breaking news
Jayashankar
-
పత్రికా స్వేచ్ఛను హరించొద్దు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరించడం తగదని, ఉద్దేశపూర్వకంగా సాక్షి దినపత్రికపై దాడులు, ఎడిటర్, విలేకరులపై అక్రమ కేసులు బనాయించడం సరికాదని, ఉద్యోగ, విద్యార్థి సంఘాల నాయకులు ఖండిస్తున్నారు. నిజాలను నిర్భయంగా రాస్తే అక్కడి పాలకులు జీర్ణించుకోలేకపోతున్నారని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య పత్రికలు వారధి అనే విషయాన్ని మర్చిపోవద్దని సూచిస్తున్నారు. అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. – సాక్షి నెట్వర్క్కేసుల నమోదు సరికాదు ములుగు రూరల్: సాక్షి కార్యాలయాలపై ఏపీ ప్రభుత్వం దాడులు చేయడం పత్రికా స్వేచ్ఛను హరించడమే అవుతుంది. సమాజంలో జరుగుతున్న అక్రమాలను ప్రజలకు తెలియజేసే పత్రికలపై దాడులు, ఎడిటర్పై కేసులు నమోదు చేయడం సరికాదు. ఏపీ ప్రభుత్వం సాక్షి ఎడిటర్, రిపోర్టర్లపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి. – పోలురాజు, టీఎన్జీఓ ములుగు జిల్లా అధ్యక్షుడు కక్షసాధింపు చర్యలు మానుకోవాలి నెహ్రూసెంటర్: సాక్షి దినపత్రిక, ఎడిటర్ ధనంజయరెడ్డిపై ఏపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు మానుకోవాలి. పత్రికా స్వేచ్ఛను హరిస్తే సమాజానికి మేలు జరగదు. జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించడం వల్ల సుపరిపాలన అనిపించుకోదు. అధికారం ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సరికాదు. – ఎం.వివేక్, డీఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు దాడులను ఖండిస్తున్నాం.. జనగామ: ప్రభుత్వం చేసే మంచి, చెడులను ప్రజలకు తెలియజేస్తూ, మనకు దారి చూపించే పత్రికలపై ఏపీ సర్కార్ తీరు సరికాదు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి, జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేయడాన్ని ఖండిస్తున్నాం. సమాజంలో పత్రికలే మార్గదర్శకంగా ఉండి మనల్ని నడిపిస్తున్నాయి. –పెండెల శ్రీనివాస్, గ్రామ పరిపాలన ఆఫీసర్ రాష్ట్ర నాయకుడు, జనగామ ఏపీ ప్రభుత్వానికి ఇది మంచిదికాదు సాక్షి దినపత్రిక, ఎడిటర్పై అక్రమ కేసులు ఎత్తివేయాలి ఉద్యోగ, విద్యార్థి సంఘాల నాయకుల డిమాండ్ -
క్రీడాకారులను అభినందించిన జీఎం
భూపాలపల్లి అర్బన్: ఈ నెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు డబ్ల్యూసీఎల్ కంపెనీ నాగపూర్లో జరిగిన కోలిండియా ఇంటర్ కంపెనీ లెవల్ వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ బాడీ బిల్డింగ్ పోటీలలో పాల్గొని పతకాలు సాధించిన సింగరేణి క్రీడాకారులను శనివారం ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి అభినందించారు. కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జీఎం ముఖ్యఅతిథిగా హాజరై శ్రీనివాసరెడ్డి, మీర్జా యాసిన్, బానోత్ రమేష్, అనుషను శాలువతో సత్కరించి అభినందించి మాట్లాడారు. సింగరేణి ఉద్యోగులు తమ విధులు నిర్వర్తించడంలోనే కాకుండా క్రీడలలోనూ అత్యుత్తమ ప్రతిభ చాటడం గర్వించదగిన విషయమన్నారు. సంస్థ తరఫున క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అన్ని విధాల సాయం అందజేస్తున్నామని తెలిపారు. యువ ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు వీరిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం కవీంద్ర, సెక్యూరిటీ ఆఫీసర్ మురళీమోహన్, అధికారులు, కార్మికులు గుండు రాజు, రాహుల్, శ్రీనివాస్, దేవయ్య, స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ పాక దేవయ్య పాల్గొన్నారు. -
బంద్ సక్సెస్
వాటాకోసం నినదించిన బీసీలుభూపాలపల్లి అర్బన్: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన బంద్ జిల్లా వ్యాప్తంగా విజయవంతమైంది. బంద్కు అన్ని బీసీ కుల సంఘాలు, రాజకీయ పార్టీలు, ఎస్సీ సామాజిక వర్గాల నాయకులు మద్దతు తెలిపి బంద్లో పాల్గొన్నారు. జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ డిపో వద్దకు బీసీ జేఏసీ నాయకులు చేరుకొని ఆర్టీసీ బస్సులు బయటకి రాకుండా అడ్డుకున్నారు. వ్యాపార సముదాయాలు, విద్యాసంస్థలు బంద్లో స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు చిరువ్యాపారులు కూడా బంద్లో పాల్గొన్నారు. జిల్లాకేంద్రంలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. జేఏసీ నాయకులు పట్టణంలోని ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పైడిపల్లి రమేష్, రమేష్, అజయ్, రామగిరి సదానందం, అశోక్, రాజేందర్, రవీందర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల ర్యాలీ జిల్లాకేంద్రంలోని హన్మాన్ దేవాలయం నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు కాంగ్రెస్ నాయకులు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కళ్లకు గంతలు కట్టుకొని.. మోకాళ్లపై నిల్చుని నిరసన.. సీపీఐ నాయకులు పార్టీ కార్యాలయం నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు. అంబేడ్కర్ సెంటర్లో పట్టణ కార్యదర్శి సోత్కు ప్రవీణ్కుమార్ ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. బీసీ జర్నలిస్టు సంఘాల నాయకులు అంబేడ్కర్ సెంటర్లో మోకాళ్లపై నిల్చొని నిరసన తెలిపారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు పట్టణంలో బైక్ర్యాలీ చేపట్టి అంబేడ్కర్సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ మద్దతు.. బంద్కు జిల్లాకేంద్రంలో ఎమార్పీఎస్ నాయకులు మద్దతు తెలిపారు. నల్ల కండువాలు ధరించి పట్టణంలో బైక్ ర్యాలీ చేపట్టారు. స్వచ్ఛందంగా పాల్గొన్న విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాలు రోడ్డెక్కని ఆర్టీసీ బస్సులు మద్దతు తెలిసిన రాజకీయ పార్టీలు, సంఘాలు జిల్లాకేంద్రంలో జేఏసీ నాయకుల ర్యాలీ -
విక్రయదారులు నిబంధనలు పాటించాలి
● ఎస్పీ కిరణ్ఖరే భూపాలపల్లి అర్బన్: టపాసుల విక్రయదారులు నిబంధనలు పాటించాలని ఎస్పీ కిరణ్ఖరే ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని కూరగాయల సంతలో ఏర్పాటు చేసిన టపాసుల దుకాణాలను పరిశీలించి విక్రయదారులతో మాట్లాడారు. టపాసులు విక్రయించాలనుకునే వారు నిబంధనలు ప్రకారం సరైన లైసెన్స్ పొందాలన్నారు. లైసెన్స్ లేకుండా విక్రయాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో జనం రద్దీగా ఉండే ప్రదేశాలు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల పక్కన, పెట్రోల్ బంకుల సమీపాల్లో దుకాణాలు ఏర్పాటు చేయవద్దన్నారు. తహసీల్దార్, ఫైర్ సర్వీస్, పోలీస్శాఖ సూచించిన ప్రదేశాలల్లో లైసెన్స్ ఉన్న వ్యాపారులు షాపులను ఏర్పాటు చేసుకోవాలన్నారు. భద్రతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
జిల్లా ప్రధాన న్యాయమూర్తితో భేటీ
భూపాలపల్లి అర్బన్: జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమేశ్బాబుతో కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ కిరణ్ఖరే శనివారం భేటీ అయ్యారు. జిల్లా కోర్టులోని తన కార్యాలయంలో కలిసి జిల్లాలో న్యాయ, పరిపాలన, రక్షణ పరమైన అంశాల గురించి చర్చించి న్యాయమూర్తి సూచనలు తీసుకున్నారు. అనంతరం వివిధ అంశాలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాజ్, జూనియర్ సివిల్ జడ్జి దిలీప్కుమార్ నాయక్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల, అడిషనల్ ఎస్పీ నరేష్కుమార్, సీఐ నరేష్ కుమార్, స్పెషల్ పీపీ నిమ్మల విష్ణువర్ధన్ పాల్గొన్నారు. పురాతన కట్టడాల పరిరక్షణకు కృషి రాష్ట్ర పురావస్తు శాఖ సంచాలకులు అర్ఙునరావు రేగొండ: జిల్లాలో అద్భుతమైన పురాతన కట్టడాలు ఉన్నాయని, వాటి పరిరక్షణకు పురావస్తు శాఖ కృషి చేస్తుందని రాష్ట్ర పురావస్తు శాఖ సంచాలకులు అర్ఙునరావు అన్నారు. శనివారం మండలంలోని పాండవుల గుట్టలు, బుగులోని గుట్టలు, మండల కేంద్రంలోని రామలింగేశ్వర స్వామి ఆలయాలను పురావస్తు శాఖ అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాండవుల గుట్టల్లోని సహజ రాతి ఆకృతులు, పురాతన చిత్రాలు, ప్రకృతి పచ్చదనం ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. ఈ గుట్టలను ప్రత్యేకంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు. మండలకేంద్రంలోని రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురావస్తు శాఖ ఉప సంచాలకులు నాగరాజు, సాయి కిరణ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఏనుగు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. -
శనిపూజలకు భక్తుల రద్దీ
కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయం అనుబంధ దేవాలయంలో నవగ్రహాల వద్ద సామూహికంగా శనిపూజలు నిర్వహించారు. శనివారం ముందుగా గోదావరిలో స్నానాలు చేసి నవగ్రహాల వద్ద భక్తులు అధికంగా పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి గర్భగుడిలో అభిషేక పూజలు చేశారు. దీంతో ఆలయ పరిసరాలు, గోదావరి తీరంలో భక్తుల సందడి నెలకొంది. సమాచారం ఇవ్వండి భూపాలపల్లి అర్బన్: అక్రమ మెడిసిన్ అమ్మకాలు చేపట్టినట్లయితే డ్రగ్స్ కంట్రోల్ అధికారులకు సమాచారం ఇవ్వాలని వరంగల్ ఔషధ నియంత్రణ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాజలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజారోగ్యాన్ని కాపాడే యుద్ధంలో పౌరులే కీలకమన్నారు. పరిసరాల్లో జరిగే అనార్ధాలను గుర్తించాలని సూచించారు. మందుల చీటీలు లేకుండా అబార్షన్ కిట్లు, నిద్ర మాత్రలు అనుమానా స్పద మందులు విక్రయించినట్లయితే 180059 96969 నంబర్కు సమాచారం అందించాలన్నారు. సమాచారం అందించిన వారి వివరా లను గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. గంజాయి విక్రేతల అరెస్ట్ కాటారం: గంజాయి సేవించడంతో పాటు జల్సాల కోసం ఇతరులకు గంజాయి విక్రయిస్తున్న యువకులను పోలీసులు శనివారం పట్టుకున్నారు. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. కాటారం మండలం గారెపల్లికి చెందిన జాడి వివేక్, ఆకుల అఖిల్, జాడి గణేశ్, దయకి శ్రీకాంత్, సయ్యద్ అస్లాం, కాటారంకు చెందిన గంట పరిపూర్ణం గంజా యికి అలవాటుపడి స్నేహితులుగా మారా రు. ఇదే క్రమంలో మండలంలోని బయ్యారం గ్రామ సమీపంలో పోలీసులు పెట్రోలింగ్లో చేస్తుండగా ఆరుగురు యువకులు అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నిస్తారు. పోలీసులు వెంబడించి పట్టుకొని వారి వద్ద గంజాయిని స్వాధీనపర్చుకున్నారు. మండలంలోని కొత్తపల్లికి చెందిన పెద్ది నిఖిల్రాజ్ అనే వ్యక్తి దగ్గర జాడి వివేక్ 950 గ్రాముల గంజాయి తీసుకొని రాగా అందులో 50 గ్రాముల వరకు గంజాయి సేవించి మిగితా గంజాయి విక్రయించడానికి తీసుకెళ్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు. ఆరు నిందితుల వద్ద 900 గ్రాముల గంజాయి, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనపర్చుకున్నట్లు ఎస్సై శ్రీనివాస్ పేర్కొన్నారు. ఏడుగురిపై కేసు నమోదు కాగా ఆరుగురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు ఒకరు పరారీలో ఉన్నట్లు ఎస్సై వివరించారు. ఆలయాలలో గుడి గంటల చోరీ ములుగు రూరల్: ములుగు మున్సిపాలిటీ పరిధిలోని గొల్లవాడ రామాలయం, మాదవరావుపల్లి హనుమాన్ ఆలయంలో గంటలు చోరీకి గురయ్యాయి. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రామాలయంలో కంచుతో తయారు చేసిన నాలుగు గంటలు, హనుమాన్ ఆలయంలో ఒక గంటను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. ఈ విషయంపై ఆలయ పూజారి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. -
టెన్త్లో మెరుగైన ఫలితాలు సాధించాలి
● డీఈఓ రాజేందర్ కాళేశ్వరం: విద్యార్థులు పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.రాజేందర్ ఆదేశించారు. శనివారం ఆయన మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. పదవ తరగతి స్పెషల్ క్లాసెస్ సక్రమంగా నిర్వహించాలని అన్నారు. అనంతరం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల గణిత సామర్థ్యాలను పరీక్షించారు. ఆయన వెంట ఎంఈఓ ప్రకాశ్బాబు, కాంప్లెక్స్ హెచ్ఎం బి.అన్నపూర్ణ, డీసీఈబీ సెక్రటరీ కిషన్రెడ్డి, ఉపాధ్యాయులు రాజేందర్, శ్యామ్, శ్రీధర్, సీఆర్పీ సతీష్ ఉన్నారు. -
రామప్పలో విదేశీయుల సందడి
వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని శనివారం హైదరాబాద్లోని ఎంసీహెచ్ఆర్డీలో శిక్షణ పొందుతున్న టాంజనియా దేశానికి చెందిన 30 మంది అధికారులు సందర్శించారు. ప్రొఫెసర్, కోర్స్ డైరెక్టర్ డాక్టర్ రావులపాటి మాధవి ఆధ్వర్యంలో వారు రామప్ప ఆలయానికి చేరుకొని రామలింగేశ్వస్వామికి పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు హరీశ్ శర్మ, ఉమాశంకర్లు వారికి తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత, శిల్పకళ ప్రాముఖ్యత గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని వారు కొనియాడారు. అనంతరం రామప్ప సరస్సును సందర్శించి సరస్సులో బోటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో వారి వెంట ఎంసీహెచ్ఆర్డీ అధికారులు రవి, సాయికృష్ణ, నందకిశోర్ తదితరులు పాల్గొన్నారు. -
మద్యం షాపులకు 1,500 దరఖాస్తులు
భూపాలపల్లి: మద్యం షాపులకు టెండర్లు హోరెత్తాయి. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం రోజు నుంచి అప్లికేషన్లు అంతంత మాత్రంగానే రాగా.. చివరి రోజు శనివారం మాత్రం భారీగా వచ్చాయి. తొలుత వ్యాపారులు సిండికేటుగా ఏర్పడి టెండర్లు వేయడం లేదని భావించినప్పటికీ, దరఖాస్తు రుసుం పెంచినందునే వెనుకంజ వేసినట్లు తెలిసింది. చివరకు పాత వ్యాపారులంతా రంగంలోకి దిగారు. ఒకేరోజు 879 అప్లికేషన్లు.. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని భూపాలపల్లి, కాటారం, ములుగు, ఏటూరునాగారం సర్కిల్ పరిధిలో 59 మద్యం షాపులకు ప్రభుత్వం గత నెల 26వ తేదీ నుంచి టెండర్లను ఆహ్వానించింది. ఈ నెల 17వ తేదీ వరకు కేవలం 621 అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి. చివరి రోజు శనివారం రాత్రి 10.30 గంటల వరకు 879 వచ్చినట్లు ఎకై ్సజ్ అధికారులు వెల్లడించారు. ఏటూరునాగారం సర్కిల్ పరిధిలో టెండర్లు వేసే వారు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో అర్ధరాత్రి వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగింది. దీంతో రెండు జిల్లాల్లో మొత్తం సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సర్కారు ఆదాయం పెరిగింది.. రాష్ట్ర ప్రభుత్వం 2023లో రూ.2 లక్షల అప్లికేషన్ ఫీజులో మద్యం దుకాణాలకు టెండర్లు ఆహ్వానించగా రెండు జిల్లాల నుంచి మొత్తం 2,161 అప్లికేషన్లు వచ్చాయి. వాటి ద్వారా రూ.43.22 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది దరఖాస్తు రుసుమును రూ.3 లక్షలకు పెంచగా శనివారం రాత్రి 11 గంటల వరకు వచ్చిన అప్లికేషన్ల లెక్కల ప్రకారం ప్రభుత్వానికి సుమారు రూ.45 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. అప్లికేషన్ల సంఖ్య తగ్గినప్పటికీ సర్కారుకు ఆదాయం పెరిగింది. రెండు షాపులకు నిల్.. ఏటూరునాగారం సర్కిల్ పరిధిలో ఎస్టీ కేటగిరికి రిజర్వ్ చేసిన గెజిట్ 49, 50 నంబరు గల మద్యం షాపులకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. 52, 53, 54, 55 షాపులకు ఒకటి చొప్పున రాగా 58వ షాపుకు రెండు చొప్పున అప్లికేషన్లు వచ్చాయి. కాగా ఆయా షాపులకు సైతం శనివారం రాత్రి వరకు దరఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు ఎకై ్సజ్ అధికారులు వెల్లడించారు. భూపాలపల్లి, ములుగు జిల్లాలకు పోటెత్తిన అప్లికేషన్లు శనివారం ఒక్కరోజే 879.. అర్ధరాత్రి వరకు కొనసాగిన దరఖాస్తుల స్వీకరణ గతేడాది 2,161 రాక.. ఈ ఏడాది తగ్గినా.. పెరిగిన ఆదాయం -
వేధించడం అప్రజాస్వామికం
ప్రజా సమస్యలపై ప్రజలను చైత్యన పరుస్తున్న పత్రికలపై ప్రభుత్వాలు కక్ష కట్టడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. పత్రికా స్వేచ్ఛను హరించడం విడ్డూరం. సాక్షి పత్రికపై, ఎడిటర్, రిపోర్టర్లపై పెట్టిన అక్రమ కేసులను ఏపీ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. పత్రికల్లో తప్పుడు కథనాలు వస్తే సంజాయిషీ అడగవచ్చు. అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. తప్పుడు కేసులు పెట్టి వేధించొద్దు. నిరంకుశత్వంతో అణగదొక్కుతామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. – రాచర్ల శ్రీనివాస్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు -
దాడి అమానుషం
నిజాలను నిర్భయంగా రాస్తూ ఎన్నో అవినీతి అక్రమాలను వెలికి తీస్తున్న సాక్షి దిన పత్రిక ఎడిటర్, జర్నలిస్టుల మీద ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం అమానుషం. తెలంగాణ సామాజిక రచయితల సంఘం ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తుంది. అక్రమ కేసులను ఎత్తేయాలి. భావప్రకటన స్వేచ్ఛకు సంకెళ్లు సమంజసం కాదు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను అడ్డుకోరాదు. పౌర సమాజం ఈ ఘటనను ఖండించాలి. – కామిడి సతీష్రెడ్డి, తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
‘సాక్షి’పై వేధింపులు సరికాదు
● జిల్లాకేంద్రంలో జర్నలిస్టుల నిరసన ర్యాలీ ● పార్టీలు, ప్రజా, కుల, విద్యార్థి సంఘాల మద్దతు భూపాలపల్లి అర్బన్: ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ ప్రభుత్వం సాక్షి దినపత్రికపై వేధింపులు, ఎడిటర్ ధనంజయరెడ్డిపై కేసులు పెడుతూ పత్రికా స్వేచ్ఛను హరించడం మానుకోవాలని జిల్లాకేంద్రంలోని కాకతీయ ప్రెస్ క్లబ్ జర్నలిస్టు సభ్యులు డిమాండ్ చేశారు. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిపై పెడుతున్న అక్రమ కేసులను నిరసిస్తూ శుక్రవారం జిల్లా కేంద్రంలోని కాకతీయ ప్రెస్ క్లబ్ నుంచి నల్ల బ్యాడ్జీలు ధరించి జర్నలిస్టులు అంబేడ్కర్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టి ధర్నా నిర్వహించారు. అనంతరం ప్రెస్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లో ప్రజా సమస్యలను ఎత్తిచూపుతున్న సాక్షి దినపత్రికపై ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. అన్యాయాలు, కుట్రలను అన్ని వర్గాలు ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. ఎడిటర్ ధనంజయరెడ్డి మీద వరుసగా కేసులు పెట్టడంతో పాటు విచారణల పేరిట వేధింపులకు గురిచేయడం సరైంది కాదన్నారు. అక్రమ కేసులు బనాయించడం అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అవుతుందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో దాడులు, భయబ్రాంతులకు గురిచేయడం హేయమైన చర్య అన్నారు. ధర్నాకు యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు క్యాతరాజు సతీష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నేరెళ్ల జోసెఫ్, బీసీ హక్కుల సాధన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి వేముల శ్రీకాంత్ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాల నాయకులు, జర్నలిస్టులు పోతరాజు రవిభాస్కర్, సామంతుల శ్యామ్, ఎడ్ల సంతోషం, సామల శ్రీనివాస్, క్యాతం సతీష్, జల్ది రమేష్, ఎర్రం సతీష్, రాజు, మంతెన సమ్మయ్య, నరసయ్య, మోహన్, సారేశ్వర్, సుధాకర్, లక్ష్మారెడ్డి, ప్రవీణ్, సత్యనారాయణ, శ్రీనివాస్, మధు, శేఖర్, రవి, మహేందర్, జగన్, మున్నా పాల్గొన్నారు. -
భూసేకరణ త్వరితగతిన పూర్తిచేయాలి
● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి: చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో రెవెన్యూ, ఇరిగేషన్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖల అధికారులు, మెగా కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూ సేకరణ, మ్యుటేషన్, పరిహార చెల్లింపులు, ప్రాజెక్టు పనుల పురోగతిపై శాఖల వారీగా సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా, న్యాయంగా భూ సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో ప్రాజెక్టు సంబంధిత ఫీల్డ్ స్థాయి సమస్యలను అధికారుల ద్వారా సమీక్షించి, తక్షణ పరిష్కార చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కుసుమకుమారి, ఇరిగేషన్ అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
బార్డర్లో వాహన తనిఖీలు
కాళేశ్వరం: కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన సమీపంలోని బార్డర్ చెక్పోస్టు వద్ద కాటారం డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో శుక్రవారం ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. మూడు రోజుల కిందట మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వద్ద మావోయిస్టుపార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్, ఛత్తీస్గఢ్లో మావోయిస్టు పార్టీ కీలక నేత ఆశన్నతో రెండువందల మంది వరకు ప్రభుత్వం వద్ద లొంగిపోయిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అక్కడ మిగిలిన కొంతమంది తలదాచుకునేందుకు ఇటువైపుగా తరలివస్తారనే అనుమానంతో పోలీసులు నజర్ వేశారు. అనుమానితులు, సానుభూతిపరులు భూపాలపట్నం, గడ్చిరోలి జిల్లాల నుంచి తెలంగాణ వైపునకు వచ్చే అవకాశం ఉన్నందున వాహన తనిఖీలు, సోదాలు చేసినట్లు తెలిసింది. వాహనాల పత్రాలు, లైసెన్స్, చలాన్లు పరిశీలించారు. నంబర్ప్లేటు లేని వాహనాలపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఆయన వెంట సీఐ ఎన్.వెంకటేశ్వర్లు, ఎస్సై తమాషారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
నాపాక ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే గండ్ర
చిట్యాల: మండలంలోని నైన్పాకలో వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహా స్వామి దేవాలయాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శుక్రవారం సందర్శించారు. అలయ అభివృద్ధి పనుల కోసం అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన వెంట పురావస్తు శాఖ డైరెక్టర్ అర్జున్రావు, డిప్యూటీ డైరెక్టర్ నర్సింగం, టెక్నికల్ డిప్యూటీ డైరెక్టర్ నాగరాజు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి ఉన్నారు. ధ్యానం దివ్య ఔషధం ● హార్ట్ఫుల్నెస్ జోనల్ కోఆర్డినేటర్ మాధవి భూపాలపల్లి అర్బన్: ధ్యానం శరీరంలోని అనేక రుగ్మతలకు ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుందని హార్ట్ఫుల్నెస్ యోగా సంస్థ జోనల్ కోఆర్డినేటర్ చింతకింది మాధవి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఇల్లందుక్లబ్లో సింగరేణి అధికారులు, వారి కుటుంబ సభ్యులకు మూడు రోజుల ఉచిత యోగా, ధ్యాన శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి యోగాసనాలు, ధ్యానం గురించి వివరించి ప్రయోగాత్మకంగా శిక్షణ ఇచ్చారు. యోగా, ధ్యానాలు ప్రతి మనిషిలోని 70వేల ఆలోచనలను సరళీకృతం చేయడమే కాకుండా వాటి ద్వారా వచ్చే అనేక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయని అన్నారు. ధ్యానం ద్వారా మనస్సు కుదుటపడుతుందని, తద్వారా శరీరంలోని అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తాయన్నారు. ఈ యోగా సాధన 15 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ అవసరమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఏరియా సింగరేణి జీఎం రాజేశ్వర్రెడ్డి ప్రారంభించగా భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హార్ట్ఫుల్నెస్ జిల్లా కోఆర్డినేటర్ చెరుకుపల్లి రవీందర్, నోడల్ కోఆర్డినేటర్ పొంగాని లక్ష్మణ్, వోడ్యాల శ్రీనివాస్, నరేష్, ప్రమీల, సవేరా, గోపాల్రెడ్డి పాల్గొన్నారు. -
తల్లి ఆరోగ్యమే బిడ్డకు శ్రీరామ రక్ష
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లి: తల్లి ఆరోగ్యమే బిడ్డకు శ్రీరామ రక్ష అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ మాస ముగింపు ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ... పోషణ మాసంలో రాష్ట్ర స్థాయిలో జిల్లాకు 4వ స్థానం లభించడం అభినందనీయమని అన్నారు. చిన్నారులు వ్యాధుల బారిన పడకుండా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దే బాధ్యత అంగన్వాడీ సిబ్బందిపై ఉందని చెప్పారు. ఇళ్లలో సహజసిద్ధంగా లభించే మునగ, కరివేపాకు వంటి ఆకుకూరలను ఆహారంలో చేర్చుకోవాలని, ఇవి శరీరానికి పుష్టి, శక్తిని అందిస్తాయని చెప్పారు. కలెక్టర్ రాహుల్శర్మ మాట్లాడుతూ.. పోషణ లోపం ఉన్న చిన్నారులను గుర్తించి, వారిని పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ నవీన్రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. టీకాలు వేయించాలి.. పశువులకు టీకాలు తప్పకుండా వేయించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సూచించారు. జిల్లా పశు వైద్యశాఖ ఆధ్వర్యంలో భూపాలపల్లి మండలంలోని మోరంచపల్లి గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా శిబిరాన్ని నిర్వహించగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. పశువుల ఆరోగ్యం రైతు కుటుంబాల ఆర్థిక స్థిరత్వానికి ముడిపడి ఉందన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఆవులు, గేదెలు, దూడలు, ఎడ్లకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు ఉచితంగా వేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా పశు వైద్యాధికారి కుమారస్వామి పాల్గొన్నారు. -
ఛత్తీస్గఢ్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత వాసుదేవరావు అలియాస్ ఆశన్న
శనివారం శ్రీ 18 శ్రీ అక్టోబర్ శ్రీ 2025సాక్షిప్రతినిధి, వరంగల్: దండకారణ్యంలో మావోయిస్టుల లొంగుబాటు కొనసాగుతోంది. బుధవారం ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ అభయ్ మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట 61 మంది సహచరులతో ఆయుధాలతో లొంగిపోయిన విషయం తెలిసిందే. తాజాగా మావోయిస్టు పార్టీ మరో కేంద్ర కమిటీ సభ్యుడు, డీకేఎస్జెడ్సీ ప్రతినిధి తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ రూపేశ్ శుక్రవారం అనుచరులతో అడవిబాటను వదిలారు. 208 మంది (110మంది మహిళలు, 98మంది పురుషులు) సహచరులతో కలిసి 153 ఆయుధా లతో ఆయన జగ్దల్పూర్లో ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్, పోలీసు ఉన్నతాధికారుల ఎదుట లొంగిపోయారు. ప్రధానంగా దంతెవాడ, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులో ఉన్న ఇంద్రావతి ఏరియాను కేంద్రంగా ఏర్పాటు చేసుకుని ఆశన్న కార్యక్రమాలు కొనసాగించారు. భారీగా లొంగిపోయినట్లు ‘ఎక్స్’ వేదికగా కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించారు. చర్చల కోసం ప్రయత్నించి.. ఆపరేషన్ కగార్ ఉధృతం కావడం.. చాలామంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మృతి చెందారు. ఈనేపథ్యంలో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామ ని కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట మార్చి 28న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఒక దశలో ఒకే అన్నప్పటికీ.. తర్వాత జరిగిన పరిణామాల్లో భాగంగా నో చెప్పారు. ఆ తర్వాత మే నెలలో కేంద్ర కమిటీ సభ్యుడు తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న చర్చలను ప్రతిపాదిస్తూ ఛత్తీస్గఢ్లోని ఓ మీడియా చానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు, ప్రజా సంఘాలు చొర వ చూపాలని ఆయన కోరారు. అయినప్పటికీ దండకారణ్యంలో పోలీస్ కూంబింగ్ కొనసాగి కేంద్ర కమిటీ కార్యదర్శి నంబళ్ల కేశవరావు అలియాస్ బస్వరాజ్ సహా పలువురు అగ్రనాయకులు, కేడర్ ఎన్కౌంటర్లలో మృతి చెందారు. చర్చలతో ఫలితం లేదని లొంగుబాటును ఎంచుకున్న కేంద్ర కమిటీ నాయకులు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అ భయ్, తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ రూపే శ్ సహచరులు, ఆయుధాలతో సరెండర్ అయ్యారు. మావోయిస్టు నేత తాతతో కలిసి పనిచేసిన ఆశన్న 1993–94లో అన్నసాగర్ ఏరియా డిప్యూటీ కమాండర్గా, కమాండర్గా పనిచేశారు. శేషగిరిరావు అలియాస్ గోపన్నతో కలిసి పనిచేసిన ఆయన నల్లగొండ జిల్లాలోనూ కొంతకాలం దళనేతగా ఉన్నారు. ఆ తర్వాత అనతి కాలంలోనే 1999లో పీపుల్స్వార్ పార్టీ నాయకత్వం యాక్షన్ టీంకు ఇన్చార్జ్గా నియమించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పలు కీలక యాక్షన్లకు ఆశన్న నాయకత్వం వహించినట్లు పోలీసు రికార్డులు నమోదయ్యాయి. 2000 సంవత్సరంలో అప్పటి హోం మంత్రి మాధవరెడ్డి కారును పేల్చి చంపిన ఘటనలో కీలకమని అప్పట్లోనే పోలీసులు ప్రకటించారు. 2003లో అలిపిరిలో చంద్రబాబు కాన్వాయ్ని క్లైమోర్మైన్ పేల్చిన ఘటనతోపాటు హైదరాబాద్ సంజీవరెడ్డినగర్లో ఐపీఎస్ అధికారి ఉమేశ్చంద్రను పట్టపగలే కాల్చిచంపిన ఘటనకు ఈయనే నాయకత్వం వహించినట్లు రికార్డులు ఉన్నాయి. ఆ తర్వాత నిర్బంధం పెరగడంతోపాటు ఉద్యమ నిర్మాణంలో భాగంగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు, దండకారణ్యంలో వివిధ కేడర్లలో పనిచేసిన ఆశన్న కేంద్ర మిలటరీ కమిషన్కు కూడా కొంతకాలం ఇన్చార్జ్గా పనిచేసినట్లు ప్రచారం ఉంది. కాగా, దళ సభ్యుడి నుంచి కేంద్ర కమిటీ నేత వరకు ఎదిగి.. ఛత్తీస్గఢ్, సౌత్బస్తర్, మాడ్ డివిజన్లలో కీలకంగా వ్యవహరించిన ఆయన శుక్రవారం ఉద్యమ సహచరులతో కలిసి లొంగిపోవడం చర్చనీయాంశంగా మారింది.తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్నది ములుగు జిల్లా వెంకటాపూర్ (రామప్ప) మండలం లక్ష్మీదేవిపేట శివారు పోలోనిపల్లి (నర్సింగాపూర్) స్వగ్రామం. తల్లి సరోజన, తండ్రి భిక్షపతిరావు, తమ్ముడు సహదేవరావు, అక్క సౌమ్య. తండ్రి భిక్షపతిరావు 2012లో గొంతు క్యాన్సర్తో మృతిచెందగా, తమ్ముడు సహదేవరావు రైల్వేశాఖలో డ్రైవర్గా పనిచేస్తూ హనుమకొండలోని గోపాల్పూర్లో స్థిరపడినట్లు బంధువులు తెలిపారు. వాసుదేవరావు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు వెంకటాపూర్ మండలంలోని లక్ష్మీదేవిపేట ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. అనంతరం కాజీపేటలోని సెయింట్ గ్యాబ్రియల్ స్కూల్లో సెకండరీ విద్యనభ్యసించారు. భువనగిరిలో ఐటీఐ కూడా చేసిన ఆయన, కాకతీయ వర్సిటీలో డిగ్రీ చదువుతూ.. రాడికల్ స్టూడెంట్ యూనియన్కు (ఆర్ఎస్యూ) నాయకత్వం వహించారు. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో 25 ఏళ్ల వయసులో అజ్ఞాతంలోకి వెళ్లారు. 1991 నుంచి ఆర్ఎస్యూలో పనిచేసి అజ్ఞాతంలోకి వెళ్లాక దళ సభ్యుడి నుంచి నాలుగున్నర దశాబ్దాల్లో కేంద్ర కమిటీ అగ్రనేత వరకు ఎదిగారు. 25 ఏళ్ల వయసులో అజ్ఞాతంలోకి.. నాలుగున్నర దశాబ్దాలు అడవిలో.. దళసభ్యుడి నుంచి కేంద్ర కమిటీ వరకు ఆశన్న ఉద్యమ ప్రస్థానం -
బోధనేతర భారం
పాఠశాలల తనిఖీలకు ఉపాధ్యాయ కమిటీలపై వ్యతిరేకతభూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో తనిఖీకి ఉపాధ్యాయుల కమిటీల ఏర్పాటుకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు ఇవ్వగా ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అసలే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతతో ఇబ్బందులు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తనిఖీలకు ఉపాధ్యాయులతో కమిటీలు వేయడం ద్వారా ప్రతిభకలిగిన వా రు కమిటీలకు వెళితే అక్కడ పాఠాలు ఎవరు చెబు తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. తని ఖీ బాధ్యతలు తీసుకున్న టీచర్లకు ఇక బడికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. దీంతో సర్కారు బడుల పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముందని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీలు.. పదేళ్ల సీనియారిటీ ఉన్న ఉపాధ్యాయులతో కమిటీలు వేయాలని విద్యాశాఖ కార్యదర్శి ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి తనిఖీ కమిటీలు వేయనున్నారు. ప్రతీ వంద ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు ఒక్కటి చొప్పున ప్రతీ 50 ఉన్నత పాఠశాలలకు ఒక కమిటీని నియమించనున్నారు. ఈ లెక్కన జిల్లాలో 394 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు 324, ఉన్నత పాఠశాలలు 70 ఉన్నాయి. ప్రాథమిక, ప్రాధమికోన్నత పాఠశాలలకు 4 కమిటీలు, ఉన్నత పాఠశాలలకు 2 కమిటీలు జిల్లాలో వేసే అవకాశం ఉంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత కమిటీలలో ప్రధానోపాధ్యాయుడితోపాటు స్కూల్ అసిస్టెంట్, ఇద్దరు టీచర్లు ఉండనున్నారు. హైస్కూల్ కమిటీల్లో నోడల్ అధికారితోపాటు 8 మంది సభ్యులు ఉండనున్నారు. బోధనకు దూరం కమిటీల్లో నియమితులయ్యే ఉపాధ్యాయులు బోధనకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఉపాధ్యాయులు బోధనకు దూరమైతే పాఠశాలల పరిస్థితి ఏమిటనేది తేలాల్సి ఉంది. ఉపాధ్యాయులపైనే ఉపాధ్యాయులు తనిఖీల కమిటీలతో పెత్తనంపై ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ కమిటీల వల్ల ఉపాధ్యాయుల్లో విభేదాలు పెరిగి లాభం కంటే నష్టం ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో తనిఖీ కమిటీల వల్ల సిలబస్ పూర్తయ్యే అవకాశం లేకుండాపోతుంది. జిల్లాలో వందకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండగా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నచోట నుంచి ఎక్కువగా ఉన్నచోటకి ఉపాధ్యాయులను సర్దుబాటు చేసి విద్యాబోధన నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తనిఖీ కమిటీల్లో ఉపాధ్యాయులను నియమించడం కోసం ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉత్తర్వులపై ఉపాధ్యాయ సంఘాల పెదవి విరుపు కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి తనిఖీ కమిటీలు 50 ఉన్నత పాఠశాలకు ఒక కమిటీ.. 100 పీఎస్, యూపీఎస్లకు తనిఖీకి మరో బృందం ఉన్నత పాఠశాలల్లో సిలబస్పై ప్రభావం -
ఇసుక అక్రమ రవాణాకు తావివ్వొద్దు
భూపాలపల్లి: ఇసుక అక్రమ రవాణా జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సూచించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరేలతో కలిసి ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరాపై రెవెన్యూ, పోలీస్, అటవీ, మైనింగ్, గృహ నిర్మాణ, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నంబర్ ప్లేట్లు లేకుండా ఇసుక రవాణా చే సే ట్రాక్టర్లను వెంటనే సీజ్ చేయాలన్నారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్ఫోర్స్ బృందాలు నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన రీచ్ల నుంచి మాత్రమే ఇసుక రవాణా చేయాలన్నారు. ఇతర జిల్లాలు, ప్రాంతాలకు ఇసుక రవాణా నిషేధమని స్పష్టం చేశారు. జిల్లా సరిహద్దుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా పటిష్ట పర్యవేక్షణ చేయాలని తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇసుక రవాణా చేయా లన్నారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులు, సిబ్బందిని సస్పెండ్ చేస్తామన్నారు. భక్తులకు ఇబ్బంది రానివ్వొద్దు బుగులోని జాతర భక్తులకు ఇబ్బందులు రాకుండా అధికారులు సమన్వయంతో తగు ఏర్పాట్లు చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారులకు సూచించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో దేవా దాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన శ్రీ బుగులోని వెంకటేశ్వరస్వామి దేవస్థానం జాతర, బ్రహ్మోత్సవాల నిర్వహణపై సమీక్ష నిర్వహించగా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రేగొండ మండలం తిరుమలగిరిలో నవంబర్ 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరిగే బుగులోని వేంకటేశ్వర స్వామి జాతరకు వచ్చే భక్తులకు అంతరాయం లేకుండా తాత్కాలిక మరమ్మతులు, రహదారుల పనులు వేగవంతంగా పూర్తి చేయాలని తెలిపారు. సమావేశంలో డీఎఫ్ఓ నవీన్రెడ్డి, అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ నవీన్రెడ్డి, సింగరేణి భూ పాలపల్లి ఏరియా జీఎం రాజేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. బుగులోని జాతర భక్తులకు సౌకర్యాలు కల్పించాలి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
అమరుల సేవలు మరువలేనివి
భూపాలపల్లి: విధి నిర్వహణలో ప్రాణత్యాగాలు చేసిన అమరుల సేవలు మరువలేనివని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన పోలీసు అమరవీరుల స్తూపాన్ని గురువారం ఎస్పీ ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. సమాజం కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసులు స్ఫూర్తిదాయకులని కొనియాడారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ పోలీసు అధికారులు, సిబ్బంది ప్రజల రక్షణకు కట్టుబడి పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేష్కుమార్, భూపాలపల్లి, కాటారం డీఎస్పీలు సంపత్రావు, సూర్యనారాయణ, సీఐలు వెంకటేశ్వర్లు, నాగార్జునరావు, నరేష్కుమార్, కర్ణాకర్, మల్లేష్, ఎస్సైలు పాల్గొన్నారు. అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు.. ఈ నెల 21వ తేదీ జిల్లాలో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తామని ఎస్పీ కిరణ్ ఖరే వెల్లడించారు. వారోత్సవాల్లో భాగంగా జిల్లాలోని పోలీస్స్టేషన్లలో ఓపెన్హౌజ్ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమాల్లో భాగంగా పోలీసుల విధులు, షీ టీం, భరోసా, సైబర్ సెక్యూరిటీ తదితర విభాగాల గురించి విద్యార్థులకు వివరిస్తామన్నారు. అలాగే ‘డ్రగ్స్ నివారణలో పోలీసుల పాత్ర, విద్యార్థులు డ్రగ్స్కు దూరంగా ఉండడం’ అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తామని ఎస్పీ వెల్లడించారు.భూపాలపల్లి అర్బన్: కోల్ ఇండియా వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్ పోటీల్లో భూపాలపల్లి ఏరియా సింగరేణి క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. వీరు పలు పతకాలు సాధించినట్లు ఏరియా అధికార ప్రతినిధి మారుతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీనివాసరెడ్డి, మీర్జా యాసిన్ బేగం, బానోత్ రమేష్ బంగారు పతకాలు, అనూష వెండి పతకం సాధించినట్లు వెల్లడించారు. కాటారం: కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అమల్లోకి తీసుకొస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఇంటింటా చేరవేసి ప్రయోజనాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రతి యూత్ కాంగ్రెస్ సభ్యుడిపై ఉందని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి బండ కిశోర్ అన్నారు. రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబు, టిపిసిసి శ్రీనుబాబు ఆదేశాల మేరకు యూత్ కాంగ్రెస్ మంథని నియోజకవర్గ అద్యక్షుడు చీమల సందీప్ ఆధ్వర్యంలో గురువారం మండలంలోని ధన్వాడలో నియోజకవర్గ స్థాయి యూత్ కాంగ్రెస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాంధించడానికి తీసుకోవాల్సిన వ్యూహాలు, పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాల గూర్చి చర్చించారు. ఈ సందర్భంగా బండ కిషోర్, చీమల సందీప్ మాట్లాడుతూ గ్రామస్థాయిలో యూత్ కాంగ్రెస్ కమిటీలను ఏర్పాటు చేసి యువతను పార్టీతో కలిపి ప్రజాసమస్యల పరిష్కారానికి కట్టుబడి పని చేయాలని సూచించారు. యూత్ కాంగ్రెస్ గ్రామ కమిటీలను రద్దు చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి నూకల కమల్, పలు మండలాల అధ్యక్షుడు చిటూరి మహేశ్గౌడ్, గడ్డం క్రాంతి, రెబల్ రాజ్కుమార్, మోత్కూరి అవినాష్, సాధుల శ్రీకాంత్, వినీత్, వంశీనాయక్, నగేశ్, రాజు పాల్గొన్నారు. ములుగు రూరల్: విదేశాల్లో ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాని జిల్లా ఉపాధి కల్పన అధికారి తుల రవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఓవర్సీస్ మాన్ పవర్ కంపెనీ లిమిటెడ్, తెలంగాణ ప్రభుత్వంలోని కార్మిక ఉపాధి శిక్షణ, ఫ్యాక్టరీల శాఖకు చెందిన నమోదిత నియామక సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన అర్హత కలిగిన వారికోసం విదేశీ నియామక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉద్యోగాలు హోటల్ మేనేజ్మెంట్లో డిప్లమా, డిగ్రీ కలిగిన వారు, ప్రభుత్వ అనుమతితో నైపుణ్య ధ్రువీకరణ పొందిన అభ్యర్థులకు అనువైనవని వివరించారు. ఆసక్తిగల వారు tomcom, resume@ gmail. comకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
క్రీడానైపుణ్యాలను పెంపొందించుకోవాలి
భూపాలపల్లి అర్బన్: పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు చదువుతోపాటు క్రీడానైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సూచించారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి ఎస్జీఎఫ్ క్రీడా పోటీల ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు ప్రోత్సహిస్తుందన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాపోటీల్లో రాణించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఈఓ రాజేందర్, డీవైఎస్ఓ రఘు, క్రీడా కార్యదర్శి జయపాల్, పీడీలు రమేష్, సాంబమూర్తి పాల్గొన్నారు. జాతర విజయవంతానికి కృషి చేయాలి రేగొండ: బుగులు వేంకటేశ్వర స్వామి జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మండలంలోని తిరుమలగిరి శివారులోని బుగులోని జాతర కోసం చేపడుతున్న ఏర్పాట్లను కలెక్టర్ రాహుల్శర్మతో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. భక్తులకు తాగునీరు, పారిశుద్ధ్యం, రవాణా, పార్కింగ్, విద్యుత్, వైద్యసేవలకు అవసరమైన ఏర్పాట్లను ముందస్తుగానే పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి నవీన్ రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా వైద్యాధికారి మధుసూదన్, ఆర్డబ్యూఎస్ ఈఈ శ్వేత, పంచాయతీరాజ్ ఈఈ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఎంపీఓ రాంప్రసాద్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఎస్జీఎఫ్ జిల్లాస్థాయి క్రీడా పోటీలు ప్రారంభం -
ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీకి చర్యలు
భూపాలపల్లి: నూతనంగా నమోదైన ఓటర్లకు గుర్తింపు కార్డులను తపాలా శాఖ ద్వారా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడించారు. గురువారం హైదరాబాద్లోని రాష్ట్ర ఎన్నికల కార్యాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులతో రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేసిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. 100 సంవత్సరాల వయసు పైబడిన ఓటర్లను గుర్తించి వారి నిజ వయస్సు ఆధారంగా సవరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పెండింగ్లో ఉన్న ఓటరు నమోదు దరఖాస్తుల పరిష్కారానికి అధికారుల సమన్వయంతో తగు చర్యలు చేపడతామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ రవి, తహసీల్దార్ శ్రీనివాస్ పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి
భూపాలపల్లి అర్బన్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే విధంగా అన్ని పార్టీలు సహకరించాలని బీసీ హక్కుల సాధన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి వేముల శ్రీకాంత్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు క్యాతరాజు సతీష్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల సాధనకు తెలంగాణ ఉద్యమ తరహాలోనే సామాజిక ఉద్యమంగా ముందుకు సాగాలన్నారు. బీసీ బిల్లును ఆమోదించి రిజర్వేషన్లు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు హైకోర్టు స్టే విధించడంతో ఎన్నికలు నిలిచిపోయాయని, దీనికి ప్రధాన కారణం బీజేపీ ప్రభుత్వమేనని విమర్శించారు. రాష్ట్రంలోని బీజేపీ కేంద్రమంత్రులు, ఎంపీలు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జోసఫ్, లా వణ్య, యాకూబ్, రమేష్, తిరుపతి, కష్ణ, మహేందర్, రజిత, యాకూబీ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలి
రేగొండ: మండలంలోని బుగులోని జాతరలో చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాల ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బుధవారం తిరుమలగిరి శివారులోని బుగులోని జాతర పనులను అధికారులతో కలిసి పరిశీలించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరలో మెట్ల వెడల్పు, కోనేరు, మంచినీరు బావి నిర్మాణ పనులకు రూ.2 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. వివిధ గ్రామాల నుంచి జాతరకు వచ్చే రోడ్లను రూ.5.5 కోట్ల నిధులతో నిర్మాణం చేపట్టనున్నామని, జాతర ప్రారంభమయ్యేలోపు పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం కోటంచలో ఆలయ నిర్మాణ పనులను పరిశీలించి, ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టయ్య, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్వరరావు, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, ఈఓ మహేష్, నాయకులు సంపత్రావు, రమణారెడ్డి, విజేందర్, తిరుపతి, వీరబ్రహ్మం, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
మరింత అంతరం!
ఓరుగల్లు కాంగ్రెస్లో తారస్థాయికి మంత్రుల మధ్య విభేదాలుసాక్షిప్రతినిధి, వరంగల్ : అధికార కాంగ్రెస్ పార్టీలో అసలేం జరుగుతోంది.. మంత్రుల మధ్య అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరాయా.. జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ దంపతుల నడుమ అగాధం పెరిగిపోయిందా.. మేడారం టెండర్లపై ఇటీవల కాలంలో కొండా మురళి హైకమాండ్కు ఫిర్యాదు చేశారన్న ప్రచారం మరింత గ్యాప్ను పెంచిందా.. వరంగల్ రాజకీయాలపై పార్టీ, ప్రభుత్వం దృష్టి సారించిందా.. అంటే నిజమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇటీవల జరిగిన పరిణామాలే ఇందుకు తాజా ఉదాహరణలుగా చెబుతున్నారు. రోజురోజుకూ చినికి చినికి గాలివానగా మారుతున్న మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య విభేదాలపై ఇటు అధిష్టానం.. అటు ప్రభుత్వం సీరియస్గా స్పందించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వివాదాస్పదంగా వ్యాఖ్యలు.. మంత్రులు, కొందరు ఎమ్మెల్యేల మధ్య రోజురోజుకూ అంతరం పెరుగుతోంది. రాష్ట్ర అటవీ, పర్యాటక, దేవాదాయశాఖల మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావుల వ్యాఖ్యలు పలుమార్లు వివాదాస్పదంగా మారాయి. కొద్ది రోజుల క్రితం ఓ ఎమ్మెల్యేపై చేసిన బాడిషేమింగ్ వ్యాఖ్యలు దుమారమే రేపాయి. ఆ తర్వాత తమ నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుంటున్నారని కొండా దంపతులపై కొందరు ఎమ్మెల్యేలు అధిష్టానం వరకు వెళ్లారు. వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల, భూపాలపల్లి ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాష్రెడ్డి, గండ్ర సత్యనారాయణరావులు టీపీసీసీ చీఫ్, సీఎంలకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ అంశంపై టీపీసీసీ క్రమశిక్షణ సంఘం కొండా సురేఖ, కొండా మురళీధర్రావులతో మాట్లాడింది. టీపీసీసీ చీఫ్, సీఎంల జోక్యంతో సద్దుమణిగినట్లే అనిపించినా.. అంతర్గతంగా ఇంకా రగులుతూనే ఉంది. ఇదే సమయంలో మేడారం సమ్మక్క–సారలమ్మల గద్దెల పునరుద్ధరణ, ఇతర అభివృద్ధి పనుల టెండర్ల విషయంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిపై కొండా మురళి ఏఐసీసీ, టీపీసీసీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ ప్రచారంపై సంప్రదించిన మీడియా ప్రతినిధులతో ‘నేను ఇంట్లోనే ఉన్నాను.. ఎవరిని కలవలేదు, ఫిర్యాదులు కూడా చేయలేదు’ అని మురళి స్పష్టం చేశారు. ఇవన్ని జరుగుతున్న సమయంలోనే మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్పై ప్రభుత్వం వేటు వేయడం, బుధవారం హనుమకొండకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని ఆమె కలవకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. అధికారుల మితిమీరినతనంపై చర్యల్లో భాగంగా ప్రభుత్వం.. ఇప్పటికే మంత్రి కొండా సురేఖ పరిధిలోని ఇద్దరు అధికారులపై వేటు వేసింది. వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ తూర్పులో వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. నాయకుల బర్త్డే వేడుకలు జరపడం.. ఏ హోదా లేకున్నా ఎస్కార్టు ఇవ్వడంతోపాటు ఇతర కారణాలను చూపుతూ ఆయనపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. నందిరాంనాయక్ స్థానంలో ఐపీఎస్ అధికారి శుభం ప్రకాశ్ నాగర్లేకు ఏసీపీ బాధ్యతలు ఇచ్చారు. తాజాగా మంత్రి సురేఖ పేషీలో ఓఎస్డీగా పనిచేసే సుమంత్ను అ పదవినుంచి ప్రభుత్వం మంగళవారం తప్పించింది. 2023 డిసెంబర్నుంచి ఈ పదవీ బాధ్యతలు చూస్తున్న సుమంత్ అభివృద్ధి పనుల్లో మితిమీరిన జోక్యం.. ఇటీవల మేడారం పనుల వివాదానికి కూడా కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. స్వయంగా సీఎం విచారణకు ఆదేశించి.. ఆరోపణలు నిజమేనని తేలడంతో వేటు వేసినట్లు తెలుస్తోంది. ఈ రెండు ఘటనలు కొండా దంపతులు ప్రమేయం లేకుండా జరిగాయన్న ప్రచారం ఉండగా.. బుధవారం సీఎం పర్యటనకు హాజరు కాకపోవడంపైనా చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే.. చాలా ఏళ్లుగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో కొండా దంపతులకున్న రాజకీయ విబేధాలు, వైరం కారణంగానే సీఎం పర్యటనకు సురేఖ దూరంగా ఉన్నారని వారి అనుచరులు చెబుతున్నారు. కాగా ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా మంత్రులు, కొందరు ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు, కుమ్ములాటలకు చెక్ పెట్టే దిశగా పార్టీ, ప్రభుత్వం సీరియస్గా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఐదారు రోజుల్లో సమగ్ర నివేదికలు ఇవ్వాలన్న ఆదేశాల మేరకు నిఘావర్గాలు రంగంలోకి దిగి ఆరా తీస్తున్నట్లు తెలిసింది. వైరల్గా మారిన మంత్రి పొంగులేటిపై ఫిర్యాదుల ప్రచారం వివాదాస్పదంగా కొండా దంపతుల వ్యాఖ్యలు... సీరియస్గా తీసుకుంటున్న ప్రభుత్వం మొన్న ఏసీపీ, నేడు ఓఎస్డీ.. వేటు వేయడంపై దుమారం ముఖ్యమంత్రి పర్యటనకు దూరంగా కొండా దంపతులు జిల్లా రాజకీయాలపై ఇంటెలిజెన్స్ వర్గాల ఆరా...? -
ఉపాధికి ప్రణాళిక
2026–27 ఆర్థిక సంవత్సరానికి సిద్ధమవుతున్న కార్యాచరణ భూపాలపల్లి రూరల్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2026–27 సంవత్సరంలో చేపట్టాల్సిన పనులకు సంబంధించి ప్రణాళిక రూపకల్పనకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు అన్ని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి అక్కడి ప్రజల సమ్మతంతో పనులు గుర్తిస్తున్నారు. ఈ ప్రక్రియకు ఈ నెల మొదటి వారం నుంచి శ్రీకారం చుట్టిన అధికారులు ఈనెలాఖరులోగా పూర్తిచేసేలా కార్యాచరణ రూపొందించారు. నవంబర్ చివరి నాటికి పనుల లక్ష్యాన్ని నిర్ధారించనున్నారు వంద రోజుల పని.. పథకంలో భాగస్వాములైన కూలీలందరికీ ఆర్థిక సంవత్సరంలో వంద రోజులు పని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇందులో భాగంగా ముందుగా గ్రామాలకు అవసరమైన పనులు గుర్తించడంతో పాటు ప్రజల అంగీకారం తప్పనిసరి కావడంతో గ్రామసభలు నిర్వహిస్తున్నారు. ఇందులో పనులకయ్యే ఖర్చు వివరాలు తయారుచేసి తీర్మానాలను ఉపాధి హామీ వెబ్సైట్లో పొందుపరిచి ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఇప్పటినుంచే పనుల గుర్తింపు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వచ్చే ఏడాది మార్చితో ముగియనున్న నేపథ్యంలో 2026–27లో చేపట్టే పనులను ఇప్పటినుంచే గుర్తించనున్నారు. జిల్లాలోని 248 గ్రామ పంచాయతీల్లో ఈ నెలాఖరులోపు గ్రామసభలు పూర్తిచేసి నవంబర్లో మండలాల వారీగా ప్రణాళిక తయారుచేసి జిల్లా ఉన్నతాధికారులకు పంపించనున్నారు. వాటిని క్రోడీకరించి రాష్ట్రస్థాయిలో ఆమోదానికి ప్రతిపాదిస్తారు. వ్యక్తిగత అభివృద్ధి పనులకు ప్రాధాన్యం అడిగిన వారికి పని కల్పించే లక్ష్యంతో అమలుచేస్తున్న ఉపాధిహామీ పథకం నిర్వహణ ఇకనుంచి గ్రామం యూనిట్ వ్యక్తిగత అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. ఇప్పటి వరకు ఉపాధి పనులు జిల్లా యూనిట్గా తీసుకొని నిర్వహిస్తుండగా.. ఒక గ్రామంలో పనులు ఎక్కువగా.. మరో గ్రామంలో తక్కువగా జరుగుతున్నాయి. పథకం ఉద్దేశం ప్రకారం పని అడిగిన 14 రోజుల్లోగా పని కల్పించాల్సి ఉంది. ఎన్ఐసీ సాఫ్ట్వేర్ వివరాలు నమోదైతే పని కల్పించాల్సిందే.. లేదంటే నిరుద్యోగ భృతి చెల్లించాల్సి ఉంటుంది.పనిదినాల లక్ష్యం 12.43 లక్షలు ఇప్పటివరకు పూర్తయినవి 7.61 లక్షలు కూలీలకు చెల్లింపులు రూ.35.80 కోట్లు జాజ్కార్డులు 1,98,060 కూలీల సంఖ్య 2,39,070 ఇప్పటికే గ్రామసభలకు శ్రీకారం స్థానికుల సమ్మతితో పనుల గుర్తింపు కొనసాగుతున్న ప్రక్రియపథకం ద్వారా సెగ్రిగేషన్ షెడ్లు, వైకుంఠదామాలు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, వనమహోత్సవం, పల్లె క్రీడా మైదానాలు వంటి పనులు, చెరువులు, కుంటల్లో పూడికతీత పనులు, కట్టుకాల్వల పనులు చేపట్టనున్నారు. ఈసారి భూగర్భజలాలు పెంచేలా ఇంకుడు గుంతలు, పంట కాల్వలు, మట్టిదారులు, కందకాల తవ్వకాలు, పశువుల పాకల నిర్మాణాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు..ఉపాధి హామీ పథకంలో భాగంగా వచ్చే ఏడాది చేపట్టే పనుల్లో నీటి సంరక్షణ పనులకు మొదటి ప్రాధాన్యం ఇస్తాం. వ్యవసాయ అనుబంధ మొక్కల పెంపకం, వ్యక్తిగత అభివృద్ధి పనులు, పశువుల కొట్టాల నిర్మాణాలు, మరుగుదొడ్ల నిర్మాణం, కోళ్లఫాం ఏర్పాటు, ఫిష్పాండ్ పనులకు ప్రాధాన్యం కల్పించాలి. గ్రామసభల అనంతరం నివేదిక రూపొందిస్తాం. –బాలకృష్ణ, డీఆర్డీఓ -
రెవెన్యూ శాఖకు జీపీఓలు కీలకం
భూపాలపల్లి: రెవెన్యూ శాఖకు జీపీఓలు కీలకమని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో నూతనంగా నియమితులైన జీపీఓ (గ్రామ పాలన అధికారి) లకు రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో భూ భారతి దరఖాస్తుల పరిష్కార ప్రక్రియపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై పలు సూచనలు చేశారు. రెవెన్యూ విధులు అత్యంత కీలకమన్నారు. గ్రామస్థాయిలో ప్రతీ అంశంపై అవగాహన ఉండటం ప్రధాన బాధ్యతనన్నారు. భూముల సమస్యలు, రైతుల ఇబ్బందులు, ప్రజల అభ్యర్థనలను మొదటగా గుర్తించేది జీపీఓలేనన్నారు. జిల్లాలో ఇప్పటివరకు సుమారు 54 వేల దరఖాస్తులు వచ్చాయని, వాటి పరిశీలనలో కీలక పాత్ర పోషించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, ఆర్డీఓ రవి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ నవీన్రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసులు, జీపీఓలు పాల్గొన్నారు. రైతులకు ఇబ్బంది రానివ్వొద్దు.. వరిధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం నుంచి వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రాష్ట్రస్థాయిలో అధికారులతో కలిసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ.. వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని సూచించారు. నవంబర్ మొదటివారం నుంచి జిల్లాలో కొనుగోలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున ముందస్తుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సిద్ధంగా ఉంచాలన్నారు. వీసీలో ఎస్పీ కిరణ్ ఖరే, అదనపు కలెక్టర్ అశోక్కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ నవీన్రెడ్డి, పౌరసరఫరాల అధికారి కిరణ్ కుమార్, డీఎం రాములు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
నేటినుంచి జిల్లాస్థాయి ఎస్జీఎఫ్ క్రీడాపోటీలు
భూపాలపల్లి అర్బన్: ఎస్జీఎఫ్ జిల్లాస్థాయి పోటీలను నేటి (గురువారం) నుంచి ప్రారంభించనున్నట్లు ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి లావుడియా జయపాల్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ క్రీడా మైదానంలో క్రీడాపోటీలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే సత్యనారాయణరావు హాజరుకాన్నట్లు తెలిపారు. రెండు రోజులపాటు అండర్– 14, 17 బాలబాలికలకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కాటారం: కాటారం మండల కేంద్రంలోని గిరిజన గురుకుల బాలుర పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి దేవ నవీన్ జాతీయ ఉత్తమ విద్యార్థి అవార్డు అందుకున్నారు. గత నాలుగేళ్లుగా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పేయింటింగ్ కాంపిటేషన్లో ప్రతిభ కనబరుస్తూ వస్తున్నాడు. దీంతో గురు, స్టూడెంట్స్ పేరెంట్స్ ఇండియా జాతీయ స్థాయి సంస్థ ఉత్తమ విద్యార్థి అవార్డుకు ఎంపిక చేసింది. అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవం, అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా బుధవారం కరీంనగర్ కళాభారతీలో నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ అధ్యక్షుడు గంగారపు మల్లేషం, ఉపాధ్యక్షుడు సుమలత చేతుల మీదుగా నవీన్కు అవార్డును ప్రదానం చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ రాజేందర్, వైస్ ప్రిన్సిపాల్ మాధవి, వెంకటయ్య, బలరాం, ఆర్ట్ టీచర్ ఆడెపు రజనీకాంత్, అధ్యాపకులు నవీన్ను అభినందించారు. పలిమెల: గిరిజన ఆశ్రమ పాఠశాల హాస్టల్స్లో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం వెంటనే వేతనాలు చెల్లించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు శంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గిరిజన కార్మికుల సమస్యల పరిష్కారానికి చేస్తున్న పోరాటానికి మద్దతుగా బుధవారం పలిమెల మండల కేంద్రంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు 8 నెలలుగా ప్రభుత్వం వేతనాలు చెల్లించకపోతే కార్మికుల కుటుంబ ఎలా గడిచేదన్నారు. వెంటనే వేతనాలు చెల్లించాలన్నారు. అలాగే డైలీవేజ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యులు పెద్ది శేఖర్, పెద్ది మధునయ్య, పెద్ది చంద్రయ్య, కాపుల రవి, పెద్ది సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. మల్హర్: మండలంలోని తాడిచర్ల అటవీ ప్రాంతంలోని పేకాట స్థావరాలపై టాస్క్ఫోర్స్ పో లీసులు బుధవారం దాడులు నిర్వహించారు. ఎస్పీ కిరణ్ఖరే ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ సీఐ రమేశ్ ఆధ్వర్యంలో దాడి చేయగా పేకాట ఆడుతున్న 10 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.50,500 నగదు, 10 మొ బైల్ ఫోన్లు, ద్విచక్ర వాహనం, కారు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిని నిందితులను, స్వాధీనం చేసుకున్న వస్తువులు కొయ్యూరు పోలీస్ స్టేషన్కు అప్పగించారు. ప్రజలు ఇలాంటి సమాచారాన్ని పోలీసులకు అందించి సహకరించాలని సీఐ కోరారు. రేగొండ: పశు పోషకులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని జిల్లా పశు సంవర్ధక అధికారి కుమారస్వామి తెలిపారు. బుధవారం మండల కేంద్రంతో పాటు రంగయ్యపల్లిలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాన్ని నిర్వహించి రైతులకు అవగాహన కల్పించారు. గాలికుంటు వ్యాధి ప్రమాదకరమైందని, పశువులకు ఒకదాని నుంచి మరొక దానికి సంక్రమిస్తుందన్నారు. నవంబర్ 14వ తేదీ వరకు టీ కా కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడిటి గోపాలకృష్ణ మూర్తి, పశువైద్యాధికారులు మైథిలీ, అభిషేక్, గోపాలమిత్ర, రైతులు పాల్గొన్నారు. -
పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం
● డీడబ్ల్యూఓ మల్లేశ్వరి మొగుళ్లపల్లి: బాలింతలు పౌష్టికాహారం తీసుకోవడంతోనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని డీడబ్ల్యూఓ మల్లేశ్వరి, తహసీల్దార్ సునీత అన్నారు. బుధవారం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ మాసం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శిశువు పుట్టిన వెంటనే ముర్రుపాలు తాగించాలని, ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ నాగరాణి, సూపర్వైజర్ మాధవి, సుజాత, అంగన్వాడీ టీచర్స్, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు. మల్హర్: గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవడంతోనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని సీడీపీఓ రాధిక అన్నారు. మండలంలోని మల్లారం కేజీబీవీలో బుధవారం పోషణమాసం కార్యక్రమం నిర్వహించారు. చిరుధాన్యాలు, ఆకుకూరలతో తయారు చేసిన పోషకాహార పదార్థాలను తయారు చేసి ప్రదర్శించారు. పోషక విలువలతో కూడిన ఆహారంపై విద్యార్థులకు, గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీడీపీఓ మాట్లాడుతూ ప్రతి గర్భిణీ రక్తహీనతతో ఉండకుండా ఐరన్ ప్రోటీన్తో కూడిన ఆహారం తీసుకో వాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం సద్విని యోగం చేసుకోవాలన్నారు. అనంతరం గర్భిణులకు సీమంతం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు భవానీ, భాగ్యలక్ష్మి, ఎన్జీఓ సమ్మయ్య, పోషన్ అభియాన్ స్వప్న, ఏఎన్ఎంస్, ఆశలు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. -
మామునూరు హద్దుల స్థిరీకరణపై దృష్టి
సాక్షి, వరంగల్: వరంగల్వాసుల చిరకాలకోరిక అయిన మామునూరు విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా ఇటు రాష్ట్ర, అటు కేంద్ర ప్రభుత్వాలు చర్యలకు ఉపక్రమించాయి. ఇప్పటికే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) వద్ద 696.14 ఎకరాలు ఉండగా.. విమానాశ్రయం పునరుద్ధరించడానికి అవసరమైన మరో 253 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం భూనిర్వాసితులనుంచి సేకరించి కేంద్రానికి ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే చాలామంది రైతుల ఖాతాల్లో భూనష్టపరిహారం నగదు జమ అవుతున్న క్రమంలోనే ఇంకోవైపు ఆ భూముల హద్దుల స్థిరీకరణకు డీపీఆర్ కన్సల్టెన్సీ సంస్థల నుంచి బిడ్లను ఏఏఐ ఆహ్వానించిన విషయం తెలిసిందే. గత నెల 30 నుంచి ఈ నెల 14వ తేదీ వరకు బిడ్లను వేయడానికి అవకాశం కల్పించింది. ఈ క్రమంలోనే కొన్ని డీపీఆర్ కన్సల్టెన్సీ సంస్థలు ఈ బిడ్ను దక్కించుకునేందుకు ఆసక్తి చూపాయి. త్వరలోనే ఓ కన్సల్టెన్సీ సంస్థకు ఈ హద్దుల స్థిరీకరణ బాధ్యతలు అప్పగించి విమానాశ్రయ పునరుద్ధరణ పనులు వేగవంతం చేయడంపై దృష్టి సారిస్తారని విమానాశ్రయ అధికారులంటున్నారు. మిగిలిన పరిహారానికి ప్రతిపాదనలు.. ఇప్పటికే జిల్లా రెవెన్యూ అధికారులు నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లిలో 253 ఎకరాలను గుర్తించి ఆయా భూయజమానులతో దఫాలవారీగా సమావేశాలు నిర్వహించారు. వ్యవసాయ భూమి ఎకరానికి రూ.1.20కోట్లు, వ్యవసాయేతర భూమికి గజానికి రూ.4,887గా నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జూలై 25న రూ.205 కోట్లు కేటాయించింది. ఇప్పటివరకు సుమారు రూ.80 కోట్ల నుంచి రూ.90 కోట్ల వరకు భూనిర్వాసితులకు పరిహారం చెల్లించారని తెలిసింది. మిగిలింది కూడా సాధ్యమైనంత తొందరగా ఇవ్వడం ద్వారా విమానాశ్రయ నిర్మాణానికి ఇబ్బంది లేకుండా చూస్తామని అధికారులు అంటున్నారు. భూపరిహారానికి అదనంగా అవసరమయ్యే డబ్బుల విషయంలో ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అవి రాగానే అంతా క్లియర్ అవుతుందని రెవెన్యూ వర్గాలు అంటున్నాయి. వెనువెంటనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏఏఐకి భూమి బదలాయించనున్నారు. విమానాశ్రయం పునరుద్ధరణపై ప్రభుత్వ విభాగాల కసరత్తు ఇప్పటికే బిడ్లను పిలిచిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా 949.14 ఎకరాల హద్దులకు డీపీఆర్ కన్సల్టెన్సీ సంస్థల ఆసక్తి ఇది ఫైనల్ కాగానే నివేదికను సిద్ధం చేసి ఏఏఐకి అప్పగింత పాత రోజులు గుర్తొచ్చేలా... కేంద్రం ఉడాన్ పథకం కింద 2022 సెప్టెంబర్లో మామూనూరు విమానాశ్రయాన్ని ఎంపిక చేసింది. నిజాం కాలంలోని ఈ విమానాశ్రయంలో ఎయిర్స్ట్రిప్ అందుబాటులో ఉండేది. అక్కడ 1400 మీటర్ల పొడవైన రన్ వే, గ్లైడర్స్ దిగేందుకు మరో చిన్న రన్ వే ఉంది. ఈ రన్ వే విస్తరణకు అదనంగా 253 ఎకరాల భూమి అవసరం కావడంతో సేకరిస్తున్నారు. మళ్లీ పాత రోజుల్లోలాగానే వరంగల్లో విమానం ఎగిరేలా అధికారులు పునరుద్ధరణ చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వరంగల్ చేరుకోవాలంటే హైదరాబాద్ నుంచి మూడు గంటల ప్రయాణం ఉంటుంది. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో అంతర్జాతీయ వస్త్ర పరిశ్రమ సంస్థల ఏర్పాటు, ఐటీ రంగం విస్తరణ, ఇతర వ్యాపారాల అభివృద్ధితో పాటు పర్యాటకాన్ని మరింత ప్రగతి బాట పట్టించేందుకు ఈ విమానాశ్రయం పునరుద్ధరణ ఎంతగానో ఉపయోగపడనుంది. కరీంనగర్తో పాటు ఖమ్మం, నల్లగొండ జిల్లా ప్రజలకు కూడా ఇది ఉపయోగపడేలా ఆయా మార్గాల్లోని రహదారులను అభివృద్ధి చేస్తున్నారు. మరో రెండేళ్లలో మామూనూరు విమానాశ్రయ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేలా అధికారులు ముందుకెళ్తున్నారు. -
మెరుగైన వైద్యం అందించాలి
గణపురం: వైద్యులు ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని డీఎంహెచ్ఓ మధుసూదన్ అన్నారు. మంగళవారం మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ల్యాబ్ సేవలు ఎలా అందుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. మందులు అందుబాటులో ఉండే విధంగా చూడాలని వైద్యులకు సూచించారు. నిర్లక్ష్యం చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట సిబ్బంది ఉన్నారు. భూపాలపల్లి అర్బన్: రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల తనిఖీల కోసం ఏర్పాటు చేస్తున్న తనిఖీ బృందాల ఏర్పాటును విరమించుకోవాలని డీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్ అశోక్, తిరుపతి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యాశాఖలో ఖాళీగా ఉన్న ఎంఈఓ, డీఈఓ తదితర పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో పనిని మెరుగుపరచడానికి ఉపాధ్యాయులను తరగతి గదులకు పరిమితం చేయాలన్నారు. కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ అనుబంధ దేవాలయం శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కాలసర్ప నివారణ పూజలకు మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. ముందుగా త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యస్నానాలు చేశారు. కాలసర్ప నివారణ పూజలకు భక్తులకు అధికంగా హాజరయ్యారు. అనంతరం స్వామి వారి గర్భగుడిలో ప్రత్యేక అభిషేక పూజలు చేశారు. దీంతో ఆలయ పరిసరాలు, గోదావరితీరాల్లో భక్తుల సందడి నెలకొంది. కాటారం: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్(టీఆర్టీఎఫ్) జిల్లా అధ్యక్షుడు పెండెం మధుసూదన్ డిమాండ్ చేశారు. మండలంలోని పలు పాఠశాలల్లో మంగళవారం టీఆర్టీఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మధుసూదన్ మాట్లాడుతూ స్థానికత ఆధారంగా చేసుకొని 317 జీఓ బాధితులందరికీ న్యాయం జరిగేలా చూడాలన్నారు. కేజీబీవీ, టీజీఎంఎస్ పాఠశాలల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సంఘ సమావేశం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు పరంసింగ్, సమ్మయ్య, సతీశ్కుమార్, హట్కర్ రమేశ్నాయక్, మోహన్రావు, రేపాల వేణుగోపాల్ పాల్గొన్నారు. భూపాలపల్లి రూరల్: నేటినుంచి నవంబర్ 14వ తేదీ వరకు జిల్లాలోని పశువులు, ఆవులు, గేదెలకు గాలికుంటు నివారణ టీకాలు వేయనున్నట్లు జిల్లా, పశు, సంవర్ధక శాఖ అధికారి డాక్టరు కుమారస్వామి అసోడా మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టీకాలు వేసేందుకు 22 వైద్యబృందాలను ఏర్పాటు చేశామన్నారు. వ్యాధి సోకకముందే టీకాలు వేయించడం ద్వారా వ్యాధిని నివారించవచ్చన్నారు. వెంకటాపురం(ఎం): రామప్పలో చేపట్టిన వరల్డ్ హెరిటేజ్ క్యాంపెయిన్ మంగళవారం 7వ రోజుకు చేరింది. ఉదయం యోగ గురువు రాంబాబు వలంటీర్లకు యోగాసనాలు నేర్పించి యోగతో కలిగే ఉపయోగాలను వివరించారు. అనంతరం రామప్ప హరిత హోటల్లో రాష్ట్ర జల వనరుల అభివృద్ది సంస్థ మాజీ చైర్మన్ వీరమల్ల ప్రకాశ్రావు కాకతీయుల గొలుసుకట్టు చెరువులు, వాటి వినియోగంపై వలంటీర్లకు వివరించారు. -
పత్తి పంట పోయింది..!
కాళేశ్వరం: ఎగువన కురిసిన వర్షాలతో మహదేవపూర్ మండలం అన్నారం టు చండ్రుపల్లి మధ్యలోని పంట పొలాలను ఈ ఏడాది గోదావరి బ్యాక్వాటర్ నాలుగుసార్లు ముంచింది. దీంతో పత్తి, వరి, మిర్చి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీనికితోడు అడవి పందులు, కోతులు తిరుగుతూ పంటను నాశనం చేస్తున్నాయి. చండ్రుపల్లికి చెందిన రైతు ఆకుదారి రాజయ్య పత్తి పంట వైరస్ సోకి పూర్తిగా ఎర్రబారిపోయింది. అడవి పందులు పంటను ధ్వంసంచేస్తున్నాయి. మంగళవారం పత్తి చేనులో మేకలు, గొర్రెలను తోలాడు. రూ.లక్షన్నర అప్పు అయిందని ఆవేదన వ్యక్తంచేశాడు. -
ఓసీపీల్లో ఉత్పత్తిని పెంచాలి
భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని ఓపెన్ కాస్ట్లో బొగ్గు ఉత్పత్తిని పెంచాలని సింగరేణి డైరెక్టర్ (పీపీ) వెంకటేశ్వర్లు ఆదేశించారు. ఈ మేరకు ఏరియాలోని కేటీకే ఓపెన్ కాస్ట్–2,3 ప్రాజెక్ట్లను డైరెక్టర్ మంగళవారం సందర్శించారు. అనంతరం జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్హాల్లో ఏరియా జీఎం రాజేశ్వర్రెడ్డితో కలిసి డైరెక్టర్ ఓపీఆర్ కాంట్రాక్టర్లు, డైరెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ప్రాజెక్ట్ ప్రస్తుత పరిస్థితులు, ఉత్పత్తి లక్ష్యాల సాధనలో ఎదురవుతున్న సవాళ్లపై సమీక్షించారు. వర్షాల కారణంగా గనిలో నిల్వ ఉన్న నీటిని తక్షణమే తొలగించి ఉత్పత్తిని కార్యకలాపాలను వేగంగా పునరుద్ధరించాలని సూచించారు. భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ, సమర్థవంతమైన ఉత్పత్తి కొనసాగించాలన్నారు. అనంతరం ఏరియా అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి 2025–26 ఆర్థిక సంవత్సరం బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలపై సమీక్షించారు. ఈ ఆయా కార్యక్రమాల్లో ప్రాజెక్ట్ మేనేజర్ శ్యామ్సుందర్, మేనేజర్ రామాకాంత్, సీఎంఓ ఏఐ అధ్యక్షుడు నజీర్ పాల్గొన్నారు. -
మృతురాలి కుటుంబానికి మంత్రి పరామర్శ
కాటారం: మండలంలోని ఒడిపిలవంచలో ఇటీవల పిడుగుపాటుతో మృతిచెందిన ఇసునం లక్ష్మి కుటుంబాన్ని మంగళవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పరామర్శించారు. కుటుంబసభ్యులను ఓదార్చి లక్ష్మి మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తంచేశారు. కుటుంబ సభ్యులు అధైర్య పడవద్దని అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ ప్రకృతి వైపరిత్యాలతో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా సహాయం అందించడానికి ప్రభుత్వం, తాము సిద్ధంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు. మంత్రి వెంట కాంగ్రెస్ మండల అద్యక్షుడు వేమునూరి ప్రభాకర్రెడ్డి, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, మాజీ సర్పంచ్ కోడి రవికుమార్, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. -
అందుబాటులోకి కా పాస్ కిసాన్ యాప్..
పత్తి పంట అమ్ముకునే సమయంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం కా పాస్ కిసాన్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రైతులు స్మార్ట్ఫోన్లలో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని తమ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. రైతులు పత్తి విక్రయానికి ముందు ఈ యాప్లో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. రైతులు తమ జిల్లాలో ఏ మిల్లులో అయిన పత్తి అమ్ముకోవడానికి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ అనంతరం సదరు మిల్లులో విక్రయాలకు అనుగుణంగా తేది, సమయాన్ని అధికారులు యాప్ ద్వారా రైతుకు తెలియజేస్తారు. రైతులు విక్రయాల కోసం పడిగాపులు కాయకుండా సమయానికి తీసుకెళ్లి పత్తి విక్రయించొచ్చు. ఇప్పటికే యాప్ విధానంపై వ్యవసాయశాఖ ఏఈఓలకు ఉన్నతాధికారులు అవగాహన కల్పించారు. వీరు రైతులకు వివరించనున్నారు. -
వరంగల్కు నేడు సీఎం రేవంత్
సాక్షి ప్రతినిధి, వరంగల్: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బుధవారం వరంగల్ నగరానికి రానున్నారు. కాజీపేటలోని పీజీఆర్ గార్డెన్స్లో జరిగే నర్సంపేట శాసనసభ్యుడు దొంతి మాధవరెడ్డి తల్లి కాంతమ్మ దశదిన కర్మ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ను విడుదల చేశారు. సీఎం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్లోని తన నివాసంనుంచి డా క్టర్ ఎంసీఆర్హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్ హెలిపాడ్కు బయలుదేరుతారు. 12.15 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 1.00 గంటలకు హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలోని హెలిపాడ్కు చేరుకుంటారు. అక్కడినుంచి 1.05 గంటలకు కాజీపేట ప్రశాంత్నగర్లోని పీజీఆర్ గార్డెన్స్కు చేరుకుంటారు. 1.15 – 1.45 గంటల వరకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డిని పరామర్శించి ఆయన తల్లి ‘మాతృయజ్ఞం’ కార్యక్రమంలో పాల్గొంటారు. 1.45 గంటలకు పీజీఆర్ గార్డెన్నుంచి బయలుదేరి 2.00 గంటలకు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు చేరుకుంటారు. అక్కడినుంచి హెలికాప్టర్లో హైదరాబాద్కు తిరుగుపయనమవుతారు. భద్రతా ఏర్పాట్ల పరిశీలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మంగళవారం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ముఖ్య మంత్రి భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, పీజీఆర్ గార్డెన్స్ ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ బృందాలతో తనిఖీలు నిర్వహించారు. సీపీవెంట అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, రెవెన్యూ అధికారి వైవీ గణేష్, ఏసీపీలు పింగిళి ప్రశాంత్రెడ్డి, సత్యనారాయణ తదితరులు ఉన్నారు. మధ్యాహ్నం 1 గంటకు హనుమకొండకు 2 గంటలకు తిరుగు పయనం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని పరామర్శించనున్న సీఎం -
పెద్దపులి.. పంటకు రక్ష!
కాళేశ్వరం: పెద్దపులి పంటకు రక్ష అంటే నిజంగా నమ్మలేకపోతున్నారా! అడవిలో ఉండాల్సిన పెద్దపులి పంటకు రక్షణగా ఉండడం ఏంటి అనుకుంటున్నారా! కాదోండోయ్ పెద్దపులి బొమ్మతో రైతు తన పంటను రక్షించుకుంటున్నాడు. మహదేవపూర్ మండలం చండ్రుపల్లి గ్రామ శివారులోని పంట పొలాలను అడవి పందులు, కోతులు ధ్వంసం చేస్తున్నాయి. దీంతో రైతు బుడే లింగయ్య కొత్తగా ఆలోచన చేశాడు. అచ్చం పెద్దపులిలాగా ఉండే ఓ పెద్దపులి బొమ్మను తన మంచె వద్ద కాపలా కాస్తున్నట్లు పెట్టాడు. ఒక్కోసారి ఒక్కో చోట ఆ బొమ్మను పెట్టి పంటను రక్షించుకోవడానికి నానాపాట్లు పడుతున్నాడు. ప్రభుత్వం అడవి పందులు, కోతుల నుంచి పంటను రక్షించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నాడు. -
కొనుగోళ్లకు సర్వం సిద్ధం
కాటారం: సాగులో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని రైతులు సాగు చేసిన పత్తి చేతికి రావడానికి సమయం ఆసన్నమైంది. జిల్లాలోని పలు మండలాల్లో మొదటి దశలో భాగంగా రైతులు పత్తిని సేకరిస్తున్నారు. రైతులు తమ చేలలో నుంచి సేకరించిన పత్తిని సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ద్వారా కొనుగోలు చేయడానికి మార్కెటింగ్ అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులు ఇప్పటికే సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసే జిన్నింగ్ మిల్లుల్లో వేబ్రిడ్జిలు, కంప్యూటర్లు, ఇతర వసతులను పరిశీలించారు. జిల్లాలో ఈ ఏడాది మూడు మండలాల పరిధిలోని ఐదు జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కేంద్రాలు ఏర్పాటుచేసి పత్తి కొనుగోళ్లు చేయనున్నారు. అందులో జిల్లాకేంద్రంలో ఒకటి, కాటారం మండలంలో రెండు, చిట్యాల మండలంలో రెండు సీసీఐ కేంద్రాలు ఏర్పాటుచేయనున్నారు. ఇప్పటికే సీసీఐకి మార్కెటింగ్ అధికారులు నివేదిక అందించగా అనుమతులు సైతం వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. సీసీఐ ఆదేశాల మేరకు ఈ నెల 23న జిల్లాలోని అన్ని సీసీఐ కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 98,870 ఎకరాల్లో పత్తి సాగు.. జిల్లాలోని 12 మండలాల్లో 98,870 ఎకరాల్లో రైతులు ఈ సీజన్లో పత్తి సాగు చేస్తున్నారు. గతేడాదితో పోల్చుకుంటే పత్తి సాగు విస్తీర్ణం పెరిగింది. 11.80 లక్షల క్వింటాళ్ల మేర దిగుబడి వస్తుందని అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. రైతుల నుంచి వచ్చిన పత్తిని నిబంధనలకు అనుగుణంగా కొనుగోలు చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి దశలో వచ్చే పత్తి కొంత తేమశాతం ఎక్కువగా ఉండి నాసిరకంగా ఉంటుందని సీసీఐ ద్వారా కొనుగోలు చేయడం కష్టతరం అవుతుందని మార్కెటింగ్ శాఖ అధికారులు చెప్పుకొస్తున్నారు. తగ్గనున్న దిగుబడి.. పత్తి చెట్లు ఎదిగే దశలో అధిక వర్షాలు కురవడంతో జిల్లాలో చాలా చోట్ల పత్తి పంట దెబ్బతింది. తెగులు సోకడంతో పాటు వర్షానికి పత్తి కాయలు మురిగిపోవడం, రాలిపోవడంతో దిగుబడిపై అధిక ప్రభావం చూపనుంది. ఎకరాకు పత్తి 10 క్వింటాళ్ల నుంచి 12 క్వింటాళ్లు దిగుబడి రావాల్సి ఉండగా ఐదు నుంచి ఆరు క్వింటాళ్లు సైతం దిగుబడి వచ్చే అవకాశాలు లేవు. దీంతో లక్షలాది రూపాయలు అప్పు చేసి పెట్టుబడి పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి నెలకొంది. దిగుబడి తగ్గితే సీసీఐ పత్తి కొనుగోలు లక్ష్యాన్ని చేరుకోలేకపోవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. పత్తి క్వింటాల్కు రూ.8,110 మద్దతు ధర.. కేంద్ర ప్రభుత్వం పత్తి పంటకు మద్ధతు ధర రూ.8110 ప్రకటించింది. నిబంధనలకు అనుగుణంగా తేమ శాతం 8 ఉన్న పత్తికి మాత్రమే మద్దతు ధర లభించనుంది. అంతకంటే తేమ శాతం ఒకటి ఎక్కువగా ఉంటే మద్ధతు ధర నుండి రూ.81.10 పైసలు తగ్గించి కొనుగోలు చేస్తారు. జిల్లాలోని సీసీఐ కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోళ్లు కొనసాగించేలా చర్యలు తీసుకుంటున్నాం. నిబంధనలకు అనుగుణంగా తేమ శాతం కలిగి ఉన్న పత్తికి మద్ధతు ధర తప్పక అందుతుంది. కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులు ముందుగా స్లాట్ బుకింగ్ చేసుకొని పత్తి విక్రయించాలి. రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి. – ప్రవీణ్రెడ్డి, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఈ నెల 23 నుంచి ప్రారంభం సుమారు 11.80 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి అంచనా -
క్రీడలతో మానసికోల్లాసం
భూపాలపల్లి: క్రీడలతో శారీరక దృఢత్వం పెంపొందడమే కాక మానసికోల్లాసం లభిస్తుందని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టేడియంలో అటవీశాఖ ఆధ్వర్యంలో కాళేశ్వరం జోన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2025ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై సీసీఎఫ్ డాక్టర్ ప్రభాకర్రావు, ఎస్పీ కిరణ్ ఖరేతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతిరోజు క్రీడలు ఆడటం మూలంగా విధుల పట్ల క్రమశిక్షణ, నైతిక విలువలు పెంపొందుతాయని అన్నారు. అనంతరం జోన్ స్థాయి అధికారుల మధ్య వాలీబాల్, క్రికెట్, కబడ్డీ, చెస్, క్యారం, బ్యాడ్మింటన్ క్రీడా పోటీలు నిర్వహించారు. సాయంత్రం పర్యావరణ పరిరక్షణపై నాటకాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, కాళేశ్వరం జోన్ పరిధిలోని ఐదు జిల్లాల డీఎఫ్ఓలు, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు.. ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ఐడీఓసీ కార్యాలయ సమావేశపు హాల్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులతో కలిసి వివిధ గ్రామాల నుంచి వచ్చిన 41 మంది నుంచి దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును ప్రాధాన్యతగా తీసుకోవాలని, సమయానికి చర్యలు తీసుకుని నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, ఆర్డీఓ రవి, అధికారులు పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలి.. జిల్లాలో ప్రభుత్వ శాఖల పనితీరు, విద్యా సంస్థలు, వసతి గృహాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ఐడీఓసీ కార్యాలయంలో వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి శాఖాధికారి ముందస్తు అనుమతి లేకుండా సెలవులలో వెళ్లరాదని సూచించారు. ఏ అధికారి సెలవులో వెళ్లారో, ఫీల్డ్కు వెళ్లారో తెలియడం లేదన్నారు. సిబ్బంది హాజరు సక్రమంగా ఉండేలా ప్రతి అధికారి పటిష్ట పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, ఆర్డీఓ రవి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ నవీన్రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
భూపాలపల్లి అర్బన్: రాష్ట్రస్థాయి రోల్ ప్లే, సైన్స్ డ్రామా పోటీలకు పలువురు విద్యార్థులు ఎంపికై నట్లు జిల్లా సైన్స్ అధికారి బర్ల స్వామి తెలిపారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన జిల్లాస్థాయి రోల్ ప్లే, సైన్స్ డ్రామా పోటీలలో జిల్లాలోని 15 పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారన్నారు. రోల్ప్లే పోటీల్లో ప్రథమ బహుమతి మహదేవపూర్ బాలురు పాఠశాల, ద్వితీయ బహుమతి భూపాలపల్లి ఉన్నత పాఠశాల, తృతీయ బహుమతి సూరారం ఉన్నత పాఠశాల సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు తెలిపారు. సైన్స్ డ్రామాలో ప్రథమ బహుమతి కాటారం ఆదర్శ హైస్కూల్, ద్వితీయ బహుమతి దామెరకుంట టీజీడబ్ల్యూఆర్ఎస్, తృతీయ బహుమతి– మహదేవపూర్ బాలికల ఉన్నత పాఠశాల సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపికై నట్లు వివరించారు. విద్యార్థులు సైన్స్, టెక్నాలజీలో ముందుండాలని, సోషల్ మీడియా, మొబైల్ వినియోగానికి దూరంగా ఉండాలని బర్ల స్వామి తెలిపారు. అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రశంసపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మిప్రసన్న, సీనియర్ ఉపాధ్యాయులు మడక మధు, వివిధ పాఠశాలల గైడ్ టీచర్లు విద్యార్థులు పాల్గొన్నారు. -
పైరవీలు అవసరం లేదు
భూపాలపల్లి: ప్రజలు పైరవీలు, మూడవ వ్యక్తి ప్రమేయం లేకుండా నిర్భయంగా పోలీసుశాఖ సేవలు వినియోగించుకోవాలని ఎస్పీ కిరణ్ ఖరే సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా దివస్ కార్యక్రమం నిర్వహించి వివిధ గ్రామాల నుంచి వచ్చిన 12 మంది నుంచి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజా దివస్కు వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలకు మరింత దగ్గరగా ఉండడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు.ఎస్పీ కిరణ్ ఖరే -
‘సేవ్ పాలపిట్ట’ వాల్పోస్టర్ ఆవిష్కరణ
భూపాలపల్లి అర్బన్: వన్యప్రాణుల వారోత్సవాల సందర్భంగా అటవీ శాఖ ముద్రించిన ‘సేవ్ పాలపిట్ట’ వాల్పోస్టర్ను గ్రీన్ వారియర్ జేవీఎస్ చంద్రశేఖర్తో కలిసి సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి సోమవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. పాలపిట్టలు రోజురోజుకూ అతరించిపోతున్నాయన్నారు. రేడియోషన్తో పాలపిట్టలకు ప్రాణహాని ఉందని తెలిపారు. వన్యప్రాణులు మన పర్యావరణంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. వన్యప్రాణుల ద్వారా పర్యావరణ సమతుల్యత, ప్రకృతి మూల్యాల పరిరక్షణ, దట్టమైన వర్షాలు, వాతావరణ నియంత్రణ వీటివల్ల సాధ్యం అవుతుందని వివరించారు. ప్రతి ఒక్కరు వన్యప్రాణుల సంరక్షణ బాధ్యతగా పరిగణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏరియా పర్సనల్ మేనేజర్ కావూరి మారుతి, పర్యావరణ అధికారి పోషమల్లు పాల్గొన్నారు. -
శిక్షకుల ఎంపికకు దరఖాస్తుల స్వీకరణ
భూపాలపల్లి అర్బన్: సింగరేణి సేవా సమితి ఉచిత వృత్తి శిక్షణ కోర్సులను నేర్పించేందుకు శిక్షకుల ఎంపికకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఏరియా అధికార ప్రతినిధి మారుతి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కంప్యూటర్ (డీటీపీ), మగ్గం వర్క్, స్పోకెన్ ఇంగ్లిషు, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, మల్టీమీడియా, జూట్ బ్యాగ్ల తయారీని నేర్పించాల్సి ఉంటుందన్నారు. ఓసీ ప్రభావిత గ్రామాల మహిళలు టైలరింగ్ కోర్సులు నేర్చుకునేందుకు ఆసక్తి, అర్హత గల వారి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు చెప్పారు. ఈ నెల 25వ తేదీలోపు జీఎం కార్యాలయంలోని పర్సనల్ డిపార్ట్మెంట్ కార్యాలయంలో అర్హత ధృవపత్రాలతో కూడిన దరఖాస్తులను అందించాలని సూచించారు. పలిమెల: పోడు పట్టాలు పొందిన రైతులందరికీ పంట రుణాలు ఇవ్వాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మహదేవపూర్ యూని యన్ బ్యాంక్ మేనేజర్, తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ మేనేజర్లకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ మహదేవపూర్, పలిమల మండలాలకు సంబంధించిన ఆదివాసీ రైతులు అటవీ పట్టా లు పొందినప్పటికీ బ్యాంకుల నుంచి పంట రుణాలు కల్పించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రుణాలు ఇస్తున్నప్పటికీ జిల్లాలో మాత్రమే ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో దమ్మూరు మాజీ ఉపసర్పంచ్ మడే సత్యనారాయణ, సంఘం నాయకులు పెద్ది శేఖర్, రామినేని రాజబాబు, తోలం భిక్షపతి, మేడే సురేష్, జనగామ ముత్తయ్య పాల్గొన్నారు. కాటారం: మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల చిత్రకళ ఉపాధ్యాయుడు ఆడెపు రజనీకాంత్కు అరుదైన గౌరవం దక్కింది. ఆయన తయారు చేసిన సూక్ష్మ కళాకృతులకు గుర్తింపుగా అత్యంత ప్రముఖమైన క్రెడెన్స్ బుక్ ఆఫ్ వరల్డ్లో చోటు దక్కింది. 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పెన్సిల్ గ్రాఫైట్పై 0.4 మిల్లీమీటర్ల ఎత్తు 0.2 మిల్లీమీటర్ల వెడల్పు ఉన్న ప్రపంచంలోనే అతి చిన్న జాతీయ పతాకాన్ని సుమారు గంట పాటు శ్రమించి రజనీకాంత్ తయారు చేశారు. క్రెడిట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు వికాస్ బొండవే, పునీత్ మాదన్ సూక్ష్మ ఆకృతిని గుర్తించి రజనీకాంత్కు ఈ మెయిల్ ద్వారా సమాచారం అందించారు. ఇంతకుముందు రజనీకాంత్ రెండు బుక్ ఆఫ్ స్టేట్ రికార్డులు, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డులతో పాటు అంతర్జాతీయ జాతీయ అవార్డులను కూడా సాధించారు. క్రెడిట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో చోటు దక్కించుకున్న రజనీకాంత్ను ప్రిన్సిపాల్ రాజేందర్, వైస్ ప్రిన్సిపాల్ మాధవి, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ వెంకటయ్య, వార్డెన్ బలరాం, ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు. వెంకటాపురం(ఎం): 13వ శతాబ్దంలోనే కాకతీయులు ట్రిపుల్ టీ (టౌన్, టెంపుల్, ట్యాంక్) విధానాన్ని అనుసరించారని ప్రొఫెసర్ పాండురంగారావు వలంటీర్లకు వివరించారు. మండల పరిధిలోని రామప్పలో జరుగుతున్న వరల్డ్ హెరిటేజ్ క్యాంపెయిన్ సోమవారం 6వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన ట్రిపుల్ టీ విధానంపై పలు వివరాలను తెలియజేశారు. అనంతరం డాక్టర్ సత్యనారాయణ రామప్ప ప్రాంత చరిత్ర, ఈ ప్రాంత ప్రజల జీవన విధానం, సాంస్కృతిక వైవిధ్యం గురించి వివరించారు. ప్రొఫెసర్ సీతారాములు స్ట్రెస్ ఎనాలిసిస్ ఆన్ హెరిటేజ్ స్ట్రక్షర్స్ ఎలా చేయాలో వివరించారు. అనంతరం పాండవుల గుట్ట, వేయి స్తంభాల గుడి, వరంగల్ కోటలో తెలుసుకున్న అంశాలను పవర్ పాయింట్ ద్వారా వలంటీర్లకు వివరించారు. ఈ కార్యక్రమంలో క్యాంపు కో ఆర్డినేటర్ శ్రీధర్రావు పాల్గొన్నారు. -
పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
రేగొండ: పోషక విలువలు గల ఆహారం తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి మల్లీశ్వరి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని రైతువేదికలో ఐసీడీఎస్ సూపర్వైజర్లు సంధ్య, సుజాత ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లీశ్వరి మాట్లాడుతూ.. పోషకాహార లోపం సమాజాభివృద్ధికి అడ్డంకిగా మారిందన్నారు. అంగన్వాడీ టీచర్లు బాలింతలు, గర్భిణులకు ఆరోగ్యకరమైన ఆహారం ప్రాముఖ్యతను తెలియజేయాలన్నారు. పోషణలోపం లేని సమాజం నిర్మించడానికి కృషి చేయాలని తెలిపారు. అనంతరం పిల్లలకు అక్షరాభ్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్వేత, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి మల్లీశ్వరి -
టెన్త్పై ఫోకస్
చిట్యాల ఉన్నత పాఠశాలలో ప్రత్యేక తరగతులను పరిశీలిస్తున్న డీఈఓ రాజేందర్ భూపాలపల్లి అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో ఉండే విధంగా జిల్లా విద్యాశాఖ అఽధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. గతేడాది జిల్లా పదో తరగతి ఫలితాల్లో వెనుకబడిపోయింది. జిల్లాలోని 10వ తరగతి విద్యార్థులకు సాయంత్రం ప్రత్యేక తరగతుల నిర్వహణను వారం రోజుల క్రితం నుంచి ప్రారంభించారు. 3,600మంది విద్యార్థులు జిల్లాలోని 12 మండలాల్లోని 157 ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత పాఠశాలల్లో 3,600 మంది పదో తరగతి విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రత్యేక తరగతు ల కార్యాచరణ ప్రణాళికలను జిల్లా ఇన్చా ర్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ తయారు చేసి పా ఠశాలల ప్రధానోపాధ్యాయులకు పంపించారు. ఫలితాల్లో జిల్లాను రాష్ట్రంలో ముందంజలో ఉంచాలని అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ప్రతీ రోజు అదనంగా గంట పాటు ప్రతి రోజు సాయంత్రం 4.15గంటల నుంచి 5.15 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక తరగతులను నిర్వహణను మండల విద్యాశాఖ అఽధికారులు, సెక్టోరియల్ అధికారులు పర్యవేక్షణ చేసి ప్రగతిని డీఈఓకు అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కూడా విద్యార్థుల సామర్ాధ్యలను అందజేయాల్సి ఉంటుంది. ప్రతి రోజు పాఠాల బోధనతో పాటు స్లిప్ టెస్టులు పెడుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోని ప్రతి విద్యార్థి పాస్ కావాలి. పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి. రాష్ట్రంలో ప్రఽథమ స్థానం సాధించడానికి ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక తరగతుల కార్యాచరణ ప్రణాళికలను కచ్చితంగా కట్టుదిట్టంగా అమలు చేయాలి. విద్యార్థులకు అన్ని సబ్జెక్టులపై పూర్తిస్థాయి పాఠాలు నేర్పించి వారి అనుమానాలను నివృత్తి చేయాలి. పక్కా ప్రణాళికలతో ప్రతి రోజు గంట పాటు అదనంగా చదివిస్తున్నాం. – రాజేందర్, ఇన్చార్జ్ డీఈఓపదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక శ్రద్ధ సాయంత్రం అదనపు క్లాసుల నిర్వహణ డిసెంబర్ 31వ తేదీ వరకు విద్యార్థులకు సిలబస్ను పూర్తిచేయాలి ప్రత్యేక తరగతుల నిర్వహణ సమయంలో సంబందిత ఉపాధ్యాయుడికి సెలవు మంజూరు చేయవద్దు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రధానోపాధ్యాయులు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలి. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ప్రతి అధ్యాయం పున:శ్చరణ చేయాలి. పరీక్ష మార్గదర్శకాలకు అనుగణంగా పాఠశాల స్థాయిలో పరీక్ష పత్రాలను తయారు చేయాలి. షెడ్యూల్ ప్రకారం విద్యార్థులకు స్లిప్ టెస్టులు నిర్వహించాలి చదువులో వెనుకబడిన పిల్లలకు సవరణాత్మక బోధన చేయాలి. ఉపాధ్యాయులు వెనుకబడిన విద్యార్థులను గుర్తించి దత్తత చేసుకోవాలి. తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థుల సామర్ధ్యాలను తల్లిదండ్రులకు తెలియజేయాలి. -
మెరుగైన పాలన అందించడమే లక్ష్యం
భూపాలపల్లి: ప్రజలకు మెరుగైన పాలన అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని ఏఐసీసీ పరిశీలకుడు జాన్సన్ అబ్రహం అన్నారు. సోమవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్ష పదవి ఎన్నిక కోసం జిల్లాలోని పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. డీసీసీ అధ్యక్ష పీఠం ఆశిస్తున్న వారి గురించి అభిప్రాయాలు సేకరించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాన్సన్ అబ్రహం మాట్లాడుతూ.. సంఘటన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమ లక్ష్యం కాంగ్రెస్ కమిటీలను బలోపేతం చేయడమేనన్నారు. అన్ని వర్గాలకు నాయకత్వ అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా తమ పార్టీ పని చేస్తుందని తెలిపారు. ప్రజా సమస్యల పట్ల అవగాహన కలిగిన నాయకుడినే జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకుంటామని వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్యే సత్యనారాయణరావు మాట్లాడుతూ.. రాహుల్గాంధీకి రెండు పర్యాయాలు పీఎంగా అవకాశం వచ్చినా, పదవిని వదిలేసి ఆ స్థానంలో సుముచితులైన వారికి కూర్చోబెట్టారన్నారు. 2029లో దోపిడీ దొంగల నుంచి ఈ దేశానికి విముక్తి కలిగేలా ప్రజలు తీర్పు ఇవ్వాలని కోరారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ వస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా అబ్జర్వర్ అఫ్సర్ జాసువి, సాగరికారావు, నాగేందర్రెడ్డి, పీసీసీ కోఆర్డినేటర్ సుబ్బారావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.ఏఐసీసీ పరిశీలకుడు జాన్సన్ అబ్రహం -
సారూ.. ఇంకెప్పుడిస్తారు?
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధి భాస్కర్గడ్డ సమీపంలో 2019లో బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించి 2023లో పనులు పూర్తిచేసింది. అప్పటి పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవం చేసి లబ్ధిదారులను ఎంపిక చేశారు. అనంతరం ఎన్నికల కోడ్ రావడంతో పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారుల జాబితాలో అవకతవకలు జరిగాయని రద్దు చేసింది. సర్వే చేసి లబ్ధిదారుల ఎంపిక చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారులను ఆదేశించారు. అధికారులు సర్వేల పేరుతోనే రెండేళ్లుగా కాలయాపన చేస్తున్నారే తప్పా లబ్ధిదారుల ఎంపిక మాత్రం చేయడం లేదు. దీంతో గదుల్లోని విద్యుత్ వైర్లు, బోర్డులు, డోర్లు, పైపులు గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. కిటికీల అద్దాలు, వంట గదుల్లో గ్యాస్ బండలు పగులగొట్టారు. పలు చోట్ల గోడలు కూడా పగుళ్లు పడుతున్నాయి. ఆకతాయిలు మద్యం తాగి ఖాళీ సీసాలు పడేస్తున్నారు. పంపిణీకి నోచుకోని భాస్కర్గడ్డ డబుల్ బెడ్రూం ఇళ్లు ● సర్వేల పేరుతో కాలయాపన ● ఆకతాయిలకు అడ్డాగా మారిన గృహాలు -
డీసీసీ పీఠం కోసం దరఖాస్తుల వెల్లువ
భూపాలపల్లి: కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష(డీసీసీ) పదవి కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని 12 మండలాల నుంచి పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న వారు జిల్లా అధ్యక్ష పదవి కోసం దరఖాస్తులు సమర్పిస్తున్నారు. ఇప్పటివరకు మాజీ మావోయిస్టు గాదర్ల అశోక్ అలియాస్ ఐతు, రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్రెడ్డితో పాటు చల్లూరి మధు, ఇస్లావత్ దేవన్, మండల తిరుపతిగౌడ్, పిప్పాల రాజేందర్, మొకిరాల మధువంశీక్రిష్ణ, క్యాతరాజు సాంబమూర్తి, అప్పం కిషన్, దబ్బెట రమేష్, గద్దె సమ్మయ్య, గూట్ల తిరుపతి డీసీసీ పీఠం కోసం దరఖాస్తులు అందజేశారు. డీసీసీ అధ్యక్ష ఎన్నిక కోసం పార్టీ అధిష్టానం నియమించిన టీపీసీసీ పరిశీలకుడు జాన్సన్ అబ్రహం ఆదివారం సాయంత్రం భూపాలపల్లికి వచ్చారు. సోమవారం పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు తీసుకోనున్నారు. జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల అబీష్టం మేరకు మాజీ మావోయిస్టు గాదర్ల అశోక్కు డీసీసీ పదవి అప్పగించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. -
బీసీలకు సముచిత స్థానం కల్పించాలి
మొగుళ్లపల్లి: డీసీసీ అధ్యక్షుల నియామకాల్లో జనాభా ప్రాతిపదికన బీసీలకు సముచిత స్థానం కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను కాంగ్రెస్ పార్టీ అమలుచేయాలన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాల్లోనూ బీసీలకు జనాభా దామాషా ప్రకారం పదవులు కట్టబెట్టాలని చెప్పారు. బీసీలకు సముచిత స్థానం కల్పించి మాట నిలుపుకోవాలని కోరారు. పాండవుల గుహలను సందర్శించిన విద్యార్థులు రేగొండ: వరల్డ్ హెరిటేజ్ వాలంటీర్స్ క్యాంపునకు వచ్చిన విద్యార్థులు ఆదివారం మండలంలోని పాండవుల గుహలను సందర్శించారు. పాండవుల గుట్టకు ఉన్న చారిత్రక ప్రాధాన్యతను అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ అధికారి డాక్టర్ కుసుమ సూర్య కిరణ్ విద్యార్థులకు వివరించారు. అనంతరం పాండవుల గుహలలోని పలు ప్రదేశాలను తిలకించారు. మందుబాబులకు అడ్డాగా పాఠశాల భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మహబూబ్పల్లి ప్రాథమిక పాఠశాల రాత్రి సమయంలో మందుబాబులకు అడ్డాగా మారుతుంది. పాఠశాలకు గేటు లేకపోవడం, ప్రహరీ ఓ మూలన కూలిపోవడంతో రాత్రి సమయాల్లో పాఠశాలలోనే మందుబాబులు మద్యం సేవిస్తున్నారు. పశువులు సైతం వస్తున్నాయి. పాఠశాలకు గేటుతో పాటు కూలిపోయిన ప్రహరీని నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కేసులు టేకుమట్ల: ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని ఎస్సై దాసరి సుధాకర్ అన్నారు. శనివారం రాత్రి మండంలోని ఎంపేడు, రామకిష్టాపూర్(వి) చలివాగు, మా నేరు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్నట్లు చెప్పారు. ట్రాక్టర్ డ్రైవర్లు ఉడుత వెంకటేష్, రొంట్ల అవినాష్రెడ్డి, అప్పని రమేష్పై ఆదివారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై దాసరి సుధాకర్ తెలిపారు. కుంటుపడుతున్న అభివృద్ధి భూపాలపల్లి అర్బన్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతుందని సీపీఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల పదవీ కాలం పూర్తయి సుమారు రెండు సంవత్సరాలు గడుస్తుందన్నారు. దీంతో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్లడం అనేది కాలయాపన తప్ప మరేం లేదన్నారు. ఈ సమావేశంలో సీపీఐ నాయకులు ప్రవీణ్ కుమార్, సతీష్, సుగుణ, శ్రీనివాస్, జోసెఫ్, లావణ్య ,మహేశ్, రవికాంత్ పాల్గొన్నారు. -
కారాఘోరం!
సాక్షిప్రతినిధి, వరంగల్: ● వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన పెండ్యాల సుచరిత (36) సబ్జైలులో రిమాండ్ ఖైదీగా ఉండి మృతి చెందారు. సుబేదారి పోలీస్స్టేషన్లో నమోదైన ఓ కేసులో ఆమెను ఆగస్టు 13న నర్సంపేట సబ్ జైలుకు తరలించారు. సబ్జైలులో అనారోగ్యానికి గురైన ఆమెను నర్సంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆగస్టు 21న మృతి చెందింది.● జనగామ సబ్జైలులో ఆత్మహత్యాయత్నం చేసిన ఓ ఖైదీ వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగారాజుపల్లికి చెందిన వరాల మల్లేశ్ (42) హత్యాయత్నం కేసులో జనగామ సబ్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. శనివారం అర్ధరాత్రి మల్లేశ్ నీటిలో బ్లీచింగ్ పౌడర్ కలుపుకుని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన అధికారులు ఖైదీని వరంగల్లోని ఎంజీఎం దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ...ఖైదీల్లో పరివర్తన తీసుకురావాల్సిన కారాగారాలు సహజ మరణాలు, ఆత్మహత్యలకు వేదికలవుతున్నాయి. నేరాలు, నేరస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండగా.. ఓ వైపు జైళ్ల కుదింపు, మరోవైపు విచారణలు, శిక్షలు, విడుదల లేక ఖైదీలతో కారాగారాలు కిటకిటలాడుతున్నాయి. కౌన్సెలింగ్ ఇవ్వాల్సిన అధికారులు సబ్జైళ్లలో రకరకాల పనులు చేయిస్తూ వేధిస్తుండడమే ఖైదీల మృతికి కారణంగా చెబుతున్నారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే జైళ్లలో ఖైదీలకు ఆత్మహత్యకు కారకాలయ్యే వస్తువులను దూరంగా సిబ్బంది ఉంచాలి. వాటిపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఖైదీల ఆత్మహత్యాయత్నం ఘటనలు పునరావృతం అవుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. అయితే, జైలులో అంతా నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే సామర్థ్యానికి మించి జిల్లా, సబ్జైళ్లలో ఖైదీలను ఉంచి.. ఆ మేరకు బడ్జెట్, సౌకర్యాలు, అధికారులు, సిబ్బంది లేక నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతోందన్న చర్చ జరుగుతోంది. సిబ్బంది, ఎస్కార్ట్ కొరతతో నెలల తరబడి విచారణలు వాయిదా పడి జైళ్లనుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. ఫలితంగా జిల్లా, సబ్జైళ్లలో ఓ వైపు సహజ మరణాలు, మరోవైపు ఆత్మహత్యాయత్నాలు, ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయన్న చర్చ జరుగుతోంది. ఖైదీలు పెరుగుతున్నా.. మారని పరిస్థితులు ఖైదీల సంఖ్య పెరుగుతున్నా.. అందుకు అనుగుణంగా జైళ్ల పరిస్థితి మారడం లేదు. నేషనల్ క్రైం రికార్డు బ్యూరో (ఎన్సీఆర్బీ) ఇటీవల విడుదల చేసిన ‘ప్రిజన్ స్టాటిస్టిక్స్ ఇండియా–2023’లో ఇవే అంశాలను ప్రస్తావించింది. ఈ లెక్కల ప్రకారం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మెరుగే అయినప్పటికీ.. రాష్ట్రంలో అన్ని రకాల జైళ్లు కలిపి 50 ఉండగా.. అన్నింట్లో సామర్థ్యాన్ని మించి ఖైదీలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్లో వరంగల్ సెంట్రల్ జైలుతోపాటు పరకాల, జనగామ, మహబూబాబాద్, నర్సంపేట సబ్జైళ్లలో కలిపి సుమారు 680 మంది ఖైదీలు ఉండాలి. వరంగల్ సెంట్రల్ జైలు కూల్చివేసే నాటికి ఒక్క ఆ జైలులోనే వెయ్యి మంది వరకు ఉన్నట్లు రికార్డులున్నాయి. 2021లో సెంట్రల్ జైలు ఎత్తివేయగా.. నర్సంపేట సబ్జైలును కూడా రద్దు చేశారు. వీటి స్థానంలో మామునూరు ఒక ఓపెన్ ఎయిర్ జైలును ప్రతిపాదించారు. నర్సంపేట సబ్జైలు స్థానంలో మహిళల ప్రత్యేక జైలు ఏర్పాటు చేశారు. జనగామ, మహబూబాబాద్, నర్సంపేట, పరకాలతోపాటు ఓపెన్ ఎయిర్ జైలు కలిపితే.. వాటిలో ఖైదీల సామర్థ్యం 50 నుంచి 80 లోపలే. ఆమేరకు పెట్టుకుని ఇతర ఖైదీలను ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, హైదరాబాద్ జైళ్లకు తరలించాల్సి ఉండగా.. ఉమ్మడి వరంగల్లోని పోలీస్స్టేషన్లలో నమోదైన వివిధ కేసుల్లో విచారణ ఖైదీలు, శిక్షలు పడిన వారు సుమారు 300 మంది జిల్లాల్లోని జైళ్లలోనే ఉంటుండడంతో అవి కిక్కిరిసిపోతున్నాయి. వాంతులు, విరేచనాలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, ముందుగా ఉన్న దీర్ఘకాలిక వ్యాధులు ఖైదీల మరణానికి కారణం కావొచ్చు. జైలులో సరైన వైద్య సంరక్షణ అందుబాటులో లేకపోతే చిన్న ఆరోగ్య సమస్యలు కూడా తీవ్రమై ప్రాణాంతకంగా మారుతాయి. జైలులోని ఒత్తిడితో కూడిన వాతావరణం కూడా ఖైదీల ఆరోగ్య పరిస్థితిని క్షీణింపజేసి మరణానికి దారితీస్తుంది. అయితే, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా ఇవి తేలుతాయి. – డాక్టర్ కేశవులు, మానసిక వైద్య నిపుణుడు జైళ్ల కుదింపుతో ఇబ్బడిముబ్బడిగా విచారణ ఖైదీలు కరువైన ఉన్నతాధికారుల పర్యవేక్షణ సంచలనంగా జనగామ సబ్జైలు ఖైదీ ఆత్మహత్య..సబ్జైలులో సహజ మరణాలకు అనారోగ్యమే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ముందుగా ఉన్న ఆరోగ్య సమస్యలు, జైలులో సరైన వైద్య సంరక్షణ లేకపోవడం, జైలు వాతావరణం వల్ల వచ్చే ఒత్తిడి వంటి కారణాల వల్ల మరణాలు తరచూ సంభవిస్తాయంటున్నారు. జైలు, పోలీసు కస్టడీలో మరణాలకు గుండె జబ్బుల వంటివి సాధారణంగా కనిపిస్తాయని వైద్య నిపుణుల అభిప్రాయం. -
మద్యం సిండికేటు
ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో ఏ4 వైన్స్ 59భూపాలపల్లి: మద్యం వ్యాపారులు ‘సిండికేటు’ అయ్యారు. గతంలో షాపులను దక్కించుకున్న వారు తిరిగి రంగంలో ఉండేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు గ్రూపుగా ఏర్పడి ఇతరులు దరఖాస్తులు చేసుకోకుండా తమవంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. రెండు జిల్లాల్లో 29 దరఖాస్తులే.. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని 59 మద్యం షాపులకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. గత నెల 26వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుండగా శనివారం సాయంత్రం వరకు కేవలం 29 అప్లికేషన్లు మాత్రమే అందాయి. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల్లో అత్యధికంగా భూపాలపల్లి సర్కిల్కు రాగా అత్యల్పంగా ఏటూరునాగారం, ములుగుకు వచ్చాయి. భూపాలపల్లిలో సిండికేటుకు యత్నాలు.. భూపాలపల్లి జిల్లాలోని 12 మండలాల్లో 30 ఏ4 మద్యం షాపులకు ఎకై ్సజ్ అధికారులు టెండర్లు ఆహ్వానించారు. ఇక్కడ గతంలో షాపులను దక్కించుకున్న, మద్యం డాన్లుగా పేరొందిన వారు తిరిగి షాపులను దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఒక్కో వ్యాపారి 50 నుంచి 100కు పైగా దరఖాస్తులు సమర్పించగా, ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బంది ఎదుర్కోకుండా సులువుగా షాపులను దక్కించుకునేందుకు సిండికేటుగా ఏర్పడి అప్లికేషన్లు వేయనున్నట్లు సమాచారం. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రంగంలోకి రియల్టర్లు.. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో రియల్ ఎస్టేట్ రంగం పడిపోవడంతో రియల్టర్లంతా మద్యం వ్యాపారంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. భూపాలపల్లి, ములుగు జిల్లా కేంద్రంతో పాటు ఇతర జిల్లాలకు చెందిన రియల్టర్లు ఇక్కడి మద్యం షాపుల కోసం దరఖాస్తులు సమర్పించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి వారు సిండికేటు కావడంతో సమాలోచనలో ఉన్నట్లు సమాచారం. ములుగులో పెరిగే అవకాశం.. ములుగు జిల్లాలో మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర, బొగత తదితర ప్రాంతాలు ప్రస్తుతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతున్నాయి. దీంతో ఇక్కడి మద్యం షాపులకు ఈసారి డిమాండ్ ఏర్పడనుంది. దీంతో ములుగు, ఏటూరునాగారం సర్కిల్ పరిధిలోని మద్యం షాపులకు అప్లికేషన్లు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఎకై ్సజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. రూ.300 అభిషేకం పూజలుషాపుల కోసం పాత వ్యాపారుల ఎత్తుగడలు సిండికేటుగా ఏర్పడి దక్కించుకునేందుకు యత్నాలు శనివారం వరకు కేవలం 29 దరఖాస్తులు -
ఉద్యోగాల ఎగవేతకు కుట్రలు
భూపాలపల్లి అర్బన్: సింగరేణి కారుణ్య నియామకాలు చేపట్టకుండా సింగరేణి యాజమాన్యం ఉద్యోగుల ఎగవేతకు కుట్రలు పన్నుతుందని బీఎంఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ ఆరోపించారు. ఏరియాలోని బీఎంఎస్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడారు. దేశంలో బొగ్గు గని కార్మికులకు దీపావళి పీఎల్ఆర్ బోనస్ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెంచినట్లు చెప్పారు. మెడికల్ బోర్డు ఉద్యోగాల జాప్యం ఎందుకు జరుగుతుందో సింగరేణి యాజమాన్యం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హక్కులను బొందపెట్టాలని సింగరేణి, రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నట్లు స్పష్టంగా కనబడుతోందన్నారు. సింగరేణిలో కార్మికులు అన్ఫిట్ అవుతున్నా వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. గుర్తింపు, ప్రాతినిథ్య సంఘాలు యాజమాన్యం, ప్రభుత్వానికి లొంగుబాటు వైఖరి అవలంబిస్తున్నాయన్నారు. ఈ సమావేశంలో నాయకులు సుజేందర్, రాసాకట్ల నర్సింగరావు, శంకర్, నారాయణ, మల్లేష్, రాజు, భాస్కర్ పాల్గొన్నారు. -
కంకరతేలి గుంతలమయంగా..
రేగొండ మండల పరిధిలోని బాగిర్థిపేట, కనిపర్తి, కొత్తపల్లిగోరి మండలంలోని వెంకటేశ్వర్లపల్లి, కోనరావుపేట, దామరంచపల్లి, గాంధీనగర్ బీటీ రోడ్డు అధ్వానంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు కంకర తేలి పెద్ద, పెద్ద గుంతలు తయారయ్యాయి. ఈ రహదారి గుండా ప్రయాణిస్తున్న వాహనదారులు గుంతల్లో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు, పాలకులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. – రేగొండ కంకర తేలిన వెంకటేశ్వర్లపల్లి, కోనరావుపేట రహదారి -
బాలలు హక్కులను తెలుసుకోవాలి
భూపాలపల్లి అర్బన్: బాలలు హక్కులను తెలుసుకొని వాటిని సాధించుకోవాలని జూనియర్ సివిల్ జడ్జి ఎస్ఆర్ దిలీప్కుమార్ నాయక్ తెలిపారు. జిల్లాకేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో శనివారం అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జూనియర్ సివిల్ జడ్జి హాజరై మాట్లాడారు. భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కులను విద్యార్థులు తెలుసుకోవాలన్నారు. రాష్ట్రపతి ద్రౌపతిముర్మును ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. బాల్య వివాహాలకు దూరంగా ఉండాలన్నారు. బాలికలు నేడు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారని, జీవితంలో ఉన్నత శిఖరాలను అవరోధించాలని ఆకాంక్షించారు. సమాజంలో పాతుకుపోయిన దురాచారా లను అధిగమించి ముందుకు సాగాలని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జీపీ సుధాకర్, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసచారి, శ్రావణ్రావు, ఎస్ఓ ఈశ్వరి, న్యాయవాదులు పాల్గొన్నారు. జూనియర్ సివిల్ జడ్జి దిలీప్కుమార్ నాయక్ -
పత్తి కొనుగోళ్లు సక్రమంగా సాగేలా చర్యలు
● మార్కెట్ చైర్పర్సన్ పంతకాని తిరుమలకాటారం: సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు సక్రమంగా సాగేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పంతకాని తిరుమల అన్నారు. కాటారం మండల కేంద్రంలో ఏఎంసీ ఆవరణలో పత్తి విక్రయాల్లో రైతులు పాటించాల్సిన సూచనలు తెలియజేస్తూ ముద్రించిన పోస్టర్ను శనివారం ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తిరుమల మాట్లాడుతూ ఈ నెల చివరి వారంలో పత్తి కొనుగోళ్లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులు పత్తి విక్రయాలకు సంబంధించి పలు సూచనలు పాటించాలని తెలిపారు. రైతులు విక్రయానికి ముందు కపాస్ కిసాన్ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకొని స్లాట్ బుక్ చేసుకోవాలని దీని ద్వారా తమ ఇష్టమైన మిల్లుకు పత్తి విక్రయించడానికి సౌలభ్యంగా ఉంటుందని తెలిపారు. రైతులు తాము వినియోగించే ఖాతాకు ఆధార్లింకు చేసుకోవాలని సూచించారు. పత్తికి మద్దతు ధర క్వింటాల్కు రూ.8110 ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. అనంతరం ఏఎంసీ కార్యాలయంలో ధన్ ధాన్య కృషి యోజన పథకం ప్రారంభోత్సవ వీడియో కాన్ఫరెన్స్లో చైర్పర్సన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ కార్యదర్శి లా షరీఫ్, ఏఎంసీ డైరెక్టర్ రమేశ్, ఆత్మకూరు కుమార్యాదవ్, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కాలసర్ప, శని పూజలకు భక్తుల రద్దీ
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ అనుబంధ దేవాలయంలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కాలసర్ప నివారణ, నవగ్రహాల వద్ద శనిపూజలకు శనివారం భక్తుల రద్దీ నెలకొంది. ముందుగా భక్తులు త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యస్నానాలు చేసి కాలసర్ప, శని పూజలను నిర్వహించారు. అనంతరం స్వామివారి గర్భగుడిలో అభిషేక పూజలు నిర్వహించారు. దీంతో ఆలయ పరిసరాల్లో భక్తుల సందడి కనిపించింది. ఎయిడ్స్పై అవగాహన ర్యాలీ భూపాలపల్లి అర్బన్: హెచ్ఐవీ, ఎయిడ్స్పై అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్యారోగ్యశాఖ, దిశ ములుగు ఆధ్వర్యంలో శనివారం భూపాలపల్లి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక పీహెచ్సీ నుంచి అంబేడ్కర్ సెంటర్ మీదుగా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎయిడ్స్ ప్రోగ్రాం అధికారిణి డాక్టర్ ఉమాదేవి హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన సమావేశానికి ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఉమాదేవి, ఆస్పత్రి ఆర్ఎంఓలు డాక్టర్ దివ్య, డాక్టర్ రాజేష్, దిశ క్లస్టర్ మేనేజర్ జ్యోతి, మారి సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ సదానందం హాజరై వాల్పోస్టర్ ఆవిష్కరించారు. ఆస్పత్రికి వచ్చిన రోగులకు ఎయిడ్స్పై అవగాహన కల్పించారు. 2030 సంవత్సరం నాటికి హెచ్ఐవీ, ఎయిడ్స్ నియంత్రించడంలో భాగంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్యశాఖ సిబ్బంది, మారి సంస్థ కార్యకర్తలు పాల్గొన్నారు. టిప్పర్ యజమానుల సమ్మె భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని బొగ్గు రవాణా చేస్తున్న టిప్పర్లకు రవాణా చార్జీలు పెంచాలని కోరుతూ.. టిప్పర్ యాజమానులు సమ్మె చేపడుతున్నారు. ఈ మేరకు శనివారం కోల్ ట్రాన్స్ఫోర్ట్ టిప్పర్ ఓనర్స్, వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భూపాలపల్లి ఏరియాలోని ఓసీపీ–2,3, తాడిచర్ల ఓపెన్ కాస్టుల వద్ద టిప్పర్లను అడ్డుకొని డ్రైవర్లకు గులాబీ పువ్వు అందించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు రొడ్డ రవీందర్ మాట్లాడుతూ.. భూపాలపల్లి నుంచి కేటీపీపీ, ఉప్పల్ బొగ్గు రవాణాకు పాత ధరలు గిట్టుబాటు కావడం లేదని తెలిపారు. నూతనంగా ప్రతి టన్నుకు రూ.110, 120, 300 పెంచాలని కోరారు. దీనిపై పది రోజుల క్రితమే కోల్ ట్రాన్స్పోర్టర్లకు సమ్మె నోటీసు అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి ప్రభాకర్, మహేందర్, రాకేష్, నర్సయ్య, లక్ష్మయ్య, రాములు, శ్రీరాములు, నర్సింహరెడ్డి, అశోక్, తిరుపతి పాల్గొన్నారు. రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్ వెంకటాపురం(ఎం): రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్గా ఉందని జర్మనీకి చెందిన డానియల్, వోలివా, సారియా కొనియాడారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామప్ప దేవాలయాన్ని వారు శనివారం సందర్శించి రామప్ప రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ బాగుందని కొనియాడారు. అదేవిధంగా ఇంగ్లండ్కు చెందిన జొనాతన్ డేవిస్ సందర్శించగా రామప్ప ఆలయ విశిష్టత గురించి గైడ్ వెంకటేశ్ ఆయనకు వివరించారు. -
వంట వండేదెట్ల..?
● మధ్యాహ్న భోజన నిర్వాహకుల అవస్థలు ● నిలిచిన బిల్లులు.. పెరిగిన ధరలు ● అప్పులు చేసి నెట్టుకొస్తున్న ఏజెన్సీలు కాటారం: నెల నెలా సక్రమంగా బిల్లులు అందకపోవడం.. నిత్యావసర సరుకులు, కోడిగుడ్ల ధరలు పెరగడంలో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు చేసి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. పెరిగిన కూరగాయలు, గుడ్లు, పప్పు దినుసులు, వంట చెరుకు, గ్యాస్ ధరలతో తమపై అధిక మొత్తంలో ఆర్థికభారం పడుతుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. నాలుగు నెలలుగా నిలిచిన బిల్లులు.. జిల్లాలో 12 మండలాల్లో మొత్తం 432 పాఠశాలలు ఉన్నాయి. విద్యార్థులకు భోజనం పెట్టేందుకు ఒక పాఠశాలకు నెలకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా సుమారు రూ.లక్ష నుంచి రూ. 1.50 లక్షల వరకు వ్యయం అవుతుంది. ఇలా జిల్లాలో ఇప్పటి వరకు మధ్యాహ్న భోజన నిర్వాహకులకు ఒక్కో నెలకు సంబంధించి సుమారు రూ.46 లక్షల వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తుంది. నాలుగు నెలలకు సంబంధించి కోటి 84లక్షల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించిన బిల్లులు అందలేదని నిర్వాహకులు చెబుతున్నారు. లక్షల్లో బిల్లులు పెండింగ్లో ఉండటంతో ఏజెన్సీల మహిళలు ఏమి చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. బిల్లులు నెలవారీగా రాకపోవడం కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు, విపరీతంగా పెరిగిపోవడంతో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ కష్టతరంగా మారుతుందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరలు.. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణకు సన్నబియ్యం పౌరపరఫరాల శాఖ నుంచి సరఫరా చేస్తుండగా.. ఇతర సామగ్రి నిర్వాహకులు సమకూర్చుకుంటున్నారు. భోజనంలో ఆకుకూరలు, వారానికి మూడు సార్లు కోడిగుడ్లు అందజేయాలి. ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు కుకింగ్ చార్జీల కింద ఒక్కొక్కరికి రూ.6.29 చెల్లిస్తారు. 9, 10 తరగతుల విద్యార్థులకు రూ.8.40 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. కోడిగుడ్డుకు రూ.6 చెల్లిస్తుంది. కానీ ప్రస్తుతం కోడి గుడ్డు ధర రూ.7 ఉండగా దోసకాయలు, ఆలుగడ్డ, బీరకాయ, దొండకాయతో పాటు ఆకుకూర ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఏ కూరగాయల ధర చూసినా కిలోకు రూ.60 కంటే తక్కువగా లేదు. కోడిగుడ్డుకు రూ.1 అదనంగా చెల్లించి విద్యార్థులకు పెట్టాల్సి వస్తుందని.. అధిక ధరలు వెచ్చించి కూరగాయలు కొనుగోలు చేయాల్సి వస్తుందని నిర్వాహకులు అంటున్నారు. ధరలు పెరుగుతున్నప్పుడు అందుకు అనుగుణంగా బిల్లులు పెంచడం లేదని అంటున్నారు. విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న పాఠశాలల్లో భోజన పథకం నిర్వహణ మరింత భారం అవుతుంది. బిల్లులు అందేలా చూస్తాం.. మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బిల్లులు పెండింగ్లో లేకుండా అందేలా చూస్తాం. నిధులు మంజూరు కాగానే సంబంధిత ఏజెన్సీల ఖాతాల్లో జమఅయ్యేలా చర్యలు తీసుకుంటాం. ఏజెన్సీ నిర్వాహకుల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికరమైన మధ్యాహ్న భోజనం అందేలా చూస్తున్నాం. – రాజేందర్, డీఈఓప్రభుత్వ పాఠశాలలు 432 విద్యార్థులు 19,788 వంట నిర్వాహకులు 510 వంట ఏజెన్సీలు 415 -
– వెంకటాపురం(ఎం)
ఆదివారం శ్రీ 12 శ్రీ అక్టోబర్ శ్రీ 2025నీటిలో తేలియాడే ఇటుకలు.. నల్లరాతి స్తంభాలు.. సరిగమలు పలికే శిల్పం.. భూకంపాలను తట్టుకునే ఆలయం.. ఓరుగల్లుకు చరిత్ర అందించిన అతిగొప్ప వరం రామప్ప. యునెస్కో గుర్తింపుతో ఈఆలయ గొప్పదనం విశ్వవ్యాప్తమైంది. ఇప్పుడు ఆ కట్టడం ప్రపంచ దేశాలకు ఆదర్శమవుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు, చరిత్రకారులు వారి వారి దేశాల్లో రామప్పను పోలిన కట్టడాలు నిర్మించడంలో భాగస్వాములవుతున్నారు. అంతేకాకుండా ఓరుగల్లులోని వివిధ ప్రాంతాల్లో నిర్మించిన అద్భుత కట్టడాలను పరిచయం చేస్తూ వాటి గొప్పదనాన్ని ప్రపంచ నలుమూలలకు తెలిసేలా వరల్డ్ హెరిటేజ్ క్యాంపు వివిధ దేశాల వలంటీర్లకు శిక్షణ ఇస్తోంది. ఈ క్యాంపు ప్రత్యేకతలే ఈ ఆదివారం ‘సాక్షి’ స్పెషల్ స్టోరీ. వలంటీర్లకు రామప్ప ఆలయ శిల్పాల ప్రత్యేకతలను వివరిస్తున్న టూరిస్ట్ గైడ్వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఏటా అక్టోబర్లో వివిధ దేశాల వలంటీర్లకు శిక్షణ ఇస్తోంది. గత నాలుగేళ్లుగా రామప్పలో క్యాంపు కొనసాగుతుండగా.. ప్రస్తుతం ఈనెల 8న క్యాంపు ప్రారంభమైంది. 12 రాష్ట్రాలకు చెందిన 35 మందితో పాటు ఇరాన్ దేశానికి చెందిన మరో ముగ్గురు శిక్షణ శిబిరంలో పాల్గొంటున్నారు. ఈనెల 17తో హెరిటేజ్ క్యాంపు ముగియనుంది. ఇండియా కల్చర్ నచ్చి వచ్చాను.. ఇండియా కల్చర్ అంటే చాలా ఇష్టం. గతంలో కెన్యా, ఇరాన్ హెరిటేజ్ క్యాంపులో పాల్గొన్నా. రామప్పలో హెరిటేజ్ క్యాంపు వాటి కంటే బాగుంది. పర్సనల్గా ఇండియా కల్చర్పై ప్రాజెక్ట్ తీసుకుని ఇక్కడి పాఠాలను అనుభవంగా తీసుకుంటా. రామప్ప టెంపుల్ వండర్ ఫుల్. – నియూషా, ఇరాన్ రామప్ప ఖ్యాతిని విస్తరిస్తా.. శిక్షణ శిబిరంలో నేర్చుకున్న మెళకువలతో రామప్ప ఖ్యాతిని విస్తరించేందుకు కృషి చేస్తా. మ్యూజియంలో పని చేయడానికి, మ్యూజియానికి వచ్చిన ప్రజలకు చారిత్రక కట్టడాల గురించి వివరించేందుకు ప్రయత్నం చేస్తా. ఆలయంలోని ఆర్కిటెక్చర్ చాలా డిఫెరెంట్గా బాగుంది. – హమీద్ దాస్, కోల్కతాపప్పు ధాన్యాల సాగు లాభదాయకం -
సమాచార హక్కు చట్టం వజ్రాయుధం
● సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి భూపాలపల్లి అర్బన్: సమాచార హక్కు చట్టం ప్రజలకు వజ్రాయుధమని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి తెలిపారు. సమాచార హక్కు చట్టం వారోత్సవాల్లో భాగంగా శనివారం ఏరియా జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి జీఎం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సమాచార హక్కు చట్టం అనేది ప్రజాస్వామ్య భారతదేశంలో పారదర్శకత, జవాబుదారీతనానికి ఒక బలమైన సాధనమన్నారు. భూపాలపల్లి ఏరియాలో ఈ చట్టాన్ని అమలు చేయడంతో ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. ఇంకా మెరుగైన సేవలు అందించడానికి అధికారులు కృషిచేయాలని సూచించారు. అనంతరం అఽధికారులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు కవీంద్ర, రవికుమార్, రాజేశ్వర్, ఎర్ర న్న, మారుతి, ప్రదీప్, కార్తీక్, రాజు పాల్గొన్నారు. -
ఇంకా మహదేవపూర్ కేంద్రంగానే..
పలిమెల: పలిమెల మండలం ఏర్పడి నేటికి పదేళ్లు అవుతున్నా మండలంలోని ప్రజలకు మాత్రం మెరుగైన పాలన ఇంకా అందడం లేదు. నేటికీ మండల కేంద్రంలో ఒక పోలీస్స్టేషన్ మినహా ఏ ఇతర కార్యాలయాలు లేవు. చిన్న మండలాలతో ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించాలనే ప్రభుత్వ ఉద్దేశంతో మహదేవపూర్ మండలంలో ఉన్న పలిమెలను ఎనిమిది గ్రామపంచాయతీలతో కలిపి మండలంగా చేశారు. మండల ఏర్పాటు తొలి రోజుల్లో సంతోషించిన ప్రజలు సేవలు అందక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పటి కలెక్టర్ ప్రత్యేక చొరవ.. అక్టోబర్ 11, 2016లో పలిమెల మండలం ఏర్పాటైంది. అప్పటి కలెక్టర్ ఆకునూరి మురళి ప్రత్యేక చొరవతో మండల కార్యాలయాలు అన్నీ ఒకే చోట ఉండేలా మండల కార్యాలయాల సమీకృత భవనాన్ని నిర్మించారు. కానీ సెక్యూరిటీ, ఇంటర్నెట్ సౌకర్యాలు లేవనే కారణంగా చూపి అధికారులు మహదేవపూర్లోనే తిష్ట వేస్తున్నారు. తనిఖీలు ఉంటేనే.. కలెక్టర్, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు, మంత్రుల, ఎమ్మెల్యేలు ఎప్పుడైనా మండల పర్యటనకు వస్తే తప్పా అధికారులు కనిపించని పరిస్థితి ఉంది. దీంతో అసలు మండలానికి చెందిన అధికారులు ఎవరో తెలియని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. అధికారాన్ని అనుభవిస్తున్నారే తప్పా ప్రజలకు మాత్రం ఉపయోగపడటం లేదని ప్రజలు బాహాటంగా అనుకుంటున్నారు. ఏం కావాలన్నా మహదేవపూర్కు.. విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులకు కావాల్సిన రెవెన్యూ సేవలు(సర్టిఫికెట్లు), వ్యవసాయ శాఖ సేవలు, మండల పరిషత్కు సంబంధించిన సేవలు, తదితర సేవలకు ప్రజలు పాత మండల కేంద్రమైన మహదేవపూర్కు పరుగులు పెట్టాల్సిందే. ముకునూరు నుంచి మహదేవపూర్ వెళ్లాలంటే సుమారు 60 కిలో మీటర్లు ప్రయాణించాలి. తీరా అక్కడికి వెళ్లాక అధికారులు ఉంటారో ఉండరో తెలియని పరిస్థితి ఉంది. కులం సర్టిఫికెట్ కావాలంటే రూ.50లతో అయ్యే పనికి చార్జీలతో కలిపి రూ.500 కావాల్సిందే. అదే కార్యాలయాలు ఇక్కడే కొనసాగితే సులభంగా పనులు అవుతాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. చుట్టుపు చూపుగా వచ్చిపోతున్న అధికారులు మెరుగైన పాలన అందని దుస్థితి ఇబ్బందులు పడుతున్న ప్రజలు -
మానసిక ఆరోగ్యం ఉండాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమేశ్బాబు భూపాలపల్లి అర్బన్: శరీర అంగాలు అన్ని సరిగా ఉంటేనే సరిపోదని, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ సీహెచ్ రమేశ్బాబు తెలిపారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని హెచ్ఎంఆర్డీఎస్లోని దివ్యాంగ బాలలతో ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గంజాయి, డ్రగ్స్, ఇతర వ్యసనాలకు అలవాటు పడినవారు, నేరాలకు పాల్పడే వారిలో చాలా మందికి మానసిక ఆరోగ్యం సరిగా ఉండదన్నారు. శరీరంపై చూపే శ్రద్ధతో పాటుగా, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. అనంతరం దివ్యాంగ పిల్లలకు పండ్లు, చాకోలెట్లు పంపిణీ చేశారు. హియరింగ్, ఎయిడ్స్, హెల్త్ క్యాంపు ఇతర ఏ సహాయం కావాలన్నా న్యాయసేవాధికార సంస్థను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాజ్, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి దిలీప్ కుమార్నాయక్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల, జీపీ సుధాకర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసచారి, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ అక్షయ, హెచ్ఎంఆర్డీఎస్ సంస్థ నిర్వాహకులు రజిత, రాజయ్య, న్యాయవాదులు, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు, దివ్యంగా విద్యార్థులు, న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. కాజీపేట అర్బన్: సమాజంలో నిట్ విద్యార్థులు ఆదర్శంగా నిలవాలని భారత లోహ సంస్థ మాజీ అధ్యక్షుడు డాక్టన్ సనక్ మిశ్రా అన్నారు. శుక్రవారం నిట్ అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఏర్పాటు చేసిన నిట్ వరంగల్ 67వ ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ‘ది హైపోతీసిస్ ఆఫ్ ది హైయరార్కీ ఆఫ్ నాలెడ్జ్’ అంశంపై మాట్లాడారు. జ్ఞానాన్ని లోతుగా అర్థం చేసుకోవడం ద్వారా విద్యార్థులకు విజ్ఞానం, మేదస్సు సాధ్యమవుతుందన్నారు. నిట్ వరంగల్ ప్రపంచంలో ప్రత్యేకతను చాటుతోందని నిట్ డైరెక్టర్ బిద్యాదర్ సుబుదీ తెలిపారు. ప్రస్తుతం నిట్ వరంగల్లో 700 అధ్యాపకుల బోధనలో 8 వేల మంది విద్యార్థులు అత్యుత్తమ సాంకేతిక విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. ప్రతీ ఏడాది 81.03 క్యాంపస్ ప్లేస్మెంట్లలో ఉద్యోగావకాశాలు సాధిస్తున్నారని, రూ.64 లక్షల అత్యధిక ప్యాకేజీతో ఉద్యోగ అవకాశాలు సాధించడం గర్వంగా నిలుస్తోందన్నారు. కార్యక్రమంలో నిట్ అధ్యాపకులు పాల్గొన్నారు. ఏటూరునాగారం: ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఆదివాసీ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శాపక నాగరాజు, ములుగు జిల్లా అధ్యక్షుడు సంతోష్ కుమార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని డీడీ జనార్దన్కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందించారు. అనంతరం మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలల్లో హెడ్ మాస్టర్, సబ్జెక్టు పోస్టులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టుల భర్తీ చేయాలన్నారు. 2013 సంవత్సరంలో అప్గ్రేడ్ అయిన ఏయూపీఎస్ పాఠశాలలకు పోస్టులను మంజూరు చేయాలన్నారు. -
పత్తిరైతు పరేషాన్!
అధిక వర్షాలతో పంట నష్టంకాళేశ్వరం: పత్తి రైతు ఈ సారి పరేషాన్లో పడ్డాడు. రోజుల తరబడి కురుస్తున్న వర్షాల కారణంగా పత్తి పంట తీవ్రంగా తిన్నదని రైతులు వాపోతున్నారు. ముందుగా కాసిన కాయలన్నీ నల్లబడిపోయాయి. విచ్చుకున్న పత్తి తడిసి అందులో మొలకలు వస్తున్నాయి. వానలకు చీడ పీడలు, తెగుళ్ల ఉధృతి బాగా పెరిగింది. తెల్లదోమ, పచ్చ దోమ దాడి పెరిగిపోయింది. దీంతో మలిదశ పూత, కాతంతా రాలిపోతోంది. తెగుళ్లతో ఆకులపై నల్లని మచ్చలు, ఎర్రబారి చెట్టు కుంగిపోతోంది. మరో రెండునెలలు పచ్చగా ఉండాల్సిన చేలు పండుటాకులతో వెలవెలబోతున్నాయి. ఆకురాల్చి మొక్కలన్నీ మోడులవుతున్నాయి. రైతులు నివారణ చర్యలు చేపట్టలేకపోతున్నారు. దీంతో దిగుబడులపై తీవ్ర ప్రభావం పడుతుందని రైతులు అంటున్నారు. అన్నారం టు కాళేశ్వరం వరకు గోదావరి ఉప్పొంగడంతో పరివాహక ప్రాంతాల్లో వరదనీరు ఇప్పుడిప్పుడే తగ్గుతుంది. ఎడతెరిపి లేని వర్షాలతో తమను నిండా ముంచాయని పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తగ్గనున్న దిగుబడి.. ఈ ఏడాది జిల్లాలో 98,780 ఎకరాల్లో పత్తిసాగు చేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, చీడ పీడల కారణంగా దిగుబడులు సగానికి పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు పంటను దెబ్బతీశాయి. మొదటి కాసిన కాయలన్నీ నల్లబడ్డాయి. విచ్చుకున్న పత్తి బూజుపట్టి రంగు మారింది. మొదట్లో కాసిన కాయలే పెద్దగా ఉండి బరువు తగ్గుతాయని రైతులు అంటున్నారు. ఆకులు, ఆ కాయలన్నీ నల్లబడి నేలరాలడంతో పాటు దోమ పోటుతో రెండో దశ పూత, కాత నిలవడం లేదు. తెగుళ్లతో రెండునెలల ముందుగానే చేలన్నీ ఎండిపోతున్నాయి. పత్తిలో సాధారణంగా ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుంది. అలాంటిది నా లుగైదు క్వింటాళ్లు రావడమే కష్టమని రైతులు అంటున్నారు. పెట్టుబడులకు అప్పులు చేసి ఖర్చు చేశామని దిగుబడులు రాకపోతే ఏం చేయాలని ఆందోళన చెందుతున్నారు. నల్లబారి రాలిపోతున్న పూత, కాత విజృంభిస్తున్న తెగుళ్లు దిగుబడులపై ప్రభావం ఆందోళనలో రైతాంగంపత్తి ఆరుతడి పంట అడపాదడపా వర్షాలు కురిస్తే పత్తిచేలు ఆరోగ్యంగా ఎదిగి, ఆశించిన దిగు బడిని వస్తుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఇందుకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. జూన్, జూలై నెలల్లో తీవ్ర వర్షాభావం ఉండగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మొదటి వారం వరకు ప్రస్తుతం వర్షాలు దంచి భూమిలో అధిక తేమతో పత్తి పంటకు వేరుకుళ్లు, పారవిల్డ్ లాంటి తెగులు సోకి వేరు వ్యవస్థ దెబ్బతిని ఎదుగుదల నిలిచిపోయింది. బురదమయంగా ఉన్న చేలల్లో సూక్ష్మదాతు లోపం కనిపిస్తోంది. మెగ్నీ షియం, జింకు, బోరాన్ లోపం వల్ల పంట దెబ్బతింటోంది. రైతులు వర్షం భయంతో ఎరువులు వేయడం లేదు. పురుగు మందులు పిచికారి చేయలేకపోతున్నారు. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి వంట చేతికొచ్చే సమయంలో దెబ్బతింటుండటంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. -
దిగుబడి కష్టమే..
నాలుగెకరాలు కౌలుకు తీసుకొని పత్తిసాగు చేఽశాను. రూ.2.50 లక్షల పెట్టుబడి ఖర్చు అయింది. తీవ్ర వర్షాలతో దిగుబడి కష్టంగా మారింది. వేరు చక్కగా ఎదిగే సమయంలో అధిక వర్షాలతో రోగాలు అంటుకున్నాయి. పత్తి చేలు ఎర్రబడి ఎండిపోతున్నాయి. రోజుల వ్యవధిలోనే మాయదారి రోగం మొత్తం పాకింది. పత్తి మొక్కలు ఆకురాలి మోడులై కనిపిస్తున్నాయి. రెండోసారి వచ్చే పూత, కాతను దక్కించుకుందామంటే చీడపీడలు ముసురు కున్నాయి. ఇప్పటికే ఎరువులు వేశాం. మందులు కొట్టాం. ప్రతీసారి కంటే ఈ ఏడు ఎక్కువ పెట్టుబడి అయింది. దిగుబడులు చేతికొచ్చే సమయంలో వర్షాలు దెబ్బకొట్టాయి. – సల్పాల కుమార్, టేకుమట్ల (రామకృష్ణపూర్ టి) -
నిర్దేశిత వ్యవధిలో సమాచారం అందించాలి
భూపాలపల్లి అర్బన్: సమాచార హక్కు చట్టం ద్వారా పౌరులు కోరిన సమాచారాన్ని నిర్దేశిత వ్యవధిలోగా అందించాలని కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన ‘సమాచార హక్కు చట్టం–2005’ వారోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడంలో సమాచార హక్కు చట్టం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. పౌరులు కోరిన సమాచారాన్ని సకాలంలో అందించడం ప్రతి అధికారి బాధ్యతగా భావించాలని సూచించారు. స్వచ్ఛందంగా ఇవ్వాల్సిన సమాచారాన్ని పౌరులకు సులభంగా అందుబాటులో ఉంచే విధంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. అంతకుముందు ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బందితో సమాచార హక్కు చట్టాన్ని గౌరవిస్తూ పౌరులు కోరిన సమాచారాన్ని సకాలంలో అందిస్తానని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, ఎస్డీసీ రమేష్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నవీన్రెడ్డి, అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి విద్యార్థులు చేసే పనిలో నిబద్ధతగా ఉంటూ, నైపుణ్యం పెంపొందించుకోవాలని కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. జిల్లా కేంద్రంలోని అధునాతన సాంకేతిక కేంద్రం (ఏటీసీ)ను కలెక్టర్ రాహుల్శర్మ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ల్యాబ్లు, పరికరాలను పరిశీలించి వాటి పని విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. అధునాతన పరికరాలు ఏర్పాటు చేసినందున వాటిని సమర్థంగా ఉపయోగించి నైపుణ్యం సాధించాలని విద్యార్థులకు సూచించారు. తరగతి గదులను సందర్శించిన కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడారు. క్రమం తప్పక కళాశాలకు హాజరు కావాలని, ఎంపిక చేసుకున్న కోర్సుల్లో చక్కటి నైపుణ్యం సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జూమ్లానాయక్, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్శర్మ -
నల్లమచ్చలు అధికం
మద్దులపల్లిలో మూడెకరాల్లో పత్తి సాగు చేశాను. మొత్తం రూ.లక్ష వరకు పెట్టుబడికి ఖర్చు అయింది. కానీ తీవ్ర వర్షాలతో పత్తి మొక్కలు దెబ్బతిన్నాయి. పత్తి నల్లబడింది. పత్తి కాయలు మురిగి పోతున్నాయి. మొక్కకు 30 నుంచి 40 కాయల వరకు పాడయ్యాయి. తెల్లదోమ, పచ్చ దోమ సోకింది. పూత, కాయంతా రాలిపోతోంది. చీడపీడల అదుపు కోసం మందులు పిచికారీ చేద్దామన్నా వానలతో చేయలేదు. ఈ సీజన్లో పెట్టబడులు రావడమే కష్టంగా ఉంది. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి. – బియ్యని శ్రీకాంత్, మద్దులపల్లి -
ఇక.. డీసీసీ అధ్యక్షుల ఎంపిక!
సాక్షిప్రతినిధి, వరంగల్: కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడంపై అధిష్టానం దృష్టి సారించింది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన జీఓ 9, ఎన్నికల నోటిఫికేషన్పై హైకోర్టు స్టే ఇవ్వడంతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఆరు వారాలపాటు నిలిచిపోగా.. ఈలోగా ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న జిల్లా కాంగ్రెస్ కమిటీల ఖరారుపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు శనివారం (ఈ నెల 11వ తేదీ) నుంచి 18వ తేదీ వరకు డీసీసీ అధ్యక్షుల రేసులో ఉన్న ఆశావహుల నుంచి జిల్లాల వారీగా దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ఢిల్లీ, ఇతర ప్రాంతాలనుంచి శుక్రవారం హైదరాబాద్కు చేరుకున్న ఏఐసీసీ పరిశీలకులు శనివారం నుంచి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇప్పుడున్న డీసీసీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల వేదికగా దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలకు నేడు ఏఐసీసీ, టీపీసీసీ పరిశీలకులు... వాస్తవానికి పార్టీ సంస్థాగత నిర్మాణం, పటిష్టత కోసం మూడు నెలల కిందటే ఏఐసీసీ కమిటీలు వేసింది. ఉమ్మడి వరంగల్కు ముగ్గురు ఏఐసీసీ పరిశీలకులతోపాటు ఒక్కో జిల్లాకు ఇద్దరు నుంచి ముగ్గురు టీపీసీసీ పరిశీలకులను నియమించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్లు పరిశీలకులతో భేటీ అయి పలు సూచనలు చేశారు. ఏఐసీసీ పరిశీలకులు నబజ్యోతి పట్నాయక్ (హనుమకొండ, వరంగల్), జాన్సన్ అబ్రహం (ములుగు, జేఎస్ భూపాలపల్లి), దేబాసిస్ పట్నాయక్ (జనగామ)లు దరఖాస్తులు, డీసీసీ ఎన్నికలను పరిశీలించనున్నారు. టీపీసీసీ పరిశీలకులుగా హనుమకొండ, వరంగల్ జిల్లాలకు గాలి అనిల్కుమార్, దుర్గం భాస్కర్, మక్సూద్ అహ్మద్, గుంజ రేణుకా నారాయణలు, ములుగు, జేఎస్ భూపాలపల్లి జిల్లాలకు జంగా రాఘవరెడ్డి, అఫ్సర్ యూసుఫ్ ఝహి, ఇ.సుబ్బారావు, ఎ.సంజీవ్ ముదిరాజ్లు, జనగామ, మహబూబాబాద్లకు కె.శంకరయ్య (ఎమ్మెల్యే), ఎండీ అవేజ్, పీసరి మహిపాల్ రెడ్డి, కె.శ్రీకాంత్జాదవ్, జువ్వాడి ఇందిరారావులు పరిశీలకులుగా వ్యవహరించనున్నారు. జిల్లాల వారీగా కార్యాలయాల్లో డీసీసీ ఆశావహులనుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ● డీసీసీ కోసం పోటీపడే వారి సంఖ్య జిల్లాల్లో చాంతాడులా పెరుగుతోంది. ● ఇప్పుడున్న డీసీసీ అధ్యక్షుల మార్పు తఽథ్యమనుకుంటే కొత్తగా హనుమకొండ జిల్లా నుంచి కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, జంగా రాఘవరెడ్డి, ఈవీ శ్రీనివాస్రావు, బట్టి శ్రీనివాస్, పింగిళి వెంకట్రాం నర్సింహారెడ్డి, బొమ్మనపల్లి అశోక్రెడ్డి, కట్ల శ్రీనివాస్లతోపాటు మరి కొంతమంది దరఖాస్తు చేసుకుంటారనే ప్రచారం ఉంది. ● వరంగల్ నుంచి ఇప్పుడున్న అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, నమిండ్ల శ్రీనివాస్, ఎంపీ ఆనంద్, బొంపెల్లి దేవేందర్రావు, గోపాల నవీన్రాజ్, నల్గొండ రమేష్, నర్సంపేట మాజీ ఎంపీపీ టి.రవిందర్రావు, పిన్నింటి అనిల్రావు, తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. ● జయశంకర్ భూపాలపల్లి డీసీసీ కోసం మాజీ మావోయిస్టు నేత గాజర్ల అశోక్, చల్లూరి మధులతోపాటు ఎనిమిది మంది వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ● జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి స్థానంలో హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, సింగపురం ఇందిర, మొగుళ్ల రాజిరెడ్డి, బండ శంకర్, లకావత్ ధన్వంతి, లక్ష్మీనారాయణలతోపాటు పలువురు ఆశావహులు సిద్ధమయ్యారు. ● ములుగు జిల్లాలో ప్రస్తుత అధ్యక్షుడు పైడాకుల అశోక్, సూర్య(మంత్రి సీతక్క కుమారుడు)ల మధ్య ఇప్పటికే పొసగడం లేదు. ఇక్కడినుంచి సూర్య సీరియస్గానే ఆశిస్తున్నారు. పైడాకుల అశోక్, కుంజ సూర్య, మల్లాడి రాంరెడ్డి, గొల్లపల్లి రాజేందర్ గౌడ్, బాదం ప్రవీణ్ తదితరలు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ● మహబూబాబాద్లో ఇప్పుడున్న జె.భరత్చంద్రా రెడ్డి, వెన్నం శ్రీకాంత్రెడ్డి, నునావత్ రాథలతోపాటు ఏడెనిమిది మంది పేర్లు వినిపిస్తున్నాయి. ● ఏదేమైనా దరఖాస్తుల ప్రక్రియ 18న ముగియగానే ఏఐసీసీ, టీపీసీసీ పరిశీలకులు, సీఎం, టీపీసీసీ దృష్టికి జాబితాను తీసుకెళ్లనున్నారని సమాచారం. అనంతరం జిల్లా ఇన్చార్జ్లు, ఇన్చార్జ్ మంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో సంప్రదింపులు జరిపి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్, మహిళ.. ఇలా సామాజిక కోణాలను దృష్టిలో పెట్టుకుని నవంబర్ మొదటి వారంలో అధ్యక్షులను ప్రకటించే అవకాశం ఉందన్న చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. భూపాలపల్లి రూరల్: ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అబ్జర్వర్ జాన్సన్ అబ్రహం ఈ నెల 13న సోమవారం జిల్లాకు రానున్నట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా పార్టీ అధ్యక్ష పదవి కోసం పోటీపడేవారు దరఖాస్తులను జిల్లా పార్టీ కార్యాలయంలో ఇవ్వాలని చెప్పారు. జిల్లా అధ్యక్ష పదవికి ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరు తమ దరఖాస్తులను వ్యక్తిగతంగా సమర్పించాలని ఆయన సూచించారు. తాను దరఖాస్తులు స్వీకరిస్తానన్నారు. ‘సంస్థాగత’ ఎన్నికలపై దృష్టి సారించిన కాంగ్రెస్ నేడు జిల్లాలకు ఏఐసీసీ, టీపీసీసీ పరిశీలకులు ఆశావహులనుంచి దరఖాస్తుల స్వీకరణ 11 నుంచి 18 వరకు ఈ ప్రక్రియ ఆ తర్వాత సీఎం, టీపీసీసీ చీఫ్తో పరిశీలకుల భేటీ నవంబర్ మొదటి వారంలో డీసీసీ అధ్యక్షుల జాబితా? పోటాపోటీగా దరఖాస్తులతో సిద్ధమైన ఆశావహులు -
ఇసుక క్వారీ తనిఖీ
మల్హర్: మండలంలోని మల్లారంలో నిర్వహిస్తున్న ఇసుక క్వారీ కేంద్రాన్ని పెద్దపల్లి టీజీఎండీసీ పీఓ రాజు గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇసుక లోడింగ్, వేబ్రిడ్జి, వేబిల్లులను పరిశీలించారు. క్వారీ టార్గెట్ ఇప్పటి వరకు పంపిన ఇసుక వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వేబ్రిడ్జి వద్ద లారీలు ఎక్కువ సమయం ఉండకుండా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. లారీల సీరియల్ ప్రకారమే లోడింగ్ జరిగే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత నిర్వాహకులకు, టీజీఎండీసీ సిబ్బందిదేనని ఆయన వెల్లడించారు. -
అదనపు ఉపాధ్యాయుడిని ఇస్తాం..
గణపురం మండలం బుర్రకాయల గూడెం పాఠశాలకు విద్యార్థుల సంఖ్యకు అణగుణంగా మరో ఉపాధ్యాయుడిని నియమిస్తామని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. గురువారం బుర్రకాయల గూడెం అంగన్వాడీకేంద్రాన్ని నీతి అయోగ్ ప్రభరి అధికారి పౌసమిబసుతో సందర్శించిన క్రమంలో గ్రామస్తులు తమ పాఠశాలలో ఒక్కరే ఉపాధ్యాయుడు ఉన్నాడని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ పాఠశాలలో 32 మంది విద్యార్థులు ఉన్నారని.. గతంతో పోలిస్తే విద్యార్థుల సంఖ్య తగ్గిందని కలెక్టర్ అన్నారు. త్వరలో మరో ఉపాధ్యాయుడిని నియమించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. -
చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు
గణపురం: గ్రామాలలో పోషణ లోపంతో బాధ పడుతున్న చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నీతి అయోగ్ ప్రభరి అధికారి పౌసమిబసు సూచించారు. మండలంలోని బుర్రకాయల గూడెం అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్శర్మతో కలిసి గురువారం పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రం పరిశీలనకు వచ్చిన ఆమెకు చిన్నారులు పూలతో స్వాగతం చెప్పగా వారిని ఆప్యాయంగా పలకరించారు. అనంతరం పోషణలోపంతో బాధపడుతున్న చిన్నారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 140 మంది చిన్నారులు పోషణ లోపంతో బాధపడుతున్నారని.. వారికి ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి అవసరమైన పోషక ఆహారాన్ని అందించాలని సూచించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న బాలామృతం, కిషోర బాలికలకు అందిస్తున్న పల్లి, మిల్లెట్ చిక్కీల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో మొత్తం 8,550 మంది కిషోర బాలికలకు పల్లి, మిల్లెట్ చిక్కీలు అందిస్తున్నట్లు అధికారులు తెలపగా.. సంతృప్తి వ్యక్తంచేశారు. అంగన్వాడీ కేంద్రం నిర్వహణ బాగుందని సిబ్బందిని అభినందించారు. అనంతరం పోషణ మాసంలో భాగంగా గర్భిణులకు సీమంతాలు చేశారు. గర్భిణులు ఆరోగ్య రక్షణకు చర్యలు తీసుకోవాలని క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేపించుకుంటూ వైద్యుల సలహాలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, జిల్లా వైద్యాధికారి మధుసూదన్, సీపీఓ బాబురావు తదితరులు పాల్గొన్నారు. పంట మార్పిడిపై అవగాహన కల్పించాలి భూపాలపల్లి: పంట మార్పిడి విధానం ద్వారా అధిక దిగుబడి సాధనకు రైతులకు అవగాహన కల్పించాలని నీతి అయోగ్ ప్రభరి అధికారి పౌసమి బసు సూచించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో ఆకాంక్షిత జిల్లాలో అభివృద్ధి సూచికలపై వైద్య, విద్య, మహిళా, శిశు సంక్షేమం, డీఆర్డీఏ, పశు సంవర్థక శాఖల అంశాలపై సమగ్ర సమీక్ష జరిపారు. కలెక్టర్ రాహుల్ శర్మ సమావేశంలో పా ల్గొని వివిధ రంగాల్లో జరుగుతున్న కార్యక్రమాల పురోగతిని వివరించారు. ఈ సందర్భంగా పౌసమి బసు మాట్లాడుతూ.. వైద్య, విద్యా రంగాల్లో గుణాత్మక మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. వైద్యులు సేవా దృక్పథంతో పనిచేయాలి రేగొండ: ప్రజలకు సేవ చేయడం కోసం ఉన్నామనే దృక్పథంతో వైద్యులు పని చేయాలని నీతి అయోగ్ ప్రభరి అధికారి పౌసమి బసు అన్నారు. గురువారం భూపాలపల్లి కలెక్టర్ రాహుల్శర్మతో కలిసి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో ఓపీ రిజిస్టర్, మందుల నిల్వలు, గర్భిణులకు అందుతున్న సేవలు, ఆస్పత్రి నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మాయంక్ సింగ్, జిల్లా వైద్యాధికారి మధుసూదన్, సీపీఓ బాబురావు, ఉప వైద్యాధికారులు శ్రీదేవి, ఉమాదేవి పాల్గొన్నారు. నీతి అయోగ్ ప్రభరి అధికారి పౌసమి బసు బుర్రకాయల గూడెంలో అంగన్వాడీ కేంద్రం పరిశీలన -
ఇప్పటికిక ఇంతే..!
జీఓ 9పై హైకోర్టు స్టే.. ‘స్థానిక’ ఎన్నికలకు బ్రేక్సాక్షిప్రతినిధి, వరంగల్ : స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ విడుదల చేసిన జీఓ 9పై దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు గురువారం స్టే ఇచ్చింది. ఉదయం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి నామినేషన్ల స్వీకరణ చేపట్టిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. హైకోర్టు తీర్పు తర్వాత ఆ మేరకే వ్యవహరిస్తామని ప్రకటించింది. దీంతో ఆరు వారాలపాటు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోనుండగా.. డిసెంబర్ మొదటి వారం తర్వాత ఈ మధ్యకాలంలో జరిగే పరిణామాలను బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సెప్టెంబర్ 29న ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ మేరకు నవంబర్ మాసాంతానికి ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల్లో ‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని అందరూ భావించారు. కానీ, హైకోర్టు స్టేతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అంతటా కలకలం... రాజకీయ పార్టీల్లో దుమారం... రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్లో భాగంగా ఉమ్మడి వరంగల్లో మూడు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలతో పాటు వామపక్ష పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు పోటీలో నిలిచేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. సెప్టెంబర్ 29న షెడ్యూల్ విడుదల తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఆశావహుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించాయి. రెండు విడతల్లో పరిషత్, మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలకు అనుగుణంగా అభ్యర్థులను ప్రకటించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. దసరా పండుగకు ముందే రిజర్వేషన్లు ప్రకటించడం.. ఎన్నికల షెడ్యూల్ వెల్లడి కావడంతో ఆశావహుల సందడి పల్లెల్లో జోరందుకుంది. ఎంపీటీసీ, సర్పంచ్ పదవులను ఆశించే వారు పండగ కావడంతో ఖర్చుకు సైతం వెనకాడలేదు. కాగా, ప్రధాన పార్టీలు గురువారం ఉదయం విడుదలైన నోటిఫికేషన్ తర్వాత దశల వారీగా 11వ తేదీ వరకు నామినేషన్లకు ప్లాన్ చేసుకున్నా.. హైకోర్టు తీర్పు తర్వాతే అభ్యర్థులను ప్రకటించేందుకు నిర్ణయించుకున్నారు. నోటిఫికేషన్ వెలువడిన రెండున్నర గంటల్లోనే హైకోర్టు ఎన్నికలకు బ్రేక్ వేసే విధంగా స్టే ఇవ్వడం కలకలం రేపింది. నోటిఫికేషన్ను రద్దు చేసిన కారణంగా ఇప్పటివరకు వేసిన నామినేషన్లు కూడా చెల్లుబాటు కావని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.ఊరించి, ఉసూరుమనిపించి.. మొత్తంగా 12 నామినేషన్లు.. రిజర్వేషన్ల ప్రకటన, ఎన్నికల నోటిఫికేషన్లు ఆశావహులను ఊరించాయి. కొత్తగా ప్రకటించిన రిజర్వేషన్లలో అవకాశం వచ్చిన వారు మురిసిపోయారు. షెడ్యూల్ ప్రకారం తొలి విడతలో ఉమ్మడి వరంగల్లో 37 జెడ్పీటీసీలు, 393 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ మేరకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ తర్వాత గురువారం ఉదయం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ముహూర్తం ప్రకారం 11వ తేదీలోగా నామినేషన్లు వేసేందుకు ఆశావహులు ఏర్పాట్లు చేసుకున్నారు. అంతా సజావుగా జరిగితే రెండో విడతకు 13వ తేదీ నుంచి 15వరకు నామినేషన్లు వేసేందుకు కూడా సర్వసన్నద్ధమయ్యారు. మొదటి విడతలో 37 జెడ్పీటీసీ, 393 ఎంపీటీసీ స్థానాలకు గాను జెడ్పీటీసీలకు మూడు, ఎంపీటీసీలకు 9 నామినేషన్లు దాఖలయ్యాయి. మహబూబాబాద్, హసన్పర్తి, సంగెం జెడ్పీటీసీలకు ఒక్కో నామినేషన్ రాగా, మహబూబాబాద్ జిల్లాలో ఎంపీటీసీలకు ఐదు, వరంగల్ జిల్లాలో రెండు (సంగెం, గీసుకొండ), జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం బాగిర్తిపేటలో ఒకటి, హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలంలో ఒకటి దాఖలైనట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్ మొదటివారం తర్వాతే... ఆశావహులు అప్పటివరకు ఆగాల్సిందే నోటిఫికేషన్ విడుదలైన రెండున్నర గంటలకు న్యాయస్థానం తీర్పు.. ఉమ్మడి వరంగల్లో జెడ్పీటీసీకి 3, ఎంపీటీసీలకు 9 నామినేషన్లు -
గిరిజనులు రిజర్వేషన్ల కోసం ఉద్యమించాలి
ఎస్ఎస్తాడ్వాయి: గిరిజనులు వందశాతం రిజర్వేషన్ల కోసం ఉద్యమించాలని ఆదివాసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ పూనెం శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మండల పరిధిలోని మేడారంలో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగానికి విరుద్ధంగా షెడ్యూల్డ్ తెగల హోదా అనుభవిస్తున్న బంజారాలను తొలగించే వరకు దీర్ఘకాలిక ఉద్యమాలను కొనసాగిస్తామన్నారు. 1976లో రాజ్యాంగానికి విరుద్ధంగా గుర్తించబడిన లంబాడీ తెగ విద్య, ఉద్యోగ, ఉపాధి, సంక్షేమ, రాజకీయ రంగాలలో అత్యధికంగా రిజర్వేషన్లు అనుభవిస్తుందని తెలిపారు. దీంతో ఆదిమ లక్షణాలున్న తొమ్మిది తెగలు నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సమ్మక్క– సారలమ్మ జాతర అభివృద్ధి ముసుగులో ఆదివాసీల సంస్కృతీ, సంప్రదాయాలకు విఘాతం కలిగించే విధంగా ప్రయత్నం చేస్తుందని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సమ్మక్క– సారలమ్మ సెంట్రల్ యూనివర్సిటీ లోగోలో లంబాడీల భాషా పదాన్ని తొలగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నెల 19న ఆదిలాబాద్లో అన్ని ఆదివాసీ ప్రజా సంఘాలతో సమావేశం నిర్వహించి ప్రణాళికలు రూపొందించుకుని ముందుకెళ్తామని వివరించారు. ఈ సమావేశంలో జేఏసీ వర్కింగ్ కమిటీ చైర్మన్ వట్టం ఉపేందర్, వైస్ చైర్మన్ రవి, జేఏసీ బాధ్యులు వాసం రామకృష్ణ, నరసింహమూర్తి, రాంచందర్, మడి సాయిబాబు, రవి, సమ్మక్క ప్రధాన పూజారి సిద్ధబోయిన సురేందర్, తుడుందెబ్బ నాయకులు కబ్బాక శ్రావణ్ కుమార్, చింత కృష్ణ, వట్టం జనార్ధన్, చందా మహేశ్ పాల్గొన్నారు. -
పొగాకు వాడకం ప్రమాదం
ములుగు: పొగాకు తాగిన వారితో పాటు పక్కన ఉండి పీల్చేవారికి అంతే ప్రమాదమని డీఎంహెచ్ఓ గోపాల్రావు అన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నుంచి బస్టాండ్ వరకు వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని డీఎంహెచ్ఓ గోపాల్రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో యువత పొగాకు వాడకాన్ని విడిచిపెట్టేలా 60రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వైద్య సిబ్బందికి సూచించారు. యువత చెడు వ్యసనాలకు బానిస కావద్దన్నారు. పొగాకులోని నికోటిన్ పదార్ధం దూమపానానికి బానిసలుగా మారుస్తుందని తెలిపారు. పొగాకు తాగడం వల్ల ఊపిరితిత్తులు, క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రతిఒక్కరూ పొగాకుకు దూరంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు పవన్కుమార్, ప్రవీణ్రెడ్డి, శ్రీకాంత్, చంద్రకాంత్, డీపీఎంఓ సాంబయ్య, సీహెచ్ఓ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.డీఎంహెచ్ఓ గోపాల్రావు -
10నుంచి 17..
రోజుకుజిల్లాలో తగ్గని జ్వరపీడితులుఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జ్వరపీడితులుభూపాలపల్లి అర్బన్: వర్షాకాలం సీజన్ ముగింపు దశకు వచ్చినప్పటికీ జిల్లాలో జ్వరపీడితులు మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో తగ్గడం లేదు. వైద్యారోగ్య శాఖ అధికారులు ముందస్తుగా వైద్యశిబిరాలు ఏర్పాటుచేయడం, ఇంటింటా జ్వర సర్వే చేయడంతో ఇరవై రోజులుగా జ్వరాలు గతంకంటే తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఇప్పటికీ ప్రతిరోజు 10నుంచి 17 మంది జ్వరపీడితులు నమోదవుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ పదుల సంఖ్యలో జ్వరపీడితులు వైద్యసేవలు పొందుతున్నారు. సెప్టెంబర్ నుంచే తగ్గుముఖం జిల్లాలో జూలై, ఆగస్టు మాసాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలాయి. అయినప్పటికీ ముందస్తుగా తెలుసుకొని సకాలంలో నయం చేసుకున్నారు. ఈ ఏడాది జిల్లాలో ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణహాని జరగలేదు. ఆగస్టు మాసంలో 821 జ్వరం కేసులు నమోదు కాగా, సెప్టెంబర్ మాసంలో 540 కేసులు నమోదు కాగా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 300 మంది వరకు అడ్మిట్ అయ్యారు. ఈ నెలలో రోజుకు 10 నుంచి 17 కేసుల వరకు నమోదవుతున్నాయని వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. 42 డెంగీ కేసులు నమోదు.. జిల్లాలో గతేడాది 60 వరకు డెంగీ, 12 మలేరియా కేసులు నమోదు కాగా ఈ ఏడాది సెప్టెంబర్ వరకు 42 డెంగీ, 10 మలేరియా కేసులు నమోదయ్యాయి. గతంతో పోలిస్తే డెంగీ, మలేరియా కేసుల నమోదు సంఖ్య కూడా తగ్గుతూ వస్తుంది. ప్రజల్లో సైతం అవగాహన పెరగడంతో దోమలు వృద్ధి చెందకుండా తగు జాగ్రత్తలు పాటిస్తున్నారు. గ్రామాల్లో డెంగీ, మలేరియా కేసులు నమోదైన వెంటనే వైద్యారోగ్యశాఖ అధికారులు మెడికల్ క్యాంపులు నిర్వహించడంతో వ్యాధులు ఇతరులకు ప్రబలకుండా అవగాహన కార్యక్రమాలు చేపడుతూ, గ్రామ పంచాయతీ సిబ్బందిని కలుపుకొని పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు.చిట్యాల సివిల్ ఆస్పత్రిలో వారం రోజుల్లో 756మంది రోగులు ఓపీ చూపించుకున్నారు. వీరిలో 138మంది జ్వరపీడితులు అడ్మిట్ అయి చికిత్స పొందారు. గురువారం 77మంది ఓపీ చూపించుకోగా.. 15మంది జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. గ్రామాల్లోనీ ఆర్ఎంపీల వద్ద కూడా పదుల సంఖ్యలో జ్వరపీడితులు చికిత్స పొందుతున్నారు. మాది జడలపేట గ్రామంలోని గాంధీనగర్. జ్వరంతో 108లో గురువారం ఉదయం చిట్యాల సివిల్ ఆస్పత్రికి వచ్చాను. పరీక్షించిన వైద్యుల్ అడ్మిట్ చేసుకుని మంచి వైద్యసేవలు అందిస్తున్నారు. – బొట్ల రాధ, గాంధీనగర్, జడలపేట కొనసాగుతున్న హెల్త్ క్యాంపులు జీజీహెచ్కు గతంకంటే తగ్గిన ఓపీ చలితో పెరిగే ప్రమాదంజిల్లాలో గత నెల రోజుల నుంచి సీజనల్ వ్యాధులు తగ్గుముఖం పట్టాయి. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు చుట్టు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. శీతా కాలం ప్రారంభంతో తగు జాగ్రత్తలు పాటించాలి. జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యారోగ్యశాఖ సిబ్బందిని అప్రమత్తంగా ఉన్నారు. ఎక్కడ జ్వరాలు వచ్చిన వెంటనే ఎపిడమిక్ టీమ్ వెళ్లి క్యాంపులు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. – డాక్టర్ చల్ల మధుసూదన్, డీఎంహెచ్ఓఅక్టోబర్ మాసంలో వాతావరణ మార్పులు సంభవిస్తాయి. వర్షకాలం ముగిసి శీతాకాలం ప్రారంభమయ్యే కాలం. శీతాకాలం ప్రారంభంలో జరుగుతున్న మార్పుల వలన చిన్న పిల్లలు, వృద్ధులు జ్వరాలు, జలుబుల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అప్రమత్తంగా ఉంటే ఈ ప్రమాదం నుంచి కూడా బయటపడే అవకాశాలు ఉంటాయి. -
లక్షపత్రి పూజలకు బుకింగ్ ప్రారంభం
కాళేశ్వరం: కార్తీక మాసం సందర్భంగా ఈనెల 21 నుంచి నవంబర్ 19 వరకు కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో లక్షపత్రి పూజలకు రూ.8వేలు చెల్లించి అడ్వాన్స్ బుకింగ్ టికెట్లు తీసుకోవాలని ఈఓ ఎస్.మహేష్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఒక రోజు ఐదు పూజలు మాత్రమే చేయనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 90004 80931, 97046 39706 నంబర్లలో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. గణపురం: ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ వేయడానికి ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని ఎన్నికల అబ్జర్వర్ ఫణీందర్ రెడ్డి గురువారం పరిశీలించారు. మండలకేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించి ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు నామినేషన్ల ప్రక్రియపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. టేకుమట్ల: ఎంపీడీఓ కార్యాలయంలోని ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని డీఎస్పీ సంపత్రావు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల నియమ నిబంధనలు పాటించేలా కృషిచేయాలని, నామినేషన్ సమయంలో అభ్యర్థులకు ఇబ్బందులు కలుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అనిత, ఎంపీఓ సురేష్ ఉన్నారు. భూపాలపల్లి అర్బన్: తెలంగాణ ప్రజా ఫ్రంట్ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం జిల్లాకేంద్రంలో పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ ముఖ్యఅతిథిగా హాజరై పతాకావిష్కరణ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం పాలకుల మెడలు వంచి విజయం సాధించినట్లు కిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకుల పార్వతి, లలిత, మినుగు నగేష్, ప్రభాకర్, కుమార్, శ్రీనివాస్ పాల్గొన్నారు. టేకుమట్ల: మండలకేంద్రంలోని 108 అంబులెన్స్ను గురువారం జిల్లా అధికారి రాజునాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, మందుల స్టాక్తో పాటు, వాహన కండీషన్ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అత్యవసర సేవల కోసం మందులను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలన్నారు. సీజనల్ వ్యాధులు, అత్యవసర సేవల కోసం వచ్చే కాల్స్కు సకాలంలో స్పందించి అందుబాటులో ఉన్న ఆస్పత్రులకు చేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈఎంటీ హరిప్రసాద్, పైలట్లు సదయ్య, షరిపొద్దీన్, రవీందర్ ఉన్నారు. రేగొండ: కొత్తపల్లిగోరి మండల కేంద్రాలలోని ఎంపీడీఓ కార్యాలయంలోని ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావుతో కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ సమయంలో ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లిగోరి తహసీల్దార్ లక్ష్మీరాజయ్య, ఎంపీడీఓలు వెంకటేశ్వరరావు, రాంప్రసాద్, మండల ప్రత్యేక అధికారి సునీల్ కుమార్ పాల్గొన్నారు. -
కనీస మద్దతు ధరకు పత్తి కొనుగోలు
భూపాలపల్లి: పత్తిని కనీస మద్దతు ధరపై కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ అశోక్కుమార్ ఆదేశించారు. బుధవారం వివిధ శాఖల అధికారులతో కలిసి పత్తి కొనుగోలు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. 2025–26లో జిల్లాలో 98,260 ఎకరాల్లో పత్తి సాగు జరిగిందని, 11,79,000 క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. అక్టోబర్ మాసం తర్వాత పత్తి దిగుబడి ప్రారంభమవుతుందని, నవంబర్, డిసెంబర్ నెలల్లో అధికంగా విక్రయానికి వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కంటే తక్కువగా మార్కెట్లో రేటు పలికితే వెంటనే సీసీఐ కేంద్రాల ద్వారా మద్దతు ధర కల్పించాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేసేందుకు భూపాలపల్లి, కాటారం, చిట్యాల మార్కెట్ పరిధిలో మొత్తం 5 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పత్తి తేమ శాతం 8 శాతం ఉన్నప్పుడు కనీస మద్దతు ధర రూ. 8,110 గా ఉందన్నారు. రైతులకు స్లాట్ బుకింగ్ తప్పనిసరని అదనపు కలెక్టర్ వెల్లడించారు. ఈ సమావేశంలో జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్రెడ్డి, అడిషనల్ ఎస్పీ నరేష్కుమార్, అధికారులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ అశోక్కుమార్ -
మొదటి విడతకు సిద్ధం
భూపాలపల్లి: స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. బీసీ రిజర్వేషన్ల అంశం హైకోర్టులో ఉండగా, నేడు తీర్పు వెలువడనున్న క్రమంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం నేటి నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లను స్వీకరించనున్నారు. మొదటి దఫాలో 6 మండలాల్లో.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మూడు విడతల్లో ఎన్నికలు జరుగనుండగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మాత్రం రెండు విడతల్లోనే ఎన్నికలు పూర్తి కానున్నాయి. జిల్లాలోని 12 మండలాల్లో 12 ఎంపీపీ, 12 జెడ్పీటీసీ, 109 ఎంపీటీసీ, 248 సర్పంచ్, 2,102 వార్డు స్థానాలు ఉన్నాయి. ఇందులో మొదటి విడతలో భాగంగా భూపాలపల్లి నియోజకవర్గంలో భూపాలపల్లి మినహా గణపురం, రేగొండ, కొత్తపల్లిగోరి, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. 6 జెడ్పీటీసీ, 58 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. నేడు (గురువారం) రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే నామినేషన్లను స్వీకరించనున్నారు. ఇందుకోసం జెడ్పీటీసీలకు 6, ఎంపీటీసీలకు 19 మంది రిటర్నింగ్ అధికారులను కలెక్టర్ రాహుల్ శర్మ నియమించారు. నామినేషన్ల స్వీకరణ ఆయా ఎంపీడీఓ కార్యాలయాల్లో నిర్వహించనుండగా ఇందుకు తగిన ఏర్పాట్లు చేశారు. నామినేషన్ల స్వీకరణ నేటి నుంచి 11వ తేదీ వరకు కొనసాగుతుంది. నేటి నుంచి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ 6 జెడ్పీటీసీ, 58 ఎంపీటీసీ స్థానాలు నేడు నోటిఫికేషన్, అనంతరం నామినేషన్ల స్వీకరణ మండలం ఎంపీటీసీ పోలింగ్ ఓటర్లు స్థానాలు కేంద్రాలుగణపురం 10 58 33,235 రేగొండ 11 63 33,973 కొత్తపల్లి గోరి 6 33 16,446 చిట్యాల 12 59 30,698 టేకుమట్ల 9 44 22,248 మొగుళ్లపల్లి 10 56 30,353 -
తిలా పాపం.. తలా పిడికెడు!
కస్టమ్ మిల్లింగ్ ధాన్యంతో మిల్లర్ల జల్సాసాక్షిప్రతినిధి, వరంగల్: కస్టమ్ మిల్లింగ్ ధాన్యం (సీఎంఆర్) కొందరు అధికారులు, రైస్మిల్లర్లకు కాసులు కురిపించే కల్పతరువుగా మారింది. సీఎంఆర్ దందా మొదలైనప్పటి నుంచి కొంతమంది వ్యాపారులు పైసా ఖర్చు లేకుండా సర్కారు ధాన్యం దారి మళ్లిస్తూ జల్సాలు చేస్తున్నారు. ఇంకొందరు ధాన్యం మరాడించి పక్క రాష్ట్రాలకు తరలించి బియ్యం అమ్ముకుని.. ఆ డబ్బుతో ఎకరాల కొద్ది భూములు కొనుగోలు చేసినట్లు ఆధారాలున్నాయి. మూడేళ్ల కిందట ఇచ్చిన ధాన్యంలో కొందరు సుమారు రూ.236 కోట్ల విలువైన ధాన్యాన్ని ఎగవేశారు. అయినా వారిపైన డబ్బులు రాబట్టుకునేందుకు తీసుకున్న చర్యలు లేవు. దీంతో అవినీతి, అక్రమాలకు అలవాటుపడిన కొందరు అధికారులు, రైస్మిల్లర్లకు సీఎంఆర్ ‘తిలా పాపం తలా పిడికెడు’గా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. వివాదమైనప్పుడే స్పందన.. కొందరు అధికారుల సహకారంతో కస్టం మిల్లింగ్ ధాన్యాన్ని పక్కదారి పట్టించడం ప్రతియేటా కొంతమంది మిల్లర్లకు తంతుగా మారింది. వీటిపై పౌరసరఫరాల శాఖ కమిషనర్, ఆయా జిల్లాల కలెక్టర్ల వరకూ వెళ్లినా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీంతో సీఎంఆర్ పాత బకాయిల మాట పక్కన పెడితే.. కొత్తగా తీసుకునే వాళ్లు సైతం చాలా వరకు మొండికేస్తున్నారు. 2022–23లోని సీఎంఆర్ గడువు దాటినా.. హనుమకొండ, వరంగల్, ములుగు, జేఎస్ భూపాలపల్లి. మహబూబాబాద్ జిల్లాల నుంచి బియ్యం ప్రభుత్వానికి చేరలేదు. ఈ విషయం మీడియా ద్వారా వైరల్, వివాదాస్పదం అయినప్పుడే కొందరు పౌరసరఫరాల శాఖ అధికారులు, ఆపై అధికారులు స్పందిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించే కొందరు ఉన్నతాధికారులకు ‘మిల్లర్లకు నోటీసులు ఇచ్చాం.. ధాన్యం రికవరీ చేస్తున్నాం.. మీడియాలో వచ్చినంత లేదు...రిజైండర్ ఇచ్చాం..’ అంటూ తప్పుదోవ పట్టిస్తున్నారు. చర్యలే నిజమైతే.. సర్కారు ధాన్యం ఎగవేసి ఆ డబ్బుతో వ్యాపారం చేసుకుంటున్న కొందరు మిల్లర్ల నుంచి మూడేళ్లవుతున్నా ఎందుకు రికవరీ కావడం లేదన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం లేదు. ఈ విషయంలో జిల్లాల కలెక్టర్లు మూలాల్లోకి వెళ్లి విచారణ జరిపి సీరియస్గా యాక్షన్ తీసుకుంటేనే తప్ప బకాయిపడిన మిల్లర్ల నుంచి ధాన్యం డబ్బులు సర్కారు ఖజానాకు చేరే అవకాశం లేదన్న చర్చ జరుగుతోంది. 1.08 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాయం విచారణలో తేల్చిన ‘ఎన్ఫోర్స్మెంట్’ మూడేళ్లయినా పట్టించుకోని యంత్రాంగం సర్కారు ధాన్యంతో ట్రేడర్ల వ్యాపారం మిల్లర్లు, అధికారులకు పప్పుబెల్లంలా సీఎంఆర్ రికవరీపై సివిల్ సప్లయీస్ మీనమేషాలురైతుల నుంచి వానాకాలం, యాసంగి సీజన్లలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని సీఎంఆర్ కింద షరా ‘మామూలు’గా రైస్మిల్లర్లకు సరఫరా చేస్తున్నారు. అలా పంపించిన ధాన్యానికి సంబంధించి బియ్యం చెల్లించని వారిని గుర్తించిన పౌరసరఫరాలశాఖ పలుమార్లు నోటీసులు జారీ చేసింది. ఎంతకీ స్పందించకపోవడంతో ఆయా మిల్లులకు సరఫరా చేసిన లెక్కల ప్రకారం ఉండాల్సిన ధాన్యానికి 2022–23లో టెండర్లు నిర్వహించారు. అలా, ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో ఉన్న మిల్లుల్లో 2,92,585 మెట్రిక్ టన్నుల ధాన్యానికి టెండర్లు వేసిన వ్యాపారులు తెచ్చుకునేందుకు మిల్లులకు వెళ్లగా అక్కడ ఉండే ధాన్యం మాయమైంది. దీనిపై సుమారు ఏడాది పాటు ధాన్యం మాయమైన మిల్లుల యజమానులపై ఒత్తిడి తెచ్చిన అధికారులు ఎట్టకేలకు 1,83,985 మెట్రిక్ టన్నులు రాబట్టినట్లు అప్పట్లోనే ప్రకటించారు. సుమారు రూ.217 కోట్ల విలువ చేసే ఆ ధాన్యం ఉమ్మడి వరంగల్కు చెందిన 31 మంది రైస్మిల్లర్ల వద్ద ఉందని పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తేల్చినప్పటికీ ఇప్పటికీ రాబట్టడం లేదు. ధాన్యం మాయం చేసిన మిల్లర్లపై రెవెన్యూ రికవరీ, పీడీ యాక్టులు పెట్టి వసూలు చేసే అవకాశం ఉంది. కేవలం 8 మిల్లులపై మొక్కుబడిగా 6ఏ కేసులతో సరిపెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. -
కార్మికుల సమస్యలు పట్టవా?
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలో సింగరేణి కార్మికులు, కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలు సింగరేణి అధికారులకు పట్టవా? అని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంపేటి రాజయ్య ఆరోపించారు. ఏరియాలోని రామప్ప కాలనీలో రెండు నెలల నుంచి పేరుకుపోయిన చెత్త కుప్పులను కాలనీవాసులతో పరిశీలించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ నెలల తరబడి కాలనీలో చెత్త కుండీల్లో కుళ్లిపోయి దుర్వాసన వస్తుందని మండిపడ్డారు. చెత్త కుళ్లిపోవడంతో ఈగలు, దోమలు వ్యాప్తి చెంది రోగాల బారిన పడుతున్నామన్నారు. తక్షణమే పేరుకుపోయిన చెత్తను తొలగించి, బ్లీచింగ్ చల్లించి, దోమల మందు పిచికారీ చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు, కాలనీ వాసులు మహేందర్, రాజు, రమేశ్, బాబురావు తదితరులు పాల్గొన్నారు.సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజయ్య -
టెట్ గుబులు
గురువారం శ్రీ 9 శ్రీ అక్టోబర్ శ్రీ 2025నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేయాలిరెండేళ్లలో ఉత్తీర్ణులు కావాలన్న సుప్రీంకోర్టుభూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ ఉపాధ్యాయులు తప్పనిసరిగా టెట్ (టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్) ఉత్తీర్ణత కావాల్సిందేనని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు వెలువరించడంతో టీచర్లు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే దీనిపై రిట్ పిటిషన్ వేయాలని గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. అలాగే 2010కి ముందు నియమితులైన ఉపాధ్యాయులందరూ రెండేళ్లలో టెట్ అర్హత సాధించాలని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం 2012, 2017, 2024లో చేపట్టిన డీఎస్సీ నియామకాల్లో టెట్ను అమలు చేసింది. విద్యాహక్కు చట్టంలో సవరణ చేయాలి.. టెట్ మార్గదర్శకాలు తమకు వర్తించవని, సుప్రీం కోర్టు తీర్పు రూల్స్ విరుద్ధమని విద్యా హక్కు చట్టం రాకముందు వివిధ నోటిఫికేషన్ల ద్వారా నియమితులైన ఉపాధ్యాయులు అంటున్నారు. ఇది ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే రిట్ పిటిషన్ వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం కొందరు నిరుద్యోగులే ఒకటి కంటే ఎక్కువసార్లు రాస్తేనే ఉత్తీర్ణత సాధిస్తున్నారని, అలాంటిది 10 నుంచి 15 సంవత్సరాల నుంచి ఉపాధ్యాయ వృత్తి కొనసాగుతున్న వారు టెట్ ఎలా పాస్ అవుతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యాహక్కు చట్టానికి ముందే ఉపాధ్యాయ వృత్తిలో చేరిన వారికి టెట్ మినహాయింపు ఇవ్వాలని, పదోన్నతులు పొందే వారికి టెట్ అమలు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు నాయకులు కోరుతున్నారు. విద్యా హక్కు చట్టంలో సవరణ చేయాలంటున్నారు. అయితే చట్ట సవరణ అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉండగా, అనేక రాష్ట్రాలు సుప్రీంలో రిట్ పిటిషన్ దాఖలు చేశాయి. 2010కి ముందు ఉద్యోగంలో చేరిన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని సవరించాలి. సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రిట్ పిటిషన్ వేయాలి. స్టే ఆర్డర్ తీసుకువస్తే బాగుంటుంది. – మందల రవీందర్రెడ్డి, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడుజిల్లాలో 430 పాఠశాలలు, 1,940 మంది టీ చర్లు ఉన్నారు. ఇందులో టెట్ ఉత్తీర్ణత లేని వా రు 800 మందికిపైగా ఉన్నారు. విద్యా హక్కు చట్టం సెక్షన్ 23(1) ప్రకారం 1 నుంచి 8 తరగతులకు బోధించే ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి చేస్తూ ఎన్సీటీఈ (నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్) 2010 ఆగస్టు 23న నోటిఫికేషన్ విడుదల చేసింది. అనంతరం 2014 నవంబర్ 12న పైస్థాయి పదోన్నతుల కోసం టెట్ తప్పనిసరి చేస్తూ ఎన్సీటీఈ మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. చాలా రాష్ట్రాల్లో టెట్ ఉత్తీర్ణత కాకుండా పదోన్నతులు ఇస్తుండడంతో కొందరు ఉపాధ్యాయులు కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో టెట్ తప్పనిసరి అంటూ కోర్టు పేర్కొంది. రానున్న రెండేళ్లలో టెట్ పాస్ కాకుంటే వెంటనే సర్వీస్ నుంచి తొలగించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. దీంతో ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ లేదంటే సర్వీస్ నుంచి తొలగింపు ఆందోళన చెందుతున్న ఉపాధ్యాయులు జిల్లాలో 1,940 మంది టీచర్లు -
దరఖాస్తుల స్వీకరణ
భూపాలపల్లి అర్బన్: వరంగల్లోని బీవీ శ్యామల రత్నం పారా మెడికల్ చారిటీ ఆధ్వర్యంలో ఉచిత పారా మెడికల్ కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డీఎంపీహెచ్ఏ (ఎం), డీఎంఎల్టీ, డీఓఏ, డీఆర్జీఏ, డీఎంఎస్ఓటీలో ఇంటర్ విద్యార్హతతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి ప్రభుత్వ ఆస్పత్రులు, రైల్యే, ఈఎస్ఐ, ఆయుష్లతో పాటు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు పొందుటకు అర్హులన్నారు. ఆసక్తి గల వారు 9059729000, 9849473179 నంబర్లను సంప్రదించాలని కోరారు. భూపాలపల్లి అర్బన్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడిని ప్రతిఒక్కరూ ఖండించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) పట్టణ కార్యదర్శి సోత్కు ప్రవీణ్కుమార్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో సీపీఐ నాయకులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్పై దాడికి పాల్పడిన న్యాయవాది రాకేష్కిశోర్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలన్నారు. ఈదాడికి ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్లు బాధ్యత వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు క్యాతరాజ్ సతీష్, నేరెళ్ల జోసెఫ్, పీక రవి, రవీందర్, జనార్దన్, లావణ్య, రజిత, సంధ్య, శ్రీలత, తదితరులు పాల్గొన్నారు. కాటారం: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ కిరణ్ఖరే తెలిపారు. బుధవారం కాటారం మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేసుల వివరాలు, సిబ్బంది హాజరు, పలు రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసుల పురోగతిపై స్థానిక పోలీస్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అల్లర్లు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. కాళేశ్వరం:వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాల ముగింపులో భాగంగా మహాదేవపూర్ బాలుర జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు బుధవారం చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బయాలజీ ఉపాధ్యాయుడు బి.ప్రభాకర్రెడ్డి, తిరుపతిరెడ్డిలు మాట్లాడుతూ ఈనెల 2 నుంచి 8వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రతీ జంతువు పర్యావరణ పరిరక్షణలో భాగమేనన్నారు. వాటి సహజ ఆవాసాలను సంరక్షించాల్సిన ఆవశ్యకత ఉందని విద్యార్థులకు వివరించారు. గెలుపొందిన విద్యార్థులకు హెచ్ఎం అనిల్ బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఫిజిక్స్ టీచర్ రాజిరెడ్డి, ఉపాధ్యాయులు రాజయ్య, అనిల్, సమ్మయ్య, అనిత, కవిత, కిరణ్ కుమార్, కోటేశ్వర్, శ్రీని వాస్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కాటారం: మహాముత్తారం మండలకేంద్రంలోని అత్యవసర సేవల 108 అంబులెన్స్ను బుధవారం జిల్లా మేనేజర్ రాజునాయక్ తనిఖీ చేశారు. 108 వాహనంలోని రికార్డులు, మెడికల్ స్టాక్, వాహనం కండీషన్ చెక్ చేశారు. అత్యవసర సేవల కోసం వాహనంలో మందులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ అందుబాటులో ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. అత్యవసర సేవల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, కాల్ అందుకోగానే ప్రమాద స్థలానికి చేరుకొని బాధితులకు ప్రథమ చికిత్స అందించి దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లాలని తెలిపారు. -
రామాయణం మార్గదర్శక గ్రంఽథం
భూపాలపల్లి: మహర్షి వాల్మీకి రచించిన రామాయణం ప్రతీ మనిషి జీవితానికి మార్గదర్శక గ్రంథం అని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. పర్గత్ దివస్ను పురస్కరించుకొని వాల్మీకి జయంతి వేడుకలను మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. మహర్షి వాల్మీకి చూపిన సత్యం, ధర్మం, కర్తవ్యమార్గాలు నేటి సమాజానికి ప్రేరణ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐలు, ఆర్ఎస్సైలు, డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు. -
ఎన్నికల నిర్వహణ సక్రమంగా జరగాలి
కాటారం: స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల నిర్వహణ ప్రక్రియ సక్రమంగా జరిగేలా లోటుపాట్లు లేకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్శర్మ ఆదేశించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో కాటారం మండలకేంద్రంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్ రూంలు, ఓట్లు లెక్కింపు కేంద్రాలను మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. విద్యుత్, స్ట్రాంగ్ రూంల భద్రత, సీసీ కెమెరాలు, పోలీస్ బందోబస్తు తదితర అంశాలపై కలెక్టర్ ఆరా తీశారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులకు సూచించారు. ఓట్ల లెక్కింపు గదుల్లో విద్యుత్ సౌకర్యం, లైటింగ్, భద్రత వంటి అన్ని సౌకర్యాలు సక్రమంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు. ఎంపీడీఓలు అన్ని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి సౌకర్యాల కల్పనపై ధృవీకరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగులకు ర్యాంపు, మూడు చక్రాల సైకిళ్లు అందుబాటులో ఉంచేలా చూసుకోవాలన్నారు. జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి మల్లీశ్వరీ నోడల్ ఆఫీసర్గా ఉంటారని తెలిపారు. అనంతరం ఏటీసీ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ల్యాబ్లో ఏర్పాటు చేసిన పరికరాలు అమర్చకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తంచేశారు. పరికరాల ఏర్పాటు విషయం తన దృష్టికి తీసుకురాకపోవడం పట్ల కలెక్టర్ ప్రిన్సిపాల్ భిక్షపతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వీడి విద్యార్థులకు సాంకేతిక విద్య సక్రమంగా అందేలా చూడాలని సూచించారు. కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ బాబు ఉన్నారు.కలెక్టర్ రాహుల్శర్మ -
ప్రచార ఖర్చులు పక్కాగా నమోదు చేయాలి
● అదనపు కలెక్టర్ విజయలక్ష్మి భూపాలపల్లి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు చేసే ప్రచార ఖర్చులను పక్కాగా నమోదు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి సూచించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్లో హాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచార ఖర్చులకు సంబంధించి రేట్ చార్ట్ నిర్దేశించు అంశంపై ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీలు, ప్రింటర్స్ అండ్ పబ్లిషర్స్, ఫ్లెక్సీల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఖర్చులను పర్యవేక్షించడానికి రేట్ చార్ట్ రూపొందించినట్లు తెలిపారు. ఈ రేట్ చార్ట్ ప్రకారం, ప్రతీ ప్రచార సామగ్రి, ఫ్లెక్సీ, పోస్టర్, ప్రచార వాహనాల అద్దె, ప్రకటనలు, ఇతర ప్రచార ఖర్చులు స్థానిక రేట్ల ఆధారంగా అభ్యర్థులు ఖర్చులో జమచేయబడతాయని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తగు అనుమతులు పొందాల్సి ఉంటుందని తెలి పారు. ఈ సమావేశంలో ఆడిట్ అధికారి మానస, డీపీఓ శ్రీలత, డీపీఆర్ఓ శ్రీనివాస్, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మకు ఉపాధి తోడు
ఈజీఎస్తో అనుసంధానం చేస్తూ ప్రభుత్వం నిర్ణయంకాటారం: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. కూలీల కొరత నివారించి నిర్మాణ పనులు సజావుగా సాగేలా తగు చర్యలు తీసుకుంటుంది. ఇందిరమ్మ ఇళ్లకు ఉపాధిహామీ పథకాన్ని అనుసంధానం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీచేయగా ఉపాధిహామీ అధికారులు గ్రామీణ స్థాయిలో అమలుకు శ్రీకారం చుట్టారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేసుకునే లబ్ధిదారు జాబ్కార్డు కలిగి ఉంటే 90 రోజులు పనిదినాలు కల్పించేలా ప్రభుత్వ చర్యలు చేపట్టింది. ఇంటి నిర్మాణాలకు కూలీల కొరత లేకుండా సదరు లబ్ధిదారు పని చేసుకొని కూలి పొందవచ్చు. దీంతో నిర్మాణ పనులు త్వరితగతిన కొనసాగడంతో పాటు లబ్ధిదారు ఉపాధి పొందే అవకాశాలు ఉన్నాయి. 90 రోజుల పనిదినాలు.. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం మొదలు పెట్టి ఉపాధిహామీలో జాబ్కార్డు ఉన్న లబ్ధిదారులకు బేస్మెంట్ స్థాయి వరకు 40 రోజులు, స్లాబ్ లెవల్ వరకు 50రోజుల పని దినాలు కల్పించనున్నారు. 90 రోజుల పనిదినాలకు సదరు లబ్ధిదారుకు రూ.27,630 చెల్లించనున్నారు. దీంతో సొంతింటి నిర్మాణానికి కూలీ పని చేసుకుని లబ్ధి పొందే అవకాశం ఉంది. జిల్లాలో 94 ఇళ్ల గుర్తింపు.. జిల్లాలోని అన్ని మండలాల్లో ఉపాధిహామీ పథకం కింద ఇప్పటివరకు 94 ఇళ్లను గుర్తించినట్లు అధికారుల లెక్కలు చెపుతున్నాయి. ఇంటి నిర్మాణంలో బేస్మెంట్ స్థాయి, గోడల నిర్మాణం, స్లాబ్ లెవల్ వరకు జరిగిన ఇళ్లను ఎంపిక చేశారు. ఇందులో 72 ఇళ్లకు ఎస్టిమేట్ ప్రక్రియ పూర్తైనట్లు అధికారులు తెలిపారు. ఈ స్థాయిలో ఉన్న ఇళ్ల లబ్ధిదారు ఈజీఎస్ పనులకు వెళ్లకుండా ఇంటి నిర్మాణ పనులకు రోజూ మస్టర్ వేసి కూలీ చెల్లించనున్నారు. జిల్లాలో ఇళ్ల గుర్తింపు జరిగినప్పటికీ స్థానిక ఎన్నికల కోడ్ ప్రభావం వల్ల మంజూరు ప్రక్రియ ఇంకా మొదలవలేదు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఉపాధిహామీ పథకాన్ని వినియోగించేలా ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. ఇందులో భాగంగా జిల్లాలోని పలు గ్రామాల్లో ఉపాధిహామీ సిబ్బంది ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పరిశీలించి గుర్తించాం. ఎంపిక చేసిన ఇళ్లకు ఎస్టిమేషన్ ప్రక్రియ పూర్తి చేశాం. స్థానిక ఎన్నికల కారణంగా ఇంకా మంజూరు పత్రాలు ఇవ్వలేదు. – బాలకృష్ణ, డీఆర్డీఓ 90 రోజులు పనిదినాలు కల్పించేలా చర్యలు నిర్మాణ పనుల వేగవంతానికి సర్కారు కసరత్తు -
ఏమవుతుందో ఏమో..!
సాక్షిప్రతినిధి, వరంగల్: షెడ్యూల్ వచ్చే దాకా ఒక టెన్షన్.. తేదీలు ప్రకటించాక రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్పై మరో టెన్షన్. ఎట్టకేలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లపై తేలే సమయం రానే వచ్చింది. బుధవారం వెలువడే హైకోర్టు తీర్పుపైనే ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతం కాగా.. అన్ని వర్గాల్లోనూ అనుకూలమా? ప్రతికూలమా? అనే ఉత్కంఠ కూడా కొనసాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. ఆ వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ కూడా ప్రకటించింది. ఇదే సమయంలో బీసీ రిజర్వేషన్ల జీఓను సవాల్ చేస్తూ రెడ్డి జాగృతి సంఘం ప్రతినిధి వంగా గోపాల్రెడ్డి పిటిషన్ దాఖలు చేయడంతో మళ్లీ గందరగోళం నెలకొంది. తీర్పు వెలువడిన తర్వాతే ముందుకు... 2024 ఫిబ్రవరి మొదటి వారంలో గ్రామ పంచాయతీల పాలకవర్గాలు, జూలైలో మండల, జిల్లా పరిషత్ పాలకవర్గాల పదవీ కాలం ముగిసింది. ఈ ఏడాది జనవరిలో మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. వీటన్నింటితోపాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీపీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలతోపాటు విద్య, ఉద్యోగ, ఉపాధిరంగాల్లోనూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తెరమీదకు తెచ్చింది. ఈ మేరకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్లో కుల గణన చేపట్టింది. బీసీ డెడికేషన్ కమిటీ వేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయమై కులగణన నివేదికను అసెంబ్లీలో ప్రభుత్వం విడుదల చేసింది. ఆ తర్వాత స్థానిక సంస్థల్లో, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లోనూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బిల్లులు రూపొందించి సభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందింది. ఆ ప్రక్రియలు పూర్తయ్యాక సెప్టెంబర్ నెలాఖరులో జీఓ 9 తీసుకొచ్చి వెంటనే రిజర్వేషన్లు ఖరారు చేసి, ఏకకాలంలో రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది. దీంతో అభ్యర్థుల ఎంపికపై ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు చేస్తుండగా బీసీ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. తీర్పుకు ముందే ఊహాగానాలు.. బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్పై నేడు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఊహాగానాలు జోరందుకున్నాయి. ఉమ్మడి వరంగల్లో ఆరు జెడ్పీలు, 75 జెడ్పీటీసీలు, 75 ఎంపీపీలకు రిజర్వేషన్ల గెజిట్ ఇప్పటికే విడుదలైంది. 778 ఎంపీటీసీ, 1,708 సర్పంచ్ స్థానాలు, 15 వేల పైచిలుకు వార్డులకు కూడా రిజర్వేషన్లు ఖరారు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం గురువారం నుంచి మొదటి విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. ఈ సమయంలో హైకోర్టు తీర్పు నేపథ్యంలో జోరందుకుంటున్న ఊహాగానాలు పల్లెల్లో గందరగోళ పరిస్థితులకు అవకాశం ఇస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం హైకోర్టు బీసీల రిజర్వేషన్లకు అనుకూలంగా తీర్పునిస్తే ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగనున్నాయని, ఒకవేళ ప్రతికూలంగా తీర్పు వెలువరిస్తే మాత్రం రిజర్వేషన్లలో మార్పులు చేయనున్నట్లు చర్చలు జరుగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం మించకుండా రిజర్వేషన్లు కల్పించాల్సి రావడంతో ఇప్పుడు చేసిన రిజర్వేషన్ల ప్రకారం బీసీలకు స్థానాలు తగ్గి జనరల్కు పెరుగనున్నాయని.. రకరకాల ప్రచారానికి తోడు మారుతున్న రాజకీయ సమీకరణలతో పరిస్థితులు హాట్హాట్గా కనిపిస్తున్నాయి. ‘స్థానిక’ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లపై నేడే జడ్జిమెంట్ వేచి చూసే ధోరణిలో ప్రధాన పార్టీల నేతలు, ఆశావహులు అనుకూలమా? ప్రతి కూలమా? తేలాకే ఎన్నికల బరిలోకి రేపటి నుంచే మొదటి విడత ఎన్నికలకు నామినేషన్లు -
ఫారెస్ట్ చెక్పోస్టు పునరుద్ధరణ
కాటారం: కాటారం మండలకేంద్రానికి సమీపంలో జాతీయ రహదారిపై గతంలో ఏర్పాటు చేసిన ఫారెస్ట్ చెక్పోస్టును మంగళవారం నుంచి పునరుద్ధరించారు. కొంతకాలంగా చెక్పోస్టు నిర్వహణలో లేకపోవడంతో అక్రమ కలప రవాణా, ఇతరత్రా అసాంఘీక కార్యక్రమాలు యథేచ్ఛగా కొనసాగుతూ వచ్చాయి. దీంతో అటవీశాఖ ఉన్నతాధికారులు చెక్పోస్టు నిర్వహణపై దృష్టిసారించి తిరిగి ప్రారంభించారు. కాళేశ్వరం జోన్ సీసీఎఫ్ డాక్టర్ ప్రభాకర్, డీఎఫ్ఓ నవీన్రెడ్డి చెక్పోస్టును ప్రారంభించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. చెక్పోస్టు ద్వారా ఇసుక లారీల నుంచి సెస్ ఫీజు వసూలు చేయనున్నట్లు సీసీఎఫ్ తెలిపారు. అక్రమ రవాణాపై నిరంతర నిఘా కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డీఓ సందీప్, మహదేవపూర్ రేంజర్ రవి, సిబ్బంది పాల్గొన్నారు.సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలిచిట్యాల: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ మల్లేష్ అన్నారు. మంగళవారం మండలంలోని లక్ష్మీపూర్తండాలో కార్డన్సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మల్లేష్ మాట్లాడుతూ గ్రామంలో గంజాయి, గుట్కా, గుడుంబా అమ్మినా, కొత్త వ్యక్తులు కనబడినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పారు. ప్రతి వాహనదారుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని అన్నారు. డయల్ 100, షీ టీమ్స్, సీసీ టీవీ కెమెరాలపై అవగాహన కల్పించారు. అనంతరం నాలుగు బృందాలుగా ఏర్పడి 110 ఇళ్లను తనిఖీ చేయగా ఎనిమిది వాహనాలకు సరైన ధృవపత్రాలు లేకపోవడంతో వాటిని సీజ్ చేసినట్లు చెప్పారు. 350 లీటర్ల గుడంబా పానకం ధ్వంసం చేశారు. పది లీటర్ల గుడుంబాను సీజ్చేసి ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్యాల, మొగుళ్లపల్లి ఎస్సైలు శ్రావన్కుమార్, అశోక్కుమార్, హేమలత, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.కొమురం భీంకు ఘన నివాళి డీడీకి సన్మానంభూపాలపల్లి రూరల్: కొమురం భీం 85 వర్ధంతిని మంగళవారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ కొమురంభీం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ.. కొమురం భీం అడవి బిడ్డల హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం పోరాటం చేసి నిజాం పాలకులకు సింహస్వప్నం అయ్యాడన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య, నాయకులు కుడుమేత సరస్వతి, ప్రధాన కార్యదర్శి దుబాసి పార్వతి, యూవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపుపాల్గొన్నారు .తెలంగాణ ఆదివాసీ ఆధ్వర్యంలో..తెలంగాణ ఆదివాసీ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్ కొమురంభీం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొమురం భీం పోరాట చరిత్రను వివరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రం దేవేందర్, డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ నాయకులు శ్రీకాంత్ పాల్గొన్నారు.ఏటూరునాగారం: ఏటూరునాగారం ఐటీడీఏ డీడీగా పదవీ బాధ్యతలను స్వీకరించిన దబ్బగట్ల జనార్దన్ను మంగళవారం ఆయన కార్యాలయంలో ఉమ్మడి జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్స్ సన్మానించారు. గతంలో పనిచేసిన డీడీ పోచం బదిలీపై వెళ్లగా ఆయన స్థానంలో జనార్దన్ విధుల్లో చేరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఓ సారయ్య, ఏసీఎంఓ కోడి రవీందర్, స్పోర్ట్స్ ఆఫీసర్లు యాలం ఆదినారాయణ, వజ్జ నారాయణ, చుంచు కొమ్మాలు పాల్గొన్నారు. -
భూ భారతి దరఖాస్తులను పరిష్కరించాలి
కాటారం: భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో భాగంగా స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారం కోసం ఆర్జిదారులకు నోటీసులు జారీ చేయాలని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ ఆదేశించారు. మహాముత్తారం తహసీల్దార్ కార్యాలయాన్ని మంగళవారం అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. భూ భారతి సదస్సుల్లో భాగంగా వచ్చిన దరఖాస్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంత మందికి నోటీసులు జారీచేశారని తహసీల్దార్ శ్రీనివాస్ ద్వారా ఆరా తీశారు. త్వరితగతిన నోటీసులు జారీ చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ అశోక్కుమార్ -
బాకీ కార్డుతో కాంగ్రెస్కు భయం
● మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లి అర్బన్: ప్రజలకు ఇచ్చిన హామీల బాకీ కార్డుతో కాంగ్రెస్ పార్టీకి భయం పుట్టిందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాధారణ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలు, 420 హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేటికి 660 రోజులు పూర్తయిందన్నారు. ఇచ్చిన వాగ్ధానాలను ప్రభుత్వం మర్చిపోయిందన్నారు. హమీలను గుర్తు చేయాలని ఇంటింటికీ వెళ్లి ప్రజలను చైతన్యం చేస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా చేసిన అభివృద్ధి ప్రజలకు తెలుసన్నారు. వాస్తవాలను ప్రజలు గమనిస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ ధోకా చేస్తే భూపాలపల్లి కుగ్రామం నుంచి నేడు జిల్లా స్థాయికి ఎలా అభివృద్ధి చెందిందన్నారు. మారుమూల జిల్లాకు మెడికల్ కళాశాల వచ్చిందని గుర్తు చేశారు. కనీసం రైతులకు యూరియా ఇవ్వలేని చేతకాని ప్రభుత్వం, ముఖ్యమంత్రి అని ప్రజలు మండిపడుతున్నట్లు తెలిపారు. ప్రధాన ప్రతిపక్ష హోదాలో తమకు ప్రశ్నించే హక్కు ఉందని.. దానికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు గుర్తుచేశారు. ఈ సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్కుమార్, నాయకులు సిద్దు, జనార్దన్, రాజు, రవికుమార్, అశోక్ పాల్గొన్నారు. -
బలమున్న చోట బరి గీసి..!
సాక్షిప్రతినిధి, వరంగల్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచేందుకు కామ్రేడ్లు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో బలమున్న చోట పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలన్న ప్రతిపాదనలు చేశారు. ఉమ్మడి వరంగల్లో ఆరు జెడ్పీటీసీ స్థానాల పేర్లను సూచించిన సీపీఐ నేతలు అందులో నాలుగు తప్పకుండా ఇవ్వాలన్న డిమాండ్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందుపెట్టారు. ఈ మేరకు సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సహాయ కార్యదర్శి తక్కెళ్లపెల్లి శ్రీనివాస్రావు తదితరులు టీపీసీపీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్, వేం నరేందర్ రెడ్డిలతో మంగళవారం హైదరాబాద్లో భేటీ అయ్యారు. ఈ ఎన్నికల్లోనూ పొత్తులతో ముందుకు సాగాలన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో రాష్ట్ర వ్యాప్తంగా తమకు బలమున్న చోట పోటీ చేస్తామని సీపీఐ నేతలు చెప్పినప్పటికీ.. ప్రత్యేకంగా ఉమ్మడి వరంగల్లో జెడ్పీటీసీ సీట్ల కేటాయింపుపై చర్చ జరిగినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి (ఎస్సీ–జనరల్), వరంగల్లో నల్లబెల్లి (బీసీ–జనరల్)లను ఇవ్వాలని సీపీఐ ప్రతినిధుల బృందం కాంగ్రెస్ నేతలకు ప్రతిపాదించింది. మహబూబాబాద్ జిల్లాలో మహబూబాబాద్ (బీసీ–జనరల్), నెల్లికుదురు (బీసీ–జనరల్)లలో ఏదేని ఒకటి, జనగామ జిల్లాలో రఘునాథపల్లి (బీసీ–మహిళ), జఫర్గఢ్ (బీసీ–జనరల్)లలో ఒకచోట జెడ్పీటీసీగా పోటీ చేసేందుకు ఛాన్స్ ఇవ్వాలని కోరారు. ఇక ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల విషయంలో సీపీఐకి బలమున్న చోట స్థానిక నాయకత్వంతో సమన్వయం చేసుకుని అభ్యర్థులను సూచిస్తామని కాంగ్రెస్ నేతలతో స్పష్టం చేసినట్లు తెలిసింది. బుధవారం ఉమ్మడి వరంగల్కు చెందిన సీపీఎం నేతలు కూడా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, వేం నరేందర్ రెడ్డిలను పొత్తుల విషయంలో కలవనున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. ‘స్థానిక’ ఎన్నికల్లో పొత్తులు.. కాంగ్రెస్తో ‘కామ్రేడ్’లు ముందుకు నాలుగు జెడ్పీటీసీ స్థానాలపై గురి... ఎంపీటీసీ, సర్పంచ్లకూ పోటీ -
రూ.1.10కోట్ల ఇన్సూరెన్స్ చెక్కు అందజేత
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి సింగరేణి ఏరియా ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తూ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన జక్కం దుర్గారాణి కుటుంబసభ్యులకు ఎస్బీఐ అధికారులు సోమవారం రూ.1.10కోట్ల ఇన్సూరెన్స్ చెక్కును అందజేశారు. ఎస్బీఐకి సింగరేణి కంపెనీతో జరిగిన ఒప్పంద ప్రకారం సింగరేణిలో పనిచేసే రెగ్యులర్ కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే బ్యాంక్ రూ.కోటి ఇన్సూరెన్స్ డబ్బులు మరణించిన వారి కుటుంబీకులకు అందజేయనున్నట్లు ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ గణేశ్యాం, ఆర్ఎం నాగవెంకట సుబ్బారావు తెలిపారు. ఈ మేరకు మృతురాలి కూతురు అభినవకు చెక్కును అందజేశామన్నారు. ఈ ఇన్సూరెన్స్ అవకాశం సింగరేణి కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని, కార్మికులు ఎస్బీఐకి సాలరీ ఖాతాను మార్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి బ్రాంచ్ మేనేజర్ నాగరాజు, ఫీల్డ్ ఆఫీసర్ రామస్వామి పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ పాలనలో అన్నీ మోసాలే..
భూపాలపల్లి రూరల్: స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామాలలో తిరుగుతూ కాంగ్రెస్ బాకీ కార్డు అంటూ దుష్ప్రచారం చేయడం చాలా సిగ్గుచేటని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై ధోకా కార్డును సోమవారం జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 23 శాతానికి కుదించి బీసీలను డోకా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమని ఆరోపించారు. 317 జీఓను తెచ్చి ఉద్యోగుల జీవితాలతో ఆడుకుని.. 20వ తేదీ వరకు జీతాలు ఇవ్వలేని స్థితికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీసుకువచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో ప్రజలు అండగా ఉండాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.ధోకా కార్డు విడుదల చేసిన ఎమ్మెల్యే గండ్ర -
ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పదోన్నతులు ఓకే..!
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని వివిధ విభాగాల్లో 2010లో నియామకమైన అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఎట్టకేలకు పదోన్నతులు కల్పిస్తూ కేయూ పాలకమండలి సమావేశం నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. వీరి నియామకాలను గత పాలకమండలిలో ఆమోదించినా పెండింగ్లో ఉండిపోయింది. తాజా సమావేశంలో పదోన్నతి అంశం చర్చకు వచ్చి పదోన్నతులకు చివరికి సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. త్వరలోనే వీరికి క్యాస్ పదోన్నతులు లభించనున్నాయి. సోమవారం హైదరాబాద్లోని సచివాలయంలో నిర్వహించిన కాకతీయ యూనివర్సిటీ పాలకమండలి సమావేశంలో ఎజెండాలోని పలు అంశాలపై చర్చించి ఆమోదించినట్లు తెలిసింది. యూనివర్సిటీలోని వివిధ విభాగాల్లో రెగ్యులర్ ఆచార్యుల కొరతతో వర్క్లోడ్ అధికంగా ఉంది. ఇందుకనుగుణంగా పార్ట్టైం లెక్చరర్లను నియమించడం లేదు. ఇటీవల వివిధ విభాగాల్లో పేపర్ వైజ్గా నియామకాలు చేపట్టారు. పార్ట్టైం లెక్చరర్లను నియమించాలనే విషయంపై పాలక మండలిలో చర్చించారు. వర్క్లోడ్కు అనుగుణంగా 130 మందిని నియమించుకునేందుకు పాలకమండలి ఆమోదించింది. ఇందుకోసం నోటిఫికేషన్ ఇచ్చి అర్హులైన వారిని నియమ నిబంధనలకు అనుగుణంగా తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న వారి పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లనుంచి 65 ఏళ్లవరకు పెంచుతూ ఆమోదించింది. రెగ్యులర్ ఆచార్యులకు మాదిరిగానే వీరికి ఉద్యోగ విరమణ ఉండనుంది. టీచింగ్, నాన్టీచింగ్ ఉద్యోగులు మరణిస్తే అంత్యక్రియల ఖర్చు రూ.20వేల నుంచి రూ.30వేలకు పెంచుతూ ఆమోదించింది. యూనివర్సిటీ భూమిలో ఇల్లు కలిగి ఉండటంతో పాటుగా పలు ఆరోపణలతో ఇప్పటికే సస్పెన్షన్లో ఉన్న ఓ అసిస్టెంట్ రిజిస్ట్రార్పై విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం న్యాయపరమైన అంశాలను పరిగణనలోనికి తీసుకొని ముందుకెళ్లాలని పాలకమండలి సూచించినట్లు సమాచారం. ప్రహరీ నిర్మాణానికి ఓకే.. కాకతీయ యూనివర్సిటీలోని భూమి చుట్టూ ప్రహరీ నిర్మించాలనే విషయంపై మళ్లీ పాలకమండలిలో చర్చకు రాగా రూ.20కోట్ల వ్యయంతో కొంత ఎత్తుగా ఉండేలా నిర్మాణాన్ని ప్రభుత్వ సంస్థ టీజీడబ్లూ ఐడీసీకి అప్పగించాలని చర్చించినట్లు సమాచారం. పాలకమండలిలో నిర్ణయించిన ప్రకారం యూనివర్సిటీ అధికారులు ముందుకెళ్లాలని నిర్ణయించారని విశ్వసనీయంగా తెలిసింది. సమావేశంలో కేయూ వీసీ ఆచార్య కె.ప్రతాప్రెడ్డి, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా, ఉన్నత విద్య కమిషనర్ శ్రీదేవసేన, రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం, పాలకమండలి సభ్యులు ఆచార్య బి.సురేష్లాల్, డాక్టర్ కె.అనితారెడ్డి, డాక్టర్ రమ, డాక్టర్ చిర్రా రాజు, సుకుమారి, మల్లం నవీన్, బాలు చౌహాన్ టి.సుదర్శన్ పాల్గొన్నారు. కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సు 65 ఏళ్లకు పెంపు రూ.20కోట్లతో ప్రహరీ నిర్మాణం కేయూ పాలకమండలి సమావేశంలో ఆమోదం -
స్థానిక పోరుపై ఫోకస్
భూపాలపల్లి: బీసీ రిజర్వేషన్ల ముచ్చట ఎలా ఉన్నా గ్రామాల్లో మాత్రం రాజకీయ వేడి రోజురోజుకూ మరింత పెరుగుతోంది. ఓ వైపు ఎన్నికలు జరుగుతాయా లేదా అనే చర్చ సాగుతున్న తరుణంలోనే మరోవైపు స్థానిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. పార్టీలు ఒకదానిపై ఒకటి దుమ్మెత్తి పోసుకుంటూనే, ఎన్నికల్లో గెలుపు గుర్రాల కోసం ఆయా పార్టీలు అంతర్గత సర్వేలు నిర్వహిస్తున్నాయి. అభ్యర్థుల కోసం పరిశీలన.. జిల్లాలో 12 ఎంపీపీ, 12 జెడ్పీటీసీ, 109 ఎంపీటీసీ, 248 సర్పంచ్, 2,102 వార్డు స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు కోసం ఆశావాహులంతా వేచి చూస్తున్నారు. కోర్టు తీర్పు రాకముందే జిల్లాలో ఎన్నికల వాతావరణం నెలకొంది. స్థానిక ఎన్నికల్లో పట్టు సాధించేందుకు ప్రధాన పార్టీలు తమదైన శైలిలో ముందుకు సాగుతున్నాయి. పార్టీల నేతలు నిత్యం గ్రామాల్లో పర్యటిస్తూ ఇతర పార్టీల వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. టికెట్ ఆశిస్తున్న వారి పేర్లను ప్రధాన పార్టీలు ఇప్పటికే సేకరించాయి. ఒక్కో స్థానానికి సుమారు పది మంది టికెట్ ఆశిస్తుండగా నలుగురు, ఐదుగురు పేర్లను ఫైనల్ చేసి మళ్లీ గ్రామాల్లో సర్వే నిర్వహిస్తున్నారు. ఎవరికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉందని గ్రామస్తుల అభిప్రాయాలు అంతర్గతంగా తీసుకుంటున్నారు. ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలకు గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో యువత బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. వేడెక్కిన రాజకీయం.. గ్రామాల్లో స్థానిక ఎన్నికల వేడి నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులు వివిధ కార్యక్రమాల పేరుతో గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇరు పార్టీల నాయకులు నిత్యం ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ బీఆర్ఎస్ నాయకులు గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తూ ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ పేరిట కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ పలు అంశాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నాయకులు సోమవారం ‘బీఆర్ఎస్ డోకా కార్డు’ను విడుదల చేశారు. దీంతో ‘స్థానిక’ రాజకీయం మరింత వేడెక్కింది. ఆ ఐదు మండలాలపైనే దృష్టి.. జిల్లాలో 12 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా జెడ్పీ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. జెడ్పీ చైర్మన్ స్థానం బీసీ జనరల్కు కేటాయించినందున ఆ రిజర్వేషన్ ఉన్న ఐదు మండలాలపైనే దృష్టి సారించాయి. జిల్లాలోని గణపురం, కొత్తపల్లి గోరి మండలాల జెడ్పీటీసీ స్థానాలు బీసీ మహిళ, చిట్యాల, భూపాలపల్లి, మహదేవపూర్ బీసీ జనరల్కు కేటాయించారు. దీంతో ఆయా మండలాల్లో దీటైన, గెలుపొందే అభ్యర్థుల కోసం రాజకీయ పార్టీలు అంతర్గత సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఇద్దరు, ముగ్గురు మద్దతిస్తే అక్కడ ఎంపీపీ.. జిల్లాలోని 109 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 12 మండలాలకు ఎంపీపీలు ఉండనున్నారు. 9 మండలాల్లో 8, 9కి పైగా ఎంపీటీసీ స్థానాలు ఉండగా మూడు మండలాల్లో మాత్రం అతి తక్కువ స్థానాలు ఉన్నాయి. దీంతో ఆయా మండలాల్లో ఇద్దరు, ముగ్గురు ఎంపీటీసీలు మద్దతిస్తే ఎంపీపీ స్థానాన్ని చేజిక్కించుకోవచ్చు. కొత్తపల్లి గోరి, మల్హర్ మండలాల్లో ఆరు చొప్పున స్థానాలు ఉండగా ముగ్గురి మద్దతు, పలిమెల మండలంలో కేవలం ఇద్దరు గెలుపొందిన ఎంపీటీసీలు మద్దతిస్తే ఎంపీపీ కుర్చీని కై వసం చేసుకోవచ్చు. దీంతో ఇక్కడి పీఠాలను దక్కించుకునేందుకు గెలుపు గుర్రాల కోసం ప్రధాన రాజకీయ పార్టీలు అన్వేషిస్తున్నాయి. జెడ్పీ పీఠం కోసం ఆ మండలాలపై దృష్టి గ్రామాల్లో నెలకొన్న రాజకీయ వేడి కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య ‘కార్డు’ పంచాయితీ -
డేంజర్ రోడ్డు
గణపురం: గాంధీనగర్ నుంచి గణపురం మండలకేంద్రంతో పాటు ములుగు జిల్లా వెంకటాపురం మండలం వెల్తుర్లపల్లి వరకు పరకాల–ములుగు ప్రధాన రహదారి డేంజర్గా మారింది. గాంధీనగర్ నుంచి వెల్తుర్లపల్లి వరకు సుమారు 9 కిలోమీటర్ల మేరకు ప్రధాన రహదారి పెద్ద గుంతలతో నిండిపోయింది. రహదారి వెంట ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేస్తున్నారు. భారీ వాహనాలతో పాటు కార్లు, ఆటోలలో వెళ్లే ప్రయాణికులు నానాయాతన పడుతున్నారు. ద్విచక్ర వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు, పాలకులు స్పందించి రోడ్డు నిర్మాణం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి
భూపాలపల్లి: ఎన్నికల ప్రారంభం నుంచి ముగింపు వరకు సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సోమవారం ఐడీఓసీ కార్యాలయపు సమావేశపు హాల్లో ఆర్వోలు, ఏఆర్వోలు, ఎంపీడీఓలు, నోడల్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. నామినేషన్ నుంచి లెక్కింపు వరకు సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ల దాఖలు, అర్హతలు, పరిశీలన, గుర్తుల కేటాయింపు, నామినేషన్ల ఉపసంహరణ, పోలింగ్ మెటీరియల్ పంపిణీ, కేంద్రాలు, స్ట్రాంగ్ రూములు ఏర్పాటు.. తదితర అన్ని కార్యక్రమాలపై కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, డిప్యూటీ కలెక్టర్ నవీన్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
మెరుగైన వైద్యసేవలు అందించాలి
మల్హర్: ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి మధుసూదన్ సిబ్బందికి సూచించారు. మండలంలోని తాడిచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం డీఎంహెచ్ఓ మధుసూదన్ సందర్శించారు. ఆస్పత్రిలోని మందుల వివరాలు, రికార్డులను పరిశీలించి, సిబ్బంది వివరాలపై ఆరాతీశారు. ఆస్పత్రికి వచ్చిన రోగులకు వైద్యం అందిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చే రోగుల పట్ల మర్యాదగా వ్యవహరిస్తూ ప్రభుత్వం వైద్యం పట్ల నమ్మకం కల్పించాలని వివరించారు. సమయపాలన పాటిస్తూ మెరుగైన వైద్యం అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీడీఎం నల్ల మధుబాబు, డాక్టర్ వినయ్భాస్కర్, సిబ్బంది పాల్గొన్నారు.జిల్లా వైద్యాధికారి మధుసూదన్ -
ఆరు గ్యారంటీలను మర్చిపోయిన కాంగ్రెస్
టేకుమట్ల: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను మర్చిపోయిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అన్నారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సట్ల రవిగౌడ్ ఆధ్వర్యంలో సోమవారం మండలకేంద్రంతో పాటు, మండలంలోని రామకిష్టాపూర్(టి)లో ఆరు గ్యారెంటీల బాకీ కార్డును ఇంటింటికీ అందించారు. అనంతరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేక అబద్దాలను చెప్పి ప్రజలను మోసం చేసిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, వాటిని పట్టించుకోకుండా పాలన సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి, బందెల స్నేహలత నరేష్, వైస్ ఎంపీపీ పోతనవేని ఐలయ్య, నల్లబెల్లి రవీందర్, ఆది రఘు, నిమ్మల స్వామి, వెంకటేశ్వర్రెడ్డి, పొన్నం చంద్రయ్య, ఆకునూరి తిరుపతి, అప్జల్, గువ్వాడి లక్ష్మన్, ఎలవేని భాగ్య పాల్గొన్నారు.బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి -
హుండీ ఆదాయం రూ.71,902
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని శ్రీభక్తాంజనేయస్వామి దేవాలయ హుండీ ఆదాయం రూ.71,902 వచ్చినట్లు ఆలయ ఈఓ మహేష్ తెలిపారు. సోమవారం ఎండోమెంట్ రెవెన్యూ డివిజన్ ఇన్స్పెక్టర్ నందనం కవిత ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు రాధాకృష్ణ, మురళీకృష్ణ, భక్తులు, సిబ్బంది పాల్గొన్నారు.ఎన్నికల విధులను సవరించాలిభూపాలపల్లి అర్బన్: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల విధులలో జరిగిన లోపాలను సవరించి విధులు కేటాయించాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్.అశోక్, ఎ.తిరుపతి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూనియర్లకు ఆర్ఓ, ఏఆర్ఓ, పీఓ, ఏపీఓలుగా, సీనియర్లకు ఓపీఓలుగా కేటాయించినట్లు ఆరోపించారు. ఎన్నికల విధులలో ప్రభుత్వం విడుదల చేసిన జీఓ ప్రకారం పదవీ విరమణ పొందే వారికి, దివ్యాంగులకు, దీర్ఘకాల అనారోగ్యం కల వారికి ఎన్నికల విధుల నుంచి మినహాయింపు కల్పించాలని డిమాండ్ చేశారు.23 వరకు ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు గడువుకాళేశ్వరం: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్)ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్ చదువుకునే వారికి 2025–2026 సంవత్సరానికి గాను అడ్మిషన్ షెడ్యూలు అపరాధ రుసుంతో ఈనెల 23వరకు అడ్మిషన్ చేసుకోవడానికి గడువు ఉందని కోఆర్డినేటర్ ప్రభాకర్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివరాలకు మొబైల్ నంబర్లు 75699 75383, 63008 54065లో సంప్రదించాలని పేర్కొన్నారు.తాడిచర్లలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్మల్హర్: స్థానిక ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా కాటారం డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో సోమవారం తాడిచర్లలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. అనంతరం డీఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ స్థానిక ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో కొయ్యూరు ఎస్సై నరేశ్, సివిల్, టీజీఎస్పీ సిబ్బంది పాల్గొన్నారు.9న బహిరంగ వేలంరేగొండ: మండలంలోని తిరుమలగిరి శివారులోని శ్రీ బుగులోని వెంటేశ్వరస్వామి దేవస్థానం నందు నవంబర్ 3 నుంచి జరిగే జాతర సందర్భంగా కొబ్బరికాయలు, లడ్డు, పులిహోర ప్రసాదం అమ్ముకునేందుకు లైసెన్స్ హక్కు కోసం ఈ నెల 9న తిరుమలగిరిలో బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆసక్తి గల వారు నిర్ణీత దరావత్తు చెల్లించి బహిరంగ వేలంలో పాల్గొనాలని తెలిపారు. -
స్పాట్ సెల్లింగ్
స్లాట్ బుకింగ్.. హన్మకొండ: పంట అమ్ముకునే సమయంలో ఎదురవుతున్న ఇబ్బందుల నుంచి పత్తి రైతులకు ఇక విముక్తి లభించనుంది. కనీస మద్దతు ధర అందించడంతోపాటు దళారుల ప్రమేయం లేకుండా రైతులు నేరుగా పత్తి అమ్ముకునేందుకు, క్రయవిక్రయాలు పారదర్శకంగా జరిగేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ‘కా పాస్ కిసాన్’ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఇక నుంచి రైతులు ఈ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుని పంటను అమ్ముకోవాలి. ఈ నేపథ్యంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులకు ఈ యాప్పై ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన అధికారులు రైతుల మొబైల్ ఫోన్లో యాప్ను డౌన్లోడ్ చేయించి పత్తి బుక్ చేసుకునే విధానంపై అవగాహన కల్పిస్తారు. తద్వారా పత్తి క్రయవిక్రయాలు పూర్తిగా యాప్ ద్వారానే సాగనున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పత్తి దాదాపు 5,23,848 ఎకరాల్లో సాగు చేశారు. ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి.. ‘కా పాస్ కిసాన్’ యాప్ను స్మార్ట్ఫోన్లలో గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ను డౌన్లోడ్ చేసుకున్నాక ముందుగా రైతు పేరు, జండర్, పుట్టిన తేదీ, కులం. చిరునామా, ఆధార్, ఫోన్ నంబర్, కౌలురైతు/సొంతమా అనే వివరాలు నమోదు చేయాలి. పట్టాదారు పాస్ పుస్తకం నంబర్, సర్వే నంబర్, రైతుకు ఉన్న మొత్తం భూమి, ఇందులో పత్తి సాగు విస్తీర్ణం, పంట రకం వివరాలు యాప్లో నిక్షిప్తం చేయాలి. రైతుకు సంబంధించిన ఆధార్ కార్డు, పాస్బుక్, రైతు ఫొటోను యాప్లో అప్లోడ్ చేయాలి. స్లాట్ బుక్ చేసుకుంటేనే అమ్మకం.. రైతులు ‘కా పాస్ కిసాన్’ యాప్లో స్లాట్ బుక్ చేసుకుంటేనే పత్తి అమ్ముకోగలుగుతారు. రైతులు ఏ మిల్లులో అమ్ముకుంటారో తెలుపుతూ స్లాట్ బుక్ చేయగానే తేదీ, సమయాన్ని అధికారులు యాప్ ద్వారా సమాచారం అందిస్తారు. అదే నిర్ణీత రోజు, నిర్ణీత సమయానికి రైతు పత్తిని తీసుకెళ్లి విక్రయించుకోవచ్చు. స్లాట్ బుక్ చేసుకోకపోతే పత్తిని అమ్ముకోలేరు. రైతులు మూడుసార్లు స్లాట్ బుక్ చేసుకుని, స్లాట్ను రద్దు చేసుకోకుండా పత్తిని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లి విక్రయించకపోతే ఆ రైతు పేరు బ్లాక్లిస్టులోకి వెళ్తుంది. బ్లాక్ లిస్టులో నుంచి పేరు తొలగించి, తిరిగి పత్తి అమ్ముకోలాంటే సీసీఐ అధికారులతో ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. ప్రత్యేక యాప్ను రూపొందించిన సీసీఐ ‘కా పాస్ కిసాన్’ యాప్ ద్వారా బుకింగ్ యాప్పై వ్యవసాయ అధికారులు, విస్తరణాధికారులకు శిక్షణ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 5,23,848 ఎకరాల్లో పత్తి సాగుజిల్లా విస్తీర్ణం (ఎకరాలు) వరంగల్ 1,18,547 హనుమకొండ 74,849 మహబూబాబాద్ 85,480 ములుగు 20,593 భూపాలపల్లి 98,260 జనగామ 1,26,119పత్తి క్వింటాకు రూ.8,110 మద్దతు ధర.. కేంద్ర ప్రభుత్వం పత్తి క్వింటాలుకు రూ.8,110 మద్దతు ధర ప్రకటించింది. ‘కా పాస్ కిసాన్’ యాప్ ద్వారా మద్దతు ధర పొందే అవకాశాన్ని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కల్పించింది. స్మార్ట్ ఫోన్లేని రైతులు ఇతరుల స్మార్ట్ ఫోన్ నుంచి కూడా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. రైతు పాస్బుక్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ‘కా పాస్ కిసాన్’ యాప్లో రైతు పట్టాదారు పాస్బుక్ నంబర్, ఇతర వివరాలు నమోదు చేయగానే పంట ఎంత సాగు చేశారో వివరాలు అందులో వస్తాయి. వ్యవసాయ శాఖ ఇప్పటికే డిజిటల్ క్రాప్ సర్వే చేస్తూ పంట సాగు వివరాలు నమోదు చేస్తోంది. డిజిటల్ క్రాప్ సర్వే దాదాపు పూర్తి కావొచ్చింది. పంట సాగు విస్తీర్ణాన్ని బట్టి దిగుబడి లెక్కిస్తారు. ఈ యాప్ ద్వారా రైతులకు దళారుల నుంచి విముక్తి కలుగుతుంది. రైతులు నిరీక్షించాల్సిన బాధ తప్పుతుంది. -
నేటి ప్రజాదివస్ రద్దు
భూపాలపల్లి: ఎస్పీ కార్యాలయంలో నేడు (సోమవారం)నిర్వహించే ప్రజా దివస్ తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఎస్పీ కిరణ్ ఖరే ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నాను. జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామపంచాయతీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజాదివస్ కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఫిర్యాదుల నిమిత్తం జిల్లా పోలీస్ కార్యాలయానికి రావద్దని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసిన తర్వాత ప్రజాదివస్ ప్రారంభమవుతుందని వెల్లడించారు.హామీలను నెరవేర్చాలిరేగొండ: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలపై బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన కాంగ్రెస్ బాకీ కార్డులను ఆదివారం మండలంలోని కనిపర్తి, నాగుర్లపల్లి గ్రామాలలో ఇంటింటికి పంచారు. ఈ సందర్భంగా గండ్ర జ్యోతి మాట్లాడుతూ.. అధికారం కోసం అడ్డగోలు హామీలిచ్చి అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు. కాంగ్రెస్ మోసాన్ని ఎండగడుతూ కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మహేందర్, భద్రయ్య, రాజు, అర్ఙున్, సుధాకర్, అంకూస్ పాల్గొన్నారు.కారు బోల్తాచిట్యాల: భూపాలపల్లి నుంచి మొగుళ్లపల్లి వెళ్తుండగా అదుపుతప్పి కారు బోల్లా పడిన ఘటన మండలకేంద్రంలోని క్రోసూరుపల్లి గ్రామశివారులో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. మొగుళ్లపల్లి మండలం ములకలపల్లి గ్రామానికి చెందిన కారు డ్రైవర్ కురిమిళ్ల మహేష్ పని నిమిత్తం భూపాలపల్లికి వచ్చి తిరిగి ఇంటికి వెళ్తున్నాడు. క్రోసూరుపల్లి గ్రామశివారులో గల ప్రధాన రోడ్డు వద్ద కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఎలాంటి ప్రమాదమూ జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నాడు.పిడుగు పాటుతో ఎద్దు మృతికాటారం(మహాముత్తారం): పిడుగుపాటుతో ఎద్దు మృతి చెందిన ఘటన మహాముత్తారం మండలం బోర్లగూడెంలో ఆదివారం చోటుచేసుకుంది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. జంగెపల్లి వెంకటరాజయ్య అనే రైతుకు చెందిన ఎద్దు ఇంటి సమీపంలోని పొలంలో మేత మేస్తుంది. వర్షం కురుస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఎద్దుపై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతిచెందింది. ఎద్దు విలువ సుమారు రూ.50వేల వరకు ఉంటుందని బాధిత రైతు వెంకటరాజయ్య తెలిపారు. ప్రభుత్వం సహాయం అందించి ఆదుకోవాలని వెంకటరాజయ్య కోరారు.విద్యుదాఘాతంతో..కాటారం: విద్యుదాఘాతంతో గేదె మృతిచెందిన ఘటన ఆదివారం మండలంలోని ఇబ్రహీంపల్లిలో చోటుచేసుకొంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. నాగుల రాజయ్య అనే రైతుకు చెందిన గేదె మేత కోసం గ్రామ పరిసర ప్రాంతానికి వెళ్లగా విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. గేదె విలువ రూ.50 వేల వరకు ఉంటుందని గేదె ఇచ్చే పాలతో ఉపాధి పొందుతున్నట్లు బాధిత రైతు రాజయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం విద్యుత్శాఖ ద్వారా పరిహారం అందించి ఆదుకోవాలని రాజయ్య వేడుకున్నారు.యువతి అదృశ్యంటేకుమట్ల: యువతి అదృశ్యమైన ఘటన మండలంలోని రామకిష్టాపూర్(వి)లో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ యువతి ఆదివారం ఉదయం టైలర్ షాపునకు వెళ్లొస్తానని చెప్పి తిరిగి రాలేదు. బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లేకపోవడంతో యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై కుమారస్వామి తెలిపారు. -
విద్యాశాఖలో నూతన విధానం
● అకడమిక్ క్యాలెండర్ల పంపిణీకి శ్రీకారం ● జీఓ జారీచేసిన పాఠశాల విద్యాశాఖ ● స్కూళ్లు, ఆఫీసుల్లో ప్రదర్శనకు చర్యలు ● కార్యక్రమాల అమలులో పారదర్శకత..భూపాలపల్లి అర్బన్: జిల్లాల్లోని పాఠశాలల్లో అకడమిక్ క్యాలెండర్ పంపిణీకి పాఠశాల విద్యాశాఖ నూతన శ్రీకారం చుట్టింది. విద్యాసంవత్సరానికి అనుగుణంగా రూపొందించిన ఈ క్యాలెండర్ ద్వారా బోధన, పరీక్షలు, సెలవులు, సాంస్కృతిక కార్యక్రమాలు, వార్షిక కార్యక్రమాల షెడ్యూల్ పొందుపర్చింది. విద్యాశాఖ ప్రతీ సంవత్సరం విధివిధానాల ప్రకారం క్యాలెండర్ విడుదల చేస్తూ వస్తోంది. ప్రభుత్వ పాఠశాలలు, కలెక్టరేట్, డీఈఓ తదితర కార్యాలయాలు, ఆయా పాఠశాలల్లో క్యాలెండర్లను ప్రదర్శించేలా చర్యలు చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ గత నెల 27న ఆదేశాలు జారీచేశారు. కార్యక్రమాల పటిష్ట అమలుకు.. ఏటా విద్యాసంవత్సరం ప్రారంభంలో అకడమిక్ క్యాలెండర్ పేరిట మార్గ సూచిని విడుదల చేస్తున్నా పాఠశాలల్లో దీనిని అమలు చేయడంలో మాత్రం లోపాలు తలెత్తుతున్నట్లు పాఠశాల విద్యాశాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులకు మినహా విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు విద్యాశాఖ విడుదల చేస్తున్న అకడమిక్ క్యాలెండర్ నిర్వహణపై సరైన అవగాహన ఉండడం లేదని భావించింది. దీంతో అకడమిక్ క్యాలెండర్ను పోస్టర్ రూపంలో అన్ని పాఠశాలల్లో ప్రదర్శించేలా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. క్యాలెండర్లో ఉండే సమాచారం జిల్లాలో 414 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 22వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీటన్నింటిలో జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో అకడమిక్ క్యాలెండర్లను పంపిణీ చేసి ప్రదర్శించేలా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఏ నెలలో ఏయే పరీక్షలు నిర్వహించాలి. సిలబస్ పూర్తిచేసే సమయం, పాఠశాల సముదాయ సమావేశాలు, ప్రదర్శన పోటీలు, క్రీడలు, గ్రంథాలయాల నిర్వహణ తదితర వివరాలు అన్నీ ఇందులో పొందుపరచబడి ఉంటాయి. ప్రధాన కార్యకలాపాలను అంశాల వారీగా రూపొందించి ఉండడంతో తదనుగుణంగా అకడమిక్ క్యాలెండర్ను ప్రయోజనాత్మకంగా అమలుచేసే ఆస్కారం ఉంటుంది. పారదర్శకత లోపించకుండా ఉంటుంది. విద్యా విషయక ప్రయోజనాలెన్నో.. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రచురించిన అకడమిక్ క్యాలెండర్ల పంపిణీ ద్వారా విద్యాపరమైన ప్రయోజనాలు పూర్తిస్థాయి ప్రయోజనకరంగా ఉండేందుకు అవకాశం ఉంటుందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు భావిస్తున్నారు. క్యాలెండర్ల ప్రదర్శన ద్వారా విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి కొనసాగే బడిబాట నిర్వహణ తేదీలు మొదలుకొని సెలవు దినాలు, నెల వారీ పరీక్షలు, పూర్తి చేయాల్సిన సిలబస్, ప్రాధాన్యత కలిగిన దినోత్సవాలు, తల్లిదండ్రుల సమావేశాలు, వివిధ రకాల పండుగ సెలవులు ఇందులో పొందుపరచబడి ఉంటాయి. ఇవన్నీ నెలవారీగా అమలు చేయడం, తద్వారా ఉన్నతాధికారుల పర్యవేక్షణ కూడా సరళతరం అవుతుందని అధికారులు అభిప్రాయం వ్యక్తంజేస్తున్నారు. పకడ్బందీ అమలుకు అవకాశం.. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రింటెడ్ అకడమిక్ క్యాలెండర్ల పంపిణీ నిర్ణయం సముచితమైంది. ఉపాధ్యాయులు, పర్యవేక్షణ అధికారులకు సౌకర్యవంతంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా పూర్తిస్థాయి ప్రయోజనం చేకూరుతుంది. ప్రింటెడ్ అకడమిక్ క్యాలెండర్లను ఆయా పాఠశాలల్లో ప్రదర్శించడం ద్వారా పారదర్శకత మరింత పెరుగుతుంది. ఉపాధ్యాయులు నెలవారీగా నిర్వహించే కార్యక్రమాల గురించి అవగాహన కలుగుతుంది. – పెండెం మధుసూదన్, టీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ప్రాథమిక పాఠశాలలు 301 ప్రాథమికోన్నత పాఠశాలలు 44 ఉన్నత పాఠశాలలు 69 మొత్తం విద్యార్థులు 22,723 -
వనదేవతలకు మొక్కులు
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు కల్యాణకట్టలో పుట్టువెంట్రుకలను సమర్పించుకున్నారు. అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకమ, చీరసారె, ఎత్తు బంగారం, కానుకలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెల వద్ద పూజలు చేశారు. మొక్కుల అనంతరం భక్తులు మేడారం పరిసరాల్లోని చెట్ల కింద విడిది చేసి వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనలు చేశారు. -
అనుమతులు వచ్చేశాయి..
మల్హర్: ఎన్నో ఏళ్ల కలగా మిగిలిన తాడిచర్ల–భూపాలపల్లి రహదారి నిర్మాణానికి అటవీశాఖ నుంచి ఫేజ్–2 అనుమతులు రావడంతో నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు రోడ్డు నిర్మాణానికి అటవీ ప్రాంతంలో హద్దులు ఏర్పాటు చేశారు. మరోవైపు రోడ్డు నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తయింది. త్వరలోనే పనులు ప్రారంభం కానుండటంతో ఈ ప్రాంతవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కాటారం మీదుగా భూపాలపల్లి.. మండల కేంద్రం తాడిచర్ల నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చేరుకోవాలంటే ప్రస్తుతం కాటారం మీదుగా ప్రయాణించాల్సి వస్తుంది. తమ ప్రాంతం నుంచి పెద్దతూండ్ల మీదుగా అటవీ ప్రాంతం గుండా రహదారి నిర్మిస్తే ఎంతో సమయంతో పాటు ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని ప్రజలు చెబుతున్నారు. మంథని నుంచి భూపాలపల్లికి వెళ్లే వారు కూడా ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చుకోవాల్సి వస్తుంది. ఏడాది క్రితం తాడిచర్ల–ఖమ్మంపల్లి గ్రామాల మధ్య మానేరు నదిపై వంతెన అందుబాటులోకి రావడంతో దూరభారం తగ్గింది. 2017 సంవత్సరంలో ఖమ్మంపల్లి నుంచి భూపాలపల్లి వరకు 20 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణానికి అనుమతి వచ్చింది. ప్రస్తుతం 12 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణాన్ని పూర్తిచేశారు. మిగతా రోడ్డు నిర్మాణం కోసం అటవీ అనుమతులు రాకపోవడంతో అక్కడికే నిర్మాణాన్ని నిలిపివేశారు. రూ.4.67 కోట్ల చెల్లింపు.. రిజర్వ్ ఫారెస్ట్ నుంచి రోడ్డు నిర్మాణానికి మోకాలడ్డిన అటవీ శాఖ ఎట్టకేలకు ఒక వరస రహదారి నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసింది. మల్హర్ మండలం పెద్దతూండ్ల గ్రామపంచాయతీ పరిధిలోని కిషన్రావుపల్లి నుంచి అటవీప్రాంతం గుండా భూపాలపల్లి వన్ ఇంకై ్లన్ మైన్ వరకు ఏడు మీటర్ల వెడల్పుతో రహదారి నిర్మాణం చేపట్టవచ్చని.. ఆ ప్రాంతంలో తాము నష్టపోతున్న చెట్ల సంపదకు గాను రూ.4.67 కోట్ల పరిహారాన్ని చెల్లించాలని అటవీశాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నిధులు చెల్లించడంతో ఫారెస్ట్ నుంచి ఫేజ్–2 అనుమతులు వచ్చాయి. ఫారెస్ట్ అధికారులు త్వరలోనే చెట్లను తొలగించనున్నారు. కిషన్రావుపల్లి నుంచి భూపాలపల్లి సమీపంలోనే వన్ఇంక్లైన్ వరకు 7 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి అధికారులు రూ.15 కోట్లతో టెండర్లు పిలిచారు. ప్రక్రియ పూర్తి కావడంతో త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. తగ్గనున్న దూరభారం.. మంథని నుంచి భూపాలపల్లికి వెళ్లాలంటే కాటారం మీదుగా 60 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఖమ్మంపల్లి–తాడిచర్ల మీదుగా కేవలం 30 కిలోమీటర్లలోనే భూపాలపల్లికి చేరుకోవచ్చు. ప్రస్తుతం నిత్యం వందలాది వాహనాలు మంథని మీదుగా సుదూర ప్రాంతం నుంచి వెళ్తున్నాయి. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే సగం దూర భారం తగ్గనుండటంతో విద్య, వైద్యం మరింత మెరుగు పడనుంది. సమయంతో పాటు ఇంధన ఖర్చులు భారీగా ఆదా కానున్నాయి. విద్య, వైద్యానికి చేరువవుతాం.. కిషన్రావుపల్లి ఫారెస్ట్లో రోడ్డు నిర్మిస్తే విద్యార్థులకు ఉన్నత చదువులు, మెరుగైన వైద్యానికి ఆస్పత్రులకు వెళ్లడానికి అనువుగా ఉంటుంది. ప్రయాణ భారం తగ్గుతుంది. – బోడ్డు తిరుపతి, పెద్దతూండ్ల, మల్హర్ కిషన్రావుపల్లి రోడ్డు నిర్మాణానికి అటవీశాఖ లైన్ క్లియర్ పూర్తయిన టెండర్ ప్రక్రియ త్వరలోనే పనులు ప్రారంభం తగ్గనున్న దూర భారం -
కోటిన్నర ప్రాపర్టీ పట్టు!
● కూపన్ కొనుగోలుకు ఉవ్విళ్లూరుతున్న జనం ● సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారిన వైనంకాళేశ్వరం: ఐదు వేల ఒక రూపాయితో కూపన్ కొనుగోలు చేసి.. లక్కీడ్రాలో మొదటి బహుమతి వరిస్తే కోటిన్నర ప్రాపర్టీ స్వంతం చేసుకొనే అదృష్టం లభిస్తుందని వాట్సాప్, సోషల్ మీడియాలో పోస్టింగ్లు వైరల్ అవుతున్నాయి. మొన్నీమధ్య యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద 66 గజాల ప్లాటుకు రూ.500 కూపన్ పెట్టి విక్రయాలు జరిపి రాష్ట్ర వ్యాప్తంగా వైరల్గా మారింది. అది మరువక ముందే మళ్లీ కాళేశ్వరంలో అలాంటి ప్రాపర్టీ విక్రయ సేల్కు భవన యజమాని కొత్తగా ఆలోచన చేశాడు. కాళేశ్వరంలోని ఎస్ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ను యజమాని శ్రీనివాస్రెడ్డి ఇటీవల విక్రయానికి పెట్టాడు. కానీ సరైన ధర, కొనుగోలుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో లక్కీడ్రాను ఏర్పాటు చేసి అందరూ కూపన్లు కోనేలా ప్లాన్ చేస్తున్నాడు. రూ.5,001తో లక్కీ డ్రా కూపన్ తీసుకొని కోటిన్నర విలువగల ప్రాపర్టీని పట్టు అని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నాడు. మొత్తం లక్కీ డ్రా కూపన్లు 2,500 వరకు విక్రయించడానికి సిద్ధమయ్యాడు. మొదటి బహుమతి కోటిన్నర ప్రాపర్టీ, రెండవ బహుమతి రెండు తులాల బంగారం, మూడో బహుమతి కిలో వెండి అందజేస్తామని కూపన్లలో పేర్కొంటున్నాడు. ఈ లక్కీడ్రా జనవరి 14న తీయనున్నారు. దీంతో ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కూపన్లు తీసుకోవడానికి ఆరా తీస్తున్నారు. ఇతర ప్రాంతాల వారు కూడా విషయం తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లాతో పాటు మంచిర్యాల, ములుగు, పెద్దపల్లి జిల్లాల్లో వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతుంది. ఈ విషయంపై పోలీసులు, నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్లు సమాచారం. -
డీఎస్పీ నవీన్కు ఘన సన్మానం
వెంకటాపురం(ఎం): మండల కేంద్రానికి చెందిన దానం నవీన్ ఇటీవల వెల్లడించిన గ్రూప్–1లో ఫలితాల్లో డీఎస్పీగా ఎంపికయ్యారు. ఈ మేరకు అదివారం మండల కేంద్రంలో నవీన్ను కాంగ్రెస్ నాయకులు శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మిల్కూరి అయిలయ్య మాట్లాడుతూ పేద కుటుంబంలో పుట్టిన నవీన్ కలెక్టర్ కావాలనే లక్ష్యంతో తన మేనమామ సమ్మయ్య సహకారంతో చదివి డీఎస్పీగా ఎంపిక కావడం అభినందనీయమన్నారు. ప్రతిఒక్కరూ నవీన్ను ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు మామిడిశెట్టి నవనీత్, నాయకులు రాజు, రాజేష్, వెంకటేశ్, తిరుపతి, సమ్మయ్య పాల్గొన్నారు. -
వ్యూహాలకు పదును..
‘స్థానిక’ ఎన్నికలకు పావులు కదుపుతున్న అగ్రనేతలుసాక్షిప్రతినిధి, వరంగల్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ పరిధిలోని ఆరు జిల్లా ప్రజాపరిషత్లతో పాటు ఎంపీపీలు, సర్పంచ్ స్థానాలను కై వసం చేసుకునేందుకు పావులు కదుపుతున్నాయి. గెలుపు గుర్రాలను రంగంలోకి దింపేందుకు అన్ని పార్టీలు కసరత్తు మొదలెట్టాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఓ అడుగు ముందుకు వేసి నియోజకవర్గస్థాయి సమావేశాల ద్వారా దరఖాస్తులు స్వీకరించేందుకు ఆదివారం నుంచి కార్యాచరణ అమలు చేయనుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ద్వితీయ శ్రేణి నేతలు, కేడర్తో సంప్రదింపులు చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని రాష్ట్ర కమిటీ సందేశం పంపింది. ఇక వామపక్షాలు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ, బీఎస్పీ తదితర పార్టీలు సైతం కార్యకలాపాలు చేస్తున్నాయి. ఇన్చార్జ్ మంత్రి, ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక బాధ్యత.. జిల్లా ఇన్చార్జ్ మంత్రి, ఎమ్మెల్యేలు జిల్లా కమిటీ అధ్యక్షులు, ముఖ్యనేతలను సమన్వయం చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఈ మేరకు ఆదివారంనుంచి నియోజకవర్గాల వారీగా కార్యకర్తల సమావేశం నిర్వహించి అభిప్రాయ సేకరణ చేయనున్నారు. ఇదే సమయంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు పోటీపడే వారినుంచి దరఖాస్తులు కూడా స్వీకరించనున్నారు. ఒక్కో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ స్థానంనుంచి నాలుగు నుంచి ఐదు పేర్లను పరిశీలించి అధిష్టానానికి ప్రతిపాదించనున్నారు. స్థానిక అభ్యర్థులకు ఈ విషయంలో ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ప్రజాదరణ, కార్యకర్తల మద్దతు ప్రాధాన్యాంశాలు కానున్నాయని, అభ్యర్థుల ఎంపిక అధిష్టానం సూచనల మేరకు పారదర్శకంగా ఉంటుందని ఓ ప్రజాప్రతినిధి తెలిపారు. నియోజకవర్గాల వారీగా నిర్వహించే సమావేశాలు కీలకమైనందున కార్యకర్తలు, నాయకులు హాజరయ్యేలా చూసుకోవాలని జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం జిల్లా ఎమ్మెల్యేలకు సూచించినట్లు తెలిసింది. ఈ మేరకు ఎమ్మెల్యేలు ముందుగానే నాయకులు, కార్యకర్తలకు సమాచారం అందించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆరు జెడ్పీలపై గురి... కాంగ్రెస్, బీఆర్ఎస్... ఈ రెండు పార్టీలు ఆరు జిల్లా ప్రజాపరిషత్ స్థానాలపై గురిపెట్టాయి. బీజేపీ సైతం గట్టీ పోటీ ఇవ్వాలని భావిస్తోంది. ఈసారి హనుమకొండ జెడ్పీ ఎస్సీ మహిళ, వరంగల్ ఎస్టీ జనరల్, ములుగు ఎస్టీ మహిళ, జనగామ ఎస్సీ మహిళ, మహబూబాబాద్ జనరల్, భూపాలపల్లి బీసీ జనరల్కు రిజర్వు చేశారు. వాస్తవానికి హనుమకొండ, వరంగల్, జనగామలు జనరల్కు వస్తాయని ఆశావహులు భావించారు. అందుకు భిన్నంగా రిజర్వేషన్లు ఉండటంతో ఆశావహుల అంచనాలు దెబ్బతినగా.. ఈ ఆరింటిని ఎలా కై వసం చేసుకోవాలి? అన్న వ్యూహంలో ప్రధాన పార్టీల నాయకత్వం యోచిస్తోంది. ఇదే సమయంలో 12 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 75 జెడ్పీటీసీ స్థానాలు.. 75 ఎంపీపీ పదవులను దక్కించుకోవడం కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. 778 ఎంపీటీసీలు, 1,705 సర్పంచ్ పోస్టులకు రిజర్వేషన్ల ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేసి గెలిపించుకోవడం పెద్ద టాస్క్గా మారింది. కాగా ఈ నెల 8న రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్పై విచారణ, తీర్పు ఉండగా.. ఆ మరుసటి రోజైన 9వ తేదీనుంచి మొదటి విడత ఎన్నికల జరిగే ప్రాంతాల్లో అభ్యర్థులు నామినేషన్లు వేసేలా పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. గెలుపు గుర్రాల ఎంపికలో ప్రధాన పార్టీలు పావులు కదుపుతుండగా.. పల్లెల్లో ‘స్థానిక’ ఎన్నికల సందడి రోజు రోజుకూ జోరందుకుంటోంది. ప్రధాన రాజకీయపార్టీల్లో సాగుతున్న కసరత్తు ఇన్చార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక బాధ్యత నేటినుంచి నియోజకవర్గాల్లో కార్యకర్తల సమావేశాలు బీఆర్ఎస్, బీజేపీలోనూ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు గెలుపు గుర్రాల వేటలో మూడు ప్రధాన పార్టీలు.. ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ -
బడుల నిర్వహణకు కష్టాలు
కాటారం: సర్కారు బడుల నిర్వహణకు నిధుల కొర త నెలకొంది. పాఠశాలలు ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ పాఠశాలల ఖాతాల్లో డబ్బులు జమకాకపోవడంతో నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాఠశాలల్లో అవసరమయ్యే చాక్పీస్లు, స్టేషనరీ సామగ్రి, చిన్న, చిన్న మరమ్మతుల కోసం ప్రధానోపాధ్యాయులు తమ జేబులో నుంచి డబ్బులు పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పీఎంశ్రీ కింద ఎంపికై న పాఠశాలలకు మాత్రం 50 శాతం నిధులు మంజూరయ్యాయి. మిగితా పాఠశాలల్లో నిధుల లేమి నెలకొనడంతో నిర్వహణ భారంగా మారిపోయింది. ఏటా రెండు పర్యాయాలు నిధులు మంజూరు చేస్తున్న ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం ఇప్పటివరకు నిధులు అందించలేదు. ఇటీవల ప్రభుత్వం పాఠశాల గ్రాంట్స్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఇప్పటి వరకు పాఠశాలల ఖాతాల్లో జమకాలేదు. జిల్లాలో 430 పాఠశాలలు.. జిల్లాలో 317 ప్రాథమిక, 44 ప్రాథమికోన్నత, 69 ఉన్నత పాఠశాలలో కలుపుకొని 430 పాఠశాలలు ఉన్నాయి. ఈ ప్రభుత్వ పాఠశాలల్లో 19,788 మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థుల సంఖ్యను బట్టి పాఠశాలలకు నిర్వహణ నిధులు మంజూరవుతాయి. గతేడాది సకాలంలో నిధులు మంజూరైనప్పటికీ ఈ ఏడాది మాత్రం నిధులు జమకావడంతో జాప్యం జరుగుతోంది. ఇప్పటివరకు నిధులు రాకపోవడంతో పాఠశాలల్లో తాగునీరు, విద్యార్థుల పరీక్షల నిర్వహణ, జాతీయ పండుగలు, గదుల మరమ్మతు, ప్రయోగశాల సామగ్రి కొనుగోలు, తదితర నిర్వహణ హెచ్ఎంలకు కష్టతరంగా మారింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా.. సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుంది. 1నుంచి 30మంది వరకు విద్యార్థులు ఉంటే ఆ పాఠశాలకు రూ.10వేలు, 31నుంచి 100లోపు పాఠశాలలకు రూ.25వేలు, 101 నుంచి 250మంది వరకు రూ.50వేలు, 251 నుంచి 1000 వరకు విద్యార్థుల సంఖ్య ఉన్న పాఠశాలలకు రూ.75వేల చొప్పున ప్రతి సంవత్సరం ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. విద్యార్థుల సంఖ్య వెయ్యి దాటితే ఆ పాఠశాలలకు రూ.లక్ష వరకు నిధులు వస్తాయి. క్రీడలపై నిర్లక్ష్యం.. ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడల నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రతి ఏటా చెల్లించే నిధుల విడుదలలో ఆలస్యం జరుగుతుండటంతో క్రీడలపై నిర్లక్ష్యం కొనసాగుతోంది. ఇప్పటివరకు నిధులు రాకపోవడంతో పాఠశాలల్లో క్రీడా సామగ్రి కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో పాఠశాలల్లో పాత క్రీడా సామగ్రితో కాలం వెల్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది. నిధులు జమ చేస్తున్నాం.. ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన నిర్వహణ నిధులు విడుదల అయ్యాయి. పాఠశాలల ఖాతాల్లో జమ చేస్తున్నాం. త్వరలోనే అన్ని పాఠశాలలకు నిధులు చేరుతాయి. పాఠశాలల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం. – రాజేందర్, జిల్లా విద్యాశాఖ అధికారిఆర్థిక కష్టాల్లో సర్కారు స్కూళ్లు నాలుగు నెలలుగా అందని నిధులు ఇబ్బందులు పడుతున్న హెచ్ఎంలు -
– ఎస్ఎస్తాడ్వాయి
ఆదివారం శ్రీ 5 శ్రీ అక్టోబర్ శ్రీ 2025కోయల పూర్వ మూలాలు, పడిగ బొమ్మలు, పూర్వ కోయ రాజ్యాల చరిత్ర, గొట్టు గోత్రాలు (పూర్వం ప్రకృతి సమతుల్య సిద్ధాంతంలో భాగంగా ఆదివాసీలు తమ వంశవృక్షాలను 3 నుంచి 7 గొట్లుగా ఏర్పాటు చేసుకుని ప్రకృతిలోని జంతువులు, చెట్లు, పక్షులు, రాజ్య వ్యవస్థ సింబల్ను దైవాలుగా పంచుకున్నారు)... వీటిని మేడారం అమ్మవార్ల గద్దెలు, సాలహారం, నూతన ఆర్చీ ద్వారాలపై తీర్చిదిద్దనున్నారు. ఆలయం మొత్తం కొండ గుహల్లో దొరికిన పూర్వ కోయ రాజ్యాలు నడిచిన క్రమంలో రాసిన తాళపత్ర గ్రంథాల ఆధారంగా వాస్తుప్రకారం రూపుదిద్దుకోనుంది. వెయ్యేళ్లు ఆదివాసీల చరిత్ర నిలిచేలా అమ్మవార్ల గద్దెల ప్రాంగణాన్ని అభివృద్ధి చేయనున్నారు. మేడారం పునర్నిర్మాణంలో ఏయే అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు.. ఆలయంలో రానున్న ఆర్చీలు, సాలహారంపై ఆదివాసీ చరిత్ర, ప్రకృతితో వారికున్న అనుబంధం తెలిపే బొమ్మల విశేషాలే ఈ వారం సండే స్పెషల్ కథనం. వనదేవతల గద్దెల ప్రాంగణం నమూనా చిత్రంప్రధాన ఆర్చీ ద్వారం 40 ఫీట్ల ఎత్తుతో నిర్మించనున్నారు. దీనిపై బండానీ వంశం సమ్మక్క తల్లి 5వ గొట్టు వంశస్తుల పూజిత జంతువు ఒంటికొమ్ము దుప్పి, అటు ఇటు చివరన అడవిదున్న కొమ్ములు, నెమలి ఈకలు ఏర్పాటుచేస్తారు. ఇవి ఆదివాసీల అస్థిత్వానికి రూపాలు. పక్కన రెండు వైపులా నాగులమ్మ (సమ్మక్క చెల్లెలు) పాము రూపంలో ఉంటుంది. వరుసగా కోయ సమాజంలో 6వ గొట్టు ఏనుగు, 3వ గొట్టు ఎద్దు, 4వ గొట్టు ఖడ్గమృగం, 5వ గొట్టు ఒంటి కొమ్ము దుప్పి, 7వ గొట్టు మనుబోతు, 8వ గొట్టు సమ్మక్క తల్లిని చిలకలగట్టు నుంచి తీసుకువచ్చే సిద్ధబోయిన వారి సింహాలు వరుసగా ఏర్పాటు చేస్తారు. ఇందులో మూర్తి అక్కుమ్ (తూత కొమ్ము) ప్రత్యేకం. దేవత ఈ శబ్దం ద్వారానే వస్తుంది అనేది సంకేతం. కింద పిల్లర్లపై కుడి వైపు 5వ గొట్టు తెలిపేలా 5 నిలువు గీతలు, పూజిత పక్షి పావురం, నెమలి పూజిత వృక్షం వెదురు చెట్టు, బండారి చెట్టు, 4వ గొట్టు సమ్మక్క భర్త మూలం తెలిపే 4 నిలువు గీతలు, పూజిత పక్షి సోనోడి పిట్ట, పాలపిట్ట, వృక్షం బూరుగు చెట్టు, తాబేలు ఏర్పాటు చేయనున్నారు. ఆదివాసీ మూలాలు, సంస్కృతీసంప్రదాయ చిత్రాలతో ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క– సారలమ్మ గద్దెల ప్రాంగణం ఆధునికీకరణకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. మొత్తంగా 8 ఆర్చీలు, గద్దెల ప్రాంగణం చుట్టూ ప్రహరీపై 700 ఆదివాసీ చిత్రాలను ఏర్పాటుచేయనున్నారు. అమ్మవార్ల గద్దెలను కదిలించకుండా కోయ మూలాలతో అభివృద్ధి పనులను చేపట్టారు. వనదేవతల వరుస క్రమంలో సమ్మక్క–సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలను ఏర్పాటు చేయనున్నారు. 300 ఫీట్ల వెడల్పు, 1000 ఫీట్ల మేర చుట్టూ ప్రహరీ నిర్మించనున్నారు. ఆదివాసీల గొట్టుగోత్రాల చిత్రాలుతాబేలుపై కోయరాజుల బొమ్మలుఅమ్మవార్ల గద్దెల పక్కన 8 పిల్లర్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ పిల్లర్లు ఫీటున్నర వెడల్పు, 8 ఫీట్ల పొడవుతో ఏర్పాటు చేస్తారు. వీటిపై 340 బొమ్మలు వేయనున్నారు. పూర్తిగా సమ్మక్క వంశం సిద్ధబోయినవారి పవిత్ర బొమ్మలతోపాటు పూజావిధానం, వారి వంశ వృక్షం ఉంటుంది. సారలమ్మ గద్దె పక్కన పిల్లర్లపై కూడా ఇదే పద్ధతిలో 342 బొమ్మలు వేస్తారు. సారలమ్మ వంశం, 3వ గొట్టు పవిత్ర బొమ్మల చిత్రాలు వేస్తారు. పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై 172 చొప్పున 344 బొమ్మలు, వారి వంశవృక్షం పవిత్ర బొమ్మలు వేస్తారు. పగిడిద్దరాజు – నాగులమ్మ కొడుకు జంపన్న గద్దె జంపన్న వాగు ఒడ్డున ఉంది. అక్కడే ఈ గద్దెను అభివృద్ధి చేయాలని పూజారులు నిర్ణయించారు. జంపన్న తమ్ముడైన ముయాన్న గద్దె ఏర్పాటు, వనం పోతురాజు ఇంకా కాపలాగా ఉండే పొలిమేర దేవతల ఏర్పాటును శాసీ్త్రయబద్ధంగా పూజారులు తీసుకున్నారు. ● ఎడమ వైపు పిల్లర్లపై మూడవ గొట్టు మూలం 3 నిలువు బొట్లు, త్రిభుజం రాజ్య సింబల్, సారలమ్మ కోసం స్వయంవరంలో బాణంతో కాకిని కొట్టి కాక అడమరాజు సారలమ్మను పెళ్లి చేసుకున్న మనిషితో కూడిన బాణం ఉంటుంది. కాకి బొమ్మ, సిద్ధబోయిన వంశస్తుల వడ్డే గోత్రం వృక్షం ఇప్పచెట్టు, చిలకలగట్టునుంచి దేవతను తీసుకొచ్చే సందర్భం బొమ్మలు.. ఇలా ప్రకృతిలోని జంతువులు, పక్షులు, చెట్ల చిత్రాలను ఈ ఆర్చీలో చేర్చి మేడారం జాతర అంటే ప్రకృతి జాతర అనేలా రూపుదిద్దుతారు. ● ఆలయంలోని తూర్పు ఈశాన్యం ద్వారం ద్వారా భక్తులు వెళ్తారు. ప్రధాన ద్వారం పూర్తిగా 5వ గొట్టు మూలం బొమ్మలు 25 రకాలు ఉంటాయి. వారి వంశ వృక్షం ఉంటుంది. పక్కన ద్వారం సిద్ధబోయిన కొక్కెర వారి మూల వంశవృక్షం 25 బొమ్మలతో ఉంటుంది. మరో ద్వారం తూర్పు ఆగ్నేయంలో ఉంటుంది. ఇది పగిడిద్దరాజుది. దీనిలో 4వ గొట్టు మూలం పూర్తిగా 25 బొమ్మలతో ఉంటుంది. తాబేలు బొమ్మపై ఉన్న నలుగురు పగిడిద్దరాజు, గోవిందరాజు, నాగుల బండడు, ముల్లూరుడిని తెలుపుతుంది. సమ్మక్క భర్త కావడంతో పగిడిద్దరాజు కుడివైపున ఉంటాడు. మధ్యలో వీరి పెళ్లి చేసిన సిద్ధబోయిన వంశం వారు ఉండేలా రూపొందించారు. వెనుక భాగంలో గోవిందరాజు ద్వారం కూడా 4వ గొట్టు మూలాన్ని తెలుపుతుంది. ● ప్రధాన ద్వారం వెనుక వైపు సారలమ్మది. దీనిపై పూర్తిగా 3వ గొట్టు మూలం జంతువులు, పక్షులు వేస్తూ కాక అడమ రాజు, సారలమ్మ మూలం తీసుకున్నారు. సమ్మక్క చెల్లెలు నాగులమ్మకి పుట్ట పోసేందుకు 5 మీటర్ల ఖాళీ స్థలం వదిలేశారు. మిగతా ద్వారాలను సాధారణ కోయ మూలాలతో ఏర్పాటు చేస్తున్నారు. ఇది దేశ పురోగమన చరిత్ర సీఎం రేవంత్ రెడ్డి ఆదివాసీ సంస్కృతి సజీవంగా నిలిచేలా ఆదివాసీ మూలాలతో అమ్మవార్ల గద్దెల ప్రాంగణం అభివృద్ధి చేయడం మా అదృష్టం. ఇది దేశ పురోగమన చరిత్ర. ఆలయ ప్రాంగణం విస్తీర్ణంలో ఆదిమ మూలం బొమ్మలు లిఖించే అవకాశం దక్కడం మంత్రి సీతక్క, సమ్మక్క– సారలమ్మ పూజారులకు, ఆదివాసీలకు మరువలేని జ్ఞాపకం. ఆదివాసీల ఆత్మగౌరవానికి అండగా ఉంటామని ప్రకటించడం చాలా సంతోషకరం. – డాక్టర్ మైపతి అరుణ్కుమార్ మేడారం గద్దెలు, సాలహారం, నూతన ఆర్చీ ద్వారాలపై 700 ఆదివాసీ చిత్రాలు 3 నుంచి 7 గొట్ల వంశస్తుల సంస్కృతీ సంప్రదాయం పరిఢవిల్లేలా ఏర్పాటు వెయ్యేళ్లు నిలిచేలా రాతికట్టడాలు, గద్దెల ప్రాంగణం విస్తీర్ణం ఆధునికీకరణ తల్లుల గద్దెలు కదిలించకుండా నిర్మాణం మారనున్న వనదేవతల గద్దెల ప్రాంగణం రూపురేఖలు అమ్మవార్ల గద్దెల పక్కన 8 పిల్లర్లు -
దసరా సంబురం
● జమ్మికి పూజలు, పాలపిట్ట దర్శనం ● రావణుడి ప్రతిమలు దహనం ● భారీగా హాజరైన జనంభూపాలపల్లి అర్బన్: జిల్లా వ్యాప్తంగా దసరా వేడుకలు గురువారం వైభవంగా నిర్వహించారు. పలు ఆలయాల్లో జమ్మిచెట్టు వద్ద పూజలు, రావణ వధ కార్యక్రమాలు చేశారు. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకాలు చేశారు. దుర్గామాత ఆలయాలకు భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. భారీ సంఖ్యలో వాహన పూజలు చేపట్టారు. జిల్లాకేంద్రంలోని కృష్ణాకాలనీ క్రీడామైదానంలో గురువారం రాత్రి మున్సిపాలిటీ, సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రావణాసుర వధ కార్యక్రమాన్ని తిలకించడానికి వేలాది మంది తరలివచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు జబర్దస్త్ టీం సభ్యులు చేపట్టిన వినూత్న కార్యక్రమాలను సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభించారు. చుట్టు గ్రామాలు, పట్టణంలోని పలు కాలనీల్లో నుంచి కుటుంబసభ్యులతో కలిసి సింగరేణి క్రీడామైదానానికి అధిక సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ.. భూపాలపల్లి పట్టణంలో అన్ని వార్డుల్లో ప్రజల మౌలిక సదుసాయాల కల్పన కోసం అత్యధికంగా నిధులు వెచ్చించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వేదిక ప్రాంతంలో సీఐ నరేష్కుమార్ పర్యవేక్షణలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అనంతరం 40 అడుగుల ఎత్తుతో ఏర్పాటుచేసిన రావణాసుర వధకు ఎమ్మెల్యే సత్యనారాయణరావు నిప్పు అంటించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో విజయదశమి వేడుకలను గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యాలయ వాహనాలను వినియోగించే సిబ్బందితో కలిసి కలెక్టర్ పూజలో పాల్గొన్నారు. -
జాతిపితకు ఘన నివాళి
భూపాలపల్లి అర్బన్: భారత జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని గురువారం కలెక్టరేట్లో జాతిపితకు ఘన నివాళులు అర్పించారు. కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమానికి కలెక్టర్ రాహుల్శర్మ ముఖ్య అతిథిగా హాజరై గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఆర్డీఓ బాలకృష్ణ, పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ కార్యాలయంలో.. ఎస్పీ కార్యాలయంలో కార్యక్రమానికి అదనపు ఎస్పీ నరేష్కుమార్ హాజరై గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆర్ఐ రత్నం, ఆర్ఎస్ఐ, డీపీఓ పాల్గొన్నారు. -
ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు
కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయం అనుబంధ దేవాలయాల్లోని శ్రీశుభా నందదేవి, శ్రీమహాసరస్వతీ అమ్మవార్లు శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు పదకొండు రోజుల పాటు వైభవంగా జరిగాయి. అమ్మవార్లు వివిధ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. గురువారం అమ్మవార్లు రాజరాజేశ్వరి అలంకరణలో దర్శనమిచ్చా రు. భక్తులు అమ్మవారికి పూజలు నిర్వహించారు. శమీ పూజ.. విజయదశమి(దసరా) సందర్భంగా గురువారం సాయంత్రం శ్రీరామాలయం నుంచి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా గోదావరి నది వద్దకు మంగళవాయిద్యాలతో కాలినడక తీసుకెళ్లారు. ఆలయ ఉపప్రధాన అర్చకుడు పనకంటి ఫణీంద్రశర్మ శమీ పూజ ఘనంగా నిర్వహించారు. అక్కడ శమీ(జమ్మిచెట్టు) ఆకులు తీసుకొని ఒకరికొకరు ఆలింగనం చేసుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈఓ మహేష్, అర్చకులు బైకుంఠపాండా, పవన్శర్మ, శ్రావణ్శర్మ, రామాచార్యులు, రిటైర్డు అర్చకులు లక్ష్మీనారాయణశర్మ, కృష్షమూర్తిశర్మ, భక్తులు పాల్గొన్నారు. -
ఉత్పత్తి పెంచేందుకు కొత్త ఆవిష్కరణలు
● సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి భూపాలపల్లి అర్బన్: రానున్న రోజుల్లో బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను మరింత పెంచేందుకు కొత్త ఆవిష్కరణ తీసుకురానున్నట్లు ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి సూచించారు. ఈ మేరకు ఏరియాలోని కాన్ఫరెన్స్హాల్లో శుక్రవారం ఏరియాలోని అన్ని గనులు, డిపార్ట్మెంట్ల భవిష్యత్పై కార్యాచరణ ప్రణాళికలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. సింగరేణి కంపెనీ వ్యాప్తంగా 100 మిలియన్ టన్నులు, భూపాలపల్లి ఏరియాలో 100 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ దిశగా ఏరియాలో సంస్థలో చేపట్టాల్సిన కొత్త ఆవిష్కరణల కోసం తీసుకోవాల్సిన చొరవపై చర్చించారు. రానున్న ఐదు సంవత్సరాలకు ప్రణాళికలు, వ్యూహ రచనలు, నష్టాలు తగ్గించుట, బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత పెంచాలన్నారు. పెండింగ్ పనుల పరిశీలనలు, ఖర్చులు తగ్గించడం, మంచి ప్రణాళికలను అనుసరించడం తదుపరి అంశాలపై అన్ని గనులు, డిపార్ట్మెంట్ ఉన్నత అధికారులతో విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్వోటు జీఎం కవీంద్ర, సివిల్ ఏజీఎం రవికుమార్, వివిధ గనుల పీఓలు, మేనేజర్లు శ్యాంసుందర్, భిక్షమయ్య, రవీందర్ పాల్గొన్నారు. -
రామప్ప శిల్పకళాసంపద అద్భుతం
● ఆలయాన్ని సందర్శించిన ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డివెంకటాపురం(ఎం): రామప్ప శిల్పకళాసంపద అద్భుతమని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తన సతీమణి వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. గైడ్ తాడబోయిన వెంకటేష్ ఆలయ విశిష్టత గురించి వివరించగా రామప్ప శిల్పాకళాసంపద బాగుందని వారు కొనియాడారు, కార్యక్రమంలో టీజీఎన్పీడీసీఎల్ ములుగు డీఈ నాగేశ్వర్రావు, విద్యుత్ అధికారులు వేణుగోపాల్, రమేష్, సాంబరాజు, సురేష్, కృష్ణాకర్ తదితరులు పాల్గొన్నారు. -
సనాతన ధర్మమే శాశ్వతం
● మూలాలు మర్చిపోతే భవిష్యత్ ఉండదు ● ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భగవద్గీత ప్రచారకుడు శ్రీ రాధా మనోహర్దాస్ స్వామీజీ ములుగు: భారతీయ మూలాలను మర్చిపోతే భవిష్యత్ ఉండదని, యుగాలు మారినా సనాతన ధర్మమే శాశ్వతమని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, భగవద్గీత ప్రచారకులు శ్రీ రాధా మనోహర్దాస్ స్వామీజీ అన్నారు. జిల్లా కేంద్రంలో విజయదశమిని పురస్కరించుకొని ధర్మజాగరణ ఉత్సవ సమితి అధ్యక్షుడు గండ్రకోట కుమార్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి రావణాసురవధ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన వక్తగా హాజరైన రాధామనోహర్ స్వామీజీ మాట్లాడుతూ.. చెడుపై మంచి సాధించిన విజయానికి రావణాసురవధ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అధర్మంపై ధర్మం, అసత్యంపై సత్యం, తప్పుపై ఒప్పు విజయం సాధించిందన్నారు. సనాతన ధర్మంలో అందరూ బాగుండాలని కోరుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ, విజయదశమి లాంటి పండుగలు ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయన్నారు. దేశం కోసం, ధర్మం కోసం యువత పాటుపడాలని, దేశ ఔన్నత్యాన్ని దెబ్బతీసేవారిని వదిలేదిలేదన్నారు. ప్రతీ ఒక్కరూ శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్మాత్మిక, సామాజిక, రాజకీయ ఎదుగుదల సాధించాలని పిలుపునిచ్చారు. అనంతరం ములుగు సీనియర్ సివిల్ జడ్జి కన్నయ్యలాల్ మాట్లాడారు. జిల్లా కేంద్రంలో దసరా సందర్భంగా నిర్వహించిన రావణాసురవధ ఆకట్టుకుందని, పండుగపూట ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వేలాదిమంది కుటుంబాలను ఒకేచోట చేర్చి పండుగ జరుపుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు. మంచి కోసం చేసే ప్రతీ పనిలో తాను పాలుపంచుకుంటానని వెల్లడించారు. అనంతరం శ్రీ రాధామనోహర్ దాస్ స్వామీజీ, సీనియర్ సివిల్ జడ్జితోపాటు పలువురు ప్రముఖులు రావణసుర ప్రతిమకు నిప్పంటించారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన నృత్యాలు ఆకర్షించాయి. కార్యక్రమంలో నిర్వాహకులు కన్నోజు సునీల్, చెలుమల్ల రాజేందర్, సుంకరి రవీందర్, గంగిశెట్టి శ్రీనివాస్, పెట్టెం రాజు, ఇమ్మడి రమేష్, వాంకుడోతు జ్యోతి, కర్ర రాజేందర్ రెడ్డి, కొత్తపల్లి బాబురావు, కొమరవెళ్లి హరినాథ్, గండ్రకోట రవీందర్, సానికొమ్ము వినీత్ రెడ్డి, తోకల నందన్, పెట్టెం రాజేందర్, ఎలగందుల మోహన్, రుద్రోజు ఆనందాచారి, రాము, సిరికొండ వెంకన్న పాల్గొన్నారు. -
స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి
గోవిందరావుపేట: కాంగ్రెస్ పార్టీ కన్నతల్లి లాంటిదని, రిజర్వేషన్ తనకు అనుకూలం కాకున్నా స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడమే లక్ష్యంగా పనిచేస్తానని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ పిలుపునిచ్చారు. మండల పరిధిలోని చల్వాయి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం మండల అధ్యక్షుడు పాలడుగు వెంకటకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పైడాకుల అశోక్ హాజరై మాట్లాడుతూ.. కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని, పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. రిజర్వేషన్ తనకు అనుకూలంగా రాకపోయినా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని తెలిపారు. పార్టీ కోసం పని చేసే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు. కార్యక్రమంలో కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, దాసరి సుదాకర్, జెట్టి సోమయ్య, కణతల నాగేందర్, కాంగ్రెస్ పార్టీ మండల, గ్రామ నాయకులు పాల్గొన్నారు. పలువురిపై కేసు నమోదు గోవిందరావుపేట: మండలంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గురువారం దసరా, రావణసుర వధ ల సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని పస్రా ఎస్సై అచ్చ కమలాకర్ తెలిపారు. పండుగ శాంతియుతంగా జరగడానికి ముందస్తుగానే మద్యం, మాంసం దుకాణ యజమానులకు కౌన్సెలింగ్ ఇచ్చి దుకాణాలను మూసివేయించామని తెలిపారు. నిబంధనలను ఉల్లఘించి బెల్ట్ షాప్లు నడిపిన నలుగురిపై కేసులు నమో దు చేసినట్టు పేర్కొన్నారు. పస్రాలోని రావణ వధ వద్ద మద్యం మత్తులో వీధుల్లోకి వచ్చి పోలీసులకు ఆటంకం కలిగించిన ఐదుగురిపై కూడా కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. గాంధీ విగ్రహానికి కార్మికుల వినతి ఏటూరునాగారం: గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో డైలీ వైజ్ వర్కర్లుగా పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చేస్తున్న నిరవధిక సమ్మె 22వ రోజుకు చేరుకుంది. నిరసనలో భాగంగా కార్మికులు .. ఎంపీడీఓ ఆఫీస్ నుంచి బొడ్రాయి ప్రాంతంలోని మహాత్మా గాంధీ విగ్రహం వరకు ర్యాలీగా వచ్చి గాంధీ విగ్రహానికి పూలదండ వేసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దావూద్ మాట్లాడుతూ.. గాంధీ అహింసా సిద్ధాంతం మేరకు శాంతియుతంగా 22రోజులుగా సమ్మె చేస్తూ నిరసన తెలియజేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్కర్లు 22 రోజులుగా సమ్మె చేస్తుంటే సమస్య పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేయడం ప్రభుత్వానికి తగదని అన్నారు. డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం యూనియన్ నాయకులతో చర్చలు జరపాలని కోరారు. ఓ పక్క గత ఎనిమిది నెలల నుంచి జీతాలు లేక కుటుంబం గడవక తీవ్రమైన ఇబ్బందులు పడుతుంటే మరోపక్క వేతనాలను తగ్గిస్తూ జీఓ 64ను తీసుకురావడం దుర్మార్గమని అన్నారు. అర్హులైన అందరికీ టైం స్కేల్ ప్రకారం అమలు అయ్యేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో చిటమట రమేష్, నాగలక్ష్మి, భాగ్యలక్ష్మి, జయలక్ష్మి, సత్యం, సమ్మక్క, కమల, విజయలక్ష్మి, రాజు, సమ్మయ్య, సూర్యతేజ, ఇందిర, సుమలత, సాంబయ్య, శివకృష్ణ, సత్యం పాల్గొన్నారు. వీరన్న సన్నిధిలో భక్తుల సందడి కురవి: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో దసరా పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం స్వామి, అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామిని దర్శించుకునేందుకు క్యూలో వేచి ఉన్నారు. దసరా సందర్భంగా వాహన పూజలు అధికంగా జరిగాయి. వాహనాలు బారులుదీరి కనిపించాయి. -
సన్నాలకు సై..
శనివారం శ్రీ 4 శ్రీ అక్టోబర్ శ్రీ 2025● జిల్లాలో 1,04,194 ఎకరాల్లో వరి సాగు ● బోనస్ ప్రకటించడమే కారణం.. ● గత సీజన్నుంచే వర్తింపుభూపాపపల్లి రూరల్: ప్రభుత్వం మద్దతు ధరతో పాటు గతేడాది నుంచి సన్న ధాన్యానికి అదనంగా క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తుండటంతో రైతులు సన్న ధాన్యం సాగుకు మొగ్గు చూపారు. ఈ వానాకాలం సీజన్లో జిల్లావ్యాప్తంగా ఉద్యాన పంటలు కలిపి 2.24 లక్షల ఎకరాలల్లో వివిధ పంటలు సాగు చేశారు. వరి 1,15,653 ఎకరాల్లో సాగు చేశారు. అందులో 1,04,194 ఎకరాలు సన్న ధాన్యం సాగుచేయగా 11,459 ఎకరాల్లో దొడ్డు ధాన్యం సాగుచేశారు. అంతకుముందు ఏడాది సన్నాలు 30వేల ఎకరాలకు మించి సాగు చేసిన దాఖలాలు లేవు. జిల్లా వ్యాప్తంగా ఈ లెక్కన ఇంత పెద్దమొత్తంలో సన్నాలు సాగుచేయడానికి కారణం ప్రభుత్వం రూ.500 బోనస్ ఇవ్వడమే. రైతులకు అదనపు ఆదాయం.. జిల్లాలో గతేడాది యాసంగి సీజన్లో 87,650 ఎకరాల్లో సన్నాలు సాగుచేయగా 23 వేల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం కొనుగోలు చేశారు. క్వింటాకు రూ.2310 మద్దతు ధరకు కొనుగోలు చేశారు. అదనంగా ప్రభుత్వం క్వింటాల్కు రూ.500 చొప్పున బోనస్ చెల్లించింది. జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్లో 1,04,194 ఎకరాల్లో సన్నధాన్యం సాగుచేశారు. సుమారుగా ఎకరాకు 25 క్వింటాల్కు పైగా దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. తెగుళ్ల బారిన సన్నాలు.. జిల్లాలో సన్నాలకు తెగుళ్లు వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా అగ్గితెగులు, పచ్చదోమ, తెగులు సోకుతున్నాయి. దీంతో దిగుబడిపై ప్రభావం చూపనుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పంట పొట్టదశకు వచ్చింది. ఈ దశలో పంటలను కాపాడుకునేందుకు వ్యవసాయ అధికారులు సూచనలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. -
ఒకరిపై కేసు నమోదు
భూపాలపల్లి అర్బన్: ఇంటికి వెళ్లి కర్రతో దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు సీఐ నరేష్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గొర్లవీడు గ్రామానికి చెందిన మందల రాజిరెడ్డి ఇంటికి గురువారం రాత్రి అదే గ్రామానికి చెందిన బి లక్ష్మయ్య వెళ్లి ఇంట్లో నిద్రిస్తున్న రాజిరెడ్డిని బయటికి పిలిచారు. బయటికి రాగానే లక్ష్మయ్య చేతిలో ఉన్న కర్రతో రాజిరెడ్డిపై దాడి చేశాడు. దీంతో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి కాటారం: మండల కేంద్రానికి సమీపంలో సబ్ స్టేషన్పల్లిలో సెప్టెంబర్ 29న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన వృద్ధుడు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కాటారం సబ్స్టేషన్పల్లికి చెందిన మాచెర్ల మల్లేశ్(60) గత నెల 29న ఇంటికి వెళ్తున్న క్రమంలో ఆర్టీసీ బస్సు వెనుకనుంచి బలంగా ఢీకొట్టింది. గాయాలైపాలైన మల్లేశ్ను చికిత్స నిమిత్తం భూపాలపల్లి వంద పడకల ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలపాలవడంతో వైద్యులు రెఫర్ చేయగా వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
అధికారులు సూచనలు ఇవ్వాలి
నాలుగెకరాల్లో సన్నరకం ధాన్యం సాగు చేశాను. ప్రభుత్వం గతేడాది వానాకాలం నుంచి క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తోంది. గతనెల నుంచి వానలు అధికంగా ఉన్నాయి. దీంతో వరి పంటకు తెగుళ్లు వ్యాప్తి చెందుతున్నాయి. అధికారులు పొలాలను పరిశీలించి తగు సూచనలు, సలహలు ఇస్తే రైతులకు మేలు జరుగుతుంది. – కంది కుమార్, రైతు, కొత్తపల్లి (ఎస్ఎం), భూపాలపల్లితెగుళ్ల నివారణకు చర్యలుపంటలు పొట్టదశకు చేరుకున్నాయి. ఈ ఏడాది జిల్లాలో సన్నధాన్యం ఎక్కువగా సాగైంది. ప్రస్తుతం అక్కడ పంటకు వివిధ తెగుళ్లు సోకుతున్నట్లు సమాచారం. రైతులు ఆందోళన పడాల్సిన అవపరం లేదు. వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి సూచనలు, సలహాలు పాటించి పంటలకు కాపాడుకోవాలి. – బాబురావు, జిల్లా ఇన్చార్జ్ వ్యవసాయ శాఖ అధికారి -
స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండండి
● రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్కములుగు: స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క పిలుపునిచ్చారు. ఇంచర్లలోని ఓ ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం సమష్టిగా పనిచేయాలన్నారు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్రెడ్డి పనిచేస్తున్నారని, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆరోపించారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు సామాజిక న్యాయం అందించాలనే తపనతో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పీటీసీలుగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించేందు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. రైతులకు రెండు రూ.లక్షల రుణమాఫీ చేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. పేద కుటుంబాలకు 200 యూనిట్లు ఉచిత కరెంట్, రేషన్ దుకాణాల ద్వారా పేదలకు సన్న బియ్యం ఇచ్చి ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి సీఎం రేవంత్రెడ్డి అని కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మల్లాడి రాంరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, మిల్కూరి అయిలయ్య, నాయకులు పాల్గొన్నారు. -
వినూత్నం.. విజయదశమి
గార్ల: దేశభక్తిని చాటుతూ దసరా రోజు మహబూబాబాద్ జిల్లా గార్లలో జాతీయ జెండాను ఆవిష్కరించడం ఆనవాయితీగా వస్తోంది. పండుగకు ఒకరోజు ముందు స్థానిక మసీదు సెంటర్లోని జెండా గద్దెకు రంగులు వేసి సిద్ధం చేస్తారు. ని జాం కాలంలో ప్రతీ దసరా రోజున నాటి తహసీల్దార్లు నెలవంక జెండాను ఎగురవేసేవారు. 1952లో గార్ల టౌన్ ము న్సిపల్ చైర్మన్ మాటేడి కిషన్రావు కాంగ్రెస్ జెండా ఆవిష్కరించారు. ఈ క్రమంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల మధ్య ఘర్షణలు జరిగాయి. మెజారిటీ కౌన్సిలర్లు కమ్యూనిస్టు పార్టీకి చెందిన వారే ఉండడంతో వారు హైకోర్టును ఆశ్రయి ంచారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు దేశభక్తికి చిహ్నంగా పార్టీలకు అతీతంగా దసరా రోజు జాతీయజెండాను ఎగురవేయాలని తీర్పు ఇచ్చింది. దీంతో 1958 నుంచి మాటేడి కిషన్రావు జాతీయజెండాను ఎగురవేశారు. కొన్నేళ్ల తర్వాత గార్ల మున్సిపాలిటీని మేజర్ గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. నాటి నుంచి ప్రథమ పౌరుడైన సర్పంచ్ దసరా రోజు జాతీయజెండా ఆవిష్కరిస్తున్నారు. గత ఏడాది సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీఓ మంగమ్మ జెండా ఆవిష్కరించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి (దసరా)ని జరుపుకుంటారు. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవిని వివిధ రూపాల్లో కొలిచిన అనంతరం ఈరోజు విశిష్ట పూజలు చేస్తారు. అయితే, ఈసారి దసరా, గాంధీ జయంతి (అహింసా దినోత్సవం) ఒకేరోజు రావడంతో ఉమ్మడి జిల్లాలో పలువురు మద్యం, మాంసానికి దూరంగా ఉండాలని తీర్మానించారు. పలు ప్రాంతాల్లో వినూత్నంగా వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకు న్నారు. పులివేషధారణ, కత్తిసాము, విన్యాసాలు, పిట్టల దొర, బొమ్మల కొలువులు ఇలా ఎన్నోరకాలుగా పల్లెలు, పట్టణాల్లో సందడి ఉంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేడు (గురువారం) వినూత్నంగా నిర్వహించనున్న దసరా వేడుకలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..మైసంపల్లిలో హోమం నిర్వహిస్తున్న ప్రజలు (ఫైల్) ప్రత్యేకంగా వేడుకలు జరుపుకునేందుకు ఏర్పాట్లు మద్యం, మాంసాహారానికి పలువురు దూరం ఉమ్మడి జిల్లాలో నేడు దసరా ఉత్సవాలు -
కాళేశ్వరం దేవస్థానం ఏసీ స్థాయి పెంపు?
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ (ఏసీ) స్థాయి హోదాను దేవాదాయశాఖ పెంచుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆ దిశగా కసరత్తులు పూర్తిచేసినట్లు తెలిసింది. ప్రస్తుతం 6ఏ ఆలయంగా ఉన్న దేవస్థానంలో గ్రేడ్–2 ఈఓ విధులు నిర్వర్తిస్తున్నారు. 2027 జూలైలో జరుగు గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని ఏసీ(అసిస్టెంట్ కమిషనర్)స్థాయి పెంచుతున్నారని తెలిసింది. దేవస్థానం క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం మరింత మంది ఉద్యోగులు, అర్చకుల అవసరం ఉండనుంది. ఆలయ వార్షికాదాయం రూ.6కోట్లకు చేరింది. మే నెలలో జరిగిన సరస్వతినది పుష్కరాల సమయంలోనే ఏసీ స్థాయి పెంపుపైన చర్చకు వచ్చింది. మంథని ఎమ్మెల్యే, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ ప్రత్యేక శ్రద్ధతో ఆలయ అభివృద్ధి కోసం స్థాయి పెంచుతున్నారని తెలిసింది. రెండు నెలల కిందటనే ఆలయ ఆదాయ, వ్యయాలు, డిపాజిట్లు, ఇతర వివరాలను కమిషనర్ కార్యాలయానికి పంపారు. 2016లో అప్పటి సీఎం కేసీఆర్, రూ.25కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ ఏడాది మే నెలలో జరిగిన సరస్వతి నది పుష్కరాల్లో రూ.35 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను చేపడుతున్నారు. దీంతో ఆలయం మరింత అభివృద్ధి చెందుతుందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఉత్తర్వులు రానున్నట్లు సమచారం. -
మంత్రి ప్రత్యేక పూజలు
కాటారం: దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలకేంద్రంతో పాటు ఎర్రగుంటపల్లి, ధన్వాడ గ్రామాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహాల వద్ద రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవార్లను దర్శించుకొని పూజా కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా పండితులు వేదమంత్రోచ్ఛరణల నడుమ అర్చనలు చేసి అమ్మవారి ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు. మంత్రి వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్రెడ్డి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు చీమల సందీప్, ఆర్యవైశ్య సంఘం సభ్యులు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. విజయదశమి శుభాకాంక్షలు భూపాలపల్లి రూరల్: జిల్లా ప్రజలకు కలెక్టర్ బుధవారం ఒక ప్రకటనలో విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, ఆనందం, ఆరోగ్యం నింపాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం వెల్లివిరియాలని కోరుకున్నారు. 54 శాతం బొగ్గు ఉత్పత్తి భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని కాకతీయ బొగ్గు గనులలో సెప్టెంబర్ నెలలో 54 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏరియాలోని గనుల్లో 3.17 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉండగా 1.71 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి మాత్రమే సాధించినట్లు తెలిపారు. గతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఓపెన్ కాస్ట్లో ఉత్పత్తికి తీవ్ర విఘాతం కలగడంతో ఉత్పత్తి వెనుకబడిపోయినట్లు కనిపిస్తుందని తెలిపారు. అక్టోబర్ నెలలో 4.23 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి టార్గెట్ను విధించినట్లు చెప్పారు. బొగ్గు ఉత్పత్తికి సింగరేణి కార్మికులు సహకరించాలని కోరారు. ఉద్యోగులందరూ రక్షణ సూత్రాలు పాటించాలని, రక్షణ విషయంలో యాజమాన్యం రాజీపడేది లేదన్నారు. కోడిపందేల స్థావరంపై దాడి కాటారం(మహాముత్తారం): మహాముత్తారం మండలం కోనంపేట శివారులో నిర్వహిస్తున్న కోడిపందేల స్థావరంపై బుధవారం ఎస్సై–2 మహేశ్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన వ్యక్తులు కోడిపందేలు నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు దాడి జరిపినట్లు ఎస్సై–2 మహేశ్ తెలిపారు. ఘటనా స్థలంలో కోడిపందేలు ఆడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.13,300 నగదు స్వాధీనపర్చుకున్నట్లు తెలిపారు. మహాముత్తారానికి చెందిన రవి, రాజేందర్, రాజేశ్, నిఖిల్, రవి, రమేశ్, శ్రీకాంత్, నాగారం గ్రామానికి చెందిన పక్రుద్దీన్, రమేశ్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేందర్కుమార్ తెలిపారు. పండుగ సందర్భంగా గ్రామాల్లో పేకాట, కోడిపందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఎస్సై హెచ్చరించారు. ప్రజలు దసరా పండుగ ప్రశాంతంగా, సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ఇంగ్లండ్కు చెందిన పర్యాటకుడు నికోలస్ సందర్శించారు. రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఆయనకు ఆలయ పూజారులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. ఆలయ శిల్పకళ విశిష్టతను గైడ్ విజయ్ కుమార్ వివరించారు. అనంతరం నికోలస్ లక్ష్మీదేవిపేటలో దసరా క్రీడల్లో భాగంగా కబడ్డీ పోటీలను వీక్షించారు. అమరావతి విద్యాలయం మైదానంలో జరిగిన ఫైనల్ పోటీల్లో పట్వారిపల్లి, నర్సింగాపూర్ జట్లు తలపడ్డాయి. ఈ పోటీలలో లక్ష్మీపురం ప్రథమ బహుమతి, నర్సింగాపూర్ ద్వితీయ బహుమతి, బూర్గుపేట తృతీయ బహుమతిని గెలుచుకున్నాయి. కబడ్డీ పోటీలు అద్భుతంగా జరిగాయని, క్రీడాకారులు బాగా రాణించారని నికోలస్ ప్రశసించారు. నర్సింగాపూర్కు చెందిన తన మిత్రుడి ఇంటికి వచ్చిన సందర్భంలో నికోలస్తో పలువురు గ్రామస్తులు, క్రీడాకారులు ఫొటోలు దిగారు. కన్నాయిగూడెం: గోదావరి వరదతో నీట మునిగి దెబ్బతిన్న పంటలను వ్యవసాయశాఖ అధికారి మహేశ్ అధికారులతో కలిసి పరిశీలించారు. బుధవారం మండల పరిధిలోని గూర్రేవుల, సింగారం, బుట్టాయిగూడెం, చింతగూడెంతో పాటు ఇతర గ్రామాల్లో నీట మునిగిన పంటలను పరిశీలించినట్లు తెలిపారు. -
జాతీయ జెండాల ఆవిష్కరణ
లింగాలఘణపురం: మండలంలోని నెల్లుట్ల, వనపర్తి గ్రామాల్లో దసరా ఉత్సవాల్లో జాతీయ జెండాలు ఆవిష్కరించడం ప్రత్యేకం. నెల్లుట్లలో పంచాయతీ కార్యాలయ సమీపంలోని బురుజుపై ఆనవాయితీగా జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. పూర్వం పటేల్, పట్వారీ వ్యవస్థ ఉన్న కాలంలో మాల్పటేల్ అనే వ్యక్తి విజయానికి సూచికగా దసరా పండుగకు జాతీయ జెండా ఎగురవేశారు. అది నేటికీ కొనసాగిస్తూ ప్రస్తుతం చిట్ల వంశానికి చెందిన వారు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. వనపర్తిలో బొడ్రాయి వద్ద ఒక రాతి స్తంభానికి జెండాను కట్టి స్థానికులు ఎగుర వేస్తారు. కొన్నేళ్లుగా ఆయా గ్రామాల పెద్దలు ఉదయమే అక్కడికి వచ్చి జెండాలను ఆవిష్కరించిన అనంతరం సాయంత్రం దసరా వేడుకలు నిర్వహిస్తారు. -
నాలుగు కత్తులు కలిస్తేనే దసరా!
గీసుకొండ: ఆ గ్రామంలో నాలుగు కత్తులు ఒక చోట కలిస్తేనే దసరా. ఈ ఆచారం సంవత్సరాలుగా కొనసాగుతోంది. గ్రేటర్ 16వ డివిజన్ ధర్మారంలో 4 కుటుంబాలకు చెందిన 4 కత్తులను గ్రామంలోని ‘కచ్చీర్’కు తీసుకుని వచ్చి దసరా ఉత్సవాలను నిర్వహించడం ఆచారంగా వస్తోంది. గంగుల వీరయ్య కుటుంబం నుంచి ఒకటి, కొట్టె లక్ష్మయ్య కుటుంబం నుంచి ఒకటి, పోలెబోయిన వారి కుటుంబాల నుంచి రెండు కత్తులకు పూజలు చేసి ఇళ్ల నుంచి మందీ మార్బలంతో అట్టహాసంగా తీసుకుని వెళ్తారు. ఆ తర్వాత ఆయుధ పూజ చేసి కత్తుల(ఆయుధాల)తో సోరకాయను కట్చేసి కంకణాలు కట్టి దసరా పండుగను జరుపుకుంటారు. కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. -
ఉత్సవాలకు సిద్ధం
భూపాలపల్లి అర్బన్: తొమ్మిది రోజుల పాటు దేవీశరన్నవరాత్రులు నిర్వహించి పదో రోజు దసరా పండుగను ఘనంగా జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. విజయదశమి సందర్భంగా అమ్మవారి ఆలయాలన్నీ పండుగ శోభ సంతరించుకున్నాయి. విజయదశమి రోజున అమ్మవారిని రాజరాజేశ్వరి అలంకరణలో పూజించనున్నారు. నేడు ఆయుధ పూజ.. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు (గురువారం) ఆయుధపూజ నిర్వహించుకోనున్నారు. రైతులు వ్యవసాయ పనిముట్లు, వాహనదారులు తమ వాహనాలకు, పోలీసులు ఆయుధాలకు ఇలా ఎవరికివారు తమ వృత్తుల్లో ఉపయోగించే పనిముట్లు, ఆయుధాలకు పూజలు చేయనున్నారు. శమీ పూజ.. విజయదశమి రోజు శమీ దర్శనం కోసం జిల్లావ్యాప్తంగా ఏర్పాట్లు చేశారు. అగ్నిని శమింపజేయడానికి ఉపయోగించిన వృక్షమే శమీ వృక్షం. అటువంటి శమీ వృక్షం వద్దకు విజయదశమి నాటి సాయంత్రం చేరుకుని ప్రదక్షిణలు చేసి ఆకును తీసుకువచ్చి పెద్ద వారికి ఇచ్చి వారికి చేసి ఆశీర్వాదం పాదాభినందనం తీసుకుంటారు. పాల పిట్ట దర్శనం ప్రత్యేకం దసరా పండుగ రోజు సాయంత్రం పాల పిట్టను చూస్తే శుభం కలుగుతుందనే నమ్మకం ఉన్నది. ఈ రోజున మూడు రకాల పక్షులను చూడడం ఆనవాయితీ. పాల పిట్టను చూస్తే పాపాలు, కర్రె పిట్టను చూస్తే కష్టాలు, గరత్మంతుడు అంటే గద్దను చూస్తే గండాలు తొలుగుతాయని ప్రజల నమ్మకం. ఇందుకోసం శమీపూజ అనంతరం కిలో మీటర్ల దూరం అటవీ ప్రాంతంలోకి పోయి పాలపిట్టను దర్శించుకుంటారు. అంబేడ్కర్ స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో దసరా వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ, సింగరేణి, దసరా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. సుమారు 40 ఫీట్ల పొడవైన రావణాసుర బొమ్మను ఏర్పాటు చేశారు. నేడు సాయంత్రం ప్రముఖ గాయకులు, మిమిక్రీ ఆర్టిస్టులు, కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలను ముఖ్య అతిఽథులుగా కలెక్టర్ రాహుల్శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ఎస్పీ కిరణ్ఖరే, సింగరేణి జీఎం రాజేశ్వర్రెడ్డి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం ఏర్పాట్లను కమిషనర్ శ్రీనివాస్, సింగరేణి అధికారులు పరిశీలించారు. కేటీకే 5వ గనిలో జమ్మి పూజలు విజయదశమి వేడుకల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని కేటీకే 5వ గని ఆవరణలోని దుర్గమాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అక్కడే ఉన్నటువంటి జమ్మి చెట్టుకు పూజలు చేసి చెట్టు ఆకును పంచిపెడుతారు. పట్టణంలో ప్రజలందరూ ఇక్కడికి చేరుకొని జమ్మి ఆకులను పంచుకుంటూ ఆశీర్వాదం తీసుకుంటారు. సందడిగా మారిన పల్లె, పట్నం జిల్లా వ్యాప్తంగా రావణాసుర దహన కార్యక్రమాలు జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు -
మద్యం, మాంసం ముట్టరు
దుగ్గొండి: దసరా అంటే మద్యం, మాంసం. ఇదే సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనూ బొడ్రాయి వద్ద గొర్రెపిల్లను బలిచ్చే ఆనవాయితీ ఉంది. కానీ, మైసంపల్లి గ్రామంలో 50 ఏళ్లుగా ఆర్య సమాజ్ పద్ధతిలో దసరా వేడుకలు నిర్వహిస్తున్నారు. గ్రామస్తులంతా బొడ్రాయి వద్ద చలువ పందిళ్ల కింద సామూహిక హోమాలు చేస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు హోమం చేసి సాయంత్రం ఇంట్లో కుటుంబ సభ్యులంతా నిష్టగా ఉండి నేలపై పడుకుంటారు. ఆ రోజు మద్యం, మాంసం ఆ ఊరిలో నిషేధం. కనీసం ఇంట్లో మద్యం బాటిల్ కూడా ఉండనివ్వరు. కాగా, చుట్టు పక్క గ్రామాల ప్రజలు వేడుకలు చూసేందుకు వందల సంఖ్యలో తరలివస్తారు. నిష్టగా ఉంటారు.. మా గ్రామంలో చాలా సంవత్సరాలుగా ఆర్యసమాజ్ పద్ధతిలో దసరా జరుగుతోంది. అన్ని గ్రామాల్లో మద్యం, మాంసం ఏరులై పారినా మా గ్రామస్తులు దసరా పండుగ రోజున నిష్టగా ఉంటారు. కుల దైవాలు, ఇష్టదైవాలకు ప్రత్యేక పూజలు చేస్తారు. అందరూ కలిసి ఒక్కచోట చేరి హోమాలు నిర్వహిస్తాం. గ్రామం అంతా ఒక్కచోటికి వచ్చిన తరుణం చాలా సంతోషంగా ఉంటుంది. ఐకమత్యానికి అద్దం పడుతుంది. – వేముల ఇంద్రదేవ్, గ్రామస్తుడు -
ఘనంగా మహా పూర్ణాహుతి
మహిషాసుర మర్దినిగా అమ్మవార్ల దర్శనం కాళేశ్వరం: శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆల య అనుబంధ దేవాలయాలైన శ్రీఽశుభానందదేవి(పార్వతి), శ్రీసరస్వతి అమ్మవార్లు 10వ రోజు మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనమిచ్చారు. బుధవారం ఆలయ అర్చకులు పనకంటి ఫణీంద్రశర్మ ఆధ్వర్యంలో ఆలయంలో విశేష అభిషేక పూజలు చేశారు. అమ్మవార్లను ప్రత్యేకంగా పట్టువస్త్రాలు, పూలతో అలంకరించారు. రాత్రి మంత్రపుష్పం పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదం అందజేశారు. భజన కార్యక్రమాలు చేశారు. ఘనంగా మహా పూర్ణాహుతి.. శీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం మధ్యాహ్నం మహర్నవమిని పురస్కరించుకొని ఆలయ యాగశాలలో మహా పూర్ణాహుతి హోమం కార్యక్రమం ఆలయ ఉపప్రధాన అర్చకులు పనకంటి ఫణీంద్రశర్మ–శృతి దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రసాద వితరణ చేశారు. ఈఓ మహేష్, భక్తులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా పాల్గొన్నారు. అనంతరం గందెసిరి మధుసూదన్–రమాదేవి దంపతులు భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. వారిని ఈఓ మహేష్ శాలువాతో సన్మానించారు.శ్రీశుభానందదేవి అమ్మవారు, శ్రీసరస్వతి అమ్మవారు -
జూకల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు
చిట్యాల: మండలంలోని జూకల్ గ్రామంలో మంగళవారం నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొని బతుకమ్మ ఆడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక బతుకమ్మ పండుగ అన్నారు. ప్రజలు బతుకమ్మ, దసరా పండుగను సుఖసంతోషాలతో జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముకిరాల మధువంశీకృష్ణ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి, నాయకులు రాంరెడ్డి, కిష్టయ్య, సంతోష్ , మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
ఎంతవుతదో..
ఎన్నికల ఖర్చుపై ఆశావహుల టెన్షన్ భూపాలపల్లి అర్బన్: ఇన్నాళ్లు నోటిఫికేషన్.. రిజర్వేషన్ కోసం ఆతృతగా ఎదురుచూసిన అభ్యర్థులు ఇప్పుడు ఎన్నికల ఖర్చును ఊహించుకుంటూ బరిలో నిలవాలంటే భయపడుతున్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీచేయాలను ఆశావహులు ఖర్చు ఎంతవుతుందో అని మదనపడుతున్నారు. పోటీ చేద్దాం అనుకున్నా ఖర్చులు భయపెడుతున్నాయి. రూ.20లక్షల వరకు.. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు ఖరారుకావటంతో పాటు, సోమవారం నాడు ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదలైంది. రిజర్వేషన్లు ఖరారుకావటంతో రిజర్వేషన్ కలిసివచ్చిన వారు ఉత్సాహంగా ఉండగా, మరికొందరు నిరాశకు గురయ్యారు. గతేడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలు ఉంటాయని తెలిసి, అప్పటి నుంచే ఆశావహ అభ్యర్థులు గ్రామాల్లో సందడి చేస్తున్నారు. వర్గాల వారీగా గ్రామస్తులను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో గ్రామాలవారీగా ఓటర్లు తక్కువగా ఉన్నా, గెలుపోటములను స్వల్ప ఓట్లే నిర్ణయిస్తాయి. కాబట్టి ప్రతి ఓటు విలువైనదే. దీంతో ఖర్చు కూడా గ్రామపంచాయతీల్లో రూ.15 లక్షల నుంచి రూ.20లక్షల వరకు అయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. మేజర్ గ్రామపంచాయతీల్లో ఇది ఇంకాస్త ఎక్కువయ్యే పరిస్థితి ఉంది. మండల హెడ్క్వార్టర్లుగా ఉన్న పంచాయతీల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయని పోటీచేసేందుకు ఆసక్తి చూపిస్తున్న అభ్యర్థులు అనుకుంటున్నారు. దావత్లతో మొదలు ఆశావహులకు ఖర్చుల మోత దసరా దావతులతో మొదలైంది. గ్రామంలో కొద్దిగా పట్టున్న చిన్న స్థాయి నాయకులకు, కులసంఘాల పెద్దలకు రోజు ఆశావహులు చాలా మంది దావత్లు మొదలు పెట్టారు. పనిలో పనిగా తాము పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు మనసులో మాట చెప్పి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. పనిలో పనిగా గ్రామాల్లోని యువ ఓటర్లకు పార్టీల పేరుతో ఓట్ల గాలాలు వేస్తున్నారు. దసరా పండుగకు గ్రామాలకు వచ్చిన వారితో మాటముచ్చట కలిపి మంచి చెడులపై తెలుసుకుంటున్నారు. మొదటి ఖర్చులే తడిసిపోతున్నాయని ఇక బరిలోకి దిగితే ఏమాత్రం ఖర్చు అవుతుందో అని అభ్యర్థులు డబ్బులు పోగేసే పనిలో ఉన్నారు. అభ్యర్థులే భరించాలి.. జిల్లాలో అధికార పార్టీతో పాటు, ప్రతిపక్షాలది కూడా ఏమంత గొప్పగా లేదు. తమ పార్టీ మద్దతు ఉన్నా కూడా ఖర్చులను అభ్యర్థులే సొంతగా భరించాలని పార్టీల నాయకులు అంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాలేదు కాబట్టి గెలవాలంటే ఎంతో కొంత మీరే ఎన్నికల ఖర్చులు భరించాలని విపక్ష పార్టీల మద్దతు పొందే ఆశావహులకు పార్టీ నాయకులు సూచనప్రాయంగా తెలియజేస్తున్నారు. అధికార పార్టీలో కూడా ఇదే తీరు కనిపిస్తుంది. పెరిగిన ఖర్చులో పార్టీ ఇచ్చే ఫండ్ ఏమాత్రం సరిపోయేలా లేదు. గ్రామాల్లో దసరా దావత్లు షురూ.. యువకులను ఆకర్షించే పనిలో నాయకులు -
బుధవారం శ్రీ 1 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
దసరా పండుగ అంటేనే చుక్క, ముక్కకు పెట్టింది పేరు. అలాంటి దసరా పండుగ గాంధీ జయంతి రోజు వస్తుండటంతో మందుబాబులకు తిప్పలు వచ్చిపడింది. కానీ ఆ లోటును పూర్తి చేయడానికి బెల్టుషాపుల నిర్వాహకులు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. గాంధీ జయంతి సందర్భంగా గురువారం రోజు మద్యం దుకాణాలు బంద్ ఉండటం బెల్టుషాపు నిర్వాహకులకు కలిసి వచ్చింది. రెండు రోజుల ముందుగానే బెల్టుషాపుల నిర్వాహకులు స్థానికంగా ఉండే వైన్స్ల నుంచి పెద్ద మొత్తంలో మద్యం కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. సాధారణంగా బెల్టు దుకాణాల్లో బీర్లతో పాటు తక్కువ ధర కలిగిన మద్యం అందుబాటులో ఉంటుంది కానీ దసరా సందర్బంగా నిర్వాహకులు అన్ని రకాల మద్యాన్ని బెల్టుషాపుల్లో అందుబాటులో ఉంచేలా కొనుగోలు చేస్తున్నారు. కాటారం: దసరా పండుగ నేపథ్యంలో జిల్లాలోని పలు గ్రామాల్లో గుడుంబా తయారీ విచ్చలవిడిగా సాగుతోంది. పండుగలు వస్తే చాలు గ్రామాల్లో గుడుంబా ఏరులై పారుతోంది. దసరా పండుగ కోసం పలు పల్లెల్లో గుడుంబా తయారీదారులు పెద్దఎత్తున గుడుంబా తయారుచేసి రవాణా, విక్రయానికి సిద్ధం చేశారు. పండుగకు పది రోజుల ముందు నుంచే గుడుంబా తయారీకి అవసరమయ్యే పటిక, బెల్లం ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకొని నాటుసారా తయారీకి పూనుకున్నారు. తయారీకి ప్రత్యామ్నాయంగా యూరియా, చక్కర, ఇతర ముడిపదార్థాలు స్థానికంగా లభిస్తుండటంతో గుడుంబా తయారీ మరింత సులభమైంది. దీంతో లీటర్ల కొద్ది గుడుంబాను తయారుచేసి దసరా పండుగకు విక్రయాలు సాగిస్తున్నారు. ఓ పక్క ఎకై ్సజ్ అధికారులు తమ దాడులతో బెంబేలెత్తిస్తున్నప్పటికీ తయారీదారులు ఏ మాత్రం జంకకుండా తమ పని తాము కానిచ్చేస్తున్నారు. దసరాకు భలే గిరాకీ.. పల్లెల్లో సాధారణ రోజుల్లోనే గుడుంబాకు, బెల్టుషాపుల్లో మద్యానికి గిరాకీ ఎక్కువగా ఉంటుంది. దసరా, సంక్రాంతి లాంటి పండుగలు వస్తే విక్రయాలు మరింత ఎక్కువగా సాగుతుంటాయి. దీని కి తోడు వైన్స్షాపులు బంద్ ఉంటుండటంతో బెల్టుషాపుల్లో మద్యం, గుడుంబా విక్రయాలు జోరుగా సాగే అవకాశాలు ఉన్నాయి. దసరా పండుగకు పల్లెలకు మద్యం, గుడుంబా కిక్కు నెలకొననుంది. నిత్యం దాడులు..మారని తీరు.. గుడుంబా నియంత్రణపై పోలీసులు, ఎక్సైజ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించినప్పటికీ అంత మొత్తంలో ఫలితం దక్కడం లేదు. పోలీసులు, ఎక్సైజ్ అధికారులు నిత్యం మూకుమ్మడిగా దాడులు నిర్వహించి వేలాది లీటర్ల బెల్లం పానకం, గుడుంబా ధ్వంసం చేసి కేసులు నమోదు చేస్తున్నప్పటికీ తయారీ మాత్రం ఆగడం లేదు. ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో రూట్ వాచ్లు, పెట్రోలింగ్ చేపడుతున్నప్పటికీ తయారీదారులు అధికారులు, సిబ్బంది కళ్లుగప్పి సరఫరా చేపడుతున్నారు. ఏడు నెలల కాలంలో జిల్లాలో గుడుంబా తయారీదారులు, విక్రయదారులపై వందలాది కేసులు నమోదయినప్పటికీ ఏ మాత్రం మార్పు రావడం లేదు. జిల్లాలో గుడుంబా తయారీ, రవాణాను నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం. దసరాకు గుడుంబా తయారీ ఎక్కువగా ఉంటుందని భావించి భూపాలపల్లి, కాటారం ఎకై ్సజ్ పరిధిలోని అధికారులు, సిబ్బంది, డిస్ట్రిక్ టాస్క్ఫోర్స్ టీంను అప్రమత్తం చేస్తూ గుడుంబా స్థావరాలపై నిత్యం దాడులు చేపడుతున్నాం. గాంధీ జయంతి రోజు మద్యం విక్రయాలు సాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్జిల్లాలో అధికంగా అటవీ గ్రామాల్లోనే గుడుంబా తయారీ జోరుగా కొనసాగుతోంది. పలు గ్రామాలు అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండటంతో తయారీదారులకు గుడుంబా తయారీ సులభతరం అవుతుంది. అటవీ ప్రాంతంలో తయారీదారులు రోజుకో అడ్డా మారుస్తూ పెద్దఎత్తున గుడుంబా తయారు చేసి రవాణాకు పాల్పడుతున్నారు. జిల్లాలోని కాటారం, మహాముత్తారం, మల్హర్, పలిమెల, మహదేవపూర్ మండలాలతో పాటు భూపాలపల్లి మండలంలోని పలు గ్రామాలు, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి, రేగొండ, మండలాల్లోని అధికంగా గుడుంబా తయారు చేస్తున్నారు. గతంలో ఇళ్ల పరిసర ప్రాంతాల్లో తయారు చేసేవారు, కానీ ఎకై ్సజ్ అధికారుల దాడులు అధికమవడంతో గ్రామాలకు సమీపంలోని అటవీ ప్రాంతాలు, పొలాలు, చేలు, వాగులు, వంకల సమీపంలో గుట్టుచప్పుడు కాకుండా తయారీకి పాల్పడుతున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా రాత్రి సమయంలో తయారీ సామగ్రిని తరలించి పగలు, రాత్రి తేడా లేకుండా పెద్ద ఎత్తున గుడుంబా తయారు చేస్తున్నారు. తయారు చేసిన గుడుంబాను మరో చోటుకు తరలించి నిల్వ చేస్తున్నారు. ఆర్డర్లపై గ్రామాల్లోని విక్రేతలకు ద్విచక్రవాహనాలు, ఆటోల్లో తీసుకెళ్లి డోర్ డెలివరీ చేస్తున్నట్లు సమాచారం. బెల్టు దుకాణాలకు సైతం భారీగా మద్యం గాంధీ జయంతి కావడంతో ముందస్తుగా కొనుగోలు పెద్ద ఎత్తున రవాణా, విక్రయాలు -
సింహ వాహనంపై ఊరేగింపు
కాళేశ్వరం: శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో శ్రీశుభానందదేవి (పార్వతి) అమ్మవారి ఉత్సవ విగ్రహన్ని ఆలయ ప్రాకారం మాడవీధుల గుండా సింహ వాహనంపై ఊరేగింపు సేవా కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మంగళవారం మంగళవాయిద్యాలతో ఊరేగింపు చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదం అందజేశారు. గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఉపప్రధాన అర్చకుడు పనకంటి ఫణీంద్రశర్మ ఆధ్వర్యంలో పూజ తంతును నిర్వహించారు. సీనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్, జూనియర్ అసిస్టెంట్ రవి, సిబ్బంది దూది శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పొరపాటుకు తావివ్వొద్దు
భూపాలపల్లి: చిన్న పొరపాటుకు కూడా తావులేకుండా స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో నోడ ల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికలు స జావుగా నిర్వహించుటలో అధికారుల విధులు చాలా కీలకమన్నారు. ఓటర్లను ప్రలోబాలకు గురిచేసే విధంగా నగదు, మద్యం, బహుమతుల పంపిణీపై పటిష్టమైన నిఘా ఉంచాలని చెప్పారు. చెక్పోస్టులలో వాహనాలను నిశిత పరిశీలన చేయాలని ఆ దేశించారు. మ్యాన్పవర్, బ్యాలెట్ బాక్సులు, ట్రా న్స్పోర్ట్ మేనేజ్మెంట్, శిక్షణా కార్యక్రమాల నిర్వహణ, మెటీరియల్ మేనేజ్మెంట్, ఎక్స్పెండిచర్ మానిటరింగ్, మీడియా కమ్యూనికేషన్, హెల్ప్లైన్ అండ్ కంప్లయింట్స్ రెడ్రెస్సల్, వెబ్కాస్టింగ్ తదితర విభాగాలపై నోడల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీపీఓ శ్రీలత, అన్ని విభాగాల నోడల్ అధికారులు పాల్గొన్నారు. పార్టీలు సహకరించాలి.. ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన సందర్భంగా ఐడీఓసీ కార్యాలయపు కాన్ఫరెన్స్ హాల్లో రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎన్నికల్లో పాటించాల్సిన నిబంధనలపై పలు సూచనలు చేశారు. స్ట్రాంగ్ రూం కోసం భవన పరిశీలన.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో జిల్లా కేంద్రంలో స్ట్రాంగ్ ఏర్పాటు కోసం కలెక్టర్ రాహుల్ శర్మ మంగళవారం స్థానిక గిరిజన ఆశ్రమ పాఠశాల భవనాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. కలెక్టర్ వెంట కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్ ఉన్నారు. యాస్పిరేషన్ పారా మీటర్లు పకడ్బందీగా నమోదు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. పలిమెల, మహాముత్తారం మండలాల యాస్పిరేషన్ పారామీటర్లు నమోదుపై మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, సీపీఓ బాబూరావు, డీఆర్డీఓ బాలకృష్ణ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులు వెన్నెముక లాంటివారని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై పీఓలు, ఏపీఓలకు మాస్టర్ ట్రెయినర్లతో ఐడీఓసీ కార్యాలయపు సమావేశపు హాల్లో కలెక్టర్ రాహుల్ శర్మ సమావేశం నిర్వహించి మాట్లాడారు. పోలింగ్ కేంద్రాల వద్ద శాంతి భద్రతల నిర్వహణ, ఓటర్ల సౌకర్యాలు, బ్యాలెట్ బాక్సులు, ఓటరు స్లిప్పులు, అభ్యర్థుల గుర్తులు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు తదితర అంశాలను తెలియజేశారు. ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులే కీలకం కలెక్టర్ రాహుల్ శర్మ -
పండుగ పూట.. రైతు తండ్లాట
యూరియా కోసం రైతులకు పండుగ పూట కూడా తండ్లాట తప్పడం లేదు. మహదేవపూర్ పీఏసీఎస్కు 660 బస్తాల యూరియా వచ్చిన విషయం తెలుసుకున్న మహదేవపూర్, బొమ్మాపూర్, బ్రాహ్మణపల్లి గ్రామాల మంగళవారం ఉదయం పీఏసీఎస్ ఎదుట బారులుదీరారు. భారీగా రావడంతో అధికారులు పోలీస్ పహారా నడుమ పంపిణీ చేశారు. గంటల తరబడి లైన్లలో వేచి ఉన్నప్పటికీ రైతులందరికీ యూరియా అందలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తచేస్తూ వెనుదిరిగారు. గ్రామాల్లోనే పంపిణీ చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటే ఇబ్బందులు ఉండవని వాపోయారు. – కాళేశ్వరం -
సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు
భూపాలపల్లి అర్బన్: జిల్లా ప్రజలకు సద్దుల బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలను కలెక్టర్ రాహుల్శర్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బతుకమ్మ తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా, ఆడబిడ్డల ఆరాధన పండుగగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్నట్లు తెలిపారు. దసరా పండుగ శక్తి ఆరాధనకు సంకేతమని, ఈ రెండు పండుగలు ప్రజలందరికీ ఆనందం, సౌఖ్యం, ఐకమత్యం కలిగించాలని ఆకాంక్షించారు. తొమ్మిది రోజుల పాటు మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఆట, పాటలతో దిగ్విజయంగా జరుపుకున్నారని పేర్కొన్నారు. భూపాలపల్లి అర్బన్: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు నోడల్ అధికారులను నియమించినట్లు కలెక్టర్ రాహుల్శర్మ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ సిబ్బంది, అధికారులను సమకూర్పు, బ్యాలెట్ బ్యాక్స్లు, ఎన్నికల సిబ్బంది రవాణా, ఓటింగ్ సామగ్రి, ఎంసీసీ, ఖర్చుల వివరాలు, మానిటరింగ్ టీమ్, మీడియా కమ్యూనికేషన్లతో వివిధ విభాగాలకు జిల్లా స్థాయి అధికారులను నోడల్ అధికారులుగా నియమించారు. పలిమెల: గోదావరికి వస్తున్న భారీ వరద కారణంగా మండలంలోని పంకెన, సర్వాయిపేట, పలిమెల గ్రామాల్లో సుమారు 30 ఎకరాల వరకు పంటలు వరద నీటిలో మునిగిపోయాయి. అప్పులు తెచ్చి పెట్టిన పెట్టుబడి మొత్తం వృథా అయిందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలం ముగింపు దశకు వచ్చినప్పటికీ వర్షాలు, వరదలతో పత్తి, మిర్చి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు వాపోయారు. తమను వ్యవసాయ అధికారులు, ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. కాటారం: రైతులు యూరియా కోసం ఆందోళన చెందవద్దని సాగుకు సరిపడా యూరియా అందిస్తామని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబురావు అన్నారు. కాటారం మండలకేంద్రంలోని పీఏసీఎస్, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో సోమవారం యూరియా పంపిణీని పర్యవేక్షించారు. యూరియా పంపిణీ పారదర్శకంగా నిర్వహించాలని రైతులకు ఇబ్బందులు కల్గనివ్వవద్దని డీఏఓ పీఏసీఎస్ అధికారులు, ఆగ్రోస్ కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు. డీఏఓ వెంట ఏఓ పూర్ణిమ, ఏఈఓలు, సిబ్బంది ఉన్నారు. కాళేశ్వరం: స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించడంతో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో రాజకీయ పార్టీల నాయకులు, దేశ నేతల విగ్రహాలను కనిపించకుండా పంచాయతీ అఽధికారులు వస్త్రాలు తొడిగారు. అక్టోబర్ 9 నుంచి నవంబర్ 11 వరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డుసభ్యుల ఎన్నికలు జరుగనున్నాయి. ప్రతీ ఒక్కరు ఎన్నికల ప్రవర్తన నియమాలు పాటించి సహకరించాలని పంచాయతీ కార్యదర్శి ఎన్.సత్యనారాయణ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
పూల పరిమళం
భూపాలపల్లి అర్బన్: ‘ఒక్కేసి పువ్వేసి చందమామ, ఒక్క జాములాయే చందమామ’ అంటూ తీరొక్క పూలతో తెలంగాణ పల్లె వాకిట్ల సాగిన బతుకమ్మ సంబురాలు సోమవారం జిల్లావ్యాప్తంగా జరిగిన సద్దుల బతుకమ్మతో ముగిశాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే ఎంగిలిపూలతో ప్రారంభమైన బతుకమ్మ తొమ్మిది రోజుల పాటు వైభవంగా కొనసాగింది. సోమవారం జిల్లావ్యాప్తంగా మహిళలు, యువతులు, విద్యార్ధినులు ఉదయం నుంచే పూల సేకరణలో నిమగ్నమయ్యారు. అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. మహిళలు, యువతులు, చిన్నారులు అందంగా తీర్చిదిద్దిన బతుకమ్మలతో ఆయా ప్రాంతాలకు తరలివెళ్లారు. అక్కడ బతుకమ్మలను ఉంచి ‘రామ రామ రామ ఉయ్యాలో..’ అంటూ పాటలు పాడారు. ఆటలు ఆడారు. కోలాటాలు, నృత్యాలతో సందడి చేశారు. కష్టాలు తొలగిపోవాలంటూ గౌరమ్మను వేడుకున్నారు. అనంతరం ఆయా ప్రాంతాల్లోని జనవనరుల్లో బతుకమ్మను జారవిడిచి ‘పోయిరా గౌరమ్మ.. పోయి రావమ్మా..’ అని ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం వాయినాలు ఇచ్చుకున్నారు. పట్టణంలో ఘనంగా.. భూపాలపల్లి పట్టణంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పాత కూరగాయాల అంగడి మైదానాలు, హనుమాన్ దేవాలయం, సంతోషిమాత, రామాలయం, అయ్యప్ప ఆలయాల వద్ద బతుకమ్మ వేడుకులకు మహిళలు, యువతులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పలు బతుకమ్మ ఆట స్థలాలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సందర్శించి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ప్రాంగణాల్లో విద్యుత్ లైట్లు ఏర్పాట్లు చేశారు. మున్సిపాలిటీ పరిఽధిలోని మహిళలు బతుకమ్మ పండుగను ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరుపుకునేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేశారు. బతుకమ్మ ఆడిన అనంతరం పట్టణ శివారులోని పాత ఎర్ర చెరువులో నిమజ్జనం చేశారు. ఊరూవాడ వేడుక ఉట్టిపడిన సంస్కృతి, సంప్రదాయం గౌరీ దేవికి ఘనంగా వీడ్కోలు వాయినాలు ఇచ్చుకున్న మహిళలు ముగిసిన పూలపండుగ -
ఎట్టకేలకు మోగిన ‘లోకల్’ ఎన్నికల నగారా
వరంగల్ ఉమ్మడి జిల్లాలో మొత్తం వివరాలుజెడ్పీలు 06జెడ్పీటీసీలు 75 ఎంపీపీలు 75 ఎంపీటీసీలు 778 సర్పంచ్లు 1,708గెలుపు గుర్రాల వేటలో పార్టీలు.. షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి. అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తుండగా.. బీఆర్ఎస్, బీజేపీ కూడా చాలెంజ్గా తీసుకుంటున్నాయి. వామపక్షాలు, ఇతర పార్టీలు సైతం ‘స్థానిక’ంలో సత్తా చాటేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ స్థానాలు, ఆరు జిల్లా పరిషత్లను గెలుచుకునేందుకు ఆ పార్టీలు పావులు కదుపుతున్నాయి. అధికార పార్టీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలపై అధిష్టానం ఈ బాధ్యతలు మోపనుండగా.. బీఆర్ఎస్, బీజేపీ సైతం త్వరలోనే ఇన్చార్జ్లను నియమించనున్నాయి. సాక్షి ప్రతినిధి, వరంగల్: ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఎట్టకేలకు సోమవారం నగారా మోగింది. పొలిటికల్ కొలువులు ఎన్నికల ద్వారా భర్తీకి సమయం ఆసన్నమైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు ముహూర్తం కుదిరింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు రెండు విడతలు.. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. అక్టోబర్ 9 నుంచి నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ మొదలు కానుండగా.. నవంబర్ 11న ఓట్ల లెక్కింపుతో ముగియనుంది. మొత్తం ఐదు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. వచ్చే నెల 9, 17 తేదీల్లో నోటిఫికేషన్.. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 9 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం ఐదు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రెండు దశల్లో, సర్పంచ్ ఎన్నికలు మూడు దశల్లో నిర్వహిస్తారు. అక్టోబర్ 23న ఎంపీటీసీ, జెడ్పీటీసీ తొలి విడుత పోలింగ్, అదే నెల 27న రెండో విడత పోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. అక్టోబర్ 17న సర్పంచ్ ఎన్నికలకు తొలి విడత నోటిఫికేషన్ విడుదల కానుండగా.. అక్టోబర్ 31న సర్పంచ్ ఎన్నికల తొలి విడత పోలింగ్ ఉంటుంది. అక్టోబర్ 21 నుంచి రెండో విడత నామినేషన్ల స్వీకరణ, నవంబర్ 4న రెండో విడత పోలింగ్, మూడో విడత ఎన్నికలకు అక్టోబర్ 25 నుంచి నామినేషన్లు స్వీకరించి, నవంబర్ 8న పోలింగ్ నిర్వహిస్తారు. సర్పంచ్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు వెల్లడిస్తారు. ఉమ్మడి వరంగల్లోని 6 జిల్లాల్లో 6 జిల్లా పరిషత్లు, 75 జెడ్పీటీసీలు, 75 ఎంపీపీలు, 778 ఎంపీటీసీలు, 1,708 గ్రామ పంచాయతీలు, 15,006 వార్డులకు ఎన్నికలు జరుగునున్నాయి. ఇందుకోసం 15,258 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 45 రోజులపాటు ఎన్నికల కోడ్ షెడ్యూల్తో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని అధికారులు ప్రకటించారు. మండల, జిల్లాల సరిహద్దుల్లో 25 చెక్పోస్టుల ఏర్పాటుకు పోలీసు కమిషనర్, ఎస్పీలు స్థల పరిశీలన చేశారు. సుమారు 45 రోజులు ఎన్నికల కోడ్ అమల్లో ఉండనుండగా, అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రారంభోత్సవాలకు బ్రేక్ పడనుంది. నగరాలు, పట్టణాలు, పల్లెల్లో ఎలాంటి అల్లర్లకు తావు లేకుండా పోలీసు నిషేధాజ్ఞలు అమల్లోకి రానున్నట్లు ప్రకటించారు. సర్పంచ్ ఎన్నికల వివరాలు ఎంపీటీసీ, జెడ్పీటీటీలకు రెండు విడతలు మూడు విడతల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు ఉమ్మడి వరంగల్లో అమల్లోకి ఎన్నికల కోడ్ మండల, జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్టుల ఏర్పాటు గెలుపు గుర్రాల వేటలో ప్రధాన రాజకీయ పార్టీలు జిల్లాల వారీగా జెడ్పీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సంర్పంచ్లు, వార్డుల వివరాలుజిల్లా జెడ్పీ జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచ్ వార్డులుహనుమకొండ 1 12 12 129 210 1,986 వరంగల్ 1 11 11 130 317 2,754 భూపాలపల్లి 1 12 12 109 248 2,102 మహబూబాబాద్ 1 18 18 193 482 4,110 ములుగు 1 10 10 83 171 1,520 జనగామ 1 12 12 134 280 2,534తొలి, రెండో విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వివరాలువిడత నామినేషన్లు చివరి తేదీ పరిశీలన ఉపసంహరణ ఎన్నికలు ఓట్ల లెక్కింపు 1 అక్టోబర్ 9 అక్టోబర్ 11 అక్టోబర్ 12 అక్టోబర్ 15 అక్టోబర్ 23 నవంబర్ 11 2 అక్టోబర్ 13 అక్టోబర్ 15 అక్టోబర్ 16 అక్టోబర్ 19 అక్టోబర్ 27 నవంబర్ 11 1 అక్టోబర్ 17 అక్టోబర్ 19 అక్టోబర్ 20 అక్టోబర్ 23 అక్టోబర్ 31 అక్టోబర్ 31 2 అక్టోబర్ 21 అక్టోబర్ 23 అక్టోబర్ 24 అక్టోబర్ 27 నవంబర్ 4 నవంబర్ 4 3 అక్టోబర్ 25 అక్టోబర్ 27 అక్టోబర్ 28 అక్టోబర్ 31 నవంబర్ 8 నవంబర్ 8 -
శ్రీ సరస్వతీదేవిగా అమ్మవార్లు దర్శనం
కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ అనుబంధ దేవాలయాలైన శ్రీసరస్వతి, శ్రీఽశుభానందదేవి(పార్వతి) అమ్మవార్లు శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు మూలనక్షత్రం సందర్భంగా శ్రీసరస్వతీదేవిగా భక్తులకు దర్శమిచ్చారు. సోమవారం ఆలయ అర్చకులు పనకంటి ఫణీంద్రశర్మ ఆధ్వర్యంలో సరస్వతిమాత ఆలయంలో విశేష అభిషేక పూజలు చేశారు. అమ్మవార్లను ప్రత్యేకంగా పట్టువస్త్రాలు, పూలతో అలంకరించారు. రాత్రి మంత్రపుష్పం పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదం అందజేశారు. భజన కార్యక్రమాలు చేశారు. అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. అనంతరం సరస్వతిమాత ఆలయంలో చిన్నారులకు సామూహిక అక్షరస్వీకారాలు నిర్వహించి పలకలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈఓ మహేష్, మాజీ డైరెక్టర్ అశోక్, అర్చకులు రామాచార్యులు, శరత్చంద్రశర్మ, రామకృష్ణశర్మ, పవన్శర్మ పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చారు. నేడు అమ్మవారి వాహన సేవ.. శ్రీదేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు సింహావాహనంపై అమ్మవారి వాహన సేవ (ఊరేగింపు) కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఈఓ మహేష్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఈఓ కోరారు. -
అమల్లోకి ఎన్నికల ప్రవర్తనా నియమావళి
భూపాలపల్లి: రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నియమావళి అమలుపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లతో రాష్ట్ర ఎన్ని కల అధికారి రాణి కుముదిని సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ ఐడీఓసీలో నోడల్ అధికారులతో సమావేశమై మాట్లాడారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయడానికే నోడల్ అధికారులను నియమించామన్నారు. గోడలపై రాజకీయ వ్రాతలు, ఫ్లెక్సీలు వంటివి తొలగించాలని, నియమావళి ఉల్లంఘన జరిగితే తగి న చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓటర్లు ప్రలోబాలకు గురికాకుండా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, నోడల్ అధికారులు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
డిప్యూటీ కలెక్టర్గా గండ్ర నవీన్రెడ్డి
భూపాలపల్లి అర్బన్: డిప్యూటీ కలెక్టర్గా గండ్ర నవీన్రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టర్ రాహుల్శర్మను కలిసి జాయినింగ్ పత్రం సమర్పించి పూలబొకే అందజేశారు. విధుల్లో చేరిన నవీన్ రెడ్డిని కలెక్టర్ రాహుల్శర్మ అభినందించారు. ప్రజలకు సేవలందించే క్రమంలో సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర కేడర్లో డిప్యూటీ కలెక్టర్గా నియామకం పొందడం అభినందనీయమని అన్నారు. విధుల నిర్వహణలో ప్రజల మన్ననలు పొందాలని.. బాధ్యతలను సమర్థవంతంగా నిబద్ధతతో నిర్వహించాలని సూచించారు. ఉద్యోగ సాధనలో ప్రోత్సహించిన తల్లితండ్రులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. అసిస్టెంట్ ఆడిట్ అధికారిగా నాగవైష్ణవి జిల్లా అసిస్టెంట్ ఆడిట్ అధికారిగా గడ్డం నాగవైష్ణవి నియమితులయ్యారు. ఈ మేరకు కార్యాలయంలో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. -
గ్రూప్–2కు పలువురి ఎంపిక
భూపాలపల్లి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించిన గ్రూప్–2 ఎంపిక జాబితాలో పలువురు జిల్లా నుంచి ఎంపికయ్యారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధి కాశీంపల్లి గ్రామానికి చెందిన శనిగరపు ప్రవీణ్కుమార్ సచివాలయంలో జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో అసిస్టెంట్ సెక్షన్ అధికారిగా, సెగ్గంపల్లి గ్రామానికి చెందిన గజ్జె ప్రవళిక గ్రేడ్–2 సబ్ రిజిస్ట్రార్గా ఎంపికయ్యారు. భూపాలపల్లి మండలం చికెన్ పల్లి గ్రామానికి చెందిన వాంకుడోతు సురేష్ ఎంపీడీఓ ఉద్యోగానికి ఎంపికయ్యారు. చిట్యాల మండలం బావుసింగ్పల్లి గ్రామానికి చెందిన పుల్లూరి రామారావు ఎంపీఓగా నియమితులయ్యారు. కష్టపడి చదివి.. ఉద్యోగం సాధించి.. చిట్యాల: మండలంలోని బావుసింగ్పల్లి గ్రామానికి చెందిన పుల్లూరి రమ–భీంరావు దంపతుల కుమారుడు రామారావు పదవ తరగతి ములుగులో, ఇంటర్ ఎస్ఆర్ హనుమకొండ, బీటెక్ హనుమకొండలో చదువుకున్నారు. ఆరేళ్లుగా హైదరాబాద్లో ఉంటూ గ్రూప్–2 కోసం కష్టపడి చదువుకున్నాడు. గతేడాది గ్రూప్–2 పోటీ పరీక్షలు రాశారు. ఆదివారం ప్రభుత్వం ప్రకటించిన ఫలితాలలో మల్టీజోన్ –1లో ఎంపీఓగా ఉద్యోగం లభించింది. రామారావు గ్రూప్–2కు ఎంపికై ఉద్యోగం సాధించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. మొక్కవోని దీక్షతో.. భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మండలం చికెన్పల్లి గ్రామానికి చెందిన వాంకుడోతు సురేష్ చిన్నప్పటి నుంచి కష్టాల్లో పెరిగాడు. తన ఎనిమిదో ఏట తండ్రి అనారోగ్యంతో మృతిచెందాడు. తల్లి కమల అన్నీ తానై సురేష్ను చదివించింది. తినడానికి తిండి లేని రాత్రులు గడపడంతో పాటు తల్లితో కలిసి కూలీ పనులకు వెళ్లి సురేష్ విద్యాభ్యాసం చేశాడు. హనుమకొండలో ఇంటర్, బీటెక్ పూర్తిచేశాడు. 2020లో తల్లి కమల కేన్సర్తో మృతిచెందింది. సురేష్ తన స్నేహితుల సహాయంతో హైదరాబాద్లో గ్రూప్–1 కోచింగ్ తీసుకుని 2024లో గ్రూప్–1 పరీక్ష రాశాడు. 572 ర్యాంకు సాధించి ఎంపీడీఓ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. -
జీఎస్టీ తగ్గింపు పేదలకు వరం
● ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ములుగు రూరల్: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ తగ్గింపు పేద, మధ్యతరగతి ప్రజలకు వరమని ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం జీఎస్టీ తగ్గింపుపై కేంద్రం తీసుకున్న చర్యలను వివరిస్తూ పలువురికి తగ్గింపు ధరల కరపత్రాలను చూపుతూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీఎస్టీ తగ్గింపునకు తగిన చర్యలు తీసుకున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 370 వస్తువులపై జీఎస్టీ తగ్గించిందని వివరించారు. జీఎస్టీ తగ్గింపుతో నిత్యావసర సరుకుల ధరలు తగ్గుముఖం పడతాయన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అజ్మీరా సీతారాంనాయక్, కృష్ణవేణి, రమేష్, వెంకట్, రాజానాయక్, సురేందర్, సిరికొండ బలరాం తదితరులు పాల్గొన్నారు. -
నేడు సద్దుల బతుకమ్మ జరుపుకోండి
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో సోమవారం(నేడు) సద్దుల బతుమ్మను ప్రాంతీయ ఆచారంగా మహిళలు జరుపుకోవాలని కాళేశ్వరం దేవస్థానం ఉపప్రధాన అర్చకుడు పనకంటి ఫణీంద్రశర్మ, అర్చకులు వెల్ధి శరత్చంద్రశర్మ ఆదివారం తెలిపారు. అమావాస్య నుంచి 9వ రోజున సద్దుల బతుకమ్మ జరుపుకోవాలని, సప్తమితో కూడిన అష్టమి ఒకే రోజు రావడంతో సందిగ్ధం నెలకొందన్నారు. సందేహం లేకుండా ప్రాంతీయ ఆచారంగా సద్దుల బతుకమ్మ వేడుకలను 29న (నేడు) సోమవారం జరుపుకోవాలని మహిళలకు విజ్ఞప్తి చేశారు. బతుకమ్మ వేడుకలు జరుపుకుకొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. ఘనంగా భగత్సింగ్ జయంతి భూపాలపల్లి రూరల్: భగత్ సింగ్ 118వ జయంతిని పురష్కరించుకొని ఆదివారం జిల్లాకేంద్రంలోని భగత్ సింగ్ విగ్రహానికి ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్ క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్రం కోసం 23 సంవత్సరాల వయస్సులోనే ప్రాణాలు త్యాగం చేసిన మహనీయుడు భగత్సింగ్ అన్నారు. ఆయన ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అక్టోబర్ 3న సెలవు ఇవ్వాలి భూపాలపల్లి అర్బన్: దసరా పండుగ రోజున గాంధీ జయంతి అవుతున్న నేపథ్యంలో సింగరేణి కార్మికులకు అక్టోబర్ 3వ తేదీన సెలవు ప్రకటించాలని బీఎంఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ యాజమన్యాన్ని కోరారు. ఈ మేరకు ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే దసరా పండుగ, గాంధీ జయంతిని గొప్పగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. సమైక్యత, సమగ్రత కోసం దసరా పండుగ సెలవుదినాన్ని మార్చాలని యాజమాన్యాన్ని కోరారు. ఈ సమావేశంలో నాయకులు సుజేందర్, మల్లేష్, శ్రీనివాస్, సదానందం, శ్రీనివాస్, రఘుపతిరెడ్డి, సాగర్, సదానందం, స్వామి, మొగిలి పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపిక మల్హర్: జటాధార ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఆధ్వర్యంలో జెట్ ఇన్నోవేటివ్ రాష్ట్ర స్థాయి అవార్డులకు ఇద్దరు టీచర్లు ఎంపికయ్యారు. మల్హర్ మండలం తాడిచర్ల జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుడు వనపర్తి కుమారస్వామి, భూపాలపల్లి మండలం గొల్లబుద్ధారం డీఎన్టీ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు జయ ఎంపికయ్యారు. నేడు (సోమవారం) సికింద్రాబాద్లో హరిహర కళాక్షేత్రంలో నిర్వహించే కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానోత్సవం చేయనున్నారు. అవార్డుకు ఎంపిక కావడం పట్ల పలువురు ఉపాధ్యాయులు వారిని అభినందించారు. సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదివారం ఒక ప్రకటనలో సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లేలా, ప్రజలంతా సుఖశాంతులతో జీవించి, దినదినాభివృద్ధి పొందేలా దీవించాలని అమ్మవారిని ఎమ్మెల్యే ప్రార్థించారు. -
సమస్యల పరిష్కారానికి కృషి
● టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్ కాటారం: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) కృషి చేస్తుందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్ అన్నారు. కాటారం మండలకేంద్రంలో ఆదివారం టీఆర్టీఎఫ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా ఎస్టీయూ రాష్ట్ర బాధ్యుడు హట్కర్ రమేశ్నాయక్, మండల అధ్యక్షుడు రేపాల వేణుగోపాల్, పీర్ల మోహన్రావు, కోటేశ్వర్, సబిత, వెంకటేశ్, కృపాకర్ తదితరులు టీఆర్టీఎఫ్ సభ్యత్వం తీసుకున్నారు. నూతనంగా చేరిన వారికి రాష్ట్ర అద్యక్షుడు కటకం రమేశ్, మెంబర్షిప్ రాష్ట్ర కన్వీనర్ సుంకేసుల ప్రభాకర్రావు మాట్లాడుతూ టీఆర్టీఎఫ్ సిద్ధాంతం భావజాలం సామాజిక కోణంతో ముడిపడి ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పెండెం మధుసూదన్, కార్యదర్శి రవీందర్, కార్యవర్గ సభ్యులు సమ్మయ్య, రఘుకుమార్, ఆజ్మీర అనిల్, రాజునాయక్, పరంసింగ్ పాల్గొన్నారు. -
సద్దులకు సిద్ధం..
భూపాలపల్లి అర్బన్: సద్దుల బతుకమ్మను సోమ, మంగళవారాల్లో నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహిళలకు అసౌకర్యం కలగకుండా జిల్లావ్యాప్తంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సద్దుల బతుకమ్మ జరుపుకునే ప్రాంగణాలు, ఆలయ ప్రాంగణాలు ముస్తాబు చేశారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధితో పాటు జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో ప్రాంగణాలు సిద్ధం చేశారు. జలాశయాల వద్ద, దేవాలయాల్లో, పలు కూడళ్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. బతుకమ్మలను నీటిలో వదిలే సమయంలో ఇబ్బందులు చోటు చేసుకోకుండా బృందాలను జలాశయాల వద్ద ఉంచనున్నారు. పోలీస్ యంత్రాంగం ఇప్పటికే బందోబస్తుపై దృష్టి సారించింది. బతుకమ్మ జరుపుకునే ప్రాంతాల్లో ఏర్పాట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. సందడి షురూ.. పుట్టింటికి వచ్చిన ఆడబిడ్డలు.. వైభవంగా బతుకమ్మ పండగను జరుపుకునేందుకు పూలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఇక కొత్త బట్టల కొనుగోళ్లతో సందడి నెలకొంది. పండుగను పురస్కరించుకొని గ్రామాల నుంచి కొందరు పూలను సేకరించి తీసుకొచ్చి పట్టణంలో విక్రయిస్తున్నారు. విద్యుత్ వెలుగుల్లో ఆటపాటలు భూపాలపల్లి పట్టణంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో బతుకమ్మ పండుగను కనుల పండువగా జరుపుకునేందుకు ప్రభుత్వ శాఖలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా మున్సిపల్, గ్రామ పంచాయతీల్లో రంగురంగుల విద్యుత్ అలంకరణలతో ప్రాంగణాలు ముస్తాబు చేస్తున్నారు. ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేస్తున్నారు. పట్టణంలో పెద్దఎత్తున వేడుకలను నిర్వహించేందుకు అంబేడ్కర్ స్టేడియం, వారాంతపు సంత, హనుమాన్, అయ్యప్ప, రామాలయాల్లో వేదికలు ముస్తాబు చేస్తున్నారు. పూలకు భలే గిరాకీ చివరి రోజైన సద్దుల బతుకమ్మ కోసం అందంగా బతుకమ్మలు పేర్చేందుకు ఆడపడుచులు పూల సేకరణలో నిమగ్నమయ్యారు. ఆదివారం గ్రామాల నుంచి కొందరు తంగేడు, గునుగు, టేకు, బంతి పూలను జిల్లాకేంద్రంతో పాటు మండల కేంద్రాల్లోకి తీసుకువచ్చి విక్రయిస్తుండగా ధరలు కూడా ఎక్కువగానే చెబుతున్నారు. తంగేడు పూల కట్టను సైజును బట్టి రూ.10 నుంచి రూ.50 వరకు విక్రయిస్తున్నారు. గునుగు పూల కట్ట రూ.20 నుంచి రూ.30 వరకు, ఇక బంతి పూలను ప్రాంతాన్ని బట్టి రూ.80నుంచి రూ.100 వరకు అమ్ముతున్నారు. ఇతర రకాల పూలకు కూడా బాగానే గిరాకీ ఉంది. ముస్తాబవుతున్న బతుకమ్మ ప్రాంగణాలు మున్సిపాలిటీ పరిధిలో ప్రత్యేక ఏర్పాట్లు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో పర్యవేక్షణరెండు రోజుల సద్దుల బతుకమ్మ.. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది బతుకమ్మ పండగపై తీవ్ర అయోమయం నెలకొంది. నేడు(సోమవారం), మంగళవారం నిర్వహించుకోవాలని పండితులు రెండు రకాల తేదీలను ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 30వ తేదీన నిర్వహించాలని సర్క్యూలర్ జారీ చేసింది. బతుకమ్మను ప్రతి ఏడాది సంప్రదాయబద్ధంగా తొమ్మిదో రోజున జరుపుకుంటారని అందులో భాగంగానే అధిక శాతం గ్రామాల్లో నేడు(సోమవారం) జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. బతుకమ్మలను పేర్చుకునేందుకు పూలను కొనుగోలు చేసుకున్నారు. కొన్ని గ్రామాల్లో మంగళవారం నిర్వహించుకోనున్నారు. -
ప్రజల భద్రత కోసమే కార్డన్సెర్చ్
● డీఎస్పీ సూర్యనారాయణ మల్హర్: ప్రజల భద్రత కోసమే కార్డన్సెర్చ్ నిర్వహిస్తున్నామని కాటారం డీఎస్పీ సూర్యనారాయణ అన్నారు. కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ నాగార్జునరావు ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం మండలంలోని కొయ్యూరు గ్రామంలో పోలీసులు కార్డన్సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 10 మంది సివిల్ కానిస్టేబుళ్లు, 20 టీజీఎస్పీ కానిస్టేబుళ్లతో కలిసి ఇళ్లలో తనిఖీలు చేశారు. నంబర్ ప్లేట్లేని 7 వాహనాలు, వాహన పత్రాలు సరిగా లేని 25 వాహనాలను సీజ్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ.. గుడుంబా, గంజాయి వంటి చెడు వ్యసనాలు, సీసీ కెమెరాలు, డయల్ 100పై ప్రజలకు అవగాహన కల్పించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలందరూ దసరా పండుగని ప్రశాంతమైన వాతావరణంలో జరపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కొయ్యూరు ఎస్సై నరేష్, రాజన్, కాటారం ఎస్సై శ్రీనివాస్, మానస, మహేష్, సిబ్బంది పాల్గొన్నారు. -
శ్రీమహా చండీదేవిగా అమ్మవార్ల దర్శనం
సోమవారం శ్రీ 29 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025కాళేశ్వరం: శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ అనుబంధ దేవాలయాలైన శ్రీఽశుభానందదేవి (పార్వతి), శ్రీసరస్వతి అమ్మవార్లు ఏడో రోజు శ్రీ మహా చండీదేవిగా భక్తులకు దర్శమిచ్చారు. ఆదివారం ఆలయ అర్చకులు అమ్మవార్లను ప్రత్యేకంగా పట్టువస్త్రాలు, పూలతో అలంకరించారు. అర్చకులు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి మంత్రపుష్పం పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదం అందజేశారు. భజన కార్యక్రమాలు చేశారు. అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలిరావడంతో రద్దీ నెలకొంది. నేడు మూలనక్షత్రం.. శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా (నేడు) సోమవారం మూల నక్షత్రం సందర్భంగా శ్రీసరస్వతి, శ్రీశుభానందదేవి అమ్మవారు ఎనిమిదో రోజు సరస్వతీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.శ్రీసరస్వతి అమ్మవారుశ్రీశుభానందదేవి అమ్మవారు -
యూరియా కోసం రైతుల ఆందోళన
కాటారం: అన్నదాతలకు యూరియా కష్టాలు తప్పడం లేదు. సరిపడా యూరియా అందకపోవడంతో రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి నెలకొంటుంది. కాటారం మండలకేంద్రంలోని పీఏసీఎస్ గోదాంలో యూరియా ఉన్నప్పటికీ పంపిణీలో జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ శనివారం కాటారం మండలకేంద్రంలో రైతులు ఆందోళన చేపట్టారు. పీఏసీఎస్ గోదాం ఎదుట కాటారం–మంథని ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. ఉదయం నుంచి గోదాం ఎదుట పడిగాపులు కాస్తున్నా యూరియా పంపిణీ ప్రారంభించలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా కోసం వ్యవసాయ పనులు వదిలిపెట్టుకొని తిరగాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు. రైతుల ఆందోళనకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. యూరియా పంపిణీలో ప్రభుత్వం విఫలమైందని, మంత్రి శ్రీధర్బాబు సొంత మండలంలో రైతులు యూరియా కోసం తంటాలు పడుతున్నారని విమర్శించారు. ఎస్సై శ్రీనివాస్, వ్యవసాయశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులను సముదాయించారు. యూరియా పంపిణీ చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. యూరియా సరిపడా పంపిణీ చేస్తాం.. కాటారం: యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దని.. సాగుకు సరిపడా యూరియా సరఫరా అవుతుందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబురావు అన్నారు. కాటారం మండలకేంద్రంలోని పీఏసీఎస్ గోదాం, రేగులగూడెం, దామెరకుంట రైతువేదికల్లో యూరియా పంపిణీని డీఏఓ శనివారం పరిశీలించారు. యూరియా కోసం వచ్చిన రైతుల పట్టాపుస్తకం, ఆధార్కార్డు జిరాక్స్లను పరిశీలించి టోకెన్లు అందజేయించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా యూరియా పంపిణీ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. యూరియా నిల్వలపై ఆరా తీశారు. డీఏఓ వెంట ఏఓ పూర్ణిమ, ఏఈఓలు ఉన్నారు. -
ఓపెన్కాస్ట్ పరిశీలన
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని కేటీకే ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్–2 గనిని సింగరేణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.వెంకన్నజాదవ్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఓపెన్కాస్టులో బొగ్గు ఉత్పత్తి, మట్టి వెలికితీత ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఈడీ మాట్లాడుతూ.. బొగ్గు ఉత్పత్తిని మరింత పెంచాలన్నారు. జీ–5 గ్రేడ్ బొగ్గు ఉత్పత్తిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ.. అధిక ప్రమాణాలతో బొగ్గు ఉత్పత్తి చేయాలన్నారు. జీ–11 గ్రేడ్ బొగ్గును రామగుండం ప్రాంతానికి రవాణా చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా జీఎం రాజేశ్వర్రెడ్డి, ఎస్వోటు జీఎం కవీంద్ర, పీఓ శ్యాంసుందర్, రక్షణ అధికారి నజీర్ పాల్గొన్నారు. కాటారం: అమలుకు నోచుకోని హామీలతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గద్దెనెక్కి ప్రజలను మోసం చేసిందని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల జాతీయ అద్యక్షుడు, బీజేపీ నాయకుడు గోమాస శ్రీనివాస్ ఆరోపించారు. కాటారం మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. చాలా ఏళ్లుగా ఏలిన కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేసిందని ఆరోపించారు. మంత్రి శ్రీధర్బాబు మంథని ప్రాంత అభివృద్ధిని మరిచిపోయారని విమర్శించారు. శ్రీనివాస్ వెంట బీజేపీ నాయకులు చల్ల నారాయణరెడ్డి, దుర్గం తిరుపతి, తదితరులు ఉన్నారు. ఘనంగా ఫ్యామిలీ డే వేడుకలు భూపాలపల్లి అర్బన్: సద్దుల బతుకమ్మ పండగను పురస్కరించుకొని ఏరియా సింగరేణి ఆధ్వర్యంలో శనివారం రాత్రి ఫ్యామిలీ డే వేడుకలను ఏరియాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏరియాలోని సుభాష్ కాలనీ సింగరేణి ఫంక్షన్హాల్లో సేవా సమితి మహిళలతో నిర్వహించిన ఈ ఫ్యామిలీ డే బతుకమ్మ సంబరాలకు ముఖ్య అతిథిలుగా ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి, సేవా అధ్యక్షురాలు సునీత రాజేశ్వర్రెడ్డి హాజరయ్యారు. మహిళలు, సేవా సభ్యులు రంగురంగుల బతుకమ్మలు అలంకరించుకొని వచ్చి ఆటపాటలతో ఆడి పాడారు. ఫ్యామిలీ డే సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన సేవా సభ్యులకు బహుమతులు అందజేశారు. ఉత్తమంగా బతుకమ్మలను అలంకరించిన మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ కావూరి మారుతి, గుర్తింపు, ప్రాతినిథ్య సంఘాల నాయకులు రమేష్, మధుకర్రెడ్డి, సీఎంఓఐఏ ప్రతినిధి నజీర్, సేవా కార్యదర్శి రుబీన, సేవా సభ్యులు పాల్గొన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు రివార్డులు ములుగు: నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులు ఇటీవల ములుగు ఎస్పీ డాక్టర్ శబరీశ్ ఎదుట లొంగిపోయారు. ఈ క్రమంలో తెలంగాణ సరెండర్ పాలసీలో భాగంగా తక్షణ సహాయంగా ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్కరికీ రూ.25 వేల చొప్పున వచ్చిన నగదు రివార్డును శనివారం ఎస్పీ తన కార్యాలయంలో వారికి అందజేశారు. గత మే నెలలో లొంగిపోయిన మడవి మంగ్లీ, మడకం కమలేష్, మడకం భీమేలకు నగదు రివార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ శబరీశ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అత్యుత్తమ సరెండర్ పాలసీని అమలు చేస్తుందన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు రివార్డు డీడీ, వైద్య చికిత్స, పునరావాస సాయం అందుతుందన్నారు. లొంగిపోయిన వారు సమాజంలో స్థిరపడేందుకు అన్ని విధాలా ప్రభుత్వం నుంచి మద్దతు లభిస్తుందన్నారు. -
శ్రీలలితా త్రిపుర సుందరీదేవిగా అమ్మవార్లు
శ్రీశుభానందదేవి అమ్మవారుశ్రీసరస్వతి అమ్మవారు కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ అనుబంధ దేవాలయాలైన శ్రీఽశుభానందదేవి(పార్వతి), శ్రీసరస్వతి అమ్మవార్లు శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజు శ్రీలలితా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. శనివారం ఆలయ అర్చకులు అమ్మవార్లను ప్రత్యేకంగా పట్టువస్త్రాలు, పూలతో అలంకరించారు. అర్చకులు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి మంత్రపుష్పం పూ జా కార్యక్రమాలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదం అందజేశారు. భజన కార్యక్రమాలు చేశారు. అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రధాన రహదారిపై మొరాయించిన లారీ
కాటారం: కాటారం మండలం ధన్వాడ సమీపంలో ప్రధాన రహదారిపై శనివారం లారీ మొరాయించింది. కాటారం నుంచి తాడిచర్ల వైపుగా బొగ్గు లోడ్ కోసం వెళ్తున్న లారీ అకస్మాత్తుగా ఇంజిన్ ఫెయిల్ అయి రోడ్డుపై నిలిచిపోయింది. రహదారి నిర్మాణంలో ఉండటంతో పాటు ఇరుకుగా ఉన్న కల్వర్టు వద్ద లారీ నిలిచిపోవడంతో ఇతర వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జాం ఏర్పడింది. భూపాలపల్లి నుంచి మంథని వైపుగా వెళ్లే ఆర్టీసీ బస్సులు, పలు వాహనాలు మండలంలోని బస్వాపూర్ మీదుగా కొయ్యూర్ గుండా రాకపోకలు సాగించాయి. పోలీసులు లారీని జేసీబీ సహాయంతో తొలిగించి రాకపోకలను పునరుద్ధరించారు.