breaking news
Jayashankar
-
4.36 ఎకరాల స్థలం కేటాయింపు
కాళేశ్వరం: ఈ ఏడాది జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ఆర్టీసీ కొత్త బస్టాండ్ నిర్మాణం కోసం రూ.3.95కోట్ల నిధులు మంజూరు చేయగా, ప్రభుత్వ స్థలం లేకపోవడంతో జాప్యం జరిగింది. దీంతో రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రత్యేక దృష్టిసారించడంతో కలెక్టర్ రాహుల్శర్మ ఆదేశాలతో రెవెన్యూశాఖ ప్రభుత్వ స్థలాలపై కసరత్తు చేసింది. గురువారం కాళేశ్వరంలోని హనుమాన్నగర్(కొత్త బస్టాండ్) ఏరియాలో 4.36ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని మహదేవపూర్ తహసీల్దార్ రామారావు, డీటీ కృష్ణ, సర్వేయర్ రమేష్ సర్వేచేసి భూపాలపల్లి ఆర్టీసీ డీఎం ఇందు, ఆర్టీసీ ఈఈ సింగ్లకు కేటాయింపు పత్రాన్ని అందజేశారు. త్వరలో అత్యాధునిక హంగులతో బస్టాండ్ నిర్మాణం కానుంది. వారి వెంట ఆర్ఐ జగన్మోహన్రెడ్డి, సీనియన్ అసిస్టెంట్ రఘు, ఎస్సై తమాషారెడ్డి, కార్యదర్శి సత్యనారాయణ, గ్రామస్తులు జానీ, కిరణ్, రాజయ్య పాల్గొన్నారు. అతి త్వరలో నిర్మాణం.. కొన్ని రోజులుగా స్థలంలేక నిర్మాణం జరుగలేదని, అతి త్వరలో బస్టాండ్ నిర్మాణం ప్రారంభమవుతుందని భూపాలపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ ఇందు తెలిపారు. కాళేశ్వరాలయానికి వచ్చే భక్తులకు, ఇతర రాష్ట్రాలకు తరలిపోయే ప్రయాణికులకు కాళేశ్వరం కూడలిగా ఉంటుందని పేర్కొన్నారు. కాళేశ్వరం బస్టాండ్కు రూ.3.95కోట్లు మంజూరు అతి త్వరలో నిర్మాణం ప్రారంభం : డీఎం ఇందు -
వెరీ స్లో.. పూర్తయింది రెండే ఇళ్లు..
స్లాబ్ లెవల్కు చేరుకున్న ఈ ఇంటి లబ్ధిదారురాలు పేరు నాగలగాని దేవేంద్ర. కొత్తపల్లిగోరి మండల కేంద్రానికి చెందిన ఈమెకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా సుమారు మూడు నెలల కాల వ్యవధిలో బేస్మెంట్, స్లాబ్ లెవల్ వరకు గోడల నిర్మాణం చేపట్టింది. ఇప్పటి వరకు ఆమెకు కేవలం రూ. లక్ష బిల్లు మాత్రమే ప్రభుత్వం నుంచి మంజూరైంది. దీంతో చేసేది లేక ఆమె ఇంటి నిర్మాణాన్ని నిలిపివేసింది. ప్రభుత్వ బిల్లులు మంజూరు చేస్తే ఇంటి నిర్మాణం పూర్తి చేసుకుంటానని వెల్లడించింది.భూపాలపల్లి: రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతుంటే జిల్లాలో మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. మంజూరులో ఆలస్యం కావడం, లోకేషన్ ఇబ్బందులే నిర్మాణాల ఆలస్యానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.పూర్తయింది రెండే ఇళ్లు..జిల్లాలోని 12 మండలాలకు 3,798 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో 2,501 ఇళ్లకు ముగ్గుపోయగా, బేస్మెంట్ లెవల్లో 1,137, స్లాబ్ లెవల్లో 103, స్లాబ్ లెవల్లో గోడలు పూర్తయినవి 55, పూర్తయిన ఇళ్లు రెండు మాత్రమే ఉన్నాయి. మరో రెండు నెలలు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడితే స్లాబ్ లెవల్లో ఉన్న ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.మంజూరు, ఆన్లైన్ ఇబ్బందులు..కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టగా జిల్లాలో భూమి ఉండి ఇళ్లు లేని నిరుపేదలను గుర్తించడంలో తీవ్ర జాప్యం జరిగింది. ఫలితంగా జిల్లాకు 3,798 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు కేవలం రెండు ఇళ్ల నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి. సర్కారు నిర్ధేషించిన సమయంలో ఇళ్ల నిర్మాణానికి ముగ్గులు పోయలేకపోవడం, వివిధ కారణాలతో ఇళ్ల నిర్మాణంలో ఆలస్యం జరుగుతోంది. ఇళ్లు మంజూరై పనులు చేపడుతున్న క్రమంలో లొకేషన్ సరిగా లేక ఆన్లైన్లో చూపించడం లేదు. దీంతో బిల్లులు రాక లబ్ధిదారులు నిర్మాణాలను నిలిపివేసి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్న అనంతరం అధికారులు ఆన్లైన్లో వివరాలను తప్పుగా ఎంట్రీ చేసినందుకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుస్తోంది. -
భావ ప్రకటన స్వేచ్ఛకు సంకెళ్లు సరికాదు!
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం వచ్చాక పత్రికా స్వేచ్ఛ, ప్రశ్నించే గొంతుకలను భౌతికదాడులతో పాటు పోలీసులను ఉపయోగిస్తూ తప్పుడు కేసులతో తీవ్ర అణచివేతకు గురిచేస్తుండడంపై పాత్రికేయులు, పాత్రికేయ సంఘాలు మండిపడుతున్నాయి. ప్రజా సమస్యలపై కథనాలు ప్రచురిస్తే సాక్షి దినపత్రిక జర్నలిస్టులపై కొందరు ప్రభుత్వ ఉద్యోగులతో ఫిర్యాదులు ఇప్పిస్తూ కేసులు నమోదు చేస్తుండడాన్ని ఖండించారు. వివిధ అంశాలపై ప్రతిపక్ష పార్టీల నాయకులు ఏర్పాటు చేసే ప్రెస్కాన్ఫరెన్స్ల వార్తలు రాసిన సందర్భంలోనూ సాక్షి దినపత్రికతో పాటు ఎడిటర్, ఇతర జర్నలిస్టులపై తప్పుడు కేసులు నమోదు చేస్తూ రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛను పూర్తిగా తమ గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. – హన్మకొండ -
కాంట్రాక్టర్లపై చర్య తీసుకోవాలి
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో ప్రాథమిక, ఉప ఆరోగ్య కేంద్రాల నిర్మాణంలో జాప్యంచేసే కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్శర్మ ఇంజినీరింగ్ అధి కారులను ఆదేశించారు. ఆరోగ్య ఉప కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వైద్య కళాశాల, ప్రభు త్వ ప్రధాన ఆస్పత్రి నిర్మాణ పనులు, వైద్య సిబ్బంది సమయ పాలన, ఖాళీ పోస్టులు భర్తీ తదితర అంశాలపై గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాల్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రధాన ఆస్పత్రిలో గోడలపై గుట్కా, ఉమ్మి వేస్తుండడంతో వైద్యసేవలకు వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పరిశుభ్రత పాటించాలని చెప్పారు. నిర్మాణంలో వచ్చే వ్యర్థాలు ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. ప్రధాన ఆస్పత్రిలో విద్యుట్ టు ఫేజ్ నుంచి త్రీ ఫేజ్కు మార్చాల్సి ఉందని.. ప్రతిపాదనలు ఇవ్వాలన్నారు. ఆస్పత్రి భవనాల నిర్మాణంలో జాప్యం జరిగితే కాంట్రాక్టర్లకు నోటీసులు జారీచేయాలని, స్పందించకపోతే బ్లాక్ లిస్టులో పెట్టాలన్నారు. మహదేవపూర్ ఆస్పత్రిలో ప్రసూతి వైద్యు ల నియామకానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. క్రిటికల్ కేర్ కేంద్రం నిర్మాణంలో జాప్యం జరుగుతుందని, ఇప్పటికే రెండు నోటీసులు జారీ చేశామని.. పనులు ప్రారంభించకపోతే చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్, టీజీఎంఐడీసీ ఈఈ ప్రసాద్, పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు, ప్రోగ్రాం అధికారిణి డాక్టర్ శ్రీదేవి పాల్గొన్నారు. ఆస్పత్రుల నిర్మాణ పనుల్లో జాప్యం వద్దు కలెక్టర్ రాహుల్శర్మ -
కోలిండియా స్థాయిలో రాణించాలి
● ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి భూపాలపల్లి అర్బన్: సింగరేణి క్రీడాకారులు కోలిండియా స్థాయిలో ప్రతిభ కనబర్చి రాణించాలని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి కోరారు. సింగరేణి వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం భూపాలపల్లి– రామగుండం–3 ఏరియాల బాడీబిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ రీజినల్ పోటీలను ఏరియాలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. క్రీడలు సింగరేణి సంస్థలో ప్రతి ఒక్కరిలో ఒక సెలబ్రేషన్లాగా నిలుస్తాయన్నారు. క్రీడలు మనందరిలో మానసికోల్లాసం, సానుకూలతను నింపుతాయని సూచించారు. మహిళా ఉద్యోగులు సైతం క్రీడల్లో రాణించాలని అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. సింగరేణి చరిత్రలో తొలిసారిగా మైనింగ్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ విభాగాల్లో గణనీయంగా మహిళా ఆఫీసర్లు నియమితులయ్యారన్నారు. సింగరేణి సంస్థలో ప్రతి ఏడాది మాదిరిగానే ఈ క్రీడలను నిర్వహించడం ఆనందకరమన్నారు. ఉద్యోగులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, క్రీడలు రోజు వారి మన కార్యకలాపాలలో భాగం చేసుకోవాలని సూచించారు. మనం ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. క్రీడలను విజయవంతంగా నిర్వహిస్తున్న నిర్వాహకులకు, పాల్గొనే ఉద్యోగులకు, అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా పర్సనల్ మేనేజర్ కావూరి మారుతి, క్రీడల గౌరవ కార్యదర్శి శ్రావణ్కుమార్, స్పోర్ట్స్ సూపర్వైజర్ పర్స శ్రీనివాస్, భూపాలపల్లి స్పోర్ట్స్ కోఆర్డినేటర్ పాక దేవయ్య, అర్జీ–3 స్పోర్ట్స్ కోఆర్డినేటర్, అంజయ్య, అఽధికారులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
జీపీఓలు వచ్చేస్తున్నారు..
భూపాలపల్లి: జిల్లాలోని 12 మండలాలకు గ్రామ పాలనాధికారులు (జీపీఓలు) రానున్నారు. గతంలో వీఆర్ఓ, వీఆర్ఏలుగా పని చేసి ప్రస్తుతం వివిధ ప్రభుత్వ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్లుగా పని చేస్తున్న వారు తిరిగి సొంత రెవెన్యూశాఖలోకి రెండు, మూడు రోజుల్లో రానున్నారు. జిల్లా వ్యాప్తంగా 107 మంది జీపీఓలుగా ఎంపిక కాగా 100 మంది బుధవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ అశోక్కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కౌన్సెలింగ్కు హాజరయ్యారు. వీరికి జిల్లాలోని 12 మండలాల పరిధిలో క్లస్టర్ల వారీగా, అభ్యర్థులు ఇచ్చిన ఐచ్చిక మేరకు ఓపెన్ కౌన్సెలింగ్ నిర్వహించి క్లస్టర్ కేటాయించారు. ఈ సందర్భంగా గ్రామ పాలన అధికారులు పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో కీలక పాత్ర పోషించాలని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ సూచించారు. ప్రజల సమస్యలను గ్రామ స్థాయిలోనే పరిష్కరించి, గ్రామీణాభివృద్ధి దిశగా కృషి చేయాలన్నారు. కలెక్టరేట్ ఏఓ మురళీధర్రావు, సిబ్బంది పాల్గొన్నారు.జిల్లాకు 107 మంది ఎంపిక -
కనిపిస్తే కరుసుడే!
భూపాలపల్లి: రోడ్డెక్కాలంటే భయమేస్తుంది. ప్ర ధాన రహదారులతో పాటు చిన్నచిన్న వీధుల్లో సై తం శునకాలు గుంపులు గుంపులుగా తిరుగుతూ మనుషులపై దాడులకు పాల్పడుతున్నాయి. తప్పి ంచుకునేంత సమయం కూడా ఇవ్వకుండా రోడ్డు మీద పడేసి పదుల సంఖ్యలో దాడులకు పాల్పడి కండలు పీకుతున్నాయి. దీంతో మహిళలు, చిన్న పి ల్లలు, వృద్ధులు భయాందోళనకు గురవుతున్నారు.పదుల సంఖ్యలో తిరుగుతూ..భూపాలపల్లి పట్టణంతో పాటు మండలాల్లోని గ్రామాల్లో కూడళ్ల వద్ద శునకాల స్వైర విహారం ఎక్కువైంది. కుక్కలను నియంత్రించేందుకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఒక్కో గ్రామంలో వందకు పైగా విచ్చలవిడిగా తిరుగుతూ ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయి. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, టిఫిన్ బాక్సులు తీసుకొని కూలీ పనులకు వెళ్లే వృద్ధులు, మహిళలపై నిత్యం దాడులు చేస్తున్నాయి. బైక్లపై వెళ్తున్న సమయంలో వెంబడిస్తూ కరిచేందుకు ప్రయత్నిస్తుండటంతో వాహనదారులు అదుపుతప్పి కిందపడి గాయాలపాలవుతున్న పరిస్థితి నెలకొంది. జిల్లాలో నెలకు 200కు పైగా కేసులు నమోదు అవుతున్నప్పటికీ పంచాయతీ, మున్సిపల్ శాఖల అధికారులు తగు చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.కుక్కలకు వింత వ్యాధులు..జిల్లాలోని కుక్కలు వివిధ రకాల వ్యాధుల బారిన పడుతున్నాయి. శరీరంపై చర్మం ఊడిపోయి రక్తం కారడం, నోటి నుంచి నురుగు రావడం, బక్కచిక్కిపోవడం తదితర లక్షణాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా, గణేష్ చౌక్లోని చికెన్, మటన్ సెంటర్ల వద్ద కనిపించే కుక్కలు వింత రోగాల బారిన పడి భయానకంగా కనిపిస్తున్నాయి. దీంతో ప్రజలు వాటిని చూసి భయాందోళనకు గురవుతున్నారు.చర్యలు తీసుకుంటాం..మున్సిపాలిటీ పరిధిలో త్వరలోనే కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటాం. ఇటీవలే టెండర్లను ఆహ్వానించాం. వారం రోజుల్లో ప్రక్రియ ముగుస్తోంది. టెండరు దక్కించుకున్న వారు ప్రత్యేక వాహనంలో శునకాలను ఏబీసీ సెంటర్కు తరలించి స్టెరిలైజేషన్, శస్త్ర చికిత్స చేసి, ఐ దు రోజుల పాటు అబ్జర్వేషన్లో ఉంచి ఫీడింగ్ ఇస్తారు. అనంతరం యాంటి రెబీస్ వ్యాక్సిన్ ఇ చ్చాక తీసుకొచ్చిన ప్రాంతంలోనే వదిలేస్తారు. – బిర్రు శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ -
విద్యార్థులతో జాగ్రత్తగా వ్యవహరించాలి
కాటారం: గురుకులం, ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో ఉండే విద్యార్థులతో ఉపాధ్యాయులు, సి బ్బంది జాగ్రత్తగా వ్యవహరించాలని జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి సూచించారు. కాటారం మండల కేంద్రంలోని గిరిజన గురుకుల బాలిక కళాశాలను బుధవారం తనిఖీ చేశారు. కళాశాల పరిసరా లు, తరగతి గదులు, డార్మెటరీ, కిచెన్, డైనింగ్ రూం, స్టాక్ రికార్డులు, ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరు పట్టికలను పరిశీలించారు. కూరగాయలు, వంటసామగ్రి నాణ్యతను పరిశీలించారు. అనంత రం విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్ర ద్ధ చూపాలని ప్రిన్సిపాల్ నాగలక్ష్మిని ఆదేశించారు. మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. విద్యార్థులతో కలిసి అడిషనల్ కలెక్టర్ భోజనం చేసి రుచిని పరిశీలించారు. అడిషనల్ కలెక్టర్ వెంట ఎంపీడీఓ బాబు, ఎంపీఓ వీరస్వామి, పంచాయతీ కార్యదర్శి షగీర్ఖాన్, సిబ్బంది ఉన్నారు. -
మద్యం టెండర్లకు కసరత్తు
ఉమ్మడి వరంగల్లో జిల్లాల వారీగా మద్యం దుకాణాలుసాక్షిప్రతినిధి, వరంగల్: వైన్స్ (ఏ4)లకు 2025–27 సంవత్సరాలకు సంబంధించి టెండర్లు నిర్వహించేందుకు ఆబ్కారీ శాఖ సన్నద్ధమవుతోంది. వాస్తవానికి నవంబర్ నెలాఖరుతో గడువు ముగియనుండగా.. ఒక నెల ముందుగానే టెండర్లు నిర్వహించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిసింది. గత ప్రభుత్వం 2023 ఆగస్టులోనే వైన్స్ల టెండర్లు నిర్వహించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 1 నుంచి కొత్త ఎకై ్సజ్ పాలసీ అమల్లోకి వస్తున్నప్పటికీ అక్టోబర్లో టెండర్లు నిర్వహించాలని ఆబ్కారీ శాఖ నిర్ణయించినట్లు తెలిసింది. ఈనేపథ్యంలోనే మద్య నిషేధ, ఆబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్లతో ఇటీవల హైదరాబాద్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. దీంతో అక్టోబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ వెలువడవచ్చని అధికారులు భావిస్తున్నారు. డిసెంబర్ 1 నుంచే కొత్త దుకాణాలు ప్రభుత్వం మద్యం దుకాణాల టెండర్ల సందర్భంగా 2023–25 ఎకై ్సజ్ పాలసీనే అమలు చేయనున్నట్లు చెబుతున్నారు. ఈసారి కూడా ఆరు స్లాబుల విధానాన్నే అమలు చేయనున్నట్లు తెలిసింది. గతంలో 5 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.50 లక్షల లైసెన్స్ ఫీజు వసూలు చేశారు. 5 వేల నుంచి 50 వేలలోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.55 లక్షలు, 50 వేల నుంచి లక్ష జనాభాకు రూ.60 లక్షలు, లక్ష జనాభా నుంచి 5 లక్షల్లోపు ఉన్న ప్రాంతాలకు రూ.65 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల్లోపు జనాభా ప్రాంతాలకు రూ.85 లక్షలు, 20 లక్షలకుపైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.1.10 కోట్లు లైసెన్స్ ఫీజు నిర్ణయించారు. ఈసారి కూడా అదే పాలసీ అమలు చేయనుండడంతో ఎప్పటిలాగే టెండర్లు వేసేందుకు ఆశావహులు సిద్ధమవుతున్నారు. కాగా, డిసెంబర్ ఒకటి నుంచి రాబోయే రెండేళ్లకు సంబంధించి కొత్త పాలసీ అమలుల్లోకి రానుండగా.. గతంలో మాదిరిగానే దుకాణాలకు సంబంధించి మూడు సామాజికవర్గాల (గౌడ, ఎస్సీ, ఎస్టీ) వ్యాపారులకు 30 శాతం వరకు రిజర్వేషన్లు కేటాయించనున్నారు. ఈసారి మద్యం దుకాణాల టెండర్లు పోటాపోటీగా సాగనున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మేడారం సమ్మక్క–సారలమ్మ–జాతరతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో మద్యం అమ్మకాలు జోరుగా సాగనున్నాయన్న చర్చ ఇప్పటికే సాగుతోంది.జిల్లా వైన్స్లు హనుమకొండ 65వరంగల్ 63జనగామ 47మహబూబాబాద్ 59జేఎస్ భూపాలపల్లి, ములుగు 60మొత్తం 294మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లు యథాతథంగా అమలు కానున్నట్లు, ఎప్పుడు నోటిఫికేషన్ వెలువడినా.. టెండర్లు నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎకై ్సజ్ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈమేరకు మద్యం దుకాణాల్లో గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం కేటాయించేలా జిల్లాల వారీగా మద్యనిషేధ, ఆబ్కారీ శాఖ చేస్తున్న కసరత్తు తుదిదశకు చేరినట్లు సమాచారం. హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, జేఎస్ భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో 2021–23 సంవత్సరాల నుంచి ఈ రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. ఈసారి కూడా ఉమ్మడి వరంగల్లో 294 మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు పాటించనున్నారు. ఈలెక్కన ఉమ్మడి వరంగల్లో 15 శాతం రిజర్వేషన్ల కింద గౌడ సామాజికవర్గానికి 39 నుంచి 44 దుకాణాలు రానున్నాయంటున్నారు. ఎస్సీలకు 27 లేదా 29, ఎస్టీలకు 13 నుంచి 15 దుకాణాలు కేటాయించనున్నారు. సుమారు 206 నుంచి 215 మద్యం దుకాణాలకు ఓపెన్ కేటగిరీ కింద కేటాయించే అవకాశం ఉండగా.. ఇందులోనూ అన్ని సామాజికవర్గాలు పాల్గొనే వీలుంటుంది. కాగా, ఈసారి కూడా 2011 జనాభా ప్రకారమే షాపులు కేటాయించనుండగా, స్లాబ్ల విధానం కూడా గత పాలసీ ప్రకారమే కొనసాగించనున్నారు. అయితే గతంలో టెండర్ దరఖాస్తు ధర రూ.2 లక్షలు ఉండగా.. ఈ సారి రూ.3 లక్షలకు పెంచారు. దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలకు పెంపు త్వరలో టెండర్ తేదీల ప్రకటన డీసీ కార్యాలయాలకు అందిన మార్గదర్శకాలు -
ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకం
భూపాలపల్లి: సమాజంలో అన్యాయం, అణచివేతలకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ జీవితం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. వివిధ కుల సంఘాల ప్రతినిధులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి, ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ అశోక్కుమార్, బీసీ సంక్షేమశాఖ అధికారి ఇందిర, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నిర్మాణ పనులు వేగిరం చేయాలి.. జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో రెవెన్యూ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, మహిళా సంక్షేమ, డీపీవో, డీఆర్డీఓ, టీడబ్ల్యూ ఐడీసీలతో అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీ భ వనాల నిర్మాణ ప్రగతిపై కలెక్టర్ సమీక్షించారు. భవనాల నిర్మాణంలో లోపాలు లేకుండా నా ణ్యతతోపాటు వేగం పెంచాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, జిల్లా అధికారులు, ఇంజనీరింగ్ విభాగాల అధికారులు పాల్గొన్నారు. శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి.. మహిళలు వ్యాపార సృజనాత్మకత, నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామికతపై అవగాహన కల్పించడంతో పాటు, వ్యాపార విస్తరణకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశపు హాల్లో ర్యాంప్, డీఆర్డీఓ, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాపార నైపుణ్య అవగహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ బాలకృష్ణ, పరిశ్రమల శాఖ జీఎం సిద్ధార్థ, వీహబ్ డైరెక్టర్ జావిద్ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
నిర్మాణ పనుల తనిఖీ
భూపాలపల్లి అర్బన్: మున్సిపాలిటీ పరిధిలోని పలు నిర్మాణ పనులను మున్సిపల్ స్పెషల్ అధికారిణి, ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి బుధవారం పరిశీలించారు. సుభాష్కాలనీలో నిర్మిస్తున్న మినీ స్టేడియం, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్, ప్రధాన రహదారిపై వాటర్ లీకేజీ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారి సునీల్కుమార్, అసిస్టెంట్ ఇంజనీర్ మానస, సిబ్బంది పాల్గొన్నారు. భూపాలపల్లి అర్బన్: సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో సింగరేణి ఉద్యోగ కుటుంబ స భ్యులు, ప్రభావిత గ్రామాల ప్రజలకు వృత్తి వి ద్యా కోర్సులపై శిక్షణ ఇవ్వనున్నట్లు ఏరియా అధికార ప్రతినిధి మారుతి ప్రకటనలో పేర్కొన్నారు. కంప్యూటర్ (డీటీపీ), మగ్గం వర్క్, స్పోకెన్ ఇంగ్లిష్, ఫొటో షాప్, జ్యూట్ బ్యాగ్ తయారీ, టైలరింగ్ కోర్సులపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన మహిళలు ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 29వ తేదీలో జీఎం కార్యాలయంలో పర్సునల్ విభాగంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎస్సెస్సీ మెమో, ఆధార్కార్డు, ఉద్యోగి ఐడీ కార్డు, పాస్ ఫొటోలు, కుల ధ్రువీకరణ పత్రాలు రెండు సెట్లు అందించాలన్నారు. కాళేశ్వరం: ప్రతీఒక్కరు రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలను వినియోగించుకోవాలని టీం లీడర్ అనిల్ అన్నారు. బుధవారం మహదేవపూర్ మండల కేంద్రంలోని సీహెచ్సీని ఆరోగ్య శ్రీ జిల్లా కోఆర్డినేటర్, డాక్టర్ నిఖిల్ స్వరూప్, మేనేజర్ విక్రమ్ ఆదేశాల మేరకు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డయాలసిస్ సెంటర్ను ఆస్పత్రి సూపరింటెండెంట్ విద్యావతితో కలిసి చూశారు. రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే పలు రికార్డులను పరిశీలించారు. చికిత్స అందించడంలో సమస్యలు ఉంటే తెలపాలని రోగులను కోరారు. ఆయన వెంట ఆరోగ్యమిత్రలు సంతోష్, రాము తదితరులు ఉన్నారు. భూపాలపల్లి రూరల్: నేడు భూపాలపల్లి బస్టాండ్ రోడ్ నుంచి 5 ఇంకై ్లన్ మధ్యలో 33 కేవీ లైన్ పనులు చేస్తున్నందున ఉదయం 8 నుంచి 10 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏఈ విశ్వాస్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణంలోని రెడ్డికాలనీ, రాంనగర్, సుభాష్ కాలనీ, ఎల్బీనగర్, లక్ష్మినగర్, బానోతు వీధి, బస్టాండ్ నుంచి ఓసి–2 రోడ్, పాత జంగేడు రోడ్ పరిధిలో విద్యుత్ అంతరాయం ఉంటుందని, విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు. భూపాలపల్లి అర్బన్: జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్హెచ్ఆర్సీ) జిల్లా అధ్యక్షుడిగా తాటికంటి రవికుమార్ను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట రాజయ్యలు తెలిపారు. జిల్లా కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన జిల్లా కమిటీ సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా సంగెం రాజేందర్, నాంపల్లి వీరేశం, ప్రధాన కార్యదర్శిగా వేల్పుల మహేందర్, సంయుక్త కార్యదర్శిగా మేరుగు సురేష్, ప్రచార కార్యదర్శిగా ముక్తేశ్వర్, అధికార ప్రతినిధిగా జోగుల సంపత్, పట్టణ అధ్యక్షుడిగా ఇప్పకాయల రాధాకృష్ణ, రాష్ట్ర ఈసీ మెంబర్గా దుండ్ర కుమార్యాదవ్లను నియమించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికై న జిల్లా అధ్యక్షుడు రవికుమార్ను రాష్ట్ర నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాకేష్, అశోక్, కిరణ్, గట్టయ్య, చారి తదితరులు పాల్గొన్నారు. -
ఏజెన్సీ విద్యపై దృష్టి సారించాలని వినతి
వెంకటాపురం(కె): ఏజెన్సీ మండలాల్లో విద్యా వ్యవస్థపై అధికారులు దృష్టి సారించాలని కోరుతూ బు ధవారం ఆదివాసీ నవ నిర్మాణ సేన ఆధ్వర్యంలో జి ల్లా విద్యాశాఖ అధికారి సిద్దార్ధరెడ్డికి వినతి ప్రతం అందజేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ నవ నిర్మాణ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు కోర్స నర్సింహమూర్తి మాట్లాడుతూ వెంకటాపురం, వాజేడు మండలాల్లో విద్యా వ్యవస్థ నిర్వీర్యం అవుతుందన్నారు. విద్యార్థులు వందల సంఖ్యలో ఉంటే ఉపాధ్యాయులు మాత్రం ఒక్కరే ఉంటున్నారని తెలిపారు. విద్యాహక్కు చట్టం ప్రకారం 11 మంది విద్యార్ధులకు ఒ క్క ఉపాధ్యాయుడు ఉండాల్సి ఉండగా 30 శాతం ఏకోపాధ్యాయ పాఠశాలలే ఉన్నాయని తెలిపారు. ఏకోపాధ్యాయ పాఠశాలలు కేవలం కేర్ టేకింగ్ స్కూల్స్గానే నడుస్తున్నాయని తెలిపారు. విద్యాబోదన సరిగా ఉండడం లేదన్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాయం అజయ్, ఉయిక మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తమ ఫలితాలు సాధించాలి
గణపురం: విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. బుధవారం గణపురం మండలంలోని గాంధీనగర్ జ్యోతి బా పూలే బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థుల హాజరు, పాఠ్యంశాలపై అవగాహన, భోజన సౌకర్యాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యాభోదనతో పాటు పలు వసతులను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సౌకర్యాలను మరింత మెరుగు పరిచేందుకు ప్రహరీ గోడ నిర్మాణం, డ్యూయల్ డెస్క్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్ధులకు మెరుగైన విద్యను అందించి వారి భవిష్యత్కు పునాదులు వేయాలన్నారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి కుమారస్వామి, తహసీల్ధార్ సత్యనారాయణ స్వామి, ఎంపీడీఓ భాస్కర్, ఎస్ఓ స్వప్నారెడ్డి , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
గని ఆవరణల్లోకి అనుమతించొద్దు
భూపాలపల్లి అర్బన్: సీఐటీయూ తలపెట్టిన బ్యాలెట్ ఓటింగ్కు గని ఆవరణల్లోకి అనుమతి లేదని.. ఎవరినీ రానివ్వవద్దని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి తెలిపారు. ఏరియా టార్గెట్ కమిటీ సమావేశం నిర్వహించారు. జీఎం మంగళవారం తన కార్యాలయంలో అన్ని గనుల మేనేజర్, సంక్షేమ అధికారులతో సమావేశం నిర్వహించారు. అన్ని బొగ్గు గనుల బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకతలను అడిగి తెలుసుకున్నారు. గనుల్లో ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్మిక సంఘం తలపెట్టిన పోల్ను గనుల లోపలకి ఎవరినీ అనుతించవద్దని అధికారులకు సూచించారు. -
నూరు శాతం హాజరు ఉండాలి
భూపాలపల్లి అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల యూ–డైస్ నమోదు, విద్యార్థులు, సిబ్బంది ముఖ గుర్తింపు హాజరు నమోదు నూరు శాతం అమలు కావాలని కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో విద్యార్థుల వివరాలు యూ–డైస్లో నమోదు, ముఖ గుర్తింపు ద్వారా విద్యార్థులు, సిబ్బంది హాజరు నమోదు, అడ్మిషన్ల పురోగతి, ఉత్తమ ఫలితాల సాధన, సౌకర్యాల కల్పన వంటి అంశాలపై డీఈఓ, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, సంక్షేమ అధికారులు, మోడల్ ఇంటర్ కళాశాలల ప్రత్యేక అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి హాజరు, ప్రతి ఉపాధ్యాయుడి సమయపాలన పారదర్శకంగా నమోదు చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన ముఖ గుర్తింపు నమోదును నూరు శాతం పూర్తి చేయాలని స్పష్టంచేశారు. ముఖ గుర్తింపు ప్రక్రియతో విద్యార్థుల, సిబ్బంది హాజరు నమోదులో పారదర్శకత ఉంటుందన్నారు. ఇంటర్లో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత, నూరు శాతం ఫలితాలు సాధించాలని చెప్పారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కల్పనలో భాగంగా లెక్చరర్లు ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధనకు కృషి చేయాలన్నారు. జిల్లాలో మొత్తం 34 జూనియర్ కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో 1,644 మంది, ఇంటర్ రెండో సంవత్సరంలో 1,566 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకన్న, డీఈఓ రాజేందర్, అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, మోడల్ కళాశాలల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. గోదావరి పుష్కరాల విజయవంతానికి ప్రణాళిక గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు సమగ్ర ప్రణాళికను రూపొందించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాల్లో గోదావరి పుష్కరాల నిర్వహణకు శాఖల వారిగా చేయాల్సిన ఏర్పాట్లుపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2027 సంవత్సరంలో జరుగనున్న గోదావరి పుష్కరాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు తరలిరానున్నట్లు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా తాగునీరు, విద్యుత్, శానిటేషన్, వైద్య, రవాణా, భద్రత తదితర సౌకర్యాలను సమగ్రంగా కల్పించాల్సిన అవసరం ఉన్నందున రానున్న మూడు రోజుల్లో చేపట్టాల్సిన పనులపై అంచనా నివేదికలు అందచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అటవీశాఖ అధికారి నవీన్రెడ్డి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రజాకవి కాళోజీ సాహిత్యం ద్వారా సమాజ మార్పునకు కృషి చేసిన ప్రజాకవి కాళోజీ నారాయణరావును స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ పిలుపునిచ్చారు. మంగళవారం కాళోజీ జయంతి కార్యక్రమాన్ని కలెక్టరేట్లో నిర్వహించగా కలెక్టర్ రాహుల్శర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. కాళోజీ రచనలు ప్రజల్లో చైతన్యం నింపాయని, ఆయన జీవితం అందరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. తన కవిత్వం ద్వారా స్వరాష్ట్ర ఆకాంక్షను రగిలించి, తెలంగాణ ప్రజలను జాగృతం చేసిన మహాకవి కాళోజీ నారాయణరావు అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఉత్తమ ఫలితాలు సాధించాలి కలెక్టర్ రాహుల్శర్మ -
సాహితీ కళాభవన్ ఏర్పాటుకు కృషి
భూపాలపల్లి అర్బన్: సాహితీవేత్తల కోరిక మేరకు జిల్లాలో సాహితీ కళా భవన్ ఏర్పాటుకు కృషి చేస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. కాళోజీ జయంతిని పురస్కరించుకొని జయశంకర్ సారస్వతి సమితి ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలో తెలుగు భాషా దినోత్సవాన్ని గడ్డం లక్ష్మయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ హాజరై మాట్లాడారు. మరుగునపడుతున్న కలలను బతికిస్తున్న కవులు, రచయితలందరికీ తన సంపూర్ణ సహకారం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా సాహితీవేత్తలను ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మహాముత్తారం ఎంఈఓ రవీందర్రెడ్డి, జయశంకర్ సారస్వతి సమితి ప్రతినిధులు సంజీవరావు, నల్లగొండ సురేష్, రమేశ్ చంద్ర, భుజేంద్రచారి, పుల్లూరి నాగేశ్వర్, జ్యోతి, సునీల్, స్థానిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, కవులు, రచయితలు, భాషాభిమానులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధికి పాటుపడాలి
హన్మకొండ: ఉమ్మడి వరంగల్ జిల్లా పునర్నిర్మాణంలో వేగం పెంచాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ అన్నారు. ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధికి పాటుపడాలన్నారు. మంగళవారం హనుమకొండ అదాలత్ కూడలిలోని రాచకొండ ప్రవీణ్ నివాసంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఉమ్మడి రాష్ట్రంలో వలస పాలకుల వివక్షకు గురికాగా, స్వరాష్ట్రంలో కల్వకుంట్ల పాలకుల కుటుంబ ప్రయోజనాల కోసం వరంగల్ జిల్లాను ముక్కలు చెక్కలు చేసి తీవ్ర విధ్వంసం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తామని ప్రకటించిన మేరకు వరంగల్, హనుమకొండ జిల్లాలను ఒకే వరంగల్ జిల్లాగా ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా రూ.6,000ల కోట్ల అభివృద్ధి నిధులను సమకూర్చి అండర్గ్రౌండ్ డ్రెయినేజీ, మామునూరు ఎయిర్పోర్టు, ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు త్వరితగతిన అమలు చేయాలన్నారు. సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల వేదిక కోఆర్డినేటర్ సోమ రామమూర్తి, ఆయా సంఘాల నాయకులు రాచకొండ ప్రవీణ్, సోమిడి శ్రీనివాస్, చాపర్తి కుమార్ గాడ్గే, సోయం రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ కూరపాటి వెంకటనారాయణ -
కాళోజీ రచనలు సమాజానికి మార్గదర్శకం
భూపాలపల్లి అర్బన్: కాళోజీ రచనలలో ప్రజల బాధ, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రాసిన రచనలు సమాజానికి మార్గదర్శకంగా పనిచేస్తామని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి తెలిపారు. కాళోజీ నారాయణరావు జయంతి (తెలంగాణ భాషా దినోత్సవం) వేడుకలను జీఎం కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. కాళోజీ రచనలు వారి ఆవేదనలతో నిండిన కవి స్వరాల తెలంగాణ ప్రజల మనసుకు హత్తుకునేలా చేశాయన్నారు. కాళోజీ జీవితాన్ని ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఽధికారులు అధికారులు పోషమల్లు, మారుతి, రాజు, శ్రావణ్కుమార్, ప్రదీప్, నరేశ్, సిబ్బంది పాల్గొన్నారు. -
రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
ములుగు/వెంకటాపురం(ఎం)/గోవిందరావుపేట: ములుగు జిల్లా కేంద్రంలోని అంతర్గత రోడ్లు, గ్రామీణ ప్రాంత రోడ్లను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారి నుంచి మదనపల్లి వరకు రూ.4 కోట్లతో విస్తరించనున్న రహదారి, సెంట్రల్ లైటింగ్ పనులను కలెక్టర్ దివాకర, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్తో కలిసి సీతక్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడారు. దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయడమే కాకుండా రోడ్డు సౌకర్యం లేని గ్రామాలకు పూర్తి స్థాయిలో రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించిందన్నారు. జిల్లా కేంద్రం నుంచి గ్రామాలకు వెళ్లే రహదారులను విస్తరించనున్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టరేట్లో మహిళా శక్తి పథకం ద్వారా ఇద్దరు మహిళలకు రూ.10లక్షల విలువ చేసే మొబైల్ ఫిష్ ఔట్లేట్ వాహనాలను సీతక్క అందజేశారు. ర్యాంప్ ఉమెన్ ఆక్సెలేరేషన్ ప్రోగ్రాంపై అవగాహన సదస్సు నిర్వహించగా సీతక్క హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషన్ సంపత్, జిల్లా మత్స్యశాఖ అధికారి సల్మాన్రాజ్ పాల్గొన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క -
లోక్ అదాలత్లో కేసులను పరిష్కరించాలి
భూపాలపల్లి అర్బన్: ఈ నెల 13వ తేదీన నిర్వహించే జాతీయ లోక్ ఆదాలత్లో కేసులను పెద్దఎత్తున పరిష్కరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమేష్బాబు ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా పోలీస్ అధికారులతో జడ్జి సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. లోక్ అదాలత్లో పరిష్కారమయ్యే కేసులకు రాజీ కుదుర్చాలన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సివిల్ జడ్జిలు నాగరాజు, దిలీప్కుమార్, అఖిల, పోలీస్ అధికారులు, కోర్టు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. అధ్యాపకుల నిరసన భూపాలపల్లి అర్బన్: మైనారిటీ గురుకుల పాఠశాల, కళాశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ సిబ్బందికి వేతనాలు చెల్లించాలని కోరుతూ మంగళవారం పాఠశాల ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. మూడు నెలల నుంచి వేతనాలు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. రాబోయే దసరా పండుగను దృష్టిలో పెట్టుకొని వేతనాలు చెల్లించాలని ఉపాధ్యాయులు, సిబ్బంది కోరారు. ‘సీఐని సస్పెండ్ చేయాలి’ భూపాలపల్లి రూరల్: శాంతియుతంగా నిరసన చేపట్టిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేసిన భూపాలపల్లి సీఐ నరేష్కుమార్ను సస్పెండ్ చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జ్ మడిపల్లి శ్యాంబాబు మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు అంబాల చంద్రమౌళి డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లాకేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సీఐపై ఎస్సీ, ఎస్టీ అట్రా సిటి కేసు నమోదు చేయాలన్నారు. సీఐపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొల్లిబాబు మాదిగ, నోముల శ్రీనివాస్, తూటిచర్ల దుర్గయ్య, అంతడుపుల సురేష్ మాదిగ పాల్గొన్నారు. పూజారుల అభిప్రాయం మేరకే గద్దెల మార్పుఎస్ఎస్తాడ్వాయి: మేడారంలో పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలను పూజారుల అభిప్రాయాల మేరకే మార్పు చేస్తున్నట్లు పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, పూజారులు చందా రఘుపతి, కొక్కెర రమేష్, కాక సారయ్య, కాక వెంకటేశ్వర్లు, దబ్బగట్ల గోవర్ధన్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమ్మక్క– సారలమ్మల గద్దెలతో పాటు గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను భక్తులు దర్శించుకునే సమయంలో ఎదురుపడి ఇబ్బందులకు గురవుతున్నారని వివరించారు. జంపన్నవాగు నుంచి వచ్చే భక్తులు టీటీడీ కల్యాణ మండపం వెనుకాల క్యూలైన్, ఆర్టీసీ బస్టాండ్ క్యూలైన్ ద్వారా వచ్చే భక్తులు మీడియా పాయింట్ సమీపంలోని ఎంట్రెన్స్ ద్వారం నుంచి ఒక్కసారిగా భక్తులు గద్దెల ప్రాంగణంలోకి రావడంతో తొక్కిసలాట జరిగి ఇబ్బంది పడుతున్నారని వెల్లడించారు. భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రెండు గద్దెలను మార్పు చేయాలని ఆలోచన చేసినట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. గోవిందరాజు, పగిడిద్దరాజుల మూలలను ముట్టుకోకుండా గద్దెల స్థానం మార్పు అనేది పూర్తిగా పూజారుల అనుమతి, అంగీకారాలతోనే పున:ప్రతిష్ట ఆదివాసీ ఆచార, సంస్కృతి సంప్రదాయాల ప్రకారం సమ్మక్క– సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజుల పూజారులతో జరుగుతుందని వివరించారు. ఆదివాసీ కులసంఘాలు, ఆదివాసీ ఉద్యోగ సంఘాలు, ఆదివాసీయేతర కులసంఘాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా సహకరించాలని కోరారు. భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న మంచి కార్యక్రమాన్ని రాజకీయం చేయాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. రెడ్డిగూడెం, కన్నెపల్లి, ఊరట్టం, మేడారం గ్రామాల మధ్య సుమారుగా 52 ఎకరాల భూమిని 1995లో దేవస్థానానికి ఈనాం భూమిగా ప్రకటించి ఇచ్చారని తెలిపారు. భూమిని ఆక్రమించుకుని వ్యవసాయం చేసుకుంటూ పంట నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. -
సేవలు అందట్లే..
మూడేళ్లుగా భర్తీకాని టీచర్, ఆయా పోస్టులుజిల్లాలో కేంద్రాలు, పోస్టులు, ఖాళీల వివరాలుప్రాజెక్టులు 02అంగన్వాడీ కేంద్రాలు 644టీచర్లు 604ఖాళీలు 40ఆయాలు 524ఖాళీలు 120గర్భిణులు 2,591 మంది బాలింతలు 16,9633 సంవత్సరాలలోపు పిల్లలు 11,9733నుంచి 5లోపు పిల్లలు 9,691భూపాలపల్లి రూరల్: జిల్లాలో మూడేళ్లుగా అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులను భర్తీ చేయకపోవడంతో గర్భిణులు, పిల్లలు, బాలింతలకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. ఇన్చార్జ్లతో కార్యకలాపాలు నిర్వహిస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు ప్రాజెక్టులు.. జిల్లాలో భూపాలపల్లి, మహదేవపూర్ అంగన్వాడీ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 644 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. 40 టీచర్, 120 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మూడేళ్లుగా ఖాళీలు భర్తీ చేయడం లేదు. పదవీ విరమణ పొందిన వారితో పాటు విధుల్లో మరణించిన వారితో ఖాళీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్న కేంద్రాల నిర్వహణ బాధ్యతను పక్క కేంద్రాల టీచర్లకు అప్పగించడంతో వారిపై అదనపు పనిభారం పడుతోంది. దీంతో కేంద్రాలు సమస్యలకు నిలయాలుగా మారాయి. టీచర్లు, హెల్పర్లది కీలక పాత్ర... అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు క్షేత్రస్థాయిలో కీలకపాత్ర పోషిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహా రం అందించడంతో పాటు పలు రకాల సేవలు అందిస్తున్నారు. వైద్యారోగ్య శాఖ కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. బూత్ లెవెల్ అధికారులుగా ఎన్నికల విధుల్లో సేవలు అందిస్తున్నారు. ఖాళీలు భర్తీ అయితే పనిభారం తగ్గడంతోపాటు, కేంద్రాల్లో మెరుగైన సేవలు అందే అవకాశం ఉంటుంది. అంగన్వాడీల్లో ఇన్చార్జ్లతో కార్యకలాపాలు ఇబ్బందులు పడుతున్న గర్భిణులు, పిల్లలు, బాలింతలుప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్ణయం అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు, ఆయాల ఖాళీలపై ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం ఖాళీలు ఉన్న కేంద్రాల్లో ఇన్చార్జ్లను నియమించాం. ఎప్పటికప్పుడు సీడీపీఓలు, సూపర్వైజర్లు కేంద్రాలను పర్యవేక్షిస్తున్నారు. ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. – మల్లీశ్వరి, ఇన్చార్జ్ జిల్లా సంక్షేమాధికారి -
వేధింపులకు భయపడొద్దు
భూపాలపల్లి అర్బన్: లైంగిక వేధింపులకు గురైనప్పుడు మౌనం వహించాల్సిన అవసరం లేదని భూపాలపల్లి అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల తెలిపారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ, జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళల రక్షణ, లైంగిక వేధింపుల నివారణ చట్టాలపై సోమవారం స్థానిక సంఘమిత్ర డిగ్రీ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్జి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పురుషులతో సమానంగా మహిళలకు కూడా చట్టాలు ఉన్నాయని తెలిపారు. ఎవరికై నా ఆపద సంభవిస్తే జిల్లా న్యాయసేవాధికార సంస్థను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ అధికారి మల్లీశ్వరి, మహిళా సాధికారత కోఆర్డినేటర్ అనూష, చైల్డ్ హెల్ప్లైన్ కోఆర్డినేటర్ తిరుపతి, సఖి అడ్మినిస్ట్రేటర్ గాయత్రి, సిబ్బంది మమతా, సురేష్, కృష్ణ పాల్గొన్నారు.అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల -
మొదటి ప్రశంస కాళోజీదే
‘ప్రజాకవి కాళోజీ నారాయణరావుతో పరిచయం ఉంది. మొదటి సారి 1990 హనుమకొండలో బ్యాంకు ఉద్యోగిగా పనిచేస్తున్న సమయంలో కాళోజీ నారాయణరావు ఇంట్లో మిత్రమండలి సమావేశం జరిగింది. ఆ సమావేశానికి వెళ్లిన నేను మొదటిసారి ఆయనను ప్రత్యక్షంగా చూశా. అప్పటికే ప్రజాకవిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా గొప్ప పేరుంది. ఆయన ముందు ధైర్యం చేసి నేను రాసిన ఒక కవితను చదివాను. దానికి కాళోజీ నన్ను అభినందించడం ఇప్పటికీ గుర్తు ఉంది.’ అని అన్నారు తెలుగు కవయిత్రి, కార్టూనిస్టు నెల్లుట్ల రమాదేవి. ఆమెను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక కాళోజీ సాహితీ పురస్కారం–2025కు ఎంపిక చేసిన నేపథ్యంలో నేడు (మంగళవారం) కాళోజీ జయంతి సందర్భంగా సోమవారం ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఉద్యోగం చేస్తూనే ఆమె చేసిన రచనలు, రాసిన కథలు.. గీసిన కార్టూన్లు, కాళోజీతో ఉన్న అనుబంధాన్ని వివరించారు. వివరాలు ఆమె మాటల్లోనే.. – సాక్షిప్రతినిధి, వరంగల్/స్టేషన్ఘన్పూర్ విద్యార్థి దశనుంచే రచనలు.. అమ్మ ప్రోత్సాహం, భర్త సహకారం.. 1980లో తొమ్మిదో తరగతిలో స్నేహ అనే నాటిక రాశాను. అనంతరం మొదటగా బుజ్జాయి అనే పిల్లల పత్రికలో నేను రాసిన కథను ప్రచురించారు. ఈ తరం అమ్మాయి అనే కథను ఒక మహిళా మ్యాగ్జిన్కు వాడుకున్నారు. నా చిన్నప్పటినుంచే మా అమ్మ శకుంతలాదేవి కథల పుస్తకాలు బాగా చదివేది. మాకు కథలు చెప్పేది. అలా కథల పుస్తకాలు చదువుతూ నేను కూడా కథలు రాయాలనుకున్నా. నన్ను మొదటి ప్రోత్సాహించింది మా అమ్మనే. అదేవిధంగా 1983లో వివాహం జరిగింది. భర్త దేవేందర్ జిల్లా కోఆపరేటిట్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్గా పనిచేసేవారు. ఆయన నన్ను బాగా ప్రోత్సహించేవారు. కథలు, రచనలకు, కార్టూన్లకు తన అభిప్రాయాలు, సూచనలు చేసేవారు. అయితే దురదృష్టవశాత్తు 2009లో ఆయన హఠాన్మరణం చెందడం బాధాకరం. కాళోజీని చాలాసార్లు కలిసి మాట్లాడాను.. నాతో కలిసి హనుమకొండలో బ్యాంకులో పనిచేసే రవికుమార్ కాళోజీ కుమారుడని తర్వాత తెలిసింది. రవికుమార్ పద్యాలు రాసేవారు. ఇద్దరం కవితలు, పద్యాలు ఒకరికొకరం చెప్పుకునేవాళ్లం. అతడితో కలిసి కాళోజీ ఇంటికి వెళ్లి ఆ మహానుభావుడితో చాలాసార్లు మాట్లాడాను. కాళోజీకి నేను రాసిన కథలు, రచనలు చూపించి సంతోష పడ్డాను. అనంతరం రెండు, మూడు సమావేశాల్లో కలుసుకున్నాం. కాళోజీ రచనలు చాలా చదివాను. ఆయన రచనలు సరళంగా, వ్యంగ్యంగా ఉంటాయి. సమాజాన్ని సూటిగా ప్రశ్నించే ఆయన రచనలు అంటే చాలా ఇష్టం. ఆయన ధిక్కార స్వరం.. సమాజానికి దిక్సూచి.. ఒక మనిషి, కవి, రచయిత ఎలా ఉండాలని సమాజానికి దిశానిర్దేశం చేయడమే కాకుండా స్వయంగా పాటించిన గొప్పవ్యక్తి కాళోజీ. ఆయన రాసిన పలుకుబడుల భాష–బడిపలుకుల భాషతోపాటు పలు రచనలు చదివాను. ధిక్కార స్వరం అయిన కాళోజీ తెలంగాణకే కాదు మొత్తం సమాజానికి దిక్సూచి. ఆయన ఏదైనా పద్యం చెపితే వాస్తవికంగా, సరళంగా ఉండేది. రచనలు, మాటలు సూటిగా, చురుకుమనిపించేలా ఉంటాయి. ఆయన పోయట్రీ తెలంగాణకు దిశానిర్దేశం. తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛగా, సంతోషంగా ఉంటున్నామంటే ఆరోజుల్లోనే తెలంగాణ గురించి మాట్లాడి, కొట్లాడిన వ్యక్తి కాళోజీ ఒకధీరోధత్తుడు. సీరియస్, హాస్యం.. రెండు ఉంటాయి.. కాళోజీ మంచి జోకులు వేసేవారు. ఒక సమావేశంలో ఆయనను కలిసినప్పుడు బ్యాంకు క్యాషియర్నైన నన్ను కేవలం పైసలు లెక్కపెడ్తున్నావా? రచనలు చేస్తున్నావా? అంటూ హాస్యంగా మాట్లాడారు. రచయితలు రచనలు చేయాలని, సమాజానికి దిశానిర్దేశం చేసేలా, ప్రజలను చైతన్యం చేసేలా రచనలు ఉండాలని చెప్పేవారు. కాళోజీ పురస్కారం... మొదటి మహిళగా సంతోషంగా ఉంది.. గత పదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న కాళోజీ సాహితీ పురస్కారానికి ఈ ఏడాది మొదటి మహిళగా నేను ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. 2015లో అమ్మంగి వేణుగోపాల్ ఈ అవార్డుకు ఎంపిక కాగా, అనంతరం గోరటి వెంకన్న తదితర ప్రముఖులు అందుకున్నారు. గత ఏడాది నలిమెల భాస్కర్కు ఈ అవార్డు అందించారు. 11వ వ్యక్తిగా మొదటి మహిళగా, కాళోజీ పుట్టిన ఓరుగల్లు బిడ్డగా ఎంపిక కావడం ఆనందంగా ఉంది. నేను రాసి, చదివిన కవిత బాగుందని మెచ్చుకోవడం మరిచిపోలేని గుర్తు ఆయన పేరిట సాహితీ పురస్కారానికి ఎంపికై నందుకు సంతోషంగా ఉంది.. అమ్మ ప్రోత్సాహంతో రచనలు.. భర్త సహకారం కొనసాగించేలా చేశాయి.. ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో కాళోజీ సాహితీ పురస్కార–2025 గ్రహిత నెల్లుట్ల రమాదేవిబహుముఖ ప్రజ్ఞాశాలి.. రమాదేవి నెల్లుట్ల రమాదేవి... తెలుగు కవయిత్రి, కథకురాలు, ఉపన్యాసకురాలు, కార్టూనిస్టు. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ రైతు కుటుంబానికి చెందిన రాంచందర్రావు, శకుంతలా దేవి దంపతులకు జన్మించారు. 1983లో దేవేందర్ను వివాహమాడిన ఆమె 1984లో గ్రామీణ బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి ఆంధ్రాబ్యాంకు సీనియర్ మేనేజర్గా పదవీ విరమణ చేశారు. కవి, రచయిత్రి, కార్టూనిస్టుగా రాణించిన రమాదేవి మొదటి కార్టూన్ 1978లో స్వాతిలో అచ్చయ్యింది. ఆ తర్వాత అనేక కథలు, కథానికలు ఆమెకు మంచి గుర్తింపు తేగా.. 2013 సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం నుంచి కీర్తిపురస్కారం అందుకున్నారు. కథలు, కవిత్వమే కాకుండా కార్టూన్లు వేసి బహుముఖ ప్రజ్ఞాశాలిగా రమణీయమైన కావ్యాలు, మనసుకు హత్తుకునే భాషతో అందరినీ ఆకట్టుకున్న రమాదేవి కాళోజీ సాహితి పురస్కారం –2025కు ఎంపికయ్యారు. -
అదనంగా 16 విక్రయ కేంద్రాలు
భూపాలపల్లి: రైతులకు ఎరువుల విక్రయాల్లో రద్దీ తగ్గించి సౌకర్యవంతమైన విధంగా పంపిణీ చేయడానికి అదనంగా 16 ఎరువుల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఐడీఓసీ కార్యాలయంలో వ్యవసాయ, సహకార శాఖల ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనంగా ఏర్పాటు చేయనున్న ఎరువుల విక్రయ కేంద్రాలకు ఈ–పాస్ యంత్రాలను పంపిణీ చేశారు. రైతులకు సరిపడా ఎరువులను సకాలంలో అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి వాల్యానాయక్, డీఏఓ బాబురావు, సిబ్బంది పాల్గొన్నారు. అప్రమత్తంగా ఉండాలి.. వాతావరణ శాఖ సూచన మేరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ఉన్న దృష్ట్యా ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అత్యవసర సేవలకు ప్రజలు కంట్రోల్ రూం 90306 32608 నంబరుకు కాల్ చేయాలని తెలిపారు. గ్రామస్థాయిలో విజయవంతం చేయాలి.. ఆది కర్మయోగి అభియాన్ మిషన్ను గ్రామస్థాయిలో మూవ్మెంట్ చేసి అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఐడీఓసీ కార్యాలయంలో ఆది కర్మయోగి అభియాన్ మిషన్పై వివిధ శాఖల జిల్లా అధికారులతో డిస్ట్రిక్ ప్రాసెస్ ల్యాబ్ అవగాహన సమావేశం నిర్వహించారు. కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఎంహెచ్ఓ డాక్టర్ మధుసూదన్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి.. ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు నుంచి సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్ రాహుల్ శర్మ మహిళలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు చేపట్టిన స్వస్థ నారి–సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమాల నిర్వహణకు షెడ్యూల్ తయారు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఐడీఓసీ కార్యాలయ సమావేశపు హాల్లో పథకం నిర్వహణపై వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, డీఎంహెచ్ఓ డాక్టర్ మధుసూదన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
దరఖాస్తులను పెండింగ్లో ఉంచొద్దు
● ఎస్పీ కిరణ్ ఖరే భూపాలపల్లి: ప్రజావాణిలో ప్రజలు అందజేసిన ఫిర్యాదులను పెండింగ్లో ఉంచకుండా తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎస్పీ కిరణ్ ఖరే జిల్లాలోని పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి 15 మంది నుంచి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడటమే పోలీసుశాఖ ధ్యేయమన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చడంలో పోలీసు విభాగం ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు. మంగపేట: కొత్తగా పోడు చేసినా, గుడిసెలు వేసిన చర్యలు తప్పవని డిప్యూటీ రేంజ్ అధికారి కోటేశ్వర్ హెచ్చరించారు. సోమవారం మంగపేట సమీపంలోని సండ్రోనిఒర్రె అటవీ ప్రాంతంలోని శాంతినగర్ గొత్తికోయ గూడెంలో గిరిజనులకు ఎస్సై టీవీఆర్ సూరీ ఆధ్వర్యంలో సీపీఎం, ఆదివాసీ గిరిజన సంఘం నాయకుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈనెల 4న పోడు భూముల్లో నూతనంగా గుడిసెలు వేస్తుండగా అటవీశాఖ అధికారులు దాడులు నిర్వహించి అడ్డుకుని కూల్చివేసిన విష యం తెలిసిందే. అటవీశాఖ చట్టాలు, విధివిధా నాలపై గొత్తికోయ గిరిజనులకు అవగాహన కల్పించారు. -
సొంతింటి పథకంపై క్యాంపెయిన్
భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికులకు సొంతింటి పథకం అమలు చేయాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో బ్యాలెట్ ఓటింగ్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్ కోరారు. సోమవారం ఏరియాలోని కేటీకే 1వ గనిలో గేట్ మీటింగ్ నిర్వహించారు. అనంతరం స్థానిక యూనియన్ కార్యాలయంలో వాల్పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సొంతింటి కల నెరవేర్చాలని ఈ నెల 11, 12వ తేదీల్లో బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్మికుల సమస్యలపై 15వ తేదీన జీఎం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. కార్మికులు సంఘాలకతీతంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ మనుగడను ప్రశ్నార్థకం చేస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సింగరేణి ప్రతి ఏడాది డివిడెంట్ల రూపంలో వేల కోట్ల రూపాయలు కార్మికుల సొమ్మును చెల్లిస్తుందన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపించారు. లాభాల వాటా 35శాతం ఇవ్వాలని, ప్రతి కార్మికుడికి 250 గజాల ఇంటి స్థలం, రూ.25లక్షలు వడ్డీ లేని రుణం చెల్లించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు సింగరేణి ఆస్తులను అనేక రకాలుగా వాడుకుంటున్నారని, ఆక్రమించుకుంటున్నారని ఆరోపించారు. సింగరేణిలో అవినీతిని నిర్మూలించి పారదర్శకతను పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కంపేటి రాజయ్య, రమేష్, రజాక్ పాల్గొన్నారు. -
తెల్లవారుజామున 5 గంటలకే..
చిట్యాల మండలకేంద్రంలోని ఓడీసీఎంఎస్ విక్రయ కేంద్రం ఎదుట సోమవారం తెల్లవారుజామున ఐదు గంటల నుంచే రైతులు యూరి యా కోసం బారులుదీరారు. కేంద్రానికి ఆదివారం 222 బస్తాల యూరియా వచ్చింది. విషయం తెలుసుకున్న రైతులు సోమవారం వందలాది మంది ఒక్కసారిగా కేంద్రానికి రావడంతో పాటు చెప్పులను తెల్లవారుజామునుంచే లైన్లలో పెట్టారు. రైతులకు ఒక బస్తా యూరియా మాత్రమే ఇవ్వడంతో ఆవేదన వ్యక్తంచేశారు. పూర్తిస్థాయిలో యూరియా అందించడంలో అధి కారులు, పాలకులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికై నా సరిపడా యూరియా అందించాలని కోరుతున్నారు. – చిట్యాలయూరియా కోసం బారులుదీరిన రైతులు -
భక్తుల భద్రతకు చర్యలేవి?
ఎస్ఎస్తాడ్వాయి: ఇటీవల జోరుగా వర్షాలు కురవడంతో మేడారం జంపన్నవాగులో వరద ప్రవాహం కొనసాగుతోంది. మొన్నటి వరకు ఇసుక దిబ్బలతో కనిపించగా నేడు నీటితో కళకళలాడుతోంది. దీంతో తొలుత స్నానఘట్టాలపై ఉన్న షవర్ కింద పుణ్యస్నానాలు ఆచరించే భక్తులు ప్రస్తుతం వాగులోనే స్నానాలు చేస్తున్నారు. వరద ఉధృతితో వాగులో భక్తులు ప్రమాదాల బారిన పడకుండా నివారణ చర్యలు తీసుకోవాలని మేడారం దేవాదాయశాఖ అధికారులు, జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా తమకేమీ పట్టనట్లుగా వ్యహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఆదివారం తాజాగా అమ్మవార్ల దర్శనానికి వచ్చిన జనగామకు చెందిన కనికంటి మనీష్ జంపన్నవాగులో స్నానం చేసేందుకు వెళ్లి గల్లంతై మృత్యువాత పడ్డాడు. ఇలాంటి ఘటనలు ప్రతిఏటా వర్షాకాలంలో చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదాల నివారణకు చర్యలు నిల్.. మేడారం వచ్చిన భక్తులు చాలా మంది జంపన్నవాగు నీటిలో పుణ్యస్నానాలు చేస్తేనే మంచిదని విశ్వసిస్తారు. వాగు వరద సమాంతరంగా వెళ్లడంతో స్నానాలకు వెళ్లిన భక్తులకు నీటి లోతు తెలియకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. గతంలో భక్తులు నీట మునిగి మృత్యువాత పడిన విషాద ఘటనలు ఉన్నాయి. హెచ్చరిక బోర్డులతో నివారణ జంపన్నవాగులో నీటి ప్రవాహం, ప్రమాదభరితంగా ఉన్న స్థలాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం వల్ల ప్రమాదాలు నివారించవచ్చు. ప్రస్తుతం రెడ్డిగూడెం లోలెవల్ కాజ్వే వద్ద వరద ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. మేడారానికి వచ్చిన భక్తులు చాలా మంది ఈ–కాజ్వే వద్ద నీటి ప్రదేశంలో ఎక్కువగా స్నానాలు చేస్తుంటారు. కాజ్వే కింద వాగులో నీరు కూడా సమృద్ధిగా ఉండడంతో భక్తులు స్నానాలు చేస్తుంటారు. కానీ లోతు కూడా భారీగానే ఉంటుంది. ఈ–కాజ్వే ప్రాంతంలో గతంలో పదుల సంఖ్యలో భక్తులు నీటమునిగి మృత్యువాత పడిన ఘటనలు ఉన్నాయి. ఈ లోలెవల్ కాజ్వే వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డు తప్పనిసరిగా ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. అలాగే ఊరట్టం జంపన్నవాగు వద్ద కాజ్వే ధ్వంసమైన ప్రదేశంలో కూడా నీటి లభ్యత ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కూడా భక్తులు స్నానాలు చేస్తుంటారు. గత మూడేళ్ల క్రితం వర్షాకాలంలో ఇద్దరు భక్తులు ఒకేసారి నీటిలో మునిగి మృత్యువాత పడ్డారు. అలాగే జంపన్నవాగు వద్ద గజ ఈతగాళ్లను ఏర్పాటు చేస్తే పుణ్యస్నానాలు చేసే భక్తులకు సూచనలు చేయడంతో పాటు ప్రమాదవశాత్తు నీటమునిగిన భక్తులను కాపాడే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. జంపన్నవాగులో ప్రవహిస్తున్న వరద హెచ్చరిక బోర్డులు కరువు పట్టించుకోని అధికారులు -
ఆలయాల అభివృద్ధికి కృషి
రేగొండ: ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద రూ.10 లక్షలతో నిర్మించిన కోటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ స్వాగత తోరణాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయాల అభివృద్ధికి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. భక్తుల సౌకర్యార్థం కోటంచలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. భక్తుల సహాయంతో ఆలయాన్ని మరింత వైభవంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ మహేష్, చైర్మన్ భిక్షపతి, మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టయ్య, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్వరరావు, నాయకులు సంపత్రావు, పున్నం రవి, పట్టెం శంకర్, సాంబయ్య, రవీందర్ రెడ్డి, వీరబ్రహ్మం, ప్రమదాదేవి పాల్గొన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు -
వరి సాగు సూపర్
భూపాలపల్లి: సకాలంలో వర్షాలు కురవకపోయినప్పటికీ జూలై చివరి వారం, ఆగస్టులో కురిసిన వర్షాలకు జిల్లాలో వరిపంట జోరుగా సాగుతోంది. జిల్లావ్యాప్తంగా సాగు ఒకేసారి మొదలవడంతో కూలీల కొరత ఏర్పడింది. దీంతో చాలామంది రైతులు ఈ సారి వెదజల్లే పద్ధతిలో వరినాట్లు వేశారు. అయినప్పటికీ పంట ఏపుగా పెరగడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మందకొడిగా ప్రారంభమై.. ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో వర్షాలు సమృద్ధిగా పడలేదు. బోర్లు, బావులు ఉన్న రైతులు సకాలంలో వరిసాగు ప్రారంభించినప్పటికీ వర్షాభావం, జలాశయాల మీద ఆధారపడే వారు సకాలంలో వరినాట్లు వేయలేదు. జూలై చివరి వారం, ఆగస్టులో కురిసిన వర్షాలకు చెరువులు నిండి, వాగులు, వంకలు ఉప్పొంగాయి. దీంతో రైతులంతా ఒక్కసారిగా వరిపంట సాగు చేశారు. గతేడాది సుమారు లక్ష ఎకరాల్లో వరిసాగు జరుగగా, ఈ ఏడాది ఏకంగా 1,13,121 ఎకరాల్లో రైతులు వరిసాగు చేశారు. ఇటీవల కురిసిన వర్షాలు వరిపంటలకు అనుకూలంగా మారాయి. యూరియా కొరత కొంతమేరకు ఉన్నప్పటికీ ప్రస్తుతం వరిపంట ఏపుగా పెరిగింది. భారీ వర్షాలు, వరదలు రాకుంటే ఈ ఏడాది అంచనాకు మించి దిగుబడి అయ్యే అవకాశం ఉంది. అకాల వర్షాల కారణంగా పత్తి, మిర్చి పంటలకు ఇప్పుడిప్పుడే తెగుళ్లు ఆశించి అనుకున్న మేరకు దిగుబడి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. వరిపంట మాత్రం ఏపుగా పెరగడం, ఎటువంటి ఇబ్బందులు లేకపోవడంతో అన్నదాతల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పత్తి, మిర్చి పంటల్లో వచ్చే నష్టాలను వరితో అధిగమించవచ్చని రైతులు భావిస్తున్నారు. వర్షాలు సకాలంలో కురవకపోవడం, ఒకేసారి రైతులంతా నాట్లు వేయాల్సిన పరిస్థితి రావడంతో జిల్లాలో కూలీల కొరత ఏర్పడింది. దీంతో కాటారం డివిజన్లోని కాటారం, మహదేవపూర్, పలిమెల మండలాలకు చెందిన రైతులు గతంలో పక్కనున్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన కూలీలను పిలిపించుకొని వరినాట్లు వేయించేవారు. ఈసారి అక్కడి నుంచి సైతం కూలీలు రాలేదు. రోజువారి కూలి పెరగడం, కొరత కారణంగా కాటారం డివిజన్, భూపాలపల్లి నియోజకవర్గంలోని వందలాది మంది రైతులు వెదజల్లే పద్ధతిలో వరిసాగు చేశారు. తట్టు సంచిలో వడ్లను రెండు రోజుల పాటు నానబెట్టి చిన్నగా మొలకెత్తాక పంట పొలాల్లో వెదజల్లారు. ఈ పద్ధతిలో సైతం వరిపైరు ఏపుగా పెరిగింది. దీంతో వచ్చే ఏడాది ఇదే తరహాలో మరింత సాగు పెరిగే అవకాశం ఉంది. ఇటీవల కురిసిన వర్షాలు నది, వాగుల పరీవాహక ప్రాంతాల్లో వరిసాగు చేసిన రైతులను తీవ్రంగా దెబ్బతిశాయి. భూపాలపల్లి నియోజకవర్గంలోని మోరంచవాగు, చలివాగు, కాటారం డివిజన్లోని గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు వరిపంటలు పూర్తిగా నీట మునిగాయి. వరదల మూలంగా పంట పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. మరికొన్ని పొలాలు నీట మునిగి దిగుబడిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో ముంపు ప్రాంతాల్లోని రైతులు మాత్రం దిగుబడిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మండలం వెదజల్లే నాట్లు వేసే పద్ధతిలో సాగు పద్ధతిలో భూపాలపల్లి 563 11,358 గణపురం 200 10,000 రేగొండ 225 7,325 కొత్తపల్లిగోరి 30 5,640 చిట్యాల 110 6,100 టేకుమట్ల 120 7,700 మొగుళ్లపల్లి 80 8,770 మహదేవపూర్ 650 7,300 పలిమెల 450 2,500 కాటారం 3,000 9,500 మల్హర్ 5,500 10,500 మహాముత్తారం 3,000 12,500 మొత్తం 13,928 99,193 ఇటీవల కురిసిన వర్షాలు అనుకూలం కూలీల కొరతతో ఈసారి వెదజల్లే పద్ధతి సన్న రకాలవైపే రైతుల మొగ్గు వర్షాలు సకాలంలో కురవకపోయినప్పటికీ జూలై, ఆగస్టు మాసాల్లో కురిసిన వర్షాలు వరిపంటలకు అనుకూలంగా మారాయి. ఈ సారి జిల్లాలో అంచనా మేరకు వరిపంట సాగు జరుగుతోంది. దిగుబడి కూడా ఆశించిన స్థాయిలో వస్తుంది. వరిసాగులో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదు. – బాబురావు, ఇన్చార్జ్ జిల్లా వ్యవసాయశాఖాధికారి -
జిల్లాకు మధ్యప్రదేశ్ మద్యం
భూపాలపల్లి: మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మ ద్యం విక్రయాలు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. కొందరు వ్యక్తులు మద్యాన్ని తీసుకొచ్చి విక్రయాలు జరుపుతున్నారు. మన రాష్ట్రంలో కంటే తక్కువ ధరకు విక్రయిస్తుండటంతో మందుబాబులు, బెల్ట్షాపుల నిర్వాహకులు విచ్చలవిడిగా కొనుగోలు చేస్తున్నారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్(జీరో మద్యం) విక్రయాలు జరుపకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ కొందరు వ్యక్తులు అక్కడి నుంచి తీసుకొని వచ్చి గుట్టుచప్పుడు కాకుండా అమ్మకాలు చేస్తున్నారు. మద్యం ధరలు మధ్యప్రదేశ్లో కూడా దాదాపుగా ఇక్కడి మాదిరిగానే ఉన్నప్పటికీ తక్కువ ధరకు ఎలా విక్రయిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడి నుంచి మద్యం తీసుకొని వచ్చి లేబుల్లు తొలగించి, కల్తీచేసిన అనంతరం తక్కువ ధరకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. శనివారం భూపాలపల్లి ఎకై ్సజ్ అధికారులు ఒక వ్యక్తిని పట్టుకొని 20.25 లీటర్ల నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. కాగా అప్పటికే పెద్దమొత్తంలో మద్యం దిగుమతి, విక్రయాలు జరిగినట్లుగా తెలుస్తోంది. విచ్చలవిడిగా విక్రయాలు -
‘డబుల్’.. ఎన్నాళ్లీ ట్రబుల్!
సాక్షిప్రతినిధి, వరంగల్:● హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో 790 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో 520 ఇళ్లు నిర్మించారు. మర్రిపల్లిగూడెం, గూడూరులో 50 చొప్పున 100 ఇళ్లు, కమలాపూర్లో 320 నిర్మించారు. రోడ్లు, డ్రెయినేజీలు, విద్యుత్, వాటర్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో కొద్ది రోజులు కాలయాపన జరిగింది. ఇప్పటికీ లబ్ధిదారులను ఎంపిక చేసి పంపిణీ చేయకపోవడంతో ఇళ్లు నిరుపయోగంగానే ఉన్నాయి. ● మహబూబాబాద్ జిల్లాలో 5,567 ఇళ్ల నిర్మాణం చేపట్టగా.. 2024 వరకు 2,503 మాత్రమే పూర్తయ్యాయి. అందులో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి 1,256 మందికి పంపిణీ చేశారు. ఇంకా 3,064 ఇండ్లు వివిధ స్థాయిల్లో ఉండగా.. పూర్తయిన 2,503 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇంకా 1,247 లబ్ధిదారులకు అందజేయడంలో కాలయాపన జరుగుతోంది. .. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పథకానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మోక్షం కలగడం లేదు. నిర్మాణాలు పూర్తయినా ఇళ్లపంపిణీపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. ఫలితంగా మూడేళ్ల కిందట పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పంపిణీకి నోచుకోక శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. వివిధ స్థాయిల్లో నిలిచిపోయిన నిర్మాణాల్లో గడ్డి, ముళ్లపొదలు ఏర్పడ్డాయి. పంపిణీ చేసిన వాటిలో సరైన మౌలిక సదుపాయాలు లేక లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఇందిరమ్మ ఇళ్లు పథకంలో అవకాశం రాక అర్హులైన వారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అసంపూర్తి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని, పూర్తయిన వాటిని పంపిణీ చేయాలన్న డిమాండ్ వస్తుంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అవకాశం రాని పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరుతున్నారు. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల సొంతింటికలను సాకారం చేసే లక్ష్యంతో, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల పథకాన్ని అమలు చేసింది. ఉమ్మడి వరంగల్లో ఈ పథకం కింద రెండు విడతల్లో 26,284 ఇళ్లు మంజూరు చేసింది. ఇందులో అధికారులు చెబుతున్న ప్రకారం సుమారు రూ.860 కోట్ల వరకు ఖర్చు చేసి 10,939 (41.62 శాతం) ఇళ్లు పూర్తి చేశారు. అందులో నుంచి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి 4,874 (44.56 శాతం) రెండు పకడల గదుల ఇళ్లను పంపిణీ చేశారు. ఇదిలా ఉండగా మంజూరైన మొత్తం 26,284లలో 4100 వరకు వివిధ కారణాలతో నిర్మాణాలు మొదలు పెట్టలేదు. నిర్మాణాలు ప్రారంభించిన 22,184 ఇళ్లలో 10,939 పూర్తయ్యాయి. 11,245 ఇళ్లు వివిధ స్థాయిల్లో నిర్మాణ దశలోనే నిలిచిపోయాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల కొన్నేళ్ల క్రితం చేపట్టిన ఈ ఇళ్ల నిర్మాణాలు నేటికీ పూర్తి కాలేదు. పూర్తయిన 10,939 ఇళ్లలో 4,874 ఇళ్లు మాత్రమే పంపిణీ చేశారు. 6,065 ఇళ్ల మంజూరులో జాప్యం జరుగుతుండడంతో ఉండడానికి గూడులేక వేలాది మంది నిరుపేదలు ఏళ్లపాటు గుడిసెల్లో జీవిస్తూ పక్కా ఇళ్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.జిల్లా మంజూరు పూర్తి పంపిణీ హనుమకొండ 4,326 2,143 1,200 వరంగల్ 6,350 2,350 1,250 జేఎస్ భూపాలపల్లి 3,882 1,615 710 జనగామ 4,400 1,600 750 ములుగు 1,800 950 300 మంజూరైన ఇళ్లలో పూర్తయినవి 41.62 శాతమే పూర్తయిన ఇళ్లలో పంపిణీ చేసింది 44.56 శాతం చాలాచోట్ల శిథిలావస్థకు గృహాలు వివిధ స్థాయిల్లో నిలిచినవి 11,245.. ఆ నిర్మాణాలపై నీలినీడలు నెరవేరని పేదోళ్ల సొంతింటి కల.. శ్రీఇందిరమ్మశ్రీపై అర్హుల ఆశలు -
కాళేశ్వరంలో బాలకవి సమ్మేళనం
కాళేశ్వరం: తెలంగాణ భాషా దినోత్సవం (కాళోజీ జయంతి) పురస్కరించుకొని పీఎం శ్రీ కాళేశ్వరం పాఠశాలలో ఆదివారం ‘బాలకవి సమ్మేళనం’ నిర్వహించారు. కాళేశ్వరం, మహదేవపూర్ పాఠశాల బాల బాలికలు కవితా పఠనం కార్యక్రమం పాఠశాల ఇన్చార్జ్ హెచ్ఎం దొనికల రాజేందర్ అధ్యక్షతన జరిగింది. 20 మంది బాల కవులతో పాటు 20 మంది కాళేశ్వరం పాఖాల కవులు పాల్గొని తెలుగుభాష, తెలంగాణ నుడికారం, పలుకు బడుల సోయగం, కాళోజీ ఔన్నత్యాన్ని కవితలతో అక్షరాంజలి సమర్పించారు. బాల కవులు విద్య, అక్షయ, జ్యోతిక, తన్మయి, తరుణ, సంయుక్త ఉత్తమ ప్రదర్శనతో సభను రంజింపచేశారు. హెచ్ఎం రాజేందర్ మాట్లాడుతూ.. విద్యార్థులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో పాఠశాలలో వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్య అతిథి మాడుగుల భాస్కరశర్మ మాట్లాడుతూ కవి సమ్మేళనం గొప్ప కార్యక్రమన్నారు. సాహిత్య కార్యక్రమాలకు తమ సహకారం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాళేశ్వరానికి చెందిన కవులు మాడుగుల భాస్కరశర్మ, నారాయణమూర్తి, శ్రీనివాస శర్మ, రామగుండం రామ్మూర్తి, ఉపాధ్యాయులు మడక మధు, జ్యోతి, శ్రీధర్, శ్యామ్, బండారి రాజ్ కుమార్లతో పాటు తండా హరీశ్గౌడ్, రహీమొద్దీన్, గన్నోజు ప్రసాద్, చిట్ల ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు. -
రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలి
కాటారం: గ్రామపంచాయతీ రికార్డుల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి అన్నారు. కాటారం మండలం మద్దులపల్లి, కొత్తపల్లి గ్రామపంచాయతీలను శనివారం అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. అభివృద్ధి పనులు, నిధుల ఖర్చు, ఇతరత్రా రికార్డులను పరిశీలించారు. పారిశుద్ధ్య పనుల నిర్వహణపై ఆరా తీశారు. కొత్తపల్లి ఇందిరా మహిళాశక్తి ద్వారా నిర్వహిస్తున్న టిఫిన్ సెంటర్ను సందర్శించి ఆహార పదార్థాల నాణ్యత, అమ్మకాలను అడిగి తెలుసుకున్నారు. ఇందిరా మహిళా శక్తి మహిళల ఆర్థికాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం ఫ్లాంటేషన్ పనులు, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఫ్లాంటేషన్లో మొక్కల సంరక్షణకు తగు జాగ్రత్తలు చేపట్టాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని అంగన్వాడీ టీచర్లకు సూచించారు. అదనపు కలెక్టర్ వెంట ఎంపీడీఓ బాబు, ఎంపీఓ వీరస్వామి, రేంజర్ స్వాతి ఉన్నారు. అదనపు కలెక్టర్ విజయలక్ష్మి -
ఆదివారం శ్రీ 7 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
వివిధ భాషల్లో 5వేల పుస్తకాలు, వందలాది జర్నల్స్, పురాతన స్క్రిప్ట్లు.. ఒకేచోట కొలువై ఉన్న ప్రొఫెసర్ గజ్జెల రామేశ్వరం ఇంటర్నేషనల్ నేచురోపతి లైబ్రరీ అండ్ రీసెర్చ్ సెంటర్ ఇక.. అనేక మంది విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగపడనుంది. అరుదైన విజ్ఞాన సంపద ఉన్న ఈ ప్రకృతి గ్రంథాలయంతో ఇటీవల కాకతీయ యూనివర్సిటీ అవగాహన ఒప్పందం (ఎంఓయూ) చేసుకుంది. గత జూలైలో పుణే జాతీయ ప్రకృతి వైద్య సంస్థ కూడా పరస్పర ఒప్పందం చేసుకుంది. భారతీయ సంప్రదాయ విజ్ఞాన వ్యవస్థ అభివృద్ధి వ్యాప్తికి పరిశోధనలు, శిక్షణ వంటి విద్యా కార్యక్రమాల్లో పరస్పర ప్రయోజనాలు పొందనున్నారు. ఈ ప్రకృతి వైద్య గ్రంథాలయం ప్రత్యేకతలు, విద్యార్థులకు ఉపయోగం, తదితర అంశాలపై ఈ వారం ప్రత్యేక కథనం.నేచురోపతి లైబ్రరీ రీసెర్చ్ సెంటర్తో కేయూ, పుణే సంస్థల ఎంఓయూకేయూతో ఎంఓయూతో కలిగే ప్రయోజనాలు.. కాకతీయ యూనివర్సిటీ వారు ఈ నెల ఒకటో తేదీన ప్రకృతి వైద్య గ్రంథాలయంతో ఎంఓయూ చేసుకున్నారు. ● ప్రకృతి వైద్యజ్ఞానాన్ని సమయానికి పొందేలా ఈ లైబ్రరీ రీసెర్చ్ సెంటర్లోని పుస్తకాల క్యా టలాగ్, వర్గీకరణ చేపడతారు. ఇందుకు కేయూ లైబ్రరీ సైన్స్ విద్యార్థులను వినియోగిస్తారు. ● ఇరు సంస్థల వర్క్షాప్లు, సేవల మార్పిడి కోసం ఎలాంటి ఆర్థిక భారం ఉండబోదు. సదస్సులు, సమావేశాలను సంయుక్తంగా నిర్వహించేందుకు అవకాశం ఉంది. ● ఎంఎల్ఐఎస్సీ విద్యార్థులు, పీహెచ్డీ పరిశోధకులు తమ ప్రాజెక్ట్ వర్క్స్, ఇంటర్న్షిప్లకు అధ్యయనం చేసేందుకు ఈ ప్రకృతి వైద్య లైబ్రరీలోకి అనుమతి ఉంటుంది. ● ఆర్ట్స్ విద్యార్థులు ప్రకృతి వైద్య విజ్ఞాన సంపదను వినియోగించుకోవచ్చు. ఉదాహరణకు తెలుగు భాషలో ప్రకృతివైద్యంపై పద్యాలు, కవితల రూపంలో కూడా చికిత్స విధానాలున్నాయి. ● అమెరికా సిలికాన్ యూనివర్సిటీలో ఆయుర్వేద డిప్లొమా కోర్సు నడుస్తున్నది. తెలుగు, హిందీ భాషల్లో ప్రకృతి వైద్యానికి సంబంధించిన పుస్తకాలు, జర్నల్స్ ఉన్నాయి. ఆయా భాషల్లో ప్రకృతి వైద్యంపై పరిశోధన చేయాలనుకునేవారికి ఎంతో ఉపయోగపడనుంది. ● ఫార్మసీ విద్యార్థులకు ఫార్మాకాగ్నెన్స్ నేచురోపతికి సంబంధించిన ఆయుర్వేదం, యోగా, నేచురోపతి మీద ఒక పేపర్ ఉంది. ఆయా విద్యార్థుల సిలబస్కు అనుగుణంగా నూట్రిషన్స్, రోగ నిరోధకత పరిశోధనలకు ఉపయోపడే ప్రకృతి వైద్యం, విజ్ఞాన పుస్తకాలను ఉపయోగించుకోవచ్చు. ● ఇంటినే గ్రంథాలయంగా మార్చిన గజ్జెల రామేశ్వరం ● వివిధ భాషల్లో 5 వేల పుస్తకాలు, జర్నల్స్ అందుబాటులో.. ● ప్రకృతి వైద్యపరిజ్ఞానం పెంపొందించుకునే అవకాశం కేయూ క్యాంపస్: హనుమకొండ ప్రకాశ్రెడ్డిపేటలోని ఇంటర్నేషనల్ నేచురోపతి లైబ్రరీ అండ్ రీసెర్చ్ సెంటర్లో దేశ, విదేశీ భాషా గ్రంథాలు ఉన్నాయి. ప్రకృతివైద్యానికి సంబంధించిన 50 పత్రికలు లభిస్తాయి. కాకతీయ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగం విశ్రాంత ఆచార్యులు గజ్జెల రామేశ్వరం 2018 జూలై 24న తన ఇంటిలోనే ఈ లైబ్రరీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ప్రకృతి వైద్యంపై ఆసక్తి ఉన్నవారు ఈ లైబ్రరీలో ఉచితంగా ప్రవేశించి చదువుకునే అవకాశం కల్పించారు. పుణే జాతీయ ప్రకృతివైద్య సంస్థతో.. పుణేలోని జాతీయ ప్రకృతివైద్య సంస్థ గత జూలై 1న ఈ ప్రకృతి వైద్య గ్రంథాలయ పరిశోధన కేంద్రంతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ సత్యలక్ష్మి, రామేశ్వరం ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. పుణే జాతీయ ప్రకృతి వైద్యసంస్థలో ఆస్పత్రి ఉంటుంది. అక్కడి నేచురోపతి కోర్సుల విద్యార్థులకు క్లినికల్ రీసెర్చ్కు సంబంధించిన ప్రకృతి వైద్య విజ్ఞాన పుస్తకాలు, జర్నల్స్ ఇక్కడి లైబ్రరీ రీసెర్చ్సెంటర్లో ఉన్నాయి. ఆ విద్యార్థులు ఇక్కడికి వచ్చి వినియోగించుకుంటారు. ఇతర దేశాల శాస్త్రవేత్తలు, ప్రకృతి వైద్యులు తమ సంస్థను సందర్శించిన సమయంలో పరిశోధనల విజ్ఞాన పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉండడం వల్ల వారిని తరచూ ఇక్కడికి పంపే అవకాశాలున్నాయి. ఇది హెల్త్ ఎడ్యుకేషన్ టూరిజానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. యోగా, హిస్టరీ, లైఫ్ సైన్సెస్ వారికి ఉపయుక్తం కేయూ దూరవిద్యలో యోగా డిప్లొమా కోర్సు నడుస్తోంది. ఈ విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు 300 వరకు ఉన్నాయి. ఫిజికల్ ఎడ్యుకేషన్లోనూ నేచురోపతిపై ఒక పేపర్ ఉంది. సైకాలజీ విద్యార్థులకు మానసిక వైద్య విద్యకు సంబంఽధించి ప్రకృతి వైద్యపరంగా విజ్ఞానసంపద ఉంది. భారత ప్రకృతివైద్య చరిత్ర, ప్రకృతి వైద్య ఉద్యమ వైతాళికులు ఎవరు అనే అనేక అంశాలు, చారిత్రక పరంగా ప్రకృతి వైద్యవిధానం ఎలా వచ్చిందనే దానిపై హిస్టరీ విద్యార్థులు, పరిశోధనలకు ఈలైబ్రరీ రీసెర్చ్సెంటర్లో అనేక దేశ, విదేశాల పుస్తకాలు, జర్నల్స్ అందుబాటులో ఉన్నాయి. లైఫ్సైన్సెస్ పీజీకోర్సుల విద్యార్థులకు ఉపయోగపడే జ్ఞాన సంపద అందుబాటులో ఉంది. ప్రకృతి వైద్యవిజ్ఞానం ప్రజాబాహుళ్యంలోకి.. మూడున్నర దశాబ్దాలుగా సేకరించిన అరుదైన ప్రకృతి వైద్యవిద్య, సాహిత్య విజ్ఞాన సంపదను అందుబాటులో ఉంచా. కేయూ, పుణేలోని జాతీయ ప్రకృతివైద్య సంస్థతో మా లైబ్రరీ రీసెర్చ్ సెంటర్తో ఎంఓయూ కుదుర్చుకున్నాం. విజ్ఞాన సంపదను విద్యార్థులు, పరిశోధకులు ఉపయోగించుకోవాలి. – గజ్జెల రామేశ్వరం, ప్రకృతి వైద్య లైబ్రరీ రీసెర్చ్ సెంటర్ వ్యవస్థాపకుడుఇంటర్న్షిప్నకు కూడా.. ఈ ఎంఓయూతో ఎంఎల్ఐఎస్సీ విద్యార్థులకు ఇంటర్న్షిప్నకు అవకాశం లభించింది. తొలుత ఒకటి రెండురోజుల్లోనే ఇద్దరు విద్యార్థులను ఆ లైబ్రరీ సెంటర్కు పంపనున్నాం. మా లైబ్రరీ సైన్స్ విభాగంనుంచి ఆ లైబ్రరీలో పుస్తకాల క్యాట్లాగ్, క్లాసిఫికేషన్కు విద్యార్థులు సహకారం అందిస్తారు. – డాక్టర్ రాధికారాణి, కేయూ లైబ్రరీ సైన్స్ విభాగం అఽధిపతి -
సూపర్ స్పెషాలిటీ వైద్యం అందేనా?
భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుతో అన్ని విభాగాల్లో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ప్రజలు ఆశించారు. కానీ గతంలో అందించిన సేవలే కొంత మెరుగుపడటం మినహా అత్యంత అవసరమైన సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులోకి రాలేదు. వివిధ రకాల కాలుష్యాలతో భూపాలపల్లి, చెల్పూర్ పారిశ్రామిక ప్రాంతంలో యూరాలజీ, న్యూరాలజీ, కార్డియాలజీ రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. వీటికి సంబంధించిన వైద్య సేవలు భూపాలపల్లిలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో అందుబాటులో లేకపోవడంతో వరంగల్, హనుమకొండ, హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖర్చులు భరించలేనివారు దేవుడిపై భారం వేసి స్థానికంగా నామమాత్రపు చికిత్సలతో సరిపెట్టుకుంటున్నారు. ప్రాథమిక దశలోనే ఆయా వ్యాధులను గుర్తిస్తే నివారణ సులభతరమయ్యే అవకాశముంది. స్థానికంగా ఆయా విభాగాల్లో చికిత్స, వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటున్నాయి. జాతీయ మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారంగా న్యూరాలజీ, కార్డియాలజీ విభాగాల్లో ఓపీ గదులను ఏర్పాటు చేసినప్పటికీ కేవలం యూరాలజీ వైద్యులు వారంలో రెండు రోజులు మాత్రమే వస్తుండగా, న్యూరాలజీ, కార్డియాలజీ వైద్యులు లేరు. యూరాలజీ, న్యూరాలజీలోనూ.. మూత్రపిండాలకు సంబంధించిన యూరాలజీ, నరాలకు సంబంధించి న్యూరాలజీ విభాగాల్లోనూ రోగుల సంఖ్య పెరుగుతోంది. ఆస్పత్రిలో యూరాలజీ, నెఫ్రాలజీ తదితర వైద్యులు అందుబాటులో ఉంటే ప్రాథమిక దశలోనే కిడ్నీ వ్యాధిని గుర్తించి చికిత్స అందిస్తే రక్తశుద్ధి వరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. మెదడు, నరాలకు సంబంధించిన కేసులు సైతం అధికంగానే ఉంటున్నాయి. న్యూరాలజీ వైద్యులు అందుబాటులో ఉంటే సకాలంలో చికిత్స అందే అవకాశం ఉంటుంది. ప్రైవేట్లో కంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లో వేతనాలు తక్కువగా ఉండటంతో పాటు పట్టణాలకు దూరంగా ఉండటంతో ఆయా విభాగాల్లోని వైద్యులు భూపాలపల్లి వైద్య కళాశాలలో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. ‘క్యాథ్ ల్యాబ్’ ఏర్పాటుతోనే.. మారుతున్న ఆహారపు అలవాట్లు, జల, వాయు, కాలుష్యాలు తదితర కారణాలతో కొంతకాలంగా గుండెపోటు బాధితుల సంఖ్య పెరుగుతోంది. భూపాలపల్లి పారిశ్రామిక ప్రాంతంలో గుండెపోటుతో మృతి చెందుతున్న వారి సంఖ్య ఇటీవల అధికంగా ఉంది. భూపాలపల్లి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ‘క్యాథ్ ల్యాబ్’ సదుపాయంతో పాటు గుండె వైద్య నిపుణులు అందుబాటులో ఉంటే ఇందులో అత్యధిక మంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది. ఇందులో ఉపయోగించే ప్రధాన యంత్రానికే సుమారుగా రూ.కోటి వరకు ఖర్చు కానుండగా పూర్తిస్థాయిలో ‘క్యాథ్ ల్యాబ్’ ఏర్పాటునకు దాదాపుగా రూ.8 కోట్లు అవసరం కానుంది. స్థానిక వైద్య కళాశాల, ఆస్పత్రి భవనాల నిర్మాణంలో సంపూర్ణ సహకారాన్ని అందించిన సింగరేణి, కేటీపీపీ పరిశ్రమలు సమాజహితం కోరి నిధులు కేటాయిస్తే భూపాలపల్లిలో క్యాథ్ల్యాబ్ ఏర్పాటు సులభతరం కానుంది. ిసింగరేణి, కేటీపీపీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు కూడా ఉపయోగపడనుంది. న్యూరో, కార్డియాలజీ, యూరాలజీ సేవలు కరువు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో స్పెషలిస్ట్ వైద్యుల నియామకం ఎప్పుడో.. అత్యవసర సేవలకు వరంగల్, హైదరాబాద్కు రోగులు త్వరలో సీటీ స్కాన్ సేవలు అందుబాటులోకి.. ఈసీఐఎల్ ఆధ్వర్యంలో సీటీ స్కాన్ ఏర్పాటు.. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్శర్మ ప్రత్యేకంగా దృష్టిసారించి సీటీ స్కాన్ ఏర్పాటు చేస్తున్నారు. ఈసీఐఎల్ సంస్థ నుంచి సీఎస్ఆర్ నిధులు కేటాయించారు. సంస్థ సహకారంతో జిల్లా ప్రజలకు ఖరీదైన స్కానింగ్ సేవలు అందనున్నాయి. ఇప్పటికే సీటీ స్కానింగ్ యంత్రాన్ని టీ–హబ్ భవనంలో అమర్చి ఉంచారు. ఈ నెల రోజుల్లోపు ప్రారంభించే అవకాశం ఉంది. స్కానింగ్ ప్రారంభం నాటికి న్యూరో స్పెషలిస్టు డాక్టర్ను నియమించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. -
ఉపాధ్యాయుల చేతుల్లో విద్యార్థుల భవిష్యత్
భూపాలపల్లి అర్బన్: విద్యార్థులను విద్యావంతులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్లోని మీటింగ్హాల్లో గురుపూజోత్సవం నిర్వహించారు. కలెక్టర్ రాహుల్శర్మతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ్ణన్ చిత్రపటానికి కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు, అదనపు కలెక్టర్ విజయలక్ష్మితో కలిసి పూలమాల వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యనారాయణరావు మాట్లాడుతూ.. తల్లిదండ్రుల తరువాత స్థానం ఉపాధ్యాయులదేనన్నారు. గురువును మించిన దైవం ఈ లోకంలో లేదన్నారు. విద్యాబోధనలో మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులు చేయడానికి ప్రభుత్వం కృషిచేస్తుందని తెలిపారు. రానున్న రోజుల్లో ఉపాధ్యాయులను విదేశాలకు పంపి ఆధునిక విద్యా విధానాలపై అధ్యయనం చేయించి అమలుచేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత 11వేల ఉపాధ్యాయుల నియామకాలు, పెండింగ్ ఉన్న ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించిందని గుర్తుచేశారు. రానున్న రోజుల్లో వాహనాల ఏర్పాటు ద్వారా విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించనున్నట్లు ప్రకటించారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్కు మార్గ నిర్దేశకులు ఉపాధ్యాయులని అన్నారు. విద్యారంగంలో విశిష్ట సేవలందించిన ఉపాధ్యాయులను గుర్తించి, సత్కరించడం ద్వారా విద్యా ప్రమాణాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. జిల్లాలోని ప్రతిభావంతమైన ఉపాధ్యాయుల సేవలను ప్రశంసిస్తూ, విద్యార్థుల భవిష్యత్ను మెరుగుపరచడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదని అభినందించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ కోట రాజబాబు, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి ప్రసంగించారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయిలో ఎంపికైన 33 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు శాలువా, మెమెంటోతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రాజేందర్, సెక్టోరియల్ అధికారులు లక్ష్మణ్, రాజగోపాల్, వివిధ ఉపాధ్యాయ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఉపాధ్యాయులకు సన్మానం -
నేడు సంపూర్ణ చంద్రగ్రహణం
కాళేశ్వరం: సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం (నేడు) ఆదివారం మధ్యాహ్నం 12గంటలకు (మూసివేత) ద్వార బందనం చేయనున్నట్లు ఈఓ మహేష్, ఆలయ ఉపప్రధాన అర్చకుడు పనకంటి ఫణీంద్రశర్మ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తిరిగి ఆలయం 8వ తేదీన సోమవారం సంప్రోక్షణాది పూజా కార్యక్రమాలు చేసి ఉదయం 7.30 గంటలకు భక్తులకు దర్శనానికి అనుమతించనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలన్నారు. ముసాయిదా ఓటరు జాబితా విడుదల భూపాలపల్లి అర్బన్: జిల్లా, మండల పరిషత్ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ స్టేషన్ల వారీగా శనివారం ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేసినట్లు జెడ్పీ సీఈఓ, స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 8వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం, 9న అభ్యంతరాలపై సూచనలను పరిష్కరించనున్నట్లు చెప్పారు. 10వ తేదీన తుది జాబితాను ప్రచురించనున్నట్లు తెలిపారు. జిల్లా ఎన్నికల అఽధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని కోరారు. కాళేశ్వరంలో 501 విగ్రహాల నిమజ్జనం కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని అంతర్రాష్ట్ర వంతెన వద్ద శుక్రవారం నుంచి శనివారం తెల్లవారుజాము వరకు జరిగిన గణపతి విగ్రహాల నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ కిరణ్ఖరే, కాటారం సబ్కలెక్టర్ మయాంక్సింగ్, డీఎస్పీ సూర్యానారాయణ, సీఐ వెంకటేశ్వర్లు, నాగార్జునరావు, ఎస్సై తమాషారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు, బందోబస్తు నిర్వహించారు. మొత్తం 501 కిపైగా విగ్రహాలు త్రివేణి సంగమ గోదావరిలో నిమజ్జనం చేసినట్లు తెలిసింది. పంచాయతీరాజ్ ఈఎన్సీ పూజలు కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని పంచాయతీరాజ్ ఈఎన్సీ నగునూరి అశోక్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. శనివారం ఆయన ఆలయానికి రాగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారి గర్భగుడిలో అభిషేక పూజలు చేసి శ్రీఽశుభానందదేవి అమ్మవారికి పూజలు చేశారు. ఆశీర్వచన వేదిక వద్ద ఆలయ అర్చకుడు బైకుంఠపాండా శాలువాతో సన్మానించి తీర్థప్రసాదం అందజేశారు. ఫుట్బాల్ పోటీలు ప్రారంభం భూపాలపల్లి అర్బన్: సింగరేణి వర్క్స్ పీపుల్స్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్మికులకు శనివారం ఫుట్బాల్ పోటీలు ప్రారంభించారు. ఏరియాలోని అంబేడ్కర్ స్టేడియంలో జరిగిన క్రీడా పోటీలకు ఏఈజీ(ఐఈడీ) జోతి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ క్రీడాస్ఫూర్తితో ఆటల్లో పాల్గొనాలని సూచించారు. సింగరేణి క్రీడాకారులు కోలిండియా స్థాయిలో రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు మారుతి, బ్రహ్మకుమారీస్, చేతన, శ్రీనివాస్, క్రీడాకారులు, కోచ్లు పాల్గొన్నారు. హేమాచలుడిని దర్శించుకున్న ఐటీడీఏ పీఓ మంగపేట: మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహాస్వామిని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వయంభు స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయానికి వచ్చిన పీఓకు ఆలయ కార్యనిర్వహణ అధికారి రేవెల్లి మహేష్, పూజారులు స్వాగతం పలికారు. ఆలయంలోని స్వయంభు స్వామివారిని దర్శించుకున్న పీఓ కుటుంబ సభ్యుల గోత్రనామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించారు. -
రద్దీగా జిల్లాకేంద్రం
భూపాలపల్లి అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు జిల్లాలోని నలుమూలల నుంచి వినాయక విగ్రహాలను ఎక్కువ సంఖ్యలో కాళేశ్వరంలోని గోదావరి నదిలో నిమజ్జనం చేసేందుకు భూపాలపల్లి పట్టణం మీదుగా తరలించారు. దీంతో జిల్లా కేంద్రం రద్దీగా మారింది. కాళేశ్వరంతో పాటు లక్నవరం, ఏటూరునాగారం ఇతర ప్రదేశాలకు విగ్రహాలను డప్పు వాయిద్యాల నడుమ తరలించారు. భూపాలపల్లి పట్టణంలోని పలు కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను సైతం కాళేశ్వరంలోని తివ్రేణి సంగమంలో నిమజ్జనం చేసేందుకు తరలించారు. యువకులు, మహిళలు ప్రత్యేక దుస్తులు ధరించి నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు. కాలనీల నుంచి వచ్చే వినాయక మండలికి చెందిన వినాయక విగ్రహాల ఎదుట మహిళలు కోలాటం ఆడుతూ.. సాంప్రదాయ బద్ధంగా మంగళహారులతో గణపయ్యను గంగమ్మ చెంతకు సాగనంపారు. పట్టణంలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడకుండా డీఎస్పీ ఆధ్వర్యంలో భద్రత ఏర్పాట్లు చేయగా ఎస్పీ కిరణ్ఖరే పరిశీలించారు. నిర్వాహకులకు సన్మానాలు నిమజ్జనానికి కాళేశ్వరం తరలివెళ్లే వినాయక విగ్రహాల నిర్వాహకులకు, కమిటీ సభ్యులకు అంబేడ్కర్ సెంటర్లో ధర్మవాహిని గణేష్ ఉత్సవ కమిటీ, గణేష్చౌక్లో ధర్మజాగరణ గణేష్ ఉత్సవ సమితిల ఆధ్వర్యంలో వేర్వేరుగా ఘనంగా సన్మానించారు. శాలువాతో సత్కరించి జ్ఙాపికలను అందజేశారు. ఈ సన్మాన కార్యక్రమాలకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ కిరణ్ఖరే, సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి, నిర్వాహకులు దేవన్, రమేష్, అనిల్, వెంకన్న, రవీందర్, ప్రభాకర్, భిక్షపతి, యుగేందర్, రవీందర్, మధుసూదన్, రాజేందర్, సంజీవరావు పాల్గొన్నారు. -
యూరియా కోసం అన్నదాతల ధర్నా
కాటారం: మన గ్రోమోర్లో నిల్వ ఉన్న యూరియా పంపిణీ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ శుక్రవారం మండల కేంద్రంలో మన గ్రోమోర్ ఎదుట రైతులు ధర్నా చేపట్టారు. జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడూతూ మన గ్రోమోర్లో యూరియా నిల్వ ఉన్నా పంపిణీ చేయడం లేదని ఆరోపించారు. స్టాక్కు సంబంధించి డీఓ ఆర్డర్ రాలేదనే సాకుతో యూరియా ఇస్తలేరని అన్నారు. యూరియా లేక ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న ఎస్సై శ్రీనివాస్ ఘటనా స్థలా నికి చేరుకొని రైతులతో మాట్లాడి సముదా యించారు. ఏఓ పూర్ణిమ, మన గ్రోమోర్ మేనేజర్తో మాట్లాడి రైతులకు యూరియా పంపిణీ చేయాలని సూచించడంతో అందజేశారు. -
బైబై..గణేశా!
గంగమ్మ ఒడికి చేరిన గణనాథుడు● నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు ● భారీ బందోబస్తుతో నిమజ్జనం ● వందల సంఖ్యలో తరలివచ్చిన గణనాథుల ప్రతిమలు, భక్తులుకాళేశ్వరం: తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు అందుకున్న వినాయకుడిని భక్తులు శుక్రవారం గోదావరిలో నిమజ్జనం చేసి వీడ్కోలు పలికారు. మహదేవపూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమ గోదావరిలో వరంగల్ ఉమ్మడి జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి వినాయక విగ్రహాల రథాలు భారీగా తరలి వచ్చాయి. పల్లెలు, పట్టణాల్లో వినాయక మండపాల్లోని కమిటీ సభ్యులు గల్లీగల్లీకి వినాయక విగ్రహాలకు తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, భజన, భక్తిసంకీర్తనలతో పూజించారు. వినాయకునికి ఇష్టమైన పిండి వంటలు, పండ్లు, నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. అంగరంగ వైభవంగా మంగళవాయిద్యాలతో నృత్యాలు, మహిళలు కోలాటం ప్రదర్శనలు, యువత తీన్మార్ డాన్స్లతో గణేష్ మహరాజ్కీ జై.. గణపతిబప్పా మోరియా, బైబై గణేష్ అంటూ నినాదాలు పలుకుతూ గంగమ్మ ఒడికి సాగనంపారు. నిమజ్జనం వద్ద అధికారులు.. ఇబ్బందులు కలుగకుండా అంతర్రాష్ట్ర వంతెన వద్ద జిల్లా అధికారులు పర్యవేక్షించారు. కాటారం సబ్కలెక్టర్ మయాంక్సింగ్, డీపీఓ వీరభద్రయ్య, తహసీల్దార్ రామారావు, ఎంపీఓ ప్రసాద్, కార్యదర్శి సత్యనారాయణ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య ఏర్పాట్లు, ఇతర ఏర్పాట్లు చేశారు. కాళేశ్వరం వైద్యాధికారి సుస్మిత వైద్యసేవలు అందించారు. ఎన్పీడీసీఎల్ ఎస్ఈ మల్చూర్, డీఈఈ పాపిరెడ్డి, నాగరాజు, శ్రీకాంత్, సదానందం అధికారులు విద్యుత్ సరఫరాను అంతరాయం లేకుండా అందజేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, పీఏసీఎస్ చైర్మన్ తిరుపతి, నాయకులు మెంగాని అశోక్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన వద్ద రెండు చోట్ల ఏర్పాటు చేసిన రెండు స్టాండ్లకు రెండేసి క్రేన్లతో విగ్రహాలను ఎత్తి విగ్రహాలను స్టాండ్లపై నుంచి గజఈతగాళ్ల సహాయంతో గోదావరి నీటిలోకి వదిలి నిమజ్జనం చేశారు. అర్ధరాత్రి వరకు నిమజ్జనం కొనసాగింది. కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని పల్లకీలో ఊరేగింపు చేసి భక్తిభజనలు, మంగళహారతులతో నిమజ్జనానికి తీసుకెళ్లారు. భక్తులు త్రివేణి సంగమ గోదావరిలో నిమజ్జనం చేశారు. దేవస్థానం ఈఓ మహేష్, సీనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్, అర్చకులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మట్టి వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కలెక్టర్ రాహుల్ శర్మ నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నవరాత్రి ఉత్సవాలను భక్తులు, యంత్రాంగపు సలహాలు, సూచనలు పాటిస్తూ దిగ్విజయంగా జరుపుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీసీలు ప్రదీప్, సంగీత్, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. -
యూరియా ఇబ్బందులు తీర్చాలి
● మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మొగుళ్లపల్లి: రైతుల యూరియా ఇబ్బందులు తీర్చాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పీఏసీఎస్ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి బస్టాండ్ ఆవరణలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అసమర్థతతోనే యూరియా కొరత ఏర్పడిందని విమర్శించారు. కేసీఆర్పై సీబీఐ విచారణను నిలిపేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బల్గూరి తిరుపతిరావు, నాయకులు కోడారి రమేష్, జోరుక సదయ్య, నెనకంటి ప్రభాకర్రెడ్డి, పెంతల రాజేందర్, రాములు, వెంకట్రెడ్డి పాల్గొన్నారు. -
గణపయ్య ఆశీస్సులు అందరిపై ఉండాలి
భూపాలపల్లి రూరల్: విఘ్నాలను తొలగించే ఆదిదేవుడు గణపయ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గణపతి నవరాత్రుల్లో భాగంగా భూపాలపల్లి మంజూర్నగర్లోని పాత కలెక్టరేట్ ప్రాంగణంలోని శ్రీ లలితా త్రిపుర సుందరిదేవీ ఆలయంలో సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి వద్ద ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, సింగరేణి జీఎం రాజేశ్వర్రెడ్డి, భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిని ఎమ్మెల్యే దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులను అందించాలని విఘ్నేశుడిని కోరుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, ఉన్నారు. దగ్ధమైన ఇల్లు పరిశీలన భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని మహబూబ్పల్లిలో ప్రమాదవశాత్తు దగ్ధమైన కొమ్ము ప్రమీలకు సంబంధించిన ఇల్లును ఎమ్మెల్యే సత్యనారాయణరావు పరిశీలించారు. -
గురుభ్యోనమః
జిల్లాలో కొందరు ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దడానికి నిరంతరం కృషి చేస్తున్నారు. విద్యార్థుల సంఖ్యను పెంచడంతో పాటు విద్యార్థులకు సొంత ఖర్చులతో వాహన సదుపాయం ఏర్పాటుచేస్తున్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్కు బాటలు వేస్తూ వెలుగులు నింపుతున్నారు. నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వినూత్నంగా బోధన చేస్తున్న ఉపాధ్యాయులపై సాక్షి ప్రత్యేక కథనం..కాళేశ్వరం: కనుబొమ్మలతో మాట్లాడే లిపిని మహదేవపూర్ జెడ్పీహెచ్ఎస్ బాలికల ఉన్నత పాఠశాల ఫిజికల్ సైన్స్ ఉపాద్యాయుడు మడక మధు కనుగొని విద్యార్థులతో అలవోకగా చెప్పిస్తూ శిక్షణ ఇచ్చి అందరినీ ఆశ్చర్యంలోకి దింపుతున్నారు. పాఠశాల 8వ తరగతి విద్యార్థులు చేసిన ఐబ్రో కోడింగ్ ద్వారా మాటలు, పాటలు లేదా సంకేత భాషలు అవసరం లేకుండా కేవలం కనుబొమ్మల కదలికలతో ఒకరు రాసిన వాక్యాన్ని మరో విద్యార్థి కనుబొమ్మల ద్వారా గ్రహించి ఖచ్చితంగా చెప్పగలగడం ఈ ఐబ్రో కోడింగ్ ఉద్దేశం. గతంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వద్ద మన్ననలు పొందారు. ప్రస్తుత మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, కలెక్టర్ రాహుల్శర్మ ఇటీవల ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. -
ప్రతాపగిరి గుట్ట అభివృద్ధికి ప్రణాళిక
కాటారం: చారిత్రాత్మక, ఆధ్యాత్మికత కలిగిన కాటారం మండలం ప్రతాపగిరి సమీపంలోని ప్రతాపగిరి గుట్ట అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయనున్నట్లు కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. ప్రతాపగిరి గుట్టను ఎస్పీ కిరణ్ఖరేతో కలిసి కలెక్టర్ సందర్శించారు. సుమారు ఆరు కిలోమీటర్లు కాలినడకన కలెక్టర్, ఎస్పీ గుట్టపై ప్రాంతాన్ని చేరుకొని పరిశీలించారు. ప్రతాపగిరి గుట్ట విస్తీర్ణం, చారిత్రాత్మకత, ఆధ్యాత్మిక చరిత్రను అడిగి తెలుసుకున్నారు. పర్యావరణ పరిరక్షణ, పర్యాటక అభివృద్ధి అవకాశాలు, సహజ సంపదల సంరక్షణ అంశాలపై అటవీశాఖ అధికారులతో కలెక్టర్, ఎస్పీ చర్చించారు. కొండ ప్రాంతంలో పచ్చదనాన్ని పెంపొందించడానికి అటవీశాఖ ద్వారా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పర్యాటకులను ఆకర్షించేలా మౌలిక వసతుల ఏర్పాటుపై ప్రత్యేక ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. ప్రకృతి సంపదను కాపాడుతూ అభివృద్థి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని కలెక్టర్ పేర్కొన్నారు. కలెక్టర్, ఎస్పీతో డీఎఫ్ఓ నవీన్రెడ్డి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, అటవీశాఖ అధికారులు, సిబ్బంది ఉన్నారు. కలెక్టర్ రాహుల్శర్మ భూపాలపల్లి: గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐడీఓసీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన మట్టి వినాయక మండపం వద్ద గురువారం మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అధికారులు, సిబ్బంది, కలెక్టరేట్కు వచ్చిన ప్రజలకు వడ్డించిన అనంతరం వారితో కలిసి కలెక్టర్ సహఫంక్తి భోజనం చేశారు. తొలిసారిగా ఐడీఓసీ కార్యాలయంలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించడాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, ఆర్డీఓ రవి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
నిమజ్జనానికి ఏర్పాట్లు
కాళేశ్వరం: తొమ్మిది రోజులు పూజలందుకున్న గణనాథులు గంగమ్మ ఒడికి చేరడానికి పయనమయ్యాడు. తొమ్మిది రోజులు అత్యంత భక్తిశ్రద్దలతో కొలిచిన భక్తులు ఆదిదేవుడిని నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి భారీగా గణనాథుల విగ్రహాలను మహదేవపూర్ మండలం కాళేశ్వరం గోదావరిలో నిమజ్జనం చేసేందుకు భక్తులు ప్రతియేటా తరలివస్తారు. శుక్రవారం(నేడు) కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన వద్ద వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడానికి దేవాదాయ, రెవెన్యూ, పంచాయతీ, పోలీసు, ఎన్పీడీసీఎల్, ఫిషరీస్ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. వంతెనపై రెండు చోట్ల నిమజ్జనం చేయడానికి వీలుగా రెండు స్టాండ్లు, ఒక జనరేటర్ ఏర్పాటు చేశారు. వంతెనపై అక్కడక్కడా లైట్లు ఏర్పాటు చేశారు. కాళేశ్వరం బస్టాండ్ నుంచి వంతెన వరకు విద్యుత్ దీపాలు అమర్చారు. రోడ్డుకు ఇరువైపులా చదును చేశారు. రోడ్డుపై గుంతలను పూడ్చివేసి వాహనాలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేపట్టారు. సుమారు 500లకు పైగా విగ్రహాలు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు పెద్దపల్లి, మంథని, కరీంనగర్ తదితర పట్టణాల నుంచి తరలిరానున్నాయి. పకడ్బందీ బందోబస్తు.. ఎస్పీ కిరణ్ఖరే, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ ఎన్.వెంకటేశ్వర్లు, ఎస్సై తమాషారెడ్డి ఆధ్వర్యంలో కాళేశ్వరంలో వినాయక నిమజ్జన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరి నదిలో వినాయక నిమజ్జనం నిమిత్తం జిల్లా నుంచి ఐదుగురు సీఐలు, 10 మంది ఎస్సైలు, 250 మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొననున్నారు. కాళేశ్వరం గోదావరి నదిలో విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు వచ్చే భక్తులు పోలీసుల సూచనలు, ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలి. వాహనాలకు డీజే సౌండ్ బాక్స్లు పెట్టకుండా ఉండాలి. వెహికల్స్ కండిషన్లో ఉండేటట్లు చూడాలి. తాగి వాహనం నడపకూడదు. వాహన డ్రైవర్కు లైసెన్స్ కలిగి ఉండేటట్లు చూసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. నిమజ్జనం వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని పోలీసులు పేర్కొంటున్నారు. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు నిఘాను తీవ్రం చేపట్టారు. కాళేశ్వరం గోదావరిలో నిమజ్జనానికి వందలాదిగా తరలివచ్చే వినాయక వాహనాలు ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూసుకోవాలి. వాహనాలు పోటీలు పడి ప్రమాదానికి గురికావొద్దు. తాగి వాహనం నడపొద్దు. పోలీసుల సూచన మేరకు నడుచుకోవాలి. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. లోతుకు వెళ్లరాదు. ప్రశాంతంగా నిమజ్జనం జరుపుకోవాలి. – సూర్యనారాయణ, డీఎస్పీ, కాటారం నేడు కాళేశ్వరం తరలిరానున్న గణనాథులు అంతర్రాష్ట్ర వంతెన వద్ద పకడ్బందీ బందోబస్తు -
13న జాతీయ లోక్ అదాలత్
భూపాలపల్లి అర్బన్: ఈనెల 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్ రమేష్బాబు తెలిపారు. కోర్టు ఆవరణలో గురువారం వాల్పోస్టర్ ఆవిష్కరణ చేపట్టి న్యాయవాదులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. జాతీయ లోక్ అదాలత్లో రాజీపడే క్రిమినల్, సివిల్, వివాహ, కుటుంబ తగాద కేసులు, మోటార్ వెహికల్ ఆక్సిడెంట్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఎక్కువ కేసులు పరిష్కరించేందుకు న్యాయవాదులు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సివిల్ జడ్జిలు నాగరాజు, దిలీప్కుమార్, నాయకులు శ్రావణరావు, విష్ణువర్ధన్, ఆనందరావు, రవీందర్, రాజ్కుమార్, ప్రియాంక పాల్గొన్నారు. -
ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం
భూపాలపల్లి: ప్రజలు తగు జాగ్రత్తలు పాటించి ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జన కార్యక్రమం నిర్వహించుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. నేడు (శుక్రవారం) జరుగనున్న వినాయక నిమజ్జన కార్యక్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గురువారం అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... మహిళలు, వృద్ధులు, చిన్న పిల్లలు చెరువుల వద్దకు వెళ్లవద్దన్నారు. విగ్రహాలు విద్యుత్ తీగలకు తాకకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. మరమ్మతులు చేపట్టాలి.. వర్షాలు, వరదల వలన దెబ్బతిన్న రహదారులను తక్షణమే మరమ్మతులు చేపట్టి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దెబ్బతిన్న వనరుల పునరుద్ధరణకు విభాగాల వారిగా ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, మిషన్ భగీరథ ఈఈ శ్వేత, పంచాయతీరాజ్ ఈఈ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. నిధులు సమర్థవంతంగా వినియోగించాలి.. జిల్లా ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం జిల్లా మినరల్ డెవలప్మెంట్ నిధులు సమర్థవంతంగా వినియోగించాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ఐడీఓసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో పలు శాఖల జిల్లా స్థాయి అధికారులతో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో డీఎంఎఫ్టీ మేనేజింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పారిశ్రామికీకరణ వలన ప్రభావితం అవుతున్న ప్రాంతాల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలైన ఆరోగ్యం, విద్య, తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాలను ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని నిధులు వినియోగించాలని తెలిపారు. ఈ సమావేశంలో డీఎఫ్ఓ నవీన్రెడ్డి, అదనపు కలెక్టర్ అశోక్కుమార్, సీపీఓ బాబూరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు.. జిల్లాలోని ఉపాధ్యాయులకు కలెక్టర్ రాహుల్ శర్మ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. జిల్లా నుంచి గ్రామ పాలన అధికారులుగా ఎంపికై న అభ్యర్థులు సీఎం చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు స్వీకరించేందుకు హైదరాబాద్ వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. గురువారం ఈ విషయమై అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా నుంచి మొత్తం 107 మంది అభ్యర్థులు ఎంపికయ్యారని తెలిపారు. ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలి దెబ్బతిన్న రహదారులను మరమ్మతు చేయాలి కలెక్టర్ రాహుల్ శర్మ -
నేను తోపుడు బండిని.. నా ధర రూ.8వేలు..
ములుగు: ‘నేను తోపుడు బండిని.. నా ధర రూ.8వేలు.. మన గ్రామంలో మంచి మనసున్న దాతలు ముందుకు వస్తే మన గ్రామ పంచాయతీకి వెళ్లి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను’అనే ఫ్లెక్సీని ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండల పంచాయతీ కార్యదర్శి చందులాల్ స్వయంగా ఫ్లెక్సీ కట్టడం జిల్లాలో చర్చనీయాంశమైంది. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సొంత ఇలాకాలో.. అదీ సొంత శాఖలోనే నిధులు లేవా అన్న చర్చ జరుగుతోంది. గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు కట్టడమే కాకుండా మండల కేంద్రంలోని పలు కూడళ్లలో సిబ్బందితో ఫ్లెక్సీలను కట్టించి వాట్సాప్ గ్రూప్లో సైతం ఫొటోలు ఆప్లోడ్ చేశాడు. దీంతో ప్రతిపక్ష నాయకులతోపాటు గ్రా మస్తులు మేజర్ గ్రామపంచాయతీ అయిన వెంకటాపురంలో తోపుడు బండి కోనేందుకు రూ.8వేలు లేవా అంటూ విమర్శిస్తున్నారు. ఓ పంచాయతీ కార్యదర్శి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిధులు లేవంటూ ఫ్లె క్సీలు కట్టడం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. ఈ విషయమై డీపీ ఓ దేవరాజ్ను వివరణ కోరగా పంచాయతీ కార్యదర్శి చందులాల్ ఫ్లెక్సీలు కట్టిన విషయం తన దృష్టికి వచ్చిందని, వెంటనే తొలగించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. పంచాయతీ కార్యదర్శి చందూలాల్ను వివరణ కోరగా పారిశుద్ధ్య పనుల్లో వేగం పెంచేందుకు కొత్త తరహాలో ఆలోచించి ఫ్లెక్సీలు కట్టించినట్లు వెల్లడించారు. -
నానో యూరియాతో రైతులకు ప్రయోజనం
కాటారం: నానో యూరియా వినియోగం ద్వారా రైతులకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబురావు అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వద్ద బుధవారం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా డీఏఓ మాట్లాడుతూ.. సాధారణ యూరియా కంటే నానో యూరియా పంట సాగులో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఆశించిన స్థాయిలో పంట దిగుబడితోపాటు పర్యావరణ కాలుష్య నియంత్రణకు దోహదపడుతుందని పేర్కొన్నారు. రైతులు నానో ఎరువుల వాడకంపై దృష్టి సారించాలని తెలిపారు. అనంతరం డీఏఓ పీఏసీఎస్తోపాటు మండల కేంద్రంలోని పలు ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. యూరియా, ఇతర ఎరువుల స్టాక్, రిజిస్టర్లను పరిశీలించారు. యూరియా కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరకు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డీఏఓ వెంట ఏడీఏ శ్రీపాల్, ఏఓ పూర్ణిమ, పీఏసీఎస్ సీఈఓ సతీశ్, ఏఈఓ ఉన్నారు.జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబురావు -
కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించడం సిగ్గుచేటు
చిట్యాల: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన కేసీఆర్పై సీబీఐ విచారణకు ఆదేశించడం సిగ్గుచేటని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో యూరియా కోసం ఇబ్బందులు పడుతున్న రైతుల పక్షాన ధర్నా చేపట్టారు. అనంతరం చేతకాని ప్రభుత్వానికి మేలుకోలుపాలని వినాయకుడి విగ్రహానికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులకు సరిపడా యూరియా అందించాలని కోరారు. అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన కేసీఆర్పై అక్రమంగా కేసులు పెట్టడం సరికాదని అన్నారు. రైతులకు సరిపడా యూరియా అందించకుండా కేవలం కక్షపూరిత రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్నరోజుల్లో ప్రజలు బుద్దిచెబుతారని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అల్లం రవీందర్, ప్రధాన కార్యదర్శి ఏరుకోండ రాజేందర్గౌడ్, మాజీ జెడ్పీటీసీ గొర్రె సాగర్, సురేష్, రమణాచారి, సరోజన, శ్రీదేవి, వెంకటేష్, రఘు, తదితరులు పాల్గొన్నారు.బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి -
పత్తి రైతు.. చిత్తు
భూపాలపల్లి రూరల్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పత్తి పంటకు గండం పొంచి ఉందంటూ పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటభూముల్లో వాననీరు నిలిచి ఉండడంతో తెగుళ్లు వ్యాప్తి చెందుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనికితోడు తేమ శాతం పెరిగి పత్తి పూత నేలరాలుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో రైతులు అధికంగా పత్తి పంటను నమ్ముకున్నారు. పత్తి సాగు చేసిన నాటినుంచి కాపు దశకు వచ్చే వరకు వర్షాలు వెంటాడుతుండడంతో పంట దిగుబడులు సగానికి తగ్గిపోయే ప్రమాదం ఉందని, పెట్టుబడులు వస్తాయో.. రావోనని దిగాలు చెందుతున్నారు. ఈఏడాది రికార్డు స్థాయిలో వర్షాలు కురవడంతో పత్తి చేలల్లో కలుపు సమస్య, తెగుళ్ల సమస్యలు అధికమయ్యాయి. గతేడాది ఇదే పరిస్థితి.. గతేడాది జిల్లాలో 92,320 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. పంట కాపు దశకు వచ్చిన నాటి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా పంటల దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. ఎకరాకు పది క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా వర్షాల వల్ల 6 క్వింటాళ్లకు పడిపోయింది. వర్షాలకు తడిసిన పత్తికి మార్కెట్లో తేమ శాతం పేరుతో మద్దతు ధర పలకలేదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కలుపు సమస్య.. కూలీలకు డిమాండ్ జిల్లాలో 1.20 లక్షల మందికి పైగా రైతులు ఈ వానాకాలం సీజన్లో 98,260 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా పంటలోపెరిగిన కలుపు తీసేందుకు కూలీలకు డిమాండ్ పెరిగింది. ఒక్కో కూలీ రోజుకు రూ.500 నుంచి రూ.800 వరకు డిమాండ్ చేస్తున్నారు. దీనిని అధిగమించేందుకు రైతులు ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తీసుకొచ్చి కలుపుతీత పనులు చేయిస్తుండడం గమనార్హం.ఈ ఫొటోలోని వ్యక్తి పేరు పిల్లి కొమురయ్య, భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని పిల్లోనిపల్లి గ్రామానికి చెందిన ఈ రైతు.. నాలుగెకరాల్లో పత్తి సాగు చేశాడు. ఒక్కో ఎకరాకు ఇప్పటికే రూ.30 వేలు ఖర్చు చేశాడు. పంట బాగా వస్తుందని ఆశపడ్డాడు. కానీ, గత 15 రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంటచేనులో నీళ్లు నిలిచి మొక్కలకు ఎర్రతెగులు సోకింది. పూత రాలిపోయింది. దీంతో దిగుబడి వచ్చే పరిస్థితి లేదని.. అప్పులే మిగులుతాయేమోనని ఆందోళనకు గురవుతున్నాడు. పెరిగిన గడ్డి, చీడపీడలు తేమశాతం పెరిగి రాలుతున్న పూత దిగుబడిపై ప్రభావం తప్పదంటున్న రైతులు జిల్లాలో 98,260 ఎకరాల్లో సాగు -
సారూ.. మా సమస్యలు పరిష్కరించండి
భూపాలపల్లి అర్బన్: సారూ.. మా పాఠశాలలో సమస్యలు ఉన్నాయి.. పరిష్కరించండి.. అంటూ.. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకు తమ సమస్యలను వివరించారు. బుధవారం ఉదయం ఆశ్రమ పాఠశాలను స్థానిక ఎమ్మెల్యే సత్యనారాయణరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో కిచెన్షెడ్, వంట సామగ్రి పరిశీలించారు. తరగతి గదుల్లోకి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆర్వో ప్లాంట్ ఏడాది కాలంగా పని చేయడం లేదని, వేడి నీటికి గ్లీజర్ ఏర్పాటు చేయాలని, మూడు నెలలు కాస్మోటిక్ సామగ్రి ఇవ్వడం లేదని, డిజిటల్ క్లాస్ పరికరాలు పనిచేయడం లేదని ఎమ్మెల్యేకు తెలిపారు. దోమలు రాకుండా కిటికీలకు మెష్ డోర్లు ఏర్పాటు చేయాలని, ఫ్యాన్లు సరిగ్గా తిరగడం లేదని విద్యార్థులు చెప్పారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే.. సమస్యలు పరిష్కరించాలని ఐటీడీఏ పీఓకు ఫోన్లో చెప్పారు. బాలికల గురుకులం పక్కన ఏర్పాటు చేసిన బాలుర పోస్ట్మెట్రిక్ హాస్టల్ను వేరే చోటుకు తరలించాలని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. తనిఖీకి వచ్చిన ఎమ్మెల్యేకు విద్యార్థుల సమస్యలు ఏకరువు పరిష్కరించాలని ఐటీడీఓ పీఓకు ఎమ్మెల్యే సూచన -
సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటం
కాళేశ్వరం: ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారారిని నిరంతరం పోరాటం చేస్తున్నామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. బుధవారం ఆయన కాళేశ్వరముక్తీశ్వరస్వామిని కమిషన్ బృందంతో కలిసి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారి గర్భగుడిలో ప్రత్యేక అభిషేక పూజలు చేసి, పార్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆశీర్వచన వేదిక వద్ద ఆలయ ఈఓ మహేష్ శాలువాతో ఆయనను సన్మానించి, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం హరితహోటల్లో వెంకటయ్య మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు పండాలన్నారు. తెలంగాణకు గుండెకాయ కాళేశ్వరం ప్రాజెక్టు అన్నారు. మేడిగడ్డ వద్ద పిల్లర్ కుంగిందని, రిపేర్లు చేసుకొని తెలంగాణకు నీటి సౌకర్యం కల్పించాలన్నారు. ఆయన వెంట కమిషన్ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ, కుర్సంగి లీలాదేవి, నేనావత్ రాంబబాబు నాయక్ ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కాళేశ్వరాలయంలో కమిషన్ బృందం పూజలు -
కార్మికుల సమస్యలను విస్మరించిన సంఘాలు
భూపాలపల్లి అర్బన్: సింగరేణిలోని కొన్ని సంఘాలు కార్మికుల సమస్యలను విస్మరించి సొంత ప్రయోజనాల కోసం పాకులాడుతున్నాయని మాజీ మంత్రి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. భారత మజ్దూర్ సంఘ్(బీఎంఎస్) ఆధ్వర్యంలో బుధవారం భూపాలపల్లి ఏరియాలో నిర్వహించిన సింగరేణి సంస్థ పరిరక్షణ, కార్మిక సమస్యల పరిష్కారానికి నిర్వహించిన కార్మిక పోరాట బహిరంగ సభలో రాజేందర్ ముఖ్య అతిథిగా మాట్లాడారు. కార్మిక సంఘాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. విద్యుత్ సంస్థల నుంచి సింగరేణికి రావాల్సిన రూ.43వేల కోట్ల బకాయిలు చెల్లించడం లేదన్నారు. సింగరేణిలో రెగ్యులర్ కార్మికుల సంఖ్య లక్షకు పైగా ఉండగా నేడు 39 వేలకు పడిపోయిందన్నారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులకు పెంచుతు కోల్ ఇండియా వేతనాలను సింగరేణిలో అమలు చేయడం లేదన్నారు. సింగరేణిలో న్యాయబద్దంగా మెడికల్బోర్డు నిర్వహించడం లేదని డ బ్బులు, పలుకుబడి ఉన్నవారిని మాత్రమే అన్ఫిట్ చేస్తున్నారని ఆరోపించారు. సింగరేణి సీఎస్ఆర్ నిధులు వేరేప్రాంతాలకు కేటాయిస్తున్నారని తెలిపా రు. ఐఏఎస్, ఐఆర్ఎస్లు బానిసలుగా విధులు నిర్వర్తిస్తున్నారని మండిపడ్డారు. గత ఆర్ధిక సంవత్సరం లాభాల్లో నుంచి కార్మికులు 40శాతం వాటా కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో యూని యన్ అధ్యక్ష, కార్యదర్శులు మాధవనాయక్, సత్త య్య, కార్యనిర్వహక అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్, సారంగపాని, పవన్కుమార్, రాజారెడ్డి, బీజేపీ నాయకులు కీర్తిరెడ్డి, అరూరి రమేష్, సీతారామ్నాయక్, వేణుగోపాల్రెడ్డి, నారాయణరెడ్డి, నిశిధర్, సుజేందర్, నర్సింగరావు, మల్లేష్ పాల్గొన్నారు.ఎంపీ ఈటల రాజేందర్ -
విద్యార్థులకు సమస్యలు లేకుండా చూసుకోవాలి
కాటారం(మహాముత్తారం): గురుకుల, ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తగా చూసుకోవాలని కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్ అన్నారు. మహాముత్తారం మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహం, జెడ్పీహైస్కూల్ను బుధవారం ఆయన తనిఖీ చేశారు. హాస్టల్లో సౌకర్యాలు పరిశీలించి స్టాక్ వివరాలను వార్డెన్ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. అనంతరం జెడ్పీహైస్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థుల వివరాలు తెలుసుకొని సౌకర్యాలు, విద్యాబోధనపై సబ్ కలెక్టర్ ఆరా తీశారు. సబ్ కలెక్టర్ వెంట తహసీల్దార్ శ్రీనివాస్ ఉన్నారు. పారదర్శకత పాటించాలి రైతులకు యూరియా పంపిణీ సక్రమంగా జరిగేలా వ్యవసాయశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ మయాంక్సింగ్ సూచించారు. మహాముత్తారం మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద యూరియా పంపిణీ ప్రక్రియను ఆయన పర్యవేక్షించారు. యూరియా స్టాక్, రిజిస్టర్లు పరిశీలించారు. పంపిణీలో పారదర్శకత పాటించాలని సబ్ కలెక్టర్ పీఏసీఎస్ అధికారులను ఆదేశించారు.కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్ -
ప్రియుడి మోజులో పడి..
భూపాలపల్లి అర్బన్: ప్రియుడి మోజులో పడిన ఓ మహిళ.. భర్తను, కుమార్తెను మూడు నెలల వ్యవధిలో హతమార్చింది. అనారోగ్యంతో భర్త చనిపోయాడని, కూతురు కనిపించడం లేదని నమ్మించింది. పోలీసులు ఆరా తీయగా ఆ మహి ళ బాగోతం బయటపడింది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఒడితల గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్పీ కిరణ్ఖరే బుధవారం ఈ కేసు వివరాలు వెల్లడించారు. ఆగస్టు 28న కాటారం పోలీస్స్టేష న్ పరిధిలోని జాతీయ రహదారి పక్కన యువతి మృతదేహం పడి ఉన్నట్లు పోలీసులకు సమాచా రం వచ్చింది. కాటారం ఎస్సై, సీఐ, డీఎస్పీలు ఘట నా స్థలాన్ని పరిశీలించి మృతదేహం చిట్యాల మండలం ఒడితల గ్రామానికి చెందిన కప్పుల వర్షిణి (22)గా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆగస్టు 3వ తేదీనుంచి వర్షిణి కనిపించడం లేదని ఆమె తల్లి కవిత అదే నెల 6న చిట్యాల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు గుర్తించారు. పోలీసుల దర్యాప్తులో కవితపై అనుమానం వచ్చిన పోలీసులు ఆ దిశగా విచారణ జరిపి తల్లి కవితనే సూత్రధారిగా గుర్తించారు. ఈ నెల 2వ తేదీన కవిత, ఆమె ప్రియుడు రాజ్కుమార్ కాటారం సీఐ నాగార్జునరావుకు పట్టుబడ్డారు. విచారణలో విస్తుపోయే విషయా లు బయటికి వచ్చాయి. మూడు నెలలక్రితం భర్తను.. కుమారస్వామి మొదటి భార్య చనిపోవడంతో మల్హర్ మండలం కొయ్యూరుకు చెందిన కవితను 24 ఏళ్లక్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఇరువురు కుమార్తెలు కాగా చిన్న కూ తు రు ఇటీవల ప్రేమ వివాహం చేసుకుంది. పెద్ద కూతురు ఇంటి వద్దే ఉంటోంది. కుమారస్వామికి పక్షవాతం రాగా ఐదేళ్లుగా మంచంపైనే ఉంటున్నాడు. ఈ క్రమంలో కవిత అదే గ్రామానికి చెందిన రాజ్కుమార్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విష యంపై ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే భర్తను చంపాలని నిర్ణయించుకున్న కవిత.. తన ప్రియుడుతో కలిసి జూన్ 25న మంచంలో పడుకున్న కుమారస్వామిని గొంతు నులిమి హత్య చేశారు. అనారోగ్యంతో చనిపోయాడని చిత్రీకరించారు. ఈ విషయం కూతురు వర్షిణికి తెలియడంతో ఆమెను కూడా హత్య చేయాలని నిర్ణయించారు. ఆగస్టు 3న రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న వర్షిణిని కవిత, రాజ్కుమార్ కలిసి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారు. మృతదేహాన్ని సంచిలో వేసి ఇంటి వెనకాల చెట్ల పొదల్లో దాచిపెట్టి మరుసటి రోజు గ్రామ శివారులోని పొదల్లో పడేశారు. మృతదేహం దుర్వాసన వస్తుండటంతో 25వ తేదీన కాటారం వైపునకు తీసుకువచ్చి అడవిలో పడేసి వెళ్లాడు. పోలీసుల దృష్టి మళ్లించేందుకు యూట్యూబ్లో చూసి అడవిలో క్షుద్ర పూజలు చేసినట్లు ఆనవాళ్లు వదిలివెళ్లారు. కాగా, విచారణలో రెండు హత్యలు చేసినట్లు కవిత, రాజ్కుమార్లు ఒప్పుకున్నట్లు ఎస్పీ తెలిపారు. -
పాస్బుక్కు ఒకే బస్తా
బుధవారం శ్రీ 3 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025మల్హర్: తాడిచర్ల సొసైటీకి మంగళవారం 444 బస్తాలు, కొయ్యూరులోని ఓ ప్రైవేట్ దుకాణానికి 200 బస్తాలు వచ్చాయి. రైతులు తెల్లవారు జాము నుంచి భారీగా చేరుకున్నారు. కొయ్యూరు పోలీసులు పంపిణీ కేంద్రం వద్దకు చేరుకొని లైన్లో ఒక్కొక్కరికి టోకోన్ అందించి, ఒక్క రైతుకు ఒక్క బస్తా మాత్రమే అందించారు. గంటల తరబడి వేచి ఉన్నా ఒక్క బస్తా మాత్రమే అందించడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్తాలు అందని రైతులు ఇంటి ముఖం పట్టారు. చిట్యాల: మండలకేంద్రంలోని ఆగ్రో ఏజన్సీస్ షాపు వద్దకు రైతులు మంగళవారం ఒక్కసారిగా రావడంతో గందరగోళం చోటుచేసుకుంది. పోలీసుల పహారాలో వ్యవసాయ అధికారులు యూరియా పంపిణీ చేశారు. అనేక మంది రైతులు క్యూలైన్లో గంటల తరబడి నిలబడ్డా దొరకకపోవడంతో ఆగ్రహంతో వెనుదిరిగారు. టేకుమట్ల: మంగళవారం ఆగ్రోస్–2కు ఒక లోడు యూరియా వచ్చింది. రైతులు మండల కేంద్రానికి చేరుకుని యూరియా కోసం ఎగబడ్డారు. లారీ నుండి నేరుగా యూరియా బస్తాలను తీసుకెళ్లారు. సుమారు మూడు గంటల పాటు ఫర్టిలైజర్ దుకాణం ఎదుట పడిగాపులు కాశారు.మొగుళ్లపల్లి మండలకేంద్రంలోని పరకాల–జమ్మికుంట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేస్తున్న రైతులుభూపాలపల్లి: జిల్లాలో యూరియా కొరత తీవ్రతరమైంది. మొక్కదశలో ఉన్న పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా తిప్పలు పడుతున్నారు. వర్షంలో గంటల తరబడి క్యూలైన్లో నిలబడగా కొందరికి ఒక్కో బస్తా చొప్పున అందగా, వందలాది మంది రైతులు ఉట్టి చేతులతోనే వెనుదిరుగుతున్నారు. వర్షంలో గంటల తరబడి నిలబడినా.. రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పోలిస్తే జిల్లాలో వరిసాగు నెల రోజులు ఆలస్యంగా జరుగుతుంది. ప్రస్తుతం వరి, పత్తి, మిర్చి సాగు చేస్తున్న రైతులకు ప్రధానంగా యూరియా అవసరం ఉంది. ఈ సమయంలోనే తీవ్ర కొరత ఉండటంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. మంగళవారం జిల్లాలోని భూపాలపల్లి మండలం జంగేడు, మహదేవపూర్, చిట్యాల, గణపురం మండల కేంద్రాలకు ఒక్కో లారీ లోడ్ చొప్పున యూరియా బస్తాలు వచ్చాయి. యూరియా వస్తుందని తెలుసుకున్న రైతులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఉదయం ఎనిమిది గంటల నుంచే పీఏసీఎస్ గోడౌన్ల వద్ద బారులుదీరారు. ఒక్కో దగ్గర వేయి మందికి పైగా రైతులు క్యూలైన్లో ఉన్నారు. పోలీసుల పహారాలో లారీలోని 400 బస్తాలను అధికారులు మొదట ఉన్న రైతులకు ఒకటి చొప్పున మాత్రమే పంపిణీ చేశారు. మిగిలిన వారంతా ఆగ్రహానికి లోనయ్యారు. తమ పంటల పరిస్థితి ఏంటని అధికారులను నిలదీశారు. ప్రతీ మండలానికి ఐదారు రోజులకు ఒక లోడ్ మాత్రమే వస్తుందని, యూరియా లేక పంటలు ఎదగడం లేదని రైతులు వాపోతున్నారు. కావాల్సింది 42,331 మెట్రిక్ టన్నులు ఇప్పటి వరకు వచ్చింది 11,200 మెట్రిక్ టన్నులు రావాల్సింది 31,131 మెట్రిక్ టన్నులు పోలీసుల పహారాలో పంపిణీ లారీ లోడ్ వస్తే క్యూలైన్లలో వేయికి పైగా రైతులు వందలాది మందికి అందని యూరియా -
యూరియా అందించడంలో విఫలం
మల్హర్: రైతులకు సరిపడా యూరియా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని టీపీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుబాసి పార్వతి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులు యూరియాకోసం గంటల తరబడి లైన్లలో నిలబడినా సరిపడా దొరకడం లేదన్నాన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పూర్తిస్థాయిలో యూరియా అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మల్హర్: సింగరేణి కాలరీస్ ఆధ్యర్యంలో నిర్వహించిన 55వ సేఫ్టీ పోటీల్లో తాడిచర్ల ఓపెన్ కాస్ట్ మైన్ ప్రతిష్టాకరమైన ‘బెస్ట్ సేఫ్టీ ప్రాక్టీసెస్ ఇన్ ఓపెన్ కాస్ట్ మైన్స్’ అవార్డుకు ఎంపికై ంది. సింగరేణి 55వ రక్షణ పక్షోత్సవ బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం ఆగస్టు 31న మంచిర్యాలలో అత్యంత వైభవంగా నిర్వహించారు. మైన్ ఏజెంట్ జీవ కుమార్, మైన్ మేనేజర్ శ్రీనివాస్, మైన్ సేఫ్టీ ఆఫీసర్ సురేష్ బాబు, జెన్కో ఎస్ఈ శ్రీనివాస్, మైన్ ఇంజనీర్ రాజు, వర్క్ మాన్ ఇన్స్పెక్టర్ సదానందం, రోడ్డ నరేష్ అవార్డును అందుకున్నారు. కాళేశ్వరం: యూరియా మహారాష్ట్రకు అక్రమంగా తరలిపోకుండా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మహదేవపూర్ మండలం కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన వద్ద కాళేశ్వరం ఎస్సై జి.తమాషారెడ్డి, మండల రెవెన్యూ సిబ్బంది మంగళవారం తనిఖీలు చేపట్టారు. రాష్ట్రం నుంచి ఎవరైనా యూరియాను మహారాష్ట్రకు తరలిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. భూపాలపల్లి అర్బన్: సివిల్ సర్వీసెస్ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల 9, 10 తేదీల్లో హైదరాబాద్లో క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు డీవైఎస్ఓ రఘు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనే ఉద్యోగులు హైదరాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు హాజరుకావాలని సూచించారు. ఈ నెల 5వ తేదీలోపు డీవైఎస్ఓ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. వివరాలకు 96180 11096, 81251 13132 ఫోన్నంబర్లలో సంప్రదించాలని సూచించారు. భూపాలపల్లి అర్బన్: సింగరేణి వర్క్పీపుల్స్, గేమ్స్ అసోసియేషన్ భూపాలపల్లి ఏరియా స్థాయి కబడ్డీ క్రీడాపోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఏరియాలోని అంబేడ్కర్ స్టేడియంలో జరిగిన ఈ క్రీడాపోటీలకు ఏరియా సివిల్ ఏజీఎం రవికుమార్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. క్రీడలు కేవలం ఆనందం మాత్రమే కాదని ఆరోగ్యానికి, శారీరక ధృడత్వానికి, పట్టుదలకు దారితీసే మంచి మార్గమన్నారు. సింగరేణి సంస్థ క్రీడల ప్రోత్సాహానికి, యువ ఉద్యోగులలో ప్రతిభను వెలికితీసి కోల్ ఇండియా స్థాయిలో రాణించాలనే ఉద్దేశంతో క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ కావూరి మారుతి, స్పోర్ట్స్ సూపర్వైజర్ శ్రీనివాస్, కోఆర్డినేటర్ పాక దేవయ్య, జనరల్ కెప్టెన్ మల్లేశ్, కబడ్డీ కెప్టెనన్్ గణేశ్, క్రీడాకారులు పాల్గొన్నారు. భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని ఓపెన్కాస్టుల నుంచి ఉప్పల్కు బొగ్గు రవాణా చేసే టిప్పర్కు ప్రతి టన్నుకు రూ.250 చెల్లించాలని టిప్పర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రోడ్డ రవీందర్ డిమాండ్ చేశారు. మంగళవారం ఏరియాలోని అసోసియేషన్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం చేశారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ.. కాంట్రాక్టర్స్ టిప్పర్ అసోసియేషన్కు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో అసోసియేషన్ నాయకులు ప్రభాకర్, అశోక్, తిరుపతి, రమేష్, శ్రీనివాస్, మధుకర్రెడ్డి, కుమారస్వామి పాల్గొన్నారు. -
ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి
భూపాలపల్లి: జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కలెక్టర్ రాహుల్ శర్మ కోరారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐడీఓసీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మట్టి వినాయక విగ్రహానికి మంగళవారం కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పర్యావరణరహిత గణేషులనే ప్రతిష్ఠించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, ఆర్డీఓ రవి, సీపీఓ బాబురావు, డీపీఆర్ఓ శ్రీనివాస్, ఈడీఎం శ్రీకాంత్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
పేదల పక్షపాతి వైఎస్సార్
చిట్యాల: పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేసిన గొప్ప మహనీయుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మండలకేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం వైఎస్సార్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి, నాయకులు దబ్బెట రమేష్, ముకిరాల మధువంశీకృష్ణ, గడ్డం కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
ప్రజలకు సులభంగా సేవలు
చిట్యాల: ప్రజలకు సులభంగా సేవలు అందేలా చర్యలు చేపట్టాలని ఎస్పీ కిరణ్ఖరే కోరారు. ఈ సందర్భంగా మంగళవారం మండలకేంద్రంలోని పోలీస్స్టేషన్లో నూతనంగా నిర్మించిన రిసెప్షన్ కౌంటర్ రూంను ఆయన ప్రారంభించారు. వార్షిక తనిఖీలో భాగంగా స్టేషన్ రికార్డులు, కేసుల రిజిస్టర్లు , ఎఫ్ఐఆర్ కాఫీలు, స్టేషన్ డైరీ తదితర అంశాలపై పరిశీలించారు. కేసుల దర్యాప్తు వేగంగా, పారదర్శకంగా జరగాలని పోలీసులకు సూచించారు. అనంతరం పోలీస్ష్టేషన్ ఆవరణలో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కను నాటారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు, సీఐ మల్లేష్, ఎస్సై శ్రావన్కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.ఎస్పీ కిరణ్ఖరే -
ప్రధాన రహదారిపై రాస్తారోకో..
మొగుళ్లపల్లి : మండల కేంద్రంలోని పీఏసీఎస్ గోదాం ఎదుట ఉదయం నుంచి రైతులు బారులుదీరారు. 11 గంటలు కావస్తున్నా పంపిణీ ప్రారంభించకపోవడంతో పరకాల–జమ్మికుంట ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు. దీంతో అరగంట సేపు వాహనాలు స్తంభించిపోయాయి. 400 బస్తాలు.. 2000 మంది రైతులు గణపురం: మండలానికి 400 బస్తాలు రాగా సుమారు 2వేల మంది రైతులు వచ్చి యూరియా కావాలంటూ ఆందోళనకు దిగారు. దీంతో ఎస్సై అశోక్ సిబ్బందితో కలిసి రైతులను క్యూ లైన్లో నిలబెట్టి యూరియాను సరఫరా చేశారు. -
ఉదయం 7నుంచే బారులు.. ఆందోళన
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మండలం జంగేడు పీఏసీఎస్ ఎదుట రైతులు ఉదయం ఏడు గంటల నుంచే యూరియా కోసం బారులుదీరారు. యూరియా సక్రమంగా పంపిణీ చేయాలని ఉదయం 11గంటలకు రైతులు ఆందోళన చేయగా పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఒక్క రైతు కుటుంబానికి ఒక బస్తా పంపిణీ చేశారు. రేగొండ: మండల కేంద్రంలోని ఆగ్రోస్కు మంగళవారం ఉదయం 444 బస్తాల యూరియా రాగా, పంపిణీ చేస్తారని తెలుసుకున్న రైతులు వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ఉదయం నుంచే రైతులు బారులుదీరారు. రెండు రోజుల క్రితం రైతువేదికల వద్ద టోకెన్ తీసుకున్న వారికి మాత్రమే యూరియా పంపిణీ చేయడంతో మిగతా రైతులు నిరాశతో వెనుదిరిగారు. -
పర్యాటకంగా అభివృద్ధి చేస్తా
రేగొండ: బుగులోని, పాండవుల గుట్టలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. తిరుమలగిరి శివారులోని బుగులోని వెంకటేశ్వర స్వామి జాతరలో రూ.1.60 కోట్లతో పలు అభివృద్ధి పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పాలకులు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవకాశమున్నా ఆ దిశగా కృషి చేయలేదని విమర్శించారు. గతంలోనే జాతరకు వచ్చే రోడ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు కాగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పనులు ప్రారంభం కాలేదన్నారు. త్వరితగతిన పనులు పూర్తయ్యేలా అధికారులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, కంజర్వేటర్ ప్రభాకర్, డీఎఫ్ఓ నవీన్రెడ్డి, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, పీఏసీఎస్ చైర్మన్ నడిపల్లి వెంకటేశ్వరరావు, నాయకులు సంపత్రావు, ఉమేష్ గౌడ్, పున్నం రవి, నిమ్మల విజేందర్, శంకర్, శ్రీనివాస్, భిక్షపతి, రమేష్ పాల్గొన్నారు.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు -
తేనెటీగల పెంపకం ద్వారా ఉపాధి
భూపాలపల్లి అర్బన్: తేనెటీగల పెంపకం ద్వారా సింగరేణి ప్రభావిత ప్రాంతాల మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి తెలిపారు. సోమవారం ఏరియాలోని ఓపెన్ కాస్టు ప్రభావిత గ్రామమైన గడ్డిగానిపల్లిలో తేనెటీగల పెంపకం, శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జీఎం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తేనెటీగల పెంపకం, శిక్షణ కోసం రూ.74,86,500 సింగరేణి సంస్థ కేటాయించినట్లు చెప్పారు. సింగరేణి వ్యాప్తంగా మూడు ఏరియాలలో ఈ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు తెలిపారు. భూపాలపల్లి ఏరియాకు రూ.24లక్షలు కేటాయించినట్లు తెలిపారు. మనబ్ కల్యాణ్ వెల్ఫేర్ సొసైటీ (ఎన్జీఓ) ఆధ్వర్యంలో పెంపకంపై ఒక వారం పాటు శిక్షణ సుమారు 100 మంది మహిళలకు ఇవ్వనున్నట్లు చెప్పారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సింగరేణి సంస్థ స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ద్వారా చదువుకున్న వారికి 36 రకాల ఉచిత కోర్సులు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఽధికారులు పోషమల్లు, మారుతి, శ్యాంసుందర్, రమాకాంద్, కృష్ణయ్య, శ్రీను, ప్రశాంత్, రాజ్వాలియా, కార్మిక సంఘాల నాయకులు రమేష్ పాల్గొన్నారు. -
జిల్లాలో పెరుగుతున్న సీజనల్ వ్యాధులు
జిల్లాలో నమోదైన కేసులుభూపాలపల్లి అర్బన్: 20 రోజులుగా కురుస్తున్న వర్షాలకు దోమలు వ్యాప్తి చెంది జిల్లాలో డెంగీ, మలేరియా జ్వరాలు విజృంభిస్తున్నాయి. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి రోజురోజుకూ ఓపీ తాకిడి పెరుగుతోంది. ప్రతి రోజు 300 నుంచి 400 మంది వరకు దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్న వారు వస్తున్నారు. జిల్లాలో 8 నెలల్లో 42 డెంగీ, 9 మలేరియా కేసులు నమోదుకాగా.. మహాముత్తారం మండలంలో అత్యధికంగా డెంగీ, మలేరియా కేసులు నమోదయ్యాయి. కొనసాగుతున్న ఫీవర్ సర్వే జిల్లాలో గత నెల చివరి వారంలో నిర్వహించిన సర్వేలో 12 మండలాల్లో 821 మందికి జ్వరం, దగ్గు, జలుబు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు గుర్తించారు. వైద్యారోగ్యశాఖ సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించి అనుమానిత 500 మంది నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్షలు సైతం నిర్వహించారు. వారిలో నుంచి నాలుగు డెంగీ, ఒక మలేరియా పాజిటివ్ వచ్చాయి. యుద్ధప్రాతిపదికన చర్యలు.. జిల్లాలోని 241 గ్రామపంచాయతీల్లో దోమల నివారణ, వ్యాధులు ప్రబలితే సత్వరమే స్పందించి బాధితులకు తగిన చికిత్సను అందించేలా వైద్యారోగ్య శాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు. పరిసరాల పరిశుభ్రతలో భాగంగా గ్రామ కార్యదర్శి, ఆశకార్యకర్తలను, స్థానిక వైద్యాధికారి, అంగన్వాడీ కార్యకర్త, సబ్ సెంటర్ల పరిధిలోని ఇద్దరు చొప్పున ఏఎన్ఎంలను ఆరోగ్య కార్యకర్తలు, పీహెచ్సీల స్థాయిలో సూపరైజర్లను అప్రమత్తం చేశారు. కేసులు నమోదు మేరకు పరిసర ప్రాంతాల్లో ప్రజల నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్షలను నిర్వహించేలా సిద్ధం చేశారు. వర్షాకాలం వ్యాధులు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమాలు చేపడుతూ అవగాహన కల్పిస్తున్నాం. వివిధ రకాల దోమలు, కీటకాలతో వ్యాధులు ప్రబలుతున్నాయి. పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి. దోమలు పుట్టకుండా.. కుట్టకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండేందుకు అవకాశం లేకుండా చూసుకోవాలి. – డాక్టర్ మధుసూదన్, డీఎంహెచ్ఓసంవత్సరం డెంగీ మలేరియా 2019 27 18 2020 07 56 2021 11 58 2022 19 24 2023 85 03 2024 60 12 2025 (ప్రస్తుతం) 42 09 8 నెలల్లో 42 డెంగీ, 9 మలేరియా కేసులు ఇంటింటా కొనసాగుతున్న ఫీవర్ సర్వే జిల్లా వ్యాప్తంగా 821 మంది జ్వర పీడితులు -
గోదావరి జలాలతో అభిషేకం
భూపాలపల్లి అర్బన్: కాళేశ్వరం ప్రాజెక్ట్పై కాంగ్రెస్ పార్టీ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు సోమవారం జిల్లాకేంద్రంలోని అమరవీరుల స్థూపానికి గోదావరి జలాలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం పట్టణ అధ్యక్షుడు జనార్దన్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ను సీఎం రేవంత్రెడ్డి కుట్ర పూరితంగా చూస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
సొంతింటి కల నెరవేరుస్తాం
భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికులకు ఇచ్చిన హమీ ప్రకారం సొంతింటి కల నెరవేరుస్తామని ఐఎన్టీయూసీ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి సభ్యుడు నరసింహరెడ్డి తెలిపారు. ఏరియాలోని కేటీకే 1వ గనిలో సోమవారం బాయిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నరసింహరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సింగరేణి సంస్థ ప్రగతిలో కార్మికులు పునాదులుగా నిలుస్తున్నారని తెలిపారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించినట్లు తెలిపారు. కార్మికుల శ్రమకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. దసరా పండగలోపు కార్మికులు 35శాతం లాభాల వాటా ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మధుకర్రెడ్డి, బుచ్చయ్య, రాజేందర్, రఘుపతిరెడ్డి, వేణుగోపాల్, రమేష్, చక్రపాణి, రవికిరణ్, నర్సింగరావు, సమ్మయ్య, శ్రీనివాస్, శ్రవణ్కుమార్, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
పాత పెన్షన్ను పునరుద్ధరించాలి
భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ (సీపీఎస్) విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని ఉద్యోగ సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ బురుగు రవి డిమాండ్ చేశారు. సోమవారం పెన్షన్ విద్రోహ దినం పాటించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన రహదారి నుంచి కలెక్టరేట్ వరకు ఉద్యోగ, ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ.. షరతులు లేని, కాంట్రిబ్యూట్ లేని విధంగా పెన్షన్ను అందించాలన్నారు. 30 సంవత్సరాలుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన ఉద్యోగికి, ఉద్యోగ విరమణ అనంతరం భరోసా లేకుండా ఉన్నటువంటి షేర్ మార్కెట్ పెట్టుబడులపై ఆధారపడిన, స్థిరమైన పెన్షన్ లేని లోపభూయిష్టమైన ఈ అసంబద్ధమైన పెన్షన్ విధానాన్ని రద్దుచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు విజయలక్ష్మి, దిల్హాత్, తిరుపతి, రామారావు, జ్ఞానేశ్వర్, సురేందర్, అన్వర్, మురళీదర్, శ్రీదేవి, సునీల్, సందాని, మురళీధర్రావు, కిరణ్కుమార్, రవీందర్రెడ్డి, మధుసూదన్, భార్గన్, రమణారెడ్డి, రాజ్కుమార్, హరిప్రసాద్ పాల్గొన్నారు. -
ప్రతీ ఫిర్యాదుకు ప్రాధాన్యం ఇవ్వాలి
భూపాలపల్లి: ప్రజాదివస్లో వచ్చే ప్రతీ ఫిర్యాదుకు ప్రాధాన్యత ఇచ్చి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఎస్పీ కిరణ్ ఖరే పోలీసు అధికారులకు సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజాదివస్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. మహిళలు, చిన్న పిల్లలకు సంబంధించిన కేసుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయవద్దని పోలీసు అధికారులకు సూచించారు. పోలీస్స్టేషన్ల పరిధిలో రాత్రిపూట గస్తీ పకడ్బందీగా నిర్వహించాలన్నారు.ఎస్పీ కిరణ్ ఖరే -
వరదలపై అప్రమత్తంగా ఉన్నాం
భూపాలపల్లి: వర్షాకాలం నేపథ్యంలో వరదలపై అప్రమత్తంగా ఉండి, తగు ముందస్తు చర్యలు తీసుకున్నామని కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడించారు. సోమవారం హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం నుంచి రాష్ట్ర మంత్రులతో కలిసి సీఎం రేవంత్రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం పలు సూచనలు, సలహాలు అందించిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని అన్నారు. జిల్లా అధికారులంతా అప్రమత్తంగా ఉన్నారని, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ వెంట ఎస్పీ కిరణ్ ఖరే, జిల్లా అధికారులు ఉన్నారు. దరఖాస్తులు పరిష్కరించాలి.. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు సమర్పించిన దరఖాస్తులు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 70మంది నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సమస్య పరిష్కారం కోసం ఇచ్చిన దరఖాస్తులను నిర్లక్ష్యం చేయకుండా సంబంధిత శాఖాధికారులు జాగ్రత్తగా పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి దరఖాస్తుకు సమాధానం ఇవ్వడం, అవసరమైన సమాచారం ప్రజలకు అందించడం, సమస్య పరిష్కారం దిశగా స్పష్టమైన రిపోర్టులు సమర్పించడం అధికారుల బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ను కలిసిన ఈఈ బసవప్రసాద్.. భూపాలపల్లి ఇరిగేషన్ డివిజన్–1 డీఈగా విధులు నిర్వర్తిస్తున్న బసవప్రసాద్కు ఈఈగా పదోన్నతి లభించగా సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో కలెక్టర్ రాహుల్శర్మను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. విజయవంతంగా ముందుకు సాగాలని కలెక్టర్ సూచించారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
గణపతి నిమజ్జనం ఏర్పాట్ల పరిశీలన
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం గోదావరి వద్ద గణపతి నిమజ్జనం ఏర్పాట్లను కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, మహదేవపూర్ తహసీల్దార్ రామారావు సోమవారం పరిశీలించారు. ఈనెల 5న నిమజ్జనం చేయనున్న నేపథ్యంలో అంతర్రాష్ట్ర వంతెన వద్ద అన్నిశాఖల అధికారులతో రెండు చోట్ల పరిశీలన చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో వినాయక ప్రతిమలు తరలివస్తాయని ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. అనంతరం కాళేశ్వరం పోలీసుస్టేషన్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గజ ఈతగాళ్లు, ఎన్పీడీసీఎల్, దేవాదాయశాఖ, ఎకై ్సజ్శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ ఎన్.వెంకటేశ్వర్లు, ఎస్సై తమాషారెడ్డి పాల్గొన్నారు. -
హేమాచలక్షేత్రంలో భక్తుల కోలాహలం
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. ఆలయంలోని స్వయంభూ లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శించుకుని పూజలు నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి కార్లు, ఆటోలు ఇతర ప్రైవేట్ వాహనాల్లో హేమాచలగుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ ప్రాంగణంలోని చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలయంలోని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు స్వామివారికి తిలతైలాభిషేకం పూజలు నిర్వహించారు. స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని పులకించారు. భక్తుల గోత్రనామాలతో ప్రత్యేక అర్చనలు జరిపించిన పూజారులు స్వామివారి విశిష్టత, ఆలయ పురాణాన్ని భక్తులకు వివరించారు. సంతానం కోసం స్వామివారి నాభిచందన ప్రసాదం స్వీకరించేందుకు వచ్చిన దంపతులకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదాన్ని పంపిణీ చేసి వేద మంత్రోచ్ఛరణతో ఆశీర్వచనం ఇచ్చారు. -
ఏటా భారంగా..
కూలీల కొరతతో అన్నదాతల అవస్థలుభూపాలపల్లి రూరల్: వ్యవసాయం రోజురోజుకూ భారంగా మారుతోంది. ఆరుగాలం కష్టపడే రైతన్నలకు ఏటా కష్టాలు తప్పటం లేదు. అతివృష్టి, అనావృష్టితో పాటు కూలీల కొరత, పెరిగిన ఎరువుల ధరలతో పాటు యాంత్రీకరణలో వెనుకంజతో సాగు చేయాలంటేనే అన్నదాతలు ఆందోళన చెందే పరిస్థితి వచ్చింది. పెరిగిన ధరలకు అనుగుణంగా కూలి రేట్లను పెంచుతుండటంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. తప్పని పరిస్థితుల్లో బతుకుదెరువు కోసం సాగు ఊబిలో దిగి అష్టకష్టాలు పడుతున్నారు. వరి, పత్తికి ప్రాధాన్యం.. మండలంలోని చెరువులు, కాలువలు, బోరుబావుల కింద వరి సాగుతో పాటు పత్తి, మిర్చి, మొక్క జొన్న ఇతర పంటలను సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో ఉన్న కొద్దిపాటి భూములను ఎవరికి వారు సాగు చేస్తుండటంతో కూలీల కొరత అధికమైంది. జిల్లాలో వరి 87,500 ఎకరాలు, పత్తి 98,500 ఎకరాల్లో సాగు చేశారు. మిర్చి 24వేల ఎకరాలకు నారు పోసుకున్నారు. ఎకరం భూమిలో దుక్కులు దున్నటం, నాట్లు వేయటం మందు చల్లటం వంటి పనులు చేయాలంటే సుమారు 12 మంది కూలీలు అవసరం ఉంటుంది. ఇక పత్తి, మిర్చి పంటల్లో 20 మంది వరకు కూలీలు అవసరముంటుంది. కానీ ఎవరి పొలాలను వాళ్లు సాగు చేస్తుండటంతో కూలీల కొరత అధికంగా ఉంది. దీంతో పరిసర ప్రాంతాల నుంచి కూలీలను తీసుకురావాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. అందుబాటులో లేని యంత్రాలు వరిసాగుకు ఒక్క ట్రాక్టర్ తప్పా ఇతర యంత్రాలు ఏవీ అందుబాటులో లేవు. కొన్నిచోట్ల గొర్రు ట్రాక్టర్తో వేస్తున్నా.. అందుబాటులో లేనివారు ఇబ్బందులు పడుతున్నారు. నాట్లు వేసే యంత్రాలు మార్కెట్లోకి వచ్చినా స్థానికంగా ఇంకా వాడకంలోకి రాలేదు. దీంతో కూలీల వినియోగం తప్పనిసరి అయింది. అచ్చులు, గొర్రు, నాటు వేయడం అన్నింటికీ కూలీల డిమాండ్ బాగా పెరిగింది. ఎరువుల ధరలు కూడా దాదాపు బస్తాకు రూ.200 నుంచి రూ.300 వరకు పెరగడంతో రైతులపై అదనపు భారం పడుతోంది.మారుతున్న కాలంలో పాటు, పెరిగిన ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. కూలీల కొరత ఉండటం వలన కూలీ రేట్లను అమాంతంగా పెంచేశారు. దీంతో రైతులు పరిసర గ్రామాల నుంచి కూలీలను అడిగినంత కూలీ చెల్లిస్తూ ప్రత్యేక వాహనాల్లో తీసుకురావాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. గతేడాది మహిళలకు కూలి రూ.250 వరకు ఉండేది. కానీ ఈ ఏడాది రూ.400నుంచి రూ.500 వరకు పెరిగింది. పురుషులకు రూ.500 నుంచి రూ.900 వరకు చెల్లించాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. కూలీ రేట్లకు రెక్కలు.. అమాంతం పెరుగుదల రూ.800 వరకు డిమాండ్ ఇబ్బందులు పడుతున్న రైతులు -
పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ బస్సులు
భూపాలపల్లి అర్బన్: ఆదాయాన్ని రాబట్టి లాభాల బాటపట్టేలా అన్ని మార్గాలను ఆర్టీసీ యాజమాన్యం అన్వేషిస్తోంది, గతంలో ప్రయాణికుల సమస్యలను అంతగా పట్టించుకోని ఆర్టీసీ నేడు ప్రయాణికులకు చేరువయ్యేందుకు వినూత్న సేవలను ప్రవేశపెట్టడానికి ప్రణాళిక రూపొందించుకుంది. ఈ నేపథ్యంలో భూపాలపల్లి ఆర్టీసీ డిపో నుంచి వినోద, విహరయాత్రలకు ప్రత్యేక బస్సులను నడిపించే చర్యల్లో నిమగ్నమైంది. ఆదాయానికే పరిమితం కాకుండా ప్రయాణికుల కుటుంబాలకు సైతం వినోదం, విహరయాత్రలను పంపించేందుకు ప్రత్యేకంగా బస్సులను కేటాయించింది. ఇది వరకే ప్రయాణికులను ఆదరించేలా ప్రతి డిపోలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిత్య విధుల్లో తీరికలేకుండా గడిపే వారికి కాలక్షేపం కోసం, తీర్థయాత్రలపై ఆసక్తి ఉన్న వారికోసం ప్రత్యేక బస్సులను కేటాయిస్తున్నారు. ప్రయాణికులు ఎక్కడికి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారన్నది తెలుసుకొని ఈ యాత్ర ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ముందస్తుగా యాత్ర వివరాలు, తేదీలు, చార్జీలను ప్రకటించి ప్రయాణికులు పేరు నమోదు చేసుకునే విధంగా ప్రచారం చేపడుతున్నారు. జిల్లా కేంద్రం నుంచి ఈ నెలలో 4 టూర్ ప్యాకేజీల వివరాలను ప్రారంభించారు. విహర, వినోద యాత్రను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఈ నెలలో నాలుగు రూట్లలో బస్సులు నడపడానికి ప్రణాళికలు రూపొందించాం. ముందస్తుగా డిపోలో పేర్లు నమోదు చేసుకొని సీట్లు రిజర్వేషన్ చేసుకోవాలి. – ఇందూ, డిపో మేనేజర్, భూపాలపల్లి ప్రయాణికుల కోసం ప్రత్యేక ప్యాకేజీలు ఆదాయం పెంపునకు చర్యలు ఈ నెలలో మూడు టూర్లకు ప్యాకేజీలు సిద్ధం -
రైతులను రోడ్డు మీదేసిన కాంగ్రెస్
రేగొండ: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతాంగం గోస పడుతుందని, రాష్ట్రాన్ని బాగు చేస్తారని నమ్మి ఓట్లేస్తే .. రైతులను నడి రోడ్డున నిలబెడుతున్నారంటూ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. రైతులకు సరిపడా యూరియా అందించాలని ఆదివారం మండల కేంద్రంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. రైతాంగం సాగు అవసరాలపై ముందు చూపు లేకపోవడమే రైతుల కష్టానికి కారణమన్నారు. యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. రాజకీయ ప్రయోజనాలే ధ్యేయంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడని ఆరోపించారు. ఇప్పటికై నా ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అంకం రాజేందర్, నాయకులు మహేందర్, సుమన్, శ్రీనివాస్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి -
శాంతించిన గోదావరి
కన్నాయిగూడెం: మూడు రోజుల నుంచి ఉరకలేసిన గోదావరి ఉధృతి ఆదివారం కొంతమేర తగ్గి శాంతించింది. మండల పరిధిలోని తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్కసాగర్ బ్యారేజీలోకి ఆదివారం సాయంత్రం వరకు 8,17,183 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. నిన్నటి వరకు 8,57,190 క్యూసెక్కుల నీరు వచ్చి చేరగా ఆదివారం 40 వేల క్యూసెక్కుల మేర ప్రవాహం తగ్గి శాంతించింది. ప్రస్తుతం బ్యారేజీ 59 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. బ్యారేజీ వద్ద ప్రస్తుతం 82.90 మీటర్ల నీటి మట్టం ఉంది. ఇన్టెక్వెల్ వద్ద ఫేజ్.2 లో ఒక మోటారును ఆన్ చేసి 247 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తున్నారు. ఇంకా నీటిలోనే రహదారులు వాజేడు: మండల పరిధిలోని పేరూరు వద్ద గోదావరి వరద క్రమేపీ తగ్గుతూ వస్తోంది. మూడు రోజుల క్రితం ముంపునకు గురైన రహదారులు ఇంకా నీటిలోనే ఉన్నాయి. వరద ఇలానే తగ్గుముఖం పడితే కొన్నిచోట్ల రహదారులు బయటపడే అవకాశం ఉంది. టేకులగూడెం చివరన 163 నంబర్ జాతీయ రహదారి ముంపునకు గురికావడంతో ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వాజేడు– గుమ్మడిదొడ్డి, ఏడ్జెర్లపల్లి– పూసూరు, పేరూరు–కృష్ణాపురం గ్రామాల మధ్యన రహదారులు ముంపులోనే ఉండడంతో ఆయా గ్రామాలకు ఇంకా రాకపోకలు కొనసాగడం లేదు. జాతీయ రహదారి నుంచి కోయవీరాపురం గ్రామానికి వెళ్లే రహదారి చాకలి వాగు వద్ద మునగడంతో గ్రామస్తులు గుట్ట పక్కన ఉన్న పాత దారి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద 8,17,183 క్యూసెక్కుల నీటి ప్రవాహం 59 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల -
గంజాయి స్వాధీనం
మల్హర్: మండలంలోని ఎడ్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని జంగిడిపల్లి వద్ద గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని కొయ్యూరు పోలీస్స్టేషన్లో కాటారం డీఎస్పీ సూర్యనారాయణ ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని ఎడ్లపల్లి గ్రామం జంగడిపల్లిలో శనివారం వాహన తనిఖీ చేస్తున్న క్రమంలో బైక్లపై నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించినట్లు డీఎస్పీ తెలిపారు. వారిని తనిఖీ చేయగా 3.335 కిలోల గంజాయి దొరికిందన్నారు. పెద్దపల్లి జిల్లా 8వ కాలనీకి చెందిన రోహిత్, బాలజీ, రిత్విక్, ఒడిశా గ్రామానికి చెందిన బుజ్జి ఒడిశా నుంచి 8వ కాలనీకి గంజాయి తరలిస్తున్నట్లు చెప్పారు. గంజాయి విలువ రూ. 1.50 లక్షలు ఉంటుందన్నారు. వీరి వద్ద నుంచి రెండు బైకులు, రెండు ఫోన్లు స్వాధీనం చేసుకొని నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాటారం సీఐ నాగార్జునరావు, ఎస్సైలు నరేష్, రజన్కుమార్, పోలీసు సిబ్బంది ఉన్నారు. -
3న కార్మిక పోరాట బహిరంగ సభ
భూపాలపల్లి అర్బన్: సింగరేణి సంస్థ పరిరక్షణ, కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 3వ తేదీన బీఎంఎస్ ఆధ్వర్యంలో కార్మిక పోరాట బహిరంగ సభను భూపాలపల్లి ఏరియాలో నిర్వహించనున్నట్లు బీఎంఎస్ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు యూని యన్ కార్యాలయంలో ఆదివారం వాల్పోస్టర్ ఆవి ష్కరణ చేపట్టారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఏరియాలోని అంబేడ్కర్ సెంటర్లో సాయంత్రం నాలుగు గంటలకు సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. సింగరేణి కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, సింగరేణి ప్రభావిత గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి ఎంపీ ఈటల రాజేందర్, బొగ్గు పరిశ్రమల ఇన్చార్జ్ కొత్త కాపు లక్ష్మారెడ్డి, బీజేపీ అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి, యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మాధవనాయక్, సత్తయ్య హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుజేందర్, నర్సింగరావు, సదానందం, మల్లేష్, రమేష్, రాజు, రాజయ్య, శంకర్, నారా యణ, రఘుపతిరెడ్డి, మొగిలి పాల్గొన్నారు. -
ఉద్యమ నేలలో మరో గాయని శ్రీహర్షిణి
టేకుమట్ల: ఉద్యమ నేలలో మరో గాయని శ్రీహర్షిణి వెలుగులోకి వచ్చిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ అన్నారు. వెలిశాలలో యువ రచయిత శ్రీపతి రాము రచనలో వెలిశాలకు చెందిన గందం శ్రీహర్షిణి పాడిన ‘ఏ దారినా మీరొస్తరో అన్నలు, ఏ తొవ్వలో ఎదురైతరో మా అక్కలు.. ఎరుపెక్కిన చుక్కలు’అనే ఉద్యమ గీతాన్ని ఆదివారం విడుదల చేసి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమ రచయితలకు వెలిశాల మట్టి త్యాగాలను అవసరాలను గుర్తు చేస్తాయని అన్నారు. శ్రీహర్షిణి ఆలపించిన ఉద్యమ గీతం ఏ ఒక్కరికో, ఏ ఒక్క ప్రాంతానికో చెందినది కాదని అన్నారు. ఉద్యమాల్లో పాల్గొని ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం పోరాడి వీరమరణం పొందిన ఉద్యమ నేతల స్ఫూర్తిని గుర్తుచేసే గీతమన్నారు. చిన్న వయస్సులోనే గొప్ప గాత్రంతోనే కాకుండా రచయితగా హర్షిణి ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం గీత రచయిత రాము మాట్లాడుతూ వెలిశాల ఉద్యమ నేపథ్యంపై ఇప్పటి వరకు ఎన్నో ఉద్యమ గీతాలను రాశానని, భవిష్యత్లో సైతం మరిన్ని చైతన్య గీతాలను అందిస్తానని అన్నారు. అనంతరం గీత రచయిత, గాయనిలను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చింతలపెల్లి స్వామిరావు, మహేందర్, లింగస్వామి, డప్పు సత్తి, అందె కుమార్, గందం సురేష్, రాజేందర్, శ్రీకాంత్, బన్నీ, కిరణ్గౌడ్ పాల్గొన్నారు.కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి అశోక్ -
దాటాలంటే సాహసమే..
భూపాలపల్లి–మల్హర్ మండలాల మధ్య సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో అడవి మార్గంలో వెళ్లాల్సి వస్తుంది. ఇటీవల తాడిచర్ల ఓపెన్కాస్టు నుంచి గణపురం మండలం చెల్పూర్ కేటీపీపీ వరకు ఏర్పాటు చేస్తున్న కన్వేయర్ బెల్ట్ రోడ్డు కాశీంపల్లి వరకు మట్టిపోసి తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. ఈ రోడ్డు అడవిలో వర్షం వరదకు కొట్టుకుపోయింది. దీంతో తాటిచెట్లు, కర్రలు వరద కాలువలపై వేసి ద్విచక్ర వాహనాలపై దాటుతున్నారు. దూరభారం తగ్గించుకునేందుకు ఈ మార్గం ద్వారా భూపాలపల్లి, మంథని, తాడిచర్ల ఓపెన్కాస్టులో పనిచేసే కార్మికులు నిత్యం ద్విచక్ర వాహనాలపై వందల సంఖ్యలో రాకపోకలు కొనసాగిస్తున్నారు. దారిలో ఏమైనా అనారోగ్య పరిస్థితి వస్తే అంబులెన్స్ రావడానికి మార్గం కూడా లేదు. – భూపాలపల్లి అర్బన్ -
ఆదివారం శ్రీ 31 శ్రీ ఆగస్టు శ్రీ 2025
తమ దగ్గరికి వచ్చిన వినాయకుడికి మొరపెట్టుకున్న రైతులు రోజుల తరబడి తిరుగుతున్నా బస్తాకూడా దొరకడం లేదని ఆవేదన ● నవరాత్రి ఉత్సవాల వేళ ఉమ్మడి జిల్లా రైతుల చెంతకు..! ● క్యూ లైన్లో కర్షకుల కష్టాలు చూసి చలించిన గణపయ్య●నేరుగా.. ములుగు జిల్లా గోవిందరావు పేట మండలం చల్వాయి గ్రామానికి చేరుకున్నారు. అరుగుపై దిగాలుగా కూర్చున్న కృష్ణారెడ్డిని పలకరిస్తూ.. వినాయకుడు : ఎందుకిలా దిగాలుగా కూర్చున్నావు? కృష్ణారెడ్డి: 16 ఎకరాల్లో వరి సాగు చేశా. 20 రోజుల క్రితమే పంటకు యూరియా వేయాలి. కొరత కారణంగా ఇప్పటి వరకు వేయలేదు. అదిగో, ఇదిగో బస్తాలు వస్తున్నాయంటూ అధికారులు రైతులను మభ్యపెడుతున్నారు. ఇప్పటికీ నాలుగు సార్లు క్యూలైన్లో నిల్చుంటే ప్రతీసారి ఒకటి లేదా రెండు బస్తాలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. పంటలకు సరిపడా యూరియా ఇవ్వట్లేదు. అధికారులు సరిపడా యూరియా పంపిణీ చేస్తారనే ఆశ కూడా రైతుల్లో లేదు. ఎకరానికి రూ.15 వేల చొప్పున పెట్టుబడి పెట్టా. అని చెప్పగానే. ఇంతదారుణమా అంటూ అక్కడినుంచి వినాయక స్వామి పరకాల మీదుగా వెళ్దామని బయలుదేరారు. వెల్లంపల్లిచల్వాయి(వరంగల్ డెస్క్)చవితి రోజు ఘనంగా పూజలందుకున్నాడు వినాయకుడు. రైతులు ప్రేమగా తెచ్చిన పత్రి, పూలు ఒంటినిండా ధరించాడు. పండ్లు, ఉండ్రాళ్లు బొజ్జ నిండా తిన్నాడు. కుటుంబ సమేతంగా వచ్చిన రైతు దంపతులను చూసి మురిసిపోయాడు. తెల్లవారి సైతం అదే రీతిన ప్రసాదాలు, పండ్లు అందాయి. కానీ.. మనసులో ఏదో వెలితి. అప్పుడు వినాయకుడు మూషిక రాజు చెవిని మెలిపెడుతూ..‘మూషికా.. నిన్న భక్తజన సందోహంతో నిండిన మండపాల్ని చూసి మురిసిపోయా.. ఇలా తెల్లారిందో లేదో పల్లెల్లోని మండపాలన్నీ వెలవెలబోతున్నాయి. రైతులు, అమ్మలు, అక్కలంతా ఎటుపోయారు? ఒక్కరూ కనిపించరేం..? రైతన్నలెందుకు పూజకు రాలేదో చూసి రాపో’ అన్నాడు. (గంట తరువాత) ‘స్వామీ.. రైతులు కుటుంబంతో సహా యూరియా కోసం సొసైటీ కార్యాలయాల వద్ద ఉంటున్నారు.. అయినా దొరకట్లేదట.. ఆందోళనలు చేస్తున్నారు.. అని బాధపడుతూ సమాధానమిచ్చాడు. ‘నా రైతులు ఇంతగనం కష్టాలు పడుతున్నారా.. వారి కష్టాలు తెలుసుకుందాం పద’ అన్నాడు. ‘నా భుజంపై ఎక్కండి. ఉమ్మడి వరంగల్ జిల్లా రైతుల దగ్గరికి తీసుకెళ్తా’ అంటూ సమాధానమిచ్చాడు మూషిక రాజు. సరే పదా.. అంటూ జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ నుంచి వారి ప్రయాణం మొదలైంది.చల్వాయినుంచి పోదాం అంటూ బయలుదేరిన వినాయకుడికి మార్గమధ్యలో హనుమకొండ జిల్లా పరకాల మండలం వెల్లంపల్లిలో ఓ రైతును పలకరించాడు. వినాయక : రైతన్నా నీపేరేంది?..రైతు : ఓదెల కొమురయ్య స్వామి..వినాయక : దిగులుగా ఉన్నావు ఏమైంది.. పొలానికి వెళ్లలే..కొమురయ్య : యూరియా దొరకడం లేదయ్యా.. వారం రోజుల క్రితం పరకాల పీఎసీఎస్లో ఇచ్చారు. ఇప్పుడు అడిగితే మాదారం సొసైటీ వారు సంబంధిత గ్రామాల రైతులకు ఇస్తున్నారు. పరకాల సొసైటీకి ఎప్పుడు వస్తదని అడిగితే ఆర్డర్ పెట్టినం అంటున్నారే తప్ప రావడం లేదు. బజార్లో వ్యాపారస్తులు అమ్ముకోవడానికి యూరియా ఉంటుంది కానీ వారు లింక్లు పెట్టి అమ్ముతున్నారు. వినాయక :అవునా.. ఏమిటీ మూషికా.. ఏ రైతన్నను పలకరించినా ఒకటే సమస్య.. వీరి కష్టాలు త్వరగా తీరాలి.. ముఖంలో నవ్వు రావాలి అంటూ తన మండపానికి వెళ్లారు. భళా.. ఏమిటీ ఇక్కడి రైతులంతా ఆనందంగా ఉన్నట్టున్నారే.. అన్ని చోట్లా కనిపించినట్లు. ఇక్కడ క్యూలైన్ లేదు. తోపులాట లేదు. పోలీసుల హడావిడి లేదు అంటూ.. నల్లబెల్లి మండలకేంద్రంలోని పీఏసీఎస్ ఎదుట నుంచి వెళ్లిపోబోయాడు వినాయకుడు. అప్పుడే ఒక రైతు కాళ్లీడుస్తూ.. పీఏసీఎస్ వైపు రావడం గమనించారు. ‘ఏంటయ్యా.. ఇక్కడ యూరియా కొరత లేనట్టుంది. నువ్వెటు వెళ్తున్నావ్’ అని నల్లబెల్లి మండలం గోవిందాపూర్ శివారు ఎర్రచెరువు తండాకు చెందిన పాడ్యా బాలును అడిగాడు వినాయకుడు. బాలు: ఈ సీజన్లో మూడెకరాల్లో వరి, మరో మూడెకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. యూరియా కోసం 12 రోజులుగా తిరుగుతున్నా. మండలంలో ఏషాపునకు వెళ్లినా యూరియా లేదు. అయిపోయిందని చెబుతున్నారు. స్టాక్ లేదని చెబుతున్నా.. ఒక్క బస్తా అయినా దొరుకుతుందేమోనని రోజూ పీఏసీఎస్కు వచ్చి పోతున్నా.’ అని సమాధానమిచ్చాడు. .. రైతులకు యూరియా కష్టాలు తీరేదెన్నడో అంటూ ముందుకు కదిలాడు వినాయకుడు.నల్లబెల్లి సూర్యుడు నడినెత్తిమీదికొచ్చేసరికి వినాయకుడు గూడూరు మండల కేంద్రానికి చేరుకున్నాడు. పీఏసీఎస్ గోదాం వద్ద లైన్లో నిల్చున్న మర్రిమిట్టలోని బందాలగడ్డ తండాకు చెందిన భూక్య హేమ్లానాయక్ను పలకరించాడు. వినాయకుడు: ఏమిటీ హుషారుగా ఉండేవాడివి.. నిస్సత్తువగా కనిపిస్తున్నావ్. హేమ్లానాయక్: ఏం చెప్పాలి స్వామి. ఆరు ఎకరాల్లో వరి సాగు చేశా. 20 రోజులవుతోంది. ఇప్పటివరకు ఒక్క బస్తా కూడా యూరియా దొరకలేదు. 10 రోజులుగా నిత్యం నా భార్య, నేనూ యూరియా కోసం వస్తున్నాం. తీసుకున్న వాళ్లే మళ్లీ మళ్లీ తీసుకుంటున్నారు. మా లాంటి వాళ్లను పట్టించుకునేటోళ్లు లేరు. కనీసం ఎకరానికి ఒక బస్తా చొప్పున 6 బస్తాలు కావాలి. ఏం చేయాలో తోచట్లేదు. లైన్లో నిలబడి, రాత్రి, పగలు తిరుగుతూ ఉంటే జ్వరం వచ్చింది. ‘అయ్యో.. హేమ్లా. ఒంట్లో జ్వరమున్నా.. పంటను కాపాడుకోవాలన్న నీ తాపత్రయం బాగుంది. ఆరోగ్యం జాగ్రత్త. అంటూ వినాయకుడు అక్కడి నుంచి బయల్దేరాడు. రైతుల పంటలను చూసుకుంటూ వెళ్తున్నారు. జిట్టెగూడెం గ్రామంలో ఓ రైతు కనిపించాడు. అక్కడే ఆగిన వినాయకుడు.. ఆ రైతును పలకరించాడు. ఏమయ్యా.. నీ పేరేమిటీ? స్వామి.. నాపేరు లకావత్ సురేందర్ వినాయకుడు: పొలం ఎట్లుంది? యూరియా దొరకట్లే.. సురేందర్: స్వామి నాకు ఆరెకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో ఐదెకరాలు వరి, ఒక ఎకరం పత్తి సాగు చేస్తున్నా. యూరియా బస్తాల కోసం పదిరోజుల నుంచి పనులు వదులుకుని రోజూ ఘన్పూర్కు వస్తున్నా. ఘన్పూర్ ఆగ్రోస్ సెంటర్లో శుక్రవారం స్టాక్ వచ్చిందని తెలుసుకుని ఉదయం వెళ్లా. మధ్యాహ్నం వరకు ఎండలో లైన్లో ఉన్నా యూరియా దొరకలేదు. లాభం లేదని ఇంటికి వచ్చా. ‘అయ్యో.. సురేందర్.. ఇన్ని కష్టాలా’.. అని అనుకుంటూ వినాయకుడు తన మూషికాన్ని కదిలిస్తూ మరో ఊరికి బయల్దేరాడు. స్టేషన్ఘన్పూర్చెన్నారావుపేట సొసైటీ ఎదుట బారులుదీరిన రైతులుగూడూరుకొత్తగూడలో క్యూలో ఉన్న రైతులు, సొమ్మసిల్లి పడిపోయిన మల్లెల రామక్కమహబూబాద్ జిల్లా కురవి మండలం ఆంధ్రా బ్యాంకు కర్షక సేవా సహకార సంఘం వద్ద చేతిలో చిట్టీ పట్టుకుని తిరుగుతున్న మోద్గులగూడేనికి చెందిన రైతు కొత్త వెంకన్నగౌడ్ను ఆపి ‘ఎందుకలా తిరుగుతున్నావ్. ఏంటి సమస్య’ అని ప్రశ్నించాడు వినాయకుడువెంకన్నగౌడ్: స్వామీ.. నేను మూడెకరాల్లో పత్తి సాగు చేస్తున్నా. పంట కోసం ఆరు బస్తాల యూరియా కావాలి. ఇప్పటి వరకు ఒక్క బస్తా కూడా దొరకలేదు. వారం రోజులుగా కాళ్లరిగేలా తిరుగుతున్నా. కష్టపడి కూపన్ సంపాదించా. కూపన్ చేతికొచ్చినా యూరియా అందలేదు. మరో రెండు రోజుల్లో లారీ వస్తుందని చెబుతున్నారు. అప్పుడైనా దొరుకుతుందో లేదో’ అని నిట్టూరుస్తూ సమాధానమిచ్చాడు. ‘దేశానికి అన్నంపెట్టే రైతుకే ఇన్ని కష్టాలా?’ అనుకుంటూ ముందుకు సాగారు మూషికరాజు, వినాయకుడు.అయ్యో.. ఇన్ని కష్టాలా.. మానుకోట,వరంగల్ జిల్లాల్లో రైతుల బారులు, ఆందోళనలు చూసి చలించిపోయాడు వినాయకుడు. నర్సంపేట, చెన్నారావుపేట, కేసముద్రం మండలం కల్వల రైతు వేదిక వద్ద రైతుల తోపులాట, నర్సింహులపేట పీఏసీఎస్ వద్ద రైతులు చేస్తున్న రాస్తారోకో, గూడూరు మండల కేంద్రంలోని ప్రధాన బస్టాండ్ సెంటర్ జాతీయ రహదారి 365పై ఆందోళన, కురవి, కొత్తగూడలో యూరియా కోసం వచ్చిన మహిళలు స్పృహతప్పి కిందపడిపోవడం చూసి నా రైతన్నలకు ఇన్ని కష్టాలా.. పాలకులేమి చేస్తున్నరు అంటూ లోలోన మదన పడుతూ ముందుకు సాగాడు. -
పురుగుల పాలు
భూపాలపల్లి: రేషన్ దుకాణాల ద్వారా పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ప్రభుత్వం, అంతకుముందు నిల్వ ఉన్న దొడ్డు బియ్యం విషయంలో ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఫలితంగా డీలర్లు, గోదాముల్లో ఉన్న బియ్యం చెడిపోతున్నాయి. బియ్యం పురుగులు, ఎలుకలు, పందికొక్కుల పాలవుతున్నాయి. ఐదు నెలలుగా వృథాగా.. రాష్ట్ర ప్రభుత్వం తెల్లరేషన్ కార్డుదారులకు ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తోంది. అంతకుముందు ఎంఎల్ఎస్ పాయింట్లు, బఫర్ గోదాంలలో భారీ మొత్తంలో దొడ్డు బియ్యాన్ని నిల్వచేశారు. రేషన్డీలర్ల వద్ద సైతం మిగిలిన బియ్యం (క్లోజింగ్ బ్యాలన్స్) నిల్వలు ఉన్నాయి. ఈ బియ్యాన్ని ఏం చేయాలనే విషయమై ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు. దీంతో జిల్లాకు సంబంధించిన దొడ్డు బియ్యం వరంగల్లోని బఫర్ గోదాంలో 800 మెట్రిక్ టన్నులు, డీలర్ల వద్ద 355, ఎంఎల్ఎస్ పాయింట్లలో 80 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయి. పనికి రాకుండా పోయిన బియ్యం.. మార్చి నెలలో నిల్వచేసిన దొడ్డు బియ్యంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో పనికి రాకుండా పోతున్నాయి. గోదాములు, ఎంఎల్ఎస్ పాయింట్లలో బియ్యం పురుగులు పట్టడమే కాక, పందికొక్కులు, ఎలుకల పాలవుతున్నాయి. బస్తాలు చిరిగిపోయి వృథాగా పోవడమే కాకుండా బియ్యం రంగు మారుతోంది. దీంతో రైస్మిల్లర్లు, ఇతర వ్యాపారులు కొనే పరిస్థితి కనిపించడం లేదు. పశువుల దాణాకు మినహా దేనికీ ఉపయోగపడే అవకాశం లేదు. జిల్లాకు సంబంధించిన దొడ్డు బియ్యం 1,235 మెట్రిక్ టన్నులు నిల్వ ఉండగా, దాని విలువ సుమారు రూ.3.58 కోట్లు ఉంటుందని అంచనా. ఇప్పుడు ఆ బియ్యాన్ని ప్రభుత్వం విక్రయించినా పావలా వంతు ధర కూడా రాదని, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రూ.కోట్లు నష్టం వాటిల్లడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రేషన్డీలర్ల ఇబ్బందులు.. జిల్లాలోని 12 మండలాల్లో 277 రేషన్షాపులు ఉన్నాయి. సగటున ఒక్కో షాపులో సుమారు 10టన్నుల నుంచి 12 టన్నుల దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో షాపులు చిన్నగా ఉండటంతో దొడ్డు బియ్యం నిల్వలతో డీలర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న షాపుల్లో ఇప్పటికే బియ్యం పందికొక్కులు, ఎలుకలు, పురుగుల పాలైందని పలువురు డీలర్లు వాపోతున్నారు. బియ్యం బస్తాలను ఎలుకలు చింపి చిందరవందర చేశాయని వెల్లడించారు. దొడ్డు బియ్యం మూలంగా సన్నబియ్యం కూడా పాడయ్యే అవకాశం ఉందని తెలుపుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి దొడ్డు బియ్యాన్ని షాపుల నుంచి తరలించాలని డీలర్లు కోరుతున్నారు. మార్గదర్శకాల మేరకు నిర్ణయం.. గోదాములు, రేషన్డీలర్ల వద్ద నిల్వ ఉన్న దొడ్డు బియ్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి మార్గదర్శకాలూ రాలేదు. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాగానే నిర్ణయం తీసుకుంటాం. – కిరణ్కుమార్, డీసీఎస్ఓబఫర్ గోదాంలో 800 డీలర్ల వద్ద 355 ఎఎంల్ఎస్ పాయింట్లలో 80 నిల్వ ఉన్న బియ్యం 1,235 విలువ రూ. 3.58 కోట్లు జిల్లాలో భారీగా దొడ్డు బియ్యం నిల్వలు గోదాంలు, డీలర్ల వద్ద 1,235 మెట్రిక్ టన్నులు విలువ రూ.3.58 కోట్లు ఐదు నెలలుగా నిర్ణయం తీసుకోని సర్కారు -
శాంతిభద్రతల పరిరక్షణ అందరి బాధ్యత
రేగొండ: గ్రామాలలో శాంతిభద్రతల పరిరక్షణ అందరి బాధ్యత అని గణపురం సీఐ కరుణాకర్ రావు అన్నారు. శనివారం మండలంలోని భాగిర్థిపేటలో గణపురం సీఐ కరుణాకర్రావు ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్సెర్చ్ నిర్వహించి 50 వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. యువత గంజాయి వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. లైసెన్స్, ఇన్సురెన్స్తో పాటు వాహన పత్రాలు చట్ట నిబంధనలకు లోబడి ఉండాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పారు. గ్రామంలో ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగితే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రేగొండ ఎస్సై రాజేష్, గణపురం ఎస్సై అశోక్, కొత్తపల్లిగోరి ఎస్సై దివ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
సాగుదారులను ఇబ్బందులకు గురిచేయొద్దు
● కాటారం సబ్కలెక్టర్ మయాంక్సింగ్ కాటారం: ఆర్ఓఎఫ్ఆర్ ద్వారా పట్టాలు పొందిన భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దని కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్ అటవీశాఖ అధికారులకు సూచించారు. మహాముత్తారం మండలం మీనాజీపేటలో ఆర్ఓఎఫ్ఆర్ పట్టా భూములను శనివారం సబ్ కలెక్టర్ పరిశీలించారు. రైతులు సాగునీటి కోసం బోర్లు వేసుకుంటున్న క్రమంలో అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. దీంతో పలువురు సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో ఆయన పరిశీలించి రైతులు, అటవీశాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బోర్లు వేసుకోవడానికి అభ్యంతరాలు చెప్పవద్దని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. సబ్ కలెక్టర్ వెంట తహసీల్దార్ శ్రీనివాస్, అటవీశాఖ అధికారులు ఉన్నారు. -
సమస్యలు పరిష్కరించాలని వినతి
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని పలు సమస్యలను పరిస్కరించాలని కోరుతూ బీజేపీ అర్బన్ అధ్యక్షుడు గీస సంపత్ కుమార్ ఆధ్వర్యంలో నాయకులు శనివారం మున్సిపల్ మేనేజర్ సుబాష్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దొంగల రాజేందర్ మాట్లాడుతూ మిషన్భగీరథ కలుషితమైన నీరు తాగడం వలన ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారన్నారు. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ దోమల నివారణ కోసం చర్యలు చేపట్టలేదన్నారు. పట్టణంలో చెత్తాచెదారం డ్రెయినేజీల్లో పేరుకుపోయి ఉందన్నారు. అధికారులు చొరవ తీసుకొని సమస్యలు పరిష్కరించాల ని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో నాయకులు బట్టు రవి, తాటి కంటి రవికుమార్, జోరు కృష్ణ, బండారు లోకేష్, దేవరకొండ వెంకటేష్, తాండ్ర హరీశ్, సంతోష్ పాల్గొన్నారు. -
రోగులకు సకాలంలో వైద్యం అందించాలి
కాటారం: ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు సకాలంలో నాణ్యమైన వైద్యం అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ వైద్యులు, వైద్య సిబ్బందికి సూచించారు. కాటారం మండలకేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం డీఎంహెచ్ఓ తనిఖీ చేశారు. ఆస్పత్రిలో పరిశుభ్రత, సౌకర్యాలు, మందులు, వైద్య సిబ్బంది హాజరు పట్టిక, ఓపీ రికార్డులు, ల్యాబ్, ఫార్మసీ పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు. వైద్య సిబ్బంది గ్రామాల్లో అందుబాటులో ఉండాలని.. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహనలు కల్పించాలని సూచించారు. ముందస్తు చర్యలు, జాగ్రత్తలను వివరించాలని తెలిపారు. గ్రామాల్లో వైద్యశిబిరాలు నిర్వహించి అవసరమైన రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని డీఎంహెచ్ఓ సిబ్బందిని హెచ్చరించారు. డీఎంహెచ్ఓ వెంట జిల్లా ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ సందీప్, మండల వైద్యాధికారిణి డాక్టర్ మౌనిక, సిబ్బంది ఉన్నారు.జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ -
సాదాబైనామాలకు మోక్షం
భూపాలపల్లి అర్బన్: తెల్లకాగితంపై లిఖితపూర్వక ఒప్పందాలతో కొనుగోలు చేసిన భూముల రిజిస్ట్రేషన్లకు అడ్డంకి తొలగడంతో వేలాది మంది రైతులకు మేలు జరగనుంది. ప్రభుత్వం 2020 అక్టోబరు 12న జారీ చేసిన జీఓ నంబరు 112ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం విదితమే. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఈ నెల 26న తీర్పు వెల్లడిస్తూ సన్న, చిన్నకారు రైతులకు తీపికబురు అందించింది. 2014 జూన్ 2కు ముందు తమ ఆధీనంలో ఉన్నట్లు చూపిన సన్నకారు రైతులకు భూముల క్రమబద్ధీకరణకు అవకాశం ఇస్తున్నట్లు కోర్టు తెలిపింది. 2020 అక్టోబరు నుంచి 2020 నవంబరు 10 వరకు తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాసుబుక్స్ చట్టం–1971 ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారికి క్రమబద్ధీకరించుకోవడానికి అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే సరికి సుమారుగా ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ఆర్ఓఆర్ చట్టంతో.. గ్రామీణ ప్రాంతాల్లో కొన్నేళ్ల కిందట సాదా కాగితంపై భూమి కొనుగోలు చేసి రాయించుకున్న వారిలో అనేకమంది పేర్లు మార్చుకొని పట్టాలు చేసుకోలేదు. ధరణికి ముందున్న ఆర్ఓఆర్ చట్టంలో సాదాబైనామాలతో పట్టాలు చేశారు. ధరణి వచ్చిన తర్వాత అవి ఆగిపోయాయి. వాటిని అమలు చేసేందుకు గత ప్రభుత్వం సాదాబైనామాలను క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. 2014 జూన్ 2లోగా లిఖితపూర్వక ఒప్పందంతో భూములు కొన్న రైతుల దరఖాస్తులకు చట్టబద్ధత కల్పించి పాసుపుస్తకాలు జారీచేయాలని భావించింది. 2020 అక్టోబరులో ప్రకటన వెలువరించి నవంబరు 10 వరకు దరఖాస్తులు స్వీకరించగా.. జిల్లాలో 51,347 మంది దరఖాస్తు చేసుకున్నారు. క్రమబద్ధీకరణకు అనుమతిచ్చిన కోర్టు ‘భూభారతి’ ద్వారా పట్టాలు సన్న, చిన్నకారు రైతులకు మేలు -
‘రెవెన్యూ’లో వేళ్లూనిన అవినీతి!
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా రెవెన్యూశాఖలో అవినీతి పరాకాష్టకు చేరుతోంది. కొందరు తహసీల్దార్లు, అధికారులు అక్రమాదాయానికి కొత్తదారులు వెతుక్కుని మరీ అవినీతికి పాల్పడుతుండడం వివాదాస్పదమవుతోంది. కిందిస్థాయిలో పలువురు వీఆర్వోలు, వీఆర్ఏల నుంచి పైస్థాయిలో సర్వేయర్లు, ఇన్స్పెక్టర్లు, తహసీల్దార్ల వరకు అవినీతి రాజ్యమేలుతోంది. ప్రతీ పనికి ఓ రేటు నిర్ణయించి వసూలు చేస్తున్న కొందరి తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారు. చేయి తడిపితే తప్ప దస్త్రం కదిలించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇదే సమయంలో ఓ వైపు శాఖాపరమైన చర్యలు.. మరోవైపు ఏసీబీ దాడులు చేస్తున్నా కొందరు తహసీల్దార్ల తీరు మారడం లేదు.తాజాగా ఖిలా వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వర్రావుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు.. శుక్రవారం ఆయన ఇంటితో పాటు కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లపై ఐదు చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించడం సంచలనంగా మారింది. ప్రాథమికంగా రూ.5 కోట్ల అక్రమాస్తులను గుర్తించిన ఏసీబీ.. కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తుండడం రెవెన్యూ వర్గాల్లో కలకలం రేపుతోంది.ఆది నుంచి అవినీతి ఆరోపణలు.. 2022లో వీఆర్ఎస్కు దరఖాస్తు..ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించిన కేసులో అరెస్టయిన తహసీల్దార్ బండి నాగేశ్వర్రావుపై గతంలోనూ అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ధర్మసాగర్, కాజీపేట, హసన్పర్తితోపాటు ఉమ్మడి వరంగల్, కరీంనగర్లో పలుచోట్ల పనిచేసిన సమయంలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఫిర్యాదులు అధికారులు అందాయి. తహసీల్దార్ ఉద్యోగంతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో భాగస్వామిగా చేరి రెండు చేతులా సంపాదిస్తూ ప్రభుత్వ, అసైన్డ్భూములను అప్పనంగా కట్టబెట్టారన్న ఫిర్యాదు మేరకు 2019లో అప్పుడున్న కలెక్టర్ విచారణ జరిపారు. ధర్మసాగర్ మండలంలోని ఓ గ్రామంలో గుట్టను విక్రయించి రిజిస్ట్రేషన్ చేసి పాస్పుస్తకాలు జారీ చేయడం వివాదంగా మారింది. 1976లో హసన్పర్తి శివారు కోమటిపల్లిలో కొనుగోలు చేసిన సీకేఎం కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్కు చెందిన 29 గుంటల భూమిని నగరానికి చెందిన ముగ్గురికి రిజిస్ట్రేషన్ చేసి వారి నుంచి రూ.45 లక్షలు తీసుకున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. ఈ విషయమై బాధితులు 2022లో అప్పటి సీపీ, డీసీపీ, ఏసీపీకి ఫిర్యాదు చేశారు. తహసీల్దార్తోపాటు ఆ ముగ్గురిపై చేసిన ఫిర్యాదుపై విచారణ జరిగినా ఇప్పటికీ నానుతోంది. వరంగల్, హైదరాబాద్లో విలాసవంతమైన భవనాలను నిర్మించడంతోపాటు ఒక్కొక్కటిగా అక్రమాలు వెలుగుచూడడంతో స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు కూడా ఆయన దరఖాస్తు చేసుకున్నారు. చివరకు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ దాడులు చేయడం చర్చనీయాంశమవుతోంది.ఏసీబీ దాడులు చేస్తున్నా వెరవని వైనం..2024లో భూసేకరణలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై వరంగల్ ఆర్డీఓ సిడాం దత్తును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.అంతకుముందు వరంగల్ జిల్లా సంగెం తహసీల్దార్ రాజేంద్రనాథ్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్లో ఏకంగా సంయుక్త పాలనాధికారి సీసీ రూ 45 వేలు తీసుకుంటూ అడ్డంగా దొరికాడు.హనుమకొండ జిల్లా నడికూడ మండల ఆర్ఐ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.భూపాలపల్లిలో రెవెన్యూ అధికారులకు లంచమివ్వాలని, లేదంటే తమ పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వడం లేదని వృద్ధ దంపతులు భిక్షాటన చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.వెంకటాపూర్లో ఓ రైతు తనకున్న భూమిని పట్టా చేయాలని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి, చివరకు విసిగిపోయి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.ఇలా ఆరోపణలు వచ్చిన పలువురిపై బదిలీలు, సస్పెన్షన్, వీఆర్లో వేటు పడినా.. రాజకీయ పలుకుబడితో మళ్లీ కీలక మండలాల్లో పోస్టింగ్లు తెచ్చుకుని అదే తంతు కొనసాగిస్తున్నారు.నాలుగేళ్లలో అవినీతి నిరోధక శాఖ ఉమ్మడి జిల్లాలో 66కు పైగా వివిధ శాఖలకు చెంది న వారిని పట్టుకుంది. అందులో రెవెన్యూ శాఖదే అగ్రస్థానం ఉండడం గమనార్హం. అయినా ఆ శాఖలో పని చేస్తున్న కొందరిలో మార్పు రావడం లేదన్న చర్చ జరుగుతోంది.ఖిలా వరంగల్ తహసీల్దార్ కార్యాలయంలో పైళ్లు పరిశీలన, స్వాధీనంఖిలా వరంగల్: వరంగల్ ఫోర్ట్రోడ్డులోని ఖిలా వరంగల్ తహీసీల్ధార్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. బీరువా, కౌంటర్లు, క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రతీ ఫైల్ను పరిశీలించి కొన్నింటిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మండల ఏర్పాటు నుంచి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. -
నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి
భూపాలపల్లి: నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ కిరణ్ ఖరే సూచించారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో పెండింగ్, విచారణలో ఉన్న కేసుల పురోగతిని సమీక్షించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతీ పోలీసు అధికారి క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేసి ప్రజల విశ్వాసం పొందాలన్నారు. మహిళల భద్రత, పిల్లల రక్షణ, అక్రమ రవాణా, సైబర్ నేరాలు, రౌడీషీటర్ల కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతీ పోలీస్స్టేషన్ పరిధిలో రాత్రి పహారా తప్పకుండా జరగాలని, ఇంటిలిజెన్స్ పెంచడం, కొత్తగా వెలుగులోకి వస్తున్న నేర ధోరణులను క్షుణ్ణంగా గమనించి తగు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ నరేష్కుమార్, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.ఎస్పీ కిరణ్ ఖరే -
క్రీడలను భాగస్వామ్యం చేసుకోవాలి
భూపాలపల్లి అర్బన్: ప్రతి ఒక్కరూ క్రీడలను జీవితంలో భాగస్వామ్యం చేసుకొని ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంభించాలని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి తెలిపారు. హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ జన్మదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఏరియాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరేణి వర్క్పీపుల్స్ గేమ్స్ అసోసియేషన్ 26వ వార్షిక క్రీడ పోటీలను జీఎం ప్రారంభించారు. ఈ క్రీడపోటీలు మన ఆరోగ్య సాధనలో భాగం కావాలని, సంస్థకు మంచిపేరు తీసుకురావాలని అ న్నారు. సింగరేణి సంస్థ క్రీడల ప్రోత్సాహానికి, యు వ ఉద్యోగులలో ప్రతిభను వెలికితీసి దేశ స్థాయిలో రాణించాలనే ఉద్దేశంతో క్రీడాకారులను ప్రోత్సహిస్తుందన్నారు. సింగరేణి సంస్థను మొదటి స్థానంలో ఉండే విధంగా కృషి చేయాలని యువ క్రీడాకారులకు, ఉద్యోగులకు జీఎం సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు కవీంద్ర, అధికారులు మారుతి, శ్రావణ్కుమార్, నజీర్, గుర్తింపు, ప్రాతినిథ్య సంఽఘాల నాయకులు రమేష్, మధుకర్రెడ్డి, స్పోర్ట్స్ సూపర్వైజర్ శ్రీనివాస్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ పాక దేవయ్య, కెప్టెన్లు, క్రీడాకారులు పాల్గొన్నారు.సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి -
ఉధృతంగా ప్రవహిస్తున్న మానేరు
ఉధృతంగా ప్రవహిస్తున్న అడవిసోమన్పల్లి మానేరు మల్హర్: రెండు, మూడు రోజులుగా కురిసిన వర్షాల కారణంగా జిల్లా సరిహద్దు అడవి సోమన్పల్లి మానేరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మానేరుకు జలకళ సంతరించుకుంది. మండలంతో పాటు భూపాలపల్లి, కరీంనగర్ జిల్లాలో కురిసిన వర్షాలతో మానేరుకు భారీగా వరద నీరు చేరుకుంది. దీనికి తోడు కరీంనగర్ డ్యాం గేట్లు ఎత్తడంతో వాగుకు ఇరువైపులా నీరు ప్రవహించడంతో మానేరు నిండు కుండాలా దర్శనమిస్తుంది. సోమన్పల్లి, కొయ్యూరు పీవీనగర్కు మధ్యలో ఏర్పాటు చేసిన చెక్డ్యాం మీదుగా వరద నీరు పరవళ్లు తొక్కుతోంది. -
క్రీడలతో ఐకమత్యం
భూపాలపల్లి రూరల్: క్రీడలు ఐకమత్యాన్ని చాటడమే కాక ఆరోగ్య, శారీరక దృఢత్వానికి దోహదపడతాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ క్రీడా దినోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి జాతీయ క్రీడా దినోత్సవ ప్రతిజ్ఞ చేపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యతో పాటు క్రీడలకు సైతం ప్రాధాన్యత కల్పిస్తూ క్రీడా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తుందని అన్నారు. జిల్లా కేంద్రంలో క్రీడా మైదానం నిర్మాణానికి రూ.6కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. మండల కేంద్రాలలో కూడా క్రీడా మైదానాల ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. క్రీడాకారులు క్రీడలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకు రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు అవార్డులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, జిల్లా క్రీడలు, యువజన సర్వీసులు శాఖ అధికారి రఘు, జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, సంక్షేమ అధికారి మల్లీశ్వరి, పరిశ్రమల శాఖ జీఎం సిద్దార్థ, ఎస్జీఎఫ్ సెక్రటరీ ఎల్.జైపాల్, క్రీడాకారులు, సీనియర్ ఫిజికల్ డైరెక్టర్లు, ఖేలో ఇండియా కోచ్ శ్రీనివాస్, విద్యార్థులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
మునిగిన పంటలు
జిల్లాలో ఎడతెరిపి లేని వర్షంభూపాలపల్లి: జిల్లాలో రెండు రోజుల పాటు ఎడతెరపి లేని మోస్తారు వర్షం కురిసింది. వర్షం, వరద నీటి రాకతో మోరంచవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. వాగు ఇరువైపుల ఒడ్డున గల వేలాది ఎకరాల వరిపంట నీట మునిగింది. లోతట్టు ప్రాంతాల్లో సైతం పంటలు నీట మునిగాయి. వర్షం కారణంగా సింగరేణి ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. నీటిపాలైన పంటపొలాలు.. జిల్లాలో మంగళవారం, బుధవారం ఎడతెరపి లేని వర్షం కురిసింది. బుధవారం గణపురం మండలంలో 98.4, రేగొండలో 81.0, మొగుళ్లపల్లిలో 72.0, మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. గణపురం, భూపాలపల్లి మండలంలో కురిసిన వర్షానికి వరద నీరు భారీగా రావడంతో మోరంచవాగు మరోమారు తన ఉగ్రరూపాన్ని చూపింది. వాగు ఇరువైపులా సుమారు అరకిలో మీటరు దూరం వరకు వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో ఆ రెండు మండలాల్లోని సుమారు రెండు వేల ఎకరాల వరిపంట పూర్తిగా నీట మునిగింది. గురువారం వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ ఇంకా వరద నీరు పోలేదు. వరద కారణంగా పొలాల్లో ఇసుక మేటలు వేస్తాయని, ఇక పంట సాగు చేయలేమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేగొండలో సైతం ఎడతెరపి లేని వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాల్లోని వరిపంటలు పూర్తిగా జలమయమయ్యాయి. పలువురు రైతులు మిర్చి సాగు ఇంకా ప్రారంభించకపోగా, మడుల్లో ఉన్న నారు పూర్తిగా మునిగిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. మళ్లీ వర్షం కురిస్తే పత్తి, మిర్చి, వరి పంటలను వదులుకోవాల్సిందేనని రైతులు వాపోతున్నారు. బొగ్గు ఉత్పత్తికి ఆటంకం... వర్షం కారణంగా బుధవారం సింగరేణి ఓపెన్కాస్ట్ గనుల్లోకి వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి నిలి చిపోయింది. మల్హర్ మండలంలోని తాడిచర్ల ఓపె న్కాస్ట్లో ఆరు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోగా, భూపాలపల్లి ఏరియాలో మంగళవారం, బుధవారం కురిసిన వర్షానికి ఓపెన్కాస్ట్ 2, 3 ప్రాజెక్టుల్లో 20వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం వాటిల్లినట్లు సింగరేణి అధికారులు వెల్లడించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్ రాహుల్ శర్మ వివిధ శాఖల అధికారులతో గురువారం ఐడీఓసీలో సమావేశమై పలు సూచనలు చేశారు. మొరంచవాగు ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక వద్ద ప్రవహిస్తోందని, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసి అవసరమైన జాగ్రత్తలు తప్పనిసరిగా చేపట్టాలని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నంబర్ 90306 32608కు కాల్ చేయాలని సూచించారు. జాలర్లు చేపల వేటకు వెళ్లవద్దన్నారు. ప్రభుత్వ యంత్రాంగానికి ప్రజలు సహకరించాలని, చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణనష్టానికి దారి తీస్తుందన్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న మోరంచవాగు 2వేల ఎకరాల వరిపంటకు నష్టం నిండు కుండలా గణపసముద్రం ఓపెన్కాస్ట్ గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి -
పేరుకే క్రీడా ప్రాంగణాలు
కాళేశ్వరం: జిల్లావ్యాప్తంగా గ్రామపంచాయతీల్లో ఏర్పాటుచేసిన క్రీడాప్రాంగణాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో నిరుపయోగంగా మారాయి. మండలానికో మినీ స్టేడియం ఏర్పాటు హామీ నేటికీ అమలుకాకపోవడంతో క్రీడాకారులు ప్రాక్టీస్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఆటలు ఆడుకునేందుకు సరైన సౌకర్యాలు లేక క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాకేంద్రంలో ఒకటే మైదానం.. జిల్లాలో 12 మండలాల్లో 248 పంచాయతీలు ఉన్నాయి. భూపాలపల్లి, రేగొండ, చిట్యాల, మొగుళ్ళపల్లి, టేకుమట్ల, గణపురం, కాటారం, మహాముత్తారం, మహదేవపూర్, పలిమెల, మల్హర్ మండలాలల్లో వాలీబాల్, కబడ్డీ, షటిల్, ఖోఖో, క్రికెట్ క్రీడాకారులు చాలామంది ఉన్నారు. సరైన వసతులు గల మైదానం లేకపోవడంతో ఆటకు దూరమవుతున్నారు. జిల్లాకేంద్రంలో సింగరేణి సంస్థకు చెందిన మైదానం మాత్రమే ఉంది. ఆటస్థలాలు లేక చెరువులు, కుంటలు, గల్లీల్లో చిన్న చిన్న ప్రాంతాల్లో ఆడుకుంటున్నారు. క్రీడలతో ఆరోగ్యం.. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతగానో ఉపయోగపడుతాయి. క్రీడలతో మానసికోల్లాసంతో పాటు ప్రశాంతత లభిస్తుంది. క్రీడల్లో రాణిస్తే భవిష్యత్లో ఉన్నత శిఖరాలను అధిరోహించచ్చు. కానీ జిల్లావ్యాప్తంగా క్రీడామైదానాలు లేకపోవడంతో క్రీడాకారులకు శాపంగా మారింది. మినీ స్టేడియాల ఏర్పాటులో జాప్యం నష్టపోతున్న క్రీడాకారులు -
స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేయాలి
పల్లెల్లో ఆటస్థలాలు లేకపోవడంతో క్రీడాపాఠశాలకు ఎంపిక కోసం సిరొంచ గ్రౌండుకు వెళ్లి ప్రాక్టీస్ చేయించాను. మూడేళ్లుగా ఎనిమిది మంది విద్యార్థులు నా ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో క్రీడాపాఠశాలలకు ఎంపికయ్యారు. గ్రౌండు ఉంటే మరింత మంది భవిష్యత్లో పెద్ద స్థాయి ఆటల్లో ఉంటారు. ప్రభుత్వం మినీ స్టేడియాలు ఏర్పాటు చేయాలి. క్రీడాకారులను ప్రొత్సహించాలి. మంత్రి శ్రీధర్బాబు ప్రత్యేక దృష్టితో కాళేశ్వరంలో స్పోర్ట్స్ స్కూల్, అకాడమీ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత విద్యార్థులకు ఉపయోగంగా ఉంటుంది. – కీర్తి శ్రీనివాస్, కోచ్ కాళేశ్వరం -
23 అడుగులకు చేరిన గణపసముద్రం
గణపురం: గణపసముద్రం చెరువు నీటి మట్టం 31 అడుగులు కాగా.. మొన్నటి వరకు 18 అడుగుల నీటిమట్టం ఉండగా ఒక్కరోజులోనే ఐదు అడుగుల నీటిమట్టం పెరిగి 23 అడుగులకు చేరుకుంది. దీంతో చెరువు నిండుకుండలా మారింది. గణపసముద్రం చెరువు పైన ఉన్న గొలుసు కట్టు చెరువులైన బుద్ధారం వంగపెల్లి వాని చెరువు, భాగిర్థిపేట రామన్న చెరువులు మత్తళ్లు పోస్తుండడంతో పెద్ద ఎత్తున వరద గణపసముద్రం చెరువుకు చేరుకుంటుంది. మరో రెండు రోజులు వర్షాలు కురిస్తే గణపసముద్రం చెరువు మత్తడి పోసే అవకాశం వుంది. మండలంలోని నగరంపల్లి మొసళ్లకుంటకు గండి పడింది. ఉప్పొంగి ప్రవహిస్తున్న మోరంచవాగు -
ఆడబిడ్డలకు వరం కల్యాణలక్ష్మి
టేకుమట్ల: కల్యాణలక్ష్మి పథకం ఆడబిడ్డలకు వరమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గురువారం మండలకేంద్రంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చేయలేని సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపిస్తుందని అన్నారు. సన్న బియ్యం, కొత్త రేషన్కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, జిల్లాకేంద్రంలో కార్పొరేట్ స్థాయిలో విద్యావ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విద్యావ్యవస్థ మెరుగుపడేందుకు నూతన కోర్సులను తీసుకువచ్చినట్లు చెప్పారు. రానున్న రోజుల్లో మరింత సంక్షేమాన్ని ప్రజల ముందు ఉంచబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయలక్ష్మి, ఆర్ఐ సంతోష్కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్గౌడ్, మాజీ జెడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి, తదితరులు ఉన్నారు.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం
శుక్రవారం శ్రీ 29 శ్రీ ఆగస్టు శ్రీ 2025మోరంచవాగు ప్రవాహంతో నీట మునిగిన వరి పొలాలుటేకుమట్ల: వర్షాలకు చలివాగు ఉప్పొంగింది. చెరువులు మత్తడి పోశాయి. మండల కేంద్రం నుంచి అంకుషాపూర్, సుబ్బక్కపల్లి ప్రధాన రోడ్డులోని లోలెవల్ కల్వర్టులు ఉప్పొంగడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. టేకుమట్ల–అంకుషాపూర్ లోలెవల్ కల్వర్టు వద్ద వరద ఉధృతి పెరగడంతో ఇరువైపులా ముళ్ల కంచెలను ఏర్పాటు చేసి ఉదయం నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు గ్రామ పంచాయతీ సిబ్బంది కాపలా కాశారు.అలుగు పారుతున్న దొమ్మిడిపెల్లి చెరువు రేగొండ: రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు రేగొండ, కొత్తపల్లిగోరి మండలాలలో ఇటీవల వేసిన వరి నాట్లు పూర్తిగా నీటమునిగాయి. మిరప నారు మడులు నీటిలో మునిగిపోయాయి. మండలంలోని చిన్నకొడేపాక, మడ్తపల్లి, పొనగండ్ల గ్రామాలలోని చెరువులు అలుగు పోశాయి. ఉధృతంగా ప్రవహిస్తున్న మోరంచవాగు 2వేల ఎకరాల వరిపంటకు నష్టం నిండు కుండలా గణపసముద్రం ఓపెన్కాస్ట్ గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి -
హత్యా.. ఆత్మహత్యా..
కాటారం: ఈనెల 3న ఇంట్లో నుంచి వెళ్లిపోయిన యువత.. 25 రోజుల తర్వాత మృతదేహంగా లభ్యమైంది. ఘటనాస్థలంలో మృతదేహం పక్కన నిమ్మకాయలు, కుంకుమ ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది హత్యా.. ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల మండలం ఒడితల గ్రామానికి చెందిన కప్పల వర్షిణి(22) తండ్రి అనారోగ్యంతో రెండు నెలల క్రితం చనిపోయాడు. అప్పటినుంచి వర్షిణి ఆవేదనతో ఉంది. ఈ నెల 3న తెల్లవారుజామున వర్షిణి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. వర్షిణి తల్లి కవిత చిట్యాల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదైంది. కాటారం మండలం మేడిపల్లి అటవీ ప్రాంతం జాతీయ రహదారికి కొంత దూరంలో కుళ్లిన స్థితిలో గురువారం ఓ మృతదేహం గమనించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ నాగార్జునరావు, ఎస్సై శ్రీనివాస్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఘటనా స్థలంలో లభించిన ఆధార్కార్డు ఆధారంగా చిట్యాల మండలం ఒడితల గ్రామానికి చెందిన కప్పల వర్షిణి(22)గా గుర్తించారు. చిట్యాల పోలీసులకు సమాచారం అందించడంతో మృతురాలి తల్లి కవిత ఘటనా స్థలానికి చేరుకొని తన కూతురిగా గుర్తించారు. మృతురాలి తల్లి కవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. మేడిపల్లి సమీపంలో యువతి మృతదేహం లభ్యం ఘటనాస్థలంలో నిమ్మకాయలు, కుంకుమ ఈనెల 3న మిస్సింగ్ కేసు నమోదు -
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
ఎస్ఎస్తాడ్వాయి: ఇంటింటా ప్రతిఒక్కరూ మొక్కలు నాటి బాధ్యతగా పెంచాలని అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) సంపత్రావు అన్నారు. టీజీఐఎల్పీ ప్రాజెక్టు కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండలంలోని గవర్నర్ దత్తత గ్రామం కొండపర్తిలో పండ్లు, వెదురు మొక్కల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండ్ల మొక్కలను నాటి సంరక్షించాలన్నారు. వెదురు మొక్కల పెంపకం లాభదాయకంగా ఉంటుందన్నారు. దత్తత గ్రామం కొండపర్తి అభివృద్ధికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీఓ శ్రీనివాస్, డీపీఎంలు రాజు, శ్రీనివాస్, తాడ్వాయి సెర్ప్ ఏపీఎం కిషన్, టీజీఐఎల్పీ జిల్లా కోఆర్డినేటర్ వెంకన్న, మండల కోఆర్డినేటర్ యాదగిరి పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ సంపత్రావు -
పూజలు చేసి.. వంతెనపై నుంచి దూకి
కాళేశ్వరం: మానసిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఇంట్లో కుటుంబ సభ్యులు మందలించారని.. తమ ఇష్ట దైవమైన కొండయ్య మహారాజ్ చిత్రపటానికి పూజ చేసి ఓ వ్యక్తి కాళేశ్వరం వంతెనపై నుంచి గోదావరిలోకి దూకి గల్లంతయ్యాడు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. మహదేవపూర్ మండల కేంద్రానికి చెందిన మండిగ బాపు (75) మంగళవారం కాళేశ్వరం చేరుకున్నాడు. అంతర్రాష్ట్ర వంతెన ఫుట్పాత్పై తమ ఇష్టదైవమైన కొండయ్య మహారాజ్ చిత్రపటానికి కుంకుమతో పూజలు చేసి కొబ్బరికాయ కొట్టాడు. ఆ తర్వాత చెప్పులు వంతెన గోడపై వదిలి గోదావరిలోకి దూకాడు. స్థానికుల సమాచారం అందించడంతో పోలీసులు కుటుంబ సభ్యులకు తెలిపారు. గల్లంతైన వృద్ధుడి కుమారుడు రాజబాపు ఫిర్యాదు మేరకు ఎస్సై తమాషారెడ్డి కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అతడి వెంట ఉన్న తన సోదరుడు చిన్నబాపును పోలీసులు విచారిస్తున్నారు. ఆయనకు భార్య వీరలక్ష్మి, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.గోదావరిలో గల్లంతైన వ్యక్తి కోసం పోలీసుల గాలింపు -
మహిళా భద్రత కోసం ఉమెన్ బ్లూ కోల్ట్స్
● ఎస్పీ కిరణ్ ఖరే భూపాలపల్లి: మహిళా భద్రత కోసం ఉమెన్ బ్లూ కోల్ట్స్ టీంలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ కిరణ్ ఖరే వెల్లడించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఉమెన్ బ్లూ కోల్ట్స్ సిబ్బందికి ద్విచక్ర వాహనాలను అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. మహిళలకు ఎల్లవేళలా రక్షణ అందించేందుకు ఈ టీంలు సహకరిస్తాయని అన్నారు. బ్లూ కోల్ట్స్ సిబ్బంది విధుల పట్ల అంకితభావంతో పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేష్కుమార్, డీఎస్పీలు సంపత్రావు, సూర్యనారాయణ, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
వైద్యులు అందుబాటులో ఉండాలి
పలిమెల: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కాటారం సబ్ మయాంక్సింగ్ వైద్యాధికారులకు సూచించారు. మండలంలోని నీలంపల్లి గ్రామాన్ని మంగళవారం కాటారం సబ్ మయాంక్ సింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలోని సబ్ సెంటర్, అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల, సబ్ సెంటర్ నిర్మాణస్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్షాలతో రోగాల ప్రబలే అవకాశం ఉండటంతో క్రమంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తూ గ్రామాల్లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రకాశ్రెడ్డి, వైద్యాధికారి డాక్టర్ కల్యాణి, ఎంఈఓ, ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శి పీటర్ పాల్, ఏఎన్ఎం, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు.సబ్ కలెక్టర్ మయాంక్సింగ్ -
నిట్ ఉన్నతిలో భాగస్వాములు కావాలి
● డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ కాజీపేట అర్బన్: నిట్ వరంగల్ క్యాంపస్ను అన్ని రంగాల్లో అగ్రభాగంలో నిలుపుతూ, ప్రపంచ స్థాయిలో కీర్తి ప్రతిష్టలను నిలిపే భాగస్వాములుగా నూతన విద్యార్థులు నిలవాలని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ తెలిపారు. నిట్లో ప్రవేశం పొందిన యూజీ 1,245 మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు నిట్ వరంగల్ ఆడిటోరియంలో మంగళవారం ఓరిఝెంటేషన్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఇందులో నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ ముఖ్య అతిథిగా పాల్గొని శ్రీసాంకేతిక విద్యకు మణిహారంగా నిలుస్తున్న నిట్ వరంగల్కు స్వాగతంశ్రీ అంటూ విద్యార్ధులను ఆహ్వానించారు. విద్యతోపాటు మానవీయ విలువలను పెంపొందించుకుని సమాజంలో ఉత్తమ పౌరులుగా రాణించాలని అన్నారు. -
రావయ్యా.. గణపయ్య
భూపాలపల్లి అర్బన్: గణేశ్ నవరాత్రి ఉత్సవాలకు అంతా సిద్ధమైంది. నవరాత్రి ఉత్సవాలు నేటినుంచి తొమ్మిది రోజుల పాటు జరగనున్నారు. విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. మండపాలు విద్యుత్ దీపాలతో ముస్తాబయ్యాయి. భక్తిపాటలతో గల్లీగల్లీలో సంబరం నెలకొననుంది. విభిన్న రూపాల్లో వినాయకుడు కొలువుదీరనున్నాడు. జిల్లాకేంద్రంతో పాటు మండలాలు, గ్రామాల్లో సుమారు 800లకుపైగా గణపతుల మండపాలు ఏర్పాటు చేశారు. సందడి వాతావరణం.. వినాయక చవితిని పురస్కరించుకొని జిల్లావ్యాప్తంగా వారంరోజుల నుంచే వినాయక విగ్రహాల విక్రయాలను ప్రారంభించారు. మంగళవారం విగ్రహాలు, పూజ సామగ్రి కొనుగోలు చేసేందుకు భక్తులు అఽధికసంఖ్యలో భూపాలపల్లికి తరలివచ్చారు. అంబేడ్కర్ సెంటర్లో వినాయకుడికి సమర్పించే పత్రి, ఎలక్కాయ, జాపత్రి, ఏకబిల్వం, పండ్లు తదితర సామగ్రితో జనాలు కిక్కిరిసిపోయారు. వినాయక విగ్రహాల ధరలు అధికంగా పెరిగిపోయాయి. రెండు ఫీట్ల నుంచి మొదలుకొని 10 ఫీట్ల వరకు విగ్రహాలను విక్రయించారు. వినాయక పూజలకు కావాల్సిన సామగ్రి దుకాణాలు, పూల దుకాణాలు, స్వీటుహౌజ్లు కిటకిటలాడాయి. కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. పలు పాఠశాలల్లో విద్యార్థులతో మట్టి వినాయక విగ్రహాలను తయారుచేసి పర్యావరణ పరిరక్షణపై ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు. జిల్లా వ్యాప్తంగా పలు స్వచ్ఛంద సంస్థలు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. అధికారులు అప్రమత్తం.. జిల్లాలో నవరాత్రి ఉత్సవాల్లో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీస్ శాఖ సిద్ధమైంది. విద్యుత్ ప్రమాదాలు సంభవించకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సోషల్ మీడియా, ప్రకటనల ద్వారా ప్రచార అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 300లకు పైగా ఆన్లైన్ దరఖాస్తులు వచ్చాయి. ఊరూవాడా ముస్తాబైన మండపాలు విభిన్న రూపాల్లో కొలువుదీరనున్న గణనాఽథులు -
రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలి
● వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ● ఎంజీఎంలో ఆకస్మిక తనిఖీ ఎంజీఎం: ఎంజీఎం ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద వైద్యులను అదేశించారు. మంగళవారం కలెక్టర్ ఎంజీఎం ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆస్పత్రిలోని జనరల్ మెడిసిన్ విభాగం డాక్టర్లు, అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా సీఎం రేవంత్రెడ్డి ఎంజీఎంపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. రోగుల సౌకర్యార్థం ఆస్పత్రిలో వెంటనే టోల్ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి అన్ని విభాగాలు, వార్డుల వద్ద ప్రదర్శించాలని సూచించారు. అప్పటి వరకు కలెక్టరేట్ టోల్ ఫ్రీనంబర్ 1800 425 3424ను సంప్రదించి వైద్యం, చికిత్సకు సంబంధించిన ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు. డాక్టర్లు, సిబ్బంది అందరూ ఎఫ్ఆర్సీ ద్వారానే హాజరు వేయాలన్నారు. ఆస్పత్రిలో అన్ని విభాగాల వద్ద ఏర్పాటు చేసిన 20 ఫిర్యాదుల పెట్టెలను డాక్టర్ల సమక్షంలో తెరిచి సమస్యలు లేకుండా చూడాలని, డబ్బులు అడిగిన సెక్యూరిటీ గార్డులపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం ఆస్పత్రి వర్క్షాప్ ప్రాంతంలో ప్రైవేట్ దుకాణాల వెండింగ్ జోన్ పనులను కలెక్టర్ పరిశీలించారు. సమావేశంలో ఎంజీఎం పర్యవేక్షకులు డాక్టర్ కిశోర్, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్లు డాక్టర్ రామ్కుమార్రెడ్డి, డాక్టర్ మురళి, ఆర్ఎంఓలు అశ్విన్కుమార్, శశికుమార్, వసంత్ తదితరులు పాల్గొన్నారు. రోగి సహాయ సేవలు ప్రారంభం ఎంజీఎంలో హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రోగి సహాయ సేవలను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సహా య సేవల కోసం శిక్షణ పొందిన ఏడుగురు కమ్యూనిటీ హెల్త్వర్కర్లను నియమించామని ఆమె తెలి పారు. శస్త్రచికిత్స, ఈసీజీ, ఎంఓటీ, ఎక్స్రే, యూఎ స్జీ స్కాన్లు, సీటి స్కాన్ వంటి వివిధ విభాగాలకు రెఫరల్స్, ట్రాన్స్ఫర్లు, డిశ్చార్జ్ అయిన రోగులు హాస్పిటల్ పరిధి నుంచి బయటికి వెళ్లే వరకు అవసరమైన సాయం చేస్తారని వివరించారు. హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ ప్రతినిధి ముజ్తబా హసన్ ఆస్కారి మాట్లాడుతూ సేవలతో రోగులకు త్వరితగతిన వైద్య సేవలు అందుతాయని తెలిపారు. -
కేఎంసీ ప్రిన్సిపాల్ చాంబర్ ముట్టడి
ఎంజీఎం: కాకతీయ వైద్య కళాశాల మెన్స్, ఉమెన్స్ హాస్టల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఎనిమిది నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని 15 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకపోవడంతో మంగళవారం కాకతీయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఎదుట కూర్చొని నినాదాలు చేశారు. ఈసందర్భంగా సీఐటీయూ హనుమకొండ జిల్లా కార్యదర్శి రాగుల రమేశ్, తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాద నాయక్ మాట్లాడుతూ.. కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లనే వేతనాలు బకాయిగా ఉన్నాయని, అధికారులు చేసిన తప్పులకు కార్మికులు బలవుతున్నారన్నారు. కార్యక్రమంలో తెలంగాణ యునైటెడ్ మెడికల్ – హెల్త్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జిల్లపెల్లి సుధాకర్, కార్మికులు పాల్గొన్నారు. -
యూరియా కోసం బారులు
కాటారం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం గోదాంకు మూడు రోజుల తర్వాత మంగళవారం ఉదయం 400 బస్తాల యూరియా వచ్చింది. దీంతో వెంటనే సుమారు 400 మందికి పైగా రైతులు ఒక్కసారిగా గోదాం ఎదుట బారులుదీరారు. దీంతో ట్రాఫిక్కు అంతరాయం కలగడంతో పాటు ఆందోళనకర పరిస్థితి నెలకొంది. పరిస్థితి చేయిదాటకుండా పోలీసులు, అధికారులు రైతులను నియంత్రించారు. ఒక్కో రైతుకు రెండు మూడు బస్తాలు పంపిణీ చేశారు. దీంతో లైన్లలో నిల్చున్న రైతులకు అందరికీ యూరియా అందలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తంచేస్తూ వెనుదిరిగారు. – కాటారంపీఏసీఎస్ గోదాం ఎదుట బారులుదీరిన రైతులు -
ప్రజలు, యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి
భూపాలపల్లి: రాబోవు కొన్ని రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ శర్మ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వర్షాలు కొనసాగుతున్న సమయంలో నిర్లక్ష్యం చూపకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తక్కువ ప్రదేశాలు, వంతెనలు, వాగులు, చెరువులు వంటి నీట మునిగే ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా జాగ్రత్త వహించాలన్నారు. విద్యుత్ తీగలు, కరెంట్ స్తంభాల దగ్గరికి వెళ్లరాదని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దన్నారు. మండల, గ్రామస్థాయి అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ప్రజల నుంచి వచ్చే సమాచారంపై వెంటనే స్పందించాలని ఆదేశించారు. సహాయక చర్యల కోసం తహసీల్దార్లు, ఎమర్జెన్సీ టీంలను సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ సూచించారు. వినాయక చవితిని పురస్కరించుకొని కలెక్టర్ రాహుల్ శర్మ మంగళవారం ఒక ప్రకటనలో జిల్లాలోని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వినాయక చవితి పండుగను శాంతి, సమన్వయ వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ప్రతిష్ఠించిన విగ్రహాల వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారని, జిల్లా యంత్రాంగం పకడ్బందీ పర్యవేక్షణ చేయాలన్నారు. నిమజ్జనం వరకు అంతరాయం కలగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని చెప్పారు. నిర్దేశించిన ప్రాంతాల్లోనే నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా భక్తులకు సూచించారు. ప్రజలందరూ అధికార యంత్రాంగం సలహాలు, సూచనలు పాటించాలన్నారు. వర్షం వల్ల విద్యుత్ ప్రమాదాలు వాటిల్లే అవకాశం ఉందని, ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ సూచించారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
పరీక్షలు చేయట్లే..
భూపాలపల్లి అర్బన్: వివిధ రకాల అనారోగ్య సమస్యలతో ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి వస్తున్న రోగులకు రక్త, స్కానింగ్, ఎక్స్రే పరీక్షలు చేయడంలో వైద్యులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఆస్పత్రిలో మైక్రోలజీ, పాథాలజీ, స్కానింగ్, ఎక్స్–రే ఆధునాతన పరికరాలు ఉన్నప్పటికీ వినియోగించడంలో విఫలమవుతున్నారు. పూర్తిస్థాయిలో సేవలు అందకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో పరీక్షల కోసం రోగులు ప్రైవేట్ను ఆశ్రయించక తప్పడం లేదు. ఇదంతా చూస్తున్నా.. వైద్యాధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. రక్త పరీక్షలు టీ హబ్కే.. గత ప్రభుత్వం టీ–డయాగ్నొస్టిక్స్ సెంటర్(టీ–హబ్) ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సీహెచ్సీలలో అన్ని రకాల రక్త పరీక్షలు, ఎక్స్–రే, ఈసీజీ, యూఎస్జీ, మమో, టీఫా స్కానింగ్లు అందుబాటులో లేవు. అక్కడ ఆస్పత్రులకు వచ్చిన బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైతే టెస్టుల కోసం రక్తాన్ని సేకరించి, స్కానింగ్కు బాధితులను టీ–హబ్కు పంపిస్తారు. 24గంటల తరువాత రిపోర్టు వస్తుంది. ఈ హబ్లో 57 రకాల పరీక్షలు చేస్తారు. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోకి పరీక్షలకు ఆధునిక యంత్రాలు ఉన్నప్పటికీ రోగుల నుంచి అవసరమైన వారి రక్తాన్ని సేకరించి ప్రతి రక్త పరీక్షకు టీ–హబ్కు పంపిస్తున్నారు. అక్కడ వారికి అందుబాటులో లేని రక్త పరీక్షలకు మాత్రమే టీ–హబ్కు పంపించాల్సి ఉండగా రెండు మూడు గంటల్లో ఆస్పత్రిలో పరీక్షలు చేసి రిపోర్టు ఇచ్చే సౌకర్యాలు ఉన్నప్పటికీ పరీక్షలు చేయడం లేదు. స్కానింగ్లకు రెండు మూడు రోజులు కడుపు, నడుము, మూత్రపిండాలు, గర్భిణులకు అప్డమిన్, ఆల్ట్రా స్కానింగ్ల కోసం రోగులు, గర్భిణులు రెండు, మూడు రోజులు తిరగాల్సి వస్తుంది. టీ–హబ్లో అల్ట్రా స్కానింగ్ చేసే రేడియాలజిస్టు ప్రతిరోజు ఉదయం 9గంటల గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విధులు నిర్వహించాల్సి ఉండగా రోజులో ఒక గంట పాటు కూడా విధులు నిర్వర్తించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేడియాలజిస్టు వచ్చిన సమయంలో స్కానింగ్ కోసం వేచి ఉన్న వారికి మాత్రమే స్కానింగ్ చేసి వెళ్లిపోతున్నాడు. ఆస్పత్రిలో అప్డమిన్ స్కానింగ్ చేసే రేడియాలజిస్టు ప్రతి రోజు 20 మందికి మాత్రమే స్కానింగ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఉదయం 9గంటలకు రావాల్సిన రేడియాలజిస్టు సమయానికి రాకపోవడం కాకుండా సమయపాలన పాటించకుండా మధ్యాహ్నం ఒంటి గంట వరకే విధుల్లో ఉంటున్నట్లు సమాచారం. ఆస్పత్రిలో ఉన్నటువంటి అన్ని రకాల సౌకర్యాలను వినియోగంలోకి తీసుకువస్తాం. తప్పని పరిస్థితుల్లో టీ–హబ్కు పంపిస్తున్నాం. స్కానింగ్ రేడియాలజిస్టులు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటాం. ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందిస్తున్నాం. – డాక్టర్ రాజేంద్రప్రసాద్, ఆస్పత్రి సూపరింటెండెంట్ స్కానింగ్, ఎక్స్రేలకూ తప్పని తిప్పలు ఆధునిక యంత్రాలున్నా పట్టించుకోవట్లే.. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్ను ఆశ్రయిస్తున్న రోగులు పట్టించుకోని వైద్యులుజిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచి అనారోగ్య బారిన పడి ఆస్పత్రికి వస్తుంటారు. ఆస్పత్రిలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసుకుంటే వారి రిపోర్టులు రావాలంటే రెండు మూడు రోజులు తిరగాల్సి వస్తుంది. ఒక రోజు వైద్య పరీక్షలు చేసుకొని రక్తం పరీక్షలకు ఇవ్వడం, రిపోర్ట్ కోసం మరుసటి రోజు రావడం, ఆ రోజు రిపోర్టు రాకపోతే మరో రోజు వచ్చి తీసుకొని డాక్టర్కు చూపించాల్సిన దుస్థితి నెలకొంది. సమయపాలన పాటించకుండా రోజుకు కొంత టార్గెట్ పెట్టుకొని స్కానింగ్లు చేయడం వలన జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారు రెండు మూడు రోజులు తిరగాల్సి ఉందని, ఉదయం ఏడు గంటలకే వచ్చే ముందు ఉండాలని వేచిచూస్తున్నారు. -
రేషన్ డీలర్లకు గౌరవ వేతనం ప్రకటించాలి
భూపాలపల్లి రూరల్: రేషన్ డీలర్లకు గౌరవ వేతనం వెంటనే ప్రకటించాలని, ఐదు నెలల కమీషన్లు, పాత బకాయిలను విడుదల చేయాలని కోరుతూ జిల్లా రేషన్ డీలర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ రాహుల్ శర్మకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్లస్వామి గౌడ్, కార్యదర్శి నిమ్మల భద్రయ్య మాట్లాడారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి రూ.5వేల గౌరవ వేతనం, రూ.300 కమీషన్ను పెంచాలని వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రం ఇచ్చామన్నారు. సెప్టెంబర్ 5వ తేదీలోపు 5నెలల కమీషన్ చెల్లించాలని, డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. లేదంటే రాష్ట్ర డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 5న రాష్ట్ర బంద్ చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల సంఘం నాయకులు, డీలర్లు పాల్గొన్నారు.సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతి -
నోటిఫికేషనే తరువాయి..
సాక్షిప్రతినిధి, వరంగల్ : స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి వేళయ్యిందా..? రిజర్వేషన్లు తేలకున్నా ఎన్నికలు నిర్వహించేందుకు సర్కారు సిద్ధమవుతోందా..? ఈ మేరకు పార్టీ కేడర్, నాయకులకు సంకేతాలు అందాయా..? పీఏసీలో తీసుకున్న నిర్ణయం మేరకు సెప్టెంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ వెలువడనుందా?.. జిల్లా ఉన్నతాధికారులను కూడా అప్రమత్తం చేశారా?... అంటే నిజమే అంటున్నాయి అధికార పార్టీ, అధికార వర్గాలు. నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడినా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని సోమవారం కలెక్టర్లకు మౌఖిక ఆదేశాలు అందాయన్న ప్రచారం జరుగుతోంది. రాజకీయ పార్టీల్లో మొదలైన సందడి... స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. మొదట పేర్కొన్న విధంగానే ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీపీపీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సెప్టెంబర్లో నోటిఫికేషన్ వస్తే ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో ఆరు జిల్లా ప్రజాపరిషత్లు, 75 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. 778 ఎంపీటీసీ స్థానాలు 75 ఎంపీపీ స్థానాలను ప్రకటించి ఆ మేరకు పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. ఆ తర్వాత 1,708 గ్రామ పంచాయతీలు, 15,006 వార్డులకు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా ఎన్నికలు జరిపే విధంగా 15,021 పోలింగ్ కేంద్రాలను కూడా సిద్ధం చేసినట్లు అధికారులు ఇది వరకే ప్రకటించారు. ఈ నెల 29న జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో జరిగే కీలక నిర్ణయాలను బట్టి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండగా.. రాజకీయ పార్టీల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికల సందడి పెరిగింది. సెప్టెంబర్ మాసంలో ఎన్నికలు ఖాయమన్న ప్రచారం నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీల టికెట్లపై పోటీ చేసేందుకు ఆశావహులు ఇప్పటినుంచే సై అంటున్నారు. ఆయా పార్టీలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎంపీలు, ఆయా పార్టీల జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలను కలిసి తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. జిల్లా జెడ్పీపీపీ జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచ్ వార్డులు పోలింగ్ కేంద్రాలు హనుమకొండ 1 12 12 129 210 1,986 1,986 వరంగల్ 1 11 11 130 317 2,754 2,754 జేఎస్భూపాలపల్లి 1 12 12 109 248 2,102 2,102 మహబూబాబాద్ 1 18 18 193 482 4,110 4,110 ములుగు 1 10 10 83 171 1,520 1,535 జనగామ 1 12 12 134 280 2,534 2,534 06 75 75 778 1,708 15,006 15,021ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు గడువు ముగిసి దాదాపుగా రెండేళ్లు కావస్తోంది. దీనిపై ఇదివరకే ఈ సెప్టెంబర్ నెలాఖరులోగా ఎన్నికలు జరిపించాలన్న హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ఇటీవల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అధికార పార్టీ నేతలు, సీఎం నిర్ణయించినట్లు ప్రచారం. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అంశం ఎటూ తేలకపోయినప్పటికీ.. పార్టీ పరంగా ఆ మేరకు అవకాశం కల్పించే యోచనలో అధిష్టానం ఉన్నట్లు ఆ పార్టీ ఉమ్మడి జిల్లా శాసనసభ్యులు చెబుతున్నారు. ఈ నెల 29న జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ కీలక నిర్ణయాలపై చర్చించి ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఎప్పుడు నోటిఫికేషన్ వెలువడినా.. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు సిద్దంగా ఉండాలని కలెక్టర్లకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్, చీఫ్ సెక్రటరీల నుంచి ఆదేశాలు అందడంతో అందరూ అలర్ట్ అయ్యారు. సెప్టెంబర్ మొదటి వారంలో ప్రకటించే అవకాశం ‘స్థానిక’ంలో బీసీలకు 42 శాతం అవకాశం.. పార్టీ కేడర్కు కాంగ్రెస్ సంకేతాలు ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ.. ఆ తర్వాతే సర్పంచ్, ‘ప్యాక్స్’ల ఎన్నికలు ఉమ్మడి జిల్లాలో 6 జెడ్పీలు, 75 జెడ్పీటీసీ స్థానాలు.. కలెక్టర్లకు సీఎస్ సమాచారం.. -
మట్టి గణపతులను పూజించాలి
భూపాలపల్లి: మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. సోమవారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్లో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పంపిణీ చేయనున్న మట్టి గణపతులు, మట్టి పతులు పూజించాలన్న వాల్పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం కార్యాలయానికి వివిధ పనులపై వచ్చిన ప్రజలకు మట్టి గణపతులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, డీఆర్డీఓ బాలకృష్ణ, కాలుష్య నియంత్రణ మండలి ఏఈ సుభాష్ నాయక్ పాల్గొన్నారు. భద్రతా చర్యలు చేపట్టాలి.. వినాయక విగ్రహాల ప్రతిష్ఠాపన నుంచి నవరాత్రుల అనంతరం నిమజ్జనాల వరకు అంతరాయం కలగకుండా భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయంలో సోమవారం వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నిమజ్జనం రోజున అత్యవసర వైద్య కేంద్రాల ఏర్పాటుతో పాటు మహదేవపూర్, జిల్లా ప్రధాన ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలన్నా రు. నిమజ్జన ప్రాంతాల్లో విద్యుత్, క్రేన్లు, తాగునీరు ఏర్పాటు చేయాలని, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్ పాల్గొన్నారు. హాస్టళ్లలో పటిష్ట పర్యవేక్షణ.. వసతి గృహాల విద్యార్థుల సంక్షేమం, ఆహార నాణ్యత పరిశీలనకు ప్రత్యేక, పోలీస్, క్లస్టర్ అధికారులు పటిష్ట పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ రాహుల్శర్మ ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో సంక్షేమ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. హాస్టళ్లలో మెనూ పాయించకపోయినా, విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసినా కఠిన చర్యలకు సిఫారసు చేయాలని, అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, డీఈఓ రాజేందర్ పాల్గొన్నారు. దరఖాస్తులను పరిష్కరించాలి.. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో కలిసి ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 53 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించారు. నిరంతర కృషితోనే జిల్లాకు గౌరవం.. కేటాయించిన లక్ష్య సాధనకు కృషి చేయడం ద్వారానే మన జిల్లాకు గౌరవం లభించిందని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో వెనుకబడిన జిల్లాల ప్రగతికి నీతి ఆయోగ్ ప్రకటించిన యాస్పిరేషన్ బ్లాక్ సంపూర్ణత అభియాన్ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లాకు రాష్ట్ర స్థాయిలో సిల్వర్, బ్రాన్జ్ మెడల్స్ సాధించిన సందర్భంగా అధికారులు, సిబ్బందికి అవార్డుల ప్రదానం కార్యక్రమం నిర్వహించారు. ముఖ గుర్తింపు ద్వారా పింఛన్ భూపాలపల్లి రూరల్: జిల్లాలోని పింఛన్దారులు ఇకపై బయోమెట్రిక్ ఆధారిత ఇబ్బందులు లేకుండా, తాము ఎక్కడ ఉన్నా సులభంగా ముఖ గుర్తింపు ద్వారా పింఛను పొందే అవకాశం కల్పించినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో డీఆర్డీఓ ఆధ్వర్యంలో పోస్టుమాస్టర్లకు పింఛను ఇవ్వడానికి అవసరమైన 89 ముఖ గుర్తింపు పరికరాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, డీఆర్డీఓ బాలకృష్ణ, ఆర్డీఓ రవి పాల్గొన్నారు. సంక్షేమ హాస్టళ్లను నిరంతరం పర్యవేక్షించాలి కలెక్టర్ రాహుల్ శర్మ -
450 మందికి వైద్య పరీక్షలు
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి సింగరేణి ఏరియా ఆస్పత్రిలో ఆదివారం నిర్వహించిన సూపర్ స్పెషాలిటీ హెల్త్ క్యాంపులో 450 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి తెలిపారు. సింగరేణి ఏరియా ఆస్పత్రిలో నిర్వహించిన హెల్త్ క్యాంపును ఏరియా జీఎం రాజేశ్వర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. హైదరాబాద్కు చెందిన స్పెషలిస్టు డాక్టర్ హాజరై ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. కార్మికుల కోరిక మేరకు సీఎండీ, డైరెక్టర్ల ఆదేశాల మేరకు సూపర్స్పెషలిటీ క్యాంపు నిర్వహించినట్లు జీఎం తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఓ టు జీఎం కవీంద్ర, అధికారులు నజీర్, మారుతి, నాయకులు విజేందర్, శేషారత్నం, ఇన్చార్జ్ ఏసీఎంజో డాక్టర్ గోపికృష్ణ, స్పెషలిస్టు డాక్టర్లు పాల్గొన్నారు. -
హాస్టల్ సిబ్బందిని జైలుకు పంపాలి
భూపాలపల్లి రూరల్: తాగునీటిలో పురుగుల మందు కలిపి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడిన సిబ్బందిని జైలుకు పంపాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం 100 పడకల ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న హాస్టల్ విద్యార్థులను పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతల నిశిధర్ రెడ్డితో కలిసి ఆమె పరామర్శించి మాట్లాడారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదంటే దీనికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, నాన్బెయిలబుల్ కేసులు పెట్టి జై ల్లో వేయాలని అన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు రాజేందర్, రవికిరణ్, ఉపాధ్యక్షులు మధుసూదన్రెడ్డి, రవి,రాజయ్య, సయ్యద్ గాలిఫ్, రవీందర్, రాజు నాయక్ పాల్గొన్నారు. ఉపాధ్యాయుడిపై హత్యాయత్నం కేసు నమోదుచేయాలి హాస్టల్లో తాగునీటిలో పురుగులమందు కలిపిన ఉపాధ్యాయుడినిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి విచారించి కఠినంగా శిక్షించాలని మానవ హక్కుల వేదిక నిజనిర్ధారణ బృందం సభ్యులు దిలీప్, పాలకుర్తి శ్రీనివాస్, కర్ణాటక సమ్మయ్య, చంద్రగిరి శంకర్ డిమాండ్ చేశారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న విధ్యార్థులను ఆదివారం బృందం సభ్యులు పరామర్శించారు. విద్యార్థులతో మాట్లాడి సంఘటన వివరాలు సేకరించిన అనంతరం మాట్లాడారు. చికిత్స పొందుతున్న విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులను, పాఠశాలకు చేరుకుని పాఠశాలలో ఉన్న విద్యార్థుల ద్వారా వివరాలు సేకరించామన్నారు. విద్యార్థులు పేర్కొన్నట్లు సంఘనటకు బాధ్యుడైన ఉపాధ్యాయుడు రాజేందర్, ఇతర బాధ్యులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తిరెడ్డి -
విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి
భూపాలపల్లి అర్బన్: మూడు రోజుల క్రితం విషతుల్యమైన నీళ్లను తాగి అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్రెడ్డి అన్నా రు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆదివారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో మూడు రోజుల క్రితం విద్యార్థులు తాగే నీటిలో విషద్రావణాన్ని కలిపినట్టు విద్యార్థుల ద్వారా ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ఇలాంటి ఘటనలు బాధాకరమని, ప్రిన్సిపాళ్లు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాఠశాలల్లో బాధ్యతగా ఉంటూ, వాతావరణ పరిస్థితులలో మార్పులకు అనుగుణంగా జాగ్రత్తలు పాటించాలన్నారు. యూఆర్ఎస్లో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడిన బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో విద్యార్థులను పరామర్శించిన అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్తో ఫోన్లో మాట్లాడారు. ఆస్పత్రి ఆవరణ శుభ్రంగా లేదని డ్యూటీ డాక్టర్లు, సూపరింటెండెంట్ అందుబాటులో లేరని, విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని చెప్పారు. ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు లేవని ప్రైవేట్ ల్యాబ్కు వెళ్లి టెస్టులు చేయించుకోవాలని విద్యార్థులను పంపించడం సరికాదన్నారు. తక్షణమే ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని రకాల ల్యాబ్ సౌకర్యాలను మెరుగుపరచాలని సూపరింటెండెంట్ను ఆదేశించారు. అనంతరం డీఈఓ ముద్దమల్ల రాజేందర్తో మాట్లాడి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల ఆరోగ్యం మెరుగయ్యే వరకు పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సుభాకర్రెడ్డి, కిరణ్కుమార్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు మందల రవీందర్రెడ్డి, స్థానిక నాయకులు కృష్ణమోహన్, హరిప్రసాద్, స్వామి, రాజిరెడ్డి, రమేష్, రవీందర్, జలంధర్ అనిల్ పాల్గొన్నారు.ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి -
ఏటా ముంపే..
కాళేశ్వరం: గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగడంతో బ్యాక్వాటర్తో ప్రతి ఏటా గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని పంటలు నీటమునిగి రైతులకు తీవ్రంగా నష్టం వాటిల్లుతోంది. అన్నారం నుంచి మేడిగడ్డ వరకు పంటలు మొక్క, పూత, కాత దశలోనే నీట మునుగుతున్నాయి. వ్యవసాయ, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రతి సంవత్సరం పంట నష్ట సర్వేలు చేయడమే తప్పా పరిహారం అందిన దాఖలాలు లేవు. గేట్లు ఎత్తితే.. మహదేవపూర్ మండలంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో వరద వచ్చినప్పుడు గేట్లు ఎత్తితే బ్యాక్ వాటర్తో పంట భూములు మునిగి ముంపునకు గురవుతున్నాయి. 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీలో 20వ పిల్లర్ కుంగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మేడిగడ్డ, సీపేజీ లీకేజీలతో అన్నారం బ్యారేజీల్లో నీటినిల్వలు చేయడం లేదు. గేట్లు కూడా ఎత్తి ఉంచుతున్నారు. వారం రోజు లుగా కురిసిన వర్షాలతో మండలంలోని అన్నారం టు మేడిగడ్డ బ్యారేజీ వరకు ఉన్న గోదావరి పరివాహక ప్రాంతాల్లోని పత్తి పంటలు నీటమునిగాయి. మొక్క, పూత దశలో ఉండి చేతికందే సమయంలో వరదలతో మునిగి నల్లగా మారి మురిగింది. వరద తీసినప్పటికీ ఒండ్రు మట్టి చేరి పంటకు యోగ్యంగా లేదు. సుమారు వందల ఎకరాల్లో పంట నష్టం జరిగినా అధికారులు మాత్రం తక్కువ సంఖ్యలో ప్రాథమికంగా సర్వే రిపోర్టులు పంపిస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఎకరానికి రూ.30వేల వరకు రైతులకు నష్టం జరిగింది. వరద ప్రభావం గోదావరి, ప్రాణహిత నదుల వరదలతో జిల్లాలోని కాటారం, మహదేవపూర్, పలిమెల మండలాల్లో పంట నష్టం జరుగుతుంది. గోదావరి తీర ప్రాంతం కాటారం మండలంలో 100 ఎకరాలు, మహదేవపూర్ మండలంలో 200, పలిమెల మండలంలో 100 ఎకరాల వరకు పంటలు నీటమునిగాయి. మహదేవపూర్లో నీటమునిగిన పత్తిపంట అన్నారం టు మేడిగడ్డ వరకు పంట నష్టం మొక్క, పూత, కాత దశలోనే నీటమునుగుడు.. సర్వేలు తప్ప అందని పరిహారం -
ఉత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహిద్దాం
కాళేశ్వరం: వినాయక నవరాత్రులు వచ్చాయంటే అందరిలో ఉత్సాహం నెలకొంటుంది. ప్రతి ఏడాది విగ్రహాల పరిమాణం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో విగ్రహాల తరలింపులో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి విద్యుత్శాఖ సిబ్బందికి, మండపాల నిర్వా హకులకు పలు సూచనలు చేసి అలర్ట్ చేస్తున్నారు. పట్టణాల నుంచి పల్లెల దాకా ఈనెల 27న వినాయక చవితి సందర్భంగా విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. ఈనేపథ్యంలో నవరాత్రులు ముగిసేవరకు పలు సూచనలు పాటించాలని అధికారులు చెబుతున్నారు. ● విగ్రహాల ఎత్తుకు అనుగుణంగా రూట్ని నిర్ణయించుకోవాలి. ఎక్కడైనా సమస్యలు ఉంటే విద్యుత్ సిబ్బందికి తెలియజేయాలి. ● విద్యుత్ లైన్లకు కనీసం రెండు అడుగుల దూరం పాటించాలి. లైన్లో ప్రవహించే విద్యుత్ సరఫరా ప్రభావం, ఇండక్షన్ రెండు అడుగుల వరకు ఉంటుంది. ● ఎత్తయిన విగ్రహాల తరలింపులో మరింత అప్రమత్తంగా ఉండాలి. ● మెటల్ ఫ్రేమ్లతో కూడిన డెకరేషన్లను వీలైనంత వరకు తగ్గించాలి. ● మండపాలకు విద్యుత్ సరఫరా కనెక్షన్ కోసం విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించి వారితోనే చేయించాలి. ● ఐఎస్ఐ మార్క్ కలిగిన ప్రామాణిక విద్యుత్ వైర్లను మాత్రమే వాడాలి. ఎలాంటి జాయింట్ వైర్లు వాడొద్దు. తగినంత కెపాసిటీ కలిగిన ఎంసీబీ తప్పనిసరిగా వాడాలి. ఇది విద్యుత్ ప్రమాదాల నుంచి రక్షణ ఇస్తుంది. ● మండపాల్లో విద్యుత్ సంబంధిత పనులు చేసేటప్పుడు పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. విద్యుత్ వైర్లు, పోల్స్, ఇతర ప్రమాదకర విద్యుత్ పరికరాల నుంచి పిల్లల్ని దూరంగా ఉంచాలి. ● ఎవరికై నా విద్యుదాఘాతం తగిలితే వెంటనే వైద్యసాయం అందించి, ఆ ప్రమాదం గురించి దగ్గరలోని విద్యుత్ సిబ్బందికి తెలియజేయాలి. ● వైరింగ్లో ఎక్కడైనా లీకేజీ ఉంటే, వర్షాలు కురిసినప్పుడు తేమ వలన విద్యుదాఘాతం తగిలే ప్రమాదం ఉంటుంది. మండపాల నిర్వాహకులు ప్రతి రోజూ తప్పనిసరిగా వైరింగ్ను పరిశీలించాలి. వినాయక మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా పోర్టల్లో చేసుకోవాలి. ప్రమాదాలకు చోటులేకుండా పండుగను ప్రశాంత వాతావారణంలో జరుపుకోవాలి. కమిటీలు, ప్రజలు సహకరించాలి. ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలి. ప్రతి విగ్రహానికి జియోట్యాగింగ్ ఉంటుంది. – పవన్కుమార్, ఎస్సై, మహదేవపూర్ జిల్లా వ్యాప్తంగా గణపతి నవరాత్రోత్సవాలకు ఏర్పాట్లు విద్యుత్ తీగల వద్ద జాగ్రత్తలు పాటించాలంటున్న అధికారులు వీలైనంతగా తక్కువ ఎత్తు విగ్రహాలు ప్రతిష్ఠించాలని సూచన -
‘సురవరం’ మరణం తీరనిలోటు
భూపాలపల్లి అర్బన్: సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి మరణం సీపీఐ, వామపక్ష, ప్రజాతంత్ర ఉద్యమాలకు తీరని లోటని పార్టీ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ తెలిపారు. ఆయన మృతిపై సీపీఐ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సుధాకర్రెడ్డి చిత్రపటానికి ఆదివారం పూలమాల వేసి ఘననివాళులర్పించారు. ప్రజా సమస్యలు, సంక్షేమానికి ఆయన చేసిన పోరాటాలను గుర్తు చేశారు. కార్యక్రమంలో నాయకులు గురిజెపల్లి సుధాకర్రెడ్డి, ప్రవీణ్కుమార్, సతీష్, సుగుణ, రాంచందర్, ఆసిఫ్పాషా, చంద్రమౌళి, శ్రీనివాస్ పాల్గొన్నారు.సీపీఐ జిల్లా కార్యదర్శి రాజ్కుమార్ -
నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
గణపురం: ప్రభుత్వ వసతి గృహాల్లోని విద్యార్థులకు భోజనం అందించడం, హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హెచ్చరించారు. గణపురం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ హాస్టల్, బీసీ వసతి గృహాన్ని ఆయన ఆదివారం తనిఖీ చేశారు. మోడల్ స్కూల్ వసతి గృహంలో మధ్యాహ్నం 12.30 గంటలు దాటినా పిల్లలకు భోజనం ఎందుకు పెట్టడం లేదని వార్డెన్ను అడగగా ఆదివారం కావున తమకు కూరగాయలు సప్లయ్ చేసే కాంట్రాక్టర్ చికెన్ అందించడంలో ఆలస్యం జరిగిందని అందుకే వంట ఆలస్యం అవుతుందని సమాధానమిచ్చారు. దీంతో సదరు కాంట్రాక్టర్ మరోసారి నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మెనూ ప్రకారం టిఫిన్, భోజనం అందిస్తున్నారా.. లేదా.. అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. సక్రమంగానే అందుతున్నాయని విద్యార్థులు చెప్పడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, తమ హాస్టల్లో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని, హాస్టల్ లోపల కారిడార్లో సీసీతో లెవలింగ్ చేయించాలని, హాస్టల్ ప్రాంగణంలో పిచ్చి మొక్కలు పెరిగి గుంతల్లో నీరు నిల్వనిలిచ దోమల బెడద ఎక్కవైందని విద్యార్థులు.. ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే మోడల్ స్కూల్ హాస్టల్లో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని, హాస్టల్ ప్రాంగణంలో గుంతలు లేకుండా సింగరేణి నుంచి మట్టిని తెప్పించి పూడ్చివేయాలని, హాస్టల్ లోపల సీసీతో మరమ్మతు పనులు చేయాలని సంబంధిత అధికారులకు కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం బీసీ బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. విద్యార్థులతో కలసి భోజనం చేశారు. భోజనంలో నాణ్యత లేదని భగార అన్నంలో క్యారేట్, పూదిన, కొత్తిమీర లాంటివి లేవని చికెన్ కూర విద్యార్థులకు సరిపోవడం లేదని, సాంబర్లో ఎలాంటి కూరగాయలు వేయలేదని ఇలా ఉంటే పిల్లలకు ఎలా పౌష్టికాహారం అందుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ప్రతిరోజు కూడా రుచికరమైన ఆహారం అందించడంలేదని, కుళ్లిపోయిన కూరగాయలతో వంట చేస్తున్నారని విద్యార్థులు ఎమ్మెల్యే చెప్పారు. ఆగ్రహించిన ఎమ్మెల్యే పద్ధతి మార్చుకొని మెనూ ప్రకారం విద్యార్థులకు శుభ్రమైన, రుచికరమైన ఆహారం అందించాని తెలిపారు. మోడల్ అంగన్వాడీ కేంద్రాలకు శంకుస్థాపన గణపురం మండలంలోని బుద్ధారం గ్రామంలో జెన్కో సీఎస్ఆర్ నిధులు రూ.80 లక్షలతో నిర్మించనున్న మోడల్ అంగన్వాడీ కేంద్రాలకు ఎమ్మెల్యే సత్యనారాయణరావు ఆదివారం శంకుస్థాపన చేశారు.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
ఘనంగా స్పోర్ట్ ్సడే రన్
వరంగల్ స్పోర్ట్స్: హాకీ క్రీడా దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని హనుమకొండ డీఎస్ఏ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన స్పోర్ట్స్డే రన్లో యువత, క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వద్ద డీవైఎస్ఓ గుగులోత్ అశోక్కుమార్ జెండా ఊపి రన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధ్యాన్చంద్ను స్మరించుకుంటూ ఈ నెల 31వ తేదీ వరకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రన్ స్టేడియం నుంచి అంబేడ్కర్ విగ్రహం మీదుగా తిరిగి స్టేడియానికి చేరుకుంది. కార్యక్రమంలో హ్యాండ్బాల్ సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్యామల పవన్, డీఎస్ఏ కోచ్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు
భూపాలపల్లి అర్బన్: సిబ్బంది సమన్వయం, విబేధాల కారణంగా విద్యార్థులను ఇబ్బంది పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాహుల్ శర్మ హెచ్చరించారు. శనివారం క్యాంపు కార్యాలయం నుంచి సంక్షేమ వసతి గృహాలలో ఆహారం, తాగునీటి నాణ్యత, సౌకర్యాల కల్పన, ఇతర అంశాలపై క్లస్టర్ అధికారులు, హాస్టల్ పర్యవేక్షణ ప్రత్యేక అధికారులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, కేజీబీవీ సంక్షేమ అధికారులు, జిల్లా కో ఆర్డినేటర్లు, ప్రిన్సిపాళ్లు, ప్రధానోపాధ్యాయులు, వార్డెన్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థుల అభ్యున్నతికి నాణ్యమైన భోజనం, విద్య అందిస్తుంటే కొంతమంది ఉపాధ్యాయులు, సిబ్బంది సమన్వయ లోపం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇక ముందు హెచ్చరికలు ఉండవని, సస్పెండ్ చేయడమే ఉంటుందని, నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. వసతి గృహాల్లో ఆహారం, సౌకర్యాలు కల్పన పర్యవేక్షణకు ఇప్పటికే ప్రత్యేక అధికారులను నియమించామని, సోమవారం నుంచి క్లస్టర్, పోలీస్ అధికారులు ప్రతీ హాస్టల్ తనిఖీ చేయాలన్నారు. విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తే సస్పెండ్ చేసేందుకు వెనుకాడబోమని విధుల నుంచి తొలగించడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తల్లితండ్రులకు దూరంగా హాస్టళ్లలో ఉంటూ విద్యార్థులు చదువుకుంటున్నారని.. వారిని మంచిగా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు. విద్యార్థులతో మాట్లాడి ఎప్పటికప్పుడు వారి సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. ఏదేని సమస్య ఉంటే ఉపాధ్యాయులతో మాట్లాడి సమన్వయ లోపాలను గుర్తించాలని తెలిపారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు స్నేహపూరిత వాతావరణం కల్పించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల స్థాయిలో మధ్యాహ్న భోజనం పరిశీలించాలన్నారు. మండల విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేయాలని విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. జిల్లాలో ఎక్కడైనా ఇబ్బందులు పడే అర్బన్ రెసిడెన్షియల్, కేజీబీవీ, కొర్కిశాల ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ రాహుల్ శర్మ హెచ్చరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, ఆర్డీఓ రవి, డీఈఓ రాజేందర్, ఇంటర్మీడియట్ అధికారి వెంకన్న పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్శర్మ -
స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం మనదే
రాష్ట్ర మంత్రులు లక్ష్మణ్, సీతక్క ● జనహిత పాదయాత్రపై సమీక్షఈ నెల 25, 26 తేదీల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేపట్టనున్న జనహిత పాదయాత్ర విజయవంతానికి శనివారం హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మంత్రులు లక్ష్మణ్, సీతక్క హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వందకు వందశాతం విజయం సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. – హన్మకొండ చౌరస్తా -
క్రీడలతో శారీరక దృఢత్వం
భూపాలపల్లి అర్బన్: క్రీడలతో శారీరక, మానసిక దృఢత్వం పెరుగుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని జయశంకర్ విగ్రహం నుంచి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ క్రీడా మైదానం వరకు జాతీయ క్రీడా దినోత్సవ రన్ నిర్వహించారు. ఎమ్మెల్యే జెండా ఊపి, క్రీడా జ్యోతితో రన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ కిరణ్ఖరే, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి రఘు, వివిధ శాఖల అధికారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు, క్రీడాకారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడమే కాకుండా, శారీరక దృఢత్వం, ఆరోగ్యకరమైన జీవనశైలికి క్రీడల ప్రాధాన్యతను ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, అధికారులు, క్రీడాసంఘాల ప్రతినిధులు, క్రీడాకారులు, పాల్గొన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
వచ్చే నెల 13న లోక్ అదాలత్
భూపాలపల్లి అర్బన్: సెప్టెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్.రమేశ్బాబు తెలిపారు. శనివారం కోర్టు ఆవరణలో జిల్లాలోని పోలీసు అధికారులతో జడ్జి సమావేశం నిర్వహించి మాట్లాడారు. జాతీయ లోక్ అదాలత్లో క్రిమినల్, సివిల్, వివాహ, కుటుంబ తగాద, మోటార్ వెహికిల్ యాక్సిడెంట్, చెక్ బౌన్స్, రాజీ పడదగు ఇతర కేసులు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కోర్టులలో పెండింగ్లో ఉన్న తమ కేసులను అధిక సంఖ్యలో పరిష్కరించుకొని లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని కోరారు. కోర్టులలో లేని కేసులను ప్రీ–లిటిగేషన్ ద్వారా న్యాయసేవాధికార సంస్థలో పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎక్కువ కేసులు పరిష్కరించేందుకు పోలీస్, ఎకై ్సజ్ శాఖ అధికారులు కృషిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి నాగరాజ్, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.ఆర్ దిలీప్కుమార్నాయక్, అదనపు ఎస్పీ నరేష్కుమార్, కాటారం డీఎస్పీ సూర్వనారాయణ, సీఐలు, ఎస్సైలు, కోర్టు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. న్యాయవాదులను అభినందించిన ప్రధాన న్యాయమూర్తి హనుమకొండలో నిర్వహించిన మధ్యవర్తిత్వ శిక్షణలో జిల్లాలోని బార్ అసోసియేషన్ తరఫున పాల్గొన్న న్యాయవాదులను జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమేశ్బాబు అభినందించారు. శిక్షణ ముగించుకొని వచ్చిన న్యాయవాదులు శనివారం మర్యాదపూర్వకంగా ప్రధాన న్యాయమూర్తిని కలిశారు. ఈ సందర్భంగా రమేశ్బాబు మాట్లాడుతూ.. కేసుల్లోని ఇరువర్గాలను సమన్వయ పరిచి కేసుల పరిష్కారానికి కృషిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి నాగరాజ్, జూనియర్ సివిల్ జడ్జి ఎస్.ఆర్ దిలీప్కుమార్నాయక్, శిక్షణ పొందిన న్యాయవాదులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమేశ్బాబు -
దరఖాస్తుల స్వీకరణ
భూపాలపల్లి అర్బన్: చిట్యాల, మహదేవపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో తాత్కాలిక పద్ధతిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ల నియామకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఇన్చార్జ్ డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్రీకాంత్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చిట్యాల సీహెచ్సీ సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టులు 12, మహదేవపూర్ సీహెచ్సీ 9..సివిల్ అసిస్టెంట్ సర్జన్ చిట్యాల సీహెచ్సీ 2, మహదేవపూర్ సీహెచ్సీ 3 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల డాక్టర్లు ఈ నెల 26వ తేదీలోపు చిట్యాల సీహెచ్సీలో అందించాలని 28వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. -
ఏటీసీ కోర్సులతో యువతకు భవిష్యత్
● కార్మికశాఖ వరంగల్ జాయింట్ కమిషనర్ రాజేంద్రప్రసాద్ కాటారం: ఐటీఐ అనుసంధానంగా ఏర్పాటుచేసిన ఏటీసీ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న కోర్సులతో యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కలిగి వారి ఉజ్వల భవిష్యత్కు ఎంతగానో ఉపయోగపడుతాయని కార్మికశాఖ వరంగల్ జాయింట్ కమిషనర్ రాజేంద్రప్రసాద్ అన్నారు. కాటారం మండలకేంద్రంలోని రైతువేదికలో శనివారం మహిళా సంఘాల సభ్యులు, స్వచ్ఛంద సంస్థ సభ్యులతో సమావేశం నిర్వహించి ఏటీసీ కోర్సులపై అవగాహన కల్పించారు. ఏటీసీ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న కోర్సులు అభ్యసించడం ద్వారా కలిగే ఉపాధి అవకాశాలను కార్మిక శాఖ అధికారులు, ఐటీఐ ప్రిన్సిపాల్స్ వివరించారు. తక్కువ కాలవ్యవధిలో ఏటీసీ కోర్సులు పూర్తి చేయవచ్చని.. తద్వారా మంచి జీతంతో ఉపాధి అవకాశాలు లేదా స్వయం ఉపాధి పొందవచ్చని పేర్కొన్నారు. ఏటీసీ కోర్సులతో కలిగే ప్రయోజనాలను వివరించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా లేబర్ ఆఫీసర్ వినోద, భూపాలపల్లి, కాటారం ఐటీఐ ప్రిన్సిపాల్స్ జుమ్లానాయక్, తిరుపతి, ఏపీఎం రవీందర్, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు పాల్గొన్నారు. -
నేడు క్రీడా దినోత్సవ రన్
భూపాలపల్లి అర్బన్: జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని నేడు (శనివారం) జిల్లా కేంద్రంలో రన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి రఘు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు రన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని అధికారులు, ఉద్యోగులు, అన్ని క్రీడాసంఘాల ప్రతినిధులు, సభ్యులు, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాళేశ్వరం: గత నెల 25న ప్రారంభమైన శ్రావణమాసం నేటితో ముగియనుంది. నెల రోజుల పాటు కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరాలయంలో ప్రత్యేక పూజలను భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయానికి వివిధ పూజలు, లడ్డు, ప్రసాదాలు, గదుల అద్దెలతో ఆదాయం సమకూరింది. గతేడాది శ్రావణమాసంలో రూ.52లక్షల వరకు ఆదాయం రాగా, ప్రస్తుతం 38.60లక్షల ఆదాయం మాత్రమే సమకూరినట్లు తెలిసింది. దీంతో ఈ శ్రావణమాసం ఆలయానికి భక్తుల సంఖ్య తగ్గడంతో ఆదాయం కూడా తగ్గినట్లు ఆలయ వర్గాలు తెలిపారు. భూపాలపల్లి అర్బన్: జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నూతన కార్యదర్శిగా అజ్మీర జైపాల్ను నియమించినట్లు జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో పనిచేస్తున్న ఫిజికల్ డైరెక్టర్లు, వ్యాయామ ఉపాధ్యాయులు అందరూ కలిసి సమష్టిగా జైపాల్ను ఏకగ్రీవంగా ఎంపిక చేశారన్నారు. నూతన కమిటీని నియమించి ఎస్జీఎఫ్ఏ క్రీడల క్యాలెండర్ను విడుదల చేసినట్లు డీఈఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంఓ లక్ష్మణ్, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. భూపాలపల్లి అర్బన్: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలపొందిన ఏఐటీయూసీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య ఆరోపించారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టిన హామీలను నెరవేర్చలేదన్నారు. ఈ సమావేశంలో నాయకులు జనార్దన్, ప్రసాద్రెడ్డి, శ్రీనివాసు, బాబు, జయశంకర్, నరసింహారెడ్డి, సాజిద్, సలీం, తదితరులు పాల్గొన్నారు. -
లక్ష పుష్పార్చన
కాళేశ్వరం: శ్రావణ శుక్రవారం సందర్భంగా కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీశుభానందదేవి(పార్వతీ) అమ్మవారికి వైభవంగా లక్షపుష్పార్చన నిర్వహించారు. ఉప ప్రధాన అర్చకులు పనకంటి ఫణీంద్రశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి వివిధ రకాల పూలతో నియమ నిష్టలతో విశేష పూజలతో అర్చన చేశారు. హారతి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కల్యాణ మండపంలో మహిళలు సామూహిక లలితా సహస్రనామ పారాయణం పఠనం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి మహిళలు అఽధికసంఖ్యలో పాల్గొన్నారు. వారికి తీర్థప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈఓ శనిగెల మహేష్, అర్చకులు భైకుంఠ పాండా, రామాచార్యులు, వెల్ది శరత్చంద్రశర్మ, గట్టు రాముఽశర్మ, రాధకృష్ణశర్మ, రామకృష్ణశర్మ పాల్గొన్నారు. -
కలుషిత నీరు తాగి విద్యార్థులకు అస్వస్థత
భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల (యూఆర్ఎస్) విద్యార్థులు శుక్రవారం కలుషిత నీరు తాగగా ఉపాధ్యాయులు అప్రమత్తమై వెంటనే ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, పాఠశాలల ఎస్ఓ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాకేంద్రంలోని సుభాష్ కాలనీలో ప్రైవేట్ భవనంలో నిర్వహిస్తున్న యూఆర్ఎస్లో ఉదయం టిఫిన్ సమయంలో 11 మంది విద్యార్థులు ఆర్వో ప్లాంట్ ద్వారా వచ్చిన నీటిని తాగారు. నీళ్లు దుర్వాసన వస్తున్నట్లు విద్యార్థులు ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థులు రాహుల్, లక్ష్మణ్, బిట్టు, శివకుమార్, అరవింద్, మహేష్, శివకుమార్, జాడి రాంచరణ్, శ్రావణ్, అజయ్, నాగచైతన్యలను ఆస్పత్రికి తరలించారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. విషయం తెలిసిన వెంటనే సీఐ నరేష్కుమార్, డీఈఓ రాజేందర్, ప్రత్యేకాధికారి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఆస్పత్రికి వెళ్లి విద్యార్థుల పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రస్తుతం విద్యార్థులకు ఇబ్బంది లేదని వైద్యులు తెలిపారు. కలుషితమైన నీటి వల్ల అస్వస్థతకు అయిన విషయాన్ని తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుని జరిగిన విషయాన్ని ఉపాధ్యాయులను తెలుసుకున్నారు. ఆర్వోప్లాంట్కు సంబంధించిన కెమికల్స్ ద్వారా తాగునీరు ఏమైనా కలుషితమైందా అనే విషయంపై డీఎంహెచ్ఓ మధుసూదన్ గురుకుల విద్యాలయాన్ని సందర్శించారు. తాగునీటిని ఓ బాటిల్లో శాంపిల్ తీసి, పరీక్ష నిమిత్తం ల్యాబ్కి పంపించాడు. -
యూరియా తిప్పలు
కొత్తపల్లిగోరి మండలకేంద్రంలోని ఆగ్రోస్ సెంటర్కు శుక్రవారం 444 బస్తాల యూరియా వచ్చింది. సమాచారం తెలుసుకున్న రైతులు సెంటర్కు భారీగా తరలివచ్చి లైన్లలో నిల్చున్నారు. ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున సిబ్బంది పంపిణీ చేశారు. లైన్లలో నిల్చున్న రైతులందరికీ యూరియా అందకపోవడంతో ఆగ్రహం వ్యక్తంచేశారు. పీఏసీఎస్కు నాలుగు రోజుల క్రితం 420 బస్తాల యూరియా రాగా మిషన్లో సాంకేతిక లోపంతో పంపిణీ చేయడంలేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. – రేగొండ (కొత్తపల్లిగోరి) -
ఉద్యోగుల భద్రత ప్రభుత్వాల బాధ్యత
భూపాలపల్లి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ విధానం రద్దు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుందని తెలంగాణ సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లింగంపల్లి దర్శన్ గౌడ్ తెలిపారు. సీపీఎస్ రద్దుచేయాలని కోరుతూ చేపడుతున్న ర్యాలీ శుక్రవారం జిల్లాకేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా కలెక్టరేట్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉద్యోగులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. ఉద్యోగ విరమణ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు ఆత్మగౌరవంతో జీవించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సెప్టెంబరు 1న నిర్వహించనున్న సభను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉపేందర్, స్థానిక నాయకులు రఘు రామస్వామి హరిహర ప్రసాద్, దిల్షాద్, శివ కష్ణ, కష్ణమూర్తి పాల్గొన్నారు. -
శనివారం శ్రీ 23 శ్రీ ఆగస్టు శ్రీ 2025
విద్యారణ్యపురి: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల హాజరుశాతం పెంపునకు (శనివారం) నుంచి ఫేషియల్ రికగ్నేషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) (ఏఐ ఆధారిత ముఖ గుర్తింపు)ను అమలు చేయనున్నారు. ఇందుకోసం ఇంటర్ బోర్డు అధికారులు సెంటర్ బోర్డ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) సాంకేతిక సహకారంతో టీజీబీఐఈ – ఎఫ్ఆర్ఎస్ యాప్ను ఇప్పటికే సిద్ధం చేశారు. ప్రతీరోజు రెండు సార్లు (ఉదయం, మధ్యాహ్న భోజనం తర్వాత) హాజరు తీసుకుంటారు. ఈమేరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టారు. కళాశాలకు ఏ విద్యార్థి అయినా హాజరుకాకుంటే అతడి తల్లిదండ్రుల ఫోన్కు సందేశం వెళ్తుంది. ఈ హాజరును ఆ కళాశాల ప్రిన్సిపాల్, డీఐఈఓ, రాష్ట్ర అధికారులు కూడా పర్యవేక్షిస్తారు. ఎఫ్ఆర్ఎస్ అమలుపై గత గురువారం ఆయా జిల్లాల్లో డీఐఈఓలు.. కాలేజీ ప్రిన్సిపాళ్లతో సమావేశాలు నిర్వహించి హాజరు అమలు విధానాన్ని తెలియజేశారు. హనుమకొండ, వరంగల్లో డీఐఈఓలు ఎ.గోపాల్, శ్రీధర్సుమన్ వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. జిల్లాల వారీగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, విద్యార్థుల వివరాలురోజుకు రెండుసార్లు హాజరు నమోదు ● గైర్హాజరైతే తల్లిదండ్రుల ఫోన్లకు సమాచారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో 50 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు2,9002,013● అధ్యాపకులు గూగుల్ ప్లేస్టోర్ నుంచి టీజీబీఐ ఈ –ఎఫ్ఆర్ఎస్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అందులో విద్యార్థుల ఫొటోతో సహా వివరాలు నమోదు చేయాలి. ● తరగతి ప్రారంభమయ్యాక స్మార్ట్ ఫోన్లో ఆ యాప్ ద్వారా కెమెరా ఓపెన్ చేసి వీడియా మాదిరిగా కూర్చున్న విద్యార్థులను తీసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా ఫొటో క్యాప్చర్ అయి హాజరు నమోదవుతుంది. ● ఈ విధానంతో 15నుంచి 20 సెకన్లలోనే 80మంది విద్యార్థుల వరకు హాజరు నమోదు చేయవచ్చని చెబుతున్నారు. ● ముఖ హాజరుకు శుక్రవారంనుంచే రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టారు. ఇంకా చేపట్టనివారు ఉంటే ఈనెల 23న చేపడతారు. ● కళాశాలల సమయం ఉదయం 9:30 గంటల నుంచి ప్రతీ తరగతి గదిలోని తొలి పీరియడ్ తీసుకునే అధ్యాపకుడు విద్యార్థుల ఎఫ్ఆర్ఎస్ హాజరు నమోదు చేస్తారు. ● మళ్లీ మధ్యాహ్నం లంచ్ తర్వాత 2గంటలకు మరోసారి నమోదు చేస్తారు. ప్రతీ జిల్లాకు ఇద్దరికి ఏఐ చాంపియన్లుగా శిక్షణ ఇంటర్ విద్యలో కృత్రిమ మేధ పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని రాష్ట్ర బోర్డు నిర్ణయించింది. విద్యలో నాణ్యత పెంపు, విద్యార్థుల్లో నైపుణ్యాల అ భివృద్ధి, సరికొత్త సాంకేతికత పరిచయం కోసం ఏఐని విని యోగించుకోనున్నారు. దీనిపై పట్టున్న సిబ్బందిని గుర్తించి ఏఐ చాంపియన్లుగా ఎంపిక చేసింది. ప్రతీ జిల్లాలోని అకడమిక్ మానిటరింగ్ సెల్లోని ఇద్దరు లెక్చరర్లు, ఒక లైబ్రేరియన్, ప్రతీ జిల్లాకు ఏఐ చాంపియన్లుగా ఎంపికై న ఒక లెక్చరర్, నాన్టీచింగ్ సిబ్బందికి శుక్రవారం హైదరాబాద్లో సంబంధిత ఉన్నతాధికారులు ఏఐ ఎఫ్ఆర్ఎస్ అమలు, వినియోగంపై శిక్షణ ఇచ్చారు. 1,2721,000విద్యార్థులకు రోజుకు రెండు సార్లు హాజరు మానుకోట1,3501,200734821520535యాప్ డౌన్లోడ్ విధానం తన మొబైల్ ద్వారా చూపిస్తున్న వరంగల్ డీఐఈఓ శ్రీధర్ సుమన్ జనగామ1,050950ఇంటర్లో హాజరుశాతాన్ని పెంచేందుకే.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల హాజరు తక్కువగానే ఉంటోంది. ఉదయం కళాశాలకు వచ్చిన విద్యార్థుల్లో మధ్యాహ్నం భోజనం కోసం కొందరు ఇంటికి వెళ్లిపోతున్న పరిస్థితి ఉంది. తిరిగి రావడం లేదు. ఇంటివద్ద కాలేజీకి అని చెప్పి డుమ్మా కొట్టే పిల్లలు కూడా ఉన్నారు. పరీక్షల్లో ఉత్తీర్ణత తక్కువగా రావడానికి కూడా విద్యార్థులు తరగతులకు సరిగా హాజరుకాకపోవడమే అనేది ఇంటర్బోర్డు అధి కారులు భావిస్తున్నారు. ఆయా సమస్యలకు పరిష్కారంగానే ఎఫ్ఆర్ఎస్ను అమలు చేస్తున్నారన్నది స్పష్టమవుతోంది. నేటినుంచే అమలు.. రిజిస్ట్రేషన్ షురూ -
పల్లెల అభివృద్ధి కోసమే పనుల జాతర
చిట్యాల: పల్లెల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయడానికే ప్రభుత్వం పనుల జాతర కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. కలెక్టర్ రాహుల్శర్మతో కలిసి మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కృషిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఈఈ వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి, ఎంపీడీఓ జయశ్రీ, డీఆర్డీఓ బాలకృష్ణ, నాయకులు ముకిరాల మధువంశీకృష్ణ, పులి తిరుపతిరెడ్డి, గుమ్మడి సత్యం, గడ్డం కొమురయ్య తదితరులు పాల్గొన్నారు. జీపీ భవనం ప్రారంభం టేకుమట్ల మండలం మందలోరిపల్లిలో రూ.20లక్షల నిధులతో ఇటీవల నిర్మించిన గ్రామ పంచాయ తీ భవనాన్ని కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మె ల్యే గండ్ర సత్యనారాయణరావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శిని అధికారులు సీట్లో కూర్చోబెట్టారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీఓ అనిత, ఎంపీఓ సురేష్, ఆర్ఐ సంతోష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్గౌడ్, మాజీ జెడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి పాల్గొన్నారు.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
తప్పు చేస్తే చట్టపరంగా శిక్ష
భూపాలపల్లి: తప్పు చేసిన వారికి చట్టపరంగా శిక్ష తప్పదని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. వివిధ కేసుల్లో సమర్థవంతంగా పనిచేసిన పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ను శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అభినందించి శాలువాలతో సత్కరించి మెమొంటోలు అందజేశారు. జిల్లాలోని మహాముత్తారం, పలిమెల మండలాల్లో నాలుగు కేసుల్లో నిందితులకు శిక్షలు విధిస్తూ ఇటీవల జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది. ఆయా కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా సమర్థవంతంగా పనిచేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎదులాపురం శ్రీనివాస్, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ నాగార్జునరావు, మహముత్తారం ఎస్సై మహేంద్రకుమార్, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఏఎస్సై వెంకన్న, కోర్టు డ్యూటీ ఆఫీసర్ కానిస్టేబుల్ రమేష్లను ఎస్పీ అభినందించి సత్కరించారు.ఎస్పీ కిరణ్ ఖరే -
ఆస్పిరేషనల్ బ్లాక్స్పై దృష్టి సారిస్తాం
భూపాలపల్లి: జిల్లాలోని ఆస్పిరేషనల్ బ్లాక్స్పై దృష్టి సారించి తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో యాస్పిరేషన్ సెంట్రల్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ రమణ యాడ్లతో సమావేశం నిర్వహించారు. ఆస్పిరేషనల్ బ్లాక్ అయినటువంటి పలిమెలను హెల్త్ ఇండికేటర్స్ నివేదిక తీసుకునేందుకు 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు స్పెషల్ ఆఫీసర్ జిల్లాలో పర్యటించారు. నీలంపల్లి, పంకెన, పలిమెల మహాముత్తారం, కాళేశ్వరం బ్రాహ్మణపల్లి, రేగొండ పీహెచ్సీలను సందర్శించారు. అభివృద్ధి నివేదికను శుక్రవారం కలెక్టర్కు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ సానుకూలంగా స్పందించి తగు చర్యలు తీసుకునేందుకు అంగీకరించారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మాయాంక్ సింగ్, అదనపు కలెక్టర్ అశోక్కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
అంతులేని ఆదాయం.. పోస్టింగ్ కోసం పోటాపోటీ..
రవాణాశాఖలో అంతులేని ఆదాయం ఉండటంతో కొందరు అధికారులు పోటీపడి పోస్టింగ్లు కొడుతున్నారు. కొందరు మోటారు వెహికిల్ ఇన్స్పెకర్లు ఇప్పుడు ఇన్చార్జ్ డీటీఓలుగా కూడా అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. ఇందులో కూడా కొన్నిచోట్ల సీనియర్లు తిరకాసు చేసి జూనియర్లను ముందుంచి తెరవెనుక అక్రమ ఆదాయమార్గాలపై చక్రం తిప్పుతున్నారు. హనుమకొండ డీటీఓ పోస్టు కూడా ఖాళీ అయిన సమయంలో వాస్తవానికి అదే కార్యాలయంలో సీనియర్గా ఉన్న 1994 బ్యాచ్కు చెందిన సీనియర్ ఎంవీఐ డీటీఓగా బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. అయితే తెరపైన కీలక పోస్టులో ఉండటం ఇష్టం లేక అత నే ఆ పోస్టుపై విముఖత చూపడంతో 2012 బ్యా చ్కు చెందిన ఒకరికి ఆ పోస్టు కట్టబెట్టి ఆ సీనియ ర్ ఎంవీఐ అన్నీ తానై చూస్తుండటం వల్లే మా మూళ్లు రెండింతలయ్యాయన్న ఆరోపణలు ఉ న్నాయి. ఇదిలాఉంటే ఇన్చార్జ్ల కోసం అన్ని జిల్లాల్లో పోటీ ఉంది. వరంగల్లో ఎంవీఐగా ఉన్న ఒకరు మహబూబాబాద్ ఇన్చార్జ్ డీటీఓగా వ్యవహరిస్తుండగా, పెద్దపల్లి ఎంవీఐగా ఉన్న ఓ అధికా రి ఆ పోస్టుతోపాటు ములుగు ఎంవీఐగా, ఇన్చార్జ్ డీటీఓగా వ్యవహరిస్తున్నారు. భూపాలపల్లిలో ఎంవీఐగా, ఇన్చార్జ్ డీటీఓగా ఒక్కరే చూస్తున్నారు. ఇలా.. ఏళ్లతరబడిగా ఉమ్మడి వరంగల్లో పాతుకుపోయిన కొందరు రవాణాశాఖ అధి కారు ల తీరుపై ఆ శాఖ ఉద్యోగులే చర్చించుకుంటున్నా రు. హైదరాబాద్ స్థాయిలో పైరవీలు చేసుకుంటూ కోరుకున్న పోస్టుల్లో కొనసాగుతున్నారంటున్నారు. కాగా,రవాణాశాఖలో పెచ్చుమీరుతున్న అవినీతిపై కొందరు అవినీతి నిరోధకశాఖ అధికా రులు కూడా ద్వంద్వ వైఖరితో ఉన్నారన్న చర్చ కూడా ఆ శాఖలో జరుగుతోంది. వ్యక్తిగత పరిచయాల ఆధారంగా లెక్కకు మించిన అవినీతి జరి గినా ఆ కార్యాలయాలు, అధికారులపై ఉదాసీనంగా ఉంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్
కాటారం: కాటారం మండలం శంకరాంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గొల్లపల్లి అంగన్వాడీ కేంద్రాన్ని గురువారం కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్ పరిశీలించారు. భారీ వర్షం కురిసినప్పుడు వరద నీరు అంగన్వాడీ కేంద్రంలోకి చేరడంతో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని పలువురు సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన సీడీపీఓ రాధికతో కలిసి అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి భవనం పరిస్థితి, చిన్నారుల ఇబ్బందిపై ఆరా తీశారు. రోడ్డు ఎత్తుగా ఉండటం, కేంద్రం చుట్టూ నీరు నిలిచి ఉండటాన్ని గమనించిన సబ్ కలెక్టర్ వెంటనే చర్యలు చేపట్టాలని పీఆర్ డీఈ సాయిలును ఆదేశించారు. శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని సీడీపీఓ, అంగన్వాడీ టీచర్ సువర్ణ సబ్ కలెక్టర్ను కోరారు. గ్రామంలో డ్రెయినేజీ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరగా.. నివేదిక తయారు చేయాలని సబ్ కలెక్టర్ అధికారులకు సూచించారు. సబ్ కలెక్టర్ వెంట పీఆర్ ఏఈ సతీశ్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ ఉన్నారు. -
మత్తులో భవిష్యత్
గంజాయి కిక్కులో స్టూడెంట్స్, యూత్ కాళేశ్వరం: గంజాయి మత్తులో పడి జిల్లాలోని విద్యార్థులు, యువకులు చేజేతులా బంగారు భవిష్యత్ను నాశనం చేసుకుంటున్నారు. పాఠశాల, కళాశాల విద్యార్థులు, యువకులు టార్గెట్గా జిల్లాలో గంజాయి విక్రయాలు సాగుతుండగా ఆ ఉచ్చులో చిక్కుకుంటున్నారు. మహారాష్ట్ర గుండా జిల్లాకు చేరుతున్న గంజాయి.. జిల్లాలోని అన్ని గ్రామాల్లో అమ్మకాలు జరుగుతున్నాయి. ఇష్టారీతిన వదిలేయడంతో.. భూపాలపల్లి, గణపురం, మహముత్తారం, కాటారం, మహదేవపూర్, కాళేశ్వరం లాంటి మండలాల్లో 13 ఏళ్ల పిల్లల నుంచి 20 ఏళ్ల యువత వరకు మద్యం, సిగరేట్, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడి బానిసలుగా మారుతున్నారు. పిల్లలను తల్లిదండ్రులు ఇష్టారీతిన వదిలేయడంతో చెడుస్నేహాలు చేస్తూ అడ్డదారులు తొక్కుతున్నారు. పోలీసులు పలుమార్లు కౌన్సెలింగ్లు ఇచ్చినా మార్పు రావడం లేదు. పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా యువకులు, విద్యార్థులు గంజాయికి బానిసలవుతున్నారు. పాఠశాల స్థాయి నుంచే కొందరు బాలురు గంజాయి కిక్కుకు బానిసలవుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జూలై 7న భూపాలపల్లిలో టాస్క్ఫోర్స్ పోలీసులకు ఐదుగురు వ్యక్తులు 135 కిలోల గంజాయితో పట్టుబడ్డారు. ఐటీఐ విద్యార్థులు ముగ్గురు జూలై 23న కాళేశ్వరం వద్ద 3.31 కిలోల గంజాయితో పోలీసులకు చిక్కారు. జూలై 26న మహాముత్తారం మండలం నుంచి భూపాలపల్లి వైపునకు బైక్పై వెళ్తున్న ముగ్గురు యువకులు 6.30 కిలోల గంజాయితో పట్టుబడ్డారు. జూలై 30న భూపాలపల్లి బస్టాండ్ వద్ద 300గ్రాముల గంజాయితో ఒకరు పట్టుబడ్డారు. ఈనెల 11న మంథని మండలం ఎక్లాస్పూర్ శివారులోని గాడుదులగండి గుట్ట సమీపంలో గంజాయి రవాణా చేస్తూ ఇద్దరితో పాటు మైనర్లు పోలీసులకు పట్టుబడ్డారు. వీరి వద్ద మహారాష్ట్రలోని సిరొంచ ప్రాంతంలో కొనుగోలు చేసిన 2.23 కిలోల ఎండు గంజాయి లభ్యమైంది. జిల్లాలో విచ్చలవిడిగా అమ్మకాలు యువతే టార్గెట్గా కోడ్ లాంగ్వేజ్ మహారాష్ట్ర గుండా జిల్లాకు.. -
పూర్వ ప్రాథమిక తరగతులకు నిధులు
విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఈ విద్యాసంవత్సరంనుంచి పూర్వ ప్రాథమిక తరగతులు ప్రా రంభించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు పా ఠశాలల్లో చిన్నారులకు అడ్మిషన్లు కల్పించారు. ప్రభుత్వం తాజాగా సమగ్ర శిక్ష ద్వారా పూర్వ ప్రాథమిక తరగతుల విద్యార్థుల కోసం నిధులు మంజూరు చేసి విడుదల చేసింది. ఈ మేరకు ఒక్కో స్కూల్కు రూ.1.70లక్షల నిధులను కలెక్టర్లకు జమ చేశారు. హనుమకొండ జిల్లాలో 45 పూర్వ ప్రాథమిక తరగతులకు నిధులు మంజూరై విడుదలయ్యాయి. అందులో 25 స్కూళ్లకు రూ.1.70లక్షల చొప్పున, మరో 20 స్కూళ్లకు రూ.50వేల చొప్పున నిధులు మంజూరు చేశారు. రంగులు, విద్యార్థులకు ఆట వస్తువులు ఆయా పాఠశాలల్లోని పూర్వ ప్రాథమిక తరగతి గదికి రూ.50వేలు వెచ్చించి రంగులు వేయించాల్సింటుంది. ఆట వస్తువులు కొనుగోలు చేయాలి. ఒక్కో విద్యార్థికి రూ.1,000 కేటాయించి బ్యాగ్, షూస్, బెల్ట్, టై తదితర వస్తువులు కొనుగోలు చేయాలి. ఈ నిధులు జిల్లా కలెక్టర్లకు విడుదల చేసిన నేపథ్యంలో వాటిని ఎలా వినియోగించుకోవాలనే విషయంపై కూడా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్.. డీఈఓలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. త్వరలోనే జిల్లాల కలెక్టర్లు ప్రతీ పూర్వ ప్రాథమిక తరగతి విద్యార్థుల బాగోగులు చూసుకునేందుకు ఒక ఆయా, ఒక ఇన్స్ట్రక్టర్ నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. కొన్నింటికి రూ.1.70లక్షలు, మరికొన్నింటికి రూ.50వేల చొప్పున విడుదల తరగతి గదికి కలర్, ఆటవస్తువులకు, విద్యార్థులకు బ్యాగ్, షూస్, టై, బెల్టు త్వరలోనే ఆయాలు, ఇన్స్ట్రక్టర్ల నియామకంజిల్లా పాఠశాలలు నిధులు భూపాలపల్లి 54 78.60 వరంగల్ 32 54.40 హనుమకొండ 65 52.50 మహబూబాబాద్ 22 37.40 జనగామ 15 21.90 ములుగు 08 13.60 -
వృద్ధులను గౌరవించాలి
భూపాలపల్లి అర్బన్: వృద్ధాప్యంలో ఉన్న వారిని గౌరవించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి నాగరాజు తెలి పారు. ప్రపంచ సీనియర్ సిటిజన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం జిల్లాకేంద్రంలోని వృద్ధాశ్రమంలో న్యాయ అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. సమస్యలు ఎదుర్కొంటున్న వయోవృద్ధులు ఎవరైనా సరే న్యాయసేవాధికార సంస్థను సంప్రదిస్తే వారికి చట్టబద్ధంగా ఉచిత సహాయం ఇస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వయోవృద్ధుల చట్టం, న్యాయసేవాధికార సంస్థ అమలుపరుస్తున్న వివిధ పథకాలను వారికి వివరించారు. వృద్ధాశ్రమంలో నివాసం ఉంటున్న పెద్దవారితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి దిలీప్కుమార్, బొట్ల సుధాకర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసచారి, అమృతవర్షిణి, అక్షర స్వచ్చంధ సేవా సంస్థ నిర్వాహకులు శ్యామ్ ప్రసాద్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్స్ కంప అక్షయ, ప్రియాంక పాల్గొన్నారు.సీనియర్ సివిల్ జడ్జి నాగరాజు -
తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దు
మొగుళ్లపల్లి: కొర్కిశాల కస్తూర్బాగాంధీ విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ అయిందని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవమని.. విద్యార్థినుల తండ్రిదండ్రులు ఆందోళన చెందవద్దని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ అన్నారు. డీఈఓ రాజేందర్, ఇన్చార్జ్ జిల్లా వైద్యాధికారి సునీత, మొగులపల్లి ఎస్సై అశోక్ గురువారం కేజీబీవీని సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారి ఆరోగ్య యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎనిమిది మంది పిల్లలకు వైరల్ ఫీవర్ రాగా.. నలుగురికి వాంతులు అయినట్లు తెలిపారు. స్కూల్ ఎస్ఓ శైలజను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గురువారం మండల వైద్యాధికారి నాగరాణి ఆధ్వర్యంలో స్కూల్లో హెల్త్ క్యాంప్ నిర్వహించినట్లు చెప్పారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు.డీఈఓ రాజేందర్ -
భద్రత, బందోబస్తు కోసమే ఆన్లైన్ నమోదు
● గణేష్ మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటించాలి ● ఎస్పీ కిరణ్ ఖరే భూపాలపల్లి: భద్రత, బందోబస్తు కోసమే పోలీసుశాఖ ఆధ్వర్యంలో గణేష్ మండపాల నిర్వహణకు సంబంధించిన ఆన్లైన్ నమోదు చేస్తున్నట్లు ఎస్పీ కిరణ్ ఖరే గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆన్లైన్ సమాచారం ఇవ్వడానికి రుసుం లేదన్నారు. మండపాల నిర్వాహకులు గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేసే ముందు స్థానిక పోలీస్స్టేషన్లో తప్పకుండా సమాచారం ఇవ్వాలని, పోలీస్ పోర్టల్లో వివరాలు పొందుపరచాలని తెలిపారు. మండపాల నిర్వాహకులు తప్పకుండా నిబంధనలు పాటించాలన్నారు. ప్రజా రవాణాకు, ఎమర్జెన్సీ వాహనాలు వెళ్లడానికి ఇబ్బంది లేకుండా మండపాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మండపాల వద్ద షాట్ సర్క్యూట్ జరుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. డీజేలు ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదని, సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించాలన్నారు. పోలీసుశాఖకు సహకరిస్తూ ప్రశాంత వాతావరణంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని ఎస్పీ కిరణ్ ఖరే సూచించారు. -
‘పనుల జాతర’కు ఏర్పాట్లు చేయాలి
● మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించాలి ● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి: ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించి గ్రామాలు అభివృద్ధి దిశగా ముందుకు సాగేందుకు చేపట్టిన పనుల జాతర–2025కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయం నుంచి నేడు (శుక్రవారం) నిర్వహించనున్న ‘పనుల జాతర–2025’ కార్యక్రమంపై గురువారం ఎంపీడీఓలు, ఎంపీఓలు, డీపీఓలు, పీఆర్ ఇంజనీర్లు, ఏపీఓలతో వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రజల భాగస్వామ్యంతో చేపడుతున్న అభివృద్ధి పనులు మరింత పారదర్శకంగా, ఫలప్రదంగా ఉండేలా అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. నేడు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రూ. 3.93 కోట్ల వ్యయంతో 1,075 పనులు చేపట్టనున్నామని, అధికారులు భాగస్వాములు కావాలని తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఆర్డీఓ బాలకృష్ణ, డీపీఓ శ్రీలత, పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఆన్లైన్లో నమోదు చేయాలి.. జిల్లాలో పీఎం ఆవాస్ యోజన సర్వే పనులను ఈ నెలాఖరులోపు పూర్తిచేసి ఆన్లైన్లో నమోదు చే యాలని కలెక్టర్ రాహుల్శర్మ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయం నుంచి గృహ నిర్మాణశాఖ అధికారులు, ఎంపీడీఓలతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో 55,444 ఇళ్లు సర్వే చేయాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం 3,359 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయన్నారు. సర్వే పనులను వేగవంతం చేయాలన్నారు. మట్టి వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలి.. వినాయక చవితి సందర్భంగా ప్రజలు పర్యావరణహితమైన మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ రాహుల్శర్మ సూచించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కాలుష్య నియంత్రణ మండలి చేపట్టిన మట్టి వినాయక విగ్రహాలను ఆవిష్కరించారు. జిల్లావ్యాప్తంగా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో వినాయక చవితి రోజున రెండు వేల మట్టి విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి క్రాంతికిరణ్, కలెక్టరేట్ సీ విభాగం పర్యవేక్షులు శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కేబుల్స్ తొలగించాలి
కాటారం: విద్యుత్ స్తంభాలపై ఏర్పాటు చేసిన కేబుల్ వైర్లు తొలగించుకోవాలని ట్రాన్స్కో ఏ డీఈ నాగరాజు కేబుల్, ఇంటర్నెట్ నిర్వాహకులకు సూచించారు. మండల కేంద్రంలోని ఏడీ ఈ కార్యాలయంలో బుధవారం కేబుల్, ఇంటర్నెట్ నిర్వాహకులు, పోలీస్, ట్రాన్స్కో అధి కారులతో ఏడీఈ సమావేశం నిర్వహించారు. విద్యుత్ స్తంభాలపై కేబుల్, ఇంటర్నెట్కు సంబంధించిన తీగలు ఏర్పాటు చేయడంతో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. విద్యుత్ ప్రమాదాల నివారణ ప్రతిఒక్కరి బా ధ్యతగా భావించాలన్నారు. గ్రామాల్లో విద్యుత్ సమస్యలు ఏర్పడితే సొంత మరమ్మతు చేయొద్దన్నారు. ఈ సమావేశంలో కాటారం ఏఈఈ ఉపేందర్, లైన్ ఇన్స్పెక్టర్ కిరణ్, కేబుల్, ఇంటర్నెట్ నిర్వాహకులు పాల్గొన్నారు. కాటారం: ఆపదలో ఉన్న వారి నుంచి సమాచారం వచ్చిన వెంటనే తక్షణ సాయం అందించాలని 108 జిల్లా మేనేజర్ మేరుగు నరేశ్ 108 అంబులెన్స్ సిబ్బందికి సూచించారు. మండల కేంద్రంలో 108 వాహనాన్ని బుధవారం తనిఖీ చేశారు. వాహనం కండీషన్, అందుబాటులో ఉన్న మందులు, ఎమర్జెన్సీ పరికరాల పనితీరు, రికార్డులను పరిశీలించారు. సిబ్బంది ఎప్పటికప్పుడు మెడిసిన్స్ అప్డేట్ చేసుకొని అందుబాటులో ఉంచుకోవాలని, అత్యవసర సమయాల్లో బాధితులకు ప్రథమ చికిత్స అందించి దగ్గరలో ఉన్న ఆస్పత్రికి చేర్చాలన్నారు. అత్యవసర సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. మేనేజర్ వెంట ఎమర్జెన్సీ మెడికల్ టెక్నిషియన్ శ్రీకాంత్, పైలెట్ విజేందర్ ఉన్నారు. భూపాలపల్లి అర్బన్: ఉపాధ్యాయుల విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23న హైదరాబాద్లో నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని ఐక్య ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) జిల్లా స్టీరింగ్ కమిటీ నాయకులు కోరారు. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలో కరపత్రాల ఆవిష్కరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. విద్యారంగ అభివృద్ధి, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కరించాలని, సీపీఎస్ రద్దు చేయాలని కోరుతూ హైదరాబాద్లో మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సేవానాయక్, తిరుపతి, కుమారస్వామి, ప్రభాకర్, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాటారం: ఉద్యోగ, ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిన సీపీఎస్ రద్దు చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని పీఆర్టీయూటీఎస్ జిల్లా అధ్యక్షుడు రేగూరి సుభాకర్రెడ్డి డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1న హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద చేపట్టనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ సంఘం సభ్యులతో కలిసి పోస్టర్ ఆవిష్కరించారు. సెప్టెంబర్ 1న చేపట్టే మహాధర్నాలో సీపీఎస్ ఉపాధ్యాయులు పాల్గొ ని ఐఖ్యతను చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రవీందర్, తిరుపతి, నాయకులు సురేశ్రావు, సంపత్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
చేపపిల్లల జాడేది!
భూపాలపల్లి రూరల్: మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి గత ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టింది. చెరువుల్లో చేపలను వదిలి మత్స్యకారుల ఉపాధికి దోహదపడింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత చేపపిల్లల పంపిణీపై అలసత్వం వహిస్తోంది. ప్రతీ సంవత్సరం మే నెలలో అధికారులు ప్రతిపాదనలు పంపి, జూన్, జూలై నెలలో టెండర్లు పూర్తి చేస్తారు. ఆగస్టు నెల వరకు చెరువులు పూర్తి స్థాయిలో నిండి ఉంటాయి కాబట్టి చేప పిల్లలను వదులుతారు. కానీ ఈ ఏడాది ఆగస్టు మాసం చివరికి వచ్చినప్పటికీ టెండర్లు పూర్తి కాలేదు. దీంతో జిల్లాలో చేపపిల్లల పంపిణీ ఉన్నట్టా..లేనట్టా! అని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. 837కి పైగా చెరువులు, కుంటలు గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఉచిత చేపపిల్ల ల పంపిణీకి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని మత్స్యకారులు అంటున్నారు. వానాకాలం భారీ వర్షాలు కురిస్తే ఆగస్టు నెల నుంచి ఉచిత చేపపిల్లల పంపిణీ జరగాల్సి ఉంది. కానీ ఆగస్టు 31వ తేదీ వరకు టెండర్లకు గడువు ఉంది. సెప్టెంబర్లో చేప పిల్లలను పంపిణీ చేసే అవకాశం ఉంది. ఆ నెలలో పంపిణీ చేస్తే చేపపిల్లల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుందని మత్స్యకారులు వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా డిపార్ట్మెంట్ చెరువులు, రిజర్వాయర్లు, గ్రామ పంచాయతీ చెరువులు మొత్తం 837 ఉన్నాయి. వీటిలో చేపపిల్లలు పోయాలంటే జిల్లాకు 2.30 కోట్ల చేపపిల్లలు అవసరం ఉంటుంది. పంపిణీలో అక్రమాలు! గతంలో మత్స్యకారులకు అందించే ఉచిత చేప పిల్ల ల పంపిణీలో భారీగా అక్రమాలు జరిగినట్లు అధికారులపై ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఉచిత చేప పిల్లల పంపిణీలో కాంట్రాక్టర్లే లాభపడుతున్నారని, మత్స్యకారులకు ప్రయోజనం ఉండటం లేదని వాపోతున్నారు. చెరువుల్లో చేపపిల్లలు పోయడానికి కాంట్రాక్ట్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు నాణ్యమైన పిల్లలను తేకుండా మత్స్యకారులను మోసం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పైగా చేపపిల్లల లెక్కింపులో కూడా అక్రమాలకు పాల్పడుతున్నారని మత్స్యకారులు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. ఇప్పటికై న అధికారులు స్పందించి నాణ్యమైన చేప పిల్లలను త్వరగా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు.మొత్తం చెరువులు 833రిజర్వాయర్లు 05మత్స్యకార సహకార సంఘాలు 125 సహకార సంఘాల సభ్యులు 10679 జిల్లాలో 837 చెరువుల్లో 2.30 కోట్ల చేపపిల్లలు అవసరం ఇప్పటికీ పూర్తికాని టెండర్లు అయోమయంలో మత్స్యకారులు -
యూరియా కొరత సృష్టించొద్దు
● కలెక్టర్ రాహుల్శర్మ భూపాలపల్లి అర్బన్: ఫర్టిలైజర్ షాపు యజమానులు యూరియా కొరత సృష్టించొద్దని, ఎరువుల సరఫరాపై రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. బుధవారం యూరియా సరఫరాపై కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి వ్యవసాయ, సహకార, సహకార సంఘాల సీఈఓలు, మార్క్ఫెడ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పంటలకు అవసరమైన యూరియా రైతులకు అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు వరి, పత్తి, మిర్చి, పప్పు దినుసుల పంటలు ఒకేసారి సాగు చేయడంతో యూరియా వినియోగం పెరిగిందన్నారు. మండల స్థాయిలో స్టాక్ వివరాలు మానిటరింగ్ చేయాలని, ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి యూరియా తరలించి రైతులకు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రైవేట్ డీలర్లు యూరియా కొనుగోలుకు ఇతర మందులు తీసుకోవాలని లింకు పెట్టొద్దన్నారు. అధికారులు, టాస్క్ టీములు ప్రతిరోజు పర్యవేక్షించాలన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, మార్క్ఫెడ్, ప్రైవేట్ కంపెనీల వద్ద మండల స్థాయిలో స్టాక్ ఎంత ఉందో క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) అశోక్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, సహకార అధికారి వాలియానాయక్, మార్క్ఫెడ్ డీఎం, సహకార సంఘాల సీఈఓలు, ఏఓలు పాల్గొన్నారు. -
మహాజాతరకు.. నిధుల వరద
‘మేడారం–2026’ నిర్వహణకు రూ.150 కోట్లు సాక్షిప్రతినిధి, వరంగల్/ఏటూరునాగారం: వచ్చే ఏడాది జరగనున్న తెలంగాణ కుంభమేళా, సమ్మక్క, సారలమ్మల మేడారం మహాజాతరకు భారీగా నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతీ రెండేళ్లకోసారి జరిగే ఈ మహాజాతరకు గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.150 కోట్లు మంజూరు చేస్తూ శాఖలవారీగా బడ్జెట్ను కేటాయించింది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. భారీగా నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, గిరిజన సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్లకు రాష్ట్ర సీ్త్ర శిశుసంక్షేమ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్శాఖ మంత్రి ధనసరి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. ఇతర రాష్ట్రాలనుంచి భక్తుల రాక మేడారం జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఈ క్రమంలోనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. గత ఏడాది రూ.110కోట్లు గత ఏడాది 2024 మహాజాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.110కోట్లు మంజూరు చేసి మేడారంలో పలు అభివృద్ధి పనులు చేసింది. జాతరలో భక్తుల సౌకర్యాలను మరింత పెంచేందుకు ఈసారి అదనంగా రూ.40 కోట్లు పెంచి రూ.150కోట్లు చేయడం గమనార్హం. 2022లో అప్పటి ప్రభుత్వం రూ.75 కోట్లను మేడారం జాతర నిర్వహణకు మంజూరు చేసింది. నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు గత ఏడాది రూ.110కోట్లే సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులకు మంత్రి సీతక్క ధన్యవాదాలు శాఖల వారీగా నిధులు కేటాయింపు 2026 జనవరిలో తెలంగాణ కుంభమేళా