Jayashankar
-
ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు
● సింగరేణి ఏరియా జీఎం రాజేశ్వర్రెడ్డి భూపాలపల్లి అర్బన్: ఏరియాలో ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి ఆదేశించారు. బుధవారం జనరల్ మేనేజర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సేఫ్టీ రివ్యూ సమావేశంలో జీఎం పాల్గొని మాట్లాడారు. డైరెక్టర్ కోల్ మైన్స్ రెగ్యులేషన్స్–2026లో జరిగిన కీలక మార్పులు, ఈ ఏడాది భూపాలపల్లి ఏరియాలో నమోదైన ప్రమాదాలు, వాటి కారణాలు, నివారణ చర్యలపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు. ఏరియా సేఫ్టీ ఆఫీసర్ మాటూరి రవీందర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అన్ని గనుల అధికారులు, ప్రాజెక్ట్ అధికారులు, ఇంజనీర్లు పాల్గొన్నారు. అనంతరం జీఎం మాట్లాడుతూ గత సమావేశ నిర్ణయాల అమలు స్థితిని సమీక్షించిన అధికారులు, కొత్తగా తీసుకొచ్చిన సేఫ్టీ సవరణలు గనుల భద్రతను మరింత బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు. భద్రతా ప్రమాణాల అమలు విధానం, ఫీల్డ్ స్థాయిలో ఎదురయ్యే సవాళ్లపై విస్తృతంగా చర్చించారు. గతంలో జరిగిన ప్రమాదాలపై విశ్లేషణ చేస్తూ, మానవ తప్పిదాలు, యంత్రాంగ లోపాలు, భద్రతా నిబంధనల నిర్లక్ష్యం తదితర ప్రధాన కారణాలను గుర్తించారు. భవిష్యత్లో ప్రమాదాలు నివారించేందుకు సేఫ్టీ అవగాహన కార్యక్రమాలు, కార్మికులకు నిరంతర శిక్షణ, ఆధునిక సాంకేతికత వినియోగం వంటి చర్యలు చేపట్టాలన్నారు. భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని, ప్రతీ ఉద్యోగి నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. సంస్థలో సేఫ్టీ సంస్కృతి బలపడాలని, జీరో ప్రమాద లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ సమావేశంలో ఓసీ త్రీ ప్రాజెక్ట్ ఆఫీసర్ భిక్షమయ్య, గనుల మేనేజర్లు, సేఫ్టీ ఆఫీసర్లు, ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. -
సైబర్ క్రైమ్పై విద్యార్థులకు అవగాహన
మొగుళ్లపల్లి : మండలంలోని వివిధ గ్రామాల బాలికలకు ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం సైబర్ క్రైమ్, సోషల్ మీడియా వినియోగంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి జి.మల్లేశ్వరి హాజరై మాట్లాడారు. నేటి బాలలే రేపటి పౌరులన్నారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుని స్కిల్ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి అంశాలను అభ్యసించాలని, తల్లిదండ్రులకు, గ్రామానికి గర్వకారణంగా నిలిచేలా మంచి భవిష్యత్ నిర్మించుకోవాలని సూచించారు. అనంతరం వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సునీత, ఎంపీడీఓ సురేందర్, ఎస్సై సురేష్, ఏపీఎం రమాదేవి, మెడికల్ ఆఫీసర్ నవత, చైల్డ్ హెల్ప్లైన్ కోఆర్డి నేటర్ గుర్రం తిరుపతి, సఖి కౌన్సిల ర్ మాధవి, అనూష, మమత, కళావ తి, అంగన్వాడీ సూపర్వైజర్లు, టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు. -
బాల్య వివాహాల నిర్మూలనకు పాటుపడాలి
ఏటూరునాగారం: బాలల హక్కుల పరిరక్షణలో భాగంగా బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతిఒక్కరూ పాటుపడాలని డిప్యూటీ డైరెక్టర్ దబ్బగట్ల జనార్దన్ అన్నారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయం ఆవరణలో బుధవారం బాలల భద్రత, సంరక్షణ, డ్రగ్స్ నిర్మూలన వారోత్సవాల కార్యక్రమాన్ని జిల్లా బాలల పరిరక్షణ విభాగం ప్రొటెక్షన్ అధికారి హరికృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ పౌరులందరికీ హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయన్నారు. బాల్య వివాహాల నిర్మూలనలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. అనంతరం ఐటీడీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రతాప్ గంటా మాట్లాడుతూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అనేక చోట్ల డబ్బులు పోగొట్టుకుని ఇ బ్బంది పడుతున్న విషయాలు చూస్తున్నామన్నా రు. అలాంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. బాలికలు చిన్న చిన్న విషయాలకు ఆకర్షణకు గురవుతుంటారని వివరించారు. తల్లిదండ్రులు వారిపట్ల బాధ్యతగా ప్రేమతో మెలగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ రాజ్కుమార్, ఎస్ఓ సురేశ్బాబు తదితరులు పాల్గొన్నారు. -
హక్కుల సాధనకు ఐక్య పోరాటాలు
భూపాలపల్లి అర్బన్: మేడే పోరాట స్ఫూర్తితో కార్మికుల హక్కుల పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమాలు చేపట్టాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య పిలుపునిచ్చారు. 140వ మేడే సందర్భంగా బుధవారం స్థానిక యూనియన్ కార్యాలయంలో కరపత్రాల ఆవిష్కరణ చేపట్టారు. ఈ సందర్భంగా గట్టయ్య మాట్లాడుతూ ఓపెన్ టెండర్లను వ్యతిరేకిస్తూ సింగరేణి సంస్థను కాపాడుకోవాలని, నాలుగు లేబర్ కోడ్ల రద్దు కోసం పోరాటాలు మరింత బలపడాలన్నారు. ఉద్యోగ భద్రతకు కార్మిక వర్గం సంఘటితంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికులపై లేబర్ కోడ్లు అమలు చేసి పని గంటలను పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దాసరి జనార్దన్, పిక కిరణ్, కాసర్ల ప్రసాద్రెడ్డి, రత్నం కిరణ్, నామాల శ్రీనివాస్, ఐత్య బాబు, రాళ్లబండి బాబు, జయశంకర్, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. ములుగు రూరల్: రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం విక్రయించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ అన్నారు. మండల పరిధిలోని పాల్సబ్పల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన బుధవారం ప్రారంభించి మాట్లాడారు. రైతులు కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కౌన్సిలర్లు పద్మదేవ్సింగ్, నల్లెల స్వాతి, భరత్ కుమార్, తిరుపతి రెడ్డి, తదితరలు పాల్గొన్నారు. -
‘షైన్’ విజయకేతనం..
హన్మకొండ : పదో తరగతి పరీక్ష ఫలితాల్లో షైన్ విద్యా సంస్థల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. తమ పాఠశాల విద్యార్థులు ఎ.అక్షర 588 మార్కులు, ఎల్.రేవంత్, ఎండి అఫ్రోజ్ 586, సమీరా నయీం 585, వెలుదండి సీమ, జి.సంహిత, కె.సుమిత్ 584, టి హాసిని, ఎ.ప్రశాంతి, ఎ.సుశాంత్, సీహెచ్.సిరి 583, వి.జాహ్నవి, మార్క శ్రీధన్ 582, ఎ.హరిణి 581, పి.యతిస్, పి.హర్షిత 580 మార్కులు సాధించారని షైన్ విద్యాసంస్థల అధినేత మూగల కుమార్ యాదవ్ వివరించారు. ఐఐటీ ఫౌండేషన్, నీట్తోపాటు పదో తరగతి పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతోనే ఈ ఫలితాలు సాధించామన్నారు. ఇటీవల వెలువడిన ఇంటర్ ఫలితాల్లో కూడా రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించారన్నారు. బుధవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పదో తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు, వారి ఉన్నతికి శ్రమించిన అధ్యాపకులను ఈ సందర్భంగా అభినందించారు. కార్యక్రమంలో కరెస్పాడెంట్ మూగల రమ, షైన్ పబ్లిక్ స్కూల్ ఎరగ్రట్టుగుట్ట బ్రాంచ్ సెక్రటరీ జక్కుల శ్రీనివాస్ యాదవ్, ఐఐటీ కోఆర్డినేటర్ మూగల రమేశ్ యాదవ్, ప్రిన్సిపాళ్లు పి.విశాల్, కె.దినేశ్, రాజ్ కుమార్, కవిత, ప్రగతిరెడ్డి, సబిత, మానస, కాలేజీ ప్రిన్సిపాళ్లు రాజుగౌడ్, పి.శ్రీనివాస్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు. -
‘పది’ ఫలితాల్లో ‘ఎస్ఆర్’ విజయభేరి
విద్యారణ్యపురి: పదో తరగతి పరీక్షల ఫలితాల్లో ఎస్ఆర్ స్కూల్స్ విద్యార్థులు విజయభేరి మోగించారని ఆ విద్యా సంస్థల చైర్మన్ ఎ. వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్రెడ్డి, సంతోష్రెడ్డి బుధవారం తెలి పారు. సి. సంస్కృతారెడ్డి 600 మార్కులకు 589, పిరంజి వంశీ 588, ఎస్.కీర్తన 587, అంకం సౌజన్య 587, ఎ. సంజయ్ 586, టి. వైష్ణవి 585, బాశెట్టి సాయిశ్రీ 584 మార్కులు సాధించారని వారు తెలి పారు. క్రమశిక్షణతో కూడిన విద్యనందిస్తున్నామని, పాఠ్యప్రణాళిక, అంకితభావం కలిగిన ఉపాధ్యాయ బృందం విద్యాబోధన చేశారని వారు పేర్కొన్నారు. తమ విద్యార్థులు పోటీ పరీక్షలను ఎదుర్కొనేలా ఐఐటీ అండ్ మెడికల్ ఫౌండేషన్లో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధం చేసేలా బృహత్తర పద్ధతిలో రాష్ట్రవ్యాప్తంగా ప్రైమ్స్కూళ్లను ప్రారంభించామని వారు వివరించారు. -
‘బాలయేసు’ విజయదుందుభి..
దేవరుప్పుల : జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని బాలయేసు ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు బుధవారం వెలువడిన పదో తరగతి ఫలితాల్లో మరోసారి విజయదుందుభి మోగించారు. 582 మార్కులతో బాకి అభిజ్ఞాన్ దేవరుప్పుల మండలంలో ఫస్ట్ ర్యాంకు సాధించాడు. మహ్మద్ రైసున్నీసా 576, కున్సోతు స్వాతి 566 మార్కులు, మొత్తం 32 మంది విద్యార్థుల్లో 22 మంది 500కు పైగా మార్కులు సాధించారని, ఇది ఎంతో గర్వకారణమని పాఠశాల కరస్పాండెంట్ బ్రదర్ జేసురాజ్ అన్నారు. ఈ సందర్భంగా ప్రతీ విద్యార్థి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందానికి అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయులు మదన్ మోహన్, మహేశ్, కృష్ణ, పాషా, షబానా, సంధ్య.. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. -
‘లా’ ఫలితాలు వెల్లడి..
● ఆలిండియా బార్ కౌన్సిల్ ఎగ్జామ్ దరఖాస్తుకు సుగమం ● నేటితో అఖరు కావడంతో అప్లయ్ చేసుకునేందుకు చాన్స్ ● ‘సాక్షి’కి విద్యార్థుల కృతజ్ఞతలు సాక్షి, వరంగల్ : కాకతీయ యూనివర్సిటీ ‘లా’ విద్యార్థులకు ఫలితాల వెల్లడి ఆలస్యమవుతుండడంతో ‘ఆలిండియా బార్ కౌన్సిల్ ఎగ్జామ్’కు దరఖాస్తు చేసుకునే అవకాశం కోల్పోతున్నారంటూ బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘లా’ విద్యార్థులకు టెన్షన్’ అనే కథనంపై కదలిక వచ్చింది. ఏమాత్రం బ్యాక్లాగ్స్ లేని మూడేళ్ల కోర్సు చదువుతున్న విద్యార్థులకు ఐదో సెమిస్టర్ మెమో, ఐదేళ్ల కోర్సు చదువుతున్న విద్యార్థులకు తొమ్మిదో సెమిస్టర్ మెమో ఈ పరీక్షకు అవసరం ఉండడంతో ఆయా విద్యార్థుల్లో ఆందోళన నెలకొందంటూ వారి వెతలను వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాకతీయ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ విభాగాధికారులు చాలెంజ్గా తీసుకుని రాత్రంతా శ్రమటోడ్చి బుధవారం సాయంత్రం ఫలితాలు ప్రకటించారు. కేయూఎగ్జామ్స్.ఆర్గ్లో ఫలితాలు అందుబాటులో ఉంచారు. దీనిపై పలువురు విద్యార్థులు ‘సాక్షి’కి ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారు. అయితే ‘ఆలిండియా బార్ కౌన్సిల్ ఎగ్జామ్’కు దరఖాస్తు చేసుకునే గడువు నేటితో ముగియనుంది. వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని బుధవారం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కుటుంబ సమేతంగా సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ ఈఓ భాస్కర్ వారిని శాలువాతో సత్కరించారు. టూరిజం గైడ్ విజయ్కుమార్ ఆలయ విశిష్టత గురించి వివరించగా శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు. -
‘ఏకశిల’ విద్యార్థుల ప్రతిభ..
హసన్పర్తి: టెన్త్ పరీక్ష ఫలితాల్లో ఏకశిల విద్యాసంస్థల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. వరుసగా 585,582,580,578 ,577,576,574,573,572,571,570 మార్కులతో రాష్ట్ర స్థాయిలో టాపర్గా నిలిచినట్లు ఏకశిల విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ గౌరు తిరుపతిరెడ్డి తెలిపారు. ఈసందర్భంగా హసన్పర్తి మండలం పెంబర్తిలోని ఏకశిల టెక్నో స్కూల్లో బుధవారం అభినందన సభ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకశిల విద్యాసంస్థలో విద్య అంటే మార్కులు మాత్రమే కాదు.. భవిష్యత్ను నిర్మించే శక్తి అన్నారు. నాణ్యమైన విద్యతోపాటు నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, జీవిత నైపుణ్యాలను పెంపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఫలితాలతో ఏకశిల విద్యాసంస్థకు మరింత గౌరవం పెరిగిందన్నారు. అనంతరం అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ఏకశిల విద్యాసంస్థల డైరెక్టర్లు బేతి కొండల్రెడ్డి, గౌరు సువిజారెడ్డి, ప్రిన్సిపాళ్లు బేతి శైలజారెడ్డి, ముచ్చ స్వప్నరెడ్డి, ఎం.డి. బాబా, కె.డి. స్వర్ణరాజ్, లవకుమార్, అడ్మినిస్ట్రేషన్ ఇన్చార్జ్ జి.రాంప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
98.36 శాతం ఉత్తీర్ణత
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో పదో తరగతి ఫలితాల్లో 98.36 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గత ఫలితాల్లో వెనుకబడి ఉన్న జిల్లా ముందువరుసలో ఉండాలని కలెక్టర్ రాహుల్శర్మ ఆదేశాలతో జిల్లా విద్యాశాఖ అధికారి పర్యవేక్షణలో ఉపాధ్యాయులు పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించారు. నవంబర్ మాసం నుంచే ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేశారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ ఏడాది టెన్త్ పరీక్షల షెడ్యూల్ సీబీఎస్ఈ తరహాలో తయారు చేసి పరీక్షలు నెల రోజుల పాటు నిర్వహించారు. ఒక్కో పరీక్షకు మధ్య నాలుగైదు రోజుల వ్యవధి ఏర్పడింది. ఫలితంగా జిల్లా రాష్ట్ర స్థాయిలో 11వ స్థానంలో నిలించింది. సంవత్సరాల వారీగా ఫలితాలు ఇలా.. జిల్లా వ్యాప్తంగా 122 ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత పాఠశాలల్లో మొత్తం 3,541 మంది విద్యార్థులకు గాను 3,483 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారిలో 1,750 మంది బాలురు పరీక్షకు హాజరుకాగా 1,708 ఉత్తీర్ణత సాధించారు. అలాగే 1,791 బాలికలకు 1,775 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 98.36 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా 58 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఫలించిన ప్రత్యేక తరగతులు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో 2025–26 విద్యా సంవత్సరానికి పదో తరగతి పరీక్ష ఫలితాలు 100 శాతం సాధించే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ అమలు చేశారు. ఇందులో భాగంగా 2025 నవంబర్ నుంచి పది విద్యార్థులకు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించారు. సెలవు రోజుల్లో కూడా విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో పాటు నిర్ణయించిన వాటి కంటే అదనంగా టెస్టులు నిర్వహించారు. వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా అభ్యాసదీపిక పేరుతో ముఖ్యమైన ప్రశ్న, జవాబులతో కూడిన పుస్తకాలను అందజేశారు. ఉపాధ్యాయులు విద్యార్థులను దత్తత తీసుకోని ప్రతీరోజు ఉదయం 4 గంటల నుంచే విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి నిద్రలేపించడం, చదివించడం వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. పెరుగుతూ.. తగ్గుతూ.. జిల్లాల పునర్విభజన తర్వాత 2016–17 సంవత్సరంలో నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో జిల్లా రాష్ట్రంలో 14 స్థానం, 2017–18లో 5వ స్థానం, 2018–19లో 7వ స్థానాల్లో నిలిచింది. 2019–20, 2019–21వ సంవత్సరానికి కోవిడ్ కారణంగా పరీక్షలు నిర్వహించలేదు. 2021–22లో 8, 2022–23లో 5వ స్థానం, 2023–24లో 16వ స్థానం, 2024–25 22వ స్థానంలో ఉండగా ఈ ఏడాది 11వ స్థానానికి పెరిగింది. ఈ ఏడాది 58 మంది విద్యార్థులు ఫెయిల్ కాగా వీరిలో ఎక్కువగా తెలుగు, గణితం సబ్జెక్టులో ఫెయిల్ అయినట్లు సమాచారం. గత కొన్ని సంవత్సరాల నుంచి టెన్త్ ఫలితాల్లో ఆశించిన స్థాయిలో ఉత్తీర్ణత లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పదో తరగతి ఫలితాల్లో గతేడాది కంటే ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెరిగింది. జిల్లా రాష్ట్రంలో 11వ స్థానంలో రావడం సంతోషకరం. వందశాతం ఫలితాల లక్ష్య సాధనకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాం. గతేడాదితో పోలిస్తే మెరుగైన ఫలితాలు సాధించాం. ఇదే ఉత్సాహంతో వచ్చే విద్యా సంవత్సరంలో ఇంకా మెరుగైన ఫలితాల సాధనకు కృషిచేస్తాం. – రాజేందర్, ఇన్చార్జ్ డీఈఓ గణపురం: మండలంలోని గాంధీనగర్ మహాత్మ జ్యోతిరావుపూలే బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు ప్రతిభ కనబరిచారు. ఎస్.వేదిత 579 మార్కులు సాధించి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఎం. లక్ష్మిప్రసన్న 576, కే. అర్చన 573, బి.వైష్ణవి 570, సాయిప్రియ 569, ఏ.రోజా 568 మార్కులు సాధించారు. -
‘తేజస్వి’ విద్యార్థుల సత్తా..
నయీంనగర్ : పదో తరగతి ఫలితాల్లో తేజస్వి పాఠశాల విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. 591 మార్కులతో కందిక సాహిత్య ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఎం.అభివర్షిని 590, ఎం.శ్రీతిక 588, జి.సాయి శ్రేష్ఠ, ఆర్. తన్మయి, ఎ.హర్షిత్, ఎండి.సుమేర్ అహ్మద్, అమృత వర్షిణి 587, కె.హిమవర్షిత, కె.నాగస్వామి, మణి సాయి ప్రణవ్ 586, జి.సౌమ్య శ్రీ, ఎల్.కిరణ్ తేజ్, సిహెచ్.మహిన్వద, ఎం.దీప్తి, ఎన్.కార్తికేయ 585, పి.సాయిసాన్వి, పి.శ్రీపాద రెడ్డి 584, సి.హెచ్.శ్రేష్ఠ 583, జునైరియా నౌరిన్, ఎల్.వర్ష, ఎ.రేష్మిత, ఎ.వర్షిణిశ్రీ 582, ఎం.గీతిక, ఎం.మేద, బి.లాస్య, ఎ.నీలిమైథిలి, టి.శశిధర్ 581, జి.సింధు 580 మార్కులు సాధించింది. 570– 579 మధ్య 78 మంది విద్యార్థులు, 560– 569 మధ్య 67 మంది, 550–559 మధ్య 73 మంది, 540 – 549 మధ్య 48 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 539 కంటే తక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు 161 మందితో నయీంనగర్, పోచమ్మకుంట, ప్రశాంత్నగర్ బ్రాంచ్లలో జిల్లా స్థాయిలో అధిక మార్కులు సాధించడం తేజస్వి ఘనత. విజయ పరంపర కొనసాగించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, తల్లిదండ్రులకు పాఠశాల చైర్మన్ రేవూరి జెన్నారెడ్డి, పిల్లలమర్రి చంద్రశేఖర్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలిపారు. -
అంత్యపుష్కరాలను విజయవంతం చేయాలి
కాళేశ్వరం: సరస్వతీ నది అంత్యపుష్కరాలను అధి కారులు సమన్వయంతో విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర దేవాదాయఽశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం హైదరాబాద్లో డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ సచివాలయంలో మే 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగు సరస్వతీనది అంత్యపుష్కరాల నిర్వహణకు సంబంధించి మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సమక్షంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సరస్వతీ అంత్య పుష్కరాల ఏర్పాట్లపై కలెక్టర్ రాహుల్ శర్మ మంత్రులకు వివరించారు. పుష్కరాల నిర్వహణలో భక్తులకు అవసరమైన సౌకర్యాలు, భద్రతా చర్యలు, రవాణా, పారిశుద్ధ్యం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇ బ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీ ధర్బాబు మాట్లాడుతూ అంత్య పుష్కరాలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున చేపట్టిన ఏర్పాట్లును త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం సరస్వతీ అంత్య పుష్కరాల వాల్ పోస్టర్, పుష్కరాల టీజర్ను విడుదల చేశారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, గోవిందహరి, కృష్ణవేణి, రామకృష్ణారావు, ఈఓ మహేష్, దేవస్థానం చైర్మన్ అవధాని మోహన్శర్మ, అర్చకులు పణీంద్రశర్మ, శరత్చంద్ర, ధర్మకర్తలు శ్యామ్, పద్మ, అశోక్, సత్త య్య, శ్రీధర్రావు తదితరులు పాల్గొన్నారు. మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్బాబు పుష్కరాల వాల్పోస్టర్ ఆవిష్కరణ -
వైద్య కళాశాలలో అవగాహన
భూపాలపల్లి అర్బన్: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని మెడికల్ కళాశాలలో షీ టీం– భరోసా విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల భద్రత, లింగ సమానత్వం, బాలల రక్షణ, మహిళలపై వివక్ష, హింసాత్మక చర్యలు, సైబర్ నేరాలపై విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించారు. సమాజంలో మహిళలు, పిల్లల భద్రతకు ప్రతీ ఒక్కరు బాధ్యత వహించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100, 112, 1930, 1098 నంబర్లను సంప్రదించాలన్నారు. సమస్యలు ఎదురైనప్పుడు భూపాలపల్లి షీ టీంను 87126 58162 నంబర్లో సంప్రదించాలని సూచించారు. మహిళలు, పిల్లల భద్రత కోసం షీ టీం సేవలను సద్వినియోగం చేసుకోవాలని షీ టీం ఎస్ఐ మహ్మద్ ఫజల్ ఖాన్, భరోసా ఎస్ఐ స్వప్న కుమారి సూచించారు. మే డేను విజయవంతం చేయాలి భూపాలపల్లి అర్బన్: మే 1వ తేదీన మే డేను విజయవంతం చేయాలని ఐఎఫ్టీయూ వరంగల్, భూపాలపల్లి జిల్లాల అధ్యక్షులు రాజేందర్, రాయిశెట్టి సమ్మయ్య పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలో మేడే పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్మిక హక్కుల పరిరక్షణ కోసం నాలుగు లేబర్ కోడుల రద్దుకు పోరాడాలని పిలుపునిచ్చారు. 8 గంటల పని దినం మేడే వీరుల త్యాగ ఫలితమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరసింగం, నవీన్, సమ్మయ్య పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర ఏటూరునాగారం: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని అమ్మి రైతులు మద్దతు ధర పొందాలని ఆత్మ చైర్మన్ కర్ల అరుణ అన్నారు. మండల పరిధిలోని రామన్నగూడెం, పప్కాపురం, రొయ్యూరు, శివాపూర్, శంకరాజుపల్లి గ్రామాల్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను అరుణ మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని కోరారు. రైతుల కష్టానికి తగిన మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. ధాన్యం విక్రయాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడ్ల దేవేందర్, చిటమట రఘు, వసంత శ్రీనివాస్, కొండగొర్ల పోశయ్య, సర్పంచ్ దేవుల పల్లి విజయ్కుమార్, వంగపండ్ల రవి పాల్గొన్నారు. -
ఓటరు జాబితా ప్రత్యేక సవరణపై జాగ్రత్తలు
భూపాలపల్లి అర్బన్: ఓటరు జాబితా ప్రత్యేక సవరణపై బూత్ స్థాయి అఽధికారులు జాగ్రత్తలు వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం పరిశీలకులు ప్రసునాంబ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భూపాలపల్లి మండలంలోని బూత్ స్థాయి అధికారులకు (బీఎల్ఓ) ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై కీలక సూచనలు జారీ చేశారు. 2025–2002 ఓటరు జాబితాలో షిఫ్టింగ్, డబుల్, డెత్ కేసులను గుర్తించి సంబంధిత జాబితాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మరణించిన ఓటర్ల విషయంలో వారి కుటుంబ సభ్యుల ద్వారా ఫారం–7 దరఖాస్తులు సమర్పింపజేయాలని సూచించారు. బీఎల్ఓ యాప్లో ఇంటింటికీ సర్వే నిర్వహిస్తూ ఓటర్ల వివరాలను సమగ్రంగా మ్యాపింగ్ చేసి, నమోదు శాతం పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేసి, ఓటరు జాబితా శుద్ధిని ఖచ్చితంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ హరికృష్ణ, తహసీల్దార్ లక్ష్మిరాజయ్య, డీటీ అంజలిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.ఎన్నికల సంఘం పరిశీలకులు -
ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు
గోవిందరావుపేట: మండల పరిధిలోని ధాన్యం కొనుగోళ్లలో పలువురు రైస్ మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. నాలుగు నుంచి ఐదు కిలోల వరకు తాలు పేరుతో కటింగ్ చేస్తున్నారని నిరసిస్తూ అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో 163 జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు తుమ్మల వెంకట్రెడ్డి, ఏనుగు రవీందర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి మాట్లాడారు. మిల్లర్ల కటింగ్లతో ఒక్కో లారీకి రూ.30వేల నుంచి రూ.40వేల వరకు నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్ధేశించిన ప్రమాణాలకు మించి కటింగ్ చేయడం అన్యాయమన్నారు. కటింగ్లను వెంటనే నిలిపివేయాలని కోరారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రైతులు ధాన్యం అమ్మకాల సమయంలో తప్పనిసరిగా రసీదులు తీసుకోవాలన్నారు. అక్రమాలకు పాల్పడితే అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిట్టిబాబు, రామస్వామి, నరసింహ నాయక్, సాంబశివుడు, సుధాకర్ రెడ్డి, చందూలాల్, సదానందం, సాంబయ్య, సత్యనారాయణ పాల్గొన్నారు. తాలు పేరుతో కటింగ్లకు పాల్పడుతున్న రైస్ మిల్లర్లు నిరసిస్తూ ఎన్హెచ్పై అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో -
తాగి నడుపుడు.. పోలీసులకు దొరుకుడు
భూపాలపల్లి: ఆ సెంటర్లో పోలీసోళ్లు ఉంటరు.. బండి ఈ సందులో నుంచి పోనియ్యి... అరె అక్కడ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నారు.. బైక్ ఇక్కడే ఆపు. కొద్దిసేపు ఆగి, పోలీసులు వెళ్లాక వెళ్దాం.. మద్యం సేవించి వాహనం నడిపే వారు ప్రతీ రోజు తీసుకునే జాగ్రత్తలు ఇవి. మందు తాగి వాహనం నడపడం మూలంగా ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిసినా, పోలీసులు పట్టుకొని కేసులు నమోదు చేస్తున్నా కూడా కొందరిలో మార్పు రావడం లేదు. డ్రంకెన్ డ్రైవ్ నియంత్రణకు జిల్లా పోలీసు యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపడుతుంది. ప్రతీ రోజు ప్రధాన కూడళ్లు, జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహిస్తున్నాం. క్షణికానందం కోసం మద్యం మత్తులో వాహనం నడిపి జీవితాలను నాశనం చేసుకోవద్దు. డ్రంకెన్ డ్రైవ్ వలన జరిగే ప్రమాదాలు, అనార్ధాల గురించి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి వివరిస్తున్నాం. వాహనదారులు తమ బాధ్యతను గుర్తించి మద్యం సేవించి వాహనం నడపొద్దని మా సూచన. – సిరిశెట్టి సంకీర్త్, ఎస్పీ గడిచిన మూడు నెలల కాలంలో (జనవరి నుంచి మార్చి వరకు) జిల్లా వ్యాప్తంగా పోలీసులు చేపట్టిన తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం 90 రోజుల వ్యవధిలోనే పోలీసులు 344 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. సగటున రోజుకు సుమారు నలుగురు మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పోలీసులకు చిక్కుతున్నారు. పట్టుబడ్డ వారిలో ఇప్పటివరకు 142 మంది వాహనదారులు కోర్టు ముందు హాజరుకాగా, వారికి న్యాయస్థానం రూ. 1,50,360 జరిమానా విధించింది. మద్యం సేవించి వాహనం నడపడాన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు, ఒకరికి జైలు శిక్ష కూడా విధించింది. మిగిలిన కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ●డ్రంకెన్ డ్రైవ్ వలన జరిగే ప్రమాదాలు కేవలం వాహనదారుడికి మాత్రమే కాక రోడ్డుపై వెళ్లే అమాయకులు కూడా బలి అవుతున్నారు. ఇంటి యజమాని మత్తులో చేసే చిన్న పొరపాటుతో భార్యాపిల్లలు అనాథలవుతున్న ఉదంతాలు జిల్లాలో అనేకంగా ఉన్నాయి. పోలీసులు ఎంతో ఓపికతో నెలలో నాలుగైదుసార్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మందుబాబుల్లో మార్పు రావడం లేదు. మూడు నెలల్లో 344 కేసులు ఒకరికి జైలు శిక్ష, 142మందికి జరిమానాలు మందుబాబుల్లో కానరాని మార్పు -
శాస్త్రోక్తంగా గరుడాదివాసం
మంగపేట: మల్లూరులోని శ్రీ హేమాచల క్షేత్రంలో భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆలయ ఉప ప్రధానార్చకులు అమరవాది మురళీకృష్ణమాచార్యుల బృందం గరుడాదివాసం కార్యక్రమాన్ని మంగళవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. రెండోరోజూ కార్యక్రమంలో భాగంగా ఆల య ఇన్చార్జ్ ఈఓ వీరస్వామి, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ సత్యనారాయణ పర్యవేక్షణలో బ్రహ్మోత్సవాల యాగ్నికులు ఉదయం 8 గంటలకు ఆలయ ప్రాంగణంలోని పంచముఖాంజనేయ స్వామి వారి కి స్నపనం (అభిషేకం) పూజలు నిర్వహించారు. యాగశాలలో పూజలు యాగశాలలో మధ్యాహ్నం 12 గంటల వరకు ఉత్సవ మూర్తులకు సేవాకాలం, బాలబోగం నివేదన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు గరుడాదివాసం కార్యక్రమంలో భాగంగా వైనతేయ లేఖనం (గరుడ) గరుడ చిత్రపటం వేసి ఆవాహనం పూజలు నిర్వహించారు. నేత్రోన్మీలన, గరుడాదివాసం, సేవాకాలం, నివేదన, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వహించారు. గర్భాలయంలోని స్వయంభు స్వామివారికి వేదమంత్రోశ్చరణతో ప్రత్యేక అర్చనలు జరిపించి వెండి కవచం, పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణయజుర్వేదం పండితులు వరప్రసాధ్, శ్రీరంగం వెంకటాచార్యులు. బరధ్వాజాచార్యులు, అమరవాది రామనర్సింహాచార్యులు, మణిదీపాచార్యులు, విరంచి, ఆలయ పూజారులు ముక్కామల రాజశేఖర్ శర్మ, అనిపెద్ది రాజీవ్, కారంపుడి పవన్కుమార్ ఆచార్యులు, ఏడునూతుల ఈశ్వర్చంద్, ఆలయ సీనియర్ అసిస్టెంట్ సీతారాములు, రికార్డు అసిస్టెంట్ లక్ష్మినారాయణ, శివరాజు శేషు, సిబ్బంది పాల్గొన్నారు. జాతరకు పటిష్ట బందోబస్తు వచ్చే నెల 6వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాల (జాతర) సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు, అవాంఛనీయమైన ఘటనలు తలెత్తకుండా నలుగురు సీఐలు, పది మంది ఎస్సైలు, 100 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఏటూరునాగారం సీఐ అనుముల శ్రీనివాస్ తెలిపారు. బందోబస్తు ఏర్పాట్ల పరిశీలనకు మంగళవారం వచ్చిన ఆయన లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. అభయాంజనేయ స్వామికి స్నపనం స్వయంభు లక్ష్మీనర్సింహస్వామికి ఆభరణాల అలంకరణ -
– సాక్షి, మహబూబాబాద్/తొర్రూరు
బుధవారం శ్రీ 29 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026నాన్నా.. చాక్లెట్లు కొనిస్తానన్నావు.. ఊరంతా తిప్పి ఊరవతలికి తీసుకువచ్చావు ఎందుకు నాన్నా.. చెట్టుకిందికి తీసుకువచ్చి తాడు తీస్తుంటే ఏదో ఊయల కడుతున్నావు అనుకున్నాం. నాకు, తమ్ముడి మెడకు చుట్టావు. ఏదో ఆట అనుకున్నాం. కొమ్మపైనుంచి తీసి లాగుతున్నావు. ఊపిరి ఆడట్లేదు నాన్న. ఇంకోసారి చాక్లెట్లు అడగము. గొంతు బిగుసుకుపోతోంది. తాడు తీయ్ నాన్నా.. నేను తమ్ముడు బాధ భరించలేకపోతున్నాం. మమ్ముల్ని కిందికి దింపు నాన్నా.. అమ్మకు, నీకు మధ్య మేము అడ్డుగా ఉన్నామా.. మీరిద్దరు పంచాయితీ పెట్టుకుంటే మాదా తప్పు. మేమేం చేశాం నేరం.. మీ పిల్లలుగా పుట్టడమా.. ’ అంటూ ఆ చిన్నారులు తమ ఆఖరి క్షణాల్లో తండ్రిని వేడుకున్నారేమో.. ఆ మాటలకు తండ్రి మనస్సు కరిగి కిందికి దించి ఉంటే రెండు ప్రాణాలు దక్కేవి. కానీ, పిల్లల రోదనలు వినే పరిస్థితిలో లేని తండ్రి.. ఇద్దరి ప్రాణాలు పోయేవరకు అక్కడే రాయిలా నిలబడి చూశాడు. విగతజీవులయ్యారని నిర్ధారించుకున్నాక సమాజం తనను ఛీ కొడుతుందని భావించి అదే చెట్టుకు ఉరివేసుకున్నాడు. బిడ్డలకోసం నూటొక్క ముడుపులు కట్టి.. కోటొక్కా.. పూజలు చేసిన వారు ఉన్నారు.. ఇది సమాజంలో ఒకవైపు ఉంటే.. భార్యాభర్తల తగాదాలు, వివాహేతర సంబంధాలు, క్షణికావేశాలతో కన్నబిడ్డలను కర్కశంగా చంపిన ఘటనలు మరోవైపు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి ఘటనే మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో సోమవారం జరగగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. అభం శుభం తెలియని ఆ పసికూనలను ఓ తండ్రి చంపి తనూ ఆత్మహత్య చేసుకున్నాడు. కింద పడితేనే తండ్రి గుండె పగిలినంత బాధ ఉంటుందంటారు.. కానీ, పిల్లలను ఉరివేసి వారి ప్రాణం పోయేదాక చూసిన అతను ఎంత కర్కోటకుడోనని, అతనికి మనస్సెట్టా వచ్చిందని.. ఆ బిడ్డలు ఎంత తల్లడిల్లిపోయారో అంటూ ఈ ఘ టన చూసిన, విన్న స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పిల్లలను తన దగ్గరికి రానివ్వడం లేదన్న అక్కసుతో.. తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామానికి చెందిన కిన్నెర గుంశావలి (29), అదే గ్రామానికి చెందిన కిన్నెర కాంతను 11 ఏళ్ల క్రితం వివాహమాడాడు. వారికి కూతురు విన్య, కుమారులు విలాస్ (5), వికేష్ (3) ఉన్నారు. గుంశావలి తొర్రూరులోని ఓ బైక్ మెకానిక్ షాప్లో పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసైన గుంశావళి రోజూ మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడేవాడు. ఈ బాధలు భరించలేక కాంత పది రోజుల క్రితం అదే గ్రామంలోని నానమ్మ సీతమ్మ ఇంటికి పిల్ల లను తీసుకొని వెళ్లింది. గుంశావలి.. పది రోజులుగా పిల్లల కోసం వెళ్తే ఆమె పంపించడం లేదు. దీంతో భార్యపై కోపం పెంచుకున్నాడు. తనకు దక్కని పిల్లలు భార్య వద్ద కూడా ఉండొద్దని కక్ష గట్టాడు. కాంత సోమవారం రోజువారీగా కూలి పనికి వెళ్లగా ఇద్దరు కుమారులు ఇంటి వద్దనే ఉన్నారు. కూతురు ఆడుకోవడానికి మరోచోటికి వెళ్లింది. సమయం చూసి వచ్చిన గుంశావలి పిల్లలకు చాక్లెట్లు కొనిస్తానని ఆశ చూపగా మానాన్న కొనిస్తాడు అంటూ హుషారుగా తండ్రి బైక్పై ఎక్కారు. గుంశావలి తొర్రూరుకు వచ్చి ఓ దుకాణంలో తాళ్లు కొనుగోలు చేశాడు. పిల్లలు నాన్నా చాక్లెట్లు ఏవీ అంటే కొనిస్తానని నమ్మబలికాడు. సాయంత్రం వరకు అటు ఇటు బైక్పై తిప్పాడు. పిల్లలు కూడా సరదాగా ఉందనుకున్నారు. సాయంత్రం తొర్రూరు మార్కెట్ సమీపంలో చెట్టుకు మొదట ఇద్దరు పిల్లలకు ఉరివేసి తరువాత తనూ ఉరేసుకున్నాడు. కాగా, కాంతకు సొంత ఇల్లు, జాగ లేదు. బంధువులింటి సమీపంలో ఓ టెంట్ వేసుకుని భర్త, పిల్లల మృతదేహాల కోసం ఎదురుచూడడం గమనార్హం. కిన్నెర గుంశావలి (ఫైల్)విలాస్ (ఫైల్)వికేష్ (ఫైల్)పనికి వెళ్లిన భార్య కాంత సాయంత్రం ఇంటికి వచ్చి తమ్ముళ్లు ఎక్కడికి వెళ్లారని కుమార్తె విన్యను అడగగా నాన్న తీసుకువెళ్లాడని బదులిచ్చింది. ఆందోళన చెందిన కాంత స్థానికుల సహాయంతో ఆటో తీసుకొని బావులు, చెరువులు, సమీప ప్రాంతాల్లో గాలించగా ఆచూకీ తెలియరాలేదు. మంగళవారం ఉదయం తొర్రూరులో పిల్లలు చంపిన ఘటన వెలుగులోకి రావడం.. పోలీసులు వివరాలు సేకరించి తల్లికి సమాచారం అందించారు. ఈ దృశ్యం చూసిన స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై భార్య కాంత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉపేందర్ తెలిపారు. చాక్లెట్లు కొనిస్తానని చెప్పి మెడకు తాళ్లు బిగించావు.. ఎప్పుడూ చాక్లెట్లు అడగము.. నొప్పిగా ఉంది.. తాడు విప్పి దించు నాన్నా.. అయినా నీ మనస్సు కరగలేదా..తొర్రూరులో ఇద్దరు కొడుకులకు మరణశాసనం రాసి తనూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి కుటుంబ కలహాలకు పిల్లలు బలి గుండెలవిసేలా రోదించిన తల్లి, బంధువులు -
క్యాంప్ను సద్వినియోగం చేసుకోవాలి
భూపాలపల్లి అర్బన్: సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత సమ్మర్ కోచింగ్ క్యాంప్ను సింగరేణి ఉద్యోగుల పిల్లలు, పరిసర ప్రాంతాల చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి సూచించారు. మంగళవారం వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరాన్ని జీఎం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చిన్నారులు వేసవి సెలవులను సమర్థంగా వినియోగించుకుని క్రీడల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. క్రీడలు శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంచడంతో పాటు క్రమశిక్షణ, జట్టు భావన, నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేస్తాయని తెలిపారు. క్యాంప్లో అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, వాలీబాల్ క్రీడల్లో నిపుణుల ద్వారా శిక్షణ అందించబడుతుందని తెలిపారు. సింగరేణి ఉద్యోగుల పిల్లలతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన 18 సంవత్సరాల లోపు బాలబాలికలు ఈ శిక్షణలో పాల్గొనే అవకాశం కల్పించినట్లు చెప్పారు. మే 22వ తేదీ వరకు ఈ శిక్షణ శిబిరం నిర్వహించబడుతుందని, ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 5.30 గంటల నుంచి 7 గంటల వరకు శిక్షణ కొనసాగుతుందని వివరించారు. క్రమబద్ధమైన శిక్షణతో పాటు క్రీడా నైపుణ్యాల అభివృద్ధికి అవసరమైన మార్గదర్శకత్వం అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఇన్చార్జ్ పర్సనల్ మేనేజర్ కావూరి మారుతి, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్, ఐఎన్టీయూసీ నాయకులు హుస్సేన్, సీఎంఓఏఐ ప్రెసిడెంట్ నజీర్, క్రీడల గౌరవ కార్యదర్శి శ్రావణ్కుమార్, స్పోర్ట్స్ సూపర్వైజర్ పర్స శ్రీనివాస్, కోఆర్డినేటర్ పాక దేవయ్య పాల్గొన్నారు.జీఎం ఏనుగు రాజేశ్వర్రెడ్డి -
పుస్తకాలొచ్చాయ్..
భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాలు జిల్లాకేంద్రంలో ఏర్పాటుచేసిన డిపోకు చేరుకున్నాయి. 2026–27 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నూతన పుస్తకాలు అందజేయనున్నారు. ఈ మేరకు 1.48లక్షల పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి. జూన్ 12వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి జూన్ మాసంలో బడిబాట కార్యక్రమం నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మండలాల వారీగా పంపిణీ.. జిల్లావ్యాప్తంగా 12 మండలాలు ఉండగా మండలాల పరిధిలోని పాఠశాలలకు సంబంధించిన పాఠ్య పుస్తకాలను జిల్లా డిపో నుంచి మండల కేంద్రాల్లోని ఎమ్మార్సీలకు తరలిస్తారు. మే చివరి వారం, జూన్ మొదటి వారంలో పాఠశాలలకు పంపించనున్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 24వేల మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయనున్నారు. 1,48,880 పుస్తకాలు అవసరం ఉండగా 90,320 పుస్తకాలు జిల్లా కేంద్రంలోని ఏర్పాటు చేసిన పుస్తకాల డిపోకు చేరుకోగా మండలాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. పార్ట్–2లో 42వేల పాఠ్య పుస్తకాలు రావాల్సి ఉంది. అక్టోబర్ మాసం వరకు మిగితా పుస్తకాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. నోట్ పుస్తకాలు సైతం.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న వారికి ప్రభుత్వం ఉచితంగా నోట్ పుస్తకాలు అందిస్తుంది. ప్రతీ సబ్జెక్ట్కు ఒక్క నోట్స్ చొప్పున అన్ని సబ్జెక్ట్లకు అందించనున్నారు. ఈ నోట్ పుస్తకాలు కార్గో ద్వారా విద్యార్థుల సంఖ్య అధారంగా పాఠశాలకు పంపిస్తారు. 24వేల మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతో పాటు నోట్ పుస్తకాలు అందించనున్నారు.జిల్లాకు ఇప్పటికే 60శాతం పుస్తకాలు చేరుకున్నాయి. మిగితా పుస్తకాలు కూడా ఈ వారం రోజుల్లో రానున్నాయి. వచ్చిన పుస్తకాలను భద్రపరుస్తున్నాం. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు ముందస్తుగానే సరఫరా చేస్తుంది. జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలకు పంపిస్తాం. – బానోత్ సమ్మయ్య, పుస్తకాల డిపో మేనేజర్●జూన్ 12వ తేది నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. పునఃప్రారంభం రోజునే విద్యార్థులకు అందించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అభ్యసిస్తున్న ప్రతీ విద్యార్థికి పుస్తకాలను అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది వేసవి సెలవుల్లోనే పూర్తిస్థాయిలో సరఫరా చేసి సకాలంలో విద్యార్థులకు అందజేయడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. జిల్లాకు వందశాతం పాఠ్యపుస్తకాలు ఇచ్చేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 6వ తేదీ నుంచి 19వ తేదీ వరకు బడిబాట నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించే అవకాశం ఉంది. జిల్లాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 69 ప్రాథమికోన్నత పాఠశాలలు 44 ప్రాథమిక పాఠశాలలు 319 విద్యార్థుల సంఖ్య 24వేలు జిల్లాకు చేరిన 60 శాతం పుస్తకాలు ప్రభుత్వ పాఠశాలల్లో 24వేల మంది విద్యార్థులు -
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం
భూపాలపల్లి అర్బన్: బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం జిల్లావ్యాప్తంగా పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా పార్టీ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొడవటంచ ఆలయ సందర్శన రేగొండ: మండలంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని భూపాలపల్లి జిల్లా ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ సెషన్ జడ్ఙి రమేష్ బాబు సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. కాళేశ్వరాలయంలో భక్తుల సందడి కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. వేసవి కావడంతో ఉదయం 11గంటల లోపు భక్తులు అభిషేక పూజలు, అర్చనలు అధికంగా నిర్వహించారు. శ్రీశుభానందదేవి అమ్మవారి ఆలయంలో దర్శనాలతో పాటు కుంకుమార్చన పూజలు చేశారు. శ్రీసరస్వతి అ మ్మవారిని దర్శించుకున్నారు. శ్రీసుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కాలసర్ప నివారణ, నవగ్రహాల వద్ద శనిపూజలను భక్తులు నిర్వహించారు. దీంతో భక్తుల సందడి కనిపించింది. కొనసాగుతున్న కల్యాణ బ్రహ్మోత్సవాలు హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో శ్రీభద్రకాళీభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు నిత్యాహ్నికం, చతుస్థానార్చన, డోలోత్సవం నిర్వహించారు. ఉదయం అమ్మవారి ఉత్సవమూరిక్తి భద్రపీఠసేవ, సాయంత్రం అశ్వవాహన సేవ నిర్వహించారు. ఉదయం అఖిల భారత పద్మశాలి సంఘం వరంగల్, హనుమకొండ, గ్రేటర్ వరంగల్ ఆధ్వర్యంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా మేయర్ గుండు సుధారాణి, ప్రభాకర్ దంపతులు, విశిష్ట అతిథిగా కేంద్ర ఖాదీ, చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం పాల్గొని అమ్మవారికి పట్టువస్త్రాలు, పండ్లు సమర్పించారు. వీరితో పాటు వడ్నాల నరేందర్, ఆడెపు రవీందర్, బచ్చు ఆనందం పాల్గొన్నారు. -
రామప్పలో అధికారుల సందడి
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ) అధికారులు సోమవారం సందర్శించారు. భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ ఈడీ ఎస్కే.గుప్తా, జేఈ చౌదరి, జేజీఎం బాలేందర్ కుమార్, డీజీఎంలు ఉమేష్కుమార్, పర్వింద్ర తివారి, వాసీమ్, ఏజీఎం గోపాలకృష్ణ సందర్శించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్లు వారికి తీర్థప్రసాదాలు అందించగా ఆలయ ఈవో ఇమ్మడి భాస్కర్ వారికి స్వామివారి శేషావస్త్రాలను అందించి శాలువాలతో సత్కరించారు. ఆలయ చరిత్ర, శిల్పకళ వైభవం గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్కుమార్ వివరించగా రామప్ప శిల్పకల సంపద బాగుందని వారు కొనియాడారు. అలాగే రామప్ప దేవాలయాన్ని అమెరికాకు చెందిన ఎడ్నోల్స్ సందర్శించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. -
నీట్ ప్రశాంతంగా నిర్వహించాలి
భూపాలపల్లి: జాతీయ స్థాయిలో ఎంతో ప్రాధాన్యత కలిగిన నీట్ పరీక్షను జిల్లాలో ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ సూచించారు. నీట్ పరీక్ష నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అశోక్కుమార్ మాట్లాడుతూ.. మే 3వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నీట్ పరీక్ష ఉంటుందని తెలిపారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాల రెండు కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలో 374 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారని, డిగ్రీ కళాశాలలో 240 మంది, జూనియర్ కళాశాలలో 134 మంది హాజరుకానున్నారని తెలిపారు. పరీక్ష నిర్వహణకు సంబంధించి జిల్లా స్థాయి సమన్వయ కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కలెక్టర్ అధ్యక్షతన అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు, డీటీఓ సంధాని, డీఈఓ రాజేందర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, నోడల్ అధికారి రమణారావు, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాసులు, అధికారులు పాల్గొన్నారు. యాంటి డ్రగ్స్పై అవగాహనకు కార్యాచరణ.. జిల్లాలో బాలల సంరక్షణ, మహిళా శ్రేయస్సు, యువతలో యాంటీ డ్రగ్స్కు వ్యతిరేకంగా అవగాహన పెంపు లక్ష్యంగా ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ అశోక్కుమార్ తెలిపారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో చిల్డ్రన్స్ వీక్ కార్యక్రమం వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఏఎస్పీ నరేష్కుమార్, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి మళ్లీశ్వరి, డీఎంహెచ్ఓ డాక్టర్ మధుసూదన్, డీఈఓ రాజేందర్, ఆర్డీఓ హరికృష్ణ పాల్గొన్నారు. దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు.. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ తెలిపారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 73 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల కలెక్టర్ విజయలక్ష్మి, ఆర్డీఓ హరికృష్ణ, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి అదనపు కలెక్టర్ అశోక్కుమార్ -
అవినీతికి.. డాక్యుమెంట్ రైటర్లు!
సాక్షిప్రతినిధి, వరంగల్: రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అధికారులు ప్రతీపనికో రేటును ఫిక్స్ చేసి కొందరు ప్రైవేట్ వ్యక్తులు, డాక్యుమెంట్ రైటర్లను మధ్యవర్తులుగా పెట్టుకుని వసూలు చేస్తున్నారు. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ ప్రాంతాల్లో ఏసీబీ దాడులు, విజిలెన్స్ తనిఖీలు జరిగినా కొందరు అధికారుల తీరు మారడం లేదు. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో విచ్చల విడిగా వసూళ్లపర్వం సాగుతుండగా.. తాజాగా సోమవారం జనగామ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు ఏడాదిలో జరిగిన లావాదేవీలకు సంబంధించిన ఫైళ్లన తీసుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది. వసూళ్లపర్వం తతంగం ఇలా... ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా 14 రిజిస్ట్రేషన్ కార్యాలయాల ద్వారా భూములు, ఇళ్లు, అపార్ట్మెంట్ల రిజిస్ట్రేషన్లు సాగుతున్నాయి. ప్రతీ రిజిస్ట్రేషన్కు లొసుగులును ఆసరా చేసుకుని వసూళ్లు చేస్తున్నారు. ఉదాహరణకు వరంగల్ ఆర్వో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రతిరోజూ 80 నుంచి 98 దస్తావేజులు రిజిస్ట్రేషన్ అవుతాయి. ఇక్కడ ప్రతీ దస్తావేజుకు రూ.వెయ్యి నుంచి రూ.5వేల వరకు ఆఫీస్ ఖర్చుల పేరిట.. నాలా, జీపీ ఇళ్లు, అపార్ట్మెంట్లకు రూ.5వేలనుంచి రూ.50వేల వరకు వసూలు చేసినట్లు ఇటీవల జరిగిన ఏసీబీ దాడుల్లో వెల్లడైంది. 126 మంది డాక్యుమెంట్ రైటర్లు ఈ కార్యాలయం పరిధిలో ఉండగా, ఇద్దరు నుంచిముగ్గురు ప్రైవేట్ వ్యక్తులతో పాటు 25 మంది డాక్యుమెంట్ రైటర్లు కేవలం డబ్బులు వసూళ్లకే పెట్టుకున్నట్లు ఏసీబీ గుట్టు విప్పింది. మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజుకు 40–50 రిజిస్ట్రేషన్లు అవుతుండగా, లేఅవుట్ లేని ప్లాట్లు గజం రూ.200ల నుంచి రూ.400ల వరకు తీసుకున్నట్లు అక్కడ జరిగిన ఏసీబీ దాడుల అనంతరం వెల్లడైంది. ఇలా వరంగల్, జనగామ, స్టేషన్ఘన్పూర్, ములుగు, భూపాలపల్లి, భీమదేవరపల్లి తదితర సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ‘కథ’నడిపించేది వీరే.. అక్రమాలకు నిలయంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉమ్మడి వరంగల్లో ఏసీబీ వరుస దాడులు.. సస్పెన్షన్ వేటు పడిన మారని తీరు విజిలెన్స్ తనిఖీలకూ వెరవని అధికారులు.. తాజాగా సోమవారం జనగామలో తనిఖీలు -
పెట్రోల్, డీజిల్.. నో స్టాక్
రేగొండ/చిట్యాల/మొగుళ్లపల్లి: రేగొండ, కొత్తపల్లిగోరి, చిట్యాల, మొగుళ్లపల్లి మండలాల్లో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులుదీరారు. పెట్రోల్, డీజీల్ కొరత ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో వాహనదారులు టిన్నులతో బంకుల వద్ద క్యూలైన్లు కట్టారు. దీంతో సాయంత్రం వరకు ఆయా బంకుల ముందు తాళ్లు కట్టి, నోస్టాక్ బోర్డు పెట్టి బారికేడ్లు పెట్టారు. చిట్యాల మండలంలోని చిట్యాల, చల్లగరిగ, జూకల్, కొత్తపేట గ్రామాలలోని పెట్రోల్ బంక్లలో డీజిల్, పెట్రోల్ లేక వాహనాదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాహనాదారులు బంకుల వద్దకు రాగానే నో స్టాక్ బోర్డు పెట్టడంతో వాహనదారులు కంగుతిన్నారు. మొగుళ్లపల్లి మండలకేంద్రంలోని పెట్రోల్ బంకుల వద్ద డీజిల్ కోసం జనాలు బారులుదీరారు. డీజిల్ కోసం పెద్దఎత్తున క్యాన్లు పట్టుకొని బంకుల వద్ద భారీ క్యూ లైన్లో నిలబడ్డారు.● ఇబ్బందుల్లో వాహనదారులు ● జిల్లావ్యాప్తంగా ఇంధన కొరత భూపాలపల్లి: జిల్లావ్యాప్తంగా ఇంధన కొరత ఏర్పడింది. పెట్రోల్, డీజిల్ లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని 12 మండలాల్లో 43 పెట్రోల్ బంకులు ఉన్నాయి. బంకుల్లో సోమవారం ఉదయం నుంచే పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. కొరత విషయం తెలుసుకున్న వాహనదారులు సాయంత్రం పలు పెట్రోల్ బంకుల వద్ద బారులుదీరారు. దీంతో ఆయా బంకుల్లో సైతం పెట్రోల్, డీజిల్ నిల్వలు ఖాళీ అయ్యాయి. యుద్ధం కారణంగా కొరత ఏర్పడిందని తెలుస్తోంది. పెట్రోల్ బంకుల యజమానులు ముందస్తుగా ఇండెంట్ పంపినప్పటికీ చమురు కంపెనీల నుంచి ఇంధనం రావడానికి రెండు, మూడు రోజులు పడుతుందని ఓ పెట్రోల్ బంక్ యజమాని తెలిపారు. సాధారణంగా నాలుగు రోజుల పాటు విక్రయించే స్టాక్ ఒక్కరోజే అయిపోయిందని సదరు పెట్రోల్ బంక్ నిర్వాహకులు తెలిపారు. సోమవారం రాత్రి వరకు జిల్లాలోని ఒక్క బంకులో కూడా పెట్రోల్, డీజిల్ లేకపోవడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
రక్షణ పరికరాలు అందజేయాలి
భూపాలపల్లి అర్బన్ : నూతనంగా సింగరేణి ఉద్యోగంలో చేరిన కార్మికులకు రక్షణ పరికరాలు (బూట్లు, టోపీలు) తక్షణమే అందజేయాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్ డిమాండ్ చేశారు. ఆదివారం ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రక్షణ పరికరాలు లేకపోవడంతో కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. యాజమాన్యం స్పందించి తక్షణమే రక్షణ కిట్లను అందజేయాలన్నారు. క్వార్టర్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ గురిజేపల్లి సుధాకర్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతరాజు సతీష్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. హెచ్చరిక బోర్డుల ఏర్పాటు మల్హర్(కాటారం): రోడ్డు ప్రమాదాల నివారణ, రోడ్డు భద్రతను పెంపొందించేందుకు కాటారం సబ్ డివిజన్ పరిధిలో పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. కమలాపూర్ క్రాస్ నుంచి కాళేశ్వరం వరకు ఉన్న రహదారిపై, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలను పాటించాలని, అతివేగాన్ని నివారించాలని పోలీసులు సూచిస్తున్నారు. బకాయిలు విడుదల చేయాలి భూపాలపల్లి అర్బన్: పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి వెంకటరమణారెడ్డి హాజరయ్యారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. అనంతరం బీఆర్ఎస్వీ నాయకులు దిలీప్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులపై నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందన్నారు. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నేడు (సోమవారం) కలెక్టర్కు ప్రజావాణిలో వినతిపత్రం, 28న విద్యార్థులతో కలిసి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పోస్టుకార్డుల ద్వారా ఫిర్యాదు చేయడం, 29న జిల్లాలోని డిగ్రీ, వృత్తి విద్య కళాశాలల బంద్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన నాయకులు మాడ హరీశ్రెడ్డి, యుగేంద్రాచారి, ఆకుదారి మనోహర్, వంశీ, 5వ వార్డు కౌన్సిలర్ కట్ల పూర్ణచందర్, బీఆర్ఎస్వీ నాయకులు భూక్య హరీశ్, కత్తి వినయ్, కళ్లపల్లి ప్రేమ్దేవ్ పాల్గొన్నారు. బ్రహ్మంగారి ఆరాధన మహోత్సవాలు రేగొండ: మండలంలోని రంగయ్యపల్లి గ్రామంలో జగద్గురు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 333వ ఆరాధన మహోత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. గోవిందామాంబా సమేత పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి అభిషేకాలు నిర్వహించి వేదమంత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు మహాఅన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి కృషిచేస్తానని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఇటీవల హామీ ఇచ్చినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు శృంగారపు వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శృంగారపు భిక్షపతి, విష్ణుమూర్తి, గురుమూర్తి, కాజుబోజు సూర్యప్రకాశ్, వేణు, రమేష్, దేవేందర్, రామ్మూర్తి, సమ్మయ్య, అంజి పాల్గొన్నారు. -
ఎవరి వాటా వారికి రావాల్సిందే..
భూపాలపల్లి రూరల్: ఎవరి కులం ఎంతో.. వారికంత వాటా దక్కాలనే నినాదంతోనే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ చైర్మన్, ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహారాజ్ అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని బాలాజీ కన్వెన్షన్ హాల్లో జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జోగ బుచ్చయ్య అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విశారదన్ మహారాజ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం కులాలను లెక్కపెట్టి చేతులు దులుపుకుంటే సరిపోదని విమర్శించారు. కుల గణన అసలు పరమార్థం.. దేశ సంపదను, భూమిని, రాజ్యాధికారాన్ని ఆయా కులాల జనాభా నిష్పత్తి ప్రకారం పంపిణీ చేయడమేనని గుర్తు చేశారు. భారత రాజ్యాంగ గణతంత్ర స్ఫూర్తి అదేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో సంపద సమ పంపిణీ జరగడం లేదన్నారు. భూమి, రాజ్యం, అధికారాలన్నీ కేవలం ఒక్క సామాజిక వర్గానికే (రెడ్డి కులానికే) అప్పగిస్తున్నారని మండిపడ్డారు. బ్యూరోక్రసీలోనూ, మంత్రి పదవుల్లోనూ అగ్రవర్ణాలకే పట్టం కడుతున్నారని, ఇదే బాటలో గత ప్రభుత్వంతో పాటు బీజేపీ కూడా నడుస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలోని 90 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాధికారం దక్కే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. 10 శాతం ఉన్న అగ్రవర్ణాల చేతుల్లో ఉన్న అధికారాన్ని బహుజనుల పరం చేయడమే జేఏసీ లక్ష్యమని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాలమూరు యూనివర్సిటీ ప్రొఫెసర్ నాదం కుమారస్వామి, బీసీ, ఎస్సీ, ఎస్టీ జాక్ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేంద్ర ముదిరాజ్, వివిధ సంఘాల సనాయకులు అజ్మీర సమ్మయ్య, రాదండి దేవేందర్, దుగ్యాల స్వామి, చంద్రగిరి శంకర్, భీమనాదని సత్యనారాయణ, సాయిబాబా, మేకల సుమన్, కొత్తూరు రవీందర్, చిట్యాల శ్రీనివాస్, అశోక్ పాల్గొన్నారు. కుల గణన చేస్తే సరిపోదు.. సంపదను పంచాలి బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ విశారదన్ మహారాజ్ -
రైస్మిల్లులకే..
భూపాలపల్లి: దారిద్రరేఖకు దిగువన ఉన్న ప్రజలు వేసవిలో ఇబ్బంది ఎదుర్కోవద్దనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా పంపిణీ చేస్తున్న సన్నబియ్యం పక్కదారి పడుతున్నాయి. కొందరు దళారులు, రేషన్ డీలర్లు బియ్యాన్ని కొనుగోలు చేసి, గుట్టుచప్పుడు కాకుండా జిల్లాలోని పలు రైస్మిల్లులకు సరఫరా చేస్తున్నారు. ఆ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి సీఎంఆర్ కింద ప్రభుత్వానికే అప్పగించేందుకు పలువురు మిల్లర్లు సిద్ధమవుతున్నారు. జిల్లాలోని 12 మండలాల్లో అంత్యోదయ, ఎఫ్ఎస్సీ, అన్నపూర్ణ కార్డులు కలిగిన కుటుంబాలు సుమారుగా 1,38,234 ఉండగా, 3,91,353 యూనిట్లు ఉన్నాయి. ఒక్కో యూనిట్కు 6 కేజీల చొప్పున ప్రతీ నెల 25,36,167 కేజీల బియ్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరఫరా చేస్తున్నాయి. వేసవి నేపథ్యంలో లబ్ధిదారులు ఇబ్బంది పడకూడదనే ఉద్ధేశంతో ప్రభుత్వం మూడు నెలలకు సంబంధించిన సన్నబియ్యాన్ని ఈ నెల 1వ తేదీ నుంచి లబ్ధిదారులకు అందజేస్తుంది. ఈసారి వచ్చిన సన్నబియ్యం అంతగా నాణ్యత లేవు. నూకశాతం కూడా ఎక్కువగా ఉంది. దీంతో లబ్ధిదారులు వాటిని వండుకునేందుకు ఇష్టపడటం లేదు. దీనిని ఆసరాగా చేసుకున్న జిల్లాలోని పలువురు డీలర్లు... లబ్ధిదారులతో వేలిముద్ర వేయించుకొని కేజీ బియ్యానికి రూ.12నుంచి రూ.15 చొప్పున లెక్కకట్టి ఫోన్ పే చేస్తున్నారు. ఇండెట్లో తేడా రాకుండా ఉండేందుకు అదే రోజు రాత్రి ఆ బియ్యం మొత్తాన్ని రహస్య ప్రదేశాల్లో నిల్వ ఉంచుతున్నారు. 10 క్వింటాల నుంచి 20 క్వింటాల బియ్యం జమ అయ్యాక అర్ధరాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా జిల్లాలోని రైస్మిల్లులకు తరలిస్తున్నారు. దళారుల దందాలో మార్పు లేదు. జిల్లాలోని ప్రతీ మండలంలో ఒకరిద్దరు దళారులు రేషన్ బియ్యం సేకరణ కోసం ప్రత్యేకంగా కూలీలను ఏర్పాటు చేసుకున్నారు. కూలీలు గ్రామాలు, పట్టణాల్లో రేషన్ బియ్యం తీసుకునే కుటుంబాల నుంచి బియ్యాన్ని కేజీకి రూ. 20 చొప్పున కొనుగోలు చేసి కమిషన్ పద్ధతిన దళారికి విక్రయిస్తున్నారు. ఆ బియ్యం పెద్ద మొత్తం అయ్యే వరకు గుట్టుచప్పుడు కాకుండా రహస్య ప్రదేశాల్లో నిల్వ ఉంచుతున్నారు. దళారులు సేకరించిన బియ్యాన్ని జిల్లాలోని కొందరు రైస్మిల్లర్లు కేజీకి రూ.26 చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. అర్ధరాత్రి, తెల్లవారుజామున టాటా ఏస్ ట్రాలీ, డీసీఎం వ్యాన్లలో గుట్టుచప్పుడు కాకుండా రైస్మిల్లర్లు చెప్పిన రహస్య ప్రదేశాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ బియ్యాన్ని మిల్లర్లు రీ సైక్లింగ్(సంచులు మార్చి) చేసి తిరిగి సివిల్ సప్లయీస్ గోడౌన్లకు పంపించేందుకు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టకుండా కట్టడి చేయాల్సిన సివిల్ సప్లై శాఖతో పాటు పోలీసుశాఖలోని కొందరు అధికారులు ఈ అక్రమ దందాకు వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పీడీఎస్ బియ్యం రవాణాపై పెద్దగా దాడులు జరగడం లేదని తెలుస్తోంది. పేదల బియ్యం పక్కదారి జోరుగా సాగుతున్న అక్రమ దందా బస్తాలు మార్చి సీఎంఆర్కు సిద్ధం చేస్తున్న మిల్లర్లు -
సమస్యల స్వాగతం
ఐటీడీఏ పీఓకు.. తెరుచుకోని టైలరింగ్ శిక్షణ కుట్టుమిషన్ల కేంద్రం ● ఈఎస్ఎస్లో గ్రౌండింగ్ అంతంతే.. ● ముందుకు సాగని రైతు భరోసా, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల సరళీకృతం ● పరిష్కారానికి నోచుకోని గిరివాణి వినతులు ఏటూరునాగారం: సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రాజెక్టు అధికారిగా లెనిన్ వాత్సల్ టొ ప్పో ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. అనంత రం పలు విభాగాల్లో తనిఖీ నిర్వహించి అధికారులతో పలు అంశాలపై చర్చించారు. నూతనంగా బా ధ్యతల చేపట్టిన పీఓకు మాత్రం ఐటీడీఏలో నెలకొ న్న అనేక సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. 2020–21 నుంచి ఇప్పటి వరకు ఎకనామికల్ సపోర్ట్ స్కీం(ఈఎస్ఎస్) పథకంలో గ్రౌండింగ్ చేయడం లేదు. 631 మందిని పథకం కింద ఎంపిక చేసి 274 మందికి గ్రౌండింగ్ చేశారు. మిగతావి పెండింగ్లో ఉన్నాయి. వాటికి ఆర్థిక శాఖ నుంచి ట్రైకార్, ట్రైబల్ వెల్ఫేర్కు నిధులు వస్తేగానీ బ్యాంకుల్లో జమయ్యే పరిస్థితి లేకుండా పోయింది. ఇంతలోనే రాజీవ్ యువ కిరణాలను తెరపైకి తేవడంతో ఈఎస్ఎస్ మరుగున పడింది. అలాగే గిరివికాసం కింద రైతులకు బోరు, మోటారు, విద్యుత్ సరఫరా ఉచితంగా ఇవ్వాలని వచ్చిన 431 దరఖాస్తులు మూడేళ్లుగా పెండింగ్ పడుతూ వస్తున్నాయి. ఇటీవల పీఎం కుసమ్ యోజన పథకం కింద గిరిజనులకు సోలార్ పంపు సెట్లు, మోటార్లను అందించేందుకు సర్వేలు చేపట్టి వాటిని కేవలం కాగితాలకు పరిమితం చేశారు. అలాగే సోలార్ ప్లాంట్స్ ఏర్పా టు చేసేందుకు ఐటీడీఏ మహిళలకు అవగాహన కల్పించి పేర్లను నమోదు చేశారు. కానీ సంఘాల పేర్ల మీద భూములు మాత్రం కేటాయించలేదు. శివాపురంలోని సబ్బుల పరిశ్రమకు జీసీసీ ద్వారా రూ. 30 లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉంది. ఇప్పించాలని అనేకమార్లు గిరివాణిలో వినతులు ఇచ్చినా ఫలితం లేకుండా పోవడంతో మూసివేశారు. వెంకటాపురం(కె) మండలం ముత్తారం గ్రామంలో నడుపుతున్న సొసైటీ క్వారీ మూడేళ్ల నుంచి గ్రామంలోని సభ్యులకు కమీషన్లు ఇవ్వడం లేదు. దీంతో గిరివాణిలో ఫిర్యాదు చేయగా ఇంత వరకు పట్టించుకోలేదు. సొసైటీ, క్వారీ వివరాలు సైతం గోప్యంగా ఉంచడంపై పలు అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి. హార్టికల్చర్ నర్సరీలో గతంలో రూ.23 లక్షలు వెచ్చించి పామాయిల్ ప్లాంటేషన్ ఏర్పాటు చేయగా ఒక్క మొక్క కూడా బతకలేదు. దీంతో రూ. 23 లక్షల నిధులు బురదలో పోసినట్లు అయ్యింది. మళ్లీ ఆ భూమిలో పండ్ల తోటల కోసం ప్లాన్ చేశారు కాని ఆచరణలోకి తీసుకురాలేదు. ఇలా అనేక సమస్యలతో ఐటీడీఏ కొట్టుమిట్టాడుతోంది. ఇవేకాకుండా ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న గిరివాణిలో అనేక మంది గిరిజనులు వినతులు ఇస్తున్నా పరిష్కారం కావడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. నూతనంగా పీఓగా బాధ్యతలు చేపట్టిన టొప్పో తమ సమస్యలు పరిష్కరించాలని వేడుకుంటున్నారు.గిరిజన మహిళా సంఘాలకు కుట్టు శిక్షణ ఇవ్వడంతో పాటు ఉచిత కుట్టు మిషన్లను అందజేసి ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజన విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫాం కుట్టించి వారికి ఇచ్చేలా అప్పటి పీఓ చిత్రామిశ్రా ప్లాన్ చేశారు. కాని ఆమె బదిలీ కావడంతో ఆ పనులు మూలకుపడ్డాయి. దీంతో స్టోర్ బోసిపోయి కనిపిస్తోంది. అంతేకాకుండా కొంత మందికి ఇటుకల తయారీకి మిషనరీలు ఇవ్వగా వాటిని కేవలం ఇంటి వద్ద ఏర్పాటు చేసుకొని ఎలాంటి పరిశ్రమలను నడపడం లేదు. దీంతో లక్షలాది రూపాయల సామగ్రి తుప్పుపట్టిపోతుంది. ఇదేకాకుండా న్యూట్రిబాస్కట్ పరిశ్రమను సైతం నడిపించలేక మహిళా గ్రూపు సభ్యులు దానిని మూసివేశారు. సరైన ఆదాయం, ఉత్పత్తి లేదని చేతులు ఎత్తేశారు. -
వాసవి మాత జయంతి వేడుకలు
భూపాలపల్లి రూరల్: వాసవి మాత జయంతి వేడుకలను ఐడీఓసీ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ రాహుల్ శర్మ, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని వాసవి మాతకు పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే సత్యనారాయణరావు మా ట్లాడుతూ.. ప్రతీ సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి నాడు అత్యంత వైభవంగా జరుపుకునే వాసవీ మా త జన్మదినం ఎంతో పవిత్రమైనదన్నారు. పార్వతీ దేవి అవతారమైన వాసవి మాత అహింసా మార్గాన్ని అనుసరించి సమాజానికి శాంతి, సామరస్యాని కి ప్రతీకగా నిలిచిన గొప్ప దైవం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి రఘు, కౌన్సిలర్లు, ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో.. జిల్లా పోలీసు కార్యాలయంలో వాసవి మాత జయంతి వేడుకలు నిర్వహించారు. ఆర్ఐ అడ్మిన్ రత్నం వాసవి మాత చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
మే 10 వరకు సెల్ఫ్ ఎన్యుమరేషన్
భూపాలపల్లి: ఈ నెల 26వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియ కొనసాగుతుందని కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఆదివారం నుంచి జనగణన డిజిటల్ నమోదు కార్యక్రమం ప్రారంభమైన సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ తన నివాసంలో సెల్ఫ్ ఎన్యుమరేషన్ విధానంలో స్వయంగా తన వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఆన్లైన్ ద్వారా స్వయంగా వివరాలు నమోదు చేసుకోవడంతో ప్రజల సమయం ఆదా అవుతుందని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. మే 11వ తేదీ నుంచి ఎన్యుమరేటర్లు ప్రతీ ఇంటికి వచ్చి వివరాలు సేకరిస్తారని తెలిపారు. ఆ సమయంలో ముందుగా సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసిన వారు నమోదు సమయంలో పొందిన ఐడీ నంబర్ తెలియజేయాలని సూచించారు. సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసిన ప్రతీ ఒక్కరు ఐడీ నంబర్ను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని తెలిపారు. జిల్లా ప్రజలు అందరూ బాధ్యతతో పాల్గొని జనగణన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఓ జవహర్ పాల్గొన్నారు. ప్రతీ ఒక్కరు పాల్గొనాలి.. జనాభా లెక్కల స్వీయ జనగణనలో ప్రతీ ఒక్కరు పాల్గొనాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఆదివారం ఐడీఓసీ కార్యాలయంలో స్వీయ గణన ప్రక్రియపై ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్వీయ గణన ప్రక్రియ వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. దేశంలోనే అతిపెద్ద ప్రజా భాగస్వామ్య కార్యక్రమం జనాభా గణన 2027 కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతీ ఒక్కరు ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు జిల్లాలో స్వీయ గణన కార్యక్రమం కొనసాగుతుందని, ఇందులో జిల్లాలోని ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, ప్రజలు ప్రతీ ఒక్కరూ పాల్గొని వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, సీపీఓ జవహర్, డీపీఆర్ఓ శీలం శ్రీనివాస్, ఆర్డీఓ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ -
కాంగ్రెస్కు మహిళలు గుణపాఠం చెప్పాలి
ములుగు రూరల్: మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్పాలని ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ అన్నారు. ఈ మేరకు ఆదివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ, మిత్ర పక్షాలు మహిళల పట్ల చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తోందన్నారు. పార్లమెంట్లో మహిళా బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసి సంబురాలు జరుపుకోవడం దారుణమన్నారు. జనాభా పెరుగుదలకు అనుగుణంగా డిలీమిటేషన్ చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తే దక్షణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆరోపించి బిల్లు ఆమోదాన్ని అడ్డుకున్నారని తెలిపారు. జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పార్లమెంట్లో ప్రాతినిధ్యం పెరిగేదని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చింతలపూడి భాస్కర్రెడ్డి, సుమలత, జాడి వెంకట్, నరేశ్ పాల్గొన్నారు. -
హేమాచలక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు
మంగపేట: రెండో యాదగిరిగుట్టగా పేరుగాంచిన మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 10 రోజుల పాటు జరిగే తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలను ఆగమశాస్త్రం ప్రకారం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉప ప్రధానార్చకులు అమరవాది మురళీకృష్ణమాచార్యుల బృందం, ఆలయ అర్చకులతో శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణ ఇన్చార్జ్ అధికారి వీరస్వామి తెలిపారు. అత్యంత వైభవంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో తగిన ఏర్పాట్లు చేశారు. అంకురార్పణతో జాతర ప్రారంభం హేమాచల క్షేత్రంలో నేడు(సోమవారం) ఉదయం 6 గంటల నుంచి బ్రహ్మోత్సవాల యాగ్నికులు యాగశాలలో విశ్వక్షేనపూజా, భగవత్ పుణ్యాహ వాచన, పసరిషత్ ప్రార్థన, రుత్విక్వరణం, రక్షాబంధనం, ఉత్సవ మూర్తులకు స్నపనం(ఉత్సవాంగస్నపనం), ఆళువార్లకు తిరువంజనం(అభిశేకం), సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పన, 28న మంగళవారం గరుడాదివాసం, 29న ధ్వజారోహనం, 30న ఎదుర్కోలు మహోత్సవం, మే 1న మధ్యాహ్నం 12.32 గంటలకు అభిజిత్ లగ్నంలో లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లతో తిరు కల్యాణ మహోత్సవం, 2న రథోత్సవం, 3న సదస్యం(వేదాశీర్వచనం), 4వ తేదీన తెప్పోత్సవం, 5న మహాపూర్ణాహుతి, నాకబలి(నాగవెల్లి), 6న ఉదయం 11 గంటలకు వసంతోత్సవం, గజవాహనసేవ, సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆలయ ఈఓ వీరస్వామి తెలిపారు. మే 1న స్వామివారి తిరుకల్యాణం హేమాచల క్షేత్రంలో 10 రోజుల పాటు సాగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా మే 1న లక్ష్మీనర్సింహస్వామికి ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లకు మధ్యాహ్నం 12.32 గంటలకు అభిజిత్ లగ్నంలో భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఉప ప్రధానార్చకుల అమరవాది మురళీకృష్ణమాచార్యుల బృందం తిరుకల్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ప్రకృతి ఒడిలో స్వయంభువుగా వెలిసి భక్తులకు కోరిన వరాలిచ్చే లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి ధృవమూర్తులకు గర్భాలయంలో ఉదయం 9 గంటలకు బ్రహ్మోత్సవాల యాగ్నికులు శాస్త్రోక్తంగా కల్యాణం జరిపించనున్నారు. అనంతరం స్వామివారు, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు కల్యాణ మండపంలో తిరుకల్యాణ మహోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. చింతామణి జలపాతం.. నాభిచందన ప్రసాదం ఆలయ సమీపంలో సహజసిద్ధంగా వెలిసిన చింతామణి జలపాతం ఆలయానికి వచ్చే భక్తులు ఔషధ గుణాల ప్రసాదంగా బావిస్తుంటారు. హేమాచల కొండపై నుంచి ఏడాది పొడవునా అన్ని కాలాల్లో ఒకే విధంగా చింతామణి జలపాతం భూమి లోపలి నుంచి పారుతూ ఉండటం విశేషం. ఆలయానికి వచ్చే భక్తులు చింతామణి జలపాతం వద్ధ స్నానమాచరిస్తారు. జలపాతం నుంచి వచ్చే నీరు అతి శీతలంగా ఔషధ గుణాలు కలిగి మినరల్ వాటర్ను తలపించే విధంగా ఎంతో రుచికరంగా ఉంటాయి. ఎన్నిరోజులు నిల్వ ఉంచినా పాడై పోకుండా ఉండటంతో నీటిని రోజు సేవిస్తే బీపీ, షుగర్ తదితర దీర్ఘకాలిక వ్యాధులు ధరిచేరవు. అలాగే ఆలయంలో ప్రతీ శని, ఆదివారం స్వామివారి నాభి నుంచి స్రవించే ద్రవాన్ని మంచి గందంతో కలిపి(నాభి చందనం) సంతానం లేని వారు సేవిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. నేటి నుంచి పది రోజుల పాటు కార్యక్రమాలు ముస్తాబైన ఆలయం.. తరలిరానున్న భక్తజనం -
ఉచిత వేసవి క్రీడా శిబిరం
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియా పరిధిలో పనిచేస్తున్న కార్మికుల పిల్లల కోసం ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నట్లు ఏరియా అధికార ప్రతినిధి, పర్సనల్ మేనేజర్ శ్యాం సుందర్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2026–27 సమ్మర్ క్యాంపులో భాగంగా 18 ఏళ్ల లోపు బాలబాలికలకు ఈ శిబిరం అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఈ శిబిరం ఈ నెల 28న సాయంత్రం 5.30 గంటలకు స్థానిక కృష్ణ కాలనీలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుందని తెలిపారు. శిక్షణ శిబిరం ప్రతిరోజూ ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 5.30 నుంచి 7.30 గంటల వరకు నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. బాస్కెట్బాల్, ఫుట్బాల్, అథ్లెటిక్స్, వాలీబాల్ వంటి క్రీడల్లో నిపుణులైన శిక్షకుల ద్వారా ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. ప్రతీ క్రీడలో 20 నుంచి 25 మంది వరకు ఎంపిక చేసి మొత్తం 25 రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నామన్నారు. ఆసక్తి గల ఉద్యోగులు తమ పిల్లల పేర్లను ఈ నెల 28 సాయంత్రం 5 గంటలలోపు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టేడియంలోని సీఈఆర్ క్లబ్లో నమోదు చేయించుకోవాలని సూచించారు. మరణంలోనూ మానవత్వం మొగుళ్లపల్లి: మండలంలోని పాత ఇస్సిపేట గ్రామానికి చెందిన పసరగొండ శ్రీధర్ హైదరాబాద్లో నివాసముంటూ శుక్రవారం గుండెపోటుతో మృతిచెందాడు. ఆయన కుటుంబసభ్యులు శనివారం నేత్రదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. పుట్టెడు దుఃఖంలోనూ భార్య స్వప్న, కుమారుడు బాలరాజు పటేల్, తల్లి సరలక్ష్మి తీసుకున్న నిర్ణయంతో ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సిబ్బంది నేత్రాలను సేకరించారు. మరణానంతరం కూడా మరొకరికి చూపునివ్వడం గొప్ప విషయమని గ్రామస్తులు ఈ కుటుంబాన్ని అభినందించారు. 28న బహిరంగ వేలం రేగొండ: మండలంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి సంబంధించిన మడ్తపల్లి గ్రామంలోని దేవస్థానం భూముల కౌలుకు బహిరంగ వేలం ఈనెల 28న మంగళవారం నిర్వహించనున్నట్లు ఈఓ మహేష్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ఆలయ ప్రాంగణంలో బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు. 30న కాళేశ్వరం దేవస్థానం పాలకవర్గ సమావేశం కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం ట్రస్టుబోర్డు(పాలకవర్గం) మొదటి సమావేశాన్ని ఈనెల 30న నిర్వహిస్తున్నట్లు దేవస్థానం చైర్మన్ అవధాని మోహన్శర్మ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పలు తీర్మానాలు చేయనున్నట్లు తెలిపారు. రామప్పలో దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ ఇంజనీర్ వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని శనివారం దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ ఇంజనీర్ (డీడీజీఈ ఢిల్లీ) అభిషేక్ అగర్వాల్ సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి ఆయన పూజలు నిర్వహించగా అర్చకులు హరీశ్ శర్మ, ఉమాశంకర్ వారికి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయ ఈఓ ఇమ్మడి భాస్కర్ శాలువాతో సన్మానించారు. ఆలయ చరిత్ర, శిల్పకళ ప్రాముఖ్యత గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు. ఆయన వెంట హైదరాబాద్ దూరదర్శన్ డైరెక్టర్ వెంకటరమణ, టూరిజం అధికారులు ఉన్నారు. దూరవిద్య డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్షలు కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి దూరవిద్య(సీడీఓఈ/ఎస్డిఎల్సీఈ) డిగ్రీ బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ (2023–24 బ్యాచ్) పరీక్షలు మే 7వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొపెసర్ కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పద్మజ తెలిపారు. మే 7, 11, 13, 15, 18, 20 తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. -
మలేరియా నివారణకు జాగ్రత్తలు
చిట్యాల: మలేరియా నివారణకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సీహెచ్.మధుసూదన్, మలేరియా ప్రోగ్రాం అధికారి డాక్టర్ సందీప్ అన్నారు. శనివారం మండలంలోని ఒడితల ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ సరైన సమయంలో పరీక్షలు చేయించుకుంటే మలేరియాను పూర్తిగా నయం చేయవచ్చని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులలో ఉచితంగా చికిత్స అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రజలు తమ ఇండ్ల చుట్టూ మురికి నిల్వలు ఉండకుండా పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలని కోరారు. ప్రతీ మంగళవారం, శుక్రవారం డ్రైడే పాటించడం ద్వారా దోమల నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఒడితల వైద్యాధికారి మౌనిక, జిల్లా అసిస్టెంట్ మలేరియా అధికారి సుధాకర్, జిల్లా అకడమిక్ రమేశ్, సబ్ యూనిట్ అధికారులు హలీం, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.డీఎంహెచ్ఓ డాక్టర్ మధుసూదన్ -
క్రీడా శిబిరాలకు వేళాయె
భూపాలపల్లి అర్బన్: విద్యార్థులకు వేసవి సెలవుల్లో ఉచితంగా క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు. చిన్నారులకు ఆహ్లాదమైన వాతావరణంలో అనుభవజ్ఞులైన క్రీడాకారులు, పీఈటీల పర్యవేక్షణలో శిక్షణ అందించనున్నారు. జిల్లా యువజన సర్వీసులు, క్రీడల శాఖ ఆధ్వర్యంలోనే 40 రోజుల పాటు ఆయా క్రీడాంశాల్లో శిక్షణ ఇస్తారు. ఈ నెల 24న వేసవి శిబిరాలను ప్రారంభించారు. వేసవిలో ఇళ్లలో ఖాళీగా ఉండే పిల్లలకు ఇది చక్కటి అవకాశం. 14 ఏళ్లలోపు బాలబాలికలు ఈ వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు అర్హులు. వేసవి సెలవులు వృథా కాకుండా వారికి ఇష్టమైన ఆటల్లో ప్రత్యేక శిక్షణ కల్పించనున్నారు. ఆధునిక యుగంలో పిల్లలు స్మార్ట్ పోన్లు, టీవీలకు అతుక్కుపోయి, చిన్న వయసులోనే అనా రోగ్యాలు కొనితెచ్చుకుంటున్నారు. సెలవులను గ్రామీణ, పట్టణ ప్రాంత పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. కొన్నేళ్లుగా ఏటా వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తోంది. ప్రభుత్వ ప్రైవేట్ ఉన్నత పాఠశాలల ఆవరణ, అందుబాటులో మైదానాలు, క్రీడా ప్రాంగణాల్లో ఆయా క్రీడాంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లాకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు ప్రభుత్వం రూ.60వేల నిధులు కేటాయించింది. ఒక్కో కోచ్కు రూ.5 వేల చొప్పున, మొత్తం జిల్లాలో 10 శిక్షణ శిబిరాలు నిర్వహించుకోవడానికి రూ.50 వేలు కోచ్లకు గౌరవ వేతనం కోసం కేటాయించారు. ప్రమాదంలో గాయాలైతే ప్రాథమిక చికిత్స అందించేందుకు మెడికల్ కిట్కు ఇతరత్రా నిర్వహణకు రూ.10 వేలు ఖర్చు చేయనున్నారు. ఆటలకు దూరమైన పాఠశాలలకు చెందిన పిల్లలు ఈ వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను సక్రమంగా సద్వినియోగం చేసుకుంటే క్రీడా నైపుణ్యాన్ని మరింత మెరుగు పరుచుకోవచ్చు. ముఖ్యంగా వేసవిలో సమయాన్ని వృథా కాకుండా ఇష్టమైన ఆటను నేర్చుకుని పట్టు సాధించే అవకాశం ఉంటుంది. సమయ పాలన, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు అలవాటు, ఆటలు ఆడుకునే చిన్నారులు ఆరోగ్యంగా ఉంటారు. భవిష్యత్లో జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహించే అవకాశాలుంటాయి. ఈ క్రీడల్లో పతకాలు సాధిస్తే క్రీడా కోటా కింద ఉన్నత విద్య నభ్యసించవచ్చు. ఉపాధి అవకాశాలకు కూడా ఆ పతకాలు ఎంతో ఉపయోగపడుతాయి. కాటారం ఖోఖో చల్లగరిగ కబడ్డీ గణపురం బాల్బ్యాడ్మంటన్ మహదేవపూర్ వాలీబాల్ అంబట్పల్లి వాలీబాల్ టేకుమట్ల షటిల్ బ్యాడ్మంటన్ అందుకుతండా కబడ్డీ వేములపల్లి బాల్బ్యాడ్మంటన్ నైన్పాక బాల్బ్యాడ్మంటన్ గంగారం కబడ్డీ కాటారం అథ్లెటిక్స్ అంబేడ్కర్ స్టేడియం క్యారమ్స్, అథ్లెటిక్స్, భూపాలపల్లి బాస్కెట్బాల్ జంగేడు వాలీబాల్ మంజూర్నగర్ తైక్వాండో మున్సిపల్ గ్రౌండ్ కబడ్డీ, అథ్లెటిక్స్ భూపాలపల్లి 10 చోట్ల శిక్షణ శిబిరాలు క్రీడాకారులకు అవకాశంవేసవి దృష్ట్యా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిర్వహించే క్రీడా శిక్షణ శిబిరాల్లో పిల్లలకు అన్ని వసతులు కల్పించడానికి చర్యలు తీసుకుంటాం. ఉదయం, సాయంత్రం వేళల్లో ఆటలు నిర్వహిస్తారు. ఇప్పటికే కోచ్ల నియామకం పూర్తిచేసి శిబిరాలను ప్రారంభించాం. శిక్షణ శిబిరాల్లో తాగునీరు, తదితర అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం. మెడికల్ కిట్లు అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు నైపుణ్యాన్ని మెరుగు పర్చుకోవాలి. సీహెచ్ రఘు, జిల్లా యువజన క్రీడల ఇన్చార్జ్ అధికారి -
వేగమైన, నాణ్యమైన దర్యాప్తు జరపాలి
భూపాలపల్లి: ప్రతీ కేసులో బాధితులకు న్యాయం జరిగేలా వేగమైన, నాణ్యమైన దర్యాప్తు జరుపాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. విచారణలో ఉన్న గ్రేవ్, నాన్–గ్రేవ్, ఎస్సీ, ఎస్టీ, మిస్సింగ్ కేసుల వివరాలను సమగ్రంగా సమీక్షించారు. లైంగిక దాడి, పోక్సో కేసులను నిర్ణీత గడువుల్లో పూర్తిచేసి నిందితులను కోర్టు ముందు నిలపాలని జిల్లాలోని పోలీసు అధికారులకు సూచించారు. పెండింగ్ కేసుల ఛేదనకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసి అమలు చేయాలని, ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులు పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి పురోగతి సాధించాలని, సీసీ కెమెరాల వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్నారు. ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో విసిబుల్ పోలీసింగ్ అమలు చేస్తూ నిత్యం వాహన తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. విధుల్లో అలసత్వం వహించినట్లయితే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ నరేష్కుమార్, భూపాలపల్లి, కాటారం డీఎస్పీలు సంపత్రావు, సూర్యనారాయణ, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
ఘనంగా గంధోత్సవం
హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి ఆలయంలో భద్రకాళీభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం నిత్యాహ్నికం, చతుస్థానార్చన నిర్వహించారు. అమ్మవారిని పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు అమ్మవారి స్నపనమూర్తికి గంధోత్సవం నిర్వహించారు. సాయంత్రం అమ్మవారి ఉత్సవమూర్తిని సాలభంజిక వాహనంపై ఊరేగించారు. పూజా కార్యక్రమాలకు వరంగల్ ఉమ్మడి జిల్లా మున్నూరు కాపు సంఘం, బంజార సమాజం వారు ఉభయదాతలుగా వ్యవహరించారు. సాలభంజిక సేవలో మహబూబాబాద్ మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ పాల్గొన్నారు. కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి దంపతులు దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. మాడవీధుల పురోగతిని పరిశీలించారు. -
మల్లూరుగుట్టపై మంటలు
● హేమాచలక్షేత్రంలో రెండు రోజులుగా కార్చిచ్చు ● కాలిబూడిదవుతున్న అటవీ సంపద ● అగ్నికి ఆహుతవుతున్న వన్యప్రాణులు మంగపేట: శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి కొలువైన మల్లూరుగుట్ట్ట అటవీ ప్రాంతం కాలిపోతోంది. రెండు రోజుల నుంచి గుట్టపై భారీ ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. దీంతో గుట్టకు అతి సమీపంలోని కొత్తమల్లూరు, మల్లూరు గ్రామాల ప్రజలు మంటల వేడికి గురవుతున్నారు. మల్లూరు నుంచి చుంచుపల్లి, రమణక్కపేట, రాజుపేట వరకు 10 కిలోమీటర్ల పొడవున ఉన్న గుట్టల్లో వారం రోజుల నుంచి కార్చిచ్చుతో అడవులు దగ్ధమవుతున్నాయి. ఏటూరునాగారం–బూర్గంపాడు ప్రధాన రోడ్డుకు అతి సమీపంలోని అదే గుట్టకు మరో వైపున గల హేమాచల లక్ష్మీనర్సింస్వామి ఆలయ ప్రాంతం నుంచి శనిగకుంట, పూరేడుపల్లి, వాగొడ్డుగూడెం వరకు గుట్టను మంటలు చుట్టు ముట్టడంతో మంటలు ఎగిసి పడుతున్నాయి. సుమారు 20 నుంచి 30 కిలోమీటర్ల పరిధికి మించి ఉన్న గుట్టపై గల లక్షలాది రూపాయల విలువైన సండ్ర, జిట్రేగు, నల్లమద్దితో పాటు తదితర విలువైన అటవీ సంపద కాలి బూడిదవుతోంది. వన్యప్రాణుల ప్రాణాలు గాల్లోకి.. హేమాచలక్షేత్రం సమీప అటవీ ప్రాంతంలో చింతామణి జలపాతం, దేవునికుంట, దబ్బతోగు, చుంచుపల్లి సమీపంలోని మామిడితోగు, రమణక్కపేట, ఎర్రమ్మతోగు తదితర తోగులతో పాటు పలు ప్రాంతాల్లో నీటి ఊటలు ఉన్నాయి. సంవత్సరం పొడవునా నీటి వసతి ఉండటంతో ఆయా అటవీ ప్రాంతాల్లో సంచరించే అడవి పందులు, కొండ గొర్రెలు, నక్కలు, తదితర జాతుల వన్యప్రాణులు అడవిలోని మంటల్లో చిక్కుకుని ఆహుతవుతున్నాయి. ఈ మంటల వేడికి తాళలేక ప్రాణాలు దక్కించుకునేందుకు అటవీ సమీప గ్రామాల్లోకి పలు రకాల జంతువులు వచ్చి వేటగాళ్లకు చిక్కి బలవుతున్నాయి. హోర్డింగులు తప్ప చర్యలేవి? వేసవికాలంలో అడవులు దగ్ధం కాకుండా ఉండేందుకు ఫైర్లైన్స్, కార్చిచ్చు కారణంగా ఏర్పడే మంటలను ఆర్పేందుకు ఎయిర్ మెషిన్ వంటి పరికరాలు వినియోగిస్తున్నారు. బేస్క్యాంప్ సిబ్బంది ఏర్పాటుతో పాటు అడవుల్లో నివసించే వన్య ప్రాణులను కాపాడేందుకు వివిధ రకాల చర్యల పేరుతో అటవీశాఖ లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్న విషయం తెలిసిందే. అడవికి నిప్పు మానవాళికి ముప్పు, అడవులను కాపాడుకుందాం అంటూ ఏజెన్సీలోని అభయారణ్యంలో అటవీశాఖ హోర్డింగులు ఏర్పాటు చేయడం తప్పా ఆచరణ మచ్చుకు కూడా కానరావడం లేదని వనప్రేమికులు ఆరోపిస్తున్నారు. మండలంలోని జిల్లా సరిహద్దులోగల అటవిశాఖ చెక్పోస్టు నిర్వహణ అధికారులు, సిబ్బందితో పాటు దోమెడ, రాజుపేట, మల్లూరు సెక్షన్ల ఎఫ్ఎస్ఓ, బీట్ అధికారులు నిత్యం మండల కేంద్రంలోని రేంజ్ కార్యాలయానికి విధులపై వచ్చి వెళ్తుంటారు. వీరికి రాజుపేట మొదలుకుని మల్లూరు వరకు రోడ్డును ఆనుకుని ఉన్న గుట్ట అటవీప్రాంతం దగ్ధమవుతున్నా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారే తప్పా మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నించడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆయుర్వేద వృక్షసంపద కనుమరుగయ్యే ప్రమాదం ప్రపంచ ప్రాణకోటికి ప్రాణవాయువునిచ్చే సహజ సిద్ధ అడవులు దగ్ధం అవుతున్నాయి. అయినా అటవీశాఖ అధికారులు నిర్లక్ష్య వైఖరిని వీడడం లేదు. అధికారుల తీరు చూస్తుంటే భవిష్యత్లో అడవులు అంతరించిపోయే పరిస్థితి కనిపిస్తుందని వనప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
దసుముడి కవితా సంకలనం ఆవిష్కరణ
హన్మకొండ: ఓరుగల్లు పోరాట వారసత్వాన్ని కవిత్వం రూపంలో వనపాక దిలీప్ రాస్తున్నారని ప్రముఖ సినీ గేయ రచయిత, నంది అవార్డు గ్రహీత మిట్టపల్లి సురేందర్ అన్నారు. శనివారం హనుమకొండ హంటర్ రోడ్డులోని మాస్టర్జీ డిగ్రీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో దిలీప్ రాసిన దసుముడి కవిత సంకలనాన్ని మానవ హక్కుల వేది ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యురాలు, సీనియర్ జర్నలిస్ట్ వేమన వసంత లక్ష్మి ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా హాజరైన మిట్టపల్లి సురేందర్ మాట్లాడుతూ బాలగోపాల్ వారసత్వాన్ని, ఆలోచనలు నింపుకున్న దిలీప్ ఈ తరం యువతకు ఆదర్శం అన్నారు. వేమన వసంత లక్ష్మి మాట్లాడుతూ దిలీప్ ఆలోచనలు భావస్పోరకం అన్నారు. ప్రధాన వక్త యాకూబ్ మాట్లాడుతూ.. సంకలనంలోని వివిధ కవితల్లో అతి ముఖ్యమైన పద బంధాలను వివరించారు. కవి తగుళ్ల గోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కుడా మాజీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజు యాదవ్, మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.తిరుపతయ్య, ఉపాధ్యక్షులు బాదావత్ రాజు, ప్రముఖ నవలా రచయిత పి.చందు, డాక్టర్ చంద్రబాను, యువకులు పాల్గొన్నారు. -
‘ప్యాక్స్’ కిరీటాలు ఎవరికో?
సాక్షిప్రతినిధి, వరంగల్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు (పీఏసీఎస్) నామినేటెడ్ పద్ధతిలో పాలకమండళ్లను నియమించే ప్రక్రియకు రంగం సిద్ధమవుతోంది. సహకార సంఘాల పదవీ కాలం గత ఏడాది ఫిబ్రవరి 14తో ముగియడంతో, ప్రస్తుతం వీటి బాధ్యతలను ప్రత్యేకాధికారులు నిర్వహిస్తున్నారు. తిరిగి వారి స్థానంలో అధికార పార్టీకి చెందిన నాయకులను వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ)ల తరహాలో సహకార సంఘాలకూ పాలకమండళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల (ఈ నెల 23న) జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు పీఏసీఎస్లతో పాటు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు (డీసీసీబీ), సహకార మార్కెటింగ్ సమాఖ్య (డీసీఎంఎస్)లకు కూడా ఇదే పద్ధతిలో పాలకమండళ్లను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్కు చెందిన ఆశావహులు మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇదీ పీఏసీఎస్ల లెక్క... ఇన్ఛార్జ్ మంత్రి, ఎమ్మెల్యేలే కీలకం.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికారుల వివరాల ప్రకారం 98 సహకార సంఘాలు ఉండగా, సుమారు 2.96 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. నామినేటెడ్ పద్ధతి ద్వారా ఉమ్మడి జిల్లాలో 98 చైర్మన్ పోస్టులు, 98 వైస్ చైర్మన్ పోస్టులతో పాటు మరో 1,260 మందికి డైరెక్టర్లుగా అవకాశం దక్కనుంది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, స్థానిక నేతలకు మంత్రివర్గం నిర్ణయం ద్వారా ఈ నామినేటెడ్ పదవులు పొందే అవకాశం కలగనుంది. అయితే మార్కెట్ కమిటీల మాదిరిగానే, స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేల ప్రతిపాదనల మేరకు పాలకవర్గాలను నియమిస్తారు. ఎమ్మెల్యే లేని నియోజకవర్గాల్లో జిల్లా మంత్రి ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతుంది. ఈ ప్రక్రియలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి కూడా కీలకంగా వ్యవహరించనున్నారు. త్వరలోనే ఈ ప్రక్రియను అమలు చేయాలని భావించిన ప్రభుత్వం ప్రస్తుత సహకార చట్టంలో మార్పులు, చేర్పులపై ఉన్నతస్థాయి కసరత్తు మొదలెట్టినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఎన్నికల నుంచి ‘నామినేటెడ్’ వైపు... సహకార సంఘాల ఎన్నికలు అధికారికంగా పార్టీ రహితంగా జరిగినా, పంచాయతీ ఎన్నికల మాదిరిగానే వీటిలో రాజకీయ పార్టీల ప్రమేయం పరోక్షంగా ఉండేది. ఆయా సంఘాల్లో సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే ఓటు వేసే హక్కు ఉంటుంది. సభ్యులు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వారై ఉండటంతో సహకార చట్టం ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొదటి దశలో సభ్యులు ఓటు వేసి డైరెక్టర్లను ఎన్నుకోవడం.. రెండవ దశలో ఎన్నికై న ఆ డైరెక్టర్లు తమలో నుండి ఒకరిని చైర్మన్గా, మరొకరిని వైస్ చైర్మన్గా ఎన్నుకునేవారు. ప్రస్తుతం ప్రభుత్వం ఈ ఎన్నికల పద్ధతికి బదులుగా, మార్కెట్ కమిటీల తరహాలో నామినేటెడ్ పద్ధతిలో పాలకమండళ్లను నియమించాలని భావిస్తోంది. క్లుప్తంగా చెప్పాలంటే, సాధారణ సభ్యులు ఓటు వేసి డైరెక్టర్లను ఎన్నుకునే ప్రక్రియకు బదులుగా, ప్రజా ప్రతినిధుల సిఫార్సుతో నేరుగా ప్రభుత్వం పాలకమండళ్లను ఎంపిక చేయడమే ఈ ‘మార్కెట్ కమిటీ తరహా నియామకం’ త్వరలోనే నామినేటెడ్ ద్వారా పాలకమండళ్లను నియమించనున్నారన్న నిర్ణయం మేరకు పీఏసీఎస్ డైరక్టర్ మొదలుకుని డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ల వరకు పదవులు పొందేందుకు ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.ఉమ్మడి జిల్లాలో ఇలా..జిల్లాల వారీగా ఇలా.. జిల్లా పీఏసీఎస్లు డైరక్టర్ సభ్యులు స్థానాలువరంగల్ అర్బన్ 12 156 30,317 (హనుమకొండ) వరంగల్ రూరల్(వరంగల్) 31 402 94,967 జనగామ 14 182 50,862 మహబూబాబాద్ 19 234 69,830 జేఎస్భూపాలపల్లి 10 130 22,773 ములుగు 12 156 27,328 నామినేటెడ్ ద్వారానే ‘సహకార’ పదవులు ఎంపికలో మంత్రులు, ఎమ్మెల్యేలే కీలకం ‘పరిషత్’ ఎన్నికలకు ముందే ప్రకటన ఆశల పల్లకిలో అధికార పార్టీ నేతలు... మొదలైన ఆశావహుల పైరవీలుమొత్తం సహకార సంఘాలు 98సభ్యులు 2,96,077డైరెక్టర్ స్థానాలు 1,260 -
శాసీ్త్రయ పద్ధతిలో ఇసుకను తొలగించాలి
భూపాలపల్లి: చెక్డ్యామ్లలో పేరుకుపోయిన ఇసుకను శాసీ్త్రయ పద్ధతిలో తొలగించడం ద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచవచ్చని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. కలెక్టర్ అధ్యక్షతన మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మల్హర్ మండలంలోని వివిధ చెక్డ్యామ్లలోని ఇసుకను డీ–సిల్టింగ్ ద్వారా తొలగించే అంశాలపై చర్చించారు. వల్లంకుంట గ్రామం వద్ద అడవిసోమన్పల్లి చెక్డ్యామ్, మల్లారం గ్రామంలోని చిన్న ఓదెల చెక్డ్యామ్, తాడిచెర్ల గ్రామంలోని గోపాల్పూర్, ఖమ్మంపల్లి చెక్డ్యామ్లలో ఇసుక తొలగింపుపై సంబంధిత శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, మైనింగ్ ఏడీ జయరాజ్, టీజీఎండీసీ, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పాల్గొన్నారు. అర్హులకు అక్రిడిటేషన్ కార్డులు.. అర్హులైన పాత్రికేయులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేస్తామని కలెక్టర్, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ రాహుల్ శర్మ అన్నారు. శనివారం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు కలెక్టర్ను కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 2026–2028 సంవత్సరాలకు చెల్లుబాటు అయ్యే అక్రిడిటేషన్ కార్డుల కోసం ఆన్లైన్ దరఖాస్తులను నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు మీడియా ప్రతినిధుల నుంచి 330 దరఖాస్తులు అందాయని అన్నారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్ అశోక్కుమార్, డీపీఆర్వో శీలం శ్రీనివాస్, అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు క్యాతం సతీష్, మంతెన సమ్మయ్య, ఎర్రం సతీష్, మోబిన్ అహ్మద్, సారేశ్వరరావు, మధు పాల్గొన్నారు. పనులు వేగవంతం చేయాలి.. వైద్య కళాశాల, వైద్య విద్యార్థుల వసతి భవనం (హాస్టల్) నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ఐడీఓసీలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. నిర్మాణ పనులకు సంబంధించి బిల్లులు పెండింగ్లో లేవని, చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నప్పటికీ పనులు ఆలస్యమవడం సరికాదన్నారు. జనగణనకు చర్యలు.. జిల్లాలో జనగణన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. జనగణన కార్యక్రమంలో భాగంగా మొదటి దశ అయిన గృహ లెక్కింపు, గృహ వసతి గణన వచ్చే నెల 11వ తేదీ నుంచి నిర్వహించబడతుందని తెలిపారు. ఈ ప్రక్రియకు ముందుగా ప్రజలకు సౌలభ్యం కల్పించేందుకు స్వీయ లెక్కింపు (సెల్ఫ్ ఎన్యూమరేషన్) సదుపాయాన్ని వెబ్ పోర్టల్ ద్వారా ఈ నెల 26వ తేదీ నుంచి అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. జిల్లా ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ గృహ, కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు కలెక్టర్ రాహుల్శర్మ -
కేంద్ర మంత్రి రాకతో వేడెక్కిన ముత్తోజిపేట
కేంద్ర హోంశాఖ సహాయ శాఖమంత్రి బండి సంజయ్ మధ్యాహ్నం ఒంటిగంటకు ముత్తోజిపేటకు చేరుకుని శంకర్గౌడ్ మృతదేహానికి నివాళులర్పించారు. అనంత రం శంకర్ భార్య లత, కుమారుడు హేమంత్, కూతురు, అల్లుడిని పరామర్శించారు. తనవంతు ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చారు. శంకర్ మృతదేహా న్ని నర్సంపేట డిపో వద్దకు తీసుకెళ్లి నివాళులర్పించిన తర్వాత ముత్తోజిపేటకు తీసుకొస్తామని బతిమిలాడినా పట్టించుకోవడం లేదని కుటుంబ సభ్యులు, కార్మికులు మంత్రికి విన్నవించారు. వెంటనే ఆయన పోలీసులతో మాట్లాడారు. డిపో వద్దకు మృతదేహాన్ని తరలించాలని కార్యకర్తలకు సంజయ్ సూచించడంతో ఫ్రీజర్లో ఉన్న శంకర్ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వారు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తోపులాటలో ఫ్రీజ ర్ బాక్స్పైన గ్లాస్ మూత పగిలిపోయింది. ఫ్రీజర్బాక్స్ను సుమారు 500 నుంచి 600 మీటర్ల దూరం వరకు కార్యకర్తలు ఒక్కసారిగా లాక్కొని రావడంతో ఒక్కసారిగా ముత్తోజిపేటలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అనుమతించని పోలీసులు.. మృతదేహాన్ని తీసుకెళ్లకుండా పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను బీజేపీ కార్యకర్తలు పక్కకు తోసేశారు. సుమారు గంటపాటు మృతదేహం ఎండలోనే ఉండిపోయింది. డిపో వద్ద ఎలాంటి సమస్య రాకుండా చూసుకుంటామని బండి సంజయ్ హామీ ఇచ్చినా పోలీసులు అనుమతివ్వలేదు. ఒక అంబులెన్స్ తీసుకొచ్చి మృతదేహాన్ని ఎక్కించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. సీపీ సన్ప్రీత్ సింగ్ వచ్చి కేంద్ర మంత్రి బండి సంజయ్కి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. మంత్రి కారు దిగి పక్కనే ఉ న్న ఇంటి రేకుల కిందకు వెళ్లిపోయారు. వెంటనే పోలీసులు మృతదేహం, కుటుంబ సభ్యులను ఇంటికి తీసుకెళ్లారు. ఈ ఉత్కంఠ మధ్యాహ్నం 3.40 గంటల వరకు కొనసాగింది. పోలీసులు నచ్చజెప్పడంతో బండి సంజయ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, మాజీ ఎమ్మెల్యేలు ధర్మారావు, కొండేటి శ్రీధర్, నాయకులు రావు పద్మ అక్కడి నుంచి వెళ్లిపోయారు. సాయంత్రం 6 గంటలకు అంతిమ యాత్ర ప్రారంభం కాగా.. 7.30 గంటలకు అంత్యక్రియలు ముగిశాయి. కాగా, శంకర్ గౌడ్ భార్య లత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు రానివ్వొద్దు
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లి: రైతులు ఇబ్బందులు పడకుండా ధా న్యం కొనుగోలు చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సూచించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి యాసంగి ధాన్యం కొనుగోలుపై పౌరసరఫరాల శాఖ, సంస్థ ఆధ్వర్యంలో రెవెన్యూ, సహకార, డీఆర్డీఏ, వ్యవసాయ, మార్కెటింగ్, రవా ణా, రైస్ మిల్లర్లు, రవాణా కాంట్రాక్టర్లు, వివిధ శా ఖల అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రవాణాకు లారీలు అందుబాటులో ఉంచాలని, తూ కం అవగానే ధాన్యాన్ని ట్యాగ్ చేసిన మిల్లులకు తరలించాలన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వేడి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులకు తగిన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ అశోక్కుమార్, సివిల్ సప్లయీస్ అధికారులు రాములు, కిరణ్కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఇంటెన్సివ్ రివిజన్ వేగిరం చేయాలి.. జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, జనగణన స్వీయ నమోదు, వరి కోతలపై హార్వెస్టర్లకు అవగాహన కార్యక్రమం, తదితర అంశాలపై రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సోమవారం నుంచి ఐదు రోజుల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని, ఇందుకు తక్షణం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 69.66 శాతం ఓటర్లు మ్యాపింగ్ జరిగిందని, రెండు నెలలుగా పురోగతి రాలేదన్నారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మ యాంక్సింగ్, అదనపు కలెక్టర్ అశోక్కుమార్, వివి ధ శాఖల అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి
భూపాలపల్లి రూరల్: విద్యార్థులు చదువుతో పాటు సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి విద్యార్థులకు సూచించారు. 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, మైనార్టీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని ఐటీఐ కళాశాలలో సంక్షేమ వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయలక్ష్మి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు ప్రతి యంత్రము పని విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీఐ ప్రిన్సిపాల్ జుమ్లానాయక్, వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఇందిర, సిబ్బంది పాల్గొన్నారు. ఇసుక ట్రాక్టర్ పట్టివేత రేగొండ: అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు కొత్తపల్లిగోరి ఎస్సై సాయి త్రిలోక్నాథ్ రెడ్డి తెలిపారు. టేకుమట్ల మండలం నుంచి ట్రాక్టర్లో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. మండలంలోని దామరంచపల్లి శివారులో శుక్రవారం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ట్రాక్టర్ను పట్టుకున్నారు. ట్రాక్టర్ యజమాని మోరె నరేష్, డ్రైవర్ కొమ్ము కుమార్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. అనుమతి పత్రాలు లేకుండా ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈనెల 24, 25 తేదీల్లో జరగాల్సిన డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీబీబీఏ, బీఎస్సీ వివిధ సెమిస్టర్ల పరీక్షలు వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ శుక్రవారం తెలిపారు. ఆర్టీసీ బస్సుల బంద్ నేపథ్యంలో ఈరెండు రోజుల పరీక్షలు వాయిదా వేసినట్లు తెలిపారు. ఈనెల 27 నుంచి టైంటేబుల్ ప్రకారం యథావిధిగా ఆయా పరీక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈనెల 24, 25న వాయిదా పడిన పరీక్షల తేదీలు తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నారు. రిజిస్ట్రార్కు ఏబీవీపీ వినతి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని ఏబీవీపీ కేయూ కార్యదర్శి మేకల జ్ఞానేశ్వర్, బాధ్యులు మెరుగు సాయి, అఖిల్, రజనీకాంత్, ప్రణయ్ శుక్రవారం ఉదయం కేయూ రిజిస్ట్రార్ రామచంద్రంకు వినతిపత్రం అందించారు. హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో భద్రకాళీభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారి ఉత్సవ మూర్తికి పలకీ సేవ, సాయంత్రం శేషవాహన సేవ నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అర్చకులు ఉద యం నిత్యాహ్నికం, చతుస్థానార్చన నిర్వహించారు. శ్రీవిద్యారణ్యుల జయంతిని పురస్కరించుకుని భద్రకాళి దేవాలయం ప్రధాన రహదారి కూడలిలోని విద్యారణ్యుల విగ్రహానికి పూలమాలవేసి పూజలు నిర్వహించారు. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లించాలి విద్యారణ్యపురి: రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లింపుల విషయంలో రాష్ట్ర కేబినెట్ నిర్ణయాన్ని అమలు చేయాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిల సాధన కమిటీ రాష్ట్ర కో–కన్వీనర్ ధర్మేంద్ర, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి భోగేశ్వర్ డిమాండ్ చేశారు. శుక్రవారం హనుమకొండలోని పీఆర్టీయూ భవన్లో నిర్వహించిన ఆసాధన కమిటీ సమావేశంలో వారు మాట్లాడుతూ.. వంద రోజుల్లో రెవెన్యూ రీసోర్సెస్ మొబిలైజేషన్ కమిటీ ద్వారా నిధులు సమకూర్చుకుని ఇచ్చిన గడువులోగా చెల్లింపులు చేయాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు బెనిఫిట్స్ రాక మానసికంగా కుంగిపోయి అనారోగ్యంతో ఇప్పటి వరకు 91 మంది మరణించారన్నారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ మృతికి శ్రద్ధాంజలి ఘటించారు. సమావేశంలో ఆకమిటీ సహ కార్యదర్శి మేకరి దామోదర్, ఇంద్రసేనారెడ్డి, విశ్వనాథం, బత్తిని సారయ్య, శ్యామ్, క్షీర సాగర తదితరులు పాల్గొన్నారు. -
బస్సు పయ్య కదల్లె..
డిపో ఎదుట ధర్నా నిర్వహిస్తున్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, ఆర్టీసీ కార్మికులు భూపాలపల్లి: హక్కుల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె మూడో రోజు శుక్రవారం సంపూర్ణంగా సక్సెస్ అయింది. భూపాలపల్లి డిపో నుంచి సంస్థ బస్సులు ఒక్కటి కూడా బయటకు రాలేదు. అద్దె బస్సుల డ్రైవర్లు సైతం సమ్మెకు మద్దతు పలికి తమ బస్సుల రాకపోకలను నిలిపివేశారు. ఆర్టీసీ అధికారులు అద్దె బస్సులను నడిపించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో భూపాలపల్లి డిపోలో సమ్మె సక్సెస్ అయింది. సమ్మెలో భాగంగా జేఏసీ నాయకులు, కార్మికులు పలు నిరసన కార్యక్రమాలను చేపట్టారు. ఉదయం డిపో ప్రధాన గేటు ఎదుట ధర్నా నిర్వహించగా, మధ్యాహ్నం డిపో నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి, అక్కడ మౌన ప్రదర్శన చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేశారు. ఆర్టీసీ కార్మికులు శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. సమ్మె కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. గురువారం ప్రైవేట్ బస్సులు నడిపించడంతో శుక్రవారం కూడా ప్రయాణికులు అంబేడ్కర్ చౌరస్తా, బస్టాండ్లో బస్సులు కోసం వేచి చూసి చివరకు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. ధరలు పెంచి ప్రయాణికుల తరలింపు.. ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా శుక్రవారం సంస్థ, అద్దె బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆటోలు, టాక్సీల యజమానులు తమ ధరలను పెంచి ప్రయాణికులను తరలించారు. గతంలో భూపాలపల్లి–కాటారం, భూపాలపల్లి–పరకాలకు బస్సు టికెట్ ధర రూ.70 ఉండగా, శుక్రవారం ఆటోలు, టాక్సీ వాహనాల యజమానులు ఒక్కొక్కరికి రూ.100 తీసుకున్నారు. బస్సులు లేకపోవడంతో చేసేది లేక అదనపు భారాన్ని భరించి ప్రయాణాలు కొనసాగించారు. శంకర్గౌడ్కు నివాళులు.. నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్గౌడ్కు భూపాలపల్లి డిపో కార్మికులు ఘనంగా నివాళులర్పించారు. రాత్రి 8 గంటలకు డిపో ఎదుట శంకర్గౌడ్ చిత్ర పటాన్ని ఏర్పాటు చేసి నినాదాలు చేస్తూ కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. శంకర్గౌడ్ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సమ్మెకు పలు సంఘాల మద్దతు.. కార్మికుల సమ్మెకు పలు రాజకీయ పార్టీల నాయకులు, సంఘాలు మద్దతు తెలిపాయి. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి డిపో వద్దకు వచ్చి ఆర్టీసీ కార్మికులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్, తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకుడు ఎస్పీకే సాగర్, వివిధ సంఘాల నాయకులు సమ్మెకు మద్దతు తెలిపి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆయా కార్యక్రమాల్లో నాయకులు, కార్మికులు బుర్రి తిరుపతి, సందీప్, కొమురన్న, రాజయ్య, శ్రీనివాస్, రాధాకృష్ణ, ఎన్ఆర్ నాయక్, సమ్మయ్య, ఎల్లాగౌడ్, బేగం, సునిత, అరుణ, రవీందర్, సుమలత తదితరులు పాల్గొన్నారు. డిపోకే పరిమితమైన సంస్థ బస్సులు మద్దతు తెలిపిన అద్దె బస్సుల డ్రైవర్లు కొనసాగిన కార్మికుల నిరసన కార్యక్రమాలు -
శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
● జిల్లా క్రీడల శాఖ అధికారి రఘు మొగుళ్లపల్లి: వేసవి క్రీడ శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా క్రీడల శాఖ అధికారి చిర్ర రఘు అన్నారు. శుక్రవారం మండలంలోని వేములపల్లి గ్రామంలో బాల్బ్యాడ్మింటన్ క్యాంప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ విద్యార్థులు ఈ వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. శిక్షణ శిబిరాలు ఏప్రిల్ 24నుంచి జూన్ 7వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అరెల్లి రమేష్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. -
పల్లెల్లో సందడి
భూపాలపల్లి రూరల్: స్థానిక పరిషత్ ఎన్నికల నగారా మోగనుందనే సంకేతాలతో గ్రామాల్లో రాజకీయ సందడి మొదలైంది. త్వరలో రిజర్వేషన్లు కూడా ఖరారు కానున్న నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులు ఇప్పటి నుంచే ఓటర్లను, పార్టీల నాయకులను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. వచ్చే నెలలో ఎన్నికలు? స్థానిక సంస్థల పరిషత్ ఎన్నికలు వచ్చే నెలలో జరిగే అవకాశం ఉంది. యంత్రాంగం ఈ మేరకు ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసింది. జిల్లాలోని 109 ఎంపీటీసీ, 12 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ముందుగానే రంగంలోకి.. ఎన్నికల తేదీ ఖరారు కానప్పటికీ ఆశావహులు ముందుగానే రంగంలోకి దిగారు. ఇప్పటి నుంచే ప్రజల్లో తమ పోటీ గురించి చర్చ ప్రారంభించి ఎన్నికల తేదీ వచ్చే నాటికి తమకు అనుకూలంగా మార్చుకోవాలన్న అభిప్రాయంతో ఉన్నారు. రిజర్వేషన్లు తమకు అనుకూలంగా వస్తే ఎంత ఖర్చయినా వెనకాడబోమని చెబుతున్నారు. అధికారంపై ధీమాతో కాంగ్రెస్.. జిల్లాలో సర్పంచ్ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని అన్ని సీట్లలో తామే జెండా ఎగరవేస్తామని కాంగ్రెస్ నేతలు ధీమాగా ఉన్నారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత స్థానిక ఎన్నికల్లో తమకు విజయం దక్కుతుందని ప్రతిపక్ష పార్టీలు అంచనా వేస్తున్నాయి. ప్రజావ్యతిరేకత తమకు అనుకూలంగా మారుతుందన్న ఆశలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అన్ని పార్టీల్లో తీవ్రమైన పోటీ నెలకొంది. వాస్తవానికి గతేడాది నవంబర్లో ఎన్నికలు జరుగుతాయని భావించినా రిజర్వేషన్లు, కోర్టు కేసుల కారణంగా వాయిదా పడ్డాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సర్పంచ్లుగా పోటీచేసి ఓడిపోయిన వారితో పాటు, సర్పంచ్ ఎన్నికల్లో ఎంపీటీసీ సీట్లు ఇస్తామని ఆశపెట్టి పోటీలనుంచి తప్పించిన నాయకులు, కొత్తగా యువ నాయకులు టికెట్లు ఆశిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్లో కూడా టికెట్ కోసం పోటీ పెరుగుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ తరఫున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు పార్టీ తరఫున ఎన్నికల ఖర్చు కోసం ఫండ్ భారీగానే ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో పార్టీలో టికెట్ కోసం పోటీ అమాంతంగా పెరిగే అవకాశం ఉంది. బీజేపీ కూడా గ్రామాల్లో తన రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకోవడంతో ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసేందుకు పలువురు టికెట్ ఆశిస్తున్నారు. గ్రామాల్లో జోరందుకున్న రాజకీయ చర్చలు ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభం -
ఆర్టీసీ సమ్మెలో విషాదం
పసుపు ధర ౖపైపెకి.. కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో పసుపు పంట ధర రోజురోజుకూ ౖపైపెకి చేరుకుంటోంది. శుక్రవారం శ్రీ 24 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026నర్సంపేట : నర్సంపేట ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న డ్రైవర్ కోల శంకర్గౌడ్ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులు నడపాలని ప్రభుత్వం, ఆర్టీసీ అధికారులు చేస్తున్న ప్రయత్నాన్ని నిరసిస్తూ డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్ప డడం కలకలం రేపింది. ఆర్టీసీ సమ్మెలో భాగంగా రెండో రోజు గురువారం ఉదయమే నర్సంపేట డిపో ఎదుట డ్రైవర్లు, కండక్టర్లు బైఠాయించారు. ఈ ఆందోళనలో పాల్గొన్న శంకర్గౌడ్ ఇంటికి వెళ్లి మధ్యాహ్నం 3.45 గంటలకు ధర్నా వద్దకు చేరుకున్నాడు. తనవెంట తెచ్చుకున్న పెట్రోల్ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడిన కార్మికులు మంటల్లో చిక్కుకున్న శంకర్ను కాపాడేందుకు 30 నిమిషాలపాటు ప్రయత్నించారు. 75 శాతం కాలిన ఆయనను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఆ తరువాత హైదరాబాద్కు తరలించారు. ప్రస్తుతం కంచన్బాగ్ డీఆర్డీఓ అపోలో ఆస్పత్రిలో వెంటి లెటర్పై చికిత్స పొందుతున్నట్లు రాత్రి ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. కాగా, నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు డిపో వద్ద ఆందోళన నిర్వహించి మాట్లాడారు. ప్రైవేట్ డ్రైవర్లను ఏర్పాటు చేసుకొని స్థానిక డిపో మేనేజర్ సమ్మెను నీరుగార్చే ప్రయత్నం చేయడంతోనే మనస్తాపం చెందిన శంకర్గౌడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. భారీ బందోబస్తు... నర్సంపేట డిపో వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా డీసీపీ అంకిత్కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మోహరించారు. బస్టాండ్ ఎదుట, వరంగల్ రోడ్డులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి ఆర్టీసీ కార్మిక సంఘాలతో నేడు (శుక్రవారం) చర్చలు జరుపుతామని ప్రకటించిన విషయాన్ని కార్మికులకు పోలీసులు తెలిపి ఆందోళన విరమించాలని కోరారు. అనంతరం ఆర్టీసీ కార్మికులు తిరిగి డిపో వద్దకు చేరుకుని ఆందోళనలు చేశారు. ఘటనాస్థలాన్ని సందర్శించిన సీపీ నర్సంపేటలో బస్టాండ్లో ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ నిప్పంటించుకున్న స్థలాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ .. రాత్రి అధికారులతో కలిసి పరిశీలించారు. ఘటన జరిగిన తీరును పోలీస్ కమిషనర్.. స్థానిక పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీపీ వెంట ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, స్పెషల్ బ్రాంచ్, నర్సంపేట ఏసీపీలు జితేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ ముస్క శ్రీనివాస్, సీఐలు శ్రీనివాస్, సాయి రమణ, దుగ్గొండి ఎస్ఐ రణధీర్ ఉన్నారు. డిపో ఎదుట ధర్నా, రాస్తారోకో.. డ్రైవర్ శంకర్గౌడ్ ఘటన గురించి తెలుసుకున్న బీఆర్ఎస్, బీజేపీ, బీసీ సంఘం, కమ్యూనిస్టు పార్టీల నాయకులు ఆర్టీసీ డిపో వద్దకు చేరుకుని ధర్నా, రాస్తారోకో చేశారు. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వ వైఫల్యంతోనే డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని ఆరోపించారు. తక్షణమే సమస్యలు పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు. ఉర్ధూకు రాష్ట్రంలో రెండో అధికార భాషా హోదా కల్పించినా నిధులు కేటాయించడం లేదు. దీంతో కంప్యూటర్ శిక్షణా కేంద్రాలు, లైబ్రరీలు దీనస్థితికి చేరుకున్నాయి.నర్సంపేటలో డ్రైవర్ శంకర్గౌడ్ ఆత్మహత్యాయత్నం తీవ్రగాయాలతో హైదరాబాద్కు తరలింపు.. వెంటిలెటర్పై చికిత్స ప్రభుత్వ వైఫల్యంతోనే కార్మికుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆరోపణ -
ముందుచూపు లేకపాయె..
కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాంతాన్ని కాకతీయులు, చాళుక్యులు పాలించిన చారిత్రక ఆధారాలున్నాయి. ఎక్కడా లేని విధంగా ఒకే పానవట్టంపై రెండు శివలింగాలు (యముడు, శివుడు) కొలువైన ప్రత్యేకత కాళేశ్వరం చరిత్ర. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2016 మే 2న కాళేశ్వరం ప్రాజెక్టుకు భూమి పూజ చేసిన అప్పటి సీఎం కేసీఆర్ రూ.25కోట్ల అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసి ప్రారంభించారు. ఆ నిధులతో పలు నిర్మాణాలు చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత గతేడాది సరస్వతినది పుష్కరాలకు రూ.35కోట్లతో శాశ్వత నిర్మాణాలు, కొన్ని తాత్కాలిక పనులు చేశారు. దీంతో అ భివృద్ధి వైపు అడుగులు వేసింది. ప్రస్తుతం మాస్టర్ ప్లాన్లో ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. ఈ నెల 20న సోమవారం రూ.198కోట్ల వ్యయంతో కా ళేశ్వరం పునరుద్ధరణ పనులకు సీఎం రేవంత్రెడ్డి భూమిపూజ చేశారు. దీంతో ఆలయం రూపురేఖలు మారనున్నాయని చర్చ జరుగుతుండగా.. నిర్మాణా లు కూల్చివేతలపై ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. శృంగేరి పీఠాధిపతులు అనుమతి.. 1982లో జీర్ణోద్ధరణ సమయంలో శృంగేరీ పీఠాధిపతితో కుంబాభిషేకం చేశారు. అనంతరం గతేడాది ఫిబ్రవరిలో కూడా కుంభాభిషేకం నిర్వహించారు. ఆలయాల తొలిగింపు ప్రక్రియకు శృంగేరి పీఠాధిప తి అనుమతి తీసుకుంటామని, నిర్మాణాలు మొదలైతే అడవిలో వెలిసిన ఆదిముక్తీశ్వరాలయంలో ద ర్శనాలు జరుగుతామని సోమవారం భూమి పూజ సమయంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వెల్లడించారు. దేవాదాయశాఖ ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ అధికారులకు ముందుచూపు లేకపోవడంతో ఎక్కడపడితే అక్కడే నిర్మాణాలు చేపట్టారు. దీంతో మాస్టర్ ప్లాన్లో నిర్మాణాలు తొలగించాల్సిన పరిస్థితి నెలకొంది. రూ.198 కోట్ల వ్యయంతో కాళేశ్వరం దేవస్థానం ప్రధాన గర్భగుడి, శ్రీశుభానందదేవి అమ్మవారి ఆలయాలు రాతితో నిర్మించనున్నారు. రెండు ఆలయాలు 1978–82 మధ్యన జీర్ణోద్దరణ సమయంలో సిమెంట్, డంగు సున్నంతో నిర్మించిన కట్టడాలు. వీటిలో నాలుగైదేళ్ల కిందట నిర్మించిన ప్రధాన ఆలయం మండపానికి ఆనుకొని నిర్మించిన అనివెట్టి మండపం, ప్రధాన ఆలయానికి ఎడమ వైపున అభిషేక మండపం, ఉత్తరం వైపున నిర్మించిన శివ కల్యాణ మండపం ఇటీవల శివరాత్రికి ప్రారంభించారు. వెలుపలి ప్రకార ఆలయాలు, విగ్రహాలు, ఈఓ కార్యాలయంతో పలు నిర్మాణాలు తొలిగించనున్నారని సమాచారం. ఇంకా ప్రకారాలు, గోపురాలు తొలిగిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. వాటి స్థానంలో నూతనంగా నిర్మాణాలు జరగనున్నాయి. కాళేశ్వరం మాస్టర్ప్లాన్తో చర్చనీయాంశం ఇటీవల దేవస్థానం పునరుద్ధరణ పనులకు సీఎం శంకుస్థాపన -
డిపోలకే పరిమితం
భూపాలపల్లి: తమ హక్కుల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె రెండో రోజు సక్సెస్ అయింది. అద్దె బస్సులు మినహా సంస్థ బస్సులు డిపో నుంచి బయటకు రాలేదు. గురువారం తెల్లవారుజామున మూడు గంటలకే ఆర్టీసీ జేఏసీ నేతలు, కార్మికులు భూపాలపల్లి డిపో కార్యాలయానికి చేరుకొని మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి నిరసన తెలిపారు. అప్పటి నుంచి డిపో ఎదుట, బస్టాండ్ సమీపంలోనే ఉంటూ డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా చూసుకుంటూ ఉన్నారు. ఉదయం 11 గంటల సమయంలో పోలీసు వ్యాన్లో అవుట్సోర్సింగ్ డ్రైవర్లు, కండక్టర్లను డిపోలోకి తీసుకొచ్చేందుకు ఆర్టీసీ అధికారులు ప్రయత్నించారు. కార్మికులు గమనించి పోలీసు వ్యాన్ను అడ్డుకొని వాహనం ఎదురుగా బైఠాయించి అడ్డుకున్నారు. కార్మికుల పరిస్థితిని జేఏసీ నాయకుడు బుర్రి తిరుపతి ఔట్సోర్సింగ్ సిబ్బందికి వివరించి విధులకు వెళ్లవద్దని ప్రాధేయపడ్డాడు. దీంతో వారు సైతం వెనుదిరిగారు. నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ విషయం తెలుసుకున్న భూపాలపల్లి డిపో డ్రైవర్ వీఎంఎం చారి భావోద్వేగానికి లోనై, కార్మికుల హక్కుల సాధన కోసం తాను సైతం బలిదానం అవుతానంటూ వ్యాఖ్యలు చేశాడు. అక్కడే ఉన్న పోలీసులు, కార్మికులు వెంటనే అతడి కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కార్మికులంతా సమ్మెలో పాల్గొన్నందున సంస్థ బస్సులు ఒక్కటి కూడా డిపో నుంచి బయటకు రాలేదు. డిపోకు చెందిన 22 అద్దె బస్సులు మాత్రం వివిధ ప్రాంతాలకు ప్రయాణికులను తరలించాయి. కొంతమంది అద్దె బస్సుల యజమానులైతే బుధవారం రాత్రే తమ బస్సులను ఇంటికి తీసెకెళ్లి, పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా, మంజూర్నగర్ తదితర సెంటర్ల నుంచి బస్సులను నడిపించారు. సమ్మెలో భాగంగా నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో జేఏసీ నాయకులు, కార్మికులు బుర్రి తిరుపతి, రాజయ్య, కొమురన్న, బండి శ్రీనివాస్, సందీప్, రాధాకృష్ణ, ఎన్ఆర్ నాయక్, సమ్మయ్య, బేగం, సునిత, అరుణ, సుమలత పాల్గొన్నారు. ఔట్సోర్సింగ్ సిబ్బందితో నడిపించేందుకు యత్నం అడ్డుకున్న కార్మికులు -
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు
భూపాలపల్లి అర్బన్: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య తెలిపారు. స్థానిక తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల పోరాటానికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. యూనియన్లను గుర్తించి అధికారిక చర్చలు జరపాలని సూచించారు. లేబర్ కోడ్లను ఆధారంగా చేసుకుని ఆర్టీసీ సమ్మెను అణచివేయాలని ప్రయత్నించడం అన్యాయమని విమర్శించారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు దాసరి జనార్దన్, కాసర్ల ప్రసాద్ రెడ్డి, నామాల శ్రీనివాస్, రాళ్లబండి బాపు, జయశంకర్, రవి, సా జిత్, నరసింహారెడ్డి, సలీం, మధుకర్ పాల్గొన్నారు. -
పుష్కరాల పనులు వేగవంతం చేయాలి
భూపాలపల్లి అర్బన్: భక్తుల సౌకర్యార్థం సరస్వతి అంత్య పుష్కరాల ఏర్పాట్లను వేగవంతం చేసి నిర్ణీత గడువులోపు పూర్తిచేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పుష్కరాల ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించారు. పుష్కరాల సందర్భంగా భక్తులకు అన్ని వసతులు కల్పించేందుకు రెవెన్యూ, ఇరిగేషన్, వైద్య, పీఆర్, విద్యుత్, ఆర్అండ్బీ, ప్రణాళిక, రవాణా, పర్యాటక, అగ్నిమాపక శాఖల అధికారులు చేపట్టిన పనుల పురోగతిని సమీక్షించారు. ప్రత్యేకంగా కాళేశ్వరం సరస్వతి ఘాట్ వద్ద జరుగుతున్న పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఘాట్ నిర్మాణం, షట్టరింగ్, స్టాంప్డ్ కాంక్రీట్ పనులు కొనసాగుతున్నాయని, వీటిని మరింత వేగవంతం చేయాలని సూచించారు. పేవర్ బ్లాక్స్ పనులు కూడా పురోగతిలో ఉన్నాయని తెలిపారు. పుష్కరాల సందర్భంగా భద్రత, పారిశుద్ధ్యం, తాగునీరు, రవాణా వంటి అన్ని ఏర్పాట్లను సమన్వయంతో నిర్వహించాలని, భక్తుల కోసం స్నానాల షవర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయ లక్ష్మి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆరోగ్య జాగ్రత్తలు అవసరం చార్ధామ్ యాత్రకు వెళ్లే యాత్రికులు ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ రాహుల్ శర్మ గురువారం ఒక ప్రకటనలో సూచించారు. హిమాలయ ప్రాంతాల్లో ఉన్న ఈ పుణ్యక్షేత్రాల్లో తక్కువ ఆక్సిజన్, తీవ్ర చలి కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. యాత్రకు ముందు వైద్య పరీక్షలు చేయించుకోవాలని, ముఖ్యంగా వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. యాత్ర సమయంలో వెచ్చని దుస్తులు, అవసరమైన మందులు వెంట తీసుకెళ్లాలని, అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 104 హెల్ప్లైన్ను వినియోగించుకోవాలని కోరారు. విద్యార్థులు లక్ష్యాలను చేరుకోవాలి మల్హర్(కాటారం): విద్యార్థులు తమ లక్ష్యాలను నిర్దేశించుకుని పట్టుదల, క్రమశిక్షణతో చదివితే ఏ లక్ష్యాన్నైనా సాధించగలరని కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. గురువారం కాటారం మండలం మేడిపల్లి గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక సంక్షేమ వారోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు నిర్వహిస్తున్న సంక్షేమ వారోత్సవాల్లో నాలుగో రోజు జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి ప్రగతి నివేదికలను అందజేశారు. అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి సంక్షేమ వారోత్సవాల ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చదువుకు పేదరికం ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డు కాదని, కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకుని తల్లితండ్రులకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీటీడబ్ల్యూఓ నాగసాగర్, ఎంపీడీఓ బాబు, సర్పంచ్ పవిత్ర, ప్రిన్సిపాల్ పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
నేడు ఉమ్మడి జిల్లా బంద్
● ఆర్టీసీ జేఏసీ పిలుపు హన్మకొండ: నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్గౌడ్ పెట్రోల్ పోసుకోవడాన్ని నిరసిస్తూ, ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోరుతూ నేడు (శుక్రవారం) ఉమ్మడి వరంగల్ జిల్లా బంద్కు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. ఈ మేరకు గురువారం రాత్రి హనుమకొండ జిల్లా బస్స్టేషన్లో ఆర్టీసీ జేఏసీ వరంగల్ రీజియన్ కమిటీ సమావేశం జరిగింది. ప్రభుత్వ వైఖరి మూలంగానే డ్రైవర్ శంకర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు జేఏసీ తెలిపింది. జేఏసీ వరంగల్ రీజియన్ కన్వీనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికై నా కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి జిల్లాలోని వ్యాపార వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలు, అన్ని వర్గాలు సహకరించి బంద్ను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ డిపోల వద్ద అంబులెన్స్లు ● శంకర్గౌడ్ ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం హన్మకొండ:వరంగల్ జిల్లా నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఘటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని డిపోల వద్ద 108 అంబులెన్స్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. గురువారం రాత్రి అంబులెన్స్లు డిపోల వద్దకు చేరుకున్నాయి. హనుమకొండ జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య ఆదేశాల మేరకు అంబులెన్స్లను అధికారులు అందుబాటులో ఉంచినట్లు 108 సిబ్బంది తెలిపారు. కోర్టు ఆవరణలో చలివేంద్రం ఏర్పాటు భూపాలపల్లి అర్బన్: ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో న్యాయవాదులు, కక్షిదారుల దాహార్తిని తీర్చేందుకు జిల్లా కోర్టు, జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణంలో గురువారం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చలివేంద్రాన్ని ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్ఆర్ దిలీప్ కుమార్ నాయక్ ప్రారంభించారు. బార్ అసోసియేషన్, న్యాయవాది భూక్యా రమేష్ నాయక్, తిరుమల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రం ద్వారా కోర్టుకు దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి తాగునీటి సౌకర్యం కల్పించడమే లక్ష్యమని జడ్జి తెలిపారు. చలివేంద్రం ఏర్పాటుకు సొంత ఖర్చులతో సహకరించిన న్యాయవాది భూక్యా రమేష్నాయక్, తిరుమలను జడ్జి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కూనూరు సురేష్ కుమార్, ఉపాధ్యక్షుడు గంగరబోయిన రాజేందర్, ప్రధాన కార్యదర్శి ఆకు ల రాములు, లేడీ జాయింట్ సెక్రటరీ కంప అక్షయ, లైబ్రరీ కార్యదర్శి ఆకినేపల్లి రవికుమార్, ట్రెజరర్ ఇందరపు శివకుమార్, స్పోర్ట్స్ సెక్రటరీ నాగరాజ్, ఈసీ సభ్యులు రాయం రమేష్, వసంత, అర్ధకుమార్ పాల్గొన్నారు. -
భూమిని రక్షించడం ప్రతీ ఒక్కరి బాధ్యత
భూపాలపల్లి అర్బన్: పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పుల నేపథ్యంలో భూమిని రక్షించడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని జిల్లా సైన్స్ అధికారి స్వామి అన్నారు. జిల్లాకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని గురువారం విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. ‘మన భూమిని కాపాడుకుందాం–పర్యావరణాన్ని రక్షిద్దాం’ అనే నినాదంతో పాఠశాల ప్రాంగణంలో కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సైన్సు అధికారి స్వామి హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్లో మొక్కలు నాటాలని, ప్లాస్టిక్ బ్యాగుల వినియోగాన్ని తగ్గించి జూట్, కాటన్ బ్యాగులను ఉపయోగించాలని సూచించారు. తక్కువ దూరాలకు వాహనాల బదులు సైకిళ్లను వినియోగించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చని తెలిపారు. చిన్నప్పటి నుంచే విద్యార్థుల్లో పర్యావరణంపై అవగాహన పెంపొందించడం ఈ వేడుకల ప్రధాన లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, పెద్దసంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.జిల్లా సైన్స్ అధికారి స్వామి -
పర్యావరణ పరిరక్షణ ప్రతీఒక్కరి బాధ్యత
భూపాలపల్లి అర్బన్: పర్యావరణ పరిరక్షణ ప్రతీఒక్కరి బాధ్యతని ఏరియా ఇంజనీర్ మాల ఎర్రన్న అన్నారు. బుధవారం ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏరియాలోని జీఎం కార్యాలయంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమంతో పాటు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏరియా ఇంజనీర్ మాల ఎర్రన్న మాట్లాడుతూ ప్రకృతి సంపదలను కాపాడడం ద్వారా భవిష్యత్ తరాలకు మంచి జీవన వాతావరణం అందించవచ్చన్నారు. సింగరేణి సంస్థ పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి పలు హరిత కార్యక్రమాలు చేపడుతోందని, ఉద్యోగులు, ప్రజలు కలిసి చెట్ల నాటకం, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, నీటి సంరక్షణ వంటి చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం 20 సంవత్సరాలుగా జేవీఎస్ చంద్రశేఖర్ (గ్రీన్ వారియర్, రిటైర్డ్ సింగరేణియన్) పర్యావరణంపై విశ్వవిద్యాలయాలు, అటవీ శాఖల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఉద్యోగులు, విద్యార్థులకు విలువైన జ్ఞానం అందిస్తున్నారని ప్రశంసించారు. అనంతరం చంద్రశేఖర్ను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం (ఐఈడీ) జోతి, ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ పోషమల్లు, పర్సనల్ మేనేజర్ కావూరి మారుతి తదితరులు పాల్గొన్నారు. -
పాఠశాలల్లో మరమ్మతు పనులు పూర్తి చేయాలి
మొగుళ్లపల్లి: వర్షాకాలానికి ముందే అన్ని సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలల్లో మరమ్మతు పనులు పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్శర్మ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం మండలంలోని మహాత్మాజ్యోతిబాపూలే పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో మరమ్మతు చేయాల్సిన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ, బీసీ మైనార్టీ, మహాత్మ జ్యోతిబాపూలే, మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలో మరమ్మతులకు సంబంధించి ప్రతిపాదనలు అందించా లన్నారు. 31 పాఠశాలల్లో చేపట్టిన మరుగుదొడ్లు పనులను పూర్తి చేయాలన్నారు. అన్ని పాఠశాల్లో వందశాతం మంచినీరు, మరుగుదొడ్లు, విద్యుత్ స రఫరా ఉండాలని స్పష్టం చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు, మంచినీటి సరఫరా పునరుద్ధరణ పనులను మే 10వ తేదీ వరకు పూర్తి చేయాలన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు నిర్వహించనున్న ‘వెల్ఫేర్ వీక్‘ సందర్భంగా అన్ని రకాల సంక్షేమ హాస్టల్లో ప్రణాళిక ప్ర కారం నిర్వహించాలన్నారు. 23న పీటీఎం, 24న నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని, 25న విద్యార్థులకు సమ్మర్ క్యాంపులు నిర్వహించి క్రీడలు, కళలు, హస్తకళలు, సంగీతం, డిజిటల్ లెర్నింగ్, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఈఓ రాజేందర్, బీసీ సంక్షేమ అధికారి ఇందిర, ఇంజనీరింగ్ అధికారులు, తహసీల్దార్ సునీత, ఎంపీడీఓ సురేందర్, ఎంపీఓ సుభాష్చంద్రబోస్, ప్రిన్సిపాల్ శ్యామల, సర్పంచ్ విజయ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
మత్తుపదార్థాలపై అవగాహన కల్పించాలి
ములుగు: మత్తుపదార్థాలతో కలిగే దుష్ప్రభావాలపై ప్రజలకు, యువతకు, విద్యార్థులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ మహేందర్జీ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్లో జిల్లా స్థాయి నార్కోటిక్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సమాజానికి శాపంగా మారిన మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. యువత, విద్యార్థులు వ్యసనాల బారిన పడకుండా పోలీస్, ఎకై ్సజ్, విద్యాశాఖలు ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. జిల్లాలో గంజాయి సాగు, విక్రయాలు, అక్రమ రవాణాకు తావులేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. విద్యాసంస్థల పరిసరాల్లో డ్రగ్స్ విక్రయాలు జరగకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని, గ్రామ, మండల స్థాయిల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ములుగు సామాజిక ఆస్పత్రిలో ప్రత్యేకంగా డి అడిక్షన్ కేంద్రం అందుబాటులో ఉందని తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీ రవీందర్, జిల్లా విద్యాశాఖాధికారి సిద్ధార్థరెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత, డీఏఓ సురేశ్కుమార్ పాల్గొన్నారు. -
కోచ్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో ఉచిత వేసవి శిక్షణ శిబిరాల నిర్వహణకు కోచ్ల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి సీహెచ్ రఘు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతీ సంవత్సరం నిర్వహించే వేసవి శిబిరాలను ఈ ఏడాది కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 10 కేంద్రాల్లో ఏప్రిల్ 24 నుంచి జూన్ 7వ తేదీ వరకు వివిధ క్రీడా విభాగాల్లో శిక్షణ శిబిరాలు నిర్వహించబడతాయన్నారు. ఆసక్తి గల కోచ్లు తమ పూర్తి వివరాలతో దరఖాస్తులను ఈ నెల 23వ తేదీలోపు జిల్లా యువజన, క్రీడల శాఖ కార్యాలయంలో అందించాలన్నారు. ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు, సీనియర్ క్రీడాకారులు, జాతీయ స్థాయి క్రీడాకారులు కోచ్లు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎంపికై న ప్రతీ కోచ్కు రూ.5వేల గౌరవ వేతనం అందజేయనున్నట్లు తెలిపారు. వివరాలకు 9618011096, 8125113132 సెల్ నంబర్లలో సంప్రదించాలన్నారు. పది రోజుల పాటు మేడే కార్యక్రమాలుభూపాలపల్లి అర్బన్: మే 1 నుంచి 10వ తేదీ వరకు జిల్లాస్థాయిలో మే డే కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా సహాయ కార్మిక శాఖ అధికారిణి వినోద బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా స్థాయి, మండల స్థాయిలో కార్మిక సంఘాలు, ఉద్యోగి కల్పన మండలి శాఖలు, ఫ్యాక్టరీలు, ఏటీసీ ప్రిన్సిపల్ తదితర సంస్థల సహకారంతో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమాలు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జరగాలని, అన్ని కార్మిక శాఖలు, ఉద్యోగి కల్పన శాఖలు, ఫ్యాక్టరీలు, ఏటీసీ ప్రిన్సిపాల్స్ సంబంధిత అధికారులకు ముందుగా సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమాల నివేదికలు ఈ నెల 27 తేదీ లోపు కార్యాలయంలో అందించాలని సూచించారు. వాల్పోస్టర్ ఆవిష్కరణ భూపాలపల్లి అర్బన్: సీఐటీయూ ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన నిర్వహించనున్న విద్యుత్ సౌద ముట్టడిని విజయవంతం చేయాలని కోరుతూ బుధవారం ఏరియాలోని కేటీకే 1వ గనిలో యూనియన్ నాయకులు వాల్పోస్టర్ ఆవిష్కరణ చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ సింగరేణి సంస్థకు జెన్కో, ట్రాన్స్కో, ఎస్టీపీ ద్వారా సరఫరా అయిన విద్యుత్కు సంబంధించిన బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.51వేల కోట్లను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 28న నిర్వహించనున్న చలో విద్యుత్ సౌద ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బాపురావు, తోట రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ సేవలపై ఆకస్మిక తనిఖీచిట్యాల: మండలకేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలోని ఆరోగ్య శ్రీ సేవలపై ఉమ్మడి వరంగల్ జిల్లా మేనేజర్ పి. విక్రమ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో రాజీవ్ ఆరోగ్యశ్రీ విభాగంలో పని చేస్తున్న ఆరోగ్య మిత్రల రికార్డులను పరిశీలించారు. ఆరోగ్యశ్రీ కింద రోగులకు అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో కిడ్నీ డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడానికి స్థలాన్ని పరిశీలించారు. ఆయన వెంట జిల్లా టీం లీడర్ యామంకి అనిల్, ఆరోగ్య మిత్రలు గుర్రపు రాజమొగిలి, స్వప్నదేవి తదితరులు ఉన్నారు. రామప్పలో శిక్షణ అధికారులు వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని బుధవారం హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న సెంట్రల్ సెక్రటరీ సర్వీస్ ఏఎస్వోలు సందర్శించారు. భారత్ దర్శన్ కార్యక్రమంలో భాగంగా రామప్ప దేవాలయాన్ని వారు దర్శించుకోగా ఆలయ అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్ వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ వారికి ఆలయ చరిత్ర, శిల్పకళ వైభవం గురించి వివరించగా శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు. -
జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న కుక్కకాటు కేసులు
భూపాలపల్లి: ఎండలు మండుతుంటే మనుషులకే కాదు.. మూగజీవాలకు కూడా చిర్రెత్తుకొస్తుంది. వేసవి సెగకు రోజురోజుకు జిల్లాలో నమోదవుతున్న కుక్కల దాడులు కలకలం రేపుతున్నాయి. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే వెయ్యికి పైగా కుక్కకాటు కేసులు నమోదు కావడం గమనార్హం. వేసవి తీవ్రత పెరిగే కొద్దీ ఈ దాడులు మరింత పెరిగే అవకాశం ఉందన్న హెచ్చరికలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఎక్కడ చూసినా శునకాల స్వైరవిహారం.. జిల్లా కేంద్రమైన భూపాలపల్లి మున్సిపాలిటీతో పాటు, మండల కేంద్రాలు, గ్రామాల ప్రధాన కూడళ్లలో ఎక్కడ చూసినా శునకాలు స్వైర విహారం చేస్తున్నాయి. చిన్న పిల్లలు, వృద్ధులు రోడ్డెక్కితే చాలు.. దాడులకు పాల్పడుతూ కండలు పీకుతున్నాయి. జి ల్లాలోని పలు కూడళ్ల వద్ద కుక్కలు కాపు కాస్తూ వాహనదారులను వెంబడిస్తున్నాయి. దీంతో వా హనదారులు భయాందోళనకు గురై అదుపుతప్పి ప్రమాదాల బారిన పడుతున్నారు. గ్రామాలు, పట్టణాలు, కాలనీలు అనే తేడా లేకుండా ఎక్కడప డితే అక్కడ కుక్కలు గుంపులుగా సంచరిస్తున్నాయి. 4 నెలల్లో 1,222 కేసులు నమోదు ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ఈ నెల 22వ తేదీ వరకు 1,222 కుక్క కాటు కేసులు నమోదు అయినట్లుగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ప్రతీ నెల పదుల సంఖ్యలో కుక్క కాటుకు గురై ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న వారు సైతం ఉన్నారు. దాడులకు గల కారణాలివే.. వేసవికాలంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో కుక్కలు తీవ్రమైన హీట్ స్ట్రెస్కు లోనవుతాయి. దీంతో వాటి ప్రవర్తనలో మార్పులు వచ్చి స్వల్ప కారణాలకే ఆగ్రహానికి గురవుతున్నాయి. అంతేకాక ఈ వేసవిలో వీధి కుక్కలకు తాగునీరు, ఆహారం లభించలేదు. దీంతో అసహనానికి గురై దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఏప్రిల్, మే నెలల్లో ఎండలు ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కుక్కలే కాకుండా కోతుల విషయంలో కూడా జాగ్రత్త వహించాలని వైద్యులు సూచిస్తున్నారు. చిన్నారులు, వృద్ధులపైనే దాడులు 4 నెలల్లో వెయ్యికి పైగా కేసుల నమోదు నియంత్రించడంలో అధికారులు విఫలం -
ప్రకృతిని కాపాడుకోవడం అందరి బాధ్యత
● వైల్డ్లైఫ్ ఇన్చార్జ్ రేంజ్ అధికారి నరేందర్ ఎస్ఎస్తాడ్వాయి: ప్రకృతిని కాపాడుకోవడం అందరి బాధ్యతని తాడ్వాయి వైల్డ్లైఫ్ ఇన్చార్జ్ రేంజ్ అధికారి నరేందర్ అన్నారు. వరల్డ్ ఎర్త్ డేను పురస్కరించుకుని వైల్డ్లైఫ్ అటవీశాఖ ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలో జాతీయ రహదారిపై బైక్ ర్యాలీ నిర్వహించి పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విరివిగా మొక్కలు నాటడం వల్ల పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తగ్గించవచ్చన్నారు. మొక్కలు నాటడమే కాకుండా ఉన్న అడవులను సంరక్షించుకోవాలన్నారు. అడవులు సురక్షితంగా ఉంటనే వాతావరణ సమతూల్యత ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ ఆఫీసర్ లింగయ్య, బీట్ ఆఫీసర్లు సుభాశ్, బాలకృష్ణ పాల్గొన్నారు. -
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుస్తా..
భూపాలపల్లి: ఈరోజు తేదీ, సమయం రాసి పెట్టుకో.. నియోజకవర్గాల పునర్విభజన జరిగినా, జరగకపోయినా, ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ వచ్చే ఎన్నికల్లో నేనే గెలుస్తానని స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు బట్టు కర్ణాకర్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి ఏర్పాటు చేసిన సభకు వచ్చిన ఆదరణను జీర్ణించుకోలేకనే బీఆర్ఎస్ నాయకులు విమర్శలు, ఆరోపణలకు పాల్పడుతున్నారన్నారు. ఇంజనీర్లు చెప్పినా.. వినకుండా నాటి సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి రూ.లక్ష కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారన్నారు. ఆ ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని ఒక్క ఎకరానికై నా సాగునీరు అందుతుందా? అని ప్రశ్నించారు. సర్పంచ్, మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా బుద్ధి రాలేదన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతున్నామని, త్వరలోనే సమ్మె విరమణ ఉంటుందన్నారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు బట్టు కర్ణాకర్, మున్సిపల్ చైర్మన్, వైస్చైర్మన్లు బుర్ర కొమురయ్య, అంబాల శ్రీనివాస్, కౌన్సిలర్లు కురిమిళ్ళ శ్రీనివాస్, రాజునాయక్, అరుణ్, బౌతు రాజేష్, నాయకులు ఇస్లావత్ దేవన్, చల్లూరి మధు, బీర్తి పృధ్వి, జంపన్న, పైడిపెల్లి రమేష్, దాట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
గురువారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
● ఈ నెల 17న చిట్యాల మండల కేంద్రానికి చెందిన గుర్రపు పోచమ్మ తన కూతురు ఇంటికి వెళ్తున్న క్రమంలో కుక్క వెనుక నుంచి వచ్చి కరిచింది. ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ● ఈ నెల 9వ తేదీన రేగొండ మండలంలోని పెద్దంపల్లి గ్రామానికి చెందిన సరోజన రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఆమె కాలిపై కుక్క కరిచింది. ● గత నెల 29న గణపురం మండలకేంద్రానికి చెందిన దామ చేరాలు అనే వ్యక్తి ఇంటి ఎదుట నిలబడి ఉండగా ఓ కుక్క అకస్మాత్తుగా వచ్చి కాలి భాగంలో కరవడంతో తీవ్ర రక్తస్రావం అయింది. ● తాజాగా నిన్న (బుధవారం) మల్హర్ మండలంలోని తాడిచర్ల గ్రామానికి చెందిన 16 ఏళ్ల యువకుడు కృష్ణ ఇంటి నుంచి బయటకు రాగా కుక్క కరవడంతో అతడిని పీహెచ్సీలో చేర్పించి చికిత్స చేయించారు. -
పోషణలోపం లేని సమాజాన్ని నిర్మించాలి
మొగుళ్లపల్లి: పోషణలోపం లేని సమాజాన్ని నిర్మించాలని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి మల్లేశ్వరి అన్నారు. మండలంలోని ఇప్పలపల్లి అంగన్వాడీ పాఠశాలలో బుధవారం పోషణ పక్వడా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఐసీడీఎస్ సూపర్వైజర్ సుజాత ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్యఅతిథిగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి మల్లేశ్వరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతీ అంగన్వాడీ టీచర్ తన పరిధిలోని బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు ఆరోగ్యకరమైన ఆహారం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయాలన్నారు. ఆకుకూరలు, పప్పులు, గుడ్లు, పాలు వంటివి తీసుకోవడం ద్వారా లభించే ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ మన శరీర రక్షణకు ముఖ్యమైనవని వీటి గురించి సమాజంలో అవగాహన పెంచి, ‘పోషణలోపం లేని సమాజం’ నిర్మించడానికి అందరం కృషి చేయాలన్నారు. జిల్లా ఇన్చార్జ్ మిషన్ కో ఆర్డినటర్ కృష్ణ మాట్లాడుతూ హెల్ప్ లైన్ నంబర్లు, సఖి అందించే సేవలు, ప్రతి అంగన్వాడీలో ప్రదర్శించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కేతిపల్లి శీరిష, సంక్షేమ శాఖ మహిళ సాధికారత సిబ్బంది అనూష, మమత, సురేష్, అంగన్వాడీ టీచర్లు, గర్భిణులు, బాలింతలు, కిషోర బాలికలు పాల్గొన్నారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి మల్లేశ్వరి -
కదలని బస్సులు
భూపాలపల్లి: తమ డిమాండ్ల పరిష్కారానికి ఆర్టీసీ కార్మికులు చేపట్టిన బంద్ బుధవారం సక్సెస్ అయింది. కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చిన నేపధ్యంలో మంగళవారం రాత్రి భూపాలపల్లి కార్మికులు డిపో వద్దకు చేరుకున్నారు. డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. కాగా డిపోలోని కార్మికులందరూ స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొనడంతో బస్సుల రాకపోకలు సాగలేదు. బుధవారం ఉదయం డిపో అధికారులు ప్రైవేట్ బస్సుల యజమానులను పిలిపించి బస్సులను నడిపించేందుకు ప్రయత్నించగా కార్మికులు అడ్డుకున్నారు. దీంతో అద్దె బస్సుల రాకపోకలు సైతం నిలిచిపోయాయి. వివిధ కారణాలతో పట్టణంలో నిలిచిన ఉన్న ఆరు అద్దె బస్సుల డ్రైవర్లతో అధికారులు ఫోన్లో మాట్లాడి పలు రూట్లలో నడిపించారు. టికెట్ లేకుండా ఉచితంగా బస్సులను నడిపించినప్పటికీ సమ్మె ప్రభావం కారణంగా ప్రయాణికులు అంతగా రాకపోకలు సాగించలేదు. భూపాలపల్లి బస్డిపోలో ఆర్టీసీ, అద్దె బస్సులు మొత్తం 81 ఉన్నాయి. వీటి ద్వారా ప్రతీరోజు డిపోకు రూ.21 లక్షల ఆదాయం రానుండగా బుధవారం ఒక్క రూపాయి కూడా ఆదాయం రాలేదు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీఆర్ఎస్, సీపీఐ, వివిధ పార్టీలు మద్దతు పలికాయి. సమ్మె సందర్భంగా డిపో ఎ దుట ధర్నా చేసిన వారిలో కార్మిక సంఘాల నాయకులు బుర్రి తిరుపతి, సందీప్, కొమురన్న, ప్రసాద్, రాధాకృష్ణ, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ సమ్మెకు టీపీఎస్ మద్దతు మల్హర్(కాటారం): రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న న్యాయమైన సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టీపీఎఫ్) జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ఆర్టీసీని ప్ర భుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఎన్ని ఒత్తిడిలు ఎదురైనా చైతన్యంతో సమ్మెను కొనసాగించాలనిపిలుపునిచ్చారు. భూపాలపల్లి డిపోలో ఆర్టీసీ బంద్ సక్సెస్ ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించిన ప్రయాణికులు అద్దె బస్సులను నడిపించేందుకు అధికారుల యత్నం అడ్డుకున్న ఆర్టీసీ కార్మికులు -
24న జాబ్ మేళా
భూపాలపల్లి అర్బన్: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 24న జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అఽధికారి శ్యామల మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా సమీకృత కలెక్టరేట్ సముదాయం ఉపాధి కల్పన కార్యాలయంలో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేళాలో ప్రముఖ సంస్థ పోర్టీ మెడికల్ కంపెనీ ద్వారా కేర్ టేకర్స్ పోస్టులకు నియామకాలు చేపట్టనున్నారు. అభ్యర్థులకు నెలకు రూ.16,500 నుంచి రూ.22,000 వరకు జీతం, ఉచిత ఆహారం, వసతి, రవాణా సౌకర్యాలు, అదనంగా రూ.50,000 ఆరోగ్య బీమా కల్పించనున్నట్లు తెలిపారు. కనీసం 8వ తరగతి నుంచి ఏదైనా విద్యార్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. హైదరాబాద్లో 50 పోస్టులు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. ఆసక్తి గల యువత విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, బయోడేటాతో ఉదయం 11 గంటలకు జాబ్ మేళాకు హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 97010 78288 నంబర్ను సంప్రదించవచ్చని తెలిపారు. ప్రవేశాల దరఖాస్తుల ఆహ్వానం భూపాలపల్లి అర్బన్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థలో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం ఈ నెల 25వ తేది వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు హసన్పర్తి గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ సుధాకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం సమీపంలోని గురుకుల కళాశాలను సంప్రదించాలని ప్రిన్సిపాల్ సూచించారు. విజయవంతం చేసిన ప్రజలకు కృతజ్ఞతలు భూపాలపల్లి రూరల్: కాటారం మండలం నస్తూర్పల్లిలో సీఎం బహిరంగ సభను విజయవంతం చేసిన ప్రజలకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ కృతజ్ఞతలు తెలి పారు. మంళవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు, ఏర్పాట్లు చేసిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు భువనసుందర్, కోకిల లక్ష్మి, పరమేశ్వరి, అప్పాల శీను, ఎన్ఎస్ఏ జిల్లా అధ్యక్షుడు మట్టెవాడ సురేష్, వినోద్, విజయభాస్కర్, నాగరాజు, సురేష్, కార్తీక్, రాజు, పాల్గొన్నారు. ఆర్టీసీ సమ్మెకు టీఆర్పీ మద్దతు భూపాలపల్లి రూరల్: ఆర్టీసీ సమ్మెకు టీఆర్పీ మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ తెలిపారు. మంగళవారం జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రవి పటేల్ మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చేంత వరకు భూపాలపల్లిలో ఒక్క బస్సు కూడా డిపో నుంచి బయటకు వెళ్లనివ్వబోమని హెచ్చరించారు. కార్మికుల న్యాయమైన 32 డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగాల ప్రణయ్ రాజ్, నాయకులు మోటపోతుల సమ్మయ్య, కౌటం సురేందర్, స్వామి పాల్గొన్నారు. ఐటీడీఏ ఏపీఓగా నాగోవరావు ఏటూరునాగారం: ఐటీడీఏ ఏపీఓగా నాగోవరావు నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఐటీడీఏ కార్యాలయంలో ఆయన ఏపీఓగా బాధ్యతలను చేపట్టారు. హైదరాబాద్ ప్లేన్ ఏరియా ఐటీడీఏ పరిధిలో పనిచేసిన నాగోవరావును ఏటూరునాగారం ఐటీడీఏకు, ఇక్కడ పనిచేసిన వసంతరావును ఉట్నూరు ఐటీడీఏకు బదిలీ చేశారు. దీంతో నాగోవరావు మంగళవారం విధుల్లో చేరారు. దీంతో కార్యాలయ సిబ్బంది ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకొని వివరాలను వెల్లడించారు. కొత్త కోర్సులు ములుగు రూరల్: సమ్మక్క,–సారలమ్మ గిరిజన యూనివర్సిటీలో మూడు కొత్త కోర్సులను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం బీఏ ఇంగ్లిష్, ఎకనామిక్స్ కోర్సులు అమలు అవుతున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి నాలుగేళ్లు బీటెక్ కంప్యూటర్ సైన్స్, డేటా అనలిస్టు, బీఎస్సీ మ్యాథమెటిక్స్, కంప్యూటరింగ్ కోర్సులను అందించనున్నారు. -
ఆర్టీసీలో సమ్మె సైరన్
● నేటి నుంచి వరంగల్ రీజియన్ వ్యాప్తంగా నిలిచిపోనున్న బస్సులు ● ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న అధికారులుహన్మకొండ: సమస్యల పరిష్కారానికి ఆర్టీసీ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు వెళ్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి మొదటి బస్సు నుంచి సమ్మెకు వెళ్లాలని ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ నిర్ణయం తీసుకుంది. దీంతో బుధవారం ఉదయం నుంచి వరంగల్ రీజియన్లోని 8 డిపోల పరిధిలో ఆర్టీసీ బస్సులు నిలిచిపోనున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వరంగల్ రీజియన్లో మొత్తం 1,036 బస్సులు సేవలు అందిస్తున్నాయి. ఇందులో 596 సంస్థ బస్సులు, 325 ప్రైవేట్ అద్దె బస్సులు, 115 విద్యుత్ బస్సులు ఉన్నాయి. మొత్తం 986 షెడ్యూల్స్ నడుస్తున్నాయి. రోజుకు 4.11 లక్షల కిలోమీటర్లు తిరిగి 4.16 లక్షల మంది ప్రయాణికులను వివిధ గమ్యస్థానాలకు చేరవేస్తూ రూ.2.06 కోట్ల ఆదాయాన్ని పొందుతుంది. సంస్థకు చెందిన 1,123 మంది డ్రైవర్లు, 1,436 మంది కండక్టర్లు సేవలు అందిస్తున్నారు. వీరితో పాటు ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ విధానంలో 140 మంది డ్రైవర్లు, 286 మంది కండక్టర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. అదేవిధంగా సంస్థ ఉద్యోగులైన 368 మెకానిక్లు, 250 మంది ట్రాఫిక్ సూపర్వైజర్లు, కార్యాలయం సిబ్బంది 60 మంది, సెక్యూరిటీ సిబ్బంది 44 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో ఔట్ సోర్సింగ్ విధానంలో కొనసాగుతున్న 140 మంది డ్రైవర్లు, 286 మంది డ్రైవర్లు మినహా మిగతా వారంతా సమ్మెలోకి వెళ్లనున్నారు. ఔట్ సోర్సింగ్ విధానంలో 104 మంది మెకానిక్లు, కార్యాలయ స్టాఫ్ 38 మంది. సెక్యూరిటీ 36 మంది ఉన్నారు. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది విధులకు హాజరయ్యే అవకాశలున్నాయి. వీరితో బస్సులు నడిపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వరంగల్–2 డిపోలో 115 విద్యుత్ బస్సులున్నాయి. ఇవి పూర్తిగా ప్రైవేట్ డ్రైవర్లతో నడుస్తున్నాయి. వీటితోపాటు మరో 325 ప్రైవేట్ అద్దె బస్సులున్నాయి. విద్యుత్ బస్సులు, ప్రైవేట్ అద్దె బస్సులు తిప్పడంతో పాటు, సంస్థ బస్సులను తిప్పేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఉన్నంతలో కనీసం ప్రధాన రూట్లలో బస్సులు నడిపేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. డిపో ఆర్టీసీ అద్దె హనుమకొండ 100 52 వరంగల్–1 105 41 వరంగల్–2 115 (ఈవీ) 44 జనగామ 83 39 నర్సంపేట 65 35 మహబూబాబాద్ 57 24 పరకాల 63 23 తొర్రూరు 57 43 భూపాలపల్లి 66 24డిమాండ్లు పరిష్కరించాలి..సమ్మె నోటీసు ఇచ్చినా ప్రభుత్వం స్పందించలేదు. సమ్మెకు ఒక రోజు ముందు చర్చల పేరుతో కాలయాపన చేయాలని చూస్తోంది. ముందుగా డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. పీఆర్సీ అమలు చేయాలని, పనిభారం తగ్గించాలి. ఎరియర్స్ ఇవ్వాలి. పని గంటలు తగ్గించాలి. ఔట్ సోర్సింగ్ విధానం తగ్గించి సంస్థ నియామకాలు చేపట్టాలి. – సీహెచ్.రాంచందర్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడుసంస్థ పరిరక్షణ ముఖ్యం ఆర్టీసీ కార్మికులుగా సంస్థ పరిరక్షణ కోసం కృషి చేస్తాం. కార్మికుల ప్రయోజనాలు, సంస్థ కోసమే సమ్మెకు వెళ్తున్నాం. విద్యుత్ బస్సులు తీసుకువచ్చి సంస్థను ప్రైవేట్పరం చేస్తున్నారు. ఇది సమంజసం కాదు. ఆర్టీసీకే విద్యుత్ బస్సులు ఇవ్వాలి. యాజమాన్యం, ప్రభుత్వం ముందుంచిన న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి. యూనియన్ రీజియన్ సెక్రటరీ -
సీఎం సభలతో ప్రజాధనం వృథా
భూపాలపల్లి: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహిస్తున్న సభలతో ప్రజాధనం వృథా కావడమే తప్ప, ప్రజలకు ఒరిగిందేమీ లేదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని అన్నారు. రేవంత్రెడ్డి ‘యాక్సిడెంటల్ ముఖ్యమంత్రి’ అని, ప్రజల ఆశీస్సులతో కాకుండా పరిస్థితుల వలన ఆయన సీఎం పదవికి చేరుకున్నారన్నారు. అందరూ ఆయనలా తొక్కుకుంటూ ఎదగలేరని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పొందుతుందని, కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్రెడ్డికి డిపాజిట్ దక్కితే చాలన్నారు. తెలంగాణలో సాగు, తాగునీటి అవసరాలను తీర్చే గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరమని ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. ప్రస్తుత ప్రభుత్వం విచారణల పేరుతో ఆలస్యం చేసి ప్రాజెక్ట్ పునరుద్ధరణ చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్, నాయకులు మేకల సంపత్కుమార్, కళ్లెపు రఘుపతిరావు, జక్కం రవి, బుర్ర సదానందం, వార్డు కౌన్సిలర్ బోగం నరేందర్ పాల్గొన్నారు. రేవంత్రెడ్డిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి -
పోలీస్స్టేషన్ తనిఖీ
మొగుళ్లపల్లి: వార్షిక తనిఖీల్లో భాగంగా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మంగళవారం మొగుళ్లపల్లి పోలీస్స్టేషన్ను తనిఖీ చేశారు. స్టేషన్ ప్రాంగణ పరిశుభ్రత, పరిసరాల నిర్వహణ, రికార్డుల నిర్వహణ విధానం, సిబ్బంది విధి నిర్వహణను సమగ్రంగా పరిశీలించారు. కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ‘‘వన మహోత్సవం’’ కార్యక్రమంలో భాగంగా పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మొక్క నాటి, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్స్టేషన్కు వచ్చే ప్రజలకు స్నేహపూర్వక వాతావరణం కల్పిస్తూ, వారి సమస్యలను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించే విధంగా సేవలు అందించాలని సిబ్బందికి ఆదేశించారు. ఆయన వెంట డీఎస్పీ సంపత్రావు, సీఐ మల్లేష్, ఎస్సై సురేష్ సిబ్బంది ఉన్నారు. -
హాష్ ఆయిల్ స్మగ్లింగ్.. నలుగురి అరెస్ట్
వరంగల్ క్రైం: హాష్ ఆయిల్ (గంజాయి మొక్కల నుంచి తీసిన నూనె)ను స్మగ్లింగ్ చేస్తున్న నలుగురిని వరంగల్ డ్రగ్ కంట్రోల్, క్యాట్ పార్టీ, ఇంతేజార్గంజ్ పోలీసులు అరెస్టు చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ ప్రకటించారు. మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీ వివరాలు వెల్లడించారు. నిందితులు ఒడిషా రాష్ట్ర మల్కాన్గిరి జిల్లా చిత్రకొండ మండలం సువ్వపల్లి గ్రామానికి చెందిన హంటల్ సన్ను, రేకపల్లి గ్రామానికి చెందిన హంటల్ సన్యాసి, కృష్ణా హంటల్, ఏపీలోని అల్లూరి జిల్లా గూడెం మండలం దారకొండకు చెందిన కండెల చిన్నబాబును అరెస్టు చేయగా, మరొకరు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ముంబైకి వెళ్లేందుకు కోణార్క్ రైలు ఎక్కి.. ఈముఠా సభ్యులు గంజాయి మొక్కల ద్వారా 40 కిలోల హాష్ ఆయిల్ను సేకరించినట్లు ఆయన తెలిపారు. 20 కిలోల హాష్ ఆయిల్ను పాండు తీసుకోగా, మిగిలిన 20 కిలోల హాష్ ఆయిల్ను కిలో చొప్పున ప్యాకెట్లలో భద్రపరిచారు. నిందితులు ఐదు కిలోల చొప్పున హాష్ ఆయిల్ను తీసుకుని ముంబైలో విక్రయించేందుకు ఆంధ్రప్రదేశ్లోని తుని రైల్వే స్టేషన్ నుంచి ఈ నెల 19న అర్ధరాత్రి కోణార్క్ రైలులో బయలుదేరినట్లు ఆయన తెలిపారు. వరంగల్ రైల్వే స్టేషన్లో ఈనెల 20న దిగి 21న ఉదయం ముంబై వెళ్లేందుకు వరంగల్ బస్టాండ్ వద్ద ఉన్న రైల్వే గూడ్స్ షెడ్ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని, వారి నుంచి రూ.2.50 కోట్ల విలువైన 20కిలోల హాష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ సన్ప్రీత్సింగ్ తెలిపారు. మరో నిందితుడు కిలో పాండు పరారీలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, వరంగల్ ఏఎప్పీ శుభం, ఏసీపీలను పోలీస్ కమిషనర్ అభినందించారు. రూ.2.50 కోట్ల విలువైన హాష్ ఆయిల్ స్వాధీనం వివరాలు వెల్లడించిన వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ -
వనదేవతలకు ప్రత్యేక పూజలు
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ కుటుంబ సమేతంగా అమ్మవార్లను మంగళవారం దర్శించుకున్నారు. సమ్మక్క– సారలమ్మ గద్దెల వద్ద ఎస్పీ మొక్కులు చెల్లించి గోవిందరాజు, పగిడిద్దరాజులకు పూజలు చేశారు. పూజారులు దగ్గరుండి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ సంప్రదాయంగా దేవాదాయశాఖ అధికారులు, పూజారులు డోలివాయిద్యాలతో స్వాగతం పలికారు. పూజారులు ఎస్పీ దంపతులను అమ్మవారి కండువాతో సన్మానించి ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ జూనియర్ అసిస్టెంట్ మధు, రికార్డు అసిస్టెంట్ వీరన్న, సారలమ్మ పూజారులు కాక వెంకటేశ్వర్లు, కాక కిరణ్ పాల్గొన్నారు. -
వైకుంఠధామానికి దారేది?
● అరిగోస పడుతున్న ఆత్మీయులు ● పట్టించుకోని అధికారులు, పాలకులుచిట్యాల: చివరి మజిలీలో ఎవరూ ఇబ్బందులు పడవద్దనే ఆలోచనతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మండలంలోని అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలు నిర్మించారు. కానీ సరైన దారులు లేక మృతుల బంధువులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో అయితే ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. ఏలేటిరామయ్యపల్లిలో.. మండలంలోని ఏలేటిరామయ్యపల్లి గ్రామ శివారు చలివాగు పక్కన గత ప్రభుత్వ హయాంలో వైకుంఠధామాన్ని నిర్మించారు. కానీ దారి సక్రమంగా లేకపోవడంతో మృతిచెందిన వారిని కనీసం తీసుకపోవడానికి సైతం అనేక అవస్థలు పడాల్సిన దుస్థితి నెలకొంది. వైకుంఠధామానికి సరైన దారి నిర్మాణం చేయాలనే ఆలోచన పాలకులకు, అధికారులకు ఎందుకు రావడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రోడ్డు నిర్మాణం చేయాలని గతంలో పలుమార్లు అధికారులకు పాలకులకు తెలిపినా పట్టించుకోవడం లేదని అంటున్నారు. గ్రామంలో వైకుంఠధామానికి సరైన రోడ్డు లేదు. గ్రా మంలో ఎవరైనా మృతిచెందితే తీసుకెళ్లడానికి అనేక ఇబ్బందులు పడాల్సి వ స్తుంది. అధికారులు, పాలకులు స్పందించి రోడ్డు సౌకర్యం కల్పించాలి. – మర్రి నరేష్, ఏలేటిరామయ్యపల్లి -
నిప్పుల కుంపటి
బుధవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026ఉక్కిరిబిక్కిరవుతున్న సింగరేణి కార్మికులుభూపాలపల్లి అర్బన్: సింగరేణి కాలరీస్ భూపాలపల్లి ఏరియాలో ఉష్ణోగ్రతలు నిప్పులకుంపటిని తలపిస్తున్నాయి. ఉదయం 9గంటల నుంచి మొదలు సాయంత్రం వరకు ఉష్ణోగ్రతలు, వడగాలుల తీవ్రత తగ్గకపోవడంతో కార్మికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలోనే మే నెలను తలపించేలా ఉష్ణోగ్రతలు పెరిగాయి. సాధారణం కన్నా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ వడగాలులు తీవ్రంగా పెరిగిపోతున్నాయి. భానుడి ప్రతాపానికి ఉదయం 9 గంటలు దాటితే చాలు బయట తిరగడం కష్టంగా మారుతోంది. సింగరేణి బొగ్గు గనులు, థర్మల్ పవర్ ప్లాంట్లు, పరిశ్రమలతో విలసిల్లుతున్న భూపాలపల్లి, తాడిచర్ల ప్రాంతంలో ఎండలు మరింత భగభగమంటున్నాయి. గనులపై మరింత ప్రభావం.. ఉపరితల గనుల్లో బొగ్గును వెలికితీయడానికి నిత్యం టన్నుల కొద్ది పేలుడు పదార్థాలు వినియోగిస్తుంటారు. బొగ్గు పొరలపై ఉన్న మట్టి, బండరాళ్లను తొలగించడానికి భారీ పేలుళ్లు జరపాల్సి ఉంటుంది. బొగ్గును వెలికితీయడానికి అవే పేలుడు పదార్థాలను వినియోగిస్తుంటారు. ఫలితంగా కర్బన ఉద్గారాలు, రాతి ఒక్కసారిగా గాలిలో కలుస్తాయి. ఈ దుమ్ము రేణువులు ఉష్ణోగ్రతలను సులభంగా గ్రహించడంతో గాలి వేడెక్కి ఎండ తీవ్రత సాధారణం కంటే అత్యధికం అవుతుంది. గనుల ప్రాంతంలో పెద్దఎత్తున నిల్వచేసే బొగ్గు మరింత వేడెక్కడంతో దాని ప్రభావం వాతావరణంపై పడి ఈ ప్రాంతాన్ని నిప్పులకొలిమిలా మార్చుతుంది. ఉపశమనానికి ప్రత్యేక చర్యలు ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరుకుంటే బొగ్గు ఉత్పత్తి ప్రక్రియను యాజమాన్యం నిలిపివేసే అవకాశం ఉంది. వేసవిలో పెరిగిన ఎండలను దృష్టిలో పెట్టుకుని సింగరేణి యాజమాన్యం ఉపరితల గనుల్లో పనిచేసే కార్మికులకు వడదెబ్బ తగలకుండా అనేక చర్యలు తీసుకుంటుంది. చలువ పందిళ్లు వేయించి స్ప్రింక్లర్లతో నీటిని చల్లడం వంటి చర్యలు చేపడుతుంది. ప్రతీ 40 మీటర్ల లోతుకు ఒక డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుతుంది. సింగరేణిలో ఉపరితల గనులు 60–160 మీటర్ల లోతులో ఉన్నాయి. ఇక్కడ సాధారణం కంటే 2నుంచి 4డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. దీంతో కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు అందించడం వంటి చర్యలకు యాజమాన్యం ఉపక్రమిస్తోంది. మరిన్ని సౌకర్యాలు అవసరం యాజమాన్యం తక్షణమే స్పందించి కార్మికుల కోసం క్షేత్రస్థాయిలో వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతుంది. మధ్యాహ్నం 12గంటల నుంచి 4గంటల మధ్య పనివేళల్లో ఉపశమనం కలిగించేలా షిప్టులను సర్దుబాటు చేస్తే మంచిది. గనిదారుల్లో నిరంతరం నీటిని స్ప్రే చేయించడం, భారీ యంత్రాల క్యాబిన్లలో ఎయిర్ కండీషనింగ్ వ్యవస్థ మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు. ప్రస్తుత ఓపెన్కాస్టుల్లో కార్మికులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వకుండా కేవలం మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. రెస్ట్ షెల్టర్ల సంఖ్య పెంచాలి. ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పా టు చేయాలని, వడదెబ్బ నుంచి కాపాడుకునేలా అవగాహన కల్పించాలని కార్మికులు విన్నవిస్తున్నారు. భూపాలపల్లి ఏరియాలో కేటీకే ఓపెన్కాస్టు ప్రాజెక్ట్–2, 3, తాడిచర్ల ఓపెన్ కాస్టు ప్రాజెక్ట్లు ఉన్నాయి. మూడు ఓపెన్ కాస్ట్ గనుల్లో రెగ్యులర్, కాంట్రాక్ట్ పద్ధతిలో సుమారు 3వేల మంది కార్మికులు మూడు షిష్టుల్లో కలిపి విధులు నిర్వర్తిస్తున్నారు. మొదటి, రెండో షిఫ్టులలో విధులకు హాజరయ్యే కార్మికులు ఎక్కువ సమయం ఎండలోనే విధులు నిర్వర్తిస్తున్నారు. భూపాలపల్లి పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఇక్కడ ఎండల తీవ్రత ఇతర ప్రాంతాల కన్నా ఎక్కువగా ఉంటోంది. ఓపెన్ గనుల్లో బొగ్గు, మట్టి, బండ రాళ్లు, దుమ్ముతో పాటు గని లోతుకు వెళ్లే కొద్ది ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. గనుల్లో కార్మికులు ఎండ తీవ్రతకు విలవిలలాడుతున్నారు. భూపాలపల్లి, తాడిచర్లలో ఎండల తీవ్రత 40–42 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉక్కపోతఅధిక ఉష్ణోగ్రతలు, వడగాలులతో కార్మికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కార్మికుల సంక్షేమం రీత్యా పనివేళలు మార్చాలి. మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు పనులు నిలిపివేసి మిగిలిన సమయాల్లో పనులు కొనసాగించేలా యాజమాన్యం ప్రణాళికలు సిద్ధం చేయాలి. గతంలో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. – నల్లవెల్లి సదానందం, ఓపెన్ కాస్ట్ కార్మికుడు, టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ -
సొంతూరుకు దామోదర్..
ఎస్ఎస్ తాడ్వాయి : కొద్దిరోజుల క్రితం రాష్ట్ర పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి బడే దామోదర్ 28 ఏళ్ల తర్వాత మంగళవారం తన స్వగ్రామం కాల్వపల్లిలో అడుగుపెట్టారు. చాలా ఏళ్ల తర్వాత గ్రామానికి వచ్చిన దామోదర్కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చిన్ననాటి మిత్రులు దామోదర్ను కలిసి తమ జ్ఞాపకాలను పంచుకున్నారు. దామోదర్ అజ్ఞాతంలోకి వెళ్లి చాలా ఏళ్ల తర్వాత స్వగ్రామానికి తిరిగి రావడంతో ఆనందం వ్యక్తం చేశారు. 28 ఏళ్ల తర్వాత వచ్చిన దామోదర్ను చూసిన కుటుంబ సభ్యుల కళ్లలో ఆనందబాష్పాలు కనిపించాయి. దామోదర్ వస్తున్న విషయాన్ని తెలుసుకొని కాల్వపల్లి చుట్టుపక్కల గ్రామాలు నార్లాపూర్, కన్నెపల్లి, మేడారం, ఊరట్టం, కొత్తూరు, వెంగళాపూర్, పడిగాపూర్ గ్రామస్తులు కాల్వపల్లికి భారీగా తరలొచ్చారు. తనకు తెలిసిన ఆయా గ్రామాల ప్రజలు, బంధువులు, తన చిన్ననాటి స్నేహితులను, తనతో పాటు చదువుకున్న తోటి విద్యార్థులను దామోదర్ ఆప్యాయంగా పలకరించి వారి బాగోగులు తెలుసుకున్నారు. ఆదివాసీ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు రాజకీయాలకతీతంగా దామోదర్ను కలిసి ముచ్చటించారు. దామోదర్కు ఘనసన్మానం సాయుధ పోరాటం వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చిన అనంతరం స్వగ్రామానికి చేరుకున్న దామోదర్ను గ్రామస్తులు, స్నేహితులు ఘనంగా సన్మానించారు. 28 ఏళ్ల అడవి బాట వీడి గ్రామస్తులను కలవడం ఆనందంగా ఉందని దామోదర్ పేర్కొన్నారు. తన జీవితాన్ని ప్రజల సేవ కోసం అంకితం చేస్తానని తెలిపారు. చిన్ననాటి మిత్రులతో ముచ్చట్లు ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు -
వినతులు పరిష్కరించండి
ఏటూరునాగారం: గిరివాణి, ప్రజావాణిలో వచ్చిన వినతులను పరిష్కరించాలని ఐటీడీఏ ఇన్చార్జ్ పీఓ, కలెక్టర్ టీఎస్.దివాకర అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో గిరివాణి, ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై అర్జీదారుల సమస్యలు విని వినతులు స్వీకరించారు. ఈ క్రమంలో గిరివాణిలో 96 దరఖాస్తులు రాగా ప్రజావాణిలో 26 దరఖాస్తులను బాధితులు అందజేసినట్లు అధికారులు తెలిపారు. ఏటూరునాగారం మండలం రొయ్యూర్కు చెందిన పలువురు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కలెక్టర్కు దరఖాస్తు పెట్టుకున్నారు. వెంకటాపురం(కె) మండలం ఎదిర గ్రామ సమీపంలోని యాకన్నగూడెంలో ప్రభుత్వం నూతనంగా పాఠశాలను ఏర్పాటు చేసింది కానీ ఎలాంటి భవనం నిర్మించలేదని తక్షణమే నిర్మించాలని గ్రామస్తులు కలెక్టర్ను కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు పాఠశాలలు, వసతి గృహాలపై ప్రత్యేక దృష్టి సారించి నిరంతరం పర్యవేక్షించి, క్షేత్రస్థాయి పరిస్థితులపై సమగ్ర నివేదికను రూపొందించాలని సూచించారు. వంటశాల, స్టోర్ రూమ్, క్యాంపస్ పరిసరాలు, మరుగుదొడ్లు, తాగునీటి వసతి లాంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి నివేదికలను వెంటనే అందించాలని స్పష్టం చేశారు. వినతులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్జీ, ఏపీవో వసంతరావు, ఆర్డీఓ వెంకటేశ్, డీడీ జనార్దన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.ఈ ఫొటోలో ఉన్న వృద్ధురాలు ఏటూరునాగారం మండలం షాపెల్లికి చెందిన మాదారపు లక్ష్మి. ఈమె భర్త ఐదేళ్ల క్రితం మరణించాడు. తన భర్త మీద ఉన్న పింఛన్ తన పేరు మీదకు మార్పించుకునేందుకు ఎంపీడీఓ కార్యాలయం వెళ్లగా ఆమె ఆధార్కార్డు ఆన్లైన్లో నమోదు చేయగా ఆమె కూడా మరణించినట్లు రికార్డులో ఉండడం గమనార్హం. ఆ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది తప్పిదం వల్ల ఈ పొరపాటు జరిగిందని పలువురు అధి కారులు చెప్పినప్పటికీ దానిని సరిచేయడం లేదు. దీంతో ఆమె కలెక్టర్కు ప్రజావాణిలో విన తి పత్రాన్ని అందజేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తనకు పింఛన్ వచ్చేలా చూడాలని వేడుకుంటుంది. అధికారులకు కలెక్టర్ దివాకర ఆదేశాలు గిరివాణిలో 96, ప్రజావాణి 26 అర్జీల రాక బాధితుల సమస్యలు విని వినతులు స్వీకరించిన కలెక్టర్ -
మంగళవారం శ్రీ 21 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
కాళేశ్వరాలయ పునరుద్ధరణ భూమి పూజలో సీఎం రేవంత్రెడ్డి, చిత్రంలో రాష్ట్ర మంత్రులు శ్రీధర్బాబు, ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి, పొన్నం, తదితరులు, మేడిగడ్డలో జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలు పరిశీలిస్తున్న సీఎం రేవంత్, సభకు హాజరైన జనంభూపాలపల్లి అర్బన్: ఓపెన్ టెన్త్, ఇంటర్ వార్షిక పరీక్షలు సోమవారం ప్రారంభమైనట్లు జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా టెన్త్ పరీక్షలకు 385 మంది విద్యార్థులకు 332 మంది హాజరుకాగా, ఇంటర్ పరీక్షలకు 611 మంది విద్యార్థులకు గాను 541 మంది హాజరైనట్లు తెలిపారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పరీక్ష కేంద్రాన్ని ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి, పలు పరీక్ష కేంద్రాలను డీఈఓ రాజేందర్, ప్రభుత్వ పరీక్షల నియంత్రణ అధికారి సామల రమేశ్ తనిఖీ చేశారు. 28న విద్యుత్ సౌధ ముట్టడి భూపాలపల్లి అర్బన్: సింగరేణికి రావాల్సిన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28వ తేదీన సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించనున్న విద్యుత్ సౌధ ముట్టడికి సింగరేణి కార్మికులు అధిక సంఖ్యలో తరలిరావాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి కంపేటి రాజయ్య సోమవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. విద్యుత్ సంస్థల నుంచి ఏళ్ల తరబడి బకాయిలు రావడం లేదన్నారు. ఇప్పటికి రూ.51వేల కోట్లు పేరుకుపోయినట్లు తెలిపారు. సింగరేణి మనుగడ ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. సింగరేణి అధికారులు విద్యుత్ సంస్థలకు బొగ్గు రవాణా నిలివేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వలన సింగరేణి రావాల్సిన బిల్లులు పెండింగ్లో ఉన్నట్లు ఆరోపించారు. మహాత్మ బసవేశ్వర మార్గం స్ఫూర్తిదాయకం భూపాలపల్లి రూరల్: సమానత్వం, సామాజిక న్యాయంపై మహాత్మ బసవేశ్వర చూపిన మార్గం స్ఫూర్తిదాయకమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మహాత్మ బసవేశ్వర 892వ జయంతి కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సత్యనారా యణరావు ముఖ్యఅతిథిగా హాజరై, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్యతో కలిసి మహాత్మ బసవేశ్వర చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయాలను కొనసాగించేందుకు కట్టుబడి పనిచేయాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి ఇందిర, వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి క్రాంతి కిరణ్, బీసీ సంఘాల ప్రతినిధులు కంపాటి రాజయ్య, మాటూరి శ్రీనివాస్, యుగేందర్, మాటూరి మంజుల, శివ దర్శనం, సతీష్ పాల్గొన్నారు. ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వం కృషివెంకటాపురం(ఎం): ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. మండల పరిధిలోని లక్ష్మీదేవిపేటలో నిర్మిస్తున్న రామాలయానికి సోమవారం మంత్రి సీతక్క భూమి పూజ నిర్వహించారు. మండల కేంద్రంలో నిర్మించిన పెద్దమ్మగుడిని సీతక్క ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు బొమ్మకంటి వంశావతిరమేశ్, మామిడిశెట్టి సుగుణస్వామి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మల్లాడి రాంరెడ్డి, జిల్లా గ్రంఽథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, నాయకులు భగవాన్రెడ్డి, చెన్నోజు సూర్యనారాయణ, బండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీలపై దాడులు ఆపాలని వినతి ములుగు రూరల్: జిల్లాలోని వలస ఆదివాసీల గూడేలపై అటవీశాఖ అధికారుల దాడులు ఆపాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు సీపీఎం నాయకులు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఆదివాసీ గూడేలపై ప్రజలు సాగు చేసుకుంటున్న భూములపై అటవీశాఖ అధికారులు కందకాలు తవ్వుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. తక్షణమే అటవీశాఖ అధికారులు దాడులు ఆపాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు తుమ్మల వెంకటరెడ్డి, రత్నం రాజేందర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.సాక్షిప్రతినిధి, వరంగల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రుల బృందం జేఎస్ భూపాలపల్లి జిల్లాలో సోమవారం సుడిగాలి పర్యటన చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణపై సమీక్ష, రెండో విడత రైతు భరోసా విడుదల తదితర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా కాళేశ్వరాలయ పునరుద్ధరణ పూజల్లో పాల్గొన్న సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు అనంతరం మేడిగడ్డ బ్యారేజ్కి వెళ్లారు. పియర్స్ వద్ద శాంపిళ్లను పరి శీలించారు. కుంగిన ఏడో బ్లాక్ వద్ద డ్రిల్లింగ్ పనులు చూసిన సీఎంకు బ్యారేజీ వద్ద చేస్తున్న పరీ క్షలను అధికారులు వివరించారు. సీఎంతో పాటు ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్జైన్ మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. జియో టెక్నికల్, జియో ఫిజికల్, జీపీఆర్ శాంపిళ్లు ఎలా తీస్తున్నారో చూశారు. ప్రభుత్వం మొత్తం 520 శాంపిళ్లు సేకరించి సెంట్రల్ వాటర్, పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూఆర్పీఎస్)కు పంపనుంది. ల్యాబ్లో పరీక్షల తర్వాత మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీపై పూర్తి అవగాహన వస్తుందని ఈ సందర్భంగా డ్రోన్ బేస్డ్ జీపీఆర్ టెస్ట్కు సంబంధించి అధికారులు సీఎంకు వివరించారు. ప్యార్లర్ క్రాస్ హోల్ సెస్మిక్ టెస్ట్ వివరాలను వివరించారు. సుమారు గంటపాటు అధికారులతో సమీక్ష.. మూడు బ్యారేజీల పరిస్థితిపై అధ్యయనం చేసిన సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులతో కలిసి కాళేశ్వరం వద్ద ఎల్ అండ్ టీ గెస్ట్హౌస్లో అధికారులతో సమీక్ష జరిపారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల లోపాలపై ఎలా ముందుకెళ్లాలో చర్చించారు. ఇటీవల నియమించిన స్టీరింగ్ కమిటీ చైర్మన్ కల్నల్ పరిచిత్ మెహ్రా బృందంతో కూడా సీఎం చర్చించి పలు సూచనలు, సలహాలు తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాళేశ్వరంలో అక్రమాలకు పాల్పడిన ఏ ఒక్కరిని వదలమని, అలాగే రూ.కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ప్రాజెక్టును కూడా గాలికి వదలమని, నిపుణుల సలహాలు సూచనలు తీసుకుని ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్న సీఎం రేవంత్రెడ్డి.. అధికారులు పూర్తిగా సహకరించాలని, ప్రాజెక్టును వినియోగంలోకి తేవాలని కోరారు. ప్రతిపక్షాలపై నిప్పులు.. అభివృద్ధి, సంక్షేమానికి హామీ.. కాటారం మండలం నస్తూర్పల్లిలో జరిగిన బహిరంగ సభలో బీఆర్ఎస్, బీజేపీలపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. తుమ్మిడిహెట్టిప్రాజెక్టును యథాతథంగా కొనసాగిస్తే లాభం ఉండదని భావించిన కేసీఆర్ పేరు మార్చి, అంచనాలు మార్చి అవినీతికి తెరతీశారని, రూ.38 వేల కోట్ల ప్రాజెక్టును రూ.1.50 లక్షల కోట్లకు పెంచారని అన్నారు. తనకు రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయని భావించారని, ఆనాడు గవర్నర్ నరసింహన్ను మభ్యపెట్టి అబద్ధాలు చెప్పించారన్నారు. మేడిగడ్డ బ్యారేజీలో లోపాలు ఉన్నాయని 2020లోనే ఇంజనీర్లు చెప్పారని గుర్తు చేశారు. ఇంజనీర్ల లేఖలను సీఎం, ఎల్అండ్టీ సంస్థ పట్టించుకోలేదని, ఫలితంగా 2023 అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజీ కుప్పకూలి పోయిందని ఆరోపించారు. అన్ని దాచిపెట్టి ఎన్నికల్లో లబ్ధిపొందాలని ప్రయత్నించినా, ప్రకృతి మరొకటి తలచి అది పూర్తిగాకుంగిపోవడంతో ప్రపంచానికి అసలు విషయం తెలిసిందన్నారు. సీబీఐ విచారణకు అప్పగించి 9 నెలలు అవుతున్నా కేంద్రం నుంచి స్పందన లేదని, కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరంపై ఇప్పటికీ సీబీఐ విచారణకు ఆదేశించలేదని, 2019 నుంచి ఈ ప్రాజెక్టు ద్వారా 162 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోశామని తెలిపారు. రూ.లక్ష కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టును వృథాగా పోనీయలేమని, మరమ్మతులు పూర్తి చేసి ప్రాజెక్టును ఉపయోగంలోకి తెస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, సీతక్క, తుమ్మల, గడ్డం వివేక్, పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డి, ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, బలరాంనాయక్, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, ఆది శ్రీనివాస్, విజయ రమణారావు, మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్, ప్రేమ్సాగర్, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు. నస్తూర్పల్లి బహిరంగ సభలో అభివాదం చేస్తున్న సీఎం రేవంత్‘రైతు ఉత్సవాలు’ సభలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి భూపాలపల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరముక్తీశ్వర స్వామి దేవస్థానానికి రూ.200 కోట్లు నిధులు ఇచ్చామని, ఆలయ పునర్నిర్మాణ పనులు, ఇతర కట్టడాలు చేపట్టి అంగరంగ సుందరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి వెల్లడించారు. ప్రజాపాలనలో భాగంగా.. కాటారం మండలం నస్తూర్పల్లి గ్రామ సమీపంలో సోమవారం ‘రైతు ఉత్సవాలు’ బహిరంగ సభ నిర్వహించారు. సభాస్థలి సమీపంలో రూ.203 కోట్లతో ఆరెంద–దామెరకుంట గ్రామాల మధ్య ఉన్న మానేరు వాగుపై రూ.203 కోట్లతో నిర్మించనున్న బ్రిడ్జి పనులకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి శ్రీధర్బాబు, ఎమ్మెల్యే సత్యనారాయణరావు కోరిన ప్రతీసారి అభివృద్ధి పనులకు సరిపడా నిధులు ఇస్తున్నామన్నారు. సరస్వతి పుష్కరాలను ఘనంగా నిర్వహించుకున్నామని, త్వరలోనే జరుగనున్న అంత్య పుష్కరాలకు కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామన్నారు. కాళేశ్వరం దేవస్థానం, ప్రాజెక్టు పునర్నిర్మాణ పనులకు అవసరమైన నిధులిస్తామని సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు.నిరుపయోగంగా ఉన్న బస్టాండ్ చిట్యాల: చిట్యాల బస్టాండ్ నిర్మాణం పూర్తయి రెండున్నరేళ్లవుతున్నా ప్రారంభానికి నోచుకోవడం లేదు. పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో లక్షల రూపాయలు వెచ్చించి కట్టినా ప్రయాణికులకు ఉపయోగం లేకుండా మారింది. దీంతో ప్రయాణికులు బస్సుల కోసం ఎండలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రారంభిస్తే ప్రయాణికులకు ఉపయోగం కలగనుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి చిట్యాల బస్టాండ్ను రూ.25లక్షలతో నిర్మాణం చేపట్టారు. రెండున్నరేళ్ల క్రితం పనులు పూర్తయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఇప్పటి వరకు ప్రారంభించడం లేదు. బస్టాండ్ చుట్టూ సీసీ రోడ్డు వేయించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావును మండల నాయకులు కోరగా స్పందించి సీసీ రోడ్డు వేయించారు. కానీ ప్రారంభం విషయంలో మాత్రం చొరవచూపడం లేదు. బస్టాండ్ను ప్రారంభిస్తే ప్రయాణికులకు మంచి సౌకర్యవంతంగా ఉంటుంది. బస్టాండ్ ప్రారంభం కాకపోవడంతో మందుబాబులకు అడ్డాగా మారింది. చీకటిపడితే చాలు మందుబాబులు కూర్చుని మద్యం సేవిస్తున్నారు. వాహనాలు సైతం నిలుపుతున్నారు. చిట్యాల బస్టాండ్ను వెంటనే ప్రారంభించేలా అధికారులు, పాలకులు చర్యలు తీసుకోవాలి. మండలకేంద్రానికి వచ్చే బస్సులు బస్టాండ్ వద్ద నుంచి వెళ్లే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. – అల్లం రవీందర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, చిట్యాలగిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న నా భర్తకు వేతనం రావడం లేదు. తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో కాంటిజెంట్ వర్కర్గా పనిచేస్తున్న నా భర్త ప్రసాద్కు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో నేను విధులకు హాజరవుతున్నాను. 2020 నుంచి వేతనం రావడం లేదు. అధికారులు, పీఓలు మారుతున్నా వేతనం రాక ఇబ్బందులు పడుతున్నాం. కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా స్పందించి పెండింగ్ వేతనాలు వచ్చేలా చూడాలి. – ఆలం రామలక్ష్మి, మేడారం, తాడ్వాయివెంకటాపురం(కె) మండలంలోని అలుబాక పంచాయతీ పరిధి ముత్తారం గ్రామస్తులతో కలిసి ఇసుక క్వారీ సొసైటీని ఏర్పాటు చేశారని కుర్సం ముత్తయ్య, బాడిష కన్నయ్య, మడ సుజాత, బాడిష స్వప్నలు కలెక్టర్కు విన్నవించారు. ముత్తారంలో సొసైటీ ఏర్పాటు చేసి మూడేళ్లు అవుతున్నా ఇంత వరకు జమ ఖర్చు చెప్పడం లేదు. పెసా కో ఆర్డినేటర్ కొమురం ప్రభాకర్ను సొసైటీ విషయం ఏది అడిగిన ఇవ్వడం లేదు. సొసైటీ పేరు కూడా చెప్పడం లేదని గిరిజనులు వాపోతున్నారు. మూడు మార్లు రూ.4 లక్షల క్యూబిక్మీటర్ల ఇసుక బయటకు రవాణా చేసినప్పటికీ వాటి కమీషన్ తమకు ఇవ్వకుండా అధికారులు, సొసైటీ సభ్యులు మింగి కూర్చుంటున్నారని తెలిపారు. గ్రామంలోని గిరిజన కుటుంబాలకు ఒక్క రూపాయి ఇవ్వకుండా సొసైటీ సభ్యులు సొంతానికి వాడుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికై నా పాత సొసైటీని రద్దు చేసి కొత్త సొసైటీని ఏర్పాటు చేయాలని ముత్తారం గ్రామస్తులు కోరారు. ముందుగా మేడిగడ్డను సందర్శించిన సీఎం, మంత్రులు, నిపుణులు ఎన్డీఎస్ఏ, స్టీరింగ్ కమిటీ, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష 3 బ్యారేజీల మరమ్మతులకు నిర్ణయం బహిరంగసభలో ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగిన సీఎం రూ.407 కోట్లతో పథకాలకు శంకుస్థాపన పట్టించుకోని అధికారులు.. పాలకులు రూ.లక్షలు వెచ్చించినా నిరుపయోగం -
‘మేడిగడ్డ లోపాలపై ఎలా ముందుకెళ్లాలో క్లారిటీ వచ్చింది’
భూపాలపల్లి: మేడిగడ్డ బ్యారేజ్ లోపాలపై ఎలా ముందకెళ్లాలో క్లారిటీ వచ్చిందన్నారు సీఎం రేవంత్. దీనికి సంబంధించి సాంకేతిక నిపుణులు, నిర్మాణ సంస్థలతో చర్చించిన తర్వాత దీనిపై ఒక అంచనా వచ్చిందన్నారు. ఎన్డీఎస్ఏ గైడ్లైన్స్ అనుగుణంగా ముందుకెళ్తామన్నారు సీఎం రేవంత్. మేడిగడ్డ బ్యారేజీని సీఎం రేవంత్తో పాటు మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, శ్రీధర్బాలులు సందర్శించారు. వీరితో పాటు ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్తో పాటు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. అనంతరం సీఎం రేవంత్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలోనే కాళేశ్వరం కూలిందని, ప్రాజెక్టు రీడిజైన్ పేరుతో కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారన్నారు. ఢిల్లీలో హరీష్ ఎవరెవర్ని కలిశారో చెప్పాలని డిమాండ్ చేశారు. -
నేటి నుంచి ఓపెన్ పరీక్షలు
భూపాలపల్లి అర్బన్: ఓపెన్ ఇంటర్, టెన్త్ పరీక్షలు నేటి (సోమవారం) నుంచి ప్రారంభం కానున్నట్లు జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ఐదు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టెన్త్ పరీక్షలకు 428 మంది, ఇంటర్మీడియట్ పరీక్షలకు 670 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. భూపాలపల్లి, కాటారం ప్రభుత్వ జూనియర్ కళాశాల, జంగేడు, భూపాలపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇంటర్మీడియట్, సింగరేణి ఉన్నత పాఠశాల, గిరిజన ఆశ్రమ పాఠశాల, కాటారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో టెన్త్ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం, సాయంత్రం పరీక్షలు ఉంటాయన్నారు. పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు చెప్పారు. నేటి ప్రజావాణి, ప్రజాదివస్ రద్దు భూపాలపల్లి రూరల్: నేడు (సోమవారం) కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి, ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజాదివస్ను రద్దుచేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ సంకీర్త్ ఆదివారం వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. భూపాలపల్లి డిపోలో జేఏసీ ఏర్పాటు భూపాలపల్లి అర్బన్: టీజీఎస్ ఆర్టీసీ భూపాలపల్లి డిపోలో కార్మిక సంఘాలన్నీ ఏకమై ఐక్య కార్యచరణ కమిటీ (జేఏసీ) ఏర్పాటు చేసుకున్నాయి. డిపోలోని అన్ని యూనియన్ల ప్రతినిధులు కలిసి నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. ఆర్టీసీ జేఏసీ చీఫ్ అడ్వైజర్గా ఎం.రవీందర్, చైర్మన్గా బుర్రి తిరుపతి, కన్వీనర్గా బండి శ్రీనివాస్, కో–కన్వీనర్గా డి.రాజయ్య, వైస్ చైర్మన్గా వి.రవి, ట్రెజరర్గా బి.సతీష్లను ఎంపిక చేశారు. ఈ నెల 22నుంచి జరిగే ఆర్టీసీ సమ్మె వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. అద్దె బస్సుల స్కీం కొనసాగించాలిహన్మకొండ: ఆర్టీసీలో అద్దె బస్సుల స్కీం కొనసాగించాలని ఆర్టీసీ హైర్ బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు లక్కం ప్రభాకర్ కోరారు. హనుమకొండ హంటర్రోడ్డులోని అభిరాం గార్డెన్స్లో ఆర్టీసీ హైర్బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వరంగల్ రీజియన్స్థాయి సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో లక్కం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని నిరుద్యోగులు 25 సంవత్సరాలుగా ఆర్టీసీలో అద్దె బస్సులు నడుపుతూ ఉపాధి పొందుతున్నారన్నారు. దేశ వ్యాప్తంగా ఆర్టీసీలకు అనుసంధానంగా 0.033 వాహనాలు నడుస్తున్నాయన్నారు. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతూ నిరుద్యోగుల పొట్ట కొట్టాలని చూడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాలుష్యం నివారణ పేరుతో ఆర్టీసీలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడితే సరిపోదని, ఇతర వాహనాలపై దృష్టి సారించాలని సూచించారు. ఆర్టీసీ హైర్బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అబ్బ మధుకర్రెడ్డి మాట్లాడుతూ 2007, 2009 బస్సుల స్థానంలో రిప్లేస్మెంట్ బస్సులను ఇవ్వాలని, డిపో మేనేజర్లతో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆర్ఎం కార్యాలయంలో సంయుక్త సమావేశం నిర్వహించాలని యాజమాన్యాన్ని కోరారు. హైర్బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వరంగల్ రీజియన్ అధ్యక్షుడు మారిపల్లి రాంరెడ్డి, అసోసియేషన్ ప్రతినిధులు బాలవర్ధన్రెడ్డి, ఎన్.ప్రసాద్, హబీబ్, జె.వెంకట్రెడ్డి, కె.సదానందం, ఎండి పర్వేజ్, జి.వెంకన్న, కె.భాస్కర్రెడ్డి, కుమార్, బి.రామలింగారెడ్డి పాల్గొన్నారు. నయీంనగర్: సమ్మె సన్నాహక కార్యక్రమంలో భాగంగా ఆదివారం హనుమకొండ బస్టాండ్ ఆవరణలోని వరంగల్–1 డిపో ఎదుట రీజియన్ జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని, లేకపోతే ఈ నెల 22వ తేదీ నుంచి కార్మికులమంతా సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. -
స్వీయ నియంత్రణ తప్పనిసరి
ములుగు రూరల్: రోడ్డు ప్రమాదాల నియంత్రణకు స్వీయ నియంత్రణ తప్పనిసరిగా పాటించాలని పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఆదివారం మండలపరిధిలోని ఇంచర్ల గ్రామ శివారులోని ఎంఆర్ ఫంక్షన్ హాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అరైవ్, అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమానికి మంత్రి సీతక్కతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా 99 రోజుల ప్రజాపాలన ప్రగతి నివేదిక కార్యక్రమం చేపట్టిందని అన్నారు. వాహనాలు నడిపే వ్యక్తులు తప్పనిసరిగా సీట్బెల్ట్ ధరించాలని, డ్రైవింగ్ చేయటంలో నిర్లక్ష్యం వహిస్తే ప్రాణహాని తప్పదని హెచ్చరించారు. పోలీస్ శాఖ వాహన తనిఖీలు చేసేది కేవలం ప్రజల సంక్షేమం కోసమేనని అన్నారు. ప్రతీ ఒక్కరు పోలీస్ శాఖకు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, మున్సిపాలిటీ చైర్మన్ చింతనిప్పుల చంద్రకళ, పంచాయతీ రాజ్ డైరెక్టర్ భగవాన్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి -
బహిరంగ సభకు తరలిరావాలి
భూపాలపల్లి రూరల్: కాటారం మండలం నస్తురుపల్లిలో నేడు(సోమవారం) నిర్వహించనున్న బహిరంగ సభకు పార్టీ కార్యకర్తలు, కార్మికులు, మహిళలు అధిక సంఖ్యలో తరలిరావాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కోరారు. ఆదివారం పట్టణంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ సందర్శన, లోపాలను ప్రజలకు తెలియజేయడం, బహిరంగ సభలో రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపారు. బహిరంగసభకు నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాశ్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ మాట్లాడుతూ పార్లమెంట్లో మహిళా బిల్లును కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందని బీజేపీ నాయకులు చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, దేవన్, దాట్ల శ్రీనివాస్, ఆకుల మహేందర్, రంజిత్ పాల్గొన్నారు.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
మండే ఎండ.. ఠండా ఠండా!
● జూపార్కులో చల్లదనం కోసం స్ప్రింక్లర్లు, చలువ పందిళ్ల ఏర్పాటు ● ఉష్ణోగ్రతలు పెరగకుండా అధికారుల ఏర్పాట్లు న్యూశాయంపేట: ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో జంతువులు, పక్షులు, సరీసృపాలకు ఉపశమనం కలిగించేందుకు మూగజీవాలు వడదెబ్బ బారిన పడకుండా వరంగల్ నగరంలోని హంటర్రోడ్డు కాకతీయ జూవలాజికల్ పార్కులో జూ క్యూరేటర్ బి.లావణ్య, అసిస్టెంట్ క్యూరేటర్ బి.మయూరి నేతృత్వంలో అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. జంతువులకు వేసవి తాపం తెలియకుండా ఉండేందుకు అటు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్క్లోజర్లో ఉండే క్రూర మృగాల కోసం ఉష్ణోగ్రతలు పెరగకుండా వాటర్ స్పింక్లర్లు, కూలర్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా పక్షుల కోసం చలువ పందిళ్లు, తడి తడకలు, గడ్డితో కూడిన పందిళ్లు ఏర్పాట్లు చేసి రోజుకు మూడు నాలుగు సార్లు నీటితో తడుపుతున్నారు. జంతువుల శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉండేందుకు అధికారులు ఆహార నియమాల్లో కీలక మార్పులు చేసి నీటితో కలిపి ఎలక్ట్రోలైట్స్ తదితర బలవర్థక ద్రావణాలు, ఆహారం అందిస్తున్నారు. జంతువులకు, పక్షులకు చల్లటి నీటితో స్నానాలు చేయించి ఎండ వేడి బారిన పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. -
నేడు ముఖ్యమంత్రి కాళేశ్వరం టూర్
భూపాలపల్లి/కాళేశ్వరం: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం పర్యటనకు సోమవారం (నేడు) రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో కాళేశ్వరం హెలిపాడ్కు చేరుకుంటారు. రోడ్డు మార్గం ద్వారా కాళేశ్వరం దేవస్థానం చేరుకుని ముందుగా శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకుంటారు. తర్వాత కాళేశ్వరం దేవస్థానంలోని తూర్పు ఈశాన్య స్థలంలో రూ.200 కోట్ల వ్యయంతో రాతి నిర్మాణ పనుల భూమిపూజలో పాల్గొంటారు. కాళేశ్వరాలయం గర్భాలయం, శ్రీశుభానందదేవి అమ్మవారి ఆలయాల నిర్మాణ పనులు చేపట్టనున్నారు. మూడు చోట్ల హెలిపాడ్ల ఏర్పాటు.. సీఎం పర్యటన నేపథ్యంలో కాళేశ్వరం దేవస్థానం, మేడిగడ్డ, నస్తుర్పల్లిలో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మూడు చోట్ల హెలిపాడ్లు సిద్ధం చేశారు. కాళేశ్వరం దేవస్థానంలో పూలతో డెకెరేషన్స్ చేశారు. పూజా కార్యక్రమాలు, భూమిపూజ కోసం దేవాదాయశాఖ ఏర్పాట్లు చేస్తోంది. మేడిగడ్డలో సమీక్ష నిర్వహిస్తుడండంతో అంబట్పల్లిలోని గెస్ట్హౌస్లో ఏర్పాట్లు చేశారు. నస్తుర్పల్లిలో సుమారు 40 ఎకరాల్లో సభాప్రాంగణం, విద్యుత్ లైట్లు, ఇతర ఏర్పాట్లు చేశారు. 20 ఎకరాల్లో పార్కింగ్ స్థలాలు, హెలిపాడ్ సిద్దం చేశారు. జిల్లా కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ సంకీర్త్, అదనపు కలెక్టర్ విజయలక్ష్మీ, డీఎస్పీ సూర్యనారాయణతో పాటు జిల్లా అధికారుల పనులు పూర్తి చేశారు. జనసమీకరణ.. కాటారం సబ్డివిజన్తో పాటు పక్క జిల్లాల నుంచి భారీ ఎత్తున సభకు ప్రజలు, రైతులు తరలి రావడానికి నాయకులు జన సమీకరణ చేపట్టారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని బస్సులు, ఇతర వాహనాలు ఏర్పాటు చేస్తున్నారు. తాగునీరు, ఆహార పదార్థాలు సమకూర్చనున్నారు. భారీగా ప్రజలను సభకు తీసుకురావాలని సర్పంచ్లు, మాజీ ప్రజా ప్రతినిధులకు మంత్రి శ్రీధర్బాబు సూచించారు. సీఎం పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు భూపాలపల్లి అర్బన్: జిల్లా వ్యాప్తంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. పరకాల నుంచి మహదేవపూర్ వరకు ఉన్న ఎన్హెచ్ 353–సీ రహదారిపై బొగ్గు, ఇసుక లారీలు, ట్రాక్టర్లు, ఇతర భారీ వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు సీఐ నరేష్శ్మార్ ఒక ప్రకటనలో తెలిపారు. రహదారి ఇరువైపులా వాహనాల పార్కింగ్కు అనుమతి లేదని స్పష్టం చేశారు. మంజూర్నగర్ నుంచి బాంబులగడ్డ వరకు ఈ నిబంధనలు కఠినంగా అమలులో ఉంటాయన్నారు. ముఖ్యమంత్రి కాన్వాయి కాటారం వైపు ప్రయాణించనున్నందున ప్రజల భద్రత దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఆదిముక్తీశ్వరాలయంలోనే పూజలు కాళేశ్వరం: కాళేశ్వరం దేవస్థానంలో రూ.200కోట్లతో రాతి నిర్మాణ పనులకు సీఎం రేవంత్రెడ్డి సోమవారం(నేడు) భూమి పూజ చేపట్టనున్నారు. వచ్చే నెల మే 21 నుంచి జూన్ 1 వరకు సరస్వతినది అంత్యపుష్కరాలు జరుగనున్నాయి. 1978 నుంచి 82 వరకు జీర్ణోద్ధరణ సమయంలో సిమెంట్తో నిర్మించిన శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ప్రధాన గర్భాలయం, శ్రీశుభానందదేవి అమ్మవారి ఆలయాలు తొలగించి రాతితో నిర్మాణం చేయనున్నారు. దీంతో ఆలయంలో నిత్య పూజలు, ఒక కిలోమీటర్ దూరంలో అడవిలో ఉన్న ఆదిముక్తీశ్వరాలయంలో పూజలు నిర్వహించడానికి దేవా దాయ శాఖ సర్వంసిద్ధం చేస్తుంది. కాళేశ్వరాలయంలో అధికారుల పరిశీలనకాళేశ్వరం ఆలయ పునరుద్ధరణ పనులకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈనేపథ్యంలో ఏర్పాట్లను కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ సిరిసెట్టి సంకీర్త్, ఐఎస్డబ్ల్యూ అధికారులతో కలిసి ఆదివారం పరిశీలించారు. రూ.200 కోట్లతో కాళేశ్వరాలయం రాతి నిర్మాణ పనులకు భూమి పూజ కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ సందర్శన కాటారం మండలం నస్తుర్పల్లిలో రైతు భరోసా నిధుల విడుదల ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్లో 19, 20వ పియర్లు, వంతెన కుంగిన విషయం తెలిసిందే. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో కూడా సీపేజీ లీకేజీలు ఏర్పాడ్డాయి. అప్పటి నుంచి ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యాంసేఫ్టీ అథారిటీ) సూచనల మేరకు నీటిని నిల్వ చేయడం లేదు. దీంతో ప్రభుత్వం మరమ్మతులు చేసి నీటిని ప్రజలకు అందించడానికి ముందుకు రావడంతో సీఎం పర్యటన ఖరారు చేసినట్లు తెలిసింది. దీంతో 3.45 గంటలకు హెలికాప్టర్లో మేడిగడ్డ బ్యారేజీకి చేరుకుంటారు. మేడిగడ్డ బ్యారేజీలో జరుగుతున్న జియో ఫిజికల్, జియో టెక్నికల్ పరీక్షలు, బోర్హోల్స్ పనులను పరిశీలిస్తారు. అక్కడ ఇరిగేషన్శాఖ ఇంజనీర్లతో సమీక్షిస్తారు. సాయంత్రం 6 గంటలకు రోడ్డు మార్గం ద్వార నస్తుర్పల్లికి చేరుకుంటారు. 6.30 గంటలకు రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం ప్రారంభిస్తారు. ప్రజలనుద్దేశించి మాట్లాడుతారు. రాత్రి 7.45 గంటల అనంతరం రోడ్డు మార్గం ద్వార వెళ్తారని అధికారులు తెలిపారు. -
సీఎం సార్.. హామీలు నెరవేర్చరూ..
సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందేదెప్పుడుభూపాలపల్లి: అసెంబ్లీ ఎన్నికలకు ముందు, అధి కారంలోకి వచ్చిన అనంతరం జిల్లాకు కాంగ్రెస్ పా ర్టీ ఇచ్చిన పలు హామీలు అమలుకు నోచుకోలేదు. వీటికి తోడు జిల్లాలో పెండింగ్ సమస్యలు అనేకంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేడు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో పెండింగ్ సమస్యలు, ఇచ్చిన హామీల అమలుకు నిధుల కేటాయింపుపై ప్రజలు గంపెడాశతో ఎదురుచూస్తున్నారు ● జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో సాధారణ వైద్య సేవలు మాత్రమే అందుతున్నాయి. మెడికల్ కళాశాలకు అనుబంధంగా నడుస్తున్న ఈ ఆస్పత్రిలో వైద్య నిపుణుల పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. మూడు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఈ జిల్లా ఆస్పత్రికి రోజురోజుకూ రోగుల తాకిడి పెరుగుతుంది. సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణులు లేకపోవడంతో చిన్నచిన్న రోగాలకు సైతం ఎంజీఎం, వరంగల్లోని ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ● జిల్లా కేంద్రమైన భూపాలపల్లి మున్సిపాలిటీ దినదినం అభివృద్ధి చెందుతుంది. గత ప్రభు త్వ హయాంలో గ్రేడ్ 2 మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయింది. సుమారు లక్షకు పైగా జ నాభా ఉన్న ఈ పట్టణాన్ని గ్రేడ్ 1 మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసి అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ● గత ప్రభుత్వాలు జిల్లాలోని తాడిచర్ల ఓపెన్కాస్ట్ ప్రాజెక్ట్ 1ను ప్రైవేట్ కాంట్రాక్టరుకు అప్పగించగా, ప్రాజెక్ట్ 2ను సింగరేణి సంస్థకే అప్పగించి పనులు చేపట్టాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. ● సింగరేణి బొగ్గు, గోదావరి జలాలు, కేటీపీపీ పరిశ్రమ ఉన్న ఈ జిల్లాలో ఇంజనీరింగ్, మైనింగ్ కళాశాల, పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారు. గత ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఈ ప్రభుత్వమైన పరిశ్రమలు నెలకొల్పి స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు.ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి 8న గణపురం మండలం చెల్పూరు పరిధిలోని సింగరేణి వేయి క్వార్టర్ల సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వరాల జల్లులు కురిపించారు. కొందరు వ్యక్తులు సింగరేణి మెడికల్ బోర్డుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, బోర్డును రద్దు చేసేది లేదని, కారుణ్య నియామకాలను కొనసాగిస్తామని ప్రకటించారు. 217 మంది డిస్మిస్డ్ కార్మికులు ఉన్నారని, త్వరలోనే వారి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కాగా కారుణ్య నియామకాలు అంతంత మాత్రంగానే జరుగుతుండగా, డిస్మిస్డ్ కార్మికుల ఊసే లేదు. భూపాలపల్లి పట్టణంలో బైపాస్ రోడ్డు నిర్మాణానికి రూ. 500 కోట్లు కేంద్రం కేటాయించిందని, డీపీఆర్ ప్రక్రియ పూర్తయిందని ప్రకటించారు. ఇప్పటి వరకు కనీసం భూసేకరణ పనులు కూడా ప్రారంభం కాలేదు. సాధారణ ఎన్నికలకు ముందు రేవంత్రెడ్డి జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారం సందర్భంగా.. సింగరేణి సంస్థలో మారు పేర్లను సవరిస్తామని, సొంతింటి కల నెరవేరుస్తామని హామీ ఇచ్చినా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. బైపాస్ రోడ్డు పనుల ప్రారంభమెప్పుడో సింగరేణిలో కారుణ్య నియామకాలు కలేనా..? 217 మంది డిస్మిస్డ్ కార్మికుల పరిస్థితేంటి నేడు జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి పర్యటన జిల్లా కేంద్రం అనంతరం కాటారం రెవెన్యూ డివిజన్ అభివృద్ధిలో పరుగులు తీస్తుంది. కాటారం, సమీపంలోని నస్తూర్పల్లి, మద్దులపల్లి, చిదినెపల్లి, పోతులవాయి, ఇబ్రహింపల్లి, బయ్యారం గ్రామాలను కలిపి కాటారాన్ని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
న్యూశాయంపేట: విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు, ఆర్ట్, సాంస్కృతిక కార్యక్రమాల్లో రాణించి నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని తెలంగాణ మైనార్టీ గురుకులాల విద్యాసంస్థ(టెమ్రిస్) రీజినల్ కో–ఆర్డినేటర్ జంగా సతీశ్ అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మైనార్టీ గురుకులాల్లో విద్యనభ్యసిస్తున్న (5 నుంచి 8వ తరగతి) విద్యార్థులకు క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల్లో శిక్షణలో భాగంగా పదిరోజుల పాటు నిర్వహించే సమ్మర్ క్యాంప్ను ఆదివారం వరంగల్ శంభునిపేట, వరంగల్(జి2) గురుకులంలో ప్రారంభించారు. ప్రిన్సిపాల్ తాళ్ల నీలిమాదేవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జంగా సతీశ్ మాట్లాడు తూ.. సమ్మర్క్యాంపునకు బాలికలకు, శంభునిపేట గురుకులంలో, బాలురకు జక్కలొద్ది గురుకులంలో సౌకర్యాలు కల్పించి పదిరోజుల పాటు క్రీడల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 400 మంది విద్యార్థులకు శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విజిలెన్స్ అధి కారులు సయ్యద్ అక్బర్, మక్బూల్పాషాతో పాటు, పీఈటీలు, ఆర్ట్స్ టీచర్లు పాల్గొన్నారు. టెమ్రిస్ ఆర్ఎల్సీ సతీశ్ -
హేమాచలుడిని దర్శించుకున్న ఏపీ హైకోర్టు జడ్జి
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి హరినాధ్ దంపతులు శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటిసారిగా ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ కార్యనిర్వహణ అధికారి వీరస్వామి ఆధ్వర్యంలో ఆలయ పూజారులు రాజశేఖర్శర్మ, పవన్కుమార్ ఆచార్యులు, రాజీవ్ శర్మ, ఈశ్వర్చంద్ వారి పేరిట స్వయంభు స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించారు. అనంతరం ఆలయ పురాణం, స్వామివారి విశిష్టతను వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రిన్సిపల్ జడ్జి సూర్యచంద్రకళ, అడిషనల్ జడ్జి డి.మధులిక తేజ, ఎస్సై టీవీఆర్ సూరి తదితరులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
ములుగు రూరల్: అర్హులందరికీ ప్రజా సంక్షేమ పథకాలు అందుతాయని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండల పరిధిలోని రాయనిగూడెం గ్రామ పంచాయతీలో ప్రజాదర్బార్ కార్యక్రమానికి మంత్రి శనివారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ప్రజల నుంచి వచ్చిన పలు అర్జీలను స్వీకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కృషి చేస్తుందని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని వెల్లడించారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, గృహలక్ష్మి, తదితర పథకాలు అందిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర, అధికారులు తదితరులు పాల్గొన్నారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క -
మే మాసంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందడి
778సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వేళయ్యింది. ఎన్నికల ప్రక్రియను ప్రారంభించే క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని శనివారం జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే నెలలోనే ‘పరిషత్’ ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తున్నారు. ఇప్పటికే గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల ఎన్నికల నిర్వహించిన ప్రభుత్వం.. ‘పరిషత్’ ఎన్నికలకు పచ్చజెండా ఊపింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ప్రక్రియ పూర్తయితే వచ్చే నెలలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 23వ తేదీలోపే ఓటర్ల జాబితా... 2025, జూలై 10 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 5 వరకు కేంద్ర ఎన్నికల సంఘం నవీకరించిన జాబితాను ప్రామాణికంగా తీసుకోవాలని కలెక్టర్లకు జారీ చేసిన ఆదేశాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఆ జాబితాలో నియోజకవర్గాల్లోని అదనపు ఓటర్ల వివరాలను మండలాల వారీగా గుర్తించి, వాటిని సంబంధిత పంచాయతీ, పోలింగ్ కేంద్రాల వారీగా ఉన్న జాబితాలకు జత చేయాలని ఆదేశించింది. వీటి ఆధారంగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీల పరిధిలోని గ్రామ పంచాయతీలు, పోలింగ్ స్టేషన్ల వారీగా కొత్త జాబితాలను రూపొందించాలని తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. ఈ జాబితాలను జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) ధ్రువీకరణ అనంతరం, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) యూజర్ మాన్యువల్ సూచనల ప్రకారం పోలింగ్ సెంటర్లకు అనుసంధానించాలని పేర్కొంది. ఆ డేటాలో ఏవైనా తేడాలున్నట్లు గమనిస్తే, వాటిని ఈ నెల 23వ తేదీలోపు ఎన్నికల సంఘానికి నివేదించాలని సూచించింది. ఈ మేరకు ఈ నెల 23వ లోపు ఓటర్ల ముసాయిదా జాబితా సిద్ధం చేసి ప్రచురించేందుకు వీలుగా జిల్లా అధికారులు కసరత్తు ప్రారంభించారు. 23 తర్వాత అభ్యంతరాలు, సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకొని తుది జాబితాను విడుదల చేసి, ఆ తర్వాత పోలింగ్ సెంటర్లు, బ్యాలెట్ బాక్స్లు, ఇతర ఏర్పాట్లపై దృష్టి సారించనున్నారు. ‘పరిషత్’లో ‘ఆమె’కే ప్రాధాన్యం... ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో మొత్తం 30,43,540 మంది ఓటర్లు ఉంటే, అందులో పరుషులు 14,89,606 కాగా, మహిళ ఓటర్లు 15,51,289 మంది ఉన్నారు. ఇతరు(థర్డ్జండర్)లు 504 కాగా, సర్వీసు ఓటర్లు 2,141. ఆరు జిల్లా ప్రజా పరిషత్లు ఉండగా ములుగు ఎస్టీ మహిళ, హనుమకొండ, జనగామలు ఎస్సీ మహిళలకు కేటాయించారు. అదే విధంగా 75 జెడ్పీటీసీలకు గాను 38, 39 ఎంపీపీ స్థానాలను మహిళలకు దక్కనున్నాయి. అలాగే 778 ఎంపీటీసీ స్థానాల్లో 399 చోట్ల మహిళలకే అవకాశం ఉన్నట్లు అధికారుల అంచనాలు చెబుతున్నాయి. ఉమ్మడి వరంగల్లో ‘స్థానిక’ వివరాలు ఇలా... జెడ్పీపీపీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు ఈ నెల 23లోపు ఓటర్ల ముసాయిదా జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్లకు ఎస్ఈసీ ఆదేశం ముసాయిదా జాబితాపై అధికారుల కసరత్తు రాజకీయ పార్టీల్లో మొదలైన సందడి... మహిళలకు భారీగా అవకాశాలు మొత్తం జిల్లాలు 06ప్రయత్నాలు మొదలెట్టిన ఆశావహులు.. 7506ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల్లో ‘పరిషత్’ సందడి మొదలైంది. వాస్తవానికి 2025 సెప్టెంబర్లో ఈ ఎన్నికలు జరుగుతాయని భావించినా రిజర్వేషన్లు, కోర్టు కేసుల కారణంగా వాయిదా పడ్డాయి. దీంతో గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలతో ఆశావహులు కొందరు సరిపెట్టుకోగా.. ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ పదవులపై కన్నేసిన మరికొందరు వేచిచూసే ధోరణిలో ఉన్నారు. తాజాగా ఓటర్ల ముసాయిదా సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయడంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఆశావహుల్లో సందడి మొదలైంది. మే మాసంలో ఎన్నికలు ఖాయమన్న ప్రచారం నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల టికెట్లపై పోటీ చేసేందుకు ఆశావహులు ఆయా పార్టీల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎంపీలు, ఆయా పార్టీల జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలను కలిసే పనిలో పడ్డారు. -
రామప్పలో ఎన్ఎస్జీ అధికారులు
వెంకటాపురం(ఎం): చారిత్రక రామప్ప దేవాలయాన్ని శనివారం ఎన్ఎస్జీ, ఆక్టోపస్ అధికారులు సందర్శించారు. రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకోగా ఆలయ అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్ వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ విశిష్టత, శిల్పకళ ప్రాముఖ్యత గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ వివరించారు. రామప్ప గార్డెన్ ఆవరణలో ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట కేంద్ర పురావస్తు శాఖ అసిస్టెంట్ ఆర్కియాలజిస్ట్ సాయికృష్ణ, సీఏ అజిత్, తహసీల్దార్ గిరిబాబు, ఆర్ఐ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన
మల్హర్(కాటారం): మండలంలోని కాటారం సన్తూర్పల్లిలో జరిగే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సభ ఏర్పాట్లను శనివారం కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్త్ కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సభా స్థలం, హెలిపాడ్, పార్కింగ్ ప్రాంతాలు, సభావేదికను సమగ్రంగా తనిఖీ చేశారు. సభ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న బారికేడ్లు, స్టేజ్ స్థితిగతులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పార్కింగ్ సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, అవసరమైతే అదనపు స్థలాన్ని చదును చేసి వాహనాల నిలుపుదల సౌకర్యాన్ని విస్తరించాలని సూచించారు. హెలిపాడ్ ప్రదేశంలో దుమ్ము ఎగరకుండా నీరు చల్లడంతో పాటు స్థలాన్ని సమంగా చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, ఆర్అండ్బీ ఈఈ రమేష్, డీఎస్పీ సూర్యనారాయణ, సీఐలు, ఎస్సైలు, అధికారులు పాల్గొన్నారు. -
గ్రీన్ఫీల్డ్ హైవే పనులు అడ్డగింత
చిట్యాల: మండలంలోని నవాబుపేట గ్రామ శివారు మీదుగా వెళ్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులను బాధిత రైతులు శనివారం అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ తమకు పూర్తిస్థాయిలో భూ పరిహారం చెల్లించలేదని, భూ పరిహారం చెల్లించిన తర్వాతే పనులు చేపట్టాలన్నారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ వసంతరావు, చిట్యాల, మొగుళ్లపల్లి ఎస్సైలు పోచంపల్లి సతీష్, ముప్పు సురేష్లు సంఘటన స్థలానికి చేరుకుని బాధిత రైతులతో మాట్లాడారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో బాధిత రైతులు దువ్వల సత్యనారాయణ, దువ్వల లక్ష్మీ, బిల్ల సత్యనారాయణరెడ్డి, నర్సయ్య, కసిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, అమరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 21న ఉచిత ఆయుర్వేద వైద్యశిబిరంభూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి సింగరేణి ఏరియా ఆధ్వర్యంలో ఈనెల 21న ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ఏరియా అధికార ప్రతినిధి ఎస్.శ్యాంసుందర్ శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక కృష్ణకాలనీలోని సీఈఆర్ క్లబ్లో మంగళవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శిబిరం జరుగుతుందన్నారు. ప్రముఖ ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ విశ్వనాథ మహర్షి నేతృత్వంలో నిర్వహించే ఈ శిబిరంలో చర్మవ్యాధులు, మోకాళ్ల నొప్పులు, గుండె దడ, బీపీ, షుగర్, థైరాయిడ్, మలబద్ధకం, అజీర్ణం, పక్షవాతం, అస్తమా, మహిళలకు సంబంధించిన వ్యాధులకు ఉచిత వైద్యసేవలు అందించనున్నారు. పూర్తి వివరాలకు 9849574706 నంబర్లో సంప్రదించాలన్నారు. ‘దేవాలయ నిర్మాణంపై ఆరోపణలు సరికాదు’ భూపాలపల్లి అర్బన్: కారల్మార్క్స్ కాలనీలో హనుమాన్ దేవాలయ నిర్మాణంపై కాలనీ ప్రజలు ఆరోపణలు చేయడం సరికాదని బీఎంఎస్ ఫిట్ కార్యదర్శులు పునిత్రావు, రాజ్నాయక్లు అన్నారు. శనివారం ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బీఎంఎస్ ఇతర అనుబంధ సంఘాలు గుడులు, బడుల నిర్మాణాలకు వ్యతిరేకం కాదన్నారు. దేవాలయ నిర్మాణంపై కేవలం అప్పాని శ్రీనివాస్పై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. సింగరేణి కార్మిక కాలనీకి చెందిన స్థలంలో హన్మాన్ దేవా లయ నిర్మాణం చేపట్టవద్దని అన్ని కార్మిక సంఘాల నాయకులు కలిసి జీఎంకు వినతిపత్రాన్ని అందించినట్లు తెలిపారు. శ్రీనివాస్ ఇంటిపై దాడి చేసిన వారిపై పోలీస్స్టేషన్లో ఫి ర్యాదు చేశామని, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గుడి నిర్మాణానికి కేటాయించిన రూ.55లక్షల నిధులను దుర్వినియోగం కా కుండా ఉపయోగించాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు నలుగూరి శ్రీనివాస్, పండాల మల్లేష్, చిట్యాల ప్రవీణ్, భాస్కర్, అల్లం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఓవర్లోడ్ సమస్య తలెత్తకుండా చర్యలు వెంకటాపురం(కె): మండలంలోని అన్ని గ్రామాల్లో వేసవి కాలంలో ఓవర్ లోడ్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ ఏడీఈ ఉమారావు అన్నారు. మండల పరిధిలోని మొర్రవానిగూడెంలో సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ట్రాన్స్ఫార్మర్ను సర్పంచ్ పర్శిక శ్రీలత శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏడీఈ ఉమారావు మాట్లాడుతూ గ్రామాల్లో మీటర్ లేనివారు పీఎం జుగా స్కీమ్ ద్వారా దరఖాస్తు చేసుకొని ఉచిత మీటర్ పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈ హనుమాన్దాస్, లైన్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్, అసిస్టెంట్ లైన్మెన్ ఫరీద్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. -
రక్తదానం చేసి ప్రాణాలను కాపాడుదాం
ములుగు: రక్తదానం చేయడం ద్వారా నిండు ప్రాణాలను కాపాడవచ్చని, రక్తదాతల సేవా స్ఫూర్తి ప్రశంసనీయమని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ, టీజీఓ అసోసియేషన్, టీఎన్జీవో యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో శనివారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మనమిచ్చే ప్రతీ రక్తపు బొట్టు ఒక నిండు ప్రాణాన్ని నిలబెడుతుందన్నారు. రక్తదానం అనేది కేవలం ఒక కార్యక్రమంగా చూడకూడదని తెలిపారు. జీవితాలను కాపాడే మహత్తర సేవలో భాగంగా ప్రతీ ఆరోగ్యవంతుడు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. రక్తం అందుబాటులో ఉండడం అత్యవసర చికిత్సల్లో ఎంతో కీలకమన్నారు. ముఖ్యంగా ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, అత్యవసర వైద్యసేవల సమయంలో రక్తదానం ప్రాణదాతగా నిలుస్తుందని వెల్లడించారు. జిల్లాలోని ప్రజలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, యువత, పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి కలెక్టర్ ప్రశంసపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు మహేందర్ జీ, సంపత్రావులు సైతం రక్తదానం చేసి ఉద్యోగులకు, దాతలకు స్ఫూర్తిగా నిలిచారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ చంద్రశేఖర్, అడిషనల్ డీఆర్డీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఫొటో ఎగ్జిబిషన్
వెంకటాపురం(ఎం): ప్రపంచ వారసత్వ దినోత్సవా న్ని పురస్కరించుకొని రామప్ప దేవాలయంలో కేంద్రపురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఫొటో ఎగ్జిబిషన్ ఏ ర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్ గిరి బాబు హాజరై ఫొటో ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ఆర్కియాలజిస్ట్ సాయి కృష్ణ, సీనియర్ సీఏ అజిత్లు మాట్లాడారు. దేశంలో మూడు వేలకు పైగా కేంద్రపురావస్తు శాఖ ఆధ్వర్యంలో వారసత్వ కట్టడాలను పరిరక్షిస్తున్నామన్నా రు. ఇందులో 43 యునెస్కో గుర్తించిన ప్రపంచ వా రసత్వ కట్టడాలు ఉన్నాయని తెలిపారు. ప్రపంచ వారసత్వ కట్టడాలు, వాటి చరిత్ర తెలిపే విధంగా ఫొటో ఎగ్జిబిషన్ను రామప్పలో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వారసత్వ కట్టడాలను సంరక్షించడంలో ప్రతిఒక్కరూ బాధ్యత వహించాలన్నారు. కార్యక్రమంలో ఆర్ఐలు రమేశ్, సుధాకర్, సీనియర్ అసిస్టెంట్ రాజు, కేంద్ర పురావస్తు, దేవాదాయ శాఖ సి బ్బంది, టూరిస్ట్ పోలీసులు, గైడ్స్ పాల్గొన్నారు. -
కోఆప్షన్ దక్కేదెవరికో?
భూపాలపల్లి: జిల్లాలోని ఏకైక భూపాలపల్లి మున్సి పాలిటీలో కోఆప్షన్ సందడి మొదలైంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ కౌన్సిలర్ స్థానాలను కై వసం చేసుకోవడంతో నాలు గు కోఆప్షన్ స్థానాలు ఆ పార్టీకే దక్కనున్నాయి. దీంతో ఆ పదవుల కోసం తీవ్ర పోటీ నెలకొంది. పది మందికి పైగా ఆశావహులు.. భూపాలపల్లి మున్సిపాలిటీలో 30 వార్డు స్థానాలు ఉండగా నలుగురు కోఆప్షన్ సభ్యులను నియమిస్తారు. అయితే ఇందులో ఇద్దరు మైనార్టీలు (ఒక మహిళ, ఒక పురుషుడు), మిగిలిన రెండింటిలో ఒకరు మాజీ ప్రజాప్రతినిధి, మరొకరు సామాజిక సేవా కార్యక్రమాల్లో ఉన్న వారిని నియమిస్తారు. నలుగురిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉండాలనే నిబంధన ఉంది. అంతేకాక మున్సిపాలిటీలో ఓటరుగా ఉండి, 21 ఏళ్లు దాటిన వారై ఉండాలి. ఈ రిజర్వేషన్ల లెక్కలు తేలడంతో, ఆయా వర్గాలకు చెందిన నాయకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో, ఈ పదవులను దక్కించుకుంటే స్థానికంగా పట్టు సాధించవచ్చని ఆశావహులు భావిస్తున్నారు. మైనార్టీ విభాగం నుంచి హఫీజ్, ఫాస్టర్ రాజ్కుమార్, మాజీ ప్రజాప్రతినిధుల విభాగం నుంచి తాటి హైమావతి, శిరుప అనిల్, ముంజాల రవీందర్, సజ్జనపు స్వామి, చల్ల రేణుక, దాట్ల శ్రీనివాస్తో పాటు మరో కొంతమంది కోఆప్షన్ పదవులను ఆశిస్తున్నారు. ఈ నెల 23 వరకు నామినేషన్ల స్వీకరణ కోఆప్షన్ పదవుల భర్తీ కోసం మున్సిపల్ అధికారులు నామినేషన్లను స్వీకరిస్తున్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి 23వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. కాగా శనివారం సాయంత్రం వరకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ‘సత్తన్న’ మదిలో ఉన్నదెవరో? కోఆప్షన్ సభ్యుల ఎంపికలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు నిర్ణయమే అత్యంత కీలకం. దీంతో ఆశావహులు ఇప్పుడు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కష్టకాలంలో సైతం వెన్నంటి ఉన్నామని, తమకు అవకాశం ఇ వ్వాలని పలువురు ఆశావహులు ఎమ్మెల్యే ముందు మొరపెట్టుకుంటున్నారు. అయితే ఈ నెల 20న రేవంత్రెడ్డి జిల్లాలో పర్యటించనున్నందున, సీఎం సభ అనంతరం కోఆప్షన్ సభ్యుల ఎంపికపై ఎ మ్మెల్యే తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. మున్సిపాలిటీలో నాలుగు పదవులు అధికార పార్టీలో నెలకొన్న తీవ్ర పోటీ ఎమ్మెల్యే చుట్టూ ఆశావహుల ప్రదక్షిణలు ఒక్క చాన్స్ ప్లీజ్ మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లుగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన, రిజర్వేషన్ల మార్పుతో పోటీ చేసే అవకాశం కోల్పోయిన, ఎమ్మెల్యే సూచనల మేరకు బరిలో నిలవని వారు.. అధికార కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఉన్నారు. వీరంతా కౌన్సిల్లో అడుగుపెట్టి తమ గళాన్ని వినిపించాలని తహతహలాడుతున్నారు. ఈ కోఆప్షన్ పదవులను మాజీ కౌన్సిలర్లు ఒక ‘లైఫ్ లైన్’లా భావిస్తున్నారు. రిజర్వేషన్లు అనుకూలించక పోటీకి దూరమైన కొందరు సీనియర్లు కూడా ఈసారి ఎలాగైనా పదవి దక్కించుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. -
సంస్కృతీ సంప్రదాయాలను కాపాడాలి
ఎస్ఎస్తాడ్వాయి: ఆదివాసీ సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడుకోవాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మైపతి అరుణ్కుమార్ అన్నారు. మండలంలోని గంగారం పంచాయతీ పరిధిలోని భూపతిపూర్ సమీపంలో కారుకొండా సడాలమ్మ జాతరను పురస్కరించుకుని ఐదు రోజుల పాటు కొర్నెబెల్లి గణేష్, చింత రమేష్, కొమరం రవి, సర్వేష్ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించనున్న పోటీలను ప్రారంభించి మాట్లాడుతూ. ఆదివాసీల ఇలవేల్పు జాతరల రక్షణ కోసం కృషి చేయాలన్నారు. క్రీడలు, విద్యతోపాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. మొదటి బహుమతి రూ. 25,016, ద్వితీయ బహుమతి రూ.15,016, తృతీయ బహుమతి రూ.10,016, నాలుగో బహుమతి రూ.5,016, ఐదో బహుమతి రూ.3,016లు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బడే రజిత రాంబాబు, యువజన సంఘాల అధ్యక్షుడు నవీన్, క్రీడాకారులు పాల్గొన్నారు. -
దవాఖానాలో దాహార్తి
ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో తాగునీటికి కటకట భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో తాగునీటి కటకటాలు తప్పడం లేదు. ప్రతి రోజు ఆస్పత్రిలో 500నుంచి 700వరకు ఓపీ, 50నుంచి 100 వరకు ఇన్ పేషెంట్లు వస్తుంటారు. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల పట్టింపులేని తనం మూలంగా ఆస్పత్రికి వచ్చే బాలింతలు, గర్భిణులు, పేషెంట్లు, అటెండెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. వేసవికాలం కావడంతో దాహార్తిని తట్టుకోలేకపోతున్నారు. ఆస్పత్రిలో తాగునీటి ఇబ్బందులపై శుక్రవారం సాక్షి పరిశీలన చేపట్టింది. రెండు బోర్లు అంతంత మాత్రమే.. ఆస్పత్రిలో ఏడాది కాలంగా రెండు బోర్లు అంతంత మాత్రమే పని చేస్తున్నాయి. ఆస్పత్రిలో మొత్తం ఐదు బోర్లు ఉండగా అందులో మూడు బోర్లు పనిచేయడం లేదు. వేసవికాలం సమీపిస్తున్నా తాగునీటి సమస్యలు పరిష్కరించుకోవడానికి ముందస్తుగా ఆస్పత్రి అధికారులు ఉన్నతాధికారులు, పాలకుల దృష్టికి తీసుకువెళ్లిన పాపాన పోలేదు. వినియోగంలో ఉన్న రెండు బోర్లతోనే వెళ్లదీస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా తాగునీటిని నిరంతరాయంగా సరఫరా చేయకపోతే ఈ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయి. అలంకారప్రాయంగా ఆర్ఓ ప్లాంట్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన ఆర్ఓ ప్లాంట్ అలంకార ప్రాయంగా మారింది. ఆస్పత్రికి వచ్చే రోగులు, అంటెండెంట్లకు సురక్షితమైన తాగునీటిని అందించాలని కలెక్టర్ ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ప్లాంట్కు సంబందించిన కెమికల్స్, మినరల్స్ కలపకుండానే నేరుగా కలుషితమైన వాటర్ ట్యాంక్ నుంచి ట్యాప్ ద్వారా సరఫరా చేస్తున్నారు. ఆస్పతికి స్వచ్ఛంద సంస్థ అందజేసిన వాటర్ ఫ్రిజ్ నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో నిరుపయోగంగా మారింది. తాగునీరు పట్టుకునే ట్యాప్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. ఓపీ పేషెంట్లు నీళ్లు తాగడానికి కనీసం గ్లాసులు కూడా ఏర్పాటు చేయలేని దుస్థితిలో ఆస్పత్రి అధికారులు ఉన్నారని రోగులు మండిపడు తున్నారు. ఏడాదిగా పనిచేయని మూడు బోర్లు నిరుపయోగంగా ఆర్వో ప్లాంటు ఇబ్బందులు పడుతున్న రోగులు, అటెండెంట్లు దుకాణాల్లో నీరు కొనుగోలు చేస్తున్న పరిస్థితి పట్టించుకోని అధికారులు.. దృష్టిసారించని పాలకులు -
వేసవిలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి
భూపాలపల్లి: ట్రాఫిక్ పోలీసులు వేసవిలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో భూపాలపల్లి ట్రాఫిక్ పోలీసులకు చలువ కళ్లద్దాలను ఎస్పీ పంపిణీ చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ఎండలో విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ సిబ్బంది తగిన జాగ్రత్తలు పాటిస్తూ, తరచూ నీరు తీసుకోవాలని సూచించారు. ప్రజల భద్రత కోసం నిరంతరం సేవలందిస్తున్న ట్రాఫిక్ సిబ్బందికి అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని తెలిపారు.ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
ఉద్యోగుల హామీలు నెరవేర్చాలి
భూపాలపల్లి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ సమస్యలు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ బూరుగు రవి మాట్లాడుతూ.. తెలంగాణ 2వ పీఆర్సీని శివశంకర్ కమిటీ నుంచి తెప్పించుకొని 51శాతం ఫిట్మెంట్తో వెంటనే అమలు చేయాలన్నారు. ఉద్యోగుల ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. 13వేల పైచిలుకు ఉన్న ఉద్యోగుల పెండింగ్ బిల్లులను ఏకమొత్తంలో ఒకే సారి విడుదల చేయాలని, ప్రభుత్వం ఇచ్చిన హమీ మేరకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్)ను రద్దుచేసి ఓల్డ్ పెన్షన్ స్కీ మ్ (ఓపీఎస్)ను అమలు చేయాలని డిమాండ్ చేశా రు. ప్రభుత్వం ముందుంచిన 63 డిమాండ్లను పరి ష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు రేగూరి సుభాకర్రెడ్డి, తిరుపతిరెడ్డి, దిల్షాద్, రామ్మోహన్, ఐలయ్య, మధుసూద న్, శ్రీనివాస్, దశరథరామారావు, సునీల్, షఫి సర్కార్ పాల్గొన్నారు.కలెక్టరేట్ ఎదుట ధర్నా -
నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం
కాళేశ్వరం: జయశంకర్భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ను ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకుల బృందం నేడు (శనివారం) ఉదయం 11గంటలకు సందర్శిస్తారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్, భూపాలపల్లి మాజీ జెడ్పీచైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, బానోత్ శంకర్నాయక్, నన్నపునేని నరేందర్, గండ్ర వెంకటరమణారెడ్డి, నడిపల్లి దివాకర్రావు, దాసరి మనోహర్రెడ్డి, మాజీ జెడ్పీచైర్పర్సన్ జ్యోతిలతో పాటు ముఖ్య నేతలు సందర్శిస్తారని పేర్కొన్నారు. దీంతో ఈనెల 20న సీఎం రేవంత్రెడ్డితో పాటు మంత్రులు మేడిగడ్డ సందర్శనకు రానున్న నేపథ్యంలో ముందుగానే బీఆర్ఎస్ బృందం రానుండడంపై రాజకీయంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. సింగరేణికి బకాయిలు చెల్లించాలి భూపాలపల్లి అర్బన్: విద్యుత్ సంస్థల నుంచి సింగరేణి సంస్థకు రావాల్సిన పెండింగ్ బకాయిలు చెల్లించాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు తుమ్మల రాజారెడ్డి, మంద నరసింహరావు డిమాండ్ చేశారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎన్నికల ముందు సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాలేదని విమర్శించారు. కారుణ్య నియామకాల కింద ఇవ్వాల్సిన ఉద్యోగాలను విజిలెన్స్ పేరుతో ఆలస్యం చేస్తూ కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. పెర్క్స్పై ఆదాయ పన్ను మినహాయింపు, కార్మికుల సొంతింటి కల, మారుపేర్ల సమస్యలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని తెలిపారు. ఈ సమస్యలన్నింటికీ ప్రధాన కారణం సింగరేణికి రావాల్సిన బకాయిలు చెల్లించకపోవడమేనని స్పష్టంచేశారు. విద్యుత్ సంస్థలు తక్షణమే బకాయిలు చెల్లించాలని, లేనిపక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 28న సీఐటీయూ ఆధ్వర్యంలో ‘చలో విద్యుత్ సౌధ’ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సీఐటీయూ నాయకులు కంపేటి రాజయ్య శ్రీ కాంత్, బాబురావు, తోట రమేశ్ పాల్గొన్నారు. విద్యుత్ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి ములుగు రూరల్: ఆస్పత్రుల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయని స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కుమారస్వామి అన్నారు. శుక్రవారం ములుగు జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్పత్రిల్లో విద్యుత్ వైర్లు నాణ్యమైనవి వినియోగించాలని, ఎలక్ట్రానిక్ పరికరాలను నిరంతరం పరిశీలించాలన్నారు. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు భయపడకుండా, సమయోచితంగా స్పందించడం ముఖ్యమన్నారు. ప్రమాద సమయంలో లిఫ్ట్ను ఉపయోగించకుండా మెట్లమార్గంలో రావాలన్నారు. అనంతరం ప్రమాదాలు జరిగిన సమయంలో తక్షణ చర్యలపై ప్రాక్టికల్ డెమో నిర్వహించారు.సమ్మేళనానికి సర్వం సిద్ధంములుగు: జిల్లా కేంద్రంలో నేడు (శనివారం) నిర్వహించనున్న విరాట్ హిందూ మహాసమ్మేళనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గండ్రకోట కుమార్ తెలిపారు. శుక్రవారం ఉత్సవ కమిటీ సభ్యులు మహాసమ్మేళనం నిర్వహించే స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహా సమ్మేళన కార్యక్రమం శనివారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమవుతుందన్నారు. శ్రీ భువనేశ్వరి దేవి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి స్వామిజీ, ధర్మ జాగరణ అఖిల భారత సహ సంయోజక్ ఏలె శ్యాంకుమార్ జీ హాజరవుతున్నట్లు తెలిపారు. ప్రతీఒక్కరూ కుటుంబ సభ్యులతో కలిసి కార్యక్రమంలో పాల్గొని కమిటీ సభ్యులు అందజేసిన నవధాన్యాలను తీసుకువచ్చి యాగంలో సమర్పించి భారతమాతతో పాటు హిందూ దేవతామూర్తుల ఆశీర్వాదం పొందాలన్నారు. -
సాక్షిప్రతినిధి, వరంగల్ :
..ఇలా కొందరు పోలీసుల వ్యవహారశైలి ఆ శాఖను అబాసుపాలు చేస్తోంది. కొందరు యువ ఎస్సైలు క్రమశిక్షణ గీత దాటి వేటుకు గురవుతుండటం ఆ శాఖలో చర్చనీయాంశమవుతోంది. వరంగల్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సన్ప్రీత్సింగ్.. కట్టుతప్పి అక్రమాలకు పాల్పడే పోలీసు అధికారులకు హెచ్చరికలు చేస్తూ నే ఉన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని మందలించినా ఫలితం లేకపోవడంతో చర్యలు తీసుకుంటున్నారు. గ్రేటర్ వరంగల్లోని ఇన్స్పెక్టర్(ఎస్హెచ్ఓ)లు, ఎస్సైలపైన ఉన్న ఫిర్యాదులపై విచారణ జరుగుతోంది. పలువురిపై చర్యలు కూడా తీసుకున్నారు. అయినప్పటికీ కొందరు పోలీసు అధికారులు తీరు మారడం లేదు. దీనికి కారణం వారికి రాజకీయ అండే కారణమన్న విమర్శలు లేకపోలేదు. వరుస ఘటనలతో కలకలం... క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాల్సిన పోలీసులు అవినీతికి పాల్పడటం, సివిల్ సెటిల్మెంట్లలో తలదూర్చడాన్ని వరంగల్ కమిషనర్ సీరియస్గా తీసుకుంటున్నారు. సుమారు 20 రోజుల వ్యవధిలో నలుగురిపై చర్యలు తీసుకున్నారు. మిల్స్ కాలనీలో ఎస్సైగా పనిచేస్తున్న సురేష్ను సస్పెండ్ చేసిన సీపీ.. ఆ ఠాణా పరిధిలోని కొన్ని ఘటనలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఆత్మకూరు ఎస్సై సతీష్ సస్పెన్షన్పైన చర్చ జరుగుతోంది. ఇదివరకే బచ్చన్నపేట ఎస్సై హమీద్ను పోలీసు హెడ్క్వార్టర్స్కు అటాచ్డ్ చేయగా, తాజాగా ఎల్కతుర్తి ఎస్సై ప్రవీణ్కుమార్ను ఏఆర్కు అటాచ్డ్ చేశారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని మరికొందరిపైనా విచారణ జరుగుతుందన్న ప్రచారం నేపథ్యంలో ఆ జాబితాలో ఎవరున్నారు? అన్న చర్చ మొదలైంది. సీరియస్గా ‘లేఖల’ పంచాయితీ.. గతేడాది డిసెంబర్లో వరంగల్ పోలీస్ డివిజన్లో ఏసీపీ, ఇన్స్పెక్టర్, ఎస్సైలపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి, ముగ్గురిని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో మరికొందరిపై త్వరలోనే బదిలీ లేదా సస్పెన్షన్ వేటు పడవచ్చన్న ప్రచారం పోలీసుశాఖలో జరుగుతోంది. గ్రేటర్ వరంగల్ పరిధి లోని నలుగురు ఇన్స్పెక్టర్ల తీరుపై ఇప్పటికే విచారణ జరుగుతున్నట్లు సమాచారం. అవినీతి అక్రమాలు, కేసులు కట్టడంలో నిర్లక్ష్యం, తప్పుడు కేసులు కట్టడం లాంటి ఆరోపణలు ప్రధానంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన ఇద్దరు ఎస్హెచ్ఓలు పొరుగు నియోజకవర్గాలకు బదిలీ చేయించుకునేందుకు ‘లేఖ’లు పొందడం కూడా వివాదాస్పదంగా మారినట్లు సమాచారం. విచారణ అనంతరం తీవ్రతను బట్టి వారిని సస్పెండ్ చేయడమా? వీఆర్కు పంపడమా? లేదా ఇతర జిల్లాలకు బదిలీ చేయడమా? అన్నది త్వరలోనే తేలనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే వారం, పది రోజుల్లో భారీగా ఇన్స్పెక్టర్ల బదిలీలు ఉంటాయన్న ప్రచారం జరుగుతుండగా.. సుమారు 10 మందికి పైగా సీఐలు వరంగల్ నగరంలోని ఆరు కీలక ఠాణాలకు లేఖలు పొంది ఒత్తిడి తీసుకువస్తున్నట్లు పోలీసుశాఖలో చర్చ జరుగుతోంది. ● యువ ఎస్సైల అత్యుత్సాహం.. అడ్డంగా బుక్కవుతున్న వైనం ● అత్యాచారం, వేధింపుల కేసుల్లో వారే.. ● వరుస సంఘటనలతో పోలీసుశాఖలో కలకలం ● పలువురిపై సస్పెన్షన్, బదిలీ వేటు ● ఇన్స్పెక్టర్లపైనా ఆరోపణలు.. విచారణ స్థాయిలో ఫిర్యాదులు ● చర్చనీయాంశంగా కొందరు పోలీసుల తీరు -
ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి
మల్హర్(కాటారం): కాటారం మండలం నస్తూర్పల్లి గ్రామంలో ఈ నెల 20న జరిగే సీఎం రేవంత్రెడ్డి బహిరంగ సభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రైతు భరోసా నిధులు విడుదల చేయనున్న బహిరంగ సభ స్థలాన్ని శుక్రవారం కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, భూపాలపల్లి, రామగుండం శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు, మక్కాన్ సింగ్ రాజ్ఠాకూర్తో కలిసి శ్రీధర్బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మంథని నియోజకవర్గం, భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజ్ సందర్శన, కాటారం మండలం నస్తూర్పల్లి గ్రామంలో రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేయడానికి సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు శాసనసభ్యులందరూ పాల్గొంటారని చెప్పారు. రైతులు, మహిళలు అధికసంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయంవతం చేయాలని కోరారు. బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన మల్హర్(కాటారం): కాటారం మండలం నస్తూర్పల్లి గ్రామంలో ఈ నెల 20న ముఖ్యమంత్రి బహిరంగ సభ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ రాహుల్ శర్మ శుక్రవారం పరిశీలించారు. సభా ప్రాంగణాన్ని సందర్శించిన కలెక్టర్ వేదిక ఏర్పాట్లు, ప్రాంగణ అభివృద్ధి, లైటింగ్, పార్కింగ్, భద్రత తదితర అంశాలపై దిశానిర్ధేశం చేశారు. ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగిన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్ అశోక్కుమార్, తహసీల్దార్ నాగరాజు, ఎంపీఓ వీరస్వామి, విద్యుత్ డీఈ నాగరాజు పాల్గొన్నారు. లైటింగ్ ఏర్పాట్ల పరిశీలన సీఎం బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తి చేయాలని డీఎల్పీఓ మల్లికార్జున్రెడ్డి అధికారులను ఆదేశించారు. నస్తూరిపల్లి లైటింగ్ ఏర్పాట్లు చేసే ప్రదేశాన్ని పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ డీఈ నాగరాజు, ఎంపీఓ, పంచాయతీ కార్యదర్శులు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు -
20నుంచి ‘ఓపెన్’ టెన్త్, ఇంటర్ పరీక్షలు
విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ నెల 20నుంచి 27వ తేదీ వరకు ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. రోజుకు రెండు సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2–30నుంచి సాయంత్రం 5–30గంటల వరకు జరుగుతాయి. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలోని హనుమకొండ, వరంగల్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో ఆయా జిల్లాల విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు చేయిస్తున్నారు. ఆరు జిల్లాల్లో కలిపి టెన్త్లో 3,945మంది విద్యార్థులకునుగాను 22 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు. 197మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఇంటర్లో 7,187మందికిగాను 35 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 359మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు హనుమకొండ జిల్లాలో ఏర్పాట్లు పూర్తిచేసినట్లు డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్, ఓపెన్ స్కూల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ ఎ.సదానందం శుక్రవారం తెలిపారు. హాల్టికెట్లు సంబంధిత వెబ్సైట్(తెలంగాణఓపెన్స్కూల్.ఓఆర్జీ)లో అందుబాటులో ఉంచారని, విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు కోరారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో టెన్త్లో 3,495 మంది.. ఇంటర్లో 7,187 మంది విద్యార్థులు -
20న ‘రైతు భరోసా’ విడుదల
ఈ నెల 20న నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం రేవంత్రెడ్డి రైతు భరోసా రెండో విడత నిధులను విడుదల చేయనున్నారు.ఈ ఫొటో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో తాగునీటి ట్యాప్ల వద్ద ప్రదేశం. ఆస్పత్రికి వస్తే రోగాలు పోతాయని అనుకొని వస్తుంటారు. కానీ కొత్త రోగాలు వ్యాప్తి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్ఓ ప్లాంట్ పూర్తిగా ధుమ్ముదూళి, బూజుతో నిండిపోయింది. శానిటేషన్ సిబ్బంది ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడంతో మట్టి పేరుకుపోయింది. మురికి పట్టిన ప్రాంతం నుంచే రోగుల బంధువులు బాటిళ్లలో నీరు తీసుకెళ్తున్నారు. -
మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
మల్హర్(కాటారం): మహిళల స్వయంకృషితో టైలరింగ్ ఎంబ్రాయిడింగ్, కుట్లు, అల్లికల ద్వారా లక్షల రూపాయలు అర్జించే అవకాశం ఉంటుందని కాటారం మార్కెట్ చైర్పర్సన్ పంతకాని తిరుమల అన్నారు. కాటారం రైతు వేదికలో ఉచిత టైలరింగ్ శిక్షణ ముగింపు కార్యక్రమానికి డీఆర్డీఓ బాలకృష్ణతో కలిసి గురువారం పాల్గొని మాట్లాడారు. సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కోరారు. మహిళలను కోటీశ్వరులను చేయాలనే ప్రధాన ఉద్దేశంతో మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్బాబు ఆలోచనతో ఇందిరమ్మ క్యాంటీన్లు, ఆర్టీసీ బస్సులు, వడ్డీలేని రుణాలు, పెట్రోల్ పంపులు, టైలరింగ్ ఉపాధి శిక్షణ కేంద్రాలను మహిళలకు కేటాయిస్తున్నారని చెప్పారు. మహిళలంతా ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వ్యాపారవేత్తలుగా పారిశ్రామిక సంస్థలను నెలకోల్పాలని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం రవికుమార్, మండల సమైక్య అధ్యక్షురాలు ఫరహాన బేగం, సీసీలు రవికుమార్, లక్ష్మి, సారక్క, మాధవి టైలరింగ్ శిక్షకులు సజన, కల్పన పాల్గొన్నారు.కాటారం మార్కెట్ చైర్పర్సన్ తిరుమల -
శుక్రవారం శ్రీ 17 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
భూపాలపల్లి పట్టణంలో పేరుకే జీఎస్టీ భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలో హోల్సేల్, రిటైల్ వ్యాపారం జీఎస్టీ బిల్లులు లేకుండానే ఎక్కువ శాతం సరుకులు ’జీరో బిల్లు’తో సాగుతోంది. జీరో బిల్లు దందాతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోంది. ఈ దందాకు అధికారులు వత్తాసు, అండదండలు ఉండటంతో అడ్డులేకుండా సాగుతోంది. భూపాలపల్లి జిల్లాకేంద్రాన్ని ఆనుకొని చుట్టుపక్కల మండలాల్లో కొన్ని ప్రాంతాలు గిరిజన పల్లెలు కావడంతో జీరో దందాకు కేంద్ర బిందువుగా మారింది. ఇతర ప్రాంతాల నుంచి స్థానిక వ్యాపారులకు వివిధ రూపాల్లో బిల్లులు లేకుండానే సరుకులు వస్తుండగా, కోట్లాది రూపాయల సరుకులు వినియోగదారులకు, చిన్న చిన్న వ్యాపారులకు యథావిధిగా జీఎస్టీ బిల్లు ఇవ్వకుండా విక్రయాలు చేస్తున్నారు. కోట్లాది రూపాయల సరుకులు వేరే రాష్ట్రాలతోపాటు వరంగల్, హైదరాబాద్ తోపాటు మరికొన్ని ప్రాంతాల నుంచి రావడం, వాటిని వ్యాపారులు తమ గోదాంలకు తరలించి అక్రమంగా నిల్వ ఉంచడం కొన్నేళ్లుగా షరామామూలేగా జరుగుతోంది. పట్టపగలు, రాత్రి తేడా లేకుండా ఆయా సరుకులను జీరో బిల్లుతోనే ఎగుమతి చేస్తున్నారు. ముఖ్యంగా ఐరన్, ఆటోమొబైల్ వస్తువులు, వంట నూనెలు, ఎరువులు, పురుగుల మందులు, పంచదార, బెల్లం, సిమెంట్, ఎలక్ట్రికల్ సామన్లు, బంగారు అభరణాలతో సహా అన్ని రకాల సరుకులంతా జీరో బిల్లులతోనే సాగుతున్నాయి. ఆయా సరుకులన్నీ ప్రతి నిత్యం వందల సంఖ్యలో వాహనాలు దిగుమతి చేస్తుంటాయి. ఇదంతా పట్టపగలే రోడ్డుపైనే సాగుతున్నా అధికారులకు మాత్రం కనీసం పట్టడం లేదు. జీఎస్టీ బోర్డులకే పరిమితమా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నేరుగా ఆదాయాన్ని అందేలా జీఎస్టీ బిల్లులను కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం జీరో దందాకు బ్రేక్ వేసి ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చూడటమే. కానీ భూపాలపల్లి, కాటారం వ్యాపారులు మాత్రం జీఎస్టీ బిల్లును కేవలం బోర్డులకే పరిమితం చేశారనే ఆరోపణలు బహిరంగంగా ఉన్నాయి. ఆయా దుకాణాల్లో, బోర్డులో మాత్రం జీఎస్టీ పిన్ నంబరును రాసి వినియోగదారులకు మాత్రం బిల్లులే ఇవ్వడం లేదు. విద్యావంతులు జీఎస్టీ బిల్లు అడిగితే ’మీకే నష్టం.. వద్దండీ’ అని చెబుతున్నారు. దాంతో వ్యాపారే ఇవ్వడం లేదు కదా అని మాకెందుకులే అంటూ బిల్లు లేకుండానే సరుకులను కొనుగోలు చేస్తున్నారు. స్థానికంగా ఒకటి రెండు పెద్ద షాపింగ్ మాల్స్లో మాత్రమే జీఎస్టీ బిల్లులు ఇస్తుండగా, మిగిలిన అన్ని దుకాణాల్లో జీరోతోనే కాలం గడిపేస్తున్నారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కోట్లాది రూపాయలు జీఎస్టీ బిల్లుల రూపంలో నష్టం వాటిల్లుతోంది. జీరో బిల్లు దందాను అరికట్టాల్సిన విజిలెన్స్, వాణిజ్య పన్నుల శాఖ అధికారుల వత్తాసుతోనే బిల్లు లేకుండా దందా సాగుతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఏళ్లుగా సాగుతున్న జీరో బిల్లు వ్యవహారంపై వాణిజ్య. విజిలెన్స్ అధికారులు అక్రమ వ్యాపారులతో మిలాఖత్ కావడంతోనే స్థానిక వ్యాపారులు అప్రమత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. ఆయా శాఖల అధికారులు కొంతమంది అక్రమ వ్యాపారులనే తమ ఏజెంట్లుగా, దళారులుగా పెట్టుకొని మిగిలిన అక్రమ వ్యాపారుల వద్ద నుంచి నెల నెల వసూళ్లు చేసి దండుకుంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు. వసూళ్ల దందాకు ఆయా శాఖల్లోని కింది స్థాయి అధికారుల పాత్రే కీలకమని తెలుస్తోంది. ఆయా శాఖలకు స్థానికంగా ఉన్న ఓ బడా వ్యాపారి, అధికార పార్టీని అడ్డుపెట్టుకొని దందాకు సహకరించేలా చక్రం తిప్పుతున్నట్లు వ్యాపారులే చెప్పడం గమనార్హం. రూ.కోట్లలో ప్రభుత్వ ఆదాయానికి గండి అక్రమ వ్యాపారానికి అధికారుల వత్తాసు -
రామప్ప దేవాలయంలో అధికారులు
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని రామప్ప దేవాలయాన్ని గురువారం హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న సెంట్రల్ సెక్రటరీ సర్వీస్కు చెందిన 70 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ సందర్శించారు. భారత్ దర్శన్లో భాగంగా వారు రామప్ప ఆలయాన్ని సందర్శించి రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించగా అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్ వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ ఆలయ చరిత్ర, శిల్పకళ వైభవం గురించి వివరించారు. వారి వెంట కోర్స్ డైరెక్టర్ కిరణ్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా రామప్ప ఆలయాన్ని డీఆర్డీఓ చంద్రశేఖర్ సందర్శించి రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. -
బీసీలే ఎక్కువ
● ఉమ్మడి వరంగల్లోని మొత్తం జనాభా 36,88,217లో 18,37,374 మంది వారే..● ఆ తర్వాతి వరుసలో ఎస్సీలు, ఎస్టీలు, ఓసీలు ● చివరి స్థానంలో బీసీ ముస్లిం, మైనారిటీలు ● మొత్తం 12,32,892 ఇళ్లు ఉన్నట్టు నిర్ధారణ ● తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్య, కులగణన సర్వేలో వెల్లడి సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జనాభా 36,88,217 మంది అని తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, కులగణన సర్వే నివేదిక తేల్చి చెప్పింది. అదే సమయంలో 12,32,892 ఇళ్లు ఉన్నట్లు ఉన్నాయని వెల్లడించింది. జనాభా పరంగా చూసుకుంటే 18,37,374 మంది బీసీలు తొలిస్థానంలో ఉంటే, 1,74,440 మందితో బీసీ ముస్లిం మైనారిటీలు చివరి స్థానంలో ఉన్నారు. ఇల్లు ఉన్నవారి విషయానికొస్తే ఓసీలు 35.35 శాతంతో తొలిస్థానంలో ఉండగా, 30.60% బీసీ ముస్లిం మైనారిటీలు చివరి స్థానంలో ఉన్నారు. అదేవిధంగా ఎస్టీలు అత్యధికంగా మహబూబాబాద్ జిల్లాలో 3,22,361 మంది ఉంటే...అత్యల్పంగా హనుమకొండలో 29,139 మంది ఉన్నారు. ఓసీలు అత్యధికంగా హనుమకొండ జిల్లాలో 89,410 మంది ఉంటే అత్యల్పంగా ములుగులో 20,684 మంది ఉన్నారని వెల్లడించింది. ఇక ఎస్సీలు అత్యధికంగా హనుమకొండ జిల్లాలో 1,83,984 మంది ఉంటే ములుగు జిల్లాలో అతి తక్కువగా 49,746 మంది ఉన్నారని తెలిపింది. బీసీలు అత్యధికంగా హనుమకొండ జిల్లాలో 4,50,150 మంది ఉంటే అతి తక్కువగా ములుగు జిల్లాలో 1,18,254 మంది ఉన్నారని పేర్కొంది. జనాభాలో వరంగల్ జిల్లా ముందు... ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు జిల్లాల మొత్తం జనాభా 36,88,217 ఉంటే వరంగల్ జిల్లాలోనే అత్యధికంగా 8,36,811 మంది ఉన్నట్టు సర్వే తేల్చింది. ఆ తర్వాత 8,04,515మందితో మహబూబాబాద్, 7,99,448మందితో హనుమకొండ, 5,45,449మందితో జనగామ, 4,07,896మందితో జయశంకర్ భూపాలపల్లిలు ఉండగా, చిట్టచివరగా 2,94,098 జనాభాతో ములుగు జిల్లా ఉంది. -
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
మల్హర్(కాటారం): ఈనెల 20న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్శర్మ అధికారులను ఆదేశించారు. గురువారం కాటారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్తో కలిసి ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం పర్యటన అనంతరం కాటారం మండలం నస్తురుపల్లిలో రైతు భరోసా రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. అధికారులు విధులను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. నస్తూరుపల్లి బహిరంగ సభకు విచ్చేసే ప్రజలకు తాగునీరు, మజ్జిగ ఏర్పాటు చేయాలన్నారు. బహిరంగ సభా స్థలి వద్ద పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి పరిశుభ్రం చేయాలని డీపీఓకు సూచించారు. విద్యుత్, ఆర్అండ్బీ, పీఆర్ ఇంజనీరింగ్, వైద్యారోగ్యశాఖ అధికారులు విధుల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మాట్లాడుతూ సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ నెల 19, 20 తేదీలలో ఇసుక లారీలకు అనుమతి ఇవ్వొద్దని, మూసివేయాలని ఆయన తెలిపారు. విధులు నిర్వహించే సిబ్బందికి గుర్తింపు కార్డులు జారీ చేయాలని కలెక్టరేట్ ఏఓకు సూచించారు. అంతకుముందు కాళేశ్వరం, నస్తూరుపల్లిలో సీఎం పర్యటన హెలి ప్యాడ్ పనులను పరిశీలించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఆర్డీఓ హరికష్ణ, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
కో–ఆప్షన్ సభ్యుల ఎంపికకు నోటిఫికేషన్ విడుదల
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి మున్సిపాలిటీలో కో–ఆప్షన్ సభ్యుల ఎంపికకు గురువారం మున్సిపల్ కమిషనర్ ఉదయ్కుమార్ నోటిఫికేషన్ విడుదల చేశారు. పట్టణంలో 30 వార్డులు ఉండగా నలుగురు కో–ఆప్షన్ సభ్యులను నియమించనున్నారు. ఈ మేరకు జనరల్ కేటగిరిలో ఒక మహిళ, జనరల్, మైనారిటీ కేటగిరిలో ఒక మహిళ, జనరల్ స్థానాలను కేటాయించారు. అర్హత గల అభ్యర్థులు ఈ నెల 23వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వరంగల్ లీగల్: వరంగల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ఎం.సాయికుమార్ను హైదరాబాద్ ఏడో చీఫ్ జుడీషియల్ మెజిస్ట్రేట్గా బదిలీ చేస్తూ.. హైకోర్టు రిజిస్టార్ జనరల్ (విజిలెన్స్) గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన సీనియర్ సివిల్ జడ్జిల బదిలీల్లో భాగంగా భూపాలపల్లి సినియర్ సివిల్ జడ్జి ఎ.నాగరాజు గద్వాల ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా బదిలీకాగా.. జనగామ సినియర్ సివిల్ జడ్జి ఇ.సుచరితను రంగారెడ్డి జిల్లా రాజేందర్నగర్లోని ప్రిన్సిపల్ సీనియర్ జడ్జిగా బదిలీ చేశారు. బదిలీ అయిన న్యాయమూర్తులు ఈనెల 20వ వరకు చార్జ్ అప్పగించి 25వ తేదీలోపు బాధ్యతలు చేపట్టాలని ఉత్తర్వుల్లో రిజిస్ట్రార్ జనరల్ ఆదేశించారు. ఐటీడీఏ ఏపీఓ డిప్యుటేషన్ రద్దు ● ఉట్నూరుకు వసంతరావు బదిలీ ● ఏటూరునాగారం ఏపీఓగా నాగోవరావు నియామకం ఏటూరునాగారం: ఏటూరునాగారం ఐటీడీఏలో డిప్యుటేషన్పై ఏపీఓగా పనిచేస్తున్న వసంతరావు జాదవ్ డిప్యూటేషన్ను ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ సబ్యసాచి ఘోష్ రద్దు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉట్నూరులో పనిచేయాల్సిన వసంతరావు ఏటూరునాగారం డిప్యుటేషన్పై వచ్చారు. గత ఏడాదిగా ఇక్కడే పనిచేస్తున్నారు. ఎట్టకేలకు హైదరాబాద్లో ఏపీఓ జనరల్గా పనిచేస్తున్న నాగోవరావును ఏటూరునాగారం ఏపీఓగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఏటూరునాగారం ఐటీడీఏ ఏపీఓగా నాగోవరావు విధుల్లో చేరనున్నారు. దేవాదుల మోటార్ల పంపింగ్ నిలిపివేత కన్నాయిగూడెం: మండల పరిధిలోని తుపాకులగూడెం గ్రామ పంచాయతీ గుట్టగంగారం వద్ద ఉన్న దేవాదులలో నాలుగు మోటార్ల పంపింగ్ను బుధవారం అధికారులు నిలిపి వేశారు. దేవాదుల వద్ద మూడు ఫేజ్లలో పది మోటార్లు ఉన్నాయి. అందులో గత కొన్ని రోజుల నుంచి ఎత్తిపోతల వద్ద ఆరు మోటార్లతో పంపింగ్ చేస్తూ నీటిని దిగువలో ఉన్న భీమ్ఘన్పూర్, గొల్ల బుద్ధారం రిజర్వాయర్లకు నీటిని ఎత్తిపోసిన అధికారులు బుధవారం ఫేజ్ త్రీలో మూడు, ఫేజ్ టులో ఒక మోటారును ఇంజనీరింగ్ అధికారులు నిలిపివేశారు. ప్రస్తుతం పేజ్త్రీలో రెండు మోటార్లతో 583 క్యూసెక్కుల నీటిని దిగువకు పంపింగ్ చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వ్యాస సంపుటి ఆవిష్కరణ కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జర్నలిజం విభాగ అధ్యాపకుడు డాక్టర్ ఆర్.ఆదిరెడ్డి రచించిన సామాజిక, ఆర్థిక, వ్యవసాయ అంశాలపై వ్యాస సంపుటిని కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డి గురువారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ.. అధ్యాపకులు, పరిశోధన, రచనా రంగాల్లో చురుగ్గా ఉండాలన్నారు. కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం మాట్లాడుతూ.. ఈగ్రంథం సమాజ చైతన్యానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో కేయూ ఓఎస్డీ ప్రొఫెసర్ బి.వెంకట్రామ్రెడ్డి, ఆకళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.జ్యోతి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రెహమాన్, రచయిత డాక్టర్ ఆర్.ఆదిరెడ్డి ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు. -
గ్రామాల అభివృద్ధే లక్ష్యం
● మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య భూపాలపల్లి రూరల్: ప్రజా ప్రతినిధులు, అధికారులను సమన్వయం చేసుకుంటూ పార్టీలకతీతంగా గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్ సూచించారు. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి నివేదిక మండల స్థాయి సమావేశం జిల్లాకేంద్రంలోని సింగరేణి కమ్యూనిటీ హాల్లో ఇన్చార్జ్ ఎంపీడీఓ నాగరాజు అధ్యక్షతన గురువారం జరిగింది. చైర్మన్ బుర్ర కొమురయ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సర్పంచ్లు, అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. గ్రామాలలో సర్పంచ్లకు పంచాయతీ కార్యదర్శులకు కొన్ని సమస్యలు ఉన్నమాట వాస్తవమేనన్నారు. వాటిని అధిగమిస్తూ గ్రామాల అభివృద్ధికి పనిచేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా కృషి చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, ఉచిత విద్యుత్ వంటి పథకాలను ప్రతి ఇంటికి చేరే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మండల ప్రత్యేక అధికారి జవహర్లాల్ మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి నివేదికలోని ఐదు అంశాలను ప్రజలకు చేరే విధంగా అధికారులు సర్పంచ్లు కృషి చేయాలని సూచించారు. వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందిస్తూ నూతన వ్యవసాయ విధానాలు అమలుచేసే విధంగా వ్యవసాయ అధికారులకు సూచనలు చేశారు. యువత జిల్లాకేంద్రంలో సింగరేణి ఏర్పాటుచేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా శిక్షణ పొందాలని, టాస్క్ ద్వారా ఉద్యోగ అవకాశాలు అందుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం నూతనంగా జూనియర్ కళాశాలకు మధ్యాహ్న భోజనం, అంగన్వాడీలకు, ప్రభుత్వ పాఠశాలలకు అల్పాహారం వంటి నూతన పథకాలను అమలు చేసే విధంగా సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో తహసీల్దార్ లక్ష్మి రాజయ్య, హౌసింగ్ పీడీ లోకిలాల్, మండల పరిషత్ సూపరింటెండెంట్ రవీందర్, ఎస్సై గీతా రాథోడ్, భూపాలపల్లి మండలంలోని సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు. -
స్కూల్ ఎదుట ధర్నా
భూపాలపల్లి అర్బన్: మాలాధారణతో బుధవారం పాఠశాలకు వచ్చిన విద్యార్థిని ప్రిన్సిపాల్ అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ గురువారం విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, బీజేపీ కౌన్సిలర్లు, నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. పోలీసులు రావడంతో తోపులాట చోటుచేసుకుంది. భూపాలపల్లి పట్టణంలోని సింగరేణి హైస్కూల్లో ఏడో తరగతి చదువుతున్న ఓంకార్ బుధవారం మాలాధారణతో పాఠశాలకు రావడంతో ప్రిన్సిపాల్ జాన్సీరాణి అనుమతించలేదు. గురువారం ఉదయం పాఠశాల గేటు ఎదుట ధర్నా చేపట్టిన నాయకులు ప్రిన్సిపాల్ తక్షణమే క్షమాపణ చెప్పాలని, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో ధర్నా కొనసాగడంతో విద్యార్థులకు అంతరాయం కలగడంతో పాఠశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిరసనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. వారు వెనక్కి తగ్గకపోవడంతో కొందరు నాయకులు, విద్యార్థి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ నాయకులు మాట్లాడుతూ.. ప్రిన్సిపాల్ వ్యాఖ్యలు కేవలం విద్యార్థిపై కాకుండా హిందూ ధర్మాన్ని అవమానించే విధంగా ఉన్నాయని ఆరోపించారు. -
20న కాళేశ్వరానికి సీఎం
కాళేశ్వరం: ఈనెల 20వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ భద్రత, ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. 20న సీఎం రేవంత్రెడ్డితో పాటు మంత్రులు రానున్న సందర్భంగా కట్టుదిట్టమైన భధ్రత ఏర్పాటు చేయనున్నారు. సుమారు 40 ఎకరాల్లో సభాస్థలి, ఇతర ఏర్పాట్లు చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలక మేడిగడ్డ బ్యారేజీలో 2023 అక్టోబర్ 21న 7వ బ్లాక్లోని 20వ పియర్(పిల్లర్) కుంగిపోగా, వంతెన కుంగి పగుళ్లు తేలిన విషయం తెలిసిందే. అదే సమయంలో అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సీపేజీ లీకేజీలు ఏర్పడ్డాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం (ఎన్డీఎస్ఏ) నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయడం లేదు. వాటికి మరమ్మతులు చేసి పునరురిస్తామని ఇటీవల సీఎం ఇచ్చిన హామీ మేరకు పర్యటన ఖరారైందని రైతాంగం ఆశిస్తోంది. ఇప్పటికే పుణేకు చెందిన సీడబ్ల్యూపీఆర్ఎస్ బృందం సైంటిస్టులు బ్యారేజీలో పలమార్లు జియోఫిజికల్, జియోటెక్నికల్తో పాటు పలు రకాల పరీక్షలు చేపట్టారు. ఆ పరీక్షలను సీఎం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించనున్నారు. ఇరిగేషన్శాఖ అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టింది. నస్తూర్పల్లిలో సభ సీఎంతో పాటు ఇతర మంత్రుల మేడిగడ్డ పర్యటన తర్వాత బహిరంగ సభలో పాల్గొని మాట్లాడనున్నారు. ఈ సభా వేదిక నిర్వహణను 40 ఎకరాల్లో కాటారం మండలం నస్తూర్పల్లిలో సభా వేదిక, వాహనాల పార్కింగ్ సదుపాయాలు, హెలిపాడ్, భద్రతా ఏర్పాట్లు, ప్రజలకు మౌలిక సదుపాయాలను అధికారులతో కలిసి కలెక్టర్, ఎస్పీ, ఇతర శాఖల అధికారులు పరిశీలించారు. కాగా, కాళేశ్వరం, కుదురుపల్లిలో సభాస్థలి కోసం పరిశీలనలు చేసినప్పటికీ అనువుగా ఉండే నస్తూర్పల్లిలో ఏర్పాట్లకు అధికారులు సుముఖం తెలిపారు. దీంతో పకడ్బందీ ఏర్పాట్లు జరుగనున్నాయి. పకడ్బందీ ఏర్పాట్లు చేయండి.. ఈ నెల 20న సీఎం రేవంత్రెడ్డి పర్యటనను పురస్కరించుకొని కాటారం మండలం ధన్వాడలోని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తన నివాసంలో భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఇందులో మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి మేడిగడ్డకు చేరుకుని ప్రాజెక్టును పరిశీలిస్తారని, అనంతరం సరస్వతి అంత్య పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించి, తర్వాత జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని వివరించారు. సీఎం పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భద్రత, రవాణా, హెలిపాడ్, పారిశుద్ధ్యం, తాగునీరు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐత ప్రకాశ్రెడ్డి, ఉపాధి హామీ పథకం రాష్ట్ర సభ్యులు దండు రమేశ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు తదితరులు పాల్గొన్నారు. కాటారం మండలం నస్తూర్పల్లిలో సభాస్థలి, పార్కింగ్ స్థలాలు ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీలు ధన్వాడలో అధికారులతో మంత్రి శ్రీధర్బాబు సమీక్ష -
యువత భవిత మనందరి బాధ్యత
● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ భూపాలపల్లి: యువత భవిత మనందరి బాధ్యతని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. అలైవ్–అరైవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఓ గార్డెన్లో పో లీసుశాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత, మత్తు ప దార్థాల నిర్మూలన, సైబర్ నేరాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సర్పంచులు, మున్సిపల్ కౌ న్సిలర్లకు బుధవారం అవగాహన కార్యక్రమాన్ని ని ర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ యువతలో సానుకూల మార్పు తీసుకురావడంలో గ్రామ, వార్డుస్థాయి నాయకత్వం కీలకమన్నారు. ప్రజాప్రతినిధులు ముందుండి యువతను సరైన దిశలో నడిపించాలని సూచించారు. మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్న వారి వివరాలను పోలీసులకు తెలియజేసి సమాజాన్ని రక్షించడంలో భాగస్వాములు కావాలని కోరారు. అలాగే నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, దీని కోసం ప్రజాప్రతినిధులు చొరవ చూపాలన్నారు. అనంతరం రహదారి భద్రతపై పోలీసు అధికారులు, సర్పంచ్లు, కౌన్సిలర్లతో ఎస్పీ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ నరేష్కుమార్, డీఎస్పీ సంపత్రావు, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్చైర్మన్ అంబాల శ్రీనివాస్, కౌన్సిలర్లు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
ధాన్యం అక్రమ రవాణా చేస్తే చర్యలు
● జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కిరణ్కుమార్కాళేశ్వరం: ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం అక్రమ రవాణా చేస్తే చర్యలు తప్పవని, దీనిని పూర్తిగా అడ్డుకునే దిశగా కఠినచర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి కిరణ్ కుమార్ తెలిపారు. బుధవారం మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద ఏర్పాటు చేసిన అంతరాష్ట్ర చెక్పోస్టును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ, పోలీసు, వ్యవసాయ, పౌర సరఫరాలశాఖలు సమన్వయంతో 24 గంటలు నిరంతర పహారా నిర్వహిస్తాయన్నారు. జిల్లా రైతుల ప్రయోజనాలను కాపాడడం, వారికి న్యాయమైన మద్దతు ధర ల భించేలా చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా ధాన్యం రాకుండా పటిష్ట నియంత్రణ చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అంతరాష్ట్ర చెక్పోస్టు ద్వారా వాహనాల తనిఖీలు క్రమం తప్పకుండా నిర్వహించబడతాయని, నియమావళిని ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాలశాఖ జిల్లా మేనేజర్ రాములు, ఎస్సై తమాషారెడ్డి, మండల వ్యవసాయ అధికారి శ్రీజ, సివిల్ సప్లయీస్ ఇన్స్పెక్టర్లు సురేందర్రెడ్డి, రాజు, జీపీఓ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. -
వేతన భారం!
భూపాలపల్లి రూరల్: నిధుల కొరతతో గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్న గ్రామ పంచాయతీలపై రాష్ట్ర ప్రభుత్వం మరోభారం మోపింది. పారిశుద్ధ్య కార్మికుల వేతనాలను ఇక నుంచి పంచాయతీ నిధుల నుంచే చెల్లించాలని ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల వేతనాలను కూడా చెల్లించారు. ఈ నిర్ణయంపై పంచాయతీ పాలకవర్గాలు కలవరపడుతున్నాయి. నిధుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పంచాయతీలకు వేతనభారం కానుంది. పాత పద్ధతిలోనే ప్రభుత్వమే నేరుగా తమ ఖాతాల్లో వేతనాలు జమ చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. పంచాయతీ కార్మికుల వేతనాలను 15వ ఆర్థిక సంఘం నిధులు, జనరల్ ఫండ్ లేదా ఇతర అంతర్గత వనరుల నుంచే చెల్లించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు సకాలంలో మంజూరు కావడంలేదు. కేంద్ర ప్రభుత్వం మూడు నెలలకు మేజర్ పంచాయతీలకు సుమారు రూ.3 లక్షల వరకు నిధులు విడుదల చేస్తోంది. ఈ నిధులతోనే పారిశుద్ధ్య పనులు, వేతనాలు చూసుకోవాలని స్పష్టం చేసింది. పంచాయతీలకు కష్టకాలం.. జిల్లాలో 248 గ్రామ పంచాయతీలు ఉండగా, 1,026 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వీరందరినీ మల్టీపర్పస్ వర్కర్లుగా పరిగణిస్తూ నెలకు రూ.9,500 చొప్పున వేతనం చెల్లిస్తున్నారు. గతంలో ఈ వేతనాల కోసం ప్రత్యేక నిధులు విడుదలయ్యేవి. పంచాయతీ అభివృద్ధి నిధులతో సంబంధం లేకుండా కార్మికులకు కనీసం మూడు నెలలకొకసారి జీతాలు చెల్లించేవారు. ప్రసుత్తం వేతనాలకు పంచాయతీ నిధులకు ముడి పెట్టడంతో కా ర్మికుల్లో ఆందోళన మొదలైంది. గ్రామాల్లో వీధి దీపాలు, బోరు మోటార్ల మరమ్మతు విద్యుత్ బిల్లుల భారం కూడా పంచాయతీలపైనే పడుతోంది. విద్యుత్ చార్జీలు, వర్కర్ల వేతనాలు చెల్లించగా మిగిలిన నిధులను మాత్రమే అత్యవసర పనులకు వాడుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే నిధులు లేక సర్పంచులు, కార్యదర్శులు సతమతమవుతున్నారు. ఈ అదనపు భారం మోయడం సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2025 నుంచి గ్రీన్ చానల్ ద్వారా వేతనాలు చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు. చేతులెత్తేయడంపై విమర్శలు వస్తున్నాయి. మాజీ సర్పంచుల ఒత్తిడి.. చేసిన పనుల బిల్లులు, బకాయిల కోసం మాజీ సర్పంచులు కొత్త పాలకవర్గాలపై ఒత్తిడి తెస్తున్నారు. గతంలో చేసిన పనులకు సంబంధించి ఎంబీ రికార్డులు చేయించినా బిల్లులు రాలేదని వాపోతున్నారు. కొందరు వాస్తవంగా పనులు చేసినా మరికొందరు అక్రమంగా బిల్లులు సృష్టించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం ఉన్న నిధులను వేతనాలు, కరెంటు బిల్లులకే కేటాయించమనడంతో పాత బకాయిలు ఎలా చెల్లించాలో తెలియక కొత్త పాలకవర్గాలు తలలు పట్టుకుంటున్నాయి. పారిశుద్ధ్య కార్మికులకు గ్రీన్ చానెల్ ద్వారా వేతనాలు ఇస్తామని ప్రకటించి, ఇప్పుడు పంచాయతీలే చెల్లించుకోవాలని చెబుతున్నారు. వెంటనే జీఓ నంబర్ 51 రద్దు చేయాలి. విద్యార్హతల ప్రకారం కారోబార్లకు కార్యదర్శులుగా పదోన్నతులు కల్పించాలి. ప్రత్యేక నిధులు కేటాయించి పాత పద్ధతిలోనే వేతనాలు అందించాలి. – బంటు సుదర్శన్, కారోబార్ పంబాపూర్ గతంలోనూ ఇదే పద్ధతిలో పంచాయతీల నుంచే పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించాం. అయితే రెండేళ్లుగా పాలకవర్గాలు లేకపోవడంతో ప్రభుత్వం చెల్లించింది. ప్రస్తుతం పాలకవర్గాలు కొలువుదీరడంతో జనవరి నుంచి పంచాయతీలు వేతనాలు చెల్లిస్తున్నాయి. – శ్రీలత, డీపీఓ కేంద్ర, రాష్ట్ర నిధులు వినియోగించుకునేందుకు అవకాశం ప్రభుత్వమే నేరుగా చెల్లించాలని విన్నపం జిల్లాలో 248 జీపీలు, 1,026 పారిశుద్ధ్య కార్మికులు -
అంబేడ్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టాలి
● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ భూపాలపల్లి: నేటి యువత అంబేడ్కర్ ఆశయాలను లోతుగా అర్థం చేసుకుని వాటిని ఆచరణలో పెట్టాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత, మహానీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 135వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అంబేడ్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ డాక్టర్ భీంరావ్ రాంజీ అంబేడ్కర్ భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే మహానీయుడని పేర్కొన్నారు. ఆయన ప్రతిభావంతమైన న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా గొప్ప సంఘ సంస్కర్తగా సేవలందించారని తెలిపారు. ముఖ్యంగా సమాజంలో ఉన్న అంటరానితనం, కుల వివక్ష నిర్మూలన కోసం జీవితాంతం పోరాడిన మహోన్నత వ్యక్తిగా కొనియాడారు. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన కృషి అపారమని, సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ వంటి విలువలను సమాజంలో స్థాపించడంలో ఆయన పాత్ర అత్యంత గొప్పదని వివరించారు. సమానత్వం, సామాజిక న్యాయం, విద్య ప్రాముఖ్యత వంటి విలువలను జీవితంలో అనుసరించి మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు. దేశాభివద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలంటే అంబేడ్కర్ ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేష్కుమార్, డీఎస్పీ సంపత్రావు, ఆర్ఐ రత్నం, ఆర్ఎస్ఐ ఫిరోజ్ తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
మైనింగ్ స్టాఫ్ సమస్యలు పరిష్కరించాలి
భూపాలపల్లి అర్బన్: పెండింగ్లో ఉన్న మైనింగ్ స్టాఫ్ సమస్యలను యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ ఆసిఫ్ పాషా డిమాండ్ చేశారు. మంగళవారం ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమయానికి రావాల్సిన ప్రమోషన్లు నిలిచిపోవడం, ప్రమోషన్ పొందిన వారికి బేసిక్ ఫిక్సేషన్ చేయకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. సీనియర్ మైనింగ్ సర్దార్లుగా పని చేస్తున్నవారికి కాలపరిమితి పూర్తయినప్పటికీ ఓవర్మెన్ ప్రమోషన్లు ఇవ్వకపోవడం అన్యాయమని తెలిపారు. అంతర్గతంగా ఎస్ఎఫ్, ఎంఎస్ తీసుకున్న ఉద్యోగులకు సీ గ్రేడ్ ప్రమోషన్లు ఇవ్వకపోవడం కూడా సరికాదని తెలిపారు. ఓపెన్ కాస్ట్ మైన్స్లో ఉన్న మైనింగ్ స్టాఫ్ ఖాళీలను తక్షణమే భర్తీచేసి, అండర్గ్రౌండ్ మైన్స్లో తగిన సిబ్బందిని నియమించాలని యాజమాన్యాన్ని కోరారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ వైస్ ప్రెసిడెంట్ మాతంగి రామచందర్, నూకల చంద్రమౌళి, సోతుకు ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. -
ఆర్టీసీ సమ్మెకు జేఏసీ పిలుపు
భూపాలపల్లి అర్బన్: సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 22వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపు ఇచ్చినట్లు ఎంప్లాయీస్ యూనియన్ డిపో అధ్యక్షుడు దుండ్ర రాజయ్య తెలిపారు. ఈ మేరకు డిపో ఎదుట మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, పీఆర్సీ అమలు, ఉద్యోగ భద్రత కల్పన, ఖాళీలను వెంటనే భర్తీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తూ ఎలక్ట్రిక్ బస్సులను దశలవారీగా ప్రవేశపెడుతున్నట్లు విమర్శించారు. ఆరు గ్యారంటీల అమలులో భాగంగా మహాలక్ష్మి పథకాన్ని విజయవంతం చేయడంలో ఆర్టీసీ కార్మికులు శక్తికి మించి పనిచేస్తున్నారని తెలిపారు. అయినప్పటికీ శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడం, అధికారుల వేధింపులు, కక్ష సాధింపు చర్యలు, యూనియన్ల పునరుద్ధరణ లేకపోవడం వంటి సమస్యలపై పలు మార్లు ప్రభుత్వానికి, మంత్రులకు వినతి పత్రాలు సమర్పించినా స్పష్టమైన హామీలు రాకపోవడంతో జేఏసీ నాయకులు సమ్మె బాట పట్టాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. సమ్మెలో పూర్తిస్థాయిలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు బుర్రి తిరుపతి, రాధాకృష్ణ, బండి శ్రీనివాస్, ఎల్లా గౌడ్, సమ్మయ్య, మధు, ఏకే స్వామి, రంజిత్ గౌడ్, కృష్ణమూర్తి పాల్గొన్నారు. -
పార్టీ పటిష్టతకు పాటుపడాలి
మల్హర్(కాటారం): క్రమశిక్షణతో అంకితభావంతో పార్టీ పటిష్టతకు పాటుపడాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఽఇటీవల కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీకి ఎన్నికై న పంతకాని సమ్మయ్య, కుంభం స్వప్నరెడ్డి, అంగజాల అశోక్ మంగళవారం కాటారం మండలం ధన్వాడ గ్రామంలో మంత్రి శ్రీధర్బాబును కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ పదవులకు వన్నెతెచ్చేలా నాయకుల పనితనం ఉండాలన్నారు. రాబోవు రోజుల్లో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రజాపాలన ప్రభుత్వం తిరిగి మరలా వచ్చేలా ప్రజాప్రతినిధులు, పార్టీ పదవులు ఉన్నవారు ప్రయత్నం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు -
తునికాకు సేకరణకు సిద్ధం!
సాక్షిప్రతినిధి, వరంగల్: తునికాకు సేకరణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈమేరకు స్టాండర్డ్ బ్యాగుకు రూ.3,300 ధరను ఖరారు చేస్తూ అటవీశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా ఆరు సర్కిళ్ల పరిధిలో 104 యూనిట్ల ద్వారా ఈ బీడి ఆకు సీజన్లో ఆకుసేకరణ చేయనున్నట్లు అధికారులు ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. కాళేశ్వరం, కవ్వాల్ టైగర్ రిజర్వ్ (కేటీఆర్) మంచిర్యాల, బాసర, రాజన్న, భద్రాద్రి, చార్మినార్ సర్కిళ్లలో 104 యూనిట్లు ఏర్పాటు చేసి 1,22,000 స్టాండర్డ్ బ్యాగు (ఎస్బీలు)లు కొనుగోలు లక్ష్యంగా ప్రకటించారు. అయితే, అటవీశాఖ ఉమ్మడి వరంగల్ (కాళేశ్వరం, భద్రాద్రి సర్కిళ్లు) 14 డివిజన్లల పరిధి ఎనిమిది డివిజన్లలో 77 యూనిట్ల ద్వారా 80,200 స్టాండర్డ్ బ్యాగుల ఆకు సేకరణే లక్ష్యంగా పెట్టుకున్నారు. సేకరణకు రూ.54.90 కోట్లు తునికాకు సీజన్ కోసం ప్రభుత్వం మంజూరు చేసిన మొత్తం బడ్జెట్ రూ. 54.90 కోట్లు వివిధ విభాగాలకు కేటాయించింది. ఇందులో తునికాకు సేకరణకు స్టాండర్డ్ బ్యాగు (ఎస్బీ)కి రూ.3,300 చొప్పున రూ.40.26 కోట్లు కాగా, ఇది మొత్తం బడ్జెట్లో అతిపెద్ద వాటా. నిర్ణీత ధర రూ.3,300 చొప్పున 1,22,000 స్టాండర్డు బ్యాగుల సేకరణ కోసం ఈ నిధులు కేటాయించారు. అదేవిధంగా సర్కిల్, డివిజన్ కార్యాలయాల్లో డేటా ఎంట్రీ, మానిటరింగ్ పనుల కోసం 12 నెలల కాలానికి ఔట్సోర్సింగ్ సిబ్బంది కోసం రూ.4.90 కోట్లు, గోదాం రికార్డు కీపర్లు, టీఎంలకు 45 రోజుల కోసం రూ.5 లక్షలు కేటాయించారు. మిగతా రూ.14,54,10,000లు కార్యాలయ, అటవీశాఖ క్వార్టర్ల నిర్వహణ, పోస్టల్, విద్యుత్, మున్సిపల్ పనులు, టెలిఫోన్, వాహనాలు తదితర అవసరాల కోసం ఖర్చు చేయనున్నారు. తగ్గిన యూనిట్లు! ఐదేళ్ల క్రితంకు ఇప్పటికీ తునికాకు యూనిట్లు గణనీయంగా తగ్గింది. 309 యూనిట్ల ద్వారా 3,569 కల్లాలు ఏర్పాటు 5,42,70 స్టాండర్డు బ్యాగుల ఆకు సేకరణ చేసేవారు. నూటికి నూరు శాతం లక్ష్యాలు నెరవేరగా, రాను రానూ 243 యూనిట్లు, 2,41,700 స్టాండర్డ్ బ్యాగులకు పడిపోయింది. ఈఏడాది మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 104 యూనిట్లు, 1,22,000 స్టాండర్డ్ బ్యాగుల సేకరణ లక్ష్యం కాగా.. ఉమ్మడి వరంగల్లో 8 డివిజన్లలోనే ఆకు సేకరించనున్నారు. ఆకు సేకరణ లక్ష్యాలు తగ్గడం ద్వారా ఉపాధి కూలీలు ఆదాయం, పనిదినాలు కోల్పోతున్నారు. ఇదిలా ఉండగా ఫ్రూనింగ్ (కొమ్మలు కొట్టె) ఈ నెలాఖరు వరకు ముగియనుండగా, అటవీశాఖ అధికారులు, కాంట్రాక్టర్లు మే 1 నుంచి తునికాకు సేకరణ ప్రారంభించి సుమారు 30–45 రోజుల్లో ఆకు సేకరణ పూర్తి చేసేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈసారి ఆకు సేకరణ చేసిన కూలీలకు స్టాండర్డ్ బ్యాగు (50 ఆకుల కట్టలు వెయ్యి)కు రూ.3,300 చెల్లించనున్నట్లు అధికారులు ఆ ఉత్తర్వుల్లో వెల్లడించారు. తెలంగాణ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ (రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్) చట్టం, 1971లోని సెక్షన్ 7 ప్రకారం, సలహా కమిటీతో సంప్రదించిన తర్వాత ప్రభుత్వం ఈ ధరలను ఖరారు చేసింది. ఈ లెక్కన ఆకు సేకరణ కోసం రూ.54.90 కోట్లు విడుదల చేశారు. కాళేశ్వరం సర్కిల్ పెద్దపల్లి, జేఎస్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మహదేవపూర్, భూపాలపల్లి, ములుగు, తాడ్వాయి, వెంకటాపురం, ఏటూరునాగారం డివిజన్లలో 37 యూనిట్ల ద్వారా 32,900 స్టాండర్డ్ బ్యాగులు కొనుగోలు చేయనున్నారు. భద్రాద్రి సర్కిల్ కేజీఎం భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లోని భద్రాచలం, మణుగూరు, పాల్వంచ, కేడబ్ల్యూఎస్ కిన్నెరసాని, కొత్తగూడెం, ఇల్లందు అటవీశాఖ డివిజన్లలో 40 యూనిట్లలో 47,300, చార్మినార్ సర్కిల్లో మూడు యూనిట్ల ద్వారా 800 స్టాండర్ట్ బ్యాగుల బీడీ ఆకు సేకరించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అహ్మద్ నదీం ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. కాగా, బీడీ ఆకు సేకరణ వ్యవహారంలో తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (టీఎఫ్డీసీఎల్) ప్రభుత్వ ఏజెంట్గా వ్యవహరించనుంది. -
అంబేడ్కర్ స్ఫూర్తితో అభివృద్ధి
భూపాలపల్లి రూరల్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం స్పూర్తిగా జిల్లాను అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. అంబేడ్కర్ 135 జయంతిని పురస్కరించుకుని ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ అయిత ప్రకాశ్రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల ప్రతినిధులతో కలిసి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. రూ.7కోట్లతో అంబేడ్కర్ భవనం, రూ.2కోట్లతో రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించేందుకు గణపురం మండలం మైలారంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను నిర్మిస్తున్నామని తెలిపారు. భూపాలపల్లి నుంచి గూడెప్పాడు వరకు రూ.664 కోట్లతో నాలుగు వరుసల రహదారి నిర్మాణం చేయనున్నామని తెలిపారు. బైపాస్ రహదారి నిర్మాణానికి రూ.500 కోట్ల మంజూరు చేసినట్లు వివరించారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. ఈ రోజు ఇంత స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామంటే అది రాజ్యాంగం మనకు కల్పించిన రక్షణ అని అన్నారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మాట్లాడుతూ.. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, వివక్ష లేనటువంటి సమ సమాజ స్థాపన చేయడం కోసం అంబేడ్కర్ విశేషంగా కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ బుర్రా కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, ఎస్సీ అభివృద్ధి అధికారి ఇందిర, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, ఆర్డీఓ హరికృష్ణ పాల్గొన్నారు.జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర -
ఆదమరిస్తే.. అగ్గిపాలే!
బుధవారం శ్రీ 15 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026కాలసర్ప నివారణ పూజలకు భక్తుల రద్దీ కాళేశ్వరం: మంగళవారం సెలవు కావడంతో కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో కాలసర్ప నివారణ పూజలకు భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ముందుగా త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో వద్ద కాలసర్ప నివారణ పూజలు భక్తులు అధిక సంఖ్యలో నిర్వహించారు. అనంతరం శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామికి అభిషేక పూజలు చేశారు. సుమారుగా 200లకుపైగా భక్తులు పూజలు చేశారు. శ్రీశుభానందేవిచ, శ్రీసరస్వతీ అమ్మవార్లను దర్శించుకున్నారు. మంచి ముహూర్తాలు ఉండడంతో భక్తులు తమ పెళ్లిళ్లు, దోషాల పాపహరణం కోసం ముందస్తుగా కాలసర్ప నివారణ పూజలు చేసుకుంటున్నారు. దీంతో కాళేశ్వరాలయం పరిసరాల్లో భక్తుల సందడి నెలకొంది. లక్ష్యంతో చదివితే బంగారు భవిష్యత్ ఎస్ఎస్తాడ్వాయి: విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే లక్ష్యంతో చదివితే బంగారు భవిష్యత్ ఉంటుందని ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ దబ్బగట్ల జనార్దన్ అన్నారు. మండల పరిధిలోని ఊరట్టం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల వార్షికోత్సవ వేడుకలను పాఠశాల పీజీ హెచ్ఎం కల్తి శ్రీనివాస్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిఽఽథులుగా డీడీ జనార్దన్, ఏటీడీఓ అజయ్కుమార్, ఏఎంఓ సుందర్రెడ్డి, సర్పంచ్ శైలజ హాజరై అంబేడ్కర్, సరస్వతిదేవి చిత్రపట్టాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివితే ఉన్నత స్థానాలకు చేరుకుంటారని తెలిపారు. ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో ముందుకు సాగుతూ మంచి పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభకనబర్చిన విద్యార్థినులకు బహుమతులను ప్రదానం చేశారు. పాఠశాల వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని విద్యార్థినులు చేసిన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నాటికలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సమ్మక్క పూజారి సిద్ధబోయిన స్వామి, డిప్యూటీ వార్డెన్ రమణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మంగపేట: మండల పరిధిలోని కమలాపురానికి చెందిన మేడిపెల్లి వెంకటేశ్వర్లు తనకు భూమి లేకున్నా 18 ఎకరాలు ఉన్నట్లుగా అక్రమంగా పొందిన పట్టాదార్ పాస్ పుస్తకాలను వెంటనే రద్దు చేయాలని సిద్ధాబత్తుల జగదీశ్వర్రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జగదీశ్వర్రావు మాట్లాడారు. వెంకటేశ్వర్లు రెవెన్యూ అధికారుల సహకారంతో మండలంలోని చెరుపల్లి, కమలాపురంలో 151/1, 208/6, 208/6ఏ సర్వే నంబర్లలో 18 ఎకరాల పట్టా భూమి ఉన్నట్లుగా పట్టాదార్ పాసుపుస్తకాలు పొందాడని తెలిపారు. వాటిపై బ్యాంకుల నుంచి రుణాలు పొందుతున్నాడని, ప్రభుత్వం నుంచి రైతుబంధు సైతం తీసుకుంటున్నట్లుగా తహసీల్దార్కు గతేడాదిలో ఫిర్యాదు చేసినట్లు వివరించారు. ఈ విషయంపై గిర్ధావర్, సర్వేయర్ సర్వే చేయగా భూమిలేదని సరైన ఆధారాలు లేవని 2026 ఫ్రిబ్రవరి 28న తనకు లెటర్ ద్వారా తెలిపారని వివరించారు. అదే విషయాన్ని కలెక్టరేట్లోని గ్రీవెన్స్లో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. దీంతో వెంకటేశ్వర్లు తనపై కోపంతో అతని స్నేహితుడితో కలిసి తనను చంపడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు పోలీసులు తనకు రక్షణ కల్పించడంతో పాటు అతడిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ములుగు: ములుగులో ఈనెల 18న నిర్వహించనున్న హిందూ సమ్మేళనాన్ని పురస్కరించుకొని నేడు సాయంత్రం 4 గంటలకు సుమారు 500 ద్విచక్ర వాహనాలతో జిల్లా కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ కన్వీనర్ గండ్రకోట కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ● నిర్లక్ష్యం వహిస్తే నష్టం అధికం ● జిల్లాలో అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభం ● నేటినుంచి అవగాహన సదస్సులుభూపాలపల్లి అర్బన్: సూరీడు నేలకొచ్చినట్టు ఎండలు మంట రేపుతున్నాయి.. జనానికి సెగలు పుట్టిస్తున్నాయి.. సామాన్య ప్రజలను అల్లాడిస్తున్నాయి.. ఈ సమయంలోనే చిన్నపాటి అజాగ్రత్తతో అగ్ని ప్రమాదాలకు ఆస్కారం ఉంది. తద్వారా సర్వం బుగ్గి అయ్యే ప్రమాదం ఉంది. ఎండాకాలం, మండించే కాలం కాబట్టి అప్రమత్తత అవసరమని అగ్నిమాపక శాఖ అధికారులు సూచిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఒకే ఒక్క అగ్నిమాపక కేంద్రం భూపాలపల్లిలో ఉంది. గతేడాది రూ.2కోట్ల మేర నష్టం జిల్లాలో గతేడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు 49 అగ్నిప్రమాదాలు జరగగా వాటిల్లో సుమారు రూ.కోటి 42 లక్షల మేర నష్టం జరిగింది. అగ్నిప్రమాదాల్లో రూ.58 కోట్ల ఆస్తిని సిబ్బంది సకాలంలో స్పందించి కాపాడారు. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉండటంతో ఏ చిన్నపాటి ప్రమాదం వాటిల్లినా తీవ్రంగా నష్టం జరిగే అవకాశం ఉంది. దీంతో అగ్నిప్రమాదాలను అదుపు చేసేందుకు అగ్నిమాపక శాఖాధికారులు విశేష కృషి చేస్తున్నారు. 14నుంచి 20వరకు వారోత్సవాలు ఈనెల 14నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. దానిలో భాగంగా మంగళవారం జిల్లాకేంద్రంలోని అగ్నిమాపక కేంద్రంలో స్టాల్ ఏర్పాటు చేసి అగ్నిమాపక అమరవీరులకు మౌనం పాటించారు. రెండో రోజు ప్రజా ప్రదేశాల్లో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు, మూడో రోజు గృహాల్లో జరిగే ఎల్పీజీ, విద్యుత్ అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన, నాలుగో రోజు ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన, ఐదో రోజు పెట్రోల్ బంకులు, ఎల్పీజీ గోడౌన్లు, పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాల నివారణ చర్యలపై, ఆరో రోజు ఫంక్షన్ హాళ్లు, పాఠశాలలు, కళాశాలలు, సినిమా థియేటర్లు, బహుళ అంతస్తుల భవనాల్లో అగ్ని ప్రమాదాల సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలపై, చివరిగా ఏడో రోజు పాఠశాల, కళాశాల విద్యార్థులకు అగ్ని ప్రమాదాల నివారణపై వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సమయస్ఫూర్తి అవసరం ప్రస్తుతం ఎండలు అధికమయ్యాయి. ఈ సమయంలో అగ్నిప్రమాదం జరిగితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. జిల్లాలో అధికశాతం తీరప్రాంత గ్రామాలు, మారుమూల ప్రాంతాలు కావడంతో ఏ చిన్న ప్రమాదం జరిగినా అంతా బుగ్గి అవుతుంది. గతంలో తీరప్రాంత గ్రామాల్లో అగ్నిప్రమాదాలు జరిగి భారీ నష్టం చూడాల్సి వచ్చింది. ప్రమాదాలు జరిగిన సమయంలో సమయ స్ఫూర్తితో వ్యవహరిస్తే నష్టాన్ని నివారించవచ్చు. అగ్ని ప్రమాదాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక కార్యాలయానికి సమాచారం అందిస్తే వెంటనే స్పందిస్తాం. అగ్నిమాపక శకటం వచ్చేలోగా నీటితో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించాలి. తద్వారా నష్టం కాస్త తగ్గుతుంది. ప్రమాదం జరిగిన వెంటనే 101, భూపాలపల్లి ఫైర్ స్టేషన్ 87126 99208 నంబర్లకు సమాచారం అందించాలి. – సతీష్కుమార్, జిల్లా అగ్నిమాపకశాఖ అధికారిఏటూరునాగారం: మండల పరిధిలోని గంటలకుంటలో గొత్తికోయ గిరిజనులకు తాగునీటి సమస్య ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క ఆ గూడేనికి మంగళవారం వాటర్ ట్యాంక్ను పంపించి నీటిని అందించారు. దీంతో గొత్తికోయలు ఆనందం వ్యక్తం చేశారు. వేసవి కాలం ముగిసే వరకు నీటి ఎద్దటి లేకుండా చూస్తామని స్థానిక నాయకుడు గుడ్ల దేవేందర్ తెలిపారు. గూడెంలో బోరు నిర్మాణానికి అటవీశాఖ అడ్డంకులు చెప్పడంతో తాగునీటిని ట్యాంకర్ల ద్వారా అందజేయాల్సి వస్తుందని దేవేందర్ తెలిపారు. కాల్చిన సిగరెట్లు, బీడీలు, అగ్గి పుల్లలను ఆర్పివేసిన తర్వాత పారేయాలి. చెత్త, గడ్డి, ఎండిన చెట్లు, పూరిపాకల వద్ద వీటిని వేయరాదు. ఎక్కువ రోజులు ఇంట్లో లేని సమయంలో విద్యుత్ మెయిన్ ఆఫ్ చేయాలి. వంట గదిలో గాలి, వెలుతురు ఉండేలా చూసుకోవాలి. గృహాలకు గడ్డి వాములు 60 అడుగుల దూరంలో వేసుకోవాలి. పూరింట్లో నివసించే వారు వంట పూర్తయిన వెంటనే పొయ్యిలో నిప్పును ఆర్పేయాలి. వేసవిలో ఉదయం 8 గంటల లోపు, సాయంత్రం 6 గంటల తర్వాత కట్టెల పొయ్యిలను ఉపయోగించాలి. గ్యాస్ సిలిండరుకు దగ్గరలో పెట్రోలు, డీజిల్, కిరోసిన్ వంటి మండే వస్తువులు ఉంచరాదు. వంట పూర్తయిన వెంటనే రెగ్యులేటర్ ఆపేయాలి. అపార్ట్మెంట్లు, కర్మాగారాల గోదాములు, గిడ్డంగులలో అగ్నిమాపక శాఖ సూచనలు విధిగా పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చు. వరంగల్ సర్కిల్ 14 డివిజన్లలో సేకరణ స్టాండర్డ్ బ్యాగుకు రూ.3,300 ధర ఖరారు రూ.54.90 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం -
రేపు అవగాహన కార్యక్రమం
భూపాలపల్లి: ‘అలైవ్–అరైవ్’ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 15వ తేదీన జిల్లాలోని సర్పంచ్లు, మున్సిపల్ కౌన్సిలర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అవగాహన కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని పుష్పగ్రాండ్లో నిర్వహిస్తామని, ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుందన్నారు. రహదారి భద్రత, సైబర్ నేరాల నివారణ, మత్తుపదార్థాల నియంత్రణ, సీసీటీవీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరవుతారని ఎస్పీ సంకీర్త్ వెల్లడించారు. భూపాలపల్లి అర్బన్: జిల్లాలో టెన్త్ పరీక్షలు విజయవంతంగా ముగియడం పట్ల కలెక్టర్ రాహుల్శర్మ హర్షం వ్యక్తం చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గత నెల 14వ తేదీన ప్రారంభమైన పరీక్షలు జిల్లాలో సజావుగా కొనసాగి, విద్యార్థులు ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాసినట్లు తెలిపారు. ఎండలను దృష్టిలో ఉంచుకుని ప్రతి పరీక్షా కేంద్రంలో అత్యవసర వైద్య సదుపాయాలు కల్పించినట్లు, విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు. పరీక్షల నిర్వహణలో ఉపాధ్యాయులు, శాఖాధికారులు, సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్, పోలీస్ సిబ్బంది సమన్వయంతో సమర్థవంతంగా విధులు నిర్వహించినందుకు కలెక్టర్ అభినందించారు. భూపాలపల్లి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయుల, కార్మిక, పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈజేఎసీ) ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ రాహుల్శర్మకు వినతిపత్రం అందజేశారు. టీజీఈజేఏసీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బురుగు రవి, విజయలక్ష్మి మాట్లాడుతూ.. ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి ఈ నెల 17న నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. టీజీఈజేఏసీ రాష్ట్ర కమిటీ ఇటీవల తీసుకున్న నిర్ణయాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల సమస్యలపై నిరసనలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టరేట్ వద్ద మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలతో నిరసన నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బంది, పెన్షనర్లు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘాల నాయకులు డాక్టర్ మధుసూదన్, శ్రీనివాస్, సుభాకర్రెడ్డి, శ్రీనివాసులు, సురేందర్రెడ్డి, పోచయ్య, తిరుపతి, కుమారస్వామి పాల్గొన్నారు. భూపాలపల్లి అర్బన్: జిల్లాలో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ఆధ్వర్యంలో నిర్వహించనున్న టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి ఆదేశించారు. పరీక్షలు విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా స్థాయి సమన్వయ సమావేశం సోమవారం కలెక్టరేట్లోని తన కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో పోలీసు శాఖ, వైద్య, ఆరోగ్య, విద్యుత్, పంచాయతీరాజ్, పోస్టల్, మున్సిపల్, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. ఈ నెల 20నుంచి 26 వరకు జరిగే పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ ఉదయ్కుమార్, డివిజనల్ పంచాయతీ అధికారి మల్లికార్జునరెడ్డి, సీఐ నరేష్కుమార్, ప్రభుత్వ పరీక్షల నియంత్రణ అధికారి సామల రమేష్, తదితరులు పాల్గొన్నారు. -
సాదా బైనామా చిక్కులకు చెక్!
సాదాబైనామాల క్రమబద్దీకరణకు భూ క్రయ,విక్రయదారుల ‘అఫిడవిట్’ల నిబంధన చిక్కులు తొలగాయి. ఆర్డీఓలే విచారణాధికారులగా దరఖాస్తుల పరిశీలనకు ప్రభుత్వం ఆదేశించింది. దీంతో నిబంధనల పేరిట ముందుకు సాగని సాదాబైనామాల క్రమబద్ధీకరణ ఇకపై ఫాస్ట్ట్రాక్లో జరగనుంది. ఉమ్మడి వరంల్ జిల్లాలో 2020 నవంబర్ 10 నుంచి పెండింగ్లో ఉన్న సుమారు 1.90 లక్షల దరఖాస్తులకు పరిష్కారం దొరకనుంది. రైతులకు ఊరట కలగనుంది. సాక్షిప్రతినిధి, వరంగల్ : ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సాదా బైనామా ఫైళ్లకు ఎట్టకేలకు కదలిక వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్కు సిద్ధమవుతూ, జిల్లాల వారీగా పెండింగ్ దరఖాస్తులను క్లియర్ చేయడానికి చర్యలు ప్రారంభించింది. దీనివల్ల వేలాది మంది రైతులు, పేదలకు ఉపశమనం లభించే అవకాశం ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2020లో తీసుకువచ్చిన 112జీఓ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకురావడంతో పాటు ఆ జీఓపై వచ్చిన అభ్యంతరాలు, సాదా బైనామాల పరిష్కారంపై విధివిధానాలను హైకోర్టుకు ప్రభుత్వం సమర్పించింది. దీంతో హైకోర్టు తన ముందు ఉన్న పిల్ను కొట్టివేసింది. ప్రభుత్వం సాదా బైనామాల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించేందుకు ఆదేశాలు ఇచ్చినా.. భూక్రయ, విక్రయదారులు ఇద్దరి అఫిడవిట్లు, తదితర నిబంధనల కారణంగా ముందుకు సాగలేదు. తాజాగా అఫిడవిట్ల నిబంధనలను సడలించడంతోపాటు దరఖాస్తుల పరిశీలించే పరిష్కరించే అధికారాలు పూర్తిగా ఆర్డీఓలకు ఇవ్వడంతో ఆ ప్రక్రియ మరింత వేగం పుంజుకోనుంది. ఐదున్నరేళ్లుగా పెండింగ్లో.. సాదాబైనాల క్రమబద్ధీకరణ కోసం జీఓలు ఎన్ని తెచ్చినా దరఖాస్తులు పెండింగ్లోనే ఉంటున్నాయి. 2016లో జీఓ నంబర్ 153, 2020లో జీఓ 112లను తీసుకువచ్చారు. 2014 జూన్ 2కు ముందు సాదాబైనామాలు కలిగిన భూములను క్రమబద్ధీకరించడం.. కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను జారీ చేసే ఉద్దేశంతో రెండు పర్యాయాలు, ఈ రెండు జీఓలు తెచ్చారు. జీఓ నం.112పై ‘పిల్’ దాఖలు కావడంతో దానిని అమలు కాకుండా నిలిపివేశారు. ఆ తర్వాత రెవెన్యూ సదస్సుల ద్వారా దరఖాస్తులను స్వీకరించిన ప్రభుత్వం వాటి పరిష్కారం మంత్రివర్గ ఉపసంఘం వేసింది. గతేడాది ఏప్రిల్, మే, జూన్ నెలల్లో రెవెన్యూ గ్రామ సదస్సులను నిర్వహించింది. ఈ సదస్సుల్లో అత్యధికంగా సాదాబైనామాలపైనే దరఖాస్తులు వచ్చాయి. గతంలో దరఖాస్తు చేసుకున్న రైతులు మరోసారి భూభారతి సదస్సులో దరఖాస్తులు చేశారు. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు, అంతకు ముందున్న మొత్తం దరఖాస్తుల సంఖ్య 1,89,739లకు చేరింది. దీంతో ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించి, సాదాబైనామాలపై మధ్యంతర స్టే ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరింది. విచారణ అనంతరం సాదాబైనామాలకు గ్రీన్సిగ్నల్ ఇవ్వగా, క్షేత్రస్థాయి పరిశీలన పేరిట తాత్సారం జరుగుతూ వచ్చింది. అర్హత కలిగిన దరఖాస్తులను పరిష్కరించనున్నారు. ‘అఫిడవిట్’ నిబంధనలు సడలింపు.. ‘రెవెన్యూ’కు ఆదేశాలు ఫాస్ట్ట్రాక్లో పెండింగ్ ఫైళ్ల పరిష్కారం ఉమ్మడి వరంగల్లో 1.90 లక్షల దరఖాస్తులు 2020 నుంచి వెయిటింగ్.. ఆర్డీఓలకు కీలక అధికారాలుజిల్లా పెండింగ్ హనుమకొండ 27,057 వరంగల్ 26,630 ములుగు 20,150 జేఎస్ భూపాలపల్లి 51,347 జనగామ 33,305 మహబూబాబాద్ 31,250 మొత్తం 1,89,739 -
ఖాళీ బిందెలతో ధర్నా
భూపాలపల్లి అర్బన్: పట్టణంలోని భగత్సింగ్కాలనీ వాసులు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు. సీపీఐ పట్టణ కార్యదర్శి సోత్కు ప్రవీణ్కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో కాలనీవాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ.. సర్వే నంబర్ 280లో ఐదు సంవత్సరాలుగా నివాసం ఉంటున్న గుడిసెవాసులకు మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఎండాకాలంలో నీటి సమస్య తీవ్రంగా ఉందని, గత సంవత్సరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు బోర్ వేయించినప్పటికీ ప్రస్తుతం సుమారు 400 కుటుంబాలు నివసించడం వల్ల సమస్య మరింత పెరిగిందని తెలిపారు. భగత్సింగ్ కాలనీ సమస్యలను అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు, కాలనీవాసులు క్యాతరాజ్ సతీష్, నేరెళ్ల జోసెఫ్, గోలి లావణ్య, ఎండీ.యాకూబ్ పాషా, గంప రాజు పాల్గొన్నారు. -
కొలువుదీరిన పాలకవర్గం
కాళేశ్వరం: శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణస్వీకార కార్యక్రమం దేవాదాయశాఖ సోమవారం ఘనంగా నిర్వహించింది. ఈఓ శనిగెల మహేశ్ ఆధ్వర్యంలో 11 మంది ధర్మకర్తలు, ఒక ఎక్స్అఫీషియో (అర్చక)తో ఆలయ చైర్మన్గా అవధాని మోహన్శర్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈఓ చైర్మన్తో పాటు ధర్మకర్తలను ప్రమాణస్వీకారం చేయించారు. ధర్మకర్తలుగా దొడ్ల అశోక్, కుంభం పద్మ, అడ్డూరి శ్రీధర్ రావు, మంచినీళ్ల దుర్గయ్య, గందెసిరి సత్యనారాయణ, సుంకరి సీతయ్య, జలవంచ సీతారాం, కాటం సత్తయ్య, శ్యాంసుందర్ దేవుడా, ఎక్స్ అఫీషియో మెంబర్గా దేవస్థానం ఉపప్రధాన అర్చకుడు పనకంటి ఫణీంద్రశర్మ 12మంది సభ్యులు రెండేళ్ల కాల పరిమితితో కొలువుదీరారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. తమ హాయంలో బృహత్తర ప్రణాళికతో మంత్రి శ్రీధర్బాబు సహకారంతో దేవస్థానం అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతామన్నారు.కాళేశ్వరం దేవస్థానం చైర్మన్గా అవధాని మోహన్శర్మ -
పోటీ పరీక్షలకు శిక్షణ
కాటారం, రేగొండ, చిట్యాల కస్తూర్బా పాఠశాలలు ఎంపిక భూపాలపల్లి అర్బన్: కస్తూర్బా బాలికల విద్యాలయాల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 495 కస్తూర్బా పాఠశాలల్లో 93 పాఠశాలను యంగ్ ఇండియా ఇంటి గ్రేటెడ్ ఆర్గనైజ్ ఎన్ఫోర్స్మెంట్ (వైఐఐఓఈ) కేంద్రాలుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ జాబితాలో జిల్లాలో కాటారం, రేగొండ, చిట్యాల కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు ఎంపికయ్యాయి. ఈ పాఠశాలలను ఎంపిక చేయడం ద్వారా బాలికలకు పోటీ పరీక్షల దిశగా ప్రాథమిక స్థాయి నుంచే తగిన శిక్షణ అందించనున్నారు. క్లాట్, యూపీఎస్సీ, నీట్, ఐఐటీ, గ్రూప్స్, బ్యాంకింగ్, ఎస్ఎస్సీ వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు అవసరమైన మార్గదర్శనం, మాక్ టెస్టులు, డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన ఈ అవకాశాలు ఇప్పుడు గ్రామీణ ప్రాంత బాలికలకు చేరుకోవడం విద్యారంగంలో ముందడుగుగా పలువురు భావిస్తున్నారు. ఈ శిక్షణల ద్వారా విద్యార్థినుల్లో నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. నిపుణుల ఉపన్యాసాలు, కేరీర్ గైడెన్స్ కార్యక్రమాలు, వర్క్షాపుల ద్వారా భవిష్యత్ లక్ష్యాలను నిర్ధారించుకునేలా ప్రోత్సహిస్తారు.. జిల్లాలో 11 కేజీబీవీలు జిల్లాలోని 12 మండలాల పరిధిలో 11 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు ఉన్నాయి. వాటిలో ఇప్పటికే ఇంటర్మీడియట్ వరకు బోధిస్తున్నారు. 2,563మంది విద్యనభ్యసిస్తున్నారు. వైఐఐఓయూకు ఎంపికై న కేజీబీవీల్లో ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి నూతన శిక్షణ తరగతులు ప్రారంభించనున్నారు. ఇందులో అర్హత పరీక్ష నిర్వహించి ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. విద్యార్థులకు అందుబాటులో నాణ్యమైన శిక్షణ తరగతులు అర్హత పరీక్ష ద్వారానే సీట్ల కేటాయింపు రేపటి వరకు దరఖాస్తుల గడువు జిల్లాలో కాటారం, రేగొండ, చిట్యాల మూడు కస్తూర్బా స్కూళ్లను యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్సీగా మార్చడానికి ఎంపిక చేశారు. గ్రామీణ ప్రాంత బాలికలకు నాణ్యమైన విద్యతో పాటు పోటీ ప్రపంచంలో నిలబడే సామర్ాధ్యన్ని పెంపొందించే దిశగా కీలక అడుగుగా నిలుస్తుంది. ప్రవేశ పరీక్షలలో ప్రతిభచూపిన వారికి అవకాశాలు లభిస్తాయి. – రాజేందర్, జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి -
ఎండలతో జాగ్రత్తగా ఉండాలి
భూపాలపల్లి: రోజురోజుకూ పెరుగుతున్న ఎండలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ రాహుల్శర్మ సూచించారు. ఎండల బారినుంచి రక్షణపై సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వాతావరణ శాఖ జిల్లాను ఆరంజ్ జోన్గా ప్రకటించినట్లు తెలిపారు. జిల్లాలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని, ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రజలు బయటకు వెళ్లొద్దని సూచించారు. చిన్నారులు, వయోవృద్ధులు ఎండ సమయంలో ప్రయాణం చేయొద్దన్నారు. అనంతరం వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో కాటారం సబ్కలెక్టర్ మయాంక్సింగ్, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఏఎస్పీ నరేష్కుమార్, డీఎంహెచ్ఓ డాక్టర్ మధుసూదన్, అధికారులు పాల్గొన్నారు. పనులు పూర్తిచేయాలి.. ఏప్రిల్ 30వ తేదీ వరకు సరస్వతి అంత్య పుష్కరాలకు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ సూచించారు. మే 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు కాళేశ్వరంలో జరుగనున్న సరస్వతి అంత్య పుష్కరాల పనులపై సోమవారం సచివాలయం నుంచి దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, ధార్మిక సలహాదారు గోవిందహరి, ఆర్కిటెక్చర్ సూర్యనారాయణతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐడీఓసీ కార్యాలయం నుంచి కలెక్టర్ రాహుల్ శర్మ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. తాత్కాలిక ప్రాతిపదికన చేపట్టబోయే పనులు 15 రోజుల ముందే పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంకా టెండర్లు పూర్తికాని పనులకు టెండర్లు పిలవాలని, టెండర్లు పూర్తయిన పనులకు నిధులు మంజూరు చేయాలని కలెక్టర్కు సూచించారు. రహదారి నియమాలు పాటించాలి.. రహదారి నియమాలు పాటిస్తూ వాహనదారులు బాధ్యతతో వాహనాలు నడిపితే ప్రమాదాలను సమర్థవంతంగా నివారించవచ్చని కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో రెవెన్యూ, పోలీస్, రవాణా, ఆర్అండ్బీ, మున్సిపల్, పంచాయతీరాజ్, వైద్య శాఖల అధికారులతో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అధిక వేగాన్ని నియంత్రించడం, హెల్మెట్, సీట్బెల్ట్ వినియోగం వంటి చర్యలు ప్రమాదాల తగ్గింపునకు కీలకమని తెలిపారు. ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఎన్యుమరేటర్ల నియామకం పూర్తి.. జనగణన కార్యక్రమానికి సంబంధించి సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్ల నియామక ప్రక్రియను పూర్తిచేసినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడించారు. సోమవారం హైదరాబాద్ నుంచి కులగణన సంచాలకులు భారతి హోళికేరి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఐడీఓసీ కార్యాలయం నుంచి కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. విద్యార్థినికి అభినందన.. చిట్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థిని నరాల అంజలి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ ర్యాంకు సాధించినందుకు గాను సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో కలెక్టర్ రాహుల్ శర్మ అభినందించారు. అలసత్వం వద్దు.. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వం వహించకుండా పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 88 దరఖాస్తులు స్వీకరించారు. రహదారి నియమాలు పాటించాలి కలెక్టర్ రాహుల్ శర్మ -
ఫెన్సింగ్తో ఉజ్వల భవిష్యత్
ఫెన్సింగ్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుంది. తల్లిదండ్రులు రొటీన్ క్రీడల్లో కాకుండా అత్యంత అరుదైన ఫెన్సింగ్లో శిక్షణ అందించేందుకు చొరవ చూపాలి. అంతంత మాత్రంగానే ఉన్న ఫెన్సింగ్ క్రీడాభివృద్ధికి, వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేయాలి. నేటి యువతలో ఫెన్సింగ్ నేర్చుకోవాలన్న ఆసక్తి ఉంది, సదుపాయాలు లేకపోవడంతో వెనుకంజ వేస్తున్నారు. – దుబ్బ రాము, కార్యదర్శి, జిల్లా ఫెన్సింగ్ సంఘం గ్రామీణ యువతను ప్రోత్సహించేందుకు చర్యలు ఆదరణ కోల్పోతున్న ఫెన్సింగ్ క్రీడలో శిక్షణ ఇచ్చేందుకు గ్రామీణ యువతను ప్రాధాన్యం ఇస్తూ ప్రోత్సహించేందుకు కృషి చేస్తాం. అందుకు వేసవి సెలవుల్లో మండల కేంద్రాల్లో ఉచిత శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. – తాళ్లపెల్లి ప్రవీణ్గౌడ్, ఉపాధ్యక్షుడు, జిల్లా ఫెన్సింగ్ సంఘం -
ఉజ్వల భవిష్యత్కు బాటలు వేసుకోవాలి
● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి: యువత చదువు, క్రీడలపై దృష్టి సారించి ఉజ్వల భవిష్యత్కు బాటలు వేసుకోవాలని, వ్యసనాలకు బానిసలై భవిష్యత్ నాశనం చేసుకోవద్దని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాల నివారణపై అవగాహన కల్పించేందుకు శనివారం జిల్లాకేంద్రంలోని రాజీవ్ చౌక్ నుంచి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సెంటర్ వరకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్తో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. డ్రగ్స్ సమస్య సమాజానికి పెద్ద ముప్పుగా మారిందని పేర్కొన్నారు. ముఖ్యంగా యువత డ్రగ్స్కు బానిసలై తమ భవిష్యత్ను నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. డ్రగ్స్ బానిసల కోసం ప్రభుత్వం ప్రత్యేక డీ–అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేస్తుందన్నారు. మన జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రిలో డీ–అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయబడుతుందని వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ.. డ్రగ్స్ రవాణా, విక్రయం, వినియోగంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. యువత చెడు అలవాట్లకు లోనవకుండా తమ జీవితాలను సవ్యంగా మలుచుకోవాలని సూచించారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మాట్లాడుతూ.. డ్రగ్స్ నివారణకు పోలీసు శాఖ ద్వారా గ్రామ గ్రామాన అవగాహన కార్యక్రమాలు పెద్దఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో గంజాయి రవాణాదారులు, విక్రేతలపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. యువత డ్రగ్స్పై అవగాహన లేకుండా సరదా కోసం తీసుకుంటూ కొద్దికొద్దిగా ఆ రొంపిలోకి దిగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం 2 కే రన్లో పాల్గొన్న విజేతలకు ప్రశంసా పత్రాలు అందచేశారు. ఈ ర్యాలీలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, డీఎంహెచ్ఓ మధుసూదన్, డ్రగ్ ఇన్స్పెక్టర్ పావని, కౌన్సిలర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. మత్తు పదార్థాలకు అలవాటు కావొద్దు యువత మత్తు పదార్థాలకు అలవాటు కావొద్దని కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. ‘అరైవ్–అలైవ్’ కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి పట్టణంలో డ్రగ్స్ వ్యతిరేఖ అవగాహన 2కే రన్, ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ.. డ్రగ్స్ వినియోగం వ్యక్తిగత జీవితం మాత్రమే కాకుండా సమాజానికి హానికరమన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. రోడ్డు భద్రతా నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, డీఎంహెచ్ఓ మధుసూదన్, అడిషనల్ ఎస్పీ నరేష్కుమార్, డీఎస్పీ సంపత్రావు, సీఐ డి.నరేష్కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
కల్యాణం.. కమనీయం
హాజరైన భక్తులుస్వామి వారి కల్యాణం జరిపిస్తున్న అర్చకులురేగొండ: మండలంలోని గడిపల్లి గ్రామంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో స్వామి వారి కల్యాణం శనివారం వైభవంగా జరిగింది. అర్చకులు సముద్రాల సురేష్, తాండూరి నరేష్ ఆధ్వర్యంలో ఆలయంలోని ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద మంత్రోత్సవాల మధ్య రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జ్ చందుపట్ల కీర్తిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిషిధర్రెడ్డి వేర్వేరుగా హాజరై స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టయ్య, సర్పంచ్ వానరాశి మౌనిక, ఆలయ చైర్మన్ జిట్టా రామకృష్ణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నామాల రమేష్, ఎన్ఎస్ఆర్ సంస్థల చైర్మన్ సంపత్రావు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
సింగరేణిలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి
భూపాలపల్లి అర్బన్: మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను శనివారం ఏరియాలోని జీఎం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి హాజరయ్యారు. మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. మహాత్మా జ్యోతిరావు పూలే మహిళా విద్యాభివృద్ధి, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం జీవితాంతం పోరాడిన గొప్ప సామాజిక సంస్కర్త అని పేర్కొన్నారు. జయంతి సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలైన సింగరేణి పాఠశాల విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం కవీంద్ర, అధికారులు ఎర్రన్న, రవికుమార్, మారుతి, మురళీమోహన్, నవీన్కుమార్, పాషా, మధుకర్రెడ్డి, నజీర్, బీసీ సంఘం నాయకులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ
● శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీ నుంచి మే 12వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్న 1 గంట వరకు శిక్షణ ఇస్తారు. థ్రెడింగ్, హెయిర్ కట్స్, వ్యాక్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచింగ్, స్కిన్కేర్, హెయిర్ కేర్, వెడ్డింగ్ ఫేస్ప్యాక్స్, హెయిర్స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, ఐబ్రోస్, బేసిక్ పింపుల్ ట్రీట్మెంట్, మేకప్ (బ్రైడల్, పార్టీ, లైట్ మేకప్), హెయిర్ మసాజ్, కమ్యూనికేషన్ – సెల్ప్ గ్రూమింగ్, ఫేషియల్స్, శారీ డ్రాపింగ్ వంటి వాటిల్లో శిక్షణ ఇస్తారు. ఇందుకోసం ఈనెల 13వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రిజిస్ట్రేషన్లు స్వీకరిస్తారు. రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.2,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈనెల 14 నుంచి మే 12వ తేదీ వరకు ఉదయం 10 గంటలనుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిక్షణ ఉంటుంది. ● రిజిస్ట్రేషన్, శిక్షణ కోసం శ్రీ శైలీ బ్యూటీపార్లర్, ఓల్డ్ బస్డిపో దగ్గర, సర్క్యూట్ హౌజ్ రోడ్డు, హనుమకొండలో సంప్రదించాలి. ● మరిన్ని వివరాల కోసం 95055 14424, 94901 55215 నంబర్లలో సంప్రదించాలి. -
విద్యార్థులకు స్పెషల్ కిట్లు
భూపాలపల్లి అర్బన్: విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు 21 రకాల వస్తువులు గల కిట్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు ప్రభుత్వం ఆ కిట్లకు ఆర్డర్ ఇవ్వగా, పాఠశాలలు ఆరంభమయ్యే నాటికి అన్ని పాఠశాలలకు చేర్చనున్నారు. పాఠశాలల తొలి రోజు నుంచే విద్యార్థులకు కిట్లు అందజేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో యేటా విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తున్నది. పట్టణ ప్రాంతాల్లో గల పాఠశాలలు మినహా, గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చదువుకునేలా ప్రోత్సహించేందుకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు 21 రకాల వస్తువులు గల కిట్లను అందజేయనున్నారు. ఇప్పటివరకు విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలతో పాటు నోట్బుక్స్, రెండు జతల యూనిఫామ్స్, మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఇచ్చే వాటితో పాటు మరో యూనిఫాం జత అదనంగా ఇవ్వనున్నారు. షూస్, రెండు జతల సాక్సులు, స్కూల్ బ్యాగ్, బెల్ట్, టై, వర్క్ బుక్, పెన్నులు, పెన్సిళ్లు, ఎరేజర్, షార్పనర్, జామెట్రీ బాక్స్, డిక్షనరీ గల కిట్ ఇవ్వనున్నారు. ఆయా జిల్లాల్లో వేర్వేరు రకాల యూనిఫామ్స్ ఉండగా, ఈ సారి రాష్ట్రమంతటా ఒకే రకమైన యూనిఫామ్ను అందజేయనున్నారు. పాఠశాలల ఆరంభం నాటికి వాటిని అందజేసేందుకు ప్రభుత్వ విద్యాశాఖ సన్నాహాలు చేస్తున్నది. కిట్లతో విద్యార్థుల సంఖ్య పెరిగేనా.. పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా అందరూ తల్లితండ్రులకు పిల్లలను బాగా చదివించాలనే చైతన్యం పెరిగింది. సాధ్యమైనంత వరకు తమ స్థోమతను ఆధారంగా ప్రైవేట్ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో చదివించేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. పదిహేనేళ్ల క్రితం ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడేవి. 2010, 2012లో మోడల్ స్కూళ్లు, కస్తూర్భాగాంధీ విద్యాలయాలు వచ్చిన తర్వాత కొంత మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం గురుకుల విద్యాలయాలకు ప్రాధాన్యం ఇచ్చింది. అప్పటికే ఎస్సీ, ఎస్టీ గురుకులాలు ఉండగా, అక్కడక్కడ బీసీ గురుకులాలు ఉన్నాయి. వీటికి తోడు ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు ఎస్బీ గురుకులాలు, రెండు బీసీ గురుకులాలు, ఒక మైనార్టీ గురుకుల విద్యాలయాన్ని ఏర్పాటు చేయడంతో వాటి సంఖ్య పెరిగింది. దీంతో ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. రెసిడెన్షియల్ తరహాలో అన్ని వసతులు కల్పించి విద్యాబోధన చేస్తున్నారు. మొదట 5, 6, 7 తరగతులతో ఆరంభించి క్రమంగా అప్గ్రేడ్ చేశారు. జిల్లాలో పాఠశాలలు, విద్యార్థులు జిల్లాలో 394 ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్, 8 మోడల్ స్కూళ్లు ఉన్నాయి. వీటిలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో 16,256 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో యేటా ఫీజుల భారం పెరిగి పోతుండడంతో విద్యార్థుల తల్లితండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే విధంగా ప్రోత్సహించేందుకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందజేయనున్న కిట్లు ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తాయో వేచిచూడాలి. స్పెషల్ కిట్లలో ఉండేవివే.. మూడు జతల యూనిఫామ్ క్లాత్, షూష్, రెండు జతల సాక్స్, స్కూల్ బ్యాగ్, బెల్ట్, టై, నోట్ బుక్స్, పాఠ్య పుస్తకాలు, వర్క్బుక్స్, పెన్సిళ్లు, ఎరేజర్, జామెట్రీబాక్స్, డిక్షనరీ ఉండనున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 21 రకాల వస్తువులు రాష్ట్రమంతటా ఒకే యూనిఫాం విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కసరత్తు -
ఆదివారం శ్రీ 12 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
వరంగల్ స్పోర్ట్స్: రాజులు పోయారు.. రాజ్యాలు పోయాయి. వారి తెగువ, ఆయుధ విద్యను ఇప్పటికీ ఓరుగల్లు ఆడబిడ్డలు వారసత్వంగా కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కత్తిసాము(ఫెన్సింగ్) క్రీడ ఉనికి పదిలంగానే ఉంది. ప్రపంచ ప్రఖ్యాత క్రీడల్లో ఫెన్సింగ్ మూడో స్థానంలో నిలుస్తోంది. అభివృద్ది చెందిన నగరాలు, దేశాలకు మాత్రమే పరిమితమైన ఈ గేమ్లో రాణిస్తున్నారు ఉమ్మడి వరంగల్కు చెందిన ఆడబిడ్డలు. రాణి రుద్రమదేవీలా కత్తి దూస్తున్న ఆ ఇద్దరి నేపథ్యమే ఈ వారం ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ. అంతర్జాతీయ వేదికపై ప్రతిభ వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటకు చెందిన గొర్రె శ్రీజ డిగ్రీ చదువుతూ మహారాష్ట్ర సాయ్ అకాడమీలో ఫెన్సింగ్లో శిక్షణ పొందుతోంది. 4వ తరగతిలో హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో చేరిన శ్రీజ 9వ తరగతి వరకు అక్కడే చదువుతూ ఫెన్సింగ్లో శిక్షణ పొందింది. అనంతరం ఎన్ఐఎస్ పంజాబ్లో సీటు సాధించి కత్తి యుద్ధంలో ప్రతిభ కనబర్చి అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఇప్పటి వరకు 20కిపైగా జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించింది. అంతర్జాతీయ స్థాయిలో బల్గేరియా, ఇటలీలో జరిగిన చాంపియన్షిప్లో తనదైన ప్రతిభ చాటింది. ఎప్పటికై నా భారత్ తరఫున ఒలింపిక్స్లో పాల్గొని పతకం సాధించడమే తన లక్ష్యమని శ్రీజ చెబుతోంది. పదేళ్లలో పది పోటీల్లో ప్రతిభ హనుమకొండ జిల్లా హసన్పర్తి మండల కేంద్రానికి చెందిన కడార్ల స్కావెస్లా స్పోర్ట్స్ కోటాలో ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతోంది. పదో తరగతిలో ఫెన్సింగ్లో శిక్షణ ప్రారంభించిన స్కావెస్లా కేవలం ఐదేళ్లలో పదికి పైగా రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించింది. మరింత మెరుగైన శిక్షణ అందిస్తే అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించి వరంగల్ జిల్లాకు పేరు తీసుకొస్తానని స్కావెస్లా చెబుతోంది. ఫెన్సింగ్ క్రీడలో రాణిస్తున్న ఓరుగల్లు యువతులు జాతీయ స్థాయిలో పతకాలు ప్రోత్సహిస్తే ఒలింపిక్స్లో రాణించే అవకాశం -
భూ వివాదాల పరిష్కారానికి ప్రణాళిక
మల్హర్(కాటారం): భూ వివాదాల పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ, ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. కాటారం డివిజన్ రెవెన్యూ, అటవీ, బుల్క్ భూ సమస్యలపై శుక్రవారం కాటారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ, అటవీ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డుల శాఖల అధికారులతో మండలాల వారీగా రెవెన్యూ, అటవీ భూ సమస్యలు, బుల్క్ భూ సమస్యలపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అటవీ, రెవెన్యూ భూముల సరిహద్దుల నిర్ధారణలో స్పష్టత తీసుకురావడానికి సంయుక్త సర్వే కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వేగంగా సమస్యలను పరిష్కరించేందుకు శాఖల మధ్య సమన్వయం పెంచాలని ఆదేశించారు. భూ సంబంధిత పెండింగ్ సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి కేసును పారదర్శకంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలి వేసవి నేపథ్యంలో మండలాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని మిషన్ భగీరీథ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులను కలెక్టర్ రాహుల్శర్మ ఆదేశించారు. శుక్రవారం కాటారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో తాగునీటి సరఫరాపై మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. నీటి కొరత ఉన్న ప్రాంతాలను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. స్టేడియం పనులను పూర్తిచేయాలి ఇండోర్ స్టేడియం పనులను త్వరితగతన పూర్తిచేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సంబందిత అధికారులను ఆదేశించారు. కాటారం మండలకేంద్రంలో నిర్మిస్తున్న ఇండోర్ స్టేడియం పనులను కలెక్టర్ రాహుల్శర్మ అధికారులతో కలిసి పరిశీలించారు. స్టేడియం పనులు నత్తనడకన సాగడంపై ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని త్వరితగతిన పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. అనంతరం కాటారం మండలకేంద్రంలోని ఆర్టీసీ బస్షెల్టర్ స్థలాన్ని పరిశీలించి తహసీల్దార్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, జిల్లా యువజన, క్రీడల అధికారి రఘు, డివిజన్ తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం భూపాలపల్లి అర్బన్: యోగా సాధన ద్వారా శారీరకంగా మానసికంగా ఆరోగ్యం మెరుగుపడుతుందని కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, ఆరోగ్య వారోత్సవం, హోమియోపతి డేని పురస్కరించుకొని శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఇల్లందు క్లబ్లో ఆయూష్ శాఖ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఒత్తిడిని జయించడానికి యోగా అద్భుతమైన సాధనమని తెలిపారు. ప్రతిరోజూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకుని క్రమం తప్పక సాధన చేసుకోవాలని సూచించారు. ఇలాంటి కార్యక్రమాల నిర్వహణ వల్ల ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంతో పాటు ఆయుష్ సేవలను ప్రజలకు మరింత చేరువచేయడానికి ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ఆరోగ్య వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు చిన్నతనం నుంచే ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రజలు ఒత్తిడి లేని జీవనం సాగించేందుకు యోగా చక్కగా పనిచేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయుష్ వైద్య విధానాల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, డీపీఆర్ఓ శ్రీనివాస్, ఆర్డీఓ హరికృష్ణ, తహసీల్దార్ లక్ష్మీరాజయ్య, రెడ్క్రాస్ చైర్మన్ శ్రీనివాస్, కౌన్సిలర్ అప్పం కిషన్, ఆయూష్, జిల్లా వైద్య బృందం, యోగా ఇన్స్ట్రక్టర్లు, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
ఆర్ట్స్ కళాశాలలో సెమిస్టర్ పరీక్షలు షురూ
కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బీఏ, బీకాం, బీఎస్సీ రెండు, నాలుగు, ఆరో సెమిస్టర్ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. పరీక్షలు నిర్వహిస్తున్న తీరును కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి పరిశీలించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు తాగునీటి సదుపాయం, నిరంతరంగా విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకున్నట్లు ఆమె తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రహమాన్, పరీక్షల నియంత్రణాధికారి సుధీర్, అధ్యాపకులు శ్రీదేవి, ఆశీర్వాదం, జితేందర్, ఆదిరెడ్డి, ఏటీబీటీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
అయ్యో పాపం..!
సింగరేణి సెక్యూరిటీ గార్డు నియామకాల్లో అన్యాయంప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు పరీక్షలు నిర్వహిస్తున్న సెక్యూరిటీ అధికారులు (ఫైల్) భూపాలపల్లి అర్బన్: సింగరేణి యాజమాన్యం ప్రవేశపెడుతున్న నూతన టెండర్ విధానం సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు, కాంట్రాక్ట్ సెక్యూరిటీ గార్హుల ఉపాధిని దెబ్బతీసేలా ఉంది. సింగరేణి వ్యాప్తంగా 12 ఏరియాల్లో దాదాపు 20 ఏళ్లుగా సుమారు 1,200 మందికి పైగా ప్రైవేట్ సెక్యూరిటీ కాంట్రాక్ట్ గార్డులు పనిచేస్తూ సంస్థ ఆస్తుల పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్నారు. యాజమాన్యం వీరి ఉపాధిని దెబ్బతీసేలా నూతన టెండర్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ టెండర్ విధానాన్ని రద్దుచేయాలని ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు కోరుతున్నారు. సింగరేణిలో అవుట్ సోర్సింగ్ ప్రారంభమైన తొలిరోజుల్లో 2001 నుంచి నేటివరకు సింగరేణి వ్యాప్తంగా సుమారు 1,220 మంది కాంట్రాక్ట్ సెక్యూరిటీ గార్డులను కంపెనీ నియమించింది. వీరిలో ఆ ప్రాంతంలో ఉన్న భూ నిర్వాసితులు, వివిధ గ్రామాల ఓసీ ప్రభావిత ప్రాంతాల గ్రామాల నిరుద్యోగ యువకులు, సింగరేణిలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన మాజీ కార్మికుల వారసులు ఉన్నారు. వీరంతా సింగరేణి వ్యాప్తంగా వివిధ ఏరియాలలో చాలీచాలని జీతాలతో, చట్టబద్ధ హక్కులు, సౌకర్యాలు అందనప్పటికీ సంస్థ అభివృద్ధి కోసం విధులు నిర్వహిస్తున్నారు. మరికొందరు ఉన్న భూములను కంపెనీకి ఇచ్చి, కట్టుకున్న ఇళ్లు కోల్పోయి పూర్తి నిర్వాసితులుగా మారారు. వీరు సింగరేణి ఇచ్చిన ప్రైవేట్ ఉద్యోగంతో తమ బతుకు బండిని నడుపుతున్న క్రమంలో కంపెనీలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల స్థానంలో కొత్తగా పలు నిబంధనలు తెచ్చింది. భూనిర్వాసితులుగా సింగరేణిచే గుర్తించబడిన వారికి ఈ నూతన విధానం వలన ఉద్యోగ అవకాశాలు లేకుండా చేసే విధంగా టెండర్ విధానాన్ని యాజమాన్యం తెచ్చిందని తక్షణమే ఈ నూతన టెండర్ విధానాన్ని రద్దు చేసి, పాత విధానాన్నే కొనసాగించే విధంగా సవరణ చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు. పర్మనెంట్, కీ పోస్టుల్లో సైతం విధులు.. సింగరేణి సంస్థలో గతంలో రిటైర్డ్ ఆర్మీ అభ్యర్థులను సెక్యూరిటీ గార్డులుగా యాజమాన్యం నియామకాలు చేపట్టేది. ఆ ప్రక్రియను నిలిపివేస్తూ అండర్ గ్రౌండ్లలో పనిచేసిన ఉద్యోగులతో సెక్యూరిటీ గార్డుల నియామకాలు చేపట్టింది. ఆ తరువాత దానిని కొనసాగించకుండా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల నియామకం చేపట్టింది. ఈ క్రమంలో పర్మనెంట్ సెక్యూరిటీ గార్డుల కంటే ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంలో పర్మనెంట్ కార్మికులు చేసిన పోస్టుల్లో ప్రైవేట్ వారు విధులు నిర్వహిస్తూ కంపెనీ ఆస్తులను కాపాడుతున్నారు. ఈ నియామకాల్లో ప్రభావిత ప్రాంతాల వాసులు, ఇళ్లు, స్థలాలు కోల్పోయిన వారికి కల్పించిన అవకాశాన్ని రద్దుచేసి, వారి ఉపాధిని దెబ్బతీసే విధంగా యాజమాన్యం తెచ్చిన నూతన విధానాన్ని రద్దు చేయాలని వేడుకుంటున్నారు. యాజమాన్యం ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారి ని తొలగించే ప్రక్రియలో భాగంగా తీసుకొచ్చిన కొత్త సర్క్యులరు వెంటనే రద్దుచేసి పాత వారికి చట్టబద్ధత హక్కులు, ఉద్యోగ భద్రత కల్పించాలి. లేదంటే ఆందోళన చేపడతాం. సింగరేణి సంస్థ అభివృద్ధి కోసం పొలాలు, ఇళ్లను ధారాదత్తం చేసిన భూనిర్వాసితులకు యాజమాన్యం తెచ్చిన నూతన విధానంతో ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. – కంపేటి రాజయ్య, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉపాధిని దెబ్బతీసేలా నూతన టెండర్ విధానం నిబంధనలు మార్చాలని డిమాండ్ -
భానుడి ప్రతాపం
భూపాలపల్లి: భానుడు ఇప్పుడే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. సింగరేణి కోల్బెల్ట్ ప్రాంతంలో ఎండలు మండిపోతున్నాయి. మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల నుంచి 40 డిగ్రీల మధ్య నమోదు అవుతుండటంతో జనం విలవిలలాడుతున్నారు. బొగ్గు గనులు, పారిశ్రామిక ప్రాంతం కావడంతో సెగలు మరింత ఎక్కువగా ఉండి, సామాన్య ప్రజలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. నిర్మానుష్యంగా మారుతున్న వీధులు.. ఉదయం 9 గంటలు దాటితే చాలు, సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రోడ్లన్నీ కర్ఫ్యూను తలపిస్తున్నాయి. ప్రధాన కూడళ్లు, జాతీయ రహదారులు వాహనాలు లేక వెలవెలబోతున్నాయి. అత్యవసర పనులు ఉన్నవారు మాత్రమే ముఖానికి రుమాళ్లు కట్టుకుని బయటకు వస్తున్నారు. ప్రజలు తమ పనులను ఉదయం వేళల్లోనే ముగించుకుని, మధ్యాహ్నం అంతా ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఓసీ కార్మికుల ఇబ్బందులు.. సింగరేణి ఉపరితల గనులు(ఓపెన్కాస్ట్)ల్లో పని చేస్తున్న కార్మికులు ఎండ వేడిమిని తట్టుకోలేకపోతున్నారు. ఎండ నేరుగా వారిపైనే పడుతుండటంతో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఎండను తట్టుకోలేక కొంతమంది కార్మికులు విధులకు హాజరుకాకపోవడంతో గైర్హాజరు శాతం ఓపెన్కాస్ట్ల్లో పెరుగుతుంది. రాత్రిషిఫ్టు కార్మికులు మాత్రం గతంలో మాదిరిగానే హాజరవుతున్నారని అధికారులు తెలుపుతున్నారు. జాగ్రత్తలు తప్పనిసరి పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు వడదెబ్బకు గురికాకుండా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అవసరమైతే తప్ప మధ్యాహ్న సమయాల్లో బయటకు రావద్దని సూచిస్తున్నారు. డీహైడ్రేషన్కు గురికాకుండా తరచూ నీళ్లు, పండ్ల రసాలు తీసుకోవాలని, ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొంటున్నారు. మున్ముందు ఎండల తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుండటంతో, సింగరేణి ప్రాంతవాసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. ఎండల తీవ్రత పెరగడంతో గృహోపకరణాల మార్కెట్ ఒక్కసారిగా పుంజుకుంది. వారం రోజులుగా ఏసీలు, ఎయిర్ కూలర్ల అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. షోరూంలన్నీ కస్టమర్లతో కిటకిటలాడుతున్నాయి. పేద, మధ్యతరగతి ప్రజల ఫ్రిజ్గా పిలవబడే మట్టి కుండలు, రంజన్లకు డిమాండ్ పెరిగింది. ఆరోగ్యం దృష్ట్యా కూడా చాలామంది వీటినే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. శీతల పానీయాలు: దాహం తీర్చుకోవడానికి ప్రజలు కొబ్బరి నీళ్లు, మజ్జిగ, పుచ్చకాయలు, ఇతర శీతల పానీయాలు తీసుకుంటున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఇళ్లకే పరిమితం అవుతున్న ప్రజలు నిర్మానుష్యమవుతున్న ప్రధాన కూడళ్లు -
నేరాల నియంత్రణకు కృషి
టేకుమట్ల: నేరాల నియంత్రణకు కృషి చేయాలని, శాంతి భద్రతలు కాపాడాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా టేకుమట్ల పోలీస్స్టేషన్ను శుక్రవారం తనిఖీ చేశారు. నమోదైన కేసుల వివరాలు తెలుసుకుని పెండింగ్ కేసులపై దృష్టి సారించాలన్నారు. అనంతరం స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా స్టేషన్ ఆవరణలో మొక్క నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవాంఛనీయ ఘటనలు, అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకోకుండా కచ్చితమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. రాత్రి వేళల్లో ప్రత్యేకంగా పెట్రోలింగ్ చేపట్టాలన్నారు. ప్రజా ఫిర్యాదులో జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు, చిట్యాల సీఐ మల్లేష్, టేకుమట్ల ఎస్సై అమూల్య పాల్గొన్నారు.ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
ఎస్ఎస్తాడ్వాయి: గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధిశాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. అర్హులైన ప్రతీ కుటుంబానికి సొంతిల్లు కట్టించి అంకంపల్లిని ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. మండలంలోని అంకంపల్లిలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంతోపాటు ఆర్అండ్బీ రోడ్డు నుంచి అంకంపల్లి వరకు రూ.83 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణానికి మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతీ పేద కుటుంబానికి సొంతల్లు ఉండాలన్నదే ప్రభుత్వ సంకల్పమని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల ద్వారా ఆ కల సాకారమవుతుందన్నారు. రోడ్డు నిర్మాణంతో విద్య, వైద్య ఉపాధి అవకాశాలు గ్రామస్తులకు సులభంగా చేరుతాయన్నారు. గ్రామీణ జీవనోపాధికి బొంగు చికెన్, ఇప్ప పువ్వు వంటి స్థానిక వనరులను ఆదాయ మార్గాలుగా మలుచుకోవాలన్నారు. అర్హులైన ము గ్గురి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. అదే గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన మంత్రి సీతక్క.. పిల్లలకు అందుతున్న పౌష్టికాహారం, మౌలిక సదుపాయాలపై పిల్లలను అడిగి తెలుసుకున్నారు. ముందుగా గంగారం గ్రా మపంచాయతీ పరిధిలోని అన్నారంలో రూ.15 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్రావు, జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్శన్ రేగ కల్యాణి, సర్పంచులు, బడే రజిత, వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్, మేడారం జాతర మాజీ చైర్మన్ అరెం లచ్చుపటేల్, జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతరెడ్డి, జిల్లా కార్యదర్శి ఇర్ప సునీల్, మండల ఉపాధ్యక్షుడు నాగేశ్వర్రావు, నార్లాపూర్ సర్పంచ్ కృష్ణ, ఉప సర్పంచ్ భాస్కర్రెడ్డి పాల్గొన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాంవెంకటాపురం(కె): అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. మండలకేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్లో వెంకటాపురం, వాజేడు, కన్నాయిగూడెం, మంగపేట, ఏటూరునాగారం మండల ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కంకలవాగు బ్రిడ్జి నిర్మాణ పనులు, పాలెం, చొక్కాల, వెంకటాపురం మండలకేంద్రంలో సీసీ రోడ్లు, రాచపల్లి పంచాయతీ మొట్లగూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి గిరిజనులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను విడతల వారీగా అందిస్తామని అన్నారు. -
పునర్జీవం
మొక్కజొన్న కొనుగోలులో ప్రభుత్వం విఫలం మొక్కజొన్న కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు విమర్శించారు.ఓటీ..లూటీ మేడారం జాతరలో విధులు నిర్వహించిన ఆర్టీసీ ఉద్యోగులకు ఓవర్ టైమ్ (ఓటీ) విధులకు సరిగా చెల్లింపులు చేయకుండా అధి కారులు ఇబ్బందులు పెడుతున్నారు. చాళుక్యులు, కాకతీయుల కాలం నాటి విగ్రహాలకు మెరుగులుకాళేశ్వరం: ప్రాచీన పుణ్యక్షేత్రమైన కాళేశ్వరాలయంలో చాళుక్యులు, కాకతీయుల కాలం నాటి కళావైభవం మళ్లీ వెలుగులోకి రానుంది. ఎన్నో ఏళ్లుగా నిరాధారణకు గురై పక్కకు పడేసిన అపూర్వ శిల్పాలను దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో గుర్తించారు. ఆ విగ్రహాలను భద్రపరిచేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. సుమారుగా క్రీస్తు శకం 540 నుంచి 1200 మధ్యకాలానికి చెందిన ఈ విగ్రహాలు ఆ కాలపు శిల్పకళా నైపుణ్యానికి అద్దం పడుతున్నాయని జోరుగా చర్చ జరుగుతోంది. 105 విగ్రహాలను ప్రస్తుతం పరిసరాల్లో గుర్తించి మెరుగులు దిద్దుతూ పునర్జీవం పోయనున్నారు. ప్రభుత్వం దృష్టి.. కాళేశ్వరంలో నిరాధరణకు గురవుతున్న శిల్పకళను భవిష్యత్ తరాలకు అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. దీంతో మ్యూజియం నిర్మాణానికి ప్రణాళికలు చేశారు. గతనెలలో రూ.1.20కోట్లతో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు శంకుస్థాపన చేశారు. మే నెలలో సరస్వతీనది అంత్య పుష్కరాలు, వచ్చే ఏడాది జూన్లో గోదావరి పుష్కరాల సమయానికి అందుబాటులోకి రానుంది. చాళుక్యులు, కాకతీయ ఽశిల్పకళా వైభవం.. కాళేశ్వరాలయం చాళుక్యులు, కాకతీయులు, ఇతర రాజవంశాల పాలనలో ఎంతో వైభవంగా నిర్మితమైందని ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఆలయ పరిసర ప్రాంతాల్లో విసిరివేయబడినట్లు ఉన్న ఈ పురాతన శిల్పాలు కాలక్రమేణా దెబ్బతిన్నా వాటి చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యం మాత్రం ఇప్పటికీ తగ్గలేదు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆర్కియాలజీశాఖ ఈ విగ్రహాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే ప్రాథమిక పరిశీలనలు పూర్తిచేసి శిల్పాల ప్రాముఖ్యతను గుర్తించారు. వీటిని ప్రత్యేకమైన రసాయనాలతో శుభ్రపరచి, సంరక్షించి, మ్యూజియంలో అమర్చే దిశగా చర్యలు చేపడుతున్నారు. శిల్పకళా వీక్షణకు అవకాశం.. చాళుక్యులు, కాకతీయుల కళా వైభవాన్ని భక్తులు, పర్యాటకులు మ్యూజియంలో ఒకే చోట ప్రత్యక్షంగా చూడగలుగుతారు. ఈ మ్యూజియం ప్రాంతీయ చరిత్రను వెలికితీసే కేంద్రంగా మారే అవకాశం ఉంది. ఇంకా పరిసరాల్లో చాలా వరకు పురాతన విగ్రహాలు ఆదరణకు నోచుకోలేదు. వాటిని కూడా గుర్తిస్తే భవిష్యత్ తరాలకు చరిత్ర తెలుసుకునే అవకాశం ఉంది. మ్యూజియంలో విగ్రహం పేరు, ఏ కాలం నాటిది, స్టోన్, చరిత్ర వివరాలు పొందుపర్చనున్నారని తెలిసింది.శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానంలో (కాలుడు–యముడు) కొలువై ఉన్నారు. ఈ పరిసరాల్లో ఎక్కడ తవ్వినా పురాతన శిల్ప కళాసంపద బయటపడుతుందని గ్రామంలో చర్చ ఉంది. ప్రస్తుతం భిన్నమైన విగ్రహాలను కొన్నింటిని నిరాధరణకు గురిచేశారు. లైమ్ సాండ్ స్టోన్, బసల్ట్, బ్లాక్ స్టోన్లు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా చాళుక్యులు, కాకతీయుల కాలం నాటి 105 విగ్రహాలను గుర్తించారు. అందులో జయ, విజేయుడు, సూర్యుడు, యముడు, చిత్రగుప్తుడు, డుండి గణపతి, వేంకటేశ్వరస్వామి, బింధు మాధవ, నందులు, చతుర్ముఖ బ్రహ్మ శివలింగం, అహళ్య, సప్తరుషులు, సపక్త మాతృకలు, కృష్ణుడు, పరుషురాముడు, బలరాముడు, సూర్యచంద్రులు, అగ్నిస్తంభం, శివలింగాలు తదితర విగ్రహాలు మెరుగులు దిద్దుతూ పునర్జీవం పొందనున్నాయి. -
ఇసుక పంపిణీలో పారదర్శకత
ములుగు: జిల్లాలోని 10 మండలాల్లో గురువారం నుంచి ‘మన ఇసుక వాహనం‘ అమలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ములుగు కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై గురువారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్థానిక గృహ నిర్మాణాలకు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి, ప్రభుత్వం ఇసుకను పారదర్శకంగా తక్కువ ధరకే అందిస్తోందని తెలిపారు. ఇసుక కావాల్సిన వారు టీఎస్ఎంఐవీ.సీజీజీ.జీఓవి.ఐఎన్ వెబ్సైట్ నుంచి వివరాలు నమోదు చేసుకోవచ్చని సూచించారు. టీ–ఫైబర్ కేబుల్స్ రక్షణకు ప్రత్యేక జాగ్రత్తలు జిల్లాలో జరిగే అభివృద్ధి పనుల కోసం జరిగే తవ్వకాల్లో భాగంగా టెలికాం, టీ ఫైబర్ కేబుల్స్ రక్షణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ దివాకర టీఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ఐటీఎస్ డిప్యూటీ డైరెక్టర్ భాస్కరరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా టెలికాం కమిటీ సమావేశానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కంట్రోల్ రూమ్ ప్రారంభం యాసంగి (రబీ) 2025–26 సీజన్ కోసం కలెక్టరేట్లోని సివిల్ సప్లై కార్యాలయంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కంట్రోల్ రూమ్ను గురువారం కలెక్టర్ దివాకర టీఎస్ ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తూకం, రవాణా, మద్దతు ధర ఇతర సాంకేతిక ఇబ్బందులు తలెత్తినప్పుడు రైతులకు కంట్రోల్ రూమ్ ద్వారా తక్షణ పరిష్కారం లభిస్తుందని, ఫిర్యాదుల కోసం 93474 16178 నంబర్ను సంప్రదించవచ్చని స్పష్టం చేశారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ మహేందర్ జీ, డీఆర్డీఓ చంద్రశేఖర్ రెడ్డి, ఏడీ మైన్స్ జయరాజు, పీడీ హౌసింగ్ సూర్యనారాయణ, సివిల్ సప్లై డీఎం కృష్ణవేణి, డిప్యూటీ తహసీల్దార్ విజయ్ కుమార్, టెలికాం సంస్థల ప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి
భూపాలపల్లి: ప్రభుత్వ ఆస్తులు కాపాడాలని, అన్యాక్రాంతం అయితే కఠిన చర్యలు తీసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో ప్రభుత్వ భూములు, చెరువులు పరిరక్షణ, కోర్టు కేసులు, కౌంటర్లు దాఖలు తదితర అంశాలపై భూ పాలపల్లి నియోజకవర్గ రెవెన్యూ, అటవీ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, సింగరేణి తదితర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అర్హులైన రైతులను గుర్తించి సమగ్ర సర్వే నిర్వహించి భూ హక్కు పత్రాలు జారీ చేయాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. సర్వే ప్రక్రియను వేగవంతం చేయడానికి లైసెన్స్డ్ సర్వేయర్ల సేవలను వినియోగించుకోవాలని సర్వే అండ్ ల్యాండ్ ఏడీకి సూచించారు. సర్వే కోసం నిర్ణయించిన గడువులో పనులు పూర్తి అయ్యేలా ఆర్డీఓ తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో డీఎఫ్ఓ నవీన్రెడ్డి, అదనపు కలెక్టర్ అశోక్కుమార్ పాల్గొన్నారు. ప్రజలకు అవగాహన కల్పించాలి.. పైపుల ద్వారా సహజ వాయువు వినియోగాన్ని పెంచడం ద్వారా ఎల్పీజీ వినియోగం తగ్గించాలనే లక్ష్యంతో, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ మౌలిక వసతుల విస్తరణ ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి నగర గ్యాస్ పంపిణీ నెట్వర్క్ విస్తరణ, వాణిజ్య ఎల్పీజీ సరఫరా పరిస్థితులు, పైపుల ద్వారా సహజ వాయువు వినియోగాన్ని ప్రోత్సహించే అంశాలపై రెవెన్యూ, పోలీసు, అటవీ, పౌర సరఫరాలు, మున్సిపల్, పంచాయతీ తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. సంక్షోభం కారణంగా దేశంలో ఎల్పీజీ సరఫరా లపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో, భారత, రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక చర్యలను చేపట్టినట్లు వివరించారు. ఈ సమావేశంలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అరైవ్ అలైవ్ సమర్థవంతంగా అమలు చేయాలి.. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడించారు. డీజీపీ శివధర్రెడ్డితో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామక్రి ష్ణారావు గురువారం జిల్లా కలెక్టర్లతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్లో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, అదనపు కలెక్టర్అశోక్కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సర్వే ప్రక్రియ వేగవంతం చేయాలి కలెక్టర్ రాహుల్ శర్మ -
కాళేశ్వరం శిల్పకళకు
శుక్రవారం శ్రీ 10 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026● దేవాదాయశాఖ ఉన్నతాధికారుల దృష్టిసారింపు ● విగ్రహాలపై ఆర్కియాలజీశాఖ రీసెర్చ్ ● 105 పాత విగ్రహాలను ప్రత్యేక రసాయనాలతో శుభ్రం ● రూ.1.20కోట్లతో మ్యూజియం నిర్మాణం ● త్వరలో భక్తులు, పర్యాటకులకు అందుబాటులోకి.. -
సున్నం, నాచు, మురికి, సిమెంట్ను తొలిగిస్తున్నాం..
పురాతన విగ్రహాలను శుభ్రంచేసే పని మాది. ద్రాక్షారామం, సామర్లకోట, డిక్కవోలులో పురాతన విగ్రహాలను శుభ్రం చేశాం. ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయి న మురికిని ఏఎస్ఏ, ఆర్కియాలజీశాఖ ఆధ్వర్యంలో ఆర్థోపాస్పరిక్యాసిడ్, అమోనియా, టీఫాల్ చ అనే రసాయనాలను నీటితో కలిపి విగ్రహాలపై ఉన్న నాచు, సున్నం, సిమెంట్, మురికిని కడిగి తొ లిగిస్తున్నాం. 105 విగ్రహాలు తీసుకువచ్చారు. రెండురోజుల్లో పూర్తి చేస్తాం. ఆ తరువాత భిన్నమైన, విరిగిన విగ్రహాలను అతికించే టీం వస్తుంది. – జి.రమణ, క్లీనింగ్ మేసీ్త్ర, ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్ చాళుక్యులు, కాకతీయుల కాలంనాటి పాత విగ్రహాలు నిరాధరణకు గురయ్యాయి. గతంలో పలుమార్లు ఆర్కియాలజీశాఖ పరిశీలనలకే పరిమితం చేశారు. ప్రస్తుతం దేవాదాయశాఖ ఉన్నతాధికారులు దృష్టిసారించి విగ్రహాలను మ్యూజియంలో ఏర్పాటు చేసేందుకు కృషి చేయడం, శిల్పకళకు మెరుగులు దిద్దడం శుభపరిణామం. ప్రతీ విగ్రహానికి ఒక్కో చరిత్ర ఉంది. విగ్రహాల ఆధారంగా భవిష్యత్ తరాలకు చరిత్ర తెలుసుకునే అవకాశం ఉంది. కాళేశ్వరాలయం అభివృద్ధికి ఇదొక అడుగు. – త్రిపురారి కృష్ణమూర్తిశర్మ, కాళేశ్వరం దేవస్థానం రిటైర్డ్ ప్రధాన అర్చకుడు కాళేశ్వరం దేవస్థానం పరిధిలో పురాతన విగ్రహాలను ఒక చోటకు చేర్చి విగ్రహాలపై రీసెర్చ్ చేస్తున్నాం. రిపోర్డు వచ్చిన తరువాత పూర్తి వివరాలు తెలుపుతాం. ప్రత్యేక రసాయనాలతో విగ్రహాలను శుభ్రం చేస్తున్నాం. చాళుక్యులు, కాకతీయుల కాలంనాటి విగ్రహాలుగా కనిపిస్తున్నాయి. ఉన్నతాధికా రుల ఆదేశాలతో వివరాలు త్వరలో తెలియజేస్తాం. – మాధవి, పురావస్తుశాఖ, అసిస్టెంట్ డైరెక్టర్, హైదరాబాద్ -
బాల్య వివాహాల నిర్మూలనలో వీసీపీసీల పాత్ర కీలకం
ఏటూరునాగారం: బాల్య వివాహాల నిర్మూలనలో వీలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ (వీసీపీసీల) పాత్ర కీలకమని జిల్లా సంక్షేమ అధికారి ఈపీ ప్రేమలత అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో జరిగిన బాలల పరిరక్షణ, బాల వివాహాల నిర్మూలనపై చెల్పాక, చిన్నబోయినపల్లి సెక్టార్లలోని అంగన్వాడీ టీచర్లకు నిర్వహించిన అవగాహన సదస్సుకు డీడబ్ల్యూఓ హాజరై మాట్లాడారు. బాలల హక్కుల పరిరక్షణలో వీసీపీసీ(వీలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ) పాత్ర కీలకమని, ప్రతీ నెలా గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ అధ్యక్షతన గ్రామ బాలల పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్లు పుష్పావతి, వసంత, పోషణ్ అభియాన్ బ్లాక్ కో–ఆర్డినేటర్ ఇమ్మాన్యూఝెల్, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. ఏటూరునాగారం: మండలంలోని గంటలకుంట అటవీ సమీపంలోని గొత్తికోయగూడేల్లో అటవీశాఖ అధికారులు తీసిన ట్రెంచ్లో పడి గురువారం ఒక ఆవు మృతి చెందింది. అటవీశాఖ అధికారులు గోతులు తీయడంతోనే ఆవు మృతి చెందిందని గొత్తికోయ గిరిజనులు ఆరోపిస్తున్నారు. -
ఎయిడ్స్పై అవగాహన సమాజ రక్షణకు కీలకం
భూపాలపల్లి అర్బన్: ఎయిడ్స్ వంటి ప్రాణాంతక వ్యాధులపై సరైన అవగాహన కలిగి ఉండటం సమాజ రక్షణకు అత్యంత కీలకమని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం చేపట్టిన ‘99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం స్థానిక అంబేడ్కర్ స్టేడియం నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు ఎయిడ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఎయిడ్స్ నివారణే ఉత్తమ మార్గమని, సురక్షిత జీవన విధానం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చని తెలిపారు. వ్యాధి వ్యాప్తి మార్గాలు, నివారణ పద్ధతులపై ప్రజలు అవగాహన పెంపొందించుకోవాలన్నారు, అపోహలు దూరం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్య రక్షణకు కట్టుబడి ఉందని, ఇటువంటి అవగాహన కార్యక్రమాలు సమాజంలో సానుకూల మార్పులు తీసుకువస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి సురక్షిత జీవన విధానాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.., ఎయిడ్స్ వంటి వ్యాధులపై సరైన అవగాహన కల్పించడం అత్యంత అవసరమని తెలిపారు. వ్యాధి వ్యాప్తి మార్గాలు, నివారణ చర్యలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, బాధితుల పట్ల వివక్ష, అపోహలను తొలగించాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో అవగాహన పెంపొందించడం, సరైన సమాచారం అందించడం, బాధితుల పట్ల సమాజంలో ఉన్న వివక్షను తగ్గించడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు -
గోవులు తరలిస్తున్న వాహనాల పట్టివేత
● 32 ఆవులు గోశాలకు తరలింపు వాజేడు: మండలంలోని మండపాక వద్ద 163వ నంబర్ జాతీయ రహదారిపై గోవులను తరలిస్తున్న నాలుగు బొలేరో వాహనాలను పోలీసులు పట్టుకున్నారు. మూగజీవాలను అక్రమంగా తరలిస్తున్న విషయం తెలుసుకున్న ఎస్సై జక్కుల సతీశ్ ఆధ్వర్యంలో గురువారం పట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల సంతలో గోవులను కొని నాలుగు బొలేరో వాహనాల్లో వరంగల్ మీదుగా హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో మండపాక వద్ద జాతీయ రహదారిపై కాపు కాశారు. అటుగా వచ్చిన బొలెరో వాహనాలను ఆపి తనిఖీ చేశారు వాటిలో 32 పశువులు ఉన్నట్లు గుర్తించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా పశువులను తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేయడంతో పాటు భూపాలపల్లి జిల్లాలోని రాంపూర్ గోశాలకు గోవులను తరలించారు. పశువులను అక్రమంగా తరలిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలను తీసుకుంటామని ఎస్సై సతీశ్ హెచ్చరించారు. -
పోరాటం ఉధృతం చేస్తాం..
ఏటూరునాగారం: గొత్తికోయ గూడేల్లో అటవీశాఖ అధికారులు ట్రెంచ్లు తీయడం నిలిపివేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండీ.దావూద్ హెచ్చరించారు. గురువారం మండలంలోని గొత్తికోయ గుడేలకు చెందిన గొత్తికోయలు ఐటీడీఏ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఐటీడీఏలోని ఎస్డీసీ గంట ప్రతాప్, డీడీ దబ్బకట్ల జనార్దన్కు వినతి పత్రం ఇచ్చారు. అనంతరం ఐటీడీఏ నుంచి సబ్ డీఎఫ్ఓ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి అక్కడ కూడా ధర్నా నిర్వహించి ఫారెస్ట్ రేంజర్ ట్రైనింగ్ ఐఎఫ్ఎస్ ప్రతిమిష్ కేశవ, డీఆర్ఓ అప్సరున్నిసా బేగంకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం కలెక్టర్, డీఎఫ్ఓతో ఫోన్లో మాట్లాడి ధర్నా విరమించారు. కార్యక్రమంలో టీఎల్ రవి, మండల కమిటీ సభ్యుడు తోలెం కృష్ణయ్య, మండల నాయకులు సమ్మయ్య సురేశ్, దేవయ్య, జోగయ్యతో పాటు 60 మంది పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండీ దావూద్ కందకాలు తీయడం నిలిపేయాలని కార్యాలయాల ఎదుట ధర్నా -
బాల్యానికి బంధనం
పదో తరగతి, ఇంటర్ పూర్తి చేసిన అమ్మాయిలకు గ్రామాల్లో వివాహాలు చేస్తున్నారు. దీంతో వారు ఊహించుకున్న భవిష్యత్ దక్కకుండా పోతుంది. పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లోనే బాల్య వివాహాలు అత్యధికంగా జరుగుతున్నాయి. దీంతో చదువుకు బ్రేక్ పడి ఇంటి బాధ్యతలు, వంటింటికే పరిమితం కావాల్సి వస్తుంది.భూపాలపల్లి రూరల్: ఆడపిల్లలకు వయస్సు రాగానే పెళ్లి చేయాలనే ఆరాటం తల్లిదండ్రుల్లో ఎక్కువగా పెరిగిపోతుంది. ఆడపిల్ల పెళ్లి చేస్తే బాధ్యత తీరుతుందని చాలా మంది భావిస్తూ మాంగళ్యతంతు ముగించేస్తున్నారు. చిన్నతనంలోనే పెళ్లి పీటలు ఎక్కిస్తున్నారు. జిల్లాలో చాలా ప్రాంతాల్లో బడుగు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీల్లోనే ఇవి ఎక్కువగా నమోదవుతున్నాయి. అధికారులు సమాచారంతో బాల్య వివాహాలను అడ్డుకొని వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నా.. చాలా మంది తీరులో మార్పు రావడం లేదు. అవగాహన కల్పిస్తున్నా.. బాల్య వివాహాల కట్టడికి జిల్లాలో మాతా శిశు సంరక్షణ అధి కారులు తగు చర్యలు తీసుకుంటున్నప్పటికీ అవి మాత్రం ఆగ డం లేదు. తమకున్న సమాచారంతో తల్లిదండ్రుల వద్దకు వెళ్లి బాలికలతో పాటు తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో కొంతవరకు ఇవి తగ్గినట్లు కనిపిస్తున్నా.. లోలోపల మా త్రం గుట్టుచప్పుడు కాకుండా పూర్తయ్యేవి అనేకం ఉంటున్నాయి. ఆర్థిక ఇబ్బందులు.. పిల్లల ప్రవర్తన చాలాచోట్ల జరుగుతున్న బాల్య వివాహాలకు ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది. తమకంటే ఆర్థికంగా ఉన్న కుటుంబాల వారికి తమ కూతుళ్లను పెళ్లి చేసి ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. దీంతో తమ అమ్మాయి జీవితం బాగుంటుందని ఆశపడుతున్నారు. మరికొందరైతే సోషల్ మీడియా ప్రభావంతో పిల్లలు పెడదారి పరుతున్నారని ఆలోచించి చిన్న వయస్సులోనే గుట్టు చప్పుడుకాకుండా పెళ్లిళ్లు చేస్తున్నారు. బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరం. నిర్మూలనకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. సమాచారం ఇస్తే అధికారులు వెంటనే అడ్డుకునేలా చర్యలు చేపడుతాం. గతంతో పోలిస్తే ప్రస్తుతం కొంత తగ్గుముఖం పట్టాయి. బాల్య వివాహాల నియంత్రణ, బాలల చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. గ్రామాల్లో బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతిఒక్కరూ సహకరించాలి. చైల్డ్ హెల్ప్లైన్ 1098కు సమాచారం అందించాలి. – మల్లీశ్వరి, జిల్లా సంక్షేమాధికారి బాల్య వివాహాలు చేస్తే అమ్మాయి తండ్రికి, అబ్బాయి తండ్రికి రూ.లక్ష జరిమానాతో పాటు రెండేళ్ల జైలు శిక్ష పడుతుంది. అబ్బాయి మేజర్ అయినట్లయితే ఆయనకు సైతం ఫైన్తో పాటు రెండేళ్ల జైలు శిక్ష ఉంటుంది. ఒకవేళ మైనర్ అయితే స్థానిక పోలీస్స్టేషన్లో కౌన్సెలింగ్ ఇస్తారు. అంధకారం అవుతున్న భవిష్యత్ అడ్డుకుంటున్నా.. ఆగని పెళ్లిళ్లు గ్రామాల్లోనే అధికం


