breaking news
Jayashankar
-
అంతులేని ఆదాయం.. పోస్టింగ్ కోసం పోటాపోటీ..
రవాణాశాఖలో అంతులేని ఆదాయం ఉండటంతో కొందరు అధికారులు పోటీపడి పోస్టింగ్లు కొడుతున్నారు. కొందరు మోటారు వెహికిల్ ఇన్స్పెకర్లు ఇప్పుడు ఇన్చార్జ్ డీటీఓలుగా కూడా అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. ఇందులో కూడా కొన్నిచోట్ల సీనియర్లు తిరకాసు చేసి జూనియర్లను ముందుంచి తెరవెనుక అక్రమ ఆదాయమార్గాలపై చక్రం తిప్పుతున్నారు. హనుమకొండ డీటీఓ పోస్టు కూడా ఖాళీ అయిన సమయంలో వాస్తవానికి అదే కార్యాలయంలో సీనియర్గా ఉన్న 1994 బ్యాచ్కు చెందిన సీనియర్ ఎంవీఐ డీటీఓగా బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. అయితే తెరపైన కీలక పోస్టులో ఉండటం ఇష్టం లేక అత నే ఆ పోస్టుపై విముఖత చూపడంతో 2012 బ్యా చ్కు చెందిన ఒకరికి ఆ పోస్టు కట్టబెట్టి ఆ సీనియ ర్ ఎంవీఐ అన్నీ తానై చూస్తుండటం వల్లే మా మూళ్లు రెండింతలయ్యాయన్న ఆరోపణలు ఉ న్నాయి. ఇదిలాఉంటే ఇన్చార్జ్ల కోసం అన్ని జిల్లాల్లో పోటీ ఉంది. వరంగల్లో ఎంవీఐగా ఉన్న ఒకరు మహబూబాబాద్ ఇన్చార్జ్ డీటీఓగా వ్యవహరిస్తుండగా, పెద్దపల్లి ఎంవీఐగా ఉన్న ఓ అధికా రి ఆ పోస్టుతోపాటు ములుగు ఎంవీఐగా, ఇన్చార్జ్ డీటీఓగా వ్యవహరిస్తున్నారు. భూపాలపల్లిలో ఎంవీఐగా, ఇన్చార్జ్ డీటీఓగా ఒక్కరే చూస్తున్నారు. ఇలా.. ఏళ్లతరబడిగా ఉమ్మడి వరంగల్లో పాతుకుపోయిన కొందరు రవాణాశాఖ అధి కారు ల తీరుపై ఆ శాఖ ఉద్యోగులే చర్చించుకుంటున్నా రు. హైదరాబాద్ స్థాయిలో పైరవీలు చేసుకుంటూ కోరుకున్న పోస్టుల్లో కొనసాగుతున్నారంటున్నారు. కాగా,రవాణాశాఖలో పెచ్చుమీరుతున్న అవినీతిపై కొందరు అవినీతి నిరోధకశాఖ అధికా రులు కూడా ద్వంద్వ వైఖరితో ఉన్నారన్న చర్చ కూడా ఆ శాఖలో జరుగుతోంది. వ్యక్తిగత పరిచయాల ఆధారంగా లెక్కకు మించిన అవినీతి జరి గినా ఆ కార్యాలయాలు, అధికారులపై ఉదాసీనంగా ఉంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్
కాటారం: కాటారం మండలం శంకరాంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గొల్లపల్లి అంగన్వాడీ కేంద్రాన్ని గురువారం కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్ పరిశీలించారు. భారీ వర్షం కురిసినప్పుడు వరద నీరు అంగన్వాడీ కేంద్రంలోకి చేరడంతో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని పలువురు సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన సీడీపీఓ రాధికతో కలిసి అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి భవనం పరిస్థితి, చిన్నారుల ఇబ్బందిపై ఆరా తీశారు. రోడ్డు ఎత్తుగా ఉండటం, కేంద్రం చుట్టూ నీరు నిలిచి ఉండటాన్ని గమనించిన సబ్ కలెక్టర్ వెంటనే చర్యలు చేపట్టాలని పీఆర్ డీఈ సాయిలును ఆదేశించారు. శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని సీడీపీఓ, అంగన్వాడీ టీచర్ సువర్ణ సబ్ కలెక్టర్ను కోరారు. గ్రామంలో డ్రెయినేజీ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరగా.. నివేదిక తయారు చేయాలని సబ్ కలెక్టర్ అధికారులకు సూచించారు. సబ్ కలెక్టర్ వెంట పీఆర్ ఏఈ సతీశ్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ ఉన్నారు. -
మత్తులో భవిష్యత్
గంజాయి కిక్కులో స్టూడెంట్స్, యూత్ కాళేశ్వరం: గంజాయి మత్తులో పడి జిల్లాలోని విద్యార్థులు, యువకులు చేజేతులా బంగారు భవిష్యత్ను నాశనం చేసుకుంటున్నారు. పాఠశాల, కళాశాల విద్యార్థులు, యువకులు టార్గెట్గా జిల్లాలో గంజాయి విక్రయాలు సాగుతుండగా ఆ ఉచ్చులో చిక్కుకుంటున్నారు. మహారాష్ట్ర గుండా జిల్లాకు చేరుతున్న గంజాయి.. జిల్లాలోని అన్ని గ్రామాల్లో అమ్మకాలు జరుగుతున్నాయి. ఇష్టారీతిన వదిలేయడంతో.. భూపాలపల్లి, గణపురం, మహముత్తారం, కాటారం, మహదేవపూర్, కాళేశ్వరం లాంటి మండలాల్లో 13 ఏళ్ల పిల్లల నుంచి 20 ఏళ్ల యువత వరకు మద్యం, సిగరేట్, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడి బానిసలుగా మారుతున్నారు. పిల్లలను తల్లిదండ్రులు ఇష్టారీతిన వదిలేయడంతో చెడుస్నేహాలు చేస్తూ అడ్డదారులు తొక్కుతున్నారు. పోలీసులు పలుమార్లు కౌన్సెలింగ్లు ఇచ్చినా మార్పు రావడం లేదు. పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా యువకులు, విద్యార్థులు గంజాయికి బానిసలవుతున్నారు. పాఠశాల స్థాయి నుంచే కొందరు బాలురు గంజాయి కిక్కుకు బానిసలవుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జూలై 7న భూపాలపల్లిలో టాస్క్ఫోర్స్ పోలీసులకు ఐదుగురు వ్యక్తులు 135 కిలోల గంజాయితో పట్టుబడ్డారు. ఐటీఐ విద్యార్థులు ముగ్గురు జూలై 23న కాళేశ్వరం వద్ద 3.31 కిలోల గంజాయితో పోలీసులకు చిక్కారు. జూలై 26న మహాముత్తారం మండలం నుంచి భూపాలపల్లి వైపునకు బైక్పై వెళ్తున్న ముగ్గురు యువకులు 6.30 కిలోల గంజాయితో పట్టుబడ్డారు. జూలై 30న భూపాలపల్లి బస్టాండ్ వద్ద 300గ్రాముల గంజాయితో ఒకరు పట్టుబడ్డారు. ఈనెల 11న మంథని మండలం ఎక్లాస్పూర్ శివారులోని గాడుదులగండి గుట్ట సమీపంలో గంజాయి రవాణా చేస్తూ ఇద్దరితో పాటు మైనర్లు పోలీసులకు పట్టుబడ్డారు. వీరి వద్ద మహారాష్ట్రలోని సిరొంచ ప్రాంతంలో కొనుగోలు చేసిన 2.23 కిలోల ఎండు గంజాయి లభ్యమైంది. జిల్లాలో విచ్చలవిడిగా అమ్మకాలు యువతే టార్గెట్గా కోడ్ లాంగ్వేజ్ మహారాష్ట్ర గుండా జిల్లాకు.. -
పూర్వ ప్రాథమిక తరగతులకు నిధులు
విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఈ విద్యాసంవత్సరంనుంచి పూర్వ ప్రాథమిక తరగతులు ప్రా రంభించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు పా ఠశాలల్లో చిన్నారులకు అడ్మిషన్లు కల్పించారు. ప్రభుత్వం తాజాగా సమగ్ర శిక్ష ద్వారా పూర్వ ప్రాథమిక తరగతుల విద్యార్థుల కోసం నిధులు మంజూరు చేసి విడుదల చేసింది. ఈ మేరకు ఒక్కో స్కూల్కు రూ.1.70లక్షల నిధులను కలెక్టర్లకు జమ చేశారు. హనుమకొండ జిల్లాలో 45 పూర్వ ప్రాథమిక తరగతులకు నిధులు మంజూరై విడుదలయ్యాయి. అందులో 25 స్కూళ్లకు రూ.1.70లక్షల చొప్పున, మరో 20 స్కూళ్లకు రూ.50వేల చొప్పున నిధులు మంజూరు చేశారు. రంగులు, విద్యార్థులకు ఆట వస్తువులు ఆయా పాఠశాలల్లోని పూర్వ ప్రాథమిక తరగతి గదికి రూ.50వేలు వెచ్చించి రంగులు వేయించాల్సింటుంది. ఆట వస్తువులు కొనుగోలు చేయాలి. ఒక్కో విద్యార్థికి రూ.1,000 కేటాయించి బ్యాగ్, షూస్, బెల్ట్, టై తదితర వస్తువులు కొనుగోలు చేయాలి. ఈ నిధులు జిల్లా కలెక్టర్లకు విడుదల చేసిన నేపథ్యంలో వాటిని ఎలా వినియోగించుకోవాలనే విషయంపై కూడా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్.. డీఈఓలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. త్వరలోనే జిల్లాల కలెక్టర్లు ప్రతీ పూర్వ ప్రాథమిక తరగతి విద్యార్థుల బాగోగులు చూసుకునేందుకు ఒక ఆయా, ఒక ఇన్స్ట్రక్టర్ నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. కొన్నింటికి రూ.1.70లక్షలు, మరికొన్నింటికి రూ.50వేల చొప్పున విడుదల తరగతి గదికి కలర్, ఆటవస్తువులకు, విద్యార్థులకు బ్యాగ్, షూస్, టై, బెల్టు త్వరలోనే ఆయాలు, ఇన్స్ట్రక్టర్ల నియామకంజిల్లా పాఠశాలలు నిధులు భూపాలపల్లి 54 78.60 వరంగల్ 32 54.40 హనుమకొండ 65 52.50 మహబూబాబాద్ 22 37.40 జనగామ 15 21.90 ములుగు 08 13.60 -
వృద్ధులను గౌరవించాలి
భూపాలపల్లి అర్బన్: వృద్ధాప్యంలో ఉన్న వారిని గౌరవించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి నాగరాజు తెలి పారు. ప్రపంచ సీనియర్ సిటిజన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం జిల్లాకేంద్రంలోని వృద్ధాశ్రమంలో న్యాయ అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. సమస్యలు ఎదుర్కొంటున్న వయోవృద్ధులు ఎవరైనా సరే న్యాయసేవాధికార సంస్థను సంప్రదిస్తే వారికి చట్టబద్ధంగా ఉచిత సహాయం ఇస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వయోవృద్ధుల చట్టం, న్యాయసేవాధికార సంస్థ అమలుపరుస్తున్న వివిధ పథకాలను వారికి వివరించారు. వృద్ధాశ్రమంలో నివాసం ఉంటున్న పెద్దవారితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి దిలీప్కుమార్, బొట్ల సుధాకర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసచారి, అమృతవర్షిణి, అక్షర స్వచ్చంధ సేవా సంస్థ నిర్వాహకులు శ్యామ్ ప్రసాద్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్స్ కంప అక్షయ, ప్రియాంక పాల్గొన్నారు.సీనియర్ సివిల్ జడ్జి నాగరాజు -
తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దు
మొగుళ్లపల్లి: కొర్కిశాల కస్తూర్బాగాంధీ విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ అయిందని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవమని.. విద్యార్థినుల తండ్రిదండ్రులు ఆందోళన చెందవద్దని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ అన్నారు. డీఈఓ రాజేందర్, ఇన్చార్జ్ జిల్లా వైద్యాధికారి సునీత, మొగులపల్లి ఎస్సై అశోక్ గురువారం కేజీబీవీని సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారి ఆరోగ్య యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎనిమిది మంది పిల్లలకు వైరల్ ఫీవర్ రాగా.. నలుగురికి వాంతులు అయినట్లు తెలిపారు. స్కూల్ ఎస్ఓ శైలజను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గురువారం మండల వైద్యాధికారి నాగరాణి ఆధ్వర్యంలో స్కూల్లో హెల్త్ క్యాంప్ నిర్వహించినట్లు చెప్పారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు.డీఈఓ రాజేందర్ -
భద్రత, బందోబస్తు కోసమే ఆన్లైన్ నమోదు
● గణేష్ మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటించాలి ● ఎస్పీ కిరణ్ ఖరే భూపాలపల్లి: భద్రత, బందోబస్తు కోసమే పోలీసుశాఖ ఆధ్వర్యంలో గణేష్ మండపాల నిర్వహణకు సంబంధించిన ఆన్లైన్ నమోదు చేస్తున్నట్లు ఎస్పీ కిరణ్ ఖరే గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆన్లైన్ సమాచారం ఇవ్వడానికి రుసుం లేదన్నారు. మండపాల నిర్వాహకులు గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేసే ముందు స్థానిక పోలీస్స్టేషన్లో తప్పకుండా సమాచారం ఇవ్వాలని, పోలీస్ పోర్టల్లో వివరాలు పొందుపరచాలని తెలిపారు. మండపాల నిర్వాహకులు తప్పకుండా నిబంధనలు పాటించాలన్నారు. ప్రజా రవాణాకు, ఎమర్జెన్సీ వాహనాలు వెళ్లడానికి ఇబ్బంది లేకుండా మండపాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మండపాల వద్ద షాట్ సర్క్యూట్ జరుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. డీజేలు ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదని, సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించాలన్నారు. పోలీసుశాఖకు సహకరిస్తూ ప్రశాంత వాతావరణంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని ఎస్పీ కిరణ్ ఖరే సూచించారు. -
‘పనుల జాతర’కు ఏర్పాట్లు చేయాలి
● మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించాలి ● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి: ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించి గ్రామాలు అభివృద్ధి దిశగా ముందుకు సాగేందుకు చేపట్టిన పనుల జాతర–2025కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయం నుంచి నేడు (శుక్రవారం) నిర్వహించనున్న ‘పనుల జాతర–2025’ కార్యక్రమంపై గురువారం ఎంపీడీఓలు, ఎంపీఓలు, డీపీఓలు, పీఆర్ ఇంజనీర్లు, ఏపీఓలతో వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రజల భాగస్వామ్యంతో చేపడుతున్న అభివృద్ధి పనులు మరింత పారదర్శకంగా, ఫలప్రదంగా ఉండేలా అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. నేడు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రూ. 3.93 కోట్ల వ్యయంతో 1,075 పనులు చేపట్టనున్నామని, అధికారులు భాగస్వాములు కావాలని తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఆర్డీఓ బాలకృష్ణ, డీపీఓ శ్రీలత, పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఆన్లైన్లో నమోదు చేయాలి.. జిల్లాలో పీఎం ఆవాస్ యోజన సర్వే పనులను ఈ నెలాఖరులోపు పూర్తిచేసి ఆన్లైన్లో నమోదు చే యాలని కలెక్టర్ రాహుల్శర్మ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయం నుంచి గృహ నిర్మాణశాఖ అధికారులు, ఎంపీడీఓలతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో 55,444 ఇళ్లు సర్వే చేయాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం 3,359 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయన్నారు. సర్వే పనులను వేగవంతం చేయాలన్నారు. మట్టి వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలి.. వినాయక చవితి సందర్భంగా ప్రజలు పర్యావరణహితమైన మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ రాహుల్శర్మ సూచించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కాలుష్య నియంత్రణ మండలి చేపట్టిన మట్టి వినాయక విగ్రహాలను ఆవిష్కరించారు. జిల్లావ్యాప్తంగా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో వినాయక చవితి రోజున రెండు వేల మట్టి విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి క్రాంతికిరణ్, కలెక్టరేట్ సీ విభాగం పర్యవేక్షులు శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కేబుల్స్ తొలగించాలి
కాటారం: విద్యుత్ స్తంభాలపై ఏర్పాటు చేసిన కేబుల్ వైర్లు తొలగించుకోవాలని ట్రాన్స్కో ఏ డీఈ నాగరాజు కేబుల్, ఇంటర్నెట్ నిర్వాహకులకు సూచించారు. మండల కేంద్రంలోని ఏడీ ఈ కార్యాలయంలో బుధవారం కేబుల్, ఇంటర్నెట్ నిర్వాహకులు, పోలీస్, ట్రాన్స్కో అధి కారులతో ఏడీఈ సమావేశం నిర్వహించారు. విద్యుత్ స్తంభాలపై కేబుల్, ఇంటర్నెట్కు సంబంధించిన తీగలు ఏర్పాటు చేయడంతో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. విద్యుత్ ప్రమాదాల నివారణ ప్రతిఒక్కరి బా ధ్యతగా భావించాలన్నారు. గ్రామాల్లో విద్యుత్ సమస్యలు ఏర్పడితే సొంత మరమ్మతు చేయొద్దన్నారు. ఈ సమావేశంలో కాటారం ఏఈఈ ఉపేందర్, లైన్ ఇన్స్పెక్టర్ కిరణ్, కేబుల్, ఇంటర్నెట్ నిర్వాహకులు పాల్గొన్నారు. కాటారం: ఆపదలో ఉన్న వారి నుంచి సమాచారం వచ్చిన వెంటనే తక్షణ సాయం అందించాలని 108 జిల్లా మేనేజర్ మేరుగు నరేశ్ 108 అంబులెన్స్ సిబ్బందికి సూచించారు. మండల కేంద్రంలో 108 వాహనాన్ని బుధవారం తనిఖీ చేశారు. వాహనం కండీషన్, అందుబాటులో ఉన్న మందులు, ఎమర్జెన్సీ పరికరాల పనితీరు, రికార్డులను పరిశీలించారు. సిబ్బంది ఎప్పటికప్పుడు మెడిసిన్స్ అప్డేట్ చేసుకొని అందుబాటులో ఉంచుకోవాలని, అత్యవసర సమయాల్లో బాధితులకు ప్రథమ చికిత్స అందించి దగ్గరలో ఉన్న ఆస్పత్రికి చేర్చాలన్నారు. అత్యవసర సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. మేనేజర్ వెంట ఎమర్జెన్సీ మెడికల్ టెక్నిషియన్ శ్రీకాంత్, పైలెట్ విజేందర్ ఉన్నారు. భూపాలపల్లి అర్బన్: ఉపాధ్యాయుల విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23న హైదరాబాద్లో నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని ఐక్య ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) జిల్లా స్టీరింగ్ కమిటీ నాయకులు కోరారు. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలో కరపత్రాల ఆవిష్కరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. విద్యారంగ అభివృద్ధి, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కరించాలని, సీపీఎస్ రద్దు చేయాలని కోరుతూ హైదరాబాద్లో మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సేవానాయక్, తిరుపతి, కుమారస్వామి, ప్రభాకర్, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాటారం: ఉద్యోగ, ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిన సీపీఎస్ రద్దు చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని పీఆర్టీయూటీఎస్ జిల్లా అధ్యక్షుడు రేగూరి సుభాకర్రెడ్డి డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1న హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద చేపట్టనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ సంఘం సభ్యులతో కలిసి పోస్టర్ ఆవిష్కరించారు. సెప్టెంబర్ 1న చేపట్టే మహాధర్నాలో సీపీఎస్ ఉపాధ్యాయులు పాల్గొ ని ఐఖ్యతను చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రవీందర్, తిరుపతి, నాయకులు సురేశ్రావు, సంపత్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
చేపపిల్లల జాడేది!
భూపాలపల్లి రూరల్: మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి గత ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టింది. చెరువుల్లో చేపలను వదిలి మత్స్యకారుల ఉపాధికి దోహదపడింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత చేపపిల్లల పంపిణీపై అలసత్వం వహిస్తోంది. ప్రతీ సంవత్సరం మే నెలలో అధికారులు ప్రతిపాదనలు పంపి, జూన్, జూలై నెలలో టెండర్లు పూర్తి చేస్తారు. ఆగస్టు నెల వరకు చెరువులు పూర్తి స్థాయిలో నిండి ఉంటాయి కాబట్టి చేప పిల్లలను వదులుతారు. కానీ ఈ ఏడాది ఆగస్టు మాసం చివరికి వచ్చినప్పటికీ టెండర్లు పూర్తి కాలేదు. దీంతో జిల్లాలో చేపపిల్లల పంపిణీ ఉన్నట్టా..లేనట్టా! అని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. 837కి పైగా చెరువులు, కుంటలు గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఉచిత చేపపిల్ల ల పంపిణీకి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని మత్స్యకారులు అంటున్నారు. వానాకాలం భారీ వర్షాలు కురిస్తే ఆగస్టు నెల నుంచి ఉచిత చేపపిల్లల పంపిణీ జరగాల్సి ఉంది. కానీ ఆగస్టు 31వ తేదీ వరకు టెండర్లకు గడువు ఉంది. సెప్టెంబర్లో చేప పిల్లలను పంపిణీ చేసే అవకాశం ఉంది. ఆ నెలలో పంపిణీ చేస్తే చేపపిల్లల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుందని మత్స్యకారులు వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా డిపార్ట్మెంట్ చెరువులు, రిజర్వాయర్లు, గ్రామ పంచాయతీ చెరువులు మొత్తం 837 ఉన్నాయి. వీటిలో చేపపిల్లలు పోయాలంటే జిల్లాకు 2.30 కోట్ల చేపపిల్లలు అవసరం ఉంటుంది. పంపిణీలో అక్రమాలు! గతంలో మత్స్యకారులకు అందించే ఉచిత చేప పిల్ల ల పంపిణీలో భారీగా అక్రమాలు జరిగినట్లు అధికారులపై ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఉచిత చేప పిల్లల పంపిణీలో కాంట్రాక్టర్లే లాభపడుతున్నారని, మత్స్యకారులకు ప్రయోజనం ఉండటం లేదని వాపోతున్నారు. చెరువుల్లో చేపపిల్లలు పోయడానికి కాంట్రాక్ట్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు నాణ్యమైన పిల్లలను తేకుండా మత్స్యకారులను మోసం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పైగా చేపపిల్లల లెక్కింపులో కూడా అక్రమాలకు పాల్పడుతున్నారని మత్స్యకారులు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. ఇప్పటికై న అధికారులు స్పందించి నాణ్యమైన చేప పిల్లలను త్వరగా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు.మొత్తం చెరువులు 833రిజర్వాయర్లు 05మత్స్యకార సహకార సంఘాలు 125 సహకార సంఘాల సభ్యులు 10679 జిల్లాలో 837 చెరువుల్లో 2.30 కోట్ల చేపపిల్లలు అవసరం ఇప్పటికీ పూర్తికాని టెండర్లు అయోమయంలో మత్స్యకారులు -
రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివి
భూపాలపల్లి రూరల్: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివని ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణరావు అన్నారు. బుధవారం భారతరత్న రాజీ వ్గాంధీ 81వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ దేశంలో సాంకేతిక రంగానికి పునాది వేసిన గొప్పనాయకుడన్నారు. అనంతరం కమలాపూర్ గ్రామంలో వర్షాలతో దెబ్బతిన్న పెద్ద చెరువు కట్ట, మత్తడి పారే రోడ్డు ప్రాంతాన్ని ఎమ్మెల్యే, నాయకులు, రైతులతో కలిసి పరిశీలించారు. అనంతరం భూపాలపల్లి మంజూరునగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇరిగేషన్, పీఆర్ శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాల నేపధ్యంలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజా ప్రతినిధులు, నాయకులు అందుబాటులో ఉండాలన్నారు. భూపాలపల్లి ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ జుమ్లా నాయక్, సిబ్బంది, కాంగ్రెస్ నేతలతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఏటీసీ గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రా జబాబు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
యూరియా కొరత సృష్టించొద్దు
● కలెక్టర్ రాహుల్శర్మ భూపాలపల్లి అర్బన్: ఫర్టిలైజర్ షాపు యజమానులు యూరియా కొరత సృష్టించొద్దని, ఎరువుల సరఫరాపై రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. బుధవారం యూరియా సరఫరాపై కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి వ్యవసాయ, సహకార, సహకార సంఘాల సీఈఓలు, మార్క్ఫెడ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పంటలకు అవసరమైన యూరియా రైతులకు అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు వరి, పత్తి, మిర్చి, పప్పు దినుసుల పంటలు ఒకేసారి సాగు చేయడంతో యూరియా వినియోగం పెరిగిందన్నారు. మండల స్థాయిలో స్టాక్ వివరాలు మానిటరింగ్ చేయాలని, ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి యూరియా తరలించి రైతులకు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రైవేట్ డీలర్లు యూరియా కొనుగోలుకు ఇతర మందులు తీసుకోవాలని లింకు పెట్టొద్దన్నారు. అధికారులు, టాస్క్ టీములు ప్రతిరోజు పర్యవేక్షించాలన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, మార్క్ఫెడ్, ప్రైవేట్ కంపెనీల వద్ద మండల స్థాయిలో స్టాక్ ఎంత ఉందో క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) అశోక్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, సహకార అధికారి వాలియానాయక్, మార్క్ఫెడ్ డీఎం, సహకార సంఘాల సీఈఓలు, ఏఓలు పాల్గొన్నారు. -
మహాజాతరకు.. నిధుల వరద
‘మేడారం–2026’ నిర్వహణకు రూ.150 కోట్లు సాక్షిప్రతినిధి, వరంగల్/ఏటూరునాగారం: వచ్చే ఏడాది జరగనున్న తెలంగాణ కుంభమేళా, సమ్మక్క, సారలమ్మల మేడారం మహాజాతరకు భారీగా నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతీ రెండేళ్లకోసారి జరిగే ఈ మహాజాతరకు గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.150 కోట్లు మంజూరు చేస్తూ శాఖలవారీగా బడ్జెట్ను కేటాయించింది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. భారీగా నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, గిరిజన సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్లకు రాష్ట్ర సీ్త్ర శిశుసంక్షేమ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్శాఖ మంత్రి ధనసరి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. ఇతర రాష్ట్రాలనుంచి భక్తుల రాక మేడారం జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఈ క్రమంలోనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. గత ఏడాది రూ.110కోట్లు గత ఏడాది 2024 మహాజాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.110కోట్లు మంజూరు చేసి మేడారంలో పలు అభివృద్ధి పనులు చేసింది. జాతరలో భక్తుల సౌకర్యాలను మరింత పెంచేందుకు ఈసారి అదనంగా రూ.40 కోట్లు పెంచి రూ.150కోట్లు చేయడం గమనార్హం. 2022లో అప్పటి ప్రభుత్వం రూ.75 కోట్లను మేడారం జాతర నిర్వహణకు మంజూరు చేసింది. నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు గత ఏడాది రూ.110కోట్లే సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులకు మంత్రి సీతక్క ధన్యవాదాలు శాఖల వారీగా నిధులు కేటాయింపు 2026 జనవరిలో తెలంగాణ కుంభమేళా -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
కాళేశ్వరం: వర్షాలు, వరదలతో ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. బుధవారం ఎస్పీ కిరణ్ఖరేతో కలిసి కాళేశ్వరం ఘాట్, వీఐపీ ఘాట్, చండ్రుపల్లి వాగులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎగువ కడెం, గడ్చిరోలి మీదుగా వరద ప్రవాహం తరలివస్తుండటంతో కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉదయం 7 గంటలకు సీడబ్ల్యూసీ నివేదిక ప్రకారం 12.220 మీటర్ల ఎత్తుకు నీటిమట్టం చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు తెలిపారు. జిల్లా రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, విద్యుత్, ఆరోగ్య తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. నది పరీవాహక గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలకు ముందుగానే సమాచారం అందించడంతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలను గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించే చర్యలు తీసుకోవాలన్నారు. అత్యవసర సేవలకు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన 9030632608 నంబర్కు కాల్ చేయాలన్నారు. అనంతరం ఎస్పీ కిరణ్ఖరే మాట్లాడుతూ అత్యవసర సేవలకు పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. ఏదేని అత్యవసర పరిస్థితిల్లో డయల్ 100కు కాల్ చేయాలన్నారు. అలాగే కాళేశ్వరం టు అన్నారం వెళ్లే రహదారిలో చండ్రుపల్లి వద్ద కాజ్వేపై వరద నీరు కమ్మెసిన తీరును కలెక్టర్ పరిశీలించారు. పూర్తిగా నీరు తగ్గే వరకు ప్రజలను ప్రయాణాలు చేయకుండా భారీ కేడింగ్ కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి నవీన్రెడ్డి, సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, తహసీల్ధార్ రామారావు, ఎంపీడీఓ రవీంద్రనాధ్, ఎఫ్డీఓ శ్రీకాంత్, రేంజర్ రవికుమార్, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై తమాషారెడ్డిలు ఉన్నారు. ఆలస్యం చేస్తే ఎప్పుడు పూర్తవుతుంది! సరస్వతీనది పుష్కరాల సమయంలో కాళేశ్వరంలో మెయిన్ గోదావరి ఘాట్ వద్ద ఆర్చ్ నిర్మాణం ఎప్పుడు పూర్తి చేస్తారని దేవాదాయ శాఖ ఇంజినీరింగ్ అధికారులపై కలెక్టర్ రాహుల్శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం కాళేశ్వరంలో వరద ఉధృతి పరిశీలనకు వచ్చిన ఆయన ఘాట్ వద్ద ఆర్చ్ నిర్మాణ పనులను పరిశీలించి దేవాదాయశాఖ ఇన్చార్జ్ ఏఈ అశోక్కు నిర్మాణంలో ఎందుకు జాప్యం జరుగుతుందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎరువులు అందుబాటులో ఉంచాలి రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. బుధవారం మహదేవపూర్లోని పీఏసీఎస్ ఎరువుల దుకాణాన్ని ఎస్పీ కిరణ్ఖరే, కాటారం సబ్కలెక్టర్ మయాంక్సింగ్తో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణంలో ఎరువుల నిల్వలు, రైతులకు అందజేస్తున్న విధానం, రికార్డులను పరిశీలించారు. ఎరువుల పంపిణీలో పారదర్శకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. వారి వెంట పీఏసీఎస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, వ్యవసాయ శాఖ ఏఓ సుప్రజ్యోతి తదితరులు ఉన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ కాళేశ్వరంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ -
నీతి అయోగ్ అధికారుల పర్యటన
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో నీతి అయోగ్ అధికారుల బృందం పర్యటించినట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ తెలిపారు. సెంట్రల్ నోడల్ అధికారి డాక్టర్ రమణ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ వరకు జిల్లాలో పర్యటించి జిల్లాలో వైద్యారోగ్యశాఖ కార్యక్రమాలు, పురోగతిని తెలుసుకోనున్నట్లు తెలిపారు. ఈ మేరకు మంగళవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో పలిమెల పీహెచ్సీలో అందుతున్న వైద్య సేవలపై డీఎంహెచ్ఓ నీతి అయోగ్ బృందానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. నాలుగు రోజుల పాటు జిల్లాలోని పీహెచ్సీలు, పల్లె దవాఖానాలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, సీహెచ్సీలను తనిఖీ చేస్తూ ప్రజలు, ఆశకార్యకర్తలు, ఏఎన్ఎంలతో మాట్లాడుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ ఉమాదేవి, డాక్టర్ ప్రమోద్కుమార్, డాక్టర్ సందీప్ పాల్గొన్నారు. -
పారితోషికాలు వెంటనే విడుదల చేయాలి
ములుగు రూరల్: ఆశ వర్కర్లకు గతనెల పారితోషికాలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఆశ వర్కర్ల యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు గుండబోయిన రవిగౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం మండల పరిధిలోని రాయినిగూడెం పీహెచ్సీ ఎదుట ఆశ వర్కర్లతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం మెడికల్ ఆఫీసర్ అన్వేష్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీ మేరకు రూ. 18 వేల ఫిక్స్డ్ వేతనం అందించాలని డిమాండ్ చేశారు. జూలై నెల పారితోషికాలు విడుదల చేయకపోవడంతో ఆశ కార్యకర్తలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. ఆశ కార్యకర్తలకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలన్నారు. గత ప్రభుత్వం పెండింగ్లో ఉన్న 6 నెలల పీఆర్సీ విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు ఈశ్వరి, సారలక్ష్మి, స్వర్ణ, వజ్ర, కవిత, జ్యోత్స్న, యశోద, రజిత, రమాదేవి, మల్లిక పాల్గొన్నారు. -
వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి
కాటారం: భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండి గ్రామాల్లో నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని కలెక్టర్ రాహుల్శర్మ అధికారులను ఆదేశించారు. మహాముత్తారం మండలం యామన్పల్లి వద్ద గల వాగు, కేశవపూర్, పెగడపల్లి గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై ప్రవహిస్తున్న పెద్దవాగును మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. వరద నీటి ప్రవాహం, రాకపోకల్లో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కలెక్టర్ ఆరాతీశారు. రహదారిపై నుంచి వరదనీటి ప్రవాహం కారణంగా వాహనదారులు ఆజంనగర్ మీదుగా రాకపోకలు సాగిస్తున్నారని అధికారులు కలెక్టర్కు వివరించారు. ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిళ్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేయాలని కలెక్టర్ తెలిపారు. వాగుల వద్ద వరద ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు రాకపోకలను నిలిపివేయాలని ట్రాక్టర్లు, భారీకేడ్లు అడ్డుగా పెట్టాలని పేర్కొన్నారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీ శాఖల అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు అధికార యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వాగుల్లో చేపలు పట్టేందుకు వెళ్లొద్దని కలెక్టర్ సూచించారు. అనంతరం మండలంలో యూరియా, ఎరువుల లభ్యత, స్టాక్ వివరాలను ఏఓ అనూషను అడిగి తెలుసుకున్నారు. రైతులకు సమయానికి ఎరువులు అందేలా చూడాలని, ఎరువుల పంపిణీలో పారదర్శకత పాటించాలని సూచించారు. వ్యవసాయేతర అవసరాల కోసం యూరియా వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు, రైతులకు ఇబ్బందులు కలిగేలా ఎరువులను బ్లాక్ మార్కెట్కు తరలించి అధిక ధరలకు విక్రయించకుండా నిరంతరం నిఘా కొనసాగించాలని పేర్కొన్నారు. మండలంలోని ఎరువుల దుకాణాలు, ఎరువుల విక్రయ కేంద్రాల్లో నిల్వలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ శ్రీనివాస్రావు, ఆర్అండ్బీ ఈఈ రమేశ్, పీఆర్ డీఈఈ రవీందర్, ఏఓ అనూష, ఎంఈఓ రవీందర్రెడ్డి ఉన్నారు. కలెక్టర్ రాహుల్శర్మ మహాముత్తారం మండలంలో వాగుల పరిశీలన -
సమాచారం ఇవ్వాలి
● ఎస్పీ కిరణ్ఖరే కాటారం: వరద ప్రభావిత ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసర సమయాల్లో పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ కిరణ్ఖరే తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో మహాముత్తారం మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాలు, కేశవపూర్, పెగడపల్లి మధ్యలోని పెద్దవాగు, అలుగువాగును మంగళవారం ఎస్పీ పరిశీలించారు. పెద్దవాగు ఉధృతి, రాకపోకలకు ప్రత్యామ్నాయ మార్గాలు, ప్రమాదాలు చోటు చేసుకోకుండా పోలీస్శాఖ ద్వారా తీసుకుంటున్న చర్యలను సీఐ, ఎస్సైని అడిగి తెలుసుకున్నారు. పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు ప్రభుత్వం, పోలీస్శాఖ తరఫున తక్షణ సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఎస్పీ వెంట కాటారం సీఐ నాగార్జునరావు, ఎస్సై మహేందర్కుమార్ ఉన్నారు. -
తెలంగాణ, ఛత్తీస్గఢ్ మధ్య రాకపోకలు బంద్
వాజేడు: మండల పరిధిలోని టేకులగూడెం గ్రామ సమీపంలో 163నంబర్ జాతీయ రహదారిపైకి మంగళవారం గోదావరి వరద వచ్చి చేరింది. దీంతో తెలంగాణ– ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్యన రాక పోకలు నిలిచిపోయాయి. గోదావరి వరద క్రమేపీ పెరుగు తుండటంతో రేగుమాకు ఒర్రె నుంచి రహదారిపైకి వరద నీరు వచ్చి చేరింది. అప్రమత్తమైన అధికారులు వరదలోకి వెళ్లకూడదని హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. అధికారులు వరద పరిస్థితిని పరిశీలించారు. ముంపునకు గురైన జాతీయ రహదారిని వెంకటాపురం(కె) సీఐ ముత్యం రమేష్, పేరూరు ఎస్సై కృష్ణ ప్రసాద్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ శ్రీకాంత్ నాయుడు పరిశీలించారు. వాహనదారులు నీటిలో నుంచి వెళ్లకుండా భారీకేడ్లను ఏర్పాటు చేశారు. పలువురు గోదావరి వరద జాతీయ రహదారిని ముంచిన విషయం తెలియక అక్కడికి చేరుకున్న రెండు రాష్ట్రాల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. లగేజీ మోసుకుంటూ వరదలో నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. అదే సమయంలో ఓ లారీ వరదలో నుంచి రావడంతో దాని పక్క నుంచి ద్విచక్రవాహనాలను దాటించారు. -
వైరల్ ఫీవర్స్
బుధవారం శ్రీ 20 శ్రీ ఆగస్టు శ్రీ 2025జిల్లాలో పెరుగుతున్న జ్వర పీడితులుభూపాలపల్లి: వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లాలో జ్వర పీడితులు రోజురోజుకూ పెరుగుతున్నారు. చిట్యాలలో 17 టైఫాయిడ్, 3 డెంగీ కేసులు, కాళేశ్వరంలో మూడు డెంగీ కేసులు నమోదయ్యాయి. వైరల్ ఫీవర్స్తో ప్లేట్లెట్ కౌంట్ తగ్గుతుండడంతో రోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆస్పత్రుల్లో పెరిగిన ఓపీ.. జ్వరాలు విజృంభిస్తుండటంతో జిల్లా ప్రధాన ఆస్పత్రి, చిట్యాల, మహదేవపూర్ ఆస్పత్రుల్లో ఓసీల సంఖ్య ఇటీవల భారీగా పెరిగింది. జిల్లా ప్రధాన ఆస్పత్రికి మంగళవారం సాయంత్రం వరకు 522 ఓపీ రాగా, 193మంది జనరల్ మెడిసిన్ వైద్యుడిని సంప్రదించారు. ఇందులో వంద మందికి పైగా జ్వర పీడితులే ఉన్నారు. బాధితులందరికీ రక్త పరీక్షలు చేయగా ముగ్గురికి ప్లేట్లెట్ కౌంట్ తగ్గినట్లుగా గుర్తించి ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకున్నారు. మిగిలిన వారికి మాత్రలు ఇచ్చి పంపారు. మహదేవపూర్ సీహెచ్సీలో సైతం అదే పరిస్థితి నెలకొంది. ఆస్పత్రికి జ్వర పీడితులే ఎక్కువగా వస్తున్నారు. కాళేశ్వరం ముగ్గురికి డెంగీ పాజిటివ్ రాగా ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించి చికిత్స పొందుతున్నారు. ఆందోళనలో ప్రజలు చిట్యాల సివిల్ ఆస్పత్రికి జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. ఈ నెల 14వ తేదీ నుంచి మంగళవారం వరకు వచ్చిన జ్వర పీడితులకు పరీక్షలు చేయగా 17 మందికి టైఫాయిడ్, ముగ్గురికి డెంగీ సోకినట్లుగా వైద్యులు గుర్తించి ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకొని చికిత్స అందిస్తున్నారు. డెంగీ కేసులు నమోదు అవుతుండటంతో చిట్యాల, సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వైరల్ ఫీవర్స్కూ తగ్గుతున్న ప్లేట్లెట్ కౌంట్.. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రికి వస్తున్న జ్వర బాధితుల్లో నూటికి 80 మందికి ప్లేట్లెట్ కౌంట్, తెల్ల రక్తకణాలు తగ్గినట్లుగా రక్త పరీక్షల ద్వారా వైద్యులు గుర్తిస్తున్నారు. డెంగీ, టైఫాయిడ్ కాకుండా వైరల్ ఫీవర్స్కు కూడా ప్లేట్లెట్ తగ్గుతుండటంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. వైద్యులను సంప్రదించాలి.. తలనొప్పి, వణుకు, చలి, శరీరం ఒక్కసారిగా వేడెక్కడం లాంటి లక్షణాలతో జ్వరం వస్తే తప్పకుండా ఆస్పత్రికి రావాలి. రెండు రోజులుగా జిల్లా ఆస్పత్రికి జ్వర పీడితులు వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన వారిలో డెంగీ కేసులు ఏమీ లేవు. వైరల్ ఫీవర్స్తో ప్లేట్లెట్ కౌంట్ తగ్గినట్లుగా గుర్తించాం. సాధారణ జ్వరంతో కౌంట్ తగ్గినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వైద్యుల సూచనల మేరకు మందులు వాడితే జ్వరం తగ్గుతుంది. – రాజేంద్రప్రసాద్, జిల్లా ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్ నాణ్యమైన వైద్యసేవలు అందించాలిప్రైవేట్ ఆస్పత్రులు కిటకిట.. జిల్లా ప్రధాన ఆస్పత్రితో పాటు భూపాలపల్లి పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రులు సైతం కిటకిటలాడుతున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో గతంలో రోజుకు ఒక్కో జనరల్ ఫిజీషియన్ 30నుంచి 40 ఓపీ చూడగా ఇప్పుడు ఆ సంఖ్య 60 నుంచి 80కి పెరిగింది. జర్వ పీడితులే ఎక్కువగా వస్తుండటంతో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్న వారిని అడ్మిట్ చేసుకొని చికిత్స అందిస్తున్నారు. చిట్యాలలో 17 టైఫాయిడ్, 3 డెంగీ కేసులు కాళేశ్వరంలో ముగ్గురికి డెంగీ తగ్గుతున్న ప్లేట్లెట్ కౌంట్ జిల్లా ఆస్పత్రి, మహదేవపూర్, చిట్యాల సీహెచ్సీలకు పెరుగుతున్న ఓపీ -
పేరూరు వద్ద క్రమేపీ పెరుగుతూ..
వాజేడు: మండల పరిధిలోని పేరూరు వద్ద గోదావరి వరద క్రమేపీ పెరుగుతోంది. సోమవారం సాయంత్రం గోదావరి నీటి మట్టం 13.940 మీటర్లు ఉండగా మంగళవారం సాయంత్రానికి 15.900 మీటర్లకు చేరుకుంది. ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు వస్తుండటంతో గోదావరి వరద తీవ్రత భారీగా పెరుగుతున్నట్లు సీడబ్ల్యూసీ సిబ్బంది తెలిపారు. పూసూరు హైలెవల్ బ్రిడ్జి వద్ద గోదావరి వరద పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. ఇన్టేక్వెల్ వద్ద వరద ఉధృతి పరిశీలన మంగపేట: మండలంలో గోదావరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతుండటంతో మండల కేంద్రంలోని పొదుమూరు, కమలాపురం ఇన్టేక్ వెల్ వద్ద గోదావరి వరద ఉధృతిని మండల స్పెషలాఫీసర్ సిద్ధార్థరెడ్డి, ఎంపీడీఓ భద్రునాయక్ మంగళవారం సాయంత్రం పరిశీలించారు. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ముంపు ప్రాంతాలైన పొదుమూరు, దేవనగరం, కత్తిగూడెం, అకినేపల్లి మల్లారం లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయా పంచాయతీల కార్యదర్శులను ఆదేశించారు. -
డ్రంకెన్ డ్రైవ్.. అతివేగం
భూపాలపల్లి: ● మొహర్రం పండుగకు సరుకులు తీసుకువచ్చేందుకు వెళ్తుండగా డీసీఎం వ్యాన్, బైక్ ఢీకొన్న ఘటనలో జూన్ 25న చిట్యాల మండలంలో ఇద్దరు స్నేహితులు అక్కడికక్కడే మృతి చెందారు. ● ఓ యువరైతు తన పొలం పనులు ముగించుకొని ఆదివారం తెల్లవారుజామున భూపాలపల్లికి వస్తున్న క్రమంలో బొగ్గులవాగు వద్ద కారు అదుపు తప్పి తన బైక్ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. జిల్లాలో ఇలా నెలకు పది ప్రమాదాలు జరిగి 15 మంది వరకు మృత్యువాత, అంతకు మించి గాయాల పాలవుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్హెచ్పై నిత్యం ప్రమాదాలే.. రేగొండ మండలం చెన్నాపూర్ గ్రామ సరిహద్దు నుంచి కాటారం మండలం నస్తూర్పల్లి వరకు జిల్లాలో ఎన్హెచ్ 353సీ జాతీయ రహదారి ఉంది. ఈ రహదారి అక్కడక్కడ మాత్రమే మరమ్మతుకు నోచుకుంది. అయినప్పటికీ ఈ రోడ్డుపై నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గడిచిన ఐదేళ్లలో జరిగిన ప్రమాదాలపై పలువురు పోలీసు అధికారులు పరిశీలన చేయగా.. అందులో నూటికి 90 శాతం ప్రమాదాలు డ్రంకెన్ డ్రైవ్, ఓవర్ స్పీడ్ వలనే చోటుచేసుకున్నట్లు తెలిసింది. ఎనిమిదేళ్ల క్రితం ఇలాగే నిత్యం ప్రమాదాలు జరుగుతుండటంతో అప్పటి ఎస్పీ భాస్కరన్ జాతీయ రహదారిపై స్పీడ్ బ్రేకర్లు వేయించారు. ఎన్హెచ్పై స్పీడ్ బ్రేకర్లు ఉండకూడదనే నిబంధనలు ఉండటంతో కొద్ది రోజులకే వాటిని తొలగించారు. దీంతో బైక్, కార్లు, లారీలు పరిమితికి మించిన వేగంతో వెళ్తున్నాయి. ఇందుకు తోడు రాత్రివేళల్లో కొందరు మద్యం సేవించి వాహనం నడుపుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. బ్లాక్ స్పాట్స్ ఏర్పాటు చేసినా.. జాతీయ రహదారిపై ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా ఎన్హెచ్ అధికారులు గుర్తించారు. రేగొండ మండలంలోని రూపిరెడ్డిపల్లి, గణపురం మండలం గాంధీనగర్, మోరంచపల్లి, భూపాలపల్లి పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా సమీపం, కమలాపూర్ క్రాస్రోడ్, కాటారం మండలం మేడిపల్లి, నస్తూర్పల్లి, మహదేవపూర్ మండలం కుదురుపల్లి తదితర ప్రాంతాల వద్ద ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో అక్కడక్కడ బ్లాక్ స్పాట్ బోర్డులను ఏర్పాటు చేసినప్పటికీ రేడియం స్టిక్కర్లు, ప్రమాద హెచ్చరిక బోర్డులు పెద్దగా కనిపించేలా ఏమీ ఏర్పాటు చేయలేదు. దీంతో ఈ ప్రాంతాల మీదుగా వెళ్లాలంటే వాహనదారులు జంకాల్సి వస్తుంది. ఎన్హెచ్పై నిత్యం ఎక్కడో ఒకచోట ప్రమాదం వందల మంది మృత్యువాత, గాయాలపాలు బ్లాక్ స్పాట్స్ ఏర్పాటు చేసినా ఫలితం సున్నా..పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రతీ ఏటా ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. 2023లో 196 ప్రమాదాలు జరుగగా, 2024లో 223, ఈ ఏడాది ఆగస్టు 15వరకే 134 ప్రమాదాలు జరిగాయి. ఆయా రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన వారి కుటుంబాలు నేటికీ రోదిస్తూనే ఉన్నాయి. వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చు. అతివేగం, డ్రంకెన్ డ్రైవ్, తొందరపాటుతనం మూలంగానే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. రాత్రివేళ, వర్షం కురిసే సమయాల్లో ఎదురుగా వచ్చే వాహనాలు కనబడవు. అందుకని అప్రమత్తంగా వాహనం నడపాలి. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం హైవేపై నిరంతర పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాం. డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు చేస్తున్నాం. హైవేపై ప్రమాద స్థలాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయించాం. – సంపత్రావు, భూపాలపల్లి డీఎస్పీ -
కోటగుళ్లలో ప్రత్యేక పూజలు
గణపురం: శ్రావణ సోమవారం సందర్భంగా కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఉదయం నుంచే భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి స్వామి వారికి అభిషేకాలు చేశారు. అర్చకుడు నాగరాజు ఆధ్వర్యంలో లక్ష మారేడు బిల్వ దళాలతో స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన నందీశ్వరుని రెండవ వార్షికోత్సవం కావడంతో త్రివేణి సంగమ జలాలు, పంచామృతాలతో నందీశ్వరుడికి అభిషేకాలు నిర్వహించారు.నందీశ్వరుడి వద్ద పూజల్లో పాల్గొన్న భక్తులు -
నీట మునిగిన పొలాలు
మల్హర్: కుంభంపల్లిలోని పొలాల్లోకి చేరిన వరద నీరుమల్హర్: ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో కుంభంపల్లి పొలాల్లోకి వరద నీరు చేరింది. కొండపేట బొమ్మరాపు వాగు ఉధృతి పెరగడంతో పాటు కుంభంపల్లి గ్రామంలో 50 ఎకరాల్లో సాగు చేసిన వరి పొలాలు నీట ముని గాయి. మల్లారం ఆరెవాగు, తాడిచర్ల ఖమ్మపల్లి మానేరులో నీటి ప్రవాహం పెరుగుతుంది. తాడిచర్ల ఓపెన్కాస్ట్లో బొగ్గు ఉత్పత్తి నిలిచి పోయిందని ఏఎమ్మార్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్రెడ్డి, సీనియర్ జనరల్ మేనేజర్ కేఎస్ఎన్ మూర్తి తెలిపారు. వర్షాల కారణంగా 1.30 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ, 6వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. రాకపోకలకు అంతరాయం కాటారం: కాటారం, మహాముత్తారం మండలంలో సోమవారం ఎడతెరిపి లేని వర్షం కురిసింది. ఉదయం నుంచి సాయంత్రం వర్షం కురవడంతో రహదారులు జలమయంగా మారిపోయాయి. కాటారం మండలం మేడిపల్లి టోల్గేట్ వద్ద వరద నీరు భారీగా చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మహాముత్తారం మండలం కేశవపూర్–నిమ్మగూడెం మధ్యలోని పెద్దవాగు కాజ్వేపై నుంచి వరద నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు గ్రామాల్లో పత్తి, వరి పంటలు నీట మునిగాయి. చండ్రుపల్లి వాగును కమ్మేసిన వరద కాళేశ్వరం: మహదేవపూర్ మండలం అన్నారం–మద్దులపల్లి ప్రధాన రహదారిపై చండ్రుపల్లి వాగును గోదావరి వరద నీరు కమ్మేసింది. లో లెవల్ వంతెన కావడంతో అన్నారం టు కాళేశ్వరం వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. భూపాలపల్లి అర్బన్: వర్షం కారణంగా భూపాలపల్లి ఏరియాలోని రెండు ఓపెన్ కాస్టుల్లో సోమవారం బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షం కారణంగా సొమవారం మూడు షిప్టుల్లో కేటీకే ఓపెన్కాస్ట్ ప్రాజెక్ట్–2, 3లలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. సుమారు 8వేల టన్నుల బొగ్గు ఉత్పత్తిని నిలిచిపోయింది. ఓపెన్ కాస్టులో రోడ్లన్నీ బురదమయంగా మారాయి. ఓపెన్కాస్టులోని పని స్థలాల్లో చేరిన వరద నీటిని ఎప్పటికప్పుడు తోడిపోసేందుకు అధికారులు భారీ సామర్థ్యం కలిగిన మోటార్లు ఏర్పాటు చేశారు. కాటారం డివిజన్లో వర్షం ఓసీల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి -
శాస్త్ర పరిశోధనలకు ప్రోత్సాహం
భూపాలపల్లి అర్బన్: విద్యార్థుల మెదడుకు పదునుపెట్టి భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. విద్యార్థి విజ్ఞాన్ మంథన్(వీవీఎం) పేరిట జాతీయస్థాయి సైన్స్ ప్రతిభా పరీక్షను ఏటా దేశవ్యాప్తంగా అక్టోబర్లో నిర్వహిస్తోంది. ఇందులో ప్రతిభచూపిన వారికి ఉపకార వేతనాలు ఇస్తోంది. ఆన్లైన్ పరీక్షకు రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 6–10 తరగతి, జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులు అర్హులు. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ విజ్ఞాన్ మంథన్ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా స్వీకరిస్తున్నారు. అర్హులైన వారు పోటీల్లో పాల్గొనేందుకు సెప్టెంబర్ 30లోగా www.vvm. org. in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. యూజర్ ఐడీ పాస్వర్డ్తో లాగిన్ అయి వివరాలు నమోదుచేయాలి. పరీక్ష రుసుము రూ.200 ఉంటుంది. ఈ నెల 16వ తేదీ నుంచి వెబ్సైట్లో పుస్తకాలు అందుబాటులో ఉంచారు. పరీక్ష నిర్వహణ ఇలా.. పాఠశాల నుంచి పాల్గొనే 6–9 తరగతి విద్యార్థులను జూనియర్లుగా, పదో తరగతి, ఇంటర్ విద్యార్థులను సీనియర్లుగా పరిగణిస్తారు. విద్యార్థులు తెలుగు, హిందీ, ఇంగ్లిష్తో పాటు ఇతర మాధ్యమాల్లో పరీక్ష రాయవచ్చు. 90 నిమిషాల్లో 100 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. గణితం, భౌతిక, రసాయన, జీవశాస్త్రాల నుంచి 50 శాతం, భారతదేశం కృషిపై 20 శాతం, శాస్త్రవేత్తల పరిశోధనలపై 20 శాతం, లాజికల్ రీజనింగ్పై 10 శాతం ప్రశ్నలు ఉంటాయి. జూనియర్ కేటగిరీ విద్యార్థులు అక్టోబరు 28 నుంచి నవంబరు 2 వరకు, సీనియర్ కేటగిరిలో నవంబర్ 19–23 వరకు వారి తరగతిని బట్టి వారికి నచ్చిన తేదీల్లో ఆన్లైన్లో పరీక్ష రాయవచ్చు. 2026 జనవరి 4న రాష్ట్ర స్థాయిలో, 30న జాతీయ స్థాయిలో పోటీలు ఉంటాయి. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులు అర్హులు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ సెప్టెంబర్ 30వ తేదీలోపు గడువుపాఠశాల స్థాయిలో 18 మంది చొప్పున, జిల్లా స్థాయిలో సబ్జెక్టుకు ముగ్గురు చొప్పున ఎంపిక చేస్తారు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పాల్గొనే వారందరికీ ధ్రువపత్రాలు అందజేస్తారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభచూపిన తొలి ముగ్గురికి రూ.5వేలు, రూ.3వేలు, రూ.2వేలు బహుమతిగా అందజేస్తారు. జాతీయస్థాయిలో ప్రతిభ చూపిన మొదటి ముగ్గురు విద్యార్థులకు రూ.25 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలు అందజేస్తారు. దేశంలోని పరిశోధన, అభివృద్ధి సంస్థలను సందర్శించే అవకాశం కల్పిస్తారు. ఏడాది పాటు నెలకు రూ.2వేల చొప్పున స్కాలర్షిప్ అందిస్తారు. ఉమ్మడి జిల్లాలోని విద్యార్థులు విద్యార్థి విజ్ఞాన్ మంథన్ను సద్వినియోగం చేసుకోవాలి. ఈ పరీక్ష ద్వారా వారిలో దాగి ఉన్న సామర్థ్యం బయటకు వస్తుంది. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో పాల్గొనడం వలన భవిష్యత్లో కూడా ఇటువంటి పరీక్షలపై భయం పోతుంది. ఈ పరీక్షకు సంబంధించిన పుస్తకాలు కూడా వెబ్సైట్లో ఉందుబాటులో ఉంటాయి. ప్రతిభ కనబర్చిన వారికి నగదు ప్రోత్సాహకాలు ఉంటాయి. ప్రతీ నెల స్కాలర్షిప్ అవకాశం ఉంటుంది. – బర్ల స్వామి, జిల్లా సైన్స్ అధికారి -
యూరియా ఇతర అవసరాలకు వాడొద్దు
భూపాలపల్లి: రైతుల కోసం సరఫరా చేసే యూరియాను ఇతర అవసరాలకు వాడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్ శర్మ హెచ్చరించారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం నుంచి సీఎస్ రామకృష్ణారావు, కార్యదర్శి రఘునందన్రావులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వ్యవసాయాధికారులతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి పలు సూచనలు చేసిన అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ రాహుల్ శర్మ సమావేశమై మాట్లాడారు. మండలాల వారిగా స్టాకు వివరాలపై ప్రతిరోజు తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సహకార సంఘం, మార్క్ఫెడ్, ప్రైవేట్ డీలర్లు అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించబోమని హెచ్చరించారు. వీసీలో ఎస్పీ కిరణ్ ఖరే, అధికారులు పాల్గొన్నారు. పాపన్నగౌడ్ పోరాటం స్ఫూర్తిదాయకం.. సామాజిక న్యాయం కోసం సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పాపన్నగౌడ్ చిత్ర పటానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, అధికారులు, గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు. దరఖాస్తులను పరిష్కరించాలి.. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో కలిసి ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 31 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఆర్డీఓ రవి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ -
రామప్ప శిల్పకళ మరుపురానిది..
వెంకటాపురం(ఎం): రామప్ప శిల్పకళ సంపద మరుపురానిదని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ సామ్ కోషి కొనియాడారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయాన్ని ఆదివారం హైకోర్టు న్యాయమూర్తులు సందర్శించారు. ఈ సందర్భంగా రామప్ప రామలింగేశ్వరస్వామిని శ్రీనివాస్రావు దర్శించుకోగా పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. రామప్ప ఆలయ విశిష్టత గురించి జస్టిస్ శ్రీనివాస్రావుకు గైడ్ విజయ్కుమార్, జస్టిస్ సామ్ కోషికి గైడ్ వెంకటేశ్ వివరించారు. ఈ సందర్భంగా వారు శిల్పకళ సంపద బాగుందని వివరించారు. వారి వెంట ములుగు జిల్లా జడ్జి సూర్య చంద్రకళ, భూపాలపల్లి జడ్జి దిలీప్కుమార్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ సదానందం ఉన్నారు.హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ సామ్ కోషి -
ఇంకా ఇన్స్పైర్ కాలేదు!
విద్యారణ్యపురి: విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇన్స్పైర్ అవార్డు మనక్ చక్కటి వేదికగా నిలుస్తోంది. విద్యార్థులు భావిభారత శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇందులో.. భాగంగా శాస్త్రసాంకేతిక శాఖ (డీఎస్టీ), నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్ఐఎఫ్) ద్వారా ప్రతి సంవత్సరం ఇన్స్పైర్ అవార్డుల మనక్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అన్ని యాజమాన్యాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, కేజీబీవీ, మోడల్ స్కూళ్లు, వివిధ గురుకులాల్లోని ఆరో తరగతి నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థుల మేధస్సుకు పదును పెడుతోంది. 2025–26 విద్యాసంవత్సరంలో ఒక్కో పాఠశాలల నుంచి ప్రాజెక్టుల రూపకల్పనకు ఐదు చొప్పున నామినేషన్లు స్వీకరిస్తున్నారు. జూన్ 15 నుంచి ఆగస్టు 15 వరకు మహబూబాబాద్ జిల్లా మినహా మిగిలిన ఐదు జిల్లాల్లో విద్యార్థులతో నామినేషన్లు చేయించేందుకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పెద్దగా ఆసక్తి చూపలేదు. మహబూబాబాద్ జిల్లా 789 నామినేషన్లతో రాష్ట్రంలోనే మొదటి స్థానం దక్కించుకుంది. సెప్టెంబర్ 15 వరకు గడువు ఉండడంతో ఇంకా నామినేషన్లు పెరిగే అవకాశం ఉంది. సైన్స్ టీచర్లు ఎక్కువగా శ్రద్ధ వహిస్తేనే.. ఉమ్మడి జిల్లాలోని డీఈఓలు, జిల్లా సైన్స్ అధికారులు ఇప్పటికే అన్ని యాజమాన్యాల పాఠశాలల హెచ్ఎంలతో సమావేశాలు నిర్వహించారు. ఇన్స్పైర్ అవార్డులకు నూతన ఆవిష్కరణల ప్రాజెక్టులతో విద్యార్థులతో నామినేషన్లు చేయించాలని ఆదేశించారు. నామినేషన్లు చేయించేందుకు ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేసుకునేందుకు స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో టెక్నికల్ టీంలు కూడా ఏర్పాటుచేశారు. పాఠశాలల్లో ఐడియా బాక్స్లను ఏర్పాటు చేయాలని ఆదేశించినా ఆ దిశగా అడుగు ముందుకు పడలేదు. ప్రధానంగా సైన్స్ టీచర్లు ఎక్కువగా శ్రద్ధ వహిస్తే నామినేషన్లు పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. హెచ్ఎంలు, టీచర్లలో కొంత నిర్లిప్తత కూడా కారణమని తెలుస్తోంది. మహబూబాబాద్ జిల్లాలో మాత్రం డీఈఓ, సైన్స్ అధికారి ప్రత్యేక దృష్టిసారించడంతో నామినేషన్లు బాగా అయ్యాయని తెలుస్తోంది. ఇన్స్పైర్ అవార్డులకు నామమాత్రంగానే నామినేషన్లు పంపారు. విద్యార్థుల్లోని ప్రతిభ వెలికితీసేందుకు ఒక చక్కటి వేదిక ఇన్స్పైర్ అవార్డు మనక్. అన్ని యాజమాన్యాల పాఠశాలలు తమ విద్యార్థులను ప్రోత్సహించాల్సి ఉంటుంది. అందుకు ఒక ఐడియాతో ప్రాజెక్టుకు సంబంధించి సంక్షిప్తంగా వివరాలు పంపించాలి. హెచ్ఎంలు, టీచర్లు ప్రత్యేక శ్రద్ధ వహించి సెప్టెంబర్ 15లోగా విద్యార్థులతో నామినేషన్లు పంపాలి. – ఎస్.శ్రీనివాసస్వామి, హనుమకొండ జిల్లా సైన్స్ అధికారిహెచ్టీటీపీఎస్//డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఇన్స్పైర్అవార్డ్స్–డీఎస్టీ.గౌట్.ఇన్ ద్వారా లేదా గూగుల్ ప్లేస్లోర్లో ఇన్స్పైర్ మనక్యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. స్కూల్ అథారిటీ ద్వారా యూజర్ ఐడీ, పాస్వర్డ్తో లాగిన్ అయ్యి విద్యార్థుల ఆవిష్కరణ వివరాలను నమోదు చేయడంతోపాటు నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. పాఠశాలల హెచ్ఎంలు, గైడ్ టీచర్ల సహకారంతో విద్యార్థులతో ప్రాజెక్టులకు సంబంధించి ఇన్స్పైర్ నామినేషన్కు కావాల్సినవి.. విద్యార్థి సృజనాత్మక ఆలోచన లేదా ప్రాజెక్టు సంక్తిప్త నివేదిక రెండువేల పదాలకు మించకూడదు. విద్యార్థి ఆధార్ కార్డుతో అనుసంధానించిన ఏదైనా జాతీయ బ్యాంకు లేదా పోస్టాఫీస్ ద్వారా జారీచేసిన పొదుపు ఖాతా పాస్పుస్తకం, విద్యార్థి పాస్ఫొటో, వివరాలు, ఫోన్నంబర్, గైడ్ టీచర్ వివరాలు కూడా ఉండాలి. ‘ఇన్స్పైర్ మనక్’ అవార్డుల నామినేషన్లు వేయించేందుకు పెద్దగా ఆసక్తి చూపని హెచ్ఎంలు, టీచర్లు 789తో మహబూబాబాద్ రాష్ట్రంలోనే మొదటి స్థానం మిగిలిన జిల్లాల్లో తక్కువగా వేసిన విద్యార్థులు -
సమస్యలు పరిష్కరించాలి
భూపాలపల్లి అర్బన్: సింగరేణికి చెందిన కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఎంఓఐ) అధికారుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్ది నారసింహులు డిమాండ్ చేశారు. ఏరియాలో సింగరేణి గెస్ట్హౌస్లో భూపాలపల్లి బ్రాంచ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని ఏరియాల అధికారుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పెద్ది నారసింహులు హాజరై మాట్లాడారు. పర్మార్మెన్స్ రిలేటెడ్ పే (పీఆర్పీ) అంశం ప్రధాన ఎజెండాగా నిలిచిందన్నారు. అధికారుల సమస్యల పరిష్కారానికి ఆందోళనలు చేపట్టనట్లు తెలిపారు. ఈ నెల 31న నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీఎంఓఐ నాయకులు లక్ష్మిపతి, నజీర్ పాల్గొన్నారు. -
కుంగిన ప్రసాదశాల పునాది
కాళేశ్వరం: దేవాదాయశాఖ అధికారుల పర్యవేక్షణ లేమి.. కాంట్రాక్టర్లకు వరంగా మారింది. ఆగమేఘాలపై చేసిన పనులకు ప్రసాదశాల భవన నిర్మాణం సాక్షంగా కనిపిస్తుంది. రూ.50లక్షల వ్యయంతో సరస్వతీనది పుష్కరాల సమయంలో నిర్మాణం చేసిన ప్రసాదశాల భవనం పునాది గోడ కిందికి కుంగింది. భూమి నుంచి పునాదిలో సిమెంట్ ఇటుకలతో నిర్మాణం చేసి కింద మట్టిపోయడంతో వర్షానికి కుంగింది. బీటలు వారి పిల్లర్ బీమ్ పొడవునా కింది వైపున క్రాక్ ఇచ్చింది. బీమ్పైన కట్టిన ఇటుకల గోడ అక్కడక్కడ వంగిపోయి, క్రాక్ వచ్చి కనిపిస్తుంది. ఇంత జరుగుతున్నా క్వాలిటీ కంట్రోల్ ఇంజనీరింగ్ విభాగం ఏమి చేస్తుందని విమర్శలు వస్తున్నాయి. ఉన్నతస్థాయి దేవాదాయశాఖ అధికారులు మౌనం పాటించడంపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయమై ఈఓ మహేష్ను సంప్రదించగా తాత్కాలికంగా పుష్కరాల సమయంలో చేసిందని, మళ్లీ మట్టి ఇటుకలతో పునాది నిర్మాణం చేస్తామని తెలిపారు. పిల్లర్లకు హాని జరుగలేదని తెలిపారు. -
అప్రమత్తంగా ఉండాలి
● కలెక్టర్ రాహుల్ శర్మ ● మోరంచపల్లి వాగు ఉధృతి పరిశీలన భూపాలపల్లి రూరల్: ఆదివారం వరకు వాతావరణ శాఖ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీచేసిన నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్శర్మ సూచించారు. ఇరిగేషన్ అధికారులతో కలిసి కలెక్టర్ రాహుల్ శర్మ శనివారం మోరంచపల్లి వాగు ఉధృతిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాగు ఉధృతి దృష్ట్యా ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే తక్షణమే స్పందించి రక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. వరద పరిస్థితిని ముందుగా అంచనా వేసి ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేయాలని సూచించారు. భారీ వర్షాలు దృష్ట్యా ప్రజల, పశువుల ప్రాణరక్షణలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముంపు ప్రాంతాలను గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. 24 గంటలు కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూం నంబర్ 90306 32608 పనిచేస్తుందన్నారు. కలెక్టర్ వెంట ఈఈ ప్రసాద్, డీఈ వరుణ్, ఏఈ షర్ఫ్ఉద్దీన్ ఉన్నారు. -
వర్షపాతం వివరాలు (మి.మీలలో)
105.897.2 62.455.6మత్తడి పడేందుకు సిద్ధంగా ఉన్నవిజిల్లాలో చెరువులు1,032577మత్తడిపోస్తున్నవి455మహదేవపూర్రేగొండమల్హర్మొగుళ్లపల్లి కాటారంటేకుమట్లపలిమెల 91.6చిట్యాలభూపాలపల్లిమహాముత్తారం 52.036.2గణపురం29.027.429.2 -
ఆస్పత్రిని పరిశీలించిన డీఎస్పీ
భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని శనివారం భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు పరిశీలించారు. పోలీస్ ఔట్ పోస్ట్, సెక్యూరిటీ సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి ప్రధాన ద్వారం, ఐసీయూలో అప్రమత్తంగా ఉండాలని సెక్యూరిటీ సిబ్బందికి సూచించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన పిల్లల వార్డులు, ఇతర వార్డులోకి వర్షపు నీరు వచ్చిన విషయమై సంబంధిత ఏఈ రవికిరణ్తో మాట్లాడారు. మూడవ అంతస్తు నిర్మాణంలో ఉన్నందున ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ నరేష్కుమార్, ఎస్సై సాంబమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు. -
కాలసర్ప, శని పూజలకు భక్తుల రద్దీ
కాళేశ్వరం: కాళేశ్వరం దేవస్థానం అనుబంధ దేవాలయంలోని శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కాలసర్ప, నవగ్రహాల వద్ద శని నివారణ పూజలను భక్తులు అధికంగా నిర్వహించారు. శనివారం ఉదయం త్రివేణి సంగమ గోదావరిలో స్నానాలు చేసి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడికి ఽశ్రావణమాసం సందర్భంగా అభిషేక పూజలు నిర్వహించారు. దీంతో ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. భూపాలపల్లి రూరల్: మాదిగ ఉద్యోగుల సంఘం జిల్లా కమిటీని ఎన్నుకున్నట్లు ఆ సంఘం ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ బొడ్డు దయాకర్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఆరిశంస్వామి మాదిగ, ప్రధాన కార్యదర్శిగా శనిగరపు భద్రయ్య, కోశాధికారిగా మోరె కుమారస్వామి మాదిగలను ఎన్నుకున్నట్లు దయాకర్ తెలిపారు. మాదిగ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సంఘం పనిచేస్తుందని తెలిపారు. మల్హర్: రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్రెడ్డి తల్లి లక్ష్మిబాయి దశదిన కర్మ కార్యక్రమానికి శనివారం మంత్రి గడ్డం వివేక్ హాజరై ప్రకాశ్రెడ్డిని పరామర్శించారు. మండలంలోని వల్లెకుంట గ్రామంలో లక్ష్మీబాయి చిత్రపటానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మంత్రి వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అయిత రాజిరెడ్డి, నాయకులు, మంత్రి అభిమానులు పాల్గొన్నారు. ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ వనదేవతలను ఛత్తీస్గఢ్ బీజేపీ నేతలు శనివారం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బీజాపూర్ బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు, బస్తర్ జిల్లా ఇన్చార్జ్ గుజ్జ వెంకటర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికై న సందర్భంగా బీజాపూర్ జిల్లా పార్టీ నాయకులు ఆయనతో కలిసి ఆమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. -
ఒడంబడిక!
నిట్ వరంగల్లోని బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏలతో పాటు పీహెచ్డీ విద్యను అభ్యసిస్తున్న సుమారు 6 వేల మంది విద్యార్థులకు ఇతర పరిశ్రమలు, సంస్థల్లో ఇంటర్న్షిప్, విద్యా పరస్పర బదిలీలకు, టెక్నాలజీ ఉపయోగానికి ల్యాబ్స్ సౌకర్యం, ఆవిష్కరణలకు, పరిశోధనలకు ఎంఓయూలు తోడ్పాటునందిస్తున్నాయి. ఇక్కడి విద్యార్థులకు వివిధ సంస్థల్లో విద్యను అభ్యసించే అవకాశం వీటి ద్వారా లభిస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలు. ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకునే అవకాశాలు. ప్రపంచాన్ని చుట్టి రావాలన్నా.. నూతన సాంకేతికతలో రాటుదేలాలన్నా.. సరికొత్త ఆవిష్కరణల్ని రూపొందించాలన్నా.. జీవితంలో బాగా స్థిరపడాలన్నా విద్యార్థులకు కల్పతరువు నిట్ వరంగల్. ఇక్కడ సీటు వస్తే చాలు.. లైఫ్ సెట్ అనుకుంటారు. అలాంటి క్యాంపస్తో వివిధ పరిశ్రమలు, కంపెనీలు ఎంఓయూలు చేసుకునేందుకు క్యూ కడుతున్నాయి. ఇప్పుడు నిట్.. ఆఫ్లైన్లోనే కాదు.. వర్చువల్గా పరస్పర ఒప్పందాలు చేసుకుంటూ కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది. – కాజీపేట అర్బన్ఎంఓయూలో ‘వరంగల్ నిట్’ కొత్త ధోరణి అటు వర్చువల్గా, ఇటు నేరుగా ఒప్పందాలు సరికొత్త ఆవిష్కరణలు, పరిశోధనలు, ఉద్యోగావకాశాలకు తోడ్పాటు ఆధునిక టెక్నాలజీ అందిపుచ్చుకోవడం, విస్తరించే దిశగా ప్రయత్నాలు ప్రత్యేకతను చాటుకుంటున్న సాంకేతిక సంస్థ -
ఆదివారం శ్రీ 17 శ్రీ ఆగస్టు శ్రీ 2025
మత్తడి పడుతున్న బొగ్గులవాగుకాటారం: మహాముత్తారం మండలకేంద్రానికి సమీపంలోని కోనంపేట వాగు, కేశవపూర్, నిమ్మగూడెం గ్రామాల మధ్య గల పెద్ద వాగులు ఉప్పొంగి ప్రవహించాయి. వరద నీరు ప్రధాన రహదారుల వంతెనల పై నుంచి ఉధృతంగా ప్రవహించడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగుకు అవతలి వైపు గల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అటు వైపుగా వెళ్లే వాహనదారులు గంటల కొద్ది నిరీక్షించాల్సి వచ్చింది. వాహనాల రాకపోకలను కట్టడి చేసేందుకు హోల్డింగ్లు అడ్డుగా పెట్టడంతో పాటు పర్యవేక్షణకు సిబ్బందిని ఏర్పాటు చేశారు. -
ఉప్పొంగిన మోరంచ వాగు
గణపురం: శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో మండలవ్యాప్తంగా 30 చెరువులు, కుంటలు నిండి మత్తళ్లు పోస్తున్నాయి. మండలంలో 66 చెరువులు కుంటలు ఉండగా.. ధర్మరావుపేట ఊరచెరువు, బుద్దారం వంగపెల్లి చెరువు, నగరంపల్లి చెరువులతో పాటు 30 కుంటలు నిండి మత్తళ్లు పోస్తున్నాయి. గణపసముద్రం చెరువు నీటి మట్టం 18 ఫీట్లకు చేరుకుంది. మండలంలో మోరంచవాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. దీంతో సమీపంలోని వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. వర్షాలు లేక వెలవెలబోయిన చెరువులు, కుంటలు నిండి మత్తళ్లు పోస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. -
ఎట్టకేలకు వరుణుడి కరుణ
● ఆలస్యంగానైనా పడుతున్న వర్షాలు.. లోటునుంచి ఎక్సెస్ వైపు వర్షపాతం ● ఉమ్మడి వరంగల్లో 25 మండలాల్లో అధికం.. 48 మండలాల్లో సాధారణం ● ఐదు మండలాల్లో ఇంకా లోటు వర్షపాతమే.. ● రైతులకు ఊరట ● వానల ఆలస్యంతో తగ్గిన సాగు విస్తీర్ణం.. ఇప్పటివరకు 77.65 శాతమే – సాక్షిప్రతినిధి, వరంగల్ -
సంఘాలను మరింత పటిష్టం చేయాలి
హన్మకొండ: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను మరింత పటిష్టం చేయాలని తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్, వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, డీసీసీబీలు, టెస్కాబ్ పాలకవర్గాలకు ప్రభుత్వం ఆరు నెలలు పొడిగింపు ఇచ్చిన సందర్భంగా శుక్రవారం హనుమకొండ నక్కలగుట్టలోని వరంగల్ డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చిత్రపటాలకు పాలక వర్గంతో కలిసి రవీందర్ రావు పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు సేవ చేసేందుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందన్నారు. వరంగల్ డీసీసీబీని ఆర్థికంగా మరింత బలోపేతం చేస్తామన్నారు. వ్యవసాయ రంగానికి సేవలు విస్తృతం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీసీసీ బ్యాంక్ డైరెక్టర్లు హరిప్రసాద్, మాడుగుల రమేష్, దొంగల రమేష్, ఎరబ్రెల్లి గోపాలరావు, మురళి, సంపెల్లి నరసింగరావు, నరేందర్ రెడ్డి, పోలపాక శ్రీనివాస్, సొసైటీ చైర్మన్లు రాజేష్ ఖన్నా, రామచంద్ర రావు, లక్ష్మారెడ్డి, దేవేందర్రావు, మాజీ జెడ్పీటీసీ ప్రభాకర్ గౌడ్, డీసీసీబీ సీఈఓ వజీర్ సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు. టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు -
డెంగీతో బాలిక మృతి
వేలేరు: డెంగీ జర్వంతో బాలిక మృతి చెందింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. బాలిక కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సూత్రపు రమేష్ కూతురు శాన్విక(7)కు ఐదు రోజల క్రితం జర్వం రాగా చికిత్స నిమిత్తం హనుమకొండలోని ఓ ప్రైవేట్ దవాఖానాకు తీసుకెళ్లారు. పరీక్షలు చేసిన వైద్యులు డెంగీగా గుర్తించి చికిత్స చేస్తున్న క్రమంలో శుక్రవారం ఉదయం మృతిచెందింది. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
దంత వైద్యశిబిరానికి స్పందన
హన్మకొండ చౌరస్తా: భారత స్వాతంత్య్ర దినోత్సవం, ఎస్వీఎస్ దంత వైద్యశాల 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హనుమకొండ చౌరస్తాలోని దంత ఆస్పత్రిలో శుక్రవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని అనూహ్య స్పందన లభించిందని నిర్వాహకులు తెలిపారు. డాక్టర్ గిరిధర్రెడ్డి పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు, టూత్పేస్టులు, మౌత్ వాష్లు అందజేశారు. దంతాల పరిరక్షణపై ప్రతిఒక్కరూ దృష్టి సారించాలని సూచించారు. వైద్య శిబిరంలో వైద్యులు గణేష్, హారిక, సిబ్బంది యాకూబ్రెడ్డి, సౌమ్య, చంద్రిక, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యార్థి ఆత్మహత్య
బచ్చన్నపేట: తండ్రి మందలించాడని మనస్థాపంతో విద్యార్థి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని లింగంపల్లిలో గురువారం రాత్రి జరి గింది. కుటుంబ సభ్యులు, ఎస్సై అబ్దుల్ హమీద్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మేడబోయిన నర్సమ్మ–మల్లయ్య దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. చిన్న కుమారుడు సాయివర్ధన్ (20) హైదరాబాద్లో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదువుతున్నాడు. సాయివర్ధన్ సరిగా చదవడంలేదని తండ్రి మల్లయ్య మందలించాడు. దీంతో సాయివర్ధన్ క్షణికావేశంలో తమ బావి వద్ద ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి పెద్దవంగర: అనుమానాస్పద స్థితిలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని ఉప్పరగూడెం గ్రామానికి చెందిన గద్దల బన్నీ (17) తన చిన్నతనంలో తల్లిదండ్రులు మృతి చెందడంతో అమ్మమ్మ గ్రామమైన ఉప్పరగూడెంలో తాత కొమురయ్య సంరక్షణ లో పెరిగాడు. పదో తరగతి పూర్తి కావడంతో ప్రస్తు తం నెల్లికుదరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. రాఖీ పౌర్ణమితోపాటు వరుస సెలవులు రావడంతో అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. శుక్రవారం తాత పొలం పనులకు వెళ్లాడు. అనంతరం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై క్రాంతికిరణ్ను వివరణ కోరగా ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వర్ధన్నపేట మార్చురీకి తరలించామని, ఫిర్యాదు అందితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడతామని తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదన్నారు. -
విద్యుదాఘాతంతో విద్యార్థికి గాయాలు
చిట్యాల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాట మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థిని దైనంపల్లి సిరి తొమ్మిదో తరగతి చదువుతుంది. శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వేడుకల ఏర్పాట్లలో భాగంగా స్టీల్ పైప్తో కూడిన జెండాలను పట్టుకుని వెళ్తున్న క్రమంలో పాఠశాల ఆవరణలో విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో విద్యార్థిని సిరి చేతికి, కాలుకు గాయాలు అయ్యాయి. గమనించిన పాఠశాల సిబ్బంది హూటహూటిన స్థానిక సివిల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించా రు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు కారుకులైన వారిపై చర్యలు తీసుకోవాలని పలు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం ఆస్పత్రిలో ఉన్న బాలికను పరామర్శించారు. -
సాంకేతికాభివృద్ధిలో కొత్త ఒరవడి
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్లో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి సాంకేతికంగా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారని ప్రాజెక్టు డైరెక్టర్ వంగూరు మోహన్రావు అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో మోహన్రావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఏపీటీఎస్–విజిలెన్స్ వారిచే గౌరవ వందనం స్వీకరించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన విద్యుత్ ఉద్యోగ అమరులకు కార్యాలయం ఆవరణలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో 18 జిల్లాల్లో 70 లక్షల మంది వినియోగదారులకు 24/7 మెరుగైన, నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని స్పష్టం చేశారు. 2024 సంవత్సరం (ఏప్రిల్ నుంచి జూలై) తో పోల్చుకుంటే 33 కేవీ బ్రేక్ డౌన్స్ 2025 (ఏప్రిల్ నుంచి జూలై) లో 21శాతం, 11 కేవీ బ్రేక్ డౌన్లు 46శాతం తగ్గాయన్నారు. విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ సీఎండీ వరుణ్ రెడ్డి స్వీయ ఆలోచనతో రూ. కోటి బీమా సౌకర్యం కల్పించడం అభినందనీయమన్నారు. పునరుత్పాదక శక్తి జూన్ 30, 2025 నాటికి ఎన్పీడీసీఎల్లో 2155.87 మెగావాట్ల సోలార్ ఎనర్జీ జనరేషన్ సామర్థ్యాన్ని సాధించామన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు వంటేరు తిరుపతి రెడ్డి, మధుసూదన్, చీఫ్ ఇంజనీర్లు అశోక్ కుమార్, తిరుమల్రావు, రాజుచౌహాన్, అశోక్, వెంకటరమణ, మాధవరావు, సీజీఎంలు చరణ్ దాస్, రవీంద్రనాథ్, జాయింట్ సెక్రటరి రమేష్, కంపెనీ కార్యదర్శి వెంకటేశం, వరంగల్ ఏపీటీఎస్ సీఐ కిరణ్ పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ ప్రాజెక్టు డైరెక్టర్ మోహన్రావు -
నలుగురు గంజాయి స్మగ్లర్ల అరెస్ట్
వరంగల్ క్రైం: çßæ¯]l$-Ð]l$-Mö…yýl ´ùÎçÜ$-Ë$, ™ðlÌS…V>׿ Ķæ*…sîæ ¯éÆöP-sìæMŠSÞ {yýlVŠæÞ MýS…{sZÌŒæ sîæ… B«§ýlÓ-Æý‡Å…ÌZ ¯]lË$VýS$Æý‡$ VýS…gêÆ‡$$ çÜÃVýSÏ-Æý‡Ï¯]l$ AÆð‡‹Üt ^ólÔ>Æý‡$. çßæ¯]l$-Ð]l$-Mö…yýl ´ù΋ÜõÜt-çÙ¯ŒS BÐ]l-Æý‡-׿ÌZ Ô¶æ${MýS-ÐéÆý‡… HÆ>µr$ ^ólíܯ]l ÑÌôæ-MýS-Æý‡$ÌS çÜÐ]l*-Ðól-Ôèæ…-ÌZ HïÜï³ ¯]lÆý‡-íÜ…àÆ>Ð]l# ÐðlÌS-Ïyìl…_¯]l ÑÐ]l-Æ>ÌS {ç³M>Æý‡….. Ô¶æ${MýS-ÐéÆý‡… E§ýlĶæ$… çßæ¯]l$-Ð]l$-Mö…yýl MýS$Ð]l*-ÆŠ‡-ç³-ÍÏÌZ° òÜÆ‡$$…sŒæ gZòÜ-‹œ çÜ*PÌŒæ §ýlVýSYÆý‡ ¯]lË$VýS$Æý‡$ Ð]lÅMýS$¢-Ë$ G…yýl$ VýS…gêÆ‡$$ MýSÍW E¯é²-Æý‡° Ð]l_a¯]l çÜÐ]l*-^éÆý‡…-™ø ¯éÆöP-sìæMŠSÞ ïÜI }M>…-™Œæ, GOòÜÞ ïÜòßæ^Œl ç³Æý‡$-Ô¶æ$-Æ>Ð]l¬-Ë$, íܺ¾…¨™ø MýSÍíÜ ÐðlãÏ M>Æý‡$-ÌZ VýS…gêÆ‡$$° ™èlÆý‡-ÍçÜ$¢¯]l² °…¨™èl$-ÌS¯]l$ A§ýl$-ç³#-ÌZMìS ¡çÜ$-MýS$-¯é²Æý‡$. MýSÈ…¯]l-VýS-ÆŠ‡MýS$ ^ðl…¨¯]l G…yîl Oò³gꯌl, G‹Üyîl A¯éÞ-ÆŠæ, G…yîl AÆ>¾¯Œl, MýS$Ð]l*-ÆŠ‡-ç³-ÍÏMìS ^ðl…¨¯]l AÆý‡Û§Šæ AÎRꯌS¯]l$ AÆð‡çÜ$t ^ólíÜ-¯]lr$Ï ™ðlÍ´ëÆý‡$. ÒÇ ¯]l$…_ 25MìS-ÌZÌS 800{V>-Ð]l¬ÌS G…yýl$ VýS…gêÆ‡$$-™ø´ër$ I§ýl$ òÜÌŒæ-¸ù¯]l$Ï, M>Æý‡$¯]l$ ÝëÓ«©¯]l… ^ólçÜ$-MýS$-¯]l²r$Ï ™ðlÍ´ëÆý‡$. Oò³gꯌl, A¯éÞ-ÆŠæ, AÆ>¾¯ŒS.. B…{«§ýl-{ç³-§ól-ÔŒæ& JyìlÔ> »êÆý‡zÆŠ‡ Ð]l§ýlª »êË$ A¯ól Ð]lÅMìS¢ ¯]l$…_ VýS…gêÆ‡$$° ¡çÜ$-Mö_a çßæ¯]l$-Ð]l$-Mö…yýl-ÌZ° MýS$Ð]l*-ÆŠ‡-ç³-ÍŠిÌSP ^ðl…¨¯]l AÆý‡Û§Šæ AÎRꯌS C…sZÏ yýl…‹³^ólíÜ, AÐ]l-çÜ-Æý‡-OÐðl$¯]l ÐéâýæÏMìS Ñ{MýS-Ƈ$$-çÜ$¢…sêÆý‡$. D{MýS-Ð]l$…-ÌZ VýS…gêÆ‡$$° M>Æý‡$-ÌZ ¡çÜ$-MöçÜ*¢ ´ùÎçÜ$-ÌSMýS$ ç³r$t-ºyéz-Æý‡° ™ðlÍ ´ëÆý‡$. °…¨™èl$-ÌS¯]l$ çßæ¯]l$-Ð]l$-Mö…yýl ´ùÎçÜ$-ÌSMýS$ Aç³µ-W…^èl-V> C¯ŒS-òܵ-MýStÆŠ‡ Ð]l$^èla ÕÐ]l-MýS$-Ð]l*ÆŠ‡ MóSçÜ$ ¯]lÐðl*§ýl$ ^ólíÜ MøÆý‡$t-ÌZ àfÆý‡$-ç³-Ç_ ÇÐ]l*…yŠæMýS$ ™èlÆý‡-Í…_¯]lr$Ï ™ðlÍ´ëÆý‡$. M>Æý‡Å-{MýS-Ð]l$…-ÌZ Ķæ*…sîæ ¯éÆöP-sìæMŠS {yýlVŠæÞ MýS…{sZÌŒæ sîæ…, çßæ¯]l$-Ð]l$-Mö…yýl ´ù΋ÜõÜt-çÙ¯ŒS A«¨M>Æý‡$-Ë$, íܺ¾…¨ ´ëÌŸY-¯é²Æý‡$. 25 కిలోల 800 గ్రాముల గంజాయి, కారు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఏసీపీ నరసింహారావు -
నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం
కాటారం: గ్రామీణ ప్రాంతంలోని నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యంగా దుద్దిళ్ల కుటుంబం ముందుకెళ్తుందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు అన్నారు. పుష్పగిరి కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఇటీవల మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఇందులో భాగంగా ఆపరేషన్ చేయించుకున్న వారికి గురువారం స్థానిక ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో శ్రీనుబాబు కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు ఆరోగ్య సేవలు చేరవేయడం, కంటి వెలుగులు కోల్పోయే పరిస్థితులను నివారించడం కోసం కంటి వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి శస్త్ర చికిత్సలు చేయించి అద్దాలు పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరు కంటి సంరక్షణ చర్యలు పాటించి సంతోషంగా ఉండాలని సూచించారు. పుష్పగిరి కంటి ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది చేస్తున్న సేవలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పంతకాని తిరుమల సమ్మయ్య, మండల అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్రెడ్డి, జిల్లా గ్రంథా లయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, ఉపాధిహామీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దండ్రు రమేశ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చినాల బ్రహ్మారెడ్డి, జాడి మహేశ్వరి, తెప్పెల దేవేందర్రెడ్డి, కుంభం రమేశ్రెడ్డి, కొట్టె శ్రీహరి, గద్దె సమ్మిరెడ్డి పాల్గొన్నారు. -
ఏరియాను లాభాల్లోకి తీసుకురావాలి
భూపాలపల్లి అర్బన్: నష్టాల్లో ఉన్న భూపాలపల్లి ఏరియాను లాభాల్లోకి తీసుకురావాలని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి కోరారు. 79వ స్వాతంత్య్ర వేడుకలను శుక్రవారం ఏరియాలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఏరియా జీఎం కార్యాలయంలో జాతీయ పతాకం ఎగురవేసిన అనంతరం సుభాష్కాలనీ సింగరేణి కమ్యూనిటీహాల్లో వేడుకలను వైభవంగా నిర్వహించారు. సింగరేణి సెక్యూరిటి సిబ్బందితో గౌరవ వందనం స్వీకరించి వేడుకలను జీఎం ప్రారంభించారు. ఏరియాలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సింగరేణి కార్మికులకు ఘనంగా సత్కరించారు. అనంతరం విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం వేడుకలను ఉద్దేశించి జీఎం మాట్లాడారు. 136 సంవత్సరాల చరిత్ర కలిగిన సింగరేణి సంస్థలో అనేక దశల్లో నూతన సంస్కరణలు చేటుచేసుకున్నట్లు తెలిపారు. సింగరేణి సీఎండీ బలరాం నేతృత్యంలో బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, కొత్త ప్రాజెక్ట్ల ప్రారంభం, సంక్షేమ కార్యక్రమాల అమలులో గణనీయమైన అభివృద్ధిని సాధిస్తూ దేశంలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలకు మార్గదర్శకంగా నిలుస్తూ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏరియా ఉత్పత్తి లక్ష్యం 72 లక్షల టన్నుల సాధించాల్సి ఉందన్నారు. ఏరియాలో గడిచిన మూడు నెలల్లో 22.5 లక్షల టన్నులు వెలికితీయాల్సి ఉండగా 21.8లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు చెప్పారు. అధిక వర్షం కారణంగా ఓపెన్కాస్టు 2, 3 ప్రాజెక్టులలో అనుకున్న స్థాయిలో ఉత్పత్తిని సాధించలేకపోయినట్లు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు రూ.331కోట్ల నష్టాల్లో ఉన్నట్లు వివరించారు. భూగర్భగనుల్లో ఎస్డీఎల్ యంత్రాల పని విధానం మెరుగుపడాల్సిన అవసరముందన్నారు. యంత్రాల పనితీరు, కార్మికుల గైర్హాజరు శాతం నైపుణ్యం కలిగిన కార్మికులు ఉద్యోగ విరమణ చేయడం వలన బొగ్గు ఉత్పత్తిని సాధించలేకపోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గుర్తింపు సంఘాల నాయకులు పాల్గొన్నారు.సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి -
విద్యకు ప్రభుత్వం పెద్దపీట
టేకుమట్ల: విద్యకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శుక్రవారం మండలంలోని వెంకట్రావుపల్లిలోని ఉన్నత పాఠశాలలో డైనింగ్హాల్ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉత్తమ విద్యతో పాటు విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలను కల్పిస్తుందని అన్నారు. అనంతరం అదే గ్రామానికి చెందిన నేరేళ్ల లక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆమె సభ్యులను కుటుంబసభ్యులను పరామర్శించి తన ప్రగాడ సానుభూతిని తెలిపారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. బాధిత కుటుంబానికి పరామర్శ రేగొండ: మండలంలోని కొడవటంచ గ్రామానికి చెందిన మూల సారయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యులను శుక్రవారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పరామర్శించారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు సంపత్రావు, తిరుపతిరెడ్డి, రవీందర్ రావు, శ్రీనివాస్, మూల ఓంకార్ ఉన్నారు.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
ప్రగతి వైపు పయనం
భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లతో పేదల్లో సంతోషంభూపాలపల్లి: ఆర్థిక, సామాజిక, పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఫలితంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రగతి వైపు పయనిస్తుందని తెలంగాణ షెడ్యూల్డ్ ట్రైబ్స్, కో–ఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్ అన్నారు. 79వ స్వాతంత్య్ర వేడుకలను శుక్రవారం జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ క్రీడా మైదానంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు బెల్లయ్యనాయక్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యఅతిథిగా హాజరై, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరేలతో కలిసి తొలుత జాతీయజెండాను ఎగురవేసి పోలీసులతో గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును బెల్లయ్య నాయక్ వివరించారు. వివరాలు ఆయన మాటల్లో.. అన్నదాతలకు అండగా ప్రజా సర్కారు విద్య, వైద్యం, విద్యుత్ రంగాలకు పెద్దపీట జిల్లా ఆస్పత్రిలో త్వరలోనే సీటి స్కాన్ సేవలు రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ ఘనంగా పంద్రాగస్టు వేడుకలు -
మహనీయుల సేవలు స్మరించుకోవాలి
భూపాలపల్లి: స్వాతంత్య్ర సముపార్జన కోసం పోరాడిన మహనీయులను ప్రతీ ఒక్కరు స్మరించుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ రాహుల్ శర్మ జాతీయ జెండాను ఎగురవేశారు. తన సతీమణి కతియాని జునేజాతో కలిసి విద్యార్థినులకు స్వీట్లు, పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేశారు. అనంతరం కలెక్టర్ ఐడీఓసీ కార్యాలయానికి చేరుకొని జిల్లా అధికారులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లా ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి, స్వాతంత్య్రం కోసం ఉద్యమించిన వారిని స్మరించుకున్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ -
శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025
జాతీయ జెండాను ఎగురవేస్తున్న రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ బెల్లయ్యనాయక్భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లతో లబ్ధి.. భూ సమస్యల పరిష్కారం కోసం భూ భారతిని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. జిల్లా వ్యాప్తంగా 223 గ్రామాల్లో భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించి 53,763 దరఖాస్తులు స్వీకరించాం. అర్హులకు భూ పట్టాలు జారీ చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద జిల్లాకు మొదటిదశలో 3,512 ఇళ్లు మంజూరు కాగా.. 2,324 ఇళ్లు గ్రౌండ్ అయ్యాయి. 922 ఇళ్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉండగా ఇప్పటి వరకు రూ.8.28 కోట్లు బిల్లులు లబ్ధిదారులకు చెల్లించాం. అన్నదాతలకు వెన్నుదన్నుగా.. రైతు భరోసా మొత్తాన్ని ప్రభుత్వం ఎకరాకు రూ. 12వేలకు పెంచడంతో పాటు తొలకరి ప్రారంభంలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేశాం. జిల్లాలో 1,15,963 మంది రైతులకు రూ. 139,54,73,000 పెట్టుబడి సాయం అందించాం. జిల్లాలోని 29,683 మంది రైతులకు రూ. 299,34,47,000 రుణ మాఫీ చేశాం. రూ.9లక్షలతో కొనుగోలు చేసిన 12 డ్రోన్లను మండలానికి ఒకటి చొప్పున అందజేశాం. పండ్ల తోటల పెంపకానికి 3,003 ఎకరాలకు రూ.3.16 కోట్లు మంజూరు లక్ష్యం కాగా ఇప్పటివరకు 1,009 ఎకరాలకు 506మంది రైతులను ఎంపిక చేశాం. ఆయిల్ పామ్ పథకంలో జిల్లాలో 2,500 ఎకరాలు సాగు లక్ష్యం కాగా.. 243 ఎకరాల్లోని 89 మంది రైతులు సాగు చేపట్టారు. -
దేశ సేవకు పునరంకితం కావాలి
భూపాలపల్లి: ప్రతీ పౌరుడు దేశ సేవకు పునరంకితం కావాలని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో 79వ స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఎస్పీ.. జాతీయ జెండాను ఎగరవేసి జిల్లా ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భారతదేశానికి స్వేచ్ఛ కల్పించిన త్యాగధనులను స్మరించుకోవడం మనందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరేష్కుమార్, భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు, డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు. రేగొండ: మండలంలోని కొడవటంచ గ్రామంలో కటంగూరి ఉదయశ్రీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 20మంది నిరుపేదలకు రూ.20వేల విలువ చేసే చెక్కులను శుక్రవారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు సేవా కార్యక్రమాలు చేయడం గొప్పతనమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నవీన్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు సంపత్ రావు, పులి తిరుపతిరెడ్డి, రవీందర్రావు, పబ్బ శ్రీనివాస్ పాల్గొన్నారు. భూపాలపల్లి అర్బన్: తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడిగా రెండోసారి మాడ హరీశ్రెడ్డి ఎంపికయ్యారు. ఈ మేరకు వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఉత్వర్తులు జారీచేశారు. తనకు మరో సారి జిల్లా బాధ్యతలు అప్పగించడం పట్ల హరీశ్రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. తనపై నమ్మకంతో బాధ్యతలు ఇచ్చినందుకు జిల్లాలో జాగృతిని బలోపేతం చేస్తామని హరీశ్రెడ్డి తెలిపారు. మల్హర్: కొయ్యూరు, వల్లెకుంట గ్రామాల్లో గుడుంబా స్థావరాలపై శుక్రవారం కొయ్యూరు పోలీసులు దాడులు నిర్వహించారు. వల్లెకుంట గ్రామంలో ఇంట్లో నిల్వ ఉంచిన 20లీటర్లు, 14లీటర్లు గుడుంబాను స్వాదీనం చేసుకొని గుడుంబా తయారీ సామగ్రిని ధ్వంసం చేసినట్లు కొయ్యూరు ఎస్సై నరేశ్ తెలిపారు. రఘు, లక్ష్మికోయ్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై 2 రజన్కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కాటారం: రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబుపై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, ఉపాధిహామీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండ్రు రమేశ్, కాటారం ప్రచార కమిటీ చైర్మన్ కుంభం రమేశ్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మంథని డిగ్రీ కళాశాలను సందర్శించి మంత్రి శ్రీధర్బాబుపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. న్యాయవాది గట్టు వామన్రావు దంపతుల హత్య కేసులో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మళ్లీ విచారణ జరపాలని సీబీసీఐడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో పుట్ట మధుకు భయం పట్టుకుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మంత్రి శ్రీధర్బాబు మంథని నియోజకవర్గంలో పలు ప్రభుత్వ విద్యాసంస్థలు ఏర్పాటు చేసి విద్యారంగ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. నిరుపేద విద్యార్థులకు అందుబాటులో ఉన్నత చదువులు తీసుకొచ్చిన ఘనత శ్రీధర్బాబుకు దక్కుతుందని అన్నారు. ఈ సమావేశంలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు చీమల సందీప్, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, నాయకులు భూపెల్లి రాజు పాల్గొన్నారు. -
అవార్డు పొందడం సంతోషం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు యాస్పిరేషన్ అంశాలలో రాష్ట్రస్థాయిలో అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా కలెక్టర్ రాహుల్ శర్మ అవార్డు తీసుకున్నారని, ఇది మనందరికీ గర్వకారణమని బెల్లయ్య నాయక్ అన్నారు. ముఖ్య అతిథి ప్రసంగం అనంతరం ఉత్తమ ఉద్యోగులకు అవార్డులను ప్రదానం చేశారు. స్వాతంత్య్ర సమరయోధులను ఘనంగా సన్మానించారు. గత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదివి అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం అందజేశారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాళ్లను బెల్లయ్యనాయక్ ప్రారంభించారు. అనంతరం పలు పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను అధి కారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు వీక్షించారు. ఆయా కార్యక్రమాల్లో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, డీఎఫ్ఓ నవీన్రెడ్డి, అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, అదనపు ఎస్పీ నరేష్కుమార్, ఆర్డీఓ రవి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
సమరయోధుల త్యాగాలతోనే స్వేచ్ఛ
అనేక మంది సమరయోధుల పోరాటాలతోనే దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఇన్నేళ్లు గడిచినా దేశంలో ఎక్కడి ప్రజలు అక్కడే ఉన్నారు. పేదలను పట్టించుకోనే నాథుడే లేడు. ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా నేటితరం విద్యార్థులు ఉన్నత చదువులు చదివి దేశానికి తమవంతు సహాయం అందించేలా బాధ్యత తీసుకుంటేనే భవిష్యత్లో దేశం ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తుంది. – జాహ్నవి, బీకాం, ద్వితీయ సంవత్సరం రాజకీయ నాయకులకు అక్రమ సంపాదనపై ఉన్న మక్కువ దేశాభివృద్ధిపై లేదు. స్వార్థపు ఆలోచనలతోనే బతుకుతున్నారు. ఎవరు ఎటుపోతే నాకేంటి? అనుకుంటున్నారు. తోటి మిత్రులకు, పేదలకు, ఇతరులకు సాయం అందించినప్పుడు దేశం ఆర్థికంగా ముందుకు వెళ్తుంది. పదిమంది చేసే పనిని ఒక ఏఐ చేస్తే మిగతావారి పొట్టకొట్టినట్లే కదా. ఏఐలో మానవ మనుగడకు ముప్పే. – ఎస్కే అన్వర్, బీఏ, తృతీయ సంవత్సరం -
నవ చైతన్యానికి విద్య పునాది
ఆనాటి పోరాట యోధులు తెల్లదొరల తుపాకీ గుండ్లకు ఎదురు నిలబడి, ప్రాణత్యాగాలు చేసి భారత్కు స్వాతంత్య్రం తీసుకొచ్చారు. నవ చైతన్యానికి విద్య పునాది అని అంబేడ్కర్ చెప్పినట్లుగా యువకులు ఉన్నత చదువులు చదివి దేశానికి ఆదర్శంగా నిలవాలి. విద్య, వైద్యం విషయంలో ఇంకా దేశానికి స్వేచ్ఛ రాలేదు. ప్రభుత్వాలు ఉచిత పథకాలు ఆపేసి ఉచిత విద్య, వైద్యంపై దృష్టి పెట్టాలి. – మహంకాళి వరుణ్, బీకాం తృతీయ సంవత్సరం దేశంలో ప్రజలు భిన్నత్వంలో ఏకత్వంగా జీవిస్తున్నారు. ముఖ్యంగా బాలికల, మహిళలు హక్కులు తెలుసుకోవాలి. స్వేచ్ఛ, సమానత్వం సాధించుకోవాలి. నేటికీ మహిళలు, చిన్నారులు, యువతులపై దాడులు కొనసాగుతున్నాయి. శిక్షలు కఠినంగా ఉంటేనే ప్రజలు క్రమశిక్షణతో జీవిస్తారు. నేటి విద్యార్థులు, యువతరం ప్రభుత్వాలను ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలి. అప్పుడే అభివృద్ధి సాధ్యం. – కె.చందన, బీఎస్సీ, తృతీయ సంవత్సరం -
వేడుకలు చూద్దాం రండి..
భూపాలపల్లి: 79వ స్వాతంత్య్ర దినోత్సవ సంబురాలకు జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టేడియం వేదిక కానుంది. వేడుకలకు అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయగా ప్రభుత్వం తరఫున తెలంగాణ షెడ్యుల్ ట్రైబ్స్ కో ఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ బెల్లయ్యనాయక్ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. వేడుకల నిర్వహణ ఇలా.. నేటి ఉదయం 9.28 గంటలకు ముఖ్యఅతిథి అంబేడ్కర్ స్టేడియం చేరుకొని 9.30 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. 9.55 నుంచి 10 గంటల వరకు పరేడ్, అనంతరం స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం, 10.20 నుంచి 12.45 గంటల వరకు పాఠశాల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు, తదుపరి ఉత్తమ అధికారులకు ప్రశంసా పత్రాల పంపిణీ, 11.25 గంటలకు ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శిస్తారు. ఏర్పాట్లు పూర్తి.. స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా అధికారులు తగు ఏర్పాట్లు చేశారు. అంబేడ్కర్ స్టేడియాన్ని ముస్తాబు చేశారు. స్టేజీని అందంగా తీర్చిదిద్దడంతో పాటు సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా షామియానాలు, కుర్చీలు, తాగునీటి సదుపాయం కల్పించారు. వేడుకల ఏర్పాట్లను గురువారం సాయంత్రం కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, జిల్లా అధికారులు పరిశీలించారు. నేడు స్వాతంత్య్ర దినోత్సవ సంబురాలు ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్యనాయక్ వేడుకలకు వేదిక కానున్న అంబేడ్కర్ స్టేడియం -
శుక్రవారం శ్రీ 15 శ్రీ ఆగస్టు శ్రీ 2025
‘దేశంలో అందరూ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అవినీతి. దీనిని రూపుమాపినప్పుడే సమాజం బాగుపడుతుంది. బీద, ధనిక తేడాలు, అధికార దర్పం తదితర కారణాలతో స్వేచ్ఛాసమానత్వం ప్రజలందరికీ అందడం లేదు. మనం ఎన్నుకునే ప్రజాప్రతినిధులు కొలువుదీరే చట్టసభలు న్యాయంగా పనిచేస్తేనే నాడు ఏ ఉద్దేశంతో అయితే బ్రిటీష్వాళ్లనుంచి స్వాతంత్య్రం పొందామో ఆ ఫలితాలు తారతమ్యాలు లేకుండా అందరికీ చేరుతాయి.’ అని ఉమ్మడి వరంగల్ జిల్లావాసులు కోరుతున్నారు. 78ఏళ్ల స్వతంత్ర భారతంలో పలు అంశాలపై ‘సాక్షి’ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించగా ప్రజలు తమ మెజారిటీ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. – సాక్షి నెట్వర్క్అవినీతి పేదరికం నాణ్యమైన విద్య వైద్యం కుల వివక్ష -
వర్షానికి కూలిన ఇల్లు
కాటారం(మహాముత్తారం): మహాముత్తారం మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షానికి దౌతుపల్లికి చెందిన మడప ధర్మయ్య ఇల్లు గురువారం ఒక్కసారిగా నేలమట్టమైంది. వర్షాలకు ఇంటి గోడలు, పై కప్పు పూర్తిగా తడిచిపోవడంతో కూలింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో కుటుంబ సభ్యులకు ప్రాణాపాయం తప్పిందని ధర్మయ్య తెలిపారు. ఇంట్లో నిల్వ ఉన్న నిత్యవసర సరుకులు, సామగ్రి, బట్టలు పూర్తిగా ధ్వంసమైనట్లు బాధితుడు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం, అధికారులు తమను ఆదుకోవాలని ధర్మయ్య వేడుకుంటున్నాడు. రేగొండ: తిరుమలగిరి శివారులోని బుగులోని గుట్టలను గురువారం జిల్లా అధికారులు పరిశీలించారు. జాతరలో పలు అభివృద్ధి పనులకు రూ.1.50 కోట్ల నిధులు కేటాయించారు. జాతరలో చేపట్టాల్సిన పనులను జిల్లా ఉన్నతాధికారులు పరిశీలించి నమూనాలు తీసుకున్నారు. జాతర సమయానికి పనులను పూర్తి చేసి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్అండ్బీ ఈఈ రమేష్, పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు, డీఈలు రవికుమార్, సతీష్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ శ్వేత, ఫారెస్ట్ డివిజన్ అధికారి అప్పల కొండ, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నరేష్, నాయకులు నిమ్మల విజేందర్, రొంటాల వెంకటస్వామి, గంగుల రమణారెడ్డి, పాల్గొన్నారు. భూపాలపల్లి రూరల్: బీజేపీ జిల్లా కమిటీని 20మందితో ఎన్నుకున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిశిధర్రెడ్డి తెలిపారు. గురువారం జిల్లాకేంద్రంలోని బీఎంఎస్ యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిటీని ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా దాసరి తిరుపతిరెడ్డి, మోరే రవీందర్ రెడ్డి, వేషాల సత్యవతి, కోడెపాక స్వరూప, సామల మధుసూదన్ రెడ్డి, గొర్రె శశి కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శులుగా దొంగల రాజేందర్, తాటికంటి రవికుమార్, పెండ్యాల రాజు, కమిటీ సభ్యుల పేర్లు ప్రకటించారు. ఈ సందర్భంగా నిశిధర్రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తంచేశారు. అనంతరం జాతీయ జెండా చేత బూని బీఎంఎస్ కార్యాలయం నుంచి భూపాలపల్లి కూడలి వరకు తిరంగా యాత్ర చేశారు. భూపాలపల్లి అర్బన్: రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తితో పాటు ఉత్పత్తి ఖర్చును తగ్గించాలని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి కోరారు. ఏరియాలోని కేటీకే 2వ గనిలో మల్టీ డిపార్ట్మెంటల్ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశానికి జీఎం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించడానికి, పని గంటలు పెంచుతూ యంత్రాలను నడపాలన్నారు. భద్రతతో కూడిన ఉత్పత్తి సాధించాలని, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటిస్తూ, అంకితభావంతో పనిచేయాలన్నారు. భద్రత పట్ల అశ్రద్ధ వహించకుండా అధికారులు, సూపర్వైజర్లు, సంబంధిత ఉద్యోగులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఉద్యోగుల గైర్హాజరు శాతాన్ని తగ్గించాలని విధులకు రానీ ఉద్యోగులను సంస్థలో నుంచి తొలగించే ప్రక్రి య కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు కవీంద్ర, జ్యోతి, రాజేశ్వర్, కృష్ణ ప్రసాద్, మారుతి, రమాకాంత్, కృష్ణయ్య, ప్రశాంత్, గుర్తింపు, ప్రాతినిథ్య సంఘాల నా యకులు రమేష్, మధుకర్ రెడ్డి పాల్గొన్నారు. -
పోలీసు వ్యవస్థపై నమ్మకం పెంచాలి
మల్హర్: ప్రజల్లో పోలీసు వ్యవస్థపై నమ్మకాన్ని పెంపొందించే విధంగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ కి రణ్ ఖరే తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం మండలంలోని కొయ్యూరు పోలీస్ స్టేషన్ను ఎస్పీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ సిబ్బంది పనితీరును, రికార్డులను పరిశీలించారు. నిందితుల అరెస్ట్, కోర్టు పెండింగ్ కేసులు, వాటికి సంబంధించిన దర్యాప్తు వివరాలను, రోడ్డు ప్రమాదాల నివారణకు, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను ఎస్సై నరేశ్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్కు వచ్చే వారితో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలన్నారు. ఫిర్యాదుదారులకు సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకాన్ని, భరోసా కలిగించాలని చెప్పారు. నేరాల కట్టడి కోసం మరింత శ్రమించడంతో పాటు, నేరం జరిగిన వెంటనే వేగంగా స్పందించాలన్నారు. రానున్న స్థానిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు తగిన చర్యలు చేపట్టాలని వెల్లడించారు. అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ నాగార్జునరావు, ఎస్సైలు మహేంద్ర కుమార్, రజన్కుమార్, సీసీ ఫసీ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
వైభవంగా మహాలింగార్చన
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా శ్రీమహాలింగార్చనశ్రీ పూజా కార్యక్రమాన్ని వైభవంగా వేద మంత్రోచ్ఛరణలతో నిర్వహించారు. బుధవారం ప్రదోషకాలంలో ఉపప్రధాన అర్చకుడు పనకంటి ఫణీంద్రశర్మ, అర్చకులు వెల్ది శరత్చంద్ర, వేద పండితులు ప్రధాన ఆలయం అనివెట్టి మండపంలో మహాలింగార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒండ్రు మట్టితో 365 మృత్తిక లింగాలను తయారుచేసి ప్రత్యేకంగా మహా రుద్రాభిషేకం తదితర పూజా కార్యక్రమాలు చేశారు. ఈ పూజ చేయడం వల్ల సంవత్సర కాలం మహాశివుడికి పూజించిన ఫలం వస్తుందని భక్తుల నమ్మకం. అనంతరం చెన్నూరుకు చెందిన ప్రతాప మారుతి భజన మండలి కార్యక్రమం నిర్వహించారు. ఈఓ ఎస్.మహేశ్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, భక్తులు పాల్గొన్నారు. -
మత్స్యకారులు చెరువుల్లో వలలను ఉంచొద్దు
భూపాలపల్లి రూరల్: జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మత్స్యకారులు చెరువులు, కుంటల్లో వలలను ఉంచొద్దని, ఉంటే వెంటనే తొలగించాలని జిల్లా మత్స్యశాఖ అధికారి విజయ్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చెరువులు, కుంటల్లో చేపల వేటకు వెళ్లొద్దని తెలిపారు. ప్రమాద సమయాల్లో సంఘాల్లో ఉన్న గజ ఈతగాళ్లకు సమాచారం ఇస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరపడవలు, తెప్పలు కలిగిఉన్న మత్స్యకారులు అత్యవసర సమయంలో సహాయ చర్యల్లో అధికారులకు సహకరించాలని కోరారు. భారీ వర్షాల కారణంగా జిల్లాలో ఎక్కడైనా చెరువులు, కుంటలు తెగితే స్థానిక అధికారులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. భారీ వర్షాలకు సంబధించి ఎలాంటి సమాచారం, సాయం కోసమైనా కంట్రోల్ రూమ్ నంబర్ 90306 32608 ద్వారా సంప్రదించాలని కోరారు. చిట్యాల తహసీల్దార్కు నోటీసులుచిట్యాల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల తహసీల్దార్కు బుధవారం రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ నోటీసులు జారీ చేశారు. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని చింతకుంటరామయ్యపల్లి గ్రామానికి చెందిన ఏలేటి రాంరెడ్డి 23 ఆగస్టు, 2022 నాడు సమాచార హక్కు చట్టం కింద అతడి భూమికి సంబంధించిన విషయమై తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేశారు. దీనికి తహసీల్దార్ సరైన సమాచారం ఇవ్వకపోవడంతో ఆర్డీఓకు అప్పిల్ చేశారు. ఆర్డీఓ కూడా సరైన సమాచారం అందించలేదు. దీంతో స్థానిక తహసీల్దార్, ఆర్డీఓలపై , జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో బాధితుడికి సరైన న్యాయం జరుగకపోవడంతో రాష్ట్ర సమాచార హక్కు కమిషన్కు ఫిర్యాదు చేశారు. స్పందించిన సమాచార హక్కు కమిషషనర్ తహసీల్దార్కు నోటీసులు జారీ చేశారు. మాదకద్రవ్యాల నిర్మూలన అందరి బాధ్యతభూపాలపల్లి అర్బన్: మాదకద్రవ్యాల నిర్మూలన అందరి బాధ్యత అని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల వినియోగ వ్యతిరేక కార్యక్రమాన్ని ఉద్దేశించి బుధవారం ఏరియాలోని కేటీకే 8వ గనిలో కార్మికులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏరియా జీఎం రాజేశ్వర్రెడ్డి హాజరై మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం కార్మికులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో కవీంద్ర, జ్యోతి, ఎర్రన్న, రాజేశ్వర్, మారుతి, మురళీమోహన్, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు రమేశ్, మధుకర్రెడ్డి పాల్గొన్నారు. ఓరుగల్లు కళాశిఖరాలు పోస్టర్ ఆవిష్కరణభూపాలపల్లి రూరల్: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, అంజలి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో ‘ఓరుగల్లు జానపద కళాశిఖరాలు వరంగల్ శంకర్, సారంగపాణి 2025 జానపద పురస్కారాలు’ కార్యక్రమం ఈనెల 21వ తేదీన హనుమకొండ కాళోజీ కళాక్షేత్రంలో జరగనుందని జిల్లాలోని కళాకారులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం కార్యక్రమ ఇన్చార్జ్ గోల్కొండ బుచ్చన్న పిలుపునిచ్చారు. ఈసందర్భంగా బుధవారం కళాకారులతో కలిసి అంబేద్కర్ సెంటర్లో పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు అంబాల చంద్రమౌళి, సీనియర్ కళాకారులు కొలుగూరి సంజీవరావు, వెన్నెల శ్రీనాథ్, నరేశ్, రవి, ప్రవీణ్కుమార్, స్వాతి తదితరులు పాల్గొన్నారు. -
విత్తన భారం!
ఉద్యానపంటల విత్తనాలను 50శాతం రాయితీపై ఇస్తామన్న ప్రభుత్వ హామీ నీటిమూట అయ్యింది. ఏడేళ్ల కిందటి వరకు ఆర్కేవీవై (రాష్ట్రీయ కృషి విజ్ఞాన్ యోజన) కింద కూరగాయల విత్తనాలను రాయితీపై అందించేవారు. ప్రస్తుతం ఈ పథకం తీగజాతి కూరగాయల సాగుకు ఏర్పాటుచేసే పందిళ్లకే పరిమితమైంది. కూరగాయలు, మిర్చి పండించే రైతుల ఆశలు ఆడియాశలయ్యాయి. భూపాలపల్లి రూరల్: ఉద్యాన పంటలకు జిల్లాలోని నేలలు అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ సాధారణ పంటలతో పాటు కూరగాయలను ఏటా రెండు సీజన్లలో విస్తారంగా పండిస్తారు. చిట్యాల, కాటారం, మల్హర్, గణపురం, రేగొండ మండలాల్లో వంకాయ, బెండ, పచ్చి మిర్చి, చిక్కుడు, క్యాలిఫ్లవర్, టమాట, బీర, సొరకాయ, బెండ, కాకర, ఉల్లి, టమాట పండిస్తారు. ఎండుమిర్చి సాగుపై ఈ ప్రాంత రైతులు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. మహదేవ్పూర్, భూపాలపల్లి, రేగొండ, మల్హర్, గణపురం, మహాముత్తారం, చిట్యాల మండలాల్లో ఏటా దాదాపు 20వేల ఎకరాలకు పైగా ఎండుమిర్చి సాగవుతోంది. రైతులపై ఆర్థిక భారం.. రాయితీపై కూరగాయల విత్తనాలను అందిస్తామని ప్రస్తుత సర్కారు హామీ ఇచ్చింది. అయితే గతేడాదితో పాటు ఈసారి కూడా రాయితీపై విత్తనాలు ఇవ్వలేదు. దీంతో ఉద్యాన రైతులపై ఆర్థిక భారం పడుతోంది. ప్రధానంగా కూరగాయలు సాగుచేసేది సన్న, చిన్నకారు రైతులే. ఏటా విత్తనాలకే రూ.6నుంచి రూ.8వేల వరకు వెచ్చిస్తున్నారు. రాయితీ ఉన్నప్పుడు రూ.3వేల నుంచి రూ.4వేలు మాత్రమే ఖర్చయ్యేదని రైతులు అంటున్నారు. రాయితీపై విత్తనాలు అందిస్తేనే ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంటున్నారు. ఇక ఎండు మిర్చి రైతుల పరిస్థితి ఏమాత్రం బాగా లేదు. ఏటా ధరలురాక నష్టపోతున్నారు. కంపెనీలు, రకాలను బట్టి విత్తనాలకే వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. రకాలనుబట్టి కేజీ రూ.300నుంచి రూ.1,300 వరకు ఉంది. ఎకరాకు కనీసంగా 3కిలోలు కావాల్సి ఉంటుంది. కొన్ని రకాలను కంపెనీలు ప్యాకెట్ల రూపంలో ఇస్తారు. ఒక ప్యాకెట్ ధర రూ.700 నుంచి రూ.800 వరకు ఉంది. ఎకరాకు 12 ప్యాకెట్లు అవసరం ఉంటుంది. ఇలా ఉద్యాన రైతులు విత్తనాల కోసం అధికంగా వ్యయం చేస్తున్నారు. ప్రభుత్వం రైతులకు ఎండు మిర్చి విత్తనాలకు రాయితీ అవకాశం కల్పిస్తేనే ప్రయోజనం చేకూరుతుంది.ఎండుమిర్చి 21,305కూరగాయలు 350 ఈ ఏడాది సాగు అంచనా (ఎకరాల్లో)ఉద్యాన పంటల విత్తనాలకు రాయితీ ఉత్తమాటే కూరగాయల రైతులకు అందని ప్రభుత్వ ప్రోత్సాహం 50శాతం ఇస్తామని హామీ ఇచ్చిన సర్కార్ పందిరి సాగుకే పరిమితమైన ఆర్కేవీవై పథకం పెట్టబడులు పెరిగి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న రైతులుపందిళ్లకే పరిమితం.. ఉద్యాన పంటలను ప్రోత్సహించడంలో భాగంగా కూరగాయల రైతులకు ప్రయోజనం చేకూర్చేలా అప్పట్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఆర్కేవీవై పథకానికి శ్రీకారం చుట్టాయి. ఈ పథకం ద్వారా రాయితీపై కూరగాయల విత్తనాలతో పాటు, ట్రేలు, తీగజాతి కూరగాయలకు అవసరమయ్యే పందిళ్లకు 50శాతం రాయితీ అందించేవారు. దీంతో చాలామంది రైతులు ప్రభుత్వ రాయితీని సద్వినియోగం చేసుకునేవారు. పండించిన కూరగాయలను మార్కెట్కు తరలించడానికి వినియోగించే ట్రేలను కూడా రాయితీపై తీసుకునేవారు. అయితే ఆర్కేవీవై పథకం కింద అవన్నీ 2015–16 వరకు అందించారు. ఆ తర్వాత ఏడాది నుంచి ఈ పథకం కేవలం పందిళ్ల ఏర్పాటుకే పరిమితమైంది. -
నిలిచిన రాకపోకలు
చిట్యాల: మండలంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలోని పాశిగడ్డతండా–ఒడితల గ్రామాల మధ్య కొండెంగల కల్వ ర్టులో వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో పాసిగడ్డతండాకు చెందిన ప్రజలు మండల కేంద్రానికి వచ్చే పరిస్థతి లేక ఇబ్బందులు పడ్డారు. వెంచరామి –అందుకుతండా గ్రామాల మధ్య కల్వర్టు వరద నీటితో ఉప్పొంగింది. బావుసింగ్పల్లి గ్రామం నుంచి ఎస్సీ కాలనీకి వెళ్లే తోళ్లమడుగు ఒర్రె ఉధృతంగా ప్రవహించింది. చల్లగరిగ– ముచినిపర్తి గ్రామాల మధ్య పంటపొలాల నుంచి వరద నీరు భారీగా వెళ్తుండడంతో రాకపోకలు నిలిచిపోయా యి. గిద్దెముత్తారం– లంబాడీతండా మధ్య ఉన్న కల్వర్టు గుండా వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో వాహనాదారులు ఇబ్బంది పడ్డారు. తహసీల్దార్ షేక్ ఇమామ్బాబా, ఎంపీడీఓ జయశ్రీ, ఎస్సై శ్రావణ్కుమార్, ఎంపీఓ రామకృష్ణ అప్రమత్తంగా ఉండి గ్రామాల్లో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు. మహాముత్తారంలో..కాటారం: కాటారం, మహాముత్తారం మండలాల్లో బుధవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. మహాముత్తారం మండలంలో మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో జనజీవనం స్తంభించింది. మహాముత్తారం మండల కేంద్రానికి సమీపంలోని సబ్స్టేషన్ వద్ద గల కోనంపేట వాగు, కేశవపూర్–నిమ్మగూడెం మధ్య గల పెద్దవాగు వరద నీరు కాజ్వేలపై నుంచి ప్రవహించడంతో ఐదు గంటల పాటు అటు వైపు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షంతో ఉధృతంగా వరద ప్రవాహం కల్వర్టులు, ఒర్రెల వద్ద ప్రమాదాలు జరగకుండా అధికారుల చర్యలు -
ఇంత నిర్లక్ష్యమా?
గొల్లబుద్దారం పాఠశాలల అభివృద్ధికి ప్రతిపాదనలు.. భూపాలపల్లి రూరల్: గొల్లబుద్దారం ఉన్నత, ప్రాథమిక పాఠశాలల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారులకు సూచించారు. మంగళవారం కురిసిన వర్షాలకు భూపాలపల్లి మండలంలోని గొల్లబుద్దారం పాఠశాల వరద ముంపునకు గురి కాగా, బుధవారం ఎమ్మెల్యే, కలెక్టర్ రాహుల్శర్మతో కలిసి పాఠశాలను, అనంతరం చికెన్పల్లి గ్రామంలో నీటి మునిగిన ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చికెన్పల్లి గ్రామంలో ఇళ్లలోకి నీరు చేరిన కుటుంబాల ప్రత్యేక కేటగిరి కింద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు వంటమనిషి తమతో దురుసుగా వ్యవహరిస్తున్నారని, భోజనంలో నాణ్యత పాటించట్లేదని తెలు పగా వంట మనుషులను తొలగించి కొత్తవారి కి అవకాశం కల్పించాలని ఆదేశించారు. ఆర్అండ్బీ ఈఈ రమేశ్, పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు, డీఈఓ రాజేందర్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో నాగరాజు పాల్గొన్నారు.భూపాలపల్లి అర్బన్: రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోకి నీరు రావడంపై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్శర్మ ఇంజనీరింగ్ అధికారులపై మండిపడ్డారు. జిల్లా ప్రధాన ఆసుపత్రి ఆవరణం, పలు వార్డులలోకి వరదనీరు చేరి రోగులు ఇబ్బందిపడిన ఘటనతో బుధవారం కలెక్టర్ రాహుల్శర్మతో కలిసి జిల్లా ప్రధాన ఆసుపత్రిని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పరిశీలించారు. వైద్యారోగ్య శాఖ, ఇంజనీరింగ్ శాఖల అధికారుల నిర్లక్ష్యం వల్లే వర్షపు నీరు చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్, ఆర్ఎంఓ డాక్టర్ దివ్య, ఏఈ రవికిరణ్ పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత.. రేగొండ: పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బుధవారం మండలంలోని తిరుమలగిరి శివారులోని బుగులోని జాతర పరిసరాలను కలెక్టర్ రాహుల్శర్మతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వనమహోత్సవంలో భాగంగా మొక్కను నాటారు. బుగులోని జాతరలో పలు అభివృద్ధి పనులకు రూ.1.50 కోట్ల నిధులను కేటాయించనున్నట్లు తెలిపారు. వైద్యారోగ్య, ఇంజనీరింగ్ శాఖల అధికారుల వల్లే ఆసుపత్రిలోకి వరద నీరు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ ఆగ్రహం -
ఉదయం 9.30 గంటలకే పతాకావిష్కరణ
సాక్షిప్రతినిధి, వరంగల్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శుక్రవారం పంద్రాగస్టు రోజున జిల్లాకేంద్రాల్లో ఉదయం 9.30 గంటలకే జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉమ్మడి వరంగల్లో జిల్లాల వారీగా వేడుకలకు హాజరయ్యే మంత్రులు/ప్రముఖుల జాబితాను బుధవారం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు విడుదల చేశారు. హనుమకొండ జిల్లా పోలీసు పరేడ్గ్రౌండ్స్లో అట వీశాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. వరంగల్లో రెవెన్యూశాఖ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ములుగులో పంచాయతీరాజ్శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) జాతీయ పతాకాలను ఆవిష్కరించనున్నారు. అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ ఎస్టీ కోఆపరేటీవ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. మహబూబాబాద్లో డిప్యూటీ స్పీకర్ జె.రాంచంద్రునాయక్, జనగామలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య జెండా ఆవిష్కరిస్తారు. జాతీయ పతాకావిష్కరణ అనంతరం గార్డ్ ఆఫ్ ఆనర్లో గౌరవ వందనం స్వీకరిస్తారని, అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రటరీ ఆ ఉత్తర్వులో జిల్లా కలెక్టర్లకు సూచించారు. పంద్రాగస్టు వేడుకలకు ప్రభుత్వం ఉత్తర్వులు జిల్లాకేంద్రంలో జెండా ఆవిష్కరించనున్న బెల్లయ్యనాయక్ -
అప్రమత్తంగా ఉండాలి
భూపాలపల్లి: జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని కలెక్టర్ రాహుల్శర్మ సూచించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయం నుంచి ఎస్పీ కిరణ్ఖరేతో కలిసి రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, వైద్య, విద్యుత్, వ్యవసాయ, ఆర్అండ్బీ, మున్సిపల్ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 72 గంటల పాటు భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్న సందర్భంగా ప్రజలు బయటికి రాకుండా ఇంటిపట్టునే ఉండేలా గ్రామాలు, మున్సిపాలిటీలో దండోరా వేయించాలని ఆదేశించారు. ఏ సమయంలోనైనా క్లౌడ్బరస్ట్ అయ్యే అవకాశం ఉందని అన్ని శాఖల అధికారులు గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన 90306 32608 కంట్రోల్ రూమ్ నంబర్కు ఫోన్ చేయాలని ప్రజలకు సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వసతి, భోజన సౌకర్యాలు ఏర్పాటు చే యాలని స్పష్టం చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎస్పీ కిరణ్ఖరే మాట్లాడుతూ.. అకస్మాత్తుగా వర్షం వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని, 25మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, అన్నిశాఖల అధికారులు పాల్గొన్నారు.అధికారులతో కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ కిరణ్ఖరే వీడియో కాన్ఫరెన్స్ -
అటవీశాఖ అడ్డంకి..
కాళేశ్వరం: కాళేశ్వరం టు మహదేవపూర్ 353(సీ) 17 కిలోమీటర్ల జాతీయ రహదారి పనులకు రెండున్నరేళ్ల క్రితం స్వయాన ప్రధాని మోదీ శంకుస్థాపన చేసినా ఇప్పటి వరకు అటవీశాఖ అనుమతులు ఇవ్వడం లేదు. దీంతో నేటికీ పనులు ప్రారంభం కాలేదు. 2.5 కిలోమీటర్ల రహదారిలో వ్యవసాయ భూములు ఉండగా.. 14.5 కిలోమీటర్లకు అటవీశాఖ అడ్డంకిగా మారింది. పనులు పూర్తయితే మహారాష్ట్రతో పాటు ఛత్తీస్గఢ్కు రాకపోకలకు సులభం అవుతుంది. 16 మీటర్లకు కుదింపు.. జాతీయ రహదారికి ఒక వైపున 22 మీటర్ల వెడల్పుతో చేపట్టాల్సి ఉంది. పెద్ద సంఖ్యలో అడవిలో చెట్లు కోల్పోవాల్సి వస్తుంది. దీంతో 16 మీటర్ల వరకే తొలగించడానికి ఆటవీ శాఖ నిర్ణయం తీసుకోవడంతో జాతీయ రహదారి అధికారులు కూడా అంగీకరించారు. మరో వైపు జెన్కో నీటి సరఫరా పైపులైను ఉండటంతో విస్తరణకు ఒకవైపు మాత్రమే భూసేకరణ చేపట్టాల్సి ఉంది. ఏడాది కిందటే విస్తరణలో కోల్పోనున్న చెట్లను లెక్కించి నంబర్లు కూడా వేశారు. 15 కిలోమీటర్ల మేర 109 రకాల 7,529 వృక్షాలు తొలగించాలి. వీటికి సంబంధించిన విలువ సుమారుగా రూ.2.67కోట్లుగా అటవీశాఖ అంచనా వేశారు. భూమికి బదులు భూమి ఆటవీ శాఖకు ఇవ్వాల్సి ఉంది. ఓ ఏజెన్సీ అటవీశాఖకు డబ్బులు చెల్లించాల్సి ఉంది. చిట్యాల, గణపురం మండలాల్లో 21 హెక్టార్ల భూమిని కూడా కేటాయించారు. రెవెన్యూ, అటవీ శాఖల సంయుక్త సర్వేలు చేపట్టి అప్పగించాల్సి ఉంది. కాలయాపన జరుగుతుండడంతో అనుమతులు రావడం లేదు. 2.5 కిలోమీటర్లు వ్యవసాయ భూములు కాళేశ్వరం శివారు నుంచి అంతర్రాష్ట్ర గోదావరి వంతెన వరకు దాదాపు 2.5 కిలోమీటర్ల రహదారి విస్తరణపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. మూడుచోట్ల ప్రతిపాదన చేసినా స్థానికులు, రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. బస్టాండు నుంచి పాతరోడ్డు మార్గం, సబ్స్టేషన్ నుంచి పోలీస్స్టేషన్ వెనుక నుంచి రైతుల పొలాల మీది మార్గం, ముక్తివనం పక్క నుంచి విస్తరించడమా అనేది అధికారులు ఇంకా తేల్చలేదని తెలిసింది. ఈ ఏడాది ఏప్రిల్లో రైతుల పొలాల మీదుగా రెవెన్యూ, ఎన్హెచ్ ఇంజనీర్లు సర్వేచేసి ఎంజాయ్మెంట్ సర్వే కన్నెపల్లి మలుపు వరకు చేశారు. ఈ విషయమై వరంగల్ ఎన్హెచ్ ఈఈ మనోహర్ను ఫోన్ ద్వారా సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.కాళేశ్వరం టు మహదేవపూర్ 353(సీ) ఎన్హెచ్కు గ్రహణం రూ.163 కోట్ల వ్యయంతో జాతీయ రహదారి 2022లో పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన 14.5 కిలోమీటర్లకు అనుమతులు ఇవ్వని అటవీశాఖ ఏళ్లుగా మరమ్మతులే.. మహదేవపూర్ నుంచి కాళేశ్వరం మధ్య వాహనాల రద్దీతో రహదారికి గుంతలు పడుతున్నాయి. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కుదురుపల్లి వద్ద వంతెన దెబ్బతిని ప్రమాదకరంగా మారింది. ఈ రహదారి వెంట ప్రతియేటా తాత్కాలిక మరమ్మతులు చేసి ఎన్హెచ్ ఇంజనీర్లు చేతులు దులుపుకుంటున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు రాకపోకలు సాగించే వారికి.. నిత్యం వేల సంఖ్యలో కాళేశ్వరం పుణ్యక్షేత్రానికి నిత్యం వచ్చే భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. వర్షాకాలంలో గోతుల్లో నీరు నిలిచి ప్రమాదకరంగా ఉంటుంది. పీఎం మోదీతో శంకుస్థాపన.. జిల్లాలోని కాళేశ్వరం వద్ద గోదావరిపై నిర్మించిన అంతర్రాష్ట వంతెన నిర్మాణంతో ఈ రహదారిపై రాకపోకలతో నిత్యం వేల సంఖ్యలో వాహనాలతో రద్దీగా మారింది. 353(సీ) కాళేశ్వరం–మహదేవపూర్ మధ్య రహదారి ఇరుకుగా ఉండడంతో 2022 నవంబరు 12న రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించి, వర్చ్యువల్ పద్ధతిలో రూ.163 కోట్లతో నిధులతో శంకుస్థాపన చేశారు. అనుమతులు రాలేదు.. మహదేవపూర్ టు కాళేశ్వరం రోడ్డుకు అనుమతులు రాలేదు. ఉన్నతాధికారులు మరింత సమాచారం కావాలని అడగగా ఈ మధ్యలోనే పంపాము. – నవీన్కుమార్, జిల్లా అటవీశాఖ అధికారి -
జిల్లా కేంద్రంలో భారీ వర్షం
మహాముత్తారం సబ్స్టేషన్ సమీపంలో ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగుకలెక్టరేట్, జీజీహెచ్లోకి చేరిన వరద నీరు భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలో మంగళవారం ఉదయం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి చుట్టూ వర్షపు నీరు భారీగా వచ్చి చేరింది. కలెక్టరేట్ ప్రధాన ద్వారం, గార్డెన్ వరద నీటితో నిండిపోయింది. టీ హబ్ చుట్టూ నీరు నిలవడంతో విద్యుత్ వైర్లకు సంబంధించిన ఎర్త్ నీటిలో మునగడంతో ఎక్స్రే యంత్రాలు పనిచేయలేదు. ఆస్పత్రికి వచ్చిన రోగులు ఇబ్బందులు పడ్డారు. పట్టణంలోని బాంబులగడ్డ, రాజీవ్నగర్కాలనీ, సుందరయ్యనగర్, భగత్సింగ్ కాలనీలోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో రెవెన్యూ అధికారులు నీటిని మళ్లించారు. గొల్లబుద్దారం పాఠశాల జలమయం భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మండలంలోని గద్దగుంట వాగు పొంగిపొర్లడంతో భూపాలపల్లి నుంచి రాంపూర్ మీదుగా అటవీ గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారిపై నీరు నిలిచిపోయింది. దీంతో హైస్కూల్ మీదుగా పోచమ్మ గుడి వరకు కూడా రోడ్లపై నీరు చేరింది. గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోయారు. గొల్లబుద్దారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలకు వరద ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో పాఠశాల ప్రాంగణం ఒక చిన్న చెరువును తలపించింది. దాదాపు 400 మంది విద్యార్థులు.. ఉపాధ్యాయులు పాఠశాల లోపలే చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరిస్థితిని గమనించిన ప్రధానోపాధ్యాయులు వెంటనే స్పందించి, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తగు జాగ్రత్తలతో ఒక్కొక్క విద్యార్థిని సురక్షితంగా ఇంటికి పంపించారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు కాటారం: మహాముత్తారం మండలంలో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో వాగుల్లోకి వరదనీరు చేరి ఉప్పొంగి ప్రవహించాయి. మహాముత్తారం సబ్స్టేషన్ సమీపంలోని కోనంపేటవాగు, కేశవపూర్–నిమ్మగూడెం మధ్య గల పెద్దవాగులు కాజ్వేపై నుంచి ప్రవహించడంతో సుమారు నాలుగు గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దవాగు ఉప్పొంగడంతో మేడారం వైపుగా వెళ్లే వాహనాలు కొంత సమయం పాటు నిరీక్షించాల్సి వచ్చింది. వాగులు దాటకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి తగు చర్యలు చేపట్టారు. -
ఎయిడ్స్పై అవగాహన ఉండాలి
భూపాలపల్లి అర్బన్: ఎయిడ్స్ నియంత్రణే లక్ష్యంగా ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జిల్లా వైద్యారోగ్యశాఖ ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఉమాదేవి తెలిపారు. యూత్ డేను పురస్కరించుకొని మంగళవారం రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు వైద్యారోగ్యశాఖ, దిశ క్లస్టర్ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించి ఐఈసీ క్యాంపెయిన్ ఆగస్టు 12 నుంచి అక్టోబర్ 12 వరకు జరిగే అవగాహన కార్యక్రమాల వాల్పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఉమాదేవి మాట్లాడుతూ హెచ్ఐవీ బాధితులు ఏఆర్టీ మందులు వాడేలా చూడాలన్నారు. మారుమూల గ్రామాలు, పట్టణాలలో ఇంటింటికీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రుక్వాన, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ కవిత, ఐసీటీసీ కౌన్సిలర్ వెంకటేశ్వర్లు, దిశ డీఎండీఓ సాయి, మారి స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ సదానందం, క్యాంపేయిన్ కౌన్సిలర్ హరికృష్ణ, టెక్నీషియన్ మారుతి, విద్యార్థులు పాల్గొన్నారు. -
అప్రమత్తంగా ఉండాలి
భూపాలపల్లి: వాతావరణ శాఖ సూచన మేరకు రానున్న మూడు రోజులు జిల్లాకు రెడ్ అలర్ట్ ఉన్నందున అధికార యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర మంత్రులతో కలిసి సీఎం రేవంత్రెడ్డి మంగళవారం జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే పాల్గొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సీఎం వివరించారు. 2023లో మోరంచవాగు ఉప్పొంగి భూపాలపల్లి మండలం మోరంచపల్లి గ్రామంలో మనుషులు, పశువులు కొట్టుకుపోయి తీవ్ర నష్టం వాటిల్లిందని, అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో కలెక్టర్ రాహుల్ శర్మ సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. అత్యవసర సేవల దృష్ట్యా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అత్యవసర సేవలకు కార్యదర్శి స్థాయి నుంచి జిల్లా అధికారుల వరకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అత్యవసర సేవలకు కలెక్టర్లో కంట్రోల్ రూం నంబర్ 90306 32608 లేదా పోలీస్ కంట్రోల్ రూం నంబర్ 100కు కాల్ చేయాలని ప్రజలకు సూచించారు. ప్రాణ నష్టం జరగడానికి వీలు లేదని, అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుని క్షేత్రస్థాయిలో అధికారులు సిద్ధంగా ఉండాలని చెప్పారు. తన అనుమతి లేకుండా కార్యస్థానం విడిచి వెళ్లొద్దని స్పష్టం చేశారు. చెరువుల సామర్థ్యాలను పరిశీలించి పరిరక్షణ చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావొద్దని, ఏ సమయంలో కుండపోత వర్షం పడుతుందో తెలియదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్పీ కిరణ్ ఖరే, అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. సమన్వయంతో పనిచేయాలి.. అటవీ సంరక్షణలో ప్రతీ శాఖ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన అటవీ సంరక్షణ చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ, అటవీ, పోలీసు, ఆర్అండ్బీ, పర్యాటక తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో డీఎఫ్ఓ నవీన్రెడ్డి, అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, ఏఎస్పీ నరేష్కుమార్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలి ప్రభుత్వ అధికారులు, సిబ్బంది సెలవులు రద్దు కలెక్టర్ రాహుల్ శర్మ ఉపాధ్యాయుల గైర్హాజరుపై కలెక్టర్ ఆగ్రహం భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుల గైర్హాజరుపై పొంతన లేని సమాధానం చెప్పిన ప్రధానోపాధ్యాయుడిపై కలెక్టర్ రాహుల్శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్శర్మ తనిఖీ చేశారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన వ్యాక్సిన్లు, మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. అనంతరం ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు గైర్హాజరు కావడం, కంప్యూటర్, సైన్స్ ల్యాబ్లకు తాళాలు వేసి ఉండటాన్ని గమనించిన కలెక్టర్ మరోసారి పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీదేవి, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీఓ నాగరాజు, ఆర్ఐ రామస్వామి, హాస్టల్ వార్డెన్ సమ్మయ్య, డాక్టర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఆలయ కమిటీ ఎన్నిక
భూపాలపల్లి రూరల్: శ్రీ సీతారామ తెలంగాణ సకల కళల కళాకారుల సంఘం జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆలయ కమిటీ నూతన అధ్యక్షుడు పోల్సాని దేవేందర్రావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా భౌతు లక్ష్మయ్య, కోశాధికారిగా ఎడ్ల రాము, సహాయ కార్యదర్శిగా తరాల సమ్మక్క, ఉపాధ్యక్షుడిగా తాళ్లపల్లి శంకర్, గడ్డం లక్ష్మయ్య, కార్యవర్గ సభ్యులుగా రంగు రవీందర్ గౌడ్, లలిత, అట్కాపురం తిరుపతి, గువ్వ లక్ష్మి, చిలుక రమాదేవిలను ఎన్నుకున్నట్లు తెలిపారు. ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం భూపాలపల్లి అర్బన్: ఏఐఎస్ఎఫ్ 90వ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమాన్ని మంగళవారం జిల్లాకేంద్రంలోని కొమురయ్య భవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోత్కు ప్రవీణ్కుమార్ హాజరై జెండా ఆవిష్కరించి మాట్లాడారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 30వ తేదీ వరకు ఏఐఎఫ్ఐ ఆధ్వర్యంలో క్రీడలు, సెమినార్లు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నేరెళ్ల జోసఫ్, నాయకులు పోతుల పవన్, భగత్, రాజేష్, శరణ్య, లావణ్య, అజయ్, వినోద్, రాకేష్, సంపత్ పాల్గొన్నారు. ఉద్యోగిపై విచారణ కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానంలో విధులు నిర్వర్తిస్తూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఉద్యోగిపై దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాలతో ఆ శాఖ డిప్యూటీ కమిషనర్ సంధ్యారాణి విచారణ చేపట్టారు. ఉద్యోగిపై వస్తున్న ఆరోపణలపై మంగళవారం ఆరాతీశారు. దేవస్థానంలోని అర్చక, సిబ్బందితో ఆమె ప్రత్యేకంగా చర్చించి వారి వాంగ్మూలాన్ని సేకరించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ కమిషనర్ ఆదేశాలతో ఆరోపణలు వస్తున్న ఉద్యోగిపై విచారణ చేశామని, నివేదికలు సమర్పిస్తామని తెలిపారు. ఆమెతో వరంగల్ ఏసీ సునీత, ఈఓ మహేష్, ఉపప్రధాన అర్చకుడు పనకంటి ఫణీంద్రశర్మ, మాజీ దేవస్థానం చైర్మన్ అవధాని మోహన్శర్మ తదితరులు ఉన్నారు. సైబర్ బాధితుడికి చెక్కు అందజేత భూపాలపల్లి అర్బన్: సైబర్ నేరంతో మోసపోయిన బాధితుడికి రూ.1.20లక్షల చెక్కును మంగళవారం భూపాలపల్లి పోలీసులు అందించారు. సీఐ నరేష్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లి పట్టణంలోని మంజూర్నగర్కు చెందిన బొప్పర్తి హరికృష్ణ సైబర్ మోసగాళ్ల చేతిలో రూ.1,75లక్షలు మోసపోయాడు. బాధితుడు నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నంబర్ 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయగా రూ.1,54,500 హోల్డ్ చేశారు. దర్యాప్తు జరిపి మొదటి విడతగా రూ.1,20లక్షల చెక్కును కోర్టు ద్వారా బాధితుడికి అందజేసినట్లు సీఐ తెలిపారు. బాధితుడికి సకాలంలో రిఫండ్ అందజేయడంలో కృషి చేసిన సైబర్ వారియర్ తిరుపతిని సీఐ అభినందించారు. గెజిట్ విడుదల చేయాలని వినతి ములుగు రూరల్ : ఐదో షెడ్యూల్ ప్రకారం పరిశ్రమల జీఓల గెజిట్ను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ మంగళవారం సీఐటీయూ నాయకులు కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాలుగు కనీస వేతన సవరణ మండలాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఈ మేరకు తక్షణమే గెజిల్ విడుదల అయ్యేలా చూడాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో నాయకులు లక్ష్మయ్య, మొగిలి, రమేష్ రాజు, రవీందర్, శివకుమార్ తదితరులు ఉన్నారు. -
నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలి
భూపాలపల్లి అర్బన్: పని గంటలు పెంచుతూ సింగరేణి ఉద్యోగులు నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి తెలిపారు. సింగరేణి వ్యాప్తంగా నిర్వహిస్తున్న మల్టీ డిపార్ట్మెంటల్ అవగాహన సమావేశాలలో భాగంగా మంగళవారం ఏరియాలోని కేటీకే 5వ గనిలో ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమానికి జీఎం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించడానికి, పని గంటలు పెంచుతూ ఎస్డీఎల్ యంత్రాలను నడపాలని భద్రతతో కూడిన ఉత్పత్తిని సాధించాలన్నారు. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని, ఎవరి స్థాయిలో వారు సాధ్యమైనంత వరకు వ్యయాన్ని తగ్గించుకోవాలని కోరారు. నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటిస్తూ, అంకితభావంతో పనిచేయాలన్నారు. భద్రత పట్ల అశ్రద్ధ వహించకుండా అధికారులు, సూపర్వైజర్లు సంబంధిత ఉద్యోగులకు భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి ఉద్యోగి సక్రమంగా పనిచేస్తూ వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుతూ, సంస్థ అభివృద్ధికి తోడ్పడాలన్నారు. ఏ ఇతర ప్రభుత్వ సంస్థలో లేని విధంగా సింగరేణి సంస్థలో ఉద్యోగుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం తేనెటీగల పెంపకం గురించి అవగాహన తరగతులను నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జీఎం కవీంద్ర, అధికారులు జోతి, ఎర్రన్న, రాజేశ్వర్, మారుతి, రమేష్, సంఘాల నాయకులు పాల్గొన్నారు.ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి -
అసమగ్ర కొలువులు
క్రమబద్ధీకరణకు నోచుకోని సమగ్ర శిక్షా ఉద్యోగులు భూపాలపల్లి అర్బన్: విద్యాశాఖలో విధులు నిర్వహిస్తున్న సమగ్ర శిక్షా ఒప్పంద ఉద్యోగులు ఆశా, నిరాశలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఉద్యోగాలు క్రమబద్ధీకరణకు నోచుకోవడం లేదని, శ్రమకు తగ్గ వేతనాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 368 మంది.. జిల్లావ్యాప్తంగా 13 విభాగాల్లో 368 మంది సమగ్ర శిక్షా ఉద్యోగులు ఉన్నారు. కేజీబీవీల్లో 251 మంది, సీఆర్పీలు 65, ఎంఆర్సీ సిబ్బంది 46, డీఈఓ కార్యాలయ సిబ్బంది ఆరుగురు పనిచేస్తున్నారు. కలెక్టర్ రాష్ట్ర ఉన్నతాధికారులకు పంపించే యూడైస్, మధ్యాహ్న భోజన పథకం నివేదికల తయారీలో సమగ్ర శిక్షా ఉద్యోగులు కీలక పాత్ర, బియ్యం పంపిణీ, పాఠశాల బయట ఉన్న విద్యార్థులను గుర్తించడం వంటి పనులు ఈ ఉద్యోగులే నిర్వహిస్తుంటారు. ప్రభుత్వ పాఠశాలల్లో క్రాష్, ఆర్ట్స్, ఫిజికల్ ఎడ్యూకేషన్ బోధించే ప్రత్యేక ఉపాధ్యాయులు కూడా ఎస్ఎస్ఏ పరిధిలోకి వస్తారు. క్షేత్రస్థాయిలో కీలకపాత్ర అకౌంటెంట్లు, ఏఎన్ఎంలు, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్లు, మండలస్థాయిలో సీఆర్పీలు, ఎంఐఎస్ కో ఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఐఈఆర్పీలు, వ్యాయామ ఒకేషనల్ ఉపాధ్యాయులు, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్లు, డే, నైట్ వాచ్మెన్, స్వీపర్లు, స్కావెంజర్లు, జిల్లాస్థాయిలో ఏపీఓలు, సిస్టం ఎనలిస్టులు, టెక్నికల్ పర్సన్లు, డీఎల్ఎంటీ మెసెంజర్లు, మోడల్ స్కూళ్లలో పనిచేసే వార్డెన్లు, ఆపరేటర్లు, కేర్ టేకర్లు కూడా సమగ్ర శిక్షా పరిధిలోకి వస్తారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల కల్పన కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో అమలు కావడంలో సమగ్ర శిక్షా ఉద్యోగులు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఉచిత పాఠ్య పుస్తకాలు, ఉచిత యూనిఫాం, మధ్యాహ్న భోజనం బియ్యం సరఫరా, ఉపాధ్యాయుల హాజరు నమోదు, ఆన్లైన్లో విద్యార్థుల నమోదు, బడిఈడు పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించడం వంటి పనులను నిర్వహిస్తున్నారు. గురుకులాల్లో సీఆర్టీలు, పీజీసీఆర్టీలు బోధన విధులు నిర్వహిస్తుండగా బోధనేతర సిబ్బంది తమకు కేటాయించిన విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రత్యేకాధికారులు కేజీబీవీల నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. సమ్మె విరమణ సమయంలో.. తమ డిమాండ్ల సాధన కోసం గత డిసెంబరు 6నుంచి జనవరి 7వరకు సమ్మె కొనసాగించారు. సమ్మె విరమణ సమయంలో పే స్కేల్ అమలుపై మూడు నెలల్లో మంత్రివర్గ ఉప సంఘ సమావేశం ఏర్పాటు చేస్తామని, ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి వీలుగా ఉత్తర్వులు జారీచేస్తామని, సమ్మె కాలపు వేతనం అందజేస్తామన్నారు. కానీ ఇచ్చిన హామీల్లో ఇంతవరకు ఒక్కటి కూడా కార్యరూపం దాల్చలేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. తమ హక్కుల సాధన కోసం 15 ఏళ్లుగా వివిధ సందర్భాల్లో పోరాటాలు చేస్తూనే వచ్చారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా తమ సమస్యలను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. హామీలు నిలబెట్టుకోవాలి.. సమ్మె సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్షా ఉద్యోగులకు ఇచ్చిన హామీ లు నిలబెట్టుకోవాలి. స మగ్ర శిక్షాను పూర్తిస్థాయిలో విద్యాశాఖలో విలీనం చేసి ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి వెంటనే ఉత్తర్వులు జారీచేయాలి. పేస్కేల్ అమలు కోసం మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం ప్రకటించాలి. సమ్మె కాలపు వేతనా లు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – చాంద్పాషా, సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఽఘం జిల్లా అధ్యక్షుడు సమ్మె చేసినా పరిష్కారం కాని సమస్యలు చాలీచాలని వేతనాలతో కుటుంబాల పోషణకు అవస్థలు ప్రభుత్వంపై నమ్మకంతో ఆశగా ఎదురుచూపుకుటుంబాల పోషణకు.. పెరుగుతున్న నిత్యావసరాలకు అనుగుణంగా వేతనాలు లేకపోవడంతో కుటుంబాల పోషణకు అవస్థలు పడుతున్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నా.. వచ్చే వేతనాలతో కనీస అవసరాలు తీర్చుకోలేక ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. ఇప్పటికై నా తమను విద్యాశాఖలో విలీనంచేసి రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. పార్ట్ టైం ఉద్యోగులను ఫుల్ టైం ఉద్యోగులుగా గుర్తించి వేతనం పెంచాలని రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. 61 ఏళ్లు నిండిన ఉద్యోగులకు రూ.20 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ చెల్లించాలని, మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.15 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి ఉద్యోగికి రూ.10 లక్షల జీవిత బీమా, రూ.5 లక్షల ఆరోగ్య బీమా సదుపాయం కల్పించాలని వారు కోరుతున్నారు. -
మల్టీ డిపార్ట్మెంట్ టీమ్ల ఏర్పాటు
భూపాలపల్లి అర్బన్: బొగ్గు ఉత్పత్తి పెంపు, యంత్రాల పనితీరు, కంపెనీ భవిష్యత్ ప్రణాళికలను తెలియజేసేందుకు యాజమాన్యం మల్టీ డిపార్ట్మెంట్ టీమ్లను ఏర్పాటు చేసినట్లు ఏరియా జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి తెలిపారు. సోమవారం మల్లీడిపార్ట్మెంట్ టీమ్ల ఏర్పాటు కార్యక్రమాన్ని జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ ఏరియాలో ఉద్యోగులందరికీ ప్రస్తుతం సింగరేణి సంస్థ ఉత్పత్తి, ఉత్పాదకత, యంత్రాల పనితీరు, ఉత్పత్తి వ్యయం విషయాలను గనులు, వివిధ శాఖల వారిగా తెలియజేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం మల్టీ డిపార్ట్మెంట్ టీమ్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వివిధ గనులు, విభాగాల నుంచి ఎంపికై న టీం సభ్యులకు అన్ని గనులు, విభాగాల్లో పనిచేసే ప్రతి ఉద్యోగి వివరాలు తెలిసి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు కవీంద్ర, జోతి, ఎర్రన్న, డాక్టర్ పద్మజ, ప్రసాద్, భిక్షమయ్య, రమాకాంత్, అరుణ్ప్రసాద్, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు రమేష్, హుస్సేన్ పాల్గొన్నారు. -
ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యం
భూపాలపల్లి: ప్రజల ఫిర్యాదులను పరిష్కరించడానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్పీ కిరణ్ ఖరే జిల్లాలోని పోలీసు అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దివస్ కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 19మంది నుంచి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. పలు సమస్యలపై అప్పటికప్పుడు స్పందించి సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి సత్వరమే పరిష్కరించాలని ఆదేశాలు జారీచేశారు. ప్రజా దివస్లో వచ్చే ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని ఎస్పీ కిరణ్ ఖరే హెచ్చరించారు.ఎస్పీ కిరణ్ ఖరే -
రెడ్డి కార్పొరేషన్ను ప్రకటించాలి
రేగొండ: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రెడ్డి కార్పొరేషన్ను తక్షణమే ప్రకటించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని భాగిర్థిపేట గ్రామంలో రూపిరెడ్డి విజేందర్రెడ్డి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జైపాల్రెడ్డి మాట్లాడుతూ.. విద్య, ఉద్యోగ రంగాల్లో రెడ్లు వెనుకబడుతున్నారని, వారి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషిచేయాలన్నారు. రెడ్డి కులస్తుల సంక్షేమం కోసం తగు చర్యలను తీసుకోవాలని కోరారు. అనంతరం రెడ్డి సంఘం కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కామిడి సతీష్రెడ్డి, పత్తి బుచ్చిరెడ్డి, పాపిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి -
అంగరంగ వైభవంగా వేడుకలు
భూపాలపల్లి: స్వాతంత్య్ర వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ నిర్వహణ ఏర్పాట్ల్లపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమాల నిర్వహణ, సాంస్కృతిక ప్రదర్శనలు, భద్రతా ఏర్పాట్లు, వేదిక అలంకరణ తదితర అంశాలపై అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. అసెట్స్ పంపిణీకి లబ్ధిదారుల జాబితా తయారు చేయాలన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ క్రీడా మైదానంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమాలకు షామియానా, కుర్చీలు, వైద్య కేంద్రం, అంబులెన్స్, తాగునీరు ఏర్పాటు చేయాలని చెప్పారు. విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ఎన్పీడీసీఎల్ అధికారులకు సూచించారు. వేడుకలకు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది తప్పకుండా హాజరు కావాలని ఆదేశించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై స్టాళ్ల ఏర్పాటుకు డీఆర్డీఓకు జాబితా ఇవ్వాలన్నారు. అన్ని కార్యక్రమాలు మినిట్ టు మినిట్ సజావుగా, సక్రమంగా నిర్వహించేందుకు ఆర్డీఓ పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, ఆర్డీఓ రవి, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఫిర్యాదులు పరిష్కరించాలి.. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల పరి ష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో అన్ని శాఖల జిల్లా అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 41మంది నుంచి దరఖాస్తులు స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. అనంతరం మాట్లాడుతూ.. దరఖాస్తులు నిశి తంగా పరిశీలించి పెండింగ్లో ఉంచకుండా సత్వర పరి ష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి హాజరుకాని అధికారులకు మెమోలు జారీచేయాలని కలెక్టరేట్ ఏఓను ఆదేశించారు. నిర్లక్ష్యం ప్రదర్శించే వారిపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కల్లెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, ఆర్డీఓ రవి, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ నులి పురుగుల నివారణకు మాత్రలు భూపాలపల్లి అర్బన్: 1–19 సంవత్సరాల వయసున్న పిల్లల్లో నులి పురుగుల నివారణకు తప్పనిసరి ఆల్బెండజోల్ మాత్రలు వేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని జంగేడు కేజీబీవీ పాఠశాలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ అన్ని పాఠశాలలు, హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలలో ఈ మాత్రలు అందుబాటులో ఉన్నాయని పిల్లలందరికీ కేంద్రాలలో మాత్రలు తప్పకుండా ఇప్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఇన్చార్జ్ వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీదేవి, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ప్రమోద్కుమార్, డాక్టర్ ఉమాదేవి పాల్గొన్నారు. -
సూపర్ స్పెషాలిటీ వైద్యులతో పరీక్షలు
భూపాలపల్లి అర్బన్: ఈ నెల 24న భూపాలపల్లి సింగరేణి ఏరియా ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్యులతో వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏరియా అధికార ప్రతినిధి మారుతి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గుండె, నరాల, జనరల్ ఫిజీషియన్, మూత్రపిండాల, జీర్ణాశయ పేగుల వైద్య నిపుణులు, జనరల్ సర్జన్లు రానున్నట్లు తెలిపారు. సూపర్ స్పెషాలిటీ వైద్యులకు చూపించుకోవాల్సిన వారు ముందుగా ఏరియా ఆస్పత్రిలో సంబందిత వైద్యుల వద్ద పరీక్షలు నిర్వహించుకోవాల్సి ఉంటుందన్నారు. వారి సూచనల మేరకు స్పెషలిస్టు డాక్టర్ కోసం ఈ నెల 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. సాయి దీప్య మెయిన్స్కు ఎంపిక కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామానికి చెందిన చకినారపు సమ్మయ్య–విజయ కుమార్తె సాయిదీప్య సివిల్స్ మెయిన్స్కు ఎంపికై ంది. సోమవారం హైదరాబాద్లో ‘రాజీవ్గాంధీ అభయ హస్తం’ ద్వారా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతులమీదుగా రూ. లక్ష చెక్కును అందుకుంది. ఆమె ఇటీవల ప్రిలిమినరీ పరీక్షలో ప్రతిభ చాటగా, ఈనెల 22న మెయిన్స్ పరీక్షలకు హాజరు కానుంది. దీంతో ఆమెతో పాటు తల్లిదండ్రులను పలువురు అభినందించారు. ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు కాటారం: ఎరువుల కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని మహదేవపూర్ ఏడీఏ శ్రీపాల్ హెచ్చరించారు. మండలకేంద్రంలోని పలు ఎరువులు, పురుగుల మందు దుకాణాలను సోమవారం ఏడీఏ తనిఖీ చేశారు. అనుమతి పత్రాలు, విక్రయాలకు సంబంధించిన రికార్డులు, యూరియా అమ్మకాలు, స్టాక్ నిల్వలను పరిశీలించారు. ఎరువులు, పురుగుల మందుల విక్రయాలకు సంబంధించిన రికార్డులను, స్టాక్ వివరాలను సక్రమంగా నమోదు చేయాలని నిర్వాహకులను ఏడీఏ ఆదేశించారు. ప్రతి కొనుగోలుపై రైతులకు బిల్లు ఇవ్వాలని సూచించారు. రైతులకు యూరియా అవసరాన్ని ఆసరాగా చేసుకొని లింకు ఎరువులు అంటగట్టవద్దని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు సాగిస్తే లైసెన్స్లు రద్దు చేస్తామని హెచ్చరించారు. అన్నపూర్ణ ఫర్టిలైజర్ దుకాణంలో రికార్డుల నిర్వహణ సరిగా లేకపోవడంతో అమ్మకాలు నిలిపివేయాలని ఏడీఏ ఆదేశించారు. ఏడీఏ వెంట ఏఓ పూర్ణిమ ఉన్నారు. సీఐగా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ కాళేశ్వరం: మహదేవపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా నల్లగట్ల వెంకటేశ్వర్లు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కాటారంలో జరుగుతున్న పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబును మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఇసుక డంప్ సీజ్ టేకుమట్ల: మండలంలోని రామకిస్టాపూర్(వి) శివారులో అనుమతులు లేకుండా అక్రమంగా నిల్వచేసిన సుమారు 70 ట్రాక్టర్ల ఇసుక డంప్ను అధికారులు సీజ్ చేశారు. తహసీల్దార్ విజయలక్ష్మి ఆదేశాల మేరకు సోమవారం హెడ్ కానిస్టేబుల్ మల్లన్న, కానిస్టేబుల్ నాగరాజుతో కలిసి ఆర్ఐ సంతోష్కుమార్ ఇసుక డంపును సీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనుమతి లేకుండా ఇసుకను డంప్ చేసినా, తరలించినా వాహనాలను సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సీజ్ చేసిన ఇసుక డంపును నేడు(మంగళవారం) వేలం వేయనున్నట్లు తెలిపారు. -
ఆదివాసీలను అంతంచేసే కుట్ర
భూపాలపల్లి అర్బన్: కేంద్ర ప్రభుత్వం ఆదివాసీలను అంతం చేసి అటవీ భూములను కార్పొరేట్ శక్తులకు అప్పగించే కుట్ర చేస్తుందని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య ఆరోపించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి గట్టయ్య హాజరై మాట్లాడారు. సామ్రాజ్యవాదులు, బహుళ జాతి కంపెనీలు, కార్పొరేట్ సంస్థలకు దేశంలోని అపారమైన ఖనిజ సంపదను దోచిపెట్టడం కోసం కేంద్రం కుట్రలు చేస్తుందన్నారు. అడవిలో ఉన్న ఆదివాసీలను అంతం చేస్తూ హింస, నిర్బంధం కొనసాగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు దుబాసి పార్వతి, సమ్మయ్య, దేవేందర్, బాపు, రాజమణి, శంకర్, సమ్మయ్య, రమేష్ పాల్గొన్నారు. -
పేదల కడుపు నింపడమే ధ్యేయం
కాటారం: రాష్ట్రంలోని నిరుపేదల కడుపు నింపడమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పథకానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. కాటారం మండల కేంద్రంలోని బీఎల్ఎం గార్డెన్స్లో సబ్ డివిజన్ పరిధిలోని లబ్ధిదారులకు మంజూరైన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్కార్డులు అందించి రేషన్ బియ్యం చేరవేయాలని సంకల్పించిందన్నారు. జిల్లాలోని 277 రేషన్ దుకాణాల ద్వారా ప్రతి నెలా 362 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. పేద ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అన్నారు. గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా లాంటి పథకాలే అందుకు నిదర్శనమని తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులతో పాటు మేడిగడ్డ వద్ద ప్రమాదవశాత్తు మృతి చెందిన ఆరుగురి కుటుంబ సభ్యులకు రూ.లక్ష చొప్పున నష్టపరిహారం అందజేశారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. కాటారం మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంత్రి శ్రీధర్బాబు శంకుస్థాపన చేశారు. అంకుషాపూర్, నస్తూర్పల్లి గ్రామపంచాయతీ నూతన భవనాలు, చిదినెపల్లి, గుండ్రాత్పల్లి, దామెరకుంట, రేగులగూడెం, ఒడిపిలవంచ, బూడిదపల్లి, ఇబ్రహీంపల్లి గ్రామాల్లో నూతనంగా నిర్మించనున్న అంగన్వాడీ కేంద్రాల భవనాలకు, మండల కేంద్రంలోని కేజీబీవీ కళాశాలకు రూ.20 లక్షలతో చేపట్టనున్న మరమ్మతు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అంతకుముందు కాటారం గ్రామపంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన శ్రీపాద చిల్డ్రన్ పార్క్ను మంత్రి ప్రారంభించారు. మంత్రి శ్రీధర్బాబు స్వగ్రామం ధన్వాడలో తన సొంత వ్యవసాయ క్షేత్రం 11 ఎకరాల్లో ఆయిల్ పాం పంట సాగుకు శ్రీకారం చుట్టగా మొక్కలు నాటారు. మండలకేంద్రంలో కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారో త్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొని అభినందనలు తెలిపారు. కార్యక్రమాల్లో కలెక్టర్ రాహుల్శర్మ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, అదనపు కలెక్టర్ అశోక్కుమార్, డీఎస్ఓ కిరణ్కుమార్, ఉద్యాన శాఖ అధికారి మణి, ఏఎంసీ చైర్మన్ పంతకాని తిరుమల పాల్గొన్నారు.రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు -
తల్లిదండ్రులకు ఇల్లు కట్టించిన కూతుళ్లు
చిట్యాల: కొడుకుల్లేరని ఆ దంపతులె ప్పుడూ బాధపడలేదు. కూతుళ్లను బాగా చదివించి.. విలువలతో పెంచారు. ఇప్పుడు వారే ఆ వృద్ధ తల్లిదండ్రులకు ఆసరాగా నిలుస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన బుర్ర నర్సయ్య, సాంబలక్ష్మి దంపతులకు ఏడుగురు కుమార్తెలు. నర్సయ్య గతంలో సర్పంచ్గా పనిచేశారు. విలువలతో కూడిన రాజకీయం చేయడంతో ఆయన ఏమీ సంపాదించుకోలేకపోయారు.కొద్ది నెలల క్రితం ఉన్న ఇల్లు సైతం వర్షానికి కూలిపోయింది. దీంతో వారు నాయకులను కలిసి ఇల్లు మంజూరు చేయాలని మొర పెట్టుకున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకాలు అందకపోవడంతో.. ఆయన ఏడుగురు కుమార్తెలు తలా కొంత డబ్బులు వేసుకుని (రూ.5 లక్షలతో) తల్లిదండ్రులకు ఇల్లు కట్టి ఇచ్చారు. నర్సయ్య ఆదివారం గృహ ప్రవేశం చేశారు. తల్లిదండ్రుల రుణం తీర్చుకునేందుకు ఇల్లు కట్టించి ఇచ్చామని కూతుళ్లు చెబుతున్నారు.అంబులెన్స్ రాలేదు.. స్నేహితుడు ప్రాణం నిలపాలని 40 కి.మీ. బైక్పై.. పుల్కల్(అందోల్): విషం తాగిన యువకుడిని ఆస్పత్రికి తరలించేందుకు ఫోన్ చేసినా 108 అంబులెన్సు రాలేదు.. దీంతో స్నేహితులే అతన్ని 40 కిలోమీటర్ల దూరం బైక్పై తరలించారు. కానీ ఆస్పత్రికి చేరేలోపే బాధితుని ఊపిరి ఆగిపోయింది. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. మండలంలోని బస్వాపూర్ గ్రామానికి చెందిన ఎర్రగొల్ల వెంకటేశం (32) ఆదివారం ఇంట్లో పురు గు మందు తాగి అపస్మారక స్థితికి చేరాడు. గమనించిన కుటుంబ సభ్యులు, స్నేహి తులు 108 అంబులెన్స్కు ఫోన్ చేస్తూనే.. సమయాన్ని వృథా చేయకుండా ద్విచ క్రవాహనంపై యువకున్ని తీసుకెళ్లారు. మార్గమధ్యలో అంబులెన్స్ ఎదురైతే.. అందులో తరలించవచ్చని భావించి ఇద్దరు స్నేహితులు.. బైక్పై బాధితుడిని తరలించారు. కానీ సంగారెడ్డి ఆస్పత్రికి వెళ్లినా అంబులెన్స్ మాత్రం రాలేదు. వైద్యులు పరీక్షించి యువకుడు చనిపోయాడని చెప్పాడు. సమయానికి అంబులెన్స్ వస్తే యువకుడు బతికేవాడని స్నేహితులు, కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. -
రేపటితో రైతుబీమా గడువు ముగింపు
భూపాలపల్లి రూరల్ : అన్నదాతల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబీమా పథకం రెన్యూవల్ గడువు ఈ నెల12వ తేదీతో ముగయనుంది. జిల్లాలోని రైతులంతా రైతుబీమాను రెన్యూవల్ చేసుకోవాలని, అదేవిధంగా కొత్త పట్టా పాస్బుక్ పొందిన రైతులు సైతం సంబంధిత రైతు వేదికల్లో ఏఈఓల ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా ఇన్చార్జ్ వ్యవసాయశాఖ అధికారి బాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 18నుంచి 59 ఏళ్ల వయసు గలవారు 2025, జూన్ వరకు భూభారతి ద్వారా పట్టా పాస్బుక్ పొందిన రైతులు అర్హులని పేర్కొన్నారు. రైతులు ఏదైనా ప్రమాదం, అనారోగ్యం లేదా ఇతర కారణాల వల్ల మరణించిన పక్షంలో నామినికి ఎల్ఐసీ ద్వారా రూ.5లక్షల ఆర్థిక సాయం అందజేస్తారని వివరించారు. ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుందని, ప్రతి ఏటా ఆగస్టు 15నుంచి తదుపరి ఆగస్టు 14 వరకు బీమా చెల్లుబాటులో ఉంటుందని వెల్లడించారు. రెన్యువల్ లేదా కొత్తగా నమోదు కావాలనుకునే రైతులు సమీపంలోని ఏఈఓ లేదా రైతు వేదికలో గడువులోపు దరఖాస్తు చేసుకోవాలని బాబు సూచించారు.జిల్లా ఇన్చార్జ్ వ్యవసాయ అధికారి బాబు -
దేవాదుల పనుల్లో నిర్లక్ష్యం వీడాలి
ఏటూరునాగారం/కన్నాయిగూడెం: గోదావరి జలాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటామని, దేవాదుల పనుల్లో కాంట్రాక్టర్లు, అధికారులు నిర్లక్ష్యం వీడాలని, పనులు పెండింగ్లో ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని భారీ నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంలోని సమ్మక్క–సాగర్ బ్యారేజీ, దేవాదుల వద్ద పంపుహౌస్ను డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, వాకిటి శ్రీహరి, ఎంపీ బలరాంనాయక్తో కలిసి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సందర్శించారు. తుపాలకుగూడేనికి హెలికాప్టర్లో చేరుకున్న మంత్రులకు మంత్రి సీతక్క ఆహ్వా నం పలికారు. ఆ తర్వాత సమ్మక్క బ్యారేజీ వద్ద 59 గేట్లను పరిశీలించారు. నీటి నిల్వలు ఏ మేరకు ఉన్నాయని, గేట్లు ఎన్ని ఎత్తి, ఎన్ని మూశారని తెలు సుకున్నారు. అక్కడి నుంచి కాన్వాయిలో దేవాదుల పంపుహౌస్ వద్ద ఉన్న గోదావరి నీటి నిల్వలను పరిశీలించి మోటార్ల ఎన్ని నడుస్తున్నాయని, ఎంత నీరు ఎత్తిపోశారని ఆరా తీశారు. ఇరిగేషన్ ఈఎన్సీ వెంకటేశ్వర్రావు ప్రొజెక్టర్ ద్వారా మంత్రులకు దేవాదుల స్థితిగతులను వివరించారు. అనంతరం సమీక్షలో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ గోదావరి జలాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందని, ఈ హైలీ ప్రాజెక్టును టీడీపీ, బీఆర్ఎస్ పూర్తి చేయలేదని పేర్కొన్నారు. అప్పుడు చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇప్పుడు పూర్తి చేసేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు. ఇరిగేషన్కు రూ.23వేల కోట్లు బడ్జెట్లో కేటాయిస్తే రూ.16 వేల కోట్లు వడ్డీలు కట్టేందుకే సరిపోతుందన్నారు. కావేరి, గోదావరికి అనుసంధానంగా 200 టీఎంసీల కెపాటీగల ఇచ్చంపల్లి, తుమ్మడిహెట్టి ప్రాజెక్టును నిర్మించి తీరుతామన్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని మంత్రులతో మాట్లాడి ఎన్ఓసీ కూడా తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. 6 లక్షల ఎకరాలకు సాగు నీరు : డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క మాట్లాడుతూ 17 నియోజకవర్గాల్లో 6 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలని లక్ష్యంగాపెట్టుకొని దేవాదుల ప్రాజెక్టు నిర్మించామని తెలిపారు. ఇప్పుడు దీని అంచనాలు కూడా మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. 16.38 టీఎంసీల నుంచి 17.38 టీఎంసీలకు పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రూ.16 కోట్లు దేవాదుల భూ నిర్వాసితులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని వివరించారు. పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లిస్తామన్నారు. 72 మీటర్ల నీటిని నిల్వ చేసుకొని మోటార్ల ద్వారా ఎత్తిపోసి రిజర్వాయర్ల నుంచి కెనాల్ ద్వారా సాగు నీరు అందిస్తామని తెలిపారు. ములుగు జిల్లాకు న్యాయం చేయాలి : మంత్రి సీతక్క ములుగు జిల్లాలో వంద కిలోమీటర్ల గోదావరి నీటి ప్రవాహం ఉందని మంత్రి సీతక్క అన్నారు. సమైక్య రాష్ట్రంలో ములుగుకు అన్యాయం జరిగిందని, స్వరాష్ట్రంలో న్యాయం చేయాలని ఆమె కోరారు. రామచంద్రపురం గ్రావిటీ కెనాల్ ద్వారా పాకాల, కొత్తగూడెం నీటి సరఫరా చేయాలి. పొట్లాపురం కెనాల్ కోసం సంబంధిత ఫైల్ను ప్రభుత్వం వద్ద ఉందని, దానిని పరిశీలించి బడ్జెట్ ఇవ్వాలి. గౌరారం, మల్లూరు, రామప్ప, లక్నవరం ప్రాంతాల్లోకి రైతులకు నీరు ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, కడియం శ్రీహరి, దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ దేవాదుల ప్రాజెక్టును పూర్తిచేసి పంటలకు నీళ్లివ్వాలని కోరారు. సమీక్షలో ఇరిగేషన్ కమిషనర్ ప్రశాంత్పాటిల్, ఇరిగేషన్ ఈఈ జగదీశ్, ములుగు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, నాయకులు ఇర్సవడ్ల వెంకన్న, అప్సర్పాషా పాల్గొన్నారు. కాంట్రాక్టర్లు చిత్తశుద్ధితో పనిచేయాలి అధికారుల పనితీరులో మార్పు రావాలి భారీ నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సమ్మక్క–సాగర్ బ్యారేజీ, దేవాదుల వద్ద పంపుహౌస్ పరిశీలన -
నేడు మంత్రి శ్రీధర్బాబు పర్యటన
కాటారం : మండలంలో నేడు (సోమవారం) రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు పర్యటించనున్నారు. స్థానిక బీఎల్ఎం గార్డెన్స్లో కాటారం సబ్ డివిజన్ పరిధిలోని మండలాలకు చెందిన లబ్ధిదారులకు రేషన్ కార్డుల మంజూరు పత్రాలు, సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ, మేడిగడ్డ వద్ద ప్రమాదవశాత్తు మరణించిన బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెక్కుల అందజేతలో మంత్రి పాల్గొననున్నారు. అనంతరం కాటారం గ్రామ పంచాయతీ సమీపంలో రూ.36 లక్షలతో నిర్మించిన చిల్డ్రన్ పార్క్, ఓపెన్ జిమ్, మద్దులపల్లి, ధర్మసాగర్, అంకుషాపూర్, రేగులగూడెం నూతన గ్రామపంచాయతీ, అంగన్వాడీల నూతన భవన నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అయ్యప్ప ఆలయంలో నిర్వహించనున్న ఏఎంసీ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవంలోను ఆయన పాల్గొననున్నారు. అలాగే మహాముత్తారం మండలంలో రూ.2.30 కోట్లతో నిర్మించిన కేజీబీవీ నూతన భవనాన్ని ప్రారంభించి పోలారం, కొర్లకుంట, మహబూబ్పల్లి, నిమ్మగూడెం, ములుగుపల్లి, మదారం, బోర్లగూడెం గ్రామపంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాలకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. మంత్రి కార్యక్రమాలకు సంబంధించి అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు.కుమారస్వామికి నేషనల్ అవార్డుభూపాలపల్లి రూరల్: బెస్ట్ సర్వీస్ సొసైటీ నేషనల్ అవార్డు 2025 సంవత్సరానికి గాను కాళేశ్వరం దేవస్థానం సరస్వతి పుష్కర ఉత్సవ కమిటీ మెంబర్గా ఓదెల కుమారస్వామి సేవలందించడం పట్ల బెస్ట్ సర్వీస్ సొసైటీ నేషనల్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ జాతీయ అవార్డు నేషనల్ కమిటీ చైర్మన్, జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ అవార్డు ఆహ్వానపత్రాన్ని ఆదివారం హైదరాబాద్లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో ఓదెలుకు అందజేశారు అవార్డును వచ్చే నెల సెప్టెంబర్ 5న తిరుపతిలోని గంధమనేని శివయ్య మెమోరియల్ ట్రస్టు కమ్యూనిటీ హాల్లో అందజేయనున్నట్లు వెల్లడించారు.42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలిభూపాలపల్లి అర్బన్ : కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం చేసి బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ిసీపీఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి బీసీ రిజర్వేషన్ల అమలుకు కేంద్రానికి ఆమోదం కోసం పంపించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బీసీలను మోసం చేస్తూ 42 శాతం రిజర్వేషన్లకు పార్లమెంట్లో చట్టం చేయకుండా మతం రంగు పులుముతోందని విమర్శించారు. రిజర్వేషన్లు మత ప్రాతిపాదికన కాదని, వెనుకబడిన వర్గాలకు ఆర్థిక, రాజకీయ, సామాజిక సమాన అవకాశాలు కల్పన కోసమన్నారు.హేమాచలుడికి భక్తిశ్రద్ధలతో పూజలుమంగపేట: మండలంలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి భక్తిశ్రద్ధలతో దర్శించుకుని పూజలు నిర్వహించారు. కార్లు, ప్రైవేటు బస్సులు, ఆటోలలో ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. అత్యంత భక్తిశద్ధలతో ఆలయంలోని స్వయంభు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు పవన్కుమార్, ఈశ్వర్చంద్ స్వామివారికి తిలతైలాభిషేకం పూజలు నిర్వహించారు. తిలతైలాభిషేకం పూజలో పాల్గొన్న భక్తులు స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని పులకించారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తుల పేరిట పూజారులు గోత్రనామాలతో ప్రత్యేక అర్చనలు జరిపించారు. స్వామివారి విశిష్టత, ఆలయ పురాణాన్ని భక్తులకు వివరించారు. -
ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్న మోదీ
భూపాలపల్లి రూరల్ : ప్రజాస్వామ్య విలువలను మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని, బీజేపీకి ఏజెంట్గా కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దొడ్డిదారిన దొంగ ఓట్లతో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి అయ్యాడని విమర్శించారు. దేశ ప్రజలు కాంగ్రెస్ను కోరుకున్నారని, కానీ దొంగఓట్ల విధానంతో బీజేపీ అధికారంలోకి వచ్చిందని వ్యాఖ్యానించారు. ఇలాంటి ఘటనలపై మేధావులు, ప్రజాస్వామ్యవాదులు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ప్రశ్నించిన వారిపై బీజేపీ కనుసన్నల్లో ఈడీ, ఐటీ సంస్థలు దాడులతో బెదిరిస్తోందని పేర్కొన్నారు. అనంతరం జయశంకర్ ఉద్యాన వనాన్ని సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా పార్క్లో కలియ తిరిగారు. జిమ్ పరికరాల రిపేర్, సైడ్ డ్రెయినేజీ పైకప్పు పూర్తిగా నిర్మించాలని ఆదేశించారు. లైటింగ్, ఫౌంటెన్ను వెంటనే అన్ని సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకురావాలి అధికారులకు ఆయన సూచించారు. దొంగతనాలపై ఎమ్మెల్యే ఆరా.. భూపాలపల్లిలోని లక్ష్మీనగర్ కాలనీల్లో శనివారం రాత్రి దొంగతనాలు జరిగిన వారి ఇళ్లకు ఎమ్మెల్యే సత్యనారాయణరావు వెళ్లి బాధితులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 9మంది ఇళ్లలో దొంగతనాలు జరగడం చాలా బాధాకరమని అన్నారు. ప్రజల భద్రతకు పోలీసులు మరింత కట్టుదిట్టమైన పహారా, సీసీ కెమెరాల ఏర్పాటు, రాత్రివేళ పెట్రోలింగ్ వంటి చర్యలు వెంటనే చేపట్టాలని ఆయన కోరారు. ఇలాంటి ఘటనలు మళ్లీ కాకుండా చూడాలని పోలీస్ అధికారులకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్, వర్కింగ్ ప్రెసిడెంట్ పిప్పాల రాజేందర్, నాయకులు బుర్ర కొమురయ్య, అంబాల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు, దాట్ల శ్రీనివాస్, ముంజాల రవీందర్ గౌడ్, తోట రంజిత్, మహేందర్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు -
అధికారులు కావలెను..
భూపాలపల్లి: పెద్ద భవనం.. విశాలమైన గదులు.. ఒక్కో విభాగానికి ప్రత్యేక గది.. ఫర్నీచర్.. విధులు నిర్వర్తించేందుకు మాత్రం అధికారులు, సిబ్బంది కొరత.. ఇదీ భూపాలపల్లి మున్సిపాలిటీ పరిస్థితి. గ్రామ పంచాయతీ నుంచి నగర పంచాయతీగా అప్గ్రేడ్ అయిన సమయంలో మంజూరైన పోస్టులే నేటికీ కొనసాగుతున్నాయి. అందులోనూ సగానికి పైగా పోస్టుల ఖాళీలు ఉన్నాయి. ఫలితంగా అభివృద్ధి కుంటుపడటమే కాక పలు పనులు ఆలస్యం అవుతున్నాయి. అన్ని విభాగాల్లో సగం ఖాళీలే.. గ్రామ పంచాయతీగా ఉన్న భూపాలపల్లి 2012 జనవరి 21న నగర పంచాయతీగా, 2017 ఆగస్టు 18న గ్రేడ్ 3 మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయింది. మున్సిపాలిటీకి 34 పోస్టులు మంజూరు కాగా ప్రస్తుతం సగం ఖాళీగానే ఉన్నాయి. మేనేజర్ రెండు నెలల క్రితం డిప్యూటేషన్పై బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్గా వెళ్లగా ఆ స్థానంలో ఎవరిని నియమించలేదు. ఒక సీనియర్ స్టెనోగ్రాఫర్ ఉండాల్సి ఉండగా లేరు. సీనియర్ అసిస్టెంట్లు ముగ్గురికి బదులుగా ఇద్దరు, ఒక సిస్టం మేనేజర్, ఒక సిస్టం అసిస్టెంట్(డాటా ఎంట్రీ ఆపరేటర్) లేరు. దీంతో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో సిస్టం అసిస్టెంట్ను నియమించుకున్నారు. వార్డు ఆఫీసర్ పోస్టులు రెండు ఉండగా ఇద్దరు ఉన్నారు. అకౌంట్ సెక్షన్లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అకౌంటెంట్ ఒకరు చొప్పున ఉండగా, సీనియర్ అకౌంటెంట్ పోస్టు ఒకటి ఉన్నప్పటికీ ఖాళీగా ఉంది. శానిటరీ ఇన్స్పెక్టర్ డిప్యూటేషన్పై వరంగల్ వెళ్లగా జూనియర్ అసిస్టెంటే ఆ విధులు నిర్వర్తిస్తున్నాడు. హెల్త్ అసిస్టెంట్ ఇద్దరికి గాను ఒకరు, శానిటరీ జవాన్లు ముగ్గురికి గాను ఇద్దరు ఉన్నారు. అసిస్టెంట్ ఇంజనీర్ ఒక పోస్టు ఉండగా ఇటీవలే భర్తీ చేశారు. ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టు ఖాళీగా ఉండగా సీడీఎంఏ నుంచి ఔట్ సోర్సింగ్పై ఒకరు వచ్చి పని చేస్తున్నారు. అసిస్టెంట్ ఈఈ ఒకరు ఉండగా, ఒక డ్రాఫ్ట్స్మ్యాన్, ఒక వర్క్ ఇన్స్పెక్టర్, క్యాడ్ ఆపరేటర్ లేరు. టౌన్ ప్లానింగ్ సెక్షన్లో టీపీవో, టీపీఎస్, టీపీబీవో, ట్రేసర్, క్యాడ్ ఆపరేటర్, టౌన్ సర్వేయర్ ఒకరు చొప్పున ఉండాల్సి ఉండగా టీపీవో, టీపీబీవో మాత్రమే ఉన్నారు. ఉన్నతాధికారులకు నివేదిక పంపాం.. మున్సిపాలిటీలో సిబ్బంది కొరత ఉన్న విషయాన్ని రాష్ట్రస్థాయి అధికారులకు నివేదించాం. కొత్త పోస్టులను కూడా మంజూరు చేయాలని కోరాం. ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొన్ని పోస్టులను ఔట్సోర్సింగ్ పద్ధతిన భర్తీ చేశాం. – బిర్రు శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్భూపాలపల్లి మున్సిపాలిటీలో ఆఫీసర్లు, సిబ్బంది కొరత నగర పంచాయతీగా ఏర్పడినప్పటి పోస్టులే అందులోనూ సగానికి పైగా ఖాళీలు కొత్త పోస్టుల మంజూరు ఊసే లేదు కుంటుపడుతున్న అభివృద్ధి పనులుఅదనపు పని భారం.. భూపాలపల్లి మున్సిపాలిటీకి మంజూరైన పోస్టులు ఖాళీగా ఉండటం, కొత్తవి మంజూరు కాకపోవడంతో ప్రస్తుతం ఉన్న అధికారులు, సిబ్బందికి పని భారం తప్పడం లేదు. పట్టణంలో నివాస భవనాలు 10,952, నివాస భవనాలు 834, వ్యాపార సముదాయాలు 567, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భవనాలు 1,211 ఉన్నాయి. వీటి నుంచి ప్రతిఏటా సుమారు రూ. 3 కోట్లకు పైగా ఆస్తి పన్ను రావాల్సి ఉంటుంది. అయితే పన్నుల వసూలుకు ఇద్దరు బిల్ కలెక్టర్లు మాత్రమే ఉన్నారు. వీరిద్దరే పట్టణంలోని 30 వార్డుల్లో పన్నులు వసూలు చేయలేరు. దీంతో అధికారులు చేసేది లేక ఔట్సోర్సింగ్ పద్ధతిన సిబ్బందిని నియమించుకుని పన్నులు వసూలు చేపిస్తున్నారు. అలాగే టౌన్ ప్లానింగ్ విభాగంలో టీపీవో, టీపీబీవో మాత్రమే ఉండటంతో అన్నింటిని పర్యవేక్షించడం వీలు కావడం లేదు. ఫలితంగా పట్టణంలో అనుమతి లేని కట్టడాలు ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నాయి. ఇంజనీరింగ్ విభాగంలో వర్క్ ఇన్స్పెక్టర్లు, డ్రాఫ్ట్మెన్స్ లేకపోవడంతో అన్నీ ఏఈనే చూసుకోవాల్సి వస్తోంది. దీంతో వివిధ అభివృద్ధి పనుల్లో ఆలస్యం జరుగుతోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి భూపాలపల్లి మున్సిపాలిటీకి సరిపడా అధికారులు, సిబ్బందిని నియమించాలని స్థానికులు కోరుతున్నారు. -
దొంగల బీభత్సం
భూపాలపల్లి అర్బన్: రాఖీ పండుగ జిల్లా కేంద్రంలోని పలువురు ఇళ్లలో విషాదంగా మారింది. రాఖీలు కట్టేందుకు సొంత ఊళ్లు, సోదరుల వద్దకు వెళ్లి వచ్చే సరికి దొంగలు ఇళ్లను దోచుకెళ్లారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని లక్ష్మీనగర్ కాలనీలో ఒక లైన్లో ఉన్న 3 ఇళ్లతో పాటు మరో లైన్లోని 4 పక్కపక్కనే ఉన్న ఇళ్లలో శనివారం రాత్రి దొంగతనాలకు పాల్పడ్డారు. మరో మూడు ఇళ్లలో చోరీకి ప్రయత్నించారు. ఈ నెల 9వ తేదీన రాఖీ పండుగ నేపథ్యంలో కొంత మంది 8న, మరి కొందరు 9వ తేదీన వారివారి బంధువుల ఇళ్లకు వెళ్లారు. తిరిగి ఆదివారం ఇంటికి వచ్చి కొందరు చూసే వరకు, మరికొందరివి ఇంటి పక్కన వారు చూసి దొంగతనం జరిగిందని సమాచారం అందించారు. ఇంటి తాళాలు పగులకొట్టి ఉండగా ఇంట్లోకి వెళ్లి చూస్తే బీరువాలు ధ్వంసం చేసి ఉన్నాయి. 26 తులాల బంగారం.. రూ.2.38లక్షల నగదు లక్ష్మీనగర్లో 10 ఇళ్లలో జరిగిన చోరీలో మూడు ఇళ్లలో ఎటువంటి బంగారు ఆభరణాలు, నగదు లేవు. మిగితా ఏడు ఇళ్లలో 26 తులాల బంగారం, 53 తులాల వెండి, రూ.2.38 లక్షల నగదు అపహరణకు గురైంది. బాధితులు కథనం ప్రకారం.. బడితల సంతోష్ ఇంట్లో 12 తులాల బంగారం, 23 తులాల వెండి, రూ.58వేల నగదు, చదువు రాకేశ్ రెడ్డి ఇంట్లో రూ.70వేలు, ఓదెల సుమతి ఇంట్లో 8 గ్రాముల బంగారం, రూ. 25వేల నగదు, నగునూరి రాజశేఖర్ ఇంట్లో తులం బంగారం, రూ.37వేలు, ఆకుల రాజ్కుమార్ ఇంట్లో తులం బంగారం, రూ.30 వేలు, ప్రవీణ్ ఇంట్లో తులం బంగారం, రూ.45 వేలు, 30 తులాల వెండి, మాచనపల్లి సురేశ్ ఇంట్లో 10 తులాల బంగారం అపహరణకు గురైంది. అదే కాలనీకి చెందిన జక్కుల రాములు ఇంటితో పాటు మరో ఇద్దరి ఇళ్లలో చోరీకి ప్రయత్నించగా ఎటువంటి బంగారు వస్తువులు, నగదు లభించలేదు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా.. జిల్లా కేంద్రంలో నేర నియంత్రణ, దొంగతనాలను అదుపు చేసేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. అయినప్పటికీ దొంగతనాలు ఆగడం లేదు. జూన్లో ఆరుగురు దొంగలను పోలీసులు పట్టుకున్నారు. అయినప్పటికీ గతంలో మాదిరిగానే దొంగతనాలు జరుగుతున్నా పోలీస్ శాఖ ఏం చేస్తుందని పలువురు చర్చించుకుంటున్నారు. సంఘటన స్థలం పరిశీలన దొంగతనాలు జరిగిన ఇళ్లను స్థానిక సీఐ నరేష్కుమార్తో పాటు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది పరిశీలించారు. క్లూస్ టీమ్ సిబ్బంది వేలి ముద్రలు సేకరించారు. విచారణ వేగవంతం చేసి దొంగలను పట్టుకుంటామని సీఐ నరేష్కుమార్ తెలిపారు. కాలనీ చుట్టు పక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలలో వీడియోలను పరిశీలిస్తున్నారు. ఒకే రోజు రాత్రి 10 ఇళ్లలో చోరీ రాఖీ పండుగకు వెళ్లి వచ్చే సరికి ఇళ్లు గుల్లా నాలుగు నెలలుగా తరచూ దొంగతనాలు విలువైన బంగారు, వెండి వస్తువులు, నగదు అపహరణ నిద్రావస్థలో పోలీసులుపోలీసుల నిఘా కరువు జిల్లా కేంద్రంలో నాలుగైదు నెలలుగా వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి. భూపాలపల్లి పోలీస్స్టేషన్లో ఒక సీఐ, నలుగురు ఎస్సైలతో పాటు ఏఎస్సై, కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా దొంగతనాలు జరుగుతున్నాయి. జరిగిన ప్రతీసారి 5 ఇళ్లకు మించి దోపిడీకి గురవుతున్నాయి. అయినప్పటికీ పోలీసులు ఏమాత్రం ప్రత్యేక నిఘా పెట్టన్నట్లు కనిపిస్తోంది. రాత్రి సమయాల్లో పెట్రోలింగ్, బ్లూకోర్ట్ టీమ్ కాలనీల్లో గస్తీ చేపట్టకుండా ఏం చేస్తుందని పలువురు బాధితులు మండిపడుతున్నారు. గత మూడు నెలల క్రితం పోలీస్స్టేషన్ పక్కనే సుమారు ఐదు సింగరేణి క్వార్టర్లు, ఎండీ క్వార్టర్లలో దొంగతనాలతో పాటు వివిధ కాలనీల్లో దొంగతనాలు జరుగుతున్నా ఎందుకు నియత్రించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
పూజారుల గదులను పట్టించుకోరూ?
ఎస్ఎస్తాడ్వాయి : మేడారంలో నిర్మించిన పూజారుల గదులు మరమ్మతులకు చేరుకున్నాయి.గతంలో మహాజాతర సందర్భంగా సమ్మక్క–సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు పూజారుల కోసం దేవాదాయ శాఖ ఆవరణంలో ప్రత్యేక గదులు నిర్మించారు. జాతర సమయాల్లో పూజారులు గదుల్లో ఉండి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. గదులు మరమ్మతుకు రావడంతో పూజారులకు మళ్లీ పాత తొమ్మిది గదుల రేకుల షెడ్డు దికై ్కంది. కొన్ని గదుల కిటీకిలు, తలుపులు పగిలిపోయాయి.అలాగే టైల్స్ సైతం దెబ్బతిన్నాయి. దేవాదాయశాఖ అధికారులు పూజారుల గదులను పట్టించుకోకపోవడంతో మరమ్మతుకు చేరుకున్నాయి. అమ్మవార్లను కొలిచే పూజారుల గదులే ఇలా ఉంటే భక్తుల సౌకర్యాలు ఎలా ఉన్నాయో సంబంధిత అధికారులకే తెలియాల్సి ఉంది. ఇటీవల పూజారుల కోసం నూతన భవనం నిర్మించారు. కానీ మహాజాతర సమయంలో పూజారులకు గదులు చాలా అవసరం. జాతర సమయంలో భక్తుల రద్దీకి పూజారులు బయటకు వెళ్లే పరిస్థితి ఉండదు. గద్దెల దగ్గర గదులు ఉండడంతో పూజా కార్యక్రమాలకు, అధికారులకు వారు అందుబాటులో ఉంటారు. దేవాదాయశాఖ అధికారులు స్పందించి గదులకు మరమ్మతులు చేపట్టాలని పూజారులు కోరుతున్నారు. -
ఆమెకు 30.. అతనికి 19!
కాటారం: ఆమె వయసు 30.. అతని వయసు 19. ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఇంతలోనే భర్తతో పాటు అతని కుటుంబ సభ్యుల వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం అంగరాజ్పల్లికి చెందిన దుర్గం సరళ(30).. అదే గ్రామానికి చెందిన 19 ఏళ్ల జాడి రాజేశ్ గత జూన్లో ప్రేమ వివాహం చేసుకున్నారు. బతుకుతెరువు నిమిత్తం కాటారం మండల కేంద్రానికి వచ్చి ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. రాజేశ్ కుటుంబ సభ్యులకు ఈ వివాహం ఇష్టం లేదు. ఈక్రమంలో రాజేశ్ను కుటుంబ సభ్యులు ఉసిగొల్పడంతో.. సరళను హింసించడం మొదలుపెట్టాడు. భర్త వేధింపులు తట్టుకోలేక సరళ శనివారం అర్ధరాత్రి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఉన్నత చదువులు చదవాలి
● ఏటీడబ్ల్యూఓ క్షేత్రయ్య కాళేశ్వరం: ఆదివాసీల పిల్లలు ఉన్నత చదువులు చదవాలని ఏటీడబ్ల్యూఓ క్షేత్రయ్య అన్నారు. ప్రపంచ ఆదివాసీల దినోత్సవం వేడుకలను శనివారం మహదేవపూర్ మండలకేంద్రంలో ఆదివాసీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండలకేంద్రంలోని కొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏటీడబ్ల్యూఓ క్షేత్రయ్య మాట్లాడుతూ ఆదివాసీల పిల్లలు విద్యని అభ్యసించి ఉన్నతస్థాయికి చేరుకోవాలని కోరారు. ఆదివాసుల కోసం ప్రత్యేక గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలను ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, పీఏసీఎస్ చైర్మన్ చల్లా తిరుపతిరెడ్డి, ఆదివాసీ జెఏసీ అధ్యక్షుడు గురుసింగ బాపు, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు మడే కుమార్, ఐటీడీఏ సాధన సమితి అధ్యక్షుడు సమ్మయ్య, పీసీసీ సభ్యుడు బెల్లంకొండ కిష్టయ్య, జీసీసీ డైరెక్టర్లు రాములు, వెంకటరాజం, తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్, ఆదివాసీ గిరిజన సంక్షేమ ఉద్యోగులు పాల్గొన్నారు. -
ఆరోగ్య శిబిరం.. సత్ఫలితం
వైద్య శిబిరాల్లో కేసుల వివరాలు వైద్య శిబిరాలు : 25 టీబీ పరీక్షలు చేసింది : 6078 టీబీ లక్షణాలు ఉన్నది : 392 హెచ్ఐవీ పరీక్షలు : 1191 పాజిటివ్ నిర్దారణ : 09 మధుమేహవ్యాధి నిర్ధారణ : 105 రక్తపోటు గుర్తింపు : 172భూపాలపల్లి అర్బన్: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆరోగ్య శిబిరాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా 2030 నాటికి క్షయను సంపూర్ణంగా నివారించాలన్న ఆశయంతో కేంద్ర ప్రభుత్వం వంద రోజుల సమగ్ర ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తుంది. క్షయవ్యాధి నిర్ధారణ కోసం జిల్లావ్యాప్తంగా ప్రతీ గ్రామం, పట్టణాల్లోని వార్డుల్లో ప్రతీ రోజు ఒక వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. స్థానికంగా ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. క్షయ, హెచ్ఐవీ, హెపటైటిస్ బీ, మధుమేహం, బీపీ వంటి పరీక్షలు చేస్తున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలే సమయం కావడంతో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఆరోగ్య శిబిరాల్లో జ్వరం, జలుబు, దగ్గు వంటి వ్యాధులకూ పరీక్షలు చేస్తున్నారు. ఫలితంగా సీజనల్ వ్యాధుల ప్రభావం జిల్లాలో కొంతమేర తగ్గింది. సమగ్ర ఆరోగ్య శిబిరాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి.. పలు రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. క్షయవ్యాధిపై అనుమానం ఉన్నవారిని ఎక్స్రే కోసం 102 వాహనాల్లో జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి అక్కడి నుంచి ఇంటికి తరలిస్తున్నారు. సీజనల్ వ్యాధులపై అవగాహన ఆరోగ్య శిబిరాలతో పాటు వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై ప్రజలు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వర్షాలు కురుస్తుండడంతో నీటిని వేడి చేసి చల్లార్చి తాగాలని, వేడి ఆహారాన్ని తీసుకోవాలని, బయటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని, ఈగలు, దోమలు వాలకుండా చూసుకోవాలని వివరిస్తున్నారు. దోమల వృద్ధికి కారణమయ్యే నీటి నిల్వ, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం, ప్రతీ శుక్రవారం డ్రైడే పాటించడం, ఇంట్లో ఉన్న నిల్వ నీటిని ఎప్పటికప్పుడు తొలగించడం చేయాలని సూచిస్తున్నారు. డెంగీ, మలేరియా, డయేరియా వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు వివరిస్తున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు దోహదపడుతున్నాయి. పరీక్షలు చేస్తున్నాం.. జిల్లాలో 100 రోజుల ప్రణాళికలో భాగంగా అన్ని వార్డులు, గ్రామాల్లో సమగ్ర ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నాం. అన్ని రకాల వ్యాధులకు పరీక్షలు చేయడంతోపాటు అవసరమైన వారికి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పరీక్షలు చేసి మందులు ఇస్తున్నాం. ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా సీజనల్ వ్యాధులను కొంతవరకు అరికట్టే అవకాశం ఉంది. – డాక్టర్ ఉమాదేవి, జిల్లా ప్రోగ్రాం అధికారిణి టీబీ ముక్త్ భారత్ అభియాన్లో వైద్య శిబిరాలు టీబీ, హెచ్ఐవీ, హైపటైటిస్ బీ, బీపీ, మధుమేహం పరీక్షలు జ్వరం, ఇతర వ్యాధులకూ వైద్య పరీక్షలు -
ఘనంగా రాఖీ వేడుకలు
అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను జిల్లా వ్యాప్తంగా శనివారం ఘనంగా నిర్వహించుకున్నారు. జిల్లాలో మహిళలు, యువతులు కనులపండువగా జరుపుకున్నారు. ప్రతీ కుటుంబంలో అక్కాచెల్లెళ్లు అన్నదమ్ములకు రాఖీలు కట్టి ఆశీర్వదించారు. విధుల్లో ఉన్న భూపాలపల్లి ఆర్టీసీ డిపో కండక్టర్ రాధాకృష్ణకు గోదావరిఖని నుంచి వచ్చి ఆర్టీసీ బస్సులోనే చెల్లి రాఖీ కట్టింది. పండుగ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. భూపాలపల్లి బస్స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడింది. బస్సుల కోసం పరుగులు తీశారు. రాఖీ, ఇతర దుకాణాలు అమ్మకాలతో రద్దీగా మారాయి. – భూపాలపల్లి అర్బన్– మరిన్ని ఫొటోలు 9లో.. -
108 వాహనం తనిఖీ
గణపురం: మండల 108 వాహనాన్ని 108 జిల్లా మేనేజర్ మేరుగు నరేష్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనంలోని మెడిసిన్తో పాటు మెడికల్ ఎక్విమెంట్స్ను పరిశీలించారు. రికార్డులతో పాటు మూడు నెలల కాలం అందించిన సేవలపై ఆరాతీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనంలో కావాల్సిన మందులను అందుబాటులో ఉంచుకుంటూ కాల్ వచ్చిన వెంటనే స్పందించి వాహనం బయలు దేరాలని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యసేవలు అందించాలని.. నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ బాలరాజు, పైలెట్ రషీద్ ఉన్నారు.సీఐల బదిలీభూపాలపల్లి అర్బన్: జిల్లాలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ మల్టీజోన్–1 ఐజీ చంద్రశేఖర్రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీచేశారు. గణపురం నూతన సర్కిల్ సీఐగా సీహెచ్ కరుణకర్రావు ఆదిలాబాద్ టూ టౌన్ నుంచి బదిలీపై రానున్నారు. సీసీఎస్ సీఐగా విధులు నిర్వర్తిస్తున్న వెంకటేశ్వర్లు మహదేవపూర్ సీఐగా, ఎస్బీ సీఐగా విధులు నిర్వర్తిస్తున్న రవీందర్ సీసీఎస్కు బదిలీ చేశారు.గణపురం సీఐగా కరుణాకర్రావుగణపురం: జిల్లాలో నూతనంగా ఏర్పడిన గణపురం సర్కిల్ ఇన్స్పెక్టర్గా సీహెచ్ కరుణాకర్రావును నియమిస్తూ ఐజీ మల్టీజోన్–1 చంద్రశేఖర్రెడ్డి శనివా రం ఉత్తర్వులు జారీ చేశారు. గణపురం, రేగొండ, కొత్తపల్లిగోరి మండలాలతో ఇటీవల సర్కిల్ను ఏర్పాటుచేశారు. ఆదిలాబాద్ టూటౌన్ సీఐగా విధులు నిర్వహిస్తున్న కరుణాకర్రావును గణపురం సీఐగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. రెండు రోజుల్లో ఆయన విధుల్లో చేరనున్నట్లు సమాచారం.సింగరేణి అధికారులతో ఎమ్మెల్యే సమీక్షభూపాలపల్లి అర్బన్: ఏరియాలో సింగరేణి కార్మికుల సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శనివారం ఏరియా జీఎం రాజేశ్వర్రెడ్డి, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరేణి ఏరియా ఆస్పత్రి పనితీరు, వైద్యుల సేవలు, అవసరమైన వైద్య సిబ్బంది నియామకం, మెరుగైన వైద్య సదుపాయాల కల్పనపై చర్చించారు. కార్మికుల సమస్యలు, గృహ వసతి, భద్రతా చర్యలు, సింగరేణి పార్క్, సింగరేణి కార్మికుల కాలనీల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు అంశాలపై అధికారులతో సమగ్రంగా చర్చించారు. కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సింగరేణి యాజమాన్యానికి ఆదేశించారు. ఈ సమావేశంలో వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.మొగిలికి సిరిమంజరి రత్న అవార్డుభూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు దుప్పటి మొగిలికి సిరిమంజరి రత్న అవార్డును అందజేశారు. జాతీయ తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు కళారత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్లో శనివారం కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దుప్పటి మొగిలికి ‘సిరిమంజరి రత్న’ బిరుదుతో ఘనంగా సత్కరించారు. నూతన కవితా ప్రక్రియ అయిన సిరిమంజరిలో దుప్పటి మొగిలి రచించిన అర్ధ శతకంకు బిరుదు ప్రదానం చేసినట్లు ఆ సంస్థ సీఈఓ ఎంవీ రత్నం ఒక ప్రకటనలో పేర్కొన్నాను.పేకాట స్థావరంపై దాడికాళేశ్వరం: మహదేవపూర్ మండలం బొమ్మాపూర్ అటవీ ప్రాంతంలో పేకాట స్థావరంపై పోలీసులు శనివారం దాడిచేశారు. ఎస్సై పవన్కుమార్ కథనం ప్రకారం.. బొమ్మాపూర్ అటవీ ప్రాంతంలో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారని పోలీసులకు సమాచారం వచ్చింది. పోలీసులు దాడిచేసి ఐదుగురిని పట్టుకున్నారు. రూ.20,020 నగదు, 7 బైక్లు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
మరో ఏడు నెలలే..!
దేవాదుల ప్రాజెక్టు పూర్తికి సర్కారు డెడ్లైన్సాక్షిప్రతినిధి, వరంగల్: జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తికి సర్కారు గడువు దగ్గర పడుతోంది. 2004లో ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం కొబ్బరికాయ కొడితే.. సుమారు 21 ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం 2023లో అధికారంలోకి వచ్చాక మొదట 2025 డిసెంబర్ నాటికి దేవాదుల సహా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మూడు పర్యాయాలు ‘దేవాదుల’పై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది మార్చి, మేలో ములుగు జిల్లా కన్నాయిగూడెం, హనుమకొండ జిల్లా దేవన్నపేట వద్ద కూడా సమీక్షించారు. ఈ సందర్భంగా 2026 మార్చి నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు మరో ఏడు నెలలే గడువు ఉండడంతో మంత్రులు తరచూ పర్యటించి సమీక్షలు నిర్వహిస్తుండడం చర్చనీయాంశం అవుతోంది. 9 జిల్లాలకు ప్రయోజనం.. ఏడాదిలో 300 రోజులు 60 టీఎంసీల నీటిని వినియోగించుకుని 9 జిల్లాల్లో 5.57 లక్షల ఎకరాలకు నీరందించే ప్రాజెక్టు పూర్తి కావడానికి మరో 9 శాతం పనులు మిగిలి ఉన్నాయి. హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ములుగు జిల్లాలతోపాటు కరీంనగర్, సిద్దిపేట, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లోని 37 మండలాలకు చెందిన 5,56,722 ఎకరాలకు నీరందించడం ఈ పథకం లక్ష్యం. ఇప్పటి వరకు 3,16,634 ఎకరాల ఆయకట్టు సాగులోకి రాగా.. మరో 2,40,088 ఎకరాల ఆయకట్టుకు నీరందాల్సి ఉంది. అదనంగా మరో 89 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అయితే, మూడో దశలో నిలిచిపోయిన భూసేకరణ కారణంగా ఈ ప్రాజెక్టు 21 ఏళ్లయినా అసంపూర్తిగానే ఉంది. రైతులు ఎక్కువ పరిహారాన్ని డిమాండ్ చేయడం, కోర్టు కేసులు వంటివి భూసేకరణకు అడ్డంకిగా మారాయి. ఈ నేపథ్యంలో 2024 ఆగస్టు 31న కన్నాయిగూడెం బ్యారేజీ వద్ద జిల్లా మంత్రులు, కలెక్టర్లు, ఇరిగేషన్ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి.. ఆర్థిక ఇబ్బందులున్నా అధిగమించి 2026 మార్చిలోగా ఈ పథకాన్ని పూర్తి చేస్తామని ప్రకటించారు. భూసేకరణే అసలు సమస్య.. జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తికి మూడో దశలో పెండింగ్లో ఉన్న భూసేకరణే ఇప్పుడు అసలు సమస్యగా మారింది. ఈ ప్రాజెక్టు ప్రారంభంలో మొత్తం 33,224 ఎకరాల భూసేకరణ అవసరం కాగా, దశలవారీగా 30,268 ఎకరాలు చేశారు. జనగామ, పాలకుర్తి, గజ్వేల్, నర్సంపేట, వర్ధన్నపేట నియోజకవర్గాల పరిధిలో సుమారు 2,956 ఎకరాల వరకు భూ సేకరణ చిక్కుముడిగా మారింది. రోజురోజుకూ భూముల ధరల పెరుగుతున్న నేపథ్యంలో రైతులు భూములు ఇవ్వడానికి అంగీకరించకపోవడం, భూములు ఇచ్చిన కొందరు ధర గిట్టుబాటు కాలేదని కోర్టుకు వెళ్లడం లాంటి కారణాలతో ఏళ్లుగా పెండింగ్ పడుతూ వస్తోంది. 2004లో రూ.6,016 కోట్లున్న అంచనా వ్యయం 2020 జూన్ నాటికే రూ.14,729.98 కోట్లకు పెరిగింది. 2024 ఆగస్టు నాటికి రూ.17,500 కోట్లు దాటిందని అంచనా వేశారు. మొత్తంగా ఈ ప్రాజెక్టు 91 శాతం పూర్తయి, సగానికి పైగా ఆయకట్టుకు నీరందిస్తున్నా.. 9 శాతం పెండింగ్ పనులతో అసంపూర్తి ప్రాజెక్టుల ఖాతాలో చేరింది. మంత్రుల పర్యటనకు ఏర్పాట్లు..డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, వాకిటి శ్రీహరి, ధనసరి అనసూయ సీతక్క, ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు ఆదివారం ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. సమాచార పౌరసంబంధాలశాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. మధ్యాహ్నం 3:45 గంటలకు ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం హెలిపాడ్కు మంత్రులు చేరుకుంటారు. 3:50 గంటలకు సమ్మక్క–సాగర్ బ్యారేజీ, దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించిన పంపింగ్ స్టేషన్ను వారు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అనంతరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై ఇంజనీర్లతో మంత్రులు సమీక్ష నిర్వహిస్తారు. 6 గంటలకు హెలికాప్టర్లోనే హైదరాబాద్కు బయలుదేరుతారు. డిప్యూటీ సీఎం, మంత్రుల పర్యటన సందర్భంగా అధికారులు, పోలీసులు భారీగా ఏర్పాట్లు చేశారు. 2026 మార్చి నాటికి పూర్తయ్యేనా.. భూసేకరణకు అడ్డంకులు ఇప్పటికే నాలుగు పర్యాయాలు ప్రాజెక్టుపై సమీక్ష 9 శాతం పెండింగ్తో అసంపూర్తి... రూ.17,500 కోట్లకు అంచనా... నేడు డిప్యూటీ సీఎం, ఉత్తమ్ సహా ఐదుగురు మంత్రుల రాక సమ్మక్క బ్యారేజీ పరిశీలన.. అనంతరం అధికారులతో సమీక్ష -
అర్ధరాత్రి నడిరోడ్డుపై క్షుద్ర పూజలు!
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: మహదేవపూర్ మండలం కాళేశ్వరం ఆర్చిగేట్ దగ్గర ఆదిముక్తీశ్వర స్వామి ఆలయానికి వెళ్లే రోడ్డుపై అర్ధరాత్రి క్షుద్ర పూజలు చేశారు. శుక్రవారం తెల్లవారు జామున నల్లకోడి, గుమ్మడికాయ, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, మద్యం ఆనవాళ్లు శ్రామికులకు కనిపించాయి. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే.. మూఢనమ్మకాలు, క్షుద్రపూజలపై ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. అయినప్పటికీ.. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి మూఢనమ్మకాలు కొనసాగుతూనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. -
సీమాంధ్ర అధికారుల ఆధిపత్యం
భూపాలపల్లి రూరల్: సింగరేణి కంపెనీలో సీమాంధ్ర అధికారుల ఆధిపత్యం నడుస్తుందని.. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో సింగరేణి కార్మికులకు తీరని అన్యాయం జరుగుతుందని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య అన్నారు. శుక్రవారం పట్టణంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో గట్టయ్య మాట్లాడారు. కార్మికులకు అన్యాయం జరుగుతున్నా గుర్తింపు, ప్రాతినిథ్య సంఘాల నాయకులు నోరుమెదపడం లేదన్నారు. సంఘాలు కార్మికుల హక్కులను కాపాడాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దాసరి జనార్దన్, నామాల శ్రీనివాస్, కాసర్ల ప్రసాద్రెడ్డి, రాళ్లబండి బాబు, నరసింహారెడ్డి పాల్గొన్నారు. -
ఘనంగా వరలక్ష్మి వ్రత పూజలు
45 ఏళ్లుగా రాఖీ కడుతున్న చెల్లెలు● వృద్ధాప్యంలోనూ ప్రేమానుబంధాన్ని చాటుతున్న అక్కాచెల్లెళ్లు ● ఎక్కడున్నా.. రాఖీ పౌర్ణమికి సోదరుల ఎదురుచూపులుదరఖాస్తుల స్వీకరణ భూపాలపల్లి అర్బన్: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీ, మోడల్ స్కూల్స్కు చెందిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ప్రిన్సి పాల్, స్పెషల్ ఆఫీసర్ల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. మండలాల పరిధిలోని ఎంఈఓ కార్యాలయాల్లో దరఖాస్తులను ఈ నెల 23వ తేదీలోపు అందించాలని సూచించారు. ఓసీ–2ను అడ్డుకుంటాం.. భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని కేటీకే ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్–2లో వ్యవసాయ భూములు కోల్పోయిన ఫక్కీర్గడ్డ, ఆకుదారివాడలకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కల్పించాలని భూనిర్వాసితులు బుర్ర మనోజ్, రమేష్, రాజయ్య, రవి కోరారు. పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎనిమిదేళ్ల నుంచి పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. భూ నిర్వాసితులపై చిన్న చూపు చూస్తున్న సింగరేణి యాజమాన్యం నష్టపరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కల్పిస్తామని మాయమాటలతో మభ్యపెడుతుందన్నారు. సింగరేణి సీఎండీ స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో ఈనెల 20 తర్వాత ఓసీ పనులు అడ్డుకుంటామన్నారు. డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడిగా దేవేందర్ భూపాలపల్లి రూరల్: డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడిగా గుడికందుల దేవేందర్, కార్యదర్శిగా భూక్య నవీన్ను ఎన్నుకున్నట్లు ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేష్ తెలిపారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని శ్రామికభవన్లో ఏర్పాటుచేసిన సమావేశంలో వెంకటేష్ మాట్లాడారు. డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లాలో విస్తృత పోరాటాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. భగత్సింగ్, చేగువేరా ఆశయస్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలన్నారు. క్షుద్రపూజల కలకలం కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం ఆర్చిగేట్ దగ్గర ఆదిముక్తీశ్వర స్వామి ఆ లయానికి వెళ్లే రోడ్డుపై క్షుద్ర పూజలు చేశారు. శుక్రవారం తెల్లవారు జామున నల్లకోడి, గుమ్మడికాయ, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, మద్యం ఆనవాళ్లు కనిపించాయి. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. మరోసారి పూజారుల సమావేశం ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ జాతరలో అభివృద్ధి పనులపై దేవాదాయశాఖ అధికారులు, పూజారులు శుక్రవారం మేడారంలో మరోసారి సమావేశమయ్యారు. ఈఓ వీరస్వామి, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, సమ్మక్క– సారలమ్మ, గోవిందరాజు పూజారులు సమావేశమయ్యారు. అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో చేపట్టనున్న అభివృద్ధి పనులపై చర్చించారు. గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను వరుస క్రమంలో ఏర్పాటు చేసే విషయంపై పూజారుల అభిప్రాయాలను దేవాదాయశాఖ అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంపై పూజారులు కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. బచ్చన్నపేట: మండల కేంద్రానికి చెందిన కొత్తపల్లి రాజయ్య, కాశీపతి, మురళి, ఊర్మిల అన్నాచెల్లెలు. ముగ్గురు అన్నలకు చిన్నారి చెల్లె ఊర్మిల. ఈమె వివాహం 1980లో జగదేవపూర్కు చెందిన వ్యక్తితో జరిపించారు. వారు అప్పటి నుంచి వ్యాపార నిమిత్తం సిద్దిపేటలో ఉంటున్నారు. 45 సంవత్సరాలుగా ఊర్మిల బచ్చన్నపేటకు వచ్చి అన్నలు కొత్తపల్లి రాజయ్య, కాశీపతి, మురళికి తప్పకుండా రాఖీ కడుతోంది. అన్నలు ఇచ్చే కట్న కానుకలను సంతోషంగా స్వీకరిస్తుంది. ప్రతీ సంవత్సరం ముగ్గురు అన్నలు చెల్లె ఊర్మిల వచ్చే వరకు ఎదురు చూస్తుంటారు. నేడు రక్షా బంధన్అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్ల మధ్య అనుబంధాన్ని పంచి పెంచే పండుగ రక్షాబంధన్. శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి రోజున కులమతాలకతీతంగా ఈ వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. రాఖీ అంటే దారం కాదు.. అది ఒక రక్షణ కవచం, బంధాలను గుర్తుచేసే సందర్భం. సోదరుడి మణికట్టుకు సోదరి కట్టే రాఖీ అనురాగాలు, ఆప్యాయతకు ప్రతీకగా నిలుస్తోంది. వృద్ధాప్యం మీద పడినా.. ఏ పరిస్థితుల్లో ఉన్నా తన తమ్ముడికి, అన్నకు రాఖీ కట్టే అక్కలు, చెల్లెళ్లు ఎందరో ఉన్నారు. ప్రేమను పంచుతున్న అలాంటివారిపై నేడు రాఖీ పౌర్ణమి (రక్షా బంధన్) సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. బంధాలకు విలువనివ్వాలి.. మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ పట్టణానికి చెందిన 82 ఏళ్ల వయసుగల తాటిపాముల నరసింహమూర్తికి 65 ఏళ్ల చెల్లెలు గుడి విజయలక్ష్మి ప్రతి ఏడాది రాఖీ కడుతుంది. ఆత్మీయత, అనురాగాలకు ప్రతీకగా రాఖీ పండుగ ఉంటుందని అన్నాచెల్లెళ్లు పేర్కొంటున్నారు. ప్రతిఒక్కరూ బంధాలు, బంధుత్వాలకు విలువ ఇవ్వాలని వారు కోరారు. రాఖీ పండుగ వచ్చిందంటే చాలు అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే ఆ సంతోషం ఎన్నటికీ మరిచిపోలేనిదని వారు తెలిపారు.అన్న జ్ఞాపకంగా.. నల్లబెల్లి: నాకు ఇప్పుడు 72 ఏళ్లు. నా చిన్నతనం నుంచి అన్న, తమ్ముడికి రాకిట్లు కట్టేదాన్ని. అన్న మల్లయ్య 28 ఏళ్ల క్రితం అనారోగ్యంతో సచ్చిపోయిండు. ఇప్పడు తమ్ముడు కృష్ణయ్యతో పాటు అన్న కొడుకు శ్రీనివాస్కు రాఖీ కడతన్న. ఈ పండుగ ఎంతో సంబరంగా అనిపిస్తుంది. తోడబుట్టినోళ్లం ఒకదగ్గర కలుసుకుని సంతోషంగా గడుపుతాం. ఎక్కడున్నా రాఖీ కట్టడానికి పుట్టింటికి వెళ్త. – నాగపురి లక్ష్మి, నల్లబెల్లిఅక్కలంటే అమితమైన ప్రేమ..జనగామ: జనగామలోని వీవర్స్ కాలనీకి చెందిన కాముని ఉపేంద్ర, వైట్ల కళమ్మ, చింతకింది సక్కుబాయి, చెన్నూరి రేణుక అక్కాచెల్లెళ్లు. వారి సోదరుడు గజ్జెల వెంకటేశ్కు ఆరు దశాబ్దాలుగా రాఖీ కడుతూ రాఖీ బంధాన్ని గుర్తుచేస్తున్నారు. మూడు రోజుల ముందుగానే రాఖీలు కొని, ఒక్కరోజు ముందుగా వెళ్తారు. తమ్ముడికి రాఖీ కడతారు.కష్టసుఖాల్లో పాలుపంచుకుంటాం..వెంకటాపురం(ఎం): మేం నలుగురం అక్కాచెల్లెళ్లం. రాఖీ పండుగ వచ్చిందంటే చాలు ఏ టా హనుమకొండకు వెళ్లి తమ్ముడు రాజ మౌళికి రాఖీ కడతాం. ఇప్పటికీ మా బంధం ఇలా నే కొనసాగుతోంది. మా కష్టసుఖాల్లో తమ్ము డు, తమ్ముడి కష్టసుఖాల్లో మేం పాలుపంచుకుంటాం. – నిర్మల, రాజమౌళి అక్కవీరు కూడా ఆచారం పాటిస్తున్నారు..హసన్పర్తి: ఇక్కడ ముస్లింలు కూడా రాఖీ వేడుకలను నిర్వహిస్తున్నారు. 30 ఏళ్లుగా ఓ ముస్లిం కుటుంబంలో ఈ ఆచారం కొనసాగుతోంది. హసన్పర్తికి చెందిన మహ్మద్ ఖాజానయీమొద్దీన్ సోదరి అమీనాషాహిన్ స్వస్థలం హనుమకొండ. రాఖీ పండుగను పురస్కరించుకుని ఏటా ఆమె ఎక్కడున్నా హసన్పర్తికి వచ్చి అన్నకు రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకుంటుంది. రాఖీ తోబుట్టువుల బంధాన్ని బలోపేతం చేస్తుందని అమీనాషాషిన్ అంటున్నారు.45 ఏళ్లుగా.. క్రమం తప్పకుండా..రేగొండ: 45 ఏళ్లుగా ఓ అక్క తన తమ్ముడికి క్రమం తప్పకుండా రాఖీ కడుతూనే ఉంది. కొత్తపల్లిగోరి మండల కేంద్రానికి చెందిన వన్నాల లింగయ్య, రాంబాయిలు అక్కాతమ్ముళ్లు. రాంబాయిని అదే మండలంలోని కొనరావుపేట గ్రామానికి ఇచ్చి వివాహం చేశారు. రాంబాయి ఏటా రాఖీ కడుతూ అక్కాతమ్ముళ్ల బంధాన్ని చాటుకుంటోంది. ఏ పరిస్థితుల్లో ఉన్నా తమ్ముడికి రాఖీ కట్టడం ఎంతో సంతోషాన్నిస్తుందని రాంబాయి తెలుపుతోంది. న్యూస్రీల్ -
‘స్వాతంత్య్ర’ వేడుకలకు ఏర్పాట్లు
కలెక్టర్ రాహుల్ శర్మభూపాలపల్లి: స్వాతంత్య్ర వేడుకల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. 79వ స్వాతంత్య్ర వేడుకల నిర్వహణపై అన్ని శాఖల అధికారులతో శుక్రవారం టెలీ కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వేడుకలకు వచ్చే అతిథులు కూర్చోవడానికి వీలుగా షామియానాలు, కుర్చీలు, బారికేడింగ్, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై స్టాల్స్ ఏర్పాటు, తాగునీటి సౌకర్యం, పాఠశాలల విద్యార్థులతో దేశ భక్తికి సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. శాఖల వారీగా స్టాల్స్ ఏర్పాటు చేసేందుకు డీఆర్డీఓకు ఈ నెల 11వ తేదీ వరకు జాబితా ఇవ్వాలని సూచించారు. కార్యక్రమం నిర్వహణలో ఇబ్బందులు రాకుండా మినిట్ టు మినిట్ షెడ్యూల్ తయారు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మువ్వన్నెల జెండా ఎగరేయాలి రేగొండ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతీ ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగరేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిషిధర్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలో హర్ ఘర్ తిరంగా యాత్రపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధానమంత్రి మోదీ ప్రారంభించిన హర్ ఘర్ తిరంగా ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రజల్లో దేశభక్తిని చాటుతుందన్నారు. ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదన్నారు. ఈ కార్యక్రమంతో జాతీయ ఐక్యతను బలోపేతం చేయడమే లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు గాలిఫ్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు పెండ్యాల రాజు, మండల ప్రధాన కార్యదర్శులు తూర్పాటి మల్లేష్, దయ్యాల కిరణ్, నాయకులు రమేష్, రత్నాకర్, శివరాజ్. సంతోష్ పాల్గొన్నారు. -
గంగపుత్ర.. అభయ మిత్ర
వీరే గజ ఈతగాళ్లు.. గోదావరిలో ప్రమాదం జరిగితే తాహతుకు మించి ధైర్యసాహసాలు చేసి మరీ కాపాడుతారు. ఇప్పటికీ ఎంతోమందికి ప్రాణదాతలయ్యారు. వినాయక నిమజ్జనం సమయంలో వినాయక విగ్రహాలను అంతర్రాష్ట్ర వంతెన వద్ద నుంచి గోదావరిలోకి వదిలేందుకు వీరే ప్రముఖపాత్ర వహిస్తారు. రాత్రిపగలు విధులు నిర్వర్తిస్తారు. గోదావరి, సరస్వతి, ప్రాణహిత పుష్కరాలు, మహాశివరాత్రితో పాటు పలు ఉత్సవాలు జరిగిన సమయాల్లో గజ ఈతగాళ్లు విధులు నిర్వహిస్తారు. కాటారం సబ్డివిజన్లో ఎవరైనా నీటిలో మునిగి మృతిచెందినా వీరి సహాయంతో మృతదేహాలు బయటికి తీస్తారు. వీరు ఇప్పటికీ వందల మృతదేహాలు తీసి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. వీరిలో కొంత మంది స్విమ్మింగ్లో శిక్షణ తీసుకుని లైసెస్స్ పొంది ఉన్నారు. కాళేశ్వరం: గంగపుత్రులకు ధైర్యసాహాసాలు, సాయం అందించే గుణం ఎక్కువ. కాళేశ్వరంలో గోదావరిని నమ్ముకొని పూర్వం నుంచి జీవనోపాధిని పొందుతున్నారు. గ్రామంలోని హిందూ ముస్లింల ఉత్సవాల్లో వారు లేనిదే పల్లకీ కదలదు. గోదావరిమాత సాక్షిగా ప్రమాదవశాత్తు లేదా మృతిచెందిన వారిని కాపాడటంలో ఈ గజ ఈతగాళ్లు సమర్థులు. ఓటు బ్యాంకుతో కాళేశ్వరం సర్పంచ్ను డిసైడ్ చేసే సత్తా వారిది. అన్నింటికీ తాము సైతం అంటూ అభయహస్తం ఇస్తున్న వారిపై ప్రత్యేక కథనం. పూర్వం నుంచి.. మహదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామంలో పూర్వం నుంచి గంగపుత్రులు చేపల వేట, నాటు పడవలను కాళేశ్వరం టు నగరం(సిరొంచ) ఒడ్డుకు ప్రజలను చేరవేస్తూ జీవనం సాగించేవారు. 2016 డిసెంబర్లో కాళేశ్వరం–సిరొంచ పరిధిలో చింతలపల్లి వద్ద అంతర్రాష్ట్ర వంతెన నిర్మాణంతో వారి జీవనోపాధికి ఆటంకం కలిగింది. దీంతో టూరిజంశాఖ ద్వారా స్పీడ్ బోట్లు కొనుగోలు చేసి కాళేశ్వరం వచ్చే టూరిస్టులు, భక్తులను జలవిహారం చేస్తూ జీవనం గడుపుతున్నారు. 65 గంగపుత్రుల కుటుంబాలు బోటులపై జీవిస్తున్నాయి. మొత్తం 400మంది సీ్త్రలు పురుషులు, చిన్నారుల వరకు ఉంటారు. స్థానిక సంస్థల్లో సర్పంచ్గా గెలువాలంటే వీరి ఆశీర్వాదం కావాల్సిందే. వారి చుట్టూరా రాజకీయం కూడా తిరుగుతుంది. వారు డిసైడ్ అయితే వారే సర్పంచ్గా గెలిచిన సందర్భాలు ఉన్నాయి.హిందూ, ముస్లింల ఉత్సవాల్లో సేవలు గోదావరిలో పడిపోతే.. కాపాడే ప్రాణదాతలు మృతదేహాలు వెలికితీసే సమర్థులు -
రైతులు ఇబ్బందులు పడొద్దు
గణపురం: ఎరువుల సరఫరాలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. గురువారం గణపురం మండలం చెల్పూరులో ఎరువుల విక్రయ కేంద్రం, పీహెచ్సీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎరువులు సరిపడా ఉన్నాయని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పట్టాలు లేని రైతులకు ఆదార్ కార్డు నమోదు చేస్తే ఎరువులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు అవసరమైన మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రాంతాలను గుర్తించి మెడికల్ క్యాంపులు నిర్వహించాలని.. ఇంటింటికీ సర్వే నిర్వహించి వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణ స్వామి, మండల వ్యవసాయ అధికారి అయిలయ్య పాల్గొన్నారు. ఐటీఐ ప్రవేశాలను సద్వినియోగం చేసుకోవాలి భూపాలపల్లి అర్బన్: ఐటీఐ ప్రవేశాలకు మూడో విడత దరఖాస్తులు స్వీకరిస్తున్నామని.. ఈ నెల 28వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ రాహుల్శర్మ సూచించారు. గురువారం కలెక్టరేట్లో ఐటీఐ ప్రవేశాల ప్రచార వాల్పోస్టర్ ఆవిష్కరించారు. వివరాలకు 85004 56034 ఫోన్ నంబర్ను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ జుమ్లానాయక్, ఉపాధి కల్పన అధికారి శ్యామల పాల్గొన్నారు. ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం జాతీయ చేనేత దినోత్సవాన్ని గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కలెక్టర్ రాహుల్శర్మ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మగ్గాలపై బట్టలు నేసే కార్మికులు చాలామంది ఉన్నారని, మహదేవపూర్ మండలంలో దసలి పట్టుతో నేసే బట్టలు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారన్నారు. చేనేత రంగంలో విశిష్ట కృషిచేసిన చేనేత కార్మికులను ఈ సందర్భంగా కలెక్టర్ శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు భీమనాధుని సత్యనారాయణ, చేనేత సహకార సంఘం సొసైటీ చైర్మన్ పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
వసతి గృహాలపై నిర్లక్ష్యం వద్దు
భూపాలపల్లి రూరల్: వసతి గృహాల్లో సమస్యలు లేకుండా చూడాలని, నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నా రు. గురువారం భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), హాస్టల్స్, వసతి గృహాల నిర్వహణ, విద్యార్థుల భోజన సౌకర్యాలు, సమస్యల పరిష్కారంపై అధికారులతో సమీక్ష సమావేశం ని ర్వహించారు. విద్యార్థులకు విద్యతో పాటు, హాస్టల్ సదుపాయాలు, ఆహారం, ఆరోగ్య పరిరక్షణను సమర్థంగా అందించడం తమ బాధ్యత అని గుర్తు చేశారు. విద్యార్థుల పట్ల శ్రద్ధ వహించాలని, వారి ఆ రోగ్యం, భద్రత విషయంలో నిర్లక్ష్యం సహించబో మని స్పష్టం చేశారు. అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, సంబంధిత శాఖల అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, హాస్టల్ వార్డెన్లు పాల్గొన్నారు.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
స్వచ్ఛమైన తాగునీరు అందేలా చర్యలు
కాటారం: ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడానికి తగిన చర్యలు తీసుకుంటామని కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. కాటారం మండలం రేగులగూడెంలో గ్రామపంచాయతీలో నల్లాల ద్వారా కలుషిత నీరు సరఫరా అవుతుందని మహిళలు ఖా ళీ బిందెలతో నిరసన తెలిపిన విషయం విదితమే. కలెక్టర్ ఆదేశాల మేరకు సబ్ కలెక్టర్, అదనపు కలెక్టర్ రేగులగూడెం చేరుకొని గ్రామపంచాయతీ సమీపంలోని కాలనీ మహిళలతో మాట్లాడారు. తా గునీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షించి సమస్య పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అధికారుల వెంట ఎంపీడీఓ బాబు, ఎంపీఓ వీరస్వామి ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రాజశేఖర్, పంచాయతీ కార్యదర్శి క్రిష్ణవేణి ఉన్నారు.సబ్ కలెక్టర్ మయాంక్సింగ్ -
యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించాలి
భూపాలపల్లి అర్బన్: నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ డిమాండ్ చేశారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) జిల్లా కమిటీ సమావేశంలో వెంకటేష్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏ ఒక్క నోటిఫికేషన్ వేయలేదన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్లను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వేయాలన్నారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నవీన్, శ్రీకాంత్, దేవేందర్, సుజాత, కవిత, స్వర్ణ, స్వాతి పాల్గొన్నారు. -
నేడు కాళేశ్వరాలయంలో వరలక్ష్మీవ్రతాలు
కాళేశ్వరం: శ్రావణమాసం సందర్భంగా కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో వరలక్ష్మి వ్రతం శుక్రవారం సందర్భంగా (నేడు)సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్నట్లు ఈఓ ఎస్.మహేష్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు పూజకు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన తెలిపారు. మిరప నర్సరీలు తనిఖీ చిట్యాల: మండలంలోని జూకల్, చల్లగరిగ గ్రామ శివారులలో నర్సరీలను జిల్లా ఉద్యానశాఖ అధికారి ఎడ్ల సునీల్ కుమార్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ సంవత్సరంలో 10 మిరప నర్సరీలకు లైసెన్స్లు రెన్యువల్ చేసినట్లు తెలిపారు. లైసెన్స్దారులు నర్సరీ చట్టం ప్రకారం విధిగా నిబంధనలు పాటించాలని కోరారు. నర్సరీ నిర్వహణలో రిజిస్టర్లు తప్పనిసరిగా అప్డేట్ చేయాలని పేర్కొన్నారు. నర్సరీ చట్టం ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
హక్కులను తెలుసుకోవాలి
భూపాలపల్లి అర్బన్: గిరిజన హక్కులను తెలుసుకొని వాటిని సద్వినియోగం చేసుకోవాలని న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి నాగరాజు తెలిపారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో గురువారం సమావేశం నిర్వహించా రు. గిరిజన హక్కుల పరిరక్షణ, హక్కుల విని యోగం అనే అంశంపై జడ్జి మాట్లాడారు. విద్యార్థులు హేతుబద్ధమైన ప్రశ్నలు వేయడం అలవాటు చేసుకోవాలన్నారు. ప్రశ్నించడం మర్చిపోయిన వ్యక్తి తన ఉనికిని కోల్పోతాడని చెప్పాడు. విద్యార్థులు పోషక ఆహారాన్ని భుజించాలని, ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువుకోవడం సాధ్యమవుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్ఆర్ దిలీప్కుమార్నాయక్, జీపీ బొట్ల సుధాకర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసచారి, ప్రధాన కార్యదర్శి శ్రావణ్రావు, పాఠశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ సమ్మయ్యనాయక్, న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించడంలో విఫలం
భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో గుర్తింపు సంఘం విఫలమైందని ఐఎన్టీయూసీ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు జోగు బుచ్చయ్య ఆరోపించారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం ఏరియాలోని అన్ని గనుల మేనేజర్లకు వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు కేటీకే 5వ గనిలో జరిగిన నిరసన కార్యక్రమానికి జోగు బుచ్చయ్య హాజరై మాట్లాడారు. జూలై 31న జరిగిన మెడికల్ బోర్డులో కార్మిక లోకానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. అండర్ గ్రౌండ్లో అన్ఫిట్ అయిన మైనింగ్ స్టాఫ్, ట్రేడ్మెన్, ఈిపీ ఆపరేటర్లకు సర్ఫెస్లో సూటబుల్ జాబ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల పరిష్కారానికి 14వ తేదీన ఏరియా జీఎం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గట్టు రాజు, సంపత్ రావు, రాజేష్ ఠాకూర్, రవి, కిరణ్, అశోక్, అజీమ్, శ్రీనివాస్, నవీన్, కుమార్, రాము, సమ్మయ్య పాల్గొన్నారు. -
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
భూపాలపల్లి అర్బన్: మధ్యాహ్న భోజన వర్కర్స్ పెండింగ్ బిల్లుల చెల్లింపుతో పాటు వారి సమస్యలు పరిష్కరించాలని మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) అనుబంధం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొరిమి సుగుణ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ధర్నా చేపట్టి, వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు. ఈసందర్భంగా సుగుణ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఉన్న పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం గౌరవ వేతనం రూ.10వేలు ఇవ్వాలని, కేంద్రం కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్మికులు స్వర్ణలత, సంపూర్ణ, లావణ్య, లక్ష్మి, సుగుణ, పద్మ, మణెమ్మ, కమల, భారతి పాల్గొన్నారు. -
పింఛన్ జారీ ఇక ఈజీ
భూపాలపల్లి రూరల్: ఆసరా పింఛన్లను ఇక నుంచి ఫేస్ రికగ్నైజేషన్ (ముఖ గుర్తింపు) విధానంలో అందజేయనున్నారు. ఇప్పటి వరకు వేలి ముద్రల (బయోమెట్రిక్) ఆధారంగా పింఛన్లు ఇస్తున్నారు. ఈక్రమంలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈనేపథ్యంలో.. ప్రభుత్వం ఆయా సమస్యలన్నింటినీ పరిష్కరిస్తూ, సులభంగా పింఛన్ అందజేసేలా రికగ్నైజేషన్ యాప్ ద్వారా ఫొటోలు తీసి, అప్లోడ్ చేసి పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం గత నెలలో పోస్టాఫీస్, బీపీఎంలకు ఫేస్ రికగ్నైజేషన్ యాప్తో కూడిన సెల్ఫోన్లు అందజేశారు. ఈనెల నుంచే ఫేస్ రికగ్నైజేషన్ విధానం ద్వారా పింఛన్లు అందజేయాలని నిర్ణయించారు. వేలిముద్రతో ఇబ్బందులు.. ఇదివరకు పింఛన్ పొందాలంటే కచ్చితంగా పోస్టాఫీసులకు వెళ్లి ఆయా అధికారుల వద్ద బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది. అయితే వృద్ధులకు వేళ్లపై ముద్రలు చెరిగిపోయి స్కాన్ కాకపోవడంతో వారు పింఛన్ తీసుకునేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.. మరోవైపు ఐరిష్లో కూడా ఒక్కోసారి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అలాంటి వారు మండల, వార్డు అధికారులు ప్రత్యేకంగా రాసిచ్చిన పత్రం ద్వారా పింఛన్లు పొండుతున్నారు. వృద్ధుల్లో కొందరు రోగాల బారిన పడి ఇంటికే పరిమితమైన సమయంలో పింఛన్లు పొందలేకపోతున్నారు. సులభంగా అందేలా.. బయోమెట్రిక్ విధానంలో పింఛన్లు ఇవ్వడంలో తలెత్తుతున్న సమస్యలకు చెక్ పెట్టేలా ప్రభుత్వం ఫేస్ రికగ్నైజేషన్ యాప్ను తీసుకొచ్చింది. ప్రభుత్వం అందజేసే సెల్ఫోన్లో బీపీఎంలు.. పింఛన్దారుల పేర్లు, వివరాలను అప్లోడ్ చేస్తారు. యాప్ ద్వారా ఫొటో తీసిన వెంటనే పింఛన్దారుడి వివరాలు వస్తాయి. వారికి పింఛన్ చెల్లించినట్లు నమోదు చేసి, నగదు అందజేస్తారు. నడవలేని వారు, వివిధ రోగాలతో మంచాలకే పరిమితమైన వారికి చివరి రోజు ఇళ్లకు వెళ్లి ఫొటో తీసి పింఛన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ప్రతి లద్ధిదారుడికి సులభంగా పింఛన్ అందనుంది. బీపీఎంలకు శిక్షణ పింఛన్ల పంపిణీలో ఫేస్ రికగ్నైజేషన్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేప్తోంది. ఈనెలలో ఇచ్చే పింఛన్లకు కొత్త విధానాన్ని వర్తింపజేస్తున్నాం. జిల్లాల్లోని బ్రాంచ్ పోస్ట్మాస్టర్లకు (బీపీఎం) ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ఇన్స్టాల్ చేసిన మొబైల్స్ ఇచ్చారు. ఆ యాప్ను ఉపయోగించి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. – బాలకృష్ణ, డీఆర్డీఓ, భూపాలపల్లి జిల్లాలో ఇలా.. పింఛన్ రకం లబ్ధిదారులు వృద్ధాప్య 21,040 వితంతు 19,243 వికలాంగులు 5,600 కల్లుగీత 1,364 చేనేత 778 పైలేరియా 38 డయాలసిస్ 51 బీడీ కార్మికులు 38 ఒంటరి మహిళలు 1,075 మొత్తం లబ్ధిదారులు 49,227ముఖ గుర్తింపుతో పింఛన్ బయోమెట్రిక్ సమస్యకు చెక్ పెట్టేలా ఫేస్ రికగ్నైజేషన్ బీపీఎంలకు సెల్ ఫోన్లు అందజేసిన ప్రభుత్వం ఈనెల నుంచే కొత్త విధానంలో పింఛన్ల పంపిణీ జిల్లా వ్యాప్తంగా 49,227 మంది పింఛన్దారులు -
ప్రకృతితో అనుబంధం
ప్రతీది ప్రకృతితో అనుబంధంగానే మా జీవన విధానం ఉంటుంది. మా పంటలు, కుటుంబాలతోపాటు, ఆడపిల్లకు సరైన వరుడిని కూడా ప్రకృతి అనుమతితోనే పొందాలన్నదే తీజ్ ఉద్దేశం. చిన్నతనంలో పండుగ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్లం.. ఇప్పటికీ తీజ్ ఉత్సవాల్లో పాల్గొనడం అంటే భలే ఇష్టం. – భూక్య ఉమ, మహబూబాబాద్అంతా మేరామా యాడీ దయ మా కుల దేవతలు సేవాలాల్, మేరామా యాడీ(గౌరీ దేవి)కి పూజలు చేసి తీజ్ పండుగను ప్రారంభిస్తాం. అంతా అమ్మవారే చూసుకుంటారని నమ్మకం. అందుకోసం గోధుమలు తెచ్చి నిష్టతో తొమ్మిది రోజులు పూజలు చేస్తాం. యువతులు పాటలు పాడుతూ.. ఆటలు ఆడడం సరదాగా ఉంటుంది. – జాటోత్ ఝాన్సీలక్ష్మి, గార్ల -
గురువారం శ్రీ 7 శ్రీ ఆగస్టు శ్రీ 2025
– 8లోuసాక్షి, మహబూబాబాద్ : గిరిజన(లంబాడ) కన్నెపిల్లలు సంబురంగా జరుపుకునే పండుగ తీజ్. ఈ నెలలో పండుగను ప్రతీ గురువారం ఏదో ఒక తండాలో జరుపుకుంటారు. నేడు (గురువారం) ఉమ్మడిజిల్లాలోని పలు తండాలు తీజ్ పండుగకు ముస్తాబయ్యాయి. ప్రకృతి సిద్ధంగా శ్రావణంలో వర్షాలు కురవడంతో ఆకాశం నుంచి కిందికి వచ్చే ఎర్రని వర్ణం గల ఆరుద్ర పురుగులను కూడా తీజ్ అంటారు. ఆ అందమైన పురుగులు దేవుడు మనకోసం కిందికి పంపిస్తాడని, ఈ పురుగులు కనిపించినప్పుడు కన్నె పిల్లలు మనస్సులో కోరుకున్న కోరిక ఫలిస్తుందనేది గిరిజనుల నమ్మకం. మా తాండేరో జోత్ తీజ్ (తండాల్లో వెలుగు తీజ్) అంటూ పండుగకు సిద్ధమయ్యారు. ● తొమ్మిది రోజులపాటు నిష్టతో కన్నె పిల్లల పూజలు ● గిరిజన తండాల్లో తీజ్ సంబురాలు ● ఏడో రోజు ఢమోళీ కార్యక్రమం నిర్వహిస్తారు. ఢమోళీ చుర్మో(రొట్టెలు, బెల్లం కలిపిన ముద్ద)ను మేరామా భవానికి నేవైద్యం పెడతారు. ● ఎనిమిదో రోజు మట్టితో బంజారా ఆరాధ్య దైవాల ప్రతిరూపాలను తయారు చేస్తారు. అబ్బాయి(డోక్రా), అమ్మాయి(డోక్రీ)లుగా పేర్లు పెడతారు. వీటిని గిరిజన సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేస్తారు. ● తొమ్మిదో రోజున డప్పుచప్పుళ్లు, గిరిజన నృత్యాలతో అందరూ బుట్టల వద్దకు వెళ్తారు. తండా నాయక్ వచ్చి యువతులకు బుట్టలను ఇచ్చి ఆశీర్వాదం అందిస్తారు. ● లంబాడీల ఆరాధ్య దైవం తుల్జా భవానీ, సేవాబాయి, సీత్లాభవానీలకు పూజలు చేసి స్నానాలు ఆచరించి పవిత్రతతో పుట్టమట్టిని తెస్తారు. ● తీజ్ (గోధు మ మొలకలు) ఏపుగా పెరిగేందుకు ఆడపిల్లలు అడవికి వెళ్లి దుస్సేరు(ఫిలోణీర్ వేళ్లీ) తెస్తారు. ఈ తీగ లతో బుట్టలు అల్లుతారు. ● పెండ్లీడుకు వచ్చిన యువతి తనకు కావాల్సి న పెళ్లికొడుకు కోసం చేసే ఈ పండుగలో ముందుగా తల్లిదండ్రులు, తర్వాత పెద్దల ఆశీస్సులు తీసుకుంటారు. ముఖ్యంగా తండా పెద్ద నాయక్ అనుమతి పొందిన తర్వాత పండుగ తంతు మొదలుపెడతారు. సంప్రదాయ పాటలుచివరి రోజు :మొదటి రోజు :● లంబాడీ భాషలో బోరడీ ఝుష్కేరో అంటే రేగుముళ్లు గుచ్చడం. తీజ్ వేడుకల్లో భాగంగా నానబెట్టిన శనిగలకు యువతలు రేగుముళ్లు గుచ్చుతారు. బావ వరుస ఉన్న వారు కన్నెపిల్ల మనస్సు చెదిరేలా కదిలిస్తూ ఉంటారు. అప్పుడు రేగుముళ్లు శనిగలకు కాకుండా వారి చేతికి కూడా గుచ్చుకుంటాయి. దీనిని భరిస్తూ రేగుముళ్లు శనిగలకు గుచ్చడం ఈ తంతు ప్రత్యేకత. లాంబి లాంబియే లాంబడీ ఏకెరీయో... తోన కుణ బొరాయో తీజ్.. సేవాభాయ బొరాయో తీజ్.. (గునుగుపూల వలె ఎదుగుతవమ్మా.. నిను కొలిచే వారెవరమ్మా.. సేవాలాల్ మహరాజ్ అలికి కొలుస్తారమ్మా తీజ్..) అని పాడుతూ తొలిరోజు వేడుకలు జరుపుకుంటారు. తూ కతేతి ఆయోరే దుదియా తళవో.. మారో తీజేరో జోత్ లేయి చాలో.. డగేరేచాలో.. (ఎక్కడినుంచి వచ్చావో దుదియా చెరువు.. తొమ్మిది రోజులు పెంచుకున్న తీజ్ తండా వెలుగును తీసుకుని వెళ్తున్నావు) అంటూ పెళ్లికాని అమ్మాయిలు పాటలు పాడుతూ తీజ్ బుట్టలను చెరువులో నిమజ్జనం చేస్తారు. 9 -
స్టోన్ క్రషర్లపై ‘మైనింగ్’ కత్తి
అక్రమాలకు ఇక అడ్డుకట్ట.. ఉమ్మడి వరంగల్లో సుమారు 360కి పైగా కంకర క్రషర్లు, 100కు పైగా గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. ఒక్క హనుమకొండ జిల్లాలోనే 29 బ్లాక్, 33 కలర్ గ్రానైట్, 64 స్టోన్ మెటల్, క్వార్ట్జ్, గ్రావెల్ క్వారీలు రెండు కలిపి 128 ఉన్నాయి. ఇందులో సగం వరకు రాజకీయ నాయకులు, వారి అనుచరులవే ఉన్నాయి. అనుమతి లేకుండా రాతి క్వారీలు నిర్వహిస్తున్నా, అనుమతి తీసుకుని నిబంధనలు ఉల్లంఘించి ఫ్రాడ్ చేసినా రెండేళ్ల జైలు శిక్షతోపాటు రూ.5 లక్షల జరిమానా విధించే చట్టాలు చుట్టాలుగా మారుతున్నాయి. కొన్నేళ్లుగా రూ.కోట్ల విలువ చేసే రాతి ఖనిజం కంకర, గ్రానైట్ రూపేణా దోపిడీకి గురైంది. తవ్వి తరలించిన దానికి.. ప్రభుత్వానికి రాయల్టీ కట్టే సమయంలో చూపించే లెక్కలకు పొంతన లేకపోగా.. 30 నుంచి 50 శాతం వరకే చెల్లించిన సందర్భాలు ఉన్నాయి. కొన్నిచోట్ల లీజు పరిమితి తీరినా.. ఇంకా గ్రానైట్, కంకర క్వారీలు నడుపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. క్వారీల్లో పేలుడుకు సంబంధించి ఇష్టారాజ్యంగా జిలెటిన్స్టిక్స్ను సరైన భద్రతా చర్యలు లేకుండా తరలిస్తున్నారు. రవాణా సమయంలో భారీ కుదుపులు వచ్చినా, ఎదురుగా ఏదైనా వచ్చి వాహనాన్ని ఢీకొన్నా భారీ పేలుడు జరిగే ప్రమాదం ఉంటుంది. అధికారుల తనిఖీలు సక్రమంగా లేకపోవడంతో అక్రమార్కులు సరైన భద్రతా వ్యవస్థ లేకుండానే జిలెటిన్స్టిక్స్ తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వీటన్నింటిపై సమీక్షలు చేసిన గనులశాఖ ప్రత్యేక బృందాలను నియమించి క్వారీల వారీగా లీజు అగ్రిమెంట్లు పరిశీలిస్తూ లీజు, రాయల్టీ బకాయిల లెక్కలు తీస్తోంది. సాక్షిప్రతినిధి, వరంగల్: గ్రానైట్ క్వారీలు, స్టోన్ క్రషర్ల అక్రమ దందాను అరికట్టేందుకు గనుల శాఖ సిద్ధమైంది. ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన రాయల్టీని రూ.లక్షల్లో కాజేస్తున్న నిర్వాహకులపై కొరడా ఝుళిపించేందుకు కసరత్తు చేస్తోంది. ఇదే సమయంలో గ్రానైట్ క్వారీలు, రోడ్, స్టోన్ మెటల్ (కంకర) క్రషర్ల ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకునేందుకు గనులశాఖ దృష్టి సారించింది. ఇందుకు ప్రభుత్వ భూముల్లో గుట్టలు, మైనింగ్కు అనువైన స్థలాలను గుర్తించి టెండర్ ద్వారా లీజుకు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది. తొలి ప్రయత్నంగా రాష్ట్ర వ్యాప్తంగా 34 గ్రానైట్, స్టోన్ మెటల్ క్వారీలకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. మొదట ఏడు క్వారీలు.. ప్రభుత్వ స్థలాలు, గుట్టలను గుర్తించి గ్రానైట్, కంకర క్వారీలను టెండర్ల ద్వారా కేటాయించేందుకు శ్రీకారం చుట్టిన గనులశాఖ.. మొదట ఉమ్మడి జిల్లాలో ఏడు క్వారీల టెండర్లు ఈ నెల 12 ఖరారు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. హనుమకొండ జిల్లా ఊరుగొండలో రెండు స్టోన్ మెటల్, రెండు కలర్ గ్రానైట్ క్వారీలు, ఆత్మకూరు మండలం పెద్దాపూర్లో బ్లాక్ గ్రానైట్ క్వారీలు ఈ టెండర్లలో ఉన్నాయి. వరంగల్ జిల్లా సంగెం మండలం లోహితలో కంకర క్వారీ, జనగామ జిల్లా చిల్పూరు మండలం శ్రీపతిపల్లిలో ఒకటి, జఫర్గఢ్ మండలం హిమ్మత్నగర్లో ఒకటి చొప్పున రెండు క్వారీలకు టెండర్లు ఆహ్వానించారు. కాగా, గనుల శాఖ నోటిఫికేషన్ మేరకు జూలై 17న డౌన్లోడ్ చేసుకుని ఈ నెల 6 వరకు టెండర్లు దాఖలు చేసే అవకాశం కల్పించారు. ఇదిలా ఉండగా.. ప్రభుత్వ భూముల్లో క్రషర్లు నడుపుతూ రాయల్టీ, లీజు డబ్బులు చెల్లించని 22 మందికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. అలాగే, కంకర, గ్రానైట్ కోసం తీసిన రాయికి రాయల్టీ కట్టని వారు.. గనులశాఖకు సూచించిన క్యూబిక్ మీటర్లను మించి రాయి తీసి తనిఖీల్లో దొరికి పెనాల్టీ చెల్లించని వారికి కూడా నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. 10–15 రోజుల్లో సదరు నిర్వాహకులు స్పందించకుంటే ఆ లీజులు సైతం రద్దు చేసి టెండర్లు పిలిచే అవకాశం ఉంటుందని మైనింగ్శాఖ అధికారులు చెబుతున్నారు.రాయల్టీ, లీజు తదితర బకాయిదారులపై దృష్టి లీజు రద్దు చేసి టెండర్ల ద్వారా కేటాయించే యోచన ఆదాయం పెంచుకునే దిశగా ప్రభుత్వం కసరత్తు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొత్తగా ఏడు గ్రానైట్ క్వారీలు, క్రషర్లు ముగిసిన టెండర్ల ప్రక్రియ.. త్వరలో అర్హులకు కేటాయింపు -
భూభారతి దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయండి
కాటారం: భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేసి పరిశీలన పూర్తి చేయాలని కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, అడిషనల్ కలెక్టర్ అశోక్కుమార్ రెవెన్యూ అధికారులకు సూచించారు. మహాముత్తారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని బుధవారం సబ్కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ తనిఖీ చేశారు. తహసీల్దార్ శ్రీనివాస్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది తదితరులున్నారు. దరఖాస్తులు త్వరగా పరిష్కరించండి మల్హర్: భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని భూపాలపల్లి అడిషనల్ కలెక్టర్ అశోక్కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ అన్నారు. మండల కేంద్రం తాడిచర్ల తహసీల్దార్ కార్యాలయాన్ని బుధవారం వారు సందర్శించారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు చేసిన వివరాలను తహసీల్దార్ రవికుమార్ను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.సబ్ కలెక్టర్ మయాంక్సింగ్ -
జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు
భూపాలపల్లి అర్బన్: స్వరాష్ట్ర సాధనలో జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు ఆచార్య జయశంకర్ అని ఆయన తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటాడని కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. బుధవారం జయశంకర్ జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి కలెక్టర్ రాహుల్శర్మ జిల్లా అధికారులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, కలెక్టరేట్ ఏఓ మురళీధర్ అధికారులు పాల్గొన్నారు. ఘనంగా జయంతి వేడుకలు ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను జిల్లా వ్యాప్తంగా బుధవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, సింగరేణి జీఎం రాజేశ్వర్రెడ్డి పూలమాల వేశారు. జిల్లా వ్యాప్తంగా జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు పాఠశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఆచార్య జయశంకర్ను స్ఫూర్తిగా తీసుకోవాలి కలెక్టర్ రాహుల్శర్మ -
భోజనంలో నాణ్యత పాటించాలి
పలిమెల: ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత పాటించాలని జేఎస్ భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. బుధవారం పంకెనలోని కేజీబీవీ (బాలికల) పాఠశాలను ఆయన సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం పాఠశాలలోని స్టోర్ రూమ్, వంట గది, సైన్స్ ల్యాబ్ను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర, సమీకృత కార్యాలయాల భవన నిర్మాణ పనులు, ఏంఆర్సీ భవనాల్ని పరిశీలించారు. అనంతరం నర్సరీని పరిశీలించారు. మొదేడు రేంజ్ పరిధి అటవీ ప్రాంతంలో పర్యటించి అటవీ శాఖ వాచ్ టవర్, అడవుల సంరక్షణ, పెంపకానికి తీసుకుంటున్న చర్యలు పరిశీలించారు. వాచ్ టవర్ ప్రాంతంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ నవీన్రెడ్డి, తహసీల్దార్ అనిల్, ఎంపీడీఓ ప్రకాశ్రెడ్డి, తదితరులున్నారు. ఆకస్మిక తనిఖీ రేగొండ: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి సూచించారు. బుధవారం మండలంలోని కస్తూ ర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంట గదిని పరిశీలించారు. నిత్యావసర సరుకులను, రిజిస్టర్లను పరిశీలించారు. నాణ్యమైన భోజనం అందించాలి చిట్యాల: మోడల్ స్కూల్ వసతి గృహంలోని విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలని డీఈఓ రాజేందర్ అన్నారు. ఈసందర్భంగా బుధవారం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ కళాశాల, బాలికల వసతి గృహాన్ని ఆయన తనిఖీ చేశారు. విద్యార్థుల సామర్థ్యాలు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అనంతరం మోడల్ స్కూల్ బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. ఆయన వెంట ఎంఈఓ కె.రఘుపతి, ఏఎంఓ లక్ష్మ ణ్, జిల్లా ప్లానింగ్ కో–ఆర్డినేటర్ రాజగోపాల్, జీసీడీఓ శైలజ, కొత్తపల్లి గోరి ఎంఈఓ రాజు, టెక్నికల్ పర్సన్ మహేందర్, ప్రిన్సిపాల్ రమేశ్, ఎమ్మార్పీ సిబ్బంది ఆకుల హరీశ్, నరేశ్, రాజు ఉన్నారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు కలెక్టర్ రాహుల్ శర్మ -
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని సింగరేణి గనుల్లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య డిమాండ్ చేశారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏరియాలోని సింగరేణి గనుల్లో గాలి కొరత, తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సరైన పనిముట్లు లేవన్నారు. యంత్రాలకు మరమ్మతులు చేయడంలో అధికారులు విఫలమైనట్లు ఆరోపించారు. ఈ సమస్యలపై అధికారులతో మాట్లాడితే పరిష్కరించకపోగా కార్మికులను బెదిరింపులకు గురిచేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో నాయకులు దాసరి జనార్దన్, శ్రీనివాస్, బాబు, జయశంకర్, నరసింహారెడ్డి, సలీం, లక్ష్మినారాయణ పాల్గొన్నారు. -
వసతి గృహాల్లో భోజనంపై ప్రత్యేక దృష్టి
భూపాలపల్లి: జిల్లాలోని అన్ని వసతి గృహాల్లో విద్యార్థులకు అందిస్తున్న భోజనంపై ప్రత్యేక దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్శర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నుండి వసతి గృహాల జిల్లా అధికారులు, పర్యవేక్షణ ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వార్డెన్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్దేశిత మెనూని తప్పకుండా పాటించాలని తెలిపారు. వంట గదులు, సామాన్లు భద్రపరచు గదులు, పారిశుద్ధ్యం నిర్వహణ, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులు, ఆర్ఓ ప్లాంట్ల పనితీరు, కూరగాయలు, మాంసం, పప్పుల సరఫరాపై దృష్టి సారించాలన్నారు. ప్రతీ మూడు రోజులకొకసారి ప్రత్యేక అధికారులు విద్యార్థులతో కలిసి భోజనం చేయాలన్నారు. ప్రభుత్వ వైద్యులు ఎప్పటికప్పుడు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షణ చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, ప్రత్యేక అధికారులు, సంక్షేమ అధికారులు పాల్గొన్నారు. విచారణ వేగిరం చేయాలి.. భూభారతి దరఖాస్తుల విచారణ వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి భూభారతి దరఖాస్తుల పరిశీలనపై తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భూ భారతిలో వచ్చిన ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి విచారణ పూర్తి చేయాలని, ప్రభుత్వ ఆదేశం ప్రకారం నిర్దేశిత సమయానికి పూర్తి చేయని తహసీల్దార్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, ఆర్డీఓ రవి, తహసీల్దార్లు పాల్గొన్నారు. అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు మొగుళ్లపల్లి: విద్యార్థుల సంక్షేమం విషయంలో అలసత్వాన్ని సహించబోమని కలెక్టర్ రాహుల్ శర్మ హెచ్చరించారు. మంగళవారం కొర్కిశాల కేజీబీవీని తనిఖీ చేశారు. విద్యార్థినుల అస్వస్థత ఘటనపై తెలుసుకున్నారు. ఘటనపై ఎస్ఓకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని డీఈఓకు ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్లక్ష్యం వహించిన నలుగురు వంట మనుషులను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. విద్యార్థులు సమస్యలు తెలియజేసేందుకు ఫిర్యాదు బాక్స్ ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రాజేందర్, ఇన్చార్జ్ వైద్యాధికారి శ్రీదేవి, తహసీల్దార్ సునీత, ఎంపీడీఓ సురేందర్ తదితరులు పాల్గొన్నారు. పీఏసీఎస్ గోదాం పరిశీలన మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకర సంఘంలోని ఎరువుల గోదాంను కలెక్టర్ రాహుల్శర్మ తనిఖీ చేశారు. రైతులు ఎవరూ అధైర్య పడద్దని రైతులకు సరిపడా ఎరువులు, యూరియా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆయన వెంట డీఏఓ బాబురావు, ఏడీఏ రమేష్, ఏఓ సురేందర్రెడ్డి, తహసీల్దార్ సునీత, సీఈఓ అప్పం సాగర్ ఉన్నారు. భూ భారతి దరఖాస్తుల విచారణ వేగిరం చేయాలి కలెక్టర్ రాహుల్ శర్మ -
బ్యాక్ వాటర్తో ముప్పు..
మహదేవపూర్ మండలం చండ్రుపల్లి వాగుపై ఉన్న లో లెవల్ కల్వర్టు మీదుగా వర్షాకాలంలో గోదావరి నది బ్యాక్ వాటర్ ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో అన్నారం నుంచి పలుగుల మీదుగా కాళేశ్వరం, కాళేశ్వరం మీదుగా అన్నారం వెళ్లే వాహనాల రాకపోకలు రోజుల తరబడి నిలిచిపోతున్నాయి. సుమారు రెండు నెలల పాటు ఇదే పరిస్థితి నెలకొంటుండంతో స్థానికులు కాళేశ్వరం వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలుగేళ్ల క్రితం ఓ టూరిస్ట్ బస్సు కాళేశ్వరం వస్తుండగా వరద నీరు భారీగా వచ్చి కల్వర్టులో బస్సు చిక్కుకుంది. అప్పటి ఎస్సై శ్రీనివాస్ తాళ్ల సహాయంతో బస్సులోని భక్తులను సురక్షితంగా బయటకు తరలించడంతో పెద్ద ముప్పు తప్పింది. -
లో లెవల్... హై రిస్క్
పక్క ఫొటోలో కనిపిస్తున్నది పలిమెల మండలం ముకునూరు గ్రామ సమీపంలోని తోగువాగుపై నిర్మించిన లో లెవల్ వంతెన. ప్రతీ ఏటా మోస్తారు వర్షానికి సైతం తోగువాగు ఉప్పొంగి వంతెన మీదుగా వరద నీరు భారీగా ప్రవహిస్తుంది. దీంతో పలిమెల–ములుగు జిల్లా కన్నాయిగూడెం మీదుగా రాకపోకలు నిలిచిపోతాయి. ఫలితంగా భూపాలపల్లి నుంచి ఏటూరునాగారం, కన్నాయిగూడెం, పలిమెల, మహదేవపూర్ మీదుగా భూపాలపల్లి జిల్లాకేంద్రానికి వచ్చే ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఏళ్ల తరబడి ఈ ప్రాంత వాసులు ఇబ్బంది పడుతున్నా ప్రజాప్రతినిధులు హై లెవల్ బ్రిడ్జి నిర్మించకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భూపాలపల్లి: ఓ మోస్తారు వర్షాలు కురిసినా గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోనున్నాయి. గోదావరి నది, మోరంచవాగు, చలివాగు, మానేరు, బొగ్గులవాగు లాంటి చిన్న, పెద్ద వాగులు, నదులు ఉన్న జిల్లాలో పలుచోట్ల లో లెవల్ కల్వర్టులు ఉండటం, అవి కూడా శిథిలావస్థకు చేరుకోవడంతో ఏటా వర్షాకాలంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బ్యాక్ వాటర్, వరద నీరు కాజ్ వే లపై నుంచి ప్రవాహిస్తుండటంతో గ్రామాలతో పాటు జిల్లాల మధ్య కూడా రాకపోకలు నిలుస్తున్నాయి. వర్షాకాలంలో నిలిచిపోతున్న రాకపోకలు.. చిట్యాల మండలంలోని శాంతినగర్–టేకుమట్ల మండల కేంద్రం మధ్య గల లో లెవల్ కల్వర్టు శిథిలావస్థకు చేరుకుంది. ప్రతీ ఏటా వర్షాకాలంలో వెలిశాల గుట్టల నుంచి వరద నీరు ఈ కల్వర్టు మీదుగా సీఆర్ పల్లి వైపు వెళ్తుంది. దీంతో చిన్న వర్షానికి సైతం ద్విచక్ర వాహనాలు, ఆటోలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది డిసెంబర్ 1న కల్వర్టుపై బ్రిడ్జి నిర్మాణం కోసం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శంకుస్థాపన చేశారు. ఇప్పటికీ పనులు ప్రారంభం కాకపోవడంతో ఈ ఏడాది వర్షాకాలంలో కూడా తిప్పలు తప్పేలా లేవు.9 ఏళ్లుగా సా...గుతున్న బ్రిడ్జి నిర్మాణం.. టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి–పెద్దపల్లి జిల్లా ఓడెడు మధ్య గల మానేరు వాగుపై 2016లో బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. ఈ బ్రిడ్జి నిర్మాణం నేటికీ పూర్తి కాలేదు. గడిచిన 9 ఏళ్లుగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో టెండరు ఆహ్వానించి మానేరు వాగులో తాత్కాలిక మట్టి రోడ్డు నిర్మాణం చేపట్టి రాకపోకలు సాగిస్తుంటారు. గత నెలలో కురిసిన వర్షాలకు మట్టి రోడ్డు కొట్టుకుపోయి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో సదరు బ్రిడ్జి నిర్మాణ కాంట్రాక్టర్లు తాత్కాలికంగా మట్టి రోడ్డు వేశారు. అది కూడా రెండు, మూడు వర్షాలు కురిస్తే కొట్టుకపోయే అవకాశం ఉంది. ఫలితంగా రెండు జిల్లాల మధ్య రాకపోకలు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడనున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చూడాలని రెండు జిల్లాల ప్రజలు కోరుతున్నారు. ఏటా వర్షాకాలంలో తప్పని తిప్పలు చిన్న వరదలొచ్చినా మునిగిపోతున్న వంతెనలు పల్లెలకు నిలిచిపోతున్న రాకపోకలు జల దిగ్బంధంలో పలు గ్రామాలు -
చిన్నపాటి వర్షానికే..
గణపురం మండలకేంద్రంలోని పరకాల–ములుగు ప్రధాన రహదారి చినుకుపడితే చిత్తడిగా మారుతుంది. మంగళవారం కురిసిన కొద్దిపాటి వర్షానికే రోడ్డుపై నీరు నిలిచి కుంటలను తలపించింది. గుంతలు ఏర్పడక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారులు స్పందించి నీరు నిలవకుండా చూడాలని వాహనదారులు కోరుతున్నారు. – గణపురంగణపురం గణపసముద్రం చెరువు నుంచి మిషన్ భగీరథ పథకంలో భాగంగా పైప్లైన్లు వేసి నియోజకవర్గంలో తాగునీటిని సరఫరా చేస్తున్నారు. వందలాది కిలోమీటర్లు పైప్లైన్లు చేశారు. కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యంతో గణపురం మండలకేంద్రంలో ధర్మరావుపేట ప్రధాన రహదారిపై మిషన్ భగీరథ పైప్లైన్లు రోడ్డుపైకి తేలాయి. వాహనాలు పైప్లైన్లపైకి ఎక్కితే పగిలే అవకాశం ఉంది. – గణపురం -
చిన్న వానలకే నిలుస్తున్న రాకపోకలు..
మొగుళ్లపల్లి మండలంలోని ములకపల్లి– మొగుళ్లపల్లి గ్రామాల మధ్య ఉన్న కాజ్ వే చిన్నపాటి వర్షానికి సైతం వరద నీటితో నిండిపోతుంది. దీంతో ఇరువైపులా ఉన్న గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఫలితంగా ఇతర గ్రామాల మీదుగా ప్రయాణించాల్సి వస్తుంది. హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం కోసం ఎనిమిది నెలల క్రితం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు నిధులు మంజూరు చేయించి శంకుస్థాపన చేశారు. ఇప్పటివరకు పనులు ప్రారంభం కాకపోవడంతో వరదలు వస్తే తమ పరిస్థితి ఏంటని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
కలెక్టర్ను సన్మానించిన టీఎన్జీవోస్ నాయకులు
భూపాలపల్లి అర్బన్: సంపూర్ణత అభియాన్లో భాగంగా గవర్నర్ చేతుల మీదగా అవార్డు అందుకున్న సందర్భంగా కలెక్టర్ రాహుల్శర్మను మంగళవారం టీఎన్జీవోస్ నాయకులు సన్మానించారు. మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించి పూల మొక్కను అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బూరుగు రవి, దశరథం, షఫి, జ్ఞానేశ్వర్సింగ్, సత్యనారాయణ, శ్రీదేవి, కిరణ్కుమార్, శంకరయ్య, సభ్యులు పాల్గొన్నారు. ఇన్చార్జ్ సూపరింటెండెంట్గా రాజేంద్రప్రసాద్ భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఇన్చార్జ్ సూపరింటెండెంట్గా డాక్టర్ రాజేంద్రప్రసాద్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నవీన్కుమార్కు పదోన్నతి రావడంతో జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాలకు బదిలీపై వెళ్లారు. దీంతో భూపాలపల్లి మెడికల్ కళాశాలలో విధులు నిర్వర్తిస్తున్న సీనియర్ ప్రొఫెసర్ రాజేంద్రప్రసాద్కు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సిబ్బంది సూపరింటెండెంట్ను మర్యాదపూర్వకంగా కలిసి పూలబొకే అందించారు. -
మోటార్లు ఆన్ చేయాల్సిందే!
కాళేశ్వరం: రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సందర్భంగా బీఆర్ఎస్ బృందం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆధ్వర్యంలో సోమవారం ‘చలో కన్నెపల్లి’ మోటార్లు ఆన్ చేయాల్సిందేననే డిమాండ్తో పర్యటించారు. ముందుగా పలువురు కాళేశ్వరాలయంలో పూజలు చేశారు. అనంతరం పంపుహౌస్ అప్రోచ్ కెనాల్ వద్ద వరదను పరిశీలించారు. మండలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపలి(లక్ష్మీ)పంపుహౌస్ మోటార్లు ఆన్చేసేందుకు పంపుహౌస్ 2వ గేటు నుంచి పంపుల వద్దకు వెళ్లడానికి బీఆర్ఎస్ బృందం సభ్యులు 300 మందితో తరలి వచ్చారు. గేటు గుండా ముట్టడించిన బీఆర్ఎస్ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో కాసేపు తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. గేటు ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి, సీఎం రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తరవాత ఇరిగేషన్ ఈఎన్సీ హెడ్ అమ్జద్ హుస్సేన్తో మాట్లాడారు. అనంతరం మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ మాట్లాడుతూ రేవంత్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి కుట్రలకు రైతులు బలైపోతున్నారన్నారు. కన్నెపల్లి వద్ద 93.7 మీటర్లు ఉంటేనే పంపులు ఆన్ చేసుకోవచ్చు, ప్రస్తుతం 97.60 మీటర్ల నీళ్లున్నా పంపులు ఆన్ చేయడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని పేర్కొన్నారు. లక్షా 40 వేల క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతుందని, ప్రతి రోజు 10 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తుందన్నారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ప్రభుత్వానికి కన్నెపల్లి పంపు హౌజ్ ఆన్ చేయడానికి వచ్చిన ఇబ్బంది ఏంటో తెలియడం లేదన్నారు. ప్రస్తుతం లక్షా 42 వేల క్యూసెక్కుల నీరు వృథాగా పోతుందన్నారు. మిడ్ మానేరులో 20 టీఎంసీలకు 7 టీఎంసీలు, ఎల్ఎండీలో 20 టీఎంసీలకు 7 టీఎంసీలే ఉన్నాయని తెలిపారు. ఎల్లంపల్లిలో 20 టీఎంసీలకు 8 టీఎంసీలే ఉన్నాయని పేర్కొన్నారు. కాళేశ్వరంతో నీళ్లు ఇవ్వకుండా అన్ని జిల్లాలను ఎండబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, ఎమ్మెల్సీ ఎల్.రమణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, విద్యాసాగర్రావు, దాసరి మనోహర్ రెడ్డి, సుంకే రవిశంకర్, రసమయి బాలకిషన్, దివాకర్రావు, చల్మడ లక్ష్మీ నరసింహరావు, దావా వసంత, జక్కు శ్రీహర్షిణి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, బీఆర్ఎస్ నాయకులు. కార్యకర్తలు పాల్గొన్నారు. ‘చలో కన్నెపల్లి’కి బీఆర్ఎస్పార్టీ బృందం పోలీసులతో వాగ్వాదం.. తోపులాట -
అంటువ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి
భూపాలపల్లి/కాళేశ్వరం/రేగొండ: అంటు వ్యాధుల నియంత్రణలో రానున్న రెండు నెలలు అత్యంత కీలకమని, వైద్య ఆరోగ్య శాఖ పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎయిడ్స్ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్, ఉమ్మడి వరంగల్ జిల్లా సీజనల్ వ్యాధుల పర్యవేక్షణ ప్రత్యేక అధికారి డాక్టర్ వాసం వెంకటేశ్వర్రెడ్డి సూచించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణపై సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి, మహదేవపూర్ ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం, ఐసీటీసీ కేంద్రాలు, రేగొండ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖలో క్షేత్రస్థాయిలో ఆశ కార్యకర్త నుంచి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వరకు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఇంటింటా జ్వర సర్వేలు నిర్వహించి పకడ్బందీగా నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. సీజనల్గా వచ్చే వ్యాధుల పట్ల ప్రజలకు సరైన అవగాహన కల్పించడంతో పాటు వైద్య ఆరోగ్యశాఖ సమస్త సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు. ఆస్పత్రి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, రోగులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో వైద్య ఆరోగ్యశాఖ ఉప సంచాలకులు నాగరాజు, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీదేవి, ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఉమాదేవి, మహదేవపూర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్ విద్యావతి, ఆర్ఎంఓ డాక్టర్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రానున్న రెండు నెలలు అత్యంత కీలకం రాష్ట్ర ఎయిడ్స్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వాసం వెంకటేశ్వర్రెడ్డి -
కాళేశ్వరాలయంలో శ్రావణ శోభ
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానంలో శ్రావణశోభ నెలకొంది. సోమవారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ముందుగా త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యస్నానాలు చేశారు. అనంతరం శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి గర్భగుడిలో ప్రత్యేక అభిషేక పూజలు చేశారు. శ్రీశుభానందదేవి, శ్రీసరస్వతి అమ్మవార్ల దేవాలయంలో మహిళలు పూజలు నిర్వహించారు. సాయంత్రం గర్భగుడిలో భక్తులు లక్షపత్రి పూజలను ప్రత్యేక పూజా కార్యక్రమాలతో నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణలో ఆలయం మారుమోగింది. దీంతో భక్తులు సందడి కనిపించింది. -
ప్రజల విశ్వాసం పొందేలా పనిచేయాలి
భూపాలపల్లి: విధి నిర్వహణలో ప్రజల విశ్వాసం పొందే విధంగా పోలీసు అధికారులు, సిబ్బంది పనిచేయాలని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా దివస్ కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 21మంది నుంచి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. బాధితుల సమస్యలు విన్న వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు ఇచ్చి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. బాధితులకు సరైన సమయంలో న్యాయం జరిగినప్పుడే పోలీసుల పట్ల గౌరవం, నమ్మకం కలుగుతుందని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు.ఎస్పీ కిరణ్ ఖరే -
ఎమ్మెల్యేల మధ్య ఇసుక దుమారం!
సాక్షిప్రతినిధి, వరంగల్/పరకాల: అధికార పార్టీకి చెందిన పరకాల, భూపాలపల్లి ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు నడుమ ఇసుక సరఫరా విషయంలో మాటల యుద్ధం జరిగిందా..? పరకాల నియోజకవర్గానికి భూపాలపల్లి నియోజకవర్గంలోని వాగులనుంచి ఇసుక తరలింపు నిలిచిపోయిందా? ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఉచిత ఇసుక సరఫరా విషయంలో మొదలైన ఈ పంచాయితీ పార్టీ కార్యకర్తల వరకు పాకిందా?.. అంటే నిజమే అంటున్నారు కాంగ్రెస్ పార్టీ కేడర్, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు. కొద్ది రోజులుగా భూపాలపల్లి నియోజకవర్గంలోని వాగులనుంచి పరకాల నియోజకవర్గానికి ఇసుక తరలకుండా రెవెన్యూ, పోలీసుశాఖల అధికారులు గస్తీ కాయడమే ఇందుకు నిదర్శనమంటున్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి మధ్య ఇసుక రవాణాపై సంభాషణ జరిగినా ఫలితం లేకపోవడంతో చివరకు ఈ పంచాయితీ జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి వద్దకు వెళ్లిందన్న ప్రచారం చర్చనీయాంశంగా మారింది. భూపాలపల్లి ఇసుక.. పరకాలకు తరలకుండా ఆంక్షలు.. అర్హులైన పేదలందరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి సొంతింటి కలనెరవేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వమే ఉచితంగా ఇసుక తరలింపునకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా సమీప ప్రాంతాల్లో ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడినుంచి సరఫరా చేయాలని సూచించింది. భూపాలపల్లి నియోజకవర్గంలోని ఏ ఒక్క వాగునుంచి ఇసుక ట్రాక్టర్ పరకాలకు తరలివెళ్లకుండా రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు కట్టడి చేస్తున్నారు. మండలాల సరిహద్దుల్లో సంబంధిత పోలీస్స్టేషన్ల సిబ్బంది రాత్రివేళలో మఫ్టీలో సంచరిస్తూ ఇసుక ట్రాక్టర్లను పట్టుకుంటున్నారని పరకాల వాసులు చెబుతున్నారు. కేసులు పెట్టడానికి కూడా వెనుకడుగు వేయకపోవడంతో, దీంతో పరకాలకు ఇసుక తరలింపు నిలిచిపోయిందని అంటున్నారు. ఇదేంటని అడిగితే పోలీసు, రెవెన్యూ అధికారులు పరకాలకు ఇసుక వెళ్తే చర్యలు తీసుకోవాలంటూ భూపాలపల్లి ఎమ్మెల్యేనుంచి ఆదేశాలున్నాయని చెబుతున్నారని పరకాల కాంగ్రెస్ నేతలు అంటున్నారు. దీంతో చిట్యాల మండలంలోని టేకుమట్ల, కాల్వపల్లి, కలకోటపల్లి, మొగుళ్లపల్లి మండలంలోని నవాబుపేట, ఇస్సిపేట, కొర్కిశాల, రేగొండ మండలంలోని కనపర్తి వాగుల నుంచి ఇసుక తరలించకుండా ఆంక్షలు విఽధించినట్లు సమాచారం. ఆకాశాన్నంటిన ఇసుక ధర.. గోదావరి పరీవాహక ప్రాంతంలోని ఇసుక క్వారీలు 15 ఉండగా, వర్షాల కారణంగా అందులో 14 క్వారీలు నీట మునిగాయి. మిగతా ఒక్కటి అడవి సోమన్నపల్లి నుంచి మాత్రమే ఇసుకను తరలిస్తున్నారు. గతంలో ఒక్కో టన్నుకు రూ.800 నుంచి రూ.1000 ఉండగా ప్రస్తుతం మూడు రెట్లు అంటే రూ.2,500 వరకు నడుస్తుంది. అంటే ఒక్కో లారీ 32 టన్నులు అంటే రూ.80వేలు అవుతుంది. అంత ధర సామాన్యుడు పెట్టలేని పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో పొరుగు జిల్లానుంచి, వాగుల నుంచి ఇసుక తరలించుకోవడంపై ఆంక్షలు విధించడం పరకాల నియోజకవర్గంలోని తమ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్చార్జ్ మంత్రి వద్దకు ఇసుక పంచాయితీ భూపాలపల్లి, పరకాల ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ, రేవూరి ప్రకాశ్రెడ్డి మధ్య నెలకొన్న ఇసుక పంచాయితీ ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వరకు వెళ్లినట్లు తెలిసింది. భూపాలపల్లి నుంచి ఇసుక రాకుండా ఆంక్షలు విధించడంపై మొదట ఎమ్మెల్యే సత్యనారాయణరావుతో మాట్లాడిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి.. ఫలితం లేకపోవడంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. రేవూరి ప్రకాశ్రెడ్డి వర్సెస్ గండ్ర సత్యనారాయణ భూపాలపల్లి వాగుల ఇసుక పరకాలకు వెళ్లకుండా ఎమ్మెల్యే ఆంక్షలు? పరకాల ఎమ్మెల్యే అడిగినా ససేమిరా అంటున్న గండ్ర ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి ‘పొంగులేటి’ వద్దకు చేరిన పంచాయితీ -
సమష్టి కృషితోనే జిల్లాకు అవార్డు
ఎరువుల కొరత లేదు రేగొండ: జిల్లాలో ఎరువుల కొరత లేదని కలెక్టర్ రాహుల్శర్మ స్పష్టం చేశారు. సోమవారం మండలంలోని పీఏసీఎస్కు చెందిన ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్ రిజిస్టర్, ఎరువుల నిల్వలు, స్టాక్ బోర్డు, రశీదు పుస్తకాలను పరిశీలించారు. రైతులు తమ అవసరాల మేరకే ఎరువులు తీసుకోవాలని తెలిపారు. ఎరువుల సరఫరాలో పారదర్శకతను పాటించాలని, దుకాణాల వద్ద స్టాక్ బోర్డులను ప్రతీ రోజు అప్డేట్ చేయాలని నిర్వాహకులకు సూచించారు. ఎరువుల సరఫరాలో అక్రమాలను సహించబోమని కలెక్టర్ హెచ్చరించారు. ఆయన వెంట తహసీల్దార్ శ్వేత ఉన్నారు.భూపాలపల్లి: సమష్టి కృషితోనే సంపూర్ణత అభియాన్లో రాష్ట్ర స్థాయిలో అవార్డు సాధించామని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. అవార్డు సాధించిన సందర్భంగా ఐడీఓసీ కార్యాలయంలో సోమవారం అన్ని శాఖల అధికారులు, సిబ్బంది కలిసి కలెక్టర్కు శాలువా కప్పి మెమొంటో అందజేసి సత్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. మారుమూల గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ కింద మహాముత్తారం, పలిమెల మండలాలను యాస్పిరేషన్ బ్లాకులుగా ఎంపిక చేసినట్లు తెలిపారు. ఆయా మండలాల్లో విద్య, వైద్యం, వ్యవసాయ, పోషణ రంగాల్లో గణనీయమైన పురోగతి సాధనతో జిల్లాకు అవార్డు లభించిందని తెలిపారు. ఇది మన జిల్లాకు లభించిన గొప్ప గౌరవమని, ఇదే స్ఫూర్తితో సేవల్లో ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. వేడుకలకు ఏర్పాట్లు చేయాలి.. స్వాతంత్య్ర వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా ప్రజలను ఉద్దేశించి అతిథి ప్రసంగించనున్న ప్రసంగ పాఠం తయారు చేయాలని డీపీఆర్ఓ శ్రీనివాస్ను ఆదేశించారు. ఇందుకు గాను అన్ని శాఖల అధికారులు 5వ తేదీ వరకు ప్రగతి నివేదికలు ఇవ్వాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. దరఖాస్తులను పరిష్కరించాలి.. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతీ దరఖాస్తు పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో అన్ని శాఖల జిల్లా అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 90మంది నుంచి కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ -
స్వచ్ఛతలో వెనుకబాటు
మూలనపడిన చెత్త సేకరణ వాహనాలుభూపాలపల్లి: భూపాలపల్లి మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా మారింది. చెత్త సేకరణ వాహనాలు మూలన పడటం, ఇళ్ల నుంచి చెత్త సేకరణలో నిర్లక్ష్యం ప్రదర్శించడం, వార్డులకు సరిపడా కార్మికులు లేకపోవడంతో నిత్యం పారిశుద్ధ్య సమస్య తలెత్తుతోంది. ఫలితంగా స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల సాధనలో జాతీయ, రాష్ట్రస్థాయిలో భూపాలపల్లి వెనుకంజలో ఉంది. సగం వాహనాలు మూలకే.. పట్టణంలో 30 వార్డులు ఉండగా సింగరేణి సంస్థ 7, మున్సిపాలిటీ 23 వార్డుల్లో పారిశుద్ధ్య నిర్వహణ పనులు చేపడుతుంది. చెత్త సేకరణ, తరలింపు కోసం మున్సిపాలిటీలో 12 స్వచ్ఛ ఆటోలు ఉండగా.. అందులో నాలుగు మరమ్మతుకు నోచుకోని ఆటోలు మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మూలన పడి ఉన్నాయి. మరొకటి షోరూంలో ఇవ్వగా బిల్లు చెల్లించని కారణంగా బయటకు రావడం లేదు. మిగిలిన ఏడింటితోనే 23 వార్డుల్లో చెత్త సేకరించాల్సి వస్తుంది. మూడు ట్రాక్టర్లు, ఒక బ్రేడ్ ట్రాక్టర్ ఉండగా మరమ్మతుకు నోచుకొని ఆరు నెలలు కావొస్తుంది. ఫలితంగా ఇంటింటా చెత్త సేకరణ సక్రమంగా జరగకపోవడమే కాక వీధుల్లో చెత్త పేరుకుపోతుంది. బస్టాండ్, మార్కెట్, ప్రధాన కూడళ్లలో ఎప్పుడు చూసినా పారిశుద్ధ్య లోపం దర్శనమిస్తుంది. మురుగు కాలువల్లో నుంచి తొలగించిన చెత్తను రోడ్డు పక్కన పడేసి రోజులు గడుస్తున్నా తొలగించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పారిశుద్ధ్య కార్మికులు ఇతర పనులకు.. పారిశుద్ధ్య కార్మికులు సరిపడా లేకపోవడమే కాక కొంతమందికి ఇతర పనులు కేటాయించడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మున్సిపాలిటీలో 154 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉండగా 67 మంది మాత్రమే శానిటేషన్ విధులు నిర్వర్తిస్తున్నారు. మిగిలిన 87 మంది డ్రైవర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, బిల్ కలెక్టర్, అటెండర్లుగా పనిచేస్తున్నారు. నలుగురు జవాన్లు మాత్రమే ఉండగా, శానిటరీ ఇన్స్పెక్టర్ లేకపోవడంతో జూనియర్ అసిస్టెంటే శానిటరీ విభాగాన్ని చూస్తున్నాడు. అటకెక్కిన బయో మైనింగ్.. పట్టణంలో ప్రతీరోజు సేకరిస్తున్న చెత్త 21 టన్నుల వరకు వస్తుంది. డంపింగ్ యార్డుల్లో ఇప్పటివరకు సుమారు ఆరు వేల టన్నుల చెత్త పేరుకుపోయి ఉంది. ఆ చెత్తను బయో మైనింగ్ విధానం ద్వారా శుద్ధి చేసి, మళ్లీ ఉపయోగించేందుకు అవసరమైన ముడి సరుకును వేరుచేస్తారు. ఈ విధానంలో వచ్చిన మట్టి, రాళ్లు, ప్లాస్టిక్, ఇనుమును మున్సిపాలిటీ ఆధ్వర్యంలో విక్రయిస్తారు. ఈ విధానం కాగితాలకే పరిమితం అయింది. బయో మైనింగ్ విధానం కోసం కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.6లక్షలు మాత్రమే మంజూరు చేసింది. తూకం వేసేందుకు వేబ్రిడ్జి నిర్మాణం, బయోమైనింగ్ యంత్రాల కొనుగోలుకు ఆ నిధులు సరిపోవడం లేదు. దీంతో టెండరు దక్కించుకున్న కాంట్రాక్టరు పనులు ప్రారంభించడం లేదు. ప్రతిపాదనలు పంపాం.. చెత్త సేకరణ వాహనాల మరమ్మతుల అనుమతి కోసం మున్సిపాలిటీ ప్రత్యేక అధికారికి ప్రతిపాదనలు పంపాం. అనుమతి రాగానే వాహనాలను బాగు చేయించి వినియోగంలోకి తీసుకొస్తాం. ప్రస్తుతం ఉన్న వాహనాలతో పారిశుద్ధ్య పనులు చేపడుతున్నాం. సమస్య తలెత్తకుండా ఇంటింటా చెత్త సేకరణ కార్యక్రమం చేపడుతున్నాం. – బిర్రు శ్రీనివాస్, భూపాలపల్లి మున్సిపాలిటీ కమిషనర్ మున్సిపాలిటీ సాధించిన ర్యాంకులు ఇలా.. సంవత్సరం రాష్ట్రస్థాయి జాతీయస్థాయి ర్యాంకు ర్యాంకు2022–2023 21 920 2023–2024 88 1,169 2024–2025 135 732 డోర్ టు డోర్ కలెక్షన్లో నిర్లక్ష్యం సరిపడా లేని పారిశుద్ధ్య కార్మికులు సమస్యలపై దృష్టి సారించని మున్సిపాలిటీ అధికారులు ‘స్వచ్ఛ సర్వేక్షణ్’లో రాష్ట్రంలో 135వ ర్యాంకు -
పురుగుల అన్నం తినలేకపోతున్నాం..
మొగుళ్లపల్లి: ‘పురుగుల అన్నం తినలేకపోతున్నాం.. కుళ్లిన పండ్లు ఇస్తున్నారు.. భోజనంలో రాళ్లు, తెల్ల పురుగులు, దోమలు, ఈగలు, వెంట్రుకలు బోళ్లను శుభ్రపరిచే స్టీల్ ముక్కలు వస్తున్నాయి.. ప్రిన్సిపాల్కు రాతపూర్వకంగా ఫిర్యాదుచేసినా పట్టించుకోవడం లేదు..’ మీరైనా పట్టించుకోండి సార్ అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణరావుకు కొర్కిశాల కేజీబీవీ విద్యార్థుల మొర పెట్టుకున్నారు. సోమవారం కేజీబీవీలో 27 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురికాగా.. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి కేజీబీవీని సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ఎమ్మెల్యే ఎదుట తమ ఆవేదన వెలిబుచ్చారు. ఉదయం ఫుడ్ పాయిజన్ అయిన వెంటనే ఉన్నతాధికారులకు ఎందుకు స మాచారం ఇవ్వలేదని కేజీబీవీ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తంచేశారు. వంట సిబ్బందిని, బియ్యం నిల్వలను వెంటనే మార్చాలని ఆదేశించారు. పలువురి పరామర్శ విద్యార్థినులను బీఆర్ఎస్ నాయకులు జోరుక సదయ్య, కొడారి రమేష్, బలుగురి తిరుపతి రావు పరామర్శించారు. మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనచారి ఫోన్లో విద్యార్థినులతో మాట్లాడి పరామర్శించారు. కొర్కిశాల కేజీబీవీ విద్యార్థుల మొర.. పాఠశాల సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం -
విద్యలో అంతరాలు తొలగించాలి
కేయూ క్యాంపస్: విద్యలో అంతరాలు తొలగించాలని ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణా పౌరస్పందన వేదిక రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ‘విద్యలో అంతరాలు–అసమానతలు తొలిగిపోయేది ఎలా’ అంశంపై హనుమకొండలోని యూనివర్సిటీ న్యాయ కళాశాలలో ఆదివారం నిర్వహించిన చర్చాగోష్టిలో ఆయన మాట్లాడారు. విద్యారంగంలో ప్రైవేటీకరణతోనే అంతరాలు మొదలయ్యాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రాఽథమిక, మాధ్యమిక విద్యాసంస్థలు దిక్కులేనివిగా తయారయ్యాయని తెలిపారు. ఇంజనీరింగ్లో రూ.45 వేల నుంచి రూ.1,51,600 వరకు ఫీజులు ఉన్నాయని వివరించారు. ఇందుకు ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్, తెలంగాణ ఉద్యమాకారుల వేదిక చైర్మన్ కె. వెంకటనారాయణ మాట్లాడుతూ ప్రపంచీకరణతో విద్యారంగంలో అంతరాలు బాగా పెరిగిపోయాయన్నారు. ఈ అంతరాలు పోవాలంటే ప్రగతిశీల భావాలున్న ప్రజాశ్రేణులను ఐక్యం చేసి పాలకవర్గాలపై పోరాటం చేయడమే మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. పౌరస్పందన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాధేశ్యాం మాట్లాడుతూ 1980 నుంచే విద్య వ్యాపార సరుకుగా మారిందన్నారు. పలువురు వక్తలు మా ట్లాడుతూ విద్యలో అంతరాలు పోవాలంటే ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. వివిధ సంఘాలు బా ధ్యుల లక్ష్మారెడ్డి, రామమూర్తి, శ్రీధర్గౌడ్, విజయకుమార్, వీరస్వామి,రాజిరెడ్డి,పెండెం రాజు,రవీందర్రాజు, శ్రీధర్రాజు పాల్గొన్నారు. బెనిఫిట్స్ చెల్లించాలిరిటైర్డ్ ఉపాధ్యాయులకు బెనిఫిట్స్ చెల్లించాలని నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హనుమకొండలోని టీఎస్యూటీఎఫ్ కార్యాలయంలో ఆదివారం టీఎస్యూటీఎఫ్ హసన్పర్తి మండల అధ్యక్షురాలు, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన ఎ.శోభారాణి సన్మాన సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి -
కాస్మొటిక్ చార్జీలేవీ?
భూపాలపల్లి అర్బన్: కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు(కేజీబీవీలు) పునఃప్రారంభమై మూడు నెలలు కావస్తున్నా కాస్మొటిక్ చార్జీల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. వీటిలో చదివేవారు నిరుపేద కుటుంబాల విద్యార్థులు కావడంతో అదనపు ఖర్చులకు ఎదురుచూడాల్సి వస్తోంది. ఇచ్చేదే తక్కువ.. ఆపై ఎడతెగని జాప్యంతో బాలికలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. బాలికల విద్యను ప్రోత్సహించడానికి ప్రభుత్వం సంస్కరణలు చేపడుతోంది. విద్యార్థినులకు ఎదురవుతున్న సమస్యల ద్యష్ట్యా ఇది వరకు ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్భాలు, కళాశాలల్లో ఆరోగ్య కిట్లు అందజేసింది. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లేమి, పేదరికం వల్ల ఎంతోమంది ఆనారోగ్యం బారిన పడిన నేపథ్యంలో బాలికల కోసం ప్రత్యేకంగా పరిశుభ్రత కిట్ల (కాస్మొటిక్ కిట్లు) పంపిణీకి శ్రీకారం చుట్టింది. వీటి స్థానంలో కేజీబీవీ విద్యార్థులకు మాత్రమే ప్రస్తుతం కాస్మొటిక్ చార్జీలుగా చెల్లిస్తుండగా.. ఈ ఏడాది ఎప్పుడు చెల్లిస్తారో తెలియకుండా పోయింది. గతేడాదికి సంబంధించి ఇంకా కొంతమందికి నిధులు జమకాలేదు.ఆరోగ్య కిట్ల నుంచి ఖాతాల్లో జమ వరకు..జిల్లాలోని 12 కేజీబీవీల్లో 2700 మంది విద్యార్థినులు చదువుతున్నారు. ఒక్కొక్కరికి కాస్మొటిక్ చార్జీల రూపేణ ప్రభుత్వం నెలకు రూ.175, రూ.275 ఖాతాల్లో జమచేస్తోంది. ఇది కూడా సకాలంలో జమ చేయకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది వరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు, కేజీబీవీలు, మోడల్ స్కూల్లలో ఆరు నుంచి ఇంటర్ వరకు విద్యార్థినులకు ఆరోగ్య కిట్లు అందజేసేవారు. కేజీబీవీలు, తర్వాత కాలంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థినులకు దశలవారీగా ఆరోగ్య కిట్లు అందజేశారు. మూడు నెలలకోసారి ఈ కిట్లు అందించారు. గత రెండేళ్ల నుంచి 16రకాల వస్తువులకు నగదు చెల్లిస్తున్నారు.నగదు.. ఆరోగ్యకిట్లు.. నగదుబాలికల ఆరోగ్య సమస్యలను దూరం చేయడానికి 2017–18 విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వం 16రకాల వస్తువులతో ఆరోగ్య కిట్లు అందజేసింది. గతంలో నెలకు రూ.100 చొప్పున అందజేసేవారు. తర్వాత కాలంలో నగదుకు బదులు ఆరోగ్య పరిశుభ్రత కిట్లు పంపిణీ చేసింది. ప్రస్తుతం మళ్లీ విద్యార్థినుల బ్యాంకు ఖాతాల్లో రూ.100 జమ చెల్లించారు. ఓసారి నగదు, మరోసారి ఆరోగ్య కిట్లు అంటూ గందరగోళంలోకి నెడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఒక్క కొబ్బరి నూనె డబ్బాకు రూ.100కు పైగా ఉంది. టూత్పేస్ట్ నెలకు సరిపడా కొనుగోలు చేయాలంటే రూ.100కు తగ్గదు. దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వం అందించే డబ్బులు ఏ మూలకు సరిపోతాయో తెలియని పరిస్థితి. ఇది వరకు ఇచ్చిన ఆరోగ్య కిట్టు విలువ దాదాపు రూ.750పై మాట. ఈ లెక్కన ప్రభుత్వం అందజేసే రూ175, రూ.275 నగదుతో ఆరోగ్య కిట్లు కొనడం ఎలా అనేది అధికారులకే తెలియాలి.ఖాతాలు తెరిస్తేనే..కాస్మొటిక్ చార్జీల జమకు ఖాతాలు తెరిపించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తి స్థాయిలో కానట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఇప్పటికిప్పుడు చార్జీలు విడుదల చేస్తే ఖాతాలు తెరవని వారికి లేనట్లే. గత ఏడాదికి సంబంధించి ఇంకా కొందరికి సాంకేతిక కారణాలతో జమ కాలేదని తెలుస్తోంది. దీంతో నెలనెలా అవసరమయ్యే న్యాప్కిన్లు కొనుక్కోలేని పరిస్థితి ఎదురవుతోంది. ప్రభుత్వం ప్రతి నెలా సానిటరీ న్యాప్కిన్లతో పాటు పలు వస్తువులతో కూడిన ఆరోగ్య కిట్లు అందజేయాలని విద్యార్థినులు కోరుతున్నారు.ఖాతాలు తెరిచేందుకు చర్యలుకేజీబీవీల్లో కొత్తగా చేరిన విద్యార్థినులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలు తెరిచే ప్రక్రియ చేపట్టాం. కాస్మొటిక్ చార్జీల కింద ఇచ్చే నిధులు ఈ ఏడాది ఇంకా విడుదల కాలేదు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు వారి ఖాతాల్లో నేరుగా జమఅవుతాయి. బకాయి ఉన్న వారికి అందించేలా చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు ఉన్న విద్యార్థినుల వివరాలను ప్రభుత్వానికి పంపించాం. – శైలజ, జీసీడీఓఅరకొరగా చెల్లింపులు..ఆరోగ్య కిట్లలో బాత్సోప్స్ 3, డిటర్జెంట్ సోప్స్ 3, హెయిర్ ఆయిల్ బాటిల్, షాంపోబాటిల్, పౌడర్, టూత్పేస్ట్, టంగ్ క్లీనర్, దువ్వెన, జడ క్లిప్పులు, జడ రబ్బర్లు, బొట్టుబిల్లల ప్యాకెట్, సానిటరీ న్యాప్కిన్లతోపాటు 16రకాల వస్తువులు ఉండేవి. రెండేళ్ల నుంచి వీటిస్థానంలో నెలకు రూ.100 చొప్పున ఖాతాల్లో జమ చేసేవారు. ఈ ఏడాది నుంచి 6, 7వ తరగతికి రూ.175, 8వ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థినులకు రూ.275కి పెంచి ఇచ్చేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. మూడు నెలలు కావస్తున్నా ఇంకా జమ కాలేదు. దసరా, దీపావళి ఇలా 60 రోజుల సెలవులు పోను పది నెలలకు మాత్రమే విద్యార్థి ఖాతాలో జమ అవుతాయి. -
మెడికల్ బోర్డు నిర్వాకంతో ఆందోళన
భూపాలపల్లి అర్బన్: సింగరేణి మెడికల్ బోర్డు విధానాలతో కార్మికులు ఆందోళన చెందుతున్నారని, హయ్యర్ సెంటర్ పేరుతో నిమ్స్కు పంపిన 47మంది కార్మికులను వెంటనే మెడికల్ బోర్డులో ఆన్ఫిట్ చేసి వారి పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం భూపాలపల్లి ఏరియాలోని కొమురయ్య భవన్లో బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏసీబీ, విజిలెన్స్ సోదాలని కార్మిక వర్గంలో ఇతరుల మీద సోదాలు నిర్వహించి భయాందోళనకు గురిచేస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై ఏఐటీయూసీ డైరెక్టర్తో చర్చించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో నాయకులు మాతంగి రామచందర్, గురుజపెల్లి సుధాకర్రెడ్డి, శ్రీనివాస్, విజేందర్, తాళ్ల పోశం పాల్గొన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ -
స్థానికం తర్వాతే..
పదవులకు ప్రామాణికం 2017 కటాఫ్.. మహిళలకు ప్రాధాన్యం రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్గౌడ్ హైదరాబాద్లో ఇటీవల ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ నుంచి జిల్లా ఇన్చార్జ్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావడంతోపాటు సంస్థాగత, నామినేటెడ్ పదవులపైన చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి కార్పొరేషన్లకు డైరెక్టర్లుగా నియమించేందుకు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు పేర్లు ఇవ్వాలని సూచించినట్లు తెలిసింది. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాలకు సంబంధించి 24 మంది పేర్లను ఎమ్మెల్యేలు సూచించాల్సి ఉంది. వరంగల్ అర్బన్ ప్రాంతాల్లో రెండింటితో సరిపెట్టలేమని, ఐదు వరకు ఇవ్వాలని ఎమ్మెల్యేలు మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లగా.. పరిశీలిస్తామన్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా రాష్ట్రస్థాయి డైరెక్టర్లతోపాటు జిల్లాస్థాయి నామినేటెడ్ పోస్టుల్లో మహిళలకు ప్రాధాన్యం ఉండేలా చూడాలని, 2017 సంవత్సరం కంటే ముందు నుంచి పార్టీలో ఉన్న సీనియర్ నాయకులకు కూడా మొదటి దఫాలోనే అవకాశం ఇవ్వాలని సూచించినట్లు సమాచారం. కష్టపడే నాయకులు, కార్యకర్తలకు పదవులు ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నదని, ప్రజాప్రతినిధులు సీనియర్లను ఎంపిక చేయాలని మీనాక్షి సూచించినట్లు తెలిసింది. ఈ మేరకు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు నియోజకవర్గాల వారీగా అర్హులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఇదే సమయంలో సీనియర్లు, ఆశావహులు పదవుల కోసం మళ్లీ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సాక్షిప్రతినిధి. వరంగల్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అన్ని స్థాయిల్లో సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. ఇందుకోసం ఆ పార్టీ అధిష్టానం తరచూ సమావేశాలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయి నుంచి కేడర్ కదిలించేందుకు కార్యాచరణ అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మండల, బ్లాక్, జిల్లా కాంగ్రెస్ కమిటీలు వేయాలని మొదట భావించింది. ఏప్రిల్ 24 నుంచి జిల్లాల వారీగా ఇన్చార్జ్ల ద్వారా సమావేశాలు ఏర్పాటు చేసి ఆశావహుల పేర్లను కూడా సేకరించింది. ఆ తర్వాత కొద్ది రోజులకే రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్గా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు చేపట్టడం.. పార్టీ పరంగా కొత్త మార్గదర్శకాలను రూపొందించడంతో సంస్థాగత కమిటీల ప్రస్తావన మరుగున పడింది. ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల భర్తీతోపాటు సంస్థాగత కమిటీలపై చర్చ జరుగుతుండగా.. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మార్పులు, చేర్పులు మంచిది కాదన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, రాష్ట్రస్థాయి కమిటీలకు డైరెక్టర్ల కోసం మాత్రం ఎమ్మెల్యేల ద్వారా పేర్లను సేకరించారు. పరిశీలనలో ఉన్న డీసీసీ అశావహుల పేర్లు ఇవే... వాస్తవానికి జిల్లా కాంగ్రెస్ కమిటీలను మే నాటికి పూర్తి చేయాలని అధిష్టానం భావించింది. ఈ మేరకు ఏప్రిల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను కలుపుకుని డీసీసీల నియామకానికి జిల్లాకు ఇద్దరు చొప్పున పరిశీలకులను నియమించింది. మే 20 నాటికి డీసీసీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని భావించి కసరత్తు చేశారు. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే సంస్థాగత కమిటీలు వేయాలని అధిష్టానం భావిస్తే జిల్లాల వారీగా ఆశావహుల జాబితాను మరోసారి పరిశీలించి ఖరారు చేసే అవకాశం ఉందని సీనియర్లు చెబుతున్నారు. ఇదే జరిగితే జిల్లాల వారీగా ఒక్కసారి పరిశీలిస్తే హనుమకొండ డీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ఉండగా.. ఆయన కాదంటే సీనియర్ల స్థానంలో బత్తిని శ్రీనివాస్, ఇనుగాల వెంకట్రాం రెడ్డి, పింగిళి వెంకట్రాంనర్సింహారెడ్డిలలో ఒకరికి అవకాశం దక్కవచ్చు. వరంగల్ జిల్లా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణనే కొనసాగించాలన్న ప్రతిపాదన వచ్చినా.. రాజకీయ సమీకరణలు మారితే నమిండ్ల శ్రీనివాస్, గోపాల నవీన్రాజ్, కూచన రవళిరెడ్డి పేర్లు వినిపించాయి. మహబూబాబాద్ డీసీసీ అధ్యక్షుడి విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న జె.భరత్చంద్రారెడ్డినే కొనసాగిస్తారన్న చర్చ ఉండగా.. ఇక్కడి నుంచి వెన్నం శ్రీకాంత్రెడ్డి, నునావత్ రాధ కూడా ఆశిస్తున్నట్లు చెప్తున్నారు. అయితే, డోర్నకల్, మహబూబాబాద్, ఎమ్మెల్యేలు రామచంద్రునాయక్, మురళీనాయక్తోపాటు సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి నిర్ణయం కీలకంగా కానుంది. జయశంకర్ భూపాలపల్లి డీసీసీ అధ్యక్షుడిగా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న మాజీ మావోయిస్టు నేత గాజర్ల అశోక్, చల్లూరి మధు తదితరుల పేర్లు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్రెడ్డి జనగామ డీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండగా.. ఈయనను మార్చితే హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, సింగాపురం ఇందిర, మొగుళ్ల రాజిరెడ్డి, లకావత్ ధన్వంతి పేర్లు పరిశీలించారు. ములుగు జిల్లాకు కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్కే మళ్లీ అవకాశమన్న ప్రచారం జరుగగా.. మంత్రి ధనసరి సీతక్క కుమారుడు సూర్య, మల్లాడి రాంరెడ్డి, గొల్లపల్లి రాజేందర్గౌడ్, బాదం ప్రవీణ్ పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి.డీసీసీలకు కొత్త సారథులు!? బ్లాక్, మండల అధ్యక్షులు కూడా యథాతథం పునరాలోచనలో పార్టీ అధిష్టానం నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఓకే.. త్వరలో డైరెక్టర్ పోస్టుల నియామకం అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు.. నగరాల్లో ఐదు కావాలన్న ఎమ్మెల్యేలు ఇటీవలే ఉమ్మడి జిల్లాల ప్రజాప్రతినిధులతో సమావేశం -
సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరం
భూపాలపల్లి రూరల్/చిట్యాల/రేగొండ: ముఖ్య మంత్రి సహాయ నిధి నిరుపేదలకు ఒక వరమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఆదివారం భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, చిట్యాల, రేగొండలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు ఇది ఎంతో ఉపశమనం కలిగిస్తుందన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకొని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నవారికి కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీలకతీఽతంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకుంటుందని తెలిపారు. భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టయ్య, పీఏసీఎస్ చైర్మన్ నడిపల్లి వెంకటేశ్వరరావు, పార్టీ మండల అధ్యక్షులు నర్సయ్య, గుట్ల తిరుపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి మధువంశీకృష్ట, చిట్యాల మార్కెంట్ కమిటి వైస్ చైర్మన్ ఎండీ రఫీ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
హేమాచలక్షేత్రంలో సండే సందడి
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచలక్షేత్రానికి ఆదివారం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఆదివారం సెలవురోజు కావడంతో ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ తదితర సుదూర ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రి వంటి ప్రాంతాల నుంచి తరలివచ్చారు. ఉదయాన్నే గుట్టపైకి చేరుకుని ఆలయ సమీపంలోని చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలయంలోని స్వామివారిని దర్శించుకుని తిలతైలాభిషేకం పూజలో పాల్గొన్నారు. ఆలయ పూజారులు స్వామివారికి తిలతైలాభిషేకం పూజలు నిర్వహించి స్వామివారిని నూతన పట్టు వస్త్రాలతో అలంకరించి భక్తుల గోత్రనామాలతో అర్చనలు జరిపించారు. స్వామివారి విశిష్టత ఆలయ చరిత్రను వివరించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తిలతైలాభిషేకం పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకన్నారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు. ఆలయ ప్రాంగణంలో నిత్య అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించి అన్నదాన కార్యక్రమ నిర్వహణకు విరాళాలు అందజేశారు. -
నేడు కన్నెపల్లి పంపు హౌస్ సందర్శన
కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు కన్నెపల్లి పంపు హౌస్ను నేడు (సోమవారం) బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సందర్శించనున్నారు. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆధ్వర్యంలో మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, కోరుకంటి చందర్, దాసరి మనోహర్రెడ్డి, రసమయి బాలకిషన్, వోడితల సతీష్బాబు, సుంకే రవిశంకర్, మాజీ జెడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి రాకేష్ తదితరులు రానున్నారు.‘కూల్చివేతలో బీఆర్ఎస్ హస్తం’భూపాలపల్లి రూరల్: గేదెల షెడ్డు కూల్చివేతలో బీఆర్ఎస్ నాయకుల హస్తం ఉందని.. ఎమ్మెల్యేకు సంబంధంలేదని కాంగ్రెస్ 9వ వార్డు అధ్యక్షుడు అలుగం సుధాకర్, 10వ అధ్యక్షుడు అన్నమనేని గోనాల్రావు అన్నారు. ఆదివారం భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని పుల్లూరు రామయ్యపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాజకీయ కుట్రలో భాగంగానే బీఆర్ఎస్ నాయకులు ప్లాన్చేసి బాధితులైన ఓదెలు, లలిత దంపతులను పావులుగా వాడుకున్నారన్నారు. పేదల కోసం పరితపించే ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకనే చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు గడ్డం రమేష్, చెప్పాల సారయ్య, కలువల రాజయ్య, తోకల బాపురెడ్డి, భద్రయ్య, భాస్కర్, రమేష్, దేవేందర్ పాల్గొన్నారు.నియామకంమల్హర్: లంబాడీ హక్కుల పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షుడిగా మండలంలోని అడ్వాలపల్లి గ్రామానికి చెందిన హట్కార్ అక్కిరామ్ నాయక్, మండల అధ్యక్షుడిగా అజ్మీర సమ్మయ్య నాయక్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు అజ్మీరా పూల్సింగ్ నాయక్ ఆదివారం వారికి నియామక పత్రాలు అందజేశారు. తమ నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు అజ్మీరా పూల్సింగ్ నాయక్, జిల్లా అధ్యక్షుడు ముకులోత్ శ్రీనివాస్, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.పెండింగ్ వేతనాలు చెల్లించాలిమల్హర్: మండలంలోని ఎడ్లపల్లి మోడల్ స్కూల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పూర్ణచందర్రావుకు ఆదివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఐదు నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలను తక్షణమే చెల్లించాలని కోరారు. ఐదు నెలలుగా జీతాలు సక్రమంగా రాక కుటుంబ పోషణ భారంగా మారుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో ఫిజికల్ డైరెక్టర్ పక్కల రాజబాబు, కంప్యూటర్ ఆపరేటర్ రాజేంద్రప్రసాద్, ఆఫీస్ సబార్డినేటర్ కనుకుల చంద్రయ్య, నైట్ వాచ్మన్ వేల్పుల మధునయ్య పాల్గొన్నారు.రాజబాబు గౌడ్కు సన్మానంకాళేశ్వరం: జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు గౌడ్ను వారి స్వగహంలో కాళేశ్వరం గౌడ సంఘం మాజీ అధ్యక్షుడు కొండ్ర శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సన్మానించారు. మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. సామాజిక వర్గానికి చైర్మన్ పదవి ఇవ్వడం సంతోషకరమన్నారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, యువ నాయకుడు దుద్దిళ్ల శ్రీనుబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఉపాధ్యక్షుడు పొన్నం లింగయ్య గౌడ్, గంట వెంకటస్వామి గౌడ్, బైరి రాజబాబు గౌడ్, దూది వెంకటస్వామి గౌడ్, సదాశివ్గౌడ్ పాల్గొన్నారు. -
రుద్రేశ్వరున్ని దర్శించుకున్న జైళ్ల శాఖ డీజీపీ
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయాన్ని తెలంగాణ జైళ్ల శాఖ డీజీపీ సౌమ్యమిశ్రా ఆదివారం సందర్శించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, అర్చకులు మంగళవాయిద్యాలతో ఘనంగా స్వాగతించారు. డీజీపీ సౌమ్యమిశ్రా ముందుగా ఉత్తిష్ట గణపతిని దర్శించుకుని రుద్రేశ్వరస్వామికి లఘన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించుకున్నారు. అనంతరం ఆలయ నాట్యమండపంలో ఉపేంద్రశర్మ తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాలు, మహదాశీర్వచనం అందించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను వరంగల్ జిల్లాలో పనిచేసినప్పుడు చాలా సార్లు వేయిస్తంభాల ఆలయాన్ని సందర్శించినట్లు తెలిపారు. స్వామివారిని దర్శించుకుంటే కొంత మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ఆలయ ఈఓ అనిల్కుమార్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. అనంతరం భద్రకాళి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆమె వెంట వరంగల్ ఏసీపీ నాగరాలె శుభం ప్రకాశ్ ఉన్నారు. -
దిల్ఖుష్ దోస్తానా
ఆడపిల్లల్లో స్నేహితుడిని చూసుకుంటూ.. కేసముద్రం: బాల్యమిత్రుడు మృతి చెందాడు. అతని ఇద్దరు కూతుళ్లు అనాథలయ్యారు. ఆ ఆడబిడ్డల్లో స్నేహితుడిని చూసుకుంటున్నారు కేసముద్రం మున్సిపల్ కేంద్రానికి చెందిన ఎస్వీవీ హైస్కూల్కు చెందిన 1996–97 ఎస్సెస్సీ బ్యాచ్ మిత్రులు. మండలంలోని వెంకటగిరి గ్రామానికి చెందిన గాండ్ల అశోక్కు ఇద్దరు కుమార్తెలు. మొదటి భార్యకు కూతురు పుట్టగానే ఆమె మృతిచెందింది. ఆతర్వాత రెండో వివాహం చేసుకున్నాడు. కాగా.. రెండో భార్యకు మరో కూతురు జన్మించగానే అశోక్ చనిపోయాడు. తండ్రిని కోల్పోయిన ఆ ఇద్దరు చిన్నారుల పరిస్థితి దయనీయంగా మారింది. స్పందించిన ఎస్సెస్సీ బ్యాచ్ పూర్వవిద్యార్థులు ఆ ఇద్దరు ఆడపిల్లల పేరుమీద సుకన్య సమృద్ధి యోజన కింద ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేయించారు. ఏటా రూ.45వేల ఫీజు చెల్లిస్తూ పెద్దకూతురు శివానిని(6వ తరగతి) నర్సంపేటలోని ఓప్రైవేట్ పాఠశాలలో చదివిస్తున్నారు. వారు చదువుకున్నంత కాలం తాము చదివిస్తామని బాల్యమిత్రులు చెబుతున్నారు. ● కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్న స్నేహితులు ● ఆర్థికంగా ఆదుకుంటున్న పూర్వ విద్యార్థులు ● ఆదర్శంగా నిలుస్తున్న ఉమ్మడి జిల్లా దోస్తులు నేడు ఫ్రెండ్షిప్ డేలింగభేదాలకు అతీతం.. కులమతాలకు వ్యతిరేకం.. కష్టాల్లో గుండె నిబ్బరం. రంగుల కలలను రంగరించే ప్రత్యేక లోకం. అదే స్నేహ బంధం దృగంతాలను చుట్టి రావాలన్నా.. అంబరాన్ని అందుకోవా లన్నా.. సందర్భమేదైనా జిందగీలో దోస్తానా అనేది ఉంటే.. దిల్.. జిగేల్ అనాల్సిందే! అలాంటి స్నేహ మాధుర్యానికి నేడు (ఆదివారం) స్నేహితుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ అక్షర రూపం ఇచ్చింది. స్నేహితం.. సేవే అభిమతం తొర్రూరు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1984–85 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు ఆపదలో స్నేహితులకు ఆర్థిక చేయూతనిస్తూ ఆసరాగా నిలుస్తున్నారు. తీవ్ర అనారోగ్యం బారిన పడి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మిత్రుడు చాట్ల సంపత్ను బతికించాలని రూ.1.3 లక్షలు సమీకరించి చికిత్స అందించారు. కంఠాయపాలెం గ్రామానికి చెందిన ఆర్ఎన్ చారి అనారోగ్యం బారిన పడి ఆర్థికంగా చితికిపోగా.. గుర్తించిన మిత్రులు రూ.50 వేలు జమ చేసి అందించారు. పదో తరగతి మిత్రుడు నాగేశ్వరావు ఆర్టీసీ కండక్టర్గా పనిచేస్తుండగా.. బస్సు ప్రమాదంలో అతడి కాళ్లు విరిగాయి. ఆరు నెలలు డ్యూటీ లేకుండా ఇంట్లోనే ఉండడంతో అతడి కూతురు చదువుకు ఫీజు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో మేమున్నామంటూ సహచర పదో తరగతి మిత్రులు రూ.70 వేలు అందించారు. స్నేహితుల సంఘం! గీసుకొండ: గ్రేటర్ వరంగల్లోని 16వ డివిజన్ ధర్మారంలోని కోట మెసమ్మ తల్లి పరపతి సంఘం (స్నేహితుల సంఘం) ఆదర్శంగా నిలుస్తోంది. 2014 ఆగస్టు 15న తొమ్మిది మంది స్నేహితులు కలిసి ఏర్పాటు చేసిన సంఘంలో ప్రస్తుతం 24 మంది సభ్యులున్నారు. రూ. 50 లక్షల టర్నోవర్తో సంఘం లావాదేవీలు నిర్వహిస్తోంది. అవసరం ఉన్నసభ్యులకు రూ.0.5 వడ్డీతో రుణాలిస్తున్నారు. సంఘ సభ్యులెవరైనా మరణిస్తే వారి కుటుంబానికి రూ.లక్ష సాయం అందిస్తున్నారు. ఏటా ఫ్రెండ్ షిప్ డే రోజున సంఘ వార్షికోత్సవం నిర్వహిస్తున్నారు. కోటమైసమ్మ తల్లికి గొర్రెలను బలిచ్చి విందు చేసుకుంటూ ఆనందంగా గడుపుతున్నారు.బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ హన్మకొండ: సమాజానికి సేవ చేయాలనే సదుద్దేశంతో 10 మందితో మొదలైంది బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్. ప్రస్తుతం వేయి మందితో నడుస్తోంది. ఆర్థిక సమస్య కారణంగా ఎవరూ చదువు మధ్యలోనే ఆపేయవద్దనే లక్ష్యంతో ఈ ఫౌండేషన్ను ఏర్పాటు చేశారు ప్రభుత్వ ఉపాధ్యాయుడు పులి దేవేందర్, డిప్యూటీ తహసీల్దార్ పతంగి భాస్కర్తో పాటు మరికొంత మంది మిత్రులు. 2020లో మొదలైన ఈ ఫౌండేషన్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పేద విద్యార్థులకు ఆర్థికసాయం, పాలిసెట్ బుక్స్ పంపిణీ, పోటీ పరీక్షల పుస్తకాలు, మెటీరియల్ అందజేత, తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఆర్థిక సహాయం. పేద విద్యార్థుల ఉన్నత చదువులకు భరోసా కల్పిస్తూ వారికి ఆర్థిక చేయూతనందిస్తూ ముందుకుసాగుతోంది. -
సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం
● ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబుమల్హర్: రైతులకు సౌకర్యాలు, గౌరవం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శనివారం మండలంలోని తాడిచర్ల గ్రామంలో రూ.50 లక్షల వ్యయంతో అధునీకరణ చేసిన సహకార సంఘ కార్యాలయం, గోదాం భవనం, రూ.25 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రంథాలయ భవనం రూ.7.80 లక్షలతో ఆర్అండ్బీ రోడ్డు నుంచి రైతు వేదిక వరకు నిర్మించనున్న సీసీ రోడ్డును, రూ.3.5 లక్షలతో పీఏసీఎస్ ఆర్చిగేట్ను మంత్రి శ్రీధర్బాబు ప్రారంభించారు. రూ.12 లక్షలతో వ్యయంతో నిర్మించనున్న తహసీల్దార్ కంపౌండ్ వాల్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. సహకార సంఘం కార్యాలయం ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రాంత రైతులకు బ్యాంకు సేవలు, వ్యవసాయ రుణాల మంజూరు సులభతరం అవుతుందన్నారు. తాడిచర్ల జూనియర్ కాలేజీలో చదువుకున్న విద్యార్థులు ప్రధానంగా బాలికలు పట్టణాలకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించడం అభినందనీయమన్నారు. అధునాతన హంగులతో గ్రంథాలయం ఏర్పాటు ద్వారా విద్యార్థులకు, ప్రజలకు పోటీ పరీక్షలకు అవసరమైన మెటీరియల్ వనరులు అందుబాటులో ఉంచాలని సూచించారు. పెద్ద తాడిచర్ల డేంజర్ జోన్ (ఇండ్ల సేకరణ) సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మ, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, సింగిల్ విండో చైర్మన్ ఇప్ప మొండయ్య, సహకార అధికారి వాలియా నాయక్, వ్యవసాయ అధికారి బాబూరావు, మహాదేవపూర్ ఏడీఏ శ్రీవ్యాల్, తహసీల్దార్ రవి పాల్గొన్నారు. -
నీతి ఆయోగ్లో జిల్లాకు రెండో స్థానం
భూపాలపల్లి: నీతి ఆయోగ్లో జిల్లా రెండో స్థానం దక్కించుకుంది. నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆస్పిరేషనల్ జిల్లాలు, ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాంలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన జిల్లాలు, మండలాలను ఎంపిక చేసి శనివారం హైదరాబాద్లోని రాజ్భవన్లో అవార్డులను ప్రదానం చేశారు. సంపూర్ణత అభియాన్ విభాగంలో మెరుగైన ఫలితాలు సాధించి జిల్లా రెండవ స్థానం దక్కించుకోగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా కలెక్టర్ రాహుల్ శర్మ అవార్డు అందుకున్నారు.స్ట్రాంగ్ రూం ఏర్పాటుకు ప్రతిపాదనలుకాటారం: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి కాటారం మండల కేంద్రంలో ఈవీఎంలు భద్రపర్చడం కోసం స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు అదనపు కలెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. శనివారం సబ్ కలెక్టర్ కార్యాలయం ఆవరణలోని గదులను అదనపు కలెక్టర్ పరిశీలించారు. పరిసరాలు, గదుల సంఖ్య, సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యుత్, ఇతరత్రా సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. అదనపు కలెక్టర్ వెంట ఎంపీడీఓ బాబు, పంచాయతీ కార్యదర్శి షగీర్ఖాన్ ఉన్నారు.సూపరింటెండెంట్గా ఉమేశ్వరిభూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి చీఫ్ నర్సింగ్ సూపరింటెండెంట్గా డి.ఉమేశ్వరి నియమితులయ్యారు. భద్రాది కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్గా విధులు నిర్వర్తిస్తున్న ఉమేశ్వరికి చీఫ్ నర్సింగ్ సూపరింటెండెంట్గా పదోన్నతి లభించింది. దీంతో బదిలీపై భూపాలపల్లి వచ్చి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి నర్సింగ్ సిబ్బంది ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్స్, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్స్ పాల్గొన్నారు.మున్సిపల్ సిబ్బంది కమిటీ ఎన్నికభూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి మున్సిపాలిటీ కార్యాలయ సిబ్బంది, కార్మికుల కమిటీని శనివారం ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షుడిగా సంకటి సదయ్య, ఉపాధ్యక్షుడిగా కల్లెపల్లి తిరుపతి, ప్రధాన కార్యదర్శిగా నగవత్ రాజేందర్ (బద్రి), కోశాధికారిగా రాపర్తి జంపయ్య, గౌరవ అధ్యక్షులుగా బండారి బాబు, నన్నపు ప్రకాశ్, ముఖ్య సలహాదారులుగా ఓరుగంటి రాజేందర్, జనగాని వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులుగా అల్లూరి మంజుల, ఏకు సునీత, అంతడుగుల సతీష్లకు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ బిర్రు శ్రీనివాస్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు, సిబ్బంది పాల్గొన్నారు.‘అదనపు రుసుము వసూలు చేస్తే చర్యలు’కాటారం: మీ సేవ ద్వారా రుసుము అదనంగా వసూలు చేస్తే చర్యలు తప్పవని ఈడీఎం శ్రీకాంత్ హెచ్చరించారు. మండలకేంద్రంలోని మీ సేవ కేంద్రాలను శనివారం ఈడీఎం తనిఖీ చేశారు. మీ సేవల్లో అందుబాటులో ఉన్న సేవలు, సౌకర్యాలపై ఆరాతీశారు. రికార్డులను పరిశీలించారు. పౌర సేవలకు సంబంధించిన ధరల పట్టికను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలను నిరంతరంగా అందించాలని సూచించారు. మీ సేవకు వచ్చే ప్రజల పట్ల మర్యాదగా నడుచుకోవాలని వారి సమయం వృథా చేయవద్దని ఈడీఎం పేర్కొన్నారు. -
మెరుగైన వైద్యసేవలు అందించాలి
మల్హర్: ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ రాహుల్శర్మ వైద్య సిబ్బందిని ఆదేశించారు. శనివారం మండలంలోని తాడిచర్ల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ఆస్పత్రికి వచ్చిన రోగులతో నేరుగా మాట్లాడి అందిస్తున్న వైద్యం, మందుల లభ్యత, సిబ్బంది హాజరు, వైద్య సేవల పని తీరు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న మందుల స్టాక్, శానిటేషన్ పరిస్థితులు, రికార్డుల నిర్వహణ, ఓపీ రిజిస్టర్ తదితర అంశాలను సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రి సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, వైద్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ -
ఆడపిల్లలకు ఆర్థిక చేయూత
ఖానాపురం: మండల కేంద్రంలోని హైస్కూల్లో 1996–97లో విద్యార్థులు పదో తరగతి పూర్తి చేసుకున్నారు. వీరంతా మూడేళ్ల క్రితం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించుకున్న సమయంలో వాట్సాప్ గ్రూప్ను క్రియేట్ చేసుకున్నారు. వీరితో పాటే 6 నుంచి 9వ తరగతి చదివిన వారిని సైతం ఇదే గ్రూప్లో యాడ్ చేసుకున్నారు. ప్రస్తుతం సుమారు 50 మందితో గ్రూప్ సాగుతోంది. గ్రూపులో ఎవరికి ఏ కష్టమొచ్చినా తామున్నామనే భరోసాను కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 14 మంది స్నేహితుల కుమార్తెల వివాహాలకు ఆర్థిక సాయం అందించారు. వివాహ సమయాల్లో కలుసుకుని ఆనందంగా గడుపుతున్నారు. -
ఆఖరి మజిలీకి చచ్చే చావు..!
జయశంకర్ భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఏలేటి రామయ్యపల్లి గ్రామానికి చెందిన వృద్ధుడు కొత్తూరి రాజిరెడ్డి (90) గురువారం మృతి చెందాడు. అంత్యక్రియలు నిర్వహించాల్సిన వైకుంఠధామం గ్రామ శివారులోని చలివాగు పక్కన ఉంది. కానీ, పొలాల వెంబడి దారంతా బురద, గుంతలమయం కావడంతో శుక్రవారం అంత్యక్రియల నిర్వహణకు బంధువులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్డు సక్రమంగా లేకపోవడంతో మృతుని బంధువులు కొద్దిదూరం వెళ్లి ఆగిపోయారు. ‘ఆ నలుగురు’మాత్రమే అష్ట కష్టాలు పడి శవాన్ని వైకుంఠధామానికి చేర్చి అంత్యక్రియలు నిర్వహించారు. వైకుంఠధామాలకు రోడ్డు సక్రమంగా వేయించలేని పాలకులు.. పల్లెలను ఎలా అభివృద్ధి చేస్తారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తిని పంచుకుని అమ్మను గెంటేశారుమద్దూరు: ఆస్తి మొత్తం లాక్కొని.. వృద్ధాప్యంలో ఉన్న తల్లిని ఇంటి నుంచి గెంటేశారు కుమారులు. దీంతో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న ఆ తల్లి.. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నానని, న్యాయం చేయాలంటూ అధికారులను ఆశ్రయించింది. ఈ ఘటన మద్దూరు మండలం ఖాజీపూర్లో శుక్రవారం చోటుచేసుకుంది. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని ఖాజీపూర్ గ్రామానికి చెందిన 83 ఏళ్ల నాగమ్మ, వడ్ల రాములు భార్యాభర్తలు. వీరికి భీములు, వెంకటయ్య, చంద్రమౌళి, ఒక కూతురు లక్ష్మమ్మ ఉన్నారు. భర్త వడ్ల రాములు ఐదేళ్ల క్రితం మృతిచెందాడు. దీంతో ఆయన పేరుమీద ఉన్న 14 ఎకరాల భూమితో పాటు, రూ.4 లక్షల నగదును గ్రామ పెద్దల సమక్షంలో పంపకాలు చేపట్టారు. నాగమ్మకు రూ.40 వేలు అందజేసి భూమి, మిగిలిన డబ్బులను కుమారులకు పంచారు. అయితే తల్లి నాగమ్మను ముగ్గురు కుమారులు ఏడాదికి ఒకరు చొప్పున చూసుకోవాలని పెద్దలు చెప్పినా, భూములు, డబ్బులు చేతికందడంతో నాగమ్మను ఇంట్లో నుంచి గెంటేశారు కుమారులు. దీంంతో నాగమ్మ భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం అనారోగ్యానికి గురికావడంతో కుమారులను ఆశ్రయించగా, తల్లిపై జాలి లేకుండా నానా మాటలు తిట్టి పంపించారు. దీంతో తనకు న్యాయం చేయాలని, భర్త ఆస్తి తనకు దక్కేలా చూడాలని ఆ తల్లి తహïసీల్దార్ మహేశ్గౌడ్ను ఆశ్రయించింది. -
బైపాస్ రోడ్డు మంజూరు చేయాలి
భూపాలపల్లి: వేలాది వాహనాలతో నిత్యం రద్దీగా మారిన భూపాలపల్లి పట్టణానికి బైపాస్ రోడ్డు మంజూరు చేయాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య శుక్రవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరిని కోరగా సానుకూలంగా స్పందించారు. కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ కావ్య... భూపాలపల్లి పట్టణంలో ప్రధానంగా సింగరేణి, కేటీపీపీ పరిశ్రమల మూలంగా ఎన్హెచ్ 353సీ మీద వాహనాల రద్దీ పెరిగి పట్టణంలో నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వెల్లడించారు. గడిచిన మూడేళ్లలో 576 ప్రమాదాలు జరిగి 233 మంది చనిపోయారని తెలిపారు. రూ.250 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న భూపాలపల్లి బైపాస్ రోడ్డులో రూ.175 కోట్లు నిర్మాణ పనులకు, రూ.75కోట్లు భూసేకరణకు వినియోగించాలని కోరారు. ఇందుకు స్పందించిన కేంద్ర మంత్రి.. వచ్చే వార్షిక ప్రణాళికలో నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చినట్లు ఎంపీ కావ్య వెల్లడించారు.కేంద్ర మంత్రిని కోరిన వరంగల్ ఎంపీ కావ్య -
మళ్లీ మొఖం చాటేసిన వానలు
భూపాలపల్లి: ఈ ఏడాది వర్షాలు అన్నదాతలను ఆందోళన కలిగిస్తున్నాయి. సకాలంలో వర్షాలు పడ క, లోటు వర్షపాతం నమోదు కావడం, చెరువులు, కుంటల్లోకి చుక్కనీరు చేరకపోవడంతో పంటల సా గుకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నా యి. పత్తికి వర్షాలు అనుకూలంగా కురుస్తున్నప్పటికీ వరి, మిర్చి పంటల సాగు ఆలస్యమవుతోంది.లోటు వర్షపాతమే..జిల్లాలో ఈ ఏడాది వానాకాలంలో ప్రధానంగా వరి 1,12,218, పత్తి 93,823, మిర్చి 28వేల ఎకరాల్లో సాగు అవుతుందని వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు అంచనా వేశారు. జూన్ నెలలో మోస్తారు వర్షాలు కురవగా, జూలైలో మూడు, నాలుగవ వారాల్లో సాధారణ, లోటు వర్షపాతం నమోదైంది. జూలైలో జిల్లావ్యాప్తంగా సగటున 16 రోజుల పాటు వర్షం కురిసినట్లుగా నమోదైనప్పటికీ చిరుజల్లులు మాత్రమే కురిశాయి. మహదేవపూర్, మహాముత్తారం, కాటారం, మల్హర్, కొత్తపల్లిగోరి మండలాల్లో సాధారణం కంటే తక్కువ వర్షం కురిసింది. గడిచిన మూడు రోజులుగా వాతావరణం వేడెక్కి సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. దీంతో వర్షాలు కురుస్తాయా లేదా పంటల సాగు ఎలా అని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.చెరువుల్లో కనిపించని నీరు..వర్షాకాలం ప్రారంభం నుంచి కురిసిన వర్షాలకు జిల్లాలోని ఏ ఒక్క రిజర్వాయర్, చెరువు కూడా నిండలేదు. చిన్న, చిన్న కుంటలు నిండినప్పటికీ ఆయకట్టులో పెద్దగా సాగు జరిగే అవకాశం లేదు. దీంతో జలాశయాల మీద ఆధారపడి సాగుచేసే రైతులు వరణుడి కరుణ కోసం ఎదురు చూస్తున్నారు.మిర్చి, వరి సాగుపై తీవ్ర ప్రభావం..ఈ ఏడాది సీజన్ ప్రారంభం నుంచి భారీ వర్షాలు కురవకపోవడంతో వరి, మిర్చి పంటల సాగు ఆలస్యం అవుతోంది. జూన్, జూలై నెలల్లో కురిసిన వానలు పత్తి పంటలకు అనుకూలంగా మారాయి. ఆ వర్షాలకు వడ్లు అలికి వరిసాగుకు సిద్ధంగా ఉన్న రైతులు మాత్రం నిరాశ చెందుతున్నారు. సరిపడా వర్షాలు పడకపోవడంతో ఇప్పటికీ వరినాట్లు వేసేందుకు వెనుకంజ వేస్తున్నారు. బోర్లు, బావులు, చెరువులు, కాల్వల కింద ఉన్న రైతులు ధైర్యంచేసి వరి నాట్లు వేస్తుండగా వానల మీద ఆధారపడే రైతులు ఇంకా నాట్లు వేయడం లేదు. దీంతో నారు ముదిరి రంగు మారిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మిర్చి సాగుచేసే రైతులు గింజలు అలుకగా అవి మొక్క దశలో ఉన్నాయి. మరిన్ని వర్షాలు కురిస్తే మిర్చి మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నారు.ఇప్పుడిప్పుడే వరినాట్లు ..గత నెలలో కురిసిన వర్షాలకు చిన్నచిన్న చెరువులు నిండాయి. వర్షాలతో పత్తి పంటలకు ఇబ్బంది లేదు. రైతులు గడిచిన పది రోజులుగా వరినాట్లు ప్రారంభించారు. మరిన్ని వర్షాలు పడితే వరి సాగుచేసే రైతులంతా నాట్లు వేసే అవకాశం ఉంది. జిల్లాలో ఈ నెలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపినందున రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.– వీరునాయక్, డీఏఓ -
ఓరుగల్లు ఖ్యాతి.. జాతీయస్థాయికి
● జిల్లావాసి కాసర్ల శ్యామ్కు నేషనల్ అవార్డు ● ఉత్తమ లిరిక్రైటర్గా గుర్తింపు ● హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లావాసులుహన్మకొండ కల్చరల్ : ఓరుగల్లు ఖ్యాతి జాతీయస్థాయిలో మారుమోగింది. ‘ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మతీరు కొంగులోనా దాసిపెట్టి కొడుకుకు ఇచ్చేప్రేమ వేరు’.. అంటూ పొద్దుపొడిచినప్పటినుంచి పల్లెటూరి బంధాలు, అనుబంధాలు, వాతావరణాన్ని వినసొంపుగా పాటరూపంలో బలగం సినిమాకు అందించిన కాసర్ల శ్యామ్కు శుక్రవారం బెస్ట్ లిరిక్స్ కేటగిరిలో నేషనల్ అవార్డు ప్రకటించారు. హనుమకొండలోని బ్రాహ్మణవాడకు చెందిన కాసర్ల శ్యామ్ జానపద పాటలు పాడటం, రాయడంలో నేర్పరి. ఈ నేపథ్యంలో జిల్లావాసికి అవార్డు రావడంతో పలువురు కళాకారులు, జిల్లావాసులు హర్షం వ్యక్తం చేశారు.ఎంతో సంతోషంగా ఉంది.. నేషనల్ అవార్డు రావడం సంతోషంగా ఉంది. ముందుగా బలగం టీముకు ధన్యవాదాలు తెలుపుతున్నా. పాటకు భీమ్స్ సంగీతంపాటు మంగ్లీ, రామ్ మిర్యాల వాయిస్లు తోడుకావడం వల్ల సంపూర్ణత్వం వచ్చింది. చిన్నతనంలో పల్లెటూర్లు తిరిగాను. పాట వింటేనే పల్లెటూరి జీవనం గుర్తుకు వచ్చేలా రాయాలని అనుకున్నా. తెలంగాణ పల్లెటూర్లలో నివసించే ప్రజలు తెల్లవారుజాము 4గంటలకే లేచి, వారు చేసే పనులు, మనుషుల మధ్య ప్రేమానుబంధాలను గుర్తు చేసుకుంటూ పాటరూపంలో రాశా. – కాసర్ల శ్యామ్, పాటల రచయిత -
కోడి‘గుడ్’..విధానం!
సరఫరాలో అక్రమాలను అరికట్టేందుకే ‘ఆన్లైన్’ ప్రక్రియసాక్షిప్రతినిధి, వరంగల్: ప్రభుత్వ విద్యాలయాల్లో కోడిగుడ్ల పంపిణీకి టెండర్ల ప్రక్రియ తుది దశకు చేరింది. అర్హులైన కాంట్రాక్టర్ల ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గిరిజన సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలకు ఆగ్మార్క్ నియమాల ప్రకారం కోడిగుడ్ల సరఫరా చేయనునన్నారు. ఈ మేరకు ఆరు జిల్లాల్లో 2025–26 సంవత్సరానికి గాను 7,33,49,825 కోడిగుడ్లు సరఫరా కోసం రూ.40,59,89,637లు ప్రతిపాదించారు. జిల్లాల వారీగా కలెక్టర్ల పర్యవేక్షణలో ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్లు ఈ టెండర్ల ప్రక్రియ నిర్వహించనున్నారు. జేఎస్ భూపాలపల్లి మినహా మిగతా ఐదు జిల్లాల్లో ఈ–ప్రొక్యూర్మెంట్ ద్వారా గతనెల 23 నుంచి ఆన్లైన్ టెండర్లు ఆహ్వానించారు. ఐదు జిల్లాల్లో ఈ నెల 6 నుంచి 12 వరకు టెండర్ షెడ్యూల్లు దాఖలు చేయడానికి చివరి తేదీలుగా ప్రకటించారు. ఆయా జిల్లా కేంద్రాల్లో కాంట్రాక్టర్లతో కలెక్టర్లు ఫ్రీ బిడ్ సమావేశాలు కూడా నిర్వహించారు. ఒక్కో జిల్లాల్లో ఒక్కో రేటు... ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో ఒక్కో జిల్లాలో ఒక్కో రేటును ప్రతిపాదించారు. 45–52 గ్రాముల బరువు గల కోడిగుడ్లను సరఫరా చేసేందుకు ఈ ధరలను అధికారులు నిర్ణయించారు. హనుమకొండ జిల్లాలో 1,31,14,397 కోడిగుడ్లకు మొత్తం ధర రూ.6,71,45,713లుగా నిర్ణయించగా సగటును ఒక్కో కోడిగుడ్డు ధర రూ.5.12లుగా ఉంది. వరంగల్ జిల్లాలో 1,40,76,730 కోడిగుడ్లకు రూ.7,89,70,455లు అవుతుండగా ఒక్కో గుడ్డు ధర సగటున రూ.5.38లు పడుతోంది. అదే విధంగా మహబూబాబాద్, ములుగు, జనగామ జిల్లాల్లో సరఫరా చేయాల్సిన కోడిగుడ్లు, కేటాయించిన డబ్బులు చూస్తే ఒక్కో గుడ్డుకు రూ.5.63లు అవుతోంది. కాగా కాంట్రాక్టర్లు ఈ టెండర్లపై ఎలా స్పందిస్తారు? ఎక్కువ రేటును కోట్ చేస్తారా? ప్రభుత్వం సూచించిన ధరలకే మొగ్గు చూపుతారా? అన్న చర్చ ఓ వైపు జరుగుతుండగా.. ఈ ఆన్లైన్ టెండర్లలోనూ కొందరు కాంట్రాక్టర్లు సిండికేట్ కడుతున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది.అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకే.. వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలకు కోడిగుడ్లు సరఫరా చేసేందుకు గతంలో జిల్లా పర్చేజింగ్ కమిటీ సిఫారసు చేసేది. కలెక్టర్ చైర్మన్గా ఉండే ఈ కమిటీ ఆగ్మార్క్ నియమాల ప్రకారం అవసరమైన కోడిగుడ్లను సరఫరా చేసేందుకు అర్హులైన కాంట్రాక్టర్లను ఎంపిక చేసేది. ఆ తర్వా త కాంట్రాక్టు పొందిన వారు కోడిగుడ్ల పరి మాణం తగ్గించి సరఫరా చేయడం, టెండర్లో పేర్కొన్న విధంగా కాకుండా తక్కువ గుడ్లను పంపిణీ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ–ప్రొక్యూర్మెంట్ విధానం ద్వారా ఆన్లైన్ టెండర్లు ఆహ్వానించింది. అర్హులైన కాంట్రాక్టర్లు బిడ్ డాక్యుమెంట్లను టౌన్లోడ్ చేసుకుని ఆన్లైన్లో బిడ్లను సమర్పించాలని నోటిఫికేషన్లో సూచించారు. సమర్పించిన బిడ్ల హార్డ్ కాపీలను ఈ నెల 6 నుంచి 12 వరకు (జిల్లాల వారీగా) జిల్లా కలెక్టరేట్/షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ కార్యాలయాలలో అందజేయాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఈ నెల 12 నుంచి 18 వరకు ఆయా జిల్లాల్లో కేటా యించిన విధంగా టెక్నికల్ బిడ్లు, ధరల బిడ్లను తెరిచి అర్హులైన వారిని ఎంపిక చేయనున్నారు. విద్యాలయాల్లో 7.33 కోట్ల కోడిగుడ్లకు.. సుమారు రూ.40.60 కోట్లు ఉమ్మడి వరంగల్లో ఐదు జిల్లాలకే టెండర్లు.. భూపాలపల్లిలోనూ త్వరలో ప్రక్రియ ఈ నెల 6 నుంచి 12 వరకు షెడ్యూల్ దాఖలు.. 12 నుంచి 18 వరకు టెండర్లు ఓపెన్ అర్హులైన వారికి కాంట్రాక్టు అప్పగింత.. ఏటా ఒక్కరికే ఇవ్వడంపై ఆరోపణలు అందుకే పాలసీ మార్చిన ప్రభుత్వం..జిల్లా సరఫరా కేటాయించిన చేయాల్సిన డబ్బులు (రూ.లలో) కోడిగుడ్లు హనుమకొండ 1,31,14,397 6,71,45,713 వరంగల్ 1,40,76,730 7,89,70,455 మహబూబాబాద్ 1,77,87,502 10,01,43,636 జనగామ 1,26,05,592 7,09,69,483 ములుగు 78,11,600 4,39,79,308 భూపాలపల్లి 79,54,004 4,47,81,042 మొత్తం 7,33,49,825 40,59,89,637 -
సరిహద్దు భూ సమస్యలను పరిష్కరించాలి
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో రెవెన్యూ, అటవీ సరిహద్దు భూ సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్హాల్లో రెవెన్యూ, అటవీశాఖ అధికారులతో కలెక్టర్ సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. కాటారం, మల్హర్, మహాముత్తారం, మహదేవపూర్ మండలాలలో రెవెన్యూ, అటవీ శాఖల మధ్య వివాదాలు ఉన్నట్లు తెలిపారు. అటవీ, రెవెన్యూ భూముల సమస్యల పరిష్కారానికి సంయుక్త సర్వే నిర్వహించి హద్దులు కేటాయించాలన్నారు. సమస్యను పరిష్కరించేందుకు ఇరువురు శాఖల అధికారులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి నవీన్రెడ్డి, అదనపు కలెక్టర్ అశోక్కుమార్, కాటారం సబ్కలెక్టర్ మయాంక్సింగ్, ఎఫ్డీఓ సందీప్రెడ్డి, ఆయా మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు. పనులను వేగవంతం చేయాలి.. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సీటీ స్కాన్ పరికరం ఏర్పాటు పనులను కలెక్టర్ రాహుల్శర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలకు సమయానుకూలంగా మెరుగైన వైద్యసేవలు అందించేందుకు సీటీ స్కాన్ పరికరం ఏర్పాటును త్వరితగతిన పూర్తిచేయాలని స్పష్టంచేశారు. పనుల్లో ఆలస్యం లేకుండా, సంబంధిత ఇంజినీరింగ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సీటీ స్కాన్ యంత్రం ఏర్పాటుతో ప్రజలకు అత్యవసర వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నవీన్కుమార్, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు. 68వేల మందికి సబ్సిడీ గ్యాస్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ను రూ.500కి అందిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్శర్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 2,36,243 లక్షల గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసి రూ.655.19 లక్షల సబ్సిడీ మంజూరు చేసినట్లు చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన గణపురం: మండలంలోని బుర్రకాయల గూడెం గ్రామంలో కలెక్టర్ రాహుల్ శర్మ ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. మండలకేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఎరువుల దుకాణం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశువుల ఆరోగ్య కేంద్రం, తహసీల్దార్ కార్యాలయంలోని భూ భారతి దరఖాస్తుల స్టోర్ రూంను పరిశీలించారు. ఇందిరమ్మ లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడారు. నిర్మాణ పనులలో జాప్యం లేకుండా నాణ్యతతో వేగవంతంగా పనులు పూర్తి చేయాలన్నారు. భూ భారతి దరఖాస్తులు పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని తహసీల్ధార్ను ఆదేశించారు. గొర్రెల వైద్య సేవలకు వచ్చిన రైతు కలెక్టర్కు గొర్రె పిల్లను బహుకరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, గృహనిర్మాణ శాఖ పీడీ లోకిలాల్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబురావు, తహసీల్దార్ సత్యనారాయణ స్వామి, ఎంపీడీఓ భాస్కర్ పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్శర్మ -
ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులోకి పాడిగేదెలు
భూపాలపల్లి: ఎమ్మెల్యే చెప్పినందుకే షెడ్డు కూలగొడుతున్నామని మున్సిపల్ అధికారులు తెలిపారంటూ.. ఏకంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి పాడిగేదెలను పంపి బాధితులు నిరసన తెలిపారు. ఈ ఘటన భూపాలపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భూపాలపల్లి పట్టణంలోని మంజూర్నగర్ కాలనీ సింగరేణి ఏరియా ఆస్పత్రి పక్కన గల స్థలంలో కూరాకుల ఓదెలు, లలిత దంపతులు గత 30 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. పాడిగేదెలు(బర్రెలు)ను సాకుతూ పాల వ్యాపారం చేసుకుంటున్నారు. రహదారిని ఆక్రమించుకొని షెడ్డు ఏర్పాటు చేసుకున్నారని, దానిని తొలగించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని నెలన్నర క్రితం రమేష్ అనే వ్యక్తి మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు నెల రోజుల క్రితం ఓదెలుకు మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అతడినుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో మున్సిపల్ కమిషనర్ బిర్రు శ్రీనివాస్ ఆదేశాల మేరకు టీపీఓ సునిల్కుమార్ గురువారం జేసీబీ సాయంతో ఓదెలు షెడ్డును కూల్చివేయించాడు. దీంతో బాధిత దంపతులు సాయంత్రం తమ పాడిగేదెలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలోకి పంపారు. తమ షెడ్డు కూల్చివేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చెప్పినట్లుగా మున్సిపల్ అధికారులు తెలిపారని, అందుకే ఎమ్మెల్యే కార్యాలయ ఆవరణలోకి గేదెలను పంపి నిరసన తెలుపుతున్నామని వెల్లడించారు. తమకు న్యాయం జరిగే వరకు గేదెలు, మేము ఇక్కడే ఉంటామని భీష్మించుకొని కూర్చున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు క్యాంపు కార్యాలయానికి చేరుకోగా ఓదెలు క్రిమిసంహారక మందు తాగేందుకు ప్రయత్నించాడు. పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం గేదెలను బయటకు పంపి ఓదెలు, లలితను అదుపులోకి తీసుకొని మాట్లాడి ఇంటికి పంపించారు. తమ షెడ్డు కూల్చారని బాధితుల నిరసన -
లాభం ఎంత..?
గత ఆర్థిక సంవత్సరం లాభాలు ప్రకటించని సింగరేణి యాజమాన్యం 69.86 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సింగరేణి సంస్థ గతంలో మారిదిగానే 2024–25 ఆర్థిక సంవత్సరం టర్నోవర్ను అధిగమించడంలో వెనుకబడింది. అనుకున్న స్థాయిలో బొగ్గు ఉత్పత్తిని సాధించలేకపోయింది. బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల సాధనలో కోల్ ఇండియాతో పోటీ పడింది. 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంకాగా.. 64.06 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించింది.● నాలుగు నెలలుగా ఎదురుచుస్తున్న కార్మికులు ● లాభాల వాటా పెంచాలని డిమాండ్ ● రూ.35 వేల కోట్లకు పైగా వ్యాపారం చేసినట్లు అంచనా భూపాలపల్లి అర్బన్: సింగరేణికి ప్రధాన బలం ఉద్యోగులేనని, విధుల్లో వారి కృషి, పట్టుదలతో సంస్థకు లాభాలు వస్తున్నాయని ప్రతిసారీ యాజమాన్యం చెబుతోంది. అందుకే ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో లేని విధంగా లాభాల్లో వాటా చెల్లిస్తూ వారిలో ఉత్తేజాన్ని నింపుతోంది. అయితే ఆర్థిక సంవత్సరం ముగిసి నాలుగు నెలలు గడిచినా నేటికీ కార్మికులకు 2024–25 ఆర్థిక సంవత్సర లాభాలను సింగరేణి యాజమాన్యం ప్రకటించలేదు. అయితే సింగరేణి సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో 59.84 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కార్మికులకు వాటా.. కోలిండియాలో సంస్థ లాభాలు సాధిస్తే అందులో కార్మికులకు వాటా చెల్లిస్తామని నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. సంస్థ బీఐఎఫ్ఆర్ పరిధిలోకి వెళ్లిన క్రమంలో సంస్థను లాభాల బాట పట్టించేందుకు అప్పటి గుర్తింపు యూనియన్ ఏఐటీయూసీతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. 1999– 2000 ఆర్థిక సంవత్సరంలో 10 శాతంతో ప్రారంభమైన లాభాల వాటా.. గత ఏడాది 32 శాతానికి చేరుకుంది. సంస్థ చరిత్రలోనే 2018–19లో అత్యధికంగా రూ.1,766 కోట్ల లాభాలు ఆర్జించింది. దీంతో కార్మికుల వాటా 28 శాతంగా ప్రభుత్వం ప్రకటించింది. ఆ ఏడాది ఒక్కో కార్మికుడికి సగటున రూ.లక్ష వరకు వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రతీ ఏడాది ఆలస్యమే..! గత ఏడాదికి సంబంధించిన ఆర్థిక సంవత్సరం ముగిసి నాలుగు నెలలు అవుతున్న ఇప్పటి వరకు కార్మికులకు రావాల్సిన లాభాలను సింగరేణి ప్రకటించలేదు. ప్రతి ఏడాది మాదిరిగానే అడిట్ పూర్తి కాలేదని సింగరేణి యాజమాన్యం సమాధానాలు చెబుతుంది. సింగరేణి సంస్థ లాభాలను ప్రకటించేందుకు ప్రతీ సంవత్సరం నాలుగైదు నెలల సమయం తీసుకుంటుంది. అధునాతన విధానాలను అమలు చేస్తూ ఆదాయ, వ్యయాలకు సంబంధించిన లెక్కలు చేస్తున్న క్రమంలో ప్రతీ ఏడాది ఇదే విధంగా ఆలస్యం చేస్తుందని కార్మికులు ఆరోపిస్తున్నారు. లాభాలు ప్రకటించి ఎప్పుడు చెల్లిస్తారో ఇప్పటి వరకు యాజమాన్యం ప్రకటించకపోవడంపై కార్మికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవ లాభాలను ప్రకటించాలి సింగరేణి యాజమాన్యం వాస్తవ లాభాలను ప్రకటించాలి. సకాలంలో కార్మికులకు అందిస్తేనే ప్రయోజనం ఉంటుంది. ప్రతి ఏడాది మాదిరిగా నామాత్రపు లాభాలు ప్రకటించొద్దు. నెలలు గడిస్తే కాని యాజమాన్యం లెక్కలు పూర్తి చేయడం లేదు. ఈసారి సంస్థ సుమారు రూ.4 వేల కోట్లకు పైగా లాభాలు సాధించి ఉంటుంది. లాభాలు ప్రకటించి కార్మికులకు 40 శాతం ప్రకటించాలి. – కంపేటి రాజయ్య, సీఐటీయూ బ్రాంచ్ కార్యదర్శిసింగరేణి లాభాలు, కార్మికులకు పంపిణీ చేసిన శాతం సంవత్సరం లాభాలు పంపిణీ శాతం (రూ.కోట్లలో)2017–18 1,200 27 2018–19 1,766 28 2019–20 993 28 2020–21 273 29 2021–22 1,227 30 2022–23 2,222 32 2023–24 2388 33