Jayashankar
-
ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా
మహాముత్తారం : లారీల ఆలస్యంతో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ఆగ్రహించిన రైతులు బుధవారం మండలంలోని బోర్లగూడెం ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు.అధికారులు వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేసి లారీల్లో తరలించాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ శ్రీనివాస్ లారీలను పంపించి ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో కులసంఘాల జేఏసీ కన్వీనర్ అజ్మీరా పూల్సింగ్, రైతులు ఠాకూర్ లక్ష్మణ్, వెంకట్రాజం, బానోత్ దేవుసింగ్, ఠాకూర్ రవి, మొగిలి రమేష్, సూరెడ్డి నర్సింహరెడ్డి, పొనగంటి రాములు, శ్రీధర్, సింగనవేని తిరుపతి, లావుడ్య రమేష్ తదితరులు పాల్గొన్నారు. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మార్క రాముగౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని వజినేపల్లి, కోనంపేట, యామన్పల్లి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కనీస సౌకర్యాలు కూడా లేవని ఆరోపించారు. రోజుల తరబడి కలాల్లో వడ్లు ఉండటంతో రైతులు పడుతున్న ఇబ్బందులను గమనించి వెంటనే అధికారులు ధాన్యాన్ని కొనుగోలు చేసి లారీల్లో తరలించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు బోర్లగూడెం సర్పంచ్ అజ్మీరా ధరమ్సింగ్, పోలారం సర్పంచ్ అంబాల రాజబాపు, మహాముత్తారం మాజీ ఎంపీటీసీ శ్రీపతి సురేష్, నాయకులు గంట కొండాల్ రెడ్డి, జంగిడి శ్రీనివాస్, అరుణ, వేణుగోపాల్రెడ్డి, రమేష్, శంకర్ తొ పాటు తదితరులు ఉన్నారు. -
మేడారంలో నార్కొటిక్స్ తనిఖీలు
ఎస్ఎస్ తాడ్వాయి : మండలంలోని మేడారంలో బుధవారం నార్లాపూర్ ఎస్సై కమలాకర్ ఆధ్వర్యంలో పోలీసులు నార్కొటిక్స్ తనిఖీ చేపట్టారు. నిషేధిత మత్తు పదార్థాల విక్రయాలను అరికట్టేందుకు స్నిఫర్ డాగ్తో విస్తృత తనిఖీ నిర్వహించారు. షాపులు, గోదాముల్లోని ప్రతి మూలన పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. మత్తు పదార్థాల రవాణా, విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని సూచించారు. అనుమానిత సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలపాలని ప్రజలను కోరారు. -
జాబ్ క్యాలెండర్ అమలుచేస్తే మరింత ఆనందం
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలకు పదేళ్ల వయోపరిమితి పెంచడం శుభపరిణామం. జీఓలో ఈ పరిమితి ఒక్క సంవత్సరానికే పరిమితం చేయడం నిరుద్యోగులకు అన్యాయమే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు. ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్నూ జారీ చేయలేదు. మరీ ఒక సంవత్సరంలో ఎప్పుడు నోటిఫికేషన్లు వేస్తారు? ఎలా భర్తీ చేస్తారు. జీఓలో వయోపరిమితి కాలాన్ని మరో ఏడాది పెంచడంతో పాటు జాబ్ క్యాలెండర్ను వెంటనే అమలు చేస్తే మరింత ఆనందం. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా 2 లక్షల పోస్టులను భర్తీ చేయాలి. – శ్రీరామోజు సురేందర్, నిరుద్యోగి, మహబూబాబాద్ -
కార్మికుల హక్కుల సాధనకు పోరాటం
భూపాలపల్లి అర్బన్ : ఒడిశా రాష్ట్రంలోని పూరి నగరంలో నిర్వహిస్తున్న ఇండియా మైన్ వర్కర్స్ ఫెడరేషన్ (ఐఎండబ్ల్యూఎఫ్) జాతీయ మహాసభల్లో భూపాలపల్లి ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు. ఈ మహాసభకు ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్, ఆసిఫ్ పాషా, కరీముల్లా, అహ్మద్ఖాన్, శ్రీనివాస్, శ్రీనివాస్ హాజరయ్యారు. మహాసభలో గని కార్మికుల సమస్యలు, హక్కుల పరిరక్షణ, సింగరేణి భవిష్యత్, ప్రైవేటీకరణ, లేబర్ కోడ్స్ వ్యతిరేక పోరాటాలు, కార్మిక సంక్షేమ అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు వారు తెలిపారు. కార్మికుల హక్కుల సాధనకు ఏఐటీయూసీ ఎల్లప్పుడూ ముందుండి పోరాడుతుందని పేర్కొన్నారు. -
ఆగని అక్రమ వసూళ్లు
టేకుమట్ల : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న కష్టాలు ఆయా కొనుగోలు కేంద్రాల్లోని ఇన్చార్జ్లకు వరంగా మారుతోంది. ధాన్యం, మొక్కజొన్నలను కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి రోజులు గడుస్తుండడంతో కాంటా కాకపోవడఽంతో పాటు, గోదాములు లేక హమాలీల కొరతతో రైతులకు నరకప్రాయంగా మారింది. ఉదయం 8 గంటలకే తట్టుకోలేని ఎండలో కొనుగోలు కేంద్రాలకు చేరుకుని కాంటాల కోసం ఎదురు చూస్తున్నారు. సకాలంలో ఆన్లైన్ కావాలన్నా, కాంటాలు కావాలంటే రైతులు తప్పని సరిగా కొనుగోలు కేంద్రాల ఇన్చార్జ్లకు ముడుపులు చెల్లించాల్సిందే. కాదంటే మరికొన్ని రోజులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యంతో పాటు, రైతులు ఉండాల్సిందే. మండలంలోని రాఘవరెడ్డిపేట, వెల్లంపల్లి, ఎంపేడు, కుందనపల్లి, వెంకట్రావుపల్లి, రామకిష్టాపూర్(వి), గర్మిళ్లపల్లి, పంగిడిపల్లిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా అన్ని కేంద్రాల్లో వసూళ్ల పర్వం యథేచ్ఛగా కొనసాగుతోంది. అందరికీ వాటాలున్నాయా..? మండలంలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో యథేచ్ఛగా వసూళ్ల పర్వం కొనసాగుతోంది. అయినా ఇప్పటి వరకు అధికారులు సెంటర్ ఇన్చార్జీలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పై స్థాయి అధికారులకు సైతం వాటాలు ఉన్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను విక్రయించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తీసుకు వస్తే వసూళ్ల దందా సాగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై అధి కారులు పెదవి విప్పకపోవడంతో వాటాల వారీగా రైతులను పీల్చుకుతింటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా డబ్బులు వసూళ్లను నిలిపివేయాలని అధికారులను రైతులు కోరుతున్నారు. రైతుల కష్టాలను ఆసరా చేసుకుంటున్న సెంటర్ ఇన్చార్జ్లు కొనుగోలు కేంద్రాల్లో యథేచ్ఛగా వసూళ్ల పర్వం పట్టించుకోని అధికారులు -
మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ
చిట్యాల : మండలంలోని కై లాపూర్లో ఉపాధి హామీ కూలీలకు బుధవారం సర్పంచ్ కోడారి ఓదెలు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. పంచాయతీ కార్యదర్శి అజీరా బేగం, ఉప సర్పంచ్ చింతల లక్ష్మీసదానందం, టెక్నికల్ అసిస్టెంట్ స్రవంతి, మేట్ రాజు, కూలీలు పాల్గొన్నారు. చలివేంద్రం ఏర్పాటు మల్హర్ (కాటారం) : కాళేశ్వరంలో నేటి నుంచి ప్రారంభం కానున్న సరస్వతి అంత్యపుష్కరాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నస్తురుపల్లి గ్రామ పంచాయతీ సమీపంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు మార్కెట్ కమిటీ చైర్పర్సర్ పంతకాని తిరుమల తెలిపారు. సరస్వతి అంత్యపుష్కరాలలో పుణ్యస్నానం ఆచరిస్తే పాప పరిహారం కలుగుతుందని, పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుందన్నారు. పుష్కరాల కాలమంతా ప్రతిరోజూ భక్తులకు చల్లని మినరల్ వాటర్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. విరమణ తప్పనిసరి భూపాలపల్లి రూరల్ : ప్రతి ఉద్యోగికి విరమణ తప్పనిసరి అని జిల్లా సహకార అధికారి వాల్య నాయక్ అన్నారు. జంగేడు పీఏసీఎస్లో స్టాఫ్ అసిస్టెంట్గా పనిచేసిన ఎం. భిక్షపతి పదవి విరమణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పాక్స్ చైర్మన్ మేకల సంపత్, జిల్లా సహకార అధికారి వాల్య నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు భిక్షపతి దంపతులను శాలువాతో సత్కరించారు. అసిస్టెంట్ రిజిస్టర్ రాజు, బ్యాంకు మేనేజర్ జీవన్, డైరెక్టర్స్ పోషయ్య, పులి వేణుగోపాల్, రవీందర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలి రేగొండ : వీఓఏల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మాధవి డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని రూపిరెడ్డిపల్లిలో వీఓఏల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమె హాజరై మాట్లాడారు. వీఓఏలకు పని భారం తగ్గించి, కనీస వేతనం అమలు చేయాలన్నారు. వీఓఏలు ఐక్యంగా ముందుకు సాగి తమ హక్కులను సాధించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల వీఓఏలు పాల్గొన్నారు. డ్రెయినేజీల్లో పూడికతీత గోవిందరావుపేట : మురుగు నీరు నిల్వ ఉండకుండా గ్రామంలో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు దుంపెల్లిగూడెం సర్పంచ్ బానోత్ సీతారాం నాయక్ అన్నారు. బుధవారం గ్రామంలో డ్రెయినేజీలో మట్టి కూరుకుపోవడంతో సీతారాం నాయక్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయితీ సిబ్బందితో పూడికతీత పనులు నిర్వహించారు.ఈ సందర్భంగా సీతారాం నాయక్ మాట్లాడుతూ.. గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. వానాకాలంలో దోమలు, అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు డ్రెయినేజీలను శుభ్రం చేస్తున్నామని అన్నారు. గ్రామ ప్రజలు కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరారు. పరామర్శ ములుగు రూరల్ : జిల్లా కేంద్రానికి చెందిన కొండ్రోజు సత్యంచారి బుధవారం అనారోగ్యంతో మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యులను నాలుగో వార్డు కౌన్సిలర్ గుంటోజు పావని నిరంజన్ పరామర్శించారు. అనంతరం సత్యం మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు. వ్యక్తి ఆత్మహత్య కన్నాయిగూడెం : భార్య చనిపోయిందన్న బెంగతో భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ సంఘటన కన్నాయిగూడెం మండలంలోని చింతగూడెం గ్రామ పరిధిలో గల గొత్తికోయగూడెంలో చోటు చేసుకుంది. ఎస్సై వెంకటేశ్ కథనం ప్రకారం.. గొత్తికోయగూడెనికి చెందిన మడవి జోగయ్య (45), భార్య గతేడాది పురుగుల మందు తాగి చనిపోయింది. అనంతరం భార్య లేదనే ఆలోచనతో కలత చెందిన భర్త జోగయ్య మంగళవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. జోగయ్య కొడుకు సమ్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
గోదాంలోకి ధాన్యం దిగుమతి
చిట్యాల : మండల కేంద్రంలోని పీఏసీఏస్ ఆధ్వర్యంలో 500 మెట్రిక్ టన్నుల నిల్వ చేసే గోదాం నిరుపయోగంగా ఉంది. దీంతో ఈ నెల 15న సాక్షి దినపత్రికలో ‘నిరుపయోగంగా పీఏసీఏస్ గోదాం’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. స్పందించి న జిల్లా అధికారులు ఎట్టకేలకు గోదాంలోకి రైతులు పండించిన ధాన్యాన్ని దిగుమతి చేసేందుకు అ నుమతించారు. చిట్యాల, మొగుళ్లపల్లికి చెందిన రై తులు తమ వాహనాల్లో ధాన్యాన్ని తీసుకువచ్చి క్యూ లో పెట్టారు. అనంతరం సంబంధిత అధికారులు హమాలీలతో దిగుమతి చేయిస్తున్నారు. కాగా సాక్షి కథనానికి స్పందించిన అధికారులకు, సాక్షికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. మిగతా ధాన్యాన్ని త్వరగా దిగుమతి చేసుకోవాలని రైతులు వేడుకున్నారు. -
అటవీశాఖ అధికారుల విచారణ
మహాముత్తారం : మండలంలోని నిమ్మగూడెం, యత్నారం మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు అమర్చిన విద్యుత్ తీగలకు తగిలి చనిపోయిన జంతువును కాల్చివేశారు. ఈ సంఘటనపై ఫ్లైయింగ్ స్క్వాడ్ డీఎఫ్ఓ జోగేందర్తోపాటు ఎఫ్డీఓ సందీప్రెడ్డి బుధవారం సంఘటన స్థలానికి చేరుకొని మహాముత్తారం పశు వైద్యాధికారి భరత్తో కలిసి కాల్చివేసిన జంతువు కళేబారం నమూనాను సేకరించి ల్యాబ్కు పంపించినట్లు తెలిపారు. నిర్ధారణ అనంతరం తదుపరి విచారణ చేయనున్నట్లు చెప్పారు. ఈ ఘటన ఆధారంగా యత్నారం గ్రామంలో కొంతమంది అనుమానితులను ప్రశ్నించగా గ్రామానికి చెందిన కోడి మాంతయ్య ఇంట్లో ఉచ్చుకు వినియోగించే విద్యుత్ తీగలు దొరికినట్లు తెలిపారు. అదే విధంగా గ్రామానికి చెందిన పుల్యాల నగేష్, రాజు, కాసిపేట కృష్టస్వామితో వెళ్లినట్లు మంతయ్య ఇచ్చిన సమాచారం మేరకు నలుగురిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాల్చిన జంతువు అటవీ జంతువా లేక గ్రామాల్లో తిరిగే జంతువా అని చెప్పలేమని తెలిపారు. నివేదిక తర్వాతనే నిర్ధారణ చేస్తామని ఎఫ్డీఓ వివరించారు. -
చదువుకు పేదరికం అడ్డుకాదు
ఎస్ఎస్తాడ్వాయి : చదువుకు పేదరికం అడ్డుకాదని తాడ్వాయి ఎస్సై కొయ్యడ జగదీశ్ అన్నారు. కల్లు గీతకార్మిక సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్షుడు గండు సదయ్య, కార్యదర్శి తిర్రి సంపత్ సమక్షంలో బుధవారం పదో తరగతి, ఇంటర్లో మెరిట్ సాధించిన గౌడ విద్యార్థులకు ప్రతిభా పురస్కార సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్సై జగదీశ్, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గుండెబోయిన రవి, కార్యదర్శి బుర్ర శ్రీనివాస్, గౌరవ అధ్యక్షుడు పులి నర్సయ్య హాజరయ్యారు. కాటాపూర్, నార్లపూర్, వెంగ్లాపూర్, తాడ్వాయి గ్రామాలకు చెందిన 12 మంది విద్యార్థులను సన్మానించి మెమోంటోలు అందజేశారు. అనంతరం కల్లుగీత కార్మిక సంఘం నాయకులు ఎస్సై జగదీశ్ను శాలువాతో సన్మానించారు. రంగు సత్యనారాయణ, పాలకుర్తి బాబు, నర్సయ్య, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
భక్తులకు లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు
● దేవాదాయ శాఖ కార్యదర్శి శైలజా రామయ్యర్ కాళేశ్వరం : కాళేశ్వరంలో నేటి నుంచి జూన్ 1వ తేదీ వరకు 12 రోజులపాటు కొనసాగే శ్రీసరస్వతి అంత్య పుష్కరాలుశ్రీ భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా వైభవంగా నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ కార్యదర్శి శైలజా రామయ్యర్ తెలిపారు. బుధవారం దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ధార్మిక సలహాదారు గోవిందహరితో కలిసి సరస్వతి ఘాట్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్న గోదావరి తీరం, మ్యూజియం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం పరిధిలో జరిగే ఈ పుష్కర స్నానాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు. అంత్య పుష్కరాల మొదటి రోజైన నేడు కంచి పీఠాధిపతి శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామి వచ్చి పవిత్ర పుష్కర స్నానాన్ని ఆచరించి ఈ వేడుకలను శాస్త్రోక్తంగా ప్రారంభిస్తారని తెలిపారు. పుష్కర స్నానానికి వచ్చే భక్తులకు వసతి, తాగునీరు, ఘాట్ల వద్ద రక్షణ చర్యలతోపాటు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. పుష్కరాల సందర్భంగా ప్రతిరోజూ సాయంత్రం వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారని తెలిపారు. ప్రతీ రోజు సాయంత్రం కాశీ పండితులచే సరస్వతి నది హారతి నిర్వహించనున్నట్లు తెలిపారు. -
వేధిస్తున్న కూలీల కొరత
రేగొండ : రేగొండ, కొత్తపల్లిగోరి మండలాల్లో మిరప కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. వానాకాలం సీజన్లో మండలంలో దాదాపు ఆరు వేల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. రేగొండ మండలంలోని పొనగండ్ల, రేపాక, కనిపర్తి, గూడెపల్లి, దుంపిల్లపల్లి, భాగిర్థిపేట, తిరుమలగిరి, రంగయ్యపల్లి, కొత్తపల్లిగోరి మండలంలోని జగ్గయ్యపేట, వెంకటేశ్వర్లపల్లి, కొత్తపల్లి, నిజాంపల్లి తదితర గ్రామాల్లో మిరప పంటను సాగు చేశారు. మండల వ్యాప్తంగా మిరపకాయలు ఒకేసారి కోతకు రావడంతో కూలీలకు డిమాండ్ పెరిగింది. వాతావరణంలో మార్పులకు ఈ ఏడాది మిరప పంటలో తెగుళ్లు, నల్లి బెడద తీవ్రంగా ఉంది. దీంతో మిరపలో తాలు శాతం పెరిగింది. ఏరిన మిరప కాయలను ఎండబెట్టిన తరువాత తాలు కాయాలు ఏరటానికి సైతం కూలీల అవసరం ఉంది. దీంతో మిరప కాయలు ఏరడంతో పాటు తాలు కాయలు వేరు చేసేందుకు కూలీల అవసరం ఉంది. ఇతర మండలాల నుంచి కూలీలు.. గ్రామాల్లో కూలీలు దొరక్క పోవడంతో శాయంపేట, ఆత్మకూరు, మల్లంపల్లి మండలాల నుంచి ఆటోలు, ట్రాలీలు, ట్రాక్టర్లలో కూలీలను తీసుకు వస్తున్నారు. రోజు కూలీ రూ.350తో పాటు ఆటో కిరాయి, మేసీ్త్ర మాములును కలుపుకుని దూరాన్ని బట్టి రూ.400 నుంచి రూ.500 వరకు చెల్లిస్తున్నారు. క్వింటా ఎండు మిర్చి ఏరడానికి పది మంది పైగా కూలీలు అవసరం అవుతున్నారు. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం, ఎస్సారెస్పీ కాల్వలకు వారబందీ ప్రకారం నీటిని విడుదల చేస్తుండటంతో మిరప పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. డీబీఎం–38 కాల్వ ద్వారా సాగునీరు రావడంతో చాలా గ్రామాల్లో యాసంగి వరినాట్లు ముమ్మరంగా వేశారు. అలాగే మండలంలో అధిక విస్తీర్ణంలో మొక్కజొన్న పంట సాగు చేశారు. దీంతో కూలీలకు తీవ్ర కొరత ఏర్పడింది. అధిక ఖర్చుపై రైతుల ఆవేదన ఇతర మండలాల నుంచి మిరప కోతలకు కూలీలు -
మహిళా బిల్లును ఆమోదించాలి
ములుగు రూరల్ : పార్లమెంట్లో మహిళ బిల్లును ప్రవేశపెట్టి వెంటనే ఆమోదించాలని టీపీసీసీ మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆంగోత్ సుగుణ సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలో మహిళా బిల్లును పార్లమెంట్లో పాస్చేయాలని పోస్టు కార్డు ఉద్యమం చేపట్టాగా ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ములుగు మున్సిపల్ చైర్మన్ చంద్రకళ, మండల మహిళ అధ్యక్షురాలు గుంటోజు పావనినిరంజన్, మున్సిపల్ కౌన్సిలర్లు నల్లెల స్వాతి, గుగ్గిల్ల దివ్య, గజ్జెల సుస్మిత, కోఆప్షన్ సభ్యులు అసియా, సుజాత, రాధిక, తదితరులు ఉన్నారు. -
గణపురంలో హెరిటేజ్ వాక్, మాక్ పార్లమెంట్
గణపురం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం గణపురం మండలకేంద్రంలో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో జెడ్పీ పాఠశాలలో మాక్ పార్లమెంట్ నిర్వహించారు. అనంతరం జిల్లా టూరిజం శాఖ ఆధ్వర్యంలో మండలకేంద్రం చౌరస్తా నుంచి కోటగుళ్ల వరకు హెరిటేజ్ వాక్ నిర్వహించారు. కార్యక్రమంలో గణపురం ఉప్పసర్పంచ్ ఓరుగంటి కృష్ణ, ఆర్కియాలజీ డైరెక్టర్ బుజ్జీ, సీనియర్ బ్యాట్మెంటన్ క్రీడాకారుడు మాడిశెట్టి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. పుష్కరాల సందర్భంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు కాళేశ్వరం : సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సమాచారం, అత్యవసర సేవలు అందించేందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు. ఈ కంట్రోల్ రూమ్కు 90306 32608 నంబర్ కేటాయించినట్లు తెలిపారు. భక్తులు ఏవైనా సమస్యలు, సూచనలు లేదా సహాయం అవసరమైతే కంట్రోల్ రూమ్ను సంప్రదించాలని సూచించారు. కొనసాగుతున్న మల్టీ డిపార్ట్మెంట్ సమావేశాలు భూపాలపల్లి అర్బన్: ఏరియాలో సింగరేణి గనుల్లో మల్టీ డిపార్ట్మెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. కేటీకే 1వ గనిలో బుధవారం మల్టీ డిపార్ట్మెంటల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఏరియా ఎస్ఓ టు జీఎం ఎస్.కవీంద్ర ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉత్పత్తి లక్ష్యాల సాధనతోపాటు భద్రత, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఖర్చులను తగ్గిస్తూ యంత్రాలను సమర్థవంతంగా వినియోగించాలని తెలిపారు. సింగరేణి సంస్థ అభివృద్ధికి ఉద్యోగులందరూ సమష్టిగా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో అధికారులు జోతి, రాజేశ్వర్, కృష్ణప్రసాద్, శ్యాంసుందర్, ప్రవీణ్విక్రమ్, కిశోర్, కార్మిక సంఘాల నాయకులు శ్రీనివాస్, రఘుపతిరెడ్డి, అధికారుల సంఘం అధ్యక్షుడు నజీర్, తదితరులు పాల్గొన్నారు. పూసుకుపండ్లకు భలే డిమాండ్ ఏటూరునాగారం: అభయారణ్యంలో సహజసిద్ధంగా లభించే పూసుకుపండ్లలో సీ విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. అలాంటి పండ్లు మండల కేంద్రంలో గొత్తికోయలు బుధవారం కిలో రూ.20ల చొప్పున విక్రయించారు. వాటిని ఏటూరునాగారం ప్రాంత ప్రజలే కాకుండా వరంగల్ నుంచి వచ్చిన వారు సైతం విరివిగా కొనుగోలు చేశారు. ఇలాంటి పండ్లను పట్టణ ప్రాంతాల ప్రజలు చూసి ఉండరు. కేవలం 30 నిమిషాల్లోనే పండ్లను విక్రయించినట్లు గొత్తికోయ గిరిజనులు తెలిపారు. మేలైన వరి వంగడాలను విత్తుకోవాలి ఏటూరునాగారం: మేలైన వరి వంగడాలను విత్తుకోవాలని వరంగల్ శాస్త్రవేత్తలు శేషు, మధు తెలిపారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో వరిసాగు పద్ధతులపై బుధవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన మేలైన వరి రకాలైన కేఎన్ఎం 1638, ఆర్ఎన్ఆర్ 1508, సాంబమసూరి, డబ్ల్యూజీఎల్ 962, డబ్ల్యూజీఎల్ 44, కేఎన్ఎం 118 వేసుకోవడం వల్ల పురుగులు, తెగుళ్లు తక్కువగా ఆశిస్తాయన్నారు. రైతులు తమ పొలంలో పండించిన రకాలను జాగ్రత్తలు పాటించి విత్తనాలుగా రెండు, మూడు సంవత్సరాల వరకు విత్తనంగా ఉపయోగించుకోవచ్చని వివరించారు. అలాగే విత్తనాల మీద పెట్టే ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు. వరిసాగు పద్ధతుల్లో మెలకువలు పాటించాలన్నారు. పంట మార్పిడి, సేంద్రియ పద్ధతులపై రైతులు అవగాహన పెంచుకోవాలన్నారు. వరి పంట వేసుకునే ముందు ఈ నెల చివరిలో లేదా జూన్ మొదటి వారంలో పచ్చిరొట్ట పంటలను వేసుకొని పూత దశలో భూమిలో కలియదున్నాలన్నారు. అనంతరం మండల వ్యవసాయ అధికారి వేణుగోపాల్, ఆత్మ చైర్పర్సన్ అరుణ మాట్లాడుతూ యూనివర్సిటీ నుంచి విడుదలైన మేలైన వరి రకాలను సాగు చేసుకోవాలని సూచించారు. -
సాగుకు సన్నద్ధం
భూపాలపల్లి రూరల్: జిల్లా రైతులు వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు. నేల స్వభావం ఆధా రంగా అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ పంటలు సాగుచేయాలని వ్యవసాయశాఖ సూచి స్తోంది. జిల్లా రైతులు అధిక శాతం వర్షాధార పంటలపై ఆధారపడుతుండగా.. ఏటా వానాకాలంలో వరి, పత్తి, కంది, యాసంగిలో బోరుబావుల కింద వరి, వేరుశనగతోపాటు మొక్కజొన్న సాగుకు ప్రా ధాన్యం ఇస్తారు. ఈ ఏడాది వానాకాలంలో సాగు కానున్న పంట వివరాలు, అవసరమైన ఎరువులు, విత్తనాలతో సాగు ప్రణాళికను జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు పర్యవేక్షణలో మండల వ్యవసాయశాఖ అధికారులు, ఏఈఓలు సిద్ధం చేశారు. ఎక్కువ మంది రైతులు పత్తి, వరి సాగుకు మొగ్గు చూపుతున్నారని ప్రభుత్వానికి నివేదించారు. సాగుపై అధికారులు అంచనా.. జిల్లాలో 2,16,734 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు కానుండగా.. 10,500 మెట్రిక్ టన్నుల యూరియా, 5,544 టన్నుల డీఏపీ, 5,544టన్నుల కాంప్లెక్స్ ఎరువులతోపాటు 2,772 టన్నుల పొటా ష్ అవసరమని అధికారులు అంచనాలు వేశారు. వరి, పత్తి సాగుకు సరిపోయేవిధంగా, అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించారు. మెదటగా జీలుగ, జనుము విత్తనాలు సిద్ధం చేశారు. రైతులు తొలకరి వర్షాలకోసం ఎదురుచూస్తున్నారు. ఎక్కువ మంది రైతులు రోహిణి కార్తెలోనే పత్తి విత్తనాలు విత్తేందుకు ఆసక్తి కనబరుస్తారు. గత రెండు సంవత్సరాలుగా అకాల వర్షాలు, గులాబీ తెగులు సోకడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈసారి పత్తి, మిర్చికి డిమాండ్ ఉండటంతో ఆయా పంటల సాగుకే రైతులు మొగ్గుచూపే అవకాశం ఉంది. అదేవిధంగా వరి సాగుకు సైతం ఎక్కువగానే ఆసక్తి కనబరుస్తున్నారు. రైతులకు అవగాహన సదస్సులు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు ఆయా గ్రామాల్లోని రైతు వేదికల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఆధునిక సాగు, పంటల మార్పడి, అధిక దిగుబడి, ఎరువుల వాడకం తదితర అంశాలపై రైతులకు వివరిస్తున్నారు. ఈ అవగాహన కార్యక్రమాలు రైతులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. జిల్లాలో రైతులు వానాకాలం పంటల సాగుకు సన్నద్ధమవుతున్నారు. వానాకాలం పంటల సాగు ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించాం. రైతులకు సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులోఉండేలా చర్యలు తీసుకుంటాం. పచ్చరొట్ట విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. నకిలీ విత్తనాలపై రైతులు జాగ్రత్తగా ఉండాలి. లైసెన్స్ ఉన్న షాపుల్లోనే కొనుగోలు చేయాలి. విత్తనాల కొనుగోలు బిల్లులు పంటలు చేతికొచ్చే వరకు రైతులు దాచిపెట్టాలి. – బాబురావు, జిల్లా వ్యవసాయాధికారి పంట గతేడాది ఈఏడాది అంచనా వరి 95,653 1,09,854 పత్తి 98,280 1,06,560 కందులు 38 120 పెసర 78 110 బబ్బెర్లు 45 90 మొత్తం 1,94,094 2,16,734 ఎరువులు 24,360 మెట్రిక్ టన్నులు అందుబాటులో విత్తనాలు, ఎరువులు ఉండేలా వ్యవసాయాధికారుల చర్యలు -
నోటిఫికేషన్లు ఆలస్యం చేయొద్దు..
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల వయోపరిమితి పెంచడం సంతోషమే. అయితే ఒక ఏడాదికే జీఓను పరిమితం చేయడం సరికాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీల అన్నింటిని గుర్తించి అన్ని నోటిఫికేషన్లు వెంటనే జారీ చేయాలి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల పట్టభద్రులు లక్షల సంఖ్యలో ఉన్నారు. వారి లక్ష్యం నెరవేరాలంటే భారీ నోటిఫికేషన్లు ఇవ్వాలి. ప్రభుత్వం వచ్చి రెండున్నర సంవత్సరాలు దాటుతోంది..ఇంకా జాప్యం చేయొద్దు. –మనుబోతుల మల్లయ్య, ఎంఎస్సీ, బీఈడీ, నెక్కొండ -
రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు
చిట్యాల/గణపురం/భూపాలపల్లి రూరల్: ధాన్యం కొనుగోలులో అక్రమాలకు పాల్పడి రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఈ సందర్బంగా బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ అశోక్ కుమార్తో కలిసి చిట్యాల మండలంలోని కై లాపూర్ శివారులోని మహావీర్, శ్రీవెంకటేశ్వర రైస్ మిల్లు, గణపురం మండలంలోని లక్ష్మీగణపతి రైస్మిల్లు, వెంకటేశ్వర ఇండస్ట్రీస్, భూపాలపల్లి మండలం గొర్లవేడులోని వెంకటేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లును ఆయన తనిఖీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం దిగుమతి జరుగుతున్నప్పటికీ రైతులకు ట్రక్ షీట్లు ఇవ్వకపోవడంప తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంటా పూర్తయిన వెంటనే రైతులకు ట్రక్ షీట్ ఇవ్వాలని అసల్యం ఎందుకు జరుగుతుందని సంబంధిత అధికారులను ప్రశ్నించారు. ట్రక్ షీట్లు ఇవ్వకుండా ధాన్యాన్ని మిల్లులకు తరలించొద్దన్నారు. దీనిపై జిల్లా అధికారుల పర్యవేక్షణ పెంచాలన్నారు. వర్షాలు వస్తే రైతులు ఇబ్బందులు పడతారని దిగుమతిని వేగవంతం చేయాలని మిల్లర్ల యాజమానులకు సూచించారు. ధాన్యం కొనుగోలులో గత బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో రైతులు దోపిడీకి గురయ్యారని అది ఇప్పుడు పునరావృతం కాకుండ చూడాలన్నారు. ప్రతి ధాన్యం గింజ కాంటా అయ్యే వరకు రైతుల వెంట ఉంటామన్నారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా పౌరసరఫరాల అధికారి కిరణ్కుమార్, డీఏం రాములు, జిల్లా సహకార అధికారి వాల్యానాయక్, మార్కెట్ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, తహసీల్దార్ వసంతరావు, ఆర్ఐ రాజేందర్, నాయకులు ముకిరాల మధువంశీకృష్ణ, తిరుపతి ఉన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
పుష్కరాల్లో పటిష్ట భద్రత
మాట్లాడుతున్న ఎస్పీ సంకీర్త్ హాజరైన పోలీస్ అధికారులు, సిబ్బంది కాళేశ్వరం : నేటి నుంచి జూన్ 1 వరకు కాళేశ్వరంలో నిర్వహించనున్న సరస్వతి అంత్య పుష్కరాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశమున్నందున భక్తులకు అసౌకర్యం కలుగకుండా పోలీస్ శాఖ తరఫున పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. బుధవారం ఆయన పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి బందోబస్తు ఏర్పాట్లపై వివరించారు. ముందుగా ట్రాఫిక్ నియంత్రణ, ఘాట్ల వద్ద భద్రత, పార్కింగ్ ప్రాంతాలు, హెలిప్యాడ్ భద్రత, క్యూ లైన్ల నిర్వహణ, పరిశీలించారు. అనంతరం ఎస్పీ సంకీర్త్ మాట్లాడుతూ.. పుష్కరాల్లో తప్పిపోయిన వారి సహాయక కేంద్రాలు, మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధంగా పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఇతర అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ పుష్కరాల విధులు నిర్వహించాలని ఆయన సూచించారు. పుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్, సీసీఎస్ టీమ్స్ ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 1,000 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీస్ శాఖకు సహకరించి సూచనలు పాటిస్తూ పుష్కరాలను సురక్షితంగా నిర్వహించుకోవాలని ఎస్పీ సంకీర్త్ కోరారు. ఎస్సీ సిరిశెట్టి సంకీర్త్ -
పనుల ఆలస్యంపై కలెక్టర్ ఫైర్
కాళేశ్వరం: సరస్వతి అంత్య పుష్కరాల పనుల్లో భాగంగా మ్యూజియం నిర్మాణ పనులు పూర్తికాకపోవడంపై కలెక్టర్ రాహుల్శర్మ అధికారులపై ఫైర్ అయ్యారు. మంగళవారం ఆయన సరస్వతి ఘాట్, గోదావరి నది ఒడ్డు, టెంట్ సిటీ, మ్యూజియం తదితర ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాట్ల పురోగతిని సమీక్షించిన కలెక్టర్, మిగిలిన పనులను బుధవారం వరకు పూర్తిచేయాలని ఆదేశించారు. మ్యూజియం పనులు పూర్తికాకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక సదుపాయాలు సమయానికి సిద్ధం చేయాలన్నారు. పరిశుభ్రత, భద్రత, తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. భక్తులు నదిలోకి వెళ్లకుండా ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, డీఆర్వో వసంత కుమారి, డీఎస్పీ సూర్యనారాయణ, ఆర్డీఓ రవీందర్, దేవస్థానం ఈఓ మహేష్, సీఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. సరస్వతి ఘాట్, గోదావరి నది ఒడ్డు, టెంట్ సిటీ పరిశీలన -
మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ
● ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో ఏటూరునాగారం: మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. మండలకేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మంగళవారం ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ ఆధ్వర్యంలో జన జాతీయ గరిమ్ ఉత్సవ్ 2026 నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీఓ లెనిన్ వత్సల్ టొప్పో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన హెల్త్ స్క్రీనింగ్, యాక్టివిటీ క్యాంప్, షీటీమ్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మొక్కలను నాటారు. మొక్కలను ప్రతిఒక్కరూ నాటి సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ నాగోరావు, జిల్లా కోఆర్డినేటర్ హాస్పిటల్ సర్వీస్ డాక్టర్ జగదీశ్, స్టాటిస్టికల్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రాజ్కుమార్, సీహెచ్సీ సూపరింటెండెంట్ సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యమకారుల హామీలు అమలు చేయాలి
● టీజీఏ అధ్యక్షుడు, ‘కుడా’ మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి ఖిలా వరంగల్: తెలంగాణ ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హమీలు వెంటనే అమలు చేయాలని ఉద్యమకారుల రాష్ట్ర టీజీఏ అధ్యక్షుడు మర్రి యాదవరెడ్డి, ఉద్యమ నాయకులు అచ్చవిద్యాసాగర్, జేఏసీ కన్వీనర్ దిడ్డి నరేందర్ డిమాండ్ చేశారు. మంగళవారం వరంగల్ కరీమాబాద్లోని చట్లోళ్ల గడ్డ వద్ద వరంగల్ ఉమ్మడి జిల్లా ఉద్యమకారుల సంఘం కన్వీనర్ మరుపల్లి రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు.. ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని కేశవరావును చైర్మన్గా నియమించడం అధికార పార్టీకి వత్తాసు పలకడమేనన్నారు. అర్హత కలిగిన ఉద్యమకారులు ఎంతో మంది ఉన్నప్పటికీ కేశవరావునే నియమించడం సరికాదన్నారు. ఇప్పటికై నా ఉద్యమకారుకిచ్చిన హామీలు ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నార్లగిరి రమేశ్, నహీం, నర్సింగం, సాంబయ్య, రమేశ్, అబ్దుల్పాషా, శంకేసి లింగమూర్తి, రాజశేఖర్, ఎల్లయ్య, దిండిగాల సోమేశ్వర్, పరదేశి రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. -
గుడుంబా పట్టివేత
చిట్యాల: మండలంలోని నవాబుపేట గ్రామానికి చెందిన తీగల రమ అక్రమంగా 10లీటర్ల గుడుంబాను రవాణా చేస్తుండగా పట్టుకున్నట్లు ఎస్సై పోచంపల్లి సతీష్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నవాబుపేట గ్రామ శివారులో పోలీసులు ఉదయం పెట్రోలింగ్ చేస్తుండగా అదే గ్రామానికి చెందిన తీగల రమ గుడుంబాను పట్టుకుని అమ్ముకునేందుకు వెళ్తుతుండగా పట్టుకున్నారు. గుడుంబాను స్వాధీనం చేసుకుని ఆమైపె కేసు నమోదు చేశారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ.. మండలంలోని ఎవరైనా గుడుంబా అమ్మినా, తయారు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య గణపురం: మండలకేంద్రానికి చెందిన జక్కు వినయ్ (25) ఆరోగ్యం సహకరించడం లేదని మనస్తాపానికి గురై పరుగుల మందు తాగి ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఎస్సై అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలకేంద్రానికి చెందిన జక్కున వినయ్ కొంత కాలంగా కిడ్నీల సంబంధిత వ్యాధితో ఎన్ని ఆస్పత్రులకు పోయిన నయం కావడం లేదు. దీంతో మనస్థాపంతో సోమవారం రాత్రి పరుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు తండ్రి జక్కు రవీందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. ఏటూరునాగారం: మండల కేంద్రంలోని 11 వార్డులోని నివాసం ఉంటున్న ఆగమ్మ (85) అనే వృద్ధురాలు జీవితంపై విరక్తి చెంది ఇంటిలో ఎవరు లేని సమయంలో మంగళవారం ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎస్ఎస్తాడ్వాయి: మండలంలోని మేడారంలో అనారోగ్య కారణంగా 65 సంవత్సరాల గుర్తు తెలియని యాచకుడు ఈనెల 18న మృతి చెందినట్లు నార్లాపూర్పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రస్తుతం ఫ్రిజర్లో భద్రపరిచినట్లు తెలిపారు. మృతుడి బంధువులు, రక్త సంబంఽధీకులుగానీ మేడారంలోని నార్లాపూర్ పోలీస్ స్టేషన్కు రావాలన్నారు. యాచకుడి గురించి ఎవరికై నా సమాచారం తెలిస్తే 87126 30132 నంబర్ను సంప్రదించాలన్నారు. -
మహిళలు, బాలికల రక్షణకే షీటీంలు
దామెర : మహిళలు, బాలిక రక్షణకే షీటీంలు పని చేస్తున్నట్లు షీటీం ఎస్సై స్వాతి అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్నేహ సమ్మర్ క్యాలెండర్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. మహిళలు, బాలికలు వేధింపులకు గురైతే షీటీంలను సంప్రదించాలన్నారు. పోకిరీల వివరాలు అందజేస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ధైర్యంగా ముందుకు వచ్చి తమ సమస్యలను షీటీంలకు తెలుపాలన్నారు. అదే విధంగా ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. అపరిచిత వ్యక్తులతో సోషల్ మీడియాలో చేస్తున్న స్నేహంతో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, బాలికలకు 18 ఏళ్లు, అబ్బాయిలకు 21 ఏళ్లు నిండిన తరువాతే వివాహం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రమేశ్, ఏపీఓ అశోక్, మహిళా సంఘాల సభ్యులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. షీటీం ఎస్సై స్వాతి -
ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
రేగొండ: ఆలయాల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మంగళవారం కొడవటంచలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్య అన్నదాన సత్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. ఆలయాల అభివృద్ధికి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎంతో దోహదపడుతాయని పేర్కొన్నారు. నిత్య అన్నదాన కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఆర్ సంస్థల అధినేత సంపత్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టయ్య, ఆర్యవైశ్య సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు -
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
మొగుళ్లపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి ముద్దమల్ల రాజేందర్ అన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండలకేంద్రంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో రాజేందర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ బడిలోనే నాణ్యమైన విద్యాబోధనతో పాటు కార్పొరేట్ స్థాయికి దీటుగా మెరుగైన సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచించి పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ప్రతీ పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో బోధన అందిస్తున్నామన్నారు. విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, దుస్తులు, పుస్తకాలు అందిస్తున్నామని చెప్పారు. విద్యార్థుల శారీరక, మానసిక దృఢత్వానికి విశాలమైన ఆటస్థలంలో వారి ఆసక్తికి తగ్గ అంశాలలో తర్ఫీదు అందిస్తున్నామన్నారు. బాలికల ఆత్మరక్షణకోసం కరాటే శిక్షణ, ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ పొందేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి విజయపాల్రెడ్డి, కమ్యూనిటీ మొబిలైజర్ అధికారి సామల రమేష్, బీసీఈబీ అసిస్టెంట్ సెక్రటరీ కిషన్రెడ్డి, సర్పంచ్ చాట్ల విజయ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ -
ఎండలోనే ప్రయాణికులు
కన్నాయిగూడెం: మండలంలో బస్ షెల్టర్ లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల కోసం ఎండలోనే నిరీక్షిస్తున్నారు. మండలం నుంచి వందల వాహనాలు, వేల మంది ప్రయాణికులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. అలాగే జిల్లా కేంద్రం నుంచి పలిమెల, మహదేవపూర్, మహాముత్తారం, కాళేశ్వరం, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఏటూరునాగారం, ములుగు, వరంగల్, హనుమకొండ, హైదరాబాద్, ఖమ్మం, భద్రాచలం తదితర ప్రాంతాలకు రవాణా సాగిస్తుంటారు. కానీ మండలంలో ఇప్పటి వరకూ బస్టాండ్, బస్ సెల్టర్లు లేక ప్రధాన రహదారి వెంట ఉన్న ఎండలో ఉండి బస్సుల కోసం ప్రయాణికులు నిరీక్షించాల్సిన పరిస్థితి. అలాగే తాగు నీరు, నీడా లేక ఎండలో ప్రజలు అవస్థలు పడుతున్నారు. బస్ షెల్టర్ లేకపోవడంతో బస్సుల కోసం చూస్తున్న ప్రయాణికులు ఎండకు తట్టుకోలేక ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇప్పటికై న అధికారులు మండల కేంద్రంలో బస్ షెల్టర్ ఏర్పాటు చేసి సౌకర్యాలు కల్పించాలిన స్థానికులు కోరుతున్నారు. బస్షెల్టర్ లేక అవస్థలు పట్టించుకోని అధికారులు బస్ షెల్టర్ లేక మండలంలోని ప్రయాణికులు గంటల కొద్ది ఎండల్లోనే నిలబడి ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రంలో, లక్ష్మీపురం వద్ద బస్ షెల్టర్లు నిర్మించాలి. అలాగే తాగు నీరు ఇతర సౌకర్యాలు కల్పించాలి. – రాజుకుమార్, యువకుడు, బుట్టాయిగూడెం -
సింగరేణి సంరక్షణే టీబీజీకేఎస్ లక్ష్యం
భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మిక హక్కులను రక్షిస్తూ సంస్థను సంరక్షించడమే తెలంగాణ బొగ్గు గని కార్మిక సమాఖ్య (టీబీజీకేఎస్) లక్ష్యమని ఆ సంఘం వ్యవస్థాపక కన్వీనర్ కెంగర్ల మల్లయ్య అన్నారు. జిల్లాకేంద్రంలోని కాకతీయ గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి పరిస్థితి దయనీయంగా మారిందని, సంస్థ ప్రైవేటీకరణ అంచున ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. డిపెండెంట్ ఉద్యోగాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని, మెడికల్ బోర్డు నిర్వహణలో యాజమాన్యం విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు ఇవ్వకపోవడంతో సింగరేణి అప్పుల ఊబిలోకి వెళ్లిందని చెప్పారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీబీజీకేఎస్ పోరాడుతుందని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు మండ సంపత్, లక్ష్మణ్, రాకేష్ రెడ్డి, అనిల్, సాంబయ్య, కిషన్ పాల్గొన్నారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం ములుగు: రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ హేమంత్ సహదేవరావును ఆయన కలిశారు. జిల్లాలో రైతుల సమస్యలను పరిష్కరిస్తూ వారి అభ్యున్నతికి తోడ్పాటు అందించాలని కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆత్మచైర్మన్ రవీందర్రెడ్డి, జిల్లా నాయకులు ఓరుగంటి అనిల్, మట్టెవాడ తిరుపతి, మాదారపు రాజు పాల్గొన్నారు.తవ్వకాల్లో బయటపడిన రాళ్ల పరిశీలనములుగు రూరల్: జిల్లా కేంద్రంలోని సమ్మక్క–సారలమ్మ గిరిజన యూనివర్సిటీ ప్రహరీ నిర్మాణం తవ్వకాల్లో బయటపడిన రాళ్లను మంగళవారం పురావస్తు శాఖ అధికారులు పరిశీలించారు. పురావస్తు శాఖ విశ్రాంత డైరెక్టర్ ఎస్ఎస్ రంగాచార్యులు, డిప్యూటీ డైరెక్టర్ రాములు నాయక్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఆలయానికి సంబంధించిన రాళ్లుగా అనుమానించారు. రాళ్ల కొలతలను తీసుకుని శాసీ్త్రయ పద్ధతిలో ఆధారాలు సేకరించారు. శిల్పం, గుడి ఆనవాళ్లు, గుడి ఆకారం బయటపడలేదని, గుడికి సంబంధించిన ఇటుకలు సైతం కనిపించలేదని తెలిపారు. పూర్తి నివేదికను తయారు చేసి పురావస్తు శాఖకు అందించనున్నట్లు వెల్లడించారు. వారి వెంట యూనివర్సిటీ అసిస్టెంట్ రిజిస్టర్ రఘురామ్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ షురూ ● అన్ని సబ్జెక్టులు కలిపి 88,512 జవాబుపత్రాలు విద్యారణ్యపురి: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాల వాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మంగళవారం సంస్కృతం సబ్జెక్టు జవాబు పత్రాల వాల్యుయేషన్ నిర్వహించారు. చీఫ్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లు (అధ్యాపకులు) 49 మంది వాల్యుయేషన్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఉమ్మడి జిల్లాకు హనుమకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంగా ఉంది. అన్ని సబ్జెక్టులు కలిపి ఈ క్యాంపునకు 88,512 జవాబుపత్రాలు కేటాయించారు. మొదటిదశలో ఇంగ్లిష్, హిందీ సబ్జెక్టుల పేపర్–1, పేపర్–2 పరీక్షల జవాబుపత్రాలు మ్యాథ్స్, పొలిటికల్ సైన్స్ పేపర్ 1 పేపర్ 2 జవాబు పత్రాల వాల్యుయేషన్ నిర్వహించనున్నట్లు క్యాంప్ ఆఫీసర్, డీఐఈఓ ఎ.గోపాల్, ఏసీఓ జనరల్–1 శ్రీనివాస్రావు తెలిపారు.రెండో దశలో ఫిజిక్స్, ఎకనామిక్స్, బాటనీ, జూవాలజీ, కెమిస్ట్రీ, కామర్స్, హిస్టరీ సబ్జెక్టుల పేపర్–1, పేపర్–2 పరీక్షల జవాబు పత్రాల వాల్యుయేషన్ ఈనెల 24 నుంచి నిర్వహించనున్నారు. -
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
ములుగు: మున్సిపాలిటీ పరిధిలోని 5 ,6వ వార్డులలోని లోఓల్టేజీ సమస్యను స్థానికులు మున్సిపల్ చైర్ పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, కౌన్సిలర్ గుగ్గిల్ల దివ్య దృష్టికి తీసుకవెళ్లారు. వారు స్పందించి ములుగు ట్రాన్స్కో ఎస్ఈ భిక్షపతి దృష్టికి సమస్యను తీసుకవెళ్లగా ఎస్ఈ వెంటనే స్పందించి లోఓల్టేజీ సమస్యను తీర్చేందుకు 160 కేవీ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో అధికారులు ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు విద్యుత్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏడీఈ వేణుగోపాల్, ఏఈ రవి, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. -
‘దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి’
వెంకటాపురం(కె): ఆదివాసీలపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షుడు కోర్స నర్సింహామూర్తి, గొండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఆదివాసీ నవనిర్మాణ సేన ఆధ్వర్యంలో గిరిజనేతరులను ఏజెన్సీ నుంచి పంపించాలని కోరుతూ మంగళవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్ఆండ్బీ ప్రధాన రహదారిపై బైటాయించి ఽఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా నర్సింహామూర్తి, సాయిలు మాట్లాడుతూ మండల కేంద్రానికి చెందిన రాంబాబుపై దాడి చేసిన గిరిజనేతరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. గిరిజనేతరుల కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకోవాలని కోరారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాలను ఎంపీడీఓ జుమ్మిలాల్, తహసీల్దార్ వేణుగోపాల్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో కుంజా మహేష్, పూనెం ప్రతాప్, నాగరాజు, వాసం నారాయణ, బాబు, శివ, తదితరులు పాల్గొన్నారు. -
రుణ ప్రణాళిక రూ.3,210.51 కోట్లు
భూపాలపల్లి రూరల్: జిల్లాలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి వార్షిక రుణ ప్రణాళిక రూ.3,210.51 కోట్లుగా నిర్దేశించినట్లు కలెక్టర్ రాహుల్శర్మ వెల్లడించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సత్యనారాయణరావులో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్శర్మ మాట్లాడుతూ వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల అభివృద్ధికి బ్యాంకుల ద్వారా విస్తృత స్థాయిలో రుణాలు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. జిల్లా అభివృద్ధికి బ్యాంకులు, అధికారులు సమన్వయంతో పనిచేసి లక్ష్యాలను సాధించాలన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా, రైతు బీమా, ఉపాధి హామీ పథకం తదిత ర నిధులు నిలుపుదల చేస్తున్నారని.. ప్రభుత్వం ఇచ్చే పథకాల నిధులను ఆపకుండా నేరుగా రైతులకు ఇవ్వాలని సూచించారు. పంట రుణాలు బాకీ ఉన్న రైతుల జాబితా ఇస్తే అవగాహన కల్పించి రికవరీ అయ్యేలా చర్యలు తీసుకుంటామని సూచించారు. ఈ సమావేశంలో లీడ్ బ్యాంక్ డిస్ట్రిక్ మేనేజర్ తిరుపతి, ఆర్బీఐ ఎల్డీఓ యశ్వంత్సాయి, నాబార్డ్ డీడీఎం టీసీ రవి, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, డీఆర్డీఓ బాలకృష్ణ, బీసీ సంక్షేమ అధికారి ఇందిర, డీటీడబ్ల్యూఓ నాగసాగర్, మెప్మా పీడీ రాజేశ్వరి పాల్గొన్నారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు చిట్యాల/గణపురం: ధాన్యం కొనుగోలులో అక్రమాలకు పాల్పడి రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. మంగళవారం చిట్యాల మండలం కై లాపూర్ గ్రామ శివారులోని శ్రీ లక్ష్మీనరసింహా రైస్మిల్లు, గణపురం మండలకేంద్రంలోని జానికరామ్ రైస్ మిల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మిల్లు యాజమానులు వరి ధాన్యంలో తాలు పేరుతో రైతులను ఇబ్బంది పెడితే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మిల్లు యాజమానులు రైతులు తెచ్చిన ధాన్యాన్ని వెను వెంటనే దిగుమతి చేసుకోవాలని ఎక్కువగా హమాలీలను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, జిల్లా పౌర సరఫరాల అధికారి కిరణ్కుమార్, డీఏం రాములు, జిల్లా సహకార అధికారి వాల్యానాయక్, మార్కెట్ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి పాల్గొన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధికి కృషి కలెక్టర్ రాహుల్ శర్మ -
పోగొట్టుకున్న సెల్ఫోన్ అప్పగింత
రేగొండ: పోగొట్టుకున్న సెల్ఫోన్ను గుర్తించి బాధితుడికి ఎస్సై సుధాకర్ మంగళవారం అందజేశారు. గణపురం మండల కేంద్రానికి చెందిన రాజు పరకాలకు వెళ్తుండగా ఫోన్ ఎక్కడో పడేసుకున్నాడు. ఈమేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు వివరాలు నమోదు చేసి సీఈఐఆర్ పోర్టల్ ద్వారా సెల్ఫోన్ గుర్తించి బాధితుడికి అందించారు. ఎవరైనా సెల్ఫోన్ పోగొట్టుకున్నా, దొంగతనానికి గురైనా ఫోన్ వివరాలు సీఈఐఆర్ పోర్టల్లో నమోదు చేసుకోవాలని, ఈ పోర్టల్ ద్వారా ఫోన్ తిరిగి పొందే అవకాశం ఉందని ఎస్సై సూచించారు. -
ఉపాధి కూలీలకు మజ్జిగ పంపిణీ
మొగుళ్లపల్లి: మండలంలోని ఇస్సిపేట సర్పంచ్ యార ముకుందర్ రెడ్డి, ఉపసర్పంచ్ బత్తిని శ్రీధర్ గౌడ్, లక్కమారి కాపు సంఘం గ్రామ అధ్యక్షుడు పెంతల మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. రోజంతా ఎండలో పనిచేయకుండా ఉదయం ఏడు గంటల నుంచి 10 గంటల వరకు పనిచేసి సాధారణ జీవనం గడుపుతున్న కూలీలకు ఉపాధిహామీ పథకం చాలా ఉపయోగకరంగా ఉందని తెలిపారు. ఎండ తీవ్రత బాగా ఉన్నందున కూలీలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ మాధవి, ఈసీ రాము, టీఏ శ్రావణ్, పంచాయతీ కార్యదర్శి సునీల్, సీనియర్ మేట్ అజయ్ పాల్గొన్నారు.ఎస్ఎస్తాడ్వాయి: మేడారం గ్రామపంచాయతీ పరిధిలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు సర్పంచ్ పిరీళ్ల భారతి మంగళవారం మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కూలీల ఆరోగ్యం దెబ్బతిన్నకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశామన్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూలీలు ఉదయమే పనులు పూర్తి చేసుకుని ఉదయం 9గంటల లోపు ఇళ్లకు చేరుకోవాలని సూచించారు. గ్రామాల్లోని ప్రతి ఒక్కరూ ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆలకుంట వనిత, పంచాయతీ కార్యదర్శి శరత్ ఉన్నారు. -
సింగరేణి అభివృద్ధికి సమష్టి కృషి
భూపాలపల్లి అర్బన్: సింగరేణి సంస్థ అభివృద్ధికి ఉద్యోగుల సమష్టి కృషి అవసరమని భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి అన్నారు. మంగళవారం కేటీకే 5వ గనిలో నిర్వహించిన మల్టీ డిపార్ట్మెంటల్ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. ప్రతీ ఉద్యోగి క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించారు. నాణ్యత, ఉత్పత్తి, ఉత్పాదకత పెంపు కోసం సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యోగుల సంక్షేమానికి సింగరేణి సంస్థ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఆరోగ్యం, విద్య, భద్రత అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. మహిళా ఉద్యోగులు కూడా ధైర్యంగా ముందుకు సాగుతూ భూగర్భ గనుల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఏరియా జీఎం రాజేశ్వర్ రెడ్డి -
పటిష్ట బందోబస్తు
భూపాలపల్లి: మూడు రాష్ట్రాల సరిహద్దులోని కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో ఈ నెల 21వ తేదీ నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు నిర్వహించనున్న సరస్వతి అంత్య పుష్కరాలకు ముందస్తు ఏర్పా ట్లు చేశాం. గతంలో జరిగిన పుష్కరాల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని వన్ వే ఏర్పాటు చేశాం. ఆధునిక టెక్నాలజీతో కూడిన ఏఐ డ్రోన్ను సైతం వినియోగించబోతున్నాం. భక్తులకు ఇబ్బంది కలగకుండా, వారి భద్రతే ప్రధాన ధ్యేయంగా పని చేసేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉంది. అంత్య పుష్కరాల సందర్భంగా పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలను ఎస్పీ సాక్షికి తెలిపారు. వివరాలు ఆయన మాటల్లోనే.. పుష్కరాల సందర్భంగా ఈసారి అత్యాధునిక టెక్నాలజీని వాడుతాం. ఏఐ డ్రోన్ను వినియోగించి కాళేశ్వరం పోలీస్స్టేషన్ నుంచి చుట్టూ ఐదు కిలోమీటర్ల పరిధిలో పర్యవేక్షిస్తాం. వాహనాలు, భక్తుల సంఖ్యను సైతం ఏఐ డ్రోన్ లెక్కిస్తుంది. తద్వారా భక్తుల ఇబ్బందులు, ట్రాఫిక్ సమస్యను ముందుగానే గమనించి పరిష్కరించవచ్చు. ఇప్పటికే కాళేశ్వరంలో ఉన్న సీసీ కెమరాలు కాకుండా మరో 150 కెమెరాలను బిగించాం. కమాండ్ కంట్రోల్ రూంను కాళేశ్వరం ఠాణాలో ఏర్పాటు చేశాం. పుష్కర ఘాట్, దేవాలయ పరిసరాల్లో మరో మూడు డ్రోన్లతో నిత్య పర్యవేక్షణ ఉంటుంది. సరస్వతి అంత్య పుష్కరాలకు భక్తులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు వన్ వే ఏర్పాటు చేశాం. పెద్దపల్లి జిల్లా మంథని తదితర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు గంగారం ఎక్స్రోడ్ నుంచి అన్నారం, మద్దులపల్లి మీదుగా, హనుమకొండ, భూపాలపల్లి నుంచి వచ్చే వాహనాలు కాటారం మండలం బస్వాపూర్ నుంచి రుద్రారం మీదుగా గంగారం ఎక్స్రోడ్, అన్నారం మీదుగా కాళేశ్వరానికి చేరుకోవాల్సి ఉంటుంది. తిరుగు ప్రయాణంలో కాళేశ్వరం నుంచి మహదేవపూర్ మీదుగా కాటారం చేరుకున్నాక హనుమకొండ, కరీంనగర్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. వాహనాల పార్కింగ్కు సమస్య తలెత్తకుండా కాళేశ్వరానికి మూడు వైపులా సుమారు 250 ఎకరాల్లో 23 పార్కింగ్ పాయింట్లను ఏర్పాటు చేశాం. ఎన్ని వాహనాలు వచ్చినా ఇబ్బంది తలెత్తే అవకాశం లేదు. పుష్కరాల సందర్భంగా సుమారు వేయి మందికి పైగా పోలీసు అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. నాతో పాటు అదనపు ఎస్పీ, 12మంది డీఎస్పీలు, 25 మంది సీఐలు, 50 మందికి పైగా ఎస్సైలు, మరో 900 మంది అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. అంచనాకు మించి భక్తుల సంఖ్య పెరిగితే పోలీసు సిబ్బందిని పెంచేందుకు సిద్ధంగా ఉన్నాం. ఏఐ డ్రోన్తో పర్యవేక్షిస్తాం సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తి చేశాం వన్ వేకు వాహనదారులు సహకరించాలి ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
మల్లూరుగుట్టపై మంటలు
మంగపేట: మండల పరిధిలోని మల్లూరుగుట్టపై మంటలను నివారించేందుకు సంబంధిత అటవీ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో గుట్టపై తరచుగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. దీంతో లక్షల రూపాయల విలువైన అటవీ సంపద కాలి బూడిదవుతోంది. అడవిలో కార్చిచ్చు సుమారు 30 కిలోమీటర్ల వైశాల్యంతో ఉన్న మల్లూరు గుట్టలపై వందల హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది. గుట్టచుట్టూ ఉన్న అటవీ ప్రాంతంలో మండు వేసవిలో సైతం తోగుల్లో ఊటనీరు, సహజసిద్ధమైన జలదారలు ఉండటంతో వివిధ రకాల వన్యప్రాణులు సంచరిస్తుంటాయి. వేసవి కాలంలో కార్చిచ్చు, పోడు నరికే వారు అడవికి వచ్చి నిప్పు పెట్టడంతో అడవి తరచుగా దగ్ధమవుతోంది. దీంతో అడవి తగలబడటంతో పాటు కొన్ని వన్యప్రాణులు సైతం వేడికి తాళలేక సమీప గ్రామాల్లోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ సంబంధిత అటవీశాఖ అధికారులు తమకేమీ సంబంధం లేదనే విధంగా వ్యవహరించడం గమనార్హం. మూడు రోజులుగా.. మూడు రోజుల నుంచి మల్లూరులోని హేమాచల క్షేత్రానికి వెళ్లే ప్రధాన రోడ్డు వెంట ఉన్న అటవి ప్రాంతం దగ్ధం అవుతోంది. అయినప్పటికీ అటవీశాఖ అధికారులు మంటలను నివారించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం శోచనీయం. ఇటీవల ఇదే ప్రాంతంలో రిజర్వు పారెస్టు చుట్టూ ఏర్పాటు చేసిన ట్రెంచ్ను పూడ్చి రోడ్డు పనులకు గుట్టను తవ్వి టిప్పర్లతో మొరం తరలించారు. ఈ విషయాన్ని స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆయా కాలనీ వాసులు చెబుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పట్టించుకోని అధికారులు దగ్ధమవుతున్న విలువైన అటవీ సంపద -
కూలీలకు హాజరు కష్టాలు
టేకుమట్ల: ప్రభుత్వాలు పల్లెల్లో వలసలను నివారించేందుకు ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టాయి. గత సంవత్సరం వరకు ఉపాధి కూలీల హాజరు నమోదును మ్యానువల్గా ఉండగా ఉపాధిలో అవకతవకలు జరుగుతున్నాయనే కారణంతో ప్రభుత్వాలు ఉపాధి పథకాన్ని పూర్తి స్థాయిలో ఆన్లైన్ నమోదు చేశాయి. ఉపాధి కూలీల హాజరు నుంచి చేయాల్సిన పనులు, పని ప్రదేశం, పని దినములు వంటి అంశాలన్ని ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. దాంతో ఉపాధి హామీ పథకం మొత్తం ఆన్లైన్లో నిక్షిప్తం అవుతోంది. ఉపాధి కూలీలకు తిప్పలు గతంలో ఉపాధి కూలీలు నేరుగా పని ప్రదేశానికి చేరుకుని పని చేసి తిరిగి ఇంటికి వచ్చే వారు. కూలీలు పని చేస్తున్న సమయంలో ఫీల్డ్ అసిస్టెంట్ హాజరును నమోదు చేసేవారు. కానీ ప్రస్తుతం ఉపాధి కూలీలు పనికి వెళ్లే ముందు ఎన్ఆర్ఈజీఏ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్లో తప్పని సరిగా క్యాప్చర్ మస్టర్ రోల్లో ఉదయం, మధ్యాహ్నం హాజరు నమోదు చేయాలి. హాజరు నమోదు ప్రక్రియలో ఐరిస్ క్యాప్చర్ చేసినప్పుడు చాలా మంది కూలీల కళ్లు నమోదు కాకపోవడంతో వెనుతిరిగి వెళ్తున్నారు. మరికొంత మంది కూలీలకు ఈ కేవైసీ చేయడంతో హాజరు నమోదుకు సమస్య లేకుండా పోతుంది. మరికొంత మంది కూలీలకు ఆధార్ అప్డేట్ చేసినా క్యాప్చర్ మస్టర్ రోల్లో హాజరు అనుమతించకపోవడంతో పని ప్రదేశానికి వచ్చి వెనుతిరిగి వెళ్తున్నారు. ఇప్పటి వరకు మండలంలోని 25 గ్రామాలలో ఐరిష్ సమస్యతో ఎంతో మంది కూలీలు ఉపాధి హామీని సద్వినియోగం చేసుకోలేక పోతున్నారు. ఇప్పటికై నా అధికారులు ఐరిష్ సమస్యకు పూర్తిస్థాయిలో పరిష్కారాన్ని చూపిస్తే మరెంతో మంది ఉపాధి కూలీలు ఉపాధిహామీ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటారని పలువురు కోరుతున్నారు. మస్టర్లో పేరున్నా ఐరిస్ రాని వైనం ఖాళీగా ఉంటున్న ఉపాధిహామీ కూలీలు -
పోస్టర్ ఆవిష్కరణ
మొగుళ్లపల్లి: మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తిరుమలాపూర్ గ్రామానికి చెందిన వర్ధమాన గేయ రచయిత దాసారపు నరేష్ రచించిన పురిటి నొప్పులు పోస్టర్ను తహసీల్దార్ సునీత మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఈ గేయాన్ని ఆలపించిన అంకుశాపూర్ గ్రామానికి చెందిన జీడి అనితను అభినందిస్తూ సామాజిక చైతన్య గీతాలు ఇంకా ఎన్నో పాడాలని, మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. అమ్మ ప్రేమను వెలకట్టలేమనీ, ఎన్ని జన్మలెత్తినా అమ్మ రుణం తీర్చలేమని, కన్నతల్లి ప్రేమను మరువద్దని, జీవితాంతం అమ్మను కంటి రెప్పల కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు మంగళపెల్లి శ్రీనివాస్, నాయకులు నిమ్మల భద్రయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మంద సాంబయ్య, డీలర్ల జిల్లా కార్యదర్శి గంగాదార్ రాజు, జీడి సంపత్ ,గాయకులు పుల్ల ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. రూ.వెయ్యి కోట్లు కేటాయించాలి మహాముత్తారం: రాష్ట్రంలో సేవాలాల్ మహారాజ్ ఆలయం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం వంద ఎకరాల స్థలంలో పాటు రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని లంబాడిహక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అజ్మీరా పూల్సింగ్నాయక్ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. రాష్ట్రంలో మూడవస్థానం కలిగిన లంబాడ జాతి ఆత్మ గౌరవాన్ని కాపాడే తమ ఇంటి ఇలవేల్పు సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటుకు ప్రభుత్వం స్థలం కేటాయించి నిధులు మంజూరు చేయాలని సీఎం రేవంత్రెడ్డిని కోరినట్లు తెలిపారు. కాంగ్రెస్లో చేరిక మహాముత్తారం: మండల కేంద్రానికి చెందిన సినియర్ బీఆర్ఎస్ నాయకుడు రామచంద్రం సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కొంగొర్ల బాపు ఆధ్వర్యంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు మంత్రి దుద్దిళ్ల శ్రీదర్బాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తాటి లచ్చయ్యగౌడ్ ఉన్నారు. ఏటూరునాగారం: రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలైన సంఘటన మండలంలోని జీడివాగు వద్ద మంగళవారం చోటు చేసుకుంది. మంగపేటకు చెందిన సోడి సమ్మక్క అనే మహిళ శుభకార్యానికి ఏటూరునాగారం వచ్చి మంగపేట వైపు వెళ్తుండగా బైక్ అదుపు తప్పి కిందపడింది. ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. 108కు సమాచారం ఇవ్వడంతో టీఎంటీ పర్వతాల రాజ్కుమార్, పైలెట్ భరత్ సహాయంతో బాధితురాలిని ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంగపేట: మండలంలోని ఏటూరునాగారం–బూర్గంపాడు ప్రధాన రోడ్డుకు ఇరువైపులా ఉన్న గ్రామాల్లో ఇసుక లారీల వేగాన్ని నియంత్రించి ప్రమాదాలు జరుగకుండా ఉండే విధంగా బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. జిల్లా సరిహద్దు నుంచి కమలాపురం వరకు సుమారు 22 కిలోమీటర్ల దూరం వరకు 11 గ్రాపంచాయతీల పరిధిలోని గ్రామాల మద్య నుంచి ప్రధాన రహాదారి ఉంది. రోడ్డుపై నుంచి నిత్యం వందల సంఖ్యలో ఇసుక లారీలు అతి వేగంగా ఒకదాని వెంట మరోటి రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో నిత్యం రద్దీగా ఉండే గ్రామాల ప్రజలు రోడ్డు దాటాలంటే ప్రాణాలను ఫణంగా పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి రోడ్డు ప్రమాదాలు జరుగకుండా గ్రామాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
ఉద్యమకారుల కమిటీకి కాలపరిమితి విధించాలి
దామెర : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేశవరావు కమిటీకి కాలపరిమితి విధించాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి సదానందం డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఉద్యమకారుల గుర్తింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. కానీ కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా, కాలపరిమితి విధించి ఉద్యమకారులకు న్యాయం చేయాలన్నారు. ఉద్యమ సమయంలో కేసులు లేకున్నా వారుచేసిన పోరాటం ప్రతిబంభించే ఫొటోలు, పేపర్ క్లిప్పింగులు పరిగణలోకి తీసుకొని ప్రతి ఒక్కరి న్యాయం చేయాలని కోరారు. మండల అధ్యక్షుడు పొలెపాక ఆరోగ్యం, ప్రధాన కార్యదర్శి గడ్డం సదానందం, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి గోవిందు అశోక్, ఉద్యమకారులు దామెర కుమారస్వామి, కిన్నెర రమేశ్, ఇటికాల బాబురావు, కుంటమల్ల రాజు, మన్నెం ఇంద్రారెడ్డి, విజేందర్రెడ్డి, ఓయూ విద్యార్థి మాలతితో పాటు తదితరులు పాల్గొన్నారు. -
స్థానిక ఉపాధ్యాయులనే నియమించాలి
మహాముత్తారం: ఇన్చార్జ్ ఎంఈఓగా మండలంలో స్థానికంగా పనిచేస్తున్న సీనియర్ ఉపాధ్యాయులకే కేటాయించాలని మండల ఏఐఏవైఎస్ మండలాధ్యక్షుడు రామగిరి రాజు అన్నారు. ఆదివారం మండలకేంద్రంలో విలేకర్ల సమావేవంలో ఆయన మాట్లాడుతూ మండలంలో సీనియర్ ఉపాధ్యాయులు ఉన్నప్పటికి వారిని నియమించకుండా విద్యాశాఖ అధికారులు స్థానికేతరులను నియమించారని ఆరోపించారు. ఇప్పటికై నా మండలంలో పలు పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న ఉపాధ్యాయుల సీనియార్టిని పరిగణంలోకి తీసుకొని స్థానికులకు కేటాయించాలని అధికారులను కోరారు. ఏఐఏవైఎస్ మండల అధ్యక్షుడు రామగిరి రాజు, ప్రజాసంఘాల నాయకులు పీక కిరణ్, పుల్యాల సురేశ్, చిర్ర మల్లేశ్ పాల్గొన్నారు. -
ఆలయంపై అధికారుల చిన్నచూపు
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయంపై మండల రెవెన్యూ అధికారులు చిన్న చూపు చూస్తున్నారని తుడుందెబ్బ మేడారం గ్రామ కమిటీ అధ్యక్షుడు గడిగ సునీల్ అన్నారు. ఆదివారం ఆయన మేడారంలో ఆదివాసీ నాయకులతో కలిసి మాట్లాడారు. మండల రెవెన్యూ అధి కారులకు సమ్మక్క సారలమ్మ ఆలయంపై, ఆదివాసీ ఆచార వ్యవహారాలపై భక్తి శ్రద్ధ లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు. జాతరపై అవగాహన లేని అధికారులను నియమించడం వల్ల జాతర నిర్వహణ అస్తవ్యస్తంగా తయారవుతుందన్నారు. మేడారంలో ఆదివాసీలకు సంబంధించిన భూముల విషయంలో తరతరాలకు నివసిస్తున్న వారికి అన్యాయం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు జనార్దన్, సిద్దబోయిన రవి, అర్జున్ కోరం ప్రేమ్, యాదగిరి, యాలం రాంబాబుతో పాటు తదితరులు పాల్గొన్నారు. -
టైలరింగ్ కోర్సులో శిక్షణ
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో కార్యక్రమంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందజేస్తారుసాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈనెల 22వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు టైలరింగ్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు శిక్షణ ఇస్తారు. శిక్షణలో నేర్పించే అంశాలు మెథడ్ ఆఫ్ కట్టింగ్, మెథడ్ ఆఫ్ స్ట్రిచ్చింగ్, జుబ్బా, పెట్టికోట్, సారీ పెట్టికోట్, ప్లాజా, ఫ్రాక్, అంబ్రెల్లా ఫ్రాక్, వీ షేప్ ఫ్రాక్, స్లీవ్లేస్ ఫ్రాక్, అంబ్రెల్లా టాప్, క్రాస్ కట్ బ్లౌజ్, ఫిష్ అంబ్రెల్లా టాప్, కట్స్ టాప్, సాదా బ్లౌజ్, ప్రిన్స్కట్ బ్లౌజ్, కటోరి బ్లౌజ్, నార్మల్ బాటమ్, ఫ్రంట్ కుచ్చుల బాటమ్, సైడ్ కుచ్చుల బాటమ్.రిజిస్ట్రేషన్ ఫీజు : రూ.2,500/-వర్క్షాపు షెడ్యూల్ తేదీలు: 22–05–2026 నుంచి 21–06–2026 వరకు శిక్షణ సమయం : ఉదయం 10 గం.నుంచి మధ్యాహ్నం 01 గం. వరకు రిజిస్ట్రేషన్, శిక్షణ స్థలం వివరాలు : రేష్మా బోటిక్, ఇంటినంబర్: 10 –10– 34, మైసమ్మ వీధి, గిర్మాజీపేట, వరంగల్. ఫోన్ నంబర్ : 95330 12727, 95055 14424 -
పుష్కరాలకు కాళేశ్వరం ముస్తాబు
కాళేశ్వరం: కాళేశ్వరంలో ఈనెల 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు 12 రోజుల పాటు జరుగు సరస్వతీనది అంత్య పుష్కరాలకు కాళేశ్వరాలయంతో పాటు పరిసరాలు ముస్తాబవుతున్నాయి. సోమవారం రాత్రి కాళేశ్వరం ఆలయ ప్రధాన ఆలయంతో పాటు శ్రీశుభానందదేవి, సరస్వతీఅమ్మవార్ల ఆలయాలతో పాటు ప్రకారాలకు రంగరంగుల విద్యుత్ దీపాలు అలంకరించారు. దీంతో ఆలయం జిగేల్మంటుంది. ఏర్పాట్లు ఇలా.. కాళేశ్వరం ఆలయంలో క్యూలైన్లు, షామియానాలు, చలువ పందిర్లు వేశారు. ప్రసాద కౌంటర్లకు క్యూలైన్ ఏర్పాట్లు చేశారు. మెట్ల మార్గం నుంచి తోరణాలు ఏర్పాటు చేశారు. వంద గదుల వద్ద భారీ డార్మెటరీ హాలు ఏర్పాటు చేశారు. భక్తులు సేద తీరడానికి శ్రీరాజరాజేశ్వర వసతి గృహం వద్ద షామియానాలు వేశారు. ఆలయం, ఘాటు వద్ద ఏర్పాటు చేశారు. గ్రామంతో పాటు పలు ప్రాంతాల్లో భారీ హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. నిరంతర విద్యుత్.. 12 రోజుల పాటు నిరంతర విద్యుత్ ఉంటుందని ఎన్పీడీసీఎల్ ఇన్చార్జ్ ఎస్ఈ భిక్షపతి తెలిపారు. పుష్కరాల కోసం ప్రత్యేకంగా 490 స్తంభాలు 16 కిలోమీటర్ల మేర కొత్త విద్యుత్ లైన్ వేశామని తెలిపారు. 12 ట్రాన్స్ఫర్మర్లు, 23 పార్కింగ్ ప్రాంతాల్లో విద్యుత్ లైట్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట డీఈ నాగరాజు, ఏడీఈ రమేష్ తదితరులు ఉన్నారు. -
క్రీడలతో మానసికోల్లాసం
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లి రూరల్: క్రీడలు యువతలో మానసికోల్లాసాన్ని పెంపొందించడంతోపాటు శారీరక దృఢత్వాన్ని, ఆలోచనా శక్తిని పెంపొందిస్తాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో సోమవారం 5కే రన్ నిర్వహించారు. ఈ సందర్భగా హనుమాన్ దేవాలయం నుంచి అంబేడ్కర్ గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే సత్యనారాయణరావు హాజరై మాట్లాడారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, ఐక్యత, పోటీతత్వం పెంపొందుతాయన్నారు. యువత ప్రతీ రోజూ క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ యువత ప్రతిభను ప్రోత్సహించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. అంబేడ్కర్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న సమ్మర్ క్రికెట్ క్యాంపు ను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రం ప్రారంభం ఎస్ఎం కొత్తపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. రైతులకు కోతలు లేకుండా కొనుగోళ్లు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఆర్డీఓ హరికృష్ణ, డీసీసీ అధ్యక్షుడు బట్టు కర్నాకర్, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, జిల్లా క్రీడల అధికారి రఘు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి
● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి: జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ధాన్యం కొనుగోళ్లపై సోమవారం ఐడీఓసీ కార్యాలయంలోఎస్పీ సిరిశెట్టి సంకీర్త్తో కలిసి రెవెన్యూ, పోలీసు, పౌర సరఫరాలు సంస్థ, వ్యవసాయ, రవాణా, సహకార శాఖల అధికారులు, రైస్ మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు తెచ్చిన ధాన్యాన్ని ఆలస్యం లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ట్యాబ్లో నమోదు చేయడంలో జాప్యం జరుగుతుండటంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. రవాణా, మిల్లింగ్ ప్రక్రియలను సమన్వయంతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్కుమార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. పుష్కర విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. సరస్వతి అంత్య పుష్కరాల విధులు కేటాయించిన అధికారులు, సిబ్బంది విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో పుష్కర విధులు కేటాయించిన అధికారులు, సిబ్బందితో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భక్తులకు ఇబ్బందులు రాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. 12 రోజులు చాలా ప్రధానమన్నారు. విధులకు గైర్హాజరైన అధికారులు, సిబ్బందికి మెమోలు జారీ చేయాలని, తగు చర్యలు నిమిత్తం ఆయా శాఖలకు సిఫారసు చేయనున్నట్లు తెలిపారు. ప్రతిరోజు స్వామీజీలు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రొటోకాల్ పాటించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, డీఆర్వో వసంతకుమారి, భూపాలపల్లి, కాటారం ఆర్డీఓలు హరికృష్ణ, రవీందర్, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఇబ్బంది లేకుండా చర్యలు కాళేశ్వరం: భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. సోమవారం ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, అధికారులతో కలిసి ఆయన పుష్కరాల పనులను పరిశీలించారు. ప్రధాన ఘాట్ను పరిశీలించిన కలెక్టర్ భక్తుల సౌకర్యార్థం గోదావరి నదిలో క్వయర్ మ్యాట్ ఏర్పాటు చేయాలని, పారిశుద్ధ్య పనులను వేగవంతం చేసి పరిశుభ్రం చేయాలని ఆదేశించారు. భక్తులు సమాచారం తెలుసుకునేలా తగిన సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. సమయం తక్కువగా ఉన్నందున ముఖ్య మైన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఆర్డీఓలు హరికృష్ణ, రవీందర్ అధికారులు పాల్గొన్నారు. -
అడవుల సంరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత
● ఎన్డీఎంఏ అబ్జర్వర్ ప్రవీణ్కాళేశ్వరం: అడవుల సంరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యతని, ప్రజల సహకారంతో అటవీ రక్షణ చర్యలు సమర్థవంతంగా నిర్వహించవచ్చని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) అబ్జర్వర్ ప్రవీణ్ తెలిపారు. అడవుల్లో సంభవించే అగ్ని ప్రమాదాల నివారణపై ఎన్డీఎంఏ ఆధ్వర్యంలో అటవీ శాఖ సిబ్బంది, స్థానిక ప్రజలకు సోమవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో భాగంగా మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్డీఎంఏ అబ్జర్వర్ ప్రవీణ్ మాట్లాడుతూ అడవుల్లో అగ్ని ప్రమాదాలు సంభవించడానికి గల కారణాలు, వాటి వల్ల ప్రకృతి సంపద, వన్యప్రాణులు, పర్యావరణానికి కలిగే నష్టాలను వివరించారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు తెలియజేశారు. అటవీ, అగ్ని ప్రమాదాల సమయంలో అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మూడు ప్రాంతాల్లో మాక్డ్రిల్స్ నిర్వహించారు. మాక్డ్రిల్స్ ద్వారా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు చేపట్టాల్సిన చర్యలు, అగ్ని నియంత్రణ పద్ధతులు, భద్రత చర్యలు, సత్వర స్పందనపై ప్రదర్శనలు నిర్వహించారు. అడవుల పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఎండిన ఆకులు, గడ్డి లేదా చెత్తను కాల్చకుండా ఉండాలన్నారు. బీడీలు, సిగరెట్ ముక్కలు వంటి మండే వస్తువులను అడవుల్లో వేయకూడదని సూచించారు. అటవీ ప్రాంతాల్లో ఎక్కడైనా అగ్ని కనిపించిన వెంటనే సంబంధిత అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహదేవపూర్ ఎఫ్డీఓ సందీప్, భూపాలపల్లి ఎఫ్డీఓ అప్పలకొండ, ఎఫ్ఆర్ఓ రవి, ఇక్బాల్, డివిజన్ సిబ్బంది, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
బందోబస్తు ఏర్పాట్ల పరిశీలన
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈనెల 21 నుంచి జూన్1 వరకు జరిగే సరస్వతినది అంత్య పుష్కరాల సందర్భంగా భక్తులకు అసౌకర్యాలు కలగకుండా చేపడుతున్న భద్రత, బందోబస్తు ట్రాఫిక్ ఏర్పాట్లను ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సోమవారం పరిశీలించారు. పుష్కర ఘాట్లు, పార్కింగ్ ప్రదేశాలు, ట్రాఫిక్ మళ్లింపు మార్గాలు, కంట్రోల్ రూమ్, సీసీ కెమెరా పర్యవేక్షణ, భక్తుల రాకపోకలకు సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లను అధికారులతో కలిసి సమీక్షించారు. పుష్కరాలకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున భద్రత పరంగా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా పోలీసు శాఖ 24 గంటలు అప్రమత్తంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించి భక్తులకు మర్యాదపూర్వకంగా సేవలు అందించాలని సూచించారు. ఆయన వెంట కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ వెంకటేశ్వర్లు, నాగార్జున్రావు, ఎస్సైలు తమాషారెడ్డి, పవన్కుమార్, నరేష్, మహేందర్ ఉన్నారు. -
పర్యాటక రంగానికి కొత్తకళ
ములుగు/ఎస్ఎస్ తాడ్వాయి: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికతో పర్యాటక రంగానికి సరికొత్త కళ రానుందని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు పేర్కొన్నారు. సోమవారం తన ఛాంబర్లో పర్యాటక శాఖకు సంబంధించిన బ్రోచర్, పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. జిల్లాలోని పర్యాటక శోభను ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఈ నెల 23 వరకు జిల్లాలో పర్యాటక వారోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా 20న బుధవారం ములుగు మండలంలోని జాకారం శివాలయం వద్ద హెరిటేజ్ వాక్ నిర్వహించాలని జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజిని ఆదేశించారు. 21న గురువారం యూట్యూబర్స్ సోషల్ మీడియా, ఇన్ఫ్లుయేన్నర్లతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయాలని డీపీఆర్ఓను ఆదేశించారు. ఈ నెల 31లోగా సేవా గుణం కలిగిన ప్రతిఒక్కరూ రెడ్ క్రాస్లో సభ్యులుగా చేరాలని పిలుపునిచ్చారు. అలాగే తాడ్వాయి డివిజన్ పరిధిలోని తాడ్వాయి టీ రేంజ్, లవ్వాల సెక్షన్, దేవునిగుట్ట వెస్ట్ బీట్లో 39వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ విక్రమ్ సింగ్ ఠాకూర్ అధ్వర్యంలో అడవి మంటల నిర్వహణపై నిర్వహించిన మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని డీఏఓ వికాస్ మీనాతో కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు పరిశీలించారు. అనంతరం మేడారంలోని వనదేవతలను సందర్శించారు. అమ్మవార్ల గద్దెల వద్ద కలెక్టర్ హేమంత్ సహదేవరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
ఇబ్బందులు కలగకుండా సేవలు..
పుష్కరస్నానానికి వచ్చే భక్తులకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో కావాల్సిన ఏర్పాట్లు పూర్తిచేశారు. వేసవికాలం కావడంలో ఇక్కడికి వచ్చే భక్తులు జాగ్రత్తలు పాటించాలి. దగ్గు, జలుబు, ఇబ్బందులు ఎదురైనట్లయితే వెంటనే వైద్యశిబిరాలకు రావాలి. ఎండలో తిరగకుండా ఉండాలి. మధ్యాహ్న సమయంలో స్నానం చేయకపోవడమే మంచిది. ప్రతీ రోజు ఒక్కో క్యాంపులో రెండు వేల ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేస్తాం. – డాక్టర్ మధుసూదన్ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి -
వైద్యసేవలు
మంగళవారం శ్రీ 19 శ్రీ మే శ్రీ 2026అంత్య పుష్కరాలకుభూపాలపల్లి అర్బన్: ఈ నెల 21వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు జిల్లాలోని కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద నిర్వహించే సరస్వతి అంత్య పుష్కరాల్లో భాగంగా భక్తుల సౌకర్యార్థం జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్యసేవలు అందించేందుకు ఆ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. 12రోజుల పాటు వైద్యశిబిరాలు, మెడికల్ క్యాంపులో వైద్యసేవలు అందించేందుకు సిబ్బందిని కూడా కేటాయించారు. భూపాలపల్లి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి నుంచి స్పెషలిస్టు వైద్యులను కేటాయించారు. 10క్యాంపులు.. కాళేశ్వరంలో 11రోజుల పాటు మూడు షిఫ్టులో 10 మెడికల్ క్యాంపులు, రెండు తాత్కాలిక ఆస్పత్రులు ఏర్పాటుచేయనున్నారు. ముక్తీశ్వర ఆలయ సమీపం, పాత ఈఓ కార్యాలయం, టెంట్ సిటీ, పార్కింగ్–1, పార్కింగ్–2, తాత్కాలిక బస్టాండ్, హరిత హోటల్, పాత బస్టాండ్, గోదావరి మెయిన్ ఘాట్, సరస్వతి ఘాట్ సమీపాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటుచేయనున్నారు. ప్రస్తుతం ఉన్న పీహెచ్సీలో 20 పడకలు, సరస్వతి ఘాట్ వద్ద మరో 20 పడకలు కలిగిన తాత్కాలిక వైద్యశాల ఏర్పాటు చేయనున్నారు. ఒక్క వైద్యశిబిరంలో ఒక డాక్టర్(ఎంఎల్హెచ్పీ), హెల్త్ సూపర్వైజర్, ఇద్దరు చొప్పున ఏఎన్ఎం, ఆశకార్యకర్తలను నియమించారు. ముందుగా వైద్యశిబిరంలో మాత్రలు అందజేయనున్నారు. అక్కడ తగ్గకపోతే తాత్కాలిక వైద్యశాల తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వ్యాధి తీవ్రతను బట్టి అత్యవసరమైతే మహదేవపూర్లోని సీహెచ్సీ తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. రెండు తాత్కాలిక ఆస్పత్రులు కాళేశ్వరంలోని పీహెచ్సీ, సరస్వతి ఘాట్ల వద్ద తాత్కాలికంగా 20 పడకల చొప్పున ఏర్పాట్లు చేశారు. ఈ ఆస్పత్రిలో అత్యవసర వైద్యసేవలు అందించేందుకు సిద్ధంచేశారు. ఆక్సిజన్, పల్స్మీటర్, ఈసీజీ సౌకర్యాలు కల్పించనున్నారు. ఇందులో ఇద్దరు స్పెషలిస్టు డాక్టర్లు, వైద్యాధికారులు ఇద్దరు, ల్యాబ్టెక్నీషియన్, పార్మసిస్టు, స్టాఫ్నర్సులను నియమించనున్నారు. ప్రతీ మెడికల్ క్యాంపు వద్ద ఒక అంబులెన్స్ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. మరో ఐదు బైక్ అంబులెన్స్లను సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. పీహెచ్సీలకు ఇబ్బంది కలగకుండా.. కాళేశ్వరంలో ఏర్పాటుచేసిన వైద్యశిబిరాల్లో డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది పాల్గొంటున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 11 రోజుల పాటు ఇబ్బందులు కలగకుండా వైద్యాధికారుల, సిబ్బంది కేటాయింపులు చేశారు. ఆర్బీఎస్కే, పల్లె దవాఖానాలు, పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లు ఉంటే ఒక్కొక్కరిని, సిబ్బందిని కూడా అదేవిధంగా ఎక్కువ మంది ఉన్న సిబ్బందిని కాళేశ్వరం విధులకు పంపించే విధంగా ఏర్పాటు చేశారు. డీఎంహెచ్ఓ పర్యవేక్షణ.. కాళేశ్వరంలో ఏర్పాటుచేసిన వైద్యశిబిరాలను ఎప్పటికప్పుడు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి మధుసూదన్ పర్యవేక్షించనున్నారు. వైద్య సిబ్బందికి విధులు కేటాయించి వారు అందిస్తున్న సేవలు, ఇబ్బందులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయనున్నారు. మరో ఇద్దరు ఇతర జిల్లాల డీఎంహెచ్ఓలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రెండు మానిటరింగ్ టీమ్లను ఏర్పాటు చేశారు. భక్తులకు ఎదురయ్యే ఇబ్బందులను తెలియజేసేందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూంను కూడా ఏర్పాటు చేయనున్నారు. కాళేశ్వరంలో 10 వైద్యశిబిరాలు 10 పడకలతో 2 మెడికల్ క్యాంపులు 30 మంది డాక్టర్లు.. 420 మంది వైద్యసిబ్బంది ప్రత్యేకంగా రెండు టీమ్ల ఏర్పాటు -
మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ
చిట్యాల : మండలంలోని రామచంద్రాపూర్ గ్రామంలో ఉపాధి హామీ పథకం కూలీలకు సర్పంచ్ గాజె హేమలతఅశోక్ సోమవారం మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎండ తీవ్రత దృష్ట్యా ఉపాధి కూలీలకు వడదెబ్బ నుంచి, వేసవి తీవ్రతను తగ్గించడానికి ఉపశమనం పొందడానికి మజ్జిగ ప్యాకెట్లు ఉపయోగపడుతాయని అన్నారు. ఉదయం ఆరు గంటలకు పనికి వెళ్లి పది గంటల లోపు పని పూర్తి చేసుకోవాలని కోరారు. ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నందున పలు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సిరిపురం నర్సింగం, వార్డు సభ్యులు ప్రభాకర్, వెంకటరమణ, సరోజన, దేవేంద్ర, మధుకర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు. వాహనాల తనిఖీ మహాముత్తారం : మండలంలోని యామన్పల్లి ప్రధాన కూడలి వద్ద సోమవారం మహాముత్తారం ఎస్సై–2 మహేష్ వాహనాల తనిఖీ చేపట్టారు. వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డ్రైవర్లు లైసెన్స్తో పాటు వాహనపత్రాలు కలిగి ఉండాలన్నారు. అదే విధంగా డ్రైవర్లు మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్సై వెంట పోలీస్ సిబ్బంది ఉన్నారు. -
యోగాతో మానసిక ప్రశాంతత
మహాముత్తారం : యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తోందని ఇన్చార్జ్ ఎంపీడీఓ ప్రకాశ్ రెడ్డి తెలిపారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలో సోమవారం ఫిట్ అండ్ యాక్టివ్ తెలంగాణ మారథాన్ అండ్ ఫిజికల్ లిటరసి కార్యక్రమం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం యోగా, ధ్యానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కార్యాలయ సూపరింటెండెంట్ రమేష్ బాబు, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, జోడి క్రిష్ణవేణి, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్ పర్సన్ శైలజ, పీఈటీ భారతి, ఉపసర్పంచ్ రామినేని పూజిత, కాంగ్రెస్ సీనియర్ నాయకులు లింగమల్ల దుర్గయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. యోగా, రన్నింగ్తో ఆరోగ్యం టేకుమట్ల : యోగా, రన్నింగ్తో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని ఎంపీడీఓ అనిత అన్నారు. సోమవారం ప్రజాపాలన– ప్రగతిప్రణాళికలో భాగంగా మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఎంపీడీఓ అనిత, ఎంపీఓ సురేష్ ఆధ్వర్యంలో యోగా, మారథాన్ 2కే రన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సై అమూల్య హాజరై యోగా, 2కే రన్లో పాల్గొన్నారు. యోగా విశిష్టత చిన్మయ మిషన్ చైర్మన్ నేతుల రాజయ్య వివరించగా, ఈజీఎస్ ఏపీఓ రమేష్ యోగాసనాలను చేయించారు. అనంతరం 2కే రన్లో పాల్గొన్నారు. ఎంపీడీఓ మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరు యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతతో పాటు, ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. యోగా వల్ల జీవన క్రియలు మెరుగుపడడమే కాకుండా పూర్తిస్థాయి ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ప్రతిదినం యోగా, వాకింగ్, రన్నింగ్ చేయాలన్నారు. మారథాన్లో ప్రథమ ద్వితీయ స్థానాల్లో నిలిచిన విజేతలకు ఆరెపల్లి సర్పంచ్ మల్లయ్య బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాట్ల శ్రీనివాస్, రాఘవరెడ్డిపేట, ఆరెపల్లి రామకిష్టాపూర్(వి), సుబ్బక్కపల్లి సర్పంచ్లు, డీఓపీ రఘు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సాధారణ వ్యక్తిలా ఎస్సై అమూల్య.. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న గైక్వాడ అమూల్య సోమవారం యోగా, 2కే రన్లో పాల్గొనేందుకు సాధారణ వ్యక్తిలా వెళ్లారు. ఇటీవల మండల కేంద్రంలో పదో తరగతి పరీక్ష కేంద్రం వద్ద ఆకతాయిల ఆటకట్టించేందుకు సివిల్ డ్రెస్లో విద్యార్థినులతో కలిసి పరీక్ష కేంద్రం వద్ద పహారా చేసిన సంఘటన జిల్లాలో చర్చానీయాంశమైంది. -
కొనుగోళ్లు సమర్థవంతంగా నిర్వహించాలి
మల్హర్(కాటారం) : ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ ఆదేశించారు. సోమవారం కాటారం మండలంలోని అన్నపూర్ణ రైస్మిల్లు, జంగేడులోని పీఏసీఎస్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మిల్లుల్లో ధాన్యం దిగుమతులు, నిల్వలు, నాణ్యతా ప్రమాణాలు, ప్రభుత్వ మార్గదర్శకాల అమలు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మిల్లులో నిల్వ ఉన్న ధాన్యం స్టాక్లను పరిశీలించి ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తక్షణ చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని మిల్లర్లకు సూచించారు. రైతులు ధాన్యం తీసుకువచ్చిన వెంటనే అన్లోడింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని, వాహనాలు ఎక్కువసేపు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ధాన్యం నిల్వ, రవాణా, రికార్డు నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యం చోటు చేసుకోరాదని హెచ్చరించారు. అదేవిధంగా జిల్లాలో ట్యాబ్ ఎంట్రీల ప్రక్రియను ప్రతిరోజూ క్రమం తప్పకుండా నిర్వహించాలని జిల్లా సహకార అధికారిని ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన 100 శాతం ట్యాబ్ ఎంట్రీలు 24 గంటలలోపు నమోదయ్యేలా పర్యవేక్షణ చేయాలని సూచించారు. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న ట్యాబ్ ఎంట్రీలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఎటువంటి అవాంతరాలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల అధికారి కిరణ్ కుమార్, సహకార అధికారి వాల్య నాయక్, సివిల్ సప్లయి ఇన్స్పెక్టర్ సురేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పారదర్శకంగా కొనుగోళ్లు చేయాలి రేగొండ : కొనుగోలు కేంద్రాల్లో పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్లు చేయాలని డీఆర్డీఓ బాలకకృష్ణ అన్నారు. సోమవారం మండలంలోని రంగయ్యపల్లిలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులు, మార్కెటింగ్ నిర్వాహకులు, రైస్ మిల్లర్లతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా కొనుగోళ్లు కొనసాగించాలన్నారు. ఎంఎస్పీ పూర్తి స్థాయిలో అందేందుకు దళారీ వ్యవస్థకు తావు లేకుండా చూడాలన్నారు. అలాగే మండల కేంద్రంలో నిర్వహించిన వీఓఏ సమావేశానికి హాజరై అర్హులందరికి అవకాశం కల్పించి ఉపాధి హామీలో కూలీల సంఖ్యను పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ ప్రేమ్రాజ్, ఏపీఓ, ఈజీఎస్, మండల సమాఖ్య అధ్యక్షులు, కమ్యూనిటీ కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ అశోక్కుమార్ -
మెడికల్ షాపుల బంద్కు సహకరించండి
మొగుళ్లపల్లి : దేశవ్యాప్తంగా ఈనెల 20న నిర్వహిస్తున్న మెడికల్ షాపుల బంద్కు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని మెడికల్ షాపుల యజమానుల సంఘం మండల కమిటీ సభ్యులు కోరారు. ఈ సందర్భంగా సోమవారం తహసీల్దార్ సునీత, ఎస్సై సురేష్ను మెడికల్ షాపు యజమానుల సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాలు అందించి బంద్కు సహకరించాలని కోరారు. ఈ–ఫార్మసీ విధానం కార్పొరేట్ కంపెనీల అడ్డగోలు డిస్కౌంట్ల ద్వారా మెడికల్ షాపుల యజమానులు నష్టపోతున్నారని, వీటివల్ల ప్రజలకు నాణ్యమైన మందులు అందించలేకపోతున్నట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు పొతంగల్ జనార్దన్, ప్రధాన కార్యదర్శి దోమకుంట్ల రమేష్, కోశాధికారి శ్రీనివాస్, సభ్యులు జనార్దన్, నరసింహారాములు, మంత్రి బాబు, బూర రాజకుమార్, తిరుపతి, శ్రీకాంత్, ప్రకాష్ తదితరులు ఉన్నారు. -
వ్యవసాయ మార్కెట్ కమిటీ సర్వసభ్య సమావేశం
మల్హర్(కాటారం) : మండలంలోని కాటారం వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో సోమవారం చైర్ పర్సన్ పంతకాని తిరుమల అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్, డైరెక్టర్లు మార్కెట్ అభివృద్ధికి, రైతులకు కల్పించే మౌలిక సదుపాయాలపై పలు నిర్ణయాలు తీసుకున్నట్లు చైర్మన్ తిరుమల వివరించారు. రాబోయే రోజుల్లో కోల్డ్ స్టోరేజ్ గోడౌన్ మార్కెట్ ప్రాంగణంలో సీసీ ప్లాట్ఫామ్స్ నిర్మాణంతోపాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానం చేసినట్లు ఆమె పేర్కొన్నారు. మార్కెట్ ప్రహరీకి రూ.కోటి మంజూరు చేయించిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబుకు మార్కెట్ కమిటీ సభ్యులు కృతజ్ఞత తీర్మానం చేశారు. అనంతరం 12.09 ఎకరాల మార్కెట్ యార్డ్ స్థలాన్ని సరిహద్దులు సర్వే చేసి చూపిస్తే ప్రహరీ నిర్మాణం చేపట్టనున్నట్లు రెవెన్యూ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బ్రహ్మారెడ్డి, డైరెక్టర్లు తిరుపతిరావు, శ్రీనివాస్, రమేష్, రాజయ్య, రాజారాం, రామకృష్ణ, శ్రీనివాస్రెడ్డి, ఇర్షాద్, సెక్రటరీ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు
టేకుమట్ల : స్థానిక ఫర్టిలైజర్ షాపు నిర్వాహకులు రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని టాస్క్ఫోర్స్ మండల అధికారులు ఏఓ కల్యాణి, ఎస్సై అమూల్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మండల కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాల్లోతనిఖీ చేపట్టారు. రికార్డులను, విత్తన ప్యాకెట్లు, మందులను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. డీలర్లు నాణ్యమైన విత్తనాలను విక్రయించాలన్నారు. నకిలీ విత్తనాలను విక్రయిస్తే షాపులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరకు, నిషేధిత గడ్డి మందులను విక్రయించినా కేసులు తప్పవని హెచ్చరించారు. రైతులకు విత్తనాలను విక్రయించినప్పుడు విధిగా రశీదు ఇవ్వాలని సూచించారు. ఏఈఓ రాహుల్, పోలీసులు ఉన్నారు. -
ఎమ్మెల్యేను కలిసిన నాయకులు
భూపాలలపల్లి రూరల్ : ఫర్టిలైజర్స్, ఫెస్టిసైడ్స్, సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ జిల్లా అసోసియేషన్ నూతన కమిటీ నాయకులు సోమవారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావును మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులకు ఎమ్మెల్యే శుభాకాఃక్షలు తెలిపారు. జిల్లా అధ్యక్షుడు కట్కం అశోక్, జిల్లా గ్రంథాలయం చైర్మన్ కోట రాజబాబు, అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు యాంసాని వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు నలిగేటి సతీష్, తదితరులు పాల్గొన్నారు. గ్రామాభివృద్ధికి కృషి కాళేశ్వరం : కాళేశ్వరం దర్శనానికి వచ్చే భక్తులకు ఉపయోగపడే విధంగా రోడ్డు ఏర్పాటు చేయాలని గ్రామ పంచాయతీ పాలకులకు వార్డు సభ్యుడు రెవెల్లి రాకేష్ ఇటీవల దరఖాస్తు చేశారు. దీంతో పాత నక్ష దారి ప్రకారం ఎయిర్టెల్ టవర్ నుంచి బ్రిడ్జి రోడ్ వరకు రోడ్డు తీయాలని కోరగా పాలకులు స్పందించారు. గ్రామ అభివృద్ధి కోసం పంచాయతీ అధికారులు, పాలకవర్గం చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. మాజీ ఎంపీటీసీ మృతి మహాముత్తారం : మండలంలోని పోలారం మాజీ ఎంపీటీసీ, ములుగుపల్లి గ్రామానికి చెందిన పురుషోత్తం రాజబాపు ఇటీవల అనారోగ్యంతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. బాధిత కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించారు. బీజేపీ బూత్ కమిటీ అధ్యక్షుడు.. చిట్యాల : మండలంలోని కాల్వపల్లికి చెందిన బీజేపీ బూత్ అధ్యక్షుడు బిస్కుల రవి అనారోగ్యంతో మృతి చెందాడు. కాగా సోమవారం ఆయన మృతదేహాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఏడునూతల నిశిధర్రెడ్డి సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. బాధిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. అనంతరం మండలంలోని గాంధీనగర్ గ్రామానికి చెందిన బీజేపీ దళిత మోర్చా జిల్లా నాయకుడు రత్న రమేష్ తల్లి సమ్మమ్మ అనారోగ్యంతో మృతిచెందగా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్, ఓబీసీ మోర్చా జిల్లా ఐటీ సెల్ కన్వీనర్ పంచిక మహేష్, ప్రధాన కార్యదర్శి రాకేష్, ఉపాధ్యక్షుడు నల్ల శ్రీనివాస్ రెడ్డి, చింతల రాజేందర్, సంఘ రఘపతి తదితరులు పాల్గొన్నారు. గోదావరిలో ఇసుక తవ్వితే చర్యలు ఏటూరునాగారం : అనుమతి లేకుండా గోదావరిలో ఇసుక తవ్వకాలు చేపడితే వాహనాలను సీజ్ చేసి వారిపై కేసులు నమోదు చేస్తామని ఆర్ఐ చిక్కుల కిరణ్కుమార్ పేర్కొన్నారు. సోమవారం మండలంలోని ముళ్లకట్ట వద్ద గోదావరి లోకి వాహనాలు వెళ్లకుండా ట్రంచ్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాత్రివేళలో దొంగతనంగా ఇసుకను లారీల్లో తరలిస్తున్నట్లు తమకు సమాచారం వచ్చిందన్నారు. వాటిని అరికట్టేందుకు గోదావరిలోకి వాహనాలు వెళ్లకుండా కందకాలు తీయడం జరిగిందన్నారు. కందకాలను ఎవరైనా పూడ్చివేస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. కొంతమంది ట్రాక్టర్ యజమానులు సైతం ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారని సమాచారం ఉందన్నారు. వారిపై కూడా చర్యలు చేపడుతామన్నారు. జీపీఓ వెంకటనర్సమ్మ పాల్గొన్నారు. క్షయ రహిత సమాజానికి కృషి గోవిందరావుపేట: క్షయ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా ఉచిత మొబైల్ చెస్ట్ ఎక్స్రే స్క్రీనింగ్ క్యాంపును నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. డయాబెటిస్, హైపర్టెన్షన్, జ్వరం, దగ్గు తదితర సమస్యలతో బాధపడుతున్న వారు తప్పనిసరిగా చెస్ట్ ఎక్స్రే స్క్రీనింగ్ చేయించుకోవాలని సూచించారు. ఎస్టీఎస్ రాజు, టీబీ అలెర్ట్ ఇండియా జిల్లా కో ఆర్డినేటర్ టి రాజు, ఎక్స్రే టెక్నీషియన్ సంతోష్, హెచ్వీ శ్యామల, ఏఎన్ఎంలు శకుంతల, సుజాత, హెల్త్ అసిస్టెంట్లు జంపయ్య, కృష్ణయ్య, సదానందం, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యమకారుల కమిటీ ఏర్పాటు హర్షణీయం
మల్హర్ : తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయడం హర్షణీయమని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు అన్నారు. సోమవారం తాడిచర్లలో ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు బూడిద సతీష్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీశాఖ మంత్రి శ్రీధర్బాబుకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా టీయూఎఫ్ జిల్లా అధ్యక్షుడు యాదండ్ల గట్టయ్య, ప్రధాన కార్యదర్శి ముడితనపల్లి ప్రభాకర్ మాట్లాడుతూ.. జీఓ 679 ద్వారా కేకే కమిటీకి చైర్మన్గా నియమితులైన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ఎమ్మెల్సీ కోదండ రాం, అద్దంకి దయాకర్, ఎస్.రాములు నాయక్, మోతె శోభన్రెడ్డితో ఏర్పాటైన కమిటీ ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి దోహదపడుతుందన్నారు. మంత్రి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ కృషిని వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో టీయూఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలోజు సత్యనారాయణ, చొప్పరి రాజు, చాంద్ పాష, సారయ్య, చంద్రమౌళి, బడితల వెంకటస్వామి, కోట నవీన్, పద్మ, వసంతతో పాటు తదితరులు పాల్గొన్నారు. -
మలుపులతో ప్రమాదాలు
చిట్యాల : మూల మలుపులతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.. మలుపుల వద్ద సూచిక బోర్డులు లేకపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. మండలంలోని జడలపేట గ్రామ పంచాయతీ నుంచి నైన్పాకకు వెళ్లే ప్రధాన రోడ్డు వైపు ఉన్న మూల మలుపులతో వాహనాదారులు ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు అక్కడ ప్రమాదకరం అనే సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో పలువురు వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. రవాణా సౌకర్యం మెరుగుపడడంతో పాటు అనేక గ్రామాల ప్రజలు నిత్యం ఈ రోడ్డు గుండానే ప్రయాణిస్తున్నారు. మూల మలుపులు ఉన్న కారణంగా గతంలో ఈ ప్రాంతంలో కొందరు మండలంలోని గాంధీనగర్, నైన్పాక గ్రామాలకు చెందిన వాహనదారులు గాయపడి మృతి చెందారు. భయం భయంగా ప్రయాణం.. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. ఇక రాత్రివేళ అయితే వాహనదారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భయం భయంగా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మూలమలుపు వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో పలువురు వాహనదారులు ఎదురెదురుగా ఢీకొనే దుస్థితి ఏర్పడుతుంది. అధికారులు మండలంలోని పలు గ్రామాల్లోని మలుపుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. పట్టించుకోని అధికారులు, పాలకులు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి జడలపేట నుంచి నైన్పాక వెళ్లే ప్రధాన రోడ్డుపై సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి. గతంలో అనేక వాహనాలు ఢీకొన్న సంఘటనలు ఉన్నాయి. మూల మలుపుల వద్ద సంబంధిత అధికారులు వెంటనే సూచిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలి. – దామెరబోయిన నారాయణరావు, బావ్సింగ్పల్లి -
యూత్ కమిటీలు పూర్తిచేయాలి
చిట్యాల : యూత్ కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసేందుకు మండలంలోని అన్ని గ్రామాల కమిటీలను పూర్తిచేయాలని యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అల్లకొండ కుమార్ తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ.. మండలంలోని గ్రామశాఖ యూత్ కమిటీలను ఏర్పాటు చేసి ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పూర్తిస్థాయి మండల కమిటీని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బొమ్మ కిరణ్గౌడ్, గోల్కొండ నాగరాజు, ఎలగొండ చిరంజీవి, తీగల నాగరాజు, గోపగాని శివ, చిట్కూరి రాజు, నీలేష్, భద్రి, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా యువజన క్రీడోత్సవాలు
భూపాలపల్లి రూరల్ : ప్రజాపాలన–ప్రగతిప్రణాళికలో భాగంగా సోమవారం భూపాలపల్లి మండలంలోని పెద్దాపూర్, నాగారం గ్రామాల్లో యువజన వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దాపూర్ బస్టాండ్ నుంచి సుబ్బక్కపల్లి సమీపంలోని విద్యుత్ సబ్స్టేషన్ వరకు పరుగుపోటీలు నిర్వహించారు. నాగారంలో వాకథాన్తో పాటు యోగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో భూపాలపల్లి ఎంపీడీఓ తరుణ్, ఎంపీఓ నాగరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో యువకులు, పంచాయతీ కార్యదర్శులు, పెద్దాపూర్, గుర్రంపేట, బావ్సింగ్పల్లి, రామ్ నాయక్ తండా, సుబ్బక్కపల్లి గ్రామాల సర్పంచ్లు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. చిట్యాల : ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో యువజన వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా సోమవారం మండల కేంద్రంలో 2కే మారథాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రం నుంచి వ్యవసాయ మార్కెట్ వరకు కొనసాగిన మారథాన్ను ఎంపీఒ రామకృష్ణ, సర్పంచ్ తౌటం లక్ష్మి ప్రారంభించారు. క్రీడలు యువతలో శరీర దారుఢ్యంతో పాటు, స్నేహభావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. నిత్యం రన్నింగ్, వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ఉప సర్పంచ్ బుర్ర వెంకటేష్, వార్డు సభ్యులు నవీన్, పంచాయతీ కార్యదర్శి దేవేందర్రెడ్డి పాల్గొన్నారు. మొగుళ్లపల్లిలో.. మొగుళ్లపల్లి : యువజన వారోత్సవాల సందర్భంగా మండల పరిషత్ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు సోమవారం 2కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సురేందర్, సర్పంచ్ విజయ, ఎస్సై సురేష్, ఎంఈఓ కుమారస్వామి, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు. -
చికిత్స పొందుతున్న మహిళ మృతి
మల్హర్ : చికిత్స పొందుతున్న ఓ మహిళ మృతిచెందిన సంఘటన మల్హర్ మండలంలోని తాడిచర్లలో సోమవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం.. తాడిచర్ల గ్రామానికి చెందిన తిక్క రమ (55) కొనుగోలు కేంద్రంలో ధాన్యం ఆరబోసింది. ఇటీవల కురిసిన వర్షం వల్ల కల్లంలో ఆరబోసిన వడ్లు తడిసిపోయాయి. దీంతో ప్రతిరోజు కుటుంబ సభ్యులతో కలిసి రమ ధాన్యంను ఆరబెట్టడానికి వెళ్లేది. ఎండలో పనిచేయడంతో ఆదివారం వడదెబ్బ తగిలి అక్కడే స్పృహ కోల్పోయిందని కుటుంబ సభ్యులు చెప్పారు. వెంటనే స్థానిక వైద్యులకు చూపించి భూపాలపల్లిలోనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరచించారు. చికిత్స పొందుతూ రమ మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. -
‘ఆదర్శ’లో ప్రవేశాలు
మొగుళ్లపల్లి: ఇంటర్మీడియేట్ ఆంగ్లమాధ్యమంలో చదవాలనుకునే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆదర్శ పాఠశాలలు ఓ వరం. విద్యార్థులకు మెరుగైన విద్య, సౌకర్యాలు కల్పిస్తుండటంతో ఆదర్శ పాఠశాలలకు ఆదరణ పెరిగింది. 2026–27 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియేట్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 25వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. జిల్లాలో మొగుళ్లపల్లి, చిట్యాల, గణపురం, కాటారం, మల్హార్, మహాముత్తారం మండలాల్లో ఆరు ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. ప్రతీ పాఠశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో ఒక్కో గ్రూపుల్లో 40 సీట్ల చొప్పున 160 సీట్లు భర్తీ చేయనున్నారు. ఈ కోర్సులను ఆంగ్ల మాధ్యమంలో విద్యార్థులకు బోధిస్తారు. ప్రక్రియ ఇలా.. పదవ తరగతిలో వచ్చిన మార్కులతో పాటు రిజర్వేషన్ ఆధారంగా విద్యార్థులను ఇంటర్మీడియేట్లో ప్రవేశాలకు ఎంపిక చేయనున్నారు. అల్పాదాయ వర్గాల వారికి మొదటి ప్రాధాన్యం ఇస్తారు. ఈ నెల 26న దరఖాస్తులను పరిశీలించి ఎంపికై న విద్యార్థుల జాబితాను పాఠశాలల్లో ప్రదర్శిస్తారు. ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు ఎంపికై న విద్యార్థుల విద్యార్హత సర్టిఫికెట్లను పరిశీలించి ప్రవేశాలు కల్పించనున్నారు. జూన్ 2వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. ఇంటర్మీడియేట్ సిలబస్తో పాటు ఎంసెట్, నీట్, సీఏ, సీపీటీ కోచింగ్ కూడా ఇస్తారు. బాలికలకు హాస్టల్ సౌకర్యం.. ఆదర్శ పాఠశాలలో చదివే బాలికలకు హాస్టల్ వసతి ఉంది. 9, 10 తరగతులతో పాటు ఇంటర్మీడియేట్ చదువుతున్న 100 మందికే ఈ అవకాశం ఉంది. హాస్టల్కు కనీసం మూడు కిలోమీటర్లు, ఆపై దూరంగా ఉండే గ్రామాల నుంచి వచ్చే వారు మాత్రమే హాస్టళ్లలో ఉండేందుకు అర్హులు. వీరి కోసం ప్రత్యేకంగా కేర్ టేకర్, నర్సును నియమించారు. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ 25వ తేదీ వరకు గడువు -
ఆందోళనలో రైతన్నలు
లారీలు లేక కొనుగోలు కేంద్రంలో ఉన్న బస్తాలు కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం ఆరబోస్తున్న రైతులుఏటూరునాగారం: వాతావరణంలో తరుచూ మా ర్పులు వస్తుండడంతో రైతుల్లో వణుకు పుడుతుంది. ఎప్పుడు వర్షం వస్తుందోనని భయంతో గడుపుతున్నారు. ధాన్యం కాంటా అయినప్పటికీ లారీల్లో ఎగుమతి కాకపోవడంతో రైతులు పడిగాపులు పడుతున్నారు. మండలంలో కొనుగోలు కేంద్రాలు 11 ఉన్నప్పటికీ వాటి ద్వారా లారీల్లో మిల్లుకు బస్తాలు ఎగుమతి కావడం లేదు. దీంతో రైతులు తీవ్ర నిరాశకు, ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షం ఎప్పుడు వ చ్చి తమను నష్టపర్చుతుందని ఆందోళన చెందుతున్నారు. ఐకేపీ, పీఏసీఎస్, జీసీసీ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన నిర్వాహకుల నిర్లక్ష్యం మూ లంగా లారీలు సమయానికి రాక ఎగుమతి కాకపోవడంతో పడిగాపులు పడుతున్నారు. మరికొంత మంది పండించిన ధాన్యం మార్చరైజ్(తేమశాతం) తగినంత లేదని కొనుగోలు కేంద్రాల వద్దనే ఆరబెట్టుకొని కాపాల కాస్తున్నారు. ఇప్పటికై నా మండల, జిల్లా అధికారులు స్పందించి లారీలను వెనువెంటనే తరలించి బ స్తాలను మిల్లులకు పంపించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లారీల కొరతతో అవస్థలు కాంటాలు అయినా కదలని బస్తాలు వాతావరణంలో మార్పులుపండించిన ధాన్యంను తరలించడం లేదు. తేమశాతం లేదని కోతలు పెడుతున్నారు. లారీలు రావడం లేదని బస్తాలను ఇక్కడే నిల్వ చేసుకోవాల్సి వస్తోంది. లారీలు లేక బస్తాలు పోక తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. వర్షం ఎప్పుడు వస్తుందోనని టార్పాలిన్లు పట్టుకొని ఇక్కడే కూర్చుకుంటున్నాం. – కంకనాల నర్సయ్య, ఏటూరునాగారం -
పోగొట్టుకున్న సెల్ఫోన్ అప్పగింత
రేగొండ: పోగొట్టుకున్న సెల్ఫోన్ను గుర్తించి బాధితునికి కొత్తపల్లిగోరి ఎస్సై సాయి త్రిలోక్ రెడ్డి ఆదివారం అందజేశారు. మండలంలోని చిన్నకోడేపాక గ్రామానికి చెందిన పరుమండ్ల రాజు పరకాలకు వెళ్తుండగా ఫోన్ ఎక్కడో పోగొట్టుకున్నాడు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు వివరాలు నమోదు చేసి సీఈఐఆర్ పోర్టల్ ద్వారా సెల్ఫోన్ గుర్తించి బాధితునికి అందించారు. ఎవరైనా సెల్ఫోన్ పోగొట్టుకున్నా , దొంగతనానికి గురైనా ఫోన్ వివరాలు సీఈఐఆర్ పోర్టల్లో నమోదు చేసుకోవాలని తిరిగి పొందే అవకాశం ఉందని ఎస్సై సూచించారు. -
బాధిత కుటుంబాలకు పరామర్శ
ములుగు రూరల్: పరామర్శిస్తున్న మంత్రి సీతక్కవెంకటాపురం(ఎం)లో..ములుగు రూరల్: మల్లంపల్లి మండలంలోని గౌస్పల్లి గ్రామానికి చెందిన తిప్పారపు కిషన్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. కాగా ఆదివారం పంచాయతీ రాజ్శాఖ మంత్రి సీతక్క బాధితుడిని పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. వెంకటాపురం(ఎం): మండల కేంద్రానికి చెందిన అన్నబోయిన ఐలక్క ఇటీవల ఆనారోగ్యంతో మృతి చెందింది. దీంతో బాధిత కుటుంబాన్ని ఆదివారం ఉప సర్పంచ్ల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొట్ల కార్తీక్ పరామర్శించారు. మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన వెంట ఉప సర్పంచ్లు చింతం ప్రకాష్, ఎ.రాజు, బద్రునాయక్, రాజు యాదవ్ ఉన్నారు. గోవిందరావుపేట: మండలంలోని కర్లపల్లి గ్రామానికి చెందిన తండ్రికొడుకులు రసపుత్ రాజు, పవన్ ఇటీవల బావిలో పడి మృతి చెందారు. దీంతో బాధిత కుటుంబాన్ని జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్ ఆదివారం పరామర్శించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెంకటకృష్ణ, నాయకులు జంపాల ప్రభాకర్, శ్రీకాంత్, రసపుత్ సీతారాం నాయక్, నాగమణి పాల్గొన్నారు. -
గుడుంబా పట్టివేత
రేగొండ: అక్రమంగా గుడుంబా విక్రయిస్తున్న మహిళపై కేసు నమోదు చేసి గుడుంబా స్వాధీనం చేసుకున్నట్లు కొత్తపల్లిగోరి ఎస్సై సాయిత్రిలోక్నాథ్ రెడ్డి తెలిపారు. కొత్తపల్లిగోరి మండలంలోని సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన గుడా లక్ష్మీ ఇంటి వద్ద అక్రమంగా గుడుంబా విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం పోలీసులు దాడులు నిర్వహించి లక్ష్మీ వద్ద 4 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. టేకుమట్ల: మండలంలోని కుందనపల్లి గ్రామానికి చెందిన ఎంఎస్పీ మండల కన్వీనర్ మాడుగుల వీరయ్య తల్లి రాజమల్లమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో బాధిత కుటుంబాన్ని ఆదివారం ఎమ్మార్పీఎస్ నాయకులు పరామర్శించి 50కిలోల బియ్యాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రేనుకుంట్ల శంకర్, ప్రధాన కార్యదర్శి ఇల్లందుల శంకర్, జిల్లా నాయకులు రాంచందర్, సంపత్, తదితరులు ఉన్నారు. కాళేశ్వరం: మహదేవ్పూర్ మండలంలోని అంబట్పల్లిలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి పేకాట రాయుళ్లను పట్టుకున్నట్లు ఎస్సై పవన్కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వివరాలను వెల్లడించారు. ఆదివారం అంబట్పల్లిలో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పేకాటస్థారంపై దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.21వేల నగదు, సెల్ ఫోన్లు, ప్లేయింగ కార్డులను స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వెంకటాపురం(కె): మండల పరిధిలోని వెంగళరావుచపేట గ్రామంలో దుక్కిటెద్దులను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని గ్రామానికి చెందిన సమ్మయ్య అనే వ్యక్తి ఆదివారం పోలీస్ స్టేషన్లో ఫిరాదు చేశారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. సమ్మయ్య అతడి తమ్ముడి కుమారుడి పెళ్లి ఉండగా ఏప్రిల్ 30 వెళ్లాడు. పెళ్లిలో ఉండగానే పట్టపగలు అతడి ఇంటి ముందు ఉన్న దుక్కిటెద్దులను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకు పోయారని తెలిపారు. ఎద్దులకోసం పది రోజుల వరకు వెతికిన ఆచూకి లభించలేదని అన్నారు. మండలం నుంచి అక్రమంగా పశువులను తరలించే వ్యక్తులు తమ ఎద్దులను అపహరించుకు పోయారనే అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయం పూర్తి స్థాయిలో విచారణ చేసి తనకు న్యాయం చేయాని ఫిర్యాదులో పేర్కొన్నాడు. గోవిందరావుపేట: మండల పరిదిలోని చల్వాయి గ్రామానికి చెందిన నిరుపేద కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గణపాక సుధాకర్ కుటుంబం జీవనోపాధి కోసం ఫాస్ట్ ఫుడ్ స్టాండ్ను కాంగ్రెస్ నాయకులు ఆదివారం అందజేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఆర్థిక సాయంతో నాయకుడు పైడాకుల కృష్ణమూర్తి ఈ స్టాండును సుధాకర్కు బహూకరించారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. కార్యకర్తల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. తేళ్ల హరిప్రసాద్, వేల్పుగొండ ప్రకాష్, చాపల నరేందర్ రెడ్డి, మల్లారెడ్డి పాల్గొన్నారు. -
మహిళల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
● కాంగ్రెస్ మండల యూత్ అధ్యక్షుడు చింత క్రాంతి గోవిందరావుపేట: మహిళల అభివృద్ధే రాష్ట్ర ప్ర భుత్వ ధ్యేయం అని కాంగ్రెస్ మండల యూత్ అధ్యక్షుడు చింత క్రాంతి అన్నారు. మండలంలోని కర్లపల్లిలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న మహిళా సమాఖ్య భవనానికి శనివారం చింత క్రాంతి ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ మహిళలకు సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు శాశ్వత వేదికగా మహిళా సమాఖ్య భవనాలు ఉపయోగపడుతాయని అన్నారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా మరింత అభివృద్ధి చేందేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. సర్పంచ్ విజయ బాలరాజు, ఈక అప్పయ్య, హూసేన్, సమ్మయ్య,రాంబాబు, ప్రవీణ్, మల్లేష్, మహిళలు, గ్రామ ప్రజలు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
కళాశాల అభివృద్ధికి తోడ్పాటు
కాళేశ్వరం: మహదేవ్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి తమవంతు తోడ్పాటు అందిస్తామని సర్పంచ్ హసీనాబానో, పీఎస్ఏ చైర్మన్ తిరుపతి రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు అరుణ శ్రీనివాస్ తెలిపారు. విద్యా వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ జన్ను విజయ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించగా వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యా వారోత్సవాలను నిర్వహిస్తోందన్నారు. అనంతరం క్విజ్, వ్యాసరచన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
ముగిసిన విద్యా వారోత్సవాలు
మల్హర్: విద్యార్థులను సన్మానిస్తున్న అధ్యాపకులుడీఈఓ చేతుల మీదుగా ప్రశంస ప్రతం అందుకుంటున్న విద్యార్థి రసజ్ఞమల్హర్: ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా ఆదివారం మండల కేంద్రం తాడిచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యా వారోత్సవాలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా2025–26 వార్షిక పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు ప్రిన్సిపల్ విజయ దేవి పర్యవేక్షణలో అధ్యాపకులు విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు అధ్యాపకేతరులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. జిల్లా టాపర్కు రూ.10వేల చెక్కు విద్యా విజయోత్సవం సందర్భంగా మండలం కేంద్రం తాడిచర్ల జిల్లాపరిషత్ పాఠశాలకు చెందిన పదవ తరగతి జిల్లా టాపర్ మేనం ప్రణవీ రూ.10వేల చెక్కును డీఈఓ రాజేందర్, విద్యా శాఖకు అకాడమిక్ ఆఫీసర్ విజయ్ పాల్రెడ్డి, క్యాంప్ మొబైలింగ్ ఆఫీసర్ రమేష్, సెక్టోరియల్ ఆఫీసర్స్ చేతుల మీదుగా అందుకుంది. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ప్రశంసా పత్రంతో సత్కరించి, చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీహెష్ఎస్ సీనియర్ ఉపాధ్యాయులు కుమారస్వామి, రమేష్ పాల్గొన్నారు. విద్యార్థులకు నగదు బహుమతి మల్హర్(కాటారం): విద్యా విజయోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులకు పదివేల నగదు బహుమతి, ప్రశంస పత్రం ప్రదానం చేశారు. జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన మండలంలోని గంగారం తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థి మాచర్ల రసజ్ఞకు రూ.10వేల నగదు బహుమతి, ప్రశంస పత్రాన్ని డీఈఓ రాజేందర్ చేతుల మీదుగా అందుకుంది. ఈ సందర్భంగా రసజ్ఞను మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ బొంపల్లి గోవర్ధన్, అధ్యాపకులు, గంగారం సర్పంచ్ అభినందించారు. మొగుళ్లపల్లి: విద్యా వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ప్రతిభ చాటిన విద్యార్థులకు ఆదివారం బహుమతులు ప్రదానం చేశారు. మండంలోని కొర్కిశాల మోడల్ స్కూల్, కళాశాల విద్యార్థిని కె.సంజన ఇంటర్లో 973మార్కులతో జిల్లా టాపర్గా నిలిచింది. ఈసందర్భంగా డీఈఓ రాజేందర్ చేతుల మీదుగా సంజనకు రూ.10వేల నగదు బహుమతితోపాటు ప్రశంస పత్రం అందజేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ తాళ్లపల్లి రాకేశ్ తెలిపారు. -
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
చిట్యాల: ప్రతీ వాహనాదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్సై–3 ఈశ్వరయ్య అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని శివాజీ సెంటర్ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. వాహనదారులు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని కోరారు. అలాగే డ్రైవింగ్ చేసే వారి వద్ద తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్లతో పాటు తదితర పత్రాలను కలిగి ఉండాలని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అనంతరం అనుమానాస్పదంగా ఉన్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో పోలీస్ సిబ్బంది లాల్సింగ్, క్రాంతి, సందీప్తో పాటు తదితరులు పాల్గొన్నారు. ఎస్సై ఈశ్వరయ్య -
పశుగ్రాసానికి తప్పని తిప్పలు
వాజేడు: గ్రాసం కోసం మూగ జీవాలు అలమటిస్తున్నాయి. ప్రతీ ఏదాడి యాసంగి పంటలు అయి పోగానే రైతులు మూగ జీవాల కోసం మేతను సేకరించి నిలువ చేస్తారు. ఈ ఏడాది పంటలు అయి పోగానే మేతను సేకరించే పనిలో రైతులు సిద్ధమయ్యారు. కాని వేసవి ఎండలు అధికంగా ఉండటంతో పంటలు పూర్తి కాక ముందే ఎరగళ్లు పడి గడ్డి చాలా వరకు కాలిపోతుంది. దీంతో వరి గడ్డి సేకరణ కష్ట సాధ్యంగా మారింది. కొందరు రైతులు మాత్రమే ముందస్తుగా గడ్డిని సేకరించి భద్రపర్చుకున్నారు. మూగ జీవాలకు మేతను ఏర్పాటు చేయడం కోసం రైతుల తిప్పలు తప్పని పరిస్థితి కనిపిస్తుంది. ప్రమాదవశాత్తు దగ్ధమైన గడ్డి.. వేసవి ఎండలు అధికంగా ఉండడంతో పొలాలు కోసిన వెంటనే ప్రమాదవశాత్తు గడ్డి దగ్ధమవుతుంది. కొందరు రైతులు వారి పొలంలోని గడ్డికి నిప్పు పెడుతున్నారు. ఒక పక్క కొయ్య కాలును తగలబెట్టవద్దని అధికారులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొందరు రైతుల్లో ఇంకా మార్పు రావడం లేదు. దీంతో మేత లభించే అవకాశాలు లేక పోవడంతో పశువులకు మేతను ఎక్కడి నుంచి తీసుకు రావాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. ఉదయం లేవగానే మూగ జీవాలను వదిలేస్తున్నారు. వాటికి మేత లభించే అవకాశం లేక పోవడంతో చెట్లు, పుట్టలు, వాగుల వెంట తిరుగుతున్నాయి. పొద్దంతా రోడ్ల వెంట తిరిగి కాలీ కడుపుతో ఇంటికి వస్తున్నాయి. వర్షాలు కురిస్తేనే పశువులకు మేత లభించే అవకాశాలు ఉన్నాయి. ప్రమాదవశాత్తు దగ్ధమవుతున్న గడ్డి మేత లభించక అలమటిస్తున్న మూగ జీవాలు -
విద్యార్థులు దేశ భవిష్యత్కు మార్గదర్శకులు
● డీఈఓ రాజేందర్ భూపాలపల్లి అర్బన్: నేటి విద్యార్థులే దేశ భవిష్యత్కు మార్గదర్శకులు అని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ హాల్లో ఆదివారం నిర్వహించిన విద్యా విజయోత్సవం కార్యక్రమంలో డీఈఓ రాజేందర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు కేవలం చదువులోనే కాకుండా దేశ భవిష్యత్ను తీర్చిదిద్దే శక్తులుగా ఎదగాలని సూచించారు. నైతిక విలువలను పెంపొందించుకుంటూ సామాజిక సమస్యల పరిష్కారంలో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. దేశ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమని, నాయకత్వ లక్షణాలు, నూతన ఆవిష్కరణలు, సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం ద్వారా వ్యక్తిత్వ వికాసం సాధించాలని తెలిపారు. సమాజ పురోగతికి విద్యార్థులు తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం అవసరమన్నారు. ఈ సందర్భంగా పదవ తరగతి, ఇంటర్మీడియట్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన, క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రశంసాపత్రాలు, ఒక్కొక్కరికి రూ.10వేల నగదు బహుమతులతో సత్కరించారు. ఉల్లాస్ కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చిన ముగ్గురు వాలంటీర్లను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పరీక్షల నియంత్రణ అధికారి సామల రమేష్, క్వాలిటీ కోఆర్డినేటర్ పింగిళి విజయపాల్రెడ్డి, ప్లానింగ్ కోఆర్డినేటర్ దుప్పటి రాజగోపాల్, జీసీడీఓ శైలజ, అసిస్టెంట్ స్టాటిస్టికల్ కోఆర్డినేటర్ రామకృష్ణ, సిబ్బంది కృష్ణమోహన్, కిషన్రెడ్డి, శ్రీకాంత్, హేమలత, మహేందర్రెడ్డి, మల్లికార్జున్, శారద, శ్రీవాణి పాల్గొన్నారు. వరేణ్య సుమహిత నృత్య విభాగంలో.. కాళేశ్వరం: విద్యావారోత్సవాల్లో భాగంగా టీజీఎంఎస్ గణపురంలో నిర్వహించిన ఆర్ట్ అండ్ కల్చర్ కార్యక్రమంలో కాళేశ్వరంలోని పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల చెందిన విద్యార్థిని మాడుగుల వరేణ్య సుమహిత నృత్య విభాగంలో ప్రథమ స్థానంలో సాధించింది. ఈ మేరకు డీఈఓ రాజేందర్ వరేణ్య సుమహితకు బహుమతి అందజేశారు. -
నేటి ప్రజావాణి రద్దు
భూపాలపల్లి రూరల్: నేడు (సోమవారం) కాళేశ్వరంలో నిర్వహించనున్న నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మాక్డ్రిల్, సరస్వతి అంత్య పుష్కరాల ఏర్పాట్ల కార్యక్రమాల్లో జిల్లా అధికారులు పాల్గొనాల్సి ఉన్నందున నేడు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు కలెక్టర్ రాహుల్శర్మ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంబంధిత కార్యక్రమాల దృష్ట్యా అధికారులు అందుబాటులో ఉండరన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సోమవారం దరఖాస్తులు ఇచ్చేందుకు రావొద్దని ఆయన సూచించారు. పరుచుకున్న పచ్చదనం మహాముత్తారం: ఎండలు మండిపోతున్నాయి. చెట్లు కూడా ఎండిపోయి.. ఆకులు రాలిపోతున్నాయి. కానీ మహాముత్తారం మండలంలోని జీలపల్లి నుంచి పర్లపెల్లి వెళ్లే ఈ రహదారి వెంబడి ఉన్న చెట్లు మాత్రం పచ్చదనంతో కొమ్మలు అల్లుకొని పచ్చదనం పరుచుకుంది. బాటసారులు, వాహనదారులు ఆహా ఎంత పచ్చదనం అంటున్నారు. నేటినుంచి యువజన వారోత్సవాలు భూపాలపల్లి అర్బన్: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నేటినుంచి ఈ నెల 23 వరకు యువజన వారోత్సవాలు నిర్వహించనున్నట్లు డీవైఎస్ఓ చిర్ర రఘు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం ‘ఫిట్ అండ్ ఆక్టివ్ తెలంగాణ మారథాన్ అండ్ ఫిజికల్ లిటరసీ’ కార్యక్రమాన్ని జిల్లా స్థాయి, మండల స్థాయిలో నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయి మారథాన్ హనుమాన్ టెంపుల్ నుంచి అంబేడ్కర్ స్టేడియం వరకు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమవుతుందన్నారు. ఈ కార్యక్రమాల్లో క్రీడాకారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు, యువత అధిక సంఖ్య లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. యువత అన్ని రంగాల్లో రాణించాలి భూపాలపల్లి అర్బన్: ఆధునిక కాలంలో యువత విద్యతో పాటు అన్ని రంగాలలో రాణించాల్సిన అవసరం ఉందని భూపాలపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.రమణరావు తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేసిన విద్యా వారోత్సవాలలో చివరి రోజైన ఆదివారం ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న కళాశాల పూర్వ విద్యార్థులు, కళాశాల క్రీడాకారులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. విద్యార్థులు విద్యతోపాటు, క్రీడలు, కళలు వంటి అన్ని రంగాలలో ప్రావీణ్యం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొన్నారు. ఎప్సెట్లో అంజన్నకు 1,661 ర్యాంకు పలిమెల: మండల కేంద్రానికి చెందిన జనగామ అంజన్న ఆదివారం విడుదలైన ఎప్సెట్ ఫలితాల్లో 1,661 ర్యాంక్ సాధించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. మొదటి నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదివిన అంజన్న పదవ తరగతిలో మంచి మార్కులు రావడంతో హైదరాబాద్లోని గౌలిదొడ్డి ప్రభుత్వ సీఓఈ కాలేజీలో సీటు సాధించాడు. ‘సువైభ’కు నగదు పురస్కారం కాళేశ్వరం: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన విద్యా వారోత్సవాల ముగింపు సందర్భంగా విజయోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియేట్ ఫలితాల్లో జిల్లా స్థాయిలో మహదేవపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని సువైభ బైపీసీ విభాగంలో 985 మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబర్చగా జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ రూ.10 వేల నగదు పురస్కారం, ప్రశంసా పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ సీహెచ్ ప్రసాద్, సంధ్య, తదితరులు పాల్గొన్నారు. -
గో బ్యాక్ టు ఛత్తీస్గఢ్?
ఏటూరునాగారం: మావోయిస్టులు, సల్వాజుడుం గొడవలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న గొత్తికోయ గిరిజనులు ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని వదిలి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతానికి 15 ఏళ్ల క్రితం వలసవచ్చారు. ఏటూరునాగారం దట్టమైన అటవీ ప్రాంతంలోని అడవులను శుభ్రం చేసుకుని ఆవాసాలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాలతో కాలం గడుపుతున్నారు. ఇక్కడే ఆధార్, రేషన్, ఉపాధిహామీ కార్డులను సై తం పొందారు. స్థానికంగా జీవనస్థితి బాగానే ఉన్నప్పటికీ ఇక్కడ సాగు చేసుకున్న భూములకు ఎలాంటి హక్కు పత్రాలు లేకపోవడం.. కేవలం సాగు ఫలాలు మాత్రమే అనుభవించాలని ఫారెస్టు, రెవె న్యూ అధికారులు గిరిజనులకు చెబుతూ వస్తున్నా రు. ఈ క్రమంలో ఇటీవల అటవీ భూముల్లో సైతం అటవీశాఖ అధికారులు గోతులు తవ్వడం, పోడు భూముల్లో మొక్కలను నాటే ప్రక్రియను మొదలు పెట్టారు. దీంతో ఈ భూములను ఎప్పటికై నా ప్రభుత్వం లాక్కుంటుందని గిరిజనులు చర్చించుకుంటున్నారు. ఇదే క్రమంలో ఛత్తీస్గఢ్లో సైతం మావో యిస్టుల ప్రభావం తగ్గిపోవడంతో తిరిగివెళ్లాలనే గొత్తికోయలు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. సల్వాజుడంతోనే వలసలు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులను ఎదుర్కొనేందుకు అక్కడి పోలీసులు అప్పటి దివంగత సీఎం మహేంద్రకర్మ గిరిజన యువకులతో సల్వాజుడు మిలటరీ ప్లాట్స్ను ఏర్పాటు చేయించారు. గిరిజనుల్లో సల్వాజుడుం పోలీసు బెటాలియన్ సభ్యులున్నారని భావించిన మావోయిస్టు పార్టీ యువకులను టార్గెట్ చేసుకొని గిరిజన కుటుంబాలపై దాడులు చేయడం మొదలు పెట్టింది. ఈ పోరాటాలను తట్టుకోలేక 2001 నుంచి 2022 వరకు ఏటూరునాగారం సమీపంలోని గోదావరి దాటి అడవుల్లోకి వలస వచ్చారు. క్రమక్రమంగా వారు మంగపేట, కన్నాయిగూడెం, ఎస్ఎస్ తాడ్వాయి, గోవిందరావుపేట, వాజేడు, వెంకటాపురం(కె) ప్రాంతాలకు విస్తరించారు. జిల్లాలో ఇప్పటి వరకు 6 మండలాల్లో 51 గూడేల్లో 3,945 జనాభా ఉంది. వీరంతా సమీప అడవిలో పోడు చేసుకొని వారికి తోచిన వ్యవసాయాన్ని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆపరేషన్ కగార్తో తగ్గిన మావోయిస్టులు ఛత్తీస్గఢ్, ఒడిషా రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆపరేషన్ కగార్ను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. 2025–26లో వేలాది మంది మావోయిస్టులు అమరులయ్యారు. చాలా మంది కేంద్ర కమిటీ సభ్యులు సైతం లొంగిపోయారు. ఛత్తీస్గఢ్ పల్లెలు సైతం మావోయిస్టులు లేని పల్లెలుగా మారాయి. ఇటీవల కర్రెగుట్టల్లో సైతం సీఆర్పీఎఫ్ క్యాంప్ను ఏర్పాటు చేశారు. దీంతో మావోయిస్టులు లేని ప్రాంతాలుగా గిరిజన గ్రామాలు మారాయని భావించిన ఇక్కడున్న గొత్తికోయలు మళ్లీ అక్కడికి వెళ్లాలని చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ ఉన్న ప్రతీ గిరిజనుడికి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఇళ్లు, పట్టా భూములు కలిగి ఉన్నారు. పట్టా భూములపై హక్కులు ఉండడంతో మళ్లీ అక్కడకు వెళ్లి వ్యవసాయం చేసుకొని స్వేచ్ఛగా జీవించవచునే భావనతో గొత్తికోయలు ఉన్నారు. 15 ఏళ్ల క్రితం ఏజెన్సీకి వలసొచ్చిన గొత్తికోయలు మావోయిస్టుల ప్రభావం తగ్గడంతో పునరాలోచన జిల్లాలో 51 గూడేల్లో.. 3,945 మంది నివాసం -
విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యం
ములుగు/ములుగు రూరల్: సమాజంలో విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని, అక్షరజ్ఞానం మనిషిని సమాజంలో ఉన్నతమైన వ్యక్తిగా నిలబెడుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా కలెక్టరేట్ హాల్లో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన విద్య విజయోత్సవ దినోత్సవ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం కార్పొరేట్ స్థాయికి మించిన మెరుగైన విద్యను ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అందిస్తుందని తెలిపారు. విద్యారంగంలో జిల్లాకు ప్రత్యేకమైన విశిష్టత లభించిందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల చూపు జిల్లా వైపే ఉందని వెల్లడించారు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో జిల్లా మొదటి స్థానంలో నిలవడం గర్వకారణంగా ఉందన్నారు. విద్యా రంగంలో జిల్లా సాధిస్తున్న పురోగతిని మంత్రి కొనియాడారు. ఫలితాల్లో బాలికలే ఎక్కువ సంఖ్యలో ఉండడం అభినందనీయమన్నారు. -
గోదావరిలో ప్రముఖులకు దారి
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈనెల 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగు సరస్వతీనది అంత్య పుష్కరాలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. వీవీఐపీల కోసం సరస్వతీఘాటు తీరం నుంచి త్రివేణి సంగమంలోని నీటి వరకు వెళ్లడానికి బారికేడ్లు ఏర్పాటు చేసి మధ్యలో మట్టిరోడ్డు వేశారు. దానిపైన మ్యాట్లు రానున్నాయి. అక్కడే కంటెయినర్లు ఏర్పాటు చేస్తున్నారు. బయోటయిలెట్లు ఏర్పాటు చేస్తున్నారు. జల్లు స్నానాలకు ఏర్పాటు చేస్తున్నారు. కుడి, ఎడమ వైపున సాధారణ భక్తులు స్నానాలకు వెళ్లేందుకు షామియానాలు, మ్యాట్లు వేయనున్నారు. తీరం నుంచి రెండు ద్వారాల ద్వారా భక్తులు తరలి వెళ్లేందుకు ఏర్పాట్లు చేపట్టారు. 15 చెక్పోస్టుల ఏర్పాటు సరస్వతీనది అంత్యపుష్కరాలకు పలు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తారనే అధికారుల అంచనాతో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు వివిధ మార్గాల వద్ద 15 చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. 21 నుంచి వన్వే అమలులోకి రావడంతో చెక్పోస్టుల వద్ద ట్రాఫిక్ ఆంక్షలు ప్రారంభం కానున్నాయి. శివ కల్యాణ మండపంలో హోమాలు ఈనెల 21నుంచి జూన్ 1వ తేదీ వరకు పన్నెండు రోజుల పాటు హోమాలు నిర్వహించడానికి దేవాదాయశాఖ శివ కల్యాణ మండపంలో ఏర్పా ట్లు చేస్తుంది. హోమాల కోసం భారీ మంచుకొండల మాదిరిగా డెకరేషన్ సెట్టింగులు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా అచలాపురానికి చెందిన వేదపండితులు హోమాది పూజలు నిర్వహించనున్నారు. చివరి మూడు రోజులు రుద్రయాగం నిర్వహించడానికి శృంగేరి పీఠం నుంచి వేదపండితుల ఆధ్వర్యంలో నిర్వహిస్తారని ఆలయ వర్గాలు తెలిపాయి. -
లారీల కోసం నిరీక్షణ!
కాళేశ్వరం: ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు నానాకష్టాలు పడుతున్నారు. కాంటా వేసేటప్పుడు తేమశాతం ఉందని కొర్రీలు పెడుతున్నారు. అదే ధాన్యం కాంటావేసి లారీలు లోడు తీసుకుపోయేందుకు రాక కల్లాల వద్దనే పడిగాపులు కాస్తున్నారు. రాత్రిపగలు ధాన్యం కేంద్రాల్లోనే బసచేస్తున్నారు. వాతావరణంలో మార్పులు వస్తుండడంతో వడగండ్ల వాన కురిస్తే ఇబ్బందులు తప్పేలా లేవని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో దళారులను కొంతమంది రైతులు ఆశ్రయించి నష్టపోతున్నారు. అధికారులు స్పందించాలని వేడుకుంటున్నారు. ధాన్యం సేకరణ ఇలా.. జిల్లాలో 185 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. యాసంగి లక్ష్యం 1.60లక్షల టన్నులు కాగా ఇప్పటివరకు 15వేల టన్నులకు పైగా మిల్లులకు వెళ్లినట్లు సమాచారం. రూ.32 కోట్లకు రూ.5కోట్ల వరకు రైతులకు చెల్లించారని తెలిసింది. అధికారుల నిర్లక్ష్యం.. రైతుల ఆవేదన రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తోంది. పక్షం రోజులుగా గన్నీ సంచుల్లో వడ్లు నింపి కొనుగోలు కేంద్రాల వద్ద కాపలా కాస్తున్నా లారీలు అందుబాటులోకి రావడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కేంద్రాల నిర్వాహకులు, లారీ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో ధాన్యం లోడింగ్ ప్రక్రియ పూర్తిగా నత్తనడకన సాగుతోందని వాపోతున్నారు. ఒకవైపు మండుతున్న ఎండల్లో రోజంతా వేచిచూడాల్సి వస్తుండగా, రాత్రులు కూడా కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో వాతావరణంలో మార్పులు కనిపిస్తుండటంతో ఎప్పుడు వర్షం పడుతుందోనన్న భయంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చేతికొచ్చిన పంట తడిసిపోతే తమ పరిస్థితి ఏంటని రైతులు కన్నీరుపెడుతున్నారు. దళారుల దందా.. లారీలు రావడం లేదని దళారులు గ్రామాల్లో వాలిపోతున్నారు. కొందరు దళారులు గ్రామాల్లో తిరుగుతూ రైతులను మోసం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్వింటాలుకు రూ.300 నుంచి రూ.400 వరకు తగ్గించి ధాన్యం కొనుగోలు చేస్తూ తమ కష్టార్జితాన్ని దోచుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది రైతులు చేసేదేమీ లేక ఎంతో కొంతకు దళారులకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. మిల్లుల్లో ఆలస్యం.. కళ్లాల్లో ధాన్యం లోడ్ చేసుకుని మిల్లులకు వెళ్లిన లారీల్లో ధాన్యం సంచులు దించేందుకు హమాలీ ఎండ తీవ్రతకు సరిగ్గా రావడం లేదు. దీంతో మిల్లుల్లో నాలుగు రోజుల కాలవ్యవధి జరుగుతుండడంతో లారీలు తిరిగి రావడానికి ఆలస్యం అవుతుంది. లారీ కాంట్రాక్టర్లు కూడా కేంద్రాలకు రావడానికి వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. ఎండ తీవ్రతను తట్టుకోలేక పలువురు లారీ డ్రైవర్లు పనికి రావడం లేదని తెలుస్తోంది. ఇకనైనా అధికారులు వెంటనే స్పందించి లారీల కొరతను తీర్చడంతో పాటు ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి దళారుల నుంచి రైతులను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై సివిల్ సప్లయీస్ డీఎం రాములును వివరణ కోరడానికి సంప్రదించగా ఫోన్లో అందుబాటులోకి రాలేదు. కల్లాల్లోనే రైతుల పడిగాపులు ఎండ తీవ్రతతో లారీల్లో లోడు దించక ఆలస్యం దళారులను ఆశ్రయిస్తున్న రైతులు క్వింటాకు రూ.200–300 వరకు రైతుకు నష్టంమిల్లుల వద్ద ఆలస్యం కావడంతోనే..మిల్లులకు వెళ్లిన లారీలు మూడు, నాలుగు రోజుల వరకు హమాలీ దించడం లేదు. ఎండకు లారీ డ్రైవర్లు కూడా పనికి రావడం లేదు. దీంతో లారీలు కల్లాల వద్దకు రావడం లేదు. – శ్రీనివాస్రెడ్డి, సివిల్ సప్లయీస్ లారీ కాంట్రాక్టర్ -
బదిలీల భయం!
● ఎంజీఎంలో పాతుకుపోయిన ఉద్యోగులు ● స్థానచలనం తప్పదా? ● ఉన్నతాధికారి పోస్టుకు డిమాండ్ కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో ఉన్నతాధికారి నుంచి జూనియర్ అసిస్టెంట్ వరకు బదిలీల ఫీవర్ పట్టుకుంది. ప్రభుత్వం బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జాయినింగ్ పీరియడ్ లెక్కలు వేసుకుంటూ సర్వీస్ బుక్లతో కుస్తీ పడుతున్నారు. డీఎంఈ కార్యాలయంలో పలుకుబడి ఉపయోగించుకుంటూ బదీలీల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొంతమంది యూనియన్ పేరు చెప్పుకుంటూ ఆఫీస్ బేరర్లుగా బదిలీల నుంచి మినహాయింపు, కోరుకున్న చోటకు వెళ్లేందుకు ఎవరికి వారే ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. నిబంధనల ప్రకారం.. 40 శాతం ఉద్యోగులకు బదిలీలకు అవకాశం ఉండడంతో నాలుగేళ్ల సర్వీస్ దాటిన వారందరికీ బదిలీల గండం ఏర్పడింది. ఇక్కడే తిష్ట.. ఎంజీఎంలో కొంతమంది ఉద్యోగులు బదిలీల నుంచి తప్పించుకుంటున్నారు. ప్రమోషన్లు సైతం వదులకుని ఇక్కడే తిష్ట వేస్తున్నట్లు తెలుస్తోంది. జూనియర్ అసిస్టెంట్ క్యాడర్లో ఉన్న ఉద్యోగులు అకౌంట్ టెస్ట్ పాస్ కాకపోవడం వల్ల ఎంజీఎంలోనే విధులు నిర్వహిస్తున్నారు. ఓ ఉద్యోగి అయితే జాయినింగ్ నుంచి ఇక్కడే విధులు నిర్వహిస్తున్నారు. దాదాపు మూడు దశాబ్దాల నుంచి పని చేస్తున్నా మళ్లీ బదిలీ నుంచి మినహాయింపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా, మినిస్టీరియల్ విభాగం నుంచి ఐదుగురు ఉద్యోగులు బదిలీలకు సిద్ధంగా ఉన్నారు. ఇక పెద్దాస్పత్రి పెద్ద పోస్ట్ అయిన సూపరింటెండెంట్ పోస్ట్ కోసం ఎంజీఎంలో పనిచేసిన ఉన్నతాధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్లో ఎంజీఎం ఆస్పత్రిని 24 అంతస్తుల భవనంలోకి మార్చే అవకాశం ఉండడంతో పెద్ద పోస్టు కోసం భారీగా పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. రావాలన్నా.. పోవాలన్నా భయమే! ఎంజీఎంలో పనిచేస్తున్నవారు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు జంకుతుండగా, ఇతర జిల్లాల్లోని అధికారుల్లో కొందరు ఎంజీఎం అంటే వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆస్పత్రిలో గతంలో జరిగిన అవకతవకలపై తరచూ పత్రికల్లో రావడంతో వామ్మో, ఎంజీఎం మాకొద్దు అంటూ ఇక్కడ ఉద్యోగం చేయడానికి జంకుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎంజీఎంలో సూపరింటెండెంట్గా పని చేస్తున్న డాక్టర్ హరీశ్చంద్రారెడ్డి మంచిర్యాలలో సూపరింటెండెంట్ పోస్టులో ఉండగా, ఎంజీఎంలో ఇన్చార్జ్ సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. డాక్టర్ హరీశ్చంద్రారెడ్డి బదిలీపై ఇతర ఆస్పత్రికి వెళ్లి, తిరిగి ఎంజీఎంలో ఇన్చార్జ్గా కొనసాగడానికి ప్రత్యేక ఆర్డర్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే.. ఈ పోస్టు కోసం ఎంజీఎంలోనే సూపరింటెండెంట్గా విధులు నిర్వహించిన డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ గోపాల్రావు గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్గా పని చేస్తున్న డాక్టర్ సంధ్య కేఎంసీతో పాటు కాళోజీ యూనివర్సీటీలో కూడా పనిచేశారు. అయితే ఆమె బదిలీ కావడానికి అవకాశం ఉన్నప్పటికీ తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ నుంచి ఆఫీస్ బేరర్ లెటర్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈపోస్టు కోసం మహబూబాబాద్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న డాక్టర్ శ్రీనివాస్ కూడా తన వంతు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. -
పశువుల అక్రమ రవాణాపై ఉక్కుపాదం
● ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ములుగు రూరల్/గోవిందరావుపేట: పశువుల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు ఆయన శనివారం మండల పరిధిలోని మల్లంపల్లితో పాటు గోవిందరావుపేట మండల పరిధిలోని పస్రాలోని సోమలగడ్డ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా నుంచి ఎట్టి పరిస్థితుల్లో పశువుల అక్రమ రవాణా జరగకూడదని, ఎవరైనా నిబంధనలకు ఉల్లంఘించి పశువుల అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చెక్ పోస్టుల వద్ద విధులు నిర్వహించే సిబ్బంది షిఫ్టుల వారీగా విధులు నిర్వహించాలన్నారు. విధుల్లో అలసత్వం వహించొద్దని హెచ్చరించారు. పశువులు రవాణా చేసే వ్యక్తుల వద్ద సరైన పత్రాలు ఉన్నాయా లేదా పూర్తి స్థాయిలో తనిఖీ చేయాలని ఆదేశించారు. -
జాగిలాలతో తనిఖీలు
భూపాలపల్లి అర్బన్: గంజాయి సరఫరా, వినియోగాన్ని అరికట్టడంపై జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశాల మేరకు శనివారం ఆపరేషన్ ఆర్ఐ కాశీరాం ఆధ్వర్యంలో ఈగల్ టీం సిబ్బంది నార్కోటిక్ డాగ్ సహాయంతో పాన్షాప్లు, కిరాణా దుకాణాలు, బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వం నిషేధించిన మత్తు పదార్థాలను ఎవరైనా నిల్వ ఉంచినా లేదా విక్రయిస్తున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే డయల్ 100 లేదా సమీప పోలీస్ స్టేషన్కు తెలియజేయాలని కోరారు. -
బంగారం కొనలేకపోతున్నాం..
ె పెరిగిన ధరల దృష్ట్యా సామాన్య, మధ్య తరగతి మహిళలం బంగారం కొనలేక పోతున్నాం. వివాహ సమయాల్లో పుట్టింటి కానుకగా అందించిన ఆభరణాలతో సరిపెట్టుకుంటున్నాం. ప్రధాని మోదీ హైదరాబాద్లో ప్రకటించిన విధంగా ఏడాది వరకు బంగారాన్ని కొనకుండా వేచిచూస్తాం. దీంతోనైనా దేశానికి మేలు కలగడంతోపాటు ధరలు దిగివస్తాయని ఆశిస్తున్నా. – గోనె లత, కరీమాబాద్ రోడ్డు వరంగల్ అవసరమైతేనే బైక్ తీస్తున్నా.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగాయి. సామాన్యులపై భారం పడింది. ఏ చిన్న పనికి కూడా వాహనంపై వెెళ్లడమే ప్రజలకు అలవాటుగా మారింది. పెరిగిన ధరలను చూస్తే చిన్న పనులకు బైక్, కారు రోడ్డు ఎక్కించడం సామాన్యులకు భారమే. అత్యవసరం అనుకుంటేనే కారు, బైక్ తీయాలని సూచిస్తున్నా. ఇంటి నుంచి ఎక్కడికై నా సైకిల్ మీద లేదా నడిచి వెళ్తున్నా. దీంతో నాకు ఆరోగ్యంతోపాటు డబ్బులు ఆదా అవుతున్నాయి. – మచ్చిక రాజు, వరంగల్ సేంద్రియ పద్ధతి పాటిస్తున్నాం.. సేంద్రియ సాగు విధానాన్ని పాటిస్తున్నాం. తప్పని పరిస్థితుల్లో యూరియాను పంటలకు వాడుతున్నాం. నూతన పద్ధతులు ఎన్ని పాటించినా ఎకరాకు ఒక బస్తా యూరియా వేస్తే పచ్చదనంతోపాటు పంట ఎదుగుదల కనిపిస్తుంది. అధికారులు ప్రత్యేక చొరవ చూపి ఖరీఫ్ సీజన్లో యూరియా కొరత లేకుండా చూడాలి. – పులి మంజుల, మహిళా రైతు, లింగగిరి -
పొదుపు.. భవిష్యత్ మదుపు!
ఖిలా వరంగల్: అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా దేశంలో విదేశీ మాదకద్రవ్య వినియోగం తగ్గించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దిగుమతి చేసుకున్న బంగారం, ఎరువులు, ఇంధనం, వంట నూనె, ఇతర సరుకుల వాడకం విషయంలో పొదుపు పాటించాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ వీటి వినియోగం ఎక్కువగా పెరిగింది. ఇదేపరిస్థితి కొనసాగితే భవిష్యత్లో ఇబ్బందులు తప్పేలా లేవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈనేపథ్యంలో ప్రధాని సూచనను మన ఇంటినుంచే ఆచరిద్దాం. దీనివల్ల వ్యక్తిగత ప్రయోజనంతో పాటు దేశానికి మేలు జరుగుతుంది. ఉమ్మడి జిల్లాలో ప్రధాన ఖర్చులు.. ఆదాపై ఈ ఆదివారం ‘సాక్షి’ సండే స్పెషల్.. నూనె వాడకమూ ఎక్కువే.. ఇళ్లలో వంటలకు వాడే నూనెకు భారీగా వెచ్చిస్తున్నారు. నలుగురు కుటుంబ సభ్యులున్న ఇంటిలో నెలకు నగటున ఐదు లీటర్లు వాడుతున్నారు. నెల రోజులకు ఇప్పటికీ చూస్తే ఒక్కో ప్యాకెట్కు రూ.25కు పైగా ధరలు పెరిగాయి. అతిగా వంట నూనె వాడితే శరీరానికి విటమిన్లు, మంచి కొవ్వు, కేలరీలు అందవు. హార్మోన్ల అసమతుల్యతతో ఎక్కువ మంది ఊబకాయం, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధుల బారినపడుతున్నా వినియోగం తగ్గించడం లేదు. ఉమ్మడి జిల్లాలో సుమారు 38.20 లక్షల కుటుంబాలు ఉండగా నెలకు 1.90 కోట్ల లీటర్ల నూనె వాడుతున్నట్లు అంచనా. ప్రధాని పిలుపు మేరకు అందులో 10 శాతం తగ్గించినా 19 లక్షల లీటర్లు ఆదా అవుతుందని నిపుణులు చెబుతున్నారు. బంగారం చూసుకుని కొందాం.. వివాహాలు, ఇతర శుభకార్యాలకు స్వర్ణాభరణాలు కొనడం అలవాటుగా మారింది. ఈ విషయంలో నియంత్రణ పాటిస్తే కచ్చితంగా ప్రయోజనం కలుగుతుంది. ప్రధానంగా వరంగల్ నగరంలో 210కుపైగా షాపులు, మిగిలిన జిల్లాల్లో మరో 200 షాపులు ఉన్నాయి. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా సగటున రోజుకు 6 కిలోల బంగారు నగల అమ్మకాలు సాగుతున్నట్లు వ్యాపారుల అంచనా. ఈ విషయంలో కొంత పొదుపు పాటించాల్సిన అవసరం ఉంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ధరలు పెరగడంతో 80 శాతం కొనుగోళ్లు తగ్గిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇంధనం ఆదా చేద్దామా.. పశ్చిమాసియా పరిణామాలు ఇంధన వినియోగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు తమ కాన్వాయిలో వాహనాలను తగ్గించుకునేలా తీసుకున్న నిర్ణయం స్ఫూర్తిగా నిలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో 7,82,314 వాహనాలు ఉన్నాయి. దీంతో సగటున నెలకు 19 లక్షల లీటర్ల పెట్రోల్, 7 లక్షల లీటర్ల డీజిల్ వినియోగమవుతోంది. ఒక ద్విచక్రవాహనం ఇంధనం కోసం సగటున నెలకు రూ.మూడు వేలు వెచ్చించాల్సి వస్తోంది. ఇది ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబం.. నెలవారీ నిత్యావసర సరుకుల కొనుగోలుకు సమానంగా ఉంటుంది. ఖరీదైన వాహనాలను విని యోగిస్తే ఇంధన వ్యయం ఎక్కువ. బైక్లపై వెళ్లడం కంటే కాలినడకన, సైకిళ్ల మీద వెళ్తే కొంత ఇంధనాన్ని ఆదా చేసినట్లే. ఎరువుల మోతాదు మించొద్దు.. పంటలకు మోతాదుకు మించి ఎరువులు వాడుతున్నారు. అధికారుల సిఫార్సు మేరకు ఎకరాకు మూడు దశల్లో 75 కిలోల యూరియా వినియోగించాల్సి ఉండగా.. జిల్లాలో 225 కిలోల కంటే ఎక్కువ ఉపయోగిస్తున్నట్లు వ్యవసాయ అధికారులే చెబుతున్నారు. దీంతో నేలసారం తగ్గడమే కాకుండా చీడ పీడలు వ్యాపించి సాగు వ్యయం గణనీయంగా పెరుగుతుంది. ఖరీఫ్లో జిల్లా వ్యాప్తంగా 15 లక్షల ఎకరాల్లో పంటలు సాగువుతుండగా.. నిబంధనల ప్రకారం 41 వేల మెట్రిక్ టన్నుల యూరియా వేయాలి. ఈ ప్రకారం రసాయన ఎరువులు వేస్తే విదేశీమారక ద్రవ్యం వినియోగం తగ్గడంతో పాటు సాగుపరంగా ఎదురయ్యే ఇబ్బందులూ తీరుతాయి. ప్రధాని మోదీ సూచనను మన ఇంటి నుంచే ఆచరిద్దాం..విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయడానికి పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలి. ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇవ్వాలి. – ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపు వంట నూనెల వాడకం తగ్గిస్తే.. ఇంటి ఖర్చులో అధిక ఆదా అవసరమైతేనే బైక్, కారు.. కాలినడక ఆరోగ్యానికి మంచిది దిగుమతి వస్తువుల వినియోగాన్ని తగ్గిస్తే మేలు -
తగ్గుతున్న అడ్మిషన్లు
● మూడు గురుకుల కళాశాలల్లో 50 మంది మాత్రమే చేరికఏటూరునాగారం: జిల్లాలోని గిరిజన గురుకుల కళాశాలల్లో అడ్మిషన్లు తగ్గుముఖం పడుతున్నాయి. ములుగు జిల్లాలోని ఇంచెర్ల, ఏటూరునాగారం, కాటారం బాయ్స్ కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదివే విద్యార్థులు కేవలం 50 మంది మాత్రమే అడ్మిషన్లు పొందారు. సుమారు మూడు కళాశాలల్లో 300 వరకు సీట్లు భర్తీ చేయాల్సి ఉంది. కానీ కేవలం మూడు కళాశాలల్లో 50 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందడం గమనార్హం. గిరిజన గురుకుల కళాశాలల్లో నాణ్యమైన విద్య, భోజనం, వసతి లేదనే అనుమానాలు గిరిజన విద్యార్థుల్లో నెలకొంది. దీంతో కళాశాలల్లో చేరేందుకు గిరిజన విద్యార్థులు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా, డివిజన్స్థాయి అధికారుల పర్యవేక్షణ గురుకులాలపై లేకపోవడంతో విద్యాబోధన సరిగా సాగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఏటూరునాగారం బాలికల గురుకుల కళాశాలలో సైతం ఫుడ్ ఫాయిజన్ అయి కూడా చాలా మంది విద్యార్థినులు ఆస్పత్రుల పాలయ్యారు. దీంతో విద్యార్థులను గురుకులాల్లో చేర్చేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు సైతం సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఆర్సీఓ హరిసింగ్ను ఫోన్లో సంప్రదించగా స్పందన కరువైంది. -
ప్రవేశాలకు వేళాయె..
● జిల్లాలో ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభం ● జూన్ 1 నుంచి కళాశాలలు పునఃప్రారంభంభూపాలపల్లి అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు పెంచేందుకు అధికారులు కార్యాచరణ చేపట్టారు. జూన్ 1నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో తొలి విడత ప్రవేశాలు చేపట్టాలని ప్రభుత్వం ప్రకటించింది. ప్రవేశాలు పెంచేందుకు ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. జిల్లావ్యాప్తంగా గతేడాది 3,778మంది విద్యను అభ్యసించారు. విద్యార్థులకు అవగాహన.. ప్రభుత్వ కళాశాలల్లో విద్యాబోధన, వసతులు, అధ్యాపకుల వివరాలు, ఫలితాలను వివరిస్తూ ప్రవేశాలు పెంచుకోవాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు దీనిపై దృష్టి సారించారు. గడిచిన విద్యా సంవత్సరంలో ఇంటర్ పరీక్షలు ముగిసిన నాటినుంచి కళాశాలల వారీగా వారి మండలాల పరిధిలో ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి టెన్త్ పూర్తిచేసిన విద్యార్థులకు అవగాహన కల్పించారు. వారం రోజులుగా ఊరూరా తిరుగుతూ పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ప్రత్యక్షంగా కలుస్తున్నారు. కళాశాలల్లో ఉన్న వసతులు, ప్రయోగశాలలు, అధ్యాపకులు తదితరలను వివరిస్తూ తమ కళాశాలల్లో ప్రవేశం పొందాలని అభ్యర్థిస్తున్నారు. గతేడాది కూడా ముందస్తు ప్రచారంతో కొంతమేరకు విద్యార్థుల సంఖ్య పెరిగి ప్రభుత్వ కళాశాలల్లో చేరారు. ఉచిత విద్య, వసతులు.. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఉచిత పుస్తకాలు అందించడంతో పాటు నిష్ణాతులైన అధ్యాపకులతో విశాలమైన తరగతి గదులు, గ్రంథాలయాలు, ప్రయోగశాలలు, మైదానాలు వంటి సౌకర్యాలు ఉన్నాయి. వీటికి తోడు గురుకులాల్లో ఉచితంగా ఇంటర్ చదువుకునే అవకాశమున్నా ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. జిల్లాలోని మోడల్ స్కూల్, కేజీబీవీల్లో చదువుతున్న వారికి ప్రాధాన్యమిస్తూ మిగిలిన సీట్లను నిబంధనలకు అనుగుణంగా కొత్తవారికి ప్రవేశాలు కల్పిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలను ఈసారి ఎక్కువగా పెంచుకునేందుకు అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లు ముందుకు సాగుతున్నారు. జిల్లా కేంద్రంలో హాస్టల్ సౌకర్యాలు జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పొందే బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి సౌకర్యాలు కూడా ఉన్నాయి. దూర ప్రాంతాల విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత విద్యను అందించేందుకు బాలబాలికలకు వేర్వేరుగా ఎస్సీ, ఎస్టీ, బీసీల పోస్ట్మెట్రిక్ హాస్టల్ వసతులు అందుబాటులో ఉన్నాయి. హాస్టల్లో ప్రతీ రోజు టిఫిన్, రెండు పూటలా భోజన సౌకర్యాలు ఉంటాయని అధ్యాపకులు ప్రచారం చేస్తున్నారు. కళాశాలల్లో సైతం ఈ ఏడాది నుంచి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 5మోడల్ కళాశాలలు 6కేజీబీవీ కళాశాలలు 10బీసీ వెల్ఫేర్ కళాశాలలు 4ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలలు 2 సోషల్ వెల్ఫేర్ కళాశాలలు 2మైనారిటీ కళాశాల 1ప్రైవేట్ కళాశాలలు 4నాణ్యమైన విద్య.. ప్రవేశాలు పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారించాం. ఈ ఏడాది జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. ప్రిన్సిపాళ్లు, అధ్యాపకుల భాగస్వామ్యంతో విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ప్రచారం చేపట్టి ప్రభుత్వ కళాశాలల్లో చేరేలా ప్రోత్సహిస్తున్నారు. కళాశాలల్లో వసతులు, ఫలితాల గురించి కరపత్రాల ద్వారా వివరిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో ఉచిత నాణ్యమైన విద్య విద్యార్థులకు అందుతుంది. గతేడాది కంటే ఎక్కువ ప్రవేశాలు పొందేలా ముందుకు సాగుతున్నాం. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు కావాల్సిన పాఠ్య పుస్తకాలు కళాశాలలకు చేరుకున్నాయి. ప్రథమ సంవత్సరం విద్యార్థుల పాఠ్య పుస్తకాలు జూన్ రెండో వారంలోపు వచ్చే అవకాశం ఉంది. – వెంకన్న, జిల్లా ఇంటర్ విద్యా నోడల్ అధికారి -
అంత్య పుష్కరాలకు ఆహ్వానం
కాళేశ్వరం: కాళేశ్వరంలో ఈనెల 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగు సరస్వతీనది అంత్య పుష్కరాలకు రావాలని హైదరాబాద్లో పలువురు మంత్రులు, ప్రముఖులకు ఆహ్వాన పత్రికను శనివారం దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ రాహుల్శర్మ అందజేశారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్కకు ఆహ్వాన పత్రికను అందజేశారు. దేవాదాయ శాఖ ధార్మిక సలహాదారు గోవింద హరి, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్రెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ముఖ్యమంత్రి కార్యదర్శి వేముల శ్రీనివాస్లకు ఆహ్వాన పత్రికను అందజేశారు. వారివెంట ఆలయ ఈఓ మహేష్, ఉపప్రధాన అర్చకులు ఫణీంద్రశర్మ, వేదపారయనదార్ వైకుంఠ పాండాలు పాల్గొన్నారు. ప్రలోభాలకు లొంగొద్దు ● అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల భూపాలపల్లి రూరల్: మానవ అక్రమ రవాణా, లైంగిక వేధింపులకు గురికావద్దని, డబ్బులు, ఉద్యోగాల ఆశ చూపించి మహిళలను, చిన్నపిల్లలను లొంగదీసుకుంటారని ఎటువంటి ప్రలోభాలకు గురికావద్దని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల సూచించారు,. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణా బాధితులు, లైంగిక దోపిడీ అనే అంశంపై శనివారం పట్ణణంలోని సఖి కేంద్రంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్జి అఖిల హాజరై ప్రసంగించారు. వెనుకబాటుతనాన్ని ఆసరాగా చేసుకొని నేరస్తులు మోసాలుచేసే అవకాశాలుంటాయని తెలిపారు. నేరాలు జరగకుండా కట్టడి చేయాలంటే ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ ప్లీడర్ బొట్ల సుధాకర్, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శ్రీనివాస్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కంప అక్షయ, జిల్లా సంక్షేమ అధికారి మల్లీశ్వరి, సీడీపీఓ రాధిక, సఖి సెంటర్ అడ్మినిస్ట్రేటర్ గాయత్రి, లీగల్ సర్వీసెస్ అథారిటీ సీనియర్ అసిస్టెంట్ సురేందర్ పాల్గొన్నారు. డీజీపీని కలిసిన ఎస్పీ భూపాలపల్లి అర్బన్: డీజీపీ సీవీ ఆనంద్ను ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ శనివారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితులు, కాళేశ్వరం పుష్కరాల బందోబస్తు ఏర్పాట్లు, ప్రజల భద్రత కోసం పోలీసు శాఖ చేపడుతున్న ప్రత్యేక చర్యలపై ఎస్పీ వివరించారు. జిల్లా పోలీసుల పనితీరును అభినందించిన డీజీపీ ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. లారీ, కారు ఢీకొని ముగ్గురికి తీవ్రగాయాలు మల్హర్(కాటారం): లారీ–కారు ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలైన ఘటన కాటారం మండలం నస్తూరిపల్లి గ్రామ క్రాస్ సమీపంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మహదేవపూర్ వైపు నుంచి కాటారం వైపు వెళ్తున్న ఇసుక లారీ, కాళేశ్వరం వైపు వస్తున్న కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన సురేందర్రెడ్డి, కిరణ్రెడ్డి, రవీందర్రెడ్డిని వెంటనే అంబులెన్స్ ద్వారా మహదేవపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. గాయపడిన వారు రేగొండ మండలం కాకర్లపల్లి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
అనాథ బాలికలకు ఉచిత ప్రవేశాలు
భూపాలపల్లి రూరల్: జిల్లాలోని అనాథ, పాక్షిక అనాథ బాలికలకు దుర్గాబాయి దేశ్ముఖ్ బాలికల పాలిటెక్నిక్ కళాశాలలో ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్టు కలెక్టర్ రాహుల్ శర్మ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పదవ తరగతి పూర్తిచేసిన అర్హత కలిగిన బాలికలు ఈ నెల 22లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు ఫారాన్ని జిల్లా బాలల పరిరక్షణ విభాగం, బాల రక్షా భవన్ కలెక్టరేట్లో అందజేయాలని సూచించారు. పూర్తి వివరాల కోసం 99481 52061 ఫోన్నంబర్లో సంప్రదించాలని తెలిపారు. మోటార్ బిగించారు మల్హర్: ఈనెల 14న సాక్షిలో ప్రచురితమైన పొలాల నుంచి తాగునీరు కథనానికి అధికారులు స్పందించారు. మండలంలోని అన్సాన్పల్లి గ్రామంలోని ఒకటో వార్డులో బోరు మోటార్ చెడిపోగా.. శుక్రవారం బోరు మోటరు బిగించారు. అధికారులు, పంచాయతీ పాలక వర్గం సభ్యులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించారు. ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ భూపాలపల్లి రూరల్: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (రామంతాపూర్)లో ఒకటవ తరగతి ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి అధికారి ఇందిరా శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాకు ఒక సీటు కేటాయించారని, దరఖాస్తు చేసుకునే విద్యార్థులు జూన్ 1నుంచి 2019 నుంచి మే 1, 2020 మధ్య జన్మించి ఉండాలని పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు ఈ నెల 29వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్కు.. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీం పథకం కింది 1వ తరగతి, 5వ తరగతిలో ప్రవేశం కోసం జూన్ 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ అధికారి ఇందిర శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో 1వ తరగతికి (41) సీట్లు, 5వ తరగతికి (43) సీట్లు కేటాయించినట్లు తెలిపారు. 31వరకు రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు భూపాలపల్లి అర్బన్: ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ నెల 31వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు భూపాలపల్లి రెడ్క్రాస్ చైర్మన్ డాక్టర్ కాశిట్టి శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా మార్గదర్శకత్వంలో, రాష్ట్ర చైర్మన్ దాన కిషోర్ నాయకత్వంలో రెడ్ క్రాస్ సంస్థ సేవలు అందిస్తుందన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, కలెక్టర్ రాహుల్ శర్మ ఆధ్వర్యంలో జిల్లాలో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతీ భారతీయ పౌరుడు జీవిత, వైస్ ప్యాట్రన్, ప్యాట్రన్ సభ్యులుగా చేరవచ్చన్నారు. ఇప్పటికే సభ్యత్వం ఉన్న వారు తమ వ్యక్తిగత వివరాల్లో మార్పులు ఉంటే వెంటనే నవీకరించుకోవాలని సూచించారు. సభ్యత్వ నమోదు కోసం మోర శంకరమూర్తి 63051 78278, సంగెం రామకృష్ణ 99081 81339లను సంప్రదించాలని తెలిపారు. పశువుల అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు రేగొండ: పశువులను అక్రమ రవాణాచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ సంపత్రావు అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలో ఏర్పాటుచేసిన చెక్పోస్ట్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సరైన ధృవపత్రాలు లేకుండా పశువులను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వివిధ సంఘాల వ్యక్తులని వాహనాలను తనిఖీ చేయరాదని, చట్టాన్ని చేతులోకి తీసుకునే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విధుల్లో అప్రమత్తంగా ఉండాలని, అక్రమ రవాణాను అరికట్టడంలో నిర్లక్ష్యం వహించద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో గణపురం సీఐ కరుణాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. -
సంస్థను ముందుకు నడిపించాలి
భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో సవాళ్లను అధిగమిస్తూ సంస్థను ముందుకు నడిపించాలని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి కోరారు. ఈ నెల 18నుంచి నిర్వహించనున్న మల్టీ డిపార్ట్మెంటల్ సమావేశాల సందర్భంగా శుక్రవారం ఏరియాలోని జీఎం తన కార్యాలయంలోని కాన్ఫరెన్స్హాల్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణి అభివృద్ధిలో ప్రతీ ఉద్యోగి కీలకపాత్ర పోషించాలన్నారు. ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ అంకితభావంతో విధులు నిర్వర్తించాలన్నారు. పని గంటలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వ్యక్తిగత అభివృద్ధితో పాటు సంస్థ అభివృద్ధికి తోడ్పడుతూ నాణ్యత, ఉత్పత్తి, ఉత్పాదకత పెంపునకు కృషిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం కవీంద్ర, అధికారులు జోతి, డాక్టర్ పద్మజ, భిక్షమయ్య, మాటూరి రవీందర్, రాజేశ్వర్, కృష్ణప్రసాద్, శైలేంద్రకుమార్, శ్యాంసుందర్, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్, ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు మధుకర్రెడ్డి పాల్గొన్నారు. -
మరో ఐదు రోజులే..
ఆలయంలో క్యూలైన్ పనులు చేస్తున్న కూలీలుశాఖ కేటాయింపు (రూ..) ఇరిగేషన్ 62.20 లక్షలు ఆర్అండ్బీ 51 లక్షలు పంచాయతీరాజ్ 34.8లక్షలు ఈఈ ఎంబీ ఇన్ఫ్రా 15 లక్షలు ఆర్టీసీ 17 లక్షలు డీపీఓ 97.42 లక్షలు ఎండోమెంట్ 67.74 లక్షలు డీఎఫ్ఓ 5.92 లక్షలు సబ్కలెక్టర్ 15 లక్షలు అటవీ శాఖ 30 లక్షలు ఎస్పీ 1.25 కోట్లు కలెక్టర్ 6 కోట్లు క్షేత్ర కన్సల్టెంట్ 17.70 లక్షలు కాళేశ్వరం: ఈ నెల 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగనున్న సరస్వతీనది అంత్య పుష్కరాలకు ప్రభుత్వం రూ.21.98కోట్ల నిధులు మంజూరు చేసి పనులు చేపట్టింది. కానీ క్షేత్రస్థాయిలో పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి. వీఐపీ ఘాటు వద్ద ఈవెంట్ పనులు, పరిసరాల్లో మరుగుదొడ్లు, పార్కింగ్, తాగునీరు, బీటీ రోడ్డు, ఫార్మేషన్ రోడ్డు పనులు నిర్వహిస్తున్నారు. సమయం దగ్గర పడుతుండడంతో అధికారులు హడావిడి చేస్తున్నారు. దీంతో నాణ్యత, నాసిరకం పనులు చేసి కాంట్రాక్టర్లు మమా అనిపిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఇంకా ఐదు రోజుల్లో పనులు పూర్తి చేసేలా కనిపించడం లేదని భక్తులు ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణలేమి కొట్ట చ్చినట్లు కనిపిస్తుందని విమర్శలు ఉన్నాయి. గోదావరి వద్ద డ్రెస్లు మార్చుకునే గదుల నిర్మాణం జరగడం లేదు. ప్రధానఘాటు, సరస్వతీ ఘాటులో జల్లు స్నానాల పంపుల నిర్మాణం జరగడం లేదు. చలువపందిర్ల పనులు ఇంకా మొదలు కాలేదు. రోడ్డు మరమ్మతు పనులు జరగడం లేదు. అక్కడక్కడా సూచిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. ఆదిముక్తీశ్వర నుంచి వీఐపీఘాటు వరకు చిప్స్ వేసి ఉంచగా, బీటీ మొదలు కాలేదు. సరస్వతీఘాటు వద్ద కై ర్ మ్యాట్ వర్క్ మొదలు కాలేదు. తాగునీటి కోసం ట్యాంకులు శుభ్రం చేయడం లేదు. మరుగుదొడ్ల పనులు పూర్తికాలేదు. అసంపూర్తిగా నిర్మాణాలు ఉన్నాయి. రూ.1.20కోట్లతో మ్యూజియం పనులు నత్తనడకన సాగుతున్నాయి. పక్కనే అటవీశాఖ లాన్ పనులు సాగుతున్నాయి. అటవీశాఖ ఆధ్వర్యంలో కుదురుపల్లి– బీరసాగర్ రోడ్డు పనులు జరుగుతున్నాయి. 260 ఎకరాల్లో పలు ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు చేపట్టారు. మద్దులపల్లి, సుద్ద వాగుల వద్ద శిథిలావస్థకు చేరిన కల్వర్టులకు రంగులు అద్ది మెరిపిస్తున్నారు. కాళేశ్వర పరిసరాల్లో సీసీ కెమెరాలు పనులు చేపట్టారు. టెంట్సిటి పనులు, డార్మెటరీ పనులు జరుగుతున్నాయి. ప్రముఖ సంస్థ సరస్వతీఘాటు వద్ద భారీ డెకరేషన్స్ చేపట్టింది. కాళేశ్వరం ఆలయంలో క్యూలైన్ పనులు జరగుతున్నాయి. శివ కల్యాణ మండపంలో భారీ సెట్టింగ్ పనులు జరుగుతున్నాయి. అక్కడే హోమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 21నుంచి సరస్వతి అంత్య పుష్కరాలు రూ.21.98 కోట్లతో పనులు పనుల నాణ్యతపై విమర్శలు -
కోర్టు ఏర్పాటుకు భవనాల పరిశీలన
మల్హర్(కాటారం): మండలంలోని కాటారంలో జూనియర్ సివిల్ జడ్జి జ్యూడిషినల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు స్థాపనకు సంబంధించి జిల్లా ఇన్చార్జ్ ప్రధాన న్యాయమూర్తి సూర్య చంద్రకళ స్థానిక న్యాయవాదులతో కలిసి శుక్రవారం పలు భవనాలను సందర్శించారు. ఈ సందర్భంగా కోర్టు నిర్వహణకు అనుకూలమైన వసతులు, భద్రతా ఏర్పాట్లు, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి అవసరమైన సౌకర్యాలు వంటి అంశాలను జడ్డి పరిశీలించారు. త్వరలోనే కాటారంలో జూనియర్ సివిల్ కోర్టు ఏర్పాటుతో ప్రజలకు మరింత మెరుగైన న్యాయ సేవలు అందుతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక న్యాయవాదులు రంజిత్ కుమార్, ఆరేళ్లి వెంకట స్వామి, రేపాల సంతోష్, ఇందారపు శివకుమార్, వల శ్రవణ్రావు, ఆకుల రాములు, మెషినేని శ్రీనివాస్రావు, అబ్దుల్ కలాం, సతీష్ పాల్గొన్నారు. -
ఓరుగల్లుకు స్వచ్ఛరక్ష
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పట్టణాల్లో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 కింద చేపట్టనున్న మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టులో పరకాల, భూపాలపల్లి, జనగామ, వర్ధన్నపేట, నర్సంపేట మున్సిపాలిటీలకు ప్రాధాన్యం లభించింది. ఈ ఐదు పట్టణాల్లో మొత్తం ఆరు మురుగునీటి శుద్ధి ప్లాంట్లు (ఎస్టీపీలు) ఏర్పాటు చేయనున్నారు. వీటి మొత్తం సామర్థ్యం 22.80 ఎంఎల్డీలుగా ఉంటుంది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివద్ధి శాఖ కార్యదర్శి డా.టీకే శ్రీదేవి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్వచ్చ భారత్ మిషన్లో భాగంగా... స్వచ్ఛ భారత్ మిషన్ (ఎస్బీఎం) 2.0 కింద రాష్ట్రవ్యాప్తంగా 101 పురపాలక సంఘాల్లో మురుగునీటి నిర్వహణ పనులకు రూ.3,705.75 కోట్ల సవరించిన పరిపాలనా అనుమతులు జారీ చేశారు. అందులో వరంగల్ విభాగానికి కూడా ప్రాధాన్యం లభించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పట్టణ పారిశుద్ధ్యానికి ఊరటనిచ్చే ఈ భారీ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. వరంగల్ విభాగంలో మొత్తం 6 మురుగునీటి శుద్ధి ప్లాంట్లు (ఎస్టీపీలు) ఏర్పాటు చేయనున్నారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్.. భూసేకరణకు ప్రత్యేక నిధులు.. పనులను వేగంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మూడు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలవనుంది. ఎక్కువ కంపెనీలు టెండర్లలో పాల్గొనేలా చర్యలు తీసుకుంది. టెండర్లు పొందిన కాంట్రాక్టర్లు 24 నెలల్లో పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టును హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) పద్ధతిలో అమలు చేయనున్నా రు. నిర్మాణ సమయంలో ప్రభుత్వం 50 శాతానికి పైగా వ్యయాన్ని చెల్లించగా, మిగిలిన మొత్తాన్ని విడతల వారీగా చెల్లించనుంది. నిర్మాణంతోపాటు ఐదేళ్లపాటు నిర్వహణ బాధ్యత కూడా కాంట్రాక్టు సంస్థలదే ఉంటుంది. భూసేకరణ కోసం ప్రత్యేక నిధులు కూడా కేటాయించారు. ఇదిలా ఉండగా పరకాల, భూపాలపల్లి, జనగామ, వర్ధన్నపేట, నర్సంపేట మున్సిపాలిటీల్లో ప్రస్తుతం మురుగునీరు నేరుగా కాలువలు, చెరువులు, వాగుల్లోకి చేరుతుండటంతో కాలుష్య సమస్య తీవ్రంగా ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే పట్టణాల్లో చెరువులు, వాగులు, భూగర్భజలాల్లో కాలుష్యం గణనీయంగా తగ్గి పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపడనున్నాయని అధికారులు చెబుతున్నారు. ‘గ్రేటర్’లో ఉన్నా లేనట్లే.. తాజాగా ప్రతిపాదనలు.. ఇక గ్రేటర్ వరంగల్ నగరంలో ఇప్పటికే స్మార్ట్సిటీ నిధులతో రెడ్డిపురం వద్ద 100 ఎంఎల్డీ, బంధంచెరువు వద్ద 15 ఎంఎల్డీ, ఉర్సుగుట్ట వద్ద 15 ఎంఎల్డీల సామర్థ్యంతో మూడు ఎస్టీపీల నిర్మాణాలు చేపట్టారు. కొన్ని అందుబాటులోకి రాకపోగా, వచ్చినవి ట్రైసిటీలో పెరుగుతున్న జనాభా, నగర విస్తరణకు సరిపోవడం లేదని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో 2057 విజన్కు అనుగుణంగా అదనపు ఎస్టీపీల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో ప్రభుత్వం రూ.5,257 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ) ప్రాజెక్టును ప్రకటించిన నేపథ్యంలో 100 శాతం మురుగునీటి శుద్ధి లక్ష్యంగా ప్రణాళికలు సిద్దం చేసినట్లు అధికారులు తెలిపారు. ఐదు మున్సిపాలిటీల్లో ఆరు ఎస్టీపీలు... తీరనున్న కాలుష్యం బాధలు పరకాల నుంచి నర్సంపేట వరకు గ్రీన్సిగ్నల్ 22.80 ఎంఎల్డీ సామర్థ్యం మూడు ప్యాకేజీలలో టెండర్లు.. పూర్తి చేసేందుకు గడువు 24 మాసాలు రూ.3,705 కోట్ల ప్రాజెక్టులో వరంగల్కు ప్రాధాన్యం -
నష్టాలకు ప్రభుత్వ విధానాలే కారణం
భూపాలపల్లి అర్బన్: సింగరేణి ఆర్థిక నష్టాలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల విధానాలే కారణమని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (బీఎంఎస్) ప్రధాన కార్యదర్శి యతిపతి సారంగపాణి, కార్యనిర్వహక అధ్యక్షుడు అప్పాని శ్రీనివాసులు అన్నారు. ఏరియాలోని కేటీకే–5గనిలో శుక్రవారం నిర్వహించిన గేట్ మిటింగ్ అనంతరం బీఎంఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సింగరేణి కార్మికుల సమస్యలపై పోరాటం చేస్తున్నట్లు చెప్పి ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సంఘాలు కార్మికులను మోసం చేశాయన్నారు. ట్రాన్స్కో, జెన్కో సంస్థలు సింగరేణికి చెల్లించాల్సిన రూ.51 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. మెడికల్ బోర్డు నిర్వహణ, డిపెండెంట్ ఉద్యోగాలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం, కార్మికుల గృహ కల అమలు వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు వెలబోయిన సుజేందర్, సత్కూరి శ్రీనివాస్, పునీత్ రావు, చిట్యాల ప్రవీణ్, రాజు నాయక్, దేవర సమ్మయ్య పాల్గొన్నారు. -
టైలరింగ్ కోర్సులో శిక్షణ
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో కార్యక్రమంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్ల అందజేతసాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈనెల 22వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు టైలరింగ్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు శిక్షణ ఇస్తారు. శిక్షణలో నేర్పించే అంశాలు మెథడ్ ఆఫ్ కట్టింగ్, మెథడ్ ఆఫ్ స్ట్రిచ్చింగ్, జుబ్బా, పెట్టికోట్, సారీ పెట్టికోట్, ప్లాజా, ఫ్రాక్, అంబ్రెల్లా ఫ్రాక్, వీ షేప్ ఫ్రాక్, స్లీవ్లేస్ ఫ్రాక్, అంబ్రెల్లా టాప్, క్రాస్ కట్ బ్లౌజ్, ఫిష్ అంబ్రెల్లా టాప్, కట్స్ టాప్, సాదా బ్లౌజ్, ప్రిన్స్కట్ బ్లౌజ్, కటోరి బ్లౌజ్, నార్మల్ బాటమ్, ఫ్రంట్ కుచ్చుల బాటమ్, సైడ్ కుచ్చుల బాటమ్.రిజిస్ట్రేషన్ ఫీజు : రూ.2,500/-వర్క్షాపు షెడ్యూల్ తేదీలు: 22–05–2026 నుంచి 21–06–2026 వరకు శిక్షణ సమయం : ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రిజిస్ట్రేషన్, శిక్షణ స్థలం వివరాలు : రేష్మా బోటిక్, ఇంటినంబర్: 10 –10– 34, మైసమ్మ వీధి, గిర్మాజీపేట, వరంగల్. ఫోన్ నంబర్ : 95330 12727, 95055 14424 -
త్వరలో మెడికల్ బోర్డు నిర్వహణ
భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి యాజమాన్యం హామీ ఇచ్చిందని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ తెలిపారు. శుక్రవారం ఏరియాలోని కొమురయ్య భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ఇటీవల యాజమాన్యంతో చర్చలు జరిగాయని, త్వరలో మెడికల్ బోర్డు నిర్వహించనున్నట్లు తెలిపారు. అండర్గ్రౌండ్ అలవెన్సుల కోతలు నిలిపివేయాలని, ఆస్పత్రి బిల్లుల పేరుతో వేతనాల నుంచి కోత విధించరాదని యాజమాన్యాన్ని కోరినట్లు చెప్పారు. పెండింగ్లో ఉన్న 337 మంది డిపెండెంట్లకు త్వరలో ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తారని తెలిపారు. డిస్మిస్ కార్మికుల సమస్యలు, మారుపేరు సమస్యలు, ఓవర్మెన్ల పెండింగ్ ప్రమోషన్ల పరిష్కారానికి కూడా యాజమాన్యం అంగీకరించిందన్నారు. ఆధార్ వివరాలు మారిన వారికి సెల్ఫ్ డిక్లరేషన్ ఆధారంగా ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తారన్నారు. ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతుందన్నారు. రాబోయే రోజుల్లో ఉద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు మోటపలుకుల రమేష్, మాతంగి రామచందర్, జి శ్రీనివాస్, ఆసిఫ్ పాషా, తాళ్ల పోషం పాల్గొన్నారు. -
మిషన్ కాకతీయకు భారీ ఊతం
సాక్షిప్రతినిధి, వరంగల్: జిల్లాలో సాగునీటి వనరుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మిషన్ కాకతీయ పనులకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. గణపసముద్రం పెద్ద చెరువు కాలువల ఆధునికీకరణతో పాటు భీమ్ఘన్పూర్ చెరువు అభివృద్ధి పనులకు పరిపాలనా అనుమతులు జారీచేసింది. గణపసముద్రం చెరువు పరిధిలో కాలువల పునరుద్ధరణ, లైనింగ్, నిర్మాణ బలోపేతం పనులు చేపట్టనున్నారు. భీమ్ఘన్పూర్ చెరువులో నీటి నిల్వ సామర్థ్య పెంపు, కాలువల మరమ్మతులు, నీటి ప్రవాహం మెరుగుపరిచే పనులు నిర్వహించనున్నారు. రెండు పనులకు రూ.59 కోట్లు.. గణపసముద్రం పెద్ద చెరువు కాలువల ఆధునికీకరణకు రూ.30.95 కోట్లు, భూపాలపల్లి మండలంలోని భీమ్ఘన్పూర్ చెరువు అభివృద్ధి పనులకు రూ.28.02 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండు కలిపి సుమారు రూ.59 కోట్లతో ఈ పనులు చేపట్టనున్నారు. ప్రభుత్వం ఈ పనుల్లో నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. నల్లరేగడి, ఉబ్బే స్వభావం ఉన్న నేలల్లో తప్పనిసరిగా సీసీ లైనింగ్ ఏర్పాటు చేయాలని ఉత్తర్వులో ప్రభుత్వం ఆదేశించింది. దీంతో కాలువలు దెబ్బతినకుండా ఉండటంతో పాటు నీటి లీకేజీలు తగ్గి, సాగునీటి వినియోగ సామర్థ్యం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. పనులకు ప్రధాన నిబంధనలు ఇవీ.. ములుగు సీఈకి పర్యవేక్షణ బాధ్యతలు.. ఇరిగేషన్, మిషన్ కాకతీయ విభాగం ఆధ్వర్యంలో అమలు చేయాలని, కాలువల హైడ్రాలిక్ డిజైన్లకు ముందస్తు సాంకేతిక అనుమతులు తప్పనిసరిగా పేర్కొంది. సీసీ లైనింగ్ కాలువలకు బలమైన రక్షణ ఉండేలా చూడాలని సూచించారు. పనుల పర్యవేక్షణ బాధ్యతను ములుగు చీఫ్ ఇంజనీర్కు అప్పగించిన ప్రభుత్వం.. డిజైన్లు, అంచనాలు సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని, అంచనాల్లో పేర్కొన్న వివరాల ఖచ్చితత్వానికి చీఫ్ ఇంజనీర్దే బాధ్యతని స్పష్టం చేశారు. చెరువులు, కాలువల ఆధునికీకరణ నిధులు రూ.59 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు గణపసముద్రం, భీమ్ఘన్పూర్ చెరువు, కాల్వలకు మహర్దశ -
రాజయ్య సంతాప సభను జయప్రదం చేయాలి
భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలో ఈ నెల 24న నిర్వహించునున్న సీపీఎం, సీఐటీయూ నాయకుడు కంపేటి రాజయ్య సంతాప సభను విజయవంతం చేయాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షుడు మంద నరసింహారావు, ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి పిలుపునిచ్చారు. ఈ సభకు సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సీఐటీయూ కార్యాయలంలో జిల్లా అధ్యక్షుడు సాయిలు అధ్యక్షతన నిర్వహించగా వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కంపేటి రాజయ్య కార్మిక, ప్రజా సమస్యల పరిష్కారానికి జీవితాంతం పోరాడిన నాయకుడని కొనియాడారు. నాయకులు గుర్రం దేవేందర్, సిహెచ్ రవికుమార్, మేకల మహేందర్, కొండ లక్ష్మి, విజయలక్ష్మి, బండారి బాబు, తోట రమేష్ పాల్గొన్నారు. -
యువత క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలి
గోవిందరావుపేట: బహుమతులు అందజేస్తున్న ఎస్సై తాజుద్దీన్ వెంకటాపురం(ఎం)లో..గోవిందరావుపేట: యువత మద్యం మత్తు, చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని పస్రా ఎస్సై తాజుద్దీన్ అన్నారు. మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల మైదానంలో ఎస్సై తాజుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి వాలీబాల్ క్రీడలు బుధవారం ముగిశాయి. పోటీల్లో రంగాపురం జట్టు ప్రథమ స్థానం సాధించగా, ఇప్పలగడ్డ జట్టు ద్వితీయ స్థానం దక్కించుకుంది. ఫ్రూట్ఫాం, గోవిందరావుపేట జట్లు కన్సోలేషన్ బహుమతులు పొందాయి. ఈ సందర్భంగా విజేత జట్లకు ఎస్సై తాజుద్దీన్ బహుమతులు, మెమెంటోలు అందజేశారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ.. మండల స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు జిల్లా స్థాయిలో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. వెంకటాపురం(ఎం): మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో మూడు రోజులుగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ మండలస్థాయి క్రీడోత్సవాలు బుధవారం ముగిసినట్లు ఎస్సై చల్ల రాజు తెలిపారు. క్రీడోత్సవాలలో మండలంలోని వివిధ గ్రామాల నుంచి 14 జట్లు పాల్గొనగా బుర్గుపేటకు ప్రథమ బహుమతి, వెంకటాపూర్కు ద్వితీయ బహుమతి వచ్చినట్లు తెలిపారు. గెలుపొందిన జట్లకు షీల్డ్లతో పాటు మెమెంటోలు అందించినట్లు ఎస్సై వెల్లడించారు. -
‘పల్లా’కు పెరుగుతున్న ప్రాధాన్యం.. సీనియర్లు నియోజకవర్గాలకే..
బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం వద్ద జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డికి ప్రాధాన్యం పెరిగింది. ఉమ్మడి వరంగల్ పార్టీ సమావేశాలు, సమీక్షలు, కేడర్ సమావేశాలు, వ్యూహాత్మక చర్చల్లో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల హనుమకొండలో కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరైన రైతు సంగ్రామ సదస్సుకు పల్లా రాజేశ్వర్రెడ్డి అధ్యక్షత వహించారు. తాజాగా మంగళవారం కేసీఆర్ భేటీ అనంతరం నియమించిన సభ్యత్వ నమోదు ఇన్చార్జ్ల నియామకంలోనూ ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు. మాజీ మంత్రి సత్యవతిరాథోడ్కు పాత ములుగు, జేఎస్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల బాధ్యతలు ఇవ్వగా.. గతంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఇన్చార్జ్ గా ఉన్న జనగామ, వరంగల్, హనుమకొండ జిల్లాల బాధ్యతలను పల్లా రాజేశ్వర్రెడ్డికి అప్పగించారు. గతంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులుగా వ్యవహరించిన పలువురు సీనియర్లను సభ్యత్వ నమోదు విషయంలో నియోజకవర్గాలకే పరిమితం చేయడం పార్టీవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాక్షిప్రతినిధి, వరంగల్ : అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ.. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి కేంద్రబిందువుగా నిలిచిన ఉమ్మడి వరంగల్ జిల్లాపై పార్టీ ప్రత్యేక దృష్టి సారించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గ్రామస్థాయి నుంచి నగర, డివిజన్ల వరకు విస్తృతస్థాయిలో సభ్యత్వ నమోదు చేపట్టి మళ్లీ కేడర్ను కదిలించే దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల కిందట ఎర్రవెల్లి ఫామ్హౌజ్లో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కీలక భేటీ నిర్వహించిన పార్టీ అధినేత కేసీఆర్ సభ్యత్వ సేకరణకు ఇన్చార్జ్ లను నియమించారు. సభ్యత్వ సేకరణకు రంగంలోకి ఇన్చార్జ్లు.. పార్టీ శ్రేణులను మళ్లీ యాక్టివ్ చేయడం, కార్యకర్తల్లో నమ్మకం పెంచడం, స్థానిక నాయకత్వాన్ని సమీకరించడం లక్ష్యంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్లో భారీ సంఖ్యలో సభ్యత్వాలు నమోదు చేసి రాష్ట్రానికి రాజకీయ సంకేతం ఇవ్వాలనే ఆలోచనతో పార్టీ ముందుకు సాగుతున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలకు ఇన్చార్జ్లను నియమించారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్కు గతంలోనూ ఇన్చార్జ్గా ఉన్న ములుగు, జేఎస్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల బాధ్యతలు అప్పగించారు. గతంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఇన్చార్జ్గా ఉన్న జనగామ, వరంగల్, హనుమకొండ జిల్లాల బాధ్యతలు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి అప్పగించారు. ఎమ్మెల్సీలు తక్కళ్లపెల్లి రవిందర్రావుని ఖమ్మం, కొత్తగూడెం, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డిని మేడ్చల్–మల్కాజిరి, యాదాద్రి, మెట్టు శ్రీనివాస్ను గద్వాల్, నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాలకు ఇన్చార్జ్లుగా నియమించారు. గ్రామాల వారీగా లక్ష్యాలు.. సభ్యత్వ సేకరణకు ప్లాన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈసారి కేవలం పేరుకే కాకుండా డేటా ఆధారిత రాజకీయ వ్యూహంగా మలచాలని బీఆర్ఎస్ భావిస్తోంది. గత ఎన్నికల్లో పార్టీకి వచ్చిన ఓట్లు, బూత్వారీ బలం, స్థానిక నాయకత్వ ప్రభావం ఆధారంగా గ్రామాల వారీగా సభ్యత్వ లక్ష్యాలను ఖరారు చేస్తున్నట్లు సమాచారం. ప్రతీ మండలానికి ప్రత్యేక టార్గెట్లు ఇవ్వడంతోపాటు యువత, మహిళలు, రైతులు, విద్యార్థులు, పాత కార్యకర్తలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మాజీ ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నేతలు, మండల స్థాయి నాయకులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించి కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల నిర్వహించిన రైతు సంగ్రామ సభకు వచ్చిన స్పందనతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా గ్రామస్థాయిలో మళ్లీ పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసి, భవిష్యత్ ఎన్నికలకు సిద్ధం కావాలనే లక్ష్యంతో పార్టీ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్లో భారీ స్థాయిలో సభ్యత్వ నమోదు జరిగితే రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి కొత్త ఊపు వస్తుందనే భావన బీఆర్ఎస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. సత్యవతిరాథోడ్పల్లా రాజేశ్వర్రెడ్డి -
కలెక్టర్ను కలిసిన కాటారం ఆర్డీఓ
భూపాలపల్లి అర్బన్: కాటారం ఆర్డీఓగా బాధ్యతలు స్వీకరించిన డి.రవీందర్ బుధవారం కలెక్టర్ రాహుల్శర్మను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్శర్మ ఆర్డీఓ రవీందర్కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. ప్రజలకు పారదర్శకంగా, సమర్థవంతంగా సేవలు అందించాలని సూచించారు. ఇద్దరు ఉద్యోగులపై చర్యలు మొగుళ్లపల్లి: పీఏసీఎస్ సీఈఓ అప్పం సాగర్ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ రాహుల్శర్మ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. కలెక్టర్ మంగళవారం మొగుళ్లపల్లి పీఏసీఎస్కు చెందిన మొట్లపల్లి ధాన్యం సేకరణ కేంద్రం(పీసీసీ)లో తనిఖీ చేసి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడంతో పాటు, ధాన్యం తూకం వేయకుండా సంబంధిత రైతులకు ధాన్యం కొనుగోలు రసీదులు జారీచేయకుండా ధాన్యం మిల్లులకు తరలించినట్లు తనిఖీలో నిర్ధారించారు. ఇతర అవకతవకలు వెలుగు చూశాయి. దీంతో మొట్లపల్లి పీసీసీ ఇన్చార్జ్ ప్రశాంత్ను విధుల నుంచి తొలగిస్తూ, సీఈఓ సాగర్పై కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు. మొగుళ్లపల్లి పీఏసీఎస్లో పనిచేస్తున్న ఎం. రమేశ్ను ఇన్చార్జ్ సీఈఓగా నియమిస్తూ, మొట్లపల్లి పీసీసీ సెంటర్లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా సత్వరమే మరొకరిని నియమించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగాలని.. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆయా కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలు జరిగినా రైతులను ఇబ్బందులకు గురిచేసినా చర్యలు తప్పవన్నారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు టేకుమట్ల: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలైన ఘటన మండలంలోని వెంకట్రావుపల్లి శివారులో బుధవారం చోటుచేసుకుంది. వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన జనగాం కుమార్, హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల మండల కేంద్రానికి చెందిన రాజ్కుమార్ ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108కి సమాచారం అందించగా క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చిట్యాల సివిల్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికి త్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. -
విద్యతోనే గ్రామాల ప్రగతి సాధ్యం
● సర్పంచ్ గురుసింగబాబు కాళేశ్వరం: గ్రామాల అభివృద్ధి, సమాజ ప్రగతి సాధించాలంటే విద్యే ప్రధాన మార్గమని చండ్రుపల్లి సర్పంచ్ గురుసింగబాబు అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మూడో రోజు బుధవారం మహదేవపూర్ మండలం కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ జన్ను విజయకుమార్ అధ్యక్షతన వివిధ గ్రామపంచాయతీల సర్పంచ్లు, ఉప సర్పంచ్లకు విద్యార్థుల నమోదు ప్రక్రియ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా వ్యవస్థ పురోగతి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నత విద్య ప్రాధాన్యతపై చర్చించారు. అనంతరం సర్పంచ్ గురు సింగబాబు మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలోని సర్పంచ్లు తమ గ్రామాల విద్యార్థులను సమీపంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేరేలా గ్రామ సభల్లో తీర్మానాలు చేసి ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. కళాశాల ప్రిన్సిపాల్ జన్ను విజయకుమార్ మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతాలకు చెందిన ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో మండల కేంద్రంలో 2008 సంవత్సరంలో ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశారని తెలిపారు. అన్నారం సర్పంచ్ నీర్ల ప్రభాకర్, మద్దులపల్లి సర్పంచ్ వేల్పుల సరిత, పలుగుల సర్పంచ్ విజయలక్ష్మి, మెట్పల్లి ఉప సర్పంచ్ రాజు, వివిధ గ్రామపంచాయతీల ప్రజాప్రతినిధులు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వ కళాశాలలో చేరాలి మల్హర్: పదవ తరగతి పాస్ అయిన విద్యార్థులు మండలంలోని తాడిచర్ల ప్రభుత్వ కళాశాలలో చేరాలని సర్పంచ్ బండి స్వామి కోరారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా బుధవారం జూనియర్ కళాశాల అధ్యాపకులతో కలిసి సర్పంచ్ బండి స్వామి విద్యార్థులకు, వారి తల్లిద్రండులకు అవగాహన కల్పించారు. ఈ విద్యా సంవత్సరంలో ముఖ్యంగా విద్యార్థినుల తల్లిదండ్రులు అమ్మాయిలను తప్పకుండా పైచదువులు చదివించాలన్నారు. చదువు మానేయకుండా తల్లిదండ్రులు చూసుకోవాలని చెప్పారు. ఇంటర్ వార్షిక పరీక్షల్లో రాష్ట్రంలోనే ఉత్తమ ఫలితాలు పొందినందుకుగాను కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి విజయదేవిని, అధ్యాపకులను ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చర్యలు
భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాల్లో నిర్వహించిన ప్రత్యేక విద్యా వారోత్సవాల వర్క్షాప్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు సర్పంచులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. కలెక్టర్ రాహుల్శర్మ మాట్లాడుతూ.. విద్యావ్యవస్థ బలోపేతానికి వారోత్సవాల ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఆర్ఓ వసంతకుమారి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, డీఈఓ రాజేందర్ పాల్గొన్నారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తాలు, తడక పేరుతో రైతులను దోపిడీ చేస్తే సహించబోమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు రైస్ మిల్లర్లను హెచ్చరించారు. కలెక్టరేట్లో ఽకలెక్టర్ రాహుల్శర్మతో కలిసి సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
పేగుబంధం వదులుకుంది..! వైద్యబంధం అల్లుకుంది..!!
ఆడశిశువుకు ‘అమ్మ’ ప్రేమను పంచిన జనగామ ఎంసీహెచ్తిక్కరపు పద్మ, నరేష్ దంపతులు జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం కళ్లెం గ్రామంలో ఓ వ్యక్తి వద్ద ఇటుక తయారీ పనులు చేస్తున్నారు. నలుగురు పిల్లలు ఉన్న వీరికి మార్చి 23న ఐదో సంతానంగా చంపక్హిల్స్ ఎంసీహెచ్లో ఆడపిల్ల జన్మించింది. పుట్టుక సమయంలో పాప బరువు 1.25 కిలోలు మాత్రమే. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా ఉండడంతో వైద్యులు తక్షణ చికిత్స ప్రారంభించారు. వారం రోజుల తర్వాత పద్మ కుట్లు విప్పిన వెంటనే పాప ఆడపిల్ల కావడంతో ‘మేము సాకలేం, మీరే చూసుకోండి’ అంటూ డాక్టర్లకు చెప్పి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. అసాధారణమైన ఈ ఘటనను గమనించిన డాక్టర్ మధుసూదన్రెడ్డి విషయం వెంటనే చైల్డ్ వెల్ఫేర్శాఖకు తెలియజేశారు. అధికారులు వచ్చి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వగా, పాపను తామే పెంచుకుంటామని వారినుంచి హామీ తీసుకున్నారు. అయితే తల్లిదండ్రులు రెండు రోజులు గడవకముందే ఎవరికీ చెప్పకుండా ఆస్పత్రిలోనే పాపను వదిలేసి వెళ్లిపోయారు. వెంటనే ఆస్పత్రి రికార్డులో ఉన్న ఫోన్నంబర్ ఆధారంగా నరేష్కు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారు, మీ ఊరు ఏంటి అని అడిగారు. ఒకసారి రాయలసీమ, మరోసారి ఉత్తరాంధ్ర అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు డాక్టర్లు తెలిపారు. లింగాలఘణపురం మండలం కళ్లెం గ్రామానికి వెళ్లిచూడగా వారు అక్కడినుంచి వెళ్లిపోయినట్లు గుర్తించారు. జనగామ: నెలలు నిండకముందే 1.25 కిలోల బరువుతో పుట్టి చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న పాపతో రక్తబంధం వదిలేసుకున్నారు ఆ తల్లిదండ్రులు. కానీ, ఆ పసికందును ఈ లోకంలోకి తీసుకువచ్చిన వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది మాత్రం అక్కున చేర్చుకున్నారు. రోజంతా పర్యవేక్షణ, పాల ఫీడింగ్, ప్రేమతో కూడిన సంరక్షణతో ఆ శిశువులో నెమ్మదిగా మార్పు తీసుకువచ్చారు. తల్లి దూరమైన చోట మానవత్వం వెల్లివిరిసింది. నేడు పాప బరువు 2.3 కిలోలకు చేరి ఆరోగ్యంగా మారింది. జనగామ జిల్లా చంపక్ హిల్స్ ఎంసీహెచ్ ఆస్పత్రిలో 50 రోజుల క్రితం చోటుచేసుకున్న ఘటన ఇప్పటికీ అందరినీ కదిలిస్తోంది. పేగుబంధం వదిలి వెళ్లినా.. అక్కున చేర్చుకుని పునర్జన్మనిచ్చిన ఆస్పత్రి, శిశువు కథ ఇది. అమ్మగా మారిన ఎస్ఎన్సీయూ పాపను పేగుబంధం కాదనుకున్నా.. వైద్యులు అక్కున చేర్చుకున్నారు. డాక్టర్ మధుసూదన్రెడ్డి పర్యవేక్షణలో పాపకు ఎస్ఎన్సీయూలో మెరుగైన వైద్యం అందిస్తూ, కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఒక్కో అనారోగ్య సమస్యకు చికిత్స చేసుకుంటూ వచ్చారు. రోజూ పాల డబ్బాతో ఫీడింగ్, అమ్మ ప్రేమ, లాలన అందిస్తూ పసిబిడ్డకు మాతృమూర్తుల్లా డాక్టర్లు, నర్సులు సంరక్షిస్తున్నారు. ఎనిమిది రోజుల వయసులో తల్లి ప్రేమ కోల్పోయిన ఈ పాపకు, ఎస్ఎన్సీయూ సిబ్బందే దేవుడిచ్చిన అమ్మలు అయ్యారు. తక్కువ బరువు నుంచి సంపూర్ణ ఆరోగ్యం.. 50 రోజుల చికిత్సతో పాప స్థితి రోజురోజుకూ మెరుగైందని డాక్టర్లు తెలిపారు. పాప పుట్టిన సమయంలో కిలో 250 గ్రాములు ఉండగా, ప్రస్తుత బరువు 2.300 కిలోలతో పూర్తిగా కోలుకుంది. ఎటువంటి అనారోగ్య సమస్య లేదు. బరువు 2.5 కిలోలకు చేరగానే చైల్డ్ వెల్ఫేర్ శాఖ సమన్వయంతో హనుమకొండ శిశుగృహానికి పాపను తరలించనున్నట్లు ఎంసీహెచ్ వైద్యుడు మధుసూదన్రెడ్డి ‘సాక్షి’కి వివరించారు.శిశువుకు అమ్మ ప్రేమను పంచుతున్న డాక్టర్, సిబ్బంది నెలలు నిండక తక్కువ బరువు, అనారోగ్య సమస్యలతో శిశువు జననం సాకలేమని వదిలివెళ్లిన తల్లిదండ్రులు.. అక్కున చేర్చుకున్న ఆస్పత్రి రక్తబంధం వదిలినా.. తల్లి ప్రేమ పంచి అన్నీ తామై చూసుకున్న వైద్యులు, సిబ్బంది 50 రోజుల్లో అద్భుతం.. బరువు పెరగడంతోపాటు సంపూర్ణ ఆరోగ్యంగా శిశువు -
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం
భూపాలపల్లి అర్బన్: జిల్లాలోని నాలుగు పరీక్ష కేంద్రాల్లో బుధవారం ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. మొదటి రోజు ద్వితీయ భాష (సెకండ్ లాంగ్వేజ్) పేపర్–1 పరీక్షకు 437 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 413 మంది పరీక్ష రాసినట్లు డీఐఈఓ వెంకన్న తెలిపారు. పేపర్–1 పరీక్షకు 24 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. దూర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు పరీక్ష సమయానికి అర గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. మధ్యాహ్నం నిర్వహించిన రెండో సంవత్సరం విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ పేపర్–2 పరీక్షకు మొత్తం 78 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 73 మంది పరీక్ష రాశారు. ఐదుగురు విద్యార్థులు గైర్హాజరయ్యారు. ప్రశాంతంగా పాలిసెట్ ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశం కోసం జిల్లా కేంద్రంలోని నాలుగు పరీక్ష కేంద్రాల్లో బుధవారం నిర్వహించిన పాలిసెట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, సంఘమిత్ర డిగ్రీ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఇందులో మొత్తం 905 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 842 మంది పరీక్ష రాసినట్లు పాలిసెట్ జిల్లా సమన్వయకర్త, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.రమణారావు తెలిపారు. 63మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. వేసవి దృష్ట్యా విద్యార్థులు వారికి కేటాయించిన పరీక్ష కేంద్రాల వద్దకు పరీక్ష సమయానికి అరగంట ముందుగానే చేరుకున్నారు. దూరప్రాంతాలకు చెందిన పిల్లలను ద్విచక్రవాహనాలు, ఆటోల ద్వారా వారి తల్లితండ్రులు, కుటుంబసభ్యులు తీసుకొచ్చారు. పరీక్ష ముగిసే వరకు తల్లితండ్రులు పరీక్ష కేంద్రాలకు సమీపంలోనే పలు దుకాణాల ముందు, చెట్ల నీడకు వేచి చూశారు. -
గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించాలి
రేగొండ: మండలంలోని పెద్దంపల్లి గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ర్పడినప్పటి నుండి గ్రామాభివృద్ధికి ఎటువంటి ని ధులు కేటాయించలేదని ఆరోపించారు. గ్రామంలో జరిగిన అభివృద్ధి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైనవేనని తెలిపారు. ఇప్పటికై నా గ్రామానికి ని ధులు మంజూరు చేసి గ్రామాభివృద్ధికి సహకరించా లని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సకినాల రవీందర్, బీఆర్ఎస్ మండల నాయకుడు ర త్నాకర్, వార్డుమెంబర్లు, తదితరులు పాల్గొన్నారు. -
అంత్య పుష్కరాలకు ఆహ్వానం
కాళేశ్వరం: కాళేశ్వరంలో ఈనెల 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగు సరస్వతీనది అంత్య పుష్కరాలకు ప్రముఖులను దేవాదాయశాఖ ప్రిన్సి పల్ సెక్రటరీ శైలజారామయ్యర్, కమిషనర్ హనుమంతరావు ఆహ్వాన పత్రికలు అందజేశారు. బుధవారం హైదరాబాద్లో రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, రాష్ట్ర ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావులకు ఆహ్వాన పత్రిక అందజేశారు. వారి వెంట కాళేశ్వరం దేవస్థానం చైర్మన్ మోహన్శర్మ, ఆర్జేసీ రామకృష్ణరావు, ఈఓ మహేష్, ఉపప్రధాన అర్చకుడు ఫణీంద్రశర్మ ఉన్నారు. -
పాలశీతలీకరణ కేంద్రం నిరుపయోగం
చిట్యాల: మండల కేంద్రంలో కొంతకాలం నుంచి పాలశీతలీకరణ కేంద్రం నిరుపయోగంగా ఉంది. దీంతో పాడి రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. ఒకప్పుడు మండలంలోని గుంటురుపల్లి, నవాబుపేటతో పాటు పలు గ్రామాలలో పాడి రైతులు సుమారు వందల లీటర్ల పాలను తీసుకుని పరకాల, హనుమకొండ పట్టణాలకు తరలించి అమ్ముకునేవారు. ఈ క్రమంలో మండల కేంద్రంలో 2002 జనవరిలో పాలశీతలికరణ కేంద్రాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి పాడి రైతులు పాలశీతలికరణ కేంద్రానికి పాలను తీసుకవచ్చి విక్రయించి అబ్ధిపొందేవారు. ఈ విధంగా మూడు సంవత్సరాలు సాఫీగా కొనసాగింది. కాలక్రమేణ పాలశీతలికరణ కేంద్రంకు పాలు అనుకున్నట్లు రావడం లేదనే సాకుతో అప్పటి సంబంధిత అధికారులు ములుగుకు తరలించినట్లు రైతులు తెలిపారు. కాగా, రైతుల విజ్ఞప్తి మేరకు మరికొన్ని నెలలు నామామాత్రంగా పాలశీతలికరణ కేంద్రాన్ని నడిపించుకుంటూ ఓ వాహనంలో పాలసేకరణ చేపట్టి అధికారులు చేతులు దులుపుకున్నట్లు పేర్కొటున్నారు. దీంతో పాలశీతలికరణ కేంద్రంలో ఉన్న యంత్రాలు మూలన పడి తుప్పుపట్టి పోయాయి. ఆర్థికంగా నష్టపోతున్న పాడి రైతులు ప్రభుత్వాలు మహిళా సంఘాలకు పాడి రైతులకు రుణాలు అందజేసి వాటి ద్వారా పాడి గేదెలను కొనుగోలు చేయించేవి. దీంతో రైతులు, మహిళా సంఘాల సభ్యులు పాలను విక్రయిస్తూ బ్యాంకు రుణాలు పోను ఆర్థికంగా బలపడేవారు. మండల కేంద్రంలోని పాలశీతలికరణ కేంద్రం మూతపడడంతో పాలను విక్రయించేందుకు ఇబ్బందులు పడుతూ తక్కువ ధరకు పాలను అమ్ముతూ ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టిపెట్టి మండల కేంద్రంలో పాలశీతలికరణ కేంద్రాన్ని పునర్ప్రాంభించాలని పలు గ్రామాల పాడి రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఉపాధి కోల్పోతున్న పాడి రైతులు పట్టించుకోని అధికారులుపునర్ప్రారంభించాలిమండల కేంద్రంలో కొంత కాలం క్రితం మూతపడిన పాలశీతలికరణ కేంద్రాన్ని అధికారులు పునర్ప్రారంభించాలి. నేను ప్రతి రోజు పది లీటర్ల పాలను పట్టణాలకు పంపుతూ ఇబ్బందులు పడుతున్నా. మండల కేంద్రంలో పాలశీతలికరణ కేంద్రం ఉంటే ఏలాంటి ఇబ్బంది ఉండదు. అధికారులు, పాలకులు స్పందించి పాలకేంద్రాన్ని మళ్లీ ఏర్పాటు చేయాలి. – కసిరెడ్డి శ్రీనివాస్రెడ్డి. పాడిగేదెల రైతు, నవాబుపేట -
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి
మల్హర్/మల్హర్(కాటారం): ఽజాప్యం లేకుండా ధాన్యం కొనుగోళ్లను వేగంగా చేపట్టాలని కలెక్టర్ రాహుల్శర్మ అధికారులను ఆదేశించారు. బుధవారం మల్హర్ మండలం కొయ్యూరు, కొండంపేట, కాటారం మండలంలోని కొత్తపల్లి, కాటారం వ్యవసాయ మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల వద్ద తార్ఫాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. రవాణా సమస్య ఉంటే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని స్పష్టం చేశారు. రోజుకు రెండు లారీలు కొనుగోలు కేంద్రాలకు పంపాలని ఆదేశించారు. కచ్చితమైన రిజిస్టర్లు ఏర్పాటు చేసి వివరాలు నమోదు చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని శుభ్రపరచాలని తాలు, రాళ్లు, మట్టి గుల్లలు లేని నాణ్యమైన ధాన్యాన్ని మిల్లులకు పంపించేందుకు రైతుల సహకరించాలన్నారు. ప్యాడీ క్లీనింగ్ పరికరాలు అందుబాటులో లేకపోతే మరొకచోట నుంచి తెప్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, డీఆర్ఓ వసంతకుమారి, పౌర సరఫరాల అధికారి కిరణ్కుమార్, డీఎం రాములు, సహకార అధికారి వాలియానాయక్, వ్యవసాయ అధికారి బాబూరావు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ -
తునికాకు సేకరణ
మహాముత్తారం: మండలంలోని జీలపల్లి, మాదారం, మహాముత్తారం, సింగారం, యామన్పల్లి గ్రామాల్లోని గిరిజనులు, గిరిజనేతరులు నాలుగు రోజులనుండి గ్రామసమీపంలోని అడవుల్లో తునికాకు సేకరణ చేపడుతున్నారు. ఉదయం సేకరించిన ఆకును కట్టలు కట్టి కల్లోకి చేరవేస్తున్నారు. కాగా, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే యూనిట్లు టెండరయ్యాయి. మరికొన్ని గ్రామాల్లో తునికాకు టెండర్లు కాకపోవడంతో ఆయా గ్రామాల్లోని ప్రజలు ఆదాయాన్ని కోల్పోతున్నారు. పరామర్శ మహాముత్తారం: మండలంలోని వజినేపల్లి గ్రామానికి చెందిన దుర్గం సమ్మయ్య అనారోగ్యంతో బాధపడుతున్నాడు. విషయం తెలుసుకున్నా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చందుపట్ల సునీల్రెడ్డి, చల్ల నారాయణరెడ్డి బుధవారం వజినేపల్లిలో వారి ఇంటికి వెళ్లి పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు పూర్ణచందర్, నాయకులు రఫీ, దుర్గం తిరుపతి తదితరులు ఉన్నారు. ఆర్డీఓకు సన్మానం మల్హర్(కాటారం): మండలంలోని కాటారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టిన రవీందర్ను బుధవారం ఈజీఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్, కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆర్డీఓను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పంతకా ని సమ్మయ్య, కొండగొర్ల రాంనారాయణ, ఆ త్మకూరి కుమార్యాదవ్ పాల్గొన్నారు. టేకుమట్ల: మామపై దాడి చేసిన అల్లుడి అరెస్టు చేసిన సంఘటన మండలంలోని గుమ్మడవెల్లిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన ఆకినపల్లి హరీశ్ తన మామ మొలుగూరి సదానందం మధ్య ఇటీవల వాగ్వాదం జరిగింది. తీవ్ర కోపోద్రిక్తుడైన హరీశ్ ఆయన మామ సదానందంను కర్రతో బలంగా కొట్టాడు. సదానందం కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరు పరచగా జడ్జి పరకాల జైలుకు రిమాండ్కు తరలించినట్లు ఎస్సై అమూల్య తెలిపారు. మహాముత్తారం: మండలంలోని బోర్లగూడెం గ్రామంలో జీసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బోర్లగూడెం సర్పంచ్ అజ్మీరా ధరమ్సింగ్ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సెంటర్ ఇన్చార్జ్ సీతునాయక్ ,రైతులు పాల్గొన్నారు. -
వీఐపీ ఘాట్.. దుర్వాసన
కాళేశ్వరం: కాళేశ్వరంలోని వీఐపీ ఘాట్ వద్ద కార్మికులు తినిపారేసిన ఆహార కవర్లు, చెత్త పేరుకుపోవడంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. సరస్వతీనది అంత్య పుష్కరాల ఏర్పాట్లలో పనిచేస్తున్న కార్మికులకు సంబంధిత కాంట్రాక్టర్ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి పూట వారికి భోజనాన్ని కవర్లలో అందిస్తున్నప్పటికీ, వాటిని నిర్లక్ష్యంగా ఘాట్ పరిసరాల్లోనే పడేస్తున్నారు. దీంతో ఘాట్ ప్రాంతం అపరిశుభ్రంగా మారి భక్తులకు అసౌకర్యం కలుగుతోంది. దేవాదాయ, పంచాయతీ శాఖ అధికారులు వెంటనే స్పందించి పరిశుభ్రత చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. సరస్వతీఘాట్లో ముమ్మర ఏర్పాట్లు భక్తులు నడిచేందుకు వీలుగా సరస్వతీఘాట్ నుంచి గోదావరిలో నీటి వరకు మట్టి రోడ్డు నిర్మాణం చేపట్టారు. రోడ్డు పూర్తయిన తరువాత వెదురు చలువ పందిర్లు వేయనున్నారు. వీఐపీ ఘాటు వద్దనే భక్తుల కోసం డార్మెటరీ రూమ్లు, స్టాల్స్ ఏర్పాటు, టెంట్ సిటీ ఏసీ, నాన్ ఏసీ రూమ్ల నిర్మాణం చేపట్టారు. పార్కింగ్ స్థలాలు చేపట్టారు. ఈనెల 20 వరకు పూర్తయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
మల్హర్(కాటారం): నీట్–2026 పరీక్షలో జరిగిన పేపర్ లీకేజీతో విద్యార్థుల భవిష్యత్పై దాడి జరిగిందని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీపీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మండలంలోని కాటారంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిరణ్ మాట్లాడారు. దేశంలో ఇప్పటికే నిరుద్యోగం, కార్పొరేట్ విద్యా వ్యవస్థ, కోచింగ్ మాఫియా భారంతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులపై ఇది మరో మోసపూరిత దాడి అని ఆరోపించారు. పరీక్షకు ముందు ప్రశ్నాపత్రం బయటకు రావడం, అనేక ప్రశ్నలు అసలు పరీక్షతో సరిపోవడం, తదనంతరం పరీక్ష రద్దు వరకు వెళ్లడం దేశ పరీక్షా వ్యవస్థ పూర్తిగా వైఫల్యానికి గురైందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విద్యార్థుల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయాయన్నారు. నీట్ పేపర్ లీకేజీపై సిట్టింగ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ఫ్రంట్ జిల్లా నాయకులు అయిత బాపు, దాసరి రమేష్, దారకొండ సూర్యశంకర్, వెంకటేశ్వర్లు. తదితరులు పాల్గొన్నారు. టీపీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ -
ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు రేగొండ: ప్రజలందరూ ఎల్లవేళలా సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బుధవారం మండలంలోని తిరుమలగిరి గ్రామంలో పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ దేవతల దీవెనలు ప్రజలపైన నిండుగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండేలా చూడాలని మొక్కులు చెల్లించుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుదర్శన్, ఉపసర్పంచ్ ఆకుతోట తిరుపతి, నాయకులు పన్నాటి శ్రీనివాస్, రొంటాల వెంకటస్వామి, తదితరులు పాల్గొన్నారు. -
ఊపందుకున్న ‘ఉపాధి’ పనులు
మల్హర్: ప్రజలకు అన్నికాలాల్లో ఉపాధి కల్పించి ఆర్థికంగా బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం మండలంలో ఉపాధి పనులు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం సీజన్ కావడం.. వ్యవసాయ పనులు పెద్దగా లేకపోవడంతో పనులకు వెళ్లేందుకు కూలీలు ఆసక్తి చూపుతున్నారు. ఉన్నతాధికారులు గ్రామల వారీగా లక్ష్యాన్ని విధించడంతో పని చేసి వారి సంఖ్య పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. మండలంలో 8,495 జాబ్కార్డులు.. మండలంలోని 15 గ్రామ పంచాయతీల్లో 22 గ్రామాల్లో 8,495 జాబ్ కార్డులు ఉన్నాయి. వీటీలో కూలీల సంఖ్య 18,873 ఉండగా ఉన్నారు. మూడు రోజులుగా1600 పై చిలుకు కూలీలు ఉపాధిహామీ పనులకు హాజరవుతున్నారని అధికారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో కూలీల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఎండ తీవ్రత కారణంగా ప్రతి రోజు ఉదయం 5:30 గంటల నుంచి ఉదయం 10:30 గంటల వరకే కూలీలు పనులుకు వెళ్తున్నారు. వడదెబ్బకు గురికాకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేస్తున్నారు. కొద్దిరోజులగా ఉపాధి హామీ పనులకు కూలీలు సంఖ్య పెంచడానికి ఉపాధిహామీ ఏపీఓ హరీష్, టీఏలు నిత్యం గ్రామాల్లోకి వెళ్లి జాబ్ కార్డు కలిగిన ప్రతిఒక్కరూ పనులకు రావాలని అవగాహన కల్పించారు. దీంతో రోజురోజుకూ కూలీల సంఖ్య పెరుగుతుంది. పనికి వెళ్తున్న 1634 మంది కూలీలు అవగాహన కల్పిస్తున్న అధికారులు -
ధాన్యం లారీలకు జీపీఎస్
వాహనాల కదలికలపై నిత్యం పర్యవేక్షణ● మిల్లుల్లో అన్లోడింగ్ జాప్యానికి చెక్ ● నూతన పద్ధతిలోనే కేటాయింపులు ● రైతులకు త్వరగా డబ్బులు చెల్లించే అవకాశంభూపాలపల్లి రూరల్: మిల్లులకు సమానంగా ధాన్యం కేటాయింపులు, పంపిన ధాన్యాన్ని అన్లోడ్ చేయడంలో జాప్యాన్ని నియంత్రించేందుకు అధికా రులు జీపీఎస్ (గ్లోబల్ పోజిషనింగ్ సిస్టమ్) ట్రాకింగ్ ఏర్పాటు చేశారు. ఈ సీజన్లో ధాన్యం కొనుగోలులో ట్రక్ షీట్ జనరేట్తోపాటు ఆన్లైన్లోనే మిల్లులకు కేటాయింపులను ప్రారంభించారు. తరుగు పేరుతో దోపిడీని అరికట్టనున్నారు. డబ్బుల చెల్లింపులు వేగిరం చేయనున్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, క్రమబద్ధంగా నిర్వహించేందుకు పౌరసరఫరాల శాఖ నూతన పద్ధతులను అమలు చేస్తుంది. జిల్లా వ్యాప్తంగా యాసంగిలో 95,590 ఎకరాల్లో వరి సాగు కాగా 1.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని జిల్లా వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 185 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు వేసి కొనుగోళ్లు ప్రారంభించారు. ఇప్పటివరకు 12 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.3 కోట్ల చెల్లింపులు చేశారు. అక్రమాలను అరికట్టేందుకే.. ధాన్యం రవాణాలో అక్రమాలను అరికట్టేందుకు జీపీఎస్ విధానాన్ని అమలు చేస్తున్నారు. తరుగు ఎక్కువగా తీయాలని మిల్లర్లు రోజుల తరబడి వాహనాల నుంచి ధాన్యం అన్లోడ్ చేయకుండా ఉంచేవారు. ధాన్యం తరుగును తీసేందుకు అంగీకరిస్తేనే దించుకునేవారు. జీపీఎస్ ఏర్పాటు చేయడంతో ఎంత సమయం వేచి ఉంది, ఎందుకు వేయిటింగ్ చేయించారనే వివరాలు తీసుకోనున్నారు. కావాలని ఆలస్యం చేస్తే మిల్లర్లపై చర్యలు తీసుకుంటారు. అక్రమాలను చెక్ పెట్టేందుకు లారీలు, డీసీఎం వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ పరికరాలు అమర్చడం తప్పనిసరి చేశారు. జీపీఎస్ సరిగా పనిచేస్తున్న వాహనాలకు మాత్రమే లోడింగ్ చేయనున్నారు. వాహనాల కదలికలను నిత్యం పర్యవేక్షించనున్నారు. ఇలా ఆన్లైన్లో ట్రక్ షీట్లు జనరేట్ చేయడం, వాహనాలకు జీపీఎస్ ఏర్పాటుతో రైతులకు మేలు జరగనుంది. తరుగు పేరుతో దోపిడీకి పాల్పడే అవకాశాలు తగ్గిపోనున్నాయి. రైతులకు 48 గంటల్లో ధాన్యం డబ్బులు జమకానున్నాయి.. ‘పలుకుబడి’కి ఇక చెల్లు ఇదివరకు సివిల్ సప్లయీస్ అధికారులు, స్థానిక అధికారులకు నచ్చిన మిల్లులకు, పలుకుబడి ఉన్న నేతల మిల్లులకు అధికంగా ధాన్యం కేటాయించేవారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో మిల్లుల యజమానుల నుంచి ఫిర్యాదులు, అధిక తరుగు, మిల్లుల వద్ద లారీలు పడిగాపులకు, అక్రమాలకు చెక్ పడనుంది. నాణ్యతలేదనే పేరుతో కోతలు, ట్రక్ షీట్లలో అవకతవకలకు పాల్పడే అవకాశాలు ఉండవు. కొనుగోలు కేంద్రాల్లో లారీ లోడ్ చేసిన వెంటనే ఆన్లైన్ ట్రక్ జనరేట్ చేసి, సంబంధిత మిల్లును ఆటోమేటిక్గా కేటాయించే విధానాన్ని అమలు చేస్తుంది. మాన్యువల్గా మిల్లుల కేటాయింపు విధానాన్ని నిలిపేసింది. కొత్త విధానంతో లారీ లోడ్ చేసే సమయానికి మిల్లు వివరాలు తెలియవు. ట్రక్ షీట్ ఆన్లైన్లో జనరేట్ రేట్ చేసిన తర్వాతనే ఆటోమేటిక్గా ఏ మిల్లుకు తరలించాలో సూచిస్తుంది. ట్రక్ షీట్లో పేర్కొన్న మిల్లుకే ధాన్యాన్ని తరలించాల్సి ఉంటుంది. పారదర్శకత కోసమే..మిల్లర్లకు ధాన్యం కేటాయింపుల్లో పారదర్శకత, త్వరగా రైతులకు డబ్బులు చెల్లింపులు జరగనున్నాయి. తరుగు పేరుతో ఇక మిల్లర్ల ఇబ్బందులు ఉండవు. వాహనాలకు సైతం జీపీఎస్ ఏర్పాటు చేశాం. దీంతో మిల్లర్లు అన్లోడింగ్ జాప్యం తగ్గనుంది. దీంతో రైతులకు మేలు జరగనుంది. అకాల వర్షానికి తడిచిన 612 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి నేరుగా మిల్లులకు తరలించాం. – రాములు, డీఎం సివిల్ సప్లయీస్ అధికారి -
కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి
● డీసీసీ అధ్యక్షుడు కరుణాకర్ భూపాలపల్లి అర్బన్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. బాలికపై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడిపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ బీజేపీ నాయకత్వం స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. కేసు విచారణ పూర్తయ్యే వరకు ఆయన ఎంపీ, మంత్రి పదవులకు రాజీనామా చేసి విచారణకు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీను, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు భువనసుందర్, వెంకీయాదవ్, దేవన్, లక్ష్మి, పరమేశ్వరి, అజ్మీర జంపన్న, రమేష్, హఫీజ్, రాధా, ప్రేమ్కుమార్, నాగరాజు, కిషోర్, భిక్షపతి, పొనగంటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా హనుమాన్ జయంతి
సాక్షి నెట్వర్క్: జిల్లావ్యాప్తంగా మంగళవారం హనుమాన్ జయంతిని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అభయాంజనేయ స్వామి ఆలయాల్లో అర్చకులు స్వామివారికి చందనం, తైలాభిషేకం, పంచాంమృతాలతో అభిషేకాలు, తమలపాకులతో ప్రత్యేకంగా అలంకరించారు. వడపప్పు, బెల్లం పాయసం నైవేద్యాలుగా సమర్పించారు. కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ అనుబంధ దేవాలయమైన కట్ట మీద ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. సాయంత్రం హనుమాన్ భక్తులు ద్విచక్ర వాహన ర్యాలీ, శోభాయాత్ర నిర్వహించారు. -
ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేయాలి
● అదనపు కలెక్టర్ విజయలక్ష్మి చిట్యాల: ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులు త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి అన్నారు. మండలంలోని నైన్పాక గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే జూన్ 2న ఇందిరమ్మ ఇళ్ల సామూహిక ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉన్నందున పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీని సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జయశ్రీ, హౌసింగ్ డీఈ శ్రీకాంత్, ఏఈ సౌమ్య, సర్పంచ్ నక్క భాస్కర్, పంచాయతీ కార్యదర్శి విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
తప్పులు లేకుండా సర్వే పూర్తిచేయాలి
ములుగు: మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న ఇళ్ల గణనలో తప్పులు లేకుండా సర్వే పూర్తి చేయాలని ఎన్యుమరేటర్లకు రాష్ట్ర సెన్సెస్ ఆపరేషన్ జాయింట్ డైరెక్టర్ సుబ్బరాజు సూచించారు. ఈ మేరకు ఆయన మంగళవారం మున్సిపాలిటీలోని సూపర్వైజర్ సర్కిల్లో సర్వే చేస్తున్న ఎన్యుమరేటర్లు ఇంటి నంబర్లను ఎలా కేటాయిస్తున్నారో, పని సక్రమంగా జరుగుతుందో లేదో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రతీ ఇంటి నంబర్ ఎదురుగా శ్రీసీఎన్శ్రీ అని తప్పనిసరిగా రాయాలని సూచించారు. మ్యాపింగ్ ఎలా చేస్తున్నారో కూడా ఆయన ఆరా తీశారు. సర్వేలో వేగం పెంచాలని తెలిపారు. ఎన్యుమరేటర్లకు కేటాయించిన హౌస్ లిస్టింగ్ బ్లాక్ హెచ్ఎల్బీ పరిధిని స్పష్టంగా తెలియజేసేందుకు మున్సిపాలిటీ నుంచి మూడు రోజుల పాటు సిబ్బందిని వారి వెంట పంపించాలని ఆదేశించారు. జిల్లాలోని ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు బుధవారం సాయంత్రంలోపు తమకు కేటాయించిన ప్రతీ ఇంటికి ఇంటి నంబర్లు వేయడం పూర్తి చేయాలని సూచించారు. వచ్చే నెల 9వ తేదీ వరకు సర్వే ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు. రోజువారీ పనితీరుపై మానిటరింగ్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెన్సెస్ ఇన్చార్జ్ వినయ్, ములుగు సీపీవో, జిల్లా సెన్సెస్ అధికారి ఎం.ప్రకాశ్, మున్సిపాలిటీ చార్జ్ ఆఫీసర్ కమిషనర్ సంపత్, స్టాటిస్టికల్ ఆఫీసర్ బి.లాల్నాయక్, ఫీల్డ్ ట్రైనర్లు, సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లు పాల్గొన్నారు. సీఎం చేతుల మీదుగా నగదు ప్రోత్సాహం మల్హర్: మండలకేంద్రంలోని ప్రభుత్వ జూని యర్ కళాశాలలో 2025–26 విద్యా సంవత్స రం ఇంటర్మీడియట్లో రాష్ట్రంలోనే ఉత్తమ ఫలి తాలు సాధించింది. ఈ మేరకు ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా సోమవారం హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా తాడిచర్ల జూనియర్ కళా శాల ప్రిన్సిపాల్ విజయదేవి రూ.1లక్ష చెక్కు ను అందుకున్నారు. ఈ మేరకు మంగళవారం ప్రిన్సిపాల్ను కళాశాల అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు వెంకటాపురం(కె): ఏజెన్సీలో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పొ అన్నారు. పీఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పీఓ తొలిసారిగా మంగళవారం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మండల పరిధిలోని చిరుతపల్లి బాలికల ఆశ్రమ పాఠశాల 1, చిరుతపల్లి బాలికల ఆశ్రమ పాఠశాల 2ను తనిఖీ చేశారు. మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. పాఠశాల పునఃప్రారంభం నాటికి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేశారు. పరిసరాలను పరిశీలించి రోగులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని ఆదేశించారు. ఆస్తి కోసం వృద్ధురాలి హత్య..గణపురం : మండలంలోని గొల్లపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి, డబ్బు కోసం నానమ్మను మనువడు, అతడి భార్య హత్య చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గణపురం సీఐ కరుణాకర్ రావు కథనం ప్రకారం.. గొల్లపల్లి గ్రామానికి చెందిన పెండ్యాల ఐలమ్మ (60)ను ఆస్తి, రూ.40 వేల కోసం ఆమె మనువడు జాకేందర్, అతడి భార్య అమకృతి ఈనెల 09న ప్రణాళిక ప్రకారం కర్రతో దాడి చేసి హత్యకు పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మంగళవారం నిందితులను అదుపులోకి తీసుకొని విచారించారు. ఇందులో తామే హత్య చేసినట్లు అంగీకరించారు. దీంతో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ కరుణాకర్రావు తెలిపారు. -
ఉమ్మడి వరంగల్ నుంచి చివరి లొంగుబాటు
కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్లో భాగంగా పలువురు మావోయిస్టు అగ్రనేతలు ఎన్కౌంటర్లలో మృతి చెందారు. దళాలకు దళాలే మృత్యువాత పడగా.. మరికొందరు అగ్రనేతలు, మావోయిస్టుల ఆయుధాలతో సహ లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చి 31 టార్గెట్గా చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ పూర్తయిన సందర్భంగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్ట్ అగ్రనేతలు ముప్పాల లక్ష్మణ్రావు అలియాస్ గణపతి, పొలిట్బ్యూరో సభ్యుడు మిసిర్ బెస్రాతో పాటు పసునూరి నరహరి అలియాస్ సంతోశ్ పేరును కూడా కేంద్రం ప్రకటించింది. ఇటీవల కాలంలో పోలీస్ కూంబింగ్లు మరింత ఉధృతంగా సాగుతున్న తరుణంలో కేంద్ర కమిటీ సభ్యుడు, జార్ఖండ్ ఈస్ట్ రీజినల్ బ్యూరో టెక్నికల్ విభాగం ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్న పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్, అలియాస్ సంతోశ్ మంగళవారం భార్యతో కలిసి తెలంగాణ పోలీసు ఉన్నతాధికారుల ఎదుట లొంగిపోయారు. కాగా, ఉమ్మడి వరంగల్ నుంచి ఇంకా ఐదారుగురు మావోయిస్ట్ ఉద్యమంలో ఉన్నట్లు ప్రచారం ఉన్నా.. పోలీసు రికార్డుల్లో మాత్రం లేరు. దీంతో ఉమ్మడి వరంగల్ నుంచి పోలీసు రికార్డుల్లో కీలక నేతగా ఉన్న పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్, సంతోశ్ లొంగుబాటు చివరిదిగా చెబుతున్నారు. అజ్ఞాత మావోయిస్టుల జాబితాలో ఉన్న నరహరి జనజీవన స్రవంతిలో కలవడంతో నక్సల్స్ రహిత జిల్లాగా మారిందంటున్నారు. -
పోలీస్స్టేషన్ను తనిఖీ చేసిన ఎస్పీ
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి పోలీస్స్టేషన్ను వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం ఎస్పీ సంకీర్త్ సందర్శించి సమగ్ర తనిఖీ నిర్వహించారు. జి ల్లాలో పోలీస్ వ్యవస్థ పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలపై ప్రత్యక్ష అవగాహన పొందడమే ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ సందర్భంగా వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన బ్యాడ్మింటన్ కోర్టును ప్రారంభించారు. స్టేషన్ పరిశుభ్రత, పరిసరాల నిర్వహణ, రికార్డుల నిర్వహణ విధానం, సిబ్బంది విధి నిర్వహణను ఎస్పీ పరిశీలించారు. స్టేషన్లో నమోదైన కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల పరిష్కారంపై అధికారులతో సమీక్ష ని ర్వహించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజలకు స్నేహపూర్వక వాతావరణం కల్పిస్తూ, వారి సమస్యలను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించే వి ధంగా సేవలు అందించాలని సిబ్బందికి సూచించా రు. ఈ కార్యక్రమంలో డీఎస్సీ సంపత్రావు, సీఐ నరేష్కుమార్, ఎస్సై సాంబమూర్తి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
సజావుగా మక్కల కొనుగోళ్లు
మొగుళ్లపల్లి/రేగొండ: జిల్లాలో మొక్కజొన్న కొనుగోళ్లు సజావుగా సాగుతుందని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. మంగళవారం మొగుళ్లపల్లి, రేగొండ మండలకేంద్రాల్లోని మక్కల కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ కమిటీ గోదాములోని నిల్వ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 49,528 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారని, ప్రభుత్వం క్వింటాకు రూ.2,400 కనీస మద్దతు ధర ప్రకటించిందన్నారు. జిల్లాలో 12 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇప్పటివరకు 26,000 మెట్రిక్ టన్నుల మక్కలు కొనుగోలు కేంద్రాలకు చేరుకోగా, అందులో 16,850 మెట్రిక్ టన్నులు పూర్తయ్యిందన్నారు. ఇంకా సుమారు 9,500 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. గోదాముల కొరత కారణంగా నిల్వ సమస్యలు ఉన్నాయని, హమాలీలకు చెల్లించే కూలి రేట్లు తక్కువగా ఉండటంతో కార్మికుల లభ్యతతో ఇబ్బందులు ఉన్నాయన్నారు. ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పటికీ రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కార్యక్రమం సజావుగా నిర్వహించేందుకు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, సహకార అధికారి వాలియా నాయక్, వ్యవసాయ అధికారి బాబురావు, తహసీల్దార్ సునీత, ఎంపీడీఓ సురేందర్, అబ్దుల్ రజాక్, వాసుదేవారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతుల వివరాలను సక్రమంగా నమోదు చేయాలి ధాన్యం విక్రయించిన రైతుల వివరాలను సక్రమంగా నమోదు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం మండలంలోని మొట్లపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రిజిస్టర్లను పరిశీలించి నమోదు ప్రక్రియ నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్ రాహుల్శర్మమక్కలు నిల్వ చేసే గోదామును పరిశీలిస్తున్న కలెక్టర్ రాహుల్ శర్మ -
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్
భూపాలపల్లి అర్బన్: ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహించే అధికారులపై సస్పెన్షన్ చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హెచ్చరించారు. మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ రాహుల్శర్మ పాల్గొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు నిర్వహించాలని, హమాలీలు, గన్నీ సంచులు, రవాణా వాహనాల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లోనే నాణ్యత పరిశీలన చేసి రైతులకు వెంటనే రశీదులు ఇవ్వాలని సూచించారు. అనంతరం కలెక్టర్ రాహుల్ శర్మ రెవెన్యూ, పౌర సరఫరాలు సంస్థ, సహకార, వ్యవసాయ, ఆర్డీఓ అధికారులతో మాట్లాడుతూ.. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగేలా అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం, మక్కలు జిల్లాకు రాకుండా చెక్పోస్టు వద్ద పర్యవేక్షించాలన్నారు. లారీల కొరత ఉన్నచోట ట్రాక్టర్లు వినియోగించుకోవాలని సూచించారు. హమాలీల కొరత ఉంటే స్థానికంగా అందుబాటులో ఉన్న హమాలీలను వినియోగించుకోవాలని సూచించారు. అధికారులందరూ సమన్వయంతో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ధాన్యం, మక్కలు కొనుగోలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, సహకార అధికారి వాలియా నాయక్, వ్యవసాయ అధికారి బాబురావు, పౌర సరఫరాల అధికారి కిరణ్కుమార్, డీఎం రాములు, డీఆర్డీఓ బాలకృష్ణ, అధికారులు పాల్గొన్నారు. వీసీలో సీఎం రేవంత్ రెడ్డి -
సింగరేణి క్వార్టర్స్లో చోరీ
● బంగారం, వెండి ఆభరణాలు అపహరణ గణపురం: మండలంలోని 1000 క్వార్టర్స్లో ఒకే రాత్రి 8 ఇళ్లలో చోరీ జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గణపురం మండలం 1000 క్వార్టర్స్లో సింగరేణి ఉద్యోగులు నివాసం ఉంటున్నారు. వేసవి సెలవులు కావడంతో వారి స్వగ్రామాలకు వెళ్లారు. ఇది గమనించిన దుండగులు పక్కా ప్రణాళికతో శనివారం రాత్రి 8 క్వార్టర్ల తాళాలు పగులగొట్టి చోరీకి యత్నించారు. ఆదివారం ఉదయం తోటి ఉద్యోగులు గమనించి బాధితులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి క్లూస్టీంతో మంగళవారం తనిఖీలు నిర్వహించారు. బ్లాక్ నంబర్ 34 రూం నంబర్ 128లో నివాసముంటున్న మల్లగాని సరస్వతికి చెందిన 3 తులాల బంగారం, 15 తులాల వెండి ఆభరణాలు, గాజుల వెంకటేశ్వర్లు 5 గ్రాముల బంగారు కమ్మలు, 4 గ్రాముల వెండి, రూ.6వేల నగదు, పాతరవేని రాజేష్కు చెందిన 2 గ్రాముల బంగారం, 4 తులాల వెండి, వేములపల్లి బాబురావు క్వార్టర్లో 10 తులాల వెండితో పాటు రూ. 1000 నగదు అపహరణకు గురైనట్లు గుర్తించారు. సింగరేణి సెక్యూరిటీ ఉండి, నిత్యం జనాభాతో ఉండే 1000 క్వార్టర్లలో చోరీ జరగడం సంచలనం సృష్టించింది. పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. -
నకిలీ విత్తనాల విక్రయంపై ఉక్కుపాదం
అవార్డుల ప్రదానంవిద్యావారోత్సవాల్లో భాగంగా సోమవారం హైదరాబాద్లో వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థిని అవునూరి సాయిశ్రీ, వరంగల్ కృష్ణా కాలనీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థి మహ్మద్ ముదాస్సిర్, హనుమకొండ పింగిళి కళాశాల విద్యార్థిని శ్రీహితకు అవార్డు చెక్కులు అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పక్కన మంత్రులు పొంగులే టి , వివేక్, పొన్నం, అజాహ రుద్దీన్ , శ్రీధర్బాబుపక్క ఫొటోలోని మహిళ పేరు తోన్గర్ కమల. చిట్యాల మండలం చల్లగరిగ గ్రామం. డయాలసిస్తో ఇబ్బందులు పడుతుంది. వైద్యం కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేసినా ఫలితం లేదు. పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంది. మూడుసార్లు ప్రజావాణిలో దరఖాస్తు చేసినా మంజూరు కాలేదు. డయాలసిస్తో ఏ పనీ చేయలేని స్థితిలో ఉంది. కుటుంబ పోషణ ఇబ్బందిగా మారిందని, పింఛన్ ఇప్పించాలని వేడుకుంటుంది. ● నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలి ● కలెక్టర్ రాహుల్ శర్మ -
మైనింగ్కు ఊతం!
సాక్షి ప్రతినిధి, వరంగల్: ప్రభుత్వం మైనర్ ఖనిజ బ్లాకుల వేలం విధానంలో కొత్త మార్గదర్శకాలకు శ్రీకారం చుట్టింది. ఖనిజాల తవ్వకాల్లో పారదర్శకత, ఆదాయం పెంపు లక్ష్యంగా హైబ్రిడ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. పూర్తిగా ఆన్లైన్లోనే వేలం ప్రక్రియ ద్వారా ఖనిజాల లీజులు కేటాయించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎన్.శ్రీధర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మైనింగ్ రంగానికి ఊతమివ్వనున్నాయి. ముఖ్యంగా గ్రానైట్, స్టోన్ మెటల్, బ్లాక్ గ్రానైట్, రోడ్ మెటల్, మట్టి, ఇసుక వంటి ఖనిజాల తవ్వకాల్లో కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే వందల సంఖ్యలో లీజులు.. ఉమ్మడి వరంగల్లో ఇప్పటికే వందల సంఖ్యలో లీజులు ఉన్నాయి. వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో అధికంగా క్వారీలు ఉన్నాయి. మైన్స్ అండ్ జియాలజీ శాఖ అంచనాల ప్రకారం ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల పరిధిలో ప్రస్తుతం చిన్న, పెద్దవి కలిపి సుమారు 250కు పైగా మైనింగ్, క్వారీ లీజులు అమలులో ఉన్నట్లు తెలుస్తోంది. అధిక భాగం స్టోన్ మెటల్, రోడ్ మెటల్ యూనిట్లు, గ్రానైట్ తవ్వకాలు, బ్రిక్ ఎర్త్, మట్టి క్వారీలు, ఇసుక రీచ్లు ఉన్నా యి. భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో గ్రానైట్, స్టోన్ మెటల్ క్వారీల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 40–60 కొత్త లీజులకు అవకాశం? పర్యావరణ, కాలుష్య నియంత్రణ అనుమతులు లేక వేలం జరగని అనేక ఖనిజ బ్లాకులు కొత్త ‘హైబ్రిడ్ విధానం’ ద్వారా వేలంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి వరంగల్లోనే మరో 40 నుంచి 60 వరకు కొత్త మైనింగ్ లీజులు, క్వారీ బ్లాకులు వేలానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని మైనింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా మహబూబాబాద్లో బ్లాక్ గ్రానైట్, భూపాలపల్లిలో రోడ్ మెటల్, ములుగులో స్టోన్ క్వారీలు, వరంగల్, హనుమకొండ పరిసరాల్లో నిర్మాణ రంగానికి అవసరమైన మెటల్ క్వారీలు అధికం. జిల్లాల్లో కొత్త విధానంతో వేగంగా అనుమతులు పొందే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. పట్టాదారులకు తీపి కబురు మైనర్ ఖనిజాల వేలం మొత్తం ఆన్లైన్లోనే జరగనుంది. బిడ్డింగ్ నుంచి లీజు కేటాయింపు వరకు ప్రతీ దశ డిజిటల్ విధానంలో ఉండడంతో అక్రమాలు తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కనీసం ముగ్గురు బిడ్డర్లు తప్పనిసరి చేయడం ద్వారా పోటీ పెరిగి ప్రభుత్వానికి అధిక ఆదాయం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పట్టా భూముల్లో ఖనిజ తవ్వకాలకు అంగీకరించిన భూ యజమానులకు ప్రభుత్వం అదనపు సొమ్ము చెల్లించనుంది. గ్రానైట్, మార్బుల్ మినహా ఇతర ఖనిజాలకు సీనియరేజ్ ఫీజులో 10 శాతం, గ్రానైట్, మార్బుల్కు 5 శాతం పెంచనున్నారు. ఈ నిర్ణయంతో ప్రైవేట్ భూముల్లో కొత్త క్వారీలకు భూ యజమానులు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా భావిస్తున్నారు. కొత్త వేలం విధానం అమలైతే ఉమ్మడి వరంగల్లో ఖనిజ ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం సుమారుగా ఏటా రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు వస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రస్తుతం నిర్మాణ రంగం వేగంగా విస్తరిస్తుండడంతో రోడ్ మెటల్, స్టోన్ మెటల్, గ్రానైట్కు డిమాండ్ పెరుగుతోంది. కొత్త లీజులు మంజూరైతే ప్రభుత్వానికి రూ.25–30 కోట్ల అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని మైనింగ్ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మైనర్ ఖనిజాల వేలంలో భారీ మార్పులు హైబ్రిడ్ విధానానికి సర్కారు గ్రీన్సిగ్నల్ పూర్తిగా ఆన్లైన్లోనే వేలం ప్రక్రియ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొత్త లీజులు గ్రానైట్, స్టోన్ మెటల్, ఇసుక క్వారీలపై ఫోకస్ -
ఆసరా కోసం..
జయశంకర్ భూపాలపల్లిమంగళవారం శ్రీ 12 శ్రీ మే శ్రీ 20267పింఛన్ల మంజూరుకు ఎదురుచూపుభూపాలపల్లి రూరల్: ఆసరా పింఛన్ల కోసం అర్హులకు ఎదురుచూపు తప్పడం లేదు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆన్లైన్ కూడా ప్రభుత్వం నాలుగేళ్లుగా బంద్ చేసింది. 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆసరా పింఛన్ల మొత్తాన్ని పెంచుతామని హామీ ఇచ్చింది. అర్హులైన వారికి కొత్తగా పింఛన్లు మంజూరు చేయకపోవడంతో వారంతా అందోళన చెందుతున్నారు. ఇటీవల ప్రభుత్వం ఈ ఏడాది జూన్ నాటికి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించింది. దీంతో పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. 2022 ఆగస్టు నుంచి ఆగిన ‘ఆసరా’ రాష్ట్ర వ్యాప్తంగా 2022 ఆగస్టు నుంచి కొత్తగా అసరా పింఛన్ల మంజూరును అప్పటి ప్రభుత్వం నిలిపివేసింది. అప్పటికే జిల్లాలో చాలామంది దరఖాస్తు చేసుకున్నా వివిధ కారణాలతో వాటిని తిరస్కరించింది. పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే పోర్టల్ క్లోజ్ చేయడంతో కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండాపోయింది. దీంతో నాలుగేళ్ల నుంచి దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు అధికారులకు నేరుగా దరఖాస్తులు ఇస్తున్నారు తప్ప మంజూరు కావడం లేదు. కలెక్టరేట్లో ప్రతీ సోమవారం ప్రజావాణిలోనూ కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. మండల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న వారు వేల సంఖ్యలో ఉన్నారు. అయినా ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో అర్హులైన వారికి ఎదురుచూపు తప్పడం లేదు. ఎన్నికల హామీ నెరవేరుతుందా..! ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఎప్పుడు అమలు చేస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అప్పుడప్పుడు ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నా ఇప్పటి వరకు అమలు కాలేదు. ఎన్నికల హామీలో భాగంగా పింఛన్ల పెంపును అమలు చేయడంతో పాటు కొత్తగా అర్హులైన వారికి పింఛన్లు అందిస్తారని కోటి ఆశలతో ఉన్నారు. ప్రభుత్వం తప్పకుండా పింఛన్లు మంజూరు చేయాలని కోరుతున్నారు. 2022 నుంచి నిలిచిన పెన్షన్ మంజూరు పోర్టల్ను పూర్తిగా మూసేసిన ప్రభుత్వం దరఖాస్తులను కూడా ఆన్లైన్ చేయలేని పరిస్థితి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న అర్హులు జూన్లో ఇస్తామని ప్రభుత్వ ప్రకటనతో చిగురిస్తున్న ఆశలు -
విద్యా వారోత్సవాలు ప్రారంభం
భూపాలపల్లి అర్బన్: ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా విద్యా వారోత్సవాలను ప్రారంభించారు. ఈ నెల 17వ తేదీ వరకు విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలలను సిద్ధం చేయడమేకాక ప్రవేశాల పెంపునకు కార్యాచరణ రూపొందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లాకేంద్రంలోని కేజీబీవీలో సమ్మర్క్యాంపు ప్రాంరభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టాల్సిన మరమ్మతులు, నూతన నిర్మాణాలేకాక అమ్మ ఆదర్శ పాఠశాల ఆధ్వర్యాన చేపట్టే పనులను ప్రారంభించారు. నేడు (మంగళవారం) పదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం రెండు సమ్మర్ క్యాంపులను ప్రారంభించనున్నారు. ఇందుకోసం చెల్పూర్. టేకుమట్ల జెడ్పీహెచ్ఎస్లను ఎంపిక చేశారు. ఈ క్యాంపుల్లో పాల్గొనే విద్యార్థుల హాజరును ముఖ గుర్తింపు ద్వారా నమోదు చేయనున్నారు. మధ్యాహ్న భోజనం, స్టేషనరీ కింద రూ.వంద, రవాణా అలవెన్స్గా ప్రతీ విద్యార్థికి రూ.వేయి నగదు అందజేయనున్నారు. ఈ క్యాంపు నిర్వహణతో సప్లిమెంటరీ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బుధవారం (13వ తేదీ).. మండలస్థాయిలో సర్పంచ్లకు వర్క్షాప్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో బోధన, ఇతర విద్యా కార్యక్రమాలను వారికి వివరించనున్నారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపునకు సహకరించాలని వివరిస్తారు. గురువారం (14వ తేదీ).. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట, మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల ఆధ్వర్యాన బడిబాట ద్వారా విద్యార్థుల నమోదు చేపడుతారు. వచ్చే విద్యా సంవత్సరం పాఠశాలల్లో అల్పాహారం అందించే అంశాన్ని వివరిస్తారు. డ్రాపవుట్ విద్యార్థులను తిరిగి చేర్పించడంతో పాటు సున్నా ప్రవేశాలు ఉన్న పాఠశాలల్లో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. శుక్రవారం (15వ తేదీ).. విద్యావారోత్సవాల్లో భాగంగా ఐదో రోజున లైబ్రరీ డేగా నిర్వహిస్తారు. ఈ మేరకు ప్రతీ పాఠశాలలో ఉన్న గ్రంథాలయ సదుపాయంపై తల్లిదండ్రులు, విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. అంతేకాక దాతల నుంచి పుస్తకాలు స్వీకరిస్తారు. శనివారం (16వ తేదీ): విద్యార్థులకు జిల్లాస్థాయి ఆర్ట్, క్రాఫ్ట్, సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తారు. మండలాల్లో విజేతలను ఆహ్వానించి జిల్లాస్థాయి పోటీలు నిర్వహించాక విజేతలకు బహుమతులు అందజేయనున్నారు. కార్యక్రమం గణపురం మోడల్స్కూల్లో జరగనుంది. ఆదివారం (17వ తేదీ).. వారోత్సవాల్లో ముగింపును చివరి రోజు ఘనంగా నిర్వహించాలని ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా పదో తరగతిలో జిల్లాస్థాయి ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేసి అభినందిస్తారు. అందరూ పాలుపంచుకోవాలి.. జిల్లాలో ఈ నెల 17వ తేదీ వరకు విద్యా వారోత్సవాలను నిర్వహిస్తున్నాం. ఇప్పటికే ఎంఈఓలు, హెచ్ఎంలతో పాటు విద్యాశాఖ బాధ్యులతో సమీక్ష నిర్వహించి సూచనలు చేశాం. కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సహకరించాలి. – రాజేందర్, జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి ఈ నెల 17వరకు నిర్వహణ రోజుకొక కార్యక్రమంతో షెడ్యూల్ ఖరారు -
ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారమే లక్ష్యం
భూపాలపల్లి అర్బన్: ప్రజలు అందించిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదివస్ కార్యక్రమంలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వచ్చిన 20 ఫిర్యాదులను స్వీకరించిన ఎస్పీ, సమస్యలను శ్రద్ధగా విని వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు తక్షణ సూచనలు చేశారు. ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తూ సంబంధిత పోలీస్స్టేషన్ల సీఐలు, ఎస్ఐలతో నేరుగా మాట్లాడి అవసరమైన దిశానిర్దేశం చేశారు. ప్రజలు పైరవీలు, మూడో వ్యక్తుల ప్రమేయం లేకుండా నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. చట్టబద్ధమైన విధానంలోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని, శాంతిభద్రతలను కాపాడుతూ ప్రజలకు మరింత చేరువగా ఉండడమే పోలీస్ శాఖ లక్ష్యమని తెలిపారు. ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజాదివస్ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి, సంబంధిత అధికారుల సహకారంతో వాటిని పరిష్కరిస్తున్నామన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు. పోలీసుల సంక్షేమానికి మరో ముందడుగు జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు సిబ్బంది సౌకర్యార్థం ఏర్పాటు చేసిన సెలూన్ను ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సోమవారం ప్రారంభించారు. విధి నిర్వహణలో ఎప్పుడూ బిజీగా ఉండే పోలీసులకు కార్యాలయ పరిసరాల్లోనే ఈ సౌకర్యం అందుబాటులో ఉండటం వల్ల సమయం ఆదా అవుతుందని ఎస్పీ తెలిపారు. పోలీసుల సంక్షేమం, వారి అవసరాలపై జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. భవిష్యత్లో కూడా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్, వెల్ఫేర్ ఆర్ఐ సంతోష్ కుమార్, ఎంటీఓ ఆర్ఐ పూర్ణచందర్ పాల్గొన్నారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
పాలిసెట్కు ఏర్పాట్లు పూర్తి
భూపాలపల్లి అర్బన్: పాలిసెట్ పరీక్షకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా సమన్వయ అధికారి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.రమణారావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా నాలుగు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు, మొత్తం 905 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు వెల్లడించారు. ఈ నెల 13న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఉదయం 10 గంటలలోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, ఆలస్యంగా వచ్చిన వారికి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. విద్యార్థులు తప్పనిసరిగా హాల్ టికెట్తో పాటు హెచ్బీ పెన్సిల్, బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తీసుకురావాలని సూచించారు. ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష హాల్లోకి అనుమతించబోమని తెలిపారు. ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ ఐటీఐ/ఏటీసీలో 2026–27, 2027–28 విద్యా సంవత్సరాలకు వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ జుమ్లానాయక్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు ఐటీఐ తెలంగాణ వెబ్సైట్ ద్వారా జూన్ 8 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రవేశాలకు సంబంధించి 10వ తరగతి ఉత్తీర్ణత అర్హతగా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ప్రవేశాల్లో ఫిట్టర్, మ్యానుఫాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫాక్చరింగ్ టెక్నీషియన్, ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్, వర్చువల్ అనాలిస్ట్ డిజైనర్–ఎఫ్ఈఎం, సీఎన్సీ మిషనింగ్ టెక్నీషియన్, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పూర్తి వివరాలకు ఐటీఐ భూపాలపల్లి కార్యాలయం, సెల్ నంబర్ 85004 65034ను సంప్రదించాలని సూచించారు. డీఆర్వోను కలిసిన ట్రెస్మా ప్రతినిధులు భూపాలపల్లి రూరల్: జిల్లాకు నూతనంగా వచ్చిన జిల్లా రెవెన్యూ అధికారి వసంత కుమారిని సోమవారం ట్రెస్సా జిల్లా ప్రతినిధి బృందం మర్యాద పూర్వకంగా కలిసింది. కలిసిన వారిలో ట్రెస్సా జిల్లా అధ్యక్షుడు మార్క రామ్మోహన్, ప్రధాన కార్యదర్శి మహ్మద్ రజాక్, ట్రెజరర్ పకిడే రాజయ్య ఉన్నారు. మ్యూజియంలోకి పురాతన విగ్రహాలు కాళేశ్వరం: కాళేశ్వరంలో ఈనెల 21నుంచి జూన్1వ తేదీ వరకు జరుగనున్న సరస్వతీనది అంత్యపుష్కరాలకు ముందుగానే మ్యూజి యం ప్రారంభించాలనే ఉన్నతాధికారుల ఆదేశాలతో నిర్మాణం పూర్తికాక ముందే హడావుడిగా పురాతన విగ్రహాలను అమర్చుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం అధికారులు పురాతన విగ్రహాలను మ్యూజియంలో అమర్చారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు కాకతీయులు, చాళుక్యులనాటి ప్రాంతీయ చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపడుతున్నప్పటికీ పూర్తిస్థాయి పనులు కాకముందే విగ్రహాల ఏర్పాటు చేపట్టడంపై స్థానికుల్లో చర్చ జరుగుతోంది. ఏరియా బీసీ, ఓబీసీ లైజనింగ్ ఆఫీసర్గా మురళీమోహన్ భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియా సింగరేణి బీసీ, ఓబీసీ లైజనింగ్ ఆఫీసర్గా ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ సిలివేరి మురళీమోహన్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం జీఎం కార్యాలయ చాంబర్లో సింగరేణి బీసీ ఓబీసీ జనరల్ సెక్రటరీ నల్లపురి రమేష్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ ఏరియాల లైజనింగ్ ఆఫీసర్లు, నాయకులు పాల్గొని భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఏరియా జనరల్ మేనేజర్ లైజనింగ్ ఆఫీసర్గా నియమితులైన మురళీమోహన్ను అభినందిస్తూ శాలువాతో సన్మానించారు. -
పదిలమా.. ప్రశ్నార్థకమా?
అనంతలక్ష్మి ఆయుర్వేద వైద్య కళాశాలలో బీఏఎంఎస్ సీట్ల భర్తీపై అయోమయం కాశిబుగ్గ: వరంగల్లోని అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలలో పేరుకుపోయిన సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ప్రతి సంవత్సరం యూజీ అడ్మిషన్ల సమయంలో బీఏఎంఎస్ సీట్ల భర్తీపై అయోమయం నెలకొంటుంది. సరిపడా సిబ్బంది, సౌకర్యాలు లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. కళాశాలలోని సీట్లు పూర్తిస్థాయిలో భర్తీకి నోచుకోవడం గగనమవుతోంది. తాజాగా 2026–2027 విద్యాసంవత్సరానికి యూజీ అడ్మిషన్ల కోసం నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టం ఆఫ్ మెడిసిన్ (ఎన్సీఐఎస్ఎం) బృందం సభ్యులు రెండు రోజులు తనిఖీలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్లోని బనారస్ యూనివర్సిటీ నుంచి వచ్చిన ప్రొఫెసర్లు అంజనా సక్సేనా, లక్ష్మీప్రసాద్ అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, ఆయుర్వేద వైద్యకళాశాలలో తనిఖీలు చేశారు. కళాశాలలోని 50 సీట్లతోపాటు 13 ఈడబ్ల్యూఎస్ సీట్లు కలిపి మొత్తం 63 సీట్లకు సరిపడా ఫ్యాకల్టీ, టీచింగ్, నాన్టీచింగ్ స్టాఫ్, ఇతర సౌకర్యాలు తెలుసుకున్నారు. టీచింగ్, టీచింగ్ డైరీ మెయింటెనెన్స్, స్టూడెంట్ అటెండెన్స్ ల్యాండ్, ల్యాబ్, లైబ్రరీ, పలు మొక్కల గార్డెన్, పరికరాలు పరిశీలించారు. సమయానికి టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, విద్యార్థులు వస్తున్నారా అని బయోమెట్రిక్ అటెండెన్స్, ఐరిస్ ద్వారా తెలుసుకున్నారు. తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడారు. బయోమెడికల్ వేస్టేజ్ నిర్వహణ, అంబులెన్స్, నర్సింగ్ స్టాఫ్ వివరాలపై ఆరా తీశారు. అలాగే, విద్యార్థులకు సంబంధించిన రెండు హాస్టళ్లను తనిఖీ చేశారు. కళాశాల అనుబంధ ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలను కూడా సందర్శించారు. ఇందులో కూడా టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, ఓపీ, ఐపీ వివరాలను నమోదు చేసుకున్నారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, డైట్, మందులు, వివిధ రకాల చికిత్స గురించి తెలుసుకున్నారు. వంద పడకల ఆస్పత్రి స్థాయికి ఎలాంటి సౌకర్యాలు కల్పించారో తెలుసుకుని వివరాలను ఆన్లైన్ ద్వారా ఢిల్లీలోని స్పెషల్ అబ్జర్వర్కు అందజేశారు. హెడ్ ఆఫీస్ లింక్ ద్వారా ఆన్లైన్న్లో క్షుణ్ణంగా చూపించి రికార్డు చేయించారు. ఎన్సీఐఎస్ఎం నిబంధనలకు అనుకూలంగా.. ఎన్సీఐఎస్ఎం నిబంధనల ప్రకారం కళాశాలలో కొన్ని అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. బోధనపరంగా హయ్యర్, లోయర్లో 12 మంది టీచింగ్ ఫ్యాకల్టీ లేనట్లు తెలుస్తోంది. నాలుగు విభాగాల్లో అసలే ప్రొఫెసర్లు లేకపోవడంతో 12 సీట్లు కోల్పోయే అవకాశం ఉంది. హై ఫ్యాకల్టీ పరంగా మరో మూడు సీట్లు గల్లంతయ్యే అవకాశం ఉంది. నాన్టీచింగ్ పరంగా 71 మందికి 28 మంది, 87 మంది సిబ్బందికి 47 మంది, 23 మంది నర్సింగ్ సిబ్బంది అవసరం ఉండగా ఏడుగురు మాత్రమే ఉన్నట్లు సమాచారం. కళాశాలకు ప్రత్యేకంగా పరీక్ష హాల్, డిజిటల్ టైబ్రరీ, అంబులెన్స్ సదుపాయం లేదు. పదేళ్లుగా లైబ్రేరియన్ పోస్టు భర్తీ కావడం లేదు. దీంతో బీఏఎంస్ సీట్లు పదిలంగా ఉంటాయా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. గతేడాది పరిస్థితి రాకూడదు.. గతేడాది కూడా ఈ పరిస్థితులు ఉండటంతో 14 సీట్లు కోల్పోవాల్సి వచ్చింది. కళాశాల, వైద్యశాలలో ఉన్న లోపాలను సరిదిద్దుతామని ఎన్సీఐఎస్ఎం అధికారులకు హామీ ఇవ్వడం, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లేఖ రాయడంతో యథావిధిగా సీట్లకు అనుమతించారు. ఇలాంటి లోపాలు ఈ విద్యా సంవత్సరంలో కూడా పునరావృతం కావడంతో మళ్లీ ఆయుర్వేద సీట్లు గల్లంతయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. హైదరాబాద్ తర్వాత ఉన్న ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ఉనికిని కాపాడాలని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే విద్యార్థులు నీట్ పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. గతేడాది 14 సీట్లు రద్దు.. తిరిగి సాధించుకున్న అధికారులు ఈ విద్యాసంవత్సరంలో కూడా కొన్ని గల్లంతయ్యే అవకాశం సరిపడా సిబ్బంది, సౌకర్యాలు లేకపోవడమే కారణం తాజాగా ఎన్సీఐఎస్ఎం బృందం తనిఖీలు -
సరస్వతీఘాట్లో భారీ సెట్టింగ్
కాళేశ్వరం: కాళేశ్వరంలో ఈనెల 21నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగనున్న సరస్వతీనది అంత్యపుష్కరాలకు భారీ సెట్టింగులు వేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఘాటుపై సరస్వతీమాత విగ్రహం, ప్లాట్ఫారంపై నాలుగు దిక్కులా తోరణాలు ఏర్పాటు చేస్తున్నారు. మెట్ల కింద నుంచి ఇసుకలో నీటి వరకు వెదురు పందిర్లు సుమారుగా 900 మీటర్ల పొడవునా వేస్తున్నారు. వేసవి దృష్ట్యా అందులో నీటి తుంపర్లు నిత్యం పడేలా చల్లదనంతో కూడా నీడనిచ్చే విధంగా తయారు చేస్తున్నారు. భక్తులు స్నానాలకు వెళ్లి వచ్చే వరకు చల్లదనం అస్వాదించనున్నారు. హారతి వేదిక వద్ద ప్రముఖుల గ్యాలరీ, భక్తులకు గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు. 40 టెండ్సిటీ టెండ్లు, మాడ్రన్ లుక్తో వేస్తున్నారు. పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు ఏర్పాటు చేస్తున్నారు. ఖాదీవస్త్రాలు, చేనేత వస్త్రాలు విక్రయించడానికి స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. -
హేమాచలక్షేత్రంలో కోలాహలం
మంగపేట: మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఈనెల 6వ తేదీతో ముగిసినప్పటికీ భక్తులు భారీగా తరలివస్తున్నారు. స్వయంభు స్వామివారిని దర్శించుకునేందుకు తరలి వచ్చిన భక్తులతో ఆలయం కోలాహలంగా మారింది. ఆదివారం సెలవు రోజు కావడం, బ్రహ్మోత్సవాలకు రాలేకపోయిన భక్తులతో పాటు ఆలయ ప్రాంగణంలో జరిగిన వివాహాలకు తరలివచ్చిన వారితో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయంలో సందడి నెలకొంది. ఆంజనేయస్వామి మాలధారుల మండలం, అర్ధ మండలం దీక్ష చేపట్టిన భక్తుల దీక్ష ముగియడంతో స్వామివారికి ఇరుముడి ఇచ్చి దీక్ష విరమించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయానికి వెళ్లే భక్తులు మార్గమధ్యంలోని లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని వెళ్తున్నారు. అదే విధంగా తిరుగు ప్రయాణంలో సైతం భక్తులు ఆలయానికి స్వామివారిని దర్శించుకునేందుకు రావడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయ ప్రాంగణం భక్తజనంతో నిండిపోయింది. -
ప్రపంచ యవనికపై వరంగల్ ‘5ఎఫ్’
● పత్తి ఉత్పత్తి నుంచి అంతర్జాతీయ ఎగుమతులు ఒకే వేదికపై.. ● కేఎంటీపీకి పీఎం మిత్ర కింద రూ.200 కోట్లు, సీఐఎస్ కింద రూ.300 కోట్లు ● వర్చువల్గా హైదరాబాద్ నుంచి ప్రారంభించిన పీఎం నరేంద్రమోదీసాక్షి, వరంగల్/గీసుకొండ: కేంద్రం ఆలోచనలకు అనుగుణంగా 5ఎఫ్ (ఫామ్ టు ఫైబర్.. టు ఫ్యాక్టరీ.. టు ఫ్యాషన్...టు ఫారిన్) దృక్కోణంతో ఓరుగల్లు ఖ్యాతి ప్రపంచానికి తెలిసేలా మరో అడుగు ముందుకు పడింది. పత్తి ఉత్పత్తి నుంచి అంతర్జాతీయ ఎగుమతుల దాకా ఒకే వేదికపై పూర్తి విలువ వ్యవస్థను కల్పించేలా దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్తో పాటు తెలంగాణ నుంచి వరంగల్లోకి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును పీఎం మిత్ర (ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపెరల్ పార్కు) పథకం కింద 2023లో ఎంపిక చేశారు. ఈ మేరకు రూ.200 కోట్లతో కూడిన అభివృద్ధి పనులను ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ వేదికగా ఆదివారం వర్చువల్గా ప్రారంభించారు. ఇప్పటికే విడుదల చేసిన రూ.30 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టగా, మరో రూ.170 కోట్ల దఫాల వారీగా కేంద్రం రాష్ట్రానికి అందివ్వనుంది. ‘కాంపిటిటివ్ ఇన్సెంటివ్ సపోర్ట్’ కింద రూ.300 కోట్ల వరకు ప్రోత్సాహక మద్దతు ఇవ్వనుండడంతో దేశ, విదేశీ కంపెనీలు ఇక్కడికి క్యూ కట్టే అవకాశం ఉంది. గీసుకొండ, సంగెం మండలాల్లోని శాయంపేట హవేలీలో మొత్తం 1,327 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ పార్కులో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. శూన్య ద్రవ వ్యర్థ సాంకేతికతతో నిర్మించిన సార్వత్రిక ద్రవ వ్యర్థాల శుద్ధి ప్లాంటు (సీఈటీపీ)కు సుస్థిర అభివృద్ధిని అందించనుంది. ఇప్పటివరకు ఈ పార్కులో 548 ఎకరాల్లో పరిశ్రమలు వస్తే పీఎం మిత్ర కింద కేఎంటీపీ ఎంపికై న తర్వాతనే 310 ఎకరాల్లో పరిశ్రమలు వచ్చాయని కేంద్ర జౌళి పరిశ్రమ మంత్రిత్వ విభాగాధికారులు అంటున్నారు. ఇందులో భాగంగానే ‘ఎవర్టాప్ టెక్స్టైల్ అండ్ అపెరెల్ కాంప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్’ వంటి సంస్థలు భారీ పెట్టుబడులతో ముందుకు రావడం దీనికి నిదర్శనమని చెబుతున్నారు. -
మేడారంలో భక్తుల సందడి
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం వేల సంఖ్యలో తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చారు. జంపన్నవాగు స్నానఘట్టాల వద్ద షెవర్ కింద స్నానాలు ఆచరించారు. అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, కానుకలు, ఎత్తు బంగారం, ఒడిబియ్యం, పూలు, పండ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజులకు పూజలు చేశారు. మొక్కుల అనంతరం మేడారం పరిసరాల్లో చెట్ల కింద విడిది చేసి వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు. దేవాదాయశాఖ జూనియర్ అసిస్టెంట్లు జగదీశ్వర్, మధు, రామదేవి సేవలందించారు. -
అన్నదాతల్లో ఆందోళన
భూపాలపల్లి: ఆకాశంలో మబ్బులు ఉరుములు అన్నదాతలకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చి, కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో విక్రయానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో అకాల వర్షాలు కురిస్తే పంటంతా నీటి పాలవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆశించిన స్థాయిలో దిగుబడి ఈ ఏడాది యాసంగిలో మొక్కజొన్న, వరిపంట ఆశించిన స్థాయిలో దిగుబడి వచ్చింది. జిల్లాలోని 12 మండలాల్లో 29వేలకు పైగా ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేయగా, 39,500 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందని అంచనా. 12 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తున్నారు. వరి 95,590 ఎకరాల్లో సాగు చేయగా, సుమారు 1.60 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి వచ్చింది. జిల్లావ్యాప్తంగా 185 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావించి ఇప్పటి వరకు 165 కేంద్రాలను ప్రారంభించారు. జిల్లాకు వర్ష సూచనలు రైతులు పండించిన ధాన్యం ఇప్పటికే కొనుగోలు కేంద్రాలకు తరలించగా, మొక్కజొన్న సగానికి పైగా కేంద్రాలకు వచ్చింది. సుమారు 15వేల ఎకరాల మొక్కజొన్న పంట ఇంకా కల్లాల్లోనే ఉంది. కంకి ఇరవడం, యంత్రాలతో కంకి పట్టించడం తదితర పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే జిల్లాకు వర్ష సూచనలు ఉన్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నెల 6వ తేదీ బుధవారం రోజున భూపాలపల్లి, మల్హర్, మహదేవపూర్, మహాముత్తారం మండలాల్లో మోస్తారు వర్షం కురిసి కొనుగోలు కేంద్రాల్లోని వడ్లు తడిశాయి. కొత్తపల్లిగోరి మండలంలో చిరు జల్లులు కురవగా పంట నష్టం ఏమీ జరగలేదు. దీంతో అక్కడి రైతులు ఊపిరి పీల్చుకున్నారు. రెండు రోజులుగా సాయంత్రం వేళల్లో మబ్బులు ఉరుముతూ వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట చేతికొచ్చాక, అకాల వర్షం పడితే పంట తీవ్రంగా దెబ్బతింటుందని, కొనేవారే కరువవుతారని ఆవేదన చెందుతున్నారు. రైతులు ప్రతీరోజు రాత్రి కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లి ధాన్యంపై పరదాలు కప్పి, తెల్లవారుజామున తొలగిస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండటం మూలంగానే ఈ పరిస్థితి ఎదురవుతుందని రైతులు వాపోతున్నారు. మబ్బులను చూస్తే భయమేస్తోంది.. నాకున్న 8 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేసిన. వచ్చిన ధాన్యం మొత్తాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన. వారం రోజులైతాంది. ఇంకా కాంటా పెట్టలేదు. మబ్బులను చూస్తే భయమైతాంది. వర్షం కురిస్తే మాత్రం ధాన్యం మొత్తం దెబ్బతింటది. ప్రతీరోజు రాత్రి ధాన్యం మీద పరదాలు కప్పి పొద్దన తీసేస్తాన. వర్షం బాగా వస్తే పరదాలు కూడా పని చేయవు. జొన్నలు మొత్తం తడిసి ముద్దయితవి. – నీరటి నారాయణ, రైతు, చిట్యాల ఉరుముతున్న మబ్బులు, చిరు జల్లులు కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లోనే మొక్కజొన్న, ధాన్యం మోస్త్తరు వానలు ఉన్నాయంటున్న వాతావరణ శాఖ కురిస్తే మొక్కజొన్న, ధాన్యం నీటిపాలే..వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు.. ఓవైపు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు నత్తనడకన సాగడం, మరోవైపు ప్రతీరోజు వర్ష సూచనలు కనిపిస్తుండటంతో పంట నీటి పాలు కాకూడదనే ఉద్దేశంతో కొందరు రైతులు పరకాల, వరంగల్ పట్టణాలకు ధాన్యాన్ని తరలించి ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఇదే అదనుగా భా వించిన వ్యాపారులు మొక్కజొన్నను క్వింటాలుకు రూ.1,900కు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం చెల్లిస్తున్న ధరతో పోలిస్తే రైతులు ఒక క్వింటాకు రూ. 500 చొప్పున నష్టపోవాల్సి వస్తుంది. -
డాక్టర్ శ్రీలతకు ఉత్తమ మహిళా సైకాలజిస్ట్ అవార్డు
కాళోజీ సెంటర్: తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీలత అందేకు ప్రతిష్టాత్మకమైన ఉత్తమ మహిళా సైకాలజిస్ట్ అవార్డును అందుకున్నారు. టీపీఏ ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఆదివారం హైదరాబాద్లో జరిగి కార్యక్రమంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా ఈ అవార్డును స్వీకరించారు. డాక్టర్ శ్రీలత మనోవిజ్ఞాన శాస్త్ర రంగంలో అందించిన సేవలకు గుర్తింపుగా అవార్డు లభించగా టీపీఏ రాష్ట్ర అధ్యక్షుడు మోత్కూరి రామచందర్ ప్రత్యేక అతిథిగా పాల్గొని అభినందించారు. -
విభజన హామీలు నెరవేర్చాలి
భూపాలపల్లి అర్బన్: తెలంగాణ రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హమీలను అమలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా జిల్లాలో అరెస్టు చేసిన సీపీఐ(ఎం) పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాల నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం ఏర్పడి పన్నెండేళ్లు గడుస్తున్నా అభివృద్ధి, ఉపాధి, సాగునీరు, పరిశ్రమలు, విద్య, సామాజిక న్యాయం వంటి రంగాల్లో తెలంగాణ ప్రజల ఆశలు నెరవేరలేదన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని, కులగణన చేపట్టకపోవడం బీసీల పట్ల వివక్షకు నిదర్శనమన్నారు. నిందితులను అరెస్ట్ చేయాలి భూపాలపల్లి అర్బన్: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడికి సంబంధించి వెలుగులోకి వచ్చిన మైనర్ బాలికపై అత్యాచార కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా గర్ల్స్ కన్వీనర్ అంబాల స్వర్ణలత ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహిళలు, బాలికల భద్రతను కాపాడాల్సిన పరిస్థితిలో ఇలాంటి ఘటనలు సమాజాన్ని కలవరపెడుతున్నాయని అన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం, పోలీసు శాఖ వెంటనే స్పందించి పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయాలని డిమాండ్ చేశారు. నిందితులు ఎవరైనా చట్టం ముందు సమానమేనని, రాజకీయ హోదాలు లేదా ప్రభావంతో కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేయకూడదన్నారు. జ్యోతిర్లింగ దర్శనం కోసం.. కాళేశ్వరం: దేశంలోని జ్యోతిర్లింగ దర్శనం కోసం ఇద్దరు యువకులు సంవత్సర కాలంగా స్కేటింగ్తో ప్రయాణిస్తున్నారు. ఆ ప్రయాణం 20 వేల కిలోమీటర్లు కాగా ఇప్పటికి 7వేల కిలోమీటర్లు పూర్తి చేసినట్లు ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం గోరఖ్పూర్కు చెందిన మనీష్, శంబూసింగ్ తెలిపారు. దేశంలోని పలు పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం గొప్పగా ఉందని పేర్కొన్నారు. వేసవికాలంలో ఉదయం, సాయంత్రం వేళల్లో ఎక్కువగా ప్రయాణిస్తున్నామని తెలిపారు. వారి యాత్ర ఆదివారం కాళేశ్వరం చేరింది. కాళేశ్వరం క్షేత్రం గురించి తెలుసుకొని యాత్ర చేస్తున్నట్లు వివరించారు. స్వామిని దర్శించుకొని వెళుతామన్నారు. రోడ్డుపై స్కేటింగ్తో వస్తుంటే జనం ఆసక్తిగా తిలకించారు. అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలి చిట్యాల: చిట్యాల మండల కేంద్రంలో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఉన్న అగ్నిమాపక కేంద్రం చిట్యాల, టేకుమట్ల , మొగుళ్లపల్లి మండలాలకు సుమారు 35 కిలోమీటర్లు ఉందని.. దీంతో అగ్రిమాపక శకటం వచ్చే సరికి భారీ నష్టం జరుగుతుందని అన్నారు. చిట్యాల మండల కేంద్రంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేస్తే ప్రమాదాలను అరికట్టవచ్చన్నారు. సమాచారం కోసం సంప్రదించాలి కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈనెల 21 నుంచి జూన్ 1వరకు జరుగు సరస్వతీ నది అంత్య పుష్కరాలకు సంబంధించిన సమాచారం కోసం కాళేశ్వరం దేవస్థానంలో సంప్రదించాలని ఈఓ మహేష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వసతి సౌకర్యం కోసం 94910 18012, ఆర్జిత సేవలకు 94910 17012, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 94910 15252 నంబర్లలో సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు. ప్రతీ రోజు జరిగే హోమంలో పాల్గొనే భక్తులు రూ.2వేలు ఒక రోజుకు దంపతులకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. దేవస్థానం నుంచి పూజాసామగ్రి అందజేస్తున్నట్లు తెలిపారు. భక్తులు గమనించాలని ఆయన తెలిపారు. నేటినుంచి ఎడ్యుకేషన్ వీక్ కాళేశ్వరం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా హైదరాబాద్ ఉన్నత విద్యాశాఖ ఆదేశాల మేరకు వారం రోజుల పాటు విద్య వారోత్సవాలను మే 11 నుంచి 17వ తేదీ వరకు ఎడ్యుకేషన్ వీక్లో మహదేవపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు ప్రినిపాల్ జున్ను విజయ్కుమార్ ఆదివారం తెలిపారు. కళాశాల హాజరు శాతం పెంచడం, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కార్యక్రమం, సృజనాత్మక స్కిల్స్ పెంచడం, కళాశాల కోసం ఫండ్స్ సమకూర్చడం, అభివృద్ధి, వివిధ రకాల సదుపాయం కోసం నిర్వహణ జరుగుతుంది. (నేడు) సోమవారం కళాశాలలో ఉదయం 11 గంటలకు ప్రారంభోత్సవం జరుగుతుందని తెలిపారు. -
గడువులోగా పూర్తయ్యేనా!
● 21నుంచి సరస్వతీనది అంత్య పుష్కరాలు ● పనుల్లో నాణ్యత లోపిస్తుందని విమర్శలుకాళేశ్వరం: కాళేశ్వరంలో ఈనెల 21న సరస్వతీనది అంత్య పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. కాళేశ్వరంలో పురాతన విగ్రహాలు అమర్చడానికి రూ.1.20కోట్ల వ్యయంతో మ్యూజియం పనులు వేగిరంగా జరుగుతున్నాయి. ఈనెల 18 వరకు పూర్తి చేయాలని అఽధికారులు ఆదేశించారు. దీంతో వేగిరంగా పనులు చేస్తూ.. నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రూ.30లక్షల వ్యయంతో నాగదేవాలయం నిర్మాణం కూడా అదే స్థాయిలో జరుగుతుంది. ఈ రెండు పనులపై రిటైర్డు డీఈ, ఏఈఈలు పర్యవేక్షణకు ఉన్నప్పటికీ గడువులోగా పూర్తయ్యేలా లేదు. క్యూరింగ్ కూడా సరిగ్గా జరుగడం లేదు. రూ.2కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రోడ్డు పనులు కూడా నెమ్మదిగా ఉన్నాయి. క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు పరీక్షలు జరుపాలని భక్తులు కోరుతున్నారు. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో చూడకపోవడంతో నాణ్యత లోపిస్తుందనే విమర్శలు వస్తున్నాయి. పొలం గట్లు పొట్టు పొట్టు! పార్కింగ్ స్థలాల కోసం అధికారులు రైతుల పంట భూములను చదును చేయడం వివాదాస్పదమైంది. పడిదం చెరువు కింది ఆయకట్ట రైతుల సమాచారం ప్రకారం.. ముందస్తు సమాచారం లేకుండా డోజర్లతో గట్లు దున్ని భూములను చదును చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి పొలం గట్టు ఎక్కడ ఉందో కూడా గుర్తుపట్టలేని పరిస్థితి ఏర్పడిందని రైతులు చెబుతున్నారు. భూములు దెబ్బతిన్న రైతులు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదుకు సిద్ధమయ్యారు. నష్టపరిహారంగా ఎకరానికి రూ.20 వేల చొప్పున చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. -
నేడు మాతృదినోత్సవం
సాక్షి, మహబూబాబాద్: మాది ఉమ్మడి కుటుంబం. అమ్మాన్నాన్న లక్ష్మీ, నరసింహం. నాన్న వ్యవసాయం చేసేవారు. ఇంట్లో నేనే పెద్ద కొడుకును. చిన్నప్పటి నుంచి బాగా చదివి ఉద్యోగం సాధించాలని అమ్మ చెబుతుండేది. అమ్మ చెప్పినట్లుగానే ఉద్యోగం సంపాదించా. నన్ను చూసి మా అన్నదమ్ములు, అక్కా చెళ్లెళ్లు అందరూ బాగా చదివి మంచి పొజీషన్లో ఉన్నారు. నాన్న చనిపోయి పదేళ్లు దాటింది. అప్పటి నుంచి అమ్మ మాతోనే ఉంటోంది. ఇప్పటికీ అమ్మతో మంచీ చెడు అన్నీ పంచుకుంటాం. అమ్మ నింపిన ధైర్యమే నా ఉద్యోగం. – ఎన్.తిరుపతిరావు, డీఎస్పీ, మహబూబాబాద్ -
అనాథలకు అమ్మ
జఫర్గఢ్: వందలాది మంది అనాథ పిల్లలతో అమ్మ అని ఆప్యాయంగా పిలుపించుకుంటున్నారు ‘మా ఇల్లు ఆశ్రమ నిర్వాహకులు గాదె పుష్పరాణి. మండలంలోని రేగడితండా గ్రామ శివారు టీబీతండా వద్ద గాదె ఇన్నయ్య 20 ఏళ్ల క్రితం ‘మా ఇల్లు’ ప్రజాదరణ అనాథ ఆశ్రమాన్ని స్థాపించారు. 32 మంది పిల్లలతో ప్రారంభించిన ఈ ఆశ్రమంలో ఇప్పటి వరకు వందకు పైగా అనాథ పిల్లలు ఆశ్రయం పొందుతున్నారు. ఆశ్రమంలోని ఆడపిల్లల విషయంలో ఆమె ప్రత్యేక శ్రద్ధవహిస్తూ తల్లిదండ్రులు లేని లోటు తీరుస్తున్నారు. ఆశ్రమానికి చెందిన ముగ్గురు ఆడపిల్లలకు సొంత ఖర్చులతో వివాహాలు జరిపించారు. పుష్పరాణి కృషి ఫలితంగా ఆశ్రమానికి చెందిన పిల్లలు లాయర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, నర్సులు, ఉపాధ్యాయులు, కానిస్టేబుల్గా ఉద్యోగాలు సాధించారు. ఈ సందర్భంగా గాదె పుష్పరాణి మాట్లాడుతూ.. ఎంతో మంది అనాథ పిల్లలకు అమ్మలా సేవ చేయడం, వారితో అమ్మ అని పిలిపించుకోవడం తనకు ఎంతో సంతోషాన్నిస్తోందన్నారు. -
ఉచిత బాల్ బాడ్మింటన్ శిక్షణ
చిట్యాల: మండలంలోని నైన్పాక గ్రామంలో ఉచిత (సమ్మర్ క్యాంప్) బాల్ బ్యాడ్మింటన్ శిక్షణను ఏర్పాటు చేసినట్లు బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గూట్ల తిరుపతి, బాల్ బ్యాడ్మింటన్ కోచ్ ఉడుత మోహన్ శనివారం తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు క్రీడలు ఎంతో అవసరం అని అన్నారు. ప్రతీ రోజు ఉదయం 6 గంటల నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 6.30 గంటల వరకు శిక్షణ ఉంటుందని అన్నారు. ఈ శిక్షణలో రన్నింగ్, వ్యాయాయంతో పాటు క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చెరువులో చేపల మృత్యువాతచిట్యాల: చైన్పాక గ్రామ శివారులోని పెద్దమ్మకుంట చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు విషం కలపడంతో 1.50 క్వింటాళ్ల చేపలు మృత్యువాత పడ్డాయి. ముదిరాజ్ సొసైటీ అధ్యక్షుడు బండి నర్సయ్య కథనం ప్రకారం.. చెరువులో చేపలు మృతి చెంది పైకి తేలడంతో గ్రామస్తులు ముదిరాజ్ సంఘం నాయకులకు సమాచారం అందించారని పేర్కొన్నారు. దీంతో శుక్రవారం ఉదయం గ్రామస్తులు, ముదిరాజ్ సంఘం నాయకులు వెళ్లి పరిశీలించారు. కాగా, అదే ప్రాంతంలో పురుగుల మందు వాసన రావడంతో గమనించిన ముదిరాజ్ నాయకులు శనివారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. చెరువులో విషం కలిపిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని నర్సయ్య కోరారు. సభను విజయవంతం చేయండి ములుగు రూరల్: నేడు (ఆదివారం) సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ ములుగు అర్బన్ అధ్యక్షుడు ఇమ్మడి రాకేష్ యాదవ్ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాటాడుతూ మోదీ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు వాసుదేవరెడ్డి, రాకేష్, ప్రమోద్రెడ్డి, రవీందర్, ప్రవీణ్, కోటేశ్వర్ పాల్గొన్నారు.13న పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ములుగు రూరల్: ఈ నెల 13న పాలిసెట్ ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు పాలిసెట్ జిల్లా కోఆర్డినేటర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కొప్పుల మల్లేశం శనివారం తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ములుగు, జాకారం బాలుర సోషల్ వెల్పేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీతో కలిపి రెండు సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రెండు సెంటర్లలో 675 మంది విద్యార్థులను కేటాయించినట్లు తెలిపారు. 13వ తేదీ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు. విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. నిమిషం ఆలస్యం అయినా అనుమతించేది లేదని తెలిపారు. విద్యార్థులు ఇటీవల డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్తో రావాలని.. వారి వెంట హెచ్బీ పెన్సిల్, బాల్ పాయింట్ పెన్, ఎరేజర్, షార్ప్నర్లు తీసుకురావాలని తెలిపారు. వాహనం ఢీకొని గేదెలు మృతివెంకటాపురం(కె): గుర్తుతెలియని వాహనం ఢీకొని ఐదు గేదెలు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని పాత్రాపరం గామ శివారులో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్లోగూడెం గ్రామానికి చెందిన రాంబాబు తన గేదెలను శుక్రవారం ఉదయం పాలెం వాగు సమీపంలోకి మేతకు తీసుకెళ్లాడు. రాత్రి గేదెలు ఇంటికి రాలేదు. శనివారం ఉదయం గేదెల కోసం వెతుకుతుండగా పాత్రాపురం పాలెం వాగు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెంది కనిపించాయి. పాత్రాపురం సర్పంచ్ బొగ్గుల పుష్పవతి సంఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. -
ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు సహకరించాలి
చిట్యాల: రైతుల పండించిన ధాన్యాన్ని మిల్లు యజమానులు గోదాములలో నిల్వ చేసుకునేందుకు సహకరించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కోరారు. శనివారం మండలకేంద్రంలోని బాలమురగన్ కాటన్ మిల్లు వద్ద ట్రాక్టర్లలో మొక్కజొన్న ధ్యాన్యంతో వేచి ఉన్న రైతులను గమనించి వారి వద్దకు వెళ్లి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మిల్లును సందర్శించి యజమానితో మాట్లాడారు. రైతులు పండించిన ధాన్యాన్ని మిల్లులో నిల్వలు చేసుకోవాలని కోరారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి, మండల నాయకులు, రైతులు ఉన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
ఇంటర్ ప్రవేశాలపై సందిగ్ధత
భూపాలపల్లి అర్బన్: ఇంటర్ ప్రవేశాల షెడ్యూల్ జారీ చేసిన మరుసటి రోజునే ఆ ఉత్తర్వులను నిలుపుదల చేయడం ప్రభుత్వ కళాశాలల అధ్యాపకులను కలవరపెడుతోంది. ఇప్పటికే ప్రైవేట్ కళాశాలలు, కార్పొరేట్ విద్యాసంస్థలు జోరుగా ప్రచారం పెంచి ప్రవేశాలు చేస్తుండగా.. ప్రభుత్వ కళాశాలలు మూసి ఉండటంతో పేద విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ నెల 8వ తేదీ నుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభించే అవకాశాలు ఉన్నా ఇప్పటి వరకు ఆదేశాలు జారీ కాలేదు. జిల్లాలో 34 కళాశాలలు.. జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఐదు, కస్తూర్బా బాలికల విద్యాలయాలు 10, ఆదర్శ పాఠశాలలు ఆరు, ఇతర కళాశాలలు 13 ఇంటర్ విద్యను అందిస్తున్నాయి. ఇటీవల పదోతరగతి ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో 3,483 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇందులో సగానికి పైగా విద్యార్థులు జెడ్పీఎస్ఎస్, కేజీబీవీ, ఆదర్శ పాఠశాల్లో చదివిన వారే కావడం గమనార్హం. విద్యార్థులు తమ ఆర్థిక స్థోమత దృష్ట్యా ప్రభుత్వ కళాశాలల్లో చేరేందుకు మొగ్గుచూపుతారు. తల్లిదండ్రుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు తక్కువ ఫీజుకే ప్రవేశం కల్పిస్తామని ఆ తర్వాత అదనపు రుసుములను వసూలు చేయడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియను నిలిపివేయడం పేద విద్యార్థులకు నష్టం చేకూర్చేలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 4న ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల కాగా.. పలు కళాశాలల అధ్యాపకులు ఉత్సాహంగా మరుసటి రోజున ప్రచారబాట పట్టాయి. అదే రోజు సాయంత్రం ఆ షెడ్యూల్ను రద్దు చేస్తున్నట్లు ఇంటర్బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ ఉత్తర్వులు జారీచేశారు. జూన్ ఒకటో తేదీ నుంచి కళాశాలలను పునఃప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించగా.. ప్రైవేట్ సంస్థలు ప్రచార జోరు పెంచడం ప్రభుత్వ కళాశాలల అధ్యాపకులను అయోమయానికి గురిచేస్తోంది. పాఠశాలలో విలీనం..? రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం నుంచి నూతన జాతీయ విద్యా విధానం అమలు చేయాలని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఇంటర్ విద్యను విలీనం చేయడానికి సిద్ధం చేసినట్లు సమాచారం. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు నూతనంగా ఏర్పాటు చేయనున్న తెలంగాణ పబ్లిక్ స్కూళ్లలో తరగతులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ పాఠశాలల్లో సౌకర్యాలు, సామర్ాధ్యలను గుర్తించి టెన్ ప్లస్ టూ విధానం అమలు చేసేలా విద్యా కమిషన్ భావిస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగా ఇంటర్ ప్రవేశాల ప్రక్రియను నిలిపివేసినట్లు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చర్చ జరుగుతోంది. పాత వర్సెస్ కొత్త విధానం ఈసారి ఆన్లైన్ విధానంలో ఇంటర్మీడియట్లో ప్రవేశాలు ఉంటాయా? లేదా పాత పద్ధతిలోనేనా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇంటర్ విద్యను పాఠశాల వ్యవస్థలో విలీనం చేయడాన్ని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం వ్యతిరేకిస్తోంది, దీనివల్ల ఐఐటీ, నీట్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. జూనియర్ కళాశాలలు 34ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 5మోడల్ జూనియర్ కళాశాలలు 6ప్రైవేట్ జూనియర్ కళాశాలలు 4ట్రైబుల్ వెల్ఫేర్ కళాశాలలు 2కేజీబీవీ కళాశాలలు 10సోషల్ వెల్ఫేర్ 2మైనారిటీ 1బీసీ వెల్ఫేర్ 4 పాఠశాల విద్యలో బోర్డు విలీనం 12వ తరగతి వరకు పాఠశాల విద్య ప్రభుత్వ కళాశాలల్లో అయోమయం -
నేటితో స్వీయ జనగణన ముగింపు
● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి: స్వీయ జనగణన నేటితో ముగుస్తుందని, ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా తమ వివరాలను నమోదు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. 2027 జనగణనలో భాగంగా ఆన్లైన్ ద్వారా స్వీయ గణన చేసుకునేందుకు నేటివరకు మాత్రమే అవకాశం ఉందని తెలిపారు. ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకునే ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. వెబ్సైట్ ద్వారా ఇంటి వద్ద నుంచే సులభంగా స్వీయ గణన నమోదు చేసుకోవాలన్నారు. మొబైల్ ఫోన్ ద్వారానే ఈ ప్రక్రియ పూర్తి సులభతరమని, నచ్చిన భాషను ఎంచుకొని వివరాలు నమోదు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు.. రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నామని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. ధాన్యం కొనుగోలు, ఫార్మర్ రిజిస్ట్రీ, సెన్సస్, విద్యా వారోత్సవాలపై శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్ని జిల్లాల కలెక్టర్లు, పౌర సరఫరాలు, విద్యా, డీఆర్డీఓ తదితర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. ఈ కాన్ఫరెన్స్కు భూపాలపల్లి ఐడీఓసీ నుంచి కలెక్టర్తో పాటు డీసీఎస్ఓ కిరణ్కుమార్, డీఎం రాములు, డీఈఓ రాజేందర్ పాల్గొన్నారు. -
భర్త లేకపోయినా.. బాధ్యత నెరవేర్చింది
బచ్చన్నపేట: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం లింగంపల్లికి చెందిన గూడ లావణ్య – కీ.శే. భూపాల్రెడ్డి దంపతులకు ఇద్దరు సంతానం. కూతురు అపూర్వ, కుమారుడు అశ్విష్రెడ్డి. కూతురు బీటెక్ మూడో సంవత్సరం చదువుతుండగా, లావణ్య భర్త భూపాల్రెడ్డి ప్రమాదవశాత్తు కరెంట్ షాక్తో మృతి చెందాడు. అయినప్పటికీ, తల్లి లావణ్య మనోస్థైర్యంతో తన పిల్ల లను చదివించింది. అపూర్వ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ కష్టపడి చదివి ఎస్సై ఉద్యోగానికి ఎంపికై ంది. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా చేర్యాల పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓగా పని చేస్తోంది. కష్టాలు, కన్నీళ్లు ఎన్ని ఎదురైనా మనోధైర్యం, గుండె నిబ్బరం వీడకుండా ముందుకు సాగాలని, తన తల్లే తనకు ఆదర్శమని ఎస్సై అపూర్వరెడ్డి చెబుతున్నారు. -
12 రోజులు ఆధ్మాత్మిక శోభ
కాళేశ్వరం: ఈనెల 21నుంచి జూన్ 1వ తేదీ వరకు కాళేశ్వరం ఆధ్యాత్మిక శోభతో మారుమోగనుంది. గతేడాది జరిగిన సరస్వతీనది ఆది పుష్కరాల మాదిరిగానే 12రోజుల పాటు అంత్య పుష్కరాలకు రోజుకొక్కరు చొప్పున పలువురు పీఠాధిపతులు రానున్నారు. పలువురు ప్రవచన కర్తలు తమ సందేశాన్ని భక్తులకు వినిపించనున్నారు. ప్రతీ రోజు తిఽథుల ప్రకారం హోమాలు నిర్వహిస్తారని ఆలయవర్గాలు తెలిపాయి. ప్రతీ రోజు కాశీపండితులతో గోదావరి హారతి, అనంతరం తెప్పోత్సవం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల్లో ప్రతీ రోజు ప్రముఖులు పాల్గొంటారు. పీఠాధిపతులు వీరే.. సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా ప్రతీ రోజు పీఠాధిపతులు పుష్కర స్నానం చేసి శ్రీకాళేశ్వరముక్తీశ్వరుడిని దర్శించుకుంటారు. కంచి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామిగల్, నాసిక్ పీఠాధిపతి మహామండలేశ్వర ఆచార్య సంవిదానంద సరస్వతి మహారాజ్, శంకరాచార్య మహాసంస్థానం శ్రీ అద్వైతానంద భారతి, శ్రీ శ్రీ అవని శృంగేరి జగద్గురువులు రానున్నారు. ఆదిలాబాద్ పీఠం శ్రీ యోగానంద సరస్వతి స్వామీజీ,హంపీ పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతి మహాస్వామి, శ్రీ దత్త గిరి మహారాజ్ ఆశ్రమం పీఠాధిపతి బర్దీపూర్ 1008 వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్ రానున్నారు. విజయనగరం, కర్ణాటకకు చెందిన చింతామణి మఠం శివానంద భారతి చింతామణి స్వామి, చింతామణి మఠం, విశాఖపట్టణం శారద పీఠం స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి, స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి, మెదక్ కోల్చారం మాధవానంద సరస్వతి రానున్నారు. ప్రవచన కర్తలు: 21 నుంచి 24 వరకు శృంగేరి శారదా పీఠ ఆస్థాన పౌరాణికులు, బాచంపల్లి సంతోష్ కుమార్ శాసీ్త్రతో పుష్కర వైభవ ప్రవచనం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు నిర్వహిస్తారు. 23న మహాసహస్రావధాని గరికపాటి నరసింహరావు గారితో ఆధ్యాత్మిక ప్రవచనం చేస్తారు. జూన్ 1న బ్రహ్మశ్రీ ద్విసహస్రావధాని మాడుగుల నాగఫణి శర్మ ఆధ్యాత్మిక ప్రవచనం చెబుతారు. ఆయా రోజుల్లో సాయత్రం 5గంటల నుంచి 6గంటల వరకు నిర్వహిస్తారు. 12 రోజులు హోమాలు ప్రపంచ శాంతి కోసం మహారుద్ర జప అభిషేక సహిత కామ్యార్థ హోమాలను ఈనెల 21 నుంచి జూన్ 1 వరకు ఆలయ ఆవరణలో నిర్వహిస్తారు. 21న మహాగణపతి హోమం, 22న సుబ్రహ్మణ్య షాఢాక్షరి హోమం (సంతానప్రాప్తి, శతృబాధ నివారణార్ధం), 23న హయగ్రీవ హోమం (సకల విద్యా ప్రాచ్యర్గం), 24న నవగ్రహ హోమం (నవగ్రహ ప్రసాద సిద్యర్థం), 25న మహామృత్యుంజయ హోమం (అనమృత్యుదోష నివారణార్థం),26న దుర్గ సూక్త హోమం (సకల ఐశ్వర్య ప్రాస్యర్ధం),27న మహా సుదర్శన హోమం (సకల దృష్టి దోష నివారణార్థం),28న మేద దక్షిణామూర్తి హోమం (మేద ధారణ సిద్యర్ధం), 29న స్వయంవర పార్వతి హోమం (శీఘ్ర వివాహ ప్రాష్యర్ధం), 30న విశాఖ దన్వంతరి హోమం (ఆయుఆరోగ్య ప్రాష్యర్ధం), 31న మహారుద్ర హోమం (అష్ట ఆశ్వర్య ప్రాష్యర్థం),జూన్1న లఘు చండీ, మహా పూర్ణాహుతి (సకల పాపక్షయార్థం) నిర్వహించనున్నారు. నదీ హారతి, తెప్పోత్సవం.. ప్రతీ రోజు సాయంత్రం 6.30 గంటల నుంచి 7.30గంటల వరకు త్రివేణి సంగమం వద్ద కాశీ పండితులతో నది హారతి కార్యక్రమం, అనంతరం తెప్పోత్సవం నిర్వహిస్తారు. ప్రతీ రోజు సాయంత్రం 7.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రసిద్ధ నృత్య కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దీంతో ఆధ్యాత్మిక శోభతో కాళేశ్వరం వెలుగులు విరజిమ్మనుంది. 21నుంచి సరస్వతీనది అంత్య పుష్కరాలు రోజుకో పీఠాధిపతి రాక రోజూ నదీహారతి, తెప్పోత్సవం నిర్వహణ -
స్వీయ జనగణనలో పాల్గొనాలి
భూపాలపల్లి: స్వీయ జనగణన కార్యక్రమంలో జిల్లా ప్రజలందరూ చురుకుగా పాల్గొనాలని కలెక్టర్ రాహుల్ శర్మ పిలుపునిచ్చారు. ఆన్లైన్ ద్వారా స్వీయ గణన చేసుకునేందుకు ఈ నెల 10వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉన్నందున, అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలు స్వీయ జనగణన వెబ్సైట్ ద్వారా ఇంటి వద్ద నుంచే మొబైల్ ఫోన్ సహాయంతో సులభంగా స్వీయ గణన పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. నచ్చిన భాషను ఎంపిక చేసుకునే అవకాశం కూడా ఉందన్నారు. గత నెల 26వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈ నెల 10తో ముగుస్తుందన్నారు. అనంతరం ఈ నెల 11వ తేదీ నుంచి ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి హౌస్ లిస్టింగ్ నిర్వహిస్తారని వివరించారు. దేశ ప్రణాళిక, భవిష్యత్ అభివృద్ధి, వనరుల సమాన పంపిణీకి జనగణన కీలకమన్నారు. అద్దె ఇళ్లలో నివసిస్తున్న వారు కూడా తమ ప్రస్తుత నివాసం నుంచే వివరాలు నమోదు చేసుకోవచ్చన్నారు. కుటుంబ వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని, అవి కేవలం జనాభా లెక్కల కోసమే వినియోగించబడతాయని స్పష్టం చేశారు. ప్రతీ కుటుంబానికి ప్రత్యేక ఎన్యుమరేషన్ ఐడీ ఇవ్వబడుతుందని, దీని ద్వారా ఎన్యుమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు ప్రక్రియ వేగంగా పూర్తవుతుందని తెలిపారు. జిల్లా ప్రజలందరూ స్వీయ జనగణనలో పాల్గొని జిల్లా, దేశ అభివృద్ధికి సహకరించాలని ఆకాంక్షించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి రేగొండ: మక్కలు, ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. మండలంలోని లింగాల రైస్మిల్, రూపిరెడ్డిపల్లిలోని సహకార సంఘం భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని తరలించడానికి లారీలను అందుబాటులో ఉంచాలన్నారు. రైస్మిల్, సహకార సంఘం భవనంలో ధాన్యాన్ని నిల్వ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, డీఎం రాములు, సహకార జిల్లా అధికారి వాలియ నాయక్, తహసీల్దార్ శ్వేత, డిప్యూటీ తహసీల్దార్ అబ్దుల్ రజాక్ పాల్గొన్నారు. ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి చిట్యాల: మండలంలోని వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యాన్ని త్వరితగతిన మిల్లులకు తరలించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులకు ఆదేశించారు. మండలంలోని దూత్పల్లిలో వరి ధ్యానం కొనుగోలు కేంద్రాన్ని, మండలకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలోని మొక్కజొన్న, వరి ధాన్యాన్ని పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ తేమశాతం వచ్చిన ధాన్యన్ని వెంటవెంటనే లారీలపైన ఆధారపడకుండా ట్రాక్టర్ల ద్వారా కూడా మిల్లులకు తరలించాలని అధికారులకు ఆదేశించారు. మొగుళ్లపల్లి: మండల కేంద్రంలోని ఆధునిక వ్యవసాయ గిడ్డంగి ని కలెక్టర్ రాహుల్శర్మ పరిశీలించి నిల్వల వివరా లు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, డీఎస్ఓ కిరణకుమార్, డీసీఓ వాల్యానాయక్, జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, మార్క్ఫెడ్ అధికారి శ్రీలత, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ -
వన్యప్రాణుల దాహం తీరేదెలా?
● అటవీలో నిరుపయోగంగా సాసర్ పిట్స్ ● వేసవిలో మూగజీవాలకు తాగునీటి కష్టాలుకన్నాయిగూడెం: మండే ఎండలకు వన్యప్రాణులు దాహంతో అల్లాడుతున్నాయి. అటవీశాఖ ఆధ్వర్యంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన నీటికుంటలు (సాసర్పిట్స్) నిరుపయోగంగా మారాయి. కేవలం పేరుకు మాత్రమే సాసర్ పిట్స్ ఏర్పాటు చేశారని, వాటిలో నీటిని నింపడంలో అధికారులు చొరప చూపడం లేదని వన్యప్రాణి ప్రేమికులు అంటున్నారు. దాహం తీర్చుకునేందుకు దూరంలో ఉన్న నీటి కుంటలు, చెరువులు, రైతు పొలాల వద్దకు వెళ్తున్నాయి. దీంతో అదను చూసి వేటగాళ్లు వన్యప్రాణులను అంతం చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఐలాపూర్, సర్వాయి అటవీ ప్రాంతంలో.. కన్నాయిగూడెం మండలం దాదాపు అటవీ ప్రాంతం కావడంతో వన్యప్రాణులు ఎక్కువగా ఉంటాయి. దీంతో అటవీశాఖ అధికారులు ఐలాపూర్, సర్వాయి, భూపతిపురం, చిట్యాల, తుపాకులగూడెం తదితర అటవీ గ్రామాల పరిధిలో సిమెంట్తో సాసర్పిట్స్ ఏర్పాటు చేశారు. వాటికి నీటి వసతి కోసం బోరు వేసి సోలార్ విద్యుత్తో మోటారు నడిచేలా ఏర్పాటు చేసి నీటి వసతి కల్పించారు. పనిచేయని సోలార్ పంపులు.. వన్యప్రాణుల దాహం తీర్చడానికి ఏర్పాటు చేసిన సాసర్పిట్స్ నీరులేక నిరుపయోగంగా మారాయి. అధికారుల నిర్లక్ష్యంతో సోలార్ విద్యుత్ పంపులు పనిచేయకపోవడంతో సాసర్పిట్స్ బీటలువారి ఎండిన ఆకులతో నీరు లేకుండా దర్శనమిస్తున్నాయి. ఇప్పటికై నా అటవీశాఖ అధికారులు, ఉన్నతాధికారులు చొరవ తీసుకుని సాసర్పిట్స్లో నీరు ఏర్పాటు చేయించాలని వన్యప్రాణి ప్రేమికులు కోరుతున్నారు. -
తాగునీటి వ్యధ
భూపాలపల్లి: వేసవి వచ్చిందంటే చాలు.. తాగునీరు, ఇతర అవసరాలకు భూపాలపల్లి పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. మిషన్ భగీరథ నల్లానీరు రోజు విడిచి రోజు వస్తుండటంతో బోర్లు లేని వారు గుక్కెడు నీళ్ల కోసం నల్లానీరు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. విలీన గ్రామాలనైతే పట్టించుకునే వారే కరువయ్యారు. మున్సిపాలిటీలో 30 వార్డులు ఉండగా సగానికి పైగా వార్డుల్లోని ప్రజలు తాగునీటి తిప్పలు పడుతున్నారు. అన్ని కాలనీలకు మిషన్ భగీరథ పైప్లైన్ ఉన్నప్పటికీ రోజు విడిచి రోజు నల్లానీరు వస్తుంది. ప్రధానంగా రాజీవ్నగర్, క్రిష్ణాకాలనీ, బాంబులగడ్డ, సీఆర్నగర్, మంజూర్నగర్తో పాటు విలీన గ్రామాలైన బెడ్డెలపల్లి, గడ్డిగానిపల్లి గ్రామాల వైపు రెండు రోజులకొకసారి మిషన్ భగీరథ నీరు సరఫరా చేస్తున్నారు. దీంతో ఆయా కాలనీల ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేసేది లేక చేతి పంపులు, పవర్ బోర్లను ఆశ్రయిస్తున్నారు. పట్టణంలోని కాలనీల్లో సొంతంగా పవర్ బోర్లు లేని వారైతే నల్లానీటి కోసం పడిగాపులు కాస్తున్నారు. ఉన్న నీటిని సర్దుకుంటూ నల్లానీటి కోసం ఎదురుచూస్తున్నారు. అంతేకాక మిషన్ భగీరథ నీటిని రాత్రి వేళలు, తెల్లవారుజామున వదులుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే ఈ నెల చివరలో ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీకి సంబంధించిన వాటర్ ట్యాంకర్లు రెండు మాత్రమే ఉన్నాయి. అందులో ఒక ట్యాంకర్ను జిల్లా ప్రధాన ఆస్పత్రికి, మరో ట్యాంకర్ను జాతీయ రహదారి మధ్యలో నాటిన మొక్కలకు నీరందించేందుకు వినియోగిస్తున్నారు. గతంలో వేసవిలో మూడు, నాలుగు వాటర్ ట్యాంకర్లను అద్దెకు తీసుకొని నీటి ఎద్దడి ఉన్న కాలనీలకు తాగునీటిని సరఫరా చేసేవారు. మిషన్ భగీరథ పథకం వచ్చిందనే కారణంతో ట్యాంకర్లను అద్దెకు తీసుకోవడం లేదు. దీంతో పైప్లైన్ లీకేజీలు, విద్యుత్ సమస్య వచ్చినప్పుడు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వారం రోజుల క్రితం మహాముత్తారం మండలం కోనంపేట వద్ద చెట్లు కూలి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో భూపాలపల్లి పట్టణానికి రెండు రోజుల పాటు తాగునీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.బెడ్డెలపల్లిలో వ్యవసాయ బోరు నీటిని బాటిళ్లలో పడుతున్న లక్ష్మయ్య, బాంబులగడ్డలో నల్లానీరు రాకపోవడంతో బోరుకు పైప్లైన్ బిగిస్తున్న మహిళ వార్డులు 30 గృహాల సంఖ్య 17,220జనాభా (సుమారుగా) 80 వేలు వాటర్ ట్యాంకర్లు 2 చేతిపంపులు 25 పనిచేస్తున్నవి 24పవర్బోర్లు 109పనిచేస్తున్నవి 108 మిషన్ భగీరథ పైప్లైన్ 113 కిలోమీటర్లు మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు 13,400రోజుకు అవసరమైన తాగునీరు 11 మిలియన్ లీటర్లు సరఫరా చేస్తున్నది 10.5 మిలియన్ లీటర్లు గొంతు తడుపుకునేందుకు తప్పని ఇబ్బందులు బోర్లను ఆశ్రయిస్తున్న ప్రజలు పట్టించుకోని అధికారులు, పాలకవర్గం -
అభివృద్ధిలో అగ్రగామిగా నిలపాలి
ములుగు రూరల్: జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా నిలపాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం కలెక్టర్ సమావేశ మందిరంలో కలెక్టర్ హేమంత్ సహదేవరావు, డీఎఫ్ఓ వికాష మీనాతో కలిసి జిల్లా అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా సమగ్ర అభివృద్ధి సాధించడంతో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుందన్నారు. ప్రజా దర్భార్ ద్వారా ప్రజల సమస్యలు నేరుగా పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేశామని, అందులో వచ్చిన ఫిర్యాదుల స్థితిగతులపై పూర్తిస్థాయిలో ప్రత్యేక అధికారిని నియమిస్తామన్నారు. పెండింగ్లో ఉన్న ప్రజా సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు. నూతన గ్రామ పంచాయతీ భవనాలకు అంచనాలు సిద్ధం చేసి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీరు, డ్రెయినేజీలు వంటి అత్యవసర పనులకే నిధుల ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. పాఠశాలలు, వసతి గృహాలు ప్రా రంభమయ్యే నాటికి వాటిలో సమస్యలను గుర్తించి పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్, ఆర్డీఓ వెంకటేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, తదితరులు ఉన్నారు. చట్టాలపై అవగాహన ఉండాలి బాలల సంరక్షణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని మంత్రి డాక్టర్ దనసరి సీతక్క అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హేమంత్ సహదేవరావుతో కలిసి బాలల హక్కుల పరిరక్షణ చట్టాలపై వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతీఒక్కరూ పాటుపడాలన్నారు. ఆడపిల్లలను చదివించాలని, ప్రభుత్వం అందుకు అనుగుణంగా అవకాశాలు కల్పిస్తుందన్నారు. మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బాలల వివాహాలపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలలపై లైంగిక వేదింపులు, దత్తత విధానం, చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి ప్రేమలత, డీఎఫ్ఓ వికాస్ మీనా, అదనపు కలెక్టర్ మహేందర్జీ, ఆర్డీఓ వెంకటేశ్, అధికారులు పాల్గొన్నారు. ఒలింపిక్ స్థాయికి ఎదగాలి క్రీడాకారులు ఒలింపిక్ స్థాయికి ఎదగాలని మంత్రి సీతక్క అన్నారు. జగ్గన్నపేట ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన రెజ్లింగ్ కోచింగ్ సెంటర్ను కలెక్టర్ హేమంత్ సహదేవరావుప్రారంభించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క -
అకాలవర్షంతో అపారనష్టం
ఏటూరునాగారం: రైతులకు ప్రకృతి అపార నష్టాన్ని మిగిల్చింది. గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ చేసిన ధాన్యం, ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసిపోవడంతో వాటిని ఆరబెట్టుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. ఆరబోసిన ధాన్యం కింద నుంచి వర్షపు నీరు ప్రవహించడంతో వాటిని బకెట్ల ద్వారా ఎత్తి పారబోస్తున్నారు. మండలంలోని గోగుపల్లి, శివాపురం, చెల్పాక తదితర గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఒక్కో రైతు ఒక్కో కష్టంగా మారింది. సరైన గోదాంలు, టార్పాలిన్లు లేక ఇబ్బంది పడ్డారు. నిర్వాహకులు కాంటాలు నిర్వహించి మిల్లులకు తరలించాలని రైతులు కోరుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో తడుస్తున్న ధాన్యం ఇబ్బందులు పడుతున్న రైతులు -
ప్రమాణ స్వీకారంలో ఉద్రిక్తత
● వివాదంగా మారిన వేంకటేశ్వరస్వామి ఆలయ కమిటీభూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రం మంజూరునగర్ శ్రీ భూనీల వేంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ ప్ర మాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం ఉద్రిక్త వాతా వరణంలో జరిగింది. ఆలయ ఈవో మహేష్ ఆధ్వర్యంలో సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఉద యం నుంచే ఆలయ పరిసరాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ రాజకీయ నాయకుల రాకపోకలు పెరగడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయాన్ని రాజకీయాలకు వేదిక చేయొద్దు.. భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన సతీమణి బీఆర్ఎస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి పార్టీ నాయకులతో కలిసి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన గండ్ర ఆలయ నిర్మాణ పనులు పూర్తికాకముందే ఎండోమెంట్ కమిటీ నియామకం, ప్రమాణ స్వీకారం నిర్వహించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఆలయాన్ని రాజకీయాలకు వేదిక చేయకుండా అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. బీఆర్ఎస్ నాయకుల ధర్నా, అరెస్ట్ ఆలయం వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని భావించిన పోలీసులు గండ్ర వెంకటరమణారెడ్డి, గండ్ర జ్యోతి సహా పలువురు నాయకులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో నాయకులు, పోలీసుల మధ్య కొద్దిసేపు వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకుంది. అనంతరం వారిని పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ ఘటనకు నిరసనగా బీఆర్ఎస్ నాయకులు అంబేడ్కర్ సెంటర్లో ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. గండ్ర జ్యోతి అస్వస్థతకు గురికావడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. -
దళారులను ఆశ్రయించొద్దు
మల్హర్: రైతులు తమ ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్రెడ్డి అన్నారు. శుక్రవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం తాడిచర్ల ఆధ్వర్యంలో రుద్రారం, దుబ్బపేట గ్రామాలలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రకాశ్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల దళారులను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రాల ద్వారా గిట్టుబాటు ధరను పొందాలన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఇప్ప మొండి, సర్పంచ్లు చంద్రగిరి సంపత్, భుక్య రవీందర్, కొండ రాజమ్మ, పీఏసీఎస్ డైరెక్టర్ సంగెం రమేష్, మండల నాయకులు బడితల రాజయ్య, వేముల చంద్రమౌళి, చంద్రగిరి అశోక్, సమ్మయ్య, సీఈఓ సంతోష్, రైతులు, హమాలీలు, సిబ్బంది పాల్గొన్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి భూపాలపల్లి అర్బన్: సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి, రాష్ట్ర కార్యదర్శి రావుల రమేశ్ డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలో సంఘం జిల్లా అధ్యక్షుడు బానోత్ సేవానాయక్ అధ్యక్షతన శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి, రమేశ్ మాట్లాడారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగుల భవిష్యత్ భద్రతకు ముప్పుగా మారిందన్నారు. ఎన్నికల హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సీపీఎస్ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ ఉద్యోగుల డీఏ బకాయిలను వెంటనే వారి ఖాతాల్లో జమ చేయాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర కౌన్సిలర్ ముత్యాల రఘుపతి, నాయకులు అన్నారెడ్డి, పెద్దన్న, అశోక్, మోహన్, శ్రీనివాసరావు, నరేష్ పాల్గొన్నారు. రేషన్ బియ్యం పట్టివేత రేగొండ: కొత్తపల్లిగోరి మండల కేంద్రంలో శుక్రవారం సివిల్ సప్లై అధికారులు, పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి 9 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కొత్తపల్లిగోరి గ్రామానికి చెందిన చాపతి రమ ప్రజల నుంచి కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని ఇంట్లో నిల్వ చేసింది. సివిల్ సప్లై అధికారులకు వచ్చిన సమాచారం మేరకు దాడి చేసి రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సివిల్ సప్లై రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయి త్రిలోక్నాథ్ రెడ్డి తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ భూపాలపల్లి రూరల్: ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న ఎస్సీ విద్యార్థులు పెండింగ్ స్కాలర్షిప్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి అధికారి ఇందిర శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వడదెబ్బతో రైతు మృతి మొగుళ్లపల్లి: వడదెబ్బకు గురై రైతు మృతిచెందిన ఘటన మండలంలోని బద్దంపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. బద్దంపల్లి గ్రామానికి చెందిన సామల రాజిరెడ్డి(65) తన పంట చేను వద్దకు వెళ్లి పనులు ముగించుకొని సాయంత్రం ఇంటి చేరుకున్నాడు. ఎండ తీవ్రతతో అస్వస్థతగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పి.. ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గమనించిన కుటుంబ సభ్యులు 108కి సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ చేరుకునేలోపే మృతి చెందాడు. మృతుడికి భార్య రాధ ఉంది. రోజంతా ఎండలో పని చేయడంతో వడదెబ్బతో అస్వస్థతకు గురై మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. నైపుణ్యాధారిత శిక్షణ కేయూ క్యాంపస్: విద్యార్థులకు నైపుణ్యాధారిత శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కేయూ వీసీ ప్రతాప్రెడ్డి అన్నారు. శుక్రవారం వర్సిటీలోని సెనేట్ హాల్లో అధ్యాపకులకు, డీన్లకు, యూనివర్సిటీ కళాశాలల ప్రిన్సిపాళ్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.


