Jayashankar
-
ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి
భూపాలపల్లి: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ కిరణ్ ఖరే సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీస్స్టేషన్ల వారీగా నమోదైన గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల విచారణ, స్థితిగతులు, పెండింగ్ కేసుల పురోగతిపై సమీక్షించారు. కేసుల దర్యాప్తులో పాటించాల్సిన నాణ్యతా ప్రమాణాలు, నేర స్థల పరిశీలన, సాక్ష్యాధారాల సేకరణ, కేసు నమోదు, నిందితుల అరెస్టు, దర్యాప్తు, చార్జిషీటు దాఖలు తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు అధికారులు విజిబుల్ పోలిసింగ్కు ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. పోలీస్స్టేషన్ పరిధిలో గ్రామ సందర్శనలు, పట్టణంలో వార్డుల సందర్శనలు పెంచాలన్నారు. స్థానికంగా ఉండే ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని, ఏదైనా శాంతి భద్రతల సమస్య తలెత్తితే వెంటనే సమాచారం అందేలా చూసుకోవాలని చెప్పారు. జిల్లాలో గంజాయి ఇతర మత్తు పదార్థాలపై పటిష్ట నిఘా ఏర్పాటుచేయాలని ఆదేశించారు. మహిళల పట్ల జరిగే నేరాలపై వేగంగా స్పందించి న్యాయం చేయాలన్నారు. వివిధ దొంగతనాల కేసుల్లో నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఏఆర్ అదనపు ఎస్పీ శ్రీనివాస్, భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు, వర్టికల్ డీఎస్పీ నారాయణనాయక్, జిల్లా పరిధిలోని సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. విజిబుల్ పోలీసింగ్కు ప్రాధాన్యత ఇవ్వాలి ఎస్పీ కిరణ్ ఖరే -
విద్యుత్ ప్రమాదాలపై అప్రమత్తం
ములుగు రూరల్: విద్యుత్ ప్రమాదాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని భూపాలపల్లి సర్కిల్ డీఈఈ(టెక్నికల్) వెంకటేశం, ములుగు డీఈఈ నాగేశ్వర్రావు సూచించారు. ఈ మేరకు మండల పరిధిలోని జగ్గన్నపేట రైతులకు మంగళవారం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు కెపాసిటర్లు బిగించడం వల్ల కలిగే లాభాలను వివరించారు. విద్యుత్ పరికరాలను తడి చేతులతో ముట్టుకోకూడదని, చార్జింగ్ పెడుతూ ఫోన్ మాట్లాడకూడదని సూచించారు. విద్యుత్ సర్వీస్ వైరు నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని సూచించారు. వ్యవసాయ కనెక్షన్ల క్రమబద్ధీకరణ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ములుగు ఏడీఈ వేణుగోపాల్, ఏఈ బానోత్ రవి, ఏఎల్ఎం కమలాకర్ పాల్గొన్నారు. -
భోజన సౌకర్యం మెరుగుపరచాలి
భూపాలపల్లి: ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, సంక్షేమ గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో అల్పాహారం, భోజన సౌకర్యాల అమలును మరింత మెరుగుపరిచేందుకు మండల ప్రత్యేక అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులతో మంగళవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని మండలాల ప్రత్యేక అధికారులు వారికి కేటాయించిన మండలాల్లో భోజన నాణ్యతను ప్రత్యక్షంగా పరిశీలించాలని ఆదేశించారు. ఇదొక నిరంతర ప్రక్రియగా జరగాలన్నారు. ఆహార పదార్థాల శుభ్రత, పోషక విలువలు, వంట గదుల నిర్వహణ, భోజన పరిమాణం, మెనూ అమలు తదితర అంశాలను గమనించి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ టెలీ కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, అన్ని మండలాల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తొద్దు.. వేసవిలో నీటి సమస్య తలెత్తకుండా సమగ్ర కార్యచరణ ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. హైదరాబాద్ నుంచి మంగళవారం వివిధ అంశాలపై ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐడీఓసీ కార్యాలయం నుంచి కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. జిల్లాలోని 53 సొసైటీల్లో యూరియా అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. క్రమం తప్పక వ్యవసాయ అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. తాగునీటి కొరత వచ్చిన గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని, స్థానిక వనరులను గుర్తించాలని తెలిపారు. లీకేజీలు అరికట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
బుధవారం శ్రీ 19 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
వేసవి భత్యం ఊసేలేదు.. వేసవికాలం దృష్ట్యా గతంలో ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఐదు నెలల పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఉపాధి కూలీలకు 20శాతం అదనపు వేసవి భత్యం ఇచ్చేది. రెండేళ్ల వేసవి భత్యం నిలిచిపోగా ఈసారి కూడా వేసవి భత్యం అందేలా లేదు. దీంతో కూలీల్లో నిరాశ వ్యక్తమవుతోంది. ఉపాధి పనిదినాలు పెంచేందుకు ఏటా రాష్ట్ర ప్రభుత్వం కూలీలకు అదనపు భత్యాన్ని అందజేసేది. దీంతో పనిచేసిన కూలీలకు ఆ రోజు పొందే కూలీలో ఫిబ్రవరి నెలలో 20శాతం, మార్చిలో 25శాతం, ఏప్రిల్, మే నెలల్లో 30శాతం, జూన్లో 20శాతం అదనపు భత్యం చెల్లిస్తుండేవారు. ఉపాధిహామీ పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గతంలో వినియోగించిన సాఫ్ట్వేర్ను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. కేంద్ర ప్రభుత్వం నూతనంగా నేషనల్ ఇర్మమెటిక్స్ సెంటర్(ఎన్ఐసీ) సాఫ్ట్వేర్ను ప్రవేశపెట్టింది. దీంతో మూడేళ్లుగా ఉపాధి చెల్లింపులు నేరుగా కేంద్ర ప్రభుత్వం ఎన్ఐసీ ఆధ్వర్యంలోకి వెళ్లడంతో అందులో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే వీలు లేకుండా పోయింది. ఉపాధి కూలీలకు కేంద్ర ప్రభుత్వం ఒక రోజుకు గరిష్టంగా రూ.300 కూలీ చెల్లిస్తుంది. కూలీల వేతనాలు సైతం వారి ఖాతాల్లోనే నేరుగా జమ చేస్తుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం వేసవి భత్యం ఇచ్చే అవకాశం లేకపోవడంతో వేసవిలో పనిచేసే కూలీల అలవెన్స్కు బ్రేక్ పడింది. దీనికి తోడు ఉపాధి పనులు జరిగే పని ప్రాంతంలో ఎండల తీవ్రత, వసతుల లేమి కారణాలతో పనులకు వచ్చే కూలీల సంఖ్య తగ్గిపోతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.● నిలిచిన వేసవి భత్యం ● కేంద్రం కొత్త సాఫ్ట్వేర్తో అందని అదనపు కూలి ● కూలీల అలవెన్స్ హుష్కాకి ● ఉపాధి పనులపై కూలీల విముఖతన్యూస్రీల్ -
రోజుకో చోట..
పలుగుల అటవీప్రాంతంలో పెద్దపులి..కాటారం/కాళేశ్వరం: మహదేవపూర్ మండలం పలుగుల గ్రామ అటవీప్రాంతంలో మంగళవారం పెద్దపులి కనిపించింది. పదిరోజులుగా పెద్దపులి కాటారం, మహదేవపూర్ అడవుల్లో తిష్టవేసి అటవీశాఖ అధికారులకు కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. ఫిబ్రవరి 10న కాటారం మండలం నస్తూర్పల్లి శివారులో ఓ రైతు పులి పాదముద్రలు(పగ్మార్క్) చూసి భయాందోళనకు గురయ్యాడు. మహదేవపూర్ మండలం అన్నారం, బీరాసాగర్, కుదురుపల్లి అడవిలో రెండు రోజులు సంచరించింది. దీంతో అటవీశాఖ అధికారులు ఆయా ప్రాంతాల్లో ట్రాకింగ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. పులి మాత్రం కెమెరాల్లో చిక్కడం లేదని అటవీశాఖ అధికారులు, సిబ్బంది చెబుతున్నారు. ట్రాకింగ్ కెమెరాలకు చిక్కకుండా.. నస్తూర్పల్లి అటవీ ప్రాంతంలో పులి పాదముద్రలు(ప్లగ్ మార్క్స్) గుర్తించిన అటవీశాఖ అధికారులు పులి కదలికలపై దృష్టి సారించారు. మొదటి రోజు కాటారం, మహదేవపూర్ రేంజ్ పరిధిల్లోని అటవీ ప్రాంతం మొత్తాన్ని అధికారులు, సిబ్బంది జల్లెజ పట్టారు. పులి ఆనవాళ్లు కానరాకపోవడంతో నస్తూర్పల్లి, వీరాపూర్, అన్నారం, బీరాసాగర్, మహదేవపూర్ అటవీప్రాంతాల్లో ఝెనిమల్ ట్రాకర్ నిపుణులతో కలిసి ట్రాకింగ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆరు బృందాలుగా విడిపోయి అటవీశాఖ అధికారులు పులి జాడను కనుక్కునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయినప్పటికీ పులి ఎక్కడ కూడా ట్రాకింగ్ కెమెరాలకు చిక్కకుండా సంచరిస్తుంది. భయాందోళనలో ప్రజలు.. పెద్దపులి రోజుకో చోట కనిపిస్తుండటంతో అటవీ ప్రాంతాలకు సమీపంలోని గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పులి ఎప్పుడు ఎక్కడికి వస్తుందో తెలియని భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. రాత్రి సమయంలో అటవీ ప్రాంతానికి సమీపంలోని పంట పొలాల వద్దకు వెళ్లడానికి రైతులు జంకుతున్నారు. ఆందోళనకు గురికావద్దు.. పులి సంచారం పట్ల ప్రజలు, రైతులు ఆందోళనకు గురికావద్దని, కాటారం రేంజ్ అధికారిణి స్వాతి, అటవీశాఖ రేంజర్ రవికుమార్ తెలిపారు. రా త్రి సమయాల్లో అటవీ ప్రాంతాల్లోకి వెళ్లవద్దని సూ చించారు. పులి, పులి ఆనవాళ్లు కనిపిస్తే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. 10రోజులుగా కాటారం, మహదేవపూర్ అడవుల్లో తిష్ట ట్రాకింగ్ కెమెరాలకు చిక్కని ౖటైగర్ అటవీశాఖ అధికారులకు ముప్పుతిప్పలుగారెకుంటలో నీరుతాగి.. మంగళవారం ఏకంగా మహదేవపూర్ మండలం పలుగుల ఎస్సీకాలనీ పక్కన నీలగిరి వనంలో పులి సంచారం చేసింది. అదేగ్రామానికి చెందిన నిట్టూరి బాపు అనే రైతు ఎడ్లబండితో పత్తిచేనుకు వెళుతున్నాడు. కొంత దూరం నడిచిన ఎద్దులు ముందుకు నడిచేందుకు వెనుకడుగు వేశాయి. రైతు ఎద్దులను దబాయించినా ముందుకు సాగలేదు. దీంతో రైతు పరీక్షించి చూడడంతో ముందు పెద్దపులి నడుచుకుంటూ వెళ్తోంది. దీంతో రైతు భయానికి గురై వెంటనే ఎడ్ల బండిని వెనుకకు తిప్పి ఇంటికి చేరుకున్నాడు. గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో అటవీశాఖ అధికారులకు తెలిపారు. అటవీశాఖ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పులికోసం చెట్టు, పుట్ట, వాగు, వంకల్లో ముమ్మరంగా అన్వేషించారు. గారెకుంట పొచమ్మ కుంట వద్ద పులి నీరుతాగి వెళ్లినట్లు పాదముద్రలను అధికారులు సేకరించారు. అక్కడి నుంచి కాళేశ్వరం వైపున నల్లవాగుకు చేరినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. -
తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు
భూపాలపల్లి: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి ఎద్దడి రాకుండా తగు చర్యలు చేపడుతున్నామని మున్సిపల్ కమిషనర్ బిర్రు శ్రీనివాస్ వెల్లడించారు. పట్టణంలోని పలు కాలనీల నుంచి మంగళవారం ఫిర్యాదులు అందగా అప్పటికప్పుడు మరమ్మతులు చేయించినట్లు చెప్పారు. కాశీంపల్లిలో ఒక చేతిపంపు మరమ్మతు, క్రిష్ణాకాలనీ, ఎల్బీ నగర్లలో మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజీ మరమ్మతు, గడ్డిగానిపల్లిలో బోరు మోటారు కాలిపోతే అప్పటికప్పుడు రిపేరు చేయించి తాగునీటి సరఫరాను పునరుద్ధరించినట్లు తెలిపారు. తాగునీటి సమస్య ఏర్పడితే మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు.మున్సిపల్ కమిషనర్ బిర్రు శ్రీనివాస్ -
విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం కావాలి
చిట్యాల: టెన్త్ విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా పరీక్షలకు సన్నద్ధం కావాలని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ అన్నారు. మండలకేంద్రంలోని ఉన్నత పాఠశాలను డీఈఓ సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదువుకుని అత్యుత్తమ మార్కులు సాధించాలని కోరారు. సెక్టోరియల్ ఆఫీసర్ రాజగోపాల్ విద్యార్థులను వివిధ సబ్జెక్టులలో ప్రశ్నలను అడిగి జవాబులు తెలుసుకున్నారు. విద్యార్థుల ప్రమాణాలు సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయులు శ్రీరాం రఘుపతి, ఉపాధ్యాయులు శ్రీనివాస్, రాజమౌళి, నీలిమారెడ్డి, విజయలక్ష్మి, కల్పన, మౌనిక, ఉస్మాన్ అలీ, ఫిజికల్ డైరెక్టర్ సూదం సాంబమూర్తి పాల్గొన్నారు. ఉత్తీర్ణత శాతం పెంచాలి మొగుళ్లపల్లి: పదిలో జీపీఏ సాధనే లక్ష్యంగా ప్రతీ విద్యార్థి శ్రద్ధగా చదవాలని డీఇఓ రాజేందర్ అన్నారు. మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మొట్లపల్లి, పిడిసిల్ల, ముల్కలపల్లి పాఠశాలలను డీఈఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల రికార్డులను, విద్యార్థుల ప్రగతి రికార్డులను, ఉపాధ్యాయుల డైరీలను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. టెన్త్ విద్యార్థులు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులను సద్వినియోగం చేసుకొని సందేహాలు నివృత్తి చేసుకోవాలన్నారు. డీఈఓ వెంట జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ దుప్పటి రాజగోపాల్, ప్రధానోపాధ్యాయులు పింగిలి విజయపాల్ రెడ్డి, నరసింహస్వామి, శ్రీనివాస్, మహేష్, కోటేశ్వర్, శ్రీమంజరి, వెంకన్న, అనిల్కుమార్ ఉన్నారు.డీఈఓ రాజేందర్ -
కల్యాణం.. కమనీయం
రేగొండ: కోటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణం మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్వామి వారి స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రతీ నెలలో కోటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కల్యాణం నిర్వహిస్తారు. మంగళవారం అభిషేకంతో ప్రారంభమై, సుదర్శన నారసింహ హోమం కొనసాగించారు. అనంతరం కల్యాణం జరిపించారు. ఆరగింపుతో కల్యాణ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ మహేష్, చై ర్మన్ ముల్కనూరి భిక్షపతి, కాంగ్రెస్ రాష్ట్ర నా యకులు కత్తి వెంకటస్వామి, ఆలయ సిబ్బంది శ్రావణ్, సుధాకర్, భక్తులు పాల్గొన్నారు. నాగేపల్లిలో వైద్యశిబిరం కాళేశ్వరం: కాళేశ్వరం పీహెచ్సీ పరిధిలోని అన్నారం సబ్సెంటర్లోని నాగేపల్లిలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుస్మిత ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మంగళవారం 38మందికి వైద్య పరీక్షలు చేశారు. 14 మంది రక్తనమూనాలు సేకరించి మలేరియా రాపిడ్ టెస్టులు చేసి మందులు పంపిణీ చేశారు. దోమలు వృద్ధి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రమ్య, సబ్ యూనిట్ ఆఫీసర్ రమేష్, ఎంపీఓ ప్రసాద్, పీహెచ్ఎస్ నీరజ, హెల్త్ అసిస్టెంట్ అడప రాజరమణయ్య, ల్యాబ్ టెక్నీషియన్ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి సురేష్ పాల్గొన్నారు. డ్రంకెన్డ్రెవ్ కేసులో ఒకరికి జైలు శిక్ష భూపాలపల్లి అర్బన్: మద్యం తాగి జిల్లాకేంద్రంలో వాహనం నడుపుతూ పట్టుబడిన కేసులో ఒకరికి జైలు శిక్ష పడినట్లు సీఐ నరేష్కుమా ర్ తెలిపారు. పట్టణంలోని సుభాష్కాలనీకి చెందిన అల్వాల వంశీ ఇటీవల మద్యం మత్తులో వాహనం నడుపుతూ పట్టుబడగా కోర్టులో ప్ర వేశపెట్టారు. రెండు రోజుల జైలు శిక్ష, రూ.వే యి జరిమానా విధించినట్లు సీఐ తెలిపారు. గుడుంబా పట్టివేత కాటారం: మండలంలోని ఆదివారంపేటలో ఓ మహిళ గుడుంబా విక్రయిస్తుండగా పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై మ్యాక అభినవ్ తెలిపారు. గుడుంబా విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు దుర్గం లక్ష్మి ఇంట్లో తనిఖీ చేయగా 10 లీటర్ల గుడుంబా లభించినట్లు ఎస్సై పేర్కొన్నారు. గుడుంబా స్వాధీనం చేసుకుని లక్ష్మిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అక్రమంగా గుడుంబా తయారీ, రవాణ, విక్రయాలకు పాల్పడితే చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. ఇసుక ట్రాక్టర్ పట్టివేత కాటారం: మండలంలోని విలాసాగర్ మానేరు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ను మంగళవారం పట్టుకున్నట్లు ఎస్సై మ్యాక అభినవ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. పోలీస్ సిబ్బంది విలాసాగర్, గంగారం గ్రామాల మధ్య పెట్రోలింగ్ నిర్వహిస్తూ గంగారం క్రాస్ వద్ద ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ను నిలిపి పత్రాలు అడిగారు. ఇసుక రవాణాకు సంబంధించి అనుమతి పత్రాలు లేకపోవడంతో పాటు వాహన పత్రాలు, డ్రైవర్కు లైసెన్స్ లేనట్లు గుర్తించారు. దీంతో ట్రాక్టర్ను పోలీస్స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. గోదావరి పరిసర ప్రాంతాల్లో సర్వే కాళేశ్వరం: మహదేవపూర్ మండలంలో గోదావరి నీటి ప్రవాహంపై కేంద్ర జలశక్తి శాఖ(సీడబ్ల్యూసీ)ఆధ్వర్యంలో సర్వే చేపట్టారు. మంగళవారం సర్వే జేఈఈ సందీప్ ఆధ్వర్యంలో సర్వే బృందం గోదావరి, పరిసర ప్రాంతాల్లో సర్వే చేశారు. ప్రతి వర్షాకాలంలో గోదావరిలో వరదల కారణంగా కోతకు గురైన ప్రాంతాన్ని సర్వే చేస్తున్నారు. వర్షాకాలంలో ఎంత మేర నీటిమట్టం ప్రవహిస్తుంది, కోతకు గురైన తరువాత ఎంత మేర ప్రవహిస్తుందనే హెచ్చుతగ్గులను సర్వే చేసి వర్షాకాలంలో దీని ఆధారంగా నీటి లెక్కలను సీడబ్ల్యూసీ అధికారులు చెబుతారని ఆయన వివరించారు. ఆయన వెంట సర్వే బృందం ఉన్నారు. -
రాష్ట్రస్థాయి టాలెంట్ టెస్ట్
కాటారం: ఫిజికల్ సైన్స్ ఫోరం ఆధ్వర్యంలో కాటారం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు మంగళవారం ఆన్లైన్ పద్ధతిలో రాష్ట్ర స్థాయి టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. గతంలో జిల్లాస్థాయిలో నిర్వహించిన టాలెంట్ టెస్ట్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచి రాష్ట్ర స్థాయికి ఎంపికై న మణిదీప్, అలేఖ్య, అభిరాంకళ్యాణ్ ఈ టాలెంట్ టెస్ట్లో పాల్గొని ప్రతిభ కనబరిచారు. అనంతరం విద్యార్థులను అభినందించి సన్మానించారు. ఈ సందర్బంగా ఎంఈఓ శ్రీదేవి మాట్లాడుతూ విద్యార్థులు సైన్స్పై ఆసక్తి పెంచుకొని భవిష్యత్లో శాస్త్రవేత్తలుగా దేశానికి సేవలందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం ఉమారాణి, ఫిజికల్ సైన్స్ ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి గండు రాజబాబు, ఉపాధ్యాయులు రాజేందర్, రాజయ్య పాల్గొన్నారు. నేడు తిరుగువారం పండుగ ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం, కన్నెపల్లి ఆలయాల్లో సమ్మక్క–సారలమ్మ పూజారులు నేడు (బుధవారం) తిరుగువారం పండుగ నిర్వహించనున్నారు. అమ్మవార్ల ఆలయాలను శుద్ధి చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం అమ్మవార్ల వస్త్రాలు, పూజా సామగ్రిని భద్రపరుస్తారు. అమ్మవార్లకు యాట నైవేద్యంగా సమర్పించనున్నారు. తిరుగువారం పండుగ రోజు పూజారుల కుటుంబీకులు, స్థానిక గ్రామస్థులు ఇళ్లను శుద్ధి చేసుకొని మొక్కులు చెల్లించుకోనున్నారు. తిరుగువారం పండుగతో మినీజాతర (మండమెలిగె) పండుగ పూజా కార్యక్రమాల ముగియనున్నాయి. -
కరువు పనిపై పెరుగుతున్న ఆంక్షలు
కాటారం: గ్రామాల్లో వలసలు తగ్గించి స్థానికంగానే ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన జాతీయ ఉపాధిహామీ పథకం లక్ష్యం నీరుగారిపోతోంది. కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకంపై విధి విధానాలు మారుస్తుండడంతో క్షేత్రస్థాయిలో పథకం అమలు తీరు అగమ్యగోచరంగా మారిపోయింది. గతంలో ఉపాధి పనులను పూర్తిస్థాయిలో వినియోగించుకున్న కూలీలు ప్రస్తుతం పనుల పట్ల పూర్తిస్థాయి విముఖత చూపిస్తున్న పరిస్థితి నెలకొంది. కేంద్రం అమల్లోకి తీసుకొచ్చిన సాఫ్ట్వేర్ కారణంగా ఉపాధి పనులపై పెరిగిన ఆంక్షలతో గ్రామాల్లో పనులకు వచ్చే కూలీల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. జిల్లాలోని మొత్తం కూలీలలో కనీసం 10శాతం కూలీలు కూడా ఉపాధి పనులకు రావడం లేదు. -
సాంకేతిక విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి
ఏటూరునాగారం: సాంకేతిక విజ్ఞానాన్ని విద్యార్థులు పెంపొందించుకోవాలని పీఎం ఎస్ఆర్ఐ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల స్కూల్ అసిస్టెంట్ లక్ష్మణ్ తెలిపారు. మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు 130 మంది మంగళవారం హనుమకొండలోని ఎన్ఐటీ యూనివర్సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక విద్య, శాసీ్త్రయ విద్య పెంపొందించేందుకు స్టెమ్ సంస్థ ద్వారా స్టడీ టూర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్పై విద్యార్థులకు అవగాహన కల్పించామని వివరించారు. ఈ టూర్లో పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఆత్మహత్యకు అనుమతించండి
భూపాలపల్లి: ‘ఓ ఎస్సై, అతడి కుటుంబసభ్యులు మా పొలంలోని వెళ్లనివ్వకుండా దారిని తొలగించారు. పైగా కేసులు పెడుతూ ఇబ్బంది పెడుతున్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతించా’లంటూ వృద్ధ దంపతులు సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ భవనం ఎదుట ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ అధికారులను వేడుకున్నారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. మొగుళ్లపల్లి మండలం వేములపల్లికి చెందిన సంది సులోచన, ప్రతాప్రెడ్డి దంపతులకు 12 ఎకరాల భూమి ఉంది. ఈ భూమికి వెళ్లడానికి దారి ఉండగా, రెండున్నరేళ్లుగా కన్నాయిగూడెం ఎస్సై (ములుగు జిల్లా)గా పనిచేస్తున్న ఇనిగాల వెంకటేష్, అతడి సోదరుడు, తండ్రి కలిసి సదరు మార్గాన్ని మూసివేశారని దంపతులు ఆరోపించారు. ‘దీనిపై హైదరాబాద్ వెళ్లి ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా, భూపాలపల్లి ఆర్డీవో రమాదేవి విచారణ చేపట్టి దారి మూసివేసిన విషయాన్ని నిర్ధారించారు. అయినా, ఎస్సై వెంకటేష్, అతని బంధువులు దారివ్వకపోగా, మాపై అక్రమ కేసులు బనాయించారు. మూడేళ్లుగా పొలానికి వెళ్లలేక వ్యవసాయం చేయట్లేదు’ అని ఆ దంపతులు వాపోయారు. ఎస్సై బాధలు తట్టుకోలేకపోతున్నామని, ఆత్మహత్యకు అనుమతి ఇవ్వాలని సులోచన, ప్రతాప్రెడ్డి కోరారు. కలెక్టర్ రాహుల్శర్మ అందుబాటులో లేకపోవడంతో ఆర్డీవో రవి వారితో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని హామీనిచ్చారు. -
నీటి మట్టం వివరాలు (మీటర్లలో..)
తగ్గుతున్న భూగర్భజలాలు ● పెరుగుతున్న నీటి వినియోగం ● ఫిబ్రవరిలోనే హడలెత్తిస్తున్న ఎండలుమండలం డిసెంబర్ జనవరి 2024 2025భూపాలపల్లి 6.35 7.20 చిట్యాల 3.81 4.76 గణపురం 5.59 6.74 కొత్తపల్లిగోరి 4.12 4.49 కాటారం 16.50 17.84 మహదేవపూర్ 11.5 11.40 మహాముత్తారం 2.86 3.22 మల్హర్ 8.28 9.31 మొగుళ్లపల్లి 4.73 6.12 పలిమెల 6.56 7.46 రేగొండ 3.51 4.56 టేకుమట్ల 4.14 4.43భూపాలపల్లి రూరల్: యాసంగి పంటల సాగుకు నీటి వినియోగం పెరగడంతో భూగర్భ జలమట్టం క్రమంగా తగ్గుతోంది. ఎండలు సైతం ఫిబ్రవరిలోనే హడలెత్తిస్తుండడంతో నెల రోజుల్లో దాదాపు ఒక మీటరు లోతుకు పడిపోయింది. వేసవిలో సాగునీటి అవసరాలు పెరిగితే భూగర్భ జలాలు పాతాళానికి చేరే అవకాశాలున్నాయి. జిల్లాలో యాసంగి పంటల సాగు జోరందుకుంది. ఇప్పటికే 85,675 ఎకరాల్లో వరి నాట్లు వేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. గణపురం సరస్సు కింద 2వేల ఎకరాలు, భీం ఘన్పూర్ చెరువు కింద 1,500 ఎకరాలలో పంటలు సాగవుతుండగా, బోర్లు, బావుల కింద 82,175 పైగా సాగవుతున్నట్లు అంచనా. దీనికితోడు 16,843 ఎకరాల్లో మొక్క జొన్న, ఉద్యాన పంటలు, కూరగాయలతో కలిపి మొత్తం 22,670 ఎకరాలు సాగు చేస్తున్నారు. వరికే నీటి అవసరం ఎక్కువ ఉంటుంది. జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో వరి సాగవుతుండడంతో సాగునీటి అవసరం పెరిగింది. దీంతో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. డిసెంబర్లో సాధారణ నీటిమట్టం 7.48 మీటర్లు కాగా, జనవరిలో 8.38 మీటర్లకు పడిపోయింది. దాదాపు ఒక మీటరు లోతుల్లోకి వెళ్లాయి. ఈసారి వర్షాకాలంలో సాధారణ వర్షపాతమే నమోదైంది. అది కూడా ఒకేసారి దంచికొట్టిన వానలతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండాయి. తర్వాత వర్షాల జాడ కరువైంది. చాలా చెరువులు ఇప్పటికే ఖాళీ అయ్యాయి. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. గణపురం మండలంలో 1.15 మీటర్లు పడిపోగా కాటారం 1.35, మల్హర్ 1.03, మొగుళ్లపల్లి 1.39, రేగొండ 1.15 మీటర్ల వరకు భూగర్భ జలమట్టం వేగంగా పడిపోతోంది. దంచికొడుతున్నాయి.. సాధారణంగా మార్చిలో ఎండల తీవ్రత ఉంటుంది. కానీ ఈసారి ఫిబ్రవరి మొదటి వారం నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. జిల్లాలో 34.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఫిబ్రవరిలో గతంలో ఎన్నడూ లేనంతగా ఒక్కసారిగా ఎండలు ముదరడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎండల తీవ్రత యాసంగి పంటలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఎండలతో పంటలకు ఎంత నీరు అందించినా వెంటవెంటనే ఆరిపోతూనే ఉంది. ముఖ్యంగా వరి పంటకు నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. ముందు నాట్లు వేసిన ప్రాంతాల్లో వరి పొట్ట దశకు వస్తుండగా, చాలా ప్రాంతాల్లో ఈ మధ్యే నాట్లు వేశారు. కొన్ని ప్రాంతాలలో నాట్లు వేస్తూనే ఉన్నారు. ఆ పంటకు ఇంకా రెండున్నర నెలలకు పైగా నీరందించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా వరి పొట్ట దశలో ఉన్నప్పుడు నీరు ఎక్కువ అవసరం ఉంటుంది. ఇప్పుడే భూగర్భ జలమట్టం పడిపోతుండడంతో బోర్లలో ఊటలు తగ్గిపోతున్నాయి. ఎండలు మరింత ముదిరితే భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయి, బోర్లు ఎత్తిపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఈ సీజన్లో పంటలు గట్టెక్కడం కష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పొదుపుగా వాడుకోవాలి.. ఎండల తీవ్రత పెరుగుతోంది. దీంతో నీటి వినియోగం పెరిగి భూగర్భ జలమట్టం పడిపోతోంది. నీటిని పొదుపుగా వాడుకోవాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు. ఏ పంటకు ఎంత అవసరమో అంతమేర నీటినే వాడాలి. – కె.శ్రీనివాస్రావు, జిల్లా భూగర్భజల శాఖ అధికారి -
నో పార్కింగ్.. నాకేంటి!
మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానంలో ఇటీవల ఆలయ రాజగోపురం నుంచి రామాలయం వరకు సీసీ రోడ్డుతో పాటు మెట్ల మార్గాన్ని పంచాయతీరాజ్శాఖ ఆధ్వర్యంలో నిర్మించారు. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు దర్శనానికి భారీగా తరలివచ్చారు. భక్తులు తమ కార్లను నో పార్కింగ్ బోర్డు వద్దనే పార్కింగ్ చేసి మెట్ల మార్గం గుండా నడుచుకుంటూ వెళ్లారు. కార్లు పార్కింగ్ చేయడంతో ఆ వీధిలో రహదారి పొడవు అంతా ట్రాఫిక్ జామ్ అయింది. దేవస్థానం అధికారులు, పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆ రోడ్డుపై వెళ్లడానికి ప్రయాణికులు, భక్తులు ఇబ్బంది పడ్డారు. – కాళేశ్వరం -
కార్పొ‘రేట్’ వేట
భూపాలపల్లి అర్బన్: కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు పదో తరగతి విద్యార్థుల కోసం ఇప్పటినుంచే వేట మొదలుపెట్టాయి. టెన్త్ వార్షిక పరీక్షలు ప్రారంభం కాకముందే పీఆర్ఓలను రంగంలోకి దింపి విద్యార్థులను కళాశాలల్లో చేర్చుకునేలా కార్యాచరణను ముమ్మరం చేశాయి. పాఠశాలల యాజమాన్యాలకు భారీగా ముడుపులు అందించి ఏఏ పాఠశాలల్లో ఎంత మంది విద్యార్థులు పదో తరగతి పరీక్ష రాస్తున్నారో వారి సమాచారాన్ని సేకరిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేసి తమ కళాశాలల్లో చదువు బాగుందని, ఇక్కడ చదవిన వారు డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు అయ్యారని ప్రచారం చేస్తున్నారు. జిల్లాకేంద్రంతో పాటు వివిధ మండలాలు, గ్రామాల్లో పీఆర్ఓల సందడి కనిపిస్తుంది. పదో తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి పలు కార్పొరేట్ కళాశాలల గురించి వివరాలు తెలియజేస్తున్నారు. ప్రధానంగా ఎంపీసీ, బైపీసీ కోర్సులతో పాటు మొదటి సంవత్సరం నుంచి ఇంజనీరింగ్, మెడిసిన్, ఎయిమ్స్ సూపర్ 60, ఇంజనీరింగ్లో ఐఐఐటీలతో పాటు గ్రూప్స్కు సంబంధించిన శిక్షణ ఇస్తామని చెబుతున్నారు. ప్రైవేట్ పాఠశాలల నుంచి వివరాల సేకరణ కార్పొరేట్ ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలు తమ సంస్థల తరఫున పీఆర్ఓలకు ఏర్పాటు చేసుకున్నాయి. వారి ద్వారా ప్రైవేట్ పాఠశాలలకు నజరానాలు ప్రకటించి, విద్యార్థుల వివరాలు సేకరించుకొని ఏ ప్రైవేట్ పాఠశాలలో ఎంత మంది ఉన్నారో, వారు ఎలా చదువుతున్నారో వారి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో అన్న విషయాలను ఆరా తీస్తున్నాయి. సుమారు రూ.15వేల నుంచి రూ.20వేల వరకు పీఆర్ఓలకు నజరానాలు ఇచ్చి విద్యార్థుల వివరాలను సేకరించి ఆ వివరాల ఆధారంగా తల్లిదండ్రులకు ఫోన్లు చేసి తమ కళాశాలల్లో పిల్లలను చేర్పించాలని కోరుతున్నారు. ఆదేశాలు బుట్టదాఖలు వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల కోసం ఎవరూ విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి తేవద్దని ఉన్నత విద్యాశాఖ అధికారులు ఆదేశాలు గతంలోనే జారీ చేశారు. అయినా వాటిని బేఖాతరు చేసి ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు పీఆర్ఓలను రంగంలోకి దింపి విద్యార్థుల అడ్మిషన్ల కోసం ఎన్నికలను ప్రచారానికి మించి ప్రచారం చేయిస్తున్నాయి. అధికారులు చర్యలు తీసుకోవాలి కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలలు జిల్లాలో పీఆర్ఓలను నియమించుకొని ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం అన్వేషిస్తున్నారు. అధికారులు ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలపై నియంత్రణ చేయడం లేదు. ఆఫర్ల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలి. – పాండవుల తిరుపతి, విద్యార్థి తండ్రి భూపాలపల్లిరూ.10వేలు అడ్వాన్స్ ప్రైవేట్ కళాశాలల్లో సీట్ కావాలంటే కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రూ.10వేలను అడ్వాన్స్గా చెల్లించాలని ఒత్తిడి తీసుకొస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు కుడా సీట్ దొరకదేమోనన్న ఆతృత, ఫీజులో రాయితీ ఉంటుందో అన్నదానితో పీఆర్ఓలు వచ్చిన వెంటనే ఏ కళాశాల, బోధన ఎలా ఉందన్న విషయాన్ని తెలుసుకొని సీట్ బుక్ చేసుకుంటున్నారు. ఏసీ బుకింగ్ అయితే మరో రూ.10వేల నుంచి రూ.30వేల వరకు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. టెన్త్ విద్యార్థుల కోసం ప్రైవేట్ కళాశాలల అన్వేషణ మెడికల్, ఇంజనీరింగ్ శిక్షణ ఇస్తామని ఎర ప్రైవేట్ పాఠశాలలకు ప్రత్యేక నజరానా రహస్యంగా విద్యార్థుల వివరాల సేకరణ పీఆర్ఓలను నియమించుకున్న సంస్థలు -
మేడారం పరిసరాలు క్లీన్
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక–సారలమ్మ మినీజాతరలో పారిశుద్ధ్య కార్మికులు షిఫ్టుల వారీగా పనిచేస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారు. జాతర వారం రోజుల ముందు నుంచి స్థానిక పారిశుద్ధ్య కార్మికులతోపాటు రాజమండ్రి నుంచి కార్మికులను అధికారులు రప్చించారు. దీంతో జాతరలో సుమారు 400 మంది కార్మికులు నిత్యం పనిచేస్తున్నారు. జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చి పడేసిన చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. తిరుగువారం వరకు పారిశుద్ధ్య పనులు కొనసాగనున్నాయి. 10 ట్రాక్టర్లలో చెత్త తరలింపు.. జాతర ముందు, జాతర నాలుగు రోజుల్లో సుమారు 5వేల టన్నుల చెత్త సేకరించారు. ఈ చెత్తను కార్మికులు ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ ప్రాంతాలకు తరలించారు. జాతరలో రోజుకు 10 ట్రాక్టర్ల ద్వారా రెండు షిప్టుల వారీగా చెత్త తరలింపు కార్యక్రమాన్ని చేపట్టారు. బుధవారం తిరుగువారం పండుగ వరకు పారిశుద్ధ్య పనులు కొనసాగిస్తామని అధికారులు వెల్లడించారు. తిరుగువారం అనంతరం పారిశుధ్ధ్య పనులను స్థానిక గ్రామ పంచాయతీ అధ్వర్యంలో చేపట్టనున్నట్లు తెలిపారు. గద్దెల ప్రాంగణంలో.. అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో భక్తులు వేసే బంగారం (బెల్లం), కొబ్బరినీళ్లు, ఒడిబియ్యం, పసుపు, కుంకుమ, ఇతర వ్యర్థాలను పారిశుద్ధ్య కార్మికులు ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. గద్దెల ప్రాంగణంలో పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు కార్మికులను జిల్లా పంచాయతీశాఖ ఆధ్వర్యంలో నియమించా రు. వీరు షిఫ్టుల వారీగా విధులు నిర్వర్తిస్తూ ఎప్పటికప్పుడు గద్దెల వద్ద చెత్తాచెదారం తొలగిస్తున్నారు. భక్తులకు మెరుగైన సేవలందించాం.. మేడారం మినీజాతరలో భక్తులకు మెరుగైన సేవలందించాం. పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా జాతరకు 10 రోజుల ముందు, జాతర నాలుగు రోజుల్లో 400 మంది కార్మికులు నిత్యం విధుల్లో ఉంటూ మెరుగైన సేవలందించారు. తిరుగువారం పండుగ వరకు పారిశుద్ధ్య పనులు కొనసాగిస్తాం. డీఎల్పీఓలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది సమష్టిగా పనిచేయడంతో భక్తులకు మెరుగైన పారిశుద్ధ్య సేవలను అందించాం. మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర ఆదేశాల మేరకు ఎక్కడా కూడా పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం. – దేవరాజ్, డీపీఓ -
ప్రజాసమస్యలపై పోరాడేందుకే పోటీ
హన్మకొండ: ‘ప్రజాసమస్యలపై పోరాడేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం.. బీజేపీకి సానుకూల వాతావరణం ఉంది.. గెలుస్తాం’ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం హనుమకొండ హంటర్ రోడ్డులోని వేధ బాంక్వెట్ హాల్లో విలేకరులతో, సత్యం కన్వెన్షన్లో జరిగిన మీట్ అండ్ గ్రీట్ విత్ టీచర్స్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఈనెల 27న జరిగే ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికల్లో మూడు స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తున్నదని, పార్టీకి అనుకూలమైన వాతావరణం కనిపిస్తున్నదని చెప్పారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పట్ల పూర్తి వ్యతిరేకతతో ఉన్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అసంతృప్తి మూటగట్టుకుంటే.. కాంగ్రెస్ ఏడాదిలోనే ప్రజల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నదని అన్నారు. గ్యారంటీలు, హామీల అమలులో.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. శాసనమండలి ప్రాధాన్యతను తగ్గించేలా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సభ్యులందరినీ మూకుమ్మడిగా తమ పార్టీలో చేర్చుకుని శాసన మండలి ఉద్దేశాలను దెబ్బతీశారని అన్నారు. నల్లగొండ–వరంగల్–ఖమ్మం ఉపాధ్యాయ స్థానం నుంచి పులి సరోత్తంరెడ్డి, మెదక్–కరీంనగర్–నిజామాబాద్–ఆదిలాబాద్ ఉపాధ్యాయ స్థానం నుంచి కొమురయ్య, పట్టభద్రుల స్థానం నుంచి అంజిరెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారని, అందరూ విజయం సాధించి తీరుతారని పేర్కొన్నారు. సరోత్తంరెడ్డికి ఉపాధ్యాయుల సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉందని, అన్ని సంఘాలు అభిమానించే వ్యక్తి అని చెప్పారు. జేఏసీలోని సంఘాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు ఇస్తున్నాయని తెలిపారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మార్తినేని ధర్మారావు. హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్రెడ్డి, అభ్యర్థి పులి సరోత్తంరెడ్డి, నాయకులు వన్నాల శ్రీరాములు, ఆర్.పి.జయంత్లాల్, డాక్టర్ పెసరు విజయ్చందర్రెడ్డి, డాక్టర్ కాళీప్రసాద్, గుజ్జ సత్యనారాయణ, చాడా శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుస్తాం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి -
నేటి ప్రజావాణి రద్దు
భూపాలపల్లి అర్బన్: నేడు (సోమవారం) జరగనున్న ప్రజావాణిని తాత్కాలికంగా రద్దు చేసినట్లు కలెక్టర్ రాహుల్శర్మ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో శాసన మండలి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, జిల్లా యంత్రాంగం ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున ప్రజావాణిని రద్దు చేసినట్లు తెలిపారు. పర్యావరణాన్ని పరిరక్షించాలి భూపాలపల్లి అర్బన్: పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని నియంత్రిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించాలని హెచ్పీసీఎల్ సెల్స్ అధికారి వెంకటేశ్వర్లు కోరారు. హెచ్పీసీఎల్ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ అధికంగా వినియోగిస్తున్నారని తెలిపారు. దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని తెలిపారు. ఎలక్ట్రికల్, సోలార్ వైపు దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీలర్లు గండ్ర హరీశ్రెడ్డి, శ్యామ్, అశోక్రెడ్డి, మహేందర్ పాల్గొన్నారు. టీజీఎండీసీ పీఓ బాధ్యతల స్వీకరణ కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల టీజీఎండీసీ పీఓగా పి.రంగారెడ్డి కాళేశ్వరంలోని టీజీఎండీసీ కార్యాలయంలో ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పీఓ ఇసుక క్వారీలను పరిశీలించారు. స్టాక్యార్డులు, లోడింగ్, వేబ్రిడ్జిల నిర్వహణను పరిశీలించారు. ఆయన వెంట బదిలీపై వెళ్లిన ఇద్దరు పీఓలు తారక్నాథ్రెడ్డి, శ్రీరాములు ఉన్నారు. ప్రశాంతంగా సీఓఈ ఎంట్రెన్స్ పరీక్ష కాటారం: మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలుర కళాశాలలో ఆదివారం నిర్వహించిన కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్సీ ప్రవేశ పరీక్ష (సీఓఈ) ప్రశాంతంగా ముగిసింది. 320మంది పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 295 మంది విద్యార్థులు హాజరుకాగా.. 25మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్, గురుకులం డీసీఓ రాజేందర్ తెలిపారు. పరీక్ష అనంతరం విద్యార్థులకు పులిహోర ప్యాకెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిపార్ట్మెంటల్ ఆఫీసర్ మాధవి, అబ్జర్వర్ నాగమణి, డిప్యూటీ వార్డెన్ నరేశ్, ఉపాధ్యాయులు, సిబ్బంది, పాల్గొన్నారు. పోస్టర్ ఆవిష్కరణ భూపాలపల్లి రూరల్: ఫిబ్రవరి 20న నిర్వహించనున్న చలో విద్యుత్ సౌధ కార్యక్రమం పోస్టర్ను జేఏసీ నాయకులు ఆదివారం సబ్డివిజన్ కార్యాలయం ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీవీఏసీ జేఏసీ జిల్లా కన్వీనర్ మోత్కూర్ కోటి మాట్లాడుతూ.. విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులను రెగ్యులర్ పోస్టుల్లోకి కన్వర్షన్ చేయాలన్నారు. ఐటీఐ చేసిన వారికి జేఎల్ఎం, డిగ్రీ చేసిన వారికి జూనియర్ అసిస్టెంట్, టెన్త్ క్లాస్ చదివిన వారికి ఆఫీస్ సబార్డినేట్, డిప్లమో చేసిన వారికి సబ్ ఇంజనీర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులుు ఎండీ అంకుషావలి, సురేందర్ రెడ్డి, మచ్చిక వెంకటేశ్వర్లు, బత్తుల రాజేందర్, శ్యామ్ వేణు, శ్రీనివాస్, రంజిత్, దేవేందర్ పాల్గొన్నారు. సింగరేణి కార్మికుడి మృతి భూపాలపల్లి అర్బన్: మంచిర్యాల జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భూపాలపల్లి ఏరియాకు చెందిన సింగరేణి కార్మికుడు పూజారి అనిల్(31) మృతిచెందాడు. మంచిర్యాలలో వివాహ వేడుకకు పట్టణానికి చెందిన నలుగురు కారులో వెళ్లివస్తున్నారు. ఈ క్రమంలో మంచిర్యాల జిల్లాలో కారు రోడ్డు డివైడర్ను ఢీకొట్టింది. దీంతో అనిల్ అక్కడికక్కడే మృతిచెందాడు. అనిల్ ఏరియాలోని కేటీకే 5వ గనిలో జనరల్ మజ్ధూర్గా పని చేస్తున్నారు. అదే గనిలో పని చేస్తున్న అండర్ మేనేజర్లు రాము, సంజయ్, దేవేందర్లకు ఈ ప్రమాదంలో గాయాలయ్యాయి. -
మహదేవపూర్ అడవుల్లోకి మళ్లీ పులి!
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ అడవుల్లోకి మళ్లీ పులి వచ్చిందనే సమాచారంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ అడవుల్లో తన ఆవాసం ఏ ర్పాటు చేసుకోవడానికి ఆరు రోజులుగా పులి కాటారం, మహదేవపూర్ ప్రాంతాల్లో తిరు గుతున్నట్లు తెలియడంతో ఆ రెండు రేంజ్ల పరిధిలో ప్రత్యేక బృందాలతో అన్వేషిస్తున్నారు. నస్తూర్పల్లి వద్ద పులి అడుగులు కనిపించడంతో అక్కడి నుంచి గూడూరు, వీరాపూర్ వరకు పరిశీలిస్తూ వెళ్లగా ఆచూకీ లభించలేదు. అడవి లో అక్కడక్కడా ట్రాకింగ్ కెమెరాలు ఏర్పాటు చేసినా.. ఎక్కడా చిక్కలేదు.అయితే, శనివారం మహదేవపూర్ మండలం కుదురుపల్లి సమీపంలో సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద పులి కనిపించినట్లు రోడ్డుమీద వెళ్తున్న వాహనదారులు అటవీశాఖకు సమాచారం ఇచ్చారు. దట్టమైన అడవి కావడంతో పాటు తాగునీటి వసతి ఉండటంతో పులి ఇక్కడ ఆవాసం ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. పశువుల కాపరులు ఆ ప్రాంతాలకు వెళ్లొద్దని, రైతులు వంటచెరుకు కోసం రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. మహదేవపూర్ అడవుల్లో ఎక్కువ సంఖ్యలో ట్రాకింగ్ కెమెరాలు అమర్చితే పులి జాడ తెలుస్తుందని భావిస్తున్నారు.కుదురుపల్లి నుంచి కాటారం, అన్నారం ప్రాంతాల్లో అడవులు దట్టంగా వ్యాపించి ఉన్నాయి. చిన్నచిన్న వాగులతో నీటి వసతి కూడా ఉంది. దీంతో పులి రోజుకు 20–25 కిలోమీటర్ల మేర ప్రయా ణం చేస్తోందని అధికారులు భావిస్తున్నారు. ఈ విషయమై అటవీశాఖ రేంజ్ అధికారి రవిని సంప్రదించగా కుదురుపల్లి వద్ద పులి కనిపించినట్లు వాహనదారులు తెలిపారని, దీంతో ఆదిలాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక యానిమల్ ట్రాకింగ్ టీం పగ్మార్క్లను పరిశోధిస్తోందని వివరించారు. గతంలో ఈ ప్రాంతంలో సంచరించిన కే–8 పులి మళ్లీ వచ్చిందా? లేక మరేదైనా కొత్త పులా అనేది తెలియాల్సి ఉందని అధికారులు చెపుతున్నారు. -
ఆదివారం శ్రీ 16 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
సామగ్రికి ప్రసిద్ధి.. తెలంగాణ జానపద సంస్కృతిలో నిర్వహించే పూజల్లో భాగంగా ధరించే గజ్జెల లాగుల తయారీకి నడికూడ గ్రామం ప్రసిద్ధి. కొమురెల్లి మల్లన్న, ఐనవోలు, బోనాలు, సమ్మక్క–సారలమ్మ జాతరలో, పట్నాలు, పెద్ద పట్నం, గట్టు మల్లన్న జాతరల్లో ఈ గజ్జెల లాగులు, పసుపుపచ్చని అంగీలు ధరిస్తారు. వేములవాడ, కొండగట్టు, శ్రీశైలం, హైదరాబాద్, రంగారెడ్డి, విజయవాడ తదితర తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి వచ్చి సామగ్రిని తీసుకెళ్తారు. గజ్జల లాగులకు బ్రాండ్గా నడికూడ గ్రామం నిలుస్తోంది. వీటిని ధరించే వారు ఎంత నిష్టగా ఉంటారో.. తయారు చేసేవారూ అంతే నిష్టతో ఉంటారు.పలు రాష్ట్రాలకు ఇక్కడి నుంచే సరఫరా.. ● వీటి తయారీని నమ్ముకున్న 200 మంది ● 60 ఏళ్లుగా ఉపాధి పొందుతూ..న్యూస్రీల్ -
జిల్లా జడ్జిని కలిసిన మున్సిపల్ కమిషనర్
భూపాలపల్లి అర్బన్: జిల్లా ప్రధాన న్యాయమూర్తి నారాయణబాబును మున్సిపల్ కమిషనర్ బిర్రు శ్రీనివాస్ శనివారం మర్యాదపూర్వకంగా కలిసి పూలబోకే అందజేశారు. భూపాలపల్లి మున్సిపల్ కమిషనర్గా బదిలీపై వచ్చిన సందర్భంగా కలిసినట్లు శ్రీనివాస్ తెలిపారు. ఉపాధ్యాయులకు శిక్షణ భూపాలపల్లి అర్బన్: జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో స్కూల్ హెల్త్, వెల్నెస్ ప్రోగ్రాంపై శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల స్థాయి విద్యార్థుల్లో ఆరోగ్య సమస్యల గురించి వివరించారు. ఆరోగ్య విషయాలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని, వారి ఆరోగ్య పరిస్థితులను గమనిస్తుండాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ ఉపాధ్యాయులకు సూచించారు. మాస్టర్ ట్రైనర్లు ఉపాధ్యాయులకు అవగాహర కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు, పీహెచ్సీల వైద్యాధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఏరియా ఆస్పత్రిని తనిఖీ చేసిన సీఎండీ భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి ఏరియా ఆస్పత్రిని శుక్రవారం రాత్రి సింగరేణి సీఎండీ బలరాంనాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాజువాలిటీలో చికిత్స పొందుతున్న ఉద్యోగులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పురుషుల వార్డు, ఐసీయూల్లోకి వెళ్లి వైద్యసేవలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో వసతులు, కావాల్సిన సౌకర్యాల గురించి డాక్టర్లు, సిబ్బందితో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జీఎం రాజేశ్వర్రెడ్డి, డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. సింగరేణి సీఎండీకి వినతి భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శనివారం సీఐటీయూ ఆధ్వర్యంలో సింగరేణి సీఎండీ బలరాంనాయక్కు వినతిపత్రం అందజేసినట్లు ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంపేటి రాజయ్య తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడం లేదని, జీఓ నంబర్ 22 ప్రకారం కార్మికులకు వేతనాలు చెల్లించాలని కోరారు. ఈఎస్ఐ కార్డులు అందించాలని, సీఎంపీఎఫ్ పాసు బుక్కులు అప్డేట్ చేయాలని వినతిలో కోరారు. ఈ కార్యక్రమంలో కార్మికులు ఆనంద్, రమేష్, సరళ, రమ, భిక్షపతి, బాబు, సారయ్య, శంకర్, సంపత్, తిరుపతి పాల్గొన్నారు. ఇసుక క్వారీ తనిఖీ మల్హర్: మల్లారం శివారులోని ఇసుక రీచ్ను మైనింగ్ ఏడీ స్పెషల్ ఆఫీసర్ రవిశంకర్, ఆర్ఐ ప్రతాప్రెడ్డి శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా క్వారీలోని ఇసుక నిల్వలపై ఆరా తీశారు. లారీలో ఇసుక ఎంత మేరకు తీసుకెళ్తున్నారు. లోడింగ్ ఎంత చేస్తున్నారు.. వేబ్రిడ్జి కాంటాను, రికార్డులను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వేబిల్లు లేకుండా, లారీల్లో అధిక లోడ్తో ఇసుక రవాణా చేస్తే చర్యలు తప్పవని క్వారీ నిర్వాహకులను హెచ్చరించారు. 2008 డీఎస్సీ అభ్యర్థులకు కౌన్సెలింగ్ భూపాలపల్లి అర్బన్: 2008 డీఎస్సీ అభ్యర్థులకు శనివారం కలెక్టరేట్లోని డీఈఓ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లాకు 43మంది అభ్యర్థులను కేటాయించగా 37మంది అభ్యర్థులు హాజరై సర్టిఫికెట్లు పరిశీలించుకున్నారు. వారికి కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఇచ్చారు. కాంట్రాక్ట్ ప్రతిపాదికన ఎస్జీటీలు ప్రభుత్వ పాఠశాలల్లో పని చేయనున్నారు. -
భక్తిశ్రద్ధలతో తయారు చేస్తాం..
గజ్జెల లాగులు కొనడానికి మన రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. ఇక్కడ భక్తిశ్రద్ధలతో తయారు చేస్తాం. వర్క్ కూడా చాలా బాగా ఉంటుంది. – రావుల సుమలత, నడికూడ నడికూడకు రావాల్సిందే.. ఇక్కడ భక్తిశ్రద్ధలతో తయారు చేస్తారు. పట్నాలు, పెద్ద పట్నం, గట్టు మల్లన్న ఏ జాతరైనా మా తాతల కాలం నుంచే గజ్జెల లాగుల కోసం నడికూడకు వచ్చేవారు. ధరలు కూడా అందరికీ అందుబాటులో ఉంటాయి. – రాజ్కుమార్ యాదవ్, సిరిసేడు, కరీంనగర్ జిల్లా -
టీజీఎండీసీ ప్రాజెక్టు మేనేజర్ బదిలీ
కాళేశ్వరం: జయశంకర్భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల టీజీఎండీపీ ప్రాజెక్టు మేనేజర్ కె.శ్రీరాములును బదిలీ చేస్తూ ఆ శాఖ ఎండీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో ఇక్కడికి నల్లగొండ జిల్లా నుంచి పి.రంగారెడ్డి పీఓగా రానున్నారు. ఆయన స్థానంలోకి శ్రీరాములు నల్లగొండకు బదిలీ అయ్యారు. శ్రీరాములుపై పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆశాఖ విచారణ జరిపి బదిలీ వేటు వేసినట్లు తెలిసింది. శ్రీనివాస్కు సన్మానం ఏటూరునాగారం : రాష్ట్ర రవాణా శాఖ డైరెక్టర్గా ఎన్నికైన వసంత శ్రీనివాస్ను మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్లో సన్మానించారు. బానాజీబందం గ్రామానికి చెందిన శ్రీనివాస్ డైరెక్టర్గా ఎంపికగా శనివారం మంత్రి పొన్నం ప్రభాకర్ను మర్యాద పూర్వకంగా కలిశారు. -
ప్రత్యేక పూజలకు ఉపయోగించే సామగ్రి తయారీకి ప్రసిద్ధి నడికూడ
మాకు ఇదే జీవనాధారం నేను మా పూర్వీకుల నుంచి గజ్జల లాగుపోయడమే వృత్తిగా ఎంచుకున్నా. ఒక్కొక్క గజ్జెల లాగు తయారు చేయడానికి ఐదు రోజుల నుంచి వారం రోజుల సమయం పడుతుంది. చేతి పని ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం సాయం చేయాలని కోరుకుంటున్నాం. మాకు ఇదే జీవనాధారం ఆదాయం అంతంత మాత్రమే ఉన్నప్పటికీ దేవుడిపై భక్తితో ఈ వృత్తిని కొనసాగిస్తున్నాం. – బుర్ర రవీందర్, నడికూడ 20 ఏళ్లుగా వస్తున్నాను.. ఏ పట్నం వేయాలన్నా కావాల్సిన పూజా సామగ్రి కోసం నడికూడకు రావాల్సిందే. నేను 20 ఏళ్లుగా వచ్చి తీసుకుని వెళ్తున్నాను. రూ.12వేల నుంచి రూ.15 వేలలో నాణ్యమైన గజ్జెల లాగు సెట్టు దొరుకుతుంది. – రామ్మూర్తి, కేసముద్రం కొత్తకొండ ఈరన్న.. కొమురెల్లి మల్లన్న.. ఎములాడ రాజన్న.. ఓదెల, ఐనవోలు మల్లికార్జున స్వామి.. ఇలా దేవాలయాలు, జాతరలు ఏవైనా శివసత్తులు, పోతరాజులుంటేనే భక్తజన సందోహం. చిన్నపట్నం, పెద్దపట్నం, అమ్మవారి బోనాలు.. పూజా కార్యక్రమాల్లో పరవశించిన శివసత్తుల శిగాలు.. పోతరాజుల విన్యాసాలు.. ఈరకోల ఆటలు.. మేకపోతులు, కోడిపుంజులను గావుపట్టే పూనకాలు భక్తులను మైమరిపిస్తాయి. ఆయా ఉత్సవాలకు ధరించే ప్రత్యేక దుస్తులు, వస్తువుల తయారీ, సరఫరా కేంద్రం హనుమకొండ జిల్లా నడికూడలో ఉంది. తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర.. ప్రాంతాల్లోని పేరున్న దేవాలయాల్లో శివసత్తులు, పోతరాజులు, భక్తులకు సుమారు 60 ఏళ్లుగా గజ్జెల లాగులు మొదలు ఈరకోలలు, పట్నాల గొంగడి, ఢమరుకం, శూలం.. వరకు ప్రతి ఒక్కటీ నడికూడ నుంచే సరఫరా అవుతున్నాయి. ఇరవై కుటుంబాలు సుమారు 200 మంది నిరంతరం శ్రమిస్తూ ఉపాధి పొందుతుండగా.. ప్రతి ఏడాది డిసెంబర్ నుంచి మార్చి వరకు నడికూడకు వచ్చి వస్తువులను కొనుగోలు చేస్తారు. -
హేమాచల క్షేత్రంలో భక్తుల సందడి
మంగపేట : మండలంలోని మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం, చింతామణి జలపాతం, వనదేవత(దైత) అమ్మవారి ప్రాంత పరిసరాల్లో కోలాహలం నెలకొంది. ఆలయంలోని స్వయంభు స్వామివారిని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారితోపాటు ఆంధ్రప్రదేశ్ నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద స్నానాలు చేసి హేమాచల కొండపైకి చేరుకున్నారు. స్వయంభు స్వామివారిని దర్శించుకున్న భక్తులు లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లకు పూలు, పండ్లు, పట్టు వస్త్రాలు సమర్పించారు. అర్చకులు స్వామివారికి తిలతైలాభిషేకం నిర్వహించారు.సంతానం కోసం వచ్చిన దంపతులకు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు. -
మేడారం జాతర సక్సెస్
ములుగు : మినీ మేడారం జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీస్ శాఖ పకడ్బందీగా భద్రత ఏర్పాట్లు చేశారు. ఎస్పీ డాక్టర్ శబరీష్ పర్యవేక్షణలో డీఎస్పీ ఎన్.రవీందర్ ఆధ్వర్యంలో భద్రత చర్యలు కట్టుదిట్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలోని 1,000 మంది పోలీసులకు ఆయా ప్రాంతాల్లో భద్రత కోసం విధులు కేటాయించారు. బుధవారం నుంచి శనివారం వరకు జరిగిన జాతర రెండు చైన్స్ స్నాచింగ్ కేసులు నమోదు కాగా, సీసీ కెమెరాల ఆధారంగా సీసీఎస్ సీఐ రమేశ్ ఆధ్వర్యంలో 25 మంది సిబ్బందిని కేటాయించి అప్పటికప్పుడు వాటిని ఛేదించారు. దీంతో పాటు మంచిర్యాలకు చెందిన దొంగల ముఠాను గుర్తించి వారి నుంచి ఆటో, కారుతో పాటు రూ.30 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. శ్రీలంకకు చెందిన పర్యాటకురాలు పద్మ మినీ జాతరకు వచ్చి బ్యాగ్తో పాటు పాస్పోర్ట్ పోగొట్టుకోగా స్పందించిన పోలీసులు అరగంటలో ఛేదించి ఆమెకు పాస్పోర్టు అందజేశారు. ట్రాఫిక్ కంట్రోల్ సంబంధించి ఓఎస్డీ మహేష్ బిగితే ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అమ్మవార్ల గద్దెల వద్ద ఎలాంటి తొక్కిసలాట జరుగకుండా చర్యలు తీసుకున్నారు. జంపన్నవాగు నుంచి సమ్మక్క గద్దెల మీదుగా ఆర్టీసి బస్టాండ్ కి వెళ్లే దారిలో, చిలుకలగుట్టకు వెళ్లే దారిలో ప్రతి క్షణం ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులు సక్సెస్ అయ్యారు. పస్రా సీఐ జి.రవీందర్ గత మేడారం అనుభవం జాతరలో చాలా ఉపయోగపడింది. -
సెట్టు రూ.13వేల వరకు..
శివసత్తులు, పోతరాజులు, భక్తులు ధరించే ప్రత్యేక దుస్తులు, వస్తువులు 10–12 రకాలను ఒక సెట్టుగా విక్రయిస్తారు. అవసరాలను బట్టి విడివిడిగా కూడా అమ్ముతారు. ఒక సెట్టులో ఎల్లమ్మ గవ్వలు, ఈరకోల, ఢమరుకం, వల, ప్రతిమలు, కాళ్ల గజ్జలు, తౌతులు, శూలం, గొంగళి, కుల్ల(గవ్వల టోపీ), నిలువు ప్యాంట్లు ఉంటాయి. నాణ్యతను బట్టి ఈ సెట్టును రూ.6వేల నుంచి రూ.13 వేల వరకు విక్రయిస్తారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మరింత ఆకర్షించేలా మెషిన్ ఎంబ్రాయిడరీతో గజ్జెల లాగుల తయారీ వస్త్రాలపై దేవతల నమూనాలను కూడా వేస్తున్నారు. పూజకు కావాల్సిన ప్రతీ సామగ్రి ఇక్కడ లభిస్తుండడంతో జాతరల సీజన్లో వివిధ ప్రాంతాల భక్తులు నడికూడ బాట పడుతున్నారు. ఎల్లమ్మ గవ్వల బుట్ట -
నిర్వహణకు నిధులేవి..?
కాటారం: రైతువేదికల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. మూడేళ్లుగా నిధుల మంజూరు లేకపోవడంతో రైతు వేదికల నిర్వహణ ఏఈఓలకు గుదిబండగా మారింది. సొంత ఖర్చులతో నిర్వహణ వెల్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది. క్షేత్రస్థాయిలో సేవలు అందేలా.. రైతువేదికల్లో తాగునీరు, విద్యుత్ సరఫరా వసతుల ఏర్పాటుతో పాటు స్టేషనరీ, పారిశుద్ధ్య నిర్వహణ, ప్రతీ మంగళవారం రైతు నేస్తం, రైతు శిక్షణ కార్యక్రమాల నిర్వహణ జరుగుతుంది. రైతువేదికల్లో సమావేశాలు నిర్వహించినప్పుడు హాజరైన రైతులు, ఇతరులకు టీ, బిస్కెట్లు అందజేయడంతో పాటు ఇతరత్రా వాటి కోసం కొంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ నిర్వహణ ఖర్చుల కింద గత ప్రభుత్వం నెలకు రూ.9వేలు అందిస్తామని ప్రకటించింది. మూడేళ్లుగా నిలిచిన నిధులు.. జిల్లాలో 45 క్లస్టర్లలో 45 రైతువేదికలు ఉన్నాయి. ఇందులో డిసెంబర్ 2021 నుంచి ఏప్రిల్ 2022 వరకు ఐదు నెలల పాటు నెలకు రూ.9వేల చొప్పున గతంలో ప్రభుత్వం నిర్వహణ నిధులు అందజేసినట్లు అధికారులు చెప్పుకొస్తున్నారు. 2022 మే నుంచి ఇప్పటి వరకు మూడేళ్లుగా ప్రభుత్వం రైతువేదికల నిర్వహణ కోసం నిధులు విడుదల చేయకపోవడంతో విస్తరణ అధికారులు నెల నెలా ఖర్చులు చెల్లించలేక అవస్థలు పడుతున్నారు. ఒక్కో రైతు వేదికకు నెలకు రూ.9వేల చొప్పున 36 నెలలకు గాను సుమారు రూ. 3.24 లక్షలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. అన్నింటి భారం ఏఈఓలపైనే... రైతు వేదికల నిర్వహణకు ప్రభుత్వం దీర్ఘకాలికంగా నిధులు మంజూరు చేయకపోవడంతో ఏఈఓలపై భారం పడుతుంది. కనీసం మరుగుదొడ్ల నిర్వహణ, పారిశుద్ద్యం, కరెంటు బిల్లుల చెల్లింపు, రైతులతో సమావేశాలు, ప్రభుత్వ చేపట్టిన రైతునేస్తం ముఖాముఖి కార్యక్రమాల నిర్వహణ సమయంలో టీ, బిస్కెట్లు, స్వీపర్ జీతం వంటి వాటికి నిధులు లేకపోవడంతో అన్నింటిని తామే భరించాల్సి వస్తుందని ఏఈఓలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల ఏఈఓల వద్ద డబ్బులు లేకపోవడంతో విద్యుత్ బిల్లుల చెల్లింపులు సైతం నిలిచిపోయినట్లు తెలుస్తోంది. రైతు వేదికల్లో ప్రజా ఉపయోగ కార్యక్రమాలు, వివిధ శాఖల సమావేశాల నిర్వహణ సైతం జరుగుతుంది. సమావేశం తర్వాత వేదికను శుభ్రం చేసుకోవాల్సిన బాధ్యత ఏఈఓలపై పడుతోంది. రైతువేదికల్లో అటెండర్ నుంచి ఏఈఓ వరకు అన్ని పనులు ఏఈఓలే చూసుకోవాల్సిన దుస్థితి నెలకొంటుంది. మరోవైపు మరుగుదొడ్లు శుభ్రం చేయడానికి, పైప్లైన్, నల్లాలు వంటివి సమకూర్చుకోవడానికి నిధులు లేక ఏఈఓలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు, వరదలు, కోతుల బెడద కారణంగా జిల్లాలోని పలు రైతు వేదికల్లో మరమ్మతు పనులు నెలకొనగా నిధులు లేక అవి అలానే ఉండిపోతున్నాయి. రైతు వేదికల నిర్వహణ కోసం నెల నెలా నిధులు మంజూరు మంజూరు చేస్తే ఇబ్బందులు ఉండవని వ్యవసాయ విస్తరణాధికారులు పేర్కొంటున్నారు. నిధుల విడుదల నిలిచిపోయింది జిల్లాలోని రైతు వేదికల నిర్వహణ కోసం గతంలో ఐదు నెలలకు సంబంధించిన నిధులను ప్రభుత్వం అందజేసింది. ప్రస్తుతం మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదు. నిర్వహణలో ఇబ్బందులు తలెత్తుతున్న విషయం వాస్తవమే. విద్యుత్ బిల్లుల చెల్లింపు, పారిశుద్ద్య నిర్వహణ కష్టతరంగా ఉంది. ప్రభుత్వం నిధులు మంజురు చేస్తుందేమో చూడాలి. – విజయ్భాస్కర్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి మూడేళ్లుగా రైతువేదికలకు అందని నిధులు తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణకు ఏఈఓల పాట్లు ఇబ్బందులు పడుతున్న వ్యవసాయశాఖ అధికారులుజిల్లా సమాచారం..మండలాలు – 12 రెవెన్యూ గ్రామాలు – 215గ్రామపంచాయతీలు – 242అగ్రికల్చర్ డివిజన్లు – 2 (భూపాలపల్లి, మహదేవపూర్) క్లస్టర్లు – 45రైతు వేదికలు – 45ఏఈఓలు – 45రైతులు – 1,16,756పంట సాగు – 2.52 లక్షల ఎకరాలు -
గజ్జెల లాగులు.. గవ్వల కుల్లలు
గజ్జెల లాగుశివుడిని అమితంగా ఇష్టపడే కొందరికి గజ్జెల లాగు అంటే బహు ప్రీతి.. అత్యంత పవిత్రంగా చూస్తారు.. నీసు తగలనివ్వరు.. తల స్నానం చేయనిదే తాకనైనా తాకరు.. మట్టి రేణువులు కూడా లాగును తాకొద్దని నేలపై సంచులు పరిచి విప్పుతారు.. మిగతా వస్త్రాలతో కాకుండా వేరుగా శుభ్రం చేస్తారు.. భక్తులు అంత పవిత్రంగా భావించే ఆ లాగుల్ని తయారు చేస్తున్నాయి నడికూడ మండలకేంద్రానికి చెందిన కొన్ని కుటుంబాలు. ఆ గజ్జెల సవ్వడే భక్తుల నాదమవుతోంది. శివరాత్రి సమీపిస్తున్న సందర్భంలో శిగాలెత్తే శివభక్తుల అలంకరణ వస్తువులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. – సాక్షిప్రతినిధి, వరంగల్/నడికూడదేవతల ప్రతిమలు,ఢమరుకం● -
జిల్లా జడ్జిని కలిసిన మున్సిపల్ కమిషనర్
భూపాలపల్లి అర్బన్: జిల్లా ప్రధాన న్యాయమూర్తి నారాయణబాబును మున్సిపల్ కమిషనర్ బిర్రు శ్రీనివాస్ శనివారం మర్యాదపూర్వకంగా కలిసి పూలబోకే అందజేశారు. భూపాలపల్లి మున్సిపల్ కమిషనర్గా బదిలీపై వచ్చిన సందర్భంగా కలిసినట్లు శ్రీనివాస్ తెలిపారు. ఉపాధ్యాయులకు శిక్షణ భూపాలపల్లి అర్బన్: జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో స్కూల్ హెల్త్, వెల్నెస్ ప్రోగ్రాంపై శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల స్థాయి విద్యార్థుల్లో ఆరోగ్య సమస్యల గురించి వివరించారు. ఆరోగ్య విషయాలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని, వారి ఆరోగ్య పరిస్థితులను గమనిస్తుండాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ ఉపాధ్యాయులకు సూచించారు. మాస్టర్ ట్రైనర్లు ఉపాధ్యాయులకు అవగాహర కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు, పీహెచ్సీల వైద్యాధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఏరియా ఆస్పత్రిని తనిఖీ చేసిన సీఎండీ భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి ఏరియా ఆస్పత్రిని శుక్రవారం రాత్రి సింగరేణి సీఎండీ బలరాంనాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాజువాలిటీలో చికిత్స పొందుతున్న ఉద్యోగులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పురుషుల వార్డు, ఐసీయూల్లోకి వెళ్లి వైద్యసేవలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో వసతులు, కావాల్సిన సౌకర్యాల గురించి డాక్టర్లు, సిబ్బందితో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జీఎం రాజేశ్వర్రెడ్డి, డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. సింగరేణి సీఎండీకి వినతి భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శనివారం సీఐటీయూ ఆధ్వర్యంలో సింగరేణి సీఎండీ బలరాంనాయక్కు వినతిపత్రం అందజేసినట్లు ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంపేటి రాజయ్య తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడం లేదని, జీఓ నంబర్ 22 ప్రకారం కార్మికులకు వేతనాలు చెల్లించాలని కోరారు. ఈఎస్ఐ కార్డులు అందించాలని, సీఎంపీఎఫ్ పాసు బుక్కులు అప్డేట్ చేయాలని వినతిలో కోరారు. ఈ కార్యక్రమంలో కార్మికులు ఆనంద్, రమేష్, సరళ, రమ, భిక్షపతి, బాబు, సారయ్య, శంకర్, సంపత్, తిరుపతి పాల్గొన్నారు. ఇసుక క్వారీ తనిఖీ మల్హర్: మల్లారం శివారులోని ఇసుక రీచ్ను మైనింగ్ ఏడీ స్పెషల్ ఆఫీసర్ రవిశంకర్, ఆర్ఐ ప్రతాప్రెడ్డి శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా క్వారీలోని ఇసుక నిల్వలపై ఆరా తీశారు. లారీలో ఇసుక ఎంత మేరకు తీసుకెళ్తున్నారు. లోడింగ్ ఎంత చేస్తున్నారు.. వేబ్రిడ్జి కాంటాను, రికార్డులను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వేబిల్లు లేకుండా, లారీల్లో అధిక లోడ్తో ఇసుక రవాణా చేస్తే చర్యలు తప్పవని క్వారీ నిర్వాహకులను హెచ్చరించారు. 2008 డీఎస్సీ అభ్యర్థులకు కౌన్సెలింగ్ భూపాలపల్లి అర్బన్: 2008 డీఎస్సీ అభ్యర్థులకు శనివారం కలెక్టరేట్లోని డీఈఓ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లాకు 43మంది అభ్యర్థులను కేటాయించగా 37మంది అభ్యర్థులు హాజరై సర్టిఫికెట్లు పరిశీలించుకున్నారు. వారికి కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఇచ్చారు. కాంట్రాక్ట్ ప్రతిపాదికన ఎస్జీటీలు ప్రభుత్వ పాఠశాలల్లో పని చేయనున్నారు. -
పాఠశాలల్లో సదుపాయాల కల్పనకు చర్యలు
● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి: పీఎం శ్రీ పథకానికి ఎంపిక చేసిన పాఠశాలల్లో సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్ శర్మ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. పీఎం శ్రీ పథకం కింద ఎంపికై న పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యా శాఖ అధికారులతో ఐడీఓసీ కార్యాలయంలో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పీఎం శ్రీ పథకం కింద జిల్లాలోని ఎనిమిది పాఠశాలలు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఆ పాఠశాలలకు రూ.73,76,640 నిధులు మంజూరు కాగా.. ఇప్పటివరకు రూ.49,29,356 ఖర్చు చేశారన్నారు. మిగిలిన నిధులతో నిర్దేశించిన పనులను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాలల్లో కిచెన్ గార్డెన్స్ ఏర్పాటు, కంపోస్ట్, స్వచ్ఛత కార్యక్రమాల నిర్వహణ, సోలార్ విద్యుత్, గ్రీన్ పాఠశాలలు, ఏకో పార్కు, చారిత్రక ప్రాంతాలకు విజ్ఞాన, విహార యాత్రలు నిర్వహించాలన్నారు. డీఎస్సీ 2008లో ఎంపికై న అభ్యర్థులు జిల్లాలో 43 మంది ఉన్నారని, వారందరి విద్యార్హతలు పరిశీలించి పొరపాట్లుకు తావు లేకుండా పకడ్బందీగా నియామకాలు చేపట్టాలని సూచించారు. విద్యార్థుల నమోదు ఆపార్ ప్రక్రియ 58 శాతం పూర్తయిందని, వంద శాతం నమోదు పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఈఓ రాజేందర్, ఎఫ్ఏఓ కార్తీక్, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. -
సోలార్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం
భూపాలపల్లి అర్బన్: సింగరేణి భవిష్యత్లో ఐదు వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని సంస్థ సీఎండీ బలరాంనాయక్ తెలిపారు. సింగరేణి కార్మిక చైతన్య యాత్రలో భాగంగా శుక్రవారం సింగరేణి డైరెక్టర్లు సత్యనారాయణ, సూర్యనారాయణ, వెంకటేశ్వర్లుతో కలిసి భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 1, 5, 6, 8, ఓసీపీ–2, 3 గనులను సందర్శించారు. అంతకుముందు కేటీకే 5వ గని ఏర్పాటుచేసి బలరామ నందనవనంను సీఎండీ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. భూగర్భ గనులు నష్టాల బాటలో ఉన్నాయని, వాటిలో సౌకర్యాలు మెరుగుపర్చనున్నట్లు పేర్కొన్నారు. ఏరియాలో తాడిచర్ల, వెంకటాపూర్ బ్లాక్లను సింగరేణికి కేటాయించి బొగ్గు ఉత్పత్తి చేపట్టేలా ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులు కృషి చేస్తున్నట్లు వివరించారు. సింగరేణి అధికారుల అలసత్వంతోనే సంస్థలో క్షేత్రస్థాయిలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు తమ దృష్టికి రావడం లేదని.. అందులో భాగంగా కార్మిక చైతన్యం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు అందరూ తమకు కేటాయించిన విధులను తప్పనిసరిగా నిర్వర్తించాలన్నారు. భారీ యంత్రాల వినియోగ సమయాన్ని పెంచాలని సూచించారు. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు తప్పనిసరిగా హాజరవుతూ నిర్దేశిత లక్ష్యాల సాధనకు కృషిచేయాలని ఆదేశించారు. గనులలో వివిధ కేటగిరీలలో పనిచేస్తున్న ఉద్యోగులతో చైర్మన్ మాట్లాడి వారికి కావలసిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అందరూ అలసత్వాన్ని వదిలి ఉత్సాహంగా పనిచేయాలన్నారు. ఆస్పత్రుల అడ్మినిస్ట్రేషన్కు మిలిటరీ డాక్టర్ను నియమిస్తున్నట్లు తెలిపారు. సంస్థలో మహిళా ఉద్యోగులు పెరుగుతున్న సందర్భంగా వారికి కావలసిన అన్ని ఏర్పాట్లను సంస్థ చేస్తుందని అన్నారు. సంస్థలో చేరిన మహిళలకు ఈపీ ఆపరేటర్లుగా వెళ్లడానికి అవకాశం ఉందని.. దానిని మహిళా కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి, కార్పొరేట్ జీఎంలు మనోహర్, రఘునాథరెడ్డి, ఎస్వోటు జీఎం కవీంద్ర, అధికారులు వెంకటరామరెడ్డి, వెంకటరమణ, జాకీర్హుస్సేన్, గుర్తింపు, పాతినిధ్య సంఘాల నాయకులు కొరిమి రాజ్కుమార్, రాజేందర్, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు. అలసత్వం వీడితేనే అభివృద్ధి సమస్యలు తెలుసుకునేందుకు కార్మిక చైతన్య యాత్ర సింగరేణి సీఎండీ బలరాం -
డీసీసీ పీఠాలపై ఎవరు..?
సాక్షిప్రతినిధి, వరంగల్ : జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ)లపై కసరత్తు క్లైమాక్స్కు చేరుకుంటోంది. ప్రభుత్వ పథకాల ప్రచారంతోపాటు క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కమిటీలు ఉండాలని అధిష్టానం భావిస్తోంది. ఈ ఏడాదంతా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీల పాలకవర్గం పదవీకాలం ముగిసి ప్రత్యేకాధికారుల పాలన సాగుతోంది. మరోవైపు ఎప్పుడు నోటిఫికేషన్ వెలువడినా ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. ఈ నేపథ్యంలో సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా డీసీసీల నియామకంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. ఎమ్మెల్యేలు లేదంటే సీనియర్లు.. టీపీసీసీ, అధిష్టానం సంకేతాల మేరకు త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి కొత్త జిల్లా అధ్యక్షులు రానున్నారు. ప్రజలతో సత్సంబంధాలు కలిగి, సమన్వయం చే యగలిగే వ్యక్తులను ఎంపిక చేయాలని ఆలోచిస్తు న్న అధిష్టానం.. ఆర్థికంగా బలంగా ఉండే వాళ్లను తీసుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలను గానీ, సీనియర్లను గానీ ఈసారి నియమించే అవకాశం ఉందని పార్టీవర్గాలు చెబుతున్నా యి. హనుమకొండ జిల్లాలో ఇద్దరు, వరంగల్లో ముగ్గురు, మహబూబాబాద్లో ఇద్దరు అధికార పా ర్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. జనగామలో ఇద్దరు, ము లుగు, జేఎస్ భూపాలపల్లిలో ఒక్కరేసి ఉన్నారు. ● హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా మరోసారి కొనసాగాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని అధిష్టానం కోరుతున్నా ఆయన ససేమిరా అంటున్నట్లు తెలిసింది. పార్టీ సీనియర్, తనకు అనచరుడిగా ఉండే ఇద్దరు పేర్లు సూచిస్తున్నట్లు చెబుతున్నారు. ● వరంగల్ జిల్లా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణనే కొనసాగించాలని కొందరు.. కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వాలని మరికొందరు సూచించినట్లు సమాచారం. ఈ విషయంలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్రెడ్డి నిర్ణయం ఫైనల్ కానుంది. ● మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా భరత్చందర్రెడ్డినే కొనసాగిస్తారన్న చర్చ ఉండగా.. డోర్నకల్, మహబూబాబాద్, ఎమ్మెల్యేలు రామచంద్రునాయక్, మురళీనాయక్లతోపాటు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిల నిర్ణయం కీలకంగా కానుంది. ● జయశంకర్ భూపాలపల్లి అధ్యక్షుడు అయిత ప్రకాశ్రెడ్డి రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నందున.. ఆయననే కొనసాగించాలా? మార్చాలా? అన్న విషయమై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో టీపీసీసీ చర్చించింది. ● ములుగు జిల్లా నుంచి మళ్లీ పైడాకుల అశోక్కే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ● జనగామ జిల్లా అధ్యక్ష పదవికి పోటీ ఏర్పడుతోంది. కొమ్మూరి ప్రతాప్రెడ్డిని కొనసాగించలేని పరిస్థితి వస్తే ఎలా? అన్న చర్చపై ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అత్త, పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి పేరును ఆ జిల్లా ఎమ్మెల్యేలు ప్రతిపాదించినట్లు ప్రచారం ఉంది. అనివార్యంగా మారిన డీసీసీ అధ్యక్షుల నియామకం.. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజుల తర్వాత రేవంత్ రెడ్డి సిఫారసు మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ డీసీసీ కమిటీలను ప్రకటించారు. రెండు విడతల్లో ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలకు అధ్యక్షులను నియమించారు. మొదటి విడతలో నియమితులైన అధ్యక్షుల పదవీకాలం రెండేళ్లు దాటిపోగా.. రెండో విడత డీసీసీలకు రెండేళ్లు కావొస్తోంది. ఈ నేపథ్యంలో అధిష్టానానికి కొత్త కమిటీల ఏర్పాటు అనివార్యంగా మారింది. 2022, డిసెంబర్ 10న హనుమకొండ, ములుగు, మహబూబాబాద్ జిల్లాలకు డీసీసీ అధ్యక్షులుగా నాయిని రాజేందర్ రెడ్డి, నల్లెల కుమారస్వామి, జె.భరత్చందర్రెడ్డిలను నియమించారు. ఇది జరిగిన కొద్ది రోజులకే ములుగు జిల్లా అధ్యక్షుడు కుమారస్వామి అనారోగ్యంతో మృతిచెందాడు. 2023, మే 16న కుమారస్వామి స్థానంలో పైడాకుల అశోక్ను ములుగు అధ్యక్షుడిగా.. వరంగల్కు మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, జయశంకర్ భూపాలపల్లికి ప్రకాశ్రెడ్డిలను నియమించారు. జనగామ జిల్లా అధ్యక్షుడి నియామకం అప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్రెడ్డి మధ్య వివాదంగా మారినా.. చివరకు కొమ్మూరి ప్రతాప్రెడ్డినే నియమించారు. ఆ తరువాత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొంది రేవంత్రెడ్డి సీఎం కావడం, టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్కుమార్గౌడ్ నియమితులయ్యారు.జిల్లా కాంగ్రెస్ కమిటీలపై టీపీసీసీ కసరత్తు ‘స్థానిక’ ఎన్నికలే లక్ష్యంగా కొత్త కమిటీలు జిల్లా అధ్యక్షుల నియామకంపై అభిప్రాయ సేకరణ ఎమ్మెల్యేలు, సీనియర్లతో అధిష్టానం సంప్రదింపులు అవకాశం రాని సీనియర్లకు టీపీసీసీలో స్థానం నెలాఖరులో కొలిక్కి వచ్చే అవకాశం -
డీసీసీబీ, ‘పాక్స్’ల పదవీకాలం పొడిగింపు
సాక్షిప్రతినిధి, వరంగల్ : రాష్ట్రంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పాక్స్) పాలకవర్గాల పదవీకాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. మరో ఆరు నెలల పాటు పదవిలో కొనసాగే విధంగా శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గం గడువు శుక్రవారంతో ముగియగా.. అదే రోజున మరో ఆరు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటికే పదవీకాలం ముగిసిన గ్రామ పంచాయతీలు, ఎంపీపీ, జిల్లా పరిషత్లకు ప్రత్యేకాధికారులను నియమించిన విషయం తెలిసిందే. సహకార సంఘాలకు కూడా ప్రత్యేక అధికారుల నియామకం ఇబ్బందికరం కాగా.. పాలకవర్గాల అభ్యర్థన మేరకు ప్రభుత్వం ‘పాక్స్’ల పదవీకాలం ఆరు నెలలు పొడిగించినట్లు చెబుతున్నారు. ఈ ఉత్తర్వుల ద్వారా ఉమ్మడి వరంగల్లో 91 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు పాలకవర్గాలు మరో ఆరు నెలలు సేవలు అందించనున్నాయి. ఇదిలా ఉండగా.. సహకార సంఘాల పదవీ కాలం పొడిగించినందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్కుమార్గౌడ్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండా సురేఖలకు, జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్రావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రజా ప్రభుత్వంలో సహకార సంఘాలకు అందిస్తున్న సహాయ సహకారాలకు ధన్యవాదాలని, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ సంఘాల బలోపేతానికి రాబోయే రోజుల్లో మరింత కృషి చేస్తామని ఆయన తెలిపారు. మరో ఆరు నెలలు కొనసాగే అవకాశం ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం -
వసతి గృహాల్లో మెరుగైన వసతులు
భూపాలపల్లి: వసతి గృహాల్లోని విద్యార్థులు బాగా చదువుకోవడానికి అవసరమైన వసతి, సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పన, మరమ్మతులు తదితర అంశాలపై ఐడీఓసీ కార్యాలయంలో శుక్రవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, విద్యా, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్, ప్రణాళిక, ఎస్సీ, బీసీ, మైనారిటీ, కేజీబీవీ, సాంఘిక సంక్షేమ, జ్యోతిబా పూలే సంక్షేమ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా శాఖల వసతి గృహాల్లో సౌకర్యాల కల్పనపై అధికారులు అందచేసిన ప్రతిపాదనల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరమ్మతులు, సౌకర్యాలు కల్పనపై అందచేసిన ప్రతిపాదనలకు సమగ్ర నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. వసతి గృహాల్లో తాగునీరు, మరుగుదొడ్లు, మరమ్మతులు, ప్రహరీ నిర్మాణం, హైమస్ట్ విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. అన్ని వసతి గృహాల్లో ఫుడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేశామని, కమిటీలు క్రమం తప్పక ఆహార నాణ్యతను పరిశీలించాలని పేర్కొన్నారు. మండల ప్రత్యేక అధికారులు, సంక్షేమ శాఖల అధికారులు క్రమం తప్పక వసతి గృహాల్లో మెనూ అమలును తనిఖీలు చేస్తూ విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని స్పష్టం చేశారు. విద్యార్థులు వెలకట్టలేని సంపద అని వెల్లడించారు. విద్యార్థులకు తాజా ఆహారాన్ని పెట్టాలని సూచించారు. సౌకర్యాలు, మరమ్మతులు ప్రతిపాదనలు సీపీఓకు అందచేయాలని తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, విద్యాశాఖ అధికారి రాజేందర్, సీపీఓ బాబురావు, పంచాయతీరాజ్ ఈఈ వెంకటేశ్వర్లు, బీసీ, ఎస్సీ సంక్షేమ అధికారులు శైలజ, సునీత, గిరిజన సంక్షేమ శాఖ అకడమిక్ మోనిటర్ రాజరత్నం పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
శనివారం శ్రీ 15 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
వీఐపీ ఘాటు నుంచి సాధారణ పుష్కర ఘాటు వరకు భక్తులు పుణ్యస్నానాలు చేస్తుంటారు. స్నానాలు చేసిన అనంతరం శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకాలు, దర్శనాలు చేసుకుంటారు. మహాశివరాత్రి రోజున సుమారు లక్షకుపైగా భక్తులు పుణ్యస్థానాల చేసి దర్శనాలకు వెళుతుంటారు. సరస్వతీ పుష్కరాలకు 12 రోజుల పాటు రోజుకు 50వేల నుంచి లక్ష వరకు భక్తులు స్నానాలు చేస్తారని అధికారులు ఇప్పటికే అంచనా వేస్తున్నారు. తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు స్నానాలు చేసే అవకాశాలు ఉన్నాయి. అధికార యంత్రాంగం ముందస్తుగా గోదావరి ప్రాంతంలో కిలోమీటర్ మేర రక్షణ వలయాలు, ఎరుపు రంగు జెండాలు ఏర్పాటు చేయాల్సిందిగా భక్తులు కోరుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, చెన్నూర్, గోదావరిఖని, మంథని, భూపాలపల్లి, పరకాల, నర్సంపేట, జనగామ, బెల్లంపల్లి, మందమర్రి, పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల, కాటారం, మహారాష్ట్ర వైపు సిరొంచ తదితర ప్రాంతాల యువకులు ఇక్కడ మృతిచెందిన ఘటనలు ఉన్నాయి. నిత్యం ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో సూచిక బోర్డులు, ఎరుపు రంగు జెండాలు, గజ ఈతగాళ్లను జిల్లా అధికార యంత్రాంగం ముందస్తుగా ఏర్పాటు చేయాలి.కాళేశ్వరంలోని త్రివేణిసంగమ గోదావరి పుణ్యస్నానాలకు గోదావర్రీ కాళేశ్వరం: కాళేశ్వరంలో ఈనెల 25 నుంచి 27 వరకు మహా శివరాత్రి ఉత్సవాలు, మే 15నుంచి 26వరకు సరస్వతీ నది పుష్కరాలను ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం, దేవాదాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవాలకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. వేసవి సమీపిస్తుండడంతో గోదావరిలో నీరు తగ్గుముఖం పడుతుంది. గోదావరిలో అక్కడక్కడా ఇసుక తరలిపోయి కయ్యలు, గోతులు ఏర్పడ్డాయి. దీంతో భక్తులు పుణ్యస్నానాలకు దిగి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. దేవాదాయ, ఇరిగేషన్, పోలీసు, పంచాయతీ, రెవెన్యూశాఖలు సంయుక్తంగా రక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంది. రక్షణ ఏర్పాట్లు అధికారయంత్రం చేపట్టడం లేదు. ఎంతో మంది మృత్యువాత.. యువత, పెద్దలు, మహిళలు, చిన్నారులు గోదావరిలో దైవదర్శనానికి వచ్చి స్నానాలకు దిగి లోతు ప్రవాహంలో చిక్కుకుని మృత్యుఒడికి చేరిన ఘటనలు కోకొల్లలు ఉన్నాయి. కొంతమంది యువకులు ఈత వచ్చిన వారు కూడా గోతులు, కయ్యల్లో పడి మృతిచెందారు. ప్రమాదవశాత్తు ప్రమాదానికి గురై తమ తల్లుల కడుపుకోతను మిగిల్చారు. ఎంతో భవిష్యత్ ఉన్న యువత అర్ధాంతరంగా గోదారి పాలు కావడంతో తల్లిదండ్రుల రోదనలే మిగిలుతున్నాయి. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా అధికారులు ముందస్తుగా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. నిత్యం విధుల నిర్వహణ.. గోదావరి వద్ద ఉత్సవాల రోజుల్లో కాకుండా నిత్యం ప్రమాద హెచ్చరిక బోర్డులు, రక్షణ వలయాలు, గత ఈతగాళ్లు గోదావరిలో ప్రమాదాల నివారణకు విధులు నిర్వర్తించేలా ఏర్పాట్లు చేయాలి. సంబంధితశాఖ తమ సిబ్బందిని ఏర్పాటు చేయాలి. కాపాడుతున్న పోలీసులు.. ఆత్మహత్యకు పాల్పడేవారు సైతం కాళేశ్వరం త్రివేణి సంగమం గోదావరికి వచ్చి పురుగుల మందు, నీటిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఇంట్లో గొడవపడి వచ్చిన అలాంటి వారిని సైతం చాలామంది వృద్ధులను, మహిళలను స్థానికులు పోలీసులు కాపాడి తమ వారికి అప్పగించారు. బ్యాక్ వాటర్తో పెన్సింగ్.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 100ఎఫ్ఆర్ లెవల్ వరకు నీటి ప్రవాహం పెరిగితే భక్తులు స్నానాలు చేసేందుకు ఫెన్సింగ్ను కాళేశ్వరం పుష్కరఘాటు పొడవునా నిర్మించారు. అప్పుడు భక్తులు పెన్సింగ్ ఇవుతల స్నానాలు చేసేవారు. కానీ ఇప్పుడు మేడిగడ్డ బరాజ్లో నీటిని నిల్వ చేయడం లేదు. దీంతో బ్యాక్వాటర్ నిల్వ లేదు. దీంతో గోదావరిలో నీరు రోజురోజుకూ తగ్గుతుంది. స్నానాలకు వచ్చే భక్తులకు సైతం నీటిలో చాలా దూరం వరకు వెళ్లాల్సి వస్తుంది. రక్షణ చర్యలు చేపడుతాం.. భక్తులు లోతు ప్రవాహంలోకి వెళ్లకుండా మహాశివరాత్రి, సరస్వతీ పుష్కరాల కోసం ముందస్తుగానే రక్షణ చర్యలు తీసుకుంటాం. సంబంధిత శాఖలో సమన్వయంతో కలిసి పనిచేస్తాం. నిత్యం రక్షణ వలయాలు ఉండేలా ప్లాన్ చేస్తాం. ఉత్సవాలు జరిగినప్పుడే కాకుండా నిత్యం ఉండేలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళుతాం. – తిరుపతిరావు, ఈఈ, ఇరిగేషన్శాఖ, మహదేవపూర్న్యూస్రీల్కిలోమీటరు మేర.. ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు శూన్యం వివిధ రాష్ట్రాల నుంచి పుణ్యస్నానాలకు భక్తజనం రాక కయ్యలు, గోతుల్లో లోతు తెలియక ప్రమాదాలు కనీసం సూచిక బోర్డులు ఏర్పాటు చేయని అధికారులు -
వందశాతం పన్నులు వసూలు చేయాలి
భూపాలపల్లి అర్బన్: ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పట్టణంలో రావాల్సిన అన్ని రకాల పన్నులను వంద శాతం వసూలు చేయాలని మున్సిపల్ కమిషనర్ బిర్రు శ్రీనివాస్ ఆదేశించారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పేరుకుపోయిన ఇంటి పన్నులు, నల్లా పన్నులు, ట్రేడ్ లైసెన్స్ల రూపంలో పన్నులపై అలసత్వం వహించ వద్దని ఆదేశించారు. పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్న అధికారులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 40శాతం పన్నులు మాత్రమే వసూళ్లు చేశారన్నారు. సమన్వయంతో పని చేస్తేనే వంత శాతం లక్ష్యాన్ని చేరుకుంటారని తెలిపారు. పట్టణ ప్రజలు సహకరించి పన్నులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు సహకరించాలని కోరారు. డంపింగ్ యార్డ్ పరిశీలన సీఆర్ నగర్ సమీపంలోఓని డంపింగ్ యార్డ్, వర్మి కంపోస్ట్ షెడ్, డీఆర్సీసీ, ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్లను మంగళవారం కమిషనర్ శ్రీనివాస్ పరిశీలించారు. ఆయా సెంటర్లలో జరుగుతున్న పనులు పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. పట్టణంలో సేకరించిన చెత్తను వర్మి కంపోస్ట్ తయారు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని. డంపింగ్ యార్డ్లో జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నీరు. విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ను వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్లు మానస, దేవేందర్, సానిటరీ ఇన్ప్ఫెక్టర్ నవీన్, జవాన్లు పాల్గొన్నారు.మున్సిపల్ కమిషనర్ బిర్రు శ్రీనివాస్ -
‘మండమెలిగె ’కు పూజారులు సిద్ధం..
బుధవారం శ్రీ 12 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025– 8లోuమేడారం, కన్నెపల్లిలో మండమెలిగె పండుగకు పూజారులు సిద్ధమయ్యారు. మంగళవారం సమ్మక్క, సారలమ్మ పూజారులు సమావేశమై మండమెలిగె పూజా కార్యక్రమాలపై చర్చించుకున్నారు. బుధవారం, గురువారం రెండు రోజులు జరగనున్న పూజా కార్యక్రమాలపై సమావేశంలో సమీక్షించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పూజలు నిర్వహించాలని నిర్ణయించారు. దేవాదాయ శాఖ తరఫున పూజారులకు దుస్తులు, పూజా సామగ్రిని అధికారులు అందించారు. మండమెలిగె పండుగ సందర్భంగా మేడారం, కన్నెపల్లిలోని ఆదివాసీలు, ఆదివాసేతరులు తమ ఇళ్లను శుద్ధి చేసుకొని అమ్మవార్లకు పూజలు నిర్వహించనున్నారు. ఎస్ఎస్ తాడ్వాయి : ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క–సారలమ్మ మినీ జాత ర (మండమెలిగె) పండుగ నేటి (బుధవారం) నుంచి ప్రారంభంకానుంది. నాలుగు రోజులపాటు జరిగే ఈ జాతరకు వివిధ శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మేడారం, కన్నెపల్లిలోని ఆలయాలు, గద్దెల ప్రాంగణాన్ని ముస్తాబు చేశారు. జాతరకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలిరానున్నారు. జాతర మొదటి రోజు (బుధవారం) మేడారం, కన్నెపల్లిలోని అమ్మవార్ల ఆలయాల్లో మండమెలిగె పండుగను సమ్మక్క–సారలమ్మ పూజారులు నిర్వహించనున్నారు. ముందుగా సమ్మక్క గుడి శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆడపడుచులు రంగవల్లులు వేసి ముస్తాబు చేస్తారు. డోలు వాయిద్యాలతో తూర్పు, పడమర పొలిమేర్లలో ధ్వజస్తంభాలు (దిష్టి తగలకుండా) మామిడి తోరణాలతో అలంకరిస్తారు. ముందుగా పూజారులు గ్రామ దేవతలకు పసుపు, కుంకుమ పెట్టి పూజలు చేస్తారు. అనంతరం గుడికి చేరుకొని అమ్మవారి దీప, ధూపాలతో పూజలు నిర్వహించి యాటతో నైవేద్యం సమర్పిస్తారు. రాత్రి సమయంలో పూజారులు అమ్మవారి పూజాసామగ్రి, పసుపు, కుంకుమలను తీసుకొని డోలు వాయిద్యాలతో గద్దెల వద్దకు వెళ్లి అమ్మవారి గద్దె వద్ద కూడా పూజలు చేస్తారు. అలాగే, కన్నెపల్లిలోని సారలమ్మ గుడిలో కూడా సారలమ్మ పూజారులు అమ్మవారికి పూజలు నిర్వహించి రాత్రి సమయంలో గద్దెల ప్రాంగణంలోకి తీసుకొచ్చి పూజలు నిర్వహిస్తారు. సమ్మక్క–సారలమ్మ పూజారులు గద్దెల వద్ద కలుసుకొని శాకాహానం (ఇప్పపువ్వు సారా) ఇచ్చి పుచ్చుకొని రాత్రంతా గద్దెల వద్ద డోలు వాయిద్యాలతో జాగారం చేస్తూ సంబురాలు జరుపుకుంటారు. నేటినుంచి మినీ మేడారం (మండమెలిగె) ముస్తాబైన మేడారం ● ఆదివాసీ సంస్కృతీసంప్రదాయబద్ధంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలుముస్తాబైన గద్దెల ప్రాంగణం... దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో సమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని శుభ్రం చేసి విద్యుత్ దీపాలతో ఆలకరించారు. భక్తుల క్యూలైన్లపై చలువ పందిళ్లు వేశారు. మంచినీటి సౌకర్యం కల్పించారు. హైమాస్ట్ లైట్ల ఏర్పాటుతో పాటు అమ్మవార్ల గద్దెలు జిగేల్మనేలా సాలాహారం చుట్టూ విద్యుత్ దీపాలను అలంకరించారు. మధ్యాహ్నం సమయంలో ఎండతీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రాంగణ ఆవరణలో కాళ్లు కాలకుండా కూల్ పెయింట్ వేశారు. న్యూస్రీల్జల్లు స్నానాలకు తిప్పలే..? -
బర్డ్ఫ్లూపై అప్రమత్తంగా ఉండాలి
కాటారం: పలు ప్రాంతాల్లో బర్డ్ఫ్లూ విస్తరిస్తున్న నేపథ్యంలో జిల్లాలోని కోళ్ల పెంపకదారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పశువైద్యాధికారి కుమారస్వామి సూచించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా పశువైద్యాధికారి, సిబ్బంది కాటారం మండలంలోని గట్లకుంట, గంగారం గ్రామాల్లోని పౌల్టీఫాంలను పరిశీలించారు. ఫాంలో పెరుగుతు న్న కోళ్ల ఆరోగ్య పరిస్థితి, నిర్వాహణపై ఆరా తీశా రు. కోళ్లఫాంలలో అకారణంగా కోళ్లు చనిపోతే వెంటనే పశువైద్యాధికారులకు సమచారం అందించా లని సూచించారు. ఫాంల నిర్వాహణలో జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. బర్డ్ఫ్లూ వ్యాధి.. కోళ్లు, ఇతర పక్షుల నుంచి మనుషులకు, జంతువులకు తొందరగా వ్యాపిస్తుందని పేర్కొన్నారు. బర్డ్ఫ్లూ సోకిన కోళ్ల ముక్కు, కళ్లు, నోటి నుంచి స్రావాలు కారుతాయని శ్వాస తీసుకోవడం వాటికి ఇబ్బంది గా ఉంటుందని, దగ్గు, గురక శబ్ధం వచ్చి ఆకలిమందిగించడం లాంటి లక్షణాలు ఉంటాయని తెలిపా రు. కోళ్లలో ఇలాంటి లక్షణాలు గుర్తిస్తే సమాచారం అందించాలన్నారు. ప్రస్తుతం జిల్లాలో బర్డ్ఫ్లూ ప్రభావం లేదన్నారు. అనంతరం మండల కేంద్రంలోని పశువైద్యశాలను సందర్శించి రికార్డులు, మందుల స్టాక్ పరిశీలించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దని అందుబాటులో ఉండి వైద్య సేవలందించాలన్నారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి ధీరజ్, పశువైద్యులు రమేశ్ ఉన్నారు.జిల్లా పశువైద్యాధికారి కుమారస్వామి -
ప్రశాంతంగా అమ్మవార్ల దర్శనం
ములుగు కలెక్టర్ దివాకర టీఎస్ ములుగు: నేటినుంచి 15వ తేదీ వరకు జరగనున్న మినీ మేడారం జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశామని ములుగు కలెక్టర్ దివాకర టీఎస్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జంపన్నవాగులో పుణ్య స్నానాలు ఆచరించేందుకు నల్లాలు, మహిళా భక్తులు దుస్తులు మార్చుకునే గదులను సిద్ధంగా ఉంచామని పేర్కొన్నారు. ఇప్పటికే పారిశుద్ధ్య పనులు చేపట్టారని, వైద్యశాఖ తరఫున శిబిరాలు ఏర్పాటుచేసినట్లు వివరించారు. అమ్మవారి గద్దెల ప్రాంగణంలో, క్యూలైన్ వద్ద ప్రత్యేక పోలీసు సిబ్బందిని నియమించామని తెలిపారు. ఏటూరునాగారం మండలం కొండాయి, ఐలాపూర్ మినీ మేడారం జాతరలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆర్టీసీ తరఫున చిన్నబోయినపల్లి నుంచి కొండాయి వరకు, ఊరట్టం నుంచి కొండాయి వరకు ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నామని పేర్కొన్నారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో అమ్మవార్లను దర్శించుకొని ఇంటికి చేరుకోవాలని ఆకాంక్షించారు. -
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
మొగుళ్లపల్లి: మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. మండలంలో మంగళవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగుల హాజరు నమోదు పట్టిక, ల్యాబ్, ఫార్మాసి, వార్డులను తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించాలని సూచించారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని తెలిపారు. అత్యవసర సమయాల్లో ఉపయోగించే అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని, వైద్య సేవలుకు ఎలాంటి ఇబ్బంది రావొద్దన్నారు. అనంతరం మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను సందర్శించిన కలెక్టర్ వంటగది, డైనింగ్ హాల్, విద్యార్థుల కోసం తయారు చేసిన మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రతి రోజు భోజనం ఎలా ఉంటుందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. నిర్దేశిత డైట్ మెనూ కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. పరిశుభ్రత పాటించాలని, విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్ర పై అవగాహన కల్పించాలన్నారు. ప్రత్యేక అధికారి, వార్డెన్ ప్రతి రోజు భోజ నాన్ని తనిఖీ చేయాలని ఆదేశించారు. నాణ్యమైన కూరగాయలు, మాంసం అందించాలని పేర్కొన్నా రు. కార్యక్రమంలో ఆర్డీఓ రవి, తహసీల్ధార్ సునీత, ఎంపీడీఓ హుస్సేన్, ప్రత్యేక అధికారి శారద, ఏటీపీలు ప్రభాకర్, అపర్ణ తదితరులు పాల్గొన్నారు. భూముల పరిశీలన.. గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రహదారి నిర్మాణంలో కోల్పోతున్న రైతుల వ్యవసాయ భూములను కలెక్టర్ రాహుల్ శర్మ మంగళవారం నేషనల్ హైవే అధికారులతో కలిసి పరిశీలించారు. మండలంలోని ఇస్సీపేట, రంగాపురం గ్రామాలలో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవేలో భూములు కోల్పుతున్న రైతులతో మాట్లాడారు. నాగ్పూర్ నుంచి విజయవాడ వరకు నూతనంగా నిర్మిస్తున్న నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే భూపాలపల్లి జిల్లాలో టేకుమట్ల, చిట్యాల, మొగుళ్లపల్లి మండలాల్లోని పలు గ్రామాల మీదుగా వెళ్తున్న క్రమంలో భూ సేకరణ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. మొగుళ్లపల్లి మండలంలోని ఇస్సీపేట, రంగాపూర్, మేదరమెట్ల, మొగుళ్లపల్లి గ్రామాల్లో సుమారు 8.78 కిలోమీటర్ల మేర నేషనల్ హైవే వెళ్తున్న క్రమంలో రైతులనుంచి భూసేకరణ చేపట్టామని, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రైతులకు పరిహారం అందిస్తామన్నారు. రంగాపూర్ గ్రామ శివారులో 20 ఎకరాల విస్తీర్ణంలో రెస్ట్ పాయింట్ (పార్కింగ్ ఏరియా)ఏర్పాటు చేస్తున్నారని నేషనల్ హైవే అధికారులతో మాట్లాడి దానిని ప్రభుత్వ భూమి ఉన్న చోటకు మార్చాలని రైతులు కోరగా నేషనల్ హైవే అధికారులతో మాట్లాడి మార్చుటకు ప్రయత్నిస్తానని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో నేషనల్ హైవే పీడీ దుర్గా ప్రసాద్, ఉద్యానవన శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి, ఏడీ సునీల్, ఆర్డీఓ రవి, తహసీల్దార్ సునీత, రైతులు పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్శర్మ -
ఉపాధ్యాయులు సమర్థవంతంగా పనిచేయాలి
భూపాలపల్లి అర్బన్: ఉపాధ్యాయులు సమర్థవంతంగా పని చేసి విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దాలని డీఈఓ రాజేందర్ ఆదేశించారు. మున్సిపల్ పరిధిలోని జంగేడు ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న ఎఫ్ఎల్ఎన్, ఎల్ఐపీ కార్యక్రమాల అమలు తీరును పరిశీలించారు. విద్యార్ధులు చదవడం, రాయడం, సంఖ్యా భావన, ప్రక్రియల చతుర్విద ప్రక్రియల్లో సామర్థ్యాలను పరిశీలించి, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. వార్షిక పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించే విధంగా చదువుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీసీఈబీ కార్యదర్శి చంద్రశేఖర్, సెక్టోరియల్ అధికారి రాజగోపాల్, ఉపాధ్యాయులు పాల్గోన్నారు. సాంకేతికతను వినియోగించాలి రేగొండ: విద్యా భోధనలో సాంకేతిక నైపుణ్యాలను వినియోగించి, భోదించడం వల్ల అర్థవంతమైన విద్యాభోదన సాధ్యమౌతుందని డీఈఓ రాజేందర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో కొనసాగుతున్న కాంప్లెక్స్ స్థాయి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్(ఐఎఫ్పీ)పై నిర్వహిస్తున్న శిక్షణా శిబిరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ తరగతులను కొనసాగించడం వల్ల విద్యార్థి ప్రత్యక్ష అనుభూతికి లోపై అవగాహన చేసుకుంటాడని అన్నారు. తరగతిలో అవసరం మేరకు సాంకేతికతను వినియోగించాలన్నారు. అలాగే కోటంచ ప్రాథమిక పాటశాలలో విద్యార్థుల గణిత నైపుణ్యాలను పరిశీలించి, ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం మధ్యాహ్న భోజన విధానాన్ని పరిశీలించారు. శిక్షణ శిబిరంలో మండల విద్యాధికారి వేల్పుల ప్రభాకర్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కృష్ణకుమారి, క్వాలిటీ కో ఆర్డినేటర్ లక్ష్మన్, ప్లానింగ్ కో ఆర్డినేటర్ రాజగోపాల్, డీసీఈబీ అసిస్టెంట్ సెక్రెటరీ కిషన్రెడ్డి ఉన్నారు.డీఈఓ రాజేందర్ -
ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ పోటీలు
భూపాలపల్లి అర్బన్: జిల్లా ఫిజికల్ సైన్స్ ఫోరం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ పోటీలను నిర్వహించినట్లు ఫోరం జిల్లా అధ్యక్షుడు రఘునాథ్రెడ్డి తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన ఈ పోటీల్లో ప్రథమ బహుమతి ఎన్.సందీప్ (టైబల్ వెల్ఫేర్ కాటారం), రెండో బహుమతి కె.అలేఖ్య(జెడ్పీహెచ్ఎస్ కాళేశ్వరం), మూడో బహుమతి అభి రఘువరన్కల్యాణ్ (ట్రైబల్ వెల్ఫేర్, కాటారం) సాఽధించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారులు లక్ష్మన్, రమేష్, రాజగోపాల్, జిల్లా సైన్స్ అధికారి బర్ల స్వామి, ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి గండు రాజబాబు, ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయుడు రమేష్, విద్యార్థులు పాల్గొన్నారు. -
బొమ్మల కొలువు
భూపాలపల్లి అర్బన్: మంజూర్నగర్లోని ఇల్లందు లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం సింగరేణి ఏరియాలో బొమ్మల కొలువు నిర్వహించారు. భువనగిరి సమీపంలోని స్వర్ణగిరి దేవాలయం నమూనాతో ఏర్పాటు చేసిన బొ మ్మల కొలువు ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సింగరేణి సీఎండీ సతీ మణి శారద బలరాం హాజరై సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏరియా సేవా సమితి అధ్యక్షురాలు సునీత రాజేశ్వర్రెడ్డి, లేడీస్ క్లబ్ సభ్యులు హాజరయ్యారు. బొమ్మల కొలువును ప్రారంభిస్తున్న సీఎండీ సతీమణి శారద -
ఫిర్యాదులను పెండింగ్లో ఉంచొద్దు
భూపాలపల్లి: ప్రజల ఫిర్యాదులను పెండింగ్లో ఉంచొద్దని ఎస్పీ కిరణ్ ఖరే జిల్లాలోని పోలీసు అధికారులకు సూచించారు. సోమవారం ప్రజాదివస్ కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో వివిధ సమస్యలపై వచ్చిన బాధితుల నుంచి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్చేసి చట్టపరంగా చర్యలు తీసుకొని బాధితులకు న్యాయంచేయాలని ఆదేశించారు. ఆయా ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను నిర్ణీత సమయంలో జిల్లా పోలీస్ కార్యాలయానికి నివేదిక రూపంలో పంపించాలని ఆదేశించారు.ఎస్పీ కిరణ్ ఖరే -
పోటెత్తిన ఎర్రబంగారం
మిర్చి సీజన్ ఊపందుకోవడంతో వరంగల్ ఏనుమాముల మార్కెట్లో విక్రయించేందుకు రైతులు పెద్ద మొత్తంలో మిర్చి బస్తాలు తీసుకువస్తున్నారు.– 8లోuఈ ఫొటోలో కనిస్తున్నది జిల్లా కేంద్రంలోని భూపాలపల్లి సబ్సెంటర్–2. 2023 ఆగస్టు మాసంలో అప్పటి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పనులు ప్రారంభించారు. రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు పనులు పూర్తికాలేదు. ఫిల్లర్ల దశలోనే ఉంది. ఎనిమిది నెలలుగా పనులు నిలిచిపోయాయి. సొంత భవనం లేకపోవడంలో అద్డె భవనంలో సబ్ సెంటర్ కొనసాగుతుండగా.. సరైన సౌకర్యాలు లేక అక్కడికి వచ్చే బాలింతలు, గర్భిణులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. -
పకడ్బందీగా పోలింగ్ ప్రక్రియ
భూపాలపల్లి: ఈ నెల 27న జరుగనున్న ఖమ్మం, నల్లగొండ, వరంగల్ ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నిక పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. ఎన్నికల నిర్వహణకు విధులు కేటాయించిన పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు, రూటు, సెక్టార్, నోడల్ అధికారులకు సోమవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల పోలింగ్ నిర్వహణపై సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. భూపాలపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా 329 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఏడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికలకు 13మంది పీఓలు, 12మంది ఏపీఓలు, 24మంది ఓపీఓలను నియమించామని తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కుకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, శిక్షణ నోడల్ అధికారి సీపీఓ బాబురావు, ఆర్డీఓ రవి తదితరులు పాల్గొన్నారు. బోర్లు మంజూరు చేయాలి.. మా తోట కార్యక్రమంలో భాగంగా పండ్లతోటలు సాగు చేస్తున్న రైతులకు బోర్ బావులు మంజూరు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయపు కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం రెవెన్యూ, అటవీ, ‘మా తోట’ రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహాముత్తారం మండలంలోని పలు గ్రామాల్లో నాబార్డు ఆధ్వర్యంలో మా తోట కార్యక్రమాన్ని చేపట్టి గిరిజన రైతులు పండ్ల తోటలు సాగు చేస్తున్నారని తెలిపారు. రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకొని మొక్కల సంరక్షణకు నీటి సౌకర్యం కల్పించాల్సి ఉన్నందున ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పొందిన రైతులకు బోరుబావులు మంజూరు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో కాటారం సబ్కలెక్టర్ మయాంక్సింగ్, అదనపు కలెక్టర్ అశోక్కుమార్, డీఎఫ్ఓ నవీన్రెడ్డి పాల్గొన్నారు. రైతులకు బోర్లు మంజూరు చేయాలి కలెక్టర్ రాహుల్ శర్మ -
జోరుగా ‘ఉపాధ్యాయ’ నామినేషన్లు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానానికి చివరిరోజు అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. అభ్యర్థులనుంచి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి నామినేషన్లు స్వీకరించారు. సోమవారం 18 మంది అభ్యర్థులు 27 సెట్ల నామినేషన్లు వేయగా.. మొత్తంగా 23 మంది 50 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. సోమవారం నామినేషన్ల స్వీకరణకు చివరి రోజు కావడంతో పెద్దఎత్తున సమావేశాలు, ర్యాలీలు నిర్వహించి దాఖలు వేశారు. నామినేషన్ల ఘట్టం ముగియడంతో మంగళవారం వాటి పరిశీలన జరగనుంది. వాటిల్లో నిబంధనలకు అనుగుణంగా లేని నామినేషన్లను తిరస్కరిస్తారు. ఈనెల 13వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది. ఆ తరువాత పోటీలో ఉండే అభ్యర్థులు ఖరారు కానున్నారు. ఈనెల 27న పోలింగ్ జరగనుంది. మార్చి 3న కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లపై అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది. భారీగా సమావేశాలు, ర్యాలీలు ఇంతకుముందే నామినేషన్లు వేసిన వారు కూడా సోమవారం పెద్దఎత్తున సమావేశాలు, ర్యాలీలు నిర్వహించి మరోసెట్ దాఖలు చేశారు. అందులో ప్రధాన సంఘాల మద్దతు కలిగిన అభ్యర్థులైన పింగిళి శ్రీపాల్రెడ్డి, పులి సరోత్తమ్రెడ్డి, పూల రవీందర్, ఎస్.సుందర్రాజు యాదవ్ తదితరులు నామినేషన్ పత్రాలను సమర్పించారు. పూల రవీందర్ బహుజన వాదంతో పెద్దఎత్తున ఎన్జీ కాలేజీ నుంచి ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేయగా, పీఆర్టీయూ–టీఎస్ అభ్యర్థి పింగిళి శ్రీపాల్రెడ్డి కూడా ఎన్జీ కాలేజీ నుంచి ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. అలాగే బీజేపీ అభ్యర్థిగా, టీపీయూఎస్ మద్దతుతో పులి సరోత్తంరెడ్డి భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్ సమర్పించారు. సుందర్రాజు యాదవ్ వాహనాల్లో ర్యాలీగా వచ్చి నామినేషన్ వేశారు. సుందర్రాజుయాదవ్, పూల రవీందర్ నామినేషన్ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో పాటు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్ధి సరోత్తంరెడ్డి నామినేషన్ కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. టీఎస్ యూటీఎఫ్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, టీచర్స్ జేఏసీ అభ్యర్థి, టీపీసీసీ అధికార ప్రతినిధి గాల్రెడ్డి హర్షవర్ధన్రెడ్డి గతంలోనే పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించి నామినేషన్లు దాఖలు చేశారు. ఇక చివరి రోజు కూడా హర్షవర్ధన్రెడ్డి తరఫున ఆయన కూతురు హేమంత సంధ్యారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఇలా మొత్తంగా 23 మంది 50 సెట్ల నామినేషన్లు వేశారు. 13 వరకు ఉపసంహరణ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి నామినేషన్ల ప్రక్రియ పూర్తయినందున బుధ, గురువారాల్లో నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. 13వ తేదీన 3 గంటల్లోగా నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంది. ఆ తర్వాత పోటీలో ఉండే అభ్యర్థులను ప్రకటిస్తారు.ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి చివరి రోజున 18 మంది నామినేషన్ మొత్తంగా 23 మంది 50 సెట్లు దాఖలు భారీ ర్యాలీలతో హోరెత్తిన నల్లగొండ నేడు నామినేషన్ల పరిశీలనఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల సంఖ్య 25,797 నల్లగొండ: వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు పెరిగారు. డిసెంబరు 30న ప్రకటించిన జాబితా ప్రకారం ఉపాధ్యాయ ఓటర్లు 24,905 మంది ఉన్నారు. అయితే నామినేషన్ల వరకు కూడా ఓటు నమోదుకు అవకాశం కల్పించారు. దీంతో మరో 892 మంది ఓటర్లు కొత్తగా ఓటు నమోదు చేసుకున్నారు. తుది ఓటరు జాబితాకు ఈ సప్లిమెంటరీ జాబితా జత చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో మొత్తం 25,797 మంది ఓటర్లు ఉన్నారు. -
మినీ మేడారానికి సిద్ధం
వాతావరణం జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఉంటుంది. రాత్రివేళ కాస్త చలితో పాటు మంచు కురుస్తుంది.– 8లోuఎస్ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క సారలమ్మ మినీ జాతరకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఈనెల 12 నుంచి 15వ తేదీ జరగనున్న జాతరకు వచ్చే భక్తుల సేవల కోసం అన్ని ఏర్పాట్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆర్టీసీ కూడాబస్టాండ్ కంట్రోల్ పాయింట్ ఏర్పాటు చేశారు. ఆగ్ని ప్రమాదాలు సంభవిస్తే నివారించేందుకు మేడారం ఎండోమెంట్ కార్యాలయంలో ఒక ఫైర్ ఇంజన్ను అందుబాటులో ఉంచారు. అడుగడుగునా నిఘా.. మేడారంలో భక్తుల రద్దీ, దొంగలు చేతివాటం ప్రదర్శించకుండా నిత్యం పర్యవేక్షించేందుకు అర్టీసీ బస్టాండ్ ప్రాంతం, ఆర్టీసీ వై జంక్షన్, మేడారం ఐలాండ్ ప్రాంతం, గద్దెల ప్రాంగణం, జంపన్నవాగు, తదితర ప్రాంతాల్లో గతంలో ఉన్న సీసీ కెమెరాలను మరమ్మతులు చేయించారు. అన్నింటినీ మేడారంలోని కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానించారు. ఫుటేజీలను నిత్యం అధికారులు పర్యవేక్షిస్తున్నారు. తాత్కాలిక డ్రెసింగ్ గదుల ఏర్పాటు జంపన్నవాగు స్నానఘట్టాల వద్ద భక్తులు దుస్తులు మార్చుకునేందుకు జీఆర్ షీట్స్తో 10 తాత్కాలిక డ్రెసింగ్ గదులను అందుబాటులో ఉంచారు. భక్తుల జల్లు స్నానాల కోసం కూడా 10 బాటరీ ఆఫ్ ట్యాప్లను ఏర్పాటు చేశారు. ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు జిల్లా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేస్తున్నారు. వ్యాపారస్తులకు కోళ్ల, మేకల వ్యర్థాలను వేసేందుకు డస్ట్బిన్లను పంపిణీ చేశారు. జాతరకు వచ్చే భక్తులు అమ్మవార్లకు మొక్కుగా కోళ్ల సమర్పిచండంతో ఎక్కడపడితే అక్కడ వ్యర్థాలు వేయకుండా షాపుల వద్ద డస్ట్బిన్లను ఏర్పాటు చేశారు. గద్దెల సమీపంలో, రోడ్ల వెంట, భక్తులు విడిది చేసే షెడ్ల వద్ద ఈగలు, దోమలు వ్యాపించకుండా కెమికల్ పిచికారీ చేశారు. – వివరాలు 8లోu ముగింపు దశకు చేరుకున్న పనులు రేపటినుంచి 15వ తేదీ వరకు జాతరభారీ పోలీస్ బందోబస్తు జాతర విధులకు వెయ్యి మంది సిబ్బంది బుధవారం నుంచి ఆదివారం వరకు కొనసాగనున్న భద్రత -
మళ్లీ పులి సంచారం..!
కాటారం: మండలంలోని నస్తూర్పల్లి అటవీ ప్రాంతంలో పులి సంచారం ప్రకంపనలు సృష్టిస్తుంది. అడవి ప్రాంతంలో తప్పిపోయిన ఎద్దు కోసం వెళ్లిన వ్యక్తికి పులి కనిపించినట్లు ప్రచారం జరగడంతో ఆ దిశగా విచారణ చేపట్టిన అటవీశాఖ అధికారులకు ఆనవాళ్లు కనిపించాయి. కాటారం మండలం నస్తూర్పల్లికి చెందిన ఓ వ్యక్తి ఎద్దు తప్పిపోవడంతో సోమవారం తెల్లవారుజామున ఎద్దు జాడ కోసం సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లాడు. ఎద్దు ఆచూకీ లభించడంతో తిరిగి వస్తున్న క్రమంలో పులి వెళ్లడం గమనించినట్లు పలువురు గ్రామస్తులకు తెలిపాడు. దీంతో అటవీశాఖ అధికారులకు సమాచారం చేరడంతో అటవీ ప్రాంతానికి చేరుకొని పులి సంచారంపై విచారణ చేపట్టారు. మహారాష్ట్ర టు చెన్నూర్.. రెండేళ్ల క్రితం డిసెంబర్, జనవరి మాసంలో మండలంలో పులి సంచరించినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించి పూర్తి నిఘా పెట్టారు. కానీ పులి మండలంలో పలు ప్రాంతాల్లో తిరిగాడి చివరగా అదిలాబాద్ ఉమ్మడి జిల్లా చెన్నూర్ వైపుగా వెళ్లినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం కూడా మహారాష్ట్ర నుంచి మహదేవపూర్ అటవీప్రాంతం మీదుగా మండలంలోకి ప్రవేశించిన పులి ఒడిపిలవంచ, జాదారావుపేట, దామెరకుంట లేదా విలాసాగర్ మీదుగా చెన్నూర్ అటవీ ప్రాంతంలోకి చేరే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాంతంలోని అటవిలో నీటి వనరులు, శాఖాహార జంతువుల సంఖ్య తక్కువగా ఉండటంతో పులి నిలకడగా ఉండే పరిస్థితి లేదంటున్నారు. పులి అలజడి మొదలవడంతో అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి పూట అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని ప్రజలు అధికారులకు సూచిస్తున్నారు. పాదముద్రలు సేకరించాం.. నస్తూర్పల్లి గ్రామానికి సమీపంలో అటవీప్రాంతంలో పులిని చూసినట్లు ఓ వ్యక్తి చెప్పడంతో సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లాం. పలుచోట్ల పాదముద్రలను గుర్తించి సేకరించాం. మరింత సమాచారం సేకరిస్తే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి పులి ఎటు వైపు నుంచి ఎటు వెళ్లింది అని తెలుసుకుంటాం. – రాజేశ్వర్, డిప్యూటీ రేంజర్, మహదేవపూర్అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు -
అసంపూర్తిగా పల్లె దవాఖాన నిర్మాణాలు
మంగళవారం శ్రీ 11 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025సా..గుతున్న పనులుభూపాలపల్లి అర్బన్: పల్లె దవాఖాన భవన నిర్మాణ పనులు మూడేళ్లుగా సా..గుతున్నాయి. దీంతో పల్లె దవాఖానాలను అద్దె భవనాల్లో కొనసాగిస్తున్నారు. పనులు ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా.. 17 భవనాల పనులు మాత్రమే పూర్తిచేశారు. జిల్లాలో ఉపకేంద్రాల పరిస్థితి జిల్లాలోని 13 ప్రాథమిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 90 ఉపకేంద్రాలు ఉన్నాయి. వాటిలో 21 పాత భవనాలలో నిర్వహిస్తున్నారు. 63 భవనాలకు అఽధికారులు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు. వాటిలో ఆరు భవనాలకు మినహా మిగితా 57కు అనుమతులు జారీచేసి నిధులు కేటాయించారు. నేషనల్ హెల్త్ మిషన్ పథకంలో 41 భవనాలు, 15వ ఆర్థిక సంఘం నిధుల కింద ఆరు భవనాలు, ఐటీడీఏ కింద రెండు, రూర్బన్ పథకంలో రెండు భవనాలకు నిధులు మంజూరయ్యారు. ఒక్కో భవనానికి రూ.20లక్షలతో పనులు చేపడుతున్నారు. ఎన్హెచ్ఎం కింద ఒక భవనానికి టెండర్ కాలేదు. 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరైనా ఆరు భవనాల పనులు చేపట్టగా.. నిధులు రాక అసంపూర్తిగా నిలిచిపోయాయి. ఎన్హెచ్ఎం కింద ఆరు భవనాలు మాత్రమే పూర్తిచేయగా మిగతా 15 నిర్మాణ దశలో ఉండగా.. ఇంకా నాలుగు నిర్మాణ పనులే ప్రారంభించలేదు. ఆరు గ్రామాల్లో స్థల వివాదాలు ఉన్నాయి. నిధులు రాక నిర్మాణాలు ఆలస్యం.. జిల్లాలో ఎన్హెచ్ఎం, 15వ ఆర్థిక సంఘం నిధులతో గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో 57 ఆరోగ్య ఉపకేంద్రాల భవనాలకు నిధులు మంజూరయ్యాయి. నిధులు రాక పలుచోట్ల భవన నిర్మాణ పనులు నిలిపివేశారు. ఇటీవల నిధులు విడుదలయ్యాయి. సంబంధిత కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి పనులు వేగవంతం చేస్తాం. పనులు పూర్తిచేసిన భవనాలు ప్రారంభించాం. – డాక్టర్ మధుసూదన్, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి●న్యూస్రీల్ఆయా మండలాల పరిధిలో..వివిధ మండలాల పీహెచ్సీల పరిధిలోని ఇస్సిపేట, కొత్తపల్లిగోరి, చల్లగరిగె, బుద్దారం, మైలారం, వేములపల్లి, గణపురం–1, రాఘవరెడ్డిపేట, నిజాంపల్లి, రేగులగూడెం, జూకల్ గ్రామాల్లో పనులు ప్రారంభంకాలేదు. పలిమెల, భూపాలపల్లి–2, కొండాపూర్, సీతారాంపూర్, ఒడిపిలవంచ, మెట్లపల్లి, పిడిసిల్ల, రంగాపూర్, కనిపర్తి, తాడిచర్ల–1, గర్మిళ్లపల్లి, వెలిశాల, కోటంచ, ఎడ్లపల్లి, టేకుమట్ల, కొత్తపల్లి, భాగిర్తిపేట, చెన్నాపూర్, రంగయ్యపల్లి, సుల్తాన్పూర్, మడ్తపల్లి, మొగుళ్లపల్లి గ్రామాల్లోని సబ్సెంటర్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో అర్ధాంతరంగా నిలిచిపోయాయి. మూడేళ్లలో పూర్తి చేసినవి 17 భవనాలే.. జిల్లాలో 90 సబ్ సెంటర్లు నూతనంగా 57 సబ్ సెంటర్లకు నిధులు మంజూరు పలు గ్రామాల్లో స్థల వివాదాలు -
ఉచిత శిక్షణకు దరఖాస్తులు
భూపాలపల్లి రూరల్: గ్రూప్–1, 2, 3, 4, బ్యాంకింగ్, ఆర్ఆర్బీ పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు, ఉచిత శిక్షణ కోసం ఈనెల 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారిణి శైలజ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని అల్ప సంఖ్యాక వర్గాల నిరుద్యోగ యువతీ యువకులు, డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులు అర్హులన్నారు. దరఖాస్తు ఫారంతో పాటు, సంబంధిత ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాలకు జిల్లా అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ అధికారి కార్యాలయం, కలెక్టరేట్, రూమ్ నంబర్ 5లో సంప్రదించాలన్నారు. బ్లాక్ లెవల్ క్రీడాపోటీలు భూపాలపల్లి అర్బన్: నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీ నుంచి బ్లాక్ లెవల్ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు నెహ్రూ యువ కేంద్రం జిల్లా అధికారి చింతల అన్వేష్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాలీబాల్, గ్రూప్ రన్నింగ్, షెటిల్ సింగిల్స్, కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో 18 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల వయస్సులోపు ఆసక్తిగల యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆసక్తి గల క్రీడాకారులు జిల్లా యూత్ క్లబ్ అధ్యక్షుడు చల్ల దీపక్ 75697 68191 ఫోన్ నంబర్ను సంప్రదించాలని కోరారు. ఉత్తమ సేవలు భూపాలపల్లి రూరల్: విద్యుత్ వినియోగదారులకు కొత్త విద్యుత్ సర్వీసుల మంజూరు మరింత సులభతరం చేశామని జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ మల్చూర్ నాయక్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వినియోగదారు డు తన అప్లికేషన్ స్థితిని ట్రాకింగ్ సిస్టంద్వారా తెలుసుకోవడానికి వెసులుబాటు కల్పించామన్నారు. అప్లికేషన్ నంబర్తో టీజీఎన్పీడీసీఎల్ వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. వినియోగదారుడు మరింత సమాచారం తెలుసుకోవడానికి 1912కి ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని పేర్కొన్నారు. జిల్లాలో బర్డ్ఫ్లూలేదు భూపాలపల్లి రూరల్: జిల్లాలో కోళ్లకు బర్డ్ఫ్లూ లేదని, వినియోగదారులు, కోళ్ల యజమానులు అధైర్యపడవద్దని జిల్లా పశు, సంవర్ధక శాఖ అధికారి కుమారస్వామి అశోద సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ వ్యాధి ఎక్కువగా చలిలో వ్యాప్తి చెందుతుందని, ఇప్పటికే జిల్లాలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవుతున్నాయని కోళ్లకు ఇబ్బంది లేదన్నారు. కోళ్లు నిరసించినట్లయితే మండల పశువైద్యాధికారుల సలహాలు సూచనలు తీసుకోవాలన్నారు. ఈ వ్యాధి నివారణ అవగాహన కోసం కోళ్ల ఫారాల యజమానులతో 12న బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని ఐడీఓసీ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. తాడిచర్లలో క్షుద్రపూజల కలకలం మల్హర్: తాడిచర్ల శివారులోని తోళ్లపాయ వైపు.. పెద్దమ్మ గుడి, బీసీ కాలనీ పోయే మూడు బాటల వద్ద ఆదివారం అర్ధరాత్రి క్షుద్ర పూజలు చేయడం కలకలం రేగింది. మూడు రోడ్లు కలిసే చోట నిమ్మకాయలు, పసుపు, కుంకుమలతో కూడిన ముద్దలు చేసి, గొర్రె పిల్లను బలిచ్చారు. క్షుద్రపూజల ఆనవాళ్లు కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురువుతున్నారు. ఈ ప్రాంతంలో పొలాలు ఉన్న రైతులు అటుగా వెళ్లడానికి భయపడుతున్నారు. మరి కొంతమంది రైతులు బిక్కుబిక్కుమంటూ వారి పనులకు వెళ్తున్నారు. -
నామినేషన్ల ఘట్టానికి నేటితో తెర
సాక్షిప్రతినిధి, వరంగల్ : వరంగల్–నల్లగొండ–ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం సోమవారం ముగియనుంది. ఎన్నికల కమిషన్ జనవరి 29న షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. శుక్రవారం నాటికి పూర్వ వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల నుంచి ఉపాధ్యాయ ప్రధాన సంఘాలు బలపరిచిన అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కలిపి 17 మంది 23 సెట్లలో నామినేషన్లు వేసినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. శనివారం, ఆదివారం సెలవు కావడంతో ఆశావహులందరూ చివరి రోజైన సోమవారం నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. రేపు పరిశీలన.. 13న ఉప సంహరణ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు 13 మంది స్వతంత్రులు 16 సెట్లలో నామినేషన్లు వేశారు. ప్రధాన సంఘాలు బలపరిచిన నలుగురు మరో ఏడు సెట్లలో నామినేషన్లు భారీ ర్యాలీల నడుమ దాఖలు చేశారు. ఇప్పటి వరకు బీజేపీ అభ్యర్థిగా పులి సరోత్తం రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి టీచర్స్ జేఏసీ మద్దతుతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఎమ్మెల్సీ, టీఎస్యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి, పీఆర్టీయూ–టీఎస్ అభ్యర్థి పింగిళి శ్రీపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవిందర్, ఏలే చంద్రమోహన్, దామెర బాబూరావు, తలకొప్పుల పురుషోత్తంరెడ్డి, డాక్టర్ పోలెపాక వెంకటస్వామి, సంగంరెడ్డి సుందర్రాజ్, చాలిక చంద్రశేఖర్, కంటె సాయన్న తదితరులు నామినేషన్ వేసిన వారిలో ఉన్నారు. సోమవారం కూడా పూర్వ మూడు జిల్లాల నుంచి నామినేషన్లు వేసేందుకు నల్లగొండకు తరలనుండగా.. మరుసటి రోజు మంగళవారం ఎన్నికల అధికారులు నామినేషన్ పత్రాలను పరిశీలించనున్నారు. 13న నామినేషన్ల ఉపసంహరణ.. అదే రోజు సాయంత్రం బరిలో ఉండే అభ్యర్థుల పేర్లు, గుర్తులు, ఖరారు కానున్నాయి.రసవత్తరంగా ‘ఉపాధ్యాయ’ పోరు..ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ఈనెల 14 నుంచి రసవత్తరంగా మారనుంది. ప్రచారం హోరెత్తించేందుకు అభ్యర్థులు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో 191 మండలాల నుంచి 24,905 మంది ఉపాధ్యాయులు తమ ఓటుహక్కును వినియోగించుకోనుండగా.. హనుమకొండ జిల్లాలో అత్యధికంగా పురుషులు, సీ్త్ర ఓటర్లు కలిపి 5,098 మంది ఉండగా.. అత్యల్పంగా సిద్దిపేట జిల్లాలోని నాలుగు మండలాల నుంచి 163 మంది ఉన్నారు. నల్లగొండ జిల్లాలో 4,483, ఖమ్మం 3,955, సూర్యాపేట 2,637, వరంగల్ 2,225, భద్రాద్రి కొత్తగూడెం1,949, మహబూబాబాద్1,618, యాదాద్రి 921, జనగామ 921, ములుగు 612, జయశంకర్ భూపాలపల్లిలో 323 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు. కాగా నామినేషన్ల ఘట్టం ముగియడమే తరువాయి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారనుందన్న చర్చ ఆ వర్గాల్లో సాగుతోంది. ఇప్పటికే 23 సెట్లలో 17 మంది నామినేషన్లు.. రేపు పరిశీలన.. 13న ఉపసంహరణ సై అంటే సై అంటున్న స్వతంత్ర అభ్యర్థులు రసవత్తరంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు -
గాసం.. గోస
● వర్షాభావ పరిస్థితులతో దెబ్బతిన్న పంట పొలాలు ● తగ్గిన ఎండుగడ్డి దిగుబడి ● ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు ● పశుపోషకులు, రైతులకు పెరుగుతున్న భారంకాటారం: ఒకప్పుడు పశుగ్రాసానికి నిలయాలుగా నిలిచిన పల్లెలో ప్రస్తుతం పశుగ్రాసం కొరత తీవ్రస్థాయిలో నెలకొంది. జిల్లాలోని పలు పల్లెల్లో సరిపడేంత పశుగ్రాసం లేకపోవడంతో పశుపోషకులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పశుగ్రాసం లేమి కారణంగా తమ పశువుల పోషణ భారంగా మారుతుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గ్రామాల్లో ఎక్కడ కూడా పశుగ్రాసం లేకపోవడంతో రైతులు, పశుపోషకులు ఇతర ప్రాంతాల నుంచి పశుగ్రాసాన్ని కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో రైతులకు, పశుపోషకులపై తీవ్ర ఆర్థిక భారం పడుతుంది. మూగజీవాలకు దొరకని ఎండుగడ్డి.. జిల్లాలో 90శాతం గ్రామాలన్నీ వ్యవసాయాధారిత కుటుంబాలే కావడంతో పశుపోషణ అధికంగా ఉంటుంది. ప్రతి కుటుంబంలో గేదెలు, ఆవులు, ఎద్దులు తప్పనిసరిగా ఉన్నాయి. వర్షాకాలంలో పంట పొలాలు, ఇతరత్రా తోటల సాగు అధికంగా ఉండటంతో పశుగ్రాసం కొరత అంతంత మాత్రమే ఉంటుంది. చలికాలం, వేసవి కాలం సమీపిస్తే పచ్చగడ్డి దొరికే అవకాశం లేకపోవడంతో మూగజీవాలకు ఎండుగడ్డే దిక్కవుతుంది. ఈ ప్రాంతంలో ఎడ్డుగడ్డి సరిగా దొరికే పరిస్థితి లేకపోవడంతో మూగజీవాలు గాసం కోసం తల్లడిల్లిపోతున్నాయి. గ్రామాల్లోని పశువులు సమీపంలో అటవీ ప్రాంతంలోకి వెళ్లి ఆకులు, చెరువులోని తుంగ, ఇతరత్రా వాటిని తిని కడుపునింపుకుంటున్నాయి. పశుగ్రాసాన్ని తెచ్చే స్థోమత లేకపోవడంలో పలువురు రైతులు తమ పశువులను ఊరి మీద వదిలేస్తున్న దాఖలాలు లేకపోలేదు. వర్షం, వరదల ప్రభావంతో.. జిల్లాలో వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా వానాకాలంలో రైతులు సాగుచేసిన పంట పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వర్షాల కారణంగా చెరువులు, కుంటలు తెగిపోవడంతో పాటు వరదలు పోటెత్తడంతో పంట పొలాలు కొట్టుకుపోవడం, ఇసుక మేటలు వేసి దెబ్బతిన్నాయి. కాటారం మండలం దామెరకుంట, గుండ్రాత్పల్లి, గంగపురి, గంగారం, విలాసాగర్, వీరాపూర్, ఇబ్రహీంపల్లి, చింతకాని, పోతుల్వాయి, మహదేవపూర్ మండలం అంబట్పల్లి, మేడిగడ్డ, బ్రాహ్మణపల్లి, మల్హర్ మండలం మానేరు ఆయకట్టు పొలాలు, మహాముత్తారం మండలంలో పలు చెరువులు తెగడంతో ఆయకట్టు పొలాలు నీట ముని గాయి. జిల్లాలో సాగు విస్తీర్ణం గతంతో పోల్చుకుంటే పెరిగినప్పటికీ వర్షం, వరదల కారణంగా దిగుబడి మాత్రం తీవ్రంగా తగ్గిపోయింది. దీని కారణంగా ఎండుగడ్డి కొరత సమస్య జఠిలమైంది.ఎండుగడ్డికి భలే గిరాకీ.. గ్రామాల్లో సరిగా పశుగ్రాసం లభించకపోవడంతో ఎండుగడ్డికి భలే గిరాకీ నెలకొంటుంది. ఒకప్పుడు రూ.3 నుంచి రూ.5 పలికిన ఎండుగడ్డి పంజ ప్రస్తుతం రూ.15 నుంచి రూ.20కి పెరిగిపోయింది. మిషన్ ద్వారా కోసిన పొలం గడ్డిని రైతులు ఎకరాకు రూ.2వేల నుంచి 3వేలకు విక్రయించే వారు కానీ ప్రస్తుతం రూ.6వేల నుంచి 7వేల వరకు ధర పలుకుతుంది. ఎండుగడ్డి ధరలు కొండనంటుతున్నప్పటికీ తమ మూగజీవాల కోసం పశుపోషకులు పశుగ్రాసాన్ని కొనుగోలు చేస్తున్నారు. కొన్ని పశువులు మిషన్ ద్వారా కోసిన గడ్డిని తినకపోవడంతో రైతులు అధిక ధర వెచ్చించి కూలీల ద్వారా సేకరించిన గడ్డిని కొనుగోలు చేస్తున్నారు. ఆయా గ్రామాలకు చెందిన పశుపోషకులు మంథని, అడవిసోమన్పల్లి, పెద్దపల్లి లాంటి ప్రాంతాల నుంచి అధిక ధర, రవాణా భారాలకు ఓర్చుకొని తెచ్చుకుంటున్నారు. -
నేటి ప్రజావాణి రద్దు..
భూపాలపల్లి రూరల్: నేడు కలెక్టరేట్లో జరుగనున్న ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దుచేసినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో శాసనమండలి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉందని, జిల్లా యంత్రాంగం ఎన్నికల విధుల్లో ఉన్నందున ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దుచేసినట్లు చెప్పారు. ప్రజలు గమనించాలని కలెక్టర్ సూచించారు. వైభవంగా ప్రతాపగిరి గుట్ట జాతర కాటారం: ప్రతాపగిరి గొంతెమ్మ గుట్టపై నిర్వహిస్తున్న గొంతెమ్మ లక్ష్మిదేవర గుట్ట జాతర ఆదివారం రెండో రోజు వైభవంగా కొనసాగింది. శనివారం ప్రారంభమైన జాతర వేడుక రెండో రోజు గుట్టపైకి లక్ష్మిదేవర, ఇతర దేవతామూర్తుల రాకతో సందడిగా మారింది. అంతకుముందు జాతర కమిటీ, ఆలయ కమిటీ, గిరిజన నాయక్పోడ్ సంఘాల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పలు గ్రామాల నుంచి తరలివచ్చిన లక్ష్మిదేవర బృందాలు డప్పు చప్పుళ్ల నడుమ సంప్రదాయ నృత్యాలతో ఆడిపాడారు. శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. అనంతరం గుట్టపైకి తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బీసుల రవీందర్, మేకల పోచయ్య, సంతోష్, కిష్టయ్య, ఎర్రయ్య, రాజేందర్, ధర్మరాజు, గ్రామస్తులు పాల్గొన్నారు. విరాళ దాతలు అసంతృప్తి కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్ధానంలో జరిగిన మహాకుంభాభిషేక మహోత్సవంలో పలు రకాలు విరాళం ఇచ్చిన దాతలు అసంతృప్తి చెందారు. ఆదివారం కుంభాభిషేకం ముగిసిన తరువాత కలశ దాతలు, ఇతర దాతలకు సన్మానం చేయాల్సి ఉంది. మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన మహేందర్ అనే భక్తులు రూ.లక్ష విరాళంగా అందజేశారు. కనీసం అతని పేరు పిలవలేదని, సన్మానం చేయలేదని వాపోయాడు. రూ.2,516 కలశపూజలకు విరాళంగా ఇచ్చిన భక్తులు కొంత మందిని పిలిచి మిగితా వారిని క్రమం ప్రకారం పిలువలేదని కొంతమంది భక్తులు దేవస్థానం ఉద్యోగులతో వాగ్వాదం జరిగింది. కొంతసేపు తరువాత వారికి నచ్చజెప్పి సన్మానించారు. నట్టల నివారణ మాత్రల పంపిణీ వాయిదా భూపాలపల్లి అర్బన్: నేడు జరగాల్సిన నట్టల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమం వాయిదా పడినట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ చల్ల మధుసూదన్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు నేటి కార్యక్రమాలను వాయిదా వేసినట్లు చెప్పారు. త్వరలో తేదీలను ప్రకటిస్తామని పేర్కొన్నారు. జిల్లా చైర్మన్గా గోవర్ధన్ భూపాలపల్లి అర్బన్: వర్డల్ కన్జ్యూమర్ రైట్స్ ఫోరమ్ జిల్లా చైర్మన్గా సిరంగి గోవర్ధన్ను నియమించినట్లు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ నలమాస శ్రీకాంత్ తెలిపారు. హనుమకొండలో ఆదివారం జరిగిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. జిల్లా వైస్ చైర్మన్లుగా గుండాల సునిల్చంద్ర, సురేష్, లతిష్, శ్రీనివాస్లను నియమించినట్లు తెలిపారు. హేమాచలక్షేత్రంలో భక్తుల కోలాహలంమంగపేట: మండల పరిధిలోని హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవురోజు కావడంతో ఆలయం ప్రాంగణంతో పాటు చింతామణి జలపాతం, వనదేవత ప్రాంతం కోలాహలంగా కనిపించింది. వివిధ వాహనాల్లో ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి హేమాచల కొండపై ఉన్న ఆలయానికి చేరుకున్నారు. భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లకు దర్శించుకుని పూలు, పండ్లు, పట్టు వస్త్రాలు సమర్పించారు. -
డంపింగ్యార్డుగా మారిన గుండం చెరువుకట్ట
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానంలో వ్యర్ధాలు, చెత్తచెదారాన్ని పడవేసి గుండం చెరువును డంపింగ్యార్డుగా మారుస్తున్నారు. మూడు రోజులుగా మహాకుంభాభిషేకం పూజలు నిర్వహించగా ఆలయంలోని చెత్తతో పాటు వ్యర్ధాలను చెరువుకట్ట వద్ద ఉన్న ఆర్చీగేటు సమీపంలో నిల్వ చేస్తున్నారు. దీంతో మిగిలిన ఆహార పదార్థాలు, తినిపారేసిన పేపర్పేట్లు, ఇతర ప్లాస్టిక్ కవర్లు వేయడంతో తీవ్రదుర్గంధం వెదజల్లుతుంది. కనీసం పంచాయతీ అదికారులు కూడా అటువైపు చూడలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దగ్గరలోని ఇళ్లకు, రోడ్డున వెళ్తున్న వారికి దుర్వాసన వస్తుందని వాపోతున్నారు. -
డీటీసీ పుప్పాల శ్రీనివాస్పై సస్పెన్షన్ వేటు?!
సాక్షిప్రతినిధి, వరంగల్ : రవాణాశాఖ వరంగల్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా పనిచేసిన పుప్పాల శ్రీనివాస్పై సస్పెన్షన్ వేటు పడినట్లు తెలిసింది. ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో అవినీతి నిరోధకశాఖ అధికారులు శ్రీనివాస్తో పాటు ఆయన బంధువులు, కుటుంబ సభ్యుల ఇళ్లలో ఈనెల 7న సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రూ.4.04 కోట్ల అక్రమాస్తులను ప్రాథమికంగా గుర్తించిన ఏసీబీ.. ఆయనపై అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13(1)(బి), 13(2)తో పాటు తెలంగాణ ఎకై ్సజ్ చట్టం–1968 కింద కేసులు మోపి వరంగల్లోని ఏసీబీ కోర్టులో హాజరు పర్చింది. ఈ మేరకు కోర్టు ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో పుప్పాల శ్రీనివాస్ను రవాణాశాఖ కమిషనర్ సస్పెండ్ చేసినట్లు అధికారవర్గాల సమాచారం. కాగా ఉమ్మడి వరంగల్కు నోడల్ అధికారిగా ఉన్న హనుమకొండ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పుప్పాల శ్రీనివాస్ స్థానంలో సీనియర్ డీటీసీని నియమించేందుకు కమిషనర్కు ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. త్వరలోనే ఉత్తర్వులు వెలువడనుండగా.. అంతకంటే ముందు సీనియర్ ఎంవీఐకి జిల్లా రవాణా శాఖ అధికారి(డీటీఓ)గా ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం రవాణాశాఖ హనుమకొండ జిల్లా కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ రమేష్ రాథోడ్కు, లేదంటే మరో ఎంవీఐ వేణుగోపాల్ రెడ్డిలో ఒకరికి ఇన్చార్జ్ డీటీఓ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. రెండు రోజుల్లో ఈ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని రవాణాశాఖ ఉన్నతాధికారవర్గాల ద్వారా తెలిసింది. అక్రమాస్తుల కేసులో రిమాండ్లో ఉన్న శ్రీనివాస్.. త్వరలోనే డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నియామకం మొదట సీనియర్ ఎంవీఐకి నేడు డీటీఓ బాధ్యతలు -
కాంగ్రెస్ పాలనలో ఎస్సీ, బీసీలకు న్యాయం
రేగొండ: కాంగ్రెస్ పాలనలో ఎస్సీ, బీసీలకు సముచిత న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. రేగొండ మండలకేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇప్పకాయల నర్సయ్య ఆధ్వర్యంలో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన ఎస్సీ, బీసీ కులగణన అవగాహన సదస్సులో ఎమ్మెల్యే మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఇంటింటి కులగణన సర్వేచేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించినట్లు తెలిపారు. 42శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, రాష్ట్ర నాయకులు నాయినేని సంపత్రావు, విజ్జన్రావు, గూటోజు కిష్టయ్య, పున్నం రవి, మైస భిక్షపతి, బొజ్జం రవి, మేకల భిక్షపతి పాల్గొన్నారు.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
ఇలా.. ‘నులి’మేద్దాం
● అన్ని కేంద్రాలకూ ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ ● జిల్లాలో 69,652మంది పిల్లలు రేపు నులి పురుగుల నివారణ కార్యక్రమంనులి పురుగులను నివారిస్తే మనం తింటున్న ఆహారంలోని పోషకాలను శరీరం గ్రహిస్తుంది. తద్వారా రక్తహీనతను నివారించవచ్చు. ఆరోగ్యం బాగుపడటంతో విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పాఠశాల, కళాశాలలకు వెళ్లేందుకు ఆసక్తి కలుగుతుంది. పని చేయగల సామర్థ్యం పెరుగుతుంది.భూపాలపల్లి అర్బన్: పిల్లల్లో అనేక వ్యాధులకు కారణమవుతున్న నులి పురుగుల నివారణకు జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక కార్యక్రమం చేపడుతోంది. నులి పురుగుల నిర్మూలనకు జిల్లాలోని 19ఏళ్ల లోపు పిల్లలు 69,652 మందికి ఈ నెల 10న ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నారు. జిల్లావ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, పాలిటెక్నిక్, ఒకేషనల్ కాలేజీలు, మెడికల్ కళాశాలలతో పాటు బడి బయట ఉన్న పిల్లలందరికీ ఈ మాత్రలు అందజేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. ఒకటి నుంచి రెండేళ్లలోపు పిల్లలకు సగం మాత్ర (200 ఎం.జీ), ఆపై వయస్సు పిల్లలకు ఒక పూర్తి మాత్ర (400 ఎంజీ) వేయనున్నారు. ఈ మాత్రలను ఇప్పటికే ఆయా కేంద్రాలకు పంపిణీ చేశారు. వ్యాపించే విధానం.. మనిషి శరీరంలోకి ఏలిక పాములు, నులి పురుగులు, కొంకెర పురుగులు అనే మూడు రకాల పురుగులు ప్రవేశిస్తుంటాయి. నులి పురుగులు ఉన్న వ్యక్తి మల విసర్జన చేయడం ద్వారా అందులోని గుడ్లు నేలలోకి తద్వారా తాగునీరు, గాలి ద్వారా ఆహార పదార్థాలపైకి చేరుతాయి. తెలియకుండా ఆ నీరు తాగిన, అటువంటి ఆహారం తిన్న వారి కడుపులోకి ఈ నులి పురుగులు ప్రవేశిస్తాయి. కడుపులో ఈ పురుగులున్న వారు రక్తహీనత, పోషకాల లోపం, ఆకలి మందగించడం, నీరసం, ఆందోళన, కడుపునొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, బరువు తగ్గడం, తరచుగా ఇన్ఫెక్షన్లకు గురవడం వంటి వాటితో బాధ పడుతుంటారు. వీటి నివారణకు ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ఒక్కటే మార్గం. దీర్ఘకాలిక వ్యాధులున్న వారు కూడా వీటిని తీసుకోవచ్చు. నిర్మూలనతో ఇవి ప్రయోజనాలుఈ జాగ్రత్తలు మేలు గోళ్లను చిన్నవిగా, శుభ్రంగా ఉంచుకోవాలి. శుభ్రమైన నీటిని తాగాలి. ఆహార పదార్థాలపై ఎప్పుడూ మూత ఉంచాలి. కూరగాయలు, పండ్లను శుభ్రమైన నీటితో కడగాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. బయట తిరిగేటప్పుడు బూట్లు/ చెప్పులు ధరించాలి. బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయవద్దు. మరుగుదొడ్డినే వాడాలి. ఏదైనా తినకముందు, తిన్న తర్వాత, మరుగుదొడ్డికి వెళ్లి వచ్చిన తర్వాత సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ప్రతి విద్యార్థికీ పంపిణీ వైద్య, ఆరోగ్యం, విద్య, ఐసీడీఎస్, ఇంటర్మీడియెట్ విద్య, సాంఘిక సంక్షేమం, మున్సిపల్ తదితర శాఖల సమన్వయంతో నులి పురుగుల నివారణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ నెల 10న ఆల్బెండజోల్ మాత్రలు అందుకోలేని వారికి ఈ నెల 17వ తేదీన మాప్ అప్ డే నిర్వహించి, మాత్రలు అందజేస్తాం. ఆరు నెలలకోసారి ఈ కార్యక్రమం చేపట్టడం ద్వారా పిల్లల్లో నులిపురుగులను నివారించవచ్చు. – డాక్టర్ మధుసూదన్, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి మాత్రలు చప్పరించాలి.. ఆల్బెండజోల్ మాత్రలను మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత మాత్రమే విద్యార్థులకు ఇవ్వాలి. ఈ మాత్రలను చప్పరించడం లేదా నమిలి మింగడం చేయాలి. మాత్రలు తీసుకున్న తర్వాత ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే దగ్గరలోని వైద్య సిబ్బందిని సంప్రదించాలి. – డాక్టర్ సురేందర్, పిడియాట్రిషన్ -
‘అవినీతికి కేరాఫ్ టీబీజీకేఎస్’
భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో అవినీతి అక్రమాలకు పాల్పడిన సంఘంగా టీబీజీకేఎస్ నిలిచిందని ఐఎన్టీయూసీ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బేతెల్లి మధుకర్రెడ్డి ఆరోపించారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పదేళ్లు అధికారంలో ఉండి సింగరేణిలో పదువులు అనుభవించి బీఆర్ఎస్, టీబీజీకేఎస్ ఓడిపోయిన 24గంటల్లోనే యూనియన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి మిర్యాల రాజిరెడ్డి ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి జనక్ప్రసాద్పై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. సమస్యలను పరిష్కరించిన జనక్ప్రసాద్పై ఆరోపణలు సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర, ఏరియా నాయకులు రఘపతిరెడ్డి, రత్నం సమ్మిరెడ్డి, నర్సింగారావు, సమ్మిరెడ్డి, శ్రీనివాస్, రాయమల్లు పాల్గొన్నారు. -
గొంతెమ్మ గుట్ట జాతర ప్రారంభం
కాటారం: ప్రతాపగిరి సమీపంలోని ప్రతాపగిరి గొంతెమ్మ గుట్టపై శనివారం జాతర ఉత్సవాలు మొదలయ్యాయి. మూడు రోజుల పాటు కొనసాగనున్న జాతరలో భాగంగా మొదటి రోజు మర్రిపల్లి లక్ష్మిదేవర ఉత్సవ విగ్రహాలను కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్దకు తీసుకెళ్లి పుణ్యస్నానం ఆచరింపజేశారు. అనంతరం ప్రతాపగిరి కోటలోని మేలు దర్వాజ వద్ద మైసమ్మ పూజలు, యాటపోతు బలి కార్యక్రమాలు నిర్వహించారు. లక్ష్మి దేవరను జడత కోటలోని గొంతెమ్మ గుడికి తీసుకెళ్లి నిలిపారు. ఈ సందర్భంగా శివసత్తులు డప్పుచప్పుళ్ల నడుమ పూనకాలతో నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతాపగిరి నాయక్పోడు ఆలయ కమిటీ సభ్యులు బీసుల రవీందర్, మేకల పోచయ్య, సంతోష్, కిష్టయ్య, ఎర్రయ్య, రాజేందర్, ధర్మరాజు, గ్రామస్తులు పాల్గొన్నారు. ‘బీజేపీది చరిత్రాత్మక విజయం’ భూపాలపల్లి రూరల్: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీది చరిత్రాత్మక విజయమని ఆ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిషిధర్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్గాంధీ, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ హామీలను ప్రజలు నమ్మలేదన్నారు. ఆ పార్టీలపై ఎంత వ్యతిరేకత ఉందో ఫలితాలను బట్టి అర్థమవుతోందన్నారు. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని గెలిపిస్తారని ధీమా వ్యక్తంచేశారు. వాహన పన్నులు చెల్లించాలి భూపాలపల్లి అర్బన్: వాహన యజమానులు గడుపులోపు పన్నులు చెల్లించాలని జిల్లా రవాణాశాఖ అధికారి సంధాని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో జిల్లాలో వాహన తనిఖీలు విస్తృతంగా చేపట్టనున్నట్లు తెలిపారు. పన్నులు చెల్లించకుండా తిరుగుతున్న వాహనాలు పట్టుబడినట్లయితే కేసులు నమోదుచేసి భారీ జరిమానాలు విధించనున్నట్లు హెచ్చరించారు. వాహనదారులందరూ రోడ్డు నియమాలు పాటించాలని సూచించారు. పెండింగ్ బకాయిలు చెల్లించాలి భూపాలపల్లి అర్బన్: 2022–23 ఆర్ధిక సంవత్సరంలో సింగరేణి అధికారులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు చెల్లించాలని కోల్ మైన్స్ అఫీసర్ అసోసియేషన్(సీఎంఓఐ) నాయకులు కోరారు. ఈ మేరకు శనివారం ఏరియా అసోసియేషన్ అధ్వర్యంలో ఎస్వోటు జీఎం కవీంద్రకు వినతిపత్రం అందజేశారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో పనితీరు సంబంధింత చెల్లింపు(పీఆర్పీ)ను కోలిండియాలో 2024 జూన్లో చెల్లించినట్లు తెలిపారు. సింగరేణిలో మాత్రం ఇప్పటి వరకు చెల్లించకపోవడం బాధాకరమన్నారు. రామప్పలో పర్యాటకుల సందడివెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని శనివారం పర్యాటకులు, విద్యార్థులు సందర్శించారు. రెండో శనివారం హాలిడే కావడంతో వివిధ ప్రాంతాల నుంచి ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు అధిక సంఖ్యలో తరలివచ్చి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. నందీశ్వరుని చుట్టూ విద్యార్థులు ప్రదక్షిణలు నిర్వహించారు. రామప్ప శిల్పాల వద్ద గ్రూప్ ఫొటోలు దిగారు. అనంతరం రామప్ప సరస్సులో బోటింగ్ చేస్తూ కేరింతలు కొట్టారు. విదేశీయుల రాక.. రామప్ప దేవాలయాన్ని ఇటలీకి చెందిన మైక్రో, మార్కో, స్టెపీనో, జాద, జర్మనీకి చెందిన మార్కుస్, క్లాడియాలు వేరు వేరుగా సందర్శించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు హరీశ్ శర్మ, ఉమాశంకర్లు వారికి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేయగా గైడ్లు విజయ్కుమార్, వెంకటేశ్లు ఆలయ విశిష్టత గురించి వివరించారు. రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్ అంటూ రామప్ప అందాలను తమ సెల్ఫోన్లో బందించుకున్నారు. -
నియామక ఉత్తర్వులు జారీచేయాలి
భూపాలపల్లి: గ్రామపంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల విధులు నిర్వహించునున్న సిబ్బందికి నియామక ఉత్తర్వులు జారీ చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. స్థానిక ఎన్నికల నిర్వహణపై శనివారం ఐడీఓసీ కార్యాలయంలో రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు, మాస్టర్ ట్రైనర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో గ్రామపంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా సాగేందుకు అవసరమైన సిబ్బంది నియామకం చేపట్టి, వారికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, సజావుగా నిర్వహించేందుకు సిబ్బందికి శిక్షణ అత్యంత కీలకమని చెప్పారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి ఉద్యోగి తన బాధ్యతలను సమగ్రంగా అర్థం చేసుకుని, సక్రమంగా విధులు నిర్వహించడానికి శిక్షణ కార్యక్రమాలు అత్యంత ముఖ్యమని వివరించారు. ఎన్నికల విధులకు అవసరమైన సిబ్బందిని సకాలంలో నియమించి, వారికి విధుల నిర్వహణ ప్రక్రియపై ఎన్నికల సంఘం మార్గదర్శకాలను వివరించాలని సూచించారు. శిక్షణ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు భూపాలపల్లి, కాటారం డివిజన్ల వారీగా షెడ్యూల్ తయారు చేయాలని వివరించారు. ఎన్నికల నిర్వహణపై సిబ్బంది సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే ఎన్నికలను పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించడానికి అవకాశం ఉంటుందని కలెక్టర్ రాహుల్ శర్మ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీపీఓ నారాయణరావు, భూపాలపల్లి ఆర్డీఓ రవి, అన్ని మండలాల ఎంపీడీఓలు, మాస్టర్ ట్రైనర్లు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ -
హామీల అమలులో విఫలం
భూపాలపల్లి అర్బన్: కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో సింగరేణి కార్మికులకు ఇచ్చిన హమీలను అమలు చేయడంలో విఫలమైనట్లు కార్మిక సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ రియాజ్ అహ్మద్, కో కన్వీనర్ కృష్ణ ఆరోపించారు. జిల్లాకేంద్రంలోని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో శనివారం హెఎంఎస్, టీఎస్యూఎస్, ఐఎఫ్టీయూ, ఏఐఎఫ్టీయూ, టీఎన్టీయూసీ, ఎస్జీకేఎస్ సింగరేణి ఐక్య సంఘాల ఐక్య వేదిక సంఘాల నాయకులు ముఖ్య నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో గుర్తింపు, ప్రాతినిఽథ్య సంఘాలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. ఆర్థిక ప్రయోజనాల కోసమే ఆ కార్మిక సంఘాలు పని చేస్తున్నట్లు ఆరోపించారు. కార్మికులకు రెండు గుంటల ఇంటి స్థలం, సొంత ఇంటి పథకం, వడ్డీ లేని రుణాలు అమలు చేయడం లేదన్నారు. నూతన బొగ్గు గనులు ప్రారంభించడం లేదని, ఆదాయ పన్ను రద్దు చేయడంలో విఫలమైందని చెప్పారు. మారు పేర్లతో కార్మికులు సతమతమవుతున్నారని, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, డిస్మిస్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఆయా సంఽఘాల నాయకులు గట్టయ్య, శ్రీనివాస్, సుదర్శన్గౌడ్, శ్రీనివాస్, శ్రీధర్, నరేష్, కిరణ్, శరత్ పాల్గొన్నారు. -
ఆదివారం శ్రీ 9 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
మాతృ దేవోభవ.. పితృదేవోభవ.. ఆచార్య దేవోభవ.. ఇలా మన పెద్దలు తల్లిదండ్రుల తర్వాతి స్థానం గురువులకు ఇచ్చారు. విద్యార్థులకు తరగతి గదిలో విద్యాబుద్ధులు నేర్పి వారిని ఉన్నత స్థానంలో నిలపాల్సిన కొందరు ఉపాధ్యాయులు దారి తప్పుతున్నారు. పాఠశాలలకు వచ్చే బిడ్డల్లాంటి విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నారు. ఆ విషయాన్ని బాధిత విద్యార్థులు అటు తల్లిదండ్రులకు, ఇటు సన్నిహితులకు చెప్పుకోలేక లోలోపల కుమిలిపోతున్నారు. లైంగిక వేధింపులు తారాస్థాయికి చేరుకోవడంతో చివరికి ధైర్యం తెచ్చుకుని తల్లిదండ్రులకు చెబుతున్నారు. పాఠశాల స్థాయి విద్యార్థినులకు ‘ఏది గుడ్ టచ్.. ఏది బ్యాడ్ టచ్’ అనేది తల్లిదండ్రులు ఇంటి వద్దనే నేర్పించాలని, బ్యాడ్ టచ్ అయితే భయపడకుండా చెప్పాల్సిన అవసరం ఉందని మానసిక వికాస నిపుణులు చెబుతున్నారు. – తొర్రూరు/కాజీపేటజనవరిలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం దొబ్బలపాడు మోడల్ స్కూల్కు చెందిన ఐదుగురు విద్యార్థినులను సీఎం కప్ పోటీల నిమిత్తం హైదరాబా ద్కు తీసుకెళ్లిన పీఈటీ వారిపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. విచారణ చేసి అతడిని సస్పెండ్ చేశారు. ఇటీవల తొర్రూరు మండలం అరిపిరాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఘటన వెలుగు చూసింది. ఉపాధ్యాయుల వేధింపుల వ్యవహారం బయటకు పొక్కడంతో పాఠశాలకు చేరుకుని తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన చేపట్టి వారికి దేహశుద్ధి చేశారు. మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం సక్రాంనాయక్ తండాలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు చిన్నారుల కు నీలి చిత్రాలు చూపించాడు. తమతో ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థినులు తల్లిదండ్రులకు చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు టీచర్కు దేహశుద్ధి చేశారు. సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. రెండేళ్ల క్రితం దంతాలపల్లి మండలం దాట్ల గ్రామ ఉన్నత పాఠశాలలోని ఓ ఉపాధ్యాయుడు క్రీడల పేరిట తాకరాని చోట తాకుతూ విద్యార్థినులను వేధించాడు. విషయం బయటకు పొక్కడంతో టీచర్పై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేశారు.చెడు స్పర్శఛాతిపై చేయి వేయడం, నడుం కింద, వెనుకవైపు తాకడం, అనుచితంగా ప్రవర్తించడం, అసభ్యకర రీతిలో వ్యవహరించడం. మంచి స్పర్శతల, వీపుపై తట్టడం, కరచాలనం, ప్రశంసిస్తూ బుగ్గలు, చెవులను తాకడం ఫిర్యాదుకు భయపడొద్దు.. చిన్నతనం నుంచి బాలికల్లో ధైర్యాన్ని నూరిపోయాలి. ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, ఇంకా ఏమైనా జరిగినా వెంటనే తల్లిదండ్రులకు చెప్పాలి. ఇంట్లో చెబితే తనను నిందిస్తారని బాలికలు భయపడొద్దు. లేదంటే ఆ సమస్య పెద్దగా మారే ప్రమాదం ఉంది. పిల్లలు చెప్పే విషయాన్ని తల్లిదండ్రులు సావధానంగా వినాలి. అంతే కానీ, వారి మనసుకు కష్టం కలిగేలా మాట్లాడకూడదు. ఫిర్యాదు చేస్తే సమాజంలో ఏమనుకుంటారో అని తల్లిదండ్రులు కూడా భయపడొద్దు. ఆపద సమయంలో బాలికలు వెంటనే 100 నంబర్కు డయల్ చేయడం ఉత్తమం. – వై.సుధాకర్రెడ్డి, సీఐ, కాజీపేట చిన్నప్పటినుంచే అవగాహన కల్పించాలి తల్లిదండ్రులు ఆడపిల్లలకు మంచి చెడులు వివరించి చెప్పాలి. బ్యాడ్టచ్, గుడ్ టచ్ అంటే ఏమిటి? వాటి పర్యవసానాలను ఎలా ఎదుర్కోవాలనే విషయంపై అవగాహన కల్పించాలి. పిల్లలను ఇష్టారీతిగా తాకితే వెంటనే రియాక్ట్ అయ్యేలా చూడాలి. పిల్లలు ఇటువంటి అనుభవం ఎదురైనప్పుడు నిర్భయంగా తల్లికి చెప్పుకునేలా మనోధైర్యం కల్పించాలి. బయట ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేలా తయారు చేయాలి. – అశోక్ పరికిపండ్ల, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు, సైకాలజిస్ట్ అనైతిక, క్షమార్హం కాని చర్యలకు పాల్పడుతున్న పలువురు ఉపాధ్యాయుల తీరుతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో చదివించే ఆర్థిక స్థోమత లేక పేదింటి తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తున్నారు. పలు ప్రాంతాల్లో చిన్నారులపై వేధింపుల ఘటనలు వెలుగు చూస్తుండటంతో కన్నవారు కుమిలిపోతున్నారు. చదువు మాన్పించేందుకు సైతం తల్లిదండ్రులు వెనుకాడడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు సన్నగిల్లే అవకా శం ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఉపాధ్యాయులపై నిఘా ఉంచాల ని, తప్పు చేసినట్లు తేలితే కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు. వరంగల్ జిల్లా పరిధిలోని అన్ని గురుకులాలు, కేజీబీవీలు, ప్రభుత్వ పాఠశాలల్లో కలెక్టర్ డాక్టర్ సత్య శారద వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థినులు నేరుగా చెప్పుకోలేని సమస్యలను తెలుసుకునేందుకు ఫిర్యాదు పెట్టెలను ప్రతి పాఠశాలలో ఏర్పాటు చేశారు. నేరుగా చెప్పలేని సమస్యలను విద్యార్థులు పేపర్పై రాసి ఆ ఫిర్యాదు పెట్టెలో వేస్తున్నారు. ఈ పెట్టెల నిర్వహణను స్వయంగా కలెక్టరే చూస్తున్నారు. ఇటీవల నెక్కొండలోని గురుకులం, కేజీబీవీలో ఆ ఫిర్యాదు పెట్టెలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి ఇద్దరు ప్రిన్సిపాళ్లు, వార్డెన్, పీఈటీకి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇలాంటి ఫిర్యాదు పెట్టెలను అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉపాధ్యాయుల వికృత చేష్టలను విద్యాశాఖ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. దీంతో కొందరు గురువులు తమ మానసిక ఆనందం కోసం బిడ్డల్లాంటి చిన్నారులపై మృగాలుగా ప్రవర్తిస్తూ వృత్తికే కళంకం తీసుకువస్తున్నారు. న్యూస్రీల్విద్యార్థినులకు చెబుదాం.. మంచీచెడు ఎవరైనా అసభ్యంగా తాకినా వద్దని చెప్పే ధైర్యం నూరిపోయాలి. కుటుంబ సభ్యులతోనూ నడుచుకోవాల్సిన విధానం వివరించాలి. బడుల్లో మహిళా ఉపాధ్యాయులు, మార్గదర్శకులు అర్థమయ్యేలా వివరించాలి. రోజువారీ విషయాలు తమతో ఆడపిల్లలు పంచుకునే వాతావరణం తల్లిదండ్రులు కల్పించాలి. ఆత్మరక్షణ విద్య నేర్పించాలి. పోలీసులతోపాటు విద్య, వైద్య, ఆరోగ్య, ఐసీడీఎస్ విభాగాల అధికారులు తరచూ పాఠశాలలను సందర్శించాలి. పక్కాగా కమిటీలు వేయాలి. విద్య, శిక్షణ సంస్థల్లో పనిచేసే సిబ్బంది పూర్వాపరాలు తెలుసుకోవాలి. పాఠశాలల వద్ద ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం చేరవేయాలి. విద్యాసంస్థల్లో సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి. ఉమ్మడి జిల్లాలో జరిగిన ఘటనలుఏది గుడ్ టచ్.. ఏది బ్యాడ్ టచ్విద్యార్థినులపై ఉపాధ్యాయుల లైంగిక వేధింపులు, అనుచిత ప్రవర్తనకొందరు ఉపాధ్యాయుల తీరుతో విద్యాశాఖకు మచ్చ పాఠశాలల్లో చోటుచేసుకుంటున్న ఘటనలతో తల్లిదండ్రుల ఆందోళన తల్లిదండ్రుల్లో ఆందోళన..అన్ని జిల్లాల్లో ఇలా చేస్తే బెటర్.. -
పరిశుభ్రత చాలా ప్రధానం
కాళేశ్వరం: పరిశుభ్రత చాలా ప్రధానమని జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు అన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణపై కాళేశ్వరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం డీఎల్పీఓ వీరభద్రయ్య, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఎంపీఓలు, కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో మూడురోజుల పాటు జరుగనున్న మహాకుంభాభిషేకం కార్యక్రమాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు కట్టుదిట్టంగా నిర్వహించాలన్నారు. ఎప్పటికప్పుడు వ్యర్థాలు తొలగిస్తూ పరిశుభ్రం చేయాలని ఆదేశించారు. అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహోత్సవ కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్నారని, భక్తులు మెచ్చేలా పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కుంభాభిషేకానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, పరిశుభ్రత విషయంలో అలసత్వం, రాజీ పడొద్దని అన్నారు. పారిశుద్ధ్య పనులను సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. సమన్వయంతో పనిచేసి కుంభాభిషేకం కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీఓలు ప్రసాద్, వీరస్వామి, ప్రకాశ్, కార్యదర్శి సత్యనారాయణ పాల్గొన్నారు.జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు -
5 ఎకరాల భూ పంపిణీ చేయాలి
భూపాలపల్లి అర్బన్: దేశవ్యాప్తంగా వ్యవసాయ భూమి లేని ప్రతీ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం ఐదు ఎకరాల భూ పంపిణీ చేపట్టాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.నాగయ్య డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలోని శ్రామిక భవనంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరుపేదలకు భూమి పంచడం వలన సంక్షేమ పథకాల అవసరం లేదన్నారు. దీంతో తమ అవసరాలు తీర్చుకునే అవకాశం ఉంటుందన్నారు. బడాబాబుల కడుపులు మరింత నింపేందుకు, మధ్య తరగతి ఉద్యోగులను మభ్యపెట్టేలా కేంద్ర బడ్జెట్ ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇంత మొండిగా ప్రజావ్యతిరేక విధానాలను అమలు జరుపుతున్న నేపథ్యంలో శ్రామికులు, ప్రజానీకం ఐక్యంగా పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజేందర్, శంకర్, రాజలింగు, శంకర్, రమా, ఆశోక్, రాజమణి పాల్గొన్నారు. -
కాళేశ్వరంలో జాతీయ రహదారి సర్వే
కాళేశ్వరం: మహదేవపూర్ నుంచి కాళేశ్వరం వరకు జాతీయ రహదారి(353 సీ) నిర్మాణంలో భాగంగా ఎంజాయ్మెంట్ సర్వే శుక్రవారం భూపాలపల్లి ఆర్డీఓ రవి ఆధ్వర్యంలో నిర్వహించారు. కాళేశ్వరం శివారు నుంచి కన్నెపల్లి వరకు రైతుల భూముల్లో రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. ఈ సర్వేను కొంత మంది రైతులు అడ్డుకొని తమకు తగిన పరిహారం ఇచ్చే వరకు నిలిపేయాలని మొరపెట్టుకున్నారు. ఈ సర్వేలో తహసీల్దార్ ప్రహ్లాద్రాథోడ్, డీటీ కృష్ణ, ఎన్హెచ్ డీఈఈ కిరణ్కుమార్, ఏఈఈ ప్రమోద్, సర్వేయర్ రమేష్, ఆర్ఐ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. 9న కాళేశ్వరానికి ముగ్గురు మంత్రుల రాక? కాళేశ్వరం: కాళేశ్వరం దేవస్థానంలో జరిగే మహాకుంభాభిషేకంలో పాల్గొనేందుకు ఈనెల 9న ఆదివారం ముగ్గురు మంత్రులు, ఎంపీ రానున్నట్లు సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ అనుమతితో మంథని శాసనసభ్యులు, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, దేవాదాయ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రానున్నారని అధికారవర్గాల ద్వార తెలిసింది. 38మంది విద్యార్థినులను చితకబాదిన సీఆర్టీ భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలోని జంగేడు కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయంలో 38మంది విద్యార్థినులను విద్యాలయ ఇంగ్లిష్ సీఆర్టీ చితకబాదినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్కు అందిన సమాచారంతో శుక్రవారం విచారణ చేపట్టారు. ఈ నెల 5వ తేదీన రాత్రి 8గంటల సమయంలో 9వ తరగతి చదువుతున్న 38మంది విద్యార్థినులపై విచక్షణారహితంగా ఇంగ్లిష్ సీఆర్టీ ముస్కాన్ కొట్టినట్లు విద్యార్థులు తెలిపారు. కిటికీలో నుంచి బయట వారితో మాట్లాడుతున్నారని కంక కర్రతో చేతులపై బలంగా కొట్టినట్టు సమాచారం. తీవ్ర గాయాలపాలైన రిషితకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేయించి ఇంటికి పంపినట్లు డీఈఓ రాజేందర్ తెలిపారు. రమ్య, సోని, సాయిహర్షితలకు గాయాలైనట్లు ఆనవాళ్లు ఉన్నాయని, ఈ ఘటనపై విచారణ జరిపి తగులు చర్యలు తీసుకుంటామని డీఈఓ తెలిపారు. విద్యార్థులకు అవగాహన భూపాలపల్లి అర్బన్: ప్రకృతి వైపరిత్యాల వలన సంభవించే ప్రమాదాల సందర్భంగా రక్షణపై ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. వరదలు, అగ్నిప్రమాదాలు, భూకంపాలు సంభవించినప్పుడు, భవనాలు కూలిన సమయంలో పాటించాల్సిన జాగ్రతలు, ప్రమాదంలో ఇరుక్కున, గాయాల పాలైన వారిని ఏ విధంగా రక్షించాలనే అంశాలపై విద్యార్థులకు కళ్లకు కట్టినట్లుగా చూపించారు. అప్రమత్తంగా వ్యవహరిస్తే ప్రమాదాల నుంచి బయటపడవచ్చని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఆర్ఎఫ్ అధికారులు, సిబ్బంది, ఇన్చార్జ్ డీఈఓ రాజేందర్, స్థానిక తహసీల్దార్ శ్రీనివాసులు, ఆర్ఐలు రామస్వామి, అజారుద్దీన్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వైభవంగా సీతారాముల కల్యాణం మంగపేట: మండలంలోని బోరునర్సాపురం శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని శుక్రవారం వేదపండితులు వైభవంగా నిర్వహించారు. ఆలయంలో ఈ నెల 4 నుంచి కొనసాగుతున్న 18వ వార్షికోత్సవాల చివరి రోజు సందర్భంగా ఉదయం సంక్షేప రామాయణం, ఆదిత్య హృదయం హోమం పూజలను నిర్వహించారు. అనంతరం సీతారాముల ఉత్సవ మూర్తుల కల్యాణం వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు మంగపేట, చెరుపల్లి, కమలాపురం తదితర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ నర్రా శ్రీధర్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
ఆదాయానికి గండి
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి మున్సిపల్ పరిధిలో కొందరు వ్యాపారులు ట్రేడ్ లైసెన్స్లు పొందకుండా వివిధ వ్యాపారాలు చేస్తున్నారు. మరికొందరు లైసెన్స్లను రెన్యువల్ చేసుకోవడంపై ఆసక్తి చూపడం లేదు. దీంతో రావాల్సిన ఆదా యాన్ని పురపాలక సంఘం భారీగా కోల్పోతోంది. మున్సిపల్ పరిధిలో అధికారుల లెక్కల ప్రకారం 1,420పైగా వివిధ దుకాణ సముదాయాలు ఉండగా అధికారులు గుర్తించనివి మరో 100కి పైగా ఉన్నాయి. ఇప్పటివరకు వెయ్యి వరకు మాత్రమే లైసెన్స్లు తీసుకున్నారు. దీంతో ప్రతి ఏడాది రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు మున్సిపాలిటీ ఆదాయాన్ని కోల్పోతుంది. మార్చి 31 గడువు.. ఎప్పటికప్పుడు భూపాలపల్లి మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వ్యాపారాలు చేసే వారిని గుర్తించి ట్రేడ్ లైసెన్స్లు జారీచేయాల్సి ఉంటుంది. కానీ.. ఆ దిశగా పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార గణాంకాల ప్రకారం.. పట్టణంలో 1,000కి పైగా ట్రేడ్ లైసెన్స్లు పొందిన వ్యాపారులున్నారు. ప్రతీ ఏడాది మార్చి 31లోపు వ్యాపారులు తమ లైసెన్స్లు పునరుద్ధరించుకోవాల్సి ఉండగా చాలామంది వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. ఇప్పటివరకు దాదాపు 200 వరకు లైసెన్స్లు పునరుద్ధరణ కావాల్సిఉంది. ఈ మేరకు ఇప్పటికే మున్సిపల్ సిబ్బంది వ్యాపారులకు సూచనలు చేసినా ఫలితం లేదు. దుకాణాలు ఎక్కువ.. లైసెన్స్లు తక్కువ ● భూపాలపల్లి జిల్లా కేంద్రం కావడంతో ప్రధాన రోడ్లతోపాటు వీధుల్లోనూ చాలా దుకాణాలు ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ● వేలల్లో దుకాణాలు ఉన్నప్పటికీ ఆ స్థాయిలో ట్రేడ్ లైసెన్స్లను మున్సిపల్ నుంచి వ్యాపారులు తీసుకోవడం లేదు. ● చాలా మంది లైసెన్స్ లేకుండానే వ్యాపారాలు చేస్తూ మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతున్నారు. ● మున్సిపల్ అధికారులకు తెలిసినప్పటికీ లైసెన్స్ల జారీకి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి. ● గతంలో ఏ దుకాణం ఏర్పాటు చేసుకున్నా.. వ్యాపారం నిర్వహించినా విస్తీర్ణంతో సంబంధం లేకుండా రూ.1,000లను ట్రేడ్ లైసెన్స్ రుసుంగా చెల్లించేవారు. రెండేళ్ల క్రితం ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. ట్రేడ్ లైసెన్స్ల రుసుంలు భారీగా పెరిగాయి. ● ప్రధాన రోడ్లు, 60 ఫీట్ల రోడ్లు, 100 ఫీట్ల రోడ్ల, వీధుల్లో నిర్వహించే వ్యాపారాలను పరిగణలోకి తీసుకొని ట్రేడ్ లైసెన్స్ రుసుం వివిధ రకాలుగా వసూలు చేస్తున్నారు. ● బ్యాంకులు, వివిధ ప్రైవేట్ సంస్థల్లో రుణాలు తీసుకోవాల్సి వస్తే మాత్రం వ్యాపారులు ట్రేడ్ లైసెన్స్లు తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. మిగితావారు అదనపు భారంగా భావించి లైసెన్స్ తీసుకోకుండానే వ్యాపారాలు చేస్తున్నారు.తప్పనిసరిగా తీసుకోవాలి.. వ్యాపారాలు చేసుకునే దుకాణాల యజమానులు తప్పకుండా ట్రేడ్ లైసెన్స్లు తీసుకోవాలి. నిర్ణీత రుసుం చెల్లించి లైసెన్స్ పత్రాలు పొందాలి. ఏడాది కాగానే తిరిగి రెన్యూవల్ చేయించుకోవాలి. సిబ్బందిని బృందాలుగా విభజించి పన్నులు వసూలు చేస్తున్నాం. – బిర్రు శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్, భూపాలపల్లి●ట్రేడ్ లైసెన్స్లపై ఆసక్తి చూపని వ్యాపారులు లైసెన్స్ లేకుండా 400 దుకాణాల నిర్వహణ ప్రతీ ఏడాది రూ.10లక్షల ఆదాయాన్ని కోల్పోతున్న మున్సిపల్ -
జూనియర్ vs సీనియర్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ హాస్టళ్లలో ఉండే కొందరు విద్యార్థులు క్రమశిక్షణ తప్పుతున్నారు. ఇటీవల రెండు సంఘటనల్లో పలువురు విద్యార్థులను హాస్టళ్లనుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలు మరిచిపోకముందే తాజాగా శుక్రవారం కామన్ మెస్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కెమిస్ట్రీ కోర్సు సీనియర్, జూనియర్ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. భోజనం చేస్తున్న సమయంలోనే విద్యార్థులు పరస్పరం దాడి చేసుకున్నారు. భోజనం ప్లేట్లు, గిన్నెలను కిందపడేశారు. ఆ సమయంలో మిగతా విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. ఎందుకు కొట్టుకుంటున్నారో తెలియక అయోమయానికి గురయ్యారు. సాయంత్రం మరోసారి ఘర్షణ.. క్యాంపస్లోని పీహెచ్సీలో చికిత్స పొందిన ఇద్దరు జూనియర్లు సాయంత్రం గణపతిదేవ హాస్టల్కు వచ్చారు. ఆ తరువాత ఏమి జరిగిందో తెలియదు.. జూనియర్లకు, సీనియర్లకు మధ్య మళ్లీ ఘర్షణ మొదలైంది. సీఐ రవికుమార్, ఎస్సై మాధవ్ ఇతర పోలీస్సిబ్బంది అక్కడి చేరుకొని ఇరువర్గాలకు చెందిన 18 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకుని పోలీస్టేషన్కు తరలించారు. తొలుత కామన్మెస్లో దెబ్బలు తగిలిన ఇద్దరు జూనియర్లను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. హాస్టళ్ల డైరెక్టర్ ఏమంటున్నారంటే.. తమకు గౌరవం ఇస్తలేరనే కారణంతోనే సీనియర్ విద్యార్థులు.. జూనియర్లతో గొడవ పడినట్లు హాస్టళ్ల డైరెక్టర్ రాజ్కుమార్ చెబుతున్నారు. మొదట ‘నావైపు ఎందుకు చూస్తున్నావు’ అని ఓ సీనియర్.. జూనియర్ విద్యార్థిని ప్రశ్నించగా.. మాటమాట పెరిగి పరస్పరం కొట్టుకున్నారని తెలిపారు. అదే కారణమా? మరేదైనా ఉందా అనే కోణంలో విచారించాల్సి ఉందని చెబుతున్నారు. తమను సీనియర్లు కొట్టారని ముగ్గురు జూనియర్లు, జూనియర్లే కొట్టారని ముగ్గురు సీనియర్ విద్యార్థులు తమ దృష్టికి తెచ్చినట్లు రాజ్కుమార్ తెలిపారు. నేడు వీసీ వచ్చాక నిర్ణయం ఘర్షణ విషయాన్ని హైదరాబాద్లో ఉన్న వీసీ కె.ప్రతాప్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా యూనివర్సిటీలోనే ఉన్న రిజిస్ట్రార్ రామచంద్రం, కెమిస్ట్రీ విభాగం అధిపతి, యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. శనివారం వీసీ వచ్చాక పోలీసులకు ఫిర్యాదు చేయాలని యోచిస్తున్నారు. అదేవిధంగా విద్యార్థులపై ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది సమావేశమై నిర్ణయించనున్నట్లు సమాచారం. హాస్టల్నుంచి సస్పెండ్ చేయాలా.. ఒక సెమిస్టర్ మొత్తం సస్పెండ్ చేయాలా అనేది ఆలోచన చేస్తున్నారు. కామన్ మెస్లో ప్లేట్లు, గిన్నెలు పడేయడంతో జరిగిన నష్టం ఎంత అనేది కూడా అంచనా వేస్తున్నారు. సీసీ పుటేజీలు కూడా పరిశీలించాలని యూనివర్సిటీ అధికారులు యోచిస్తున్నారు. ఎవరెవరి మీద ఎవరు దాడి చేసుకున్నారనేది స్పష్టంకానుంది. పోలీసులకు పరస్పరం ఫిర్యాదులు కొట్టుకున్న విద్యార్థులను కేయూ పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు సీనియర్లు 8 మంది, జూనియర్లు 10మంది, నలుగురు ఏబీవీపీ నాయకులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కొట్టుకున్న ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కెమిస్ట్రీ కోర్సు విద్యార్థులు కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత సీనియర్లకు గౌరవం ఇస్తలేరనే కారణంతో గొడవ? కామన్మెస్లో ఒకసారి, హాస్టల్ వద్ద మరోసారి ఘర్షణ ఇద్దరు జూనియర్లను ఎంజీఎం ఆస్పత్రికి తరలింపు పోలీసుల అదుపులో 18మంది విద్యార్థులు నేడు వీసీతో చర్చించి చర్యలు తీసుకునే అవకాశం ఆధిపత్యం కోసమేనా.. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కెమిస్ట్రీ కోర్సు సీనియర్లు తమకు జూనియర్లు గౌరవం ఇవ్వడం లేదని కొంతకాలంగా గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం కామన్మెస్లో అందరూ భోజనం చేస్తున్నారు. ఏమి జరిగిందో తెలియదు.. ఒక్కసారిగా జూనియర్లకు, సీనియర్లకు మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాలు కొట్టుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమాచారం తెలుసుకున్న హాస్టళ్ల డైరెక్టర్ ఎల్పీ రాజ్కుమార్, కేయూ పోలీస్టేషన్ ఎస్పై మాధవ్ తన పెట్రోలింగ్ సిబ్బందితో కామన్మెస్కు చేరుకున్నారు. దెబ్బలు తాకిన ఇద్దరు జూనియర్లను క్యాంపస్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. ఘర్షణకు దారితీసిన పరిస్ధితులను పోలీసులు అక్కడి సిబ్బంది, విద్యార్థులను, హాస్టళ్ల డైరెక్టర్ రాజ్కుమార్ను అడిగి తెలుసుకున్నారు. -
రామప్పను సందర్శించిన శ్రీలంక టూరిస్టులు
వెంకటాపురం(ఎం)/గోవిందరావుపేట: ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయాన్ని శుక్రవారం శ్రీలంకకు చెందిన 15 మంది టూర్ ఆపరేటర్స్ సందర్శించారు. తెలంగాణ పర్యాటక శాఖ, శ్రీలంక ఎయిర్లైన్స్ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలైన నాగర్జునసాగర్, నేలకొండపల్లి, బుద్దవనం, వరంగల్ కోట, భద్రకాళి, వేయిస్తంభాల గుడిని సందర్శించారు. పర్యటనలో భాగంగా శుక్రవారం రామప్ప ఆలయం, లక్నవరం సరస్సులను సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ వివరించగా ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శ్రీలంక నుంచి తెలంగాణలోని పర్యాటక ప్రదేశాలకు త్వరలో టూర్లను కండక్ట్ చేసేందుకు పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తున్నామన్నారు. రామప్ప సరస్సును సందర్శించి సరస్సులో బోటింగ్ చేశారు. లక్నవరం సరస్సు ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చిందన్నారు. వారి వెంట టూరిజం అధికారులు సాయిరాం, శ్రీనాథ్లు ఉన్నారు. అదే విధంగా క్రొయేషియా దేశానికి చెందిన పీటర్ సందర్శించారు. శుక్రవారం సందర్భంగా రామలింగేశ్వరస్వామిని శ్రీ దుర్గ అవతారంలో అలంకరించినట్లు ఆలయ ప్రధాన అర్చకుడు హరీశ్శర్మ తెలిపారు. -
ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరి వేయాలి
పలిమెల: ఈనెల 10న నిర్వహించబోయే జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా 1–19 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరి వేసుకునేలా అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) విజయలక్ష్మి ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఎంపీడీఓ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండలంలోని పలిమెల, నీలంపల్లి, పంకెన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లకు పంకెన ప్రభుత్వ పాఠశాల ఆవరణలో నేషనల్ డీ వార్మింగ్ డేపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి హాజరై మాట్లాడారు. నులి పురుగుల నివారణ కోసం డీ వార్మింగ్ డే రోజున పిల్లలందరూ ఆల్బెండజోల్ మాత్రలు విధిగా వేసుకోవాలన్నారు. ఆ రోజున ఏదైనా కారణాలతో మాత్రలు తీసుకోని పిల్లలకు ఈనెల 17న మాప్ ఆఫ్ రోజున మాత్రలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ విజిటర్ లక్ష్మి, ఏఎన్ఎంలు పద్మ, లావణ్య, శ్రీలత, పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, ఆశవర్కర్లు పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రం పరిశీలన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు ఉపయోగించనున్న పంకెన ఎంపీయూపీఎస్ స్కూల్లోని పోలింగ్ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలో ఏర్పాట్లు, కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి శ్రీధర్ ఉన్నారు. -
ఎన్నికల నియమావళి పాటించాలి
భూపాలపల్లి: రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళి పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించే అంశంపై గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఐడీఓసీ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 10న గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలకు ఓటరు జాబితా అందజేస్తామన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, ఎంసీఎంసీ నోడల్ అధికారి శ్రీని వాస్, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు. మెరుగైన సేవలు అందించాలి.. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఉద్యోగుల బాధ్యత కీలకమని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో గ్రూప్ 4 ద్వారా ఎంపికై కలెక్టరేట్లో వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న జూనియర్ సహాయకులతో కలెక్టర్ సమావేశమై మాట్లాడారు. ఫైల్స్ నిర్వహణలో ఏదేని సలహాలు, సూచనలకు పైఅధికారుల సూచనలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ హర్షం.. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 4వ తేదీన నిర్వహించిన గార్డెన్ ఫెస్టివల్ పోటీల్లో ఉద్యాన విభాగంలో జయశంకర్ భూపాలపల్లి ఐడీఓసీ కార్యాలయానికి ఉ త్తమ ఉద్యాన విభాగంలో రోలింగ్ ట్రోఫీ, గోల్డెన్ గ్రీ న్ సర్టిఫికెట్ లభించడం పట్ల కలెక్టర్ రాహుల్ శర్మ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్లో నిర్వహించిన 8వ గార్డెన్ ఫెస్టివల్, 2వ అర్బన్ ఫార్మింగ్ ఫెస్టివల్ ముగింపు ఉత్సవం సందర్భంగా ఈ అవార్డు ప్రదానం చేసినట్లు తెలిపారు. జిల్లా తరఫున జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధి కారి కె. శ్రీకాంత్రెడ్డి అవార్డు అందుకున్నారన్నారు. ఉద్యోగుల బాధ్యత అత్యంత కీలకం కలెక్టర్ రాహుల్ శర్మ -
10న ఐటీఐ అప్రెంటిస్షిప్ మేళా
కాటారం: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో ఈ నెల 10న ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్షిప్ మేళా (పీఎంఎన్ఏఎం) నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ భిక్షపతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదర్శ ఆటోమోటర్స్ ప్రైవేట్ లిమిటెడ్, వరుణ్ మోట ర్స్, శ్రీధర్ ప్రైవేట్ లిమిటెడ్తో పాటు మరి కొన్ని ప్రముఖ కంపెనీల ప్రతినిధులు ఈ మేళాకు హాజరవుతారని తెలిపారు. ఐటీఐ ఎలక్ట్రిషియన్, ఫిట్టర్ విభాగాల్లో పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని, ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకొని మేళాకు హాజరుకావాలని సూచించారు. ఆసక్తిగల అభ్యర్థులు బయోడెటా, అప్రె ంటిషిప్ రిజిస్ట్రేషన్, ఎస్ఎస్సీ మెమో, ఐటీఐ మెమో, ఎన్టీసీ, కుల ధృవీకరణపత్రం, ఆధార్, రెండు పాస్పోర్ట్ ఫొటోలతో హాజరుకావాలని ప్రిన్సిపాల్ తెలిపారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆర్జిత సేవలు బంద్కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానంలో ఈనెల 7, 8, 9 తేదీల్లో జరిగే మహా కుంభాభిషేకానికి మూడు రోజుల ఆర్జీత సేవలను నిలిపివేస్తున్నట్లు ఈఓ మహేష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కుంభాభిషేకానికి వచ్చే భక్తులు దర్శనం చేసుకొని, అన్నప్రసాదం తీసుకోవాలని తెలిపారు. ఇసుక లారీలు నిలిపివేత ఈనెల 7, 8, 9 తేదీల్లో మహదేవపూర్ మండలం మీదుగా నడిచే ఇసుక లారీలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా టీజీఎండీసీ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పాఠశాల బస్సులు శుభకార్యాలకు వాడొద్దు ● డీటీఓ సంధాని భూపాలపల్లి: పాఠశాల యాజమాన్యాలు తమ బస్సులను శుభకార్యాలకు వాడొద్దని జిల్లా రవాణాశాఖ అధికారి మహ్మద్ సంధాని బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. పాఠశాల బస్సులను విద్యార్థులను తరలించడానికి మాత్రమే ఉపయోగించాలన్నారు. వాహనాలు అన్ని పత్రాలు కలిగి ఉండాలని, స్కూల్ బస్సు నడిపే డ్రైవర్ కనీసం ఐదు సంవత్సరాలు హెవీ డ్రైవింగ్ లైసెన్స్పై అనుభవం కలిగి ఉండాలన్నారు. లేదంటే బస్సులు సీజ్ చేస్తామన్నారు. రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్ వెంకటాపురం(ఎం): రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్గా ఉందని ఇంగ్లాండ్కు చెందిన జాన్ దంపతులు కొనియాడారు. రామప్ప దేవాలయాన్ని బుధవారం వారు సందర్శించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం పాలంపేట శివారులో ప్రధాన రహదారి పక్కన నాటు వేస్తున్న కూలీలతో మాట్లాడారు. నాటు వేసే విధానం బాగుందని పేర్కొంటూ నాటు వేసే ఫొటోలను తమ సెల్ఫోన్తో తీసుకున్నారు. రామప్ప పరిసర ప్రాంతాలు అందంగా, ఆహ్లాదకరంగా ఉన్నాయని కొనియాడారు. సైబర్ నేరాలపై అవగాహన అవసరం ములుగు: సైబర్ నేరాలపై ప్రతీ ఒక్కరికి అవగాహన అవసరమని సైబర్ క్రైం డీఎస్పీ సందీప్రెడ్డి సూచించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో వైద్యులు, విద్యార్థులకు బుధవారం జాగృక్త దివాస్ కార్యక్రమంలో భాగంగా అవగాహన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సందీప్రెడ్డి మాట్లాడుతూ క్రిప్టో కరెన్సీ, మల్టీలెవల్ మార్కెటింగ్(ఎంఎల్ఎం) పిరమిడ్ ఫ్రాడ్స్, జంప్డ్ డిపాజిట్ స్కాంలపై వివరించారు. ఒక వేళ ఎవరైనా సైబర్క్రైం బారిన పడితే వెంటనే 1930 టోల్ నెంబర్కి లేదా వెబ్సైట్ ద్వారా గానీ ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. సైబర్ క్రైం స్థానిక అధికారులు, సిబ్బంది వెంటనే స్పందించి తగి న చర్యలు తీసుకుంటారని వివరించారు. కాటమయ్య కి ట్ను ఉపయోగించుకోవాలి వెంకటాపురం(ఎం): ప్రతీ గీత కార్మికుడు కాటమయ్య కిట్ను ఉపయోగించుకోవాలని బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారి రవీందర్రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని పాలంపేటలో 40మంది గీత కార్మికులకు సేఫ్టీ మోకుల వినియోగంపై ట్రైనర్లు బుర్ర శ్రీనివాస్, గుంగెబోయిన రవి, రంగు సత్యనారాయణ, పులి రమేష్లు శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు కారుపోతుల సత్యం, రత్నాకర్ పాల్గొన్నారు. -
ఈసారి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు కాళేశ్వరం గోదావరిలో త్రివేణి సంగమం
● అంతర్వాహినిగా కలిసే సరస్వతి నది ● మే 15 నుంచి 26 వరకు పుష్కరాలు ● వీఐపీ ఘాట్ దగ్గర శాశ్వత ప్రాతిపదికన పనులు ● ఈసారి ప్రత్యేక ఆకర్షణగా జాయ్రైడ్, టెంట్సిటీ, కల్చరల్ ఫెస్టివల్స్ ● క్షేత్ర సంస్థ ఆధ్వర్యంలో సిద్ధమైన మాస్టర్ప్లాన్ పార్కింగ్హెలిపాడ్సిరొంచ టు కాళేశ్వరం దారి.. -
విద్యుత్ తీగలు అమర్చితే చర్యలు
ములుగు: వన్య ప్రాణులకు హాని కలిగించేలా పంట పొలాల చుట్టూ విద్యుత్ తీగలు అమర్చితే చర్యలు తప్పవని ఎస్పీ డాక్టర్ శబరీశ్ హెచ్చరించారు. ఈ మేరకు వైల్డ్లైఫ్ శాఖ తరఫున ఏర్పాటు చేసిన వాల్ పోస్టర్ను బుధవారం ఎస్పీ తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జంతువుల ప్రాణాలు మనిషి ప్రాణా లతో సమానమన్నారు. పంటపొలాల చుట్టూ విద్యుత్ తీగలు ఏర్పాటు చేస్తే సెక్షన్ 105 బీఎన్ఎస్ కింద పదేళ్ల జైలుశిక్ష, ఎలక్ట్రిసిటీ యాక్జ్ 135 తరఫున మూడేళ్ల జైలు శిక్ష, వైల్డ్లైఫ్ ప్రోటెక్షన్ కింద మూడేళ్ల జైలు శిక్ష ఉంటుందని తెలిపారు. పోలీసు అధికారులు, విద్యుత్ సిబ్బంది గ్రామాల వారీగా ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రవీందర్, సీఐ శంకర్, ఎస్సై వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.ఎస్పీ డాక్టర్ శబరీశ్ -
కార్మికుల సమస్యలు పరిష్కరించండి
భూపాలపల్లి అర్బన్: ఏరియాలో గని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం నాయకులు ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. కేటీకే 5వ గనిలో మ్యాన్ రైడింగ్ను పొడగించాలని, కొత్త టబ్బులను ఏర్పాటు చేసి నాణ్యత పాటించాలని, టబ్బుల రిపేరు సామానులు సరిగా రావడం లేదని, షూ, సాక్స్లు, వీల్స్ బోలోట్స్, ఇతర మెటీరియల్ నాసిరకంగా ఉంటున్నాయన్నారు. క్యాంటిన్లో నాణ్యతతో కూడిన అల్పాహారం అందించాలని, ఎస్డీఎల్ యంత్రాల మరమ్మతు పరిరకాలు లేక ఫిట్టర్ కార్మికులు ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య, నాయకులు రాజయ్య, జనార్దన్, శ్రీనివాస్, శ్రీధర్లు పాల్గొన్నారు. -
ఎంఎల్ఎస్ పాయింట్ ఏర్పాటు చేయాలి
భూపాలపల్లి రూరల్: జిల్లాలోని గోదాం ఇరుకుగా ఉండటంతో బియ్యం నిల్వ చేసుకోలేకపోతున్నామ ని, మరొక ఎంఎల్ఎస్ పాయింట్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రమేశ్ ఆధ్వర్యంలో బుధవారం జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో చిట్యాల, మొగుళ్లపల్లి, టేకుమట్ల, రేగొండ, గణపూర్, గోరి కొత్తపల్లి, భూపాలపల్లి ఏడు మండలాలకు రేషన్ షాప్ డీలర్లకు చిట్యాల ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి బి య్యం సరఫరా చేయాల్సి ఉంది. అయితే గోదాం ఇరుకుగా ఉండి బియ్యం నిల్వ చేసుకోలేక పోవడంతో సకాలంలో రేషన్ షాప్ డీలర్లకు బియ్యం సరఫరా చేయడం లేదు. ఈ విషయాన్ని గమనించి జిల్లా కేంద్రంలో మరొక ఎంఎల్ఎస్ పాయింట్ ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం ఉత్తమ ఉద్యోగి డీఎస్ఓ శ్రీధర్కు శాలువాతో సన్మానించా రు. ఈ కార్యక్రమంలో డీలర్ల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మామిడి రమేష్, ఉపాధ్యక్షులు పద్మ, సుధమల్ల బాలకిషన్, రేకల రమేష్, బొచ్చు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.జాయింట్ కలెక్టర్కు రేషన్ డీలర్ల వినతి -
జిల్లాకు చేరుకున్న పోరుయాత్ర
భూపాలపల్లి అర్బన్: పెండింగ్ కేసులను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బాధితులు చేస్తున్న పోరుయాత్ర బుధవారం భూపాలపల్లి ఏరియాకు చేరుకుంది. గొలేటి నుంచి కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయం వరకు పోరుయాత్ర చేపడుతున్నారు. ఈ సందర్భంగా యాత్ర బుధవారం భూపాలపల్లి ఏరియాకు చేరగా ఎస్ఓటు జీఎం కవీంద్రకు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం బాధితులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని ఎమ్మెల్యే, మంత్రులు, కార్మిక సంఘాల నాయకులు ఈ సమస్యపై దృష్టిసారించి పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాధితులు శ్రీనివాస్, శ్రావణ్, సతీష్, నవీన్, సునీల్రెడ్డి, హరీష్, వెంకటస్వామి, కుమార్, రమేష్లు పాల్గొన్నారు. -
గురువారం శ్రీ 6 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
సర్వసతి (అంతర్వాహిని)త్రివేణి సంగమం2015లో గోదావరి పుష్కరాల సందర్భంగా కాళేశ్వరంలోని గోదావరి తీరంలో ప్రధాన స్నానఘట్టాలకు దూరంగా వీఐపీ ఘాట్ నిర్మించారు. ఈ పదేళ్లలో ఇక్కడ ఈ ఘాట్ తప్ప మరో సౌకర్యం లేదు. సరస్వతి పుష్కరాల సందర్భంగా వీఐపీ ఘాట్పై ప్రత్యేక శ్రద్ధ చూపనున్నారు. ● ప్రస్తుతం ఉన్న స్నానఘట్టాల పక్కన కొత్తగా 150 మీటర్ల పొడవుతో కొత్త స్నానఘట్టాలు నిర్మించనున్నారు. ● ఇక్కడ శాశ్వత ప్రాతిపదికన టాయిలెట్స్, వాష్రూమ్స్ అందుబాటులోకి తేనున్నారు. దీంతోపాటు తాత్కాలిక ప్రాతిపదికన బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్, మహిళలకు దుస్తులు మార్చుకునే గదులు, టాయిలెట్స్ నిర్మించనున్నారు. ● వీఐపీల వాహనాల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ స్లాట్, ఆ వాహనాలు సులువుగా రాకపోకలు చేసేందుకు వీలుగా ప్రస్తుతం ఉన్న సీసీ రోడ్డు విస్తరణ, మట్టి రోడ్డు స్థానంలో కొత్తగా రోడ్డు నిర్మించనున్నారు. ● ఇక్కడే బస చేయాలనుకునే వారి కోసం టెంట్సిటీ కూడా ఏర్పాటు చేయనున్నారు. ● అద్దె ప్రాతిపదికన గుడారాలు బుక్ చేసుకుని త్రివేణి సంగమ ప్రదేశం దగ్గర భక్తులు బస చేయవచ్చు. ● ముఖ్యంగా వెదురు గుడారాలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి.పశ్చిమ ఘాట్సరస్వతి నది పుష్కరాలను పురస్కరించుకుని ముక్కంటి కొలువైన కాళేశ్వరం సరికొత్తగా ముస్తాబు కానుంది. మే 15 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్న పుష్కరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.25 కోట్లు కేటాయించింది. వీటితో ఏయే పనులు చేయాలో జిల్లా యంత్రాంగం ప్రణాళికలు రూపొందించింది. దేవాదాయ ధర్మాదాయశాఖ ద్వారా నిర్దేశించి, కలెక్టర్ రాహుల్శర్మ నియమించిన కన్సల్టింగ్ కన్జర్వేషన్ ఆర్కిటెక్ట్ జీఎస్వీ సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలోని ‘క్షేత్ర’సంస్థ మాస్టర్ప్లాన్ తయారుచేసింది. పుష్కరాల ఏర్పాట్లపై ‘సాక్షి’ ముందస్తుగా అందిస్తున్న ప్రత్యేక కథనం.. – భూపాలపల్లి గోదావరి నదినదిలోనుంచి నిర్మించే రోడ్డుటెంట్ సిటీతూర్పు ఘాట్పశ్చిమ ఘాట్కు వెళ్లే దారికాళేశ్వరం ఆలయంట్రాఫిక్ సమస్య తలెత్తకుండా.. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వాహనాల పార్కింగ్ కోసం మూడు స్థలాలను ఎంపిక చేశారు. కాటారం–మహదేవపూర్ నుంచి వచ్చే భక్తుల కోసం కాళేశ్వరం దగ్గరలోని ఇప్పలబోరు సమీపంలో 3.29 ఎకరాలు, ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో 5.07 ఎకరాలు, మహారాష్ట్రలోని సిరొంచ నుంచి వచ్చే వాహనాలకు కన్నెపల్లి సమీపంలో 2.12 ఎకరాల్లో పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయనున్నారు. తూర్పు ఘాట్కు వెళ్లే దారికాటారం టు కాళేశ్వరం దారి..గుండం చెరువుపార్కింగ్హిందూ పురాణాల్లో సరస్వతి నదిని అంతర్వాహినిగా పేర్కొంటారు. ఉత్తరాది ప్రజలు ప్రయాగ్రాజ్ దగ్గర గంగ, యమునా నదులు కలిసే చోట సరస్వతి నది అంతర్వాహినిగా కలుస్తుందని నమ్ముతారు. మన దగ్గర దక్షిణ గంగగా పేర్కొనే గోదావరి, ప్రాణహిత నదుల సంగమ స్థానమైన కాళేశ్వరంలో సరస్వతి నది అంతర్వాహినిగా కలుస్తుందని భక్తుల నమ్మకం. స్థల పురాణం ప్రకారం కాళేశ్వరం ఆలయంలో శివుడికి అభిషేకం చేసిన జలం ప్రత్యేక మార్గం గుండా ప్రవహించి ప్రాణహిత–గోదావరి సంగమ ప్రదేశం దగ్గర కలుస్తుందని, ఈ ప్రవాహం అంతర్వాహినిగా ఉండటం వల్ల సరస్వతి నదిగా పేర్కొంటారు. దీంతో దక్షిణ భారతదేశంలో సరస్వతి పుష్కరాలు కాళేశ్వరానికి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. పోలీస్ కమిషనర్ ఆఫీస్హరిత హోటల్భక్తులకు తాగునీరు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తారు.విశ్రాంతి తీసుకోవడానికి, పిండాలు సమర్పించడానికి వీలుగా స్నానఘట్టాల దిగువన వెదురుతో చలువ పందిళ్లు, ప్రధాన ఆలయం నుంచి స్నానఘట్టాల వరకు ఉన్న రోడ్డును రద్దీకి తగ్గట్టుగా విస్తరించనున్నారు. కాళేశ్వరంలో చూడదగిన ప్రదేశాలు ఏమిటి, ఎలా వెళ్లాలి అనే వివరాలు తెలిపేలా ప్రధాన కూడళ్లలో బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. మహదేవపూర్ టు కాళేశ్వరం దారి150 మీటర్ల మేర కొత్తగా స్నానఘట్టాలు..న్యూస్రీల్త్రివేణి సంగమం వరకు ప్రత్యేక దారి.. పుష్కరాలను పురస్కరించుకుని మూడు నదులు కలిసే సంగమ ప్రదేశం దగ్గర భక్తులు స్నానాలు చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఇందుకోసం ప్రధాన ఘాట్తోపాటు వీఐపీ ఘాట్ నుంచి త్రివేణి సంగమం వరకు భక్తులు చేరుకునేలా ఇసుక బస్తాలతో 30 మీటర్ల వెడల్పుతో ప్రత్యేక దారిని, ఆ దారిపై పందిరిని ఏర్పాటు చేయనున్నారు. ఈ దారులకు ఇరువైపులా భక్తులు స్నానాలు చేయొచ్చు. లేదంటే సంగమం వరకు చేరుకుని స్నానాలు చేసేవిధంగా ఏర్పాట్లు చేయనున్నారు. ఎక్కువ లోతు ఉన్న ప్రదేశాలకు భక్తులు వెళ్లకుండా బారికేడ్లు, ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తారు. షిఫ్ట్నకు 12 మంది తగ్గకుండా మొత్తం 25 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచనున్నారు. సకల సౌకర్యాలు -
కుంభాభిషేకాన్ని వైభవంగా నిర్వహిస్తాం
కాళేశ్వరం: కాళేశ్వరం దేవస్థానంలో మహాకుంభాభిషేకాన్ని అందరితో కలిసి గొప్పగా నిర్వహిస్తామని కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. బుధవారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, దేవాదాయశాఖ ఆర్జేసీ రామకృష్ణరావుతో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు. ఆల య రాజగోపురం వద్ద మెట్ల మార్గాన్ని పరిశీలించి ఆలయంలోని పరంజా(కర్ర)లతో చేస్తున్న మెట్ల మార్గాన్ని పరిశీలించారు. మెట్ల కెపాసిటీ అడిగి తె లుసుకున్నారు. వీఐపీలు, సామాన్యుల వీక్షణకు ఎక్కడ ఉంటారని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈఓ కార్యాలయంలో అధికారులతో కలిసి మహాకుంభాభిషేకం వాల్పోస్టర్లను ఆవిష్కరించా రు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కాళేశ్వరం దేవస్థానంలో ఈనెల 7, 8, 9 తేదీల్లో జరిగే మ హాకుంభాభిషేకం కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. భక్తులు మెచ్చేలా ఏ ర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. దా దాపు 42 సంవత్సరాలు తర్వాత జరుగుతున్న కార్యక్రమమం కావడంతో చాలా ప్రాధాన్యం ఉందన్నారు. ఈ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమష్టి కృషి చే యాలన్నారు. భక్తులు కార్యక్రమం వీక్షించేందుకు వీలుగా ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేయాలన్నారు. భక్తుల రద్దీ నియంత్రణ, క్యూ పాటించడానికి వీలుగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. డిప్యూటీ కమిషనర్ సంధ్యారాణి, అసిస్టెంట్ కమిషనర్ సునీత, దేవస్థానం ఈఓ మహేష్, డీపీఓ నారాయణరావు, ఇరిగేషన్,పీఆర్ ఈఈలు తిరుపతి, వెంకటేశ్వర్లు, డీపీఆర్ఓ శ్రీని వాస్, కాటారం డీఎస్పీ రామ్మోహన్రెడ్డి, మండల ప్రత్యేకాదికారి వీరభద్రయ్య, తహసీల్దార్ ప్రహ్లాద్ రాథోడ్, డీటీ కృష్ణ, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఆలయ అర్చకులు కృష్ణమూర్తిశర్మ, ఫణీంద్రశర్మ, సీఐ రామచంద్రారావు, ఎస్సై తమాషారెడ్డి పాల్గొన్నారు.మహాత్తర ఘట్టం మహా కుంభాభిషేకం– వివరాలు 8లోu ఈనెల 7, 8, 9 తేదీల్లో కార్యక్రమం భక్తుల వీక్షణకు రెండు ఎల్ఈడీ స్క్రీన్లు కలెక్టర్ రాహుల్శర్మ ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు ఎస్పీ కిరణ్ఖరే మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో జరగబోయే కుంభాభిషేకం, మహాశివరాత్రి, సరస్వతీ పుష్కరాలకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. బుధవారం ఆయన కాళేశ్వరంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నెల 7, 8, 9వ తేదీల్లో కాళేశ్వరంలోని కాళేశ్వరముక్తీశ్వర స్వామి ఆలయంలో జరిగే కుంభాభిషేకం, మహాశివరాత్రి, మే నెలలో జరిగే సరస్వతీ పుష్కరాల్లో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా ముందస్తుగా బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. వాహనాలకు సరైన పార్కింగ్ ఉండే విధంగా చూడాలన్నారు. ట్రాఫిక్ జాం కాకుండా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కాళేశ్వర ఆలయ పరిసరాలు, మెయిన్ ఘాట్, వీఐపీ ఘాట్లను, బైపాస్ రోడ్డును పరిశీలించారు. కాటారం డీఎస్పీ రామ్మోహన్రెడ్డి, సీఐ చంద్రరా వు, ఎస్సై తమాషారెడ్డి ఉన్నారు.