Jayashankar
-
దరఖాస్తు గడువు పొడిగింపు
భూపాలపల్లి రూరల్: రాజీవ్ యువ వికాస్ పథకం దరఖాస్తుల గడువును ఈనెల 14వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా అల్పా సంఖ్యాక వర్గాల అధికారిణి టి.శైలజ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని అల్ప సంఖ్యాక వర్గాల నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్, మున్సిపల్, ఎంపీడీఓ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తాం మల్హర్: ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను 100 శాతం పరిష్కరించడానికి కృషి చేస్తానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడి హామీనిచ్చారు. రుద్రారం గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలను మంగళవారం ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు లక్షణ్బాబు, ఉపాధ్యాయ బృందం ఆయనకు ఘన స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించి, ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాత పెన్షన్ వర్తింపు, పెండింగ్ బకాయిలు తదితర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సుభాకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి కిరణ్కుమార్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు విజయపాల్రెడ్డి పాల్గొన్నారు. సూరారం పాఠశాల సమీపంలో క్షుద్రపూజలు కాళేశ్వరం: మహదేవపూర్ మండలం సూరారం జెడ్పీహెచ్ఎస్ పాఠశాల సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డుపై క్షుద్రపూజలు చేశారు. మంగళవారం ఉదయం రోడ్డుపై ఎరుపు రంగు వస్త్రంలో కొబ్బరికాయ, కుంకుమ, నిమ్మకాయలు దర్శనమివ్వడంతో గ్రామస్తులతో పాటు విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. కోనంపేట సమీపంలో పులి ప్రచారం కాటారం: మహాముత్తారం మండలం కోనంపేట అటవీ ప్రాంతంలో పులి సంచరించినట్లు మంగళవారం ప్రచారం జరిగింది. అటవీ ప్రాంతంలోకి వెళ్లిన పలువురు పులి అడుగులను పోలిన గుర్తులను గమనించి గ్రామస్తులకు తెలిపారు. దీంతో పులి అడవిలో ఉందనే వార్త గ్రామం మొత్తం చుట్టేసింది. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అటవీ ప్రాంతానికి చేరుకొని పాదముద్రలను పరిశీలించారు. అవి పులి అడుగులు కావని పులిని పోలిన హైనా వంటి అటవీ జంతువు పాదముద్రలు అని రేంజ్ అధికారిణి ఉష తెలిపారు. ప్రజలు భయాందోళనకు గురికావద్దని సూచించారు. గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలిభూపాలపల్లి అర్బన్: పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ పట్టణ కార్యదర్శి సోత్కు ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. పెంచిన గ్యాస్ ధరలను నిరసిస్తూ మంగళవారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వంట సిలిండర్ గ్యాస్ ధర రూ.50 పెంచడం దారుణమన్నారు. పేద ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బందులు పడుతుంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ఇష్టానుసారంగా ధరలు పెంచుకుంటూ పోతున్నాయని మండిపడ్డారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక, రోజువారి కూలీ వేతనం పెరగక అనేక అవస్థలు పడుతుంటే బీజేపీ ప్రభుత్వం నిత్యవసర ధరలను పెంచుకుంటూ పేద ప్రజల నడ్డి విరుస్తుందన్నారు. పెంచిన ధరలను తగ్గించకపోతే సీపీఐ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన పోరాటాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని ప్రవీణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు వేముల శ్రీకాంత్, నేరెళ్ల జోసెఫ్, అస్లాం, వైకుంఠం, హరీశ్, శివకృష్ణ, శేఖర్, లావణ్య, వనిత, సరూప పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ విద్య
కాటారం: ప్రభుత్వ పాఠశాలల ద్వారా కార్పొరేట్ స్థాయిలో విద్యార్థులకు విద్య అందుతుందని.. అందుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి అన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో కాటారం మండలకేంద్రంలో చేపట్టిన బడిబాట కార్యక్రమాన్ని మంగళవారం ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి డీఈఓ రాజేందర్తో కలిసి ప్రారంభించారు. డీఈఓ, ఉపాధ్యాయులతో పాటు ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి గ్రామంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం కోసం ప్రభుత్వం అమ్మ ఆదర్శ కమిటీలను ఏర్పాటు చేసి సౌకర్యాల కల్పనకు కృషి చేస్తుందన్నారు. కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతుందన్నారు. విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చించడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల సంఖ్యను పెంచే బాధ్యత ప్రతి ఉపాధ్యాయుడు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ మానిటరింగ్ అధికారి లక్ష్మణ్, సెక్టోరియల్ అధికారి రాజగోపాల్, సీఎంఓ రమేశ్, జీసీడీఓ శైలజ, కిషన్రెడ్డి, ఎంఈఓ శ్రీదేవి, హెచ్ఎం ఉమారాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
సన్నబియ్యంతో పేదలకు మేలు
భూపాలపల్లి రూరల్: ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న సన్నబియ్యంతో పేదలకు మేలు జరుగుతుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కారల్మార్స్ కాలనీలో లంబాడ సామాజిక వర్గానికి చెందిన బానోతు మౌనిక కిషన్ నాయక్ ఇంట్లో ప్రభుత్వం అందించిన సన్నబియ్యం భోజనాన్ని మంగళవారం కుటుంబసభ్యులు, కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు భోజనం చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ పేదలందరికీ పూర్తి స్థాయిలో ఆహార భద్రత కల్పించడమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం ఆహార భద్రత కార్డుదారులకు ఉచితంగా సన్న బియ్యం ఇస్తున్నట్లు తెలిపారు. సన్నబియ్యం పంపిణీతో పేదల కళ్లలో ఆనందాన్ని స్వయంగా చూశానని ఎమ్మెల్యే అన్నారు. భోజనం అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మౌనిక. కిషన్ కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలు అందజేశారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ జిల్లాలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని అన్ని చౌక ధరల దుకాణాలకు సన్నబియ్యం స్టాకు చేరినట్లు తెలి పారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, పౌరసరఫరాల అధికారి రాములు, సివిల్ సప్లయ్ అధికారి శ్రీనాథ్, తహసీల్దార్ శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు దాట్ల శ్రీనివాస్, శిరుప అనిల్, ముంజాల రవీందర్, జిల్లా నాయకులు బుర్ర కొమురయ్య, టీపీసీసీ సభ్యుడు చల్లూరి మధు, అంబాల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కలెక్టర్తో కలిసి సహపంక్తి భోజనం -
పకడ్బందీగా ధాన్యం కొనుగోళ్లు
భూపాలపల్లి రూరల్: యాసంగి ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు రాకుండా కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశపు హాలులో రెవెన్యూ, పౌర సరఫరాలు, పౌర సరఫరాల సంస్థ, సహకార, వ్యవసాయ, డీఆర్డీఏ, తూనికలు కొలతలు, కార్మిక శాఖల అధికారులతో యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పీఏసీఎస్, ఐకేపీకి కేటాయించిన అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సకాలంలో ప్రారంభించాలని సూచించారు. ఏ గ్రేడ్ రకం క్వింటాల్కు రూ.2,320, బీ గ్రేడ్ రకానికి రూ.2,300 మద్దతు ధర ప్రకటించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 50శాతం కొనుగోలు కేంద్రాలు మహిళా సమాఖ్యలకు కేటాయించాలన్నారు. ఎంపిక చేసిన గ్రామ సమాఖ్యలకు ధాన్యం కొనుగోలుపై అవగాహన కల్పనకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయాల్లో పాటించాల్సిన నియమ, నిబంధనల బ్యానర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. రైతులకు నగదు చెల్లింపు కోసం కొనుగోలు వివరాలు ఎప్పటికప్పుడు ట్యాబ్లలో నమోదు చేయాలని కొనుగోలు కేంద్రాల ఇన్చార్జ్లను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో నీడ కోసం షామియానా, తాగునీరు, ప్యాడీక్లీనర్, మాయిశ్చర్స్, తూకపు యంత్రాలు, టార్పాలిన్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని మార్కెటింగ్ శాఖ అధికారిని ఆదేశించారు. సన్నరకం, దొడ్డు రకం విడివిడిగా కొనుగోలు చేయాలని, గుర్తించడానికి వీలుగా మార్కింగ్ చేయాలని సూచించారు. సన్న రకం ధాన్యానికి బోనస్ చెల్లింపు ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనాథ్, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రాములు, డీఆర్డీఓ నరేష్, వ్యవసాయ అధికారి వీరునాయక్, జిల్లా సహకార అధికారి వాలియా నాయక్, మార్కెటింగ్ ఏడీ కనకశేఖర్, తూనికలు కొలతల శాఖ అధికారి శ్రీలత, సహాయ కార్మిక శాఖ అధికారి వినోద పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
చిన్న కాళేశ్వరం సర్వే అడ్డగింత
కాటారం: చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగంగా మండలంలోని గూడూరు పరిధిలో కొనసాగుతున్న కాల్వ నిర్మాణ సర్వే పనులను మంగళవారం రైతులు అడ్డుకున్నారు. కాల్వ నిర్మాణంతో తాము భూములు కోల్పోయి నష్టపోవాల్సి వస్తుందని, కాల్వ అలైన్మెంట్ మార్చాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పొలాల మధ్య నుంచి కాల్వ నిర్మాణం జరిగితే తమ పంటలకు నష్టం జరుగుతుందని నిర్వాసిత రైతులు అధికారులకు విన్నవించారు. రైతుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని.. చిన్న కాళేశ్వరం డీఈఈ ఉపేందర్ రైతులకు నచ్చజెప్పారు. డీఈఈ వెంట ఏఈ వెంకన్న, ఎస్సై శ్రీనివాస్, సర్వే ఇన్స్పెక్టర్ రాములు ఉన్నారు. -
చెట్టును ఢీకొని ఒకరికి తీవ్రగాయాలు
కాటారం: గాలివానకు ప్రధాన రహదారిపై నేలకు ఒరిగిన చెట్టును గమనించక ఢీ కొట్టిన ద్విచక్రవాహనదారుడు తీవ్ర గాయాలపాలైన ఘటన మంగళవారం రాత్రి కాటారం మండలంలో చోటుచేసుకుంది. బొప్పారం గ్రామానికి చెందిన మంతెన పూర్ణచందర్ తన ద్విచక్ర వాహనంపై బొప్పారం నుంచి మండల కేంద్రానికి వస్తున్నాడు. గాలివానకు ఓ చెట్టు విరిగి రోడ్డుపై పడిపోయి ఉంది. పూర్ణచందర్ చీకట్లో చెట్టును గమనించక బైక్తో చెట్టును బలంగా ఢీ కొట్టాడు. పూర్ణచందర్ తలతో పాటు తీవ్రగాయాలయ్యాయి. అటు వైపుగా వెళ్లిన వారు 108కి సమాచారం అందించడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
కాటారం: అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న ఆరేళ్లలోపు చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ తెలిపారు. జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో చేపడుతున్న కార్యక్రమాన్ని సోమవారం డీఎంహెచ్ఓ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ చిన్నతనంలోనే ఆరోగ్య, మానసిక సమస్యలను గుర్తించేందుకు జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా ప్రత్యేక కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఆరేళ్ల లోపు చిన్నారుల్లో ఎక్కువ శాతం నేత్ర సమస్యలు, మానసిక సమస్యలు వస్తున్న నేపథ్యంలో ఈ పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రమోద్, ఆర్బీఎస్కే డాక్టర్ బండి శ్రీనివాస్, డాక్టర్ సుజాత, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ మధుసూదన్ -
పుష్కరాల పనులు పూర్తిచేయాలి
కాళేశ్వరం: మే 15నుంచి 26వరకు జరగనున్న సరస్వతీ నది పుష్కరాల అభివృద్ధి నిర్మాణ పనులను మే 4వరకు పూర్తిచేయాలని ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లను కలెక్టర్ రాహుల్శర్మ ఆదేశించారు. మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మితో కలిసి అభివృద్ధి పనులను సోమవారం పరిశీలించారు. ముందుగా జ్ఞానసరస్వతి (వీఐపీ)ఘాటు వద్ద నిర్మాణంలో ఉన్న పుష్కరఘాటును పరిశీలించి ఈఈ తిరుపతిరావుతో మాట్లాడారు. సరస్వతీ మాత విగ్రహ ఏర్పాటుకు జరుగుతున్న నిర్మాణ పనులను, శాశ్వత ప్రాతిపదికన నిర్మిస్తున్న మరుగుదొడ్ల పనులను పరిశీలించారు. ప్రధాన ఘాట్ వద్ద జరుగుతున్న మరుగుదొడ్ల పనులు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, స్వాగత తోరణం పనులు, పుష్కర ఘాట్లలో స్నానఘట్టాలు, నిర్మాణ పనులను ఆర్డబ్ల్యూఎస్ ద్వారా నిర్మిస్తున్న తాగునీటి ట్యాంక్ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం దేవస్థానం ఈఓ కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మే నెలలో కాళేశ్వరంలో నిర్వహించే సరస్వతీ పుష్కరాలకు పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. కొన్నిచోట్ల శాశ్వత ప్రాతిపదికన పనుల నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. త్వరితగతిన నిర్మాణ పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా మరుగుదొడ్లు, తాగునీరు, పుష్కరఘాట్లలో స్నానఘట్టాలు, బట్టలు మార్చుకునే గదులు, చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్తో పాటు ఈఓ మహేష్, డీపీఓ నారాయణరావు, సూపరింటెండెంట్ శ్రీనివాస్, సీఐ రామచందర్రావు, స్థానికులు శ్రీనివాసరెడ్డి, అశోక్ ఉన్నారు. చెట్లను తొలగించాలా.. వద్దా.. కాళేశ్వరంలోని ఆర్చీగేటు నుంచి వీఐపీ ఘాటు వరకు రోడ్డు వెడల్పు పనులు జరుగుతున్నాయి. ఎడమ వైపున భారీ వృక్షాలు ఐదారు వరకు ఉన్నాయి. సోమవారం కలెక్టర్ రాహుల్శర్మ పనులకు పరిశీలనకు రాగా కాంట్రాక్టర్లు వృక్షాలు తొలగిస్తామని చెప్పారు. ఆయన స్పందించి వృక్షాలను తొలగించవద్దని చెప్పారు. తమ భూమిలో స్తంభాలు వేయొద్దు.. ప్రధాన గోదావరిఘాటు వద్ద స్థానిక భూ యజమానులు తమభూమిలో అనుమతి లేకుండా విద్యుత్ స్తంభాలు ఎలా వేస్తారని కలెక్టర్తో మొరపెట్టుకున్నారు. పట్టా పరిశీలించాలని డీటీ కృష్ణకు ఆదేశించారు. కలెక్టర్ రాహుల్శర్మ దేవస్థాన కార్యాలయంలో సమీక్ష -
ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ వేగవంతం
భూపాలపల్లి: జిల్లాలో తలపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేసి త్వరితగతిన గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ హౌసింగ్ అధికారులకు సూచించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలోని మొదటి అంతస్తులో గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయాన్ని కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లకు ఎంపికై న లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టి గడువులోపు పూర్తి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, హౌసింగ్ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ లోకిలాల్, డీఈ శ్రీకాంత్, ఏఈ రాజలింగం తదితరులు పాల్గొన్నారు. కంటి వైద్య శిబిరంతో ప్రతి ఒక్కరికీ మేలు కాటారం: కంటి వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ఉచిత కంటి వైద్య శిబిరంతో ఎంతో మేలు జరుగుతుందని కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు వర్ధంతిని పురస్కరించుకొని పుష్పగిరి కంటి ఆస్పతి ఆధ్వర్యంలో కాటారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని శ్రీపాద ట్రస్టు చైర్మన్ శ్రీనుబాబుతో కలిసి కలెక్టర్ రాహుల్శర్మ ప్రారంభించారు. అంతకుముందు శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కంటి పరీక్షలు చేయించుకునే ఆర్థిక స్థోమత లేని వారికి ఈ ఉచిత వైద్య శిబిరం ఉపయోగపడుతుందన్నారు. కంటి చూపు లోపం ఉన్న ప్రతి ఒక్కరు కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. శ్రీనుబాబు మాట్లాడుతూ పుష్పగిరి ఆస్పత్రి ఆధ్వర్యంలో పేద ప్రజల కోసం ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆపరేషన్ అవసరమైన ప్రతి ఒక్కరికీ ఉచితంగా చేయించడంతో పాటు కంటి అద్దాలు అందించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి మధుసూదన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్రెడ్డి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు చీమల సందీప్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, యూత్ అధ్యక్షుడు చీటూరి మహేశ్గౌడ్, మహిళా అధ్యక్షురాలు జాడి మహేశ్వరి, మండల వైద్యాధికారిణి మౌనిక, నాయకులు పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ -
పెయింటింగ్ డబ్బులు ఇవ్వలేదు..
గతేడాది ఆగస్ట్ మాసంలో భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ మండలం రేపాక, చిట్యాల మండలం జూకల్లు గ్రామాల్లోని అంగన్వాడీ సెంటర్లను మోడల్ అంగన్వాడీలుగా మార్చే క్రమంలో పెయింటింగ్ వేశాం. రూ.1.10లక్షలు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు సంబంధిత శాఖ అధికారులు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అప్పులు చేసి పెయింటింగ్ డబ్బాలు, ఇతర మెటీరియల్ తీసుకువచ్చి వేశాం. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా చిట్యాల మండలం ముచినీపర్తి, ఏలేటిరామయ్యపల్లి, గుంటూరుపల్లి గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించే పెయింటింగ్స్ వేశాం. దానికి సంబంధించిన డబ్బులు ఇవ్వడం లేదు. సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. – సుదమల్ల రమేశ్, ఆర్టిస్ట్, రేపాక, రేగొండ -
శివాలయానికి రూ.1.16లక్షల విరాళం
చిట్యాల: మండలంలోని నవాబుపేట గ్రామంలో నిర్మిస్తున్న శివాలయానికి గోపాలపూర్ గ్రామానికి చెందిన లక్ష్మణాచార్యులు(మూకయ్య) చిన్న కుమారుడు రంగాచార్యులు రూ.లక్ష పదహారు వేలు విరాళం అందజేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు కసిరెడ్డి రత్నాకర్రెడ్డి సోమవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు రఘునందన్ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ముగిసిన వసంత నవరాత్రి ఉత్సవాలు రేగొండ: కొత్తపల్లిగోరి మండలకేంద్రంలోని నవదుర్గ ఆలయంలో తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన వసంత నవరాత్రి ఉత్సవాలు సోమవారం ముగిశాయి. చివరి రోజు ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమం చేశారు. దుర్గమాతను బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిషిధర్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు సూదనబోయిన విష్ణు యాదవ్, పెండ్యాల రాజు, రాంబాబు, వేణు, నరేష్, అనిల్, బాబురావు, వీరేశం, రాజు, విమల పాల్గొన్నారు. ఉచిత పాలిటెక్నిక్ కోచింగ్ భూపాలపల్లి అర్బన్: సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో అన్ని సింగరేణి పాఠశాలల్లో ఉచిత పాలిటెక్నిక్ కోచింగ్ నిర్వహించనున్నట్లు ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి జి.శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాలిసెట్ రాసే విద్యార్థుల కోసం ఏరియాలోని సింగరేణి ఉన్నత పాఠశాలలో శిక్షణ తరగతులను ఈ నెల 10వ తేదీన ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సింగరేణి కార్మికుల పిల్లలతో పాటు పరిసర గ్రామాల విద్యార్థులు కూడా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పాలిటెక్నిక్ ద్వారా అపారమైన ఉద్యోగ అవకాశాలు ఉంటాయని తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో హెల్ప్డెస్క్ భూపాలపల్లి అర్బన్: రాజీవ్ యువ వికాసం స్కీం దరఖాస్తులను ఆన్లైన్లో నమోదుచేసేందుకు మున్సిపల్ కార్యాలయంలో హెల్ప్డెస్క్ను ఏర్పాటుచేసినట్లు మున్సిపల్ కమిషనర్ బిర్రు శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత ధృవీకరణ పత్రాలను కార్యాలయంలోని రూమ్ నంబర్ 12లో అందజేయాలని సూచించారు. ఆరోగ్యంగా జీవించడం మానవుడి హక్కు భూపాలపల్లి అర్బన్: ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలని.. ఆరోగ్యంగా జీవించడం మానవుడి హక్కు అని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జయరాంరెడ్డి తెలిపారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిల్ హాలులో సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జడ్జి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. న్యూట్రిషన్ ఆహారం తీసుకుంటూ, వ్యాయామం, యోగ లాంటి అలవాట్లను కలిగి ఉంటే రోగాలు దరిచేరవన్నారు. వేసవిలో పనిచేసే ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు విరివిగా అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఉమాదేవి, హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు పాల్గొన్నారు. కారు పల్టీ.. ముగ్గురికి గాయాలు గోవిందరావుపేట: మండల పరిధిలోని పస్రా గుండ్లవాగు కార్నర్ సమీపంలో ఛత్తీస్గఢ్కు చెందిన ఓ కారు పల్టీలు కొట్టింది. ఈ ఘటన సోమవారం చోటుచేసుకోగా ముగ్గురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే..ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాకు చెందిన సత్తేంద్ర వరంగల్ వైపునకు కారులో వస్తుండగా వాహనం అదుపు తప్పి పల్టీలు కొట్టి రోడ్డు కింద పడిపోయింది. ఈ క్రమంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన ఇతర వాహనదారులు 108 వాహనానికి సమాచారం అందించగా అక్కడకు చేరుకున్న సిబ్బంది గాయపడిన వారిని ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. -
ఆరు ఎకరాల మామిడితోట దగ్ధం
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని రామక్రిష్ణాపూర్ పరిధిలో గల మోకిరాల తిరుపతిరావుకు చెందిన మామిడి తోటకు సోమవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో సుమారు రెండు వేల చెట్లు కాలిపోయాయి. చెల్పూరుకు చెందిన తిరుపతిరావు రామక్రిష్ణాపూర్ పరిధిలో ఆరు ఎకరాల్లో హిమయిత్, దశరి రకంకు చెందిన 8 ఏళ్ల వయస్సు గల రెండు వేల మామిడి చెట్లను సాగు చేస్తున్నాడు. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. నాలుగేళ్లుగా క్రాప్ వస్తుందని తిరుపతిరావు పేర్కొన్నారు. మామిడితోట వద్ద వర్కర్లు కాపలా ఉంటున్నారు. సోమవారం ఉదయం కొంతమంది వ్యక్తులు మామిడితోట వైపునకు వచ్చి వెళ్లిన కొద్దిసేపటికే తోటలో మంటలు చేలరేగడంతో వర్కర్లు నాలుగు మోటార్ల సహాయంతో మంటలను ఆర్పివేసే ప్రయత్నం చేశారు. అయినా అదుపులోకి రాలేదు. పంట చేతికి వచ్చేదశలో మామిడిచెట్లు కాలిపోవడంతో పాటు డ్రిప్ పైపులు పూర్తిగా కాలిపోవడంతో సుమారు రూ.20 లక్షల నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తిరుపతిరావు తెలిపారు. రెండు వేల చెట్లు అగ్నికి ఆహుతి రూ.20 లక్షల నష్టం -
హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం
కాటారం: రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వ హక్కులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోందని స్టేట్ ఆయిల్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాటారం మండలకేంద్రంలో సోమవారం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ శ్రేణులతో కలిసి రాఘవరెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకుడు దుద్దిళ్ల శ్రీనుబాబు గారెపల్లిలో ర్యాలీ నిర్వహించారు. ప్రధాన కూడలిలోని అంబేడ్కర్, మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ మహాత్మాగాంధీ చూపిన శాంతి, అహింసా సిద్ధాంతాలను బీజేపీ విస్మరిస్తోందన్నారు. అనంతరం రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్రెడ్డి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు చీమల సందీప్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, యూత్ అధ్యక్షుడు చీటూరి మహేశ్గౌడ్, మహిళా అధ్యక్షురాలు జాడి మహేశ్వరి, నాయకులు పాల్గొన్నారు. ఆయిల్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి -
పరిష్కారమెప్పుడో..?
భూపాలపల్లి అర్బన్: ప్రజావాణిలో సమస్యలకు పరిష్కారం లభించడంలేదని ప్రజలు వాపోతున్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన గ్రీవెన్స్లో జిల్లా నుంచి మొత్తం 48 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టర్ రాహుల్శర్మ, అదనపు కలెక్టర్ ఆశోక్కుమార్, ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఆర్డీఓ రవి కలిసి ఆర్జీలను స్వీకరించారు. వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అధికారులు నిర్ధిష్ట సమయంలో స్పందించాలని సూచించారు. ప్రజలు అధికారులను నేరుగా కలిసే వేదిక ప్రజావాణి అని ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించి ప్రజల మన్ననలు పొందాలన్నారు. పింఛన్ను పునరుద్ధరించడం లేదు.. ఆరు సంవత్సరాలుగా బోదకాలుతో బాధపడుతుండగా పింఛన్ అమలు చేశారు. ఎనిమిది నెలల క్రితం పింఛన్ ఆగిపోయింది. నాటి నుంచి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పింఛన్ రావడం లేదు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో జరిగిన సదరం క్యాంపునకు వెళ్లగా పైలేరియా అని గుర్తించారు. పింఛన్ కోసం తిరిగితిరిగి అలసిపోతున్నాం. కలెక్టర్ స్పందించి పింఛన్ ఇప్పించాలి. – కామారపు నాగబూషణం, ఇస్సిపేట ఆధార్ సెంటర్ ఏర్పాటుకు అవకాశం కల్పించాలి.. దివ్యాంగుడినైనా నాకు జీవనోపాధి కోసం కలెక్టర్ స్పందించి ఆధార్ సెంటర్, మీసేవా కేంద్రం ఏర్పాటుకు అవకాశం కల్పించాలి. 2019 సంవత్సరం నుంచి జీవనోపాధి కోసం ఎదురు చూస్తున్నాను. ప్రస్తుతం గ్రామంలోనే సీఎస్సీ కేంద్రాన్ని నడిపిస్తున్నారు. ఆధార్ ఆపరేటర్ సూపర్వైజర్ ట్రైనింగ్ పూర్తిచేశాను. గ్రామాల్లో ఆధార్ సెంటర్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నాకు ఆధార్ సెంటర్ కేటాయించినట్లయితే గ్రామాల్లో ప్రజలకు సేవలందిస్తాను. – సంగీ శంకర్, దుబ్యాల, టేకుమట్లఉపాధి కల్పిస్తామని పట్టించుకోవడం లేదు.. జిల్లా కేంద్రంలో నిర్మించిన కలెక్టరేట్ స్థలంలో 141 సర్వే నంబర్లో మా తండ్రి పేరున ఉన్నటువంటి ఐదున్నర గుంటల భూ మిని కోల్పోయాం. అప్పటి కలెక్టర్ భవేష్మిశ్రా నష్టపోయిన భూమికి బదులుగా ఉపాధి అవకాశం కల్పిస్తామని చెప్పారు. కాంట్రాక్ట్ పద్ధతిలో ఏదైనా ఉద్యోగ అవకాశం కల్పించాలి. – కామారపు రవికుమార్, ఇస్సిపేట ప్రజావాణిలో దరఖాస్తుల వెల్లువ వివిధ సమస్యలపై 48 ఆర్జీలు.. ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి కలెక్టర్ రాహుల్శర్మ -
కల్యాణాన్ని వీక్షించిన మంత్రి
కాటారం: ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు స్వగ్రామం ధన్వాడలోని దత్తాత్రేయ స్వామి ఆలయంలో స్వామి వారి కల్యాణ మహోత్సవం కనుల విందుగా సాగింది. కల్యాణాన్ని మంత్రి శ్రీధర్బాబు వీక్షించి మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, తల్లి జయమ్మ, సోదరుడు శ్రీనుబాబు దంపతులు కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. అంతకముందు శ్రీనుబాబు దంపతులు శ్రీసీతారాముల సహిత లక్ష్మణ, ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాలను. పట్టు వస్త్రాలను మంత్రి ఇంటి నుంచి ఆలయం వరకు తీసుకొచ్చారు. కాటారం మండల కేంద్రంలోని భక్తాంజనేయ స్వామి ఆలయంతో పాటు, గారెపల్లి ఆంజనేయస్వామి ఆలయం, ధన్వాడ దత్తాత్రేయ స్వామి ఆలయాల్లో కల్యాణం ఘనంగా నిర్వహించారు. -
‘ఎల్సీ’కి సాంకేతికత జోడింపు
హన్మకొండ: విద్యుత్ వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన సేవలందించేందుకు టీజీ ఎన్పీడీసీఎల్ ఆధునిక సాంకేతిక పద్ధతులను అవలంబిస్తోంది. ఈక్రమంలో లైన్ క్లియరెన్స్(ఎల్సీ) తీసుకునేందుకు మరింత బాధ్యతాయుతంగా, సులభంగా ఉండేలా ప్రత్యేక యాప్ను రూపొందించింది. ఇప్పటి వరకు ఫోన్ కాల్ ద్వారా ఎల్సీ తీసుకోవడంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. విద్యుత్ ప్రమాదాలతో ప్రాణ నష్టం జరుగుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎల్సీ(ఫీడర్లలో విద్యుత్ సరఫరా నిలిపివేత, పునరుద్ధరణ) కోసం ప్రత్యేక యాప్ను ఎన్పీడీసీఎల్ యాజమాన్యం రూపొందించింది. ఇప్పటి వరకు ఎల్సీ తీసుకుంటే తీసుకున్న ఉద్యోగికి, సబ్స్టేషన్ ఆపరేటర్కు మాత్రమే తెలిసేది. ఈయాప్ ద్వారా ఏఈ, ఏడీఈ, డీఈలు కూడా తెలుసుకునే వీలు కలగడంతోపాటు పర్యవేక్షణ పెరుగుతుంది. ఫీడర్ల ఎంపికలోనూ కచ్చితత్వం ఉంటుంది. పొరపాట్లకు తావులేకుండా.. ఎల్సీ(లైన్ క్లియర్) తీసుకోవాలనుకున్న లైన్మెన్ యాప్ ఓపెన్ చేసి అందులో సంబంధిత ఫీడర్లో ఎల్సీ కావాలని సంబంధిత ఏఈకి విన్నవించుంటే అతను పరిశీలించి ఆ ఫీడర్లో ఎల్సీ ఇవ్వొచ్చా లేదా? అత్యవసరాలు ఏమైనా ఉన్నాయా.. అప్పటికే షెడ్యూల్ చేయబడిన పనులు ఉన్నాయా.. మరే ఇతర షెడ్యూల్ చేసిన పనులు ఉన్నాయా? అని పరిశీలిస్తారు. ఏఈ నిర్ణయం మేరకు ఎల్సీ అనుమతి ఆధారపడి ఉంటుంది. ఎల్సీకి అనుమతిస్తే లైన్మెన్, సబ్స్టేషన్ ఆపరేటర్కు యాప్ ద్వారా సమాచారం అందుతుంది. దీని ఆధారంగా సబ్ స్టేషన్ యాప్లో నిర్దిష్టంగా పేర్కొన్న ఫీడర్లో ఎల్సీ ఇస్తారు. దీని ద్వారా పొరపాటు జరుగుకుండా ఉంటుంది. సూచనలిస్తూ.. పొరపాట్లను నివారించేందుకు తగు సూచనల్ని యాప్ ఇస్తుంది. హెల్మెట్ ధరించాలని, హ్యాండ్ గ్లౌజ్లు వేసుకోవాలని, ఎర్త్ రాడ్ వాడాలని, ఏబీ స్విచ్ ఓపెన్ చేశారా? లేదా అనే జాగ్రత్తలను యాప్ గుర్తు చేస్తుంది. ఎక్కడైనా డబుల్ ఫీడింగ్ ఉందా? ఈ ఫీడర్కు వేరే ఫీడర్తో అనుసంధానం ఉందా? వంటి సమాచారాన్ని తెలియజేస్తుంది. దీని ద్వారా జాగ్రత్త పడుతూ ప్రాణ నష్టాన్ని నివారించవచ్చు. డబుల్ ఫీడరింగ్ ఉంటే రెండు ఫీడర్లలో ఎల్సీ తీసుకోవడమా? లేదా ఇతరత్రా జాగ్రత్తలు తీసుకువచ్చా? అని బేరీజు వేసుకుని పనులు చక్కదిద్దుతారు. ఎల్సీ తీసుకున్న ఫీడర్లో పనులు పూర్తి కాగానే యాప్లో ఆ సమాచారాన్ని లైన్మెన్ పొందుపర్చి, విద్యుత్ సరఫరా పునరుద్ధరించవచ్చనే సంకేతాన్ని, సమాచారాన్ని యాప్ ద్వారా చేరవేస్తారు. దీన్ని సంబంధిత సెక్షన్ ఏఈ పరిశీలించి సబ్స్టేషన్ ఆపరేటర్కు సమాచారం చేరవేస్తారు. దీంతో ఎల్సీ తీసుకున్న ఫీడర్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తారు. భద్రతా ప్రమాణాలు పెంచడానికి యాప్.. విద్యుత్ వినియోగదారులకు మరింత ఉత్తమ సేవలు అందించడంలో భాగంగా భద్రతా ప్రమాణాలను పెంచడానికి ప్రత్యేకంగా ఎల్సీ యాప్ను టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం రూపొందించింది. ఎల్సీ యాప్ ద్వారా విద్యుత్ అంతరాయాల సమయాలు, మానవ తప్పిదాలను అరికట్టవచ్చు. విద్యుత్ ప్రమాదాలు, ప్రాణ నష్టాన్ని నివారించవచ్చు. – పి.మధుసూదన్రావు, ఎస్ఈ, హనుమకొండఆన్లైన్లో సులభంగా విద్యుత్ లైన్ క్లియరెన్స్ నూతన యాప్ రూపొందించిన టీజీ ఎన్పీడీసీఎల్ అధికారులు, ఉద్యోగులకు శిక్షణ -
రణదివే ఆశయాలను కొనసాగించాలి
ములుగు రూరల్ : కార్మిక ఉద్యమనాయకుడు, సీఐటీయూ అఖిల భారత వ్యవస్థాపక అధ్యక్షుడు బీటీ రణదివే ఆశయాలను కొనసాగించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలో రణదివే 35వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం అనంతరం 1970లో ఐక్యత, పోరాటం అనే నినాదంతో సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్(సీఐటీయూ) ఏర్పడిందని అన్నారు. కులం, మతం, లింగ బేధం తేడాలతో విడిపోవడం వల్ల కార్మికులు నష్టపోతారని ఐక్యతగా ఉద్యమం నిర్మించాలని పిలుపునిచ్చారని అన్నారు. కార్యక్రమంలో ఆశ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి నీలాదేవి, సద్దాం హుస్సేన్, నారాయణ, ప్రవీణ్, రవీందర్, రాజు, రజిత, రమ, జ్యోత్న్స తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్ -
షెడ్యూల్లో చేరిస్తేనే రిజర్వేషన్లు సాధ్యం
మొగుళ్లపల్లి: తమిళనాడు తరహాలో తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు రాజ్యాంగం 9వ షెడ్యూల్లో చేరిస్తేనే సాధ్యమవుతుందని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్గౌడ్ అన్నారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల కోటాలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు జీఓల ద్వారా నిలువవన్నారు. 1962 నుంచి ఇప్పటివరకు రిజర్వేషన్ల పెంపుపై ఎన్ని జీఓలు, చట్టాలు వచ్చినా అమలు కాలేదన్నారు. బదిలీలు నిలిపేయాలని మంత్రికి వినతి కాటారం: ఉమ్మడి వరంగల్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా పంచాయతీ కార్యదర్శుల బదిలీలు కొనసాగుతున్న నేపథ్యంలో కాటారం సబ్ డివిజన్లో బదిలీల ప్రక్రియ నిలిపేయాలని కోరుతూ ఆదివారం మంత్రి శ్రీధర్బాబుకు పంచాయతీ కార్యదర్శులు వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ కాటారం సబ్డివిజన్ పరిధిలో కొనసాగుతున్న పంచాయతీ కార్యదర్శులు అధిక సంఖ్యలో మంథని నియోజకవర్గానికి చెందిన వారే ఉన్నారని తెలిపారు. గ్రామ పంచాయతీ కార్యక్రమాల నిర్వహణ, అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ.2లక్షల నుంచి రూ.5లక్షల వరకు సొంత డబ్బు పంచాయతీ కార్యదర్శులు ఖర్చు చేశారన్నారు. రెండేళ్లుగా నిధుల కొరత కారణంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల కొరత ఉందని వారు మంత్రికి విన్నవించారు. బదిలీల కారణంగా కార్యదర్శులకు అందాల్సిన బకాయిలపై పలు అంశాలు ప్రభావితం చేస్తాయని తమ సమస్యలను అర్థం చేసుకొని బదిలీలు నిలిపివేయాలని మంత్రిని కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో సబ్ డివిజన్ పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. బీజేపీ ఆవిర్భావ వేడుకలు భూపాలపల్లి రూరల్: పట్టణంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో బీజేపీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిశిధర్రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మోదీ విజన్తో రానున్న రోజుల్లో రాష్ట్రంలో అధికారంలోకి రానున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత మోర్చా నాయకులు బట్టు రవి, పార్లమెంట్ కో– కన్వీనర్ లింగంపల్లి ప్రసాదరావు, నాయకులు దొంగల రాజేందర్, దాసరి తిరుపతిరెడ్డి, పెండ్యాల రాజు, వేణు, రఘునాథరెడ్డి, మునీందర్, కుమార్, విప్లవ రెడ్డి, దేవేందర్ పాల్గొన్నారు. రూ.లక్ష విరాళం చిట్యాల: మండలంలోని నవాబుపేట గ్రామంలో నిర్మిస్తున్న శివాలయానికి అదే గ్రామానికి చెందిన కాల్వ రఘోత్తంరెడ్డి కుమారుడు కాల్వ రాంరెడ్డి రూ.లక్ష వెయ్యి నూట పదహారు ఆలయ కమిటీ అధ్యక్షుడు కసిరెడ్డి రత్నాకర్రెడ్డికి అదివారం అందజేశారు. ఈ సందర్భంగా రత్నాకర్రెడ్డి వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మందల రాఘవారెడ్డి, మోతుకూరి నరేష్, చెక్క నర్సయ్య, బిళ్ల సత్యనారాయణరెడ్డి, బొమ్మ శంకర్, కొక్కుల సారంగం, కాల్వ సమ్మిరెడ్డి, సర్వ శరత్, తీగల నాగరాజు, ప్రధాన అర్చకులు రఘునందన్ పాల్గొన్నారు. లీకేజీలను గుర్తించిన ఇంజనీర్లు ధర్మసాగర్: హనుమకొండ జిల్లా ధర్మసాగర్లోని రిజర్వాయర్ సమీపాన ఇటీవల జరిగిన టన్నెల్ లీకేజీలను ఎట్టకేలకు ఇంజనీర్లు గుర్తించారు. దేవాదుల పథకంలో భాగంగా 3వ ప్యాకేజీ కింద దేవన్నపేట పంపుహౌస్ నుంచి రిజర్వాయర్ సమీపం వరకు పైపులైన్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి సుమారు 200 మీటర్లు రిజర్వాయర్ వరకు టన్నెల్ నిర్మించారు. ఈ క్రమంలో గత నెల 27న రిజర్వాయర్లోకి నీటిని పంపింగ్ చేయగా వారం రోజుల క్రితం టన్నెల్ లీకేజీ అయింది. దీనితో పంపులు ఆపివేసి టన్నెల్ నుంచి నీటిని డీ వాటరింగ్ చేశారు. ఈ క్రమంలో ఆదివారం పైపు నుంచి టన్నెల్లోకి దిగిన మెగా ఇంజనీర్లు, సిబ్బంది లీకేజీలను కనుక్కుని మరమ్మతులు ఎలా చేయాలో పరిశీలించారు. -
రాజ్యాంగంపై అవగాహన పెంచడమే లక్ష్యం
భూపాలపల్లి రూరల్/ రేగొండ: రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. ఆదివారం జిల్లాకేంద్రం, కొత్తపల్లిగోరి మండలాల్లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదంతో ఎమ్మెల్యే పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం పలువురు మేధావుల ఆలోచనలతో ఏర్పడిన పవిత్ర గ్రంథామన్నారు. అలాంటి రాజ్యాంగాన్ని బీజేపీ అణగదొక్కాలని చూస్తుందన్నారు. ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నర్సయ్య, నాయకులు సూదనబోయిన ఓంప్రకాశ్, దుగ్యాల రాజేశ్వరరావు, చిగురుమామిడి కుమార్, వెంకటేష, వీరబ్రహ్మం, శ్రీనివాస్, ప్రభాకర్, సంతోష్ రాజయ్య, పాల్గొన్నారు. నాపాక ఆలయం సందర్శన చిట్యాల: నైన్పాక నాపాక శ్రీ లక్ష్మీనరసింహాస్వామి ఆలయాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సందర్శించారు. అనంతరం ఆలయంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకలలో పాల్గొని పూజలు చేశారు. రైతు వేదికలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని కళాకారులకు బహుమతులు అందజేశారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
అటకెక్కిన డేంజర్ జోన్
మల్హర్: తమ ప్రాంతంలో అపార బొగ్గు నిక్షేపాలను వెలికితీసేందుకు అవసరం అయిన ఇళ్ల స్థలాలను సైతం ఇచ్చేందుకు ముందుకు వచ్చిన నిర్వాసితులను జెన్కో మాత్రం తన తీరుతో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. తాడిచర్లలో బొగ్గు తవ్వకాల కోసం అన్వేషణ ప్రారంభించినప్పటి నుంచి తమకు దక్కాల్సిన వాటికోసం ఈ ప్రాంతవాసులు ఎన్నోమార్లు రాజీలేని పోరాటాలు చేపట్టారు. ప్రతీ సందర్భంలోనూ కంపెనీ తనకు అనుకూలంగా ఉండే విధంగా వ్యవహరిస్తూనే నిర్వాసితుల సమస్యలను మాత్రం పెడచెవిన పెడుతూనే ఉంది. బొగ్గు వెలికితీత ప్రారంభించి ఏడేళ్లు గడుస్తున్నా నేటికీ ఈ ప్రాంతవాసులకు డేంజర్ జోన్ ఇళ్ల సమస్య పరిష్కారానికి మాత్రం నోచుకోవడం లేదు. బ్లాస్టింగ్లతో భయాందోళన బొగ్గు వెలికితీత కోసం పెడుతున్న బాంబులు ఇళ్లలో వణుకు పుట్టిస్తున్నాయి. ఈ బాంబులతో గిన్నెలు, బోళ్లు కూడా కింద పడుతున్నాయి. అసలు ఇంట్లో ఉండాలంటేనే భయం.. భయంగా బతికే పరిస్థితి నెలకొంది. ఇది మండల పరిధిలోని పెద్దతాడిచర్ల ఉపరితల బొగ్గు గనికి కూతవేటు దూరంలో నివసించే కాలనీ వాసుల ఆవేదన. తాడిచర్ల ఓపెన్కాస్ట్లో జరుగుతున్న బ్లాస్టింగ్లతో రోజురోజుకూ ప్రజల్లో భయాందోళన పెరుగుతుంది. ఓసీపీ ప్రాజెక్టు 500 మీటర్ల పరిధిలో ఇళ్లు ఉండడంతో పాటు స్థాయికి మించి బ్లాస్టింగ్ చేయడం ద్వారా తమ ఇళ్ల కప్పులు పగులుతున్నాయని, గోడలు బీటలు వారుతున్నాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. బ్లాస్టింగ్ సమయంలో ఉండాలంటేనే జంకుతున్నామని చెప్పారు. పనులతో వచ్చే దుమ్ము, ధూ ళి ఇళ్లపై చేరడంతో పాటు, తినే ఆహార పదార్థాలపై పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రోగాల బారిన పడాల్సి వస్తుందని అంటున్నారు. సీఎండీ రాకతో.. మండలంలోని తాడిచర్ల ఓపెన్కాస్ట్ మైన్లో జెన్కో సీఎండీ సందీప్కుమార్ సుల్తానీయ ఈనెల 1వ తేదీన పర్యటించారు. ఈ నేపథ్యంలో మండలంలోని పెద్దతాడిచర్ల డేంజర్ జోన్ ఇళ్ల సమస్యను పరిష్కస్తామని నిర్వాసితులు ఆందోళన చెందవద్దని హమీఇచ్చారు. సీఎండీ ప్రకటనతో నిర్వాసితుల్లో డేంజర్ జోన్పై ఆశలు చిగురించాయి. డేంజర్ జోన్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కొంతమంది ఇప్పటికే హైకోర్టు మెట్లు ఎక్కినట్లు తెలిసింది. సేకరణ పనులు ప్రారంభించాలి మండలంలో పెద్ద తాడిచర్ల ఇళ్ల సేకరణ పనులు ఆలస్యం చేయకుండా ప్రారంభించాలి. ఓపెన్కాస్ట్ బ్లాసింగ్లతో తాము ఇబ్బందులు పడుతున్నాం. జిల్లా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించి నాయ్యం చేయాలి. – మంతెన సమ్మయ్య, పెద్ద తాడిచర్ల, మల్హర్జెన్కో తీరుతో భూ నిర్వాసితులకు ఇబ్బందులు బ్లాస్టింగ్లతో భయాందోళన సీఎండీ రాకతో చిగురించిన ఆశలుపీఎన్ ప్రకటనకే పరిమితం డేంజర్ జోన్ పరిధిలో ఉన్న ఇళ్ల సేకరణకు 2022 డిసెంబర్ 14న 359.23 ఎకరాలకు 2600 చిలుకు ఇళ్లకు పీఎన్ (ప్రాథమిక నోటిఫికేషన్)ను ప్రతికల్లో ప్రచురించారు. కానీ డిక్లరేషన్ ప్రకటించకపోవడంతో 2024 డిసెంబర్లో సదరు నోటిఫికేషన్ రద్దయింది. దీంతో డేంజర్ జోన్ సమస్య మొదటికి వ చ్చింది. నోటిఫికేషన్ వేసి ఇళ్లు సేకరించి తమకు న్యాయం చేయాలని మండలానికి వచ్చిన జిల్లా అ ధికారులు, ప్రజాప్రతినిధులను వేడుకుంటున్నారు. -
‘ఆపరేషన్ కగార్’ను నిలిపేయాలి
ములుగు రూరల్: దండకారణ్యంలో మావోయిస్టులపై సాగుతున్న ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకుడు బొమ్మెడ సాంబయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై ప్రజాధర్నా వాల్పోస్టర్ను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీ గిరిజన హక్కుల రక్షణకు రాజ్యాంగంలో పొందుపరిచిన షెడ్యూల్లోని చట్టాలను ప్రధాని మోదీ, అమిత్షా కాలరాస్తున్నారని తెలిపారు. కార్పొరేట్ కంపెనీలకు అటవీ సంపదను దోచిపెట్టేందుకే అమాయకపు గిరిజనులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఆదివాసీ ప్రజలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జరుపుతున్న హత్యాకాండను నిలిపివేయాలని కోరారు. రేపు(8వ తేదీ)హైదరాబాద్లోని ఇందిరాపార్కు చౌక్ వద్ద చేపడుతున్న ప్రజాధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు దయాకర్ పాల్గొన్నారు. న్యూడెమోక్రసీ నాయకులు సాంబయ్య -
సరస్వతీ పుష్కరాల్లో ‘జ్ఞానతీర్థం’శోభ
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణీ సంగమంలో మే 15 నుంచి 26 వరకు సరస్వతీ పుష్కరాలు జరుగనున్నా యి. పుష్కరాల అభివృద్ధి పనులకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రూ.25 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ పలుమార్లు సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యటనలు, మంత్రి శ్రీధర్బాబు ప్రత్యేక దృష్టిసారించడంతో పనుల్లో వేగం పెరిగింది. కాగా, రూ.21కోట్ల వ్యయంతో దేవాదాయ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ శాఖ, ఎన్పీడీసీఎల్లు పనులు ప్రా రంభించాయి. అధునాతనంగా దేవాదాయశాఖ ఆధ్వర్యంలో రూ.20 లక్షలతో ‘జ్ఞానతీర్థం’ నమూనా ఎఫ్ఆర్పీ ఫైబర్ విగ్రహాన్ని ఏర్పా టు చేస్తున్నారు. ఫైబర్ విగ్రహం తాళపత్ర గ్రంథాలతో రెండు చేతుల్లో దీపం వెలిగి ప్రకాశించేలా నిర్మించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. విగ్రహం ఉద్ధేశం.. పూర్వం కాకి నదిలో స్నానం చేసి హంసలాగా మారి జ్ఞానం పొందింది. అలా ఇక్కడి నదిలో స్నానం చేసిన భక్తులు జ్ఞానాన్ని పొందుతారని సారాంశంగా, భక్తులను ఆహ్వానించేలా ఉండే విధంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయవర్గాల ద్వారా తెలిసింది. పుష్కర ఘాట్కు రెయిలింగ్ సుమారు 86 మీటర్ల పొడవుతో నిర్మిస్తున్న జ్ఞానతీర్థం (వీఐపీ) ఘాట్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఘాట్ తీరంలో రూ.కోటితో సరస్వతీమాత విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. విగ్రహం చుట్టూర వేదమూర్తుల విగ్రహాలు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే తమిళనాడులోని మహాబలిపురంలో రూపుదిద్దుకుంటున్న విగ్రహం ఏప్రిల్ రెండో వారంలో కాళేశ్వరం చేరనుంది. విగ్రహం మెట్ల కింది భాగం, కుడి, ఎడమ వైపు మూడు భాగాల్లో రాతితో చెక్కిన నిర్మాణాలు చేపట్టనున్నారు. మూడు వైపులా రెయిలింగ్ను రాతితో కాకి, హంస, మకరం చిత్రాలను రాతిపై చెక్కి అమర్చనున్నారు. దీంతో పుష్కరఘాట్కు సరికొత్త శోభ సంతరించుకుంటుంది. విస్తృత ప్రచారం.. మే 15 నుంచి 26 వరకు 12 రోజులపాటు జరుగే సరస్వతి పుష్కరాలకు రూ.20 లక్షలతో విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివస్తారు. ఈనేపథ్యంలో హైదరాబాద్తోపాటు ముఖ్యపట్టణా ల్లో హోర్డింగ్స్, వాల్పోస్టర్లు, మీడియా ద్వారా ప్రచారం చేపట్టనున్నారు. ఈప్రచార భాద్యతలు ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వనున్నారని తెలిసింది. రూ.30 లక్షలతో పుష్కరాల 12 రోజుల కాశీ పండితులచే హారతిని అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవికాకుండా టూరిజంశాఖ ద్వారా ఆరు ఎకరాల స్థలంలో 50–60కిపైగా టెన్సీటీ నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇప్పటికే స్థలాన్ని ఏర్పాటు చేశారు. టెన్సీటీ తాత్కాలిక నిర్మాణాలు 2027 జూలైలో జరిగే గోదావరి పుష్కరాల వరకు భక్తులకు అందుబాటులో ఉండనున్నాయి. టూరిజం శాఖ నిర్వహణ ఉంటుంది. త్వరలో పనులు ప్రారంభించనున్నారు. రూ.కోటితో సరస్వతీమాత విగ్రహం, సుందరీకరణ రూ.20లక్షలతో ఆహ్వానం పలికే ఫైబర్ విగ్రహం నిర్మాణం 12 రోజులపాటు కాశీ పండితులచే హారతి -
జగ్జీవన్రామ్ ఆశయాలు కొనసాగించాలి
భూపాలపల్లి అర్బన్: డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని కొనసాగించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్లోని మీటింగ్హాల్లో నిర్వహించిన జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో కలెక్టర్ రాహుల్శర్మతో కలిసి ఎమ్మెల్యే సత్యనారాయణరావు పాల్గొన్నారు. జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చిట్ట చివరి పేద కుటుంబం వరకు సంక్షేమ పథకాలు చేరేవిధంగా అధికారులు పని చేసినప్పుడే మహనీయుల ఆశయాలను సాధించిన వారమవుతామని తెలిపారు. విద్యనభ్యసించడం వల్ల ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు వస్తుందనడానికి జగ్జీవన్ రామ్ జీవితం నిదర్శనమని అన్నారు. అతి పిన్న వయస్కుడైన మంత్రిగా బాధ్యతలు చేపట్టి ప్రజాసేవతో మన్ననలు పొందారని కొనియాడారు. నేటితరం యువతకు ఆయనను ఆదర్శంగా తీసుకుని రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని అన్నారు. కలెక్టర్ రాహుల్శర్మ మాట్లాడుతూ.. బాబూ జగ్జీవన్ రామ్ సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం కోసం చేసిన కృషి ఎనలేనిదని తెలిపారు. ఆయన ఆశయాలను నేటి తరానికి అందించాల్సిన బాధ్యత మనందరిదన్నారు. ఆయన సేవలు ప్రతి ఒక్క భారతీయుడికి మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఎస్సీ అభివృద్ధి అధికారి సునీత, డీఆర్డీఓ నరేష్, జిల్లా వైద్యాధికారి మధుసూదన్, ఇన్చార్జ్ డీఈఓ రాజేందర్, డీఎస్పీ సంపత్ రావు, వివిధ కులసంఘాల నాయకులు పాల్గొన్నారు. జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో.. భూపాలపల్లి రూరల్: జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు శనివారం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, మాట్లాడా రు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జగ్జీవన్ రామ్ ఎంతో కృషి చేశారని తెలిపారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత
టేకుమట్ల: రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత అని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శనివారం మండలంలోని రాఘవరెడ్డిపేటలో జైబాపు, జై భీం, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ, అంబేడ్కర్, రాజ్యాంగ చిత్రపటాలకు పూలమాలలు వేసి, మాట్లాడుతూ రాజ్యాంగ విలువలను ప్రజలందరికీ తెలిసేందుకు పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. బడుగు, బలహీన వర్గాలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అంబేడ్కర్ రాజ్యాంగంలో పొందుపర్చిన అంశాలను ప్రజలందరూ తెలుసుకోవాలన్నారు. సామాజికవర్గం కోసం కాదని, దేశ ప్రజలందరి కోసం రాజ్యాం రూపొందించినట్లు తెలిపారు. కానీ, నేడు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే కుట్ర పన్నుతుందన్నారు. రాజ్యాంగాన్ని విమర్శించే బీజేపీ నాయకులను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం మండలంలోని కుందనపల్లిలో బాబు జగ్జీవన్రావు జయంతి వేడుకల్లో పాల్గొని, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. మండలంలోని ఆరెపల్లి, కుందనపల్లి, గుమ్మడవెల్లి, దుబ్యాల, ఎంపేడు, వెంకట్రావుపల్లిలోని అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్గౌడ్, మాజీ జెడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి, మండల ఇన్చార్జ్ కామిడి శ్రీనివాస్రెడ్డి, నాయకుల శ్రీనివాస్, వీరన్న, కిరణ్, వీరేశం, రవీందర్, కుమారస్వామి, ప్రభాకర్, సంపత్, స్వామిరావు, మహిపాల్రెడ్డి, సాంబయ్య పాల్గొన్నారు. -
భవిత.. భరోసా
ఆదివారం శ్రీ 6 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025– 8లోuభవిత కేంద్రాలు12● దివ్యాంగ విద్యార్థులకు ఎనిమిది నెలల భత్యం విడుదల ● 329 మందికి రూ.8.92 లక్షల నిధులు ● నేరుగా విద్యార్థుల ఖాతాల్లో జమ ● హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులువిద్యార్థుల సంఖ్య 329 కాటారం: దివ్యాంగ విద్యార్థులకు విద్యాపరంగా, ఇతర అంశాలపై భవితా కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణ కల్పించడంతోపాటు కేంద్రాల వద్దకు రాలేని వారికి ఇంటి వద్దనే తర్పీదు ఇచ్చి వారిలో క్రమంగా మార్పులు తీసుకురావడం కోసం గతంలో ప్రభుత్వాలు విలీన విద్యకు శ్రీకారం చుట్టాయి. మానసిక, శారీరక వైకల్యం కల్గిన బాల బాలికలకు వివిధ పద్ధతుల్లో విద్య అందించడానికి ప్రభుత్వం గతంలో విలీన విద్యా వనరుల కేంద్రాలు(ఐఈఆర్సీ) ఏర్పాటు చేసింది. వీటినే భవిత కేంద్రాలుగా పిలుస్తుంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్థికంగా వెనుకబడి, దివ్యాంగులైన తమ చిన్నారులను శిక్షణకు తీసుకురాలేని కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెలనెలా రవాణా, ఎస్కార్ట్, స్టైఫండ్, రీడింగ్ అలవెన్స్ రూపంలో భత్యం అందజేస్తూ ప్రోత్సాహిస్తున్నాయి. ఈ నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర శిక్షా తెలంగాణ, పీఎంశ్రీ ఆధ్వర్యంలో సమకూరుస్తున్నాయి. 2024–25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎనిమిది నెలల భత్యం రూ.8.92 లక్షలు ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. జిల్లాలో 12 భవిత కేంద్రాలు.. జిల్లాలో మొత్తం 12 భవిత కేంద్రాలు ఉన్నాయి. వాటిలో కాటారం, భూపాలపల్లి, చిట్యాల కేంద్రాలకు సొంత భవనాలు ఉండగా మిగిలిన 9 మండలాల్లో ప్రభుత్వ పాఠశాలల ఆవరణలోని ఒక గదిలో భవిత కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఐఈఆర్పీ (ఇన్క్లూసివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్) లు సమ్మేళన విద్యావిధానంతో ఈ చిన్నారులకు శిక్షణ ఇచ్చి సాధారణ పిల్లల్లా తీర్చిదిద్దుతుంటారు. భవిత కేంద్రాలకు రాలేని మానసిక వైకల్యంగల వారికి ఇంటి వద్దకే వెళ్లి నైపుణ్యాలు నేర్పిస్తుంటారు. జిల్లాలో 329 మంది దివ్యాంగులైన బాలబాలికలు భవితా కేంద్రాల్లో శిక్షణ పొందుతుండగా 19 మంది ఐఈఆర్పీలు విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లాలో సుమారు 65 మంది ఇంటి వద్ద నేర్చుకునే విద్యార్థులకు ప్రతి శనివారం ఒక్కో ఐఈఆర్పీలు తమ పరిధిలోని ఇళ్లకు వెళ్లి బోధిస్తుంటారు. వివిధ కేటగిరీల కింద.. ● భవిత కేంద్రాలకు వచ్చే దివ్యాంగ పిల్లలకు నెలకు రూ.500 చొప్పున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పది నెలల రవాణా భత్యం అందిస్తున్నాయి. 1 నుంచి 12 తరగతి వరకు అభ్యసించే వారికి ఏటా రూ.5వేల చొప్పున చెల్లిస్తాయి. ● అంధత్వం, అంగవైకల్యం కలిగి పాఠశాలలకు వచ్చి చదివే వారికి నెలకు రూ.550 చొప్పున పది నెలలకు రూ.5,500 అందజేస్తారు. ఈ విద్యార్థులను కుటుంబ సభ్యులు ఎవరైనా తీసుకొని వస్తుండటంతో ఎస్కార్ట్ భత్యంగా కాస్త ఎక్కువ అందిస్తారు. ● పాఠశాలలు, భవిత కేంద్రాలు, ఇంటి వద్ద విద్య పొందే బాలికలకు స్టైఫండ్ కింద నెలకు రూ.200 చొప్పున పది నెలలకు రూ.2వేలు అదనంగా చెల్లిస్తారు. ● అంధులు, అల్పదృష్టి కల్గిన పిల్లలకు రీడింగ్ అలవెన్స్ పేరుతో నెలకు రూ.60 చొప్పున పది నెలలకు రూ.600 అదనంగా చెల్లిస్తుంటారు. విద్యార్థుల ఖాతాల్లో నేరుగా.. పాఠశాలలు, భవిత కేంద్రాలు, ఇంటి వద్ద శిక్షణ పొందుతున్న మానసిక, శారీరక వైకల్యం కల్గిన పిల్లలకు ప్రభుత్వం ప్రతి ఏడాదీ రవాణా, ఎస్కార్ట్, స్టైఫండ్, రీడింగ్ అలవెన్స్లను అందిస్తుంది. ప్రస్తుతం జిల్లాకు సంబంధించిన లబ్ధిదారులైన విద్యార్థుల ఖాతాల్లో ప్రభుత్వమే నేరుగా డబ్బులు జమ చేస్తుంది. ఇప్పటికే జిల్లాలో అందరి ఖాతాల్లో జమ అయ్యాయి. – రమేశ్, విలీన విద్య జిల్లా కోఆర్డినేటర్ పీఎంశ్రీ నిధులు49,800 సమగ్ర శిక్షా నిధులు 8,42,380 ● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు న్యూస్రీల్ -
రామప్ప శిల్పాలతో కీ చైన్ల ఆవిష్కరణ
వెంకటాపురం(ఎం): చారిత్రక రామప్ప దేవాలయాన్ని నిర్మించి 812సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శనివారం రామప్ప గార్డెన్లో రామప్ప శిల్పాలతో కూడిన కీ చైన్లను రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, కాకతీయ హెరిటేజ్ ట్రస్టు సభ్యుడు పాండురంగారావు, ఉమ్మడి జిల్లా టూరిజం అధికారి శివాజీ, సేవా టూరిజం అండ్ కల్చరల్ సొసైటీ అధ్యక్షుడు కుసుమ సూర్యకిరణ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకతీయుల కళావైభవాన్ని భవిష్యత్ తరా లకు అందించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. 812 ఏళ్ల క్రితం నిర్మించినా రామప్ప ఆలయం చెక్కు చెదరకుండా ఉందని, యునెస్కో గుర్తింపుతో ప్రపంచ పటంలో రామప్ప ఆలయానికి గుర్తింపు లభించిందన్నారు. -
ఆహ్లాదం కరువు..
జిల్లా కేంద్రంలో అధ్వానంగా పార్కులుజిల్లాకేంద్రంలోని పార్కులు అధ్వానంగా మారాయి. బస్టాండ్ సమీపంలోని ప్రొఫెసర్ జయశంకర్, పట్టణ శివారు ప్రధాన రహదారిపై అటవీశాఖ పరిధిలోని ప్రొఫెసర్ జయశంకర్ ఎకో పార్క్లో సౌకర్యాలు లేక కొట్టుమిట్టాడుతున్నాయి. పార్కులో ఆట పరికరాలు, ఓపెన్ జిమ్ పరికరాలు విరిగి, పలిగిపోయి మూల పడి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు సంబంధిత అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఎమ్మెల్యే, కలెక్టర్ సందర్శించి మరమ్మతులు చేయాలని ఆదేశించినా అధికారుల్లో చలన కలగడం లేదు. దీంతో పిల్లలకు పార్కుల్లో ఆటవిడుపు లభించడం లేదు. – భూపాలపల్లి అర్బన్● ప్రొఫెసర్ జయశంకర్, ఎకో పార్కులో సౌకర్యాలు కరువు ● పాడైన ఆటల పరికరాలు ● ఏళ్లుగా మరమ్మతుకు నోచుకోని వైనం ● ఎమ్మెల్యే, కలెక్టర్ చెప్పినా పట్టించుకోని అధికారులు -
ఎప్పుడూ తాళమే..
శనివారం శ్రీ 5 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025– 8లోuభూపాలపల్లి–పరకాల జాతీయ రహదారికి ఆనుకొని పట్టణ శివారులో సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ ఎకో పార్కును ఆరేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. ఈ పార్కులో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. పూర్తిగా అడవినే పార్కుగా మార్చి రోడ్లు వేసి ఓపెన్ జిమ్, ఆట పరికరాలు ఏర్పాటు చేశారు. జిమ్తో పాటు ఆట పరికరాలు కూడా చెడిపోయి నిరుపయోగంగా మారాయి. కానీ ఈ పార్కు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల మాత్రమే తెరిచి ఉంటుంది. ఇంట్లో నుంచి పిల్లలను ఉదయం, సాయంత్రం వేళల్లో ఆహ్లాదం కోసం పార్కుకు వెళ్దామన్నా పోలేని పరిస్థితి దాపురించింది. పార్కును అభివృద్ధి చేస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు పలుమార్లు చెప్పినా ఇప్పటి వరకు ఆచరణలోకి రావడం లేదు. ఉదయం, సాయంత్రం వేళల్లో కూడా పార్కు తెరిచి ఉండే విధంగా చూడాలని పలువురు పట్టణ ప్రజలు కోరుతున్నారు. న్యూస్రీల్ -
జిమ్ చేయలేక.. ఆటలు ఆడుకోక..
విరిగి నిరుపయోగంగా మారిన పరికరాలుబస్టాండ్ సమీపంలోని ప్రొఫెసర్ జయశంకర్ పార్క్ను సింగరేణి యాజమాన్యం 2017 సంవత్సరంలో నిర్మించి మున్సిపల్ శాఖకు అప్పగించింది. దీంతో గార్డెనింగ్, పచ్చదనం బాధ్యత సింగరేణి యాజమాన్యం నిర్వహిస్తున్నప్పటికీ జిమ్, చిన్న పిల్లల కోసం ఏర్పాటుచేసిన వివిధ రకాల పరికరాల నిర్వహణ భారం మున్సిపల్ శాఖ చూసుకోవాల్సి ఉంది. ఎనిమిది సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన జిమ్, ఆటల పరికరాలు పూర్తిగా చెడిపోయాయి. జారుడు బళ్లలు, ఊయ్యాలలు, ఇతర వస్తువులు పూర్తిగా పగిలిపోయి కొన్ని, విరిగిపోయి నిరుపయోగంగా మారాయి. దీంతో సరైన జిమ్, ఆటల పరికరాలు లేకపోవడంతో ఇటు పెద్దలు, అటు చిన్నారులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ దీపాలు లేకపోవడంతో రాత్రి వేళలో ఇబ్బందులు పడుతున్నారు. విష పురుగులు తిరుగుతున్నాయి. -
పన్నుల రాయితీపై అవగాహన కల్పించాలి
భూపాలపల్లి అర్బన్: పన్నుల వసూళ్లపై ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీపై పట్టణ ప్రజలకు అవగాహన కల్పించాలని మున్సిపల్ కమిషనర్ బిర్రు శ్రీనివాస్ ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం మున్సిపాలిటీలోని కాన్ఫరెన్స్ హాల్లో సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరం ఇంటి పన్నుల ముందుస్తు చెల్లింపుపై ఐదు శాతం రాయితీ, ఎల్ఆర్ఎస్ 25శాతం రాయితీపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలని చెప్పారు. నిరంతరం పర్యవేక్షణ చేయాలని అసిస్టెంట్ ఇంజనీర్, పంపు ఆపరేటర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో అధికారులు, సిబ్బంది మానస, దేవేందర్రెడ్డి పాల్గొన్నారు. రెండో రోజు పాదయాత్ర భూపాలపల్లి రూరల్: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర శుక్రవారం నాటికి రెండో రోజుకు చేరుకుంది. భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారా యణ రావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు విస్లావత్ దేవన్ ఆధ్వర్యంలో 12, 13 వార్డుల్లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ పేరిట రాజ్యాంగ పరిరక్షణ యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా దేవన్ మాట్లాడారు. బీజేపీ నాయకులు మహాత్మా గాంధీని, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్పై అవహేళనగా మాట్లాడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అప్పం కిషన్, పిప్పాల రాజేందర్, స్వామి, రవీందర్, అశోక్, పాల్గొన్నారు. కామేశ్వరాలయ పునాది మట్టి తొలగింపు వెంకటాపురం(ఎం): ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయం పక్కన ఉన్న కామేశ్వరాలయ పునరుద్ధరణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. కామేశ్వరాలయాన్ని పునర్నిర్మించేందుకు ఆలయ ప్రదేశంలో ఉన్న మట్టిని జేసీబీ, ట్రాక్టర్లతో తొలగిస్తున్నారు. సాండ్ బాక్స్ టెక్నాలజీ ప్రకారం ఆలయం అడుగుభాగాన పోసే ఇసుక కొట్టుకుపోకుండా ఆలయం చుట్టూ రెండు మీటర్ల లోతు నుంచి రాయితో గోడను నిర్మించారు. ఆలయం అడుగుభాగంలో ఉన్న లూజ్ మట్టిని తొలగించి లెవలింగ్ పనులు చేస్తున్నారు. మట్టి తొలగించిన అనంతరం ఆలయ అడుగుభాగంలో పెద్దరాళ్లను పేర్చి ఇసుకతో నింపనున్నారు. సాండ్ బాక్స్ టెక్నాలజీ ద్వారానే కామేశ్వరాలయాన్ని పునరుద్ధరించేందుకు పురావస్తుశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పపువ్వు సేకరణపై అవగాహనవెంకటాపురం(ఎం): ఇప్పపువ్వు సేకరణపై మండలంలోని బండ్లపహాడ్, ఊట్ల గొత్తికోయ గ్రామాల్లో గిరిజనులకు అటవీశాఖ అధికారులు శుక్రవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ములుగు ఎఫ్ఆర్ఓ శంకర్ మాట్లాడుతూ.. ఇప్పపూవ్వు సేకరణ సమయంలో ఇప్పచెట్ల కింద క్లీనింగ్ కోసం నిప్పు పెట్టవద్దని, గ్రీన్ షాడో నెట్లను ఉపయోగించాలన్నారు. ఇప్పచెట్ల కింద ఉన్న చెత్తను తొలగించేందుకు నిప్పు పెట్టడం వల్ల మంటలు వ్యాపించి ఇతర చెట్లు కాలిపోయే ప్రమాదముంటుందన్నారు. ఇప్పచెట్ల కింద చెత్తను తొలగించి గ్రీన్నెట్లను వాడుతున్నవారికి అటవీశాఖ తరఫున బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎఫ్ఆర్ఓ యాకూబ్ జానీ, ఎఫ్ఎస్ఓ రాజేశ్వరి, ఎఫ్బీఓలు రజిత, స్వర్ణలత, రూప్కుమార్, బేస్ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు. -
ఉపాధి హామీ కూలీలను పెంచాలి
భూపాలపల్లి అర్బన్: ఉపాధి హామీ పనులకు కూలీలను పెంచాలని కలెక్టర్ రాహుల్శర్మ ఎంపీడీఓలను ఆదేశించారు. ఉపాధిహామీ పథకం పనులు, సెర్ప్ కార్యక్రమాలు, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, అమ్మ ఆదర్శ పాఠశాలల పనులపై శుక్రవారం రెవెన్యూ, పంచాయతీరాజ్, డీఆర్డీఓ, గృహ నిర్మాణ శాఖ, మున్సిపల్ మండల ప్రత్యేక అధికారులతో కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఉన్నామని ఉపాధి హామీ పథకం పనులు పెద్దఎత్తున చేపట్టేందుకు కూలీలను మొబలైజ్ చేయాలని ఎంపీడీఓలకు సూచించారు. మూడు నెలలు అత్యంత కీలకమని.. మూడు నెలల్లో 80 రోజుల పని దినాలు పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కూలి రేటు రూ.300 నుంచి రూ.307లకు పెంచినట్లు తెలిపారు. డిమాండ్కు తగినట్లు పనులు జరిగేలా కార్యాచరణ తయారు చేయాలన్నారు. మహదేవపూర్, మహాముత్తారం, పలిమెల మండలాల్లో 5వేల మంది రైతుల భూముల్లో వెదురు పెంపకం చేపట్టేందుకు ఈ నెల 15వ తేదీ వరకు రైతులను ఎంపిక చేయాలన్నారు. యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలు 50 శాతం మహిళా సంఘాలకు కేటాయించాలని, మహిళా సంఘాల జాబితా తయారు చేయాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియపై ఎంపిక చేసిన సంఘాలకు శిక్షణ ఇవ్వాలన్నారు. చేయూత (వృద్ధాప్య పింఛను) పొందుతున్న వ్యక్తి భర్త లేదా భార్య మరణిస్తే వారిలో జీవించి ఉన్న ఒకరికి పింఛను మంజూరు చేసేందుకు మున్సిపల్, మండల స్థాయిలో విచారణ నిర్వహించి నివేదిక అందజేయాలన్నారు. భూపాలపల్లి, కాటారం డివిజన్లో మహిళా స్వయం సహాయ సంఘాలకు పెట్రోల్ బంకులు ఏర్పాటుకు భూమి కేటాయింపు చేయాలని అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో 559 పనులు పెండింగ్లో ఉన్నాయని, పూర్తయిన పనులకు బిల్లులు చెల్లించేందుకు ఈ నెల 11వ తేదీ వరకు అన్ని బిల్లులు అందజేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కాటారం డివిజన్లో మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల నివేదిక అందజేయాలన్నారు. మంజూరైన ఇండ్ల పనులు చేపట్టేందుకు తక్షణమే మార్కింగ్ చేయాలని ఆదేశించారు. ఇండ్లు ప్రగతి వివరాలను ఎంపీడీఓలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, డీఆర్డీఓ నరేష్, పరిశ్రమల శాఖ అధికారి సిద్ధార్థ, జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్, గృహ నిర్మాణ శాఖ పీడీ లోకిలాల్, ఆర్డీఓ రవి అన్ని మండలాల ప్రత్యేక అధికారులు ఎంపీడీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్శర్మ హెల్ప్ డెస్క్ల ఏర్పాటుమున్సిపల్, ఎంపీడీఓ కార్యాలయాల్లో రాజీవ్ యువ వికాసం హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల స్వీకరణపై కలెక్టరేట్ నుంచి మండల ప్రత్యేక అధికారులు, రెవెన్యూ, పంచాయతీ రాజ్, పరిశ్రమలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో రాజీవ్ యువ వికాసం దరఖాస్తులు స్వీకరించాలని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు ఈ పథకానికి 4,479 దరఖాస్తులు వచ్చాయని, ప్రజలకు తెలిసేలా గ్రామ, గ్రామాన విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన రాజీవ్ యువ వికాసం హెల్ప్ డెస్క్ను పరిశీలించారు. -
ఆర్థిక సంక్షోభం ఉన్నా పథకాల అమలు
కాటారం: బీఆర్ఎస్ ప్రభుత్వం కారణంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని అయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. కాటారం మండల కేంద్రంలోని బీఎల్ఎం గార్డెన్స్లో శుక్రవారం సన్న బియ్యం ఉచిత పంపిణీ పథకాన్ని మంత్రి శ్రీధర్బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి నిరుపేద కడుపునింపడం కోసం ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటి సారిగా రాష్ట్రంలో సన్న బియ్యం పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. గత ప్రభుత్వం ప్రాధాన్యత తక్కువ ఉన్న దొడ్డు బియ్యం పంపిణీ చేసిందని తెలిపారు. దీని ఫలితంగా రీసైక్లింగ్ జరిగి కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైందన్నారు. సన్నబియ్యం వినియోగం పెంచి దొడ్డు బియ్యం రీసైక్లింగ్ను అరికట్టడానికి రేషన్దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీని ప్రభుత్వం ప్రారంభించినట్లు తెలిపారు. ప్రభుత్వంలో రేషన్ డీలర్లు భాగస్వాములని ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా సక్రమంగా పంపిణీ చేయాలని సూచించారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని పేర్కొన్నారు. పైరవీలకు తావులేకుండా నిష్పక్షపాతంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాశ్రెడ్డి, కలెక్టర్ రాహుల్శర్మ, సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, అదనపు కలెక్టర్ అశోక్కుమార్, ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఎస్ఓ శ్రీనాథ్, డీఎం రాములు, డీఆర్డీఓ నరేశ్, పరిశ్రమల శాఖ జీఎం సిద్ధార్థ, కాటారం సబ్ డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు -
ఉపాధి లక్ష్యంగా..
కాటారం ఐటీఐకి అనుసంధానంగా ఏటీసీపెరుగుతున్న ఆదరణ.. ప్రస్తుతం ఐటీఐ కోర్సులకు ఆదరణ పెరుగుతోంది. భూపాలపల్లి, కాటారం ఐటీఐ కళాశాలల్లో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, కోపా, డ్రాఫ్ట్మెన్ సివిల్ విభాగాలు కొనసాగుతున్నాయి. ఆయా విభాగాల్లో ఎలక్ట్రిషియన్, ఫిట్టర్ విభాగాాల్లో 20 చొప్పున సీట్లు, కోపా, సివిల్ డ్రాఫ్ట్మెన్లో 24 చొప్పున సీట్లు ఉన్నాయి. ప్రతి ఏడాది ఎలక్ట్రిషియన్, ఫిట్టర్ కోర్సుల్లో చేరడానికి విద్యార్థులు అధిక సంఖ్యలో ఆసక్తి చూపుతున్నారు.● అధునాతన, సాంకేతికతపై శిక్షణ ● పూర్తికావస్తున్న ఏటీసీ శిక్షణ భవనాలు ● వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రవేశాలు ● ఆరు కోర్సుల్లో 172 సీట్లుకాటారం: యువతకు అధునాతన, సాంకేతిక విద్యను అందించి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇందులో భాగంగా ప్రభుత్వం గతంలో ఏర్పాటు చేసిన పారిశ్రామిక సంస్థ(ఐటీఐ)లను నవీకరించి అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాలు(ఏటీసీ)గా తీర్చిదిద్దుతున్నారు. జిల్లా కేంద్రంతో పాటు కాటారం సబ్ డివిజన్ కేంద్రంలోని ఐటీఐ కళాశాలకు అనుసంధానంగా ఏటీసీ ఏర్పాటుకు సర్వం సిద్ధమవుతోంది. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు అధునాతన, సాంకేతికతపై శిక్షణకు ఆయా ఏటీసీ కేంద్రాల్లో వచ్చే విద్యాసంవత్సరం(జూన్ 2025) నుంచి పూర్తి స్థాయిలో తరగతుల ప్రారంభానికి చర్యలు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే జిల్లా కేంద్రంలోని ఏటీసీలో ఈ విద్యాసంవత్సరం నుంచి అడ్మిషన్లు ప్రారంభం కాగా ల్యాబ్ భవనం పూర్తికాక థియరీ క్లాస్లు మాత్రమే సాగుతున్నాయి. కాటారం ఏటీసీ కేంద్రంలో ల్యాబ్ భవనం పూర్తికావస్తుండటంతో ఈ ఏడాది నుంచి థియరీ, ప్రాక్టికల్ తరగతులు జరగనున్నాయి. డిమాండ్ ఉన్న కోర్సుల్లో యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించడం, శిక్షణ పూర్తయిన వారికి స్వయం ఉపాధి కల్పించేలా పనిచేస్తాయి. భూపాలపల్లి, కాటారంలో రూ.4.76 కోట్లతో ఏటీసీ భవన నిర్మాణాలు చేపట్టగా చివరి దశలో ఉన్నాయి. పరిశ్రమల డిమాండ్కు అనుగుణంగా టాటా టెక్నాలజీ లిమిటెడ్ భాగస్వామ్యంతో ఆరు కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ఏడాది, రెండేళ్ల కోర్సులకు సంబంధించి 172 సీట్లు భర్తీ చేస్తారు. ఇప్పటికే ఏటీసీలకు 70 శాతం ప్రయోగ పరికరాలు(యంత్రాలు) చేరగా బిగించారు. కోర్సులకు సంబంధించి ఏటీసీ భవనంలో డెల్వర్క్ స్టేషన్, ఐవోటీ కిట్, సర్వర్ రాక్, త్రీడీ ప్రింటర్, కార్ లిఫ్ట్, సిల్, ఫెయింట్ బాత్, ఇండస్ట్రీయల్ రోబోటెక్, కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ సిస్టమ్(సీఎన్సీ), వీఎంసీ, ప్లంబింగ్ పరికరాలు బిగించారు. మరికొన్ని పరికరాలు రావాల్సి ఉంది.కొత్త కోర్సులు ఇవే.. కోర్సులు సీట్లు కాలవ్యవధి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ అటోమేషిన్ 40 ఏడాది ఇండ్రస్టియల్ అండ్ అటోమేషిన్ 40 ఏడాది ఇండస్ట్రియల్ రోబోటెక్స్, డిజిట్ మ్యానుఫ్యాక్చరింగ్ 20 ఏడాది ఆర్టీసియన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్ 24 రెండేళ్లు బేసిక్డిజైనర్, వర్చువల్ వెరిఫయిర్ 24 రెండేళ్లు మెకానిక్ ఎలక్ట్రానిక్ వెహికల్ 24 రెండేళ్లుయువతకు స్వయం ఉపాధి పెంపొందించే దిశగా ఏటీసీలు దోహదపడుతాయి. భూపాలపల్లి ఏటీసీలో ప్రస్తుతం తరగతులు కొనసాగుతున్నాయి. కాటారంలో ఏటీసీ భవన నిర్మాణం పూర్తికావచ్చింది. త్వరలోనే యంత్రాల బిగింపు ప్రక్రియ మొదలవుతుంది. ఈ విద్యాసంవత్సరం నుంచి అడ్మిషన్లు ప్రారంభిస్తాం. ఏటీసీ కోర్సుల శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలు, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రయత్నిస్తాం. – భిక్షపతి, ప్రిన్సిపాల్, ఐటీఐ, కాటారం -
విద్యుత్ సమస్య పరిష్కారానికి చర్యలు
కాటారం: గ్రామాల్లో లోవోల్టేజ్ విద్యుత్ సమస్యను అధిగమించేందుకు శాశ్వత చర్యలు చేపడుతున్నట్లు ట్రాన్స్కో ఎస్ఈ మల్చూర్ అన్నారు. కాటారం మండలకేంద్రంలోని గారెపల్లిలో లో వోల్టేజ్ సమస్య నివారణలో భాగంగా నాలుగు చోట్ల నూతనంగా ఏర్పాటు చేసిన 100కేవీ ట్రాన్స్ఫార్మర్లను గురువారం ఎస్ఈ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ గారెపల్లిలోని అయ్యప్ప టెంపుల్ రోడ్, హనుమాన్నగర్, మాంటిస్సోరి స్కూల్ కాలనీ, హమాలీ వాడలో కొంత కాలంగా లో వోల్టేజ్ సమస్య ఉన్నట్లు వినియోగదారులు తమ దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు. దీంతో సుమారు రూ.16 లక్షల వ్యయంతో నాలుగు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నాణ్యతతో కూడిన విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు తెలిపారు. విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం సిబ్బంది కృషి చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో డీఈఈ పాపిరెడ్డి, ఏడీఈ నాగరాజు, ఇన్చార్జ్ ఏఈ ఉపేందర్, సిబ్బంది పాల్గొన్నారు.ట్రాన్స్కో ఎస్ఈ మల్చూర్ -
7, 8 తేదీల్లో ఉచిత కంటి వైద్యశిబిరం
కాటారం: శ్రీపాద ట్రస్టు, పుష్పగిరి కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో ఈ నెల 7, 8 తేదీల్లో కాటారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించనున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ సూచించారు. వైద్యులు, సిబ్బందితో గురువారం మండలకేంద్రంలోని అయ్యప్ప ఫంక్షన్ హాల్లో డీఎంహెచ్ఓ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శిబిరంలో ఉచితంగా కంటి అద్దాలు అందజేస్తారన్నారు. కంటి ఆపరేషన్ అవసరమైన వారు హైదరాబాద్లోని పుష్పగిరి ఆస్పత్రికి వెళ్లడానికి, తిరిగి రావడానికి ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో వైద్యాధికారిణి మౌనిక, వైద్యులు సందీప్, సుష్మిత, కల్యాణి, వినయ్, మహేంద్రనాధ్యాదవ్, ఆప్తమిక్ ఆఫీసర్స్ బూరుగు రవి, సత్యనారాయణ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
భూ సేకరణకు రైతులు సహకరించాలి
కాటారం: చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగంగా నిర్మించనున్న ప్రధాన కెనాల్స్ కోసం అవసరమయ్యే భూ సేకరణకు రైతులు సహకరించాలని భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్ తెలిపారు. కాటారం మండలం గుమ్మాళ్లపల్లిలో గురువారం భూ సేకరణ గ్రామసభ నిర్వహించారు. గుమ్మాళ్లపల్లి, ఆదివారంపేట, ఒడిపిలవంచ, వీరాపూర్, రఘుపల్లి, జాదారావుపేట గ్రామాలకు సంబంధించిన భూ నిర్వాసితుల వివరాలను అధికారులు చదివి వినిపించారు. ఆదివారంపేట చెరువు నుంచి ఆయా గ్రామాలకు కాల్వల ద్వారా నీరు చేరవేయడం కోసం కాల్వల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. దీనికోసం 45.39 ఎకరాల మేర భూమి సేకరించినట్లు చెప్పారు. ఎక్కువ భూమి కోల్పోతున్నప్పటికీ సర్వే అధికారులు రికార్డుల్లో తక్కువ భూమి నమోదు చేశారని, నష్టపరిహారం పెంచాలని, కెనాల్ అలైన్మెంట్ మార్చాలని పలువురు సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. గతంలో కోల్పోయిన భూములకు పరిహారం పూర్తిస్థాయిలో అందలేదని ఆయనకు విన్నవించారు. రైతుల సమస్యలను ఉన్నతాధికారులకు నివేదించి ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చూస్తామని సబ్ కలెక్టర్ రైతులకు నచ్చజెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు, భూ సేకవరణ విభాగం, ఇరిగేషన్ అధికారులు, రైతులు పాల్గొన్నారు.కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్ -
దొడ్డి కొమురయ్యను స్ఫూర్తిగా తీసుకోవాలి
భూపాలపల్లి: దొడ్డి కొమురయ్యను నేటితరం స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. గురువారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన దొడ్డి కొమురయ్య జయంతి కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య ఆదర్శ ప్రాయుడని చెప్పారు. తెలంగాణ రైతాంగ ఉద్యమంలో విశిష్టమైన పాత్ర పోషించారని చెప్పారు. రైతుల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని ఆయన సేవలను కొనియాడారు. దోపిడీ వ్యవస్థ, వెట్టి చాకిరి విధానాలకు వ్యతిరేకంగా యువతను కూడగట్టుకుని దొరలు, భూస్వాములపై పోరాటం చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, బీసీ సంక్షేమ అధికారి శైలజ, యాదవ, ఇతర కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మందుల కొరత లేకుండా చూడాలి భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మందుల కొరత లేకుండా చూడాలని కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. ఆస్పత్రిని కలెక్టర్ రాహుల్ శర్మ గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. ఆస్పత్రిలోని టీ హబ్, సెంట్రల్ డ్రగ్స్ స్టోర్, ఎన్సీడీ సెంటర్, డైస్ బిల్డింగ్లను పరిశీలించి వైద్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేయబోయే స్కాన్ మిషన్ కోసం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నవీన్కుమార్తో కలిసి పరిశీలించి టీ హబ్లో ఒక గదిలో ఎన్సీడీ సెంటర్ ఏర్పాటు చేసిన గదులను గుర్తించారు. రోగుల పట్టికను పరిశీలించి, పరీక్షల గురించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. డ్రగ్ స్టోర్లో నిల్వ ఉన్న మందుల వివరాలు అడిగి రిజిస్టర్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇంచార్జీ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ నవీన్కుమార్ పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
నేడు మంత్రి శ్రీధర్బాబు పర్యటన
కాటారం: కాటారం మండలంలో నేడు(శుక్రవారం) రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పర్యటించనున్నారు. మండలకేంద్రంలోని బీఎల్ఎం గార్డెన్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించనున్నారు. కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్, పలిమెల మండలాలకు సంబంధించి పంపిణీ చేపట్టనున్నారు. ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ గడువు పొడిగింపు భూపాలపల్లి అర్బన్: ఎల్ఆర్ఎస్–2020 క్రమబద్ధీకరణకు ఫీజు రాయితీతో కూడిన చెల్లింపు గడువును ఈ నెల 30వ తేదీ వరకు ప్రభుత్వం పొడిగించినట్లు మున్సిపల్ కమిషనర్ బిర్రు శ్రీ నివాస్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నా రు. 25శాతం రాయితీతో ఫీజు చెల్లింపునకు అ వకాశం ఉందని పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించుకోవాలన్నారు. స్విమ్మింగ్ కోచ్కు సన్మానం భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని సింగరేణి స్విమ్మింగ్ పూల్ కోచ్గా విధులు నిర్వహించి బెల్లంపల్లి ఏరియాకు బదిలీపై వెళ్తున్న భీముని తిరుపతిని ఏరియా పర్సనల్ విభాగం అధికారులు గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏరియా అధికార ప్రతినిధి మారుతి మాట్లాడారు. అధికారుల సుచనలు, సలహాలు పాటిస్తూ తిరుపతి తన విధులు బాధ్యతగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్సనల్ విభాగం అధికారులు, సిబ్బంది గుండు రాజు, శ్రావణ్కుమార్, రవి, చంద్రయ్య, శివ, ప్రణయ్, ప్రతిభ, శ్రీనివాస్ పాల్గొన్నారు. ముగిసిన టెన్త్ ఒకేషనల్ పరీక్షలుభూపాలపల్లి అర్బన్: జిల్లా వ్యాప్తంగా గురువారం ఏడు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన పదో తరగతి ఒకేషనల్ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఒకేషనల్ పరీక్షకు 395మంది విద్యార్థులకు గాను 392మంది హాజరైనట్లు తెలిపారు. దీంతో పరీక్షలు ముగిశాయన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి భూపాలపల్లి రూరల్: రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు, ఇచ్చిన హమీలను అమలు చేయకపోవడం లాంటి వైఫల్యాలను బీజేపీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండట్టాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏడు నూతుల నిశిధర్రెడ్డి అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ వైస్ చైర్మన్ నాగపురి రాజమౌళి గౌడ్తో కలిసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా ఉద్యమ కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్లాలన్నారు. రైతు వ్యవసాయ కూలీలు, మహిళలు, నిరుద్యోగ, యువత ఇలా అన్ని వర్గాల ప్రజల సమస్యలపై పోరాడాలన్నారు. రాబోవు రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీసి ఒత్తిడి తీసుకువచ్చేలా ఆయా అంశాలపై ఆందోళనలకు సిద్ధం కావాలని తీర్మానించామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చదువు రామచంద్రారెడ్డి, కన్నం యుగదీశ్వర్, నాయకులు మొగిలి, మోరే రవీందర్ రెడ్డి, దొంగల రాజేందర్, వివిధ మండల అధ్యక్షులు పాల్గొన్నారు. షెడ్ల నిర్మాణ పనులకు మార్కింగ్ ఎస్ఎస్తాడ్వాయి: మేడారంలోని వనదేవతల సన్నిధిలో గల క్యూలైన్లపై జీఐ షీట్ల షెడ్ల నిర్మాణం పనులకు గురువారం మార్కింగ్ చేశారు. జీఐ షీట్ల షెడ్ల నిర్మాణానికి రూ.3కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిన విషయం తెలిసిందే. -
సన్నబియ్యం.. నేతలు రాక ఆలస్యం
సాక్షిప్రతినిధి, వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకానికి ప్రొటోకాల్ సమస్య తప్పలేదు. వాస్తవానికి ఉగాది కానుకగా ప్రకటించిన ఈ పథకాన్ని ఈ నెల 1న అన్ని గ్రామాల్లో ప్రారంభించాల్సి ఉంది. వివిధ కారణాలు, ప్రభుత్వ పరమైన కార్యక్రమాల వల్ల ప్రజాప్రతినిధులు కొన్నిచోట్ల హాజరు కాలేదు. దీంతో కార్పొరేటర్లు, కాంగ్రెస్ నేతలు, అధికారులు కూడా ప్రారంభించే సాహసం చేయలేదు. ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు అధికారికంగా ప్రారంభించాకే పంపిణీ చేయాలనుకుంటున్నట్లు అధికారులు పరోక్ష సంకేతాలు కూడా ఇచ్చారు. దీంతో వరంగల్ తూర్పు, స్టేషన్ఘన్పూర్, జనగామ, ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాల్లో ఒకటి, రెండు రోజుల ఆలస్యంగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం మొదలు కాగా.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారులు రేషన్ దుకాణాల ఎదుట బారులుదీరి తీసుకెళ్తున్నారు. ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో 2,315 రేషన్ షాపుల ద్వారా ప్రతినెలా 20,958 మెట్రిక్ టన్నుల బియ్యం పేద ప్రజలకు అందజేస్తున్నారు. ప్రభుత్వం ఈ ఉగాది నుంచి రేషన్కార్డులపై సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించడం పట్ల లబ్దిదారుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. రేషన్షాపుల ఎదుట సందడే సందడి.. గ్రేటర్ వరంగల్లోని 66 డివిజన్లతోపాటు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సన్నబియ్యం కోసం లబ్దిదారులు ఉదయం నుంచే రేషన్షాపులకు చేరుకుంటున్నారు. మంగళవారం నుంచి గురువారం రేషన్దుకాణాల్లో అధికారికంగా పంపిణీ ప్రారంభం కాగా.. ఉదయం 8 గంటల నుంచే రేషన్షాపుల వద్ద భారీ సంఖ్యలో లబ్ధిదారులు క్యూలలో నిల్చుంటున్నారు. దీంతో రేషన్ షాపుల వద్ద ఈ తరహాలో సందడి చూసి చాలా రోజులైందన్న ఆశ్చర్యాన్ని డీలర్లు వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 15వ తేదీ వరకు లేదా సన్నబియ్యం స్టాక్ ఉన్నంత వరకు ఉదయం, సాయంత్రం వేళల్లో లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని డీలర్లు చెప్తున్నారు. సంతోషంగా ఉంది ప్రభుత్వం మాలాంటి నిరుపేదలకు, మధ్యతరగతి ప్రజలకు స న్నబియ్యం ఇస్తుండటం సంతో షంగా ఉంది. రేషన్ షాప్ల ద్వా రా అందిస్తున్న సన్న బియ్యం ద్వారా ఎంతో మేలు జరుగుతుంది. దొడ్డు బియ్యం తినాలంటే ఇబ్బంది పడేవాళ్లం. చాలాఏళ్ల నుంచి ఇస్తామని చెబుతున్నా ఇప్పటికి అమల్లోకి రావడం సంతోషం. – నామని కనక లక్ష్మి, శాయంపేట జిల్లాల వారీగా రేషన్ దుకాణాలు, కార్డులు, బియ్యం సరఫరా పంపిణీ ఇలా.. రెండు రోజులపాటు కొనసాగిన ప్రారంభ వేడుకలు లబ్ధిదారుల బారులు.. రేషన్ దుకాణాల వద్ద సందడి ఉమ్మడి వరంగల్లో 32.61లక్షల మంది కార్డుదారులు 2,315 దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ.. కలెక్టర్లు, ఉన్నతాధికారుల పర్యవేక్షణజిల్లా దుకాణాలు కార్డులు లబ్ధిదారులు బియ్యం పంపిణీ (మె.టన్నుల్లో) హనుమకొండ 414 2,28,143 6,75,246 4,051.476 వరంగల్ 509 2,66,429 7,94,087 5,014.541 జనగామ 335 1,61,472 4,85,164 3,094.690 మహబూబాబాద్ 558 2,41,012 7,03,550 4,511.000 జేఎస్భూపాలపల్లి 277 1,23,508 3,50,527 2,276.520 ములుగు 222 91,737 2,52,348 1,650.000 -
ఎంపీడీఓ చాంబర్లో కునుకు తీసిన కుక్క
అధికారులు విధులు నిర్వర్తించేందుకు.. ప్రజలు వివిధ అవసరాల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయానికి వస్తుంటారు. కానీ, ఈ శునకం మాత్రం సేదదీరేందుకే ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చినట్టుంది. ఏకంగా ఎంపీడీఓ చాంబర్లోనే కునుకు తీసింది. బుధవారం కొత్తపల్లి గోరి ఎంపీడీఓ.. విధుల్లో భాగంగా జిల్లా కేంద్రానికి వెళ్లడం.. కార్యాలయ సిబ్బంది నిర్లక్ష్యంగా ఉండడంతో ఓ కుక్క దర్జాగా బాస్ గదిలోనే నిద్రించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. – రేగొండ(కొత్తపల్లి గోరి) -
ముగిసిన టెన్త్ పరీక్షలు
భూపాలపల్లి అర్బన్: జిల్లా వ్యాప్తంగా 20 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన టెన్త్ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. చివరి రోజు సాంఘిక శాస్త్రం పరీక్ష ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ తెలిపారు. చివరి రోజు మొత్తం 3,449 మంది విద్యార్థులకు 3,442 మంది విద్యార్థులు హాజరుకాగా ఏడుగురు విద్యార్థులు గైర్హాజరైనట్లు వెల్లడించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని పరీక్ష కేంద్రాల్లో ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఎలాంటి మాల్ప్రాక్టీస్, మాస్కాపింగ్ జరగకుండా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆనందంగా గడపాలి భూపాలపల్లి: ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఉద్యోగ విరమణ తప్పనిసరి, విరమణ అనంతరం ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. సుదీర్ఘకాలం పోలీసు శాఖకు సేవలందించి పదవీ విరమణ పొందుతున్న ఎస్సై పోరిక లాల్ సింగ్ను జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ఎస్పీ సత్కరించి, కానుక అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఎలాంటి రిమార్కులు లేకుండా సర్వీసును పూర్తి చేసి పదవీ విరమణ పొందడం అభినందనీయం అన్నారు. కుటుంబానికి దూరంగా ఉంటూ.. ప్రజలకు సేవలు అందించడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1987వ సంవత్సరంలో లాల్ సింగ్ పోలీసు కానిస్టేబుల్గా పోలీసుశాఖలోకి అడుగుపెట్టి దాదాపు 38 సంవత్సరాలపాటు సేవలు అందించారని పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో తనవంతు పాత్రను పోషించడం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ బోనాల కిషన్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు నగేష్, రత్నం, పోలీస్ అధికారుల సంఘం నేత యాదిరెడ్డి, ఎస్సై లాల్ సింగ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
ఇదీ.. మా బ్రాండ్.!
తిమ్మంపేట చపాట మిర్చికి జీఐ ట్యాగ్ సర్టిఫికెట్ జారీ సాక్షి, వరంగల్/దుగ్గొండి: గ్రామీణ ప్రాంతాల్లో 80 సంవత్సరాల నుంచి రైతులే విత్తనాలు తయారు చేసుకుని పండిస్తున్న వరంగల్ చపాట మిరప ఇక అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందనుంది. 2024 నవంబర్లోనే ఈ మిరపకు అంతర్జాతీయస్థాయి భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్) లభించినా.. తాజాగా ఉగాది పండుగ వేళ తిమ్మంపేట మిరప రైతు ఉత్పత్తిదారుల సంఘానికి పేటెంట్ కల్పిస్తూ కేంద్ర భౌగోళిక గుర్తింపు సంస్థ ఉత్తర్వులిచ్చింది. చైన్నెలోని ఇండియన్ పేటెంట్ సంస్థ జీఐ (జియోగ్రాఫికల్ ఇండికేషన్) ట్యాగ్ సర్టిఫికెట్ జారీ చేసింది. మహబూబాబాద్ జిల్లా మల్యాల ఉద్యాన పరిశోధనస్థానం శాస్త్రవేత్త కె.భాస్కర్, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీ సహకారంతో వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట మిరప రైతు ఉత్పత్తిదారుల సంఘం ఈ చపాట మిర్చికి భౌగోళిక గుర్తింపు కోసం ఇండియన్ పేటెంట్ ఆఫీస్ చైన్నె సంస్థకు 2022లో దరఖాస్తు చేస్తే మూడేళ్లకు అధికారికంగా పేటెంట్ లభించింది. చపాట మిరపలో రంగు ఎక్కువగా, కారం తక్కువగా ప్రత్యేక లక్షణాలు కలిగి ఉండడంతో అంతర్జాతీయస్థాయిలో 18వ ఉత్పత్తిగా జీఐ ట్యాగ్ లభించింది. ఈ పంట ఉత్పత్తిపై ముద్రించిన జీఐ ట్యాగ్ను స్కాన్ చేయడం వల్ల వినియోగదారులకు ఈ చపాట మిర్చి ప్రత్యేకత తెలుస్తుంది. ఒకప్పుడు నడికూడ నుంచే.. ఒకప్పడు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రస్తుతం హనుమకొండ జిల్లాలో ఉన్న నడికూడ మండలంలోనుంచే ఈ చపాట మిరప సాగు ఎక్కువగా ఉంది. ఆ తర్వాత దాదాపు 80 ఏళ్ల క్రితం నుంచే నడికూడ ప్రాంతవాసులు ఇతర ప్రాంతాల రైతులకు విత్తనాలు ఇచ్చా రు. ఇలా కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం నాగారంలోనూ అప్పటినుంచే సాగు చేస్తున్నారు. ఇక్కడ వాతావరణం అనుకూలంగా ఉండటంతో పంట దిగుబడి ఎక్కువగా వస్తుంది. సొంతంగా విత్తనాలు తయారు చేసుకుని పంట పండించే వరంగల్ చపాట అంతర్జాతీయంగా గుర్తింపు పొందడంతో రైతులు సంబురపడుతున్నారు. ప్రస్తుతం వరంగల్ చపాట, టమాట మిరప, సింగిల్ పట్టి, డబుల్ పట్టి పేర్లతో దొడ్డు మిరపను దుగ్గొండి, నర్సంపేట, నల్లబెల్లి మండలాల్లో విరివిగా పండిస్తున్నారు. మార్కెట్లో ధర బాగా పలకడం, వరంగల్ జిల్లా వాతావరణం అనుకూలంగా ఉండటంతో సాగు చేస్తున్నారు. దుగ్గొండి మండలంలోని తిమ్మంపేట గ్రామంలో 300 మంది మిరప రైతులు తిమ్మంపేట చిల్లీ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ లిమిటెడ్ పేరున రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని ఏర్పాటు చేసుకొని మిర్చికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొచ్చారు. తమ సొంత లోగో, బ్రాండ్ ఏర్పాటు చేసుకుని ఇతర రాష్ట్రాలు, దేశాలకు అమ్ముకునే అవకాశం కలి గింది. ప్రస్తుతం వరంగల్, హనుమకొండ, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో చపాట మిచ్చి 6,738 ఎకరాల్లో సాగుచేస్తున్నారు. ప్రతి ఏటా 10,951 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేస్తున్నారు. దాదాపు 20,574 మంది రైతులు జీఐ ట్యాగ్ ద్వారా లబ్ధి పొందనున్నారు. సొంత లోగో, బ్రాండ్తో అమ్ముకునే వీలు అధిక ధర వచ్చే అవకాశముందని రైతుల్లో ఆనందంఫలించిన తిమ్మంపేట రైతుల కృషి.. దుగ్గొండి మండలంలోని తిమ్మంపేట గ్రామంలో 300 మంది మిరప రైతులు తిమ్మంపేట చిల్లీ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ లిమిటెడ్ పేరున రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని ఏర్పాటు చేసుకొని మిర్చికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొచ్చారు. తమ సొంత లోగో, బ్రాండ్ ఏర్పాటు చేసుకుని ఇతర రాష్ట్రాలు, దేశాలకు అమ్ముకునే అవకాశం కలిగింది. ప్రస్తుతం వరంగల్, హనుమకొండ, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో చపాట మిర్చి 6,738 ఎకరాల్లో సాగుచేస్తున్నారు. ప్రతి సంవత్సరం 10,951 మెట్రిక్ టన్ను లు ఉత్పత్తి చేస్తున్నారు. దాదాపు 20,574 మంది రైతులు జీఐ ట్యాగ్ ద్వారా లబ్ధి పొందనున్నారు.జీఐ ట్యాగ్తో అధిక ధరకు అవకాశం.. వరంగల్ చపాట మిరపకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురాగలిగినందుకు సంతోషంగా ఉంది. దీనివల్ల రైతులు నేరుగా వివిధ రాష్ట్రాలు, దేశాలకు పంట ఉత్పత్తిని ఎగుమతి చేసుకునే అవకాశం కలిగింది. ఫలితంగా బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం కిలో రూ. 300 ఉన్నది. జీఐ ట్యాగ్ వల్ల అంతర్జాతీయ ప్రమాణాల దృష్ట్యా కిలోకు రూ.450 నుంచి 500 వరకు ధర లభించనుంది. అధిక ధర పలికితే రైతుకు లాభం వస్తుంది. తిమ్మంపేట గ్రామం జాతీయస్థాయిలో ఉనికిలోకి రావడం చాలా సంతోషంగా ఉంది. – నరహరి రాజ్కుమార్రెడ్డి, తిమ్మంపేట ఎఫ్పీఓ అధ్యక్షుడు -
బహుజన వీరుడు సర్వాయి పాపన్నగౌడ్
భూపాలపల్లి రూరల్: బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణరావు అన్నారు. బుధవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా భూపాలపల్లి కలెక్టరేట్లోని ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అ యిత ప్రకాశ్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమసమాజ నిర్మాణ స్థాపన కోసం పోరాటం చేసిన గొప్ప పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న అని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా వెనుక బడిన తరగతుల అధికారి శైలజ, తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే సత్యనారాయణరావు -
టార్గెట్.. 2.50 లక్షల మంది
సాక్షిప్రతినిధి, వరంగల్/ఎల్కతుర్తి : వరంగల్ వేదికగా ఈ నెల 27న బీఆర్ఎస్ మరోసారి ప్రతిష్టాత్మక కార్యక్రమం నిర్వహించేందుకు బుధవారం అంకురార్పణ జరిగింది. పార్టీ ఆవిర్భావ రజతోత్సవ మహాసభ హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, సభా పర్యవేక్షకులు, మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు, మాజీ ఎమ్మెల్యేలు వొడితల సతీశ్కుమార్, పెద్ది సుదర్శన్రెడ్డి, నరేందర్, ఉమ్మడి జిల్లా పార్టీ ఇన్చార్జ్ గ్యాదరి బాలమల్లు తదితరులు భూమి పూజ చేశారు. అంతకుముందు మంగళవారం ఎర్రవెల్లిలో ఉమ్మడి వరంగల్కు చెందిన ముఖ్యనేతలతో సమావేశమైన అధినేత కేసీఆర్.. సభావేదిక, జనసమీకరణ, ఇతర ఏర్పాట్లకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. 10 లక్షల మందికితో బహిరంగసభ నిర్వహించాలని, దీనికి కోసం ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 2.50 లక్షల మందిని సమీకరించాలని టార్గెట్ పెట్టారు. జనసమీకరణకు ఇన్చార్జ్ల నియామకం.. కేసీఆర్ ఆదేశాలతో 2.50 లక్షల మంది జనసమీకరణకు బీఆర్ఎస్ పార్టీ నేతలు కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు అధినేత.. సభ ఏ ర్పాట్లు, జన సమీకరణకు సంబంధించి ముఖ్యనేతలకు నియోజకవర్గాల వారీగా బాధ్యతలు అప్పగించారు. పాలకుర్తి, వర్ధన్నపేటకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఇన్చార్జ్గా వ్యవహరించనుండగా.. వరంగల్ పశ్చిమను మాజీ చీఫ్విప్ వినయ్భాస్కర్కు అప్పగించారు. వరంగల్ తూర్పును నన్నపునేని నరేందర్, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డికి, భూపాలపల్లిని గండ్ర వెంకటరమణారెడ్డికి, నర్సంపేట, ములుగు నియోజకవర్గాలకు పెద్ది సుదర్శన్రెడ్డిని ఇన్చార్జ్లుగా నియమించారు. అదేవిధంగా జనగామ, స్టేషన్ఘన్పూర్ బాధ్యతలను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి చూడనుండగా, పరకాలను చల్లా ధర్మారెడ్డి, మహబూబాబాద్ను సత్యవతి రాథోడ్, శంకర్నాయక్, డోర్నకల్ను రెడ్యానాయక్, మాలోత్ కవితకు అప్పగించారు. సభ ఏర్పాట్లు, జనసమీకరణ తదితర బాధ్యతలు నిర్వహించే హైదరాబాద్కు చెందిన పార్టీ రాష్ట్ర, జాతీయస్థాయి నాయకులు వరంగల్ నగరంలోనే మకాం వేయనున్నారు. నేటి నుంచి మరింత వేగంగా పనులు.. సభకు మరో 24 రోజులే గడువు ఉండటంతో గురువారం నుంచి సభా కోసం చేపట్టే పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి. ఇప్పటివరకు బహిరంగసభకు సిద్ధం చేసిన 1,213 ఎకరాల స్థలంలో.. 154 ఎకరాల్లో మహాసభ ప్రాంగణం ఉంటుందని, పార్కింగ్ కోసం 1,059 ఎకరాలను కేటాయించినట్లు వెల్లడించిన బీఆర్ఎస్ నేతలు, మరో మూడు, నాలుగు వందల ఎకరాలు కూడా సేకరించనున్నట్లు వివరించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఉమ్మడి జిల్లా నుంచి జన సమీకరణ జన సమీకరణకు ఇన్చార్జులుగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇప్పటికే కేసీఆర్తో భేటీ అయిన ముఖ్య నేతలు -
యాంత్రీకరణ.. పునరుద్ధరణ
గురువారం శ్రీ 3 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025రాయితీపై సాగు యంత్రాల పంపిణీభూపాలపల్లి రూరల్: సాంకేతిక అభివృద్ధితో వ్యవసాయ రంగంలో అనేక మార్పులు సంతరించుకున్నాయి. దీంతో సాగులో యంత్ర పరికరాల వినియోగం పెరిగింది. ఇందులో భాగంగా 2006లో అప్పటి ప్రభుత్వం రైతులకు వ్యవసాయ యంత్రాలను సబ్సిడీలో అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 2018 వరకు కొనసాగిన ఈ కార్యక్రమంలో గత బీఆర్ఎస్ హయాంలో ఆగిపోయింది. ఈ వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పునరుద్ధరించి.. మహిళా రైతులకు వ్యవసాయ పరికరాలను రాయితీపై అందించాలని నిర్ణయించింది. ఇప్పటికే 18 రకాల యాంత్రీకరణ పరికరాలు( ట్రాక్టర్, రోటోవేటర్, స్ప్రెయర్, డ్రిప్, డ్రోన్, తదితరాలు) ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం జిల్లాకు రూ.38.51 లక్షలు నిధులను కేటాయించింది. రానున్న రోజుల్లో 820 వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను ఇవ్వాలని నిర్ణయించింది. వీటన్నింటిని 50 శాతం రాయితీలో మహిళా రైతులకు మాత్రమే అందించాలనే నిబంధన విధించింది. దీంతో అధికారులు గత నెల చివరి వరకు లబ్ధిదారులనుంచి దరఖాస్తులు స్వీకరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గాల వారీగా పరికరాలు, నిధులను కలెక్టర్ రాహుల్ శర్మ కేటాయించారు. మండలాల వారీగా మహిళా రైతులను ఎంపిక చేయనున్నారు. -
మూడు రాష్ట్రాల్లో తూటాలై పేలిన అక్షరాలు
బుధవారం శ్రీ 2 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025● చట్టంపై పట్టుకోసం న్యాయ విద్య.. ● విప్లవ ప్రజాపోరాటాల చరిత్ర అక్షరీకరణ ● పలు విప్లవ పత్రికలకు సంపాదకత్వం దేవరుప్పుల: ప్రజా చైతన్యానికి ఊపిరిలూదిన జనగామ జిల్లా కడవెండిలో పుట్టిన గుమ్ముడవెల్లి రేణుక అదే పోరాట పంథాను ఎంచుకుని అడవిబాట పట్టింది. చిన్నతనంలోనే వివాహం, తదితర ఘటనలు ఆమెను తీవ్రంగా కలిచివేశాయి. ఈనేపథ్యంలో చట్టంపై అవగాహన కోసం న్యాయ విద్యను అభ్యసించింది. ఆమె సోదరుడు ప్రసాద్ అలియాస్ ఉసెండి దండకారణ్యంలో పనిచేసేవాడు. ఈక్రమంలో పోలీసుల అత్యంత నిర్బంధాలను చవిచూసిన తండ్రి సోమయ్య.. కూతురు రేణుకకు యుక్త వయసు రాగానే ఉన్నత చదువులకు అవకాశం ఇవ్వకుండా ఓ వ్యక్తితో వివాహం చేశారు. దీంతో వారి దాంపత్య జీవితంలో పురుషాధిక్యత వంటి అంశాలతో కలహాలు వచ్చాయి. అనివార్యంగా విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. యుక్తవయస్సు రాగానే తన ఆలోచనలకు విరుద్ధంగా పితృస్వామ్య వ్యవస్థలో నిర్ణయాలు, అజమాయిషీపై ఆమె తీవ్రంగా ఆ లోచించింది. ఈనేపథ్యంలోనే ఓయూలో దూరవిద్యలో డిగ్రీ చేసి చట్టంపై పట్టు కోసం తిరుపతి పద్మావతి విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బీ చదివింది. ఎల్ఎల్బీ చదువుతున్న క్రమంలోనే.. రేణుక లా చదువుతున్న సమయంలో అప్పటికే ఉద్యమంలో ఉన్న పద్మక్క, సూర్యం పరిచ య మయ్యారు. దీంతో ఆమె ఆలోచనాత్మక ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు ప్రజాసంఘాల్లో భాగస్వామ్యమవుతూ దండకారణ్యం బాట పట్టింది. వరుస ఎన్కౌంటర్లు, నిర్బంధ పరిస్థితుల్లో మావోయిస్టు పార్టీ నిర్ణయంతో ఒడిశా, ఛత్తీస్గఢ్లో ప్రజాక్షేత్రంలో చోటుచేసుకున్న అనేక కీలక ఘటనలు, ఘ ట్టాలపై విశ్లేషణాత్మక అధ్యయనాలు చేసి పార్టీకి మా ర్గదర్శకాలు చేసింది. అజ్ఞాత జీవితాన్ని ఎదుర్కొంటూనే విప్లవ ప్రజాపోరాటాల చరిత్రను అక్షరీకరించింది. నక్సల్స్ తరఫున ప్రభాత్, మహిళా మార్గం, అవామి జంగ్, పీపుల్స్ మార్చ్, పోటియారో ఫోల్లో, సంఘర్షణ్, భూమ్కల్ సందేశ్, పితురీ వంటి విప్లవ పత్రికలకు సంపాదకత్వం వహించింది. తొలుత భాషాధార(బీడీ) ప్రాంతంలో పని చేసే క్రమంలో బీడీ దమయంతి పేరుతో రచనలు చేసింది.కడవెండి పడమటి తోట.. నక్సల్స్ ఉద్యమానికి బాట కడవెండికి చేరిన రేణుక మృతదేహం– వివరాలు 8లోu -
ఉత్పత్తిలో వెనుకంజ
భూపాలపల్లి అర్బన్: గడిచిన 2024–25 ఆర్థిక సంవత్సరంలో భూపాలపల్లి ఏరియా కాకతీయ గనుల్లో సింగరేణి యాజమాన్యం నిర్ధేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించకుండా వెనుకంజలో ఉంది. 49.60లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను 37.02లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిచేసి 75శాతంలో నిలిచింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను 46.54 లక్షల ఉత్పత్తి లక్ష్యం సింగరేణి యాజమాన్యం విధించారు. గతేడాది కంటే సుమారు 3లక్షల టన్నుల టార్గెట్ను తగ్గించారు. భూపాలపల్లి ఏరియాలో నాలుగు భూగర్భ గనులు, రెండు ఓపెన్కాస్టు గనులు ఉన్నాయి. ఈ ఏడాది మిగిలిన 12,57,708 లక్షల బొగ్గు ఉత్పత్తిని వెలికితీయలేకపోయారు. ఈ మేరకు ఇప్పటినుంచి నిర్ధేశించిన ఉత్పత్తిని సాధించేందుకు అధికారులు ఏరియాలోని ప్రతి గనికి నెలలు, రోజు వారీగా విభజించి కేటాయించారు. వెలికితీసిన బొగ్గు ఉత్పత్తిలో 33.66లక్షల టన్నుల బొగ్గును రవాణ చేశారు. లక్ష్యానికి దూరంగా ఓసీ–3 భూపాలపల్లి ఏరియాలో నాలుగు భూగర్భ గనులకు 9.60లక్షలు, రెండు ఓపెన్కాస్టులకు 40 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని కేటాయించారు. వాటిలో భూగర్భ గనుల నుంచి 6,93,013, ఓపెన్కాస్ట్ 2–ప్రాజెక్ట్లో 15లక్షల టన్నుల టార్గెట్గాను 14,67,133, ఓసీ–3లో 25లక్షల టన్నులకు కేవలం 15,42,146 టన్నులు మాత్రమే సాధించి 62శాతంలో నిలిచింది. ఓపెన్కాస్టుల ద్వారానే తక్కువ సమయంలో ఎక్కువ బొగ్గును వెలికితీయాలనే ఉద్దేశం ఏర్పాటు చేశారు. ఓపెన్కాస్టు 3 ప్రాజెక్ట్ను ప్రారంభించి నాలుగేళ్లవుతున్నా పూర్తిస్థాయిలో బొగ్గు ఉత్పత్తి చేయడం లేదు. భూగర్భ గనులతో సమానంగా ఓపెన్కాస్టులో కూడా ఉత్పత్తి తగ్గడంతో భూపాలపల్లి ఏరియా ఉత్పత్తిలో వెనుకబడింది. కారణాలెన్నో.. భూగర్భ, ఓపెన్కాస్టు గనుల్లో ఉత్పత్తి తగ్గడానికి అధికారులు అనేక కారణాలు చూపిస్తున్నారు. భూగర్భ గనుల్లో కార్మికుల గైర్హాజరు శాతం ఎక్కువగా ఉండటం, సర్ఫెస్ కార్మికుల సంఖ్య ఎక్కువగా పెరగడం కారణాలు ఉన్నాయి. ఈ ఏడాది ఽఅధికంగా వర్షాలు కురవడంతో ఓపెన్కాస్టుల్లో రోజుల తరబడి ఉత్పత్తిని నిలిచిపోయింది. దీంతో ఉత్పత్తిపై తీవ్రమైన ప్రభావం పడింది. ఓపెన్కాస్టు 3లో ఓబీ పనులు సక్రమంగా సాగకపోవడం, భూసేకరణ అనుకున్న స్థాయిలో జరగపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఓసీపీ–2లో 182లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి లక్ష్యానికి గాను 152 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని, ఓసీపీ–3లో 254లక్షల క్యూబిక్ మీటర్లకుగాను 127లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని మాత్రమే వెలికితీశారు. పూర్తిస్థాయిలో మట్టి వెలికితీతను కూడా చేపట్టకుండా 72శాతంలోనే ఉంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 75 శాతం బొగ్గు ఉత్పత్తి ఈ ఏడాదికి ఉత్పత్తి లక్ష్యం 46.53లక్షల టన్నుల బొగ్గు నష్టాల్లో భూపాలపల్లి ఏరియాఉత్పత్తి పెంచేందుకు ప్రణాళికలు భూపాలపల్లి ఏరియాలో భూగర్భగనులు, ఓపెన్కాస్ట్ గనుల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో యాజమాన్యం నిర్ధేశించిన ఉత్పత్తి లక్ష్యాలను సాఽధించేందుకు ఇప్పటి నుంచే కావాల్సిన ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి తెలిపారు. ఏరియాలోని జీఎం కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వార్షిక బొగ్గు ఉత్పత్తి వివరాలు వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే సుమారు రూ.46కోట్ల నష్టాలను తగ్గించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో అధికారులు వెంకటరామిరెడ్డి, జోతి, సురేఖ, రవికుమార్, మారుతి. శ్రావణ్కుమార్పాల్గొన్నారు. -
కాలసర్ప నివారణ పూజలు
కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ అనుబంధ దేవాలయం శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కాలసర్ప నివారణ, శని పూజలకు భక్తుల రద్దీ నెలకొంది. మంగళవారం ముందుగా త్రివేణి సంగమ గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు చేసి స్వామివారి ఆలయంలో సామూహికంగా పూజలు నిర్వహించారు. కొంతమంది భక్తులు నవగ్రహాల వద్ద శనిపూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి గర్భగుడిలో అభిషేక పూజలు చేశారు. శ్రీశుభానందదేవి అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు. దీంతో ఆలయ పరిసరాలు, గోదావరి తీరం వద్ద భక్తులతో సందడి వాతావరణం కనిపించింది. -
వాతావరణం
జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండతో పాటు ఉక్కపోతగా ఉంటుంది. రాత్రివేళ కాస్త మంచు కురుస్తుంది.క్షేత్రస్థాయి పరిస్థితులపై విశ్లేషణాత్మకంగా..– 8లోu1994లో తాను ఎదుర్కొన్న సంఘర్షణను బట్టి ‘మహిళలపై హింస–మండుటెండు గాయాలు’ రచన చేసింది. పత్రికల్లో బీడీ దమయంతి పేరిట సల్వాజుడుం విధ్వంసం తీరుపై ‘పచ్చని బతుకుల్లో కురుస్తున్న నిప్పులు’, ఆదివాసీ భూపోరాటాల విజయపథంలో ‘విముక్తి బాటలో నారాయణఖేడ్’, భూఆక్రమణలు చేపడుతూ వడ్డీ వ్యాపారుల ఆగడాలు, ఆదివాసీ, దళితుల మధ్య పాలకుల చిచ్చు అంశాలపై మీడియా రూపంలో క్షేత్ర స్థాయిలో విశ్లేషణాత్మక అధ్యయనాలు చేసి మావోయిస్టు అగ్రనేత రామకృష్ణతో పర్యటన చేసింది. సింగన్ మడుగు ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరిట అడవిలో ఆరు ఊర్లను తగులబెట్టిన నేపథ్యంపై ఆమె చేసిన రచనలు తుపాకీ తూటాల కంటే రెట్టింపులో పేలి ప్రజాచైతన్యానికి ఊపిరిలూదినట్లు చెబుతుంటారు. యుక్త వయసులో ఓ ఇంటి ఆవిడగా సంఘర్షణ పడి సమ సమాజ స్థాపన కోసం అడవిబాట పట్టిన ఉద్యమ కెరటం రేణుక ప్రస్థానం దంతెవాడ ఎన్కౌంటర్తో ముగిసినా మెట్లమీద మిడ్కో(మిణుగురు పువ్వు) పేరిట ఆమె రచనలు, సాహిత్యం ఎప్పటికీ గుర్తుండిపోతుందని సాహిత్యాభిమానులు అంటున్నారు. -
పెరిగిన టోల్ చార్జీలు
కాటారం: కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన టోల్చార్జీల సవరణతో టోల్ చార్టీల పెంపు మంగళవారం నుంచి అమలులోకి వచ్చింది. 353(సీ) జాతీయ రహదారిపై కాటారం మండలం మేడిపల్లి వద్ద నిర్వహిస్తున్న టోల్గేట్లో పలు వాహనాలకు సంబంధించిన టోల్చార్జీలు రూ.5నుంచి రూ.20 మధ్య పెరిగినట్లు టోల్గేట్ సూపర్వైజర్ మునీర్ తెలిపారు. కారు, జీప్లకు రిటర్న్ జర్నీకి సంబంధించి ఫాస్ట్గా హోల్డర్స్కు రూ.15 చార్జ్ చేస్తుండగా ప్రస్తుతం రూ.20కి నాన్ ఫాస్టాగ్ హోల్డర్స్కు రిటర్న్ జర్నీకి రూ.30 ఉండగా రూ.35కి పెరిగింది. మిగితా వాహనాల సైజ్ను బట్టి రూ.5నుంచి రూ.20 పెరిగినట్లు సూపర్వైజర్ పేర్కొన్నారు. పెరిగిన టోల్చార్జీలు వచ్చే ఏడాది మార్చి 31 వరకు అమల్లో ఉండనున్నాయి. -
సోలార్ పంపులతో మూగజీవాలకు తాగునీరు
కాళేశ్వరం: ఎండల తీవ్రత పెరుగుతుండడంతో అటవీశాఖ అధికారులు మూగజీవాల దాహార్తి తీర్చేందుక సోలార్ పంపులు సిద్ధం చేస్తున్నారు. ఎండలు మండిపోతుండడంతో చెరువులు, కుంటల్లో నీరు వట్టిపోతున్న విషయం తెలిసిందే. మంగళవారం మహదేవపూర్ రేంజ్ పరిధిలోని కాళేశ్వరం తదితర అటవీ ప్రాంతాల్లో సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేశారు. సోలార్ పంపుల ద్వారా చెరువులు, కుంటల్లో నీటిని నింపుతున్నారు. అడవుల్లో ఉన్న మూగ జీవాలకు నీటి కోసం 24 గంటల పాటు మోటార్ ఆన్చేసి ఉంచడంతో నీరు కుంటలు, చెరువుల్లో నిండి మూగ జీవాల దాహార్తి తీరనుంది. మహదేవపూర్, కాళేశ్వరం–2, నస్తూర్పల్లి, బొమ్మాపూర్, కుదురుపల్లి ఆరు చోట్ల సోలార్ సెట్ పంపులు ఉన్నాయి. కొన్ని రిపేర్లు ఉండగా మరమ్మతులు చేసి ఉపయోగంలోకి తీసుకు వస్తున్నట్లు రేంజర్ రవి తెలిపారు. జంతు ప్రేమికులు అటవీ శాఖ అధికారులకు అభినందనలు చెబుతున్నారు. -
వడదెబ్బ.. తస్మాత్ జాగ్రత్త
ప్రాథమిక చికిత్స ● వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే నీడకు తీసుకెళ్లాలి. చల్లని నీరు, ఐస్తో తుడవాలి. వదులుగా ఉన్న నూలు దుస్తులు వేయాలి. ● ఫ్యాను గాలి లేదా చల్లని గాలి తగిలేలా ఉంచాలి. ● ఉప్పు కలిపిన మజ్జిగ, కొబ్బరిబొండాం లేదా చిటికెడు ఉప్పు, చక్కెర కలిపిన నిమ్మరసం, గ్లూకోజ్ ద్రావణం లేదా ఓరల్ రీ హైడ్రేషన్ ద్రావణం (ఓఆర్ఎస్) తాగించవచ్చు. వడదెబ్బ తగిలి అపస్మారక స్థితిలో ఉన్న వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించాలి. చేయకూడని పనులు ● మండు వేసవిలో తీవ్ర ఉష్ణోగ్రత సమయంలో బయట ఎక్కువగా తిరగొద్దు. ● రోడ్లపై విక్రయించే చల్లని రంగు పానీయాలు తాగవద్దు. ● ఇంట్లో వండుకున్న ఆహారం మాత్రమే తినడం మంచిది. ● మాంసాహారం తగ్గించి తాజా కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. ● వేసవిలో ఆకలి తక్కువగానూ దాహం ఎక్కువగానూ ఉంటుంది. నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు తీసుకోవాలి.అత్యధికంగా నమోదవుతున్న పగటి ఉష్ణోగ్రతలు ● సోమవారం 40 డిగ్రీలు.. ● ప్రజల ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పు ● ముందస్తు జాగ్రత్తలతో ఉపశమనంవేసవికాలం అంటే ఎండ తీవ్రత కాస్త ఎక్కువగా ఉండటం సాధారణం. కానీ, ఏకంగా 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తెల్లవారడమే ఆలస్యం అన్నట్లుగా ఉదయం నుంచే సూర్య ప్రతాపం ప్రారంభం అవుతుండడంతో జనం ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంటుంది. ఏప్రిల్ ప్రారంభంలోనే ఇలా ఉంటే ఈనెల చివరి వరకు, మేలో ఎండల ప్రభావం ఇంకెలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. – భూపాలపల్లి అర్బన్వడదెబ్బ లక్షణాలు వడదెబ్బ తాకిన వారి కాళ్లు వాపులు వస్తాయి. కళ్లు తిరగడం, శరీర కండరాలు పట్టుకోవడం, తీవ్రమైన జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అధిక చెమట పట్టడం, తలతిరిగి పడిపోవడం వంటివి జరిగితే వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి సత్వర వైద్యం అందించాలి.జిల్లాలో భానుడు భగ్గుమంటుండడంతో జనం బెంబేలెత్తుతున్నారు. ఉదయం 9గంటలకే ఎండ తీవ్రత పెరుగుతోంది. ఇప్పుడే 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఈనెల చివరి, మే మాసంలో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉండడంతో ఏమాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రజలు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.తేలికపాటి ఆహారం ఉత్తమం నూనె పదార్థాలు, వేపుళ్లు, చిప్స్, జంక్ ఫుడ్ వంటి వాటి జోలికి వెళ్లకపోవడం ఉత్తమం, తేలికపాటి ఆహారం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా బయటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. బాగా చల్లగా ఉన్న నీరు తాగడం వల్ల తిన్న ఆహార పదార్థాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కూల్డ్రింక్స్కు పిల్లలను దూరంగా ఉండాలి. -
● రజతోత్సవ మహాసభపై సమీక్ష
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించతలపెట్టిన పార్టీ రజతోత్సవ మహాసభ ఏర్పాట్లపై మంగళవారం పార్టీ అధినేత కేసీఆర్తో ఎర్రవెల్లిలోని తన నివాసంలో ఉమ్మడి జిల్లా నేతలు సమావేశమయ్యారు. సమావేశంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, తక్కళ్లపల్లి రవీందర్రావు, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, తాటికొండ రాజయ్య, సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, దాస్యం వినయ్భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, రెడ్యానాయక్, శంకర్ నాయక్, గండ్ర వెంకట రమణారెడ్డి, నన్నపునేని నరేందర్, నాయకులు లక్ష్మణ్రావు, గండ్ర జ్యోతి, నాగజ్యోతి పాల్గొన్నారు. -
పేదలందరికీ సన్నబియ్యం
భూపాలపల్లి రూరల్: ప్రజా ప్రభుత్వంలో పేదలందరికీ సన్నబియ్యం అందిస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. భూపాలపల్లి మండలం మోరంచపల్లి, గణపురం మండల కేంద్రంలో మంగళవారం ఎమ్మెల్యే సత్యనారాయణరావు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలు సన్నబియ్యం తినేలా చేయాలనే సంకల్పంతోనే సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించామని చెప్పారు. అనంతరం గణపురంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట జిల్లా పౌర సరఫరాల డీఎం రాములు, సివిల్ సప్లయ్ అధికారి శ్రీనాథ్, భూపాలపల్లి, గణపురం మండ ల కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
ఒకే వేదికపై ముగ్గురు..
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రం బాంబులగడ్డ సమీపంలోని ఈద్గాలో సోమవారం జరిగిన రంజాన్ వేడుకలకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హాజరయ్యారు. ముస్లింలతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆసక్తిగా గమనించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి కరచాలనం చేసుకొని పలకరించుకున్నారు. చివరికి వచ్చిన గండ్ర వెంకటరమణరెడ్డి ఎవరినీ పలకరించకుండా నేరుగా నమాజ్ వద్దకు వెళ్లారు. ముగ్గురు నాయకులు సుమారు అరగంటకు పైగా పక్కపక్కన కూర్చుని ప్రార్థనల్లో పాల్గొని ప్రసంగించారు. గ్రూప్–1 ర్యాంకర్కు ఏఎస్పీ సన్మానంఏటూరునాగారం: మండల కేంద్రంలోని మానసపల్లికి చెందిన దైనంపల్లి ప్రవీణ్కుమార్ ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్–1 ఫలితాల్లో 105వ ర్యాంకు సాధించాడు. ఈ విషయం తెలుసుకున్న ఏఎస్పీ శివం ఉపాధ్యాయ తన కార్యాలయంలో సోమవారం ప్రవీణ్ను ఘనంగా సన్మానించారు. ఉన్నత పదవుల్లో చేరి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ప్రవీణ్ చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయినా.. కష్టపడి చదివి మంచి ర్యాంకు సాధించారు. చదువుకు పేదరికం అడ్డు కాదని పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని ప్రవీణ్కుమార్ నిరూపించాడని గ్రామస్తులు, ప్రజలు అభినందించారు. భద్రకాళి అమ్మవారికి పుష్పార్చన హన్మకొండ కల్చరల్: వసంత నవరాత్ర ఉత్సవాల్లో భద్రకాళి దేవాలయంలో సోమవారం అమ్మవారికి పుష్పార్చన చేశారు. ఉదయం అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అమ్మవారికి నిర్మాల్యసేవలు, నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం వేదపండితులు, వేదపాఠశాల విద్యార్థులు తెల్లచామంతి పూలకు సంప్రోక్షణ చేసి అమ్మవారికి లక్షపుష్పార్చన నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయశాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె.దుర్గాప్రసాద్, డీఈ ఈ సీహెచ్ రమేశ్బాబు, ఏఈ వీరచందర్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈఓ శేషుభారతి, దేవాలయ సిబ్బంది పర్యవేక్షించారు. వేయిస్తంభాల దేవాలయంలో సీతారాములకు పూజలు హన్మకొండ కల్చరల్: శ్రీరామనవమి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో సోమవారం రెండోరోజూ సీతారాములకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో శ్రీరుద్రేశ్వరుడికి రుద్రాభిషేకం, 121 మంది దంపతులు సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహించారు. తెలుగు సంవత్సరాది ప్రారంభం, శివ ప్రీతికరమైన సోమవారం కావడంతో అధికసంఖ్యలో భక్తులు దేవాలయాన్ని సందర్శించారు. కృష్ణయజుర్వేద పండితుడు గుదిమెల్ల విజయకుమారాచార్యులు ఆధ్వర్యంలో సీతారాముల ఉత్సవ మూర్తులను ప్రతిష్ఠించి అనుష్టాన పూజలు, యాగశాలలో మహా సుదర్శనహోమం జరిపారు. కార్యక్రమాలను ఆలయ ఈఓ అనిల్కుమార్, సిబ్బంది పర్యవేక్షించారు. -
వనదేవతలను దర్శించుకున్న అధికారులు
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మలను నిజామాబాద్ సెంట్రల్ జైలు ఎస్పీ కూన ఆనందరావు, రాష్ట్ర సెక్రటేరియట్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పుట్ట దేవిదాస్ కుటుంబ సమేతంగా సోమవారం దర్శించుకున్నారు. వనదేవతలకు ఎత్తు బంగారం సమర్పించారు. గోవిందరాజు, పగిడిద్దరాజులను దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం సమ్మక్క పూజారి సిద్ధబోయిన స్వామి, రమేష్లు డోలు వాయిద్యాలతో వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారిని అమ్మవార్ల పట్టువస్త్రాలతో సన్మానించి ప్రసాదం అందజేశారు. వారి వెంట నాయకపోడు సంఘం రాష్ట్ర నాయకుడు కూన శివరాం, ఎస్ఎస్ తాడ్వాయి మండల అధ్యక్షుడు గుండ్ల రాజు, మండల యూత్ అధ్యక్షుడు కోడి సతీష్ పాల్గొన్నారు. -
విస్తృత ప్రచారం నిర్వహించాలి
భూపాలపల్లి: రాజీవ్ యువ వికాసం పథకంపై విస్తృత ప్రచారం నిర్వహించి ఎక్కువమంది దరఖాస్తు చేసుకునేలా చూడాలని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ సూచించారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్లోని ప్రజా భవన్ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్కు ఐడీఓసీ నుంచి అదనపు కలెక్టర్ పాల్గొన్నారు. సమావేశం అనంతరం జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. పథకంపై మండల, మున్సిపల్ స్థాయిలో టామ్ టామ్ ద్వారా ప్రచారం నిర్వహించాలన్నారు. జిల్లాలో రాజీవ్ యువ వికాసం పథకానికి వచ్చిన దరఖాస్తుల వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ నరేష్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వర్లు, పరిశ్రమల శాఖ జీఎం సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ అశోక్కుమార్ -
ఉద్యోగికి ఘన సన్మానం
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియా ఇంజనీర్ పి.రామకృష్ణారెడ్డి సోమవారం ఉద్యోగ విరమణ పొందగా ఏరియా అధికారులు ఘనంగా సన్మానించారు. జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఏరియా జీఎం రాజేశ్వర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డిని ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధికారులు వెంకటరామిరెడ్డి, వెంకటరమణ, భిక్షమయ్య, రవికుమార్, ప్రసాద్, మారుతి పాల్గొన్నారు. 8వ గనిలో.. ఏరియాలోని కేటీకే 8వ గనిలో విధులు నిర్వరిస్తూ ఉద్యోగ విరమణ పొందిన ఆరెల్లి లాలయ్యను గని మేనేజర్ భానుప్రసాద్, గని అధికారులు, కార్మికులు ఘనంగా సన్మానించారు. బొగ్గు ఉత్పత్తికి లాలయ్య చేసిన కృషి మరువలేనిదన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని కార్మికులు పని చేయాలని భానుప్రసాద్ సూచించారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అధికారి సాయికృష్ణ, కార్మిక సంఘాల నాయకులు శంకర్, సమ్మయ్య, విజేందర్, రాజేష్ పాల్గొన్నారు. -
పేదల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం
భూపాలపల్లి రూరల్: రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబం కడుపు నిండా భోజనం చేయడం లక్ష్యంగా ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. జిల్లాకేంద్రంలోని రాంనగర్ కాలనీ చౌకధరల దుకాణంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాశ్రెడ్డితో కలిసి సోమవారం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను సరిచేసుకుంటూ హామీలను నెరవేరుస్తున్నట్లు చెప్పారు. గతంలో రేషన్ బియ్యం పంపిణీలో మాఫియాలు ఉండేవని ఇప్పుడు వాటిని శాశ్వతంగా నిర్మూలించామని తెలిపారు. గత పది సంవత్సరాలలో రేషన్ కార్డులు ఇవ్వలేదని, ఇప్పుడు అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ.. సన్నబియ్యం పంపిణీతో నిరుపేదలకు ఉపయోగం కలుగుతుందన్నారు. నియోజకవర్గానికి కావాల్సిన పనులు, నిధులు మంజూరు చేయించాలని మంత్రిని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, డీఎస్ఓ రాములు, ఆర్డీఓ రవి, తహసీల్దార్ శ్రీనివాసులు, మాజీ కౌన్సిలర్లు దాట్ల శ్రీని వాస్, ముంజాల రవీందర్, టీపీసీసీ సభ్యుడు మ ధు, పిప్పాల రాజేందర్ పాల్గొన్నారు. యువతకు ప్రోత్సాహం రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ప్రభుత్వం యువతను ప్రోత్సహిస్తున్నట్లు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. భూపాలపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాశ్రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. పదేళ్లుగా ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో చాలామంది వయసు దాటిపోయి నిరుద్యోగులుగా మారారన్నారు. నిరుద్యోగులను ఆదుకునేందుకు ప్రభుత్వం రాజీవ్ యువవికాసం పథకాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. ఈ పథకానికి ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 57వేలు ఉద్యోగాలు భర్తీ చేశామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దేవన్, టీపీసీసీ సభ్యుడు మధు, మాజీ కౌన్సిలర్లు దాట్ల శ్రీనివాస్, ముంజాల రవీందర్, నాయకులు పిప్పాల రాజేందర్, కురిమిల్ల శ్రీనివాస్, అప్పం కిషన్ పాల్గొన్నారు.రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబుఐక్యతకు ప్రతీక రంజాన్ కాటారం: హిందూ, ముస్లింల ఐక్యతకు రంజాన్ పండగ ప్రతీకగా నిలుస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని కాటారం మండలకేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి శ్రీధర్బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. ముస్లింలకు రంజాన్ చాలా పవిత్రమైన పండగ అన్నారు. నెల రోజుల పాటు ఉపవాసాలు ఉండి ప్రార్థనలు చేసి వారి భక్తిని చాటుకుంటారని పేర్కొన్నారు. ముస్లిం, మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్రెడ్డి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు చీమల సందీప్, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, యూత్ అధ్యక్షుడు చిటూరి మహేశ్గౌడ్, మాజీ కోఆప్షన్ సభ్యుడు అజీజ్, ముస్లిం మతపెద్దలు, యువకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
కల్యాణ మహోత్సవానికి పందిరి పూజ
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని రామాలయంలో వచ్చే నెల 6న శ్రీసీతారాముల కల్యాణం ఉండడంతో పచ్చని పందిరి ముహూర్త కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు యల్లాప్రగడ నాగేశ్వర్రావు శర్మ, ఆలయ చైర్మన్ అలువాల శ్రీనివాస్ నిర్వహించారు. పాలకర్రకు కుంకుమ, పసుపుతో అలంకరించి కంకణాలు కట్టి కొబ్బరికాయలు కొట్టి కల్యాణ వేడుకల పందిళ్ల ఏర్పాటు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయంలో స్వామివారి కల్యాణ మహోత్సవం తిలకించేందుకు వచ్చే భక్తులకు చలువ పందిళ్లు వేయనున్నట్లు ఆలయ చైర్మన్ తెలిపారు. అనంతరం లగ్న పత్రికను రాసి సీతాదేవి, రాములవారి తరఫున కమిటీ సభ్యులు, గ్రామస్తులు నిలబడి లగ్న పత్రికను సంపద్రాయబద్ధంగా స్వీకరించారు. నూతన వస్త్రాలను కప్పుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కల్యాణ మహోత్సవ వేడుకలను ఐదు రోజులపాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గడదాసు శివ, పిట్టల శివ, గార మహేష్, తదితరులు పాల్గొన్నారు. -
ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు
భూపాలపల్లి అర్బన్: రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు కలెక్టర్ రాహుల్శర్మ ఆదివారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పవిత్రమైన నెలగా త్యాగం, భక్తి, మానవతా విలువల ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఉపవాస దీక్ష, ప్రార్థనలు, దానం వంటి ఆచారాలు సామాజిక సమగ్రతను పెంపొందిస్తాయని తెలిపారు. అందరూ కలిసికట్టుగా సమాజంలో శాంతి, ఐకత్యను చాటాలని పిలుపునిచ్చారు. ఈ పండగను ఆనందంగా, సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. ధన్వాడలో మంత్రి పూజలు కాటారం: ఉగాది నేపథ్యంలో తన స్వగ్రామం ధన్వాడలోని దత్తాత్రేయ స్వామి ఆలయంలో మంత్రి శ్రీధర్బాబు ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ప్రజలు ఆదివారం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలకేంద్రంలోని ఆంజనేయ స్వామి ఆలయంతో పాటు అయ్యప్ప స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం ఆలయాల్లో పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గం యూత్ అధ్యక్షుడు చీమల సందీప్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్రెడ్డి, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, యూత్ అధ్యక్షుడు చిటూరి మహేశ్గౌడ్, ఆలయాల పురోహితులు పాల్గొన్నారు. సమస్యలపై మంత్రికి వినతి కాటారం: తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఆదివారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్బాబుకు గ్రామ పంచాయతీ కార్యదర్శుల సంఘం నాయకులు వినతిపత్రం సమర్పించారు. అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను జేపీఎస్గా మార్చి రెగ్యూలర్ చేయడంతో పాటు రాష్ట్రంలోని జేపీఎస్లుగా ఉన్న వారిని రెగ్యూలర్ పంచాయతీ కార్యదర్శులుగా ప్రమోట్ చేయాలని మంత్రిని కోరారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు సంఘం నాయకులు తెలిపారు. వినతిపత్రం సమర్పించిన వారిలో సంఘం జిల్లా నాయకులు కరుణాకర్, సృజన్, వేణు ఉన్నారు. జాతీయ కమిటీ సభ్యుడిగా రాజయ్య భూపాలపల్లి అర్బన్: ఆలిండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్(ఏఐసీడబ్ల్యూఎఫ్) జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఏరియాకు చెందిన కంపేటి రాజయ్య ఎన్నికయ్యారు. ఈ నెల 28నుంచి 30వ తేదీ వరకు జార్ఘండ్ రాష్ట్రంలోని రాంచీలో జరిగిన జాతీయ మహాసభల్లో రాజయ్యను జాతీయ కమిటీ సభ్యుడిగా ఎన్నుకున్నారు. కమిటీలో అవకాశం దక్కడం పట్ల రాజయ్య సంతోషం వ్యక్తం చేశారు. రాములోరి కల్యాణానికి రూ.లక్ష విరాళం రేగొండ: మండలంలోని రూపిరెడ్డిపల్లి గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ ఆలయంలో నిర్వహించే సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకలకు గ్రామానికి చెందిన రావుల వనజ అశోక్ దంపతులు రూ.1,11,116 విరాళం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దైవకార్యానికి తనవంతు సహాయం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ముడుతనపల్లి శంకర్, కమిటీ సభ్యులు శ్రీనివాస్, రవి, శంకర్, రాజుకుమార్, శ్రీధర్, రఘు పాల్గొన్నారు. -
కాళేశ్వరాలయంలో ‘పంచాంగ శ్రవణం’
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో శ్రీవిఽశ్వావసు నామసంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని వేదపండితులు ‘పంచాంగ శ్రవణం’ భక్తులకు చదివి వినిపించారు. ఆదివారం సాయంత్రం ఆలయం అనివెట్టి మండపంలో ఆలయ ప్రధాన అర్చకుడు త్రిపురారి కృష్ణమూర్తిశర్మ, ఉపప్రధాన అర్చకుడు ఫణీంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు సుబ్రహ్మణ్యశర్మ, బైకుంఠపాండాలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాశులవారీగా ఆదాయ, వ్యయాలు, రాజ్యపూజ్యం, అవమానాలను వివరించారు. అనంతరం ఉగాది పచ్చడి, ప్రసాదాన్ని భక్తులకు వితరణ చేశారు. స్వామివారి గర్భగుడిలో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం మాజీ ధర్మకర్తలు కామిడి రాంరెడ్డి, శ్యాం సుందర్ దేవుడ, నాయకులు శ్రీనివాసరెడ్డి, మోహన్రెడ్డి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. కవి సమ్మేళనం.. ఉగాది పర్వదినం సందర్భంగా కవులు, రచయితలు కవి సమ్మేళనం నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన పలువురు పాల్గొన్నా రు. వారిని దేవదాయశాఖ అధికారులు శాలు వాతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. సూపరింటెండెంట్ శ్రీనివాస్, అర్చకులు కృష్ణమూర్తిశర్మ ఉన్నారు. కవులు గడ్డ లక్ష్మయ్య, మా డుగుల భాస్కరశర్మ తదితరులు పాల్గొన్నారు. -
హేమాచలక్షేత్రంలో ప్రత్యేక పూజలు
మంగపేట:హేమాచలక్షేత్రంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామికి ఆలయ పూజారులు ముక్కామల రాజశేఖర్శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పట్టు వస్త్రాలతో అలంకరించి ప్రత్యేక పల్లకీలో ప్రతిష్టించి మంగళవాయిద్యాల నడుమ మల్లూరు గ్రామానికి తీసుకువచ్చారు. భక్తులు దర్శించుకునేందుకు స్వామివారి విశ్రాంతి మండపంపై రాత్రి 8గంటలకు ప్రతిష్టించారు. 9గంటలకు పూజారులు పంచాంగ శ్రవణం నిర్వహించారు. గ్రామంలోకి పల్లకీపై వచ్చిన ఉత్స వ మూర్తులసేవకు గ్రామస్తులు, భక్తులు ఎదురేగి బిందెలతో నీళ్లుబోసి స్వాగతం పలికారు. అనంతరం దేవాతామూర్తులను పురవీధుల్లో ఊరేగించా రు. ఈ కార్యక్రమంలో ఆలయ సీనియర్ అసిస్టెంట్ సీతారాములు, సిబ్బంది శేషు, నూతులకంటి అజయ్, సెగ్గెం పుల్లయ్య గ్రామస్తులు పాల్గొన్నారు. వ్యవసాయ అధికారులకు ఫోన్ నంబర్లుములుగు: జిల్లాలోని ఆయా మండలాల వ్యవసాయ అధికారులకు ప్రభుత్వం ప్రత్యేక ఫోన్ నంబర్లు కేటాయించింది. ఇకపై సదరు మండలాల రైతులు అధికారులతో మాట్లాడేందుకు సంబంధిత నంబర్లను సంప్రదించాలని జిల్లా వ్యవసాయ అధికారి సురేష్ తెలిపారు. రేపటి నుంచి అధికారులు ఆయా నంబర్లలో అందుబాటులో ఉంటారని వివరించారు. -
ప్రజలను చైతన్యం చేయాలి
భూపాలపల్లి రూరల్: కవులు, కళాకారులు తమ నైపుణ్యంతో ప్రజలను చైతన్యం చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురష్కరించుకొని ఆదివారం జిల్లా కేంద్రంలోని పుష్పగార్డెన్లో వివేకనంద సేవా సమితి వ్యవస్థాపకుడు కొల్గూరి సంజీవరావు అధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై కవులు, కళాకారులను పురస్కారాలతో సత్కరించారు. కవి సమ్మేళనం కార్యక్రమాలు భవిష్యత్లోనూ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఆర్ సంపత్రావు, హాస్యనటుడు ఆర్ఎస్ నందా తదితరులు పాల్గొన్నారు. ఉగాది శుభాకాంక్షలు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఒక ప్రకటనలో ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ నుంచి ప్రభుత్వం రేషన్లో సన్నబియ్యం పంపిణీ చేయడం సంతోషకరమన్నారు.కవి, కళాకారులను సత్కరించిన ఎమ్మెల్యే గండ్ర -
తెలుగుదనం ఉట్టిపడేలా..!
గీసుకొండ: తెలుగుదనం ఉట్టిపడేలా పంచెకట్టు, లాల్చీతో సంప్రదాయానికి బ్రాండ్గా నిలుస్తున్నారు గీసుకొండ ఎంపీడీఓ కార్యాలయ సూపరింటెండెంట్ ఆసూరిమరింగంటి వెంకట కమలాకర్. అధికారుల సమీక్షలు ఉన్నా, మండల పరిషత్ కార్యాలయంలో జరిగే సమావేశాల్లోనూ ఆయన డ్రెస్ కోడ్ భిన్నంగా ఉంటుంది. నిలువుబొట్టు, పంచెకట్టు, లాల్చీతోపాటు పిలకజుట్టుతో ప్రత్యేకంగా ఉంటారు. బ్రాహ్మణీయ వైష్ణవ కుటుంబంలో పుట్టిన ఆయన కృష్ణతత్వం వైపు ఆకర్షితులై తన జీవన విధానాన్ని మలుచుకున్నారు. ఎవరితోనైనా ప్రశాంతంగా, సౌమ్యంగా మాట్లాడటం ఆయన తీరు. పాఠశాల, కళాశాలలో చదువుకునేటప్పుడు ప్యాంట్, షర్టు వేసుకున్నా.. 1994లో జూనియర్ అసిస్టెంట్గా ప్రభుత్వ ఉద్యోగం వచ్చినప్పటి నుంచి ఆయన డ్రెస్కోడ్ పూర్తిగా మారిపోయింది. నేటి ఆధునిక ప్రపంచంలో ఇలా సంప్రదాయ వస్త్రధారణతో కనిపించేవారు చాలా అరుదుగా కనిపిస్తారు. -
మైనార్టీల అభివృద్ధికి పెద్దపీట
కాళేశ్వరం: కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. మహదేవపూర్ మండలకేంద్రంలోని జామా మసీదులో శనివారం ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందుకు కాటారం సబ్కలెక్టర్ మయాంక్సింగ్తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లింలకు పండ్లు తినిపించి దీక్ష విరమింపచేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. మైనార్టీ మహిళలకు, యువతకు స్వయం ఉపాధి పొందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టంచేశారు. రాష్ట్రంలోని మసీదుల అభివృద్ధికి, సంక్షేమానికి నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో మైనార్టీలతో పాటు ఇతర వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేస్తుందన్నారు. మైనార్టీ సోదర సోదరీమణులకు రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐత ప్రకాశ్రెడ్డి, మహదేవపూర్ డిప్యూటీ తహసీల్దార్ కృష్ణ, ముస్లిం మతపెద్దలు గయాజ్ఖాన్, తాజోద్దీన్, సలామోద్దీన్, మజీద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కోట రాజబాపు, అక్భర్ఖాన్, అస్రర్, శకీల్, తాజ్, పీఏసీఎస్ చైర్మన్ తిరుపతి, మాజీ ఎంపీపీ రాణిబాయి, అజీంఖాన్, శశిభూషన్కాచే పాల్గొన్నారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు -
మళ్లీ పులి కలకలం..
కాటారం: పులి మళ్లీ కలకలం సృష్టించింది. మండలంలోని ఒడిపిలవంచ అటవీ ప్రాంతంలోని ఎర్ర చెరువు వద్ద శనివారం ఉదయం గుమ్మాళ్లపల్లికి చెందిన పలువురికి పులి కనిపించినట్లు తెలిసింది. దీంతో వారు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో డిప్యూటీ రేంజర్ సురేందర్, సిబ్బంది ఎర్ర చెరువు వద్ద పులి కదలిక ఆనవాళ్లను గుర్తించి పాదముద్రలు(ప్లగ్మార్క్స్) సేకరించారు. పులి వీరాపూర్ మీదుగా గూడూరు అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. అక్కడి నుంచి అన్నారం అడవుల్లోకి వెళ్తుందా లేక గుండ్రాత్పల్లి సమీపంలోని గోదావరి వాగు దాటి చెన్నూర్ టైగర్ జోన్ అటవీ ప్రాంతంలోకి వెళ్తుందా అని పలువురు చర్చించుకుంటున్నారు. ఆ ఒక్క పులి ఏనా.. కాటారం మండలం నస్తూర్పల్లి అటవీ ప్రాంతంలో ఫిబ్రవరి 10న ఓ రైతు ఎద్దు తప్పిపోగా అటవీ ప్రాంతంలోకి వెళ్లగా పులి కనబడటంతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అప్పటి నుంచి పులి కాటారం, మహదేవపూర్ అటవీ ప్రాంతాల్లో సంచరిస్తూ రోజుకో చోట కనిపిస్తూ వచ్చింది. సుమారు నెల రోజుల పాటు కాటారం మండలం నస్తూర్పల్లి, వీరాపూర్, గూడూరు, గుండ్రాత్పల్లి, ప్రతాపగిరి, మహదేవపూర్ మండలం అన్నారం, పల్గుల, కుదురుపల్లి, మద్దులపల్లి, ఏనకపల్లి అటవీ ప్రాంతాల్లో పులి ముమ్మరంగా చక్కర్లు కొట్టింది. పల్గుల వద్ద ఓ ఎద్దును, రఘుపల్లి సమీపంలో ఓ లేగదూడపై దాడిచేసి చంపింది. ఆ తర్వాత పులి భూపాలపల్లి మండలం కమలాపూర్ అటవీ ప్రాంతంలో ప్రత్యక్షమైంది. కొన్ని రోజులకు ములుగు జిల్లాలో సంచరించినట్లు అధికారులు గుర్తించారు. కాటారం, మహదేవపూర్ అటవీ ప్రాంతాల్లో సంచరించిన పులి, ఇతర ప్రాంతాల్లో తిరిగిన పులి ఒక్కటేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పులి ఎప్పుడు ఎక్కడ ఉంటుందో తెలియక అటవీ ప్రాంతానికి సమీపంలోని గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. రైతులు, ఉపాధికూలీలు అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. పులి సంచారం నేపథ్యంలో ఒడిపిలవంచ, గుమ్మాళ్లపల్లి అటవీ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపాధిహామీ పనుల వద్ద కూలీలకు అటవీశాఖ అధికారులు అవగాహన కల్పించారు. ఒడిపిలవంచ అడవిలో సంచారం పాదముద్రలు గుర్తించిన అటవీశాఖ అధికారులు -
నేడు పంచాంగ శ్రవణం
కాళేశ్వరం: ఉగాది పర్వదినం సందర్భంగా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి దేవస్ధానంలో ఆదివారం పంచాంగ శ్రవణం నిర్వహిస్తున్నట్లు ఈఓ మహేష్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సాయంత్రం 5.30గంటలకు కార్యక్రమానికి ఆలయ అర్చకులు, వేదపండితులతో నిర్వహిస్తారన్నారు. అనంతరం తీర్థప్రసాదం అందజేస్తారని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని తెలిపారు. పంచాంగం ఆవిష్కరణ భూపాలపల్లి అర్బన్: స్వస్తి శ్రీ విశ్వావసు నామ నూతన సంవత్సర పంచాంగ పుస్తకాన్ని శనివారం జిల్లాకేంద్రంలో పురోహితులు ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా సంఘం రాష్ట్ర నాయకులు సాంబయ్య, నంది విజయ్ హాజరై ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిరసనగండ్ల వెంకటరమణాచార్యులు, వీరన్న, ఇంద్రపాల, సాంబశివుడు, హరిరఘశర్మ, సత్యనారాయణ, విజయ్ పాల్గొన్నారు. ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు భూపాలపల్లి అర్బన్: ఉగాది పండగను పురస్కరించుకొని కలెక్టర్ రాహుల్శర్మ జిల్లా ప్రజలకు శనివారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది తెలుగు ప్రజల సంస్కృతిని ప్రతిబింబించే గొప్ప పండుగ అని, కొత్త ఆశలతో, నూతన ఉత్సాహంతో నిండిన విశేషమైన రోజు అని తెలిపారు. జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో, శాంతి సౌభాగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. జ్యోతిని అభినందించిన కలెక్టర్ పలిమెల: ఇటీవల కాంబోడియాలో జరిగిన పస్ట్ ఏసియన్ పారా ఒలింపిక్స్ త్రోబాల్ పోటీలో బ్రాంజ్ మెడల్ సాధించిన కావేరి జ్యోతిని శనివారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రాహుల్శర్మ అభినందించారు. ప్రయాణ, వసతి, శిక్షణ ఖర్చులను ప్రభుత్వం నుంచి ఇప్పించినట్లు తెలిపారు. పల్లె నుంచి ప్రతిభ కనబరిచి దేశానికి వన్నె తెచ్చిన జ్యోతిని మండల ప్రజలు, జిల్లా అధికారులు అభినందించారు. క్రీడాకారులకు సన్మానం భూపాలపల్లి రూరల్: జాతీయస్థాయి క్రీడా పోటీలలో పాల్గొన్న క్రీడాకారులను శనివారం ఐడీఓసీ కార్యాలయంలో ఎమ్మెల్యే సత్యనారా యణరావు సన్మానించారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి ఆలిండియా సివిల్ సర్వీసెస్లో పాల్గొన్న జిల్లాకు చెందిన ఫిజికల్ డైరెక్టర్స్ విజయలక్ష్మి, సీహెచ్ ఆనంద్, జాతీయ స్థాయి సైక్లింగ్ కోచ్గా ఎంపికై జాతీయ స్థాయిలో కోచింగ్ ఇచ్చిన మమత ఫిజికల్ డైరెక్టర్లను ఎమ్మెల్యే గండ్ర శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి చిర్ర రఘు పాల్గొన్నారు. ఈద్గాలో రంజాన్ ఏర్పాట్లు భూపాలపల్లి అర్బన్: రంజాన్ పండగను పురస్కరించుకొని పట్టణ శివారులోని ఈద్గాలో చేపడుతున్న ఏర్పాట్లను శనివారం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ పరిశీలించారు. ముస్లింల పవిత్ర రంజాన్ పండుగ నమాజు కోసం అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. ఈద్గా ప్రాంగణాన్ని వాటర్ ట్యాంకర్ ద్వారా శుభ్రం చేస్తూ చుట్టు పరిసరాల్లో చెత్తను తొలగించినట్లు కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ నవీన్కుమార్, పర్యావరణ ఇంజనీర్ దేవేందర్, జామ మసీదు అబ్బాసియా మసీద్ నాయకులు పాల్గొన్నారు. -
ఉగాదితో జాతర ముగింపు..
ఐనవోలు: సంక్రాంతి రోజు కర సంక్రమనం దిష్టి కుంభం కార్యక్రమంతో ప్రారంభమైన హనుమకొండ జిల్లా ఐనవోలు శ్రీమల్లికార్జునస్వామి జాతర ఉత్సవాలు నేటి(ఉగాది)తో ముగియనున్నాయి. పూర్వం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ సమయం అనువైనదిగా భావించి భక్తులు మల్లన్నకు మొక్కులు చెల్లించేవారు. ఉగాది (ఆదివారం) రోజు ఆలయంలో ఉదయం మల్లన్నకు మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించి నూతన వస్త్రాలు అలంకరిస్తారు. ఉగాది పచ్చడిని నైవేద్యంగా సమర్పించి భక్తులకు అందిస్తారు. సాయంత్రం పంచాంగ శ్రవణం చేయడంతో 3 నెలల పాటు సాగిన జాతర ఉత్సవాలు ముగిసినట్లు ప్రకటిస్తారు. -
రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ ధ్యేయం
కాటారం: రాజ్యాంగ పరిరక్షణ, అంబేడ్కర్ ఆశయ సాధన కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని రాష్ట్ర ఆయిల్ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. కాటారం మండలకేంద్రంలో శుక్రవారం ‘జై బాపు, జై భీమ్, జై సంవిధన్’ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జంగా రాఘవరెడ్డి హాజరై మాట్లాడారు. మహాత్మాగాంధీ, అంబేడ్కర్, రాజ్యాంగాన్ని గౌరవించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సోదరుడు దుద్దిళ్ల శ్రీనుబాబు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్రెడ్డి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు చీమల సందీప్, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు, యూత్ అధ్యక్షుడు చిటూరి మహేశ్, నాయకులు పాల్గొన్నారు. -
కలెక్టర్పై ఫిర్యాదు
కాటారం: కౌలు రైతు ఆత్మహత్య ఎక్స్గ్రేషియా చెక్కుల పంపిణీలో జరిగిన అవకతవకలపై వివరాలు అడిగితే కలెక్టర్ రాహుల్శర్మ తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ కాటారం మండలకేంద్రానికి చెందిన రామిళ్ల రాజబాబు శుక్రవారం ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సునీల్కుమార్కు ఫిర్యాదు చేశారు. రాజబాబు తండ్రి రామిళ్ల మల్లయ్య కౌలు రైతు కాగా కొంత కాలం క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రభుత్వం విడుదల చేసిన ఎక్స్గ్రేషియా మంజూరు జాబితాలో మల్లయ్య పేరు ఉండగా జిల్లా అధికారులు వెల్లడించిన జాబితాలో మాత్రం మల్లయ్య పేరుతో పాటు మరికొంత మంది రైతుల పేర్లు లేవని రాజబాబు తెలిపారు. దీంతో గత వారం జరిగిన ప్రజావాణిలో ఎక్స్గ్రేషియా జాబితాలో అవకతవకలపై కలెక్టర్ను అడగగా సరైన సమాధానం చెప్పకుండా తమ పట్ల దురుసుగా ప్రవర్తించి అసహనం వ్యక్తం చేసినట్లు రాజబాబు పేర్కొన్నారు. ఈ విషయాలను ఎస్సీ కమిషన్ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు కలెక్టర్ వ్యవహార శైలిపై విచారణ జరపాలని, ఎక్స్గ్రేషియా అందేలా న్యాయం చేయాలని కోరినట్లు రాజబాబు తెలిపారు. దీంతో స్పందించిన డైరెక్టర్ కలెక్టర్కు నోటీస్ జారీ చేసినట్లు వివరించారు. -
బియ్యం గోదాం తనిఖీ
చిట్యాల: మండలకేంద్రంలోని బియ్యం గోదాం(ఎంఎల్ఎస్ పాయింట్)ను జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ పెరుమాండ్ల రాములు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. అనంతరం రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిట్యాల బియ్యం గోదాం నుంచి ఆరు మండలాలకు 176 రేషన్ షాపులు ఉన్నాయని, 14,844 టన్నుల బియ్యం సప్లై అవుతున్నాయని తెలిపారు. శుక్రవారం నాటికి 110 రేషన్ షాపులకు బియ్యం సప్లై చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మిగతా 66 రేషన్ షాపులకు రెండు రోజులలో సప్లై చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో ప్రజలు పాల్గొని తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్ (ఏసీఎస్ఓ) వేణు, గోదాం ఇన్చార్జ్ గంగాధరి రాజు ఉన్నారు. -
జయశంకర్ భూపాలపల్లి
శనివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 20259వసంతాలకు అనాది. శుభాలకు పునాది. తెలుగు సంవత్సరాది.. ఉగాది. కోయిలమ్మ కమ్మని స్వరాల నడుమ, షడ్రుచుల మేళవింపులో కోటి ఆశలకు రెక్కలు తొడుగుతూ వచ్చే వేడుక ఇది. తెలుగుదనం ఉట్టిపడేలా.. సంప్రదాయానికి జీవం పోసేలా సాగే పర్వదినమిది. కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే వేళ కవుల భావాలకు ‘సాక్షి’ అక్షరరూపం ఇస్తోంది. మరింకెందుకాలస్యం.. కలాలు కదిలించండి.. ఉగాదిపై కవితలు రాయండి. చివరి తేదీ : 29–03–2025ఇఫ్తార్ విందులో ఎస్పీ కిరణ్ ఖరే, ఎమ్మెల్యే సత్యనారాయణరావు, పోలీసు అధికారులు భూపాలపల్లి రూరల్: సద్గుణాలను పెంపొందించడమే రంజాన్ పండుగ ముఖ్య ఉద్దేశమని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణవుతో కలిసి పట్టణ ముస్లిం పెద్దలు, పోలీసు ముస్లిం ఉద్యోగులకు ఎస్పీ ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. క్రమశిక్షణ, దాతృత్వం కలయికే రంజాన్ మాసం అన్నారు. రంజాన్ మాసం అందరిలో సోదరభావం పెంపొందిస్తుందన్నారు. ఈ మాసంలో ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ.. మత సామరస్యానికి ప్రతీక రంజాన్ మాసం అన్నారు. సర్వ మతాలసారం ఒకటేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బోనాల కిషన్, భూపాలపల్లి, కాటారం డీఎస్పీలు సంపత్రావు, రామ్మోహన్రెడ్డి, డీటీఓ సంధాని, జిల్లా పరిధిలోని సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.న్యూస్రీల్ఎస్పీ కిరణ్ ఖరే -
ముందస్తు ఉగాది వేడుకలు
ముందస్తు ఉగాది వేడుకలు నిర్వహిస్తున్న మహిళలు కాటారం: మండలకేంద్రంలోని అయ్యప్ప కాలనీలో మహిళలు శుక్రవారం ముందస్తు ఉగాది వేడుకలను నిర్వహించారు. స్థానిక శ్రీ హర్షిత డిగ్రీ కళాశాలలో మహిళలంతా కలిసి షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని తయారు చేశారు. భక్తిశ్రద్ధలతో పాటలు పాడి పూజలు చేశారు. అనంతరం ఉగాది పచ్చడి, భక్ష్యాలను స్వీకరించి కాలనీలో పంపిణీ చేశారు. మహిళలు ఒకరికొకరు ఉగాది శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పడకంటి అంజలిని పలువురు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో గుండూరి పద్మ, రామగిరి శ్రీదేవి, మాధవి, రాజేశ్వరీ, పడకంటి అంజలి, కళ, స్వప్న, కల్పన, సంధ్య, లహరి, పద్మ, జ్యోతి, రాధ, విజయ, సుజాత, నీరజ, పావని తదితరులు పాల్గొన్నారు. -
పరీక్ష కేంద్రాల సందర్శన
మొగుళ్లపల్లి: మొగుళ్లపల్లి, మొట్లపల్లి ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పదవ తరగతి పరీక్ష కేంద్రాలను జిల్లా విద్యాశాఖాధికారి ముద్దమల్ల రాజేందర్ శుక్రవారం తనిఖీ చేశారు. విద్యార్థులకు సౌకర్యాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ముల్కలపల్లి ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించారు.ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ, వారి అభ్యాసన సామర్థ్యాలను పరీక్షించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఆయన తో జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ దుప్పటి రాజగోపాల్ ఉన్నారు. ఏడుగురు విద్యార్థులు గైర్హాజరు భూపాలపల్లి అర్బన్: జిల్లావ్యాప్తంగా జరుగుతున్న పదవ తరగతి వార్షిక పరీక్షలకు శుక్రవారం ఏడుగురు విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భౌతికశాస్త్ర పరీక్ష జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగిందన్నారు. 3,449 మంది విద్యార్థులకు గాను 3,442 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. -
నిర్ణీత సమయంలో పుష్కర పనులు
భూపాలపల్లి: నిర్ణీత సమయంలో సరస్వతీ పుష్కర పనులను పూర్తి చేయాలని, ఇందుకోసం డిస్ట్రిక్ట్ టాస్క్ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడించారు. సరస్వతీ పుష్కరాల ఏర్పాట్లపై గురువారం వివిధ శాఖల అధికారులతో ఐడీఓసీ కార్యాలయం నుంచి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇరిగేషన్ అధికారులు వీఐపీ పుష్కర ఘాట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పుష్కర ఘాట్లో స్నానఘట్టాలు, బట్టలు మార్చుకునే గదులు, చలువ పందిళ్ల ఏర్పాటుతో పాటు గోదావరి తీరంలో తాత్కాలిక రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీటి ట్యాంకు నిర్మాణం, పైపులైను ఏర్పాటు, పార్కింగ్ స్థలాల వద్ద నీటి సౌకర్యం, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. దేవాదాయ శాఖ ద్వారా చేపట్టిన పనులను ఏప్రిల్ నెలాఖరు వరకు పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎస్పీ కిరణ్ ఖరే, సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీపీఓ నారాయణరావు, సీపీఓ బాబురావు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాలు పెంచేలా చర్యలు.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుత యాసంగి సీజన్లో మహిళా సంఘాలకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. సెర్ప్ కార్యక్రమాలపై సెర్ఫ్ సీఈఓ దివ్యతో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేష్కుమార్ గురువారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్.. జిల్లా అధికారులతో సమావేశమై మాట్లాడారు. 2022–23 సంవత్సరానికి సంబంధించిన కమీషన్ పౌర సరఫరాల శాఖ వద్ద పెండింగ్ ఉన్న వివరాలు అందజేయాలన్నారు. గన్నీ బ్యాగులు రీ కన్సిలేషన్ ప్రక్రియ కూడా పూర్తి కావాల్సి ఉందని, త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఆర్డీఓ నరేష్, ప్రధాన ఆస్పత్రి పర్యవేక్షకుడు డాక్టర్ నవీన్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ రాములు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
నీరులేక.. బోరు పడక..
టేకుమట్ల మండలం అంకుషాపూర్ గ్రామానికి చెందిన ఒజ్జ రాములు రామకిష్టాపూర్(టి) శివారులో మూడెకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకున్నాడు. ఎకరం భూమిలో యాసంగిలో వరి సాగు చేశాడు. సాగునీటి కోసం పక్కనున్న రైతు బోరు సహాయం తీసుకున్నాడు. భూగర్భ జలాలు అడిగంటిపోవడంతో బోర్లలో నీరు లేకుండాపోయింది. దీంతో భూ యజమానిని సంప్రదించగా.. 20రోజుల క్రితం 150 ఫీట్ల వరకు బోరు వేయించాడు. చుక్కనీరు పడకపోవడంతో చేసేది లేక రైతు వరిపంటను వదిలేసుకున్నాడు. గొర్రెలు, మేకలకు పంట మేతగా మారడంతో లబోదిబోమంటున్నాడు. – భూపాలపల్లి -
జయశంకర్ భూపాలపల్లి
శుక్రవారం శ్రీ 28 శ్రీ మార్చి శ్రీ 2025Iవసంతాలకు అనాది. శుభాలకు పునాది. తెలుగు సంవత్సరాది.. ఉగాది. కోయిలమ్మ కమ్మని స్వరాల నడుమ, షడ్రుచుల మేళవింపులో కోటి ఆశలకు రెక్కలు తొడుగుతూ వచ్చే వేడుక ఇది. తెలుగుదనం ఉట్టిపడేలా.. సంప్రదాయానికి జీవం పోసేలా సాగే పర్వదినమిది. కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే వేళ కవుల భావాలకు ‘సాక్షి’ అక్షరరూపం ఇస్తోంది. మరింకెందుకాలస్యం.. కలాలు కదిలించండి.. ఉగాదిపై కవితలు రాయండి. చివరి తేదీ : 29–03–2025 -
ఎట్టకేలకు నీటి విడుదల
హసన్పర్తి/ధర్మసాగర్: దేవాదుల ప్రాజెక్ట్ మూడవ దశలో భాగంగా దేవన్నపేట వద్ద నిర్మించిన పంస్హౌజ్ వద్ద ఏర్పాటు చేసిన మూడు మోటార్లలో ఒక మోటార్ను ఎట్టకేలకు గురువారం సాయంత్రం మంత్రులు నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీఽనివాస్రెడ్డిలు ప్రారంభించారు. 600 క్యూసెక్కుల నీటిని ధర్మసాగర్ రిజర్వాయర్లోకి వదిలారు. అరగంటపాటు వెయింటింగ్.. వారం రోజుల క్రితం ధర్మసాగర్ చెరువులోకి నీటిని విడుదల చేయడానికి వచ్చిన మంత్రులు మోటార్లలో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగా ఆన్ కాకపోవడంతో తిరిగి వెళ్లారు. రెండు రోజుల క్రితం ట్రయల్ రన్ చేస్తున్న క్రమంలో గేట్వాల్వ్లు పడిపోయాయి. ప్రత్యేక నిపుణులతో వాటికి మరమ్మతులు చేయించారు. రెండోసారి గురువారం సాయంత్రం మోటార్లు ఆన్ చేయడానికి వచ్చినా... మళ్లీ సాంకేతిక సమస్య కారణంగా అరగంట పాటు వెయిట్ చేశారు. టెక్నీషియన్లు సమస్య పరిష్కరించిన తర్వాత మంత్రులు లాంఛనంగా మోటార్ ఆన్ చేశారు. పూజలు..సన్మానాలు మొదట దేవన్నపేటకు చేరుకున్న మంత్రులకు కలెక్టర్ ప్రావీణ్య, నాయకులు పూలబొకేలు ఇచ్చి స్వాగతం పలికారు. వారు తొలుత శిలాఫలకాన్ని సందర్శించారు. అనంతరం పంప్హౌస్ వద్దకు చేరుకోగా, వారికి ఇంజనీర్లు నీటిపంపింగ్ విధానాన్ని కంప్యూటర్లో చూపించారు. నీరు ఎక్కడినుంచి ఎలా వెళ్తుందో వివరించారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి మూడో దశ ప్రాజెక్టును మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ప్రారంభించారు. అక్కడినుంచి ధర్మసాగర్ రిజర్వాయర్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే నీరు రిజర్వాయర్లోకి వస్తుండగా పసుపు, కుంకుమ, పూలు చల్లి పూజలు చేశారు. నీటిలోకి సారె వదిలారు. ఈ సందర్భంగా మంత్రులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి శాలువాలు కప్పి సన్మానించారు. అక్కడే మంత్రులు రెండు నిమిషా లు మాట్లాడి హైదరాబాద్కు వెళ్లిపోయారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, యశ్వసినిరెడ్డి, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య, నగర కమిషనర్ అశ్విని తాజాజీ వాకడే, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వెంకట్రామ్ నర్సింహారెడ్డి, ఈఎన్సీ అనిల్కుమార్, సీఈ అశోక్కుమార్, ఎస్ ఈ వెంకటేశ్వర్లు, ఈఈ సీతారాంనాయక్, డీఈఈ రాజు, ఏఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు..దేవాదుల మూడో దశ మోటార్ ఆన్ చేసిన మంత్రులు ఉత్తమ్, పొంగులేటి ధర్మసాగర్ రిజర్వాయర్లోకి 600 క్యూసెక్కులు దేవన్నపేట పంప్హౌజ్తో 5,22,522 ఎకరాలకు సాగు నీరు వరంగల్, కాజీపేట, హనుమకొండతో పాటు జనగామకు తాగునీరురెండు భాగాలుగా నీటి పంపిణీ – మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి దేవాదుల పంప్హౌస్నుంచి వచ్చే నీటిని రెండు భాగాలుగా పంపిణీ చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. ధర్మసాగర్ రిజర్వాయర్ కేంద్రంగా ప్రారంభించిన దేవన్నపేట పంప్హౌజ్తో 5,22,522 ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుందన్నారు. స్టేషన్ ఘన్పూర్, వరంగల్ వెస్ట్, వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గాల పరిధిలోని 17,545 ఎకరాలకు ఉత్తర భాగం ప్రధాన కాలువ ద్వారా, అదే విధంగా దక్షిణభాగం కాలువ గుండా స్టేషన్ ఘన్పూర్, వరంగల్ వెస్ట్, వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గాల పరిధిలోని 1,58,948 ఎకరాలతోపాటు ధర్మసాగర్ తరువాత బొమ్మకూర్, తపాసుపల్లి, గండిరామా రం, అశ్వారావుపల్లి పరిధిలోని 3,46,029 ఎకరాలకు నీరు అందించనున్నట్లు వెల్లడించారు. వరంగల్, హనుమకొండ, కాజీపేట మూడు నగరాలతోపాటు జనగామ పట్టణానికి తాగునీరు అందించేందుకు దోహదపడుతుందన్నారు. -
ప్రజా సమస్యలను పరిష్కరించాలి
భూపాలపల్లి రూరల్: జిల్లాలో నెలకొన్న ప్రజా సమస్యల్ని పరిష్కరించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు జె.వెంకటేష్, జిల్లా కార్యదర్శి బందు సాయిలు డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ధర్నాలో వారు మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా గ్రామాలలో ప్రజా స్థానిక సమస్యలపై సర్వే నిర్వహించగా.. పలు సమస్యలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని, తాగునీటి సమస్య ఉన్న గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలన్నారు. పలిమెల, మహాముత్తారం, కాటారం, మహదేవపూర్, మల్హర్ మండల కేంద్రాల్లో ఇళ్లు లేని పేదలకు పట్టాలు అందించా లని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో నాయకులు చెన్నూరి రమేష్, గుర్రం దేవేందర్, వెలిశెట్టి రాజ య్య, ఆత్కూరి శ్రీకాంత్, శేఖర్ పాల్గొన్నారు.సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు వెంకటేష్ -
రాజ్యాంగ రక్షణే ప్రధాన లక్ష్యం
మల్హర్: రాజ్యాంగ రక్షణే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. మండలంలోని తాడిచర్లలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బడితెల రాజయ్య ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ‘జై బాపు, జై భీమ్, జై సంవిధన్’ సన్నాహక సమావేశంలో రాఘవరెడ్డి మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని, రాజ్యాంగ నిర్మాతలను అవమానిస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ శీనుబాబు, పీఏసీఎస్ చైర్మన్ ఇప్ప మొండి, మాజీ ఎంపీపీ మల్హల్రావు, అయిత రాజిరెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు గడ్డం క్రాంతి పాల్గొన్నారు. రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి -
సరస్వతీ పుష్కరాల పనుల పరిశీలన
కాళేశ్వరం: కాళేశ్వరంలో మే 15నుంచి 26వరకు జరగనున్న సరస్వతీ నది పుష్కరాల అభివృద్ధి పనులను దేవాదాయశాఖ ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించారు. గురువారం ప్రసాదం కౌంటర్ భవనం, కల్యాణ మండపం షెడ్డు నిర్మాణం, పార్కింగ్ స్థలంలో సీసీ ఫ్లోరింగ్, శ్రీసూర్య ఆలయం ఎదుట సీసీ ఫ్లోరింగ్, వీఐపీ ఘాటు వద్ద మండప నిర్మాణాలు, లైటింగ్ ఏర్పాట్లు, సరస్వతి విగ్రహం నిర్మాణ పనులు వివిధ పనులను దేవస్థానం ఈఓ శనిగెల మహేష్, ఎండోమెంట్ ఎస్ఈ దుర్గ ప్రసాద్, స్థపతి వల్లి నాయగం పరిశీలించారు. వారివెంట డీఈఈ రమేష్బాబు, ఏఈఈలు చందర్, అశోక్ ఉన్నారు. ఆలయాన్ని సందర్శించిన దేవాదాయ శాఖ స్థపతి రేగొండ: మండలంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దేవాదాయ, ధర్మదాయ శాఖ స్థపతి శ్రీవల్లీనాయక్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో గర్భగుడి పునర్నిర్మాణానికి పలు సూచనలు చేశారు. ఆలయ విస్తరణ పనులలో భాగంగా కల్యాణ మండపం, సింహద్వారం, నాగమయ్య గుడి, బాలాలయ్య గుడి నిర్మాణం కోసం స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ పనులకు సంబంధించిన ప్రతిపాదనలు త్వరితగతిన సిద్ధం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఎస్ఈ దుర్గప్రసాద్, డీఈ రమేష్, ఆలయ ఈఓ మహేష్, ఆలయ చైర్మన్ భిక్షపతి, నాయకులు నాయినేని సంపత్రావు, పబ్బ శ్రీనివాస్, శివాజీ, కోటేశ్వరరావు, కమలాకర్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. సమగ్ర విచారణ జరిపించాలి ● అసెంబ్లీలో కోరిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లి: గత నెలలో దారుణ హత్యకు గురైన నాగవెల్లి రాజలింగమూర్తి కేసును సమగ్ర విచారణ జరిపించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గురువారం అసెంబ్లీలో కోరారు. మేడిగడ్డ బరాజ్ నిర్మాణంలో జరిగిన అవినీతి, గత ఎమ్మెల్యే చేసిన అవినీతిపై పోరాడినందుకు రాజలింగమూర్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు అనేక కేసులు నమోదు చేయించారన్నారు. ప్రాణభయం ఉందని అతడు పోలీస్స్టేషన్లో ముందే తెలిపాడన్నారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆత్మ అయిన మున్సిపల్ మాజీ వైస్చైర్మన్ కొత్త హరిబాబు హత్య కేసులో నిందితుడిగా ఉండి ప్రస్తుతం జైలులో ఉన్నాడన్నారు. ఈ హత్య కేసుపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. నియోజకవర్గంలోని భీంఘన్పూర్, గణపురం రిజర్వాయర్ల చానల్స్ మరమ్మతు, కెనాల్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని సత్యనారాయణరావు కోరారు. -
పుష్కరాలకు నీళ్లెలా..?
మే 15 నుంచి 26వరకు సరస్వతీ పుష్కరాలు కాళేఽశ్వరం: మే 15నుంచి 26వరకు సరస్వతీ నది పుష్కరాలు నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. రూ.25కోట్ల నిధులతో పనులు జరుగుతున్నాయి. 40డిగ్రీల ఎండ తీవ్రతతో కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమంలో గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిణి సరస్వతీ నదుల్లో నీరు తగ్గుముఖం పడుతుంది. ప్రస్తుతం కాళేశ్వరం వద్ద 2వేల క్యూసెక్కులు నీరు తరలిపోతుంది. దీంతో మే నెల వరకు తగ్గే అవకాశం ఉంది. దీని కోసం ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా కన్నెపల్లి సమీపంలో కాఫర్డ్యాం లేదా సిమెంట్బ్యాగులతో ఇసుక నింపి అంతర్రాష్ట్ర వంతెన దిగువన గోదావరికి అడ్డుగా వేస్తే నీరు నిల్వ పెరిగి నీరు పెరిగే అవకాశం ఉంది.మే నెలలో 44–45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో ఎండ తీవ్రత పెరిగి గోదావరిలో నీరు తగ్గుముఖం పడుతుంది. ప్రతియేటా వేసవి కాలం మే నెలలో 600–800ల క్యూసెక్కులు ప్రవహిస్తుంది. అప్పటికే గోదావరి నీటిమట్టం తగ్గి చిన్నపాయలాగా పారుతుంది. ఈ సారి పుష్కరాలు ఉండడంతో ప్రాణహితనది నీటిపై ఆధారపడాల్సి రానుంది. దీంతో త్రివేణి సంగమం వద్ద నీరు లేకపోవడంతో పుష్కరాల స్నానాలకు 12 రోజుల పాటు భక్తులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా పుష్కరాలకు వచ్చే భక్తులు స్నానాలకు, పితృదేవతలకు పిండప్రదానం పూజలు చేస్తారు. నీరు సమృద్ధిగా ఉంటేనే ఇవి సాధ్యం. జల్లుస్నానాల కింద చేసి నదిలో చేసిన అనుభూతి రాదని భక్తుల విశ్వాసం. మేలో వందల్లో క్యూసెక్కులు.. ప్రతి ఏడాది మేలో ఎండలతో పాయలాగే గోదావరి కన్నెపల్లి వద్ద కాపర్డ్యాం లేదా అడ్డుకట్ట నిర్మాణమే పరిష్కారం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే పుష్కరాలకు నీరు -
పిల్లలు ఎవరిని అమ్మా అని పిలవాలి సంధ్యా..
జయశంకర్: రెక్కాడితే గాని డొక్కాడని రెండు నిరుపేద కుటుంబాలను మృత్యువు వెంటాడింది. ఉదయం కూలీకి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చారు. ఖాళీగా ఉంటే ఏముంటుంది..? అదనపు కూలీకి వెళ్తే పూట అయినా గడుస్తుంది కదా అనే ఆశతో సాయంత్రం కూడా వెళ్లారు. అయితే ఈ కూలే వారికి చివరిది అవుతుందని అనుకోలేదు. పాపం.. పని వెళ్లకున్నా బతికేవారేమో. మృత్యువు లారీ రూపంలో ఇద్దరు మహిళా కూలీలను కబలించింది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం రామకిష్టాపూర్(టి)లో మంగళవారం చోటు చేసుకుంది. ప్రత్యక్షుల కథనం ప్రకారం.. రామకిష్టాపూర్(టి) గ్రామానికి చెందిన మోకిడి పూలమ్మ(45), మోకిడి సంధ్య(30)తోపాటు మరో ఆరుగురు కూలీలు ఉదయం పనులకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చారు. సాయంత్రం వేళలో కూడా మళ్లీ అదే గ్రామానికి చెందిన సల్పాల బుచ్చయ్య అనే రైతు పొలంలోని పని చేయడానికి వెళ్తున్నారు. సరిగా పొలం వద్దకు చేరుకునే సమయానికి చిట్యాల మండలం శాంతినగర్ శివారు కాటన్ మిల్లు నుంచి అతివేగంగా పత్తి గింజల లోడ్తో మూలమలుపు వద్ద నుంచి వస్తున్న లారీని గమనించిన కూలీలు కొంత దూరం పరుగులు తీశారు. ఇందులో ముగ్గురు పొలంలోకి వెళ్లడంతో అక్కడే లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పత్తి గింజల బస్తాలు పడడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో మహిళ తృటిలో తప్పించుకుంది. తోటి మహిళా కూలీలు భయంతో కేకలు వేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఏఎస్సై అమరేందర్రెడ్డి సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకుని జేసీబీ సాయంతో లారీని లేపారు. మృతదేహాలను పత్తి గింజల బస్తాల కింద నుంచి బయటకు తీసి 108లో చిట్యాల సివిల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. అప్పటి వరకు అందరి మధ్యలో ఉన్న ఇద్దరు విగత జీవులుగా మారడంతో తోటి మహిళా కూలీల రోదనలు మిన్నంటాయి. కాగా, ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారైనట్లు మహిళా కూలీలు తెలిపారు.పిల్లలు ఎవరిని అమ్మా అని పిలవాలి సంధ్యా..మన పిల్లలు ఇక నుంచి ఎవరిని అమ్మా అని పిలవాలి సంధ్యా.. ఒక్కసారి చూడు సంధ్యా.. నా ప్రాణం పోయేలా ఉంది.. అయ్యో దేవుడా ఒక్కసారి బతికించమంటూ సంధ్య భర్త రాజు రోదించిన తీరు చిట్యాల సివిల్ ఆస్పత్రిలో ప్రతీ ఒక్కరిని కంట తడి పెట్టించింది. అమ్మా లే.. అమ్మా లే.. అంటూ చిన్నారుల రోదనలు మిన్నంటాయి. పూలమ్మ భర్త, కూతురు సైతం కన్నీరుమున్నీరయ్యారు. సంధ్య, పూలమ్మ కుటుంబ సభ్యులు పెద్దఎత్తున చిట్యాల సివిల్ ఆస్పత్రికి చేరుకుని వారి మృతదేహాల మీద పడి గుండెలవిసేలా రోదించారు. -
పతకాలు సాధించడం అభినందనీయం
భూపాలపల్లి రూరల్: జాతీయస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో పతకాలు సాధించడం అభినందనీయమని భూపాలపల్లి సింగరేణి ఏరియా జీఎం ఏనుగు రాజేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం ఇటీవల విజయవాడలో జరిగిన జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో పతకాలు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. అనంతరం జీఎం మాట్లాడుతూ అంకితభావంతో సాధన చేస్తే సాధించలేనిది ఏదీలేదన్నారు. క్రీడలతో పాటు విద్యార్థులు ఉన్నత చదువులు, ఉద్యోగాలు సాధించాలని కోరారు. అలాగే విద్యార్థులకు స్విమ్మింగ్ నేర్పించిన కోచ్ పాక శ్రీని వాస్ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డీవైపీఎం క్రాంతి కుమార్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ శ్రావణ్ కుమార్, స్పోర్ట్స్ సూపర్వైజర్ పర్స శ్రీనివాస్, కోచ్ రాజమౌలి తదితరులు పాల్గొన్నారు. కాగా ఉగాది పండుగ సందర్భంగా సింగరేణి సంస్థ సీఎండీ బలరాం ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలపగా జీఎం కార్యాలయంలో ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి అధికారులతో కలిసి కరపత్రాలను ఆవిష్కరించారు. ఎస్టూఓ జీఎం కవింద్ర, అధికారులు సురేఖ, శ్రావణ్ కుమార్, ఏరియా అధికార ప్రతినిధి కావూరి మారుతి తదితలరులు పాల్గొన్నారు. -
సెలూన్ షాపుల బంద్ సంపూర్ణం
భూపాలపల్లి రూరల్: జిల్లా కేంద్రంలోని మంజూర్నగర్లో ఏర్పాటు చేస్తున్న కార్పొరేట్ సెలూన్తో పాటు కార్పొరేట్ వ్యవస్థకు వ్యతిరేకంగా నాయీబ్రాహ్మణులు బుధవారం చేపట్టిన సెలూన్ షాపుల బంద్ సంపూర్ణమైంది. ఈ సందర్భంగా నాయీబ్రాహ్మణులు జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి మాదాసు రాజశేఖర్ మాట్లాడుతూ కార్పొరేట్ సెలూన్ వ్యవస్థలో వెనక్కి తగ్గకుంటే రాబోయే రోజుల్లో పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. నాయీబ్రాహ్మణులకు జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పందిళ్ల రమేష్, జిల్లా గౌరవ అధ్యక్షుడు దుబ్బాక సంపత్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయ గిరి సమ్మయ్య, మండల అధ్యక్షుడు మంతెన భూమయ్య, నాయకులు వంగపల్లి సుదర్శన్, మురహరి శంకర్, జంపాల తిరుపతి, తదితరులు పాల్గొన్నారు. -
గురువారం శ్రీ 27 శ్రీ మార్చి శ్రీ 2025
భూపాలపల్లి: వేసవిలో తాగునీటి ఇబ్బంది రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నాం. తాగునీటి సరఫరాలో సమస్యలు తలెత్తితే మున్సిపల్ కార్యాలయంలోని కాల్ సెంటర్ 8978180036కు ఫోన్ చేస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని భూపాలపల్లి మున్సిపాలిటీ కమిషనర్ బిర్రు శ్రీనివాస్ వెల్లడించారు. పట్టణ పరిధిలోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు బుధవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఫోన్ ఇన్ నిర్వహించగా అనూహ్య స్పందన లభించింది. మున్సిపల్ పరిధిలోని పలువురు తమ సమస్యలను కమిషనర్కు ఫోన్లో వివరించగా, కొన్నింటిని తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. ప్రశ్న: సెంట్రల్ లైటింగ్ లైట్లు వెలగక ప్రమాదాలు జరుగుతున్నాయి. – ముంజాల రవీందర్, మాజీ కౌన్సిలర్, మంజూర్నగర్ కమిషనర్: సెంట్రల్ లైటింగ్ మరమ్మతుకు నోచుకున్న విషయాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు దృష్టికి తీసుకెళ్లగా డీఎంఎఫ్టీ నిధుల నుంచి రూ.1.50 కోట్లు మంజూరు చేయించారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. ప్రశ్న: హనుమాన్నగర్ సమీపంలోని పోచమ్మగుడి వద్ద డివైడర్ కటింగ్ను మరింత వెడల్పు చేయాలి. మెయిన్ రోడ్లోని ప్రధాన ఆస్పత్రి, మజీద్ దగ్గర మిషన్ భగీరథ వాటర్ లీకేజీ అయి దుకాణాల ఎదుట నీరు పారుతుంది. – మహ్మద్ రఫీక్, ఫొటో స్టూడియో యజమాని, హనుమాన్నగర్ కమిషనర్: డివైడర్ కటింగ్ను వెడల్పు చేసే విషయాన్ని ఎన్హెచ్ అధికారులకు లేఖ ద్వారా తెలియజేస్తాం. వాటర్ లీకేజీ కాకుండా తక్షణమే చర్యలు తీసుకుంటాం. ప్రశ్న: సుభాష్కాలనీలోని వారసంత జరిగే స్థలం పక్కన సైడ్ కాల్వలు లేక మురుగు నీరు రోడ్డుపై పారుతుంది. – అనపర్తి లక్ష్మణ్, సుభాష్కాలనీ కమిషనర్: డ్రెయినేజీ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తాం. తాత్కాలికంగా అక్కడ సిమెంట్ పైపులు వేస్తాం. ప్రశ్న: జంగేడులోని ఓపెన్ జిమ్ను మరమ్మతు చేయించాలి – కూచన కిషన్ప్రసాద్, జంగేడు, 14వ వార్డు కమిషనర్: మున్సిపాలిటీ పరిధిలోని అన్ని ఓపెన్ జిమ్ల మరమ్మతుకు ప్రతిపాదనలు పంపిస్తాం. ప్రశ్న: మంజూర్నగర్లోని వెంకటేశ్వరస్వామి గుడి వెనుక కాలనీలో సైడ్ కాల్వలు లేక ఇబ్బంది పడుతున్నాం. – మంథెన సత్యనారాయణ, పసుల శ్రీనివాస్, వెంకటేశ్వర కాలనీ కమిషనర్: అక్కడ సుమారు 300 మీటర్ల మేరకు సైడ్ కాల్వ నిర్మించాల్సి ఉన్నట్లుగా గుర్తించాం. ఏప్రిల్ నెలలో ఎస్టిమేట్ తయారు చేపిస్తాం. ప్రశ్న: సుభాష్కాలనీలో పది లైన్లకు కలిపి ఒకే వాల్వ్ ఉంది. దీంతో మిషన్ భగీరథ నీరు చాలా నెమ్మదిగా, తక్కువగా వస్తున్నాయి. – చుక్క బాలరాజు, సుభాష్కాలనీ. కమిషనర్: నేను స్వయంగా అక్కడికి వచ్చి చూస్తాను. మరో రెండు వాల్వ్లను తక్షణమే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటా. ప్రశ్న: శాంతినగర్ 18వ వార్డులో ఖాళీ స్థలాల్లో పిచ్చిమొక్కలు పెరగడంతోపాటు పందులకు ఆవాసంగా మారుతున్నాయి. – ప్రభుదాస్, శాంతినగర్ కమిషనర్: ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు జారీ చేసి స్థలాలను శుభ్రం చేసేలా చర్యలు తీసుకుంటాం. ప్రశ్న: రెడ్డికాలనీలో చెత్త సేకరణకు ప్రతీరోజు రావడం లేదు. – రాజేందర్రెడ్డి, రెడ్డికాలనీ కమిషనర్: శానిటరీ ఇన్స్పెక్టర్కు చెప్పి ప్రతీరోజు చెత్త వాహనాలు వచ్చేలా చూస్తాం. ప్రశ్న:అంబేడ్కర్ సెంటర్ నుంచి ఓసీపీ 2 వరకు నిర్మిస్తున్న రహదారి పనులు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. – భీమనాధుని సత్యనారాయణ, రెడ్డికాలనీ కమిషనర్: ఆర్అండ్బీ అధికారులతో మాట్లాడి పనులు వేగవంతం చేసేలా చూస్తాం. ప్రశ్న: నోటీసులు ఇవ్వకుండా నా ఇళ్లు కూలగొట్టారు. – పుల్యాల తిరుపతి, సుభాష్కాలనీ కమిషనర్: సైడ్ కాల్వ నిర్మించాల్సిన స్థలంలో మీరు ఇంటి నిర్మాణం చేపట్టారు. నోటీసులు ఇచ్చి కొంత మేరకు తొలగించాం. సైడ్ కాల్వ నిర్మాణానికి సహకరించాలి. ప్రశ్న: మంజూర్నగర్ మెయిన్ రోడ్డుకు మూడేళ్లుగా పైప్లైన్ ద్వారా తాగునీరు అందించడం లేదు. – లక్ష్మణ్నాయక్, మంజూర్నగర్ కమిషనర్: ఏఈని పంపించి మిషన్ భగీరథ నీరు అందించేలా చర్యలు తీసుకుంటాం. న్యూస్రీల్ప్రశ్న: ఓసీపీ 2 (పాత కేటీకే 2వ ఇంక్లైన్) నుంచి అంబేడ్కర్ మీదుగా బొగ్గు లారీలు వెళ్లడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. మిలీనియం క్వార్టర్స్లోని పెద్ద రోడ్డు నుంచి కేటీకే 5వ ఇంక్లైన్ వరకు సింగరేణి నిర్మించిన రోడ్డు మీదుగా లారీలను నడిపిస్తే ఇబ్బంది ఉండదు. – గంపల దేవేందర్, సుభాష్కాలనీ కమిషనర్: రెండు రోజుల్లో సింగరేణి జీఎం, ఎస్పీ గారికి లేఖ రాసి మిలీనియం క్వార్టర్స్, కేటీకే 5వ ఇంక్లైన్ మీదుగా బొగ్గు లారీలు వెళ్లేలా చర్యలు తీసుకుంటాం. -
ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాలి
కాళేశ్వరం: ఉపాధి పనుల్లో కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. బుధవారం మహదేవపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామపంచాయతీ, రెవెన్యూ సిబ్బంది, ఉపాధిహామీ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ వేసవికాలం సమీపించినందున తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఉపాధిహామీ పథకంలో ఆర్థిక సంవత్సరానికి లేబర్ బడ్జెట్ అప్రూవ్ చేసిన పని టార్గెట్గా పెట్టుకోవాలన్నారు. కూలీల దినసరి వేతనం రూ.300 లభించేవిధంగా మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు ముందస్తుగా కొలతల ప్రకారం పని చేయించాలని ఆదేశించారు. మెట్పల్లి, మహదేవపూర్, కాళేశ్వరం అంబట్పల్లిలో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఈనెలాఖరు వరకు 25శాతం రుసుము రాయితీతో చెల్లించాలన్నారు. పంచాయతీల్లో ఇంటి పన్ను వందశాతం పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎల్పీఓ వీరభద్రయ్య, తహసీల్ధార్ ప్రహ్లాద్రాథోడ్, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఎంపీఓ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ విజయలక్ష్మి -
రానివ్వం
వేసవిలో నీటి సమస్య వస్తే 8978180036కు ఫోన్ చేయండితాగునీటికి ఇబ్బందులు ‘సాక్షి’ ఫోన్ ఇన్లో సమస్యలు వింటున్న మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్● త్వరలోనే సెంట్రల్ లైటింగ్ మరమ్మతు పనులు ● మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ● ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమానికి అనూహ్య స్పందన ప్రశ్న: జవహర్నగర్కాలనీలో తాగునీటి కొరత ఉంది. కొందరు మిషన్ భగీరథ పైప్లైన్కు మోటార్లు బిగిస్తున్నారు. అంబేడ్కర్ సెంటర్లో పార్కింగ్ స్థలం లేక వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. – ఎరుకల గణపతి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కమిషనర్: వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. తనిఖీలు నిర్వహించి మిషన్ భగీరథ పైప్లైన్లకు మోటార్లు బిగించే వారిపై కేసులు నమోదు చేయిస్తాం. పట్టణ మాస్టర్ ప్లాన్ సిద్ధం అవుతుంది. త్వరలోనే పార్కింగ్ ఇబ్బందులు తీరుతాయి. -
పరీక్షలు ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలి
గణపురం: విద్యార్థుల పరీక్షలు ముగిసే వరకు అన్ని శాఖల అఽధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్శర్మ కోరారు. బుధవారం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యుత్, తాగునీరు, వైద్యసేవలను పరిశీలించి, పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పరీక్షల నిర్వాహన పకడ్బందీగా నిర్వహించాలన్నారు. పరీక్ష కేంద్రం వద్ద బందోబస్తు నిర్వహించాలని, విద్యార్థుల వెంట ఎలక్ట్రానిక్ పరికరాలను ఉండకుండా, మాస్ కాపీయింగ్కు తావు లేకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. అలాగే ప్రశ్నపత్రాలు, జవాబు పత్రాల తరలింపులో జాగ్రత్తగా ఉండాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ సత్యనారాయణస్వామి, సీఎస్, తదితరులు ఉన్నారు. ఏడుగురి గైర్హాజరు భూపాలపల్లి రూరల్: జిల్లాలో నిర్వహిస్తున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలు కొనసాగుతున్నట్లు డీఈఓ రాజేందర్ తెలిపారు. బుధవారం నిర్వహించిన పరీక్షలో 3,449 మందికి గాను 3,442 మంది విద్యార్థులు హాజరై ఏడుగురు విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. జిల్లాలోని పలు పరీక్ష కేంద్రాలను అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, పరీక్షల నియంత్రణ అధికారి మందల రవీందర్రెడ్డి, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేసినట్లు తెలిపారు.కలెక్టర్ రాహుల్శర్మ -
లింగాపూర్ సమీపంలో పులి సంచారం
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని లింగాపూర్ జాతీయ రహదారి శివారులోని నందిపాడు ప్రాంతంలో మంగళవారం సాయంత్రం పులి సంచరిస్తున్నట్లు గొత్తికోయలు గమనించి లింగాపూర్ గ్రామస్తులకు సమాచారం అందించారు. ఈ మేరకు వారు బుధవారం ఉదయం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ములు గు ఎఫ్ఆర్ఓ శంకర్ అటవీశాఖ సిబ్బందితో కలిసి పులి సంచరించిన ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు. ఆ ప్రదేశంలో పులి సంచరించినట్లు పాదముద్రలను గుర్తించారు. ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఓ శంకర్ మాట్లాడుతూ పస్రా రేంజ్ పరిధిలో పులి సంచరిస్తున్నట్లు వెల్లడించారు. లింగాపూర్ పరిధిలోని జాతీయ రహదారి పక్కన కూడా పులి సంచరించినట్లు వివరించారు. పులి పాదముద్రల ఆధారంగా ట్రేస్ చేస్తున్నామన్నారు. ప్రజలు, మేకల కాపరులు అటవీ ప్రాంతంలోకి వెళ్లకూడదన్నారు.పాదముద్రలను గుర్తించిన అటవీశాఖ అధికారులు -
ఓరుగల్లే ఫైనల్..!
సాక్షిప్రతినిధి, వరంగల్/ఎల్కతుర్తి : బీఆర్ఎస్ ఉద్యమాలకు సెంటిమెంట్గా భావించే ఓరుగల్లులోనే ఏప్రిల్ 27న బీఆర్ఎస్ రజతోత్సవ భారీ సభను నిర్వహించాలన్న తుది నిర్ణయానికి ఆ పార్టీ అధినేత కేసీఆర్ వచ్చారు. ఆయన ఆదేశాల మేరకు బుధవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నాయకులు స్థల పరిశీలన చేశారు. మొదట గ్రేటర్ వరంగల్ పరిధిలోని హంటర్రోడ్డు, లేదా ఉనికిచర్లలో నిర్వహించాలని ఈ నెల 10న మాజీ మంత్రి, సభ ఇన్చార్జ్ టి.హరీశ్రావు స్థల పరిశీలన చేశారు. ఆ తర్వాత హసన్పర్తి మండలం దేవన్నపేట అయితే ట్రాఫిక్కు అంతరాయం లేకుండా ఉంటుందని భావించి అక్కడ కూడా పర్యటించారు. ఇదే సమయంలో ఈసారి సభను వరంగల్ కాకుండా హైదరాబాద్ శివారులో పెట్టాలన్న చర్చ పార్టీలో జరిగినట్లు ప్రచారం జరిగింది. వేసవి ఎండలు తీవ్రమయ్యే సమయంలో వరంగల్ కంటే హైదరాబాద్ శివారు ప్రాంతమైతే బాగుంటుందని భావించినట్లు సమాచారం. ఘట్కేసర్లో సభావేదికను ఎంచుకున్నారన్న ప్రచారం కూడా జరిగింది. తాజాగా కేసీఆర్ ఆదేశాల మేరకు బుధవారం మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్భాస్కర్, వొడితెల సతీష్కుమార్, పెద్ది సుదర్శన్ రెడ్డి తదితరులు హస్నాబాద్ నియోజకవర్గ పరిధి ఎల్కతుర్తిలో స్థల పరిశీలన చేశారు. ఎల్కతుర్తి మండల కేంద్రంతోపాటు గోపాల్పూర్, మడిపల్లి, చింతలపల్లి శివార్లు.. ఎల్కతుర్తి – భీమదేవరపల్లి మధ్యన కుడి, ఎడమల స్థలాలను కూడా పరిశీలించారు. ఈ మేరకు రైతులనుంచి అంగీకారపత్రాలు కూడా తీసుకున్నారు. ఎల్కతుర్తి సభాస్థలిపై కేసీఆర్కు నివేదిక.. నేడో, రేపో నిర్ణయం.. సభావేదిక వివరాలను గురువారం పార్టీ అధినేత కేసీఆర్కు అందజేయనున్నట్లు బీఆర్ఎస్ నాయకులు చెప్పారు. సుమారు 15లక్షల మంది వరకు హాజరయ్యే రజతోత్సవ సభ కోసం భారీ ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఇదే విషయమై ఎల్కతుర్తి మండలంలో నిర్వహించేందుకు పరిశీలించిన రెండు, మూడు స్థలాల వివరాలు, మ్యాప్లను పార్టీ అధి నేత కేసీఆర్కు సమర్పించినట్లు ఆ పార్టీ నేతలు చె ప్పారు. కేసీఆర్తో చర్చించి ఆయన నిర్ణయం మే రకు సభావేదికపై స్పష్టమైన ప్రకటన వెలువడుతుందని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్కుమార్ తెలిపారు. ఇదిలా ఉండగా.. రజతోత్సవ సభపై త్వ రలోనే తుది నిర్ణయం తీసుకోనున్న కేసీఆర్.. నేడో, రేపో ఉమ్మడి వరంగల్ నేతలతో చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.డ్రోన్ల ద్వారా సభావేదిక మ్యాపింగ్.. ఎల్కతుర్తి మండల కేంద్రంలో అనువైన ప్రదేశాన్ని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీష్కుమార్, దాస్యం వినయ్భాస్కర్, పెద్ది సుదర్శన్రెడ్డిలు బుధవారం బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పరిశీలించారు. ముల్కనూర్ రోడ్డు, చింతలపల్లి రోడ్డు సమీపంలో గల అనువైన ప్రదేశాన్ని చూసి అనువుగా భావించిన వారు.. డ్రోన్ కెమెరా ద్వారా ఆ ప్రాంతాన్ని మ్యాపింగ్ చేయించారు. ఈ భూమికి సంబంధించిన రైతులతో మాట్లాడగా వారు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిపారు. అందుకు అనుగుణంగా ఎల్కతుర్తికి వచ్చే దారులవెంట కిలోమీటర్ దూరంలో గల ప్రదేశాలను వాహనాల పార్కింగ్ కోసం చూశారు. వారి వెంట పార్టీ మండల అధ్యక్షుడు పిట్టల మహేందర్, మాజీ వైస్ఎంపీపీ తంగెడ నగేష్, మాజీ ఎంపీటీసీ కడారి రాజు, శేషగిరి, రవిందర్, చిట్టిగౌడ్ ఉన్నారు.ఇక్కడే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు కేసీఆర్ సై తాజాగా ఎల్కతుర్తిలో స్థల పరిశీలన చేసిన నేతలు డ్రోన్ కెమెరాలతో సభాస్థలి, పార్కింగ్ స్థలాల మ్యాపింగ్ కేసీఆర్ దృష్టికి మ్యాప్లతో సహా అన్ని వివరాలు వేదిక దేవన్నపేటా? ఎల్కతుర్తా.?.. నేడో, రేపో తేల్చనున్న అధినేత -
‘రూరల్ ఇండియా’ సేవలు అభినందనీయం
భూపాలపల్లి: రూరల్ ఇండియా స్వచ్ఛంద సంస్థ సేవలు అభినందనీయమని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి నందకుమార్ బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీని కలిసి పలు పుస్తకాలను అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని అటవీ గ్రామాలతో పాటు ఎంపిక ప్రాతిపదికన 19 ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో లైబ్రరీల ఏర్పాటు, స్పోర్ట్స్ కిట్లను సంస్థ వ్యవస్థాపకుడు పూణేకు చెందిన ప్రదీప్ లోకండే అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి నితీన్కుమార్, ఎస్పీ సీసీ ఫసియొద్ధిన్ తదితరులు పాల్గొన్నారు.ఎస్పీ కిరణ్ ఖరే -
తరాలపల్లి నుంచి దండకారణ్యం వరకు..
సాక్షిప్రతినిధి, వరంగల్/కాజీపేట అర్బన్ : అంకేశ్వరపు సారయ్య అలియాస్ సుధీర్, ఎల్లన్న, సుధాకర్.. హనుమకొండ జిల్లా తరాలపల్లి ముద్దుబిడ్డ.. రెండు పదుల వయస్సులో ఆయిడిసి, బాయిడిసి అడవిబాట పట్టిన మావోయిస్టు నేత. దళసభ్యుడినుంచి దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడి వరకు ఎదిగిన సారయ్య అలియాస్ సుధీర్ 35 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం ముగిసింది. ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందాడు. దంతెవాడ జిల్లా బీజాపూర్ ప్రాంతంలోని గీడం పోలీస్స్టేషన్ పరిధిలోని గిర్సాపర, నెల్గోడ, బోడ్గా, ఇకెలి గ్రామాల సరిహద్దు ప్రాంతాల్లో ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు ఎస్పీ గౌరవ్రాయ్ మంగళవారం ప్రకటించారు. ఈ ఎన్కౌంటర్లో మొత్తం ముగ్గురు మృతిచెందగా.. మృతుల్లో సారయ్య ఉన్నట్లు వెల్లడించారు. సారయ్య మృతి చెందాడన్న వార్తతో తరాలపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. నేడు తరాలపల్లికి సారయ్య మృతదేహం రానుంది. విద్యార్థిదశ నుంచే ఉద్యమాలు.. తరాలపల్లి గ్రామానికి చెందిన సారయ్య కొండపర్తి గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించారు. 1982లో 10వ తరగతి చదువుతున్న తరుణంలోనే నాడు మావోయిస్టులు ఇచ్చిన ‘గ్రామాలకు తరలండి’ పిలుపునకు ఆకర్షితుడై, తరాలపల్లి విలేజ్ ఆర్గనైజర్ బండి ఆశాలు, హనుమకొండ సిటీ ఆర్గనైజర్ తిప్పారపు రాములు అలియాస్ తాత సారథ్యంలో తరాలపల్లి గ్రామ అధ్యక్షుడిగా తన ప్రస్థానం ప్రారంభించాడు. అంచెలంచెలుగా మావోయిస్టు పార్టీలో ఎదుగుతున్న తరుణంలో 1990లో బీఎస్ఎఫ్ సిబ్బంది గ్రామాల్లోకి రావడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 1993లో జరిగిన ఎన్కౌంటర్లో సిటీ ఆర్గనైజర్ తాత చనిపోవడంతో.. అజ్ఞాతంలోకి వెళ్లిన సారయ్య నేటి వరకు గ్రామానికి తిరిగి రాలేదు. అమరుల పల్లె తరాలపల్లి.. కాజీపేట మండలం తరాలపల్లి ఉద్యమాలకు కేరాఫ్. ఎందరో ఈ గ్రామంనుంచి విప్లవోద్యమాల వైపు ఆకర్షితులై ఎన్కౌంటర్లలో అసువులు బాశారు. 1991లో వేల్పుల జగదీష్ అలియాస్ ఉప్పలన్న, 1992లో బండి ఆశాలు అలియాస్ శ్రీను పగిడేరు ఎన్కౌంటర్లో చనిపోయారు. 1998 నుంచి గాజుల శ్రీకాంత్ అలియాస్ శ్రీనాథ్, ముప్పిడి నాగేశ్వర్రావు అలియాస్ విశ్వనాథ్, చిరబోయిన సదానందం అలియాస్ కౌముదీ, సంపత్, కొత్తపల్లి సాంబయ్య అలియాస్ ఉప్పలన్నలు మృతిచెందగా.. మంగళవారం ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో అంకేశ్వరపు సారయ్య చనిపోవడం చర్చనీయాంశంగా మారింది. ముగిసిన అంకేశ్వరపు సారయ్య ఉద్యమ ప్రస్థానం 35 ఏళ్ల అజ్ఞాతవాసం... దళసభ్యుడి నుంచి డీకేఎస్జడ్సీ వరకు దంతెవాడ ఎన్కౌంటర్లో అసువులు బాసిన సుధీర్ విషాదంలో తరాలపల్లి.. నేడు గ్రామానికి మృతదేహం -
తాగు, సాగునీటి సమస్య రానివ్వొద్దు
భూపాలపల్లి: వేసవిలో తాగు, సాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. తాగునీరు, సాగు నీరు, ఉపాధి హామీ పథకం అమలు, ఎల్ఆర్ఎస్, ఇంటి పన్నుల వసూలు, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల మంజూరు తదితర అంశాలపై మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మండలస్థాయిలో అధికారులు సమావేశం ఏర్పాటుచేసి తాగునీటి సమస్యలపై నివేదికలు అందించాలన్నారు. గ్రామాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరాను అందించాలని, ఎక్కడైనా తాగునీటి సమస్య తలెత్తితే అధికారులు ముందుగానే ప్రజలకు తెలియజేయాలన్నారు. సాగునీరు సమస్య తలెత్తకుండా చూడాలని క్షేత్రస్థాయిలో పరిశీలించి కాలువలు, చెరువుల నుంచి సాగవుతున్న పంటలకు నీరు అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు సరైన పనిదినాలు కల్పించాలన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 91శాతం ఇంటి పన్నులు వసూలు చేశారని, మిగిలిన 9 శాతాన్ని ఈ నెల 31వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, డీపీఓ నారాయణరావు, వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ప్రణాళికలు రూపొందించాలి.. జిల్లాలో సమగ్ర ప్రణాళిక అమలుకు సంబంధించి ‘సబ్కి యోజన–సబ్కి వికాస్’ కింద జిల్లా, మండల ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో ‘సబ్కి యోజన–సబ్కి వికాస్’ కింద జిల్లా, మండల ప్రణాళికలు రూపకల్పనపై జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమర్థవంతమైన అభివృద్ధి చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
లారీడ్రైవర్లు సమయపాలన పాటించాలి
భూపాలపల్లి: రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ జామ్ సమస్య ఉత్పన్నం కాకుండా ఉండేందుకు ఇసుక లారీ డ్రైవర్లు తప్పకుండా నిర్ధేషిత సమయంలోనే లారీలను రోడ్డుపైకి తీసుకురావాలని ఎస్పీ కిరణ్ ఖరే మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 7గంటల నుంచి 9గంటల వరకు, సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 7గంటల వరకు ఇసుక లారీలకు జాతీయ రహదారిపై అనుమతి లేదన్నారు. హోల్డింగ్ పాయింట్స్, చెక్పోస్టుల్లో లారీలు నిలిపిఉంచి, సమయపాలన ప్రకారం నడుచుకోవాలని పేర్కొన్నారు. ఇసుక లారీల ట్రాఫిక్ నియంత్రణకు రేగొండ, కాటారంలో చెక్పోస్టులు, హోల్డింగ్ పాయింట్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లా పోలీసులు 24 గంటల పాటు పెట్రోలింగ్ నిర్వహిస్తారని, లారీడ్రైవర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.ఎస్పీ కిరణ్ ఖరే -
బుధవారం శ్రీ 26 శ్రీ మార్చి శ్రీ 2025
భూపాలపల్లి రూరల్: ఉగాది పండగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం పేదలకు తీపికబురు అందించింది. ఆహారభద్రత కార్డుదారులకు ఏప్రిల్ 1నుంచి సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయించింది. ప్రస్తుతం డీలర్ల వద్ద నిల్వ ఉన్న దొడ్డుబియ్యం మొత్తం వెనక్కి పంపించాలని ఆదేశించింది. ఈ మేరకు అవసరమైన చర్యలు ముమ్మరం చేసింది. ఇప్పటికే గోదాముల్లో బియ్యం సిద్ధంగా ఉంచిన అధికారులు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే వాటిని రేషన్ షాఫులకు తరలించి పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. సర్కారు తాజా నిర్ణయంతో సన్నబియ్యం కొనుగోలు చేయలేని పేదలకు ప్రయోజనం చేకూరనుంది. ఏప్రిల్ 1నుంచి పంపిణీకి ఏర్పాట్లు లబ్ధిదారుల్లో హర్షం.. -
గుడుంబా స్థావరాలపై దాడులు
మల్హర్ : మండలంలోని అడ్వాలపల్లి, దుబ్బపేట, గాదంపల్లి గ్రామాల్లోని గుడుంబా స్థావరాలపై మంగళవారం ఎకై ్సజ్ అధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా గుడుంబా తయారీ కేంద్రాల్లో నిల్వ ఉన్న 600 లీటర్ల చక్కెర పానకాన్ని అధికారులు ధ్వంసం చేశారు. 40 కేజీల చక్కెర, 12 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు కాటారం ఎకై ్సజ్ ఎస్సై కిష్టయ్య పేర్కొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గుడుంబా తయారీ అనర్ధాలపై అవగాహన కల్పించారు. గుడుంబా తయారు చేసినా, కలిగి ఉన్న, రవాణా చేసిన, విక్రయించిన చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ దాడుల్లో హెడ్ కానిస్టేబుల్ రాంచందర్, కానిస్టేబుళ్లు వెంకట రాజు, రామకృష్ణ పాల్గొన్నారు. -
ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలి
భూపాలపల్లి రూరల్: పోలీసులు ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదివస్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన 21మంది అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి, సమస్యల పూర్తి వివరాలను సమర్పించాలని, ప్రతి కేసుపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు సమస్యలతో పోలీసుస్టేషన్ వచ్చినప్పుడు తక్షణమే స్పందించి న్యాయం జరిగేలా చేసినప్పుడే పోలీసులపై నమ్మకం కలుగుతుందని తెలిపారు.ఎస్పీ కిరణ్ ఖరే -
బయోమెట్రిక్ ప్రకారమే వేతనాలు
భూపాలపల్లి: బయోమెట్రిక్ హాజరు ప్రకారమే సిబ్బందికి వేతన చెల్లింపులు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశపు హాల్లో అన్ని శాఖల అధికారులతో కలిసి బయోమెట్రిక్ హాజరు పరికరాలను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బంది తప్పనిసరిగా ఉదయం, సాయంత్రం నిర్దేశిత సమయం ప్రకారం బయోమెట్రిక్ హాజరు నమోదుచేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. మిల్లెట్ కౌంటర్ అందుబాటులో ఉండాలి.. మిల్లెట్ కౌంటర్ ప్రతీరోజు కలెక్టరేట్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్శర్మ డీఆర్డీఓ నరేష్కు సూచించారు. ఐడీఓసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మిల్లెట్ కౌంటర్ను పరిశీలించారు. వాటర్ షెడ్ యాత్ర విజయవంతం చేయాలి.. ఈ నెల 29న జిల్లాలో నిర్వహించే వాటర్షెడ్ యాత్రను విజయవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. ఐడీఓసీ కార్యాలయ సమావేశపు మందిరంలో వివిధ శాఖల అధికారులతో వాటర్షెడ్ యాత్ర నిర్వహణపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వేసవిలో నీటి వినియోగం, భూగర్భ జలాలు పెంపొందించేందుకు ఈ నెల 22న ఆదిలాబాద్లో మొదలైన యాత్ర 29వ తేదీన జిల్లాలో కొనసాగుతుందని తెలిపారు. క్షయ వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలి.. క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఐడీఓసీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అవగాహనతోనే క్షయ వ్యాధిని నిర్మూలించగలమని అన్నారు. సమీక్ష అనంతరం ఐడీఓసీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన క్షయ వ్యాధి అవగాహన స్టాల్ను కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ మధుసూదన్, వైద్యాధికారులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ ఈవీఎం గోదాంను పరిశీలించారు. ఈవీఎంల భద్రతపై నిరంతర పటిష్ట పర్యవేక్షణ ఉండాలని అధికారులకు సూచించారు. క్షయ వ్యాధి నిర్మూలనకు కృషి కలెక్టర్ రాహుల్ శర్మ -
కోటగుళ్లను సందర్శించిన ఇటలీ ఆర్కిటెక్చర్ బృందం
గణపురం: మండలకేంద్రంలోని కోటగుళ్లను సోమవారం ఇటలీ దేశానికి చెందిన ఆర్కిటెక్చర్ బృందం సందర్శించింది. ఇటలీకి చెందిన రార్టో, మేఘా ఆధ్వర్యంలో ఆర్కిటెక్చర్ బృందం సందర్శించి మొదట ఆలయంలో ప్రత్యేక పూజలు చేసింది. అనంతరం కోటగుళ్ల శిల్పసంపదను కెమెరాల్లో చిత్రీకరించుకున్నారు. ఆలయ శిల్ప సంపద అద్భుతంగా ఉందని కొనియాడారు. పరీక్ష కేంద్రాల తనిఖీ భూపాలపల్లి రూరల్: జిల్లాలోని పదవ తరగతి పరీక్షా కేంద్రాలను డీఈఓ రాజేందర్ సోమవారం తనిఖీ చేశారు. కాటారం ఆదర్శ పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, మహదేవపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బాలురు, బాలికల పాఠశాలను సందర్శించారు. రెండు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు జిల్లాలోని పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశాయి. పరీక్షలకు సోమవారం 3,449 విద్యార్థులకు 3,435 మంది హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడొద్దు ● కాటారం డీఎస్పీ గడ్డం రామ్మోహన్రెడ్డికాళేశ్వరం: ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో క్రికెట్ అభిమానులు, యువకులు ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని కాటారం డీఎస్పీ గడ్డం రామ్మోహన్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మహదేవపూర్ పోలీసుస్టేషన్లో విలేకర్లతో మాట్లాడారు. క్రికెట్ బెట్టింగ్లు చట్టవిరుద్ధమన్నారు. బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకొని జీవితాలను నాశనం చేసుకోవద్దని, రోడ్డున పడొద్దన్నారు. యువత, అభిమానులు దూరంగా ఉండాలని అన్నారు. ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఆయన వెంట సీఐ రామచందర్రావు, ఎస్సైలు పవన్కుమార్, తమాషారెడ్డి, రమేష్ ఉన్నారు. 27న ‘హలో బీసీ.. చలో ఢిల్లీ’ మొగుళ్లపల్లి: ఈ నెల 27న ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరిగే బీసీల మహాధర్నాకు వేలా దిగా తరలివచ్చి హలో బీసీ.. చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల కోటాలో 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ శాసనసభలో బిల్లు ఆమోదింపజేయడాన్ని స్వాగతిస్తున్నామన్నా రు. ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి బీసీ విద్యార్థులు, బీసీ యువత, బీసీ మహిళలు, బీసీ ఉద్యోగస్తులు వేలాదిగా తరలి రావాలన్నారు. -
ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలు
రేగొండ: సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి అన్నారు. సోమవారం కనిపర్తి పాఠశాల స్కూల్ అసిస్టెంట్ ఎల్లంకి భిక్షపతి ఉద్యోగ విరమణ సభకు శ్రీపాల్రెడ్డి హాజరై మాట్లాడారు. అన్ని వృత్తుల్లోకెల్లా ఉపాధ్యాయ వృత్తి గొప్పదని కొనియాడారు. విద్యార్థుల మేధాశక్తిని పెంచే ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలు అన్నారు. అంకితభావంతో పనిచేసిన భిక్షపతిని ఆదర్శంగా తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. పదవీ విరమణ అనంతరం శేష జీవితాన్ని ప్రజా సేవకు అంకితం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రేగొండ ఎంఈఓ ప్రభాకర్, కొత్తపల్లిగోరి ఎంఈఓ రాజు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సుబాకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి కిరణ్, మండల నాయకులు పాల్గొన్నారు.టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి -
అవినీతిపై విచారణ చేపట్టాలి..
మంగళవారం శ్రీ 25 శ్రీ మార్చి శ్రీ 2025చిట్యాల మండలం కొత్తపేట గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో చోటు చేసుకున్న అవినీతిపై విచారణ జరిపించాలని చిగురు రాజ్కుమార్, దొడ్డి శంకర్ కోరారు. కారోబార్ దేవేందర్ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన నర్సరీలో అక్రమాలకు పాల్పడ్డాడని, పనిచేయని కూలీలను హాజరు రిజిస్టర్లో నమోదు చేసి, కూలీ డబ్బులు చెల్లించి, అందులో నుంచి సగం డబ్బులు తీసుకుంటున్నాడని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఎంపీడీఓకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదని, తగు విచారణ జరపాలని కోరారు. -
అక్రమంగా మట్టి తవ్వకాలు
కాటారం: మహాముత్తారం మండలం యామన్పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గడ్డగూడెం సమీపంలోని ఎర్రకుంట చెరువులో ఆదివారం అక్రమంగా మట్టి తవ్వకాలు జరిగాయి. కొందరు వ్యక్తులు జేసీబీ సహాయంతో విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు చేపట్టి ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఆదివారం సెలవు కావడంతో పగలు, రాత్రి తేడా లేకుండా మట్టి రవాణా చేపట్టినట్లు స్థానికులు తెలిపారు. ఇరిగేషన్ శాఖకు చెందిన చెరువుల నుంచి యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుగుతున్నట్లు పలువురు ఫిర్యాదు చేసినప్పటికీ సంబంధిత శాఖ అధికారుల నుంచి స్పందన లేదు. అధికారుల కనుసన్నల్లోనే ఈ అక్రమ మట్టి దందా జరుగుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. -
కార్పొరేట్ సెలూన్లను రద్దుచేయాలి
భూపాలపల్లి రూరల్: జిల్లా కేంద్రంలో ప్రారంభం కాబోతున్న కార్పొరేట్ సెలూన్లను వెంటనే రద్దు చేయాలని నాయీ బ్రాహ్మణ సేవా సంఘం భూపాలపల్లి పట్టణ అధ్యక్షుడు పందిళ్ల రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి మాదాస్ రాజశేఖర్, జిల్లా గౌరవాధ్యక్షుడు కురిమిల్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలోని మంజూరునగర్ ప్రాంతంలో పింక్స్ ఇన్ బ్లూస్ బ్యూటీ పార్లర్ అనే పేరుతో కార్పొరేట్ సెలూన్ అండ్ పార్లర్ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుందని, ఆదివారం పార్లర్ముందు నిరసన చేపట్టారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ.. కార్పొరేట్ సెలూన్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పోరాటానికి సిద్ధమని ప్రకటించారు. నిరవధిక నిరాహార దీక్ష చేయడానికై నా సిద్ధమని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ముల్కనూర్ బిక్షపతి, జిల్లా కోశాధికారి గిద్దమారి సుధాకర్, మండల అధ్యక్షులు మంతెన భూమయ్య, ప్రధాన కార్యదర్శి గిద్దమరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
మతోన్మాదంపై పోరాటానికి సిద్ధంకావాలి
భూపాలపల్లి అర్బన్: కేంద్రం ప్రభుత్వం అవలంభిస్తున్న మతోన్మాద వ్యతిరేక కార్యక్రమాలపై పోరాటానికి సిద్ధం కావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు పిలుపునిచ్చారు. భగత్సింగ్ 94వ వర్ధంతిని ఆదివారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిలు మాట్లాడుతూ.. భారతీయుల హృదయాలను ఉత్తేజ పరచిన విప్లవకారుడు భగత్సింగ్కు అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ఉరిశిక్ష అమలు చేసిందన్నారు. నాటి ఉద్యమ పోరాటంలో చేసిన త్యాగాలను గుర్తుచేశారు. ఆయన స్ఫూర్తితో నేటితరం యువత బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే విధంగా పోరాడాలని పిలుపునిచ్చారు. రామప్పలో యూరప్ దేశస్తులువెంకటాపురం(ఎం): రామప్ప దేవాలయాన్ని ఆదివారం యూరప్కు చెందిన జెయో, ఇలోనాలు సందర్శించారు. రామలింగేశ్వర స్వామిని వారు దర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ వెంకటేశ్ వివరించగా రామప్ప శిల్పకళసంపద బాగుందని కొనియాడారు. ఆదివారం సెలవుకావడంతో వివిధ ప్రాంతాల నుంచి అధికసంఖ్యలో పర్యాటకులు రామప్పకు తరలివచ్చారు. వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రొఫెసర్లు రామప్ప దేవాలయాన్ని సందర్శించి రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకతీయ యూనివర్సిటీలో రెండు రోజుల సెమినార్ ముగించుకొని అమ్మవార్ల దర్శనానికి వచ్చినట్లు వెల్లడించారు. జాతీయ కౌమార విద్యా సదస్సుకు డాక్టర్ రామయ్య ములుగు: ప్రాంతీయ విద్యాసంస్థ(ఎన్సీఈఆర్టీ) బోపాల్లో నేడు, మంగళవారం జరగనున్న జాతీయ కౌమార విద్యా సదస్సుకు తెలంగాణ రాష్ట్రం నుంచి తాను ఎంపికై నట్లు ములుగు మండలం అబ్బాపురం ప్రభు త్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు, మనో విజ్ఞానవేత్త డాక్టర్ కందాల రామయ్య ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కౌమారదశలో బాలికలు ఒత్తిడిని ఎదుర్కొనే విధానాలు అనే అంశంపై చేసిన పరిశోధన, విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై వాటి ప్రభావాన్ని తెలిపేలా వివరించనున్నట్లు వెల్లడించారు. -
వేముల శంకర్కు డాక్టరేట్
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని మిరాకిల్ వాలంటరీ ఆర్గనైజేషన్ ద్వారా వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న ఐటీ మాస్టర్ డైరెక్టర్ వేముల శంకర్కు డాక్టరేట్ అవార్డు వరించింది. ఏషియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ అక్రిడిటేషన్ ఆర్గనైజేషన్(యూఎస్ఏ) గౌరవ డాక్టరేట్ను అందించింది. జిల్లాకేంద్రంలో 11 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం 350–400 యూనిట్ల రక్తాన్ని ఎంజీఎం ఆస్పత్రికి అందిస్తూ వేలాది ప్రాణాలను రక్షిస్తున్నారు. అవయవదానం ఆవశ్యకతపై విద్యా సంస్థలలో అవగాహన కార్యక్రమాలు, ప్రచార యాత్రలు నిర్వహించారు. హరితహారం కార్యక్రమాల్లో పాల్గొని ఐదు వేల మొక్కలను నాటించి 8,900మందికి ఉచిత కంప్యూటర్ శిక్షణ, నాలుగు వేల మందికి వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించారు. ఏప్రిల్ 17వ తేదీన హైదరాబాద్లో ఈ ప్రతిష్టాత్మక డాక్టరేట్ అవార్డును అందించనున్నారు. -
వైద్యశిబిరానికి విశేష స్పందన
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన వైద్యశిబిరానికి విశేష స్పందన లభించింది. మెడికవర్ హాస్పిటల్ నేతృత్వంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్యశిబిరం నిర్వహించారు. ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏఐటీయూసీ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ మాతంగి రామచందర్, అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ గురిజపల్లి సుధాకర్రెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. సుమారు 500 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. మెడికవర్ హాస్పిటల్ వైద్య బృందం ఆధ్వర్యంలో అందరికీ ఉచిత పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమంతో పాటు వారి ఆరోగ్యమే లక్ష్యంగా మెడికవర్ హాస్పిటల్ మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు తాళ్ల పోశం, నేరెళ్ల జోసెఫ్ వేముల శ్రీకాంత్, డాక్టర్లు షఫీ పాలగిరి, డాక్టర్ శ్రవణ్ కుమార్ జోగు, టుది ఎకో ప్రకాశ్, పీఆర్ఓ రాజు, జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు. -
మేడారంలో భక్తుల సందడి
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం వేల సంఖ్యలో తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు జంపన్నవాగు స్నానఘట్టాల షెవర్ల కింద స్నానాలు ఆచరించారు. అనంతరం అమ్మవార్ల గద్దెలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పసుపు, కుంకుమ, కానుకలు, ఎత్తు బంగారం, చీరసారె కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఓ ఎన్నారై కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవార్లకు పూజలు చేశారు. డీజె సౌండ్ నృత్యాలతో పలువురు భక్తులు సందడి చేశారు. మొక్కుల అనంతరం భక్తులు చెట్ల కింద వంటావార్పు చేసుకుని భోజనాలు చేశారు. సుమారు 10వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. ‘అమ్మవార్ల చరిత్ర గొప్పది’ మేడారం సమ్మక్క– సారలమ్మ చరిత్ర చాలా గొప్పదని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రొఫెసర్లు కొనియాడారు. కాకతీయ యూనివర్సిటీలో రెండు రోజుల సెమినార్ ముగించుకొని అమ్మవార్ల దర్శనానికి వచ్చినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవార్లను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. వనదేవతల చరిత్ర నలుదిశలా వ్యాపించేలా తమకున్న వనరులతో పుస్తకాలను తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించేలా చూస్తామన్నారు. సమ్మక్క– సారలమ్మ జాతరకు జాతీయస్థాయి గుర్తింపును తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ప్రజల మనో భావాలను గుర్తించాలన్నారు. వనదేవతలను దర్శించుకున్న వారిలో ప్రొఫెసర్లు గోవాకు చెందిన ప్రకాశ్దేశాయ్, తమిళనాడుకు చెందిన లక్ష్మణన్, కేరళ రాష్ట్రానికి చెందిన జోష్జార్జి, ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి చెందిన అంజిరెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన శ్రీనివాసులు, కాకతీయ యూనివర్సిటీకి చెందిన సత్యనారాయణ, యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ అంకిళ్ల శంకర్, కలిపిండి వినోద్, చేరాల శివప్రసాద్ ఉన్నారు. -
మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్
భూపాలపల్లి రూరల్: మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు అని కలెక్టర్ రాహుల్ శర్మ, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. ఆదివారం సాయంత్రం జిల్లాకేంద్రంలోని భారత్ ఫంక్షన్హాలులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే సత్యనారాయణరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిముల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. రంజాన్ మాసంలో ఆచరించే ఉపవాస దీక్షలు ముస్లిం సోదరులకు ఇచ్చే ఇఫ్తార్ విందు లాంటి కార్యక్రమాలు ప్రజలలో సోదరభావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా రంజాన్ మాస విశిష్టతను కొనియాడారు. సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిములకు ఫలహారాలు తినిపించారు.కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర -
తల్లిదండ్రులు గమనిస్తుండాలి..
● పిల్లలు ఎక్కువ సేపు టీవీలు, స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లను చూస్తే కళ్లు పొడిబారి దృష్టి సమస్య వస్తుంది. ● పిల్లలు ఖాళీ సమయంలో టీవీలకు, ఫోన్లకు అతుక్కుపోకుండా ఆరుబయట ఆడుకునేలా ప్రోత్సహించాలి. ● చదివే సమయంలో పుస్తకాలను దగ్గరగా పెట్టుకోకుండా కంటికి కనీసం 30 సెంటీమీటర్ల దూరంలో ఉండేలా చూడాలి. ● పిల్లలు అన్నం తిననని మారాం చేసే సమయంలో టీవీ, ఫోన్ ఇచ్చే అలవాటు చేయకూడదు. ● పాఠశాలల నుంచి ఇంటికి రాగానే టీవీ, ఫోన్తో గడపకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. -
నీటి పొదుపు బాధ్యత
కాటారం: నీటిని పొదుపుగా వాడుకొని భూగర్భ జలాలను పెంపొందించుకోవడం ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించాలని భూగర్భ జలవనరుల శాఖ అధికారి రామకృష్ణ అన్నారు. ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకొని నీటి ఆవశ్యకతపై వెలుగు రేఖ గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మండలంలోని మేడిపల్లి ఆశ్రమ పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తాగునీటి వినియోగం, నిర్వహణ, నీటి ప్రాముఖ్యత, నీటి సంరక్షణ చర్యలు, భూగర్భ జలాలను పెంపొందించుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై జలవనరుల శాఖ అధికారులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షం నీటిని భూమిలోకి ఇంకిస్తే భూగర్భ జలమట్టాన్ని పెంచుకోవచ్చన్నారు. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను తప్పనిసరిగా నిర్మించుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ డీపీఎం కిరణ్, డీబీఎస్ బ్యాంకు మేనేజర్ హరీశ్, సీఈఓ రజిత, రిసోర్స్పర్సన్ లక్ష్మిరాజం పాల్గొన్నారు. -
పనుల ప్రతిపాదనలు సమర్పించాలి
● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి: కాళేశ్వరంలో సరస్వతీనది పుష్కరాలకు చేపట్టనున్న తాత్కాలిక ఏర్పాట్ల పనులకు సంబంధించిన అంచనా ప్రతిపాదనలు త్వరితగతిన సమర్పించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. శనివారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్, దేవాదాయ, పర్యాటక ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గతంలో శాశ్వత పనులకు అంచనాలు అందజేశారని, కొన్ని తాత్కాలిక పనులు చేపట్టాల్సి ఉన్నందున మరోమారు ప్రతిపాదనలు అందజేయాలన్నారు. పుష్కరాల్లో భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. స్వచ్ఛతపై ప్రత్యేక దృష్టి సారించేందుకు జోన్ల వారీగా విభజించి, ప్రత్యేక పారిశుద్ధ్య సిబ్బందిని నియమించాలని సూచించారు. ఈ సమావేశంలో డీఎఫ్ఓ నవీన్రెడ్డి, వివిధ శాఖల ఇంజనీరింగ్ విభాగం అధికారులు, ఆర్టీసీ, పోలీసు, పర్యాటక శాఖ అధికారులు పాల్గొన్నారు. భూముల కేటాయింపునకు చర్యలు తీసుకోవాలి.. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన భూముల కేటాయింపునకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్శర్మ సూచించారు. ఐడీఓసీ కార్యాలయంలో చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన అటవీ భూముల కేటాయింపుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాటారం, మహదేవపూర్ మండలాల్లో ప్రాజెక్టుకు అవసరమైన అటవీ భూముల కేటాయింపు, రేగొండ మండలం బుద్దారం నుంచి రామన్నగూడెం తండా వరకు రహదారి నిర్మాణానికి అవసరమైన భూముల కేటాయింపు విషయమై అటవీ శాఖ అధికారులతో సమీక్షించారు. అటవీ, రెవెన్యూ, సర్వే, ఆర్అండ్బీకి అవసరమైన భూముల కేటాయింపునకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో డీఎఫ్ఓ నవీన్రెడ్డి, అదనపు కలెక్టర్ అశోక్కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
చట్టాలపై అవగాహన ఉండాలి
టేకుమట్ల: మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని చైల్డ్ హెల్ఫ్లైన్ జిల్లా అధికారి కళావతి అన్నారు. శనివారం మండలంలోని రామకిష్టాపూర్(టి) అంగన్వాడీ కేంద్రంలో మహిళలకు చట్టాలపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం సుకన్య సమృద్ధియోజన, బేటీ బచావో–బేటీ పడావో, మిషన్ వాత్సల్య, చైల్డ్ హెల్ప్లైన్, సఖి కేంద్రాలను నిర్వహింస్తుందని అన్నారు. బాలికల చదువు అనంతరం వివాహానికి సుకన్య సమృద్ధి యోజన ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. బాలికలే భవిష్యత్కు పునాదులుగా బేటీ బచావో–బేటీ పడావో కార్యక్రమం కొనసాగిస్తున్నారని అన్నారు. బాలికలు సమాజంలో ఎక్కడైనా, ఎప్పుడైనా ఇబ్బందులకు గురయితే చైల్డ్ హెల్ప్లైన్ తోడ్పాటునందిస్తుందన్నారు. మహిళలు కుటుంబ పరంగా ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటే సఖి కేంద్రం ద్వారా న్యాయం పొందే అవకాశం ఉందని చెప్పారు. చైల్డ్ హెల్ప్లైన్, బాలికల సమస్యల కోసం 1098, వృద్ధుల సమస్యల కోసం 14567, మహిళల సమస్యల కోసం 181 టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ సరోజన, సఖి గాయత్రి మిషన్ శక్తి కో ఆర్డినేటర్ అనూష, మమత, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. -
దృష్టి లోపం
పిల్లల్లో పెరుగుతున్న కంటి సమస్యలు●● జిల్లాలో 3,449మందికి పరీక్షలు ● 676మందికి లోపం ఉన్నట్లు నిర్ధారణ ● ఆర్బీఎస్కే పరీక్షల్లో వెల్లడి భూపాలపల్లి అర్బన్: జిల్లాలో దృష్టి లోపం ఉన్న పిల్లలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమ్ (అర్బీఎస్కే) ఆధ్వర్యంలో జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 3,449మంది విద్యార్థులకు కంటి పరీక్షలు చేయగా 676 మందికి దృష్టిలోపం ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ విద్యా సంవత్సరం ముగిసేలోగా జిల్లాలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మొత్తంగా 3,500మందికి కంటి పరీక్షలు చేయనున్నారు.మూడు, ఆరేళ్లలో పరీక్షలు బాల్యంలోనే కంటి సమస్యలను గుర్తిస్తే భవిష్యత్లో ఇబ్బందులు ఉండవు. మూడేళ్ల వయస్సులో కంటి వైద్య పరీక్షలు చేస్తే బొమ్మలను గుర్తు పడుతున్నారా అనేది తేలుతుంది. తిరిగి ఆరేళ్ల వయసులో పరీక్షించాలి. దృష్టి లోపం ఉంటే అద్దాలు, ఇతర సంరక్షణ చర్యలు తీసుకోవాలి.ప్రతి విద్యార్థినీ పరీక్షిస్తున్నాం.. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి విద్యార్థికీ కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాం. దృష్టి లోపాలను గుర్తిస్తూ అద్దాల పంపిణీకి నివేదిస్తున్నాం. సమస్య అధికంగా ఉంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లో శస్త్రచికిత్స చేస్తాం. జిల్లాలో ఇప్పటివరకు శస్త్ర చికిత్సలు చేసే అవసరం రాలేదు. – బండి శ్రీనివాస్, జిల్లా నోడల్ అధికారిపెరుగుతున్న మానసిక సమస్యలు విద్యార్థులు ఎక్కువ సమయం ఫోన్లు వాడుతుండటంతో దృష్టి లోపంతో పాటు మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒత్తిడికి గురై ప్రతి చిన్న విషయానికి చిరాకు పడుతున్నారు. ఆకలి మందగించడంతో పాటు ఏకాగ్రత, ఆలోచనా శక్తి కోల్పోతున్నారు. బరువు పెరగడంతో పాటు ఎదుగుదల క్షీణిస్తోంది. తలనొప్పితో బాధపడుతున్నారు. అయిదేళ్లలోపు పిల్లలకు ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఇస్తుండటంతో కంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. -
జీపీ భవన నిర్మాణంపై ప్రజాభిప్రాయ సేకరణ
కాటారం: మహాముత్తారం మండలం కొర్లకుంట గ్రామపంచాయతీ భవన నిర్మాణంపై శనివారం కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ సభ నిర్వహించారు. కొన్ని రోజుల క్రితం గ్రామ పంచాయతీ భవన నిర్మాణం చేపట్టగా పనుల్లో నాణ్యత లోపించిందని పలు కారణాలతో నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయింది. దీంతో పలువురు మంత్రి శ్రీధర్బాబు దృష్టికి తీసుకెళ్లగా గ్రామపంచాయతీ నిర్మాణంపై అభిప్రాయాలు సేకరించాలని సబ్ కలెక్టర్ను మంత్రి ఆదేశించారు. దీంతో పనులు కొనసాగించడమా లేక మరో చోట నిర్మించడమా అనే అంశాలపై అధికారులు ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు. నివేదిక ఆధారంగా త్వరలో చర్యలు చేపట్టనున్నట్లు సబ్కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్లో ఎస్పీ
భూపాలపల్లి: జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మామునూరు బెటాలియన్ సమీపంలోని ఫైరింగ్ రేంజ్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పోలీసు అధికారులు ఈ ఏడాదికి సంబంధించిన ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. ఈ సాధనలో ఎస్పీ కిరణ్ ఖరే, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని పిస్టల్, ఏకే 47, ఎస్ఎల్ఆర్, ఇన్సాస్, వివిధ ఆటోమేటిక్ ఆయుధాలతో ఫైరింగ్ సాధన చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ఫైరింగ్లో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని మంచి మెలకువలు నేర్చుకోవాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు చాలా కీలకమైనవని, అత్యవసర సమయాల్లో ప్రజల మాన, ధన, ప్రాణ రక్షణకోసం ఎల్లవేళలా సంసిద్ధులై ఉండాలని పిలుపునిచ్చారు. ఫైరింగ్లో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులను ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బోనాల కిషన్, ఏఆర్ అదనపు ఎస్పీ వేముల శ్రీనివాస్, డీఎస్పీలు సంపత్రావు, నారాయణనాయక్, జిల్లా పరిధిలోని సీఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
శనివారం శ్రీ 22 శ్రీ మార్చి శ్రీ 2025
హన్మకొండ: ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందించేందుకు ఆర్టీసీ ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకుంటోంది. ప్రయాణికులకు సౌకర్యవంతంగా టికెట్ జారీకి ఇ–టిమ్స్ను ప్రవేశ పెట్టింది. దీనిలో భాగంగా ఆర్టీసీ వరంగల్ రీజియన్లోని ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈమేరకు కండకర్లు, డ్రైవర్లకు శిక్షణ ఇస్తూ క్రమంగా ఇ–టిమ్స్ను ప్రవేశపెడుతున్నారు. ఇప్పటివరకు ఉపయోగించిన టిమ్స్తో చూసుకుంటే మరిన్ని ఫీచర్లతో వీటిని రూపొందించారు. వరంగల్ రీజియన్లో ప్రతిరోజూ 936 బస్సులు వివిధ రూట్లలో తిరుగుతుంటాయి. 3.76 లక్షల కిలోమీటర్లు తిరిగి సగటున రోజుకు రూ.2.20 కోట్ల ఆదాయాన్ని సంస్థ రాబట్టుకుంటుంది. 936 బస్సులకుగాను ప్రస్తుతం 750 ఇ–టిమ్స్ మాత్రమే చేరుకున్నాయి. అన్ని బస్సుల్లో అమలుచేయాలంటే మరో 186 అవసరం. ఎప్పుడైనా టిమ్ మొరాయిస్తే బాగు చేసే వరకు వినియోగించుకునేలా అదనంగా మరికొన్ని అవసరం. ఆర్టీసీలో డిజిటల్ చెల్లింపులతో టికెట్ల జారీ ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న సంస్థ వరంగల్ రీజియన్కు చేరుకున్న 750 ఇ–టిమ్స్ టికెట్ జారీపై మరింత స్పష్టత ప్రతి స్టేజీ వారీగా వివరాలు తెలుసుకునే సౌకర్యం -
విచ్చలవిడిగా పార్కింగ్
కాళేశ్వరం: ఇసుక లారీలు ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా పార్కింగ్ చేస్తుండడంతో ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై రెండు వరుసల్లో లారీలు వెళ్తుండడంతో జనం ప్రయాణం చేయాలంటే జంకుతున్నారు. జిల్లాలోని మహదేవపూర్ మండలం పలుగుల, మద్దులపల్లి, పూస్కుపల్లి, బొమ్మాపూర్, ఎలికేశ్వరం తదితర గ్రామాల్లో టీజీఎండీసీ ఆధ్వర్యంలో ఇసుక క్వారీలు ప్రభుత్వం నిర్వహిస్తుంది. దీంతో నిత్యం హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్ తదితర నగరాలు, పట్టణాలకు లారీలు, టిప్పర్లలో ఇసుక రవాణాతో తరలిపోతుంది. నెలన్నర రోజులుగా నిత్యం క్వారీ ల్లో ఇసుక క్వాంటిటీ మునుపటి కన్నా ఎక్కువగా పెంచడంతో లారీలు భారీగా క్యూ కడుతున్నాయి. ఊపందుకున్న నిర్మాణాలు.. వేసవికాలం కావడంతో నగరాలు, పట్టణాల్లో ఇళ్ల నిర్మాణాలతో పాటు ఇతర పనులకు ఇసుక అవసరం. దీంతో ఇసుకకు బాగా డిమాండ్ పెరిగింది. లారీలు పెద్దసంఖ్యలో తరలివస్తున్నాయి. దీంతో ట్రాఫిక్జాం అవుతుంది. ఆయా గ్రామాల్లో రోడ్డుపై నిలిచి ఉండడంతో రోజువారి పనులకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. డబుల్ రోడ్డుపై రెండు వరుసల్లో లారీలు ఖాళీ, లోడ్ లారీలు పక్కపక్కనే నిలిచి ఉండడంతో మధ్య నుంచి ప్రయాణించడానికి రోడ్డు లేక జనం అవస్థలు పడుతున్నారు. కనీసం ఆటో కూడా వెళ్లలేని పరిస్థితి ఉంది. సమయ పాలన ఏది.. గతంలో విధులు నిర్వర్తించిన టీజీఎండీసీ అధికారులు, పోలీసులు సమయపాలన పాటించి ప్రమాదాలకు చెక్పెట్టారు. సంబంధిత టీజీఎండీసీ, పోలీసుల ఆధ్వర్యంలో ఉదయం, సాయంత్రం వేళల్లో సమయపాలనతో లారీలకు అనుమతి ఇచ్చేవారు. ఉదయం ఆరు గంటల నుంచి 9గంటల వరకు, సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 9గంటల వరకు లారీలను నిలిపి అనుమతి ఇచ్చేవారు. ప్రస్తుతం కూడా మళ్లీ సమయ పాలనను ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. ఘటనలు ఇలా.. ఉన్నతాధికారులు ఇప్పుడు ఇసుక తరలించాలనే ఉద్దేశంతో ఇబ్బడిముబ్బడిగా లారీలతో ఇసుక తరలించి అక్కడక్కడ ప్రమాదాలకు నిలయంగా మారుతున్నారు. వారం రోజుల్లో రెండు ఘటనలు జరిగాయి. కాళేశ్వరంలోని ఎస్సీ కాలనీ వద్ద లారీ డైవర్ మద్యం మత్తులో ఇంట్లోకి దూసుకెళ్లాడు. ఇళ్లు కూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. పలుగుల వద్ద లారీలు జాం కావడంతో మంచిర్యాల జిల్లా మద్దికాల రాజు అనే యువకుడు లారీ రెండు చక్రాల కింద పడ్డాడు. ఈ ఘటనలో బైక్ నుజ్జునుజ్జు కాగా రాజు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఇలా నిత్యం రోడ్డుపై లారీలతో ప్రమాదాలు జిల్లాలో ఎక్కడో ఓచోట జరుగుతున్నాయి. అధికారులతో మాట్లాడుతా.. పరీక్షలు జరుగుతున్నందున సమయపాలనపై ఉన్నతాధికారులతో మాట్లాడుతా. విద్యార్థులు, ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చేస్తాం. పార్కింగ్ కోసం స్థలాల పరిశీలన చేస్తున్నాం. ట్రాఫిక్జాంకు త్వరలో చెక్పెడుతాం. – శ్రీకాంత్, టీజీఎండీసీ పీఓ, భూపాలపల్లిఇసుక క్వారీలువిద్యార్థులకు ఇబ్బందులు.. రోడ్డుకు రెండు వరుసల్లో లారీలు పట్టించుకోని అధికారులు టెన్త్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు తప్పని తిప్పలుపదవ తరగతి పరీక్షలు శుక్రవారం ప్రారంభం కాగా ఏప్రిల్ 2వ తేదీ వరకు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఉదయం వేళలో లారీల రాకపోకలతో ట్రాఫిక్ జామ్ ఏర్పడితే పరీక్ష సమయానికి వెళ్లరు. ఒక్క పరీక్షకు అందకపోయినా భవిష్యత్కు ఇబ్బంది తప్పదు. ప్రమాదం జరిగితే ఇబ్బందులకు గురవుతారు. బైక్, ఇతర ప్రైవేట్ వాహనాల్లో వచ్చేటప్పుడు లారీలతో దారిలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. పరీక్ష సమయాల్లో ఉదయం ఏడు గంటల నుంచి 9.30గంటలు, మద్యాహ్నం 12.30.గంటల నుంచి 2గంటల వరకు సమయపాలన ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ఆవైపుగా ఆలోచన చేయడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. -
మౌలిక వసతుల కల్పనకు కృషి..
ములుగు రూరల్: జిల్లాలోని సమ్మక్క–సారక్క గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని యూనివర్సిటీ వీసీ వై.ఎల్ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం జాకారంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన వర్సిటీలో ప్రస్తుతం రెండు కోర్సులు బీఏ ఎకానామిక్స్, బీఏ లిటరేచర్ ఉన్నాయని వచ్చే అకడమిక్ ఇయర్లో ఎంబీఏ, బయో టెక్నాలజీ, బీబీఏ కోర్సులు ప్రారంభించేలా కృషి చేస్తానన్నారు. విద్యార్థుల కోసం హాస్టల్ సౌకర్యం, క్లాస్ రూంల ఏర్పాటు, ములుగు ఏజెన్సీ ప్రాంతంలోని వర్సిటీకి నైపుణ్యం కలిగిన ప్రొఫెసర్ను తీసుకొస్తామన్నారు. త్వరలో ట్రైబల్ స్టడీ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గిరిజన వర్సిటీ ప్రహరీ నిర్మాణానికి ప్రభుత్వం రూ.25 కోట్లు కేటాయించిందని, గిరిజన వర్సిటీపై టోఫో గ్రాఫికల్ సర్వే నిర్వహిస్తామన్నారు. మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేసి కార్యకలాపాలు కొనసాగిస్తామని చెప్పారు. విద్యార్థులను ఆకర్షించేందుకు అంతర్జాతీయ స్థాయిలో హాస్టల్ నిర్మాణాన్ని ఏర్పాటు చేయనున్నట్లు, కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు త్వరలోనే బిల్డింగ్ నిర్మాణం కోసం ప్రత్యేక ప్రణాళికలను తయారు చేస్తామన్నారు.గిరిజన యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ శ్రీనివాస్ -
టెన్త్ పరీక్షలు ప్రారంభం
భూపాలపల్లి అర్బన్: జిల్లావ్యాప్తంగా శుక్రవారం పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా 21 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా 3,449మంది విద్యార్థులకు గాను 3,441 మంది హాజరుకాగా 8మంది గైర్హాజరైనట్లు జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ తెలిపారు. మొదటిరోజు పరీక్ష కావడంతో విద్యార్థులు ఉదయం 8గంటల నుంచే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. 9గంటల తరువాత విద్యార్థులను క్షణ్ణంగా పరిశీలిస్తూ పరీక్ష హాల్లోకి అనుమతించారు. పరీక్ష కేంద్రాల తనిఖీ.. జిల్లావ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాలను కలెక్టర్ రాహుల్శర్మ, ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా ఇన్చార్జ్ డీఈఓ రాజేందర్ వేర్వేరుగా తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల్లో వైద్యం, కరెంట్, రవాణా సౌకర్యం, ఇతర వసతులు కల్పించినట్లు అధికారులు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్శాఖ ఆధ్వర్యంలో 144 సెక్షన్ విధించి పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఆయుష్ భవనంలోకి నర్సింగ్ కళాశాల
భూపాలపల్లి అర్బన్: నర్సింగ్ విద్యార్థులకు తరగతుల నిర్వహణకు తాత్కాలికంగా ఆయుష్ భవనం వినియోగించడానికి అవకాశం కల్పించాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ‘ఆన్లైన్లోనే తరగతులు’ శీర్షికతో నర్సింగ్ కళాశాలకు భవనం కరువు అని బుధవారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ స్పందించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో వైద్య, నర్సింగ్, ఆయుష్, సీహెచ్సీ, టీజీఎంఎస్ఐడీసీ ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఆయుష్ భవనంలోని రెండు అంతస్తులను నర్సింగ్ కళాశాల నిర్వహణకు కేటాయించాలని సూచించారు. ప్రధాన ఆస్పత్రి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం నుంచి అవసరమైన సిబ్బందిని సర్దుబాటు చేసి, కళాశాల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నర్సింగ్ విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. తాత్కాలికంగా భవనం వినియోగంపై కమిషనర్తో మాట్లాడతానని తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఎంహెచ్ఓ డాక్టర్ మధుసూదన్, ప్రధాన ఆస్పత్రి పర్యవేక్షకుడు డాక్టర్ నవీన్, వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ రాజేశం, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి పాల్గొన్నారు. జాగ్రత్తలపై అవగాహన కల్పించాలి.. వడదెబ్బకు గురికాకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృత అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ తెలిపారు. ఐడీఓసీ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో వేసవిలో ప్రజలు వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వడదెబ్బ తగలడానికి గల ప్రధాన కారణాలు, లక్షణాలు, నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశం అనంతరం వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ మధుసూదన్, ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి పర్యవేక్షకుడు డాక్టర్ నవీన్, వివిధ శాఖల అధికారులు, వైద్యులు పాల్గొన్నారు. రెండు అంతస్తుల వినియోగం జిల్లా ప్రధాన ఆస్పత్రి, డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి సిబ్బంది సర్దుబాటు కలెక్టర్ రాహుల్ శర్మ -
ఆలిండియా పోటీలకు ఎంపిక
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం నాగెపల్లి గ్రామానికి చెందిన గుర్సింగ విజయలక్ష్మి ఆల్ఇండియా సివిల్ సర్వీసెస్ ఖోఖో పోటీలకు ఎంపికై ంది. తెలంగాణ తరఫున జట్టులో శుక్రవారం నుంచి ఈనెల 24 వరకు న్యూఢిల్లీలో జింఖాన గ్రౌండ్లో జరుగనున్న జాతీయస్థాయి ఖోఖో పోటీలకు తెలంగాణ తరఫున ఎంపికై నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడలో జరిగిన ఆలిండియా సివిల్ సర్వీసెస్ హాకీ క్రీడలో తెలంగాణ తరఫున జట్టులో ఆడినట్లు పేర్కొన్నారు. ఆమె కాటారంలో వ్యాయామ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. ఆమె ఎంపిక కావడంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు, క్రీడాకారులు అభినందనలు తెలిపారు. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక రాష్ట్రస్థాయి అధ్లెటిక్స్ పోటీలకు మహదేవపూర్ జెడ్పీహెచ్ఎస్ బాలికల, బాలుర పాఠశాల విద్యార్థులు ఎంపికై నట్లు పీడీ గుర్సింగ పూర్ణిమ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాలికల విభాగంలో 100 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందెంలో 9వ తరగతి విద్యార్థిని బద్దెల విష్ణుప్రియ, 8వ తరగతి విద్యార్థిని వసంత అనుజ్ఞ, 7వ తరగతి విద్యార్థిని మాడిగ అక్షిత, 6వ తరగతి విద్యార్థిని పెద్ది మధులత, బాలుర విభాగం నుంచి 9వ తరగతి విద్యార్థి సంగం అభిరాంప్రసాద్, 6వ తరగతి విద్యార్థి సుంకరి ప్రద్యున్ ఎంపికయ్యారు. ఈనెల 23న హైదరాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొననున్నారు. విద్యార్థులను పాఠశాల హెచ్ఎం సరిత, ఉపాధ్యాయులు అభినందించారు. -
తాగునీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలి
కాటారం: వేసవికాలంలో నియోజకవర్గంలో తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆదేశించారు. కాటారం మండల కేంద్రంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో గురువారం జిల్లా కలెక్టర రాహుల్శర్మతో కలిసి పలు శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కాటారం, భూపాలపల్లి డివిజన్లలో తాగునీటి సమస్య ఉండకూడదని, అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి సమస్య పరిష్కరించాలని సూచించారు. సబ్డివిజన్ పరిధిలో 30 బోర్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని, అవసరం ఉన్న గ్రామాల్లో ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రభుత్వం ద్వారా మంజూరైన అభివృద్ది పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. కాటారం హెడ్ క్వార్టర్స్లో మినీ స్టేడియం, చిల్డ్రన్స్ పార్క్ నిర్మాణానికి స్థల సేకరణ చేపట్టాలని, నిర్మాణం పూర్తయిన గ్రామపంచాయతీ భవనాల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. పలు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, నిర్మాణాలకు చర్యలు తీసుకోవాలని అన్నారు. డివిజన్ కేంద్రంలో మంజూరు చేసిన కూరగాయల మార్కెట్, కమ్యూనిటీ హాల్ నిర్మాణాలకు టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టాలని, అంబులెన్స్, వైకుంఠ రథాల ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు వేగంగా చేయాలని, భూ సేకరణ త్వరగా పూర్తి చేయాలన్నారు. ఇసుక లారీల వేగనియంత్రణకు స్పీడ్ గన్స్, ఇతరాత్ర చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను మంత్రి ఆదేశించారు. సరస్వతి పుష్కరాల ఏర్పాట్లలో వేగం పెంచాలన్నారు. సమీక్ష సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, డీఆర్డీఓ నరేశ్, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ అయిత ప్రకాశ్రెడ్డి, కాటారం డీఎస్పీ గడ్డం రామ్మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి పెద్దపీట రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. రంజాన్ మాసం పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కాటారం మండల కేంద్రంలోని మజీద్లో ముస్లింలకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మంత్రి శ్రీధర్బాబు పాల్గొన్నారు. ముస్లింలతో కలిసి మంత్రి మజీద్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇఫ్తార్ విందులో భాగంగా ముస్లింలకు స్వీట్లు, పండ్లు తినిపించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో ముస్లిం, మైనార్టీలకు పెద్దఎత్తున నిధులు కేటాయించిందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ కిరణ్ఖరే, సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ అయిత ప్రకాశ్రెడ్డి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు సందీప్, సమ్మయ్య, ప్రభాకర్రెడ్డి, అజీజ్ పాల్గొన్నారు.రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు -
ఆర్థికాభివృద్ధివైపు అడుగులు పడట్లే!
జీడీడీపీలో వెనుకబడిన ఓరుగల్లు..అట్టడుగున ఆరు జిల్లాలు.. ● తలసరి ఆదాయంలో పుంజుకున్న భూపాలపల్లి ● 15 నుంచి 12 స్థానానికి పెరిగిన వైనం.. గతంతో పోలిస్తే పరవాలేదు ● అడవుల విస్తీర్ణంలో ములుగు ఫస్ట్.. మూడో స్థానంలో భూపాలపల్లి ● తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ – 2025లో వెల్లడిజిల్లా స్థూల దేశీయోత్పత్తి (జీడీడీపీ)లో ఉమ్మడి వరంగల్ పరిధిలోని ఆరు జిల్లాలు ఈసారి కూడా వెనుకబడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో విడుదల చేసిన తెలంగాణ సామాజిక–ఆర్థిక దృక్పథ నివేదిక – 2025 గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలో 32, 33వ స్థానంతో అట్టడుగున నిలిచాయి. ఈ జిల్లాల వృద్ధి రేటు రాష్ట్ర వ్యాప్తంగా వెనకబడి ఉంది. 2022–23 సంవత్సరాలకు ప్రస్తుత ధరల్లో జీడీడీపీ విలువ పెరుగుదల కనిపించినప్పటికీ రాష్ట్రస్థాయిలో మిగతా జిల్లాలతో పోలిస్తే చాలా వెనుకబడ్డాయి. ఉమ్మడి జిల్లా పరిస్థితులపై రాష్ట్ర ఆర్థిక, గణాంకశాఖ విడుదల చేసిన ‘‘తెలంగాణ సామాజిక–ఆర్థిక దృక్పథ నివేదిక – 2025’’ గణాంకాల ఆధారంగా ప్రత్యేక కథనం IIలోu – సాక్షి ప్రతినిధి, వరంగల్ -
డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం
భూపాలపల్లి రూరల్: డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు యువత, విద్యార్థులు మాదక ద్రవ్యానికి దూరంగా ఉండి, ఉజ్వల భవిష్యత్ కోసం బాటలు వేసుకోవాలని ఎస్పీ కిరణ్ ఖరే గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గంజాయి, డ్రగ్స్ మహమ్మారిని ప్రారంభ దశలోనే గుర్తించి, నివారించాలని తెలిపారు. యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడడం వల్ల ఆరోగ్యం క్షీణిస్తుందని తెలిపారు. నేర ప్రవృత్తి వైపు దారితీస్తుందన్న విషయం గమనించాలని పేర్కొన్నారు. తద్వారా కుటుంబ సభ్యులు, బంధువులకు దూరమవుతారని తెలిపారు. జిల్లాలో డ్రగ్స్, గంజాయి సంబంధిత సమాచారం తెలిస్తే 87126 58111 నంబర్ ద్వారా సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామ ని ఎస్పీ పేర్కొన్నారు. డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలు విక్రయిస్తే చట్ట పరంగా కఠిన చర్యలు తప్పవని ఎస్సీ హెచ్చరించారు. దరఖాస్తుల ఆహ్వానం భూపాలపల్లి రూరల్: అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి సునీత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 విద్యాసంవత్సరంలో విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల విద్యార్థులు ఈ విద్యానిధికి www. telanganaepass. cgg. gov. in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మార్చి 20వ తేదీ నుంచి మే 19వ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. సందేహాల నివృత్తికి ఫోన్ నంబర్ 99088 43340 ద్వారా సంప్రదించాలని కోరారు. పెట్రోల్ బాటిల్తో వ్యక్తి హల్చల్ మల్హర్: మండలంలోని తాడిచర్ల తహసీల్దార్ కార్యాలయంలో గురువారం ఓ వ్యక్తి పెట్రోల్ బాటిల్తో హల్చల్ చేశాడు. కొయ్యూరు ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వల్లెకుంట గ్రామానికి చెందిన నార శంకర్ కొంత కాలంగా భూమి పట్టా చేయాలంటూ కార్యాలయం చుట్టూ తిరుతున్నాడు. కాగా గురువా రం తహసీల్దార్ కార్యాలయానికి పెట్రోల్ బాటి ల్తో వచ్చి ఆర్ఐ రాజశేఖర్, జూనియర్ అసిస్టెంట్తో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో తన రికార్డులు రెవెన్యూ సిబ్బంది తారుమారు చేశారని ఆరోపణలు చేస్తూ వెంట తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్ను ఆర్ఐ టేబుల్ మీద గట్టిగా కొట్టాడు. దీంతో బేబుల్ మీద ఉన్న రికార్డులతోపాటు ఆర్ఐ రాజశేఖర్, జూనియర్ అసిస్టెంట్ కీర్తన మీద కొంత పెట్రోల్ డ్రాప్స్ పడ్డాయి. లైటర్తో వెలిగిస్తాని భయబ్రాంతులకు గురి చేయడంతో తాము వేరే రూములోకి వెళ్లినట్లు ఆర్ఐ రాజశేఖర్ వెల్లడించారు. అప్రమత్తమై పోలీసులకు సమాచార అందించామని, సదరు వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నించగా పారిపోయనట్లు పేర్కొన్నారు. తమ విధులకు ఆటకం కలిగించి, హత్యాయత్నం చేశాడని శంకర్పై చర్యలు తీసుకోవాలని ఆర్ఐ రాజశేఖర్, జూనియర్ అసిస్టెంట్ కీర్తన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కొయ్యూరు ఎస్సై నరేష్ తెలిపారు. బడ్జెట్ కేటాయింపులో బీసీలకు అన్యాయం మొగుళ్లపల్లి: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2025–2026 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో బీసీలకు అన్యాయం చేసిందని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్గౌడ్ ఆరోపించారు. గురువారం ఆయన మండల కేంద్రంలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.3,04,965 కోట్ల మొత్తం బడ్జెట్లో 56 శాతం పైగా ఉన్న బీసీలకు కేవలం 3.6శాతం రూ.11,405 ఓట్లు కేటాయించి బీసీలను అవమానపరిచారని ఆయన మండిపడ్డారు. బీసీ లకు స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదింపజేసిన ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో మాత్రం ఎందుకింత వివక్షత చూపుతుందని ప్రశ్నించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం ప్రతి సంవత్సరం బీసీలకు రూ.20 వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని చెప్పి ఇప్పుడు మాట మార్చడం సరికాదన్నారు. -
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
భూపాలపల్లి రూరల్: గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మారుమూల అటవీ గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గురువారం డీసీసీ అధ్యక్షుడు, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్ రెడ్డితో కలిసి భూపాలపల్లి మండలంలో రూ.4.73 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి ప్రజా ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ గ్రామాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికీ అందించేలా చూస్తున్నామన్నారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం, ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, బస్సులకు మహిళలను ఓనర్లను చేసినట్లు తెలిపారు. ప్రతీ మహిళ ఆర్థికంగా ఎదగాలని, ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలని, అన్ని రంగాల్లో వారిని ముందంజలో ఉంచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 12 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో మండలపార్టీ అధ్యక్షుడు సుంకరి రామచంద్రయ్యతోపాటు ఆయాగ్రామాల్లోని పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
కాటారం: జాతీయ స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలుర కళాశాల అకాడమీ విద్యార్థులు ఎంపికయ్యారు. జనవరి 18 నుంచి 20వ తేదీ వరకు కరీంనగర్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర హ్యాండ్బాల్ అసిసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్స్ 19 విభాగంలో కరీంనగర్ జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. దీంతో నిర్వాహకులు ఈ జట్టును జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. జట్టులో అత్యంత ప్రతిభ కనబర్చిన కాటా రం గిరిజన సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థి టి.జితేందర్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ రాజేందర్ తెలిపారు. మార్చి 26 నుండి 30వ తేదీ వరకు బీహార్లో జరిగే(హెచ్ఎఫ్ఐ) జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. జితేందర్ను ప్రిన్సిపాల్ రాజేందర్, వైస్ ప్రిన్సిపాల్స్ మాధవి, వెంకటయ్య, పీడీ మహేందర్, పీఈటీ శ్రీనివాస్, కోచ్ వెంకటేశ్, డిప్యూటీ వార్డెన్ నరేశ్, ఉపాధ్యాయులు అభినందించారు. ఖోఖోకు ఎంపికై న ఆనంద్ టేకుమట్ల: మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఫిజికల్ ఎడ్యూకేషన్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్న చాగంటి ఆనంద్ జాతీయ స్థాయి సివిల్ సర్వీసెస్ ఖోఖోకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా ఆయన సాక్షితో మాట్లాడుతూ జనవరిలో హైదరాబాద్లో జరిగిన ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ తెలంగాణ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చడం ద్వారా నేటి(శుక్రవారం) నుంచి ఈ నెల 24 వరకు ఢిల్లీలో కొనసాగే జాతీయ స్థాయి సివిల్ సర్వీసెస్ ఖోఖోలో తెలంగాణ జట్టులో ఆడనున్నట్లు తెలిపారు. -
మే 10లోపు పనులు పూర్తి చేయాలి
కాళేశ్వరం: మే 10 లోపు పనులన్ని పూర్తి చేసి సరస్వతి నది పుష్కరాలకు సిద్ధం కావాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లను రాష్ట్ర దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ ఆదేశించా రు. మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మే 15 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న సరస్వతి పుష్కరాల ఏర్పాట్లను దేవాదాయశాఖ కమిషనర్ శ్రీధర్, కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ కిరణ్ఖరేలతో కలిసి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా వీఐపీ ఘాట్ వద్ద మెట్ల నిర్మాణ పనులను పరి శీలించారు. 150మీటర్ల పొడవు మెట్లను 86మీటర్ల పొడవుకు కుదించిన విషయమై చర్చించారు. ఘాట్ వద్ద రహదారి వీఐపీ ఘాట్ వద్ద రూ.కోటితో కొనసాగుతున్న సరస్వతి విగ్రహం, సుందరీకరణ పనులు పరిశీలించి, విగ్రహ ఏర్పాటుకు స్థలం నిర్ణయించారు. వీఐపీ ఘాట్ నుంచి గోదావరి ఘాట్ వరకు గోదావరిలో కర్రలు లేదా స్టీల్తో రహదారి నిర్మాణం చేపట్టాలన్నారు. పురుషులు, మహిళల కోసం వేర్వేరుగా శాశ్వత మరుగుదొడ్ల నిర్మాణం వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. పుష్కరాల్లో 12 రోజులపాటు గోదావరి హారతి నిర్వహించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఇబ్బందులు కలగొద్దు భక్తులకు ఇబ్బందులు కలగకుండా సమగ్ర ప్రణాళిక, సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పూర్తి చేయాల్సిన శాశ్వత, తాత్కాలిక పనులకు ముందుగానే షెడ్యూల్ తయారు చేసుకోవాలని, సిబ్బందిని ఎక్కువ సంఖ్యలో నియమించుకోవాలని పెంచాలని సూచించారు. అంచనాల్లో వ్యత్యాసాలతో చేపట్టే పనులపై రెండు రోజుల్లో నివేదికలు అందచేయాలని సూచించారు. పుష్కరాలకు ప్రత్యేక యాప్ పుష్కర సమాచారం తెలిసేలా ప్రత్యేకంగా యాప్ తయారు చేయాలని, విస్తృత ప్రచారానికి అంబాసిడర్ను నియమించాలని తెలిపారు. 12 రోజుల కార్యక్రమాలకు సంబంధించి షెడ్యూల్ తయారు చేయాలని ఈఓ మహేష్ను ఆదేశించారు. వేసవి దృష్ట్యా గోదావరిలో చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. గోదావరిలో నీటి నిల్వలను పరిశీలించాలన్నారు. అన్న సత్రాన్ని అందుబాటులోకి తేవాలని సూచించారు. ప్రసాదాల కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులు గోదావరిలోకి వెళ్లకుండా ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. ఆర్టీసీ బస్సులు నిలిపే ప్రదేశం, 86గదుల వసతి గృహాన్ని పరిశీలించారు. సమీక్షలో సమావేశంలో కలెక్టర్ రాహుల్ శర్మ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇంజనీరింగ్ శాఖల ద్వారా చేపట్టనున్న పనుల ప్రగతిని వివరించారు. కాటారం సబ్కలెక్టర్ మయాంక్సింగ్, దేవాదాయశాఖ ఆర్జేసీ రామకృష్ణారావు, ఏసీ సునీత, ఈఓ మహేష్, డీఎస్పీ రామ్మోహన్రెడ్డి, సీఐ రామచందర్రావు, ఎస్సైలు తమాషారెడ్డి, పవన్ పాల్గొన్నారు. మే 15 నుంచి 26 వరకు సరస్వతి పుష్కరాలు ఏర్పాట్లను పరిశీలించిన దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ కాళేశ్వరం ఈఓ కార్యాలయంలో అధికారులతో సమీక్ష -
విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి
భూపాలపల్లి రూరల్: పదో తరగతిలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని డీఈఓ రాజేందర్, జిల్లా పౌర సంబంధాల అధికారి శ్రీనివాస్ విద్యార్థులకు సూచించారు. భూపాలపల్లి మండలంలోని గొల్లబద్దారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. విద్యార్థులు కృషి, పట్టుదలతో ముందుకు సాగితే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని తెలిపారు. కలెక్టర్ సంతకం చేసిన ‘అందరూ చదవాలి.. అందరూ ఎదగాలి‘ అనే ప్రేరణ కరపత్రాన్ని విద్యార్థులకు అందజేశారు. పరీక్షా ప్యాడ్, పెన్నులు పంపిణీ చేశారు. ప్రధానోపాధ్యాయులు రవీందర్ రెడ్డి, ప్లానింగ్ కోఆర్డినేటర్ రాజ్ గోపాల్, లక్ష్మీనారాయణ, తిరుపతి రెడ్డి, సునీత, విద్యార్థులు పాల్గొన్నారు. దరఖాస్తుల స్వీకరణ భూపాలపల్లి రూరల్: రాజీవ్ యువ వికాసం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాల వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా రూ.4లక్షల వరకు ఆర్థిక సాయాన్ని 60 నుంచి 80 శాతం సబ్సిడీతో అందించనుంది. ఈమేరకు ఆసక్తి, అర్హతగల వారు ఆధార్, కులం, నివాసం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో ఏప్రిల్ 5వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని, జిల్లా కలెక్టరేట్ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్ పరీక్షలో 10 మంది విద్యార్థుల డీబార్ భూపాలపల్లి అర్బన్: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వార్షికల్లో భాగంగా బుధవారం 10 మంది విద్యార్థులు డీబార్ అయినట్లు నోడల్ అధికారి వెంకన్న తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సెంటర్లో ఆరుగురు, తేజస్విని గాంధీ జూనియర్ కళాశాల సెంటర్లో నలుగురు విద్యార్థులను స్పెషల్ స్క్వాడ్ డీబార్ చేసినట్లు వెల్లడించారు. కలెక్టరేట్ ఎదుట ఆశ వర్కర్ల ఆందోళన భూపాలపల్లి అర్బన్: వైద్యారోగ్యశాఖ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న తమకు కనీస వేతనాలు అమలు చేసి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఆశ కార్యకర్తలు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఉదయం 8గంటలకే కలెక్టరేట్కు చేరుకోని ధర్నా, ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. ఈసందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బందు సాయిలు, తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కేతం విజయ, మెట్టుకొండ లక్ష్మి మాట్లాడారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశాలకు ప్రభుత్వం రూ.18,000 వేతనం నిర్ణయించాలని, పదోన్నతులు కల్పించి పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు డిమాండ్లు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఆకుదార రమేష్, రాజేందర్, ఆశాలు తిరుమల, రాధిక, రాజేశ్వర్రెడ్డి, రమ, సరిత, యాకూబ్, శారద పాల్గొన్నారు. నేడు దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాక కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మే 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరుగనున్న సరస్వతీ నది పుష్కరాల అభివృద్ధి పనుల పరిశీలనకు దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, కమిషనర్ శ్రీధర్ గురువారం రానున్నారు. ఉదయం 10 గంటలకు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించనున్నారు. కాగా, అభివృద్ధి పనులకు రూ.25కోట్ల నిధులు విడుదల చేసిన విషయం తెలిసిందే. -
సంక్షేమం, ఐటీ, అభివృద్ధిపైన ఆశలు..
ఎస్సీ, బీసీ, ఎస్టీ, మహిళా సంక్షేమం కోసం ఈసారి భారీ కేటాయింపులే జరిగాయి. అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా కలిగిన జిల్లాలో ఆ వర్గాలకు మేలు జరుగనుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఎస్సీ సంక్షేమం కోసం రూ.40,232, ఎస్టీలకు రూ.17,169 కోట్లు కేటాయించడం పట్ల ఉమ్మడి వరంగల్కు ప్రాధాన్యం ఉంటుందంటున్నారు. ఐటీ, పరిశ్రమల రంగంపైన దృష్టి సారించిన నేపథ్యంలో రెండో నగరంగా వరంగల్ వృద్ధి చెందుతుందన్న ఆశాభావం కూడా వ్యక్తమవుతోంది. పీఎం మిత్ర నిధులతో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు మరింత అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉండగా, ఐటీ హబ్, టెక్స్టైల్ పార్కు, మడికొండ పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలపై ఆశలు రేకెత్తుతున్నాయి. ఎకో టూరిజానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిన నేపథ్యంలో ములుగు, జేఎస్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలకు మహర్దశ రానుంది. -
హరిబాబును సస్పెండ్ చేయరా.?
భూపాలపల్లి అర్బన్: నాగవెళ్లి రాజలింగమూర్తి హత్య కేసులో బీఆర్ఎస్ నాయకుడు కొత్త హరిబాబు పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయడం లేదని రాజలింగమూర్తి భార్య సరళ ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సరళ మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ హత్య రాజకీయాలు చేయడం లేదని చెప్పిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కొత్త హరిబాబు, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిలతోపాటు కేటీఆర్, హరీశ్రావుల పాత్ర ఉన్నట్లు దాడి జరిగిన రోజునే పోలీస్స్టేషన్ ఫిర్యాదు చేస్తే డీఎస్పీ, సీఐలు ఫిర్యాదును రద్దు చేసి వారికి అనుకూలంగా ఫిర్యాదు రాసుకొని సంతకాలు చేయించుకున్నట్లు తెలిపారు. మేడిగడ్డ, బీఆర్ఎస్ నాయకుల అక్రమాలు, ప్రభుత్వ భూముల కబ్జాలపై పోరాటాలు నిర్వహించినందుకే హత్య చేశారని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ కౌన్సిలర్గా ఉన్న తనను అకారణంగా సస్పెండ్ చేశారని, హత్య చేసిన హరిబాబును ఎందుకు ఇప్పటికీ సస్పెండ్ చేయలేదన్నారు. తప్పు చేయని హరిబాబు ఎందుకు తప్పించుకు తిరిగాడ ని ప్రశ్నించారు. తనకు ప్రాణభయం ఉందని, బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ఇంటి చుట్టూ కొత్త వ్యక్తులు తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్రెడ్డి స్పందించి సీబీసీఐడీతో విచారణ జరిపించాలని కోరారు. హరిబాబు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు..? భూపాలపల్లి: సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి హత్య కేసులో నిందితుడిగా ఉన్న భూపాలపల్లి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు కొత్త హరిబాబు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టి వేసింది. భూపాలపల్లి పట్టణానికి చెందిన రాజలింగమూర్తి గత నెల 19న హత్యకు గురి కాగా హరిబాబు ఏ8 నిందితుడిగా ఉన్నాడు. ఈ నెల 4న ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు. వాదనలు జరుగుతున్న సమయంలోనే మంగళవారం అతడిని భూపాలపల్లి పోలీసులు అదుపులోకి తీసుకొని జిల్లా కేంద్రంలోని ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచి, జడ్జి ఆదేశాల మేరకు ఖమ్మం జైలుకు తరలించారు. బుధవారం హైకోర్టులో వాదనలు జరుగగా హరిబాబు బెయిల్ పిటిషన్ను కొట్టివేసినట్లు సమాచారం. -
ఆరు గ్యారంటీలకు బడ్జెట్లో ప్రాధాన్యం.. మహిళా పథకాలకు పెద్దపీట
సాక్షి ప్రతినిధి, వరంగల్: అసెంబ్లీలో ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన 2025–26 రాష్ట్ర బడ్జెట్లో ఉమ్మడి వరంగల్కు దక్కిన ప్రాధాన్యంపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. రెండో రాజధానిగా హైదరాబాద్కు పోటీగా అభివృద్ధి చేస్తామంటున్న ప్రభుత్వం.. బడ్జెట్లో ఆ మేరకు ప్రాధాన్యం ఇవ్వలేదన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో అభివృద్ధి, సంక్షేమ రంగాలకు చేసిన కేటాయింపుల్లోనే ఉమ్మడి వరంగల్కు ప్రయోజనాలు కలుగుతాయన్న మరో వాదన కూడా వినిపిస్తోంది. ముఖ్యమంత్రిగా మొదటిసారి వరంగల్ నగరంలో పర్యటించిన రేవంత్రెడ్డి.. నగరం అభివృద్ధి కోసం 8 అంశాలు ప్రాధాన్యంగా రూ.6,115 కోట్ల విడుదలకు ఉత్తర్వులు జారీ చేశారు. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ఇన్నర్, ఔటర్ రింగు రోడ్లు, మామునూరు ఎయిర్పోర్టు తదితర అంశాలు అందులో ఉన్నాయి. వీటికి నేరుగా నిధులు ఇచ్చేలా ప్రతిపాదనలు చేసినట్లు బడ్జెట్లో కనిపించ లేదు. కాగా, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినట్లుగా కనిపించిందన్న చర్చ ఉంది. ● విద్య, వైద్య రంగాలకు కేటాయింపులపై భిన్నస్వరాలు ● అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, ఎయిర్పోర్టు, ‘సూపర్’ ప్రస్తావన లేదు ● కాళేశ్వరానికి రూ.2,685 కోట్లు.. దేవాదులకు రూ.245 కోట్లు ● స్మార్ట్సిటీకి రూ.179 కోట్లు, కేయూసీ, జీడబ్ల్యూఎంసీకి రూ.100 కోట్లు ● రామప్ప, పాకాలకు రూ.ఐదేసి కోట్లు.. ‘కాళోజీ’కి రూ.రెండు కోట్లే ● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఊతం ● ఎకో టూరిజం ప్రస్తావన.. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఆశలు -
కూలీలు కొలతల ప్రకారం పని చేయాలి
చిట్యాల: ఉపాధి హామీ కూలీలు కొలతల ప్రకారం పని చేయాలని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి అ న్నారు. బుధవారం మండలంలోని లక్ష్మీపూర్తండా గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆమె ఆకస్మీకంగా తనిఖీ చేశారు. కూలీల హాజరు పట్టికను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతీరోజు రూ.300 కూలీ పడే విధంగా కూలీలు కొలతలప్రకారం పని చేసుకోవాలని తెలిపారు. పని ప్రదేశంలో కూలీల కోసం తాగానీరు, నీడ సౌకర్యం, ప్రథమ చికిత్స బాక్స్ను అందుబాటులో ఉంచాలని పంచాయితీ కార్యదర్శికి సూ చించారు. ఆమె వెంట ఎంపీడీఓ జయశ్రీ, ఎంపీఓ రామకృష్ణ, ఏపీఓ అలీంపాషా, ఈసీ సుధాకర్, పంచాయితీ కార్యదర్శి శ్రీకాంత్, ఏఫ్ఏ రాజు ఉన్నారు. ఇళ్ల పనులు పూర్తి చేయాలి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు త్వరగా ఇళ్ల పనులు పూర్తి చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి కోరారు. మండలంలో ఇటీవల ఎంపికై న ముచినిపర్తి గ్రామంలో నిర్మించుకుంటున్న ఇందిర మ్మ ఇళ్లను బుధవారం ఆమె పరిశీలించారు. ఎంపీడీఓ జయశ్రీ, ఎంపీఓ రామకృష్ణ ఉన్నారు. కాటారం: మహాముత్తారం మండలం మదారం మామిడికుంటలో కొనసాగుతున్న ఎంఐ ట్యాంక్, ఫిష్ పాండ్ పనులను డీఆర్డీఓ నరేశ్ బుధవారం పరిశీలించారు. పని ప్రదేశంలో సౌకర్యాలు, కూలీల హాజరు, పనుల తీరుపై ఆయన ఆరా తీశారు. కూలీ లకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేసి వేసవిలో కూలీ లు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఎంపీడీఓ శ్రీనివాస్, ఈసీ నాగేందర్, టీఏ, పంచాయతీ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నారు.అదనపు కలెక్టర్ విజయలక్ష్మి -
విద్యారంగానికి మంచి రోజులు..
ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రోత్సహించడానికి ఈసారి రూ.23,108 కోట్లు కేటా యించింది. దీంతో సర్కారు చదువులకు ఇంకా మంచి జరగనుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. 20–25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మించ తలపెట్టిన ప్రభుత్వం ఇటీవల ఉమ్మడి జిల్లాకు రూ.1400 కోట్లతో ఏడింటిని మంజూరు చేసింది. ఈ బడ్జెట్తో ఈసారి ఆ స్కూళ్లు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. అలాగే, వరంగల్లో మొత్తం 3,331 ప్రభుత్వ బడులు ఉండగా, అందులో 4,67,011 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు, ప్రహరీలతోపాటు మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈసారి నిధులు వెచ్చించే అవకాశం ఉంది. -
అందరినోటా ఆరు గ్యారంటీలు..
కాంగ్రెస్ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో చేర్చిన ఆరు గ్యారంటీ పథకాలకు ఈ బడ్జెట్లోనూ అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఉమ్మడి జిల్లాలో 8,77,173 మంది రైతులకు రైతుభరోసా పథకం ఈ ఏడాది కూడా అమలు కానుంది. ఒక కార్పొరేషన్, 9 మున్సిపాలిటీలు, 1,708 గ్రామపంచాయతీలుండగా మహాలక్ష్మి పథకం కింద సుమారు ప్రతి మహిళకు రూ.2.500 చొప్పున సుమారు 7.21 లక్షల మందికి అందే అవకాశం ఉంది. ఆర్టీసీ బస్సుల్లో వరంగల్ రీజియన్లో రోజుకు సగటున సుమారు 55 వేల మంది మహిళలు ఉచితంగా రాకపోకలు సాగించేందుకు ఢోకా లేదు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ కనెక్షన్లపై రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకంలో 6,10,220 మంది లబ్ధిదారులకు కొనసాగనుంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఇప్పటికే 2.50 లక్షల మందిని రెవెన్యూ అధికారులు అర్హులుగా గుర్తించగా, గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల లోపు కరెంట్ వాడిన 6,12,901 మందికి ఉచిత విద్యుత్ సౌకర్యం కలగనుంది. -
అభివృద్ధి పనుల్లో వేగంపెంచాలి
మల్హర్: పీఎంశ్రీ పథకం ద్వారా మండలంలోని ఎడ్లపల్లి మోడల్ పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. మండలంలోని ఎడ్లపల్లి మోడల్ స్కూల్లో పీఎంశ్రీ పథకం ద్వారా పాఠశాల మొదటి అంతస్తులో నిర్మిస్తున్న సైన్స్ ల్యాబ్, మరుగుదొడ్ల నిర్మాణం పనులు, ఆర్ఓ ప్లాంట్ను ఆయన బుధవారం పరిశీలించి, ఉపాధ్యాయులతో మాట్లాడారు. పాఠశాల మొదటి అంతస్తులో కిటికీ డోర్స్, గ్రిల్స్ తలుపులు ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయులు.. కలెక్టర్ను కోరగా ఏర్పాటు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపా ల్ పూర్ణచందర్ రావు, తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీఓ శ్యాం సుందర్ పాల్గొన్నారు. రాజకీయ పార్టీల సహకారం అవసరం భూపాలపల్లి: ఓటరు జాబితా రూపకల్పన, నవీకరణకు రాజకీయ పార్టీల సహకారం అవసరమని జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ తెలిపారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతీ ఓటరు జాబితాలో ఉండేలా చూడాలన్నారు. తహసీల్దార్ శ్రీనివాసులు, అబ్బాస్, ఇమా మ్, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ‘పది’ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి.. ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా బోధన సాగిందని తెలిపారు. గత ఏడాది వార్షిక ఫలితాల్లో 93 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 16వ స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. కలెక్టర్ రాహుల్ శర్మ -
ఉపాధి కూలీలకు వసతులు కల్పించాలి
మల్హర్: ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఉపాధిహామీ పనులకు వచ్చే కూలీలకు పని ప్రదేశంలో అన్ని వసతులు కల్పించాలని డీఆర్డీఓ నరేష్ సిబ్బందిని ఆదేశించారు. మండలంలోని ఎడ్లపల్లి గ్రామంలో చేపడతున్న ఉపాధిహామీ పనులను డీఆర్డీఓ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నరేష్ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొలతల ప్రకారం పనిచేస్తే ఒక్క రోజుకు రూ.300 చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. అన్ని జీపీల్లోని పని ప్రదేశాల్లో కూలీలకు తాగునీరు, నీడ పందిరి, మెడికల్ కిట్లు ఏర్పాటు చేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ హరీశ్, టెక్నికల్ అసిస్టెంట్లు రమేష్, శైలజ, శేఖర్, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. యూరియా వాడకం తగ్గించాలి గణపురం: రైతులు వరి పంటలో యూరియా వాడకం తగ్గించాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎన్.వీరునాయక్ అన్నారు. మండలకేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం పంట నమోదు ప్రక్రియను పరిశీలించి రైతులు వేసిన వరిపంటపై యూరియా ఎక్కువగా వాడుతున్నారని అన్నారు. యూరియా వాడకం తగ్గించాలని కోరారు. యూరియా అధికంగా వాడడం మూలంగా చీడపీడలు ఎక్కువగా ఆశిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఐలయ్య, పీఏసీఏస్ సీఈఓ భిక్షపతి, ఏఈఓలు పాల్గొన్నారు. సౌకర్యాలను పరిశీలించిన ఆర్డీఓ భూపాలపల్లి అర్బన్: పదో తరగతి పరీక్షల నేపథ్యంలో జిల్లాకేంద్రంలోని పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్న సౌకర్యాలను మంగళవారం ఆర్డీఓ రవి తహసీల్దార్ శ్రీనివాసులుతో కలిసి పరిశీలించారు. పట్టణంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సింగరేణి హైస్కూల్, జంగేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. ఆశ్రమ పాఠశాలలో వంట గదులు, తరగతి గదులను తనిఖీ చేశారు. పదో తరగతి పరీక్షల నేపథ్యంలో సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలి భూపాలపల్లి అర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని భారతీయ మజ్ధూర్ సంఘ్ (బీఎంఎస్) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. భారతీయ మజ్ధూర్ సంఘ్ జాతీయ కమిటీ పిలుపు మేరకు మంగళవారం జిల్లాకేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తంచేసి అదనపు కలెక్టర్ అశోక్కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈపీఎఫ్ వేతన పరి మితిని రూ.15వేల నుంచి రూ.30వేలకు పెంచాలన్నారు. ప్రభుత్వ ఆస్తుల విక్రయాలపై తక్షణ నిషేదం విధించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుజేందర్, మల్లేష్, నర్సింగరావు, మల్లయ్య, రఘుపతిరెడ్డి, మల్లేష్, మొగిలి, భిక్షపతి, సురేష్ పాల్గొన్నారు. -
‘ఎల్ఆర్ఎస్’ను సద్వినియోగం చేసుకోవాలి
భూపాలపల్లి రూరల్: ప్రభుత్వం కల్పించిన ప్లాట్ల లేఅవుట్ క్రమబద్ధీకరణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాహుల్శర్మ సూచించారు. ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ ప్రక్రియపై ఐడీఓసీ కార్యాలయ సమావేశపు హాలులో మంగళవారం లే అవుట్స్ ఓనర్లు, లైసెన్స్ సర్వేయర్లు, డాక్యుమెంట్ రైటర్స్తో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెలాఖరు వరకు ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపులో ప్రభుత్వం 25శాతం రాయితీ అవకాశం కల్పించిందని.. అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని స్పష్టంచేశారు. ప్లాట్లు కొనుగోలు చేసి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ కలిగిన వారికి కూడా 31లోగా ఎస్ఆర్ఎస్ చేసుకుంటే 25 శాతం రాయితీ వర్తిస్తుందని అన్నారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎల్ఆర్ఎస్ కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఎస్ఆర్ఎస్ రెగ్యులరైజేషన్ కోసం సంబంధించి ఏదేని సలహాల కోసం మున్సిపల్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, సబ్ రిజిస్ట్రార్ రాము, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, టిపిఓ సునీల్, లేఅవుట్ ఓనర్లు, లైసెన్స్ సర్వేయర్లు, డాక్యూమెంట్ రైటర్లు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
ఆన్లైన్లోనే తరగతులు..
నర్సింగ్ కళాశాలకు భవనం కరువుభవన నిర్మాణానికి రూ.26కోట్ల నిధులు నర్సింగ్ కళాశాల, హాస్టల్ భవన నిర్మాణాల కోసం ప్రభుత్వం గతేడాది రూ.26కోట్ల నిధులను కేటాయించింది. రెవెన్యూ శాఖ అధికారులు భూమిని కేటాయిస్తే టెండర్లు పూర్తిచేసి భవన నిర్మాణం చేపట్టే అవకాశాలు ఉన్నాయి. అధికారులు స్థల సేకరణపై శ్రద్ధ చూపనట్లు కనిపిస్తుంది. కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి భవన నిర్మాణం చేపట్టాలని.. అప్పటివరకు తాత్కాలిక భవనం కేటాయించాలని విద్యార్థులు కోరుతున్నారు. భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలో ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమైన నర్సింగ్ విద్య అంతంత మాత్రమే నడుస్తుంది. కళాశాలకు భవన సౌకర్యం లేకపోవడంతో గత డిసెంబర్లో వర్చువల్ పద్ధతిలో ప్రారంభమైన నర్సింగ్ కళాశాల తరగతులు నిర్వహిస్తున్నారు. వసతి, తరగతులకు భవనం లేకపోవడంతో విద్యార్థులు ఆన్లైన్ తరగతులతో నెట్టుకొస్తున్నారు. జిల్లాకేంద్రంలోని వైద్య కళాశాల సమీపంలో ఆయూష్ ఆస్పత్రిని వినియోగించుకునేలా ఏర్పాట్లు చేసి భవనానికి నర్సింగ్ కళాశాల అని బోర్డు కూడా పెట్టారు. తీరా కళాశాల ప్రారంభోత్సవ సమయానికి ఆయూష్ విభాగం అధికారులు భవ నం అప్పగించలేమని చెప్పడంతో తాత్కాలికంగా వైద్య కళాశాలలో వర్చువల్ పద్ధతిన కళాశాలను ప్రారంభించగా 45మంది విద్యార్థులు ప్ర వేశాలు పొందారు. సరైన భవనం లేకపోవడంతో తరగతుల నిర్వహణ భారమైంది. దీంతో ఆన్లైన్లో విద్యార్థులు తరగతులను వింటున్నా నెట్వర్క్ సమస్యతో పాటు, కొంతమంది విద్యార్థులకు సరైన ఫోన్లు అందుబాటులో లే కపోవడం సమస్యగా మారుతోంది. జూన్ మాసంలో మొదటి సెమిస్టర్ ఉండటంతో ఇదే పరిస్థితి కొనసాగితే విద్యార్థుల భవిష్యత్ ఎలా ఉంటుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.● ఆయూష్ ఆస్పత్రి భవనం అప్పగించి.. అంతలోనే రద్దుచేసి.. ● నిధులు మంజూరైనా స్థలం కరువుఅధ్యాపకుల కొరత నర్సింగ్ కళాశాలకు సంబంధించి ప్రవేశాల ప్రక్రియలో భాగంగా 60మంది విద్యార్థులతో మొదటి సంవత్సరం ప్రారంభం కావాల్సి ఉన్నా కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ మాత్రం 45మందికి మాత్రమే ప్రవేశాలు కల్పించేలా ఉత్తర్వులు జారీచేసింది. దీంతో మొదటి సంవత్సరంలో 45మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. కళాశాల తరగతుల నిర్వహణకు సంబంధించి ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ సహా ముగ్గురు ప్రొఫెసర్లు, ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 16మంది అధ్యాపకులు ఉండాలి. కళాశాల నిర్వహణకు సంబంధించి ఒక ఏఓ, ఇద్దరు చొప్పున యూడీసీ, ఎల్డీసీ, ఒక ఆఫీస్ సబార్డినేట్ ఉండాలి. కాంట్రాక్ట్ పద్ధతిలో శానిటేషన్, క్లీనింగ్ చేసేందుకు మరొక 40మంది సిబ్బంది అవసరం. కానీ ప్రస్తుతం ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్తో పాటు జిల్లా జనరల్ ఆస్పత్రికి చెందిన ఐదుగురు నర్సింగ్ ఆపీసర్లు విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు.స్థల సేకరణ పూర్తయితే భవన నిర్మాణం.. కళాశాల నిర్మాణానికి స్థలం, తాత్కాలిక భవనం కేటాయించాలని కలెక్టర్ను పలుమార్లు కలిశాం. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఆన్లైన్లో జూమ్ యాప్ ద్వారా నిత్యం నాలుగు తరగతులను నిర్వహిస్తున్నాం. కళాశాల భవనం, అధ్యాపకులు, సిబ్బంది నియామకంపై ఇప్పటికే అధికారులకు నివేదికలు అందించాం. తరగతుల నిర్వహణలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. – ఉమామహేశ్వరి, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్● -
విద్యా సామర్థ్యాలను పెంపొందించాలి
చిట్యాల: పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు విద్యా సామర్థ్యాలను పెంపొందించేలా ఉపాధ్యాయులు శ్రద్ధ తీసుకోవాలని రాష్ట్ర విద్యా పరిశీలకులు (ఎస్సీఈఆర్టీ) రాంబాబు అన్నారు. మండలకేంద్రంలోని ఉన్నత పాఠశాలను మంగళవారం పర్యవేక్షించారు. అనంతరం రిజిస్టర్లను పరిశీలించారు. వి ద్యార్థులను గ్రూపులుగా విభజించి వారి విద్యా సా మర్థ్యాలను పెంపొందించే కోసం పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అకాడమిక్ మాని టరింగ్ అధికారి కె.లక్ష్మన్, ఎంఈఓ కొడెపాక రఘుపతి, ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయులు శ్రీరాం రఘుపతి, ఉపాధ్యాయులు బొమ్మ రాజమౌళి, బుర్ర సద య్య, రామనారాయణ, ఉస్మాన్ అలీ, శంకర్, శ్రీని వాస్, నీలిమా రెడ్డి, సరళాదేవి, విజయలక్ష్మి, కల్పన, సుజాత, మౌనిక, సీఆర్పి రాజు పాల్గొన్నారు. ప్రణాళికలపై సమీక్ష గణపురం: పదో తరగతి విద్యార్థుల ప్రగతి, ఫ్రీ పైనల్ ఫలితాలతో పాటు వారి విద్యాభివృద్ధి కోసం ఉపాధ్యాయులు చేపట్టిన ప్రణాళికలపై రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి పరిశోధకులు రాంబాబు సమీక్ష నిర్వహించారు. మండలకేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల/కళాశాలను ఆయన సందర్శించారు. అనంతరం పాఠశాలలోని పలు రికార్డులను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఉప్పలయ్య, పాఠశాల ప్రిన్సిపాల్ తిరుపతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.ఎస్సీఈఆర్టీ రాష్ట్ర పరిశీలకులు రాంబాబు -
‘దేవాదుల’ గట్టెక్కించేనా?
సాక్షిప్రతినిధి, వరంగల్/హసన్పర్తి/ధర్మసాగర్: వేసవి ఎండల తీవ్రత.. అడుగంటుతున్న భూగర్భజలాలు.. దీంతో జనగామ, హనుమకొండ జిల్లాల్లోని నాలుగు నియోజకవర్గాల్లో అక్కడక్కడ పంటలు ఎండుతున్నాయి. చేతికందే దశలో దేవాదుల ప్రాజెక్టు పరిధిలో వరి పంటలు దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్టు కింద 50 నుంచి 60వేల ఎకరాలకు సాగునీరందించేలా దేవాదుల ప్రాజెక్టు మూడవ దశలో భాగంగా దేవన్నపేటలో నిర్మించిన పంప్హౌజ్ మోటార్లను జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో కలిసి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రారంభించేందుకు మంగళవారం సాయంత్రం పంపుహౌజ్కు చేరుకున్నారు. కానీ, మోటారు మరమ్మతుకు రావడం, ఆస్ట్రియానుంచి వచ్చిన బృందం చేపట్టిన రిపేర్లు పూర్తి కాకపోవడంతో మంత్రులు రాత్రి ఎన్ఐటీ గెస్టుహౌస్లో ఉన్నారు. అసెంబ్లీలో బుధవారం బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో రాత్రి 11.30 గంటలకు హైదరాబాద్కు వెళ్లిపోయారు. ఫేజ్–3 పనులపైనే దృష్టి... చేతికందే పంటలను కాపాడేందుకు మూడో ఫేజ్ పనులపై అధికారులు దృష్టి సారించారు. దేవన్నపేట పంపుహౌజ్లో ప్రస్తుతం ఒక్కో మోటారు 800 క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఇక్కడ మూడు మోటార్లు ఏర్పాటు చేయగా.. అందులో ఒక్కటి ఆన్చేసి జనగామ, పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో సుమారు 60వేల నుంచి 65వేల ఎకరాల వరకు సాగునీరు అందించడంపై దృష్టి పెట్టారు. మంగళవారం రాత్రి వరకు మోటారు మొరాయించడంతో ఈ యాసంగి పంట చేతికందే వరకు నీటి సరఫరా అవుతుందా? అన్న ఆందోళన ఆ నాలుగు నియోజకవర్గాల్లోని రైతుల్లో వ్యక్తమవుతోంది. హడావుడిగా సాగిన మంత్రుల పర్యటన.. దేవాదుల చివరి ఆయకట్టుకు సాగునీరందిచేందుకు యుద్ధప్రాతిపదికన ఖరారైన మంత్రుల టూర్ హడావిడిగా సాగింది. మొదట మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా హసన్పర్తి మండలం దేవన్నపేటకు పంప్హౌజ్కు చేరుకున్నారు. అక్కడినుంచి ధర్మసాగర్ రిజర్వాయర్లో నీరు పంపింగ్ అయ్యేలా మోటార్ ఆన్ చేయాల్సి ఉంది. అనంతరం ధర్మసాగర్ రిజర్వాయర్కు చేరుకుని అక్కడ పూజలు చేసి.. మీడియా సమావేశంలో మాట్లాడుతారనేది షెడ్యూల్. కానీ, అనుకున్న ప్రకారం దేవన్నపేటకు మంత్రులు చేరుకున్నప్పటికీ మోటార్ మొరాయించడంతో స్విచాన్ చేయకుండా అక్కడే అధికారులతో సమీక్ష నిర్వహించారు. ధర్మసాగర్ రిజర్వాయర్ వద్ద వేసిన టెంట్లు, కుర్చీల వద్దే ప్రజలు, కార్యకర్తలు ఉండిపోయారు. చివరి నిమిషంలో మీడియా సమావేశం దేవన్నపేటలోనే ఉంటుందనడంతో ధర్మసాగర్ నుంచి దేవన్నపేటకు మీడియాతోపాటు నాయకులు, కార్యకర్తలు, అధికారులు వెళ్లాల్సి వచ్చింది. కాగా దేవన్నపేట పంపుహౌజ్, ధర్మసాగర్ రిజర్వాయర్తోపాటు పలుచోట్ల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల పక్కన ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, మామిడాల యశస్విని రెడ్డి తదితరుల ఫొటోలు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. రాత్రి వరకు కాని మోటార్ మరమ్మతు చివరి ఆయకట్టు రైతుల్లో ఆందోళన హడావుడిగా సాగిన మంత్రుల పర్యటన ‘ధర్మసాగర్ రిజర్వాయర్’ కార్యక్రమం రద్దు దేవన్నపేట పంపుహౌజ్కు హుటాహుటిన అధికారులు అధికారులపై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం దేవాదుల ప్రాజెక్టు దశలు ఎప్పుడు ప్రారంభమయ్యాయని, ఇతర అంశాలపై మంత్రులు అడిగిన ప్రశ్నలకు నీటిపారుదల శాఖ అధికారుల నుంచి సరైన సమాధానం లేదు. దీంతో వారిపై మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమీక్షకు సమాచారం లేకుండా ఉత్త చేతులతో వస్తారా అని మండిపడ్డారు. చిన్న చిన్న సమస్యలతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, బల్దియా కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, కుడా చైర్మన్ వెంకట్రామిరెడ్డి, మేయర్ గుండు సుధారాణి, పీసీసీ మాజీ కార్యదర్శి నమిండ్ల శ్రీనివాస్, ఎన్ఎస్యూఐ జిల్లా మాజీ అధ్యక్షుడు సురేందర్రెడ్డితోపాటు దేవాదుల ఉన్నతాఽధికారులు పాల్గొన్నారు. -
కుష్ఠు వ్యాధి నిర్మూలనకు సహకరించాలి
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో కుష్ఠు వ్యాధి నిర్మూళనకు సహకరించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ అన్నారు. ఈ నెల 30వ తేదీ వరకు నిర్వహించనున్న సర్వేను విజయవంతం చేయాలని కోరారు. కుష్ఠు వ్యాధి సర్వే, నిర్మూళనపై జిల్లాకేంద్రంలోని తన కార్యాలయంలో మంగళవారం వైద్యాధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో కుష్ఠు వ్యాధిగ్రస్తులు, అనుమానితులను గుర్తించేందుకు జిల్లావ్యాప్తంగా టీమ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంటింటికి వచ్చే ఆరోగ్య కార్యకర్తలకు జిల్లా ప్రజలు సహకరించాలని కోరారు. వ్యాధి లక్షణాలు ఉంటే తెలియజేయాలని కోరారు. వ్యాధిబారిన పడిన వారికి ప్రభుత్వం తరఫున రూ.12వేల ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ప్రోగ్రాం అధికారులు, వైద్యాధికారులు రవిరాథోడ్, శ్రీదేవి, ఉమాదేవి, సిబ్బంది మల్లయ్య, శ్రీదేవి పాల్గొన్నారు.జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ -
మంగళవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2025
ఉమ్మడి వరంగల్ జిల్లాలో టెన్త్ విద్యార్థుల వివరాలు– 8లోuఏడాదంతా చదివింది ఒక ఎత్తయితే.. దాన్ని పరీక్షల్లో ప్రజెంట్ చేయడం మరో ఎత్తు.. కొందరు విద్యార్థులు బాగా చదువుతారు. తీరా పరీక్ష సమయానికి మరిచిపోతుంటారు.. మరికొందరేమో ఎంత చదివినా హ్యాండ్ రైటింగ్ బాగోలేక మార్కులు కోల్పోతారు.. ఇంకొందరైతే పరీక్ష అంటే గాబరా పడిపోయి ప్రశ్నల కు సమాధానం తెలిసినా నిర్ణీత సమయంలో రాయలేకపోతారు.. ఇలా చాలా మంది విద్యార్థులు ఏదో ఒక సమస్యతో బాధపడేవారే. వీరంతా మంచి మార్కులు సాధించేందుకు, పరీక్షలను ఈజీగా రాసేందుకు సబ్జెక్టు నిపుణులు సూచనలిస్తున్నారు. ఈనెల 21 నుంచి పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. మంచి మార్కులు సాధించడానికి ఆయా సబ్జెక్టుల నిపుణులను ‘సాక్షి’ పలకరించింది. విద్యార్థుల కోసం వారు తమ సూచనలు, సలహాలు వెల్లడించారు. – మహబూబాబాద్ అర్బన్ మొత్తం విద్యార్థులు 42,262బాలికలు 20,600బాలురు 21,662ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలిపదో తరగతి వార్షిక పరీక్షలు మరో మూడ్రోజుల్లో ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలి. బాగా చదివాను.. పరీక్షలు బాగా రాస్తాను.. అనే భావనతో వెళ్లాలి. నెగెటివ్ ఆలోచనలను దరిచేర నీయొద్దు. గతంలో సాధించిన విజయాలను గుర్తు చేసుకోవాలి. టీవీ, సెల్ఫోన్, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి. ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు వహించాలి. ఫాస్ట్ఫుడ్, జంక్ఫుడ్ జోలికి వెళ్లొద్దు. సాత్విక ఆహారం తీసుకుంటే తొందరగా జీర్ణమవుతుంది. తగినంతగా నీరు తాగాలి. ఎవరైనా ఒత్తిడికి లోనైనా.. పరీక్షలంటే భయం కలిగినా 93911 17100, 94408 90073 నంబర్లకు ఫోన్ చేస్తే తగిన సూచనలిస్తాం. – పోగు అశోక్, తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వివరాలు 8లోu -
ఇసుక లారీలతో ట్రాఫిక్ జామ్
వెంకటాపురం(కె): మండల పరిధిలోని యాకన్నగూడెం గ్రామ సమీపంలోని రాళ్లవాగు సమీపంలో బ్రిడ్జి కుంగిపోవటంతో వాగులో నుంచి తాత్కాలికంగా రోడ్డును వేశారు. వాహనాల రాకపోకలతో వాగులో ఏర్పాటు చేసిన తాత్కాలిక రోడ్డు గుంతలమయంగా మారటంతో పాటు వాహనాలు రోడ్డు పై దిగబడుతున్నాయి. సోమవారం రోడ్డుపై మట్టిపోసి డోజర్తో చదునుచేసే పనులు చేపట్టారు. దీంతో సుమారు గంటపాటు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఇసుక లారీలు భారీగా వచ్చి చేరడంతో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టి త్వరగా పూర్తి చేయాలని స్థానికులు, ప్రయాణికులు కోరుతున్నారు. -
ఒక్కొక్కరిది ఒక్కో బాధ
సాదుకున్న కొడుకు తిండి పెడుతలేడు.. నా పేరు అల్లూరు జగదీశ్వర్, అంకుశాపూర్ గ్రామం, టేకుమట్ల మండలం. నాకు పిల్లలు లేకపోవడంతో మా ఊరికి చెందిన రాజేంద్రప్రసాద్ను చిన్నతనంలోనే దత్తత తీసుకొని ఉన్నత చదువులు చదివించాను. నా భార్య అనారోగ్యంతో ఇటీవలే చనిపోయింది. నాకు పక్షవాతం వచ్చి నడవలేని స్థితిలో ఉన్నాను. సాదుకున్న కొడుకు నాకున్న ఎకరం 10 గుంటల భూమిని తన పేరుపై ఎక్కించుకొని హనుమకొండకు వెళ్లాడు. కనీసం తిండి పెట్టే వారు కరువయ్యారు. సాదుకున్న కొడుకు నా బాగోగులు చూసేలా చూడండి అని జగదీశ్వర్ వేడుకున్నాడు.ప్రజావాణికి 51 దరఖాస్తులు ● ఎక్కువగా భూ సమస్యలు, పింఛన్ కోసమే.. ● బ్యాంకు అధికారుల తీరుపై కలెక్టర్ రాహుల్ శర్మ ఆగ్రహం ● ప్రజావాణికి గైర్హాజరైన అధికారులకు షోకాజ్ నోటీసులు భూపాలపల్లి: జిల్లాకేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి 51 వినతులు వచ్చాయి. అందులో ప్రధానంగా భూ సమస్యలు, పింఛన్ల మంజూరు దరఖాస్తులే ఎక్కువగా ఉన్నాయి. పంట రుణం మాఫీ విషయంలో చోటుచేసుకున్న తప్పిదాలు, పంట రుణం డబ్బుల కోసం కల్యాణలక్ష్మి చెక్కును ఆపిన బ్యాంకు అధికారులపై కలెక్టర్ రాహుల్ శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజావాణికి గైర్హాజరైన జిల్లా అధికారులకు షోకాజ్ నోటీసులు జారీచేయాలని ఏఓను ఆదేశించారు. -
జీరో మద్యం కేసులో నిందితుల అరెస్ట్
కాటారం: మహాముత్తారం మండలంలో పట్టుబడిన జీరో మద్యం కేసులో మరో ముగ్గురు నిందితులను సోమవారం అరెస్ట్ చేసినట్లు ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ కిష్టయ్య తెలిపారు. ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ కిష్టయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మహాముత్తారం మండలం కనుకునూరు, సింగంపల్లి, నర్సింగాపూర్, మహాముత్తారం గ్రామాల్లో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్(జీరో మద్యం) విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు ఈ నెల 11న ఎకై ్సజ్, ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ఫోర్స్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. కనుకునూర్లో బొచ్చు అనసూర్య ఇంట్లో తనిఖీలు చేపట్టగా కొంత మేర ఎన్డీపీఎల్, అక్రమ మద్యం లభించింది. సదరు మహిళను అదుపులోకి తీసుకొని విచారించగా సింగంపల్లిలో శ్రీరామ్ ప్రేమ్కుమార్, నర్సింగాపూర్లో గాదె సారయ్య జీరో మద్యం సరఫరా చేస్తున్నట్లు వెల్లడించింది. ప్రేమ్కుమార్ ఇంట్లో సోదాలు చేపట్టగా కొంత అక్రమ మద్యం లభించింది. అనంతరం విచారణలో ఇందులో సంబంధం ఉన్న నర్సింగాపూర్కు చెందిన సంది సుధాకర్, మారగోని బాపు పేర్లు తెలపడంతో అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. మహాముత్తారానికి చెందిన మహబూబ్ పాషా మధ్యప్రదేశ్ నుంచి ఎన్డీపీఎల్ మద్యం సరఫరా చేస్తున్నట్లు నిందితులు అంగీకరించారు. మహబూబ్పాషా ప్రస్తుతం పరారీలో ఉన్నాడని గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ కిష్టయ్య తెలిపారు. ఈ దాడుల్లో 9.375 లీటర్ల ఎన్డీపీఎల్ మద్యం, 26.96 లీటర్ల అక్రమ మద్యం, 22.1 లీటర్ల బీర్లు స్వాధీనపర్చుకొని సీజ్చేసినట్లు ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ వెల్లడించారు. -
అడవిలో కార్చిచ్చు!
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం పూసుకుపల్లి–మద్దులపల్లి అటవీప్రాంతంలో సోమవారం రా త్రి కార్చిచ్చు అంటుకొని మంటలు చెలరేగాయి. రహదారి పక్కన మంటలు వ్యాపించడంతో అడవి జీవరాశులు పరుగులు తీశాయి. అటవీ సంపద కా ర్చిచ్చుతో బూడిద అవుతున్నా అటవీశాఖ అధికారులు స్పందించలేదు. వేసవికాలం కావడంతో ఆకులన్నీ ఎండిపోయి ఉండడంతో నిప్పు అంటుకొని కిలోమీటర్ల మేరకు వ్యాపిస్తున్నా సంబంధిత అధికా రులు రక్షణ చర్యలు తీసుకోవడం లేదు. మంటలు, పొగలతో రోడ్డుపైన వెళ్లేందుకు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అడవిలో చిన్న చిన్న మొక్కలు, చెట్లు కాలిపోయాయి. మొబైల్ ఫైర్ టీంలు సంచరించకపోవడంతో విలువైన అటవీ సంపద కాలి బూడిదవుతుందని ఆరోపణలు ఉన్నాయి. -
పకడ్బందీగా టెన్త్ పరీక్షలు
భూపాలపల్లి అర్బన్: ఈనెల 21నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలను అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. కలెక్టరేట్లోని కార్యాలయ సమావేశపు హాల్లో సోమవారం సమీక్ష నిర్వహించారు. పరీక్షల నిర్వహణకు జిల్లాలో 21 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 121 పాఠశాలలకు చెందిన 1,725 మంది బాలురు, 1,724 మంది బాలికలు మొత్తం 3,449 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు తెలిపారు. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. విద్యార్థులను గంట ముందు నుంచే పరీక్షా కేంద్రాలకు అనుమతిస్తారని చెప్పారు. విద్యార్థులు చివరి నిమిషం వరకు వేచిఉండకుండా ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ సూచించారు. పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లను తహసీల్దార్లు పరిశీలించి ధృవీకరణ నివేదికలు అందచేయాలని తెలిపారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, సిట్టింగ్ స్క్వాడ్లు, ఇన్విజిలేటర్లు విధులు నిర్వహించనున్నారని తెలిపారు. సెంటర్ కస్టోడియన్లు, రూట్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, ఇన్చార్జ్ డీఈఓ రాజేందర్, క్రైం డీఎస్పీ నారాయణ, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ రవీందర్ రెడ్డి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. కళ్లద్దాల పంపిణీ విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి దృష్టి లోపం ఉన్న వారికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేసినట్లు కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాల్లో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు కళ్లద్దాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల కంటి పరిరక్షణకు అన్ని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలోని విద్యార్థులకు, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు గత నెలలో కంటి పరీక్షలు నిర్వహించామని తెలిపారు. కంటిచూపు సమస్యలున్నట్లు గుర్తించిన విద్యార్థులకు తిరిగి ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి భూపాలపల్లిలో కంటి పరీక్షలు నిర్వహించి దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ పరీక్షల ద్వారా దృష్టి లోపం ఉన్నట్లు గుర్తించిన 658 మంది విద్యార్థుల్లో 292మందికి మొదటి విడతగా ఉచిత కంటి అద్దాలు పంపిణీ చేశామని, మిగిలిన విద్యార్థులకు త్వరలో పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, ఆర్బీఎస్కే కో–ఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస్, పీఓ ప్రమోద్, సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
లొంగిపోయినా.. ఇంటి జాగ ఇస్తలేరు..
నా పేరు అనపర్తి సన్యాసి, నా భార్య పేరు బాలక్క. మాది సర్వాయిపేట గ్రామం. పలిమెల మండలం. మేము ఇద్దరం కలిసి 1996లో అప్పటి పీపుల్స్వార్ పార్టీలో చేరాం. ప్రభుత్వం, పోలీసుల సూచన మేరకు 2006లో అప్పటి ఉమ్మడి కరీంనగర్ ఎస్పీ డీఎస్ చౌహాన్ ఎదుట లొంగిపోయాం. మాకు పునరావాసం కింద ఇంటి నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని కలెక్టర్ను కోరగా తహసీల్దార్కు లేఖ రాశారు. అయినప్పటికీ తహసీల్దార్ ప్రభుత్వ భూమి లేదంటూ ఇప్పటి వరకు భూమి మంజూరు చేయడం లేదు. 19 ఏళ్లు వనవాసంలో ఉన్నాం. ఇప్పటికై నా ప్రభుత్వ భూమి కేటాయిస్తే ఇళ్లు కట్టుకుంటాం.