Jayashankar
-
పునర్జీవం
మొక్కజొన్న కొనుగోలులో ప్రభుత్వం విఫలం మొక్కజొన్న కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు విమర్శించారు.ఓటీ..లూటీ మేడారం జాతరలో విధులు నిర్వహించిన ఆర్టీసీ ఉద్యోగులకు ఓవర్ టైమ్ (ఓటీ) విధులకు సరిగా చెల్లింపులు చేయకుండా అధి కారులు ఇబ్బందులు పెడుతున్నారు. చాళుక్యులు, కాకతీయుల కాలం నాటి విగ్రహాలకు మెరుగులుకాళేశ్వరం: ప్రాచీన పుణ్యక్షేత్రమైన కాళేశ్వరాలయంలో చాళుక్యులు, కాకతీయుల కాలం నాటి కళావైభవం మళ్లీ వెలుగులోకి రానుంది. ఎన్నో ఏళ్లుగా నిరాధారణకు గురై పక్కకు పడేసిన అపూర్వ శిల్పాలను దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో గుర్తించారు. ఆ విగ్రహాలను భద్రపరిచేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. సుమారుగా క్రీస్తు శకం 540 నుంచి 1200 మధ్యకాలానికి చెందిన ఈ విగ్రహాలు ఆ కాలపు శిల్పకళా నైపుణ్యానికి అద్దం పడుతున్నాయని జోరుగా చర్చ జరుగుతోంది. 105 విగ్రహాలను ప్రస్తుతం పరిసరాల్లో గుర్తించి మెరుగులు దిద్దుతూ పునర్జీవం పోయనున్నారు. ప్రభుత్వం దృష్టి.. కాళేశ్వరంలో నిరాధరణకు గురవుతున్న శిల్పకళను భవిష్యత్ తరాలకు అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. దీంతో మ్యూజియం నిర్మాణానికి ప్రణాళికలు చేశారు. గతనెలలో రూ.1.20కోట్లతో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు శంకుస్థాపన చేశారు. మే నెలలో సరస్వతీనది అంత్య పుష్కరాలు, వచ్చే ఏడాది జూన్లో గోదావరి పుష్కరాల సమయానికి అందుబాటులోకి రానుంది. చాళుక్యులు, కాకతీయ ఽశిల్పకళా వైభవం.. కాళేశ్వరాలయం చాళుక్యులు, కాకతీయులు, ఇతర రాజవంశాల పాలనలో ఎంతో వైభవంగా నిర్మితమైందని ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఆలయ పరిసర ప్రాంతాల్లో విసిరివేయబడినట్లు ఉన్న ఈ పురాతన శిల్పాలు కాలక్రమేణా దెబ్బతిన్నా వాటి చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యం మాత్రం ఇప్పటికీ తగ్గలేదు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆర్కియాలజీశాఖ ఈ విగ్రహాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే ప్రాథమిక పరిశీలనలు పూర్తిచేసి శిల్పాల ప్రాముఖ్యతను గుర్తించారు. వీటిని ప్రత్యేకమైన రసాయనాలతో శుభ్రపరచి, సంరక్షించి, మ్యూజియంలో అమర్చే దిశగా చర్యలు చేపడుతున్నారు. శిల్పకళా వీక్షణకు అవకాశం.. చాళుక్యులు, కాకతీయుల కళా వైభవాన్ని భక్తులు, పర్యాటకులు మ్యూజియంలో ఒకే చోట ప్రత్యక్షంగా చూడగలుగుతారు. ఈ మ్యూజియం ప్రాంతీయ చరిత్రను వెలికితీసే కేంద్రంగా మారే అవకాశం ఉంది. ఇంకా పరిసరాల్లో చాలా వరకు పురాతన విగ్రహాలు ఆదరణకు నోచుకోలేదు. వాటిని కూడా గుర్తిస్తే భవిష్యత్ తరాలకు చరిత్ర తెలుసుకునే అవకాశం ఉంది. మ్యూజియంలో విగ్రహం పేరు, ఏ కాలం నాటిది, స్టోన్, చరిత్ర వివరాలు పొందుపర్చనున్నారని తెలిసింది.శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానంలో (కాలుడు–యముడు) కొలువై ఉన్నారు. ఈ పరిసరాల్లో ఎక్కడ తవ్వినా పురాతన శిల్ప కళాసంపద బయటపడుతుందని గ్రామంలో చర్చ ఉంది. ప్రస్తుతం భిన్నమైన విగ్రహాలను కొన్నింటిని నిరాధరణకు గురిచేశారు. లైమ్ సాండ్ స్టోన్, బసల్ట్, బ్లాక్ స్టోన్లు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా చాళుక్యులు, కాకతీయుల కాలం నాటి 105 విగ్రహాలను గుర్తించారు. అందులో జయ, విజేయుడు, సూర్యుడు, యముడు, చిత్రగుప్తుడు, డుండి గణపతి, వేంకటేశ్వరస్వామి, బింధు మాధవ, నందులు, చతుర్ముఖ బ్రహ్మ శివలింగం, అహళ్య, సప్తరుషులు, సపక్త మాతృకలు, కృష్ణుడు, పరుషురాముడు, బలరాముడు, సూర్యచంద్రులు, అగ్నిస్తంభం, శివలింగాలు తదితర విగ్రహాలు మెరుగులు దిద్దుతూ పునర్జీవం పొందనున్నాయి. -
ఇసుక పంపిణీలో పారదర్శకత
ములుగు: జిల్లాలోని 10 మండలాల్లో గురువారం నుంచి ‘మన ఇసుక వాహనం‘ అమలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ములుగు కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై గురువారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్థానిక గృహ నిర్మాణాలకు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి, ప్రభుత్వం ఇసుకను పారదర్శకంగా తక్కువ ధరకే అందిస్తోందని తెలిపారు. ఇసుక కావాల్సిన వారు టీఎస్ఎంఐవీ.సీజీజీ.జీఓవి.ఐఎన్ వెబ్సైట్ నుంచి వివరాలు నమోదు చేసుకోవచ్చని సూచించారు. టీ–ఫైబర్ కేబుల్స్ రక్షణకు ప్రత్యేక జాగ్రత్తలు జిల్లాలో జరిగే అభివృద్ధి పనుల కోసం జరిగే తవ్వకాల్లో భాగంగా టెలికాం, టీ ఫైబర్ కేబుల్స్ రక్షణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ దివాకర టీఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ఐటీఎస్ డిప్యూటీ డైరెక్టర్ భాస్కరరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా టెలికాం కమిటీ సమావేశానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కంట్రోల్ రూమ్ ప్రారంభం యాసంగి (రబీ) 2025–26 సీజన్ కోసం కలెక్టరేట్లోని సివిల్ సప్లై కార్యాలయంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కంట్రోల్ రూమ్ను గురువారం కలెక్టర్ దివాకర టీఎస్ ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తూకం, రవాణా, మద్దతు ధర ఇతర సాంకేతిక ఇబ్బందులు తలెత్తినప్పుడు రైతులకు కంట్రోల్ రూమ్ ద్వారా తక్షణ పరిష్కారం లభిస్తుందని, ఫిర్యాదుల కోసం 93474 16178 నంబర్ను సంప్రదించవచ్చని స్పష్టం చేశారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ మహేందర్ జీ, డీఆర్డీఓ చంద్రశేఖర్ రెడ్డి, ఏడీ మైన్స్ జయరాజు, పీడీ హౌసింగ్ సూర్యనారాయణ, సివిల్ సప్లై డీఎం కృష్ణవేణి, డిప్యూటీ తహసీల్దార్ విజయ్ కుమార్, టెలికాం సంస్థల ప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి
భూపాలపల్లి: ప్రభుత్వ ఆస్తులు కాపాడాలని, అన్యాక్రాంతం అయితే కఠిన చర్యలు తీసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో ప్రభుత్వ భూములు, చెరువులు పరిరక్షణ, కోర్టు కేసులు, కౌంటర్లు దాఖలు తదితర అంశాలపై భూ పాలపల్లి నియోజకవర్గ రెవెన్యూ, అటవీ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, సింగరేణి తదితర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అర్హులైన రైతులను గుర్తించి సమగ్ర సర్వే నిర్వహించి భూ హక్కు పత్రాలు జారీ చేయాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. సర్వే ప్రక్రియను వేగవంతం చేయడానికి లైసెన్స్డ్ సర్వేయర్ల సేవలను వినియోగించుకోవాలని సర్వే అండ్ ల్యాండ్ ఏడీకి సూచించారు. సర్వే కోసం నిర్ణయించిన గడువులో పనులు పూర్తి అయ్యేలా ఆర్డీఓ తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో డీఎఫ్ఓ నవీన్రెడ్డి, అదనపు కలెక్టర్ అశోక్కుమార్ పాల్గొన్నారు. ప్రజలకు అవగాహన కల్పించాలి.. పైపుల ద్వారా సహజ వాయువు వినియోగాన్ని పెంచడం ద్వారా ఎల్పీజీ వినియోగం తగ్గించాలనే లక్ష్యంతో, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ మౌలిక వసతుల విస్తరణ ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి నగర గ్యాస్ పంపిణీ నెట్వర్క్ విస్తరణ, వాణిజ్య ఎల్పీజీ సరఫరా పరిస్థితులు, పైపుల ద్వారా సహజ వాయువు వినియోగాన్ని ప్రోత్సహించే అంశాలపై రెవెన్యూ, పోలీసు, అటవీ, పౌర సరఫరాలు, మున్సిపల్, పంచాయతీ తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. సంక్షోభం కారణంగా దేశంలో ఎల్పీజీ సరఫరా లపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో, భారత, రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక చర్యలను చేపట్టినట్లు వివరించారు. ఈ సమావేశంలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అరైవ్ అలైవ్ సమర్థవంతంగా అమలు చేయాలి.. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడించారు. డీజీపీ శివధర్రెడ్డితో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామక్రి ష్ణారావు గురువారం జిల్లా కలెక్టర్లతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్లో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, అదనపు కలెక్టర్అశోక్కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సర్వే ప్రక్రియ వేగవంతం చేయాలి కలెక్టర్ రాహుల్ శర్మ -
కాళేశ్వరం శిల్పకళకు
శుక్రవారం శ్రీ 10 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026● దేవాదాయశాఖ ఉన్నతాధికారుల దృష్టిసారింపు ● విగ్రహాలపై ఆర్కియాలజీశాఖ రీసెర్చ్ ● 105 పాత విగ్రహాలను ప్రత్యేక రసాయనాలతో శుభ్రం ● రూ.1.20కోట్లతో మ్యూజియం నిర్మాణం ● త్వరలో భక్తులు, పర్యాటకులకు అందుబాటులోకి.. -
సున్నం, నాచు, మురికి, సిమెంట్ను తొలిగిస్తున్నాం..
పురాతన విగ్రహాలను శుభ్రంచేసే పని మాది. ద్రాక్షారామం, సామర్లకోట, డిక్కవోలులో పురాతన విగ్రహాలను శుభ్రం చేశాం. ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయి న మురికిని ఏఎస్ఏ, ఆర్కియాలజీశాఖ ఆధ్వర్యంలో ఆర్థోపాస్పరిక్యాసిడ్, అమోనియా, టీఫాల్ చ అనే రసాయనాలను నీటితో కలిపి విగ్రహాలపై ఉన్న నాచు, సున్నం, సిమెంట్, మురికిని కడిగి తొ లిగిస్తున్నాం. 105 విగ్రహాలు తీసుకువచ్చారు. రెండురోజుల్లో పూర్తి చేస్తాం. ఆ తరువాత భిన్నమైన, విరిగిన విగ్రహాలను అతికించే టీం వస్తుంది. – జి.రమణ, క్లీనింగ్ మేసీ్త్ర, ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్ చాళుక్యులు, కాకతీయుల కాలంనాటి పాత విగ్రహాలు నిరాధరణకు గురయ్యాయి. గతంలో పలుమార్లు ఆర్కియాలజీశాఖ పరిశీలనలకే పరిమితం చేశారు. ప్రస్తుతం దేవాదాయశాఖ ఉన్నతాధికారులు దృష్టిసారించి విగ్రహాలను మ్యూజియంలో ఏర్పాటు చేసేందుకు కృషి చేయడం, శిల్పకళకు మెరుగులు దిద్దడం శుభపరిణామం. ప్రతీ విగ్రహానికి ఒక్కో చరిత్ర ఉంది. విగ్రహాల ఆధారంగా భవిష్యత్ తరాలకు చరిత్ర తెలుసుకునే అవకాశం ఉంది. కాళేశ్వరాలయం అభివృద్ధికి ఇదొక అడుగు. – త్రిపురారి కృష్ణమూర్తిశర్మ, కాళేశ్వరం దేవస్థానం రిటైర్డ్ ప్రధాన అర్చకుడు కాళేశ్వరం దేవస్థానం పరిధిలో పురాతన విగ్రహాలను ఒక చోటకు చేర్చి విగ్రహాలపై రీసెర్చ్ చేస్తున్నాం. రిపోర్డు వచ్చిన తరువాత పూర్తి వివరాలు తెలుపుతాం. ప్రత్యేక రసాయనాలతో విగ్రహాలను శుభ్రం చేస్తున్నాం. చాళుక్యులు, కాకతీయుల కాలంనాటి విగ్రహాలుగా కనిపిస్తున్నాయి. ఉన్నతాధికా రుల ఆదేశాలతో వివరాలు త్వరలో తెలియజేస్తాం. – మాధవి, పురావస్తుశాఖ, అసిస్టెంట్ డైరెక్టర్, హైదరాబాద్ -
బాల్య వివాహాల నిర్మూలనలో వీసీపీసీల పాత్ర కీలకం
ఏటూరునాగారం: బాల్య వివాహాల నిర్మూలనలో వీలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ (వీసీపీసీల) పాత్ర కీలకమని జిల్లా సంక్షేమ అధికారి ఈపీ ప్రేమలత అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో జరిగిన బాలల పరిరక్షణ, బాల వివాహాల నిర్మూలనపై చెల్పాక, చిన్నబోయినపల్లి సెక్టార్లలోని అంగన్వాడీ టీచర్లకు నిర్వహించిన అవగాహన సదస్సుకు డీడబ్ల్యూఓ హాజరై మాట్లాడారు. బాలల హక్కుల పరిరక్షణలో వీసీపీసీ(వీలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ) పాత్ర కీలకమని, ప్రతీ నెలా గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ అధ్యక్షతన గ్రామ బాలల పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్లు పుష్పావతి, వసంత, పోషణ్ అభియాన్ బ్లాక్ కో–ఆర్డినేటర్ ఇమ్మాన్యూఝెల్, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. ఏటూరునాగారం: మండలంలోని గంటలకుంట అటవీ సమీపంలోని గొత్తికోయగూడేల్లో అటవీశాఖ అధికారులు తీసిన ట్రెంచ్లో పడి గురువారం ఒక ఆవు మృతి చెందింది. అటవీశాఖ అధికారులు గోతులు తీయడంతోనే ఆవు మృతి చెందిందని గొత్తికోయ గిరిజనులు ఆరోపిస్తున్నారు. -
ఎయిడ్స్పై అవగాహన సమాజ రక్షణకు కీలకం
భూపాలపల్లి అర్బన్: ఎయిడ్స్ వంటి ప్రాణాంతక వ్యాధులపై సరైన అవగాహన కలిగి ఉండటం సమాజ రక్షణకు అత్యంత కీలకమని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం చేపట్టిన ‘99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం స్థానిక అంబేడ్కర్ స్టేడియం నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు ఎయిడ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఎయిడ్స్ నివారణే ఉత్తమ మార్గమని, సురక్షిత జీవన విధానం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చని తెలిపారు. వ్యాధి వ్యాప్తి మార్గాలు, నివారణ పద్ధతులపై ప్రజలు అవగాహన పెంపొందించుకోవాలన్నారు, అపోహలు దూరం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్య రక్షణకు కట్టుబడి ఉందని, ఇటువంటి అవగాహన కార్యక్రమాలు సమాజంలో సానుకూల మార్పులు తీసుకువస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి సురక్షిత జీవన విధానాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.., ఎయిడ్స్ వంటి వ్యాధులపై సరైన అవగాహన కల్పించడం అత్యంత అవసరమని తెలిపారు. వ్యాధి వ్యాప్తి మార్గాలు, నివారణ చర్యలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, బాధితుల పట్ల వివక్ష, అపోహలను తొలగించాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో అవగాహన పెంపొందించడం, సరైన సమాచారం అందించడం, బాధితుల పట్ల సమాజంలో ఉన్న వివక్షను తగ్గించడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు -
గోవులు తరలిస్తున్న వాహనాల పట్టివేత
● 32 ఆవులు గోశాలకు తరలింపు వాజేడు: మండలంలోని మండపాక వద్ద 163వ నంబర్ జాతీయ రహదారిపై గోవులను తరలిస్తున్న నాలుగు బొలేరో వాహనాలను పోలీసులు పట్టుకున్నారు. మూగజీవాలను అక్రమంగా తరలిస్తున్న విషయం తెలుసుకున్న ఎస్సై జక్కుల సతీశ్ ఆధ్వర్యంలో గురువారం పట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల సంతలో గోవులను కొని నాలుగు బొలేరో వాహనాల్లో వరంగల్ మీదుగా హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో మండపాక వద్ద జాతీయ రహదారిపై కాపు కాశారు. అటుగా వచ్చిన బొలెరో వాహనాలను ఆపి తనిఖీ చేశారు వాటిలో 32 పశువులు ఉన్నట్లు గుర్తించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా పశువులను తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేయడంతో పాటు భూపాలపల్లి జిల్లాలోని రాంపూర్ గోశాలకు గోవులను తరలించారు. పశువులను అక్రమంగా తరలిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలను తీసుకుంటామని ఎస్సై సతీశ్ హెచ్చరించారు. -
పోరాటం ఉధృతం చేస్తాం..
ఏటూరునాగారం: గొత్తికోయ గూడేల్లో అటవీశాఖ అధికారులు ట్రెంచ్లు తీయడం నిలిపివేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండీ.దావూద్ హెచ్చరించారు. గురువారం మండలంలోని గొత్తికోయ గుడేలకు చెందిన గొత్తికోయలు ఐటీడీఏ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఐటీడీఏలోని ఎస్డీసీ గంట ప్రతాప్, డీడీ దబ్బకట్ల జనార్దన్కు వినతి పత్రం ఇచ్చారు. అనంతరం ఐటీడీఏ నుంచి సబ్ డీఎఫ్ఓ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి అక్కడ కూడా ధర్నా నిర్వహించి ఫారెస్ట్ రేంజర్ ట్రైనింగ్ ఐఎఫ్ఎస్ ప్రతిమిష్ కేశవ, డీఆర్ఓ అప్సరున్నిసా బేగంకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం కలెక్టర్, డీఎఫ్ఓతో ఫోన్లో మాట్లాడి ధర్నా విరమించారు. కార్యక్రమంలో టీఎల్ రవి, మండల కమిటీ సభ్యుడు తోలెం కృష్ణయ్య, మండల నాయకులు సమ్మయ్య సురేశ్, దేవయ్య, జోగయ్యతో పాటు 60 మంది పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండీ దావూద్ కందకాలు తీయడం నిలిపేయాలని కార్యాలయాల ఎదుట ధర్నా -
సేఫ్టీ ఫోర్ట్నైట్ కార్యక్రమాలు షురూ
భూపాలపల్లి అర్బన్: 56వ వార్షిక సేఫ్టీ ఫోర్ట్నైట్ కార్యక్రమాలు బుధవారం ఏరియాలోని కేటీకే 6వ గనిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఇంటర్ ఏరియా ఫస్ట్ ఎయిడ్ పోటీలు నిర్వహించారు. గని మేనేజర్ అనుగ్రహ నారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి రక్షణ జీఎం సాయిబాబు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. కార్మికుల భద్రతకు సంస్థ అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. గనుల్లో పనిచేసే ప్రతీ కార్మికుడు భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ఫస్ట్ ఎయిడ్ పరిజ్ఞానం ప్రాణాలను కాపాడగలదన్నారు. ఫస్ట్ ఎయిడ్ పోటీల్లో వివిధ ఏరియాల బృందాలు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటాయి. ఈ పోటీల ద్వారా అత్యవసర పరిస్థితుల్లో స్పందించే సామర్థ్యాన్ని పెంపొందించడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీజీఎం సాయిప్రసాద్, డాక్టర్ ఉదయ్కుమార్, మధుబాబు, తిరుపతి, రవీందర్, కార్మిక సంఘాల ప్రతినిధులు, సూపర్వైజర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు. రేపు ఉచిత ఆయుష్ వైద్యశిబిరంభూపాలపల్లి అర్బన్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 10న ఉచిత ఆయుష్ మెడికల్ క్యాంపు నిర్వహించనున్నట్లు జిల్లా ఆయుష్ వైద్యులు డాక్టర్ తనూజా రాణి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 6:30 నుంచి 7:30 గంటల వరకు ఇల్లందు క్లబ్లో ఉచిత యోగా శిబిరం నిర్వహించబడుతుందన్నారు. అనంతరం ఉదయం 9:30 గంటల నుంచి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని డీఈఐసీ భవనంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడుతుందని, ఈ శిబిరంలో ఆర్థరైటిస్, గ్యాస్ట్రిక్ సమస్యలు, కిడ్నీ సంబంధిత వ్యాధులు, చర్మవ్యాధులు, రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులకు ఆయుర్వేద, హోమియోపతి, యునాని వైద్యులు ఉచితంగా చికిత్స అందించనున్నారని తెలిపారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
బాల్యానికి బంధనం
పదో తరగతి, ఇంటర్ పూర్తి చేసిన అమ్మాయిలకు గ్రామాల్లో వివాహాలు చేస్తున్నారు. దీంతో వారు ఊహించుకున్న భవిష్యత్ దక్కకుండా పోతుంది. పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లోనే బాల్య వివాహాలు అత్యధికంగా జరుగుతున్నాయి. దీంతో చదువుకు బ్రేక్ పడి ఇంటి బాధ్యతలు, వంటింటికే పరిమితం కావాల్సి వస్తుంది.భూపాలపల్లి రూరల్: ఆడపిల్లలకు వయస్సు రాగానే పెళ్లి చేయాలనే ఆరాటం తల్లిదండ్రుల్లో ఎక్కువగా పెరిగిపోతుంది. ఆడపిల్ల పెళ్లి చేస్తే బాధ్యత తీరుతుందని చాలా మంది భావిస్తూ మాంగళ్యతంతు ముగించేస్తున్నారు. చిన్నతనంలోనే పెళ్లి పీటలు ఎక్కిస్తున్నారు. జిల్లాలో చాలా ప్రాంతాల్లో బడుగు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీల్లోనే ఇవి ఎక్కువగా నమోదవుతున్నాయి. అధికారులు సమాచారంతో బాల్య వివాహాలను అడ్డుకొని వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నా.. చాలా మంది తీరులో మార్పు రావడం లేదు. అవగాహన కల్పిస్తున్నా.. బాల్య వివాహాల కట్టడికి జిల్లాలో మాతా శిశు సంరక్షణ అధి కారులు తగు చర్యలు తీసుకుంటున్నప్పటికీ అవి మాత్రం ఆగ డం లేదు. తమకున్న సమాచారంతో తల్లిదండ్రుల వద్దకు వెళ్లి బాలికలతో పాటు తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో కొంతవరకు ఇవి తగ్గినట్లు కనిపిస్తున్నా.. లోలోపల మా త్రం గుట్టుచప్పుడు కాకుండా పూర్తయ్యేవి అనేకం ఉంటున్నాయి. ఆర్థిక ఇబ్బందులు.. పిల్లల ప్రవర్తన చాలాచోట్ల జరుగుతున్న బాల్య వివాహాలకు ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది. తమకంటే ఆర్థికంగా ఉన్న కుటుంబాల వారికి తమ కూతుళ్లను పెళ్లి చేసి ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. దీంతో తమ అమ్మాయి జీవితం బాగుంటుందని ఆశపడుతున్నారు. మరికొందరైతే సోషల్ మీడియా ప్రభావంతో పిల్లలు పెడదారి పరుతున్నారని ఆలోచించి చిన్న వయస్సులోనే గుట్టు చప్పుడుకాకుండా పెళ్లిళ్లు చేస్తున్నారు. బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరం. నిర్మూలనకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. సమాచారం ఇస్తే అధికారులు వెంటనే అడ్డుకునేలా చర్యలు చేపడుతాం. గతంతో పోలిస్తే ప్రస్తుతం కొంత తగ్గుముఖం పట్టాయి. బాల్య వివాహాల నియంత్రణ, బాలల చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. గ్రామాల్లో బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతిఒక్కరూ సహకరించాలి. చైల్డ్ హెల్ప్లైన్ 1098కు సమాచారం అందించాలి. – మల్లీశ్వరి, జిల్లా సంక్షేమాధికారి బాల్య వివాహాలు చేస్తే అమ్మాయి తండ్రికి, అబ్బాయి తండ్రికి రూ.లక్ష జరిమానాతో పాటు రెండేళ్ల జైలు శిక్ష పడుతుంది. అబ్బాయి మేజర్ అయినట్లయితే ఆయనకు సైతం ఫైన్తో పాటు రెండేళ్ల జైలు శిక్ష ఉంటుంది. ఒకవేళ మైనర్ అయితే స్థానిక పోలీస్స్టేషన్లో కౌన్సెలింగ్ ఇస్తారు. అంధకారం అవుతున్న భవిష్యత్ అడ్డుకుంటున్నా.. ఆగని పెళ్లిళ్లు గ్రామాల్లోనే అధికం -
సేంద్రియ సాగుపై దృష్టి సారించాలి
చిట్యాల: రైతులు ప్రకృతి వ్యవసాయం (సేంద్రియ సాగు)పై దృష్టి సారించి అధిక దిగుబడులను పొందాలని చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి అన్నారు. బుధవారం మండలకేంద్రంలోని రైతువేదికలో మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ వ్యవసాయంలో అధికంగా రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగంతో నేల సారవంతం తగ్గిపోయి పంటల నాణ్యత దెబ్బతినడం, రైతుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడుతున్నాయన్నారు. ఏఓ శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ జీవామృతం, నీమాస్త్రం, అగ్న్యాస్త్రం వంటి సేంద్రియ ద్రావణాల తయారీ విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం రైతులకు ప్రకృతి వ్యవసాయ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ చిర్ర సన్నీ, స్వచ్ఛంద సంస్థ జిల్లా నోడల్ అధికారి మణికుమార్, కృషి సఖీలు పింగిలి జ్యోతి, మోత్కూరి గీత, నవాబుపేట సర్పంచ్ పర్లపెల్లి రవి, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
‘లింగ నిర్ధారణ’ చట్టరీత్యా నేరం
భూపాలపల్లి అర్బన్: లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ తెలిపారు. బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిరోధక చట్టం అమలుపై జిల్లా సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మధుసూదన్ మాట్లాడుతూ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. ఎవరైనా స్కానింగ్ కేంద్రాల్లో ఇలాంటి పరీక్షలు నిర్వహిస్తే రూ.10 వేలు జరిమానాతో పాటు జైలు శిక్ష విధించబడుతుందని హెచ్చరించారు. జిల్లాలోని అన్ని స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు కచ్చితంగా సూచనలను పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో పీఓ డాక్టర్ శ్రీదేవి, డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ దేవేందర్, డాక్టర్ సుధాకర్, డాక్టర్ సంధ్య, ఎన్జీఓ ప్రతినిధి శ్యాంప్రసాద్, డెమో శ్రీదేవి పాల్గొన్నారు. -
నేడు హైస్పీడ్ కారిడార్ కవచ్ ట్రయల్రన్
కాజీపేట రూరల్ : కాజీపేట–పెద్దంపేట రైల్వేస్టేషన్ల వరకు 101 కిలోమీటర్ల మేర గ్రాండ్ ట్రంక్ రూట్లో కవచ్ (రైలు ప్రమాద నివారణ వ్యవస్థ)ను పూర్తిచేసి గురువారం ట్రయల్ రన్ చేయనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే పీసీ ఎస్టీఈపీవీ మురళీకృష్ణ, సీఎస్టీఈ ఎం.కోటేశ్వర్రావు నేతృత్వంలో సికింద్రాబాద్ డిప్యూటీ సీఎస్ టీఈ జి.కుమారన్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ యూని ట్ పనిని పూర్తి చేశారు. స్వదేశీ భద్రత సాంకేతికతను బలోపేతం చేయడంలో ముఖ్యమైన అడుగుగా అధికారులు పేర్కొంటున్నారు. దక్షిణమధ్య రై ల్వేలో గ్రాండ్ ట్రంక్ రూట్ అయిన బల్లార్షా–విజయవాడ సెక్షన్ అత్యంత రైళ్ల ట్రాఫిక్ కలిగింది. ఈ సెక్షన్లో ఎస్ఐఎల్ –0 కవచ్ వ్యవస్థ ప్రమాదాలను నివారిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ మేర కు కాజీపేట నుంచి పెద్దంపేట వరకు కవచ్పై రెండు రైలు ఇంజన్లతో ట్రయల్ రన్ చేయనున్నట్లు పేర్కొన్నారు. కాగా, ట్రయల్రన్ నిర్వహణకు పలువురు అధికారులు గురువారం ప్రత్యేక రైలులో సికింద్రాబాద్ నుంచి కాజీపేటకు రానున్నారు.కాజీపేట–పెద్దంపేట మధ్య నిర్వహణ గ్రాండ్ ట్రంక్ రూట్లో కవచ్ వ్యవస్థ ఏర్పాటు ఇండియా రైల్వే నెట్వర్క్తో జీరో ప్రమాదాలు సికింద్రాబాద్ నుంచి కాజీపేటకు రానున్న అధికారులు రైళ్లు ఢీకొనకుండా నివారణ, బ్లాక్ సెక్షన్లో రైళ్లు ముఖాముఖి లేదా వెనుక నుంచి ఢీకొనకుండా నిరోధించే అత్యాధునిక సాంకేతికత. బ్లాక్స్టాప్ సందేశాలు : ఎదురుగా వచ్చే రైళ్లను అప్రమత్తం చేయడానికి సెక్షన్ పరిధిలో తక్షణమే బ్లాక్ స్టాప్ సందేశాలను పంపుతుంది. రోల్బ్యాక్ ప్రొటెక్షన్ : లోకోమోటివ్ అనుకోకుండా వెనక్కి కదలడాన్ని గుర్తించి, అనుకోకుండా వెనక్కి కదలడాన్ని గుర్తించి ఆటోమెటిక్గా నిరోధిస్తుంది. మాన్యువల్ ఎస్ఓఎస్: అత్యవసర సమయంలో లోకోపైలెట్లు మాన్యువల్ ఎస్ఓఎస్ సిగ్నల్ను పంపే కీలక సదుపాయం ఉంది. వ్యూహాత్మక ప్రాధాన్యం: విజయవాడ–బల్లార్షా మార్గం ప్రాంతీయ రైల్వే మౌలిక సదుపాయాలకు వెన్నెముక వంటిది. ఈ హైస్పీడ్ కారిడార్ కవచ్ను అనుసంధానించడం ద్వారా దక్షిణ మధ్య రైల్వే మానవ తప్పిదాల ప్రమాదాన్ని తగ్గించి సిగ్నలింగ్ నెట్వర్క్ విశ్వనీయతను పెంపొందించనుందని దక్షిణమధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. -
బోనస్ వెంటనే చెల్లించాలి
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో రైతులకు చెల్లించాల్సిన సన్నధాన్యం బోనస్ను వెంటనే విడుదల చేయాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి గురుజపెళ్లి సుధాకర్రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మహదేవపూర్, కాటారం, పలిమెల, మహాముత్తారం, మల్హర్ మండలాలకు చెందిన రైతులకు సన్నవడ్ల బోనస్ బ్యాంక్ ఖాతాల్లో జమ కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సుమారు 2,700 మంది రైతులకు రూ.6.56 కోట్ల బోనస్ రావాల్సి ఉందన్నారు. వెంటనే జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకొని బ్యాంకులతో సమన్వయం చేసి బోనస్ చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే సీపీఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఐ పట్టణ కార్యదర్శి ప్రవీణ్కుమార్, జిల్లా నాయకులు క్యాతరాజు సతీష్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి వేముల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం
భూపాలపల్లి అర్బన్: గర్భిణులు, బాలింతల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తూ పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. బుధవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న హెల్త్ వీక్ కార్యక్రమంలో మూడవ రోజు ‘సేఫ్ మదర్ డే’ కార్యక్రమానికి కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గర్భిణులు, బాలింతల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. సేఫ్ మదర్ డే కార్యక్రమం ద్వారా గర్భధారణకు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలపై అవగాహన పెంపొందుతుందన్నారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లే దిశగా వెంటిలేటర్లు, సీటీ స్కాన్ యంత్రాలు ఏర్పాటు చేశామని, త్వరలోనే ఎంఆర్ఐ యంత్రాన్ని ప్రారంభించనున్నామని వెల్లడించారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడని, దీంతో ఆరోగ్యవంతమైన కుటుంబం, సమాజం నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. హెల్త్ వీక్ ద్వారా ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు, వైద్యులు గ్రామీణ స్థాయిలో ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, జిల్లా వైద్యరోగ్య శాఖ అధికారి మధుసూదన్, సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్, కౌన్సిలర్లు, వైద్యులు పాల్గొన్నారు. పారిశుద్ధ్యం అస్తవ్యస్తంపై ఆగ్రహం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో నెలకొన్ని పారిశుద్ధ్య అస్తవ్యస్తంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యవసర విభాగం, ల్యాబ్, ఎంఆర్ఐ, ఓపీ విభాగాలను సందర్శించి వైద్యసేవలపై అధికారులను ప్రశ్నించారు. ఆస్పత్రి నిర్వహణ, పారిశుద్ధ్యం, సిబ్బంది హాజరు విషయంలో మెరుగు పడాలని ఆదేశించారు. నూతన క్యాజువాలిటీ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
ప్రజల రక్షణకు సాంకేతిక వినియోగం
భూపాలపల్లి: ప్రజల రక్షణకు సాంకేతికతను వినియోగిస్తున్నట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ వెల్లడించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ను బుధవారం ప్రారంభించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రధాన కూడళ్లు, సమస్యాత్మక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఈ సెంటర్కు అనుసంధానించామన్నారు. దొంగతనాలు, చట్ట విరుద్ధ కార్యకలాపాలను అరికట్టవచ్చన్నారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా విశ్లేషించి త్వరగా నిందితులను పట్టుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేష్కుమార్, వెల్ఫేర్ ఆర్ఐ సంతోష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హోంగార్డు కుటుంబానికి అండగా నిలుస్తాం అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మృతి చెందిన హోంగార్డు ఎర్రగొల్ల రంజిత్ కుటుంబానికి అండగా నిలుస్తామని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ వెల్లడించారు. బుధవారం హోంగార్డు రంజిత్ మృతదేహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఎస్పీ వెంట అదనపు ఎస్పీ నరేష్కుమార్, సీఐ నల్ల గట్ల వెంకటేశ్వర్లు, ఆర్ఐలు సంతోష్, రత్నం, హోంగార్డ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మొగిళి తదితరులు పాల్గొన్నారు.ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
జయశంకర్ భూపాలపల్లి
బుధవారం శ్రీ 8 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ7● శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీ నుంచి మే 12వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్న 1 గంట వరకు శిక్షణ ఇస్తారు. థ్రెడింగ్, హెయిర్ కట్స్, వ్యాక్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచింగ్, స్కిన్కేర్, హెయిర్ కేర్, వెడ్డింగ్ ఫేస్ప్యాక్స్, హెయిర్స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, ఐబ్రోస్, బేసిక్ పింపుల్ ట్రీట్మెంట్, మేకప్ (బ్రైడల్, పార్టీ, లైట్ మేకప్), హెయిర్ మసాజ్, కమ్యూనికేషన్ – సెల్ప్ గ్రూమింగ్, ఫేషియల్స్, శారీ డ్రాపింగ్ వంటి వాటిల్లో శిక్షణ ఇస్తారు. ఇందుకోసం ఈనెల 8వ తేదీ నుంచి 13 తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రిజిస్ట్రేషన్లు స్వీకరిస్తారు. రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.2,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈనెల 14 నుంచి మే 12వ తేదీ వరకు ఉదయం 10 గంటలనుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిక్షణ ఉంటుంది. ● రిజిస్ట్రేషన్, శిక్షణ కోసం శ్రీ శైలీ బ్యూటీపార్లర్, ఓల్డ్ బస్డిపో దగ్గర, సర్క్యూట్ హౌజ్ రోడ్డు, హనుమకొండలో సంప్రదించాలి. ● మరిన్ని వివరాల కోసం 95055 14424, 94901 55215 నంబర్లలో సంప్రదించాలి. -
‘రామప్ప చరిత్ర గొప్పది’
వెంకటాపురం(ఎం): చారిత్రక రామప్ప దేవాలయం చరిత్ర ఎంతో గొప్పదని మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఈవీ.నరసింహారెడ్డి అన్నారు. మండల పరిధిలోని రామప్ప దేవాలయాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. రామలింగేశ్వరస్వామికి ఆయన పూజలు నిర్వహించగా ఆలయ అర్చకులు హరీశ్ శర్మ, ఉమాశంకర్లు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామి వారి శేషవస్త్రాలను బహూకరించారు. ఆలయ చరిత్ర, శిల్పకళ ప్రాముఖ్యత గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు. ఆయన వెంట ప్రముఖ చరిత్రకారుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ ఈమని శివనాగిరెడ్డి, యువ చరిత్రకారుడు అరవింద్ ఆర్య, తహసీల్దార్ గిరి బాబు, ఆర్ఐ రమేశ్, టూరిస్ట్ పోలీస్ శ్రీనివాస్, తదితరులు ఉన్నారు. -
‘బూత్ లెవెల్’ కసరత్తు!
సాక్షిప్రతినిధి, వరంగల్: గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్ఏ) నియామక ప్రక్రియను వేగవంతం చేసేందుకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రతీ బూత్కు ప్రత్యేక ఏజెంట్లను ఎంపిక చేస్తూనే.. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇన్చార్జ్లను నియమిస్తూ కేడర్ను యాక్టివ్ చేయడంపై దృష్టి సారించింది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే పార్టీ కేడర్ ప్రజల్లోకి వెళ్లేలా బూత్స్థాయి కమిటీలను ఆచితూచి నియమిస్తోంది. ఇందుకోసం.. ఇతర జిల్లాలకు చెందిన సీనియర్లను ఉమ్మడి వరంగల్లోని 12 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇన్చార్జ్లుగా నియమించారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న సీనియర్లకు ఇతర జిల్లాల ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. కీలకంగా బీఎల్ఏలు.. రాబోయే ఎన్నికల్లో బూత్ లెవెల్ ఏజెంట్లు కీలకంగా వ్యవహరించేలా అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జ్లు కమిటీలు వేయాల్సి ఉంది. ప్రతీ బూత్కు 10–15 మంది యాక్టివ్ టీమ్తో బూత్ లెవెల్ ఏజెంట్లను ఎంపిక చేయాలనేది పార్టీ అధిష్టానం ఆదేశాలు. ఎంపికై న బీఎల్ఏలు ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేలా చూడాలి. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రతీ బూత్ను టార్గెట్గా తీసుకుని పనిచేస్తోంది. స్థానికంగా ప్రభావం ఉన్న యువకులు, సీనియర్ కార్యకర్తలను ఎంపిక చేసి.. ఓటర్లతో నేరుగా సంబంధాలు పెంచేలా బాధ్యతలు అప్పగించనున్నారు. ఓటర్ లిస్ట్లో లోపాల గుర్తింపు, సరిదిద్దే పనితో పాటు ‘బూత్ గెలిస్తేనే సీటు గెలుస్తాం’ అనే స్ట్రాటజీతో ముందుకెళ్లాలన్న పార్టీ అధిష్టానం సూచనల మేరకు అసెంబ్లీ ఇన్చార్జ్లు కేడర్కు మార్గనిర్దేశనం చేస్తున్నారు. బీఎల్ఏలు ప్రభుత్వ పథకాలు, పార్టీ హామీలపై అవగాహన, అసంతృప్త వర్గాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు కేడర్కు సంకేతాలిచ్చారు. ఈనేపథ్యంలో బూత్ లెవెల్ ఏజెంట్ల కోసం కూడా పోటీ పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. 12 సెగ్మెంట్లకు ఇన్చార్జ్లు వీరే.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్, మహబూబాబాద్, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధి 12 సెగ్మెంట్లకు ఇన్చార్జ్లను నియమించారు. జనగామకు బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తికి దుద్దిళ్ల శ్రీనివాస్, పరకాల, వరంగల్ పశ్చిమకు పల్లె శ్రీనివాస్గౌడ్కు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేటకు మోతుకూరి ధర్మారావు, భూపాలపల్లి, ఎండీజావేద్ (ఆర్జీపీఆర్ఎస్), డోర్నకల్, మహబూబాబాద్కు ఎండీ.అవేజ్, నర్సంపేట, ములుగుకు నాగ సీతారాములును అసెంబ్లీ ఇన్చార్జ్లుగా నియమించారు. అదేవిధంగా జిల్లాకు చెందిన నాయకులు జంగా రాఘవరెడ్డికి నల్లగొండ, ఈవీ.శ్రీనివాస్రావుకు భువనగిరి, గాజర్ల అశోక్కు భద్రాచలం, కూచన రవళిరెడ్డికి పినపాక, ఇల్లందు నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించారు. ‘సంస్థాగత’ంపై కాంగ్రెస్ ఫోకస్ బూత్ స్థాయి కమిటీలపై గురి 12 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇన్చార్జ్లు ఇతర జిల్లాలకు పార్టీ సీనియర్లు నియామక ఉత్తర్వులు జారీ చేసిన టీపీసీసీ చీఫ్ -
ఐక్య పోరాటం ఉధృతం
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర నలుమూలల నుంచి విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులు, అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు, బిల్ కలెక్టర్లు, పీస్ రేట్ వర్కర్లు భారీ సంఖ్యలో తరలిరావడంతో మంగళవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం హోరెత్తింది. ఆర్టిజన్లను రెగ్యులర్ ఉద్యోగులుగా కన్వర్షన్ చేయాలని, అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు, బిల్ కలెక్టర్లు, పీస్ రేట్ వర్కర్లను ఆర్టిజన్లుగా కన్వర్షన్ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనకు రెగ్యులర్ ఉద్యోగ సంఘాలు మద్దతు తెలిపాయి. – హన్మకొండ -
ప్రశాంతంగా పరీక్ష
భూపాలపల్లి అర్బన్: జిల్లావ్యాప్తంగా పదవ తరగతి జీవశాస్త్రం పరీక్ష ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సమర్థవంతంగా నిర్వహించినట్లు చెప్పారు. జిల్లావ్యాప్తంగా 3,544మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా ఆరుగురు గైర్హాజరైనట్లు వెల్లడించారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయన్నారు. ములుగు: యువత పొగాకు, గుట్కాలు, సిగరెట్లు, మద్యం తదితర మత్తు పానీయాలకు దూరంగా ఉండాలని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్ సూచించారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా ఉండేందుకు ప్రతిరోజూ గంట పాటు వ్యాయామం చేయాలన్నారు. అలాగే ఉచిత న్యాయ సహాయంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్న్స్ కౌన్సిల్ బానోత్ స్వామిదాస్, సివిల్ సర్జన్ నరేశ్, డాక్టర్ దీపక్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎస్ తాడ్వాయి : ఏజెన్సీలోని వడ్డీ వ్యాపారులు అక్రమంగా అధిక వడ్డీలు వసూలు చేస్తూ గిరిజనులను శ్రమదోపిడీకి గురిచేస్తున్నారని, వారి ఆగడాలను వెంటనే ప్రభుత్వం అరికట్టాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు మైపతి అరుణ్కుమార్, జాతీయ అధ్యక్షుడు సుధాకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మండల పరిధిలోని లింగాలలో తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ బృందం మంగళవారం స్థానిక ఆదివాసీ రైతులతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. అనంతరం సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడారు. పంట రుణాల పేరిట ఒక్కొక్క కుటుంబానికి రూ. 30 లక్షలు అప్పుగా చూపిస్తూ పలువురి నుంచి భూములను ఆక్రమించుకోవడంతో పాటు వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. 1960 వ్యాపారాల చట్టం ప్రకారం ఇది రాజ్యాంగం విరుద్దమని పేర్కొన్నారు. ఇలా అక్రమ వడ్డీలు వసూలు చేస్తున్న వడ్డీ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం దుబ్బగూడెం గ్రామంలో సైతం రైతులతో సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ నాయకులు, స్థానిక ఆదివాసీ రైతులు పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా ఫిజిక్స్ విభాగం ప్రొఫెసర్ బి.వెంకట్రాంరెడ్డి నియమితులయ్యారు. మంగళవారం కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటి వరకు గణిత విభాగం ప్రొఫెసర్ పి.మల్లారెడ్డి ఓఎస్డీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన స్ధానంలో వెంకట్రాంరెడ్డిని ఏడాది పాటు బాధ్యతలు నిర్వర్తించేందుకు నియమించారు. వీసీ ప్రతాప్రెడ్డి ఉత్తర్వులను వెంకట్రాంరెడ్డికి అందజేశారు. ప్రస్తుతం ఆయన టీజీఎడ్సెట్–2026 కన్వీనర్గా కూడా వ్యవహరిస్తున్నారు. కేయూ క్యాంపస్: ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ ప్రతినిధుల బృందం మంగళవారం కాకతీయ యూనివర్సిటీని సందర్శించింది. ఆ అసోసియేషన్ చీఫ్ కన్వీనర్ డాక్టర్ అనిల్కుమార్ ఠాకూర్, జాయింట్ సెక్రటరీ నారాయణన్, సౌత్ కో–ఆర్డినేటర్ దిలీప్ కుమార్ కేయూ వీసీ ప్రతాప్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈఏడాది డిసెంబర్ 27, 28, 29 తేదీల్లో యూనివర్సిటీలో ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ వార్షిక సమావేశం నిర్వహించే అవకాశాలు, వసతులు ఇతర ఏర్పాట్లను పరిశీలించేందుకు బృంద సభ్యులు కేయూను సందర్శించారు. ఈసందర్భంగా కేయూ వీసీ ప్రతాప్రెడ్డికి వినతిపత్రాన్ని అందించారు. -
ఆశవర్కర్ల సేవలు అమూల్యం
టేకుమట్ల: ఆశవర్కర్ల సేవలు అమూల్యమైనవని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. మంగళవారం మండలంలోని వెలిశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి రికార్డులు, హాజరు పట్టిక, ఫార్మసీ, ల్యాబ్ తదితర విభాగాలను పరిశీలించారు. ఏ ప్రాంతం నుంచి రోగులు వస్తున్నారు, ఏ ఆరోగ్య సమస్యతో ఎక్కువ మంది వస్తున్నారని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ రాహుల్శర్మ మాట్లాడుతూ ఆస్పత్రిలో ప్రతి రోజు సుమారు 70 మందికి తగ్గకుండా ఓపీ చూడాలన్నారు. బాల్యంలో పోషకాహార లోపం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని రకాల వైద్యసేవలను అందిండంతో పాటు, ప్రసవాలను పెంచాలని సూచించారు. ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించి ఆరోగ్య సమాజానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యులు హారిక, నాగరాణి, తహసీల్దార్ స్వరూపరాణి, ఎంపీడీఓ అనిత, ఎంపీఓ సురేష్, సర్పంచ్ బొడ్డు తిరుపతి ఉన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
వ్యాధులపై జాగ్రత్తగా ఉండాలి
మొగుళ్లపల్లి: అసంక్రమణ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ ఎల్.విజయలక్ష్మి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా డాక్టర్ నవత ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయలక్ష్మి హాజరై మాట్లాడారు. బీపీ, షుగర్, క్యానర్స్ లాంటి వ్యాధులను అరికట్టేందుకు ఆశ కార్యకర్తల పాత్ర కీలకం అన్నారు. అనంతరం ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చాట్ల విజయ రవి, ఎంపీడీఓ సురేందర్, ఆస్పత్రి సిబ్బంది, ఆశవర్కర్లు పాల్గొన్నారు. పరీక్ష కేంద్రం తనిఖీ.. మండలకేంద్రంలోని జిల్లా ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని విజయలక్ష్మి పరిశీలించారు. మండలంలోని పాత ఇస్సిపేట గ్రామంలో జరుగుతున్న ఉపాధి పథకంలో రోడ్డు ఫార్మేషన్ పనిని పరిశీలించారు.అదనపు కలెక్టర్ విజయలక్ష్మి -
సైబర్ నేరాలపై అవగాహన ఉండాలి
కాళేశ్వరం: సైబర్ నేరాలపట్ల ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని కాటారం డీఎస్పీ సూర్యనారాయణ అన్నారు. మంగళవారం ఆయన గ్రామస్తుల కమ్యూనిటీ సీసీటీవీ ప్రోగ్రాంలో భాగంగా 10 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ప్రారంభించారు. అనంతరం అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు అలవాటు పడవద్దన్నారు. యువత బండి నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. హెల్మెట్ తప్పక ధరించాలని చెప్పారు. అతివేగం ప్రమాదకరమన్నారు. రోడ్డు భద్రతా నిబంధనలు ఉల్లంగిస్తే భారీ జరిమానాలు తప్పవని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చీర్ల చంద్రశేఖర్రెడ్డి, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు పవన్కుమార్, సాయిశశాంక్ పాల్గొన్నారు. -
జయశంకర్ భూపాలపల్లి
మంగళవారం శ్రీ 7 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి: చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్కు అవసరమైన భూ సేకరణ ప్రక్రియను రైతులను సమన్వయం చేసుకుంటూ పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రాజెక్టుకు భూములు అవసరమైన గ్రామాల్లో గ్రామసభల నిర్వహణకు ముందస్తుగా షెడ్యూల్ రూపొందించాలని సూచించారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, అదనపు కలెక్టర్ అశోక్కుమార్, ఎస్డీసీ రమేష్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కుసుమకుమారి, అధికారులు పాల్గొన్నారు. అలసత్వం ప్రదర్శించొద్దు.. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాహుల్ శర్మ హెచ్చరించారు. ప్రజల నుంచి 80 దరఖాస్తులను స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. -
ప్రజావాణి ఎదుట రైతుల బైఠాయింపు
భూపాలపల్లి: సన్నవడ్లను విక్రయించి మూడు నెలలు కావస్తున్నా ప్రభుత్వం ఇప్పటి వరకు బోనస్ చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ జిల్లాలోని మల్హర్, కాటారం మండలాలకు చెందిన 50మంది రైతులు సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వం సూచించిన మేరకు సన్నవడ్లను సాగు చేశామని, క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించి ఇప్పటివరకు ఇవ్వడం లేదన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ స్పందించి.. వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో బోనస్ జమఅయ్యేలా చూస్తానని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. ఈ కార్యక్రమంలో టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు కౌటం రవీందర్, రైతులు పాల్గొన్నారు. -
హోటళ్లలో ఆకస్మిక తనిఖీ
భూపాలపల్లి అర్బన్: ఆహార భద్రతా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని పలు హోటళ్లలో సోమవారం జిల్లా ఆహరభద్రత అధికారి వరుణ్రెడ్డి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. వంటగది, ఆహార పదార్థాల నిల్వ విధానం, గదిలోని పరిసరాల పరిశుభ్రత వంటి అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వరుణ్రెడ్డి మాట్లాడుతూ.. హోటల్ నిర్వాహకులకు పలు సూచనలు, సలహాలు చేశారు. హోటళ్లలో ఆహార పదార్థాలను పరిశుభ్రంగా నిల్వ చేయడం, శుభ్రంగా ఉండేలా చూసుకోవడం వంటి అంశాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. నిల్వచేసిన ఆహర పదార్థాలను ఉపయోగించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
జగ్జీవన్రామ్ ఆశయ సాధనకు కృషి
భూపాలపల్లి రూరల్: డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పిలుపునిచ్చారు. ఆదివారం ఐడీఓసీ కార్యాలయంలో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి ఇందిర ఆధ్వర్యంలో నిర్వహించిన జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి, జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడు తూ జగ్జీవన్ రామ్ నిరుపేద కుటుంబంలో జన్మించి కేంద్రమంత్రిగా, ఉప ప్రధానిగా దేశ ప్రజలకు ఎనలేని సేవలు అందించారన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ కృషి, పట్టుదలతో సాధన చేస్తే విజయం సాధ్యమవుతుందని నిరూపించిన గొప్ప వ్యక్తి జగ్జీవన్ రామ్ అన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ బుర్రా కొముర య్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, కౌన్సిలర్లు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు, బీసీ సంఘం నాయకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అణగారిన వర్గాల సంక్షేమానికి.. సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమానికి అహర్నిశలు శ్రమించిన మహనీయుడు జగ్జీవన్ రామ్ ఎస్సీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్, ఆర్ఐ అడ్మిన్ రత్నం, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు. -
ఏటీసీలతో ఉపాధి
ఏటూరునాగారం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు(ఏటీసీలు) విప్లవాత్మక మార్పులు తేనున్నాయి. గత ఐదేళ్లతో పోలిస్తే ప్రస్తుతం టెక్నాలజీ పూర్తిగా మారిపోయింది. ఏజెన్సీ ప్రాంతాల్లోని విద్యార్థులను పారి శ్రామిక వేత్తలు, పారిశ్రామికులుగా తీర్చిదిద్దాలని, సాంకేతిక పరిజ్ఞానం అందిస్తూ ఉపాధి కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ మేరకు నూతనంగా జిల్లాలో ఏటూరునాగారం, వాజేడు మండల కేంద్రాల్లో రెండు ఏటీసీలను ఏర్పాటు చేశారు. ఐటీఐ విద్యార్థులతో పాటు ఏటీసీలో చేరే విద్యార్థులకు ప్ర త్యేక శిక్షణ ఇస్తున్నారు. పదో తరగతి పూర్తి అయిన విద్యార్థులకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఏటీసీల ముఖ్య ఉద్దేశం ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత మెరుగు పర్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక పథకాలను ప్రవేశపెడుతుంది. వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో ఆదాయం పెరగాలంటే నైపుణ్యం ఉన్న మానవ వనరులు ఎంతో కీలకం. స్కిల్స్ యూనివర్సిటీలను ఏర్పాటు చేశారు. ఐటీఐల్లోని విద్యార్థులకు ఏసీటీల ద్వారా శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేకంగా టాటా గ్రూప్ వారితో అనుసంధానం అయ్యారు. టాటా కంపెనీ నైపుణ్యం శిక్షణపై ఆసక్తితో ఉన్న విద్యార్థులకు నేర్పించేందుకు ఆరు ట్రేడ్లను ముందుకు తీసుకొచ్చింది. రూ.35 కోట్లతో అత్యాధునిక యంత్రాలు, సామగ్రిని ఏర్పాటు చేశారు. దీనిలో ఆరు రకాలుగా శిక్షణ ఇచ్చేందుకు నైపుణ్యం కలిగిన ట్రైనర్లను ఇక్కడ నియమించారు. టాటా టెక్నాలజీ సంస్థ ట్రైనింగ్ పూర్తి చేసిన వారిని వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ముందస్తుగానే అగ్రిమెంట్లు చేయించుకుని వెళ్తున్నారు. ఇప్పటికీ 38 మంది వరకు ఉద్యోగం పొందారు. జిల్లాలో రెండు కేంద్రాల ఏర్పాటు వసతి, భోజనం లేక విద్యార్థుల అవస్థలుఏడాది కోర్సులు ఇండస్ట్రీయల్ రోబోటిక్స్ డిజిటల్ మాన్యుఫాక్చరింగ్ టెక్నీషియన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ అడ్వాన్స్డ్ టూల్స్ రెండేళ్ల కోర్సులు అడ్వాన్స్డ్ సీఎన్సీ మెకానిక్ టెక్నీషియన్ బేసిక్ డిజైన్ అండ్ వర్చువల్ వెరిఫైయర్ మెకానికల్ మెకానిక్ ఎలక్ట్రికల్ వెహికిల్ జిల్లాలోని నిరుద్యోగులు, విద్యార్థులు ఏటీసీలో శిక్షణ నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. కానీ స్థానికంగా వసతి, భోజన సౌకర్యం లేకపోవడంతో ఇక్కడికి వచ్చే విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. గతంలో ఐటీడీఏ ద్వారా ఇక్కడ మేనేజ్మెంట్ హా స్టల్ ఏర్పాటు చేయడంతో విద్యార్థులు ఇక్కడ ఉంటూ చదువుకునే వారు. ఇప్పుడు అలాంటి అవకా శం లేక అద్దెకు ఉండలేక, భోజన వసతి లేక, తల్లి దండ్రులను వదిలి వచ్చి ఇక్కడ ఉండలేక చదువుకు దూరం అవుతున్నారు. ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే ఐటీడీఏ ద్వారా గిరిజన, గిరిజనేతర విద్యార్థిని, విద్యార్థులకు భోజనం, వసతి కల్పించాలని విద్యావేత్తలు, మేధావులు కోరుతున్నారు. -
అడ్మిషన్లు ప్రారంభం
ఏటూరునాగారంలోని ఐటీఐ, ఏటీసీ సెంటర్లలో అడ్మిషన్లను ప్రారంభించాం. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు వారివారి సర్టిఫికెట్లతో ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి. నూతనంగా ఏటీసీ సెంటర్లను ఏర్పాటు చేయడంతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ కలగనుంది. విద్యార్థులకు మరింత అవకాశాన్ని కల్పించడానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుంది. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా ప్రతీ ఒక్క విద్యార్థికి ఉపాధి కల్పించడం జరుగుతుంది. – జగన్మోహన్రెడ్డి, ఐటీఐ, ఏటీసీ ప్రిన్సిపాల్, ఏటూరునాగారం -
‘ప్రభుత్వ విద్యను చిన్నచూపు చూడటం సరికాదు’
భూపాలపల్లి అర్బన్: సీఎం రేవంత్రెడ్డి ఓ ప్రైవేట్ పాఠశాల ప్రారంభోత్సవానికి హాజరై ప్రభుత్వ పాఠశాలల విద్యను బలహీనపర్చే మాటలు మాట్లాడటం, చిన్నచూపు చూడటం సరికాదని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నక్క తిరుపతి, కొత్త కుమారస్వామిలు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కార్పొరేట్ విద్యా వ్యవస్థకు బ్రాండ్ అంబాసిడర్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు దాదాపు సమానంగా ఉన్నాయని అసర్, నాస్ వంటి సర్వేలు స్పష్టం చేశాయన్నారు. వాస్తవాలను పక్కన పెట్టి ప్ర భుత్వ పాఠశాలలో లోపాలున్నాయని సీఎం వ్యాఖ్యానించడం ప్రభుత్వ విద్యను బలహీనపర్చే చర్యగా భావించాల్సి వస్తుందన్నారు. వెంకటాపురం(ఎం): కేన్ మొక్కలను సంరక్షించాలని కేన్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ, వృక్ష శాస్త్రవేత్త డాక్టర్ సుతారి సతీష్ ప్రభుత్వాన్ని కోరారు. మండల పరిధిలోని పాలంపేట గ్రా మ శివారు, రామప్ప దేవాలయానికి అతి సమీపంలో ఉన్న కేన్ ప్రాంతాన్ని ఆయన ఆది వారం పరిశీలించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ 51 ఎకరాల్లో కేన్ మొక్కలు విస్తరించి ఉన్నాయని తెలిపారు. కేన్ ప్రాంతాన్ని రక్షిత ప్రాంతంగా గుర్తించినప్పటికీ అధికారులు రక్షణ చర్యలు చేపట్టడం లేదన్నారు. ఈ ఏడాది జనవరి 12న కొంతమంది సుమారు రెండు ఎకరాల ప్రాంతంలో కేన్ ప్రాంతాన్ని దగ్ధం చేశారని తెలిపారు. మూడు నెలల అనంతరం అవి చిగురిస్తున్నాయని వెల్ల డించారు. కేన్ ప్రాంతాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తెలంగాణకే తలమానికంగా ఉన్న కేన్ రక్షిత ప్రాంతం చుట్టూ ఇప్పటికై నా అటవీ, రెవెన్యూశాఖ అధికారులు జీపీఎస్ ద్వారా సర్వే నిర్వహించాలన్నారు. అలాగే ట్రెంచ్ కొట్టి చైన్ లింక్ ఫెన్సింగ్ను త్వరితగతిన ఏర్పాటు చేసి కేన్ ప్రాంతాన్ని భావితరాలకు అప్పగించాలని సతీష్ కోరారు. మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్య స్నానాలు ఆచరించారు. ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని తిల తైలాభిషేకం పూజాలో పాల్గొని మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. ఆలయ అర్చకులు భక్తుల గోత్ర నామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు అర్చకులు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు. వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ జిల్లా టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జేఎన్ఎస్లో మూడు రోజులపాటు నిర్వహించిన ఇంటర్ క్లబ్ టెన్నిస్ పోటీలు ఆదివారం ముగిశాయి. టి.సాత్విక్–రడం శ్రీనివాస్ ప్రథమ స్థానం, ఎరగ్రట్టు స్వామి–ఎం.శివరాజ్ ద్వితీయ స్థానాన్ని దక్కించుకున్నారు. హనుమకొండ ఏసీపీ నరసింహారావు, టెన్నిస్ అసోసియేషన్ హనుమకొండ అధ్యక్షుడు నల్ల సురేందర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత క్రీడల్లో చురుకుగా పాల్గొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, టెన్నిస్ వంటి క్రీడలు శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. పోటీలు నిర్వహించడానికి సహకరించిన హనుమకొండ డీవైఎస్ఓ గుగులోత్ అశోక్కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో హనుమకొండ టె న్నిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎరగ్రట్టుస్వామి, టెన్నిస్ అసోసియేషన్ సభ్యుడు బాబురెడ్డి, ప్రతినిధులు పాల్గొన్నారు. -
బీరమయ్య జాతర.. తరలొచ్చిన భక్తజనం
వాజేడు: మండల పరిధిలోని లొట్టిపిట్ట గండి ప్రాంతం ఆదివారం తెల్లవారు జాము నుంచి బీరమయ్య నామస్మరణతో మార్మోగింది. మండుటెండలో తె లంగాణ– ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతమైన లొట్టిపిట్టగండి వద్ద కొండలపైన గిరిజనుల ఆరాధ్య దైవమైన బీరమయ్య (భీష్మశంకరుడు) జాతర శనివా రం రాత్రి నుంచి ప్రారంభమైంది. ఈ క్రమంలో ఆ ప్రాంతమంతా బీరమయ్య నామస్మరణతో మార్మోగింది. ఆదివారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో సమీప గోదావరిలో నిష్టతో స్నానాలు ఆచరించి బీరమయ్య, రేఖలమ్మలకు ఆదివాసీ సంస్కృతీ, సంప్రదాయాల ప్రకారం కల్యాణం జరిపించారు. భక్తులు వివిధ వాహనాల్లో భారీగా తరలివచ్చి బీరమయ్యకు మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం రాత్రి నుంచి జాతర ప్రాంతంలో గిరిజన సంప్రదాయ పద్ధతిలో చేసిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు ఏర్పాట్లను చేశారు. గుట్టపైన ఉన్న గుడికి చేరే సమయంలో భక్తులకు ఎండ తగలకుండా ఉండేలా నీడ ఉండేలా ఏర్పాట్లు చేశారు. ప్రతిఏటా బీరమయ్య జాతర సమయంలో భద్రాచలం ఆర్టీసీ డిపో నుంచి భక్తుల కోసం ప్రత్యేక బస్సులను నడిపేవారు. కాని రెండేళ్లుగా బస్సులు నడప డం లేదు. దీంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. లొట్టిపిట్ట గండిలో గిరిజనుల కోలాహలం దేవర్ల రాకతో మొదలైన జాతరతంతు -
సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేయాలి
మల్హర్(కాటారం): కాటారం డివిజన్ కేంద్రంలో సీనియర్ సిటిజన్స్ డే కేర్ సెంటర్ను ఏర్పాటు చేయాలని సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర నాయకుడు, డీటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, విద్యా పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర సహా ప్రధాన కార్యదర్శి ఎం.రఘుశంకర్రెడ్డి కోరారు. మండలంలోని కాటారం స్థానిక ఆదర్శ విద్యాలయంలొ ఆదివారం కరుణాకర్ ఆధ్వర్యంలో కాటారం రెవెన్యూ డివిజన్ స్థాయి పెన్షనర్స్, సీనియర్ సిటిజన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘుశంకర్రెడ్డి మాట్లాడుతూ కాటారం డివిజన్ స్థాయిలో సుమారు 450 మంది పెన్షనర్స్, వేలాదిగా సీనియర్ సిటిజన్స్ ఉన్నారని చెప్పారు. సీనియర్ సిటిజన్స్ రిక్రియేషన్, డేకేర్ సెంటర్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రత్యేక చొరవ తీసుకొని మంజూరు చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండలం సంఘం ప్రతినిధులు అంకమ్మ అంకన్న, శంకరయ్య, వెంకటి, ఎం.రవి శంకర్రెడ్డి, మధుసూదన్రావు, దామోదర్రెడ్డి, డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
3 దశల్లో పరీక్ష
డ్రైవింగ్ లైసెన్స్ జారీ ఇక కఠినతరం ● రోడ్డు భద్రతపై మరింత అవగాహన ● త్వరలో మార్గదర్శకాలుభూపాలపల్లి అర్బన్: డ్రైవింగ్ లైసెన్స్ పొందడం ఇకపై కఠినతరం కానుంది. లైసెన్స్ జారీ కోసం మూడు దశల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల్లో వచ్చిన ఫలితం ఆధారంగా లైసెన్స్ జారీ చేస్తారు. ప్రధానంగా డ్రైవింగ్ నైపుణ్యం పెంచడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచడం, వీలైనంత మేర రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రభుత్వం కొత్తగా మార్గదర్శకాలు రూపొందిస్తోంది. రోడ్డు ప్రమాదాలు నూరు శాతం తగ్గాలంటే రోడ్డు భద్రతపై ప్రతీ ఒక్కరికి అవగాహన తప్పనిసరి. ప్రస్తుతం దరఖాస్తుదారులకు ఎల్ఎల్ఆర్, శాశ్వత డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించి లైసెన్స్ జారీ చేస్తున్నారు. వీటికి అదనంగా రోడ్డు భద్రతపై ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించాలని యోచిస్తోంది. 6 విభాగాలుగా పరీక్షలు మూడు గంటల నిడివితో ఉండే ఈ పరీక్షలను ఆరు విభాగాలుగా నిర్వహిస్తారు. ఒక్కో విభాగానికి 30నిమిషాల సమయం ఉంటుంది. పరీక్షలు రాసిన వారికి ఒక సర్టిఫికెట్ నంబర్ కేటాయించి దాని ఆధారంగా లెర్నర్ డ్రైవింగ్ టెస్ట్కు దరఖాస్తు చేసుకునే అర్హత కల్పిస్తారు. ఈ మాసం నుంచే ఈ విధానం అమలులోకి వస్తుందని భావిస్తున్నా, ప్రభుత్వం నేటికీ ఎలాంటి మార్గదర్శకాలను విడుదల చేయలేదు. మార్గదర్శకాలు వచ్చిన వెంటనే ఈ విధానం అమలులోకి రానుంది. రోడ్డు ప్రమాదాల నివారణకు.. ప్రతీ రోజు ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదం కారణంగా క్షతగాత్రులు కావడం లేదా రోడ్డు ప్రమాదంలో మరణించడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని డ్రైవింగ్ లైసెన్స్ జారీని కఠినతరం చేయనున్నారు. రహదారి ప్రమాదాలు, మరణాల నియంత్రణకు రోడ్డు భద్రతా చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలను అమలు చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ సూచనలతో రాష్ట్ర ప్రభుత్వం, రవాణాశాఖ నూతన లైసెన్స్ల జారీకి శ్రీకారం చుట్టనున్నాయి. రోడ్డు ప్రమాదాలతో పలు కుటుంబాలు కుటుంబ పెద్దను కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. చాలామంది డ్రైవర్లు మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ రోడ్డు భద్రతా నియమాలపై సరైన అవగాహన లేక ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే లైసెన్స్ ఇచ్చే ముందు అభ్యర్థులకు తప్పనిసరిగా పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు నూతన విధానం అమలుచేయనుంది. నూతనంగా ఆన్లైన్ రోడ్డు సేప్టీ అవేర్నెస్ మాడ్యూల్స్ పరీక్షకు అవసరమైన సామగ్రిని కూడా రవాణాశాఖ సమకూర్చుకోనుంది. మార్గదర్శకాలు రాగానే అమలు..రాష్ట్ర ప్రభుత్వం, రవాణాశాఖ నూతన డ్రైవింగ్ లైసెన్స్ జారీకి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసిన అనంతరం అమలు చేస్తాం. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా డ్రైవింగ్ లైసెన్స్ జారీ మరింత కఠినతరం చేసేందుకు మూడు దశల్లో పరీక్షలు ఉంటాయి. పకడ్బందీగా, పారదర్శకంగా డ్రైవింగ్ లైసెన్స్లు జారీ చేస్తాం. ప్రతీ ఒక్కరికి రోడ్డు భద్రతాపై అవగాహన కల్పించేందుకు కఠిన నిబంధనలు అమలులోకి రానున్నాయి. ప్రభుత్వం విడుదల చేసే మార్గదర్శకాలకు అనుగుణంగా డ్రైవింగ్ లైసెన్స్లను జారీచేస్తాం. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. – సంధాని, జిల్లా రవాణాశాఖ అధికారిలైసెన్స్ కోసం.. కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ కోసం మూడు దశల విధానాన్ని అమలు చేయనున్నారు. మొదటి దశలో ఎల్ఎల్ఆర్ దరఖాస్తు చేయడానికి ముందే అభ్యర్థులు మూడు గంటల పాటు ఆన్లైన్లో రోడ్డు భద్రతా అవగాహన మాడ్యూల్స్ను పూర్తిచేయాల్సి ఉంటుంది. రెండో దశలో లెర్నర్ లైసెన్స్ కోసం ఆన్లైన్ టెస్ట్ ఉత్తీర్ణత కావాల్సి ఉంటుంది. ఆ తరువాత ఎల్ఎల్ఆర్ పరీక్ష రాసి లైసెన్స్ పొందాలి. మూడో దశలో శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ కోసం సంబంధితశాఖ కార్యాలయంలో ట్రాక్పై నిర్వహించే ప్రాక్టికల్ టెస్ట్కు హాజరై నైపుణాన్ని నిరూపించుకున్న తరువాత లైసెన్సును జారీచేస్తారు. ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్ జారీకి పకడ్బందీగా పరీక్ష నిర్వహిస్తున్నా, ప్రభుత్వం రోడ్డు భద్రతపై కీలక నిర్ణయం తీసుకోవడంతో నూతన విధానం అమలులోకి రానుంది. ఈ విధానంతో మరింత పారదర్శకత పెరుగుతుందని భావిస్తున్నారు. డ్రైవింగ్పై సరైన అవగాహన లేకుండానే ప్రమాదాలకు కారకులు అవుతున్న వారికి ఇక నుంచి లైసెన్స్ జారీ చేయడంలో కఠినంగా వ్యవహరించనుంది. ప్రభుత్వం విడుదల చేసే మార్గదర్శకాలు డ్రైవింగ్ లైసెన్స్ పొందడం అనేది అంత సులభతరం కాదని తెలుస్తోంది. కొత్తగా రానున్న నిబంధనల కారణంగా లైసెన్స్ పొందే వారికి రోడ్డు భద్రతపై మరింత అవగాహన పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
నాణ్యమైన వైద్యసేవలు లక్ష్యం
● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి రూరల్: నాణ్యమైన వైద్యసేవలను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని చేపట్టినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. శనివారం ఐడీఓసీ కార్యాలయంలో ఈ నెల 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నిర్వహించనున్న హెల్త్ వీక్ కార్యక్రమంపై వైద్య, విద్య, సంక్షేమ శాఖలు, ఫుడ్ సేఫ్టీ, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారం రోజుల పాటు నిర్వహించే ఆరోగ్య కార్యక్రమాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. వైద్యశాఖతో పాటు విద్యా, సంక్షేమ శాఖలు, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో ఆరోగ్య వారాన్ని విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. మండల, గ్రామస్థాయిలో కూడా ఈ కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యేలా చేయాలని స్పష్టంచేశారు. 6వ తేదీ ఉదయం ఫుడ్ సేఫ్టీ ఫోకస్ డేతో కార్యక్రమం ప్రారంభం అవుతుందని చెప్పారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, డీఈఓ రాజేందర్, బీసీ సంక్షేమ అధికారి ఇందిర, మైనార్టీ సంక్షేమ అధికారి కుమారస్వామి, డీపీఓ శ్రీలత, మహిళా సంక్షేమ అధికారి మల్లేశ్వరి, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు, ప్రధాన ఆస్పత్రి ఉప పర్యవేక్షకులు డాక్టర్ వెంకటరత్నం, ఆహార తనిఖీ అధికారి వరుణ్ రెడ్డి, ఈడీఎం శ్రీకాంత్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
హరించిపోతున్న కార్మిక హక్కులు
భూపాలపల్లి అర్బన్: కార్మిక సంఘాల ఆధిపత్యంతో కార్మిక హక్కులు హరించుకుపోతున్నాయని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య ఆరోపించారు. యూనియన్ కార్యాలయంలో శనివారం కార్మిక సంఘాల ఐక్యవేదిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గట్టయ్య మాట్లాడుతూ.. కార్మిక సంఘాల ఆధిపత్య ధోరణులతో కార్మికుల హక్కులు క్రమంగా హరించుకుపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. సింగరేణిలో గతంలో ఐక్య పోరాటాల ద్వారా అనేక హక్కులు సాధించుకున్న గొప్ప చరిత్ర కార్మిక వర్గానిదని తెలిపారు. సింగరేణి పోరాటాల ప్రభావంతో కోలిండియా కార్మికులు కూడా అనేక హక్కులు సాధించుకున్నారని గుర్తుచేశారు. ఎన్నికల విధానాల కారణంగా కార్మిక సంఘాలు విభజనకు గురై, గెలిచిన సంఘాలు యాజమాన్యం, ప్రభుత్వాలకు అనుకూలంగా మారుతున్నాయని విమర్శించారు. ఈ పరిస్థితి సింగరేణి భవిష్యత్కు ప్రమాదకరమని తెలిపారు. ఈ సమావేశంలో ఏఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు రాములు, పోషమల్లు, ఎస్జీకేఎస్ రాష్ట్ర నాయకులు మహేందర్, టీఎస్యూఎస్ రాష్ట్ర నాయకులు నీరేటి రాజన్న, జైపాల్ సింగ్, చారువాక, దాసరి జనార్దన్ పాల్గొన్నారు. -
తహసీల్దార్ల బదిలీ
భూపాలపల్లి: జిల్లా వ్యాప్తంగా పలువురి తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ రాహుల్శర్మ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. భూపాలపల్లి తహసీల్దార్గా పి.లక్ష్మీరాజం, వై.శ్రీనివాసులు (కలెక్టర్ కార్యాలయం), ఎన్.హేమ (కొత్తపల్లిగోరి), విజయలక్ష్మి (కాటారం సబ్ కలెక్టర్ కార్యాలయం), సత్యనారాయణ (మహదేవపూర్), రామారావు (కలెక్టర్ కార్యాలయం), రాజేశ్వర్రావు (పలిమెల), స్వరూపరాణి (కలెక్టర్ కార్యాలయం సూపరింటెండెంట్, టేకుమట్ల తహసీల్దార్), రాజేశ్వర్రావు (గణపురం) తహసీల్దార్లుగా నియమించారు. చిట్యాల డిప్యూటీ తహసీల్దార్గా అనిల్ (చిట్యాల), ఇమాం బాబాషేక్ (మహాముత్తారం), సందీప్ (మల్హర్)లను కలెక్టర్ బదిలీ చేశారు. రామప్ప శిల్పకళ బాగుంది వెంకటాపురం(ఎం): రామప్ప శిల్పకళ బాగుందని పీసీసీఎఫ్– చీఫ్ వైల్డ్లైఫ్ అధికారి వినయ్కుమార్ అన్నారు. మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ఆయన శనివారం సందర్శించి రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి ఆయన పూజలు నిర్వహించగా ఆలయ అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్లు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ ఈఓ ఇమ్మడి భాస్కర్ శాలువాతో సత్కరించారు. ఆలయ చరిత్రను టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ వివరించారు. వారి వెంట కాళేశ్వరం సీపీఎఫ్ ప్రబాకర్, ములుగు డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, ఎఫ్డీఓ సత్తయ్య, ఎఫ్ఆర్ఓ శంకర్, డీఆర్ఓ మధు బాబు, ఎఫ్బీవో కిషన్ తదితరులు ఉన్నారు. రామప్పలో మఠాధిపతి నాగమహర్షి, కెనడాకు చెందిన హరిదాస్ రామప్ప దేవాలయాన్ని శ్రీ మహాకాళేశ్వర దేవస్థానం నాగమఠం మఠాధిపతి శ్రీశ్రీశ్రీ కాలనాగ మహర్షి, కెనడా దేశానికి చెందిన హరిదాస్తో కలిసి శనివారం రామప్పను సందర్శించారు. భూపాలపల్లి జిల్లా నందిగామ మహాకాళేశ్వర దేవస్థానానికి హరిదాస్ రాగా మఠాధిపతి అయిన నాగమహర్షి హరిదాస్ను తీసుకుని రామప్ప ఆలయానికి వచ్చి రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ వెంకటేశ్ వివరించగా రామప్ప ఆలయం బాగుందని వారు కొనియాడారు. హేమాచలక్షేత్రంలో భక్తుల కోలాహలంమంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శనివారం భక్తుల కోలాహలం నెలకొంది. రాష్ట్రంలోని సుదూర ప్రాంతాల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. తిల తైలాభిషేకం పూజలో పాల్గొన్నారు. మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారిని నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. ఆలయ అర్చకులు భక్తుల గోత్రనామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు అర్చకులు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు. పెద్దసంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల సందడి నెలకొంది. ‘విద్యార్థులు సేవాభావాన్ని అలవర్చుకోవాలి’ ములుగు రూరల్: విద్యార్థులు సేవాభావాన్ని అలవర్చుకోవాలని డిగ్రీ కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ బాలయ్య అన్నారు. ఈ మేరకు శనివారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్–2 ఆధ్వర్యంలో జాకారంలోని ప్రభుత్వ పాఠశాలలో శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ దాసరి సమత ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ వలంటీర్లు యూనిఫాం లేని సైనికులని తెలిపారు. ఈ శిబిరాలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, సహనశీలత, సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయన్నారు. ఈ శిబిరం నాలుగు రోజుల పాటు కొనసాగుతుందని వెల్లడించారు. క్లీన్ అండ్ గ్రీన్ –ప్లాస్టిక్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ కోసం పాటుపడాలని సూచించారు. అనంతరం విద్యార్థులు జాకారం పాఠశాల పరిసరాలను శుభ్రం చేశారు. -
హెచ్పీవీ వ్యాక్సిన్ వేసుకోవాలి
● అదనపు కలెక్టర్ విజయలక్ష్మి మల్హర్(కాటారం): 14 సంవత్సరాల పై బడిన బాలికలందరూ హెచ్పీవీ వ్యాక్సిన్ను తప్పనిసరిగా వేసుకోవాలని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శనివారం కాటారం ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, బొప్పారం ఆరోగ్య ఉపకేంద్రాన్ని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో అందుతున్న వైద్యసేవల పట్ల ఇన్ పేషెంట్లు, ఫార్మసీ, హెచ్పీవీ వ్యాక్సినేషన్, వ్యాధి నిరోధక టీకాలు, ఆస్పత్రిలో డెలివరీలపై ఆరా తీశారు. వైద్యసేవలను పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో ఎన్సీఈడీ ఇంప్రూవ్ చేయాలని సిబ్బందికి సూచించారు. తల్లిదండ్రులు సైతం బాలికలకు బాధ్యతగా తప్పకుండా హెచ్పీవీ వ్యాక్సిన్ వేయించాలని కోరారు. అనంతరం గంగారం గ్రామపంచాయతీలో తెలంగాణ మోడల్ స్కూల్ సందర్శించి టీచర్స్ హాజరును పరిశీలించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న టీచర్స్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న భోజనం మెనూను అడిగి తెలుసుకున్నారు, సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వీరస్వామి, స్థానిక వైద్యాధికారి మౌనిక, బొప్పారం సర్పంచ్ జగదీశ్వర్, కార్యదర్శులు పాల్గొన్నారు. -
కాజీపేట పీఓహెచ్కు రూ.521 కోట్లు
రైల్వే బడ్జెట్ (పింక్ బుక్)లో కాజీపేటను కీలక మెయింటెనెన్స్ హబ్గా మార్చేందుకు పెద్దపీట వేశారు. కాజీపేట పీరియాడికల్ ఓవరాలింగ్ (పీఓహెచ్) వర్క్ షాప్ కోసం రూ. 521.36 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. కాజీపేటలో 24–కోచ్ల నిడివి గల క్యాంటెక్ డిజైన్ పిట్ లైన్ల కోసం రూ.17.81 కోట్లు ఇచ్చారు. కాజీపేట డీజిల్ లోకో షెడ్ సామర్థ్యం పెంపు (ఎలక్ట్రిక్ లోకోలను ఉంచేందుకు) కోసం రూ.30.95 కోట్లు, ఎలక్ట్రిక్ లోకో షెడ్ సామర్థ్యం పెంపు (125 నుంచి 175 లోకోలకు) రూ. 21.68 కోట్లు, ఎలక్ట్రిక్ లోకో షెడ్ విస్తరణ (175 నుంచి 300 లోకోలకు)కు రూ. 22.56 కోట్లు చొప్పున కేటాయించారు. -
ఏరివేత షురూ..
2,070 రేషన్కార్డులు అనర్హమైనవిగా గుర్తింపుభూపాలపల్లి: ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి, అనర్హులుగా ఉండి కూడా రేషన్కార్డులు పొందిన వారిపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించనుంది. అర్హులైన పేదలకు మాత్రమే సంక్షేమ ఫలాలు అందాలనే లక్ష్యంతో చేపట్టిన రేషన్ కార్డుల ప్రక్షాళన ప్రక్రియ జిల్లాలో వేగవంతమైంది. క్షేత్రస్థాయిలో విచారణ.. కొంతకాలంగా అందుతున్న ఫిర్యాదుల ఆధారంగా జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ అధికారులు ప్రత్యేక విచారణ చేపట్టారు. ఈ తనిఖీల్లో ఇప్పటివరకు జిల్లాలోని 12 మండలాల్లో సుమారు 2,070 మంది అనర్హులు తెల్లరేషన్కార్డులు పొందినట్లుగా అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ మేరకు క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల ఆర్థిక స్థితిగతులు, వాహనాలు, భూమి వివరాలను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఐటీ చెల్లింపుదారులకు కార్డు తొలగింపు.. రేషన్కార్డుల ఏరివేత ప్రక్రియలో ముఖ్యంగా ఆదాయపు పన్ను (ఇన్కాంటాక్స్) చెల్లిస్తున్న వారిపై అధికారులు దృష్టి సారించారు. నిబంధనల ప్రకారం ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వ్యక్తులు తెల్లరేషన్ కార్డు పొందేందుకు అనర్హులు. అయినప్పటికీ పలువురు ఈ సమాచారాన్ని దాచిపెట్టి కార్డులు పొందినట్లుగా రెవెన్యూ అధికారులు గుర్తించారు. అటువంటి వారి కార్డులను తక్షణమే రద్దు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అధికంగా భూపాలపల్లి పట్టణంలోనే.. జిల్లా కేంద్రం మినహా గ్రామీణ ప్రాంతాల్లో నూటికి 99 శాతం మంది తెల్లరేషన్కార్డు పొందేందుకు అర్హులే ఉన్నారు. భూపాలపల్లి పట్టణంలో మాత్రం వందల సంఖ్యలో అనర్హులు తెల్లరేషన్కార్డులు పొందారనే ఆరోపణలు ఉన్నాయి. ఐటీ చెల్లించే వారితో పాటు, పలువురు ప్రభుత్వ, సింగరేణి ఉద్యోగులు సైతం తెల్లరేషన్కార్డు సొంతం చేసుకున్నట్లు సమాచారం. పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తీసుకొని వచ్చి తెల్లరేషన్కార్డులు మంజూరు చేయించినట్లు తెలుస్తోంది. జిల్లాకేంద్రంలో పూర్తిస్థాయిలో విచారణ జరిపితే భారీ సంఖ్యలో అనర్హులు బట్టబయలు అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. విచారణ చేపడుతున్న రెవెన్యూ అధికారులు జిల్లాలో ఐటీ చెల్లించే వారి కార్డులు రద్దు..? -
త్యాగానికి ప్రతీక గుడ్ ఫ్రైౖడే
భూపాలపల్లి అర్బన్: కరుణ, దయ, ప్రేమ, శాంతి, త్యాగానికి ప్రతీక గుడ్ ఫ్రైడే అని సీఎస్ఐ చర్చి పాస్టర్ రెవరెండ్ ఎస్ జోసఫ్కిషోర్ అన్నారు. శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా స్థానిక సీఎస్ఐ చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు చర్చిల్లో అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ కిషోర్ మాట్లాడుతూ.. ప్రపంచ మానవాలి కోసం తన ప్రాణాలను సైతం అర్పించిన మహోన్నతమైన వ్యక్తి ఏసు ప్రభువు అని కొనియాడారు. సమాజంలో శాంతి, కరుణ ప్రేమ ఈ మానవాళికి పంచిన ప్రేమ మూర్తి అని అన్నారు. ఏసుక్రీస్తు బోధనలు నేటి సమాజానికి మార్గదర్శకమని అన్నారు. -
రెండు బ్యారెక్లు కేటాయించాలి
భూపాలపల్లి అర్బన్: బ్యారెక్లలో నివాసముంటున్న కార్మికులకు రెండు బ్యారెక్లు కేటాయించాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) బ్రాంచ్ కార్యదర్శి కంపేటి రాజయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం జీఎం కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మిక కుటుంబాల సభ్యులు ధర్నా చేపట్టి పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ.. సింగరేణిలో 1993 సంవత్సరం నుంచి కొనసాగుతున్న కాలనీలలో ప్రస్తుతం పెద్దసంఖ్యలో క్వార్టర్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా కేటీకే 2 ఇంక్లైన్, 6 ఇంక్లైన్ ప్రాంతాలలో కలిపి సుమారు 520 క్వార్టర్లు ఉండగా, వాటిలో దాదాపు 320 క్వార్టర్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. కొన్ని క్వార్టర్లు శిథిలావస్థకు చేరి ఉపయోగించలేని స్థితిలో ఉన్నాయని తెలిపారు. ఖాళీ క్వార్టర్లను ఉపయోగించకుండా వదిలేయడం వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అద్దె ఇళ్లలో నివసించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఖాళీ క్వార్టర్లను కార్మికులకు కేటాయించి, క్వార్టర్లను మరమ్మతు చేయాలని కోరారు. ప్రతీ రెండు బ్యారెక్లను ఒక క్వార్టర్గా కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుమ్మరి శ్రీనివాస్, నారాయణ, శివ, బ్రహ్మం, కాలనీ మహిళలు స్వరూప, లక్ష్మి, సాహితి పాల్గొన్నారు. చాక్పీస్పై ఏసు శిలువ మల్హర్(కాటారం): గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని కాటారం గిరిజన గురుకుల కళాశాల చిత్రకళ ఉపాధ్యాయుడు, సూక్ష్మ కళాకారుడు ఆడెపు రజినీకాంత్ చాక్పీస్స్తో ఏసు శిలువ తయారు చేశారు. ఏసుక్రీస్తు కళారూపాన్ని 3.5 సెంటీమీటర్ల ఎత్తు, 2.8 సెంటీమీటర్ల వెడల్పుతో సుమారు మూడు గంటల పాటు శ్రమించి గుండు పిన్ సహాయంతో తయారుచేశారు. రెమ్యునరేషన్ చెల్లించాలి ములుగు: రాష్ట్రంలో 18 నెలల క్రితం నిర్వహించిన కులగణన కార్యక్రమంలో భాగంగా విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రెమ్యునరేషన్ను చెల్లించాలని స్టేట్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ఏళ్ల మధుసూదన్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కులగణన వంటి కీలక కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎంతో కృషి చేశారన్నారు. తమ వ్యక్తిగత సమయాన్ని, శ్రమను వెచ్చించి ప్రభుత్వ బాధ్యతను నెరవేర్చిన వారికి రెమ్యునరేషన్ చెల్లింపులో నిర్లక్ష్యం ప్రదర్శించడం విచారకరమన్నారు. -
బండికి.. దండిగా!
సాక్షిప్రతినిధి, వరంగల్: దక్షిణ మధ్య రైల్వే పరిధి ఉమ్మడి వరంగల్ జిల్లాకు భారీగా నిధులు కేటాయించారు. 2026–27 రైల్వే బడ్జెట్ (పింక్ బుక్)లో హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ ప్రాంతాలకు భారీగా నిధులు, ప్రాజెక్టులు కేటాయించారు. ముఖ్యంగా రైల్వే మౌలిక సదుపాయాల కల్పన, క్వాడ్రప్లింగ్ (నాలుగు లైన్లు), సర్వేలు, నిర్మాణంలో ఉన్న మూడో లైన్ పూర్తి, స్టేషన్ల ఆధునికీకరణకు ఈ బడ్జెట్ పెద్దపీట వేసింది. దక్షిణ మధ్య రైల్వేశాఖ కేటాయింపులతో కూడిన పింక్బుక్ శుక్రవారం విడుదల కాగా, అధిక నిధులు కేటాయించడంపై హర్షం వ్యక్తమవుతోంది. కొత్త లైన్లు, డబ్లింగ్ పనులు.. భారీగా నిధులు ఉమ్మడి వరంగల్ మీదుగా వెళ్లే ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు నిధుల కేటాయింపు జరిగింది. కొత్త లైన్లు, డబ్లింగ్, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశారు. ● కాజీపేట–విజయవాడ మధ్య 219.64 కి.మీ.పొడవైన మూడో లైన్, విద్యుద్ధీకరణ పనుల కోసం రూ.1,955.27 కోట్లు మంజూరు చేశారు. ● కాజీపేట–బల్లార్షా వరకు 201.04 కి.మీ. పొడవైన మూడో లైన్ పనులకు రూ.2,063.03 కోట్లు ఇచ్చారు. ● నష్కల్ (పెండ్యాల్) – హసన్పర్తి నడుమ 24.55 కి.మీ. బైపాస్ లైన్ నిర్మాణానికి రూ.465.29 కోట్లు మంజూరయ్యాయి. ● భద్రాచలం రోడ్ – డోర్నకల్ వరకు 54.65 కి.మీ సెక్షన్ పనుల కోసం రూ.770.12 కోట్లు కేటాయించారు. ● కాజీపేట – బల్లార్షా మెయిన్ లైన్ను పెద్దపల్లి–కరీంనగర్ లైన్తో అనుసంధానించే 2.169 కి.మీ. బైపాస్ లైన్ కోసం రూ.36.99 కోట్లు కేటాయించారు. ● ఘన్పూర్–సూర్యాపేట (పాలకుర్తి మీదుగా) 170 కి.మీ. కొత్త లైన్ సర్వేకు నిధులిచ్చారు. ● బీజాపూర్–వరంగల్కు 288 కి.మీ.ల కొత్త లైన్ కోసం సర్వేకు కూడా అనుమతి ఇచ్చారు. ● క్వాడ్రప్లింగ్ (నాలుగు లైన్ల) సర్వేలకు కూడా నిధులు ఇచ్చారు. రైల్వేస్టేషన్లకు ‘అమృత్ భారత్’ హంగులు ‘అమత్ భారత్ స్టేషన్ స్కీమ్’ కింద ప్రధాన స్టేషన్ల అభివృద్ధికి నిధులు కేటాయించారు. ఇందులో భాగంగా.. వరంగల్ స్టేషన్ తూర్పు వైపు ఎంట్రీ అభివృద్ధి, బుకింగ్ ఏరియా, కాన్ కోర్స్ మెరుగుదల కోసం రూ.4.50 కోట్లిచ్చారు. వరంగల్ స్టేషన్లో 12 మీటర్ల వెడల్పు గల కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ (ఎఫ్ఓబీ) కోసం రూ. 13.24 కోట్లు, కాజీపేట స్టేషన్ ఆధునికీకరణకు రూ.18.73 కోట్లు (జనగామ, యాదాద్రితో కలిపి) కేటాయించారు. కాజీపేటలో 12 మీటర్ల వెడల్పు గల ఎఫ్ఓబీ కోసం రూ.9.78 కోట్లు, ప్లాట్ఫామ్ 4–5 వరకు ఎఫ్ఓబీ విస్తరణ, లిఫ్టులు, ఎస్కలేటర్ల కోసం రూ.13.93 కోట్లు మంజూరు చేసినట్లు పింక్బుక్లో పేర్కొన్నారు. మహబూబాబాద్–జనగామ స్టేషన్లలో 12 మీటర్ల వెడల్పు గల ఎఫ్ఓబీలు, రాంప్ల నిర్మాణం కోసం రూ.44.34 కోట్లు, జనగామ గూడ్స్ షెడ్ సౌకర్యాల మెరుగుదలకు రూ. 6.24 కోట్లు ఇచ్చారు. అలాగే భద్రత పనుల కింద వరంగల్–చింతలపల్లి లెవల్ క్రాసింగ్ 63 ఏ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.25.58 కోట్లు, కాజీపేట – వరంగల్ ఎల్సీ 61 వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి కోసం రూ. 24.65 కోట్లు, రఘునాథపల్లి–ఇప్పగూడ ఎల్సీ 44 వద్ద 2–లేన్ రైల్వే ఓవర్ బ్రిడ్జి, సబ్వే కోసం రూ.12.83 కోట్లు, డోర్నకల్–మణుగూరు మార్గంలో కారేపల్లి–సింగరేణి కొలీరీస్ మధ్య వివిధ లెవల్ క్రాసింగ్ల వద్ద రైల్వే అండర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టనున్నట్లు పింక్బుక్లో పేర్కొన్నారు. లైన్ కి.మీ నిధులు భూపాలపల్లి–కాజీపేట (హసన్పర్తి) 64 1.60 హసన్పర్తి–కరీంనగర్ 62 1.55 డోర్నకల్–గద్వాల (సూర్యాపేట, నల్లగొండ మీదుగా) 296 7.40 కాజీపేట–సికింద్రాబాద్ 120 2.40 కాజీపేట–విజయవాడ 220 4.40 కాజీపేట–బల్లార్షా 234 4.68 వరంగల్–సికింద్రాబాద్ 38 0.75 కాజీపేట–విజయవాడ మూడో లైన్కు రూ.1,955 కోట్లు కాజీపేట–బల్లార్షాకు రూ.2,063 కోట్లు నష్కల్–హసన్పర్తికి రూ.465.29 కోట్లు క్వాడ్రప్లింగ్, కొత్త రైల్వే సర్వేల కోసం కేటాయింపులు కాజీపేట జంక్షన్ నుంచే పలు మార్గాలు పీఓహెచ్కు రూ.521.36 కోట్లు.. ‘అమృత్ భారత్’ కింద స్టేషన్లకు కొత్త హంగులు 2026–27 రైల్వే బడ్జెట్ (పింక్బుక్)లో భారీగా నిధులు -
దొడ్డి కొమురయ్య త్యాగాలు చిరస్మరణీయం
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లి రూరల్: తెలంగాణ సాయుధ పోరాటంలో దొడ్డి కొమురయ్య త్యాగాలు, పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు శుక్రవారం భూపాలపల్లి ఐడీఓసీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరై దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ.. దొడ్డి కొమురయ్య చూపిన ధైర్యం, అంకితభావం నేటితరానికి ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. సమాజంలో సమానత్వం, న్యాయం కోసం పోరాడిన మహనీయుల మార్గంలోనే ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం బీసీ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు దొడ్డి కొమురయ్య సేవలను స్మరించుకొని ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి ఇందిర, సహాయ వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి క్రాంతి కిరణ్, మున్సిపల్ వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, కౌన్సిలర్ అప్పం కిషన్, యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు. -
ఆలయ పునర్నిర్మాణ పనులు అస్తవ్యస్తం
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర నాటికి ఆలయ పునర్నిర్మాణం పనులు ఇంకా పూర్తి కాలేదు. జాతర సమయం నాటికి కొంత మేరకు పనులు పూర్తి కాకపోవడంతో తాజాగా మళ్లీ పనులను మొదలు పెట్టారు. ప్రహరీ నిర్మాణం, ఆర్చీలపై చెక్కిన ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయ బొమ్మలు బాగానే ఉన్నా గద్దెల ప్రాంగంణంలో ఫ్లోరింగ్ పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. పగిలిన గ్రానైట్ రాళ్లు జాతర సమయంలో హడావుడిగా గద్దెల ప్రాంగణంలో ఫ్లోరింగ్ పనులు చేయడంతో గ్రానైట్ రాళ్ల మధ్య సందులు ఏర్పడ్డాయి. కొన్ని చోట్ల గ్రానైట్ రాళ్లు పగిలిపోయాయి. రాళ్లు కుంగిపోయిన విషయాన్ని జాతర సమయంలో గుర్తించిన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ధనసరి సీతక్కలు సరిచేయాలని ఆదేశించడంతో జాతర అనంతరం మళ్లీ పనులను ప్రారంభించారు. గద్దెల ప్రాంగణంలో కుంగిన గ్రానైట్ రాళ్లను తొలగించి సమాంతరంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులు భాగానే ఉన్నప్పటికీ ప్రస్తుతం గద్దెలను ప్రతిరోజూ నీటితో కడగడంతో నీళ్లు గ్రానైట్ రాళ్ల మధ్య నిలిచి పోతున్నాయి. అంతేకాకుండా సమ్మక్క గద్దె వద్ద గ్రానైట్ రాళ్లతో ఏర్పాటు చేసిన మెట్లరాళ్లు కూడా పగిలిపోయాయి. వాటిని తొలగించి మళ్లీ ఏర్పాటు చేస్తున్నారు. సమ్మక్క గద్దె నుంచి సారలమ్మ గద్దెకు వెళ్లే మెట్ల వద్ద గ్రానైట్ రాయి పగిలి కుంగిపోయింది. ఇటీవల మేడారం సమ్మక్క పూజారి కుమారుడి కాళ్లపై గద్దెల చుట్టూ ఏర్పాటు చేసిన రాయి కాలు మీద పడి గాయపడిన ఘటన కూడా చోటు చేసుకుంది. కంపుకొడుతున్న డ్రెయినేజీ గద్దెల ప్రాంగణాన్ని నీటితో శుద్ధి చేసిన నీళ్లు బయటకు వెళ్లేందుకు అండర్ డ్రెయినేజీ నిర్మాణం చేశారు. జాతర సమయంలో హడావుడిగా డ్రెయినేజీ నిర్మాణం చేయడంతో దీంతో ఆ డ్రెయినేజీలో చెత్తాచెదారం పేరుకుపోయి గద్దెలను శుద్ధి చేసిన నీళ్లు బయటకు వెళ్లకపోవడంతో దుర్వాసన వస్తోంది. డ్రెయినేజీ నిర్మించినా ప్రయోజనం లేకుండా పోయిందని భక్తులు విమర్శిస్తున్నారు. మళ్లీ డ్రెయినేజీని సక్రమంగా చేసేందుకు చర్యలు తీసుకోవడం గమనార్హం. మహాజాతరలో మీడియా కవరేజ్ కోసం నిర్మించిన మీడియా పాయింట్ జాతర సమయం వరకు పూర్తి కాలేదు. అయితే మీడియా పాయింట్ కవరేజ్కు అనుకూలంగా లేవనే విషయాన్ని గుర్తించిన మంత్రులు జాతర అనంతరం ఆ పనులను నిలిపివేసినట్లు తెలిసింది. ఆదివాసీ బొమ్మల ఏర్పాటు గద్దెల చుట్టూ నిర్మించిన రాతి ప్రహరీ పైభాగంలో రాతితో చెక్కిన ఆదివాసీ బొమ్మలను అమర్చుతున్నారు. అయితే ఓ రాతి బొమ్మ కొమ్ము విరిగిపోవడంతో దాన్ని గమ్ముతో అతికించి ఏర్పాటు చేసేందుకు సిద్ధం చేశారు. అధికారులు విరిగిన కొమ్ము బొమ్మను పక్కన పెట్టించాలని భక్తులు కోరుతున్నారు. -
కడిగేసిన ‘కాగ్’!
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్లో అభివృద్ధి వేగం పెరుగుతుందని అధికారులు చెబుతుండగా.. అభివృద్ధి పేరిట జరిగిన నిబంధనల ఉల్లంఘనలను ‘కాగ్’ కడిగేసింది. కేటాయించిన నిధులు పూర్తిగా వినియోగం కాకపోవడం, ప్రాజెక్టులు ఆలస్యమవడం, శాఖల నిర్లక్ష్యం కలిసి అభివృద్ధిని నెమ్మదింపజేస్తున్నాయని పేర్కొంది. ముఖ్యంగా గ్రేటర్ వరంగల్లో స్మార్ట్సిటీ పనులు, గ్రామాల్లో పంచాయతీరాజ్ పనులు, మహబూబాబాద్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు.. ఈ మూడు రంగాల్లో సమస్యలు తీవ్రంగా ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది. 2022 మార్చితో ముగిసిన కాలానికి భారత కంప్ట్రోలర్, ఆడిట్ జనరల్ (కాగ్) నివేదిక –25ను ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విడుదల చేశారు. ఈ నివేదికలో ఉమ్మడి జిల్లాలో జరిగిన పలు పద్దులు, అంశాలు, ఉల్లంఘనలపై కాగ్ అక్షింతలు వేసింది. గ్రేటర్లో దారిమళ్లిన నిధులు.. వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలో నీటి సరఫరా ప్రాజెక్టుల కోసం కేటాయించిన అమృత్ నిధులను నిబంధనలకు విరుద్ధంగా ఇతర పనులకు మళ్లించినట్లు కాగ్ గుర్తించింది. అమృత్ పథకంతో సంబంధం లేని రోడ్డు పనులు, టీ–ఫైబర్ ప్రాజెక్టు పనుల కోసం ‘మిషన్’ నిధుల నుంచి రూ.21.30 కోట్లు చెల్లించడాన్ని తప్పుబట్టింది. మున్సిపల్ సాధారణ నిధుల నుంచి చెల్లించాల్సిన సిమెంట్, ఇనుము ధరల సర్దుబాటు కోసం రూ.8.60 కోట్లు అమృత్ నిధులు వాడడం కూడా నిబంధనల ఉల్లంఘనేనంది. నీటి సరఫరా పనుల నిర్వహణలో కాంట్రాక్టర్కు అక్రమంగా లబ్ధి చేకూర్చినట్లు ఆడిట్లో తేలింది. పెట్రోల్, ఆయిల్, లూబ్రికెంట్స్ (పీఓఎల్) ధరల సర్దుబాటు లెక్కించేటప్పుడు, అసలు ధర లీటరుకు రూ. 64.36 ఉండగా, తప్పుగా రూ.62.46గా తీసుకోవడం వల్ల కాంట్రాక్టర్కు రూ.1.05 కోట్లు అదనంగా చెల్లించారని పేర్కొంది. బిల్లులను సిద్ధం చేసే సమయంలో ప్రభుత్వ ఉత్తర్వులు పాటించకపోవడం, పీఏఓల (పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్స్) పరిశీలన లోపం కారణంగా ఈ అధిక చెల్లింపులు జరిగాయని అభిప్రాయపడింది. రిజర్వాయర్ల నిర్మాణంలో జాప్యం.. తాగునీటి రిజర్వాయర్ల నిర్మాణానికి భూమిని అప్పగించడంలో విపరీతమైన జాప్యం జరిగిందని కాగ్ ఆక్షేపించింది. మొత్తం 33 ఎలివేటెడ్ లెవల్ సర్వీస్ రిజర్వాయర్ (ఈఎల్ఎస్ఆర్)ల నిర్మాణానికి సంబంధించి భూమి అప్పగింతలో 2 నుంచి 59 నెలల వరకు జాప్యం జరిగిందని పేర్కొంది. కోమటిపల్లి, కాకతీయ వైద్య కళాశాల, యాదవనగర్ వంటి ప్రాంతాల్లో భూ వివాదాలు, కోర్టు కేసుల కారణంగా నిర్మాణ పనులు ఆలస్యమైనట్లు పాలకులు వివరణ ఇచ్చారు. యాదవనగర్ వద్ద 2022 ఏప్రిల్లో భూమి అప్పగించినా రిజర్వాయర్ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని ఆడిట్ గమనించింది.. మోడికుంట్లవాగు ప్రాజెక్టులో నిర్లక్ష్యం.. ములుగు జిల్లాలోని మోడికుంట్లవాగు జలాశయ నిర్మాణంలో తీవ్ర జాప్యం జరిగిందని కాగ్ అధికారులపై అక్షింతలు వేసింది. పనులు ప్రారంభం కాకపోయినా కాంట్రాక్టర్కు ఇచ్చిన మొబిలైజేషన్ అడ్వాన్స్పై జమ అయిన రూ.6.89 కోట్ల వడ్డీని వసూలు చేయడంలో ప్రభుత్వశాఖ విఫలమైందని స్పష్టం చేసింది. రహదారుల నిర్వహణలో లోపాలు.. మహబూబాబాద్ జిల్లాలో గ్రామీణ రహదారుల నాణ్యతపై కాగ్ అసంతృప్తిని వ్యక్తం చేసింది. తమ బృందం ప్రత్యక్ష తనిఖీలు నిర్వహించిందని, జిల్లాలోని పలు బీటీ రోడ్ల అంచులు విరిగిపోవడం, గుంతలు పడడం వంటి లోపాలను వారు గమనించారని పేర్కొంది. రోడ్ల ప్రారంభంలో ఉండాల్సిన పీఎంజీఎస్వై గుర్తింపు చిహ్నాలు, సైన్ బోర్డులు 95 శాతం పనుల్లో ఏర్పాటు చేయలేదని ఆక్షేపించింది. దుస్థితిలో ఐటీ టవర్ల నిర్వహణ, పార్కులు.. వరంగల్లోని ఐటీ టవర్ల నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి విధానాలు రూపొందించలేదంది. దీనివల్ల లీజు పత్రాల తయారీ, సిబ్బంది నియామకం, జరిమానాల విధింపు వంటి కీలక విషయాలపై టీఎస్ ఐఐసీకి స్పష్టత లేకుండా పోయిందని కాగ్ పేర్కొంది. కాగా, కోవిడ్–19, ఇతర కారణాల వల్ల వివిధ ఐటీ టవర్ల నుంచి సుమారు రూ. 3.42 కోట్ల బకాయిలను టీఎస్ఐఐసీ వసూలు చేయలేకపోయిందని, ఐటీ టవర్ల నిర్మాణం కోసం టీఎస్ఐఐసీ రూ. 134.40 కోట్లు ఖర్చు చేయగా, ప్రభుత్వం కేవలం రూ. 6.29 కోట్లు మాత్రమే తిరిగి ఇచ్చిందని కాగ్ కుండబద్ధలు కొట్టింది. కల్యాణలక్ష్మిలో అవకతవకలు.. కల్యాణలక్ష్మి పథకం అమలులో అనేక లోపాలు, నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు ఆడిట్లో వెల్లడైంది. రాష్ట్రంలో ప్రధానంగా 5,522 కేసులను ఆడిట్ చేయగా.. వాటిలో రూ.55.12 కోట్ల విలువైన ప్రయోజనాలు అనర్హులకు అందినట్లు గుర్తించినట్లు స్పష్టమైంది. సిస్టంలో వరుడి ఆధార్ సంఖ్యను ఽధ్రువీకరించే నిబంధన లేకపోవడం.. ఒకే వరుడిని ఇద్దరు వధువులు వివాహం చేసుకున్నట్లు ఉన్న 676 కేసుల్లో రూ.3.38 కోట్లు మంజూరు చేశారు. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా 80కి పైగా ఉన్నట్లు తేలిందని నివేదిక స్పష్టం చేసింది. వరంగల్–హైదరాబాద్ రూట్లో వజ్ర బస్సులు లాభదాయకం కాదని, అప్పటికే ఉన్న బస్సుల కంటే ఇవి అదనపు భారమని ఆర్టీసీ ఆర్ఎం 2017లోనే చెప్పినా పెడ చెవిన పెట్టడం వల్ల రూ.22.04 కోట్లు వృథా అయ్యాయని కాగ్ అభిప్రాయపడింది. ‘వజ్ర’ ఏసీ బస్సులు నష్టాల వెనుక అధికారుల నిర్లక్ష్యం ఉందని నివేదిక పేర్కొంది. టీ–ఫైబర్ ప్రాజెక్టు పనుల కోసం రూ.21.30 కోట్లు జనరల్ ఫండ్కు బదులు మరో రూ.8.60 కోట్లు అమృత్ నిధులు మోడికుంట కాంట్రాక్టర్కు అప్పనంగా రూ.6,89 కోట్లు భారత కంప్ట్రోలర్, ఆడిట్ జనరల్ (కాగ్) నివేదిక –2025లో వెల్లడి -
అగ్గితో బుగ్గి!
శుక్రవారం శ్రీ 3 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026ఫైర్స్టేషన్లలో వేధిస్తున్న సిబ్బంది కొరతఆరుగురు విద్యార్థుల గైర్హాజరు భూపాలపల్లి అర్బన్: పదో తరగతి వార్షిక పరీక్షల్లో భాగంగా గురువారం నిర్వహించిన భౌతిక శాస్త్ర పరీక్షకు ఆరుగురు విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 3,544 మంది విద్యార్థులకు 3538 మంది హాజరైనట్లు తెలిపారు. సమస్యలు పరిష్కరించేదెప్పుడో.. భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికుల సమస్యలకు ఎప్పుడు పరిష్కారం దొరుకుతుందని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) బ్రాంచ్ కార్యదర్శి కంపేటి రాజయ్య విమర్శించారు. ఈ మేరకు గురువారం ఏరియాలోని కేటీకే 6వ గనిలో కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ.. మున్సిపాలిటీ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన మెడికల్ బోర్డు నిర్వహణ హామీ ఇప్పటికీ అమలు కాలేదని అన్నారు. అసెంబ్లీ వేదికగా సింగరేణి కార్మికుల దీర్ఘకాలిక సమస్యలు అయిన అలవెన్సులు, ఆదాయపన్ను మాఫీ, సొంత ఇంటికల, మారుపేర్ల, ఇతర అంశాలకు పరిష్కారం దొరుకుతుందని భావించిన కార్మికుల ఆశలు నెరవేరలేదన్నారు. వేజ్బోర్డులో చేసుకున్న ఒప్పందాలు కూడా ఇప్పటివరకు అమలు కాలేదని, గెలిచిన సంఘాలు వాటిని అమలు చేయించడంలో విఫలమయ్యాయని విమర్శించారు. గుర్తింపు సంఘమైన ఏఐటీయూసీ యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురాలేకపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు కుమ్మరి శ్రీనివాస్, శ్రీకాంత్, తోట రమేష్, బాబురావు పాల్గొన్నారు. ‘విస్తారాకులతో ఆరోగ్యానికి మేలు’ ఎస్ఎస్తాడ్వాయి: అడవుల్లో సహజంగా లభించే ఆకులతో తయారు చేసిన విస్తరాలతో ఆరోగ్యానికి ఎంతో మేలని ప్రపంచ పర్యావరణ సంస్థ జిల్లా అధ్యక్షుడు బొల్లు నగేంద్రకుమార్ అన్నారు. మండల పరిధిలోని కామారంలోని సమ్మక్క–సారలమ్మ ఆర్గానిక్ విస్తరాకుల తయారు సంఘం భవనాన్ని గురువారం సందర్శించి మాట్లాడారు. పాలిథిన్ కవర్లతో ఉన్న పేపర్ పేట్ల వినియోగాన్ని మానుకుని పర్యావరణానికి మేలు చేసే సహజ విస్తరాలను వినియోగించాలని సూచించారు. విస్తరాకులు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్న సంఘం సభ్యులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షురాలు కొర్నెబెల్లి కవిత, సభ్యులు రేగ అనూష, కోరం ఇందు, పూర్ణ, సోలం అన్నపూర్ణ, రేగ సరళ, శ్రీదేవి నాగమణి, రేగ స్వాతి పాల్గొన్నారు. తాత్కాలిక అంతరాయం ములుగు: సర్వర్ నిర్వహణ పనుల నేపథ్యంలో నేటి(శుక్రవారం) రాత్రి 10 గంటల నుంచి ఏప్రిల్ 5 ఉదయం 8 గంటల వరకు మీ సేవ ఆన్లైన్ సేవలకు తాత్కాలిక అంతరాయం ఏర్పడుతుందని కలెక్టర్ టీఎస్.దివాకర గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సర్వర్ పనితీరు మెరుగుదల, భద్రత వ్యవస్థల సాంకేతిక సమస్యల నివారణకు సర్వర్ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కాళేశ్వరం: వేసవి కావడంతో ఎండలు దంచికొడుతున్నాయి. ఏమరపాటున ఉంటే విద్యుత్ షార్ట్సర్క్యూట్, అగ్గిరవ్వలతో ప్రమాదం పొంచి ఉంది. చిన్న పొరపాట్లు పెద్ద ఆస్తి నష్టానికి, ప్రాణాల మీదకు దారి తీస్తాయి. ప్రజలను, ఆస్తులను అగ్నికి ఆహుతి కాకుండా కాపాడే ఫైర్స్టేషన్లో సిబ్బంది కొరత వేధిస్తుంది. భూపాలపల్లి, మహదేవపూర్ ఫైర్ స్టేషన్లలో సిబ్బంది కొరత వెక్కిరిస్తుంది. భూపాలపల్లిలో ఫైర్ స్టేషన్ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహిస్తుండగా, అదే చోట మహదేవపూర్కు కేటాయించిన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. దీంతో రెండు ఫైర్స్టేషన్లను పక్కా భవనాలు లేక ఒకే చోట నిర్వహిస్తున్నారు. భూపాలపల్లిలో రేగొండ, కొత్తపల్లిగోరి, చిట్యాల, మొగుళ్లపల్లి, టేకుమట్ల, కాటారం డివిజన్లోని మహదేవపూర్ ఫైర్స్టేషన్ కాటారం, మహాముత్తారం, పలిమెల, మల్హర్ మండలాలకు సేవలందించాలి. కానీ దూరభారం కావడంతో ఫైరింజన్ వచ్చే వరకు బూడిదవుతుందని విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో గతేడాది నుంచి ఈ ఏడాది వరకు 52 ప్రమాదాలు జరిగాయి. ఇందులో రూ.10కోట్ల వరకు ఆస్తినష్టం జరిగింది. ఇందులో ఫైర్ సిబ్బంది రూ.20కోట్లకుపైగా ఆస్తిని కాపాడారు. ఎలాంటి ప్రాణనష్టమూ జరుగలేదు. 101కాల్ వస్తే ఆలస్యమే.. అరకొర సౌకర్యాలు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉండడంతో అక్కడ ప్రత్యేక భవనాలు లేకపోవడంతో అన్ని కార్యకలాపాలు భూపాలపల్లి నుంచే నిర్వహిస్తున్నారు. 101కు అత్యవసర సమయాల్లో స్పందించడం ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రజల ప్రాణ భద్రతకు కీలకమైన ఫైర్ సర్వీసులే ఇలాంటి సమస్యలతో నడవడం వల్ల ప్రజలకు ఆందోళన కలుగుతుంది. అధికారులు తక్షణమే భవనాల నిర్మాణాన్ని పూర్తి చేసి, ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. ఉన్నతాధికారులు దృష్టిసారించాలని పలువురు కోరుతున్నారు. భూపాలపల్లి, మహదేవపూర్ ఫైర్ స్టేషన్లు ఒకే చోట సేవలందిస్తున్నాయి. ప్రజలకు అందుబాటులో ఉన్నాం. 101కు కాల్ చేస్తే నిమిషాల వ్యవధిలో ప్రమాదం జరిగిన చోటుకు చేరుతాం. ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి. విద్యుత్ కనెక్షన్ కెపాసిటీని పెంచుకోవాలి. సిబ్బంది కొరత ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. – శ్రీనివాస్, భూపాలపల్లి ఫైర్స్టేషన్ ఆఫీసర్రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ములుగు/వెంకటాపురం(ఎం)/ గోవిందరావుపేట: గ్రామాల అభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. ములుగు మున్సిపాలిటీలోని 6వ వార్డులో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ అధ్యక్షతన గురువారం నిర్వహించిన వార్డు సభకు సీతక్క హాజరై మాట్లాడారు. రెండేళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల లబ్ధిని వివరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేస్తామని తెలిపారు. నూతనంగా ఏర్పడిన ములుగు మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడానికి రూ.1.25కోట్లతో ప్రత్యేక వాహనాలను కొనుగోలు చేయడమే కాకుండా రూ.50 కోట్లతో సీసీ రోడ్లు, సెంట్రల్ లైటింగ్ సిస్టం పనులను ఈనెల 15 నుంచి ప్రారంభించనున్నట్లు వివరించారు. జిల్లా వ్యాప్తంగా మహిళా సంఘాల సభ్యులకు రూ.57 వేల కోట్ల రూపాయల వడ్డీలేని రుణాలను అందించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, జిల్లా గ్రంథాలయం చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కల్యాణి తదితరులు పాల్గొన్నారు. సర్వాయి పాపన్న చిత్ర పటానికి పూలమాల వేస్తున్న ఎమ్మెల్యే సత్యనారాయణరావు భూపాలపల్లి: బహుజన వీరుడు సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ అని, ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని సర్వాయి పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుజన వీరుడు పాపన్న గౌడ్ గొప్ప స్వాతంత్య్ర సమర యోధుడని కొనియాడారు. కుల, మత, జాతి విభేదాలు లేకుండా సమసమాజ నిర్మాణ స్థాపన కోసం పోరాటం చేసిన పోరాట యోధుడు పాపన్నగౌడ్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, బీసీ సంక్షేమ అధికారి ఇందిర, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏమరపాటున ఉంటే అంతా బూడిదే భూపాలపల్లి, మహదేవపూర్లో భవనాల లేమి వేసవిలో ప్రతియేటా రూ.కోట్ల ఆస్తి నష్టం సూచనలు పాటించా లంటున్న అధికారులుభూపాపల్లి ఫైర్స్టేషన్లో 17 పోస్టులకు, 4 ఖాళీలు, మహదేవపూర్లో 18 పోస్టు మంజూరు కాగా 14 ఖాళీలు ఉన్నాయి. కాటారం డివిజన్లో ఏడాదిన్నరగా మహదేవపూర్ ఫైర్స్టేషన్ మంజూరైనా సేవలు మాత్రం భూపాలపల్లి నుంచి కొనసాగుతున్నాయి. కనీసం ప్రభుత్వ భవనం లేక మహదేవపూర్ ప్రాంతానికి ఫైర్ సేవలు అందడం లేదు. కాల్చిన అగ్గిపుల్లలు, సిగరెట్లు, బీడీలను ఆర్పేసిన తరువాత పారేయాలి. చెత్త, గడ్డి, పూరిగుడిసెల వద్ద పారేయరాదు. ఇంట్లో ఎక్కువ రోజులు ఉండని పక్షంలో విద్యుత్ మెయిన్ ఆఫ్ చేయాలి. వంట గదిలో గాలి, వెలుతురు ఉండేలా చూసుకోవాలి. ఇళ్లకు గడ్డి వాములు సుమారు 60 అడుగుల దూరంలో పెట్టుకోవాలి. పూరింట్లో నివసించే వారు వంట పూర్తయిన వెంటనే పొయ్యిలో నిప్పును ఆర్పేయాలి. వేసవిలో ఉదయం 8గంటల లోపు, సాయంత్రం ఆరు గంటల తరువాత కట్టెలపొయ్యిని ఉపయోగించవద్దు. గ్యాస్ సిలిండర్ల దగ్గర పెట్రోల్, డిజీల్, కిరోసిన్ వంటి మండే లిక్విడ్లు ఉంచరావు. వంట పూర్తయితే వెంటనే రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి. అపార్ట్మెంట్లు, కర్మాగారాలు, గోదాములు, గిడ్డంగుల్లో అగ్నిమాపక సూచనలు విధిగా పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చు. -
‘వంటావార్పు’ను విజయవంతం చేయాలి
మొగుళ్లపల్లి: భూపాలపల్లి సర్కిల్ ఆఫీస్ ఎదుట నేడు (గురువారం) నిర్వహించనున్న వంటావార్పు కార్యక్రమాన్ని విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు అన్మ్యాన్డ్, స్పాట్ బిల్డర్స్, పీస్ రేటు కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని టీవీఏఈ విద్యుత్ జేఏసీ భూపాలపల్లి డివిజన్ జాయింట్ సెక్రటరీ వేముల కిరణ్గౌడ్ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఆర్టిజన్ కార్మికులను విద్యార్హతను బట్టి కన్వర్షన్ చేయాలని, అన్మ్యాన్డ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ఏప్రిల్ 8 నుంచి సమ్మెకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. భూపాలపల్లి అర్బన్: గత ఆర్థిక సంవత్సరానికి సింగరేణి సంస్థ భూపాలపల్లి ఏరియాకు 46.54 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించగా 74 శాతం బొగ్గు ఉత్పత్తిని వెలికితీశారు. ఏరియాలోని జీఎం కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బొగ్గు ఉత్పత్తి, రవాణా వివరాలను ఏరియా జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది అదనంగా 55 వేల టన్నుల బొగ్గు రవాణా చేశామన్నారు. ఏరియాకు మొత్తం 46.54 లక్ష టన్నుల లక్ష్యానికి 34.22 లక్ష టన్నులు మాత్రమే సాధించి 74 శాతంలో నిలిచామన్నారు. కేటీకే–1 గని 71 శాతం, కేటీకే–5, కేటీకే–6 గనులు 49 శాతం చొప్పున, కేటీకే–8 గని 44 శాతం సాధించాయి. కేటీకే ఓసీ–2 గని 97 శాతం, ఓసీ–3 గని 69 శాతం సాధించాయన్నారు. గతేడాదిలో ఏరియాకు రూ.703 కోట్ల నష్టం వచ్చినట్లు తెలిపారు. ఓపెన్ కాస్ట్–2, 3 గనుల్లో ఉత్పత్తి పూర్తి స్థాయిలో రాకపోవడంతో రూ.149 కోట్ల నష్టం వచ్చినట్లు తెలిపారు. 2026–27 ఆర్థిక సంవత్సరంలో సంస్థ నిర్దేశించిన 46 లక్షల టన్నుల లక్ష్యాలను చేరుకోవాలంటే కార్మికులు ఉద్యోగులు సమష్టిగా పని చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎస్ఓటు జీఎం కవీంద్ర, ఐఈడీ జ్యోతి, డీజీఎం ఫైనాన్స్ రాజేశ్వరరావు, పర్సనల్ మేనేజర్ శ్యాంప్రసాద్, డీవైపీఎం శ్రావణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. భూపాలపల్లి రూరల్: టీపీసీసీ సాంస్కృతిక సేన జిల్లా కమిటీని జిల్లా కేంద్రంలో ఎన్నుకున్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు నియామక పత్రం అందించారు. అధ్యక్షుడిగా గడ్డం రమేశ్ చంద్ర, ప్రధాన కార్యదర్శి రజినికాంత్, ఉపాధ్యక్షుడు దేవేందర్, కోశాధికారి ప్రతాప్, కార్యదర్శులుగా నరేశ్, రాజ్నాయక్, కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. భూపాలపల్లి అర్బన్: జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్బాద్లో భారత్ కుకింగ్ కోల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో గత నెలలో జరిగిన కోల్ ఇండియా స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో భూపాలపల్లి ఏరియాలోని కేటీకే–1వ గనికి చెందిన పోగుల శంకరయ్య విశిష్ట ప్రతిభ కనబరిచారు. 45 ఏళ్ల వయో విభాగం డబుల్స్లో పాల్గొని మొదటి స్థానం సాధించి బంగారు పతకం గెలుచుకున్నారు. ఈ సందర్భంగా జీఎం కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం జీఎం ఏనుగు రాజేశ్వర్రెడ్డి శాలువా, బహుమతులతో శంకరయ్యను ఘనంగా సన్మానించారు. కోల్ ఇండియా స్థాయి పోటీల్లో సింగరేణి సంస్థకు ప్రథమ స్థానం తీసుకురావడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జీఎం కవీంద్ర, ఏజీఎం జ్యోతి, డీజీఎం రాజేశ్వర్, పర్సనల్ మేనేజర్ సల్ల శ్యామ్సుందర్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ శ్రవణ్కుమార్, స్పోర్ట్స్ సూపర్వైజర్ పర్స శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లకు
గురువారం శ్రీ 2 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026భూపాలపల్లి రూరల్: జిల్లాలో యాసంగి వరి సాగు చివరి దశకు చేరుకోవడంతో జిల్లా యంత్రాంగం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. ఎప్పటిలాగే ఐకేపీ, సహకార సంఘాల ఆధ్వర్యంలో కొనుగోళ్లు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రస్తుత యాసంగిలో 97,570 ఎకరాల్లో వరి సాగైంది. మరో 15 రోజుల్లో వరికోతలు ప్రారంభం కానుండటంతో కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. దిగుబడి అంచనా.. జిల్లాలో యాసంగి సీజన్లో 1.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. అందులో 80 శాతం దొడ్డు ధాన్యం, 20 శాతం సన్నధాన్యం రానున్నట్లు అధికారులు అంచనా వేశారు, పెరగనున్న కొనుగోలు కేంద్రాలు యాసంగి సీజన్లో దిగుబడి అధికంగా వస్తున్నందున దానికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. గత సంవత్సరం 160 కొనుగోలు కేంద్రాల వరకు ఏర్పాటు చేయగా ఈసారి 185 వరకు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అవసరాన్ని బట్టి ఎక్కడైతే ధాన్యం అధికంగా వస్తుందో అక్కడ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాల మేరకు రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్కుమార్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన ప్రధాన శాఖల అధికారులు, మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. యాసంగి కొనుగోళ్లలో ఎక్కడ ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టేలా ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు బ్లాక్ లిస్టులో ఉన్న మిల్లులకు ధాన్యం లేదు.. జిల్లాలో మూడు మిల్లులు బ్లాక్ లిస్టులో ఉన్నందున ఆ మిల్లులకు పోయే ధాన్యాన్ని ఇతర మిల్లులకు మళ్లించి కొనుగోళ్లు చేపట్టనున్నారు. ధాన్యం రవాణా విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా మిల్లుల ఎంపిక, లారీల ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించనున్నారు. తూకం యంత్రాలతో పాటు టార్పాలిన్లు, గన్నీబ్యాగులు, టెంట్లు, ఇతర పరికరాలను సమకూర్చుతున్నారు. జిల్లాకు 3 లక్షల వరకు వరకు గన్నీ బ్యాగులు అవసరం ఉంటాయని అంచనా వేశారు. అందులో ఇప్పటికే జిల్లాలో 20 లక్షల వరకు గన్నీ బ్యాగులు సిద్ధంగా ఉన్నా యి. మిగతా వాటిని సమకూర్చుకునే కార్యాచరణపై అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. 185 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు 1.60 లక్షలు మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం ఏర్పాట్లలో నిమగ్నమైన అధికార యంత్రాంగం -
అభివృద్ధి పనుల పరిశీలన
పలిమెల: మండలంలోని చేపట్టిన అభివృద్ధి పనులను అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) విజయలక్ష్మి బుధవారం పరిశీలించారు. పలిమెల గ్రామంలో నిర్మాణంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి జూన్ 2వ తేదీలోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం గ్రామ పంచాయతీ నర్సరీని సందర్శించి పలు సూచనలు చేశారు. పలిమెల పల్లె దవాఖానాను సందర్శించి ప్రారంభోత్సవానికి 99 రోజుల ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అలాగే నీలంపల్లి గ్రామ పంచాయతీలోని సబ్ సెంటర్ నిర్మాణం ప్రారంభించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ మధుసూదన్, పంచాయతీరాజ్ ఈఈ వెంకటేశ్వర్లు, డీఈ సాయిలు, ఎంపీడీఓ రవీంద్రనాథ్, మెడికల్ ఆఫీసర్లు కల్యాణి, రఘురాం, ఏపీఎం రాజలింగం తదితరులు పాల్గొన్నారు. పీహెచ్సీ తనిఖీ కాళేశ్వరం: మహదేవపూర్ మండలం అంబట్పల్లి లోని పీహెచ్సీని అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చేశారు. బుధవారం పీహెచ్సీలోని వైద్యులు, సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమయపాలన పాటించాలని, రోగులకు అందుబాటులో ఉండాలన్నారు. ఆమె వెంట జిల్లా వైద్యాధికారి మధుసూదన్, డాక్టర్ కల్యాణి, జగదీష్ కన్నా త దితరులు ఉన్నారు. -
పుష్కరాల ఏర్పాట్లు వేగవంతం చేయాలి
భూపాలపల్లి అర్బన్: మే 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు కాళేశ్వరంలో జరగనున్న సరస్వతి అంత్య పుష్కరాల ఏర్పాట్ల పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్శర్మ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో సరస్వతి అంత్య పుష్కరాల పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పుష్కరాల సమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు సమయానికి పూర్తి చేయాలని సూచించారు. ముఖ్యంగా ఘాట్ల అభివృద్ధి, రహదారుల మరమ్మతు, తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రెవెన్యూ, దేవాదాయ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, విద్యుత్, మిషన్ భగీరథ తదితర శాఖల అధికారులు కేటాయించిన పనులను సమన్వయంతో నిర్వహించి, నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పుష్కరాల సందర్భంగా భక్తుల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నిర్వహణ, భద్రతా చర్యలు, వైద్య సదుపాయాలు సమర్థవంతంగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, ఇరిగేషన్, పీఆర్, విద్యుత్, మిషన్ భగీరథ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్శర్మ -
నల్లబ్యాడ్జీలతో నిరసన
భూపాలపల్లి అర్బన్: కేంద్ర ప్రభుత్వం అమలు చేసే నాలుగు లేబర్ కోడ్స్ విధానాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (ిసీఐటీయూ) ఆధ్వర్యంలో బుధవారం ఏరియాలోని కేటీకే–5 గనిలో నల్లబ్యాడ్జీలు, నల్లజెండాలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ బ్రాంచ్ కార్యదర్శి కంపేటి రాజయ్య మాట్లాడుతూ నూతనంగా కేంద్రం తీసుకువచ్చిన లేబర్ కోడ్ల అమలుతో కార్మికులకు, కార్మిక సంఘాలకు ఎటువంటి చట్టపరమైన హక్కులు లేకుండా పోతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లేబర్ కోడ్ల అమలుపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, బాబురావు, రమేష్లు పాల్గొన్నారు. ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లేబర్ కోడ్స్ను రద్దు చేసి పాత కార్మిక చట్టాలను కొనసాగించాలని గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం (ఐఎఫ్టీయూ) డిమాండ్ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం ఏరియాలోని ఓపెన్కాస్ట్–2, 1వ గనుల్లో కార్మికులకు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. అనంతరం గనుల మేనేజర్లకు వినతి పత్రాలు అందించారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణ, డివిజన్ అధ్యక్షుడు సమ్మయ్య, కార్యదర్శి నర్సింగ్, నాయకులు నవీన్, దుర్గం సమ్మయ్య, అర్జున్లాల్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్లో ‘సంస్థాగత’ సందడి!
సాక్షిప్రతినిధి, వరంగల్ : అధికార కాంగ్రెస్ పార్టీలో ‘సంస్థాగత’ సందడి కొనసాగుతోంది. ప్రభుత్వం, ప్రజలకు వారధిగా ఉండేలా కార్యకర్తలను సన్నద్ధం చేస్తున్నారు. అధిష్టానం ఆదేశం మేరకు పాత కమిటీలను రదు చేసిన జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ)ల అధ్యక్షులు.. వార్డు, డివిజన్ కమిటీలనుంచి పూర్తిస్థాయి జిల్లా కమిటీలను వేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు గ్రామ, మండల, జిల్లా స్థాయిలలో సీనియర్ కాంగ్రెస్ నాయకులను పరిశీలకులుగా నియమించారు. హనుమకొండ జిల్లాతోపాటు ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఏప్రిల్ మాసాంతానికల్లా అన్ని స్థాయిల్లో సంస్థాగత కమిటీలు వేయాలన్న హైకమాండ్ ఆదేశాల మేరకు డీసీసీ అధ్యక్షులు ఆయా జిల్లాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలను సంప్రదించి కమిటీలను రూపొందిస్తున్నారు. జిల్లా కమిటీల్లో 31 నుంచి 51 మందికి ప్రాతినిధ్యం... ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో పూర్తిస్థాయి జిల్లా కమిటీ కార్యవర్గం ఈ నెలాఖరుకు ఖరారు కానుంది. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామకం జరిగి నాలుగు నెలలు పూర్తవగా... పూర్తిస్థాయి కమిటీలను వేయలేదు. ఉగాది సందర్భంగా రాష్ట్రంలోని సుమారు 14 జిల్లాల్లో పూర్తి స్థాయి డీసీసీ కమిటీలు ప్రకటించారు. వీటిలో వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, కోశాఽధికారి, అధికార ప్రతినిధులు, కార్యదర్శులు, కార్యవర్గసభ్యులతో పాటు విస్తృత స్థాయి నిర్మాణం పూర్తి చేశారు. ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో పెండింగ్లో ఉండగా.. ఇటీవల కసరత్తు మొదలైంది. ఈ క్రమంలోనే వా ర్డు, డివిజన్, గ్రామ, మండల కమిటీలు మొదలు పూర్తి స్థా యి జిల్లా కమిటీల దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన జరుగుతోంది. చాలా జిల్లాల్లో జిల్లా కమిటీలు జెంబోజెట్లుగా ని యామకాలు చేశారన్న ఆరోపణలు ఉండగా.. ఉమ్మడి జి ల్లాలో మాత్రం చిన్న జిల్లాలుంటే 31.. పెద్ద జిల్లాలైతే 51 మందికి మించకుండా ప్రాతినిధ్యం కల్పించాలని నిర్ణయించా రు. ఇందుకోసం డీసీసీ అధ్యక్షులు ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్లను సంప్రదించి జాబి తాలు రూపొందించే పనిలో ఉండగా.. ఈ నెల 8న కీలక స మావేశం హైదరాబాద్లో ఏర్పాటు చేసినట్లు సమాచారం. ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా ఉండేలా పార్టీ సంస్థాగత కమిటీల నిర్మాణం పారదర్శకంగా జరుగుతోంది. అన్ని స్థాయిల కమిటీల్లో సామాజిక ప్రాతినిధ్యం ఉంటుంది. మహిళలకు 30 శాతం అవకాశాలు తప్పనిసరి చేశాం. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ అధిష్టానం మార్గదర్శకాల మేరకు కమిటీలు పని చేస్తాయి. పార్టీ సిద్ధాంతాల పునశ్చరణ, గాంధీజీ ఆశయాల సాధన, క్రమశిక్షణ కలిగిన నాయకత్వ నిర్మాణం కోసం వారం వారం ‘సర్వోదయ చరక అభ్యాస్’ ప్రత్యేక శిక్షణ అన్ని స్థాయిల నాయకులకు ఉంటుంది. – ఇనగాల వెంకట్రాంరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు, హనుమకొండ జిల్లావార్డు, డివిజన్, గ్రామ, మండల కమిటీల తర్వాత జిల్లా కమిటీలను పూర్తిస్థాయిలో నియమించనున్నారు. ఇందుకోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సముచిత ప్రాధాన్యత దక్కేలా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ముఖ్యంగా మహిళలకు 30 శాతం ప్రాతినిధ్యం ఉండేలా, పార్టీ బలోపేతం దృష్ట్యా మండల స్థాయి కార్యవర్గాల్లో 35 సంవత్సరాల పైబడిన వారికే ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మండల అధ్యక్షులు, కమిటీ సభ్యులు కనీసం మూడేళ్లపాటు పార్టీకి చురుకై న సేవలు అందించిన వారికి కూడా తగిన గుర్తింపు ఇవ్వనున్నారు. జిల్లా పరిధిలోని రెండేళ్లు పూర్తి చేసుకున్న మండల, మునిసిపల్, కార్పొరేషన్ డివిజన్ అధ్యక్షులను ఈసారి తప్పనిసరిగా మార్చాలని నిబంధన పెట్టుకున్నారు. ఈ మేరకు వార్డు, డివిజన్, గ్రామ, మండల కమిటీలు పూర్తయిన తర్వాత జిల్లా కమిటీలను ప్రకటించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. ఇదివరకున్న కమిటీలను రద్దు చేసిన డీసీసీలు గ్రామస్థాయి నుంచి కమిటీలు.. మండలాల వారిగా పరిశీలకులు జిల్లా కమిటీలో 31 నుంచి 51 మందికి ప్రాతినిధ్యం పల్లెల్లో మొదలైన కాంగ్రెస్ కమిటీల సందడి ఏప్రిల్ మాసాంతానికల్లా పూర్తిస్థాయి కమిటీలు? -
మున్సిపల్ బడ్జెట్ రూ.100.87 కోట్లు
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి పురపాలక సంస్థ 2026–27 సంవత్సరపు ముసాయిదా బడ్జెట్ను మంగళవారం కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ప్రవేశపెట్టారు. అదనపు ఇన్చార్జ్ కలెక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ను చైర్మన్ బుర్ర కొమురయ్య, కమిషనర్ ఉదయ్కుమార్ సమక్షంలో కౌన్సిలర్లు ఆమోదం తెలిపారు. అంచనా బడ్జెట్ రూ.100.87కోట్లు నిర్ణయించి ప్రకటించారు. సాధారణ ఆదాయం రూ.11.32కోట్ల 50 వేలు, గ్రాంట్ల నిధుల ఆదాయం రూ.88.28కోట్లుగా నిర్ణయించారు. ఏప్రిల్ 1, 2026 నాటికి మిగులు బడ్జెట్ కింద ప్రారంభ విలువ రూ.7కోట్ల 1లక్ష 99వేలు చూపించారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి అంచనా బడ్జెట్ గతేడాది రూ.31.17కోట్ల 64 వేలుగా అంచనా వేయగా, మార్చి 31నాటికి అయిన ఖర్చు రూ.21.04కోట్ల 64వేలుగా వివరించారు. ఆదాయం రూ.11.32కోట్లు మున్సిపల్ పన్నులు, ఇతరత్రాల రూపంలో రూ.11,32కోట్ల 50వేల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ఇందులో పన్నుల రూపంలో రూ.7.74 కోట్లు, కేటాయించిన ఆదాయాలు అద్దె ద్వారా రూ.51.50లక్షలు, ప్రజారోగ్యం, పారిశుద్ధ్య విభాగం రశీదుల ద్వారా రూ.68లక్షలు, పట్టణ ప్రణాళిక విభాగం రశీదుల ద్వారా రూ.1.92కోట్లు, ఇంజినీరింగ్ విభాగం ద్వారా రూ.46.50లక్షలు, మొత్తం రూ.50.37 కోట్ల ఆదాయం రానున్నట్లు అంచనా వేశారు. వీటితో పాటు కాపిటల్ ఫండ్ (సీపీఎస్) నాన్ ప్లాన్ నిధులు రూ.88,28 కోట్లు, డిపాజిట్లు రుణాలు రూ.1.26కోట్లు మొత్తంగా పన్ను వనరులు, కాపిటల్ ఫండ్ నిధులన్ని కలిపి రూ.10.087కోట్ల బడ్జెట్గా అంచనా వేశారు. వేతనాలు, పారిశుద్ధ్య నిర్వహణ, గ్రీన్ బడ్జెట్ వ్యయం, ఇంజినీరింగ్ విభాగాల నిర్వహణ, సాధారణ పరిపాలన, పట్టణ ప్రణాళిక విభాగం, వసతులు, వార్డులవారీగా నాన్ప్లాన్, ప్రణాళిక, ఇతర నిధుల ఖర్చు అంచనా వేశారు.ఆదాయ వనరులు పెంచాలి.. మున్సిపల్ అభివృద్ధి కోసం పాలకవర్గ సభ్యులు సహకరించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. ఆదాయ వనరులపై పాలకవర్గ సభ్యులు దృష్టిసారించాలన్నారు. పట్టణంలో వనరులను సృష్టించుకోవడం వలన అభివృద్ధి ముందుకు సాగుతుందన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో ఏవైనా లోపాలు ఉన్నట్లయితే వాటిని సవరించాలని అధికారులకు, వచ్చే సమావేశంలో సభలో చర్చించాలని కౌన్సిలర్లకు సూచించారు. శానిటేషన్ విభాగానికి నిధులు పెంచాలని, వినియోగంలోని సులబ్ కాంప్లెక్స్లకు నిధులు ఎందుకు కేటాయించారని పలువురు కౌన్సిలర్లు ప్రశ్నించారు. -
ఎక్స్పైరీ అమ్మకాలు
భూపాలపల్లి అర్బన్: ప్రజారోగ్యం గాలికి వదిలేసి, కాసులే పరమావధిగా కొందరు వ్యాపారులు బరితెగిస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాలు, గ్రామాల్లో వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. కాలంచెల్లిన ఆహార పదార్థాలు, పానీయాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా జిల్లా కేంద్రంలో ఎక్స్పైరీ తేదీ ముగిసి రెండు నెలలవుతున్నా దానిని వినియోగదారులకు అంటగడుతున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. చూసి కొనాల్సిందేనా.. సాధారణంగా ఏదైనా ఆహార వస్తువు కొనే ముందు వినియోగదారులు దానిపై ఉన్న తయారీ, గడువు తేదీలను గమనించాలి. నమ్మకంతో కొనే వారిని ఆసరాగా చేసుకొని కొందరు వ్యాపారులు జిల్లాలో పాత స్టాక్ను విక్రయిస్తున్నారు. తాజాగా జిల్లాకేంద్రంలోని జయశంకర్ సెంటర్లోని ఓ కిరాణం దుకాణంలో లభ్యమైన బిస్కెట్ ప్యాకెట్లకు 2026 జనవరి వరకు మాత్రమే గడువు ఉంది. పలు బిస్కెట్ ప్యాకెట్లు, కూల్డ్రింక్స్ బాటిళ్ల గడువు ముగిసిపోయినవి దుకాణంలో ఉన్నాయి. ఏప్రిల్ నెల వచ్చినా ఇంకా పాత వస్తువులను దుకాణాలలో ఉంచి విక్రయించడం నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిస్తుంది. మరో సూపర్మార్కెట్లో 2025 అక్టోబర్ 28వ తేదీతో గడువు ముగిసిన బ్రూ కాఫీ ఫౌడర్ దర్శనమిస్తుంది. గడువు ముగిసిన పదార్థాలు, పానియాలు సేవించడంతో ఫుడ్ పాయిజన్, వాంతులు, విరేచనాలు వంటి తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వేసవి కాలం కావడంతో చిన్నారులు యువత కూల్డ్రింక్స్ను ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఇంత జరుగుతున్నా సంబంధింత ఆహార భద్రతా అధికారులు తనిఖీలు చేపట్టకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. కలెక్టర్కు ఫిర్యాదు జిల్లాకేంద్రంలో కిరాణా దుకాణాలు, సూపర్మార్కెట్లలో గడువు ముగిసిన ఆహార పదార్థాలు, కూల్ డ్రింక్ విక్రయాలు చేపడుతున్నారని వరల్డ్ కన్సుమర్ రైట్ సభ్యులు సోమవారం కలెక్టర్ రాహుల్శర్మకు ఫిర్యాదు చేశారు. విచ్చల విడిగా గడువు ముగిసిన వస్తువులను అమ్మకాలు చేపడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గడువు ముగిసిన బిస్కెట్ ప్యాకెట్లు, కూల్డ్రింక్స్ బాటిళ్ల ఫొటోలను ఆధారాలతో కలెక్టర్కు అందించారు. అధికారులు స్పందించేనా.. ఎక్స్పైరీ ముగిసిన వస్తువులను అమ్ముతున్నా.. ఫిర్యాదులు వస్తేనే అధికారులు స్పందిస్తారా లేదా విధి నిర్వహణను నెరవేరుస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ఆహార కల్తీ నియంత్రణ, తనిఖీ అధి కారులు ఉన్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. గడువు తేదీ ముగిసిన వస్తువులను వినియోగదారులకు అమ్మడం నేరం. తేది ముగిసిన వస్తువులు అమ్మకాలు చేపడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. పలు దుకాణదారులకు నోటీసులు జారీ చేశాం. మరోసారి జరిగితే చర్యలు తీసుకుంటాం. వినియోగదారులు గమనించి ఫిర్యాదు చేయాలి. – జి.వరుణ్రెడ్డి, జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్జిల్లాకేంద్రంతో పాటు మండల కేంద్రాల్లో కిరాణా షాపులు, హోటళ్లు, కూల్ డ్రింక్ ఏజెన్సీలలో నిరంతరం తనిఖీలు నిర్వహించాల్సిన అధికారులు కార్యాలయానికే పరిమితమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి, ఇప్పటికై నా జిల్లా ఉన్నతాఽధికారులు స్పందించి జిల్లాకేంద్రంతో పాటు మండలాలు, గ్రామాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. పట్టించుకోని అధికారులు -
బాధితులకు న్యాయం చేయాలి
ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ భూపాలపల్లి: ప్రతీ కేసులో నాణ్యమైన, వేగవంతమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చూడాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించి జిల్లాలోని పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. విచారణలో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ నరేష్కుమార్, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. వెంకట్రెడ్డి సేవలు మరువలేనివి.. గంట వెంకట్రెడ్డి 36 ఏళ్ల పాటు పోలీసు శాఖకు అందించిన సేవలు మరువలేనివని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న వెంకట్రెడ్డి మంగళవారం ఉద్యోగ విరమణ పొందగా ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఈదురుగాలుల బీభత్సం
● అకాల వర్షంతో రైతులకు నష్టం కాళేశ్వరం/చిట్యాల: మంగళవారం తెల్లవారుజామున మహదేవపూర్, చిట్యాల మండలాల్లో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. దీంతో పంటలకు నష్టం జరిగింది. కాళేశ్వరం, అన్నారం, పలుగుల, చండ్రుపల్లి గ్రామాల్లో చేతికొచ్చిన పంటలు నేలమట్టమయ్యాయి. కల్లాల్లో ఆరబోసిన మిర్చి తడిసింది. కొన్ని చోట్ల మిర్చిపై పట్టాలు కప్పివేయడంతో వర్షపు నీరు నిలిచింది. చిట్యాల మండలం గుంటురుపల్లి, గోపాలపూర్తో పాటు పలు గ్రామాల శివారులలో మొక్కజొన్న పంట పూర్తిగా నేలమట్టమైంది. వరి పంట కోతకు వచ్చే సమయంలో ఈదురుగాలులు వీచి పంట నేలమట్టం కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. గుంటురుపల్లి శివారులో వీరవేని గణేష్ ఏడెకరాల్లో మొక్కజొన్న సాగుచేయగా.. నాలుగెకరాల పంట నేలమట్టమైంది. గోపాలపూర్లో బోగం నర్సయ్య మొక్కజొన్న పంట పూర్తిగా నేలమట్టమైంది. అధికారులు పంటలను పరిశీలించి నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. -
అరవింద్సాయికి జాతీయ అవార్డు
భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రానికి చెందిన యువకుడు రామగిరి అరవింద్సాయి ప్రతిష్టాత్మకమైన అండర్ 25 జాతీయ అవార్డును అందుకొని జిల్లా ప్రతిష్టను పెంచాడు. హైదరాబాద్లో సోమవారం నిర్వహించిన ‘యువ భారత్ రన్’ కార్యక్రమంలో భాగంగా స్టూడెంట్ ట్రైబ్ సంస్థ ఆధ్వర్యంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్ఎస్ఎస్) ద్వారా సమాజానికి చేసిన విశేష సేవలు, యువతకు ప్రేరణగా నిలిచే కార్యక్రమాలను గుర్తిస్తూ అవార్డును అందించారు. ఈ అవార్డును కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, సినీ నటుడు శర్వానంద్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ ఘనత సాధించడం పట్ల కుటుంబ సభ్యులు, స్వర్ణకార సంఘం ప్రతినిధులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. -
ఎస్సీ, ఎస్టీ కేసుల పరిష్కారానికి కృషి
భూపాలపల్లి: ఎస్సీ, ఎస్టీ కేసులను సమీక్షిస్తూ సత్వర పరిష్కారానికి కృషి చేయాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా స్థాయి ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు అందించిన వివరాలు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదనపు కలెక్టర్ అశోక్కుమార్ మాట్లాడుతూ.. అట్రాసిటీ కేసుల విషయంలో త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ అభివృద్ధి అధికారి ఇందిర, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన రాజీ పడదగిన 353 కేసులు పరిష్కారం అయినట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ వెల్లడించారు. లోక్ అదాలత్ విజయవంతానికి కృషి చేసిన జిల్లాలోని పోలీసు అధికారులు, కోర్టు, ఇతర సిబ్బందిని ఎస్పీ అభినందించారు. -
‘కాళేశ్వరం’ ట్రస్టుబోర్డు నియామకం
కాళేశ్వరం: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు నియామకానికి దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ రెండేళ్ల కాలపరిమితితో ఉత్తర్వులు జారీచేశారు. 12 మంది సభ్యులతో పాలకవర్గం ఏర్పడనుంది. సభ్యులుగా దొడ్ల అశోక్, కుంభం పద్మ, అడ్డూరి శ్రీధర్రావు, బీసుల నర్సయ్య, మంచినీళ్ల దుర్గయ్య, గంధెసిరి సత్యనారాయణ, సుంకరి సీతయ్య, అవధాని మోహన్శర్మ, జలవంచ సీతారాం, కె.సత్తయ్య, డి.శ్యాంసుందర్ నియమితులయ్యారు. ఎక్స్అఫీషియోగా ఉప ప్రధాన అర్చకుడు పనకంటి ఫణీంద్రశర్మను నియమించారు. చైర్మన్గా అవధాని మోహన్ శర్మ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిసింది. సభ్యుల కుదింపు.. బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో 15 మంది సభ్యులతో పాలకవర్గం ఉండగా, ప్రస్తుతం 12 మందికే పరిమితం చేయడంతో కొంతమంది ఆశావహులు నిరాశకు గురయ్యారు. గతేడాది నవంబర్ 15న నోటిఫికేషన్ జారీ అయినప్పటికీ, పలుమార్లు వాయిదాల తర్వాత చివరకు నియామక ఉత్తర్వులు వెలువడటంతో ఎంపికై న వారిలో ఆనందం వ్యక్తమవుతోంది. 27 నెలలుగా పాలకవర్గం లేకపోవడం గమనార్హం. కాళేశ్వరంపై మంత్రి చూపు.. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఇప్పటికే ప్రత్యేకమైన ప్రణాళికలు సిద్ధం చేసి కాళేశ్వరం రూపురేఖలు మార్చేందుకు బృహత్తర కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కాళేశ్వరం పర్యటన సందర్భంగా తెలిపారు. ప్రభుత్వం రాష్ట్రంలో గోదావరి పుష్కరాలు జరిగే ప్రాంతాలకు రూ.500కోట్ల నిధులు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ఆ నిధులతో పలు అభివృద్ధి జరుగనుంది.ట్రస్టుబోర్డుకు రెండు పుష్కరాలు.. ట్రస్ట్ బోర్డు ముందున్న ముఖ్య బాధ్యతల్లో ఈ ఏడాది మే 21 నుంచి జూన్ 1 వరకు జరగనున్న సరస్వతి నది అంత్య పుష్కరాలు, వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 6 వరకు జరగనున్న గోదావరి పుష్కరాల నిర్వహణ ప్రధానంగా ఉన్నాయి. దేవస్థానం అభివృద్ధికి ఈ కొత్త పాలకవర్గం కీలకంగా మారనుందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
జన గణన సమర్థవంతంగా నిర్వహించాలి
ములుగు: జన గణన–2027 మొదటి విడతలో భాగంగా చేపట్టనున్న జన గణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని డైరెక్టర్ ఆఫ్ సెన్సస్, జనగణన సంచాలకులు భారతి హోళీకేరి సూచించారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి సోమవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వీడియో కాన్ఫరెన్స్లో జన గణన, ఇళ్ల గణన, మ్యాప్ తయారీ, ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల నియామకంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇళ్ల గణన ప్రక్రియను సక్రమంగా నిర్వహించేందుకు అధికారులందరూ పూర్తి అవగాహనతో పని చేయాలని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి గణన చేపట్టాలని సూచించారు. దేశంలో తొలిసారిగా జన గణనను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. మే 11 నుంచి జూన్ 9 వరకు ఇళ్ల గణన కార్యక్రమం కొనసాగుతుందని, ప్రతీ కుటుంబానికి సంబంధించిన వివరాలు సమగ్రంగా నమోదు చేయాలని సూచించారు. సన్నాహక చర్యలను ముందుగానే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. యాప్ నిర్వహణలో ఎటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తినా వెంటనే పరిష్కరించాలని, గణన ప్రక్రియ నిరాటంకంగా కొనసాగేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మండలాల వారీగా ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల నియామకం చేపట్టాలని తదితర అంశాలపై సూచించారు. అనంతరం కలెక్టర్ దివాకర మాట్లాడుతూ జిల్లాలో జన గణన–2027 మొదటి విడత ఇళ్ల గణన కార్యక్రమాన్ని సమన్వయంతో సక్రమంగా నిర్వహిస్తామని తెలిపారు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ భారతి హోళీకేరి -
బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలి
● జిల్లా సంక్షేమ అభివృద్ధి అధికారి ప్రేమలత ఏటూరునాగారం/కన్నాయిగూడెం: బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలని జిల్లా సంక్షేమ అభివృద్ధి అధికారి ప్రేమలత అన్నారు. జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం మండలాల్లో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు, బాలల హక్కులను పరిరక్షించేందుకు సంబంధిత చట్టాలపై సోమవారం అవగాహన కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. రైతులు, భవన నిర్మాణ కార్మిక యజమానులకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం(డీసీపీయూ), చైల్డ్హెల్ప్లైన్ (సీహెచ్ఎల్), ఉమెన్ హబ్ సంయుక్తంగా ప్రత్యేక బృందాలుగా విడిపోయి ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు వెల్లడించారు. బాలల హక్కుల పరిరక్షణకు కలెక్టర్ దివాకర ఆదేశాల ప్రకారం మిషన్ శక్తి, మిషన్ వాత్సల్య సిబ్బంది వ్యవసాయ క్షేత్రాల్లో పర్యటించారు. రైతులకు నోటీసులు జారీ చేశారు. 14 నుంచి 18ఏళ్ల బాలలను పనుల్లో పెట్టుకోవద్దని తెలిపారు. ఈ డ్రైవ్లో భాగంగా సుమారు వంద మంది రైతులకు నోటీసులు అందజేసినట్లు వెల్లడించారు. బాలల హక్కులపై అవగాహన కల్పించినట్లు వివరించారు. బాలలను పనుల్లో పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. బాలలు తప్పకుండా విద్యను కొనసాగించేలా తల్లిదండ్రులు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్లైన్ కోఆర్డినేటర్ అబ్బనబోయిన నరేశ్, సూపర్వైజర్ సుదర్శన్, బాలల పరిరక్షణ విభాగం అధికారులు సంజీవ, జ్యోతి, మహిళా శక్తి సాధికారిత జిల్లా అధికారి రమాదేవి పాల్గొన్నారు. -
మక్కల కొనుగోళ్లలో జాప్యం
మహబూబాబాద్ రూరల్ : మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మక్కల కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఎదుట రైతులు సోమవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. మక్కలను మార్కెట్ యార్డులో విక్రయానికి తీసుకువస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు మార్క్ఫెడ్ అధికారులు, సిబ్బంది కొనుగోలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్లో మక్కలకు మద్దతు ధర రూ.2,400 అందడంలేదని, వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి క్వింటాకు ధర రూ.1,800 చెల్లిస్తున్నారని తెలిపారు. అకాల వర్షాలు, మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఎప్పుడు ఏప్రమాదం ముంచుకొస్తుందోనని ఆందోళన చెందుతున్నామన్నారు. కాగా, ఆందోళనతో మార్కెట్లో క్రయవిక్రయాలు నిలిచిపోగా అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఏఎంసీ గదిలో పీఏసీఎస్ సెక్రటరీ ప్రమోద్కుమారును నిర్బంధించారు. ఆగ్రహించిన అన్నదాతలు ఏఎంసీ గదిలో పీఏసీఎస్ సెక్రటరీ నిర్బంధం -
ఎంఆర్ఐ యంత్రం ఏర్పాటులో నిర్లక్ష్యం వద్దు
భూపాలపల్లి: ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ఎంఆర్ఐ యంత్రం ఏర్పాటు పనుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని కలెక్టర్ రాహుల్ శర్మ హెచ్చరించారు. ఎమ్మారై యంత్రం ఏర్పాటు పురోగతిపై సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో రెవెన్యూ, ప్రణాళిక, వైద్య, టీజీఎంఐడీసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... అవసరమైన పరికరాల కొనుగోలుకు అడ్వాన్స్ మంజూరు చేశామని, పనుల్లో జాప్యం జరిగితే సహించమన్నారు. ఏప్రిల్ 8వ తేదీ నాటికి పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, జిల్లా అధికారులు, జిల్లా ప్రధాన ఆస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్ రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలి.. ప్రజావాణిలో సమస్య పరిష్కారానికి ప్రజలు అందచేసిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. గ్రామసభలకు ఏర్పాట్లు చేయాలి.. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2వ తేదీన అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామసభలు నిర్వహించేందుకు సమగ్ర ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్శర్మ ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో రెవెన్యూ, వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి అర్బన్: జిల్లాలోని దివ్యాంగులు సదరం శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాహుల్శర్మ సూచించారు. సోమవారం జిల్లాకేంద్రంలోని జిల్లా ప్రధాన ఆస్పత్రిలో నూతన సదరం, యూడీఐడీ కార్యాలయాన్ని జిల్లా అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సదరం శిబిరాలకు వచ్చే దివ్యాంగుల కోసం ఆస్పత్రిలో మెరుగైన సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ సులభంగా సదరం, యూడీఐడీ సర్టిఫికెట్లు పొందడంతో పాటు వాటి ద్వారా లభించే ప్రభుత్వ ప్రయోజనాలను పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఆర్డీఓ బాలకృష్ణ, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్, డీపీఎం రవి, సదరం ఆపరేటర్ పాల్గొన్నారు. -
హేమాచలక్షేత్రం ఇన్చార్జ్ ఈఓగా వీరస్వామి
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయ కార్యనిర్వహణ ఇన్చార్జ్ అధికారి(ఈఓ)గా వీరస్వామి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత కార్యనిర్వహణ ఇన్చార్జ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న రేవెల్లి మహేశ్ స్థానంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్, మేడారం సమ్మక్క–సారలమ్మ దేవస్థానం ఇన్చార్జ్ ఈఓగా విధులు నిర్వహిస్తున్న వీరస్వామిని మల్లూరు లక్ష్మీనర్సింహస్వామి ఆలయ ఇన్చార్జ్ ఈఓగా నియమిస్తూ దేవాదాయశాఖ అదనపు కమిషనర్ శ్రీనివాస్ ఈ నెల 24న ఉత్తర్వులు జారీ చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు వీరస్వామి సోమవారం హేమాచలుడిని దర్శించుకుని ఆయన బాధ్యతలను స్వీకరించినట్లు తెలిపారు. -
రూ. 396.69 కోట్లు
కేయూ అంచనా బడ్జెట్కేయూ క్యాంపస్ : 2026–2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాకతీయ యూనివర్సిటీ అంచనా బడ్జెట్ రూ 396.69 కోట్లుగా ప్రవేశపెట్టారు. ఈసారి లోటు రూ 27.13 కోట్లుగా చూపారు. సోమవారం కేయూ పరిపాలన భవనంలోని సెనెట్హాల్లో వీసీ కె.ప్రతాప్రెడ్డి అధ్యక్షత వహించగా ఎకనామిక్స్ విభాగం అధిపతి, పాలకమండలి సభ్యుడు బి. సురేశ్లాల్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు, విరమణ బెనిఫిట్స్, నిర్వహణ వ్యయాలు, పరీక్షలు, అభివృద్ధి కార్యక్రమాలతోపాటు వివిధ ఇతర ఖర్చులకు కలిపి మొత్తం రూ. 355.90 కోట్లు కేటాయించారు. మొత్తం బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ ఇన్ఎయిడ్గా రూ. 205.47 కోట్లు రానుండగా ఇతర వనరుల నుంచి రూ 126.52 కోట్ల రాబడి వస్తుందని అంచనా వేశారు. ఈ బడ్జెట్ను ప్లానింగ్, నాన్ప్లానింగ్ రూపంలో రాబడులు, ఖర్చులు మొ త్తం 8 అంశాలను చూపారు. వీటిలో ఉన్నత విద్యా మండలి నుంచి రూ. 10 లక్షలు, ఇతరాల నుంచి రూ.15.50 లక్షలు, అకడమిక్, ట్యూషన్ ఫీజుల రూ పంలో రూ. 8.33 కోట్లు, అంతర్గత వనరుల ద్వారా రూ. 41.41కోట్లు, ఇతర పద్దుల ద్వారా రూ.21.56 కోట్లు, పరీక్షల విభాగం నుంచి రూ. 49.54 కోట్లు ఉన్నట్లు చూపారు. ఈ అకడమిక్ సెనెట్.. బడ్జెట్ ఆమోదంతోపాటు స్టాండింగ్ కమిటీ వార్షిక నివేదకను కూడా ఆమోదించింది.కార్యక్రమంలో కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం, విద్యా కళాశాల డీన్ రాంనాథ్కిషన్, అకడమిక్ ఆడిట్ విభాగం రిజిస్ట్రార్ కోల శంకర్, కేయూ ఫైనాన్స్ ఆఫీసర్ హబీబుద్దీన్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ వల్లాల పృథ్వీరాజ్, వివిధ కాలేజీల ప్రిన్సిపాళ్లు, పరీక్షల విభాగం అధికారులు, వివిధ విభాగాల డీన్లు, అకడమిక్, అకౌంట్స్ విభా గాల ఉద్యోగులు, సెనెట్ సభ్యులు పాల్గొన్నారు. కాగా, తొలుత కేయూ మాజీ వీసీ లింగమూర్తి మృతికి సంతాపంగా నివాళులర్పిస్తూ సమావేశం రెండు నిమిషాలు మౌనం పాటించింది.దేశంలోనే ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో కేయూ కూడా ఒకటి. ప్రస్తుతం కేయూ అభివృద్ధి పథంలో ముందుకెళ్తుంది.అకడమిక్, పరిశోధనల పరంగా అభివృద్ధి మార్గంలో పయనిస్తోంది. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా యూజీ, పీజీ కోర్సుల్లోనూ సిలబస్ కూడా మారుతోంది. విద్యార్థులకు స్కిల్, జాబ్ ఒరియెంటేడ్ కోర్సులు లక్ష్యంగా సిలబస్ రూపల్పన చేపడుతున్నాం. కృత్రిమ మేధా క్వాంటం టెక్నాలజీ పొందుపరుస్తున్నాం. త్వరలోనే విద్యార్థులకు కూడా ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని తీసుకురాబోతున్నాం. రూసానిధులతో ‘ఐ’ రీసెర్చ్సెంటర్లు, 42 మంది అధ్యాపకులు వ్యక్తిగత ప్రాజెక్టులు,74 మంది ప్రాజెక్ట్ ఫె ల్లోలుగా నియామకాలు చేశాం. కెహబ్లోనే త్వరలోనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఏర్పా టు చేయబోతున్నాం. యూనివర్సిటీలో పరీక్షల విభాగం మూల్యాంకనం ఆన్లైన్లో డిజిటలీకరణ, క్యాంపస్లో సీసీ కెమెరాలు, యూనివర్సిటీలో మౌలిక వసతుల కల్పనకు డిటైల్డ్ ప్రాజెక్టు రూపకల్పన చేసి సుమారు రూ. 400 కోట్ల మేర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. –కె. ప్రతాప్రెడ్డి, వీసీ అకడమిక్ సెనెట్లో ఆమోదం -
ఆర్టిజన్లు సమ్మెకు వెళ్తే అంధకారమే
హన్మకొండ: విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులు సమ్మెకు వెళ్తే రాష్ట్రంలో అంధకారం తప్పదని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్ఈఈయూ)–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ అన్నారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ కార్యాలయం ఎదుట ఆర్టిజన్ ఉద్యోగులు ధర్నా చేశారు. ఈ ధర్నాకు ఇనుగాల శ్రీధర్ సంఘీభావం ప్రకటించి మాట్లాడుతూ విద్యుత్ ఆర్టిజన్లు డిమాండ్లు న్యాయమైనవన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం, విద్యుత్ సంస్థల యాజమాన్యాలు స్పందించి అర్హతను బట్టి ఆర్టిజన్లను రెగ్యులర్ ఉద్యోగులుగా కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 7వ తేదీలోపు సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు వెళ్తేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారన్నారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ సుంకు సతీశ్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టిజన్ ఉద్యోగులు సమ్మెకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర సెక్రటరీ జనరల్ మన్నె శశికుమార్, టీఆర్వీకేఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాడ దేవేందర్ రెడ్డి, టీఎస్ఈఈయూ–327 నాయకులు పి.మహేందర్ రెడ్డి, చిట్ల ఓదెలు, దొనికల సదయ్య, టీఆర్వీకెఎస్ నాయకులు బండారి ప్రభాకర్, నరేందర్ పాల్, టీఆర్పీఈయూ నాయకులు రావుల రమణారెడ్డి, కడెం మహేశ్ సంఘీభావం తెలిపి మాట్లాడారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్ సికిందర్, ట్రాన్స్ కోవిభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, నాయకులు ఎన్.రాంబాబు, పూర్ణాచారి, సతీశ్, శ్రీనాథ్, ఐలయ్య, రాజన్న, సృజన, రాకేశ్, శ్రీధర్ పాల్గొన్నారు. టీఎస్ఈఈయూ–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ శ్రీధర్ -
ప్రైవేట్ సంస్థలను తరిమికొడతాం
హన్మకొండ: ఆర్టీసీ డిపోల నుంచి ప్రైవేట్ సంస్థలను పంపించకపోతే తామే తరిమికొడతామని.. ఆ రోజు తప్పక వస్తుందని టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఈదురు వెంకన్న అన్నారు. ఆర్టీసీ డిపోలను ప్రైవేట్కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ, విద్యుత్ బస్సులను ఆర్టీసీకి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం హనుమకొండలోని వరంగల్–2 డిపో ఎదుట ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలని చూస్తోందని విమర్శించారు. ప్రభుత్వరంగ రవాణ సంస్థలుండగా కేంద్ర ప్రభుత్వం విద్యుత్ బస్సులను ప్రైవేట్కు అప్పగించడంలో అర్థం లేదన్నారు. ప్రైవేట్ సంస్థలకు రాయితీ లబ్ధిచే కూర్చడానికే ఈ విధానం అవలంబిస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికై నా తమ విధానాలను మార్చుకుని ఆర్టీసీలకే విద్యుత్ బస్సులు కొనుగోలు చేసి అప్పగించాలన్నారు. -
తగ్గిన విద్యుత్ అంతరాయాలు
● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి హన్మకొండ: సాంకేతిక పరిజ్ఞానంతో విద్యుత్ అంతరాయాలు తగ్గాయని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో సంస్థ పరిధిలోని 17 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ విద్యుత్ అంతరాయాలు తగ్గించడంలో అవుటేజి మేనేజిమెంట్ సిస్టం ఎంతో దోహపడుతుందన్నారు. స్కాడా కంట్రోల్ రూమ్ నుంచి అవుటేజి మేనేజ్మెంట్ సిస్టం ద్వారా సబ్ స్టేషన్లు, విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల అంతరాయాల లోకేషన్ తెలుసుకోవచ్చని, తద్వారా వేగంగా పునరుద్ధరణ చర్యలు చేపట్టొచ్చన్నారు. పొడవు లైన్లలో, అడవుల్లో కవర్డ్ కండక్టర్తో చెట్లు కొమ్మలు విరిగినా ఎలాంటి అంతరాయాలు ఉండవన్నారు. డైరెక్టర్లు వి.మోహన్ రావు, టి.మధుసూదన్, చీఫ్ ఇంజనీర్లు టి.తిరుమల్ రావు, టి.సదర్ లాల్, రాజు చౌహాన్, అశోక్, సురేందర్, జయవంత్ రావు చౌహాన్, అన్నపూర్ణ, వెంకట రమణ, జీఎంలు సామ్య నాయక్, శ్రీనివాస్, వేణు మాధవ్, వాసుదేవ్, ప్రభావతి, తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్యానికి దూరం
భూపాలపల్లి: రేపటితో మార్చి నెలాఖరు. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి కూడా గ్రామ పంచాయతీల్లో ఆస్తి పన్నుల వసూలు నూరుశాతం కాలేదు. జిల్లావ్యాప్తంగా ఇంటి పన్నులు, నల్లా బిల్లులు పేరుకుపోవడంతో పంచాయతీల్లో అభివృద్ధి పనులపై ప్రభావం పడనుంది. జిల్లాలోని 12 మండలాల్లో 248 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆయా పంచాయతీల నుంచి ఈ ఏడాది ఆస్తి, నల్లా పన్ను రూపేణా రూ. 4.25 కోట్ల వసూలు కావాల్సి ఉండగా.. రెండు రోజుల క్రితం వరకు రూ. 2.93 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. ఇంకా సుమారు రూ.1.32 కోట్లు బకాయి ఉంది. రేపటితో ఈ ఆర్థిక సంవత్సరం ముగియనుండగా, ఒక్కరోజే ఇంత భారీ మొత్తాన్ని వసూలు చేయడం అధికారులకు శక్తికి మించిన పనిలా మారింది. అంతగా పెరగని డిమాండ్.. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి అంతంత మాత్రంగానే డిమాండ్ పెరిగింది. గ్రామాల్లో పాత పెంకుటిళ్ల స్థానంలో కొత్త భవనాలు వెలిశాయి. అయినప్పటికీ చాలా గ్రామాల్లో రికార్డుల్లో మాత్రం పాత ఇళ్లే ఉన్నాయి. ఆన్లైన్ రికార్డులు, క్షేత్రస్థాయి పరిస్థితులు పొంతన లేకపోవడంతో పన్ను డిమాండ్ పెరగలేదు. ఉన్న డిమాండ్ను వసూలు చేయడమే కష్టంగా మారిన తరుణంలో, కొత్తగా అసెస్మెంట్ చేయకపోవడం ఆదాయానికి గండి కొడుతోంది. పని ఒత్తిడిలో కార్యదర్శులు.. పంచాయతీ కార్యదర్శులు కేవలం పన్నుల వసూళ్లకే పరిమితం కాకుండా పారిశుద్ధ్యం, ఉపాధి హామీ తదితర పనుల పర్యవేక్షణలో నిమగ్నమై ఉంటున్నారు. దీంతో పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించలేకపోతున్నారు. అంతేకాక ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగడంతో కార్యదర్శులంతా ఎన్నికల బీజీలో ఉండటం కూడా పన్నుల వసూళ్లపై ప్రభావం పడింది. వసూలు రూ.2.93 కోట్లు మాత్రమే -
గుట్టలు గుటకాయ స్వాహా!
మైనింగ్ మాఫియా విచ్చలవిడితనానికి గుట్టలన్నీ గుల్ల అవుతున్నాయి. అనుమతి ఒకచోట, తవ్వకాలు మరోచోట చేపట్టి అక్రమ మైనింగ్ చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి పెట్టారు. అనుమతుల పేరిట పరిమితికి మించి, హద్దులు దాటి గుట్టలను కరిగించారు. భువనగిరి–ఆరెపల్లి బైపాస్ పక్కన.. నగరాన్ని ఆనుకుని ఉన్న కోమటిపల్లి గుట్ట ఆనవాళ్లు కోల్పోయింది. నిబంధనలు పక్కనబెట్టి రూ.కోట్లాది విలువైన మట్టిని, రాళ్లను యథేచ్ఛగా తరలించారు. మైనింగ్ దందాపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిన నేపథ్యంలో అక్రమార్కుల్లో వణుకు మొదలైంది.సాక్షిప్రతినిధి, వరంగల్: ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే కాదు.. జీవవైవిధ్యం, నగర ప్రశాంతతను దెబ్బతీసే విధంగా గుట్టలను గుల్ల చేశారు. గ్రేటర్ వరంగల్ పరిధి హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం భీమారం రెవెన్యూ శివారులోని కోమటిపల్లి గుట్ట ఆనవాళ్లు కోల్పోయింది. ఈ గుట్ట మొరం క్వారీగా మారింది. అనుమతికి మించి యథేచ్ఛగా గుట్టను కొల్లగొట్టారు. విచ్చలవిడిగా సాగిన ఈ వ్యవహారంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ దందాలో ఉమ్మడి వరంగల్కు చెందిన ఓ ప్రజాప్రతినిధి ఒకరు భాగస్వామిగా ఉండి.. తన స్నేహితుడి కుమారుడికి లీజు ఇచ్చినట్లు సమాచారం. ఇష్టారాజ్యంగా మొరం తరలించి గుట్టను గుల్ల చేసిన ఫిర్యాదుల నేపథ్యంలో త్వరలోనే విచారణకు ఆదేశించనున్నారన్న ప్రచారం జరుగుతోంది. కోమటిపల్లి గుట్టే కాదు.. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా సాగుతున్న అక్రమ మైనింగ్పై ‘విజిలెన్స్’ రంగంలోకి దిగనుండడం చర్చనీయాంశంగా మారింది. ఇష్టారాజ్యంగా మైనింగ్.. విచ్చలవిడిగా తరలింపు.. 2017లో క్వారీకి అనుమతి పొందిన ఓ వ్యాపారి మరో ప్రాంతంలో మొరం తవ్వకాలు చేపట్టాడు. దీంతో అప్పుడు ఉన్న మైనింగ్, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోలేదు. ఇటీవల ఆ క్వారీ రెన్యువల్ కాలేదు. ఏడాదికోసారి పర్యావరణం, కార్మిక శాఖల అనుమతులు పొందాల్సి ఉంది. ఇవేమీ లేకుండా క్వారీ నిర్వహణ సాగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. నిత్యం వందలాది ట్రాక్టర్ల మొరం వివిధ ప్రాంతాలకు తరలి వెళ్తోంది. 50 నుంచి 60 ఫీట్ల లోతు వరకు మొరం గుట్టను తవ్వారు. అయితే బండరాళ్లు రావడంతో వదిలివేసి.. మరో ప్రాంతంలో తవ్వుతున్నారు. ఇలా 20 నుంచి 30 ప్రాంతాల్లో గుట్టను బ్లాస్టింగ్ చేసి చీల్చారు. లీజు కాలం ముగిసినా ఈ గుట్టపై 2023 వరకు యథేచ్ఛగా తవ్వకాలు సాగాయి. వరంగల్ నగరం శివారుతో పాటు నగరంలో సాగుతున్న వందలాది కొత్త నిర్మాణాల కోసం ఇక్కడి మొరం సరఫరా చేశారు. ఆ సమయంలో ఒక హెక్టారు లీజుకు ఏడాదికి లక్ష రూపాయలతో పాటు మొరం రవాణా కోసం పర్మిట్ అవసరం. క్యూబిక్ మీటరుకు రూ.70 చొప్పున సర్కారు ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. ఒక ట్రాక్టర్ బయటికి వెళ్లిందంటే రూ.210 చెల్లించాలి. ఒక ట్రాక్టర్లో మూడు క్యూబిక్ మీటర్ల మొరాన్ని తరలించవచ్చు. ప్రతి రోజు ఇక్కడి నుంచి వెయ్యి ట్రిప్పుల మొరం వివిధ ప్రాంతాలకు తరలి వెళ్తోంది. రోజుకు సర్కారు రూ.2.10 లక్షల ఆదాయాన్ని కోల్పోయిందంటే.. అధికారుల అండతో కోమటిపల్లి గుట్టపై మొరం మాఫియా ఏ మేరకు అక్రమార్జన చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇది ఉమ్మడి వరంగల్లో ఓ ఉదాహరణ మాత్రమే.. ఇలాంటివి పదుల సంఖ్యలో ఉన్నాయి. కాగా అక్రమ మైనింగ్పై శనివారం అ సెంబ్లీలో ప్రభుత్వం విచారణ చేయిస్తామని ప్రకటించడంతో పలుచోట్ల మై నింగ్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇదీ కోమటిపల్లి గుట్ట బాగోతం.. హసన్పర్తి మండలం భీమారం శివారులోని సర్వే నంబర్ 340లో సుమారు 57 ఎకరాల్లో కోమటిపల్లి గుట్ట ఆక్రమించుకుని ఉంది. అయితే ఇక్కడ అందుబాటులో ఉన్న భూమిని గతంలో కొంత గిరిజన గురుకుల కళాశాల, హోటల్ మేనేజ్మెంట్ కళాశాల, ఇంటర్నేషనల్ స్టేడియానికి కేటాయించాలని ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఇందులో గిరిజన కశాశాలతో పాటు హోటల్ మేనేజ్మెంట్ కాలేజీకి ఐదెకరాల చొప్పున స్థలం కూడా కేటాయించారు. అయినా అప్పటి సర్కారు 341/1 సర్వేనంబర్ పేరిట 3.260 రెండున్నర హెక్టార్ల భూమిని క్వారీకి అనుమతి ఇచ్చింది. 2017 జూలై 25 నుంచి ఐదేళ్ల పాటు నిబంధనల ప్రకారం క్వారీ నిర్వహించేలా 4097/ క్యూఎల్అండ్1/ డబ్ల్యూజీఎల్/2017 ద్వారా ఈ అనుమతులు ఇచ్చారు. ఈ క్వారీని గతంలో కీలక ప్రజాప్రతినిధి ముఖ్య అనుచరుడు, సన్నిహితుడు తన కుమారుడి పేరిట కేటాయించారు. అయితే ఇందులో సదరు ప్రజాప్రతినిధి కూడా స్లీపింగ్ పార్టనర్గా ఉన్నట్లు తనిఖీలకు వెళ్లిన సందర్భంగా అధికారుల విచారణలో వెల్లడి కావడం గమనార్హం. లీజు ఒకచోట.. తవ్వకాలు మరోచోట రూ.కోట్లాది విలువైన మట్టి, రాళ్ల తరలింపు కోమటిపల్లి గుట్టను కొల్లగొట్టిన అక్రమార్కులు ఉమ్మడి జిల్లాలో యథేచ్ఛగా సాగిన దందా మైనింగ్ దందాపై విచారణకు ప్రభుత్వం ఆదేశం -
సమృద్ధిగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ నిల్వలు
● కలెక్టర్ రాహుల్ శర్మభూపాలపల్లి: జిల్లాలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని.. కొరత లేదని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. శనివారం ఐడీఓసీ కార్యాలయంలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఎస్పీ సంకీర్త్తో కలిసి కలెక్టర్ జిల్లా ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్యాస్, పెట్రోల్, డీజిల్పై పటిష్ట పర్యవేక్షణ కొనసాగాలని ఆదేశించారు. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్లు వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే కేసులు నమోదు చేయాలని సూచించారు. జిల్లాలో మొత్తం లక్షా 20 వేల మంది గ్యాస్ వినియోగిస్తున్నారని చెప్పారు. సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు, ఆస్పత్రులకు యధావిధిగా గ్యాస్ సరఫరా జరుగుతుందన్నారు. ఆయా శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. పెట్రోల్, డీజిల్ అత్యవసర సేవలకు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మండలాల్లో డీటీలు, ఎస్సైలు పర్యవేక్షణ చేస్తున్నారని పేర్కొన్నారు. వాహనాలు తనిఖీ చేసి కేసులు నమోదు చేయాలని ఆర్డీఓకు సూచించారు. ఎక్కడైనా కొరత ఉంటే వెంటనే తెలియజేయాలని సూచించారు. బ్లాక్ మార్కెటింగ్, అనధికార రీఫిల్లింగ్ సెంటర్లు, అక్రమ నిల్వలు, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అసత్య ప్రచారాలు నమ్మొద్దు గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరతపై సామాజిక మాధ్యమాల్లో వచ్చే అసత్య ప్రచారాలు ప్రజలు నమ్మి ఆందోళన చెందొద్దని ఎస్పీ సంకీర్త్ సూచించారు. జిల్లాలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ డీలర్లతో సమావేశం నిర్వహించామని చెప్పారు. జిల్లాలో సరిపడా నిల్వలు ఉన్నాయని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. అసత్య ప్రచారాలపై పర్యవేక్షణ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. రద్దీ లేకుండా పెట్రోల్ బంకులు, గ్యాస్ గోడౌన్ల వద్ద పటిష్ట నిఘా కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, డీఈఓ రాజేందర్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్, సంక్షేమ శాఖల అధికారులు, హెచ్పీసీఎల్ సేల్స్ ఆఫీసర్ అమర్త్యదాస్ పాల్గొన్నారు. -
ఆదివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2026
అటకెక్కిన రాజీవ్ యువ వికాసం ● పథకం అమలుపై నీలినీడలు ● పరిశీలన పూర్తయినా తప్పని నిరీక్షణవిద్యార్థులకు వైద్యపరీక్షలు మల్హర్: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య బృందం జనరల్ సర్జన్ డాక్డర్ సాయికుమార్, మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్ రవి, డాక్టర్ దీప్తి వారి ఆధ్వర్యంలో శనివారం మండలంలోని తాడిచర్ల జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం విద్యార్థుల సమస్యలు తెలుసుకుని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయులు వి.కుమారస్వామి పాల్గొన్నారు. -
పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని టెన్త్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్శర్మ శనివారం పరిశీలించారు. విద్యార్థులకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించాలని, సమయపాలన కచ్చితంగా పాటించాలని సంబంధిత అధికారులకు సూచించారు. డీఈఓ రాజేందర్ చిట్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సోషల్ వెల్ఫేర్ పాఠశాల, టేకుమట్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మొట్లపల్లి పాఠశాలలను సందర్శించి పరీక్షా నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా పరిశీలకులు జనార్దన్రావు, డిప్యూటీ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ గణపురం మండలంలోని ఆదర్శ పాఠశాలలను తనిఖీ చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,544 మంది విద్యార్థులకు గాను ఐదుగురు గైర్హాజరు అయినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.రాజేందర్ తెలిపారు. -
రాజీమార్గంలో వివాదాల పరిష్కారం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమేష్బాబుభూపాలపల్లి అర్బన్: నైతిక విలువలు పాటిస్తూ రాజీమార్గంలో ముందుకు సాగితే వివాదాలకు తావులేకుండా ప్రశాంతమైన జీవితం గడపవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్ రమేశ్బాబు తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో జిల్లా జడ్జి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోదరభావంతో కలిసి జీవిస్తే వివాదాలు తలెత్తవని తెలిపారు. చిన్నచిన్న విభేదాలను పెంచుకుని కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగితే సమయం, డబ్బు, మనశ్శాంతి నష్టమవుతాయని హెచ్చరించారు. ప్రజలు రాజీమార్గాన్ని ఎంచుకుని సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. లోక్ అదాలత్ ద్వారా ఇరువర్గాల అంగీకారంతో కేసులను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి నాగరాజ్, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్ఆర్ దిలీప్ కుమార్నాయక్, గవర్నమెంట్ ప్లీడర్ బొట్ల సుధాకర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏదులాపురం శ్రీనివాస్, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ పాల్గొన్నారు. బాలుడికి న్యాయం, రూ.15 లక్షల పరిహారం చిట్యాల మండలం చింతకుంటరామయ్యపల్లెకు చెందిన మోత్కూరి మణిదీప్ అనే ఆరు సంవత్సరాల బాలుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఘటనలో లోక్ అదాలత్ ద్వారా న్యాయం జరిగింది. మొగుళ్లపల్లి శివారులో జరిగిన ఈ ప్రమాదంలో అతని తాతయ్య మరణించగా, బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కేసును పరిశీలించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్ రమేశ్బాబు బాలుడికి రూ.15 లక్షల పరిహారం చెల్లించాలని ఇన్సూరెన్స్ కంపెనీని ఆదేశించారు. ఏడేళ్ల భూ వివాదం పరిష్కారం టేకుమట్ల మండలం కుందనపల్లి గ్రామానికి చెందిన అన్నదమ్ములు అంతటి స్వామి, అంతటి తిరుపతి మధ్య భూమి పంపకాలపై ఏడు సంవత్సరాలుగా కొనసాగుతున్న వివాదం లోక్ అదాలత్లో పరిష్కారమైంది. ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్ఆర్ దిలీప్ కుమార్నాయక్ సమక్షంలో ఇరువురు రాజీకి వచ్చి కేసును ముగించారు. -
ఇప్పట్లో లేనట్లేనా?
భూపాలపల్లి అర్బన్: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రాయితీ రుణాలతో స్వయం ఉపాధి పొందాలనుకున్న యువత ఆశలు ఆవిరవుతున్నాయి. గత జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాయితీ రుణాల మంజూరు పత్రాలను పంపిణీ చేయాల్సి ఉండగా.. ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అప్పటి నుంచి దరఖాస్తుదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మూలుగుతున్న దరఖాస్తులు దరఖాస్తులు సమర్పించి సుమారు ఏడాది గడుస్తున్నా పథకం అమలు కాకపోవడంతో మండల పరిషత్ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తులు కంప్యూటర్లకే పరిమితమయ్యాయి. రూ.50వేలు, రూ.లక్ష, రూ.2లక్షల నుంచి రూ 4లక్షల వరకు రుణాలు పొందేందుకు జిల్లాలోని 12 మండలాల్లో వివిధ గ్రామాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులు పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు కులం, నివాసం, ఆదాయం, తదితర సర్టిఫికెట్ల కోసం వేలాది రూపాయలు ఖర్చుపెట్టి, వారాల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగి, కోటి ఆశలతో దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకొని ఏడాది గడుస్తున్నా ప్రభుత్వం ఈ పథకం గురించి ఊసే ఎత్తడం లేదని, దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పథకం ఆరంభంలో బ్యాంకుల్లో సిబిల్ స్కోర్ ఉన్నవారికి రుణం మంజూరు చేయాలని, నిబంధనను ప్రభుత్వం మొదట ప్రవేశపెట్టింది. దీంతో యువతీ యువకుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో సిబిల్ స్కోర్ అనే నిబంధనను ప్రభుత్వం తొలగించింది. దరఖాస్తు చేసుకున్న లబ్దిదారుల్లో ఆశలు చిగురించాయి. అయినప్పటికీ ప్రభుత్వం పథకం గురించి ఊసే ఎత్తకపోవడంతో తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇప్పట్లో కేటాయింపులు లేనట్లేనా? అధికారులు క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తి చేశారు. రూ.50వేల యూనిట్లకు దరఖాస్తు చేసుకున్న వారికి యూనిట్లను కేటాయించాలనుకున్న ప్రభుత్వం వెనకడుగు వేసింది. యూనిట్ల కేటాయింపు ప్రక్రియను వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటినుంచి దరఖాస్తుదారులు యూనిట్ల కేటాయింపు కోసం నిరీక్షిస్తున్నారు. నూతన బడ్జెట్ అమలయ్యేనా.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ.6వేల కోట్ల నిధులు కేటాయించినట్లు ప్రకటించారు. గతంలో కార్పొరేషన్ రుణాలకు కేటాయించిన నిధులను సైతం అమలు చేయకపోవడంతో నిరుపేద నిరుద్యోగులు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. రాజీవ్ యువ వికాసానికి కేటాయించిన బడ్జెట్ సైతం అమలు చేస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రుణాలు అందించాలి.. రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకొని ఏడాది కావస్తుంది. అధికారులు విచారణల పేరుతో కాలయాపన చేస్తున్నారు. గతంతో కార్పొరేషన్ రుణాలకు సైతం అనేక మార్లు దరఖాస్తులు చేసుకున్నాం. రుణాలు మాత్రం రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలను గుర్తించి సకాలంలో రుణాలు అందించి ఆదుకోవాలి. – మత్స్య శ్రీకాంత్, దరఖాస్తుదారుడు టేకుమట్లదరఖాస్తుల సంఖ్య.. ఎస్సీలు 6,711 బీసీలు 11,225 మైనారిటీలు 749 ఈబీసీలు 401 క్రిస్టియన్లు 9 -
గులాబీలతో పుష్పార్చన
● ముగిసిన వసంత నవరాత్రోత్సవాలు హన్మకొండ కల్చరల్ : వరంగల్ నగరంలోని శ్రీభద్రకాళి దేవాలయంలో జరుగుతున్న వసంత నవరాత్రోత్సవాలు శుక్రవారం ముగిశాయి. చివరిరోజు అమ్మవారికి గులాబీపూలతో పుష్పార్చన నిర్వహించారు. ప్రధానార్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అర్చకులు ఉదయం అమ్మవారికి నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం అర్చకులు, వేదపాఠశాల విద్యార్థులు గులాబీపూలకు సంప్రోక్షణ జరిపి అమ్మవారికి లక్ష పుష్పార్చన నిర్వహించారు. పుష్పార్చనలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, వ్యవసాయ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయాన్ని సందర్శించే భక్తులు ఎండతాకిడితో ఇబ్బంది పడకుండా శాశ్వత ప్రాతిపదికన జర్మన్ పెండల్స్ టెంట్లు వేయించాలని అందుకు అయ్యే ఖర్చు రూ.10లక్షలు విరాళంగా ఇస్తానని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు. దీంతో ఆలయ ధర్మకర్తలు పది రోజుల్లో పనిపూర్తి చేయిస్తామని హామీ ఇవ్వడంతో టెంట్లు ఏర్పాటు పనులను పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి ప్రారంభించారు. -
అడవిలో మంటలు
● రక్షణ చర్యలు పాటించని అటవీశాఖ ● వృక్ష సంపద అగ్నికి ఆహుతి ● క్విక్ రెస్పాన్స్ టీం అలసత్వం..– మరిన్ని ఫొటోలు 9లోuకోదండరామాలయంలో కల్యాణం నిర్వహిస్తున్న పండితులుకాళేఽశ్వరం: వేసవి ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో కాటారం డివిజన్ పరిధిలోని పలు అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు పెరుగుతున్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో ఎండిన ఆకులు, గడ్డి, చెత్తాచెదారం వెంటనే అంటుకొని అడవంతా మంటలు చెలరేగుతున్నాయి. దీంతో అటవీ జీవరాశులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. మంటలు వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ అటవీశాఖ అధికారులు సకాలంలో స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గంటల తరబడి మంటలు ఎగిసిపడుతున్నా అధికారులు ఆలస్యంగా చేరడం వల్ల భారీగా అటవీ నష్టం జరుగుతుంది. రాత్రి వేళల్లో పొగతో రోడ్లంతా నిండిపోతున్నాయి. అడవిలో మంటలు ఎగిసిపడుతున్నాయి. డివిజన్లో ఇలా.. కాటారం డివిజన్లో మహదేవపూర్, పలిమెల, మహాముత్తారం అటవీ ప్రాంతాల్లో నిత్యం మంటలు చెలరేగుతున్నాయి. అదుపు చేసేందుకు ఒక్కో రేంజ్కు ఐదుగురితో కూడిన క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ఉన్నప్పటికీ అవి సమర్థవంతంగా పనిచేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో అడవిలో జీవించే కొద్ది పాటి జంతువులు దుప్పులు, కుందేలు, కొండగొర్రెలు, నక్క, పక్షులు తదితర జీవరాశులు ప్రమాదాలబారిన పడుతున్నాయని సమాచారం. దీనికితోడు విలువైన అటవీ సంపద కూడా అగ్నికి ఆహుతి అవుతుంది. వీటికి రక్షించడంతో అటవీశాఖ అధికారులు వెనుకంజలో ఉన్నారు. వేసవి కాలంలో ఇటువంటి ఘటనలు తరచుగా జరుగుతున్నందున అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని, తగిన సిబ్బందిని నియమించి మంటలు మొదలైన వెంటనే అదుపులోకి తీసుకొచ్చే విధంగా ఉన్నతా ధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది. యాత్రస్థలం కావడంతో.. కాటారం నుంచి కాళేశ్వరం ప్రధాన రహదారిపై నిత్యం వేలల్లో వాహనాలు తెలంగాణ మీదుగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతాలకు వెళ్తుంటారు. దీంతో పాటు ముఖ్యంగా కాళేశ్వరం దేవస్థానానికి వచ్చే భక్తులు సైతం రోడ్లపై వాహనాలు నిలిపి వంట చెరుకు తెస్తుంటారు. ఆ క్రమంలో కూడా నిప్పు అంటుకుంటుంది. వంటలు చేస్తుండడంతో కూడా నిప్పుతో మంటలు ఎగసి పడుతున్నాయి. అటవీశాఖ దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. మంటలు అదుపులోనే..అడవిలో ప్రస్తుతం మంటలు అదుపులోనే ఉన్నాయి. మా క్విక్రెస్పాన్స్ టీం తరుచూ పెట్రోలింగ్ చేస్తున్నాయి. ఎలాంటి సమాచారం వచ్చినా నిమిషాల్లోనే మంటలు ఆర్పుతున్నారు. అడవిలో మంటలు పెట్టినట్లు మా దృష్టికి వస్తే చర్యలు తప్పవు. – రవికుమార్, అటవీశాఖ రేంజర్, మహదేవపూర్ -
ఆపద్బాంధవులు
ములుగు: అడవులు, కొండలు, రహదారి సరిగా లేని మారుమూల గ్రామాలు, అడవుల్లో నివాసముంటున్న గొత్తికోయల ఆవాసాలు. దూరప్రాంతాల్లో ఉన్న ఏజెన్సీ గ్రామాలతో కూడిన జిల్లా ములుగు. ఇక్కడ అత్యవసర వైద్యసేవలు అందించడం సవాల్తో కూడిన సహవాసం. వర్షాకాలంలో పొంగి ప్రవహించే వాగులు, వంకలు, గిరిజన గ్రామాల్లో మొబైల్ సిగ్నల్స్ లేక అవస్థలు పడుతున్న ప్రజలకు ప్రాణాధారంగా నిలుస్తున్నాయి 108 అంబులెన్స్ సిబ్బంది సేవలు. ప్రాంతం ఏదైనా పల్లె ఎక్కడ ఉన్నా.. అత్యవసర సమయాల్లో వచ్చే ప్రతీ కాల్కు స్పందిస్తూ రాత్రింబవళ్లు నిరంతరం సేవలు అందిస్తూ ప్రతీ ప్రాణాన్ని కాపాడేందుకు నిరంతరం శ్రమిస్తూ పునర్జన్మ ప్రసాదించే ప్రాణదాతలుగా నిలుస్తున్న 108 సిబ్బందిపై సాక్షి ప్రత్యేక కథనం. 10 మండలాలు..14 అంబులెన్స్లు ములుగు జిల్లా 10 మండలాల పరిధిలోని 171 గ్రామ పంచాయతీలతో పాటు, ములుగు మున్సిపాలిటీ పరిధితో కలిపి 14 అంబులెన్స్ల సిబ్బంది నిరంతరం ప్రజలకు అత్యవసర సేవలు అందిస్తున్నారు. 108 అంబులెన్స్లో పైలట్ (డ్రైవర్)తో పాటు ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (ఈఎంటీ) ఉంటారు. 108కు కాల్ రాగానే సకాలంలో ఘటన స్థలానికి చేరుకొని ప్రాథమిక చికిత్స చేయడం, రోగిని ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడేందుకు కృషి చేస్తున్నారు. 108 అంబులెన్స్ సిబ్బంది సమయస్ఫూర్తితో అనేక మంది ప్రాణాలు నిలుస్తున్నాయి. అంబులెన్స్లో ప్రసవాలు అనేకం డెలివరీ కేసులపై 108 సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. గర్భిణులు నొప్పులు మొదలు కావడంతో కుటుంబసభ్యులు 108కి కాల్ చేయడం, వెంటనే అక్కడకు చేరుకొని ఆస్పత్రికి తరలించే సమయం లేకపోవడంతో అనేక మంది గర్భిణులకు 108 అంబులెన్స్లోనే సిబ్బంది పురుడు పోసి తల్లి, శిశువు క్షేమంగా ఉండేలా వైద్యసేవలు అందిస్తున్నారు. ఏడాదిలో సుమారు 60 మందికి పైగా గర్భిణులకు పురుడు పోసి తల్లీబిడ్డలు క్షేమంగా ఉండేలా సేవలందించారు. రోడ్డు ప్రమాదం జరిగిన, గుండెపోటు వచ్చిన ఆస్పత్రికి వెళ్లేలోపు గోల్డెన్ ఆవర్లో చికిత్స ఎంతో అవసరం, ఈఎంటీ ప్రాథమిక చికిత్స చేస్తే పైలట్ ట్రాఫిక్ సమస్యను దాటుతూ ప్రాణపాయ స్థితిలో ఉన్నవారిని కంటికిరెప్పలా కాపాడుతూ సరైన సమయంలో ఆస్పత్రికి చేర్పించి ప్రాణాలు నిలబెడుతూ వందలాది కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు. 18,886 కేసులకు స్పందన ప్రమాదం, ప్రసవవేదన, జ్వరం, పాముకాటు, శ్వాస ఇబ్బంది, గుండెపోటు, జబ్బు ఏదైనా సకాలంలో వైద్యం అందకపోతే నిండు ప్రాణాలు గాలిలో కలవక తప్పదు. ఏ అత్యవసర పరిస్థితి అయినా మేమున్నామంటూ.. ఆపదలో ఉన్న ప్రజల ప్రాణాలు రక్షిస్తూ మెరుగైన సేవలందిస్తున్నారు. జిల్లాలో 2025 మార్చి 31 నుంచి ఫిబ్రవరి 28, 2026 వరకు 18,886 కేసులకు స్పందించి వారికి మెరుగైన వైద్యసేవలు అందిస్తూ సకాలంలో ఆస్పత్రికి చేర్చారు. 1,569 రోడ్డు ప్రమాద కేసులు, 2,461 గర్భిణుల కేసులు, 827 మంది సృహ కోల్పోయిన కేసులు, 2,437 కడుపునొప్పి కేసులు, 1,251 శ్వాసకోస సంబంధిత కేసులు, 953 డొమెస్టిక్ ప్రమాదాలు, 932 గుండెనొప్పి సంబంధిత కేసులు, 863 పాయిజన్ కేసులు, 647 ఫిట్స్ కేసులు, 368 ఆత్మహత్యాయత్నం కేసులు, 271 పెరాలసిస్ కేసులు, 445 జంతు దాడి కేసులు, 46 బర్నింగ్ కేసులు, 5,816 ఇతర సంబంధిత కేసులకు సకాలంలో స్పందించి వైద్యసేవలు అందించారు. పునర్జన్మ ప్రసాదించే ప్రాణదాతలు ఆపదలో ఆదుకుంటున్న 108 సిబ్బంది ఏడాదిలో 18,886 కేసులకు స్పందన అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్యసేవలు గిరిజన ప్రాంతంలో ఘనమైన సేవలు -
జయశంకర్ భూపాలపల్లి
Iనేడు శ్రీరామనవమిని సందర్భంగా గురువారం రాత్రి కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ అనుబంధ దేవాలయం రామాలయం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఉత్సవ మూర్తుల ఎదుర్కోలు సేవా కార్యక్రమం పురవీధులగుండా ఘనంగా నిర్వహించారు. హనుమాన్మాలధారణ భక్తులతో సందడి నెలకొంది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎస్.మహేష్, సర్పంచ్ వెన్నపురెడ్డి మోహన్రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ ఉమామహేశ్వర్, హనుమాన్ మాలదారన స్వాములు పాల్గొన్నారు. – కాళేశ్వరంశుక్రవారం శ్రీ 27 శ్రీ మార్చి శ్రీ 2026తల్లిదండ్రులు పిల్లలకు టూ, ఫోర్ వీలర్స్ ఇవ్వొద్దు కాళేశ్వరం: వేసవిలో ఎండల తీవ్రత పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలను ఈనెల 16 నుంచి ఒక్కపూటే నడిపిస్తోంది. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాతే విద్యార్థులను ఇంటికి పంపిస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత బడి లేకపోవడంతో పిల్లలు ఆడుకునేందుకు బయటకు వెళ్తున్నారు. ఇలా అనేకమంది ఆటా పాటల్లో మునిగితేలుతున్నారు. ఇలాంటి ఆనంద సమయాల్లో విషాదాలు పొంచి ఉంటాయని తల్లిదండ్రులు గ్రహించాలి. దీంతో వారిని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. వారికి టూ, ఫోర్ వీలర్ వాహనాలు ఇచ్చి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు. జిల్లాలోని కాటారం డివిజన్లోని పలు మండలాల్లో బావులు, చెరువులు, గోదావరి తీర ప్రాంతాలు ఉన్నాయి. విద్యార్థులు అటువైపు వెళ్లకుండా తల్లిదండ్రులు దృష్టిసారించాలి. బావులు, చెరువుల వద్దకు వెళ్లొద్దు.. పట్టణ ప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు, కుంటలు, ఉపాధిహామీలో మట్టి తీసిన గుంతల్లో నీరు నిల్వ ఉంది. విద్యార్థులు అటువైపు వెళ్లకుండా చూసుకోవాలి. బావుల్లో సరదా కోసం ఈత నేర్చుకునేందుకు వెళ్లిన పిల్లలు మునిగిపోయిన విషాద ఘటనలు ఏటా పదులసంఖ్యలో ఉంటున్నాయి. డ్రైవింగ్ మోజులో టూ, ఫోర్ వీలర్స్, సైకిళ్లపై మోజుతో కొందరు విద్యార్థులు ఇళ్లలో చెప్పకుండా రోడ్డెక్కితే ప్రమాదాల బారిన పడే ఆస్కారం అధికంగా ఉంది. బడి వదలగానే కొందరు పిల్లలు సమయం దొరికిందని ఎండలో ఆడుతారు. దీంతో వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇంట్లో ఖాళీగా వీడియో గేమ్స్, టీవీ, కంప్యూటర్లకు అతుక్కుపోతున్నారు. దృష్టి లోపాలతో పాటు మానసిక బలహీనులుగా మారే అవకాశం ఉంది. వీటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. తల్లిదండ్రులు సరదాగా సమయం కేటాయించి వారితో ఉంటూ ఆటల వైపునకు దృష్టి మళ్లించాలి. పిల్లలు మధ్యాహ్నం బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండేలా తల్లిదండ్రులు చూసుకోవాలి. ఎండలు ఎక్కువైనా పిల్లలు ఆహారం తీసుకోరు. వీరికి ఇష్టమైన ద్రవ పదార్థాలు, పండ్లరసాలు ఎక్కువగా తీసుకునేలా చొరవ తీసుకోవాలి. డీహైడ్రేషన్ కాకుండా చూడాలి. – సుస్మిత, కాళేశ్వరం పీహెచ్సీ వైద్యాధికారి●18 ఏళ్లు నిండని విద్యార్థులకు టూ, ఫోర్ వీలర్స్ వాహనాలు ఇవ్వొద్దు. తల్లిదండ్రులు వాహనాలు ఇచ్చి కష్టాలు కొని తెచ్చుకోవద్దు. రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటాం. –ఎన్.వెంకటేశ్వర్లు, సీఐ మహదేవపూర్ జాగ్రత్తలు తప్పనిసరి ఆడుకుంటూ వెళ్లి ప్రమాదాల బారిన పడే అవకాశం ఆటలపై దృష్టి సారించేలా చూడాలిస్ట్రీట్.. ట్రీట్.. వీధి కుక్కల సంరక్షణకు పలువురు జంతుప్రేమికులు ముందుకొస్తున్నారు. సెంటర్స్ప్రెడ్లో uఒంటిపూట బడిసమయంలోనూ హెచ్ఎంలు, ఉపాధ్యాయులు విద్యార్థులపై మరింత శ్రద్ధ తీసుకోవాలి. పాఠశాలలో స్వచ్ఛమైన తాగునీటి వసతితోపాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రాథమిక చికిత్స కిట్లు అందుబాటులో ఉండేలా చూడాలని ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశించారు. తరగతి గదుల్లో ఫ్యాన్లు తిరిగేటట్లు శ్రద్ధ వహించాలి. మధ్యాహ్న భోజనం నీడ కింద కూర్చుని తినేలా ఏర్పాట్లు చేయాలి. ఎండలో ఆటలాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. -
పనులు పూర్తిచేయాలి
● ఎంఆర్ఐ ఏర్పాటులో జాప్యంపై కలెక్టర్ ఆగ్రహం భూపాలపల్లి అర్బన్: ఎంఆర్ఐ యంత్రం అత్యవసరతను దృష్టిలో ఉంచుకుని ఈ నెలాఖరు వరకు పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్శర్మ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని గురువారం కలెక్టర్ సందర్శించారు. ఎంఆర్ఐ పరికరం, డయాలసిస్ కేంద్రం ఏర్పాటు పనులను పరిశీలించారు. జిల్లా జనరల్ ఆస్పత్రి ఎంఆర్ఐ యంత్రం ఏర్పాటుకు అవసరమైన విద్యుత్ సరఫరా పనుల్లో జాప్యం జరుగుతుండటంపై కలెక్టర్ రాహుల్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఆర్ఐ యంత్రం కోసం అవసరమైన విద్యుత్ సౌకర్యాల కల్పనలో ఆలస్యం జరుగుతుండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం ఉన్నట్లు గమనించిన కలెక్టర్ అధి కారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ విధులకు గైర్హాజరు కావడంపై షోకాజ్ నోటీస్ జారీచేయాలని ఆదేశించారు. ఎంఆర్ఐ పనులను నిరంతరం పర్యవేక్షించేందుకు ఆర్డీఓను నియమించినట్లు తెలిపారు. విద్యుత్ సరఫరా ఏర్పాటుకు అవసరమైన పరికరాలు ఇప్పటికీ సమకూర్చకపోవడంపై ప్రశ్నిస్తూ, పనులు పూర్తికా వడానికి ఇంకా ఎంత సమయం పడుతుందో అని అసహనం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటరత్నం, వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రాజేష్, టీజీఎంఎస్ఐడీసీ ఏఈ రవికిరణ్ పాల్గొన్నారు. -
సరఫరా నిరంతరం చేయాలి
● అదనపు కలెక్టర్ అశోక్కుమార్ భూపాలపల్లి అర్బన్: జిల్లాలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పెట్రోల్, డీజిల్ సరఫరా నిరంతరంగా, పారదర్శకంగా కొనసాగాలని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ తెలిపారు. గురువారం భూపాలపల్లిలోని హెచ్పీ పెట్రోల్ బంక్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వినియోగదారులకు అందిస్తున్న సేవలు, పెట్రోల్, డీజిల్ సరఫరా విధానం, నిల్వల పరిస్థితి, అమ్మకాల విధానం, భద్రతా ప్రమాణాలను నిశితంగా పరిశీలించారు. పంపిణీ విధానం, రికార్డుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి, వినియోగదారులకు సమయానికి సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వినియోగదారుల ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని, భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని, అవసరానికి అనుగుణంగా మాత్రమే ఇంధనాన్ని కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో సరిపడా నిల్వలు ఉన్నాయని, ఆయిల్ కంపెనీలు ఇండెంట్ల ఆధారంగా నిరంతర సరఫరా కొనసాగిస్తున్నాయని తెలిపారు. వదంతుల నేపథ్యంలో అక్రమంగా నిల్వలు చేయడం, అక్రమంగా పెట్రోల్, డీజిల్ అమ్మకాలు చేపడితే చట్టపరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ తనిఖీలో పౌర సరఫరాల అధికారి శరణ్ కుమార్, ఇన్స్పెక్టర్ సురేందర్రెడ్డి పాల్గొన్నారు. -
భూ సమస్యలు వేగంగా పరిష్కరించాలి
రేగొండ: మండలంలోని కొడవటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం హుండీల్లోని లెక్కించగా రూ.23.12 లక్షల ఆదాయం సమకూరినట్లు ఈఓ మహేష్ తెలిపారు. కోటంచ దేవస్థానంలో వారం రోజులపాటు జరిగిన బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం లెక్కించినట్లు వెల్లడించారు. అలాగే మిశ్రమ బంగారం 28 గ్రాములు, మిశ్రమ వెండి 1.3 కిలోలు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ పర్యవేక్షకుడు అనిల్కుమార్, సర్పంచ్ సావటి మెగిళి, జీపీఓ రవీందర్, ఆలయ సిబ్బంది రవీందర్, శ్రావణ్, సుధాకర్, జానపద కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు నిమ్మల రాజు, కొత్తపల్లిగోరి, కొడవటంచ భజన బృందాలు పాల్గొన్నారు. ప్రమాద బీమా చెక్కు అందజేత భూపాలపల్లి అర్బన్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సింగరేణి సెక్యూరిటీ గార్డ్ నేరుపాటి మొగిలి కుటుంబ సభ్యులకు ప్రమాద బీమా చెక్కును బుధవారం అందజేసినట్లు బ్రాంచీ మేనేజర్ రామస్వామి తెలిపారు. కలెక్టర్ రాహుల్శర్మ, సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి చేతుల మీదగా బ్యాంక్ ఆవరణలో చెక్కును అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. సింగరేణి సంస్థలో ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా సౌకర్యం కల్పించడం విశేషమని తెలిపారు. భూపాలపల్లి ఏరియాలో ఇంకా సుమారు 60 మంది ఉద్యోగులు ఈ సౌకర్యం లేని బ్యాంకుల్లో ఖాతాలు కలిగి ఉన్నారని, వారు ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంకుల్లోని కార్పొరేట్ శాలరీ ఇన్సూరెన్స్ పథకంలోకి మారాలని సూచించారు. గనులు, విభాగాల వారీగా ఖాతాలు మార్చుకోవాల్సిన వారి సంఖ్యను వివరించారు. డిపార్ట్మెంట్లలో 12 మంది, కేటీకే–1లో 12 మంది, కేటీకే–5లో 9 మంది, కేటీకే–6లో 13 మంది, కేటీకే–8లో 8 మంది, కేటీకే ఓసీ–2లో ఆరుగురు ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏరియా పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, కావూరి మారుతి, సెక్యూరిటీ ఆఫీసర్ మురళీమోహన్, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ మధుకర్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. భూగర్భ జలాల అభివృద్ధి, వినియోగంపై అవగాహన భూపాలపల్లి రూరల్: ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా జిల్లా భూగర్భ జల శాఖ అశ్రీత ఎన్జీఓ ఆధ్వర్యంలో భూపాలపల్లి మండలం నాగారంలో గ్రామంలో బుధవారం ప్రజలు, రైతులకు నీటి ప్రాముఖ్యత, వినియోగం అనే అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ రైతులు కాలే.కుమార్, మండల రాజయ్యను సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా భూగర్భజల శాఖ అధికారులు శ్రీనివాసరావు, విక్రమ్, వ్యవసాయ శాఖ అధికారులు సతీష్ కుమార్, ఉద్యానవన శాఖ ఏఈఓ సుమలత, మిషన్ భగీరథ ఇన్చార్జ్ సాయి, ఎలిగేషన్ విభాగం ఏఈఓ క్రాంతి, సర్పంచ్ అంబాల దుర్గమ్మ, మాజీ సర్పంచ్ నాంపల్లి శ్రీనివాస్, మాజీ ఉపసర్పంచ్ సెగ్గం మల్లేష్, అంబాల జగదీష్ పాల్గొన్నారు.భూపాలపల్లి రూరల్: తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్, హైదరాబాద్ ద్వారా 2025–26 ఎస్సీ యాక్షన్ ప్లాన్ కింద జిల్లాలోని అర్హులైన అభ్యర్థుల నుంచి వివిధ ఆర్థిక సహాయ పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు గడుపు పెంచినట్లు కలెక్టర్ రాహుల్శర్మ, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంఘం చైర్మన్, బుధవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఏప్రిల్ 2వ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఇప్పటివరకు 671 దరఖాస్తులు అందినట్లు వెల్లడించారు. భూపాలపల్లి: భూపాలపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని భూ సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో రెవెన్యూ, అటవీ, సర్వే శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భూ వివాదాలకు సంబంధించిన అన్ని రికార్డులు, పొజిషన్ సమగ్రంగా పరిశీలించి నివేదికలను అందజేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. దీర్ఘకాలంగా ఉన్న భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రెవెన్యూ, అటవీ శాఖలకు సంబంధించిన భూ వివాదాల విషయంలో సంయుక్త సర్వేలు నిర్వహించి హద్దులను నిర్ణయించాలని సూచించారు. సమావేశంలో డీఎఫ్ఓ నవీన్రెడ్డి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, అదనపు కలెక్టర్ అశోక్కుమార్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కుసుమకుమారి, ఆర్డీఓ హరికృష్ణ, తహసీల్దార్లు పాల్గొన్నారు. రైతులతో సమావేశం ఏర్పాటు చేయాలి తాడిచర్ల నుంచి కేటీపీపీ వరకు ఏర్పాటు చేయనున్న కన్వేయర్ బెల్ట్ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులతో నెగోషియేషన్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులకు సూచించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో రెవెన్యూ, అటవీ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, కేటీపీపీ ఇంజినీరింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా ప్రాజెక్టు పురోగతిని, భూ సేకరణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రాజెక్టు అమలులో భాగంగా ప్రభావితం అవుతున్న రైతుల సమస్యలను పరిగణించి, వారికి న్యాయమైన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. భూ సేకరణ ప్రక్రియ పారదర్శకంగా, చట్ట బద్ధంగా కొనసాగాలని, రైతులకు ఎటువంటి అన్యాయం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఎఫ్ఓ నవీన్రెడ్డి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, అదనపు కలెక్టర్ అశోక్కుమార్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కుసుమకుమారి, ఆర్డీఓ హరికృష్ణ, అధికారులు పాల్గొన్నారు. మరింత చేరువలో బ్యాంకింగ్ సేవలు బ్యాంకింగ్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో భూపాలపల్లిలోని మంజూరునగర్లో కొత్తగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ప్రారంభించినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. బుధవారం ఎస్బీఐ బ్రాంచ్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ఎల్డీఎం తిరుపతి, ఎస్బీఐ అధికారులు పాల్గొన్నారు. విద్యా ప్రమాణాలను మెరుగుపర్చాలి మల్హర్(కాటారం): విద్యా ప్రమాణాలను మెరుగుపర్చేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. మండలంలోని మేడిపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలను బుధవారం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల ఆవరణ, తరగతి గదులు, విద్యార్థుల వసతి గహం, భోజన శాలను సమగ్రంగా పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సదుపాయాలు, మౌలిక వసతులు, పరిశుభ్రత, ఆహార నాణ్యత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. పాఠశాల వసతి గృహం నిర్వహణ, సిబ్బంది కొరత, మౌలిక సదుపాయాల పరిస్థితి తదితర అంశాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరు శాతం పెంపు, బోధనా నాణ్యత మెరుగు, వసతి గృహాల్లో శుభ్రత పాటించడం, పోషకాహారం సమయానికి అందించడం వంటి విషయాల్లో సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాలల్లో గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా ప్రతీ ఒక్కరు కృషి చేయాలని, చిన్న సమస్యలను వెంటనే పరిష్కరించేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ బాబు, నాయాబ్ తహసీల్దార్ రామ్మోహన్, పంచాయతీ కార్యదర్శి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ భూపాలపల్లి: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వదంతులతో ప్రజలు ఆందోళనకు గురి కావొద్దని తెలిపారు. ఒకేసారి పెద్ద సంఖ్యలో పెట్రోల్ బంకులకు వెళ్లి వాహనాల్లో ఫుల్ ట్యాంక్ నింపించుకోవడం వల్ల అనవసర రద్దీ, అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల్లో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని, సరఫరా కూడా నిరంతరంగా కొనసాగుతుందని తెలిపారు. ఎటువంటి కొరత పరిస్థితి లేదని, ప్రజలు అవసరానికి మించి ఇంధనం నిల్వ చేసుకోవద్దని సూచించారు. అలా చేయడం వల్ల ఇతరులకు అసౌకర్యం కలుగుతుందని ఎస్పీ సంకీర్త్ తెలిపారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
గిరిజనులకు ఆరోగ్య సేవలు సామాజిక బాధ్యత
మల్హర్(మహాముత్తారం): గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం పోలీస్ శాఖ సామాజిక బాధ్యతలో భాగమని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. జిల్లా పోలీస్శాఖ ఆధ్వర్యంలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ బుధవారం మండలంలోని మహాముత్తారం పోలీస్ స్టేషన్ పరిధిలోని పెగడపల్లి ఆశ్రమ పాఠశాలలో పోలీస్ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజనులు 6,200 మందికి ఉచితంగా వైద్యసేవలు అందించారు. ఈ మెగా మెడికల్ క్యాంప్కు కలెక్టర్ రాహుల్ శర్మ హాజరై మాట్లాడారు. మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజన ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు పోలీస్ శాఖ చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయమని పేర్కొన్నారు. ఇలాంటి శిబిరాల ద్వారా ప్రజల ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స అందించడం ఎంతో అవసరమని చెప్పారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆరైవ్.. అలైవ్ కార్యక్రమంలో భాగంగా డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు కూడా నిర్వహించామన్నారు. భవిష్యత్లో కూడా ఇలాంటి మెడికల్ క్యాంపులు కొనసాగిస్తామని వెల్లడించారు. యశోద హాస్పిటల్ (హైదరాబాద్), ఏకశిల హాస్పిటల్ (హనుమకొండ), సిగ్మా హాస్పిటల్, కూరపాటి హాస్పిటల్స్, శరత్ లేజర్ ఐ కేర్ (హనుమకొండ), భూపాలపల్లి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్కు చెందిన వైద్యులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు మొత్తం 34 మంది వైద్యులు 9 విభాగాల్లో సేవలు అందించాని ఎస్పీ వివరించారు. ఈ శిబిరంలో గుండె, మూత్రపిండాలు, జనరల్ మెడిసిన్, సీ్త్ర వ్యాధులు, కంటి, చర్మ, చెవి–ముక్కు–గొంతు, ఎముకలు, కీళ్ల సంబంధిత వ్యాధులకు పరీక్షలు నిర్వహించామని తెలిపారు. అలాగే అదనంగా రక్త పరీక్షలు, 2డీ ఎకో, ఈసీజీ వంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించి, అవసరమైన మందులు పంపిణీ స్పష్టం చేశారు. కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, డీఎఫ్ఓ నవీన్రెడ్డి, అదనపు ఎస్పీ నరేష్ కుమార్, డిప్యూటీ డీఎంహెచ్ఓ శ్రీదేవి, డీఎస్పీ సూర్యనారాయణ, సీఐలు, ఎసైలు తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పెగడపల్లి ఆశ్రమ పాఠశాలలో పోలీస్ మెగా మెడికల్ క్యాంప్ 6,200 మంది గిరిజనులకు చికిత్స -
పెరిగిన రుణ పరిమితి
భూపాలపల్లి రూరల్: ప్రభుత్వం పంటల రుణ, పరిమితిని పెంచడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంటల సాగు వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రస్థాయి సాంకేతిక కమిటీ 2026–27 ఆర్థిక సంవత్సరానికి వానాకాలం, యాసంగి పంటల రుణ పరిమితి పెంచింది. ఎకరాకు ఏ పంటకు ఎంత రుణం ఇవ్వాలని ఖరారు చేస్తూ స్టేట్ లెవెల్ బ్యాంకర్ల కమిటీ కి పంపించింది. దీంతో పంట రుణాల వరిమితిని పెంచుతూ ఎస్ఎల్బీసీ జిల్లా, మండలాల బ్యాంకర్లకు సర్క్యులర్ పంపించింది. దీంతో ఈ రుణ పరిమితిని ఏప్రిల్ నుంచి వర్తింపజేయనున్నట్లు సమాచారం. 128 రకాల పంటలతో పాటు కోళ్లు, గొర్రెలు, మేకలు, పందులు, తేనెటీగలు, చేపల పెంపకం తదితర యూనిట్లకు ఈ రుణపరిమితి వర్తించనుంది. సాగు విస్తీర్ణం ఇలా.. జిల్లా వ్యాప్తంగా 2.25 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతున్నట్లు వ్యవసాయశాఖ లెక్కలు చెబుతున్నాయి. జిల్లాలో 1,26,407 మంది పంట రుణాలకు అర్హులు. కాగా, వీరిలో 78 శాతం మందికే రుణాలు అందుతున్నాయి. మిగతా రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. బ్యాంకర్లు ఇస్తున్న పంట రుణాలకు తక్కువ వడ్డీ ఉండగా పట్టా పాస్బుక్ కలిగిన ప్రతీ రైతు సమీపంలోని బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.ప్రభుత్వం పంట రుణపరిమితి పెంచడం ద్వారా రైతులకు మేలు జరుగుతుంది. నాకు ఐదెకరాల సాగుభూమి ఉంది. ఏటా అవసరానికి సరిపడా పంట రుణం తీసుకుంటున్నాను. రుణ పరిమితి పెంచడం సాగును ప్రోత్సహించడమే. – తరాల విష్ణు, రైతు, కొత్తపల్లి (ఎస్ఎం) పంటల రుణ పరిమితి పెంచడంతో వరికి గతేడాది ఎకరాకు రూ.46 వేలు ఉండగా ప్రస్తుతం రూ.48 వేలు అందనుంది. పత్తికి రూ.4 వేలు, మిర్చికి రూ.4 వేలు, కందికి రూ.2 వేలు, సోయాకు రూ.2 వేలు, పెసర, జొన్న, మక్క, పంటలకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేలు అదనంగా రానున్నాయి. దీంతో పంటల సాగుకు అవసరమైన పెట్టుబడులకు ఇబ్బందులు లేకుండా ఉపశమనం కలగనుందని పలువురు రైతులు పేర్కొంటున్నారు. కాగా, ఐదెకరాలకు పైగా ఉన్న రైతులకు రూ.2 లక్షలకు మించి రుణాలివ్వడంలేదని.. బ్యాంకర్లు కండిషన్లు పెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల నేపథ్యంలో రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని ప్రటించి కుటుంబాన్ని యూనిట్గా తీసుకోవడంతో చాలామంది రైతులకు రూ.2 లక్షల వరకు రుణ మాఫీ కాలేదు. దీంతో రైతులు రూ.2 లక్షల లోపు పరిమితితోనే రుణాలు తీసుకుంటున్నారు.పెంచిన రుణ పరిమితి సౌకర్యాన్ని రైతులు వినియోగించుకోవాలి. తీసుకున్న రుణాలు గడువులోపు చెల్లించిన రైతులకే వడ్డీ రాయితీ వర్తిస్తుంది. రుణ పరిమితి పెంపుతో రైతులకు ఉపయోగంగా ఉంటుంది. – తిరుపతి, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఏప్రిల్ 10 నుంచి రుణాల పంపిణీ 1,26,407 లక్షల మంది రైతులకు మేలు -
డ్రైవర్లకు కంటిచూపు ప్రధానం
● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ భూపాలపల్లి: వాహన డ్రైవర్లకు కంటిచూపు ప్రధానమని, కంటిచూపు మందగింపుతోనే ప్రమాదాలు చోటు చేసుకుంటాయని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని సింగరేణి ఫంక్షన్ హాల్లో శరత్ ఐ కేర్ హాస్పిటల్ సహకారంతో జిల్లాలోని వాహన డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, డ్రైవర్ల కంటి ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం, వారి ప్రాణ భద్రతను కాపాడడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఈ శిబిరంలో సుమారు 300 మందికి పైగా ఆటో, లారీ డ్రైవర్లు కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ నరేష్కుమార్, భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు, స్థానిక సీఐ డి.నరేష్కుమార్, ఎస్సై సాంబమూర్తి పాల్గొన్నారు. రాజీతో సమస్యలను పరిష్కరించుకోండి ఈ నెల 28వ తేదీన నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. జాతీయ లోక్ అదాలత్లో రాజీ పడదగిన కేసులను పరస్పర సమ్మతితో త్వరగా పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. చిట్యాల: మండలకేంద్రంలోని రాంనగర్ కాలనీకి చెందిన సరిగొమ్ముల నాగరాజ్ ఇంట్లో అక్రమంగా ఎనిమిది గ్యాస్ సిలిండర్లు నిల్వ ఉంచారు. దీంతో నమ్మదగిన సమాచారం మేరకు సివిల్ సప్లయీస్ ఇన్స్పెక్టర్ భాస్కర్ల రాజు, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన ఎనిమిది గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీలో ఏఎస్సైలు సమ్మిరెడ్డి, మధుసూదన్, కానిస్టేబుల్ లాల్సింగ్, హోంగార్డ్ ప్రసాద్ తదితరులు ఉన్నారు. -
టీబీపై పోరాటం అందరిబాధ్యత
భూపాలపల్లి అర్బన్: ప్రతీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుందని, టీబీపై పోరాటం మన అందరి బాధ్యత కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. మంగళవారం ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా జిల్లాకేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులకు ఉచిత టీబీ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ టీబీపై ప్రతిఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి కార్యాచరణలో భాగంగా మున్సిపల్ కార్మికులు, ఆశ సిబ్బందికి ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని జిల్లా వైద్యాధికారి, మున్సిపల్ కమిషనర్కు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, కౌన్సిలర్ అప్పం కిషన్, ప్రోగ్రాం అఽధికారిణి డాక్టర్ ఉమారాణిలు పాల్గొన్నారు. -
పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి
మల్హర్(మహాముత్తారం):పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం మహాముత్తారం మండలంలోని కేజీబీవీ పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ప్రాంగణం అపరిశుభ్రంగా ఉండటంతో విద్యాశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి పాఠశాలలో పిచ్చిమొక్కలు తొలగించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. దీంతో విద్యార్థుల భద్రతకు ముప్పు ఏర్పడుతుందన్నారు. చేపట్టిన పారిశుద్ధ్య పనుల ఫొటోలను తనకు పంపించాలని సూచించారు. అదనంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటుతూ పచ్చదనం పెంచాలన్నారు. రో డ్డు, విద్యుత్ పనులను వెంటనే వేగవంతం చేసి, వినియోగంలోకి తీసుకురావాలని సంబంధిత శాఖ ల అధికారులను ఆదేశించారు. అనంతరం టెన్త్ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. హలో స్టూడెంట్స్ ఎలా ఉన్నారు? ఇప్పటి వరకు ఎన్ని పరీక్షలు రాశారు? ఎలా రాశారు? ఇంకా ఎన్ని పరీక్షలు మిగిలి ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. బాగా చదివి ఉన్నత స్థాయికి చేరాలని విద్యార్థుల ను ప్రోత్సహించారు. కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, డీఈఓ రాజేందర్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ ప్రకాష్, సర్పంచ్ బాబు, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ పాల్గొన్నారు. సీఎస్ఆర్ నిధులు కీలకం గ్రామాల అభివృద్ధికి సీఎస్ఆర్ నిధులు కీలకమని కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. మంగళవారం మండలంలోని మండల పరిషత్ పాఠశాలలో హెచ్డీఎఫ్సీ సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన స్మార్ట్ తరగతి గదులు, ఆధునికీకరించిన మరుగుదొడ్లు, ఎమ్మార్సీ భవనం, చిన్నారుల కోసం ఏర్పాటు చేసి న ఆట పరికరాలను కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రత్యేక చొరవతో సీఎస్ఆర్ నిధుల ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించామన్నారు. కార్యక్రమంలో అయి త ప్రకాష్రెడ్డి, డీఈఓ రాజేందర్, హెచ్డీఎఫ్సీ జోనల్ మేనేజర్ రుణాకర్రెడ్డి పాల్గొన్నారు. రోడ్డు, విద్యుత్ పనులు వేగవంతం చేయాలి కలెక్టర్ రాహుల్ శర్మ -
గ్యాస్ కష్టాలు!
భూపాలపల్లి అర్బన్: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం సామాన్యులపై తీవ్ర ప్రభావం పడుతోంది. వంటగ్యాస్ కొరత తీవ్రతరం కాకపోయినా.. కమర్షియల్ సిలిండర్ల సరఫరాను తగ్గించారు. దీంతో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు, తోపుడు బండ్లపై తినుబండారాలు, టిఫిన్లు అమ్మేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకొని వంటలు చేస్తుండగా కమర్షియల్ గ్యాస్పైనే ఆధారపడిన టిఫిన్ సెంటర్లు, తోపుడు బండ్ల వ్యాపారులు వాటిని మూసివేసుకోవాల్సి న పరిస్థితి ఏర్పడుతుంది. కమర్షియల్ వంట గ్యాస్ సిలిండర్ ధర గతంలో రూ.2వేలు ఉండగా బ్లాక్ మార్కెట్లో ఒక్కో సిలిండర్ రూ.4వేల నుంచి రూ.5వేల వరకు అమ్ముతుండడంతో చిన్న వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 400పైగా హోటళ్ల, టిఫిన్ సెంటర్ల, తోపుడు బండ్లు ఉన్నాయి. జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లో సుమారు 10కిపైగా హోటళ్లు మూడపడ్డాయి. మూత పడుతున్న టిఫిన్ సెంటర్లు, చిన్న హోటళ్లు ఇబ్బందులు పడుతున్న చిరు వ్యాపారులుబతుకుదెరువు కోసం బజ్జ్జీల బండి ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నాం. పది రోజుల నుంచి గ్యాస్ సిలిండర్ కొరతతో ఇబ్బందులు పడుతున్నాం. కమర్షియల్ సిలిండర్లు రావడం లేదు. దీంతో రెండు రోజుల నుంచి బజ్జీల బండి తీయడం లేదు. రోజు వారి ఖర్చులు, గిరి గిరి చిటీలు కట్టడం ఇబ్బందిగా మారింది. – ఉపాధ్యాయ్ శుభం, బజ్జీల బండి నిర్వాహకుడు -
– వివరాలు 8లోu
– సాక్షిప్రతినిధి, వరంగల్ ‘ఓరుగల్లు’లో 21కి పెరగనున్న అసెంబ్లీ నియోజకవర్గాలు హనుమకొండలో ఆరు, వరంగల్లో ఐదు... మానుకోటలో నాలుగు... జేఎస్ భూపాలపల్లిలో రెండు.. జనగామ, ములుగులలో యఽథాతఽథం ఆరు జిల్లాల పరిధిలోనే మొత్తం 21 నియోజకవర్గాలు 2027 జనాభా లెక్కల ఆధారంగా చేసే అవకాశం... ఆ ప్రకారమే 2029 ఎన్నికలు... కేంద్రం కసరత్తు నేపథ్యంలో చర్చనీయాంశంగా పునర్విభజన -
సమస్యల పరిష్కారానికి ‘సేవ్ సింగరేణి’ బస్సు జాతా
భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి ‘సేవ్ సింగరేణి’ బస్సు జాతా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్ తెలిపారు. మంగళవారం ఏరియాలోని కేటీకే ఓసీ2 గనిలో సేవ్ సింగరేణి బస్సు జాతాకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం రమేష్ మాట్లాడుతూ సింగరేణి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బస్సు జాతా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. సేవ్ సింగరేణి పిలుపులో భాగంగా నేడు జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో బైక్ ర్యాలీ, కార్నర్ సభలకు కార్మికులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మైనింగ్ ఇన్చార్జ్ రామ్చందర్, బ్రాంచ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్యం క్షయం
భూపాలపల్లి అర్బన్: రెండు వారాలకు మించి దగ్గు ఉందా.. అయితే టీబీ(క్షయ) అయ్యిండొచ్చు. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లి ఉచిత పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధి నిర్ధారణ అయితే వైద్యులు మందులిస్తారు. చిన్నపాటి దగ్గే కదా అని నిర్లక్ష్యం చేస్తే అదే రేపు ప్రాణాంతకం అవ్వొచ్చు. ముందుగా జాగ్రత్త పడితే ఆరోగ్యం మీ చేతుల్లోనే భద్రంగా ఉంటుంది. జిల్లాలో చాప కింద నీరులా వ్యాపిస్తున్న క్షయ వ్యాధికి కళ్లెం వేయాలి. అందరం కలిసి క్షయను నిర్మూలించగలం అనే నినాదంతో అధికారులు ఈ ఏడాది ముందుకెళ్తున్నారు. నేడు ప్రపంచ క్షయ నివారణ దినం సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం. అవగాహన కార్యక్రమాలు.. టీబీ నిర్మూలనకు ప్రభుత్వం నడుంబిగించింది. వైద్యశాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎంతో పటిష్ట చర్యలు తీసుకుంటున్నా క్షయ వ్యాధి తగ్గుముఖం పట్టకపోవడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో చాపకింద నీరులా క్షయ విస్తరించడం, కొన్నేళ్లుగా వ్యాధిగ్రస్తులను గుర్తించి చికిత్స అందిస్తున్నా, ఏటా బాధితులు పెరుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం 2030 నాటికి టీబీని నిర్మూలించడమే లక్ష్యంగా ఐదేళ్లుగా కృషి చేస్తున్నా, ఏటా వీరి సంఖ్య వెయ్యికి దగ్గరగా నమోదవుతోంది. 680 క్షయవ్యాధి కేసులు 2025 సంవత్సరంలో జిల్లాలో మొత్తం 680 క్షయవ్యాధి కేసులు నమోదు అయ్యాయి. వీటిలో 482 మంది రోగులు చికిత్స పూర్తి చేసి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం 281 మంది రోగులు చికిత్సలో కొనసాగుతున్నారు. 12 మంది రోగులు మరణించారు. మరోవైపు క్షయ పోషణ పథకం కింద కేవలం 114 మంది మాత్రమే లబ్ధి కలిగింది. వ్యాధి గుర్తింపు ఇలా.. టీబీ.. మైకో బ్యాక్టీరియా ట్యూబర్కిలోసిస్ ద్వారా సంక్రమిస్తుంది. ఊపిరితిత్తులకు లేదా శరీరంలోని ఇతర భాగాలకు రెండు రకాలుగా వ్యాపిస్తుంది. 85 శాతం మందికి ఊపిరితిత్తులకే సోకడం గమనార్హం. రెండు వారాలకు మించి దగ్గు ఉండడం, సాయంత్రం వేళ జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, ఛాతినొప్పి, దగ్గినప్పుడు రక్తంతో కూడిన తెమడ వస్తే వ్యాధి లక్షణాలుగా చెప్పవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. బాధితులకు వ్యాధి తీవ్రతను బట్టి ఆరు, ఎనిమిది నెలలు, రెండేళ్ల కోర్సు ప్రకారం మందులు వాడాల్సి ఉంటుంది. వ్యాధిగ్రస్తుడు దగ్గినా, తుమ్మినా తుంపర్లు వాతావరణంలో కలిసి బ్యాక్టీరియా ద్వారా ఇతరులకు సంక్రమిస్తుంది. రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు దీని బారిన పడే ప్రమాదం ఉంది. హెచ్ఐవీ, షుగర్ వ్యాధిగ్రస్తులు, అతిగా మద్యం సేవించేవారు, పొగతాగేవారు, గర్భిణులు, బాలింతలు, సరైన పోషకాహారం తీసుకోనివారు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు త్వరగా దీని బారినపడే ప్రమాదం ఉంది. చికిత్సలో భాగంగా వ్యాధిగ్రస్తులు ప్రతీరోజు ట్యాబ్లెట్లను వేసుకునేలా ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్(ఎఫ్ఎసీ) చికిత్స విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ వ్యాధిని నిర్ధారణకు అధునాతన సీబీనాట్ (క్యాట్రేజ్ బేస్డ్ న్యూక్లిస్ ఆసిడ్ ఆంప్లీ క్లీన్ టెస్టు) విధానం (క్షయ నివారణ విభాగం కేంద్రం) జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆవరణలో ఉండగా కాటారం, మహాదేవపూర్, చిట్యాల, రేగొండలో తెమడ పరీక్షల మిషన్లను అందుబాటులో ఉన్నాయి. జిల్లా ఆస్పత్రిలో టీబీ టెస్టుల కోసం ప్రత్యేక గదిని కేటాయించి, సీబీనాట్ పరీక్ష చేసి చికిత్స అందిస్తున్నారు. టెస్టుల కోసం ట్రూనాట్ మిషన్ను ఏర్పాటు చేయగా, అనుమానితుల నుంచి శాంపిళ్లను సేకరించి, వ్యాధిని నిర్ధారిస్తున్నారు. చిన్నారులకు బీసీజీ టీకా వేయడం వల్ల వారు క్షయ బారిన పడే అవకాశాలు తక్కువ. ప్రభుత్వ ఆస్పత్రుల్లో టీబీ నిర్ధారణ పరీక్షలు చేసి వ్యాధి సోకిన వారికి మందులు అందిస్తున్నాం. రెండు వారాల కంటే ఎక్కువ రోజులు దగ్గు ఉండి, సాయంత్రం జ్వరం వచ్చే వారు ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలి. క్షయ నివారణ జిల్లాగా మార్చేందుకు అందరి సహకారం ఉండాలి. – డాక్టర్ ఉమాదేవి, ప్రోగ్రాం అధికారి గతేడాది 680 కేసులు నమోదు 12 మంది మృతి అవగాహన కల్పిస్తున్నా.. అంతంతే.. నేడు ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినంక్షయ వ్యాధిగ్రస్తులకు చికిత్స పూర్తయ్యే వరకు నిక్షయ పోషణ యోజన కింద నెలకు రూ.వెయ్యి ఇస్తారు. ఈ డబ్బును వారి ఖాతాల్లో జమచేసి, ఆధార్, బ్యాంక్ ఖాతాలతోని క్షయ పోర్టల్లో నమోదు చేస్తున్నారు. ప్రైవేట్ నర్సింగ్ హోంలు, ల్యాబ్లో పరీక్షలు చేసుకుని, వ్యాధి నిర్ధారణ అయితే వ్యాధిగ్రస్తుల వివరాలను సమీప ప్రభుత్వ ఆస్పత్రిలోని టీబీ యూనిట్ సిబ్బందికి తెలియజేయాలి. ఈ డబ్బులతో వ్యాధిగ్రస్తుడు బియ్యం, పప్పుదినుసులు, గుడ్లు, పాలు, కూరగాయలు కొనేందుకు గాను ఈ మొత్తాన్ని ఉపయోగించాలి. నిక్షయ్ మిత్ర కార్యక్రమం ద్వారా దాతలు పౌష్టికాహార పదార్థాలు అందజేస్తారు. -
ఏర్పాట్లలో ఆలస్యం చేయొద్దు
భూపాలపల్లి: కాళేశ్వరంలో మే 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరగనున్న సరస్వతి అంత్య పుష్కరాల ఏర్పాట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం చేయవద్దని కలెక్టర్ రాహుల్ శర్మ స్పష్టం చేశారు. సరస్వతి అంత్య పుష్కరాల పనులపై సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో రెవెన్యూ, పోలీస్, దేవాదాయ, ఇరిగేషన్, పీఆర్, మిషన్ భగీరథ, ఆర్అండ్బీ, విద్యుత్, వైద్య శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డెడ్లైన్ ప్రకారం జాప్యం లేకుండా కచ్చితంగా పనులు పూర్తి చేయాలని సూచించారు. శాఖల మధ్య సమన్వయంతో పనులలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. గాలికుంటుపై అప్రమత్తంగా ఉండాలి.. జిల్లాలోని పశుపోషకులు గాలికుంటు వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో పశువైద్య, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న జాతీయ పశువ్యాధుల నివారణ కార్యక్రమంలో భాగంగా ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమ ప్రచార రథాన్ని, కర పత్రాలను ఆవిష్కరించారు. తక్షణ చర్యలు తీసుకోవాలి.. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 55 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. ప్రతిపాదనలు పంపాం.. 2027లో నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు సంబంధించి ఇరిగేషన్, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, దేవాదాయ తదితర శాఖల ద్వారా చేపట్టనున్న పనులపై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడించారు. గోదావరి పరివాహక జిల్లాల కలెక్టర్లతో గోదావరి పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన పనులపై హైదరాబాద్ నుంచి దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావుతో కలిసి గోదావరి పరివాహక జిల్లాల కలెక్టర్లతో సోమవారం దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
సమస్యల పరిష్కారానికి లోకల్ కోర్టు
టేకుమట్ల: విద్యుత్ సమస్యల పరిష్కారానికి విద్యుత్ వినియోగదారుల వేదిక(లోకల్ కోర్టు)లను నిర్వహిస్తునట్లు టీఎస్ ఎన్పీడీసీఎల్ విద్యుత్ వినియోగదారుల ఫోరం చైర్మన్ ఎన్వీ వేణుగోపాలచారి అన్నారు. సోమవారం మండలకేంద్రంలోని రైతు వేదికలో విద్యుత్ సమస్యలు–పరిష్కారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల నుంచి 19 దరఖాస్తులను స్వీకరించి, మూడు సమస్యలను అక్కడే పరిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లూజ్ లైన్లు, రోడ్డు క్రాసింగ్లు, ఓవర్ లోడ్ ట్రాన్స్ఫార్మర్లు వంటి సమస్యలను ఎదుర్కొంటున్న వారు విద్యుత్ అధికారులకు రాత పూర్వకంగా వినతి పత్రాలు అందించాలన్నారు. విద్యుత్ సమస్యలు ఉంటే స్థానికంగా ఉండే విద్యుత్ అధితకారులతో సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. దరఖాస్తు చేసిన వినియోగదారుడి విద్యుత్ సమస్యను 45రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. నాణ్యమైన విద్యుత్ సరఫరాకు విద్యుత్ అధికారులకు విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫోరం ఫైనాన్ష్ మెంబర్ దేవేందర్, టీఎం రమేష్, భూపాలపల్లి డీఈ నాగరాజు, చిట్యాల ఏడీఈ సుందరకుమార్, ఎస్ఏఓ లక్పతి, ఏఏఓ సతీష్, ఏఈలు మణిదీప్, చంద్రశేఖర్, సంజయ్, సబ్ ఇంజనీర్లు వెంకటేష్, శ్రీనివాస్, రమేష్, సిబ్బంది పాల్గొన్నారు. -
రేపు మెగా పోలీస్ మెడికల్ క్యాంప్
భూపాలపల్లి: పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 25న(రేపు) పోలీసు మెగా మెడికల్ క్యాంపు నిర్వహించనున్నట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. మహాముత్తారం పోలీస్స్టేషన్ పరిధిలోని పెగడపల్లి ఆశ్రమ పాఠశాలలో క్యాంపు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ శిబిరంలో సుమారు 5000 మంది గిరిజనులకు ఉచిత వైద్య సేవలు అందిస్తామన్నారు. ఈ క్యాంపులో హైదరాబాద్ యశోద హాస్పిటల్కు చెందిన స్పెషలిస్ట్ డాక్టర్ల బృందం, భూపాలపల్లి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వైద్యులు సేవలు అందిస్తారన్నారు. ఈ అవకాశాన్ని మారుమూల ప్రాంత ప్రజలు సద్వినియోగిం చేసుకోవాలని ఎస్పీ సూచించారు. తక్షణ పరిష్కారమే లక్ష్యం.. ప్రజాదివస్ కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదివస్లో ఆయన 10 ఫిర్యాదులకు స్వీకరించారు. డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్ష శిబిరం.. భూపాలపల్లి పట్టణంలోని బస్టాండ్ పక్కన గల సింగరేణి కమ్యూనిటీ హాల్లో నేడు (మంగళవారం) డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్ష శిబిరం ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ వెల్లడించారు. జిల్లాలోని ఆటో, లారీ, టిప్పర్ డ్రైవర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సూచించారు. ● గిరిజనులకు ఉచితంగా వైద్యసేవలు ● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
అవగాహనతో కుష్ఠు నివారణ
● జిల్లా వైద్యాధికారి మధుసూదన్రేగొండ: అవగాహన పెంచుకోవడం ద్వారా కుష్ఠు వ్యాధిని కొంతవరకు నివారించవచ్చని జిల్లా వైద్యాధికారి మధుసూదన్ అన్నారు. సోమవారం మండలకేంద్రంలోని సబ్ సెంటర్లో కుష్ఠు వ్యాధి గుర్తింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుష్ఠు వ్యాధి సంక్రమణ వ్యాధి అయినప్పటికీ ప్రారంభ దశలో గుర్తించి చికిత్స అందిస్తే నయం చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఇంటింటికీ వెళ్లి లక్షణాలున్న వ్యక్తిని గుర్తించి, పరీక్షలు చేసి ఉచిత చికిత్స అందిస్తామన్నారు. ప్రజలు భయాందోళనకు గురికాకుండా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి హిమబిందు, పీఎంఓ మల్లయ్య, ఏపీఎంఓ ఎర్రయ్య నాయక్, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. కొనసాగుతున్న టెన్త్ పరీక్షలు ● పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ రాహుల్శర్మ భూపాలపల్లి అర్బన్: జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. సోమవారం నిర్వహించిన ఇంగ్లిష్ పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.రాజేందర్ తెలిపారు. కలెక్టర్ రాహుల్శర్మ జిల్లా కేంద్రంలోని సింగరేణి, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. డీఈఓ రాజేందర్ స్థానికంగా ఉన్న నాలుగు పరీక్ష కేంద్రాలను, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్ కాటారం మండల కేంద్రంలోని ఆదర్శ విద్యాలయాన్ని తనిఖీ చేసి పరీక్ష కేంద్రాల నిర్వహణ తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. 3,544 మంది విద్యార్థులకు గాను ఐదుగురు విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈఓ రాజేందర్ తెలిపారు. జిల్లాస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపిక పోటీలు భూపాలపల్లి అర్బన్: జిల్లాలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలకు ఈ నెల 30వ తేదీన జిల్లాస్థాయి ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి చిర్ర రఘు తెలిపారు. స్థానిక అంబేడ్కర్ స్టేడియంలో ఉదయం 8గంటల నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిపారు. నాలుగవ తరగతి చదువుతున్న బాలబాలికలకు ఎత్తు, బరువు, 800 మీటర్ల పరుగు, షటిల్ రన్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, ఫ్లయింగ్ స్టార్ట్, మెడిసిన్ బాల్ పుట్, వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలిటీ వంటి తొమ్మిది రకాల పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలలో ప్రతిభ కనబరిచిన వారిలో నుంచి 10 మంది చొప్పున బాలబాలికలను ఎంపిక చేసి రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నట్లు తెలిపారు. మండలస్థాయిలో ఎంపికై న విద్యార్థులే జిల్లాస్థాయి ఎంపికలకు హాజరుకావాలని సూచించారు. ఎంపికలకు హాజరయ్యే వారు జనన ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, స్టడీ సర్టిఫికెట్, ప్రోగ్రెస్ రిపోర్ట్, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు తప్పనిసరిగా తీసుకురావాలని తెలిపారు. -
ఒకేసారి మూడు నెలల రేషన్
● జిల్లాలో 1,38,234మంది తెల్లరేషన్కార్డులు భూపాలపల్లి: భానుడి భగభగలు మొదలయ్యాయి. మార్చి నెలలోనే ఎండలు మండిపోతుండటంతో రానున్న మూడు నెలల్లో ఉష్ణోగ్రతలు మరింత తీవ్రంగా ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో రేషన్ బియ్యం కోసం రేషన్ షాపుల వద్ద పేద ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవద్దనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకేసారి ఏప్రిల్, మే, జూన్ నెలల రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు జిల్లా అధికారులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లు చేస్తున్న పౌరసరఫరాల అధికారులు సాధారణంగా ప్రతీ నెల కేటాయించే కోటాను కాకుండా రాబోయే మూడు నెలల బియ్యాన్ని ఏప్రిల్ నెలలోనే లబ్ధిదారులకు అందజేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాల మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని 12 మండలాల్లో 277 రేషన్షాపులు ఉండగా 1,38,234 మంది రేషన్కార్డుదారులు, 3,91,353 మంది లబ్ధిదారులు(యూనిట్లు) ఉన్నారు. సర్కారు తీసుకున్న నిర్ణయంతో వీరందరికీ మూడు నెలల రేషన్ బియ్యం అందనుంది. పౌరసరఫరాల అధికారులు ఇందుకోసం ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో అంత్యోదయ, అన్నపూర్ణతో పాటు తెల్లరేషన్కార్డుల కుటుంబాల్లో సభ్యులందరికీ మూడు నెలలకు సరిపడా బియ్నాన్ని అందించేందుకు గోడౌన్లను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న బియ్యం నిల్వలు, కావాల్సిన బియ్యం వివరాలను ఉన్నతాధికారులకు నివేదించి సకాలంలో బియ్యం దిగుమతి జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాక ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యం అందించనుండటంతో రేషన్ డీలర్ల వద్ద క్యూ కట్టడం.. తదితర ఇబ్బందులు తలెత్తే దృష్ట్యా, ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయమై ప్రణాళికలు రూపొం దిస్తున్నారు. -
మక్కలకు లేదు మద్దతు
ఉమ్మడి వరంగల్లో యాసంగి సాగు వివరాలు..సాక్షిప్రతినిధి, వరంగల్: కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జరుగుతున్న జాప్యం కారణంగా మొక్కజొన్న రైతులకు మార్కెట్లో ‘మద్దతు’ దొరకడం లేదు. యాసంగి మక్కల కొనుగోళ్ల కోసం ప్రతీసారి మార్చి మొదటి వారంలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసే మార్క్ఫెడ్, ‘ప్యాక్స్’, ఇతర ప్రభుత్వరంగ సంస్థలు ఈసారి వేచిచూసే ధోరణిలో ఉన్నాయి. ఎక్కడా కూడా మార్క్ఫెడ్ ఇంకా కొనుగోళ్లను ప్రారంభించకపోవడంతో సిండికేట్గా మారిన కొందరు ప్రైవేట్ వ్యాపారులు మార్కెట్లో తమకు తోచిన ధరకు కొనుగోలు చేస్తున్నారు. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) క్వింటాలుకు రూ.2,400 కాగా.. కనిష్టంగా రూ.1,700, గరిష్టంగా రూ.1,950 చెల్లిస్తున్నారని రైతులు చెబుతున్నారు. ఎంఎస్పీతో పోలిస్తే క్వింటాలుకు రూ.500 నుంచి రూ.650 వరకు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో పెరిగిన సాగు.. ఈ యాసంగిలో మొక్కజొన్న సాగు గణనీయంగా పెరిగింది. వ్యవసాయశాఖ అంచనాలను మించి రైతులు 88 శాతం అధికంగా సాగు చేశారు. వాస్తవానికి 2025–26 యాసంగిలో మొత్తం సాగు అంచనా 68,67,407 ఎకరాలు కాగా, 81,20,332 (118 శాతం) ఎకరాల్లో రైతులు వివిధ పంటలు వేశారు. ఇందులో మొక్కజొన్న సాగు అంచనా 6,45,574 ఎకరాలకు 12,13,914 (188 శాతం) ఎకరాల్లో వేశారు. అత్యధికంగా ఉమ్మడి వరంగల్లో 3,43,732 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న వేశారు. సాగైన మొత్తం విస్తీర్ణంలో సగటున ఎకరానికి 18 క్వింటాళ్లు వస్తే 6,18,717 టన్నులు.. 25 క్వింటాళ్లు వస్తే 8,59,330 టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. గతేడాది 26 కేంద్రాలను ప్రతిపాదించిన మార్క్ఫెడ్, వ్యవసాయశాఖలు ఈసారి ఇంకా కొనుగోలు కేంద్రాల పరిశీలనలోనే ఉన్నాయి. దీంతో రైతులు అవసరాల కోసం ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించి తక్కువ ధరకు అమ్ముకుంటున్న పరిస్థితి నెలకొంది. ఈ నెల 18న మక్కల కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అసెంబ్లీలో చర్చకు తేగా.. ఆ తర్వాత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఐదు రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో పురోగతి లేదు. కనీస మద్దతు ధర క్వింటాకు రూ.2,400.. వ్యాపారుల ధర రూ.1,950 ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా 3.43 లక్షల ఎకరాల్లో సాగు అసెంబ్లీలో ఈనెల 18న చర్చ.. మంత్రి ఆదేశించినా పురోగతి లేదు మొక్కజొన్న రైతుకు తప్పని దళారుల బెడదపై ఫొటోలో ఉన్నది హనుమకొండ జిల్లా వేలేరు మండలం పీచరకు చెందిన రైతు నకీర్త మధు. మూడెకరాల్లో మొక్కజొన్న సాగు చేశాడు. ఇటీవల కురిసిన వడగళ్లకు కొంత మేరకు దెబ్బతింది. మిగిలిన పెరడు కోసి కంకి కొట్టాడు. అమ్మేందుకు మక్కలను కల్లం వద్ద ఆరబోశాడు. బయట అమ్ముకుందామంటే ధర తక్కువ. కొనుగోలు కేంద్రాలు అగొచ్చే ఇగొచ్చే అని అధికారులు అంటుంటే ఐదారు రోజుల నుంచి ఆశగా ఎదురుచూస్తున్నాడు. కానీ, ఇంతవరకు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఈ పరిస్థితి ఒక్క నకీర్త మధుదే కాదు.. అనేక మంది మక్క రైతులు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. -
‘ట్రామా’.. ధీమా
సాక్షి, వరంగల్: ఉత్తర తెలంగాణకే తలమానికమైన వరంగల్లోని మహాత్మాగాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆస్పత్రిలో ట్రామాకేర్ సేవలను మరింత పకడ్బందీగా అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రోడ్డు ప్రమాదాలు, ఇతర కారణాలతో తీవ్రంగా గాయపడిన వారికి సత్వరమే మెరుగైన చికిత్స అందించేందుకు మూడుస్థాయిల్లో ట్రామా ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం.. లెవల్–1 ట్రామాకేర్ ఆస్పత్రుల్లో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి చోటు కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా లెవల్–1, లెవల్ –2, లెవల్–3గా విభజించి వైద్యారోగ్య శాఖ సౌకర్యాలను మరింత మెరుగుపరిచేందుకు కసరత్తు ప్రారంభించింది. ఎంజీఎం ఆస్పత్రిలో కూడా నిపుణులైన వైద్యులతో ట్రామా చికిత్సలో నాణ్యతను పెంచేందుకు కృషి చేస్తోంది. మూడేళ్ల క్రితం ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్మెంట్ (ఈఎండీ)ను అందుబాటులోకి తీసుకురావడంతో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందుతోంది. అయితే నిమ్స్, ఉస్మానియా, గాంధీ, బీబీనగర్ ఎయిమ్స్, హైదరాబాద్ ఈఎస్ఐసీతోపాటు లెవల్–1 ట్రామాకేర్ ఆస్పత్రుల్లో ఎంజీఎంకు చోటు కల్పించడంతో మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి. గోల్డెన్ అవర్లో ఆస్పత్రికి వచ్చిన క్షతగాత్రులకు అన్ని విభాగాల వారు ఒకే సమయంలో 24 గంటలు అందుబాటులో ఉండడం ద్వారా సత్వర వైద్యం అంది ప్రాణాలు నిలిచే అవకాశం ఉంటుంది. అలాగే, వరంగల్లో నిర్మితమవుతున్న మల్టీసూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో 10 నుంచి 12 పడకలతో ట్రామా ఐసీయూ అందుబాటులోకి రానుండడం కూడా క్షతగాత్రులకు ఎంతో ఉపయుక్తం కానుంది. న్యూరో, ఆర్థో, జనరల్ సర్జరీ, కార్డియాక్ స్పెషలిస్టులు, అనస్థీషియా నిపుణులు, జనరల్ మెడిసిన్ వైద్యులతో పాటు డెంటల్, ఈఎన్టీ నిపుణులు కూడా అందుబాటులో ఉండడం వల్ల రోడ్డు ప్రమాద బాధితులకు అవసరమైన వైద్యం అందించే వీలుంటుంది. ఈ లెవల్–1 ట్రామాకేర్ ఆస్పత్రుల్లో మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించి క్షతగాత్రులకు భరోసా కల్పించేలా చేస్తున్నారు. ఇప్పటికే ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్తో పాటు రేడియాలాజీ, అల్ట్రాసౌండ్ స్కాన్, సీటీస్కాన్ సేవలు ఎంజీఎంలో అందుబాటులో ఉన్నాయి. ఇంకా అవసరమైన సౌకర్యాలు కల్పించనున్నారు. రోజుకు 200 వరకు ట్రామా కేసులు.. ఎంజీఎం ఆస్పత్రి క్యాజువాలిటీకి రోజుకు 500 నుంచి 700 వరకు కేసులు వస్తుంటాయి. వీటిలో 150 నుంచి 200 వరకు ట్రామా కేసులు ఉంటాయి. 30 నుంచి 50 వరకు మేజర్ కేసులుంటే, మిగిలినవి మైనర్. శని, ఆదివారాల్లో ఈ కేసులు ఇంకాస్త ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చిన క్షతగాత్రులకు వెంటనే వైద్యం అందేలా చేస్తున్నారు. లెవల్–1 ట్రామాకేర్ ఆస్పత్రిగా అభివృద్ధి చేయడం ద్వారా ఎంజీఎంలో మరిన్ని సౌకర్యాలు పెరిగి 24 గంటలపాటు అన్ని విభాగాల వైద్యులు ఉంటారు. వీరికి ప్రత్యేక శిక్షణ తరగతులు ఇవ్వడం ద్వారా సమయానుకూలంగా స్పందించే అవకాశముంటుంది. ఇలా గోల్డెన్ అవర్లో క్షతగాత్రులకు మెరుగైన సత్వర చికిత్స అందించడం ద్వారా ప్రాణాలు నిలుస్తాయి. లెవల్–1లో ఎంజీఎం ఆస్పత్రికి చోటు కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం కొత్త మల్టీసూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోనూ ట్రామా ఐసీయూ -
బీపీ.. షుగర్
జీవనశైలి మార్పుతో దీర్ఘకాలిక వ్యాధులు ● నలుగురిలో ఒకరికి బీపీ.. ఐదుగురిలో ఒకరికి మధుమేహం ● నియంత్రణ కోసం వైద్యారోగ్య శాఖ చర్యలు ● పల్లెల్లోనూ పెరుగుతున్న కేసులుజిల్లా జనాభా : 4.50లక్షలు (2011 జనాభా లెక్కల ప్రకారం)ఎన్సీడీ ద్వారా స్క్రీనింగ్ 1,40,000బీపీ వ్యాధిగ్రస్తులు 27,660షుగర్ వ్యాధిగ్రస్తులు 12,245భూపాలపల్లి అర్బన్: ప్రస్తుతకాలంలో దీర్ఘకాలిక జబ్బుల బారిన పడే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఆహారం, జీవన విధానంలో మార్పులు, మానసిక ఒత్తిడి.. ఇలా పలు కారణాలతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. బీపీ, షుగర్(మధుమేహం) బారిన పడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇదివరకు పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ జబ్బుల బారిన పడేవారు. ప్రస్తుతం పల్లెల్లోనూ కేసులు పెరుగుతున్నాయి. ప్రతీ నలుగురిలో ఒకరికి బీపీ, 30 ఏళ్లు నిండిన ప్రతి ఐదుగురిలో ఒకరికి షుగర్ ఉందంటే పరిస్థితి తీవ్రత అంచనా వేయవచ్చు. ఈ స్థాయిలో బీపీ, మధుమేహ బాధితులు ఉండటం అత్యంత ఆందోళన కలిగించే అంశమని వైద్యులు పేర్కొంటున్నారు. అవగాహన లేక కొందరు, నిర్లక్ష్యంతో మరికొందరు ఈ ప్రమాదకర జబ్బులను నియంత్రణలో ఉంచుకోలేకపోవడంతో వివిధ వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఈ క్రమంలో కొందరు మృత్యువాత పడుతున్నారు. జీవన విధానంలో మార్పులు చేసుకుంటే సుఖమయమైన జీవితం గడపవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. యోగాతో పాటు వ్యాయామం చేస్తే ఒత్తిడిని జయించవచ్చంటున్నారు. సమీకృతాహారం తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. జిల్లాలో ఎన్సీడీ ప్రోగ్రాం ద్వారా 30 ఏళ్లు పైబడిన వారికి బీపీ, షుగర్, మహిళలకు రొమ్ము, గర్భాశయ, నోటి క్యాన్సర్కు సంబంధించి పరీక్షలు చేస్తున్నారు. మూడో విడతలో ఇప్పటివరకు లక్షా 40వేల మందికి స్కీన్రింగ్ చేసినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఇందులో 27,660 మంది బీపీ, 12,245 మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నట్లు పేర్కొంటున్నారు. క్యాన్సర్కు సంబంధించి మహిళలు దాదాపు 382 మంది వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. స్క్రీనింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. వీటితో నష్టాలు.. బీపీ, షుగర్ వల్ల జనం అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రాణాలు పోతున్న ఘటనలు అనేకం ఉన్నాయి. ఆహారపు అలవాట్లు, జీవన శైలితోనే 90 శాతం మందికి బీపీ వస్తుందని వైద్యాధికారులు చెబుతున్నారు. ఇందులో ప్రైమరీ, సెకండరీ హైపర్టెన్షన్ ఉంటుంది. బీపీతో గుండె సంబంధిత వ్యాధులు, బ్రెయిన్ స్ట్రోక్, శరీరంలోని ఇతర అవయవాలు చెడిపోవడం, కంటి సమస్యలు రావడం, రక్తం గడ్డకట్టడంతో పక్షవాతం వస్తుంది. బీపీ ఎక్కువై నరాలు చిట్లిపోయి చనిపోతున్నారు. షుగర్ వల్ల నరాలు బలహీనమవడం, కాళ్లకు తిమ్మిర్లు రావడం, కిడ్నీలు చెడిపోవడం, కంటి సమస్యలు, శరీరంలో అన్ని అవయవాలకు ఇన్ఫెక్షన్ రావడం, రోగనిరోధక శక్తి తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. 30ఏళ్లు పైబడిన వారికి షుగర్ వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. ప్యాంక్రియాస్ గ్రంథి ఇన్సులెన్ రిలీజ్ చేయకపోవడంతో షుగర్ పెరిగి డయాబెటిస్కు దారి తీస్తుందంటున్నారు. ఇక రొమ్ము క్యాన్సర్ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ లైంగిక సంబంధాలతో వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు వ్యాధిగ్రస్తులను గుర్తిస్తున్నాం.. ఎన్సీడీ ప్రోగ్రాంలో భాగంగా బీపీ, షుగర్, రొమ్ము, సర్వైకల్, నోటి క్యాన్సర్ వ్యాధిగ్రస్తులను గుర్తిస్తున్నాం. బీపీ, షుగర్ ఉన్నవారికి నెలనెలా మందులను పంపిణీ చేస్తున్నాం. క్యాన్సర్ అనుమానాలు, లక్షణాలు కనిపిస్తే స్థానికంగా ప్రాథమిక నిర్ధారణ చేసి రొమ్ము, ఇతర క్యాన్సర్ను గుర్తించేందుకు పెద్ద ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నాం. జీవనశైలితో వ్యాధుల బారిన పడుతున్నారు. వ్యాయామంతో రోగాలు దరిచేరకుండా ఉంటాయి. – డాక్టర్ మధుసూదన్, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి -
పూర్తి కమిటీలు ఎప్పుడు?
సాక్షిప్రతినిధి, వరంగల్ : అధికార కాంగ్రెస్ పార్టీ ఇటీవల మళ్లీ సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో వేగం పెంచింది. ఇప్పటికే డీసీసీ అధ్యక్షులను నియమించిన పార్టీ, తాజాగా కొన్ని జిల్లాల్లో పూర్తిస్థాయి కమిటీలను ప్రకటించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో మాత్రం ఇంకా పూర్తిస్థాయి కార్యవర్గం, కమిటీలు పెండింగ్లోనే ఉన్నాయి. ఉగాది సందర్భంగా రాష్ట్రంలోని 14 జిల్లాల్లో పూర్తిస్థాయి డీసీసీ కమిటీలు ప్రకటించారు. వీటిలో వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, కోశాఽధికారి, అధికార ప్రతినిధులు, కార్యదర్శులు, కార్యవర్గసభ్యులతో పాటు విస్తృతస్థాయి నిర్మాణం పూర్తి చేశారు. ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో 2025, నవంబర్ 22న ప్రకటించిన డీసీసీ అధ్యక్షుల జాబితాతో ఆగిపోయింది. పూర్తిస్థాయి కమిటీలకు మోక్షం కలగకపోగా, పార్టీ పదవులను ఆశిస్తున్న వారిలో ఉత్కంఠ కొనసాగుతోంది. నాలుగు నెలల కిందటే డీసీసీ అధ్యక్షులు.. డీసీసీ అధ్యక్షుల్లో ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల్లో ఇద్దరు షెడ్యూల్ కులాలు, ఒక మైనారిటీ, ఒక బీసీ, ఒక జనరల్, ఒక షెడ్యూల్ తెగలకు చెందిన వారికి అధిష్టానం పార్టీ జిల్లా పగ్గాలు అప్పగించింది. హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా ‘కుడా’చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డిని నియమించగా, వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా మైనార్టీ వర్గానికి చెందిన మహ్మద్ అయూబ్కు అవకాశం ఇచ్చారు. ఈ విషయంలో కీలక ప్రజాప్రతినిధులు అసంతృప్తికి గురైనట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. జనగామ జిల్లా అధ్యక్షురాలిగా లకావత్ ధన్వంతి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడిగా బట్టు కరుణాకర్, మహబూబాబాద్కు ఎమ్మెల్యే మురళి నాయక్ భార్య ఉమలను ఖరారు చేయగా, ములుగు జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి రెండోసారి పైడాకుల అశోక్కు దక్కింది. డీసీసీ అధ్యక్షుల సంధర్భంగా హనుమకొండ, ములుగు జిల్లాలు మినహా.. మిగతా నాలుగు జిల్లాల్లో సీనియర్లు అలకకు గురికాగా, కేడర్లో తర్జన భర్జన జరిగింది. ఈ నేపథ్యంలో అందరినీ అధిష్టానం బుజ్జగించింది. తాజాగా పూర్తిస్థాయి కమిటీల కూర్పు విషయం వచ్చే సరికి మళ్లీ రాజకీయ సిఫారసులు పెరగడం తలనొప్పిగా మారుతుందన్న చర్చ పార్టీ నేతల్లో సాగుతోంది. పూర్తిస్థాయి కార్యవర్గంపై ఇంకా గందరగోళం పొరుగు జిల్లాల్లో కార్యవర్గం, కమిటీలు ఖరారు ఉమ్మడి వరంగల్లో ముందుకు కదలని పరిస్థితి ఆశావహుల్లో కొనసాగుతున్న ఉత్కంఠ -
ఏఐ శిక్షణ పూర్తి
భూపాలపల్లి: ఉత్తరాఖండ్ రాష్ట్రం మసూరీలోని లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ పరిపాలన అకాడమీలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రతిష్టాత్మక ఏఐ శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ రాహుల్ శర్మ విజయవంతంగా పూర్తి చేశారు. ఈనెల 16వ తేదీ నుంచి 20 తేదీ వరకు నిర్వహించిన ‘డిజిటల్ రూపాంతరణ కోసం ఏఐ చాంపియన్స్ ప్రోగ్రాం’లో రాహుల్ శర్మ పాల్గొన్నారు. భవిష్యత్లో జిల్లాలో పరిపాలనను మరింత పారదర్శకంగా, వేగవంతంగా, ప్రజల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంలో ఈ శిక్షణ ఉపయోగపడనుంది. రాష్ట్రం నుంచి ఎంపికై న కలెక్టర్లలో రాహుల్ శర్మ ఒకరు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ, జిల్లాలో పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు, ప్రజలకు త్వరితగతిన, నాణ్యమైన సేవలు అందించేందుకు ఏఐ శిక్షణ ఎంతో ఉపయోగ పడుతుందని చెప్పారు. రాష్ట్రం నుంచి ఈ ప్రతిష్ఠాత్మక శిక్షణ కార్యక్రమానికి తనను ఎంపిక చేయడం గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. భవిష్యత్లో ఆధునిక సాంకేతికతలను వినియోగించి ప్రజాసేవలను మరింత మెరుగుపరచడానికి కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. గెలుపోటములు సహజం భూపాలపల్లి అర్బన్: క్రీడా పోటీల్లో గెలుపోటములు సహజమని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి తెలిపారు. జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని కృష్ణకాలనీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలను శనివారం జీఎం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. పోటీల్లో పాల్గొన్న ప్రతి క్రీడాకారుడు క్రీడాస్ఫూర్తితో ఆడాలన్నారు. గెలిచిన వారు వినయంగా ఉండాలని.. ఓడిన వారు నిరుత్సాహ పడకుండా మరింత శ్రమించి ముందుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ నరేష్కుమార్, సింగరేణి అధికారులు శ్యామ్సుందర్, శ్రావణ్కుమార్, శ్రీనివాస్, అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రచారి, కార్యదర్శి రమేస్, సభ్యులు శ్రీను, అభి, హేమంత్, రాజ్కుమార్, క్రీడాకారులు పాల్గొన్నారు. రామప్పలో అమెరికన్లు వెంకటాపురం(ఎం): చారిత్రక రామప్ప దేవాలయాన్ని అమెరికాకు చెందిన రోలండో అలెక్టెరియా, రేటా హెంగ్లు శనివారం సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ వెంకటేశ్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని వారు కొనియాడారు. -
ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభం
మల్హర్: మండలంలోని తాడిచర్లలో ఏర్పాటుచేసిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ.. మహిళలకు జీవనోపాధి పెంపొందించడానికి నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో మంత్రి శ్రీధర్బాబు ఈ కార్యక్రమానికి శ్రీకారం చూట్టారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బండి స్వామి, కొయ్యూరు సర్పంచ్ కొండ రాజమ్మ, రాష్ట్ర ఉపాధిహామీ కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్, తాడిచర్ల ఉప సర్పంచ్ బబ్బిలి రాజు, డీపీఎం గోవింద్ చవాన్, ఏపీఎం హనుమంతరావు, సీసీలు, వీఓలు పాల్గొన్నారు. మహిళలకు ఆర్థిక చేయూత కాళేశ్వరం: కుట్టు మిషన్ల ద్వారా మహిళలకు ఆర్థికంగా చేయూతను అందిస్తున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు అన్నారు. శుక్రవారం మహదేవపూర్ మండలం పలుగుల గ్రామంలో కుట్టు మిషన్ కేంద్రాన్ని సర్పంచ్ గారె విజయలక్ష్మితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రవీంద్రనాథ్, ఏపీఓ రాజన్న, ఐకేపీ సిబ్బంది శశి, ఉప సర్పంచ్ చంద్రయ్య, దేవస్థానం మాజీ డైరెక్టర్ మెంగాని అశోక్, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. -
రేపే రైతు భరోసా
భూపాలపల్లి: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో రేపు జమ కానున్నాయి. యాసంగి సీజన్ ప్రారంభం నుంచి పెట్టుబడి సహాయం కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 22నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లాలోని రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రైతులకు ఉపశమనం.. యాసంగి సీజన్ ప్రారంభమై సుమారు మూడు నెలలు కావస్తుంది. జిల్లాలోని 1,08,418 మంది రైతులు ఈ సీజన్లో వరి, మొక్కజొన్న, అరటి, కూరగాయలు తదితర పంటలను సాగుచేశారు. సరిగ్గా పెట్టుబడి సమయంలో రైతు భరోసా అందలేదు. దీంతో రైతులంతా స్థానిక అడ్తీ, వడ్డీ వ్యాపారులను ఆశ్రయించారు. ప్రస్తుతం పంటలు చేతికొచ్చే దశలో ఉండగా, ఇప్పటికీ మొక్కజొన్న, అరటి, కూరగాయలు లాంటి పంటలు సాగుచేస్తున్న రైతులు ఇంకా ఎరువులు, క్రిమిసంహారక మందులకు డబ్బులు వెచ్చించాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలోనే ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేయనుండటంతో రైతులకు కొంతమేరకు ఉపశమనం కలగనుంది. ప్రతీ ఒక్కరికి ఎకరాకు.. గతంలో ఎకరం వరకు ఉన్న రైతులకు తొలుత, తరువాత రెండెకరాలు.. ఇలా పెట్టుబడి సహాయాన్ని ప్రభుత్వం అందించేది. ఈసారి ఎన్ని ఎకరాలు ఉన్నా.. తొలుత ఒక ఎకరానికి, తరువాత రెండు ఎకరాలకు.. ఇలా విస్తీర్ణం ఆధారంగా దఫాల వారీగా పెట్టుబడి సహాయాన్ని ప్రభుత్వం అందించనుంది. ఫలితంగా జిల్లాలోని 1,08,418 రైతులకు తొలిరోజు అనగా రేపు(ఆదివారం) ఒక ఎకరాకు రూ.6 వేల చొప్పున రైతు భరోసా సహాయం అందనుంది.మండలం రైతుల జమకావాల్సిన సంఖ్య డబ్బులు(రూ. కోట్లలో)భూపాలపల్లి 14,128 రూ. 16.12 చిట్యాల 13,068 రూ. 15.80 మొగుళ్లపల్లి 12,093 రూ. 13.16 రేగొండ 12,353 రూ. 12.31 టేకుమట్ల 10,949 రూ. 11.04 గణపురం 8,433 రూ. 7.30 కొత్తపల్లిగోరి 7,251 రూ. 6.58 మహాముత్తారం 7,987 రూ. 7.38 కాటారం 8,566 రూ. 6.93 మల్హర్ 6,924 రూ. 5.88 మహదేవపూర్ 5,080 రూ. 4.08 పలిమెల 1,586 రూ. 1.38 రైతుల ఖాతాల్లో జమ కానున్న డబ్బులు తొలుత ప్రతీ రైతుకు ఒక ఎకరాకు.. జిల్లాలో 1,08,418 మంది లబ్ధిదారులు -
కూరగాయల సాగుతో అధిక లాభాలు
జిల్లా ఉద్యాన శాఖ అధికారి సునీల్కుమార్మల్హర్(కాటారం): రైతులకు తక్కువ కాలంలో ఆదాయం అందించే ముఖ్యమైన పంటగా కూరగాయల సాగు నిలుస్తుందని, సరైన ప్రణాళికతో సాగుచేస్తే అధిక లాభాలు పొందవచ్చని జిల్లా ఉద్యాన శాఖ అధికారి సునీల్కుమార్ అన్నారు. శుక్రవారం కాటారం మండలం గంగారం గ్రామంలో సునీల్ ఆధ్వర్యంలో ఉద్యాన పంటలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీజన్కు అనుగుణంగా సరైన రకాలు ఎంపిక చేసుకోవడం, నాణ్యమైన విత్తనాల వినియోగం, సమతుల్య ఎరువుల వినియోగం, తగినంత నీటి నిర్వహణ, మల్చింగ్ విధానం వంటి ఆధునిక పద్ధతులను అనుసరించడం ద్వారా దిగుబడి, నాణ్యత పెరుగుతుందని చెప్పారు. ఇంటి వద్ద చిన్న స్థాయిలో కూరగాయల తోటలు (కిచన్గార్డెన్) ఏర్పాటు చేసుకోవడం ద్వారా కుటుంబానికి పోషకాహారం అందడమే కాకుండా అదనపు ఆదాయం కూడా పొందవచ్చని సూచించారు. గంగారం గ్రామంలో దాదాపు ప్రతి కుటుంబం కూరగాయల సాగుపై ఆధారపడి జీవనోపాధి పొందుతుందని చెప్పారు. కూరగాయల పంటలలో కనిపించే ముఖ్యమైన చీడపీడలు, వ్యాధులను సమయానికి గుర్తించి సమగ్ర కీటక నియంత్రణ (ఐపీఎం) పద్ధతులను అనుసరించడం ద్వారా ఖర్చు తగ్గించి మంచి దిగుబడులు సాధించవచ్చని రైతులకు వివరించారు. అనంతరం పందిరి నిర్మాణం చేపట్టిన రైతులకు అందించే ప్రోత్సాహకాలు, ఉద్యాన శాఖ ద్వారా అందిస్తున్న ఉచిత కూరగాయల మినీ కిట్లను సర్పంచ్తో కలిసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వ్యవసాయ విస్తరణ అధికారి, ఉద్యా న విస్తరణాధికారి రాందాస్, రైతులు పాల్గొన్నారు. మంగపేట: మండలంలోని శ్రీహేమాచల లక్ష్మీనర్సింహాస్వామి ఆలయ ప్రాంగణంలో ఆల య కార్యనిర్వాహణ అధికారి రేవెల్లి మహేష్ ఆధ్వర్యంలో శుక్రవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ మందరగిరి వేంకటేశ్వరస్వామి దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి శ్రీనివాస్ పర్యవేక్షణలో స్వామివారి ప్రధాన ఆలయం, ఇతర ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన 9 హుండీల్లో స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకలను కల్యాణ మండపంలో లెక్కించారు. డిసెంబర్ 3 నుంచి ఈనెల 19వ తేదీ వరకు భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.12,59,594ల ఆదాయం వచ్చినట్లు ఈఓ మహేష్ తెలిపారు. హుండీ లెక్కింపు సందర్భంగా ఎస్సై టీవీఆర్ సూరీ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఆలయ పూజారులు శ్రీవారి సేవాసమితి బృందం, భక్తులు పాల్గొన్నారు. -
ఓరుగల్లుకు షాక్!
శనివారం శ్రీ 21 శ్రీ మార్చి శ్రీ 2026రాష్ట్ర బడ్జెట్2026–2027బడ్జెట్లో అంచనాల మేరకు దక్కని ప్రాధాన్యం ఓరుగల్లుకు కీలకంగా 10 ప్రాజెక్టులు... జరగని ప్రత్యేక కేటాయింపులు.. కొత్తగా ప్రాజెక్టులను ప్రకటించలేదు. అయితే బడ్జెట్ (ప్రగతి పద్దు)లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన వివిధ అభివృద్ధి పనులు, విద్యాసంస్థలకు నిధులు కేటాయించారు. ప్రధానంగా వరంగల్ నగరాభివృద్ధి, ఉన్నతవిద్య, పర్యాటక రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు కనిపించింది. అయితే, కీలకమైన 10 ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ప్రకటించినా.. ప్రత్యేకంగా కేటాయించే నిధులను ప్రస్తావించలేదు. రైల్వే కోచ్ఫ్యాక్టరీ, టెక్స్టైల్ పార్కు, మామునూరు ఎయిర్పోర్ట్, ఐటీ టవర్, రింగ్రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, జాతీయస్థాయి యూనివర్సిటీ, ఫుడ్ ప్రాసెసింగ్ పార్కు, టూరిజం సర్క్యూట్కు ప్రత్యేక కేటాయింపులు లేవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా వరంగల్ స్మార్ట్సిటీకి గత బడ్జెట్లో రూ.156.52 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఈసారి రూపాయి కూడా ఇవ్వలేదు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) సహాయం కోసం రూ.40 కోట్లు కేటాయించింది. పథకం కింద వరంగల్ స్మార్ట్సిటీ అభివృద్ధి పనుల కోసం రూ.44,137.02 లక్షలు కేటాయించారు.● కొత్త ప్రాజెక్టులు జీరో.. పాత పనుల కొనసాగింపు ● కేటాయింపుల్లో ఉమ్మడి జిల్లాకు ‘ప్రత్యేకం’ లేదు ● యూజీడీ, మామునూరు సహా కీలక ప్రాజెక్టులకు పద్దులు లేవు ● అభివృద్ధి, సంక్షేమ పథకాలు యథాతథం.. ఆరు గ్యారంటీలకు ఆదరణ ● సాగునీరు, వ్యవసాయరంగాలు, మహిళా సంక్షేమానికి పెద్దపీటసాక్షిప్రతినిధి, వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు మరోసారి నిరాశే ఎదురైంది. శాసనసభలో శుక్రవారం డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన ప్రగతిపద్దుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శాఖల వారీగా నిధులు కేటాయించినప్పటికీ వరంగల్ పేరుతో ప్రత్యేకంగా ప్రకటించిన పథకాలు లేకపోవడం గమనార్హం. ఇప్పటికే కొనసాగుతున్న ప్రాజెక్టులకు మాత్రమే పరిమితమైన ఈ బడ్జెట్పై ప్రజల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. పెద్దగా ప్రచారం చేసిన టెక్స్టైల్ పార్కు, మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలకు కేవలం కొనసాగింపు నిధులే కేటాయించగా.. కొత్త పెట్టుబడులు, పరిశ్రమలు, ప్రత్యేక ప్యాకేజీ వంటి అంశాలు పూర్తిగా కనిపించలేదు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ బడ్జెట్లో కొత్తగా మెగా ప్రాజెక్టు ఒక్కటి కూడా ప్రకటించకపోవడం.. ప్రత్యక్ష కేటాయింపుల్లో ప్రాధాన్యం దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రం యూనిట్గా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళా, రైతు, కార్మికవర్గాలకు ప్రయోజనం కలగనుంది. కాగా, ఈ బడ్జెట్లో వివిధ రంగాలకు జరిగిన కేటాయింపుల ద్వారా ఉమ్మడి వరంగల్కు రూ.6 వేల కోట్ల నుంచి రూ.7 వేల కోట్ల వరకు పరోక్షంగా లాభం చేకూరనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ● వ్యవసాయ రంగానికి రూ.23,179 కోట్లు కేటాయించడం ద్వారా ఉమ్మడి జిల్లాలో 15,01,109 ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్న 6,33,229 మంది రైతులకు అర్హతను బట్టి రైతుభరోసా, రైతుబీమా సౌకర్యం కలగనుంది. రైతుభరోసా ద్వారా సుమారు 6.50 లక్షల మంది రైతులకు రూ.900 కోట్ల నుంచి రూ.1,100 కోట్ల వరకు సంవత్సరానికి లబ్ధి చేకూరనుంది. ● ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రోత్సహించడానికి ఈబడ్జెట్లో రూ.26,674 కోట్లు కేటాయించింది. మొత్తం 3,331 ప్రభుత్వ పాఠశాలల్లో 4,67,011 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు, ప్రహరీతోపాటు మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈసారి నిధులు వెచ్చించడం ద్వారా విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ● ఉచిత ప్రయాణ పథకం కొనసాగింపు వల్ల ఆర్టీసీ బస్సుల్లో వరంగల్ రీజియన్లో రోజుకు సగటున సుమారు 55 వేల మంది మహిళలు రాకపోకలు సాగించనున్నారు. ● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన సుమారు 8 వేల మంది లబ్ధిదారులకు బిల్లులు అందనున్నాయి. ● గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల లోపు కరెంట్ వాడుతున్న 6,12,901 మందికి ఉచిత విద్యుత్ సౌకర్యం నిరంతరం కొనసాగనుంది. గోదావరి ఎత్తిపోతల పథకం (జీఎల్ఐఎస్) ప్రాజెక్టు ఎస్టాబ్లిష్మెంట్కు రూ.5 కోట్లు జేసీఆర్ దేవాదుల ఎత్తిపోతల పథకం (సీఈ) పేరిట రూ.445 కోట్లు రామప్ప, పాకాల, లక్నవరం, మల్లూరుకు రూ.కోటి చొప్పన రూ.4 కోట్లు మామునూరు వెటర్నరీ సైన్స్ కళాశాలకు రూ.25 కోట్లు వరంగల్లోని రీజినల్ సైన్స్ సెంటర్కు రూ.30 లక్షలు వరంగల్ పోలీస్ కమిషనరేట్లో కొత్త భవనాల నిర్మాణానికి రూ.10 కోట్లు మేడారం జాతర పనుల కోసం రూ.10 కోట్లు ములుగులోని ఫారెస్ట్ కాలేజీ, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్సీఆర్ఐ) రూ. 93.22 కోట్లు కాకతీయ విశ్వవిద్యాలయానికి రూ.40 కోట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్యవిజ్ఞాన విశ్వవిద్యాలయానికి రూ. 60 లక్షలు వరంగల్, కరీంనగర్ క్రీడా పాఠశాలల సాయం కోసం రూ.42.80 కోట్లు జనగామలో ప్రభుత్వ కోకోన్ మార్కెట్ నిర్మాణానికి రూ.2.53 కోట్లు -
కాళేశ్వరాలయంలో ‘పంచాంగ పఠనం’
కాళేశ్వరం: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో వేదపండితులు భక్తులకు ‘పంచాంగ పఠనం’ చేశారు. గురువారం సాయంత్రం ఆలయ ఉపప్రధాన అర్చకుడు పనకంటి పణీంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు బైకుంఠపాండాలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాశులవారీగా ఆదాయ, వ్యయాలు, రాజపూజ్యం, అవమానాలను వివరించారు. అనంతరం ఉగాది పచ్చడి, ప్రసాదాన్ని భక్తులకు వితరణ చేశారు. స్వామివారి గర్భగుడిలో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెన్నపురెడ్డి మోహన్రెడ్డి, ఉప సర్పంచ్ చెమ్మాల సుధీర్, మాజీ సర్పంచ్లు వసంత, రాంరెడ్డి, మాజీ డైరెక్టర్లు సమ్మయ్య, శ్యాందేవుడా, కె.శ్రీనివాస్రెడ్డి, ఎస్.శ్రీనివాస్రెడ్డి, గందెసిరి సంతోష్, రామన్న, రమేష్ ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
రేపు ఉచిత ఆయుర్వేద వైద్యశిబిరం
భూపాలపల్లి అర్బన్: సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన ఉచిత ఆయుర్వేద వైద్యశిబిరం నిర్వహించనున్నట్లు ఏరియా అధికార ప్రతినిధి శ్యాంసుందర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణంలోని కృష్ణాకాలనీ సీఈఆర్ క్లబ్లో ఏర్పాటు చేసే వైద్య శిబిరానికి ఆయుర్వేద స్పెషలిస్టు డాక్టర్ విశ్వనాధ మహర్షి హాజరుకానున్నట్లు తెలిపారు. చర్మవ్యాధులు, మోకాళ్ల నొప్పులు, గుండెదడ, బీపీ, ఘగర్, థైరాయిడ్, మలబద్ధకం, అజీర్ణం, పక్షవాతం, ఆస్తమా, సీ్త్రలకు సంబంధించిన వ్యాధుల నివారణ కోసం వైద్య శిబిరం ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ఉంటుందని తెలిపారు. మల్హర్/మల్హర్(కాటారం): మండలంలోని కాటారం గ్రామానికి చెందిన విద్యారంగం, సామాజిక సేవలో నాలుగు దశాబ్దాలుగా విశిష్టసేవలు అందిస్తున్న ప్రముఖ విద్యావేత్త జనగామ కరుణాకర్రావుకు రాష్ట్రస్థాయి ఉగాది ఉత్తమ సేవారత్న పురస్కారం లభించింది. గురువారం జిల్లాకేంద్రంలోని ఇల్లందు క్లబ్లో నిర్వహించిన ఉగాది పురస్కారాల కార్యక్రమంలో కరుణాకర్రావు రాష్ట్ర స్థాయి సేవారత్న పురష్కరాన్ని అందుకున్నారు. మల్హర్ మండలం తాడిచర్ల గ్రామానికి చెందిన సాయివాణి విద్యానికేతన్ పాఠశాల కరస్పాండెంట్ వీరమేని సంపత్రావుకు రాష్ట్ర స్థాయి ఉగాది పురస్కార అవార్డు అందుకున్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తదితరులు కరుణాకర్రావు, సంపత్రావులను అభినందించి, సత్కరించారు. పోచమ్మ బోనాలు టేకుమట్ల: మండలకేంద్రంలోని పోచమ్మతల్లి ఆలయానికి గురువారం భక్తులు పోటెత్తారు. భక్తులు బోనాలతో మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాట్ల శ్రీనివాస్, భక్తులు పాల్గొన్నారు. మహాముత్తారంలో వడగళ్ల వాన మల్హర్(మహాముత్తారం): మండలంలోని పోలారం, కనుక్కునూరు, నిమ్మగూడెం, యత్నారం, సింగంపల్లి తదితర గ్రామాల్లో గురువారం వడగళ్ల వాన కురిసింది. తోటల్లోని మిర్చి నేలరాలింది. కల్లాల్లో ఆరబోసిన మిర్చి తడిసి పోయింది. తడిసిన పత్తి నల్లబారుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రామప్పలో నేషనల్ డిఫెన్స్ కాలేజీ అధికారులు వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని గురువారం న్యూఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజీలో నేషనల్ సెక్యూరిటీ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్పై శిక్షణ ఇచ్చే అధికారులు సచిన్ బాద్షా, తరుణ్గుప్తా, ఇవాన్ అలెగ్జాండర్, అంజన వశిష్టలు సందర్శించారు. రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించగా పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప శిల్పకళసంపద బాగుందని వారు కొనియాడారు. వారి వెంట కోఆర్డినేటర్ సందీప్, తహసీల్దార్ గిరిబాబు, ఎస్సై చల్ల రాజు, ఏఎస్సై సాంబారావు, ఆర్ఐ రమేశ్, టూరిస్ట్ పోలీసులు శ్రీనివాస్, భద్రు పాల్గొన్నారు. -
ఉదయ భాస్కర్కు అర్చకరత్న అవార్డు
గోవిందరావుపేట: బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహించిన 18వ దక్షిణ భారత కాన్ఫరెన్స్లో మండల కేంద్రానికి చెందిన ప్రముఖ అర్చకుడు తిరుక్కోవల్లూరు ఉదయ భాస్కర్కి అర్చక రత్న అవార్డు ప్రదానం చేశారు. ఆధ్యాత్మిక సేవా రంగంలో ఆయన చేస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పలు రాష్ట్రాల నుంచి విచ్చేసిన పండితులు, సాహితీవేత్తలు, ఆధ్యాత్మిక ప్రముఖులు పాల్గొని, అర్చక వృత్తి పరిరక్షణలో ఉదయ్ భాస్కర్ చేసిన కృషిని ప్రశంసించారు. అనంతరం ఉదయ భాస్కర్ మాట్లాడుతూ అర్చక రత్న అవార్డు తనపై మరింత బాధ్యతను పెంచిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని అర్చకుల స్థాయి పెంపు, వారికి అవసరమైన శిక్షణ, మద్దతు అందించాల్సి ఉందని వివరించారు. -
రంజాన్ మాసం క్రమశిక్షణకు ప్రతీక
భూపాలపల్లి: రంజాన్ మాసం క్రమశిక్షణ, త్యాగం, దాతృత్వానికి ప్రతీక అని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం సాయంత్రం పోలీసు అధికారులు, సిబ్బందికి ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరయ్యారు. ఇఫ్తార్ విందు అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు వ్యవస్థలో మతసామరస్యాన్ని పెంపొందించే లక్ష్యంతో పండుగలను సమష్టిగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే సత్యనారాయణరావు మాట్లాడుతూ.. రంజాన్ మాసం శాంతి, సహనం, పరస్పర గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. సమాజంలో ఐక్యతను మరింత బలపరిచే పండుగగా భావించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్చైర్మన్ అంబాల శ్రీనివాస్, అదనపు ఎస్పీ నరేష్కుమార్, డీఎస్పీలు సంపత్రావు, సూర్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్, సీఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
పిచ్చుకలు.. ప్రకృతి నేస్తాలు!
గుంతలమయంగా రహదారి రేగొండ మండలంలో రహదారులు పూర్తిగా గుంతలమయం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఖిలా వరంగల్: జీవ పరిణామ క్రమంలో ఉద్భవించిన అద్భుత జంతుజాలమే పక్షులు.. ఈ సంపద ప్రకృతి వరప్రసాదం. అందులో పిచ్చుకలు.. ప్రకృతికి అందం, మానవాళికి జీవవైవిధ్యంతోపాటు ఆనందాన్ని అందిస్తాయి. ఒకప్పుడు ఉదయం లేవగానే నగర, పట్టణ,గ్రామాల్లో ఎక్కడ చూసినా పిచ్చుకలు కనిపించేవి. ఇళ్లల్లోకి వచ్చి కిచకిచమంటూ పలకరించేవి. చప్పుడు చేయగానే తుర్రుమంటూ ఎగిరిపోతుండేవి. కాలక్రమంలో ఈబుజ్జి పక్షులు మన జీవితాల నుంచి క్రమంగా కనుమరుగవుతున్నాయి. అంతరించిపోతున్న పిచ్చుకలను సంరక్షించడంతో పాటు వాటి ప్రాఽధాన్యం మానవాళికి తెలియజేయడం కోసం ఏటా మార్చి 20న ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పిచ్చుకలతో మానవాళి మనుగడ.. చూసేందుకు చిన్నవిగా ఉండే పిచ్చుకలు మానవాళి మనుగడకు ఎంతో మేలు చేస్తాయి. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పంటలను ఆశించే వివిధ కీటకాలను తినటం ద్వారా తెగుళ్లు రాకుండా పరోక్షంగా మేలు చేస్తాయి. వివిధ పంటల్లో పరపరాగ సంపర్కం జరిగేలా చేసి దిగుబడులు పెంచుతాయి. నేలను సారవంతం చేస్తూ భూమిలో మొక్కలు మొలకెత్తేందుకు దోహదం చేస్తాయి. మనమేమి చేయాలంటే.. అవగాహన ఉన్న కొందరు గ్రామీణ ప్రాంత ప్రజలు, రైతులు తమ పంట పొలాల్లో పక్షుల కోసం ప్రత్యేకంగా టీ ఆకారంలో కర్రలను ఉంచడం ద్వారా వాటిపై పక్షులు వాలుతుంటాయి. ● పొలం గట్లపై మోదుగు, చీమ చింత, మల్బరీ, నేరేడు వంటి పండ్ల చెట్లను పెంచడం ద్వారా పక్షులు పంట పొలాలకు దగ్గరలో స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ● నగరాల్లో ప్రత్యేక గూళ్లు లభ్యమవుతున్నాయి. ఇంటి ఫోర్టికో వద్ద, పరిసరాల్లో ఆ గూళ్లను ఏర్పాటుచేసి అక్కడక్కడ డబ్బాల్లో ధాన్యం గింజలు, తాగునీరు అందుబాటులో ఉంచాలి. వాతావరణం జిల్లాలో ఉదయం ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన చిరు జల్లులు కురిసే అవకాశం ఉంది.తగ్గిపోవడానికి కారణాలెన్నో.. పిచ్చుకల సంతతి తగ్గిపోవడానికి అనేక కారణాలున్నాయి. విద్యుత్, పెట్రోల్ వంటివి వినియోగం, సెల్టవర్ల కారణంగా పెరుగుతున్న రేడియేషన్, పట్టణీకరణ పేరుతో ఎక్కడి కక్కడ సిమెంటు ఇళ్ల నిర్మాణాలు, కనీసం ఇవి గూడు పెట్టుకునే ఆవాసాలు లేకపోవడం, వ్యవసాయంలో పురుగు మందులు, క్రిమి సంహారక మందుల వినియోగం బాగా పెరగడం వంటివి ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. ఆహ్లాదాన్ని పంచే అతి చిన్న పక్షులు రక్షిస్తేనే పర్యావరణ సమతుల్యత నేడు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం -
మొబైల్, మద్యం మాయలో..
● ఆన్లైన్ గేమ్స్తో కష్టాలు ● పలు కేసుల్లో మైనర్లు అరెస్ట్ ● అప్పులతో పెరుగుతున్న ఆత్మహత్యలుమొబైల్ నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఇంట్లో ప్రతీఒక్కరికి మొబైల్ సాధారణమైంది. కొందరు మొబైల్ను మంచి కోసం ఉపయోగిస్తుంటే మరికొందరు మొబైల్ ఫోన్లో ఆన్లైన్ గేమ్స్కు, చెడు వ్యసనాలకు అలవాటు పడి అప్పులపాలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఎక్కువగా వాహనాలను నడిపేవారు మొబైల్లో మాట్లాడుతూ నడపడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. యువత లక్ష్యాన్ని ఎంచుకుని అందుకు అనుగుణంగా ముందుకు వెళ్తేనే సమాజంలో తమకంటూ గుర్తింపు వచ్చి తమ జీవితాలను అందంగా మార్చుకునే వీలుందని అభిప్రాయపడుతున్నారు. -
ఉగాది సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక
భూపాలపల్లి రూరల్: ఉగాది పండుగ తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గురువారం మంజూర్నగర్లో ఇల్లందు క్లబ్ హౌజ్లో శ్రీ వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఉత్తమ ఉగాది పురస్కారాలు–2026 సంజీవనం పుస్తకావిష్కరణ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇలాంటి ఉత్సవాలు సమాజంలో ఐక్యతను, సంప్రదాయ విలువలను పెంపొందిస్తాయన్నారు. ‘సంజీవనం’ వంటి పుస్తకాలు మన సంస్కృతి, జీవన విధానాలను భవిష్యత్ తరాలకు అందించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్యగౌడ్, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు, కౌన్సిలర్లు, ఉగాది ఉత్సవ నిర్వహణ కమిటీ సభ్యులు, కళాకారులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
హక్కులు, బాధ్యతలపై అవగాహన ఉండాలి
అదనపు కలెక్టర్ అశోక్కుమార్ భూపాలపల్లి: వినియోగదారులు తమ హక్కులు, బాధ్యతలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్కుమార్ సూచించారు. ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘సురక్షితమైన ఉత్పత్తులు–నమ్మకమైన వినియోగదారులు’ అనే నినాదంతో జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. నాణ్యత లేని వస్తువులు కొనుగోలు చేయకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. కొనుగోలు సమయంలో బిల్లులు తప్పనిసరిగా తీసుకుని భద్రపరచాలన్నారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో డీసీఎస్ఓ కిరణ్కుమార్, డీఎం రాములు, డీఎంహెచ్ఓ మధుసూదన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. సకాలంలో సరఫరా చేయాలి ఎల్పీజీ సిలిండర్ల సరఫరాలో సీరియల్ క్రమాన్ని పాటించాలని, వినియోగదారులకు సకాలంలో సిలిండర్ సరఫరా చేయాలని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ సూచించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రపంచ వినియోగదారుల సమావేశంలో జిల్లాలోని అన్ని ఎల్పీజీ డీలర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఏజెన్సీల వారీగా స్టాక్ లభ్యత, రోజువారి సరఫరా పరిస్థితి, ఆయిల్ కంపెనీలకు పంపిన ఇండెంట్లు, పెండింగ్ బుకింగ్స్ తదితర అంశాలను సమీక్షించారు. ఈ సమావేశంలో డీసీఎస్ఓ కిరణ్కుమార్, ఎల్పీజీ డీలర్లు పాల్గొన్నారు. -
జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు
● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి: జిల్లా ప్రజలకు కలెక్టర్ రాహుల్ శర్మ తెలుగు నూతన సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పండుగ ప్రతీ కుటుంబానికి ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం తీసుకురావాలని ఆకాంక్షించారు. ఉగాది పండుగ కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలకు శ్రీకారం చుట్టే శుభదినమన్నారు. జిల్లా అభివృద్ధికి ప్రజలందరు భాగస్వాములు కావాలని కోరారు. ఈ పండుగ ప్రతిఒక్కరికి సు ఖసంతోషాలను తీసుకురావాలని కలెక్టర్ ఆకాంక్షించారు. కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి దేవస్థానం పరిధిలోని పురాతన విగ్రహాల పరిరక్షణకు పు రావస్తు శాఖ, దేవాదాయశాఖ సంయుక్తంగా శ్రీకారం చుట్టారు. బుధవారం ఈఓ మహేష్తో కలిసి పు రావస్తుశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మా ధవి, డిప్యూటీ సూపరింటెండెంట్ కోటయ్యలు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ముందుగా కాళేశ్వరంలోని పురాతనమైన నృసింహస్వామి, సోమేశ్వరాలయం, చంద్రశేఖరాలయాలు, కాళేశ్వరాలయం ఆవరణలోని పురాతన విగ్రహాలను, వివిధ ప్రాంతాల్లో నిరాధరణకు గురైన చారిత్రక విగ్రహాలను అధికారులు పరిశీలించారు. నిబంధనల మేరకు విగ్రహాలను రసాయన పదార్థాలతో శుభ్రం చేసి మెరుగులు దిద్దడం, భక్తులు, పర్యాటకుల సందర్శనార్థం దేవాలయ ఆవరణలోనే ప్రత్యేకంగా భద్రపరస్తామని అధికారులు తెలిపారు. రూ.120 కోట్ల వ్యయంతో మ్యూజియం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. -
ఉద్యాన పంటల సాగుతో అధిక లాభాలు
మొగుళ్లపల్లి: ఉద్యాన పంటల సాగుతో అధిక లా భాలు పొందవచ్చని జిల్లా ఉద్యాన శాఖ అధికారి సునీల్కుమార్ అన్నారు. బుధవారం మండలంలోని ఇస్సిపేట గ్రామంలో ఉద్యాన పంటల సాగుపై అవగాహన, శిక్షణ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉద్యాన పంటల ప్రాముఖ్యత, తక్కువ నీటితో అధిక ఆదాయం పొందే విధానాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి సురేందర్రెడ్డి, జైన్ ఇరిగేషన్ కంపెనీ ప్రతినిధి శ్యాంసుందర్, సర్పంచ్ యార ముకుందం, ఆయిల్ పామ్ కంపెనీ ప్రతినిధులు వాసు, ప్రీతం, అజయ్, రమేష్, జైన్, ఫినోలెక్స్ కంపెనీ ప్రతినిధులు శ్యామ్ కు మార్, రజనీకాంత్, రైతులు పాల్గొన్నారు.జిల్లా ఉద్యాన శాఖ అధికారి సునీల్కుమార్ -
ఉగాది భవిష్యత్కు పునాది
వేప పూత పులకరింతలు, మామిడి పిందెల పలకరింతలు, మోదుగచెట్ల మధురిమలు. తీరొక్క పూల పరిమళాలు.. నూతనత్వానికి ఆనవాళ్లు.. నూతన సంవత్సరాది వేడుకలు. – హన్మకొండ కల్చరల్తెలుగువారి మొదటి పండుగ ఉగాది. ఈ పండుగ తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు కేంద్రబిందువుగా నిలుస్తోంది. సౌభాగ్యానికి , ప్రేమ, ఆధ్యాత్మిక చింతనకు, పల్లెల్లోని జానపదుల జీవనశైలికి సంకేతంగా నిలుస్తోంది. తెలుగు వారి నూతన సంవత్సరం ప్రారంభమయ్యే రోజు కాబట్టి ఈ రోజున కొత్త నిర్ణయాలు తీసుకునేందుకు ఇష్టపడుతారు. పంచాంగం విని భవిష్యత్కు పునాది వేసుకుంటారు. కొత్త మజిలీలను వెతుక్కుంటారు. ‘శ్రీపరాభవ’ నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ నేడు (గురువారం) ఉగాది పర్వదినం జరుపుకునేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. పచ్చడి ప్రత్యేకత.. కాలాన్ని బట్టి వచ్చే పండుగల్లో ఆయా కాలాల్లో పండించిన వాటిని దేవుడికి నివేదించడం ప్రకృతిపై ప్రేమతో మనిషి ఏర్పర్చుకున్న నియమావళి. అదేవిధంగా చైత్రమాసం నాటికి ప్రజలు తాము కొత్తగా పొందే చింతపండు, బెల్లం, మామిడి పిందెలు, వేప పూతను కొత్తకుండలో వేసి పచ్చడిగా చేసి భగవత్ నివేదనలుగా సమర్పిస్తారు. తెలంగాణలో ఉగాది పచ్చడిని పానీయంలా చేయడం సంప్రదాయం. దీన్ని షడ్రుచుల సమ్మేళనంగా భావిస్తారు. కానీ నీళ్లలో కలిపి పానీయంగా తాగితే ఎండాకాలంలో మండుటెండల నుంచి రక్షణ పొందవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి. మంగళస్నానం.. కొత్త సంవత్సరంలో కొత్తదనాన్ని ఆహ్వానిస్తూ శరీరంలోని పాత మురికిని తొలగించుకోవడం కోసం పండుగనాడు విధిగా నువ్వుల నూనెతో శరీరమంతా రుద్దుకొని ఒకగంట ఆగిన తర్వాత తలస్నానం చేయాలని పెద్దలు సూచిస్తున్నారు. పండుగనాడు నువ్వుల నూనెతో చేసే స్నానాన్ని మంగళస్నానంగా పిలుస్తుంటారు. మంగళస్నానం ఆచరిస్తే శరీర, మనసులోని మలినం పోతుందని హిందువులు నమ్ముతుంటారు. వేయిస్తంభాల గుడిలో ప్రత్యేకం.. చారిత్రాత్మక రుద్రేశ్వరస్వామి ఆలయంలో 48 ఏళ్లుగా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గురువారం ఉదయం నుంచి రుద్రేశ్వరస్వామికి మహాన్యాసకపూర్వక పాశుపత ఏకాదశ రుద్రాభిషేకం, సామూహిక రుద్రాభిషేకాలు, కాళికాపూజ, శ్రీసీతారాముల విగ్రహప్రతిష్ఠాపన పూజలు, భక్తులకు ఆరోగ్య ఐశ్వర్య విద్యశాంతి ఒనగూరాలని సంకల్పిస్తూ సుదర్శన హోమం నిర్వహిస్తున్నట్లు.. భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేయడం జరుగుతుందని ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ చెబుతున్నారు. సాయంత్రం సంస్కృత పండితులు సముద్రాల శఠగోపాచార్యులుచే పంచాంగశ్రవణం, కూచిపూడి నృత్యాలు, కవి సమ్మేళనం జరుగుతాయని వేయిస్తంభాల దేవాలయం ఈఓ అనిల్కుమార్ తెలిపారు. రోడ్ల రద్దీ.. ఉగాది పండుగను పురస్కరించుకుని పండుగకు కావాల్సిన కొత్త బెల్లం, కొత్త చింతపండు, నోము దండలు, జంద్యాలు, కొత్త కుండలు, దీపాంతలు, వివిధ రకాల పూలు, మోదుగపూలు, మోదుగాకులు, ఇసుక, మర్రి ఊడలు, పసుపు కుంకుమ గంధం, మామిడాకులు తదితర వస్తు సామగ్రి కొనుగోలు చేయడానికి అమ్మడానికి వచ్చిన వారితో నగరంలోని పలు కూడళ్లలో రద్దీ ఏర్పడింది. శ్రీపరాభవ సంవత్సరంలో రాజు ‘గురువు’ శ్రీపరాభవ నామ సంవత్సరంలో గురువు రాజుగా, మంత్రిగా కుజగ్రహాలు ఉన్నాయి. ఫలితంగా గురువు రాజైతే పాలకులు కర్మాయుక్తులు, ధర్మయుక్తులు అవుతారు, ప్రభువులు సన్మార్గులు, నీతివేత్తలుగా జీవిస్తారు. ప్రజలు సుభిక్షం, ఆరోగ్యం, సుఖం కలుగుతాయి. మంత్రి కుజుడు కావున అగ్నిచేత దహనాలు, యుద్ధాలు తప్పవు. ఈ సంవత్సరం పాడి అభివృద్ధి, సుగంధ ద్రవాలు, బంగారం, ముత్యాలు, వస్తువుల ధరలు పెరుగుతాయి, రస జాతి వస్తువుల ధరలు తగ్గుతాయి. – గంగు ఉపేంద్రశర్మ రుషులు అందించిన అద్భుత విజ్ఞానమే పంచాంగం.. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే ఐదు అంగాలు కలది పంచాంగం. దీన్ని మహా విష్ణుస్వరూపంగా భావించి పూజించాలి. సాయంకాలం పంచాంగ శ్రవణం చేయాలి. నేటి ఆధునిక కాలపు నవీన విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందని కాలంలో భారతీయులు పంచాంగం ద్వారానే కాలగతులు తెలుసుకునేవారు. ఎక్కడో ఉన్న గ్రహాలను వాటి దూరాలను ఎలాంటి టెలిస్కోప్ లాంటి ఖగోళ విజ్ఞాన శోధన పరికరాలు లేకుండా భారతీయ మేధావులు సృష్టించిన ఒకానొక అద్భుతమే పంచాంగం. – డాక్టర్ శ్రీఆరుట్ల శ్రీనివాసాచార్యస్వామి, ఆస్ట్రాలజర్పంచాంగ శ్రవణానికి ముస్తాబైన ఆలయాలు జిల్లాలో పండుగ సందడి జోరుగా వేపపువ్వు, కుండలు కొనుగోళ్లుబంచ్కు రూ.50 పలుకుతున్న ధర సాక్షి, వరంగల్: ఉగాది పచ్చడిలో వాడే వేపపువ్వుకు ఈసారి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. జిల్లాలోని చాలా మండలాల్లో వేప చెట్లు డైబ్యాక్, ట్రీమస్టికో వైరస్ బారిన పడడంతో కొమ్మలు మోడువారిపోయాయి. ప్రస్తుతం వేప పువ్వు దొరికే పరిస్థితి లేదు. కానీ ఉగాది పచ్చడిలో తప్పనిసరిగా వేసుకునే వేప పువ్వుకు ఈసారి మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. గ్రేటర్ వరంగల్లో బుధవారం రూ.20 నుంచి రూ.50 వరకు (చిన్న కట్ట, ఆకులతో కూడుకున్నది) వేప పువ్వును వ్యాపారులు విక్రయించారు. -
ర్యాగింగ్ శిక్షార్హ నేరం
భూపాలపల్లి అర్బన్: తోటి విద్యార్థులను ర్యాగింగ్ చేయడం శిక్షార్హ నేరమని ఎస్పీ సంకీర్త్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో మంగళవారం యాంటీ ర్యాగింగ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ర్యాగింగ్కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు పరస్పర గౌరవంతో, స్నేహపూర్వక వాతావరణంలో ఉండాలన్నారు. ర్యాగింగ్తో మానసిక, శారీరక ఒత్తిడి కలుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ర్యాగింగ్ ఘటనలు గమనించిన వెంటనే ప్రొఫెసర్లు పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. అవసరమైతే హెల్ప్లైన్ 18001805522, డయల్ 100 వినియోగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, వైస్ ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, పోలీస్ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.ఎస్పీ సంకీర్త్ -
నిలిచిన నిధులు..
భూపాలపల్లి రూరల్ : లాభసాటి వ్యవసాయం, చీడపీడల నివారణ, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధించే దిశగా వ్యవసాయశాఖ అధికారులు రైతులకు సలహాలు, సూచనలు అందించేందుకు ప్రభుత్వం రైతువేదికలు నిర్మించింది. కొన్ని నెలలుగా నిధులు మంజూరు నిలిచిపోవడంతో వీటి నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆగస్టు 2022 వరకు నిర్వహణ నిధులు మంజూరు చేయగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నిలిచిపోయాయి. జిల్లాలో 45 రైతువేదికలు గత ప్రభుత్వం 2020లో ప్రతీ వ్యవసాయ క్లస్టర్కు ఓ రైతు వేదిక నిర్మించింది. ప్రతీ 5వేల మంది కర్షకులకు రెండు నుంచి నాలుగు గ్రామాలను కలిపి ఒక క్లస్టర్ ఏర్పాటు చేశారు. ఒక్కో దానికి వ్యవసాయశాఖ ద్వారా రూ.12 లక్షలు, ఉపాధిహామీ పథకం కింద రూ.10లక్షలు వెచ్చించారు. జిల్లాలో 45 రైతువేదికలు నిర్మించగా నిర్వహణ కోసం నెలకు రూ.3వేల చొప్పున మంజూరు చేస్తామని అప్పటి ప్రభుత్వం చెప్పింది. ఆ నిధులు చాలవని వ్యవసాయశాఖ నివేదించడంతో రూ.9వేల చొప్పున విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత 2022 నవంబర్లో ఐదు నెలలకు సంబంధించి ఒక్కో వేదికకు రూ.45 వేల చొప్పున విడుదల చేసింది. ఇక అప్పటి నుంచి చెల్లింపులు నిలిచిపోయాయి. సుమారుగా 40 నెలలుగా నిధులు మంజూరు కాకపోవడంతో ఒక్కో రైతు వేదికకు ఇప్పటివరకు రూ.3.60లక్షల నిధులు రావాల్సి ఉంది. అంటే జిల్లాలోని 45 రైతువేదికలకు నిర్వహణ నిధుల కింద రూ.కోటి 62లక్షల వరకు ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. అయినప్పటికీ రైతువేదికల నిర్వహణ తప్పనిసరి కావడంతో ఏఈఓలు సొంతంగా వెచ్చిస్తూ అప్పుల పాలవుతున్నారు. క్షేత్రస్థాయిలో సేవలందించేందుకు.. జిల్లాలోని 12 మండలాల్లో 45 క్లస్టర్లలో రైతువేదికలు నిర్మించి ఏఈఓలకు విధులు అప్పగించారు. వీటి నిర్వహణకు అప్పటి ప్రభుత్వం ప్రతినెలా ఒక్కో రైతువేదికకు రూ.9వేలు మంజూరు చేసి నిర్వహణ కొనసాగించింది. ఈ నిధులతో రైతువేదికల్లో తాగునీటి కోసం రూ.500, పారిశుద్ధ్య నిర్వహణకు రూ.3వేలు, స్టేషనరీ కోసం రూ.వెయ్యి, కరెంట్ బిల్లు కోసం రూ.వెయ్యి, మరమ్మతుల కోసం రూ.వెయ్యి, నెలలో ఎనిమిదిసార్లు రైతులతో సమావేశాలు నిర్వహించనుండగా టీ, స్నాక్స్ కోసం రూ.2,500 ఖర్చు చేయాల్సి ఉంది. కొన్ని నెలలుగా రైతువేదికలకు నిర్వహణ నిధులు ఆగిపోయాయి. కలెక్టర్ ఆదేశానుసారం నిర్వహణ లోపం లేకుండా చూస్తున్నాం, రైతులకు సేవలు అందించే విషయంలో సమస్యలు తలెత్తకుండా ఏఈఓలు చూస్తున్నారు. నిధులు మంజూరు కాగానే రైతు వేదికల పెండింగ్ బిల్లులు చెల్లింపులు చేస్తాం. – బాబురావు, జిల్లా వ్యవసాయాధికారిమండలాలు 12 రైతువేదికలు 45 ఒక్కోదానికి బకాయి 3.60లక్షలు మొత్తం బకాయిలు 1.62 కోట్లుజిల్లాలోని రైతువేదికల్లో కనీస వసతులు కానరావడం లేదు. ఏఈఓలు పంటలకు సంబంధించిన వివరాలు ఆన్లైన్లో నమోదు చేసేందుకు కంప్యూటర్లు ఉన్న విద్యుత్ బిల్లులు, మరమ్మతులకు నిధులు రావడం లేదు. ఉన్నతాధికారులకు పంపించాల్సిన నివేదికలు ప్రింట్ తీయడానికి ప్రింటర్లు కూడా లేవు. స్టేషనరీ, తాగునీటి ఖర్చులన్నీ ఏఈఓలే భరించాల్సి రావడం, సహాయకులు కూడా లేక అన్ని పనులు వారే చేయాల్సి వస్తుండడంతో ఇబ్బంది పడుతున్నారు. శుభ్రం చేయించే బాధ్యత జీపీలు నిర్వహించాలని సూచించినా ఎక్కడా పట్టించుకోవడం లేదు. చాలాచోట్ల నీటి సౌకర్యం లేక మరుగుదొడ్లు నిరుపయోగమయ్యాయి. దీంతో మహిళా ఉద్యోగులు, రైతులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికై నా రైతువేదికల పెండింగ్ నిర్వహణ నిధులు వెంటనే మంజూరు చేయాలని, ఇప్పటి నుంచి నెలనెలా నిధులు విడుదల చేయాలని ఏఈఓలు, రైతులు కోరుతున్నారు. అధికారులకు భారమైన నిర్వహణ కనీస వసతుల కల్పనపై పట్టింపేది? ఇబ్బందుల్లో రైతులు, ఏఈఓలు -
శాసీ్త్రయ పద్ధతులతో అధిక దిగుబడులు
రేగొండ: రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు శాస్త్రీయ పద్ధతులను అనుసరించాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి సునీల్ కుమార్ అన్నారు. మంగళవారం కొత్తపల్లిగోరి మండలంలోని గాంధీనగర్ గ్రామంలో రైతులకు ఉద్యాన పంటలపై అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యాన పంటల సాగు ద్వారా మార్కెట్లో మంచి రేటు లభించి రైతుల ఆదాయం పెరుగుతుందని అన్నారు. డ్రిప్ సాగు విధానాన్ని అనుసరించడం ద్వారా పంటల ఉత్పత్తి పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన విస్తరణ అధికారి సురేష్ పాల్గొన్నారు. -
గ్యాస్ సరఫరాలో పారదర్శకతకు ప్రాధాన్యం
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా గ్యాస్ సరఫరా పారదర్శకంగా, నిరంతరంగా కొనసాగాలని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ తెలిపారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని హెచ్పీ గ్యాస్, సింగరేణి కాలరీస్కు చెందిన భారత్ గ్యాస్ ఏజెన్సీలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వినియోగదారులకు అందిస్తున్న సేవలు, గ్యాస్ సరఫరా విధానం, నిల్వల పరిస్థితి, భద్రతా ప్రమాణాలను సమగ్రంగా పరిశీలించారు. గ్యాస్ సిలిండర్ల నిల్వ, పంపిణీ విధానం, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. వినియోగదారులకు సమయానికి గ్యాస్ సరఫరా అందించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. వినియోగదారుల ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించడంతో పాటు భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. అగ్ని ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలను పాటించాలని సూచిస్తూ, గ్యాస్ సరఫరాలో జాప్యం లేకుండా సమయపాలన పాటించాలని స్పష్టం చేశారు. ఎల్పీజీ డీలర్లు వినియోగదారుల బుకింగ్ సీక్వెన్స్ను తప్పనిసరిగా పాటిస్తూ గ్యాస్ రీఫిల్స్ను సరఫరా చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ క్రమాన్ని అతిక్రమించకూడదని ఆదేశించారు. జిల్లాలో గ్యాస్ కొరత ఎక్కడా లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న అపోహలను నమ్మి కొందరు వినియోగదారులు అవసరానికి మించి బుకింగ్స్ చేస్తున్నారని తెలిపారు. ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించారు. గ్యాస్ నిల్వలు, బుకింగ్స్, ఆయిల్ కంపెనీల నుంచి రావాల్సిన సరఫరాపై పర్యవేక్షణ కోసం కలెక్టర్ రాహుల్శర్మ అధ్యక్షతన ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కమిటీ రోజువారీ పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తూ సరఫరా వ్యవస్థను సక్రమంగా కొనసాగించేలా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి కిరణ్కుమార్, ఇన్స్పెక్టర్ సురేందర్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. 6 గృహవినియోగ సిలిండర్ల స్వాఽధీనం జిల్లాలోని వివిధ బేకరీలు, చికెన్ సెంటర్లపై సివిల్ సప్లయి ఇన్స్పెక్టర్లు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి గృహ వినియోగ ఆరు సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు సివిల్ సప్లయి ఇన్స్పెక్టర్ సురేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సురేందర్రెడ్డి మాట్లాడుతూ.. గృహ వినియోగానికి కేటాయించిన సిలిండర్లను వాణిజ్య వంటలకు ఉపయోగించడం చట్ట విరుద్ధమని స్పష్టం చేశారు. ఇటువంటి అక్రమ వినియోగం వల్ల ప్రభుత్వానికి నష్టం కలగడమే కాకుండా, అర్హులైన గృహ వినియోగదారులకు ఇబ్బందులు కలుగుతాయని తెలిపారు.అదనపు కలెక్టర్ అశోక్కుమార్ -
కాళేశ్వరంలో అర్చకుడి నియామకం
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం అర్చకుడిగా కొడమంచిలి ఫణికుమార్శర్మను నియమించారు. మంగళవారం దేవాదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వుల మేరకు పలు అభియోగాల నేపథ్యంలో కశ్యప్శర్మ నియామకాన్ని నిలిపివేశారు. ఆయన స్థానంలో కొడమంచిలి ఫణికుమార్ శర్మను నియమించినట్లు ఆలయ ఈఓ మహేష్ తెలిపారు. పోలీస్స్టేషన్ తనిఖీ మల్హర్(మహాముత్తారం): మహాముత్తారం పోలీస్ స్టేషన్ను మంగళవారం కాటారం డీఎస్పీ సూర్యనారాయణ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ రికార్డులను, సిబ్బంది పనితీరును పరిశీలించి స్టేషన్ పరిసర ప్రాంతాలను క్లీన్ అండ్ గ్రీన్గా ఉండేలా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని, అప్రమత్తంగా విధులు నిర్వహించాలని డీఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహాముత్తారం ఎస్సై మహేందర్కుమార్, ఎస్సై– 2 మహేష్, సిబ్బంది పాల్గొన్నారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలి పలిమెల: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచి మొదటి విడత గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని జిల్లా హౌసింగ్ పీడీ లోకిలాల్ లబ్ధిదారులకు సూచించారు. మంగళవారం మండలంలోని పలిమెల గ్రామ పంచాయతీ పరిధిలో నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ హౌస్, పైలట్ ప్రాజెక్టు విలేజ్ పంకెన గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్ల పనుల పురోగతిని అధికారులతో కలిసి అయన పరిశీలించారు. ఈ సందర్భంగా లోకిలాల్ మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో జాప్యం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ పాగె వైకుంఠం, హౌసింగ్ డీఈ శ్రీకాంత్, ఏఈ సందీ ప్, పంచాయతీ కార్యదర్శి శ్రీధర్ పాల్గొన్నారు. భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి పురపాలక సంఘం 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ట్రేడ్ లైసెన్స్ పన్నులు ఆన్లైన్లో చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ ఉదయ్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వ్యాపారస్తులు ఈ నెల 31వ తేదీలోపు పెనాల్టీ లేకుండా పన్ను చెల్లించాలని సూచించారు. గడువు తరువాత ఏప్రిల్ 30 వరకు 25శాతం, మే 1 తరువాత 50 శాతం పెనాల్టీ విధించనున్నట్లు హెచ్చరించారు. పన్ను చెల్లింపును కార్యాలయంలో లేదా సీడీఎంఏ తెలంగాణ ఆన్లైన్ ద్వారా చేయవచ్చని తెలిపారు. -
నల్ల బ్యాడ్జీలతో నిరసన
భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో పాత విధానంలోనే మెడికల్ బోర్డు నిర్వహించాలని, రాజకీయ జోక్యాన్ని నిర్మూలించాలని ఏఐటీయూసీ బ్రాంచీ సెక్రటరీ మోటపలుకుల రమేశ్ డిమాండ్ చేశారు. సేవ్ సింగరేణి బస్ యాత్రలో భాగంగా మంగళవారం ఏరియాలోని అన్ని గనులు, విభాగాల్లో కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ.. ఈ నెల 30న కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా గనుల కార్మికులు, యూనియన్ నాయకులు శ్రీనివాస్, ఆసిఫ్పాషా, శంకర్ పాల్గొన్నారు. -
న్యూ కనెక్షన్ ఇక ఈజీ..
బుధవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2026గతంలో కొత్తలైన్లకు జౌట్ రైట్ కంట్రిబ్యూటర్ చార్జీలు వసూలు చేసేది. దీంతో కొత్తలైన్లు, కనెక్షన్లు ఏర్పాటు చేసుకోవడానికి చార్జీలు చెల్లించలేని వినియోగదారులు ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ రెగ్యూలేషన్ కమిషన్ సులభతరంగా పారదర్శకంగా ఒక కిలోమీటర్ వరకు ఉచితంగా సర్వీస్ లైన్లు అందే విధంగా ఆదేశాలు జారీచేసింది. ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలి.హన్మకొండ: నూతన విద్యుత్ సర్వీస్ల మంజూరును విద్యుత్ పంపిణీ సంస్థలు సులభతరం చేశాయి. ఈ మేరకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి రెగ్యులేషన్ నంబర్ 1 ఆఫ్ 2026 జారీ చేసింది. దీని ప్రకారం విద్యుత్ వినియోగదారులకు మరింత సులభతరంగా, పారదర్శకంగా సర్వీస్ పొందే అవకాశం కలిగింది. కొత్త ఎల్టీ కనెక్షన్లు, అదనపు లోడ్ కోసం సర్వీస్ లైన్చార్జీలను సరళంగా, ఏకరీతిగా నిర్ణయించారు. ఒక కిలోమీటర్ దూరం వరకు ఎలాంటి చార్జీలూ వర్తించవు. కిలోమీటర్ దూరం తర్వాత పొందే విద్యుత్ సర్వీస్కు మాత్రమే సర్వీస్ లైన్, ఇతర చార్జీలు చెల్లించాలి. లోడ్ ఆధారంగా మాత్రమే చార్జీలు విధిస్తారు. క్షేత్రస్థాయిలో స్థల పరిశీలన అవసరం లేకుండా త్వరితగతిన కొత్త సర్వీసులు మంజూరు చేస్తారు. ఈ విధానం టీజీఎన్పీడీసీఎల్ పరిధిలో అమలు చేస్తున్నారు. ఈ నూతన విధానం ద్వారా వినియోగదారులు విద్యుత్ కనెక్షన్ను వేగంగా పొందుతారు. చార్జీల చెల్లింపులో స్పష్టత ఉంటుంది. 20 కిలోవాట్ వరకు డెవలప్మెంట్ చార్జీలు, సర్వీస్ లైన్ చార్జీలు వర్తింపు. 20 కిలోవాట్ పై వాటికి కేవలం సర్వీస్ లైన్చార్జీలు మాత్రమే వర్తిస్తాయి. డెవలప్మెంట్ చార్జీలు ఉండవు. – మల్చూర్ నాయక్, ఎస్ఈ, జయశంకర్ భూపాలపల్లి నూతన విద్యుత్ సర్వీస్ల మంజూరు నిబంధనలు మరింత సులభతరంకిలోమీటర్ దూరం వరకు ఎలాంటి చార్జీలు లేవు.. సర్వీస్ లైన్ చార్జీలను సరళం చేసిన విద్యుత్పంపిణీ సంస్థలు అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు, మల్టీ స్టోర్ భవనాలకు మొత్తం కాంట్రాక్టెడ్ లోడ్ ఆధారంగా చార్జీలు విధిస్తారు. ట్రాన్స్ఫార్మర్ ఖర్చు భారం వినియోగదారునిపై పడదు. ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు బాధ్యత విద్యుత్ సంస్థదే. నూతన ఏకరీతి విధానం రైతులకు ఎంతో ఉంటుంది. అధిక ఖర్చుల భారం పడదు. ఒక కిలో వాట్కు కేవలం రూ.1000 మాత్రమే చెల్లించాలి. కాంట్రాక్టెడ్ లోడ్ ఆధారంగా చార్జీలు -
నకిలీ హాజరుకు చెక్
భూపాలపల్లి రూరల్: గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా నిధుల దుర్వినియోగం ఆగడంలేదు. ఈ నేపథ్యంలో పథకంలో అనేక మార్పులు తీసుకువస్తున్నాయి. ఇప్పటికే ఆన్లైన్ అటెండెన్స్ ప్రవేశపెట్టారు. ఇక నకిలీ హాజరు నమోదుకు చెక్ పెట్టేందుకు పనులకు హాజరయ్యే కూలీలకు ముఖగుర్తింపు హాజరు(ఎఫ్ఆర్ఎస్) చేస్తున్నారు. మార్చి 2 నుంచి కొత్త యాప్లో కూలీల హాజరు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. కూలీల హాజరు తీసుకునే సమయంలో కూలీ ఫొటో, ఈకేవైసీ ప్రక్రియలో పొందుపరిచిన ఫొటో ఒకేలా ఉంటేనే హాజరు నమోదవుతుంది. నూతన యాప్తోనే.. గతేడాది ఆగస్టు నుంచి ఎన్ఎంఎంఎస్ యాప్లో జిల్లాలోని కూలీల ఈ కేవైసీ ప్రక్రియ ఉపాధి హామీ సిబ్బంది పూర్తి చేశారు. తర్వాత ఎన్ఎంఎంఎస్ నూతన యాప్ను క్షేత్ర సహాయకులు, పంచాయతీ కార్యదర్శులు, మేట్లకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ నూతన యాప్లో కూలీల హాజరును నమోదు చేస్తున్నారు. నమోదు ఇలా.. పని ప్రదేశానికి వెళ్లిన క్షేత్ర సహాయకులు ముందుగా యాప్లో పనులకు వచ్చిన వ్యక్తి పని ఐడీ నంబర్ ఎంచుకుని మాస్టర్లో కనిపించే పేర్లపై కూలీ ఫొటో తీసి నమోదు చేస్తున్నారు. అప్పుడు ఈ కేవైసీ సందర్భంగా తీసిన ఫొటో ప్రస్తుతం తీసిన ఫొటో ఒకరిదే అయితే కూలీ హాజరు నమోదు అవుతుంది. పని ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలో కూలీ పనులకు వచ్చిన మొత్తం సభ్యుల గ్రూపు ఫొటో మరోసారి తీసి యాప్లో నమోదు చేస్తారు. ఇలా రెండుసార్లు ఫొటో తీసి ముఖ గుర్తింపు హాజరు ప్రక్రియ ద్వారా నిత్యం కూలీ పనులకు వచ్చేవారి హాజరును నమోదు చేస్తున్నారు. ఎఫ్ఆర్ఎస్ హాజరు నమోదుతో కూలీలకు డబ్బులు చెల్లింపు సమయంలో పూర్తి పారదర్శకత ఉంటుందని అధికారులు అంటున్నారు. గతంలో అనేక సంఘటనలు.. జిల్లా వ్యాప్తంగా 1,06,033 జాబ్ కార్డులు ఉన్నాయి. 2,26,233 మంది కూలీలు ఉన్నారు. ప్రస్తుతం 6,97,226 యాక్టివ్ జాబ్ కార్డులు, 1,24,549 మంది కూలీలు యాక్టివ్గా పనిచేస్తున్నారు. గతంలో జిల్లాలోని పలు గ్రామాల్లో ఒకరికి బదులు మరొకరు కుటుంబ సభ్యులు పనులకు వెళ్లి హాజరు వేసుకున్నట్లు ఘటనలు సామాజిక తనిఖీల్లో పలుమార్లు వెలుగులోకి వచ్చాయి. దీంతో బాధ్యుల నుంచి నిధులు రికవరీ చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. వీటిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నూతన యాప్ అందుబాటులోకి తెచ్చింది. దీంతో నకిలీ హాజరు నమోదుకు ఆస్కారం ఉండదని అధికారులు అంటున్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన యాప్తో నకిలీ హాజరు ఉండదు. అవకతవకలు జరిగే అవకాశం ఉండదు. పనులకు వచ్చిన వారికే కూలీ వస్తుంది. హాజరు శాతంలో పారదర్శకత ఉంటుంది. – బాలకృష్ణ, డీఆర్డీఓగ్రామపంచాయతీలు 248 జాబ్ కార్డులు 1,06,033 కూలీల సంఖ్య 2,26,270 యాక్టివ్ జాబ్ కార్డులు 69,726 యాక్టివ్ కూలీల సంఖ్య 1,24,349 నూతన యాప్తోనే నమోదు ముఖం ఫొటోతోనే గుర్తింపు ఈ కేవైసీతో సరిపోతేనే కూలీ నమోదు -
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
భూపాలపల్లి: ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేయాలని, అన్యాయానికి గురైన వారికి అండగా నిలవాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ జిల్లాలోని పోలీసు అధికారులకు సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా దివస్ కార్యక్రమంలో 15 మంది బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు పైరవీలు లేకుండా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, నిర్భయంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలని సూచించారు. చట్టబద్ధమైన విధానంలోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని, శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలకు మరింత చేరువగా ఉండడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పీపీ వాదనలతో నిందితులకు శిక్షలు జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్ వాదనలతో చాలా మంది నిందితులకు శిక్షలు పడ్డాయని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. క్రిమినల్ కేసుల్లో సమర్థవంతమైన వాదనలు వినిపిస్తున్న పీపీ శ్రీనివాస్ను సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అభినందించి ప్రశంస పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పీపీ శ్రీనివాస్ కృషి ద్వారా మొత్తం 12 కేసుల్లో దోష నిర్ధారణ జరిగిందన్నారు. అందులో ఏడు కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు శిక్ష విధించగా, మిగిలిన కేసుల్లో కనీసం 10 సంవత్సరాల కారాగార శిక్షను కోర్టు విధించిందని ఎస్పీ వెల్లడించారు.ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
లక్ష్మీదేవర బోనాలు
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం పలుగుల పంచాయతీలో లక్ష్మీదేవర బోనాల పండుగను గ్రామస్తులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో పూజలు నిర్వహించారు. డప్పుచప్పుళ్లతో ఆటపాటలతో బోనం సమర్పించారు. వివిధ గ్రామాల భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గారె విజయలక్ష్మి శంకర్, ఉపసర్పంచ్ ఓద్ది చంద్రయ్య, నాయకులు సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. సెక్యూరిటీ మేనేజర్కు వినతి భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలో రెండు దశాబ్దాలుగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ సింగరేణి సెక్యూరిటీ గార్డులకు రన్నింగ్టెస్ట్ నిబంధన తొలగించాలని సోమవారం కొత్తగూడెం కార్పొరేట్ సెక్యూరిటీ మేనేజర్కు ఏఐటీయూసీ భూపాలపల్లి బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేశ్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సెక్యూరిటీ సిబ్బంది ప్రతినిధి బౌతు కమలాకర్ మాట్లాడుతూ.. 20 ఏళ్లుగా సంస్థ ఆస్తుల రక్షణలో నిబద్ధతతో పనిచేస్తున్నామని తెలిపారు. కొత్త టెండర్ ప్రక్రియలో భాగంగా రన్నింగ్ టెస్ట్ నిర్వహించే నిబంధనతో 45నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన అనుభవజ్ఞులైన పాత సిబ్బంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పాత సిబ్బందికి రన్నింగ్ టెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సెక్యూరిటీ సిబ్బంది మేరుగు రమేష్, కుమారస్వామి, రాజు, కటకం సతీష్, భోగి రాజేందర్, మారం రామిరెడ్డి, సతీష్ పాల్గొన్నారు. గ్యాస్ ధరలు తగ్గించాలి భూపాలపల్లి అర్బన్: కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ పట్టణ కార్యదర్శి సోత్కు ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ పరిస్థితుల పేరుతో గ్యాస్ ధరలను పెంచడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. క్రూడాయిల్ ధరల మార్పులను కా రణంగా చూపుతూ ప్రజలపై భారాన్ని మో పడం సమంజసం కాదన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు వేముల శ్రీకాంత్, నేరెళ్ల జోసెఫ్, యాకుబ్ పాషా, గోలి లావణ్య, ఎండీ సాబీర్, పొనగంటి లావణ్య పాల్గొన్నారు. రేగొండ: కొత్తపల్లిగోరి మండలంలోని జగ్గయ్యపేటలో ఓ ఇంటి వద్ద గుడుంబా తయారు చేసి అమ్ముతున్నారనే సమాచారం మేరకు ఎస్సై సాయి త్రిలోక్నాథ్ రెడ్డి సిబ్బందితో కలిసి సోమవారం తనిఖీ చేశారు. ఆ ఇంట్లో 20 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. 300 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. గుడుంబా తయారు చేసి అమ్ముతున్న మంద పరుశురాం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఎవరైనా గుడుంబా అమ్మినట్లయితే తమకు సమాచారం అందించాలని కోరారు. కాళేశ్వరం: మహదేవపూర్ మండల కేంద్రంలో 2023లో జరిగిన హత్య కేసులో కోర్టు విచారణకు హాజరు కాని ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకుని కోర్టులో హాజరుపరిచారు. పలిమెల మండలం పంకెన గ్రామానికి చెందిన పాగే అనిల్, భూపాలపల్లికి చెందిన గోల్కొండ శివ పలుమార్లు కోర్టు విచారణకు హాజరు కాలేదు. మెజిస్ట్రేట్ వారిపై నాన్బెయిలబుల్ వారంట్ జారీ చేశారు. సోమవారం ఎస్సై పవన్ కుమార్ నిందితులను మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. -
పెండింగ్ సమస్యలపై వినతి
భూపాలపల్లి అర్బన్: సింగరేణి అధికారుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సీఎంఓఏఐ భూపాలపల్లి అధికారుల సంఘం ప్రతినిధులు సోమవారం ఏరియా జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఎంఓఏఐ ఏరియా అధ్యక్షుడు ఎండీ నజీర్ మాట్లాడుతూ..కోలిండియా లిమిటెడ్లో అమలవుతున్న పే అప్గ్రేడేషన్ను సింగరేణి అధికారులకు కూడా అమలు చేయాలని కోరారు. కోలిండియాలో చెల్లిస్తున్న అన్ని భత్యాలు, పే అప్గ్రేడేషన్, పీఆర్పీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం సింగరేణి ఉద్యోగులకు ప్రకటించిన ఇతర భత్యాలను అధికారులకు కూడా అమలు చేయాలని, వివిధ పదోన్నతుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. చార్జ్షీట్ విచారణలను పారదర్శకంగా నిర్వహించి త్వరితగతిన ముగించాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్ సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఎంఓఏఐ ఏరియా కార్యదర్శి అరుణ్, జాయింట్ ట్రెజరర్ సాయికృష్ణ, జాయింట్ సెక్రటరీ మన్నాన్, ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్, మిర్జా యాసిన్ బేగ్, అధికారులు శ్రీనాథ్, సమ్మిరెడ్డి, మహేందర్, జ్యోతి పాల్గొన్నారు. -
వ్యర్థాలు తిని వంద గొర్రెల మృత్యువాత
ఎస్ఎస్ తాడ్వాయి : మేడారంలో భక్తులు పడేసిన వ్యర్థాలు (ఎండి పోయిన అన్నం) తిని సుమారు వంద గొర్రెలు మృత్యువాత పడ్డాయి. మహబూబ్నగర్ జిల్లా మరికెల మండల కేంద్రానికి చెందిన ఆంజనేయులు కొద్ది రోజుల క్రితం తనకున్న 200 గొర్రెలను తీసుకుని మేత నిమిత్తం తాడ్వాయి మండలం మేడారం అటవీ ప్రాంతానికి వచ్చాడు. ఊరట్టం పంచాయతీ పరిధిలోని పెట్రోల్ బంక్ సమీపంలో గొర్రెల మంద పెట్టుకుని సమీప అటవీ ప్రాంతానికి మేతకు తీసుకెళ్లేవాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఒక్కసారిగా గొర్రెలు అస్వస్థకు గురై సుమారు వంద మృత్యువాత పడ్డాయి. మేడారం వనదేవలతను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు పడేసిన వ్యర్థాలు తినడంతో గొర్రెలు అస్వస్థకు గురై మృత్యువాత పడినట్లు బాధిత గొర్రెల యజమాని ఆంజనేయులు తెలిపారు. ఈ ఘటనలో సుమారు రూ.10 లక్షల పైగా నష్టం వాటిల్లిందని కన్నీరుమున్నీరయ్యాడు. మిగతా గొర్రెలు కూడా అనారోగ్యంగానే కనిపిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఆదుకుని పరిహారం చెల్లించాలని వేడుకున్నాడు. ములుగు: బాలల రక్షణపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ సంపత్రావు పేర్కొన్నారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాస్థాయి బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సమావేశాన్ని జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సంపత్రావు హాజరై మాట్లాడారు. జిల్లాలో నూతనంగా బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కమిటీకి కలెక్టర్ చైర్మన్గా, 14 మంది జిల్లా అధికారులు సభ్యులుగా ఉంటారని వివరించారు. బాలల రక్షణపై అవగాహన కల్పించడం, ఆరేళ్లకు పైబడిన బాలలందరూ బడికి వెళ్లేలా చూడడం, బడి మానేసిన పిల్లలను గుర్తించి వారిని తిరిగి బడిలో చేర్పించడం కమిటీ నిర్వహిస్తుందని తెలిపారు. -
అంతర్మథనం
భూపాలపల్లి అర్బన్: కొత్తగా ఎన్నికై న సర్పంచ్లు గ్రామ సమస్యలు ప్రభుత్వానికి, అధికారులకు తెలియజేయడానికి సరైన వేదిక దొరకడం లేదు. గతంలో మండల పరిషత్ పాలకవర్గాలు ఉన్నప్పుడు మూడు నెలలకోసారి మండల సభలు నిర్వహించేవారు. అప్పుడు మండల సభలలో సర్పంచ్లు తమ గ్రామ సమస్యలు అధికారులకు తెలిపేవారు. దీంతో అధికారులకు సర్పంచ్లకు మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం ఉండేది. ఇప్పుడు రెండేళ్లుగా ఎన్నికలు లేక మండల సభలు జరగడం లేదు. గత డిసెంబర్లో కొత్తగా ఎన్నికై న సర్పంచ్లు తమ గ్రామ సమస్యలు ఎలా తెలుపాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలలకోసారి మండల సభలు గతంలో మండల పరిషత్ పాలకవర్గాలు ఉన్న సమయంలో ఎంపీపీ అధ్యక్షతన ఎంపీటీసీలు సభ్యులుగా ప్రతీ మూడు నెలలకోసారి మండల సర్వసభ్య సమావేశాలు నిర్వహించేవారు. సభలో ప్రత్యేక ఆహ్వానితులుగా సర్పంచ్లు హాజరయ్యేవారు. డివిజన్ స్థాయి అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యేవారు. మండలంలో ప్రతీ ప్రభుత్వ శాఖ అధికారి తమ శాఖ మూడు నెలల ప్రగతి నివేదికతో వచ్చేవారు. సమావేశంలో వ్యవసాయ, విద్య, విద్యుత్, వైద్య ఆరోగ్య, ఐసీడీఎస్, పీఆర్ ఇంజినీరింగ్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్, ఐకేపీ, ఉపాధిహామీ, పశుసంవర్దక, రెవెన్యూ ఇలా 11 శాఖలకు చెందిన అధికారులు తమ మూడు నెలల ప్రగతి నివేదికలు చదివి వినిపించేవారు. ఈ సమయంలో శాఖల వారి అధికారులు తమ నివేదిక చదివినప్పుడు ఆయా గ్రామాల సర్పంచ్లు తమ గ్రామాల సమస్యలపై ప్రశ్నలు అడిగేవారు. వారు లేవనెత్తిన సమస్యల పరిష్కారం అధికారులు వివరించేవారు. దీంతో సర్పంచ్లకు, మండల అధికారులకు మధ్య మంచి సంబందాలు ఏర్పడేవి. డివిజన్ స్థాయి అధికారుల రాకతో గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి మండల సభలు వేదికలు అయ్యేవి. గడువు ముగిసిన వెంటనే గ్రామపంచాయతీలు, మండల పరిషత్ పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో స్థానిక సంస్థల పాలన అస్తవ్యస్తంగా మారింది. రెండేళ్ల అనంతరం గత డిసెంబర్ నెలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. అప్పటికే గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయాయి. పలుచోట్ల సీసీ రహదారులు, మురుగు కాలువలు నిర్మించాల్సి ఉంది. రోడ్ల మరమ్మతులు చేపట్టాలి. వీధిదీపాలు, పారిశుద్ధ్యం మెరుగు తదితర అభివృద్ధి పనుల కోసం నిధుల లేమి వెంటాడుతోంది. ఈ క్రమంలో సర్పంచ్లు తమ గ్రామాల సమస్యలు ఎలా తెలపాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మండలస్థాయి అధికారులకు తమకు మధ్య పరిచయం కోసమైనా మండల సభలు నిర్వహిస్తే బాగుంటుందని పలువురు అంటున్నారు. మండలసభ ఏర్పాటుచేస్తే అధికారులకు, సర్పంచ్లకు మధ్య సమన్వయం ఏర్పడుతుందని అంటున్నారు. మండల పరిషత్ పాలక వర్గాలు లేక ఇబ్బందులు సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో.. -
కలెక్టరేట్ ఎదుట ధర్నా
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి అదనపు కలెక్టర్ అశోక్కుమార్కు వినతిపత్రం అందజేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని యూటీఎఫ్ ఆధ్వర్యంలో మూడంచెల పోరాట కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ నాయకులు, సమగ్ర శిక్ష ఉద్యోగులు మాట్లాడుతూ.. సమగ్ర శిక్ష ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్ అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, సమ్మె కాలానికి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని కోరారు. 20న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపడతామని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి నక్క తిరుపతి, కొత్త కుమారస్వామి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు. -
వినతులు పరిష్కరించండి..
ములుగు రూరల్/ఏటూరునాగారం: జిల్లాలో నిర్వహించిన ప్రజావాణి, గిరిజన దర్బార్లో బాధితుల నుంచి స్వీకరించిన అర్జీలను పరిశీలించిన అదనపు కలెక్టర్ సంపత్రావు, ఐటీడీఏ డీడీ జనార్దన్ తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో 46 వినతులు రాగా అదనపు కలెక్టర్ సంపత్రావు స్వీకరించారు. అలాగే ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్లో 11 వినతులు రాగా డీడీ జనార్దన్, ఏవో రాజ్కుమార్లు స్వీకరించారు. ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వహించొద్దని అధికారులకు సూచించారు. ఎస్ఎస్తాడ్వాయి మండల పరిధిలోని భూపతిపురానికి చెందిన రైతు, వాజేడు మండలం గుమ్మడిదొడ్డికి చెందిన మరో రైతు ఇందిర సౌర జలగిరివికాసం కింద బోరు మంజూరు చేయాలని వినతి పత్రం సమర్పించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అయోధ్యాపురంలో కంటేజెంట్ వర్కర్గా పనిచేస్తున్న ఉద్యోగి 28 నెలలుగా వేతనం రావడం లేదని ఇప్పించాలని కోరారు. కన్నాయిగూడెం మండలం కంతనపల్లికి చెందిన రైతు రైతుబంధు ఇప్పించాలని దరఖాస్తు చేసుకున్నారు. వెంకటాపురం మండలం ఎదిర గ్రామానికి చెందిన ప్రజలు పెసా గ్రామసభ నిర్వహించాలని కోరారు. మిగిలిన వారు ఇతర సమస్యలపై దరఖాస్తులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్(ఎస్డీసీ)అనిల్, మేనేజర్ శ్రీనివాస్, కొండల్రావు పాల్గొన్నారు. అధికారులను ఆదేశించిన అదనపు కలెక్టర్ సంపత్రావు, ఐటీడీఏ డీడీ జనార్దన్ ప్రజావాణిలో 46, గిరిజన దర్బార్లో 11 వినతులు స్వీకరణ -
ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి
భూపాలపల్లి: సమస్య పరిష్కారం కోరుతూ ప్రజలు ప్రజావాణిలో అందజేసిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు త్వరగా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ సూచించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో కలిసి ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 52 దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి కార్యాలయానికి వచ్చి దరఖాస్తులు ఇస్తున్నారని, ఆ దరఖాస్తుల పట్ల అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించొద్దన్నారు. ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఆర్డీఓ హరిక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ అశోక్కుమార్ -
కాన్షీరాం జయంతి వేడుకలు
భూపాలపల్లి రూరల్: కాన్షీరాం మహారాజ్ 92వ జయంతి వేడుకలు బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏ సీ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలోని ధర్మ సమాజ్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీ జి ల్లా అధ్యక్షుడు కొత్తూరి రవీందర్ మాట్లాడు తూ భారతదేశ రాజకీయ వ్యవస్థలో సామాజిక రాజకీయ, సాంస్కృతిక సమానత్వానికి పునా ది వేసిన బహుజన యోధుడు కాన్షీరాం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నా యకులు సామల శ్రీనివాస్ కనకం మల్లయ్య, చిట్యాల శ్రీనివాస్, మంద రమేశ్, కోరళ్ల శ్యా మ్, పుల్ల అశోక్, చిర్ర శ్రీకాంత్ పాల్గొన్నారు. ‘గిరిజనేతరుల భూములను పంచాలి’ వాజేడు: వలస గిరిజనేతరుల కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూములను ఆదివాసులకు పంచాలని నవ నిర్మాణ సేన జిల్లా కన్వీనర్ ఎట్టి విద్యాసాగర్ అన్నారు. మండల పరిధిలోని గుమ్మడి దొడ్డిలో ఆదివారం హరినాథ్ అధ్యక్షతన నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్టలో ఆచార్య వినోబాబావే భూదాన్ ట్రస్ట్ బర్డ్ ద్వారా పేదలకు ఇచ్చిన భూములను ప్రభుత్వం అక్రమంగా గుంజుకోవడం దారుణమన్నారు. పేదల భూములను లాక్కున్న ప్రభుత్వం షెడ్యూల్ ఏరియాలో ఎల్టీఆర్ చట్టాన్ని ఉల్లంఘించి వలస గిరిజనేతరులు వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదని ప్రశ్నించారు. వలస గిరిజనేతరుల వద్ద ఉన్న ప్రభుత్వ భూములను వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఆదివాసులకు పంచాలని డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో నవనిర్మాణ సేన ఆధ్వర్యంలో దశల వారీగా ఉద్యమాలను చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు అశోక్, సునీల్, సూర్యం, బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. పోచమ్మతల్లికి బోనాలు వాజేడు: మండల కేంద్రంలోని ప్రజలు ఆదివారం పోచమ్మ తల్లికి బోనాలను సమర్పించారు. ప్రతీ ఇంటి నుంచి బోనంతో మహిళలు తరలివెళ్లారు. పోచమ్మతల్లికి చీరె, సారె సమర్పించారు. కోళ్లను కోసుకున్నారు. కుటుంబ సభ్యులతో సహా పోచమ్మ చెట్టు వద్దకు చేరుకున్న భక్తులు సల్లంగా సూడు పోచమ్మ తల్లి అంటూ మొక్కుకున్నారు. మత సామరస్యానికి ప్రతీక రంజాన్ములుగు: మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క పేర్కొన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రభుత్వం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందుతో పాటు తోఫా అందిస్తుందని తెలిపారు. జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు, తోఫా పంపిణీ కార్యక్రమానికి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముస్లిం మత పెద్దలతో, సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ప్రజా ప్రభుత్వం మొదటి నుంచి మత సామరస్యానికి, లౌకిక వాదానికి కట్టుబడి ఉందని తెలిపారు. అన్ని కులాలు, మతాలను సమానంగా గౌరవిస్తూ, రాజ్యాంగం కల్పించిన లౌకిక స్ఫూర్తిని కాపాడుతుందని వెల్లడించారు. పాలకులు ప్రజలందరినీ సమానంగా చూడాలన్నారు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టాలే తప్పా విద్వేషాలు రెచ్చగొట్టకూడదని హితవు పలికారు. అనంతరం కలెక్టర్ దివాకరతో కలిసి ఈద్ కా తోఫా కానుకలను అందజేసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, మున్సిపాలిటీ చైర్పర్సన్ చింత నిప్పుల చంద్రకళ, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల ఆశోక్, నాయకులు భగవాన్రెడ్డి, వంగ రవియాదవ్ పాల్గొన్నారు. -
ప్రాదేశికం ఎప్పుడు?
రేగొండ: జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం ముగిసి దాదాపు 9 నెలలు కావస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణపై ఇంకా స్పష్టత ఇవ్వడం లేదు. ఆ పదవులపై కన్నేసిన వారికి ఉత్కంఠ తప్పడం లేదు. గతేడాది జూలై 4వ తేదీన జెడ్పీ, మండల పరిషత్ సభ్యుల పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి జిల్లా, మండల పరిషత్లు ప్రత్యేధికారుల పాలనలోనే కొనసాగుతున్నాయి. జిల్లాలో 12 జెడ్పీటీసీ, 119 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నది. ఇప్పటికే అధికార యంత్రాంగం ఓటరు జాబితా సిద్ధం చేసింది. మారనున్న రిజర్వేషన్లు.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు మారే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో ఉన్నతాధికారుల సూచనల మేరకు (42 శాతం బీసీ రిజర్వేషన్ల ప్రకారం) కేటాయించినా, ప్రస్తుత పరిస్థితులతో అవి మారే అవకాశాలే అధికంగా ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. కొత్తగా అమల్లోకి వచ్చిన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం అప్పటి రిజర్వేషన్లను రెండు సార్లు అమలు చేయాలి. కానీ ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడం, రాజకీయ సమీకరణాలతో కొత్త మండలం ఏర్పాటు కావడం, ఓటర్ల సంఖ్య పెరగడం లాంటి కారణాలతో రిజర్వేషన్లలో మార్పులు ఖాయమంటున్నారు. మూడు నెలలు ఆగాల్సిందేనా? ఇటీవల మున్సిపల్ ఎన్నికలు నిర్వహించిన ప్రభుత్వం ఆ వెంటనే ప్రాదేశిక సమరానికి సిద్ధపడుతుందని ఆశావాహులు భావించారు. కానీ ప్రాదేశిక ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం మార్పులు చేస్తుందనే ఊహగానాలు కూడా వినిపిస్తున్నాయి. అంతే కాదు ఎంపీపీ, జెడ్పీ చైర్ పర్సన్ స్థానాలకు పరోక్ష పద్ధతి కాకుండా ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తుందనే ప్రచారం ప్రస్తుతం జోరుగా సాగుతోంది. ఏ పద్ధతి అయినా ఎన్నికలు ఇప్పుడు నిర్వహించే పరిస్థితులైతే కనిపించడం లేదనే సంకేతాలు కూడా వస్తున్నాయి. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక పేరిట 99 రోజుల కార్యాచరణను ప్రభుత్వం చేపట్టడంతో ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశాలు లేవని ఆశావాహులు నిరాశకు గురవుతున్నారు. ఇంకా స్పష్టత ఇవ్వని ప్రభుత్వం ఆశావహుల ఎదురుచూపు -
హేమాచల క్షేత్రంలో భక్తుల కోలాహలం
మంగపేట: మండల పరిధిలోని మల్లూరులో గల శ్రీ హేమాచల క్షేత్రంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. ఆలయంలో స్వయంభుగా వెలిసిన లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వందల సంఖ్యలో తరలివచ్చారు. పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని తిల తైలాభిషేకం పూజాలో పాల్గొన్నారు. మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారిని నిజరూప దర్శనం చేసుకుని పరవశించారు. ఆలయ అర్చకులు భక్తుల గోత్ర నామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. సంతానం కోసం వచ్చిన దంపతులు అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని నాభిచందన ప్రసాదాన్ని స్వీకరించారు. కలెక్టర్ దివాకర దంపతులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన వారికి ఆలయ అర్చకులు కలెక్టర్ దంపతుల గోత్ర నామాలతో స్వామివారికి అర్చనలు జరిపించి స్వామివారి, అమ్మవార్ల శేష వస్త్రాలను బహుకరించారు. అనంతరం వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. -
పలుగుల రోడ్డుకు మోక్షం
మల్లన్న బోనాలుమల్లన్న పట్నాలు వేస్తున్న భక్తులు మహదేవపూర్ మండలం మద్దులపల్లి గ్రామంలోని గోదావరి ఒడ్డున వెలిసిన మల్లన్న దేవుడి ఆలయంలో ఆదివారం మల్లన్న పట్నాలు, బోనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒగ్గు కళాకారులతో పట్నాలు నిర్వహించి మల్లన్న దేవుడికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు. భక్తులు డప్పుచప్పుళ్ల మధ్య శివశక్తుల పూనకాలతో భవిష్యవాణి వినిపించారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు, గ్రామస్తులు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. – కాళేశ్వరంకాళేశ్వరం: మహదేవపూర్ మండలం పలుగుల గ్రామానికి వెళ్లే ఆరు కిలోమీటర్ల ప్రధాన రహదారికి ఎట్టకేలకు మోక్షం లభించింది. దశాబ్దకాలంగా ఇసుల రీచుల గుండా తరలివచ్చిన లారీలతో రోడ్డు తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ రహదారిని పునర్నిర్మించేందుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు రూ.22 కోట్లతో ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో రహదారి అభివృద్ధి పనులకు రెండు రోజుల క్రితం శంకుస్థాపన చేశారు. కొన్నేళ్లుగా వర్షాకాలంలో రాత్రి ఆపదొస్తే కనీసం 108 అంబులెన్స్ వెళ్లలేని దుస్థితిలో ఈ రహదారి ఉంది. కీలక రవాణా మార్గం.. పలుగుల రహదారి పలుగుల టు కుంట్లం గ్రామాల ప్రజలకు కీలక రవాణా మార్గంగా ఉంది. కొన్ని సంవత్సరాలుగా రహదారి తీవ్రంగా దెబ్బతిని ప్రయాణికులకు నరకయాతనగా మారింది. ముఖ్యంగా ఇసుక రీచ్ల నుంచి వచ్చే భారీ లారీల రాకపోకలతో రహదారి ఆనవాళ్లు కోల్పోయి పూర్తిగా చెడిపోయింది. మోకాలు లోతు గుంతలు, దుమ్ము కారణంగా వాహనదారులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారి ప్రయాణం చేయడం కూడా కష్టంగా మారేది. రహదారి నిర్మాణం పూర్తయితే పలుగుల, పరిసర గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను సులభంగా మార్కెట్లకు తరలించుకునే అవకాశం కలుగుతుంది. విద్యార్థులకు రవాణా మెరుగుపడి కాళేశ్వరం పాఠశాలకు రానున్నారు. కొత్త రహదారి నిర్మాణంతో ప్రాంత అభివృద్ధికి ఊతం లభిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రూ.22 కోట్లతో మంత్రి శంకుస్థాపన పదేళ్ల నరకయాతనకు చెక్ ఇసుక రీచుల లారీలతో ఆనవాళ్లు కోల్పోయిన రోడ్డు -
సోమవారం శ్రీ 16 శ్రీ మార్చి శ్రీ 2026
జిల్లాలో క్యాన్సర్ కేసుల వివరాలుభూపాలపల్లి అర్బన్: జిల్లాలో క్యాన్సర్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఐదేళ్లలో 358 కేసులు నమోదయ్యాయి. పేదరికం, నిరక్షరాస్యతతో గ్రామీణులకు క్యాన్సర్పై అవగాహన లేకపోవడంతో ఏటా పదుల సంఖ్యలో మృతిచెందుతున్నారు. మొదట్లో గుర్తించకపోవడంతో చివరి దశలో ఆస్పత్రులకు వెళ్తున్నారు. దీంతో బతికే అవకాశాలు తగ్గుతున్నాయి. జిల్లాలో గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ బాధితులు ఎక్కువగా ఉన్నట్లు వైద్యశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జీవనశైలిలో మార్పులు.. జిల్లాలో ప్రతీ ఏట పదుల సంఖ్యలో క్యాన్సర్తో చనిపోతున్నారు. దురలవాట్లు, జీవన శైలిలో మార్పులతో బాధితుల సంఖ్య పెరుగుతోంది. వ్యాధిపై అవగాహన ఉంటే ఆదిలోనే అరికట్టవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. పురుషుల్లో నోటి, వివిధ రకాల క్యాన్సర్లు వస్తుండగా, మహిళల్లో రొమ్ము, సర్విక్ రకాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జిల్లా కేంద్రంలో క్యాన్సర్ నిర్ధారణ లేకపోవడంతో వరంగల్, హనుమకొండ, హైదరాబాద్, ఇతర దూర ప్రాంతాలకు వెళ్లి పరీక్షలు చేసుకొని వైద్య చికిత్సలు పొందుతున్నారు. ఇలా గుర్తించండి.. నోటి, రొమ్ము, సర్విక్ క్యాన్సర్లను తొలిదశలోనే గుర్తిస్తే చికిత్స సులభమవుతుంది. రొమ్ములో గడ్డలు ఏర్పడితే మామోగ్రామ్ పరీక్ష చేయించాలి. మలం, యూరిన్లో రక్తం, తెల్లబట్ట, ఎర్ర బట్ట, ఒక్కసారిగా బరువు తగ్గడం జరిగితే సర్విక్ క్యాన్సర్గా భావించి హెచ్పీవీ డీఎన్ఏ పరీక్ష చేయించుకోవాలి. ఏడాదికోసారి స్క్రీనింగ్ చేసుకోవడం ద్వార ముందస్తుగా గుర్తించే వీలుంటుంది. నోటి అల్సర్లు, దగ్గితే రక్తం పడటం, బరువు తగ్గడం లక్షణాలు కనిపిస్తే నోటి క్యాన్సర్ పరీక్ష చేయించాలి.హెచ్పీవీ వ్యాక్సిన్తో అప్రమత్తం క్యాన్సర్ దరిచేరకుండా ఉండేందుకు వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. 9 నుంచి 15 ఏళ్ల వయసు పిల్లలకు హెచ్పీవీ రెండు డోసుల్లో వేసుకోవాలి. 21 ఏళ్ల వరకు కూడా వేసుకోవచ్చు. జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, చిట్యాల, మహదేవపూర్ సీహెచ్సీలో 14 నుంచి 15 ఏళ్ల పిల్లలకు హెచ్పీవీ వ్యాక్సిన్లు వేస్తున్నారు. మహిళల్లో అధికంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులు అధికంగా నమోదుతున్నాయి. ఈ క్యాన్సర్ను నివారించాలని ముందస్తుగా బాలికలను వ్యాక్సిన్ వేస్తున్నారు. వ్యాయామం చేయాలి.. క్యాన్సర్ను మొదట్లో గుర్తిస్తే నయం చేయొచ్చు. రొమ్ము, సర్విక్ క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తే తొలి దశలోనే ఆస్పత్రికి వెళ్లాలి. నిత్యం అర గంట వ్యాయామం చేయాలి. భోజనంలో ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. రెడ్మీట్, ఆయిల్స్, జంక్ఫుడ్స్ మానేయాలి. – డాక్టర్ శ్రీదేవి, ఎంసీహెచ్ ప్రోగ్రాం అధికారి -
‘మేడిగడ్డ’ వినాశనానికి బాధ్యత వహించాలి
కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ వినాశనానికి అప్పటి కేసీఆర్ సర్కారే బాధ్యత వహించాలని రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ ప్రతినిధుల బృందం సభ్యులు పి.సుదర్శన్, బి.వెంకట్, సాయిబాబు, నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. మహదేవపూర్ మండలంలో నిర్మించిన మేడిగడ్డ (లక్ష్మి), అన్నారం (సరస్వతి), పెద్దపల్లి జిల్లా సుందిళ్లలో పార్వతి (సుందిళ్ల) బ్యారేజీలతో, పంపుహౌస్ను వారు ఆదివారం క్షేత్రస్థాయిలో సందర్శించారు. అక్కడ కుంగిపోయిన పియర్లు, దెబ్బతిన్న గేట్లను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ సుమారు రూ.90 వేల కోట్ల నుంచి రూ. లక్ష కోట్ల వరకు ప్రజాధనాన్ని వెచ్చించిన ఈ ప్రాజెక్టులో జరిగిన నష్టం అత్యంత ఆందోళనకరమని అన్నారు. ఈ భారీ వైఫల్యానికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వమే ప్రాథమిక బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. కేవలం కమీషన్లు, ప్రచారం కోసం శాసీ్త్రయత లేకుండా పనులు చేయించడంతో మేడిగడ్డ బ్యారేజీలో 19 నుంచి 22 వరకు ఉన్న గేట్ల ప్రాంతం కుంగిపోయిందని మండిపడ్డారు. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి, నాణ్యత లోపాలపై తక్షణమే విచారణ జరిపి, బాధ్యులైన అధికారులు, కాంట్రాక్ట్ సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాధనాన్ని బూడిదలో పోసిన వారి ఆస్తులను జప్తు చేసి, ఆ నిధులతోనే జరిగిన నష్టాన్ని పూడ్చాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం ఈ సమస్యను కేవలం గత ప్రభుత్వంపై రాజకీయ విమర్శలు చేసేందుకే పరిమితం చేయకూడదని సూచించారు. రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి, నిపుణుల కమిటీ సూచనల మేరకు వెంటనే మరమ్మతులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే వర్షాకాలంలో రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, పంటలకు సకాలంలో నీరు అందించేలా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రాజెక్టు కేవలం ప్రచారానికే పరిమితమైందా అని నాయకులు ప్రశ్నించారు. సీఎం రేవంత్ ప్రభుత్వం రాజకీయాలు పక్కన పెట్టి మరమ్మతు చేయాలి అధికారులు, కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి రైతు, కూలీ, కార్మిక సంఘాల డిమాండ్ -
మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట
మల్హర్(కాటారం): మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. కాటారం మండలకేంద్రంలోని ఎల్జీ గార్డెన్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ముస్లింలతో కలిసి ప్రార్థనలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... ముస్లిం సోదరులు రంజాన్ మాసం అంతా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఆచరించే ముస్లిం సోదరులకు ఇచ్చే ఇఫ్తార్ విందు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయన్నారు. రంజాన్ పండుగ వారి జీవితాలలో సుఖసంతోషాలను నింపాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్రెడ్డి, జిల్లా గ్రంథాలయ చెర్మన్ కోట రాజబాబు, ఉపాధిహామీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేశ్, ముస్లిం పెద్దలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు -
‘జైన గుడిని పరిరక్షించాలి’
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని రామప్ప ఆలయ పరిసరాల్లోని జైన గుడిని పరిరక్షించాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డా.ఈమని శివనాగిరెడ్డి, టార్చ్ సంస్థ కార్యదర్శి అరవింద్ ఆర్య కోరారు. ఆదివారం వారు రామప్ప పరిసరాల్లోని కాకతీయ కట్టడాల ఆనవాళ్లను పరిశీలించిన అనంతరం జైన ఆలయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. గర్భాలయం, అర్ధమండపం, రెండింటికి ద్వారాలు, వాటిపైన జైన చిహ్నమైన పూర్ణకలశం, గర్భాలయంపై నాగర శైలి విమాన శిఖరం, దానికి అనుసంధానంగా సుకనాసి, కాకతీయ ఆలయ వాస్తుకు అద్ధం పడుతున్నాయని వివరించారు. గర్భాలయం లోపల పీఠంపై గల సింహం, శిల్పం, చివరి జైన తీర్థంకుడైన వర్ధమాన మహావీరుడి లాంఛనమని తెలిపారు. అందువల్ల ఈ ఆలయం వర్ధమాన మహావీరుడికి అంకితం చేశారన్నారు. వాస్తు నైపుణ్యం ఉన్న ఈ ఆలయాన్ని సైతం పదిలపరిస్తే సందర్శకులకు ఆకర్షణగా నిలుస్తుందని వివరించారు. రామప్ప ఆలయ సమీపంలోని రెండు సమకాలీన ఆలయాలను రక్షిత కట్టడాల జాబితాలో చేర్చిన కేంద్ర పురావస్తు శాఖ అధికారులను వారు అభినందిస్తూ, జైనుగుడిని కూడా ఆ జాబితాలో చేర్చాలని వారు కోరారు. -
పిలవని పేరంటానికి వెళ్తే..
శుభకార్యాలకు పిలవకున్నా వెళ్లి భోజనం చేసేవారికి ఆదివారం భూపాలపల్లి పట్టణం సుభాష్కాలనీ సింగరేణి ఫంక్షన్ హాల్ ఎదుట హెచ్చరిక బోర్డు పెట్టారు. సింగరేణి ఫంక్షన్ హాల్లో ఆదివారం వివాహం జరిగింది. ఫంక్షన్ హాల్లో ఎలాంటి కార్యక్రమం జరిగినా ఫంక్షన్కు సంబంధం లేనివారు వందలాది మంది వచ్చి భోజనాలు చేస్తున్నారని నిర్వాహకులు గుర్తించారు. దీంతో ఇతరులెవరూ రాకుండా ఫంక్షన్ హాల్ ఎదుట ‘వివాహానికి సంబంధం లేనివారు వస్తే రూ.5వేల జరిమానా, 3నెలల జైలు’ అని ఫ్లెక్సీ పెట్టారు. భోజన ప్రియులు బోర్డును చూసి వెనుదిరిగి వెళ్లారు. గతంలో శుభకార్యాలు చేసినప్పుడు భోజనాలు సరిపోక ఇబ్బందులు అయ్యేవని.. ఫ్లెక్సీ ఏర్పాటుతో అందరికీ భోజనాలు సరిపోయాయని నిర్వాహకులు అన్నారు. – భూపాలపల్లి రూరల్ -
జాతీయ సంఘాలు సమాధానం చెప్పాలి
భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికులకు శాశ్వత ఉద్యోగాలు ఆలస్యంగా ఇవ్వడం, ప్రమోషన్ పాలసీ అమలు చేయకపోవడం, కార్మికులను వివిధ స్కీముల పేరుతో తొలగించడం వంటి సమస్యలపై జాతీయ కార్మిక సంఘాలు సమాధానం చెప్పాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య డిమాండ్ చేశారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికులకు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో హామీలను ఎంతవరకు అమలు చేశారో బహిరంగ చర్చలో చెప్పాలని ఐఎన్టీయూసీ నాయకత్వానికి సవాల్ చేశారు. కార్మికుల ఐక్య పోరాటాలతో సాధించిన హక్కులను కొన్ని జాతీయ సంఘాలు ప్రభుత్వాలు, యాజమాన్యాలతో కుమ్మకై ్క తాకట్టు పెట్టాయని ఆరోపించారు.ఈ సమావేశంలో నాయకులు కాసర్ల ప్రసాద్రెడ్డి, దాసరి జనార్దన్, నామల శ్రీనివాస్, రాళ్లబండి బాబు, జయశంకర్, నరసింహారెడ్డి పాల్గొన్నారు. -
సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి
● జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత ఏటూరునాగారం: సర్పంచ్లు సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం నిర్వహించిన 99 రోజుల ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా సర్పంచ్లకు శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రేమలత హాజరై మాట్లాడారు. శిశు సంక్షేమ శాఖ ద్వారా మహిళలు, పిల్లల సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలు, సేవల గురించి వివరించారు. ముఖ్యంగా ఈ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సఖి వన్ స్టాప్ సెంటర్, చైల్డ్ హెల్ప్లైన్–1098, జిల్లా హబ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ వంటి విభాగాల ద్వారా మహిళలు, బాలికలు, పిల్లలకు అందిస్తున్న సేవలను వివరించారు. మహిళలు ఎదుర్కొనే గృహహింస, వేధింపులు, అత్యాచారం వంటి సమస్యలపై సఖి కేంద్రం ద్వారా అందించే వైద్యం, న్యాయ సహాయం, తాత్కాలిక ఆశ్రయం వంటి సేవలను సర్పంచ్లు గుర్తుంచుకొని కావాల్సిన వారికి సాయం చేయాలన్నారు. అలాగే ప్రమాదంలో ఉన్న లేదా సహాయం అవసరమైన పిల్లల కోసం చైల్డ్ హెల్ప్లైన్ 1098 ద్వారా 24 గంటల పాటు సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. అదేవిధంగా డీహెచ్ఈడబ్ల్యూ ద్వారా మహిళల సాధికారత, అవగాహన కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తదితర అంశాలపై సర్పంచ్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ, ఏఓ వేణుగోపాల్, ఎంపీడీఓ శ్రీనివాస్, డీఈ పురుషోత్తం, ఈజీఎస్ ఏపీఓ చరణ్రాజు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు శ్రీవిద్య, వసంత, బాలల పరిరక్షణ విభాగం అధికారి రాజు, సఖి కౌన్సిలర్ కల్పన, చైల్డ్ హెల్ప్లైన్ సూపర్వైజర్ విక్రమ్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
ఎవరికీ పట్టని ‘సీఎంఆర్’!
సాక్షిప్రతినిధి, వరంగల్: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని ఓ రైస్మిల్లును ఏడాది క్రితం డిఫాల్టర్ల జాబితాలో చేర్చారు. 2021–22, 2022–23 సంవత్సరాలకు సీఎంఆర్ కింద కేటాయించిన సుమారు రూ.7.50 కోట్ల విలువైన ధాన్యం ఎగవేయడమే ఇందుకు కారణం. డిఫాల్టర్ల జాబితాలో చేర్చి నోటీసులు ఇచ్చి కేసులు నమోదు చేసినా ఇప్పటికీ నూరు శాతం సీఎంఆర్ రికవరీ కాలేదు. హసన్పర్తి మండలంలోని ఓ రైస్మిల్లు నిర్వాహకులు 2,200 మెట్రిక్ టన్నుల బియ్యం చెల్లించాల్సి ఉంది. దాడులు, తనిఖీలు చేసి నోటీసులు జారీ చేయడంతో 1,300 మెట్రిక్ టన్నులు చెల్లించారు. ఇంకా 900 మెట్రిక్ టన్నులు ఇవ్వాలని కమిషనర్ కార్యాలయానికి అందిన ఫిర్యాదులో పేర్కొన్నారు. .. ఇలా ప్రతీసారి కస్టం మిల్లింగ్ ధాన్యం (సీఎంఆర్) దారి మళ్లుతోంది. వ్యాపారం, వృత్తి మీద నిబద్ధత ఉన్న సుమారు 75 శాతం మంది రైస్మిల్లర్లు సకాలంలో సీఎంఆర్ చెల్లిస్తున్నారు. కొందరు రాజకీయ పలుకుబడి, మరికొందరు అక్రమార్జన కోసం సీఎంఆర్ బకాయి పెడుతున్నారు. ఓ సీజన్కు చెల్లించాల్సింది మరో సీజన్కు ఇస్తూ.. కొందరు అధికారులను మేనేజ్ చేస్తూ సర్కారు ధాన్యంతో వ్యాపారం చేస్తున్నారు. కొందరైతే మొత్తానికే ఎగవేస్తున్నారు. సర్కారు ధాన్యం మరాడించి పక్క రాష్ట్రాలకు తరలించి బియ్యం అమ్ముకుని.. ఆ డబ్బుతో ఎకరాల కొద్ది భూములు కొనుగోలు చేసి ‘రియల్’ వ్యాపారం చేస్తున్నారు. ఏటా రూ.కోట్ల విలువ చేసే ధాన్యం దారి మళ్లుతుండగా అవినీతి, అక్రమాలకు అలవాటుపడిన కొంతమంది అధికారులు, రైస్మిల్లర్లకు సీఎంఆర్ వరంగా మారిందన్న చర్చ జరుగుతోంది. స్కాం ఇలా వెలుగులోకి.. ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తోంది. ఈ ధాన్యాన్ని సివిల్ సప్లయీస్/మార్కెటింగ్ శాఖ ద్వారా రైస్ మిల్లులకు పంపుతుంది. మిల్లర్లు ధాన్యం తీసుకున్న తర్వాత మిల్లింగ్ చేసి బియ్యం ఇవ్వాలి. ఒప్పందం ధాన్యం మిల్లింగ్ చేసి సుమారు 67 శాతం బియ్యం ఎఫ్సీఐ/సివిల్ సప్లయీస్ గోదాములకు ఇవ్వాలి. ఇక్కడే అసలు స్కాం మొదలవుతుంది. కొంతమంది మిల్లర్లు ప్రభుత్వ ధాన్యం మిల్లింగ్ చేయరు.. లేదా కొంత మాత్రమే మిల్లింగ్ చేస్తారు. మిగిలిన ధాన్యాన్ని మార్కెట్ ధర ఎక్కువ ఉంటే ప్రైవేట్కు అమ్మేయడం, లేదంటే మరాడించి బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించి అమ్ముకుంటున్నారు. ఈ వ్యవహారంలో ఫేక్ మిల్లింగ్ రికార్డులు, స్టాక్ రిజిస్టర్ మార్పులు చేసి తక్కువ బియ్యం చూపించడం.. బియ్యం ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరిగితే ధాన్యం తడిగా ఉండడం, మిల్లింగ్, ట్రాన్స్పోర్ట్ సమస్యలను చెప్పి దాటవేయడం పరిపాటి. తీరా పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీలు చేసినప్పుడు మిల్లుల్లో ఉన్న ధాన్యం, సరఫరా చేసిన బియ్యం లెక్కల్లో భారీ తేడా కనిపిస్తుంది. దీంతో సీఎంఆర్ బకాయిలు, పక్కదారి పట్టించిన స్కాంలు బయట పడుతున్నాయి. 33మంది మిల్లర్ల నిర్లక్ష్యం 2021–22లో రైతుల నుంచి వానాకాలం, యాసంగి సీజన్లలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని సీఎంఆర్ కింద రైస్మిల్లర్లకు సరఫరా చేశారు. ఆ ధాన్యానికి సంబంధించిన బియ్యం సరఫరా చేయడంలో ఉమ్మడి వరంగల్లోని 33 మంది మిల్లర్లు నిర్లక్ష్యం వహించారు. బియ్యం చెల్లించని వారికి పౌరసరఫరాలశాఖ నోటీసులు ఇచ్చింది. స్పందించకపోవడంతో ఆయా మిల్లులకు సరఫరా చేసిన లెక్కల ప్రకారం ఉండాల్సిన ధాన్యానికి 2023లో టెండర్లు నిర్వహించారు. అలా ఉమ్మడి వరంగల్లోని మిల్లుల్లో 2,92,585 మెట్రిక్ టన్నుల ధాన్యానికి టెండర్లు వేసిన వ్యాపారులు.. తెచ్చుకునేందుకు మిల్లులకు వెళ్లగా అక్కడ ఉండే ధాన్యం మాయమైంది. దీనిపై సుమారు ఏడాది పాటు ధాన్యం మాయమైన మిల్లుల యజమానులపై ఒత్తిడి తెచ్చిన అధికారులు ఎట్టకేలకు 1,83,985 మెట్రిక్ టన్నులు రాబట్టినట్లు అప్పట్లోనే ప్రకటించారు. ఇంకా సుమారు రూ.107 కోట్ల విలువ చేసే ఆ ధాన్యం రైస్మిల్లర్ల వద్ద ఉందని పౌర సరఫరాలశాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తేల్చారు. ధాన్యం మాయం చేసిన మిల్లర్లపై రెవెన్యూ రికవరీ, పీడీ యాక్టులు పెట్టి వసూలు చేసే అవకాశం ఉంది. కేవలం 8 మిల్లులపై మొక్కుబడిగా 6ఏ కేసులతో తాత్సారం చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై తాజాగా పౌర సరఫరాల శాఖ కమిషనర్కు కొందరు రైస్మిల్లర్లే ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సీఎంఆర్ బకాయిలు రాబట్టడంపై కొందరిపై కఠినంగా, మరికొందరిపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించినట్లు తెలిసింది. ఈ మేరకు ఉమ్మడి వరంగల్లో సీఎంఆర్ బకాయిలపై కమిషనర్ కార్యాలయం తాజాగా ఆరా తీయడం రైస్మిల్లర్లలో చర్చనీయాంశంగా మారింది. డిఫాల్టర్ రైస్మిలర్లపై చర్యలు లేవు.. వారి వద్దే కస్టం మిల్లింగ్ రైస్ నోటీసులకే పరిమితమైన రికవరీ.. ‘తిలా పాపం తలా పిడికెడు’లా పరిస్థితి మూడేళ్లు గడిచినా ఇంకా మౌనమే.. మిల్లర్ల వ్యాపారానికి సర్కారు ధాన్యం అధికారుల ఉదాసీనతపై కమిషనర్ సీరియస్.. మళ్లీ తెరపైకి బకాయిల వ్యవహారం -
టెన్త్ పరీక్షలు ప్రారంభం
● నలుగురు విద్యార్థులు గైర్హాజరు ● కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్భూపాలపల్లి అర్బన్: జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు తెలుగు పరీక్ష ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ తెలిపారు. జిల్లాకేంద్రంలోని సింగరేణి పాఠశాల, ఆశ్రమ పాఠశాలను సందర్శించి పరీక్షల నిర్వహణను పరిశీలించారు. కలెక్టర్ రాహుల్శర్మ జంగేడు పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి పరీక్ష నిర్వహణ, మౌలిక సదుపాయాల ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. అదనపు కలెక్టర్ విజయలక్ష్మి గణపురం మండలకేంద్రంలోని మోడల్ స్కూల్ను సందర్శించారు. 3,544 మంది విద్యార్థులకు గాను నలుగురు విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈఓ రాజేందర్ వెల్లడించారు. పరీక్షల నిర్వహణలో భాగంగా ప్రభుత్వ పరీక్షల నియంత్రణ అధికారి సామల రమేష్ మహాముత్తారం, మహదేవపూర్ పాఠశాలలను సందర్శించారు. రెండు ఫ్ల్లయింగ్ స్క్వాడ్ బృందాలు పర్యవేక్షణ చేశాయి. -
బుకింగ్ డబుల్
ఆదివారం శ్రీ 15 శ్రీ మార్చి శ్రీ 2026భూపాలపల్లి: ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతుండటంతో భారత్లో గ్యాస్ సరఫరాలపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో జిల్లాలో గృహావసరాలకు మినహా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల పంపిణీ జరగడం లేదు. ఫలితంగా జిల్లాకేంద్రంలోని పలు రెస్టారెంట్లు, హోటళ్లు మూసివేయగా, పలువురు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నారు. డబుల్ అయిన గ్యాస్ బుకింగ్.. జిల్లాలో హెచ్పీ, భారత్, ఇండేన్ కంపెనీలకు చెందిన 12 ఏజెన్సీలు ఉన్నాయి. ఆయా ఏజెన్సీల్లో డొమెస్టిక్(గృహావసర) కనెక్షన్లు 1,32,330 ఉన్నాయి. ఆయా వినియోగదారులు గతంలో నెలకు సుమారు 1,500 గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకునే వారు. యుద్ధ వాతావరణం నేపథ్యం, గ్యాస్ కొరత తీవ్రం అవుతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం రోజుకు 2,800 నుంచి 3వేల మంది సిలిండర్ల కోసం బుక్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకరోజుకు జిల్లాకు సుమారు 2వేల సిలిండర్లు మాత్రమే వస్తున్నాయి. దీంతో డొమెస్టిక్ సిలిండర్ల కొరత కొంతమేరకు మాత్రమే ఉంది. బుకింగ్ చేసుకున్న వారు ఒకటి రెండు రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. మూతబడుతున్న హోటళ్లు, రెస్టారెంట్లు.. వంటగ్యాస్ కొరత నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల పంపిణీని నిలిపివేసింది. దీంతో జిల్లాకేంద్రంతో పాటు కాటారం డివిజన్ కేంద్రంలో పలు హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు గ్యాస్ సిలిండర్లు లేక ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. పలు రెస్టారెంట్ల యజమానులు మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నారు. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు.. గ్యాస్ కొరత ఎప్పుడు తీరుతుందో తెలియదనే ఉద్ధేశంతో వంటచెరుకును ఉపయోగించి ఆహార పదార్థాలను తయారు చేస్తున్నారు. కట్టెలను కొనుగోలు చేసి హోటల్, రెస్టారెంట్ సమీపంలో పొయ్యిలను ఏర్పాటు చేసుకొని తమ వ్యాపారానికి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. రీసైక్లింగ్ షురూ.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత నెలకొనడంతో కొందరు వ్యాపారులు కొత్త దందాకు దిగినట్లు సమాచారం. గృహావసరాల సిలిండర్లను రూ.1,500 నుంచి రూ.1,800 వరకు కొనుగోలు చేసి కమర్షియల్ సిలిండర్లలోకి రీసైక్లింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా జిల్లాకేంద్రంలోని పలు షాపుల యజమానులు సైతం డొమెస్టిక్ సిలిండర్లను కొనుగోలు చేసి రీసైక్లింగ్కు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రోజుకు 3వేల గ్యాస్ సిలిండర్ల బుకింగ్ వ్యాపార సంస్థలకు కమర్షియల్ గ్యాస్ నిలిపివేత మూతబడుతున్న హోటళ్లు, రెస్టారెంట్లు పలుచోట్ల కట్టెల పొయ్యితో వంటల తయారీ -
అక్రమ వినియోగంపై నిఘా..
ఎల్పీజీ సిలిండర్లు దాచివేత, బ్లాక్ మార్కెటింగ్, గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్యానికి వినియోగించడం వంటి అక్రమాలపై కఠిన నిఘా ఉంచినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సరఫరా పరిస్థితిపై జిల్లాస్థాయి ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ సూచనల మేరకు జిల్లాలో గ్యాస్ సరఫరా అందుబాటును నిరంతరం పర్యవేక్షించేందుకు మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, గ్యాస్ ఏజెన్సీలను జిల్లా అధికారులు సమన్వయం చేస్తూ వినియోగదారులకు అంతరాయం లేకుండా గ్యాస్ సరఫరా కొనసాగించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లకు గ్యాస్ సిలిండర్లు ప్రాధాన్యతతో సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. డొమెస్టిక్ సిలిండర్లను వ్యాపారానికి వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. – రాహుల్ శర్మ, కలెక్టర్ -
రేపటినుంచి ఒంటి పూట బడులు
భూపాలపల్లి అర్బన్: వేసవికాలం.. పైగా ఎండలు అధికంగా ఉన్న దృష్ట్యా ఒంటి పూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీచేసింది. దీంతో సోమవారం నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటి పూట బడులను నిర్వహించనున్నారు. ప్రతీరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు కొనసాగనున్నాయి. పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్న పాఠశాలల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు కొనసాగనున్నాయి. అందుకు అనుగుణంగా జిల్లా విద్యాశాఖ అధికారులకు ఉత్తర్వులు అందాయి. జిల్లావ్యాప్తంగా 430 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉండగా, వాటిలో 24 వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఒంటి పూట బడులు నిర్వహించనున్న నేపథ్యంలో యథావిధిగా మధ్యాహ్న భోజనం కొనసాగనుంది. అందుకు గాను విద్యాశాఖ అధికారులు నిర్వాహకులకు ఆదేశాలు జారీచేశారు. తరగతులు పూర్తయిన తరువాత మధ్యాహ్న భోజనం అందించి విద్యార్థులను ఇంటికి పంపాలని సూచించారు. ఎమ్మెల్యే పరామర్శ చిట్యాల: మొగుళ్లపల్లి మండలం కొర్కిశాల గ్రామంలో క్రేన్ వైర్ తెగి మృతిచెందిన ముగ్గురి మృతదేహాలను చిట్యాల సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆస్పత్రికి చేరుకుని మృతదేహాలను సందర్శించారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముకిరాల మధువంశీకృష్ణ, చిలుకల రాయకోంరు, గుర్రపు తిరుపతి గౌడ్, బుర్ర శ్రీనివాస్, తక్కళ్లపల్లి రాజు, ఏఎంసీ వైస్ చైర్మన్ రఫీ, అల్లం రాజు ఉన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థులు మల్హర్(కాటారం): రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ పోటీలకు మండలంలోని కాటారం ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల విద్యార్థులు ఎంపికయ్యారు. ఈనెల 13నుంచి ఈనెల 15 (ఆదివారం) వరకు హైదరాబాద్లోని చింతల్బస్తీలో జరుగుతున్న సీనియర్ మెన్ రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ పోటీల్లో చరణ్, శివబాలాజీ పాల్గొంటున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ ఆసనాడ మాధవి, సీనియర్ వైస్ ప్రిన్సిపాల్ వెంకటయ్య, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ బలారం, పీడీ కుడిమేత మహేందర్, పీటీ మంతెన శ్రీనివాస్ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. హేమాచలక్షేత్రంలో భక్తుల సందడిమంగపేట: మల్లూరు శ్రీ హేమాచలక్షేత్రంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. స్వయంభుగా వెలిసిన లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కార్లు, ప్రైవేటు బస్సులు, ఆటోలలో తరలివచ్చి ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. తిల తైలాభిషేకం పూజలో పాల్గొని మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారిని నిజరూప దర్శనం చేసుకున్నారు. ఆలయ అర్చకులు భక్తుల గోత్ర నామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి చరిత్ర, ఆలయ పురాణం వివరించి ఆశీర్వచనం ఇచ్చారు.


