Jayashankar
-
విద్యుత్ తీగలు అమర్చి చంపాలనుకుంది
టేకుమట్ల: కడవరకు నీతోనే ఉంటానని పెళ్లినాటి ప్రమాణాలను మరిచిన ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తపై హత్యాయత్నానికి పాల్పడింది. విద్యుదాఘాతంతో మృతిచెందినట్లు చిత్రీకరించే ప్రయత్నం బెడిసికొట్టింది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో బుధవారం జరిగింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ వివాహిత, మరో గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తమ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని, అతన్ని చంపాలనుకుంది. మంగళవారం రాత్రి భర్త పడుకున్న సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది. లైట్ ఆఫ్ చేసి, భర్త కాళ్లకు విద్యుత్ తీగలను అమర్చి ఆత్రుతగా స్విచ్ బోర్డ్లో విద్యుత్ సరఫరా లేని ప్లగ్లో పెట్టగా విద్యుత్ సరఫరా కాలేదు. వెంటనే ఇద్దరు కలిసి వేరే ప్లగ్లో పెట్టాలని మాట్లాడుకుంటున్న క్రమంలో భర్తకు మెలకువ వచ్చింది. ఎవరంటూ అరవడంతో ప్రియుడు పరార య్యాడు. వెంటనే లైట్లు ఆన్ చేయగా కాళ్లకు అమర్చిన విద్యుత్ వైర్లు, కరెంటు సరఫరాలేని ప్లగ్లో పెట్టడాన్ని గమనించి గ్రామస్తులకు తెలిపాడు. స్థానిక సర్పంచ్ సదరు మహిళను పోలీస్స్టేషన్లో అప్పగించినట్లు సమాచారం. -
కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్: మంత్రి ఉత్తమ్
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి మండిపడ్డారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం మేడిగడ్డ బ్యారేజ్ను సందర్శించారు. బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న జియో టెక్నికల్, జియో ఫిజికల్ పరీక్షలలో భాగంగా బోర్ హోల్స్ పనులను పరిశీలించారు.దివంగత సీఎం వైఎస్సార్ హయాంలోనే రాష్ట్ర రైతాంగానికి సాగు తాగునీరు అందించడానికి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టామని.. కాంగ్రెస్ ప్రభుత్వంలో 30 శాతం పనులు పూర్తి చేశామన్నారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తూ నిధులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారని గుర్తు చేశారు.కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వానికి పేరు రావద్దని.. కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు తెరపైకి తీసుకువచ్చారన్నారు. చేవెళ్ల నుండి మేడిగడ్డకు ప్రాజెక్టును మార్పు చేసి తెలంగాణకు తీరని ద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇప్పటివరకు లక్ష 45 వేల కోట్లు ఖర్చు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్టు నుండి ఒక్క చుక్క నీరు కూడా ఉపయోగంలోకి రాలేదన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే ప్రాజెక్టు లోపభూయిష్టంగా ఉందని నిపుణులు నివేదిక ఇవ్వడం జరిగిందని తెలిపారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఇతర సంస్థల చేత బ్యారేజ్ కొంగుబాటుపై దర్యాప్తు జరిపించడం జరిగిందన్నారు. ఆఫ్రి సంస్థ ఆధ్వర్యంలో రీ డిజైన్ పనులు కొనసాగుతున్నాయన్నారు. జూలై మొదటి వారంలోపు పరీక్షలు పూర్తి చేస్తామని తెలిపారు. -
తుదిదశకు ఇన్వెస్టిగేషన్
● ఈనెల 20కల్లా పూర్తి చేయడానికి ప్రణాళికలు ● నేడు మేడిగడ్డకు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కాళేశ్వరం: మహదేవపూర్ మండలంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, పెద్దపల్లి జిల్లాలోని సుందిళ్ల బరాజ్లలో పరిశోధన (ఇన్వెస్టిగేషన్) పరీక్షలు తుదిదశకు చేరుకున్నాయి. ఇప్పటిి వరకు 70శాతానికి పైగా పరీక్షలు పూర్తయ్యాయి. సుందిళ్ల బరాజ్లో మొత్తం 75 పరీక్షలకు 69 పూర్తికాగా.. అన్నారంలో 66కు 58 పూర్తయ్యాయి. మేడిగడ్డలో 85కు 73 జీపీఆర్ పరీక్షలు పూర్తయ్యాయి. బరాజ్లలో పరీక్షలను నీటిపారుదల కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ కల్నల్ పరీక్షిత్ మెహ్రాతో పాటు టీం స్థితిగతులను సమీక్షిస్తూ పనుల్లో వేగిరం పెంచుతున్నారు. మిగిలిన పరీక్షలు ఈనెల 20వరకు పూర్తి చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఇంజనీర్లు పనిచేస్తున్నారు. మేడిగడ్డ బరాజ్కు నేడు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి రానున్నారు. కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించిన పరిశోధన (ఇన్వెస్టిగేషన్) పనులు సుమారు 70శాతం వరకు పూర్తయి.. తుది దశకు చేరినట్లు ఇంజనీర్లు చెపుతున్నారు. కాంక్రీట్ నిర్మాణాలపై సమగ్ర నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ (ఎన్డీటీ) పరీక్షలు పూర్తి చేశారు. బరాజ్, వంతెనల వద్ద కాంక్రీట్ నిర్మాణంలో పగుళ్లు, ఖాళీలు, బలహీన ప్రాంతాలు ఉన్నాయా తెలుసుకోవడానికి ఎన్డీటీ పరీక్షలు చేశారు. అదే సమయంలో రాఫ్ట్ కింద ఉన్న భూగర్భ అసాధారణ పరిస్థితులను గుర్తించి మ్యాపింగ్ చేయడానికి గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) సర్వేలు జరుగుతున్నాయి. జీపీఆర్ పరికరం ద్వారా రేడియో తరంగాలను భూమి లేదా కాంక్రీట్లోకి పంపుతుంది. లోపలి పొరలు, ఖాళీలు, పగుళ్లు, ఇనుప రాడ్ల నుంచి తరంగాలు తిరిగి వస్తాయి. ఆ ప్రతి ధ్వనులను విశ్లేషించి లోపలి నిర్మాణం ఎలా ఉందో తెలుస్తుంది. 20 మెగాహెర్ట్ ్జ వరకు తక్కువ ఫ్రీక్వెన్సీ పరిధిలో ఈ సర్వేలు జరుపుతున్నారు. అధునాతన జీపీఆర్ వ్యవస్థలు ఇండియాలోనే చాలా అరుదుగా అందుబాటులో ఉన్నాయని ఇంజనీర్లు అంటున్నారు. నిర్మాణానికి ముందు చేపట్టిన అధ్యయనాల సమాచారాన్ని ధృవీకరించేందుకు వ్యూహాత్మకంగా బోర్హోల్ పరిశోధనలు నిర్వహించారు. తాజాగా వేసిన బోర్హోల్ పరీక్షల ఫలితాలు నిర్మాణానికి ముందు చేసిన పరిశోధనలతో అనుగుణంగా ఉన్నట్లు గుర్తించినట్లు తెలిసింది. భూగర్భ పరిస్థితులపై మరింత స్పష్టత కోసం 80 మీటర్ల లోతు వరకు అదనపు బోర్హోల్ డ్రిల్లింగ్ చేపట్టి, బెడ్ రాక్ స్థాయిలు, అడుగుభాగన భౌగోళిక నిర్మాణాలను అధ్యయనం చేస్తున్నారు. పునరుద్ధరణ రూపకల్పనకు అవసరమైన నమ్మకమైన డేటా సేకరణ కోసం భూగర్భ మట్టి దృఢత్వం, సాంద్రత, భరించే సామర్థాఽన్ని తెలుసుకోవడానికి ప్రమాణికంగా స్టాండర్డ్ పెనెట్రేషన్ టెస్టులు (ఎస్పీటీ) చేస్తున్నారు. నీటి పారగమ్యత (పర్మియబిలిటీ) పరీక్షలు నిర్వహించారు. గోదావరి నది ఒడ్డున గరిష్ట వరద మట్టం (ఎంఎఫ్ఎల్) వరకు తాజా టోపోగ్రాఫికల్, సర్వే వివరాలను సేకరించారు. ఇవి మెరుగైన హైడ్రాలిక్ మోడలింగ్ అధ్యయనాలకు ఉపయోగపడనున్నాయని తెలిసింది.45 డిగ్రీల సెల్సియస్కు పైగా నమోదవుతున్న తీవ్ర ఉష్ణోగ్రతలు, నైపుణ్యం కలిగిన సిబ్బంది కొరత వంటి సవాళ్లు ఉన్నప్పటికీ, రాత్రి వేళల్లో కూడా పని గంటలను పొడిగిస్తూ ప్రాజెక్టు బృందాలు పనులను నిరంతరంగా కొనసాగిస్తున్నాయి. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని రూపకల్పన చేశారు. హైడ్రాలిక్ మోడలింగ్ పూర్తి చేయడానికి వినియోగించనున్నారు. తుది పునరుద్ధరణ డిజైన్ల అమలుకు ముందు ఎన్డీఎస్ఏ, సీడబ్ల్యూసీ పరిశీలించి ఆమోదించనున్నాయి. -
మోహన్నాయక్పై ఇక్కడా ఆరా!
సాక్షిప్రతినిధి, వరంగల్: రోడ్లు–భవనాల శాఖ (ఆర్అండ్బీ) ఇంజనీర్ఇన్చీఫ్ జె.మోహన్నాయక్ అక్రమాస్తులపై సోదాలు చేపట్టిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు.. మంగళవారం ఉమ్మడి వరంగల్లోనూ ఆరా తీయడం సంచలనంగా మారింది. హైదరాబాద్తోపాటు బంధువులు, సన్నిహితులకు చెందిన నివాసాలు సహా 11 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఉమ్మడి వరంగల్లో సుదీర్ఘకాలం పనిచేసిన అధికారి కావడంతో ఈ ప్రాంతంలో ఇటీవల జరిగిన లావాదేవీలపై అందిన ఫిర్యాదులపైనా ఆరా తీసినట్లు తెలిసింది. ఈ విషయం ఆనోట ఈనోట బయటకు పొక్కడం స్థానిక కాంట్రాక్టర్లు, అధికారులు, రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఎవరీ మోహన్ నాయక్..? జె. మోహన్ నాయక్ తెలంగాణ ఆర్అండ్బీ శాఖలో అత్యంత కీలకమైన ‘ఇంజనీర్–ఇన్–చీఫ్ (స్టేట్ రోడ్స్)’ హోదాలో ఉన్నారు. అదే సమయంలో తెలంగాణ స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఆర్డీసీ) మేనేజింగ్ డైరెక్టర్గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మాణం, విస్తరణ, నిర్వహణ, పెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పర్యవేక్షణ ఆయన పరిధిలోనే ఉంటుంది. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేపడుతున్న అనేక రాష్ట్ర రహదారి ప్రాజెక్టులు, డబుల్ రోడ్లు, బ్రిడ్జిలు, అభివృద్ధి పనులు స్టేట్ రోడ్స్ విభాగం ఆధ్వర్యంలో సాగుతున్నాయి. వరంగల్–ములుగు, వరంగల్–నర్సంపేట, వరంగల్–మహబూబాబాద్ తదితర ప్రధాన రహదారి పనుల పర్యవేక్షణలో ఆయన కార్యాలయానికి కీలక పాత్ర ఉంది. ఈఎన్సీ పదోన్నతికంటే ముందు ఉమ్మడి వరంగల్ ఎస్ఈగా సుమారు నాలుగేళ్లు పనిచేశారు. దీంతో మోహన్ నాయక్ పేరు ఉమ్మడి వరంగల్లోని కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ వర్గాలకు సుపరిచితం. తాజాగా రూ. 6 లక్షల వసూలు.. కిందిస్థాయి అధికారుల సమక్షంలోనే.. గ్రేటర్ వరంగల్ను కలుపుకునే ఉండే ఓ నియోజకవర్గ పరిధిలో చేపట్టిన ఓ ఎర్త్వర్క్ (తారు వేసే ముందు)(మట్టి పనికి) సంబంధించిన వ్యవహారం ఇటీవల వివాదాస్పదంగా మారింది. కాంట్రాక్టర్కు భారీగా లాభం జరిగేలా అంచనాలు పెంచినట్లు తెలుసుకున్న సదరు ఈఎన్సీ హైదరాబాద్ నుంచి వచ్చి ఆగమేఘాల మీద ఆ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ కాంట్రాక్టర్నుంచి కిందిస్థాయి అధికారుల సమక్షంలోనే రూ.6 లక్షలు తీసుకోవడంపై ఇప్పుడు ఆర్అండ్బీ శాఖలో తీవ్ర చర్చ జరుగుతోంది. కాంట్రాక్టర్ల నుంచి పనుల బిల్లులు, అనుమతులు, కాలపరిమితి పొడిగింపుల పేరుతో వసూళ్లు జరిగాయన్న ప్రచారం కూడా ఉంది. అర్హత లేని కాంట్రాక్టర్కు భారీ పనులా? వరంగల్లో ఎస్ఈగా పనిచేసిన కాలంలో ఉన్న పరిచయాలతో అర్హత ప్రమాణాలు పూర్తిగా లేని ఓ కాంట్రాక్టర్కు సుమారు రూ.60 కోట్ల విలువైన రోడ్డు విస్తరణ, నిర్మాణ పనులు ఏడాది కింద అప్పగించారన్న ఫిర్యాదులున్నాయి. ఆ రూ.60 కోట్ల పనికి టెండర్ అయిన సమయంలో అంతే విలువ గల పనులకు రెండేళ్లు కాలపరిమితి ఇచ్చి.. సదరు కాంట్రాక్టర్కు మాత్రం మూడేళ్లు ఇవ్వడం అప్పట్లో వివాదాస్పదమైంది. అంతేకాకుండా పనుల కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా ప్రత్యేక అనుమతులతో గడువు పెంచి పనులు కొనసాగించేందుకు అవకాశం కల్పించారనే విమర్శలు ఉన్నాయి. ఈ వ్యవహారాలకు సంబంధించిన పాత రికార్డులు, టెండర్ పత్రాలను కూడా విచారణ సంస్థలు పరిశీలించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా శాఖలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు ఇంజనీరింగ్ అధికారులకు కీలక పోస్టింగులు, బదిలీలు, పనుల కేటాయింపుల్లో మోహన్నాయక్ ప్రభావం చూపారనే ప్రచారం ఆ శాఖలో సాగుతోంది. దీంతో ఏసీబీ దర్యాప్తు ఎటువైపు మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ ఆ వర్గాల్లో నెలకొంది. చర్చనీయాంశంగా ఆర్అండ్బీ ఈఎన్సీపై ఏసీబీ దాడులు ఉమ్మడి వరంగల్లో రోడ్ల విస్తరణ, నిర్మాణ టెండర్లనుంచి ఎర్త్వర్క్ల వరకు ఆరోపణల జాబితా తాజాగా రూ.6 లక్షలు వసూలు? కిందిస్థాయి అధికారుల్లో చర్చ ఉమ్మడి వరంగల్లో నాలుగేళ్లు ఎస్ఈగా సేవలు అర్హత లేకున్నా కొందరు కాంట్రాక్టర్లకు పనులు.. రూ.60కోట్ల ఓ టెండర్పైనా ఆరా ఏసీబీ దాడులతో ఆర్అండ్బీ వర్గాల్లో కలకలం -
ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాలు సురక్షితం
రేగొండ: ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు సురక్షితమని, తగిన పౌష్టికాహారం తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి మధుసూదన్ పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆస్పత్రిలో జరుగుతున్న ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గర్భిణులు రక్తహీనత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పుట్టిన గంటలోపే బిడ్డకు తల్లి పాలు పట్టించాలని, శిశువులకు వ్యాధులు సోకకుండా ఉండేందుకు వ్యాధినిరోధక టీకాలు వేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో పీఓ ఎంసీహెచ్ డాక్టర్ శ్రీదేవి, మండల వైద్యాధికారిణి హిమబిందు, ఆశకార్యకర్తలు, గర్భిణులు పాల్గొన్నారు.సింగరేణిని కాపాడేందుకు ఏకం కావాలి భూపాలపల్లి అర్బన్: కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు అన్యాయం చేస్తోందని, కార్మిక లోకం ఏకమై సింగరేణిని కాపాడుకోవాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం ఏరియాలోని కేటీకే–1వ గనిలో నిర్వహించిన గేట్మీటింగ్లో ఆయన మాట్లాడారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు, మెడికల్ అన్ఫిట్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడంలో విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలు పెరగడం వల్ల సంస్థ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు. ఈ నెల 12న మాజీ మంత్రి హరీశ్రావు భూపాలపల్లిలో నిర్వహించనున్న సమావేశానికి సింగరేణి కార్మికులు అధికసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అధికారుల తనిఖీ మల్హర్(కాటారం): కాటారం మండల పరిధిలోని ఎరువులు, పురుగుల మందులు, విత్తనాల విక్రయ కేంద్రాలపై మంగళవారం టాస్క్ఫోర్స్, రెవెన్యూ, వ్యవసాయ, పోలీస్శాఖ అధికారులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. లక్ష్మీగణపతి ట్రేడర్స్, శ్రీ రాజరాజేశ్వర అగ్రిమాల్ షాపులను క్షుణ్ణంగా పరిశీలించారు. దుకాణాల్లోని రికార్డులు, పత్తి విత్తనాల నిల్వలు (స్టాక్స్), వాటికి సంబంధించిన సర్టిఫికెట్లు, డిస్ప్లే బోర్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులను విక్రయించాలన్నారు. అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. -
పోలీసు సిబ్బందికి ప్రశంసపత్రాలు
భూపాలపల్లి: విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ ఉత్తమ సేవలు అందించిన పోలీసు సిబ్బందికి ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆధ్వర్యంలో మంగళవారం పోలీస్ కార్యాలయంలో అభినందించి ప్రశంస పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన పోలీసు సేవలు అందించడంలో ప్రతీ పోలీసు సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. క్రమశిక్షణ, నిజాయితీ, సేవాదృక్పథంతో విధులు నిర్వర్తించే సిబ్బందిని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. పోలీసు శాఖ ప్రతిష్టను పెంపొందించే విధంగా ప్రతి ఒక్కరూ తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని ఎస్పీ పిలుపునిచ్చారు. గణపురం పోలీస్స్టేషన్ తనిఖీ గణపురం: గణపురం పోలీస్స్టేషన్ను ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతి, సీసీ కెమెరాల పనితీరు, స్టేషన్ పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీస్స్టేషన్కు వచ్చే కేసుల దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటు ప్రజల ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా వ్యవహరించి నేరాల నియంత్రణకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రజలకు నాణ్యమైన పోలీస్ సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట గణపురం సీఐ కరుణాకర్ రావు, ఎస్ఐ అశోక్ ఉన్నారు. -
మాది ప్రజాప్రభుత్వం
చిల్పూరు/జఫర్గఢ్: కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. జనగామ జిల్లా చిల్పూరు మండలంలోని పల్లగుట్ట గ్రామంలో మంగళవారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి హాజరయ్యారు. తొలుత ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కావ్య, కలెక్టర్ సందీప్ కుమార్ఝా, ట్రాన్స్కో సీఎండీ కృష్ణభాస్కర్, ఎన్పీడీసీఎల్ సీఎండీ కె.వరుణ్రెడ్డి, చిల్పూరు ఆలయ చైర్మన్ శ్రీధర్రావు, స్థానిక సర్పంచ్ నర్సింహారెడ్డి డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రజలనుద్దేశించి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. స్టేషన్ఘన్పూర్ ప్రాంతం ఒకప్పుడు వలసలకు కేరాఫ్గా ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవన్నారు. నియోజకవర్గంలో దేవాదుల ప్రాజెక్టు, రిజర్వాయర్ల ద్వారా పంటలకు నీరు అందడం, పెరిగిన వ్యవసాయ పంపుసెట్ల వల్ల పంట దిగుబడులు పెరిగి రైతుల ఆదాయం పెరిగి వలసలు తగ్గాయన్నారు. ఏ ప్రాంతంలో నీరు ప్రవహించాల న్నా, ఇతర అవసరాలకూ విద్యుత్ అవసరమని, అందుకు విద్యుత్ వ్యవస్థను నిరంతరం ఆధునీకరిస్తున్నామన్నారు. నియోజకవర్గ సమస్యలను ఎమ్మెల్యే శ్రీహరి తన దృష్టికి తీసుకొచ్చారని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు పల్లగుట్ట గ్రామంలో రూ.60.62 కోట్లతో చేపట్టిన 4 విద్యుత్ సబ్స్టేషన్ల ప్రారంభం, 3 సబ్స్టేషన్ల శంకుస్థాపనల శిలాఫలకాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి ఎరువుల షాపులు, దివ్యాంగులకు సంబంధించిన స్టాళ్లను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రూ.3.5 కోట్ల విలువైన సీ్త్రనిధి చెక్కులు అందజేశారు. 107 స్వయం సహాయక సంఘాల మహిళలకు సీ్త్రనిధు రుణాల కింద రూ.3.07 కోట్లు, బ్యాంకు లింకేజీ కింద 407 స్వయం సహాయక సంఘాలకు రూ.32.89కోట్ల విలువైన చెక్కులను మహిళలకు అందించారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు యశస్వినిరెడ్డి, నాగరాజు, నాయిని రాజేందర్రెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డి, ఆయిల్ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రూపాషా, కుడా చైర్మన్ వెంకట్రాంరెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ పేరుతో బీజేపీ కుట్ర: ఎంపీ కావ్య ఓటు హక్కుపై ఎస్ఐఆర్ పేరుతో బీజేపీ చేస్తున్న కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని ఎంపీ కడియం కావ్య అన్నారు. 10 ఏళ్లుగా అబివృద్ధిలో చీకట్లో మగ్గిపోయిన స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గం కడియం నాయకత్వంలో మోడల్ నియోజకవర్గంగా రూపుదిద్దుకుంటున్నట్లు తెలిపారు. నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యవసాయ, గృహ అవసరాలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు.రఘునాథపల్లిలో ఉన్న 132/ 33 కేవీ సబ్ స్టేషన్ను 220/133 కేవీ సబ్ స్టేషన్గా అప్గ్రేడ్ చేయాలని, ఇళ్లపై నుంచి వెళ్తున్న విద్యుత్ లైన్లను తొలగించేందుకు నిధులు మంజూరు చేయాలని డిప్యూటీ సీఎంను కోరారు. సాగునీటి వసతులతో ఘన్పూర్లో వలసలు తగ్గాయి పల్లగుట్ట సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రూ.60.62 కోట్లతో 4 సబ్స్టేషన్ల ప్రారంభం, 3 సబ్స్టేషన్లకు శంకుస్థాపన -
ఈవీఎం గోదాం తనిఖీ
భూపాలపల్లి అర్బన్: జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ మంగళవారం జిల్లాకేంద్రంలోని ఈవీఎం, వీవీ పాట్ గోదామును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదాంలో భద్రపరిచిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు, వీవీపాట్ యంత్రాల భద్రతను పరిశీలించారు. గోదాంలో అమలు చేస్తున్న భద్రతా చర్యలు, సీసీటీవీ పర్యవేక్షణ, అగ్నిమాపక పరికరాలు, డబుల్ లాక్ సిస్టమ్ అంశాలను కలెక్టర్ పరిశీలించారు. యంత్రాల నిర్వహణ రికార్డులు, స్ట్రాంగ్ రూమ్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఎన్నికల సంఘం సూచించిన నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. తనిఖీలో ఎన్నికల విభాగం పర్యవేక్షకులు అబ్బాస్, నవీన్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఖర్చు పెరుగుతోంది..
జిల్లా కేంద్రంలో ఆటోడ్రైవర్గా పనిచేస్తున్నాను. డ్రైవర్గా పని చేస్తూనే మా ఇద్దరు పిల్లల్ని ప్రైవేట్లో చదివిస్తున్నా. చదువుల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో అధిక మొత్తం వరకు డబ్బు వెచ్చించాల్సి వస్తోంది. దీనికి తోడు రోజువారీ ఖర్చులు నిత్యావసరాలు, ఇంటి అద్దె పోనూ రూపాయి కూడా మిగలడం లేదు. మళ్లీ కొత్త అప్పులు చేయాల్సి వస్తోంది. – తిక్క రాజు, హన్మాన్నగర్, భూపాలపల్లి జూన్ వచ్చిందంటే చాలు రెండువైపులా పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. ఒకవైపు పిల్లల చదువులపై, మరోవైపు పంట పెట్టుబడులు, ఇలా రెండు వైపులా ఒకేసారి ఒకే నెలలో ఖర్చు పెట్టాల్సి రావడంతో భారంపడుతోంది. రైతు భరోసా డబ్బులు త్వరగా ఇవ్వాలి. – కె.శ్రావణ్రెడ్డి, చింతలపల్లి, మహాముత్తారం -
భారీగా ఎస్సైల బదిలీలు
భూపాలపల్లి: జిల్లాలో 15 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ కాళేశ్వరం జోన్ డీఐజీ అంబర్ కిషోర్ ఝా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. డీఎస్బీ ఎస్సైగా పని చేస్తున్న సీహెచ్ శ్రీనివాస్ను కాటారం ఎస్హెచ్ఓగా, వీఆర్లో ఉన్న జె.మహేష్ను కాటారం ఎస్సై 2గా, మహాముత్తారం ఎస్సై పి.మహేందర్కుమార్ను కొయ్యూరుకు, వీఆర్లో ఉన్న ఎ.కల్యాణ్ను కొయ్యూరు ఎస్సై 2, భూపాలపల్లి ఎస్సై 2 జి.రమేష్ను మహాముత్తారం ఎస్హెచ్ఓగా, వీఆర్లో ఉన్న సాయి శశాంక్ను పలిమెల ఎస్హెచ్ఓ, భూపాలపల్లి ఎస్సై 1 మచ్చ సాంబమూర్తిని మహదేవపూర్ ఎస్హెచ్ఓగా, పలిమెల ఎస్సై జె.రమేష్ను మహదేవపూర్ ఎస్సై 2, మహదేవపూర్ ఎస్హెచ్ఓగా పని చేస్తున్న కె.పవన్కుమార్ను భూపాలపల్లి ఎస్సై 1, కొయ్యూరు ఎస్హెచ్ఓగా ఉన్న వి.నరేష్ను డీఎస్బీకి, వేకెన్నీ రిజర్వ్లో ఉన్న వి.రజన్కుమార్ను చిట్యాల ఎస్సై 2గా, ఆర్.అశోక్, ఎ.శ్రీనివాస్లను డీఎస్బీకి, ఈ.సురేష్ను డీసీఆర్బీ, చిట్యాల ఎస్సై 2గా పని చేస్తున్న ఎండీ షాఖాన్ను వీఆర్కు బదిలీ చేస్తూ డీఐజీ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీచేశారు. 15 మందిని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ -
జయశంకర్ భూపాలపల్లి
మంగళవారం శ్రీ 9 శ్రీ జూన్ శ్రీ 20267కొండెక్కిన చేపల ధరలుమృగశిర కార్తె నాడు చేపలు తినాలనే సాంప్రదాయాన్ని పాటించేందుకు జిల్లావ్యాప్తంగా ప్రజలు ఉదయం నుంచే చెరువులు, చేపల మార్కెట్ వద్ద క్యూ కట్టారు. జిల్లాలోనే అతిపెద్ద చెరువైన గణపురం మండలకేంద్రంలోని గణపసముద్రం చెరువుతో పాటు, మండలంలోని పలు కుంటలు, చెరువుల నుంచి మండలకేంద్రానికి సోమవారం చేపలను తీసుకొచ్చి పెద్దఎత్తున విక్రయించారు. సాధారణంగా తెల్లచేపలు రవ్వులు, బొచ్చ కిలో రూ.200 ఉండగా.. సోమవారం కిలో రూ.300పైన విక్రయించారు. కొర్రమీను చేపలు సాధారణంగా రూ.300 ధర ఉంటే.. మృగశిర సందర్భంగా రూ.400 నుంచి 500 వరకు విక్రయించారు. – గణపురం -
నిధులున్నా.. అనుమతుల్లేవ్!
కాళేశ్వరంలో పనులకు ఫారెస్ట్ క్లియరెన్స్ చిక్కులుఅభివృద్ధి పనులకు అటవీశాఖ అనుమతులు లేక నిధులు మూలుగుతున్నాయి. మహదేవపూర్ నుంచి కాళేశ్వరం వంతెన వరకు జాతీయ రహదారి 353(సీ)రోడ్డుకు అటవీశాఖ పలు కారణాలతో కొర్రీలు పెడుతూ వస్తోంది. దీంతో నేటికీ రోడ్డుకు మోక్షం కలుగలేదు. ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.3.96 కోట్ల నిధులు మంజూరు చేసి ఏడాదిన్నర కావస్తున్నా రెవెన్యూ వర్సెస్ అటవీశాఖ మధ్యన స్థలం పంచాయితీ ఎటూ తేలడం లేదు. రూ.22కోట్ల వ్యయంతో పలుగుల టు కుంట్ల వరకు రోడ్డు నిర్మాణం కోసం మార్చిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు శంకుస్థాపన చేసినా అటవీశాఖ క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో పనులు సాగడం లేదు. – కాళేశ్వరంప్రధాని మోదీ శంకుస్థాపన చేసినా.. మహదేవపూర్ నుంచి కాళేశ్వరం వంతెన వరకు జాతీయ రహదారి 353(సీ) పనులకు నాలుగేళ్ల కిందట రూ.163 కోట్ల వ్యయంతో కేంద్ర నిధులతో రామగుండంలో వర్సువల్గా పీఎం నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు. మహదేవపూర్ నుంచి కాళేశ్వరం వరకు 14 కిలోమీటర్లలో 1,700 వరకు చెట్లు కోల్పోతుంది. కేంద్రం ఏజెన్సీ పర్యటించి ఎంత మేరకు రోడ్డు విస్తరణలో చెట్లు కోల్పోతున్నది అంచనా వేసింది. అటవీమార్గంలో కల్వర్టు వద్ద జంతువులు రోడ్డు క్రాస్ చేయడానికి నిర్మాణాలు చేయాలని సూచించారు. కేంద్రం పరిశీలనలో ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పట్లో అనుమతులు వచ్చేలా లేవని సమాచారం. రూ.163కోట్లు మంజూరైనా రోడ్డు పనులు మొదలు కాకుండా జాప్యం జరుగుతుంది. దీంతో వచ్చే ఏడాది కాళేశ్వరంలో జరిగే గోదావరి పుష్కరాల వరకు కూడా రోడ్డు నిర్మాణం అయ్యేలా కనిపించడం లేదు. రెవెన్యూ.. ఫారెస్టు పంచాయితీ కాళేశ్వరంలో ప్రస్తుతం ఉన్న పాత బస్టాండ్ స్థలం చిన్నగా ఉండడంతో పుష్కరాలు, ఉత్సవాలు జరిగినప్పుడు వినియోగించే తాత్కాలిక బస్టాండ్ స్థఽలంలో రెవెన్యూశాఖ 4.34 ఎకరాలను ఆర్టీసీకి కేటాయించింది. రూ.3.96 కోట్ల నిధులు కూడా మంజూరయ్యాయి. పనులు మొదలు పెట్టే సమయంలో అటవీశాఖ అధికారులు అడ్డుకొని తమ రిజర్వు ఫారెస్టు భూమి అని నిలిపివేశారు. దీంతో ఆ రెండు శాఖల మధ్య పంచాయితీ ఎటూ తేలడం లేదు. మంత్రి శ్రీధర్బాబు దృష్టికి తీసుకు వెళ్లినా ఇప్పటికీ స్పష్టత రాలేదని తెలిసింది. ఉన్నతాధికారులు స్పందిస్తే వచ్చే గోదావరి పుష్కరాల వరకు బస్టాండ్ భక్తులకు అందుబాటులోకి రానుంది. 8 కిలోమీటర్ల రోడ్డుకు.. మద్దులపల్లి క్రాస్రోడ్డు నుంచి కుంట్లం గ్రామం వరకు 8 కిలోమీటర్ల రోడ్డుకు అటవీశాఖ మెలిక పెట్టిందని తెలిసింది. ఇప్పటికే ఉన్నటువంటి రోడ్డుకు ప్రస్తుతం ప్రభుత్వం రూ.23 కోట్లు మంజూరు చేసింది. కానీ రోడ్డు విస్తరణకు అటవీశాఖ అడ్డంకి చెప్పడంతో మంత్రి శ్రీధర్బాబు దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. ప్రస్తుతం కలెక్టర్, డీఎఫ్ఓల పరిశీలనలో ఉంది. కానీ వర్షాకాలం సీజన్ కావడంతో పలుగుల, కుంట్లం గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తప్పేలా లేవని విమర్శలు ఉన్నాయి. ఎన్హెచ్ అనుమతులకు పంపాం..మహదేవపూర్ టు కాళేశ్వరం వరకు 14 కిలోమీటర్ల అడవిలో రోడ్డు నిర్మాణానికి మా తరఫున పెండింగ్ లేదు. కేంద్రానికి ఆన్లైన్లో పంపాం. కేంద్రం ఏజెన్సీ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన చేసింది. ఆర్టీసీకి ఎక్కడా మా ఫారెస్టు తరఫున స్థలం కేటాయించలేదు. రెవెన్యూ పత్రం తీసుకువచ్చారు. కానీ తమ ఫారెస్టు నుంచి అనుమతులు లేవు. పలుగుల రోడ్డుకు త్వరలో అనుమతులతో పనులు ప్రారంభం కానున్నాయి. – సందీప్రెడ్డి, ఎఫ్డీఓ, మహదేవపూర్ ఎన్హెచ్, బస్టాండ్, రోడ్డు అభివృద్ధి పనులకు బ్రేక్ పట్టించుకోని పాలకులు, ఉన్నతాధికారులు -
అధికారులకు క్షేత్రస్థాయి అవగాహన కీలకం
భూపాలపల్లి: ప్రతి అధికారికి క్షేత్ర స్థాయి అవగాహన అత్యంత కీలకమని కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు. 2025 బ్యాచ్ ఐఏఎస్ అధికారుల శిక్షణలో భాగంగా ‘తెలంగాణ దర్శన్’ కార్యక్రమం కింద ఆరుగురు ట్రెయినీ ఐఏఎస్ అధికారులు ఆదివారం, సోమవారం జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని పాండవులగుట్ట (రేగొండ మండలం), కేటీపీపీ(చెల్పూర్), సింగరేణి ఓపెన్కాస్ట్, భూగర్భ గనులను సందర్శించారు. రెండు రోజుల పర్యటన ముగిసిన అనంతరం, సోమవారం శిక్షణా ఐఏఎస్ అధికారులు ఐడీఓసీ కార్యాలయంలో కలెక్టర్ రాహుల్ శర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో నిర్వహించిన పర్యటనకు సంబంధించిన వివిధ అంశాలను అధికారుల బృందాన్ని కలెక్టర్ రాహుల్ శర్మ అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారికి పలు సూచనలు, సలహాలు అందజేశారు. జిల్లాలో పర్యటించిన వారిలో ట్రెయినీ ఐఏఎస్లు ఇట్టబోయిన సాయి శివాణి, సచిన్ బసవరాజ్, ఎన్ శ్రీకాంత్రెడ్డి, పోతరాజు హరిప్రసాద్, పరాస్ కుమార్, సురేష్ పామూరి ఉన్నారు. సమస్యల పరిష్కారానికి గ్రామసభలే వేదిక మల్హర్: గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించేందుకు గ్రామసభలు సమర్థవంతమైన వేదికగా నిలుస్తాయని కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. సోమవారం మల్హర్ మండలం రుద్రారం గ్రామంలో ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం’లో భాగంగా నిర్వహించిన గ్రామసభలో కలెక్టర్ రాహుల్శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతీ గ్రామసభలో వివిధ శాఖల అధికారులు తమ శాఖల ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలు, ప్రజలకు అందుబాటులో ఉన్న సేవలపై అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామసభల ద్వారా గ్రామస్తుల సమస్యలను నేరుగా తెలుసుకొని త్వరితగతిన పరిష్కరించే అవకాశం కలుగుతుందని చెప్పారు. ముఖ్యంగా ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియ, ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతులు పంటల సేద్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు పారిశుద్ధ్యం, కాలుష్య నియంత్రణ, సురక్షిత తాగునీటి నిర్వహణ తదితర కీలక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని కలెక్టర్ వివరించారు. అందిన సమస్యలను సంబంధిత అధికారుల ద్వారా వెంటనే పరిశీలించి, త్వరితగతిన పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఆర్డీఓ రవీందర్, మండల ప్రత్యేక అధికారి, జిల్లా వ్యవసాయ అధికారి బాబూరావు, తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీఓ క్రాంతికుమార్, సీడీపీఓ రాధిక, సర్పంచ్ సంపత్ పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ -
జిల్లాకేంద్రాన్ని అభివృద్ధి చేయరా?
భూపాలపల్లి: జిల్లా కేంద్రమైన భూపాలపల్లిని అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా ఆస్పత్రి అస్తవ్యస్తంగా మారిందని, పేషెంట్లు నానా అవస్థలు పడుతున్నా కనీస సౌకర్యాలు కల్పించే నాథుడే కరువయ్యాడన్నారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు అటకెక్కాయని, కార్మికుల వారసులు ప్రైవేట్ ఉద్యోగాలు, కూలీనాలీ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. స్థానిక ఎమ్మెల్యేకు పోలీసులు దాసోహం అయ్యారని ఆరోపించారు. ఇండస్ట్రియల్ పార్కు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ శిలాఫలకాలకే పరిమితం అయ్యాయన్నారు. తన హయాంలో చేసిన అభివృద్ధి తప్ప కొత్తగా ఏమీ లేదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్, నాయకులు కళ్లెపు రఘుపతిరావు, సెగ్గెం సిద్ధు, పిల్లలమర్రి నారాయణ తదితరులు పాల్గొన్నారు. అధ్వానంగా జిల్లా ఆస్పత్రి అటకెక్కిన సింగరేణి వారసత్వ ఉద్యోగాలు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి -
పాఠశాలలను బలోపేతం చేయాలి
● జిల్లా విద్యాశాఖాధికారి రాజేందర్ మొగుళ్లపల్లి: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి రాజేందర్ అన్నారు. సోమవారం మండలకేంద్రంలోని విద్యావనరుల కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాప్రమాణాలు పెంచేందుకు ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. నాణ్యమైన విద్యను అందించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలన్నారు. బడిబాటలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పారు. తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి లింగాల కుమారస్వామి, ఎంఐఎస్ కోఆర్డినేటర్ చంద్రమౌళి, సీఆర్పీలు రాములు, శ్రీనివాస్, ఉపాధ్యాయులు కృష్ణారెడ్డి, మహేష్, కొమురెల్లి, రమేష్ పాల్గొన్నారు. -
దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
● డీఆర్ఓ వసంతకుమారి భూపాలపల్లి: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డీఆర్ఓ వసంతకుమారి సూచించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 75 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం డీఆర్ఓ మాట్లాడుతూ.. ప్రజావాణి అప్టికేషన్లు పెండింగ్లో ఉంచవద్దని అధికారులకు సూచించారు. 14న సైక్లింగ్ పోటీలుములుగు/ములుగు రూరల్: ఈ నెల 14న ములుగు జిల్లాకేంద్రంలో అస్మిత ఖేలో ఇండియా బాలికల సిటీ సైక్లింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీనియర్, జూనియర్, సబ్ జూనియర్ విభాగాల్లో పోటీలు జరుగుతాయని, విజేతలకు మెరిట్ సర్టిఫికెట్తో పాటు మెడల్స్ అందజేస్తామన్నారు. పోటీల్లో పాల్గొనే ప్రతీఒక్కరికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ అందిస్తామన్నారు. -
ఐటీడీఏలో వినతుల స్వీకరణ
ఏటూరునాగారం: ఏటూరునాగారం ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్లో ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో 27 మంది గిరిజనుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. గిరిజన సహకార సంస్థ మహదేవ్పూర్లోని గ్యాస్ గోదాంలో డెలవరీ బాయ్స్గా పనిచేస్తున్న వారిని తొలగించి, వేరే వారిని నియమించాలని గిరిజన ప్రాథమిక సహకార సంస్థ డైరెక్టర్లు బుచ్చయ్య, పోచయ్య తెలిపారు. మంగపేట మండలం గంపోనిగూడెం గ్రామానికి చెందిన గిరిజనుడు 2008–09 నుంచి ఇప్పటి వరకు పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వడం లేదని, దానికి కోసం నిత్యం ప్రదక్షిణలు చేస్తున్నట్లు గిరిజనులు తెలిపారు. ములుగు గ్రామంలో సంధ్యారాణి ఎంబీఏ కంప్యూటర్ పూర్తి చేసి ఉన్నానని, ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని విన్నవించారు. ఏటూరునాగారం మండలం షాపెల్లి గ్రామానికి చెందిన గిరిజనులు రుణం కావాలని విన్నవించారు. కార్యక్రమంలో ఎస్డీసీ ప్రతాప్, ఈఈ వీరభద్రం, డీటీ అనిల్, డిప్యూటీ డీఎంహెచ్ఓ క్రాంతికుమార్, జీసీసీ డీఎం వాణి, జేడీఎం కొండల్రావు, పెసా కోఆర్డినేటర్ ప్రభాకర్ పాల్గొన్నారు. -
స్టేషన్ ఘన్పూర్లో నేడు డిప్యూటీ సీఎం పర్యటన
జనగామ: జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో నేడు (మంగళవారం) ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన 4 సబ్స్టేషన్లను ప్రారంభించడంతోపాటు మరో 3 సబ్స్టేషన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి తదితరులు హాజరుకానున్నారు. కోటగుళ్లలో ప్రత్యేక పూజలుగణపురం: గణపురం మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు నాగరాజు ఆధ్వర్యంలో ఉదయం నుంచి గణపేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు.భక్తులు పెద్ద ఎత్తున స్వామి వారిని దర్శించుకున్నారు. మృగశిర కార్తె వచ్చె.. వర్షం తెచ్చె.. కాళేశ్వరం: ఎండల తీవ్రతతో సతమతమవుతున్న ప్రజలకు భారీ వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. సోమవారం రాత్రి మహదేవపూర్, కాళేశ్వరంలో గంటన్నరపాటు వర్షం కురిసింది. మృగశిర కార్తె సందర్భంగా కురిసిన ఈ వర్షాన్ని ప్రజలు శుభసూచకంగా భావిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజులుగా 46–47 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. తాజాగా కురిసిన వర్షంతో మండల వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. దీంతో ఖరీఫ్ సీజన్లో మొదటి వర్షం కావడంతో రైతులు వ్యవసాయ పనులకు సిద్ధం కానున్నారు. ఘన వ్యర్థాల నిర్వహణపై అవగాహన సదస్సు భూపాలపల్లి అర్బన్: ఘన వ్యర్థాల నిర్వహణపై సోమవారం మున్సిపల్ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్, స్వచ్ఛ భారత్ మిషన్కు చెందిన 60మంది కార్మికులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీపీసీబీ నోడల్ అధికారి శ్రీకాంత్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు, తడి–పొడి చెత్త వేరుచేసే విధానం, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన చట్టాలపై అవగాహన కల్పించారు. చెత్త రహిత గ్రామాలు, పట్టణాల నిర్మాణంలో కార్మికుల పాత్ర, పరిశుభ్రత ప్రమాణాల అమలుపై జిల్లా స్వచ్ఛ భారత్ మిషన్ కో–ఆర్డినేటర్ వెంకటేష్ సూచనలు చేశారు. మున్సిపల్ పరిధిని పరిశుభ్రంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దడంలో క్షేత్రస్థాయి సిబ్బంది కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. హేమాచలక్షేత్రంలో 11న బహిరంగ వేలంమంగపేట: మండలంలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహాస్వామి ఆలయ ప్రాంగణంలో వివిధ రకాల షాపుల నిర్వాహణ హక్కులు పొందేందుకు ఈనెల 11న దేవాదాయఽ శాఖ ఆధ్వర్యంలో బహిరంగ వేలం పాట నిర్వహించనున్నట్లు ఆలయ ఇన్చార్జ్ కార్యనిర్వాహణాధికారి వీరస్వామి సోమవారం తెలిపారు. 2026 మే 15 నుంచి 2027 జూన్ 25 వరకు సంవత్సరం పాటు కొబ్బరి కాయలు, పూజసామగ్రి విక్రయాలు జరుపుకునేందుకు 2 షాపులు, క్యాంటీన్లు 2, బొమ్మలు, గాజులు, దేవుడి ఫొటోలు విక్రయ షాపులకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈనెల 11న ఉదయం 11 గంటలకు హేమాచల క్షేత్రంలోని కల్యాణ మండపంలో నిర్వహించే వేలంలో పాల్గొనే వారు కొబ్బరికాయలు, పూజ సామగ్రి ఒక్కో షాపునకు రూ.50,000, బొమ్మలు, గాజులు, క్యాంటీన్లు ఒక్కో షాపునకు రూ.25,000 చొప్పున దరావత్తు చెల్లించి వేలం పాటలో పాల్గొనవచ్చన్నారు. -
అడ్మిషన్ల పెంపే లక్ష్యం
భూపాలపల్లి అర్బన్: విద్యార్థుల అడ్మిషన్ల పెంపు లక్ష్యంగా భూపాలపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపక బృందం సోమవారం విస్తృత ప్రచారం నిర్వహించింది. ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ బి.బాలునాయక్ ఆధ్వర్యంలో అధ్యాపకులు సదానందం, అనిల్కుమార్, రాజు, నరేష్ గొల్లబుద్దారం, చికెన్పల్లి, పంబాపూర్, అజాంనగర్, నందిగామ, దీక్షకుంట, లంబాడీతండా, పలు గ్రామాల్లో పర్యటించి విద్యార్థులు, తల్లిదండ్రులను కలిశారు. ఈ సందర్భంగా కళాశాలలో అందుబాటులో ఉన్న ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ, ఏసీఈసీ గ్రూపులు తెలుగు, ఇంగ్లిషు మాధ్యమాల్లో అందుబాటులో ఉన్నాయని వివరించారు. విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం, ఉచిత పాఠ్యపుస్తకాలు, గ్రంథాలయ వసతి, స్కాలర్షిప్లు కల్పిస్తున్నట్లు తెలిపారు. సైన్స్ విద్యార్థులకు ఆధునిక ప్రయోగశాలలతో పాటు ప్రత్యేక ఐఐటీ–జేఈఈ, నీట్ కోచింగ్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలో ప్రభుత్వ పర్యవేక్షణలో అల్పాహారం, మధ్యాహ్న భోజన వసతి, నీట్, ఈఎంసెట్ పరీక్షలకు పూర్తి ఫీజు రాయితీ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. దూర ప్రాంతాల విద్యార్థులకు ఆర్టీసీ బస్సు పాస్ సదుపాయం, విశాలమైన భవనాలు, అనుభవజ్ఞులైన ప్రభుత్వ అధ్యాపకులతో నాణ్యమైన విద్యాబోధన కళాశాల ప్రత్యేకతలని వివరించారు. పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులు భూపాలపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరి ప్రభుత్వ విద్యా సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని అధ్యాపకులు పిలుపునిచ్చారు. జూనియర్ కళాశాల అధ్యాపకుల ప్రచారం -
సమస్యల తక్షణ పరిష్కారమే లక్ష్యం
భూపాలపల్లి: ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారమే లక్ష్యంగా పోలీసుశాఖ పని చేస్తోందని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజాదివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 15 మంది నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు పైరవీలు లేకుండా, మూడవ వ్యక్తి ప్రమేయం లేకుండా, నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. చట్టబద్ధమైన విధానంలోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలకు మరింత చేరువగా ఉండడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు.ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
గుట్కా, పొగాకు ఆరోగ్యానికి హానికరం
గుట్కా, పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది. వీటిలో ఉండే నికోటిన్ కారణంగా వ్యసనం పెరిగి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నోటిలో పుండ్లు, తెల్లటి మచ్చలు, నోరు తెరవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. యువత గుట్కా, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి. – డాక్టర్ వెంకటరత్నం, ప్రొఫెసర్ ఈఎన్టీ, భూపాలపల్లి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి -
గుట్కా జోరు
భూపాలపల్లి అర్బన్: నిషేధిత గుట్కా వ్యాపారం జిల్లాలో మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది. ప్రభుత్వం గుట్కా విక్రయాలపై పూర్తిస్థాయిలో నిషేధం విధించినప్పటికీ ఇక్కడి కేటుగాళ్లు మాత్రం యథేచ్ఛగా నల్లబజారులో దందాను కొనసాగిస్తున్నారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ నుంచి గుట్టుచప్పుడు కాకుండా రవాణా చేస్తూ స్థానిక కిరాణషాపులు, పాన్ డబ్బాల్లో రెట్టింపు ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పోలీసులు, టాస్క్ఫోర్స్ అధికారులు అప్పుడప్పుడు నామమాత్రపు దాడులు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఈ అక్రమవ్యాపారానికి అడ్డుకట్ట పడడం లేదు. అధికారుల లీలలు, మాఫియా నెట్వర్క్ కారణంగా జిల్లాలో యువత గుట్కా వ్యసనానికి బానిసవుతూ ఆరోగ్యాన్ని గుల్ల చేసుకుంటుంది. ఎక్కడా తగ్గలే.. జిల్లాకేంద్రంతో పాటు కాటారం, మహదేవపూర్, మల్హర్, టేకుమట్ల, చిట్యాల, మొగుళ్లపల్లి, గణపు రం, రేగొండ తదితర మండలాల్లో గుట్కా విక్రయాలు బహిరంగంగానే జరుగుతున్నాయి. పాఠశాలలు, కళాశాలల సమీపంలోని చిన్న దుకాణాల నుంచి గ్రామీణ ప్రాంతాల కిరాణా షాపుల వరకు నిషేధిత గుట్కా ప్యాకెట్లు సులభంగా లభిస్తున్నాయి. ప్రభుత్వం నిషేధించినా విక్రయాలు మాత్రం ఎక్కడా తగ్గుముఖం పట్టకపోవడం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ప్రాంతాల నుంచి జిల్లాలో విక్రయమవుతున్న గుట్కా ఉత్పత్తులలో ఎక్కువ భాగం హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ వంటి ప్రాంతాల నుంచి ట్రాన్స్పోర్ట్ వాహనాల ద్వారా రహస్యంగా జిల్లాకు చేరుతున్నట్లు సమాచారం. ఆదివారం ఉదయం భూపాలపల్లి సీసీఎస్ పోలీసులు ట్రాన్స్పోర్ట్ వాహనంలో వచ్చిన ఆరు నిషేధిత గుట్కా సంచులను పట్టుకున్నారు. సాధారణ సరుకుల మధ్య గుట్కా కార్టన్లను దాచిపెట్టి రవాణా చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రైవేట్ వాహనాలు, చిన్న సరుకు రవాణా వాహనాలను కూడా వినియోగిస్తున్నట్లు సమాచారం. అక్రమ రవాణాదారులు తనిఖీలను తప్పించుకునేందుకు కొత్త మార్గాలను అనుసరిస్తున్నారని, రాత్రి వేళల్లో ఎక్కువగా సరఫరాలు జరుగుతున్నాయని తెలిసింది. జిల్లా కేంద్రంతో పాటు కాటారం, మహదేవపూర్లకు చేరిన తర్వాత చిన్న వ్యాపారుల ద్వారా గ్రామాలకు పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. నోటి క్యాన్సర్, దంత సమస్యలు.. గుట్కా వినియోగం కారణంగా యువతలో అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నోటి క్యాన్సర్, దంత సమస్యలు, జీర్ణకోశ వ్యాధులు, గుండె సంబంధిత సమస్యలకు గుట్కా ప్రధాన కారణంగా మారుతోందని చెబుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, యువకులు సులభంగా గుట్కాకు బానిసలవుతున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది. తక్కువ ధరలో లభించడం, సులభంగా అందుబాటులో ఉండటం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కూడా గుట్కా వినియోగం పెరుగుతోందని పలువురు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై కూడా ఈ వ్యసనం ప్రతికూల ప్రభావం చూపుతోందని అంటున్నారు. నిషేధం కాగితాలకే పరిమితమా..? ఆహార భద్రత, ప్రమాణాల చట్టం 2006 ప్రకారం మానవ ఆరోగ్యానికి హానికరమైన ఆహార పదార్ధాల తయారీ నిల్వ పంపిణీ, విక్రయాలు నిషేధించింది. గుట్కా విక్రయాలపై ప్రభుత్వం పలుమార్లు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినప్పటికీ వాటి అమలు విషయంలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆహార భద్రత శాఖ, పోలీస్ శాఖ, ఇతరశాఖల అధికారులు సంయుక్తంగా చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ అక్రమ వ్యాపారం కొనసాగుతుండటం పర్యవేక్షణలో లోపాలను సూచిస్తోంది. జిల్లాలో గుట్కా అక్రమ రవాణా, నిల్వలు, విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలి ట్రాన్స్పోర్ట్ కేంద్రాలు, గోదాములు, హోల్సేల్ వ్యాపార కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి గుట్కా సరఫరా దందాలో ఉన్న ప్రధాన నిర్వాహకులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం విధించిన నిషేధం అధికారులు సమర్థవంతంగా అమలుచేయాలి నిషేధం అమలు కావాలంటే సంబంధిత శాఖల మధ్య సమన్వయం పెరగాలి నిరంతర పర్యవేక్షణ, ప్రత్యేక దాడులు, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గుట్కా విక్రయాలపై అధికారులు మరింత కఠినంగా వ్యవహరించాలి నిషేధం ఉన్నా బహిరంగంగానే వ్యాపారం హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ నుంచి భారీగా దిగుమతి అధికారుల నామమాత్రపు దాడులు యువత భవిత బుగ్గిపాలు -
ఫిట్నెస్పై కదలట్లే..!
సాక్షిప్రతినిధి, వరంగల్ : మరో వారం రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. వేలాది మంది విద్యార్థులు మళ్లీ బడి బస్సులు, వ్యాన్లలో ప్రయాణించేందుకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో విద్యార్థుల ప్రాణ భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. అనేక ప్రైవేట్ పాఠశాలల బస్సులు, వ్యాన్లు ఫిట్నెస్ చేయించుకపోవడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. 33.43 శాతం బస్సులు ఇంకా సామర్థ్య పరీక్షల నిర్ధారణ (ఫిట్నెస్) సర్టిఫికెట్లు పొందలేదు. సోమవారం (జూన్ 1) నాటికి 820 బస్సులు ఫిట్నెస్కు దూరంగా ఉన్నాయి. ఫిట్నెస్ నత్తనడకపై సాక్షి కథనం.. స్కూల్ బస్సుల ఫిట్నెస్ నత్తనడకన నడుస్తోందని ‘సాక్షి’ వారం కిందటే కథనం రూపంలో అధికారులు దృష్టికి తీసుకెళ్లింది. వారిలో పెద్ద కదలిక లేకపోవడం, ఇటు స్కూల్ యాజమాన్యాలు కూడా మాములుగా తీసుకోవడంతో వారం రోజుల్లో 125 బస్సులకు మాత్రమే ఫిట్నెస్ చేశారు. ఇంకా 693 బస్సులకు బీమా, పర్మిట్లు, కాలుష్య ధ్రువపత్రాలు సైతం నవీకరించకపోయినా అధికారులు కఠిన చర్యలకు కదలడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తనిఖీలు, చర్యలు ఇంకెప్పుడు..? హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, జేఎస్ భూపాలపల్లి జిల్లాల్లో వందలాది ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఎక్కువభాగం విద్యార్థుల రవాణాకు బస్సులు, వ్యాన్లు నిర్వహిస్తున్నాయి. ప్రతిరోజూ వేలాది మంది విద్యార్థులు ఈ వాహనాలపై ఆధారపడుతున్నారు. ప్రతీ విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు రవాణా శాఖ, పోలీసులు, విద్యాశాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాలి. కానీ పాఠశాలలు తెరుచుకునే సమయం దగ్గరపడుతున్నా ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తృత స్థాయిలో తనిఖీలు జరగలేదని తెలుస్తోంది. రవాణాశాఖ గణాంకాల ప్రకారం ఉమ్మడి వరంగల్లో మొత్తం 2,079 స్కూల్ బస్సులు, వ్యాన్లు ఉంటే.. శనివారం నాటికి 1,386 వాహనాలకే సామర్థ్య పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు జారీ చేశారు. 693 బస్సులకు ఇంకా ఫిట్నెస్ నిర్వహించలేదు. హనుమకొండ జిల్లాలో 348, వరంగల్లో 172, మహబూబాబాద్లో 43, జనగామలో 75, జేఎస్ భూపాలపల్లిలో 28, ములుగులో 27 బస్సులు ఫిట్నెస్కు దూరంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాగా, గతేడాది తనిఖీల్లో అరిగిపోయిన టైర్లు, పని చేయని ఎమర్జెన్సీ డోర్లు, గడువు ముగిసిన ఫైర్ ఎక్స్టింగ్విస్టర్లు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేకపోవడం, సీట్లకు మించి విద్యార్థులను ఎక్కించడం, జీపీఎస్ పరికరాలు పనిచేయకపోవడం, స్పీడ్ గవర్నర్లు లేకపోవడం వంటి ప్రధాన లోపాలను గుర్తించి సరిచేశారు. ఈసారి 693 బస్సులు ఇంకా ఫిట్నెస్కు దూరంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఫిట్నెస్ లేకుండా పాఠశాల బస్సులు రోడ్డెక్కితే కేసులు నమోదు చేస్తాం. ఫిట్నెస్ తోపాటు డ్రైవర్ తప్పని సరిగా లైసెన్స్ కలిగి ఉండాలి. క్లీనర్తోపాటు మిగతా నిబంధనలు కచ్చితంగా పాటించాలి. పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకోవద్దు. – నాగలక్ష్మి, ఎంవీఐ, హనుమకొండ గ్రామీణ ప్రాంతాలకు ఎక్కువగా నడుపుతున్నారుకొన్ని పాఠశాలల నిర్వాహకులు ఫిట్నెస్ లేని బస్సులను ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో నడుపుతున్నారు. ఇక్కడ తనిఖీలు ఎక్కువ జరగవని, ఎవరూ పట్టించుకోరని నడుపుతున్నారు. పాఠశాలలు ప్రారంభం కాగానే అధికారులు తనిఖీలు నిర్వహించాలి. – నద్దునూరి నాగరాజు, పేరెంట్ సీరియస్గా తీసుకోని స్కూళ్ల యాజమాన్యాలు, అధికారులు ఉమ్మడి జిల్లాలో 2,079 స్కూల్ బస్సులకు 1,386కే సామర్థ్య పరీక్షలు వారంలో 125 బస్సులకే ఫిట్నెస్.. ఇంకా ఫిట్నెస్ లేనివి 33.43 శాతం వారంలో తెరుచుకోనున్న స్కూళ్లు.. తనిఖీలు, చర్యలపై మీనమేషాలుఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇలా... స్కూల్ బస్సులు : 2,079 ఫిట్నెస్ చేసినవి : 1,386 చేయించుకోనివి : 693 -
గ్యాస్ ‘బండ’ మోత
కనెక్షన్ల వివరాలు భూపాలపల్లి: సామాన్యుడి వంటగదిలో మరోమారు ‘గ్యాస్’ మంటలు రేగాయి. నిత్యం పెరుగుతున్న ధరలతో ఇప్పటికే సతమతం అవుతున్న పేద, మధ్యతరగతి ప్రజలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి భారాల వడ్డన వదిలింది. గృహావసరాలకు వినియోగించే(డొమెస్టిక్) గ్యాస్ సిలిండర్ ధరను ఆదివారం నుంచే రూ.29 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రకటించడంతో వినియోగదారులు ఒక్కసారిగా బిత్తెరపోయారు. మూడు నెలల్లోనే రెండోసారి.. మూడు నెలల క్రితం మార్చి నెలలో కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూ.60 మేర పెంచి షాక్ ఇచ్చింది. ఆ భారం నుంచి కోలుకోకముందే, ఇప్పుడు మరోమారు రూ.29 పెంచింది. తాజా పెంపుతో జిల్లాలో గ్యాస్ సిలిండర్ ధర రికార్డు స్థాయిలో రూ.1,013కు చేరుకుంది. సిలిండర్ ధర రూ.వేయి దాటడంతో పేద, మధ్యతరగతి ప్రజలు ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు. జిల్లా ప్రజలపై భారం.. గ్యాస్ సిలిండర్ ధర పెంపు ప్రభావం జిల్లాపై తీవ్రంగా పడనుంది. జిల్లాలో హెచ్పీ, భారత్, ఇండేన్ గ్యాస్ కంపెనీలకు చెందిన డొమెస్టిక్ కనెక్షన్లు మొత్తం 1,31,426 ఉన్నాయి. ఆదివారం పెరిగిన రూ.29 ధరతో పోల్చి చూస్తే.. జిల్లాలోని గ్యాస్ వినియోగదారులపై నెలకు ఏకంగా రూ.38,11,354 అదనపు భారం పడనుంది. నిత్యావసరాల ధరలు ఇప్పటికే ఆకాశాన్ని తాకుతుండగా, ఇప్పుడు గ్యాస్ బిల్లు కూడా పెరగడంతో నెలవారీ బడ్జెట్ తలకిందులు అవుతుందని సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – నునావత్ విజయ, గృహిణి, మహాముత్తారం హెచ్పీ 49,345ఇండేన్ 43,106భారత్ 38,975మొత్తం 1,31,426 మళ్లీ పెరిగిన సిలిండర్ ధర రూ.29 పెంపుతో రూ.1,013 జిల్లా ప్రజలపై నెలకు రూ.38,11,354 భారం -
నేడు మృగశిర కార్తె..
ఏటూరునాగారం: నేటి మృగశిర కార్తెకు మత్స్యకారులు సిద్ధమవుతున్నారు. సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇది సంప్రదాయకంగా రుతుపవన వర్షాల ప్రారంభాన్ని సూచిస్తుంది. మృగశిర కార్తె రోజు చేపలను తింటే అనారోగ్య సమస్యలు ఉండవని ప్రజలు భావిస్తుంటారు. అందుకని మత్స్యకారులు పెద్ద ఎత్తున చేపలు పట్టి విక్రయించడానికి వలలు సిద్ధం చేసుకున్నారు. నేడు(సోమవారం) ఉదయం నుంచే చేపలు అమ్మడానికి ఏటూరునాగారం మండల కేంద్రంలోని చేపల మార్కెట్ వద్దకు చేపలను తరలించడంతో పాటు ఓడవాడ, రామన్నగూడెం, రాంనగర్, జెడ్పీహెచ్ఎస్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా చేపల విక్రయదారులు ధరలను పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
పూజల నిర్వహణ ఎక్కడ?
● 17న కాళేశ్వరం దేవస్థానం అభివృద్ధి పనులు ప్రారంభం ● షాపింగ్ కాంప్లెక్సు నిర్వాహకుల ఆందోళన కాళేశ్వరం: కాళేశ్వరం దేవస్థానం అభివృద్ధి పనులకు ఈనెల 17న ముహూర్తం ఖరారు కావడంతో భక్తులు, ప్రజల్లో సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. కాళేశ్వరం దేవస్థానానికి రూ.198కోట్ల వ్యయంతో రాతి నిర్మాణం పనులు చేపడుతుండగా, ప్రస్తుత గర్భాలయంతో పాటు పలు ఉప ఆలయాల తొలిగింపు ప్రక్రియ జరుగనుంది. దీంతో గర్భాలయంలోని జోడు లింగాలకు తమిళనాడులోని శిల్పులు కొలతలు తీసుకున్నారు. వాటిని యధాస్థితిలో ఉంచి నిర్మాణ సమయంలో ప్రమాదం లేకుండా పైన కప్పులాగా నిర్మించనున్నారు. అడవిలోని ఆదిముక్తీశ్వరాలయం వద్ద బాలాలయం ఏర్పాటు కానుందని తెలిసింది. అక్కడే పూజలు నిర్వహణ జరుగుతుందని తెలిసింది. కానీ శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కాలసర్ప నివారణ పూజలు ప్రతీ మంగళవారం నిర్వహిస్తారు. శనివారం నవగ్రహాల వద్ద శనిపూజలు భక్తులు అధిక సంఖ్యలో నిర్వహిస్తుంటారు. ఆలయ పునరుద్ధరణ నేపథ్యంలో పూజలు ఎక్కడ నిర్వహిస్తారనేది భక్తులు, స్థానికుల్లో ఆందోళనలు కలుగుతున్నాయి. కాలసర్ప, శనిపూజలు వీఐపీఘాటులో ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. భక్తులు నేరుగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసి అక్కడే పూజలు చేసి ఆదిముక్తీశ్వరాలయంలో అభిషేక పూజలు చేసుకునేలాగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అలా కాకుండా ఆదిముక్తీశ్వరాలయం వద్ద శని, కాలసర్ప నివారణ పూజలు చేసే వీలు కల్పిస్తారా అనేది ఈ నెల 10వ తేదీ వరకు దేవాదాయశాఖ ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలిసింది. కాళేశ్వరం దేవస్థానం పరిధిలోని షాపింగ్ కాంప్లెక్సు తొలగించనున్న కారణంగా ఆయా షాపుల సముదాయాల్లో వివిధ దుకాణాలు, బొమ్మలు, మనియార్, పూలు, కొబ్బరికాయలు, పూజా సామగ్రి, హోటళ్లు నిర్వహణకు ప్రతియేటా రూ.కోటికి పైగా ఆలయానికి ఆదాయం వస్తుంది. ఆదిముక్తీశ్వరస్వామి ఆలయం వద్ద దుకాణాలు ఎలా కేటాయిస్తారో అని ఎదురు చూస్తున్నారు. వీఐపీ ఘాటు వద్ద శని, కాలసర్ప పూజలు ఏర్పాటు చేస్తే దుకాణాల నిర్వహణ రెండు చోట్ల ఏర్పాటు చేసే వీలున్నట్లు సమాచారం. దీంతో దుకాణాల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. పునరుద్ధరణతో ఏమైనా కాల వ్యవధి పొడిగిస్తారా అనేది తెలియాల్సి ఉంది. -
అంబర్, గుట్కా ప్యాకెట్ల స్వాధీనం
భూపాలపల్లి: జిల్లాకేంద్రంలో భారీ ఎత్తున ప్రభుత్వ నిషేధిత అంబర్, గుట్కా ప్యాకెట్లను సీసీఎస్ పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. సీసీఎస్ సీఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని కాశీంపల్లికి చెందిన యూసఫ్ వద్ద నిషేధిత పొగాకు ఉత్పత్తులు ఉన్నట్లు సమాచారం అందింది. ఈ మేరకు ఆదివారం ఉదయం దాడులు నిర్వహించి రూ. 1.92 లక్షల విలువైన అంబర్తో పాటు వివిధ రకాల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ అభిప్రాయం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని సీఐ రమేష్ వెల్లడించారు. -
భూ తగాదాతో వ్యక్తిపై కత్తితో దాడి
చిట్యాల: భూ తగాదాల విషయంలో ఒకరిపై కత్తితో దాడిచేసి గాయపరిచిన ఘటన మండలంలోని కొత్తపేట గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన ఎండీ.రాజ్మహ్మద్కు అదే గ్రామానికి చెందిన చిగురు నరేష్కు మధ్య గతంలో భూతగాదాల విషయంలో గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆదివారం గ్రామ శివారులో ట్రాక్టర్లలో మట్టి తరలిస్తున్న క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఆవేశానికి గురైన నరేష్ కత్తితో రాజ్మహ్మద్పై దాడిచేయడంతో తీవ్రగాయాలపాలయ్యాడు. ఇది గమనించిన గ్రామస్తులు రాజ్మహ్మద్ను సివిల్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హనుమకొండ ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి సోదరుడు అఫ్జల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పోచంపల్లి సతీష్ తెలిపారు. కేయూ బాటనీ విభాగం అధిపతిగా మమత కేయూ క్యాంపస్: కేయూ బాటనీ విభాగం అధిపతిగా యూనివర్సిటీ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్, కెమిస్ట్రీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ మమతను నియమిస్తూ (తదుపరి ఉత్వర్వులు వెలువడేవరకు) రిజిస్ట్రార్ వి.రామచంద్రం ఉత్తర్వులు జారీచేశారు. ఆమె ఈనెల 6న సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ప్రొఫెసర్ లలితాకుమారి ఇప్పటివరకు బాటనీ విభాగం అధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె పదవీ కాలం ముగియగా మళ్లీ విభాగం అధిపతిగా యూనివర్సిటీ అధికారులు కొనసాగించడం లేదు. దీంతో మమతను బాటనీ విభాగం అధిపతిగా నియమించారు. కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లలో ఒకరికి అవకాశం? యూనివర్సిటీలోని బాటనీ విభాగంలో ఒక్కరు రెగ్యులర్ ఫ్రొఫెసర్, ఐదుగురు కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్నే బాటనీ విభాగం అధిపతిగా నియమిస్తారా అనేది యూనివర్సిటీలో చర్చనీయాంశమైంది. సీనియారిటీని పరిగణనలోనికి తీసుకొని విభాగం అధిపతిగా ఒక కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ను నియమించాలని వీసీ, రిజిస్ట్రార్ను కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు కోరినట్లు సమాచారం. నేటి నుంచి కేయూ దూరవిద్య పీజీ సెమిస్టర్ పరీక్షలు కేయూ క్యాంపస్: కేయూ పరిధి దూరవిద్య సీడీఓఈ/ఎస్డీఎల్సీఈ ఎంఏ, ఎంకామ్, హెచ్ఆర్ఎం, జేఎంసీ, ఎమ్మెస్సీ కోర్సుల (2023–24 బ్యాచ్) మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 8వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పద్మజ తెలిపారు. ఈనెల 8, 10, 12, 15, 17, 19, 22 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆయా తేదీల్లో పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. మొత్తం 11 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు, 2,354 మంది పరీక్షలు రాయనున్నట్లు పేర్కొన్నారు. హేమాచల క్షేత్రంలో కోలాహలంమంగపేట: మండల పరిధిలోని మల్లూరు హేమాచల క్షేత్రంలోని లక్ష్మీనర్సింహస్వామి దేవాలయంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. సెలవురోజు కావడంతో రాష్ట్రంలోని వరంగల్, హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం, కరీంనగర్ తదితర ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, రాజమండ్రి, గుంటూరు నుంచి భక్తులు భారీ సంఖ్యలో వివిధ వాహనాల్లో ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్నారు. ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. అత్యంత భక్తి శ్రద్ధలతో స్వయంభు స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. ఆలయ పూజారులు భక్తుల గోత్రనామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. -
మండుటెండలో ఉపాధి కష్టం
భానుడు భగ్గుమంటున్నా ఉపాధి హామీ పనుల వద్ద కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. కూలీలకు కనీసం గుక్కెడు తాగునీరు, కాసేపు సేదదీరేందుకు టెంట్ సౌకర్యం కూడా కల్పించకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. మహాముత్తారం మండలంలోని మహాముత్తారం, పెగడపల్లి, బోర్లగూడెం గ్రామాల్లో ఉపాధి పనులు కొనసాగుతున్నాయి. శనివారం పెగడపల్లి గోరుకల కుంటలో పూడికతీత పనులు చేపడుతున్న ఉపాధిహామీ కూలీలకు తాగునీరు, నీడకోసం టెంట్, అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే ఎమర్జెన్సీ కిట్టు సౌకర్యాలేవీ కల్పించలేదు. ఎండతీవ్రతను తట్టుకునేందుకు అక్కడే ఉన్న చెట్టునీడన కూలీలు సేదదీరారు. – మహాముత్తారం -
రేగొండలో పలు షాపుల తనిఖీ
రేగొండ: మండలకేంద్రంలోని పలు షాపులను తహసీల్దార్ శ్వేత, ఎస్సై సుధాకర్, ఏఓ వాసుదేవారెడ్డి శనివారం తనిఖీ చేశారు. ఇన్వాయిస్, స్టాక్ రిజిస్టర్, బిల్లు బుక్కులను పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్వేత మాట్లాడుతూ నకిలీ విత్తనాలు అమ్మితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. విత్తన డీలర్లు విధిగా స్టాక్ వివరాలు, ధరల పట్టిక రోజు వారిగా నమోదు చేయాలన్నారు. అధిక ధరలకు విత్తనాలను విక్రయించే వారిపై పీడీ యాక్టు కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విత్తనాలను లైసెన్స్ కలిగిన డీలర్ల నుంచి కొనుగోలు చేసి రశీదు పొంది రశీదును పంట కాలం పూర్తయ్యే వరకు భద్రపరుచుకోవాలని రైతులకు సూచించారు. -
‘నీట్’కు పకడ్బందీ ఏర్పాట్లు
భూపాలపల్లి అర్బన్: ఈ నెల 21న నిర్వహించనున్న నీట్ను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. నీట్ నిర్వహణ, ధాన్యం కొలుగోలు, జూన్ 9న సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించనున్న ఆంశాలపై శనివారం సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల్లో భద్రత, సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ ధృవీకరణ, ప్రశ్నపత్రాల సురక్షిత రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ నెల 9న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగే మహిళా సంఘాల సభకు జిల్లాల నుంచి మహిళలను సురక్షితంగా తరలించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. జిల్లా నుంచి వెళ్లే మహిళా సంఘాల సభ్యులకు రవాణా, తాగునీరు, ఆహారం, ప్రథమ చికిత్స సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. -
కీలక పోస్టులు ఖాళీ
ఏటూరునాగారం: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గిరిజనుల సంక్షేమమే ధ్యేయంగా ఏర్పాటైన ఏటూరునాగారం ఐటీడీఏలో ప్రస్తుతం పలు కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కీలక పోస్టులు నెలల తరబడి ఖాళీగా ఉండడంతో గిరిజనుల సంక్షేమం కుంటుపడుతోంది. దీనిపై పాలకులు, అధికారులు ఏమాత్రమూ పట్టించుకోవడం లేదు. దీంతో గిరిజనులకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఖాళీలు ఏం ఉన్నాయంటే.. ఏటూరునాగారం ఐటీడీఏ అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారిగా పనిచేస్తున్న నాగోరావు గతనెల 31న పదవీ విరమణ పొందారు. ఆయన స్థానంలో ఇంకా ఎవరినీ భర్తీ చేయలేదు. ఐటీడీఏ పరిపాలన అధికారిగా పనిచేసే రాంబాబు గతేడాది డిప్యూటేషన్పై భద్రాచలం ఐటీడీఏకు వెళ్లారు. అప్పుడు ఎస్ఓగా రాజ్కుమార్కు ఏఓ ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఇటీవల ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రాజ్కుమార్ బదిలీపై ఉట్నూరు వెళ్లడంతో ఏఓ పోస్టు ఖాళీగా ఉంది. భద్రాచలంలో పనిచేస్తున్న ఏఓ రాంబాబు డిప్యూటేషన్ రద్దు చేసి ఐటీడీఏకు తిరిగి రప్పించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ఎలాంటి ఉత్తర్వులూ రాలేదు. ఎస్ఓ రాజ్కుమార్ బదిలీ కావడంతో ఎస్ఓ పోస్టు కూడా ఖాళీగానే ఉంది. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాయంలో పనిచేస్తున్న డీటీ(డిప్యూటీ తహశీల్దార్) కిశోర్ను కన్నాయిగూడెం తహశీల్దార్ కార్యాలయానికి డిప్యూటేషన్పై పంపించారు. కన్నాయిగూడెంలో రెగ్యులర్ డీటీ వచ్చినప్పటికీ ఐటీడీఏ నుంచి వెళ్లిన డీటీ డిప్యూటేషన్ను రద్దు చేయకపోవడంతో ఐటీడీఏలో ఎస్డీసీ కార్యాలయంలో డీటీ పోస్టు ఖాళీగా ఉంది. ఇలా అనేక కీలక పోస్టుల్లోని అధికారులు బదిలీలు, డిప్యూటేషన్లలో ఉండడంతో కార్యాలయం పనితీరు అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు, పాలకులు స్పందించి ఐటీడీఏ కార్యాలయంలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని గిరిజనులు కోరుకుంటున్నారు. ఏటూరునాగారం ఐటీడీఏలో ఇన్చార్జ్ అధికారులు డిప్యుటేషన్లో కొందరు.. బదిలీలో మరికొందరు.. పట్టించుకోని పాలకులు, అధికారులు -
19న కిసాన్ మేళా
భూపాలపల్లి రూరల్: ఈ నెల 19న జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో కిసాన్మేళా ఏర్పాటుచేస్తున్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబురావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వ్యవసాయశాఖ చేపట్టే కార్యక్రమాలను వ్యవసాయ శాస్త్రవేత్తలను చర్చించనున్నట్లు తెలిపారు. రైతులు అధిక సంఖ్యలో పాల్గొని కిసాన్ మేళాను విజయవంతం చేయాలని కోరారు. ఆదిముక్తీశ్వరాలయంలో దర్శనాలు? కాళేశ్వరం: ఈ నెల 17న కాళేశ్వరం దేవస్థానంలో శంగేరి పీఠం శిష్య బృందం ఆధ్వర్యంలో కళాపకర్షణ క్రతువు నిర్వహించనున్నారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాల్లో భాగంగా కొత్త రాతి నిర్మాణాలు, పాత దేవాలయాల తొలగింపు పనులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన ఆలయంలో భక్తుల దర్శనాలకు అంతరాయం కలగనున్నందున భక్తులకు దర్శన సౌకర్యం కల్పించేందుకు దేవాదాయ శాఖ అడవి ప్రాంతంలో ఉన్న ఆది ముక్తీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు సమాచారం. పునర్నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు భక్తులు అక్కడే స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆలయంలో ఒకే పాన వట్టంపై ఉన్న జోడు లింగాలకు (శివుడు, యముడు) ప్రమాదం లేకుండా పై కప్పు నిర్మిస్తున్నారు. దర్శనాల ఏర్పాట్లు, సమయాలు ఇతర వివరాలపై దేవస్థానం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మూడు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత రేగొండ: అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. మండలంలోని కనిపర్తి గ్రామ శివారులో శనివారం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్నారు. అనంతరం ట్రాక్టర్ డ్రైవర్లు కౌటం ప్రశాంత్, పున్నం రమేష్, కుర్రే కిరణ్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. అనుమతి పత్రాలు లేకుండా ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గోదావరిలో తగ్గుతున్న నీటిమట్టం కన్నాయిగూడెం: గోదావరిలో నీరు తగ్గుముఖం పడుతుండడంతో సమ్మక్కసాగర్ బ్యారేజీ ఎగువన బండలు తేలి బయట కనిపిస్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న నీటిని సమ్మక్కసాగర్ గేట్లు ఎత్తి నీటిని ఎప్పటికప్పుడు దిగువకు వదులుతుండడంతో బ్యారేజీ ఎగువన నీటిమట్టం తగ్గుతోంది. ఈ క్రమంలో గోదావరిలో ఉన్న బండరాళ్లు బయట పడ్డాయి. బ్యారేజీ నిర్మాణం సమయంలో నీటిని మళ్లించి నిర్మాణాలు చేయాలని గోదావరికి అడ్డుగా కాఫర్ డ్యామ్ను బండరాళ్లతో నిర్మించారు. నిర్మాణం పూర్తి కావడంతో పాటు గోదావరిలోకి భారీగా వరదలు వచ్చి చేరడంతో అక్కడే ఉండిపోయింది. దీంతో నీరు తగ్గడంతో గోదావరి పొడవున బండరాళ్లు రోడ్డుమాదిరిగా కనిపిస్తున్నాయి. కాజీపేట మీదుగా రెండు ప్రత్యేక రైళ్లు కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్ మీదుగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు, ప్రయాణికుల సౌకర్యార్థం బిలాస్పూర్–బెంగళూరు కాంట్ మధ్య వేసవి ప్రత్యేక రైలును నడిపిస్తున్నట్లు శనివారం దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ ఎ.శ్రీధర్ తెలిపారు. ఈనెల 12న బిలాస్పూర్–బెంగళూరు కాంట్ (08263) వెళ్లే వీక్లీ ఎక్స్ప్రెస్ మరుసటి రోజు కాజీపేటకు చేరుకుని వెళ్తుంది. ఈరైలుకు భత్పర, రాయ్పూర్, దుర్గ్, వాడ్స, చాంద్ఫోర్ట్, బల్లార్షా, సిర్పూర్ కాగజ్నగర్, మంచిర్యాల, కాజీపేట, చర్లపల్లి, సికింద్రాబాద్, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, యాద్గిర్, కృష్ణ, రాయ్చూర్, మంత్రాలయం రోడ్డు, గుంతకల్, గూటి, అనంతపూర్, ధర్మవరం, హిందూపూర్, యెలహంకలో హాల్టింగ్ కల్పించారు. -
ఉద్యోగి భద్రతకు అత్యంత ప్రాధాన్యం
భూపాలపల్లి అర్బన్: ప్రతీ ఉద్యోగి భద్రతను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని ‘జీరో హార్మ్’ లక్ష్య సాధనకు కట్టుబడి పనిచేయాలని ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి అన్నారు. కేటీకే ఓసీ 2 ప్రాజెక్ట్లో శనివారం ప్రత్యేక భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉద్యోగులకు భద్రతా నియమాలు, జాగ్రత్తలు, ప్రమాదాల నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ అప్రమత్తతతో విధులు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్యామ్సుందర్, ఏరియా రక్షణాధికారి మాటూరి రవీందర్, ఆఫీషియేటింగ్ ఏరియా ఇంజనీర్ వాల్మీకి కృష్ణయ్య, మేనేజర్ బోయిన రామాకాంత్, సంక్షేమ అధికారి సాధన్, రక్షణ అధికారి శివకుమార్, నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
రామప్ప ఆలయంలో ట్రెయినీ ఐఏఎస్లు
వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని శనివారం ట్రెయినీ కలెక్టర్లు సాయి శివాని, సచిన్ బసవరాజ్, నీలటూరు శ్రీకాంత్ రెడ్డి, పోతరాజు హరిప్రసాద్, పారస్ కుమార్, పామూరి సురేశ్ సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించగా ఆలయ అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్ తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ మండపంలో వారిని ఈఓ ఇమ్మడి భాస్కర్ శాలువాలతో సన్మానించారు. ఆలయ చరిత్ర, శిల్పకళ ప్రాముఖ్యతను టూరిజం అధికారి సూర్యకిరణ్, గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు. వారి వెంట తహసీల్దార్ గిరిబాబు, ఆర్ఐ రమేశ్, టూరిస్ట్ పోలీసులు, పురావస్తు శాఖ సిబ్బంది ఉన్నారు. రామప్ప ఆలయాన్ని జపాన్కు చెందిన నాకాలిబోర్, షిగా దంపతులు సందర్శించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. -
అభివృద్ధి జపం.. చెట్టు కింద సభ
గ్రామ పంచాయతీల బలోపేతమే తమ లక్ష్యమని.. గ్రామాల అభివృద్ధే ముఖ్యమని పాలకులు రోజూ చెబుతున్న మాటలు క్షేత్రస్థాయిలో నీటిమూటలుగానే మిగులుతున్నాయి. చిట్యాల మండలం ఏలేటిరామయ్యపల్లిలో గ్రామ పంచాయతీకి స్థలంతో పాటు భవనం లేకపోవడంతో శనివారం మండల అధికారులు పోచమ్మతల్లి దేవాలయం చెట్టు నీడన గ్రామసభ నిర్వహించారు. గ్రామాభివృద్ధికి దిక్సూచిగా నిలవాల్సిన గ్రామసభ.. సొంత భవనం లేక చెట్టునీడన సాగడం స్థానిక స్వపరిపాలన దయనీయ స్థితికి అద్దం పడుతోంది. అధికారులు గ్రామపంచాయతీకి స్థలం కేటాయించి భవనాన్ని నిర్మించాలని సర్పంచ్ కొడారి అశోక్ కోరారు. సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని తహసీల్దార్ వసంతరావు తెలిపారు. – చిట్యాల -
లైసెన్సులు రద్దు చేస్తాం..
బీటీ 3 విత్తనాలు, గ్లైఫోసెట్ మందులు విక్రయించే ఫర్టిలైజర్ షాపుల లైసెన్సులు రద్దు చేస్తాం. పీడీ యాక్ట్లు నమోదు చేయిస్తాం. రైతులు రసీదులు లేకుండా విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయవద్దు. లూజు విత్తనాల జోలికి పోవద్దు. పత్తిసాగులో బీటీ 2 విత్తనాలను మాత్రమే వాడండి. – బాబురావు, జిల్లా వ్యవసాయాధికారి క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం..ప్రభుత్వం నిషేధించిన విత్తనాలు, నకిలీ ఎరువులు, పర్యావరణాన్ని దెబ్బతీసే గ్లైఫోసెట్ వంటి మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు. రెవెన్యూ, పోలీస్, వ్యవసాయశాఖల అధికారులతో కూడిన ప్రత్యేక టాస్క్ఫోర్స్ టీంలను మండలానికి ఒకటి ఏర్పాటు చేశాం. ఎక్కడైనా ప్రభుత్వ నిషేధిత విత్తనాలు, ఎరువులు విక్రయిస్తున్నట్లు దృష్టికి వస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి. – సిరిశెట్టి సంకీర్త్, ఎస్పీ -
మహిళా సాధికారతే ధ్యేయం
భూపాలపల్లి రూరల్: మహిళా సాధికారతే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. శనివారం భూపాలపల్లి మండలం గుర్రంపేట రెవెన్యూ పరిధిలోని గుర్రంపేట, రామ్ నాయక్ తండా, పెద్దాపూర్, బావుసింగ్పల్లి, సుబ్బక్కపల్లి గ్రామాల ప్రజల సమస్యల పరిష్కారానికి గుర్రంపేటలో ఏర్పాటుచేసిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి సీతక్క, కలెక్టర్ రాహుల్ శర్మ, ఐడీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పోతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వారి వద్దకే వెళ్లి తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించడమే ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. ములుగు నియోజకవర్గంలో ఇప్పటివరకు 70 గ్రామాల్లో ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహించామని, ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను నాలుగు రోజులలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికే నియోజకవర్గంలో లక్షకు పైగా పెన్షన్లు అందించామని, రాబోయే రోజుల్లో మరో రెండు నుంచి మూడు లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు స్పష్టం చేశారు. రామ్నాయక్ తండా పేరు మార్పు అంశంపై గ్రామసభ తీర్మానం చేసి ప్రతిపాదనలు పంపించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ... ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళిక కార్యక్రమం ద్వారా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనుల అమలుకు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి నవీన్ రెడ్డి, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఆర్డీఓ హరికృష్ణ, తహసీల్దార్ లక్ష్మీరాజయ్య, ఎంపీడీఓ తరుణ్ ప్రసాద్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రజాదర్బార్లో దరఖాస్తుల స్వీకరణ -
కుర్చీలో సర్పంచ్.. క్షేత్రంలో కూలీ
రాజకీయాల్లో చిన్న పదవి దక్కినా చాలు.. రంగులు మార్చే నాయకులు, కార్లలో తిరిగే ప్రజాప్రతినిధులు ఉన్న రోజులివి.. ఒక ఊరికి సర్పంచ్ అంటే ఆ గ్రామ పథమ పౌరురాలు. రూ.కోట్ల నిధులు, గ్రామాన్ని శాసించే అధికారం చేతిలో ఉంటాయి. కానీ ఇవేమీ మహాముత్తారం మండలం పెగడపల్లి సర్పంచ్ కొర్ర వినోదను మార్చలేదు. 2019 ఒకసారి, 2025లో మరోసారి రెండుసార్లు సర్పంచ్ అయినా బతుకుదెరువు కోసం మండు టెండలో ఉపాధి హామీ పనులకు కూలీలతో కలిసి వెళ్తోంది. సర్పంచ్ పదవి కేవలం ప్రజలకు సేవచేసే మార్గంగానే భావించిన ఆమె నిప్పులు కురుస్తున్న ఎర్రటి ఎండలో సైతం కుటుంబ జీవనం కోసం ఉపాధి పనులకు వెళ్తోంది. – మహాముత్తారం -
మాదక ద్రవ్యాలతో ముప్పు
భూపాలపల్లి అర్బన్: మాదక ద్రవ్యాల వినియోగంతో యువత ప్రాణాలకు తీవ్రమైన ముప్పు వాటిల్లుతుందని సీసీఎస్ ఎస్సై రమేష్ తెలిపారు. సీసీఎస్, షీ టీంల ఆధ్వర్యంలో శనివారం జిల్లాకేంద్రంలో వేర్వేరుగా మెడికల్ కళాశాల, ఐటీ మాస్టర్స్ కంప్యూటర్స్, ఆర్టీసీ బస్టాండ్లలో మహిళలు, బాలికల భద్రత, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ కళాశాలలో సీసీఎస్ ఎస్సై రమేష్ మాట్లాడుతూ.. మానవ అక్రమ రవాణా సమాజానికి తీవ్రమైన ముప్పుగా మారిందన్నారు. ఉద్యోగాలు, విద్య వివాహాల పేరుతో మోసాలకు పాల్పడే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియా, ఆన్లైన్ వేదికల ద్వారా వచ్చే అనుమానాస్పద ఆఫర్లను నమ్మవద్దన్నారు. మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల రవాణా లేదా విక్రయాలకు సంబంధించిన సమాచారంం తెలిసిన, ఆడ పిల్లలకు ఇబ్బంది ఎదురైనా వెంటనే పోలీసులను సమాచారం అందించాలని సూచించారు. చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. -
నకిలీ భయం
పత్తిసాగుపై నిషేధిత బీటీ 3 నీడ భూపాలపల్లి: వానాకాలం సీజన్ ప్రారంభం కానుండటంతో రైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. ఇదే తరుణంలో అక్రమార్కులు మళ్లీ కోరలు చాస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా నిషేధించిన బీటీ–3 (హెచ్టీబీటీ–హెర్బిసైడ్ టొలరెంట్ బీటీ) పత్తి విత్తనాలు, ప్రాణాంతక గ్లైఫోసెట్ గడ్డిమందు మార్కెట్లోకి గుట్టు చప్పుడు కాకుండా ప్రవేశించనున్నాయి. గతేడాది నూజివీడు లింకులు బహిర్గతం.. గతేడాది ఖరీఫ్ సీజన్లో జిల్లాలోని కాటారం, మల్హర్, మహాముత్తారం మండలాల్లో నిషేధిత బీటీ–3 విత్తనాలు, గ్లైఫోసెట్ గడ్డిమందు భారీస్థాయిలో పట్టుబడటం సంచలనం సృష్టించింది. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ నకిలీ దందాను పోలీసు అధికారులు ఛేదించారు. మహాముత్తారం మండలంలోని మీనాజిపేటలో 250 గ్రాముల బీటీ పత్తి విత్తనాలు దొరికాయి. అవి ఎక్కడి నుంచి వచ్చాయని పోలీసులు ఆరాతీయగా తీగ లాగితే డొంకంతా కదిలింది. కాటారం మండలంలో గ్లైఫోసెట్ దొరకగా, మల్హర్ మండలం రుద్రారంలో ఏకంగా 2 క్వింటాళ్ల బీటీ 3 పత్తి విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా, ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇక్కడి ఫర్టిలైజర్ షాపుల యజమానులతో కలిసి నూజివీడు నుంచి బీటీ 3 విత్తనాలను ట్రాన్స్పోర్ట్లో వేసి పంపినట్లు తేలింది. ఈ వ్యవహారంలో కీలక సూత్రధారులపై కేసులు నమోదైనప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. జిల్లాలోని వందలాది మంది అమాయక రైతులు ఆ విత్తనాలను కొనుగోలు చేసి సాగు చేశారు. చివరకు మొలకలు రాక, పంట దెబ్బతిని, తాము కొన్నది నకిలీ విత్తనాలు అని తెలుసుకునే సరికి పెట్టుబడి అంతా బూడిదలో పోసిన పన్నీరైంది. అడ్డుకట్ట పడేనా.. గతేడాది కాటారం డివిజన్లో ఈ అక్రమ దందా బహిర్గతం అయినప్పటికీ భూపాలపల్లి డివిజన్లో సైతం ప్రతీ ఏటా జరుగుతున్నట్లు తెలుస్తోంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పోలీసు, వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి టాస్క్ఫోర్స్ టీంలను ఏర్పాటు చేశారు. దీంతో ఈ ఏడాదైనా నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల విక్రయాలకు అడ్డుకట్ట పడేనా అనే చర్చ జోరుగా సాగుతోంది. బీటీ 3తో తీవ్ర నష్టం.. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బీటీ 2 విత్తనాలు కేవలం పురుగులను మాత్రమే తట్టుకుంటాయి. బీటీ–3 (హెచ్టీబీటీ) విత్తన జన్యువును ఎలా మారుస్తారంటే.. పొలంలో గడ్డి మొలవకుండా కొట్టే గ్లైఫోసెట్ అనే శక్తివంతమైన కెమికల్ను కూడా ఈ పత్తి మొక్క తట్టుకోగలదు. గ్లైఫోసెట్ క్యాన్సర్ కారకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. అంతేకాక పర్యావరణం సైతం తీవ్రంగా దెబ్బతింటుంది. మానవ మనుగడకే ప్రమాదకరం అయినందున కేంద్ర ప్రభుత్వం దీనిపై నిషేధం విధించింది. అవగాహన సదస్సులు ఏవి? గతేడాది తరహాలో జిల్లాలోని రైతులు మోసపోయారు. ఈసారి మోసపోకుండా ఉండేందుకు వ్యవసాయ అధికారులు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మండల, జిల్లాస్థాయి అధికారులు ప్రకటనలకే పరిమితం అవుతున్నారు తప్ప క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడం లేదు. దీంతో రైతులు నష్టపోయే అవకాశం ఉంది. గతేడాది వెలుగుచూసిన నూజివీడు లింకులు ఈ ఏడాదైనా అడ్డుకట్ట పడేనా? తనిఖీల కోసం టాస్క్ఫోర్స్ టీంల ఏర్పాటు -
అప్పుడే.. బాగుండె!
నాడు ఎంజీఎంలో విజయవంతంగా హార్ట్ సర్జరీలుకాశిబుగ్గ: నాడు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో డాక్టర్ అమరవాది ప్రభాకరాచారి విధులు నిర్వర్తించిన సమయంలో హృద్రోగుల వెతలు తీరాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలకు పెద్ద దిక్కుగా ఉన్న ఆస్పత్రిలో కార్డియో థొరాసిక్ సర్జరీ యూనిట్ ద్వారా రెగ్యులర్గా గుండె జబ్బులకు చికిత్స చేసేవారు. ముఖ్యంగా యూనిట్కు హెడ్గా ఉన్న డాక్టర్ అమరవాది ప్రభాకర్ 2004, మే 24న తొలిసారి ఓపెన్ హార్ట్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేసి పేరు సంపాదించుకున్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నేడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన కార్డియో థొరాసిక్ సర్జరీ యూనిట్ నామ్కే వాస్తేగా పనిచేస్తోంది. కనీసం డాక్టర్ అమరవాదిని స్ఫూర్తిగా తీసుకుని ఓపెన్ హార్ట్ సర్జరీలు చేస్తారని ఆశించిన హృద్రోగులకు నిరాశ మిగిల్చింది. లక్షలాది రూపాయల పరికరాలు, ఫ్యాకల్టీ ఉన్నా హార్ట్ సర్జరీల జోలికి వెళ్లడం లేదు. దీంతో పేద రోగులు అధిక డబ్బులు పెట్టి ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నారు. నేడు మూతబడిన కార్డియో థొరాసిక్ యూనిట్.. గతంలో ఎంజీఎంలో ఉన్న కార్డియో థొరాసిక్ యూనిట్ను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు మార్చారు. ఈ యూనిట్ నామమాత్రంగా కొనసాగుతోంది. ఫ్యాకల్టీ ఉన్నా అధికారులు గుండె శస్త్ర చికిత్సలు చేయించడం లేదని విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం కార్డియో థొరాసిక్ యూనిట్లో ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఒక ఫర్ఫ్యూజనిస్టు ఉన్నారు. వీరితో బైపాస్ సర్జరీలు చేయించే అవకాశమున్నా ముందుకు సాగడం లేదు. ముఖ్యంగా ఏసీ సెంట్రల్ సిస్టం లేకపోవడంతో సర్జరీలు చేయడం లేదని తెలుస్తోంది. దాదాపు రెండేళ్ల నుంచి ఈ యూనిట్ మూతబడి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఈ యూనిట్లో గతంలో ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయకపోయినా ఐదుగురికి గుండె శస్త్ర చికిత్సలు చేశారు. మరో 40 వరకు వాస్కులర్ సర్జరీలు చేశారు. దీనివల్ల ఆరోగ్యశ్రీ ద్వారా ఆస్పత్రికి రూ.60లక్షల వరకు ఆదాయం సమకూరినట్లు సమాచారం. ప్రస్తుతం హృద్రోగులకు ఓపీ సేవలు అందిస్తూ మిగతా సమయంలో ఫ్యాకల్టీ మొత్తం ఖాళీగా ఉంటున్నట్లు తెలుస్తోంది. కొన్నేళ్లుగా ఆగిన శస్త్రచికిత్సలు సూపర్స్పెషాలిటీ హాస్పిటల్లోనూ నిలిచిన సేవలు 2004, మే 24న తొలిసారి ఓపెన్ హార్ట్ సర్జరీ డాక్టర్ అమరవాది ఆధ్వర్యంలో కొనసాగిన ఆపరేషన్లు డాక్టర్ అమరవాదికి నాటి సీఎం ప్రశంసలు.. 2004 నుంచి 2007 వరకు డాక్టర్ అమరవాది ప్రభాకరాచారి ఎంజీఎంలో కార్డియో థొరాసిక్ సర్జన్గా విధులు నిర్వర్తించారు. నాడు కార్డియాలజీతో పాటు కార్డియో థొరాసిక్ యూనిట్లు పనిచేశాయి. ముఖ్యంగా 2004లో ఎంజీఎం చరిత్రలో తొలిసారి వరంగల్కు చెందిన రమ్య అనే యువతికి ఓపెన్ హార్ట్ సర్జరీ విజయవంతం చేసి రాష్ట్రవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. నాలుగేళ్ల కాలంలో పలువురికి సర్జరీలు, ముఖ్యంగా పిల్లలకు కూడా ఆపరేషన్లను విజయవంతంగా చేశారు. నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంజీఎం వచ్చిన సమయంలో డాక్టర్ అమరవాదిని మెచ్చుకున్నారు. పేదలకు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇక్కడినుంచే ప్రకటించినట్లు చెబుతున్నారు. కాగా డాక్టర్ అమరవాది ప్రస్తుతం హైదరాబాద్లో నివసిస్తూ ఆన్లైన్ ద్వారా గుండె సంబంధ వ్యాధులకు సలహాలు ఇస్తున్నారు. -
అధికారులు ఏర్పాట్లు చేయాలి
● నేటి ప్రజాదర్బార్కు మంత్రి సీతక్క ● కలెక్టర్ రాహుల్ శర్మభూపాలపల్లి: నేడు(శనివారం) భూపాలపల్లి మండలంగుర్రంపేటలో జరుగనున్న ప్రజాదర్బార్ కార్యక్రమానికి అధికారులు తగు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. గుర్రంపేట గ్రామంలో మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) నిర్వహించనున్న ప్రజాదర్బార్ కార్యక్రమ ఏర్పాట్ల్లపై శుక్రవారం అన్ని శాఖల జిల్లా అధికారులు, రెవెన్యూ, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పింఛన్లు, ఇందిరమ్మ ఇండ్లు దరఖాస్తుదారుల కోసం ప్రత్యేక కౌంటర్లు, ఇతర అంశాలకు సంబంధించి మరొక కౌంటర్ ఏర్పాటు చేయాలని సూచించారు. ములుగు నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ఐదు గ్రామ పంచాయతీలకు చెందిన ప్రజలు వారి వారి సమస్యల దరఖాస్తులు లిఖిత పూర్వకంగా అందజేయాలని సూచించారు. ఈ టెలీ కాన్ఫెరెన్స్లో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, ఆర్డీఓ హరికృష్ణ, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. బాధ్యతలు స్వీకరించిన డీటీఓ.. జిల్లా రవాణా శాఖ అధికారి(డీటీఓ)గా వెంకన్న శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఐడీఓసీ కార్యాలయంలో కలెక్టర్ రాహుల్ శర్మను కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంవీఐ సుందర్లాల్ తదితరులు పాల్గొన్నారు. -
‘చల్వాయి’కి రాష్ట్రస్థాయి గుర్తింపు
గోవిందరావుపేట: ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2026 సందర్భంగా పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, గ్రామ పరిశుభ్రత కార్యక్రమాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచినందుకు మండలంలోని చల్వాయి గ్రామ పంచాయతీకి రాష్ట్రస్థాయి ఉత్తమ పర్యావరణ పనితీరు అవార్డు లభించింది. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో చల్వాయి గ్రామ పంచాయతీ చేపట్టిన తడి–పొడి చెత్త సేకరణ, వ్యర్థాల శాసీ్త్రయ నిర్వహణ, మొక్కల పెంపకం, పర్యావరణ హిత కార్యక్రమాలు, పరిశుభ్రత చర్యలు, గ్రామ సుందరీకరణ పనులను పరిశీలించి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మేకల రాధసుదర్శన్ మాట్లాడుతూ చల్వాయి గ్రామాన్ని పరిశుభ్రమైన పచ్చదనంతో కూడిన ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యమని, గ్రామ ప్రజల సహకారం, పంచాయతీ సిబ్బంది కృషి, ప్రజాప్రతినిధుల సమష్టి ప్రయత్నాల ఫలితంగానే ఈ అవార్డు లభించిందన్నారు. ఈ గుర్తింపు గ్రామాభివృద్ధికి మరింత ప్రేరణగా నిలుస్తుందన్నారు. కాగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ సనత్నగర్లో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ఈ పురస్కారం అందించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. -
ప్రతిభ చాటేందుకు ఉత్తమ వేదిక
● ఎంపీ డాక్టర్ కడియం కావ్య ● అంతర్జిల్లా బాస్కెట్బాల్ పోటీలు ప్రారంభంభూపాలపల్లి అర్బన్: ప్రతిభను చాటుకునేందుకు క్రీడలు ఉత్తమ వేదిక అని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహిస్తున్న 11వ యూత్ అంతర్ జిల్లా బాస్కెట్ బాల్ పోటీలను శుక్రవారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి ఎంపీ కావ్య ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించిన ఎంపీ బాస్కెట్బాల్ గోల్ వేసి వారిని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఎంపీ కావ్య మాట్లాడుతూ.. యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదగడంలో క్రీడలు కీలకపాత్ర పోషిస్తాయన్నారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు క్రీడలు దోహదపడతాయన్నారు. గెలుపు, ఓటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని క్రీడాకారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ సంకీర్త్, బాస్కెట్బాల్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, సింగరేణి జీఎం రాజేశ్వర్ రెడ్డి, జెన్కో సీఈ ప్రకాశ్, మున్సిపల్ చైర్మన్ కొమురయ్య, క్రీడా అధికారులు, క్రీడాకారులు పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాలి
● ఎమ్మెల్యే సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్శర్మభూపాలపల్లి రూరల్: పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరు నడుం బిగించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లాకేంద్రంలోని మైసమ్మ ఆలయం, ప్రధాన రహదారి వద్ద పర్యావరణ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్ రాహుల్ శర్మ హాజరై మొక్కలు నాటారు. అనంతరం జరిగిన సమావేశంలో కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ మొక్కలు నాటడం ప్రతీ ఒక్కరి సామాజిక బాధ్యత అని తెలిపారు. పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో, వర్షపాతం పెరగడంలో మొక్కలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి భూపాలపల్లి అర్బన్: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని జిల్లా అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి.అఖిల కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అదనపు జూనియర్ సివిల్ జడ్జి అఖిల మాట్లాడుతూ.. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతిఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. ప్రతి వ్యక్తి తమ పుట్టినరోజు సందర్భంగా కనీసం ఒక మొక్కను నాటి, దానిని పెంచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ ప్లీడర్ బొట్ల సుధాకర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కూనూరు సురేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఆకుల రాములు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సృజన కుమారి, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ శ్రీనివాస్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ కంప అక్షయ, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
చదువుకు కొదవలేదు..
శనివారం శ్రీ 6 శ్రీ జూన్ శ్రీ 2026రూపాయి ఖర్చులేదు.. సర్కారు బడి.. పిలుస్తోంది ఈ రోజుల్లో చదువు అనగానే కార్పొరేట్ పాఠశాలల చుట్టూ తిరగడం, రూ.వేలల్లో ఫీజు కట్టడం ఒక అలవాటుగా మారిపోయింది. ఫీజులు ఎక్కువగా ఉంటేనే చదువు బాగా వస్తుందనేది భ్రమ మాత్రమే. మన కళ్ల ముందు మన ఊళ్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు కార్పొరేట్ విద్యాసంస్థలకు ఏ మాత్రమూ తీసిపోకుండా అన్నీ వసతులతో విద్యార్థులను ఆహ్వానిస్తున్నాయి. ఈ విద్యాసంవత్సరంలో మన పిల్లలను మన ప్రభుత్వ బడిలో చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్కు బాటలు వేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఈ విద్యా సంవత్సరం నుంచి జిల్లావ్యాప్తంగా పాఠశాల స్థాయిలోనే ఏఐ టెక్నాలజీతో విద్యాబోధన చేపట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఈ నెల 12నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. – భూపాలపల్లి అర్బన్ అర్హత కలిగిన ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉపాధ్యాయులు కఠినమైన డీఎస్సీ, టెట్ పరీక్షలు రాసి అత్యుత్తమ నైపుణ్యంతో ఎంపికై న విద్యావంతులు. వీరు పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకుని బోధించే అవకాశం ఉంటుంది. మారుతున్న బోధన, అభ్యాసన విధానాలకు అనుగుణంగా ఉపాధ్యాయులకు ప్రభుత్వం శిక్షణ ఇస్తోంది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం తరగతులను ప్రారంభించారు. ముందుగానే ఉపాధ్యాయులకు శిక్షణ ఇప్పించి 6 నుంచి 10వ తర గతి వరకు తెలుగు, ఇంగ్లిష్ మీడియం సెక్షన్లను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఆధునిక వసతులు డిజిటల్ క్లాస్ రూమ్లు, కంప్యూటర్ ల్యాబ్లు, అత్యాధునిక సైన్స్ ప్రయోగశాలలు ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పరిశోధనల్లో పాల్గొనే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. జాతీయ, సైన్స్ పరిశోధన అంశాలు ప్రదర్శించేందుకు ఇన్స్ఫైర్ అవార్డుల పథకంలో పాఠశాల స్థాయి నుంచే ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఇందులో భాగంగా ప్రతీ పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులకు రూ.5 వేల చొప్పున సాయం అందిస్తున్నారు. ఇది కాకుండా పాఠశాల తరఫున వైజ్ఞానిక ప్రదర్శనల్లో పాల్గొనేందుకు విద్యార్థులకు విద్యాశాఖ ప్రోత్సహిస్తోంది. సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పేద విద్యార్థులు రోజూ బడికి వచ్చేలా తీసుకునే చర్యల్లో భాగంగా ప్రభుత్వం అన్ని సర్కారు బడుల్లో సన్నబియ్యంతో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తోంది. ఈ పథకం అమలు ద్వారా విద్యార్థులు ఇంటి నుంచి భోజనం తెచ్చుకునే బాధ తప్పింది. ఈ ఏడాది నుంచి ఉదయం అల్పాహారం అందించే అవకాశాలు ఉన్నాయి. రెండు జతల యూనిఫాం.. 1 నుంచి 8 వతరగతి విద్యార్థులకు యేటా రెండు జతల యూనిఫాంలను విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ప్రభుత్వం ఉపకార వేతనాలు అందిస్తోంది. పాఠశాల ఇంటికి మూడు కిలోమీటర్ల పైన దూరం ఉండి రవాణా సౌకర్యం లేకపోతే 6, 7, 8వ తరగతి విద్యార్థులకు నెలకు రూ.250 చొప్పున ప్రభుత్వం రవాణా భత్యం చెల్లిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. విశాలమైన క్రీడా మైదానాలు ప్రైవేట్ స్కూళ్లతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడలకు తగిన ప్రాధాన్యత ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలకు విశాలమైన మైదానాలు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడా పరికరాలు ఉండటంతో విద్యార్థులకు క్రీడల్లో నైపుణ్యం సాధిస్తున్నారు. క్రీడల్లో ప్రతిభ చూపితే రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. సుశిక్షితులైన ఉపాధ్యాయులతో విద్యాబోధన విద్యార్థులకు అన్నీ ఉచితమే మధ్యాహ్న భోజనం, యూనిఫాం, విశాలమైన ఆటస్థలాలు -
నకిలీవి విక్రయిస్తే కఠిన చర్యలు
● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ భూపాలపల్లి: నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. రైతులను మోసంచేసే వారిపై క్రిమినల్ కేసులతో పాటు పీడీ యాక్ట్లు నమోదు చేస్తామన్నారు. పోలీసుశాఖ ఆధ్వర్యంలో సీసీఎస్ టీం శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపుల్లో తనిఖీ చేసిందన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువుల విక్రయాలను అరికట్టేందుకు జిల్లాలోని ప్రతీ మండలంలో రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ శాఖల సమన్వయంతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శాఖల సమన్వయం కీలకం.. మహిళలు, చిన్నారులపై జరిగే హింస, వేధింపుల కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం, రక్షణ, పునరావాస సేవలు అందించేందుకు సంబంధిత అన్ని శాఖల మధ్య సమన్వయం అత్యంత అవసరమని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో భరోసా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మహిళలు, చిన్నారుల సంక్షేమానికి సంబంధించిన వివిధ శాఖల అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ నరేష్కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇల్లు తొలగించారు!
● పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం మల్హర్(కాటారం): గతంలో ప్రకటించిన ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో తన పేరు ఉన్నప్పటికీ తాజా గ్రామసభలో వెల్లడించిన లబ్ధిదారుల జాబితాలో తన పేరు తొలగించారని శ్రీనివాస్గౌడ్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో కాటారం మండలం ఉండ్రాతుపల్లి గ్రామపంచాయతీ గ్రామసభలో గందరగోళం నెలకొంది. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గురువారం గ్రామసభ నిర్వహించారు. గత జాబితాలో ఇందిరమ్మ ఇల్లు ఉండి ఇప్పుడు తొలగించారని శ్రీనివాస్గౌడ్ ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామసభలోనే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు శ్రీనివాస్ను అడ్డుకుని ప్రమాదం జరగకుండా కాపాడారు. మంత్రి శ్రీధర్బాబు, సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. ఆయిల్పామ్ తోట దగ్ధం మొగుళ్లపల్లి: అగ్ని ప్రమాదంలో ఏడెకరాల ఆయిల్పామ్ తోట దగ్ధమైన ఘటన మండలంలోని రంగాపురం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. రంగాపురం గ్రామానికి చెందిన రైతు పోలినేని లింగారావుకు చెందిన ఆయిల్పామ్ తోటకు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుంది. గాలికి మంటలు వ్యాపించి ఏడెకరాలకు విస్తరించింది. మంటలను అదుపుచేసే పరిస్థితి లేకపోవడంతో తోటతో పాటు మామిడి చెట్లు, వ్యవసాయ క్షేత్రంలోని డ్రిప్ పైప్లైన్స్ ఇతర వ్యవసాయ పనిముట్లు మొత్తం అగ్నికి ఆహుతయ్యాయని రైతు లింగారావు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు రూ.7లక్షల మేర నష్టం వాటిల్లిందని తెలిపారు. వేగవంతం చేయాలి చిట్యాల: సాదాబైనామాను వేగవంతం చేయాలని భూపాలపల్లి ఆర్డీఓ హరికృష్ణ అన్నారు. గురువారం చిట్యాల తహసీల్దార్ కార్యాలయంలో చిట్యాల, మొగుళ్లపల్లి, టేకుమట్ల మండలాలకు చెందిన రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ సాదాబైనామాలో భూముల వివరాలు పెండింగ్ లేకుండా చూడాలన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. రైతుల భూసమస్యలను ఆలస్యం కాకుండా సిబ్బంది విచారణ చేసి వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో చిట్యాల, మొగుళ్లపల్లి, టేకుమట్ల తహసీల్దార్లు వసంతరావు, సునీత, స్వరూపరాణి, చిట్యాల డిప్యూటీ తహసీల్దార్ అనిల్, ఆర్ఐ రాజేందర్ పాల్గొన్నారు. భర్త వేధింపులతో ఆత్మహత్య గణపురం: భర్త వేధింపులతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలకేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గణపురం మండలకేంద్రానికి చెందిన కోలెపాక శంకర్(47) అదే గ్రామానికి చెందిన సొంత అక్క కూతురైన కావ్యశ్రీ(34)ని 13 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కూమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. శంకర్ రోజు మద్యం తాగి పేకాట ఆడుతూ భార్యను వేధింపులకు గురిచేశాడు. ఇదే క్రమంలో బుధవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. మనస్థాపానికి గురైన కావ్యశ్రీ గురువారం తెల్లవారుజామున క్రిమి సంహారక మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలో మృతి చెందింది. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అశోక్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ములుగు సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఐటీడీఏలో ఇంటర్కమ్ లింక్ఫోన్స్ ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ఐటీడీఏలో ఇంటర్కమ్ లింక్ఫోన్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి అధికారులకు, సిబ్బందికి సమాచారం ఇచ్చేందుకు లింక్ టెలిఫోన్స్ ఉపయోగపడుతాయి. -
పారదర్శకంగా రవాణా ప్రక్రియ
మల్హర్(కాటారం): ధాన్యం రవాణా ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ అశోకుమార్ అన్నారు. గురువారం కాటారంలోని ఏఎంసీ గోదాం, రుద్ర కాటన్ మిల్లు, మీనాక్షి జిన్నింగ్ మిల్లును అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం అన్ లోడింగ్ ప్రక్రియను సమగ్రంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ధాన్యం దిగుమతి సమయంలో ఆలస్యం జరగకుండా సక్రమంగా నిర్వహించేందుకు సంబంధిత ఇన్చార్జ్లను ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం తూకం, నిల్వలు చేపట్టాలన్నారు. గోదాంలలో సరైన వసతులు కల్పించడం, తగిన భద్రతా చర్యలు తీసుకోవడం, ధాన్యం నాణ్యతను కాపాడే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎం రాములు తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ అశోక్కుమార్ -
నేడు శృంగేరికి అధికారులు
కాళేశ్వరం: కాళేశ్వరాలయం ఆలయ అభివృద్ధి, పునరుద్ధరణ పనులు ఈనెల 17న ప్రారంభిస్తున్న నేపథ్యంలో దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు, ఈఓ మహేష్, ఉపప్రధాన అర్చకుడు ఫణీంద్రశర్మ కర్ణాటకలోని శృంగేరి పీఠానికి (నేడు) శుక్రవారం వెళ్లనున్నారు. శృంగేరి పీఠాధిపతి అనుమతులు ఇప్పటికే సూత్రపాయంగా ఇవ్వడంతో పనులు మొదలు పెట్టడానికి తేదీ ఖరారు చేసి వారి రాక కోసం ఆహ్వానానికి అధికారులు వెళుతున్నట్లు తెలిసింది. ఆలయంలో పనులు ప్రారంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులకు దర్శనాలు భారీగా వస్తుంటారు. ఈ క్రమంలో దర్శనాలు చేసుకునేందుకు బాలాలయాన్ని ఆలయ ఆవరణ లేదా అడవిలోని ఆదిముక్తీశ్వరాలయం వద్ద ఏర్పాటు చేయడానికి ఇప్పటికే దేవాదాయశాఖ కసరత్తు చర్యలు ప్రారంభించారు. గురువారం తమిళనాడులోని శిల్పులు కాళేశ్వరం దేవస్థానం గర్భాలయంలోని జోడు లింగాల (కాలుడు,యముడు) కొలతలు తీసుకున్నారు. అదే నమూనాతో లింగాలు తయారు చేసి బాలాలయంలో ఏర్పాటు చేసి భక్తుల దర్శనాలు చేస్తారని సమాచారం. ఈ బాలాలయం ఆలయం ఆవరణలోనా.. ఆది ముక్తీశ్వరాలయంలోనా.. అనేది శృంగేరి పీఠాఽఽధిపతి ఆదేశాలతో ఏర్పాటు కానుందని తెలిసింది. -
భద్రతకు అత్యంత ప్రాధాన్యం
భూపాలపల్లి అర్బన్: ప్రతీ ఉద్యోగి భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఏరియాలోని కేటీకే–1 గనిలో గురువారం ప్రత్యేక భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉద్యోగులకు భద్రతా నియమాలు, పనిస్థలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదాల నివారణ చర్యలపై ఈ సందర్భంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జీఎం రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతీ ఉద్యోగి భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సింగరేణి నిర్దేశించుకున్న జీరో హార్మ్ లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ కట్టుబడి పనిచేయాలన్నారు. ప్రమాదాలను పూర్తిగా నివారించేందుకు భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అప్రమత్తతతో విధులు నిర్వహించడం ద్వారా ప్రమాదాల అవకాశాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ మాటూరి రవీందర్, ఏరియా ఇంజనీర్ రాజారావు, కేటీకే–1వ గని మేనేజర్ ప్రవీణ్ విక్రమ్, కార్మిక సంఘాల ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఏరియా జీఎం రాజేశ్వర్ రెడ్డి -
ద్రోహం చేసే సంఘాలకు బుద్ధిచెప్పాలి
భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికుల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్న సంఘాలకు కార్మికులు తగిన గుణపాఠం చెప్పాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షుడు మంద నరసింహారావు, ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం టీబీజీకేఎస్ నాయకుడు దుడ్డేల సాయిలు సీఐటీయూలో చేరగా ఆయనకు కండువా కప్పి యూనియన్లోకి ఆహ్వానించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గుర్తింపు సంఘం ఏఐటీయూసీ యాజమాన్యంతో, ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రభుత్వంతో కుమ్మక్సై కార్మిక సమస్యల పరిష్కారాన్ని అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. సింగరేణి జేఏసీ పిలుపునిచ్చిన సమ్మెను ఈ సంఘాలు వాయిదా వేయించి కార్మికుల పోరాటాన్ని నీరుగార్చాయని విమర్శించారు. బదిలీల పేరుతో కార్మికుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. 14 నెలలుగా మెడికల్ బోర్డు నిర్వహించకపోవడంతో కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మెడికల్ అన్ఫిట్ అయిన సుమారు 400 మందికి వెంటనే వీటీసీ శిక్షణ తరగతులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సింగరేణి నిధులను ఇతర ప్రాంతాలకు మళ్లించడాన్ని సీఐటీయూ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, ఆ నిధులను సింగరేణి ప్రాంతాల అభివృద్ధికే ఖర్చు చేయాలని కోరారు. సింగరేణి పరిరక్షణ, కొత్త గనుల ఏర్పాటు, ఉద్యోగుల భద్రత వంటి అంశాల సాధనకు అన్ని కార్మిక సంఘాలు సమష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు తోట రమేష్, బాబురావు, శ్రీకాంత్, దుడ్డేల సాయిలు, రాజేష్ పాల్గొన్నారు. -
రామప్ప అభివృద్ధికి కృషి
● చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వెంకటాపురం(ఎం): రామప్ప దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. మాజీ ఎంపీ సీతారాం నాయక్ తో కలిసి గురువారం పాలంపేట గ్రామంలోని రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. ఆలయ అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్ వారికి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు. ఆలయ ఈఓ ఇమ్మడి భాస్కర్ వారిని శాలువాలతో సన్మానించారు. ఆలయ చరిత్ర, శిల్పకళ ప్రాముఖ్యత గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ వారికి వివరించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలలో ఏకై క యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దేవాలయంలో పురావస్తు, పర్యాటక, దేవాదాయ శాఖల అభివృద్ధి నిధులకు ప్రతిపాదనలు పంపిస్తే పార్లమెంటులో ప్రస్తావించి నిధుల సమీకరణకు తన వంతు సహకారం అందిస్తానని ఎంపీ పేర్కొన్నారు. రామప్ప శిల్పకళ సౌందర్యం ఎంతో అద్భుతంగా ఉందని కొనియాడారు. వారి వెంట టూరిస్ట్ పోలీసులు శ్రీకాంత్, దశరథ్, దేవాదాయ, టూరిజం, పురావస్తు శాఖల సిబ్బంది ఉన్నారు. -
విద్యార్థుల నమోదు పెంచేందుకు చర్యలు
భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, కేజీబీవీలు, తెలంగాణ మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరిగేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ రాహుల్శర్మ ఆదేశించారు. గురువారం కలెక్టర్ తన కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో విద్యార్థుల నమోదు, విద్యా ప్రమాణాలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అధికారులు, ప్రజాప్రతినిధులు, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు, గ్రామస్తులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల చేరికలను పెంచాలని సూచించారు. విద్యా సూచికల్లో జిల్లా ఆశించిన స్థాయిలో లేదని అసంతప్తి వ్యక్తంచేశారు. భవిత కేంద్రాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, విద్యార్థుల నమోదు విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. కళాశాలలు, వసతి గృహాల్లో సీట్లు అందుబాటులో ఉన్నప్పటికీ విద్యార్థుల నమోదు తక్కువగా ఉండటం ఆందోళనకరమన్నారు. పాఠశాలలు, హాస్టళ్లలో తాగునీరు, సివిల్ వర్క్స్ వంటి సౌకర్యాలపై టీజీడబ్ల్యూఈఐడీసీ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం జిల్లా విద్యాశాఖ రూపొందించిన పోర్టల్ను ఆవిష్కరించారు. విద్యాశాఖకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉండేలా రూపొందించిన డీఈఓ జయశంకర్ భూపాలపల్లి.కామ్ ప్రజలకు ఉపయోగపడుతుందని తెలిపారు. యువతకు అప్రెంటిస్ అవకాశాలు కల్పించాలి.. జిల్లాలో యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు పరిశ్రమలు ముందుకు వచ్చి అప్రెంటిస్ అవకాశాలు కల్పించాలని కలెక్టర్ రాహుల్ శర్మ పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్లోని తన కార్యాలయంలో ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యార్థులకు అప్రెంటిస్ అవకాశాల కల్పనపై పరిశ్రమలు, ఐటీఐ, పాలిటెక్నిక్, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పరిశ్రమలు అప్రెంటిస్ నియామకాల కోసం నాట్స్ (ఎన్ఏటీఎస్) ఆన్లైన్ పోర్టల్లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులకు అప్రెంటిస్ శిక్షణ కల్పించడం ద్వారా వారి సాంకేతిక నైపుణ్యాలు మెరుగుపడి భవిష్యత్ ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని తెలిపారు. జెన్కో, ఏఎంఆర్ తాడిచర్ల వంటి పరిశ్రమలు అప్రెంటిస్ అవకాశాల కల్పనలో ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. అవసరమైన అనుమతుల కోసం తన వంతు సహకారం, సిఫారసులు అందిస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలోని అన్ని పరిశ్రమలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అప్రెంటిస్ నియామకాలలో భాగస్వాములు కావాలని, యువతకు నైపుణ్యాభివద్ధి, ఉపాధి అవకాశాల కల్పనలో తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకన్న, జిల్లా పరిశ్రమల అధికారి సిద్ధార్థ రెడ్డి, ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిపాల్స్, పరిశ్రమల ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ -
అన్నదాత ఆగమాగం
మహాముత్తారం మండలంలో గురువారం అకాలవర్షం కురిసింది. దీంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నీళ్లు నిలిచాయి. దీంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వివిధ గ్రామాల్లో ప్రభుత్వం ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లబస్తాలు తడవడంతో రైతులు టార్పిన్ కవర్లు కప్పుకున్నారు. ప్రభుత్వం వెంటనే ధాన్యాన్ని మిల్లులకు తరలించి రైతులకు నష్టం జరగకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. మహాముత్తారం మండలం కోనంపేటలో ధాన్యం బస్తాలపై పరదాలు కప్పిన రైతులు – మహాముత్తారం -
కార్మిక వ్యతిరేక విధానాలతోనే నష్టాలు
భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలు, రాజకీయ జోక్యాల కారణంగానే సింగరేణి ఆర్థిక ఇబ్బందుల్లో పడిందని బీఎంఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పాని శ్రీనివాస్ అన్నారు. గురువారం కేటీకే–5 ఇంకై ్లన్లో పిట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గేట్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. కార్మిక సమస్యల పరిష్కారం పేరుతో సమ్మెలు, చర్చలు జరిపిన గుర్తింపు సంఘాలు కార్మికులకు ప్రయోజనం చేకూర్చలేకపోయాయని విమర్శించారు. తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో సంస్థలు సింగరేణికి చెల్లించాల్సిన రూ.51వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మెడికల్ బోర్డు నిర్వహణ, సొంత ఇంటి పథకం, పెర్కస్పై ఆదాయపు పన్ను రద్దు, మారుపేర్ల సవరణ, పెండింగ్ డిపెండెంట్ ఉద్యోగాలు, డిస్మిస్ కార్మికులకు అవకాశం, మైనింగ్, టెక్నికల్, క్లరికల్ సిబ్బంది సమస్యల పరిష్కారం వంటి అంశాలపై యాజమాన్యం చర్యలు తీసుకోవాలని కోరారు. జూన్ 30తో 11వ వేతన సవరణ గడువు ముగియనున్న నేపథ్యంలో జూలై 1 నుంచి అమలులోకి వచ్చే 12వ వేతన సవరణ కోసం జేబీసీసీఐ కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలని బీఎంఎస్ జాతీయ కోల్ సెక్టర్ ఇన్చార్జి కొత్తకాపు లక్ష్మారెడ్డి కేంద్ర స్థాయిలో ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని తెలిపారు. ఈ నెల 7న భూపాలపల్లిలో జరిగే బీఎంఎస్ 29వ మహాసభలో 12వ వేతన సవరణ, కొత్త బొగ్గు గనుల ప్రారంభం, కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం, కార్మిక సంక్షేమ అంశాలపై కీలక తీర్మానాలు చేయనున్నట్లు వెల్లడించారు. మహాసభలను కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యతిపతి సారంగపాణి, వెలబోయిన సుజేందర్, సత్కూరి శ్రీనివాస్, ఓరం లక్ష్మణ్, కొత్తూరి మల్లేష్, కటకం శ్రీనివాస్, అల్లం శ్రీనివాస్, పునీత్ రావు, చిట్యాల ప్రవీణ్, రాజు నాయక్ పాల్గొన్నారు. బీఎంఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ -
కరెంట్ షాక్
‘గృహజ్యోతి’కి భూపాలపల్లి: జిల్లాలో ఎండ తీవ్రతతో పాటు వడగాలులు కూడా రోజురోజుకూ పెరుగుతున్నాయి. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు, ఫ్రిజ్లను విపరీతంగా వాడుతున్నారు. జిల్లాలో విద్యుత్ వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ఫలితంగా గృహజ్యోతి పథకానికి కరెంట్ షాక్ తగులుతోంది. నెలవారీ బిల్లు 200 యూనిట్లు దాటడంతో ఉచిత కరెంట్ అర్హత పొందే లబ్ధిదారులు సంఖ్య జిల్లాలో ఒక్కసారిగా తగ్గిపోయింది. ఒక్క మే నెలలోనే 4,515 మంది 200 యూనిట్ల కంటే ఎక్కువగా వినియోగించారు. పెరిగిన విద్యుత్ వినియోగం.. ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురుస్తుందా అన్నట్లుగా జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. జూన్ మొదటి వారంలోకి అడుగిడినప్పటికీ తీవ్రమైన ఎండలు ఉండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటలలోపు, సాయంత్రం 6గంటల నుంచి 8 గంటల వరకు తమ అవసరాల నిమిత్తం బయటకు వస్తున్నారు. మిగిలిన సమయం మొత్తం ఇంట్లోనే గడుపుతున్నారు. ఏసీ, కూలర్లు, ఫ్యాన్లు, ఫ్రిడ్జ్లను ఎక్కువగా వాడుతుండటంతో జిల్లాలోని ప్రతీ ఇంటా గతేడాది కంటే ఈ వేసవిలో విద్యుత్ వినియోగం తీవ్రంగా పెరిగింది. ఇందుకు అనుగుణంగా ఎన్పీడీసీఎల్ అధికారులు సైతం ముందస్తు ఏర్పాటు చేయడంతో ఇబ్బందులు తలెత్తలేదు. కొత్త ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయడం, డిమాండ్కు అనుగుణంగా సరఫరా చేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోలేదు. తగ్గిన గృహజ్యోతి వినియోగదారులు.. వేసవి కారణంగా గృహజ్యోతి విద్యుత్ వినియోగదారులు సైతం తగ్గారు. తెల్లరేషన్ కార్డు కలిగి ఉండి ఒక నెలలో 200 యూనిట్లలోపు వినియోగించే వారికి గృహజ్యోతి పథకం పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందజేస్తుంది. గతంలో పోలిస్తే ఈ ఎండాకాలంలో గృహజ్యోతికి అర్హులైన వారి సంఖ్య తగ్గింది. విద్యుత్ను ఎక్కువగా వినియోగించడం మూలంగా 201 యూనిట్ వాడిని వారికి సైతం రూ.వేయి వరకు విద్యుత్ బిల్లు వచ్చింది. జిల్లాలో గృహజ్యోతి లబ్ధిదారులు 60,599 మంది ఉండగా, గత నెలలో 4,515 మంది 200 యూనిట్ల కంటే ఎక్కువగా వినియోగించారు. దీంతో వీరు బిల్లు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. వడగాలులతో ఇళ్లకే పరిమితమవుతున్న ప్రజలు నిరంతరాయంగా ఏసీ, కూలర్లు, ఫ్యాన్ల వాడకం ఉచిత విద్యుత్ అర్హత కోల్పోతున్న గృహాలు విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేస్తున్నాం. ఫిబ్రవరి నుంచి మే నెల వరకు విద్యుత్ డిమాండ్ ప్రతి నెలా పెరుగుతూ వచ్చింది. అయినప్పటికీ మా అధికారులు, సిబ్బంది కృషితో వినియోగదారులకు విద్యుత్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నాం. ఇందుకోసం జిల్లాలో కొత్తగా 78 ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశాం. -
వీరన్న సన్నిధిలో పూజలు
కురవి:మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని డైరెక్టర్ ప్రొటోకాల్ జీఏడీ శివలింగయ్య(ఐఏఎస్) దంపతులు బుధవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ ఈఓ సత్యనారాయణ, చైర్మన్ కొర్ను రవీందర్రెడ్డి స్వాగతం పలికారు. వారు ఆలయం చుట్టు ప్రదక్షిణలు చేశారు. స్వామివారిని దర్శించుకున్నారు. వారి పేర అర్చకులు గోత్రనామార్చనలు నిర్వహించారు. భద్రకాళీ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుఉన్నారు.. ముఖమండపంలో వారికి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ విజయ, సర్పంచ్ బాదావత్ లక్ష్మీరాజునాయక్, పంచాయతీ కార్యదర్శి రాజేశ్, జీపీఓ జుంకీలాల్, టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు సీహెచ్.శ్రీనివాస్ ఉన్నారు. -
అత్యవసరంగా కావాల్సినవి..
పరికరం సంఖ్య వ్యయం ఫుల్రూమ్ డీఆర్ ఎక్స్రే 2 70 లక్షలు మొబైల్ డీఆర్ ఎక్స్రే 4 80 లక్షలు అల్ట్రాసౌండ్ 4 1.20 కోట్లు హారిజొంటల్ ఆటోక్లేవ్స్ 3 15 లక్షలు ఓటీ టేబుల్స్ 4 16 లక్షలుప్రధాన పరికరాల పరిస్థితి ఇలా పరికరం ఎంజీఎం సూపర్ స్పెషాలిటీఎంఆర్ఐ 1 (తరచూ మరమ్మతు) లేదు సీటీ స్కాన్ 1 (మరమ్మతు) 1 (పనిచేయదు) క్యాథ్ ల్యాబ్ లేదు 1 (పనిచేయదు) డీఆర్ ఎక్స్రే పాతది (మరమ్మతు) 1 ( ఏఎంసీ డ్యూ) అల్ట్రాసౌండ్ 4 (పాతవి, మరమ్మతు) 2 2డీ ఇకో 1 (పనిచేయదు) పనిచేస్తోంది ఈసీజీ 4 తరచూ మరమ్మతు 2 పనిచేస్తున్నాయిఎంజీఎం ఆస్పత్రి ఓపీలు, పరీక్షలు (సుమారుగా) రోజువారీ ఓపీ : 2,000 ఇన్పేషంట్లు : 1,000 ఎంఆర్ఐ/సీటీ స్కాన్ అవసరమయ్యే వారు : 500 ప్రస్తుతం జరుగుతున్న స్కాన్లు : 50 అల్ట్రాసౌండ్ అవసరమయ్యే వారు : 200 ప్రస్తుతం జరుగుతున్న అల్ట్రాసౌండ్లు: 100లోపు -
ఓటరు సవరణ పకడ్బందీగా చేపట్టాలి
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్శర్మ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. 2026 అక్టోబర్ 1ను అర్హత తేదీగా నిర్ణయించి ప్రత్యేక ఓటరు సవరణ షెడ్యూల్ విడుదల చేసినట్లు తెలిపారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటి సర్వే నిర్వహిస్తారని చెప్పారు. జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించి, అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా విడుదల చేస్తామని తెలిపారు. గ్రామ, వార్డు సభలను నిర్వహించాలి ప్రజాపాలన –ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈ నెల 4, 6, 8, 10 తేదీల్లో జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీ వార్డుల్లో గ్రామ, వార్డు సభలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్తో కలిసి వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. గ్రామసభల్లో ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ కార్యక్రమం, పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకం, పారిశుద్ధ్యం, మహిళల రక్షణ, బాల్య వివాహాల నివారణ, మాదకద్రవ్యాల నియంత్రణ, రహదారి భద్రత వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే ఖరీఫ్ సీజన్కు అవసరమైన విత్తనాలు, ఎరువులు రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మా ట్లాడుతూ.. గ్రామ, వార్డు సభల్లో పోలీసు అధికారులు పాల్గొని ప్రకృతి వైపరీత్యాలు, రహదారి భద్రత, డ్రగ్స్ నివారణపై అవగాహన కల్పించాలని సూచించారు. నకిలీ విత్తనాలు, ఎరువుల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతీఒక్కరి బాధ్యతని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. ఆటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 5న నిర్వహించనున్న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం కలెక్టరేట్లో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, జిల్లా అటవీ శాఖ అధికారి నవీన్రెడ్డితో కలిసి ప్లాస్టిక్ వాడకంపై అవగాహన కల్పించేందుకు క్లాత్ బ్యాగులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వినియోగం వల్ల భూమి, నీరు కలుషితమవడంతోపాటు పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, డీఆర్డీఓ బాలకృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, సీపీఓ జవహర్, డీఈఓ రాజేందర్, తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ -
ఉద్యానం.. ఆశాజనకం
భూపాలపల్లి రూరల్: జిల్లాలో పండ్ల తోటల సాగు విస్తీర్ణం ఏటేటా పెరుగుతోంది. నీటి వనరులు పుష్కలంగా ఉండటంతోపాటు ఇక్కడి నేలలు, వాతావరణ పరిస్థితులు పండ్ల తోటల సాగుకు అనుకూలంగా ఉండటంతో రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా పండ్ల తోటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. నేలలు, వాతావరణం అనుకూలం పండ్లతోటలు, కూరగాయల సాగుకు ఎర్రటి, ఒండ్రుతో కూడిన ఎర్రటి నేలలు ఉండాలి. ఇలాంటి నేలలే జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి. జిల్లాలో 800పైగా చెరువులు ఉన్నాయి. వీటన్నింటి ద్వారా బోరుబావుల్లో ఆశించిన స్థాయిలో నీటిమట్టం ఉంటోంది. సాధారణంగా పండ్ల తోటలను బోరుబావుల కిందే ఎక్కువగా సాగుచేస్తారు. వేసవిలో పగటి ఉష్ణోగ్రతలు ఎంత ఉన్నా, సాయంత్రం నుంచి రాత్రి వరకు చల్లగా ఉంటుంది. శీతాకాలంలో ఎంత చలిఉన్నా.. ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోవు. ఇలా జిల్లాలో నేలలు, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో రైతులు పండ్ల తోటలను సాగుపై ఆసక్తి చూపుతున్నారు. 1,148 ఎకరాల్లో సాగు.. ఏళ్ల తరబడి పత్తి, వరి, వేరుశనగ తదితర పంటలను సాగుచేస్తూ వస్తున్న రైతుల ఆలోచనా సరళిలో మార్పు వస్తోంది. ప్రధానంగా పండ్ల తోటలకు ఇక్కడి నేలలు, వాతావరణం అనుకూలంగా ఉండటం.. పండ్ల రకాన్ని బట్టి మూడేళ్ల నుంచి ఐదేళ్లపాటు మంచి నిర్వహణ పద్ధతులు అవలంబిస్తే, తోటలు బాగా వచ్చి ఆర్థికంగా లాభపడతామన్న ఆలోచనతో రైతులు పండ్ల తోటల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. మామిడి, బత్తాయి, బొప్పాయి, అంజీర, జామ, డ్రాగన్ ఫ్రూట్ తదితర పండ్లతోటలు సాగు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, తోటల సాగు విస్తీర్ణం పెరగడానికి మరో కారణం కూడా ఉంది. కేంద్రం ఆధీనంలోని ఎంఐడీహెచ్ పథకంతోపాటు ఉపాధి హామీ పథకం కింద పండ్లతోటల సాగును ప్రోత్సహిస్తున్నారు. ఆయా పథకాలతో సన్న, చిన్నకారు రైతులు సైతం పండ్లతోటల సాగుపై మొగ్గుచూపుతున్నారు. ఇక ఆర్థికంగా ఉన్న రైతులు పథకాలతో సంబంధం లేకుండా సాగు చేస్తున్నారు. 2021–22లో 641 ఎకరాల్లో పండ్ల తోటలు ఉండగా.. ప్రస్తుతం ఆ విస్తీర్ణం 1,148.03 ఎకరాలకు పెరగడం గమనార్హం.మామిడి తోట జిల్లాలో అనుకూలమైన నేలలతో రైతుల మొగ్గు రాయితీలతో ప్రోత్సహిస్తున్న ఉద్యానశాఖ 1,148 ఎకరాలకు పెరిగిన సాగు విస్తీర్ణంసంవత్సరం రైతులు సాగు (ఎకరాల్లో) 2021–22 335 641 2022–23 367 691 2023–24 370 741 2024–25 840 1,045.25 2025–26 742 1,148.03 2026–27 –– 1,205 అంచనా -
సర్వీస్ రికార్డే కీలకం..!?
పోలీస్శాఖలో కొత్త ఫార్ములా.. ● పోస్టింగ్ల ‘రాజకీయా’నికి డీజీపీ బ్రేక్ ● ‘సేఫ్ పోస్టింగ్’లకు ‘డిప్యుటేషన్’తో చెక్.. లూప్లైన్ డ్యూటీలు ఇక తప్పనిసరి ● ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల కంటే డీజీపీ రూల్సే పవర్ఫుల్ ● ఒకేచోట ఉంటే కూడా ఔట్... పోలీస్వర్గాల్లో కలకలంసాక్షిప్రతినిధి, వరంగల్: పోలీస్శాఖలో తప్పనిసరి డిప్యుటేషన్ విధానం మళ్లీ అమల్లోకి రాబోతుంది. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్ కొత్త నిబంధనలను అమలు చేసే పనిలో పడ్డారు. పోలీస్ అధికారి ఇకపై ప్రమోషన్కు ముందు.. తర్వాత కనీసం రెండేళ్లయినా డిప్యుటేషన్పై లూప్లైన్ పోస్టింగుల్లో పనిచేయాల్సిందే. గతంలోనూ ఈ నిబంధనలున్నా.. రాజకీయ పలుకుబడి, పైరవీల కారణంగా అమలు కాలేదు. చాలామంది సబ్ ఇన్స్పెక్టర్ నుంచి డీఎస్పీ/ఏసీపీల వరకు శాంతిభద్రతల విభాగంలోనే కొనసాగుతూ వస్తున్నారు. డీజీపీ కొత్త ఫార్ములా అమల్లోకి వస్తే డిప్యుటేషన్పై ఇతర యూనిట్లలో పనిచేసిన వారికి ప్రాధాన్యత దక్కనుంది. సిఫార్సులు కాకుండా సర్వీస్ రికార్డులు ప్రామాణికంగా పదోన్నతులు, పోస్టింగ్లు దక్కనున్నాయన్న చర్చ ఆ శాఖలో హాట్టాపిక్గా మారింది. బదిలీ లేదా డిప్యుటేషన్.. పలువురు అధికారులకు ఎఫెక్ట్.. వరంగల్ పోలీస్ కమిషనరేట్తో పాటు ములుగు, మహబూబాబాద్, జేఎస్ భూపాలపల్లి జిల్లాల్లో పలువురిపై బదిలీ లేదా డిప్యుటేషన్ వేటు తప్పేట్టులేదు. డీఎస్పీ, ఏసీపీ, సీఐ, ఎస్ఐ స్థాయిలో పనిచేస్తున్న అధికారులు గణనీయ సంఖ్యలో ఐదేళ్లకు పైగా ఒకే ప్రాంతంలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. డీఎస్పీ/ఏసీపీలు 10–15 మంది, సీఐలు 30 మందికిపైగా, ఎస్ఐలు 40–50 మంది వరకు ఉండగా, కొత్త విధానం అమలైతే వీరంతా బదిలీ, డిప్యుటేషన్ పరిధిలోకి వచ్చే అవకాశముందని ఆ శాఖ అధికారులే చెబుతున్నారు. సీఐ, డీఎస్పీ/ఏసీపీలుగా పనిచేస్తున్న పలువురు రెండు నుంచి మూడు ప్రమోషన్లు పొందినా.. చాలామంది సీఐడీ, డీసీఆర్బీ, పీసీఆర్, పీటీసీ, సీటీసీ, ఇంటెలిజెన్స్ త దితర లూపులైన్ విభాగాలవైపు కన్నెత్తయినా చూడలేదు. దీంతో డీజీపీ కొత్త నిర్ణయంతో ఉమ్మడి వరంగల్లో చాలామందికి డిప్యుటేషన్లు తప్పవన్న చ ర్చ జరుగుతోంది. కుటుంబం, పిల్లల విద్య, స్థానిక అనుబంధాల కారణంగా కొందరు సీనియర్ అధికా రులు డిప్యుటేషన్లు, బదిలీల నిర్ణయంపై ఆందోళ న చెందుతుండగా, కీలక పోస్టింగ్ల కోసం ఎదురుచూస్తున్న యువ అధికారులు మాత్రం స్వాగతిస్తున్నారు. ఒకే వర్గం అధికారుల ఆధిపత్యానికి చెక్ పడి కీలక పోస్టుల్లో కొత్తవారికి అవకాశాలు లభిస్తాయని, ఫీల్డ్, లాఅండ్ఆర్డర్, ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ విభాగాల్లో అనుభవం, పోస్టింగ్లలో పారదర్శకత పెరిగే అవకాశం ఉంటుందని వారంటున్నారు. లూపులైన్ విధులు తప్పనిసరి.. దీర్ఘకాలికంగా శాంతిభద్రతల విభాగంలో పనిచేసే అధికారులకు లూపులైన్ పోస్టింగ్లు తప్పనిసరి కానుంది. ఇప్పటివరకు పట్టణ పోలీస్ స్టేషన్లు, ట్రాఫిక్, టాస్క్ఫోర్స్, ప్రత్యేక విభాగాల పోస్టింగులలో రాజకీయ ప్రభావం కీలక పాత్ర పోషించేదన్న అభిప్రాయం ఉంది. కొత్త విధానం అమలైతే ఒకేచోట ఎక్కువకాలం కొనసాగడం కష్టమవడంతోపాటు సిఫార్సుల ప్రభావం కూడా తగ్గే అవకాశముంది. ఒకే కమిషనరేట్, జిల్లా లేదా ప్రత్యేక విభాగంలో ఐదేళ్లకు పైగా కొనసాగుతున్న అధికారులను ఇతర యూనిట్లు, జిల్లాలు లేదా విభాగాలకు పంపడం అనివార్యం కానుంది. ఇకపై పోస్టింగ్లలో వ్యక్తిగత సిఫార్సుల కంటే సర్వీస్ రికార్డు, పనితీరు, పరిపాలనా అవసరాలకే ప్రాధాన్యం లభించే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులే చెబుతున్నారు. -
నియామక పత్రాలు ఇవ్వాల్సిందే..
● కొరిమి రాజ్కుమార్ భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో కారుణ్య నియామకాలు పొందిన కార్మికులకు నియమాక పత్రాలు అందించాలని లేనిపక్షంలో సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నామని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ పేర్కొన్నారు. డిపెండెంట్ ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలు వెంటనే అందజేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఏరియా సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం జీఎం రాజేశ్వర్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజ్కుమార్ మాట్లాడుతూ.. సింగరేణి వ్యాప్తంగా వివిధ అనారోగ్య కారణాలతో మెడికల్ అన్ఫిట్ పొందిన కార్మికుల పిల్లల్లో సుమారు 400 మంది డిపెండెంట్ ఉద్యోగాలకు అర్హత సాధించి రెండేళ్లుగా నియామక పత్రాల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఒక్క భూపాలపల్లి ఏరియాలోనే సుమారు 70 మంది ఉద్యోగాలు మంజూరై కూడా నియామక పత్రాలు అందక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆయా కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. జూన్ 2న నియామక పత్రాలు అందజేస్తారని ఆశించిన కార్మికులకు నిరాశే మిగిలిందన్నారు. కార్యక్రమంలో నాయకులు మాతంగి రామచందర్, ఆసిఫ్ పాషా, శ్రీనివాస్, నూకల చంద్రమౌళి, తోట రామచందర్, రాజేందర్, గణేష్, సీపీఐ పట్టణ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతరాజు సతీష్, కార్మికులు పాల్గొన్నారు. పకృతివనం.. ప్లాస్టిక్మయం భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మండలంలోని పల్లెపకృతి వనం.. ప్లాస్టిక్మయమైంది. నిర్వహణ సరిగా లేకపోవడంతో మొక్కలు ఎండిపోయాయి. గ్రామానికి ముఖ ద్వారంలోనే ఉన్నా పకృతి వనాన్ని అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడంలేదనే విమర్శలు ఉన్నాయి. వేసవిలో సెలవులకు గ్రామానికి వచ్చినవారు ఈ ప్రకృతి వనాన్ని చూసి అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి వనం మొత్తం ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లతో నిండిపోయింది. ఎటు చూసినా చెత్త మాత్రమే దర్శనమిస్తుంది. దీంతో ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి ప్రకృతి వనాన్ని శుభ్రం చేయించి వినియోగంలోని తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. ఐటీడీఏ డీడీ జనార్దన్ బదిలీ ఏటూరునాగారం: సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలోని గిరిజన సంక్షేమ విద్యా విభాగంలో ఉప సంచాలకుడి(డీడీ)గా పనిచేస్తున్న దబ్బగట్ల జనార్దన్ బుధవారం బదిలీ అయ్యారు. మంచిర్యాల గిరిజన సంక్షేమ అధికారిగా వెళ్లారు. ఆయన స్థానంలో నాగర్కర్నూలు జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి ఫిరంగికి పదోన్నతి కల్పిస్తూ ఏటూరునాగారం డీడీగా బదిలీ చేశారు. అదే విధంగా ఐటీడీఏ ఇన్చార్జ్ ఏఓగా ఎస్డీసీ విభాగంలో డీటీగా పనిచేస్తున్న అనిల్కు అదనపు బాధ్యతలను అప్పగించారు. -
అవగాహనతోనే ప్రమాదాల నివారణ
భూపాలపల్లి అర్బన్: భద్రతపై అవగాహన కలిగిఉన్నప్పుడే ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. ఏరియాలోని కేటీకే–5వ గనిలో బుధవారం ప్రత్యేక భద్రతా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఉద్యోగులకు భద్రతా నిబంధనలు, పనిస్థలాల్లో పాటించాల్సిన జాగ్రత్తలు, ప్రమాదాల నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. కార్మికులతో కలిసి రక్షణ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల భద్రత సంస్థకు అత్యంత ప్రాధాన్య అంశమని పేర్కొన్నారు. గనుల్లో పనిచేసే ప్రతి ఉద్యోగి భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ అప్రమత్తతతో విధులు నిర్వహించాలని సూచించారు. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉన్నందున భద్రత విషయంలో రాజీ పడొద్దన్నారు. సంస్థ నిర్దేశించుకున్న ‘జీరో హార్మ్’ లక్ష్య సాధనకు యాజమాన్యం, అధికారులు, ఉద్యోగులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ) తప్పనిసరిగా వినియోగించడం, యంత్రాలు, పరికరాలను నిర్దేశిత విధానాలకు అనుగుణంగా ఉపయోగించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చన్నారు. పనిస్థలంలో అసురక్షిత పరిస్థితులు కనిపిస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని, ప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించే సంస్కృతిని పెంపొందించుకోవాలని సూచించారు. ఉద్యోగుల ఆరోగ్యం, భద్రత, సంక్షేమం కోసం సంస్థ చేపడుతున్న కార్యక్రమాలను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏరియా సేఫ్టీ ఆఫీసర్ మాటూరి రవీందర్, ఏరియా ఇంజనీర్ రాజారావు, కేటీకే–1 గ్రూప్ ఏజెంట్ ములుకుంట్ల తిరుపతి, గని మేనేజర్ రమేష్, కార్మిక సంఘాల నాయకులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. భూపాలపల్లి ఏరియా సింగరేణి జీఎం రాజేశ్వర్రెడ్డి -
శాంతిభద్రతల పరిరక్షణే ముఖ్యం
● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ భూపాలపల్లి రూరల్: రాష్ట్ర అభివృద్ధి, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు సేవలందిస్తుందని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్ అధికారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడారు. పోలీస్శాఖలో ఉత్తమ సేవలు అందించిన పోలీస్ అధికారులు, సిబ్బందికి ఎస్పీ చేతుల మీదుగా కఠిన సేవా పథకాలు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్, భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు, డీపీఓ సిబ్బంది, ఆర్ఐలు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పిడుగుపాటుతో 35 మేకల మృత్యువాత
వెంకటాపురం(కె): మండల పరిధిలోని ఆలుబాక గ్రామ శివారు అటవీ ప్రాంతంలో ఈదురు గాలులతో కూడిన వర్షానికి పిడుగు పడి 35 మేకలు మృత్యువాత పడ్డాయి. ఈ సంఘటన గ్రామ శివారులో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం..ఆలుబాక గ్రామానికి చెందిన మజ్జా చంద్రయ్యకు చెందిన మేకలను కాపరులు చిన్నక్క, నర్సింహారావులు మేతకు తోలుకెళ్లారు. అకాల వర్షానికి పిడుగు పడి మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి. మేకల కాపరులు స్పృహ తప్పిపడిపోయారు. గమనించిన గ్రామస్తులు అక్కడకు చేరుకుని 108కు సమాచారం ఇచ్చారు. వారిని వెంకటాపురం వైద్యశాలకు తరలించి చికిత్స అందించగా వారు కోలుకున్నారు. అలాగే బర్రెబొందవ గ్రామంలో పిడుగుపడి మూడు పశువులు మృతి చెందాయి. -
సంక్షేమం వైపు..
సంక్షోభం నుంచిభూపాలపల్లి: సంక్షోభంలో ఉ న్న రాష్ట్రాన్ని సంక్షేమం వైపు తీ సుకెళ్తున్నాం. తెలంగాణ రాష్ట్ర సాధనలో అసువులుబాసిన మ హానీయుల స్ఫూర్తితో ముఖ్య మంత్రి రేవంతర్రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం ప్రగతి పథం వైపు సాగుతూ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది. ప్ర ణాళికబద్ధమైన అభివృద్ధి సాధనకు విజన్ 2047తో ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ విప్ యె న్నం శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు. జిల్లాలో మంగళవారం జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలి సి ఐడీఓసీ కార్యాలయానికి విచ్చేసిన విప్ శ్రీనివా స్రెడ్డికి కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. భూ భారతితో భూ సమస్యలు పరిష్కారం.. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం ధరణిని రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తెలంగాణ భూ భారతి చ ట్టం 2025ను తెచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 5,010 గ్రా మ పాలనాధికారులతో సహా 8,900 మంది సిబ్బందిని నియమించి, 5,520 మంది లైసెన్స్డ్ సర్వేయర్లు రైతులకు సేవలను అందిస్తున్నారన్నారు. వ్యవసాయ దిగుబడుల్లో మొదటి స్థానం.. వ్యవసాయశాఖ ద్వారా రైతులకు ఇస్తున్న ప్రోత్సాహకాలతో వ్యవసాయ దిగుబడుల్లో రాష్ట్రం దేశంలో నే మొదటిస్థానంలో నిలవడం గర్వకారణం. జిల్లాలోని 29,683 మంది రైతులకు రూ. 299.35 కోట్లు రుణమాఫీ చేశామని, పంట పెట్టుబడికి రైతు భరోసా పథకం ద్వారా ఎకరాకు రూ.12 వేల చొప్పున సహాయం అందిస్తున్నాం. యాసంగిలో ఇప్పటి వరకు 10,833 మంది రైతుల నుంచి 80 వేల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసి రూ.79.30 లక్షలు చెల్లింపు చేశాం. అలాగే జిల్లాలో 1,38,747 రేషన్ కార్డులు ఉండగా, వాటిలో 3,93,919 మంది సభ్యులు నమోదై ఉన్నారు. వీరి కోసం ప్రతీ నెలా 2,530 టన్నులు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం. అలాగే రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి భద్రత కల్పించాలనే సంకల్పంతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ పథకం ద్వారా రూ. 5 లక్షల బీమా అందించనున్నామన్నారు. విద్యా, వైద్యరంగాలకు భారీగా నిధులు.. విద్యారంగం బలోపేతానికి ప్రభుత్వం ఎస్పీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల విద్యార్థులకు 40 శాతం డైట్ చార్జీలు, 200 శాతం కాస్మాటిక్ చార్జీలను పెంచింది. ఫ్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు పోషకాలతో బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజన పథకం అమలు చేసున్నాం. ఈ సంవత్సరం 10వ తరగతిలో రాష్ట్రస్థాయిలో 11వ స్థానంలో జిల్లా నిలిచింది. జిల్లా ప్రధాన ఆస్పత్రిలో రూ. 9.6 కోట్లతో అదనపు అంతస్తు నిర్మాణం, రూ. 4 కో ట్లతో సీటీ స్కాన్ యంత్రం, రూ. 40 లక్షలతో వెంటిలేటర్లు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. కాళేశ్వరం అభివృద్ధికి రూ.200 కోట్లు.. కాళేశ్వర ముక్తీశ్వర దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ. 200 కోట్లు మంజూరు చేసింది. గత నెల మే 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో సరస్వతీ అంత్య పుష్కరాలను ఘనంగా నిర్వహించుకున్నాం. రూ. 1.20 కోట్లతో నిర్మించిన మ్యూ జియంను మే 21న గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దంపతులు ప్రారంభించారు. మారుమూల గ్రామాలు, నిరుపేదలు నివసిస్తున్న ఈ జిల్లా సమగ్రాభివృద్ధికి నిరంతర కృషి చేస్తున్న ప్ర జాప్రతినిధులు, అధికారులకు శ్రీనివాస్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఎ మ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, ఏఎస్పీ నరేష్కుమార్, ఆర్డీఓ హరికృష్ణ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజబాబు, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు.. సొంతిళ్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నాం. సొంత స్థలంలో ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షలు అందజేస్తున్నాం. ప్రభుత్వం మొదటి విడతలో జిల్లాకు 4,434 ఇళ్లు మంజూరు చేయగా, 547 నిర్మా ణం పూర్తి కాగా 3,887 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు రూ. 77.12 కోట్లు మంజూరు చేశామని స్పష్టం చేశారు. -
పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి
● డీఈఓ రాజేందర్భూపాలపల్లి అర్బన్: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ని ర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం కలెక్టరేట్లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ ది నోత్సవ వేడుకల్లో వాల్పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే త రాలకు కాలుష్య రహిత సమాజాన్ని అందించేందు కు ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించాలని సూ చించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంఓ విజయపాల్రెడ్డి, సీఎంఓ రమేష్, 99 డేస్ యాక్షన్ ప్లాన్ జిల్లా నోడల్ అధికారి శ్రీకాంత్, జిల్లా సైన్స్ అధికారి స్వామి, సూపరింటెండెంట్ స త్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. -
ముహూర్తం ఖరారు!
కాళేశ్వరం: కాకతీయులు, చాళులక్యులు 11 శతా బ్దంలో నిర్మించిన కాళేశ్వరం దేవస్థానం మరో సరికొత్త నిర్మాణాలకు వేదిక కానుంది. 1982కు పూ ర్వం శిథిలావస్థలో ఉన్న కాళేశ్వరాలయం..దినదినాభివృద్ధి చెందుతుంది. తాజాగా కాళేశ్వరాలయంలో రాతి నిర్మాణాలకు ఏప్రిల్ 20న సీఎం ఎనుముల రేవంత్రెడ్డి రూ.198కోట్ల వ్యయంతో భూమి పూజ చేసిన విషయం విధితమే. ప్రస్తుతం దేవస్థానంలోని నిర్మాణాల తొలగింపు ప్రక్రియ ఈనెల 17న ఉదయం 8 గంటలకు శాస్త్రోక్తంగా విశేష పూజలతో పనులు ప్రారంభిస్తారని ముహూర్తాన్ని ఖరారు చేసినట్లు స్వయాన రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అంత్యపుష్కరాల ముగింపు కార్యక్రమంలో చెప్పారు. దీంతో కాళేశ్వరం దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చి కొంగొత్త రూపు దిద్దుకోనుంది. రూ.198కోట్లతో ఇలా.. రూ.133.50కోట్లతో ఆలయ కాంప్లెక్స్లోని గర్భాలయం, అర్థమండపం, శిఖరం, నందులు, ధ్వజం, 11 ఉప ఆలయాలు, ప్రాకారం, ఆగ్నేయంలో పాకశాల, నైరుతిలో విజయగణపతి ఆలయం, వాయువ్యంలో సుబ్రహ్మణ్యస్వామి ఆలయం, నాలుగు రాజగోపురాల నిర్మాణాలు చేస్తారు. ఈఓ కార్యాలయం, దేవస్థానం, దుకాణాల సముదాయం, ఎస్ఎస్ఆర్ కాటేజీ, సింగరేణి గెస్ట్హౌస్లు తొలిగిస్తారని తెలిసింది. రూ. 5కోట్లతో భూసేకరణ కింద సమీపంలోని కొన్ని గృహాలకు సంబంధించి తొల స్తారని సమాచారం. రూ.35.50కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు, భక్తులు వెయిటింగ్ షెడ్లు, షా పింగ్ కాంప్లెక్సులు, టిక్కెట్ కౌంటర్ హాల్, కల్చ రల్ సెంటర్, బ్యాంకు, ఎస్ఆర్ఆర్ కాటేజీ, ఈఓ కార్యాలయం, ప్రవేశ తోరణం, అభివృద్ధి పనులు చేస్తారు. రూ.6కోట్లతో గుండం చెరువు సుందరీకరణ చేస్తారు. రూ.18కోట్లతో ఆలయ అభివృద్ధి పనులతో పాటు నాలుగు ప్రధానకూడలి నుంచి ఆలయానికి చేరుకునే రోడ్డు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈ పనులు ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టనున్నారు. ఆలయ ఆవరణలో భక్తుల దర్శనం కోసం దేవాదాయశాఖ ఆధ్వర్యంలో బాలాలయం నిర్మించనున్నట్లు తెలిసింది. ఏడాదిలో పూర్తికి ప్రణాళికలు వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 6వ తేదీ వరకు గోదావరి పుష్కరాలు ప్రభుత్వం నిర్వహించడానికి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రూ.వెయ్యి కోట్లు మంజూరు చేస్తారని ప్రకటించారు. సంవత్సరం సమయం ఉన్న నేపద్యంలో పనులు త్వరగా ప్రారంభించడానికి యంత్రాంగం ప్రణాళికలు రూపొందించారు. మంత్రి శ్రీధర్బాబు, ఆయన సతీమణి దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్లు ప్రత్యేక శ్రద్ధతో ఆర్కిటెక్చర్లతో పనులు చేపట్టడానికి చర్యలకు పూనుకున్నారు. ఇప్పటికే మ్యాప్లు సిద్ధం చేసినట్లు తెలిసింది. త్వరలో శృంగేరికి.. త్వరలో ఈఓ మహేష్, ఉప ప్రధాన అర్చకుడు ఫణీంద్రశర్మలు శృంగేరి పీఠానికి వెళ్లనున్నారు. ఇప్పటికే సూత్రప్రాయంగా శృంగేరి పీఠం అనుమతులు తీసుకొని తొలిగింపు ప్రక్రియ మొదలుపెట్టనున్నామని అధికారుల ద్వారా తెలిసింది. గోదావరి పుష్కరాల వరకు కుంభాభిషేకం చేసి ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న దేవాలయాల స్థానంలో పూర్తిగా రాతి నిర్మాణాలు జరుగతుండడంతో భక్తులు, స్థానికుల్లో అభివృద్ధిపైన ఆశలు పెరుగుతున్నాయి. ఈనెల 17న కాళేశ్వరంలో రాతి నిర్మాణాల పనులు ప్రారంభం శృంగేరి పీఠాధిపతుల ఆదేశానుసారం తొలగింపు ప్రక్రియ సంవత్సరంలో పనులు పూర్తయ్యేలా చర్యలు వచ్చే గోదావరి పుష్కరాలకు ప్రారంభోత్సవాలు -
సభల నిర్వహణకు షెడ్యూల్ సిద్ధం చేయాలి
కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి: ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు గ్రామ, వార్డుల సభల నిర్వహణకు షెడ్యూల్ సిద్ధం చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి గ్రామ, వార్డు సభల నిర్వహణపై డీజీపీ సీవీ ఆనంద్తో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీసీలో సీఎస్ మాట్లాడుతూ.. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చేపట్టాల్సిన సభలపై పలు సూచనలు చేశారు. ఈ సమావేశానికి ఐడీఓసీ నుంచి జిల్లా అధికారులు పాల్గొన్నారు. నాణ్యమైన విత్తనాలు విక్రయించాలిరేగొండ: రైతులకు నాణ్యమైన విత్తనాలు విక్రయించాలని జిల్లా వ్యవసాయాధికారి బాపురావు అన్నారు. మంగళవారం మండలం కేంద్రంలోని రైతువేదికలో భూపాలపల్లి డివిజన్ పరిధిలోని ఏడు మండలాల విత్తనాల డీలర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విత్తనాలు కొనుగోలు చేసే రైతులకు తప్పకుండా రశీదులు ఇవ్వాలని సూచించారు. అలాగే స్టాక్ రిజిస్టర్లు అప్డెట్ చేయడంతో పాటు, ధరల పట్టికలను రోజు వారీగా నమోదు చేయాలని ఆదేశించారు. రాబోయే వానాకాలం ప్రభుత్వం సూచించిన 8 రకాల సన్నరకాలను మాత్రమే విక్రయించాలన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి సహాయ వ్యవసాయ సంచాలకులు రమేష్, ఏడు మండలాల వ్యవసాయశాఖాధికారులు వాసుదేవరెడ్డి, సతీష్, సురేందర్ రెడ్డి, సారయ్య, ఐలయ్య, కల్యాణి, శ్రీనివాస్ రెడ్డి, విత్తన డీలర్లు పాల్గొన్నారు. ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ మేళాభూపాలపల్లి అర్బన్: జిల్లా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో జిల్లా ఉపాధి కల్పన, యువజన సేవల శాఖ ఆధ్వర్యంలో నేడు (బుధవారం) ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఎం.మల్లయ్య మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంప్లాయిమెంట్ కార్డు కోసం గతంలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే వారన్నారు. నిరుద్యోగ యువతకు సౌకర్యవంతంగా ఉండేందుకు ప్రత్యేక మేళాలో కలెక్టరేట్లోని ఉపాఽధి కార్యాలయంలో దరఖాస్తులను స్వీకరింస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు తమ విద్యార్హతల ధ్రువపత్రాలు, బయోడేటా, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు వెంట తీసుకురావాలన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు పొందాలని కోరారు. జిల్లాలోని నిరుద్యోగ యువత అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సేవా పతకానికి ఎంపిక మహాముత్తారం: విధుల్లో అంకితభావంతో పనిచేసే వారికిచ్చే కఠిన సేవా పతకానికి మహాముత్తారం ఎస్సై మహేందర్కుమార్ ఎంపికయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రకటించిన కఠిన సేవా పతకాల జాబితాలో ఆయన పేరును ప్రకటించారు. ఎస్సై ఎంపికకావడంపై పలువురు అభినందనలు తెలిపారు. చెత్తా, ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు ఏటూరునాగారం: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని ఏటూరునాగారం దక్షిణం రేంజ్ అధికారి అబ్దుల్ రెహమాన్ అన్నారు. ప్రజాపాలన ప్రగతిలో ప్రణాళికలో భాగంగా మంగళవారం మండల కేంద్రంలోని 163 జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న చెత్తాచెదారం, ప్లాస్టిక్ వంటి వ్యర్థాలను సిబ్బందితో కలిసి తొలగించారు. ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఓ మాట్లాడుతూ చిన్నబోయినపల్లి పల్లె ప్రకృతి వనం నుంచి అటవీశాఖ చెక్ పోస్టు వరకు చెత్తాచెదారం ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రతీ ఇంటికి ఐదు మొక్కలు పెంచాలని కోరారు. విద్యార్థులు పాఠశాలల్లో క్రీడా మైదానాల వెంట మొక్కలను పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. -
ఉపాధి కూలీలతో ఆవిర్భావ వేడుకలు
భూపాలపల్లి రూరల్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శాసనమండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి భూపాలపల్లి మండలంలోని కమలాపూర్ గ్రామంలో ఉపాధి కూలీలతో కలిసి జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మండుతున్న ఎండల్లోనూ నిరంతరం శ్రమిస్తున్న కూలీల కష్టాన్ని అభినందిస్తూ, శ్రమజీవుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. భూపాలపల్లికి చెందిన ఓ పండ్ల వ్యాపారి తనకు అభిమానంతో అందించిన కొబ్బరి బొండాన్ని మహిళా కూలీతో వచ్చిన చిన్నారికి తాగించారు. ఈ దృశ్యం అక్కడి వారిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో సర్పంచ్, నాయకులు, ప్రజాప్రతినిధులు, కూలీలు పాల్గొన్నారు. -
ఉత్పత్తి, రవాణా, విద్యుత్ రంగాల్లో విశేష పురోగతి
● భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డిభూపాలపల్లి అర్బన్: రాష్ట్రంలో సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తితో పాటు రవాణా, విద్యుత్ ఉత్పత్తి రంగాల్లో విశేష పురోగతిని సాధిస్తున్నట్లు ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం భూపాలపల్లి ఏరియాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో అంబేడ్కర్ సెంటర్లో తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయ పద్ధతిలో బతుకమ్మ, బోనాలు, పీరీల మధ్య ధూంధాం పాటలతో నృత్యాలు చేస్తూ జీఎం కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలోనే అంబేడ్కర్ సెంటర్లో ఏరియా జీఎం రాజేశ్వర్రెడ్డి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. జీఎం, అధికారులు తెలంగాణ అమరవీరుల స్థూపానికి పూల వెసి నివాళులర్పించారు. సాయంత్రం అంబేడ్కర్ స్టేడియంలో సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించగా పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. భూపాలపల్లి ఏరియాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బొగ్గు రవాణా లక్ష్యం 4.25 లక్షల టన్నులు కాగా ఇప్పటివరకు 5.30 లక్షల టన్నుల రవాణా చేసి లక్ష్యాన్ని 25 శాతం అధిగమించినట్లు వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ సోలార్ విద్యుత్ ఉత్పత్తిని విస్తరిస్తున్నామని, గ్రీన్ ఎనర్జీ రంగంలో సింగరేణి ముందంజలో ఉందన్నారు. భూపాలపల్లి ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సింగరేణి సీఎస్ఆర్ నిధులతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణి తన వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ ముందుకు సాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా సేవా సమితి అధ్యక్షురాలు సునీతరాజేశ్వర్రెడ్డి, ఎస్ఓటు జీఎం కవీంద్ర, అధికారులు రవికుమార్, రాజారావు, రవీందర్, నజీర్, శ్యాసుందర్, కార్మిక సంఽఘాల నాయకులు రమేష్, మధుకర్రెడ్డి, ఉద్యోగులు, కార్మికులు, సేవా సభ్యులు పాల్గొన్నారు. -
49 శాతం బొగ్గు ఉత్పత్తి
భూపాలపల్లి అర్బన్: ఏరియాలో మే మాసంలో లక్ష్యంలో 49శాతం మాత్రమే బొగ్గు ఉత్పత్తిని సాధించినట్లు ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2.38 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యానికి గాను 1,16లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. జూన్ మాసంలో 2.35 లక్షల టన్నుల ఉత్పత్తి, రవాణా లక్ష్యాలను సాధించేందుకు అధికారులు, ఉద్యోగులు, కార్మికులు సమష్టిగా కృషి చేయాలని కోరారు. గైర్హాజరు శాతం తగ్గించి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని, అన్ని భద్రతా నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో ఉత్పత్తి, రవాణా కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఓపెన్కాస్ట్ గనులు, రహదారులు, డ్రెయినేజీ, పంపింగ్ వ్యవస్థలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, రక్షణ విషయంలో రాజీ లేదని జీఎం స్పష్టం చేశారు. అటవీశాఖ అధికారులపై దాడి? మహాముత్తారం: అటవీ భూముల్లో పోడు వ్యవసాయం చేస్తున్నారనే సమాచారం మేరకు అక్కడకు వెళ్లిన అటవీశాఖ అధికారులపై కొంత మంది వ్యక్తులు దాడి చేసిన ఘటన మహాముత్తారం మండలంలో చోటుచేసుకుంది. ఫారేస్ట్రేంజ్ అధికారుల కథనం ప్రకారం.. మహాముత్తారం మండలం నిమ్మగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని అటవీ భూములో చెట్లు నరికి సాగుకు కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారన్న సమాచారం మేరకు ఆదివారం అర్ధరాత్రి అటవీశాఖ సిబ్బంది అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అటవీశాఖ అధికారులను చూసిన డోజర్లతో పోడుచేసే వ్యక్తులు కర్రలు, రాళ్లతో అటవీశాఖ అధికారులపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడుల్లో పెగడపల్లి రేంజ్ అధికారులు శ్రీనివాస్, అఖిల్రెడ్డికి గాయాలయ్యాయి. వెంటనే వీరు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారి సూచనల మేరకు మహాముత్తారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఏరియా సింగరేణి ఉత్తమ ఉద్యోగుల ఎంపిక భూపాలపల్లి అర్బన్: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సింగరేణి సంస్థ ప్రకటించిన ఉత్తమ ఉద్యోగుల జాబితాలో భూపాలపల్లి ఏరియాకు చెందిన ఇద్దరు ఉద్యోగులు ఎంపికై నట్లు ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యామ్సుందర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏరియా స్థాయి ఉత్తమ ఉద్యోగిగా కేటీకే–1 గని ఎస్డీఎల్ ఆపరేటర్ లకవత్ శంకర్ ఎంపికయ్యాడు. కంపెనీ స్థాయి ఉత్తమ ఉద్యోగిగా కేటీకే ఓసీ–2 గని ఫిట్టర్ కె.రాజయ్య ఎంపికయ్యారు. నేడు (మంగళవారం) జరిగే వేడుకల సందర్భంగా భూపాలపల్లి అంబేడ్కర్ స్టేడియంలో లకవత్ శంకర్ను ఏరియా జనరల్ మేనేజర్ సత్కరించనుండగా, కంపెనీ స్థాయి ఉత్తమ ఉద్యోగిగా ఎంపికై న రాజయ్యను కొత్తగూడెంలో జరిగే కార్యక్రమంలో సింగరేణి సీఎండీ సన్మానించనున్నట్లు తెలిపారు. సింగరేణి అభివృద్ధికి వారు అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాలు దక్కడం గర్వకారణమని పేర్కొన్నారు. ఎంపికై న ఇద్దరు ఉద్యోగులను అధికారులు, సహోద్యోగులు అభినందించారు. భక్తులకు మజ్జిగ పంపిణీ వెంకటాపురం(ఎం): రామప్ప దేవాలయంలో భక్తులకు సోమవారం ఉచితంగా మజ్జిగను దాతల సహకారంతో పంపిణీ చేసినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఇమ్మడి భాస్కర్ తెలిపారు. సరస్వతి అంత్య పుష్కరాలకు వెళ్లిన భక్తులు తిరుగు ప్రయాణంలో రామప్పను సందర్శిస్తున్నారని తెలిపారు. భక్తులు, పర్యాటకుల కోసం ఉచితంగా మజ్జిగను అందించడం అభినందనీయమని తెలిపారు. శంకర్ రాజయ్య -
రామప్పలో సినిమా షూటింగ్
వెంకటాపురం(ఎం): షైన్ స్టూడియో బ్యానర్ పై రూపొందుతున్న ‘ప్రొడక్షన్ నంబర్ నెం. 2 సినిమా షూటింగ్ను రామప్ప దేవాలయంలో సోమవారం మంత్రి సీతక్క తనయుడు సూర్య, రైస్ మిల్లర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్ క్లాప్ కొట్టి సినిమా షూటింగ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షైన్ స్టూడియోస్ బ్యానర్స్ సినిమాను చిత్రీకరించడం అభినందనీయమన్నారు. యూనిట్ బృందంతో కలిసి రామప్ప రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్లు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గిరిబాబు, ఎస్సై చల్లారాజు, ప్రొడ్యూసర్ వేణు యాదవ్, హీరో అజయ్, మూవీ డైరెక్టర్ నేరెళ్ల దేవేందర్, కో డైరెక్టర్ ఆర్య అరవింద్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
విద్యుత్ దీపాలతో ముస్తాబైన కలెక్టరేట్భూపాలపల్లి అర్బన్: తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను పురస్కరించుకొని అధికారులు కలెక్టరేట్లో నిర్వహణ ఏర్పాట్లు పూర్తిచేశారు. కలెక్టర్ కార్యాలయ ఆవరణలో నేడు (మంగళవారం) జరిగే ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి హాజరుకానున్నారు. ఉదయం 7.25గంటలకు కేటీపీపీ గోదావరి గెస్ట్హౌస్ నుంచి శ్రీనివాస్రెడ్డి జిల్లాకేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్దకు బయలుదేరి కలెక్టర్ రాహుల్శర్మతో కలిపి అమరవీరులకు పుష్పాంజలి ఘటిస్తారు. కలెక్టరేట్కు చేరిన అనంతరం పోలీసులతో గౌరవవందనం స్వీకరించి జాతీయ పతాక ఆవిష్కరణ చేస్తారు. శ్రీనివాస్రెడ్డి సోమవారం గోదావరి గెస్ట్హౌస్ చేరుకోగా భూపాలపల్లి ఆర్డీఓ హరికృష్ణ పూల మొక్క అందించి స్వాగతం పలికారు. -
ఉవ్వెత్తున లేచిన ఉద్యమం
భూపాలపల్లి: మలిదశ తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా తనదైన శైలిలో అలుపెరుగని పోరాటాన్ని సాగించి, ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించింది. జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు, సింగరేణి కార్మికుల సమ్మె, రాష్ట్రం కోసం ఆత్మహత్యాయత్నాలు రాష్ట్ర ఏర్పాటుకు దోహదపడ్డాయి. ఎన్నో పోరాటాల అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో జిల్లాలో నాడు చేపట్టిన ఉద్యమాల వివరాలతో ‘సాక్షి’ ప్రత్యేక కథనం. రాష్ట్రం ఏర్పడే వరకు దీక్షలు.. ప్రత్యేక రాష్ట్రం కోసం మలి దశ ఉద్యమం ప్రారంభమైన తరుణంలో తెలంగాణ తొలి శాసన సభాపతి సిరికొండ మధుసూదనాచారి ఈ ప్రాంతంలో ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపడంలో కీలకపాత్ర పోషించారు. ఆయన సారథ్యంలో అన్ని పార్టీలతో కలిసి జేఏసీని ఏర్పాటు చేసి భూపాలపల్లి పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో 1,540 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. రాష్ట్రంలో అత్యధిక రోజులు దీక్షలు కొనసాగించిన జాబితాలో భూపాలపల్లి సైతం నిలిచింది. ఈ కార్యక్రమాలను జేఏసీ కన్వీనర్ పైడిపెల్లి రమేష్, కో కన్వీనర్లు జోగుల సమ్మయ్య, గీస సంపత్ తదితరులు దిగ్విజయంగా నడిపించారు. రాష్ట్రం ఏర్పడిన తరువాతనే ఈ దీక్షలను నిలిపివేశారు. ఆంధ్రా పెత్తనం మాకు వద్దంటూ.. మలిదశ తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్న సమయంలో 2010లో భూపాలపల్లి ఏరియాలో సింగరేణి ఓపెన్కాస్ట్ ప్రాజెక్ట్ 1 పనులు జరుగుతున్నాయి. ఓవర్ బర్డెన్ పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్ ఆంధ్ర ప్రాంతానికి చెందిన అతను కావడం, బంద్కు పిలుపునిచ్చిన్పపటికీ పనులు కొనసాగించడంతో ఉద్యమకారులు కన్నెర్రజేశారు. ప్రాజెక్ట్లోని డంపర్లకు నిప్పటించి తగులబెట్టారు. నలుగురు ఆత్మాహత్యాయత్నం.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నలుగురు ఉద్యమకారులు బలిదానానికి యత్నించారు. ముద్దమల్ల భార్గవ్, తాటి అశోక్, మద్దెల విజయ్, దుర్శనపెల్లి రాంగోపాల్రావు 2012 ఏప్రిల్ 9వ తేదీన భూపాలపల్లి పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటన అప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. సింగరేణి కార్మికుల పాత్ర మరువలేనిది.. ఎన్ని నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర విభజన చేయకపోవడంతో తెలంగాణ జేఏసీ సకల జనుల సమ్మెకు పిలుపునిచ్చింది. జేఏసీ పిలుపు మేరకు భూపాలపల్లి ఏరియాలోని సుమారు 7వేల మంది సింగరేణి కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. 2011 సెప్టెంబర్ 13వ తేదీ నుంచి అక్టోబర్ 24వ తేదీ వరకు 42 రోజుల పాటు విధులకు ఒక్కరు కూడా హాజరు కాకుండా మద్దతు పలికారు. బొగ్గుగని కార్మికుల సమ్మెతో దేశం మొత్తం చీకటిమయం అయ్యే పరిస్థితి సైతం నెలకొంది. వేతనాలు రాకున్నా, అధికారుల నుంచి, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనప్పటికీ కార్మికులు సమ్మెలో పాల్గొనడం నేటికీ మరువలేని సంఘటన. ప్రత్యేక రాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం 1,540 రోజుల పాటు భూపాలపల్లిలో రిలే దీక్షలు సింగరేణి యంత్రాలను తగులబెట్టిన ఉద్యమకారులు 42 రోజులు సమ్మెలో పాల్గొన్న నల్ల సూరీలు -
జయశంకర్ భూపాలపల్లి
మంగళవారం శ్రీ 2 శ్రీ జూన్ శ్రీ 20267రాష్ట్రం ఏర్పడిన అనంతరం గురుకులాలు, మహాత్మా జ్యోతిబా పూలే లాంటి హాస్టళ్లను ఏర్పాటు చేశారు. జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ భవనం నిర్మించాలని ప్రస్తుత ప్రభుత్వం భావించింది. ఈ మేరకు జిల్లాలోని గణపురం మండలం గాంధీనగర్ శివారులో రూ.196 కోట్లతో గతేడాది అక్టోబర్ 10న భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఆ పనులు పురోగతిలో ఉన్నాయి. స్కూల్ నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందనుంది. పేద, మధ్యతరగతి విద్యార్థులకు మెరుగైన విద్య, నాణ్యమైన భోజనం అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం జిల్లాలో ఒక మైనార్టీ, రెండు ఎస్సీ, రెండు ఎస్టీ, రెండు బీసీ గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేసింది. కార్పొరేట్ స్థాయి విద్య.. -
నిరుపేదల సొంతింటి కల సాకారం
మల్హర్(కాటారం): రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల సొంతింటి కలను సాకారం చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. సోమవారం కాటారం మండలం దన్వాడ గ్రామంలో కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి మంత్రి శ్రీధర్బాబు ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం చేసి వారికి నూతన వస్త్రాలను అందజేశారు. రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. కాటారం సబ్ డివిజన్ పరిధిలోని మల్హర్, కాటారం, మహాముత్తారం, మహదేవపూర్, పలిమెల మండాలల్లోని 300 మంది ఇందిరమ్మ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందించారు. అనంతరం మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ.. కొత్త భవనం అందుబాటులోకి రావడం ద్వారా గ్రామ ప్రజలకు పరిపాలన సేవలు మరింత సులభంగా, వేగంగా అందుతాయని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి పూర్తిగా కట్టుబడి పనిచేస్తోందన్నారు. మహిళలను బస్సులకు అధిపతులను చేయాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ పీడీ లోకిలాల్, ఆర్డీఓ రవీందర్, ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ అయిత ప్రకాశ్రెడ్డి, ఉపాధిహామీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాంబాబు, కాటారం మార్కెట్ కమిటీ చైర్పర్సన్ తిరుమల పాల్గొన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు కాళేశ్వరం: అర్హులైన ప్రతీ పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి మహదేవపూర్ మండల కేంద్రంలో పండుగ వాతావరణంలో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు గృహసౌకర్యం కల్పించడంలో కట్టుబడి ఉందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయన్నారు. కలెక్టర్ రాహుల్శర్మ మాట్లాడుతూ పథకం అమలులో పారదర్శకతను పాటిస్తూ అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను అందిస్తున్నామని తెలిపారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కాటారం, మహదేవపూర్లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు -
ఏర్పాట్లపై స్వామిజీ అభినందనలు
● మాధవానంద సరస్వతి ఆశీస్సులు పొందిన మంత్రులుకాళేశ్వరం: సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై శ్రీ మాధవానంద సరస్వతి స్వామీజీ అభినందలు తెలిపారు. ఆదివా రం కాళేశ్వరం వచ్చిన ఆయనను మంత్రులు పొ న్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్బాబు స్వామీజీ ఆశీ స్సులు పొందారు. అంత్య పుష్కరాలకు వచ్చే భక్తు ల సౌకర్యార్థం ప్రభుత్వం చేపట్టిన ముందస్తు చర్యలు, నిరంతర పర్యవేక్షణ పట్ల స్వామిజీ సంతృప్తి వ్యక్తం చేస్తూ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మక్కన్సింగ్ ఠాకూర్, సీడబ్ల్యూసీ సభ్యు డు గొడుగు రుద్రరాజు, తదితరులు పాల్గొన్నారు. -
కిటకిటలాడిన హేమాచల క్షేత్రం
మంగపేట: మండలంలోని మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయ క్షేత్రం వేలాది మంది భక్తజనంతో ఆదివారం కిటకిటలాడింది. ఆలయంలో స్వయంభు లక్ష్మీనర్సింహాస్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని వరంగల్, హైదరాబాద్, నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్ తదితర ప్రాంతాలతోపాటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, రాజమండ్రి, గుంటూరు తదితర ప్రాంతాల నుంచి అధికసంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం కోలాహలంగా మారింది. ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ సమీపంలోని చింతామణి జలపాతం వద్ద పుణ్య స్నానాలు ఆచరించారు. గంటల కొద్ది సమయం భక్తులు క్యూలో వేచి ఉండి భక్తిశ్రద్ధలతో తిలతైలాభిషేకం పూజలో పాల్గొన్నారు. మానవ శరీరాన్ని పోలి ఉండే స్వయంభు స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. ఆలయ పూజారులు భక్తుల గోత్ర నామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందచేశారు. ఉదయం నుంచి సాయంత్రం 05 గంటల వరకు ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. -
ఎస్సైపై జాతీయ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు
మల్హర్(కాటారం): తనపై కాటారం ఎస్సై దాడిచేశాడంటూ బాధితుడు ఎస్సైపై జాతీయ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేశాడు. దళిత కుటుంబానికి చెందిన తనపై కాటారం ఎస్సై దాడి చేశారని కాటారం గ్రామపంచాయతీకి చెందిన రామిల్ల రాజు ఈనెల 29న జాతీయ ఎస్సీ కమిషన్ను ఆశ్రయించాడు. దీనిపై ఎస్సీ కమిషన్ స్పందించింది. 15 రోజుల్లో పూర్తి నివేదికను ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. ప్రమాదాలు జరిగినా పట్టించుకోరా..? మహాముత్తారం: మహాముత్తారం గ్రామపంచాయతీలో గడ్డం రాజయ్య ఇంటిసమీపంలోని మలుపువద్ద గతంలో సైడ్కాల్వ నిర్మాణం చేపట్టారు. ఆ కాల్వను పూర్తిగా నిర్మించకుండా వదిలేశారు. ప్రధాన రహదారి కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఈ కాల్వలో ద్విచక్రవాహనాలు, పశువులు పడిన ఘటనలు ఉన్నాయి. అయినప్పటికీ గ్రామపంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా స్పందించి ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు. బావిలో పడి మహిళ మృతి రేగొండ: బావిలో పడి మహిళ మృతిచెందిన ఘటన రేగొండ మండలం మడతపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మోటబోతుల సులోచన (40) కొన్ని సంవత్సరాలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది. ఆదివారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన ఆమె మధ్యాహ్నం వరకు తిరిగి రాలేదు. దీంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు చుట్టూ పక్కల వెతకగా గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో మృతదేహం లభ్యమైంది. మృతురాలి భర్త కొమురయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. కాలిన ధాన్యం చిట్యాల: గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడంతో వరి ధాన్యం కాలిపోయిన ఘటన చిట్యాల మండలకేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. మండలకేంద్రానికి చెందిన బొల్లెపెల్లి సాంబయ్య తన రెండు ఎకరాల పంట పొలంలో వరి పంట సాగుచేశాడు. వారం క్రితం కోయగా ధాన్యం కల్లంలోనే ఉంది. గుర్తు తెలియని వ్యక్తులు సమీపంలో పంట పొలంలో నిప్పంటించగా కాలుకుంటూ వచ్చి సాంబయ్య పంట పొలంలోని ధాన్యానికి అంటుకుంది. దీంతో రూ.50వేల విలువైన ధాన్యం పూర్తిగా దగ్ధమైంది. పైపులు కూడా కాలిపోయాయని బాధితుడు తెలిపాడు. కులవర్గ విభేదాలు విస్మరించాలి హన్మకొండ కల్చరల్ : కులవర్గ విభేదాలను విస్మరించాలని చిన్మయానంద మిషన్ ప్రధాన కార్యదర్శి శ్రీసువిరానందస్వామి ఉద్భోధించారు. ఆదివారం హనుమకొండలోని వేయిస్తంభాల దేవాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఈఓ అనిల్కుమార్, ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామిజీ భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ.. చిన్మయ మిషన్ స్థాపించి 75ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అమృతోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీరన్న సన్నిధిలో భక్తుల సందడి కురవి: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో ఆదివారం భక్తులతో సందడి నెలకొంది. మండుటెండలను సైతం లెక్కచేయకుండా వీరభద్రస్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. క్యూలో నిల్చొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. -
జీవనాధారమే జీవం తీసింది!
● వల చుట్టుకుని మత్స్యకారుడి మృతిరేగొండ: చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడు కాళ్లకు వల చుట్టుకుని మృతిచెందిన ఘటన కొత్తపల్లిగోరి మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మండల కేంద్రానికి చెందిన కట్ల సతీష్ (33) గ్రామ సమీపంలోని చెరువులో చేపలు పట్టడానికి వెళ్లాడు. ఈ క్రమంలో సతీష్ కాళ్లకు వల చిక్కుకోవడంతో చెరువులో మునిగి చనిపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహన్ని పోస్ట్మార్టం నిమిత్తం పరకాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య మౌళిక, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయి త్రిలోక్నాథ్ రెడ్డి తెలిపారు. -
వనదేవతలను దర్శించుకున్న మంత్రి సీతక్క
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క సారలమ్మలను రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క ఆదివారం దర్శించుకున్నారు. అమ్మవార్ల గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోవిందరాజు, పగిడిద్దరాజులకు పూజలు చేశారు. దేవాదాయ శాఖ అధికారులు, పూజారులు డోలు వాయిద్యాలతో గద్దెల వద్దకు మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి సీతక్కకు పూజరులు అమ్మవార్ల ప్రసాదం అందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగ కల్యాణి, మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్, మేడారం జాతర మాజీ చైర్మన్ లచ్చు పటేల్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ పాక సాంబయ్య, పులి సంపత్, తదితరులు పాల్గొన్నారు. బాధిత కుటుంబాలకు పరామర్శ మండలంలోని కాల్వపల్లికి చెందిన ఉపాధ్యాయుడు బొదెబోయిన బుచ్చయ్య ఇటీవల మృతి చెందారు. ఆదివారం కన్నెపల్లిలో జరిగిన ఆయన పెద్దకర్మ కార్యక్రమానికి హాజరైన మంత్రి సీతక్క ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
డివిజన్ కల నెరవేరేనా?
సాక్షిప్రతినిధి, వరంగల్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తవుతున్న వేళ రైల్వే రంగంలో కీలక మార్పు చోటు చేసుకోబోతోంది. సోమవారం నుంచి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే (సౌత్ కోస్ట్ రైల్వే) జోన్ పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. దీంతో ఇప్పటి వరకు రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా సేవలందించిన దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) పరిధి గణనీయంగా మారనుండగా.. ఉమ్మడి వరంగల్లో రైల్వే డివిజన్ ఏర్పాటు హామీగానే మిగలనుంది. అన్నీ ఉన్నా.. డివిజన్ లేదు.. కాజీపేటను డివిజన్గా ఏర్పాటు చేయడానికి అనువైన అన్ని సౌకర్యాలు ఉన్నాయి. విద్యుత్ లోకోషెడ్, రెండు పిట్లైన్లు, భారీ రైల్వేయార్డు, కోచ్ నిర్వహణ కేంద్రం, కొత్తగా నిర్మిస్తున్న మెము (మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్), ఇంటర్సిటీ కోచ్ తయారీ యూనిట్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో రాజకీయ నిర్ణయాలతో కొత్త డివిజన్లు ఏర్పాటవుతున్నా అన్ని అర్హతలు ఉన్నా కాజీపేటకు మాత్రం డివిజన్ ప్రకటించకపోవడం ఉమ్మడి వరంగల్ వాసుల్లో అసంతృప్తికి కారణమవుతోంది. డివిజన్ వస్తే కొత్తమార్గాలు.. ఉమ్మడి వరంగల్ (కాజీపేట)కు డివిజన్ వస్తే కాజీపేట–బల్లార్షా, కాజీపేట–మోటుమర్రి, పెద్దపల్లి–నిజామాబాద్, డోర్నకల్–మణుగూరు, డోర్నకల్–భద్రాచలం రోడ్–సత్తుపల్లి మార్గాలు చేరే అవకాశం ఉంది. దాదాపు 695 కిలోమీటర్ల మేర విస్తరించే ఈ డివిజన్లో సింగరేణి బొగ్గు రవాణా కూడా ఉండడంతో ప్రారంభం నుంచే లాభాల్లో నడిచే అవకాశముందని రైల్వే అధికార వర్గాలు చెబుతున్నాయి. కాగా, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో రైల్వే పరిపాలన అంతా సికింద్రాబాద్ కేంద్రంగానే కొనసాగుతోంది. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటుతో దక్షిణ మధ్య రైల్వే పరిధి తగ్గనుంది. ఈ నేపథ్యంలో దక్షిణ భారతదేశంలో అత్యంత కీలక రైల్వే కూడళ్లలో ఒకటైన జంక్షన్.. ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ దిశలకు వెళ్లే రైళ్లకు ప్రధాన అనుసంధాన కేంద్రంగా ఉన్న కాజీపేటను డివిజన్ చేస్తే ఉమ్మడి వరంగల్ కొత్త గుర్తింపు రానుంది. ఎన్నికల వేళ మళ్లీ తెరపైకి.. రానున్న గ్రేటర్ వరంగల్ ఎన్నికల నేపథ్యంలో కాజీపేటకు రైల్వే డివిజన్ హోదా అంశం మరోసారి రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక జోన్ లభించిన నేపథ్యంలో కాజీపేట డివిజన్ ప్రకటించాలన్న డిమాండ్ ప్రజల నుంచి వినిపిస్తోంది. కాగా, ఉమ్మడి వరంగల్కు డివిజన్ వల్ల వేలాది ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు, రైల్వే మౌలిక వసతుల విస్తరణ, కొత్త రైళ్ల మంజూరు, సరుకు రవాణా ఆదాయం పెరగనుంది. వరంగల్ను రైల్వే పరిపాలనా కేంద్రంగా తీర్చిదిద్దే అవకాశం ఉండనుండగా, పరిశ్రమలు, వ్యాపారాలకు ప్రోత్సాహం తద్వారా ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ఊతం ఇవ్వనుందని నిపుణులు చెబుతున్నారు. 1980 నుంచే ఉద్యమం.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాజీపేటను ప్రత్యేక రైల్వే డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని రైల్వే ఉద్యోగ సంఘాలు, ప్రయాణికుల సంఘాలు, ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. 1980 నుంచి వివిధ దశల్లో ఉద్యమాలు కొనసాగుతున్నాయి. కాజీపేట జంక్షన్ దేశంలోనే అత్యంత కీలక రైల్వే కూడళ్లలో ఒకటిగా ఎదిగినప్పటికీ సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోనే కొనసాగుతోంది. కాగా, విశాఖపట్నం జోన్ ప్రతిపాదన నేపథ్యంలో ఈ ఏడాదిలో డివిజన్ కోసం ఉద్యమాలు జరిగాయి. సోమవారం నుంచి విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అమల్లోకి వస్తున్న సందర్భంగా కాజీపేట డివిజన్ కోసం ఉద్యోగ, ప్రజాసంఘాలు మళ్లీ ఉద్యమాలకు పిలుపునివ్వడం చర్చనీయాంశమవుతోంది. రాజకీయ లబ్ధి కోసమే సౌత్ కోస్టల్ రైల్వే రాజకీయల లబ్ధి కోసమే సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటు చేశారు. ఈ రైల్వే జోన్ ఏర్పాటుతో రైల్వే కార్మికులకు ఎలాంటి లాభం లేదు. విడిపోతున్న సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ జోన్, సౌత్ కోస్టల్ రైల్వే జోన్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు రైల్వే బోర్డు పరిష్కరించాలి. –పిల్లలమర్రి రవీందర్, సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ సికింద్రాబాద్ డివిజన్ సెక్రటరీ కాజీపేటను డివిజన్గా చేయాలి..నాందేడ్, హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్లతో దక్షిణ మధ్య రైల్వే జోన్గా, విజయవాడ, గుంటూరు, గుంతకల్, విశాఖపట్టణం డివిజన్లతో సౌత్ కోస్టల్ రైల్వే జోన్లుగా విడిపోతున్నాయి. సౌత్ కోస్టల్ రైల్వేజోన్ ఏర్పాటును తెలంగాణ ఎప్పుడు వ్యతిరేకించలేదు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న కాజీపేట డివిజన్ చేసి, కాజీపేట, నాందేడ్, హైదరాబాద్, సికింద్రాబాద్తో కలిపి దక్షిణ మధ్య రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి. – దేవులపల్లి రాఘవేందర్, రైల్వే జేఏసీ కన్వీనర్ కాజీపేటకు అన్ని అర్హతలు ఉన్నా మొండిచెయ్యే నేటి నుంచి దక్షిణ కోస్తా రైల్వేజోన్ అమలు రైల్వే పునర్వ్యవస్థీకరణతో ప్రజల్లో ఆశలు డివిజన్ ఏర్పాటు కోసం ఉద్యమాలకు సిద్ధమవుతున్న ఉద్యోగ, ప్రజాసంఘాలు -
భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు
● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ కాళేశ్వరం: సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా ఆదివారం కాళేశ్వరానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చిన నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట భద్రత, ట్రాఫిక్ ఏర్పాట్లు చేపట్టినట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన క్యూ లైన్లు, పుష్కర ఘాట్, త్రివేణి సంగమం వద్ద భక్తుల, ట్రాఫిక్ రద్దీని డ్రోన్ సహాయంతో నిరంతరం పర్యక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మాట్లాడుతూ.. భక్తుల వాహనాలకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించినట్లు తెలిపారు. భక్తులు నదిలో లోతైన ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. భక్తులు సురక్షితంగా పుష్కర స్నానాలు ఆచరించేలా పోలీస్ సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటూ సూచనలు చేస్తున్నట్లు తెలిపారు. -
కష్టపడేవారికి ఎప్పటికై నా గుర్తింపు
ములుగు రూరల్: పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి గుర్తింపు దక్కుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, సీ్త్ర–శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. మండలంలోని ఇంచర్ల ఎంఆర్ గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అర్హులకు అందించేలా పార్టీ నాయకులు కృషి చేయాలన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారికి తప్పకుండా న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఎన్నికలు, పార్టీ నిర్మాణంలో బూత్ ఏజెంట్ల వ్యవస్థ చాలా కీలకమైనదని పేర్కొన్నారు. అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్ ఆధ్వర్యంలో టీపీసీసీ డాక్టర్స్ సెల్, మెడికల్ వింగ్ ములుగు జిల్లా చైర్మన్గా మల్లంపల్లి మండలానికి చెందిన ఆనందపు రవిబాబును నియమించగా ఆయనను శాలువాలతో సన్మానించారు. ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా ఇంచర్ల గ్రామానికి చెందిన మట్టెవాడ తిరుపతిని నియమించగా వారికి నియామకపత్రాలను అందించారు. ఇదిలా ఉండగా.. పేదలు సైతం కార్పొరేట్ వైద్యం పొందేందుకు సీఎంఆర్ఎఫ్ ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి సీతక్క తెలిపారు. ఈ మేరకు పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను అందించారు. అనంతరం కొత్తగూడ మండలం సాధిరెడ్డిపల్లికి చెందిన దివ్యాంగుడు పుల్సం రవికిరణ్కు మూడు చక్రాల వాహనం అందించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, తితరులు పాల్గొన్నారు. -
ఆలస్యమైతే సమస్యలే..
● ఇతర జిల్లాల కంటే సాగు జాప్యం ● అకాల వర్షాలకు దెబ్బతింటున్న పంటలు ● సాగునీరు, స్థానిక పరిస్థితులే కారణంభూపాలపల్లి రూరల్: కాలానికి అనుగుణంగా జిల్లాలో పంటల సాగులో మారని రైతన్నకు నష్టాలు తప్పడం లేదు. ఇతర జిల్లాలతో పోలిస్తే జిల్లాలో వ్యవసాయంలో వ్యత్యాసం కనిపిస్తోంది. ములుగు, వరంగల్, పెద్దపల్లి జిల్లాలతో పోలిస్తే ఇక్కడి పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. స్థానిక పరిస్థితులతో దుక్కులు దన్నడం మొదలు విత్తనం వేసి పంట చేతికొచ్చేదాకా తేడా ఉంటోంది. దీంతో యాసంగిలో అకాల వర్షాలకు చేతికొచ్చిన పంటలు నష్టపోవాల్సి వస్తోంది. మరో వారం, పది రోజుల్లోనే రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకే అవకాశముంది. ఈ క్రమంలో ప్రణాళిక ప్రకారం వెళ్తే నష్టాన్ని నివారించే అవకాశాలు ఉన్నట్లు వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. నారు నుంచి కోతల దాకా.. వానాకాలం ఆరంభం జూన్ మొదటి వారంలో వరినార్లు పోస్తే అక్టోబర్ వరకు కోతలు పూర్తయ్యే అవకాశముంది. మళ్లీ నవంబర్లో నాట్లు వేస్తే ఏప్రిల్లో కోతలు పూర్తి కానున్నాయి. జిల్లాలో రైతులు జూలైలో నార్లు పోస్తూ.. ఆగస్టు, సెప్టెంబర్ వరకు నాట్లు వేస్తున్నారు. బోరు బావులు తప్పా, కుంటలు, చెరువుల్లో నీరు వచ్చే దాకా సాగుపై ధీమాలేని కారణంగానే ఈ జాప్యం జరుగుతోంది. సాగునీటి సౌకర్యం లేక.. జిల్లాలో వేలాది ఎకరాలకు ఇప్పటికీ వర్షాధారమే దిక్కు. అందుకే రైతులు అధికంగా ఆరుతడి పంటలు వేస్తుంటారు. భారీ సాగునీటి ప్రాజెక్టు లేక చిన్న వనరులే దిక్కవుతున్నాయి. కుంటలు, చెరువులు, రిజర్వాయర్లు, పాటు బోరు బావులు కింద పంటలు సాగవుతున్నాయి. వానలు సమృద్ధిగా కురిసి నీరు చేరితే భరోసాతో రైతులు వరి వేస్తున్నారు. ఇక వానాకాలంలో ఆరుతడి పంటలైన వరి, పత్తి, కంది, పెసర పంటలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ముందుగా సాగుచేస్తేనే మేలు.. యాసంగిలో రైతులు ముందుగా సాగు చేయడంతో నష్టం తగ్గించుకోగలిగారు. జిల్లాలో గత నెలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. కొన్నిచోట్ల ఇప్పటికే కొనుగోళ్లు పూర్తికావచ్చాయి. ముందుగా వరి నాట్లు వేసిన రైతులు పంట చేతికి రాగానే వెంటనే అమ్మేసుకున్నారు. ఆలస్యంగా నాట్లు వేసిన రైతులు వాతావరణంలో వస్తున్న మార్పులు, మబ్బుల కారణంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం మాయిశ్చర్ రాక ఆందోళన చెందుతున్నారు. పశువులు నష్టం చేస్తాయని.. ముందస్తుగా నార్లుపోస్తే పశువులు, మేకలు, గొర్రెలు, ఇతర జీవాల సంచారంతో రక్షణ ఉండదని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో అందరూ ఒకేసారి జూలైలోనే వరినార్లు పోస్తున్నారు. ఆ సమయంలో పశువుల కాపర్లు పంట చేన్లకు వెళ్లకుండా పశువులను నిలుపుతున్నారు. స్థానికంగా ఉన్న పరిస్థితుల కారణంగానే జిల్లాలో సాగులో జాప్యం జరుగుతోంది. ఇక ప్రైవేట్లో కాకుండా ప్రభుత్వమే నిర్ణీత సమయంలో విత్తనాలు పంపిణీ చేస్తే కొంతవరకు సమస్య తీరే అవకాశముంది. సాగులో 15రోజులు ముందుకెళ్లాలి.. జిల్లాలో వరికోతలు దాదాపు పూర్తయ్యాయి. కొన్నిచోట్ల అకాల వర్షాల కారణంగా ధాన్యానికి నష్టం వాటిల్లింది. వానాకాలంలో ముందుగానే సాగు పనులు ప్రారంభించేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. సాగులో ఆధునిక పద్ధతులు అవలంభించాలి. జూన్ నెలలో నార్లు పోసుకోవాలి. సాగులో 15రోజులు ముందుకెళ్లాలి. అధికారుల సలహాలు, సూచనలు పాటించాలి. – బాబురావు, జిల్లా వ్యవసాయాధికారి వానాకాలం సాగు అంచనా (ఎకరాల్లో) వరి 1,09,854 పత్తి 1,06,560 పెసర 90 కంది 110 -
ఎంజీఎం కోల్పోయిన ఆరోగ్యసిరి
ఆదివారం శ్రీ 31 శ్రీ మే శ్రీ 2026ఆరోగ్యశ్రీ సేవలందించి క్ల్లెయిమ్ చేయని విభాగాలు●రావాల్సిన ఆదాయం (రూ. లక్షల్లో)కార్డియాక్ అండ్ 37 కార్డియోథొరాసిక్ కార్డియాలజీ 56 ఈఎన్టీ 480 జనరల్ మెడిసిన్ 227 యూరినరీ 32 మెడికల్ అంకాలజీ 672 నెఫ్రాలజీ 47 ఆర్థోపెడిక్ సర్జరీ 39 పాలీ ట్రామా 91 ప్లాస్టిక్ సర్జరీ 112 సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ 105 సర్జికల్ అంకాలజీ 195కాశిబుగ్గ ఉత్తర తెలంగాణ జిల్లాలకు ప్రధానంగా ఉన్న వరంగల్ నగరంలోని మహాత్మాగాంధీ స్మారక వైద్యశాల (ఎంజీఎం)లో ఆరోగ్యశ్రీ ద్వారా రోగులకు సేవలు అందించిన వైద్యులు, సిబ్బంది వాటి వివరాలను సంబంధిత ట్రస్ట్కు పంపడంలో నిర్లక్ష్యం చేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. దీనివల్ల సుమారు రూ.8కోట్ల మేర ఆదాయం రాకుండా పోయినట్లు తెలుస్తోంది. ఇందులో ఎంజీఎంలో ఆరోగ్యశ్రీ సేవలందించిన దాదాపు అన్ని డిపార్ట్మెంట్లలో వైద్యుల నిర్లక్ష్యం, సిబ్బంది అలసత్వం కనిపిస్తోంది. ఏప్రిల్ 1, 2024 నుంచి ఈ ఏడాది మార్చి 31వ తేదీ వరకు ఆస్పత్రికి వచ్చిన ఆరోగ్యశ్రీ రోగులకు వివిధ విభాగాల్లో వైద్యులు, సిబ్బంది ఉచితంగా సేవలు అందించారు. ఆయా కేసులకు దాదాపు రూ.8 కోట్ల వరకు ఆదాయం ఆస్పత్రికి రావాల్సి ఉంది. క్లెయిమ్ చేసేందుకు ఆయా కేసుల వివరాలు ఆరోగ్యశ్రీ ట్రస్ట్కు పంపాలి. కానీ, ఎవరూ పట్టించుకోలేదు. ఇది వైద్యులు, సిబ్బంది అలసత్వం, ఉన్నతాధికారుల పర్యవేక్షణాలోపం, టెక్నికల్ సమస్య వల్ల జరిగినా, ఎంజీఎం ఆస్పత్రికి మాత్రం భారీ నష్టమే వాటిల్లింది. ఈ వ్యవహారంలో ఎంజీఎంలో ఉన్న దాదాపు అన్ని డిపార్ట్మెంట్లలో వైద్యుల నిర్లక్ష్యం, సిబ్బంది అలసత్వం కనిపిస్తోందన్న విమర్శలున్నాయి. మరికొన్ని విభాగాల్లో ఇలా..డెర్మటాలజీ 2 కేసులకు రూ.70వేలు, గ్యాస్ట్రో ఎంటరాలజీ 33 కేసులకు గాను రూ.5లక్షలు, క్రిటికల్ కేర్ 2 కేసులకు రూ.2లక్షలు, గైనకాలజీ, సర్జరీ ఒక కేసుకు రూ.15వేలు, ఇన్ఫెక్షన్ డిసీజెస్ ఒక కేసుకు రూ.9 వేలు, న్యూరాలజీలో 12 కేసులకు రూ.7 లక్షలు, పల్మనాలజీలో మూడు కేసులకు రూ.11 వేలు, రుమటాలజీలో 7 కేసులకు రూ.5 లక్షల చొప్పున, మరికొన్ని కేసులకు రూ.లక్షల్లో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి రావాల్సిన ఆదాయం గడువు దాటిపోవడంతో ల్యాప్స్ అయినట్లు సమాచారం. జనరల్ సర్జరీ కేసులు : 1,170 రూ. 2 కోట్లు (రావాల్సిన ఆదాయం) పలు డిపార్ట్మెంట్లకు సుమారు రూ.8 కోట్ల నష్టం ట్రస్ట్కు వివరాలు పంపడంలో నిర్లక్ష్యం.. లోపించిన పర్యవేక్షణ గడువు దాటిపోవడంతో ల్యాప్స్ అయినట్లు విమర్శలువిభాగాలు, కేసులు -
ధాన్యం దిగుమతుల్లో వేగం పెంచాలి
● కలెక్టర్ రాహుల్ శర్మ మల్హర్(కాటారం): జిల్లాలో ధాన్యం దిగుమతుల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్శర్మ అధికారులను ఆదేశించారు. శనివారం కాటారం మండలం రేగులగూడెంలోని రుద్ర జిన్నింగ్ మిల్లు, మీనాక్షి ఆగ్రో జిన్నింగ్ మిల్లులో జరుగుతున్న ధాన్యం దిగుమతి ప్రక్రియను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమని, వారి పంటకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం దిగుమతులలో జాప్యం లేకుండా అవసరమైన హమాలీలను అందుబాటులో ఉంచి అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు వివరించారు. లారీల కొరత తలెత్తకుండా ఉండేందుకు ఇసుక రవాణాకు ఉపయోగించే లారీలను కూడా ధాన్యం రవాణాకు వినియోగించాలని తెలిపారు. ఈ మేరకు టీఎస్ఎండీసీ ప్రాజెక్టు అధికారి రామకృష్ణకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీచేశారు. ఇసుక రవాణా లారీల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులు, గోదాములకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోకుమార్, తహసీల్దార్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
అధికారులకు ఎస్పీ సన్మానం
భూపాలపల్లి అర్బన్: జిల్లా పోలీస్ కార్యాలయంలో పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారులను పోలీస్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ హాజరై అధికారుల సేవలను కొనియాడారు. పోలీస్ ఉద్యోగం అత్యంత బాధ్యతాయుతమైనదని, విధుల నిర్వహణలో కుటుంబ సౌకర్యాలను త్యాగం చేస్తూ సమాజ శ్రేయస్సు కోసం కృషి చేసిన అధికారుల సేవలు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ కుటుంబ సభ్యులతో సమయం గడపాలని సూచించారు. ఈ సందర్భంగా ఏఎస్ఐలు సంధి ప్రతాపరెడ్డి, మదన నాగయ్య, చింత సుధీర్, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మాచర్ల వైకుంఠంను శాలువాలతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ ఆర్ఐ రత్నం, వెల్ఫేర్ ఆర్ఐ సంతోష్కుమార్, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. ఆవిర్భావ వేడుకలకు అతిథులు వీరే.. ● భూపాలపల్లికి ప్రభుత్వ విప్ యెన్నం సాక్షిప్రతినిధి, వరంగల్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం (జూన్ 2) సందర్భంగా జిల్లాల్లో జాతీయ పతాకావిష్కరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖులను నియమించింది. హనుమకొండకు రెవెన్యూ గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, వరంగల్కు అటవీ, పర్యావరణం, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ములుగుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), జనగామకు ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, జయశంకర్ భూపాలపల్లికి ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్రెడ్డి, మహబూబాబాద్కు ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్లు జాతీయ పతాకాలను ఆవిష్కరించనున్నారు. ముందుగా తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపాల వద్ద పుష్పాంజలి ఘటించనున్నారు. -
హామీలు నెరవేరుస్తాం
భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ బి.జనక్ప్రసాద్ తెలిపారు. శనివారం భూపాలపల్లి సింగరేణి గెస్ట్హౌస్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి కార్మికులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో కీలకపాత్ర పోషించినప్పటికీ, వారి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం, ఐఎన్టీయూసీ ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లలేకపోయాయని చెప్పారు. మెడికల్ బోర్డు పాత విధానం పునరుద్ధరణ, విజిలెన్స్ కేసుల పరిష్కారం, మారుపేరుల సమస్య, సొంత ఇంటి కల సాకారం, పెర్క్స్పై ఆదాయపు పన్ను భారం వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఐఎన్టీయూసీ నాయకులు ధర్మపురి, వికాస్ యాదవ్, జోగ బుచ్చయ్య, రాజేందర్, రత్నం సమ్మిరెడ్డి, కొలిపాక నర్సింగరావు, గడిపే చక్రపాణిలు పాల్గొన్నారు. ఓపెన్ స్కూల్ ఫలితాలు విడుదల విద్యారణ్యపురి: ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షల ఫలితాలను శనివారం అధికారులు విడుదల చేశారు. ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. టెన్త్ పరీక్షలకు 3,357 మంది విద్యార్థులు హాజరుకాగా.. అందులో 2,792 మంది (83.17 శాతం) విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. టెన్త్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా 92.09 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో రెండో స్థానాన్ని సాధించిందని ఓపెన్ స్కూల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ ఎ.సదానందం తెలిపారు. మహబూబాబాద్ జిల్లా 91.72 శాతం ఉత్తీర్ణతతో మూడో స్థానం, ములుగు జిల్లా 90.62 శాతం ఉత్తీర్ణతతో ఐదో స్థానం, హనుమకొండ జిల్లా 89.04 శాతం ఉత్తీర్ణతో ఏడో స్థానంలో నిలిచింది. హనుమకొండ డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ విద్యార్థులను అభినందించారు. ఇంటర్లో ములుగు జిల్లా రాష్ట్రస్థాయిలో ఫస్ట్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలకు 6,568 మంది విద్యార్థులు హాజరుకాగా అందులో 5,174 మంది (78.78 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ములుగు జిల్లా 81.66 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని కోఆర్డినేటర్ ఎ.సదానందం తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా 81.51 శాతం ఉత్తీర్ణతతో మూడో స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. మొక్కజొన్న డబ్బులు విడుదల భూపాలపల్లి: మార్క్ఫెడ్ ద్వారా జిల్లాలో మొక్కజొన్న విక్రయించిన 460 మంది రైతులకు రూ.5.42 కోట్లు విడుదలయినట్లు కలెక్టర్ రాహుల్శర్మ శనివారం తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధరతో పాటు చెల్లింపులు చేసేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. చిట్యాలలో రూ.42,22,800, గొర్లవీడులో రూ.61,48,800, కొత్తగోరిపల్లిలో రూ.18,18,1200, మొగుళ్లపల్లిలో రూ.68,84, 400, పీఏసీఎస్ గణపురం 24,30,000, రేగొండ రూ.1,64,22,000 చెల్లింపులు రైతుల ఖాతాల్లో జమకానున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్ విద్యార్థుల ఉత్తీర్ణత వివరాలు.. జిల్లా టెన్త్ ఉత్తీర్ణత ఇంటర్ ఉత్తీర్ణత హనుమకొండ 511 455 1,449 1,160 వరంగల్ 563 340 790 550 భూపాలపల్లి 354 326 611 498 మహబూబాబాద్ 507 465 869 687 జనగామ 740 588 1,862 1,473 ములుగు 682 618 987 806 -
రీల్స్ టు సిల్వర్ స్క్రీన్
విదేశాల్లో రీల్స్తో ఫేమస్ అయిన పాలకుర్తి వాసి● కోలీవుడ్లో ‘13/13 లక్కీ నన్’తో హీరోగా అరంగేట్రం ● త్వరలో రిలీజ్ కానున్న సినిమా ● ఐటీ ఉద్యోగంతో పాటు నటనలో రాణిస్తున్న నందుఒక్క చాన్స్.. ఒకే ఒక్క చాన్స్ అంటూ చిత్ర పరిశ్రమలో వేలాది మంది అవకాశాల కోసం తిరుగుతుంటారు. చాలా మందిలోని కళ కేవలం కలగానే మిగిలిపోతుంది. కానీ, డ్యాన్స్ చేసి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసిన అతడికి లక్షలాది మంది అభిమానులు దొరికారు. సినిమాపై ఉన్న మక్కువే అతడికి అవకాశాలు వెతుక్కుంటూ తెచ్చింది. కోలీవుడ్లో హీరోగా అరంగేట్రం చేసిన జనగామ జిల్లా పాలకుర్తి ప్రాంతానికి చెందిన ప్రవాస భారతీయుడు నందు రాపోలుపై ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ.. పాలకుర్తి టౌన్: ఎన్నారై రాపోలు నందు బాల్యం మొత్తం పాలకుర్తి పరిసర ప్రాంతంలోనే గడిచింది. ఉద్యోగ రీత్యా ఆయన సింగపూర్లో సెటిలయ్యారు. అక్కడ బ్యాంకులో ఉద్యోగం చేస్తూనే తెలుగు ఫిలిమ్ డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు. కోవిడ్ సమయంలో ఇంటికే పరిమితమైన నందు సరదాగా రీల్స్ చేయడం ప్రారంభించారు. అమెరికాలోని అట్లాంటాలో ఉన్న తన బంధువు సురేఖ నున్నతో కలిసి చేసిన వీడియోలు మిలియన్ల వ్యూస్ సాధించాయి. ఇద్దరూ వేర్వేరు ఖండాల్లో ఉన్నప్పటికీ, ఒకే పాటలో హీరోహీరోయిన్ పాత్రలను విభజించుకుని, ఎక్కడా తేడా తెలియకుండా సింక్ చేస్తూ చేసిన వీడియోస్ బాగా పాపులరయ్యాయి. వారు చేసిన 25 రీల్స్లో 20 వీడియోలు ఒక మిలియన్ (10 లక్షలు) వ్యూస్ దాటాయి. నందు ఆత్మవిశ్వాసంతో కూడిన డాన్స్, సినిమాపై ఆయనకున్న ప్రేమ చాలా మంది దృష్టిని ఆకర్షించింది. నిర్మాత కోన వెంకట్ సైతం నందు చేసిన ఒక రీల్ను తన ఇన్స్టాలో షేర్ చేయడంతో నందుకు మంచి గుర్తింపు వచ్చింది. కోలీవుడ్ హీరోగా.. నందు డాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ చూసి హీరో పాత్రకు ఎంపిక చేశారు. మలేషియా, తమిళనాడులో చిత్రీకరించిన ‘13/13 లక్కీ నన్’ చిత్రంలో నందు లవర్ బాయ్ పాత్రలో నటించారు. ఈ తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ తమిళనాడు, సింగపూర్, అమెరికా, మలేషియాలో ఏకకాలంలో విడుదల కానుంది. కాగా, నందు 2014 నుంచి సింగపూర్లో తెలుగు సినిమాలను పంపిణీ చేస్తున్నారు. స్థానిక పంపిణీదారులతో కలిసి ఇప్పటివరకు 25కు పైగా సినిమాలు విడుదల చేశారు. సరదాగా చేసిన రీల్స్తో హీరో అవకాశం.. కోవిడ్ సమయంలో సరదాగా చేసిన రీల్స్ నా జీవితాన్నే మార్చేస్తాయని అస్సలు ఊహించలేదు. ఐటీ ఉద్యోగం చేస్తూనే నటనపై అభిరుచిని కొనసాగించాను. సోషల్ మీడియా ద్వారా వచ్చిన గుర్తింపే నాకు కోలీవుడ్లో హీరో అవకాశం తెచ్చింది. ఉద్యోగం నా జీవనాధారం. సినిమాలు నా ఫ్యాషన్, ప్రేక్షకుల ప్రేమతో ఇంకా మంచి పాత్రలు చేయాలని ఉంది. – రాపోలు నందు, సింగపూర్ -
డిసిల్టింగ్ విధానాన్ని రద్దు చేయాలి
వెంకటాపురం(కె): ఏజెన్సీలో డిసిల్టింగ్ విధానాన్ని రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బండారు రవి కుమార్ అన్నారు. ఈ మేరకు మండల కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో ఆర్అండ్బీ ప్రధాన రహదారిపై సీపీఎం నాయకులు శుక్రవారం బైటాయించారు. డిసిల్టింగ్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసిల్టింగ్ పేరుతో గోదావరి నది గర్భాన్ని ఇష్టారాజ్యంగా భారీ యంత్రాలతో నది పర్యావరణ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసేందుకు చూస్తున్నారని తెలిపారు. సీతారామ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పేరుతో డిసిల్టింగ్ విధానం ప్రవేశపెట్టి ప్రభుత్వం సర్వే చేపట్టిందని వెల్లడించారు. పర్యావరణ అనుమతులు లేవని కోర్టు నిలుపుదల చేసినా ప్రాజెక్టు పేరుతో ఏజెన్సీ మండలాల్లో అధికారులు సర్వే చేయటం విడ్డూరంగా ఉందన్నారు. డిసిల్టింగ్ విధానాన్ని రద్దు చేయకపోతే పార్టీలు, ప్రజా సంఘాలతో భారీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు మద్దతు తెలిపినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి భీరెడ్డి సాంబశివ, నాయకులు రత్నం రాజేందర్, దావూద్, చిట్టిబాబు, గ్యానం వాసు, కుమ్మరి శ్రీను, చిట్టెం ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్ -
మూడో విడతకు మోక్షమెప్పుడో?
ములుగు: యాసంగి సీజన్ పంటలు చేతికి వచ్చినా పెట్టుబడి సాయం (రైతు భరోసా) పూర్తి స్థాయిలో ప్రభుత్వం అందించలేకపోవడం పట్ల అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీజన్ ప్రారంభానికి ముందే అందాల్సిన పెట్టుబడి సాయం ఆలస్యమైనప్పటికీ రెండు విడతల్లో రెండు ఎకరాల వరకు మాత్రమే అందించడంతో మూడో విడతకు మోక్షమెప్పుడు లభిస్తుందని రైతులు ఎదురుచూస్తున్నారు. మొదటి విడత సాయం డబ్బులను మార్చి 23న, రెండో విడత సాయాన్ని ఏప్రిల్ 20న రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. నెల రోజులు దాటినా మూడో విడత సాయానికి సంబంధించిన షెడ్యూల్ ఇంకా ప్రభుత్వం ప్రకటించకపోవడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెండు విడతల్లో అందిన సాయం ఇలా.. ములుగు జిల్లాలో 88,138 మంది రైతులకు ఎకరానికి రూ.6 వేల చొప్పున రూ.106,08 కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమచేయాల్సి ఉండగా, రెండు విడతల్లో కలిపి 81,096 మంది రైతులకు రూ.66.56 కోట్లను జమ చేసింది. ఇంకా 7,042 మంది రైతులకు రూ.39.52 కోట్లను జమ చేయాల్సి ఉంది. ప్రతీ రైతుకు రెండెకరాల వరకు మాత్రమే పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందించింది. ఐదెకరాల వరకైనా పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని రైతులు భావించినప్పటికీ రెండెకరాల వరకు మాత్రమే పరిమితం చేయడంతో అన్నదాతలు నిరుత్సాహానికి గురవుతున్నారు. ఖరీఫ్ పంటలకు.. రైతు భరోసాపై అయోమయం వానాకాలం పంటల సాగును జిల్లాలో రైతులు ఇప్పటికే ప్రారంభించారు. మరో 10 రోజుల్లో వర్షాలు కురిస్తే పంటలను సాగు చేసుకునేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే విత్తనాలు, ఎరువులను సమకూర్చుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. యాసంగి పంటకే పెట్టుబడి సాయాన్ని రెండెకరాలకు పరిమితం చేయడంతో వానాకాలం పంట(ఖరీఫ్ సీజన్)కు అందే రైతు భరోసాపై రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కనీసం 5 ఎకరాల వరకు పెట్టుబడి సాయం అందిస్తామని కటాఫ్ ప్రకటించి ప్రతీ రైతుకు పెట్టుబడి సాయాన్ని సమాయానికి అందించాలని రైతులు కోరుతున్నారు. యాసంగి సీజన్ ముగుస్తున్నా అందని పెట్టుబడి సాయం రెండు విడతల్లో ఇప్పటి వరకు అందింది రెండు ఎకరాలకే.. మూడో విడత రైతు భరోసాపై ఇప్పటికీ ఖరారు కాని షెడ్యూల్మండలం రైతులు పెట్టుబడి సాయం (రూ.కోట్లలో) ఏటూరునాగారం 6,785 5.43 గోవిందరావుపేట 6,346 5.49 కన్నాయిగూడెం 4,828 3.74 మంగపేట 10,121 9.57 ఎస్ఎస్తాడ్వాయి 7,557 6.85 వెంకటాపురం(కె) 8,014 6.39 వాజేడు 8,624 6.65 మల్లంపల్లి 5,676 4.41 ములుగు 11,952 9.09 వెంకటాపురం(ఎం) 11,193 8.94 -
విత్తనాలు కొనుగోలు చేయాలి
కాళేశ్వరం: రైతులు లైసెన్స్ ఉన్న డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి జాడి బాబురావు అన్నారు. శుక్రవారం మహదేవపూర్ మండలం బొమ్మపూర్ రైతువేదికలో మహదేవపూర్ ఏడీఏ శ్రీపాల్తో కలిసి విత్తనాల డీలర్లు, రైతులకు డివిజన్ స్థాయి సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యవసాయాధికారి మాట్లాడుతూ.. రైతులు విత్తనాలు ఎంపిక చేసుకునే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లేబుల్ చూసి విత్తనాలు కొనుగోలు చేయాలని చెప్పారు. ఏడీఏ శ్రీపాల్ మాట్లాడుతూ.. రైతులు విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు కచ్చితంగా ఆ సీడ్ ప్యాకెట్ బిల్లు సీజన్ అయిపోయేంత వరకు జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని చెప్పారు. యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియా వాడాలని సూచించారు. వరి కొయ్యలను కాల్చకుండా పర్యావరణాన్ని రక్షించాలని చెప్పారు. -
రైస్ మిల్లు తనిఖీ
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మండలం గొర్లవీడు గ్రామంలోని వెంకటేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లును ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ శుక్రవారం తనిఖీ చేశారు. మిల్లులో వడ్ల నిల్వ, ప్రాసెసింగ్ విధానం, రోజుకు ఎంత మేర వడ్లు స్వీకరిస్తున్నారనే అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రైతుల నుంచి సాధ్యమైనంత ఎక్కువ వడ్లను పారదర్శకంగా కొనుగోలు చేయాలని సూచించారు. రానున్న రోజుల్లో వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున ధాన్యం లోడింగ్, అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తిచేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని రైస్ మిల్ యాజమాన్యాలకు సూచించారు. ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్ల కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లులను స్థానిక పోలీస్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. రోజువారీ వడ్ల కొనుగోలు, ఎగుమతులపై నివేదికలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపించాలని ఆదేశించారు. ఎస్పీ వెంట భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు, సీఐ నరేష్ కుమార్ ఉన్నారు. -
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం
ఏటూరునాగారం: బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని ఏపీఓ కొమురం నాగోరావు తెలిపారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో ఎస్ఎస్తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం(కె) మండలాలకు చెందిన పురోహితులు, ఖ్వాజీలు, పాస్టర్లు, టెంట్హౌజ్ నిర్వహకులు, ఫొటో గ్రాఫర్లు, ప్లెక్సీలు ముద్రించేవారు, బ్యాండ్మేళం, క్యాటరింగ్ నిర్వహకులతో బాల్య వివాహాలపై అవగాహన సదస్సును శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఓ మాట్లాడుతూ బాల్య వివాహాలను అరికడితేనే బాలల భవిష్యత్కు భరోసా లభిస్తుందన్నారు. ఏజెన్సీలో వందశాతం బాల్య వివాహాల నిర్మూలనకు అందరూ కట్టుబడి ఉండాలన్నారు. తద్వారా అందరూ కలిసికట్టుగా ములుగును బాల్య వివాహాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని ఐటీడీఏ అదనపు ప్రాజెక్టు అధికారి కొమురం నాగోరావు అన్నారు. అనంతరం డీడబ్ల్యూఓ ఈసంపెల్లి ప్రేమలత మాట్లాడుతూ బాల్య వివాహాల సమాచారం ముందుగా తెలిసే అవకాశం పురోహితులు, ఖ్వాజీలు, పాస్టర్లు, టెంట్హౌజ్ నిర్వహకులకు తెలిసి ఉంటుందని తెలిపారు. ఈ సమయంలోనే వారిని కట్టడి చేసి వయస్సు నిండని అమ్మాయిలకు వివాహం చేస్తే జరిగే నష్టాలపై వివరించాలని సూచించారు. వివాహాలతో సామాజిక, ఆరోగ్య, కుటుంబ పరమైన దుష్ప్రభావాలను తల్లిదండ్రులకు వివరించాల్సి ఉంటుందన్నారు. వధువు వయస్సు 18 ఏళ్లు, వరుడి వయస్సు 21 ఏళ్లు నిండాలని అలా కాకుండా తక్కువ వయస్సు ఉన్నవారికి వివాహం చేస్తే పోక్సో కేసు నమోదు అవుతుందని హెచ్చరించారు. అలాగే రెండేళ్ల జైలుతో పాటు రూ.1 లక్ష జరిమానా విధిస్తారని వివరించారు. ములుగును బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చేందుకు కట్టుబడి ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వాల్ పోస్టర్లను ఆవిష్కరించి హాజరైన వారికి అందజేశారు. ఈ కార్మక్రమంలో వెంకటాపురం సీడీపీఓ ముత్తమ్మ, జిల్లా బాలల పరిరక్షణ అధికారులు ఓంకార్, హరికృష్ణ, సర్పంచ్లు, వీసీపీసీ కన్వీనర్లు, టీచర్లు, ఐసీడీఎస్ సూపర్ వైజర్లు కృష్ణవేణి, హరికృష్ణ, సంజీవ, సుమన్, జ్యోతి, రాజు, నరేశ్ తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ ఏపీఓ కొమురం నాగోరావు -
అప్రమత్తంగా ఉండాలి
కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి: జిల్లాలో నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. నిన్న(గురువారం) జిల్లా గరిష్ట ఉష్ణోగ్రత 46.2 డిగ్రీలు నమోదైందని తెలిపారు. వాతావరణ శాఖ ముందస్తు సూచనల ప్రకారం రాబోయే మూడు రోజుల్లో కూడా ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే అవకాశం ఉందని, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బయటకు వెళ్లడం తగ్గించాలన్నారు. ఎక్కువగా నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు వంటి ద్రవాలను తీసుకోవాలన్నారు. వృద్ధులు, పిల్లలు, గర్భిణులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పాలిసెట్ ధ్రువపత్రాల పరిశీలన భూపాలపల్లి అర్బన్: పాలిసెట్ అడ్మిషన్ల కోసం ధ్రువపత్రాల పరిశీలన శుక్రవారం ప్రారంభమైనట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, పాలిసెట్ సమన్వయకర్త డాక్టర్ ఎ.రమణారావు తెలిపారు. జూన్ 1వ తేదీ వరకు ధ్రువపత్రాలను పరిశీలించనున్నట్లు తెలిపారు. ప్రవేశాలు పొందే విద్యార్థులు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాలని సూచించారు. ఈ పరిశీలనకు అధికారులుగా శ్రీధర్, దేవేందర్, శ్రీనివాస్, రాజకుమార్ వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. కారు బోల్తా.. ఆరుగురికి గాయాలు మల్హర్(కాటారం): కాళేశ్వరం వెళ్లి వస్తుండగా కారు అదుపుతప్పి బోల్తాపడి ఆరుగురికి గాయాలైన ఘటన కాటారం మండలం బస్వాపూర్లో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండకు చెందిన ఆరుగురు కారులో శుక్రవారం కాళేశ్వరంలో అంత్యపుష్కరాలకు వెళ్లారు. పుష్కర స్నానాలు చేసి దర్శనం అనంతరం హనుమకొండకు తిరుగుపయనమయ్యారు. కాటారం మండలం బస్వాపూర్ క్రాస్ వద్ద కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని భూపాలపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఓటరు జాబితా సవరణ వేగవంతం భూపాలపల్లి రూరల్: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్ఛమైన ఓటరు జాబితాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు బలమైన పునాది అని తెలిపారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలోని ఐడీఓసీ కార్యాలయం నుంచి కలెక్టర్ రాహుల్శర్మ, భూపాలపల్లి ఆర్డీఓ హరికృష్ణ, తహసీల్దార్లు, ఆర్ఐలు, బీఎల్ఓలు, సూపర్వైజర్లు, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు అబ్బాస్, నవీన్ పాల్గొన్నారు. గాలివానతో కూలిన టెంట్లు పలిమెల(కాళేశ్వరం): మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో శుక్రవారం ఉదయం గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో భక్తులకోసం ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు, ఫ్లెక్సీలు నేలకూలాయి. -
ప్రతీ గింజను కొనుగోలు చేస్తాం
మల్హర్(కాటారం): కల్లాలో ఆరబోసిన ప్రతీ ధాన్యం గింజను రైతుల నుంచి కొనుగోలు చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధరబాబు అన్నారు. శుక్రవారం మండలంలోని కాటారం మార్కెట్ యార్డులో ఆరబోసిన ధాన్యాన్ని మంత్రి శ్రీధర్బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షాలతో ఇబ్బందులు జరుగుతాయని.. తడిసిన ధానాన్ని కొనుగోలు చేస్తామని అన్నారు. రైతులు ఎవరూ ఆందోళన పడొద్దని.. ధాన్యం మొత్తాన్ని సేకరిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్కు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పంతకాని తిరుమల, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు -
కొనుగోళ్లలో వేగం పెంచాలి
భూపాలపల్లి: అకాల వర్షాల దృష్ట్యా ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సూచించారు. ధాన్యం కొనుగోళ్లపై శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్తో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మక్కల కొనుగోలులో రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. అదే స్ఫూర్తితో ధాన్యం కొనుగోళ్లలో సైతం వేగం పెంచాలని సూచించారు. అకాల వర్షాలతో ధాన్యం తడవకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ధాన్యం కాంటా జరిపిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ కచ్చితంగా చేయాలన్నారు. ఐరిస్ పద్ధతిని తొలగించి ఓటీపీ ద్వారా ధాన్యం కొనుగోలు చేపట్టాలన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. ట్రక్ షీట్ ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతీ రోజు కచ్చితంగా 8 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు జరిగేలా చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
కొనండి మహాప్రభో..
భూపాలపల్లి: కష్టనష్టాలను ఓర్చుకొని ఆరుగాలం పండించిన వరిధాన్యాన్ని విక్రయించేందుకు జిల్లావ్యాప్తంగా అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. హమాలీలు, లారీల కొరత కారణంగా పక్షం రోజుల క్రితం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన వడ్లను నేటికీ కాంటా వేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారుల ముందుచూపు లేమి కారణంగానే.. జిల్లాలోని 12 మండలాల్లో వానాకాలం సీజన్లో వరి, మిర్చి, పత్తి పంటలను సాగు చేయగా అకాల వర్షాల మూలంగా మిర్చి, పత్తి పంటల నుంచి అంతగా దిగుబడి రాలేదు. దీంతో ఈ యాసంగిలో సుమారు 1.05 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. 1.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైతులు దిగుబడి చేసిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి రోజుల తరబడి వేచిచూస్తున్నా కొనే నాఽథుడే కరువయ్యాడు. గతంలో తేమ పేరిట జాప్యం చేయగా ఇప్పుడు హమాలీలు, లారీల కొరతతో సకాలంలో ధాన్యం కొనుగోలు జరగడం లేదు. వడ్లను విక్రయించేందుకు ఒక్కో రైతు కనీసం 15 నుంచి 20 రోజుల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. పౌరసరఫరాల అధికారుల ముందు చూపు లేమి కా రణంగానే ఈ పరిస్థితి ఎదురైనట్లుగా తెలుస్తోంది. వర్షం వస్తే ధాన్యం నీటిపాలే.. జిల్లాలో రైతులు పండించిన వరిధాన్యం ఈ నెల 28వ తేదీ వరకు 99,138 మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాలకు రాగా 61,698 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లుగా అధికారులు తెలిపారు. అధికారుల లెక్కలకు మించి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో గడిచిన రెండు రోజులు ఓ వైపు ఉష్ణోగ్రతలు పెరుగుతూనే మరోవైపు ఈదురుగాలులు వీస్తూ వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు వర్షం కురిస్తే కేంద్రాల్లో వడ్లు తడిసి ముద్దవుతాయని, కొనే నాఽథుడే కరువవుతాడని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షానికి భయపడి రైతులు ధాన్యం బస్తాలపై కవర్లు కప్పుకొని వెళ్తుండగా మరికొందరు రైతులు రాత్రి 12 గంటల వరకు కొనుగోలు కేంద్రాల వద్దనే ఉంటున్నారు. ప్రజాప్రతినిధులు చెప్పినా.. ధాన్యం కొనుగోలులో అలసత్వం ప్రదర్శించవద్దని ఓవైపు రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్రాబు, మరోవైపు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారులకు సూచిస్తున్నారు. నిర్లక్ష్యం ప్రదర్శించే వారిని సస్పెండ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ కొనుగోళ్లలో వేగం పెరగడం లేదు. కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం జిల్లాలో ఈదురుగాలులు, వర్ష సూచనలు ఆందోళనలో అన్నదాతలు హమాలీ, లారీల కొరత పేరిట జాప్యం -
రైతుల పరిస్థితి ఆగం
భూపాలపల్లి: రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఆగమాగం ఉందని.. రైతుల సమస్య గాలికి వదిలేసి ప్రభుత్వం గాలిలో సంచిరిస్తుందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. గురువారం జిల్లాకేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వెంకటరమణారెడ్డి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం ఎగుమతి కాక, ఎగుమతి అయిన ధాన్యం దిగుమతి కాక రైతులు అరిగోస పడుతుంటే ముఖ్యమంత్రి గాలిలో తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కూడా రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపే అధ్వాన పరిస్థితి ఏర్పడిందన్నారు. రానున్న రెండు మూడు రోజులో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని అన్నారు. బీజేపీ రైతు గోస–బీజేపీ భరోసా యాత్ర రైతుల గోస చూడటానికి వచ్చినట్టు లేదని, బీజేపీ ప్రచారానికి వచ్చినట్టు హంగు ఆర్బాటాలు చేస్తుందని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ప్లోర్ లీడర్ గండ్ర హరీశ్రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు కటకం జన్దాన్, కౌన్సిలర్లు, నాయకులు మోతె రాజు, నూనె రాజు, సతీష్ పాల్గొన్నారు. బీజేపీది ప్రచార యాత్ర మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి -
ఇక రెండో విడత
జూన్ 2న ‘ఇందిరమ్మ ఇళ్ల పథకం’ ప్రారంభంశుక్రవారం శ్రీ 29 శ్రీ మే శ్రీ 2026భూపాలపల్లి: సొంతంగా ఇల్లు నిర్మించుకోవాలని ఆశపడుతున్న నిరుపేదలకు ప్రభుత్వం త్వరలోనే మరో తీపికబురు అందించనుంది. ప్రతిష్టాత్మక ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతను వచ్చేనెల 2వ తేదీన ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తుంది. తొలి విడతలో అవకాశం రాని అర్హులకు ఈసారి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. గతంలో భూపాలపల్లి నియోజకవర్గంలోని భూపాలపల్లి, గణపురం, రేగొండ, కొత్తపల్లిగోరి, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి, మంథని నియోజకవర్గంలోని కాటారం, మల్హర్, మహాముత్తారం, మహదేవపూర్, పలిమెల మండలాల పరిధిలోని గ్రామాలకు మొత్తం 4,231 ఇందిరమ్మ ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. లబ్ధిదారుల సొంత స్థలాల్లో పునాదుల దశ నుంచి స్లాబ్ పూర్తయ్యే వరకు మొత్తం నాలుగు విడతల్లో రూ.5లక్షల చొప్పున నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేసేలా నిబంధనలు విధించారు. మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరై చాలాకాలం అవుతున్నా, జిల్లాలో ఇప్పటివరకు కేవలం 527 మాత్రమే పూర్తికావడం గమనార్హం. ఇందుకు ప్రధాన కారణం నిధుల విడుదలలో జరుగుతున్న ఆలస్యమేనని లబ్ధిదారులు వాపోతున్నారు. చాలామందికి మొదటి, రెండో విడత బిల్లులు రాకపోవడంతో పునాదుల దశలోనే పనులు ఆగిపోయాయి. మరికొందరు కాంట్రాక్టర్లు, బిల్డర్లు, మేసీ్త్రలకు పనులు అప్పగించినా, బిల్లుల చెల్లింపుల్లో జాప్యం వల్ల వారు కూడా నిర్మాణాలను నిలిపివేశారు. దీనికి తోడు రోజురోజుకూ పెరుగుతున్న నిర్మాణ సామగ్రి ధరలు, లబ్ధిదారుల ఆర్థిక ఇబ్బందులు తోడవ్వడంతో ఇళ్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయని తెలుస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ విస్తీర్ణానికి సర్కారు నిబంధనలు విధించింది. ఈ నిబంధనలు లబ్ధిదారులకు ఇబ్బందికరంగా మారాయి. పరిమితిని మరింత పెంచి, ఎక్కువ విస్తీర్ణంలో ఇళ్లు నిర్మించుకునే అవకాశం కల్పించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో రెండవ విడతలోనైనా నిబంధనలను సడలించాలని, బిల్లుల చెల్లింపులు సకాలంలో జరగాలని లబ్ధిదారులు కోరుతున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పోటెత్తిన భూక్రయవిక్రయదారులు కొనసాగుతున్న మొదటి విడత నిర్మాణాలు మంజూరైనవి 4,231 గ్రౌండింగ్ అయినవి 542 ప్రారంభించినవి 539 బేస్మెంట్ స్థాయి 985 స్లాబ్ స్థాయి 466 స్లాబ్ పూర్తయినవి 1,172 నిర్మాణం పూర్తయినవి 527ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతకు సంబంధించి నేడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ సూచనలు, నిబంధనల మేరకు రెండో విడతను సజావుగా నిర్వహిస్తాం. – శ్రీకాంత్, డీఈ, హౌజింగ్ మే నెలాఖరులోగా కొనుగోళ్లు పూర్తి చేయాలి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష -
గాలివాన బీభత్సం
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలో గురువారం సాయంత్రం బలమైన ఈదురుగాలులు వీచాయి. సింగరేణి ఏరియా వర్క్షాపు, కేటీకే 5వ గని సమీపంతో పాటు పలుచోట్ల భారీ చెట్లు నేలకొరిగి రహదారులపై పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చెట్లు విద్యుత్ తీగలపై పడటంతో జిల్లాకేంద్రంలోని పలు ప్రాంతాలతో పాటు సింగరేణి గనుల నివాస గృహాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన ప్లెక్సీ తగిలి ఒక మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇండ్లపై కప్పు రేకులు ఎగిరిపడ్డాయి. విద్యుత్ శాఖ, సింగరేణి, మున్సిపల్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి చెట్ల తొలగింపు పనులు చేపట్టారు. విద్యుత్ లైన్లను మరమ్మతు చేసి సరఫరా పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు కొనసాగిస్తున్నారు. -
చివరి గింజ వరకూ కొంటాం..
సాక్షి, పెద్దపల్లి : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో చివరి గింజ వరకూ మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లపై పెద్దపల్లి ఐడీఓసీ కార్యాలయంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావుతో కలిసి ఉత్తమ్కుమార్రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు గత ప్రభుత్వంతో పోలిస్తే 25 నుంచి 30 శాతం అధికంగా జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి, 8 లక్షల మంది రైతులకు రూ.11 వేల కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. రాబోయే 4 నుంచి 5 రోజుల పాటు ఇసుక రవాణా నిలిపివేసి వాహనాలను పూర్తిగా ధాన్యం రవాణాకు వినియోగించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం సుమారు 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తుండగా, ఎఫ్సీఐ కేవలం 51 లక్షల మెట్రిక్ టన్నులకే పరిమితమైందన్నారు.డిసెంబర్ 2023 తర్వాత కనీస మద్దతు ధర విధానాన్ని కచ్చితంగా అమలు చేస్తూ రైతులకు ఇప్పటివరకు అదనంగా రూ.16,479 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం వర్షాల కారణంగా కేవలం 9 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసిందని, ఆ ధాన్యాన్ని కూడా పూర్తి మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. తరుగుతీస్తే కఠిన చర్యలు.. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్ల కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామని తెలిపారు. అవసరమైతే అదనపు గోదాములు అద్దెకు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఎక్కడైనా రైతుల నుంచి ఒక్క కేజీ ధాన్యం తరుగు తీసినట్లు తెలిసినా కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా మిల్లర్లతో రైతులకు పరిహారం ఇప్పిస్తామని హెచ్చరించారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ జిల్లాలో స్టోరేజీ ప్లేస్ తక్కువగా ఉన్నందున, పెద్దపల్లిలో 50వేల మెట్రిక్టన్నుల ధాన్యం దించుకునేలా చర్యలు తీసుకోవాలని మంత్రులను కోరారు. 65 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం.. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ యాసంగి సీజన్లో లక్షా 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 185 కొనుగోలు కేంద్రాల ద్వారా 65 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. జిల్లాకు సంబంధించి పెద్దపల్లిలో 20 వేల మెట్రిక్ టన్నులు, వరంగల్లో 20 వేల మెట్రిక్ టన్నులు, హనుమకొండలో 10 వేల మెట్రిక్ టన్నులు మిల్లింగ్ కోసం పౌరసరఫరాల శాఖ అలాట్మెంట్ చేసిందని తెలిపారు. భూపాలపల్లి జిల్లాలో హర్వెస్టింగ్ కొన్ని ప్రాంతాలలో ఆలస్యంగా జరుగుతుందని, చాలా మండలాలో ఇంకా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రావాల్సి ఉందని అన్నారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు. -
భవన నిర్మాణానికి భూమి పూజ
మల్హర్: వల్లెకుంట గ్రామ సమైక్య భవన నిర్మాణానికి గురువారం రాష్ట్ర ట్రెడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్రెడ్డి భూమి పూజ చేశారు. రూ.10లక్షలతో నిర్మించే భవనాన్ని త్వరితగతిన పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొమ్మ రజిత, ఉపాధిహామీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితెల రాజయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి పాల్గొన్నారు. కుమారుడి ఫొటోకు పుష్కర స్నానం భూపాలపల్లి అర్బన్: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం బేతాళగడ్డ గ్రామానికి చెందిన గంగిశెట్టి పద్మావతి, తన కుమార్తె ఝాన్సీతో కలిసి సరస్వతి ఘాట్కు విచ్చేసి పుష్కర స్నానం చేశారు. ఈ సందర్భంగా రెండు సంవత్సరాల క్రితం విద్యుదాఘాతానికి గురై మృతిచెందిన తన కుమారుడు గంగిశెట్టి మహేష్ ఫొటోకు పవిత్ర స్నానం ఆచరించారు. కుమారుడి జ్ఞాపకాలను తలుచుకుంటూ భావోద్వేగానికి గురైన ఆమెను చూసిన భక్తులు సైతం చలించిపోయారు. రామప్ప దేవాలయంలో సీవీఓ శశిధర్ రాజు పూజలు వెంకటాపురం(ఎం): చారిత్రక రామప్ప దేవాలయాన్ని గురువారం తెలంగాణ సివిల్ సప్లయీస్ డిపార్ట్మెంట్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ (సీవీఓ) శశిధర్ రాజు కుటుంబ సమేతంగా సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు హరీశ్ శర్మ, ఉమా శంకర్లు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి టూరిజం గైడ్ తాడబోయిన వెంకటేశ్ వివరించగా రామప్ప శిల్పకళసంపద బాగుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం(ఎం)ఎస్సై చల్లా రాజు, టూరిస్ట్ పోలీసులు శ్రీకాంత్, భద్రు ఉన్నారు. బాల్యవివాహాల నిర్మూలనకు కృషి ఏటూరునాగారం: జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని డీడబ్ల్యూఓ ప్రేమలత సూచించారు. ఈ మేరకు మండల కేంద్రంలో ఆమె గురువారం విలేకరులతో మాట్లాడారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ములుగును బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చేందుకు అన్ని మండలాల్లో అవగాహన సదస్సులను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు నేడు(శుక్రవారం) ఐటీడీఏలో అవగాహన సదస్సును నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే ఎస్ఎస్తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం, వెంకటాపురం(కె), వాజేడు మండలాలకు చెందిన వివాహాలు నిర్వహించే పురోహితులు, ఖ్వాజీలు, పాస్టర్లు, టెంట్హౌజ్ నిర్వాహకులు, ఫొటోగ్రాఫర్లు, బ్యాండ్ మేళం నిర్వాహకులకు బాల్య వివాహ నిరోధక చట్టంపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. భక్తిశ్రద్ధలతో బక్రీద్ చిట్యాల: బక్రీద్ వేడుకలను ముస్లింలు జిల్లావ్యాప్తంగా గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొరు అలాయి బలాయి తీసుకున్నారు. భూపాలపల్లి, గణపురం మండలాల్లో ప్రార్థనల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. -
నో డ్రగ్స్–సేవ్ లైఫ్
మత్తు పదార్థాలపై సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం జెడ్పీహెచ్ఎస్ గోరంట్ల పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్ కాళేశ్వరం అంత్య పుష్కరాల్లో ఫ్లెక్సీ పట్టుకుని గురువారం అవగాహన కల్పించారు. శ్రీనో డ్రగ్స్–సేవ్ లైఫ్శ్రీ అనే నినాదంతో కరపత్రాలు పంచుతూ భక్తుల్లో చైతన్యం కల్పించారు. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు సేవించడంతో శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక సమస్యలు ఏర్పడుతాయని తెలిపారు. యువత మత్తుకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. – భూపాలపల్లి అర్బన్ -
ఇంచెంచెర్వుపల్లిలో భారీ అగ్నిప్రమాదం
పొలాల్లో చెలరేగుతున్న మంటలు కాలిపోయిన వడ్ల కుప్పలువెంకటాపురం(ఎం): మండల పరిధిలోని ఇంచెంచెర్వుపల్లి గ్రామంలో గురువారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు వరికొయ్యలను తగలబెట్టగా గ్రామ పరిసరాల్లో చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించాయి. వ్యవసాయ భూములను అగ్నికి ఆహుతి చేశాయి. ఈ అగ్ని ప్రమాదంలో ఆగే తిరుపతి, రాజు, కామ సదానందం, అశోక్కు చెందిన ఐదెకరాల్లోని వరి పంట పూర్తిగా దగ్ధంకాగా, మూడు బోర్ మోటార్లు, పైపులు, వందల సంఖ్యలో వరిగడ్డి కట్టలు మంటల్లో కాలిపోయాయి.. పంట వ్యర్థాలను కాల్చితే చర్యలు పంట పొలాల్లో వరి కొయ్యలు, వ్యర్థాలకు నిప్పు పెట్టి జరిగే ప్రమాదాలకు కారణమైన వారిపై చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై చల్లా రాజు హెచ్చరించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయ న విలేకరులతో మాట్లాడారు. పంట వ్యర్ధాలను కా ల్చడం వల్ల భూసారం తగ్గడమే కాకుండా విద్యుత్ మోటార్లు, గడ్డివాములు తగలబడి రైతులకు భారీగా ఆర్థిక నష్టం వాటిల్లుతుందని తెలిపారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఐదెకరాల్లోని వరిపంట దగ్ధం కాలిపోయిన మూడు బోరుమోటార్లు, పైపులు, వరిగడ్డి -
ధాన్యంలో కోతలు సరికాదు
చిట్యాల/భూపాలపల్లి రూరల్: రైతుల పండించిన ధాన్యంపై మిల్లు యాజమానులు అక్రమంగా కోతలు విధిస్తే చర్యలు తప్పవని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. చిట్యాల మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో, భూపాలపల్లి మండలంలోని ఎస్.ఎం కొత్తపల్లి గ్రామంలో తడిసిన వరి ధాన్యాన్ని బుధవారం వారు పరిశీలించి, మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరత లేకుండా చూడాలని, ఎలాంటి కోతలు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు కుమ్మకై ్క రైతులను ఇబ్బందులకు గురి చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చేసి మిల్లలకు లారీలలో తరలించాలని తెలిపారు. ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని తడిసిన ధాన్యం సైతం కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేస్తామన్నారు.వ జిల్లాలో ఇప్పటికే 90శాతం మక్కల కొనుగోలు పూర్తయిందని తెలిపారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ కాంటా అయిన ధాన్యాన్ని రైతులు తమ సొంత వాహనాల్లో మిల్లులకు తరలించుకోవచ్చని రవాణా చార్జీలు ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు అవకతవకలు పాల్పడితే సస్పెండ్ చేస్తామని, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయా కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్ ఆశోక్కుమార్, డీసీఓ వాల్యానాయక్, చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ముకిరాల మధువంశీకృష్ణ , మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి, మాజీ జెడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి, ఆర్ఐ రాజేందర్, మండల నాయకులు చిలుకల రాయకోంరు, అల్లకోండ కుమార్, గుర్రపు తిరుపతిగౌడ్, బుర్ర లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. కాంటావేసి త్వరగా మిల్లులకు తరలించాలి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గండ్ర, కలెక్టర్ రాహుల్శర్మ -
పని ప్రదేశాల్లో సౌకర్యాలు కల్పించాలి
ములుగు రూరల్: ఉపాధిహామి పని ప్రదేశాలలో కూలీలకు సౌకర్యాలు కల్పించాలని బీఆర్ఎస్ నాయకుడు పోరిక గోవింద్నాయక్ అన్నారు. బుధవారం మండలంలోని జాకారంలో ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలను సర్పంచ్ దాసరి సమత–రమేష్తో కలిసి మాట్లాడారు. ఉపాధి హామి పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వంవిఫలమయిందని అన్నారు. నీడ, మంచినీళ్లు, మెడికల్ కిట్లు అందుబాటులో లేవని అన్నారు. ఉపాధిహామి కూలీలలకు సకాలంలో డబ్బులను చెల్లించాలని అన్నారు. కూలీలకు పండ్లు పంపిణీ చేశారు. బీఆర్ఎస్ నాయకుడు గోవింద్నాయక్ -
ధాన్యం కొనుగోలుపై ఆరోపణలు అవాస్తవం
ఏటూరునాగారం: జిల్లాలో ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనర్సింహరావు ఆరోపణలు అవాస్తవం అని కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న అన్నారు. ఏటూరునాగారం మండలం రోహిర్ గ్రామపంచాయతీ పరిధిలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న, జిల్లా కార్యదర్శి గుడ్ల దేవేందర్, సర్పంచ్లు కావిరి అర్జున్, దేవులపల్లి విజయ్ కుమార్ తదితరులు సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక దృష్టి సారించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను కొనసాగిస్తోందన్నారు. ప్రస్తుతం కేంద్రాల్లో ధాన్యం నిల్వలు అధికంగా ఉండటంతో, కొంత ప్రాంతాల్లో లారీల కొరత కారణంగా రవాణాలో స్వల్ప ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. అయినప్పటికీ అధికార యంత్రాంగం వెంటనే స్పందిస్తూ ధాన్యం తరలింపునకు చర్యలు చేపడుతోందన్నారు. ఈ చిన్న సమస్యలను ప్రతిపక్ష నాయకులు రాజకీయ లబ్ధి కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేయడం సరికాదన్నారు. శంకరాజుపల్లి సర్పంచ్ దేవులపల్లి విజయికుమార్, జిల్లా ఎస్సి సెల్ కార్యదర్శి కొడగొర్ల పోచయ్య, యూత్ జిల్లా ఉప అధ్యక్షుడు సర్వ అక్షిత్, మండల వర్కింగ్ ప్రసిడెంట్ దొంగిరి మధుబాబు, గజ్జల అంకుల్, నర్సయ్య, శేఖర్, ఇనుగుల హరీష్, దుర్గయ్య, గోపాల్, శ్రీనివాస్ పాల్గొన్నారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకన్న -
రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలి
వాజేడు: మండల పరిధిలోని చెరుకూరు నుంచి, ధర్మవరం వరకు అటవీ అనుమతులు లేవనే కారణంతో రహదారి పనులను నిలిపి వేశారని వెంటనే పనులు ప్రారంభించాలని బీఆర్ఎస్ మండల కార్యదర్శి పెనుమల్ల రామకృష్ణారెడ్డి అన్నారు. మండల పరిధిలోని చెరుకూరు వద్ద జాతీయ రహదారిపై బుధవారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా చేశారు. రహదారి పనులను వెంటనే ప్రారంభించాలని కోరుతూ జాతీయ రహదారిపై బీఆర్ఎస్ నాయకులు బైటాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రహదారి సింగిల్ రోడ్డు కావడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. వాహనాలు వెళ్లలేని విధంగా రోడ్డు గుంతలమయంగా మారిందని ఆరోపించారు. రహదారి నిర్మాణం కోసం నిధులు మంజూరైనా పనులు పూర్తి చేయలేదని వెంటనే అటవీ అనుమతులు వచ్చేలా చేసి రోడ్డు పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రహదారిపై బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేస్తున్న విషయం తెలుసున్న పోలీసులు అక్కడికి చేరుకొని ధర్నాను భగ్నం చేశారు. రోడ్డుపై బైటాయించిన వారిని అక్కడిని నుంచి పక్కకు లాక్కెల్లారు. బీఆర్ఎస్ నాయకులు రామకృష్ణారెడ్డి, సాంబమూర్తి, బుల్లేశ్వరరావు, స్వరూప, జానకి రమణ, ఆదినారాయణ, సుమాంజలి, బెనిని, సాంబశివరావు, తిరిపతి రావు, లోహ మూర్తి తదితరులు ఉన్నారు. -
చిలుక జోస్యం...
పలిమెల(కాళేశ్వరం): కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతి నది అంత్యపుస్కారల్లో బస్టాండ్ సమీపంలో పలువురు చిలుక జోష్యం చెబుతూ ఉపాధి పొందుతున్నారు. భక్తులు చిలుక జోష్యం చెప్పించుకుంటూ వారి జాతకాలు అడిగి తెలుసుకుంటున్నారు.కాళేశ్వరం: అంత్య పుష్కరాల్లో దేవాదాయశాఖ అధికారులు, అర్చకులు, సిబ్బంది అంతా వాకీటాకీతో కమ్యూనికేషన్ చేస్తున్నారు. కాళేశ్వరం దేవస్థానంలో సెల్ టవర్ సిగ్నల్స్ సరిగ్గా పని చేయకపోవడంతో త్వరగా స్పందించడానికి ఎనిమిది వరకు వాకీటాకీలకు వినియోగిస్తున్నారు. కమిషనర్ స్థాయి నుంచి అర్చకుని వరకు వినియోగిస్తున్నారు.కూలుతున్న టెంట్లు పలిమెల (కాళేశ్వరం ): కాళేశ్వరంలో సరస్వతి నది అంత్యపుస్కారాల కోసం ప్రధాన ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ఓ టెంటు గాలికి ఒక వైపు ఊడిపోయి ప్రమాదకరంగా మారింది. కాగా టెంటు నిర్వాహకులు నిత్యం పర్యవేక్షణ చేస్తూ ఎవరు ప్రమాదానికి గురికాకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు. పెరిగిన గిరాకీ మహాముత్తారం: సరస్వతి పుష్కరఘాట్వద్ద వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. భక్తులు బుధవారం ఎక్కువసంఖ్యలో రావడంతో గోదావరి నదివద్దసందండి నెలకొంది. గోదావరివద్ద ఏర్పాటు చేసిన వివిద దుకాణాల వద్ద రద్దీ పెరిగింది. దీంతో దుకాణదారులకు గిరాకీ పెరగడంతో సంతోషం వ్యక్తంచేశారు.మహాముత్తారం: సరస్వతీ అంత్యపుష్కరాల్లో భాగంగా పలు ప్రాంతాల నుంచి భక్తులు వచ్చిన వాహనాలు నిలుపుట కోసం అధికారులు పలు ప్రాంతాల్లో వాహనపార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. వీఐపీ పార్కింగ్ స్థలంతోపాటు సరస్వతీ ఘాటువద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలు నిండాయి. దీంతో పోలీసులు వచ్చి వెళ్లే వాహనాలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ట్రాఫిక్ నియంత్రించారు. -
సన్మానం
కాళేశ్వరం: మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా సిరోంచా తాలూకా జానం పల్లె గ్రామానికి చెందిన గండ్రకోట సంపత్ 14 సంవత్సరాలుగా పోలీస్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ ఇటీవల నిర్వహించిన ఎస్సై పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఎస్సైగా ఎంపికయ్యారు. ఈ మేరకు బుధవారం మహదేవపూర్ మండలం రాపల్లి కోట గ్రామానికి తన అత్తమామలను కలవడానికి వచ్చిన సందర్భంగా రాపల్లి కోట యాదవ సంఘం బాధ్యులు సంపత్–స్రవంతి దంపతులకు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. యాదవ సంఘం మండల అధ్యక్షుడు పంచక మల్లేష్ యాదవ్, ఉపాధ్యక్షుడు కాటమెన రాజయ్య, సర్పంచ్ కల్లా గట్టయ్య, సంఘం నాయకులు, బంధుమిత్రులు గ్రామస్తులు పాల్గొన్నారు. భూపాలపల్లి అర్బన్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2000 సంవత్సరంలో ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టులను స్మరించుకుంటూ ఈ నెల 31న 26వ వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ప్రజా ప్రతిఘటన రాష్ట్ర కార్యదర్శి సామ మోహన్రెడ్డి, రైతు కూలి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బొబ్బల సాంబయ్యలు తెలిపారు. జిల్లా కేంద్రంలో సీపీఐఎంఎల్, ప్రజా ప్రతిఘటన పార్టీ ఆధ్వర్యంలో కమాండర్లు సమ్మన్న, శనిగరపు రంజిత్ల వర్ధంతి సభకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఈ నెల 31న భూపాలపల్లిలో నిర్వహించనున్న వర్ధంతి సభను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కాండూరి కుమారస్వామి, ఐఎఫ్టీయూ నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్, రాష్ట్ర కన్వీనర్ పావురాల భిక్షపతి, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. వాజేడు: ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిర్మించిన వ్యాపార సముదాయాలకు టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు ఎంపీడీఓ శ్రీకాంత్ నాయుడు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ముందు అద్దెకు ఇవ్వడంకోసం నాలుగు గదులను నిర్మించినట్లు తెలిపారు. 29లోగా టెండర్ షెడ్యూల్ తీసుకొని 30లోగా సాయంత్రం 5 గంటలలోగా టెండర్ సమర్పించాలని తెలిపారు. 31 తారీకున డ్రా తీసి గదులను కేటాయించనున్నట్లు వెల్లడించారు. టెండర్ ఫారం రూ.2000, దరఖాస్తు సొమ్ము రూ.5000 డీడీ తియ్యాలని తెలిపారు. పూర్తి వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. వెంకటాపురం(కె): మండల కేంద్రంలో సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు బుధవారం కాంగ్రెస్ నాయకులు అందజేశారు. పీఏసీఎస్ అధ్యక్షుడు చిడెం మోహనరావు, మండల అధ్యక్షుడు సయ్యద్ హుస్సేన్, చిట్టెం సాయి, బాలసాని వేణు, తదితరులు ఉన్నారు. చిట్యాల: మండలంలోని గిద్దెముత్తారం గ్రామంలో పని చేస్తున్న ఉపాధిహామీ కూలీలకు మాజీ సర్పంచ్ పోలవేన పోశాలు, మాజీ ఎంపీటీసీ పప్పుల విజయలక్ష్మీ సంజీవయ్య బుధవారం మజ్జిక ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎండ తీవ్రత ఎక్కువ ఉండడంతో కూలీలు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
రెండు రోజుల గడువు ఇస్తున్నాం..
భూపాలపల్లి: రాష్ట్ర ప్రభుత్వానికి రెండు రోజుల గడువు ఇస్తున్నాం.. ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు పూర్తి చేయకపోతే ఆందోళనలు తప్పవని బీజేపీ బృందం హెచ్చరించింది. రైతు గోస–బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా బీజేపీ బృందం బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించింది. గణపురం మండలంలోని చెల్పూరు, కాటారం మండలంలోని కొత్తపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకుంది. కాటారంలో ధాన్యం దహనం చేసి నిరసన తెలిపి కేసు పాలైన తిరుపతిని బీజేపీ నేతలు పరామర్శించారు. అనంతరం బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఎంపీలు రఘునందర్రావు, ఈటల రాజేందర్ మాట్లాడుతూ 40 రోజుల నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారని, బీజేపీ బృందం వస్తున్న విషయాన్ని తెలుసుకొని గన్నీ బ్యాగులు, లారీలు వస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఇంకా 70 శాతం ధాన్యం కేంద్రాల్లోనే ఉందన్నారు. కాటారం మండలంలో నిరసన తెలిపిన 9 మంది రైతులపై ప్రభుత్వం నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిందని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యే వరకు తాము ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు. బీజేపీ ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, పైడి రాకేశ్రెడ్డి, రామారావు పటేల్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, రాష్ట్ర, జిల్లా, స్థానిక నాయకులు చందుపట్ల కీర్తిరెడ్డి, చల్లా నారాయణరెడ్డి, నిషిధర్రెడ్డి, ఎరుకల గణపతి, కన్నం యుగేంధర్, మహిపాల్రెడ్డి, జయశ్రీ, కరివేద మనోహర్ పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయకపోతే ఆందోళనలే.. బీజేపీ నేతలు ఏలేటి మహేశ్వర్రెడ్డి, రఘునందన్రావు, ఈటల రాజేందర్ చెల్పూరు, కాటారంలో పర్యటన -
బుకింగ్ చేయాల్సిందే..
భూపాలపల్లి రూరల్: సాధారణ యూరియాకు బదులు నానోయూరియాను వాడాలని వ్యవసాయ అధికారులు ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. దీనికి తోడు యూరియా కావాల్సిన రైతులు ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాల్సిందేనని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లాకు 37 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు యూరియాను కేటాయించాలని ఆ శాఖ జిల్లా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ ఖరీఫ్ సాగు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసిన వ్యవసాయశాఖ అందులో ఎరువులకు సంబంధించిన నివేదికను కూడా ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ ఖరీ్ఫ్లో 2,16,734 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని, మరో 20వేల ఎకరాలు ఉద్యాన పంటలు ఉంటాయని పేర్కొంది. ఈ సాగు విస్తీర్ణానికి సరిపడా యూరియాను కూడా అంచనా వేసింది. అయితే ఖరీఫ్ సీజనులో నెలవారీ కోటాలను కూడా ఖరారు చేశారు. జిల్లాలో ప్రస్తుతం 5,479 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలున్నాయి. నెల వారీగా ఎంత మొత్తంలో యూరియా అవసరం ఉంటుందనే అంశాన్ని నివేదికలో పేర్కొన్నారు. అత్యధికంగా జూలైలో వినియోగం ఎక్కువగా ఉంటుంది. వరి సాగు చేసే రైతులు ఈ సమయంలో యూరియాను ఎక్కువగా వాడుతారు. జూన్లో 4,200 మెట్రిక్ టన్నులు, జూలైలో 5,101 మెట్రిక్ టన్నులు, ఆగస్టులో 5,225 మెట్రిక్ టన్నులు, సెప్టెంబర్ 6,135 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని లెక్కగట్టారు. రైతులు యూరియా కొనుగోలు చేయాలంటే మొబైల్ యాప్లో ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవడం తప్పనిసరిగా మారింది. సాగుచేఉసిన పంట విస్తీర్ణం, ఆ విస్తీర్ణానికి సరిపడా నిర్ణీత మొత్తంలో మాత్రమే యూరియా కొనుగోలు చేసేందుకు వీలవుతుంది. సబ్సిడీ యూరియా పక్కదారి పట్టకుండా ప్రభుత్వం ఈ యాప్ విధానాన్ని అమలు చేస్తున్న విషయం విదితమే. అయితే కొందరు రైతుల పేరుతో యూరియా యాప్లో బుక్ చేసుకుని బ్లాక్ మార్కెట్ తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు గతంలో వ్యవసాయశాఖ అధికారుల దృష్టికి వచ్చింది. ఈసారి అలా జరగకుండా క్షేత్రస్థాయిలో వ్యవసాయశాఖ అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాల్సి అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పంటల సాగుకు సరిపడా యూరియా సరఫరా కాక గత వానాకాలం, యాసంగి లో రైతులు ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా వ్యవసాయశాఖ ముందు జాగ్రత్తలు చేపట్టింది. మరోవైపు యూరియా ఎరువుకు ప్రత్యామ్నాయంగా నానో యూరియాకు ప్రాధాన్యతనివ్వాలని వ్యవసాయశాఖ పేర్కొంటోంది. నానో యూరియా వాడకంతో వృథాను అరి కట్టవచ్చని రైతులకు వ్యవసాయ శాఖ వివరిస్తోంది. ఈ ఖరీఫ్ నానో యూరియాను వినియోగించుకోవాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు. ఖరీఫ్కు కావాల్సింది 37 వేల మెట్రిక్ టన్నులు ప్రభుత్వానికి ప్రతిపాదించిన వ్యవసాయశాఖ ప్రస్తుతం జిల్లాలో 5,479 మెట్రిక్ టన్నుల నిల్వలు సెప్టెంబర్లో అత్యధిక డిమాండ్ నానో యూరియాపై నజర్ -
మహిళలు ఆర్థికాభివృద్ధి చెందాలి
వెంకటాపురం(కె): మహిళలు ఆర్థికాభివృద్ధి చెందాలని ఎంపీడీఓ జుమ్మిలాల్ అన్నారు. బుధవారం మండల మహిళా సమాఖ్య ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మహిళా సమాఖ్య సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళా శక్తి వారోత్సవాలు ఈ నెల 25 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధిలో ముందుండాలని అన్నారు. రుణం పొందిన మహిళలు సక్రమంగా చెల్లిస్తే రూ.10లక్షల వరకు రుణాలు పొందవచ్చని తెలిపారు. రుణం పొందిన మహిళలు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10లక్షల భీమా సౌకర్యం ఉంటుందని అన్నారు. మహిళా శక్తి సంఘాలకు పెరటి కోళ్ల పెంపకం, గొర్రె పెంపకం రుణాలు అందిసాతమని తెలిపారు. మండలంలో గ్రామాఖ్య భవనాలు 31 మంజూరు అయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు పూనెం ఉషారాణి, ఏపీఓ భవాని, ఏపిఎం అప్పారావు, సీసీ శంకరమ్మ, సర్సయ్య, సమ్మయ్య, వెంకటలక్ష్మీ, సిబ్బంది స్వప్న, సతీష్, గ్రామ సమాఖ్య వీఓఏలు, ప్రజాతినిధులు పాల్గొన్నారు. ఎంపీడీఓ జుమ్మిలాల్ -
పుణ్యప్రదం.. పుష్కర స్నానం
జిల్లాలోని మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరంలో సరస్వతి నది అంత్యపుష్కరాలు కొనసాగుతున్నాయి. ఏడో రోజు బుధవారం సుమారు 25 వేల మంది భక్తులు పుష్కరస్నానాలు ఆచరించారు. అనంతరం కాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్కు చెందిన శ్రీదత్తగిరి మహరాజ్ ఆశ్రమ పీఠాధిపతి, తెలుగు రాష్ట్రాల మహామండలేశ్వర్ శ్రీ 1008 వైరాగ్య శిఖామణి అవధూతగిరి మహరాజ్, మహామండలేశ్వర్ ఈట సిద్ధేశ్వరానందగిరి మహరాజ్ త్రివేణి సంగమం వద్ద వైభవంగా గంగా హారతి నిర్వహించారు. సాయంత్రం దేవాదాయ శాఖ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. – కాళేశ్వరంపుష్కరఘాట్లో స్నానాలు చేస్తున్న భక్తులు -
యూనిఫామ్ ఊసేది?
విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఈ విద్యాసంవత్సరం (2026–27)లో యూనిఫామ్ సకాలంలో అందే పరిస్థితులు కనిపించట్లేదు. ఇప్పటివరకు క్లాత్ పంపిణీ కాకపోవడమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. ప్రతీ ఏడాది ఏప్రిల్లో పాఠశాలలకు వేసవి సెలవులకు ముందే విద్యార్థులకు స్కూల్ వైజ్గా కొలతలు తీసుకునేవారు. టెస్కో నుంచి ఒక్కో విద్యార్థికి ఒక జత కోసం ఎంఆర్సీ పాయింట్లకు డీఆర్డీఏ అధికారుల పర్యవేక్షణలో క్లాత్ పంపిణీ చేసేవారు. విద్యార్థుల సంఖ్యను బట్టి క్లాత్ బండిల్స్ రాగానే ఆయా పాఠశాలల హెచ్ఎంల సమక్షంలో కుట్టు పనికి గ్రామీణ ప్రాంతాల్లో డీఆర్డీఏ పర్యవేక్షణలోని మహిళా సంఘాలకు, పట్టణ ప్రాంతాల్లో మెప్మా ద్వారా క్లాత్ను అందజేసేవారు. ఒక్కో విద్యార్థికి తొలుత జత చొప్పున జూన్ 12వ తేదీ(పాఠశాలల పునఃప్రారంభం)కంటే ముందుగానే పాఠశాలల పాయింట్లలో అందుబాటులో ఉండేవి. మరో జత స్కూల్ యూనిఫామ్కు క్లాత్ చేరుకున్నాక ఆగస్టు నెల వరకు అందజేసేవారు. ఇలా ప్రతీ విద్యార్థికి రెండు జతల యూనిఫామ్ను అందజేస్తూ వస్తున్నారు. కానీ, ఈవిద్యాసంవత్సరం ఆరంభానికి రోజులు దగ్గర పడుతున్నప్పటికీ యూనిఫామ్ ఊసే వినిపించడం లేదు. హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఏ జిల్లాకు కూడా ఇప్పటివరకు కనీసం ఒక జతకు సంబంధించి క్లాత్ కూడా చేరుకోలేదు. ఈసారి టెస్కోకు ఇచ్చారా? లేదా? రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా టెస్కో ద్వారానే స్కూల్ యూనిఫామ్ క్లాత్ను సరఫరా చేస్తున్నారు. ఈసారి టెస్కోకు కాకుండా ప్రభుత్వం ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తున్నట్లు కొద్దిరోజుల క్రితం ఆరోపణలు వచ్చాయి. టెస్కో ద్వారానే, మరేదైనా సంస్థ ద్వారా క్లాత్ పంపిణీ చేయిస్తారా? అనేది జిల్లాల విద్యాశాఖ అధికారులకు సమాచారం లేదు. ఇక మండల విద్యాశాఖ అధికారులు కూడా ఇప్పటివరకు క్లాత్ సరఫరా కాలేదని చెబుతున్నారు. ఎప్పుడు వస్తుందో తెలియదని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి పాఠశాలలు పునఃప్రారంభానికి జత స్కూల్ యూనిఫామ్ అందించడం సాధ్యం కాకపోవచ్చని పలువురు హెచ్ఎంల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ మండల పాయింట్లకు చేరుకుంటున్నాయి. హనుమకొండ జిల్లాలో 30,996 మంది, వరంగల్ జిల్లాలో సుమారు 32 వేల మంది, ములుగు జిల్లాలో 28,858 మంది విద్యార్థులకు యూడైస్ ప్రకారం రెండు జతల చొప్పున స్కూల్ యూనిఫామ్ అందించాల్సి ఉంటుంది. 24 వస్తువుల కిట్ ఎవరికి? మరోవైపు ప్రభుత్వం విద్యార్థులకు 24 రకాల వస్తువులతో కూడిన కిట్ను ఈ విద్యాసంవత్సరం అందజేస్తుందన్న ప్రచారం ఉంది. ఆ కిట్లను అన్ని ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలలకు అందజేస్తారా? లేదా? అనేది కూడా స్పష్టత లేదని చెబుతున్నారు. కిట్లు కేవలం గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులకే పంపిణీ చేస్తారనేది విశ్వసనీయంగా తెలిసింది. ఇటీవల హనుమకొండ జిల్లాలో పలుచోట్ల ఉపాధ్యాయులు బడిబాటలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరేవారికి కిట్లను ప్రభుత్వం అందిస్తారని చెబుతూ వచ్చారు. ఆ తర్వాత గురుకుల విద్యార్థులకే అని తెలిసి చెప్పడం మానేశారని ఉపాధ్యాయ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటివరకు జిల్లాలకు రాని క్లాత్ పాఠశాలల పునఃప్రారంభం నాటికి ఒక జత అయినా అందేనా? ఎలాంటి సమాచారం లేదంటున్న విద్యాశాఖ అధికారులుజిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, విద్యార్థుల సంఖ్యజిల్లాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 69ప్రాథమికోన్నత పాఠశాలలు 44ప్రాథమిక పాఠశాలలు 319విద్యార్థుల సంఖ్య 24వేలు -
ఎండలపై అప్రమత్తం..
కూలీలకు మజ్జిగ పంపిణీ చేస్తున్న దాతలుఉపాధి కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్న ఆశవర్కర్వాజేడు: వేసవిలో ఎండలు మంట పుట్టిస్తున్నాయి. ఎండల తీవ్రతరం కావడంతో ప్రజలు వడదెబ్బ బారిన పడుతున్నారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉపాధి పనులను చేస్తున్న కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందిస్తున్నారు. ఆశ కార్యకర్తలు కూలీలు పని చేస్తున్న చోటుకు వెళ్లి ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారు. అదే విధంగా ఇంటింటికీ తిరిగితూ ఎండకు తీసుకోవాల్సిన రక్షణ చర్యలను తెలియజేస్తూ ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందిస్తున్నారు. ఎండలతో ఎలాంటి ఇబ్బందులు వచ్చిన వైద్యశాలకు వచ్చి వైద్యం చేయించుకోవాలని సూచిస్తున్నారు. మజ్జిగ సరఫరా చేస్తున్న దాతలు ఉపాధిహామీ పథకం పనులను చేస్తున్న కూలీలకు సర్పంచ్లు, దాతలు మజ్జిగను పంపిణీ చేస్తున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూలీలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సర్పంచ్లు మజ్జిగ ప్యాకెట్లను వారికి అందిస్తున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమయితేనే ఎండ సమయంలో బయటకు వెళ్లాలని తెలుపుతున్నారు. ఉపాధి కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్న ఆశవర్కర్లు మజ్జిగ సరఫరా చేస్తున్న దాతలు -
ప్రమాదకరంగా రోడ్డు
మల్హర్: మండలంలోని అన్సాన్పల్లి–భూపాలపల్లి మండలంలోని కాసీంపల్లి శివారులోని అంతర్గత రోడ్డు ప్రమాదకరంగా ఉంది. దీంతో వాహనదారులు భయంభయంగా ప్రయాణం చేస్తూ రోడ్డును దాటితే చాలు అనే పరిస్థితి నెలకొంది. 2023 జూలై నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఆయా గ్రామల మధ్యగల బీటీ ఒక చోటు పూర్తిగా కొట్టుకపోయింది. వరద నీరు ప్రవహించడంతో అలాగే మరి కొన్ని చోట్ల బీటీ కింద ఉన్న మట్టి కొట్టుక పోయి రోడ్డు ప్రమాదకరంగా మారింది. మరమ్మతులు లేవు.. ఈ రోడ్డు గుండా మండలంలోని అన్సాపల్లి గ్రామస్తులు భూపాలపల్లి జంగేడు, కాసీంపల్లి గ్రామం మీదుగా భూపాలపల్లికి నిత్యం ప్రయాణం సాగిస్తుంటారు. రైతులు గ్రామ శివారులోని తమ పొలాలకు వ్యవసాయ పనులకు సైతం వెళ్తుంటారు. కానీ రోడ్డు ప్రమాదకరంగా మారి రెండు సంవత్సరం గడుస్తున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. రానున్న వర్షకాలం సీజన్లో ఇబ్బందులు మరింత ఎక్కువ ఎదురయ్యే అవకాశాలు ఉంటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు విన్నవించిన పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. భయాందోళనలో వాహనదారులు పట్టించుకోని అధికారులు -
పంట వ్యర్థాలను తగులబెట్టొద్దు
రేగొండ: వానకాలం సీజన్ కోసం భూములను సిద్ధం చేసే క్రమంలో పంట వ్యర్థాలను తగులబెట్టడం చట్టరీత్యా నేరమని మండల వ్యవసాయాధికారి వాసుదేవరెడ్డి హెచ్చరించారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో విలేకరుల సమావేశంంలో ఆయన మాట్లాడుతూ.. పంట అవశేషాలను తగలబెట్టడం వలన గాలి కాలుష్యం పెరిగి ప్రజారోగ్యం దెబ్బతింటుందన్నారు. వేసవి కాలంలో మంటలు వేగంగా వ్యాపించి ఆస్తి, ప్రాణ నష్టం ఉందని హెచ్చరించారు. పంట వ్యర్థాలను తగలబెడితే రూ.2500 నుంచి రూ.10 వేల వరకు జరిమానా విధిస్తారని తెలిపారు. మహాముత్తారం: రైతులు పంట వ్యర్థాలను కాల్చకుండా పొలంలోనే కలియదున్నాలని మండల వ్యవసాయ అధికారి అనుష అన్నారు. మంగళవారం మండలంలోని వజినేపల్లి గ్రామంలో రైతులు కాల్చిన వరిపొలాలను పరిశీలించారు. అనంతరం ఏఓ మాట్లాడుతూ.. పంట కొతల అనంతరం అవశేషాలైనటువంటి వరికొయ్యలు పత్తికట్టె, మిరపకట్టె వంటి వాటిని కాల్చవద్దని రైతులకు సూచించారు. వాటికి కాల్చడం ద్వారా భూమిలో ఉన్న సూక్ష్మజీవులు చనిపోయి భూసారం దెబ్బతింటుందన్నారు. -
రోడ్డు నిర్మాణం పూర్తయ్యేనా?
టేకుమట్ల: శిథిలమైన వెల్లంపల్లి–ఎంపేడు ప్రధాన రోడ్డుతో ఎంపేడు, వెల్లంపల్లి రైతులు రవాణా సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాంతో గత సంవత్సరం రోడ్డు నిర్మాణం కోసం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు రూ.3కోట్ల నిధులను కే టాయించారు. వెల్లంపల్లి, ఎంపేడు రైతులు ఇక నుంచి రవాణా కష్టాలు తప్పినట్టేనని ఆనందం వ్య క్తం చేశారు. శంకుస్థాపన చేసిన సుమారు ఆరు నెల ల అనంతరం కాంట్రాక్టర్ మొరంతో చదును చేసి కంకర పోశాడు. అనంతరం రోలర్తో చదును చేసి పత్తాలేకుండా పోయాడు. పనులు ప్రారంభమైన కొంత సమయానికి మళ్లీ నిలిచిపోవడంతో రానున్న వర్షాకాలంలో ఇబ్బందులు తప్పవని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంకరతో కష్టాలు.. వెల్లంపల్లి–ఎంపేడు, కుందనపల్లి గ్రామాల రైతుల పొలాలు ఎక్కువగా ఈ రోడ్డు వెంటే వెళ్తుంటారు. ప్రస్తుతం రోడ్డు పొడవునా కాంట్రాక్టర్ కంకరపోసి వదిలేయడంతో కాడెడ్లు, రైతులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొద్ది రోజుల్లో వర్షాకాలం ప్రారంభం కానుండంతో ఇప్పట్లో బీటీ రోడ్డు నిర్మాణం లేనట్లేనా అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు, పాలకులు స్పందించి బీటీ రోడ్డు నిర్మానానికి కృషి చేయాని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. నిలిచిన ఎంపేడు–వెల్లంపల్లి రోడ్డు నిర్మాణం కంకర పోసి వదిలేసిన కాంట్రాక్టర్ ఇబ్బంది పడుతున్న వాహనదారులు -
జేఎల్ఎంలకు పదోన్నతి కలేనా..?
హన్మకొండ: ఆకాశంలో వేలాడుతున్న విద్యుత్ తీగలపై అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులపై యాజమాన్యం కనికరం చూపడం లేదు. ఉన్నత స్థానాల్లో ఉన్న అధికారులు పదోన్నతి మీద పదోన్నతి తీసుకుంటూ.. జూనియర్ లైన్మెన్ల చిరుద్యోగుల పదోన్నతి హక్కును కాలరాయడంపై నిరసన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని టీజీ ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్లో జూనియర్ లైన్మన్లకు ఆ యాజమాన్యాలు ఏఎల్ఎంలుగా పదోన్నతి కల్పించాయి. కానీ, ట్రాన్స్కోలో కల్పించకుండా జూనియర్ లైన్మన్లను గోస పెడుతోందన్న విమర్శలు ఎదుర్కొంటోంది. అన్నీ ఖాళీలే.. టీజీ ట్రాన్స్కోలో జేఎల్ఎం పోస్టులు 1119 ఉన్నా యి. ఇందులో 892 పోస్టులు భర్తీ అయ్యాయి. అసిస్టెంట్ లైన్మన్ పోస్టులు 378 ఉండగా ఇక్కడ ఆరుగురు మాత్రమే ఉన్నారు. లైన్మన్ పోస్టులు 280 ఉండగా ఏడుగురు మాత్రమే ఉన్నారు. 372 అసిస్టెంట్ లైన్మన్ పోస్టులు ఖాళీగా ఉన్న వాటిని పదో న్నతి ద్వారా భర్తీ చేయకుండా జేఎల్ఎంల సహనానికి పరీక్ష పెడుతున్నారు. 24 గంటలు శ్రమిస్తూ వ్యవస్థను నిలబెడుతున్న తమపై ఇంత వివక్ష యాజమాన్యానికి తగదని మొత్తుకుంటున్నారు. వయస్సు మీరుతున్నా.. జూనియర్ లైన్మన్ పోస్టులు నియమించే క్రమంలో అప్పటికే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, ఆర్టిజన్లుగా పని చేస్తూ ఈ ఉద్యోగంలోకి వచ్చిన వారు చాలామంది ఉన్నారు. రిక్రూట్మెంట్ సమయంలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, ఆర్టిజన్ ఉద్యోగులకు ఇన్ సర్వీస్ వెయిటేజీ ఇవ్వడంతో చాలాది జేఎల్ఎంలుగా ఎంపికయ్యారు. వీరు అప్పటికే 10 నుంచి 15 సంవత్సరాల సర్వీస్ చేసిన వారున్నారు. చాలామంది 50 ఏళ్ల వయస్సుకు వచ్చారు. వయస్సు మీరుతున్నా వీరంతా తమకు ఒక్క పదోన్నతి వచ్చిన చాలు అనే ఆశతో ఉన్నారు. కానీ, వీరి ఆశలను ట్రాన్స్ కో యాజమాన్యం నీరుగారుస్తోంది. ఇంజనీర్లు, అకౌంట్స్, హెచ్ఆర్డీ విభాగంలో అన్ని స్థాయి ఉద్యోగులకు పదోన్నతి కల్పించిన యాజమాన్యం తమకు ఎందుకు కల్పించడం లేదని జూనియర్ లైన్మన్లు ప్రశ్నిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ప్రాణాలను సైతం లెక్క చేయకుడా విధులు నిర్వహిస్తున్న జేఎల్ఎంలపై యాజమాన్యం తక్కువ చేసి చూడడం సమంజసం కాదని ఉద్యోగ సంఘాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికై నా జేఎల్ఎంలకు పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. ట్రాన్స్కో యాజమాన్యం తీరుపై విమర్శలు ఏఎల్ఎంలుగా పదోన్నతి కల్పించడంలో జాప్యం ప్రమాదకరంగా విధులు నిర్వర్తిస్తున్నా కనికరం చూపని మేనేజ్మెంట్ -
ఎండతీవ్రతకు 400 గబ్బిలాలు మృతి!
కాళేశ్వరం: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ గ్రామంలో చింత చెట్లపై ఏళ్లుగా నివాసం ఏర్పచుకున్న గబ్బిలాలు వారం రోజులుగా వీస్తున్న వడగాలులతో వందల సంఖ్యలో మృత్యువాత పడ్డాయి. కోర్టు ప్రాంగణం, అటవీశాఖ విశ్రాంతి భవనం వెనుక ఉన్న చింతచెట్లపై గబ్బిలాల మరణమృదంగం మోగింది.గోదావరి, ప్రాణహిత తీర ప్రాంతాల్లోని సరిహద్దులో 46 డిగ్రీలకుపైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చల్లని ప్రదేశం, నీరు లభించక సుమారుగా 400పైగా గబ్బిలాలు మృతిచెంది నేలపై పడ్డాయి. మరికొన్ని గబ్బిలాలు చెట్టుపైనే మృతి చెంది వేళాడుతూ దర్శనమిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. చూసేవారంతా అయ్యోపాపం అంటున్నారు. -
బాల్యవివాహాలను అరికట్టాలి
మల్హర్: బాల్య వివాహాల అరికట్టాలని సఖీ కేంద్రం కేస్ వర్కర్ సరిత, జిల్లా మహిళా సాధికారత కేంద్రం మిషన్ కోఆర్డినేటర్ కృష్ణ అన్నారు. మంగళవారం మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో అంగన్వాడీ సూపర్వైజర్ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో బాల్యవివాహాల నిర్మూలనపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాల్యవివాహాలు బాలికల జీవితాలను అర్ధాంతరంగా నిలిపివేసే సామాజిక సమస్య అని పేర్కొన్నారు. చిన్న వయస్సులో వివాహం జరగడం వల్ల బాలికల చదువు మధ్యలోనే ఆగిపోవడంతో పాటు, ఆరోగ్యపరమైన సమస్యలు, మానసిక ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు వంటి అనేక ఇబ్బందులు ఎదురవుతాయని వివరించారు. ‘బాల్య వివాహం–బతుకు ఆగం’ అనే పోస్టర్లు ఆవిష్కరించి ఆ నినాదాన్ని ప్రతి గ్రామానికి, ప్రతి కుటుంబానికి తీసుకెళ్లాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. 1098 (చైల్డ్ హెల్ప్లైన్), 181 (మహిళా హెల్ప్లైన్), 14567 వంటి అత్యవసర సేవా నంబర్ల గురించి వివరించారు. అనంతరం బాల్యవివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు జయప్రద, అరుణ,లక్ష్మీ, బాలమ్మ, బాలికలు, మహిళలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మహాముత్తారం: ప్రజాపాలన ప్రగతిప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం మహిళవారోత్సవాల్లో భాగంగా మండలకేంద్రంలో అంగన్వాడీ సూపర్వైజర్ నిహరిక ఆధ్వర్యంలో బాల్యవివాహం బతుకు ఆగం అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాల్య వివాహల వల్ల బాలికల విద్యా,ఆరోగ్యం భవిష్యత్పై కలిగే ప్రతికూల ప్రభావల గురించి సర్పంచ్ కొండగోర్ల బాపు వివరించారు. నాగరాణి, సఖీసెంటర్ అడ్మిన్ గాయిత్రి, ఏఏఐ కుమారస్వామి, డీహెచ్ఈబ్ల్యూ అకౌంటెంట్ సురేష్, అంగన్వాడీ కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. టేకుమట్ల: బాల్య వివాహాల నిర్మూలకు అందరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎస్సై అమూల్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో మండల విద్యాధికారి ఆధ్వర్యంలో బాల్య వివాహం–బతుకు ఆగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల భవిష్యత్లో శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడతారని తెలిపారు. చైల్డ్ లైన్ ప్రతినిధి కళావతి, సర్పంచ్ మాట్ల శ్రీనివాస్, సూపర్వైజర్ సరోజన, డీసీపీయూ సోషల్ వర్కర్ కుమార్ పాల్గొన్నారు. మొగుళ్లపల్లి: మండలంలోని పిడిసిల్ల గ్రామంలో బాల్య వివాహం–బతుకు ఆగం అనే కార్యక్రమంపై ఐసీడీఎస్ సూపర్వైజర్ మాధవి ఆధ్వర్యంలో సర్పంచ్ నైనాకంటి మమత సమక్షంలో కిశోర బాలికలకు, మహిళలకు గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్యవివాహల నిర్మూళనకు సంబంధిచిన పోస్టర్ ఆవిష్కరించారు. అంగన్వాడీ టీచర్ శ్యామల చైల్డ్ హెల్ప్ లైన్ అధికారి చరణ్, సఖి కౌన్సిలర్ మాధవి, మమతతో పాటు తదితరులు పాల్గొన్నారు. -
కాళేశ్వర దేవస్థానం చైర్మన్ను తొలగించాలి
మహాముత్తారం: సరస్వతీ అంత్యపుష్కర పుణ్యస్నానానికి వచ్చిన భక్తులు గోదావరిలో పూజలు నిర్వహించారు. కొంతమంది మహిళలకు గోదావరిలో స్నానమాచరించిన అనంతరం దేవుడి పూనకాలు వచ్చాయి. దీంతో స్నానానికి వచ్చన మరికొంతమంది మహిళలు తమ ఆరోగ్యంతోపాటు కుటుంబసమస్యలు సంతానంకోసం దేవతలను సంతు అడుగుతు దేవతలను ప్రసన్నం చేసుకున్నారు.కాళేశ్వరం: కాళేశ్వరం దేవస్థానం చైర్మన్ మోహన్ శర్మను వెంటనే పదవి నుంచి తొలగించి, మహిళా వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేయాలని కుల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ డిమాండ్ చేశారు. మంగళవారం కాళేశ్వరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సరస్వతి అంత్య పుష్కరాలకు వచ్చిన మహిళా భక్తులను చైర్మన్ అవమానించారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే రెండు రోజుల్లో దేవస్థానం ఈఓ కార్యాలయం ముందు నిరసన చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కమిటీ కన్వీనర్ అజ్మీరా పూల్ సింగ్ నాయక్, లింగమల్ల సదవాలిరావుతో పాటు తదితరులు పాల్గొన్నారు. క్షమాపణ చెప్పాలి మల్హర్(కాటారం): మహిళా లోకం అసహ్యించుకునే విధంగా కాలేశ్వరం ఆలయ చైర్మన్ మోహన్శర్మ ప్రవర్తన ఉందని ఆయన వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలని కాటారం డివిజన్ బీఆర్ఎస్ నాయకుడు జక్కు శ్రావణ్ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కమిషనర్ స్పందించి, మహిళలపై దురుసుగా ప్రవర్తించిన చైర్మన్ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కోరారు. కుల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ -
మీడియాపాయింట్ వద్దనే ఉద్యోగుల తిష్ట!
కాళేశ్వరం: కాళేశ్వరంలో జరిగే అంత్య పుష్కరాలకు వచ్చిన వివిధ శాఖలకు చెందిన కొంత మంది ఉద్యోగులు ఈఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మిడియా పాయింట్లోనే తిష్టవేసి సాయంత్రం వ రకు సేదదీరుతున్నారు. మీడియాపాయింట్లో రెండు ఏసీలు విశాలమైనగది ఉండడంతో ఎండ తీవ్రతకు తట్టుకోలేక ఉద్యోగులు తిష్ట వేసి వారి విధులు మరిచిపోయి అక్కడే సాయంత్రం వరకు ఉండడం గమనార్హం. వారిపైన ఉన్నతాధికారులు దృష్టిసారించాలని పలువురు జర్నలిస్టులు కోరుతున్నారు. త్రుటిలో తప్పిన ప్రమాదం కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని సరస్వతీఘాటులో తెప్పోత్సవానికి విద్యుత్ వైరు సరిచేస్తుండగా అక్కడే పని చేస్తున్న బాపు అనే కూలీకి విద్యుత్షాక్ తగలడంతో మంగళవారం కిందపడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన మరో కూలీ కర్రతో కొట్టడంతో ప్రమాదం తప్పింది. కొంత సేపు తరువాత బాపు స్పృహా నుంచి తేరుకున్నాడు. క్షేమంగా బయటపడడంతో ఊపిరిపీల్చుకున్నారు. పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి కాళేశ్వరం: రాష్ట్ర ప్రభుత్వం నూతన పింఛన్లు మంజూరు చేస్తున్న క్రమంలో మహదేవపూర్ మండలంలోని అర్హులైన దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులు అందరూ దరఖాస్తు చేసుకోవాలని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి (వీహెచ్పీఎస్) మండల అధ్యక్షుడు వీరగంటి సమ్మయ్య సూచించారు. గత 13 సంవత్సరాల నుంచి పింఛన్ రాక వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు మనోవేదనకు గురయ్యారని, ప్రభుత్వం ఇటీవల నూతన పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోమని ప్రకటించడంతో వీరికి భరోసా, మనోధైర్యాన్ని కల్పించినట్లు అయిందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పకుండా గడువులోపు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. బెల్లి లలితకు నివాళి మల్హర్: మండలంలోని కొయ్యూరులో సోమవారం బెల్లి లలిత వర్ధంతిని ప్రజా సంఘాల జిల్లా చైర్మన్ పీక కిరణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం కిరణ్ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాట మాటతో సబ్బండ వర్గాలను, కులాలను, చైతన్యం చేస్తూ తెలంగాణ పల్లెల్లో ఉద్యమ జ్వాలను రగిలించిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ దేవి భూమయ్య, సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జనగామ జనార్ధన్. కుల ప్రజా సంఘాల జిల్లా కో కన్వీనర్ అయితే బాపు, మండల కో కన్వీనర్ గడ్డం లచ్చన్న, బోయిని రాజన్న, యాదండ్ల గట్టయ్య, వేల్పుల నారాయణ, యాట్ల శంకర్, సదానందం, తదితరులు పాల్గొన్నారు. ఇసుక ట్రాక్టర్ పట్టివేత రేగొండ: ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. మండల కేంద్రంలో మంగళవారం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకున్నారు. అనంతరం ట్రాక్టర్ యజమాని జైపాల్రెడ్డి పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
బాల్య వివాహాలు చట్టవిరుద్ధం
కాళేశ్వరం: బాల్య వివాహాలు చట్టవిరుద్ధమని ఏఎస్పీ నరేష్కుమార్ అన్నారు. బాల్య వివాహాల నిర్మూలనపై మంగళవారం కాళేశ్వరంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నరేశ్కుమార్ మాట్లాడుతూ బాలికలకు విద్య, ఆరోగ్య, సురక్షితమైన భవిష్యత్ను కల్పించడం ప్రతీ ఒక్కరి బాధ్యత అన్నారు. చట్ట ప్రకారం అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 21 సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే వివాహం జరగాలని తెలిపారు. బాల్యవివాహాల నిర్మూలనపై అవగాహన కల్పించేలా రూపొందించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, మహదేవపూర్ సీఐ వెంకటేశ్వర్లు, కాళేశ్వరం ఎస్ఐ తమాషా రెడ్డి, ఉప సర్పంచ్ సుధీర్, భరోసా ఎస్ఐ స్వప్న కుమారి, సీడీపీఓ, అంగన్న్వాడీ టీచర్లు పాల్గొన్నారు. ఏఎస్పీ నరేష్కుమార్ -
ఇద్దరిపై కేసు నమోదు
రేగొండ: సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 23న ఫిర్యాదుదారు, అతడి మిత్రులపై వాట్సాప్ గ్రూపులో గుర్రాల సుమన్ రెడ్డి అనే వ్యక్తి అసత్య ప్రచారాన్ని పోస్ట్ చేశాడు. దీంతో అతడిపై కేసు నమోదు చేసి విచారించగా కొలెపాక భిక్షపతి సూచన మేరకు వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేసినట్లు అంగీకరించాడు. దీంతో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపాడు. సోషల్ మీడియాలో శాంతిభద్రతాలకు విఘాతం కలిగించే విధంగా పోస్ట్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. సన్మానం భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి పట్ణణ కేంద్రంలోని ఆంజనేయ ఆలయ కమిటీ చైర్మన్గా నూతనంగా ఎన్నికై న నాగపూరి సమ్మయ్యను మంగళవారం పట్టణ కేంద్రంలో ఐఎన్టీయూసీ బ్రాంచ్ ఉప అధ్యక్షులు బేతిల్లి మధుకర్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులతో పాటు స్థానికులు పాల్గొన్నారు. పరామర్శ చిట్యాల: మండల కేంద్రానికి చెందిన గంగాధరి రాజు కొంత కాలంగా కేన్సర్తో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మంగళవారం ఆస్పత్రికి వెళ్లి రాజును పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాజుకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ఉపాధి కూలీలకు మజ్జిగ పంపిణీ భూపాలపల్లి రూరల్: మండలంలోని గుర్రంపేట గ్రామంలో ఉపాధిహామీ కూలీలకు సర్పంచ్ కోడూరి రమేశ్ మంగళవారం మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ రాజు, ఉప సర్పంచ్ దామెరుప్పల సుధాకర్, వార్డ్ మెంబర్ దామెరుప్పల సుమలత, ఇతర వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. కాటారంలో.. మల్హర్(కాటారం): కాటారం మండలంలోని గుండ్రాత్ పల్లి 8వ వార్డు సభ్యుడు జనగాం రవీనా సురేష్ కుమారుడు నిహాన్స్ జన్మదినం పురస్కరించుకొని గుండ్రాత్ పల్లి, గంగాపురి, మల్లారం గ్రామాల్లో పని చేస్తున్న ఉపాధికూలీలకు మంగళవారం మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ సెలవోజు తిరుపతి, మాజీ సర్పంచ్ ప్రవళిక ప్రభాకర్, శంకరయ్య, మల్లన్న తదితరులు పాల్గొన్నారు. వారాంతపు సంత వెలవెల వెంకటాపురం(కె): రోజు రోజుకు పెరుగుతున్న ఎండల కారణంగా మండల కేంద్రంలో వారాంతపు సంత వెలవెలపోయింది. ఈ మేరకు మంగళవారం మండలకేంద్రంలో ప్రతీ వారం సంత నిర్వహణకు అధిక సంఖ్యలో జనం నిత్యావసర వస్తువుల కొనుగోలుకు వచ్చేవారు. నేటి వారాంతపు సంతకు వేసవి తీవ్రత పెరగడంతో ప్రజలు లేక వ్యాపారాలు జరగలేదని నిర్వాహకులు తెలుపుతున్నారు. మండలకేంద్రంలో 46 డిగ్రీల ఎండ నమోదు కావడంతో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. -
ధాన్యం కొనేవరకూ పోరాటం
ఆత్మకూరు: చివరి ధాన్యం కొనుగోలు చేసే వరకు బీజేపీ పోరాటం ఆగదని బీజేపీ ప్రజాప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. ప్రభుత్వం మెడలు వంచి రైతు సమస్యలు పరిష్కరిస్తామని, కుల్కచర్ల నుంచి నీరుకుళ్ల వరకు అన్నీ సమస్యలే ఉన్నాయని వారు పేర్కొన్నారు. రైతు గోస–బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా మంగళవారం నీరుకుళ్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ బృందం పరిశీలించింది. బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఎంపీలు రఘునందన్రావు, ఈటల రాజేందర్, ఆర్మూర్, కామారెడ్డి ఎమ్మెల్యేలు పైడి రాకేశ్రెడ్డి, వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు రోడ్లపై ధాన్యం ఆరబోశారన్నారు. మొక్కజొన్న కొనుగోళ్లు నిలిపివేశారని, ధాన్యం కొనుగోళ్లను కూడా ఎత్తేస్తారని రైతులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. వరంగల్ డిక్లరేషన్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్కు డిపాజిట్లు కూడా దక్కవన్నారు. ఎంపీ రఘునందన్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో 50 రోజులుగా వడ్ల కుప్పల మీదే నిద్రిస్తున్నారన్నారు. ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి బుకాయించుడు బంద్ చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు అప్పుల కుప్పలు, ఆత్మహత్యలు మిగిలాయని, కేసీఆర్కు పట్టిన గతే రేవంత్కు పడుతుందని హెచ్చరించారు. బీజేపీ జాతీయ నాయకుడు గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్, కిసాన్మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్మోహన్రెడ్డి, మాజీ ఎంపీ సీతారాంనాయక్, పరకాల ఇన్చార్జ్ కాళీప్రసాదరావు, జిల్లా అధ్యక్షుడు సంతోష్రెడ్డి, రావు పద్మ, డాక్టర్ విజయ్చందర్రెడ్డి, దశమంతరెడ్డి పాల్గొన్నారు. బీజేపీ శాసనసభాపక్షనేత మహేశ్వర్రెడ్డి, ఎంపీలు రఘునందన్రావు, ఈటల -
బాలల హక్కులను పరిరక్షించాలి
భూపాలపల్లి రూరల్: బాలల హక్కుల పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలోని ఐడీఓసీలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన స్నేహ బాలల హక్కుల సదస్సు, మాక్ పార్లమెంట్ కార్యక్రమానికి కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చిన్నారుల్లో నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, ప్రజాస్వామ్యంపై అవగాహన పెంపొందించేందుకు మాక్ పార్లమెంట్ వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. డీఆర్డీఓ బాలకృష్ణ, డీడబ్ల్యూఓ మల్లీశ్వరి, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్, తదితరులు పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం చిట్యాల: గ్రామాల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మంగళవారం మండలంలోని చింతకుంట రామయ్యపల్లి గ్రామంలో గ్రామ పంచాయితీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ వసంతరావు, ఎంపీడీఓ జయశ్రీ, సర్పంచ్ మటిక సుజాత రవీందర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మధువంశీకృష్ణ, మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి, పంచాయతీ కార్యదర్శి సునంద పాల్గొన్నారు. మహిళల సంక్షేమమే లక్ష్యం మొగుళ్లపల్లి: మహిళాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అ న్నారు. మండలంలోని రంగాపురం గ్రామంలో నూ తనంగా నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నారుల భవిష్యత్కు బలమైన పునాది అంగన్వాడీ కేంద్రాలేనని తెలిపారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి మల్లీశ్వరి, తహసీల్దార్ సునీత, ఎంపీడీఓ సురేందర్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
రూ.5.60 కోట్లతో జియో ట్యూబ్స్
ఏటూరునాగారం: మండల పరిధిలోని రామన్నగూడెంలోని పుష్కరఘాట్కు అనుకొని 800 మీటర్ల మేర కరకట్ట మట్టి గోదావరి వరదలతో ఒర్లిపోయింది. రివిట్మెంట్కు వేసిన రాళ్లు సైతం కొట్టుకుపోయి గోదావరిలో కలిశాయి. గోదావరి కరకట్ట ఆనుకొని ఉన్న ఒడ్డు మొత్తం ఒర్లిపోతుండడంతో కరకట్ట ప్రమాద స్థాయికి చేరింది. గతంలో మంజూరైన జియో ట్యూబ్స్ పనులు పుష్కరఘాట్ నుంచి 800 మీటర్ల దూరంలో కరకట్ట కోతకు గురైన ప్రాంతం ఉంది. ముందుగా ప్రమాద స్థాయిలో కోతకు గురై ఉన్న ప్రాంతంలో 150 మీటర్ల మేర తొలి దశగా జియోట్యూబ్స్ పనులను రూ. 65 లక్షలతో చేపట్టారు. ఇప్పటి వరకు 125 మీటర్ల వరకు పూర్తి అయ్యింది. ఇంకా 25 మీటర్ల కోసం ఇసుక ఫిల్లింగ్ పనులు చేపడుతున్నారు. అదే విధంగా మళ్లీ ఇక్కడి నుంచి 650 మీటర్ల దూరంలో ఉన్న పుష్కరఘాట్ వరకు కూడా ఈ జియో ట్యూబ్స్ను వేస్తూ కరకట్టను మరింత పటిష్టపర్చాలని ఇరిగేషన్శాఖ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. భారీ నీటి పారుదలశాఖ అధికారులు నుంచి 650 మీటర్ల పుష్కరఘాట్ వరకు ఉన్న కరకట్ట ఒర్లిపోకుండా జియోట్యూబ్స్ వేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రూ.5.60 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసి ఇంజనీరింగ్ చీఫ్కు పంపించారు. పుష్కరాల కోసం.. వచ్చే ఏడాది జూన్లో గోదావరి పుష్కరాలు ఉన్న నేపథ్యంలో కరకట్టను పటిష్టపర్చనున్నారు. ఇప్పటి వరకు వచ్చిన పలు దఫాల వరదలకు కరకట్ట మట్టి కొట్టుకపోవడంతోపాటు ఘాట్లోని మెట్లు మొత్తం కొట్టుకుపోయాయి. ఈ ఏడాది వచ్చే గోదావరి వరదకు కరకట్ట మట్టి, మెట్లు సైతం కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ప్రతిపాదనలను సిద్ధం చేసి ఇక్కడ కూడా ట్యూబ్స్ను అమర్చాలని డిసెంబర్లో సర్వే చేపట్టారు. పనులపై వేగాన్ని పెంచాలనే ఉద్దేశంతో గోదావరిలో ఆయిల్ ఇంజిన్లను ఏర్పాటు చేసి ఇసుక ఫిల్లింగ్ పనులు చేస్తున్నారు. ఇసుకను నింపిన తర్వాత టెక్స్టైల్ క్లాత్ వేసి ఆ తర్వాత జియోట్యూబ్స్ను వాటిపై అమర్చి అందులో ఇసుక, నీటిని నింపి ఎటు కదలకుండా కరకట్టకు రక్షణ ఇచ్చే విధంగా అమర్చనున్నారు. గోదావరి ఇప్పటి వరకు పూర్తి అయిన 125 మీటర్లు, ఇప్పుడు పనులు జరుగుతున్న 25 మీటర్లతో పాటు 650 మీటర్లు అదనంగా జియోట్యూబ్స్కు నిధులు మంజూరు అయితే అస్సాంకు చెందిన కాంట్రాక్టర్ ద్వారా ఈ పనులను పూర్తి చేయించనున్నట్లు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. పుష్కరఘాట్ను ఆనుకుని 850 మీటర్లు పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు వచ్చే ఏడాది పుష్కరాల కోసం ముందస్తుగా చర్యలు భారీ నీటి పారుదలశాఖ ఆధ్వర్యంలో పనులు -
పొక్లెయినర్ను అడ్డుకున్న ఉపాధి కూలీలు
భూపాలపల్లి రూరల్: మండలంలోని వజినపల్లి గ్రామంలో అక్రమంగా మట్టిని తరలించేందుకు వచ్చిన పొక్లెయినర్ను ఉపాధి హామీ కూలీలు అడ్డుకున్నారు. గ్రామంలోని స్థానిక చెరువులో కొంతకాలంగా జేసీబీతో గుంతలు తవ్వుతూ మట్టిని తరలిస్తున్నారు. ఉపాధి కూలీలు ఏకమై మంగళవారం జేసీబీ పనులను నిలిపివేశారు. ఈ సందర్భంగా జేసీబీ యజమాని కూలీలతో దురుసుగా ప్రవర్తించాడు. ఈ విషయమై కూలీ లు అధికారులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు వచ్చి మట్టి తీయడానికి అనుమతులు లేవని తెలపడంతో జేసీబీ వెనుదిరిగిపోయినట్లు కూలీలు తెలిపారు. వరికొయ్యలను కాల్చొద్దు భూపాలపల్లి రూరల్: జిల్లాలోని రైతులు ఎవరు కూడా వరి కొయ్యలతో పాటు వివిధ పంటల వ్యర్ధాలను కాల్చవద్దని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబురావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొయ్యలను కాల్చడం వల్ల భారీ పరిమాణంలో విషపూరిత వాయువులైన కార్బన్ మోనాకై ్సడ్, కార్బన్ డయాకై ్సడ్ సల్ఫర్ ఆకై ్సడ్లు గాలిలో కలిసిపోయి దట్టమైన పొగమంచును ఏర్పరుస్తాయన్నారు. నేలను సారవంతంగా ఉంచే వానపాములు, మేలుచేసే బ్యాక్టీరియా మిత్ర పురుగులు, సూక్ష్మజీవులను, శిలీంధ్రాలను నాశనం చేస్తుందని వివరించారు. పంట పొలాలను కాల్చొద్దు కాళేశ్వరం: పంట అవశేషాలను, పొలాలను కాల్చడం వల్ల అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మంగళవారం ఒక ప్రకటనలో రైతులకు విజ్ఞప్తి చేశారు. మహదేవపూర్ మండల పరిధిలోని కాళేశ్వరంలో జరిగిన పంట పొలాల అగ్ని ప్రమాద ఘటనలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ నరేష్ కుమార్, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, మహదేవపూర్ సీఐ వెంకటేశ్వర్లు, కాళేశ్వరం ఎస్సై తమాషారెడ్డి మంగళవారం ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసే చర్యలు చేపట్టారు. పోలీసులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా, ఫైర్ సిబ్బందితో కలిసి మంటలను పూర్తిగా ఆర్పివేశారు. దేవాదుల ఎత్తిపోతల వద్ద సిల్ట్ తొలగింపు కన్నాయిగూడెం: మండల పరిధిలోని తుపాకులగూడెం గ్రామ పంచాయతీలోని గుట్టలగంగారం సమీపంలో గల గోదావరిపై ఉన్న దేవా దుల ఎత్తిపోతల వద్ద సిల్ట్ తొలగించే పనులు అధికారులు మంగళవారం మొదలుపెట్టారు. ప్రతీ సంవత్సరం మే నెల చివరి వారంలో ప్రారంభించి పోర్బే గదులతో పాటు, కాల్వలో ఉన్న సిల్ట్ను తొలగించి శుభ్రం చేస్తారు. దీంతో నీరు కాల్వ ద్వారా పోర్బే నుంచి నీరు మోటర్ల వద్దకు చేరుతుంది. ఇలా చేరడంతో పంపింగ్ చేయడానికి సులువుగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. పిడుగుపాటుకు రైతు మృతి రేగొండ: పిడుగుపాటుకు రైతు మృతిచెందిన ఘటన రేగొండ మండలం లింగాల గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తిప్పారపు రాజు (34) పొలంలో ఉన్న పశువులను తీసుకురావడానికి వెళ్తుండగా సా యంత్రం ఉరుములతో కూడిన వర్షం ప్రారంభమైంది. ఈ క్రమంలో పొలంలో ఉన్న రాజు పై పిడుగు పడి చనిపోయాడు. రాజుకు భార్య పావని, కూతురు, కుమారుడు ఉన్నారు. రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు, తోటి రైతులు కోరుతున్నారు. తాటిచెట్టుపై పిడుగు మొగుళ్లపల్లి:వేములపల్లి గ్రామంలో మంగళవారం సాయంత్రం తాటిచెట్టు పై పిడుగుపడింది. దీంతో చెట్టుపై మంటలు చెలరేగాయి. దీంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.ప్రాణదాతలు పైలట్లుములుగు రూరల్: అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడే ప్రాణదాతలు అంబులెన్స్ పైలట్లని జిల్లా వైద్యాధికారి గోపాల్రావు అన్నారు. మంగళవారం అంతర్జాతీయ పైలెట్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో ఆయన కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. -
గాలివాన బీభత్సం
● తడిసిన ధాన్యం ● కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు చిట్యాల/రేగొండ/టేకుమట్ల: జిల్లాలో మంగళవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. చిట్యాల, రేగొండ, టేకుమట్ల మండలాల్లో వర్షానికి కల్లాల్లో ధాన్యం తడిసిపోయింది. చిట్యాల వ్యవసాయ మార్కెట్ ఓ రైతుకు చెందిన వరిధాన్యం తడిసిపోయింది. చిట్యాల మండల కేంద్రంతో పాటు గుంటూరుపల్లి, నైన్పాక, తిరుమాలాపూర్ గ్రామాలలో విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో పాటు చెట్లు రోడ్లపై కూలిపోయాయి. హైస్కూల్లో ప్రహరీపై భారీ వృక్షం కూలింది. పోలీస్స్టేషన్లో విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలి పోయి భవనాలపై పడ్డాయి. ఏఆర్పల్లిలో కుమారస్వామికి చెందిన ఇల్లు వెనుకభాగం కూలిపోయింది. వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన గుండా స్వామి ఇంటి రేకులు గాలికి లేచిపోయాయి. చిట్యాల సివిల్ ఆస్పత్రి నేమ్ బోర్డు పడిపోయింది. రేగొండ మండలం లింగాల గ్రామంలో రోడ్డుకు అడ్డంగా చెట్లు విరిగి పడడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. కొడవటంచలోని కోడెపాక రాజయ్య ఇంటి ముందు చెట్టు విరిగిపడింది. గూడెపల్లి గ్రామానికి చెందిన గుండె నారాయణ, గుండె రవి ఇంటిపై చెట్టు విరిగి పడడంతో రేకులతో పాటు గోడలు ధ్వంసమయ్యాయి. టేకుమట్ల మండలం దుబ్యాల గ్రామానికి చెందిన బిల్లకంటి కోటేశ్వర్రావు ఇంటిరేకులు ఎగిరి పడ్డాయి. చిట్యాల: పాఠశాలలో కూలిపోయిన భారీ వృక్షంరేగొండ: ధ్వంసమైన రేకుల ఇల్లుచిట్యాల: మార్కెట్లో తడిసిన ధాన్యంటేకుమట్ల: కిందపడ్డ ఇంటిపైకప్పు -
టిఫిన్స్.. కొనలేం తినలేం!
భూపాలపల్లి అర్బన్: అసలే ఉరుకులు పరుగుల జీవితం. ఒక్కోసారి ఇంట్లో బ్రేక్ ఫాస్ట్ (టిఫిన్) కాకపోతే చిరు ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు ఎక్కువగా చిన్న చిన్న టిఫిన్ సెంటర్లకు వెళ్లి తింటుంటారు. మొన్నటి వరకు ప్లేట్ పూరీ, ఇడ్లీ, వడ, దోశకు రూ.30 నుంచి రూ.40వరకు ఉండగా.. వాటి ధరలు అమాంతం పెంచారు. ఏకంగా రూ.50 నుంచి రూ.70వరకు పెంచడంతో సామాన్యులు తినలేని పరిస్థితి నెలకొంది. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో గ్యాస్ సిలిండర్లు సక్రమంగా రాకపోవడం.. ఇటీవల కమర్షియల్ సిలిండర్ల ధరలను పెంచడంతో చిరువ్యాపారులకు గుదిబండగా మారింది. చిన్నచిన్న టిఫిన్ సెంటర్ల నుంచి పెద్దపెద్ద బిర్యానీ సెంటర్లు కూడా కట్టెల పొయ్యినే వినియోగిస్తున్నారు. అటు టిఫిన్స్. ఇటు మీల్స్ సెక్షన్లో ఒకేసారి రేట్లు పెంచారు. ఇది సామాన్య, మధ్యతరగతి వారికి ఇబ్బందిగా మారింది. చిరు హోటళ్లకు గుదిబండగా మారింది. ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, గప్చుప్ బండ్లు, చిన్నచిన్న హోటళ్లు, బిర్యానీ సెంటర్లు కమర్షియల్ సిలిండర్ల పైనే ఆధారపడుతుంటారు. సాయంత్రం, మధ్యాహ్నం వేళ రోడ్లపై టిఫిన్స్ విక్రయిస్తుంటారు. ఇది సామన్య, మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సిలిండర్ల ధర పెంచడంతో విధిలేని పరిస్థితుల్లో టిఫిన్స్ ధర పెంచారు. ఒక హోటల్కు నెలకు 4–5 వాణిజ్య సిలిండర్లు అవసరం ఉంటుందని నిర్వాహకులు పేర్కొంటున్నారు. సిలిండర్ల ధర పెంచడంతో రూ.5వేల నుంచి రూ.6వేల భారం పడుతోందని, అందుకే విధిలేని పరిస్థితుల్లో టిఫిన్ ధరలు పెంచాల్సి వచ్చిందని వారు పేర్కొంటున్నారు. ఒకవైపు ఇంటి అద్దెలు, సిబ్బంది వేతనాలు, నిత్యావసర కూరగాయల ధరలు పెరిగిపోవడంతో వ్యాపారం సరిగా సాగడం లేదని, జీవనం కష్టతరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా చిన్న హోటల్కు వెళ్లి పూరీ, దోశగాని తింటే రూ.30నుంచి రూ.40 ఉండేది. ప్రస్తుతం రూ.60 నుంచి రూ.80కు పెరిగింది. ఈ ధర దాదాపు అన్నంతో కూడిన భోజనం వస్తుంది. అలా ఒక్కసారిగా రేట్లు పెంచడంతో వినియోగదారులకు ఇబ్బందిగా మారింది. సామాన్య కుటుంబాలకు ఇది భారంగా మారింది. హోటల్ నిర్వాహకులు కట్టెల పొయ్యిని వాడటంతో ఖర్చు అధికంగా అవుతుందని, దీంతో విధిలేని పరిస్థితుల్లో రేట్లు పెంచామని చెబుతున్నప్పటికీ అంతిమభారం కష్టమర్లపైనే పడుతోంది. సామాన్యులు తినలేని పరిస్థితి భారీగా పెరిగిన సిలిండర్ రేట్ హోటల్ యజమానులపైనా ఆర్థిక భారంఇడ్లీ రూ.50 వడ రూ.50 మసాల దోశ రూ.70 రవ్వ దోశ రూ.80 పూరీ రూ.60జిల్లాకేంద్రానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు పని నిమిత్తం బయటకు వెళ్లాడు. అప్పటివరకు ఇంట్లో టిఫిన్ చేయకపోవడంతో అంబేడ్కర్ సెంటర్ సమీపంలోని ఓ హోటల్కు వెళ్లి దోశ ఆర్డర్ ఇచ్చాడు. దానికి హోటల్ నిర్వాహకుడు రూ.70 బిల్లు వేశాడు. దీంతో అవాక్కయిన సదరు ఉపాధ్యాయుడు.. ఒక్క దోశకే ఇంతనా..? అని ప్రశ్నించగా.. ధరలు పెరిగాయని, సిలిండర్ల కొరత ఉందని, అందుకే రేట్లు పెంచాల్సి వచ్చిందని నిర్వాహకుడు జవాబిచ్చాడు. -
పుష్కరాల్లో ఫైరింజన్లు, గ్రామాల్లో మంటలు
టేకుమట్ల(కాళేశ్వరం): పుష్కరాలలో విపత్తులు సంభవించినప్పుడు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెె త్తకుండా ఉండేందుకు ముందస్తు చర్యలో భాగంగా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఆల యం వద్ద, ప్రధాన ఘాట్, సరస్వతీ ఘాట్ వద్ద ఫైరింజన్లను ఏర్పాటు చేశారు. కానీ జిల్లాలోని ప్రతీ మండలంలో రోజుకో అగ్ని ప్రమాదం సంభవిస్తుండడంతో ఆ యా మండలాల ప్ర జలు ఫైరింజన్కు కా ల్ చేస్తే కాళేశ్వరంలో ఉన్నామంటున్నారు. ఇప్పటి వరకు టేకుమట్ల, చి ట్యాల, రేగొండ, మొగుళ్లపల్లి, గణపురం, భూ పాలపల్లి మండలాల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో రై తులు లక్షల్లో నష్టపోయారు. విపత్తులు సంభవించినప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను కల్పించక పోవడంతో ప్రమాదాల తీవ్రత ఎక్కువ ఉంది. -
అర్ధాకలిలో పోలీసులు ?
చిట్యాల(కాళేశ్వరం) : ఈ నెల 21 నుంచి పుష్కరాలలో విధులకు హాజరైన పోలీసులు అర్ధాకలితో తీవ్ర ఆవేదన చెందుతున్నట్లు తెలిసింది. ఐదు రోజులుగా బందోబస్తులో భాగంగా పగలు రాత్రి తేడా లేకుండా గస్తీ కాస్తు ప్రజల సంరక్షణే ధ్యేయంగా పని చే స్తున్న పోలీసులకు అకలి మంటలు తప్పడం లేదు. విధుల్లో పోలీస్ సిబ్బందికి క్యాంటీన్ ఏర్పాటు చేసి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనాన్ని అందిస్తున్నారు. ఉడికి ఉడకని టిఫిన్, భోజనాలు, నీళ్ల చారు, రుచి లేని కూరలతో తినలేక పోలీసులు కడుపు మార్చుకుంటున్నట్లు సమాచారం. దీంతో విధి లేక నగదు చెల్లింపులతో ఇతర హోటళ్లును అశ్రయిస్తు ఆకలి తీర్చుకుంటున్నట్లు తెలిసింది. పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలను కే టాయించిన ప్రజా సంక్షేమం కోసం విధులు నిర్వహిస్తున్న పోలీసులపై ఉన్నతాధికారులు అలసత్వం వహిస్తున్నారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. ఉన్నతాధికారులు స్పందించి విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి నాణ్యమైన భోజనాలతో పాటు చల్లని తాగునీరు అందించాలని కోరుతున్నారు. సేవా సంస్థ మహిళలపై ఆగ్రహం కాళేశ్వరం: పుష్కరాలలో ఐదో రోజు పలువురు సేవా సంస్థ మహిళలపై చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారని సోమవారం నిరసన తెలిపారు. ఈ క్రమంలో సేవాసంస్థ మహిళలు మాట్లాడుతూ గర్భగుడి వద్ద సేవా కార్యక్రమాలు చేస్తున్న తమను చైర్మన్ మోహన్శర్మ అమర్యాదగా మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారని మహిళలు నిరసన తెలిపారు. దీంతో కాసేపు ఆలయంతో పాటు ఈఓ కార్యాలయం వద్ద గందరగోళం నెలకొంది. ఈ విషయమై ట్రస్టుబోర్డు చైర్మన్ మోహన్శర్మను సంప్రదించగా సేవకు వచ్చిన మహిళలు భక్తులకు ఆటంకం కల్పిస్తు గర్భగుడిలో అభిషేకాలు చేస్తుండగా బయటికి రావాలని చెప్పినా ఎంతకీ ఆ మహిళలు వినలేదని, సేవా కార్యక్రమాలు చేయాల్సిన మహిళలు గర్భగుడిలోనే ఉంటున్నారని తెలిపారు. సుమారు 200 మంది వరకు గర్భ గుడిలో ఒకరి తరువాత ఒకరు గంటల తరబడి అభిషేకాలు చేస్తూ, భక్తుల దర్శనాలకు ఆటంకం కల్పించారని తెలిపారు. ఎవరినీ అమర్యాదగా ప్రవర్తించలేదన్నారు. భక్తులకు ఆటంకం కలుగడంతో వారిని బయటికి రావాలని కోపంతో చెప్పానని తెలిపారు. -
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
● జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ రేగొండ: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ అన్నారు. సోమవారం కొత్తపల్లిగోరి మండల కేంద్రంలో జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాధవీలత ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభిస్తుందన్నారు. పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగేలా పాలకవర్గం కృషి చేయాలని కోరారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి రాజు, ప్రాఽథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీ, జిల్లా సెక్టోరియల్ అధికారులు సీఎంఓ రమేష్, ఏఎంఓ విజయ్పాల్రెడ్డి, అంగన్వాడీ సూపర్వైజర్ సంధ్య, సీఆర్పీ సహదేవ్, తదితరులు పాల్గొన్నారు. -
‘ఎల్అండ్టీ’ అగ్నిప్రమాదంపై ఫిర్యాదు
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామశివారు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ గెస్ట్ హౌస్లో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో గెస్ట్ హౌస్లో ఉన్న ఎలక్ట్రిక్ వస్తువులు, ఫర్నిచర్తో పాటు పలువురి సిబ్బంది సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయని ఆ సంస్థ గెస్ట్హౌస్ ఇన్చార్జ్ తపాస్ కుమార్ నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ప్రమాదంలో రూ.1.48కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పవన్కుమార్ తెలిపారు. అగ్ని ప్రమాద స్థలం పరిశీలన మహదేవపూర్ మండలం అంబటిపల్లిలోని మేడిగడ్డ బరాజ్ వద్ద ఎల్అండ్టీ గెస్ట్ హౌస్లో ఆదివారం మధ్యాహ్నం జరిగిన భారీ అగ్నిప్రమాద ఘటన స్థలాన్ని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సోమవారం పరిశీలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు, జరిగిన నష్టం వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నామని తెలిపారు. భవిష్యత్లో ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. -
ఎగ్జిబిషన్ అదుర్స్
కాళేశ్వరం : పుష్కరాల సందర్భంగా సరస్వతి ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ సందర్శకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఆటవస్తులు, ఈ వినోద కార్యక్రమాలు పిల్లలకు ఆనందాన్ని పంచడమే కాకుండా, పుష్కరాల సందడిని మరింత ఆహ్లాదకరంగా మా రుస్తున్నాయి. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ చిన్నారుల భద్రత, సౌకర్యాల దృష్ట్యా తగిన ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు వినోదాన్ని కూడా అందించేందుకు ఈ ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని కలెక్టర్ ప్రకటనలో తెలిపారు. -
‘తీగలవాగు’కు మోక్షం కలిగేనా?
మల్హర్: చిన్ననీటి వనరులను రక్షించాలనే ఉద్దేశంతో 1975లో మండలంలోని ఉమ్మడి పెదతూండ్ల గ్రామ పంచాయతీ సమీపంలోని తీగలవాగుకు అడ్డంగా ఆనకట్టను రూ.13 లక్షలతో నిర్మించారు. కానీ 1978లో ఆనకట్టకు గండిపడడంతో ప్రాజెక్టులో నీరు నిలువలేదు. 1986లో కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోయింది. అప్పటి నుంచి ఈ ప్రాజెక్టును పట్టించుకున్న పాపానపోలేదు. సుమారు 20 ఏళ్ల అనంతరం 2002లో రూ.1.40 కోట్లతో ప్రతిపాదనలు పంపినప్పటికీ అప్పటి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వ చ్చిన వెంటనే జలయజ్ఞం కార్యక్రమం చేపట్టడంతో ఈ ప్రాజెక్టుకు మోక్షం లభించింది. ఎన్నికల ప్ర చారంలో భాగంగా దివగంత జననేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన బస్సుయాత్ర సందర్భంగా ఈ ప్రాజెక్టు గురించి స్థానిక నాయకులు ప్రస్తావన తీసుకొచ్చారు. తదనంతరం అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి శ్రీధర్బాబు చొరవతో 2006లో ప్రాజెక్టు అధునీకరణకు రూ.3.74కోట్లతో ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు 456 జీఓను జారీ చేశారు. దీంతో టెండర్ ప్రక్రియ ముగిసిన తర్వాత పనులు ప్రారంభించారు. కాంట్రాక్టర్ పనుల నిర్వహణలో తీవ్ర అలసత్వం ప్రదర్శించడంతో రెండు నెలల కాలంలోనే కురిసిన భారీ వర్షానికి మరోసారి ఆనకట్టకు భారీ గండి పడింది. ప్రాజెక్టు పనులు పూర్తి కాకుండానే గండి పడటంతో తమ తప్పును సమర్థించుకునేందుకు అధికారులు తప్పంతా కాంట్రాక్టర్పై నెట్టా రు. కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ప్రాజెక్టుల పని తీరు పర్యవేక్షించాల్సిన బాధ్యత ఆ శాఖ అధి కా రులపై ఉందనే విషయాన్ని మరిచిపోవడాన్ని రైతులు తీవ్రంగా విమర్శించారు. చిన్నకాళేశ్వరం ప్రాజెక్టుకు తీగల వాగును అనుసంధానం చేస్తే మరమ్మతు పనులు జరిగే అవకాశం ఉంటుందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఈప్రాజెక్టు పూర్తయి తే దీనికింద 1029 ఎకరాల భూమి సాగులో వస్తుంది. ముంపు బాధితులకు పరిహారం ప్రాజెక్టుకు గండి పడటంతో ప్రాజెక్టు కింద భూములు నష్టపోయిన ముంపు రైతులకు పరిహారం అందించారు. ప్రాజెక్టు కింద సమూరు 71మంది రై తు ల వద్ద నుంచి అధికారులు 84 ఎకరాల పై చిలుకు భూములను సేకరించి, పరిహారం అందించారు. ఏళ్ల నుంచి నిరుపయోగంగా ప్రాజెక్టు వైఎస్సార్ ఆశయానికి తూట్లు ప్రాజెక్టు ద్వారా పొలాలకు నీళ్లు వస్తే మాకు బాధలు తొలగిపోతాయి. సాగు చే స్తే వాన వస్తదో రాదో అని ప్రతి సంవత్సరం భయపడుతున్నాం. తీగల ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే మాకు కావల్సినన్ని నీళ్లుంటాయి. – మోహన్నాయక్, రైతు, అడ్వాలపల్లిఏళ్లుగా తీగులవాగు ప్రా జెక్టు నిరుపయోగం ఉంది. ప్రాజెక్టు పనులు పూర్తియి అందుబాటులోకి వ స్తే నీళ్లు మంచిగా వస్తాయి. రెండు, మూడు పంట లైన పండిస్తాం. కష్టపడటానికి సిద్ధంగా ఉంటాం. – కిషన్నాయక్, రైతు, అడ్వాలపల్లి, మల్హర్ -
చెట్టును ఢీకొన్న కారు
● ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు మల్హర్(కాటారం): ప్రమాదవశాత్తు కారు చెట్టును ఢీకొట్టడంతో ఒకరు మృతిచెందగా ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాటారం నుంచి ధర్మసాగర్ వైపు కారు వెళ్తుంది. ఈ క్రమంలో గుమ్మళ్లపల్లి శివారులో అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లి చెట్టును బలంగా ఢీకొట్టింది, ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న శ్రావణ్(22) మృతిచెందగా.. శశివరణ్, రాజుకుమార్కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కారు ఢీకొని వృద్ధుడు.. గణపురం: మండలంలోని లక్ష్మారెడ్డిపల్లెలో జరిగిన రోడ్డు ప్రమాదంలో లక్ష్మారెడ్డిపల్లె గ్రామానికి చెందిన బొక్కల ఐలయ్య (75) అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. లక్ష్మారెడ్డి పల్లె గ్రామానికి చెందిన బొక్కల ఐలయ్య వ్యక్తిగత పనుల నిమిత్తం సోమవారం తెల్లవారుజామున కాలినడకన జాతీయ రహదారిపైకి వెళ్లాడు. పరకాల నుంచి భూపాలపల్లి వైపు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి ఐలయ్యను ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. మేడారం దర్శనానికి వెళ్లి వస్తూ.. ఎస్ఎస్తాడ్వాయి : మేడారం సమ్మక్క– సారలమ్మ దర్శనానికి వెళొస్తూ కారు చెట్టును ఢీకొట్టిన ఘటనలో కారులోని వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం అర్థరాత్రి చోటు చేసుకుంది. నార్లాపూర్ ఎస్సై కమలాకర్ తెలిపిన వివరాల ప్రకారం. వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని గురిజాలకు గ్రామానికి చెందిన మచ్చిక సాయికుమార్ ఈ నెల 24న సమ్మక్క– సారలమ్మల దర్శనానికి మేడారానికి వచ్చారు. మొక్కుల అనంతరం తిరుగు ప్రయాణంలో మేడారం– తాడ్వాయి మార్గ మధ్యలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టింది. ఈఘటనలో మచ్చిక సాయికుమార్(25)కు తీవ్ర గాయాలు కావడంతో అస్పత్రికి తరలిస్తున్న క్రమంలో పరిస్ధితి విషమించి మృతి చెందాడు. -
ఆటోలకు భలే గిరాకీ.. ఉపాధి పొందుతున్న డ్రైవర్లు
టేకుమట్ల(కాళేశ్వరం): కాళేశ్వరం అంత్య పుష్కరాలకు వస్తున్న భక్తులతో ఆటోలకు భలే గిరాకీ లభిస్తుంది. బస్టాండ్ నుంచి సరస్వతీ పుష్కరఘాట్ వరకు ఒక్కో వ్యక్తి నుంచి రూ.20–25 చార్జీలు తీసుకుంటున్నారు. మహాలక్ష్మీ పథకంతో ఆటోలకు గిరాకీ లేక ఇబ్బందులు ఎదుర్కొన్న డ్రైవర్లకు అంత్య పుష్కరాలు ఆసరగా నిలిచాయి. ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు కొనసాగే పుష్కరాల్లో ఆటోడ్రైవర్లు ఆనందంగా ఉంటున్నారు. అంత్య పుష్కరాల సందర్భంగా పుష్కరఘాట్కు వస్తున్న భక్తులతో ఆటోలను నడుపుకుంటూ డ బ్బులు సంపాదించుకుంటున్నాం. ఇన్ని రోజులు గిరాకీలు లేక ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. బస్టాండ్ నుంచి సరస్వతీ ఘా ట్కు ఆటోలు నడపుతూ బిజీ బి జీగా ఉన్నాం. – రాజు ఆటో డ్రైవర్, కాళేశ్వరం -
సన్మానం
కాళేశ్వరం : మహదేవపూర్ మండలం మద్దులపల్లిలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను సర్పంచ్ ఎల్పుల సరిత ఆధ్వర్యంలో సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఘ నంగా సన్మానించారు. సర్పంచ్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో కృషి చేసి మంచి మార్కులు సాధించి గ్రామానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. కూలీలకు మజ్జిగ పంపిణీ రేగొండ : కొత్తపల్లిగోరి మండలంలోని వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలకు సర్పంచ్ కాడవేన సరిత యుగంధర్ సోమవారం మజ్జిగ పంపిణీ చేశారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో కూలీలు వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు మజ్జిగ పంపిణీ చేసినట్లు ఆమె తెలిపారు. పరిహారం చెల్లించాలి మహాముత్తారం : చిన్నకాళేశ్వరం కాల్వ ని ర్మాణం పనుల్లో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం నూతన మార్కెట్ విలువను అ మలు చేసి రైతులకు పరిహారం అందించాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం భూ ముల మార్కెట్ విలువను పెంచేందుకు తీసుకున్న నిర్ణయం ఈనెల 28న నూతన మార్కెట్ విలువ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో గతంలో సర్వే చేసిన భూములకు నూతన మార్కెట్ విలువను అమలుచేసి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళా వారోత్సవాలు మల్హర్(కాటారం): మండలంలోని కాటారం ఎర్రగుంటపల్లి అంగన్వాడీ కేంద్రంలో సోమవారం మహిళా వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. సీడీపీఓ రాధిక మాట్లాడుతూ స్థాని కంగా అందుబాటులో ఉండే తక్కువ ఖర్చుతో కూడిన పోషకాహార పదార్థాలను ఎలా విని యోగించుకోవాలో మహిళలకు అవగాహన కల్పించారు. అనంతరం ఆహార వైవిధ్యం, ఆ రోగ్యకరమైన ఆహార అలవాట్లపై అవగాహన కల్పించి, ప్రతిజ్ఞ చేయించారు. సూపర్వైజర్ శివరాణి, పాల్గొన్నారు. ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల ధర్నా భూపాలపల్లి అర్బన్ : భూపాలపల్లి ఆర్టీసీ డి పో ఎదుట సోమవారం ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. తాము బతికుండగా నే రావాల్సిన బకాయిలు, పెన్షన్ అందించా లని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రిటైర్డ్ కార్మికులు సమ్మిరెడ్డి, సదయ్య మాట్లాడుతూ పీఆర్సీ–2017 బకా యిలు, గ్రాట్యుటీ, లీవ్ ఎన్క్యాష్మెంట్ మొత్తాలను వెంటనే చెల్లించాలని కోరారు. తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని డీఎంకు వినతిపత్రం అందజేశారు. ధర్నాలో పలువురు రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం కృషి భూపాలపల్లి రూరల్: మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం మదర్ థెరిసా పట్టణ సమైక్య ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా కొమురయ్య హాజరై మాట్లాడుతూ స్వయం సహాయక సంఘం సభ్యులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అన్నారు. మున్సిపల్ కమిషనర్ ఉదయ్కుమార్, మున్సిపల్ వైస్చైర్మన్ అంబాల శ్రీనివాస్, మెప్మా డీఎంసీ రాజేశ్వరి, సీఓ నిర్మల ఆర్పీలు, తదితరులు పాల్గొన్నారు. -
ఇప్పపువ్వు లడ్డూ @ రూ.100
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ఐటీడీఏ ఎదుట ఇప్పపువ్వు లడ్డూలు విక్రయిస్తున్నారు. కన్నాయిగూడెం మండలం రాజన్నపేటకు చెందిన గిరిజన ఆదివాసీ మహిళలు ఇప్పపువ్వు లడ్డూలను తయారు చేసి ఒక బాక్స్లో పెట్టి రూ.100 చొప్పున ఐటీడీఏకు వచ్చి వెళ్లే వారికి విక్రయిస్తున్నారు. సమ్మక్క–సారలమ్మ మహిళా సంఘం సభ్యులు ఇప్ప పువ్వును సేకరించి వాటితో స్వచ్ఛమైన బెల్లంతో లడ్డూలను తయారు చేస్తున్నారు. ఈ లడ్డూలతో అనేక పోషకాలు అందుతాయని వివరిస్తూ విక్రయిస్తున్నారు. దీంతో పలువురు లడ్డూలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. 5 ఇసుక ట్రాక్టర్ల పట్టివేత మల్హర్: అనుమతులు లేకుండా తాడిచర్ల మానేరు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను సోమవారం కొయ్యూరు పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. తాడిచర్ల మానేరు నుంచి ఇసుకను ట్రాక్టర్ల ద్వారా లోడ్ చేసుకొని తరలిస్తుండగా తాడిచర్ల సెంటర్లో పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన ట్రాక్టర్లను సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు. అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై–2 రజన్కుమార్, హెడ్ కానిస్టేబుల్ మల్లయ్య, సిబ్బంది పాల్గొన్నారు. -
భూముల విలువ పెంపు
నాలుగేళ్ల తర్వాత పెంచుతున్న ప్రభుత్వం ● కమర్షియల్, నాన్ కమర్షియల్ ప్రాంతాల వారీగా పెంపు ● ప్రాంతాన్ని బట్టి 50 శాతం నుంచి 100 శాతం పెరిగే అవకాశం ● త్వరలో కొత్త చార్జీలు అమలయ్యే అవకాశంభూపాలపల్లి అర్బన్: జిల్లాలో భూముల విలువ భారీగా పెరగనుంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో భూములకు ఉన్న ధర, ప్రభుత్వ విలువకు చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని భూముల విలువ పెంచాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. అందులో భాగంగా జిల్లాలో కమర్షియల్, నాన్ కమర్షియల్ ప్రాంతాల వారీగా ఉన్న భూముల విలువలను పరిగణనలోకి తీసుకుని ఆయాచోట్ల ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఎంత ధరలు ఉన్నాయి, ఎంత పెంచితే బాగుంటుందనే దానిపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ కసరత్తు చేస్తోంది. గతంలో 30 నుంచి 50 శాతం వరకు.. ప్రభుత్వం 2022 జనవరిలో భూముల విలువ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రాంతాన్ని బట్టి గతంలో 30శాతం నుంచి 50శాతం వరకు పెంచింది. అప్పట్లో పెంచిన భూ విలువలను అదే ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి తెచ్చింది. ప్రస్తుతం భూ విలువ పెంపుపై పది రోజులుగా కసరత్తు చేస్తోంది. బహిరంగ మార్కెట్లో భూముల విలువ అధికంగా ఉన్న ప్రాంతాల్లో రేట్లు పెంచేందుకు సిద్ధమైంది. మరో రెండు రోజుల్లో ఫైనల్ ప్రభుత్వం భూముల విలువను మరో రెండు రోజుల్లో ఫైనల్ చేసి ప్రకటించే అవకాశం ఉంది. దానికి సంబంధించిన కసరత్తు చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భూముల విలువ పెంపునకు సంబంధించిన ప్రక్రియ దాదాపు పూర్తయింది. దాన్ని రాష్ట్ర స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకు పంపారు. వారు పంపినా అమల్లోకి తెచ్చే అవకాశం ఉంది. ధరల ఆధారంగా భూముల విలువను పెంచుతూ నిర్ణయం తీసుకోనున్నారు. మొత్తానికి పెంచిన ధరలు రెండు మూడు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఈనెల 28 లేదా జూన్ 1వ తేదీ నుంచి పెంచే అవకాశాలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో భారీగా పెరిగే అవకాశాలు జిల్లా కేంద్రంలోని మంజూర్నగర్, పుల్లూరిరామయ్యపల్లి, కుందురుపల్లి తదితర ప్రాంతాల్లో కమర్షియల్, నాన్ కమర్షియల్కు సంబంధించిన భూముల విలువలు ప్రస్తుతం గజం రూ.2100 ఉంటే, దానిని రూ.3500కు పెంచే అవకాశం ఉంది. కాటారం, గణపురం మండలాల్లో సైతం భూముల ధరలు అధికంగా ఉన్నాయి. అక్కడ సైతం జిల్లా కేంద్రంతో సమానంగా భూముల ధరలు పెరుగుతున్నట్లు తెలిసింది. 50శాతం నుంచి 100శాతం వరకు.. ప్రభుత్వం ప్రాంతాన్ని బట్టి ప్రస్తుతం 50 శాతం నుంచి 100 శాతం పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లాలో 50 శాతంలోపే పెంచే అవకాశాలు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. అధికంగా భూముల విలువ పెంచినా రిజిస్ట్రేషన్లు తగ్గి ప్రభుత్వానికి ఆదాయం తగ్గే అవకాశం ఉంటుంది. తద్వారా ప్రజల కొనుగోళ్ల సామర్థ్యం మందగిస్తుందని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగా జిల్లాకేంద్రంతో మండలకేంద్రాల్లో భూముల విలువలు బహిరంగ మార్కెట్లో ఎంత మేరకు పెరిగాయన్న వివరాలను అధికారులు సేకరించి ప్రభుత్వానికి పంపించినట్లు తెలిసింది. జిల్లాకేంద్రంతో పలు మండలాల్లో ప్రధాన ప్రాంతాల్లో మాత్రం 100 శాతం వరకు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
అంగన్వాడీ కేంద్రాల్లో సమతుల్యమైన ఆహారం
● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి రూరల్: ఐదు సంవత్సరాలలోపు చిన్నపిల్లలకు సమతుల్యమైన, పోషక విలువలు కలిగిన ఆహారం అందించి బాల్యాన్ని బలోపేతం చేయడం అంగన్వాడీ కేంద్రాల లక్ష్యమని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా వారోత్సవాలు నిర్వహించారు. ‘సే నో టు జంక్ ఫుడ్’ నినాదంతో ఏర్పాటుచేసిన ప్రత్యేక ఫుడ్స్టాల్ను కలెక్టర్ సందర్శించారు. వంటకాల తయారీ విధానం, పోషక ప్రయోజనాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలకు నాణ్యమైన, సమతుల్య ఆహారం అందించడం ద్వారా వారి శారీరక, మానసిక వికాసం సాధ్యమవుతుందన్నారు. మార్కెట్లో లభించే జంక్ ఫుడ్ను చిన్నపిల్లలకు ఇవ్వకుండా, స్థానికంగా అందుబాటులో ఉన్న తాజా కూరగాయలు, ఆకుకూరలు, ధాన్యాలు వంటి పోషకాహారాన్ని అందించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి మల్లీశ్వరి, అంగన్వాడీ సూపర్వైజర్లు, టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు. గిరిజనులకు ప్రభుత్వ పథకాలు అందించాలి జిల్లాలోని నాలుగు బ్లాక్లలో 31 ఆది సేవాకేంద్రాలు ఉన్న గ్రామాల్లో అర్హులందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులకు సూచించారు. గిరిజన కుటుంబంలో ప్రతీ ఒక్కరికి సికిల్ సెల్ ప్రాబ్లం లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి నాగసాగర్, జిల్లా కోఆర్డినేటర్ శ్రీహరి, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి భూపాలపల్లి: ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 40 దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలకు సమయపాలనతో కూడిన సేవలను అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టంచేశారు. ప్రజావాణికి వచ్చిన ప్రతీ దరఖాస్తును అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించాలని, ఇందుకు సంబంధించి ఆయా శాఖలకు వెంటనే ఎండార్స్మెంట్ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా దరఖాస్తును తప్పనిసరిగా ప్రజావాణి పోర్టల్లో నమోదు చేయాలని చెప్పారు. దరఖాస్తుదారుడికి తప్పకుండా రశీదు అందజేయాలన్నారు. దీని ద్వారా సమస్యల పరిష్కారంలో పారదర్శకత పెరుగుతుందని చెప్పారు. దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించి ఆయా శాఖల అధికారులు తీసుకున్న చర్యల వివరాలను ఎప్పటికప్పుడు పోర్టల్లో అప్డేట్ చేయాలని ఆదేశించారు. బాధితులకు న్యాయం చేయడంలో నిర్లక్ష్యం వహించినా, కాలయాపన చేసినా అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా రెవెన్యూ అధికారి వసంత కుమారి, ఆర్డీఓ హరికృష్ణ, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
జేసీబీకి పుష్కరస్నానం
మహాముత్తారం : సరస్వ తి అంత్యపుష్కరాలు సో మవారం ఐదో రోజు భ క్తులు పుష్కరస్నానం ఆచరించారు. కుటుంబ స భ్యులతో వచ్చిన ఓ బా లుడు తమవెంట తీసుకొచ్చిన ఆటవస్తువు (జేసీబీ)కి సైతం పుష్కరస్నానం చేయించాడు. శివయ్యకు భక్తుల మొక్కులు చిట్యాల(కాళేశ్వరం): కాళేశ్వరం ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన శివయ్య విగ్రహానికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయానికి చేరుకుని ఆలయంలోని శివలింగాన్ని దర్శించుకున్న అనంతరం ఆలయం ముందు ఉన్న శివయ్య విగ్రహానికి పూజలు చేస్తున్నారు. కాళేశ్వర గాంధీ మహాముత్తారం: కాళేశ్వ రం పుష్కరాల్లో సరస్వతి పుష్కరఘట్ వద్ద ఒకరు గాంధీ వేషధారణతో మెట్లపై భక్తులకు దర్శనమిచ్చాడు. భక్తులు గాంధీతో సెల్ఫీలు దిగుతూ డ బ్బులు ఇవ్వడానికి పోటీపడ్డారు. భద్రాచలానికి చెందిన మధు జాతరలు, ఉత్సవాలు జరిగే ప్రాంతాల్లో గాంధీ వేషధారణ వృత్తిగా మార్చుకొని జీవనం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. కొంతమంది చిల్లర లేవని వెళ్లిపోవడాన్ని గమనించి క్యూఆర్కోడ్ను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. చిలుక జోష్యం మహాముత్తారం : సరస్వతి అంత్య పుష్కరా ల్లో భాగంగా పరిసర ప్రాంతాలతో పాటు పట్టణాల నుంచి వ చ్చిన వారు వివిధ రకాల వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. రాజమండ్రి నుంచి వచ్చిన చిలుక పంచాంగం జ్యోతిష్యుడు చిలుక పంచాంగం చెబుతామంటూ పుష్కర ఘాట్ వద్ద కూర్చొని జాతకం చూస్తామంటూ భక్తులను ఆకట్టుకుంటున్నాడు. కుర్రో.. కుర్రు టేకుమట్ల(కాళేశ్వరం): కాళేశ్వరంలో కొనసాగుతున్న అంత్య పుష్కరాల సందర్భంగా సరస్వతీ ఘాట్ వద్ద ఓ కోయ ప్రత్యేక వేషధారణలో కుర్రో, కుర్రు కొండ దేవర అంటూ భిక్షాటన చేశాడు. నడిరోడ్డుపై నిల్చుని ఎండలో భక్తులకు చేయి చాపడంతో భక్తులు సైతం అతనికి కానుకలు అందించారు.


