breaking news
Jayashankar
-
దరఖాస్తుల స్వీకరణ గడువు పెంపు
భూపాలపల్లి రూరల్: జిల్లాలోని అర్హత కలిగిన దివ్యాంగులకు ఉపకరణాల కోసం దరఖాస్తు గడువును ఈనెల 5వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా సంక్షేమ అధికారి శ్రీమతి మల్లేశ్వరి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాకు రెట్రో ఫిట్మెంట్ స్కూటీలు –25, బ్యాటరీ వీల్ చైర్లు 8, మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రై సైకిళ్లు 10, బ్యాటరీ మినీ ట్రేడింగ్ ఆటో 1, హైబ్రిడ్ వీల్చైర్లు 3, ల్యాప్ టాప్ 1, చేతికర్రలు 13, వీల్ చైర్లు 3, చెవిటి యంత్రం 1, ట్రై సైకిళ్లు 3, స్మార్ట్ కేన్స్ 6 కేటాయించారన్నారు. సందేహాల నివృత్తి కోసం హెల్ప్ లైన్నంబర్ 155326 లేదా 96523 11804లో సంప్రదించాలని సూచించారు. గీత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలి భూపాలపల్లి రూరల్: ప్రభుత్వం అందజేస్తున్న సేఫ్టీ మోకులను గీత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీపతి ప్రభాకర్ గౌడ్ అన్నారు. భూపాలపల్లి మండలం కొత్తపల్లి (ఎస్ఎం) శివారు సోలిపేట తాటివనంలో సోమవారం బీసీ సంక్షేమ శాఖ, ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో సేఫ్టీ మోకుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్గౌడ్ వివిధ గ్రామాలకు చెందిన 150మంది గీత కార్మికులకు సేఫ్టీమోకులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రమాదాల నివారణకు సేఫ్టీ మోకులు ఉపయోగకరంగా ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తడుక సుధాకర్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ అధికారి క్రాంతి కిరణ్, ఎకై ్సజ్ శాఖ ఎస్సై రబ్బాని, ఎస్ఎం కొత్తపల్లి గౌడ సంఘం సొసైటీ అధ్యక్షుడు ఆరెల్లి రఘుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. చౌకబారు విమర్శలు మానుకోవాలి మల్హర్: మంత్రి శ్రీధర్బాబుపై పుట్ట మధు చేస్తున్న చౌకబారు విమర్శలను మానుకోవాలని ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్డీ జిల్లా అధ్యక్షుడు అయిత ప్రకాశ్రెడ్డి అన్నారు. సోమవారం తాడిచర్లలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీధర్బాబు విద్యావంతుడైన, విజన్ ఉన్న నాయకుడని పేర్కొన్నారు. నియోజకవర్గానికి మంత్రి చేస్తున్న అభివృద్ధిని తట్టుకోలేకనే మధు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. శ్రీధర్బాబుతోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య, కాంగ్రెస్ పార్డీ మండల అధ్యక్షుడు బడితెల రాజయ్య, మాజీ ఎంపీపీ చింతలపల్లి మల్హల్రావు, కాంగ్రెస్ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు దండు రమేశ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ మల్క సూర్యప్రకాశ్రావు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
భూపాలపల్లి: అనేక రకాల సమస్యలతో పోలీసులను ఆశ్రయించే బాధితులకు సత్వర న్యాయంచేసే విధంగా చర్యలు తీసుకోవాలని.. నిర్లక్ష్యం వహించవద్దని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. సోమవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 26మంది నుంచి ఎస్పీ తన కార్యాలయంలో ఫిర్యాదులు స్వీకరించారు. నడవడానికి ఇబ్బంది పడుతున్న దివ్యాంగుడి దగ్గరకు స్వయంగా వెళ్లి సమస్య అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, ఫిర్యాదుల పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజాదివస్లో వచ్చే ఫిర్యాదులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడంతో పాటు పెండింగ్లో లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఎస్పీ సూచించారు. సీజ్ చేసిన వాహనాలను తీసుకెళ్లండి.. జిల్లాలోని వివిధ కేసుల్లో పోలీస్స్టేషన్లలో సీజింగ్లో ఉన్న 182 వాహనాలను, వెహికల్లకు సంబంధించి సరైన పత్రాలు, ఆధార్ కార్డు చూపించి వాహన యజమానులు తీసుకెళ్లాలని ఎస్పీ కిరణ్ ఖరే సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాహన రిజిస్ట్రేషన్ పత్రాలను సంబంధిత పోలీస్స్టేషన్లో అందజేసి వాహనాలను తీసుకెళ్లాలని, వాహనాల జాబితాను జిల్లా పోలీస్ వెబ్సైట్, ట్విట్టర్, ఎక్స్, ఫేస్బుక్లో పోస్ట్ చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఆరు నెలల్లోపు తీసుకెళ్లని పక్షంలో వేలం నిర్వహిస్తామన్నారు.ఎస్పీ కిరణ్ ఖరే సదానందం సేవలు స్ఫూర్తిదాయకం.. పోలీసుశాఖలో 42 ఏళ్లు సేవలు అందించి ఉద్యోగ విరమణ పొందిన రిజర్వ్ ఎస్సై సదానందం సేవలు స్ఫూర్తిదాయకమని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఉద్యోగ విరమణ పొందిన సదానందంకు శాలువా కప్పి పూలమాల వేసి జ్ఞాపిక అందజేసి ఎస్పీ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరేష్కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు నగేష్, రత్నం, శ్రీకాంత్ పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణకు కృషి
● ఏరియా సింగరేణి జీఎం రాజేశ్వర్రెడ్డి భూపాలపల్లి అర్బన్: ప్లాస్టిక్ నియంత్రించి పర్యావరణ పరిరక్షణకు ప్రతీఒక్కరు కృషిచేయాలని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి కోరారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఏరియాలోని మైన్స్ రెస్క్యూ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని జీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. ప్లాస్టిక్ కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా ఒక సమస్యగా మారిందన్నారు. మహాసముద్రాలు, వన్యప్రాణులు, జీవ జలాలతో పాటు మానవ ఆరోగ్యానికి ప్రమాదంగా తయారైనట్లు తెలిపారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పునర్వినియోగ ప్రత్యామ్నాయాలను స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడం అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఽధికారులు కవీంద్ర, జోతి, సురేఖ, మారుతి, పోషమల్లు, ఐఎన్టీయూసీ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు మధుకర్రెడ్డి, రెస్క్యూ ఇన్చార్జ్ పూర్ణచందర్, ఉద్యోగులు పాల్గొన్నారు. క్రషర్, బంకర్ ప్రారంభం గణపురం: సింగరేణిలో అధునాతన యంత్రాలను వినియోగించుకొని అధిక ఉత్పత్తి సాధించవచ్చని భూపాలపల్లి జీఎం రాజేశ్వరెడ్డి అన్నారు. గణపురం మండలం పరుశరాంపల్లి ఓసీ–3 ప్రాజెక్టులో సోమవారం క్రషర్, బంకర్లకు ఆయన ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటుజీఎం కవిందర్, ప్రాజెక్టు అధికారి భిక్షమయ్య, మేనేజర్లు శ్రీనివాస్, మధుసూదన్ పాల్గొన్నారు. -
వైద్యచికిత్సతోపాటు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్న ‘వంగర’ వైద్యురాలు
లెక్కలన్నీ తేల్చుతారు.. ప్రతీ సంస్థకు సీఏ తప్పనిసరి. ఏడాదిలో చేసిన జమ, ఖర్చులకు సంబంధించిన ప్రతీ పైసా లెక్క తేల్చుతారు. నేడు చార్టెర్డ్ అకౌంటెంట్ డే సందర్భంగా కథనం.– 8లోuమంగళవారం శ్రీ 1 శ్రీ జూలై శ్రీ 2025హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర పీహెచ్సీ నిత్యం గర్భిణులు, మహిళలు, రోగులతో నిండిపోయి ఉంటుంది. ఇక్కడ వైద్యం కోసం వారంతా గంటల తరబడి ఎదురుచూస్తుంటారు. అందుకు కారణం అక్కడి వైద్యురాలు రుబీనా. ఆమె కేవలం చికిత్సలు అందించడమే కాకుండా జబ్బు రావడానికి కారణాలు. ఎలా చేస్తే ఆరోగ్యంగా ఉండగలం అని రోగులకు విడమర్చి చెబుతున్నారు. పేదల కష్టాలను దగ్గర్నుంచి చూశారు. వారి జబ్బులకు కారణం తెలుసుకున్నారు. వారి ఆర్థిక వెనుకబాటుకు అనారోగ్యమే కారణమని గ్రహించారు. ఆరోగ్యం అందరి ప్రాథమిక హక్కు అని చెప్పాలనుకున్నారు. అందుకే ఆమె డాక్టరయ్యారు. అనా రోగ్యంతో వచ్చిన రోగికి వైద్యమందించడమే కాదు.. వారికి అవగాహన కల్పిస్తే మరోసారి అనారోగ్యం బారిన పడరని అవగాహన కల్పించడం మొదలు పెట్టారు.ఇందుకోసం సొంతఖర్చులతో లైబ్రరీ ఏర్పాటుచేశారు. ఫలితంగా ఇప్పుడా ప్రభుత్వ వైద్యురాలి వద్దకు ప్రజలు క్యూ కడుతున్నారు. నేడు (మంగళవారం) నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా పేదల ఆరోగ్య నేస్తం వంగర పీహెచ్సీ వైద్యురాలు సయ్యద్ రుబీనాపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.వంగర పీహెచ్సీలో వైద్యఆరోగ్య పుస్తకాలు చదువుతున్న మహిళలు, లైబ్రరీలోని పుస్తకాలునవజాత శిశువుతో డాక్టర్ రుబీనా (ఫైల్)ఆరోగ్య విద్య.. పుస్తక పఠనం వంగర పీహెచ్సీ వైద్యురాలిగా చేరిన తర్వాత ఆస్పత్రికి వచ్చే రోగులకు, గర్భిణులకు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధకనబర్చడం మొదలెట్టారు. సమీప గ్రామాల్లో క్యాంపులు పెట్టి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. టీబీ, షుగర్, బీపీ వంటి వ్యాధులపై వందల సంఖ్యలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్ర భుత్వ పాఠశాలల్లో డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య కార్యకర్తల ద్వారా గర్భం దాల్చిన మహిళల్ని కలిసి ప్రైవేట్కు వెళ్లకుండా పీహెచ్సీలో పరీక్షలు చేయించుకునేలా, ప్రసవం చేయించుకునేలా ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కల్పిస్తున్నారు. ఫలితంగా వంగర పీహెచ్సీకి రోజూ దాదాపు 70 నుంచి 100 మంది ఓపీ చూపించుకుంటున్నారు. డాక్టర్ కోసం వేచి ఉన్న సమయంలో పేషెంట్లతో పుస్తకాలు చదివిస్తున్నారు. ఇందుకోసం లై బ్రరీ ఏర్పాటుచేశారు. ఆమె సొంత ఖర్చులతో హెల్త్ గైడ్, హెల్త్ కేర్, ఆరోగ్య వ్యాయామ విద్య, ఆరోగ్య నిధి, ఆ రోగ్య విజ్ఞాన శాస్త్రం, యోగా, వంటిల్లే వైద్యశాల వంటి పుస్తకాలను కొనుగోలు చేసి రోగులతో చదివిస్తున్నారు. ● పలు గ్రామాల్లో సదస్సుల నిర్వహణ.. ● ఆరోగ్యకేంద్రంలో సొంతంగా ఆరోగ్య పుస్తకాలతో లైబ్రరీ ఏర్పాటు ● ఆస్పత్రికి వచ్చే మహిళలు, గర్భిణులతో పుస్తక పఠనం.. నేడు జాతీయ వైద్యుల దినోత్సవంఅనారోగ్యంతో వచ్చినవారికి మందులిచ్చి పంపించడం అందరూ చేస్తుంటారు. కానీ అనారోగ్యానికి కారణాలు. మరోసారి అలా చేయకుండా ఉండేందుకు జాగ్రత్తలు చెబితే ఆ వైద్యుల్ని ఎవరైనా మరిచిపోతారా? అచ్చం రుబీనా అదే పద్ధతి ఫాలో అవుతున్నారు. వచ్చిన వారికి తన పరిధిలో పూర్తి సాయం చేస్తున్నారు. ఒక ఇంట్లోని మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ ఇళ్లంతా బాగుంటుందని ఆమె నమ్ముతారు. అందుకని ముఖ్యంగా మహిళా సంబంధిత అనారోగ్య సమస్యలపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. వారిని ఎడ్యుకేట్ చేస్తూ మందులిస్తున్నారు. కేన్సర్పై అవగాహన సదస్సులో మాట్లాడుతున్న డాక్టర్ రుబీనావాతావరణం జిల్లాలో వాతావరణ మార్పుల కారణంగా తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. పలుచోట్ల సాధారణ పరిస్థితి ఉంటుంది.ప్రజల ఆరోగ్యమే నా కర్తవ్యం ఉద్యోగాన్ని బాధ్యతగా భావిస్తున్నా. తెలంగాణ ఫార్మేషన్ డే రోజు టీబీ మీద, డ్రగ్స్ మీద పరేడ్ గ్రౌండ్లో మేం చేసిన స్కిట్కు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అయితే వ్యాధులపై అవగాహన సాధారణంగా చెప్పకుండా స్కిట్ల ద్వారా, పాటల ద్వారా అవగాహన కల్పిస్తే ప్రజల్లోకి వెళ్తుందని నమ్ముతున్నా. ఇప్పుడు నా పీహెచ్సీ పరిధిలో 27,000 పాపులేషన్ ఉంది. వారు ఆరోగ్యంగా ఉండడమే నా కర్తవ్యం. – రుబీనా, పీహెచ్సీ వైద్యురాలు, వంగర రైల్వే టికెట్ ధరలు పెంపు నేటి నుంచి స్వల్పంగా రైల్వే టికెట్ చార్జీలు పెంచుతున్నట్లు రైల్వే అధికారులు సోమవారం రాత్రి తెలిపారు. – 8లోu– సాక్షి, వరంగల్ డెస్క్అవగాహనే కొండంత అండ.. -
స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగస్వాములు కావాలి
భూపాలపల్లి: స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ (ఎస్ఎస్జీ)లో ప్రతీ ఒక్కరు భాగస్వాములై గ్రామాల స్వచ్ఛతలో ముందుండాలని కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2025 కార్యక్రమ కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కలిసి ‘ఒక అడుగు స్వచ్ఛత వైపు’ అనే నినాదంతో గ్రామీణ ప్రాంతాల్లో శుభ్రత, పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. గ్రామీణ ప్రజలు యాప్ డౌన్లోడ్ చేసుకొని గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాల పరిస్థితులపై అభిప్రాయాలను తెలియజేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, డీఆర్డీఓ బాలకృష్ణ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. క్యాబిన్ ఏర్పాటు చేయాలి.. చెల్పూరు మిల్లెట్స్ విక్రయ నిర్వహణకు ఐడీఓసీ కార్యాలయంలో క్యాబిన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ డీఆర్డీఓకు సూచించారు. మిల్లెట్ యూనిట్ నిర్వహిస్తున్న మహిళలతో కలెక్టర్ ఐడీఓసీ కార్యాలయంలో ముఖాముఖి అయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నేటి ప్రజల దైనందిన జీవనశైలిలో మిల్లెట్స్ వినియోగం ఆరోగ్యపరంగా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ బాలకృష్ణ, చెల్పూరు మిల్లెట్ యూనిట్ నిర్వాహకులు పాల్గొన్నారు. శేష జీవితం ప్రశాంతంగా గడపాలి.. 37 సంవత్సరాల పాటు రెవెన్యూ శాఖలో ఖాజా మోహినుద్దీన్ నిర్విరామ సేవలు అందించారని కలెక్టర్ రాహుల్ శర్మ అభినందించారు. కలెక్టరేట్ పరిపాలన అధికారిగా విధులు నిర్వహిస్తున్న మహ్మద్ ఖాజా మోహినుద్దీన్ ఆత్మీయ అభినందన వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, ఎస్డీసీ వైవీ రమేష్, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, డీటీలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. వినతులు పరిష్కరించాలి.. ప్రజావాణిలో వచ్చిన వినతుల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. జిల్లాకేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 57మంది నుంచి వినతులను కలెక్టర్ రాహుల్ శర్మ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, అదనపు కలెక్టర్ అశోక్కుమార్, ఆర్డీఓ రవి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. వాల్పోస్టర్ ఆవిష్కరణ భూపాలపల్లి రూరల్: సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్ కరపత్రాన్ని కలెక్టర్ రాహుల్ శర్మ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి ఎం.వెంకటేశ్వర్లు, ఆర్డీఓ రవి పాల్గొన్నారు. మిల్లెట్స్ విక్రయానికి కలెక్టరేట్లో ప్రత్యేక క్యాబిన్ కలెక్టర్ రాహుల్ శర్మ -
రోడ్లపైనే చెత్త కుప్పలు
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డులలో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. చెత్త సేకరణ నిర్వహణ అధ్వానంగా మారింది. పట్టణంతో పాటు విలీన గ్రామాల్లో ఏ మూలన చూసినా చెత్త కుప్పులు కుప్పులుగా పేరుకుపోయి కనిపిస్తుంది. పట్టణంలో ప్రతీ మూడు రోజులకు ఒకసారి చెత్త సేకరణ చేయడం వలన ప్రజలు ఇళ్లలోని చెత్తను తీసుకువెళ్లి కాలనీ సమీపంలోని ఖాళీ స్థలాలు, రోడ్ల పక్కన పడేస్తున్నారు. రోజులు, నెలలు గడుస్తున్నా పడేసిన చెత్తను మున్సిపల్ సిబ్బంది తొలగించడం లేదు. వర్షాకాలం కావడంతో చెత్త కుళ్లిపోయి దుర్వాసన వ్యాపించడంతో పాటు ఈగలు, దోమలు వృద్ధి చెందుతున్నాయి. చెత్తకుండీలు అంతంత మాత్రమే భూపాలపల్లి పట్టణంలో 30 వార్డులు ఉండగా.. సుమారు 70వేల జనాభా ఉంది. కేవలం 17 చెత్త కుండీలు మాత్రమే కొనుగోలు చేసి అక్కడక్కడ ఏర్పాటు చేశారు. కాలనీలో ప్రతి మూడు రోజులకు ఒక సారి చెత్తను సేకరించడం వలన మూడు రోజుల పాటు చెత్తను నిల్వ చేసుకోలేక ప్రజలు కాలనీల్లో ఖాళీ స్థలాలు, రోడ్డు పక్కన, మురుగు కాలువల్లో పడేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం రూ.20లక్షలతో చెత్తను తీసుకువెళ్లే ట్రక్ మౌంటెడ్ గ్యారేజ్ కాంపాక్టర్ వాహనాన్ని కొనుగోలు చేశారు. కుండీలో వేసిన చెత్తను ఈ వాహనం మనుషుల సహాయం లేకుండా తీసుకెళ్తుంది. పట్టణంలో ప్రతీ కాలనీలో రెండు కుండీలను ఏర్పాటు చేయడం వలన రోడ్లు, ఖాళీ స్థలాలలో చెత్త పడేయకుండా ఉండే అవకాశం ఉంటుంది. పై ఫొటోలో కనిపిస్తున్నది భూపాలపల్లి పట్టణంలోని గణేష్చౌక్ నుంచి జంగేడుకు వెళ్లే దారిలోని శాంతినగర్కాలనీ సమీపంలోని ప్రధాన రహదారి పక్కన ప్రాంతం. ప్రతీ రోజు దారి పొడవునా చెత్త పేరుకుపోయి ఉంటుంది. ప్రధాన రహదారి పక్కనే చెత్త కనిపిస్తున్నటికీ మున్సిపల్ అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. చెత్త వేయకుండా అవగాహన కార్యక్రమాలు సైతం నిర్వహించడం లేదు.కాలనీల శివారుల్లో దుర్వాసన పట్టణంలో కనిపించని చెత్తకుండీలు పట్టించుకోని మున్సిపల్ అధికారులు ఇబ్బందుల్లో పట్టణ ప్రజలుభూపాలపల్లి–కాటారం జాతీయ రహదారి పక్కన పట్టణ సమీపంలోని పాత ఎర్ర చెరువు వద్ద చెత్త ఎప్పుడు చూసినా కుప్పులు కుప్పులుగా పేరుకుపోయి మినీ డంపింగ్ యార్డును తలపిస్తుంది. అక్కడ ఏర్పాటు చేసిన చెత్త కుండీ సైతం ఎప్పుడూ నిండిపోయి ఉంటుంది. పట్టణంలో ఎక్కడో మూలన పేరుకుపోయి ఉన్న చెత్తను కాకుండా ప్రధాన రహదారి పక్కన రోజుల తరబడి పేరుకుపోతున్న చెత్తను సైతం తొలగించకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనడానికి నిదర్శనం ఇది. పట్టణంలోని రాజీవ్నగర్ సమీపంలోకి కేటీకే 6వ గనికి వెళ్లే దారి పక్కన పడేసిన చెత్త నెలల తరబడి ఉండి కుల్లిపోయి, భూగర్భంలోనే కలిసిపోతుంది. అక్కడ పడేసిన చెత్తను పారిశుద్ధ్య సిబ్బంది తరలించడం లేదని కాలనీవాసులు అంటున్నారు. కాలనీలో ఎక్కడి నుంచో చెత్తను తీసుకువచ్చి ఇక్కడ పడేస్తున్నారని కాలనీవాసులు అవేదన వ్యక్తంచేస్తున్నారు. చెత్త కుళ్లిపోయి దుర్వాసన వ్యాపించడమే కాకుండా దోమల, ఈగలు వృద్ధి చెందుతున్నాయని కాలనీ వాసులు తెలిపారు. -
ముగిసిన పాలిసెట్ కౌన్సెలింగ్
భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన పాలిసెట్–2025 కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసినట్లు పాలిసెట్ జిల్లా కన్వీనర్ డాక్టర్ ఎ.రమణారావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మూడు రోజుల పాటు కొనసాగిన ఈ కౌన్సెలింగ్లో 218మంది విద్యార్థులు హాజరై తమ ధ్రువీకరణ పత్రాల పరిశీలనలో పాల్గొన్నట్లు తెలిపారు. ఈ కౌన్సెలింగ్లో కళాశాల సిబ్బంది శ్రీధర్, దేవేందర్, టి శ్రీధర్, శ్రీనివాస్, డి.శ్రీనివాస్ పాల్గొన్నారు. మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలిగా లావణ్య భూపాలపల్లి అర్బన్: భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎన్ఎఫ్ఐడబ్ల్యూ) జిల్లా అధ్యక్షురాలిగా గొలి లావణ్యను ఎన్నుకున్నట్లు రాష్ట్ర సమితి సభ్యురాలు కొరిమి సుగుణ తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగిన ఎన్ఎఫ్ఐడబ్ల్యూ నిర్మాణసభలో జిల్లా అధ్యక్షురాలిని ఎన్నుకున్నట్లు తెలిపారు. ఆపరేషన్ కగార్ను నిలిపేయాలి రేగొండ: ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పడం కోసం ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసులు, మావోయిస్టులను ఎన్కౌంటర్ చేయడాన్ని నిలిపివేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ డిమాండ్ చేశారు. సీపీఐ 17వ మహాసభ సందర్భంగా ఆదివారం రూపిరెడ్డిపల్లిలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజల పక్షాన సీపీఐ వంద సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తుందన్నారు. మండలంలో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేయడానికి యువకులు, కార్మికులు, రైతాంగాన్ని సమీకరించి పార్టీని బలోపేతం చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటరాములు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటి చంద్రమౌళి, మండల కార్యదర్శి పెంట రవి, సీనియర్ నాయకులు సమ్మిరెడ్డి, శాంతికుమార్, అన్నారపు రాజేందర్, ప్రకాశ్, పద్మ, భవాని, లలిత, చంద్రమౌళి పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు విద్యార్థి ఎంపిక కాళేశ్వరం: మహాదేవపూర్ మండలం కాళేశ్వరం గిరిజన ఆశ్రమ పాఠశాలకు చెందిన నాలుగవ తరగతి విద్యార్థి గంట హరిచందన స్పోర్ట్స్ స్కూల్స్ ప్రవేశం కోసం రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొనేందుకు ఎంపికై నట్లు హెచ్ఎం బాలకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్రాను. జిల్లా కేంద్రంలో జరిగిన పోటీల్లో మొదటిస్థానంలో నిలిచింది. జూలై 1నుంచి హైదరాబాద్ హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ పోటీల్లో పాల్గొననుందని ఆయన తెలిపారు. రేపటినుంచి ఈఏపీసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం భూపాలపల్లి అర్బన్: రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్ డిగ్రీ కోర్సులలో ప్రవేశాలకోసం నిర్వహించిన ఈఏపీసెట్–2025 కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా కన్వీనర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రమణరావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈఏపీసెట్–2025 ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జూలై 4వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందన్నారు. అర్హులైన విద్యార్థులు TGEA-PCET. NIC.I N వెబ్సైట్ ద్వారా స్లాట్ బుక్ చేసుకొని అన్ని ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో పాటు రెండు జతల జిరాక్స్ తీసుకొని సకాలంలో కౌన్సెలింగ్కు హాజరుకావాలని సూచించారు. నేడు ఉద్యమకారుల దీక్ష ములుగు రూరల్: జిల్లా కేంద్రంలో నేడు(సోమవారం) తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న శాంతియుత నిరవదిక దీక్షను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంటి భద్రయ్య ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా కేంద్రంలో దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద జిల్లాలోని పది మండలాలకు చెందిన ఉద్యమకారులు పార్టీలకు అతీతంగా హాజరుకావాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఉద్యకారులకు 250 గజాల ఇంటి స్థలం, రూ.25 వేల పెన్షన్ స్కీం మంజూరు చేయాలని కోరారు. -
వైభవంగా శాకంబరీ మహోత్సవాలు
హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయంలో వైభవంగా కొనసాగుతున్న శాకంబరీ నవరాత్ర మహోత్సవాలు ఆదివారం నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేద పండితులు ఉదయం అమ్మవారికి సుప్రభాతసేవ, నిత్యాహ్నికం, క్షీరాన్న నివేదన నీరాజన మంత్రపుష్పం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. కాళీక్రమాన్ని అనుసరించి స్నపనభేరాన్ని కురుకుల్లా క్రమంలో, షోడశీక్రమాన్ని అనుసరించి భోగభేరాన్ని భేరుండాక్రమంలో అలంకరించి నవరాత్ర విశేషపూజలు నిర్వహించారు. -
దివ్యాంగులు హక్కుల కోసం ఉద్యమించాలి
ములుగు రూరల్: దివ్యాంగులు తమ హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమించాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు బానోతు భద్రునాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ భవన్లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మానసికధైర్యంతో ది వ్యాంగులు జీవనం కొనసాగించాలని సూచించా రు. అనంతరం జిల్లా కమిటీ ఎన్నుకున్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా పూజారి మాణిక్యం, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా పెద్దబోయిన శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడిగా రాజు, శ్రీనివాస్, సహాయ కార్యదర్శిగా సురేష్, కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు మంచోజు చంద్రమౌళి, తదితరులు పాల్గొన్నారు. -
భలే..భలే.. బొచ్చ చేప
మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహితకు వరద తాకిడి పెరుగుతుంది. ఆదివారం గోదావరి, ప్రాణహిత కలిసే కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమంలో మహారాష్ట్రలోని సిరొంచకు చెందిన జాలర్లు చిన్న నావలపై చేపల వేట చేపట్టారు. దీంతో వారికి వివిధ రకాలైన చేపలు తమ వలలకు చిక్కాయి. అందులో బొచ్చ జాతికి చెందిన పెద్ద చేప చిక్కింది. ఎనిమిది కిలోల వరకు ఉంటుందని జాలర్లు పేర్కొంటున్నారు. జీవనోపాధికోసం నిత్యం నదిపై జీవన పోరాటం చేస్తుంటామని తెలిపారు. – కాళేశ్వరంగోదావరిలో నావపై చేపలు పడుతున్న జాలర్లు -
వ్యాధుల భయం
ఈ ఫొటోలో కనిపిస్తున్నది పట్టణంలోని కాారల్మార్క్స్ కాలనీ. ఇంటి స్థలంలో ఇళ్లు నిర్మించకపోవడంతో ఖాళీగా దర్శనమిస్తుంది. ఈ స్థలంలో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి. వర్షపు నీరు నిలిచి దోమలు విజృంభిస్తున్నాయి. ఖాళీ స్థలం ఉండటం వలన చుట్టు పక్కల వారు ఇక్కడే చెత్తను పడేస్తున్నారు. దీంతో రాత్రి వేళలో విషపురుగులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షంతో ఖాళీ స్థలాల్లో నిలుస్తున్న నీరు●● పెరుగుతున్న పిచ్చి మొక్కలు ● దోమలకు అడ్డా.. ● ఆందోళనలో పట్టణవాసులుభూపాలపల్లి అర్బన్: ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షాలకే జిల్లాకేంద్రంలో డ్రెయినేజీలు పొంగిపొర్లుతున్నాయి. ఖాళీ స్థలాల్లో మురికినీరు నిలిచి పిచ్చిమొక్కలు దట్టంగా పెరుగుతున్నాయి. ఖాళీ ప్లాట్లను పట్టించుకోకపోవడంతో సమస్య మరింత తీవ్రమవుతోంది. బీసీ కాలనీ, వెంగల్రావు వెంచర్, మైసమ్మకాలనీ వంటి శివారు కాలనీలతో పాటు పట్టణంలోని ఎల్బీనగర్, హన్మాన్నగర్, కారల్మార్క్స్ కాలనీ, జవహర్నగర్, గాంధీనగర్లలో ఈ సమస్య అధికంగా కనిపిస్తుంది. ఖాళీ స్థలాలతో ఇబ్బందులు జిల్లాకేంద్రంలోని ఖాళీ ప్లాట్లలో పిచ్చిమొక్కలు విపరీతంగా పెరిగి ఉన్నాయి. మురికినీరు నిలిచి విషపూరిత, పాములు, దోమలు, ఈగలకు ఆవాసంగా మారాయి. సాయంత్రం వేళల్లో ఇవి ఇళ్లలోకి చొరబడుతుండడంతో కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు. తలుపులు మూసుకోకపోతే ఇబ్బందులు తప్పడం లేదని వారు చెబుతున్నారు. మున్సిపల్ అధికారులు ఈ సమస్యను పట్టించుకోకపోవడంతో స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి జబ్బులు సైతం ప్రబలే ప్రమాదం కనిపిస్తుంది. నిబంధనల ప్రకారం మున్సిపల్ అధికారులు ఈ స్థలాలను శుభ్రం చేసి, యజమానుల నుంచి ఖర్చు వసూలు చేయవచ్చు. కానీ ఈ విధానం అమలు కావడం లేదు. బ్లీచింగ్ పౌడర్, కెమికల్ స్ప్రే వంటి చర్యలపై దృష్టి సారించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. పరిష్కార మార్గాలు మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి ఖాళీ స్థలాల్లోని పిచ్చిమొక్కలను తొలగించడం, డ్రెయినేజీలను సక్రమంగా ఏర్పాటు చేయడం, ఫాగింగ్ అన్ని కాలనీల్లో నిర్వహించడం, యజమానులకు నోటీసులు జారీ చేసి జరిమానాలు విధించడం వంటి చర్యలు చేపట్టాలి. ఇలా చేస్తే పారిశుద్ధ్య సమస్యలు తగ్గి ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం లభిస్తుంది. -
భక్తుల సందడి
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచలక్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్త జనంతో కిక్కిరిసింది. ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలయంలోని స్వయంభు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు స్వామివారికి ప్రతీ ఆదివారం నిర్వహించే తిలతైలాభిషేకం పూజలు నిర్వహించి భక్తుల గోత్రనామాలతో ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణాన్ని వివరించారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేసి ఆశీర్వచనం ఇచ్చారు. -
సాగునీటి కష్టాలు
వాజేడు : తలాపున గోదారి.. ఓ వైపు మోడి కుంట, మరోవైపు గుండ్లవాగు ఉన్నా రైతులకు సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. మండలంలో సాగునీటి ప్రాజెక్టులు లేకపోవడంతో రైతులకు ప్రతిఏటా నీటి కష్టాలు తప్పడం లేదు. రైతులు ఎక్కువగా బోర్లు, కాల్వలపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. వాజేడులో ఒకవైపు గుండ్లవాగు ప్రాజెక్టు ఉండగా అది లీకులతోనే నీరంతా వృథాగా పోతున్న పరిస్థితి ఉంది. అలాగే మరో వైపు మోడికుంట ప్రాజెక్టు మంజూరైనా నేటి వరకు పనులు చేపట్టక పోవడంతో సాగునీరు ఎప్పుడు వస్తుందో తెలియని దుస్థితి. మండలానికి ఎగువ భాగంలో లొట్టిపిట్ట గండి వద్ద గోదావరిపై సమ్మక్క–సారక్క బ్యారేజీ ఉన్నా వాజేడు వైపు కాల్వ లేక సాగునీరు అందడం లేదు. అలంకారప్రాయంగా గుండ్లవాగు గుండ్లవాగు ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. నాసిరకం నిర్మాణం వల్ల ప్రాజెక్టు మనుగడకే శాపంగా మారింది. ప్రాజెక్టు కింద సాగుచేస్తున్న ఆయకట్టులో ఒక్క ఎకరాకు కూడా నీరు అందడం లేదంటే అతిశయోక్తి కాదు. ప్రాజెక్టులో నిల్వ ఉండాల్సిన నీరు లీకేజీల కారణంగా బయటకు వృథాగా వెళ్తుడడంతో ప్రాజెక్టు అలంకారప్రాయంగా మారిన పరిస్థితి ఉంది. జలగం వెంగళరావు సీఎంగా ఉండగా 1970లో ఈ ప్రాజెక్టును మంజూరు చేసి ప్రారంభించగా 55ఏళ్లు అవుతున్నా మరమ్మతులతోనే దర్శనమిస్తోంది. ప్రాజెక్టులో ఉండాల్సిన నీరంతా భూగర్భం నుంచి బయటకు వాగులోకి వచ్చి చేరుతుండడంతో నీరు ఎలా బయటకు వెళ్తుందో అర్థంకాక అలా వదిలేశారు. కొంతకాలం తర్వాత జపాన్కు చెందిన సాంకేతిక నిపుణులతో అధ్యయనం చేసి ప్రాజెక్టు పునర్నిర్మాణానికి రూ.14 కోట్ల నిధులు మంజూరు చేసి భూగర్భంలోని రంధ్రాలను పూడ్చారు. వర్షాకాలంలో కాల్వకు గండ్లు పడుతుండటంతో రైతులకు ఇబ్బందిగా మారింది. ఈ ప్రాజెక్టు ద్వారా 2,580 ఎకరాల విస్తీర్ణానికి సాగునీరు అందించాల్సి ఉన్నా నేటి వరకు ఒక్క ఎకరాకు కూడా నీరు అందలేదు. ప్రాజెక్టు ప్రధాన కట్ట వద్ద గోడలు కూలిపోతున్నాయి. ప్రాజెక్టు పాతది కావడంతో ప్రధాన గేటు సమీపంలో కొంత భాగం గోడ కూలిపోయింది. ఎడమకాల్వతో సస్యశ్యామలం దేవాదుల లక్ష్మీపురం వద్ద గోదావరిపై నిర్మించిన సమ్మక్క–సారక్క బ్యారేజీ వాజేడు మండలానికి లొట్టి పిట్ట గండి వద్ద ఉంది. వాజేడుకు ఆనుకొని ఉన్న బ్యారేజీతో ఇక్కడి రైతులకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. లొట్టిపిట్ట గండి వద్ద బ్యారేజీ నుంచి వాజేడు మండలానికి ఎడమ కాల్వను ఇస్తే పంటలకు సాగునీరు అందే అవకాశం ఉంది. ఎడమ కాల్వ ద్వారా నీటిని ఇస్తే వాజేడు మండలం పంటలతో సస్యశ్యామలంగా మారుతుందని అన్నదాతలు కోరుతున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి సమ్మక్క–సారక్క బ్యారేజీ నుంచి ఎడమ కాల్వ ద్వారా సాగునీటిని అందించాలని రైతులు కోరుతున్నారు.ప్రారంభం కానీ మోడికుంట ప్రాజెక్టు పనులు గుండ్లవాగుకు లీకులు బోర్లు, కాల్వలపైనే ఆధారంమోడికుంటకు మోక్షం కరువు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మోడికుంట ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులు తొలిగిపోయి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మండల పరిధిలోని కృష్ణాపురం సమీపంలో మోడికుంట మధ్యతరహా ప్రాజెక్టు నిర్మాణానికి ఆమోదం తెలిపింది. రూ.718 కోట్ల వ్యయంతో ప్రాజెక్టును నిర్మించేలా అనుమతులు ఇస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు నీటి పారుదల శాఖకు స్పష్టమైన ఆదేశాలు సైతం ఇచ్చినట్లు సమాచారం. గేట్లతో స్పిల్వేను నిర్మించడంతో పాటు 1,292 మీటర్ల పొడవు ఆనకట్ట, 21,850 కిలోమీటర్ల పొడవున ప్రధాన కాల్వ నిర్మాణానికి డిజైన్ చేసినట్లు తెలిసింది. 28, 950 కిలో మీటర్ల విస్తీర్ణంలో పిల్ల కాల్వలను నిర్మించి 13,591 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేలా నిర్మించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సీడబ్ల్యూసీ, టీఏసీ, పర్యావరణ, అటవీ శాఖ అనుమతులు గతంలోనే రాగా మోడికుంట ప్రాజెక్టు నిర్మాణానికి మార్గం సుగుమమైంది. కాని ప్రాజెక్టు పనులు ఇంకా మొదలు కాకపోవడంతో మోడికుంట ద్వారా సాగునీరు అందించడానికి ఇంకా ఎన్నేళ్లు పడుతుందోనని రైతులు ఎదురుచూస్తున్నారు. -
పేదల పక్షాన పోరాడిన గాజర్ల రవి
● ఎమ్మెల్యేలు గండ్ర, రేవూరి టేకుమట్ల: సామాన్య కుటుంబంలో జన్మించిన గాజర్ల రవి చిన్నతనం నుంచే బడుగు, బలహీన వర్గాల కోసం పేద ప్రజల పక్షాన పోరాటం చేశాడని భూపాలపల్లి, పరకాల ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. ఈ నెల 18న ఎన్కౌంటర్లో మృతి చెందిన గాజర్ల రవి సంస్మరణ సభ వెలిశాలలో సోమవారం నిర్వహించారు. గాజర్ల రవి కుటుంబసభ్యులను ఎమ్మెల్యేలు పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ పేద ప్రజల కోసం రవి చిన్నతనంలోనే అడవిబాట పట్టాడన్నారు. సంస్మరణ సభకు అభిమానులు, సానుభూతిపరులు, ప్రజాసంఘాల నేతలు భారీగా తరలివచ్చారు. ఎమ్మెల్సీ సిరికొండ పరామర్శ గాజర్ల రవి సంతాపసభకు ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి హాజరయ్యారు. రవి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పలు గ్రామాలలో మరణించిన వారి కుటుంబ సభ్యులను అనంతరం పరామర్శించారు. రామకృష్ణాపూర్ గ్రామంలో రెండు సీఎంఆర్ఎఫ్ చెక్కులను బాధితులకు అందజేశారు. ఆయన వెంట కార్మిక శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్ నాయకులు నిమ్మల స్వామి, శంకర్, తిరుపతి పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించడంలో విఫలం
● మాజీ ఎంపీ మిడియం బాబురావు ఏటూరునాగారం : వలస ఆదివాసుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎంపీ మిడియం బాబురావు అన్నారు. ఆదివాసీ హక్కులపై శనివారం మండల కేంద్రంలోని గిరిజన భవన్లో గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఒకరోజు శిక్షణ తరగతులు నిర్వహించగా బాబురావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆదివాసీల గూడేలకు కనీస వసతులు కల్పించకుండా, వారిని వలసవాదులుగా ముద్రించి, కుల ధ్రువీకరణ పత్రాలు, కనీస వసతులు కల్పించకుండా ఆదివాసీ హక్కులను కాలరాస్తోందన్నారు. వారిని అడవి నుంచి పంపించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. ఆదివాసీలకు దేశంలో ఎక్కడైనా జీవించే హక్కు ఉందని, వారికి అన్ని వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అని సూచించారు. అటవీ సంరక్షణ, జంతు, జీవజాతుల రక్షణ పేరుతో ఆదివాసీలను అడవుల నుంచి పంపేందుకు జీఓ 49 తీసుకువచ్చి 339 ఆదివాసీల గ్రామాలను ఖాళీ చేయించాలని ప్రభుత్వాలు చూస్తున్నాయని మండిపడ్డారు. జీఓ 49ను వెంటనే రద్దు చేయాలని, ఆదివాసీల హక్కులకు రక్షణ కల్పిస్తూ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు జెజ్జరీ దామోదర్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దుగ్గి చిరంజీవి, గొంది రాజేష్, జిల్లా కమిటీ సభ్యులు అలెం అశోక్, కుర్సం శాంతకుమారి, కోరం చిరంజీవి, తోలెం కృష్ణయ్య, కుర్సం చిరంజీవి, పూనెం నగేష్, ఊకే ప్రభాకర్, కొట్టెం కృష్ణారావు పాల్గొన్నారు. -
భర్త జ్ఞాపకాలతో..
మహబూబాబాద్ రూరల్: కట్టుకున్న భర్తను ప్రాణంగా భావించి ఆయన మృతి అనంతరం పాలరాతితో విగ్రహం చేయించి ఓ భార్య ఆయనకు గుడి కట్టించింది. మహబూబాబాద్ మండలం సోమ్లా తండా గ్రామానికి చెందిన బానోత్ కల్యాణి ఎంపీటీసీగా పనిచేసింది. హరిబాబుతో ఆమెకు 1996లో వివాహం కాగా.. 2021లో హరిబాబు అనా రోగ్యంతో మృతిచెందాడు. ఆయనతోపాటే తాను చనిపోదామని కల్యాణి ప్రయత్నించినా బంధువులు ధైర్యం చెప్పడంతో హరిబాబు జ్ఞాపకాలతో జీవిస్తోంది. ఈక్రమంలో రూ.5.30 లక్షలతో పండుగ వాతావరణంలో గతేడాది ఏప్రిల్ 23న గుడి ప్రారంభించింది. ప్రతీ శనివారం ఆయనకు పూజలు చేస్తోంది. -
ఎల్లప్పుడూ కళ్ల ముందే ఉండాలని..
డోర్నకల్: కంటికి రెప్పలా చూసుకునే భర్త, అమ్మా అమ్మా అంటూ రోజుకు వెయ్యిసార్లు పలకరించే కుమారుడు అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో దిక్కు తోచని స్థితికి చేరుకున్న ఓ మహిళ తన భర్త, కుమారుడిని విగ్రహాల రూపంలో చూసుకుంటూ వారి జ్ఞాపకాలను నెమరువేసుకుంటుంది. డోర్నకల్ మండలం దుబ్బతండాకు చెందిన అజ్మీర బాల్యా, భారతి దంపతులకు సాయికుమార్ ఏకై క కుమారుడు. భారతి దుబ్బతండా సర్పంచ్గా పని చేసి భర్త బాల్యా సహకారంతో గ్రామాభివృద్ధిలో తమ వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వహించింది. బాల్యా, భారతి వ్యవసాయం చేస్తుండగా కుమారుడు ఖమ్మంలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. ఈ నెల 5న కుమారుడు సాయికుమార్ను కళాశాలకు పంపేందుకు బాల్యా ద్విచక్రవాహనంపై ఖమ్మం బయల్దేరగా ఖమ్మంలో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొని బాల్యా, సాయికుమార్ మృతి చెందారు. వారిని మర్చిపోలేని భారతి.. బాల్యా, సాయికుమార్ విగ్రహాలను గ్రామ ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసింది. జూన్ 15న వారి సంతాప సభలోబాల్యా సాయికుమార్ విగ్రహాలను ఆవిష్కరించారు. -
విద్యకు అధిక ప్రాధాన్యం
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు టేకుమట్ల: ప్రజా ప్రభుత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శనివారం మండలంలోని అంకుషాపూర్ గ్రామ శివారులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో రూ.2కోట్ల 30 లక్షల నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదులు, ప్రయోగశాల గదులను రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్రెడ్డి, కలెక్టర్ రాహుల్శర్మ, జెడ్పీ సీఈఓ విజయలక్ష్మితో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు తమ లక్ష్యాన్ని ఎంచుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ ఎస్ఓ స్వప్న, మాజీ జెడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ అయిలయ్య, తహసీల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీఓ అనిత, ఎంపీఓ సురేష్, ఆర్ఐ సంతోష్కుమార్ పాల్గొన్నారు. -
చిన్న కాళేశ్వరం పనుల్లో వేగం పెంచాలి
● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి: చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. శనివారం ఐడీఓసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనుల ప్రగతిపై ఇరిగేషన్, ఫారెస్ట్, రెవెన్యూ శాఖల అధికారులతో పాటు మెగా కంపెనీ ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఆధునీకరణలో ఉన్న చెరువులు, కాలువలు, పంప్హౌస్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. భూసేకరణ సమస్యలు ఉన్న గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి గ్రామస్తులతో తీర్మానం చేయించాలని సూచించారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, అదనపు కలెక్టర్ అశోక్కుమార్, డీఎఫ్ఓ నవీన్రెడ్డి, ఇరిగేషన్ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఆదివారం శ్రీ 29 శ్రీ జూన్ శ్రీ 2025
ఐనవోలు: మండల కేంద్రానికి చెందిన వడిచర్ల శ్రీనివాస్–అనురాధ దంపతుల కుమారుడు కమల్హాసన్, కూతురు శివాని. శ్రీనివాస్ టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. సమాజ సేవంటే ఇష్టపడే శ్రీనివాస్ ఎంపీటీసీగా పని చేశారు. గతేడాది జనవరి 22న అనారోగ్య కారణాలతో ఆయన మృతి చెందాడు. కమల్ హాసన్ నాన్న నిర్ణయం మేరకు డిగ్రీ తర్వాత లండన్కు వెళ్లారు. తండ్రి చనిపోయిన తర్వాత ఆయన కోరిక మేరకు చెల్లి పెళ్లి జరిపించాడు. ఆపెళ్లిలో అతడి తండ్రి ఫైబర్ విగ్రహాన్ని తయారు చేయించి నాన్నతో తనకున్న ఎమోషన్ను అందరికి చూపించాడు. ఈసారి లండన్ నుంచి ఇండియాకు వచ్చినపుడు ఆ ఫైబర్ విగ్రహాన్ని మండల కేంద్రంలో ఏర్పాటు చేయించనున్నట్లు కమలహాసన్ తెలిపారు.న్యూస్రీల్పెళ్లిలో విగ్రహం ఓ ఎమోషన్ -
కుమారులు దూరమై.. విగ్రహాల్లో కొలువై
కొడకండ్ల: అల్లారుముద్దుగా పెంచుకున్న ఇద్దరు కుమారులు రోడ్డు ప్రమాదంలో దూరమయ్యారు. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని వారి జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటూ ఆ తల్లిదండ్రులు కాలం వెళ్లదీస్తున్నారు. ప్రాణం పోయిన వారి కుమారులకు విగ్రహాల రూపంలో ప్రాణం పోసి కళ్లారా చూస్తున్నారు. కొడకండ్ల మండలం రామవరం గ్రామానికి చెందిన మేటి రాములు–రాజేశ్వరి దంపతులకు ముగ్గురు కుమారులు. వ్యవసాయమే జీవనాధారమైన వారు కుమారులను చిన్నప్పటి నుంచి ప్రైవేట్ పాఠశాలల్లోనే చదివించారు. తల్లిదండ్రుల శ్రమను గుర్తించిన వారు ప్రయోజకులయ్యారు. పెద్దకుమారుడు అరవింద్, రెండో కుమారుడు శ్రవణ్ సాప్ట్వేర్ ఇంజనీర్లుగా హైదరాబాద్లో మూడో కుమారుడు శ్రవణ్ వరంగల్ ఎంజీఎంలో హౌస్ సర్జన్గా పనిచేసేవారు. గత సంవత్సరం మే 19న శివ హైదరాబాద్లోని అన్న శ్రవణ్ వద్దకు వెళ్లాడు. భోజనం తెచ్చుకునేందుకు బయటికి వెళ్లిన ఇద్దరు సోదరులను స్కార్పియో కారు ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. కుమారులను గుర్తు చేసుకుంటూ తమ వ్యవసాయ భూమిలో గదిని నిర్మించి శ్రవణ్, శివ విగ్రహాలను ఏర్పాటు చేయించారు. మే 19న ప్రథమ వర్ధంతి సందర్భంగా తల్లిదండ్రులు ఆవిష్కరించుకున్నారు. -
పాఠశాలలను పర్యవేక్షణ చేయాలి
భూపాలపల్లి అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను విద్యాశాఖ అధికారులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షణ చేయాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) అశోక్కుమార్ తెలిపారు. కలెక్టరేట్లోని మీటింగ్హాల్లో శనివారం జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులతో జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ అధ్యక్షతన శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా అదనపు కలెక్టర్ అశోక్కుమార్ హాజరై బడిబాట కార్యక్రమంలో నమోదైన విద్యార్థుల సంఖ్య, తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై చర్చించారు. ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ యాప్ అత్యధికంగా నమోదు చేసిన సూరారం కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులను అభినందించారు. మిగతా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు అందరూ ఎక్కువ శాతం ఎఫ్ఆర్ఎస్ యాప్లో విద్యార్థుల హాజరు నమోదు అయ్యేలా చూడవలసిందిగా సూచించారు. ప్రతిరోజు విధిగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు వారి పాఠశాలలలో ప్రార్థన సమయానికి హాజరై పర్యవేక్షించాలని ఆదేశించారు. -
నేరాల నియంత్రణకు సమర్థవంతంగా పనిచేయాలి
● ఎస్పీ కిరణ్ ఖరే భూపాలపల్లి: నేరాల నియంత్రణకు పోలీసు అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా పనిచేయాలని ఎస్పీ కిరణ్ ఖరే సూచించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్స్టేషన్లలో నేరాల నమోదు, పెండింగ్ కేసులు, ఎన్బీడబ్ల్యూ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, మహిళలకు వ్యతిరేకంగా జరిగే నేరాలు, పోక్సో కేసులు, కోర్టు మానిటరింగ్, శిక్షల అమలుపై చర్చించి పోలీసు అధికారులకు ఎస్పీ మార్గనిర్దేశం చేశారు. విధులను విజిబుల్ పోలీసింగ్తో పాటు ప్రభావవంతంగా నిర్వర్తించాలని అన్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నందున పోలీసు అధికారులు, సిబ్బంది పకడ్బందీగా పని చేయాలని తెలిపారు. గ్రామాలలో జరిగే శాంతి భద్రతల అంశాలను ముందస్తు సమాచారం సేకరించి సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసుల పనితీరును సమీక్షించేందుకు ఏర్పాటు చేసిన ఫంక్షన్ వర్టికల్లో ఎవరికి కేటాయించిన విధులను వారు అఫ్డేట్ చేయాలన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ నరేష్కుమార్, భూపాలపల్లి, కాటారం, వర్టికల్ డీఎస్పీలు సంపత్రావు, సూర్యనారాయణ, నారాయణనాయక్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
వాల్పోస్టర్ ఆవిష్కరణ
భూపాలపల్లి అర్బన్: నేషనల్ స్టూడెంట్స్ పర్యావరణ పోటీల (ఎన్ఎస్పీసీ)వాల్పోస్టర్ను శనివారం జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాతావరణ మార్పుల ప్రభావం నుంచి రక్షణ కోసం విద్యార్థుల్లో పర్యావరణ నైపుణ్యాలు, ఆరోగ్యకరమైన జీవనశైలి విద్యార్థులు అలవర్చుకోవాలని డీఈఓ రాజేందర్ తెలిపారు. హరిత్, ద వే ఆఫ్ లైఫ్ అనే నినాదంతో పర్యావరణ సంరక్షణ అనే ఉద్దేశంగా దేశవ్యాప్తంగా జూలై 1వ తేదీ నుంచి అగస్టు 21వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేయాలని తెలిపారు. ఆన్లైన్లోనే పోటీలు నిర్వహించి ఆగస్టు 30వ తేదీన ఫలితాలు విడుదల చేయడం జరుగుతుందన్నారు. ఈకో మిత్ర మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు స్వామి, లక్ష్మన్, రమేష్, రాజగోపాల్, రామకృష్ణ, ఎంఈఓలు పాల్గొన్నారు. లాంగ్టర్మ్ కోచింగ్కు దరఖాస్తుల స్వీకరణభూపాలపల్లి రూరల్: సివిల్ సర్వీస్లో లాంగ్టర్మ్ కోచింగ్కు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతులు అభివృద్ధి అధికారి క్రాంతికిరణ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికై న వారికి హైదరాబాద్లోని బీసీ స్టడీ సర్కిల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆసక్తి గలవారు జూలై 8వతేదీ వరకు అన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 0870–2571192 లేదా 77803 59322 నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
పరిశీలిస్తూ.. ప్రశ్నిస్తూ
ఎంజీఎం : నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎన్ఎంసీ) మెడికల్ కాలేజీల్లో వసతులపై జారీ చేసిన షోకాజ్ నోటీసుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పర్యవేక్షణ కమిటీ శుక్రవారం నగరంలోని కేఎంసీ, ఎంజీఎం, సీకేఎం, జీఎంహెచ్ ఆస్పత్రులను తనిఖీ చేసింది. పర్యవేక్షణ కమిటీ చైర్మన్, రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సంగీత సత్యనారాయణ.. హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు స్నేహ శబరీష్, సత్యశారదతో కలిసి ముందుగా కాకతీయ మెడికల్ కళాశాల(కేఎంసీ)ను సందర్శించారు. బోధన సిబ్బంది, పరికరాల లేమిపై ఆయా విభాగాఽధిపతులతో సమీక్షించారు. కేఎంసీలో హెమటాలజీ విభాగాన్ని, వైద్యవిద్యార్థుల వసతి గృహాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి.. ప్రిన్సిపాల్ రాంకుమార్రెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెడికల్ కళాశాలను, ప్రస్తుతం ఉన్న వైద్య అధ్యాపకుల పోస్టుల ఖాళీలు, మౌలిక వసతులపై ప్రభుత్వానికి నివేదించేందుకు పలు అంశాలపై చర్చించారు. పీఎంఎస్ఎస్వై ఆస్పత్రి పరిశీలన.. కేఎంసీ ప్రాంగణంలోని పీఎంఎస్ఎస్వై ఆస్పత్రిని కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డయాలసిస్ యూనిట్తోపాటు ఆపరేషన్ థియేటర్, యూ రాలజీ విభాగాన్ని తనిఖీ చేశారు. పలు అంశాలపై ఆయా విభాగాల వైద్యులతో మాట్లాడి సమస్యలు వివరిస్తున్న క్రమంలో వసతుల లేమిపై ప్రభుత్వానికి రాత పూర్వకంగా నివేదించాలని ఆదేశించా రు. పరికరాల మరమ్మతులో అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు. చిన్న చిన్న సమస్యలతో రోగులకు సేవలు నిలిపివేయకుండా చూడాలన్నా రు. అనంతరం కేయూ జంక్షన్లోని క్షయ ఆస్పత్రిని సందర్శించి రోగులు, ఓపీ సేవల గురించి ఆరా తీశారు. మెడికల్ వ్యర్థాలను ఎక్కడికి తరలిస్తున్నారన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఎంజీఎంలో ఫార్మసీ సూపర్వైజర్పై చర్యలకు ఆదేశాలు ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం మౌలిక వసతుల కల్పనలో భాగంగా ఎంజీఎం ఆస్పత్రిని సాయంత్రం కమిషనర్ డాక్టర్ సంగీతసత్యనారాయణ సందర్శించారు. మొదట ఓపీ విభాగాన్ని పరిశీలించి కౌంటర్లు పెంచాలని ఆదేశించారు. ఫార్మసీ విభా గంలో ఈ–ఔషధి నమోదులో వివరాలు చెప్పడంలో విఫలమైన ఫార్మసీ సూపర్వైజర్ను సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం రోగులకు అందించే భోజనశాల, పిల్లల విభాగా న్ని పరిశీలించి ఆరోగ్య మహిళ పథకం ద్వారా అందుతున్న సేవలపై ఆరా తీశారు. అదేవిధంగా సీకేఎం ఆస్పత్రిని సందర్శించి ఆయా వార్డులు, ఓపీ సేవలు, రెఫరల్స్, ఫాలోఆప్ వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ కిశోర్, హనుమకొండ, వరంగల్ డీఎంహెచ్ఓలు అప్పయ్య, సాంబశివరావు, ఆర్ఈహెచ్ సూపరింటెండెంట్ భరత్, సీకేఎం ఆస్పత్రి వైద్యులు పాల్గొన్నారు. హాజరుశాతంపై చర్యలు తప్పవు.. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం వైద్యుల హాజరుశాతాన్ని ఫేస్ బ యోమెట్రిక్తో చేపట్టాలని కమిషనర్.. వైద్యారోగ్యశాఖాధికారులకు స్పష్టం చేశారు. దీనిపై ఎంజీఎం సూపరింటెండెంట్ స్పందించి అలాంటి హా జరుశాతం ఎంజీఎంలో మొదలు కాలేదని సాంకేతిక కారణాలు చెప్పగా, బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరి అని ఆదేశించారు. భవిష్యత్లో వైద్యు ల హాజరుశాతంపై బయోమెట్రిక్ ఆధారంగా చర్యలు ఉంటాయని ఆమె స్పష్టం చేశారు. ఎన్ఎంసీ షోకాజ్ నోటీసులతో ఆస్పత్రులను సందర్శించిన పర్యవేక్షణ కమిటీ కేఎంసీ, ఎంజీఎం, సీకేఎం, జీఎంహెచ్ ఆస్పత్రుల తనిఖీ సమస్యలను రాతపూర్వకంగా ప్రభుత్వానికి పంపించండి.. పర్యవేక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ సంగీత సత్యనారాయణ ఎంజీఎంలో ఫార్మసీ సూపర్వైజర్ సస్పెన్షన్కు ఆదేశాలు -
చారిత్రక ప్రాధాన్యతను తెలుసుకోవాలి
రేగొండ: రాష్ట్రంలోని ఏకై క జియో హెరిటేజ్ ప్రదేశంగా ఉన్న పాండవుల గుట్టలను సందర్శించి దాని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ చారిత్రక ప్రాధాన్యతను తెలుసుకోవాలని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ మంజు అన్నారు. శుక్రవారం మండలంలోని తిరుమలగిరి గ్రామ శివారులోని పాండవుల గుట్టలను సందర్శించి గుట్ట నిర్మాణ ప్రాముఖ్యతను, వయస్సు, పురాతన శిలా చిత్రాలు వంటి అంశాలను తెలియజేస్తూ ఏర్పాటు చేసిన జియో హెరిటేజ్ ఇన్ఫర్మేషన్ ప్యానెల్ బోర్డును డాక్టర్ మంజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాచార బోర్డులో ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్చేస్తే పాండవుల గుట్టలో కనిపించే భౌగోళిక లక్షణాలు, ప్యాలియోలిథిక్ జీవన చరిత్ర ఆధారాలను సందర్శకులు అర్థం చేసుకునేందుకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ రమేష్ సామల, గుండా రమేష్, తుషార్ చంద్రపటేల్, అశోక్ కుమార్ కలబతులా హాజరయ్యారు. -
సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ డిప్యూటీ డైరెక్టర్ తనిఖీ
గణపురం: సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ డిప్యూటీ డైరెక్టర్ జై ప్రకాశ్రాయి సభ్యులతో కలిసి శుక్రవారం మండలకేంద్రంలోని రేషన్షాపు నంబర్ 3లో తనిఖీచేశారు. రేషన్ బియ్యం పంపిణీ విధానాన్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు రేషన్ బియ్యం సక్రమంగా సరఫరా చేయకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ కార్పొరేషన్ అధికారి జమన్ కుమార్, భూపాలపల్లి సివిల్ సప్లయీస్ అధికారి శ్రీనాధ్, డీఎం రాములు పలు మండలాల తహసీల్దార్లు ఉన్నారు. రీజియన్ రక్షణ జీఎం పరిశీలన భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ 2, 3లను రామగుండం రీజియన్ రక్షణ జీఎం మధుసూదన్ శుక్రవారం పరిశీలించారు. ఏరియా జీఎం రాజేశ్వర్రెడ్డితో మొదటగా వ్యూ పాయింట్ వద్దకు చేరుకొని ఉపరితల గని ప్లాన్లను పరిశీలించి ఉపరితల గనులలో జరుగుతున్న పని విధానాలు, స్థితిగతులు, యంత్రాల పనితీరును తెలుసుకున్నారు. ఏరియాలో సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి తగు ప్రణాళికలు సిద్ధంచేసుకొని రక్షణకు ప్రాధాన్యత ఇస్తూ బొగ్గు ఉత్పత్తిని సాధించాలని సూచించారు. ప్రతీ ఉద్యోగి నిబంధనలు పాటించాలని, ఉద్యోగులందరూ రక్షణ పరికరాలను ఉపయోగించి సమష్టిగా కృషిచేసి ఉత్పత్తి శాతాన్ని పెంచి సంస్థ మనుగడకు తోడ్పడాలని రక్షణ జీఎం కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం కవీంద్ర, ఏరియా సేఫ్టీ అధికారి ప్రసాద్, అధికారులు శ్యాంసుందర్, రమాకాంత్, క్రిష్ణయ్య, భిక్షమయ్య, శ్రీనివాస్, రాజారావు పాల్గొన్నారు. అంబులెన్స్ వాహనాల తనిఖీ భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని 108, 102, నియోనటల్ అంబులెన్స్ వాహనాలను శుక్రవారం ఉమ్మడి వరంగల్ క్లస్టర్ మేనేజర్ నసీరుద్దీన్ తనిఖీ చేశారు. అంబులెన్స్లను తనిఖీచేసి రికార్డులను పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ వచ్చిన వెంటనే వాహనం బయలుదేరాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మేనేజర్ నరేష్, టెక్నీషియన్, పైలెట్లు సుజాత, నరేష్, విజేందర్, రాజశేఖర్, సురేష్ పాల్గొన్నారు. గీత కార్మికుడికి తీవ్రగాయాలు రేగొండ: గీత కార్మికుడు తాటిచెట్టు పై నుంచి జారీపడటంతో తీవ్ర గాయాలైన ఘటన మండలకేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలకేంద్రానికి చెందిన గీత కార్మికుడు ఓరుగంటి సాయిలు వృత్తిలో భాగంగా శుక్రవారం తాటి చెట్టు ఎక్కి కిందికి దిగుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు కింద జారిపడ్డాడు. దీంతో సాయిలుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనంలో పరకాల ప్రభుత్వాస్పత్రికి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. మొక్కలను సిద్ధంచేయాలి కాటారం: వన మహోత్సవానికి మొక్కలు సిద్ధం చేయాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి బాలకృష్ణ అన్నారు. మండలకేంద్రంలోని వననర్సరీని శుక్రవారం డీఆర్డీఓ పరిశీలించారు. మొక్కలను జాగ్రత్తగా పెంచాలని.. ప్రతీ మొక్క ఎదిగేలా చూడాలన్నారు. లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటాలని ఆదేశించారు. డీఆర్డీఓ వెంట ఏపీఓ వెంకన్న, ఫ్లాంటేషన్ మేనేజర్ శ్రీకాంత్, టీఏ మనోజ్, పంచాయతీ కార్యదర్శి షగీర్ఖాన్ ఉన్నారు. జాతీయ ఉత్తమ అవార్డులకు దరఖాస్తుల స్వీకరణ భూపాలపల్లి అర్బన్: జిల్లాలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుల నుంచి జాతీయ స్థాయి ఉత్తమ అవార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూలై 13వ తేదీ వరకు నేషనల్ అవార్డ్సు టీచర్స్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హత ఆసక్తి గల ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాన్నారు. -
మహిళలపై దాడులను అరికట్టాలి
భూపాలపల్లి అర్బన్: మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులను అరికట్టాలని భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎన్ఎఫ్ఐడబ్ల్యూ) జిల్లా కార్యదర్శి కొరిమి సుగుణ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని రావినారాయణరెడ్డి భవన్లో (ఎన్ఎఫ్ఐడబ్ల్యూ) నిర్మాణ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సుగుణ మాట్లాడుతూ.. దేశం, రాష్ట్రంలో మహిళలపై అనేక అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వాలు వాటిని అరికట్టడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. మహిళలపై జరుగుతున్న అత్యాచార దాడులను అరికట్టేందుకు దేశంలో నూతన చట్టాలు తీసుకురావాలని కోరారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించి మహిళలు రాజకీయాల్లో రాణించే విధంగా అవకాశాలు కల్పించాలన్నారు. మహిళల అభివృద్ధికి ప్రభుత్వాలు తోడ్పాటునందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు గోలి లావణ్య, పెద్దమామల సంధ్య, క్యాతరాజు అనూష, పల్లెల రజిత, గడ్డం స్వరూప, కటకోళ్ల భారతి, ఇటుకల శ్రీలత పాల్గొన్నారు. -
కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు
కాటారం: కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. కాటారం డివిజన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలకు సీఎస్ఆర్ నిధుల ద్వారా సమకూర్చిన 600 డెస్క్ బెంచీలను కాటారం మండలకేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం మంత్రి పంపిణీ చేశారు. పాఠశాలలో లైబ్రరీని ప్రారంభించారు. అనంతరం మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ విద్యార్థులకు ఉచితంగా యూనిఫాం, పుస్తకాలు, నోట్బుక్కులు అందజేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు, ఉపాధ్యాయులను సంక్రాంతి, దసరా సెలవుల్లో హైదరాబాద్, ఢిల్లీ లాంటి నగరాలకు తీసుకెళ్లే కార్యక్రమం చేపడుతామన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల సంఖ్య, హాజరుశాతం పెంచేందుకు కృషిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్శర్మ, సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, డీఈఓ రాజేందర్, ఎంఈఓ శ్రీదేవి పాల్గొన్నారు. పార్టీ బలోపేతం దిశగా చర్యలు.. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా అధిష్టానం చర్యలు తీసుకుంటుందని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. కాటారం మండలకేంద్రంలో మండల సంస్థాగత ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. మంత్రి శ్రీధర్బాబుతో పాటు ట్రేడ్ ప్రమోషన్ కమిషన్ చైర్మన్ ఐత ప్రకాశ్రెడ్డి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, జిల్లా పరిశీలకులు లింగాజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్థానిక సంస్థలకు త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయని వేలాది మంది కార్యకర్తలకు పదవులు దక్కే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు చీమల సందీప్, మండల అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్రెడ్డి, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, యూత్ అధ్యక్షుడు మహేశ్గౌడ్ పాల్గొన్నారు. రవాణా సౌకర్యం మొరుగుమల్హర్: గ్రామీణా ప్రాంతం నుంచి జిల్లా కేంద్రానికి రవాణా వ్యవస్థను మెరుగుపరిచి, మండల ప్రజలకు జిల్లా కేంద్రాన్ని మరింత దూరభారం తగ్గిస్తామని ఐటీ, పరిశమ్రల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. మండలంలోని పెద్దతూండ్ల కిషన్రావుపల్లి అటవీ ప్రాంతం నుంచి భూపాలపల్లి వన్ఇంక్లయిన్ మైన్ వరకు రూ. 4.70 కోట్లతో నిర్మించే రోడ్డును శుక్రవారం మంత్రి శ్రీధర్బాబు భూమి పూజ నిర్వహించారు. తాడిచర్ల పాత గ్రామ పంచాయతీలో చిల్డ్రన్ పార్కును శ్రీధర్బాబు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాడిచర్ల 132/33కేవీలైన్ సబ్స్టేషన్ ఏర్పాటుకు సన్నాహలు చేస్తున్నామన్నారు. కొయ్యూరు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ రిపేర్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించామని, త్వరలోనే తీసుకువస్తామని వివరించారు. పెద్దతాడిచర్ల డేంజర్ జోన్ సమస్య త్వరలోనే పరిష్కరిస్తామని హమీఇచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్రెడ్డి, కలెక్టర్ రాహుల్శర్మ, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, పీఏసీఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య పాల్గొన్నారు. సైనికుల్లా పనిచేయాలిగ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలపడేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. తాడిచర్లలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బడితెల రాజయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి మంత్రి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్రెడ్డి, మండల అధ్యక్షుడు బడితెల రాజయ్య, మాజీ ఎంపీపీ మల్హల్రావు, అయిత రాజిరెడ్డి, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు దండు రమేశ్ పాల్గొన్నారు.రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు -
అక్రమ అరెస్ట్ అమానుషం
కాటారం: గ్రామపంచాయతీ కారోబార్లు, వర్కర్లను అక్రమంగా అరెస్ట్ చేయడం అమానుషమని తెలంగాణ ఎంప్లయీస్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్ దోమల శ్రీనివాస్ అన్నారు. హైదరాబాద్లో సీఐటీయూ ఆధ్వర్యంలో తలపెట్టిన ధర్నాకు కారోబార్లు, సిబ్బంది వెళ్లకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మండలంలోని పలువురు కారోబార్లు, సిబ్బందిని గురువారం అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. తమ యూనియన్ నుంచి ముట్టడికి పిలుపునివ్వలేదని మరో యూనియన్ తలపెట్టిన ధర్నాకు తమకు సంబంధం లేదన్నారు. పోలీసులకు వివరించినప్పటికీ వినిపించుకోలేదని రాత్రి నుంచి సాయంత్రం వరకు స్టేషన్లో ఉంచారని ఆరోపించారు. పోలీసులు వివరాలు తెలుసుకోకుండా అక్రమ నిర్బంధం చేయడం బాధాకరమని శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు మెండ మల్లికార్జున్రావు, చిట్యాల శశికుమార్, బొర్లకుంట రవి, ఆత్కూరి రవి, కొండయ్య ఉన్నారు. -
కపాలినీ, భగమాలినీ క్రమాల్లో భద్రకాళి అమ్మవారు
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో జరుగుతున్న శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం అమ్మవారికి కపాలినీ, భగమాలినీ క్రమాలలో పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు ఉదయం 4 గంటల నుంచి సుప్రభాతసేవ, నిత్యాహ్నికం, క్షీరాన్న నివేదన, చతుఃస్థానార్చన తదితర పూజలు నిర్వహించారు. దశ మహావిద్యల్లోని కాళీక్రమాన్ని అనుసరించి స్నపనభేరాన్ని కపాలినిగా, షోఢశీక్రమాన్ని అనుసరించి భోగబేరాన్ని భగమాలినిగా అలంకరించి నవరాత్ర విశేష పూజలు జరిపారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి పూజలు జరుపుకున్నారు. సినీ నటులు కొణిదెల నాగబాబు సతీమణి పద్మజ అమ్మవారిని దర్శించుకున్నారు. -
వెలికితీస్తే వెలుగులెన్నో
1980వ దశకంలో మొదటిసారి రైతుపొలంలో నల్లబంగారం● 1992–94లో ఓఎన్జీసీ, సింగరేణి సంయుక్త పరిశోధనలు ● నక్సలైట్లు యంత్రాలను కాల్చడంతో ఆగిన ప్రయత్నాలు ● 2018లో పొలంలో బోరు వేయడంతో మరోసారి బయటపడిన బొగ్గు ● సింగరేణి సంస్థ వెలికి తీస్తే ఉపాధి, అభివృద్ధిచండ్రుపల్లిలో బోరు వేస్తుండగా బయటకు వచ్చిన నల్లని చూర (ఫైల్) కాళేశ్వరం: అపారమైన సహజ సంపదకు కేరాఫ్ మహదేవపూర్ ప్రాంతం. ఒకప్పుడు టేకు కలప విరివిగా దొరికేది. ప్రస్తుతం ఇసుకతో ప్రభుత్వానికి నిత్యం ఆదాయం వస్తోంది. ఈ ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలను సైతం వెలికితీస్తే యువతకు ఉపాధి అవకాశాలతో పాటు ఈప్రాంతమంతా అభివృద్ధితో పోటీ పడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ఈప్రాంతం ప్రపంచ స్థాయి గుర్తింపునకు చేరింది. కాగా, మహదేవపూర్ మండలం చండ్రుపల్లి పరిసర ప్రాంతాల్లో బొగ్గు నిక్షేపాలు విరివిగా ఉన్నట్లు పరిశోధనలతో తేలింది. సంబంధిత సంస్థలు బొగ్గు వెలికితీత, సర్వేలు చేపడితే భవిష్యత్లో మహదేవపూర్ సహజ ఖనిజ సంపదకు చిరునామాగా నిలవనుంది. కానీ.. సింగరేణి ఇక్కడి కొత్త ప్రాజెక్టులపై దృష్టిసారించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొదటిసారి ఆనవాళ్లు.. 1980–81లో చండ్రుపల్లిలో గోమాస మల్లయ్య అనే రైతు తన పొలంలో వ్యవసాయం కోసం బావిని తవ్వాడు. అప్పుడు కాళేశ్వరం పరిధి కన్నెపల్లి గ్రామానికి చెందిన ఓ బోరింగ్ నిర్వాహకుడు అప్పుడు ఆవిషయాన్ని ఆగ్రామస్తులెవ్వరికీ చెప్పలేదు. చెబితే గ్రామాన్ని ఖాళీ చేయిస్తారని భయపడ్డాడు. ఆతర్వాత 1986లో బావి తవ్వకంలో బొగ్గు ఆనవాళ్లు బయటపడ్డాయని బోరింగ్ నిర్వాహకుడు మండల ప్రజలతో చెప్పడంతో ఆవిషయం బయటకు పొక్కింది. అప్పుడు.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే.. 2004లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి మంత్రి వర్గంలో గడ్డం వినోద్ కార్మికశాఖ మంత్రిగా ఇక్కడ బొగ్గు వెలికితీసే ప్రయత్నాలు చేశారు. మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, కార్మికశాఖ మంత్రులుగా దుద్దిళ్ల శ్రీధర్బాబు, గడ్డం వివేక్ ఉండడంతో పాటు ఎంపీగా గడ్డం వంశీకృష్ణ ఉన్నారు. ఈప్రాంతంలో బొగ్గు గనులు ఏర్పాటు చేస్తే ఇక్కడి యువతకు ఉపాధి దొరుకుతుంది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అసెంబ్లీ, పార్లమెంట్లో గళం విప్పి బొగ్గు వెలికితీయాలని, ఈ ప్రాంత అభివృద్ధిపై దృష్టిసారించాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. నా పొలంలో బొగ్గు పడింది.. నాకు చండ్రుపల్లిలో ఐదెకరాల పొలం ఉంది. 2018లో బోరు వేయించాను. నల్లని బొగ్గు బిల్లలతో 35–40 ఫీట్ల నుంచి బయటకు వచ్చింది. బొగ్గు పడిందని మొదట భయమైంది. 250 ఫీట్ల నుంచి నీళ్లు పడ్డాయి. మాఊళ్లో ఎవరు బోరు వేసినా నల్లని బిళ్లలు పడుతున్నాయి. అధికారులు సర్వే చేపడితే యువతకు ఉపాధి దొరుకుతుంది. ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. నేను బోరు వేసిన మరుసటి రోజు సింగరేణి రామగుండం సర్వే డిపార్ట్మెంట్ వాళ్లు సర్వే చేసి వెళ్లారు. కానీ.. ఇప్పటికి ఎలాంటి పరిశోధనలు చేయలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో సర్వేపై ఆశలు ఉన్నాయి. – జాడి సురేందర్, చంద్రుపల్లి, రైతునక్సలైట్ల హెచ్చరికలు.. సీనియర్ జియాలజిస్ట్ కోనప్ప ఆధ్వర్యంలో 1992–94లో ఓఎన్జీసీ(ఆయిల్ నేచర్ గ్యాస్ సంస్థ) బొగ్గు ఉన్నట్లు పరిశోధన చేసి కనిపెట్టారు. గ్రేడ్ బి, సీ బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నట్లు ధ్రువీకరించారు. సింగరేణి సంస్థ కూడా చండ్రుపల్లి, నాగేపల్లి, అన్నారం, సస్తూర్పల్లి, తాడిచర్ల ప్రాంతాల్లో బొగ్గు కోసం పలు భారీ వాహనాలతో అన్వేషిస్తూ పరిశోధనలు జరిపింది. మల్హర్ మండలం తాడిచర్లలో కూడా బొగ్గు ఉన్నట్లు అదే సమయంలో కనుగొన్నారు. మహదేవపూర్–1, చండ్రుపల్లి బ్లాకులుగా బొగ్గు గురించి అన్వేషణ చేశారు. అప్పుడే పలిమెల మండలంలోని లెంకలగడ్డ, సర్వాయిపేటలో కూడా బొగ్గు గురించి సర్వే చేశారు. ఆ సమయంలో మహదేవపూర్ ప్రాంతంలో నక్సలైట్ల ప్రభావం ఎక్కువగా ఉండేది. అభయారణ్యం కావడంతో పోలీసులు కూడా వచ్చే పరిస్థితి లేదు. కాగా.. చండ్రుపల్లి శివారులో ఉన్న సింగేణి సంస్థ భారీ యంత్రాలు, డ్రిల్లింగ్ మిషన్లను నక్సలైట్లు కాల్చివేశారు. బొగ్గు నిక్షేపాల వెలికితీతను నిలిపివేయాలని హెచ్చరించారు. దీంతో ఆసంస్థలు పరిశోధనలు నిలిపాయి. సర్వే అధికారులు వెనుదిరిగి వెళ్లారు. అర్ధంతరంగా నిక్షేపాల వెలికితీతను నిలిపివేశారు. అనంతరం అప్పటి నుంచి ఇప్పటి వరకు బొగ్గు వెలికితీతపై సింగరేణి, ఆయా ప్రభుత్వాలు దృష్టి సారించలేదు. రైతు పొలంలో బొగ్గు గోదావరి తీర ప్రాంతమైన చండ్రుపల్లిలో 2018లో అదే గ్రామానికి చెందిన రైతు జాడి సురేందర్ పొలంలో బోరు వేయించాడు. 40 ఫీట్ల లోతుకు వెళ్లగానే నల్ల రంగులో బొగ్గు రూపంలో బిల్లలు బయటకు వచ్చాయి. బోరు ప్రాంతమంతా బొగ్గు వాసన వచ్చింది. దీంతో రైతులకు బొగ్గు కనబడడంతో అవాక్కయ్యాడు. అప్పట్లో ఆ విషయం మండలంలో చర్చనీయాంశం. -
ఈవీఎం గోదాం వద్ద పటిష్ట భద్రత
భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాం వద్ద పటిష్ట భద్రత ఉండాలని కలెక్టర్ రాహుల్శర్మ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఈవీఎం, వీవీ ప్యాట్ గోదాంలను గురువారం కలెక్టర్ పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లు, గోదాం నిర్వహణ, సీసీ కెమెరాల పనితీరు, రౌండ్ ది క్లాక్ మానిటరింగ్ అంశాలను ఆయన సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు గోదాంలో భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నామన్నారు. అనంతరం తనిఖీ రిజిస్టర్లో సంతకం చేశారు. ఈతనిఖీలో ఎన్నికల విభాగం డీటీ అబ్బాస్, ఐటీ పర్సన్ నవీన్, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
లక్ష్యం మేర రుణాలు మంజూరు చేయాలి
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో ప్రతీ సెక్టార్కు నిర్దేశించిన లక్ష్యం మేర బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ రాహుల్ శర్మ అధ్యక్షతన జిల్లా స్థాయి కన్సల్టేటివ్ కమిటీ (డీసీసీ), జిల్లా స్థాయి రివ్యూ కమిటీ (డీఎల్ఆర్సీ) సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో జిల్లాలోని బ్యాంకుల రుణాలు, లావాదేవీలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు, వార్షిక క్రెడిట్ ప్లాన్ 2024–25 ప్రకారం మార్చి 31 నాటికి బ్యాంకుల ప్రగతిని సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 2024–25 ఆర్థిక సంవత్సరం మొత్తం రుణాల లక్ష్యం: రూ.2,565.06 కోట్లుగా నిర్ణయించగా.. రూ.1,923.32 కోట్లు సాధించడం ద్వారా 74.98 శాతం పురోగతి సాధించినట్లు వివరించారు. వ్యవసాయ రంగంలో రూ.2,055.42 కోట్ల లక్ష్యంతో పోలిస్తే రూ.1,219.48 కోట్లు మంజూరు చేసి 59.33 శాతం పురోగతి సాధించినట్లు తెలిపారు. షార్ట్ టర్మ్ క్రాప్ రుణాలు రూ.1,344.57 కోట్లు కాగా.. రూ.660.10 కోట్లు లక్ష్యం సాధించారని తెలిపారు. ఎంఎస్ఎంఈ రంగంలో రూ.96.73 కోట్లు రుణాలు మంజూరు లక్ష్యం కాగా.. రూ.60.77 కోట్లు, విద్యా రుణాలు రూ.18.01 కోట్లు లక్ష్యం కాగా.. రూ.7.23 కోట్లు, గృహ నిర్మాణ రుణాలు రూ.52.76 కోట్లు లక్ష్యం కాగా 3.14 కోట్లు మాత్రమే ఇచ్చారని రుణాలు మంజూరు పురోగతితో వెనుకబాటులో ఉన్నదని లక్ష్యం మేర రుణాలు మంజూరు చేయాలని సూచించారు. ఇతర ప్రాధాన్యతా రంగాలకు రూ.12.37 కోట్లు రుణాలు 38.48 కోట్లు రుణాలు మంజూరు చేశారన్నారు. నాన్ ప్రియార్టీ రంగంలో రూ.330.77 కోట్ల లక్ష్యంతో పోలిస్తే రూ.594.22 కోట్లు మంజూరు చేయడం ద్వారా 179.65 శాతం పురోగతి సాధించినట్లు తెలిపారు. పురోగతి పెంచాలి.. బ్యాంకర్లు వ్యవసాయ, విద్యా, గృహ రుణాలు. మంజూరు చేయాలని, గ్రామీణాభివృద్ధికి మరింత కృషి చేయాలని, ముఖ్యంగా హౌసింగ్ లోన్లు, విద్యా లోన్లలో పురోగతి పెంచాలని సూచించారు. రైతులకు, చిన్న, మధ్య తరహా వ్యాపారాల వారికి అవసరమైన క్రెడిట్ సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని బ్యాంకర్లను ఆదేశించారు. కొత్తపల్లి (గోరి), చల్లగరిగే తెలంగాణ గ్రామీణ బ్యాంకు సేవలపై రైతులు నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే ఉంటే స్టేట్ కమిటీకి ఫిర్యాదు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధికి బ్యాంక్ లింకేజీ రుణాలివ్వాలని సూచించారు. అ నంతరం 2025–26 జిల్లా వార్షిక రుణ ప్రణాళిక 2,920.33 కోట్లను ఆమోదించి, వార్షిక రుణ ప్రణాళిక పుస్తకాలను ఆవిష్కరించారు. సమావేశంలో ఎల్డీఎం తిరుపతి, ఆర్బీఐ ఎల్డీఓ సాయి తేజారెడ్డి, నాబార్డు డీడీఎం చంద్రశేఖర్, ఎస్బీఐ ఆర్ఎం సుబ్బారావు, టీజీబీ ఆర్ఎం ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఆర్థిక సంవత్సర రుణ లక్ష్యం రూ.2,920.33 కోట్లు కలెక్టర్ రాహుల్ శర్మ ఆధ్వర్యంలో డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశం -
అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ
భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని గురువారం ఆవిష్కరించారు. ఈకార్యక్రమానికి ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆంతోటి నాగేశ్వర్రావుతో కలిసి ఏరియా జీఎం రాజేశ్వర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఏరియా జీఎం మాట్లాడుతూ.. స్వతంత్ర భారతదేశ ప్రగతికి అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగం దిశా నిర్దేశం చేసిందన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల కారణంగానే ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛా, సమానత్వం, సమాన అవకాశాలు లభించాయన్నారు. కార్యక్రమంలో అధికారులు అసోసియేషన్ నాయకులు కవీంద్ర, జ్యోతి, ఎర్రన్న, సురేఖ, మారుతి, రజిని, ప్రదీప్, బాలరాజు, చంద్రశేఖర్రావు, ఎంవీ రావు, వెంకటేశ్వర్లు, రాయమల్లు, చక్రపాణి, రమేశ్, మధుకర్రెడ్డి పాల్గొన్నారు. -
సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి
భూపాలపల్లి అర్బన్: వచ్చే నెల 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ పిలుపునిచ్చారు. భూపాలపల్లి ఏరియాలోని కొమురయ్య భవనంలో గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బ్రిటిష్ కాలం నుంచి ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం నాలుగు కోడ్లుగా విభజించి కార్మిక హక్కులను కాలరాస్తోందన్నారు. ఈనాలుగు కోడ్లను వెంటనే రద్దు చేయాలని కోరుతూ.. జూలై 9న బీఎంఎస్ మినహా అన్ని కార్మిక సంఘాలు ఒక్కరోజు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. సింగరేణిలో 2009లో ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా ఉన్న సమయంలో అగ్రిమెంట్ ప్రకారం మెడికల్ అన్ఫిట్ అయిన కార్మికులకు సర్ఫేస్లో సూటబుల్ జాబ్ ఇవ్వాలని తీర్మానించినట్లు తెలిపారు. పదేళ్లుగా టీబీజీకేఎస్ స్టక్చ్రర్ మీటింగ్లు నిర్వహించలేదని, ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా గెలవడంతో అనేక సమస్యలను స్టక్చ్రర్ మీటింగ్లో యాజమాన్యానికి తెలిపినట్లు, అన్ని అంగీకరించినప్పటికీ ఇంకా సర్క్యూలర్ జారీ కాలేదని, సర్క్యూలర్ జారీ చేయాలని యాజమాన్యాన్ని కోరినట్లు తెలిపారు. గని ప్రమాదాల్లో చనిపోతే కార్మికుడి కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాలని ఏఐటీయూసీగా డిమాండ్ చేయగా.. అందుకు అన్ని బ్యాంకుల్లో కోటి రూపాయల ఇన్సూరెన్స్ పాలసీని తీసుకొచ్చినట్లు యాజమాన్యం చేసిందన్నారు. సమావేశంలో కేంద్ర, రాష్ట్ర కమిటీ నాయకులు అక్బర్ అలీ, ఎల్లయ్య, వీరభద్రం, వైవీరావు, సమ్మయ్య, మోటపలుకుల రమేశ్, మాతంగి రామచందర్, సుధాకర్రెడ్డి, చంద్రమౌళి, మల్లికార్జున్, నాగేంద్రబాబు పాల్గొన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య -
‘మత్తు’ నివారణలో తల్లిదండ్రుల పాత్ర కీలకం
భూపాలపల్లి అర్బన్: మత్తు పదార్థాల నివారణలో తల్లిదండ్రుల పాత్ర కీలకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్.రమేశ్బాబు సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం నుంచి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వరకు నిర్వహించిన అంతర్జాతీయ మత్తు పదార్థాల నివారణ ర్యాలీని కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ కిరణ్ఖరే జెండా ఊపి ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. డ్రగ్స్ భూతాన్ని తరిమేయాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు పిల్లల అలవాట్లను నిశితంగా గమనించాలన్నారు. డ్రగ్స్ భూతాన్ని తరిమేయడంలో సహాయం కావాల్సిన వారు జిల్లా న్యాయసేవాధికార సంస్థ, పోలీసు శాఖను సంప్రదించాలని సూచించారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. డ్రగ్స్ను తరిమేయడంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమన్నారు. మత్తుపదార్థాల నిర్మూలన కోసం కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాజు, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్ఆర్ దిలీప్కుమార్నాయక్, అడిషన ల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల, అడిషనల్ కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, అడిషనల్ ఎస్పీ నరేశ్కుమార్, సింగరేణి జీఎం రాజేశ్వర్రెడ్డి, వివిధ శా ఖల అధికారులు మల్లీశ్వరి, శ్రీనివాస్, రాజేందర్, పోలీసులు, న్యాయవాదులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్ రమేశ్బాబు -
భద్రకాళి అమ్మవారికి సహస్ర కలశాభిషేకం
శాకంబరీ నవరాత్రి మహోత్సవాల సందర్భంగా అమ్మవారి అలంకరణహన్మకొండ కల్చరల్: వరంగల్ నగరంలోని శ్రీభద్రకాళి దేవాలయంలో శాకంబరీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం అమ్మవారికి సహస్ర కలశాభిషేకోత్సవం శోభాయమానంగా జరిగింది. ‘కుడా’ చెర్మన్ ఇనగాల వెంక్రటామిరెడ్డి, దేవాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ డాక్టర్ శివసుబ్రహ్మణ్యం అమ్మవారి సన్నిధిలో జ్యోతిప్రజ్వలనం చేసి ఉత్సవాలను ప్రారంభించారు. సహస్ర కళశాభిషేకం మధ్యాహ్నం ప్రారంభమైంది. భద్రకాళి పంచమూర్తులకు, శ్రీచక్రానికి అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారిని కాళీక్రమంలో అలంకరించారు. రాత్రి కామేశ్వరీ నిత్యాక్రమంలో ఆవరణార్చనలు జరిపారు. భక్తులతో దేవాలయం కిక్కిరిసిపోయింది. భద్రకాళి శరణం మమ అంటూ జయజయధ్వానాలు చేస్తూ పులకించిపోయారు. ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ శేషు భారతి, సూపరింటెండెంట్ అద్దంకి విజయ్కుమార్, ఆలయ ధర్మకర్తలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని శుక్రవారం ఉదయం కపాలినీ క్రమంలో, సాయంత్రం భగమాలినీక్రమంలో పూజలు జరపనున్నారు. శాకంబరీ ఉత్సవాలు ప్రారంభం -
విద్యార్థులకు టీషర్టుల పంపిణీ
చిట్యాల: మండలంలోని జూకల్ ఉన్నత పాఠశాలలో నూతనంగా చేరిన విద్యార్థులకు అదే గ్రామానికి చెందిన పూర్వ విద్యార్థి మెరుగు రాజ్కుమార్ యాదవ్ తన సొంత డబ్బులతో 20 మంది విద్యార్థులకు టీషర్టులను మాజీ సర్పంచ్ పుట్టపాక మహేందర్, మాజీ ఎంపీటీసీ జంబుల తిరుపతి చేతుల మీదుగా గురువారం పంపిణీ చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదువుకోవాలని కోరారు. ప్రభుత్వం పాఠశాలలోనే మెరుగైన వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు మానసికంగా, శారీరకంగా అభివృద్ధి చెందేందుకు ఇలాంటి కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయన్నారు. కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ చాడ అనంద్రెడ్డి, మాజీ ఎస్ఎంసీ చైర్మన్ దొంతి రాంరెడ్డి, చేయూత స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి మేదరి సునీల్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గిరగాని కృష్ణ, ఉపాధ్యాయులు రాధికారాణి, ఉమాదేవి, స్వరూప, రూపశ్రీ, ఎండి.రఫీ, గ్రామస్తులు రేగూరి కుమార్రెడ్డి, శ్రీనివాస్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
సింగరేణి పైరవీకారులపై ఏసీబీ దాడులు
భూపాలపల్లి అర్బన్: సింగరేణి పైరవీకారులపై విజిలెన్స్ విచారణతోపాటు ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. సింగరేణిలో అవినీతి పెరిగిపోవడంతో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏసీబీ నిఘా పెట్టింది. సింగరేణి మెడికల్ బోర్డులో అవినీతి చాపకింద నీరులా విస్తరిస్తుంది. పలువురు సింగరేణి కార్మిక సంఘాల నాయకులు, చోట మొటా కార్మికులు సైతం లంచావతారమెత్తి సంస్థకు చెడు పేరును తీసుకొస్తున్నారు. ఈక్రమంలో భూపాలపల్లి ఏరియా కేటీకే 1వ గనిలో విధులు నిర్వర్తిస్తున్న సింగరేణి కార్మికుడు సాదర్ల ప్రశాంత్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది నుంచి విచారణ గతేడాది జనవరిలో మెడికల్ బోర్డులో జరుగుతున్న అవినీతి వ్యవహారంపై సంస్థ దృష్టి సారించింది. అందులో భాగంగా కారుణ్య నియామకాల్లో జరిగే అవినీతిపై నజర్ పెట్టాల్సిందిగా కోరుతూ సీఐడీ, ఏసీబీలను కోరుతూ 2024 జనవరిలో లేఖలు రాసింది. ఎవరైనా డబ్బులు అడిగితే ఫిర్యాదు చే యాలంటూ సంస్థ కోరింది. అప్పటికే ఆరేడేళ్లుగా ఈ దందా సాగుతుండడంతో ఫిర్యాదులు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో గతేడాది మేలో మెడికల్ బోర్డు అవినీతిపై కచ్చితమైన సమాచారం అందిస్తే రూ.10వేల బహుమతి అందిస్తామని, వివరాలు గోప్యంగా ఉంచుతామని సంస్థ పే ర్కొంది. అవినీతి వివరాలు తెలిపేందుకు ప్రత్యేకంగా 94911 44104 వాట్సాప్ నంబర్ అందుబాటులోకి తెవడంతో ఫిర్యాదు రావడం మొదలైంది. రూ.లక్షల్లో వసూళ్లు సింగరేణి సంస్థలో ఒకప్పుడు వారసత్వ ఉద్యోగాలు ఉండగా.. 90వ దశకంలో ఈ విధానాన్ని రద్దు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వారసత్వ ఉద్యోగాల అంశం తెరమీదకు వచ్చింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారసత్వ ఉద్యోగాలను పునరుద్దరించేందుకు ప్రయత్నిస్తే.. చట్టపరమైన చిక్కులు ఎదురయ్యాయి. దీంతో వారసత్వ ఉద్యోగాలకు అనధికారిక ప్రత్యామ్నాయంగా 2017లో కారుణ్య నియామకాలు తిరిగి మొదలయ్యాయి. అయితే కార్మికుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొంత మంది దళారులు డబ్బులు ఇస్తేనే ఉద్యోగాలు వస్తాయంటూ ప్రచారం చేశారు. చివరకు ఈ ప్రచారం బహిరంగంగానే స్థిరపడిపోయి ఒక్కో ఉద్యోగానికి కార్మికులు కనిష్టంగా రూ.ఐదు లక్షలు సిండికేట్కు ముట్టచెబితే తప్ప పని కాదనే నమ్మకానికొచ్చారు కారుణ్య నియామకాలకు వెళ్లే కార్మికులు. ప్రత్యేక నిఘా పెట్టి.. సింగరేణి కారుణ్య నియామకాల దందాపై సీబీఐ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. వేర్వేరు ఫోన్ కాల్స్ ద్వారా అందిన సమాచారాన్ని విశ్లేషించి, పక్కా ఆధారాలతో ఈ ఏడాది మే 6న కొత్తగూడెం మెయిన్ వర్క్షాపులో పని చేస్తున్న అన్నెబోయిన రాజేశ్వరరావు అనే ఉద్యోగిని ఏసీబీ అధికారులు టార్గెట్ చేశారు. అతని బ్యాంక్ ఖాతాల్లో రూ.32 లక్షల విలువైన నగదు ఉన్నట్టుగా గుర్తించారు. అతన్ని విచారిస్తే లభించిన సమాచారం. అప్పటికే తమ దగ్గరున్న వివరాలు, ఫిర్యాదుదారులు చెప్పిన అంశాలను బేరీజు వేసుకుని సరిగ్గా నెల రోజుల తర్వాత జూన్ 5న కొత్తగూడెం పట్టణంలో మరో మహిళ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ప్రస్తుతం ఆమె నుంచి వివరాలు రాబట్టే పని చేస్తున్నారు. వారి విచారణలో భూపాలపల్లి ఏరియాకు చెందిన ప్రశాంత్ సమాచారం బయటికి వచ్చింది. అంతేకాకుండా డబ్బులిస్తే కారుణ్య నియామకాల్లో ఉద్యోగాలు పెట్టిస్తామని డబ్బులు దండుకుంటున్న సంస్థేతర వ్యక్తులకు సంస్థలో ఉన్న ఉద్యోగులకు మధ్య జరిగిన లావాదేవీలపై పక్కా ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. ఏసీబీ అధికారుల అదుపులో సింగరేణి కార్మికుడుభూపాలపల్లి ఏరియాలోని కేటీకే 1వ గనిలో విధులు నిర్వర్తిస్తున్న సింగరేణి కార్మికుడు సాదర్ల ప్రశాంత్ను బుధవారం ఉదయం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం ఏసీబీ డీఎస్పీ రమేష్, బృందం పట్టణంలోని ప్రశాంత్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. బ్యాంక్ అకౌంట్లు పరిశీలించి సెల్ఫోన్ తనిఖీ చేసి వారి వెంట తీసుకువెళ్లి వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరుపర్చినట్లు సమాచారం. సింగరేణి కారుణ్య నియామకాలు, కార్మికులను బదిలీలు చేయించేందుకు పలువురు కార్మికుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఏసీబీ అధికారులు నిర్ధారించారు. కొత్తగూడెం ఏరియాలోని రాజేశ్వర్రావు అనే కార్మికుడితో కలిసి పైరవీలకు పాల్పడ్డాడని గుర్తించారు. గత ఏడాది నుంచి సింగరేణి వ్యాప్తంగా సింగరేణి విజిలెన్స్ విభాగం, ఏసీబీ అధికారులు విచారణ చేపడుతున్నారు. ఈ విచారణంలో ప్రశాంత్ పట్టుపడగా మరికొంతమంది పైరవీదారులు చిక్కే అవకాశం ఉంది. సింగరేణిలో యథేచ్ఛగా కారుణ్య నియామకాలు ఉద్యోగాల పేరిట కార్మిక కుటుంబాలపై వల ఏడాదిన్నరగా మెడికల్ దందాపై నజర్ దాడులు, అరెస్టులు ప్రారంభించిన ఏసీబీ అధికారులు -
బాలాజీ.. పీఎఫ్ బోలోజీ
హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతున్న జేబీఎంకు డ్రైవర్లను సమకూర్చిన శ్రీ బాలాజీ కన్సల్టెన్సీ పీఎఫ్, ఈఎస్ఐ పేరుతో జీతంలో కోత పెట్టింది. కానీ ఆ సొమ్మును పీఎఫ్ ఖాతాలో జమ చేయలేదు. మూడు నెలల పాటు జేబీఎంకు డ్రైవర్లను సమకూర్చిన శ్రీ బాలాజీ కన్సల్టెన్సీ తప్పుకున్న తర్వాత సిస్కాన్ ప్రస్తుతం రెండు నెలలకు పైగా డ్రైవర్లను సమకూరుస్తోంది. ఈ రెండు సంస్థలు గత ఐదు నెలలకుపైగా పీఎఫ్ ఖాతాలు ప్రారంభించలేదని, కానీ, జీతాల్లో కోత పెడుతున్నాయని డ్రైవర్లు వాపోతున్నారు. ఈ రెండు సంస్థలు కలిపి ఇప్పటివరకు ఐదు నెలల కాలానికి ఒక్కో డ్రైవర్ నుంచి నెలకు రూ.3 వేల చొప్పున కట్ చేశారు. 287 మంది డ్రైవర్లు జేబీఎం బస్సులు నడుపుతున్నారు. ఈ లెక్కన నెలకు రూ.8.61 లక్షలు వసూలు చేశారు. ఐదు నెలలకు 287 మందినుంచి రూ.43.05 లక్షలు కోత పెట్టారు. ఈ సొమ్ము ఎవరి చేతుల్లోకి వెళ్లిందని జేబీఎం డ్రైవర్లు ప్రశ్నిస్తున్నారు. 112 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయింపు.. టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజియన్కు ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం 112 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించింది. వీటిలో 19 సూపర్ లగ్జరీ, 18 డీలక్స్, 75 ఎక్స్ప్రెస్ బస్సులు ఉన్నాయి. జేబీఎం సంస్థ నిర్వహణలో ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. ఈ మేరకు టీజీఎస్ ఆర్టీసీతో ఒప్పందం చేసుకుంది. వీటిని జనవరి 6న రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ప్రారంభించారు. కన్సల్టెన్సీ ప్రతినిధి ఏమంటున్నారంటే.. ఈ విషయమై గతంలో శ్రీ బాలాజీ కన్సల్టెన్సీ ప్రతినిధిగా, ప్రస్తుతం సిస్కాన్ బాధ్యుడిగా పని చేస్తున్న వేణుమాధవ్ను వివరణ కోరగా త్వరలో డ్రైవర్లకు పీఎఫ్ ఖాతాలు ఓపెన్ చేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా పీఎఫ్, ఈఎస్ఐ పేరుతో వసూలు చేసిన సొమ్మును తిరిగి డ్రైవర్లకు జీతాలతో కలిపి చెల్లించనున్నట్లు చెప్పారు.జీతాలు ఓకే.. పీఎఫ్, ఈఎస్ఐ కోతలు ఎక్కడికెళ్లాయి..? జేబీఎం సంస్థకు శ్రీ బాలాజీ కన్సల్టెన్సీ డ్రైవర్లను సమకూర్చింది. మొదటి మూడు నెలలు డ్రైవర్లను అందించిన ఈ సంస్థ ఆ తరువాత తప్పుకుంది. ఈ స్థానంలో గత రెండు నెలలకు పైగా (జూన్తో 3 నెలలు) సిస్కాన్ డ్రైవర్లను సమకూరుస్తోంది. డ్రైవర్లను సమకూరుస్తున్నందుకు జేబీఎం.. ఆ సంస్థలకు చెల్లింపులు చేస్తోంది. శ్రీ బాలాజీ మూడు నెలలపాటు డ్రైవర్లకు జీతాలు చెల్లించింది. ఈ క్రమంలో పీఎఫ్, ఈఎస్ఐ పేరుతో నెలకు రూ.3 వేల చొప్పున జీతంలో కోత పెట్టిందని జేబీఎం డ్రైవర్లు తెలిపారు. గత రెండు నెలలు జీతం చెల్లించిన సిస్కాన్ కూడా నెలకు రూ.3 వేల చొప్పున కోత పెట్టిందని డ్రైవర్లు చెప్పారు. ఈ లెక్కన శ్రీ బాలాజీ కన్సల్టెన్సీ 287 మంది డ్రైవర్ల నుంచి మూడు నెలలకుగాను రూ.25.83 లక్షలు వసూలు చేసింది. అదే విధంగా సిస్కాన్ రెండు నెలలకు రూ.17.22లక్షలు వసూలు చేసిందని డ్రైవర్లు వివరించారు. అయినా ఐదు నెలలకుపైగా తమకు పీఎఫ్ ఖాతాలు ప్రారంభించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. తమ వద్ద వసూలు చేసిన సొమ్ము ఏమైందని ప్రశ్నిస్తున్నారు. వసూలు చేసిన సొమ్మును పీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తారా... నేరుగా తమకే తిరిగి చెల్లిస్తారా అని నిలదీస్తున్నారు. తమ జీతంలో కోత పెట్టి వసూలు చేసిన సొమ్మును కన్సల్టెన్సీ సంస్థలు సొంతానికి వాడుకుంటే ఊరుకునేది లేదని జేబీఎం డ్రైవర్లు హెచ్చరిస్తున్నారు. ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల పీఎఫ్ సొమ్ము కాజేస్తున్న కన్సల్టెన్సీలు.. మొదటి మూడు నెలలు జేబీఎంకు డ్రైవర్లను సమకూర్చిన శ్రీ బాలాజీ ఆ తరువాత తప్పుకుని సిస్కాన్కు అప్పగింత 287మంది డ్రైవర్ల వద్ద పీఎఫ్ కోసం రూ.3 వేల చొప్పున కోత ఐదు నెలలైనా పీఎఫ్ ఖాతాలు ప్రారంభించని శ్రీ బాలాజీ, సిస్కాన్ తమ సొమ్ము కాజేతపై ఆందోళన చెందుతున్న డ్రైవర్లు -
విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం
● టీజీఎంఎస్ఐడీసీ ఎండీ ఫణీందర్రెడ్డి భూపాలపల్లి అర్బన్: మెడికల్ కళాశాలలో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలంగాణ మెడికల్ సైన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఎంఎస్ఐడీసీ) ఎండీ ఫణీందర్రెడ్డి అన్నారు. కలెక్టర్ రాహుల్శర్మ, ఉస్మానియా వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజారావుతో కలిసి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల, జీజీహెచ్లను బుధవారం ఆయన పరిశీలించారు. నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కళాశాల, హాస్టల్, ఆస్పత్రి భవనాలతోపాటు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని వార్డులు, ప్రయోగశాలలు, తరగతి గదులు, పరికరాలను పరిశీలిస్తూ, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఈ సంవత్సరం ఎంబీబీఎ స్ అడ్మిషన్లు ప్రారంభమవుతున్న తరుణంలో వి ద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందు కు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర ప్రభు త్వ ఆదేశాల మేరకు వైద్య కళాశాల, ప్రభుత్వ ప్రధా న ఆస్పత్రిలో అన్ని విభాగాలను పరిశీలించి నివేదికను వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శికి సమర్పించనున్నట్లు తెలిపారు. కలెక్టర్ రాహుల్శర్మ మాట్లాడుతూ.. విద్యార్థుల వసతి సౌకర్యాలకు సింగరేణి సంస్థ నుంచి ప్రత్యేక బ్లాక్ కేటాయించనున్నట్లు తెలిపారు. నిర్మాణంలో ఉన్న బ్లాకులు, ల్యాబ్లు, మెడికల్ పరికరాలను పరిశీలించి తగిన సూచనలు ఇచ్చారు. వైద్యకళాశాల ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ నవీన్కుమార్, ఈఈ ప్రసాద్ పాల్గొన్నారు. -
మార్పు వచ్చింది..
సాక్షి, మహబూబాబాద్: జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం.. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల పనితీరు, విద్యార్థుల సామర్థ్యాలు మొదలైన ఆరు అంశాలపై నిర్వహించిన ఫెర్మార్మింగ్ గ్రేడ్ ఇండెక్స్(ఎఫ్జీఐ) నివేదిక మెరుగ్గా ఉంది. గత రెండు సంవత్సరాల కంటే.. గడిచిన విద్యాసంవత్సరంలో ఫలితాలు మెరుగ్గా ఉన్నట్లు స్పష్టం చేసింది. ఆరు అంశాల్లో 74 సూచికలకు 600 మార్కులు కేటాయించారు. ప్రతీ పాఠశాల నుంచి యూడైస్లో పొందుపర్చిన అంశాలను పరిశీలించి, సేకరించిన వివరాల ప్రకారం జాతీయ స్థాయిలో జిల్లాల వారీగా మార్కులు కేటాయించారు. ఆరు అంశాలుగా పరిశీలన.. ప్రభుత్వ పాఠశాల పనితీరుకు అద్దం పట్టే ప్రధాన అంశాలను పరిశీలించారు. ఇందులో ఆరు అంశాల్లో 74 సూచికలను పేర్కొని మార్కులు వేశారు. మొదటి అంశంగా.. అభ్యసన ఫలితాలు, సామర్థ్యాలు, సంబంధాలు, ఉపాధ్యాయుల లక్ష్యాలు, నైపుణ్యాలు, రెండో అంశం.. బోధన నిర్వహణ, పిల్లల ప్రతిస్పందన, మూడో అంశం.. మౌలిక సదుపాయాల కల్పన, సౌకర్యాలను పరిశీలించారు. అలాగే పాఠశాలల భద్రత, పిల్లల రక్షణ, డిజిటల్ లర్నింగ్, నిధుల వినియోగం, హాజరు పర్యవేక్షణ, పాఠశాలల్లో నాయకత్వ లక్షణాలు మొదలైన విషయాలను పరిశీలించారు. మొదటి రెండు అంశాల్లో గతం కంటే మెరుగైన మార్కులు సాధించగా.. మౌలిక వసతుల కల్పన, డిజిటల్ లర్నింగ్లో 2022–23 విద్యా సంవత్సరం కంటే 2023–24 విద్యా సంవత్సరంలో వెనకబడినట్లు తేలింది. అయితే గత విద్యా సంవత్సరం 2024–25లో మాత్రం అన్ని అంశాల్లో మెరుగుపడ్డామని, ఇందుకు ఈ ఏడాది పదో తరగతిలో సాధించిన ఫలితాలే నిదర్శనమని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. గతం కన్నా మెరుగు.. ఆరు అంశాల్లో 2022–23 విద్యా సంవత్సరం కంటే 2023–24 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల పనితీరు మెరుగు పడినట్లు స్పష్టమవుతోంది. ప్రధానంగా అభ్యసన ఫలితాలు, సమన్వయం, ఉపాధ్యాయుల పనితీరుపై మొత్తం 24 సూచికలకు 290 మార్కులు కేటాయించగా 2022–23 సంవత్సరంలో హనుమకొండ జిల్లా 109 మార్కులు సాధించింది. అత్యల్పంగా మహబూబాబాద్ జిల్లాకు 79 మార్కులు వచ్చాయి. అయితే 2023–24లో హనుమకొండ జిల్లాకు 122 మార్కులు రాగా మహబూబాబాద్కు 95 మార్కులొచ్చాయి. అలాగే మౌలిక సదుపాయాల కల్పనపై 12 సూచికల్లో 51 మార్కులకు 2022–23లో మహబూబాబాద్, హనుమకొండ జిల్లాలకు 29 మార్కుల చొప్పున వచ్చాయి. అదే మరుసటి సంవత్సరం హనుమకొండకు 29 మార్కులు రాగా మహబూబాబాద్ జిల్లాకు 27 మార్కులు వచ్చాయి. పాఠశాలల్లో పిల్లల భద్రతపై 31 మార్కులకు జనగామ, హనుమకొండ, ములుగు జిల్లాలకు 10 మార్కులకు పైగా రాగా మిగిలిన జిల్లాల్లో తక్కువగా వచ్చాయి.ఉమ్మడి జిల్లాల వారీగా ఆరు అంశాల్లో సాధించిన మార్కుల వివరాలు జిల్లా మొత్తం 2022–23 2023–24 మార్కులు వరంగల్ 600 226 245 హనుమకొండ 600 250 275 మహబూబాబాద్ 600 210 229 జనగామ 600 235 271 భూపాలపల్లి 600 220 253 ములుగు 600 214 231ప్రభుత్వ పాఠశాలలపై ఆరు అంశాలతో పీజీఐ సర్వే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2022–23 కన్నా 2023–24 మెరుగ్గా ఫలితాలు శుభ సూచికం అంటున్న విద్యావేత్తలు -
వార్షిక లాభాల్లో 40శాతం వాటా ఇవ్వాలి
భూపాలపల్లి అర్బన్: 2024–25 ఆర్థిక సంవత్సరం సింగరేణి లాభాల్లో వాటాను కార్మికులకు 40శాతం ఇవ్వాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య డిమాండ్ చేశారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యాజమాన్యం గత లాభాలను నేటికీ ప్రకటించలేదన్నారు. లాభాలు ప్రకటించి కార్మికులకు అందించాలని కోరారు. సమావేశంలో జనార్ధన్, ప్రసాద్రెడ్డి, శ్రీనివాస్, జయశంకర్, సాజిత్ పాల్గొన్నారు.నియామకంభూపాలపల్లి అర్బన్: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) జిల్లా కన్వీనర్గా పట్టణా నికి చెందిన గుజ్జల ప్రేమ్కుమార్ నియమితులయ్యారు. ఆర్మూర్లో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జాన్రెడ్డి.. ప్రేమ్కుమార్ను కన్వీనర్గా నియమించారు.ముగిసిన క్రీడాపాఠశాల ఎంపికలుభూపాలపల్లి అర్బన్: క్రీడాపాఠశాల జిల్లాస్థాయి ఎంపికలు బుధవారం ముగిసినట్లు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి రఘు తెలిపారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించిన ఈ ఎంపిక పోటీలకు అన్ని మండలాల విద్యార్థులు పాల్గొన్నట్లు తెలిపారు. 11 మండలాల నుంచి 80 మంది విద్యార్థులు పాల్గొనగా జిల్లా స్థాయికి 20 మంది బాలబాలికలను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. జూలై 1వ తేదీన హైదరాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని డీవైఎస్ఓ తెలిపారు.డబుల్బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలనమొగుళ్లపల్లి: మండలంలోని ముల్కలపల్లి, వేములపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్బెడ్రూం ఇళ్లను బుధవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో హుజీంగ్ పీడీ లోకిలాల్, పంచాయతీరాజ్ డీఈ రవికుమార్, ఎంపీడీఓ సత్యనారాయణ, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.గుడుంబా విక్రయిస్తే కఠిన చర్యలుటేకుమట్ల: గ్రామాల్లో గుడుంబా తయారు చేసినా, విక్రయించినా కఠినచర్యలు తప్పవని వరంగల్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అంజన్రావు, జిల్లా ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంతోపాటు, అంకుషాపూర్, సోమనపల్లి, వెంకట్రావుపల్లి గ్రామాల్లో గుడుంబా స్థావరాలపై బుధవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురి నుంచి 10 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకుని, 450 లీటర్ల చక్కెర పానకాన్ని పారబోశారు. ఇద్దరిని అరెస్టు చేసి, నలుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ గుడుంబా వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, కావున గుడుంబాను సేవించరాదన్నారు. అలాగే గుడుంబాను గ్రామాల్లో ఎవరైనా తయారు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాడుల్లో భూపాలపల్లి ఎస్హెచ్ఓ రమ్య, డీటీఎఫ్ సీఐ రాజసమ్మయ్య, భూపాలపల్లి ఎస్సై రబ్బాని, తదితరులు ఉన్నారు. -
కదలని బండి.. తొలగని చెత్త
చెత్త సేకరణ ట్రాక్టర్లకు అందని ఇంధనంట్రాక్టర్ రాక నెల రోజులైంది.. చెత్త ట్రాక్టర్ రాక నెల రోజులవుతోంది. ఎండకాలంలో టాక్టరు రాకున్న చెత్తను కాల్చినం. వారం రోజులుగా కొద్దిగా వానలు కురవడంతో చెత్త కాలడంలేదు. చెత్తతోటి ఈగలు, దోమలు ఎక్కువయ్యాయి. గ్రామంలో ఎక్కడి చెత్త అక్కడే ఉంది. అధికారులు స్పందించి చెత్తను తీయించాలి. – పాలకుర్తి కళమ్మ, కమలాపూర్ నిధులు లేవు పంచాయతీల్లో ట్రాక్టర్ డీజిల్, మరమ్మతులకు నిధులు లేవు. 18 నెలలుగా నిధులు రావడంలేదు. కార్యదర్శులు ఇప్పటికే రూ.లక్షల్లో ఖర్చు చేశారు. ఇంటి పన్నులు వసూలు చేసిన నిధులు ట్రెజరీల్లో నిల్వ ఉంచారు. ప్రభుత్వం ట్రెజరీల నుంచి నిధులు విడుదల చేయించాలి. ప్రతినెలా టాక్టర్, వీధిలైట్లు, తదితర ఖర్చుల కోసం ప్రత్యేకంగా నిధులు విడుదల చేయాలి. – రాంబాబు, జిల్లా అధ్యక్షుడు, పంచాయతీ కార్యదర్శుల సంఘం చెత్త సేకరణపై చర్యలు తీసుకుంటాంగ్రామాల్లో చెత్త తీస్తున్నారు. గతంలో కొంతమంది కార్యదర్శులు తాళాలు ఇచ్చి మళ్లీ తీసుకెళ్లారు. గ్రామాల్లో చెత్త తీస్తున్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎక్కడైనా చెత్త సేకరణపై సమస్యలుంటే చర్యలు తీసుకుంటాం. – వీరభద్రయ్య, డీపీఓమల్లంపల్లిలో వృథాగా ఉన్న ట్రాక్టర్ భూపాలపల్లి రూరల్: పల్లెల్లో చెత్తసేకరణ నత్తనడకన సాగుతోంది. నిరంతరం కొనసాగాల్సిన ఈ ప్రక్రియ.. వారంలో ఒకటి, రెండు దఫాలే జరుగుతోంది. ట్రాక్టర్లలో డీజిల్ లేకపోవడమే ఇందుకు కారణం. సర్పంచ్ల పదవీకాలం ముగియడం.. ప్రభుత్వాలనుంచి నిధులు నిలిచిపోవడం.. పంచాయతీల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. మొన్నటి వరకు అప్పు చేసి పనులు చేపట్టిన పంచాయతీ కార్యదర్శులు ఆర్థికభారం భరించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాక్టర్ల నిర్వహణ చూడలేమంటూ కొంత మంది కార్యదర్శులు ఇటీవల మండల పరిషత్ కార్యాలయాల్లో తాళం చేతులు అప్పగించారంటే పరిస్థితి ఏస్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. పెద్ద పంచాయతీల్లో ఇంటి పన్నులు తదితర నిధులు.. గ్రామ కార్యదర్శులు సొంత ఖర్చులతో వారంలో ఒకటి రెండుసార్లు ట్రాక్టర్లు తీస్తున్నట్లు సమాచారం. కానీ, చిన్న పంచాయతీల్లోని ట్రాక్టర్లకు డీజిల్ లేక షెడ్లకే పరిమితం అయ్యాయి. పేరుకుపోతున్న చెత్త.. గ్రామ పంచాయతీల్లో దుర్గంధం నెలకొంది. క్రమం తప్పకుండా చెత్త సేకరణ జరగకపోవడం, మరోవైపు వానాకాలం కావడంతో గ్రామాల్లో చెత్త పేరుకుపోయి దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారంలో ఒకటి రెండు దఫా చెత్త సేకరిస్తున్నారు. కొన్ని పంచాయతీల్లో ఊరిబయటకే చెత్త తరలించి దహనం చేస్తున్నారు. కొందరు తమ ఇళ్లలోని చెత్తను స్వయంగా డంపింగ్ యార్డులకు తీసుకెళ్లి పడేస్తున్నారు. కార్యదర్శుల పైనే భారం.. సుమారు 18 నెలలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు ఆగిపోవడం, ప్రత్యేకాధికారులు గ్రామాలవైపు చూడకపోవడంతో పంచాయతీల నిర్వహణ భారం కార్యదర్శులపైనే పడుతోంది. ఉన్నతాధికారుల ఒత్తిడి మేరకు ఇంతకాలం సొంతఖర్చులతో సమస్యలు పరిష్కరించిన పంచాయతీ కార్యదర్శులు ఇక భరించలేమంటున్నారు. ముఖ్యంగా ట్రాక్టర్ల నిర్వహణ భారం తడిసి మోపడవుతుందని వాపోతున్నారు. అయితే ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడం, ఆర్థిక భారం తమపైన పడుతుండడంతో భరించలేని పంచాయతీ కార్యదర్శులు తమ అసోసియేషన్ పిలుపు మేరుకు ట్రాకర్ల నిర్వహణ చూడలేమంటూ మండల పరిషత్ కార్యాలయాల్లో తాళం చేతులు అప్పగించారు. కానీ, కొంతమంది మళ్లీ తీసుకెళ్లినట్లు సమాచారం. ఏదిఏమైనప్పటికీ గ్రామాల్లో ట్రాక్టర్ల ద్వారా చెత్త సేకరణ ప్రతిరోజూ చేపట్టాలని ప్రజలు కోరుతుండగా.. నిర్వహణ భారం తమపై పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులు కోరుతున్నారు. ఇంటింటి చెత్త సేకరణకు ఆటంకం చిన్న పంచాయతీల్లో పూర్తిగా బంద్ దుర్గంధం వెదజల్లుతున్న పల్లెలునిధులు నిల్..! పల్లెల్లో చెత్త సేకరణ, మొక్కలకు నీరు పోసేందుకు గత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పంచాయతీకి ఒకటి చొప్పున ట్రాక్టర్, ట్యాంకర్ మంజూరు చేసింది. అందులో భాగంగా జిల్లాలోని 241 జీపీలకు ఒక ట్రాక్టర్, చెట్లకు నీరు పోసేందుకు ఒక ట్యాంకర్ చొప్పున పంచాయతీలు ప్రభుత్వ నిధులతో కొనుగోలు చేశాయి. మేజర్ పంచాయతీల్లో ప్రతి రోజూ, చిన్న గ్రామ పంచాయతీల్లో రెండు రోజులకు ఒకసారి తప్పనిసరిగా చెత్త సేకరించాల్సి ఉంటుంది. పెద్ద పంచాయతీలో డీజిల్ ఖర్చు నెలకు రూ.10 వేల వరకు, చిన్న గ్రామ పంచాయతీలో రూ.5 వేల చొప్పున ఖర్చు వస్తుంది. అయితే పంచాయతీల్లో ప్రజాప్రతినిధుల కాలపరిమితి ముగియడంతో 15 నెలలుగా ప్రత్యేకాధికారుల పాలన సాగుతోంది. ఈ ట్రాక్టర్ల నిర్వహణ అగమ్యగోచరంగా మారింది. -
అర్హత పరీక్షలో ఎంపిక కాలేదని ఆత్మహత్య
కాటారం(మహాముత్తారం): డిఫెన్స్ అకాడమీ అర్హత పరీక్షలో ఎంపిక కాలేదనే మనస్తాపంతో ఓ విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహాముత్తారం మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహాముత్తారం మండల కేంద్రంలోని నేతకానిపల్లికి చెందిన మంతెన రంజిత్(15) ఇటీవల పదవ తరగతి పాసయ్యాడు. డిఫెన్స్లో పనిచేయడంపై ఆసక్తి ఉండటంతో తల్లిదండ్రులు కరీంనగర్లోని శ్రీ చైతన్య డిఫెన్స్ అకాడమీలో చేర్పించారు. అకాడమీ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన అర్హత పరీక్షలో రంజిత్ క్వాలిఫై కాలేదు. దీంతో ఇంటికి తిరిగి వచ్చిన రంజిత్ తీవ్ర మనస్తాపానికి గురై ఈ నెల 23న ఇంట్లో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం భూపాలపల్లి వంద పడకల ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం వైద్యుల సూచన మేరకు వరంగల్ ఆస్పత్రికి తరలించగా రంజిత్ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి తండ్రి రాజబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ రాజయ్య తెలిపారు. -
ఎరువులు, విత్తన దుకాణాలపై నిఘా
భూపాలపల్లి: నకిలీ ఎరువులు, విత్తనాల విక్రయాలు జరుగకుండా దుకాణాలపై నిఘా ఉంచాలని, లూజ్ విత్తన విక్రయాలు జరుగకుండా చూడాలని కలెక్టర్ రాహుల్శర్మ సూచించారు. ఇందిరమ్మ ఇండ్లు, వన మహోత్సవం, సీజనల్ వ్యాధుల నియంత్రణ, టీబీ ముక్త్ భారత్, వైద్య కళాశాలల నిర్వహణ, భూ భారతి, ఎరువులు, విత్తనాలు లభ్యత తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మంగళవారం హైదరాబాద్ సచివాలయం నుంచి ఆయా శాఖల కార్యదర్శులతో అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశం అనంతరం కలెక్టర్ రాహుల్శర్మ తన కార్యాలయంలో జిల్లా అధికారులతో మాట్లాడుతూ.. భూ భారతి రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన 48,651 దరఖాస్తులు ఆన్లైన్ చేయాలన్నారు. ఆగస్టు 15 నాటికి ప్రతీ దరఖాస్తు పరిష్కారానికి చర్యలు చేపట్టాలని, ఆ విధంగా కార్యాచరణ తయారు చేయాలని సూచించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతీ మంగళవారం, శుక్రవారం డ్రై డే కార్యక్రమాలు నిర్వహించి పరిసరాలు పరిశుభ్రం చేయించాలని ఆదేశించారు. టీబీ ముక్త్ భారత్లో భాగంగా స్క్రీనింగ్ పెంచాలని, అనుమానితులకు ఎక్స్రే తీయాలన్నారు. ఈ సమావేశంలో డీఎఫ్ఓ నవీన్రెడ్డి, అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్కలెక్టర్ మయాంక్సింగ్, ఏఎస్పీ నరేష్కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్శర్మ రూ.136.94 కోట్లు జమభూపాలపల్లి రూరల్: రైతు భరోసా పథకం కింద మంగళవారం నాటికి జిల్లాలోని 1,14,718 మంది రైతుల ఖాతాల్లో రూ.136,93,80,755 కోట్లు జమ అయినట్లు కలెక్టర్ రాహుల్శర్మ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు భరోసా పథకం కింద ఈ నిధులు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ సాయంతో రైతులు విత్తనాలు, ఎరువులు, ఇతర సాగు అవసరాలు తీర్చుకునేందుకు అవకాశం కలుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. రైతులకు వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమకావడం వల్ల పారదర్శకత సాధ్యమైందని చెప్పారు. వ్యవసాయానికి ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడతాయని కలెక్టర్ స్పష్టంచేశారు. -
‘తల్లి పేరుతో మొక్క నాటండి’
ములుగు రూరల్: డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దినోత్సవాన్ని పరస్కరించుకుని జిల్లా కేంద్రంలో బీజేపీ మహిళా మోర్చా నాయకులు మొక్కలు పంపిణీ చేశారు. ఈ మేరకు మంగళవారం మహిళా మోర్చా ఆధ్వర్యంలో తల్లి పేరుతో మొక్కను నాటండి కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు బలరాం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శ్యాం ప్రసాద్ ముఖర్జీ దేశం కోసం చేసిన త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతిఒక్కరూ మొక్కలు నాటి కాపాడాలన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా నాయకులు మాధవి, రమ, జయ, సుభద్ర, తిరుమల, బీజేపీ నాయకులు రాజ్కుమార్, కుమార్, రవిరెడ్డి, శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు. -
ఆకలి బాధ తీరేనా..
జూనియర్ కళాశాలల్లో అమలుకు నోచుకోని మధ్యాహ్న భోజనం కాటారం: ఇంటర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు కలగా మిగిలిపోయింది. దీంతో విద్యార్థులు మధ్యాహ్నం భోజనం కోసం అలమటిస్తూ అర్ధాకలితో చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించి మంత్రివర్గ ఆమోదం సైతం తెలిపినప్పటికీ అమలుకు నోచుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం గతేడాది అధికారంలోకి రాగానే సంబంధితశాఖ అధికారుల నుంచి ప్రతిపాదనలు కోరింది. ఈ విద్యాసంవత్సరం ప్రారంభమై 15 రోజులు కావస్తున్నప్పటికీ పథకం అమలుపై ఇప్పటివరకు స్పష్టత లేదు. దీంతో ఈ ఏడాది సైతం కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. దూర ప్రాంతం నుంచి వచ్చే వారికి తిప్పలు.. ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలులో లేకపోవడంతో ఆయా కళాశాలలకు దూర ప్రాంతం నుంచి వచ్చే విద్యార్థులు ఆకలితో ఇబ్బందులు పడుతున్నారు. చాలా కళాశాలలు జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లోనే ఉండటంతో గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యార్థులు ఉదయం పూట తినకుండానే వస్తున్నారు. మధ్యాహ్నం సైతం తినకుండా కళాశాలల పక్కన ఉండే కిరాణాదుకాణాల్లో తినుబండారాలు, బిస్కెట్లు తింటూ అర్ధాకలితో చదువు నేర్చుకుంటున్నారు. దీంతో అలిసిపోయి విద్యార్థులు సరిగా క్లాస్లు వినలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. మరికొందరు విద్యార్థులైతే కళాశాలలకు రావడమే మానేస్తున్నారు. ఉత్తీర్ణత, హాజరుశాతం పెరిగే అవకాశం.. కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తే విద్యార్థుల ఉత్తీర్ణత, హాజరుశాతం పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంత విద్యార్థులు అధికంగా ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్నారు. వారికి మధ్యాహ్న భోజనం ఇంటి నుంచి తీసుకొచ్చుకునే పరిస్థితి, సమయాభావం తక్కువగా ఉంటుంది. దీంతో వారు మధ్యాహ్నం సమయం వరకు తరగతులకు హాజరై ఇంటికి వెళ్తున్నారు. సరిగా తరగతులకు హాజరుకాకపోవడం వలన ఈ ప్రభావం పరీక్ష ఫలితాల్లో చూపిస్తుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఒక వేళ మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పిస్తే విద్యార్థులు సక్రమంగా తరగతులకు హాజరై ఉత్తీర్ణ శాతం పెరిగే అవకాశాలు ఉంటాయని పలువురు భావిస్తున్నారు. రూ.కోటి అంచనా.. జిల్లాలో ఐదు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, రెండు ప్రభుత్వ డిగ్రీ, ఒక పాలిటెక్నిక్, రెండు ఐటీఐ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో సుమారుగా రెండు వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరికి మధ్యాహ్న భోజనం అందించడానికి రూ.కోటి మేర ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.జిల్లాలోని కళాశాలల వివరాలు..కళాశాలలు విద్యార్థులు (సుమారు)జూనియర్ 05 1,000 డిగ్రీ 02 550 పాలిటెక్నిక్ 01 172 ఐటీఐ 02 130 మొత్తం 10 1,852కార్యరూపం దాల్చేనా.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కొన్నేళ్లుగా ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తూ వస్తున్నాయి. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెరిగింది. ఇదే ఫార్ములా ప్రభుత్వ కళాశాలల్లో ప్రయోగిస్తే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి సైతం ప్రతిపాదన అందజేసినప్పటికీ అమలుకు మాత్రం నోచుకోవడం లేదు. 2018లో అప్పటి ప్రభుత్వం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాలని ముందడుగు వేసినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. 2021లో మారోమారు ఈ ప్రయత్నం చేసినప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. ఈ విద్యా సంవత్సరం నుంచి కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అందించాలని 2024–25 విద్యా సంవత్సరం చివరలో ప్రతిపాదనలు సిద్ధంచేశారు. కానీ ఇప్పటివరకు ఆ ప్రతిపాదనల ఊసే లేకుండా పోయింది. ఒక్కో విద్యార్థికి రూ.20 నుంచి రూ.25 వరకు ఖర్చు అవుతుందని అధికారులు చెప్పుకొస్తున్నారు. గతేడాది ప్రభుత్వానికి ప్రతిపాదనలు నేటికీ స్పష్టత కరువు విద్యార్థుల హాజరుశాతంపై ప్రభావంఆదేశాలు రాలేదు.. కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలుకు సంబంధించి ఇప్పటివరకు ఆదేశాలు రాలేదు. గతేడాది ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉన్నతాధికారుల ద్వారా ప్రతిపాదనలు పంపించాం. కళాశాలలు, విద్యార్థుల సంఖ్య తదితర వివరాలు అందజేశాం. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాలేదు. – వెంకన్న, ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీసర్ -
కేటీకే 1వ గనిలో సమస్యలు పరిష్కరించాలి
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 1వ గనిలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్ డిమాండ్ చేశారు. కేటీకే 1వ గనిలో ఫిట్ సెక్రటరీ సదయ్య ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన గేట్ మీటింగ్కు రమేష్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మాన్రైడింగ్ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని, కార్మికుల కాప్లైట్స్, ఎక్స్ప్లోడర్స్, ఫిల్టర్ బెడ్ రిపేర్, తాగునీటి సమస్యలు తక్షణమే పరిష్కరించాలని కోరారు. బైక్ పార్కింగ్ షెడ్స్లలో సిమెంట్ రేకులు తొలగించి ఐరన్ రేకులు ఏర్పాటు చేయాలన్నారు. 3సీమ్లో ఖాళీ టబ్బులు సరిపడా పెంచాలని, మాన్వేలో వర్షం వల్ల స్లాపు పగుళ్లు ఏర్పడి కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే రిపేర్ చేయాలని కోరారు. కేటీకే ఓసీ 2 నుంచి కేటీకే 1వ గని వరకు వీధి దీపాలు ఏర్పాటుచేయాలని కోరారు. ఈ సమస్యలపై గని మేనేజర్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సదయ్య, సుధాకర్రెడ్డి, శ్రీనివాస్, కార్మికులు పాల్గొన్నారు. -
ఎంజీఎంలో సెక్యూరిటీ గార్డు, స్వీపర్పై దాడి
ఎంజీఎం : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని అత్యవసర విభాగంలోని సెక్యూరిటీ సిబ్బంది, స్వీపర్పై మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి దాడి చేశాడు. ఈఘటనపై అటు కాంట్రాక్ట్ యాజమాన్యం, ఇటు ఆస్పత్రి అధికారులు కనీసం పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో చికిత్స కోసం వచ్చిన ఓ యువకుడు అత్యవసర విభాగంలో రక్తం మరకలు తుడుస్తున్న ఓ స్వీపర్పై అసభ్య పదజాలంతో దూషించడంతో అడ్డొచ్చిన సెక్యూరిటీ గార్డుపై దాడి చేశాడు. ఆ వ్యక్తి మద్యం మత్తులో ఉండడంతో అక్కడున్న ఓ వార్డు బాయ్ వచ్చి సదరు వ్యక్తిని సముదాయించి పంపించేశాడు. సదరు యువకుడు మళ్లీ తిరిగి వచ్చి విధుల్లో ఉన్న పీఆర్ఓకు ఫోన్ చేయించి సెక్యూరిటీ సిబ్బందిని మరోసారి దుర్భాషలాడాడు. ఈఘటనలో అక్కడికి చేరుకున్న పీఆర్ఓ ‘అతను ఓ వీఐపీ.. అతడితో పెట్టుకుంటే మీ ఉద్యోగాలు పోతాయ్’ అని సెక్యూరిటీ గార్డు, స్వీపర్లపై రుసరుసలాడాడు. బెదిరించి దాడి చేసిన సదరు యువకుడికి దగ్గరుండి చికిత్స అందించి పంపించారు. కాగా, ఈఘటనతో ఖంగుతిన్న సెక్యూరిటీ గార్డులు మంగళవారం ఉదయం తమ కార్యాలయం వద్ద కొద్దిసేపు నిరసన వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వచ్చి వివరాలు సేకరించి వెళ్లిపోయారు. ఈ ఘటనపై సెక్యూరిటీ, శానిటేషన్ కాంట్రాక్టర్.. ఎంజీఎం పరిపాలనాధికారులకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేయలేదు. దీంతో తాము ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఎంజీఎం పరిపాలనాధికారులు చెప్పడం కొసమెరుపు.ఎవరు ఆ వీఐపీ?మద్యం మత్తులో వచ్చి సెక్యూరిటీ గార్డుపై దాడి చేసి పీఆర్ఓకు ఫోన్ చేయించి చికిత్స పొందిన ఆ వీఐపీ ఎవరు అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. దాడికి గురైన మహేశ్ అనే సెక్యూరిటీ గార్డు ఎంజీఎంలో వైద్యుల వద్ద చికిత్స పొందాడు. ఇంత జరిగినా ఆ వీఐపీ రోగిపై చర్యలు తీసుకునేందుకు సెక్యూరిటీ కాంట్రాక్టర్ ఫిర్యాదు చేయకపోవడం, ఎంజీఎం పరిపాలనాధికారులు రాతపూర్వకంగా ఫిర్యాదు అందలేదని దాటవేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మున్ముందు ఏదైనా పెద్ద ఘటన జరిగితే తమ పరిస్థితి ఏంటని సెక్యూరిటీ సిబ్బంది, స్వీపర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
మున్సిపాలిటీ మేనేజర్ బదిలీ
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న మేనేజర్ను బదిలీ చేస్తూ మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్రీదేవి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మేనేజర్ రమేష్ను బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయానికి బదిలీ చేయగా భూపాలపల్లికి అతన స్థానంలో ఎవరినీ కేటాయించలేదు.29, 30తేదీల్లో రాష్ట్ర మహాసభకాటారం: వరంగల్లో ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ ప్రజాఫ్రంట్(టీపీఎఫ్) నాలుగవ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో నాయకులతో కలిసి కిరణ్ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ ప్రజల పక్షాన నిత్యం పోరాటం చేస్తున్న టీపీఎఫ్ మహాసభలకు పెద్ద ఎత్తున తరలివచ్చి ఐక్యతను చాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు కుడిమేత సరస్వతి, ప్రధాన కార్యదర్శి దుబాసి పార్వతి, నాయకులు సూర్యశంకర్, అయిత బాపు, అక్కల బాపు పాల్గొన్నారు.గాజర్ల కుటుంబానికి నకిరేకల్ ఎమ్మెల్యే పరామర్శటేకుమట్ల: మండలంలోని వెలిశాల గ్రామానికి చెందిన మావోయిస్టు నేత గాజర్ల రవి అలియాస్ గణేష్ ఇటీవల ఎన్కౌంటర్లో మృతి చెందగా మంగళవారం ఆయన కుటుంబ సభ్యులను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పరామర్శించారు. ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళ్లర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాడ సానుభూతిని తెలిపారు. మాతృశ్రీ ఫౌండేషన్ చైర్మన్ దొంతుల శ్రీనివాస్, ఏవైఎస్, దళిత సంఘాల నాయకులు కూడా పరామర్శించారు. పరామర్శించిన వారిలో అరకొండ రాజయ్య, తిరుమలేష్, ఎలకటి రాజయ్య, సాంబయ్య, రాములు, కిరణ్, కుమార్, రమేష్, భద్రయ్య, ప్రకాశ్, సదానందం, క్రాంతి ఉన్నారు.బొగ్గు లారీల అడ్డగింతమల్హర్ : మండలంలోని తాడిచర్ల ఓపెన్కాస్ట్ బొగ్గు లారీలను తాడిచర్ల ఎస్సీ కాలనీ యువకులు మంగళవారం అడ్డుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెద్ద తాడిచర్ల డేంజర్ జోన్ ఇళ్లు సేకరించిన పలుమార్లు జెన్కో అధికారులు, రెవెన్యూ అధికారులకు విన్నవించిన పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కంపెనీ నిర్వాహకులు ఎస్సీకాలనీ పరిధిలో గ్రామస్తులను మభ్యపెడుతూ, వారు లేని సమయంలో కాల్వలు తీసి మట్టి పోస్తున్నారని విమర్శించారు. శ్రీధర్బాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు డేంజర్ జోన్ ఇళ్లు సేకరణకు కృషి చేయాలని వారు కోరారు. నిరుద్యోగ యువతకు ఓపెన్కాస్ట్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని విన్నవించారు. రాజ్కుమార్, ఓదెలు,చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.తీర్థయాత్రలకు రైల్వే సేవలు వినియోగించుకోవాలిములుగు రూరల్ : తీర్థయాత్రలకు వెళ్లే భక్తులు ప్రత్యేక రైళ్లను వినియోగించుకోవాలని ఐఆర్టీసీ టూరిజం జాయింట్ జనరల్ మేనేజర్ డీఎస్జీపీ కిశోర్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూలై 5నుంచి జూలై 13వ తేదీ వరకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లను ప్రారంభిస్తున్నామన్నారు. ఉజ్జయిని (మహకాళేశ్వర్–ఓంకారేశ్వర్), త్రయంబకేశ్వర్–భీమశంకర్, ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగ యాత్రలో ఎల్లోరా, మోవ్, నాగ్పూర్ ప్రాంతాలను సందర్శించొచ్చని తెలిపారు. సాధారణ టికెట్ ధర రూ. 14,700, 3–ఏసీ రూ.22900, 2–ఏసీ రూ. 29,900 ఉంటుందని తెలిపారు. ఈ యాత్ర రైలు సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, నాందేడ్, ముద్ఖడ్, పూర్ణ మీదుగా సాగుతుందని తెలిపారు. టికెట్ బుక్ చేసుకునే వారు 9701360701, 9281495843,9281030750, 9281030749 నంబర్లను సంప్రదించాలన్నారు. -
సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం చేయొద్దు
ములుగు రూరల్: పోలీస్ అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా పనితనాన్ని మెరుగుపరుచుకోవాలని ఎస్పీ డాక్టర్ శబరీశ్ సూచించారు. ఈ మేరకు మంగళవారం పోలీస్ హెడ్ క్వాటర్స్లో డ్యూటీమీట్ను ప్రారంభించి మాట్లాడారు. అధికారులు, సిబ్బంది నైపుణ్య అభివృద్ధి, ప్రదర్శనకు సరైన వేదిక డ్యూటీ మీట్ అన్నారు. నేర పరిశోధన, నేర స్థల పరిశోధన, ఫొటోగ్రఫీ, వీఐపీ మూమెంట్, డాగ్ స్క్వాడ్ పనితనం, ఫింగర్ ప్రింట్ తీసే విధానం, బాంబు డిస్పోజల్, వీడియోగ్రఫీ ద్వారా నేరస్తులను కనుగొనుట, కంప్యూటర్ పరిజ్ఞానం, అంశాలపై రాత పరీక్ష, మౌఖిక పరీక్షలు ఉంటాయని వివరించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రివార్డులు సాధించాలని తెలిపారు. ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్లకు కొన్ని అంశాలు, ఏఎస్సై, కానిస్టేబుళ్లకు కొన్ని అంశాలపై పరీక్షలు నిర్వహించనున్నట్లు వివరించారు. నూతన చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. నేరం జరిగిన పద్ధతులను పరిశోధనను విధులకు అనుకూలంగా మార్చుకోవాలన్నారు. సందేహాలు ఉంటే ఉన్నతాధికారులను, అనుభవం ఉన్న అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ, ములుగు డీఎస్పీ రవీందర్, సీఐలు సురేశ్ కుమార్, రవీందర్, రిజర్వు ఇన్స్పెక్టర్లు స్వామి, సంతోష్కుమార్, తిరుపతి, ఎస్సైలు, ఆర్ఎస్సైలు పాల్గొన్నారు. -
రాష్ట్ర చరిత్రలోనే అరుదైన రికార్డు
భూపాలపల్లి రూరల్: రైతులకు ఇచ్చినమాట ప్రకారం 9 రోజుల్లో రూ.9వేల కోట్ల నగదు బదిలీ చేయడం రాష్ట్ర చరిత్రలోనే అరుదైన రికార్డని, ఇప్పటివరకు రాష్ట్రంలో కోటి 49లక్షల 39వేల 111 ఎకరాలకు రైతు భరోసా అందించిన ఘనత సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానిదని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. రైతుభరోసా నగదు బదిలీ విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ‘రైతు పండుగ’ పేరుతో జరుపుతున్న నేపథ్యంలో మంగళవారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ అధ్యక్షతన రైతు భరోసా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్యఅతిథిగా హాజరై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సాగులో ఉన్న ప్రతి ఎకరానికి పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు తెలిపారు. కేంద్రం కొనుగోలు చేయలేని పంట ఉత్పత్తులను రాష్ట్ర ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయిస్తోందని తెలిపారు. అనంతరం వాకర్స్తో కలిసి జయశంకర్ పార్కును పరిశీలించారు. పలు అభివృద్ధి పనులు చేయిస్తానని వాకర్స్కు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.రైతు భరోసా సంబురాల్లో ఎమ్మెల్యే గండ్ర -
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
భూపాలపల్లి అర్బన్ : యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి నిర్మూలనకు కృషి చేయాలని ఎకై ్సజ్ ఎస్సై రబ్బాని కోరారు. మున్సిపల్ పరిధిలోని జంగేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం డ్రగ్స్ నియంత్రణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రబ్బాని హాజరై మాట్లాడారు. మత్తు పదార్థాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని, గంజాయి, డ్రగ్స్ ఇతర మాదక ద్రవ్యాలను వినియోగించిన, సరఫరా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఎవరైనా మాదకద్రవ్యాలు వాడుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు, పాఠశాలల ఉపాధ్యాయులకు సమాచారం అందించి మాదకద్రవ్యాల నిరోధానికి సహకరించాలని కోరారు. అనంతరం వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. జంగేడు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అశోక్కుమార్, ఉపాధ్యాయులు, ఎకై ్సజ్ సిబ్బంది పాల్గొన్నారు. -
మావోయిస్టులకు సహకరించొద్దు
పలిమెల: మావోయిస్టులకు ఎవరూ సహకరించవద్దని పలిమెల ఎస్సై రమేష్ సూచించారు. మండలంలోని అయా గ్రామాల్లో పోలీసుల ఆధ్వర్యంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఛత్తీస్గఢ్లో జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లు, అరెస్టులతో తీవ్రంగా నష్టపోయిన సీపీఐ (మావోయిస్టు) దళాలు జిల్లాలోకి వచ్చే అవకాశం ఉందన్నారు. మావోయిస్టు సాయుధ దళాలు, దళ సభ్యులు, అనుమానితులు, అపరిచిత వ్యక్తులు ఎవరైనా ఆదివాసీ గుంపుల దగ్గరలో సంచరించినట్లయితే వెంటనే డయల్ 100 ఫోన్ చేసి సమాచారం ఇచ్చి తగిన పారితోషికం పొందాలని పేర్కొన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. మావోయిస్టులకు సహకరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.డ్యాన్స్ మాస్టర్స్అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా గణేష్భూపాలపల్లి అర్బన్: డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ జిల్లా నూతన కమిటీని సోమవారం ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా గణేష్, గౌరవ అధ్యక్షుడిగా రమేష్, సుధాకర్, రాజేష్, ఉపాధ్యక్షులుగా రాకేష్, నాని, కోశాధికారిగా శేఖర్, ప్రధాన కార్యదర్శిగా నరేష్, జాయింట్ కార్యదర్శిగా తిరుపతి, ఈసీ మెంబర్లుగా పలువురు ఎన్నికయ్యారు.వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితిజిల్లా అధ్యక్షుడిగా రాజమల్లుకాళేశ్వరం: భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడిగా మహదేవపూర్ మండలం సూరారం గ్రామానికి చెందిన బోధ రాజమల్లు నియామకమయ్యారు. సోమవారం నియామకపత్రాన్ని రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె భాగ్యమ్మ ఫౌండేషన్ చైర్మన్ గిద్దె రాజేష్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గ్రామంలో ఉండే తనని గుర్తించి తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్షుడిగా నియమించిన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్, సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొల్లూరి ఈదయ్యబాబుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. సంఘం బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. త్వరలో జిల్లాలోని అన్ని మండలాల్లో నూతన కార్యవర్గాలను ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు. -
సర్వే నంబర్ 33
రేగొండ: కొత్తపల్లిగోరి మండలంలోని కొనరావుపేట గ్రామ శివారులో సర్వే నంబర్ 33లోని అసైన్డ్ భూమి వివాదాలకు కేంద్రంగా మారింది. ఈ సర్వే నంబర్లో ప్రభుత్వ రికార్డుల ప్రకారం 196 ఎకరాల భూమి ఉంది. కానీ భూమికి మించి అధికంగా పట్టాలు జారీ కావడంతో రైతులు, అన్నదమ్ములు, క్రయవిక్రయదారుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. తహసీల్దార్ కార్యాలయంలో ఈ సర్వే నంబర్కు సంబంధించిన పిర్యాదులు సర్వసాధారణమయ్యాయి. అధికారులు 33 సర్వే నంబరా అని ఎదురు ప్రశ్న వేస్తూ కామన్ అన్నట్టు చూస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమే భూ సమస్యకు కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. ఇష్టారాజ్యంగా పట్టాలు.. కొనరావుపేట గ్రామ శివారులో 33 సర్వే నంబర్లో వాస్తవంగా 2006 సంవత్సరం వరకు 196 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా, ప్రస్తుతం 486 ఎకరాలకు పట్టా ఉంది. 290 ఎకరాలు అధికంగా నమోదు చేశారు. అక్రమ పట్టాదారులు రైతు భరోసా, పీఎం కిసాన్, బ్యాంకులో క్రాప్ లోన్లు తీసుకుని లబ్ధిపొందుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం ఈ సమస్యకు మూల కారణం గతంలో పని చేసిన వీఆర్ఓలు. ఎకరానికి పది వేలు చొప్పున తీసుకుని ఇష్టారీతిన పట్టాలు జారీ చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. డబ్బులిస్తే చాలు.. గ్రామంతో సంబంధం లేని వ్యక్తుల పేరిట కూడా పట్టాలు జారీ చేసినట్లు చెబుతున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత అక్రమ పట్టాదారులు భూమి తనదేనంటూ సాగు చేసుకుంటున్న రైతులతో గొడవ పడ్డ సందర్భాలు ఉన్నాయి. ఒక అధికారి ఏకంగా తన కుటుంబ సభ్యులకు కూడా పట్టా చేయించడం గమనార్హం. రెవెన్యూ వ్యవస్థలో లోపాలు 33 సర్వే నంబర్లోని భూవివాదం రెవెన్యూ వ్యవస్థలోని పారదర్శకత, కచ్చితత్వం లోపాలను స్పష్టం చేస్తుంది. అధికారుల నిర్లక్ష్యం, రికార్డుల నిర్వహణలో తప్పిదాలు ఈ సమస్యకు దారితీశాయి. ఆన్లైన్ రెవెన్యూ రికార్డులు వాస్తవ భూవిస్తీర్ణంతో సరిపోలకపోవడం, అసైన్డ్ భూముల జారీలో అస్పష్టత వంటివి రైతుల గొడవలకు కారణమయ్యాయి. ఈ సమస్య రైతు భరోసా, పీఎం కిసాన్ వంటి పథకాల అమలును అడ్డుకుంటుంది. క్షేత్రస్థాయి సర్వే, కఠినమైన పర్యవేక్షణ ద్వారా ఇటువంటి సమస్యలను నివారించవచ్చు. సర్వే చేసి అర్హులకు అందజేస్తాం కొనరావుపేట శివారులోని సర్వే నంబర్ 33లో భూమిని సర్వేయర్లతో టీం ఏర్పాటు చేసి కొలత చేయిస్తాం. మోఖాపై రైతులు ఎవరు, సాగు చేయకుండా పట్టాలు పొందిన వారు ఎవరు అనే విషయాలను పరిశీలిస్తాం. అనంతరం ఒరిజినల్ పట్టా దారులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటాం. – లక్ష్మీరాజయ్య, తహసీల్దార్, కొత్తపల్లిగోరిఉన్నది 196 ఎకరాలు.. 486 ఎకరాలకు పట్టాలు! కొనరావుపేటలో భూ వివాదం అధికారుల మామూళ్లతో రైతులకు శిక్ష ఏళ్లుగా భూముల కోసం గొడవలు -
భూమిని పట్టా చేయాలి
మహదేవపూర్ మండలం ఎలకేశ్వర శివారులో రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. మా మామ గారి పేరున ఉన్న భూమిని సమీపంలోని వ్యక్తి అక్రమంగా పట్టా చేసుకున్నాడు. అతని పేరును తొలగించి మాకు న్యాయం చేయాలని తహసీల్దార్ను కోరినా పట్టించుకోవడం లేదు. భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కాస్తులో మేమే ఉన్నాం. అతనికి ఎటువంటి ఆధారాలు లేకున్నా అధికారులు ఆయన పేరును ఆన్లైన్లో ఎక్కించారు. భూభారతి ద్వారా అతని పేరు తొలగించి మా పేరు నమోదు చేయాలని కోరుతున్నాం. – బి.సుశీల, బొమ్మపూర్, మహదేవపూర్ -
డయేరియా ప్రబలకుండా ఏర్పాట్లు
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో డయేరియా బారిన పడకుండా ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ రాహుల్శర్మ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్హాల్లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్టాప్ డయేరియా–2025 క్యాంపెయిన్ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 0–5 సంవత్సరాల చిన్నారులు డబేరియా బారిన పడే అవకాశం ఉందన్నారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నిల్వ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వలన డయేరియా ప్రబలే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, డీఈఓ రాజేందర్, సంక్షేమ అధికారి మల్లీశ్వరి, బీసీ సంక్షేమ అధికారి క్రాంతికిరణ్, ఆర్డీఓ రవి, వైద్య ఆరోగ్యశాఖ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ శ్రీదేవి, ప్రమోద్ పాల్గొన్నారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం.. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. కలెక్టరేట్లో సోమవారం మహిళా, శిశు, వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నాషా ముక్త్ భారత్ అభియాన్ సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత డ్రగ్స్కు అలవాటు పడి వ్యసనాలకు బలి అవుతుందన్నారు. రైతువేదికల్లో ఏర్పాట్లు చేయాలి.. మంగళవారం రైతులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖాముఖి కార్యక్రమానికి రైతు వేడుకల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. వానాకాలం పంట సాగుకు రైతు భరోసా నిధులను విజయవంతంగా రైతుల ఖాతాలో జమ చేసిన సందర్భంగా నేడు(మంగళవారం) సాయంత్రం ఆరు గంటలకు ముఖ్యమంత్రి హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విచారణ వేగవంతం చేయాలి ప్రజాపాలన, మీ సేవా కేంద్రాల్లో వచ్చిన రేషన్ కార్డుల దరఖాస్తుల విచారణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్హాల్లో ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక సరఫరా, రేషన్ కార్డుల దరఖాస్తుల విచారణ, భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులపై రెవెన్యూ, పంచాయతీ రాజ్, గృహ నిర్మాణ శాఖ, ఇరిగేషన్, మైనింగ్ తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డుల దరఖాస్తుల విచారణ ప్రక్రియ ఐదు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను జిల్లాలోని వనరుల నుంచి ఉచితంగా ఇవ్వాలని సూచించారు. రెవెన్యూ సదస్సుల్లో 48,651 దరఖాస్తులు వచ్చాయని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, డీఎస్ఓ శ్రీనాథ్, డీపీఓ వీరభద్రయ్య, మైనింగ్ ఏడీ జయరాజ్, గృహ నిర్మాణశాఖ పీడీ లోకిలాల్, ఆర్డీఓ రవి, తహసీల్దార్లు, ఎంపిడీఓలు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్శర్మ -
న్యాయం చేయాలని వేడుకోలు..
మంగపేట: భర్త అనారోగ్యంతో మరణించగా ఇద్దరు కూతుళ్లతో ఉన్న తనకు అండగా నిలవాల్సిన బంధువులు, ఓ బీఆర్ఎస్ నాయకుడు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఓ మహిళ తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది.. న్యాయం కోసం అధికారుల ఆశ్రయిస్తే తమపై దాడి చేసేందుకు యత్నిస్తున్నారని బాధితురాలు కన్నీటి పర్యంతమైంది. ఈ మేరకు సోమవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట విలేకర్లకు బాధితురాలు తన గోడును వెళ్లబోసుకుంది. వివరాల్లోకి వెళ్తే..మండల పరిధిలోని కమలాపురం గ్రామానికి చెందిన కోరుకొప్పుల సత్యం, రాణి దంపతులు నివాసం ఉంటున్నారు.. ఈ క్రమంలో భర్త అనారోగ్యానికి గురై మృతువాత పడ్డాడు.. ఈ క్రమంలో ఉమ్మడి కుటుంబంలోని తన వాటాకు రావాల్సిన భూమిని తాను ఇంటివద్ద లేని సమయంలో చిన్న పిల్లలైన కూతుళ్లను బెదిరించి సంతకాలు పెట్టించి అమ్మారని వాపోయింది. అంతేకాకుండా తన భర్త వైద్యం కోసం దాతలు అందించిన రూ.10 లక్షల్లో నుంచి రూ.6 లక్షల నగదును వారే తీసుకున్నారని ఆరోపించింది. న్యాయం కోసం తాను ఎస్పీ, సీఐ, ఎస్సై, తహసీల్దార్ను ఆశ్రయించానని వివరించింది. స్పందించిన అధికారులు తమ భూమిని తమకు ఇవ్వాలని సూచించడంతో తమపై ఫిర్యాదు చేస్తారా అనే కోపంతో అంతుచూస్తామంటూ కమలాపురానికి చెందిన ఓ బీఆర్ఎస్ నాయకుడి అండతో తమపై దాడి చేసేందుకు యత్నిస్తున్నారని వాపోయింది. -
ఘనంగా ఒలింపిక్ డే
ఒలింపిక్ రన్ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లి అర్బన్: ఒలింపిక్ డేను పురస్కరించుకొని జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లాకేంద్రంలో రన్ కార్యక్రమానికి ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని జయశంకర్ విగ్రహం నుంచి అంబేడ్కర్ స్టేడియం వరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరై ఒలింపిక్ టార్చ్తో రన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేష్కుమార్, డీడబ్ల్యూఓ మల్లీశ్వరి, డీపీఓ వీరభద్రయ్య, బీసీ వెల్ఫేర్ అధికారి క్రాంతికిరణ్, సీఐ నరేష్, ఎస్ఐ సాంబమూర్తి, క్రీడాసంఘాల ప్రతినిధులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి
కాటారం: పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు భాగస్వాములు కావాలని జిల్లా సంక్షేమాధికారిణి మల్లీశ్వరి అన్నారు. నాశముక్తి భారత్ వారం రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం మండలకేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఫ్లాంటేషన్ డ్రైవ్ నిర్వహించారు. జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది, విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి పాఠశాల ఆవరణలో సామూహికంగా మొక్కలు నాటారు. నాశముక్తి భారత్ లక్ష్యాలపై సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా మల్ల్లీశ్వరి మాట్లాడుతూ విద్యార్థులు మత్తుపదార్థాల వినియోగానికి దూరంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాలతో కలిగే దుష్పరిణామాలపై వివరించారు. ప్రతీఒక్కరు ప్రకృతి పరిరక్షణకు కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ రాధిక, కేజీబీవీ ప్రిన్సిపల్ చల్ల సునీత పాల్గొన్నారు.జిల్లా సంక్షేమాధికారిణి మల్ల్లీశ్వరి -
పంట రుణాలను రెన్యూవల్ చేయాలి
ములుగు రూరల్: రైతులు తీసుకున్న పంట రుణాలను రెన్యూవల్ చేయాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి. అమ్జద్పాషా అన్నారు. ఈ మేరకు సోమవారం జంగాలపల్లి యూనియన్ బ్యాంక్ వద్ద రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం బ్యాంక్ మేనేజర్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ చేయాలన్నారు. జిల్లాలో 30 శాతం మంది రైతులకు మాత్రమే పట్టాలు ఉన్నాయన్నారు. గతంలో మాదిరిగా పహానీనకల్ ఆధారంగా రుణాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కృష్ణయ్య, భిక్షపతి పాల్గొన్నారు. రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అమ్జద్పాషా -
ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కేటాయించాలి
గణపురం మండలంలోని ఓపెన్ కాస్టు–3 ప్రాజెక్ట్లో గుర్రంపేట ఎస్సీ కాలనీ ప్రజలందరం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. గ్రామ సమీపంలో ఓపెన్ కాస్ట్ ఏర్పాటు చేయడంతో అనారోగ్య పాలవుతున్నాం. ఓపెన్కాస్ట్ నుంచి వెలువడుతున్న దుమ్ము, ధూళితో ప్రమాదం పొంచి ఉంది. బ్లాస్టింగ్ సామార్ాధ్యనికి మించి చేయడం వలన ఇంటిలో పగుళ్లు వస్తున్నాయి. ఎప్పుడు ప్రమాదం జరుగుతుందో అనే భయందోళనలో ఉన్నాం. గతంలో కలెక్టర్. సింగరేణి అధికారులు మా గ్రామానికి వచ్చి సమస్యను పరిశీలించారు. ప్రత్యమ్నాయ చర్యలు ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పటివరకు పట్టించుకోవడం లేదు. – దూడపాక శంకర్, గుర్రంపేట, భూపాలపల్లి -
సమ్మక్కసాగర్లో ఇసుక మేటలు
సమ్మక్కసాగర్ బ్యారేజీలోకి నీటి ప్రవాహం తగ్గడంతో కనిపిస్తున్న ఇసుక మేటలు కన్నాయిగూడెం: మండల పరిధిలోని తుపాకులగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో గల గోదావరిపై నిర్మించిన సమ్మక్కసాగర్ బ్యారేజీకి నీటి ప్రవాహం తగ్గడంతో ఇసుక మేటలు దర్శనమిస్తున్నాయి. జూన్ మొదటి వారంలో వర్షాలు పడడంతో బ్యారేజీలోకి కొంత నీరు వచ్చి చేరింది. దీంతో బ్యారేజీలో నీటి ప్రవాహం కొంత పెరిగింది. ప్రస్తుతం వర్షాలు పడకపోవడంతో ఎగువ నుంచి గోదావరిలోకి వరద ప్రవాహం తగ్గిపోయింది. దీంతో సమ్మక్క సాగర్ బ్యారేజీలో ఇసుక మేటలు తేలి కొంత మేర ఎడారిగా దర్శనమిస్తున్న పరిస్థితి నెలకొంది. బ్యారేజీలోకి ఎగువ నుంచి 5,800 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా బ్యారేజీ వద్ద రెండు గేట్లు ఎత్తి 6వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. బ్యారేజీ సామర్థ్యం 6.94 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.922 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఎగువ నుంచి తగ్గిన నీటి ప్రవాహం -
‘ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి క్షమాపణ చెప్పాలి’
ములుగు రూరల్: సీఎం రేవంత్రెడ్డి, మంత్రి సీతక్కపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు వంగ రవియాదవ్ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కౌశిక్రెడ్డి ఎన్నికల్లో గెలిపించకపోతే కుటుంబంతో సహ ఆత్మహత్య చేసుకుంటామని ప్రజలను బ్లాక్మెయిల్ చేసి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి సీతక్క గురించి మాట్లాడడం సరికాదన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని లూటీ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేస్తుంటే ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తూ పబ్బంగడుపుతున్నారని విమర్శించారు. కౌశిక్రెడ్డి పద్ధతి మార్చుకోకపోతే కాంగ్రెస్ కార్యకర్తల చేతిలో తన్నులు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చాంద్పాషా, పౌడాల ఓం ప్రకాశ్, కంబాల రవి, నల్లెల భరత్, యాసం రవికుమార్, షకిల్, అనిల్, బోడ రఘు తదితరులు పాల్గొన్నారు. -
మేడం.. ఏదో ఒకటి తేల్చండి..!
సాక్షిప్రతినిధి, వరంగల్: మంత్రి కొండా సురేఖ దంపతులు వర్సెస్ ఎమ్మెల్యేల వివాదం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ పేషీకి చేరింది. ఇటీవల మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళీ వ్యాఖ్యలను.. వారి వ్యతిరేక వర్గం ప్రజాప్రతినిధులు మీనాక్షి దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్.నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి తదితరుల బృందం ఆదివారం హైదరాబాద్లో నటరాజన్ను కలిశారు. ‘మంత్రి కొండా సురేఖ దంపతుల వ్యాఖ్యలు పార్టీని, నాయకులను ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి. వారి వైఖరి, వ్యాఖ్యలతో ప్రజల్లో పలుచబడి పోతున్నాం.. ఇక భరించలేం.. మేడం.. మీరు ఏదో ఒకటి తేల్చండి.. పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకోండి’ అంటూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై బహిరంగంగా కామెంట్లు చేయడం, సీనియర్లని చూడకుండా పరుషపదజాలాన్ని వాడటం పార్టీ ఇమేజ్ను దిగజార్చేలా ఉందని బృందం వివరించింది. ఫిర్యాదులను స్వీకరించిన మీనాక్షి నటరాజన్.. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంటామని, అన్ని కోణాల్లో పార్టీ పరంగా విచారించేందుకు త్వరలోనే కమిటీ వేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానని కూడా చెప్పినట్లు సమాచారం. అక్కడి నుంచి వరంగల్ కాంగ్రెస్ నాయకుల బృందం పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవిని కలిసి కొండా దంపతులపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. గత ఐదారు రోజులుగా వరంగల్లో జరుగుతున్న కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలు, కొండా దంపతుల వ్యాఖ్యలు, వైఖరిని ఆయనకు వివరించినట్లు తెలిసింది. సానుకూలంగా స్పందించిన మల్లు రవి పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇవ్వడంతో ప్రజాప్రతినిధుల బృందం వెనుతిరిగినట్లు సమాచారం. కాగా కొండా దంపతులపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఇద్దరు లేదా ఐదుగురు సీనియర్లతో నేడో, రేపో కమిటీ వేసి విచారణ చేపట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఆ ఇద్దరి వ్యాఖ్యలతో ప్రజల్లో పలుచబడుతున్నాం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్తో ‘కొండా’ వ్యతిరేక ప్రజాప్రతినిధులు హైదరాబాద్లో మీనాక్షి, మల్లు రవిని కలిసిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు కమిటీ వేసి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ.. నేడో, రేపో అధికారిక ప్రకటన.. -
సోమవారం శ్రీ 23 శ్రీ జూన్ శ్రీ 2025
– 8లోuప్రైవేట్ పాఠశాలల్లో విద్య వ్యాపార ధోరణితో కొనసాగుతుందనే ఆరోపణలు లేకపోలేదు. విద్యార్థుల ఫీజులు మొదలుకొని, పుస్తకాలు, యూనిఫాం, రవాణ, టర్మ్ ఫీజుల పేరిట బాదుతున్నారు. ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు కాకుండా నోట్బుక్స్, ఆయా పాఠశాలల వర్క్ బుక్స్ పేరిట రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇవే పుస్తకాలు దుకాణాల్లో కొనుగోలు చేస్తే రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు మించవని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుస్తకాలు బయట కొనుగోలు చేస్తే యాజమాన్యాలు అనుమతించడం లేదనే ఆరోపిస్తున్నారు.కాటారం: జిల్లాలో పలు ప్రైవేట్ పాఠశాలలు విద్యను వ్యాపారంగా మార్చుకుంటున్నాయి. అధిక ఫీజులతో విద్యార్థుల తల్లిదండ్రులు సతమతమవుతుంటే మరో పక్క పాఠ్య, రాత పుస్తకాలు, టై, బెల్టులు, యూనిఫామ్స్ కూడా పాఠశాలల్లోనే కొనుగోలు చేయాలని యాజమాన్యాలు నిబంధనలు పెడుతుండటంతో ప్రైవేట్లో విద్యను కొనుగోలు చేయడానికి సతమతమవుతున్నారు. ప్రతి ఏటా విద్యాసంవత్సరం ప్రారంభంలో ప్రైవేట్ పాఠశాలల్లో ఈ తంతు యధావిధిగా నడుస్తున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు నామమాత్రంగా తనిఖీలు నిర్వహిస్తూ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. నామమాత్రంగా తనిఖీలు.. ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్కులు, యూనిఫాంలు, టై, బెల్టులు, ఇతర సామగ్రి విక్రయించకూడదని విద్యాశాఖ నిబంధనలు కఠినంగా ఉన్నాయి. అయినప్పటికీ వీటిని బేఖాతరు చేస్తూ యాజమాన్యాలు తమ వ్యాపారం తాము కొనసాగిస్తున్నారు. ఇది బహిర్గతంగా జరుగుతున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు ఏ మాత్రం దృష్టి సారించడం లేదు. విద్యార్థి సంఘాల నాయకులలో లేక ఇతరత్రా సంఘాల నాయకులో ఫిర్యాదు చేస్తే ఫిర్యాదులో పేర్కొన్న పాఠశాలకు అధికారులు ముందస్తు సమాచారం చేరవేసి తనిఖీలకు వెళ్తున్నారనే ఆరోపణలు దండిగా ఉన్నాయి. తప్పనిసరిగా దాడులు చేయాల్సి వస్తే అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేపట్టి కంటితుడుపు చర్యలు తీసుకుంటున్నారనే విమర్శలు సైతం లేకపోలేదు.న్యూస్రీల్యూనిఫాంలు, టై బెల్టుల విక్రయంమొదలైన విక్రయాలు.. ఈ నెల 12నుంచి జిల్లాలో పాఠశాలలు తెరుచుకున్నాయి. అడ్మిషన్లు జోరుగా జరుగుతుండటంతో ఇదే అదునుగా భావించిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం అధిక ఫీజులతో పాటు పాఠ్య పుస్తకాలు, ఇతర సామగ్రి పేరిట ఒకే సారి అందిన కాడికి దండుకుంటున్నారు. జిల్లాలోని పలు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో యజమాన్యాలు బహిరంగంగానే పుస్తకాలు, యూనిఫాంల వ్యాపారం కొనసాగిస్తున్నారు. పాఠశాలల్లోనే ఓ గదిలో పాఠ్య పుస్తకాలు, తమ పాఠశాలల పేరిట ముద్రించిన నోట్ బుక్కులు, యూనిఫాం, టై, బెల్టులు భద్రపరిచి ప్రత్యేకంగా ఓ ఇన్చార్జ్ని నియమించి విక్రయాలు చేపడుతున్నారు. దీంతో ప్రత్యక్షంగా పాఠశాలల్లో బుక్ సెంటర్లనే తలపించే రీతిలో పుస్తకాల వ్యాపారాలు కొనసాగుతున్నాయి.పాఠ్య, పుస్తకాలు, తల్లిదండ్రులపై ఆర్థిక భారం చోద్యంచూస్తున్న విద్యాశాఖ అధికారులుఅంతా వ్యాపార ధోరణే.. -
హామీలను అమలుచేయాలి
భూపాలపల్లి రూరల్: రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం రూ.6లక్షల నిధులు కేటాయించాలని దళితులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందుకూరి రాజారత్నం డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని రావి నారాయణరెడ్డి భవన్లో జరిగిన దళిత హక్కుల పోరాట సమితి నాయకులు పొనగంటి లావణ్య అధ్యక్షతన మూడవ జిల్లా మహాసభకు రాజారత్నం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలుచేయాలని కోరారు. అంబేడ్కర్ యోజన పథకాన్ని వెంటనే ప్రారంభించాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న దళిత కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీహెచ్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాసపల్లి భద్రయ్య, సీపీఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్, నేరెళ్ల జోసెఫ్, పసరగొండ మహేందర్, బౌతు కమలాకర్, దొంతుల రవీందర్, రాజమౌళి, గుర్రం సంపత్, రమేష్ రాజేష్, చిట్యాల పద్మ, బానమ్మ పాల్గొన్నారు.డీహెచ్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజారత్నం -
విక్రయాలపై దృష్టి సారించాలి..
విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో పలు ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్కులు, టై, బెల్టుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. బహిరంగ మార్కెట్లోని పలు పుస్తకాల పబ్లిషర్స్తో పాఠశాల యజమాన్యాలు కుమ్మకై ్క తమ ఇష్టమొచ్చిన ధరలకు విద్యార్థులకు పుస్తకాలు, నోట్ బుక్స్ అంటగడుతున్నాయి. విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ పాఠశాలల్లో బుక్స్ విక్రయాలపై దృష్టి సారించాలి. – బొడ్డు స్మరన్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు చర్యలు తీసుకుంటాం.. ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలి. పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ విక్రయించకూడదు. ఇప్పటికే ప్రైవేట్ పాఠశాలలకు హెచ్చరికలు జారీ చేశాం. ఎవరైనా స్టేషనరీ వ్యాపారం చేయడం లాంటి వాటికి పాల్పడితే చర్యలు తీసుకుంటాం. – రాజేందర్, జిల్లా విద్యాశాఖ అధికారి● -
భద్రకాళి అమ్మవారికి రూ.కోటితో రథం
హన్మకొండ కల్చరల్ : కంచి కామాక్షి అమ్మవారి రథం మాదిరిగా శ్రీభద్రకాళి అమ్మవారికి రూ.కోటి వ్యయంతో రథం తయారు చేయించడానికి ఆలయ ధర్మకర్తల మండలి తీర్మానించింది. ఈనెల 26 నుంచి ప్రారంభమయ్యే శాకంబరీ ఉత్సవాల ఏర్పాట్లపై చర్చించేందుకు ఆదివారం దేవాలయ కార్యాలయంలో వ్యవస్థాపక ధర్మకర్త డాక్టర్ బండారు శివసుబ్రహ్మణ్యం అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. ఆలయ ఈఓ శేషుభారతి, ధర్మకర్తలు, ఆలయ ప్రధానార్చకులు శేషు పాల్గొన్నారు. అమ్మవారి గుడి చుట్టూ మాడవీధుల నిర్మాణం జరుగుతున్నందున ఇకపై అమ్మవారికి నిర్వహించే వాహన, రథసేవలు మాడవీధుల గుండానే చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ఆగమశాస్త్రం ప్రకారం టేకు కర్రతో రథం తయారు చేయించడానికి మండలి తీర్మానించారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అనుమతికి కృషి చేయాలని మంత్రి కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డిని ధర్మకర్తల మండలి సభ్యులు కోరారు. నిత్యం ఉదయం, సాయంత్రం, రాత్రి మహాపూజ అనంతరం భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేయాలని, ఇందుకు శాశ్వత నిధిని బ్యాంకులో ఏర్పాటు చేయడానికి దాతలు విరాళం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో అర్చకులు భద్రకాళి శేషు, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, గదె శ్రవణ్కుమార్ రెడ్డి, ఓరుగంటి పూర్ణచందర్, తొగరు క్రాంతి, బింగి సతీష్, మోతుకూరి మయూరి, గండ్ల స్రవంతి, నార్ల సుగుణ, పాలడుగుల అంజనేయులు, జారతి వెంకటేశ్వర్లు, అనంతుల శ్రీనివాస్రావు, పార్నంది నరసింహమూర్తి పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్తల మండలి తీర్మానం 26నుంచి శాకంబరీ ఉత్సవాలపై సమావేశం -
ప్రతీ రైతుకు భరోసా
భూపాలపల్లి రూరల్: రైతు భరోసా కింద ఆదివారం వరకు జిల్లాలో రూ.132,52,49,227 నేరుగా రైతుల ఖాతాల్లో జమయ్యాయని, ప్రతీ రైతుకు రైతు భరోసా జమ అవుతుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరునాయక్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతు భరోసా పథకం కింద జిల్లాలోని 1,14,011మంది రైతుల ఖాతాల్లో మొత్తం రూ.1,32,52,49,227 నేరుగా జమచేసినట్లు తెలిపారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, సాగు అవసరాలకు ఈ నిధులు ఉపయోగపడతాయని తెలిపారు. చర్యలు తప్పవు.. భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మండలంలో ప్రభుత్వ పనులకు సంబంధించిన శిలాఫలకాలను ధ్వంసం చేసిన వ్యక్తులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని భూపాలపల్లి సీఐ నరేష్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివారం నాగారం గ్రామంలో పోలీసులు విచారణ చేపట్టారు. శిలాఫలకాలు ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని, అవసరమైతే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని తెలిపారు. జిల్లాస్థాయి క్రీడా పాఠశాల ప్రవేశాల ఎంపిక భూపాలపల్లి అర్బన్: ఈ నెల 25వ తేదీన క్రీడా పాఠశాలకు జిల్లాస్థాయి ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి రాము ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండలస్థాయిలో ఉత్తీర్ణత పొందిన విద్యార్థులకు జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో జిల్లాస్థాయి క్రీడా పాఠశాల ప్రవేశాలకు ఎంపికలు నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లాస్థాయి పోటీలకు హాజరయ్యే విద్యార్థులు పుట్టినతేది ధృవీకరణ పత్రం, కుల, స్టడీ సర్టిఫికెట్, పాస్ ఫొటోలు, ఆధార్కార్డు తీసుకురావాలని సూచించారు. సిరిసిల్ల పరామర్శ టేకుమట్ల: ఎన్కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ గణేశ్ కుటుంబ సభ్యులను ఆదివారం మాజీ ఎంపీ, ప్రణాళికా సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య పరామర్శించారు. ఈ సందర్భంగా రవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గాజర్ల రవి పీడిత ప్రజల కోసం తన జీవితాన్నే త్యాగం చేశాడన్నారు. ఆయన వెంట మాజీ ఎంపీటీసీ సంగి రవికుమార్, మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్గౌడ్, నాయకులు కత్తి సంపత్, శ్రీనివాస్, రవిందర్, వంగ నరేష్, కోరె చంద్రమౌళి, జంగపెల్లి సారయ్య, తిరుపతి, ఉన్నారు. పామాయిల్ తోట దగ్ధం రేగొండ: మండలంలోని రేపాకపల్లి గ్రామంలో ఓ రైతుకు చెందిన పామాయిల్ తోటకు గుర్తుతెలియని వ్యక్తులు శనివారం నిప్పుపెట్టారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రేపాకపల్లి గ్రామానికి చెందిన చేరి సబిత రెండు ఎకరాలలో పామాయిల్ తోట సాగుచేశారు. పంట కోతకు రావడంతో ఆదివారం ఉదయం కూలీలతో చేను దగ్గరికి వెళ్లే సరికి పంట మొత్తం దగ్ధమైంది. చేతికందిన పంట కాలిపోవడంతో రూ.3లక్షలు నష్టపోయామని బాధిత రైతు కన్నీరుమున్నీరయ్యారు. యాజమాన్య విధానాలు సరికాదు భూపాలపల్లి అర్బన్: సింగరేణి యాజమాన్యం చేపడుతున్న బదిలీల విధానాలు సరికాదని సీఐటీయూ బ్రాంచ్ కార్యదర్శి కంపేటి రాజయ్య ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నాలుగు సంవత్సరాలకు మించి ఎక్కువ సర్వీస్ ఉన్న కార్యాలయ సిబ్బందిని ఇతర శాఖలకు బదిలీ చేయాలని కోరారు. గతంలో పనిచేసిన విభాగాలకు బదిలీ చేయకూడదన్నారు. పరస్పర బదిలీలకు కఠిన నిబంధనలతో కూడిన సర్క్యులర్ యాజమాన్యం సవరించాలని కోరారు. అధికారులు ఐదు సంవత్సరాల నుంచి ఒకే ఏరియాలో పనిచేయకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ 10 సంవత్సరాలకు పెంచడం సరికాదన్నారు. పోరాటం చేయాలి ములుగు రూరల్: సామాజిక న్యాయం కోసం ప్రతిఒక్కరూ పోరాటం చేయాలని సామాజిక న్యాయ వేదిక జిల్లా అధ్యక్షుడు పోరిక శ్యామల్ నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రెడ్డి కులానికి చెందిన వారికే ఎక్కువ సంఖ్యలో మంత్రి పదవులు దక్కుతున్నాయని ఆరోపించారు. -
క్లైమాక్స్కు ‘దత్తత దందా’
సాక్షి, వరంగల్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దత్తతలో నకిలీ సర్టిఫికెట్ల దందా’ విచారణ క్లైమాక్స్కు చేరుకుంది. ఇటు పోలీసులు, అటు అధికారులు వేర్వేరుగా చేసిన విచారణ నివేదికల ఆధారంగా కలెక్టర్ సత్యశారద ఆదేశాలకు అనుగుణంగా బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశముంది. ఇప్పటికే గతంలో నకిలీ విద్యార్హత సర్టిఫికెట్లతో జిల్లా సంక్షేమ విభాగంలోని వీహబ్లో ఉద్యోగం పొంది ఏడాదికిపైగా విధులు నిర్వర్తించిన సిక్కుల సుజాతపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లుగానే దత్తత వ్యవహారంలో నకిలీ బర్త్ సర్టిఫికెట్లతో సంబంధమున్న సిబ్బందిపై కూడా చట్టపరమైన చర్యలకు అవకాశముంది. ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు అధికారే, కొన్ని నెలల క్రితం ఓ దత్తత విషయంలో నిబంధనలు అతిక్రమించి మెమో అందుకున్నా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ ‘మంత్రి’ దగ్గరికి వెళ్లి జిల్లా పాలనాధికారిపై ఒత్తిడి తెచ్చి ఉద్యోగం పోకుండా చూసుకున్నారనే ప్రచారం ఉంది. ఈసారి కూడా నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం తన మెడకు చుట్టుకుంటుందనే ఉద్దేశంతో మరోమారు సదరు మంత్రితోపాటు ఓ ఎమ్మెల్యే నుంచి కలెక్టర్పై ఒత్తిడి తెచ్చి ఈ విచారణను నీరుగార్చేలా చేశారనే టాక్ ఉంది. ఈ కేసు విషయంలో కలెక్టర్ సత్యశారద పారదర్శక విచారణ నివేదిక తెప్పించుకుంటున్నా.. ఆలోపే బ్రేక్ వేయాలనుకుంటుండడం గమనార్హం. నకిలీ బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారంలో కలెక్టర్ ఏ నిర్ణయం తీసుకుంటున్నారనేది అసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈ దందాలో 8 మందిని పోలీసులు విచారించారు. అసలే పాఠశాల లేని, అది కూడా నర్సంపేట కేంద్రంగా నకిలీ సర్టిఫికెట్లు రూపొందించడంతో విస్మయం చెందారు. డాటా ఎంట్రీ ఆపరేటర్ ఈమెయిల్ ఇవ్వడంపై అనుమానాలు.. నకిలీ సర్టిఫికెట్ల దందాపై రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ విభాగం డైరెక్టరేట్ కార్యాలయం నుంచి విచారణ చేసి వెంటనే నివేదిక సమర్పించాలని వచ్చిన సంబంధిత విభాగాధికారులు పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కారా నిబంధనల ప్రకారం దత్తత కోరుకునే దంపతుల దరఖాస్తు సమయంలో వారి ఈమెయిల్ ఐడీ ఇవ్వాలి. లేదంటే ఆఫీస్ మెయిల్ ఐడీ కూడా ఇవ్వొచ్చు. అయితే వీరు మాత్రం పాప రావడానికి ఎంత వరుసలో ఉన్నాం, ఇంకెంత మంది ముందున్నారు, పాప రెఫరల్ వచ్చే సమాచారం కోసం సదరు అధికారితోపాటు అప్పుడు ఈ విభాగంలో పనిచేసే ఓ డాటా ఎంట్రీ ఆపరేటర్ వ్యక్తిగత ‘ఈ–మెయిల్స్’ ఇవ్వడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. కారా నుంచి వచ్చే సమాచారం తమ మెయిల్కు రాగానే మీకు పాప మరో వారం రోజల్లో వస్తుంది, మాకేం చేస్తారనే మాటమంతీ జరిగి ఉండొచ్చని విచారణ చేసిన పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. అలాగే, విచారణ జరుగుతుండగానే బాలరక్షా భవన్లో పనిచేస్తున్న నర్సంపేటకు చెందిన ఓ వ్యక్తి ఉద్యోగానికి రాజీనామా చేశారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు అతడి పాత్రపై కూడా ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఎందుకంటే ఏడు నకిలీ సర్టిఫికెట్లు నర్సంపేట నుంచి రావడంతో పోలీసులకు మరిన్ని అనుమానాలు బలపడేలా చేసింది. గతంలోనే చైల్డ్ హెల్ప్లైన్లో నకిలీ అనుభవ సర్టిఫికెట్ ఇచ్చి అర్హత జాబితాలో ఎక్కడో మూలకు ఉన్నా కూడా అక్కడి అధికారుల అండదండలతో ఉద్యోగం పొందారన్న ఆరోపణలున్నాయి. త్వరలో కలెక్టర్కు నివేదిక.. దత్తత దందాపై జిల్లా రెవెన్యూ అధికారి నివేదిక మేరకు కలెక్టర్ చర్యలు తీసుకుంటారు. ఈ నివేదిక ఒకటిరెండు రోజుల్లో కలెక్టర్ వద్దకు చేరుతుంది. అలాగే, బాలరక్షాభవన్లో చైల్డ్ హెల్ప్లైన్ విభాగంలో పనిచేసే ఓ ఉద్యోగి రాజీనామా అంశాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాకే తదుపరి నిర్ణయం ఉంటుంది. – రాజమణి, వరంగల్ జిల్లా సంక్షేమ విభాగాధికారి 8 మందిని విచారించిన వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు అసలు లేని పాఠశాల నుంచి నకిలీ బర్త్ సర్టిఫికెట్లపై విస్మయం ఓవైపు విచారణ.. మరోవైపు ఓ ఉద్యోగి రాజీనామాతో అనుమానాలు -
ఆదివారం శ్రీ 22 శ్రీ జూన్ శ్రీ 2025
– 8లోuఏటూరునాగారం అభయారణ్యంలోని కొండేటివాగుమేడారం–తాడ్వాయి మధ్యలో ఇటీవల కనిపించిన అడవి దున్న (ఫైల్) ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, తాడ్వాయి అభయారణ్యాన్ని పర్యాటకులు చుట్టి వచ్చేందుకు అటవీశాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్ఎస్ తాడ్వాయి వైల్డ్ లైఫ్ శాఖ ఆధ్వర్యంలో జంగిల్ సఫారీకి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. పర్యాటకులు సఫారీలో అడవులను వీక్షించేందుకు సైతం రోడ్ల నిర్మాణ పనులు చేస్తున్నారు. త్వరలోనే జంగిల్ సఫారీ పర్యాటకులకు అందుబాటులోకి రానుంది. 17 కిలోమీటర్లు దారి.. అడవులను జంగిల్ సఫారీ ద్వారా సందర్శించేందుకు ఎస్ఎస్తాడ్వాయి హట్స్ సమీపం నుంచి కాటాపూర్ బీటీ రోడ్డు నుంచి అడవిలో 17 కిలోమీటర్ల వరకు దారి ఏర్పాటు చేశారు. దారి మధ్యలో సిమెంట్ కాజ్వేలు కూడా నిర్మించారు. అడవిలో పెద్దగుట్ట వరకు దారి ఏర్పాటు చేశారు. ఈదారి మార్గాన జంగిల్ సఫారీలో పర్యాటకులు పెద్దగుట్ట చుట్టి వచ్చేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రకృతిని ఆస్వాదించేలా.. హైదరాబాద్ పట్టణ ప్రాంతాల నుంచి బొగత, లక్నవరం, రామప్ప పర్యాటక ప్రాంతాల సందర్శనకు వచ్చే పర్యాటకులు దట్టమైన అడవుల్లోని ప్రకృతికి ఫిదా అవుతారు. గతంలో ఎస్ఎస్ తాడ్వాయి హట్స్లో బస చేసిన పర్యాటకులు ట్రెక్కింగ్, జంగిల్ సఫారీ ద్వారా అడవులను చుట్టుముట్టి వచ్చేవారు. సుమారు ఐదేళ్ల క్రితం జంగిల్ సఫారీ మూలనపడింది. దీంతో అప్పటినుంచి పర్యాటకులు ఎస్ఎస్ తాడ్వాయిలోని అడవుల సందర్శన నిలిచిపోయింది. పెరుగుతున్న పర్యాటకుల తాకిడి రోజురోజుకూ పలు ప్రాంతాల నుంచి పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు పర్యాటకుల తాకిడి పెరుగుతుండడంతో అటవీశాఖ అధికారులు మళ్లీ జంగిల్ సఫారీని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అడవి మార్గాల్లో రోడ్లను ఏర్పాటు చేస్తున్నారు. రోడ్ల నిర్మాణ పనులు కూడా పూర్తి దశకు చేరుకున్నాయి. త్వరలోనే జంగిల్ సఫారీ వాహనాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. తాడ్వాయి మండల పరిధిలోని దామెరవాయి అటవీ ప్రాంతంలోని ఆదిమానవుల సమాధులను పర్యాటకులు, యూనివర్సిటీ విద్యార్థులు సందర్శిస్తున్నారు. అడవుల సందర్శనతో పాటు సమాధులను వీక్షించేందుకు జంగిల్ సఫారీ వాహనం ఏర్పాటు చేస్తే బాగుంటుందని స్థానికులు, పర్యాటకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాడ్వా యి నుంచి మేడారం మీదుగా ఊరట్టం ఏటూరునాగారం మండలంలోని కొండాయి వెళ్లే దారిలో మూడు కిలోమీటర్ల దూరంలో కొండేటి వాగు వ్యూ పాయింట్ చాలా అద్భుతంగా ఉంది. ఈ పాయింట్ వరకు జంగిల్ సఫారీ ఏర్పాటు చేస్తే మేడారానికి వచ్చే భక్తులతో పర్యాటకుల సంఖ్య పెరగనుంది.రెండు నెలల్లో అందుబాటులోకి.. ఎస్ఎస్తాడ్వాయిలోని జంగిల్ సఫారీ 60 రోజుల్లో పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొస్తాం. తాడ్వాయి హట్స్ నుంచి 17 కిలోమీటర్లు పెద్దగుట్ట వరకు రోడ్డు నిర్మాణం పూర్తయింది. ఇంకా అన్ని హంగులతో అడవులను సందర్శించేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. – రమేశ్, ఎఫ్డీఓ, ఏటూరునాగారంజంగిల్ సఫారీ కోసం అడవిలో వేసిన రోడ్డున్యూస్రీల్తాడ్వాయి, ఏటూరునాగారం అభయారణ్యంలో త్వరలో ‘జంగిల్ సఫారీ’ అడవుల్లో 17కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణంబోన్ల నడుమ జంతువుల్ని.. డెన్ మధ్యన పులిని.. గూళ్లలో పిచ్చుకల్ని.. నిలువ నీటి తొట్లలో తాంబేళ్లను.. ఆక్వేరియంలో చేపల్ని జూ పార్క్లో చూసి మురిసిపోతాం. అలాంటిది.. దట్టమైన అడవిలో పచ్చందాల నడుమ సఫారీలో ప్రయాణిస్తూ.. వేటాడే పులిని.. చెవులకింపైన పక్షుల కిలకిలారావాల్ని.. చెంగుచెంగున పరుగెట్టే లేడికూనల్ని చూస్తూ సెల్ఫోన్లలో బంధిస్తూ పర్యాటకులు మైమరచిపోయేలా.. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యాటకానికి మరింత శోభ తెచ్చేలా ఎస్ఎస్ తాడ్వాయి వైల్డ్లైఫ్ అటవీశాఖ ఏర్పాట్లు చేస్తోంది. తాడ్వాయి, ఏటూరునాగారం అభయారణ్యంలో హాయిగా విహరించేందుకు సాగుతున్న ‘జంగిల్ సఫారీ’ ఏర్పాట్లపై ఈవారం ‘సాక్షి’ ప్రత్యేకం. –ఎస్ఎస్తాడ్వాయి ఏర్పాట్లు చేస్తున్న అటవీశాఖ అధికారులు ఉమ్మడి జిల్లా పర్యాటకానికి మరింత శోభ -
అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
● జిల్లా వ్యవసాయ అధికారి వీరునాయక్ రేగొండ: విత్తనాలను అధిక ధరలకు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ అధికారి వీరునాయక్ అన్నారు. శనివారం మండలకేంద్రంలోని పలు ఎరువులు, విత్తన దుకాణాలను ఏఓ వాసుదేవారెడ్డితో కలిసి తనిఖీచేసి ఇన్వాయిస్, స్టాక్ రిజిస్టర్, బిల్లు బుక్కులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విత్తన డీలర్లు విధిగా స్టాక్ వివరాలు, ధరల పట్టిక రోజు వారీగా నమోదు చేయాలన్నారు. అధిక ధరలకు విత్తనాలను విక్రయించే వారిపై పీడీ యాక్టు కింద కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విత్తనాలను లైసెన్స్ కలిగిన డీలర్ల నుంచి కొనుగోలు చేసి, రశీదు పొంది ఆ రశీదును పంట కాలం పూర్తయ్యే వరకు భద్రపరుచుకోవాలని రైతులకు సూచించారు. బిజీ 3, లూజు పత్తి విత్తనాలను ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయవద్దని, ఎవరైనా అమ్మితే సమాచారం అందించాలని కోరారు. -
మొలకెత్తలే..
రేగొండ: గత నెలాఖరులో మురిపించిన తొలకరి వర్షాలకు పత్తి విత్తనాలు విత్తిన రైతులు ఆ తర్వాత వర్షాల జాడ లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వర్షాలు లేకపోవడంతో విత్తనాలు మొలకెత్తే సమయానికి భూమి లో తేమ శాతం లేకపోవడంతో విత్తనాలు మాడిపోతున్నాయి. దీంతో జిల్లాలోని పలు మండలాల్లో రైతులు మళ్లీ దుక్కులు దున్ని విత్తనాలు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఊరించి.. ఉసూరుమనిపించి.. జిల్లావ్యాప్తంగా ఈ సారి సీజన్లో 93వేల 823 ఎకరాల్లో పత్తి సాగు జరుగుతుందని అధికారులు అంచనా వేశారు. గత నెలాఖరులో కురిసిన తొలకరి వర్షాలకు పలువురు రైతులు 46వేల ఎకరాల్లో పత్తి విత్తనాలు విత్తారు. రేగొండ మండలంలో అత్యధికంగా 18వేల ఎకరాల్లో సాగుచేశారు. 20 రోజులుగా వర్షాలు ముఖం చాటేయడంతో విత్తనాలు మొలకెత్తే పరిస్థితులు లేవు. దీంతో పలువురు రైతులు పత్తి చేన్లకు నీళ్లు పెడుతున్నారు. పత్తి సాగు ఆరంభంలోనే రైతులకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడడంతో ఇబ్బందులు పడుతున్నారు. భూమిలోనే మాడిపోతున్నాయి.. రేగొండ మండలంలో ప్రధానంగా జగ్గయ్యపేట, జూబ్లీనగర్, కొత్తపల్లిగోరి, రేపాక తదితర గ్రామాలలో సుమారు 12వేల ఎకరాలలో విత్తనాలు విత్తారు. విత్తనాలు వేసి వారం, పది రోజులవుతున్నప్పటికీ వర్షాలు ముఖం చాటేయడంతో భూమి లోపలి వేడి, బయటి ఉష్ణోగ్రతలకు విత్తనాలు భూమిలోనే మాడిపోతున్నాయి. మొలకెత్తిన విత్తనాలు వర్షాలు లేక ఎండిపోతున్నాయి. దీంతో జగ్గయ్యపేట, కొత్తపల్లిగోరి, రాజక్కపల్లి శివారులోని కొంత మంది రైతులు విత్తనాలు మొలకెత్తేందుకు వీలుగా పత్తి చేన్లకు నీటి తడులు పెడుతున్నారు. శుక్రవారం సాయంత్రం ఆకాశం మేఘావృతమైనప్పటికీ అక్కడక్కడ చిరుజల్లులు మాత్రమే పడ్డాయి.పత్తిసాగుకు ఆదిలోనే అడ్డంకులు ఇప్పటికే 46వేల ఎకరాల్లో పత్తి సాగు వర్షాభావ పరిస్థితులతో రైతుల ఆందోళనతొలకరి వర్షాలకు తొందరపడొద్దు రైతులు తొందరపడి పత్తి విత్తనాలు విత్తొద్దు. తొలకరి వర్షాలకు భూమి లోపలి వేడి తగ్గదు. కనీసం 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత విత్తనాలు వేయాలి. వర్షాలు విస్తారంగా కురిసేటప్పుడు విత్తనాలు వేస్తే బాగుంటుంది. – వాసుదేవారెడ్డి, మండల వ్యవసాయ అధికారి, రేగొండవిత్తనాలు మొలకెత్తలేదు..పది రోజుల క్రితం కురిసిన వర్షానికి రెండెకరాల్లో పత్తి విత్తనాలు విత్తిన. వర్షాలు పడకపోవడంతో మొలకెత్తలేదు. ఎండవేడికి విత్తనాలు భూమిలోనే మాడిపోయాయి. రెండు రోజుల నుంచి నీటి తడులు అందిస్తున్నాను. – మానూరి అశోక్, కొత్తపల్లిగోరి -
ఉద్రిక్తత.. ఉత్కంఠ
హనుమకొండలో శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఉద్రిక్తత, ఉత్కంఠ వాతావరణం నెలకొంది. గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని హనుమకొండ సుబేదారి పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి తరువాత శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేసి నేరుగా వరంగల్కు తీసుకు వచ్చారు. మాజీ ప్రజాప్రతినిధులు, విద్యార్థి నాయకుల ఆందోళన, పరామర్శలతో సుబేదారి పోలీస్స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాత్రి ఆయనకు బెయిల్రావడంతో కార్యకర్తలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. – వరంగల్ క్రైం● ఉదయం నుంచి రాత్రివరకు సాగిన ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి ఎపిసోడ్ ● శంషాబాద్లో అరెస్ట్ చేసి హనుమకొండ సుబేదారి పోలీస్స్టేషన్కు.. ● బీఆర్ఎస్, విద్యార్థి నేతల ఆందోళన.. సీఎం దిష్టిబొమ్మ దహనం.. ● బెయిల్ రావడంతో కార్యకర్తల ఆనందోత్సాహం– వివరాలు 8లోu -
యోగాతో ఆరోగ్యకర జీవనం
భూపాలపల్లి: ఆరోగ్యకర జీవనానికి యోగా ఎంతో ఉపయోగకరమని, నిత్య జీవితంలో ప్రతీ ఒక్కరు యోగా సాధన చేయాలని కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఐడీఓసీ కార్యాలయంలో వైద్య, ఆయూష్ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా వేడుకలకు కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఆసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ సంవత్సరం ‘యోగా ఫర్ వన్ ఎర్త్ ... వన్ హెల్త్’ థీమ్ చేపట్టినట్లు తెలిపారు. శరీరాన్ని శుద్ధిచేసి, మంచిని ఆచరిస్తూ, మంచి ఆలోచనలతో అమూల్యమైన ఫలితాలను సాధించేందుకు దివ్యమైన ఆయుధంగా యోగా ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఎంహెచ్ఓ మధుసూదన్, ఆయూష్ వైద్యురాలు డాక్టర్ తనూజారాణి, డీపీఓ వీరభద్రయ్య, డీఎస్పీ సంపత్రావు, ఈడీఎం శ్రీకాంత్ పాల్గొన్నారు. అత్యవసర వైద్యసేవలు అందించాలి.. అత్యవసర వైద్యసేవలకు వైద్యసిబ్బంది అందుబాటులో ఉండాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ఐడీఓసీ కార్యాలయంలో వైద్య, పంచాయతీరాజ్, మున్సిపల్, డీఆర్డీఓ తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ, వ్యాధులు ప్రబలితే అత్యవసర వైద్యసేవలు అందించుట, డ్రై డే అమలు, వ్యక్తిగత పరిశుభ్రత, విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక పర్యవేక్షణ తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ మధుసూదన్, ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి పర్యవేక్షకుడు డాక్టర్ నవీన్కుమార్, డీపీఓ వీరభద్రయ్య, డీఆర్డీఓ బాలక్రిష్ణ పాల్గొన్నారు. సాగుపై అవగాహన కల్పించాలి.. వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. సాగు పెట్టుబడికి ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా నిధులు జమపై శనివారం వ్యవసాయ అధికారి వీరునాయక్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు జిల్లాలోని 12 మండలాల పరిధిలోని 1,12,740 మంది రైతులకు రూ.127.18 కోట్లు రైతు భరోసా నిధులు నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలకు జమ అయినట్లు తెలిపారు. ఈ సమావేశంలో డీఏఓ వీరునాయక్, ఉద్యానవన శాఖాధికారి సునీల్కుమార్ పాల్గొన్నారు. వన మహోత్సవానికి ప్రణాళికలు.. వన మహోత్సవం కార్యక్రమానికి ముందస్తు కార్యాచరణ ప్రణాళికలతో అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. శనివారం ఐడీఓసీ కార్యాలయంలో వన మహోత్సవ ఏర్పాట్ల్లపై అటవీ, డీఆర్డీఓ, వ్యవసాయ, ఉద్యానవన, మున్సిపల్, పోలీస్, కేటీపీపీ, సింగరేణి తదితర శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 28.77 లక్షల మొక్కలు నాటేందుకు శాఖలు, పరిశ్రమలకు లక్ష్యాన్ని కేటాయించామని అన్నారు. ఈ సమావేశంలో డీఎఫ్ఓ నవీన్రెడ్డి, డీఆర్డీఓ బాలక్రిష్ణ, డీఏఓ వీరునాయక్, ఉద్యానవన శాఖాధికారి సునీల్కుమార్, డీఎస్పీ సంపత్రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వైద్యులు అందుబాటులో ఉండాలి కలెక్టర్ రాహుల్శర్మ -
23న ఒలింపిక్ డే రన్
భూపాలపల్లి అర్బన్: అంతర్జాతీయ ఒలింపిక్ డేను పురస్కరించుకొని ఈ నెల 23న రన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి సీహెచ్.రఘు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 6గంటలకు జిల్లాకేంద్రంలోని హన్మాన్ దేవాలయం నుంచి అంబేడ్కర్ స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని క్రీడాసంఘాల సభ్యులు, క్రీడాకారులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ సభ్యులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మినీ స్టేడియం ఏర్పాటు చేయాలని వినతి కాటారం: మండలకేంద్రంలో మినీ స్టేడియం ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్కు వినతిపత్రం సమర్పించారు. కాటారం శివారులో ఊర చెరువును ఆనుకొని ఉన్న ఖాళీ స్థలంలో సర్వే నంబర్ 71లో మినీ స్టేడియం ఏర్పాటు చేసేలా చొరవ చూపాలని కోరారు. స్టేడియం ఏర్పాటుతో యువత క్రీడలపై ఆసక్తి పెంచుకొని గంజాయి, మాదక ద్రవ్యాలకు అలవాటుపడకుండా ఉంటారని పేర్కొన్నారు. గతంలో సర్వే నంబర్ 49 తిమ్మనకుంట శిఖం భూమిలో స్టేడియం ఏర్పాటు చేస్తామని ప్రజాప్రతినిధులు, నాయకులు ఆర్బాటాలు చేసి ఇప్పటి వరకు నిర్మాణం చేపట్టలేదని అన్నారు. వినతిపత్రం సమర్పించిన వారిలో డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఆత్కూరి శ్రీకాంత్, బీఎస్పీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బొడ్డు రాజ్కుమార్, రైతు సంఘం నాయకులు గుమ్మడి తిరుపతి ఉన్నారు. వాహనాల తనిఖీ టేకుమట్ల: పోలీసుల ఎన్కౌంటర్లో మృతిచెందిన గాజర్ల రవి అలియాస్ గణేష్ అంతిమయాత్రకు శుక్రవారం రాష్ట్రం నలు మూలల నుంచి వాహనాల్లో హాజరయ్యారు. వారి వాహనాలను మండలకేంద్రంలోని టేకుమట్ల–ఆశిరెడ్డిపల్లి ప్రధాన రోడ్డులో పోలీసులు నిలిపి విస్తృతంగా తనిఖీచేశారు. గాజర్ల రవి అంత్యక్రియల్లో పోలీసులు మఫ్టీలో గస్తీ నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడిగా సత్యనారాయణ భూపాలపల్లి రూరల్: బీసీ హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షుడిగా భీమనాథుని సత్యనారాయణ ఎన్నికయ్యారు. జిల్లా రెండో మహాసభ శుక్రవారం జిల్లాకేంద్రంలో జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా వేముల శ్రీకాంత్, సహాయ కార్యదర్శులుగా క్యాతరాజు సతీష్, అస్లాం, జిల్లా ఉపాధ్యక్షులుగా మేరుగు రమేష్, గోలి లావణ్య, జిల్లా కోశాధికారిగా కట్టెగొల్ల భారతి, జిల్లా కార్యవర్గ సభ్యులుగా రమేష్ చారి, మహేష్,పుప్పాల వనిత, సుధాకర్, శేఖర్, అజయ్, భగత్ లను ఎన్నుకున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రాములు తెలిపారు. వరల్డ్ రికార్డ్కు అలకనంద ఎంపిక మల్హర్: మండలంలోని అన్సాన్పల్లి గ్రామానికి చెందిన భరతనాట్య వర్థమాన నృత్య కళాకారిణి బానోతు అలకనంద వర్డల్ రికార్డ్కి ఎంపికై నట్లు తల్లిదండ్రులు బానోతు రాజకుమార్ దివ్య తెలిపారు. ఈ సందర్భంగా రాజ్కుమార్ మాట్లాడుతూ.. అలకనంద మూడు సంవత్సరాల నుంచి ఎన్నో వేదికలపై తన భరతనాట్య నృత్య ప్రదర్శనలు ఇస్తూ ప్రముఖుల ద్వారా 20 జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకుందన్నారు. అలకనంద నృత్య ప్రదర్శనలను పరిశీలించిన అనంతరం ప్రముఖ రాయల్ ఇంటర్ నేషనల్ బుక్ ఆఫ్ రికార్డు, 21 సెంచరీ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డు సంస్థల ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ ఎం.హారిక, తెలంగాణ రాష్ట్ర చీఫ్ కోర్టినేటర్ ఇసపల్లి నరేశ్ ఆమెను వరల్డ్ రికార్డుకు ఎంపిక చేస్తూ నియామక పత్రం ఇచ్చినట్లు రాజ్కుమార్ తెలిపారు. వరల్డ్ రికార్డుకు ఎంపిక కావడం పట్ల గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు సంతోషం వ్యక్తం చేశారు. -
ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలి
ములుగు రూరల్: పోలీస్స్టేషన్కు వచ్చే ఫిర్యాదులదారులతో సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఎస్పీ శబరీష్ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని పోలీస్స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఫిర్యాదులు వచ్చిన వెంటనే విచారణ అధికారికి అందించి విచారణ అనంతరం కేసులు నమోదు చేయాలన్నారు. రికార్డులు పెండింగ్ లేకుండా చూసుకోవాలని, విచారణ చేపడుతున్న కేసుల్లో ప్లాన్, యాక్షన్ కలిగి ఉండాలన్నారు. రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, మాదకద్రవ్యాల నిర్మూలనకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సైబర్ నేరాల బారిన ప్రజలు పడకుండా అప్రమత్తం చేయాలన్నారు. డీఎస్పీ రవీందర్, ఎస్బీ సీఐ శంకర్, సీఐ సురేష్, ఎస్హెచ్ఓ వెంకటేశ్వర్రావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ శబరీష్ -
శనివారం శ్రీ 21 శ్రీ జూన్ శ్రీ 202
జిల్లాలో ప్రధాన రిజర్వాయర్లు 03 అన్నారం, గణపురం, భీంఘన్పూర్ చెరువులు, కుంటలు 832 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు 130సహకార సంఘాల సభ్యుల సంఖ్య 10,073ఆదేశాలు రాగానే టెండర్లు.. జిల్లాకు సంబంధించి ఉచిత చేప పిల్లల పంపిణీ కోసం ప్రణాళిక తయారు చేసి ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే టెండర్ల ప్రక్రియ చేపడుతాం మత్స్యకారులు, సొసైటీల వారు ముందస్తుగా చేపపిల్లలను చెరువుల్లో వదలవద్దు. అధికారుల సూచన మేరకే చేపపిల్లలను వదలాలి. – వై.విజయ్కుమార్, జిల్లా మత్స్యశాఖ అధికారిజూలైలో వదిలే ఏర్పాటు చేయాలి.. చేప పిల్లల పంపిణీ ప్రక్రియ త్వరగా అయ్యేలా చూడాలి. జూలై నెలాఖరు వరకు చేప పిల్లలను వదిలే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. లేదంటే దిగుబడి తగ్గే అవకాశం ఉంది. గతేడాది నవంబర్లో చేప పిల్లలను వదిలారు. చేపలు ఎదగలేదు. దిగుబడి తగ్గింది. – చక్రపాణి, జిల్లా మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు ●న్యూస్రీల్ -
ప్రతీ రైతుకు ‘భరోసా’
భూపాలపల్లి రూరల్: పాత రైతులతో పాటు కొత్త రైతులకు కూడా రైతు భరోసా అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ రాహుల్శర్మ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2025 రైతు భరోసా నిధుల పంపిణీ వివరాలు వెల్లడించారు. జిల్లాలో 282 గ్రామాల నుంచి 1,24,397 మంది రైతులకు గాను రూ.143,99,06,145 నిధులను రైతుల ఖాతాల్లో జమచేయాల్సి ఉందన్నారు. ఈ నెల 20వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా 1,09,034 మంది రైతులకు రూ.114.43 కోట్లు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు.కలెక్టర్ రాహుల్శర్మ -
మొక్కల పెంపకంలో జాగ్రత్తలు పాటించాలి
కాటారం: నర్సరీల్లో మొక్కల పెంపకం పట్ల తగు జాగ్రత్తలు పాటించి సక్రమంగా ఎదిగేలా చర్యలు తీసుకోవాలని అటవీశాఖ మహదేవపూర్ డివిజన్ అధికారి సందీప్రెడ్డి సూచించారు. కాటారం మండలకేంద్రంలోని సెంట్రల్ నర్సరీని శుక్రవారం ఆయన పరిశీలించారు. మొక్కల పెంపకం, మొక్కల రకాలు తదితర అంశాలపై ఎఫ్డీఓ ఆరాతీశారు. మొక్కల పెంపకం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం గుమ్మాళ్లపల్లి అటవీ ప్రాంతంలో కలియ తిరిగి అటవీ అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు. జిల్లాలోని అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నందున అటవీశాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఎఫ్డీఓ వెంట కాటారం రేంజ్ అధికారి స్వాతి, డిప్యూటీ రేంజ్ అధికారి సురేందర్, బీట్ అధికారులు రాజేందర్, రాజ్కుమార్ ఉన్నారు.ఎఫ్డీఓ సందీప్రెడ్డి -
ఆదివాసీలకు చట్టబద్ధత కల్పించాలి
ములుగు రూరల్: షెడ్యూల్ ప్రాంతంలో పూర్వం నుంచి జీవిస్తున్న ఆదివాసీలకు చట్టబద్ధత కల్పించాలని తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు చింత కృష్ణ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ దివాకరకు తుడుందెబ్బ, ఎమ్మార్పీఎస్ నేతలు కలిసి వినతి ప్రతం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా భూభాగం భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ భూ భాగాన్ని కాపాడాల్సిన దేశ అత్యున్నత ఇండియన్ సర్వీసెస్ అధికారులే చోద్యం చేయడం బాధాకరమన్నారు. ఏటూరునాగారంలోని శివపురం షెడ్యూల్డ్ ఏరియా గ్రామంలో కొంతమంది గిజనేతరులు ఆదివాసీల పట్టా భూమిని సాగు చేయడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకుడు నెమలి నర్సయ్య, నాయక పోడ్ దెబ్బ వ్యవస్థాపక పొలిట్ బ్యూరో సభ్యుడు బొల్లెం సారయ్య, ఎమ్మార్పీఎస్, మహాజన సోషలిస్ట్ పార్టీ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు వావిలాల స్వామి పాల్గొన్నారు. -
భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సు
టేకుమట్ల/మొగుళ్లపల్లి: భూ సమస్యలు పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ అశోక్కుమార్ అన్నారు. శుక్రవారం టేకుమట్ల మండలం సోమనపల్లి, మొగుళ్లపల్లి మండలం పిడిసిల్ల గ్రామాల్లో భూ భారతి సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్కుమార్ మాట్లాడుతూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమస్యల పరిష్కారానికి సదస్సుల్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. దరఖాస్తు చేయని వారు ఈ నెల 23న తహసీల్దార్ కార్యాలయంలో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. పిడిసిల్ల గ్రామంలోని రేషన్షాపుపై పలు ఆరోపణలు రావడంతో డీఎస్ఓ శ్రీనాథ్తో కలిసి తనిఖీ చేశారు. ఈ కార్యక్రమాల్లో తహసీల్దార్లు విజయలక్ష్మి, సునీత, గిర్దావర్ శివరామకృష్ణ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ అశోక్కుమార్ -
వెలిశాల.. శోకసంద్రం
గాజర్ల రవి అంతిమయాత్రలో పాల్గొన్న అభిమానులు టేకుమట్ల: మూడు దశాబ్దాలుగా పీడిత ప్రజల విముక్తి కోసం ఉద్యమ బాట పట్టి ఎన్కౌంటర్లో మృతిచెందిన గాజర్ల రవి అలియాస్ గణేష్ అంత్యక్రియలు స్వగ్రామం టేకుమట్ల మండలం వెలిశాలలో శుక్రవారం ముగిశాయి. రంపచోడవరంలో గురువారం రాత్రి పోస్టుమార్టం అనంతరం రవి పార్థీవ దేహాన్ని కుటుంబ సభ్యులకు అందించగా శుక్రవారం ఉదయం 8:30 గంటలకు స్వగ్రామమైన వెలిశాలకు చేరుకుంది. ఉద్యమ గీతాలతో కవులు, కళాకారులు, ఉద్యకారులు ఉద్యమాల బిడ్డా, నిను మరువదు ఈ గడ్డ అంటూ నివాళులర్పించారు. కాగా, రవి మృతదేహాన్ని వెలిశాలకు తీసుకొస్తున్న సమయంలో చిట్యాల, చల్లగరిగలో వాహనాన్ని ఆపి పలువురు నివాళులర్పించారు. ఎరుపెక్కిన వెలిశాల.. గాజర్ల రవి అలియాస్ గణేష్ అంత్యక్రియల నేపథ్యంలో గ్రామంలో పెద్దఎత్తున ఎర్రజెండాలు, రవి చిత్రాలతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆయన పార్థీవ దేహం వెలిశాలకు చేరుకోగానే ఉద్యమ గీతాలతో హోరెత్తించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు మొదలైన అంతిమయాత్ర కూతవేటు దూరానికే సుమారు నాలుగు గంటల పాటు కొనసాగింది. ఉద్యమ నినాదాలు, గీతాలు, డప్పు కళాకారుల దరువులకు వెలిశాల దద్ధరిల్లింది. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సతీమణి పుష్ప ఉద్యమ గీతాలు, నృత్యాలతో విప్లవానికి చావు లేదనే విధంగా ఆడి పాడారు. అంతిమ యాత్ర ప్రారంభం నుంచి చివరి అంకం వరకు ఉద్యమ గీతాలు, నృత్యాలతో హోరెత్తించారు. భారీగా తరలివచ్చిన అభిమానులు గాజర్ల రవికి అంతిమ వీడ్కోలు తెలిపేందుకు మాజీ మావోయిస్టులు, ప్రజాసంఘాల నాయకులు, కవులు, గాయకులు, ప్రజలు, అభిమానులు తరలిరావడంతో వెలిశాల జన సంద్రమైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేపడుతున్న మారణహోమాన్ని వెంటనే ఆపాలని, ప్రధాని నరేంద్రమోదీ, అమిత్షా కనుసన్నల్లో పని చేస్తున్నాడని భారత్ భచావో అధ్యక్షుడు, తెలంగాణ సిద్ధాంతకర్త గాదె ఇన్నయ్య, విమలక్క మండిపడ్డారు. హక్కులు సాధించుకోవాలంటే పోరాడాలని అమ్మే నేర్పిందని గాజర్ల రవి సోదరుడు గాజర్ల అశోక్ అలియాస్ ఐతు అన్నారు. కష్టమున్న చోట ఎదురించి పోరాడమని వెలిశాల చెప్పిందని అన్నారు. దొరలు, పెత్తందార్లు చేసే అరాచకాల నుంచి పీడిత ప్రజల విముక్తి కోసం గాజర్ల కుటుంబం పోరాడిందని.. ఆ క్రమంలో పోలీసులు పెట్టిన చిత్రహింసలు వెలిశాల ప్రజలకు తెలుసన్నారు. చివరికి అన్నయ్య రవన్న మృతదేహాన్ని సైతం రంపచోడవరం ఆస్పత్రిలో చూపించకుంటే పోలీసులను ప్రశ్నిస్తేనే చూపించారని అన్నారు. నివాళులర్పించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు.. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, తీన్మార్ మల్లన్న గాజర్ల రవి మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు. సాయంత్రం ఐదు గంటల వరకు వేలాది మంది నడుమ జరిగిన అంతిమయాత్ర అనంతరం గాజర్ల రవి అలియాస్ గణేష్ చితికి సోదరుడు అశోక్ అలియాస్ ఐతు నిప్పంటించారు. మావోయిస్టు నేత గాజర్ల రవికి కన్నీటి వీడ్కోలు ఎర్రజెండాలతో ఎరుపెక్కిన గ్రామం తరలివచ్చిన ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు నివాళులర్పించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు -
నాణ్యమైన వైద్యసేవలు అందించాలి
కాటారం: ప్రభుత్వ వైద్య ఆరోగ్య కేంద్రాల ద్వారా గ్రామీణ ప్రాంతంలోని ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని జాతీయ నాణ్యత ప్రమాణాల బృందం సభ్యులు సూచించారు. మహాముత్తారం మండలం కొర్లకుంటలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను శుక్రవారం బృందం సభ్యులు పరిశీలించారు. ఆరోగ్య మందిర్ ద్వారా అందుతున్న వైద్య సేవలు, మందులు, సౌకర్యాలు, ఇతరత్రా అంశాలపై ఆరా తీశారు. వైద్యసేవలను విస్తృత పర్చడంతో పాటు రోగుల పట్ల మర్యాదగా నడుచుకోవాలని సూచించారు. వైద్యసిబ్బంది అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బృందం సభ్యులు డాక్టర్ సునిత పలివల్, డాక్టర్ గంగతరన్, జిల్లా ప్రోగ్రామింగ్ అధికారులు డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ ఉమాదేవి, వైద్యులు డాక్టర్ సందీప్, డీపీఓ చిరంజీవి, ఇన్చార్జ్ జిల్లా క్వాలిటీ మేనేజర్ శరత్, డీడీఎం మధుబాబు, వైద్యులు రాజకుమారి జ్యోతి, మమత ఉన్నారు. -
దిగుమతి భారం తగ్గించేందుకే ఆయిల్పామ్ సాగు
గోవిందరావుపేట: దేశంలో వంటనూనె దిగుమతి భారాన్ని తగ్గించేందుకే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్పామ్ సాగును ప్రోత్సహిస్తున్నాయని జిల్లా ఉద్యాన అధికారి దండు సంజీవరావు అన్నారు. మండల పరిధిలోని రాంనగర్ గ్రామంలో రైతులకు ఆయిల్పామ్ సాగుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంజీవరావు మాట్లాడుతూ దేశంలో వంట నూనె ఉత్పత్తి 16.69 మిలియన్ మెట్రిక్ టన్నులు కాగా 33.20 మిలియన్ మెట్రిక్ టన్నుల వినియోగం జరుగుతుందన్నారు. దేశంలో పామ్ ఆయిల్ 259 లక్షల టన్నులు వినియోగానికి అవసరం కాగా 100 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ ఆఫీసర్ శ్రీకాంత్, కేఎన్ బయో సైన్స్ మండల ప్రతినిధి సురేష్, నవీన్ నాయక్, రైతులు సోనియా నాయక్, మోహన్ పాల్గొన్నారు.జిల్లా ఉద్యాన అధికారి సంజీవరావు -
మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి
ములుగు రూరల్: మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర–శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క అన్నారు. మండల పరిధిలోని జగ్గన్నపేట బాలికల ఆశ్రమ పాఠశాలలో కుట్టుమిషన్ శిక్షణ ముగింపు కార్యక్రమంలో మహిళలకు కుట్టు మిషన్లు, ధ్రువపత్రాలను మంత్రి గురువారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలు నైపుణ్యం లేని కారణంగా ఉపాధికి దూరంగా ఉంటున్నారన్నారు. ప్రజా ప్రభుత్వం సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో మహిళల అభివృద్ధికి కట్టుబడి పని చేస్తుందని తెలిపారు. విద్యార్థులకు యూనిఫాం కుట్టే పనితో మహిళా సంఘాలకు రూ.30 కోట్ల వరకు ఆదాయం వచ్చిందని తెలిపారు. 15నుంచి 60 సంవత్సరాల వయసు కలిగిన మహిళలు అందరూ తప్పకుండా మహిళా సంఘాలలో చేరాలని సూచించారు. మహిళా సంఘాలకు పెట్రోల్ బంక్లు, ఇందిరా శక్తి క్యాంటీన్లు, బస్సులు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవకాశాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాలలో చేరిన చిన్నారులకు అక్షరభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి తుల రవి, డీఎస్పీ రవీందర్, ట్రైబల్ వెల్పేర్ డీడీ పోచం, ఎంపీడీ రామకృష్ణ, జిల్లా మహిళా సాధికారత కేంద్రం అధికారి రమాదేవి, డీసీపీఓ ఓంకార్, సీడీపీఓ శిరీష తదితరులు పాల్గొన్నారు. అనంతరం ములుగు జిల్లా కేంద్రం నుంచి పొట్లాపూర్ వరకు చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. రోడ్డు నిర్మాణ పనులకు అంచనా విలువ రూ.19 కోట్లతో రోడ్డు వెడల్పు, పటిష్ట పరిచేందుకు నిధులు కేటాయించినట్లు వివరించారు. -
సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
చిట్యాల: ప్రధాని నరేంద్రమోదీ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రతి బీజేపీ కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతల నిశీధర్రెడ్డి కోరారు. గురువారం మండలంలోని జూకల్ ఫంక్షన్ హాల్లో మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో విజయ సంకల్పసభ నిర్వహించారు. ఈ సందర్భంగా నిశీధర్రెడ్డి మాట్లాడుతూ.. మోదీ 11 సంవత్సరాల కాలంగా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి నిరుపేదలకు అండగా నిలుస్తున్నాడని అన్నారు. రానున్న ఎన్నికలలో మండలంలో బీజేపీ జెండా ఎగిరేలా కృషి చేయాలని కోరారు. అందుకోసం ప్రతీ కార్యకర్త సైనికుడిలాగా పనిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వికసిత్ భారత్ జిల్లా కన్వీనర్ జన్నే మొగిలి, మండల ప్రధాన కార్యదర్శి మైదం శ్రీకాంత్ పాల్గొన్నారు.బీజేపీ జిల్లా అధ్యక్షుడు నిశీధర్రెడ్డి -
‘సికిల్సెల్’తో తీవ్ర అనారోగ్యం
ములుగు రూరల్: సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు రక్తహీనతతో తీవ్ర అనారోగ్యం కలుగుతుందని ములుగు డీఎంహెచ్ఓ గోపాల్రావు అన్నారు. ఈ మేరకు గురువారం ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని చేపట్టిన ర్యాలీకి ఆయన జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. సికిల్ సెల్పై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల ద్వారా సికిల్ సెల్ను గుర్తించవచ్చన్నారు. సికిల్ సెల్ జన్యు సంబంధమైన వ్యాధి అన్నారు. వ్యాధిగ్రస్తులకు దృష్టిలోపం, కీళ్ల నొప్పులు, చాతి నొప్పి, ఆయాసం వంటి లక్షణాలు ఉంటాయని వివరించారు. పోషకాహార సమతుల్యత, వైద్యుల పర్యవేక్షణ, శారీరక శ్రమతో నియంత్రించవచ్చని వివరించారు. జిల్లాలో 22,392 మందికి వైద్య పరీక్షల కార్డులను అందించినట్లు వెల్లడించారు. అందులో 15 మందికి వ్యాధి నిర్ధారణ అయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీసీహెచ్ జగదీశ్, ప్రోగ్రాం అధికారి శ్రీకాంత్, పవన్కుమార్, ప్రసాద్ పాల్గొన్నారు. సీజనల్ వ్యాధుల నిర్మూలనకు కృషి ఎస్ఎస్తాడ్వాయి: వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని డీఎంహెచ్ఓ గోపాల్రావు కోరారు. మండల పరిధిలోని కొడిశాల పీహెచ్సీ పరిధిలోని పడిగాపూర్, ఎల్బాక గ్రామాల్లో గురువారం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను ఆయన సందర్శించారు. గ్రామాల్లో సిబ్బందితో కలిసి ఇంటింటిని పరిశీలించారు. ప్రతిఒక్కరూ ఇంటి పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. ఇంటి పరిసరాల్లో, రోడ్లపై నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని సూచించారు. డీఎంహెచ్ఓ వెంట వైద్యాధికారి పవన్ కుమార్, డీఎంఓ సంపత్, ఏఎంఓ దుర్గారావు, మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ వెంకట్రెడ్డి ఉన్నారు. ములుగు డీఎంహెచ్ఓ గోపాల్రావు -
వాతావరణం
జిల్లాలో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం ఉక్కపోతగా ఉంటుంది. పలుచోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది. చిట్యాల: పై ఫొటోలో కనిపిస్తున్నది చిట్యాల మండలకేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల. పాఠశాలలో సరిపడా తరగతి గదులు లేకపోవడంతో రెండో తరగతి విద్యార్థులను వరండాలోనే కూర్చోబెట్టి పాఠాలు బోధిస్తున్నారు. పాఠశాలలో 65మంది విద్యార్థులు, ఆరు తరగతులకు నలుగురు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. మూత్రశాలల నిర్మాణాలు అసంపూర్తిగా ఉండటంతో విద్యార్థులు ఆరుబయటకు వెళ్లాల్సి వస్తుంది. మూడేళ్ల క్రితం అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ప్రారంభించారు. నేటికీ పూర్తి చేయలేదు. తాగునీటి సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు తాగునీటిని ఇంటి నుంచి తీసుకువస్తున్నారు. -
శుక్రవారం శ్రీ 20 శ్రీ జూన్ శ్రీ 2025
అసంపూర్తిగా ఉన్న టాయిలెట్స్అద్దె ఇంట్లో ఒకే గదిలో ఐదు తరగతుల బోధనపిల్లర్ల స్థాయిలో నిలిచిన పాఠశాల భవన నిర్మాణ పనులుఅద్దె ఇంట్లో పాఠశాల పై ఫొటోలో కనిపిస్తున్నది జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని టాయిలెట్స్. 2022 సంవత్సరంలో మన ఊరు మన బడి కార్యక్రమంలో రూ.5లక్షల నిధులతో టాయిలెట్స్, వంట గది నిర్మాణ పనులు చేపట్టారు. పనులు దాదాపు 80శాతం వరకు పూర్తిచేశారు. టాయిలెట్స్కు నీటి సౌకర్యం కల్పించకపోవడంతో నిరుపయోగంగా మారాయి. ఈ పాఠశాలలో 150మంది విద్యార్థులు, ఎనిమిది మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రస్తుతం పాఠశాలలో నాలుగు టాయిలెట్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకా నాలుగు టాయిలెట్స్ అవసరం ఉన్నాయి. వంట గది నిర్మాణం పూర్తికాకపోవడంతో తరగతి గదిలోనే వంట చేస్తున్నారు. ఆరు తరగతులకు నాలుగు గదులు మాత్రమే ఉన్నాయి. కాటారం: మండలకేంద్రంలోని ఎస్సీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అద్దె ఇంట్లో కొనసాగుతుంది. మన ఊరు–మనబడి కార్యక్రమంలో భాగంగా నూతన భవన నిర్మాణం కోసం 2022 సంవత్సరంలో రూ.7లక్షలు నిధులతో పనులు ప్రారంభించారు. రెండేళ్లుగా నిర్మాణ పనులు నిలిచిపోయి పిల్లర్లకే పరిమితమయ్యాయి. నూతన భవనం మంజూరు కావడంతో శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాన్ని తొలగించారు. దీంతో అదే ఏడాది తాత్కాలికంగా రెండు గదులున్న పెంకుటిళ్లు అద్దెకు తీసుకొని పాఠశాలను నడిపిస్తున్నారు. ఈ పాఠశాలలో 24మంది విద్యార్థులు ఉండగా ఒకే గదిలో పాఠాలు చెబుతున్నారు.న్యూస్రీల్ -
స్థానిక పోరుపై నజర్!
కాళేశ్వరం: పంచాయతీరాజ్, రెవెన్యూశాఖల మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వేర్వేరుగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని పేర్కొనడంతో పల్లెల్లో ఆశావహుల సందడి నెలకొంది. ఈనెల చివరన లేదా వచ్చే నెలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు ఇప్పటికే సర్వం సిద్ధం చేసినట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్లు తేలిన తరువాతనే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. అధికారులు సిద్ధం.. పంచాయతీ పోరుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అధికార యంత్రాంగం కూడా ఏర్పాట్లు పూర్తి చేసింది. దీంతో ఆశావహులు కూడా స్థానిక పోరుపై నజర్ వేశారు. దానికి అనుగుణంగానే పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఏవి ముందుగా వచ్చినా అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉంది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టారు. జిల్లాలో 241 పంచాయతీలు, 2,044 వార్డులు, 12 జెడ్పీటీసీ, 106 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. భూపాలపల్లిలో మున్సిపాలిటీ ఉంది. 2,044 వార్డులు, 2,044 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 2,91,663మంది ఓటర్లు ఉన్నారు. 2024 ఫిబ్రవరి 1న సర్పంచులు, జూన్ 31న ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, ఆగస్టు నెలలో మున్సిపాలిటీల పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. అప్పటినుంచి గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. ఊహల్లో ఆశావహులు.. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో గ్రామ, మండలస్థాయిలో కష్టపడిన ఆయా పార్టీల నాయకులు ఇప్పుడు తమ లక్ష్యమంతా స్థానిక సంస్థల్లో పోటీ చేయడమే అని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ప్రకటన రావడమే తరువాయి అన్న చందంగా పంచాయతీల్లో నిత్యం ప్రజల సమస్యలను ఆలకిస్తున్నారు. ముఖ్యంగా గ్రామస్థాయిలో సర్పంచ్కు పోటీచేసే విషయంలో ఈ సారి గట్టి పోటీయే కనపడుతోంది. మూడు ప్రధాన పార్టీల మద్దతు, స్వతంత్రంగా బరిలో నిలవాలనుకునే వారు ఆశల లోకంలో విహరిస్తున్నారు. గతంలో పోటీచేసి ఓడిపోయిన వారితోపాటు కొత్తవాళ్లు, యువత ఎక్కువగా ఈ పదవిపై కన్నేస్తున్నారు. ఇందుకోసం ఏ పార్టీ మద్దతు ఉంటే తమకు లాభం ఉంటుందనే విషయంపై ఆలోచిస్తున్నారు. గ్రామాల్లో ఇప్పటికే పార్టీలు, దావత్లతో కిక్కెస్తున్నారు. అధికార పార్టీ ఇప్పటికే పంచాయతీల వారీగా సంస్థాగత ఎన్నికల పరిశీలకులను నియమిస్తుంది. దీంతో గ్రామాల్లో గ్రూపు రాజకీయాలు, తగాదాలు లేకుండా సమన్వయ పరుస్తుంది.మంత్రి మాటలతో.. మంత్రి పొంగులేటి వ్యాఖ్యలతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ముందు నిర్వహించి, ఆ తరువాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం చూస్తున్నట్లు తెలిసింది. కొన్ని రోజులుగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలపై కన్నేసిన నాయకులు ఇప్పటికే తమ బలాలను చూపించుకుంటున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అతి మర్యాదలు చేస్తున్నారు. తమ పార్టీ ముఖ్యులను కలుస్తూ తమ అభ్యర్థిత్వాన్ని తెలుపుతున్నారు. ఎమ్మెల్యే, మంత్రుల స్థాయిలో అనుకూల రిజర్వేషన్లపై చర్చిస్తున్నట్లు తెలిసింది. బీసీ రిజర్వేషన్పై పార్టీ పరంగా 42శాతమా లేదా చట్టబద్ధంగా 42శాతం రిజర్వేషన్ కల్పించాలా అనే చర్చ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే కులగణన కూడా పూర్తిచేసి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి సమర్పించింది. దీంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఎన్నికలు నిర్వహించనున్నారని తెలిసింది. దీంతో పల్లెల్లో ఆశావహుల్లో సందడి వాతావరణం కనిపిస్తుంది. జిల్లాలో 241 గ్రామపంచాయతీలు 12 జెడ్పీటీసీ, 106 ఎంపీటీసీ స్థానాలు బీసీ రిజర్వేషన్ తేలిన తర్వాతనే ఎన్నికలకు ప్రభుత్వం? పల్లెల్లో జోరందుకున్న ఆశావహుల సందడి హీటెక్కుతున్న గ్రామాలు -
యువత మత్తుకు దూరంగా ఉండాలి
కాళేశ్వరం: యువత గంజాయి, గుడుంబా లాంటి మత్తుకు దూరంగా ఉండాలని, భవిష్యత్ నాశనం చేసుకోవొద్దని కాటారం డీఎస్పీ ఎ.సూర్యనారాయణ అన్నారు. ఆయన గురువారం మహదేవపూర్ పోలీస్స్టేషన్లో బాధ్యతలు చేపట్టిన తరువాత విలేకర్ల సమావేఽశం నిర్వహించారు. డీఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ ఈ నెలలో మేడిగడ్డ బ్యారేజీ వద్ద గోదావరి నీటిలో మునిగి మృతి చెందిన ఆరుగురు మృతుల కుటుంబసభ్యులకు సంతాపం తెలియజేశారు. ఆ బ్యారేజీ ప్రాంతంలో సూచిక, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయిస్తానని తెలిపారు. గోదావరిలోకి ఈతకు వెళ్లొద్దని, చేపలు పట్టే జాలర్లు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. జాతీయ, రాష్ట్ర రోడ్ల మీద పశువులను విడిచిపెట్టవద్దని.. అలా చేస్తే వాటిని గ్రామపంచాయతీ ద్వారా స్వాధీనం చేసుకొని గోశాలకు తరలిస్తామన్నారు. ట్రాక్టర్లు, బైకులు, ఇతర మోటార్ వాహనాలను మైనర్లకు ఇవ్వొద్దని, ఒకవేళ ఇస్తే తల్లిదండ్రులు, వాహన యజమానులపై కేసు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. వారిని కోర్టులో హాజరు పరుస్తామన్నారు. గంజాయి సేవించే వారిపై కఠిన చర్యలు తప్పవని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహదేవపూర్ సీఐ రామచందర్రావు, మహదేవపూర్ ఎస్సై 2 నాందేవ్, పీఎస్సై సాయిశశాంక్ పాల్గొన్నారు. మేడిగడ్డ వద్ద హెచ్చరిక, సూచిక బోర్డుల ఏర్పాటు మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు కాటారం డీఎస్పీ సూర్యనారాయణ -
ఉద్యమంలో ముగిసిన గాజర్ల కుటుంబ ప్రస్థానం
గాజర్ల రవి (ఫైల్)భూపాలపల్లి/టేకుమట్ల: వెలిశాల తల్లడిల్లింది. ఈ ప్రాంతంలో నక్సల్స్ ఉద్యమానికి పురుడు పోసిన గాజర్ల కుటుంబంలో మరొకరు పోలీసుల ఎన్కౌంటర్లో చనిపోయారు. 2008లో గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్ ఎన్కౌంటర్లో చనిపోగా, తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా, మారేడుమిల్లి అడవుల్లో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ఆయన తమ్ముడు రవి అలియాస్ గణేష్ మృతిచెందాడు. దీంతో మావోయిస్టు ఉద్యమంలో గాజర్ల కుటుంబ ప్రస్థానం ముగిసినట్లయ్యింది. విషయం తెలియడంతో వెలిశాల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఉద్యమాల బిడ్డ–నిను మరువదు పోరు గడ్డ అంటూ పలువురు ఉద్యమకారులు రవి ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. మూగబోయిన వెలిశాల.. ఎన్కౌంటర్లో రవి మృతి చెందిన విషయం తెలిసి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నక్సల్స్ ఉద్యమానికి పురుడు పోసిన గాజర్ల కుటుంబంలో ఇద్దరు ఉద్యమకారులు నేలకొరిగారంటూ గ్రామస్తులు కన్నీరు మున్నీరవుతున్నారు. మాజీ మావోయిస్టులు, సానుభూతిపరులు రవితో గడిపిన సమయాలను నెమరువేసుకుంటున్నారు. 2008లో జరిగిన ఎన్కౌంటర్లో గాజర్ల సారయ్య హతమవగా కుటుంబ సభ్యులు జ్ఞాపకార్థంగా ఆయన విగ్రహాన్ని గ్రామంలో ఏర్పాటు చేశారు. కాగా గుర్తు తెలియని వ్యక్తులు ఆ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఇప్పటికీ కూలిపోయిన సారయ్య విగ్రహం అక్కడ ఉంది. కాగా, గాజర్ల కుటుంబంలో నక్సల్స్లో చేరిన ముగ్గురిని చూసి గ్రామంలో చాలామంది ఉద్యమ బాట పట్టారు. దీంతో 2005లో అప్పటి సీఐ శ్యాంసుందర్రెడ్డి, ఎస్సై ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో వెలిశాల గ్రామంలో శాంతి స్తూపాన్ని ఏర్పాటు చేశారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత రవి మృతి 33 ఏళ్ల క్రితం ఎర్రజెండా పట్టి అజ్ఞాతంలోకి.. సెంట్రల్ కమిటీ సభ్యుడి హోదాలో మరణం వెలిశాలలో ముగిసిన అన్నల శకం -
ఉచిత శిక్షణకు దరఖాస్తుల స్వీకరణ
భూపాలపల్లి రూరల్: యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రవేశానికి హైదరాబాద్లో ఉచిత శిక్షణకు జిల్లాలోని డిగ్రీ పూర్తి చేసిన షెడ్యూల్డ్ కులాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారిణి సునీత బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి గల వారు టీఎస్స్టడీ సర్కిల్.కో.ఇన్ వెబ్సైట్లో జూలై 17వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రతీ రైతుకు ‘రైతు భరోసా’ భూపాలపల్లి రూరల్: పాత రైతులతో పాటు నూతనంగా పట్టా పాస్బుక్కులు పొందిన రైతులకు కూడా రైతు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినట్లు కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. బుధవారం కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ వరకు అర్హులైన ప్రతీ రైతుకు రైతు భరోసా అందిస్తామన్నారు. జిల్లాలో 282 గ్రామాల నుంచి 1,24,397 మంది రైతులకుగాను రూ.143,99,06,145 నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉందన్నారు. ఇందులో రూ. 114,50,67,074 నిధులు ఖజానా ద్వారా విడుదల అయ్యాయన్నారు. ఇప్పటి వరకు 90,837 మంది రైతులకు రూ.72,30,42,624 నిధులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయన్నారు. మిగతా రైతులకు ఈనెల 20వ తేదీలోపు జమ అవుతాయన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో రైతు భరోసా సమర్థవంతంగా కొనసాగుతుందన్నారు. ఫర్టిలైజర్ షాపుల తనిఖీభూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మండలంలోని పలు గ్రామాల్లో విత్తనాలు, ఫర్టిలైజర్ షాపుల్లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరునాయక్, ఏఓ సతీష్ తనిఖీలు చేపట్టారు. బుధవారం కొంపెల్లి, గుడాడ్పల్లి, గోర్లవీడు, వజినపల్లి, నేరేడుపల్లి గ్రామాల్లో షాపుల్లో రికార్డులను పరిశీలించారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు విక్రయించాలని, తప్పకుండా రశీదు ఇవ్వాలని, ప్రభుత్వ నిబంధనలు పాటించాలని యజమానులకు సూచించారు. తనిఖీల్లో వ్యవసాయశాఖ అధికారులు, కార్యాలయ సిబ్బంది ఉన్నారు. ఉద్యాన పథకాలపై అవగాహన ఉండాలిచిట్యాల: మండలంలోని జూకల్ రైతువేదికలో ఉద్యాన పథకాలపై రైతులకు బుధవారం అవగాహన, శిక్షణ శిబిరం ఏర్పాటు చేసినట్లు ఉద్యాన శాఖ జిల్లా అధికారి ఏ.సునీల్కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వివిధ రకాల ఉద్యాన పథకాలు, వాటి అర్హత ప్రమాణాలు రాయితీ ఏవిధంగా ఇస్తున్నారో అవగాహన కల్పించారు. పండ్ల తోటల పెంపకం, కూరగాయల పందిరి, ఉద్యాన యాంత్రికరణ, ఆయిల్పామ్ సాగు, డ్రిప్, స్ప్రింకర్ల వంటివాటిపై అవగాహన కల్పించారు. ఉద్యాన సాగులో శాసీ్త్రయ యాజమాన్య పద్ధతులు, కొత్త పద్ధతుల ప్రాముఖ్యం, నవీన సాంకేతికత వినియోగంపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి దీపక్, ఓరుగల్లు ఎఫ్పీఓ డైరెక్టర్ సమ్మిరెడ్డి, దుబాసి నర్సయ్య, వెంకటేశ్వర్లు, ఆయిల్ ఫామ్ ప్రతినిధులు అరవింద్, సాయి, ప్రీతం, మారి సంస్థ ప్రతినిధి కళ్యాణ్, డ్రిప్ కంపెనీ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.జనరల్ స్థానాల్లో బీసీలు పోటీ చేయాలిమొగుళ్లపల్లి: ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్న తరుణంలో 2023 సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతీ జనరల్ స్థానాల్లో బీసీలు పోటీ చేయాలన్నారు. బీసీల ఓట్లు బీసీలకు వేసుకుంటే రాజ్యాధికారం మన చేతిలో ఉంటుందన్నారు. పార్టీలకతీతంగా బీసీ అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. -
వరుణ దేవుడా..కరుణించూ..
భూపాలపల్లి రూరల్: జిల్లాలో వర్షాధార పంటలు సాగు చేసే రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ముందస్తుగా మురిపించిన వరుణుడు ప్రస్తుతం ముఖం చాటేశాడు. ఈ ఏడాది రుతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయని, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో రైతులు సంతోషపడ్డారు. ఈ క్రమంలోనే జిల్లాలోకి నైరుతి పవనాలు ముందుగానే ప్రవేశించడంతో తొలకరి జల్లులు పడ్డాయి. మే నెల చివరివారంలో వర్షాలు విస్తారంగా కురవడంతో రైతులు పొలంబాట పట్టారు. దుక్కులు దున్ని.. ఎరువులు, విత్తనాలు సిద్ధం చేసుకోగా.. సుమారుగా 36వేల ఎకరాల్లో పత్తి విత్తనాలు విత్తారు. విత్తనాలు మొలకెత్తే దశలో ఉండగా.. వరుణుడు ముఖం చాటేచేయడంతో నీరు అందక.. మొలకలను భూమిపై మొచి పెంచుకోవడానికి రైతులు నానాతంటాలు పడుతున్నారు. వాన జాడ లేకపోవడంతో రైతులకు ఆదిలోనే కష్టాలు ఆరంభమయ్యాయి. ఎండలు భగ్గుమంటుండటంతో.. మొలకలు వాడిపోకుండా నీటి సౌకర్యం ఉన్న రైతులు నీటిని అందిస్తూ కాపాడుకుంటున్నారు. విత్తనాలు నాటని రైతులు విత్తనాలు వేయాలా?వద్దా? అనే అయోమయంలో ఉన్నారు. పత్తికే ప్రాధాన్యం.. ప్రతీఏడాది జిల్లాలో వరి తర్వాత స్థానం పత్తి పంటదే ఉంటుంది. మార్కెట్లో పత్తి పంటకు గిట్టుబాటు ధర పలకకఽపోయినా, లాభాలు రాకున్న పెట్టుబడి మాత్రం వస్తుందనే నమ్మకంతో పత్తి పంటకు ప్రాధాన్యం ఇస్తారు. జిల్లాలో 93,823 ఎకరాల్లో పత్తిసాగుకు అధికారులు అంచనా వేయగా, ఇప్పటి వరకు సుమారుగా 36 వేల ఎకరాల్లో సాగైనట్లు అధికారులు చెబుతున్నారు. భూమిలోనే మాడిపోతున్నాయి.. వర్షాకాలం ఎంత త్వరగా విత్తనాలు వేస్తే అంత మంచిదని, చీరపీడలు, ప్రకృతి వైపరీత్యాల బారిన పడకుండా పంటలు చేతికి వస్తాయని రైతుల నమ్మకం. అందుకే జూన్ నెల ప్రారంభం నుంచే విత్తనాలు వేస్తారు. రోహిణి కార్తెలో వరి నార్లు పోస్తారు. అయితే ఈ ఏడాది మే నెల చివరి వారంలోనే తొలకరి వర్షాలు కురిశాయి. కానీ, జూన్ నెలలో కురవాల్సిన వర్షాలు ఇప్పటి వరకు జాడ లేదు. మృగశిర కార్తెలోనైనా వరుణుడు కరుణించక పోతాడా అని ఆశిస్తున్నారు. ఇంకా సమయం ఉంది.. పెద్దవానలు కురిస్తేనే భూమిలో తేమ శాతం పెరుగుతుంది. అప్పుడు విత్తనాలు నాటుకుంటే మొలకెత్తుతాయి. జూలై 20వ తేదీ వరకు వరకు పత్తి విత్తనాలు వేసుకునేందుకు సమయం ఉంది. ఇప్పటి వరకు 40 శాతం భూమిలో రైతులు పత్తి విత్తనాలు నాటారు. మిగతా రైతులు ఆశించిన మేర వర్షాలు కురిసిన తర్వాతే విత్తనాలు నాటుకోవాలి. – వీరునాయక్, జిల్లా వ్యవసాయశాఖ అధికారిపంటల సాగు వివరాలు (ఎకరాల్లో..)పంటలు అంచనా సాగు వరి 1,12,218 నారు దశ పత్తి 93,823 36,000 మిర్చి 28,000 ––––ఈ ఫొటోని రైతు జంగేడు గ్రామానికి చెందిన దొంగల రమేశ్. మేనెల చివరివారంలో కురిసిన వర్షాలకు ఎకరంన్నర భూమిలో పత్తివిత్తనాలతో పాటు పెసర పంట వేశాడు. అప్పటి నుంచి వర్షాలు కురవకపోవడంతో పత్తి, పెసర మొలకలు మొలవలేదు. ఆశతో మొలకలు మొలుస్తాయోనని రోజూ తోటకు వచ్చి చూసి వెళ్తున్నాడు. వర్షాలు కురవడం లేదు.. మొలకలు రాకపోవడంతో దీనంగా ఆకాశంవైపు చూస్తున్నాడు. ఇలా జిల్లాలో చాలామంది రైతులు పత్తి విత్తనాలు నాటి.. వర్షాల కోసం ఆకాశంవైపు చూస్తున్నారు.జాడలేని వానలు తొలకరి వర్షాలకే విత్తనాలు విత్తిన రైతులు ఇప్పటికే 36వేల ఎకరాల్లో పత్తి సాగు గ్రామాల్లో కప్పతల్లికి పూజలు పంటను కాపాడుకునేందుకు అన్నదాతల కష్టాలువర్షాలు కురవాలని కప్పతల్లి ఆట చిట్యాల: వర్షాకాలం మొదలైన ఇప్పటి వరకు సరైన వర్షాలు కురవకపోవడంతో మండలంలోని ముచినిపర్తి గ్రామస్తులు బుధవారం క ప్పతల్లి ఆట ఆడారు. అనంతరం గ్రామదేవతలకు జలాభిషేకం చేశారు. వర్షాలు అధికంగా కురవాలని, పంటలు సమృద్ధిగా పండాలని పూజలు చేశారు. గ్రామస్తులు పాపిరెడ్డి, రవీందర్, చంద్రమౌళి, రమణకుమార్, రాజు, రా జన్న, తిరుపతి, రాజు తదితరులు ఉన్నారు. -
వాతావరణం
జిల్లాలో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం ఉక్కపోతగా ఉంటుంది. పలుచోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది.దేశాభివృద్ధికి ప్రతిఒక్కరూ కృషి చేయాలి● బీజేపీ జిల్లా అధ్యక్షుడు నిషిధర్రెడ్డి రేగొండ: దేశాభివృద్ధికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిషిధర్ రెడ్డి అన్నారు. బుధవారం కొత్తపల్లిగోరి మండలం కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు సూదనబోయిన విష్ణుయాదవ్ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ సంకల్ప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశ విధానాలు ప్రపంచానికే దిక్సూచిగా మారుతున్నాయన్నారు. ఒకే దేశం, ఒకే ఎన్నిక విధానాన్ని తీసుకురావడంలో మోదీ సఫలీకృతం అయ్యారన్నారు. అనంతరం ఇటీవల నూతనంగా వచ్చిన తహసీల్దార్ లక్ష్మిరాజయ్యను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ లింగంపల్లి ప్రసాదరావు, సీనియర్ నాయకులు తిరుపతి రెడ్డి, సుమన్, వేణు, బాబురావు, విమల, సదానందం తదితరులు పాల్గొన్నారు. 226 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత?చిట్యాల: మండలంలోని కొత్తపేట గ్రామ శివారు మేఘన రైస్ మిల్లు వద్ద 266 క్వింటాళ్ల రేషన్ సన్న బియ్యం లారీని జిల్లా టాస్క్ఫోర్స్ అధికారులు, స్థానిక పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ అధికారులు మిల్లు వద్ద వేచి చూసి దాడులు నిర్వహించారు. దీంతో లారీలో ఉన్న సన్నబియ్యం స్థానిక పోలీస్స్టేషన్కు తరలించారు. అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారా..లేదా? అనేది నేడు (గురువారం) నిర్థారణ కో సం బియ్యం నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపించారు. ఈ విషయంపై ఎస్సై ని వివరణ కోరగా లారీని స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఫీజుల దోపిడీని అరికట్టాలి
భూపాలపల్లి అర్బన్: ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు సొత్కు ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయంలోని సూపరింటెండెంట్ రాజయ్యకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ప్రవీణ్కుమార్, జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసెఫ్లు మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, పాఠశాలలోనే పుస్తకాలు, యూనిఫాం విక్రయిస్తూ అక్రమంగా లక్షల రూపాయలను దోచుకుంటున్నారన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో పేదలకు 25 శాతం ఉచిత విద్యను అమలు చేయాలన్నారు. పాఠశాలలపై తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు కునూరి భగత్, మేడి శేఖర్, అజయ్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. -
‘భూభారతి’ నిరంతర ప్రక్రియ
కాళేశ్వరం: భూభారతి సదస్సులో దరఖాస్తు చేసుకోనివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది నిరంతర ప్రక్రియ అని అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) అశోక్కుమార్ తెలిపారు. బుధవారం మహదేవపూర్ మండలం కుంట్లంలో జరిగిన భూభారతి సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. సోమవారం నుంచి సంబంధిత ఆధారాలతో తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ నెల 3 నుంచి 18వ తేదీ వరకు జరిగిన రెవెన్యూ సదస్సులో మొత్తం 2,640 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామారావు, డీటీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ముందస్తు సాగుకు సిద్ధం కావాలి
గణపురం: గణపసముద్రం చెరువు ఆయకట్టు రైతులు ముందస్తు సాగుకు సిద్ధం కావాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బుధవారం గణపసముద్రం చెరువు కోట కాల్వ నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణపసముద్రం చెరువులో పంట సాగుకు నెల రోజులకు సరిపడా నీరు ఉందని ఆలోపు వర్షాలు పడుతాయన్నారు. లేదంటే రామప్ప చెరువు నుంచి గణపసముద్రంకు నీటిని విడుదల చేసి నింపుతామన్నారు. ఇతర ప్రాంతాల్లో ఇప్పటికే నార్లు పోసి సాగుకు సిద్ధమయ్యారన్నారు. గణపసముద్రం ఆయకట్టు రైతులు ఎప్పుడు నెలరోజులు ఆలస్యంగా పంట సాగు చేస్తున్నారని, దీంతో వాతావరణం సహకరించక నష్ట పోవడం జరుగుతుందన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి పంట సాగుకు సిద్ధం కావాలన్నారు. పంట పొలాలకు నీరు సాఫీగా వెళ్లేందుకు కాల్వలో సిల్డ్ తీయించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఐబీ ఈఈ బస్వప్రసాద్, ఏఈ సమ్మారావు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గణపసముద్రం ఆయకట్టుకు సాగు నీరు విడుదల -
ఇల్లు, ఆదాయం లేని కుటుంబం ఉండొద్దు
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్బాబు పక్కన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ రాహుల్ శర్మ, సింగరేణి సీఎండీ బలరాంనాయక్రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఇల్లు, ఆదాయం లేకుండా ఇబ్బంది పడొద్దనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంత్రి శ్రీధర్బాబుతో కలిసి భూపాలపల్లి నియోజకవర్గంలో భట్టి విక్రమార్క మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క – వివరాలు 8లోu -
జీసీసీ సేవలను విస్తృతం చేయాలి
ఏటూరునాగారం: ఐటీడీఏ పరిధిలోని ఏజెన్సీ గ్రామాల్లో గిరిజన సహకార సంఘం పరిధిలో గల ప్రజలకు అందుతున్న సేవలను మరింత విస్తృత పర్చాలని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన జీసీసీ అధికారుల సమావేశంలో పీఓ మాట్లాడారు. జీసీసీ వాహనాల మరమ్మతులు ఇప్పటి వరకు ఎన్ని చేయించారని, ఇంకా ఎన్ని చేయించాల్సి ఉందని ఆరా తీశారు. మహదేవ్పూర్ సొసైటీకి చెందిన గ్యాస్గోదాం సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డీఆర్ డిపోలు, ఎంఎల్ఎస్ పాయింట్ల గోదాంలు, పెట్రోల్ బంక్ల తనిఖీలను మరింత ముమ్మరం చేయాలన్నారు. డీఆర్ డిపోల నిత్యావసర వస్తువుల కొనుగోళ్లు, లాభాలపై చర్చించారు. జీసీసీ గోదాంలు, ఆఫీసులు, డీఆర్ డిపోల స్థలాలను తనిఖీ చేసి గుర్తించాలన్నారు. ఆహార సదుపాయాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి సకాలంలో డీఆర్ డిపోలు, హాస్టళ్లకు సరఫరా అయ్యేలా చూడాలని, ఆహారం నిల్వలు గడువు ముగిసిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఏటూరునాగారం డివిజన్ పరిధిలో పనిచేసే పెట్రోల్ బంక్లు దగ్గర తప్పకుండా సౌండ్బాక్సుల స్కానర్లను అమర్చాలన్నారు. బంక్లు, గోదాంల వద్ద బోరు సదుపాయం లేకపోతే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఎవరైనా విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జీసీసీ డీఎం వాణి, మేనేజర్లు దేవ్, స్వామి, డీఈఓఎస్ అన్వర్, ప్రసాద్ పాల్గొన్నారు.ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా -
మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు
● కాటారం డీఎస్పీ సూర్యనారాయణ కాటారం: మైనర్లకు వాహనాలు ఇచ్చి పనులు చేపిస్తే సదరు వాహన యజమానులపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని కాటారం డీఎస్పీ సూర్యనారాయణ హెచ్చరించారు. కాటారం మండలం మేడిపల్లి పరిధిలోని బస్వాపూర్కు చెందిన బాలుడు మంగళవారం ట్రాక్టర్తో పని చేస్తుండగా పోలీసులు గుర్తించారు. ట్రాక్టర్ యజమాని వెన్నపురెడ్డి సమ్మయ్య, ట్రాక్టర్పై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇచ్చి డ్రైవింగ్ చేయించడం, పనులు చేయించడం నేరమన్నారు. అలాంటి వారిని ఉపేక్షించబోమని పేర్కొన్నారు. మైనర్లతో పనులు చేయిస్తే బాలకార్మిక చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని డీఎస్పీ హెచ్చరించారు. వాహనాల యజమానులు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు. రామప్పను సందర్శించిన కుడా చైర్మన్వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని మంగళవారం వరంగల్ కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్రెడ్డి సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి ఆయన పూజలు నిర్వహించగా ఆలయ పూజారి హరీశ్ శఽర్మ తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు. -
పిల్లర్ల దశలోనే..
మూడేళ్లుగా సా..గుతున్న వైద్య కళాశాల పనులుభూపాలపల్లి అర్బన్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.162కోట్లతో జిల్లాకేంద్రంలో ప్రారంభమైన ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణ పనులు మూడేళ్లుగా సా..గుతున్నాయి. పాలకుల పట్టింపులేనితనంతో ఇబ్బందులు తప్పడం లేదు. సరైన ఫ్యాకల్టీ, వసతి, సౌకర్యాలు, సదుపాయాలు లేకపోవడంతో వైద్య విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పనులు నిబంధనలకు లోబడి లేవని జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) 12 అంశాలలో లోపాలను గుర్తించి షోకాజ్ నోటీసులు జారీచేసినట్లు తెలుస్తోంది. ఏడుగురితోనే బోధన మెడికల్ కళాశాలలో మొదటి, రెండో సంవత్సరానికి సంబంధించి 35 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు ఉండాల్సి ఉంది. ఎనిమిది మంది ప్రొఫెసర్లకు గాను ఇద్దరు, 10మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు ఇద్దరు, 17మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ముగ్గురు మాత్రమే ఉన్నారు. మరో నెల రోజుల్లో మరో నూతన బ్యాచ్ ప్రారంభం కానుండగా.. సెప్టెంబర్లో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం తరగతులు ప్రారంభంకానున్నాయి. మూడో సంవత్సరానికి బోధించేందుకు ఫ్యాకల్టీని నియమించాల్సి ఉంది. మెరుగుపడకపోతే సీట్ల కోతే.. ప్రభుత్వ మెడికల్ కళాశాల, జనరల్ ఆస్పత్రిలో ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం సూచించిన అంశాలను మెరుగుపర్చకపోతే విద్యార్థుల సీట్లను తగ్గించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 100 సీట్లతో ప్రథమ సంవత్సరం సీట్లను కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తుంది. విద్యార్థులకు కావల్సిన సౌకర్యాలు, సదుపాయాలు నెలరోజుల్లో కల్పిస్తామని ఎన్ఎంసీకి తెలిపారు. సకాలంలో సౌకర్యాలు కల్పించి ఫ్యాకల్టీని భర్తీచేయకపోతే 50 సీట్లకు తగ్గించే ప్రమాదం పొంచి ఉంది. దీనిపై జిల్లా ప్రజా ప్రతినిధులు, కలెక్టర్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ప్రత్యేక దృష్టి సారించి అన్ని వసతులు సమకూర్చాల్సిన అవసరముంది.వేగవంతం చేస్తాం.. స్థానిక ప్రభుత్వ మెడికల్ కళాశాలలో భవన నిర్మాణం మినహా అన్ని చిన్న చిన్న అంశాలను గుర్తించి సరిచేయాలని ఆదేశాలు వచ్చా యి. నెల రోజులలో వాటిని పూర్తిచేస్తాం. సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినం. ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం. – రాజేంద్రప్రసాద్, వైద్య కళాశాల ప్రిన్సిపల్, భూపాలపల్లి రూ.162కోట్లతో నిర్మాణ పనులు 35మంది ఫ్యాకల్టీకి ఉన్నది ఏడుగురే.. వసతులు లేక వైద్య విద్యార్థుల ఇబ్బందులు లోపాలను గుర్తించిన ఎన్ఎంసీ -
భట్టికి కేటీపీపీ ఇంజనీర్ల వినతి
గణపురం: రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న ఇంజనీర్ల సమస్యలను పరిష్కరించాలని ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు వినతిపత్రం అందించారు. మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మధ్యాహ్నం గణపురం మండలం చెల్పూరు కేటీపీపీలోని గోదావరి అతిథిగృహానికి లంచ్కు వచ్చారు. ఆయనకు అసోసియేట్ జనరల్ సెక్రటరీ భాస్కర్ ఆధ్వర్యంలో పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నియమావళి ప్రకారం 1999 నుంచి 2004 మధ్య నియామకం పొందిన ఇంజనీర్లకు జీపీఎఫ్ విధానం అమలు చేయాలన్నారు. తెలంగాణ జెన్కోలో పనిచేస్తున్న ఇంజనీర్లకు బదిలీ మార్గదర్శకాలు జారీచేయాలని చెప్పారు. జెన్కో డిస్కౌంట్ ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఇంజనీర్ల పోస్టులను భర్తీచేయాలని వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ఇంజనీర్లు పాల్గొన్నారు. పోల్టాక్స్ రద్దుచేయాలని వినతి భూపాలపల్లి అర్బన్: కేబుల్ ఆపరేటర్లపై ప్రభుత్వం విధిస్తున్న పోల్ టాక్స్ను రద్దుచేయాలని కోరుతూ కేబుల్ ఆపరేటర్ల సంఘం నాయకులు మంగళవారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు వేశాల రమేష్బాబు మాట్లాడుతూ.. కేబుల్ ఆపరేటర్లు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ పనిచేస్తున్నారని తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించి టాక్స్ రద్దుచేయాలని కోరారు. జాబ్మేళాను సద్వినియోగం చేసుకోవాలిములుగు రూరల్: నిరుద్యోగ యువత రేపు(19న) జిల్లాకేంద్రంలోని టాస్క్ రీజినల్ సెంటర్లో నిర్వహిస్తున్న జాబ్మేళాను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ దివాకర మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. టాస్క్ రీజినల్ సెంటర్లో నైపుణ్య శిక్షణ పొందిన టెక్నికల్, నాన్ టెక్నికల్ కోర్సుల్లో శిక్షణ పొందిన టెన్త్, ఇంటర్, డిప్లమా, డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ విద్యార్థులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. శిక్షణ పొందిన నిరుద్యోగ యువత ములుగు, వరంగల్, హైదరాబాద్లోని సాబిక్ టెక్నాలజీ ప్రైవేటు లిమిటెడ్, టాటా స్ట్రీవ్, జస్ట్డియల్, జహ్నావి కమ్యూనికేషన్, హెచ్బీడీ ఫైనాన్స్, షణ్ముక బయో ఆర్గానిక్స్, ముథూట్ మైక్రోఫిన్ లిమిటెడ్, శ్రీరాం ఫైనాన్స్తో పాటు ఇతర కంపెనీలలో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత గురువారం ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని టాస్క్ రీజినల్ సెంటర్లో హాజరు కావాలని సూచించారు. పూర్తి వివరాలకు టాస్క్ రీజినల్ కో ఆర్డీనేటర్ సెల్ నంబర్ 9618449360లో సంప్రదించాలని తెలిపారు. పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకం ఏటూరునాగారం: బాల్య వివాహాల నిర్మూలనలో పంచాయతీ కార్యదర్శులు ప్రధాన పాత్ర పోషించాలని బాల్య వివాహ నిరోధక అధికారిణి, సీడీపీఓ ప్రేమలత అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగము ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని పంచాయతీ కార్యదర్శులకు బాల్యవివాహాల నిషేధ చట్టం – 2006 పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగము అధికారి హరికృష్ణ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆధునిక సమాజంలో ఇప్పటికీ బాల్య వివాహాలు సవాల్గా మారాయన్నారు. మారుమూల ప్రాంతాల్లో వివిధ కారణాలతో బాల్య వివాహాలు జరుగుతున్నాయని తెలిపారు. గ్రామ స్థాయిలో బాల్యవివాహ నిరోధక అధికారులుగా పంచాయతీ కార్యదర్శులు వ్యవహరించాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో బాల్య వివాహాల నిర్మూలనలో పంచాయతీ కార్యదర్శులు ప్రధాన పాత్ర పోషించాలని సూచించారు. బాల్య వివాహ రహిత జిల్లాగా ములుగును మార్చడమే లక్ష్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎంపీఓ కుమార్ మాట్లాడారు. -
ఆధునిక పరిజ్ఞానం అందేలా..
కాటారం: పెరిగిన పెట్టుబడి, కూలీల కొరత, మద్దతు ధర లేకపోవడం లాంటి అనేక సమస్యలతో వ్యవసాయసాగులో సతమతమవుతున్న రైతన్నలను బాసటగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంది. సమస్యలను అధిగమించి వ్యవసాయం రైతులకు లాభసాటిగా చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం రైతునేస్తం ప్రారంభించింది. గతంలో మొదలైన రైతునేస్తంకు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి రైతులు ఆధునిక వ్యవసాయ విధానాలు అవలంభించేలా ప్రభుత్వం చొరవ చూపుతుంది. ప్రధానంగా గ్రామీణ రైతులకు ఆధునిక సాగు విధానంపై సలహాలు, సూచనలు అందించి ప్రోత్సహిస్తే లాభసాటిగా అధిక దిగుబడులు సాధించేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అధికశాతం రైతులకు సరైన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో వ్యాపారులు సూచించిన సలహాలు పాటిస్తూ అధిక పెట్టుబడులతో తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి తోడు మండల కేంద్రాల్లో ఉండే వ్యవసాయశాఖ అధికారులను కలిసి పంటల సాగు విధానం గురించి తెలుసుకునేందుకు రైతులకు కష్టంగా మారింది. రైతు వేదికల్లో రైతునేస్తం.. ప్రభుత్వం వ్యవసాయశాఖ ద్వారా అందిస్తున్న సేవలను రైతులకు మరింత చేరువ చేసేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మండలాల్లో ప్రతి ఒక క్లస్టర్కు రైతువేదికలను నిర్మించింది. ప్రతి రోజు ఈ కేంద్రాల్లో ఏఈఓ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. ఐదు గ్రామాలకు సంబంధించిన ఒక క్లస్టర్ రైతువేదిక ద్వారా వ్యవసాయ శాఖ సేవలను ఏఈఓలు రైతులకు అందిస్తూ వచ్చేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రైతు వేదికలను మరింత పటిష్టం చేసే దిశగా చర్యలు తీసుకుంది. ప్రతి మండలంలోని రైతులకు అందుబాటులో ఉండే విధంగా రైతునేస్తం కార్యక్రమం అమల్లోకి తీసుకొచ్చింది. రైతునేస్తంలో భాగంగా రైతువేదికలో వీడియో కాన్ఫరెన్స్లను ఏర్పాటు చేసింది. జిల్లాలో మండలానికి ఒకటి చొప్పున 12 మండలాల్లో రైతువేదికల్లో రైతునేస్తం నిర్వహిస్తుండగా ప్రస్తుతం నూతనంగా మరో 20 కేంద్రాల్లో రైతునేస్తం కార్యక్రమం నిర్వహణ చేపట్టేలా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీంతో జిల్లాలో ఇక నుంచి 32 కేంద్రాల్లో రైతునేస్తం సేవలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. జిల్లా వివరాలు.. రైతులు 1,09,614 సాగు భూమి 2,17,164ఎకరాలు వరి సాగు 1,12,218 ఎకరాలు పత్తి 93,823 ఎకరాలు ఇతరత్రా పంటలు 11,123 ఎకరాలుసాగులో మెళకువలపై అవగాహన జిల్లాలో 12 రైతు వేదికల్లో సేవలు అందుబాటులోకి మరో 20 కేంద్రాలు ప్రతీ మంగళవారం సలహాలు, సూచనలు ఇవ్వనున్న శాస్త్రవేత్తలుసాగు, పాడిపై సూచనలు, సలహాలు.. జిల్లాలోని రైతువేదికల్లో ఏర్పాటుచేసిన రైతు నేస్తం కార్యక్రమం ద్వారా ప్రతి మంగళవారం శాస్త్రవేత్తలు రైతులతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. సీజన్కు అనుగుణంగా ఆయా విభాగాల శాస్త్రవేత్తలు రైతులకు పంటల సాగుపై సలహాలు. సూచనలు అందిస్తున్నారు. వ్యవసాయంలో ఎరువుల యాజమాన్యం, వంగడాల ఎంపిక, కలుపు నివారణ, అధిక వర్షాల వేళ పంటల వారీగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సస్యరక్షణ చర్యలను శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. చిరుధాన్యాలు, వాణజ్య పంటలు, కూరగాయలు సాగు విధానాలను రైతులు అడిగి తెలుసుకొని సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. కాలానుగుణంగా పశువులకు అందించాల్సిన టీకాలు, పాడి అభివృద్ధిపై పాడి రైతులకు సంబంధిత శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంలో అవగాహన కల్పిస్తున్నారు. రైతులకు ప్రభుత్వం ద్వారా వచ్చే రాయితీలు, దరఖాస్తు విధానాలను తెలియజేస్తున్నారు. జిల్లాలో 45 రైతువేదికలు ఉండగా 32 కేంద్రాల్లో రైతునేస్తం నిర్వహిస్తుండటంతో రైతులకు సేవలు మరింతగా అందుబాటులోకి రానున్నాయి. రైతులకు సేవలు చేరువగా.. జిల్లాలోని రైతులకు ప్రభుత్వం ద్వారా వ్యవసాయసేవలు మరింత చేరువ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో 12 కేంద్రాల్లో రైతునేస్తం కొనసాగుతుండగా ప్రస్తుతం ప్రభుత్వ ఆదేశాలతో మరో 20 కేంద్రాలలో అందుబాటులోకి తీసుకువచ్చాం. ప్రతి మంగళవారం రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా శాస్త్రవేత్తలు రైతులకు సాగుపై సూచనలు, సలహాలు అందిస్తున్నారు. రైతులు వ్యవసాయసాగులో ఆధునిక పద్ధతులు పాటించి అధికలాభాలు సాధించాలి. – వీరూనాయక్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
అభివృద్ధిలో అధికారుల పాత్ర కీలకం
భూపాలపల్లి అర్బన్: జిల్లా అభివృద్ధిలో అధికారుల పాత్ర కీలకమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాల్లో శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్శర్మతో కలిసి అధికారులతో జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు చేరే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకగా చేపట్టిన ఇందిర ఇల్లు అర్హులైన నిరుపేదలకు చెందాలని పూర్తిస్థాయిలో అధికారులు విచారణ జరిపి అనర్హులను గుర్తించి తొలగించాలన్నారు. తొందరపడి తప్పులు చేయొద్దని, రేషన్ కార్డులు జారీచేసేందుకు విచారణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. సన్న బియ్యం పంపిణీలో నాణ్యత ఉండాలని, నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. అక్రమాలకు పాల్పడితే పైరవీలకు అవకాశం లేకుండా 6ఏ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. మంత్రి, ఎమ్మెల్యేలు చెప్పినా పైరవీలకు అవకాశం లేకుండా నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని సూచించారు. భూ భారతి రెవెన్యూ సదస్సులు అన్ని గ్రామాల్లో నిర్వహించాలన్నారు. రాజీవ్ యువ వికాసం పథకంలో పాడి గేదెల యూనిట్ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐత ప్రకాశ్రెడ్డి, ఎస్పీ కిరణ్ ఖరే, అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ఆర్డీఓ రవి, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష -
నేరుగా ఇసుక వ్యాపారం చేసుకోవాలి
ఏటూరునాగారం: జిల్లాలోని ఇసుక రీచ్లకు గిరిజన సంఘాలు ప్రాతినిధ్యం వహిస్తూ 30 మంది సభ్యుల భాగస్వామ్యంతో గిరిజన సంఘాలు నేరుగా ఇసుక వ్యాపారం చేసుకోవాలని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా అన్నారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో ఐటీడీఏ, టీజీఎండీసీ సంయుక్తంగా గిరిజన మహిళా సంఘాల సభ్యులకు ఇసుక రీచ్లపై సోమవారం అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ ఇసుక వ్యాపారంలో థర్డ్పార్టీ ప్రమేయం లేకుండా స్వతంత్రంగా ఇసుక కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు సంఘాల సభ్యులు సిద్ధంగా ఉండాలన్నారు. ఎనిమిది సంఘాలకు వ్యాపారాన్ని ఎలా నిర్వహించుకోవాలో వివరించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గిరిజన సంఘాలకు ఇసుక వ్యాపారం ఎలా చేయాలని టీజీఎండీసీ సిబ్బందితో శిక్షణ, అవగాహన పూర్తిగా ఇప్పించినట్లు వెల్లడించారు. ఇసుక రీచ్లను స్వతంత్రంగా స్థిరంగా నిర్వహించడానికి గిరిజన సంఘాలకు అధికారం ఇచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ఇందుకోసం కావాల్సిన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏపీఓ వసంతరావు, డిప్యూటీ తహసీల్దార్లు అనిల్, కిశోర్ కుమార్, టీజీఎండీసీ సిబ్బంది, ఇసుక సొసైటీల సభ్యులు పాల్గొన్నారు. అటవీ భూములపై గిరిజనులతో పీఓ చర్చ మండలంలోని రొయ్యూర్ అటవీశాఖ పరిధిలో ఉన్న భూముల్లో గిరిజనులు గుడిసెలు వేయడంతో గొడవకు దారి తీసిన విషయంపై సోమవారం మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో ఐటీడీఏ ఆర్ఓఎఫ్ఆర్ విభాగం డిప్యూటీ తహసీల్దార్లు గిరిజనులతో చర్చించారు. రెవెన్యూ భూములు, అటవీశాఖ భూములు పరిస్థితి, హక్కుల విధానాన్ని డీటీలు అనిల్, కిశోర్కుమార్ గిరిజనులు వివరించారు. అనంతరం ఐటీడీఏ పీఓ సమావేశానికి హాజరై అటవీభూముల్లో ఇళ్ల సమస్య, అందుబాటులో ఉన్న పట్టా భూముల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలను మంత్రి సీతక్క, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ వసంతరావు, ఐటీడీఏ డీడీ పోచం, గిరిజన నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా -
నేడు డిప్యూటీ సీఎం రాక
భూపాలపల్లి: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు నేడు జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా మంగళవారం ఉదయం 11 గంటలకు రేగొండ మండలం చెన్నాపూర్కు చేరుకొని 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి భూపాలపల్లికి చేరుకొని మంజూర్నగర్, చిట్యాల మండలం నవాబుపేట, గణపురం మండలంలోని ధర్మారావుపేటలో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 12.45 గంటలకు మంజూర్నగర్లో ఏర్పాటు చేసిన ప్రజాసభలో డిప్యుటీ సీఎం ప్రసంగిస్తారు. కేటీపీపీ అతిథి గృహంలో మధ్యాహ్న భోజనం చేశాక, 2.30 గంటలకు అతిథి గృహంలోని మీటింగ్ హాల్లో సింగరేణి అధికారులతో సమావేశమై సంస్థ ప్రాజెక్టు విషయాలపై చర్చించనున్నారు. సమావేశం అనంతరం రోడ్డు మార్గం ద్వారా ఖమ్మం వెళ్తారు. ఏర్పాట్ల పరిశీలన.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు జిల్లాలో పర్యటించనున్న నేపధ్యంలో ఏర్పాట్లను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. ప్రజా సభాస్థలితో పాటు ప్రారంభోత్సవ స్థలాలను పరిశీలించి ఆయా శాఖల అధికారులకు సూచనలు చేశారు. పలు అభివృద్ధి పనుల ప్రారంభం, శంకుస్థాపన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర -
ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించాలి
భూపాలపల్లి: ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ సూచించారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ మండలాల నుంచి 53 మంది ఫిర్యాదులు సమర్పించగా స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కాటారం సబ్కలెక్టర్ మయాంక్సింగ్, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఆర్డీఓ రవి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల రాష్ట్ర ప్రభుత్వం, క్రీడాశాఖ ఆధ్వర్యంలో నడిచే క్రీడా పాఠశాలల ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసినట్లు అదనపు కలెక్టర్ అశోక్కుమార్ తెలిపారు. స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాల వాల్పోస్టర్ను సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ప్రస్తుతం నాలుగవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, వీవైఎస్ఓ రఘు, ఆర్డీఓ రవి పాల్గొన్నారు. ఐటీఐ, ఏటీసీలో అడ్మిషన్లు ప్రారంభం.. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) ఆధ్వర్యంలో 2025–26/27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ నూతన కోర్సులను ప్రారంభించినట్లు అదనపు కలెక్టర్ అశోక్కుమార్ తెలిపారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో వివిధ కోర్సులకు సంబంధించిన అడ్మిషన్ల వాల్పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఐటీఐలో ప్రవేశం కోసం జూన్ 21వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్ నంబర్ 89851 00563లో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఐటీఐ ప్రిన్సిపల్ జమ్లనాయక్, ఆర్డీఓ రవి పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ అశోక్కుమార్ -
విక్రయాలు ఆగేనా..
మరో ఏడాది గుట్కా నిషేధం పొడిగింపుభూపాలపల్లి: పొగాకు, నికోటిన్ కలిగిన గుట్కా, పాన్ మసాలాలను ఏడాది క్రితం రాష్ట్ర ప్రభుత్వం నిషేధించగా, మరో ఏడాది పాటు నిషేధాన్ని పొడిగిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. సర్కారు ప్రకటనకు ముందే జిల్లాలోని పలువురు హోల్సేల్ వ్యాపారులు అప్రమత్తమై భారీ మొత్తంలో గుట్కా, పాన్ మసాలాలను దిగుమతి చేసుకొని నిల్వ చేసుకున్నారు. భారీగా నిల్వలు.. గత నెలతో గుట్కా, పాన్ మసాలాల నిషేధం గడువు ముగియనుండటంతో జిల్లాకేంద్రంలోని పలువురు హోల్సేల్ వ్యాపారులు గుట్కా, పాన్ మసాలా, అంబర్, అనార్ తదితర పొగాకు, నికోటిన్ కలిగిన ఉత్పత్తులను భారీ మొత్తంలో దిగుమతి చేసుకొని నిల్వ చేసుకున్నారు. రహస్య ప్రదేశాల్లో నిల్వ ఉంచిన గుట్కా, పాన్ మసాలాలను కిరాణ, పాన్షాపులకు గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు. మంథని, హనుమకొండ నుంచి.. జిల్లాకేంద్రంతో పాటు మండలాలకు అధికంగా మంథని, హనుమకొండ పట్టణాల నుంచి నిషేధిత గుట్కా, పాన్ మసాలాల ప్యాకెట్ల బస్తాలు వస్తున్న ట్లు తెలుస్తోంది. మంథని, గోదావరిఖనికి చెందిన ఇద్దరు వ్యాపారులు ప్రత్యేక వ్యాన్లలో జిల్లాకు సరఫరా చేస్తుండగా, హనుమకొండ నుంచి ట్రాన్స్పోర్ట్లలో సరుకుల మాటున వస్తున్నట్లు సమాచారం. జిల్లాలోనే అధిక విక్రయాలు.. పెద్దపల్లి, హనుమకొండ, కరీంనగర్ జిల్లాల్లో గుట్కా, పాన్ మసాలాల విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నిత్యం తనిఖీలు చేస్తూ విక్రయదారులు, వ్యాపారులపై కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో అక్కడి బడా వ్యాపారులంతా భూపాలపల్లి వైపు చూస్తున్నారు. ఇక్కడ తనిఖీలు అంతంత మాత్రంగానే ఉండటంతో తమ వ్యాపారాన్ని సాఫీగా సాగిస్తున్నారు. చర్యలు తప్పవు.. ప్రభుత్వం నిషేధించిన గుట్కా, తదితర పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. గుట్కాలు విక్రయించే వారిపై ఇప్పటికే నిఘా ఉంచాం. పొగాకు ఉత్పత్తులతో అనారోగ్యాలకు గురవుతారు. త్వరలోనే విక్రయదారులపై దాడులు నిర్వహిస్తాం – సంపత్రావు, భూపాలపల్లి డీఎస్పీ ఉత్తర్వులు జారీచేసిన అధికారులు జిల్లాలోని హోల్సేల్ షాపుల్లో భారీగా నిల్వలు -
స్థలాల దుర్వినియోగం సరికాదు
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి స్థలాలను ప్రభుత్వ అవసరాలకు కేటాయిస్తూ యాజమాన్యం దుర్వినియోగానికి పాల్పడుతుందని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. కేటీకే 8వ గనిలో ప్రధాన రహదారి పక్కన సింగరేణి యాజమాన్యం 15 సంవత్సరాలకు పైగా పెంచినటువంటి వందలాది చెట్లను తొలగించి ప్రభుత్వ సబ్స్టేషన్ నిర్మాణానికి స్థలం కేటాయించినట్లు ఆరోపించారు. సబ్ స్టేషన్ నిర్మాణం కోసం స్థలం కేటాయించడమే కాకుండా చెట్ల తొలగింపు, భూమి చదును చేసేందుకు సివిల్, ఎస్టేట్, ఫారెస్ట్ అధికారులను కేటాయించి కంపెనీ యంత్రాలను సైతం కేటాయించారని మండిపడ్డారు. ప్రభుత్వ అవసరాల కోసం సింగరేణి నిధులను దుర్వినియోగం సరికాదన్నారు. -
నిబంధనలు పాటించకుంటే గుర్తింపు రద్దు
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల గుర్తింపును రద్దుచేయాలని ప్రోగ్రెస్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (పీఎస్ఎఫ్ఐ) జిల్లా అధ్యక్షుడు పసుల వినయ్కుమార్ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ ధనార్జనే ధ్యేయంగా భావిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డబ్బు దోచుకుంటున్నారని ఆరోపించారు. పాఠశాలలోనే పుస్తకాలు, బట్టలు అమ్ముతూ విద్యాహక్కు చట్టాన్ని తుంగలో తొక్కి తమకు ఇష్టం వచ్చిన ఫీజులు పెట్టుకొని వసూలు చేస్తున్న పరిస్థితి ఉందన్నారు. ఎల్హెచ్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా సమ్మయ్య మల్హర్: లంబాడీ హక్కుల పోరాట సమితి (ఎల్హెచ్పీఎస్) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పెద్దతూండ్ల గ్రామానికి చెందిన అజ్మీర సమ్మయ్య నాయక్ నియమితులయ్యారు. సోమవారం సంఘం జాతీయ అధ్యక్షుడు దస్రం నాయక్ చేతుల మీదుగా సమ్మయ్య నాయక్ నియామక పత్రం అందుకున్నారు. జిల్లా కమిటీ ఎన్నిక భూపాలపల్లి అర్బన్: వ్యాయామ విద్య ఉపాధ్యాయుల సంఘం జిల్లా కమిటీని సోమవారం ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా సిరంగి రమేష్, ప్రధాన కార్యదర్శిగా గట్టికొప్పుల సురేష్లను జిల్లాలోని వ్యాయామ ఉపాధ్యాయులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ అధ్యక్ష పదవి తనలో మరింత బాధ్యత పెంచిందని రమేష్ తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ భూపాలపల్లి రూరల్: బీసీ బాలుర, బాలికల వసతి గృహాల్లో ప్రవేశాల కోసం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 3వతరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఈ నెల 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి క్రాంతి కిరణ్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ బీసీ బాలికల వసతిగృహం గణపురం (81) సీట్లు, ప్రభుత్వ బీసీ బాలుర వసతిగృహం చిట్యాల (64), మొగుళ్లపల్లి (27), మహదేవపూర్ (72), మహాముత్తారం బాలుర వసతిగృహం (69) సీట్లు ఖాళీలు ఉన్నాయన్నారు. జిల్లాలోని విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్లో చేసిన దరఖాస్తుతో పాటు సంబంధిత పత్రాలు జతచేసి వసతి గృహ సంక్షేమ అధికారికి 30వ తేదీ సాయంత్రంలోగా అందించాలన్నారు. వివరాలకు వసతి గృహాల్లో సంప్రదించాలని సూచించారు. 18,19 తేదీల్లో ఎంపిక పోటీలు భూపాలపల్లి అర్బన్: స్పోర్ట్స్ పాఠశాలల ఎంపికకు ఈ నెల 18, 19వ తేదీల్లో మండల స్థాయి ఎంపిక క్రీడాపోటీలను నిర్వహించనున్నట్లు మండల ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి దేవానాయక్ తెలిపారు. సోమవారం మండలంలో పీఈటీలతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్ పాఠశాలలకు మండలస్థాయిలో ఎంపికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 4వ తరగతి కోసం 8నుంచి 9సంవత్సరాలలోపు బాలబాలికలు హాజరుకావాలని సూచించారు. పట్టణంలోని అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పీఈటీలు రాజయ్య, శ్రీకోటి, రియాజ్, నవీన్ పాల్గొన్నారు. నియామకం చిట్యాల: తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ యునైటెడ్ అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రటరీగా మండలకేంద్రానికి చెందిన కారోబార్ అంకం సదానందంను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు సాదుల శ్రీకాంత్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాధ్యతలు అప్పగించిన ప్రతీ ఒక్కరికి సదానందం కృతజ్ఞతలు తెలిపారు. -
పంట నష్ట పరిహారం చెల్లించాలి
గోవిందరావుపేట: వడగండ్ల వానతో పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం తెలంగాణ రైతుసంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత ఏప్రిల్, మే నెలలో కురిసిన భారీ వడగండ్ల వర్షాలకు మండల పరిధిలోని పంటపొలాలు 60శాతం వరకు దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని వివరించారు. రైతుల అకౌంట్లలో వెంటనే మంజూరైన డబ్బులను జమ చేయాలన్నారు. యాసంగిలో పండించిన ధాన్యానికి బోనస్ డబ్బులు పడలేదని వివరించారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
రేగొండ: అర్హులందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. సోమవారం మండలంలోని పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. పలు గ్రామాల్లో సీసీ రోడ్లు, నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ.. పేదవాడి సొంత ఇంటి కలను నిజం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పార్టీలకు అతీతంగా పేదలకు ఇళ్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. పలువురి ఆందోళన.. మండలంలోని వెంకటేశ్వర్లపల్లి, కోనరావుపేట, కొత్తపల్లి (కె) గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసే క్రమంలో అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారంటూ పలువురు ఆందోళన చేపట్టారు. దీంతో లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేయకుండా పేద ప్రజలను గుర్తించి వారికే అందజేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. భావితరాలకు స్ఫూర్తి అంబేడ్కర్ కొత్తపల్లిగోరి మండల కేంద్రంలో రూ.5 లక్షలతో డీఎంఎఫ్టీ నిధులతో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. అంబేడ్కర్ను భావితరాలు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. అనంతరం రేగొండ మండలం దమ్మన్నపేట రైతువేదికలో రైతు భరోసాపై సీఎం రేవంత్రెడ్డి సందేశాన్ని ఎమ్మెల్యే సత్యనారాయణ రావు కలెక్టర్ రాహుల్శర్మతో కలిసి వీక్షించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన నేపథ్యంలో చెన్నాపూర్లో సబ్స్టేషన్ వద్ద ఏర్పాట్లను డీఎస్పీ సంపత్రావుతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, హౌసింగ్ పీడీ లోకిలాల్, పీఆర్ డీఈ రవికుమార్, తహసీల్దార్ లక్ష్మిరాజయ్య, ఇన్చార్జ్ ఎంపీడీఓ రాంప్రసాద్, భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గూటోజు కిష్టయ్య, పీఏసీఎస్ చైర్మన్ నడిపల్లి వెంకటేశ్వరరావు, కొడవటంచ ఆలయ డైరెక్టర్ ఆకుల రమేశ్, కాంగ్రెస్ నాయకులు నాయినేని సంపత్రావు, సూదనబోయిన ఓంప్రకాశ్ పాల్గొన్నారు.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
యోగాతో మానసిక ప్రశాంతత
భూపాలపల్లి అర్బన్: ప్రతీ రోజు యోగా చేయడం వలన మానసిక ప్రశాంతత పెరుగుతుందని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి తెలిపారు. ఈ నెల 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం జీఎం కార్యాలయంలో వారం రోజుల శిక్షణ శిబిరాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జీఎం హాజరై ప్రారంభించి మాట్లాడారు. ఆరోగ్యమే మహా భాగ్యం, ఈ సంవత్సరానికి థీమ్ వన్ ఎర్త్, వన్ హెల్త్ను ఎంచుకున్నట్లు చెప్పారు. మనసు శాంతంగా ఉంటే ఎన్నో రకాల సమస్యలు తొలగుతాయని అన్నారు. యోగా ఒక జీవన విధానం, మంచి ఆరోగ్యం కోసం ప్రతీ రోజు యోగా చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని అన్ని విభాగాల ఉన్నతాధికారులు, జీఎం కార్యాలయ సిబ్బంది కలిసి యోగా ప్రతిజ్ఞ చేసి యోగా గురువు ఆంజనేయులుతో యోగాసనాలు చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు వెంకటరామరెడ్డి, కవీంద్ర, జోతి, మారుతి, చంద్రశేఖర్, ప్రదీప్, రాజు, సందీప్, కార్మికసంఘాల నాయకులు మధుకర్రెడ్డి, ఆసిస్పాషా పాల్గొన్నారు. -
పార్టీలకు స్థానిక జోష్!
మంత్రి పొంగులేటి ప్రకటనతో పల్లెల్లో మొదలైన ఎన్నికల సందడిసాక్షి ప్రతినిధి, వరంగల్: పల్లెల్లో మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. పొలిటికల్ పార్టీలకు ఎలక్షన్ జోష్ వచ్చింది. వారం, పది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ ఉంటుందన్న మంత్రుల వ్యాఖ్యలు.. ఎన్నికల వేడిని రగిలించాయి. మూడు రోజుల క్రితం మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ‘ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. అత్యధికంగా గెలిచేలా సిద్ధంగా ఉండాలి’ అని నాయకులకు మార్గనిర్దేశం చేసిన మంత్రి ధనసరి సీతక్క పరోక్షంగా ‘స్థానిక’ ఎన్నికల సంకేతాలు ఇచ్చారు. రెవెన్యూ, గృహనిర్మాణశాఖ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఏకంగా వారం రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందని, ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయని ప్రకటించారు. సోమవారం జరిగే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పారు. దీంతో అధికార కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్, బీజేపీ తదితర పార్టీలు పోటీకి సమాయత్తం అవుతున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అన్ని పార్టీల ఆశావహులు పోటీ చేసేందుకు మళ్లీ పావులు కదుపుతున్నారు. పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు! మంత్రుల వ్యాఖ్యలు, ఇదే అంశంపై సోమవారం కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకుంటామనడంతో ‘స్థానిక’ ఎన్నికల నగారా ఖాయమన్న చర్చ జరుగుతోంది. 2019 ఏప్రిల్ 20న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. మే 6, 10, 14 తేదీల్లో మూడు విడతలుగా పోలింగ్ నిర్వహించారు. 27న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించారు. ఈసారి కూడా మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండగా.. ఇప్పటికే జిల్లాల వారీగా ఎన్నికల, అధికార యంత్రాంగం ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా పోలింగ్ కేంద్రాలు, బూత్లు, ఓటర్ల లిస్టును సిద్ధం చేశారు. 2019 ఎన్నికల సమయంలో రిజర్వేషన్ల ప్రకారం జెడ్పీ చైర్మన్ పదవులు కేటాయించారు. వరంగల్ అర్బన్ (హనుమకొండ) ఎస్సీ పురుషుడు/మహిళ, వరంగల్ రూరల్ (వరంగల్) జనరల్, జనగామ అన్ రిజర్వుడ్ కోటాలో పురుషుడు/మహిళ, జయశంకర్ భూపాలపల్లి ఎస్సీ మహిళ, ములుగు అన్ రిజర్వుడ్ పురుషుడు/మహిళ, మహబూబాబాద్ ఎస్టీ మహిళకు కేటాయించారు. ఎంపీటీసీ, ఎంపీపీలు, సర్పంచ్లు కూడా రిజర్వేషన్లు ఇచ్చారు. అయితే ఈసారి నిర్వహించబోయే ఎన్నికల్లో పాత రిజర్వేషన్లనే పరిగణనలోకి తీసుకుంటారా? లేక కొత్త నిబఽంధనలు తీసుకొస్తారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సర్పంచ్ ఎన్నికలకు సమయం ఉంది.. వాస్తవానికి గతంలో సర్పంచ్ ఎన్నికలు ముందు జరిగి.. తర్వాతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. 2019లో పంచాయతీ ఎన్నికలు జనవరిలో జరిగితే, మే, జూన్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ ఎన్నికల తంతు జరిగింది. ఈసారి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలే ముందు జరిపించే అవకాశం ఉందనడంతో సర్పంచ్, వార్డు సభ్యులు, మున్సిపల్ చైర్మన్, సభ్యుల ఎన్నికలకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. 2019లో ఉమ్మడి వరంగల్లో మంగపేట మండలం, ఏకగ్రీవమైన 305 పంచాయతీలు మినహా 1,403 గ్రామ పంచాయతీల్లో మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఈసారి కూడా గతేడాది జూలైలోనే అధికారులు పంచాయతీల ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు. 1,705 జీపీల్లో 15,056 వార్డుల్లో 22,45,394 మంది ఓటర్లను గుర్తించిన అధికారులు ఆ మేరకు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే ప్రభుత్వం అప్పుడు ఎన్నికలకు విముఖత వ్యక్తం చేయడంతో సర్పంచ్ల పదవీకాలం ముగిసిన వెంటనే స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. కాగా.. తాజాగా ఎన్నికల ప్రస్తావన తెర మీదకు రావడంతో అన్ని పార్టీల ఆశావహులతో సందడి మొదలైంది.2019 ఎన్నికల్లో జిల్లాల వారీగా మొత్తం జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాలు జిల్లా పేరు జెడ్పీటీసీ ఎంపీపీ ఎంపీటీసీ స్థానాలు స్థానాలు స్థానాలు వరంగల్ అర్బన్ 07 07 86 వరంగల్ రూరల్ 16 16 178 జేఎస్.భూపాలపల్లి 11 11 106 ములుగు 09 09 72 మహబూబాబాద్ 16 16 198 జనగామ 12 12 140 మొత్తం 71 71 780 వారంలో నోటిఫికేషన్ ఉంటుందన్న సంకేతాలు నేటి కేబినెట్ మీటింగ్ తర్వాత మరింత స్పష్టత ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఆ తర్వాతే సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు అధికార పార్టీలో మళ్లీ మొదలైన ఆశావహుల ప్రయత్నాలు ‘స్థానిక’ ఎన్నికలకు రాజకీయ పార్టీల సమాయత్తం -
1,310 కేసుల పరిష్కారం
భూపాలపల్లి అర్బన్: మూడు రోజుల క్రితం జిల్లాకోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో భూపాలపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో 1,310 కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించినట్లు సీఐ నరేష్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పలు కేసులలో ఉన్న కక్షిదారులను ఎస్సైలు, కోర్టు కానిస్టేబుళ్లు 15 రోజుల నుంచి స్వయంగా కలిసి రాజీమార్గంపై అవగహన కల్పించినట్లు తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా సత్వరం న్యాయం జరుగుతుందని, ఇరువర్గాలకు న్యాయం జరుగుతుందని అవగాహన కల్పించినట్లు చెప్పారు. ఇందుకు కృషిచేసిన ఎస్సైలు, కానిస్టేబుళ్లను సీఐ అభినందించారు. నాపాక ఆలయంలో ప్రత్యేక పూజలు చిట్యాల: మండలంలోని నైన్పాక గ్రామంలోని నాపాక శ్రీ లక్ష్మీనరసింహాస్వామి సర్వతోభద్ర ఆది ఏకశిల దేవాలయంలో భూపాలపల్లి సీఐ దొమ్మాటి నరేష్ కుమార్–లక్ష్మీ దంపతులు ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు పెండ్యాల ప్రభాకరాచార్యులు ఆలయ విశిష్టతను తెలియజేశారు. వారి వెంట సిరసనగల్లా శేషాచార్యులు, నీలిమ దంపతులు ఉన్నారు. మిషన్ భగీరథ లీకేజీ.. మల్హర్: మండలంలోని వల్లెకుంట మహా రాజుల కాలనీ మూడు రహదారుల వద్ద మిషన్ భరీగథ నీరు లీకేజీ అవుతుంది. దీంతో నీరు వృథాగా పోతూ కలుషితమవుతుంది. నీరు రోడ్లపైకి చేరడంతో వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలు చేసుకుంటున్నాయి. లీకేజీలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. జిల్లా అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. వర్షాలు కురవాలని.. కాటారం: వర్షాలు కురవాలని కోరుతూ మండలంలోని కొత్తపల్లి తండావాసులు ఆదివారం వన భోజనాలకు తరలివెళ్లారు. కుటుంబ సమేతంగా సమీపంలోని పంట పొలాల్లోకి వెళ్లారు. వన దేవతలకు మొక్కులు సమర్పించారు. పెద్దలు, మహిళలు, చిన్నారులు పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ఆహ్లాదంగా గడిపారు. సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ ప్రతి ఏడాది వర్షాకాలం ప్రారంభంలో వనభోజనాలకు వెళ్లడం ఆనవాయితీగా వస్తుందని తండాపెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తండాపెద్దలు ఆజ్మీర రాములునాయక్, ఊదానాయక్, జోహార్, సామెల్, హట్కర్ రావుజీ పాల్గొన్నారు. ఐఎన్టీయూసీ యూత్ వింగ్ కన్వీనర్గా రామకృష్ణ భూపాలపల్లి అర్బన్: ఐఎన్టీయూసీ బలోపేతానికి యువ శక్తి పోరాట పీఠిక పేరుతో యూత్ వింగ్ కన్వీనర్గా కుసుమ రామకృష్ణను నియమించినట్లు ఏరియా బ్రాంచీ ఉపాధ్యక్షుడు బేతెల్లి మధుకర్రెడ్డి తెలిపారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో ఆదివారం నూతన కమిటీని ఎన్నుకున్నట్లు తెలిపారు. కో కన్వీనర్లుగా రాజ్కుమార్, సాయిప్రసాద్, క్రాంతికుమార్, నాగరాజు, సంతోష్, మోహినోద్దిన్, తిరుపతి, రామ్కుమార్, శ్రీనివాస్లను నియమించినట్లు చెప్పారు. కనీస వేతనాల సలహాల మండలి చైర్మన్, ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి జనక్ప్రసాద్ను సమావేశం అనంతరం గోదావరిఖనిలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజేందర్, రఘుపతిరెడ్డి, చక్రపాణి, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, శంకర్, అన్ని గనులు కార్యదర్శులు, యువ కార్మికులు పాల్గొన్నారు. -
మధ్యాహ్న భోజన కార్మికుల ఇబ్బందులు
ఏటూరునాగారం: మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రభుత్వం అరకొరగా మెస్చార్జీలను పెంచడంతో తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం మధ్యాహ్న భోజన కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వంట కార్మికులకు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు నెలలుగా వంట, కోడిగుడ్ల బిల్లులు, వేతనాలు రావడం లేదన్నారు. గత ప్రభుత్వంలో ప్రారంభమైన అల్పాహారం బిల్లులు, వేతనాలు కూడా పెండింగ్లోనే ఉన్నాయని తెలిపారు. ఇప్పుడు పాఠశాలలు ప్రారంభం కావడంతో బిల్లులతో కిరాణం, కూరగాయల వద్ద బిల్లులు చెల్లించకపోవడంతో అప్పు పుట్టడం లేదన్నారు. మెనూ ప్రకారం వంటలు చేయాలని కొందరు అధికారులు ఒత్తిడి చేయడం చూస్తుంటే, పొమ్మనలేక పొగ పెట్టినట్లుగా ఉందన్నారు. కోడిగుడ్లు పూర్తిగా ప్రభుత్వమే సరఫరా చేస్తేనే విద్యార్థులకు అందించడం సాధ్యం అవుతుందన్నారు. వంటగ్యాస్ భారాన్ని కూడా ప్రభుత్వమే భరించాలని చెప్పారు. ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించే మెనూ చార్జీలు అరకొరగా పెంచి పెద్ద మొత్తంలో నిబంధనలు పెట్టడం దారుణమన్నారు. ఈ సమావేశంలో పోరెడ్డి ప్రమీల, రమ, చిటమట లక్ష్మీ, మట్టి లక్ష్మీ, ఇర్సవడ్ల నర్సమ్మ, మామిడి పార్వతి, కల్పన, మల్లమ్మ, కుప్ప చిన్నమ్మ, బొల్లె సత్తెమ్మ, రామక్క, గుంటి సరోజన, కుమ్మరి కొమురక్క పాల్గొన్నారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్ -
మేడారంలో భక్తుల సందడి
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు కల్యాణ కట్టలో పుట్టు వెంట్రుకలు సమర్పించుకున్నారు. అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, ఎత్తు బంగారం, ఒడిబియ్యం, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజుకు పూజలు చేశారు. సుమారుగా 10వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. మంత్రి సీతక్క దృష్టిసారించి భక్తుల కావాల్సిన సౌకర్యాలను దేవాదాయశాఖ అధికారులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని పూజారులు కోరుతున్నారు. -
సోమవారం శ్రీ 16 శ్రీ జూన్ శ్రీ 2025
– 8లోuభూపాలపల్లి అర్బన్: జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు అడ్మిషన్ మొదలుకొని అనేక రకాల ఫీజుల పేరుతో దోచుకుంటున్నాయి. పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లు, యూనిఫాం, స్టేషనరీ పాఠశాలలోనే కొనుగోలు చేయాలనే నిబంధనలు పెడుతూ అధిక మొత్తంలో డబ్బులు లాగుతున్నారు. బహిరంగమార్కెట్ కంటే 15శాతం ఎక్కువ ధర వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 75 ప్రైవేట్ పాఠశాలలు.. జిల్లాలో 75 ప్రైవేట్ పాఠశాలలున్నాయి. ప్రాథమిక, హైస్కూల్ స్థాయిల్లో నడుస్తున్నాయి. సుమారు 15వేల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. ఎల్కేజీ విద్యార్థులకు సగటున రూ.25వేలు, పదోతరగతి విద్యార్థులకు రూ.50 వేలు ఫీజు తీసుకుంటున్నారు. వీటితో పాటు పాఠశాలల్లోనే పాఠ్య పుస్తకాలు, నోటు బుక్కులు కొనుగోలు చేయాలనే నిబంధనలు పెడుతున్నారు. బహిరంగ మార్కెట్లో అవే పుస్తకాలు రూ.10నుంచి 15శాతం తగ్గింపు ధరతో దొరుకుతున్నాయి. అమ్మకాల విషయంలో పాఠశాలల యాజమాన్యాలు కమీషన్లకు కక్కుర్తి పడుతున్నాయి. పుస్తకాలు, నోటు బుక్కులతో పాటు పెన్ను నుంచి పెన్సిల్ వరకు బ్యాడ్జి నుంచి స్కూల్ డ్రెస్సు, స్కూల్ షూ కూడా పాఠశాలలోనే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పుస్తకాలకు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు రూ.3వేల నుంచి 8వేల వరకు వెచ్చించాల్సి వస్తుంది. కనీస సౌకర్యాలు కరువు చాలా పాఠశాలల్లో రేకుల గదుల్లోనే తరగతులు కొనసాగిస్తున్నారు. వెలుతురు సరిగా లేక, ఫ్యాన్లు తిరగక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఆటస్థలాలు కూడా ఎక్కువ పాఠశాలల్లో లేవు. దీంతో క్రీడలు లేక విద్యార్థులు మానసికంగా కుంగిపోయే ప్రమాదం ఉంది. పేరెంట్స్ కమిటీలను యాజమాన్యాలు కాగితాలకే పరిమితం చేస్తున్నాయి. పట్టించుకోవాల్సిన విద్యాశాఖ అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటాం.. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలి. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటాం. అర్హత కలిగిన ఉపాధ్యాయులను నియమించుకోవాలి. విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా ప్రైవేట్ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలి. – రాజేందర్, ఇన్చార్జ్ డీఈఓనిబంధనలు ఇవి.. ● ప్రైవేట్ పాఠశాలల్లో వసతులకు సరిపడా తరగతి గదులు ఉండాలి ● భవన నిర్మాణ నాణ్యత ధ్రువీకరణ పత్రం ఉండాలి. ● విద్యార్థుల మానసిక ఎదుగుదల కోసం ఆటస్థలం, లైబ్రరీ, ప్రహరీ, అగ్నిమాపక శాఖ జారీ చేసిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఉండాలి. ● తాగునీటి వసతి, ప్రథమచికిత్స, కంప్యూటర్ గది, సిబ్బంది గది, మూత్రశాలలు, మరుగుదొడ్లు ఖచ్చితంగా ఉండాలి. ● విద్యాహక్కు చట్టం ప్రకారం బీఎడ్, డీఎడ్ పూర్తిచేసిన వారు బోధన చేయాలి. ● తరగతి గదుల్లో అవసరమైనంత వెలుతురు ఉండాలి. ● పిల్లలు రోడ్డు దాటడానికి సౌకర్యం కల్పించాలి. ● పోషకుల కమిటీ, ఫీజు వివరాలు నోటీసు బోర్డుపై అతికించటం, ప్రభుత్వ పుస్తకాలతోనే విద్యాబోధన చేయటం, ఒక తరగతి గదిలో 40మంది విద్యార్థులు దాటితే మరో సెక్షన్ కోసం అనుమతి తీసుకోవటం, ప్రీ ప్రైమరీ కోసం అనుమతి తీసుకోవటం, తదితర వసతులు ఉండాలి.న్యూస్రీల్ప్రైవేట్ పాఠశాలల్లో భయపెడుతున్న ఫీజులు, సామగ్రి ఖర్చు పుస్తకాలు, యూనిఫాం విక్రయాలకు సొంత కౌంటర్లు 15శాతం వరకు అదనంగా వసూలు -
రేపు డిప్యూటీ సీఎం భట్టి రాక
భూపాలపల్లి రూరల్: పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఈనెల 17న మంగళవారం భూపాలపల్లి నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటించనున్నారని, పర్యటనను విజయవంతం చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం భూపాలపల్లి మంజూరునగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కొత్తపల్లిగోరి, భూపాలపల్లి, గణపురం, చిట్యాల మండలాల్లో పలు పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. మంజూర్నగర్లో బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. గణపురం మండలం చెల్పూర్ గ్రామంలోని జెన్కోలో సింగరేణి, జెన్కో అధికారులతో వేర్వేరుగా నిర్వహించే సమీక్షలో పాల్గొంటారని పేర్కొన్నారు. మోరంచపల్లి నుంచి మంజూరునగర్ సభావేదిక వరకు నిర్వహించనున్న ద్విచక్ర వాహన ర్యాలీలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు. సభాస్థలి పరిశీలన.. మంజూరునగర్లోని సభా ప్రాంగణాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సింగరేణి, జెన్కో, పోలీసు, ఇతర శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పార్టీ నాయకులు సుంకరి రామచంద్రయ్య, దాట్ల శ్రీనివాస్, పిప్పాల రాజేందర్, శిరుప అనిల్, అప్పం కిషన్, మహేందర్ ఉన్నారు. పర్యటనను విజయవంతం చేయాలి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు -
రెండేళ్లుగా గుంతలమయం..
టేకుమట్ల: మండలంలోని వెలిశాల–గర్మిళ్లపల్లి ప్రధాన రోడ్డు నుంచి వెంకట్రావుపల్లికి వెళ్లే దారి సుమారు కిలో మీటర్ మేర రెండు సంవత్సరా లుగా గుంతలమయంగా మారింది. భారీ వాహనాల రాకతో గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారింది. నిత్యం వెంకట్రావుపల్లి, బూర్నపల్లి, ద్వారకపేట ప్రజలే కాకుండా కిష్టంపేట మీదుగా కాల్వశ్రీరాంపూర్కు వెళ్లే వాహనదారులు అదే దారి గుండా ప్రయాణించాలి. వాహనదారులు పగలు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళలో మరీ దారుణంగా ఉంటుంది. ఇప్పటికై నా పాలకులు, అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులకు నిధులు కేటాయించి రోడ్డును నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. -
విపత్తులు ఎదుర్కొనేందుకు సిద్ధం
ములుగు రూరల్: ప్రకృతి విపత్తులు ఎదుర్కొనేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉందని ఎస్పీ డాక్టర్ శబరీశ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాలు కురిసినా లోతట్టు ప్రాంతాలలో హఠాత్తుగా వరదలు వచ్చినా, ముంపునకు గురైనప్పుడు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అత్యవసర సేవలు అందించేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో లోతట్టు ప్రాంతాలను గుర్తించి ప్రజలకు సహాయార్ధం బృందాలను తరలించనున్నట్లు వెల్లడించారు. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటే సమీప పోలీస్స్టేషన్కు గాని, 100కు కాల్ చేయాలని సూచించారు. సకాలంలో సమాచారం అందిస్తే అక్కడికి చేరుకుని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు సులభంగా ఉంటుందని వివరించారు. -
భూమి అమ్మి చదివించారు..
నల్లబెల్లి: చదువు ఒక్కటే తరగని ఆస్తి అని బలంగా నమ్మారు వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామానికి చెందిన ఈర్ల రవీందర్. కూలీ చేసి కొనుక్కున్న 4 ఎకరాల భూమిని కుమారుడు ప్రశాంత్ చదువు కోసం అమ్మేశారు. తండ్రి కష్టాన్ని ప్రత్యక్షంగా చూసిన ప్రశాంత్ ఇష్టంగా చదివారు. ఎండీ జనరల్ మెడిసిన్ పూర్తి చేసిన ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ విభాగంలో పని చేస్తున్నారు. ‘నాకోసం భూమి అమ్మి కుటుంబ పోషణ కోసం నాన్న 5 ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నారు. నాన్న ప్రోత్సాహమే నన్ను వైద్యుడిని చేసింది. నా విజయం నాన్నకు అంకితం’ అంటున్నారు ప్రశాంత్. -
ఆపదకాలంలో ఆదుకునేందుకు రక్తదానం
భూపాలపల్లి అర్బన్: ఆపదకాలంలో ఆదుకునేందుకు ప్రతి ఏడాది రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు ఐటీ మాస్టర్ నిర్వాహకుడు శంకర్ తెలిపారు. ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐటీ మాస్టర్ యాజమాన్యం, తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఐజేయూ జిల్లా కమిటీ) ఆధ్వర్యంలో శనివారం ఐటీ మాస్టర్ క్యాంపస్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ.. 2008వ సంవత్సరం నుంచి ప్రతీ సంవత్సరం ఐటీ మాస్టర్ యజమాన్యం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సేకరించిన రక్తాన్ని ఎంజీఎంలో చికిత్స పొందుతున్న నిరుపేదలకు, ప్రజలకు చికిత్స నిమిత్తం అందించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి అన్ని మండలాల నుంచి జర్నలిస్టులతో పాటు ప్రజాసంఘాలు, స్టూడెంట్స్, సింగరేణి కార్మికులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని స్వచ్ఛందంగా 280 యూనిట్ల రక్తాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు క్యాతం సతీష్ కుమార్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. -
రాజీమార్గంతో వివాదాలకు దూరం
భూపాలపల్లి అర్బన్: రాజీమార్గాన్ని ఎంచుకొని వివాదాలు లేని జీవితాలను గడపాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ సీహెచ్ రమేశ్ బాబు అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణాల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాల్గొని మాట్లాడారు. చిన్న చిన్న విషయాల్లో పంతాలకు పోయి గొడవలు పెట్టుకుంటే నష్టమే తప్ప లాభం ఉండదన్నారు. జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకొని రాజీపడి కేసుల్లో నుంచి బయటపడాలన్నారు. సీనియర్ సివిల్ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ.. క్షమాగుణాన్ని కలిగి ఉండడం గొప్ప విషయం అన్నారు. ప్రతిఒక్కరు సోదరాభావంతో మెలగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్ఆర్ దిలీప్కుమార్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసచారి, ప్రధాన కార్యదర్శి శ్రావణ్ రావు, న్యాయవాదులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమేష్ బాబు -
నడిచే దైవం.. నాకు తొలినేస్తం
ఖిలా వరంగల్: వరంగల్ 34వ డివిజన్ శివనగర్కు చెందిన ఇట్టబోయిన రాజు మెడికల్ రిప్రసెంటేటివ్గా పని చేస్తూ పిల్లల్ని చదివించారు. తండ్రి కష్టానికి ఫలితంగా.. కుమార్తె సాయి శివాని ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ ఫలితాల్లో 11వ ర్యాంకు సాధించారు. ఆమె సాక్షితో మాట్లాడుతూ.. ‘కలెక్టర్ కాలన్నది నా లక్ష్యం కాదు. మానాన్న కోరిక. ఆయన ఎంత కష్టాన్నైనా పైకి కనపడనివ్వకుండా తనలోనే దాచుకుంటారు. నేను ఉన్నత స్థానాన్ని చేరుకోవాలని తపిస్తారు. ఇంజనీరింగ్ ఈసీఈ పూర్తయిన అనంతరం ఇంటి వద్ద ఉంటూ రోజూ 18 గంటలకుపైగా సివిల్స్కు సన్నద్ధమయ్యా. ఇటీవల విడుదలైన ఇల్ ఇండియా సివిల్ సర్వీస్లో 11వ ర్యాంకు సాధించా. ‘నువ్వు కలెక్టర్ కావాలమ్మా’ అనేవారు. ఆయన నడిచే దైవం. నాకు తొలినేస్తం. ఆయన నింపిన స్ఫూర్తే నన్ను ఈస్థానంలో నిలబెట్టింది. -
నాన్న ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి..
వరంగల్ క్రైం: చిన్నప్పటి నుంచి మా నాన్న జన్నేల్సింగ్ నాలో నింపిన ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి చేరుకున్నాను. నాన్న ప్రిన్సిపాల్ కావడంతో చదువులో ప్రోత్సాహం అందించారు. సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే సమయంలో ఆయన మోటివేషన్ నాలో రెట్టింపు ఉత్సాహం నింపింది. చిన్నప్పటి నుంచి ప్రతీ విషయంలో అవగాహన కల్పించేవారు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచేలా తీర్చిదిద్దారు. సామాజిక సమస్యలు, వాటిని ఎదుర్కొంటున్న ప్రజల జీవన స్థితిగతులపై అవగాహన కల్పించారు. ప్రతీ దశలో వెన్నంటి ప్రోత్సహించారు. – సన్ప్రీత్సింగ్, వరంగల్ పోలీస్ కమిషనర్ -
తండ్రి తాపీ మేసీ్త్ర.. కుమార్తె డాక్టర్
కాజీపేట రూరల్: ఆయన చదువుకోలేదు. తనలా పిల్లలు కావొద్దని బాగా చదివించాడు. సమాజంలో గొప్ప స్థాయిలో కూతుళ్లను చూస్తూ మురిసిపోతున్నాడు కాజీపేట బాపూజీనగర్కు చెందిన తాపీ మేసీ్త్ర లింగాల వీరస్వామి. వీరస్వామికి ఇద్దరు కూతుళ్లు. 15 ఏళ్ల క్రితం భార్య చనిపోయింది. పెద్ద కూతురు హేమలతను వైద్య విద్య చదివించాడు. ఆమె ప్రస్తుతం జగిత్యాల జిల్లా ప్రైమరీ వెటర్నరీ సెంటర్ పెగడపల్లిలో అసిస్టెంట్ సర్జన్గా పని చేస్తున్నారు. చిన్న కూతురు సు మలత హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. నాన్న జీవితమే తమకు ప్రేరణనిచ్చిందని.. సుమలత, హేమలత చెబుతున్నారు. -
వందలాది పిల్లలకు దేవుడిచ్చిన నాన్న
ఆదివారం శ్రీ 15 శ్రీ జూన్ శ్రీ 2025జఫర్గఢ్: కన్నపిల్లలు కాకున్నా.. వందలాది మంది పిల్లలతో నాన్న అని పిలుపించుకుంటున్నారు ‘మా ఇల్లు’ అనాథ ఆశ్రమ నిర్వాహకులు గాదె ఇన్నయ్య. మండలంలోని రేగడితండా గ్రామ శివారు టీబీ తండా వద్ద ఉన్న ‘మా ఇల్లు ప్రజాధరణ అనాథ ఆశ్రమం’లో రెండు దశాబ్దాలుగా ఎంతో మంది అనాథలను అక్కున చేర్చుకుని ఆశ్రమంలో చోటు కల్పించారు. వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్నారు గాదె ఇన్నయ్య. అనాథ పిల్లల పట్ల తండ్రి ప్రేమను పంచుతూ.. పిల్లల అభిమానాన్ని పొందుతున్నారు. ఆశ్రమంలోని పిల్లలు తమ ఆధార్ కార్డుల్లో, పాఠశాలల రికార్డుల్లో సైతం ఇన్నయ్య పేరునే తమ తండ్రిగా రాయించడం విశేషం. ఈసందర్భంగా గాదె ఇన్నయ్య మాట్లాడుతూ.. ఎంతో మంది అనాథ పిల్లలతో నాన్న అని పిలుపించుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. పిల్లలు కూడా తనను తండ్రిలాగే భావిస్తూ తనపై అభిమానం చూపుతున్నట్లు పేర్కొన్నారు. పిల్లలు ఇన్నయ్యను నాన్న అంటూ అప్యాయంగా పిలుస్తుంటారు ఇలా.. పిలవడమే తమకిష్టం అని పిల్లలు చెబుతున్నారు. ‘తండ్రి లేని లోటును తీరుస్తున్న ఇన్నయ్యే మా నాన్న’ అంటూ వారు పేర్కొనడం గమనార్హం.న్యూస్రీల్ -
బలోపేతం దిశగా..
కాటారం: అంగన్వాడీ కేంద్రాలను బలోపేతంచేసే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి పలు చర్యలు తీసుకోవడంతో పాటు చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తుంది. ప్రస్తుతం కేంద్రాల్లో చిన్నారుల సంఖ్య పెంచడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కేంద్రాల నిర్వహణలో మార్పులు తీసుకురావడంతో పాటు సేవలను మరింత విస్తృత పరిచేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తుంది. చిన్నారులకు ఎంతో ప్రాముఖ్యమైన పూర్వ ప్రాథమిక విద్యను పక్కాగా అందించే చర్యల్లో భాగంగా ప్రభుత్వం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆటపాటలతో కూడిన విద్య.. గ్రామాల్లో రెండున్నరేళ్లు దాటిన చిన్నారులను గుర్తించి అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించేందుకు ఈ నెల 11నుంచి అమ్మ మాట–అంగన్వాడీ బాట పేరుతో పలు కార్యక్రమాల నిర్వహణ చేపడుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అమ్మ మాట–అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల పరిధిలో టీచర్లు, సిబ్బంది తమ కేంద్రాల పరిధిలో రోజుకో కార్యక్రమం చేపడుతున్నారు. కార్యక్రమం ముగింపులో భాగంగా ఈ నెల 17న సామూహిక అక్షరాభ్యాసం చేయించాలని నిర్ణయించారు. అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన చిన్నారులకు ఉచితంగా యూనిఫాం అందించేందుకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యకు దీటుగా అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీప్రైమరీ విద్య అందిస్తున్నారు. పిల్లలపై మానసిక ఒత్తిడి కలగకుండా నిపుణుల సూచన మేరకు ఆటలు, పాటలు, కథల ద్వారా చిన్నారులకు చదువుపై ఆసక్తి పెంపొందిస్తున్నారు. చిన్నారులను ఆకట్టుకునే విధంగా సెలబస్ రూపొందించి విద్యను బోధించడానికి సిద్ధమయ్యారు. చిన్నారులు పాఠశాలల్లో చేరే నాటికి అక్షరాలు, అంకెలు నేర్పించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ముందుకెళ్తుంది. బడిబాట పట్టేలా.. అంగన్వాడీ కేంద్రాల్లోని 3నుంచి 6ఏళ్ల పిల్లలను బడిబాట పట్టించేందుకు అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది సిద్ధం చేస్తున్నారు. గతంలో అంగన్వాడీ కేంద్రాలను ప్రీ స్కూల్గా భావించే వారు. చిన్నారులు పాఠశాల వాతావరణానికి అలవాటుపడేలా, పౌష్టికాహారం అందించి ఆటలు ఆడించి, బడి అంటే భయం పోగొట్టేలా తీర్చిదిద్దేవారు. గతేడాది నుంచి అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో పలు మార్పులు తీసుకొచ్చారు. కేవలం పౌష్టికాహారం అందించడం, ఆటపాటలతో గడపడమే కాకుండా వారికి విజ్ఞానాన్ని అందించేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు వర్క్బుక్కులు అందించి వారితో హోంవర్క్ చేయిస్తున్నారు. ఎల్కేజీ వారికి తంగేడు పువ్వు పేరుతో నాలుగు పుస్తకాలు, యూకేజీ వారికి పాలపిట్ట పేరుతో ఐదు పుస్తకాలు రూపొందించి ఆటపాటలతో బోధించారు. ప్రస్తుతం నిపుణ్ భారత్ ద్వారా వచ్చిన ప్రియదర్శిని పుస్తకంతో సులభ పద్ధతుల్లో విద్యాబోధన చేపట్టనున్నారు. దీంతో చిన్నారుల మేథస్సు వికసించడంతో పాటు మానసిక మార్పులు చోటు చేసుకోనున్నాయి. చిన్నారుల సంఖ్య పెంచేలా.. ఆరేళ్ల లోపు చిన్నారులు అంగన్వాడీ కేంద్రాలకు వచ్చేలా ఐసీడీఎస్ అధికారులు, అంగన్వాడీ టీచర్లు చర్యలు చేపడుతున్నారు. కేంద్రాల్లో చిన్నారుల సంఖ్య పెంచడం కోసం కసరత్తు చేస్తున్నారు. అమ్మమాట–అంగన్వాడీ బాట కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించి తల్లిదండ్రులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను వివరిస్తున్నారు. చిన్నారులకు ప్రీ ప్రైమరీ విద్య ఆవశ్యకత, అంగన్వాడీలకు పంపించడం ద్వారా వారికి చేకూరే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నారు. చిన్నారుల సంఖ్య పెంచేలా కార్యక్రమాలు.. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వ ఆదేశాలతో అమ్మమాట–అంగన్వాడీ బాట కార్యక్రమం నిర్వహిస్తున్నాం. గ్రామాల్లో పలు కార్యక్రమాలు చేపట్టి అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలు, ఆట పాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్య అమలు తీరుపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం. రెండున్నరేళ్లు దాటిన చిన్నారులను అంగన్వాడీకి పంపించడం ద్వారా వారిలో మేథాశక్తి పెంపొందుతుంది. – మల్లీశ్వరి, డీడబ్ల్యూఓ అంగన్వాడీలపై దృష్టి సారించిన ప్రభుత్వం అమ్మ మాట–అంగన్వాడీ బాట పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు చిన్నారుల సంఖ్య పెంచేలా కసరత్తు 17వరకు పలు కార్యక్రమాల నిర్వహణజిల్లా వివరాలు.. మండలాలు 12 ఐసీడీఎస్ ప్రాజెక్ట్లు 2 (భూపాలపల్లి, మహదేవపూర్) అంగన్వాడీ కేంద్రాలు 643 చిన్నారుల సంఖ్య 10,364(సుమారు) -
మత్స్యకారులకు అండగా ఉంటాం..
ములుగు రూరల్: ప్రభుత్వం మత్స్యకారుల కుటుంబాలకు అండగా ఉంటుందని మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని గిరిజన భవన్లో యుఎల్టీ, నిర్మాణ్ సంస్థ ఆధ్వర్యంలో మత్స్యకారులకు అందించిన తెప్పలు, వలలను కలెక్టర్ టీఎస్ దివాకరతో కలిసి అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మత్స్యకారులకు అవసరమైన తెప్పలు, వలలు అందించడం అభినందనీయమన్నారు. ములుగు మండలంలోని జీవింతరావుపల్లిని ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పైలెట్ ప్రాజెక్టు గ్రామంగా ఎంపిక చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, నిర్మాణ సంస్థ ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ప్రతీ ఇంటికి సురక్షిత తాగునీరు ప్రతీ ఇంటికి సురక్షితమైన తాగునీటిని అందిస్తామని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది, సీ్త్ర శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ దనసరి సీతక్క అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఆటోమెటిక్ క్లోరినేషన్ డౌసింగ్ సిస్టంను ప్రారంభించారు. మంత్రి సీతక్క -
యూనిఫాం అందజేత
భూపాలపల్లి అర్బన్: ఏరియాలో నూతనంగా డిప్యూటేషన్పై వెళ్లిన మహిళా ఎస్అండ్పీసీ సిబ్బందికి శుక్రవారం ఏరియా ఇన్చార్జ్ జీఎం కవీంద్ర యూనిఫాం అందజేశారు. జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కవీంద్ర ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నూతనంగా విధుల్లో చేరుతున్న మహిళా ఉద్యోగులు ఎస్అండ్పీసీకి రావడం సంతోషకరమైన విషయమన్నారు. సింగరేణి ఉద్యోగంలో చేరే మహిళలు సంస్థలో అన్ని రకాల పనులు చేయడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు డాక్టర్ పద్మజ, మారుతి, మురళీమోహన్, మహిళా సెక్యూరిటీ ఉద్యోగులు పాల్గొన్నారు. -
నెరవేరనున్న నిరుపేదల సొంతింటి కల
ములుగు రూరల్: నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారని గ్రంథాలయ సంస్థచైర్మన్ బానోత్ రవిచందర్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను అందిస్తామన్నారు. లబ్ధిదారులకు ఇంటి నిర్మాణాన్ని బట్టి ప్రతీ సోమవారం బిల్లు చెల్లిస్తున్నామని, లబ్ధిదారులు త్వరగా ఇంటి నిర్మాణాలు చేపట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చింతనిప్పుల భిక్షపతి, భోడ రఘు, అనిల్, షకిల్, జాఫర్, అభినయ్, రాజన్న, మహేందర్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. మంజూరు పత్రాలు ఇచ్చి లాక్కున్నారు.. వాజేడు: రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ఇందిరమ్మ మంజూరు పత్రాలను ఇచ్చారని, మీరు అర్హులు కారని తిరిగి తీసుకున్నారని మండల అంగన్వాడీ సిబ్బంది భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి కాకర్లపూడి విక్రాంత్, మాజీ జెడ్పీటీసీ తల్లడి పుష్పలతలతో కలిసి భద్రాచలం వెళ్లారు. తమకు గత నెల 7న మంత్రి పర్యటనలో భాగంగా మంజూరు పత్రాలను ఇవ్వడంతో 5 రోజులు ఆగి తాము కొత్త ఇంటిని నిర్మించుకోవడానికి పాత ఇంటిని తొలగించినట్లు ఎమ్మెల్యేకు తెలిపారు. -
కొనసాగుతున్న రేషన్ పంపిణీ
ములుగు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలు కడుపు నిండా భోజనం చేయాలనే ఉద్ధేశ్యంతో రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. ఈ ఏడాది ఉగాది పండుగ సందర్భంగా పథకాన్ని ప్రారంభించి నిరుపేదలకు అందిస్తుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ చేయడాన్ని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో దొడ్డు బియ్యం పంపిణీలో 80శాతం మంది లబ్ధిదారులు అమ్మకాలు చేపట్టడంతో ప్రజా పంపిణీ బియ్యం పక్కదారి పట్టేది. కానీ సన్నబియ్యం పంపిణీతో నిరుపేదలకు సద్వినియోగం అవుతుంది. జిల్లాలో 94,628 కార్డులు జిల్లాలోని పది మండలాల్లో 94,628 రేషన్ కార్డులు ఉన్నాయి. ప్రతీ నెల జిల్లాలో 1,714 టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభంతో రవాణా ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తుగా మూడు నెలల బియ్యాన్ని చౌకధరల దుకాణాలకు తరలించి లబ్ధిదారులకు అందజేస్తున్నారు. జిల్లాలో మూడు నెలలకు గాను 5,157 టన్నుల బియ్యం పంపిణీ చేయనున్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు బియ్యం పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. కాగా సన్నధాన్యానికి ప్రభుత్వం బోనస్ ఇస్తుండటంతో రైతులు అత్యధికంగా వరిసాగు చేస్తున్నారు.మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ జిల్లాలో 94,628 కార్డులు తూకాల్లో అవకతవకలు లేకుండా నిత్యం తనిఖీలు సివిల్ సప్లయీస్ అధికారి ఫైజల్ హుస్సేన్ -
సమస్యల పరిష్కారం కోసం సదస్సులు
గణపురం: గ్రామాల్లో భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ అన్నారు. గణపురం మండలం అప్పయ్యపల్లె గ్రామంలో శుక్రవారం నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సుకు హాజరై మాట్లాడారు. రెవెన్యూ శాఖ అందించే సేవలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించి రిజిస్టర్లలో నమోదు చేసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణస్వామి, రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ అశోక్కుమార్ -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలన
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం ఎలికేశ్వరం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను హౌసింగ్ సీఈ ఎం.చైతన్యకుమార్, పీడీ లోకిలాల్ శుక్రవారం పరిశీలించారు. గ్రామంలో పర్యటించి మంజూరైన 56 ఇళ్లలో ముగ్గుపోసిన 21, బేస్మెంట్ లెవల్లో ఉన్న 4 ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఈ మాట్లాడుతూ లబ్ధిదారులు 400 స్కేర్ఫీట్ నుంచి 600 స్కేర్ఫీట్ల లోపు నిర్మాణం చేయాలన్నారు. లబ్ధిదారులకు నాలుగు విడతల్లో బిల్లులు జమ అవుతాయని తెలిపారు. రూ.లక్ష బేస్మెంట్ లెవల్, రూ.లక్ష లెంటల్ లెవల్, రూ.రెండు లక్షలు స్లాబ్ లెవల్, రూ.లక్ష ప్లాస్టరింగ్ వరకు విడతల వారీగా జమ చేస్తారన్నారు. నిర్మాణం చేసే మేసీ్త్రలకు ప్రభుత్వం ఒక ధర నిర్ణయించినట్లు తెలిపారు. అధిక డబ్బులు అడిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారి వెంట ఏఈ, డీఈలు ఉన్నారు. -
అధికారంలోకి వచ్చి తీరుతాం..
భూపాలపల్లి రూరల్: నరేంద్ర మోదీ పాలనలో దేశం ప్రగతి పథంలో దూసుకెళ్లుతుందని, 11 ఏళ్ల పాలన అభివృద్ధికి నిదర్శమని రానున్న రోజుల్లో తెలంగాణలోనూ అధికారంలోకి వచ్చి డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు చేస్తామని బీజేపీ మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి, జిల్లా ఇన్చార్జి అల్జాపూర్ శ్రీనివాస్ అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిశీధర్రెడ్డి అధ్యక్షతన ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ పాలన 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఆయా జిల్లాల్లో బీజేపీ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నప్పటికీ, అవగాహన లేక కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు క్షేత్రస్థాయిలో అమలు చేయడం లేదని చెప్పారు. పార్టీలోని అన్ని కమిటీల సభ్యులు క్షేత్రస్థాయిలో మోదీ పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు. బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్చార్జ్ కందుల సంధ్యారాణి మాట్లాడారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకులు, క్రమశిక్షణ సంఘం కన్వీనర్ నాగపూరి రాజమౌళి గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెన్నంపల్లి పాపయ్య, నాయకులు జన్నె మొగిలి, ప్రసాద్రావు, దొంగల రాజేందర్, బట్టు రవి, కంబాల రాజయ్య, వేషాల సత్యవతి, సయ్యద్ గాలిఫ్ పాల్గొన్నారు.బీజేపీ మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి అల్జాపూర్ శ్రీనివాస్ -
ప్రభుత్వ పాఠశాలల్లో అక్షరాభ్యాసం
భూపాలపల్లి అర్బన్: ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ప్రభుత్వ పాఠశాలల్లో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని పుల్లూరిరామయ్యపల్లి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయురాలు హిమబిందు తన కూతురు ప్రహర్షిని అదే పాఠశాలల్లో ప్రీ ప్రైమరీలో చేర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రషీద్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ రమ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శానిటేషన్, మెప్మా ఆర్పీలకు వైద్య పరీక్షలు భూపాలపల్లి అర్బన్: పురపాలక సంఘ కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 100 రోజుల ప్రణాళిక కార్యాచరణలో భాగంగా శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో శానిటేషన్ సిబ్బంది, మెప్మా ఆర్పీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి మధుసూదన్ వైద్యాధికారులతో కలిసి వైద్యశిబిరం ఏర్పాటుచేసి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎఫ్ఈ అన్నపూర్ణ వైద్య పరీక్షలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైద్యాఽధికారులు డాక్టర్ రోహిణి, డాక్టర్ స్వాతి, వైద్య సిబ్బంది, శానిటరీ ఇన్స్పెక్టర్ నవీన్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. సమగ్ర కులగణన సాహసోపేత నిర్ణయం కాటారం: దేశంలో సమగ్ర కులగణన బిల్లును అమల్లోకి తీసుకురావడానికి ప్రధాన మంత్రి మోదీ చేస్తున్న కృషి సాహసోపేతమైందని కులగణన సాధన సమితి జాతీయ కన్వీనర్, బీసీ నాయకుడు డాక్టర్ పరికిపండ్ల అశోక్ అన్నారు. శుక్రవారం కాటారం వచ్చిన ఆయనను అఖిల భారత పద్మశాలి రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు ఎలుబాక సుజాత ఆధ్వర్యంలో బీసీ సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు. అనంతరం విలేకర్ల సమావేశంలో అశోక్ మాట్లాడారు. మూడు సంవత్సరాలుగా బీసీ లెక్కలు తేల్చాలనే ఏకై క డిమాండ్తో ప్రధాన మంత్రికి కోటి ఉత్తరాల కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్లు తెలిపారు. తెలంగాణలో ప్రారంభించి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, డిల్లీ వరకు ప్రత్యక్షంగా తిరుగుతూ ప్రజలను చైతన్యం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ గుమ్మడవెల్లి శ్రీనివాస్, రుషికేశ్, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. కాళేశ్వరం బస్టాండ్లో షీ, మాతాశిశు కేంద్రం కాళేశ్వరం: సరస్వతీనది పుష్కరాల సందర్భంగా కాళేశ్వరం తాత్కాలిక బస్టాండ్లో షీ రూమ్ (సానిటరీ హైజిన్ ఎంపవర్మెంట్), మాతా శిశు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పుష్కరాలకు కాళేశ్వరం వచ్చే మహిళలు, బాలింతల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన షీ, మాతా శిశు కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్శర్మ ఆదేశాల మేరకు శుక్రవారం కాళేశ్వరంలోని శాశ్వత బస్టాండ్కు మార్చినట్లు కాటారం సబ్కలెక్టర్ మయాంక్సింగ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాళేశ్వరం వచ్చే మహిళలకు బస్టాండ్లో షీ, మాతా శిశు కేంద్రం రూములు అందుబాటులో ఉంటాయని తెలిపారు. షీ రూమును, బ్రెస్ట్ ఫీడింగ్ కేంద్రాన్ని పాలిచ్చే తల్లులు వినియోగించుకోవాలని సూచించారు. -
శనివారం శ్రీ 14 శ్రీ జూన్ శ్రీ 2025
కొనుగోలు కేంద్రాలు 204 రైతులు 20,583 సేకరించిన ధాన్యం 1,11,337 మెట్రిక్ టన్నులు ధాన్యం విలువ రూ.258కోట్లు చెల్లించింది రూ.150కోట్లు సన్నధాన్యం రైతుల సంఖ్య 19,763 సన్నధాన్యం కొనుగోలు 25,924 టన్నులు అందించాల్సిన బోనస్ రూ.9.88 కోట్లుబోనస్ రాలే.. నేను ఆరెకరాల్లో వరి పంట సా గుచేశాను. 100 క్వింటాల సన్న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో విక్రయించాను. ధాన్యం డబ్బులు ఖాతాలో జమయ్యా యి. ఇక బోనస్ ఎప్పుడు వేస్తారో తెల్వదు. ఇదే విషయమై అధికారులను అడిగితే డబ్బులు రావడానికి ప్రాసెస్ జరుగుతుందని చెబుతున్నారు. – బొల్లు సరోత్తం రెడ్డి, టేకుమట్ల త్వరలోనే ఖాతాలో జమవుతాయి.. సన్న రకం ధాన్యానికి సంబంధించి బోనస్ రూ.9.88 కోట్లు ఇచ్చేది ఉంది. దానికి సంబంధించిన రూ.7.61 కోట్లు బోనస్ ఆన్లైన్ అయ్యాయి, మిగితావి త్వరగా ఆన్లైన్చేసే విధంగా ఆదేశించాం. ప్రభుత్వం నుంచి నేరుగా రైతుల ఖాతాల్లో జమవుతాయి. – శ్రీనాఽథ్, జిల్లా పౌరసరఫరాల అధికారి న్యూస్రీల్ -
ముస్తాబు.. స్వాగతం
వేసవి సెలవుల్లో ఆటపాటలతో గడిపిన విద్యార్థులు గురువారం బడిబాట పట్టారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను ఉపాధ్యాయులు ముస్తాబు చేసి విద్యార్థులకు స్వాగతం పలికారు. మామిడి కొమ్మలు, బెలూన్లు, పూలతో బడుల ప్రాంగణాలను అలంకరించారు. పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు పూల అందజేసి స్వాగతం పలికారు. పలు మండలాల్లో పాఠశాలలను డీఈఓ రాజేందర్, ఎంఈఓలు సందర్శించి విద్యార్థులకు పాఠ్య, నోట్ పుస్తకాలు, యూనిఫాంలు అందించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులను పాఠశాలలకు ఆహ్వానించి పండగ వాతావరణంలో పాఠశాలలను పున:ప్రారంభించారు. స్కూళ్ల వద్ద సందడి వాతావరణం కనిపించింది. –భూపాలపల్లి అర్బన్ -
ధరలు భగభగ!
కొనలేని స్థితిలో సామాన్యులు● వర్షాభావంతో పెరిగిన ధరలు ● మింగుడు పట్టని పప్పన్నం ● మరింత పెరిగే అవకాశంకాళేశ్వరం: జూన్ మాసంలో వర్షాల జాడలేక ఎండలు మండిపోతుండడంతో కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. సామాన్యులు పౌష్టికాహారం తినలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఎండల ప్రభావంతో కూరగాయల ధరలను వ్యాపారులు తగ్గించడం లేదు. గతంలో పోల్చితే ఈఏడాది కూడా కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. వేసవిలో అక్కడక్కడా అకాల వర్షాలతో కూడా కూరగాయల పంటకు దిగుబడిని తగ్గింది. వాతావరణంలో వచ్చే మార్పులతో కూడా ఎండలకు కూరగాయల దిగుబడి లేక ధరలు పెరగడంతో సామాన్యులు కొనలేని పరిస్థితి ఏర్పడుతుంది. పట్టణాలతో పోల్చితే గ్రామాల్లో మరింత అధిక ధరలు ఉన్నాయి. సామాన్యుడు కనీసం తాజా కూరగాయలు కొనుగోలు చేయడం లేదు. గతంలో రూ.200–300 వరకు డబ్బులు పెడితే సంచినిండా కూరగాయలు ఇంటిల్లిపాదికి వారం పాటు సరిపోయేది. ప్రస్తుతం రూ.400–500 పెట్టి కొనుగోలు చేసినా సరిపడా కూరగాయలు లభించడం లేదని పలువురు వాపోతున్నారు. ఇంకా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు పేర్కొంటున్నారు. పప్పుతో ముద్దదిగని పరిస్థితులు నెలకొన్నట్లు సామాన్యులు తెలుపుతున్నారు. ప్రభుత్వం నిత్యవసర వస్తువుల ధరలు అదుపు చేయాలని సామాన్యులు కోరుతున్నారు.ఎండల ప్రభావం ఇలాగే ఉంటే.. ఎండల ప్రభావంతో కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. ఎండల ప్రభావం ఇలానే ఉంటే ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. టమాట ధర ఇప్పటికే పెరిగింది. మరింత పెరిగే అవకాశం ఉంది. మార్కెట్లో ధరలు అకాశన్నంటుతున్నాయి. దీంతో కూరగాయలకు గిరాకీ కూడా తగ్గుతుంది. – మక్సూద్, కూరగాయల వ్యాపారి, కాళేశ్వరంకూరగాయలు కొనలేం.. ఎండలు మండిపోతుండడంతో కూరగాయల ధరలు పెంచారు. సామాన్యులం కూరగాయలు కొనలేం. మరింత పెరుగుతాయని వ్యాపారులు చెపుతున్నారు. వారానికి రూ.500పెడితే కూడా సరిపడా కూరగాయలు వస్తలేవు. ఽటమాట ధర పెరుగుతుంది. ధరలను నియంత్రించాలి. – స్వప్న, టేకుమట్లధరలు (కిలోకు..)టమాట రూ.40–50 పచ్చి మిర్చి రూ.60 వంకాయ రూ.50 బెండకాయ రూ.40 కొత్తిమీర రూ.120 కాకరకాయ రూ.70 బీరకాయ రూ.100 సోరకాయ రూ.20(ఒక్కటి) అలసంద రూ.50 కాలీఫ్లవర్ రూ.80 క్యాబేజీ రూ.40 మునుగకాయ రూ. 80 దోసకాయ రూ.40 చిక్కుడుకాయరూ.90 అడవి కాకరకాయ రూ.350 -
ఫీజు రాయితీ కల్పించాలి
భూపాలపల్లి అర్బన్: జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో జర్నలిస్ట్ల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ కల్పించాలని కోరుతూ.. గురువారం టీఎస్జేయూ నాయకులు జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. ఫీజు రాయితీ కల్పించే విధంగా సర్క్యూలర్ జారీ చేయాలని కోరారు. దీంతో స్పందించిన డీఈఓ రాయితీ కల్పించేలా ఆదేశాలిస్తూ ప్రైవేట్, కార్పోరేట్ పాఠశాలల యాజమాన్యాలకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజషన్ సెక్రటరీ పావుశెట్టి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంతోష్, జిల్లా ప్రధాన కార్యదర్శి దొమ్మటి రవీందర్, నాయకులు రవీందర్, రవి, భూపాల్, సతీష్, చంద్రమౌళి, జగన్ పాల్గొన్నారు. -
డీఎస్పీ బాధ్యతల స్వీకరణ
కాటారం: కాటారం డీఎస్పీగా సూర్యనారాయణ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన రామ్మెహన్రెడ్డి సాధారణ బదిలీలో భాగంగా ఇటీవల బదిలీ కాగా హైదరాబాద్ ఎస్ఐబీలో పనిచేస్తున్న సూర్యనారాయణ కాటారం బదిలీపై వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన డీఎస్పీని సబ్ డివిజన్ పరిధిలోని సీఐ, ఎస్సైలు మర్యాదపూర్వకంగా కలిశారు.ఉపాధి లక్ష్యాలు పూర్తిచేయాలిరేగొండ: ఉపాధి హామీ పథకం లక్ష్యాలను సకాలంలో పూర్తిచేయాలని డీఆర్డీఓ బాలకృష్ణ అన్నారు. ఉపాధి హామీ పనులపై గురువారం ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనులు పూర్తి చేయడంలో అధికారులు పోటీతత్వంతో పనిచేయాలని తెలిపారు. లక్ష్యం ప్రకారం మండలంలో ప్లాంటేషన్ చేపట్టాలని, అందులో సుమారు 100 ఎకరాలలో పండ్ల మొక్కలను నాటాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి లేబర్ టర్న్ఔట్ పెంచాలని, కూలీలకు వంద శాతం చెల్లింపులు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మంజుల, ఎంపీఓ రాంప్రసాద్, టీఏలు రాజు, రమేష్ పాల్గొన్నారు.మెడికల్ బోర్డును పునరుద్ధరించాలిభూపాలపల్లి అర్బన్: మూడు నెలలుగా నిలిచిపోయిన సింగరేణి మెడికల్ బోర్డును పునరుద్ధరించాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య కోరారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు నెలల కాలం నుంచి సింగరేణిలో మెడికల్ బోర్డు పెట్టకపోవడంతో సింగరేణి కార్మికులు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. గతంలో మెడికల్ బోర్డులో జరిగిన కుంభకోణం దోపిడీ విషయంలో విచారణ పేరుతో మెడికల్ బోర్డు నిర్వహించకపోవడం సరైనది కాదన్నారు. దీనిపై గుర్తింపు, ప్రాతినిథ్య సంఘాలు మాట్లాడకపోవడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఈ సమావేశంలో నాయకులు దాసరి జనార్దన్, కాసర్ల ప్రసాదరెడ్డి, నామాల శ్రీనివాస్, రాళ్లబండి బాపు, జయశంకర్, ఎండి సాజిత్ పాల్గొన్నారు.కొనసాగుతున్న క్రికెట్ క్రీడాపోటీలుభూపాలపల్లి అర్బన్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న అంతర్ జిల్లాల క్రికెట్ పోటీలు కొనసాగుతున్నాయి. స్థానిక అంబేడ్కర్ స్టేడియంలో గురువారం నిర్వహించిన ఐదవ లీగ్ మ్యాచ్ను సీఐ నరేష్కుమార్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హెచ్సీయూ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించి క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడం సంతోషకరమైన విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కార్యదర్శి చాగంటి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, అధ్యక్షుడు కర్ణాకర్, కోచ్లు పాల్గొన్నారు.శిలాఫలకం కూల్చారు..టేకుమట్ల: మండలంలోని ఆరెపల్లి శివారులో రైతుల భూములకు వెళ్లే దారి మరమ్మతు కోసం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు బుధవారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. శిలాఫలకాన్ని గుర్తుతెలియని వ్యక్తులు కూల్చేశారు. గురువారం కాంగ్రెస్ నాయకులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఉపాధి కల్పించడమే లక్ష్యం
రేగొండ: పేద, దళిత కుటుంబాలకు జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా భూమి కొనుగోలు పథకం కొనసాగుతోందని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ అన్నారు. కొత్తపల్లిగోరి మండలంలోని జగ్గయ్యపేట, చెన్నాపూర్ శివారులోని భూములను గురువారం భూమి కొనుగోలు పథకంలో భాగంగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వర్లుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో భూసేకరణ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతోందన్నారు. ఎంపిక ప్రక్రియలో సమీక్ష, ధృవపత్రాల పరిశీలన, గ్రామస్థాయి సమావేశాల ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని పేర్కొన్నారు. ఈ పథకం దళితుల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మిరాజయ్య, సర్వేయర్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
చిట్యాల: ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ అన్నారు. మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు గురువారం పునఃప్రారంభమయ్యాయి. బడిబాటలో భాగంగా నైన్పాక ఉన్నత పాఠశాలలో నూతన విద్యా సంవత్సర ప్రారంభ వేడుకలు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఊర్మిళ అధ్యక్షతన పండుగ వాతావరణం ఉట్టిపడేలా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఈఓ రాజేందర్ హాజరై విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, స్కూల్ యూనిఫామ్స్ అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల శారీరక, మానసిక ఎదుగుదలకు కావాలసిన అన్ని వసతులు కల్పించామన్నారు. సుశిక్షితులైన ఉపాధ్యాయులతో సమగ్రమైన విజ్ఞానం అందించబడుతుందని తెలిపారు. గ్రామస్తులు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ ద్వారా విద్యాబోధన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంతో జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం పదవ తరగతిలో మండలంలో అత్యధిక మార్కులు సాధించిన నైన్పాక విద్యార్థిని రమ్యను ఆయన ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి కొడెపాక రఘుపతి, సీఎంఓ రమేష్, సెక్టోరియల్ ఆఫీసర్ రాజగోపాల్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఊర్మిళ, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాముకుంట్ల తిరుపతయ్య, ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ పాఠశాలల చైర్మన్లు, తల్లిదండ్రులు, విద్యావంతులు పాల్గొన్నారు. చిట్యాలలో... మండలకేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఎంఈఓ కొడెపాక రఘుపతి విద్యార్థులకు పాఠ్యప్తుకాలు, నోట్ బుక్కులు, దుస్తులు పంపిణీ చేశారు. అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులకు బొకేలు ఇచ్చి ఆహ్వానించారు.డీఈఓ రాజేందర్ -
పిల్లలు పనిలో కాదు.. బడిలో ఉండాలి
భూపాలపల్లి అర్బన్: చిన్నపిల్లలు ఉండాల్సింది బడిలో కానీ పనిలో కాదని సీనియర్ సివిల్ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాజు అన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం సమావేశం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి జడ్జి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చిన్నపిల్లలను పనిలో పెట్టుకుంటే ఉపేక్షించేది లేదన్నారు. చిన్న పిల్లలు ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలన్నారు. కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చెప్పారు. ఐక్యరాజ్యసమితి తీసుకున్న నిర్ణయంతో యావత్తు ప్రపంచం బాల కార్మిక నిర్మూలన కోసం కదులుతుందని తెలిపారు. బాలకార్మిక నిర్మూలన కోసం ప్రతీ ఒక్కరూ కలిసికట్టుగా నడవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్ఆర్ దిలీప్కుమార్నాయక్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రావణ్రావు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మిప్రసన్న, న్యాయవాదులు, విద్యార్థులు పాల్గొన్నారు.