breaking news
Eluru
-
మోసాల్లో బ్యాంకింగ్
బంగారం.. అమ్మో బంగారం అనేంతగా ధర పెరిగింది.. జీవితకాల గరిష్టాలకు చేరి ఆశ్చర్యపరిచింది.. ధర పెరగడంతో బంగారంపై ఇచ్చే రుణం విలువ కూడా రెట్టింపయ్యింది. ఇదే అదునుగా కొందరు బ్యాంకు అధికారులు మోసాలకు తెరదీశారు. జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధి లోని బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లో వెలుగుచూసిన మోసాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఏఐ సృష్టించిన చిత్రం సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఓ బ్యాంకులో బంగారు ఆభరణాల స్థానంలో నకిలీ ఆభరణాలు ఉంచి దాదాపు రూ.10 కోట్లు మోసం చేసిన ఘటన.. మరో ఫైనాన్స్ సంస్థలోఆడిట్ కోసం వచ్చిన వ్యక్తి 2 కిలోల బంగారంతో పరారీ.. ఇంకో ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో ఖాతాదారుడి బంగారం గోల్మాల్.. నకిలీ పత్రాలతో వేలం నిర్వహించి ఓ స్థలాన్ని ఖాతాదారుడికి విక్రయించిన సంఘటన మరో ప్రైవేట్ బ్యాంకులో ఇలా.. వరుస మోసాలకు జంగారెడ్డిగూడెం డివిజన్ వేదికైంది. ఆయా కేసుల్లో బ్యాంకర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. గోల్డ్లోన్ ఖాతాలతో ఏ‘మార్చి’.. జంగారెడ్డిగూడెం ఐఐఎఫ్ఎల్లో బంగారాన్ని ఖా తాదారుడికి తెలియకుండా బ్యాంకు మేనేజర్ మరో బ్యాంకులో కుదువపెట్టి రుణం పొందిన ఘటనపై గత ఫిబ్రవరి 21న కేసు నమోదైంది. పట్టణానికి చెందిన ధనలక్ష్మి 270 గ్రాముల బంగారాన్ని తాకట్టు పెట్టి రూ.13 లక్షల రుణం పొందారు. ఈ మేరకు ప్రతినెలా వడ్డి చెల్లించేవారు. బ్యాంకు మేనేజర్ ఉద్దగిరి చైతన్య రాము బంగారం విలువ పెరిగిందని, లోన్ ఎక్కువ వస్తుందని చెప్పి ఆమె నుంచి ఓటీపీలు తెలుసుకున్నాడు. ఆమెకు తెలియకుండా రుణం తీర్చి.. 270 గ్రాముల బంగారాన్ని విడిపించి మరో ఖాతాలో కుదువపెట్టి ఎక్కువ రుణం పొందాడు. రుణం చెల్లించేందుకు బ్యాంకుకు వెళ్లిన ఆమె తన పేరుపై గోల్డ్లోన్ లేదని చెప్పడంతో అవాక్కయ్యింది. మేనేజర్ రాముకు ఫోన్ చేస్తే స్పందించలేదు. అతడు ఉద్యోగం మానేసిన ట్టు తెలుసుకుని పోలీసులను ఆశ్రయించింది. ఈ–వేలం.. నకిలీ పత్రాలతో మోసం నకిలీ పత్రాలతో లేని స్థలానికి ఈ–వేలం నిర్వహించి ఓ ఖాతాదారుడిని మోసగించిన ఘటనపై గత జూలై 8న కేసు నమోదైంది. జంగారెడ్డిగూడెం కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంకులో సర్వేనం.455లో 108 గజాల స్థలానికి ఈ–ఆక్షన్ నిర్వహించగా పట్టణానికి చెందిన రాజు జయపాండే రూ.17.66 లక్షలకు దక్కించుకున్నారు. అనంతరం ఈ ఏడాది జనవరి 7న బ్యాంక్ అధికారి యశోద కృష్ణారావు, మేనేజర్ ఐన ఆంజనేయులు ఆ స్థలాన్ని జయపాండే పేరున రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చారు. అనంతరం జయపాండే సదరు స్థలం వద్దకు వెళ్లగా ఆ సర్వే నంబర్లో 108 గజాల స్థలం లేదని, ఆ స్థలంపై ఎలాంటి బ్యాంకు రుణం లేదని తెలుసుకుని అవాక్కయాడు. నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్పై బ్యాంకు అధికారులను నిలదీయగా రేపూమాపూ అంటూ తిప్పించుకుని కోర్టుకు వెళ్లమని చెప్పి చేతు లు దులుపుకున్నారు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు బ్యాంకు అధికారి యశోద కృష్ణారావు, మేనేజర్ ఐన ఆంజనేయలు, అసిస్టెంట్ మేనేజర్ కిషోర్, బ్యాంకు అధికారి హరిప్రియ తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. చింతలపూడిలోని కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలో గతేడాది సెప్టెంబర్ 9న ఆడిట్ కోసం వచ్చిన ఉద్యోగి వి.ఉమమాహేశ్వరరరావు 4.484 కిలోల బంగారాన్ని అపహరించాడు. దాదాపు నాలుగు నెలల పాటు పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నాడు. బంగారం విలువ సుమారు రూ.7 కోట్ల వరకు ఉంటుంది. ఈ ఏడాది జనవరిలో ఆయన్ను పోలీసులు అరెస్టు చేసి బంగారాన్ని రికవరీ చేశారు. అయితే రికవరీ చేసిన సొత్తును పూర్తిస్థాయిలో పంపిణీ చేయకపోవడంతో జూన్ వరకు ఫైనాన్స్ కంపెనీ వద్ద బాధితుల ఆందోళనలు కొనసాగాయి. ‘గోల్డ్’మాల్ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లో ‘బంగారం’ మోసాలు వరుస కేసుల్లో బ్యాంకర్ల అరెస్ట్ జంగారెడ్డిగూడెం డివిజన్లో నాలుగు సంఘటనలు వెలుగులోకి సరికొత్త మోసాలు నకిలీ ఆస్తి పత్రాలతో ఈ–వేలం జంగారెడ్డిగూడెంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) బ్రాంచ్లో గోల్డ్లోన్ మోసంపై గత జూన్ 16న కేసు నమోదైంది. 176 ఖాతాల్లోని 6.449 కిలోల తాకట్టు బంగారాన్ని మాయం చేసి వాటి స్థానంలో నకిలీ ఆభరణాలను ఉంచారు. ఈ కేసులో పోలీసులు బ్యాంక్ అప్రయిజర్ చలపాక రాజు, బ్యాంకు మేనేజర్ కుమారపు భాస్కరరావు, జాయింట్ మేనేజర్ తన్నేరు అజయ్బాబు, క్రెడిట్ ఆఫీసర్ జంగల సాయిరాజును అరెస్ట్ చేసి 4.120 కిలోల ఆభరణాలు, రూ.10 లక్షల నగదు మొత్తంగా రూ.5.81 కోట్ల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. తాకట్టు బంగారాన్ని మార్చి నకిలీవి చేర్చే విషయంలో అప్రయిజర్ మొదలు బ్యాంక్ మేనేజర్ వరకు కుమ్మక్కయ్యారని పోలీసుల విచారణలో తేలింది. -
బీసీల ఆత్మబంధువు జగనే..
● వెన్నుపోటు పార్టీ వంచనపై బీసీ గర్జన రౌండ్ టేబుల్ సమావేశం ● వైఎస్సార్సీపీ నాయకుల వెల్లడి సాక్షి, రాజమహేంద్రవరం/రాజమహేంద్రవరం రూ రల్ : రాష్ట్రంలోని బలహీనవర్గాలకు అసలైన ఆత్మ బంధువు వైఎస్ జగన్మోహన్రెడ్డేనని వైఎస్సార్సీపీ బీసీ నాయకులు ముక్తకంఠంతో పేర్కొన్నారు. 139 బీసీ కులాల కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత ఆయకే దక్కుతుందని కొనియాడారు. వెన్నుపోటు పార్టీ వంచనపై బీసీ గర్జన పేరిట రౌండ్ టేబుల్ సమావేశాన్ని వైఎస్సార్సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రాచపల్లి రమేష్యాదవ్ అధ్యక్షతన, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో బొమ్మూరులోని పార్టీ కా ర్యాలయంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీలకు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎండగడుతూ.. వైఎస్ జగన్ ప్రభుత్వంలో జరిగిన మేలును నాయకులంతా గుర్తు చేసుకున్నారు. -
ఇష్టారాజ్యం.. వార్డు పునర్విభ‘జనం’
నూజివీడు : మున్సిపల్ పరిపాలన అనుభవం లేని అధికారులు.. విధి నిర్వహణలో అలసత్వం.. రాజకీయ పార్టీల నాయకులతో సమన్వయ లోపం వె రసి నూజివీడు మున్సిపాలిటీలో వార్డుల పునర్విభజన ప్రక్రియ అస్తవ్యస్తంగా, గందరగోళంగా మా రింది. మున్సిపాలిటీలో వార్డులను 32 నుంచి 36కు పెంచారు. అయితే మున్సిపల్ అధికారులు నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వార్డులను వి భజించారని రాజకీయ పక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రతి వార్డులో 1,100 ఓట్లకు పది శాతం ఓట్లు పెరగడం లేదా తగ్గడం ఉండాలని నిబంధనలు ఉన్నా.. వాటిని పరిగణనలోకి తీసుకోలేదు. నిర్దిష్ట హద్దులేమీ లేకుండా వార్డులను విభజించడంతో పోటీలో నిలిచే అభ్యర్థులు ఓట్లరను వెతుక్కోవడం కష్టతరం కానుంది. దీంతో శాసీ్త్రయంగా, నిబంధనల ప్రకా రం పునర్విభజన చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఒక వార్డులో 847 ఓట్లు.. మరో వార్డులో 1,513 ఓట్లు మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి ఓటర్ల సంఖ్యే నిదర్శనంగా ఉంది. 29వ వార్డును 847 ఓట్లుతో వి భజించగా.. 34వ వార్డును 1,513 ఓట్లతో విభజించారు. ఒక వార్డులో అత్యంత కనిష్ట సంఖ్యలో, మ రో వార్డులో దానికి దాదాపు రెట్టింపు సంఖ్యలో ఓ టర్లను ఎలా విభజిస్తారనే ప్రశ్నలు ఎదురవుతున్నా యి. నిబంధన ప్రకారం అన్ని వార్డుల్లో 1,000 నుంచి 1,200 ఓట్ల వరకు మాత్రమే ఓటర్లు ఉండాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా ఇక్కడ జరిగింది. 17వ వార్డులో 866 ఓట్లు, 4వ వార్డులో 915 ఓట్లు, 14వ వార్డులో 942 ఓట్లు, 13వ వార్డులో 970 ఓట్లు ఉండగా, 15వ వార్డులో 1,499 ఓట్లు, 35వ వా ర్డులో 1,456 ఓట్లు, 3వ వార్డులో 1,442 ఓట్లు, 22వ వార్డులో 1,440 ఓట్లు, 26వ వార్డులో 1,383 ఓట్లు ఉండటం గమనర్హం. సరిహద్దులపై స్పష్టత లేదు జనాభా సంఖ్య, ఓటర్ల జాబితాల మధ్య సమ న్వయం చేసుకుంటూ వార్డులను విభజన ప్రక్రియ ను చేయాలి. అయితే అలా కాకుండా ఆఫీసులో కూ ర్చుని రికార్డుల్లోని ఇంటి నంబర్ల ఆధారంగా విభ జన చేయడం వల్ల వార్డు పరిధి గాని, వార్డు సరిహద్దులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయనే అంశాలపై ప్రజలకు గాని, రాజకీయ నాయకులకు గాని స్పష్టత లేకుండా పోయింది. ఏ డోర్ నంబర్ ఏ వార్డులోకి వస్తుంది, ఏ వీధి ఏ వార్డులో ఉంటుందనే వాటిపై కూడా స్పష్టత లేదు. పాతవార్డులు కొన్నింటిని అసలు ఏ మాత్రం కదిలించకుండా అలాగే ఉంచడం అనుమానాలకు తావిస్తోంది. రాజకీయ నాయకుల ప్రమేయంతోనే పునర్విభజన చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల అనుభవలేమి తికమకగా నూజివీడులో వార్డుల విభజన కొన్నిచోట్ల 850 ఓట్లు, మరికొన్ని చోట్ల 1,500కు పైగా.. సరిహద్దులపైనా స్పష్టత కరువు -
గణపతి పూజకు ధరల విఘ్నం
ద్వారకాతిరుమల: విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడి పూజను అట్టహాసంగా చేసుకోవాలని ప్రతి కుటుంబం కోరుకుంటుంది. అయితే ఈసారి పండుగకు ధరలే పెద్ద విఘ్నంగా మారాయి. పూజా సామగ్రి కొనుగోలు చేయాలంటేనే సామాన్యులు వెనుకడుగు వేసే పరిస్థితి నెలకొంది. పండ్లు, పూలు, కొబ్బరికాయలు, పత్రి నుంచి ప్రసాదానికి ఉపయోగించే డ్రైఫ్రూట్స్ వరకు ధరలు భారీగా పెరగడంతో పేద, మధ్యతరగతి వర్గాలపై అదనపు భారం పడింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఆదివారం మార్కెట్లలో వినాయక చవితి సందడి కనిపించింది. కానీ అమ్మకాలు మాత్రం ఆశించిన స్థాయిలో సాగలేదు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమలలో వ్యాపారాలు అంతంత మాత్రంగానే జరిగాయి. భగ్గుమన్న ధరలు.. అస్తం (డజన్నర) అరటిపండ్ల ధర రూ. 100కు చేరింది. పావు కిలో చామంతి పూలకు ఏకంగా రూ. 150 వరకు చెల్లించాల్సి వచ్చింది. అలాగే కొబ్బరికాయ ఒక్కటి రూ. 30 నుంచి రూ. 40 పలికింది. కిలో ఆపిల్, దానిమ్మ ధరలు రూ. 150 చొప్పున ఉండగా.. ద్రాక్ష, కిస్మిస్ పండ్లు కిలో రూ. 200, వినాయకుడి పూజలో ఉపయోగించే మొక్కజొన్న పొత్తు ఒక్కటే రూ. 20 లకు చేరింది. అరటి పిలక కూడా రూ. 25 నుంచి రూ. 30 వరకు పలికింది. సామాన్యుడు పూజ చేసుకోవాలంటే.. 2 వేల నుంచి రూ. 2,500 వరకు ఖర్చయ్యే పరిస్థితి నెలకొంది. అదే పురోహితుడి సహాయంతో శాస్త్రోక్తంగా పూజ చేయించుకోవాలంటే ఖర్చు రూ. 3 వేలకు పైమాటే. ఈసారి బడ్జెట్లోనే పూజ.. ధరలు పెరగడంతో భక్తులు గతంలో మాదిరిగా పెద్ద మొత్తంలో పూజా సామగ్రిని కొనుగోలు చేయలేదు. సంప్రదాయం కోసం అవసరమైన మేరకే పండ్లు, పూలు, పత్రి, కొబ్బరికాయలు తీసుకున్నారు. పండ్లు, పూలు, పత్రి.. అన్నింటా పెరిగిన ధరలు -
శ్రీవారి సేవలో హైకోర్టు జడ్జి
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.జయసూర్య ఆదివారం సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు దేవస్థానం అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని న్యాయమూర్తి ప్ర త్యేకపూజలు నిర్వహించారు. అనంతరం ఆల య ముఖ మండపంలో ఆయనకు అర్చకులు శ్రీవారి శేషవస్త్రాన్ని కప్పి, వేద ఆశీర్వచనాన్ని పలికారు. ఏఈఓ పి.నటరాజారావు స్వామివా రి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లా ప్రజలంతా వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ సహకరించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి సూచించారు. ప్రజలకు చవితి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా మరింత అభివృద్ధి సాధించాలని గణపతిని ప్రార్థిస్తున్నా మన్నారు. పోలవరం రూరల్ : ఎగువన నదీ పరీవాహక ప్రాంతాల్లోని భారీ వర్షాలతో పోలవరం వద్ద గోదావరి నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు వద్ద నీటిమట్టం 30 మీటర్లకు చేరుకుంది. ప్రాజెక్ట్ స్పిల్వేకి చెందిన 48 గేట్ల ద్వారా 2,17,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ఇసుక మేటలు ముంపునకు గురవుతున్నాయి. దిగువన వరద ప్రవాహం తీవ్రమవుతుండటంతో తీర ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కామవరపుకోట : జాతీయస్థాయి అథ్లెటిక్స్ పో టీలకు ఈస్ట్ యడవల్లి హైస్కూల్ వ్యాయామ ఉపాధ్యాయుడు రవి ఎంపికయ్యారని హెచ్ఎం కోటేశ్వరి తెలిపారు. తణుకులో జరిగిన మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో 40 ప్లస్ విభాగంలో రవి హైజంప్లో స్వర్ణ, హేమర్ త్రోలో రజత పతకాలు సాధించారన్నారు. ఆయన వచ్చేనెల 9 నుంచి 11 వరకు కోయంబత్తూరులో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. -
హోటల్ వర్కర్ల మధ్య వివాదమే హత్యకు కారణం
● యువకుడి హత్య కేసులో నిందితుల అరెస్ట్ ● హత్యకు పాల్పడిన నిందితుడితో పాటు హోటల్ యజమాని అరెస్ట్ భీమడోలు: పాత గొడవలతో ఓ యువకుడిని హత్య చేసిన కేసులో ఇద్దరు నిందితులను ఆదివారం ద్వారకాతిరుమల పోలీసులు అరెస్ట్ చేశారు. ద్వారకాతిరుమల మండలంలోని లక్ష్మీనగర్ పరిధిలో జరిగిన ఈ హత్య కేసుకు సంబంధించి ప్రధాన నిందితులైన ఏలూరి శివశంకర్ (వర్కర్), నిడమర్రు మండలం తోకలపల్లి గ్రామానికి చెందిన హోటల్ యాజమాని భలే విఘ్నేశ్వరరావులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు. భీమడోలు పోలీస్స్టేషన్లో సీఐ వి.కృష్ణతో కలిసి ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్కుమార్ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. జాతీయ రహదారి పక్కన గల లక్ష్మీనగర్ వద్ద భలే విఘ్నేశ్వరరావుకు చెందిన ఛాయ్ బిస్కెట్ ఫుడ్ కోర్టులో అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం చుక్కలూరుకు చెందిన కోనేటి గంగాధరరావు, ద్వారకాతిరుమల మండలం గుణ్ణంపల్లి గ్రామానికి చెందిన ఏలూరి శివశంకర్ కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరిద్దరికీ హోటల్లో పని విషయంలో తరచూ గొడవలు జరిగి, పలుమార్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో కక్షలు పెంచుకున్నారు. ఈ తరుణంలో నిందితుడు ఏలూరి శివశంకర్ ఈ విషయాన్ని హోటల్ యాజమాని భలే విఘ్నేశ్వరరావుకు చెప్పాడు. గంగాధర్ను ఏదో రకంగా అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో శివశంకర్ను హోటల్ యాజమాని రెచ్చగొట్టాడు. ఈ నేపథ్యంలో ఈనెల 8వ తేదీ రాత్రి యాజమాని ప్రోద్బలంతో శివశంకర్ తన వద్ద ఉన్న చాకుతో గంగాధర్ను పొడిచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన గంగాధర్కు సరైన వైద్యం అందించకుండా హోటల్ యాజమాని నిర్లక్ష్యం వహించడంతో, బాధితుడు ఈనెల 10వ తేదీన హోటల్ రెస్ట్ రూమ్లోనే మృతి చెందాడు. గుణ్ణంపల్లి వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ద్వారకాతిరుమల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఏలూరి శివశంకర్తో పాటు అతనికి సహకరించిన భలే విఘ్నేశ్వరరావును భీమడోలు సీఐ వి.కృష్ణ పట్టుకుని అరెస్ట్ చేశారని డీఎస్పీ పేర్కొన్నారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన దర్యాప్తు అధికారి, సీఐ వి.కృష్ణ, ఎస్సై టి. సుధీర్ పోలీస్ సిబ్బంది జి. ధర్మరాజు, వీజే ప్రకాష్బాబులను డీఎస్పీ అభినందించారు. -
విద్యుత్ సరఫరాలో కూటమి విఫలం
కామవరపుకోట: విద్యుత్ సరఫరాలో, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి నాణ్యమైన విద్యుత్ అందించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్సీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంభం విజయరాజు ప్రభుత్వాన్ని విమర్శించారు. ఆదివారం వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ రాయంకుల సత్యనారాయణ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో కలిసి విద్యుత్ కోతలకు నిరసనగా కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టారు. స్థానిక కొత్తూరు బస్టాండ్ ఎదురుగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద నుంచి చెక్పోస్ట్ వరకు పాదయాత్రగా ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కంభం విజయరాజు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంలో విఫలమైందన్నారు. గత కొన్ని రోజులుగా గృహ విద్యుత్ సరఫరా కూడా సరిగా లేకపోవడం వల్ల వృద్ధులు, విద్యార్థులు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల కోట్ల అప్పులు తెచ్చి అమరావతి పేరుతో దోచిపెట్టడమే పరమావధిగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం, రాష్ట్రంలోని రైతులు, సామాన్య ప్రజల పట్ల బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఏవేవో సాకులు చెబుతూ అప్రకటిత విద్యుత్ కోతలు విధిస్తే.. రైతులు, ప్రజల పక్షాన ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ హయాంలో ఏనాడు ఇటువంటి దుర్భర పరిస్థితులు లేవని, విద్యుత్ రంగంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక సంస్కరణలు తీసుకువచ్చి రాష్ట్ర రైతాంగానికి ఐదేళ్లపాటు నాణ్యమైన విద్యుత్ అందించారన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడంపై ఉన్న శ్రద్ధను పరిపాలనపై చూపాలని కూటమి ప్రభుత్వానికి సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు సాయిన కనకరాజు, గుర్రాల రవి, రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి భీమిరెడ్డి వెంకన్నబాబు, మనెల్లి మద్ది రామయ్య, నార్ని శివన్నారాయణ, దేవరపల్లి రామ్మోహన్రావు, పెద్ది రాజు, నెక్కలపూడి బాబీ, తమ్మిశెట్టి గిరిజ సుబ్రహ్మణ్యం, మేడంకి పద్మ, సిరిశెట్టి సిద్దిరాజు, మేడంకి విజయరావు, ఎస్కే కరిముల్లా, బొల్లు వెంకట సత్యనారాయణ, నానది సాగర్ కిరణ్, కనుమూరు అంజిరెడ్డి, ప్రసాద్రెడ్డి, రఘపతిరెడ్డి, మెరుగు బాబురావు, జోడలా వెంకట్, అడమెల్లి అచ్చియ, యానాద్రి పీటర్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ చింతలపూడి కన్వీనర్ కంభం విజయరాజు ధ్వజం -
విద్యుత్ ఓసీ ఉద్యోగుల సంఘ కార్యదర్శిగా తురగా
ఏలూరు (ఆర్ఆర్పేట): విద్యుత్ ఓసీ ఉద్యోగుల అసోసియేషన్ ఈపీడీసీఎల్ డిస్కం కార్యదర్శిగా నగరానికి చెందిన తురగా రామకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించగా.. అధ్యక్ష, కార్యదర్శులుగా ఎ.అప్పలరాజు, తురగా రామకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తురగా రామకృష్ణ మాట్లాడుతూ 1999 ఫిబ్రవరి 1 నుంచి 2004 లోపు సంస్థలో చేరిన ఉద్యోగులకు ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్కు (పాత పెన్షన్ విధానానికి) మార్చడానికి కృషి చేస్తానని, అలాగే డిస్కం పరిధిలో ఉన్న సమస్యలపై సీఎండీతో చర్చించి న్యాయం చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన్ను విద్యుత్ ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. రాష్ట్ర నాయకులు, వివిధ కంపెనీల నాయకులు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, డివిజన్ స్థాయి నాయకులు, ముఖ్య కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
హిందీ ఉపాధ్యాయుల సంఘం గౌరవ అధ్యక్షుడిగా రాజు
ముదినేపల్లి రూరల్: హిందీ ఉపాధ్యాయుల రాష్ట్ర సంఘం గౌరవ అధ్యక్షుడిగా స్థానిక జెడ్పీ హైస్కూల్ హిందీ ఉపాధ్యాయుడు ఇనుపకుతిక సత్యనారాయణరాజు ఎంపికయ్యారు. సంఘం రాష్ట్ర కార్యవర్గ ఎంపికలు గుంటూరులో ఆదివారం జరిగినట్లు సత్యనారాయణరాజు తెలిపారు. ఇప్పటివరకు ఆయన సంఘం ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. సత్యనారాయణరాజు ఎంపికపై స్థానిక ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేస్తూ.. ఆయన సంఘ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణరాజు మాట్లాడుతూ.. సంఘానికి రాష్ట్రవ్యాప్తంగా మరింత గుర్తింపు దక్కేలా సాయశక్తుల కృషి చేస్తామని పేర్కొన్నారు. -
రిలయన్స్కు భూములు ఇవ్వమని నిరసన
చింతలపూడి: అండర్గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ (యూసీజీ) ప్రాజెక్టు పేరుతో రిలయన్స్ సంస్థ కోసం రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవాలని చూడటం దుర్మార్గమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. శ్రీనివాస్ మండిపడ్డారు. వెంకటాపురం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రైతులు, స్థానిక ప్రజలు భారీ నిరసన చేపట్టారు. అనంతరం ఒక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ‘రిలయన్స్కు మా భూములు ఇవ్వం – మా భూమి, మా హక్కు‘ అంటూ రైతులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. సదస్సులో కె. శ్రీనివాస్ మాట్లాడుతూ, రిలయన్స్ బొగ్గు ఆధారిత గ్యాస్ ఉత్పత్తి కోసం ఈ ప్రాంతంలో దాదాపు 10 వేల ఎకరాలు సేకరిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం దారుణమన్నారు. రైతులతో చర్చించకుండా, వారి ఆమోదం లేకుండా భూసేకరణ ఎలా చేస్తారని నిలదీశారు. ఈ ప్రాజెక్టు వల్ల ఉపాధి విధ్వంసం జరుగుతుందని మాజీ జెడ్పీటీసీ సీహెచ్ ఖాదర్బాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయిల్ పామ్, కొబ్బరి, కోకో, మొక్కజొన్న, వరి తదితర ఉద్యాన, ఆహార పంటలు నాశనమై తీవ్ర ఉపాధి నష్టం వాటిల్లుతుందని తెలిపారు. పర్యావరణ విపత్తులు, భూగర్భ జలాల కాలుష్యం వంటి తీవ్ర నష్టాలను ప్రభుత్వం గోప్యంగా ఉంచుతోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు పి.పాండురంగారావు, సీఐటీయూ జిల్లా నాయకులు ఆర్వీఎస్ నారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు జి. వెంకట్రావు, రైతులు మధుబాబు, వై.సాయి, ఫణీంద్ర, ఊసా సుబ్బారావు, మాదాసు శ్రీనివాసరావు, బి. కోటేశ్వరరావు, హరికృష్ణ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం (చింతలపూడి): స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో ఓ ద్విచక్ర వాహనంలోకి పాము దూరి కలకలం రేపింది. గమనించిన వాహనదారుడు భయంతో బండిని పక్కన నిలిపి, పామును బయటకు పంపేందుకు ప్రయత్నించాడు. అయితే, పాము బండి లోపలి భాగానికి మరింత లోతుగా వెళ్లిపోవడంతో ఎంతకీ బయటకు రాలేదు. దీంతో వాహనదారుడు స్నేక్ సేవియర్ సొసైటీ ప్రతినిధి క్రాంతికి సమాచారం అందించాడు. వెంటనే అక్కడికి చేరుకున్న క్రాంతి చాకచక్యంగా ద్విచక్ర వాహనంలో ఉన్న పామును సురక్షితంగా బయటకు తీశాడు. అనంతరం దానిని నివాస ప్రాంతాలకు దూరంగా ఉన్న అటవీ ప్రాంతంలో వదిలివేయడంతో వాహనదారుడు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. -
కలువ పూలు కోసేందుకు దిగి..
భీమడోలు: కలువ పూలు కోసేందుకు చెరువులోకి దిగిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందిన విషాద ఘటన ఆదివారం సాయంత్రం భీమడోలు మండలంలోని అన్నేవారిగూడెంలో చోటు చేసుకుంది. దుద్దేపూడి పంచాయతీ శివారు అన్నేవారిగూడెంకు చెందిన పోతుబోయిన రాఘవులు (37) ఈ దుర్ఘటనలో మృతి చెందాడు. పండగ పూట ఈ ఘటన జరగడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళ్తే... గ్రామానికి చెందిన పి. రాఘవులు జీవనోపాధి నిమిత్తం వినాయక ఉత్సవాల సందర్భంగా కలువ పూసి కోసి మార్కెట్లో అమ్ముకుందామని భావించి గ్రామంలోని ఓ చెరువులోకి దిగాడు. అయితే, చెరువు లోతు అంచనా వేయలేకపోవడంతో నీటిలో చిక్కుకుని ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, చెరువులో గాలించి బయటకు తీశారు. అప్పటికే ఆయన మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భీమడోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జై వనరూపిణీ.. జై విజయకారిణీ
బుట్టాయగూడెం: మండలంలోని కామవరం సమీపంలో అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ప్రత్యేక బస్సుల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. అనంతరం ధూప, దీప, నైవేద్యాలతో అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భారీగా తరలివచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీవారితో పాటు పోలీసులు కూడా బందోబస్తు నిర్వహించారు. పెదవేగి: మండలంలోని రాట్నాలకుంట రాట్నాలమ్మ తల్లిని ఆదివారం ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి అమ్మవారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారికి వివిధ సేవల రూపేణా రూ.67,246 ఆదాయం లభించిందని ఆలయ కమిటీ చైర్మన్ మన్నే శ్రీనివాసరావు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సతీష్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ విడుదల సత్యనారాయణ తెలిపారు. ద్వారకాతిరుమల: చిన్నతిరుపతి ఆలయంలో శ్రీవారి మూలవిరాట్ను ఓ మహిళ ఆదివారం తన సెల్ఫోన్తో ఫొటోలు తీసిన ఘటన వివాదాస్పదమైంది. విశాఖకి చెందిన సదరు మహిళ కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం శ్రీవారి దర్శనానికి వచ్చింది. ఆలయంలోకి సెల్ఫోన్లు తీసుకెళ్లేందుకు అనుమతి లేకపోయినా.. సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి తులసిమాలలతో కలిపి, కవర్లో పెట్టుకుని ఉచిత క్యూలైన్ ద్వారా లోపలికి వెళ్లింది. దర్శనం అనంతరం సెల్ఫోన్తో మూలవిరాట్ను ఫొటోలు తీసింది. దీనిని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని ఆలయ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు ఆమె సెల్ఫోన్లోని ఫొటోలను డిలీట్ చేయించారు. ఆమె వివరాలు నమోదు చేసుకుని, మందలించి విడిచిపెట్టారు. సదరు మహిళ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ అని తెలుస్తోంది. దేవరపల్లి: తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలంలోని యర్నగూడెం వద్ద హెచ్సీసీ ఫ్లై ఓవర్ సర్వీసు దిగిన వెంటనే మారుతీ కారు అదుపుతప్పి మినప చేనులోకి దూసుకు వెళ్లి బోల్తాపడింది. ఈ ఘటనలో కారులో వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఏలూరుకు చెందిన వారు ముగ్గురూ ఆదివారం పోలవరం జిల్లాలోని మారేడుమిల్లి విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతంలో ఇరువైపులా చెట్లు, విద్యుత్ స్తంభాలు ఉన్నప్పటికీ వాటి మధ్య నుంచి కారు దూసుకువెళ్లి బోల్తా పడింది. కై కలూరు: అమ్మలగన్న అమ్మ.. కొల్లేటికోట పెద్దింట్లమ్మా.. పాహిమాం అంటూ భక్తులు ఆర్తితో వేడుకున్నారు. పెద్దింట్లమ్మ దేవస్ధానం వద్ద ఆదివారం భక్తులు కిటకిటలాడారు. సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మకు వేడి నైవేద్యాలు సమర్పించారు. ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పేటేటి పరమేశ్వరశర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఆదివారం ఒక్క రోజు వివిధ సేవల రూపేణా అమ్మవారికి రూ.22,810 ఆదాయం వచ్చిందని తెలిపారు. పెంటపాడు: పరిమెళ్ల గ్రామంలో శనివారం అర్ధరాత్రి జరిగిన దొంగతనంలో వెండి పూజా సామాన్లు అపహరణకు గురయ్యాయి. గ్రామానికి చెందిన కొలచల అగ్నిహోత్రుడు హైదరాబాద్లో నివసిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ఆయన ఇంటి తలుపులు పగులకొట్టి, లోపలకు ప్రవేశించారు. రెండు వెండి చెంబులు, రెండు పళ్లాలు, పూజకు సంబంధించిన ఒక చిన్న పళ్లెం అపహరించినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం ఉదయం పనిమనిషి ఇంటి ఆవరణను ఊడ్చేందుకు వచ్చేసరికి తలుపులు తెరుచుకుని ఉండటాన్ని గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. -
ఎల్నినో లీల.. తప్పిన జలకళ
● నామమాత్రంగా జలపాతాల్లో నీటి ప్రవాహం ● నిరాశతో వెనుదిరుగుతున్న పర్యాటకులు ● వెలవెలబోతున్న పశ్చిమ ఏజెన్సీ అందాలు బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీ ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం. ప్రతీఏటా వర్షాకాలం మొదలైతే చాలు, బుట్టాయగూడెం మండలంలోని మారుమూల గ్రామమైన ఉప్పరిల్ల, ముంజులూరు గ్రామ అటవీ ప్రాంతాల్లో ఉన్న జలపాతాలు జలకళతో ఉట్టిపడుతూ పర్యాటకులను ఆహ్వానిస్తుంటాయి. వీటితోపాటు పోలవరం మండలం కుంకాల సమీపంలోని జలపాతం, పాపికొండల అభయారణ్యంలో ఉన్న జలతారు వాగు జలపాతం ప్రకృతి ప్రేమికులకు ఎంతో కనువిందు చేస్తుంటాయి. పర్యాటకులకు నిరాశే ఈ జలపాతాలను చూసేందుకు విజయవాడ, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, భీమవరంతోపాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది పర్యాటకులు మైళ్ల దూర ప్రయాణం చేసి వచ్చి, జలపాతాలను తిలకించి మంత్రముగ్ధులవుతుంటారు. దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఉన్న ఈ జలపాతాలను చేరుకోవడం కష్టతరమైనప్పటికీ, వాటిని చూసిన అనంతరం ఆ ప్రయాణ శ్రమను పర్యాటకులు మరచిపోయి ఎంతో ఆనందాన్ని పొందుతుంటారు. అయితే, ఈ ఏడాది ఆ పరిస్థితులు కనిపించడంలేదు. జలపాతాలను తిలకించేందుకు వచ్చిన పర్యాటకులకు నిరాశే మిగులుతోంది. ఎల్నినో ప్రభావంతో ప్రకృతి అందాలు వెలవెల ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు సకాలంలో కురవలేదు. అప్పుడప్పుడు కురిసిన కొద్దిపాటి వర్షాల కారణంగా జలపాతాల్లో నీటి ప్రవాహం నామమాత్రంగానే సాగుతోంది. ఎత్తైన కొండల నుంచి దూకాల్సిన జలపాతాలు కేవలం చిన్నపాటి నీటిధారలుగా మారి వెలవెలబోతూ కనిపిస్తున్నాయి. దూర ప్రాంతాల నుంచి వందల కిలోమీటర్లు ప్రయాణించి వస్తున్న పర్యాటకులకు ఈ పరిస్థితి తీవ్ర నిరాశను మిగులుస్తోంది. జలపాతాల హోరులో సేద తీరాలని ఆశపడిన వారు, రాళ్ల మధ్య సన్నగా జారుతున్న నీటి ప్రవాహాన్ని చూసి నిరాశతో వెనుతిరగాల్సి వస్తోంది. గతంలో ఈ పరిస్థితి ఎన్నడూ లేదు ప్రతీఏటా వర్షాకాలం ప్రారంభంలో కురిసే వర్షాలకు జూన్ నెలాఖరు నుంచే జలపాతాలు కనువిందు చేస్తుంటాయి. కార్తీక మాసంలోనూ ఈ జలపాతాలను చూసేందుకు ఎంతోమంది ప్రకృతి ప్రేమికులు ఇక్కడికి వచ్చి ఆహ్లాదకరంగా గడుపుతుంటారు. అయితే, గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో ఈ ప్రాంతంలోని ప్రకృతి అందాలు కళావిహీనంగా మారా యి. ఈ ప్రాంతంలోని అనేక పిక్నిక్ స్పాట్లు కూడా ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల బోసిపోయి కనిపిస్తున్నాయి.ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా కురవలేదు. అప్పుడప్పుడు కురిసిన వర్షాలకు కొద్దిపాటి ధారలతోనే జలపాతాలు ప్రవహిస్తున్నాయి. పరిసర ప్రాంతాల నుంచి అనేక మంది పర్యాటకులు ఎంతో కష్టపడి ఇక్కడికి వస్తున్నా నిరాశతోనే వెనుతిరుగుతున్నారు. గతంలో ఈ పరిస్థితి ఎన్నడూలేదు. వర్షాలు కురిస్తేనే మళ్లీ జలపాతం అందాలను తిలకించవచ్చు. – మూలెం రమేష్, పులిరామన్నగూడెం, బుట్టాయగూడెం -
ఏజెన్సీలో గాలివాన బీభత్సం
బుట్టాయగూడెం: ఏజెన్సీ ప్రాంతంలో శనివారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. ఉదయం నుంచి మబ్బుగా ఉన్నా సాయంత్ర సమయానికి ఒక్కసారిగా బలమైన ఈదురుగాలులు వీచి గంట సేపు వర్షం కరిసింది. వీచిన గాలికి పలుచోట్ల చెట్టుకొమ్మలు విరిగిపడి రోడ్లకు అడ్డంగా పడ్డాయి. అలాగే విద్యుత్ వైర్లపై కూడా చెట్ల కొమ్మలు పడటంతో సుమారు గంటన్నర వరకూ విద్యుత్ అంతరా యం కలిగింది. విద్యుత్శాఖ సిబ్బంది చెట్ల కొ మ్మలను తొలగించి సాయంత్రం 6 గంటల సమయానికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. అలాగే మర్లగూడెం సమీపంలోని పాట్మెమ్మగుడి వద్ద చెట్ల కొమ్మలు రహదారికి అడ్డంగా పడడంతో వాహనాల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం కలిగింది. స్థానికులు, అధికారులు కొమ్మలను తొలగించడంతో సమస్య తీరింది. అలాగే శనివారం బుట్టాయగూడెం వారాంతపు సంత కావడంతో కురిసిన వర్షానికి వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముదినేపల్లి, మండవల్లిలో.. ముదినేపల్లి రూరల్/మండవల్లి: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో ముదినేపల్లి, మండవల్లి మండలాల్లో శనివారం భారీ వర్షం కురిసింది. దీంతో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎల్నినో ప్రభావంతో ఇప్పటివరకూ సరైన వానలు కురవకపోవడంతో నిరాశ చెందిన రైతులకు ఈ వర్షం ఊరట నిచ్చింది. ప్రస్తుతం పొలాలు ఈనిక దశలో ఉన్నాయని, వర్షం మేలు చేస్తుందని అంటు న్నారు. ముదినేపల్లి మండలంలోని పెయ్యేరు, శ్రీహరిపురం, సింగరాయపాలెం, అన్నవరం, కాకరవాడ కాలనీల్లోని రోడ్లపై నీరు నిలిచిపోయింది. కై కలూరులో.. కై కలూరు: కై కలూరులో వర్షం దంచికొట్టింది. దీంతో డ్రెయిన్లు పొంగిపొర్లయి. బస్టాండ్, వెలంపేట, టౌన్హాలు ప్రాంతాల్లోకి వర్షం నీరు చేరింది. చవితి పందిళ్ల ఏర్పాట్లకు అంతరాయం కలిగింది. -
చవితి వేడుక.. ఉపాధి వీచిక
ద్వారకాతిరుమల: ఉమాసుతుడు, ఏకదంతుడు, వి ఘ్నాలను తొలగించే వినాయకుడి ఆరాధనకు ఉ మ్మడి పశ్చిమగోదావరి జిల్లా సిద్ధమవుతోంది. భక్తిశ్రద్ధలతో గణనాథుడిని కొలిచేందుకు గ్రామగ్రామానా ఏర్పాట్లు జోరందుకున్నాయి. ఇప్పటికే వీధివీధినా మండపాలు వెలిశాయి. గణేషుడి ప్రతిమలను సోమవారం ప్రతిష్ఠించేందుకు ఉత్సవ కమిటీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. మండపాల అలంకరణలు, విద్యుత్ దీపాలు, పూజా సామగ్రి సిద్ధం చేసుకుంటున్నారు. మరికొన్ని చోట్ల నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు తుది మెరుగులు దిద్దుతున్నారు. వేలాది మందికి ఉపాధి గణేష్ నవరాత్రి ఉత్సవాలు వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. పురోహితులు, వినాయక విగ్రహాల తయారీ, విక్రయాలు, పూజా సామగ్రి, పూలు, పండ్లు, పత్రి విక్రయాల నుంచి మండపాల అలంకరణలు, విద్యుత్ దీపాల ఏర్పాటు, సౌండ్ సిస్టమ్స్, టెంట్ హౌస్లు, నిమజ్జనోత్సవ రవాణా వరకు పలు రంగాల వారికి పని లభిస్తుంది. చిన్నస్థాయి వ్యాపారుల నుంచి పెద్ద టెంట్ హౌస్ నిర్వాహకుల వరకూ చవితి సీజన్ ద్వారా ఆదాయం పొందుతున్నారు. నిర్విఘ్నంగా వేడుకలు ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏళ్ల తరబడి నిరంతరాయంగా చవితి వేడుకలు జరుగుతున్నా యి. ద్వారకాతిరుమలలోని చెరువు వీధిలో జై గణేష్ కమిటీ ఆధ్వర్యంలో 42 ఏళ్లుగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఏటా ఉత్సవాలను నిర్వహిస్తూ గణనాథుడి సేవలో తరించడం ఆనందంగా ఉంటుందని కమిటీ సభ్యులు చెబుతున్నారు. వేడుకలు విషాదం కారాదని తగు జాగ్రత్తలు, అనుమతులు తీసుకోవాలని కమిటీ నిర్వాహకులు సూచిస్తున్నారు. మండపాల వద్ద విద్యుత్ వైర్లు, అలంకరణ, స్విచ్ బోర్డులు, జనరేటర్లు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే నిమజ్జనం జరిగే చెరువులు, కాలువల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పోలీసు నిబంధనలు అందరూ పాటించాలని అంటున్నారు. పూజలందుకో వినాయక వాడవాడలా గణేష్ మండపాలు పూలు, విద్యుద్దీప అలంకరణలు వేలాది మందికి ఉపాధి మార్గం జిల్లాలో చవితి సందడి 42 ఏళ్లుగా గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తున్నాం. మొ దట పెద్దలు ప్రారంభించిన ఈ సంప్రదాయాన్ని ఇప్పుడు యువత ముందుకు తీసుకెళ్తోంది. గణపతి ఆశీస్సులతో అందరికీ మంచి జరగాలన్నదే మా ఆకాంక్ష. ఉత్సవాలు ఆనందంగా జరగాలి.. ఎవరికీ ఇబ్బంది కలగకుండా, ప్రమాదాలకు తావులేకుండా నిర్వహించడమే మా లక్ష్యం. – చిలుకూరి నాగ సుబ్రహ్మణ్యం, ఉత్సవ కమిటీ నిర్వాహకుడు, చెరువు వీధి, ద్వారకాతిరుమల -
విగ్రహంలో విత్తనం.. పర్యావరణ రక్షణం
కై కలూరు: భక్తి అంటే కేవలం ఆడంబరమే కాదు.. భావితరాలకు ప్రాణవాయువును అందించే బాధ్యత అని నిరూపిస్తున్నారు కై కలూరు ప్రకృతి గణేశా ఉత్సవ కమిటీ సభ్యులు. రైల్వేస్టేషన్ రోడ్డులోని టీటీడీ కల్యాణమండపం ఎదురుగా ఏకంగా 10 వేల మట్టి విగ్రహాలను ఒకే వేదికపై కొలువుతీరుస్తున్నారు. ఇప్పటికే 5 వేల విగ్రహాలను గంగానది మట్టితో చేయించి కోల్కతా నుంచి తీసుకురాగా, మరో 5 వేల విగ్రహాలను స్థానిక మట్టితో తయారు చేయిస్తున్నారు. 9 రోజులు ప్రత్యేక పూజలు చేసి, అన్నసమారాధన రోజు భక్తులందరికీ వీటిని ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ప్రతి విగ్రహంలోనూ సీడ్ బాల్స్ పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రతి మట్టి విగ్రహంలోనూ సీడ్ బాల్స్ (విత్తనాలు) ఉంచుతున్నారు. ఈ నెల 25న జరిగే భారీ అన్నసమారాధనకు వచ్చిన ప్రజలు ఈ విగ్రహాలను తమ ఇళ్ల వద్దే కుండీల్లో లేదా పెరట్లో నిమజ్జనం చేసుకోవచ్చు. మట్టి కరిగిపోగానే అందులోని విత్తనం మొలకెత్తి పచ్చని మొక్కగా మారుతుంది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల కలిగే ముప్పును నివారించడానికి యువకులు చేస్తున్న ఈ ప్రయోగాన్ని అందరూ అభినందిస్తున్నారు. యువత ఆలోచనకు రెక్కలు.. కై కలూరుకు చెందిన మర్రాపు జగదీష్ యూట్యూబర్గా దేశంలోని వివిధ ప్రాంతాలు తిరుగుతూ, వినాయక చవితిని పర్యావరణహితంగా జరుపుకోవడం గమనించారు. చెట్లను పెంచడానికి మట్టి విగ్రహాల ద్వారానే మొక్కలను అందించాలని భావించి, 28 మంది స్నేహితులతో కలిసి కమిటీ ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో శివలింగం, వినాయకుడు, కలశం, లడ్డూల రూపంలో విగ్రహాలను సిద్ధం చేశారు. వీటిలో కొన్నింటిని ఈ నెల 22న వేలంపాట వేయనున్నారు. కార్యక్రమాలు ఇలా.. ఈ నెల 14న వినాయక చవితి నుంచి 25వ తేదీ వరకు దంపతులతో లక్ష్మీగణపతి హోమం, పంచామృత అభిషేకాలు, విద్యుత్ దీపాలు ఆర్పి ప్రత్యేక గంగాహారతి నిర్వహించనున్నారు. అలాగే కూచిపూడి, జానపద నృత్యాలు, మ్యాజిక్ షో, కోలాట ప్రదర్శన, ప్రవచనాలు చేపట్టనున్నారు. పర్యావరణహిత మట్టి విగ్రహాల ఉచిత పంపిణీ అందరినీ ఆకట్టుకుంటోంది. కై కలూరులో 10,000 మట్టి వినాయకులు సిద్ధం 9 రోజుల పూజలు.. పదివేల పచ్చని మొలకలు ఉచిత విగ్రహాల పంపిణీగిన్నిస్బుక్ రికార్డులలో చేరదగిన అంశం భక్తితో పాటు పర్యావరణ బాధ్యతను గుర్తుచేయడానికి వినూత్న కార్యక్రమానికి స్వీకారం చుట్టాను. కోల్కత నుంచి ఇప్పటికే 5 వేల విగ్రహాలు వచ్చాయి. మరో 5 వేల విగ్రహాలను స్థానికులతో తయారు చేయిస్తున్నాను. భక్తులను ఆకర్షించడానికి కొన్ని విగ్రహాల్లో బహుమతులు పెట్టే ఆలోచన ఉంది. ఒకే ప్రాంగణంలో 10 వేల విగ్రహాలకు పూజలు గిన్నిస్బుక్ రికార్డు. వచ్చే ఏడాది దరఖాస్తు చేస్తాను. – మర్రాపు జగదీష్, ప్రముఖ యూ ట్యూబర్, కై కలూరు -
మద్యం దుకాణాల రెన్యువల్కు నోటిఫికేషన్
ఏలూరు టౌన్ : జిల్లాలోని 155 మద్యం షాపుల రెన్యువల్స్కు ప్ర భుత్వం నోటిఫికేషన్ జా రీ చేసిందని మద్య నిషే ధ అబ్కారీ జిల్లా అధి కారి ఎ.అవులయ్య ప్రక టనలో తెలిపారు. 141 దుకాణాలు ఓపెన్ కేటగిరీలో, 14 షాపులు గీత కార్మికులకు కేటాయించామని, వీటి యజమానులు ఈనెల 21న సాయంత్రం 5 గంటలలోపు రెన్యువల్ చేసుకోవాలన్నారు. రెన్యువల్స్కు 38 శాతం రిటైల్ ఎ కై ్సజ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రతి మద్యం షాపునకు పర్మిట్ రూమ్ను తప్పనిసరి చేశారనీ, రూ.7.50 లక్షలు, రూ.5 లక్షలుగా ఫీజులు నిర్ణయించారన్నారు. రెన్యువల్ ప్రాసెసింగ్ ఫీజు రూ.5 వేలు మద్యం లైసెన్సుదారుడు చెల్లించాలన్నారు. రెన్యువల్స్ ద్వారా రూ.153.23 కోట్లు ఆదాయం సమకూరుతుందని తెలిపారు. రెన్యువల్ చేసుకోకుంటే మరోసారి మరోసారి దరఖాస్తులు ఆహ్వానిస్తామన్నారు. పర్మిట్ రూములు, లైసెన్సు ఫీజుల్లో బకాయిలు ఉంటే అనర్హులుగా పరిగణిస్తామన్నారు. ఆగిరిపల్లి: ఆగిరిపల్లి శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆవరణలోని క ల్యాణ మండపంలో ఈనెల 20న జిల్లాస్థాయి యోగా పోటీలు నిర్వహించనున్నారు. ఆసక్తి గలవారు తమను సంప్రదించాలని నిర్వాహకులు యండురి నరసింహమూర్తి, బొద్దూరు సాంబశివరావు తెలిపారు. ఏలూరు (ఆర్ఆర్పేట): వినాయకచవితి సందర్భంగా సోమవారం జిల్లాలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ కె.వెట్రిసెల్వి శనివారం ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ ఫిర్యాదులకు సంబంధించిన స మాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్కు కాల్ చేసి సంప్రదించవచ్చన్నారు. అలాగే ఆన్లైన్లో మీకోసం.ఏపీ.ఇన్లో అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు. ప్రత్తిపాడు : దుండగులు చేపల చెరువు యజమాని గొంతు కోసి హత్య చేసి, బంగారు వస్తువులు, నగదు దోచుకుపోయిన ఘటన శనివారం తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలంలోని టి.రాయవరంలో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు గ్రామానికి చెందిన తటవర్తి మెహర్ ప్రసాద్కు చెందిన చెరువును ఏలూరు జిల్లా పైడిచింతపర్రు గ్రామానికి చెందిన మోరి నరసింహారావు (70) లీజుకు తీసుకుని నాలుగేళ్లుగా చేపలు పెంచుతున్నాడు. చెరువు వద్ద మకాంలో కొవ్వాడలంక గ్రామానికి చెందిన వితంతువైన తన కుమార్తె బలే నాగలక్ష్మితో కలిసి జీవిస్తున్నాడు. ఐదు రోజుల క్రితం పెన్షన్ నిమిత్తం తన కుమార్తె కొవ్వాడలంక వెళ్లింది. శుక్రవారం సాయంత్రం చేపల చెరువు మకానికి సమీపంలో ఉన్న ప్రత్తిపాడు మండలం ఏలూరు గ్రామానికి చెందిన స్నేహితులు గొర్ల రాంబాబు, చిరికే అప్పారావుతో కలిసి టీ తాగారు. ఆ రాత్రి వేళ ఇద్దరు లేదా ముగ్గురు అగంతకులు వచ్చారని, వారితో జరిగిన ఘర్షణలో పదునైన ఆయుధంతో నరసింహారావు మెడ కోసి, హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. నాగలక్ష్మి గదిలోని బీరువా పగలగొట్టి 10 గ్రాముల బంగారు వస్తువులు, రూ.2 లక్షల నగదు దోచుకుపోయారు. స్నేహితులు రాంబాబు, అప్పారావు ఉదయం వచ్చి పిలిచినా పలకకపోవడంతో లోపలికి వెళ్లి చూడగా అతడు విగతజీవుడై పడి ఉన్నాడు. వారి సమాచారం మేరకు ఎస్సై ఎస్.లక్ష్మీకాంతంతో కలిసి సీఐ బి.సూర్య అప్పారావు, డీఎస్పీ ఏబీజీ తిలక్ హత్యా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ అధారాలను సేకరిస్తోంది. మృతదేహాన్ని శవపరీక్షకై ప్రత్తిపాడు సీహెచ్సీకి తరలించారు. నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ‘పశ్చిమ’వాసులకు స్వల్పగాయాలు అమలాపురం రూరల్: కోనసీమ జిల్లా అమలాపురం మండలం భట్నవిల్లిలో జాతీయ రహదారిపై శనివారం రాత్రి కాకినాడ వైపు నుంచి పశ్చిమగోదావరి జిల్లా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. స్థానిక వనువులమ్మ గుడిసెంటర్ వద్ద టర్నింగ్ పాయింట్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు ముందు భాగం దెబ్బతింది. కాగా కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిని స్థానికుల సురక్షితంగా బయట తీశారు. వారికి స్వల్ప గాయాలు కాగా స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేయించారు. -
అందని ‘గౌరవం’
● జెడ్పీటీసీలకు ముగుస్తున్న పదవీ కాలం ● 36 నెలల గౌరవ వేతనం బకాయి ● జిల్లాలో రూ.1.03 కోట్ల మేర బిల్లుల పెండింగ్ దెందులూరు: పదవీకాలం ముగుస్తున్న చివరి రోజుల్లో కూడా తమకు దక్కాల్సిన గౌరవ వేతనం అందకపోవడంపై జిల్లాలోని పలువురు జెడ్పీటీసీ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలకు రూ.6 వేల చొప్పున 37 నెలలకు ఒక్కో సభ్యుడికి రూ.2.16 లక్షలు రావాల్సి ఉందని అంటున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని మొత్తం 48 మంది సభ్యులకు రూ.1.03 కోట్ల బకాయి వేతనాలు విడుదల కావాల్సి ఉందని చెబుతున్నారు. 30తో ముగియనున్న పదవీ కాలం జిల్లాలోని 48 మండలాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 48 మంది జెడ్పీటీసీల పదవీకాలం 2026 సెప్టెంబర్ 30తో ముగియనుంది. గౌరవ వేతన బిల్లుల మంజూరు కోసం జిల్లాపరిషత్ అధికారులు రెండు, మూడు సార్లు నివేదికలు పంపినా ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ గ్రామాల్లోని సమస్యలను జెడ్పీటీసీ సర్వసభ్య సమావేశాల్లో మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్న తమ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదని మండిపడుతున్నారు. జిల్లాలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం ప్రజాప్రతినిధుల గౌరవవేతనం బిల్లులను ఎందుకు పెండింగ్లో పెడుతోందో సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జెడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం త్వరలో ముగియనుంది. ఈలోపు తమకు రావాల్సిన మొత్తం బకాయి వేతనాలు చెల్లించాలి. ప్రజాప్రతినిధులు అంతా వేతనాలు అందుతాయో.. లేదో అనే మీమాంసలో ఉన్నారు. – రమేష్, కామవరపుకోట జెడ్పీటీసీ జిల్లాలోని జెడ్పీటీసీ సభ్యులందరికీ పెండింగ్ ఉన్న గౌరవ వేతన బకాయిలు పూర్తిగా చెల్లించాలి. గౌరవంగా పదవీ విరమణలోపు బిల్లులు చెల్లింపు ప్రక్రియ జరిగేలా అన్నిస్థాయిల ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలి. – మండల సరస్వతి, ఏలూరు జెడ్పీటీసీ -
శ్రీవారి దివ్య క్షేత్రం.. భక్తులతో కోలాహలం
ద్వారకాతిరుమల: భక్తుల గోవింద నామస్మరణలు.. కోలాట ప్రదర్శనలతో చినవెంకన్న దివ్యక్షేత్రం శనివారం మార్మోగింది. శ్రీవారికి ప్రీతికరమైన రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు క్షేత్రానికి తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. గోవింద నామస్మరణలు చేస్తూ భక్తులు స్వామివారిని దర్శించి పులకించిపోయారు. సాయంత్రం వరకు ఆలయంలోని అన్ని విభాగాల్లో భక్తుల రద్దీ కొనసాగింది. మరోవైపు అనివేటి మండపాల్లో వివిధ భజన మండళ్ల సభ్యులు నిర్వహించిన కోలాట ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. లయబద్ధంగా సాగిన కోలాట నృత్యాలను భక్తులు ఆసక్తిగా తిలకించారు. ముఖ్యంగా చిన్నారుల కోలాట ప్రదర్శనలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
దీర్ఘకాలిక సమస్యలపై కార్యాచరణ ప్రణాళిక
ఏలూరు టౌన్: వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. రమేష్కుమార్ తెలిపారు. ఏలూరులోని ఏపీజీఈఏ సంఘ కార్యాలయంలో ఉమ్మడి తూర్పు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకుల సమావేశం నిర్వహించారు. వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించే ఈ సన్నాహక సమావేశానికి ఏలూరు జిల్లా సహ అధ్యక్షుడు గోవిందరావు అధ్యక్షత వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజ్కుమార్ మాట్లాడుతూ... వైద్య ఆరోగ్యశాఖలో గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించామని తెలిపారు. ఉద్యోగులపై పెరుగుతున్న పని ఒత్తిడి, ఎఫ్ఆర్ఎస్ విధానం, వివిధ యాప్ల నిర్వహణతో అదనపు పనిభారం, సిబ్బంది కొరత, పరిపాలనా సమస్యలపై లోతుగా చర్చించి కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ నాయకత్వంలో త్వరలోనే వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులతో రాష్ట్రస్థాయిలో భారీ ప్రాంతీయ సమావేశాన్ని నిర్వహించాలని ఈ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించామన్నారు. వైద్య ఆరోగ్యశాఖకు శాపంగా మారిన జీవో నెం. 143ని తక్షణమే రద్దు చేయాలని, సచివాలయ ఏఎన్ఎంలను వైద్య ఆరోగ్యశాఖలో విలీనం చేయాలని సమావేశంలో నేతలు కోరారు. ఈ సమావేశంలో తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల ఏపీజీఈఏ జిల్లా నాయకులు, వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. -
7,224 కేసుల పరిష్కారం
ఏలూరు (ఆర్ఆర్పేట): ప్రీ లోక్ అదాలత్లో రాజీ చేయబడిన కేసులతో పాటు మిగిలిన కేసు లు కూడా రాజీ చేస్తామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి అన్నారు. శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో ఏర్పాటు చేసిన సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా 3వ జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. మొ త్తం 35 బెంచీలను ఏర్పాటు చేశామన్నారు. ఈ లోక్అదాలత్లో 7,224 కేసులను పరిష్కరించామని, వీటిలో 6,709 క్రిమినల్ కేసులు, 126 సి విల్ కేసులు, 127 వాహన ప్రమాద బీమా కేసు లు ఉన్నాయన్నారు. వాహన ప్రమాద బీమా కే సుల్లో రూ.10 కోట్లకు పైగా కక్షిదారులకు పరిహారం అందించామని, 222 ప్రీ లిటిగేషన్ కేసులను రాజీ చేశామన్నారు. టాటా ఇన్సూరెన్స్కు సంబంధించి రూ.38 లక్షల పరిహారాన్ని బాధితులకు అందించామన్నారు. 1వ అ దనపు జిల్లా జడ్జి యు.ఇందిరా ప్రియదర్శిని, 2వ అదనపు జిల్లా జడ్జి ఎం.మీనాదేవి, 8వ అదనపు జిల్లా జడ్జి ఐ.శ్రీనివాసమూర్తి, పోక్సో స్పెషల్ జడ్జి కె.శ్రీవాణి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి, ఏలూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోనే సీతారాం, లోక్ అ దాలత్ నామినేటెడ్ సభ్యులు కానాల రామకృష్ణ ఏపీపీ ఏవీ నారాయణ పోలీస్, రెవెన్యూ అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
శంభునిపేట అంగన్వాడీలో చోరీ
పాలకొల్లు సెంట్రల్: స్థానిక శంభునిపేట 11వ వార్డులోని అంగన్వాడీ కేంద్రంలో చోరీ జరిగినట్లు నిర్వాహకురాలు జి. కుమారి తెలిపారు. శుక్రవారం రాత్రి అంగన్వాడీ కేంద్రం తాళాలు పగులగొట్టిన దుండగులు.. గ్యాస్ సిలిండర్, ఆయిల్ ప్యాకెట్లతోపాటు మరికొన్ని వస్తువులను దొంగిలించినట్లు గుర్తించామని ఆమె పేర్కొన్నారు. గతంలో కూడా కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఇలాగే గ్యాస్ సిలిండర్లు చోరీకి గురైన సంఘటనలు ఉన్నాయని కుమారి తెలిపారు. ఉండి: ఉండిలో రోడ్ ఓవర్ బ్రిడ్జ్ (ఆర్వోబీ) నిర్మాణ పనుల్లో భాగంగా ఈ నెల 15వ తేదీ నుంచి 22వ తేదీ వరకు రైల్వే గేటును మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఆర్వోబీ నిర్మాణ పనుల్లో భాగంగా భారీ యంత్రాలతో పనులు చేపట్టాల్సి ఉన్నందున, ఆ సమయంలో వాహనాల రాకపోకలకు అవకాశం లేకపోవడంతోనే గేటు మూసివేస్తున్నట్లు వారు వెల్లడించారు. కాబట్టి వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించి సహకరించాలని అధికారులు కోరారు. కుక్కునూరు: ప్రత్యామ్నాయ ఎరువుల వినియోగంతో భూసారాన్ని పరిరక్షించడంతో పాటు పంటల దిగుబడి, నాణ్యతను పెంచుకోవచ్చని ఏలూరు ఐఎఫ్ఎఫ్సీఓ జిల్లా అధికారి దిలీప్కుమార్ తెలిపారు. కుక్కునూరు మండల కేంద్రంలోని రైతు సేవా కేంద్రం ప్రొప్రైటర్ వేల్పుల వెంకన్నబాబు ఆధ్వర్యంలో శనివారం రైతుల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు ప్రత్యామ్నాయ ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించారు. రైతులు కేవలం రసాయనిక ఎరువులపైనే ఆధారపడకుండా.. నానో ఎరువులు, జీవ ఎరువులు, సాగరిక, బోరాన్, నేచురల్ పొటాష్ వంటి ప్రత్యామ్నాయ ఎరువులను వాడాలని సూచించారు. వీటి వినియోగ పద్ధతులు, వాటి ద్వారా పంటలకు కలిగే మేలును వివరించారు. భూసార పరిరక్షణతోనే స్థిరమైన వ్యవసాయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక రైతులు పాల్గొన్నారు. భీమవరం: వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేసి ఉత్సవాలు నిర్వహించేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని భీమవరం ఆర్డీవో కె. ప్రవీణ్కుమార్రెడ్డి అన్నారు. శనివారం భీమవరం త్యాగరాజ భవనంలో ఉత్సవ నిర్వాహకుల కోసం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఉత్సవాలను ఆహ్లాదకర వాతావరణంలో, భక్తి పారవశ్యంతో నిర్వహించాలని, స్థానిక ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నరసాపురం డీఎస్పీ ఎం. సుధాకర్ మాట్లాడుతూ.. మండపాల వద్ద, నిమజ్జన కార్యక్రమాల్లో డీజేలను వినియోగించవద్దని స్పష్టం చేశారు. బాణసంచా కాల్పులు, అశ్లీల నృత్యాలు వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉత్సవాల్లో నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో భీమవరం వన్టౌన్, టూటౌన్ సీఐలు ఎ. రమేష్, పి. మురళీకృష్ణ, భీమవరం తహసీల్దార్ ఆర్. రాంబాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తణుకు అర్బన్: తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన పోలవరపు వెంకటలక్ష్మి (40) కనిపించడం లేదంటూ అందిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు తణుకు రూరల్ ఎస్సై నాళం శ్రీనివాసరావు తెలిపారు. శనివారం మధ్యాహ్నం వెంకటలక్ష్మి తన అత్త సీతమ్మతో గొడవ పడుతుండగా, ఆమె కుమారుడు మోహన్ ఇద్దరినీ మందలించాడు. దీంతో కోపంతో ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు ఎస్సై తెలిపారు. కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు. -
మమ్మల్ని ఏమార్చొద్దు.. కాపు రిజర్వేషన్లు ఇవ్వండి
ద్వారకాతిరుమల: కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని గతంలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నిలబెట్టుకోవాలని కాపు రిజర్వేషన్ పోరాట సమితి (కేఆర్పీఎస్) రాష్ట్ర గౌరవ చైర్మన్, టీబీకే జేఏసీ సౌత్ ఇండియా కన్వీనర్ దా సరి రాము డిమాండ్ చేశారు. స్థానిక కాపు కల్యాణ మండపంలో కేఆర్పీఎస్–కాపునాడు పెద్దల ఆ ధ్వర్యంలో శనివారం కాపుల చైతన్య సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాము మాట్లాడుతూ గతంలో చంద్రబాబు రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారని, అవకాశం ఉండి చేయగలిగితే చేయండి.. కానీ మమ్మల్ని ఏమార్చొద్దు అని ఆయన కోరారు. హామీలు అమలు చేయాలి అసెంబ్లీలో తీర్మానం చేసిన 5 శాతం బీసీ–ఎఫ్ కేటగిరీ రిజర్వేషన్లను వీలైనంత త్వరగా అమలు చే యాలని రాము కోరారు. కాపు కార్పొరేషన్కు ఏటా రూ.3 వేల కోట్లు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. అన్ని కులాలకూ వర్తించే సంక్షేమ పథకాలు, పెన్షన్లు, అమ్మఒడి తదితర పథకాల్లో కాపులకు అందిన మొత్తాలను లెక్కించి ‘కాపులకు ఇన్ని వేల కోట్లు ఇచ్చాం’ అని ప్ర భుత్వం చెప్పడం సరికాదన్నారు. ప్రస్తుతం కాపులు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను వినియోగించుకుంటున్నారని, అయితే నిబంధనల ప్రకారం అర్హత లేని ఆస్తిపరులకు కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు జారీ అవుతున్నాయని ఆరోపించారు. అలాగే కాపు జనాభా రాష్ట్రంలో సుమారు 18 నుంచి 20 శాతానికి పైగా ఉందని, ఈ నిష్పత్తిన ఎమ్మెల్యే, ఎంపీ సీట్లలో కాపులకు న్యాయం జరగడం లేదన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం కాపులకు ప్రాతినిధ్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. నెలాఖరులో విజయవాడలో ధర్నా కాపు రిజర్వేషన్లు, కాపు కార్పొరేషన్కు నిధులు, ఇతర సమస్యలపై నెలాఖరులో విజయవాడ ధర్నాచౌక్లో కాపు సంఘాల పెద్దలతో భారీ ధర్నా నిర్వహించనున్నట్టు రాము చెప్పారు. అనంతరం చంద్రబాబును బహిరంగ చర్చకు రావాలంటూ కరపత్రాన్ని ఆవిష్కరించారు. అధ్యక్షుడు రావి శ్రీనివాస్, రాష్ట్ర చైర్మన్ కాజా సత్యనారాయణ, కో–కన్వీనర్లు కాకిలేటి హరనాథ్, వలవల శ్రీధర్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కాపునాడు అధ్యక్షుడు చినమిల్లి వెంకటరాయుడు, న్యాయవాదులు మాకా శ్రీనివాసరావు, కన్నా రజని, ఉమ్మడి విశాఖ జిల్లా కాపు నేత తోట రాజీవ్, కాపు జేఏసీ నాయకుడు ఆమంచి సోములు, రాష్ట్ర కాపు జేఏసీ నాయకుడు తోట రామకృష్ణ, కాపు నేతలు పల్నాటి బుజ్జి, పెద్దిరెడ్డి జ్యోతి శ్రీనివాస్, రుద్ర శివాజీ, పుప్పాల మురళీ, పెద్దిరెడ్డి నాగేశ్వరరావు, ఉక్కుర్తి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. కాపుల చైతన్య సదస్సులో వక్తల డిమాండ్ -
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదాం
● పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలి ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ నూజివీడు: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జెండాను ఎగురవేయడానికి పార్టీ కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పనిచేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) దిశానిర్దేశం చేశారు. నూజివీడు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం పట్టణంలోని కృష్ణవిలాస్ కల్యాణమండపంలో శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఎన్నార్ మా ట్లాడుతూ ఎన్నికల ముందు మాయమాటలు, అబద్ధపు ప్రచారంతో అధికారంలోకి వచ్చిన వెన్నుపో టు పార్టీ నాయకులు రాష్ట్ర ప్రజలను నిండా ముంచారన్నారు. ఇచ్చిన హామీల్లో అమలు చేస్తున్నవి ఒకటి రెండు తప్ప మిగిలిన వాటన్నింటినీ వెన్నుపోటు పార్టీ నాయకుడు చంద్రబాబు తుంగలో తొక్కారన్నారు. 27 నెలల కూటమి ప్రభుత్వం పాలనలో పూర్తిగా విఫలమైందన్నారు. మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తానని చెప్పి రాష్ట్రంలో ఒక్క మహిళకి కూడా ఇవ్వలేదన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తానని వారిని మోసం చేసిందన్నారు. సంపద సృష్టించి అభివృద్ధి చెస్తానని చెప్పిన చంద్రబాబు అధికారం చేపట్టిన తరువాత అప్పులు చేసే పనిలోనే ఉండి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశాడన్నారు. ఈ ఊబిలో నుంచి రాష్ట్రం బయటపడటం కష్టమేనన్నారు. ప్రభుత్వ వైఫల్యాలన్నింటినీ ప్రజల్లోకి తీ సుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలల్లో అందరూ సంఘటితంగా పనిచేయాలని, గెలుపు గుర్రాలను నిలబెట్టి గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో వైఎస్సార్సీపీ జెండాను ఎగురవేయాలన్నారు. ప్రకృతి సంపదను కొల్లగొడుతున్న కూటమి మాజీ ఎమ్మెల్యే, నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ నూజివీడు మున్సిపాలిటీని ఇప్పటివరకు తన సారథ్యంలో ఐదుసార్లు గెలుపొందామని, ఆరోసారి కూడా కై వసం చేసుకొని వైఎస్సార్సీపీ జెండాను మున్సిపాలిటీపై ఎగురవేయాలన్నారు. అప్పుడే ప్రభుత్వం దిగి వచ్చి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే అ వకాశం ఉండి ప్రజలకు మంచి జరుగుతుందన్నా రు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నా, ఎరువుల ధరలు ఏది చూసినా బస్తా రూ.2 వేలకు పైగానే ఉన్నా ప్రభుత్వానికి కనిపించడం లేదన్నారు. కనీసం ధరలు పెరగకుండా నియంత్రించే చర్యలు కూడా చేపట్టకుండా ప్రభుత్వం గాలికొదిలేసిందన్నారు. ఇక్కడి మంత్రి ఆగిరిపల్లి మండలంలోని కొండలన్నీ కొల్లగొట్టడుతున్నా కలెక్టర్, నూజివీడు సబ్ కలెక్టర్ పట్టించుకోవడం లేదన్నారు. ఐఏఎస్ అధికారులైనా సహజ సంపదను సంరక్షించాల్సిన బాధ్యతను నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. పది కొండలకు గుండుకొట్టి బోడికొండలను చేశారన్నారు. ప్రకృతి సంపదను దోచేసుకుని కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్నారన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బులు పెట్టి గెలవాలని అధికార పార్టీ చూస్తోందని, వైఎస్సార్సీపీ ప్రజాబలంతో గెలుస్తుందని అన్నారు. ఎన్నికల్లో సత్తాచాటేందుకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు సిద్ధమవ్వాలని ప్రతాప్ పిలుపునిచ్చారు. ఏపీ కో–ఆపరేటివ్ యూనియన్ మాజీ చైర్మన్ దేశిరెడ్డి రాఘవరెడ్డి, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు శీలం రాము, జెడ్పీ వైస్చైర్మన్ గుడిమళ్ల కృష్ణంరాజు, ముసునూరు జెడ్పీటీసీ వరికూటి ప్రతాప్, పార్టీ ముసునూరు, ఆగిరిపల్లి మండలాల అధ్యక్షులు మూల్పూరి నాగవల్లేశ్వరరావు, బెజవాడ రాంబాబు, బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు మందాడ శివశంకరరావు, రైతు విభాగం అధ్యక్షుడు ఈలప్రోలు వెంకట సుబ్బయ్య, జిల్లా అధికార ప్రతినిధి కంచర్ల లవకుమార్, క్రిస్టియన్ మైనారిటీ జిల్లా అధ్యక్షుడు పిళ్లా చరణ్ తదితరులు పాల్గొన్నారు. -
గిరిజన నిర్వాసితుల్లో గుబులు
కుక్కునూరు: పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కారణంగా ముంపునకు గురవుతున్న గిరిజన నిర్వాసితుల కోసం కుక్కునూరు మండలంలోని పుల్లప్పగూడెంలో నిర్మించిన ఆర్అండ్ఆర్ కాలనీల వద్ద పిచ్చిమొక్కల తొలగింపు, శుభ్రపరిచే పనులు చేపట్టడంపై స్థానిక గిరిజనుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. తమ కోసం నిర్మించిన ఇళ్లను ఇతర ప్రాంతాల నిర్వాసితులకు కేటాయించేందుకే ఈ పనులు చేపడుతున్నారనే అనుమానాలను వారు వ్యక్తం చేస్తున్నారు. అనుమానాలెన్నో.. ప్రభుత్వం మండలంలోని గిరిజన నిర్వాసితుల కోసం కివ్వాక, మర్రిపాడు, పుల్లప్పగూడెం, వెంకటాపురం, నెమలిపేట గ్రామాల సమీపంలో ఆర్అండ్ఆర్ కాలనీల నిర్మాణం చేపట్టింది. ప్రస్తుతం మొదటి విడతగా 41.15 కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పరిహారం జమ చేసిన ప్రభుత్వం, వారిని పునరావాస కాలనీలకు తరలించేందుకు చర్యలు వేగవంతం చేసింది. అలాగే పోలవరం మండలంలోని నిర్వాసితులకు కుక్కునూరు మండలంలో ’భూమికి భూమి’ కింద పరిహారం అందించి పునరావాస కాలనీలు నిర్మించేందుకు భూసేకరణ ప్రక్రియ ప్రారంభించింది. అయితే కుక్కునూరు మండలంలోని గిరిజన గ్రామాలు 45 కాంటూర్ పరిధిలో ఉండటం, పుల్లప్పగూడెం కాలనీ వద్ద ఇప్పుడు హడావుడిగా శుభ్రతా పనులు చేపట్టడంతో స్థానిక గిరిజనుల్లో అనుమానాలు మొదలయ్యాయి. 41 కాంటూర్ పరిధిలో ఉన్న పోలవరం జిల్లా నిర్వాసితులకు ఈ ఇళ్లను కేటాయించేందుకే శుభ్రం చేస్తున్నారేమోనని వారు భయపడుతున్నారు. దగ్గరుండి నిర్మాణం చేయించుకున్న గిరిజనులు కాలనీల నిర్మాణ సమయంలో ఇళ్ల నాణ్యతపై అప్పట్లో పెద్దఎత్తున అభ్యంతరాలు రావడంతో, అధికారులు గిరిజనులతో కమిటీలు ఏర్పాటు చేసి వారి సమక్షంలోనే నిర్మాణ పనులను పర్యవేక్షించే అవకాశం కల్పించారు. అంతేకాకుండా ఏ ఇల్లు ఎవరికి కేటాయించేదీ ముందే నిర్ణయించారని గిరిజనులు చెబుతున్నారు. దీంతో కొంతమంది నిర్వాసితులు తమ సొంత ఖర్చులతో ఆ ఇళ్లలో అల్మరాలు తదితర వసతులు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఆ ఇళ్లను వేరే ప్రాంత నిర్వాసితులకు కేటాయిస్తే తమ పరిస్థితి ఏమిటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్పష్టత ఇవ్వాలని డిమాండ్ ఈ కాలనీలను ఎవరికి కేటాయించనున్నారనే అంశంపై అధికారులు వెంటనే స్పష్టత ఇవ్వాలని స్థానిక గిరిజన నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. తమ కోసం నిర్మించిన ఇళ్లను తమకే కేటాయించి, ఇప్పటికే నిర్ణయించిన లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. లేనిపక్షంలో తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ విషయమై కుక్కునూరు తహసీల్దార్ చలపతిరావును వివరణ కోరగా కాలనీల్లో ఇళ్లను ఎవరికి కేటాయించాలనేది ప్రభుత్వం పరిధిలోని అంశమని తెలిపారు. ప్రస్తుతం ఆ ఇళ్లను పోలవరం జిల్లా ప్రాంత నిర్వాసితులకు కేటాయిస్తున్నారనే సమాచారం తమ వద్ద లేదని ఆయన పేర్కొన్నారు.మండలంలో నిర్మించిన పునరావాస కాలనీని గతంలో ప్రభుత్వం ఇక్కడి వారి కోసమే అని చెప్పింది. అందుకోసం కమిటీలు కూడా వేశారు. దీంతో దగ్గరుండి నాణ్యతతో నిర్మాణం చేయించుకున్నాం. ఈ ఇళ్లను స్థానికులకే ప్రభుత్వం అప్పగించాలి – సరియం ప్రసాద్, రెడ్డిగూడెం, కుక్కునూరు మండలం మా కోసం నిర్మించిన పునరావాస కాలనీలు ఒకవేళ పోలవరం జిల్లా నిర్వాసితులకు ఇవ్వాలనుకుంటే వారికి స్థానికంగా నిర్మాణం చేపట్టండి. అంతేకానీ మా కోసం అని చెప్పిన వాటిని వారికి మాత్రం కేటాయించవద్దు. – తురసం వసంతరావు, ఆంబోతులగూడెం, కుక్కునూరు మండలం పుల్లప్పగూడెం ఆర్అండ్ఆర్ కాలనీ వేరే వారికి కేటాయిస్తారనే అనుమానం కాలనీ వద్ద పారిశుధ్య పనులతో ఆందోళన స్పష్టత ఇవ్వాలని గిరిజనుల డిమాండ్ -
భూసేకరణలో నిర్లక్ష్యం సహించం
జేసీ అభిషేక్ గౌడ ఏలూరు (ఆర్ఆర్పేట) : చింతలపూడి ఎత్తిపోతల పథకం భూసేకరణలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీ సుకుంటామని జేసీ ఎంజే అభిషేక్ గౌడ హెచ్చరించారు. పథకం పనుల పురోగతిపై శుక్రవారం కలెక్టరేట్లో సమీక్షించారు. భూసేకరణ ప్రక్రియను నిర్ణీత గడువులో పూర్తి చేయాలన్నారు. 40 రోజులుగా ఎటువంటి ప్రగతి ప్రదర్శించకపోవడంపై కొవ్వూరు భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మెరుగుపర్చుకోవాలని సూ చించారు. జిల్లాలో ఈ–క్రాప్, ఈ–కేవైజీ క చ్చితంగా నమోదు చేయాలని అన్నారు. నూ జివీడు సబ్ కలెక్టర్ బి.వినూత్న, వ్యవసాయ శాఖ జేడీ హబీబ్ బాషా పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ప్రస్తుత విద్యాసంవత్సరంలో నిర్వహించే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్షకు దరఖాస్తులు ఆ హ్వానిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎం. వెంకటలక్ష్మమ్మ శుక్రవారం ప్రకటనలో తెలి పారు. ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, ఎయిడెడ్, మండలపరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ల్లోని 8వ తరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. విద్యార్థి కుటుంబ ఆదాయం రూ.3.50 లక్షల లోపు ఉండాలన్నారు. నవంబర్ 15న పరీక్ష నిర్వహిస్తారని, ఓబీసీ విద్యా ర్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీలు రూ.50 వచ్చే నెల 12లోపు చెల్లించాలన్నారు. వచ్చేనెల 13 తో ఫీజు చెల్లింపు గడువు ముగుస్తుందన్నారు. -
నేడు జాతీయ లోక్ అదాలత్
జిల్లా జడ్జి శ్రీదేవి ఏలూరు (ఆర్ఆర్పేట): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని కోర్టుల్లోనూ శనివారం ఉదయం 11 గంటల నుంచి జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్టు జిల్లా జడ్జి ఎస్.శ్రీదేవి ప్రకటనలో తెలిపారు. ఏలూరు జిల్లా కోర్టు ఆవరణలోని జిల్లా న్యాయ సేవ సదన్ భవనంలో కార్యక్రమం నిర్వహిస్తామని, కక్షిదారులు రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ప్రకృతి సంపదను, వన్యప్రాణులను కాపాడే క్రమంలో అటవీ శాఖ సిబ్బంది త్యాగాలు వెలకట్టలేనివని జిల్లా అటవీ శాఖాధికారి పీవీ సందీప్రెడ్డి అన్నారు. ఏలూరు జిల్లా అటవీ శాఖ అధికారి కార్యాలయంలో జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. అటవీ అమరవీరుల త్యాగాలను మననం చేసుకుంటూ నివాళులర్పించారు. డీఎఫ్ఓ సందీప్రెడ్డి మాట్లాడుతూ అటవీ అమరవీరుల ఆదర్శాలను, కర్తవ్య నిష్టను ప్రతిఒక్కరూ స్పూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. డివిజన్ పరిధిలోని అటవీ శాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అమరవీరుల స్మారకార్థం అటవీ శాఖ సిబ్బందితో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అలాగే ఏలూరు డివిజన్ పరిధిలోని ఏడు అటవీ రేంజ్లలో కూడా సంబంధిత రేంజ్ అధికారులు, సిబ్బంది అటవీ అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి, ర్యాలీలు నిర్వహించారు. జంగారెడ్డిగూడెం (చింతలపూడి): పదో తరగతి పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణతో పనిచేయాలని డీఈఓ పి.వెంకటలక్ష్మమ్మ, డీవైఈఓ రామన్న దొర అన్నారు. జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలోని ఎంఈఓలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో మ ధ్యాహ్న భోజన పథకాన్ని నాణ్యతా ప్ర మాణాలతో, పరిశుభ్రంగా నిర్వహించాలని ఆ దేశించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హా జరు శాతాన్ని రోజూ డిజిటల్ పద్ధతిలో న మోదు చేస్తూ వంద శాతం హాజరు నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే మన బడి మన భవిష్యత్తు కింద పాఠశాలల్లో చేపట్టిన సివిల్ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రజా పరిషత్ పరిధిలోని 48 జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ స్థానా లకు సంబంధించిన ఫొటో ఓటర్ల జాబితాలను ఈనెల 11న ప్రచురించి, జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో ప్రజల పరిశీలనార్ధం అందుబాటులో ఉంచామని జెడ్పీ ఇన్చార్జి సీఈఓ జీవీకే మల్లికార్జునరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ని అనుసరించి ఈ జాబితాను ప్రచురించినట్టు ఆయన పేర్కొన్నారు. -
బ్యాంకు ఉద్యోగుల నిరసన
ఏలూరు (ఆర్ఆర్పేట): జాతీయ బ్యాంకుల్లో పనిచేస్తున్న అధికారులకు, ఉద్యోగులకు, సిబ్బందికి వారానికి ఐదు రోజులు పని దినాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ, అలాగే ద్వైపాక్షికంగా ఒప్పుకున్న పీఎల్ఏ విధానాన్ని, ఏకపక్షంగా అమలు చేస్తున్న విధానాన్ని నిరసిస్తూ ఏలూరులో బ్యాంకు ఉద్యోగులు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేసి ఆర్ఆర్పేట యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్ నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యూఎఫ్బీయూ కన్వీనర్ కాళే శ్రీనివాసరావు మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని దినాలను కల్పిస్తామని జాతీయ బ్యాంక్ల యూనియన్కి హామీ ఇచ్చి చాలా కాలం అయినా అమలులో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. బ్యాంకు ఉద్యోగులకు పనిభారం పెరిగిందనర్నారు. అలాగే పనితీరు ఆధారిత ప్రోత్సాహకం అన్ని క్యాడర్లకూ సమానంగా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఎస్బీఐ ఏలూరు రీజనల్ సెక్రటరీ విమల్, యూనియన్ బ్యాంక్ ఏఐబీఓసీ నాయకుడు శ్రీరంగం శ్రీనివాసరావు, ఎస్బీఐ ఆఫీసర్స్ నాయకుడు వెంకటేశ్వరరావు, బ్యాంక్ ఆఫ్ బరోడా యూనియన్ నాయకుడు ఎస్.శ్రీనివాసరావు, ఇండియన్ బ్యాంక్ జాయింట్ జనరల్ సెక్రటరీ ఎంఆర్కే రెడ్డి, డీసీసీబీ బ్యాంక్ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. వీరికి ఏఐటీయూసీ, సీఐటీయూ నాయకులు రెడ్డి శ్రీనివాస్, డీఎన్వీడీ ప్రసాద్ తదితరులు మద్దతు పలికారు. -
ఆశల పొగాకు
● రైతులను ఊరిస్తున్న ధరలు ● వైఎస్ జగన్ పర్యటన అనంతరం ధరల పెరుగుదల ● కిలో రూ.346 గరిష్ట ధర ● ఒక్కరోజే 4,233 బేళ్ల విక్రయాలు బుట్టాయగూడెం : ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న వర్జీని యా పొగాకు ధరలు ప్రస్తుతం పుంజుకుంటున్నట్టు కనిపిస్తోంది. దాదాపు ఐదు నెలలుగా కిలో రూ.265 ధర కొనసాగగా జూలై 25 నుంచి కాస్త నెమ్మదిగా ధరలు పెరుగుతున్నాయి. అయితే పొగాకు ధరలు ప్రారంభం నుంచి గిట్టుబాటు కాక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్న నేపథ్యంలో గత నెల 5న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేవరపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం మార్కెట్లో ధర పెరుగుతూ వస్తోంది. ఈనెల 4న కిలోకు గరిష్ట ధర రూ.328 పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో బుధవారం రూ.326, గురువారం రూ.345, శుక్రవారం రూ.346కు పెరిగింది. ఒక్కసారిగా కిలోకు రూ.19 నుంచి రూ.20 పెరగడం గమనార్హం. మున్ముందు ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది కిలోకు గరిష్టంగా రూ.453, సగటున రూ.311 ధరలు రైతులకు లభించాయి. ఒక్కరోజే 5.50 లక్షల కిలోల విక్రయం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని జంగారెడ్డిగూడెం 1,2, కొయ్యలగూడెం, దేవరపల్లి, గోపాలపురంలోని వేలం కేంద్రాల పరిధిలో శుక్రవారం ఒక్కరోజు 5,50,000.60 కిలోల వరకూ విక్రయాలు జరిగినట్టు పొగాకు బోర్డు రీజనల్ మేనేజర్ జె.సురేంద్రకుమార్ తెలిపారు. అలాగే గరిష్టంగా కిలో రూ.346, సగటున రూ.315.08 చొప్పున ధర పలికినట్లు తెలిపారు. జంగారెడ్డిగూడెం వేలం కేంద్రం–1 పరిధిలో 1,22,412.20 కిలోలు, జంగారెడ్డిగూడెం–2 పరిధిలో 1,37,794.80 కిలోలు, కొయ్యలగూడెంలో 1,17,572.60 కిలోలు, గోపాలపురంలో 1,26,998.60 కిలోలు, దేవరపల్లిలో 45,222.40 కిలోల చొప్పున కొనుగోలు చేసినట్టు చెప్పారు. ప్రస్తుతం ధర ఆశాజనకంగా ఉందని నాణ్యత కలిగిన బ్రైట్ గ్రేడ్ పొగాకు మంచి ధర పలుకుతుందని చెప్పారు. అలాగే రైతుల దగ్గర నుంచి సుమారు 67 మిలియన్ కిలోల వరకూ పొగాకు అమ్మకానికి ఉందని ఆర్ఎం తెలిపారు. మొత్తం ఐదు కేంద్రాల పరిధిలో 5,267 బేళ్లు అమ్మకానికి రాగా ట్రేడర్లు 4,233 బేళ్లు కొనుగోలు చేశారు. 1,034 బేళ్లు తిరస్కరణకు గురయ్యాయి. మొత్తంగా ఇప్పటివరకూ 26.35 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలు చేశారు. వేలం కేంద్రం గరిష్టం కనిష్టం సగటు జంగారెడ్డిగూడెం–1 345 150 283.92 జంగారెడ్డిగూడెం–2 345 150 284.11 కొయ్యలగూడెం 345 150 273.02 గోపాలపురం 346 150 295.96 దేవరపల్లి 345 150 315.08 -
స్థానిక ఎన్నికల్లో విజయ ఢంకా మోగిద్దాం
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ గణపవరం: కూటమి ప్రభుత్వ మోసాలను, వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం.. జగన్ సంక్షేమ పా లనను ప్రజలకు గుర్తుచేద్దాం.. మనమంతా కలిసికట్టుగా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ ఢంకా మోగిద్దామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్), ఉంగుటూరు నియోజకవర్గ కన్వీనర్ పుప్పాల వాసుబాబు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక కేవీపీ కన్వెన్షన్ హాలులో ఉంగుటూరు నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీఎన్నార్ మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో అధికార కూటమి పార్టీ అక్రమాలు, మోసాలపై పార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. కుట్రలను ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని సూచించారు. అక్రమాలను అడ్డుకుంటే వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయం ఖాయమన్నారు. కూటమి పింఛన్ల డ్రామా ఎమ్మెల్సీ, జిల్లా పార్టీ పరిశీలకుడు వంక రవీంద్రనాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎప్పుడు, ఏ ఎన్నిక జరిగినా జగన్ బరిలోకి సింగిల్గానే వస్తారని, అ ధికారం కోసం కనపడిన ప్రతివారితో చేతులు కలిపి వాళ్ల కాళ్లు పట్టుకోవడం చంద్రబాబుకే చెల్లుతుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఒక్క కొత్త పింఛన్, ఇంటి స్థలం ఇవ్వలేదన్నారు. చేతకాని ప్రభుత్వానికి స్థానిక ఎన్నికలు దగ్గరకు రావడంతో ఇవన్నీ ఇప్పుడు గుర్తుకు వచ్చాయా అని ప్రశ్నించారు. పింఛన్ల మంజూరు డ్రామా అని దుయ్యబట్టారు. ఎంపీపీ అర్ధవరం రాము, వైఎస్సార్సీపీ బీసీ సెల్ నాయకుడు పెనుగొండ బాలకృష్ణ, పార్టీ నేత వెజ్జు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ స్థానిక ఎ న్నికల్లో ఆయా గ్రామాల నాయకులే అభ్యర్థులను ఎంపిక చేసి గెలిపించుకునే బాధ్యత తీసుకోవాల న్నారు. అక్రమ కేసులతో వేధింపులకు గురిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి గుణపాఠం తప్పదన్నారు. టీటీడీ మాజీ సభ్యుడు గాదిరాజు సుబ్బరాజు, నా లుగు మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, మండల పార్టీ కన్వీనర్లు, అనుబంధ విభాగాల నా యకులు, మండల, జిల్లా, రాష్ట్ర పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఐదేళ్ల పదవీకాలం విజయవంతంగా ముగించిన నాలుగు మండలాల సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలకు వాసుబాబు శాలువాలు కప్పి మెమొంటోలు అందజేశారు. మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ కన్వీనర్ పుప్పాల వాసుబాబు మాట్లాడుతూ మెగా డీఎస్సీ పేరుతో జరి గిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ కూటమి ప్రభుత్వానికి మరణశాసనం రాస్తున్నాయన్నారు. సీబీఐ విచారణకు ఆదేశించే దమ్ములేని దద్దమ్మలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ఎ దురుదాడికి తెగబడుతున్నారని విమర్శించారు. సూపర్సిక్స్ హామీలను అటకెక్కించిన చంద్రబాబు ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. 50 ఏళ్లకే పింఛన్, మహిళలకు నెలకు రూ.1,500, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు భృతి, ఉచిత గ్యాస్ సిలిండర్లు, వలంటీర్ల కొనసాగింపు, వారికి నెలకు రూ.10 వేల వేతనం, ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్, డీఏల చెల్లింపు హామీలన్నీ ఏమాయ్యాయన్నారు. పార్టీకి కా ర్యకర్తలే నిజమైన నాయకులని, వారికోసం తా మంతా ఎంతటి త్యాగాలకై నా సిద్ధంగా ఉంటామన్నారు. ప్రశ్నిస్తానంటూ పార్టీ పెట్టిన పవన్కల్యాణ్ అధికారం రుచి మరిగి ప్రశ్నించడమే మ రిచిపోయారన్నారు. ప్రజలకు ఎప్పుడైనా అండగా ఉండేది, భరోసా ఇచ్చేది వైఎస్సార్సీపీ మాత్రమే అన్నారు. -
ఇదేంపునర్విభజన?
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఒకే కాలనీ.. రెండు డివిజన్లు.. ఒక డోర్ నంబర్ ఒక డివిజన్లో.. పక్క డోర్ నంబర్ మరో డివిజన్లో.. రెండు డివిజన్లకు ఒకటే సరిహద్దులు. ఇది ఏలూరు నగరపాలక సంస్థలో డివిజన్ల పునర్విభజన జరిగిన తీరు. ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించలేదు. కనీసం క్షేత్రస్థాయిలో తి రిగి ఏఏ డివిజన్లో పరిస్థితి ఏంటి.. 50 నుంచి 62కు ఎలా పెంచాలనే దానిపై కనీసం కసరత్తు లే దు. నేరుగా ప్రజాప్రతినిధి కార్యాలయం నుంచి టౌ న్ప్లానింగ్లో చక్రం తిప్పే సాధారణ సచివాలయ ప్లానింగ్ కార్యదర్శికి జాబితా ఇచ్చారు. అంతా బాగుందని వెంటనే ఖరారు చేశారు. కట్చేస్తే.. పునర్విభజనపై ప్రతిపక్ష వైఎస్సార్సీపీతో పాటు అధికార జనసేన పార్టీ కూడా భగ్గుమంది. 62 డివిజన్లకు.. నగర డివిజన్లను 50 నుంచి 62కు పెంచారు. 2011 జనాభా లెక్కల ప్రకారం నగర జనాభా 2.24 లక్షలు. 2021 జనాభా లెక్కల ప్రకారం 3.04 ల క్షలకు 7 విలీన పంచాయితీలు కలిపితే చేరింది. డివిజన్ల పెంపు కోసం జనాభాను గణనీయంగా పెంచారనేది రాజకీయ పార్టీల ఆరోపణ. ఇక పునర్విభజన తీరుపై సర్వత్రా విమర్శలు రేగుతున్నాయి. తప్పుల తడకతో పునర్విభజన ప్రాథమిక ప్రకటన చేశారు. పాత 1వ డివిజన్ కొత్త 3వ డివిజన్, పాత 2వ డివిజన్ కొత్త 4వ డివిజన్ హద్దులు అడ్డగోలుగా మార్చేశారు. 2,500లు ఓటింగ్ ఉన్న పాత 13వ డివిజన్ లోని వైఎస్సార్ కాలనీని రెండు ముక్కలు చేసి 11వ డివిజన్లో కొంత, 24వ డివిజన్లో కొంత కలిపే శారు. ఒకే ప్రణాళికతో నిర్మించిన వైఎస్సార్ కాలనీ లోని ఇళ్లను కొత్త సరిహద్దులు పెట్టి రెండు ముక్కలు చేయడంపై గందరగోళం రేగింది. డ్రైనేజీ, తాగునీ రు, పారిశుద్ధ్యం, ఇతర సమస్యల కోసం రెండు డివిజన్ల చుట్టూ తిరిగాలా..? విభజన కాదు ఐక్యతే అభివృద్ధి అంటూ కాలనీవాసులు నగర కమిషనర్కు వినతిపత్రం ఇవ్వడంతో పాటు సోషల్ మీడియాలో క్యాంపెయినింగ్ చేస్తున్నారు. మరో అద్భుతమేమిటంటే.. కొత్తగా 14, 15 డివిజన్లకు రెండింటికీ ఒకే హద్దులను నిర్ణయించి ప్రకటించారు. ఎలాంటి మార్గదర్శకాలు పాటించలేదు. ఏలూరు నగర కమిషనర్ పరిధిలో టౌన్ప్లానింగ్ సిబ్బంది పునర్విభజన ప్రక్రియ సరిహద్దులను శాసీ్త్రయంగా నిర్ణయించారు. కాని సర్వే నంబర్లు, కాల్వ హద్దులు, చెరువు హద్దులు, ప్రధాన రోడ్డు హద్దులు తీసుకుని మూడు రోజులపాటు ఒకే చోట కూర్చొని పెద్ద కసరత్తు చేశారు. నగర కమిషనర్ నేతృత్వంలో ఏసీపీ స్థాయి అధికారి ఈ ప్రక్రియ మొత్తం నిర్వహించారు. అయితే చేసింది వార్డు సచివాలయ ప్లానింగ్ కార్యదర్శి. ఎలాంటి అవగాహన, అనుభవం లేకుండా సర్వే నంబర్లతో చేసి కొత్త గందరగోళం సృష్టించారు. కేవలం వార్డు సచివాలయ కార్యదర్శికి నగరంపై అవగాహన ఏ మాత్రం ఉంటుంది. దశాబ్దాలుగా కొనసాగే డివిజన్ల విషయంలో నగరపాలక సంస్థ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కేవలం ఐదారేళ్ల స ర్వీసు అనుభవం ఉన్న చిన్నపాటి ప్లానింగ్ కార్యదర్శికి టీపీబీఓ పోస్టు కట్టపెట్టి ఆయనతో డ్రాఫ్ట్ సిద్ధం చేయించడంపై తీవ్ర విమర్శలు రేగుతున్నారు. డివిజన్ల పునర్విభజనకు ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. ప్రతి డివిజన్లో ఒక డోర్ నంబర్ నుంచి ఒక డోర్ నంబర్ వరకు ఎంపిక చేసుకుని సగటున 4,500 నుంచి 5 వేల ఓట్లకు 10 శాతం అటుఇటుగా డివిజన్లను ఖరారు చేయాలి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 2.24 లక్షల ఓటింగ్ ఏలూరులో పోలైంది. 7 విలీన గ్రామాలు కలుపుకుని మొత్తం ఓట్లను 62 డివిజన్లల్లో సగటున 4 నుంచి 5 వేలు వచ్చేలా రూపొందించారు. అది కూడా ప్రజలందరికీ తెలిసే డోర్ నంబర్లు, ప్రధాన సెంటర్ల పేరుతో జాబితాను రూపొందించి కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటుచేసి అభ్యంతరాలను స్వీకరించాలి. అలాగే రాజకీయ పార్టీల సూచనలు తీసుకోవాలి. ఏలూరులో 14, 15 డివిజన్లకు ఒకే హద్దులు తప్పుల తడకలతో డివిజన్ల పునర్విభజన జాబితా వైఎస్సార్ కాలనీ రెండు ముక్కలు 50 డివిజన్ల నుంచి 62 డివిజన్లకు కార్పొరేషన్ పెంపు పునర్విభజనపై పార్టీల అభ్యంతరం -
లో గ్రేడ్ ధర పెంచాలి
హైగ్రేడ్ పొగాకు ధర పెరుగుతున్నా లోగ్రేడ్ పొగాకు అమ్మకాల్లో నష్టం వస్తుంది. కిలో రూ.150కు మించి కొనుగోలు చేయడం లేదు. మరో రూ.100 పెంచితే నే రైతులకు కొంతైనా మేలు జరుగుతుంది. ఒకటి, రెండు బేళ్లకు మాత్రమే ఎక్కువ ధర వస్తుండటం, మిగిలిన బేళ్లకు ధర రాకపోవడంతో రైతులు ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. – కలగర నాని, పొగాకు రైతు, కొమ్ముగూడెం, బుట్టాయగూడెం మండలం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దేవరపల్లి పొ గాకు బోర్డును సందర్శించిన తర్వాత క్రమంగా ధరలు పెరుగుతున్నాయి. గోపాలపురం కేంద్రంలో అత్యధికంగా కిలో రూ.346 పలికింది. అయితే తక్కువ గ్రేడ్కు రూ.150 మాత్రమే రావడం ఇబ్బందికరం. లోగ్రేడ్ ధరలు కూడా పెంచి కొనుగోలు చేయాలి. – సయ్యద్ బాజీ, పొగాకు రైతు, అచ్చియ్యపాలెం, బుట్టాయగూడెం మండలం -
గణపయ్యకు గ్లోబల్ క్రేజ్ !
ద్వారకాతిరుమల: విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు.. విద్య, విజ్ఞానం, విజయాలకు ఆదిదేవుడు.. భారతీయుల ఆరాధ్య దైవమైన గణనాథుడి ఖ్యాతి దేశ సరిహద్దులు దాటి ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. హిందూ సంప్రదాయంలోనే కాకుండా వివిధ దేశాల సంస్కృతులు, కళలు, ఆధ్యాత్మిక సంప్రదాయాల్లోనూ వినాయకుడి రూపాలు కనిపిస్తుండటం విశేషం. భారతదేశంలో వేలాది గణేశ్ ఆలయాలు, విగ్రహాలతో పాటు ప్రతి ఏడాది గణేశ్ చతుర్థి వేడుకలు వైభవంగా జరుగుతాయి. పొరుగున ఉన్న నేపాల్లో కాఠ్మాండుతో పాటు పలు ప్రాంతాల్లో గణేశ్ ఆలయాలు ఉన్నాయి. థాయ్లాండ్లో ‘ఫ్రా ఫికానెట్’గా పిలిచే గణేశుడు అదృష్టం, విజయం, కళలకు ప్రతీకగా ఆరాధించబడుతున్నాడు. పురాతన శిల్పాల్లోనూ.. ఇండోనేషియా, కంబోడియా, వియత్నాం వంటి దేశాల్లోని పురాతన ఆలయాలు, శిల్పకళలో గణేశుడి రూపాలు దర్శనమిస్తాయి. జావా, బాలి ప్రాంతాల్లోని పురాతన కళా సంపదలో గణేశుడి శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వియత్నాంలోని చామ్ కళా సంప్రదాయంలోనూ గణేశుడి శిల్పాలకు చారిత్రక ఆధారాలున్నాయి. జపాన్లో ‘కంగిటెన్’ రూపంలో గణేశుడి ఆరాధనకు చారిత్రక ఆనవాళ్లు ఉన్నాయి. ప్రపంచ దేశాల్లోనూ విగ్రహాలు మలేషియా, సింగపూర్, శ్రీలంక, మయన్మార్ తదితర ఆసియా దేశాల్లో హిందూ దేవాలయాల్లో గణేశుడి విగ్రహాలు కొలువుదీరాయి. మారిషస్లో భారతీయ మూలాలున్న ప్రజలలో గణేశ్ ఆరాధనకు ప్రత్యేక స్థానం ఉంది. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, న్యూజిలాండ్ వంటి దేశాల్లోనూ హిందూ ఆలయాలతో పాటు మ్యూజియంలలో గణేశుడి విగ్రహాలు, కళాఖండాలు కనిపిస్తాయి. సీషెల్స్ రాజధాని విక్టోరియాలోని నవశక్తి వినాయకర్ ఆలయం అక్కడి గణేశ్ ఆరాధనకు ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తోంది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం, పసడీనా నగరంలోని నార్టన్ సైమన్ మ్యూజియంలో ఉన్న 1164 నాటి గణేష్ శిల్పం విశిష్ట ఖ్యాతి కలిగిన గణనాథుడి నవరాత్రి ఉత్సవాలను తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రతి ఏటా అట్టహాసంగా నిర్వహిస్తారు. వినాయకచవితి అంటేనే పండుగ సందడి, భక్తి శ్రద్ధలు, ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ఏ పండుగలోనూ కనిపించని ప్రత్యేక సందడి వినాయకచవితి వేడుకల్లో కనిపిస్తుంది. వీధివీధినా వినాయక విగ్రహాల ప్రతిష్ఠ, మండపాల ఏర్పాటు, ప్రత్యేక అలంకరణలు, భక్తి కార్యక్రమాలతో పండుగ వాతావరణం నెలకొంటుంది. యువత సైతం ఉత్సవాల నిర్వహణలో ముందుండి ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈనెల 14న వినాయకచవితి పండుగను ఘనంగా జరుపుకునేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలుచోట్ల వినాయక మండపాల ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. విగ్రహాల కొనుగోలు, మండపాల అలంకరణ, విద్యుత్ దీపాల ఏర్పాటు తదితర పనులు వేగం పుంజుకున్నాయి. మరోవైపు ఉత్సవ కమిటీలు ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నాయి. భారతీయ ఆధ్యాత్మికతకు విశ్వవ్యాప్త ప్రతీకగా వినాయకుడు ఆసియా దేశాల నుంచి అమెరికా, యూరప్ వరకు గణేషుడి విగ్రహాలు ఇండోనేషియా కరెన్సీ నోటుపైనా కొలువైన గణేషుడు ఈనెల 14న వినాయకచవితి సందర్భంగా ప్రత్యేక కథనం -
బ్యాంకు ఉద్యోగుల సమ్మె జయప్రదం చేయాలి
తాడేపల్లిగూడెం (టీఓసీ): దేశవ్యాప్తంగా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో శుక్రవారం తలపెట్టిన దేశవ్యాప్త బ్యాంకు ఉద్యోగుల సమ్మెను జయప్రదం చేయాలని యూనియన్ నాయకులు గురువారం పట్టణంలో కోరారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ... ఐదు రోజుల బ్యాంకింగ్ విధానాన్ని అమలు చేయాలని, పీఎల్ఐని ఉపసంహరించుకోవాలని, ఇతర పెండింగ్ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగ సంఘాలు ఈ సమ్మెకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ, తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ తోట సూర్యనారాయణ, ఎస్బీఐ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు మానుకొండ కిరణ్, బి. ఏడుకొండలు, లింగంపల్లి గాంధీ, శీతాళం నారాయణమూర్తి, వీరబాబు, సెంట్రల్ బ్యాంక్కు చెందిన శాస్త్రి, చంద్రకళ, అపర్ణరాజు తదితర సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు
తణుకు అర్బన్: పది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనుకున్న సమయంలో మృత్యువు కబళించిన ఘటన తణుకు మండలం తేతలి జాతీయ రహదారిపై గురువారం చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా, మూడేళ్ల బాలుడితో పాటు ఆరుగురు గాయపడ్డారు. తణుకు పట్టణ శివారు వీరభద్రపురానికి చెందిన మెరిపే ప్రసాద్, ఆయన భార్య వెంకటలక్ష్మి (38), కుమారుడు హేమ చంద్రబాబుతో కలిసి తాడేపల్లిగూడెం మండలం పడాల నుంచి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయలుదేరారు. అదే సమయంలో తణుకుకు చెందిన లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు చీకటి శ్రీనివాసరావు కుటుంబసభ్యులతో కలిసి కారులో వస్తున్నారు. తేతలి జాతీయ జాతీయ రహదారి పెట్రోలు బంకుకు ఎదురుగా వచ్చేసరికి వీరి కారు అదుపుతప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి, పంట కాలువ దాటి అవతలి గట్టుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వెంకటలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె భర్త ప్రసాద్కు తీవ్రగాయాలయ్యాయి. కారులో ఉన్న శ్రీనివాసరావుకు కాలు విరగగా, మిగిలిన నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం సినిమా స్టంట్ను తలపించేలా.. తేతలి జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదం సినిమా స్టంట్ను తలపించింది. కల్వర్టు వద్ద బైక్ను ఢీకొన్న కారు, సుమారు 20 అడుగుల వెడల్పు ఉన్న పంట కాలువ పైనుంచి గాల్లోకి లేచి పల్టీలు కొడుతూ అవతలి గట్టుపై పడింది. ప్రమాద సమయంలో ద్విచక్ర వాహనంపై ఉన్న మూడేళ్ల బాలుడు హేమ చంద్రబాబు ఎలాంటి గాయాలు లేకుండా బయటపడటం విశేషం. తల్లి మృతదేహం వద్ద బాలుడు రోదించిన తీరు అందరినీ కలచివేసింది. అందుబాటులో లేని 108 వాహనం ప్రమాద సమయంలో 108 వాహనం అందుబాటులో లేకపోవడంతో స్థానికులు క్షతగాత్రులను ట్రక్కు ఆటోలో ఆసుపత్రికి తరలించారు. తణుకుకు కేటాయించిన 108 వాహనం మరమ్మతుల్లో ఉండగా, ప్రత్యామ్నాయ వాహనం ఏలూరు వెళ్లడంతో ఈ పరిస్థితి తలెత్తింది. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులను, క్షతగాత్రులను స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పరామర్శించారు. మహిళ మృతి, ఆరుగురికి గాయాలు -
బాలింత మృతి.. బంధువుల ఆందోళన
కొయ్యలగూడెం : కొయ్యలగూడెంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి వద్ద బాలింత మృతి చెందిన ఘటనకు సంబంధించి ఆమె బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. కొయ్యలగూడెంకు చెందిన ఓ గర్భిణి జంగారెడ్డిగూడెం రోడ్డులోని ప్రైవేట్ ఆసుపత్రిలో డెలివరీ కోసం చేరారు. అయితే ఆపరేషన్ చేయగా బిడ్డ జన్మించిన అనంతరం బాలింతకు ఫిట్స్ వచ్చినట్లు తెలిసింది. దీంతో అదే ఆసుపత్రికి చెందిన అంబులెన్స్లో బాలింతను రాజమండ్రిలోని వేరొక ప్రైవేట్ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మరణించినట్లు ఆసుపత్రి యాజమాన్యం పేర్కొంది. అయితే, ఇందుకు విరుద్ధంగా బంధువులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఆసుపత్రి వైద్యుడి నిర్లక్ష్యం వల్లనే బాలింత మృతి చెందిందని, ఆపరేషన్ సమయంలోనే ఆమె చనిపోయినప్పటికీ... ఆ విషయాన్ని పక్కదారి పట్టించడానికి మృతదేహాన్ని రాజమండ్రికి తరలించి, అక్కడ చనిపోయినట్లు నమ్మబలుకుతున్నారని మృతురాలి బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. దాదాపు వంద మంది ఆసుపత్రి వద్ద ఆందోళనకు పూనుకోవడంతో పాటు ఆసుపత్రిలోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. దీంతో జాతీయ ప్రధాన రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న ఎస్సై వి. చంద్రశేఖర్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు కొనసాగించారు. -
ఫుడ్ జోన్లో గొడవ.. కత్తిపోటుకు యువకుడు బలి
ద్వారకాతిరుమల: చాయ్ బిస్కెట్ ఫుడ్ జోన్లో జరిగిన గొడవ ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. తోటి కార్మికుడు కత్తితో పొట్టలో పొడవడంతో తీవ్రంగా గాయపడిన కోనెటి గంగాధరరావు (35) చికిత్స అనంతరం విశ్రాంతి పొందుతూ గురువా రం మధ్యాహ్నం మృతిచెందాడు. ద్వారకాతిరు మల మండలం లక్ష్మీనగర్లో ఈనెల 8న రాత్రి ఘ టన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన గంగాధరరావు, ద్వారకాతిరుమల మండలం గుణ్ణంపల్లికి చెందిన ఏలూరు శివశంకర్ లక్ష్మీనగర్లో జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ చాయ్ బిస్కెట్ ఫుడ్ జోన్లో పనిచేస్తున్నారు. వీరి మధ్య చిన్నపాటి మనస్పర్థలు రావడంతో గత 15 రోజులుగా గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో ఈనెల 8న రాత్రి 11 గంటల సమయంలో ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. ఆ సమయంలో శివశంకర్ తన వెంట తెచ్చుకున్న కత్తితో గంగాధరరావును పొట్టలో పొడి చి పరారయ్యాడు. వెంటనే ఫుడ్ జోన్ యజమాని భలే విజ్ఞేశ్వరరావు గాయపడిన గంగాధరరావును నల్లజర్లలోని పీహెచ్సీకి తరలించగా వైద్యులు చికిత్స అందించి మూడు కుట్లు వేశారు. అనంతరం అతడిని ఫుడ్ జోన్లోని రెస్ట్ రూమ్కు తరలించారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం పరిస్థితి విషమించడంతో గంగాధరరావు మృతి చెందాడు. భీమడోలు సీఐ పి.కృష్ణ, ద్వారకాతిరుమల ఎస్సై టి.సుధీర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గుణ్ణంపల్లి ఇన్చార్జి వీఆర్వో వల్లూరి వెంకట సత్యనారాయణరావు ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
క్యూవీఎస్ఈ మోసాలపై అప్రమత్తం
దెందులూరు: ప్రజలంతా మోసపూరిత అప్లికేషన్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ కే. శివకిషోర్ అన్నారు. పొరపాటున కూడా క్యూవీఎస్ఈ అప్లికేషన్లను ఎవ్వరూ ఓపెన్ చేయవద్దని హెచ్చరించారు. ఏ ఒక్కరూ ఉచితంగా డబ్బులు ఇవ్వరని, అత్యాశకు పోవద్దని సూచించారు. అధిక వడ్డీలు, ఎక్కువ డాలర్లు ఇస్తామని నమ్మబలికే మాటలు చెప్పడమే కాకుండా, మొదట్లో ఒకటి రెండు నెలలు నమ్మకం కోసం డబ్బులు జమ చేస్తారని, ఆ తర్వాత బోర్డు తిప్పుతారని తెలిపారు. కాబట్టి అత్యాశకు పోయి మోసపోవద్దని ఎస్పీ సూచించారు. సైబర్ మోసాలకు గురైతే బాధితులు వెంటనే సైబర్ సెల్కు ఫిర్యాదు చేయాలని వివరించారు. మరోవైపు, మోసపూరిత అప్లికేషన్లపై ప్రజలను అప్రమత్తం చేస్తున్న ఎస్పీ సందేశాన్ని దెందులూరు ఎస్సై డి. వెంకట్కుమార్.. వాట్సప్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తాడేపల్లిగూడెం (టీఓసీ): పట్టణంలో గురువారం తెల్లవారుజామున టూటౌన్ నుంచి వన్టౌన్ వైపునకు మొదటి ఫ్లైఓవర్ బ్రిడ్జి మార్గంలో ఓ ట్రాలీపై వెళుతున్న క్రేన్ అదుపు తప్పి పడిపోయింది. క్రేన్లోని ఆయిల్ అంతా ఒలిగింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. అనంతరం క్రేన్ను అక్కడ నుంచి తొలగించి వేరే ప్రాంతానికి తరలించారు. కొయ్యలగూడెం: అక్రమ కలపను స్వాధీనం చేసుకున్నట్లు కన్నాపురం అటవీ శాఖ రేంజర్ సెహన్షా గురువారం పేర్కొన్నారు. కొయ్యలగూడెం– గవరవరం మెయిన్ రోడ్డు సమీపంలో ట్రాక్టర్ ట్రక్కులో ఉన్న టేకు జాతికి చెందిన అక్రమ కలప గుర్తించామన్నారు. పట్టుకున్న కలప విలువ సోమవారం రూ.35 వేలు ఉంటుందని కలపతో సహా వాహనాన్ని కన్నాపురం కార్యాలయానికి తరలించి కేసు నమోదు చేసినట్లు చెప్పారు. భీమవరం: భీమవరం పట్టణంలోని రైల్వే ఫ్లైఓవర్ పైనుంచి పడి వృద్ధుడు మృతి చెందినట్లు భీమవరం వన్టౌన్ పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే... గురువారం రాత్రి ఫ్లైఓవర్ పైనుంచి గుర్తుతెలియని 65 ఏళ్ల వృద్ధుడు కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతుని వివరాలు తెలిసినవారు పోలీస్స్టేషన్లో సంప్రదించాలని కోరారు. -
కూటమి కుట్రలకు భయపడం
కారుమూరి సునీల్ సతీమణి కీర్తి ఏలూరు టౌన్: ఉమ్మడి పశ్చిమలో బీసీ వర్గానికి చెందిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుటుంబాన్ని అణచివేసేందుకు చేస్తున్న రాజకీయ కుట్రలను తిప్పికొడుతూ.. పార్టీ కార్యకర్తలకు అండగా నేనున్నానంటూ ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జి కారుమూరి సునీల్కుమార్ సతీమణి కీర్తి భరోసా ఇచ్చారు. ఏలూరులోని పార్టీ కార్యాలయంలో గురువారం పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆమె మమేకమయ్యారు. జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, సమన్వయకర్తలు కంభం విజయరాజు, మామిళ్లపల్లి జయప్రకాష్ ఆమెకు సంఘీభావం తెలుపుతూ ధైర్యం చెప్పారు. అనంతరం కీర్తి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో కూటమి ప్రభుత్వ కుట్రలను ఎదుర్కొంటామనీ, అక్రమ కేసులు, అరెస్ట్లు, బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశా రు. రాష్ట్రంలో రెండేళ్ల కూటమి పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారనీ, అనేక సమస్యలతో సతమతమవుతున్నారనీ ప్రజల పక్షాన పోరాటం చేస్తామని చెప్పారు. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామగ్రామానా పర్యటిస్తూ టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మహిళలకు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ నేడు దారుణంగా మోసం చేసిందని విమర్శించారు. వైఎస్సార్సీపీలోని బీసీ నాయకులను రాజకీయంగా దెబ్బకొట్టాలనే కుటిలమైన ఆలోచనతో అక్రమ కేసులు పెడుతున్నారని, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. బీసీ నేతలపై వేధింపులు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన తనయుడు సునీల్కుమార్ను లేని కేసుల్లో ఇరికించి అక్రమంగా అరెస్ట్లు చేసి, జైలులో పెట్టారని.. బీసీ నేతలను టీడీపీ ప్రభుత్వం వేధింపులకు గురిచేయటాన్ని ప్రజలంతా చూస్తున్నారన్నారు. కారుమూరి కుటుంబానికి అందరూ అండగా నిలవాలన్నారు. కూటమి అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్న కారుమూరి నాగేశ్వరరావు కుటుంబంపై ప్రభుత్వం కక్ష గట్టిందన్నారు. రానున్న రోజుల్లో నాగేశ్వరరావు, సునీల్కుమార్ కడిగిన ముత్యంలా బయటకు రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, నగర మహిళ అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, మాజీ కార్పొరేటర్ ఇనపనూరి కేదారేశ్వరి, పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. -
స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యం
చింతలపూడి: రాష్ట్రంలో కూటమి అన్యాయాలను ఎండగడుతూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వెన్నుపోటు పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) పిలుపునిచ్చారు. స్థానిక వీకేఎం ఫంక్షన్ హాల్లో గురువారం నియోజకవర్గ ఇన్చార్జి కంభం విజయరాజు అధ్యక్షతన వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డీఎన్నార్ మాట్లాడుతూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సమష్టిగా పనిచేయాలన్నారు. సూపర్ సిక్స్ హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకు మొండిచేయి చూపిందన్నారు. నియోజకవర్గంలో ఎక్కడా ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వరాదని, కూటమి నేతలతో ఎవరైనా లాలూచీ పడితే పార్టీపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రూపు రాజకీయాలు, వ్యక్తిగత పట్టుదలను పక్కనపెట్టి గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించాలని సూచించారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీని అత్యధిక మెజార్టీతో గెలిపించి వైఎస్ జగన్కు కానుకగా అందించాలని, ఈ విజయం జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడానికి పునాది కావాలన్నారు. కూటమి పాలనపై పోరాటం : మచిలీపట్నం నియోజకవర్గ పరిశీలకుడు జెట్టి గురునాథరావు మాట్లాడుతూ రెండున్నరేళ్లుగా కూటమి పాలనపై వైఎస్సార్సీపీ పోరాటం చేస్తోందన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లిందని, ముఖ్యంగా జంగారెడ్డిగూడెం, కామవరపుకోట, లింగపాలెం మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కూటమికి రోజులు దగ్గర పడ్డాయి నియోజకవర్గ ఇన్చార్జి కంభం విజయరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందని, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. కూటమికి రోజులు దగ్గరపడ్డాయన్నారు. నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలన్నింటినీ గెలుచుకోవడానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా కృషి చేయాలన్నారు. అనంతరం ‘వెన్నుపోటు పార్టీ..వెన్నుపోటు పాలన’ పోస్టర్లను నేతలు ఆవిష్కరించారు. ముందుగా ఇటీవల మృతి చెందిన పార్టీ ముఖ్య నేతలు జగ్గవరపు జానకీరెడ్డి, పుచ్చకాయల వినోద్రెడ్డి, వేమన్ రెడ్డి, గంగాధర్ రావులకు మౌనం పాటించి నివాళులర్పించారు. నియోజకవర్గ పరిశీలకుడు దాసరి రమేష్, జెడ్పీటీసీ మొలుగుమాటి నీరజా సుధాకర్, మున్సిపల్ విభాగం జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకటేశ్వర్రావు, పట్టణ అధ్యక్షుడు కొప్పుల నాగేశ్వర్రావు, లింగపాలెం మండల అధ్యక్షుడు ఎ.శాంతారావు, కామవరపుకోట మండల అధ్యక్షుడు రాయంకుల సత్యనారాయణ, జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షుడు కర్పూరం గుప్తా, మండల అధ్యక్షుడు నాగేంద్ర, రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శులు సీహెచ్ జ్ఞానారెడ్డి, మల్నీడి బాబ్జి, మేధావుల విభాగం రాష్ట్ర కార్యదర్శి గోలి చంద్రశేఖర్రెడ్డి, జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు త్సల్లాబత్తుల శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి ముప్పిడి శ్రీనివాసరావు, రాష్ట్ర మున్సిపల్ విభాగం కార్యదర్శి ఎ.సుబ్బారావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సొంగా సందీప్, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ -
కూటమిలో స్థానిక పంచాయితీ
శురకవారం శ్రీ 11 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026ఏలూరు (ఆర్ఆర్పేట): జాతీయ న్యాయసేవాధికార సంస్థ, రాష్ట్ర న్యా యసేవాధికార సంస్థ ఆ దేశాల మేరకు శనివారం ఉమ్మడి పశ్చిమగోదా వరి జిల్లావ్యాప్తంగా జా తీయ లోక్అదాలత్ నిర్వహించనున్నట్టు ఉమ్మడి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి తెలిపారు. గురువారం స్థానిక జిల్లా కోర్టు ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా బెంచీలు ఏర్పాటు చేశామని, ఇప్పటివరకూ 10,577 కేసులను రాజీయోగ్యమైనవిగా గుర్తించామన్నారు. కక్షిదారులు ప్రత్యక్షంగా గాని న్యాయవాది ద్వారా గాని సంబంధిత కోర్టులను సంప్రదించి కేసులు పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. గత జూలైలో జరిగిన జాతీయ లోక్ అదాలత్లో 7,910 కేసులను పరిష్కరించామన్నారు. లోక్ అదాలత్ వల్ల సమయం, డబ్బు ఆదా అవుతాయన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం (చింతలపూడి): గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి దేవస్థానం హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కించా రు. 99 రోజులకు రూ.64,93,560 సమకూరినట్టు ఆలయ ఈఓ ఆర్వీ చందన తెలిపారు. అలాగే అన్నదానం హుండీ ద్వారా రూ. 99,200 ఆదాయం లభించిందన్నారు. దేవదాయ శాఖ అధికారి కూచిపూడి శ్రీనివాసు, ఆలయ చైర్మన్ రాజాన సత్యనారాయణ పర్యవేక్షించగా ధర్మకర్తలు పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): గర్భిణులు ఆహారంపై జాగ్రత్త వహించాలని, ప్రోటీన్ ఎక్కువగా ఉండేటా చూసుకోవాలని ఐసీడీఎస్ పీడీ పి.శారద అన్నారు. గురువారం ఏలూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని సుంకరవారితోట అంగన్వాడీ కేంద్రంలో 9వ జాతీయ పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆమె మాట్లాడుతూ నెల రోజులపాటు అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ముఖ్యంగా మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి ఆహారంలో ఐరన్, ప్రోటీన్, కాల్షియం, మినరల్స్ ఉండేలా చూసుకోవాలన్నారు. ఏలూరు ప్రాజెక్టు అధికారి సీడీపీఓ ఎ.పద్మావతి మాట్లాడుతూ ఆహారంలో వైవిధ్యం, అంగన్వాడీ కమిటీ పనులు, ఐవీఆర్ఎస్ కాల్స్, ఆహారంలో పోషక విలువలను వివరించారు. సూపర్ వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు, తల్లులు పాల్గొన్నారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు: సగం సీట్లు కావాల్సిందేనని జనసేన.. జనసేనకు అంత సీన్ లేదంటూ టీడీపీ.. ఏలూరు నగర మేయర్తో సహా నాలుగు మున్సిపల్ చైర్మన్లు కావాలని జనసేన.. కౌన్సిలర్లు, కార్పొరేటర్ల స్థానాలిచ్చి పార్టీ అధిష్టానం సరిపెడుతుందని టీడీపీ.. ఇలా రెండు పార్టీల మధ్య కుమ్ములాటలకు స్థానిక సంస్థల ఎన్నికలు తెరలేపాయి. జనసేన ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో స్థానిక సంస్థలు మొత్తం జనసేనకే ఇవ్వాలని డిమాండ్ తెరమీదకు తెచ్చిన క్రమంలో కౌంటర్గా టీడీపీ నేతలు ఆశావహులను ప్రమోట్ చేస్తూ హడావుడికి తెరతీయడం ఉమ్మడి పశ్చిమలో చర్చనీయాంశంగా మారింది. మాదంటే.. మాదంటూ.. ఉమ్మడి పశ్చిమలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూటమిలో సీట్ల పంపకాల పంచాయితీ ముందుగానే మొదలైంది. సామాజిక, పార్టీ ఓటింగ్, పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ స్థానాలకు అనుగుణంగా కచ్చితంగా 50 శాతం సీట్లు ఇవ్వాల్సిందేనని జనసేన బలంగా డిమాండ్ చేస్తోంది. దానికనుగుణంగా నియోజకవర్గాల వారీగా జరుగుతున్న జనసేన సమావేశాల్లో ఎమ్మెల్యేలు సైతం అదే మాట చెబుతున్నారు. ఇక దీనికి సమాంతరంగా టీడీపీ నేతలు కూడా సమావేశాల్లో మెజార్టీ స్థానాలు తెలుగుదేశానికే ఉంటాయని ఆశావహులంతా సిద్ధంగా ఉండాలని, ఎవరి ప్రచారాలను పట్టించుకోవద్దంటూ పరోక్షంగా కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ స్థానంపై రెండు పార్టీల్లో బలమైన పోటీ ప్రారంభమైంది. జనసేనకు అత్యధిక బలం ఉండి, పొత్తు ధర్మంలో భాగంగా టీడీపీ అసెంబ్లీ సీటు ఇచ్చామని, దానికి అనుగుణంగా అప్పట్లో నగర మేయర్ స్థానం తమకు వస్తుందని పార్టీ పెద్దలు చెప్పారని దానికనుగుణంగా ఏలూరు మేయర్ స్థానం తమకు ఇవ్వాల్సిందేనని జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా ఏలూరు నగరపాలక సంస్థ, తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం మున్సిపల్ చైర్మన్ స్థానాలు కోసం జనసేన నేతలు పట్టుబడుతున్నారు. ఇదే క్రమంలో ఆయా స్థానాల కోసం టీడీపీ నేతల నుంచి బలమైన పోటీ ప్రారంభమైంది. టీడీపీ మరో అడుగు ముందుకేసి హడావుడిగా ఆశావహులను తెరపైకి తెస్తుంది. విద్యార్థిని లక్ష్మిని అభినందిస్తున్న ఉపాధ్యాయులు ద్వారకాతిరుమల: ఇన్స్పైర్–మనక్ జాతీయస్థాయి ప్రదర్శనకు ద్వారకాతిరుమల శ్రీవారి దేవస్థానం సంస్కృతోన్నత పాఠశాల విద్యార్థిని పోలుబోయిన లక్ష్మి ఎంపికై ంది. 2023–24, 2024–25 విద్యా సంవత్సరాలకు నిర్వహించిన జాతీయ స్థాయి ప్రదర్శన, ప్రాజెక్ట్ (ఎన్ఎల్ఈపీ) పోటీల్లో ప్రతిభ చాటిన లక్ష్మి ఈ ప్రదర్శనకు అర్హత సాధించింది. 2024–25లో పదో తరగతి పూర్తిచేసిన ఆమె ఎవరైనా దాడికి పాల్పడినప్పుడు కరెంట్ షాక్ ఇచ్చేలా పనిచేసే సేఫ్టీ లిప్స్టిక్ ప్రాజెక్టును రూపొందించి ఘనత సాధించింది. ఆమెను గురువారం పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు అభినందించారు. వచ్చేనెల 12 నుంచి 14 వరకు ఢిల్లీలో జాతీయస్థాయి ప్రదర్శన జరుగనుంది. పాఠశాల హెచ్ఎం పి.శేషుకుమార్, గైడ్ టీచర్ సీహెచ్ కాంతారావు, సైన్స్ ఉపాధ్యాయ బృందం చినవెంకన్న దేవస్థానం ఈఓ, పాఠశాల కరస్పాండెంట్ వేండ్ర త్రినాథరావును మర్యాదపూర్వకంగా కలిశారు. జాతీయ స్థాయిలోనూ ప్రతిభ చాటి రాష్ట్రానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఈఓ ఆకాంక్షించారు. ఆల య చైర్మన్ ఎస్వీ సుధాకరరావు సైతం విద్యార్థినికి అభినందనలు తెలిపారు. జగ్గయ్యపేట: మండలంలోని ముక్త్యాలలోని భవానీ ముక్తేశ్వేర స్వామి వారి దత్తత ఆలయం చెన్నకేశవ స్వామివారి ఆలయంలో జరిగిన బంగారు, వెండి ఆభరణాల చోరీ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి పూర్తి సొత్తు స్వాధీనం చేసుకున్నట్టు విజయవాడ రూరల్ డీసీపీ లక్ష్మీనారాయణ తెలిపారు. పట్టణంలోని సీఐ కార్యాలయంలో ఆయన విలేకరుల ఎదుట నిందితులను హాజరుపరిచి వివరాలు తెలిపారు. ఈనెల 6న అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించి స్వామి, అమ్మవార్లకు చెందిన 6.5 కిలోల వెండి, ఆరు గ్రాముల బంగారం చోరీ చేశారన్నారు. సోమవారం జిల్లా ఏసీ చిల్లకల్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయ గా సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నాలుగు బృందాలతో దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంతో.. చోరీకి ముందు నంబర్ ప్లేట్ లేని కారు ఆలయం చుట్టు పక్కల సంచరించగా ముగ్గురు వ్యక్తులు ఆల యంలోకి వచ్చి రెక్కీ చేసినట్లు సీసీ ఫుటేజీలలో గుర్తించామని తెలిపారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన బత్తుల కోటయ్య అలియాస్ కోటేశ్వరరావు జగ్గయ్యపేట మండలం జయంతిపురం గ్రా మానికి చెందిన అల్లుడు కావటంతో తరచూ వచ్చి వెళ్తుంటాడు. ఈ క్రమంలో పరిసర ప్రాంతాల్లోని ఆలయాల పూర్తి సమాచారం సేకరించి పాత నేరస్తులు నాగర్కర్నూలు జిల్లా తిమ్మయ్యపల్లికి చెందిన డేరంగుల మల్లేష్, ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలానికి చెందిన కారం సాంబయ్యలతో కలిసి చోరీకి పాల్పడినట్టు తెలిపారు. వీరిని కోదాడ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో అదుపులోకి తీసుకుని రూ.15 లక్షల విలువైన చోరీ సొత్తు, కారును స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఏలూరు టౌన్: ఆధునిక యుగంలో సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోవటంతో సైబర్ నేరగాళ్ల ప్రలోభాలతో ఆమాయక ప్రజలు మోసపోతున్నారనీ.. పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు బ్యాంకులు, పోలీసులు సమన్వయంతో పనిచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్కుమార్ అన్నారు. జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ ఆదేశాలతో నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల అధికారులతో గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సైబర్ నేరాలపై అధికారులతో చర్చించారు. అనంతరం ఆ యన మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు అవలంబిస్తున్న కొత్త పద్ధతులు, విధానాలపై బ్యాంకు అధికారులకు వివరించారు. ముఖ్యంగా ఫిషింగ్ లింకులు, ఫేక్ కేవైసీ అప్డేట్స్, లోన్ యాప్స్లో మోసాలపై బ్యాంకులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఖాతాదారులకు సైబర్ భద్రతపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత బ్యాంకు అధికారులపై ఉందన్నారు. బ్యాంకు ప్రాంగణాల్లో సైబర్ నేరాల నివారణకు పోస్టర్లు, హెల్ప్లైన్ నెంబర్లు ప్రదర్శించాలని సూచించారు. ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ స్థానం కోసం జనసేన బలంగా ప్రయత్నిస్తోంది. ఓటింగ్ పరంగా పార్టీకి పట్టుందని, గతంలో పొత్తుల్లో దక్కిన ఏలూరును చివరి నిమిషంలో మార్చి జనసేనకు నష్టం చేకూర్చారని, అందుకే మేయర్ స్థానం ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి తెచ్చింది. ఈ నేపథ్యంలో జనసేన నేతలతో సంబంధం లేకుండా ఏలూరు నగరంలో డివిజన్ల పునర్విభజన స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లో జరిగింది. దీంతో జనసేన నేత రెడ్డి అప్పలనాయుడు విభజన గందరగోళంగా జరిగిందని, సర్వే నంబర్లు, చెరువుల పేరుతో డివిజన్ల హద్దులు నిర్ణయించడం సరికాదని, కలెక్టర్కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో మళ్లీ వివాదం రేగింది. సీట్లు.. సిగపట్లు ఏలూరు మేయర్ సీటు కోసం జనసేన పట్టు అడ్డగోలుగా డివిజన్ల పునర్విభజనపై అభ్యంతరం ఉమ్మడి జిల్లాలో మూడు మున్సిపల్ చైర్మన్లు, ఒక నగర పంచాయతీ ఇవ్వాలని డిమాండ్ వార్డు కౌన్సిలర్లు, నగర కార్పొరేటర్ల సీట్లతో సరిపెడతామంటూ టీడీపీ నేతల వ్యాఖ్యలు ఉమ్మడి పశ్చిమలో కూటమి కుమ్ములాటలు ప్రారంభం ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని 14 నియోజకవర్గాల్లో ఏలూరు నగరపాలక సంస్థ, నూజివీడు, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, జంగారెడ్డిగూడెం మున్సిపాల్టీలతో పాటు ఆకివీడు, చింతలపూడి నగర పంచాయతీలు ఉన్నాయి. వీటిలో కొన్ని మున్సిపాల్టీలు పునర్విభజన, ఇతర అంశాలపై కోర్టులో కేసు ఉన్నా ఎన్నికలు జరుగుతాయని ముందస్తు హడావుడికి తెరలేచింది. దీంతో తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మున్సిపాల్టీతో పాటు అత్యధిక స్థానాలు పొత్తుల్లో దక్కించుకుంటామంటూ వ్యాఖ్యానించారు. అలాగే భీమవరం మున్సి పాల్టీలో టీడీపీ, జనసేన చైర్మన్ స్థానాల కోసం పోటాపోటీ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే సీరియస్గా మున్సిపల్ చైర్మన్ కోసం పట్టుపట్టకపోయినా నేతలు మాత్రం బలంగా ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు 50 వార్డులున్న భీమవరంలో 20 వార్డులు బీజేపీకి ఇవ్వాలని కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ డి మాండ్ చేయడం విశేషం. తణుకులో పొత్తుల్లో జనసేనకు దక్కాల్సిన సీటును త్యాగం చేసినందుకు మున్సిపల్ చైర్మన్ జనసేనకే ఇవ్వాల్సిందేనని డిమాండ్ తెరపైకి తెచ్చారు. టీడీపీ నేతలు మాత్రం అన్ని సీట్లు, అన్ని స్థానాలు ఇచ్చేంతా సీన్ లేదని ప్రత్యక్ష ఎన్నికలు కాబట్టి కోట్లు ఖర్చు పెట్టేవారికే మొదటి ప్రాధాన్యత ఉంటుందని, జనసేనకు ప్రతిచోట 15 శాతానికి మించకుండానే సీట్లు ఉంటాయని కేడర్కు బలంగా చెబుతున్నారు. -
న్యాయవాదులకు అండగా నిలవాలి
ఏలూరులో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ భారీ సమావేశం ఏలూరు టౌన్ : రాష్ట్రంలో న్యాయవాదుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం అందరూ ఐక్యంగా పోరాడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఏలూరు లేడీస్ క్లబ్లో జరిగిన ఏలూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ లీగల్ సెల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ కూటమి నేతలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా న్యాయవాదులను నిరాశకు గురిచేశారని విమర్శించారు. ముఖ్యంగా జూనియర్ న్యాయవాదులు వృత్తిలో స్థిరపడే దశలో ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో శ్రీవైఎస్సార్ లా నేస్తంశ్రీ ద్వారా నెలకు రూ.5 వేల ఆర్థిక సహాయం అందించి జూనియర్లకు భరోసా కల్పించామని గుర్తుచేశారు. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ను అమలు చేయాలి ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే న్యాయవాదులకు నెలకు రూ. 10 వేలు ఆర్థిక సహాయం ఇస్తామన్న హామీని విస్మరించడం సరికాదన్నారు. న్యాయవాదుల భద్రత కోసం శ్రీఅడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్శ్రీను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ రాజేంద్రప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీవీ రామాంజనేయులు, అధికార ప్రతినిధి మున్నుల జాన్గురునాథ్, సీనియర్ న్యాయవాదులు సుధీర్మాస్టర్, బి. జగన్నాధరెడ్డి, అచంట వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ సంక్షేమ పథకాలను మరింత విస్తరించాలని, నిధులు కేటాయించాలని కోరారు. న్యాయవాదుల కుటుంబాలకు మెరుగైన ఆరోగ్య, సామాజిక భద్రత కల్పించే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ లీగల్సెల్ ముఖ్యనేతలు వీ లక్ష్మీకుమార్, ఎం.వాసుదేవరావు, ఎం.రాజేంద్ర, స్టాన్లీబాబు, తుమరాడ స్రవంతి, ఇనపనూరి కేదారేశ్వరి, అల్తి శ్రీనివాసరావు, జే. సురేష్రెడ్డి, ఓ.సుజాత, విశాల్, జ్యోతి, కొండా యశ్వంత్, మధు, ఎం.రవి, పండుబాబు, భారీ సంఖ్యలో న్యాయవాదులు హాజరయ్యారు. -
భాద్రపదం.. పితృదేవతలకు ప్రీతికరం
● రేపటి నుంచి భాద్రపదం ప్రారంభం ● వినాయక చవితి తరువాత పితృదేవతల ఆరాధనకు ప్రాధాన్యం ద్వారకాతిరుమల: సకల శుభాలు, సుముహూర్తాలను అందించిన శ్రావణ మాసం శుక్రవారంతో ముగియనుంది. శనివారం నుంచి భాద్రపద మాసం ప్రారంభం కానుంది. సనాతన హైందవ సంప్రదాయంలో ప్రతి మాసానికీ ఓ ప్రత్యేకత ఉన్నట్టే.. భాద్రపదానికి ఉంది. ముఖ్యంగా పితృదేవతల ఆరాధనకు ఈ మాసం విశిష్టమైనదని పండితులు చెబుతున్నారు. ఆధ్యాత్మిక చింతన, దానధర్మాలు, పితృకార్యాలకు అనువైన మాసంగా పేర్కొంటున్నారు. భాద్రపదంలో వినాయక చవితి ప్రధాన పర్వదినంగా నిలుస్తోంది. ఈ నెల 14న వినాయకచవితి పండుగను నిర్వహిస్తారు. ఆ తర్వాత పలు పండుగలు, వ్రతాలు, జయంతులు వరుసగా రానున్నాయి. ముఖ్యంగా మహాలయ పక్షాల్లో పితృదేవతల ఆరాధనకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. పండుగలు.. వ్రతాలతో భక్తిభావం శుభకార్యాలకు కొంత విరామం ఉన్నా.. భాద్రపదంలో వచ్చే పండుగలు, వ్రతాలు భక్తిభావాన్ని పెంపొందిస్తాయి. ఏ కార్యం తలపెట్టినా ముందుగా విఘ్నాధిపతి గణపతిని స్మరించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో ఈ నెల 14న వినాయక చవితిని భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు. 15న రుషి పంచమి, 19న రాధాష్టమి, 23న వామన జయంతి, 25న అనంత పద్మనాభ వ్రతం, 26న భాద్రపద పౌర్ణమి రానున్నాయి. పౌర్ణమి అనంతరం పితృపక్షాలు ప్రారంభమవుతాయి. ఈ సమయంలో పూర్వీకులను స్మరించుకుంటూ తర్పణాలు, శ్రాద్ధ కర్మలు, అన్నదానాలు నిర్వహిస్తారు. అక్టోబర్ 10న సర్వపితృ అమావాస్యతో ఈ పర్వకాలం ముగియనుంది. జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం ఎప్పటికీ తీర్చలేనిది. వారి పేరిట దానధర్మాలు, అన్నదానాలు చేయడం, తర్పణాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పితృదేవతల అనుగ్రహం పొందవచ్చని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా మహాలయ పక్షాల్లో శ్రాద్ధ కర్మలు నిర్వహించడం ద్వారా పూర్వీకులకు శాంతి చేకూరుతుందని విశ్వాసం. –సేనాపతి మోహన మురళీకృష్ణ, వేద పండితుడు, శ్రీవారి దేవస్థానం, ద్వారకాతిరుమల -
గోల్డ్లోన్ కుంభకోణం గుట్టురట్టు
● జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడాలో గోల్డ్లోన్ స్కామ్ ● 176 ఖాతాల్లో బంగారం గోల్మాల్ ● ముగ్గురు బ్యాంకు అధికారుల అరెస్ట్ ఏలూరు టౌన్: జంగారెడ్డిగూడెంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో వెలుగు చూసిన గోల్డ్లోన్ కుంభకోణంలో దర్యాప్తు మరింత పుంజుకుంది. ఈ స్కామ్లో బ్యాంకు అధికారుల పాత్రపై లోతైన దర్యాప్తు చేపట్టగా.. వారు ప్రధాన నిందితుడితో కుమ్మకై ్క, ఖాతాదారులను మోసం చేసినట్లు పోలీసుల విచారణలో నిర్ధారణ అయింది. ఈ కేసులో ముగ్గురు బ్యాంకు అధికారులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు జంగారెడ్డిగూడెం పోలీసులు వెల్లడించారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. భారీ కుంభకోణం వివరాలు ఏలూరు జిల్లాలో సంచలనం సృష్టించిన ఈ ఘటనలో, బ్యాంక్ ఆఫ్ బరోడా జంగారెడ్డిగూడెం శాఖలో దాదాపు 6 కిలోల 449.50 గ్రాముల బంగారం మాయమైంది. ఖాతాదారులు గోల్డ్లోన్ కోసం కుదువపెట్టిన బంగారాన్ని అపహరించడంతో ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ మాయమైన బంగారం విలువ సుమారు రూ.10 కోట్లు ఉంటుందని అంచనా. ఎస్పీ శివకిషోర్ ప్రత్యేక చొరవతో.. జంగారెడ్డిగూడెం డీఎస్పీ బీహెచ్.వెంకటేశ్వర్లు, సీఐ ఎంవీ సుభాష్, ఎస్సైలు ఎన్.వీరప్రసాద్, ఎన్.కుటుంబరావు ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ ఏడాది జూలై 10న బ్యాంక్ ఆఫ్ బరోడాలో గోల్డ్ అప్రైజర్గా పనిచేసిన జంగారెడ్డిగూడెం వెలమపేటకు చెందిన చలపాక రాజును మొదటి నిందితుడిగా (ఏ1) అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 4.120 కిలోల బంగారు ఆభరణాలు, రూ.10 లక్షల నగదుతో పాటు మొత్తం సుమారు రూ.5 కోట్ల 81 లక్షల 65 వేల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. బ్యాంకు అధికారుల పాత్ర కీలకం ఈ కుంభకోణంలో బ్యాంక్ ఆఫ్ బరోడా జంగారెడ్డిగూడెం శాఖకు చెందిన ముగ్గురు అధికారుల పాత్ర కీలకంగా మారినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మొత్తం 176 గోల్డ్లోన్ ఖాతాల్లో భారీ అవకతవకలు జరిగినట్లు వెల్లడైంది. గోల్డ్ అప్రైజర్ చలపాక రాజు.. తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను అక్రమంగా అపహరించి, వాటి స్థానంలో నకిలీ ఆభరణాలను ఉంచినట్లు విచారణలో తేలింది. ఏ1 నిందితుడు చలపాక రాజు 2016 నుంచి గోల్డ్ అప్రైజర్ పనిచేస్తుండగా.. ఏ2 నిందితుడు కుమారపు భాస్కరరావు బ్రాంచ్ మేనేజర్గా 2025 మే నెల నుంచి, ఏ3 నిందితుడు తన్నేరు అజయ్బాబు బ్యాంకు జాయింట్ మేనేజర్గా 2025 అక్టోబర్ నుంచి పనిచేస్తున్నారు. క్రెడిట్ ఆఫీసర్గా పనిచేస్తున్న జంగల సాయిరాజ్ను ఏ4 నిందితుడిగా నిర్ధారించారు. ప్రధాన నిందితుడు చలపాక రాజుతో పాటు ఈ బ్యాంకు అధికారులందరూ కుమ్మకై ్క ఖాతాదారులను మోసం చేసినట్లు ఎస్పీ శివకిషోర్ స్పష్టం చేశారు. ముగ్గురు అధికారులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. ఈ కేసును విజయవంతంగా ఛేదించిన డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ సుభాష్, ఎస్ఐలు వీరప్రసాద్, కుటుంబరావు, ఏఎస్సై రాజేంద్రప్రసాద్, హెచ్సీ రాంబాబు, కానిస్టేబుళ్లు రమేష్, రామాంజనేయులు, జగదీష్, సీహెచ్.సత్యనారాయణ, మణికంఠ, రవికుమార్లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. -
పీఓపీ విగ్రహాల జోరు.. నిబంధనలు బేఖాతరు
భీమవరం: కాలుష్య నియంత్రణకు సాక్షాత్తు కలెక్టర్ చదలవాడ నాగరాణి జారీ చేసిన ఆదేశాలు క్షేత్రస్థాయిలో ఎక్కడా అమలు కావడం లేదు. జిల్లాలో విచ్చలవిడిగా క్యారీబ్యాగ్స్ వినియోగం సాగుతుండగా.. మరోవైపు వినాయక చవితికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ (పీఓపీ) విగ్రహాలను పూర్తిగా విడనాడాలన్న నిబంధనను బేఖాతరు చేస్తూ జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున విగ్రహాల తయారీ జోరుగా సాగుతోంది. జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం, ఆకివీడు, నరసాపురం తదితర ప్రాంతాల్లో భారీ గూడారాలు ఏర్పాటు చేసి, అధిక సంఖ్యలో.. రకరకాల ఆకృతుల్లో చిన్న, పెద్ద సైజు విగ్రహాలను తయారుచేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువవడం విశేషం. పర్యావరణానికి ముప్పు జిల్లాలోని 20 మండలాల పరిధిలో దాదాపు అన్ని గ్రామాల్లోనూ వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. కొన్ని గ్రామాల్లో అయితే మూడు, నాలుగు చోట్ల ప్రత్యేకంగా మండపాలు ఏర్పాటు చేసి తొమ్మిది రోజుల పాటు పూజలు జరుపుతారు. అయితే, గత కొన్నేళ్లుగా యువత 90 శాతం వరకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ విగ్రహాలనే ఎంచుకుంటున్నారు. ఇవి తక్కువ బరువుతో, ఆకర్షణీయమైన రంగులతో, విభిన్న ఆకారాల్లో లభిస్తుండటంతో వీటి వైపే మొగ్గు చూపుతున్నారు. రసాయనాలు, రంగులతో ప్రమాదం అయితే, ఈ విగ్రహాల తయారీలో జిప్సం, గంధకం, మెగ్నీషియం, పాదరసం, కాడ్మియం వంటి హానికారక రసాయనాలను వినియోగిస్తున్నారు. వీటితో తయారుచేసిన విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేసినప్పుడు.. ఆ రసాయనాలు జలవనరులలో కలిసి అందులోని ఆక్సిజన్ శాతాన్ని తగ్గించడంతోపాటు ఆమ్లత్వాన్ని విపరీతంగా పెంచుతాయని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ ఏళ్లు గడిచినా భూమిలో కరిగిపోయే అవకాశం లేదు. రంగుల కోసం సిలికా, జింక్, గాజు పొడులను వాడటం వల్ల జలచరాలకు తీవ్ర ప్రమాదం పొంచి ఉంది. ఎరుపు రంగు కోసం వాడే మెర్క్యూరీ సల్ఫేట్ వల్ల చర్మవ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అలాగే నలుపు రంగు కోసం రెడ్ ఆకై ్సడ్, కాడ్మియం; నీలం రంగు కోసం క్రోమియం, అయోడైడ్; గులాబీ రంగు కోసం పొటాషియం డైక్రోమేట్ వంటి రసాయనాలను వాడటం వల్ల ఉబ్బసం (ఆస్తమా), అలెర్జీలు, తీవ్రమైన చర్మవ్యాధులు బారిన పడే ప్రమాదముంది. వినాయక చవితి అసలు పరమార్థం ఇదే హిందువులు నిర్వహించే ప్రతి శుభకార్యాన్ని విఘ్నేశ్వర పూజతోనే ప్రారంభిస్తారు. వినాయకుడిని వివిధ రకాల పవిత్ర ఆకులు, పుష్పాలతో పూజించడం ద్వారా.. వాటి సువాసనల నుంచి వెలువడే మిశ్రమ వాయువులను పీల్చడం వల్ల శ్వాసకోశ వ్యాధులు దూరమవుతాయి. అంతేకాకుండా మానసిక ప్రశాంతత చేకూరుతుంది. కేవలం మట్టితో తయారుచేసిన వినాయక విగ్రహాలను పూజించి, వాటిని నీటిలో నిమజ్జనం చేయడం ద్వారా ఎలాంటి కాలుష్యం కలగకుండా సులువుగా కరిగిపోతాయి. పట్టించుకోని అధికార యంత్రాంగం పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ విగ్రహాల తయారీని పూర్తిగా నివారించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అధికారులను స్పష్టంగా ఆదేశించారు. అయినప్పటికీ, ప్రభుత్వ కార్యాలయాలకు అతి సమీపంలోనే విగ్రహాల తయారీ యథేచ్ఛగా సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. జిల్లాలో క్యారీబ్యాగ్స్ వాడకం నిషేధం ఎలాగైతే నీరుగారిపోయిందో, ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ విగ్రహాల నిషేధం కూడా అలాగే మూలన పడే పరిస్థితి కనిపిస్తోంది. చవితికి పెద్ద ఎత్తున ముస్తాబవుతున్న ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ విగ్రహాలు మట్టి గణపతి విగ్రహాలనే పూజిద్దాం: కలెక్టర్ భీమవరం (ప్రకాశంచౌక్): వినాయక చవితి వేడుకల్లో మట్టి వినాయక ప్రతిమలతో చేసిన విగ్రహాలనే పూజించాలని, పర్యావరణ పరిరక్షణకు అందరూ సహకరించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. మండపాల్లో, ఇండ్లలోనూ పర్యావరణ హిత వినాయక ప్రతిమలను ప్రతిష్టించి పూజించాలని కోరారు. శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో బుధవారం కలెక్టర్ ఛాంబర్లో మట్టి వినాయక ప్రతిమలను కలెక్టర్ నాగరాణి, ఎస్పీ నయీం అస్మి చేతుల మీదుగా ఆవిష్కరించారు. జాయింట్ కలెక్టర్ కల్పశ్రీ, చెరుకువాడ రంగసాయి, కంతేటి వెంకటరాజు పాల్గొన్నారు. -
తల్లి మందలించిందని కాలువలో దూకేశాడు
కుమారుడి ఆత్యహత్య నూజివీడు: తల్లి మందలించిందని క్షణికావేశంలో పోలవరం కుడి కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకున్న యువకుడి ఉదంతమిది. వివరాల ప్రకారం... నూజివీడు పట్టణంలోని ఎంప్లాయీస్ కాలనీకి చెందిన పిల్లి రామారావు, లక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు పిల్లి మహేష్ (26) బైక్ మెకానిక్ షెడ్లో పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం ఇంటివద్ద తల్లి చెప్పిన పని అతను చేయలేదు. దీంతో ఆ తల్లి కొడుకుని మందలించింది. ఆ తరువాత ఇంటి నుంచి ద్విచక్రవాహనంపై వెళ్లిన మహేష్ నేరుగా విజయవాడ రూరల్ మండలం, నున్న సమీపంలోని పోలవరం కుడి కాల్వ వద్దకు వెళ్లాడు. అక్కడ తన బండి, ఫోన్ వదిలేసి కాల్వలో ఉద్ధృతంగా వస్తున్న నీటి ప్రవాహంలోకి దూకాడు. సాయంత్రమైనా మహేష్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతని ఫోన్కు ఎన్నిసార్లు కాల్ చేసినా స్పందన లేదు. దీంతో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు ఫోన్ లొకేషన్ పరిశీలించగా, పోలవరం కాల్వ వద్ద ఉన్నట్లు చూపించింది. హుటాహుటిన అక్కడకు వెళ్లి చూడగా బైక్, ఫోన్ అక్కడే లభించడంతో, అతను కాల్వలో దూకి ఉంటాడని నిర్ధారణకు వచ్చారు. బుధవారం వేకువజాము నుంచే మహేష్ స్నేహితులందరూ కలిసి పోలవరం కుడి కాల్వ వెంబడి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం వెలగలేరు వద్ద పోలవరం కాల్వలో మహేష్ మృతదేహం కనిపించింది. వెంటనే మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులు, పోస్టుమార్టం నిమిత్తం మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
బెయిల్పై బయటకు వచ్చి.. ఇంటి తాళాలు పగులకొట్టి..
● చోరీ కేసులను ఛేదించిన పోలీసులు ● రూ.25 లక్షల సొత్తు స్వాధీనం తాడేపల్లిగూడెం: తేలికగా డబ్బు సంపాదించాలనే అలవాటుకు బానిసైన ఓ యువకుడు, జల్సాలు, ఆన్లైన్ జూదాల కోసం తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడ్డాడు. నరసాపురంనకు చెందిన కొత్తపల్లి నరేష్ అనే పాత నేరస్తుడు ఈ చోరీలకు పాల్పడుతూ ఇటీవల పోలీసులకు చిక్కాడు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను తాడేపల్లిగూడెం డీఎస్పీ యు.రవిచంద్ర బుధవారం పట్టణ పోలీస్ స్టేషన్లో వెల్లడించారు. నర్సాపురానికి చెందిన కొత్తపల్లి నరేష్పై రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సుమారు 40కి పైగా దొంగతనం కేసులు ఉన్నాయి. గతంలో జైలుకు వెళ్లిన అతను, బెయిల్పై ఆగస్టు 1న బయటకు వచ్చాడు. వారం రోజుల పాటు దొంగతనాలు చేయడానికి అనువైన ఇళ్లను రెక్కీ చేశాడు. ఆ తర్వాత తన చేతికి పని చెప్పాడు. తాడేపల్లిగూడెం పట్టణంలో వరుసగా చోరీలకు పాల్పడి, చివరకు పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. చోరీల పరంపర ఇలా.. ఆగస్టు 1న బెయిల్పై బయటకు వచ్చిన నరేష్, 6న పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో తాళం వేసి ఉన్న ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డాడు. 27వ తేదీన పట్టణంలోని రేలంగి సెంటర్ సమీపంలోని టీడీపీ ఆఫీస్ రోడ్డులో ఉన్న మరో ఇంట్లోకి ప్రవేశించి నగదు, బంగారం, వెండి ఆభరణాలను దోచుకెళ్లాడు. ఈ చోరీ చేసిన సొత్తును శేష్మహల్ రోడ్డులోని సాయిరాం గోల్డ్ టెస్టింగ్ సెంటర్ వద్ద విక్రయించేందుకు బుధవారం యత్నిస్తుండగా పోలీసులు అతన్ని పట్టుకున్నారు. నిందితుడు చేసిన రెండు చోరీలకు సంబంధించి సుమారు 19 కాసుల (151.207 గ్రాముల) బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.22 లక్షలు ఉంటుందని అంచనా. వీటితో పాటు కేజీ బరువుకు సమానమైన 967 గ్రాముల వెండి వస్తువులు (సుమారు రూ.3 లక్షల విలువైనవి) దక్కించుకున్నారు. మొత్తం రూ.25 లక్షల విలువైన సొత్తుతో పాటు, చోరీలకు ఉపయోగించిన ఏపీ 39 ఎంబీ 3280 నంబరు గల సుజుకి యాక్సెస్ స్కూటర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును విజయవంతంగా ఛేదించిన పట్టణ సీఐ బోణం ఆదిప్రసాద్, ఎస్సైలు బాదం శ్రీనివాసు, కె. వెంకటరమణ, సిబ్బంది ఏ. దుర్గాప్రసాద్, పి. శ్రీనివాసరావు, ఆర్ఎండీవీ ప్రసాద్, కె. మహేశ్వరరావులను అధికారులు ప్రత్యేకంగా అభినందించారు. -
చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
ద్వారకాతిరుమల: ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడిన నిందితుడిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. వివరాల ప్రకారం. జి.కొత్తపల్లి గ్రామానికి చెందిన కాసాని రామారావు, ఆయన భార్య ఈనెల 3న ఇంటికి తాళం వేసి నల్లజర్ల మండలం పోతినీడుపాలెంలోని చిన్నల్లుడి ఇంటికి వెళ్లారు. ఈ నెల 7న ఉదయం 7.30 గంటలకు తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. లోపల బీరువాను సైతం ధ్వంసం చేసి అందులోని ఒక జత బంగారు చెవి దిద్దులు, రూ. 50 వేల నగదును అపహరించినట్లు గుర్తించారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు, ఏలూరు డీఎస్పీ శ్రావణ్కుమార్ పర్యవేక్షణలో భీమడోలు సీఐ పి.కృష్ణ, ద్వారకాతిరుమల ఎస్సై టి.సుధీర్ దర్యాప్తు చేపట్టారు. కామవరపుకోట మండలం రావికంపాడు గ్రామానికి చెందిన యడ్లపల్లి హేమంత్ను నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి 10 గ్రాముల బంగారు చెవి దిద్దులు స్వాధీనం చేసుకున్నారు. నేరానికి ఉపయోగించిన బైక్ను సీజ్ చేశారు. కేసు దర్యాప్తులో హెడ్కానిస్టేబుల్ ప్రసాద్, సీహెచ్ లక్ష్మీనారాయణ, ఎన్.శివకృష్ణ పాల్గొన్నారు. మండవల్లి: రాజస్థాన్ రాష్ట్రంలో తలదాచుకున్న సిగరెట్ బాక్స్ల చోరీ కేసు నిందితుడిని మండవల్లి పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. మండలంలోని లోకుమూడిలో గల రత్న ఎంటర్ప్రైజెస్ గోడౌన్లో సిగరెట్ బాక్సులు చోరీకి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై 2026 జనవరి 6న మండవల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా ఈ కేసులో ఏ–2 నిందితుడు బుందారాం కుమావత్, ఏ–3 నిందితుడు మనక్ కుమావత్లను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అయితే, ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఏ–1 దినేష్ రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించారు. ఎస్పీ కే. ప్రతాప్ శివకుమార్, ఏలూరు ఎస్డీపీఓ డీ. శ్రావణ్కుమార్, సీఐ వీ. రవికుమార్ ఆదేశాల మేరకు.. మండవల్లి ఎస్సై రామచంద్రరావు టెక్నికల్ ఆధారాలు, ఇతర సమాచారాన్ని సేకరించారు. నిందితుడి ఆచూకీ రాజస్థాన్లో ఉన్నట్లు కనుగొని, అక్కడికి వెళ్లి చాకచక్యంగా బుధవారం అతన్ని అరెస్ట్ చేశారు. అడ్డుకోబోయి అస్వస్థతకు గురైన రైటర్ భీమవరం: భీమవరం ఒకటో పట్టణ పోలీసుస్టేషన్ ఆవరణలో పి.బ్రహ్మానందరావు అనే వ్యక్తి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్రహ్మానందరావుకు, ఆయన భార్య వాణిశ్రీకి మధ్య కొన్నేళ్లుగా వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ విషయమై మాట్లాడేందుకు ఇద్దరినీ బుధవారం పోలీస్స్టేషన్కు పిలిపించారు. భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇస్తుండగా మనస్తాపానికి గురైన బ్రహ్మానందరావు, అప్పటికే జేబులో తెచ్చుకున్న చెదల నివారణ మందును తాగేందుకు యత్నించారు. ఇది గమనించిన స్టేషన్ రైటర్ నాగరాజు వెంటనే అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వీరిద్దరి పెనుగులాటలో ఆ మందు కొంత స్టేషన్ రైటర్ నాగరాజు నోట్లో కూడా పడింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది ఇరువురిని హుటాహుటిన సమీపంలోని భీమవరం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక వైద్య చికిత్స అనంతరం స్టేషన్ రైటర్ నాగరాజును ఇంటికి పంపించారు. బ్రహ్మానందరావుకు ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్య చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ద్వారకాతిరుమల: మండలంలోని దేవినేనివారిగూడెంకు చెందిన ఆదూరి సురేష్ (30) ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈనెల 4న పిల్లలకు టిఫిన్ తీసుకుని ఇంటికి వెళ్తుండగా వాహనం అదుపుతప్పి గ్రామంలోని సీసీ రోడ్డుపై పడిపోయాడు. ఈ ఘటనలో సురేష్ తలకు తీవ్ర గాయమైంది. కుటుంబ సభ్యులు తొలుత ఏలూరు ప్రభుత్వాస్పత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి 11.30 గంటలకు మృతి చెందాడు. మృతుడి భార్య ఆదూరి సమీర బుధవారం ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై ఎస్కే అమీర్ తెలిపారు. -
మత్స్యకారులు విలపింఛెన్
కై కలూరు : మత్స్యకారులకు ఎన్టీఆర్ భరోసా పింఛను పథకం లబ్ధిదారులకు కష్టాలు తెచ్చిపెడుతోంది. వయస్సు 50 సంవత్సరాలు దాటిన మత్స్యకారులు మత్స్యశాఖ అభివృద్ధి అధికారి (ఎఫ్డీవో) సంతకాల కోసం కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. రోజూవారీ పనులు మానుకుని కిలోమీటర్లు ప్రయాణించి వస్తున్నా, అధికారులు అందుబాటులో లేకపోవడంతో నిరాశగా వెనుతిరుగుతున్నారు. మరికొందరు కార్యాలయాల్లోనే గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. బుధవారం ఉదయం కై కలూరులో ఎఫ్డీవో అందుబాటులో లేకపోవడంతో దరఖాస్తుదారులు పడరాని పాట్లు పడ్డారు. దీనికి తోడు దరఖాస్తుల గడువు సమీపిస్తుండటం, మధ్యలో వరుసగా ప్రభుత్వ సెలవులు రావడం ఆన్లైన్ నమోదు ప్రక్రియను మరింత కష్టతరం చేసింది. ఏలూరు జిల్లాలో... ఏలూరు జిల్లాలో మొత్తం 230 మత్స్యకార సొసైటీల్లో 22,000 మంది సభ్యులు ఉన్నారు. వీటిలో కొల్లేరు ప్రాంతంలోని 151 సొసైటీలకు సంబంధించి 14,474 మంది సభ్యులు ఉన్నారు. ఒక్క కై కలూరు నియోజకవర్గంలోనే 65 సొసైటీల నుంచి దాదాపు 10,000 మంది సభ్యులు ఉన్నారు. వరుస సెలవులతో ఆందోళన మత్స్యకారుల కొత్త పింఛను దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 16వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. సొసైటీలో సభ్యుడిగా ఉండటంతో పాటు, మత్స్య, అటవీశాఖలు అందించిన ఫిషర్మెన్ లైసెన్సులు, ఆధార్, రేషన్ కార్డులు, ఆధార్తో అనుసంధానమైన బ్యాంక్ పాస్పుస్తకం నకలు సమర్పించాల్సి ఉంటుంది. అయితే, ఈ నెల 12న రెండో శనివారం, 13న ఆదివారం, 14న వినాయకచవితి సందర్భంగా వరుస ప్రభుత్వ సెలవులు వచ్చాయి. కేవలం 15, 16 తేదీలు మాత్రమే దరఖాస్తుల సమర్పణకు అవకాశం ఉంది. మరోపక్క, కై కలూరు మండలంలో 4 వేల మంది దరఖాస్తుదారులకు గాను, బుధవారం సాయంత్రం నాటికి కేవలం 360 దరఖాస్తులపై మాత్రమే సంతకాలు పూర్తయ్యాయి. ఈ వేగాన్ని చూస్తే, గడువులోగా మొత్తం ప్రక్రియ పూర్తవ్వడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వేధిస్తున్న సిబ్బంది కొరత రాష్ట్రంలోనే మంచినీటి చేపల, రొయ్యల రెఫరల్ ల్యాబొరేటరీగా నిలిచిన కై కలూరు మత్స్యశాఖ కార్యాలయంలో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. గతంలో గ్రామ మత్స్యశాఖ సహాయకులు (వీఎఫ్ఏ) 32 మంది విధులు నిర్వహించగా, వీరు ఆక్వా, సొసైటీ రైతులకు ఎంతో సహాయపడ్డారు. ప్రస్తుతం ఉద్యోగ సర్దుబాట్ల కారణంగా కేవలం 22 మందే మిగిలారు. కలిదిండి మండలంలో ఇద్దరు మాత్రమే వీఎఫ్ఏలు ఉండటం ఈ సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. ఇవే కాకుండా ఒక ఎఫ్డీవో, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, ల్యాబ్ అటెండర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరో ఇద్దరు అధికారులు ఏలూరు, కై కలూరుల్లో మూడు రోజుల చొప్పున విభజన పద్ధతిలో పనిచేస్తున్నారు. తక్షణమే స్పందించి ఖాళీలను భర్తీ చేయాలని మత్స్యకారులు, రైతులు కోరుతున్నారు. మత్స్యకార సొసైటీల్లో సభ్యులు నిబంధనలో చూపించిన ధ్రువపత్రాలు తీసుకురావాలి. గురు, శుక్ర, మంగళ, బుధ వారాల్లో ఎక్కువ శాతం సభ్యులకు సంతకాలు చేసే అవకాశం ఉంది. ఆధార్ కార్డులో 50 ఏళ్లు దాటిన సభ్యులు మాత్రమే దరఖాస్తులు చేయాలి. – సీహెచ్ గణపతి, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి (ఎఫ్డీవో), కై కలూరు ఎన్టీఆర్ భరోసా పింఛను పథకంలో 50 ఏళ్లు దాటిన మత్స్యకార సొసైటీ సభ్యుల దరఖాస్తు గడవు పెంచాలి. ఈనెల 12, 13, 14న ప్రభుత్వ సెలవులు వచ్చాయి. చాలా మందికి నిబంధనలు తెలియవు. ఆన్లైన్ పక్రియ ఆలస్యం అవుతోంది. – బంటుమిల్లి సాదు కొండయ్య, ఎంపీటీసీ సభ్యుడు, పల్లెవాడ మత్స్యకార పింఛనుకు తిప్పలు వరుస సెలవులతో తగ్గిన దరఖాస్తుల గడువు సంతకాల కోసం ఫిషరీస్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు మొరాయిస్తున్న ఆన్లైన్ వెబ్సైట్లు -
పంట పొలాలను బొగ్గు పాలు చేస్తారా?
చింతలపూడి: రిలయన్స్ కార్పొరేట్ లాభాల కోసం అన్నదాతల జీవితాలను, పచ్చని వ్యవసాయ క్షేత్రాలను బొగ్గు పాలు చేస్తారా? అని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. శ్రీనివాస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. రాఘవాపురం శివారు అంకులయ్య కొత్తగూడెంలో బొగ్గు గని ప్రభావిత ప్రాంత రైతుల అత్యవసర సమావేశం మంగళవారం రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు ‘మా భూమి – మా హక్కు’, ‘రిలయన్స్ కు భూములివ్వం’ అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కె. శ్రీనివాస్ మాట్లాడుతూ రిలయన్స్ బొగ్గు ఆధారిత గ్యాస్ (యూసీజీ) ప్రాజెక్టు కోసం సుమారు 10 వేల ఎకరాల భూసేకరణ జరుపుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందన్నారు. స్థానిక రైతులతో కనీస చర్చలు జరపకుండా, వారి ఆమోదం లేకుండా బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. లక్షల కోట్ల పెట్టుబడులతో ప్రాంతం అభివృద్ధి చెందుతుందని పాలకులు మాయమాటలు చెబుతున్నారని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు ద్వారా కేవలం 5 వేల మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వమే చెబుతోందని, కానీ ఇక్కడ ఆయిల్ పామ్, కొబ్బరి, కోకో, మొక్కజొన్న, వరి పంటలపై వేలాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని గుర్తు చేశారు. ఈ భూములు కోల్పోతే రైతులు, వ్యవసాయ కార్మికుల ఉపాధి పూర్తిగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. యూసీజీ ప్రక్రియ వల్ల తలెత్తే పర్యావరణ ముప్పును అధికారులు గోప్యంగా ఉంచుతున్నారని, ప్రాజెక్టు సమగ్ర నివేదికను తక్షణమే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాభిప్రాయ సేకరణను మొక్కుబడిగా కాకుండా, ప్రజల అభీష్టానికి అనుగుణంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు పి. పాండురంగారావు, సీఐటీయూ జిల్లా నాయకులు ఆర్.వి.ఎస్. నారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు సత్యనారాయణతో పాటు రైతులు చీకటి శ్రీనివాసరావు, శెట్టిపల్లి ప్రసాద్, మామిళ్ళపల్లి అప్పారావు, బాలా నరసింహారావు, చీకటి వెంకట సత్యనారాయణ, చీకటి రజని, మట్టా దమయంతి, మోరంపూడి శ్రీనివాసరావు, చీకటి సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
తేలని విలీన పంచాయితీ
తాడేపల్లిగూడెం మున్సిపల్ ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠ తాడేపల్లిగూడెం: స్థానిక మున్సిపాలిటీలో కుంచనపల్లి, పడాల, ప్రత్తిపాడు, కొండ్రుపోలు, ఎల్.అగ్రహారం గ్రామాల విలీనంపై గత కొన్నేళ్లుగా హైకోర్టులో వివాదం నడుస్తోంది. ఈ కోర్టు లిటిగేషన్ల కారణంగా సుమారు ఏడేళ్లుగా గూడెం మున్సిపాలిటీకి ఎన్నికలు జరగడం లేదు. ప్రస్తుతం ప్రత్యేకాధికారి, అధికారుల కౌన్సిల్ సంయుక్త పర్యవేక్షణలోనే పాలన సాగుతోంది. త్వరలోనే రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశముండటంతో కోర్టు తీర్పు కోసం ప్రజాప్రతినిధులు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబరు 1న తీర్పు వస్తుందని భావించినప్పటికీ, సంబంధిత న్యాయమూర్తి అందుబాటులో లేకపోవడంతో విచారణ వాయిదా పడుతూ వచ్చి, చివరకు మంగళవారం నాటికి చేరింది. 24కు కేసు వాయిదా ఐదు గ్రామాల విలీనానికి సంబంధించి నమోదైన రెండు కేసులలో పిటిషనర్ల తరఫున వాదించాల్సిన న్యాయవాది మంగళవారం కోర్టుకు హాజరుకాలేదు. (పడాల, ఎల్.అగ్రహారం గ్రామాలకు ఒకరు, కుంచనపల్లి, ప్రత్తిపాడు, కొండ్రుపోలు గ్రామాలకు మరో న్యాయవాది కేసు నమోదు చేయగా.. వారిలో ఒకరు గవర్నమెంట్ ప్లీడర్గా వెళ్లడంతో ప్రస్తుతం ఒక్కరే ఉన్నారు). ఆయన కూడా రాకపోవడంతో తుది వాదనల విచారణను హైకోర్టు ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. ప్రభుత్వం తరఫున న్యాయవాది సాంబశివప్రసాద్ తన వాదనలు వినిపించారు. మళ్లీ సవాల్ చేస్తే ఎన్నికలు ప్రశ్నార్థకమే ఈ నెల 24న వెలువడే తుది తీర్పు విలీనానికి అనుకూలంగా వస్తే, ఆయా గ్రామాల ప్రజలు దానిని సవాల్ చేస్తూ మళ్లీ కోర్టును ఆశ్రయించే అవకాశముంది. దీంతో గూడెం మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై తీవ్ర అనిశ్చితి నెలకొంది. -
రైతుల సమక్షంలో రీ సర్వే చేయాలి
మరో ఐదుగురి అరెస్ట్ మత్తు కోసం ఉపయోగించే ట్రామడాల్ ఇంజెక్షన్లను అక్రమంగా కొనుగోలు చేసి, వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తున్న కేసులో మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు. 8లో uపెదపాడు: రీ–సర్వేలో రైతులను భాగస్వాములను చేయాలని, ముందుగానే సమాచారం అందించి వారి సమక్షంలోనే సర్వే పూర్తి చేసి ఈ–కేవైసీ నమోదు చేయాలని రాష్ట్ర సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మండలంలోని తాళ్లమూడి గ్రామంలో జరుగుతున్న రీ–సర్వేను జిల్లా రెవెన్యూ అధికారులతో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతుల సమక్షంలో సర్వే సాగుతుండటంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ కూర్మనాథ్ మాట్లాడుతూ సర్వేలో తప్పులకు తావులేకుండా పారదర్శకత కోసం క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2,800 బృందాల ద్వారా అత్యాధునిక రోవర్లతో సర్వే కొనసాగుతోందని తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి భూ వివాదాలు తలెత్తకుండా రైతులు సంతృప్తి చెందేలా ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ సర్వే ఇన్స్పెక్టర్ కేఎస్ మూర్తి, రీ–సర్వే డిప్యూటీ తహసీల్దార్ కె.దుర్గారావు, మండల సర్వేయర్ సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఏలూరుకు జాతీయ గుర్తింపు
ఏలూరు (ఆర్ఆర్పేట): వాయు కాలుష్య నియంత్రణలో ఏలూరు నగరం జాతీయ స్థాయిలో అద్భుత ప్రతిభ కనబరిచిందని నగర పాలక కమిషనర్ భాను ప్రతాప్ తెలిపారు. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ‘నేషనల్ క్లీన్ ఎయిర్’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ‘స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ (2025–26)’లో ఏలూరు జాతీయ స్థాయిలో 4వ ర్యాంక్ సాధించిందని మంగళవారం విలేకరులకు తెలిపారు. గతంలో 31వ ర్యాంకులో ఉన్న నగరం, అధికారుల కృషి ఫలితంగా కేటగిరీ–3 విభాగంలో ఈ ఘనత సాధించిందని వివరించారు. నగరంలో కాలుష్యాన్ని 69 మైక్రోగ్రాముల నుంచి 61 మైక్రోగ్రాములకు తగ్గించడంలో అధికారులు చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిచ్చాయని పేర్కొన్నారు. జాతీయ స్థాయి గుర్తింపు సాధించినందుకు నగరపాలక సంస్థ అధికారులను జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అభినందించారని తెలిపారు. ఇదే స్ఫూర్తితో ఏలూరును సంపూర్ణ పారిశుద్ధ్య నగరంగా తీర్చిదిద్దాలని ఆదేశించినట్లు స్పష్టం చేశారు. ఆకివీడు: స్థానిక సీహెచ్సీ ముగ్గురు గైనకాలజిస్టులను నియమించినట్లు జిల్లా వైద్య విధాన పరిషత్ కోఆర్డినేటర్ డాక్టర్ పగడాల సూర్యనారాయణ తెలిపారు. సీహెచ్సీలో గైనకాలజిస్టుల కొరతపై ఇటీవల ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన ఆయన, మంగళవారం ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సూర్యనారాయణ మాట్లాడుతూ తాత్కాలిక ప్రాతిపదికన వారంలో రెండేసి రోజుల చొప్పున విధులు నిర్వహించేలా భీమవరం నుంచి ఇద్దరు, నూజివీడు నుంచి ఒకరు చొప్పున ముగ్గురు వైద్యులను ఏర్పాటు చేశామని చెప్పారు. త్వరలోనే ఇక్కడ శాశ్వత గైనకాలజిస్టును నియమిస్తామని స్పష్టం చేశారు. గతంలో ఇక్కడ పనిచేస్తూ అమరావతికి డిప్యూటేషన్పై వెళ్లిన డాక్టర్ ప్రశాంత్ సోమవారం తిరిగి బాధ్యతలు స్వీకరించారని వివరించారు. అనంతరం వార్డులను పరిశీలించి, ఇన్పేషెంట్లతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలను తెలుసుకున్నారు. భీమడోలు: కొల్లేరు కాంటూరు పరిధిలోని అంబర్పేట రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 322 జిరాయితీ భూములను రీసర్వే కార్యక్రమంలో ప్రభుత్వ భూములుగా మార్చొద్దని, తమకు భూ హక్కు కల్పించాలని సన్న, చిన్నకారు రైతులు మంగళవారం భీమడోలు తహసీల్దార్ బి.రమాదేవికి వినతిపత్రం అందించారు. ఆరు దశాబ్ధాలుగా 55 ఎకరాల భూములను సాగు చేసుకుంటూ జీవిస్తున్నామని, ఇటీవల జిరాయితీ భూములను ప్రభుత్వ భూములుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని, అదే జరిగితే తామంతా రోడ్డున పడతామని, తమకు న్యాయం చేయాలని వారు వేడుకున్నారు. -
అరణ్యంలో హైటెక్ నిఘా
● సాంకేతిక పరిజ్ఞానంతో అడవులు, వన్యప్రాణుల రక్షణ ● లైవ్ కంట్రోల్ రూమ్, కెమెరా ట్రాప్లు ● డ్రోన్లతో కట్టుదిట్టమైన పర్యవేక్షణ బుధవారం శ్రీ 9 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026బుట్టాయగూడెం: అడవుల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణ కోసం అటవీశాఖ సరికొత్త సాంకేతికతతో కూడిన నిఘా వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై అడవుల్లో స్మగ్లర్లు అడుగుపెట్టినా, కార్చిచ్చు రగులుతున్నా క్షణాల్లో సమాచారం అధికారులకు చేరుతుంది. పాపికొండల అభయారణ్యంలోని ఎత్తైన ప్రాంతాల్లో అత్యాధునిక కెమెరాలను అమర్చి, అడవిలో జరిగే ప్రతి కదలికను కంట్రోల్ రూమ్ నుంచి లైవ్గా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. వీటితో పాటు 4జీ, పీటీజెడ్, ఫ్లాష్, డ్రోన్ కెమెరాలతో అటవీ ప్రాంతాన్ని కట్టుదిట్టంగా పర్యవేక్షిస్తున్నారు. 1,012.86 చదరపు కిలోమీటర్లలో విస్తరణ ఏలూరు జిల్లా పశ్చిమ ఏజెన్సీ పరిధిలోని బుట్టాయగూడెం, పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఉన్న పాపికొండల అభయారణ్యం 1,012.86 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉండటంతో, వేటగాళ్ల ఆగడాలకు పూర్తిగా అడ్డుకట్ట వేసేందుకు అధికారులు దట్టమైన అటవీ ప్రాంతంలో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా జంతువులతో పాటు అడవిలోకి అక్రమంగా చొరబడే వ్యక్తుల స్పష్టమైన చిత్రాలు నమోదవుతాయి. జంతు గణన కోసం అభయారణ్యం పరిధిలోని 116 ప్రాంతాల్లో మొత్తం 232 ట్రాప్ కెమెరాలను అమర్చారు. వీటి ద్వారా జంతుగణన సులభమవుతుంది. అభయారణ్యంలో అరుదైన జీవజాలం ఈ అభయారణ్యంలో ఎలుగుబంట్ల సంఖ్య అధికంగా ఉంది. వీటితో పాటు చిరుతలు, పెద్దపులులు, కొండగొర్రెలు, జింకలు, చుక్కల దుప్పులు, సాంబార్లు, అడవిపందులు, అడవి దున్నలు, ముళ్లపందులు, నక్కలు, ముంగీసలతో పాటు ప్రమాదకరమైన గిరినాగులు, నెమళ్లు, గద్దలు వంటి రకరకాల జీవజాలం సంచరిస్తోంది. వన్యప్రాణులను వేటాడినా, అక్రమాలకు పాల్పడినా కఠిన చట్టాల కింద చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. అడవులు, వన్యప్రాణుల సంరక్షణకు ఆధునిక సాంకేతికతతో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. నిఘా కెమెరాల ద్వారా కార్యాలయం నుంచే అడవిని నేరుగా పర్యవేక్షిస్తున్నాం. స్మగ్లింగ్కు పాల్పడినా, వన్యప్రాణులను వేటాడాలని చూసినా వెంటనే గుర్తించి కఠిన చట్టాల ద్వారా జైలుకు పంపుతాం. – ఎస్కే వలీ, అటవీశాఖ రేంజ్ అధికారి, పోలవరం -
‘మన అంగన్వాడీ – మన బాధ్యత’
● నేటి నుంచి జాతీయ పోషణ మాసోత్సవాలు ● ఏలూరులో పకడ్బందీ ఏర్పాట్లు కై కలూరు: పోషకాహార లోపరహిత సమాజమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా నేటి నుంచి ‘జాతీయ పోషణ మాసోత్సవాలు’ ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది ‘మన అంగన్వాడీ – మన బాధ్యత’ నినాదంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చిన్నారులు, కిషోర బాలికలు, గర్భిణులు, బాలింతలకు సరైన పౌష్టికాహారంపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబరు 9 నుంచి అక్టోబరు 8 వరకు నెల రోజుల పాటు ప్రత్యేక కార్యచరణ రూపొందించారు. ఏలూరు జిల్లాలో ఇలా ఏలూరు జిల్లా పరిధిలోని 2,226 అంగన్వాడీ కేంద్రాల ద్వారా పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జిల్లాలో 3 సంవత్సరాల లోపు పిల్లలు 47,450 మంది, 3–6 సంవత్సరాల లోపు పిల్లలు 7,163 మంది, అలాగే బాలింతలు ఉన్నారు. కలెక్టర్ కే.వెట్రిసెల్వీ ఆదేశాల మేరకు ఈ నెల 1 నుంచి 8 వరకు ముందస్తు సన్నాహక కార్యక్రమాలు పూర్తి చేశారు. ప్రాజెక్టు స్థాయిలో నెల రోజుల క్యాలెండర్ను తయారు చేయడంతో పాటు బ్యానర్లు, కరపత్రాలు, పోస్టర్లను పంపిణీ చేశారు. అక్టోబరు 9 నాటికి జిల్లా సమగ్ర నివేదికను రాష్ట్ర కార్యాలయానికి అందించనున్నారు. వారణాసిలో జాతీయ ప్రారంభం మొదటి రోజు జాతీయ ప్రారంభ కార్యక్రమం ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరగనుంది. వెబ్కాస్ట్ ద్వారా దీన్ని తిలకించిన అనంతరం, మధ్యాహ్నం 1 గంట తర్వాత జిల్లా స్థాయిలో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. మీడియా సమావేశం నిర్వహించి జిల్లా కార్యచరణ ప్రణాళికను విడుదల చేస్తారు. ఇదే రోజు ప్రాజెక్టు పరిధిలో ప్రారంభ సభలు, ప్రతిజ్ఞలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఏకకాలంలో ప్రారంభ ధ్రువీకరణ, ఏఎంసీ సభ్యులు, తల్లులతో సమావేశాలు, ఫొటోలు, వీడియో డాక్యుమెంటేషన్లు చేపడతారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు శిశు సంక్షేమ శాఖతో పాటు వైద్యారోగ్యం, విద్య, సమగ్రశిక్ష, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్వయం సహాయక సంఘాలు, వ్యవసాయం, ఉద్యానవనం, ఆహార భద్రత శాఖలు, ఎన్జీవోలు సంయుక్తంగా పనిచేయనున్నాయి. పోషకాహార విలువలు, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. నెల రోజుల్లో అంగన్వాడీ కేంద్రాల్లో ఏఎంసీ సమావేశం, రుచి పరీక్ష, వంటల ప్రదర్శన, పోషణ్ మేళా, పీఎంఎంవీవై నమోదు శిబిరం జరగాలి. ప్రతి కార్యక్రమం అరనిమషం వీడీయో, హెచ్డీ ఫొటోలు జన్ ఆందోళన్ డ్యాష్ బోర్డులో నమోదు చేయాలి. ప్రతీ అంగన్వాడీ కేంద్రానికి 10 అంశాల కార్యక్రమాన్ని రూపొందించాం. – పి.శారద, ఉమెన్, చైల్ట్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ ఆఫీసర్, ఏలూరు జిల్లా క్ర.సం అంశం నిర్వహణ తేదీలు 1. ఆహార వైవిద్యం – తగినంత ప్రోటీన్ సెప్టెంబరు 10–15 2. అంగన్వాడీ కేంద్రాల్లో తాజా వేడి భోజనం సెప్టెంబరు 16–21 3. సమాజ భాగస్వామ్యం, జవాబుదారితనం సెప్టెంబరు 22–26 4. పోషణ, బాల్య వికాసానికి ప్రారంభ ప్రేరణ సెప్టెంబరు 27–అక్టోబరు 01 5. ప్రధాన మంత్రి మాతృ వందన యోజన అక్టోబరు 02–08 -
ఈవీ ‘ప్రయాణం’ ఈజీ!
ద్వారకాతిరుమల: పెరుగుతున్న కాలుష్యం, రోజురోజుకూ భారమవుతున్న ఇంధన ధరలు, వాతావరణ మార్పుల ప్రభావం.. వీటన్నింటికీ ప్రత్యామ్నాయంగా ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ వాహనాల (ఈవీ) వినియోగం వేగంగా విస్తరిస్తోంది. పెట్రోల్, డీజిల్ వాహనాలకు భిన్నంగా విద్యుత్తో నడిచే ఈ వాహనాలు కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు, వినియోగదారులపై ఇంధన వ్యయ భారాన్ని కూడా తగ్గిస్తున్నాయి. ఈవీల మరో ప్రత్యేకత ఏమిటంటే.. విద్యుత్ మోటార్లు సాంప్రదాయ ఇంజిన్ల కంటే నిశ్శబ్దంగా పనిచేస్తాయి. దీంతో శబ్ద కాలుష్యాన్ని తగ్గించడంలోనూ ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. పర్యావరణ హితమైన రవాణా వ్యవస్థ వైపు ప్రజలను నడిపించాలనే ఉద్దేశంతో ఏటా సెప్టెంబర్ 9న ప్రపంచ విద్యుత్ వాహనాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనూ ఆర్టీసీ కీలక అడుగులు వేస్తోంది. ఏపీఎస్ ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తంగా 1,050 ఎలక్ట్రిక్ బస్సులను ’పీఎం ఈ–బస్ సేవా’ కింద ప్రవేశపెట్టే ప్రణాళికలో ఉంది. దీని పూర్తి అమలుకు మార్చి 2027 నాటిని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 750 బస్సులను 11 నగరాలకు, మరో 300 బస్సులను తిరుమల – తిరుపతి మార్గానికి కేటాయించారు. కాలుష్యానికి చెక్.. సాంప్రదాయ పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలు గాలి కాలుష్యానికి ప్రధాన కారణాల్లో ఒకటి. అయితే, ఈవీల్లో టెయిల్పైప్ ఉద్గారాలు ఉండవు. ఫలితంగా నగరాలు, పట్టణాల్లో గాలి నాణ్యత మెరుగుపడేందుకు ఇవి దోహదపడతాయి. ముఖ్యంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈవీల వినియోగం పెరగడం వల్ల వాయు కాలుష్యంతో పాటు శబ్ద కాలుష్యం కూడా గణనీయంగా తగ్గుతుంది. ప్రయాణ ఖర్చు ఆదా ఈవీ యజమానులకు ప్రధానంగా కలిగే ప్రయోజనం రోజువారీ ప్రయాణ ఖర్చు తగ్గడం. పెట్రోల్, డీజిల్తో పోలిస్తే విద్యుత్ను వినియోగించడం వల్ల కిలోమీటరుకు అయ్యే వ్యయం చాలా తక్కువ. రోజూ కార్యాలయాలు, వ్యాపారాలు, విద్యాసంస్థలు, ఇతర అవసరాల కోసం ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఇది దీర్ఘకాలంలో భారీ మొత్తాన్ని ఆదా చేస్తుంది. నిర్వహణ వ్యయం కూడా తక్కువే అంతర్గత దహన ఇంజిన్ వాహనాలతో పోలిస్తే ఈవీల్లో కదిలే యాంత్రిక భాగాలు తక్కువగా ఉంటాయి. ఇంజిన్ ఆయిల్ మార్పు వంటి కొన్ని సాధారణ నిర్వహణ అవసరాలు ఉండవు. దీంతో సర్వీసింగ్, నిర్వహణ ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. అయితే బ్యాటరీ ఆరోగ్యం, టైర్లు, బ్రేకులు, ఇతర సాధారణ నిర్వహణ అంశాలపై మాత్రం యజమానులు శ్రద్ధ వహించాలి. చార్జింగ్ సౌకర్యాలు విస్తరిస్తే ఈవీల వినియోగం పెరగడానికి అవసరమైన చార్జింగ్ మౌలిక వసతులు కూడా క్రమంగా విస్తరిస్తున్నాయి. ఇళ్ల వద్ద, కార్యాలయాల్లో, వాణిజ్య ప్రాంతాల్లో చార్జింగ్ సదుపాయాలు అందుబాటులోకి రావడం వినియోగదారులకు మరింత సౌకర్యాన్ని కల్పిస్తోంది. సౌర విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన వనరులతో ఈవీ చార్జింగ్ను అనుసంధానిస్తే పర్యావరణ ప్రయోజనం మరింత పెరిగే అవకాశం ఉంది. సవాళ్లూ ఉన్నాయి.. ఈవీలకు ప్రయోజనాలతో పాటు కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. వాహనం కొనుగోలు ధర, బ్యాటరీ ఖర్చు, చార్జింగ్ సమయం, దూర ప్రయాణాల్లో చార్జింగ్ స్టేషన్ల లభ్యత వంటి అంశాలను కొనుగోలుదారులు ముందుగానే పరిశీలించాలి. వాహనం కొనుగోలు చేసేటప్పుడు బ్యాటరీ సామర్థ్యం, వారంటీ, చార్జింగ్ సదుపాయం, సర్వీస్ నెట్వర్క్, వాస్తవిక డ్రైవింగ్ రేంజ్ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో.. సుమారు ఈవీ టూ–వీలర్స్ (స్కూటీలు/బైక్లు) 18,500 – 20,000, కార్లు 1,200 – 1,500, ఆటోలు/మూడు చక్రాల వాహనాలు 2,500 – 3,000 వరకు ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణకు ‘ఈవీ’లే దిక్సూచి వేగంగా విస్తరిస్తున్న వినియోగం వినియోగదారులకు ఆదా.. ఆదాయానికి మించి ప్రయోజనాలు నేడు ప్రపంచ విద్యుత్ వాహనాల దినోత్సవం 100 కిలో మీటర్ల ప్రయాణానికి అయ్యే ఖర్చు ఇలా.. వాహనం సగటు మైలేజ్ 100 కి.మీ ధర రూ.. 100 కి.మీ. (లీటరుకు) కి.మీలు అవసరమయ్యేది ఖర్చు పెట్రోల్ కారు 15 6.67 లీటర్లు 117.75/ లీటర్ 785 డీజిల్ కారు 20 5 లీటర్లు 95.20/ లీటర్ 476 ఈవీ కారు ఇంటి 08 12.5 యూనిట్లు 2/ యూనిట్ 25 (ఏసీ)ఛార్జింగ్ ఈవీ కారు మార్కెట్లో 08 12.5 20/ యూనిట్ 250 (డీసీ) ఛార్జింగ్ -
రాష్ట్రస్థాయి చదరంగం పోటీల్లో ప్రతిభ
టి.నరసాపురం: రాష్ట్రస్థాయి చదరంగం పోటీల్లో చిన్నగురవాయిగూడెం మోడల్ ప్రైమరీ స్కూల్ మూడో తరగతి విద్యార్థిని గుడికందుల చిరన్వి ద్వితీయ స్థానం సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు టి. కన్నయ్య తెలిపారు. ఈ నెల 4వ తేదీన గుంటూరు జిల్లా దుగ్గిరాలలోని డి.పాల్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘వి కింగ్స్ చెస్ అకాడమీ’ నిర్వహించిన ‘ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఓపెన్ రాపిడ్ చెస్ టోర్నమెంట్–2026’ పోటీల్లో చిరన్వి ఈ ప్రతిభ కనబరిచింది. అండర్–7 బాలికల విభాగంలో ఆడిన 7 గేములకు గాను 4 పాయింట్లు సాధించి ఆమె రెండో స్థానంలో నిలిచింది. విజేతగా నిలిచిన విద్యార్థినికి నిర్వాహకులు ప్రశంసాపత్రం, మెమొంటోతో పాటు నగదు బహుమతిని అందజేశారు. ఈ సందర్భంగా మంగళవారం పాఠశాలలో అభినందన సభ ఏర్పాటు చేసి విద్యార్థినిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎం. విజయమణి, ఎం. మోహినికుమారి, జి. శ్రీదేవి, ఎస్. రవికుమార్, విద్యార్థి తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
మద్ది క్షేత్రంలో విశేష పూజలు
జంగారెడ్డిగూడెం (చింతలపూడి): గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయంలో మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి స్వామిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయానికి వివిధ సేవల ద్వారా ఆలయానికి రూ. 2,73,457 ఆదాయం సమకూరినట్లు ఆలయ కమిటీ తెలిపింది. అలాగే సుమారు 1,950 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం రూ.25 లక్షల వ్యయంతో నిర్మించనున్న మరుగుదొడ్ల నిర్మాణ పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రాజాన సత్యనారాయణ, ధర్మకర్తలు పాల్గొన్నారు. ఆంజనేయస్వామి సన్నిధిలో... మద్ది ఆంజనేయస్వామివారిని ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ముఖమండపంలో అర్చకులు వేదాశీర్వచనం గావించగా, ఆలయ అసిస్టెంట్ కమిషనర్, కార్యనిర్వహణాధికారిణి ఆర్వీ చందన స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని బహుకరించారు. -
మత్తు ఇంజెక్షన్ల కేసులో మరో ఐదుగురి అరెస్ట్
జంగారెడ్డిగూడెం (చింతలపూడి): మత్తుగా ఉపయోగించే ట్రామడాల్ ఇంజెక్షన్లను అక్రమంగా కొనుగోలు చేసి, వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తున్న కేసులో మరో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు జంగారెడ్డిగూడెం డీఎస్పీ బి.వెంకటేశ్వర్లు తెలిపారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్ సూచనల మేరకు జంగారెడ్డిగూడెం సీఐ ఎంవీ సుభాష్, ఎస్సై ఎన్. వీరప్రసాద్, సిబ్బందితో కలిసి పట్టణంలోని పలు మెడికల్ ఏజెన్సీలపై దాడులు నిర్వహించినట్లు చెప్పారు. గతంలో లక్ష్మీ శ్రీనివాస మెడికల్ ఏజెన్సీ యజమాని కాండ్రేగుల లక్ష్మణ సాయికిషోర్ను అరెస్ట్ చేయగా, అతనిచ్చిన సమాచారం ఆధారంగా విస్తృత దర్యాప్తు చేపట్టి ఈ అరెస్టులు చేసినట్లు పేర్కొన్నారు. అరెస్టయిన నిందితులు జ్యోతిక పెద్దింటి మెడికల్ హాల్ యజమాని ఏలూరి సతీష్, రూపా పెద్దింటి మెడికల్ ఏజెన్సీ యజమాని ఏలూరి దుర్గాప్రసాద్, అదే ఏజెన్సీలో పనిచేసే దేవ రాజశేఖర్, శ్రీ భవానీ మెడికల్ ఏజెన్సీకి చెందిన మాధవరపు శివకృష్ణ, మధ్యాహ్నపువారిగూడెంలోని చిరు మెడికల్ యజమాని తమ్మిశెట్టి చిరంజీవి 880 మత్తు ఇంజెక్షన్లు స్వాధీనం నిందితుల నుంచి 780 ట్రామడెక్స్, 100 ట్రామెక్ ఇంజెక్షన్లతో పాటు విక్రయాలకు ఉపయోగించిన మొబైల్ ఫోన్లు, సంబంధిత రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరుస్తున్నట్లు వెల్లడించారు. యువతను పక్కదారి పట్టిస్తున్న మత్తు పదార్థాలు, ఇంజెక్షన్ల అక్రమ రవాణాపై వేగంగా స్పందించి, కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ ఎంవీ సుభాష్, ఎస్సై ఎన్.వీరప్రసాద్, ట్రాఫిక్ ఎస్సై ఎం. కుటుంబరావు, క్రైమ్ ఏఎస్సై సంపత్, ఎన్.రాజేంద్ర, హెచ్సీ ఉమామహేశ్వరరావు, కానిస్టేబుళ్లు రమేష్, షాన్ బాబు, మణికంఠ, సత్యనారాయణ, రవికుమార్లను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఆగిరిపల్లి: మండలంలోని శోభనాపురం గ్రామ శివారులో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై ఎస్సై హనుమంత్ నాగరాజు తన సిబ్బందితో కలిసి దాడి చేసి 8మంది జూదరులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.11,600 నగదు, 7 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
పోలవరం రూరల్: వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పోలవరం డీఎస్పీ కె. జయకృష్ణ సూచించారు. పోలవరంలో నిర్వహించిన గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండపాల ఏర్పాటుకు నిర్వాహకులు ఆన్లైన్ ద్వారా తప్పనిసరిగా అనుమతి పొందాలని, భద్రత కోసం ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ట్రాఫిక్కు ఆటంకం కలగకుండా చూడాలని స్పష్టం చేశారు. ఊరేగింపుల్లో డీజేలు, అధిక శబ్దాలు, అశ్లీల నృత్యాలు లేదా రెచ్చగొట్టే నినాదాలకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక విగ్రహాలనే ఉపయోగించాలని, నిమజ్జన వేడుకల్లో మద్యం సేవించిన వారిని దూరంగా ఉంచాలని కోరారు. కొయ్యలగూడెం: గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో వృద్ధుడు మృతి చెందిన ఘటన దిప్పకాయలపాడు తూర్పు కాల్వ వంతెనపై మంగళవారం ఉదయం సంభవించింది. దిప్పకాయలపాడు గ్రామానికి చెందిన ఆసుబోయిన వెంకటేశ్ (75) ఉపాధి హామీ కూలీగా పనిచేస్తున్నారు. బిల్లిమిల్లి సమీపంలో నిర్వహిస్తున్న ఉపాధి పనులకు హాజరు కావడానికి సైకిల్పై వెళుతుండగా.. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ముగ్గురు సంతానం ఉన్నారు. ఈ ఘటనపై ఎస్సై వి.చంద్రశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సుందరగిరిపై వైభవంగా పవిత్రారోహణ
● స్వర్ణ శేషవాహనంపై నారసింహుడికి కోవెల ఉత్సవం ● వేడుకల్లో నరసింహ గురూజీతో పాటు పాల్గొన్న సినీ దర్శకుడు త్రివిక్రమ్ ద్వారకాతిరుమల: చినవెంకన్న ఆలయానికి దత్తత దేవాలయమైన ఐఎస్ జగన్నాథపురంలోని సుందరగిరిపై కొలువైన శ్రీ కనకవల్లీ సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దివ్య పవిత్రోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో రెండో రోజు మంగళవారం పవిత్రారోహణ వేడుక కన్నులపండువగా జరిగింది. ముందుగా అర్చకులు, పండితులు ఆలయ యాగశాలలో ఉదయం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణల నడుమ మండప పూజలు, నిత్య హోమాలు, బలిహరణ, మూలవరులకు, ఉత్సవ మూర్తులకు అభిషేకాలు, అలంకరణలు జరిపారు. ఆ తరువాత స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను స్వర్ణ శేష వాహనంపై ఉంచి పూజలు నిర్వహించిన అనంతరం దివ్య పవిత్రాలతో ఆలయం చుట్టూ కొవెల ప్రదక్షిణలు చేశారు. ఆ తరువాత స్వామివారి మూలవిరాట్, ఉత్సవ మూర్తులపై దివ్య పవిత్రాలను వేసి పవిత్రారోహణ వేడుకను నేత్రపర్వంగా నిర్వహించారు. సాయంత్రం మండప పూజలు, నిత్య హోమములు, మూలమంత్ర హోమములు, బలిహరణ, నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. హైదరాబాద్కు చెందిన కొచ్చర్లకోట సత్యవెంకట లక్ష్మీనరసింహ గురూజీతో పాటు ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పండితుల నుంచి వేద ఆశీర్వచనాన్ని పొందారు. ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. బుధవారం జరిగే పవిత్రావరోహణతో ఉత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. -
కొల్లేరుపై లోకల్ రాజకీయం
మంగళవారం శ్రీ 8 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026సాక్షి ప్రతినిధి, ఏలూరు: స్థానిక సంస్థల ఎన్నికల వేళ కొల్లేరు రాజకీయానికి కూటమి తెరలేపింది. ప్రజల ఓట్లకు గాలం వేయడానికి భూపంపిణీ అంటూ కొత్త హామీతో ముందుకు వస్తోంది. లంక గ్రామ ప్రజల అమాయకత్వాన్ని ఓట్ల రూపంలో మలచుకుని స్థానిక పోరు ముగిసిన తర్వాత విస్మరించే తరహాలో కొత్త హామీల హడావుడికి తెరదీయడం కొల్లేరులో చర్చనీయాంశంగా మారింది. కొల్లేరు 5వ కాంటూరు అభయారణ్య పరిధిలో అక్రమ చెరువుల తొలగింపుపై సుప్రీంకోర్టు, సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ (సీఈసీ) ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీనికి భిన్నంగా కూటమి నేతలు అమలయ్యే అవకాశం లేదని తెలిసినా భూముల పంపిణీ పేరుతో గాలం వేస్తున్నారు. 77,138 ఎకరాల్లో.. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలో కొల్లేరు 5వ కాంటూరు వరకు 9 మండలాల పరిధిలో 122 గ్రామాల్లో 77,138 ఎకరాల్లో కొల్లేరు విస్తరించి ఉంది. మొత్తం విస్తీర్ణంలో 14,932 పట్టా భూములు, 5,510 డీ ఫాం భూములను మినహాయించాలని కూటమి నేతల అండదండలతో పలువురు సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. గతేడాది కొల్లేరు పరిశీలనకు వచ్చిన సీఈసీ ముందు రాజకీయనేతలు పలు డిమాండ్లు పెట్టగా అవి తిరస్కరణకు గురయ్యాయి. పైగా రెండు నెలల్లో చిత్తడి నేలల చట్టం ప్రకారం సరిహద్దులను అందించాలని అధికారులను హెచ్చరించింది. ఎన్నికల నాటకం.. భూ పంపిణీ హామీలు కోర్టు వివాదాలు, కేంద్ర నిబంధనలు గుదిబండగా మారిన సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో కూటమి నేతలు మళ్లీ పాత పాట అందుకున్నారు. కొల్లేరు భూములను రైతులకు, నిరుపేదలకు పంపిణీ చేస్తామంటూ దశాబ్దాలుగా చెప్పిన మాటనే మళ్లీ చెబుతున్నారు. ఇటీవల కై కలూరు నియోజకవర్గంలో పర్యటించిన సీఎం చంద్రబాబు సైతం కొల్లేరు వ్యవహారంపై ఎలాంటి హామీ ఇవ్వలేదు. కొల్లేరు సరిహద్దుల వివాదం న్యాయస్థానాల పరిధిలో ఉన్నప్పుడు క్షేత్రస్థాయిలో భూ పంపిణీ ఎలా సాధ్యమనే ప్రశ్నకు నేతల వద్ద సమాధానం లేదు. కొల్లేరు పరీవాహక నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కొల్లేరుకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని పదేపదే చెబుతున్నారు. మరోపక్క సుప్రీంకోర్టు చిత్తడి నేలల చట్టం అమలు కోసం అధికారులను నివేదికలు కోరింది. కొల్లేరు అభ యారణ్య చట్టం కాంటూరు 5 వరకు ఉంటే చిత్తడి నేలల చట్టం కాంటూరు 10 వరకు ఉంటుంది. కొల్లేరు అభయారణ్య పరిరక్షణ అనేది అంతర్జాతీయ స్థాయి ప్రాముఖ్యత కలిగిన పర్యావరణ అంశం. న్యాయస్థానాలు, పర్యావరణ కమిటీలు అక్రమాలపై ఉక్కుపాదం మోపుతుంటే, ఎన్నికల తాయిలాల కోసం మళ్లీ కొల్లేరు భూములను తెరపైకి తేవడం ప్రజలను వంచించడమే అని పలువురు వాపోతున్నారు. స్థానిక పోరు నేపథ్యంలో మళ్లీ భూ పంపకం పేరుతో హడావుడి కొల్లేరు వ్యవహారం కోర్టులో ఉన్నా కూటమి నేతల అసత్య హామీలు లంక గ్రామాలే టార్గెట్గా ముందస్తు హంగామా ఎన్నికలు వచ్చినప్పుడల్లా కొల్లేరు భూ పంపిణీ అంటూ కొత్త హామీలు కొల్లేరు సమస్యలను పరిష్కరిస్తామని ఎన్నికల్లో నాయకులు హామీలు ఇచ్చారు. కోర్టులు ఏం చెబుతున్నాయనే విషయాలు కొల్లేరు ప్రజలకు తెలియడం లేదు. కొల్లేరుపై స్పష్టమైన విధానాన్ని తెలపాలి. తీవ్ర తాగునీటి సమస్యను పరిష్కరించండి. – జయమంగళ కాసులు, మాజీ సర్పంచ్, పెంచికలమర్రు స్థానిక ఎన్నికల్లో పట్టు కోసమే కూటమి ప్రభుత్వం తెరపైకి మరోసారి కొల్లేరు అంశాన్ని తీసుకువచ్చింది. కూటమి నాయకులు చెప్పే కల్లబొల్లి మాటలను నమ్మే పరిస్థితిలో కొల్లేరులో రైతులు లేరు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం తథ్యం. – మోరు రామరాజు, వైఎస్సార్సీపీ ప్రచార విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
సుందరగిరిపై దివ్య పవిత్రోత్సవాలు
ద్వారకాతిరుమల: చినవెంకన్న ఆలయానికి దత్తత దేవాలయమైన ఐఎస్ జగన్నాథపురంలోని సుందరగిరిపై కొలువైన శ్రీ కనకవల్లీ సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో దివ్య పవిత్రోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో తెలిసీ తెలియక జరిగిన తప్పుల ప్రాయఃశ్చిత్తం నిమిత్తం నిర్వహిస్తున్న ఈ పవిత్రోత్సవాలు స్వామివారి కీర్తిని, వైభవాన్ని మరింతగా చాటనున్నాయి. ఆలయ యాగశాలలో వేద పండితులు, అర్చకులు ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనం, రుత్విక్ వరుణ, అఖండ దీపస్థాపన, దీక్షాధారణ, పంచగవ్య ప్రాశన, పంచగవ్య ప్రోక్షణ, అగ్ని ప్రతిష్ఠాపన, వాస్తు హోమాది కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణల నడుమ అంకురార్పణ చేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. విహిత దేవత మండప ఆరాధనలు, పవిత్రాభిమన్త్రణ, మూల మంత్ర హోమాలు, అధివాసములు, నీరాజన మంత్రపుష్పములు, బలిహరణలు నిర్వహించారు. హైదరాబాద్కు చెందిన కొచ్చర్లకోట సత్యవెంకట లక్ష్మీనరసింహ గురూజీ కుటుంబ సమేతంగా ఈ వేడుకల్లో పాల్గొని, పూజాధి కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. కారు ఢీకొని బాలుడి దుర్మరణం.. తండ్రికి గాయాలు ఆకివీడు: ఏలూరు జిల్లా కై కలూరు శివారు వడ్డిగూడెంకు చెందిన కొల్లేపర పవన్కుమార్, ఆయన రెండవ కుమారుడు జ్ఞానేశ్వర్ (5) జ్వరంతో బాధపడుతుండగా సోమవారం ద్విచక్ర వాహనంపై ఆకివీడు వచ్చి, స్థానిక పిల్లల ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నారు. అనంతరం తిరిగి ఇంటికి బయలుదేరగా, జాతీయ రహదారిపై దుంపగడప గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న కారు వారిని వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మోటారు సైకిల్పై నుంచి తండ్రీకొడుకులు రోడ్డుపై పడిపోయారు. బాలుడు జ్ఞానేశ్వర్కు తలపై తీవ్ర గాయమవ్వడంతో వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తీవ్ర గాయాలైన తండ్రి పవన్కుమార్ స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు చేతి మోచేయి భాగం వెనుకవైపు, వీపుపై తీవ్ర గాయాలయ్యాయి. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక సీహెచ్సీలోని మార్చురీకి తరలించారు. మంగళవారం పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎస్సై శుభశేఖర్, సీఐ కాళీచరణ్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. తల్లడిల్లుతున్న అమ్మ, అన్న జ్వరంతో బాధపడుతున్న జ్ఞానేశ్వర్ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకుని వస్తానని చెప్పి, తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని తల్లి, అన్న కన్నీరుమున్నీరవుతున్నారు. ఎంతో తెలివిగా, చలాకీగా తిరిగే తన కుమారుడు విగతజీవుడిగా పడి ఉండటాన్ని చూసి ఆ తల్లి పడుతున్న వేదన వర్ణనాతీతంగా ఉంది. కొయ్యలగూడెం: దిప్పకాయలపాడు గ్రామానికి చెందిన వర్జీనియా పొగాకు రైతు ఎర్రిబోయిన శ్రీనివాసరావు (40) అప్పుల బాధతో పురుగుమందు తాగి, చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మాజీ సర్పంచ్ గొడ్డటి రాణి, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీనివాసరావు 17 ఎకరాల్లో కౌలు సాగు కోసం రూ. 50 లక్షల వరకు అప్పులు (బ్యాంకు రుణం రూ. 20 లక్షలతో కలిపి) పెట్టుబడి పెట్టాడు. అయితే, ధరలు పడిపోవడంతో 30 క్వింటాళ్ల పొగాకు అమ్మగా కేవలం రూ. 10 లక్షలే వచ్చాయి. పెరిగిన అప్పులు తీర్చే మార్గం లేక, ధరలు మళ్లీ పుంజుకుంటాయన్న ఆశ నిరాశ కావడంతో మనస్తాపం చెంది ఈ నెల 5న ఆయన పొలంలో పురుగుమందు తాగాడు. రాజమండ్రి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆటోలో డ్రమ్ములతో కోళ్ల వ్యర్థాలు
దెందులూరు: ఆటోలో కోళ్ల వ్యర్థాలను పోతునూరు శివారులోని చేపల చెరువులకు తరలిస్తుండగా దెందులూరు ఎస్సై డి.వెంకట్కుమార్కు పట్టుబడ్డారు. సంఘటన వివరాలను ఆయన వెల్లడించారు. ఈ నెల 6న గుండుగొలను నుంచి పోతునూరు చెరువుల వైపు వెళ్తున్న ఆటోను వెంబడించగా, ఆటోలో ఉన్న వ్యర్థ పదార్థాల డ్రమ్ములు రెండు కింద పడిపోయాయి. అదే సమయంలో అదుపుతప్పి ఆటో చెరువులో పడిపోయిందని ఎస్సై తెలిపారు. ఈ ఘటనపై ఆటో డ్రైవర్ కర్నాటి ప్రభాకర్రాజు, తేరా రాజశేఖర్తో పాటు హనుమాన్ జంక్షన్లోని కారుణ్య చికెన్ సెంటర్ యజమానిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. విచారణలో భాగంగా మొత్తం 8 డ్రమ్ములతో చికెన్ వ్యర్థాలను తరలిస్తున్నట్లు నిర్ధారణ అయిందని ఆయన పేర్కొన్నారు. చెరువులో పడిన ఆటో -
స్థానిక సమరానికి సన్నద్ధం
ఏలూరులో వైఎస్సార్సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఏలూరు టౌన్: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయబావుటా లక్ష్యంగా సమష్టిగా కృషి చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) అన్నారు. స్థానిక ఏ1 కన్వెన్షన్లో సోమవారం పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ‘టీడీపీ వెన్ను పోటు పార్టీ.. వెన్నుపోటు పాలన’ అనే బ్రోచర్ను ఆవిష్కరించారు. మాజీ సీఎం జగన్ పాలనలో సంక్షేమ పథకాలు, లబ్ధిదారులతో కూడిన వివరాలతో ముద్రించిన బ్రోచర్ను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. జిల్లాలో పార్టీ బలోపేతం, పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం, ప్రజా సమస్యలపై పోరాటాలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. స్థానిక పోరులో అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, గెలుపునకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికపై దృష్టి సారించాలని తీర్మానించారు. ప్రజలతో మమేకం కావాలి పార్టీ శ్రేణులంతా ప్రజలతో మమేకమవుతూ, వారి సమస్యలు తెలుసుకోని పరిష్కారానికి కృషిచేయాలని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ అన్నారు. సమష్టి నిర్ణయాలతో ముందుకు సాగుతూ అభ్యర్థుల విజయానికి నిబద్ధతతో పనిచేయాలని కోరారు. కూటమి పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలతో కలిసి పోరుబాట పట్టాలన్నారు. భవిష్యత్ అంతా కార్యకర్తలదేనని వైఎస్ జగన్ హామీ ఇచ్చారన్నారు. టీడీపీది అరాచక పాలన నేడు రాష్ట్రంలో టీడీపీ పాలన చూస్తుంటే దేశంలోనే ఉన్నామా.. పక్క దేశంలో ఉన్నామా? అన్న అనుమానం వస్తుందనీ నూజివీడు మాజీ ఎమ్మెల్యే సమన్వయకర్త మేకా వెంకటప్రతాప్ అప్పారావు అన్నారు. కూటమి పాలనతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారనీ, పార్టీ శ్రేణులు అండగా నిలవాలన్నారు. అన్నివర్గాల్లో అసంతృప్తి పీఏసీ సభ్యుడు, ఉంగుటూరు సమన్వయకర్త పుప్పాల వాసుబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారని, రోడ్లెక్కి నిరసన తెలుపుతున్నారన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులు అండగా ఉంటూ వారి పక్షాన ఉద్యమించాలన్నారు. డీఎస్సీలో అక్రమాలు పోలవరం మాజీ ఎమ్మెల్యే, సమన్వయకర్త తెల్లం బాలరాజు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందనీ, ఉద్యోగాల నియామకాల పేరుతో స్కాములు చేస్తోందని విమర్శించారు. డీఎస్సీ పోస్టుల భర్తీలో విద్యామంత్రిపై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయనీ, సీబీఐ విచారణకు వెళ్లే దమ్ములేక, వైఎస్సార్సీపీ నేతలపై వేధింపులకు పాల్పడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల తరఫున పోరాటం చింతలపూడి సమన్వయకర్త కంభం విజయరాజు మాట్లాడుతూ.. గత వైఎస్సార్సీపీ పాలనలో సచి వాలయ ఉద్యోగాల భర్తీ పారదర్శకంగా జరిగిందని, నేడు ఆ పరిస్థితి లేదన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులంతా ప్రజలతో ఉంటూ పోరాటం చేయాల్సిన సమయం అసన్నమైందన్నారు. సమన్వయంతో విజయం ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ అభ్యర్థుల విజయానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. రాష్ట్ర బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నౌడు వెంకటరమణ మాట్లాడుతూ టీడీపీ నేతలు బీసీలపై లేనిపోని ప్రేమ ఒలకబోస్తున్నారనీ, టీడీపీ కేవలం బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకుందని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీలోని బీసీ నేతలను టార్గెట్ చేస్తున్నారని, స్థానిక ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పదని హెచ్చరించారు. దెందులూరు నేత కొఠారు రామచంద్రరావు, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్గురునాథ్, రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు, ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, నియోజకవర్గ పరిశీలకులు నూకపెయ్యి సుధీర్బాబు (కై కలూరు), డీవీఆర్కే చౌదరి (ఏలూరు), దాసరి రమేష్ (చింతలపూడి), కనుమూరి శివాజీ (పోలవరం), వాసంశెట్టి గంగాధర్ (నూజివీడు), సుబ్బరాజు (ఉంగుటూరు), నాయకులు తుమరాడ స్రవంతి, కోమటి విష్ణువర్థన్, శెట్టి రాజా, ముంగర సంజయ్కుమార్, మంతెన సోమరాజు, అంబికా రాజా, పల్లగాని నరసింహారావు, ఆళ్ల సతీష్చౌదరి, సయ్యద్ బాజీ, కామిరెడ్డి నాని, వాసిరెడ్డి మధు, నెరుసు చిరంజీవి, గేదెల సూర్యప్రకాష్, తేరా ఆనంద్, చిక్కాల దుర్గాప్రసాద్, భోగిశెట్టి పార్వతి, పల్లి శ్రీనివాస్, పి.రాజేష్, స్టాన్లీబాబు, భాస్కర్ల బాచి, సాయిల స్వాతి, చిలకపాటి డింపుల్, జిజ్జువరపు విజయనిర్మల, చప్పిడి వెంకన్న, కిలాడి దుర్గారావు, ఇనపనూరి జగదీష్, కంచుమర్తి తులసీ, తులసీ వర్మ, కుమారి, మోటమర్రి సదానంద కుమార్, బండ్లమూడి సునీల్, జిల్లా పార్టీ కమిటీ సభ్యులు, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ముఖ్యనేతలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. తానూ పార్టీలో ఒక కార్యకర్తనేననీ.. స్థానిక ఎన్నికల్లో సమష్టిగా పోరాటం చేస్తే విజయం తధ్యమని జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ అన్నారు. కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయంతో పాటు 2029 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ను మరోసారి ముఖ్యమంత్రిని చేసేవరకూ అలుపెరుగని పోరాటం చేయాలన్నారు. నేతలంతా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని, టీడీపీ పాలనపై ప్రజలతో కలిసి పోరాటం చేయాలని డీఎన్నార్ పిలుపునిచ్చారు. -
ఆర్చిపై పేరు తొలగించాలంటూ వినతి
నూజివీడు: నూజివీడు ఎమ్మార్ అప్పారావు కాలనీ వద్ద అనుమతి లేకుండా నిర్మించిన ఆర్చిపై కాలనీతో సంబంధం లేకపోయినా వేసిన మంత్రి కొలుసు పార్థసారథి పేరును తొలగించాలని కోరుతూ కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో వైఎస్సార్సీపీ నాయకులు కలెక్టర్ వెట్రిసెల్వికి సోమవారం వినతిపత్రం అందజేశారు. వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు శీలం రాము, జెడ్పీ వైస్ చైర్మన్ గుడిమళ్ల కృష్ణంరాజు, మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు మలిశెట్టి బాబీ మాట్లాడుతూ కాలనీని 2006లో అప్పటి సీఎం వైఎస్సార్ శంకుస్థాపన చేసి 4 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వడంతో పాటు ఇందిరమ్మ గృహాలను మంజూరు చేశారన్నారు. అప్పటి నుంచి కాలనీ మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అభివృద్ధి చేసుకుంటూ వచ్చారన్నారు. ఇప్పుడు ఇష్టారాజ్యంగా నిర్మించడమే కాకుండా వారికి వారే వారి పేర్లు వే సుకోవడంపై సబ్ కలెక్టర్కు, మున్సిపల్ కమిషనర్కు తెలిపినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇప్పటికై నా ఆర్చిపై మంత్రి కొలుసు పేరును తొలగించాలని కోరారు. ఏలూరు (ఆర్ఆర్పేట): పీజీఆర్ఎస్లో అందిన అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం జిల్లాస్థాయి పీజీఆర్ఎస్లో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలో ఎన్టీఆర్ భరోసా నూతన పింఛన్ల నమోదు ప్రక్రియ ఈనెల 16 వరకు స్వర్ణ గ్రామం/స్వర్ణ వార్డుల్లో నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ కె.వెట్రిసెల్వి ప్రకటనలో తెలిపారు. అర్హులు డిజిటల్ అసిస్టెంట్లు లేదా వార్డు ఎడ్యుకేషన్–డేటా ప్రాసెసింగ్ కార్యదర్శులను నేరుగా సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): నెలాఖరు నాటికి 1,500 మంది పోలవరం ప్రాజెక్టు నిర్వాసి తులకు పునరావాస కాలనీల్లో గృహప్రవేశాలు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. పోలవరం ప్రాజెక్ట్ పునరావాసం, కాలనీల నిర్మాణాలకు సంబంధించి భూసేకరణ, కాలనీల నిర్మాణ పనులపై అధికారులతో సమీక్షించారు. నిర్వాసితులను కాలనీలకు తరలించేందుకు డిసెంబర్ వరకూ నెలవారీ లక్ష్యాలు నిర్దేశించుకుని డిసెంబర్లోపు పోలవరం ప్రాజెక్ట్ మొదటి దశ నిర్వాసితులందరినీ కాలనీలకు తరలించేందుకు చర్య లు తీసుకోవాలన్నారు. కాలనీలో ఇళ్ల నిర్మాణంతో పాటు మౌలిక వసతుల కల్పనపై దృష్టి సా రించాలన్నారు. జేసీ ఎంజే అభిషేక్ గౌడ, పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ అభిషేక్, ఐటీడీఏ పీఓ రాములు నాయక్, ఆర్డీఓ రమణ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు టౌన్: ఏలూరు కొత్తబస్టాండ్లో ప్ర త్యేకంగా ఏర్పాటుచేసిన మదర్ ఫీడింగ్ సెంటర్ను సోమవారం రాత్రి జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సెంటర్లో సౌకర్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మెరుగైన రీతిలో సౌకర్యాల కల్పనకు అధికారులకు సూచనలు, ఆదేశాలు జారీ చే శారు. ఎంతో ప్రాధ్యానమిస్తూ కేంద్రాన్ని ఏర్పా టు చేశారని, శ్రద్ధ చూపాలని సూచించారు. డీఎస్పీ డి.శ్రావణ్కుమార్, త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు, టూటౌన్ సీఐ అశోక్కుమార్, ఆర్టీసీ డీఎం, సిబ్బంది ఉన్నారు. తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సోమవారం ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్గా ప్రసాద్ (ఏలూరు) బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఏలూరు నుంచి రిలీవ్ అయ్యి గూడెం రావడానికి మధ్యాహ్నం కావడంతో 1.30 గంటల వరకు స్లాట్ బుక్ చే సుకున్నా రిజిస్ట్రేషన్లు కాలేదు. జిల్లా రిజిస్ట్రార్ ఆదేశాలతో ఉదయం బుక్ చేసుకున్న స్లాట్ల వారికి రిజిస్ట్రేషన్లు చేశారు. తొలిరోజు రిజిస్ట్రేషన్లు సాఫీగా జరిగినట్టు సమాచారం. -
చెరువు మట్టిని కొల్లగొట్టేస్తున్నారు
ఆగిరిపల్లి: మండలంలో ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక చెరువులు ఎండిపోయి రైతులు ఉసురుమంటుంటే, మరోపక్క అక్రమార్కులు మాత్రం చెరువులో మట్టిని ఇష్టానుసారంగా తవ్వి జేబులు నింపుకుంటున్నారు. మండలంలోని కలటూరులో గత మూడు రోజులుగా పగలు, రాత్రి తేడా లేకుండా గ్రామంలోని శోభనాద్రి చెరువులో ఎటువంటి అనుమతులు లేకుండా మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. రెండు జేసీబీలతో చెరువు మట్టిని తవ్వి, సుమారు 50 ట్రాక్టర్లతో వెంచర్లకు వందలాది ట్రిప్పులుగా తరలిస్తున్నారు. గ్రామానికి చెందిన టీడీపీ మండల నాయకుడి కనుసన్నల్లోనే ఈ తతంగం యథేచ్ఛగా సాగుతోందని, లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ అధికారులు అక్రమార్కులతో కుమ్మక్కవడంతో, చెరువులో మట్టిని అక్రమంగా తవ్వుతున్న విషయం తెలిసినా అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని వాపోతున్నారు. చెరువును ఇష్టానుసారంగా తోడేయడంతో పెద్దపెద్ద గోతులు ఏర్పడ్డాయని, దీనివల్ల భవిష్యత్తులో ప్రమాదాలు పొంచి ఉన్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించి, శోభనాద్రి చెరువులో అక్రమంగా మట్టి తవ్వుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. -
సేవలు అ‘ద్వితీయ’ం
ఆస్పత్రికి వెళ్లి వస్తూ.. ద్విచక్రవాహనంపై ఆస్పత్రికి వైద్యానికి వెళ్లి వస్తూ మార్గమధ్యంలో కారు ఢీకొన్న ప్రమాదంలో ఐదేళ్ల బాలుడు మృత్యువాత పడగా తండ్రి గాయపడ్డారు. 8లో uద్వారకాతిరుమల: రాష్ట్రంలోని ఏడు ప్రధాన ఆలయాలకు వచ్చే భక్తులకు ఆయా దేవస్థానాలు అందిస్తున్న సేవలపై ప్రభుత్వం తాజాగా నిర్వహించిన సర్వేలో ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రానికి రెండో ర్యాంకు లభించింది. ప్రతి నెలా వాట్సాప్, ఐవీఆర్ఎస్ ద్వారా దర్శనం సంతృప్తికరంగా జరిగిందా? ఆలయాల్లో తాగునీటి వసతులు బాగున్నాయా? ప్రసాదం తాజాగా, రుచిగా ఉందా? పారిశుధ్యం సంతృప్తికరంగా ఉందా? అనే అంశాలపై సర్వే నిర్వహిస్తున్నారు. గతనెల 4 నుంచి ఈనెల 4 వరకు జరిపిన సర్వే వివరాలను సోమవారం వెల్లడించారు. మొదటి ర్యాంక్ విజయవాడ, రెండో ర్యాంక్ ద్వారకాతిరుమల, మూడో ర్యాంక్ శ్రీకాళహస్తి, నాల్గో ర్యాంక్ అన్నవరం, ఐదో ర్యాంక్ కాణిపాకం, ఆరో ర్యాంక్ సింహాచలం, ఏడో ర్యాంక్ శ్రీశైలం దేవస్థానాలు సాధించాయి. పెరిగిన సంతృప్తి ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్లో భక్తుల సంతృప్తి శాతం ద్వారకాతిరుమల దేవస్థానంపై మాత్రమే పె రిగింది. మిగిలిన అన్ని దేవస్థానాలపై అసంతృప్తి పెరిగింది. ద్వారకాతిరుమల క్షేత్రంపై ఆగస్టులో 71.4 సంతృప్తి శాతంగా ఉండగా సెప్టెంబర్లో 72.1 శాతానికి పెరిగింది. -
ఫిజియోథెరపీ.. బీ హ్యాపీ
● మారిన జీవన శైలితో పెరుగుతున్న మెడ, నడుము, మోకాళ్ల నొప్పులు ● మందులకు తోడు ఫిజియోతో మేలు ● నేడు ప్రపంచ ఫిజియోథెరపీ డే ద్వారకాతిరుమల: మారుతున్న జీవనశైలి.. గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చోవడం.. మొబైల్ వినియోగం పెరగడం.. శారీరక శ్రమ తగ్గిపోవడం.. ప్రయాణాల్లోనూ నడకకు దూరమవడం.. ఇవన్నీ కలిసి చిన్న వయసులోనే మెడ, వెన్ను, భుజాలు, మోకాళ్లు, కీళ్ల నొప్పులకు కారణమవుతున్నాయి. కదలికలు తగ్గిపోవడంతో కండరాల బలం తగ్గడం, శరీర బరువు పెరగడం, కీళ్లపై ఒత్తిడి పెరగడం వంటి సమస్యలు ఎక్కువవుతున్నాయి. శారీరక చురుకుదనం లేకపోవడం, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, టైప్–2 మధుమేహం వంటి అనారోగ్య సమస్యల ప్రమాదాన్ని కూడా పెంచుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పేర్కొంటోంది. ఫిజియోథెరపీతో మళ్లీ బలం నొప్పి వచ్చిన ప్రతిసారీ మందులు వేసుకోవడం లేదా పూర్తిగా విశ్రాంతి తీసుకోవడం పరిష్కారం కాదని వైద్యులు సూచిస్తున్నారు. సమస్యకు కారణాన్ని గుర్తించి, కండరాలు–కీళ్ల కదలికలను మెరుగుపరిచేలా వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా ఫిజియోథెరపీ చేయించుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. ఫిజియోథెరపీలో స్ట్రెచింగ్, కండరాల బలోపేత వ్యాయామాలు, జాయింట్ మొబిలిటీ వ్యాయామాలు, బ్యాలెన్స్ ట్రైనింగ్, నడక శిక్షణ వంటి విధానాలను రోగి పరిస్థితిని బట్టి ఉపయోగిస్తారు. దీని ప్రధాన ఉద్దేశం నొప్పిని మాత్రమే తగ్గించడం కాకుండా.. శరీర కదలికలు, కండరాల బలం, సమతుల్యత, రోజువారీ పనులు చేసుకునే సామర్థ్యాన్ని మెరుగుపరచడం. శస్త్రచికిత్స తర్వాత ఫిజియోనే కీలకం మోకాలి మార్పిడి, హిప్ రీప్లేస్మెంట్, ఎముకల శస్త్రచికిత్సలు, వెన్నెముక సంబంధిత ఆపరేషన్లు, లిగమెంట్ లేదా కండరాల శస్త్రచికిత్సల తర్వాత ఫిజియోథెరపీకి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఆపరేషనన్ పూర్తయిందంటే చికిత్స ముగిసినట్లు కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. శస్త్రచికిత్స తర్వాత క్రమంగా కదలికలను పెంచడం, కండరాల బలాన్ని తిరిగి సాధించడం, నడకను మెరుగుపరచడం, రోజువారీ పనులకు తిరిగి అలవాటు పడటం వంటి అంశాల్లో పునరావాస చికిత్స కీలకం. అయితే శస్త్రచికిత్స తర్వాత ఏ వ్యాయామం చేయాలి, ఎప్పుడు ప్రారంభించాలి, ఎంత తీవ్రతతో చేయాలి అనే విషయాలను రోగి స్వయంగా నిర్ణయించుకోకూడదు. శస్త్రచికిత్స చేసిన వైద్యుడు, ఫిజియోథెరపిస్ట్ సూచనల మేరకు వ్యాయామాలు చేయాలి. ప్రస్తుత జీవనశైలిలో శారీరక చురుకుదనం తగ్గిపోవడంతో యువత నుంచి వృద్ధుల వరకు భుజం, మెడ, నడుము, మోకాళ్ల నొప్పులు, కండరాల బలహీనత వంటి సమస్యలతో ఫిజియోథెరపీ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. ప్రతిరోజూ కొంత సమయం వాకింగ్, తగిన వ్యాయామాలు చేయడం అలవాటుగా మార్చుకోవాలి. శారీరక చురుకుదనాన్ని పెంచుకోవడం ద్వారా కండరాలు, కీళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడంతో పాటు అనేక నొప్పి సమస్యలను నివారించవచ్చు. –బి.సాయిసుచరిత, ఫిజియోథెరపిస్ట్, విర్డ్ హాస్పిటల్, ద్వారకాతిరుమల ఏలూరు జిల్లాలో కై కలూరు, దెందులూరు, పోలవరం, బుట్టాయిగూడెం, భీమడోలు ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు ఫిజియోథెరపీ పరికరాలు కేటాయించినట్టు ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వెల్లడిస్తోంది. ద్వారకాతిరుమల విర్డ్ ఆస్పత్రిలో ఫిజియోథెరపీ సేవలను పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురం, భీమవరం ఏరియా ఆస్పత్రుల్లో పక్షవాతం, ఆర్థోపెడిక్ కేసుల పునరావాసానికి ఫిజియోథెరపీ సేవలు అందుతున్నాయి. -
జాతీయ ఫెన్సింగ్ పోటీలకు ఎంపిక
నూజివీడు: పట్టణంలోని ఎస్ఆర్ఆర్ హైస్కూల్కు చెందిన ఐదుగురు విద్యార్థులు జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు డీవీఎల్ పుష్పలత సోమవారం తెలిపారు. ఈ నెల 23 నుంచి జమ్మూకాశ్మీర్లో నిర్వహించే జాతీయ స్థాయి పోటీల్లో వీరు రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని ఆమె పేర్కొన్నారు. అండర్–12 బాలుర విభాగంలో కే. హరీష్కుమార్, పీ. మహేష్, ఎస్. వర్ధన్బాబు, సీహెచ్. వీరేంద్ర, బాలికల విభాగంలో పీ. హరిశ్రీ ఈ పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయికి ఎంపికై న విద్యార్థులను హెచ్ఎంతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. -
18 రోజులు.. రూ.2.03 కోట్లు
చినవెంకన్నకు కాసుల పంట ద్వారకాతిరుమల: చినవెంకన్న ఆలయ హుండీల నగదు లెక్కింపు సోమవారం స్థానిక ప్ర మోద కల్యాణ మండపంలో నిర్వహించారు. ఈ లెక్కింపులో శ్రీవారికి విశేష ఆదాయం సమకూరింది. గత 18 రోజులకు నగదు రూపంలో రూ.2,03,75,763ల ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. అలాగే కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 104 గ్రాముల బంగారం, 2.410 కేజీల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. లెక్కింపులోకి రాని రద్దయిన పాత రూ.2,000, రూ.500ల నోట్ల ద్వారా రూ.6,500లు లభించాయన్నారు. సగటున రోజుకు శ్రీవారికి రూ.11,31,987 ఆదాయం వచ్చిందన్నారు. మద్ది ఆంజనేయస్వామి ఆ లయ ఈఓ ఆర్వీ చందన, దేవస్థానం ట్రస్ట్బోర్డు సభ్యులు పర్యవేక్షించారు. -
అక్షరాస్యతలో వెనుకబడి
కై కలూరు: విద్యార్థి బడి గడప దాటకుండా చూడటంలోనే విద్యావ్యవస్థ విజయం దాగి ఉంది. అక్షర ఆంధ్రా అంటూ విద్యాశాఖ ప్రచారాలు చేస్తున్నా ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో డ్రాప్ఔట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఏలూరు జిల్లాలో బుట్టాయగూడెం, పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు ప్రాంతాల్లో గిరిజనులు రవాణా సౌకర్యాలు లేక పాఠశాలలు మానివేస్తున్నారు. అలాగే కొల్లేరు పరీవాహక ప్రాంతాల్లో వరదలు, వర్షాల సమయంలో పాఠశాలలకు వెళ్లడం ప్రహసనంగా మారింది. దెందులూరు మండలం కోమటిలంకలో వరద వస్తే తగ్గే వరకూ పిల్లలు బడులు, కాలేజీలకు వెళ్లలేరు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో తల్లిదండ్రులతో కలిసి చేపల, రొయ్యల చెరువులపై కాపాలా ఉంటూ కొందరు చిన్నారులు విద్యాజీవితాన్ని చిదిమేసుకుంటున్నారు. నేడు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం శ్రేయస్సు కోసం అక్షరాస్యత : 60వ వార్షిక అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని ఈ ఏడాది ‘ప్రజలు, గ్రహం–శ్రేయస్సు కోసం అక్షరాస్యత’ అనే నినాదంతో నిర్వహిస్తున్నారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, రీడింగ్ పోటీలు, అవగాహన ర్యాలీలు నిర్వహించనున్నారు. చదువులు సాగుతోందిలా.. నిరాక్షరాస్యత ప్రధానంగా 45 ఏళ్లుపైబడిన వయోజనులు ఏజెన్సీ (గిరిజన తాండ), కొల్లేరులంక గ్రా మాల్లో చేపల, రొయ్యల చెరువులపై పనిచేసే కూ లీల్లో కనిపిసస్తోంది. ఇక ఉన్నత విద్య, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ చదువుతున్న 15–24 ఏళ్ల యువత ఏలూరు జిల్లాలో 89 శాతం, పశ్చిమగోదావరి జిల్లాలో 93 శాతం మంది ఉన్నారు. 2001 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పురుషుల అక్షరాస్యత 78.05 శాతం, మహిళల అక్షరాస్యత 68.99 శాతంగా ఉంది. అలాగే నిరక్షరాస్యులైన పురుషులు 4,19,258 ఉండగా, మహిళలు 5,87,168 మంది ఉన్నారు. గ్రామాల్లో ఇప్పటికీ హోటళ్లు, చేపల చెరువులు, ఇటుకుల తయారీలో చిన్నారులు మగ్గిపోతున్నారు. గతమెంతో ఘనం : గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, సీబీఎస్ఈ, గోరుముద్ద, ఇంగ్లిష్ మీడియం విద్య, డిజిటల్ విద్యా, ట్యాబ్ల అందజేతతో పాటు నాడు–నేడు పథకంలో పాఠశాలలను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దారు. దీంతో పేద తల్లిదండ్రులు తమ పిల్లలను పనికి మాన్పించి బడికి పంపించేందుకు ఆసక్తి చూపారు. అయితే రాష్ట్రంలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం చిన్నపాటి కారణాలతో తల్లికి వందనం నిలిపివేస్తోంది. అలాగే ప్రభుత్వ ఇంగ్లిష్ మీడియం విద్య, సీబీసీఎన్సీ తొలగింపుతో చాలా మంది ప్రైవేటు పాఠశాలల బాటపడుతున్నారు. ఆటపాక పక్షుల కేంద్రం నుంచి కోమటిలంకకు పడవపై ప్రయాణిస్తున్న విద్యార్థులు (ఫైల్) వరదల సమయంలో కై కలూరు డిగ్రీ కాలేజీకి వస్తున్న కోమటిలంక విద్యార్థి (ఫైల్) 2011 జనాభా లెక్కల ఆధారంగా జిల్లాల పునర్విభజన తర్వాత గణాంకాలు శాతాల్లో.. జిల్లా మొత్తం అక్షరాస్యత పురుషులు మహిళలు ఏలూరు 71.44 77.63 71.05 పశ్చిమగోదావరి 74.63 77.92 71.36 ఉపాధ్యాయులపై యాప్ల రూపంలో తీవ్ర పనిఒత్తిడి పడుతోంది. గ్రామాల్లో పాఠశాలలకు రహదారి సౌకర్యాలు లేవు. వైఎస్ జగన్ పాలనలో నాడు–నేడు పనుల్లో బడులు సుందరంగా మారాయి. ప్రస్తుతం డ్రాప్ఔట్లు పెరుగుతున్నాయి. ప్రైవేటు పాఠశాలలకే తల్లిదండ్రులు మొగ్గుచూపుతున్నారు. ఇది మారాలి. – వై.వేణుగోపాలరావు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహిత, విశ్రాంత హెచ్ఎం, కై కలూరు నాకు ఇద్దరు ఆడ బిడ్డలు. కారు డ్రైవర్ను. వైఎస్సార్సీపీ పాలనలో క్రమం తప్పకుండా అమ్మఒడి పథకం పొందాను. ఇప్పుడు ఒక నెల కరెంటు బిల్లు 300 యూనిట్లు దాటిందని పథకం ఆపివేశారు. కార్యాలయాలు చుట్టూ తిరిగినా ఫలితం లేదు. ప్రభుత్వం నిబంధనలు సడలించాలి. – పొన్నబండ నరసింహా, కారు డ్రైవర్, కై కలూరు ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న డ్రాప్ఔట్లు ఇంగ్లిష్ మీడియం రద్దుతో ప్రైవేట్ స్కూళ్లకు మొగ్గు మారుమూల గ్రామాలకు లేని రవాణా సౌకర్యాలు నేడు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం -
విద్యార్థులకు ‘పద్మ పూజిత’ స్కాలర్షిప్లు
మద్దిలపాలెం (విశాఖ): విద్యార్థుల ఉన్నత విద్యకు ఆర్థిక సహాయం అందిస్తూ వారిని ప్రోత్సహించే లక్ష్యంతో పద్మ పూజిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెరిటోరియస్ స్కాలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్–2026ను ఆదివారం మద్దిలపాలెంలోని శంకర ప్యాలెస్లో నిర్వహించారు. ఈ ఏడాది మొత్తం 107 దరఖాస్తులు అందగా.. పరిశీలన అనంతరం 77 మంది విద్యార్థులను స్కాలర్షిప్లకు ఎంపిక చేసి మొత్తం రూ.12.20 లక్షలు పంపిణీ చేశారు. 9, 10వ తరగతి చదువుతున్న 29 మందికి రూ.2.90 లక్షలు, డిగ్రీ, డిప్లొమా, ఫార్మసీ చదువుతున్న 10 మందికి రూ.1.50 లక్షలు, ఇంటర్, బీటెక్ చదువుతున్న 38 మందికి రూ.7.80 లక్షల మెరిట్ స్కాలర్షిప్లు, ధ్రువీకరణ పత్రాలను ఫౌండేషన్ చైర్మన్ ఆర్వీఎస్వీ బసవరాజు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో ప్రతిభావంతులైన విద్యార్థులకు సహకారం అందిస్తున్నామని తెలిపారు. కృష్ణంరాజు మాట్లాడుతూ విద్యతో ఉజ్వల భవిష్యత్తు సాధ్యమన్నారు. పడాల ప్రసాద్ విద్యార్థులకు ప్రేరణాత్మక సూచనలు చేశారు. సానుకూల దృక్పథంతో విద్యను అభ్యసించాలని పోతినేని నిర్మల సూచించారు. ఉండి: ఎన్నార్పీ అగ్రహారంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్సై హెచ్.మల్లిఖార్జునరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఆకివీడు మండలం దొడ్డనపూడికి చెందిన ఓ కారు ఉండి వైపు నుంచి భీమవరం వైపు వెళ్తోంది. అదే సమయంలో భీమవరం నుంచి ఉండి వైపు వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఆ కారు ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే క్షతగాత్రులను భీమవరం ఆసుపత్రికి తరలించారు. బాధితుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని ఎస్సై తెలిపారు. ప్రమాదంపై సమాచారం అందిందని, బాధితులు కోలుకున్నాక లేదా ఆసుపత్రి నుంచి పూర్తి సమాచారం అందిన వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని ఎస్సై పేర్కొన్నారు. -
చవితి వేడుకలకు డీజేలు నిషేధం
పెనుగొండ: గణేష్ నిమజ్జన ఉత్సవాలకు డీజే సౌండ్ సిస్టమ్లకు ఎలాంటి అనుమతులు లేవని పెనుగొండ ఎస్సై కే.గంగాధరరావు స్పష్టం చేశారు. ఆదివారం పెనుగొండలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. డీజే శబ్దాల వల్ల గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు, వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులపాలవుతున్నారని, అందువల్లనే డీజేలకు అనుమతులు నిరాకరిస్తున్నట్లు తెలిపారు. గణేశ్ ఉత్సవాలకు అనుమతులు పొందేందుకు డీజీపీ సూచనల మేరకు సింగిల్ విండో ద్వారా అనుమతులు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. గతంలో ఉత్సవ కమిటీ సభ్యులు పోలీస్, అగ్నిమాపక, గ్రామ పంచాయతీ, విద్యుత్, రెవెన్యూ వంటి శాఖల నుంచి అనుమతులు వేర్వేరుగా తీసుకోవాల్సి వచ్చేదని, ప్రస్తుతం ఒకే డిజిటల్ ప్లాట్ఫారమ్ ద్వారా అనుమతులు పొందేలా ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. దరఖాస్తు చేసిన అనంతరం సంబంధిత శాఖల బృందం మండప ప్రాంతాన్ని పరిశీలించి, క్యూఆర్ కోడ్తో డిజిటల్ ఎన్ఓసీ మంజూరు చేస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా మండపాలను రహదారులపై రాకపోకలకు ఆటంకం కలగకుండా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మండపాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు, అగ్నిప్రమాదాల నివారణకు ఇసుక బస్తాలు, నీటి డ్రమ్ములు వంటి రక్షణ పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాల ఏర్పాటును ప్రోత్సహించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే అనుమతులు రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
జనసేన నుంచి వైఎస్సార్సీపీలో చేరికలు
కామవరపుకోట: జీలకర్రగూడెం గ్రామానికి చెందిన పలువురు జనసేన పార్టీని వీడి వైఎస్సార్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్సార్ సీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంభం విజయరాజు సమక్షంలో, మండల కన్వీనర్ రాయంకుల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఇంగిర్తి వర్మ, ఇంగిర్తి పౌలు, చెమటపాము బలివియ్య పార్టీ కండువా కప్పుకుని వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా విజయరాజు మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వ అసమర్థ పాలనతో ప్రజలు విసిగిపోయి పూర్తి వ్యతిరేకతతో ఉన్నారని, అందుకే ఏ గ్రామానికి వెళ్లినా వైఎస్సార్సీపీకి ప్రజల నుంచి రోజురోజుకూ ఆదరణ పెరుగుతోందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీలోకి చేరిన వారు మాట్లాడుతూ... జనసేనలో ఎంత కష్టపడినా సరైన గుర్తింపు లేకపోవడం వల్లే వైఎస్సార్సీపీలో చేరామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శి గుర్రాల రవి, ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి భీమిరెడ్డి వెంకన్నబాబు, కామవరపుకోట 1వ సచివాలయం అధ్యక్షుడు తమ్మిశెట్టి గిరిజ సుబ్రహ్మణ్యం, సేవా శీను, అల్లూరి పెద్దిరాజు, మండల ఉపాధ్యక్షుడు తమ్మిశెట్టి సూర్యప్రకాష్, నాగళ్ల సీతారాంబాబు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
సుబ్బారాయుడికి ప్రత్యేక పూజలు
ముదినేపల్లి రూరల్: ప్రసిద్ధి చెందిన సింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్లోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారి పుట్టలో పాలు పోసి, ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. పాలపొంగళ్ల శాల వద్ద మహిళలు నైవేద్యాలు తయారుచేసి స్వామివారికి సమర్పించారు. నాగబంధాల వద్ద స్వామివారి మూర్తులను ప్రతిష్ఠించేందుకు అర్చకులతో పూజలు చేయించి, ప్రతిష్ఠాపన తంతును శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం నాగబంధాల వద్ద, గోశాలలోని గోవులకు మహిళలు పసుపు–కుంకుమలతో పూజలు చేశారు. భక్తుల రద్దీకి తగినట్లుగా అన్నప్రసాద ఏర్పాట్లు చేపట్టారు. ఆలయ సహాయ కమిషనర్ ఆర్.గంగాశ్రీదేవి, చైర్మన్ బొంగు రవికుమార్ ఏర్పాట్లు పర్యవేక్షంచారు. -
సబ్కా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
ఏలూరు (ఆర్ఆర్పేట): స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ (సబ్కా) రాష్ట్ర కార్యవర్గ సమావేశం, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. విజయ్కుమార్ అధ్యక్షతన ఆదివారం నగరంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కాంట్రాక్టర్ల పెండింగ్ బకాయిలను వినాయక చవితిలోపు మంజూరు చేసి చెల్లించాలని నాయకులు డిమాండ్ చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి, అసోసియేషన్ భవన నిర్మాణానికి స్థల కేటాయింపునకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఏలూరు జిల్లా నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. గౌరవ అధ్యక్షుడిగా ఇసుకపల్లి తాతారావు, అధ్యక్షుడిగా మోటేపల్లి చంద్రశేఖర్, కార్యదర్శిగా వి. రామ్ప్రసాద్, కోశాధికారిగా ఎల్. వెంకటరావుతో పాటు పలువురు సలహాదారులు, ఉపాధ్యక్షులు, సంయుక్త కార్యదర్శులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్ కె. శివకుమార్, జాయింట్ సెక్రటరీ సూర్యప్రకాష్ పాల్గొన్నారు. -
అక్రమంగా మత్తు ఇంజెక్షన్ల విక్రయం
జంగారెడ్డిగూడెం (చింతలపూడి): మత్తు ప్రభావం కలిగించే ట్రామడాల్ ఇంజెక్షన్లను అక్రమంగా కొనుగోలు చేసి, వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తున్న మెడికల్ ఏజెన్సీ నిర్వాహకుడిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఆదివారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. మెడికల్ ఏజెన్సీలపై తనిఖీలు నాలుగు రోజుల క్రితం జంగారెడ్డిగూడెం మండలం వేగవరం హైస్కూల్ సమీపంలో వాడేసిన ట్రామడాల్ సిరంజీలను స్థానికులు గుర్తించి డ్రగ్ కంట్రోల్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన డ్రగ్ ఇన్స్పెక్టర్ మల్లికార్జునరావు పట్టణంలోని మెడికల్ ఏజెన్సీల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రెండు రోజుల పాటు నిర్వహించిన తనిఖీల్లో ట్రామడాల్ అక్రమ అమ్మకాలను గుర్తించి, ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. లైసెన్సును దుర్వినియోగం చేసి.. దీనిపై విచారణ జరిపిన పోలీసులు.. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సాయి సౌజన్య నగర్కు చెందిన కాండ్రేగుల లక్ష్మణ సాయి కిషోర్ (28) ను అరెస్టు చేశారు. నిందితుడు శ్రీ లక్ష్మి శ్రీనివాస మెడికల్ ఏజెన్సీని నిర్వహిస్తూ, తన లైసెన్సును దుర్వినియోగం చేసి కంపెనీల నుంచి సుమారు 20 వేల ట్రామడాల్ ఇంజెక్షన్లను కొనుగోలు చేసినట్లు తేలింది. అందులో 12,450 ఇంజెక్షన్లను నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి బిల్లులు లేదా డాక్టర్ ప్రిస్క్రిప్షన్లు లేకుండా అక్రమంగా విక్రయించారు. ఒక్కో ఇంజెక్షన్ను రూ. 5 చొప్పున కొనుగోలు చేసి, రూ. 20 నుంచి రూ. 50 వరకు అధిక ధరలకు విక్రయించినట్లు విచారణలో వెల్లడైంది. మిగిలిన ఇంజెక్షన్ల వివరాలపై నిందితుడు ఇచ్చిన సమాచారంతో, డాంగేనగర్లోని ఓ వుడ్ కార్వింగ్ వర్క్షాప్లో డ్రగ్ ఇన్స్పెక్టర్ సోదాలు నిర్వహించారు. అక్కడ నాలుగు కార్టన్ బాక్సుల్లో రహస్యంగా దాచిన 7,550 ట్రామడాల్ ఇంజెక్షన్ అంప్యూల్స్ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ ఫిర్యాదు మేరకు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశామని, అతని వద్ద నుంచి ఒక మొబైల్ ఫోన్, స్టాక్ రిజిస్టర్లు, ఇన్వాయిస్లు, మెడికల్ ఏజెన్సీ లైసెన్స్ పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ ఇంజెక్షన్లను స్థానికంగా ఉన్న పలు మెడికల్ షాపులు, ఇతర వ్యక్తులకు కూడా సరఫరా చేసినట్లు తెలుస్తోందని, ఈ నెట్వర్క్లో మరికొందరి ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. మత్తు కలిగించే ఔషధాలను అక్రమంగా నిల్వ చేసినా, విక్రయించినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో సీఐ ఎంవీ సుభాష్, ఎస్సైలు ఎన్వీ ప్రసాద్, కుటుంబరావు, వల్లి పద్మ తదితర సిబ్బంది పాల్గొన్నారు. మెడికల్ ఏజెన్సీ నిర్వాహకుడి అరెస్టు -
నేత్రపర్వం.. శివ కల్యాణం
ద్వారకాతిరుమల: క్షేత్రపాలకునిగా విరాజిల్లుతున్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో శివదేవుని కల్యాణ మహోత్సవం ఆదివారం నేత్రపర్వంగా జరిగింది. ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుక భక్తులకు ఎంతగానో కనువిందు చేసింది. ముందుగా దేవస్థానం సిబ్బంది ఆలయాన్ని, పరిసరాలను సుగంధభరిత పుష్పమాలికలు, మామిడి తోరణాలు, అరటి బోదెలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం మండపంలో ఏర్పాటు చేసిన వేదికపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఉంచి, అర్చకులు విశేష పుష్పాలంకారాలు చేశారు. ఆ తరువాత కల్యాణ తంతును ప్రారంభించి, సుముహూర్త సమయంలో స్వామి, అమ్మవార్ల శిరస్సులపై జీలకర్ర, బెల్లం ధరింపజేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణలు, భక్తుల శివనామస్మరణల నడుమ మాంగల్యధారణ, తలంబ్రాల వేడుకలను వైభవంగా జరిపి, కల్యాణ మూర్తులకు హారతులు సమర్పించారు. ఈ వేడుకలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని, స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. -
చిన్నారికి మూడు ముళ్లు.. నివారిస్తే నిండు నూరేళ్లు!
నూజివీడు డివిజన్లో గత 11 నెలల కాలంలోని వివరాలు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు : 17 డివిజన్లో గర్భధారణలు : 11,496 టీనేజీ గర్భిణులు : 1158 మంది. టీనేజీ గర్భిణుల శాతం : 10 నూజివీడు: అభం శుభం తెలియని పసిమొగ్గలు పురిటి నొప్పులు పడుతున్నారు. చదువుకోవాల్సిన వయసులో, ఎదిగీ ఎదగని చిరుప్రాయంలోనే తల్లులవుతున్నారు. తల్లిదండ్రులలో అవగాహన లోపం, పేదరికం, సామాజిక దురాగతాలు, అఘాయిత్యాల మాటున బలవుతున్నారు. వీరిని రక్షించాల్సిన వ్యవస్థ, దారి చూపాల్సిన ప్రభుత్వ యంత్రాంగం చేతులెత్తేస్తుండటంతో వందలాది మంది బాలికల బంగారు బాల్యం బుగ్గిపాలవుతుండటమే కాకుండా, వారి భవిష్యత్ నాశనమవుతుండటం ఆవేదన కలిగిస్తోంది. 19 ఏళ్ల లోపే బాలికలు చిన్నారి తల్లులుగా మారుతున్నారు. నూజివీడు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆరు మండలాల్లో ప్రతి 100 మంది గర్భిణీల్లో 10 మంది టీనేజీ గర్భిణీలు ఉండటం గమనార్హం. దీనికంతటికి బాల్య వివాహాలు జరుగుతున్నా వాటిని ఆపలేకపోవడమే కారణం. ఆగని బాల్య వివాహాలు టీనేజీ గర్భధారణలకు బాల్య వివాహాలు ప్రధాన కారణం కాగా, ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం, రాజకీయ నాయకుల అండదండలు ఉండటం, మంచి సంబంధమని భావించడం, సామాజిక దురాచారాలు, కుటుంబ ఒత్తిళ్లు, దగ్గరి సంబంధాలు, మేనరికాలు, ఎక్కువ మంది ఆడపిల్లలు ఉండటం, ఆడపిల్లలను నేటికీ భారంగా పరిగణించడం, వివాహం చేసి బాధ్యత వదిలించుకోవడం వంటివి కనిపిస్తున్నాయి. అలాగే లైంగిక విద్యపై అవగాహన లేకపోవడం, పేదరికం, బడి మానేయడం, ఆర్థిక సమస్యలు, కుటుంబీకుల ఆరోగ్య సమస్యలు, సామాజిక మాధ్యమాల ప్రభావంతో పక్కదారి పట్టడం, తాత్కాలిక ఆకర్షణలకు గురికావడం వంటి కారణాలతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది. రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రతి మూడు నెలలకొకసారి సమావేశాలు నిర్వహిస్తున్నా బాల్య వివాహాలు ఆగడం లేదు. ఐసీడీఎస్, పోలీసు, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ, మహిళా పోలీసు తదితర ఇన్ని విభాగాల సిబ్బంది గ్రామ స్థాయిలో ఉన్నప్పటికీ బాల్య వివాహాలు జరుగుతూనే ఉండటాన్ని బట్టే వీరి పనితీరు ఎలా ఉందో అర్థమవుతోంది. మరోవైపు టీనేజీ గర్భిణీల వివరాలను ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్లో మైనర్ల వివరాలను నమోదు చేసేందుకు అవకాశం లేకపోవడంతో, పేదవర్గాలకు చెందిన టీనేజీ గర్భిణీలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందడం లేదు. బాల్య వివాహాల నివారణలో వైఫల్యం బాల్య వివాహాల నిర్మూలన కోసం జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రత్యేక వాహన ప్రచారంతో సహా వివిధ కార్యక్రమాల నిర్వహణ కోసం జిల్లావ్యాప్తంగా ప్రతి నెలా లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నారు. మండల సమాఖ్య, ఆరోగ్య సిబ్బంది, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, విద్యా సంస్థలు, ప్రజాప్రతినిధులు, పురోహితులు, పాస్టర్లు, ఇమామ్లు వంటి దైవ సేవకులు, షామియానాలు వేసేవారు, ఫొటోగ్రాఫర్లు, భజంత్రీలు వాయించేవారు.. ఇలా ప్రతి విభాగంలోనూ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. అయినా బాల్య వివాహాలు ఆగడం లేదు. కమిటీలున్నా.. ఫలితం శూన్యం బాల్య వివాహాల నియంత్రణలో మహిళా, శిశు సంక్షేమ శాఖకు మించిన బాధ్యత చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్లపై (సీఎంపీఓ) ఉంది. బాల్య వివాహ నిరోధక చట్టం (పీసీఎంఏ)–2006 ప్రకారం జిల్లా, డివిజన్, ఐసీడీఎస్ సీడీపీఓ, మండల, గ్రామ స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేశారు. వీటిని ఏర్పాటు చేసినప్పటికీ ఫలితం శూన్యమే. బాల్య వివాహాల నియంత్రణలో ఈ కమిటీలన్నీ ఏం చేస్తున్నాయనేది ఎవరికీ అంతుబట్టని పరిస్థితి. ఇవి కనుక సక్రమంగా పనిచేస్తే చిన్నారులకు ఈ దుస్థితి ఎందుకు వస్తుందనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ ప్రాంతాల్లో ఎక్కువ టీనేజీ గర్భిణీల సంఖ్య ఆగిరిపల్లి, సగ్గూరు, చాట్రాయి, చనుబండ, లింగపాలెం, ధర్మాజిగూడెం, యర్రగుంటపల్లి, గొల్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆగని బాల్య వివాహాలు ప్రతి 100 మంది గర్భిణుల్లో 10 మంది టీనేజీ అమ్మాయిలే బుగ్గిపాలవుతున్న బాలికల బంగారు బాల్యం -
రాట్నాలమ్మ తల్లికి రూ.1,14 లక్షల ఆదాయం
పెదవేగి: మండలంలోని రాట్నాలకుంట రాట్నాలమ్మ తల్లి ఆలయానికి ఆదివారం జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ అర్చకులు, కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో విశేషంగా అలంకరించారు. భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి, అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. అమ్మవారికి వివిధ రూపాల ద్వారా రూ.1,14,808 ఆదాయం సమకూరినట్లు ఆలయ కమిటీ చైర్మన్ మన్నే శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సతీష్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ విడుదల సత్యనారాయణ తెలిపారు. కై కలూరు: జిల్లాలో ప్రసిద్ధి చెందిన కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం వద్ద ఆదివారం భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు పేటేటి పరమేశ్వరశర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు కన్నులపండువగా నిర్వహించారు. ఆదివారం ఒక్కరోజే ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డు ప్రసాదాల విక్రయం, గదుల అద్దెలు, ఫొటోల అమ్మకం, వాహన పూజలు, విరాళాల ద్వారా మొత్తం రూ.48,081 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు తెలిపారు. పెనుగొండ: వాసవీ శాంతిధామంలో ఆదివారం గజ్జెల మహోత్సం కనులపండువగా నిర్వహించారు. కూచిపూడి నృత్యం నేర్చుకున్న చిన్నారులు తమ మొదటి ప్రదర్శనను ఇక్కడ భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. 102 అడుగుల రుషీగోత్ర మందిరంలో, 90 అడుగుల వాసవీమాత పంచలోహ విగ్రహం, మరకతశిల వాసవీమాత సన్నిధిలో నృత్యకారిణులు గజ్జెల పూజా మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా వారు చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమానికి పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. టి.నరసాపురం: అదనపు కట్నం కోసం వివాహితను వేధిస్తున్న భర్తతోపాటు మరో నలుగురు కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎం.జయబాబు ఆదివారం తెలిపారు. మండలంలోని బొర్రంపాలెం గ్రామానికి చెందిన వీరమల్ల జ్యోత్స్నకు, కొండూరు మండలం నందిగామకు చెందిన పలగాని నవీన్కుమార్తో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లయిన కొంతకాలం బాగానే చూసుకున్న నవీన్కుమార్.. ఆ తర్వాత మద్యం, అక్రమ సంబంధాలకు అలవాటుపడ్డాడు. భార్య జ్యోత్స్నను అదనపు కట్నం తేవాలని డిమాండ్ చేస్తూ, కుటుంబ సభ్యులతో కలిసి శారీరకంగా, మానసికంగా వేధిస్తూ కొట్టసాగాడు. గతేడాది నవంబర్ 12న ఆమెను ఇంటి నుంచి బయటకు గెంటేశారు. అప్పటి నుంచి పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయితీ నిర్వహించినా వారు తిరిగి కాపురానికి తీసుకెళ్లకపోవడంతో, బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. జ్యోత్స్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ముదినేపల్లి రూరల్: అప్పులపాలై మనస్తాపంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కాకరవాడలో శనివారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన పామర్తి వీరలక్ష్మి (35) శ్రీహరిపురంలోని కిరాణా దుకాణంలో పనిచేస్తోంది. ఆమె భర్త కోటేశ్వరరావు కొంతకాలంగా అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యాడు. భర్త వైద్యం కోసం, ఇద్దరు కుమార్తెల చదువుకోసం చేసిన అప్పులు తలకు మించిన భారంగా మారడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో శనివారం ఉదయం దుకాణంలోనే ఎలుకల మందు తిని, వాంతులు చేసుకుంటూ ఇంటికి చేరుకుంది. పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం గుడివాడ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని మరో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వీరలక్ష్మి శనివారం రాత్రి మృతి చెందినట్లు ఆమె సోదరుడు ఫిర్యాదు చేశారని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
హక్కులు, అవకాశాలు పొందడమే లక్ష్యం
గంగవరం: రాజ్యాంగం కల్పించిన హక్కులు, అవకాశాలను పొందడంలో తాము తీవ్ర అన్యాయానికి గురవుతున్నామని ఆదివాసీ గౌడ సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం గంగవరంలో ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల ఆదివాసీ గౌడ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆదివాసీ గౌడ సంఘ అధ్యక్షుడు మట్ట రామ్మూర్తి, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు కొప్పుల నాగరాజు, పోలవరం ఏజెన్సీ ఏరియా అధ్యక్షుడు నాయుడు సత్యనారాయణ ఈ సమావేశంలో మాట్లాడారు. తరతరాలుగా మన్యంలో జీవనం సాగిస్తున్న ఆదివాసీ గౌడలకు రాజ్యాంగం కల్పించిన విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పూర్తిస్థాయిలో అందడం లేదని వారు వాపోయారు. ఐక్యతతోనే తమ హక్కులను సాధించుకోగలమని పిలుపునిచ్చారు. త్వరలో ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీ గౌడలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని వారు తెలిపారు. -
భైరవపట్నంలో భారీ అగ్నిప్రమాదం
మండవల్లి: మండలంలోని భైరవపట్నంలో శనివారం రాత్రి 11:40 గంటలకు ఒక్కసారిగా మంటలు చెలరేగి భారీ అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చని భావిస్తున్నారు. గంటా సరోజినమ్మ (65) ఈ ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నారు. అందరూ నిద్రిస్తున్న సమయంలో ఇల్లంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఇంటి నుంచి పొగలు రావడం గమనించిన ఇరుగుపొరుగువారు, గ్రామ యువకులు వెంటనే అప్రమత్తమయ్యారు. అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమయస్ఫూర్తితో చేపట్టిన తక్షణ సహాయక చర్యల వల్ల పెనుముప్పు తప్పింది. ఈ ఆకస్మిక అగ్నిప్రమాదం నుంచి సరోజినమ్మ ప్రాణాపాయం లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించకుండా అదుపుచేశారు. ఈ ప్రమాదంలో ఇంట్లోని సామగ్రి పూర్తిగా దగ్ధమై, సుమారు రూ. 2 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేశారు. -
ఏపీకి బిగ్ అలర్ట్.. రాగల మూడు గంటల్లో..
సాక్షి, విజయవాడ: రాగల మూడు గంటల్లో వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. నూజివీడు, ఆగిరిపల్లి, గన్నవరం, ఏలూరు, మైలవరం, నున్న, విజయవాడ పరిసర ప్రాంతాల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.కాగా, దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. పలు రాష్ట్రాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ.. ఢిల్లీతో పాటు హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, పంజాబ్, మధ్యప్రదేశ్లలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, బిహార్, నాగాలాండ్, మణిపూర్, మిజోరంలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. -
రైలు నుంచి దూకిన ప్రయాణికుడు
ఉండి: చెరుకువాడ రైల్వే స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం నడుస్తున్న రైలు నుంచి ప్రయాణికుడు కిందికి దూకేయడంతో కలకలం రేగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని బట్టలు తయారు చేసే కంపెనీలో పనిచేస్తున్న అశ్విన్ బూయ్, అతని తమ్ముడు అశోక్ బూయ్ ఒరిస్సాలోని సొంతూరు ఇచ్ఛాపూర్ వెళ్లేందుకు సంబల్పూర్ ఎక్స్ప్రెస్లో బయలుదేరారు. గత కొన్ని రోజులుగా అశ్విన్ మానసిక స్థితి సరిగా లేదు. ప్రయాణంలో భాగంగా అశ్విన్ వాష్రూంకు వెళ్తానని చెప్పి వెళ్లాడు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో తమ్ముడు అశోక్ వెళ్లి చూడగా, అశ్విన్ బోగీ గుమ్మంలో నిలబడి ఉన్నాడు. లోపలికి రావాలని పిలిచినా వినకుండా తాను చనిపోతానని చెప్పి చెరుకువాడ పరిధిలో రైలు నుంచి కిందికి దూకేశాడు. తమ్ముడు వెంటనే ట్రైన్ చైన్ లాగడంతో రైలు నిలిచిపోయింది. సిబ్బంది సాయంతో అశ్విన్ను తిరిగి రైలులోకి ఎక్కించి చెరుకువాడ స్టేషన్కు తీసుకువచ్చారు. 108 అంబులెన్స్ ద్వారా భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో అశ్విన్కు తల, ముఖంపై తీవ్ర గాయాలై దవడ ఎముక విరిగింది. అశోక్ స్టేట్మెంట్ రికార్డు చేసుకుని వైద్యం కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు ఎలాంటి కేసు నమోదు చేయలేదని రైటర్ చక్రవర్తి చెప్పారు. -
నోటీసులు లేకుండా ఎలా వస్తారు?
ఇటీవల సదస్సులోనే మా భూములు ఇచ్చేది లేదని అధికారులకు స్పష్టంగా చెప్పాం. అయినా మళ్లీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు మా భూముల్లోకి రావడం అన్యాయం. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న పచ్చని పొలాలను కార్పొరేట్ కంపెనీల కోసం లాక్కోవాలని చూస్తే సహించేది లేదు. – చేపూరి ఖాదర్ బాబు, మాజీ జెడ్పీటీసీ, రైతు, శెట్టివారిగూడెం భూగర్భ గ్యాసిఫికేషన్ అనేది అత్యంత ప్రమాదకరమైన ప్రక్రియ. భూగర్భ జలాలు విషపూరితమైతే మేము, మా పశువులు ఏం తాగి బతకాలి? పంటలు పండక, తాగేందుకు నీరు లేక భవిష్యత్తులో ఈ ఊళ్లను వదిలి రోడ్డున పడాల్సిందేనా? మా ప్రాణాలు పోయినా భూములను వదులుకోం. – యర్రంశెట్టి రామకృష్ణారావు, రైతు, సుబ్బారాయుడుగూడెం ఇక్కడ ఎకరం భూమి రూ.40 నుంచి 50 లక్షల పైనే ఉంది. ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలు, పర్యావరణ ప్రభావంపై ఉన్న అనుమానాలను మొదట నివృత్తి చేయాలి. బలవంతపు సేకరణలు కుదరవు. ప్రభుత్వమే ముందుకు వస్తే మార్కెట్ ధరకు రెట్టింపు పరిహారం ఇవ్వాలి. అప్పటివరకు సర్వేలను అడుగు కూడా ముందుకు పడనివ్వం. – గోలి చంద్రశేఖర్రెడ్డి, రైతు, వ్యాపారవేత్త, చింతలపూడి -
ముగిసిన చెస్ పోటీలు
పెదవేగి: వీకింగ్స్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘‘డీ పాల్ ఏపీ ఓపెన్ రాపిడ్ చెస్ టోర్నమెంట్–2026’’ విజయవంతంగా ముగిసింది. ఏలూరు జిల్లా దుగ్గిరాలలోని డీ పాల్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించిన ఈ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి మొత్తం 320 మంది చెస్ క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. టోర్నమెంట్ డైరెక్టర్ ఎస్. శ్యామల మాట్లాడుతూ... ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోటీలను సజావుగా నిర్వహించినట్లు తెలిపారు. ఉదయం 9:45 గంటలకు ప్రారంభమైన పోటీలు సాయంత్రం 6 గంటల వరకు కొనసాగాయి. మొత్తం 7 రౌండ్లుగా జరిగిన పోటీల్లో క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచారని చీఫ్ ఆర్బిటర్ పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డీ పాల్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఫాదర్ నెల్సన్, వైస్ ప్రిన్సిపాల్ అజిత్, ఫాదర్ టోనీ తదితరులు విజేతలకు ట్రోఫీలు, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో చెస్ డెవలప్మెంట్ అండ్ ప్లేయర్స్ అసోసియేషన్ ఆఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు శ్రీ కిరణ్ కుమార్ పాలూరి, కార్యదర్శి శ్రీ కె.ఎస్. నాగేశ్వరరావు, అసోసియేషన్ సభ్యులు సీహెచ్ పద్మ, సురేఖ, సీహెచ్ పాల్ విక్టర్ తదితరులు పాల్గొని టోర్నమెంట్ విజయవంతానికి సహకరించారు. టాప్–3 విజేతలు ప్రథమ స్థానం: రామ్చరణ్ తేజ (7 పాయింట్లు), తూర్పు గోదావరి జిల్లా ద్వితీయ స్థానం: రావు జె. మల్లేశ్వర (6.5 పాయింట్లు), ఎన్టీఆర్ జిల్లా తృతీయ స్థానం: జి. అనూష ఎన్ఎల్వీ (6.5 పాయింట్లు), ఎన్టీఆర్ జిల్లా -
గురువులు దైవంతో సమానం
ఏలూరు (ఆర్ఆర్పేట): విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న గురువులు దైవంతో సమానమని జిల్లా కలెక్టర్ కే. వెట్రిసెల్వి అన్నారు. గురుపూజా దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ ఆమె శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో శనివారం జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి కలెక్టర్ వెట్రిసెల్వి, జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా 33 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేసి ఘనంగా సత్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయులందరికీ ఆదర్శనీయులని పేర్కొన్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని జెడ్పీ చైర్పర్సన్ పద్మశ్రీ అన్నారు. తల్లిదండ్రుల తర్వాత సరైన మార్గంలో నడిపించేది గురువేనని ఎమ్మెల్యే బడేటి చంటి కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. వెంకటలక్ష్మమ్మ, ప్రభుత్వ పరీక్షల నిర్వహణ సహాయ కమిషనరు ఆర్.ఆశ, ఉప విద్యాశాఖ అధికారులు పీఎస్ సుధాకర్, ఎన్.రవీంద్ర భారతి, జిల్లా పరిషత్తు, విద్యాశాఖ అధికారులు, ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నరసాపురం రూరల్: మొగల్తూరు పరిధిలోని కొత్తాట గ్రామంలో ఉప్పుటేరులో ఉన్న ఒక మృతదేహాన్ని శనివారం ఎస్సై జయలక్ష్మి ఆధ్వర్యంలో పోలీసులు ఒడ్డుకు చేర్చారు. జిల్లాలో నమోదైన మిస్సింగ్ కేసుల ఆధారంగా ఆరా తీయగా, పాలకొల్లు రూరల్ పోలీస్ స్టేషన్లో నమోదైన అదృశ్యం కేసుతో ఇది సరిపోలింది. మృతుడిని పాలకొల్లుకు చెందిన కుచ్చర్లపాటి వేణురాజు (53)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పాలకొల్లు రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పెదపాడు : కృష్ణా తూర్పు కాలువలో వసంతవాడ వద్ద గుర్తుతెలియని మృతదేహం లభ్యమైనట్లు పెదపాడు పోలీసులు తెలిపారు. వివరాల ప్రకారం... నీటిలో తేలుతున్న మృతదేహాన్ని స్థానికులు గమనించి సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుని వయస్సు సుమారు 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉంటుందని, బ్లూ కలర్ ప్యాంట్, సిమెంట్ కలర్ ఫుల్ హ్యాండ్స్ షర్ట్ ధరించి ఉన్నారని తెలిపారు. ఆ వ్యక్తి మృతి చెంది సుమారు వారం రోజులు కావచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై పెదపాడు హెడ్ కానిస్టేబుల్ పుల్లయ్య సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు 94407 96637 నంబరులో పోలీసులను సంప్రదించాలని కోరారు. పెదపాడు: ఏపూరులో కొత్తూరుకు చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెదపాడు ఏఎస్సై గజపతిరావు తెలిపిన వివరాల ప్రకారం... కొత్తూరుకు చెందిన కడిమి నాగరాజు మృతి చెందిన తర్వాత, అతని భార్య వెంకటరమణ అత్తాకోడళ్ల కలహాల కారణంగా కలపర్రులో నివాసం ఉంటోంది. వారి రెండో కుమారుడు రాజేష్ మాత్రం నాయనమ్మ వద్దే ఉంటున్నాడు. శనివారం ఉదయం 5:45 సమయంలో రాజేష్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తాడేపల్లిగూడెం (టీఓసీ): గణపవరం మండలం కాశిపాడు గ్రామం వద్ద ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో కాలువలో పడి మృతి చెందాడు. తాడేపల్లిగూడెం అగ్నిమాపక అధికారి, సిబ్బంది శనివారం వివరాలను వెల్లడించారు. పెంటపాడు మండలం కోరుమిల్లి గ్రామానికి చెందిన ఊదరపల్లి రాజేష్ కుమార్ (25) అనే యువకుడు ఈ నెల 4వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం సుమారు 2.30 గంటల సమయంలో కాశిపాడు గ్రామం వద్ద కాలువలో పడిపోయాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వాటర్ టెండర్, రెస్క్యూ బోటుతో సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. అయితే రాత్రి కావడంతో గాలింపును తాత్కాలికంగా నిలిపివేశారు. అనంతరం శనివారం ఉదయం 6 గంటల నుంచి తిరిగి గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో పిప్పర సమీపంలోని కోమటిపాలెం గ్రామం వద్ద సాయంత్రం 5 గంటల సమయంలో రాజేష్ మృతదేహం లభ్యమైనట్లు ఫైర్ సిబ్బంది తెలిపారు. అనంతరం మృతదేహాన్ని కాలువ నుంచి వెలికితీసి, పోలీసుల సమక్షంలో బంధువులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
కూటమి ఒం‘టెట్టు’ పోకడ
నూజివీడు: ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు స్పెషల్ టెట్ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత నెల 24న విడుదల చేసిన నోటిఫికేషన్పై ఉపాధ్యాయులు పెదవి విరుస్తున్నారు. గతంలో నిర్వహించిన సాధారణ టెట్ పరీక్ష మాదిరిగానే స్పెషల్ టెట్ కూడా ఉండటంతో, ఉపాధ్యాయుల డిమాండ్లలో కనీసం ఒక్కదానికీ మినహాయింపు ఇవ్వలేదని మండిపడుతున్నారు. ఉపాధ్యాయ సంఘాల సూచనలేవీ పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా స్పెషల్ టెట్ నోటిఫికేషన్ ఇచ్చిందని వాపోతున్నారు. గతంలో నిర్వహించిన టెట్కు దీనికి తేడా ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చిన అంశాలేవీ లేకుండానే స్పెషల్ టెట్ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవ్వడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయమైన డిమాండ్లను కూడా పరిష్కరించకపోతే ఎలాగని నిలదీస్తున్నారు. సుదీర్ఘకాలంగా సేవలందిస్తూ రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న ఉపాధ్యాయులు కూడా టెట్ రాయాలంటే ఎలాగని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిమాండ్లను పరిగణనలోకి తీసుకోకుండానే.. ప్రభుత్వం విడుదల చేసిన స్పెషల్ టెట్ నోటిఫికేషన్కు, గతంలో ఉపాధ్యాయులు రాసిన సాధారణ టెట్ నోటిఫికేషన్కు ఎలాంటి తేడా లేదు. ఉపాధ్యాయ సంఘాలు కొన్నాళ్లుగా గట్టిగా వినిపిస్తున్న ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం పెడచెవిన పెట్టి, తను అనుకున్నదే జరగాలన్నట్లుగా నోటిఫికేషన్ జారీ చేయడం దారుణమని వాపోతున్నారు. ప్రధాన డిమాండ్లు ఇవే ● టెట్లో 150 మార్కులకు గాను ఓసీలకు 90 మార్కులు, బీసీలకు 75 మార్కులు, ఎస్సీ, ఎస్టీలకు 60 మార్కులు వస్తే సరిపోతుంది. అలా కాకుండా ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న టెట్లో క్వాలిఫై కావడానికి అన్ని కేటగిరీల ఉపాధ్యాయులకు 150 మార్కులకు 40 శాతం (60 మార్కులు)గా ప్రకటించాలి. ● స్కూల్ అసిస్టెంట్ గణితం ఉపాధ్యాయుడు కూడా టెట్లో బయాలజీ ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి వస్తోంది. పదో తరగతితోనే బయాలజీ చదవడం మానేసిన వారు, ఇప్పుడు బయాలజీ ప్రశ్నలకు సమాధానాలు రాయాలంటే ఎలాగని ఉపాధ్యాయులు నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉపాధ్యాయులు ఏ సబ్జెక్టును, ఏ తరగతులకు బోధిస్తున్నారో దానిని పరిగణనలోకి తీసుకుని టెట్ నిర్వహించాలి. పేపర్–2 సిలబస్ 6 నుంచి 10వ తరగతి పాఠ్యాంశాల ఆధారంగా ఉండటంతో పాటు, కాఠిన్యత ఇంటర్మీడియెట్ స్థాయి వరకు ఉంటుందని ప్రస్తుత నోటిఫికేషన్లో పేర్కొనడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ● టెట్ను ఆఫ్లైన్లో నిర్వహించాలి. రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న ఉపాధ్యాయులకు కంప్యూటర్ను ఉపయోగించే సామర్థ్యం తక్కువగా ఉన్నందున ప్రభుత్వం ఈ విషయాన్ని ఆలోచించాలి. ● 2010కి ముందు ఉపాధ్యాయ ఉద్యోగాల్లో చేరిన వారికి టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి. ● తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేసినట్లుగా, ఏపీ ప్రభుత్వం కూడా 2010 ఆగస్టు 28వ తేదీకి ముందు ఉపాధ్యాయులుగా నియమితులైన వారికి టెట్ నుంచి పూర్తి, శాశ్వత మినహాయింపు ఇవ్వాలని కోరాలి. దీనికోసం ఆర్టీఈ చట్టంలో మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేయాలి. ఇన్సర్వీసు ఉపాధ్యాయుల కొరకు వెలువడిన టెట్ స్పెషల్ నోటిఫికేషన్లో ప్రత్యేకత ఏమీ లేదు. ఉపాధ్యాయుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోకుండానే ప్రభుత్వం నోటిఫికేషన్ను విడుదల చేసింది. 40 శాతం మార్కులు వస్తే ఉత్తీర్ణులైనట్లు నిర్ణయించాలి. రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్నవారికి టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి. – బత్తుల అనురాధ, యూటీఎఫ్ ఏలూరు జిల్లా కార్యదర్శి, నూజివీడు పిల్లలకు ఉపాధ్యాయుడు ఏ సబ్జెక్టు అయితే బోధిస్తున్నాడో, అదే సబ్జెక్టులో టెట్ పరీక్ష నిర్వహించాలి. సోషల్ బోధించే ఉపాధ్యాయులకు గణితం ప్రశ్నలు ఇచ్చి పరీక్ష రాయమంటే ఎలా రాస్తారో ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. దీనివల్ల టెట్లో అర్హత సాధించడం కష్టసాధ్యమవుతుంది. ప్రభుత్వం పునరాలోచించి తగిన సవరణలు చేయాలి. – మల్లెల చెన్నకేశవరావు, ఉపాధ్యాయుడు, నూజివీడు స్పెషల్ టెట్తో ఒరిగిందేమీ లేదు సాధారణ టెట్కు దీనికీ తేడా లేదు ఉపాధ్యాయుల డిమాండ్లను పట్టించుకోని ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాల ఉద్యమ పథం -
ఏడుగురు దొంగల ముఠా అరెస్టు
ఏలూరు టౌన్: ఏలూరు నగరంలో రద్దీ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న ఏడుగురు సభ్యుల ముఠాను రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా కార్యకలాపాలను ఓ మైనర్ బాలిక నడిపిస్తుండటం గమనార్హం. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్కుమార్ వివరాలను వెల్లడించారు. నగరంలోని పాత బస్టాండ్, ఫైర్ స్టేషన్, ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంతాలలో బైకులు చోరీ చేసి, వాటిని విక్రయించడం లేదా తాకట్టు పెట్టి వచ్చే డబ్బుతో నిందితులు జల్సాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నగరంలోని కొత్తపేట ప్రాంతానికి చెందిన పూతీ ప్రసాద్ అలియాస్ పెరుమాళ్ళ దాలయ్య,, లంకపేట ప్రాంతానికి చెందిన విప్పర్తి రాజు, బీడీ కాలనీకి చెందిన దొంగ దుర్గా సాయిరాం, వంగాయిగూడెం నేరెళ్ల రాజు కాలనీకి చెందిన రూతు మణికంట, భీమడోలు మండలం గుండుగొలను, వడ్డీగూడెం గ్రామానికి చెన్నపాటి ఆంజనేయులు, అదే ప్రాంతానికి చెందిన శానాపతుల వీరవంశీలతో పాటు సూత్రధారిగా ఉన్న ఓ మైనర్ బాలికను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి సుమారు 20 లక్షల రూపాయల విలువైన 21 ద్విచక్ర వాహనాలను (ఎక్కువగా సుజుకి యాక్సెస్ బైకులు) స్వాధీనం చేసుకున్నారు. మైనర్ బాలికను బాలికల వసతిగృహానికి, మిగిలిన నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. రెండో పట్టణ సీఐ అశోక్ కుమార్ ఎస్సైలు రామకృష్ణ, మధు వెంకటరాజా, మహిళా ఎస్సై నాగ కళ్యాణి, హెడ్ కానిస్టేబుల్ కే రవిచంద్ర, కానిస్టేబుల్ విశాఖ రజినిలను ప్రత్యేకంగా అభినందించారు. -
రిలయన్స్ ప్రాజెక్టుకు భూములివ్వం
చింతలపూడి: చింతలపూడి ప్రాంతంలో రిలయన్స్ సంస్థ చేపట్టనున్న భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ (యూసీజీ) ప్రాజెక్టుకు స్థానిక రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ప్రాజెక్టు కోసం తమ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని రైతాంగం తెగేసి చెబుతోంది. శనివారం శెట్టివారిగూడెం, వెంకటాపురం సమీపంలోని భూములను పరిశీలించేందుకు వచ్చిన రెవెన్యూ అధికారులను స్థానిక రైతులు అడ్డుకున్నారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా తమ పొలాల్లోకి ఎలా వస్తారని నిలదీస్తూ, తమ భూముల జోలికి రావద్దని తహసీల్దారుకు స్పష్టం చేశారు. గ్యాసిఫికేషన్ ప్రక్రియతో ప్రమాదం ఈ గ్యాసిఫికేషన్ ప్రక్రియ వల్ల భూగర్భ జలాలు పూర్తిగా విషతుల్యమవుతాయని, భూమి నిస్సారమై గాలి, నీరు కలుషితమవుతాయని గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల భవిష్యత్తులో భూమి కుంగిపోవడం, విషవాయువులు వెలువడటం జరిగి ఊళ్లకు ఊళ్లే ఖాళీ చేసి వలస వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో వ్యవసాయ భూమి ఎకరం ధర రూ. 40 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు పలుకుతోంది. ఒకవేళ ప్రాజెక్టు చేపడితే ప్రభుత్వం మార్కెట్ విలువకు రెట్టింపు పరిహారం చెల్లించాలని, భూసేకరణ నిబంధనలు, నష్టపరిహార ప్యాకేజీపై పూర్తి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. శెట్టివారిగూడెం, వెంకటాపురంలో రెవెన్యూ అధికారుల రాకపై ఆగ్రహం -
అక్షర రూపశిల్పి ఉపాధ్యాయుడు
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ కై కలూరు: సమాజంలో ఉపాధ్యాయుడి పాత్ర వెలకట్టలేనిదని, భావిభారత పౌరులను తీర్చిదిద్దే శిల్పిలు ఉపాధ్యాయులని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు(డీఎ న్నార్) కొనియాడారు. కై కలూరు పార్టీ కార్యాలయంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. విశ్రాంత ప్రధానోపాధ్యాయులు వై.వేణుగోపాలరావు, వి.రాజారా వు, జి.వెంకటరావు, జె.బోయాజ్లను సన్మా నించారు. ముందుగా రాధాకృష్ణన్ చిత్రపటానికి నివాళి అర్పించారు. పార్టీ మండలాధ్యక్షు డు శింగంశెట్టి రాము, పట్టణ అధ్యక్షుడు స మయం వీరాంజనేయులు (అంజి), నాయకు లు దానం నవరత్నకుమారి, తోట మహేష్, సాధు కొండయ్య, అబ్దుల్ మాలిక్, బూరుబో యిన మోహనరావు, ఉచ్చుల చినరాజు, సో మల శ్యామ్సుందర్, బండి ప్రసాద్, ముంగర గోపాలకృష్ణ, మడక శ్రీను పాల్గొన్నారు. -
ఉమ్మడి పశ్చిమలో 2 జెడ్పీలు
ఆదివారం శ్రీ 6 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026సాక్షి ప్రతినిధి, ఏలూరు: జిల్లా పరిషత్ పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. గత ప్రభుత్వ హయాంలో పార్లమెంట్ స్థానం ప్రతిపాదికగా తీసుకుని జిల్లాలను ఏర్పాటుచేశారు. దానికనుగుణంగానే జిల్లా పరిషత్ను కూడా పూర్తిస్థాయిలో నూతన జిల్లాకు అనుగుణంగా ఏర్పాటుచేశారు. దీంతో ప్రస్తుతం ఉన్న పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా పరిషత్గా మారనుంది. జెడ్పీటీసీ స్థానాలు, సిబ్బంది మార్పు లు, జిల్లాల కేటాయింపు ప్రక్రియ పూర్తి చేయనున్నారు. మరోవైపు ఈనెల 24తో పాలకవర్గం పదవీ కాలం ముగియనుండటంతో జెడ్పీ విభజన ప్రక్రియ వేగంగా పూర్తి చేస్తున్నారు. 90 ఏళ్ల చరిత్ర సుదీర్ఘ చరిత్ర కలిగిన పశ్చిమగోదావరి జిల్లాపరిషత్ తొలుత 1936లో జిల్లా బోర్డుగా ప్రస్తానం ప్రారంభించింది. 90 ఏళ్ల సుదీర్ఘ జిల్లా పరిషత్ చరిత్రలో పలువురు ప్రముఖులు జెడ్పీ చైర్మన్లుగా రాజకీయంగా కీలక ప్రస్థానం ప్రారంభించి రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులుగా వెలుగొందారు. 1936లో ఏర్పడిన జిల్లా బోర్డుకు మొదటి అధ్యక్షుడిగా రెండేళ్లపాటు సర్ధార్ దండు నారాయణరాజు పనిచేశారు. ఆ తరువాత 1959 నుంచి జిల్లా పరిషత్గా రూపాంతరం చెందింది. అల్లూరి బాపినీడు మూడుసార్లు జెడ్పీ చైర్మన్గా సేవలందించారు. జిల్లా పరిషత్ చైర్మన్లుగా గతంలో పనిచేసిన గోకరాజు రంగరాజు టీటీడీ చైర్మన్గా చేగొండి హరిరామజోగయ్య, యర్రా నారాయణ స్వామి, మాగంటి రవీంద్రనాథ్చౌదరి, కారుమూరి నాగేశ్వరరావు తదితరులు రాష్ట్ర మంత్రులుగా పనిచేశారు. ప్రస్తుతం 22వ జిల్లా పరిషత్ చైర్మన్గా ఘంటా పద్మశ్రీ 2023 జూన్ 8న బాధ్యతలు స్వీకరించారు. ఈనెల 24న ఆమె పదవీ కాలం ముగియనుంది. అలాగే జెడ్పీ చైర్మన్లుగా పనిచేసిన వారిలో ఉన్నత విద్యావంతులు, ఉన్నత ఉద్యోగులు సైతం ఉన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 15 నియోజకవర్గాల్లో 48 జెడ్పీటీసీ స్థానాలతో జిల్లా పరిషత్ ప్రస్తుతం కొనసాగుతుంది. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్లమెంట్ స్థానం ప్రతిపాదికన తీసుకుని ప్రజామోదంతో నూతన జిల్లాలను ఏర్పాటుచేశారు. ఈ క్రమంలో ఉ మ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలుగా మారింది. అప్పటివరకు జిల్లాలో ఉన్న కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు నియోజకవర్గాలు తూర్పుగోదావరి జిల్లాలో చేరగా కృష్ణా జిల్లాలో ఉన్న నూజివీడు, కై కలూరు నియోజకవర్గాలు ఏలూరు జిల్లాలో కలిశాయి. ఇక తాజాగా నూజివీడు, కై కలూరు నియోజకవర్గాల్లో 8 మంది జెడ్పీటీసీలతో కలిపి ఏలూరు జిల్లా 27 జెడ్పీ స్థానాలతో కొత్త ఏర్పాటైంది. అలాగే ఉంగుటూరు నియోజకవర్గం నుంచి పశ్చిమగోదావరిలోకి మారిన గణపవ రం జెడ్పీటీసీ స్థానంతో కలుపుకుని పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ 20 స్థానాలతో ఏర్పాటైంది. జిల్లా పరిషత్లో ఉపాధ్యాయులు కాకుండా కార్యాలయ సిబ్బంది 976 మంది పనిచేస్తున్నారు. మరో రెండు రోజుల్లో సిబ్బంది విభజనకు మార్గదర్శకాలు వెలువడనున్నాయి. అలాగే కొత్త జిల్లాలకు ఒక సీఈఓ, డిప్యూటీ సీఈఓ స్థానాలను కూడా ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఆగిరిపల్లి, భీమడోలు, బుట్టాయగూడెం, చాట్రాయి, చింతలపూడి, దెందులూరు, ద్వారకాతిరుమల, ఏలూరు, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, కై కలూరు, కలిదిండి, కామవరపుకోట, కొయ్యలగూడెం, కుక్కునూరు, లింగపాలెం, మండవల్లి, ముదినేపల్లి, ముసునూరు, నిడమర్రు, నూజివీడు, పెదపాడు, పెదవేగి, పోలవరం, టి.నర్సాపురం, ఉంగుటూరు, వేలేరుపాడు మండలాల జెడ్పీటీసీ స్థానాలతో ఏలూరు జిల్లాపరిషత్ను ఏర్పాటుచేశారు. ఆచంట, ఆకివీడు, అత్తిలి, భీమవరం, యలమంచిలి, గణపవరం, ఇరగవరం, కాళ్ల, మొగల్తూరు, నరసాపురం, పాలకొల్లు, పాలకోడేరు, పెంటపాడు, పెనుగొండ, పెనుమంట్ర, పోడూరు, తాడేపల్లిగూడెం, తణుకు, ఉండి, వీరవాసరం మండలాల జెడ్పీటీసీలతో పశ్చిమ జిల్లాపరిషత్ ఏర్పాటైంది. జిల్లా పరిషత్ పునర్వ్యవస్థీకరణ 27 జెడ్పీటీసీ స్థానాలతోఏలూరు జిల్లా పరిషత్ 20 జెడ్పీటీసీ స్థానాలతోపశ్చిమగోదావరి జిల్లా పరిషత్ సిబ్బంది విభజనకు రెండు రోజుల్లో జీఓలు ఏలూరులోకి కొత్తగా కై కలూరు, నూజివీడు నియోజకవర్గ జెడ్పీటీసీ స్థానాలు ఉమ్మడి పశ్చిమ నుంచి నిడదవోలు, గోపాలపురం, కొవ్వూరు నియోజకవర్గ జెడ్పీటీసీ స్థానాలు ‘తూర్పు’నకు.. -
జయ కృష్ణా.. ముకుందా.. మురారి
ద్వారకాతిరుమల: జయ కృష్టా.. ముకుంద.. మురారి.. కీర్తనలతో శ్రీవారి దివ్యక్షేత్రం మార్మోగింది. కృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని శనివారం సా యంత్రం ఉట్ల పండుగ, స్వామివారి గ్రామోత్సవం నేత్రపర్వంగా జరిగాయి. ఉట్ల ఉత్సవంలో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా ఆలయంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను రాజాధిరాజ వాహనంపై కొలువుదీర్చారు. వాహనాన్ని సుందరంగా అలంకరించి విశేష పూజలు చేశారు. అనంతరం మంగళ వాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణల మధ్య వాహనం ప్రధాన రాజగోపురం మీదుగా క్షేత్ర పురవీధులకు పయనమైంది. శ్రీవారి కల్యాణ మండపం వద్ద దేవస్థానం ఏర్పాటు చేసిన ఉట్టిని కొట్టిన యువకుడిని ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు సత్కరించారు. కొండపైన గోసంరక్షణశాల వద్ద, క్షేత్రంలోని పలు కూడళ్లలో ఉట్ల సందడి కనిపించింది. గోసంరక్షణశాల వద్ద ఘాట్రోడ్డులో చిన్నారుల నృత్య ప్రదర్శనలు, అలంకరణలు ఆకట్టుకున్నాయి. ద్వారకాతిరుమలలో ఉట్ల ఉత్సవం ఘాట్ రోడ్డులో చిన్నారుల నృత్యప్రదర్శన గోసంరక్షణశాల వద్ద ఉట్టిని కొడుతున్న యువకులు -
గోదావరిలో దూకిన కుటుంబం
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: ఏపీలో మరో విషాదం చోటుచేసుకుంది. యలమంచిలి మండలం చించినాడ బ్రిడ్జిపై నుంచి గోదావరిలో దూకి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. నంబూరి శ్రీనివాస్ కుటుంబంతో సహా వశిష్ట గోదావరి బ్రిడ్జిపై నుంచి దూకారు. తండ్రి, కుమార్తె నంబూరి నిత్య(15), కుమారుడు నంబూరు ఈశ్వర్(16) గల్లంతవ్వగా.. తల్లి పద్మినిని జాలర్లు కాపాడారు. తణుకు పట్టణానికి చెందిన వారిగా గుర్తించారు.తణుకు నుంచి రెండు బైకులపైకి వచ్చి చించినాడ వశిష్ట గోదావరి బ్రిడ్డిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. పద్మినిని పాలకొల్లు ఆసుపత్రికి తరలించారు. ఆర్థిక సమస్యలు కారణంగానే కుటుంబం ఆత్మహత్య చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ప్రతాప్ అప్పారావు అరెస్టు దుర్మార్గం
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ నూజివీడు: మేకా వెంకట ప్రతాప్ అప్పారావును పోలీసుస్టేషన్కు తీసుకెళ్లడం దుర్మార్గమని, ఎప్పుడో 20 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఎమ్మార్ అప్పారావు కాలనీకి సంబంధించిన ఆర్చిపై మంత్రి కొలుసు పార్థసారథి పేరు ఏర్పాటు చేయడం విచిత్రంగా ఉందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) పేర్కొన్నారు. నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావును అరెస్టు చేశారన్న సమాచారం తెలుసుకొని వెంటనే నూజివీడుకు వచ్చి ప్రతాప్ అప్పారావును కలిసి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో క్రెడిట్ చోరీ పిచ్చి పతాకస్థాయికి చేరిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో ఎక్కడైనా కొత్తగా పది ఎకరాలు కొని పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇచ్చి కాలనీని నిర్మాణం చేసి అక్కడ మంత్రి పేరు పెట్టుకుంటే జనం హర్షిస్తారన్నారు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన కాలనీకి మంత్రి సౌజన్యం అని పేరు పెడుతుంటే అది ఎంతమాత్రం కరెక్టు కాదని చెప్పడం తప్పా అని ప్రశ్నించారు. పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం సమంజసం కాదన్నారు. ఇలాంటి చర్యల వల్ల కూటమి పాలకులను ప్రజలంతా అసహ్యించుకుంటారన్నా రు. చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం తప్పదని, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు ఎంతో సహనంతో ఉన్నారని డీఎన్నార్ అన్నారు. -
పీఎఫ్ ఖాతాలను ఆన్లైన్ చేయాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లా పరిషత్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలను ఆన్లైన్ చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.రెడ్డిదొర ఆధ్వర్యంలో ఆ సంఘ నాయకులు జిల్లాపరిషత్ ఉప కార్యనిర్వహణ అధికారి కె.భీమేశ్వర్ను కలిసి ప్రాతినిధ్యం చేశారు. ఈ సందర్భంగా రెడ్డిదొర మాట్లాడుతూ రెండేళ్లుగా జెడ్పీ పీఎఫ్ ఖాతాలను ఆన్లైన్ చేయకపోవడం వలన ఖాతాదారుల అకౌంట్లో ఎంత సొమ్ము ఉందో తెలియడం లేదన్నారు. దీంతో ఉప కార్యనిర్వహణ అధికారి సానుకూలంగా స్పందించి సాధ్యమైనంత తొందరలోనే ఖాతాలను ఆన్లైన్ చేయిస్తానని తెలిపారన్నారు. అలాగే ఫైనల్ పేమెంట్లు, లోన్ల ప్రక్రియను కూడా తొందరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.రామారావు, కార్యదర్శి యూవీ నరసింహారాజు, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యుడు పి.జగదీష్, జంగారెడ్డిగూడెం మండల శాఖ అధ్యక్షుడు ఐ.వెంకటరత్నం, సీనియర్ నాయకులు కె.నాగేశ్వరరావు, ఎస్.రమేష్ పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాస్థాయిలో నిర్వహించనున్న ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమానికి ఫ్యాప్టో భాగస్వామ్య సంఘాల నాయకులు దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు ప్యాఫ్టో సెక్రటరీ జనరల్ యం.ఆదినారాయణ తెలిపారు. శుక్రవారం స్థానిక జిల్లాపరిషత్ ఆవరణలో నిర్వహించిన సమావేశంలో ఏలూరు జిల్లా ప్యాఫ్టో చైర్మన్ జి.మోహన్ మాట్లాడుతూ రావికంపాడు హైస్కూల్ హెడ్మాస్టార్పై జరిగిన దాడికి విద్యాశాఖ తరపున తగిన న్యాయం జరగనందున ఉపాధ్యాయ దినోత్సవం రోజున ప్రతి పాఠశాలలోనూ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి వినతిపత్రాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాలను శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకుండా, ఒకవైపు సత్కారాలు నిర్వహించడం సరైన సందేశాన్ని ఇవ్వదని, ముందుగా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించి, వారి గౌరవానికి, ఆత్మాభిమానానికి భంగం కలగకుండా భద్రత, భరోసా కల్పించినప్పుడే ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు నిజమైన అర్థం ఉంటుందన్నారు. కో–చైర్మన్ జి.వెంకటే శ్వరరావు, జె.రవీంద్ర, డిప్యూటీ సెక్రటరీ జనరల్స్ ఐ.రమేష్, టి.రామారావు, కార్యవర్గ స భ్యులు పాల్గొన్నారు. ఏలూరు టౌన్: జిల్లాలోని పోలీస్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణను ప్రతి శుక్రవారం నిర్వహించేలా చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలతో ఏలూరు, జంగారెడ్డిగూడెం, పోలవరం, నూజివీడు పోలీస్ సబ్ డివిజన్లో పోలీసులకు శిక్షణ, పరేడ్, సీపీఆర్పై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఏలూరు సబ్డివిజన్కు సంబంధించి ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్కుమార్ ఆదేశాలతో వన్టౌన్ సీఐ కె.రామకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బందికి అవగాహన కల్పించారు. ఎస్ఐలు సుధాకర్, రామకృష్ణ, వి.వెంకటేశ్వరరావు ఉన్నారు. ఏలూరు లోని ఆంధ్రా హాస్పిటల్స్ కార్డియాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ ప్రత్యేకంగా సీపీఆర్పై శిక్షణ అందించారు. అత్యవసర పరిస్థితుల్లో గుండెపోటుకు గురైన వ్యక్తికి వైద్య సాయం అందించేలోపు తీసుకోవాల్సిన తక్షణ చర్యలు, సీపీఆర్ నిర్వహించే విధానం, ప్రాణాలను రక్షించటంలో సీపీఆర్ ప్రాధాన్యతను వివరించారు. పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో భా గంగా రోడ్డు ప్రమాదాలు, ఆకస్మికంగా గుండెపోటు ఇతర అత్యవసర స్థితిలో ప్రజలకు స త్వర సహాయం అందించే అంశాలపై వివరించారు. ప్రజలకు మరింత మెరుగైన సహాయం అందించటమే లక్ష్యంగా ఈ ప్రత్యేక శిక్షణను అందిస్తున్నట్లు సీఐ రామకృష్ణ తెలిపారు. నరసాపురం రూరల్: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు మండలంలోని కొప్పర్రు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మెయిన్ ఉపాధ్యాయురాలు రాజశ్రీ ఎంపికయ్యారు. శనివారం విజయవాడలో జరిగే కార్యక్రమంలో తాను సీఎం చంద్రబాబు చేతులమీదుగా అవార్డు అందుకోనున్నట్టు ఆమె తెలిపారు. పలువురు ఆమెను అభినందించారు. -
ట్రిపుల్ఐటీ.. నీటి కష్టాలు ఏంటి ?
● 20 రోజులుగా కనీస అవసరాలకూ కష్టాలే ● పట్టించుకోని ఆర్జీయూకేటీ యాజమాన్యంనూజివీడు: ప్రతిష్టాత్మక నూజివీడు ట్రిపుల్ఐటీ (ఆర్జీయూకేటీ)లో గత 20 రోజులుగా తీవ్ర నీటి కొరత వేధిస్తోంది. వేలాది మంది విద్యార్థులు స్నానాలు, పారిశుధ్య అవసరాలకు నీరు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. క్యాంపస్లో 20 బోర్లు ఉండటంతో పాటు కృష్ణాజలాల సరఫరా ఉన్నప్పటికీ, నిర్వహణ లోపం వల్ల సమస్య పరిష్కారం కావడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు పలుమార్లు విన్నవించినా కనీస ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం లేదని విమర్శిస్తున్నారు. సరిపోని సరఫరా సమయం క్యాంపస్లో మొత్తం 8,800 మంది విద్యార్థులు (65 శాతం బాలికలు, 35 శాతం బాలురు) చదువుతున్నారు. సాధారణ రోజుల్లో ఉదయం రెండు గంటలు (6:00 నుంచి 8:00), సాయంత్రం రెండు గంటలు (6:00 నుంచి 8:00) మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు. దీంతో ఉదయం 5 గంటలకే లేచి క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు. సెలవు రోజుల్లో మరింత ఘోరం సెలవు రోజుల్లో ఈ కష్టాలు రెట్టింపవుతున్నాయి. ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట మాత్రమే నీటిని ఇస్తుండటంతో దుస్తులు ఉతుక్కోవడం, స్నానాలు చేయడం కూడా సాధ్యపడటం లేదని అంటున్న్నారు. 350 మందికి 1,600 లీటర్లే నీటి కొరత వల్ల బాత్రూమ్లు, మరుగుదొడ్ల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. ఒక్కో ఫ్లోర్లో 350 నుంచి 400 మంది విద్యార్థులకు గాను 8 డ్రమ్ముల్లో కేవలం 1,600 లీటర్ల నీటిని మాత్రమే నింపుతున్నారు. అంటే ఒక్కొక్కరికి కనీసం 4 లీటర్ల నీరు కూడా అందడం లేదు. ఫలితంగా ప్రాథమిక అవసరాలు తీర్చుకోలేక, పారిశుధ్య లోపంతో తీవ్ర తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శాశ్వత పరిష్కారం చూపాలి వేలాది మంది భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ మౌలిక వసతి సమస్యపై ఆర్జీయూకేటీ యా జమాన్యం తక్షణమే స్పందించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. నీటి నిల్వ, సరఫరా వ్యవస్థలను సమీక్షించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. -
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులపై అనాసక్తి
● అవార్డుకు దరఖాస్తు చేసుకోని అర్హులు ● ఉపాధ్యాయ దినోత్సవాన్ని బహిష్కరించిన టీచర్ సంఘాలు ఏలూరు (ఆర్ఆర్పేట): ఉపాధ్యాయుల ప్రతిభకు కొలమానంగా నిలిచే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఏలూరు జిల్లాలో ఉపాధ్యాయులు అనాసక్తి కనబరిచారు. 60 అవార్డులకు గాను కేవలం 33 మందే దరఖాస్తు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. అనాసక్తికి ప్రధాన కారణాలు ● ఇన్–సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి చేయడాన్ని ఉపాధ్యాయ లోకం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నా, తమిళనాడు తరహాలో అసెంబ్లీలో రద్దు తీర్మానం చేస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించకపోవడంపై అసంతృప్తి నెలకొంది. ● జిల్లాలో ఉపాధ్యాయులపై వరుస దాడులు జరుగుతుండటం, ముఖ్యంగా రావికంపాడు ప్రధానోపాధ్యాయుడిపై జరిగిన దాడి ఉపాధ్యాయులను మరింత ఆగ్రహానికి గురిచేసింది. ప్రభుత్వం, విద్యా శాఖ వ్యవహారశైలిపై నిరసనగా వారు ఈ అవార్డులను బహిష్కరించినట్టు తెలుస్తోంది. 33 మంది ఎంపిక : దరఖాస్తు చేసుకున్న 33 మందిని విద్యాశాఖ అధికారులు పరిశీలించి తుది జాబితాను ప్రకటించారు. వీరిలో 30 మంది (12 మంది స్కూల్ అసిస్టెంట్లు, 18 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు) ఉన్నారు. మరో ముగ్గురు స్కౌట్ టీచర్లకు కూడా అవార్డులు ప్రకటించారు. ఉపాధ్యాయ దినోత్సవం బహిష్కరణ శనివారం ఉపాధ్యాయ దినోత్సవానికి జిల్లా విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు చేశారు. శనివారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటలకు ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయుల నిరసన సెగ తగిలింది. ఫ్యాప్టో సభ్య సంఘాలైన పలు ఉపాధ్యాయ సంఘాలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటామని శుక్రవారం ప్రకటించాయి. ఈ కార్యక్రమాన్ని అడ్డుకోబోమని, శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్దతిలో తమ నిరసన ఉంటుందని ఆయా సంఘాల నాయకులు ప్రకటించారు. -
కొలుసు పేరును తొలగించాల్సిందే
మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఎమ్మార్ అప్పారావు కాలనీ రోడ్డు వద్ద నిర్మించిన ఆర్చిపై మంత్రి కొలుసు పార్థసారథి పేరును తొలగించాల్సిందేనని మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు డిమాండ్ చేశారు. 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ కాలనీకి శంకుస్థాపన చేయడమే కాకుండా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి పేదలు ఇళ్లు కట్టుకునేలా చేయగా, ఈ రోజు కాలనీ రోడ్డు వద్ద ఆర్చిని అనధికారికంగా నిర్మించడమే కాకుండా మంత్రి కొలుసు పార్థసారథి సౌజన్యంతో అని రాయడమేమిటని ప్రశ్నించారు. ఎమ్మార్ అప్పారావు కాలనీని ఏమై నా మంత్రి కొలుసు ఏర్పాటు చేయించారా, పే దలకు ఏమైనా మంత్రి హయాంలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేయించారా, ఇళ్లు మంజూరు చేశారా అని నిలదీశారు. క్రెడిట్ చోరీ చేయాలని చూడటం టీడీపీకి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. -
గోకుల కృష్ణా.. గోపాల కృష్ణా
చినవెంకన్న దివ్య క్షేత్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కన్నులపండువగా జరిగాయి. గోవులకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 8లో uశనివారం శ్రీ 5 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026ఏలూరు (ఆర్ఆర్పేట): కార్పొరేట్ విద్యాసంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ విద్యను ని ర్వీర్యం చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందనే విమర్శలు విద్యావేత్తల నుంచి వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ పేద విద్యార్థులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వ విద్యా సంస్థలను నీరుగార్చి, వారిని ప్రైవేట్ బాట పట్టించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తాజా పరిణామాలు కూడా ప్రభుత్వ విద్యారంగాన్ని సమూలంగా దెబ్బతీసేలా ఉన్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులను బోధనకు దూరం చేయడం ద్వారా విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాలు సన్నగిల్లేలా చేసి, పేద ప్రజలు ఆర్థిక భారాన్ని సైతం లెక్కచేయకుండా తమ పిల్లలను ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలకు పంపేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని విమర్శలు వస్తున్నాయి. బోధనకు దూరమవుతున్న ఉపాధ్యాయులు విద్యా సంవత్సరం ప్రారంభమైన నాటి నుంచే ఉపాధ్యాయులకు రకరకాల బోధనేతర పనులు అప్పగించడం ద్వారా ప్రభుత్వం వారిని బోధనకు దూరం చేసింది. ఆ తర్వాత పేరెంట్–టీచర్ మీటింగ్ పేరుతో మరోసారి బోధనా సమయాన్ని తగ్గించింది. దీనికి తోడు టెట్ అర్హత తప్పనిసరి అనే నిబంధన ఉపాధ్యాయుల నెత్తిపై పిడుగులా పడింది. కొందరు ఉపాధ్యాయులు ఈ పరీక్షల కోసం సెలవులు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐ గాట్ కర్మయోగి యాప్ ద్వారా ఉపాధ్యాయులు 60 కోర్సులు పూర్తి చేయాలనే కొత్త నిబంధన అదనపు భారంగా మారింది. ఈ కోర్సులు పూర్తి చేయకపోతే జీతాలు ఆపుతామంటూ వస్తున్న హెచ్చరికలతో ఉపాధ్యాయులు బోధనను పక్కనపెట్టి ఆ కోర్సులు పూర్తి చేసే పనిలో పడ్డారు. కొన్ని మండలాల్లో అయితే, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న ఉపాధ్యాయులను మండల విద్యాశాఖాధికారి కార్యాలయాలకు పిలిపించుకుని జీతాల బిల్లులు, ఇతరత్రా ఆఫీసు పను లు చేయించుకుంటున్నారు. యాప్ల భారం.. బోధనకు దూరం విద్యార్థులను గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులను బోధనకు దూరం చేస్తున్న వైనం యాప్ల అప్లోడ్తోనే రోజు గడిచిపోతోంది ఫోన్లు, డేటా ఇవ్వని ప్రభుత్వం ఉపాధ్యాయుల ఆగ్రహం రోజూ పలు యాప్లు అప్లోడ్ చేయడమే ఉపాధ్యాయుడి ప్రధాన వృత్తిగా ప్రభుత్వం మార్చివేసింది. విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించే అవకాశమే ఇవ్వడం లేదు. ఈ యాప్ల భారం ఇలాగే కొనసాగితే ప్రభుత్వ పాఠశాలల మనుగడ, పేద విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలపై పెను ప్రభావమే ప డుతుంది. యాప్ల అప్లోడ్కు ప్రత్యేక వ్య వస్థను ఏర్పాటు చేయాలి – తాళ్లూరి రామారావు, ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపాధ్యాయులపై యాప్ల అప్లోడ్ భారాన్ని పూర్తిగా తొలగించాలి. యాప్లను అప్లోడ్ చేయడానికి ప్రత్యేక వ్యవస్థను ప్రభు త్వం ఏర్పాటు చేసుకోవాలి. ఒక్క లీప్యాప్లోనే 100 టైల్స్ ఉన్నాయి. వాటిని పూర్తి చేయడానికే ఎక్కువ సమయం పట్టేస్తోంది. మిగిలిన యాప్లను కూడా ఉపాధ్యాయులే అప్ లోడ్ చేయాలంటే విద్యార్థులకు బోధన ఎప్పుడు చేయాలి. – గెడ్డం సుధీర్, వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి -
దేశ సేవలో వీర మరణం పొంది..
● ఆర్మీ హవాల్దర్కు కన్నీటి వీడ్కోలు ● సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు భీమడోలు : దేశ రక్షణ కోసం భారత సైన్యంలో హవాల్దర్గా విధులు నిర్వహిస్తూ అకాల మరణం చెందిన భీమడోలులోని లోకంటి గోపాలకృష్ణ (41)కు శుక్రవారం గ్రామస్తులు పెద్ద ఎత్తున కన్నీటి వీడ్కోలు పలికారు. ఈనెల 1న జమ్మూకాశ్శీర్లోని ఉదంపూర్లో తన విధులు ముగించుకున్న తర్వాత రాత్రి అకాల మరణం చెందారు. అక్కడ సైన్యం ఆసుపత్రిలో శవ పంచనామాను నిర్వహించి పార్ధివదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. అక్కడ నుంచి ఢిల్లీ వరకు, ఢిల్లీ నుంచి గన్నవరం వరకు విమానంలో తీసుకుని వచ్చి అంబులెన్స్లో భీమడోలు గ్రామానికి శుక్రవారం పంపారు. దీంతో భీమడోలు విషాదఛాయలు అలముకు న్నాయి. గ్రామ శివారు నుంచి గ్రామస్తులు భారీగా తరలివచ్చి ర్యాలీగా వీడ్కోలు పలికారు. గోపాల్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. సైనిక లాంఛనాలతో.. ఏలూరు 19 ఆంధ్రా బెటాలియన్ ఎన్సీసీకి చెందిన జేసీవో సుబేదార్ వినోద్ ఆధ్వర్యంలో సైనిలాంఛనాలతో గౌరవ వందనం సమర్పించారు. గోపాలకృష్ణ పార్ధివదేహం వద్ద ఘన నివాళులర్పించారు. జాతీయ జెండాను కుటుంబ సభ్యులకు అందజేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, స్నేహితులు, బంధువులు, వివిధ సంస్థల ప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి పార్ధివదేహంపై పుష్పాంజలి ఘటించారు. ఆయన సేవలను స్మరించుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. కుటుంబ సభ్యుల రోదనలు గోపాలకృష్ణ మృతితో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయనకు తల్లి, భార్యతోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇటీవల తండ్రి మృతి చెందడంతో కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న గోపాలకృష్ణ అకాల మరణంతో కుటుంబం రోదనలు మిన్నంటాయి. దేశానికి సేవ చేయాలన్న తపనతో కొన్నేళ్ల కితం గోపాలకృష్ణ సైన్యంలో చేరారు. దేశ సేవలో ఆయన చేసిన సేవలను గ్రామస్తులు కొనియాడారు. -
రైస్మిల్లులో భారీ అగ్నిప్రమాదం
భీమడోలు : భీమడోలులోని వడ్లపట్ల రోడ్డులోని కన్యకా పరమేశ్వరి రైస్ మిల్లులో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.కోటి విలువైన యంత్రాలు, సామగ్రి, ధాన్యం, బియ్యం నిల్వలు మంటలకు దగ్ధమ య్యాయి. రైస్మిల్లులోని ఎలిమినేటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించడంతో భారీ నష్టం వాటిల్లింది. దీంతో మంటలు ఎగసిపడటంతో పరిసర ప్రాంతాల్లో కొంతసేపు తీవ్ర ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న భీమడోలు, ఏలూరు అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. ఇటీవల భీమడోలుకు నూతనంగా మంజూరైన అగ్నిమాపక వాహనం కొంత సేపు మొరాయించడంతో సిబ్బంది ఇబ్బంది పడ్డారు. దీనితో స్థానిక ప్రాంత వా సులు భయాందోళనలు చెందారు. అనంతరం ఏలూరు నుంచి వాహనం రావడంతో మంటలు ఆర్పారు. భీమడోలు సీఐ వి.కృష్ణ, ఎస్సై ఎస్కే మదీనాబాషా సంఘటన స్థలానికి చేరకుని పరిస్థితిని పర్యవేక్షించి తమ సిబ్బందితో అగ్నిమాపక సిబ్బందికి సహకరిస్తూ సహాయ చర్యలు చేపట్టారు. అయితే రైస్మిల్లులోకి ప్రవేశించేందుకు అవకాశం లేకపోవడంతో కిటికీల నుంచి ఫైర్ గన్లతో నీటిని పంపి మంటలను ఆర్పేందుకు అవస్థలు పడ్డారు. అగ్నిమాపక అధికారి ఎస్.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సిబ్బంది రైస్ మిల్లులోని మంటలను అదుపులోకి తీసుకుని వచ్చేందుకు రాత్రి వరకు ప్రయత్నించారు. ప్రమాదంపై విచారణ చేస్తున్నామని అగ్ని మాపక అధికారి ఎస్.శ్రీనివాసరావు పేర్కొన్నారు. -
నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అరెస్ట్
నూజివీడు: పట్టణంలోని ఎమ్మార్ అప్పారావు కాలనీ వద్ద అనధికారికంగా టీడీపీ నాయకులు నిర్మించిన ఆర్చిపై మంత్రి కొలుసు పార్థసారథి సౌజన్యంతో అనే పేరును తొలగించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు చేపట్టిన ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాలనీ వద్ద పోలీసులకు, వైఎస్సార్సీపీ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనతో ట్రాఫిక్ నిలిచిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటూ సీఐ ఐవీ నాగేంద్రకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రతాప్ అప్పారావును అరెస్టు చేసి పోలీసుస్టేషన్కు తరలించారు. శుక్రవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో గురుకుల పాఠశాల వద్ద నిర్మించిన ఆర్చి వద్దకు కార్యకర్తలు, నాయకులతో కలిసి ప్రతాప్ అప్పారావు చేరుకున్నారు. అక్కడి నుంచే ఫోన్లో మున్సిపల్ కమిషనర్ కొరపాటి పీరయ్యతో మాట్లాడి పేరును తీయించాలని చెప్పారు. ఇక్కడకు వచ్చి అనుమతి లేకుండా నిర్మించిన ఆర్చిని పరిశీలించి పేరును తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని ప్రతాప్ కోరారు. అర గంట సేపు వేచి చూసినా కమిషనర్ రాకపోయే సరికి నాయకులు, కార్యకర్తలతో కలిసి మచిలీపట్నం–నూజివీడు–కల్లూరు జా తీయ రహదారిపై ఆందోళనకు దిగారు. విషయం తెలిసి నూజివీడు పట్టణం, ఎమ్మార్ అప్పారావు కాలనీ, సమీప గ్రామాల నుంచి వైఎస్సార్సీపీ, నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో హైవేపై ఇరువైపులా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. సీఐ ఐవీ నాగేంద్రకుమార్ ఆందోళన విరమించాలని కోరారు. దీనికి ప్రతాప్ అప్పారావు బదులిస్తూ మున్సిపల్ కమిషనర్ వస్తానని అరగంట వేచి చూసినా రాలేదని అందుకే ఆయన వచ్చే వరకూ ఆందోళన చేస్తామని చెప్పారు. అయితే అరెస్టు చేయాల్సి వస్తుందని సీఐ చెప్పడంతో వైఎస్సార్సీపీ నాయకులకు, సీఐకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు ప్రతాప్ అప్పారావును అరెస్టు చేసి పోలీసు కారు ఎక్కించారు. కారుకు అడ్డుగా పార్టీ శ్రేణులు ప్రతాప్ అప్పారావును కారులో తీసుకెళ్తుండగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, కాలనీకి చెందిన మహిళలు కారుకు అడ్డుగా రోడ్డుపై పడుకుని ముందుకు కదలనివ్వలేదు. ఆర్చిపై కొలుసు పార్థసారథి పేరును తొలగించాలంటూ నినాదాలు చేశారు. క్రెడిట్ చోరీ చేసేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీ నాయకులు డౌన్డౌన్, ఇదేమీ రాజ్యం ఇదేమీ రాజ్యం దోపిడీ రాజ్యం, దొంగ ప్రభుత్వం, పోలీసుల దౌర్జన్యం నశించాలి, మేకా వెంకట ప్రతాప్ అప్పారావును వెంటనే విడుదల చేయాలని, కాలనీ ఏర్పాటుతోగాని అభివృద్ధితో గాని ఏ సంబంధం లేని వారి పేరు తొలగించాలంటూ పెద్ద ఎత్తున నినా దాలు చేశారు. చివరకు పోలీసు కారు ముందు బైఠాయించిన, పడుకున్న వారిని పక్కకు నెట్టేసి కారును ముందుకు తీసుకెళ్లి ప్రతాప్ అప్పారావును పట్టణ పోలీసుస్టేషన్కు తరలించారు. మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావుతో పాటు 32 మందిని అరెస్టు చేసి వారందరికీ 41 నోటీసు అందించి పంపించారు. నేషనల్ హైవేపై ఆందోళన చేయడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయి ప్రజలు ఇ బ్బంది పడుతుండటంతోనే మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావును అరెస్టు చేసి పో లీసుస్టేషన్కు తరలించాం. ఆర్చి విషయం ఏ మైనా ఉంటే సంబంధిత అధికారులతో మా ట్లాడుకోవాలే తప్ప రోడ్డెక్కి ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగించకూడదు. – కేవీవీఎన్వీ ప్రసాద్, డీఎస్పీ సంబంధం లేని కాలనీ ఆర్చిపై మంత్రి కొలుసు పేరు వేయడంపై అభ్యంతరం మూడు రోజులుగా చెబుతున్నా స్పందించని అధికారులు ఆందోళనకు దిగిన ప్రతాప్ అప్పారావు -
రుణం పేరుతో సైబర్ మోసం
ద్వారకాతిరుమల : ఎస్బీఐ ఫైనాన్స్ పేరుతో వచ్చిన ఫేక్ కాల్ను నమ్మిన ఓ వ్యక్తి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయాడు. ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లి పంచాయతీ ద్వారకానగర్కు చెందిన గాంచి కిషోర్కుమార్కు శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో ఫేక్ కాల్ వచ్చింది. రూ.50 వేల లోను మంజూరైందని నమ్మించిన సైబర్ నేరగాళ్లు.. అప్లికేషన్ ప్రాసెసింగ్ కోసం ముందు రూ.650 పంపాలని, ఆ తరువాత రూ.2,975 చెల్లిస్తే రుణం విడుదల అవుతుందని చెప్పారు. ప్రాసెసింగ్ నిమిత్తం మీరు ముందుగా చెల్లించిన సొమ్ము కూడా లోన్తో కలిపి తిరిగి ఇస్తామని నమ్మించారు. దీంతో కిషోర్కుమార్ తొలుత రూ.650, ఆపై కొంత అప్పు చేసి రూ.2,975 లను రెండు దఫాలుగా వారు పంపిన స్కానర్కు చెల్లించాడు. కొద్దిసేపటికి రూ.50,520 లోన్ మంజూరైనట్టు బాధితుడి ఫోన్కు ఫేక్ మెసేజ్ వచ్చింది. అయితే నగదు విడుదల కావాలంటే జీఎస్టీ నిమిత్తం మరో రూ.5 వేలు చెల్లించాలని వారు సూచించారు. దీంతో అనుమానం వచ్చిన కిషోర్కుమార్ భీమడోలు పోలీసులను ఆశ్రయించాడు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్టు తెలుసుకుని లబోదిబోమన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి ద్వారకాతిరుమల స్టేషన్కు బదిలీ చేశారు. తణుకు అర్బన్: తణుకు మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన వృద్ధుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నాళం శ్రీనివాసరావు తెలిపారు. గ్రామానికి చెందిన బాలిక తల్లి ఉపాధి నిమిత్తం విదేశాల్లో ఉంటున్నారు. ఈ క్రమంలో అమ్మమ్మ వద్ద ఉంటున్న బాలికను అదే గ్రామానికి చెందిన బోనగిరి సత్యనారాయణ మాయమాటలు చెప్పి అసభ్యంగా ప్రవర్తించినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యా దు చేశారు. దీంతో నిందితుడిపై ఫోక్సో కేసుతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు. దెందులూరు : మండలంలోని గోపన్నపాలెం గ్రామంలో శుక్రవారం టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో మోటార్సైక్లిస్ట్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు పెదవేగి మండలం సూర్యరావుపేట గ్రామానికి చెందిన కాసులు (53)గా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించి మరి న్ని వివరాలు తెలియాల్సి ఉంది. అత్తిలి: అతిలి పోలీస్స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ట్రాక్ చేసి రికవరీ చేసినట్టు ఎస్సై కేఎన్ విశ్వనాథ్ తెలిపారు. రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను సంబంధిత బాధితులకు శుక్రవారం అందజేశారు. ప్రజలు ఎవరైనా తమ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నా, చోరీకి గురైనా వెంటనే సీఐఈఐఆర్ పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేసుకోవాలని కోరారు. ఐఎంఈఐ నంబర్ వంటి వివరాలను భద్రపరచుకోవడం ద్వారా ఫోన్ రికవరీకి అవకాశం ఉంటుందన్నారు. ప్రజలు అనధికారికంగా, సరైన బిల్లులు, వివరాలు లేకుండా విక్రయించే మొబైల్ ఫోన్లను కొ నుగోలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. జంగారెడ్డిగూడెం (చింతలపూడి): మండలంలోని లక్కవరంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కోసన తిరుమలరెడ్డి (27) తాను నివాసం ఉంటున్న రేకుల షెడ్డులో ఉరి వేసుకుని మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ఆయన భార్య రాఖీ పండుగ నిమిత్తం పుట్టిల్లు కాకినాడ వెళ్లినట్లు తెలుస్తోంది. ఘటనను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే భార్యకు సమాచారం అందించారు. విషయం తెలిసిన లక్కవరం పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. -
గోకుల కృష్ణా.. గోపాల కృష్ణా
● శ్రీవారి క్షేత్రంలో కృష్ణాష్టమి వేడుకలు ● నేడు ఉట్ల పండుగ ద్వారకాతిరుమల : చినవెంకన్న దివ్య క్షేత్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శుక్రవారం కన్నులపండువగా జరిగాయి. గోపాలుడైన శ్రీకృష్ణునికి అత్యంత ప్రీతిపాత్రమైన గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు ఆధ్యాత్మికానందాన్ని పొందారు. కొండపై ఉన్న గోసంరక్షణశాలలో రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణుడిని సుందరంగా అలంకరించారు. ఈ దివ్యరూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆలయ తూర్పు ప్రాంతంలోని సప్తగోకులం భక్తజన సందోహంతో కళకళలాడింది. పెద్ద సంఖ్యలో భక్తులు గోవులను భక్తిశ్రద్ధలతో పూజించి, వాటికి దాణా అందించారు. పురోహితులు గోపాలకృష్ణునికి విశేష పూజాధికాలు నిర్వహించి, మంగళహారతులు సమర్పించారు. గోవులను సేవించడం ద్వారా శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందవచ్చన్న విశ్వాసంతో భక్తులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. విశేష పూజలు సాయంత్రం ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా సాగాయి. అర్చకులు పాలవెల్లిని ఏర్పాటు చేసి, శ్రీకృష్ణుడి జన్మాష్టమి పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం బాలకృష్ణుడికి అత్యంత ప్రీతికరమైన వెన్నతో పాటు 12 రకాల పిండి వంటకాలను నైవేద్యంగా సమర్పించారు. కృష్ణాష్టమి సందర్భంగా శుక్రవారం రద్దు చేసిన నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలు శనివారం నుంచి యథావిధిగా జరుగుతాయని దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాధరావు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. నేడు ఉట్ల పండుగ జన్మాష్టమి మరుసటి రోజు ఉట్ల పండుగ నిర్వహించడం క్షేత్రంలో ఆనవాయితీ. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం శ్రీవారి క్షేత్రంలో ఉట్ల పండుగను వైభవంగా నిర్వహించనున్నారు. ఉభయ దేవేరులతో శ్రీవారు క్షేత్ర పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. భక్తులు అశేషంగా తరలిరావాలని ఈఓ కోరారు. -
వరలక్ష్మీ నమోస్తుతే
భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం పట్టణ ప్రజల ఇలవేల్పు, ఆరాధ్య దైవం మావుళ్లమ్మవారి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మీ వ్రత కుంకుమ పూజలు వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సామూహిక వరలక్ష్మీ వ్రతంలో పాల్గొన్న భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో చీర, రవికతో పాటు లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. దేవస్థానం అధికారులు, సిబ్బంది పటిష్ట ఏర్పాట్లు చేశారు. దేవస్థానం ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జునశర్మ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమ పూ జలు జరిగాయి. అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మ హాలక్ష్మీ నగేష్, ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు పాల్గొన్నారు. -
అనుమానం పెనుభూతమై..
తణుకు అర్బన్: భార్యపై భర్త కత్తితో దాడి చేసిన ఘటన శుక్రవారం తణుకు పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతవూరు ఇరగవరం రోడ్డు కాలనీలో నివసిస్తున్న పులసేరి భవానీపై భర్త దుర్గాప్రసాద్ కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని ముందుగా తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించగా ఆమె పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం తణుకులోని ప్రెవేటు ఆసుపత్రికి తరలించారు. 11 ఏళ్ల క్రితం వివాహం అయిన వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత పదేళ్లుగా ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశంలో ఉంటున్న దుర్గాప్రసాద్ ఏడాదికోసారి స్వదేశమైన తణుకు వస్తుంటారు. భవానీ స్థానికంగా ఒక హోటల్లో క్యాషియర్గా పని చేస్తుండగా ఆమైపె అనుమానం పెంచుకున్న దుర్గాప్రసాద్ ఇటీవల తణుకు వచ్చిన రోజు నుంచి ఘర్షణ పడుతున్నాడు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదంతో భార్యపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశారు. సమాచారం తెలుసుకున్న పట్టణ సీఐ జేవీ రమణ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుడు దుర్గాప్రసాద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తణుకు పట్టణ ఎస్ఐ సీహెచ్వీ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భార్యపై కత్తితో దాడి -
ఇద్దరి అదృశ్యంపై వేర్వేరు ఫిర్యాదులు
భార్యపై అలిగి భర్త.. ముదినేపల్లి రూరల్: పనుల్లో సాయం చేయమని అడిగిన భార్యపై అలిగిన భర్త అదృశ్యమయ్యాడంటూ కుమారుడు స్థానిక పోలీసుస్టేషన్లో శుక్రవారం ఫిర్యాదు చేశాడు. వివరాల ప్రకారం మండలంలోని పెనుమల్లి శివారు సింగారానికి చెందిన మొవ్వ బాబురావును భార్య గొడ్లపాక శుభ్రం చేయమని కోరింది. దీనిపై ఆగ్రహించిన బాబురావు ఆమైపె కోప్పడగా ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి. దీంతో మనస్తాపానికి గురైన బాబురావు రెండు రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లిపోగా.. బంధువుల ఇళ్ల వద్ద పరిసర ప్రాంతాల్లో గాలించినప్పటికీ ఆచూకీ దొరక్కపోవడంతో కుమారుడు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. భర్త కనిపించడం లేదని.. తన భర్త అదృశ్యమయ్యాడంటూ భార్య స్థానిక పోలీసుస్టేషన్లో శుక్రవారం ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం మండలంలోని వణుదుర్రు శివారు కొత్తపల్లికి చెందిన చెన్నూరు దుర్గాభవానీ, దుర్గారావుకు ఐదేళ్ల క్రిందట వివాహం జరిగింది. వీరి మధ్య ఇటీవల మనస్పర్థలు తలెత్తడంతో దుర్గాభవానీ పుట్టింటికి వెళ్లింది. అనంతరం పెద్దలు జోక్యం చేసుకుని ఇద్దరి మధ్య రాజీ కుదర్చగా కొత్తపల్లిలో కాపురం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి దుర్గారావు మద్యం తాగివచ్చి భార్యతో గొడవపడ్డాడు. శుక్రవారం ఉదయం లేచి చూడగా భర్త కనిపించకపోవడంతో పోలీసుస్టేషన్ ఫిర్యాదు చేశారు. -
తీవ్ర సంక్షోభంలోకి ఆక్వా రంగం
యలమంచిలి: ఆక్వారంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సంక్షోభంలోకి నెడుతోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు విమర్శించారు. గురువారం పాలకొల్లులో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఆక్వా రంగానికి ఎలాంటి సహకారం అందడం లేదన్నా రు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆక్వాకు రూ.1.50కే సబ్సిడీ విద్యుత్, అప్సడా చట్టం ద్వారా ఫీడ్, సీడ్ ధరల నియంత్రణ, స్థానిక అమ్మకాలు పెంచేలా ఫిష్ ఆంధ్ర, మ త్స్యశాఖ అధికారుల ద్వారా సూచనలు, సలహాలు అందించేలా రైతులకు మేలు చేశారన్నారు. అలాగే నరసాపురంలో ఆక్వా వర్సిటీని తీసుకువచ్చారన్నారు. అయితే ప్రస్తుత కూటమి పాలనలో గత 40 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా విపత్కర పరిస్థితులను ఆక్వా రైతులు ఎదుర్కొంటున్నారన్నారు. ఎని మిది నెలల్లో మేతల ధరలు కిలోకు రూ.28 వరకు పెరగడంతో రైతులకు తీవ్రం భారం పడుతోందన్నారు. ఆక్వారంగాన్ని కాపాడాలంటూ రైతులు రోడ్డెక్కి నిరసనలు, ధర్నాలు చేయడంతో పాటు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి భీమవరంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారన్నారు. ఆక్వా వర్సిటీని అటకెక్కించి.. అప్సడా మాజీ వైస్ చైర్మన్ వడ్డి రఘురామ్ మాట్లాడుతూ ఆక్వాకు మేలు చేసేలా రూ.100 కోట్లతో నరసాపురంలో ఆక్వా వర్సిటీని ఏర్పాటుచేస్తే.. కూ టమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తట్ట ఇసుక, ఒక్క సిమెంట్ బస్తా పని కూడా చేయలేదన్నారు. సీడ్, ఫీడ్ కంపెనీలన్నీ చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారివే కావడంతో కంపెనీలు చెప్పిందే చె ల్లుతోందన్నారు. ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడంతో రైతులు పూర్తిగా నష్టపోతున్నారన్నారు. ట్రంప్ ఆక్వా ఎగుమతులపై 50 శాతం సుంకం వేస్తే రొ య్యల ప్రాసెసింగ్ ప్లాంట్లు నష్టపోతాయని, సబ్సిడీ రూపంలో ఏదైనా చేయండని కేంద్రానికి ఉత్తరం రాసిన చంద్రబాబు.. ఇప్పుడు మేత ధరలు తగ్గించాలని ఫీడ్ కంపెనీలకు ఎందుకు ఉత్తరం రాయలేదని రఘురాం ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ పోరాటం వైఎస్సార్సీపీ పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్జి గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి) మాట్లాడుతూ ఆక్వా రైతులకు న్యాయం చేసేలా వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందన్నారు. వైఎస్సార్సీపీ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు -
రొయ్యకు మేత.. రైతుకు వాత
చినవెంకన్నకూ ధరల భారమే! నిత్యావసర వస్తువుల ధరల సెగ ద్వారకాతిరుమల చినవెంకన్నకూ తగులుతోంది. ప్రసాదం తయారీ, నిత్యాన్నదానంపై ధరల ప్రభావం చూపుతోంది. 8లో uశురకవారం శ్రీ 4 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026ఏఐ సృష్టించిన చిత్రం సాక్షి ప్రతినిధి, ఏలూరు: టన్ను రొయ్యలు సాగు చేయాలంటే.. టన్నున్నర మేత కావాలి.. ఇదే సిండికేట్ వ్యాపారులకు ఆదాయ వనరు. ఫీడ్, సీడ్ కంపెనీల నిర్వాహకులు ఒకరే కావడంతో అందరూ సిండికేట్గా మారి అడ్డగోలుగా ఆక్వా మేత ధరలు పెంచుతున్నారు. గత 8 నెలల కాలంలో నాలుగు విడతల్లో వనామీ రకం రొయ్యల మేత రూ.30, టైగర్ రకం రొయ్యల మేత ధర రూ.35కు పెరిగింది. తాజాగా వనామీ రకం మేతపై టన్నుకు రూ.9 వేలు, టైగర్ రొయ్యల మేత పై రూ.12లు పెంచి మరోసారి ఆక్వా రైతుల నడ్డివిరగ్గొట్టారు. కేవలం రేటు పెంపు వల్ల మళ్లీ ఆక్వా రైతులపై రూ.వెయ్యి కోట్లకుపైనే అదనపు భారం పడింది. ఇక మేత పెంపు వల్ల ప్రస్తుత కౌంట్ ధరలకు అనుగుణంగా క్వింటాల్ రొయ్యలకు సగటు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు నష్టం వస్తుందని రైతులు వాపోతున్నారు. 35 నియోజకవర్గాల్లో ఆక్వా సాగు రాష్ట్రంలో సముద్ర తీర ప్రాంతం అధికంగా ఉన్న 35 నియోజకవర్గాల్లో ఆక్వాసాగు సుమారు 5 లక్షల ఎకరాల్లో విస్తరించి ఉంది. ఉభయగోదావరితో పాటు కృష్ణా, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, విశాఖ, శ్రీకాకుళం జిల్లాలో ఆక్వాసాగు జరుగుతుండగా సింహభాగం సాగు 2.63 లక్షల ఎకరాలు ఒక్క పశ్చిమగోదావరిలోనే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఏటా 8 నుంచి 8.50 లక్షల టన్నుల రొయ్యలు రాష్ట్రం నుంచి అమెరికా, యూరప్, చైనా దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ప్రధానంగా 40 కౌంట్ దేశీయ రొయ్యకు అమెరికాలో మంచి మార్కెట్ ఉండటంతో ఎక్కువ అమెరికా ఎగుమతులపైనే సిండికేట్ కంపెనీలు దృష్టి పెడుతుంటాయి. ఒక్క పశ్చి మగోదావరి జిల్లాలోనే సుమారు 65 వేల మంది రైతులు ఆక్వాసాగులో ఉండగా రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షలకు పైనే ఆక్వారంగంలో ఉన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 15 లక్షల మంది ఈ రంగంపై ఆధారపడి ఉన్నారు. గతేడాదిగా ఆక్వా ధరలు భారీగా పతనం, మేతల ధరలు భారీగా పెరుగుదలతో రైతులు తీవ్ర అగచాట్లు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది జూలైలో మేత ధరలను భారీగా పెంచారు. కిలోకు రూ.14 నుంచి 16కు పెంచగా రైతు లు, ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఆందోళనలతో కిలోకు రూ.2లు తగ్గించారు. సరిగ్గా నెల రోజులు దాటగానే మళ్లీ ఽమేత ధరలను పెంచేశారు. సిండికేట్ మాఫియాలో అప్సడా గత ప్రభుత్వ హయాంలో 2020లో ఆక్వాసాగు అభివృద్ధి సంస్థ (అప్సడా)ను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటుచేస్తూ చట్టం తీసుకువచ్చారు. ఆక్వా రంగంలో సీడ్, ఫీడ్, మందుల రేట్లు, ప్రాసెసింగ్, కొనుగోలు ధరలతో పాటు ఏ సమస్య వచ్చినా రైతులకు అండగా నిలిచేలా అప్సడా పని చేసేలా తీర్చిదిద్దారు. కూటమి ప్రభుత్వం అ ధికారంలోకి వచ్చిన తరువాత సీడ్, ఫీడ్ రెండు కంపెనీలు ఒకరే యజమాని కావడం, సింహభాగం కంపెనీలు చంద్రబాబు సానుభూతిపరులవే కావడంతో సిండికేట్ మాఫియాలో అప్సడా నలిగిపోతుంది. పలుమార్లు ఆక్వా రైతులు తారాస్థాయిలో నిరసనలు తెలిపినా అప్సడా స్పందించని పరిస్థితి. మేత ధరలు, పంట ధరలు అన్ని సిండికేటే నిర్ణయించడంతో ఆక్వా రైతులు క్రాప్ హాలిడే బాట పడుతున్నారు. ధరల పెంపు దారుణం సిండికేట్ రాజ్యం సహించం ఫీడ్యించుకు తినేలా ! మళ్లీ ధరల బాదుడు కిలో వనామీ మేత రూ.9, టైగర్ మేత రూ.12కు పెంపు 8 నెలల్లో కిలోకు రూ.35 వరకు రేట్ల పెంపు ఫీడ్, సీడ్ కంపెనీలు ఒకటే కావడంతో ఇష్టారాజ్యం ఆక్వారంగంపై పట్టుకోల్పోతున్న అప్సడా ఎకరాకు సగటున రూ.50 వేల వరకు రైతుకు నష్టం -
దేవుడి దగ్గరా ‘పవర్’ పాలిటిక్స్
● ఆలయాల్లో మూలవిరాట్ ఫొటోలు, వీడియోలపై నిషేధం ● అయినా జనసేన నేతల చిత్రీకరణ ద్వారకాతిరుమల: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మండలంలోని ఐఎస్ జగన్నాథపురంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన పూ జలు వివాదానికి దారితీశాయి. నారసింహుని మూ లవిరాట్ ఫొటోలు, వీడియోలు తీయడమే ఈ వివాదానికి కారణం. ఆలయాల్లో స్వయంభు విగ్రహాలను ఫొటోలు, వీడియోలు తీయకూడదని దేవదాయశాఖ కమిషనర్ ఇటీవల ఆదేశాలు ఇచ్చారు. చినవెంకన్న దేవస్థానం అధికారులు ప్రధాన ఆలయంతోపాటు ఉప, దత్తత ఆలయాల్లోనూ ఈ నిషేధాన్ని అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో పోలవరం నియోజకవర్గానికి చెందిన పలువురు జనసేన నాయకులు నారసింహుని ఆలయంలో పూజలు చేసి ఫొటోలు, వీడియోలు దిగడంతో పాటు వాటిని చేశారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై అధికారులు ఎందుకు స్పందించలేదని భక్తులు ఆక్షేపిస్తున్నారు. యూట్యూబర్లపై కేసులు.. మరి ఇప్పుడు? గతంలో శ్రీవారి ఆలయంలో మూలవిరాట్ను ఫొటోలు తీసిన, డ్రోన్ కెమెరా ఎగురవేసిన యూ ట్యూబర్లపై దేవస్థానం అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయించారు. అదే నిబంధనలు ఇప్పుడు జనసేన నాయకులకు వర్తిస్తాయా? నిబంధనలు ఉల్లంఘించిన వారిపైనా చర్యలు తీసుకుంటారా? లేక అధికార పార్టీ నాయకులు కావడంతో కిమ్మనకుండా ఉంటారా? అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. -
చినవెంకన్నకూ ధరల భారమే!
ద్వారకాతిరుమల: పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల సెగ ద్వారకాతిరుమల చినవెంకన్నకు తగులుతోంది. ఇప్పటికే కూరగాయల ధరలు పెరగడంతో నిత్యాన్నదానంపై అదనపు భారం పడుతుండగా.. తాజాగా బియ్యం, పప్పులు, నెయ్యి, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు కూడా మార్కెట్లో మండిపోతున్నాయి. దీంతో స్వామివారి నిత్యాన్నదానం, నివేదనలు, ప్రసాదాల తయారీ తదితరాల నిర్వహణ వ్యయం మరింత పెరిగే పరిస్థితి నెలకొంది. దేవస్థానానికి అవసరమైన నిత్యవసర వస్తువులను సరఫరా చేసేందుకు అధికారులు ఆరు నెలలకొకసారి ఈ–ప్రోక్యూర్మెంట్ టెండర్ను నిర్వహిస్తారు. అవసరమైన సరుకులను కోరిన పరిమాణంలో కాంట్రాక్టర్ అందించాలి. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సరుకులు సరఫరా చేస్తున్న కాంట్రాక్టు గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. ప్రస్తుతం పాత ధరలకే సరఫరా టెండర్ నిబంధనల ప్రకారం ప్రస్తుత కాంట్రాక్టర్.. మార్కెట్లో ధరలు పెరిగినా పాత టెండర్ ధరలకే నిత్యావసర వస్తువులను సరఫరా చేస్తున్నారు. అయితే కొత్త టెండర్ ఖరారయ్యే సమయానికి మార్కెట్లో పెరిగిన ధరలు కచ్చితంగా ప్రతిబింబించే అవకాశం ఉంది. కొత్త టెండర్పై ప్రభావం మరో ఆరు నెలల పాటు నిత్యావసర వస్తువుల సరఫరా కోసం గతనెల 29న దేవస్థానం కొత్తగా ఈ–ప్రోక్యూర్మెంట్ టెండర్ను పిలిచింది. అక్టోబర్ 1 నుంచి కొత్త టెండర్దారు సరుకులను సరఫరా చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకుని టెండర్దారులు కోట్ చేసే ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని అధికారులు, వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. అదే జరిగితే నిత్యావసర సరుకుల కొనుగోలు వ్యయం పెరిగి, దేవస్థానంపై అదనపు ఆర్థిక భారం పడనుంది. ప్రసాదాల తయారీకే ఖర్చు ఎక్కువ స్వామివారి లడ్డూ, పులిహోర, శర్కర పొంగలి ప్రసాదాల తయారీకి వినియోగించే ముడి సరుకుల ధరలు భారీగా పెరిగాయి. పచ్చి సెనగపప్పు, పంచదార, బియ్యం, చింతపండు, యాలుకలు ధరలు ప్రస్తుతం మార్కెట్లో విపరీతంగా పెరిగాయి. ఎన్నడూ లేని విధంగా రోజురోజుకి నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కూరగాయల సరఫరా ఇలా.. దేవస్థానం టెండర్ షరతుల ప్రకారం కూరగాయలు సరఫరా చేసే కాంట్రాక్టర్ రైతు బజారులోని ధరలకంటే 25 శాతం తక్కువ ధరలకు వాటిని సరఫరా చేయాల్సి ఉంది. మార్కెట్ ధరలతో దేవస్థానానికి సంబంధం లేదు. రైతు బజార్లోని ధరలను చూసుకుని, కావాల్సిన పరిమాణాన్ని కాంట్రాక్టర్కు సూచిస్తే చాలు.. కూరగాయలు నిత్యాన్నదాన భవనానికి చేరుతాయి. అయితే గత పదిరోజులతో పోలిస్తే కొన్ని కూరగాయల ధరలు బాగా పెరిగాయి. ఆ భారం శ్రీవారిపైనే పడుతోంది. ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రం అంబరుఖానాలో పులిహోర ప్రసాదాన్ని ప్యాకింగ్ చేస్తున్న మహిళా కార్మికులు శ్రీవారి నిత్యాన్నదానానికి ట్రస్ట్ ఉండటంతో భక్తులు నిత్యం లక్షలాది రూపాయలను విరాళాలుగా అందిస్తున్నారు. వాటిని బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి, వచ్చిన వడ్డీతో దేవస్థానం అన్నదానాన్ని నిర్వహిస్తోంది. ధరల పెరుగుదల కారణంగా వడ్డీ సొమ్ము మరింతగా ఖర్చవుతోంది. కూరగాయలతో పాటు సరుకుల ధరలకు రెక్కలు నిత్యాన్నదానం, నివేదనలు, ప్రసాదాల తయారీపై ప్రభావం నిత్యావసర వస్తువుల సరఫరాకు కొత్తగా పిలిచిన టెండర్ ప్రస్తుత ధరల ప్రభావం శ్రీవారిపై భారీగా చూపే అవకాశం కూరగాయ రకం గతనెల ఈనెల 23 ధర 3 ధర (కేజీ) రూ. (కేజీ) రూ.టమాట 16.5 22.5 క్యారెట్ 33 36 దొండకాయలు 21 22.5 బంగాళ దుంపలు 19.5 21 ఉల్లిపాయలు 36 37.5 దోసకాయలు 15 18 కీరదోస 25.5 30 -
అడుగంటిన ఆశలు
బుట్టాయగూడెం: రిజర్వాయర్ల పరిధిలో ఈ ఏడాది పంట సాగు అయ్యే పరిస్థితులు కనిపించడంలేదు. సెప్టెంబర్ మొదటి వారం దాటుతున్నా వరుణుడి జాడ లేకపోవడంతో రైతుల ఆశలు అడుగంటుతున్నాయి. పోలవరం నియోజకవర్గంలో సుమారు 32 వేల ఎకరాల్లో ఖరీఫ్ సాగు జరగాల్సి ఉండగా.. ఇప్పటివరకూ వ్యవసాయ బోర్లు ఉన్న ప్రదేశాల్లో కేవలం వెయ్యి ఎకరాల్లో మాత్రమే పంటలు సాగు చేసినట్లు అధికారులు చెప్తున్నారు. పూర్తిగా తగ్గిన జల్లేరు నీటిమట్టం బుట్టాయగూడెం మండలంలోని జల్లేరు జలాశయంలో ప్రస్తుత నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయింది. ఈ జలాశయం పూర్తి నీటి సామర్థ్యం 217.80 మీటర్లు కాగా, ప్రస్తుతం 211.50 మీటర్ల మేర మాత్రమే నీరు ఉంది. ఈ జలాశయం నీటిపై ఆధారపడి 4,200 ఎకరాల ఆయకట్టు కింద రైతులు వరి, పత్తి, మొక్కజొన్న, వేరుశనగ వంటి పంటలను పండిస్తుంటారు. అయితే ఖరీఫ్ సాగుకు ఆశించిన స్థాయిలో నీరు లేకపోవడంతో అనేకమంది రైతులు పొలాలను బీడుగా వదిలేశారు. ప్రస్తుతం నీటిమట్టం 211.50 మీటర్లుగా ఉండడంతో ఈ నీరు కేవలం 200 ఎకరాలకు మాత్రమే సరిపోతుందని అధికారులు వెల్లడిస్తున్నారు. దీంతో దొరమామిడి, తెల్లంవారిగూడెం, దుద్దుకూరు, ముప్పినవారిగూడెం, శ్రీరామపురం, కోటనాగవరం పరిసర ప్రాంతాల్లోని రైతులకు ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. పోగొండ రిజర్వాయర్లోనూ అదే పరిస్థితి బుట్టాయగూడెం మండలంలోని చింతలగూడెం సమీపంలో నిర్మించిన పోగొండ రిజర్వాయర్ పరిస్థితి కూడా ఇదేవిధంగా ఉంది. ఈ రిజర్వాయర్ పూర్తి నీటి మట్టం 157 మీటర్లు కాగా, ప్రస్తుతం 152.5 మీటర్లు మాత్రమే నీరు ఉంది. ఈ రిజర్వాయర్ పరిధిలో సుమారు 4 వేల ఎకరాల్లో గిరిజన రైతులు వివిధ రకాల పంటలు పండిస్తుండగా.. ఇక్కడి నుంచి విడుదలయ్యే నీటి ద్వారా బందకట్టు, ఆయకట్టు రైతులు మరో 3,652 ఎకరాల్లో పంటలు సాగు చేస్తుంటారు. అయితే వర్షాలు లేక నీటి మట్టం తగ్గిపోవడం వల్ల ఇక్కడ కూడా ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. పెద్దవాగు ప్రాజెక్టులోనూ లేని నీరు పెద్దవాగు ప్రాజెక్టు ఆంధ్రా, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా వేలేరుపాడు, కుక్కునూరు మండలాల పరిధిలో 11,388 ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటలు పండిస్తుంటారు. అయితే గత ఏడాది వరదలకు ఈ ప్రాజెక్టు గట్టు కొట్టుకుపోవడంతో నీరు నిల్వ ఉండే పరిస్థితి లేదు. ఈ ఏడాది వర్షాలు కురవకపోవడంతో ప్రాజెక్టు పూర్తిగా అడుగంటింది. దీంతో ఇక్కడ కూడా సాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో తుఫానులు ఏర్పడి ఏవైనా వర్షాలు కురుస్తాయనే ఆశతో రైతులు ఎదురుచూస్తున్నారు. వరుణదేవుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిస్తేనే ఖరీఫ్లో వ్యవసాయం చేసేందుకు రైతులు సిద్ధపడుతున్నారు. నిండని చెరువులు నియోజకవర్గంలో సుమారు 128 మైనర్ ఇరిగేషన్ చెరువుల పరిధిలో 30 వేలకు పైగా ఆయకట్టు భూములు ఉన్నాయి. వీటి కింద రైతులు వరి, పత్తి, మొక్కజొన్న, వేరుశనగ వంటి పంటలు సాగు చేస్తుంటారు. అయితే ఇప్పటివరకూ ఈ చెరువుల కింద కేవలం 1,100 ఎకరాల్లో మాత్రమే రైతులు సాగు చేసినట్లు అధికారులు చెప్తున్నారు. ఈ భూములన్నీ పూర్తిగా వర్షాధారంపైనే ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతం వర్షాలు కురవకపోవడంతో ఏ ఒక్క చెరువులోనూ నీరు లేక, ఆయకట్టు రైతులు పంటల సాగుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బుట్టాయగూడెం మండలం జల్లేరు జలాశయంలో నీటిమట్టం తక్కువగా ఉన్న దృశ్యం చిన్నజీడిపూడి సమీపంలో పంటలు వేయకుండా ఖాళీగా ఉంచిన సాగు భూమి జలాశయాల్లో తగ్గిన నీటిమట్టం ప్రశ్నార్థకంగా రబీసాగు దిక్కుతోచని స్థితిలో రైతులు నియోజకవర్గంలో సుమారు 32 వేల ఎకరాలకు నీటి సమస్య ప్రస్తుతం 12 వేల ఎకరాల్లోనే ఖరీఫ్ సాగు ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురవడం వల్ల జలాశయాల్లో నీటి మట్టం బాగా తగ్గాయి. జల్లేరు జలాశయంలో ఉన్న నీరు కేవలం 200 ఎకరాలకు మాత్రమే సరిపోతుంది. పోగొండ రిజర్వాయర్, పెద్దవాగు ప్రాజెక్టుల్లోనూ తగినంత నీరు లేని పరిస్థితి ఉంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వర్షాలు కురిస్తే జలాశయాలు నిండుతాయనే ఆశతో ఉన్నాం. – టి. సురేష్, ఎంఐ ఏఈ, కేఆర్పురం, బుట్టాయగూడెం మండలంఈ ఏడాది వర్షాలు లేకపోవడం వల్ల పంటలు పండించలేని పరిస్థితి ఏర్పడింది. ప్రతి ఏటా రబీలో జల్లేరు జలాశయం నుంచి వచ్చే నీటి ద్వారా మొక్కజొన్న, వరి వంటి పంటలు పండిస్తున్నాం. ఈ ఏడాది ఆ పరిస్థితి కనిపించడం లేదు. జలాశయంలో నీటి మట్టం తగ్గడంతో మా భూములకు నీరు వచ్చే అవకాశం లేదు. – తెల్లం భీమరాజు, రైతు, దుద్దుకూరు, బుట్టాయగూడెం మండలం -
జిల్లా ప్రజా రవాణా అధికారిగా సుబ్రహ్మణ్యం
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లా ప్రజారవాణా అధికారిగా అడ్డాల సుబ్రహ్మణ్యం గురువారం బాధ్యతలు చేపట్టారు. ఎస్.గిరిధరకుమార్ గతనెల 31న పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో తిరువూరు డిపో మేనేజర్గా పనిచేస్తూ పదోన్నతిపై సుబ్రహ్మణ్యం ఇక్కడకు వచ్చారు. కార్యాలయ, డిపో సిబ్బంది, యూనియన్ల నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టరేట్కు వెళ్లి కలెక్టర్ సీహెచ్ నాగరా ణిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. జి ల్లాలో ప్రజారవాణా వ్యవస్థను మరింత బలోపే తం చేసి, ప్రయాణికులకు మెరుగైన, సౌకర్యవంతమైన సేవలు అందేలా చర్యలు తీ సుకోవాలని కలెక్టర్ సూచించారు. మరింత సమర్థవంతంగా సేవలు అందించేందుకు కృషి చేస్తానని సుబ్రహ్మణ్యం అన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం కలెక్టరేట్ వద్ద పంచాయతీ కార్మికులు గురువారం ధర్నా చేసి కలెక్టర్కు వినతిపత్రం అందించారు. పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ పంచాయతీల్లో స్వీపర్లు, పంపు ఆపరేటర్లు, వెహికల్ డ్రైవర్స్ ఎలక్ట్రీషియన్లు, బిల్ కలెక్టర్లు, అటెండర్లు యాళ్ల తరబడి చాలీచాలని జీతాలతో బతుకుతున్నారన్నారు. ఎన్నికల సమయంలో తమను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తమకు యూనిఫామ్, చెప్పులు, సబ్బులు, నూనెలు, కనీసం గ్లౌజులు, మాస్కులు కూడా ఇవ్వడం లేదన్నారు. టెండర్ విధానం రద్దు చేయాలని, కనీసం రూ.26 వేల వేతనం, గుర్తింపు కా ర్డులు, పీఎఫ్, ఈఎస్ఐ అమలు తదితర డి మాండ్లను వివరించారు. జిల్లాలోని పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. వీరవాసరం: మండలంలోని రాయకుదురు జె డ్పీ హైస్కూల్ ప్లస్ ప్ర ధానోపాధ్యాయుడు కానుకొలను శ్రీనివాసరావు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారని గురువారం హైస్కూల్ సిబ్బంది తెలిపారు. ఆయన 2017లో ధర్మారావు ఫౌండేషన్ (పాలకొల్లు) ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు, 2019లో ఆంధ్రప్రదేశ్ సోషల్ సైన్సెస్ టీచర్స్ ఫెడరేషన్ ద్వారా స్టేట్ లెవెల్ బెస్ట్ సోషల్ టీచర్ అవార్డును, 2022–23లో పాలకొల్లు లయన్స్ క్లబ్ ద్వారా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, 2023లో సర్వేపల్లి రాధాకృష్ణ బెస్ట్ టీచర్ అవార్డును అందుకున్నారని చెప్పారు. 2025లో జిల్లాస్థాయిలో ఉత్తమ ప్రధానోపాధ్యాయుడు అవార్డును పొందరన్నారు. పోలవరం రూరల్: గోదావరిలో వరద ప్ర వాహం క్రమేపీ తగ్గుతూ సాధారణ స్థితికి చేరుకుంటోంది. నదీ పరీవాహక ప్రాంతాల్లో, ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నదిలోకి చేరే నీటి పరిమాణం తగ్గుతోంది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద నీటిమట్టం 28 మీటర్లకు చేరుకుంది. స్పిల్వేకి చెందిన 48 గేట్ల ద్వారా 1.63 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నూజివీడు: స్థానిక ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ప్రవేశాలకు ఈనెల 7వ తేదీ మధ్యాహ్నం 1 గంటలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రధానాధికారి రజిత గురువారం ప్రకటనలో తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వారు, ఆపైన చదివిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తు కాపీని ప్రింట్ తీసుకుని, 7న జరిగే సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు, కౌన్సెలింగ్కు హాజరు కావాలని సూచించారు. ఆరేడులో శాస్త్రవేత్తల బృందం ఉండి: మండలంలోని ఆరేడులో గురువారం జలచర వ్యాధుల జాతీయ పర్యవేక్షణ కార్యక్రమంలో భాగంగా శాస్త్రవేత్తలు, అధికారుల బృందం పర్యటించింది. జిల్లాలో ఆక్వా వ్యాధులు ప్రబలుతున్నాయనే సమాచారం మేరకు ఆగర్రు, మోడుగుల, సరిపల్లె, నిడమర్రు, ఉండి మండలం ఆరేడులోని రొయ్యల చెరువులను బృంద సభ్యులు పరిశీలించి రొయ్యల నమూనాలు సేకరించారు. -
సైబర్ మోసగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి
● ఏలూరు జిల్లా ఎస్పీ శివకిషోర్ ● సైబర్ నేరంలో మోసపోయిన బాధితుడికి రికవరీ సొమ్ము అందజేత ఏలూరు టౌన్ : అధిక మొత్తంలో లాభాలు వస్తాయంటూ ఆశ చూపి మోసాలకు పాల్పడే సైబర్ కేటుగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ సూచించారు. సైబర్ మోసంలో భారీగా సొమ్ము పోగొట్టుకున్న వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు రికవరీ చేసిన డబ్బులను బాధితుడికి అందజేశారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ ఈ వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ ప్రసాద్రావు, ఏలూరు డీఎస్పీ శ్రావణ్కుమార్, సైబర్ సెల్ సీఐ దాసు తదితరులు పాల్గొన్నారు. ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో రూ.67 లక్షలు టోకరా కామవరపుకోట మండలం సాగిపాడు గ్రామానికి చెందిన మల్లెంపల్లి జీవన్కుమార్కు వాట్సాప్ ద్వారా పరిచయమైన వ్యక్తులు ‘వీఎల్ బుక్’ పేరుతో ఒక లింక్ పంపారు. ఆన్లైన్లో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని నమ్మించారు. అనంతరం అతడిని గేమింగ్ బెట్టింగ్లోకి దింపి పెద్దఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిపించారు. ఇలా జీవన్కుమార్ నుంచి ఆన్లైన్ ద్వారా రూ.67,67,888 కాజేశారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నంబర్ 1930కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తడికలపూడి పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితులు ఉపయోగించిన బ్యాంకు ఖాతాలు, నగదు లావాదేవీలను పోలీసులు విశ్లేషించారు. రూ.19.54 లక్షలు రికవరీ.. బాధితుడికి అందజేత దర్యాప్తులో భాగంగా రికవరీ చేసిన రూ.19,54,600 నగదును జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ చేతుల మీదుగా బాధితుడికి అందజేశారు. అలాగే, మోసపోయిన మొత్తంలో మరో రూ.16 లక్షల సొమ్మును వివిధ బ్యాంకు ఖాతాల్లో ఫ్రీజ్ చేయించి, ఆ పత్రాలను బాధితుడికి అందించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు ఆ సొమ్మును కూడా బాధితుడు పొందేలా పోలీస్ అధికారులు తగిన చర్యలు చేపట్టారు. బెంగళూరు కేంద్రంగా మోసాలు.. 15 మంది నిందితుల గుర్తింపు ఈ ఆన్లైన్ మోసానికి సంబంధించిన కేసులో మొత్తం 15 మంది నిందితులను గుర్తించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. నిందితులకు బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) కింద నోటీసులు జారీ చేశామని స్పష్టం చేశారు. విచారణలో భాగంగా గణపవరం మండలం అర్థవరం గ్రామానికి చెందిన సాగిరాజు చైతన్య వర్మ అనే వ్యక్తి ‘వీఎల్ బుక్’ లింక్ పేరుతో మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్న ముఠాలో ఉన్నట్లు తేలింది. నిందితుడు బెంగళూరు నుంచి ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారణ అయిందని ఎస్పీ వెల్లడించారు. ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా వ్యాప్తంగా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను భారీఎత్తున రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. సెల్ఫోన్ల రికవరీలో రాష్ట్రవ్యాప్తంగా సగటున 35 శాతం మాత్రమే ఉండగా.. ఏలూరు జిల్లాలో అత్యధికంగా 80 శాతం రికవరీ సాధించామని ఆయన వెల్లడించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాధితులకు మొబైల్ ఫోన్లను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. 2026 ఆగస్టు నెలలో భారీగా 206 మొబైల్ ఫోన్లు రికవరీ చేసినట్లు స్పష్టం చేశారు. ఈ సెల్ఫోన్ల విలువ సుమారు రూ.51.50 లక్షలు ఉంటుందని తెలిపారు. ఇప్పటివరకూ ఏలూరు జిల్లాలో సీఈఐఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు ఫిర్యాదు చేయగా.. మొత్తం 4,266 సెల్ఫోన్లను రికవరీ చేశామని చెప్పారు. ఇలా రికవరీ చేసిన సెల్ఫోన్ల విలువ సుమారు రూ.10 కోట్ల 66 లక్షల 50 వేలు ఉంటుందని వివరించారు. ఎవరి ఫోన్లయినా చోరీకి గురైనా, పోగొట్టుకున్నా వెంటనే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) పోర్టల్లో ఫిర్యాదు చేయాలని జిల్లా ప్రజలకు ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ వై. ప్రసాద్రావు, ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్కుమార్, సైబర్సెల్ సీఐ దాసు, ఏలూరు త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
ధరల నియంత్రణలో ప్రభుత్వాలు విఫలం
ఏలూరు (టూటౌన్): పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా వైఫల్యం చెందాయని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డీఎన్వీడీ ప్రసాద్, నగర కార్యదర్శి పంపన రవికుమార్ విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నిరసిస్తూ సీపీఎం ఏలూరు నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పాత బస్టాండ్ సెంటర్లో వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పచ్చగడ్డి తింటూ రెండు చెవుల్లో పువ్వులు పెట్టుకుని ధర్నా నిర్వహించారు. ఉల్లి ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్యుడికి ఉల్లిపాయలు సైతం ఒక ఖరీదైన వస్తువుగా మారిపోయాయని తెలిపారు. ఈ నిరసనలో భాగంగా మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఎస్. సత్యనారాయణ, గడిగంటి కోటేశ్వరరావులకు ఉల్లిపాయల దండలు వేసి సత్కరించి, ప్రభుత్వ తీరును వినూత్నంగా ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా డీఎన్వీడీ ప్రసాద్, పంపన రవికుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం కిలో పంచదార రూ.72, సన్ఫ్లవర్ ఆయిల్ రూ.180, వేరుశనగ నూనె రూ.190, బెల్లం రూ.90, కందిపప్పు రూ.120, గ్యాస్ సిలిండర్ రూ.1,000కి పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్లో ఉల్లిపాయలు సైతం కిలో రూ.60 పలుకుతున్నాయని చెప్పారు. ప్రజల కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని ఈ దౌర్భాగ్య పరిస్థితులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నగర కమిటీ సభ్యులు వైఎస్. కనకారావు, మంచెల్ల ఇస్సాకు, తమ్మినేని అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు. -
మహిళల రక్షణ కోసం కొత్త చట్టాలు
ఏలూరు (ఆర్ఆర్పేట): మహిళల రక్షణ కోసం కొత్త చట్టాలు వచ్చాయని వాటి గురించిన అవగాహన కలిగి ఉండాలని ఏలూరు వన్టౌన్ ఎస్సై సుధాకర్ సూచించారు. జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్, డీఎస్పీ డి.శ్రావణ్కుమార్ ఆదేశాల మేరకు ఏలూరు వన్టౌన్ ఇన్స్పెక్టర్ కె.రామకృష్ణ ఆధ్వర్యంలో ఎస్సై సుధాకర్, శక్తి టీం సభ్యులు వెన్నవల్లివారి పేట ఉర్దూ పాఠశాలలో విద్యార్థినులకు కొత్త చట్టాలు, మహిళల భద్రత కోసం శక్తి యాప్ ప్రాముఖ్యతను గురించి అవగాహన కార్యక్రమాన్ని గురువారం ని ర్వహించారు. బాలికలు ఆత్మవిశ్వాసంతో ముందు కు సాగాలని, వేధింపులు, ఇబ్బందులు ఎదురైతే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను లేదా డయల్ 112 లేదా పోలీసులను సంప్రదించాలని సూచించా రు. శక్తి యాప్ ద్వారా కూడా సహాయం పొందవచ్చని సూచించారు. -
‘సీఎం సార్.. మా డబ్బులు మాకివ్వండి’
ఏలూరు (టూటౌన్): ‘సీఎం సార్, మా డబ్బులు మాకివ్వండి’ అంటూ ఉద్యోగులు గళమెత్తారు. ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం కూడా జిల్లాలో ఉద్యోగులు నల్ల బ్యా డ్జీలతో విధులకు హాజరయ్యారు. వాట్సాప్ డీపీ (ప్రొఫైల్ ఫొటో)లో ‘సీఎం సార్, మా డబ్బులు మాకివ్వండి’ అని నిరసన కొనసాగించడంతో పాటు మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఏలూరు కలెక్టరేట్, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం, నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసనలు తెలిపారు. ఏపీజేఏసీ జిల్లా చైర్మన్ కె.రమేష్కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బంది సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. వెంటనే 12వ పీఆర్సీ కమిషన్ను నియమించాలన్నారు. ఉద్యోగులకు కనీ సం 30 శాతానికి తగ్గకుండా ఐఆర్ ప్రకటించాలని, ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలన్నారు. మొత్తంగా ఉద్యోగులకు రావాల్సిన రూ.40 వేల కోట్ల బకాయిలపై స్పష్టమైన రూట్ మ్యాప్ ప్రకటించాలన్నారు. జనరల్ సెక్రటరీ బి.రాంబాబు, రె వెన్యూ సర్వీసెస్ అస్సోసియేషన్ జిల్లా సెక్రటరీ ఎ.ప్రమోద్కుమార్, మహిళా విభాగం చైర్పర్సన్ గీతిక, మహిళా విభాగం జనరల్ సెక్రటరీ భాశీరా, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల నిరసన -
వ్యక్తి అనుమానాస్పద మృతి
భీమవరం: భీమవరం వన్టౌన్ బ్రిడ్జిపేట సమీపంలోని కందికట్లవారి వీధిలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఏలూరి రాజేశ్(38) బుధవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి రాత్రి వరకు తిరిగి రాలేదని, గురువారం ఉదయం ఇంటి బయట సిమెంట్ రోడ్డుపై మృతి చెంది ఉన్నట్లు మృతుని భార్య శ్రీదేవి ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి సీఐ ఎ.రమేశ్ దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఉంగుటూరు: కై కరం శివారు లంకమాలపల్లిలో ప్రభుత్వ భూమిలోని నాలుగు ఎకరాల్లో చేపల చెరువు సాగు చేసుకుంటున్న తనపై కక్షగట్టి, స్థానికంగా తనంటే గిట్టనివారితో కలిసి కొందరు తమకు చెందిన సుమారు రూ.2 లక్షల విలువైన చేప పిల్లలను, రూ.15 వేల విలువైన వలలను నాశనం చేశారని కప్పల రణరాజ్ చేబ్రోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుటుంబం నలుగురం కలిసి గత 40 సంవత్సరాలుగా ఈ భూమిలో వరి సాగు చేసుకుంటున్నామని, అయితే ఆ తర్వాత వరి పండని నేపథ్యంలో గత 14 ఏళ్లుగా దీనిని చేపల చెరువుగా మార్చి సాగు చేసుకుంటున్నామని ఫిర్యాదుదారుడు తెలిపారు. నూజివీడు: మండలంలోని తుక్కులూరులో ఓ వ్యక్తి వద్ద నుంచి దాదాపు 3 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకోవడం సంచలనంగా మారింది. నిరంతరం అందరిలో ఒకడిగా తిరిగే వ్యక్తి పెద్ద ఎత్తున గంజాయిని తీసుకొచ్చి విక్రయిస్తున్న విషయం తెలిసి గ్రామస్తులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇతనితో పాటు మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారిస్తున్నట్లు సమాచారం. వీరు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రాంతాల్లోని ఒరిస్సా బోర్డర్ నుంచి గంజాయిని తీసుకువచ్చి అమ్ముతుండటం గమనార్హం. ఇటీవల కాలంలో తుక్కులూరుతో పాటు పట్టణంలోని ఎమ్మార్ అప్పారావు కాలనీలో గంజాయి సేవించే వారి సంఖ్య పెరిగిందని, చీకటి పడితే వీధుల్లోకి వెళ్లలేకపోతున్నామని ఆయా కాలనీ వాసులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు గంజాయి రవాణాకు సంబంధించి సమగ్రంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. గంజాయిని తీసుకొచ్చి అమ్మడం వెనుక ఉన్న వారందరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు వినికిడి. ఈ రాకెట్ వివరాలను నేడు మీడియా ముందు వెల్లడించనున్నట్లు సమాచారం. నూజివీడు: తన కుమార్తెను బెదిరించి, భయపెట్టడం వల్లే బలవన్మరణానికి పాల్పడిందని దుడ్డు రంజిత (18) తల్లి మేరీ గురువారం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇవి. మేరీ పెద్ద కుమార్తె రంజిత ఇంటర్ వరకు చదువుకొని చాక్లెట్ కంపెనీలో రోజువారీ పనులకు వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన బండారు చందు ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంట పడుతుండటంతో ఈ ఏడాది మే 3వ తేదీన రూరల్ పోలీస్స్టేషన్లో కేసు పెట్టారు. దీంతో అప్పటి నుంచి చందుతో పాటు అతని తల్లిదండ్రులు, బాబాయిలు మేరీ కుటుంబంపై కక్ష పెంచుకుని నీకు జీవితం లేకుండా చేస్తామంటూ బెదిరిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 2న కుటుంబ సభ్యులు ఇంటి వద్ద లేని సమయంలో బండారు చందు మేరీ ఇంటి ఆవరణలో నుంచి బయటకు వస్తుండటాన్ని ఆమె చిన్నకుమార్తె మౌనీ చూసింది. కొద్దిసేపటి తరువాత ఇంటిలోకి వెళ్లి చూడగా రంజిత ఫ్యానుకు వేలాడుతూ ఉండటాన్ని చూసి కేకలు వేయగా, చుట్టుపక్కల వారు వచ్చి రంజితను కిందకు దింపి హనుమాన్ జంక్షన్లోని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. తన కుమార్తె చనిపోవడానికి బండారు చందు, అతని కుటుంబ సభ్యులే కారణమని వారిని కఠినంగా శిక్షించాలని మేరీ ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై జీ జ్యోతీబసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నిబంధనలు మీరి ‘అదనపు బాధ్యతలు’
● కొందరికే పదేపదే అదనపు బాధ్యతలు ● నూజివీడు ట్రిపుల్ఐటీ అధికారుల నిర్వాకం ● విద్యావర్గాల్లో తీవ్ర చర్చ నూజివీడు: నూజివీడు ట్రిపుల్ఐటీలో అదనపు బాధ్యతల కేటాయింపులపై నిబంధనల ఉల్లంఘన జరుగుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏడాదికోసారి మార్చాల్సిన బాధ్యతలను కొందరికే కట్టబెట్టడంపై విద్యావర్గాల్లో చర్చ సాగుతోంది. యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన సాధారణంగా నిబంధనల ప్రకారం ఏడాదికోసారి అదనపు బాధ్యతలు నిర్వర్తించే వారిని మార్చాలి. కానీ, కొందరు అధికారుల ఇష్టారాజ్యంగా నిర్ణయాలతో కొందరికే పదేపదే అవకాశాలు దక్కుతున్నాయి. ఒకే అధ్యాపకుడికి వరుస కీలక పోస్టులు మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఒక అధ్యాపకుడు ఫిబ్రవరి 2021 నుంచి అక్టోబర్ 2021 వరకు అసోసియేట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్గా, 2021 నవంబర్ నుంచి 2022 ఆగస్టు వరకు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్గా పనిచేశారు. ఆ తర్వాత 2022 ఆగస్టు నుంచి 2024 జనవరి వరకు డీన్ అకాడమిక్స్గా, ప్రస్తుతం 2024 ఆగస్టు నుంచి ఇన్చార్జి ఏఓగా కొనసాగుతున్నారు. అలాగే ఇదే క్యాంపస్లో తెలుగు విభాగానికి చెందిన మరో అధ్యాపకుడు సెక్యూరిటీ, హౌస్కీపింగ్ తదితర వ్యవహారాలకు ఫ్యాకల్టీ ఇన్చార్జిగా నాలుగేళ్లకు పైగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల అకాడమిక్ నష్టం పరిపాలన, పరీక్షల నిర్వహణ వంటి పనుల్లో తలమునకలవడం వల్ల బోధనకు తగిన సమయం కేటాయించలేకపోతున్నారని, ఇది విద్యార్థుల అకాడమిక్ ప్రయోజనాలపై ప్రభావం చూపుతోందని ఫ్యాకల్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అనుభవానికి నోచుకోని ఇతరులు అర్హత కలిగిన ఇతర అధ్యాపకులకు అవకాశం ఇవ్వకపోవడం వల్ల వారికి పరిపాలనా అనుభవం దక్కకపోవడంతో పాటు వ్యవస్థలో పారదర్శకత లోపిస్తోందనే వాదన వినిపిస్తోంది. ప్రతిష్టాత్మక ప్రభుత్వ సంస్థలో పారదర్శకతను పెంచేందుకు, విమర్శలకు తావులేకుండా నిబంధనలకు అనుగుణంగా అదనపు బాధ్యతలను కేటాయించాల్సిన అవసరం ఉంది. -
రైతులకు తీవ్ర నష్టం
ఆక్వా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఫీడ్ ధరను కేజీకి రూ.10 నుంచి రూ.12 వరకు పెంచారు. దీంతో రైతులకు తీవ్ర నష్టం తప్పదు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి. టన్ను 100 కౌంట్ రొయ్య పంటకు రూ.2,72,000 ఖర్చవుతోంది. మేత ధరల పెంపుతో టన్ను రొయ్యలకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు నష్టపోతాం. ఇష్టానుసారం పెంచిన రేట్లను తగ్గించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం. – చవ్వాకుల సత్యనారాయణమూర్తి, రొయ్యల రైతు నేను 25 ఎకరాల రొయ్యల సాగు చేస్తున్నా. ఫీడ్ తయారీ, ప్రాసెసింగ్ ప్లాంట్ల, రొయ్యల మందుల యజమానులు సిండికేట్గా మారి ని లువునా దోచేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం కనుసన్నల్లోనే సిండికేట్ వ్యవస్థ నడుస్తోంది. ఫీడ్ తయారీ ఉత్పత్తులు పెరిగాయన్న సాకుతో రేట్లు పెంచేశారు. తయారీ ఉత్పత్తులు తగ్గినప్పుడు ఎందుకు రేట్లు తగ్గించడం లేదు. ఎప్పుడైనా అదనపు భారం చివరకు రైతులపైనే పడుతుంది. – కావలి దాము, ఆక్వా రైతు, నందమూరిగరువు రొయ్యల రైతును చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. ఆక్వా రైతు లు, ఫీడ్ యజమానులతో నిర్వహించిన సమావేశంలో కిలోకు రూ.4 తగ్గిస్తారని చెప్పి, రూ.2 తగ్గించి చేతులు దులుపుకున్నారు. ఇదంతా చూస్తే చంద్రబాబు మాటకు విలువ లేకుండా పోయిందా..? లేదా చంద్రబాబు ఫీడ్ యజమాలతో కుమ్మక్కయ్యారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. జగన్ హ యాంలో రొయ్యల రైతుల సమస్యలు వెంటనే పరిష్కారమయ్యేవి. – బొల్లెంపల్లి శ్రీనివాసచౌదరి, రొయ్యల రైతు, అండలూరు -
దివ్యాంగులను ఢీకొట్టిన వ్యాన్
తణుకు అర్బన్ : దివ్యాంగుల వాహనాన్ని వ్యాన్ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు దివ్యాంగులు గాయపడ్డారు. తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నుంచి ఆర్వోబీవైపు నాలుగు చక్రాల దివ్యాంగుల వాహనంలో వస్తున్న ఇద్దరు దివ్యాంగులను వెనుకనుంచి వ్యాన్ ఢీకొట్టింది. దీంతో డ్రైవింగ్ చేస్తున్న అత్తిలి మండలం కొమ్మర గ్రామానికి చెందిన దివ్యాంగుడు మరపట్ల నరేష్ వ్యాన్ చక్రాల మధ్యకు వెళ్లిపోగా మంచిలి గ్రామానికి చెందిన దివ్యాంగుడు కొల్లాటి వెంకటేశ్వరరావు పక్కకు ఎగిరిపడ్డారు. తక్షణమే ప్రయాణికులు వ్యాన్ టైర్ల మధ్య నుంచి నరేష్ బయటకు లాగారు. పోలియోతో ఉన్న నరేష్కు తిరిగి రెండు కాళ్లకు గాయాలుకాగా, వెంకటేశ్వరరావు స్వల్పగాయాలతో బయటపడ్డారు. వ్యాన్ డ్రైవర్ ఫోన్ మాట్లాడుతూ వాహనాన్ని నడిపారని అందుచేతనే వాహనాన్ని అదుపుచేయలేక ఎదురుగా వెళ్తున్న దివ్యాంగుల మోటారుసైకిల్ను ఢీకొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటన జరిగిన వెంటనే వ్యాన్ డ్రైవర్ వాహనాన్ని వదిలేసి ఆ ప్రాంతం నుంచి పరారయ్యాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో 108 వాహనం ద్వారా క్షతగాత్రులను తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దివ్యాంగులకు నిత్యావసర సరుకులు ఉచితంగా ఇస్తున్న నేపధ్యంలో తణుకు వచ్చామని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సరుకులు తీసుకుని తిరుగు ప్రయాణంలో ఇలా జరిగినట్లు దివ్యాంగులు తెలిపారు. తణుకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లగ్జరీ కారులో వచ్చి.. 40 కేజీల చేప కొనేశాడు!
సాధారణంగా చేపల కోసం దగ్గరలోని మార్కెట్కు వెళ్లడం సహజం. కానీ కోటి రూపాయల విలువైన లగ్జరీ కారులో ఏకంగా 40 కిలోమీటర్లు ప్రయాణించి రూ.10 వేలకు కేవలం ఒకే ఒక్క చేప కొనుగోలు చేసిన ఆసక్తికర ఘటన జంగారెడ్డిగూడెం మండలంలోని దేవులపల్లిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవులపల్లిలోని శ్రీ కరాటం జలాశయంలో మత్స్యకారుల వలకు ఒక భారీ చేప చిక్కింది. కాటా వేసి చూడగా ఆ చేప బరువు దాదాపు 40 కేజీలు ఉంది. ఇంత పెద్ద చేప చిక్కిందనే వార్త చుట్టుపక్కల ప్రాంతాలకు దావానలంలా వ్యాపించింది. విషయం తెలుసుకున్న ఏలూరుకు చెందిన ఒక చేప ప్రియుడు, ఆ భారీ చేపను ఎలాగైనా సొంతం చేసుకోవాలనే కుతూహలంతో ఏకంగా కోటి రూపాయల విలువైన తన లగ్జరీ కారులో 40 కిలోమీటర్లు ప్రయాణించి దేవులపల్లి చేరుకున్నారు. ఎంతో ఆసక్తిగా రూ.10 వేలు వెచ్చించి ఆ చేపను కొనుగోలు చేసి తీసుకెళ్లారు. -ఏలూరు జిల్లా చదవండి: ఆ ఇద్దరు ఐఏఎస్లదీ ఒకే కథ! -
వ్యక్తి అనుమానాస్పద మృతి
ఏలూరు టౌన్/దెందులూరు: ఏలూరు రూరల్ పరిధిలోని రవాణా శాఖ కార్యాలయం సమీపంలో ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది పడి ఉన్నాడు. స్థానికులు గుర్తించి ఏలూరు రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఏలూరు రూరల్ ఎస్సై వెంకటేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు గుండుగొలను ప్రాంతానికి చెందిన చిన్ని దుర్గారావు (25)గా గుర్తించారు. ఇతను చేపల చెరువుల వద్ద పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం ఉదయం ఏలూరు శివారులోని ఆర్టీవో కార్యాలయం సమీపంలో రోడ్డు పక్కన విగతజీవుడిగా పడి ఉన్నాడు. అనారోగ్య కారణాల వల్లనే ఇతను మృతి చెంది ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్) మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పెదవేగి : పోలవరం కుడి కాలువలో దూకి యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు పెదవేగి ఎస్సై హరి గోపాల్ తెలిపారు. వివరాల్లోకి వెళితే... పెదవేగి మండలం వేగివాడకు చెందిన చిత్తూరు సాయి శిరీష ఏలూరులోని ఓ బ్యాంకులో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తోంది. అయితే గతనెల 30వ తేదీ నుంచి ఆమె కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పెదవేగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో బుధవారం అంకన్నగూడెం లాకుల వద్ద శిరీష మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
అనుమతి లేకుండా ఆర్చి నిర్మాణం తగదు
నూజివీడు: ఎలాంటి అనుమతులు లేకుండా ఎమ్మార్ అప్పారావు కాలనీ వద్ద ‘కొలుసు పార్థసారధి సౌజన్యంతో’ అంటూ ఆర్చిని నిర్మించడం ఎంతమాత్రం సమంజసం కాదని, ఈ చర్య పట్టణ ప్రజలను విస్మయానికి గురిచేస్తోందని మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ధ్వజమెత్తారు. దీనిపై బుధవారం ‘సాక్షి’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ నేపథ్యంలో ఆయన ఎమ్మార్ అప్పారావు కాలనీ వద్దకు వచ్చి అక్రమంగా నిర్మిస్తున్న ఆర్చిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసి ఈ కాలనీని ఏర్పాటు చేశారని, ఇప్పుడు ‘పార్థసారథి సౌజన్యంతో’ అంటూ ఆర్చిని ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా, పద్ధతి, విధానాలను పాటించకుండా ఆర్చిని కడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు. వివాదాలు సృష్టించి.. కాలనీకి శంకుస్థాపన చేసినప్పుడు ఈ కాలనీకి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు పెట్టాలని కొందరు నాయకులు సూచించగా, ఆయన దానిని నిరాకరించి ఎమ్మార్ అప్పారావు పేరు పెట్టాలని సూచించారని మేకా ప్రతాప్ గుర్తుచేశారు. వైఎస్ ఆజ్ఞ మేరకే ఈ కాలనీకి ఎమ్మార్ అప్పారావు పేరు పెట్టామన్నారు. ప్రశాంతంగా ఉండే నూజివీడు ప్రాంతంలో కావాలని వివాదాలు సృష్టించి పబ్బం గడుపుకోవాలని మంత్రి ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. కాలనీ పేరు వద్ద ఎవరి సౌజన్యం ఉండటానికి వీల్లేదని, కేవలం ‘ఎమ్మార్ అప్పారావు కాలనీ’ అని మాత్రమే ఉండాలన్నారు. సౌజన్యం పేరుతో బోర్డులు పెట్టుకుంటామంటే నూజివీడు పట్టణ ప్రజలు చూస్తూ ఊరుకోరని, ‘కొలుసు పార్థసారథి సౌజన్యం’ అనే పేరును వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అధికారులు ఎందుకు అడ్డుకోలేదు? తాము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని మున్సిపల్ కమిషనరే స్వయంగా చెప్పినా, ఇక్కడ ఆర్చిని ఎలా నిర్మిస్తున్నారని ప్రశ్నించారు. అనుమతులు లేకుండా నిర్మాణం జరుగుతుంటే మున్సిపల్ అధికారులు ఎందుకు అడ్డుకోలేదో సమాధానం చెప్పాలన్నారు. అధికారులు ఇలా మిన్నకుండిపోవడం ఎంతమాత్రం సమంజసం కాదన్నారు. గతంలో తాము కూడా ఆర్చి కట్టాలని అనుకున్నామని, దీనికి హైవే అధికారులకు దరఖాస్తు చేసుకోగా.. రోడ్డు విస్తరణ పనులు ఉన్నందున, అది పూర్తయిన తర్వాత నిర్మించుకోవచ్చని వారు సూచించారని తెలిపారు. ఈ కాలనీని ఏర్పాటు చేసింది కేవలం వైఎస్ రాజశేఖరరెడ్డేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు శీలం రాము, జడ్పీ వైస్ చైర్మన్ గుడిమళ్ల కృష్ణంరాజు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కొమ్ము వెంకటేశ్వరరావు, నాయకులు మలిశెట్టి బాబీ, బసవా వినయ్, కంచర్ల లవకుమార్, ఎమ్మార్ మస్తాన్, కాలి సుగుణరావు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు -
ఏలూరులో ‘ఎపిక్’ సందడి
ఏలూరు (ఆర్ఆర్పేట): నగరంలో బుధవారం ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ చిత్ర నటీనటులు సందడి చేశారు. స్థానిక ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలకు వచ్చి విద్యార్థులతో ముచ్చటించారు. ఇది మంచి ఫీల్ ఉన్న ప్రేమకథా చిత్రమని, యువతకు వినోదం, అనుభూతి పంచుతాయని హీరో ఆనంద్ దేవరకొండ అన్నారు. ఈ చిత్రాన్ని ఆ దరించి, మరిన్ని మంచి చిత్రాలు తీసేలా ప్రో త్సహించాలని హీరోయిన్ వైష్ణవి చైతన్య కోరారు. కళాశాల ప్రిన్సిపాల్ పి.బాలకృష్ణ ప్రసాద్, హెచ్ఓడీలు, విద్యార్థులు పాల్గొన్నారు. పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు సమీ పం నుంచి పెద్ద పులి గోదావరి దాటి పోలవరం జిల్లా వైపు వెళ్లిపోయింది. ప్రాజెక్టు సమీపంలోని సింగన్నపల్లి నుంచి నది దాటి దేవీపట్నం మీదుగా వెళ్లినట్టు అటవీ శాఖ అధికా రులు ట్రాకర్ ద్వారా గుర్తించారు. గత వారం రోజులుగా పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో అభయారణ్యంలో సంచరించిన పెద్ద పులి ఒక దూడను హతమార్చి, మరో దూడను గాయాలపాలు జేసింది. తిరిగి గోదావరి నది దాటి వెళ్లినట్టు పోలవరం అటవీ శాఖ రేంజ్ అధికారి ఎస్కే వలీ తెలిపారు. ఏలూరు (టూటౌన్): దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజనలో భాగంగా నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఫ్లాగ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి కె.శ్రీకాంత్ ప్రకటనలో తెలిపారు. సోలార్ రూఫ్టాప్ ఇన్స్టలేషన్ అండ్ సర్వీస్, మల్టీ స్కిల్లో మూడు నెలలపాటు శిక్షణ ఇస్తామన్నారు. ఉచిత భోజన, వసతి కల్పిస్తామన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులై, 18 ఏళ్లు నిండిన అభ్యర్థులు అర్హులని, వివరాలకు 7901332323, 8328450627 నంబర్లలో సంప్రదించాలన్నారు. భీమవరం: ఉమ్మడి పశ్చి మగోదావరి జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల ని రుద్యోగ యువతకు వివిధ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నట్టు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం.ముక్కంటి బుధవారం ప్రకటనలో తెలిపారు. అసిస్టెంట్ టెక్నీషియన్, కిసాన్ డ్రోన్ ఆపరేటర్, ఎలక్ట్రిక్ వెహికల్ మెయింటెనెన్స్ టెక్నీషియన్, ఎలక్ట్రీషి యన్–స్మార్ట్ ఎనర్జీ, సోలార్ పీవీ ఇన్స్టాలర్, ఫార్మా బయోలాజిక్స్, వైద్యపరికరాలు, ఏ1 డేటా ఇంజనీరింగ్ ఎనలిస్ట్, జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ వంటి కోర్సుల్లో శిక్షణ ఇస్తామన్నారు. అభ్యర్డులకు ఉచిత భోజన, వసతి కల్పిస్తామన్నారు. అభ్యర్థులు ఈనెల 6వ తేదీలోపు పేర్లు నమోదు చేసుకోవాలని, మరి న్ని వివరాలకు సెల్ 9701355337, 97058 63666, 9393527666, 9640294967 నంబర్లలో సంప్రదించాలని కోరారు. ఏలూరు (టూటౌన్): ఏలూరు దొండపాడులోని ఉమా ఎడ్యుకేషన్–టెక్నికల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రంలో దివ్యాంగులకు బుధవారం ఉచితంగా కృత్రిమ అవయవాలను అందజేశారు. కో–ఆర్డినేటర్ శ్రీనివాస్రెడ్డి కృత్రిమ అవయవాలను అందించి మాట్లాడుతూ దివ్యాంగుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి, వారు ఇతరులపై ఆధారపడకుండా తమ పనులు తాము చేసుకునేలా చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాపరిషత్ ఇన్చార్జి సీఈఓగా జిల్లా పంచాయతీ అధికారి మల్లికార్జునరావు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు సీఈఓగా పనిచేసిన పి.జగదాంబ గత ఆగస్టు 31న ఉద్యోగ విరమణ చేశారు. అశ్వారావుపేట రూరల్: అత్తారింటికి వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన బుధవారం భద్రాద్రి కొత్తగూ డెం జిల్లా అశ్వారావుపేట మండలంలో జరిగి ంది. ఎస్సై టి.యయాతీరాజు కథనం ప్రకారంఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం రామ చంద్రాపురానికి చెందిన దాబా మంగబాబు (30) ద్విచక్రవాహనంపై కొల్లూరిగూడెంలోని అత్తారింటికి వెళ్తున్నాడు. కన్నాయిగూడెం శివా రు మూలమలుపు వద్ద ఎదురుగా వచ్చిన ట్రా క్టర్ ఢీకొట్టింది. దీంతో మంగబాబు అక్కడిక్క డే మృతి చెందాడు. ఆయనకు భార్య సంధ్య, ఇద్దరు సంతానం ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేశారు. -
●40 కిలోల చేప రూ.10 వేలు
సాధారణంగా చేపల కోసం దగ్గరలోని మార్కెట్కు వెళ్లడం సహజం. కానీ కోటి రూపాయల విలువైన లగ్జరీ కారులో ఏకంగా 40 కిలోమీటర్లు ప్రయాణించి రూ.10 వేలకు కేవలం ఒకే ఒక్క చేప కొనుగోలు చేసిన ఆసక్తికర ఘటన జంగారెడ్డిగూడెం మండలంలోని దేవులపల్లిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవులపల్లిలోని శ్రీ కరాటం జలాశయంలో మత్స్యకారుల వలకు ఒక భారీ చేప చిక్కింది. కాటా వేసి చూడగా ఆ చేప బరువు దాదాపు 40 కేజీలు ఉంది. ఇంత పెద్ద చేప చిక్కిందనే వార్త చుట్టుపక్కల ప్రాంతాలకు దావానలంలా వ్యాపించింది. విషయం తెలుసుకున్న ఏలూరుకు చెందిన ఒక చేప ప్రియుడు, ఆ భారీ చేపను ఎలాగైనా సొంతం చేసుకోవాలనే కుతూహలంతో ఏకంగా కోటి రూపాయల విలువైన తన లగ్జరీ కారులో 40 కిలోమీటర్లు ప్రయాణించి దేవులపల్లి చేరుకున్నారు. ఎంతో ఆసక్తిగా రూ.10 వేలు వెచ్చించి ఆ చేపను కొనుగోలు చేసి తీసుకెళ్లారు. – జంగారెడ్డిగూడెం (చింతలపూడి) -
పోలీస్ అధికారులకు ఆత్మీయ వీడ్కోలు
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా పోలీస్ శాఖలో విధులు నిర్వర్తించి పదవీవిరమణ పొందిన పోలీస్ అధికారులకు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ చేతుల మీదుగా పదవీవిరమణ పొందిన అధికారులను ఘనంగా సత్కరించారు. ఏలూరు డీఐఆర్ ఏఆర్ ఎస్సై వెంకటేశ్వరరావు, ఏలూరు వన్టౌన్ ఏఎస్సై వేద కుమారి, భీమడోలు పోలీస్ స్టేషన్ ఏఎస్సై వెంకటేశ్వరరావు సుదీర్ఘకాలం పాటు ప్రజలకు నిస్వార్థ సేవలందించి పదవీవిరమణ పొందారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రతీ ఒక్కరినీ ప్రత్యేకంగా అభినందించారు. పోలీస్ శాఖ పట్ల అంకితభావం, నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేసి పదవీవిరమణ పొందడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. పోలీస్ కుటుంబాలకు శాఖ తరఫున ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా కల్పించారు. ట్రైనీ ఐఏఎస్ సీహెచ్ శ్రావణ్కుమార్ రెడ్డి, ఆర్ఐ సతీష్, ఆర్ఎస్ఐ వెంకటేష్, సిబ్బంది, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. దెందులూరు: దెందులూరు మండలానికి చెందిన పసల దుర్గారావు (36) రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గుండుగొలను సెంటర్ సమీపంలో మంగళవారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో దుర్గారావు శరీరం నుజ్జునుజ్జు కావడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. -
గోసంరక్షణ శాల గణాంకాలు
గోశాల షెడ్లు – 9 మొత్తం గోవులు – 358 గోవుల జాతులు – 10 రోజువారీ పాల ఉత్పత్తి – 120 లీటర్లు గో దత్తత పథకం ద్వారా రైతులకు అందించిన గోవులు – 7,198 శాశ్వత విరాళాలు – రూ. 7.91 కోట్లు ఎఫ్డీపై వార్షిక ఆదాయం – రూ. 49.54 లక్షలు పశుగ్రాసం సాగు విస్తీర్ణం – 20 ఎకరాలు -
ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు
అత్తిలి బస్స్టేషన్ సెంటర్లో ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం ఉదయం అత్తిలి నుంచి తన స్వగ్రామమైన పైడిపర్రు వెళ్లడానికి అనపర్తి కాంతమ్మ అనే వృద్ధురాలు తణుకు రోడ్డు కూడలిలో బస్సు కోసం వేచి ఉన్నారు. ఈ సమయంలో భీమవరం నుంచి తణుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, బస్స్టేషన్ నుంచి తణుకు రోడ్డు వైపు మలుపు తిరుగుతుండగా.. కాంతమ్మ ఆ బస్సు ఎక్కేందుకు ఒక్కసారిగా బస్సు ముందు భాగానికి వచ్చారు. అకస్మాత్తుగా రావడంతో డ్రైవర్ గమనించలేకపోవడంతో ఆమె బస్సు ముందు చక్రాల కింద పడి, రెండు కాళ్లు నుజ్జునుజ్జు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన వృద్ధురాలిని వెంటనే 108 వాహనంలో తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం నిమిత్తం అక్కడి నుంచి ఆమెను ఏలూరు ఆసుపత్రికి పంపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దెందులూరు: దెందులూరు గ్రామానికి చెందిన వేముల తిరుపతయ్య (31) ఫిట్స్ వచ్చి మృతి చెందినట్లు ఎస్సై బి.వెంకట్కుమార్ తెలిపారు. ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పుల వాయిదాలు చెల్లించలేక ఆయన తీవ్ర మానసిక ఆందోళనకు గురై అనారోగ్యం పాలయ్యాడు. మంగళవారం రాత్రి పరిస్థితి విషమించడంతో ఏలూరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఫిట్స్ రావడంతో మృతి చెందాడని పోలీసులు వివరించారు. మృతుడు తిరుపతయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఆగిరిపల్లి: రోడ్డు ప్రమాదంలో గాయపడి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆగిరిపల్లికి చెందిన షేక్ ఫిరోజ్ బాషా (46) మృతి చెందాడు. ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం విజయవాడ రోడ్డులోని పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డుపై నిలిపి ఉంచిన జేసీబీని ఫిరోజ్ బాషా తన ద్విచక్ర వాహనంతో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలవడంతో, బంధువులు మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన బుధవారం ఉదయం మృతి చెందారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై ఎస్సై నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డుపై కుటుంబ సభ్యుల ఆందోళన నూజివీడు : మండలంలోని సీతారామపురానికి చెందిన 18 ఏళ్ల యువతి బుధవారం సాయంత్రం ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు మృతదేహంతో నూజివీడు–హనుమాన్జంక్షన్ రోడ్డుపై ఆందోళనకు దిగారు. ఎస్సై జ్యోతీబసు, ఏఎస్సై తావిరియా నాయక్ సంఘటనా స్థలానికి చేరుకుని, రహదారిపై ఉన్న మృతదేహాన్ని తొలగించి ఆందోళనను విరమింపజేశారు. కొద్ది నెలల క్రితం ఇదే యువతికి సంబంధించి అదే గ్రామానికి చెందిన యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పశువుల కృత్రిమ గర్భధారణ వేగిరపర్చాలి
బుట్టాయగూడెం: పశువుల కృత్రిమ గర్భధారణ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని జిల్లా పశుసంవర్థక శాఖ జేడీ రామ్మోహన్రావు ఆదేశించారు. బుధవారం ఆయన స్థానిక పశువుల ఆస్పత్రిని సందర్శించి, పశుసంవర్థక శాఖ ఏహెచ్ఏలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశువులకు ఉచితంగా అందించే థైలేరియా టీకాల కార్యక్రమం సక్రమంగా అమలయ్యేలా చూడాలని సూచించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాలో విదేశీ సంకరజాతి ఆవులకు సంబంధించి థైలేరియా నివారణకు ఉచితంగా టీకాలు వేస్తున్నట్లు తెలిపారు. సుమారు 2 వేల డోసులను 5 వేల పశువులకు వేస్తుండగా, ఇప్పటికే ఈ టీకా కార్యక్రమం 90 శాతం పూర్తయినట్లు వెల్లడించారు. అలాగే, జిల్లాలో ఎల్నినో ప్రభావం పశుసంవర్థక శాఖపై లేదని, ప్రస్తుతం పశువులకు ఎటువంటి మేత కొరత లేదని స్పష్టం చేశారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 1,956 మంది రైతులకు 29 వేల కేజీల విత్తనాలను అందించామని, పశువులు ఉండి భూమిలేని రైతులకు వీటిని 50 శాతం సబ్సిడీపై ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలవరం పశుసంవర్థక శాఖ సహాయ సంచాలకులు జేవీ రమణయ్య తదితరులు పాల్గొన్నారు. -
ద్విచక్ర వాహనాల చోరీ కేసు ఛేదన
పోలవరం రూరల్: ద్విచక్ర వాహనాల చోరీ కేసును పోలవరం పోలీసులు ఛేదించి, నిందితుడిని అరెస్ట్ చేయడంతో పాటు అతని వద్ద నుంచి 6 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలవరం డీఎస్పీ కె. జయకృష్ణ తెలిపారు. బుధవారం పోలవరం పోలీస్ స్టేషన్లో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు, సీఐ బి. కృష్ణకుమార్ పర్యవేక్షణలో పోలవరం ఎస్సై పి. అప్పారావు, సిబ్బంది వాహనాల తనిఖీ చేపట్టారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 360 డిగ్రీల సీసీ కెమెరాల నిఘా వ్యవస్థ ద్వారా చోరీకి గురైన బైక్ కదలికలను గుర్తించి, ఏలూరు కంట్రోల్ రూమ్ సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో రేపల్లెవాడ జంక్షన్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తూ తప్పించుకునేందుకు యత్నించిన కమ్మరగూడెం గ్రామానికి చెందిన దాసరి శ్రీనివాస్ అలియాస్ చింటు (19)ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో నిందితుడు పలు ప్రాంతాల్లో బైక్ల చోరీకి పాల్పడినట్లు అంగీకరించడంతో, అతని నుంచి మొత్తం 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బైక్లలో పోలవరం పోలీస్ స్టేషన్ పరిధిలో 3, సీతానగరం పీఎస్ పరిధిలో 2, రాజమహేంద్రవరం త్రీటౌన్ పీఎస్ పరిధిలో 1 ద్విచక్ర వాహనం ఉన్నాయి. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం అతనికి జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు డీఎస్పీ తెలిపారు. 6 బైక్ల స్వాధీనం, నిందితుడి అరెస్ట్ -
పేదల పాలిట దేవుడు వైఎస్సార్
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ లింగపాలెం: మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి అమలు చేసిన పథకాలు చరిత్రలో నిలిచిపోతాయని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) అన్నారు. మండలంలోని కొత్తపల్లిలో ఏర్పాటుచేసిన వైఎస్సార్ విగ్రహాన్ని బుధవారం ఆయన ఆవిష్కరించారు. విగ్రహ దాత వైఎస్సార్సీపీ సీనియర్ నేత భీమిరెడ్డి వెంకట సూరారెడ్డి (బీవీఎస్ రెడ్డి)ని ప్రత్యేకంగా అభినందించారు. జెడ్పీటీసీ వడ్డాని హరినాథ్రాజు, ఎంపీటీసీ వడ్డాని లలిత ఆధ్వర్యంలో విగ్రహావిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా డీఎన్నార్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్మెంట్, జలయజ్ఞం, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ వంటి పథకాలతో పేదల గుండెల్లో వైఎస్సార్ చిరస్థాయిగా నిలిచిపోయారన్నా రు. తండ్రి బాటలోనే మాజీ సీఎం వైఎస్ జగన్మో హన్రెడ్డి ముందుకు సాగుతున్నారని, మరలా జగన్ ను సీఎం చేసేందుకు కార్యకర్తలు అవిశ్రాంతంగా కృషి చేయాలన్నారు. చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంభం విజయరాజు మాట్లాడుతూ పేదలు, విద్యార్థులు, రైతులు, మహిళలు, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి వైఎస్సార్ ఎంతగానో కృషి చేశారన్నారు. వైఎస్ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజలకు సేవ చేయడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అన్నారు. అనంతరం భారీ అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకుడు జెట్టి గురునాథరావు, రాష్ట్ర వైఎస్సార్సీపీ సోషల్ మీడియా అధ్యక్షుడు దొడ్ల అంజిరెడ్డి, లింగపాలెం, చింతలపూడి మండలాల పార్టీ అధ్యక్షులు అన్నపనేని శాంతారావు, రమేష్రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శి చిలుకూరి జానారెడ్డి, గ్రామ అధ్యక్షుడు కొల్లి వీరభద్రరావు, నాయకులు పాల్గొన్నారు. -
కొనసాగిన ఉద్యోగుల నిరసనలు
ఏలూరు (ఆర్ఆర్పేట): ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉద్యమ కార్యాచరణలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల నిరసన కార్యక్రమం రెండో రోజు బుధవారం కొనసాగింది. ప్రభుత్వ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమరావతి జేఏసీ ఏలూరు జిల్లా చైర్మన్ కె.రమేష్కుమార్ మాట్లాడుతూ ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. పెండింగ్లో ఉన్న డీఏ, పీఆర్సీ బకాయిలు, 12వ పీఆర్సీ కమిషన్ నియామకం, మధ్యంతర భృతి (ఐఆర్) విడుదల, పెండింగ్లో ఉన్న ఐదే డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 8 వరకు ప్రతి ఉద్యోగి హ్యాండ్ టు హ్యాండ్ కార్యక్రమంలో భాగంగా అన్ని కార్యాలయాలనూ సందర్శించి కరపత్రా లు పంపిణీ చేయడంతో పాటు ఉద్యోగులు ఎందు కు ఉద్యమం చేయాల్సి వస్తుందో తెలియజేస్తామన్నారు. ఉద్యోగులు వాట్సాప్ డీపీలో ‘సీఎం సార్, మా డబ్బులు మాకివ్వండి’ అని రాసిన ఫొటోను ప్రొఫైల్ ఫొటోగా పెట్టుకుని నిరసన కొనసాగించారు. ఏలూరులోని ఆర్టీసీ డిపో గ్యారేజ్, జిల్లా సహకార శాఖ కార్యాలయాల వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎ.ప్రమోద్కుమార్, ఏపీజేఏసీ అమరా వతి జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
మహానేతా.. మనసాస్మరామి
కృత్రిమ గర్భధారణ వేగిరపర్చాలి పశువుల కృత్రిమ గర్భధారణ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని జిల్లా పశుసంవర్థక శాఖ జేడీ రామ్మోహన్రావు సిబ్బందికి ఆదేశించారు. 8లో uపోలవరం జలాలతో దివంగత మహానేతకు జలాభిషేకం చేసి అభిమానం చాటుకున్నారు. గోదావరి జలాలను పోలవరం కుడికాలువ నుంచి ప్రత్యేకంగా ఉంగుటూరు, ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్తలు తీసుకువచ్చి మరీ జలాభిషేకం చేశారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా ఉభయగోదావరితో పాటు రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని మాజీ సీఎం వైఎస్సార్ తలంచారు. దానికనుగుణంగా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి పనులు వేగవంతం చేశారు. ఈ క్రమంలో మహానేత చలువతో కుడికాలువ జలాలు పశ్చిమకు చేరుతుండటంతో ఆయన్ని స్మరిస్తూ జలాభిషేకం చేసి అభిమానం చాటుకున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయి. పార్టీ శ్రేణులు, అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ద్విచక్ర వాహనాల చోరీ కేసును పోలవరం పోలీసులు ఛేదించి, నిందితుడిని అరెస్ట్ చేయడంతో పాటు 6 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ జయకృష్ణ తెలిపారు. 8లో uగురువారం శ్రీ 3 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026కై కలూరు: సంత మార్కెట్లో వైఎస్సార్ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు ఏలూరు: గోదావరి జలాలతో అభిషేకం చేస్తున్న కన్వీనర్ మామిళ్లపల్లి జయప్రకాష్ సాక్షి ప్రతినిధి, ఏలూరు: జిల్లావ్యాప్తంగా బుధవారం వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. కై కలూరు నియోజకవర్గంలో కై కలూరు, కలిదిండి మండలాల్లో పార్టీ సమన్వయకర్త, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు నేతృత్వంలో కార్యక్రమాలు నిర్వహించి పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా దూలం నాగేశ్వరరావు మాట్లాడు తూ ప్రజల మదిలో దివంగత వైఎస్సార్ శాశ్వత స్థానం ఏర్పరుచుకున్నారని, ఆయన హయాంలో ప్రారంభమైన పనులతో జిల్లాలో అందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని కొనియాడారు. ఉంగుటూరు నియోజకవర్గం.. ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో పోలవరం జలాలతో నియో జకవర్గ సమన్వయకర్త పుప్పాల వాసుబాబు వైఎస్సార్ విగ్రహానికి జలాభిషేకం నిర్వహించి అనంతరం పూలమాలలు వేశారు. ఏలూరు నియోజకవర్గం.. ఏలూరు ఫైర్స్టేషన్ సెంటరులో నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ ఆధ్వర్యంలో దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సెయింట్ ఆన్స్ కళాశాల వద్ద ఉన్న విగ్రహానికి గోదావరి జలాలతో జలాభిషేకం చేశారు. అనంతరం మార్కెట్ యార్డు వద్ద పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అలాగే నగరంలో పలు ప్రాంతాల్లో వైఎస్సార్ విగ్రహాలకు ర్యాలీగా వెళ్లి నివాళులర్పించారు. నూజివీడు నియోజకవర్గం.. నూజివీడులో చినగాంధీ బొమ్మ సెంటరులో వైఎస్సార్ చిత్రపటానికి నియోజకవర్గ సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప్ అప్పారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోలవరం నియోజకవర్గం.. బుట్టాయగూడెం, కొయ్యలగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో నియోజకవర్గ సమన్వయకర్త తెల్లం బాలరాజు మహానేత వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జీలుగుమిల్లి మండలం ములగలంపల్లిలో మహిళలకు చీరలు పంపిణీ చేశారు. చింతలపూడి నియోజకవర్గం.. చింతలపూడి, కామవరపుకోట, లింగపాలెం మండలాల్లో పార్టీ నియోజకరవ్గ సమన్వయకర్త కంభం విజయరాజు దివంగత నేత విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చింతలపూడి పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలకు పులిహోర, దుప్పట్ల పంపిణీ చేశారు. ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. దెందులూరు నియోజకవర్గం.. దెందులూరు, పెదవేగి మండలాల్లో ఏపీ ఆయిల్ఫెడ్ మాజీ చైర్మన్ కొఠారు రామచంద్రరావు వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మనసున్న మారాజుకు నీరాజనం వాడవాడలా వైఎస్సార్ వర్ధంతి పోలవరం జలాలతో దివంగత వైఎస్సార్ విగ్రహాలకు అభిషేకం జిల్లావ్యాప్తంగా సేవా కార్యక్రమాలు -
శ్రీవారి క్షేత్రంలో.. కన్నయ్య గోకులం
ద్వారకాతిరుమల: బృందావనంలో కృష్ణుడి చుట్టూ గోవులు.. ద్వారకాతిరుమలలో చినవెంకన్న సన్నిధిలోనూ గోవుల సందడి. అక్కడ కృష్ణుడికి గోమాతలతో అనుబంధం.. ఇక్కడ శ్రీవారి సేవలో గోవుల పాత్ర. గోమాతను దేవతగా కొలిచే హిందూ సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనంగా ద్వారకాతిరుమల శ్రీవారి గోసంరక్షణశాల నిలుస్తోంది. కొండపై తొమ్మిది షెడ్లలో 358 గోవులను ఆలయ అధికారులు భక్తిశ్రద్ధలతో సంరక్షిస్తున్నారు. వాటి నుంచి లభించే పాలు కేవలం పానీయంగా కాకుండా.. స్వామివారి సేవలో పవిత్ర ద్రవ్యంగా మారుతున్నాయి. అభిషేకాల నుంచి నైవేద్యాల తయారీ వరకు వినియోగిస్తున్నారు. భక్తులకు, చిన్నారులకు సైతం పాలు, మజ్జిగగా అందిస్తున్నారు. గోవులే ఇక్కడ సేవకులు 1984లో ప్రారంభమైన గోసంరక్షణశాల కాలక్రమంలో విస్తరించింది. పలు రాష్ట్రాల నుంచి వచ్చిన గోవులకు ఇక్కడ సురక్షితమైన వాతావరణం కల్పిస్తున్నారు. పరిశుభ్రమైన షెడ్లు, పౌష్టికాహారం, పశువైద్య సేవలు, ప్రత్యేక సంరక్షణతో గోవులను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ప్రస్తుతం 10 రకాల జాతులకు చెందిన 358 గోవులు గోశాలలో ఉన్నాయి. భక్తుల సహకారంతో.. గోవుల సంరక్షణకు భక్తులు కూడా తమ వంతు సహకారం అందిస్తున్నారు. గోసంరక్షణశాలకు ఇప్పటివరకు భక్తులు అందించిన సుమారు రూ. 7.91 కోట్లు శాశ్వత విరాళాలను బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి, దాని ద్వారా ఏడాదికి వస్తున్న దాదాపు రూ. 49.54 లక్షలతో గోపోషణ నిర్వహిస్తున్నారు. గోవుల మేత కోసం దేవస్థానం ప్రత్యేకంగా 20 ఎకరాల్లో పశుగ్రాసాన్ని పెంచుతోంది. రెండు సప్తగోకులాల్లో.. శ్రీవారి ఆలయ తూర్పు ప్రాంతంలో, అలాగే ఇటీవల కొండపైన వకుళమాత నిత్యాన్నదాన భవనం సమీపంలో నిర్మించిన బృందావనంలో ఏర్పాటు చేసిన సప్త గోకులాల్లో నిత్యం గోపూజలు నిర్వహిస్తున్నారు. క్షేత్రానికి వచ్చే భక్తులు స్వామి దర్శనానంతరం గోపూజలు జరుపుకుంటున్నారు. రైతులకు దత్తతగా.. గోవులను గోసంరక్షణశాలలో మాత్రమే కాకుండా రైతుల జీవనోపాధికి ఉపయోగపడేలా చేయాలన్న ఉద్దేశంతో దేవస్థానం 2013లో గో దత్తత పథకాన్ని ప్రారంభించింది. ఇప్పటి వరకు అధికారులు వివిధ ప్రాంతాలకు చెందిన రైతులకు 7,198 గోవులను దత్తతగా అందించారు. రైతులు వీటిని గో ఆధారిత ప్రకృతి వ్యవసాయానికి వినియోగిస్తున్నారు. దత్తత ఇచ్చిన గోవుల పరిస్థితిని తెలుసుకునేందుకు దేవస్థాన అధికారులు ఏడాదిలో రెండు, మూడు సార్లు రైతుల వద్దకు వెళ్లి పరిశీలిస్తున్నారు. గోమాతల నుంచి రోజుకి 120 లీటర్ల పాలు వస్తున్నాయి. ఇందులో 31 లీటర్ల పాలు శ్రీవారి ఆలయంలో స్వామివారి మహా నివేదనకు, 15 లీటర్ల పాలు క్షేత్రానికి వచ్చే 5 ఏళ్ల లోపు పిల్లల ఆకలి తీర్చేందుకు, 20 లీటర్ల పాలు ఆగమ పాఠశాలలో విద్యార్థులకు, 15 లీటర్ల పాలు ఉప, దత్తత ఆలయాల్లో దేవతామూర్తుల అభిషేకాలకు, 20 లీటర్ల పాలు నిత్యాన్నదానానికి, 10 లీటర్ల పాలు విక్రయానికి, మిగిలిన పాలు భక్తులకు మజ్జిగ అందించేందుకు వినియోగిస్తున్నారు. శ్రీవారి సేవలో గోమాతలు 10 రకాల జాతులకు చెందిన 358 గోవుల సంరక్షణ నిత్యం 120 లీటర్ల స్వచ్ఛమైన పాలు అభిషేకాలు, నైవేద్యాలకు వినియోగం.. భక్తులకు పాలు, మజ్జిగ వీటితోనే రేపు శ్రీవారి క్షేత్రంలో కృష్ణాష్టమి వేడుకలు.. 5న ఉట్లు పండుగ కృష్ణాష్టమి పండుగను పురస్కరించుకుని శుక్రవారం శ్రీవారి ఆలయంలో విశేష కార్యక్రమాలు జరగనున్నాయి. అందులో భాగంగా నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు ఆలయంలో పాలవెల్లి కట్టి, శ్రీకృష్ణుడి జన్మోత్సవ పూజలను నిర్వహిస్తారు. అనంతరం వెన్నతో కలిపి 12 రకాల పిండి వంటలను స్వామివారికి నివేదిస్తారు. మరుసటి రోజు శనివారం సాయంత్రం క్షేత్రంలో ఉట్లు వేడుకను, శ్రీవారి గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. గోసంరక్షణకు దేవస్థానం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. గోశాల అభివృద్ధితో పాటు గోవుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. గోవుల నుంచి లభించే పాలతోనే ప్రధాన ఆలయంతో పాటు ఉప, దత్తత ఆలయాల్లో దేవతామూర్తులకు అభిషేకాలు, సేవలు నిర్వహిస్తున్నాం. గోపాలు తల్లిపాలతో సమానమనే భావనతో శ్రీవారి దర్శనానికి వచ్చే చిన్నారులకు పాలు అందిస్తున్నాం. – వేండ్ర త్రినాథరావు, శ్రీవారి దేవస్థానం ఈఓ -
మత్తు ఇంజక్షన్ల గుట్టురట్టు
రెండు మెడికల్ ఏజెన్సీల్లో సోదాలు జంగారెడ్డిగూడెం (చింతలపూడి): హైదరాబాద్, అహ్మదాబాద్ నుంచి దొంగచాటుగా మత్తు ఇంజక్షన్లు తీసుకువచ్చి స్థానికంగా విక్రయిస్తున్న మెడికల్ ఏజెన్సీల గుట్టురట్టయ్యింది. వేగవరం హైస్కూల్ సమీపంలోని ఆయిల్పామ్ తోటలో లభ్యమైన మత్తు ఇంజక్షన్లు, సిరంజీల వ్యవహారంలో డ్రగ్ ఇన్స్పెక్టర్ మల్లికార్జునరావు ఆధ్వర్యంలో సిబ్బంది విచారణ చేపట్టారు. విద్యార్థులు, యువకులు మత్తుకు బానిసై ఈ ఇంజక్షన్లను వాడుతూ, ఖాళీ వైల్స్ (మందు సీసాలు), సూదులను తోటలో విసిరేస్తున్నారని స్థానికుల నుంచి అందిన ఫిర్యాదు మేరకు ఈగిల్ టీమ్, డ్రగ్స్ ఇన్స్పెక్టింగ్ టీమ్ అధికారులు రంగంలోకి దిగారు. తోటలో లభ్యమైన ఖాళీ వైల్స్ను పరిశీలించి, బ్యాచ్ నంబర్ల ఆధారంగా జంగారెడ్డిగూడెంలోని రెండు ప్రధాన మెడికల్ ఏజెన్సీల్లో సోదాలు నిర్వహించారు. అనంతరం డ్రగ్ ఇన్స్పెక్టర్ మల్లికార్జునరావు వివరాలు వెల్లడించారు. రికార్డులు లేని విక్రయాలు : జంగారెడ్డిగూడెంలోని శ్రీ లక్ష్మీ శ్రీనివాస మెడికల్ ఏజెన్సీస్ యజమాని కిషోర్ హైదరాబాద్ నుంచి గత రెండు నెలల్లో ఏకంగా రూ.5 లక్షల విలువైన 20,000 ట్రామడాక్స్ వైల్స్ను కొనుగోలు చేశారు. వీటికి సంబంధించి ఎలాంటి స్టాక్ లేదా విక్రయ బిల్లులు చూపించలేదు. రికార్డులు లేకుండా వీటిని బ్లాక్లో విక్రయించినట్టు అధికారులు గుర్తించారు. అలాగే డి.రూప పెద్దింటి మెడికల్ ఏజెన్సీస్ యజమాని ప్రసాద్ అహ్మదాబాద్ నుంచి కొనుగోలు చేసిన 5,000 వైల్స్లో (విలువ రూ.95 వేలు) 3,800 వైల్స్ను తెలంగాణలోని కన్నాయిగూడేనికి చెందిన రిష్వంత్ మెడికల్స్కు విక్రయించారు. సదరు షాపు వ్యక్తి ఇక్కడికి వచ్చి మత్తు ఇంజక్షన్లు కొనుగోలు చేస్తూ, రికార్డులు లేకుండా స్థానిక విద్యార్థులకు, యువతకు అక్రమంగా విక్రయిస్తున్నట్టు ప్రాథమిక విచా రణలో తేలిందని మల్లికార్జునరావు తెలిపారు. ప్రాణాలకే ప్రమాదం ట్రామడాల్ అనేది తీవ్రమైన నొప్పుల నివారణకు వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడే మందని, దీనిని మత్తు కోసం వాడితే కిడ్నీలు తీవ్రంగా దెబ్బతిని ప్రాణాపాయం సంభవించే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన ఈ ఏజెన్సీలపై లైసెన్సు రద్దు, క్రిమినల్ చర్యల కోసం సహాయ సంచాలకుడు (ఏడీ)కి నివేదిక పంపినట్టు వెల్లడించారు. తెలంగాణ సరిహద్దు షాపుల లింకులపై అక్కడి డ్రగ్ కంట్రోల్ అధికారులకు కూడా ఫిర్యాదు చేశామన్నారు. -
పేదల హృదయాల్లో.. చెరగని సంతకం
నిర్వాసిత సర్వేలో జాప్యం కుక్కునూరుకు చెందిన పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాల ఇళ్ల నిర్మాణాల ఫీల్డ్ వెరిఫికేషన్ సర్వేను అధికారులు ప్రకటించిన తేదీల్లో నిర్వహించ లేదు. 8లో uసమస్య తక్షణ పరిష్కారం కంటే శాశ్వత పరిష్కారానికి ప్రాధాన్యమిచ్చారు... దశాబ్దాలుగా నిలిచిపోయే కీలక ప్రాజెక్టులకు బీజం వేశారు.. అన్నదాత నుంచి సామాన్యుడి వరకు అందరికీ మేలు జరిగేలా, ప్రతి నియోజకవర్గ రూపురేఖలు, అభివృద్ధి పరుగులతో మారేలా బృహత్తర ప్రణాళిక రూపొందించి అమలు చేశారు. శాశ్వత అభివృద్ధితో ఉమ్మడి పశ్చిమ జిల్లావాసుల మదిలో అభివృద్ధి ప్రదాతగా దివంగత వైఎస్సార్ నిలిచారు. ఏజెన్సీలో పోడు భూముల పంపిణీ నుంచి లక్షలాది మందికి అన్నదాతలకు సాగునీరందించే పోలవరం ప్రాజెక్టు వరకు ప్రతీది మహానేత హయాంలోనే సాగింది. ఏటా సెప్టెంబర్ 2న ప్రపంచ కొబ్బరి దినోత్సవం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమగోదావరి ప్రాంతంలో కొబ్బరి సాగు, రైతుల పరిస్థితిపై ప్రత్యేక కథనం. 8లో uబుధవారం శ్రీ 2 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సుస్థిర అభివృద్ధికి మహానేత వైఎస్సార్ హయాంలో అంకురార్పణ జరిగింది. ప్రతి నియోజకవర్గంలో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను శాశ్వత రీతిలో పరిష్కరించడంతో పాటు దీర్ఘకాలంలో జిల్లా రూపురేఖలు మార్చే ప్రాజెక్టుకు సైతం అంకురార్పణ ఆయన హయాంలోనే పడింది. నూజివీడు ట్రిపుల్ఐటీ, తాడేపల్లిగూడెం హార్టికల్చర్ యూనివర్శిటీ, చింతలపూడి ఎత్తిపోతల పథకం, పోలవరం బృహత్తర ప్రాజెక్టు ఇలా అన్ని ప్రాజెక్టులు ఆయన చలవే. పోడుతో గిరి‘జనం’కు మేలు పోడు భూముల పంపిణీతో గిరిజనులకు మేలు చేశారు.అటవీ సంపదపై ఆధారపడే గిరిజనులను సాగువైపు మళ్లించి సుస్థిర ఆదాయం సాధించేలా బృహత్తర ప్రణాళిక సిద్ధం చేశారు. దానికనుగుణంగా పోలవరం ఏజెన్సీ ప్రాంతంలో4500 ఎకరాల పోడుభూములను 2200 మంది గిరిజనులకు పంపిణీ చేశారు. ఆ భూముల్లో ప్రస్తుతం వరి, పొగాకు, మొక్కజొన్న, ఉద్యానవనసాగు పూర్తి స్థాయిలో జరుగుతుంది. ఏజెన్సీ ప్రజల మెరుగైన వైద్యం కోసం జంగారెడ్డిగూడెంలో 100 పడకల ప్రభుత్వాసుపత్రికి కూడా ఆయన హయాంలోనే శంకుస్థాపన జరిగింది. తమ్మిలేరు ముంపు నుంచి ఏలూరుకు రక్షణ 2005లో తమ్మిలేరు వరద ఉధృతికి ఏలూరు నగరం అతలాకుతలమైంది. దీంతో శాశ్వత పరిష్కారం కోసం 2005లో తమ్మిలేరు రిటైనింగ్వాల్ను మంజూరు చేసి రూ.17 కోట్లతో పనులు ప్రారంభించారు. తదనంతరం పాలకుల నిర్లక్ష్యంతో ఆగిపోయిన పనులను మళ్లీ 2024లో ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో పూర్తయ్యింది. ఏకకాలంలో లక్షల క్యూసెక్కులు వచ్చినా ఏలూరు నగరానికి ఎలాంటి ముప్పువాటిల్లకుండా కిలోమీటరు మేర రిటైనింగ్వాల్ నిర్మించారు. చింతలపూడికి మొదటి అడుగు చింతలపూడి ఎత్తిపోతల పథకానికి దివంగత వైఎస్సార్ 2008లో శంకుస్థాపన చేశారు. 15 మెట్ట ప్రాంత మండలాల్లో 2.10 లక్షల ఎకరాలకు సాగునీరివ్వడం కోసం రూ.1701 కోట్ల వ్యయంతో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. కాల్వల నిర్మాణ పనులు, ఇతర పనులు కొంత మేరకు పూర్తి చేసిన క్రమంలో కోర్టు కేసులు దాఖలయ్యాయి. వాటిన్నంటిని అధిగమించి పనులు చేశారు. తదనంతరం పాలకులు ప్రాజెక్టు పరిధిని, విస్తీర్ణాన్ని, వ్యయాన్ని గణనీయంగా పెంచుకుంటూ వెళ్లారు తప్ప ప్రాజెక్టు పూర్తి పై దృష్టి మాత్రం సారించలేదు. కై కలూరు: దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ, మండల, గ్రామాల్లో ఘనంగా బుధవారం నిర్వహించాలని వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కై కలూరు నియోజకవర్గానికి సంబంధించి ఉదయం 8 గంటలకు కై కలూరు సంతమార్కెట్ వైఎస్ భారీ విగ్రహం వద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు. నియోజకవర్గంలో 4 మండలాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తప్పనిసరిగా హాజరుకావాలని డీఎన్నార్ కోరారు. నేడు దివంగత నేత వైఎస్సార్ వర్ధంతి ఏలూరులో రిటైనింగ్వాల్, ఏజెన్సీలో పోడు భూముల పంపిణీ నూజివీడులో ట్రిపుల్ఐటీతో విద్యా ప్రదాతగా మారిన వైనం ప్రతి నియోజకవర్గంలోనూ వైఎస్సార్ శాశ్వత అభివృద్ధి ముద్ర -
సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి
ఏలూరు (టూటౌన్): పీజీఆర్ఎస్ అర్జీదారులను కార్యాలయాల చుట్టూ తిప్పకుండా సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని, ఇందులో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా వివిధ శాఖల అధికారులతో పిజీఆర్ఎస్, ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్), ‘కౌశలం’ తదితర అంశాలపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీఎం కార్యాలయానికి వచ్చే అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలన్నారు. కౌశలం కార్యక్రమం కింద జిల్లాలోని 2,303 మంది యువతకు శిక్షణ అందించామని, వారందరికీ ఉపాధి అవకాశాలు లభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, నూజివీడు సబ్ కలెక్టర్ బి. వినూత్న, డీఆర్ఓ ఎం.శ్రీదేవి, ఎస్డీసీ దేవకీదేవి పాల్గొన్నారు. లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ జిల్లాలో 2,53,845 మంది లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా కింద రూ.111.60 కోట్ల సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. మంగళవారం స్థానిక ఆదివారపుపేట, రజకులపేట సచివాలయాల వద్ద ఆమె లబ్ధిదారులకు స్వయంగా పింఛను నగదును అందజేశారు. -
బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుపై రైతుల ఆగ్రహం
నూజివీడు సబ్ కలెక్టర్ వినూత్న ఆధ్వర్యంలో గ్రామసభచింతలపూడి: మండలంలోని రేచర్ల, శెట్టివారిగూడెం గ్రామాల పరిధిలో ప్రతిపాదిత బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుపై రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు సర్వే, బొగ్గు తవ్వకాలపై స్థానిక రైతుల అభిప్రాయాలు సేకరించేందుకు నూజివీడు సబ్ కలెక్టర్ వినూత్న ఆధ్వర్యంలో మంగళవారం శెట్టివారిగూడెంలో గ్రామసభ నిర్వహించారు. రిలయన్స్ సంస్థ ప్రతినిధులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో రైతులు వారిని ప్రశ్నలతో నిలదీశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ వినూత్న మాట్లాడుతూ ఇది కేవలం రైతుల అభిప్రాయ సేకరణ మాత్రమేనని, ఇప్పుడే పనులు ప్రారంభించడం లేదని స్పష్టం చేశారు. ప్రాజెక్టు పైలట్ పనులు దశలవారీగా జరుగుతాయని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. అనంతరం రిలయన్స్ ప్రతినిధులు మాట్లాడుతూ మండలంలో మొత్తం 38 గ్రామాలను ఎంపిక చేయగా, ప్రభుత్వ అనుమతితో తొలిదశలో రేచర్ల, శెట్టివారిగూడెం పరిధిలోని సుమారు 1,000 ఎకరాల్లో సర్వే చేపట్టనున్నట్లు వెల్లడించారు. భూగర్భంలో బొగ్గు నిల్వల శాతం, విస్తీర్ణం, లోతు, పొరల పరిమాణాన్ని గుర్తించేందుకే ఈ ప్రాథమిక సర్వే నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అన్నదాతల ప్రశ్నల వర్షం రిలయన్స్ ప్రతినిధుల ప్రకటనపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పలు కీలక డిమాండ్లు తెరపైకి తెచ్చారు. ముఖ్యంగ ఏయే సర్వే నంబర్లలో సర్వే జరుగుతుంది, సరిహద్దులేమిటో రైతులకు ముందే లిఖితపూర్వకంగా తెలపాలని స్పష్టం చేశారు. భవిష్యత్తులో తీసుకోబోయే 7 వేల ఎకరాల సేకరణ విధానం, నష్టపరిహారం వివరాలను ముందే ప్రకటించాలని డిమాండ్ చేశారు. బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు విజయవంతంగా నడుస్తున్న ప్రాంతాలకు స్థానిక రైతుల నుంచి 10 మందిని 15 రోజుల పాటు తీసుకెళ్లి, అక్కడి వాస్తవ పరిస్థితులను ప్రత్యక్షంగా చూపించాలని కోరారు. రైతుల పట్టా భూముల కంటే ముందు సమీపంలోని ప్రభుత్వ భూముల్లో ట్రయల్స్ నిర్వహించి పర్యావరణ ప్రభావాలను అంచనా వేయాలని డిమాండ్ చేశారు. గతంలో చింతలపూడి ఎత్తిపోతల పథకం, గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రాజెక్టుల సమయంలో న్యాయమైన పరిహారం అందక తీవ్రంగా నష్టపోయామని, అభివృద్ధి పేరిట మళ్లీ మోసపోయేందుకు సిద్ధంగా లేమని తేల్చిచెప్పారు. గతంలో వేసిన ట్రయల్ బోర్ల కారణంగా 100 మీటర్ల పరిధిలోని భూగర్భ జలాలు కలుషితమయ్యాయని, తాగు, సాగునీటి వనరులకు, పర్యావరణానికి ముప్పు వాటిల్లితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రైతుల సందేహాలను పూర్తిగా నివృత్తి చేసి, రక్షణపై స్పష్టమైన లిఖితపూర్వక హామీ ఇచ్చేంతవరకు సర్వేతో సహా ఎలాంటి ప్రక్రియలనూ ముందుకు తీసుకెళ్లకూడదని గ్రామసభ ఏకగ్రీవంగా డిమాండ్ చేసింది. కాగా, రైతుల అభిప్రాయాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని సబ్ కలెక్టర్ తెలిపారు. -
సూపర్ ఎల్నినో ఎఫెక్ట్
● ఏలూరు జిల్లాపై తీవ్ర ప్రభావం ● 47.3 శాతం వర్షపాత లోటు ● ఆక్వా, వ్యవసాయ రంగాలకు భారీ గండి కై కలూరు: సూపర్ ఎల్నినో ప్రభావంతో ఏలూరు జిల్లా తీవ్ర భానుభగవానుడి ప్రతాపానికి, అనావృష్టికి గురవుతోంది. పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల ఆక్వా, వ్యవసాయ రంగాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. వేడిగాలులు తట్టుకోలేక గృహ వినియోగంలో ఏసీలు, కూలర్లు, మరోవైపు వ్యవసాయం, ఆక్వారంగాల్లో మోటార్ల వాడకం విపరీతంగా పెరిగింది. విద్యుత్ వినియోగం అనూహ్యంగా పెరగడంతో పెరిగిన విద్యుత్ బిల్లుల కారణంగా పలు కుటుంబాలు ‘తల్లికి వందనం’ వంటి సంక్షేమ పథకాలకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. రుతుపవనాలు బలహీనపడి వర్షాలు ముఖం చాటేయడంతో రైతాంగం దిక్కుతోచని స్థితిలో పడింది. రుతుపవనాల కనుమరుగు : గతేడాది నైరుతి రుతుపవనాల ప్రారంభం నుంచి సాధారణం కంటే 5.84 శాతం అధిక వర్షపాతం నమోదవ్వగా, ఈ ఏడాది ఎల్నినో ప్రభావం వల్ల పరిస్థితి పూర్తి విరుద్ధంగా మారింది. ఆగస్టు చివరి నాటికి సాధారణ వర్షపాతం 567.1 మి.మీ నమోదు కావాల్సి ఉండగా, కేవలం 298.8 మి.మీ మాత్రమే కురిసింది. అంటే ఏకంగా 47.3 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీంతో ఖరీఫ్ సాగు తీవ్రంగా దెబ్బతింది. వర్షాలు లేక బోర్లపైన, మోటార్లపైన ఆధారపడటంతో డీజిల్, విద్యుత్ ఖర్చులు రైతులకు భారంగా మారాయి. ఆక్వా రంగం కుదేలు జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో చేపలు, 1.10 లక్షల ఎకరాల్లో రొయ్యలు కలిపి మొత్తం 2.90 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. దీనిపై సుమారు 75,000 మంది ఆధారపడి జీవిస్తున్నారు. ఎల్నినో ధాటికి చెరువుల్లో నీరు వేడెక్కి రొయ్యలు మేత తినడం మానేశాయి. దీనికితోడు తెల్లమచ్చల వ్యాధి, విబ్రియో, వివిధ వైరస్ తెగుళ్లు విజృంభిస్తున్నాయి. మందుల ఖర్చులు, మేతల ధరలు అమాంతం పెరగడం, తీవ్ర నీటి కొరత వేధిస్తుండటంతో ఆక్వా రైతులు గగ్గోలు పెడుతున్నారు. పెరిగిన విద్యుత్ డిమాండ్ డిస్కంల నివేదిక ప్రకారం తీవ్రమైన వేడిగాలుల వల్ల విద్యుత్ డిమాండ్ గతేడాదితో పోలిస్తే సగటున 15 శాతం నుంచి 20 శాతం వరకు పెరిగింది. రంగాల వారీగా పరిశీలిస్తే ఆక్వారంగంలో 35 శాతం, వ్యవసాయ రంగం 30 శాతం, గృహ వినియోగం 25 శాతం, పరిశ్రమలు 10 శాతం మేర వినియోగం పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు, ఉక్కపోత భరించలేక గృహాల్లో ఏసీల వాడకం పెరగడంతో, మధ్యతరగతి కుటుంబాలు విద్యుత్ బిల్లులు చెల్లించలేక అప్పులపాలవుతున్నాయి. నెల సాధారణ 2025 2026 వర్షపాతం వర్షపాతం వర్షపాతం జనవరి 0.2 0.0 0.0 ఫిబ్రవరి 0.2 0.1 0.0 మార్చి 0.5 1.2 0.3 ఏప్రిల్ 0.5 0.0 0.1 మే 1.7 3.5 0.8 జూన్ 112.5 124.0 106.26 జూలై 242.9 255.4 89.03 ఆగస్టు 246.5 210.2 56.64 సాగు చెరువుల్లో తక్కువ సంఖ్యలో చేప పిల్లలను వదలాలి. ఆక్వా సాగుపై ఎల్నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఉష్ణోగ్రతల మార్పుల వల్ల విబ్రియో, బ్యాక్టీరియా వ్యాధులు వ్యాపిస్తున్నాయి. రొయ్యల చెరువుల్లో ఆక్సిజన్ అందించేందుకు ఎరేటర్లను నిరంతరం వాడాలి. ఉష్ణోగ్రతలు మరింత పెరిగితే పెద్ద చేపలు చనిపోయే ప్రమాదం ఉంది. – ఎం.రవికుమార్, మత్స్యశాఖ సహాయ సంచాలకుడు, కై కలూరు పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్లే ఎల్నినో ఏర్పడి వర్షాలు కురవడం లేదు. వరి సాగుకు నీటి కొరత తీవ్రంగా ఉంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలు ఏవి వేయాలో రైతులకు వివరిస్తున్నాం. ప్రతి ఒక్క రైతు తప్పనిసరిగా పంటల బీమా చేయించుకునేలా అవగాహన కలిగిస్తున్నాం. – ఆర్.దివ్య, వ్యవసాయ అధికారి, కై కలూరు -
మెట్ట ప్రాంత ఎమ్మెల్యేపై భార్య ఫిర్యాదు?
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లాలోని మెట్ట ప్రాంతంలోని ప్రజాప్రతినిధిపై ఆయన భార్య పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మంగళవారం ఏలూరు నగరానికి చేరుకున్న మెట్ట ప్రాంత ఎమ్మెల్యే సతీమణి తన భర్తపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ ఉన్నతాధికారుల చుట్టూ తిరిగినట్లు చెబుతున్నారు. సాక్షాత్తూ అధికారంలో ఉన్న ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేయడం... దానిపై పోలీసులు చర్యలు చేపట్టడం సాధ్యమయ్యే పనేనా? సదరు ఎమ్మెల్యేకు కౌన్సెలింగ్ ఇస్తారా? అంటూ జనంలో చర్చ సాగుతుంది. కానీ బాధిత మహిళకు (ఎమ్మెల్యే భార్య) భరోసా దొరకలేదని అంటున్నారు. మొత్తానికి సదరు ఎమ్మెల్యే సారు సతీమణి ఎందుకు వచ్చారు? ఏమి జరిగిందనే విషయంపై ఆరా తీస్తే నో కామెంట్ అనే జవాబు చెప్పటం విడ్డూరంగా ఉంది. ఏలూరు (ఆర్ఆర్పేట): ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు నిర్వహించే స్పెషల్ టెట్ మార్గదర్శకాలను సవరించాలని, లేనిపక్షంలో బుధవారం నుంచి మంగళగిరిలోని విద్యాభవన్ వద్ద నిరవధిక ధర్నా చేపడతామని ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.రెడ్డిదొర ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. మార్గదర్శకాల మార్పుపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్కు నోటీసు ఇవ్వగా, ఆయన మంగళవారం చర్చలకు పిలిచారని తెలిపారు. అయితే ఆఫ్లైన్లో పరీక్ష నిర్వహణ, ఉత్తీర్ణత మార్కుల తగ్గింపు, స్కూల్ అసిస్టెంట్ గణితం, పీఎస్, బీఎస్ అభ్యర్థులకు వారి సొంత సబ్జెక్టుల నుంచే ప్రశ్నలు ఇవ్వాలనే ప్రధాన డిమాండ్లపై కమిషనర్ నుంచి సానుకూల స్పందన రాలేదని వెల్లడించారు. దీంతో ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ధర్నా యథావిధిగా కొనసాగుతుందని, జిల్లాల నుంచి ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెం: నాణ్యమైన పరిశోధనలతోనే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని ఐఐటీ హైదరాబాద్ కెమికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ చంద్రశేఖరశర్మ తెలిపారు. ఏపీ నిట్ పరిశోధన విభాగం, ఐఐసీ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ‘పరిశోధన – అభివృద్ధి’పై ఆచార్యులు, విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఐటీ ప్రొఫెసర్ చంద్రశేఖరశర్మ, జీకేసీ ఐఈటీ మాల్డా మాజీ డైరెక్టర్ పరమేశ్వరరావు ముఖ్య అతిథులుగా ప్రసంగించారు. పరిశోధనలో నైతిక విలువలు పాటించడం అత్యంత ప్రాధాన్యమని, నిధుల సాధనకు సమర్థవంతమైన పరిశోధనా ప్రతిపాదనలు కీలకమని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి, వాటిని స్థానిక అవసరాలకు అనుగుణంగా మలుచుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం పరమేశ్వరరావు మాట్లాడుతూ పరిశోధనకు తగిన సమస్యను ఎంపిక చేసుకోవడం నుంచి ప్రతిపాదన తయారీ వరకు శాసీ్త్రయ దృక్పథం అవసరమన్నారు. సమస్య ప్రాధాన్యత, లక్ష్యాలు, కార్యాచరణ, ఆశించిన ఫలితాలు స్పష్టంగా ఉండాలని సూచించారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు పరిశోధక విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని అసోసియేట్ డీన్ డాక్టర్ తపస్ పరమానిక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీన్ కిరణ్ శాస్త్రి, ఐఐసీ ప్రెసిడెంట్ డాక్టర్ కార్తికేయశర్మ, వి. సందీప్, వీరేష్కుమార్, ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రశాఖ వార్షిక సర్వసభ్య సమావేశం విజయవాడలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లాకు మూడు ప్రతిష్ఠాత్మక అవార్డులు వరించాయి. జిల్లాలో మానవతా సేవలను విస్తరించేందుకు ఉత్తమ సహకారం, ప్రోత్సాహం అందించినందుకుగాను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణికి 2025–26 సంవత్సరానికి గవర్నర్ గోల్డ్ మెడల్, మాజీ జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డికి 2024–25 సంవత్సరానికి గోల్డ్ మెడల్ లభించాయి. అలాగే నూతన జిల్లాల విభాగంలో పశ్చిమగోదావరి జిల్లా రెడ్క్రాస్ అత్యుత్తమ సేవలందించి 2024–25 గాను రాష్ట్రస్థాయి ప్రథమ బహుమతిని సాధించింది. ఈ అవార్డును జిల్లా రెడ్క్రాస్ చైర్మన్ డాక్టర్ ఎం.ఎస్.వి.ఎస్. భద్రిరాజు, గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా అందుకున్నారు. -
నల్ల బ్యాడ్జీలతో ప్రభుత్వ ఉద్యోగుల నిరసన
ఏలూరు (ఆర్ఆర్పేట): ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉద్యమ కార్యాచరణలో భాగంగా తొలిరోజు ఏలూరు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. సీఎం సార్.. మా డబ్బులు మాకివ్వండి అనే వాక్యంతో కూడిన ఫొటోను ఉద్యోగులంతా తమ వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్గా పెట్టుకుని నిరసన తెలియజేశారు. ఏలూరులోని డీఎస్ఓ, కలెక్టరేట్, రూరల్ తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏపీజేఏసీ అమరావతి ఏలూరు జిల్లా చైర్మన్ కే. రమేష్ కుమార్ మాట్లాడుతూ బుధవారం నుంచి ఈ నెల 8వ తేదీ వరకు ప్రచార కార్యక్రమంలో భాగంగా అన్ని కార్యాలయాలను సందర్శించి కరపత్రాలు పంపిణీ చేస్తామన్నారు. ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో? వివరిస్తామని చెప్పారు. పెండింగ్లో ఉన్న డీఏలు, పీఆర్సీ బకాయిలు, 12వ పీఆర్సీ కమిషన్ నియామకం, మధ్యంతర భృతి (ఐఆర్) విడుదల వంటి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. -
ఇంకా తెలియని పులి జాడ
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో కలకలం రేపుతున్న పులి జాడ ఇంకా లభించకపోవడంతో అటవీ శాఖ అధికారుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. గత 24 గంటలుగా అటవీ శాఖ అధికారులు, ప్రత్యేక బృందాలు పులి సంచారాన్ని గుర్తించేందుకు విస్తృతంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. సిగ్నళ్లు నిలిచిపోవడంతో చిక్కుముడి పులి కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు దానికి ప్రత్యేక రేడియో కాలర్ అమర్చినప్పటికీ, సోమవారం సాయంత్రం నుంచి ఎటువంటి సిగ్నళ్లు అందడం లేదు. దీంతో అసలు పులి ప్రస్తుతం ఏ ప్రాంతంలో ఉంది? ఏ దిశగా ప్రయాణిస్తోంది? అనే విషయాలను అధికారులు కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. రేడియో కాలర్ పనిచేయకపోవడం లేదా దట్టమైన కొండలు, రంధ్రాల మధ్యకు వెళ్లడం వల్ల సిగ్నళ్లు నిలిచిపోయి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. డ్రోన్లు, అడుగు జాడల ద్వారా శోధన ఒకవైపు డ్రోన్ కెమెరాల సహాయంతో ఆకాశ మార్గం గుండా అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతుండగా, మరోవైపు ప్రత్యేక శిక్షణ పొందిన అటవీ సిబ్బంది క్షేత్రస్థాయిలో పులి అడుగు జాడలను (పగ్మార్క్స్) గుర్తించేందుకు అణువణువూ శోధిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్ సమీపంలోని లోతైన మందంలోకి లేదా దట్టమైన కొండల మధ్యలోకి పులి వెళ్లిపోయి ఉంటుందా? అనే అనుమానాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. అటవీ అధికారుల మకాం, ప్రజలకు హెచ్చరికలు పులి సంచరించిన ప్రాంతాలలోనే అటవీ శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది మకాం వేశారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పులి జాడ స్పష్టంగా తెలిసే వరకు పోలవరం ప్రాజెక్ట్ కార్మికులు, పశువుల కాపరులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, స్థానిక అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు రాకూడదని, అటవీ ప్రాంతాల వైపు వెళ్లరాదని అటవీశాఖ రేంజర్ ఎస్కే వలీ సూచించారు. 24 గంటలుగా ముమ్మరంగా గాలింపు చర్యలు సిగ్నళ్లు అందక పులి ఎక్కడుందో చెప్పలేకపోతున్న అధికారులు డ్రోన్లు, శాటిలైట్ ట్రాకింగ్తో అణువణువూ శోధన -
కొబ్బరి కల్పవృక్షమే!
ద్వారకాతిరుమల: కొబ్బరి చెట్టు.. రైతుకు ఆదాయాన్ని అందించడమే కాదు.. మనిషి నిత్య జీవితంలోనూ విడదీయరాని భాగం. పచ్చికొబ్బరి, ఎండుకొబ్బరి, కొబ్బరి నీరు, గుజ్జు, నూనె, కొబ్బరి పాలు ఇలా ఆహారంలో వినియోగించే ఉత్పత్తులెన్నో. ఇక కొబ్బరి పీచు, చిప్ప, ఆకులు కూడా వివిధ రకాల వస్తువుల తయారీలో ఉపయోగపడుతున్నాయి. అందుకే కొబ్బరి చెట్టును ’కల్పవృక్షం’గా పిలుస్తారు. ఏటా సెప్టెంబర్ 2న ప్రపంచ కొబ్బరి దినోత్సవం నిర్వహిస్తున్న నేపథ్యంలో.. ఉమ్మడి పశ్చిమగోదావరి ప్రాంతంలో కొబ్బరి సాగు, రైతుల పరిస్థితిపై ప్రత్యేక కథనం. వేలాది ఎకరాల్లో సాగు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 50,690 ఎకరాల్లో కొబ్బరి సాగవుతోంది. గోదావరి డెల్టా ప్రాంతాల్లో ఈ పంట సాగుకు అనుకూల వాతావరణం ఉంది. కొబ్బరితోపాటు అనేక ప్రాంతాల్లో అంతర పంటగా కోకోను కూడా రైతులు సాగు చేస్తున్నారు. జిల్లా ఉద్యానవన శాఖ గణాంకాల్లోనూ కొబ్బరి ప్రధాన పంటగా నమోదైంది. కొబ్బరికి సంబంధించిన సాగు విస్తీర్ణం పెంపు, పునరుజ్జీవనం, తిరిగి నాటడం వంటి కార్యక్రమాలకు కొబ్బరి అభివృద్ధి మండలి పథకాల కింద సబ్సిడీలు కూడా అమలవుతున్నాయి. డెల్టాలో కొబ్బరి తోటలే గోదావరి డెల్టా పరిధిలోని పాలకొల్లు, యలమంచిలి, నరసాపురం, మొగల్తూరు, ఆచంట, పోడూరు తదితర మండలాల్లో కొబ్బరి తోటలు విస్తారంగా ఉన్నాయి. గోదావరి కాలువల ద్వారా సమృద్ధిగా లభించే సాగునీరు, తేమతో కూడిన నేలలు కొబ్బరి సాగుకు అనుకూలంగా ఉండటంతో ఈ ప్రాంతంలో కొబ్బరి ప్రధాన ఉద్యాన పంటగా విస్తరించింది. ముఖ్యంగా పశ్చిమగోదావరి డెల్టా ప్రాంతంలోని పలు మండలాలు కొబ్బరి సాగుకు ప్రత్యేక గుర్తింపు పొందాయి. అలాగే ఏలూరు జిల్లా పరిధిలోనూ కొబ్బరి సాగు గణనీయంగా విస్తరించింది. ద్వారకాతిరుమల, కామవరపుకోట, ఉంగుటూరు, నిడమర్రు, గణపవరం, దెందులూరు, భీమడోలు, ఏలూరు రూరల్, పెదవేగి, పెదపాడు తదితర మండలాల్లో కొబ్బరి తోటలు ఉన్నాయి. రాష్ట్రంలోని ప్రధాన కొబ్బరి సాగు జిల్లాల్లో ఏలూరుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఇతర పంటల నుంచి కొబ్బరి సాగువైపు రైతులు మళ్లుతున్నారు. పీచుతోనూ ఆదాయం కొబ్బరికాయ రైతుకు ప్రధాన ఆదాయ వనరు. పచ్చికాయలకు, ఎండుకొబ్బరికి, కొబ్బరి నూనెకు మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. కాయలోని పీచుతో తాళ్లు, మ్యాట్లు, బ్రష్లు వంటి వస్తువులను తయారు చేస్తారు. చిప్పను బొగ్గు, ఇతర ఉత్పత్తుల తయారీలో వినియోగిస్తున్నారు. ఆకులతో చాపలు, బుట్టలు తదితర గ్రామీణ ఉత్పత్తులు తయారవుతున్నాయి. ఉమ్మడి పశ్చిమలో కొబ్బరి సాగు విస్తీర్ణం ఇలా.. జిల్లా సాగు విస్తీర్ణం సాగు విస్తీర్ణం అంచనా ఉత్పత్తి (హెక్టార్లలో) (ఎకరాల్లో) (కాయలు) ఏలూరు 15,408 38,070 246.5 కోట్లు పశ్చిమగోదావరి 5,107 12,620 81.7 కోట్లు 22 వేలకు పైగా హెక్టార్లలో సాగు కాయ నుంచి పీచు వరకు.. ప్రతి భాగం ఉపయోగమే రైతులకు దీర్ఘకాలిక ఆదాయం నేడు ప్రపంచ కొబ్బరి దినోత్సవం కొబ్బరి తోటల్లో అంతర పంటగా కోకో సాగు చేయడం రైతులకు అదనపు ఆదాయ మార్గంగా మారుతోంది. ఒకే భూమిలో ప్రధాన పంటతోపాటు అంతర పంటను సాగు చేయడం ద్వారా భూమి వినియోగాన్ని పెంచుకోవచ్చని ఉద్యానశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి ప్రాంతంలో కొబ్బరి తోటల మధ్య ఎక్కువగా కోకో పంట సాగవుతోంది. కొబ్బరి నీరు వేసవిలో సహజ పానీయంగా వినియోగిస్తారు. కొబ్బరి గుజ్జులో ఫైబర్ తదితర పోషకాలు ఉంటాయి. కొబ్బరి పాలను వివిధ వంటకాల్లో ఉపయోగిస్తారు. కొబ్బరి నూనెను వంటతోపాటు సౌందర్య ఉత్పత్తుల్లోనూ వినియోగిస్తారు. అయితే కొబ్బరి నూనెలో సంతృప్త కొవ్వు అధికంగా ఉండటంతో పరిమితంగా తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు గురుకులం విద్యార్థులు
పెదవేగి: రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు పెదవేగి గురుకుల పాఠశాల విద్యార్థులు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ ఎం.రమేష్ బాబు, వైస్ ప్రిన్సిపాల్ నిర్మల, ఫిజికల్ డైరెక్టర్ జయరాజ్ తెలిపారు. ఈ నెల 11 నుంచి 13 వరకు విజయనగరం జిల్లా బొబ్బిలిలో జరిగే రాష్ట్రస్థాయి సబ్–జూనియర్స్ బాలుర పోటీలకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జట్టుకు గురుకుల పాఠశాల నుంచి ఎంజే వర్మకుమార్, కే. జోషన్, ఏ.పూర్ణనంద, పీ.అజయ్, కే.సుదీప్ ఎంపికయ్యారు. అలాగే, ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు కడపలో జరిగే రాష్ట్రస్థాయి జూనియర్స్ విభాగపు పోటీలకు యూ దురా్ాగరావు, ఎస్.జస్వంత్, ఈ. సూర్య, బీ. మహేష్, జీ. రాజశేఖర్, హెన్రీ, ఎన్. నవసంపత్, బీ. రాజు, బీ. అభిరామ్ ఎంపికై నట్లు వారు వెల్లడించారు. ఉంగుటూరు: జాతీయ రహదారిపై బాదంపూడి వద్ద డివైడర్ను కారు ఢీకొన్న ప్రమాదంలో జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) జీవీకే మల్లికార్జునరావు త్రుటిలో పెను ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జయింది. సోమవారం రాత్రి విధులు ముగించుకుని ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం వస్తుండగా బాదంపూడి వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే, ఈ ప్రమాదంలో డీపీవో మల్లికార్జునరావుకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న ఉంగుటూరు ఎంపీడీవో రాజ్మనోజు, డిప్యూటీ ఎంపీడీవో రమేష్బాబు, సూపరింటెండెంట్ హనుమాన్ బాబు తాడేపల్లిగూడెం వెళ్లి డీపీవోను పరామర్శించారు. ఉంగుటూరు: మతిస్థిమితం లేని ఓ మహిళ ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదానికి గురై మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోపాలపురం గ్రామానికి చెందిన ఇల్లెందుల లక్ష్మి (50) కొంతకాలంగా మతిస్థిమితం లేక బాధపడుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం వేకువజామున పొయ్యి వెలిగిస్తుండగా ప్రమాదవశాత్తు ఆమె చీరకు నిప్పంటుకుని మంటలు చెలరేగి ఒళ్లంతా తీవ్రంగా గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను మెరుగైన చికిత్స నిమిత్తం తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి మార్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. బాధితురాలికి భర్త, కుమార్తె ఉన్నారు. ఈ ఘటనపై చేబ్రోలు ఎస్సై సూర్యభగవాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కలిదిండి(కై కలూరు): ప్రమాదవశాత్తూ ప్రైవేటు ఎలక్ట్రీషియన్ మృతి చెందిన ఘటన కలిదిండి మండలం పోతుమర్రులో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కొలుసు రంగారావు (47) విద్యుత్ స్తంభంపై పనిచేస్తుండగా విద్యుత్ షాక్కు గురై కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో ఆయన తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మరణించాడు. మొదటి భార్య మరణించడంతో రంగారావు శ్రీదేవి అనే మరో మహిళను వివాహం చేసుకున్నారు. ఆమె ద్వారా ఒక పాప ఉంది మొదటి భార్య సంతానంలో ముగ్గురికి ఇంకా వివాహాలు కాలేదు. రంగారావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కై కలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతని రెండో భార్య శ్రీదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
6 వేల సీట్లతో ట్రిపుల్ఐటీ
నూజివీడులో 120 ఎకరాల విస్తీర్ణంలో 2 వేల అడ్మిషన్లతో ట్రిపుల్ఐటీ నెలకొల్పారు. రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలో రాష్ట్రంలో మూడు ట్రిపుల్ఐటీలను దివంగత వైఎస్సార్ ఏర్పాటు చేస్తే దానిలో ఒకటి నూజివీడులో ఏర్పాటైంది. పూర్తిస్థాయి కార్పొరేట్ సౌకర్యాలతో ప్రారంభమైన ట్రిపుల్ఐటీ అంచెలంచెలుగా ఎదిగి వేలాది మంది పేద విద్యార్థులకు వరదాయినిగా మారింది. ఇప్పటి వరకు సుమారు 6 వేల మందికిపైగా ట్రిపుల్ఐటీ విద్యార్థులు క్యాంపెస్ ప్లేస్మెంట్లల్లో ఉన్నత కొలువులు పొందారు. అదే విధంగా గ్రూప్–2 నుండి సివిల్స్ వరకు పదుల సంఖ్యలో ట్రిపుల్ఐటీ విద్యార్థులుండడం విశేషం. నూజివీడు ట్రిపుల్ఐటీ -
పోలవరం నిర్వాసిత సర్వేలో జాప్యం
కుక్కునూరు: పోలవరం ప్రాజెక్టు 41.15 కాంటూర్ పరిధిలోని కుక్కునూరు గ్రామానికి చెందిన నిర్వాసిత కుటుంబాల ఇళ్ల నిర్మాణాల ఫీల్డ్ వెరిఫికేషన్ సర్వేను అధికారులు ప్రకటించిన తేదీల్లో నిర్వహించకపోవడంపై నిర్వాసితులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు సర్వేలు నిర్వహించినప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోగా, మరోసారి సర్వే పేరుతో కాలయాపన చేస్తుండటంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసంపూర్తిగా సర్వేలు... గల్లంతవుతున్న పేర్లు 2017లోనే ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి అధికారులు తొలిసారి సర్వే నిర్వహించారు. ఆ సమయంలో రూపొందించిన తొలి జాబితాలో ఉన్న కొంతమంది నిర్వాసితుల పేర్లు తుది జాబితాకు వచ్చేసరికి గల్లంతయ్యాయి. దీంతో బాధితులు అధికారులకు దరఖాస్తులు సమర్పించగా, గతంలో ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా నిర్వహించారు. అయినప్పటికీ, పేర్లు కోల్పోయిన నిర్వాసితులకు ఇప్పటివరకు న్యాయం జరగలేదు. ఈ నేపథ్యంలో గతంలో జాబితా నుంచి మిస్సయిన, 41.15 కాంటూర్ పరిధిలోని గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన ఎర్రటా డిక్లరేషన్ ప్రతిపాదనల పరిశీలన కోసం మరోసారి ఫీల్డ్ వెరిఫికేషన్ చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా కుక్కునూరు మండలంలోని దానరచర్ల గ్రామంలో ఆగస్టు 1న, కుక్కునూరులో ఆగస్టు 4న, కివ్వాకలో ఆగస్టు 7న సర్వే నిర్వహిస్తామని అధికారిక షెడ్యూల్ ప్రకటించారు. అయితే, ప్రకటించిన తేదీన సంబంధిత అధికారులు కుక్కునూరుకు వచ్చి సర్వే నిర్వహించలేదని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. దీంతో ఇళ్ల నిర్మాణాల పరిశీలన, ఎర్రటా డిక్లరేషన్ ప్రక్రియ మరింత ఆలస్యమవుతుందన్న ఆందోళన వారిలో నెలకొంది. ఎప్పుడు పరిష్కారం లభిస్తుంది? ‘‘గతంలో సర్వే జరిగింది.. మళ్లీ ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా చేశారు. అయినప్పటికీ పరిహారం అందలేదు. ఇప్పుడు మరోసారి సర్వేకు తేదీలు ప్రకటించి, ఆ తేదీల్లో కూడా అధికారులు రాకపోవడం నిరాశ కలిగిస్తోంది. అసలు సర్వే ఎప్పుడు నిర్వహిస్తారో, మా సమస్యలకు ఎప్పుడు పరిష్కారం లభిస్తుందో స్పష్టత ఇవ్వాలి’’ అని నిర్వాసితులు కోరుతున్నారు. ఈ కాంటూర్ పరిధిలోని కొంతమందికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద ఇళ్ల నిర్మాణాల పరిహారం అందగా, జాబితాలో మిగిలిపోయిన వారు మాత్రం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. పదేపదే సర్వేలు, వెరిఫికేషన్లు జరుగుతున్నా తుది పరిష్కారం మాత్రం కనిపించకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సత్వరమే స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి -
జిరాయితీ భూములను ప్రభుత్వ భూములుగా మార్చొద్దు
భీమడోలు: ఆరు దశాబ్దాలుగా సాగులో ఉన్న తమ జిరాయితీ భూములను రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా మార్చడాన్ని నిరసిస్తూ భీమడోలు మండలం అంబర్పేట రెవెన్యూ పరిధిలోని కురెళ్లగూడెం (కొల్లేరు) రైతులు మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. సర్వే నెంబర్ 322 లోని సుమారు 55 ఎకరాల జిరాయితీ భూములను, అధికారుల అక్రమ సబ్–డివిజన్ల ద్వారా ప్రభుత్వ భూములుగా మార్చారని రైతులు ఆరోపించారు. బడా ఆక్వా రైతు ఎన్వీఆర్కే రాజుకు లబ్ధి చేకూర్చేందుకే అధికారులు తమకు అన్యాయం చేస్తున్నారని, దీనివల్ల తమ కుటుంబాలు రోడ్డున పడతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు చెందిన 6 ఎకరాల భూమిని బడా ఆక్వా రైతు ఎన్వీఆర్కే రాజు ఆక్రమించుకుంటున్నాడని, కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా పట్టించుకోవడం లేదని రైతు అల్వా శేషగిరిరావు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని కోరితే రెవెన్యూ అధికారులు ఆ రైతుకు అనుకూలంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆందోళనలో భాగంగా రైతులు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేసి, అనంతరం డెప్యూటీ తహసిల్దార్ సుధాకర్కు వినతిపత్రం అందజేశారు. దీనిపై తహసీల్దార్ బి.రమాదేవి స్పందిస్తూ, రైతులకు అన్యాయం చేసే ఉద్దేశం లేదని, ఆరు దశాబ్దాల నాటి ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. అధికారుల ఆదేశాల మేరకు రికార్డులను పరిశీలించి అర్హులైన రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైతులు పి.రవికుమార్, ఈతకోట శ్యామల, మోపిదేవి వెంకట సత్యనారాయణ, ఈతకోట వెంకటేశ్వరరావు, మోపిదేవి కృష్ణ, వీరయ్య, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.


