Eluru
-
అన్నదాతకు డీజిల్ వెతలు
డీజిల్ కొరత అన్నదాతను అతలాకుతలం చేస్తోంది. ఒకవైపు కోతలు వేగంగా సాగుతున్నాయి. కోత యంత్రాలకు ధాన్యం లోడుతో తిరిగే లారీలకు, రొయ్యల చెరువుల్లో ఆక్సిజన్ నింపే ఏరియేటర్లు తిరగడానికి డీజిల్ అవసరం. ఇలా అన్నదాతలు, ఆక్వా రైతులకు డీజిల్ అనివార్యమైన తరుణంలో, కొరతతో అల్లాడిపోతున్నారు. ప్రధానంగా ఉమ్మడి పశ్చిమలో 1,900కు పైగా కోత యంత్రాలకు రోజుకు సగటున 2 లక్షల లీటర్ల డీజిల్ డిమాండ్ ఉండగా, దానిలో నాలుగో వంతు సరఫరా కూడా లేకపోవడంతో ఇబ్బందులు తీవ్రమయ్యాయి. బుధవారం శ్రీ 29 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026పెట్రోల్, డీజిల్ సరఫరాలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఎన్నికల ముందు రైతు ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, రైతుకే తొలి ప్రాధాన్యత అని ప్రతి సభలోనూ చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వంలో ఎవరైనా స్పందిస్తున్నారా? క్షేత్రస్థాయిలో రైతులకు డీజిల్ అందేలా వెంటనే చర్యలు చేపట్టాలి. – డీవీఆర్కే చౌదరి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రైతులు కన్నీరు పెడుతున్నారు. ధాన్యం సరఫరాకు, చేపలు, రొయ్యల చెరువుల వాహనాలకు డీజిల్, పెట్రోల్ కూడా సరఫరా చేయలేకపోతే ప్రభుత్వం రైతులకు మేలు చేసినట్టేనా? క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న పాట్లు, డీజిల్ బ్లాక్ మార్కెట్ విక్రయాల పరిస్థితిని నేరుగా గమనించి, ప్రభుత్వం తక్షణమే పరిస్థితిని చక్కదిద్దాలి. – ఎన్.గాంధీ, రైతు, జోగన్నపాలెం సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉమ్మడి పశ్చిమలో వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రధానంగా రెండు జిల్లాల్లో కలిపి 4.25 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. ప్రస్తుతం మెట్ట ప్రాంతాల్లో 80 శాతం పైగా కోతలు పూర్తవగా, డెల్టాలో 40 నుంచి 50 శాతం మాత్రమే కోతలు పూర్తయ్యాయి. జిల్లాలో వరి కోతకు హార్వెస్టింగ్ యంత్రాల వినియోగం తప్పనిసరిగా మారింది. ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలోనే 1,600 హార్వెస్టింగ్ యంత్రాలు ప్రస్తుతం వినియోగంలో ఉన్నాయి. ఎకరం కోత పూర్తి చేయడానికి సగటున 10 లీటర్ల డీజిల్ తప్పనిసరి. అదేవిధంగా ధాన్యం రవాణా చేసే లారీలకు 30 లీటర్లు, ట్రాక్టర్లకు 20 లీటర్ల మేర డీజిల్ అవసరం. వరి కోతలు వాయిదా ఈ క్రమంలో ఉమ్మడి పశ్చిమలో కేవలం వరి కోతలు, రవాణాకే రోజుకు సగటున 2.5 లక్షల లీటర్ల డీజిల్ డిమాండ్ ఉంది. జిల్లాలో ఆ మేరకు సరఫరా లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆక్వా సాగులో రొయ్యల చెరువులకు ఆక్సిజన్ నింపే ఏరియేటర్లకు ఎకరాకు సగటున 5 నుంచి 10 లీటర్ల మేర డీజిల్ అవసరం. జిల్లాలో అత్యధికంగా సుమారు 2 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు. వ్యవసాయానికి, ఆక్వాకు కలిపి మొత్తం 3.5 లక్షల లీటర్ల మేర డీజిల్ డిమాండ్ ఉంది. డీజిల్ పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో కోతలు వాయిదా పడుతుండగా, ధాన్యం లోడును కళ్లాల్లోనే ఉంచుతున్నారు. వాతావరణ మార్పులతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఏలూరు జిల్లాలో 232, పశ్చిమ గోదావరి జిల్లాలో 160 పెట్రోల్ బంకుల్లో డీజిల్ నిల్వలు సరిపడా లేని పరిస్థితి టోకెన్లు, క్యూలైన్లు కోత యంత్రాలకు, రైతుల ఇతర అవసరాలకు స్థానిక తహసీల్దార్ల ద్వారా టోకెన్ల పంపిణీకి ప్రభుత్వం తెరదీసింది. తహసీల్దార్ కార్యాలయాల్లో, రైతు భరోసా కేంద్రాల వద్ద గంటల కొద్దీ పడిగాపులు పడి టోకెన్లు తీసుకుని, మళ్లీ బంకుల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. రెండు జిల్లాల్లో అధికార యంత్రాంగం యథావిధిగా బంకుల తనిఖీలు నిర్వహించడంతో పాటు కంట్రోల్ రూంలో ప్రత్యేక ఫోన్ నెంబర్లు కేటాయిస్తున్నారు. వ్యవసాయ అనుబంధ శాఖలకు, మెడికల్, ఆర్టీసీకి ఇబ్బందులు లేకుండా టోకెన్లు జారీ చేశామని, అవసరమైన మేర డీజిల్ సరఫరా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు ప్రకటించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం ఇబ్బందికరంగానే ఉంది. ఎకరా కోతకు 10 లీటర్ల డీజిల్ వినియోగం ఆక్వాకు, ధాన్యం రవాణా లారీలకు డీజిల్ తప్పనిసరి ఉమ్మడి పశ్చిమలో 1,900కు పైగా కోత యంత్రాలు తహసీల్దార్లు స్లిప్పులు ఇస్తేనే యంత్రాలకు డీజిల్ -
‘పోలవరం’లో మట్టి, రాతి నాణ్యతా పరీక్షలు
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టులో కేంద్ర మట్టి, పదార్థాల పరిశోధనా సంస్థ (సీఎస్ఎంఆర్ఎస్) బృందం మంగళవారం విస్తృతంగా పర్యటించి నాణ్యతా పరీక్షలు నిర్వహించింది. ఈ బృందంలో నిపుణులు అన్వేష్, గౌరవ్ పాండే, ఉదయ్ చక్రవర్తి, హరీందర్ సింగ్ ప్రకాష్లు ఉన్నారు. గతంలో ప్రాజెక్టు కాంక్రీట్ పనులను పరిశీలించిన ఈ బృందం, తాజాగా ఈసీఆర్ఎఫ్ నిర్మాణానికి వినియోగిస్తున్న రాళ్లు, మట్టి నాణ్యతను పరీక్షించింది. గ్యాప్–1, గ్యాప్–2 ప్రాంతాల్లో జరుగుతున్న పనులతో పాటు అక్కడ వినియోగిస్తున్న ఇసుకను కూడా వారు పరిశీలించారు. ప్రాజెక్టు ఆవరణలో నిల్వ ఉన్న రాళ్లు, మట్టి నమూనాలను సేకరించి స్థానిక ల్యాబ్లో పరీక్షించిన నిపుణులు, నాణ్యత పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. గ్యాప్–1లో ఇప్పటివరకు జరిగిన పనుల్లో వాడిన పదార్థాలకు రింగ్ టెస్ట్ నిర్వహించారు. మరిన్ని లోతైన పరీక్షల కోసం కొంత మట్టిని ఢిల్లీలోని తమ కేంద్ర పరిశోధనాలయానికి తీసుకెళ్లారు. -
డీజిల్ కృత్రిమ కొరత సృష్టిస్తే కేసులు
ఏలూరు (టూటౌన్): డీజిల్ కృత్రిమ కొరత సృష్టించే బంకు యజమానులపై కేసులు నమోదు చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఏలూరులోని పలు పెట్రోల్ బంకులను మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి డీజిల్ నిల్వలు, సరఫరా, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డీజిల్ కొరత ఏర్పడుతుందేమోనని ఆందోళనతో ప్రజలు కొనుగోళ్లకు ప్రయత్నిస్తుండడంతో సమస్య ఏర్పడుతుందన్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని కొందరు బంకు యజమానులు డీజిల్ నిల్వలు ఉన్నప్పటికీ బంకుల ముందు నో స్టాక్లు పెడుతున్నారన్నారు. తహసీల్దార్లు, పౌర సరఫరాల శాఖాధికారులు తమ పరిధిలోని బంక్లను పరిశీలించి డీజిల్ నిల్వలు ఉన్నా నో స్టాక్ బోర్డులు పెట్టి కృత్రిమ కొరత సృష్టించే వారిపై, పెట్రోల్, డీజిల్ను బ్లాక్ మార్కెటింగ్ చేసే బంకు యజమానులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. డీజిల్ను ఇళ్ల వద్ద నిల్వ ఉంచవద్దని, మండే స్వభావం ఉన్న డీజిల్, వేసవి తీవ్రత దృష్ట్యా అగ్నిప్రమాదాలకు కారణమవుతుందని, ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, అసిస్టెంట్ కలెక్టరు సీహెచ్ శ్రావణ్కుమార్ రెడ్డి, డీఎస్ఓ బాబు ఇ.బి.విలియమ్స్, తహసీల్దారు కె.గాయత్రీదేవి తదితరులు పాల్గొన్నారు. -
శ్రీవారికి నృత్య నీరాజనం
ద్వారకాతిరుమల: మయూరాలు పురివిప్పి నర్తించినట్టు.. ఆ కళాకారుల నాట్య హేలాను కన్నులారా వీక్షించిన నృత్యాభిమానులు ఆనందంతో పులకించిపోయారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీ కామాక్షి నృత్యాలయం (మైలవరం), శ్రీ పాద వల్లభ కూచిపూడి నాట్య నిలయం (ఏలూరు), డీజీ సరస్వతి (విజయవాడ), శ్రీ జననీ నృత్య నికేతన్ (కాకినాడ) వారు మంగళవారం శ్రీహరి కళాతోరణ వేదికపై కూచిపూడి నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా విభిన్న నృత్య రీతులను ప్రదర్శించి చూపరులను ఆకట్టుకున్నారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. కూచిపూడి నృత్య ప్రదర్శన విభిన్న భంగిమల్లో చిన్నారులు -
డీజిల్ కొరత చేతకానితనమే
జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణుల నిరసనలు ఏలూరు టౌన్: రాష్ట్రంలో పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయని.. డీజిల్ కృత్రిమ కొరతతో వాహనదారులు, వ్యాపారులు, ముఖ్యంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని. ఇది కూటమి ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమని వైఎస్సార్సీపీ ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ ధ్వజమెత్తారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ఏలూరులో పార్టీ నేతలు, కేడర్ ప్రజా నిరసన చేపట్టింది. సీఎస్ఐ చర్చి సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద పార్టీ నాయకులు, శ్రేణులతో కలిసి జేపీ కొద్దిసేపు నిరసన తెలిపారు. ఆటోడ్రైవర్లు, వాహనదారులు, ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. తొలుత వైఎస్సార్సీపీ ఏలూరు కార్యాలయం నుంచి ర్యాలీగా నడుచుకుంటూ పెట్రోల్ బంకు వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జయప్రకాష్ మాట్లాడుతూ.. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో డీజిల్, పెట్రోల్ కొరత దుస్థితి లేదని, ఏపీ ప్రభుత్వం చేతకానితనం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల గ్యాస్ సిలిండర్ల కొరతతో ఇబ్బందిపడ్డారని, తాజాగా డీజిల్ కొరత ఏర్పడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్బాబు, రాష్ట్ర కార్యదర్శి దాసరి రమేష్, బీసీ సెల్ అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, అధికార ప్రతినిధి మున్నుల జాన్గురునాథ్, నగర మహిళ అధ్యక్షురాలు విజయ నిర్మల, బీసీ సెల్ అధ్యక్షుడు కిలాడి దుర్గారావు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఇనపనూరి జగదీష్, వైఎస్సార్సీపీ నాయకులు ఇమ్మానియేల్ జయకర్, భాస్కర్ల బాచి, పల్లి శ్రీనివాస్, కొల్లిపాక సురేష్, సాయిప్రదీప్, రాజేష్, గంటా రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
మద్ది క్షేత్రంలో విశేష పూజలు
జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ముఖ మండపం వద్ద స్వామివారికి తమలపాకులతో అష్టోత్తర పూజలు జరిపారు. ఆలయానికి వివిధ సేవల ద్వారా రూ. 2,00,379 ఆదాయం వచ్చిందని, అన్నదాన సత్రంలో 1,925 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు ఈవో ఆర్వీ చందన తెలిపారు. ఏలూరు (ఆర్ఆర్పేట): సమగ్రశిక్ష ఏలూరు జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో ఖాళీగా ఉన్న అకడమిక్ మానిటరింగ్ అధికారి (ఉర్దూ), అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారి, అసిస్టెంట్ ప్రోగ్రామింగ్ అధికారి (ఏపీఓ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ కే పంకజ్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన స్కూల్ అసిస్టెంట్లు, సెంకడ్ గ్రేడ్ టీచర్లు తమ దరఖాస్తులను మే 4వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు కార్యాలయంలో అందజేయాలన్నారు. సమాచారం అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉందని, మరిన్ని వివరాలకు 63032 09397 నంబర్లో సంప్రదించవచ్చన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో మంగళవారం వేసవి విజ్ఞాన శిక్షణ శిబిరం ప్రారంభించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం.శేఖర్ బాబు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి అతిథులుగా వయోజన విద్య అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఆర్.విజయ్ కుమార్, ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ ఏలూరు అధ్యక్షురాలు ఈ. సరోజ, టీమ్ సభ్యులు పాల్గొని చిన్నారులకు విజ్ఞానంతో కూడిన సందేశాన్ని అందించారు. శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడానికి వాలంటీర్లు, రిసోర్స్ పర్సన్లుగా ముందుకు వచ్చిన సుజయ్ కృష్ణ (కార్టూన్లు, స్టోరీస్) ఆర్.భాస్కర్ సాయి కుమార్ (డ్రాయింగ్, ఇతరాలు), యోహాను (చదరంగం), వై కృష్ణ ఫణికాంత్ (వెస్ట్రన్ డాన్స్) సీహెచ్వీ సురేంద్ర (మైండ్ మెమరీ గేమ్స్, స్కిల్స్), జీ అశోక్ కుమార్ (స్పోకెన్ ఇంగ్లీషు), జే మూర్తి (శతక పద్యాలు, భగవద్గీత, కథలు), కొడాలి హిమబిందు (తెలుగు సాహిత్యం, పద్యాలు)లను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం చిన్నారులకు స్వీట్లు, బిస్కట్లు పంచిపెట్టారు. ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రంలో సమగ్రశిక్ష ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మే 15వ తేదీన విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి నారా లోకేష్ నివాసం వరకూ చేపట్టనున్న పాదయాత్రను జయప్రదం చేయాలని సమగ్ర శిక్ష ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ కాంతారావు, వైస్ చైర్మన్ వాసా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఈమేరకు మంగళవారం విజయవాడలోని రాష్ట్ర సమగ్ర శిక్ష కార్యాలయానికి వెళ్లి ఏఎస్పీడీని కలిసి పాదయాత్రకు సంబంధించిన నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని కేడర్లకు జీతాలు పెంచాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, ఈపీఎఫ్, ఈఎస్ఐ, ఎంటీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పాదయాత్రకు సమగ్రశిక్ష ప్రాజెక్టు ఉద్యోగి కుటుంబ సభ్యులతో సహా సన్నద్ధమౌతున్నామని స్పష్టం చేశారు. అలాగే కేజీబీవీ టీచర్లకు జరుగుతున్న లాంగ్ స్టాండింగ్ బదిలీలను న్యాయబద్ధంగా జరపాలని కోరారు. ఏలూరు (టూటౌన్): రసాయనిక పరిశ్రమల్లో విపత్తు సమయంలో నష్ట నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 30న చింతలపూడిలో ఐఓసీఎల్ పైప్లైన్ వద్ద మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కె.వెట్రిసెల్వి చెప్పారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫెరెన్స్ హాల్లో మాక్ డ్రిల్ నిర్వహణకు సంబంధించి టేబుల్ టాప్ ఎక్సరసైజ్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మాక్ డ్రిల్లో సంబంధిత అధికారులు తప్పనిసరిగా పాల్గొని, జాగ్రత్త చర్యలపై అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఫైర్ ఆఫీసర్ రత్నబాబు, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. -
మా పొగాకు కొనేవారేరి?
ఆగిరిపల్లి: మండలంలో కనసానపల్లి, నెక్కలం గొల్లగూడెం, అడవినెక్కలం గ్రామాల్లో పొగాకు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. పొగాకు కంపెనీకి చెందిన ప్రతినిధులు గ్రామాలకు వచ్చి రైతులకు క్వింటాకు రూ.16 వేలు ఇస్తామని చెప్పి, నారు కూడా ఇవ్వడంతో ఈ నాలుగు గ్రామాల్లో సుమారు 400 ఎకరాల్లో వైట్ బర్లి పొగాకును రైతులు అప్పులు చేసి మరీ సాగు చేశారు. ఎకరానికి రూ.1.50 లక్షల రూపాయలు ఖర్చు అయ్యింది. అయితే కొనుగోలుకు సంబంధించి బాండ్లు కూడా ఇస్తామని చెప్పి రైతులతో సంతకాలు చేయించుకున్నారు. తర్వాత బాండ్లు ఊసే ఎత్తలేదు. తీరా పంట చేతికి వచ్చాక కంపెనీ ప్రతినిధులు ప్లేట్ ఫిరాయించి పొంతన లేని మాటలు చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొగాకు నాణ్యత బాగా లేదని, కంపెనీలో సరిపడా నిలువలు ఉన్నాయని కంపెనీ ప్రతినిధులు కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతులు దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కంపెనీలు ఎప్పుడు కొంటాయో? తెలియక రైతులు పొలాల్లో, ఖాళీ స్థలాల్లో మండేలు వేసి కాపలా కాస్తున్నారు. కొంతమంది రైతులు కోత కోయడానికి కూడా డబ్బులు లేకపోవడంతో ఉసురుమంటూ పొలాల్లోనే వదిలేస్తున్నారు. ఇప్పటికై నా కంపెనీలు కొనుగోలు ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.దయనీయంగా నాలుగు గ్రామాల రైతుల పరిస్థితి -
కామినేని.. అట్టుకు అట్టున్నర వడ్డిస్తాం
కైకలూరు: ‘అవినీతి, అక్రమ కేసులు, మట్టి మాపీయా, పిల్లల విక్రయాలు, గంజాయి అమ్మకాలు, చేపల దొంగతనాలు, పేకాట, పొట్టెళ్ల పందాలు, ఇటువంటి వాటిని అడ్డుకోలేని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ రౌడీ మూకలను పెంచి పోషిస్తున్నారని, అధికారంలోకి రాగానే అట్టుకు అట్టున్నర వడ్డిస్తాం’ అని వైఎస్సా ర్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) హెచ్చరించారు. కై కలూరు పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ సీపీ మద్దతుతో పాలన సాగించిన మాజీ సర్పంచులకు మంగళవారం సన్మానం చేశారు. కూటమి నుంచి కై కలూరు మాజీ సర్పంచ్ దానం మేరీ నవరత్నకుమారి తిరిగి వైఎస్సార్సీపీలో చేరారు. ఆమెకు డీఎన్నార్ కండవా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా డీఎన్నార్ మాట్లాడుతూ కూటమి పాలనలో తన కుటుంబానికి చెందిన 100 ఎకరాల చేపల చెరువులో రౌడీ మూకలతో మూడు రోజుల పాటు రూ.48 లక్షల విలువైన చేపలను పట్టివేశారన్నారు. ఇందులో ఎమ్మెల్యే ప్రమేయం లేదని ఆయన గ్రామంలో లక్ష్మీనరసింహస్వామి వద్ద ప్రమాణం చేస్తే తన కుటుంబం రాజకీయాల నుంచి తప్పుకుంటామని సవాల్ విసిరారు. ఈ పరిస్థితుల్లోనే చేపల దొంగ అనే పదం వాడనని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా ఉండగా కై కలూరు సీహెచ్సీని 50 పడకల ఆస్పత్రిగా మార్పు, డయాలసిస్ సెంటర్, సున్నంపూడి నుంచి గొల్లగూడెం పైపులైన్, గుడ్లవల్లేరు వద్ద స్లూయిజ్ తొలగింపు, పెద్దింట్లమ్మ వారధి, అనివేటిమండపం, వెంకటాపురంలో పాలిటెక్నిక్ కాలేజీ, 100 ఎకరాల్లో గ్రీన్ విలేజ్, వైవాకలో 317 మంది దళితులకు పట్టాలు, సంతమార్కెట్ క్లాంప్లెక్సు, పెనుమాకలంక రోడ్డుకు శంకుస్థాపన ఇలా అనేకం చేశామన్నారు. ఎవరికో పుట్టిన బిడ్డకు పేరు పెట్టుకున్నట్లు గ్రీన్ విలేజ్, పాలిటెక్నిక్ కాలేజీలకు పేరు మారుస్తున్నారన్నారు. గోపవరంలో 220/33 విద్యుత్ సబ్స్టేషన్ తానే తీసుకొచ్చానని చెప్పారు. కూటమి నాయకులకు వంత పాడుతున్న కై కలూరులో ఇద్దరు పోలీసు అధికారులు ఇక్కడ నుంచి వెళ్లినా వైఎస్సార్ సీపీ పాలన రాగానే వారితోనే ఇక్కడే డ్యూటీలు చేయిస్తామన్నారు. ఎమ్మెల్యే కామినేని హావభావాలను అనుకరిస్తూ డీఎన్నార్ మాట్లాడిన తీరు ఆకట్టుకుంది. ముదినేపల్లి మండలం శ్రీహరిపురంలో బాబు మిస్సింగ్ కేసు 100 రోజుల దాటినా కనిపెట్టలేదన్నారు. బంధువులు రోడ్డుపై ధర్నా చేసిన తిరిగి వారిపైనే కేసులు కడతామని పోలీసులు బెదిరిస్తున్నారన్నారు. పసిపిల్లల విక్రయాలు కేసులో మరింత దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏలూరు పార్లమెంటు కార్యదర్శి నూకపెయ్యి సుధీర్బాబు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ముదిరాజుల విభాగ అధ్యక్షుడు కోమటి విష్ణువర్థనరావు, రాష్ట్ర మహిళా విభాగ సెక్రటరీ గంటా సంధ్య, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చేబోయిన వీరరాజు, ఎంపీపీలు రామిశెట్టి సత్యనారాయణ, చందన ఉమామహేశ్వరరావు, పెద్దిరెడ్డి శ్రీరామదుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ హెచ్చరిక -
జీజీహెచ్లో మరణ మృదంగం
● వైద్యుల నిర్లక్ష్య వైఖరితో రోగుల మరణాలు? ● మృతదేహాలకు పోస్టుమార్టం చేయని వైనం ఏలూరు టౌన్: ఏలూరు సర్వజన ఆసుపత్రికి రోగమొచ్చింది. ప్రజలకు వైద్యసేవలు అందించడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిరోజూ వందలాదిమంది రోగులు అనార్యోగంతో ఏలూరు జీజీహెచ్కు వస్తూ ఉంటారు. కానీ రోగులకు మెరుగైన వైద్యం అందించటంలో ఘోర వైఫల్యం కనిపిస్తోంది. జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు హెచ్చరించినా డోంట్ కేర్ అనే ధోరణితో హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది పని చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నారు. ఇటీవల వైద్యులు, సిబ్బంది ఉదాసీన వైఖరితో ఒక 14 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోగా... ఒక వృద్ధురాలు సైతం సకాలంలో అంబులెన్స్ అందుబాటులో లేకపోవటంతో మృతి చెందింది. ఇక ఎంసీహెచ్ విభాగంలో వారంలో రెండు, మూడు సంఘటనలు చోటు చేసుకోవడంతో గర్భిణులను భయబ్రాంతులకు గురి అవుతున్నారు. కుట్లు విడిపోవటం, ఇన్ఫెక్షన్లు రావటం, ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడం వంటి పరిస్థితులు హాస్పిటల్ వైద్యులపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. అత్యవసర విభాగానికి రాత్రివేళల్లో ప్రాణాపాయ స్థితిలో తీసుకెళ్తే వైద్యం అందుతుందనే గ్యారెంటీ లేదంటున్నారు. సిఫార్సులు లేకుంటే రోగి చేతిని కూడా ముట్టుకునే పరిస్థితి ఏలూరు జీజీహెచ్లో లేదని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఏలూరు జీజీహెచ్లో కోకొల్లలుగా జరుగుతున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. బాలిక మృతితో ఆందోళన మూడు రోజుల క్రితం పెదపాడు మండలం తాళ్లమూడికి చెందిన 14 ఏళ్ల బాలిక అనారోగ్యంతో ఏలూరు సర్వజన ఆసుపత్రిలో చేరింది. తొలుత హనుమాన్ జంక్షన్లోని ఆస్పత్రికి తీసుకువెళ్లగా... ఏలూరు జీజీహెచ్లో మంచి వైద్యం దొరుకుతుందనే ఆశతో తల్లితండ్రి బాలికను తీసుకువచ్చారు. కానీ వైద్యుల నిర్లక్ష్యం బాలిక ప్రాణాలు తీసింది. బాలిక నోరు, ముక్కు నుంచి నురగలు కక్కుతూ మృతి చెందడంతో తల్లిదండ్రులు రోధించారు. తమ కుమార్తెను సరైన వైద్యం అందించలేదనీ, వైద్యుల నిర్లక్ష్యమే బాలిక ప్రాణాలు బలితీసుకుందంటూ హాస్పిటల్లోనే ఆందోళనకు దిగారు. పోస్టుమార్టం చేయరా? ఏలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ బోధనాసుపత్రి (సర్వజన ఆసుపత్రి)లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలు పాటించే పరిస్థితి కానరావడం లేదు. ఒక బాలిక వైద్యం పొందుతూ ఆకస్మికంగా మృతి చెందినా బాలిక మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండానే పంపివేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎవరి ఒత్తిడితో, సిఫార్సుతో పోస్టుమార్టం చేయలేదో ? తెలియాల్సి ఉంది. -
గేట్లో ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ప్రతిభ
నూజివీడు: గేట్లో ఉత్తమ ర్యాంకులు సాధించి ట్రిపుల్ఐటీల ప్రతిష్టను మరింత పెంచారని రిజిస్ట్రార్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ అన్నారు. నూజివీడు ట్రిపుల్ఐటీలో గేట్–2026లో ప్రతిభ కనబర్చిన నేపధ్యంలో మంగళవారం గేట్–2026 సక్సెస్ మీట్ను నిర్వహించారు. గేట్ పరీక్షలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులతో పాటు అర్హత సాధించిన ఇతర విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా జాతీయస్థాయిలో 100 లోపు ర్యాంకులు సాధించిన హర్షిత్ రెడ్డి (26వ ర్యాంక్), ఆర్. సురేష్ (37వ ర్యాంక్), మనోజ్ కుమార్ (43వ ర్యాంక్), తిలక్ (54వ ర్యాంక్), నాగరాజు (66వ ర్యాంక్), అజయ్ కుమార్ (69వ ర్యాంక్), హర్షిత్ రెడ్డి (70వ ర్యాంక్), శ్రీనివాస్ (95వ ర్యాంక్)లను వారి తల్లిదండ్రుల సమక్షంలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో నూజివీడు డైరెక్టర్ ఆచార్య ఎస్ఎస్ఎస్వీ గోపాలరాజు, ఏస్ ఇంజినీరింగ్ అకాడమీ రీజినల్ మేనేజర్ దోసపాటి హర్షవర్ధన్, సెంట్రల్ అకడమిక్ డీన్ దువ్వూరి శ్రావణి, సెంట్రల్ ఫైనాన్స్ ఆఫీసర్ నాగార్జునదేవి, పరిపాలనాధికారి బి.లక్ష్మణరావు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి
జంగారెడ్డిగూడెం: ఆయిల్ పామ్ లోడ్ లారీ మోటార్సైకిల్ను ఢీకొన్న ఘటనలో ఒక బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మండలంలోని పుట్లగట్లగూడెంలో జంగారెడ్డిగూడెం–ఏలూరు రాష్ట్ర రహదారిపై జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కామవరపుకోట మండలం ఆడమిల్లి గ్రామానికి చెందిన చల్ల మౌళి (17) మండలంలోని గుర్వాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామి క్షేత్రానికి వచ్చి స్వామిని దర్శించుకుని, తన మోటార్సైకిల్పై తిరిగి ఇంటికి వెళుతున్నాడు. పుట్లగట్లగూడెం వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న ఆయిల్ పామ్ లోడ్ లారీ మౌళి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో మౌళి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న లక్కవరం ఎస్సై షేక్ జబీర్ సిబ్బందితో కలిసి ఘటనానికి స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్ను క్లియర్ చేసి మౌళి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్సై తెలిపారు. అయితే మృతుడు చల్ల మౌళి (17)కి తండ్రి లేకపోవడంతో నాయనమ్మ భగవతి వద్ద పెరిగినట్లు బంధువులు తెలిపారు. మౌళి కూలి పనులు చేసుకుంటూ నాయనమ్మకు ఆసరాగా ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. మౌళి మృతితో వృద్ధురాలు భగవతికి ఆధారం లేకుండా పోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో ఇటీవల ఏర్పడిన డీజిల్ కొరత పరిస్థితి క్రమంగా తగ్గుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి తెలిపారు. రోజురోజుకూ డీజిల్ సరఫరా పెరుగుతుండగా, వినియోగదారులు అవసరం మేరకే కొనుగోలు చేయడం వల్ల పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుందని ఆయన వెల్లడించారు. మంగళవారం రాత్రి భీమవరం పట్టణంలోని ఉమామహేశ్వర ఆగ్రో సర్వీసెస్ పెట్రోల్ బంక్, పుష్ప పెట్రోల్ బంక్, ఉండి ఎన్ఆర్పీ అగ్రహారంలోని పౌర సరఫరాల శాఖ పెట్రోల్ బంక్, గణపవరంలోని పెట్రోల్ బంకులను రాహుల్కుమార్రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలు, రైతులతో మాట్లాడి క్షేత్రస్థాయిలో డీజిల్ అవసరాల గురించి అడిగి తెలుసుకున్నారు. -
న్యాయం జరిగే వరకు పోరాటం
ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రంలో నిరంకుశ రాజ్యం నడుస్తోందని, టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని వైఎస్సా ర్సీపీ లీగల్ సెల్ ఏలూరు నగర అధ్యక్షుడు ప్రత్తిపాటి తంబి ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది జూన్ నెలలో సాక్షి దినపత్రిక కార్యాలయంపై టీడీపీ అరాచక శక్తులు దాడులు చేసి ఫర్నిచర్ను ధ్వసం చేసిన సంఘటనలో పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసులు కట్టకుండా కాలయాపన చేశారని మండిపడ్డారు. దీనిపై వైసీపీ లీగల్ సెల్ పక్షాన ఏలూరు మొబైల్ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ నమోదు చేయగా గౌరవ న్యాయస్థానం ఈ సంఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించిందని పేర్కొన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు హత్యా రాజకీయాలు చేస్తూ సామాన్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, వీటన్నింటినీ ప్రజల వద్దకు తీసుకువెళుతున్న సాక్షి దినపత్రిక గొంతు నొక్కాలని పత్రికా కార్యాలయాలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని, న్యాయం జరిగే వరకూ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. -
శేష్మహల్ రోడ్డులో ఏం జరుగుతోంది?
తాడేపల్లిగూడెం: స్కామ్లు, స్కీమ్లు.. హవాలా.. దివాలా...ఆత్మహత్యలు, టోకరాలకు పట్టణంలో శేష్మహల్ రోడ్డు కేరాఫ్గా మారిందా..? అనే సందేహాలు ప్రజల్లో వస్తున్నాయి. ఒక్కప్పుడు సినిమా థియేటర్లకు కేరాఫ్ అడ్రస్గా ఉండే ఈ ప్రాంతం ఎనిమిది నెలలుగా తరచూ వార్తల్లోకి వస్తుంది. ఓ పక్క జీఎస్టీ అధికారుల దాడులు, మరో వైపు చోరీ సొత్తు రికవరీ పేరిట కోనసీమ జిల్లా కొత్తపేట పోలీసులు సోదాలతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇటీవలకాలంలో కొత్తపేట పోలీసు స్టేషన్లో కొన్ని చోరీలు జరిగాయి. నిందితులు నలుగురిని విచారించగా, చోరీ సొత్తులో 21 గ్రాముల బంగారాన్ని శేష్మహల్ రోడ్డులోని ఒక బంగారు దుకాణంలో విక్రయించినట్టుగా చెప్పారు. కొత్తపేట సబ్ఇన్స్పెక్టర్ నిందితులు నలుగురిని సంకెళ్లతో ఓ వాహనంలో తీసుకొచ్చారు. దుకాణం చూపించాక హైడ్రామా సాగింది. చివరికి ఆరోపణ ఎదుర్కొన్న వ్యక్తి చోరీ సొత్తు కొనలేదని చెప్పడంతో, తదుపరి విచారణ కోసం పోలీసులు సదరు వ్యాపారిని కొత్తపేట తీసుకెళ్లారు. చోరీ బంగారు బరువు కాస్తా నిందితులు మాట మార్చడంతో ఎనిమిది గ్రాములకు తగ్గింది. తాడేపల్లిగూడెంలో విక్రయించింది ఎనిమిది గ్రాములే అని చెప్పారు. ఆ బంగారం కోసం తాను కొనలేదని దుకాణ యజమాని చెప్పడంతో పూచీకత్తు మీద పెద్ద మనుషుల సమక్షంలో అతడిని వదిలేశారు. జీఎస్టీ అధికారుల దాడులు ఈ ప్రాంతంలో బంగారు దుకాణాలు ఎక్కువగా ఉంటాయి. అయితే నెల రోజుల ముందు ఒక దుకాణంలో మూడు రోజుల పాటు జీఎస్టీ దాడులు జరిగాయి. ఆ సమయంలో కూడా ఈ ప్రాంతం గురించి చర్చ సాగింది. ఎఫ్ఎంబీ ప్రకారం వంద అడుగుల రోడ్డు ఉండాల్సిన ఈ ప్రాంతంలో నాయకులను ప్రసన్నం చేసుకుని రోడ్డును దర్జాగా ఆక్రమించి, షాపులు కట్టేశారు. గతంలో కూడా ఇదే ప్రాంతంలో ఒక వ్యాపారి వ్యాపారంలో దెబ్బతిని రాజమండ్రి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కూటమి నాయకుడొకరు విషయం సెటిల్మెంటు పేరిట కేజీలకు కేజీలు వెండి నొక్కేశాడని సమాచారం. ఇదే ప్రాంతానికి ఒకరు ఇటీవల బంగారం సరఫరా చేస్తే, వ్యాపారులను మోసం చేయబోయి దొరికిపోయారు. వీటన్నింటికి శేష్మహల్ రోడ్డు కేరాఫ్గా మారడం చర్చనీయాంశంగా మారింది. కాబట్టి వినియోగదారులు బంగారం కొనుగోలు చేసే విషయంలో దుకాణదారుల ట్రాక్ను పరిగణనలోకి జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తాజాగా చోరీ సొత్తు కోసం పోలీసుల తనిఖీలు -
స్టీమింగ్ రైస్ ప్రక్రియను ప్రోత్సహించాలి
పెనుమంట్ర: రైతులకు, మిల్లర్లకు ఆమోదయోగ్యంగా ఉండే రైస్ స్టీమింగ్ చేసే ప్రక్రియను రైతుల అవగాహన కల్పించి ప్రోత్సహించాలని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకుడు డాక్టర్ సీహెచ్ శ్రీనివాసరావు శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులకు సూచించారు. మార్టేరు వ్యవసాయ పరిశోధన స్థానంలో మంగళవారం గోదావరి మండల పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. గోదావరి మండల వరి రైతులు ఉత్పత్తి చేస్తున్న ధాన్యాలు మిల్లింగ్ చేస్తున్న సమయంలో నూక శాతం పెరిగి ఆ బియ్యనికి మార్కెట్ విలువ తగ్గిపోవడం గోదావరి మండల రైతులకు ప్రధాన సమస్యగా ఉందన్నారు. రైస్ను స్టీమింగ్ చేసి మిల్లింగ్ చేయడం వల్ల ధాన్యం పై పోరలో ఉండే పోషకాలు బియ్యంలో చేరి పోషక విలువలు పెరుగుతాయన్నారు. కార్యక్రమంలో అనకాపల్లి ప్రాంతీయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పీవీకే జగన్నాథరావు వరి, చెరకు పంటలు విలువ ఆధారిత ఉత్పత్తులపై అవగాహన కల్పించారు. అనంతరం గోదావరి మండల సహ పరిశోధన సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ శాస్త్రవేత్తలు వ్యవసాయ అధికారులు అభ్యుదయ రైతులను బృందాలుగా ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యల గురించి 2026–27 సంవత్సరానికి సంబంధించి పరిశోధన, విస్తరణ ప్రణాళికలను రూపొందించారు. -
ధాన్యం బస్తాల లారీ కాలువలో బోల్తా
దెందులూరు: మండలంలోని కొవ్వలి గ్రామంలో ధాన్యం బస్తాలతో వస్తున్న లారీ కాలువలో బోల్తా పడిన సంఘటన మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. 650 బస్తాలతో లోడుతో ఉన్న లారీ కాలువలో బోల్తా పడింది. కొవ్వలి గ్రామానికి చెందిన గరికపూడి సత్యనారాయణ కౌలు రైతు దాళ్వాసాగు చేసి పండిన ధాన్యాన్ని మిల్లుకు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పొలంలోకి నేరుగా లారీ వెళ్లి అక్కడే బస్తాలును లోడ్ చేసుకుని మిల్లుకు తరలించేందుకు వస్తుండగా చేపల ఫారం సమీపంలో వచ్చేసరికి లారీ అదుపుతప్పి కాలువలో బోల్తా పడింది. దీనివల్ల ధాన్యం మొత్తం తడిచి పనికి రాకుండా పోయింది. లారీ తో సహా దాన్యపు బస్తాలు నీటిలో మునిగిపోవడంతో రూ.8 లక్షలు నష్టం జరిగిందని కౌలు రైతు సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశాడు. టి.నరసాపురం: ఆయిల్ పామ్ తోటలో వ్యక్తి మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎం.జయబాబు మంగళవారం విలేకరులకు తెలిపారు. వివరాల ప్రకారం ఈ నెల 25న జంగారెడ్డిగూడెం మండలం టెక్కినవారిగూడెం గ్రామానికి చెందిన పసుపులేటి రామచంద్రరావు (40) గుడికి వెళుతున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి బయటకు వచ్చాడన్నారు. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు రామచంద్రరావు కోసం వెతుకున్నారన్నారు. ఈ క్రమంలో ఈ నెల 27న సాయంత్రం మండలంలోని తిరుపతిపాడు గ్రామ శివారులో ఓ రైతుకు చెందిన ఆయిల్ పామ్ తోటలో రామచంద్రరావు మృతిచెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. కుటుంసభ్యులకు సమాచారం అందడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రామచంద్రరావు మద్యానికి బానిసై బయట వ్యక్తులకు ఇచ్చిన అప్పులు తిరిగి రాకపోవడం, షుగర్ వ్యాధి వచ్చి ఆరోగ్యం క్షీణించడంతో మానసికంగా బాధపడుతున్నాడన్నారు. రామచంద్రరావు మృతిపై మృతుని అన్న నాగ పుల్లారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నరసాపురం రూరల్: మండలంలోని కాళీపట్నం తూర్పు గ్రామంలో నిద్రస్తున్న సమయంలో పాము కాటుకు గురై గ్రామానికి చెందిన బాలం కొండబాబు (45) అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనకు సంబందించి వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం సాయంత్రం కొండబాబు తన ఇంటిలో నిద్రిస్తుండగా పాము కాటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు గమనించి నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్య సేవలు పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుని సోదరుడు బాలం రాజేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై కె.నాగేశ్వరరావు తెలిపారు. దెందులూరు: మసీదుపాడు గ్రామానికి చెందిన పైడి తరుణ్ను ఈనెల 26న సానిగూడెం అడ్డరోడ్డు వద్ద కత్తితో నరికి గాయపర్చిన గాలాయగూడెం గ్రామానికి చెందిన కూచిపూడి హర్షవర్ధన్ను అరెస్ట్ చేశామని దెందులూరు ఇన్చార్జ్ ఎస్సై ఆర్.శ్రీను మంగళవారం విలేకరులకు తెలిపారు. గాయపడ్డ బాధితుడు తరుణ్ చెల్లెలు వివాహాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం, ఇతర విషయాలపై ఇద్దరికి ఘర్షణ జరిగిన నేపథ్యంలో దాడి చేశాడని స్పష్టం చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా నిందితుడిని అరెస్ట్ చేశామని వివరించారు. -
శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ
ద్వారకాతిరుమల: చిన్నతిరుపతిలో జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి పెద్ద తిరుపతి దేవస్థానం అధికారులు సోమవారం పట్టు వస్త్రాలను సమర్పించారు. టీటీడీ ఏఈఓ కె.మోహన్ రాజు, సిబ్బంది ముందుగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పట్టు వస్త్రాలతో ఆలయంలో ప్రదక్షిణలు చేశారు. అనంతరం శ్రీవారు, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఆ తరువాత ఆలయ ముఖ మండపంలో అర్చకులు, పండితులు వారికి వేద ఆశీర్వచనాన్ని, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా పట్టు వస్త్రాలను స్థానిక దేవస్థానం ఏఈఓ మెట్టపల్లి దుర్గారావు, సూపరింటెండెంట్ ఐవీ రామారావులకు అందించారు. పెనుమంట్ర: వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (గుంటూరు) పరిశోధన సంచాలకులు డాక్టర్ సీహెచ్ శ్రీనివాసరావు అన్నారు. మార్టేరు వ్యవసాయ పరిశోధన స్థానంలో రెండు రోజులపాటు జరిగే గోదావరి జిల్లాల మండల పరిశోధన, విస్తరణమండలి సమావేశాలను సోమవారం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ నానో ఎరువులు, డ్రోన్ టెక్నాలజీ, సేంద్రియ వ్యవసాయం, పోషక విలువలు కలిగిన రకాల అభివృద్ధి, ఎండాకు తెగులు యాజమాన్యం వంటి అంశాలపై పరిశోధనలను విస్తృతం చేయాల్సిన బాధ్యత శాస్త్రవేత్తలపై ఉందన్నారు. డాక్టర్ జి శివన్నారాయణ, డాక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
మస్తర్ ఒకచోట.. పని మరో చోట
కుక్కునూరు: ఉపాధి హామీ పథకంలో వర్క్ ఆర్డర్ ఇచ్చిన చోట మస్తర్ వేయించుకొని.. పని మరో ప్రదేశంలో చేయించడం స్థానికంగా విమర్శలకు దారి తీసింది. మండలంలోని దాచారం పంచాయతీ, నెమలిపేట గ్రామ సమీపంలో ఎన్ఆర్ఈజీఎస్లో భాగంగా చెరువు పూడికతీత పనిని స్థానిక రైతు వర్సా నాగేశ్వరరావు పేరుమీద వర్క్ ఆర్డర్ను మంజూరు చేశారు. గత రెండు వారాలుగా చెరువు పూడికతీత పనులు నిర్వహిస్తున్నారు. కాని రెండు రోజులుగా చెరువు వద్ద మస్తర్ తీసుకొని పనులు మాత్రం ఆర్అండ్ఆర్ కాలనీలో చేయిస్తున్నారు. అదేంటని అడిగితే ఆర్అండ్ఆర్ కాలనీలో పట్టాల పంపిణీ కార్యక్రమం ఉందని చెట్ల పొదలను తీయించమని ఐటీడీఏ పీఓ ద్వారా వచ్చిన ఆర్డర్ మేరకు కాలనీలో పనిచేస్తున్నట్టు సిబ్బంది తెలిపారు. ఈ విషయమై స్థానిక రైతు, ఉపాధి హామీ కూలీ వర్షా నాగేశ్వరరావు మాట్లాడుతూ, చెరువు పూడిక తీత పనుల్లో మట్టిని పొలాల్లోకి తోలుకుంటామంటే కేసు పెడతామని ఏపీవో హెచ్చరించారని అలాంటిది నిబంధనలకు విరుద్ధంగా ఒకచోట మస్తర్ తీసుకొని మరోచోట పని చేయించడం ఏంటని ప్రశ్నించారు. నిబంధనలు కేవలం సామాన్యులకు మాత్రమేనా అధికారులకు ఉండవా.. వారు పాటించరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా రైతులకు ఉపయోగపడే పనులు మాత్రమే చేయించాలని డిమాండ్ చేశారు. -
అంగరంగ వైభవం.. ధ్వజారోహణం
ద్వారకాతిరుమల: సహస్ర నామాలతో భక్తజన నీరాజనాలు అందుకునే చినవెంకన్న బ్రహ్మోత్సవాలకు చరాచర సృష్టిని ఆహ్వానిస్తూ.. సోమవారం రాత్రి నిర్వహించిన ధ్వజారోహణ వేడుక భక్తజన కోటికి కనుల పండువయ్యింది. వైఖానస ఆగమయుక్తంగా ఇంద్రాది అష్టదిక్పాలకులను, భేరీ దేవతలను, గంధర్వ, కిన్నెర, కింపురుషాది దేవగణాలను, సప్త అధోలోక జీవులను స్వాగతిస్తూ లాంఛనంగా వేద మంత్రోచ్ఛరణలతో శ్రీవారి ఆలయ ప్రాకారంలోని ధ్వజస్తంభంపై గరుడపటాన్ని అర్చకులు ఎగురవేశారు. ఉదయం ఆలయంలో ఉత్సవ నిత్యహోమ గ్రామ బలిహరణలు, వేద స్వస్తి, సాయంత్రం రుత్విగ్వరణ, మృద్గ్రహణ, అంకురార్పణ, ధ్వజారోహణ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. రాత్రి హంస వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ ముఖ మండపంలో స్వామివారి సత్యా కృష్ణుని అలంకారం ఆకట్టుకుంది. శ్రీహరి కళాతోరణ వేదికపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను అలరించాయి. సాయంత్రం ఆలయంలో అంకురార్పణ వేడుక అట్టహాసంగా జరిగింది. బ్రహ్మోత్సవాలకు సర్వదేవతలను ఆహ్వానించే దిశగా గరుడపటాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేసి ధ్వజారోహణను వైభవంగా నిర్వహించారు. అర్చకులు పంపిణీ చేసిన గరుడ ప్రసాదాన్ని సంతానం లేని మహిళలు స్వీకరించారు. ఈ ప్రసాదం తింటే పిల్లలు పుడతారన్నది భక్తుల నమ్మకం. బ్రహ్మోత్సవాల్లో నేడు ● ఉదయం 7 గంటల నుంచి.. సూర్యప్రభ వాహనంపై గ్రామోత్సవం. ● రాత్రి 7 గంటల నుంచి చంద్రప్రభ వాహనంపై శ్రీవారి తిరువీధి సేవ ● శ్రీవారి ప్రత్యేక అలంకారం : అహల్య శాపం విమోచనం -
విద్యుత్ వైర్లు తగిలి ఎండు గడ్డి దగ్ధం
భీమడోలు: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ ట్రాక్టర్లోని ఎండు గడ్డి పూర్తిగా దగ్ధమైంది. వివరాలు ఇలా ఉన్నాయి. అంబర్పేట గ్రామం నుంచి దెందులూరు మండలం రామారావుగూడెం వైపుగా రెండున్నర ఎకరాల గడ్డితో వెళ్తున్న ట్రాక్టర్ భీమడోలు శ్రీవేంకటేశ్వర కళాశాల రోడ్డుకు వచ్చేసరికి కిందకు ఉన్న విద్యుత్ వైర్లను తాకడంతో ఒక్కసారి మంటలు రేగి ట్రాక్టర్లోని గడ్డి పూర్తిగా కాలి బూడిదైంది. ట్రాక్టర్ పాక్షికంగా దెబ్బతింది. సుమారు రూ.25వేల ఆస్తి నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న భీమడోలు అగ్నిమాపక అధికారి వి.రవికుమార్ ఆధ్వర్యంలో ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ఏలూరు టౌన్: వ్యవసాయ క్షేత్రాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలోని రాగివైరును చోరీ చేస్తున్న ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జంగారెడ్డిగూడెం ఏఎస్పీ ఆర్.సుస్మిత వివరాలు వెల్లడించారు. చింతలపూడి గ్రామశివారు ఎన్వీఎన్ కాలనీ సమీపంలోని బొల్లినేని డుండి అనే వ్యక్తి పొలంలో ఈనెల 17వ తేదీ రాత్రి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పగులగొట్టి కాపర్వైరు దొంగతనం చేశారు. దీనిపై 18న చింతలపూడి విద్యుత్ శాఖ ఏఈ పజ్జూరి కోటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చింతలపూడి సీఐ టీ.క్రాంతికుమార్ ఆధ్వర్యంలో ఎస్సై కే.సతీష్ కుమార్ కేసు నమోదు చేశారు. ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలతో ఏఎస్పీ సుస్మిత పర్యవేక్షణలో రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. వారి నుంచి 160 కిలోల రాగి వైరును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు చింతలపూడి ఎన్వీఎన్ కాలనీకి చెందిన చుండ్రు అనిల్కుమార్ అలియాస్ సన్నీ, యామర్ల వీరాంజనేయులు అలియాస్ వీరబాబు, బట్టువారిగూడెం కాలనీకి చెందిన అందుగుల వెంకటేశ్వరరావు, లింగపాలెంలో నివాసం ఉంటున్న ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ పా షాతో పాటు మైనర్ బాలుడ్ని పోలీసులు అరెస్ట్ చేసి చింతలపూడి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. కై కలూరు: మద్యం మత్తులో ఏటీఎం పగులగొట్టి దొంగతనానికి యత్నించిన వ్యక్తిని కై కలూరు టౌన్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. టౌన్ సీఐ ఏవీఎస్.రామకృష్ణ, ఎస్సై డి.వెంకట్కుమార్ పోలీసు స్టేషన్లో కేసు వివరాలు వెల్లడించారు. కై కలూరు మండలం భుబలపట్నంలో వెల్పూరి నాగరాజు రొయ్యల చెరువుపై పనిచేయడానికి అల్లూరి సీతారామరాజు జిల్లా, పెదబయలు మండలం, గుల్లేలా పంచాయతీకి చెందిన వందలం నాగరాజు దాదాపు 3 నెలల క్రితం పనిలో చేరాడు. పని విషయంలో యజమాని తిట్టడంతో ఇంటికి వెళ్లిపోతానని చెప్పారు. ఈ నేపధ్యంలో యజమాని ఈనెల 24న కై కలూరు రైల్వేస్టేషన్లో వందలం నాగరాజును దించాడు. అతడు తెల్లవారుజామున 3 గంటలకు మద్యం మత్తులో కేడీసీసీ ఏటీఎంలో డబ్బులు కోసం వచ్చాడు. ఏటీఎం కార్డు బదులు ఆధార్ కార్డును మిషన్ శ్లాట్లో పెట్టాడు. అది రాలేదు. దీంతో అప్పటికే పగిలి ఉన్న కీబోర్డును గట్టిగా కొట్టడంతో ఊడి వచ్చింది. దీంతో చేతిని గట్టిగా లోపలకి దూర్చి కార్డు కోసం ప్రయత్నించాడు. అదే సమయంలో డబ్బులు ఉంటే తీసుకోడానికి సిద్ధమయ్యాడు. చివరకు అతని వల్ల కాక పారిపోయాడు. దీనిపై బ్యాంకు మేనేజర్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. -
కొంతేరులో నాటికల పోటీలు
యలమంచిలి: కొంతేరు గ్రామంలోని యూత్ క్లబ్ నాటక పరిషత్ ఆధ్వర్యంలో మే 1, 2, 3 తేదీల్లో 44వ అఖిల భారత స్థాయి నాటికల పోటీలు నిర్వహిస్తున్నట్లు యూత్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు అంబటి మురళీకృష్ణ, గంటా ముత్యాలరావు (నాయుడు) తెలిపారు. నాటిక పోటీల సావనీర్ సోమవారం యూత్ క్లబ్ నాటక పరిషత్ పాలకవర్గ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూత్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ పులపర్తి వీరాస్వామి యూత్ క్లబ్ కళామందిరం వేదికపై జరిగే ఈ పోటీల్లో మొదటి రోజు ప్రముఖ టీవీ, సినీ నటుడు నిర్మాత ఖండవల్లి అనిల్ ఆర్కాను సన్మానిస్తామన్నారు. మొదటి రోజు మొదటి ప్రదర్శనగా కాకినాడ బీవీకే క్రియేషన్స్ వారిచే తితిక్ష, రెండవ ప్రదర్శనగా గుంటూరు శ్రీ కరణం సురేష్ మెమోరియల్ థియేటర్ వారిచే తరమెల్లిపోతున్నదో నాటికలు ప్రదర్శిస్తారు. రెండవ రోజు మొదటి నాటికగా హైదరాబాద్ గోవాడ క్రియేషన్స్ వారిచే అమ్మ చెక్కిన బొమ్మ రెండవ ప్రదర్శనగా విజయవాడ హర్ష క్రియేషన్స్ వారిచే భువికోరని భ్రమణం, మూడవ ప్రదర్శనగా యడ్లపాడు మానవత వారిచే అందరూ మంచివారే..కానీ నాటికలు ఉంటాయి. మూడవ రోజు మొదటి ప్రదర్శనగా గుంటూరు అభినయ ఆర్ట్స్ వారిచే ఇది అతని సంతకం, రెండవ ప్రదర్శనగా విశాఖపట్నం చైతన్య కళా స్రవంతి వారిచే అగ్ని సాక్షి నాటికలు ప్రదర్శిస్తారు. ఏలూరు టౌన్: పోలీస్ సిబ్బంది సంక్షేమమే ప్రధాన లక్ష్యమని ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ అన్నారు. చాట్రాయి పోలీస్స్టేషన్లో ఏఎస్సైగా విధులు నిర్వర్తిస్తూ అనారోగ్యంతో మరణించిన వీ.మాధవరెడ్డి సతీమణి సుజాతకు సోమవారం ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ శివకిషోర్ చేతులమీదుగా ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఫ్లాగ్ ఫండ్ రూ.25 వేలు, విడో ఫండ్ రూ.50 వేల చెక్కును ఎస్పీ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాధవరెడ్డి సేవలు ఎనలేనివనీ, ఆయన మరణం పోలీస్ శాఖకు తీరని లోటన్నారు. కుటుంబ సభ్యుల్లో అర్హులైన ఒకరికి కారుణ్య నియామకం చేపట్టేందుకు సిఫార్సు చేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. కార్యక్రమంలో పోలీస్ ప్రధాన కార్యాలయ బీ సెక్షన్ సూపరింటెండెంట్ పీ.నాగేశ్వరరావు, కార్యాలయ సిబ్బంది ఉన్నారు. -
వ్యక్తిపై కత్తితో దాడి
దెందులూరు: ఓ వ్యక్తిపై కత్తితో దాడి జరిగిన ఘటన సానిగూడెం అడ్డరోడ్డు వద్ద ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. దెందులూరు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మసీదుపాడు గ్రామానికి చెందిన పైడి తరుణ్ చెల్లి, గాలాయగూడెం గ్రామానికి చెందిన కూచిపూడి హర్షవర్థన్ గతంలో ప్రేమించుకుని విడిపోయారు. ప్రస్తుతం ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే హర్షవర్థన్ సెల్ఫోన్లో ఆమె స్టేటస్ పెట్టుకోవడంపై తరుణ్ నిలదీయడంతో ఇద్దరికీ ఫోన్లో వాగ్వాదం జరిగింది. అనంతరం పని నుంచి ఇంటికి వస్తున్న పైడి తరుణ్ను సానిగూడెం అడ్డరోడ్డు వద్ద కూచిపూడి హర్షవర్థన్ దారి కాచి కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలైన బాధితుడు ఏలూరు వైద్యశాలలో చేరి చికిత్స పొందుతున్నాడు. ఆసుపత్రి నుంచి అందిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. ఏలూరు (టూటౌన్): వెలుగు వీవోఏల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ వెలుగు వీవోఏ యానిమేటర్స్ ఉద్యోగుల సంఘం (సీఐటీయూ) ఆధ్వర్యంలో సోమవారం ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి ఎస్కే సుభాషిణి, జిల్లా గౌరవాధ్యక్షుడు డీఎన్వీడీ ప్రసాద్ మాట్లాడుతూ కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, రాజకీయ వేధింపులు అరికట్టాలని కోరుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకొని పొదుపు మహిళలకు రూ.10 లక్షల వరకు వడ్డీ రాయితీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్కు వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘ జిల్లా సహాయ కార్యదర్శి పార్వతి, ఉపాధ్యక్షులు విజయకుమారి, ఇందిరా, లక్ష్మీదేవి, లలిత కుమారి, కుమారి, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఇళ్లు కూల్చొద్దంటూ నిరసన
● తహసీల్దార్ కార్యాలయం వద్ద మహిళల బైఠాయింపు ● తమకు న్యాయం చేయాలని వేడుకోలు ఉండి: మా ఇళ్లు కూలగొట్టొద్దు.. మా తాళిబొట్లు తాకట్టు పెట్టి మరీ కట్టుకున్నాం.. మా బతుకులు నాశనం చేయొద్దు బాబూ అంటూ మహిళలు అఽధికారుల కాళ్లవేళ్లా పడ్డారు. ఉణుదుర్రులోని ఆలకోడు వద్ద ఆక్రమణలు ఖాళీ చేయాలని అధికారులు నోటీసులు ఇవ్వడంతో తమ ఇళ్లు కూల్చవద్దంటూ 70 కుటుంబాలకు చెందిన మహిళలు సోమవారం ఉండి తహసీల్దార్ కార్యాలయం వద్ద నేలపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ఇళ్లు రోడ్డును ఆక్రమించుకుని గానీ, ఇతరులకు ఆటంకంగా గానీ లేకపోయినా గ్రామానికి చెందిన కొందరు కక్షకట్టి మా ఇళ్లు కూల్చి వాటిపై ఆక్వాచెరువులకు వెళ్లాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేదలైన తమపై ఎందుకింత కక్షకట్టారో తెలియడం లేదని వాపోయారు. మా ప్రాణాలైనా అర్పిస్తాం గానీ మా ఇళ్లు మాత్రం కూలగొట్టేందుకు అంగీకరించమంటూ వారు నినాదాలు చేశారు. అధికారులు మాకు స్థలం ఇస్తామని చెప్పి.. కనీసం పూడిక కూడా చేయని గోతిలో స్థలాలున్నాయి వెళ్లండి అని చెప్పడం ఎంత వరకు సమంజసమంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆలకోడు ఆక్రమించుకున్న స్థానిక ఆక్వారైతులకు సహకరిస్తూ నిరుపేదల బతుకులు బుగ్గిచేయడానికి నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రయత్నించడం సబబు కాదని కన్నీళ్లు పెట్టుకున్నారు. మా ఇళ్లు కూల్చొద్దు. మా జీవితాలు ఫణంగా పెట్టి ఇళ్లు కట్టుకున్నాం. ఇప్పుడు వాటిని కూలగొట్టేస్తామంటే మేం ఎలా బతకాలి. దయచేసి మా జీవితాలను నాశనం చేయవద్దు. – కటికిరెడ్డి అన్నపూర్ణ, ఉణుదుర్రు చాలాకాలంగా మేము ఈ ప్రాంతంలోనే నివసిస్తున్నాం. మేం నివసించే స్థలం ఎవ్వరికీ అడ్డులేదు. ఆక్వా,చేపల చెరువుల యజమానుల కోసం నిరుపేదల ఇళ్లు కూలగొట్టడం అన్యాయం. కటికిరెడ్డి వెంకటసుబ్బమ్మ, ఉణుదుర్రు మేం నివసిస్తున్న ప్రాంతంలో కాలువ పేరు చెప్పి నిరుపేదల ఇళ్లు కూలగొట్టేందుకు సిద్ధపడడం దారుణం. మాకు అండగా ఉండాల్సిన ప్రభుత్వమే మాపై కక్ష కట్టి మా జీవితాల్లో నిప్పులు పోస్తోంది. – కండిబోయిన పద్మ, మాజీ వార్డు సభ్యురాలు కూటమి ప్రభుత్వం వచ్చాక మూడు సెంట్లు ఇంటి స్థలం ఇస్తామని చెప్పి ఇప్పుడు ఉణుదుర్రు వాసుల ఇళ్లు అక్రమంగా కూలగొట్టడం దారుణం. జీవో నంబర్ 30 ప్రకారం నివసిస్తున్న ప్రాంతంలోనే నిరుపేదలకు ఇంటిపట్టాలు ఇవ్వాలి. – ధనికొండ శ్రీనివాస్, సీపీఎం జిల్లా నాయకుడు -
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే డీజిల్ కొరత
భీమడోలు: పెట్రోల్, డీజిల్ కొరత కూటమి ప్రభుత్వ వైఫల్యమేనని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు. భీమడోలులో సోమవారం చలివేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో ప్రతి సరుకు కొనుగోలుకు క్యూ కట్టాల్సిన దుస్థితి ఏర్పడిందని, యూరియా, గ్యాస్ కోసం ఇప్పటికే ఇబ్బంది పడుతుండగా.. తాజాగా డీజిల్, పెట్రోలు కోసం బారులు తీరాల్సిన పరిస్థితి వచ్చిందని, ఇదంతా విజన్ ఉన్న చంద్రబాబుకు ముందుగా తెలియదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో క్యూ కట్టకుండా దొరికేది కేవలం మద్యం మాత్రమేనని విమర్శించారు. విజయవాడ నుంచి తిరుపతి వరకు హైవేలపై బంకులన్నీ మూసివేయడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమన్నారు. వరి కోత యంత్రాలు, ఆక్వా రంగాలకు కూడా డీజిల్ సరఫరా చేయకుండా నాలుగు రోజులుగా రైతులు, ప్రజలను మానసిక క్షోభను అనుభవిస్తున్నారన్నా రు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అనాలోచిత విధానాలే ఇందుకు కారణమన్నారు. రవాణా రంగం కుదేలై నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశనంటుతున్నాయన్నారు. గంటల తరబడి పెట్రోలు బంకుల వద్ద ప్రజలు పడిగాపులు పడాల్సి వస్తోందన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ రాలేదని, ప్రజావసరాలను దృష్టిలో ఉంచుకుని వ్యవస్థలను సమర్థవంతంగా నిర్వహించామని గుర్తుచేశారు. కూటమి ఫ్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని డీజిల్, పెట్రోలు సరఫరాను సాధారణ స్థాయికి తీసుకురావాలని వాసుబాబు డిమాండ్ చేశారు. -
ఇంధన కొరత తీర్చడంలో విఫలం
కామవరపుకోట: పెట్రోల్, డీజిల్ కొరత తీర్చటంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్సీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంభం విజయరాజు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బూటకపు హామీలతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, అమరావతి రాజధాని పేరుతో రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని, ఇప్పుడు డీజిల్, పెట్రోల్ కొరత వల్ల వాహనదారులు, రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. డీజిల్ కొరత వల్ల రవాణా వ్యవస్థ స్తంభించిపోయిందన్నారు. దీంతో నిత్యావసర సరుకులకు సామాన్యులు ఇబ్బంది పడుతున్నారన్నారు. రబీ సీజన్ కావడం వల్ల పంట కోత మెషీన్లకు, ట్రాక్టర్ల వాడటానికి డీజిల్ లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. వెంటనే ఇంధన సరఫరా సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. మండల కన్వీనర్ రాయంకుల సత్యనారాయణ, నానాది సాగర్, భీమిరెడ్డి వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి హామీలో అవినీతిని అరికట్టాలి
ఏలూరు (టూటౌన్): ఉపాధి హామీ పథకంలో అవినీతిని అరికట్టాలని వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగ అధ్యక్షుడు వెన్నుపూస రవీంద్రరెడ్డి పిలుపు మేరకు జిల్లా పంచాయతీరాజ్ విభాగ అధ్యక్షుడు పుప్పాల గోపి ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవినీతిని అరికట్టాలని, కూలీల వేతనాలు చెల్లించాలని సోమవారం కలెక్టర్ వెట్రిసెల్వికి వినతిపత్రం అందించారు. జిల్లాలో ఉపాధి శ్రామికుల వేతనాల బకాయిలు మంజూరు చేయించాలని కోరారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ విభాగం ప్రధాన కార్యదర్శి చిలుకూరి జ్ఞానారెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శి కోటగిరి రాజా నాయన, రాష్ట్ర పంచాయతీ విభాగం కార్యదర్శి మల్నీడి బాబి, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి నిట్ట గంగరాజు, దెందులూరు జెడ్పీటీసీ నిట్ట లీలా నవకాంతం, పెదపాడు ఎంపీపీ బత్తుల రత్నకుమారి ఏసు రాజు, జిల్లా చేనేత విభాగం అధ్యక్షుడు ద్వంతంశెట్టి సత్యనారాయణ, పోలవరం నియోజకవర్గ పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు శ్యామ్బాబు, చింతలపూడి నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు చండీ ప్రియారెడ్డి, సర్పంచ్ పుచ్చకాయల విష్ణు, తమ్మినేని శ్రీనివాసరావు, గౌతు రాము, మిద్దె వెంకటేశ్వరరావు, ఎలిశెట్టి బాబి, గాది రమణ, శ్రీనివాసరావు, ఎంపీటీసీలు పంతుల వెంకన్న బాబు, బండారు నాగరాజు, ఉంగుటూరు విద్యార్థి విభాగం అధ్యక్షుడు సంపతి గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలి
ఏలూరు (టూటౌన్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో అందిన అర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి సూచించారు. సోమవారం ఏలూరు కలెక్టరేట్లో జిల్లాస్థాయి పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లలో 203 అర్జీలను స్వీకరించారు. అర్జీలు పెండింగ్లో ఉండకుండా చూడాలని, పరిష్కార ప్రక్రియలో పారదర్శకత ఉండాలని అన్నారు. జేసీ ఎంజే అభిషేక్ గౌడ, ట్రైనీ ఐఏఎస్ చింతకింది శ్రావణ్కుమార్రెడ్డి, ఇన్చార్జి డీఆర్వో ఎల్.దేవకీదేవి తదితరులు పాల్గొన్నారు. సాధారణ పరిస్థితికి చర్యలు జిల్లాలో డీజిల్ సమస్యకు మంగళవారం ఉదయం నాటికి సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి చెప్పారు. జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరతపై తీసుకుంటున్న చర్యలను జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్తో కలిసి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ప్రస్తుతం 600 కిలోలీటర్ల వరకు ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. డీజిల్ సమస్యలు తెలియజేసేందుకు కలెక్టరేట్లో 7569296272 నంబర్తో కంట్రోల్రూమ్ ఏర్పాటుచేశామన్నారు. జిల్లాలో రబీ ధాన్యం రవాణా, ఆక్వా రైతులకు, అత్యవసర వైద్య వాహనాలకు 12 వేల లీటర్ల డీజిల్ అందించామన్నారు. జిల్లా ఎస్పీ శివకిషోర్ మాట్లాడుతూ అవసరానికి మించి డీజిల్ కొనుగోలు చేసి ఇళ్లలో నిల్వ చేసుకుంటే ప్రస్తుత వేసవి దష్ట్యా అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో శాఖా గ్రంథాలయాల్లో వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్టు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తుగ నాగరాజు ఓ ప్రకటనలో తెలిపారు. శిబిరాల్లో పుస్తక పఠనం, కథారచన, పద్యరచన, వక్తృత్వ పోటీలు, చిత్రలేఖనం, కార్టూన్ రూపకల్పన, హస్తకళలు, క్విజ్, సాంస్కృతిక కార్యక్రమాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ శిక్షణ, వ్యక్తిత్వ వికాస తరగతులు తదితర అంశాలు చేర్చామన్నారు. అలాగే ప్రాథమిక కంప్యూటర్ అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామన్నారు. ప్రత్యేక కార్యాచర ణ ప్రణాళికలను రూపొందించి పిల్లలు, యు వత అధిక సంఖ్యలో పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ద్వారకాతిరుమల: రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వృద్ధుడు సోమవారం ఉదయం మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని రాళ్లకుంటకి చెందిన గజ్జరపు రంగారావు (60) ఈనెల 25న ఉదయం తన బైక్పై శ్రీవారి దర్శనార్థం ద్వారకాతిరుమల వస్తున్నారు. రాళ్లకుంటలోని సెయింట్ గ్జేవియర్ పాఠశాల వద్దకు వచ్చేసరికి బీపీ పెరిగి బైక్పై నుంచి పడిపోయారు. దీంతో ఆయన తలకు తీవ్రగాయాలు కాగా రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. మృతుడి కుమారుడు రాము ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ట్టు హెడ్ కానిస్టేబుల్ జి.దుర్గారావు తెలిపారు. దెందులూరు: పెదవేగి మండలం రాట్నాలకుంట రాట్నాలమ్మవారి ఆలయంలో హుండీల ఆ దాయాన్ని సోమవారం లెక్కించారు. దేవదా య శాఖ ఏలూరు డివిజనల్ ఇన్స్పెక్టర్ సురేష్బాబు ఆధ్వర్యంలో లెక్కించగా 33 రోజులకు రూ.8,72,346 సమకూరింది. ఆలయ చైర్మన్ మన్నే శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారి ఎన్.సతీష్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. పెనుగొండ : అయోధ్యలంక రావిలంకలో మట్టి, ఇసుక దందాపై వైఎస్సార్సీపీ నాయకులు సోమవారం కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. హైకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా మట్టి, ఇసుక రాత్రి వేళ్లల్లో తరలించుకుపోతున్నారని ఆరోపించారు. అధికార పార్టీ అండతో చెలరేగిపోతున్నారని ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని వి మర్శించారు. ఆచంట నియోజకవర్గంలోని ఇ సుక ర్యాంపులన్నీ సీఆర్జెడ్ పరిధిలో ఉన్నా తవ్వకాలను అడ్డుకోకపోవడం దారుణమన్నారు. -
బంకుల్లో నో స్టాక్
నో ఆయిల్.. నో స్టాక్.. పెట్రోలు బంకులకు నాలుగువైపులా తాళ్లు కట్టి మరీ ప్రత్యేక ఏర్పాట్లు.. బంకుల ముందు 300 నుంచి 500 మీటర్ల మేర భారీ క్యూలైన్లు.. 10 లీటర్ల డీజిల్, 2 లీటర్ల పెట్రోలు కావాలంటే కనీసం రెండు గంటలు పడిగాపులు అనివార్యం.. ఇక మండలాల్లో అయితే క్యాన్లు పట్టుకుని మరీ అన్నదాతల పడిగాపులు.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలుచోట్ల డీజిల్ కోసం ఆటోడ్రైవర్లు బారులు తీరిన దృశ్యాలు. ఇది పెట్రోలు, డీజిల్ కొరత పరిస్థితి. ఏలూరు అశోక్నగర్ బంకు వద్ద ఆటోలు సాక్షిప్రతినిధి, ఏలూరు : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ కొరత తారాస్థాయికి చేరింది. రెండు రోజుల నుంచి జిల్లావ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ నిల్వలు గణనీయంగా తగ్గడంతో వాహనదారులు బారులు తీరుతున్నారు. డిమాండ్కు తగినంతగా సప్లయ్ లేకపోవడంతో అన్నదాతలు మొదలు ఆటోడ్రైవర్ల వరకు అందరూ ఇంధన కొరతతో అతలాకుతలమ వుతున్న పరిస్థితి. ఇక ప్రభుత్వం మాత్రం యథావిధిగా కమాండ్ కంట్రోల్ రూమ్లు, ఆకస్మిక తనిఖీ లు, ఆయిల్ డీలర్లతో సమావేశాలు నిర్వహి స్తూ హడావుడి చేస్తోంది తప్ప క్షేత్రస్థాయిలో పరిస్థితిని చక్కదిద్దలేకపోతోంది. ఏలూరు జిల్లాలో 232, పశ్చిమగోదావరి జిల్లాలో 160 పెట్రోలు బంకులున్నాయి. ఏలూరు జిల్లాలో రోజుకు సగటున 3.65 లక్షల లీటర్ల డీజల్, 2.60 లక్షల లీటర్ల పెట్రోలు, అలాగే పశ్చిమగోదావరిలో 3.50 లక్షల లీటర్ల డీజిల్, సుమారు 2 లక్షల లీటర్ల పెట్రోలు వినియోగిస్తున్నా రు. ద్విచక్రవాహనాలు, కార్లు, సాధారణ గృహావసరాలకే కాకుండా వ్యవసాయం, ఆక్వా, ప్రైవేటు రవాణా ఇలా అన్నింటిలో డీజిల్ వినియోగం అ త్యధికంగా ఉంటుంది. వరి కోతలకు తప్పని వెతలు ప్రధానంగా ఏలూరు జిల్లాలో ధాన్యం రవాణా లారీలకు, కోతల సమయంలో యంత్రాలకు డీజిల్ వినియోగం అధికంగా ఉంది. అలాగే ఆక్వాకు రోజు సగటున ఏలూరు జిల్లాలో 15 నుంచి 20 వేల లీటర్ల డీజిల్ ఏలూరు జిల్లాలో, పశ్చి మలో 30 నుంచి 40 వేల లీటర్ల డీజిల్ అవసరం ఉంది. ఈ క్రమంలో రెండు రోజుల నుంచి మా ర్కెట్లో డీజిల్ నిల్వలు పూర్తిగా తగ్గిపోవడం, కంపెనీలు అవసరాలకు అనుగుణంగా డీజిల్ సరఫరా చేయకపోవడం అధికారులకు ఆయిల్ కంపెనీలతో సమన్వయలోపం ఉండటం వెరసి పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. అధికారుల హడావుడి ఏలూరులో కలెక్టర్ కె.వెట్రిసెల్వి, ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్, పశ్చిమగోదావరిలో కలెక్టర్ సీహెచ్ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పెట్రోలు బంకులు తనిఖీలు చేశారు. రెండు జిల్లాల్లో కలెక్టరేట్లో ప్రత్యేక కాల్ సెంటర్ను ఏర్పాటు చేసి ఫిర్యాదులు ఉంటే ఫోన్ చేయాలని నంబర్లు ప్రకటించారు. అలాగే తహసీల్దార్లు తదితర అధికారులు బంకుల వద్ద పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ఉమ్మడి పశ్చిమలో ఆక్వా సాగు అత్యధికంగా ఉంది. రెండు జిల్లాల్లో కలిపి సగటున 50 వేల లీటర్ల డీజిల్ను ఆక్వా సాగుదారులు ప్రతిరోజూ వినియోగిస్తున్నారు. రొయ్యల చెరువుల్లో ఆక్సిజన్ నింపే ఏరియేటర్లు తిరగటానికి, చెరువులో నీటిని నింపుకునేందుకు మోటార్లు, అలాగే అప్రకటిత కరెంట్ కోతలు ఉన్న సమయంలో జనరేటర్ వినియోగానికి డీజిల్ తప్పనిసరి. దీంతో ఆక్వా రైతులు రెండు జిల్లాల్లో బంకుల వద్ద భారీగా క్యూలు కట్టారు. కొన్నిచోట్ల మాత్రమే రెండు గంటలకుపైగా పడిగాపులు కాస్తే 5 లీటర్ల డీజిల్ ఇస్తున్నారు. వాహనాలకు మాత్రమే ఇంధనం సరఫరా చేయాలని అధికారులు ఆదేశించారని, డబ్బాల్లో ఆయిల్ నింపమని బంకు సి బ్బంది చెబుతున్నారు. దీంతో పాటు ఏ లూరు జిల్లాలో ధాన్యం రవాణా లారీలు, కోతల సమయంలో యంత్రాల వినియోగానికి రోజూ వేల లీటర్ల డీజిల్ అవసరం ఉంటుంది. పూర్తిగా కొరత ఉండటం, అనేకచోట్ల నోస్టాక్ బోర్డులు ఏర్పాటు చేయడం, మండల కేంద్రాల్లో పూర్తిగా నిల్వలు లేక బంకులు నిలిచిపోయిన పరిస్థితుల్లో ఆయిల్ డ బ్బాలతో రైతులు అన్ని బంకులు తిరుగుతుండటం గమనార్హం. పశ్చిమగోదావరిలో రబీ సీజన్ నేపథ్యంలో 2.80 లక్షల ఎకరాల్లో కో తలు జరుగుతున్నాయి. సుమారు 1,675 కో త యంత్రాలకు రోజుకు సగటున లక్ష లీటర్లు డీజిల్ అవసరం. కానీ వందల లీటర్లు కూడా దొరికే పరిస్థితి లేకపోవడంతో కోతలపై తీవ్ర ప్రభావం పడింది. ఇంధన వెతలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా డీజిల్, పెట్రోల్ కొరత బంకుల వద్ద భారీగా క్యూలైన్లు ఏలూరులో ప్రధాన బంకుల వద్ద అర కిలోమీటర మేర క్యూలైన్లు ధాన్యం కోతలు, రవాణాకు తప్పని డీజిల్ కష్టాలు ఆక్వా రైతులకూ అవే తిప్పలు బంకులు తనిఖీ చేసిన కలెక్టర్లు, ఎస్పీలు ప్రైవేటు రవాణారంగంపై తీవ్ర ప్రభావం -
వాసవీ మాత.. ఆరాధ్య దేవత
జై వాసవీ.. జైజై వాసవీ స్మరణలు మార్మోగాయి. ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. అశేష భక్తజనంతో పెనుగొండలో ఆధ్యాత్మిక శోభ వెల్లివెరిసింది. అమ్మవారిని వెండి పల్లకిలో ఉంచి గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామంలోని బజారు రామాలయం నుంచి నగరేశ్వరస్వామి ఆలయం వరకు మహిళలు కలశాలతో ఊరేగారు. అడుగడుగునా భక్తులు నీరాజనాలు అర్పించారు. అనంతరం మూలవిరాట్కు అభిషేకాలు నిర్వహించారు. వాసవీ శాంతిథాంలో విశేష పూజలు, లక్ష కుంకుమార్చనలు జరిగాయి. సాయంత్రం వెండి రథోత్సవం కనులపండువగా జరిగింది. రాష్ట్రంతో పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ నుంచి వాసవీ మాలధారులు గణపతి, వాసవీ హోమాలు నిర్వహించి మాల విరమణ గావించారు. –పెనుగొండ -
పల్లెల్లో అనుగృహమెప్పుడో..?
ఇళ్ల మంజూరు 72,059 తొలి రెండేళ్లలో పూర్తయినవి 15 వేలు శ్లాబ్ పూర్తయినవి 1,513 శ్లాబ్ దశకు వచ్చినవి 2,025 పలు దశల్లో నిర్మాణాలు 34,000 గ్రామాల్లో ఇళ్ల మంజూరు నిల్ పట్టణాలకు ఇళ్ల మంజూరు 595 వాటిలో పూర్తయినవి 57 నిర్మాణంలో ఉన్నవి 224 భీమవరం(ప్రకాశం చౌక్): రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో పల్లెవాసులకు‘గృహ’యోగం కలగడం లేదు. ప్రభుత్వం గద్దెనెక్కి రెండేళ్లు కావస్తున్నా ఒక్క ఇంటిని కూడా మంజూరు చేయకపోవడం పేదల సంక్షేమంపై నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. దీంతో పేదల సొంతింటి కల సాకారం కావడం లేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గ్రామాల్లో సెంటున్నర, పట్టణాల్లో సెంటు భూమి చొప్పున మంజూరు చేయగా.. వేలాది ఇళ్ల నిర్మాణాలు జరిగాయి. కొందరికి స్థలాలు మంజూరు కాగా ఇళ్ల నిర్మాణాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వంలో ఇళ్ల ఊసే ఎత్తడం లేదు. దీంతో అద్దె ఇళ్లలోనే కాలం గడుపుతున్నారు. కొందరు అప్పులు చేసి ఇళ్ల నిర్మాణాలు చేపట్టినా బిల్లులు రావడం లేదు. నిర్మాణాలకు వేసవి అనుకూలమైనా.. వేసవి కాలం ఇళ్ల నిర్మాణాలకు అనుకూలం. ఏటా జనవరి నుంచి జూన్ వరకు నిర్మాణ పనులు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇలాంటి సమయంలో నిర్మాణాలు చేపడదామని ఆలోచిస్తున్న పేదల కు ప్రభుత్వ సాయం మాత్రం అందడం లేదు. దీంతో చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. అక్కడక్కడా కొందరు మాత్రమే అప్పులు చేసి నిర్మాణాలు చేపడుతున్నారు. చాలా చోట్ల గ్రామాల్లో గత ప్రభుత్వంలో మంజూరైన ఇళ్ల స్థలాలు ఖాళీగానే ఉంటున్నాయి. బెస్మెంట్, దశల వారీగా నిర్మాణాలు చేపట్టినా బిల్లులు వస్తాయో రావో అన్న సందిగ్ధంలో చాలా మంది ఉన్నారు. 595 ఇళ్లు మంజూరు చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు కావస్తున్నా జిల్లాలో పట్టణాలకు 595 ఇళ్లు మా త్రమే మంజూరు చేసింది. వీటిలో 57 ఇళ్లు మా త్రమే పూర్తయ్యాయి. 2014 నుంచి 2019 వరకు అప్పటి టీడీపీ ప్రభుత్వం సెంటు భూమి కూడా పే దలకు ఇవ్వలేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో నూ ఇళ్ల నిర్మాణంపై నిర్లక్ష్యం చూపుతుందని లబ్ధిదారులు వాపోతున్నారు. అప్పట్లో సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేవారికి గృహాలు మంజూరు కూడా అరకొరగానే ఉంది. అది కూడా టీడీపీ నాయకులు, అనుయాయులకే ప్రాధాన్యమిచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో గృహయజ్ఞం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల ఇళ్ల నిర్మా ణాలకు అధిక ప్రాధాన్యమిచ్చారు. జగనన్న లేవుట్లు, సొంత స్థలాలు మొత్తంగా సుమారు 70 వేల ఇళ్లు మంజూరు చేయగా వాటిలో 30 వేల నిర్మాణా లు పూర్తయ్యాయి. అధికారం చేపట్టిన తొలి రెండేళ్లలోనే 15 వేల వరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేశారు. వేలాది ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లలో సుమారు 6 వేల నిర్మాణా లు ప్రస్తుత చంద్రబాబు పాలనలో పూర్తికాగా.. చంద్రబాబు తన మంత్రులు, అధికారులతో గృహప్రవేశాలు చేయించి వాటిని తానే మంజూరు చేసినట్టు గొప్పులు చెప్పుకుంటున్నారు. యూనిట్ కాస్ట్ పెంచాలి పెరుగుతున్న భవన నిర్మాణ సామగ్రి ధరల దృష్ట్యా ఇంటి యూనిట్ కాస్ట్ పెంచాలనే డిమాండ్ వినిపిస్తోంది. ప్రస్తుతం యూనిట్ కాస్ట్ రూ.1.80 లక్షలు ఉండగా కనీసం రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు పెంచాలని స్థలాల లబ్ధిదారులు కోరుతున్నారు. గూడు.. గోడు ఇళ్ల మంజూరు కోసం పేదల ఎదురుచూపులు గ్రామీణ ప్రాంతాలకు ఇళ్ల మంజూరు నిల్ రెండేళ్లలో పట్టణాలకు కేవలం 595 ఇళ్లు మంజూరు వాటిలో నిర్మాణం పూర్తయినవి 57 గృహాలే.. ఇళ్ల నిర్మాణంపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం -
డీఏ బకాయిలు విడుదల చేయాలి
పాలకొల్లు సెంట్రల్: ఉద్యోగులకు రావాల్సిన డీఏ బకాయిలను విడుదల చేయాలని మహి ళా, శిశు సంక్షేమ శాఖ ఉద్యోగుల సంఘం రా ష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్రాజు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక పెన్షనర్స్ అసోసియేషన్ భవనంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా శ్రీకాంత్రాజు మాట్లాడుతూ పీఆర్సీని ఏర్పాటుచేసి మధ్యంతర భృతి ప్రకటించాలని కోరారు. జోనల్ వ్యవస్థ ఏర్పాటులో సంఘంతో అధికారుల సమన్వయ స మావేశం ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశా రు. యాప్ల భారం తగ్గించి ఉదయం, సా యంత్రం సమయాల్లో జూమ్ సమావేశాలు ర ద్దు చేయాలని కోరారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు 62 ఏళ్ల పదవీ విరమణ అమలు చేయాలని కోరారు. డీసీపీఓ, ఐసీపీఎస్, డీఈఓ, బీపీసీలకు బదిలీలు కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస టైం స్కేల్ అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ కుమారి, జిల్లా అధ్యక్షుడు జెట్టి సత్యనారాయణ -
గిరిజనుల సంస్కృతికి బాట
● పూర్వీకుల నుంచి వస్తున్న బాట పండుగ ● ప్రభుత్వం గుర్తించాలని కోరుతున్న ఆదివాసీలు బుట్టాయగూడెం: సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా ఆదివాసీ కొండరెడ్లు బాట పండుగను జరుపుకుంటారు. ఇప్పటికే ఈ పండుగలు ప్రారంభం కావడంతో గ్రామాల్లో సందడి నెలకొంది. గిరిజన నృత్యాలతో డోలు కొయ్యల వాయిద్యాలతో గిరిపల్లెలు సందడిగా మారాయి. గిరిజనుల ఆచారం ప్రతి ఏటా వేసవిలో మామిడికాయల కాపు చేతికి వచ్చిన తర్వాత ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. పండుగ జరిగే వరకూ చిన్నపిల్లలతో సహా ఎవ్వరూ కూడా జీడిమామిడి, మామిడి, పనస పండ్లను ముట్టుకోరు. వాటివైపు కన్నెత్తి చూడరు. ఇది పూర్వం నుంచి వస్తున్న ఆచారం. కొండరెడ్లు బాట పండుగ జరిపిన తర్వాతే మామిడి కాయలు, పనసకాయలు తింటారు. అలాగే కోయతెగలకు చెందిన గిరిజనులు ఉగాది తర్వాత నుంచి మామిడికాయ పండుగను వైభవంగా నిర్వహించిన అనంతరం తినడం సాంప్రదాయంగా వస్తుంది. అయితే ఈ పండుగల్లో ప్రతి ఇంటికీ ఒక కోడి చొప్పున గ్రామంలో ఎన్ని ఇళ్లు ఉంటే అన్ని కోళ్లను కోసి దేవతలకు నైవేద్యంగా సమర్పిస్తారు. వీటితో పాటు మేకలను కూడా కోసి దేవతలకు నైవేద్యంగా పెట్టి సహపంక్తి భోజనాలు చేస్తారు. ఈ కార్యక్రమంలో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ కూడా పాల్గొంటారు. బాట పండుగను కన్నారప్పాడు ఉప్పరిల్ల, ముంజులూరు, చింతకొండ, రేపల్లె, రేగులపాడు, తదితర గ్రామాల్లో ఎంతో వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. గిరిజనుల పండుగలను ప్రభుత్వం గుర్తించాలని గిరిజనులు కోరుతున్నారు. గిరిజన సంప్రదాయ పండుగలైన బాట పండుగ, మామిడికాయ పండుగ, చిక్కుడు, పప్పుల పండుగలను ప్రభుత్వం గుర్తించాలి. ఐటీడీఏ ద్వారా ఈ పండుగలను ఘనంగా జరిపించే విధంగా ఏర్పాటు చేయాలి. మా పూర్వీకుల నుంచి వస్తున్న పండుగలను నేటికీ మేము ఆచరిస్తున్నాము. – కొక్కెర భీమరాజు, అలివేరు, బుట్టాయగూడెం మండలం -
రోడ్డు నిర్మాణంలో నాణ్యత డొల్ల
పాలకొల్లు సెంట్రల్: రోడ్డు పనుల్లో నాణ్యత లోపిస్తే ఉపేక్షించేది లేదని మంత్రి చెబుతున్నా కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆవ డ్రెయినేజీపై గ్రావెల్ రోడ్డు నిర్మాణంలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్ నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని పలువురు బాహటంగా విమర్శిస్తున్నారు. మండలంలోని పెదగరువు ప్రాంతంలో ఉన్న ఆవ మీడియం డ్రెయిన్పై రూ.17.69 లక్షల నిధులతో గ్రావెల్ రహదారి నిర్మాణం చేపట్టారు. సహజంగా పుంత రోడ్డు నిర్మాణం చేయాలంటే ముందుగా జంగిల్ (మొక్కలు) శుభ్రం చేయాలి. రోడ్డుకు ఇరువైపులా మొక్కలు తొలగించకుండానే షట్రు (పెద్ద రాళ్లు) వేసి గ్రావెల్ వేస్తున్నారు. గ్రావెల్ సైతం దాదాపుగా నాలుగు అంగుళాలు మందం వేయాల్సి ఉన్నా నామమాత్రంగా గ్రావెల్ వేసుకుని వెళుతున్నారు. అలాగే రోడ్డు సమానం చేయకుండా ఎత్తు పల్లాలుగా నిర్మాణం చేసుకుని వెళుతున్నారు. దీంతో రోడ్డు నిర్మాణంపై స్థానికులు, రైతులు పెదవి విరుస్తున్నారు. ఈ విషయంపై ఇరిగేషన్ అధికారికి ఫోన్ చేయగా ఆయన అందుబాటులో లేరు. -
ప్రపంచ సాహిత్య మహాసభల ప్రోగ్రాం కన్వీనర్గా పార్థసారథి
ఏలూరు (ఆర్ఆర్పేట): శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించనున్న 7వ తెలుగు ప్రపంచ సాహిత్య మహాసభలు ప్రోగ్రాం కన్వీనర్గా టీ పార్థసారథి నియమితులయ్యారు. ఈ మేరకు శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ ఛైర్మన్ కత్తిమండ ప్రతాప్ కుమార్ పార్థసారథికి నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ 2024, 2025 సంవత్సరాల్లో 48 గంటల పాటు తెలుగు ప్రపంచ సాహిత్య మహాసభలు నిర్వహించిన అనుభవం ఉన్నందున తనను మళ్లీ ప్రోగ్రాం కన్వీనర్గా నియమించారని తెలిపారు. తెలుగు భాషా వైభవాన్ని విశ్వవ్యాప్తంగా ప్రతిధ్వనింపచేయాలనే మహత్తర సంకల్పంతో జూన్ 6, 7 తేదీల్లో రాజమహేంద్రవరం గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో 7వ తెలుగు ప్రపంచ సాహిత్య మహాసభలు నిర్వహించనున్నట్టు తెలిపారు. -
బెధరగొడుతున్నాయ్
బుట్టాయగూడెం: పేదలపై ధరల దరువు తీవ్ర ప్ర భావం చూపుతోంది. ముఖ్యంగా నిత్యావసర స రుకులు, కూరగాయల ధరల పెరుగుదల భారంగా మారింది. అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం ధరల నియంత్రణకు చర్యలు తీసుకోకపోవడంతో బతికేదెలా అంటూ సామాన్యులు ఆవేదన చెందుతున్నారు. ఎన్నికల సమయంలో అధికారమే పరమావధిగా కూటమి నాయకులు ఎడాపెడా హామీలు గుప్పించారు. తీరా అధికారం చేపట్టి రెండేళ్లు కావస్తున్నా వాగ్దానాలు నెరవేర్చకపోవడంతో ఇప్పటికే ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ సమయంలో ధరల బాదుడు వీరికి మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే పెరిగిన నిత్యావసర సరుకులు ధరలతో సతమతమవుతుండగా.. తాజాగా కూరగాయల ధరలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇదిలా ఉండగా యుద్ధ ప్రభావంతో గ్యాస్ సిలిండర్లకు కొరత ఏర్పడగా.. వంటకు కష్టాలు తప్పడం లేదు. సామాన్యులకు వెజ్‘ట్రబుల్స్’ ప్రస్తుతం కూరగాయల ధరలు ఆకాశాన్నంటి సా మాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఒక్కసారిగా కూరగాయాల ధరలన్నీ పెరిగిపోయాయి. నాలుగు రోజుల్లో కూరగాయలు ధరలు కిలోకు రూ.30 పైగా పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. కిలో వంకాయలు రూ.30 నుంచి రూ.70కు పెరిగాయి. వారంతపు సంతల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. కిలో నిమ్మకాయలు రూ.160, టమాటా రూ.40, చిక్కుడు రూ.140కు విక్రయిస్తున్నారు. కూ రగాయలు రకాన్ని బట్టి రూ.10 నుంచి రూ.30 వ రకు పెరిగినట్టు వినియోగదారులు చెబుతున్నారు. నెత్తిన గుది‘బండ’ పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల కారణంగా ముఖ్యంగా హర్మూజ్ జలసంధి వద్ద రవాణా అంతరాయాలతో దేశంలో వంట గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. ఇదే అదనుగా కొందరు గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. గృహ వినియోగ సిలిండర్ రూ.2 వేల వరకూ విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గ్యాస్ కొరత లేదని అధికారులు చెబుతున్నా గ్రామాల్లో గ్యాస్ కష్టాలు మాత్రం తప్పడం లేదు. ధరలను నియంత్రించడంతో పాటు గ్యాస్ సరఫరాపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కూరగాయల ధరలన్నీ మండిపోతున్నాయి. సామాన్య ప్రజ లు ఏమి కొనాలో? ఏమి తినాలో? తెలియక సతమతమతున్నారు. గత వారం కంటే ప్రస్తుతం కూరగాయల ధరలు కిలో రూ.30కు పైగా పెరిగాయి. ప్రభుత్వం పెరుగుతున్న ధరలను నియంత్రించేందుకు కృషి చేయాలి. – కారం రాఘవ, సీపీఐఎంఎల్ న్యూడెమొక్రసీ నేత, అలివేరు, బుట్టాయగూడెం మండలం రోజురోజుకూ ధరలు పె రుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాల తీరుతో సామాన్యుడికి తీరని నష్టం కలుగుతోంది. వంట గ్యాస్ కూడా సకాలంలో దొరకని పరిస్థితి నెలకుంది. ఇప్పటికై నా ప్రభుత్వాలు స్పందించి ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి – తెల్లం బాలరాజు, మాజీ ఎమ్మెల్యే, దుద్దుకూరు, బుట్టాయగూడెం మండలంధరల దరువు కూరగాయల ధరలకు రెక్కలు తీరని వంట గ్యాస్ కష్టాలు నిత్యావసర సరుకుల ధరలు ఆకాశంలో.. సామాన్యుడు బతికేదెలా? -
పెద్దింట్లమ్మా.. చల్లగా చూడమ్మా
కై కలూరు: రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానంలో భక్తుల రద్దీ ఆదివారం కనిపించింది. పాఠశాలలకు వేసవి సెలవులు వల్ల సమీప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ సమీపంలో పవిత్ర కోనేరులో స్నానాలు ఆచరించి అమ్మవారికి వేడి నైవేద్యాలను భక్తులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఒక్క ఆదివారం రోజున ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డూ ప్రసాదం విక్రయం, దేవస్థాన గదుల అద్దెలు, అమ్మవారి ఫొటోల విక్రయం, వాహన పూజలు, విరాళాల ద్వారా మొత్తం రూ. 72,492 ఆదాయం వచ్చిందని ఈవో తెలిపారు. ముదినేపల్లి (కై కలూరు): సుబ్రహ్మణ్యేశ్వరా.. శరణు అంటూ భక్తులు ఆర్తీతో వేడుకున్నారు. సింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్లో వేంచేసియున్న శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సమీప జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు దేవాలయ ప్రాంగణంలో ఉన్న పుట్టలో పాలు పోసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమాలను ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారిణి ఆర్.గంగాశ్రీదేవి, ఆలయ చైర్మన్ బొంగు రవికుమార్, ధర్మకర్తల మండలి సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. దెందులూరు: పెదవేగి శ్రీ రాట్నాలమ్మ తల్లి ఆలయంలో ఆదివారం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. సేవ టికెట్లు, దర్శనం, ప్రసాదాల విక్రయం తదితర సేవల రూపంలో అమ్మవారికి మొత్తం రూ.98,413 ఆదాయం లభించిందని ఆలయ చైర్మన్ మన్నె శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సతీష్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ విడుదల సత్యనారాయణ తెలిపారు. బుట్టాయగూడెం: కామవరం సమీపంలో అటవీప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడి దర్శనార్థం ఆదివారం భక్తులు పోటెత్తారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ప్రత్యేక బస్సుల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. అలాగే విజయవాడకు చెందిన భక్తులు డప్పు వాయిద్యాల నడుమ నైవేద్యాలను తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. అనంతరం దూపదీప నైవేద్యాలతో పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ వారితోపాటు పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
చినవెంకన్న పెళ్లి కొడుకాయెనే..
● వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలు ప్రారంభం ● గజవాహనంపై అట్టహాసంగా శ్రీవారి తిరువీధి సేవ ● ఉదయం 8 గంటల నుంచి భజన కార్యక్రమాలు ● ఉదయం 9 గంటల నుంచి భక్తిరంజని ● రాత్రి 7 గంటల నుంచి అంకురార్పణ, రుత్విగ్వరణ, ధ్వజారోహణం ● రాత్రి 9 గంటల నుంచి హంసవాహనంపై తిరువీధి సేవ ● శ్రీవారి ప్రత్యేక అలంకారం : సత్యా కృష్ణుని అలంకారం ద్వారకాతిరువుల: సర్వాభరణ భూషితుడైన శ్రీవారు పెండ్లి కుమారుడిగా, నుదుటున కల్యాణ తిలకం.. బుగ్గన చుక్కలతో పద్మావతి, ఆండాళ్ అమ్మవార్లు పెండ్లి కుమార్తెలుగా శోభిల్లారు. ద్వారకాతిరుమలలో చినవెంకన్న వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలుత ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు శ్రీహరి కళాతోరణ వేదికపై జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను అర్చకులు ఆలయం నుంచి నిత్య కల్యాణ మండపం వద్దకు తొళక్క వాహనంపై తీసుకెళ్లారు. అక్కడ వేదికపై అలంకరించిన సు వర్ణ సింహాసనంపై శ్రీవారు, అమ్మవార్లను వేంచేపు చేశారు. పండితులు పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలను చేసే వేడుకను నేత్రపర్వంగా నిర్వహించారు. ఈఓ త్రినాథరావు దంపతులు పూలు, పండ్లు సమర్పించారు. అర్చకులు, పండితులకు నూతన వస్త్రాలు అందించారు. శ్రీహరి కళాతోరణం వేదికపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలంకరించాయి. రాత్రి గజ వాహనంపై స్వామివారి తిరువీధి సేవ నేత్రపర్వంగా సాగింది. ఆలయ ముఖ మండపంలో స్వామివారి శ్రీ మహావిష్ణువు అలంకారంలో దర్శనమిచ్చారు. -
డిమాండ్ ఎక్కువ.. సరఫరా తక్కువ
● 40 శాతం మేరే డీజిల్ సరఫరా ● బంకులపై తీవ్ర ఒత్తిడి ● డీజిల్, పెట్రోల్ కొరతతో ఇక్కట్లు నూజివీడు: బంకుల యజమానులు అడిగినంత డీజిల్ను ఆయిల్కంపెనీలు సరఫరా చేయడం లేదు. 10వేల లీటర్లకు ఇండెంట్ పెడితే కేవలం 4వేల లీటర్లు ఇచ్చి సరిపెట్టేస్తున్నారు. దీంతో డీజిల్ కోసం పెట్రోలు బంకులపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ప్రభుత్వ రంగంలోని ఆయిల్ కంపెనీలు అడిగినంత డీజిల్ను ఎందుకు సరఫరా చేయడం లేదని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. మామిడి కోతలు, దాళ్వా వరికోతలు, మొక్కజొన్న నూర్పుడిలు ప్రారంభం కావడంతో ట్రాక్టర్లు, లారీలు, ట్రక్కు వాహనాలు, వరికోత మిషన్లకు డీజిల్ అవసరం నెలకొంది. అంతేగాకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనందున ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం నుంచి కేటాయించిన రైసుమిల్ వద్దకు తరలించాల్సి ఉండగా డీజిల్ కొరతతో లారీలు కదలడం లేదు. దీంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల సిబ్బంది, ధాన్యం విక్రయించిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని పెట్రోలు బంకుల్లో పెట్రోలు లేకపోతే స్పీడ్ పెట్రోలు అంటగట్టేస్తున్నారు. ఇది లీటరుకు రూ.10 ఎక్కువైనప్పటికీ చేసేదేమీ లేక వాహనదారులు పోయించుకుంటున్నారు. డీజిల్, పెట్రోలు కొరతతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పలుచోట్ల బంకుల మూసివేత జిల్లా వ్యాప్తంగా డీజిల్, పెట్రోలు కొరతతో పెట్రోలు బంకుల వద్ద తమ వాహనాలకు డీజిల్, పెట్రోలు కొట్టించేందుకు ప్రజలు బారులు తీరారు. కొన్ని బంకులు అయితే డీజిల్, పెట్రోలు అయిపోవడంతో బంకులనే మూసివేశారు. డీజిల్ కొరత కారణంగా ట్రాక్టర్లు, వరికోత మిషన్లకు డీజిల్ దొరకక వ్యవసాయ పనులు నిలిచిపోయాయి. వరికోత మిషన్ యజమానులు బంకుల వద్దకు క్యాన్లు తీసుకొని వచ్చి డీజిల్ కొట్టమంటే బంకుల నిర్వాహకులు క్యాన్లలో కొట్టేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో వరికోత మిషన్ యజమానులకు, పెట్రోలు బంకు నిర్వాహకులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంటోంది. వరికోత మిషన్లను బంకు వద్దకు ఎలా తీసుకురావాలని నిలదీస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 59 పెట్రోలు బంకులుండగా పెట్రోలు వాహనదారులకు ఎంతోకొంత దొరుకుతుండగా డీజిల్ మాత్రం దొరకడం లేదు. దీంతో ఆటో వాలాలు, ట్రక్కు వాహనాలు, ప్యాసింజర్ వాహనాలు, టాక్సీలు, లారీలు, ట్రాక్టర్లు కదలని పరిస్థితి నెలకొంది. నిన్నటి నుంచి డీజిల్ కోసం పదుల సార్లు బంకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నామని వాహనదారులు వాపోతున్నారు. -
ప్రాణం తీసిన వేగం
తణుకు అర్బన్: కారు, మోటార్సైకిల్ను ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. తణుకు జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఉండ్రాజవరం మండలం చివటం గ్రామానికి చెందిన అడపా సత్యనారాయణ (48) తణుకులోని ఆసుపత్రిలో తన కుమార్తె ఉండడంతో మోటార్ సైకిల్పై బయలుదేరాడు. జాతీయ రహదారి షర్మిష్ట సెంటర్ వద్ద రోడ్డు దాటుతుండగా విజయవాడ నుంచి విశాఖపట్నం వైపు వెళుతున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సత్యనారాయణను చికిత్స నిమిత్తం తణుకులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా కొద్దిసేపటికే ఆయన మృతిచెందారు. ప్రమాదంలో మృతుడు నడుపుతున్న మోటార్ సైకిల్ నుజ్జునుజ్జు కాగా కారు అదుపుతప్పి డివైడర్ ఎక్కింది. తణుకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మితిమీరిన వేగం జంక్షన్ ప్రాంతంలో వేగ నియంత్రణ నిబంధనలు ఉన్నా ఖమ్మంనకు చెందిన కారు అతి వేగంగా జంక్షన్లో రోడ్డు దాటుతున్న సత్యనారాయణ వాహనాన్ని ఢీకొట్టిందని స్థానికులు చెబుతున్నారు. కారు వేగానికి ద్విచక్ర వాహనాన్ని ఈడ్చుకుంటూ ఏకంగా డివైడర్ ఎక్కి ఆగింది. వేగం కారణంగా నిండు ప్రాణం బలైపోయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కారు ఢీకొని మోటార్సైక్లిస్టు మృతి -
ముగిసిన ర్యాపిడ్ చెస్ పోటీలు
ఏలూరు రూరల్: నగరంలోని సత్రంపాడు సిద్ధార్థ విద్యాలయంలో నాల్గో ఏజీసీఓ, ఎంకేపీజే రాష్ట్రస్థాయి ఓపెన్ ర్యాపిడ్ చెస్ పోటీలు ఆదివారం ముగిశాయి. రాష్ట్ర నలుమూలల నుంచి 114 మంది చిన్నారులు తరలివచ్చారు. వై.ప్రేమరక్షిత ప్రథమ, కుష్యంత్ ద్వితీయ, సీహెచ్ వివేక్ తృతీయ స్థానంలో నిలిచారు. వీరితో పాటు ప్రతిభ చాటిన కె.ఓంకార్, జి.కృష్ణారెడ్డి, జి.అవ్రహామ్, కె.తిషంకాకోటి, ఎ.అభిరామ్, జి.అనురూప్మోషే, జ్యోతిస్వరూప్లకు నిర్వాహకులు సర్టిఫికెట్లు, షీల్డ్స్ అందజేశారు. విజయ మల్టీస్పెషాలటీ హాస్పటల్ ఎండీ డాక్టర్ కల్పన, చెస్ అకాడమీ డైరెక్టర్ జి.యోహనాన్, ఎంకేపీజే డైరెక్టర్ వై.మహేష్, సెయింట్ ఆన్స్ కళాశాల అధ్యాపకులు కె.అరుణ, జి.స్వరూపరాణి, జి.విజయ్ పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని దుకాణాల్లో పనిచేసే కార్మికులంతా స్వీయగణన నమోదు చేసుకోవాలని ఉప కార్మిక కమిషనర్ పి.శ్రీనివాస్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సో మవారం ఈ కార్యక్రమం చేపట్టాలని కోరారు. కార్మిక సంఘాల నాయకులు తమ సంఘాల్లోని కార్మికులు స్వీయగణనలో నమోదు చేసుకునేలా అవగాహన కలిగించాలని సూచించారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వచ్చేనెల 6న మహాధర్నా నిర్వహించనున్నట్టు వైఎస్ఆర్టీఏ రాష్ట్ర అధికార ప్రతినిధి గెడ్డం సుధీర్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వడ్లమూడి రామ్మోహన్, పగడాల సాంబశివరావు ప్రకటనలో తెలిపారు. విజయవాడ ధర్నా చౌక్లో ఉదయం 10 గంటలకు మహా ధర్నా నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి 26 జి ల్లాల నుంచి వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు పాల్గొంటున్నారని, ఉపాధ్యాయ ఎ మ్మెల్సీలు టి.కల్పలతరెడ్డి, పి.చంద్రశేఖర్రెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి పాల్గొంటారన్నారు. ధర్నాకు వైఎస్సార్టీఏ మండల, జిల్లా నాయకులు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. తక్షణమే పీఆర్సీ కమిషన్ నియమించాలని, 30 శాతం ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న డీఏలను మంజూరు చేయాలని, పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆగిరిపల్లి: త్వరలోనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఏడీఏ భవానీ తెలిపారు. ఆదివారం ‘సాక్షి’లో ‘మొక్కజొన్నకు అందని మద్దతు ధర’ శీర్షికన ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలని ప్రభుత్వానికి నివేదికలు పంపించామని, ఆదేశాలు రాగానే ఏర్పాటుచేస్తామని ఏడీఏ భవానీ తెలిపారు. -
ఎర్రకాలువ జలాశయానికి తూట్లు
జంగారెడ్డిగూడెం మండలం వేగవరంలో ఎర్రకాలువ జలాశయం మరోవైపున తవ్వకాలు జంగారెడ్డిగూడెం: ఏజెన్సీ, మెట్ట ప్రాంతంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. తవ్వేయ్.. తరలించేయ్.. అన్నట్టు ఇష్టానుసారంగా చెరువులు, కాలువ గట్లు, జలాశయాలను తవ్వేస్తున్నారు. మట్టిని తవ్వి కమర్షియల్ లేఅవుట్లకు, ఇటుక బట్టీలకు మట్టిని తరలించి లక్షలాది రూపా యలు దోపిడీ చేస్తున్నారు. వాస్తవానికి మట్టి తరలింపునకు అనుమతులు తీసుకున్నా, కేవలం రైతులు తమ పొలాలను మెరక చేసుకునేందుకు మాత్రమే తరలించాలి. కానీ మట్టి మాఫియా మాత్రం యథేచ్ఛగా కమర్షియల్ వెంచర్లకు మ ట్టిని తరలించేస్తున్నాయి. జంగారెడ్డిగూడెం మండలంలోని ఎర్రకాలువలో జలాశయ గర్భాన్నీ తవ్వేస్తున్నారు. దీంతో జలాశయంలో భారీ గోతులు ఏర్పడి మృత్యుపాశాలుగా మారుతున్నాయి. రేయింబవళ్లు యథేచ్ఛగా తవ్వకాలతో ఎర్రకాలువ జలాశయానికి, పర్యావరణానికి తీవ్ర నష్టం తప్పదని పలువురు అంటున్నారు. తవ్వకాలు ఇంతలా జరుగుతున్నా అధికారులు కన్నెత్తి చూడటం లేదు. అలాగే మండలంలోని శ్రీనివాసపురం, తిరుమలాపురం, కేతవరం తదితర గ్రామాల్లో చెరువులను తవ్వేసి మట్టిని కొల్లగొడుతున్నారు. కొయ్యలగూడెం మండలంలో బయ్యన్నగూడెం, యర్రంపేట, కనకాద్రిపురం, రాజవరం, గవరవరం, అలాగే జీలుగుమిల్లి మండలంలో కాలువ గట్లు, చెరువుల్లో కూడా మట్టి తవ్వకాలు ఇష్టారాజ్యంగా జరుగుతున్నాయి. తాజాగా తాటియాకులగూడెంలోని చెరువుల్లో మట్టిని తవ్వి అక్రమంగా రవాణా చేస్తున్నారు.యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు -
ఉపాధ్యాయుల మహాధర్నా
ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించే వరకూ పోరాటం కొనసాగిస్తామని పీఆర్ఆటీయూ ఏలూరు జిల్లా అధ్యక్షుడు పువ్వుల ఆంజనేయులు స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం విజయవాడ ధర్నా చౌక్లో శనివారం పీఆర్టీయూ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12వ పీఆర్సీ కమిటీని తక్షణం నియమించాలని, 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను ప్రకటించాలని, సీపీఎస్ను రద్దు చేయాలని, ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయాలని, ఈహెచ్ఎస్ (హెల్త్ కార్డ్స్) వినియోగంలో లోపాలను సరిచేసి అన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో అన్ని వ్యాధులకు వర్తించేలా చూడాలని, 1998, 2008 ఎంటీఎస్ టీచర్లను క్రమబద్ధీకరణ చేయాలన్న ముఖ్యమైన 27 డిమాండ్ల సాధనకై ధర్నా చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం స్పందించి ఈ సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఏలూరు (ఆర్ఆర్పేట): వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటలక్ష్మమ్మ ఒక ప్రకటనలో హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని యాజమాన్య పాఠశాలలకు ఈనెల 24 నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించిందని, అయినప్పటికీ కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఈ సెలవుల కాలంలో కూడా తరగతులు నిర్వహిస్తున్నట్టు అధికారుల దృష్టికి సమాచారం అందిందన్నారు. వేసవి సెలవుల సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాలలను నిర్వహించడం గాని, విద్యార్థులకు తరగతులు నిర్వహించడం గాని పూర్తిగా నిషేధించినట్టు స్పష్టం చేశారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘించిన పక్షంలో పాఠశాలల గుర్తింపు రద్దు సహా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. -
క్రీడా శిక్షణ శిబిరాలు విజయవంతం చేయాలి
ఏలూరు రూరల్ : మే 1 నుంచి 31 వరకూ జిల్లాలో చేపట్టనున్న 60 వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు విజయవంతం చేయాలని సెట్వెల్ సీఈఓ కేఎస్ ప్రభాకర్ అన్నారు. శనివారం ఆయన ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో ఆట స్థలాలను పరిశీలించారు. అనంతరం డీఎస్డీఓ ఎస్ఏ అజీజ్ ఆధ్వర్యంలో జిల్లా స్కూల్గేమ్స్ సెక్రటరీ అలివేలుతో పాటు పలువురు వ్యాయామ ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. నెల రోజుల పాటు సాగే క్రీడా శిక్షణ శిబిరాల్లో పాల్గొనే బాలబాలికలకు ఆటలపై ఆసక్తి పెంచాలన్నారు. ఉదయం 6 నుంచి 8 వరకూ, సాయంత్రం 5 నుంచి 7.30 నిమషాల వరకూ శిక్షణ కొనసాగుతుందన్నారు. ఇందులో 8 ఏళ్ల నుంచి 14 ఏళ్ల లోపు బాలబాలికలకు శిక్షణ ఇచ్చి, ప్రతిభ గలవారిని గుర్తించి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలన్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు పాఠశాల పిల్లలను శిబిరాలకు తరలివచ్చేలా కృషి చేయాలన్నారు. -
డీజిల్ నో స్టాక్
జిల్లా వ్యాప్తంగా ఈనెల 26, 29, 30న, అలాగే మే 7, 8, 9, 13 తేదీల్లో భారీగా వివాహాలు జరగనున్నాయి. ఇప్పటికే పెళ్లివారు వివాహాలు, రిసెప్షన్లు జరుపుకునేందుకు ఫంక్షన్ హాల్స్ బుక్ చేసుకున్నారు. ప్రస్తుతం ఎండ వేడి, ఉక్కబోత తీవ్రంగా ఉండటంతో ఏసీ ఫంక్షన్ హాల్స్కే వారు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. పెళ్లి వారి నుంచి ఫంక్షన్ హాల్స్ యజమానులు సెంట్రల్ ఏసీకి గంటకు రూ.2,500 నుంచి రూ.3 వేలు వరకు తీసుకుంటున్నారు. ఫంక్షన్ అయ్యే వరకు జనరేటర్ మీదే సెంట్రల్ ఏసీ పనిచేస్తుంది. అందువల్ల ఇప్పుడు ఫంక్షన్ సజావుగా సాగాలంటే డీజిల్ తప్పనిసరిగా ఉండాల్సిందేనని ఫంక్షన్ హాల్స్ యజమానులు అంటున్నారు. ద్వారకాతిరుమల: గతంలో ఎన్నడూ లేని పరిస్థితి. డీజిల్ కోసం అన్నదాతలు, ఆక్వా రైతులు, ఆటో కార్మికులు, లారీ డ్రైవర్లు రోడ్డెక్కాల్సిన దుస్థితి. పాలకుల అసమర్థత, అధికారుల నిర్లక్ష్యం కారణంగా అన్నివర్గాల ప్రజలు డీజిల్ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొరత లేదంటూ అధికారులు ప్రకటనలు చేస్తున్నా.. కళ్లముందు బంకుల్లో క్యూలు పరిస్థితి అద్దం పడుతోంది. జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల్లో శనివారం డీజిల్ నో స్టాక్ బోర్డులే కనిపించాయి. ఉదయం కొన్ని బంకుల్లో డీజిల్ ఉన్నట్టు తెలుసుకున్న రైతులు, వ్యాపారులు, వాహన చోదకులు బారులు తీరారు. డీజిల్ నిల్వ చేసుకునేందుకు డబ్బాలు పట్టుకుని బంకుల వద్ద పడిగాపులు పడ్డారు. కొద్దిసేపటికే బంకుల యజమానులు డీజిల్ లేదంటూ చేతులెత్తేశారు. దాంతో వారంతా నిరాశతో వెనుదిరిగారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే లోడు లారీలు రహదార్లపై భారీగా నిలిచిపోయాయి. ప్రస్తుతం జరిగే వివాహాలపై డీజిల్ ఎఫెక్ట్ పడింది. డీజిల్ కొరత కొనసాగితే ప్రజలకు ఇక్కట్లు తప్పవు. రవాణా నిలిచిపోతే నిత్యావసర సరుకులతో పాటు, ప్రతి వస్తువు ధర రెట్టింపయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుతం అన్ని సరుకులు రవాణా చేసే లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఉరుకులు పరుగులు జిల్లా వ్యాప్తంగా జరిగే వేలాది వివాహాల్లో అధిక శాతం వివాహాలు ద్వారకాతిరుమల శ్రీవారి సన్నిధిలోనే జరుగుతాయి. అధిక శాతం ఏసీ కల్యాణమండపాలే ఉన్నాయి. ఆదివారం క్షేత్రంలో భారీగా పెళ్లిళ్లు జరగనున్న నేపధ్యంలో దాదాపు కల్యాణ మండపాలన్నీ ముందే బుక్ అయ్యాయి. శనివారం డీజిల్ కొరత ఏర్పడడంతో ఫంక్షన్ హాల్స్ యజమానులపై పిడుగు పడింది. వెంటనే డీజిల్ కోసం పరుగులు తీయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో కొందరు యజమానులు పక్క రాష్ట్రంలోని సత్తుపల్లి నుంచి డీజిల్ను దిగుమతి చేసుకున్నారు. ట్యాంకర్ డీజిల్ను రెండు మూడు రోజుల పాటు జనాలకు సరిపెట్టాలని బంకుల యజమానులకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో ద్వారకాతిరుమల తహసీల్దార్ జేవీ సుబ్బారావు డీజిల్ను డబ్బాల్లో కొట్టొద్దని, ఒక్కొక్కరికి 10 లీటర్లు మాత్రమే అందించాలని బంకుల యజమానులకు సూచించినట్టు తెలిసింది. ఇదిలా ఉంటే శనివారం సాయంత్రం కొన్ని బంకులకు వచ్చిన ట్యాంకర్లు తక్కువ డీజిల్ను దిగుమతి చేసి వెళ్లిపోయాయి. దాంతో యజమానులు కొద్దిసేపు ఆయిల్ కొట్టి, లాక్ పడిందంటూ చేతులెత్తేశారు. ఇదిలా ఉంటే డబ్బాల్లో ఆయిల్ కొట్టకపోతే తమకు ఇబ్బందులు తప్పవని పలువురు రైతులు అంటున్నారు. ద్వారకాతిరుమల శ్రీవారి కొండపైన మాధవ కల్యాణ మండప సముదాయం గ్యాస్ కొరతకు ప్రత్యామ్నాయం కట్టెలు. కానీ డీజిల్కు ప్రత్యామ్నాయం లేదు. దాంతో డీజిల్ కోసం పరుగులు తీయాల్సి వస్తోంది. ఆదివారం నుంచి ఫంక్షన్లు భారీగా జరుగుతాయి. డీజిల్ లేకపోతే సెంట్రల్ ఏసీలు పనిచేయవు. అలాగే ఫంక్షన్ జరిగే సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినా ఇబ్బందే. వివాహాలను దృష్టిలో పెట్టుకుని ఫంక్షన్ హాల్స్కు ఎక్కువ డీజిల్ సరఫరా అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. – ఓజీఆర్ కుమార్, ఎస్వీఎస్ ఫంక్షన్హాల్ యజమాని, ద్వారకాతిరుమల జిల్లా వ్యాప్తంగా రైతులు, వ్యాపారులు, వాహనదారుల ఇక్కట్లు పెళ్లిళ్లపై తీవ్ర ప్రభావం దిక్కుతోచని స్థితిలో ఫంక్షన్ హాల్స్ యజమానులు -
ఏలూరు మాదేపల్లిలో వ్యక్తి హత్య
పాతకక్షల నేపథ్యంలోనే గొడవ? ఏలూరు టౌన్: ఏలూరు రూరల్ పరిధిలోని మాదేపల్లి రోడ్డు వంకినేని ప్లాట్స్ సమీపంలో శనివారం రాత్రి ఒక వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు రాళ్లతో కొట్టి హతమార్చారు. పదిమందికి పైగా వ్యక్తులు పేకాట ఆడుతూ ఉండగా... వివాదం చెలరేగి ఒక వ్యక్తిని అత్యంత కిరాతకంగా రాళ్లతో కొట్టి చంపారు. సమాచారం అందుకున్న ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ పోలీస్ అధికారులను అప్రమత్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ట్రైనీ ఐపీఎస్ జయశర్మ, ఏలూరు వన్టౌన్ సీఐ సత్యనారాయణ పరిస్థితిని పరిశీలిస్తున్నారు. వంకినేని ప్లాట్స్ సమీపంలో రాత్రివేళ పేకాట ఆడుతూ ఉండగా... వివాదం చెలరేగి మాదేపల్లి ప్రాంతానికి చెందిన రాయి నూకరాజు అనే వ్యక్తిని పాలగూడెం ప్రాంతానికి చెందిన సంచర్ల మహేష్, సుంకరవారితోటకు చెందిన సత్తిబాబు అనే ఇద్దరు ఇటుకరాయిలతో తలపై విచక్షణారహితంగా కొట్టి హత్య చేశారు. నిందితుల్లో ఒకరు మహేష్పై పోలీస్ షీట్ ఉన్నట్లు సమాచారం. హత్యకు గురైన నూకరాజుకు భార్య, పిల్లలు ఉండగా, కూలిపనులు చేస్తుంటాడని తెలుస్తోంది. ఏలూరు రూరల్ పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. పాతకక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైందని చెబుతున్నారు. ఇంతకీ ఈ హత్యఘటనలో ఇద్దరు మాత్రమే ఉన్నారా ? లేక ఇంకా ఎవరైనా ఉన్నారా ? అనేది పోలీస్ విచారణలో తేలాల్సి ఉంది. ద్వారకాతిరుమల: మండలంలోని పంగిడిగూడెంకు చెందిన పారా అథ్లెట్ కస్సే పవన్ కుమార్ జాతీయ స్థాయిలో మరో విజయాన్ని సాధించాడు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్ఏఐ) నిర్వహించిన నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (ఎన్సీఓఈ) పారా అథ్లెటిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అద్భుత ప్రతిభ కనబరిచి శిక్షణకు ఎంపికయ్యాడు. ఖీ46 కేటగిరీలో పాల్గొన్న పవన్ కుమార్ 100 మీటర్లు, 200 మీటర్లు, లాంగ్ జంప్ ఈవెంట్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి అంతర్జాతీయ కోచ్లను ఆకట్టుకున్నాడు. అతని ప్రతిభను గుర్తించిన అధికారులు అతనిని ఎన్సీఓఈ శిక్షణకు ఎంపిక చేశారు. ట్రైనింగ్ లిస్ట్ విడుదలైన తరువాత పవన్ కుమార్ గుజరాత్, బెంగళూరు, కేరళ లేదా కోల్కతా లోని ఎస్ఏఐ ఎన్సీఓఈ కేంద్రాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నత స్థాయి శిక్షణ పొందనున్నాడు. పాలకొల్లు సెంట్రల్: ఈ నెల 16వ తేదీన యలమంచిలి మండలం బూరుగుపల్లి గ్రామంలో నూకాలమ్మవారి జాతరలో రౌడీ షీటర్లు, కిరాయి వ్యక్తులు హల్చల్ చేసి కారుతో గుద్ది ఒక వ్యక్తిని హత్యచేసి మరో వ్యక్తిపై హత్యాయత్నం జరిపిన ఘటనలో బోణం గణేష్కుమార్తో పాటు మరో ఎనిమిది మందిని అరెస్టు చేశారు. మిగిలిన వారి గురించి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా శనివారం మరో ఐదుగురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితులను కోర్టు రిమాండ్కు పంపినట్లు రూరల్ సీఐ జి శ్రీనివాస్ తెలిపారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. దొరికిన ఐదుగురు నిందితుల్లో భీమవరంనకు చెందిన నలుగురు రౌడీషీటర్లు ఉన్నట్లు చెప్పారు. -
మద్దతు ధర చట్టం చేయాలి
జంగారెడ్డిగూడెం: పంట రుణాలను పూర్తిగా రద్దు చేసి, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని తీసుకువచ్చినపుడే రైతులు సంక్షోభం నుంచి బయటపడతారని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ అధ్యక్షుడు అశోక్ ధావలే అన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభల సందర్భంగా ఉద్దరాజు రామం మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలోని సూర్య కిరణ్ ఫంక్షన్ హాలులో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. జూన్ 3, 4, 5 తేదీల్లో ఏలూరులో జరగనున్న రైతు సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ ఈ సదస్సుకు అధ్యక్షత వహించారు. గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులు అశోక్ ధావలేకు తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఆగిరిపల్లి: మండలంలోని నెక్కలం గొల్లగూడెంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులను డీసీఎం వాహనం ఢీకొనడంతో ఒక యువకుడు మృతి చెందగా, మరొక యువకునికి గాయాలయ్యాయి. ఎస్సై శుభశేఖర్ తెలిపిన వివరాలు ప్రకారం గ్రామానికి చెందిన పిన్నిబోయిన హరికృష్ణ (18) ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేశాడు. శనివారం మధ్యాహ్నం అడ్డరోడ్డు నుంచి తన ద్విచక్ర వాహనంపై తన మిత్రుడితో కలిసి ఇంటికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న డీసీఎం వాహనం ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హరికృష్ణని చికిత్స కోసం విజయవాడకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మరో యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తండ్రి పంగిడియ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై శుభశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అబాసుపాలు
సాక్షి, భీమవరం : ఆపద ఎదురైనప్పుడు ఎవరైనా రక్షణ కోసం చూసేది పోలీసుల వైపే. కాగా జిల్లాలోని పోలీసు లోకల్ బాస్లు కొందరు పాలక పక్షాల నేతలకు కొమ్ముకాస్తూ గుట్టుచప్పుడు కాకుండా తెరవెనుక సెటిల్మెంట్లు, పైరవీలు ఎన్నో చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఎమ్మెల్యేలు, ఇతర నేతల వద్ద మెప్పు కోసం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారంటున్నారు. 2022 ఆగస్టు 5న పాలకొల్లులో టిడ్కో లబ్ధిదారులకు ప్లాట్ల పంపిణీ సందర్భంగా చోటుచేసుకున్న ఘటనపై రెండేళ్ల తర్వాత 2024 డిసెంబర్ 13న పాలకొల్లు పట్టణ పోలీస్ స్టేషన్లో వైఎస్సార్సీపీకి చెందిన 24 మందిపై కేసులు నమోదు చేశారు. కూటమి పాలన వైఫల్యాలను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్న వారిని పాలకపక్షం నేతలు పోలీసుల అండతో కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారు. కక్షతో వైఎస్సార్సీపీ నేతలపై వేధింపులు అత్తిలి ఎంపీపీ ఉప ఎన్నికలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నివాసాన్ని అల్లరి మూకలు ముట్టడించి వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులు ఎన్నికకు హాజరుకాకుండా అడ్డుకున్నప్పుడు పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారన్న విమర్శలున్నాయి. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తణుకు వై జంక్షన్లోని వైఎస్సార్ విగ్రహం వద్ద కూటమి నేతల ఫొటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం వివాదస్పదమైంది. అప్పుడు మొదలైన పోలీస్ పికెటింగ్ కొద్దిరోజుల క్రితం వరకు కొనసాగింది. అత్తిలిలో విగ్రహం ఏర్పాటు ప్రయత్నాలు వివాదస్పదం కావడంతో కొద్దినెలలుగా పోలీస్ పికెటింగ్ కొనసాగుతోంది. కూటమి హయాంలో జిల్లాలోని భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాలు కోడిపందేలు, పేకాట తదితర జూదాలకు స్థావరాలకు నిలయంగా మారాయన్న విమర్శలు ఉన్నాయి. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారంటున్నారు. తణుకు పోలీసు సర్కిళ్లు వివాదస్పదంగా మారాయి. ఏళ్ల తరబడి కొందరు సర్కిళ్ల పరిధిలో తిష్టవేసి సెటిల్మెంట్లు వ్యవహారాలు నడుపుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. రెండు సర్కిళ్లలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీని పరిస్థితి. జనవరి 25న తణుకు రూరల్ సీఐ, ఎస్సైలు, 27న అత్తిలి ఎస్సై లీవ్పై వెళ్లిపోయారు. రెండు రోజుల వ్యవధిలో ఒక సీఐ, ఇద్దరు ఎస్సైలు సెలవుపై వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. ఫిబ్రవరిలో తణుకు అర్బన్ సీఐ, ఎస్సైలను ఉన్నతాధికారులు రేంజ్ వీఆర్కు పంపడం గమనార్హం. ఫ్లెక్సీల వివాదాలు, ఇతర ఆరోపణలకు వారిపై ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఆకివీడు సీఐపై సస్పెన్షన్ వేటు పడింది. దళిత బాలికపై లైంగిక దాడికేసులో భీమవరం పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. బాలికకు న్యాయం చేయాల్సింది పోయి నిందితులకు కొమ్ము కాస్తారా? అంటూ మండిపడింది. అధికార పక్షానికి చెందిన నిందితులను రక్షించేందుకు పోలీసులు కేసు వాపసు తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారంటూ న్యాయం కోసం బాలిక తల్లి హైకోర్టును ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగుచూసింది. జిల్లా వ్యాప్తంగా బయటపడని ఉదంతాలెన్నో?.నక్కల డ్రెయిన్లో అక్రమ మట్టి తవ్వకాలు అడ్డుకోవాలని ఆచంటకు చెందిన రైతులు అధికారులకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేక వారం క్రితం డ్రెయిన్ వద్ద బైఠాయించారు. స్థానిక కూటమి నేతల ఒత్తిళ్లతో పోలీసులు రైతులను నిర్భంధించి పక్కకు తరలించారు. మరుసటిరోజు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాకోసం ముందస్తు అనుమతి తీసుకున్నారు. ఎండ తీవ్రతతో నీడ కోసం టెంట్ ఏర్పాటు చేసుకుంటుండగా అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. అక్రమ తవ్వకాలు అడ్డుకోవడం మాని తమపై జులం ప్రదర్శిస్తున్నారంటూ పోలీసుల తీరు పట్ల రైతులు నిరసన తెలిపారు. పాలక పక్షాల సేవలో పోలీసు అధికారులు నిబంధనలు తుంగలో తొక్కి రెడ్బుక్ రాజ్యాంగం సెటిల్మెంట్లు, పైరవీలతో సరి ఇప్పటికే వీఆర్, సెలవులో పలువురు సీఐలు, ఎస్సైలు చర్చనీయాంశంగా భీమవరం పోలీసులపై హైకోర్టు అక్షింతల వ్యవహారం -
దేవస్థానం అన్నప్రసాదంలో పురుగు
జంగారెడ్డిగూడెం: స్థానిక గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో అందిస్తున్న అన్నప్రసాదంలో పురుగు రావడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్న ఓ చిన్నారి భోజనంలో పురుగు రాగా తండ్రికి చూపించింది. దీంతో వెంటనే ఆ విషయాన్ని సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లగా ప్లేటులో ఉన్న అన్నం పడేసి రండి... మళ్లీ పెడతామంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని చిన్నారి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై చిన్నారి తండ్రి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్ అయింది. ఆలయ ఈఓ చిన్నారి తండ్రికి ఫోన్ చేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను పోలీస్స్టేషన్లో పెట్టి కుమ్మించేస్తానని.. కేసులు బనాయిస్తానని ఈఓ బెదిరించినట్లు చెప్పారు. జరిగిన తప్పును సరిదిద్దుకోవాల్సింది పోయి ఆలయ సిబ్బంది, ఈఓ కూడా దురుసుగా వ్యవహరించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ఈ ఘటనపై ఆలయ ఈఓ కలగరశ్రీనివాస్ను వివరణ కోరగా అదంతా ఒట్టిదేనని.. అలాంటిదేమి జరగలేదని తెలిపారు. -
మొక్కజొన్నకు అందని మద్దతు ధర
ఆగిరిపల్లి: మొక్కజొన్న దిగుబడి ఆశాజనకంగా ఉన్న ప్రభుత్వం మద్దతు లేకపోవడంతో ఆరుగాలం కష్టపడిన రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్నకు మద్దతు ధర ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులకు నష్టాలు తప్పడం లేదు. ప్రస్తుతం పంట పూర్తిగా కొతకు వచ్చి దిగుబడులు సైతం రైతు చేతికి వచ్చాయి. అయితే ఆశించిన ధర లభించక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు రూ.30 వేల వరకు నష్టం మండలంలో 1,600 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న పంటను వేశారు. ఎకరానికి 35 నుంచి 40 క్వింటాలు దిగుబడి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం సైతం మొక్కజొన్న పంటకు క్వింటాకు రూ.2400 మద్దతు ధర ప్రకటించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఇప్పటికీ ఏర్పాటు చేయకపోవడంతో రైతులకు మద్దతు ధర అందని పరిస్థితి. దీంతో దళారులు రూ.1,600 నుంచి రూ.1,700కు మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నారు. చేసేది లేక రైతులు ఈ ధరకు అమ్ముకోవడంతో క్వింటాకు రూ.700 నుంచి రూ.800కు నష్టపోతున్నారు. అంటే ఎకరాకు సుమారు రూ.25 నుంచి రూ.30 వేల వరకు నష్టపోతున్నారు. అంతేకాకుండా దళారులు క్వింటా బస్తాకు అదనంగా కేజీ తీసుకుంటున్నారని రైతులు వాపోతున్నారు. విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రైతులు ఆరోపిస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో క్వింటాల్ మొక్కజొన్నకు రూ.2,600 వరకు మద్దతు ధర లభించేది. అంతేకాకుండా ప్రతి ఏడాది మద్దతు ధర పెంచుతూ వచ్చింది. దీంతో మొక్కజొన్న సాగు చేసిన రైతులకు నష్టం పోవడం అనే ప్రశ్న ఉండేది కాదు. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మద్దతు ధర రూ.200 రూపాయలు తగ్గించడంతోపాటు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయని రాష్ట్ర ప్రభుత్వం రైతులను దోచుకుంటున్న దళారులు కిలోకు రూ.700 వరకు నష్టపోతున్నామని ఆవేదన నేను ఐదు ఎకరాల్లో మొక్కజొన్న పంటను వేశాను. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులు క్వింటా మొక్కజొన్నను రూ.1500కు కొనుగోలు చేస్తామని చెబుతున్నారు. దీంతో పంట కోయకుండా వదిలేశాను. – దండిబోయిన వెంకటేశ్వరరావు, రైతు, ఈదులగూడెం మొక్కజొన్న పంటకు శ్రమ, చీడపీడలు ఎక్కువే. పంట చివరి వరకు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో క్వింటాకు రూ.700 వరకు నష్టపోతున్నాం. మద్దతు ధర అందితే రైతులకు లాభం వచ్చేది. – గుజ్జర్లపూడి తిరుపతిరావు, రైతు, చొప్పరమెట్ల -
ప్రశాంతంగా పాలిసెట్
ఏలూరు (ఆర్ఆర్పేట): పాలిసెట్ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగాయని ఏలూరు జిల్లా కోఆర్డినేటర్ పీ.సుబ్రహ్మణ్యం తెలిపారు. శనివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జిల్లాలోని ఏలూరులో 9 కేంద్రాలతో పాటు జంగారెడ్డిగూడెంలో మూడు, నూజివీడులో మరో మూడు కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించారు. ఏలూరులోని 9 కేంద్రాల్లో మొత్తం 3248 మంది విద్యార్థులకు గాను 2905 మంది హాజరయ్యారు. జంగారెడ్డిగూడెంలోని 3 పరీక్షా కేంద్రాల్లో 1272 మందికి 1149 మంది విద్యార్థులు హాజరు కాగా, నూజివీడులోని మూడు కేంద్రాల్లో మొత్తం 835 మంది విద్యార్థులకు 765 మంది విద్యార్థులు హాజరయ్యారు. జంగారెడ్డిగూడెం: పట్టణంలోని ఏలూరు రోడ్డు మహేంద్ర ట్రాక్టర్ షోరూం వద్ద 7 అడుగుల గోధుమ త్రాచుపామును గుర్తించారు. వెంకటేశ్వర ఇంజనీరింగ్ వర్క్ షాప్ దగ్గర స్క్రాప్ తీస్తుండగా రేకు కింద పాము ఉండటాన్ని గమనించి స్నేక్ సేవియర్స్ సొసైటీకి సమాచారం అందించారు. సంస్థ ప్రతినిధి చదలవాడ క్రాంతి అక్కడికి చేరుకుని పామును సురక్షితంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఏలూరు రూరల్ : మే 5, 6 తేదీల్లో ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఆవరణలో రాష్ట్ర స్థాయి సీనియర్ మెన్, ఉమెన్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలు జరగనున్నాయని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి దేవరపల్లి ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఈ నెల 29న ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు చేపట్టనున్నామని వివరించారు. ఈ పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటిన అథ్లెట్లను జిల్లా జట్లకు ఎంపిక చేస్తామని వెల్లడించారు. ఆసక్తి గలవారు రూ.100 ఎంట్రీ ఫీజు చెల్లించి ఆధార్, వయస్సు ధ్రువీకరణ పత్రాలతో ఉదయం 6.30 గంటలకు హాజరుకావాలని సూచించారు. మరింత సమాచారం కోసం 6281431202 నెంబర్కు ఫోన్ చేసి సంప్రదించాలన్నారు. బుట్టాయగూడెం: జిల్లాలోని కేఆర్పురం ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి బ్యాక్లాగ్ సీట్లకు, ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశం కోసం గిరిజన విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ఐటీడీఏ పీఓ కె. రాములు నాయక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బుట్టాయగూడెం మండలం కేఆర్పురం బాలుర గురుకుల పాఠశాల, బుట్టాయగూడెం గురుకుల పాఠశాల, జీలుగుమిల్లి బాలుర గురుకుల పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు బ్యాక్లాగ్ సీట్లను ప్రవేశ పరీక్ష మెరిట్ మార్కుల ఆధారంగా భర్తీ చేస్తారన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 22 నుంచి మే 20 వరకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. జూన్ 15వ తేదీన సంబంధిత పాఠశాలల్లో పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఈ ప్రవేశాలకు సంబంధించి విద్యార్థులు ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణులై ఉండాలి. భీమవరం(ప్రకాశంచౌక్) : దేవదాయ, ధర్మాదాయ శాఖకు చెందిన ఆలయాలు, సత్రాలకు సంబంధించిన భూములను పరిరక్షించుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని ఆ శాఖ డిప్యూటీ కమిషనర్ డీఎల్వి రమేష్బాబు తెలిపారు. అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో ఆలయాల ఈవోలతో శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాకు సంబందించి 700 ఎకరాల రికార్డులు పరిశీలించామని, దీనిపై సంబందిత ఈవోలు నివేదికలు సిద్ధం చేశారని తెలిపారు. తన పరిధిలోని 7 జిల్లాలకు సంబంధించి దేవాలయాల ఆస్తుల నివేదికలు సిద్ధంగా ఉన్నాయని ఆయన వివరించారు. -
తల్లీబిడ్డ ఆరోగ్యానికి ప్రాధాన్యం
కై కలూరు : ఆరేళ్ల లోపు పిల్లల మెదడును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం అందరి బాధ్యతని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. పోషణ పక్వాడా ముగింపు కార్యక్రమం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మండల పరిషత్ మీటింగ్ హాలులో శనివారం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉంటే సమాజం బాగుంటుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్రావు, ఆర్డీవో కిశోరు, ఐసీడీఎస్ అధికారి పి.శారద తదితరులు పాల్గొన్నారు. అనంతరం తహసీల్దారు కార్యాలయంలో ఎన్ఆర్ఈజీఎస్, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ, మత్స్యశాఖ అధికారులలో కలెక్టరు సమీక్ష నిర్వహించారు. ఆక్వా వాహనాలను రోడ్లపై పెట్టి నీటిని వదలడంతో రోడ్లు పాడవుతున్నాయని ఎమ్మెల్యే కలెక్టర్కు చెప్పారు. దీంతో ఆమె నాలుగు మండలాల రెవెన్యూ, ఫిషరీస్, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ శాఖలు మీటింగ్ పెట్టి వాహనదారులకు అవగాహన కలిగించాలన్నారు. సుఖ ప్రసవాలకు ప్రాధాన్యం అన్ని డెలివరీలు ప్రభుత్వ హాస్పిటల్లో జరగాలని, సుఖప్రసవాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. కై కలూరు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టరు శనివారం తనిఖీ చేశారు. 50 పడకల హాస్పటల్లో పనిచేసే వారి వివరాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటరు ప్రగతి సూచిక బోర్డులను పరిశీలించి వైద్యుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. హాస్పిటల్లో స్కానింగ్ సెంటర్, రేడియాలజిస్ట్ పోస్టు, వైద్యుడి పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. -
ఉపాధి హామీ అమలులో విఫలం
ఏలూరు టౌన్: కూటమి ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ కూలీల జీవనంపై దెబ్బకొడుతోందని వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ వింగ్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు పుప్పాల గోపి ఆరోపించారు. శనివారం ఏలూరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ పంచాయతీరాజ్ ప్రధాన కార్యదర్శి జ్ఞానారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కోటగిరి రాజా నాయనతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి అవినీతిపై ఉన్న శ్రద్ధ కూలీలకు వేతనాలు చెల్లించటం లేదన్నారు. 2025 డిసెంబర్ నుంచీ రాష్ట్రంలో ఏకంగా రూ.1000 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని విమర్శించారు. ఉపాధి హామీ పనులు చేసే కూలీలకు మండుటెండలో కనీసం మంచినీరు ఇవ్వలేని స్థితిలో ఈ దద్దమ్మ ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం మారిన వెంటనే కూటమి నేతలు తమకు అనుకూలమైన ఎఫ్ఏలను నియమించుకుని, ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. నకిలీ మస్తర్లు, బినామీ కూలీలతో అవినీతి దందా సాగుతుందని విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 27న వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం నాయకత్వంలో ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఉపాధి కూలీల సమస్యలు, అవినీతి, బకాయిల విడుదలపై ధర్నా చేపడతామని చెప్పారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ క్రిస్టియన్ మైనార్టీ కార్యదర్శి చిన్న అనిల్కుమార్, ఎంపీటీసీ సభ్యులు పంతులు వెంకన్నబాబు, వార్డు సభ్యులు రామయ్య తదితరులు ఉన్నారు. వైఎస్సార్ సీపీ పంచాయతీరాజ్ జిల్లా అధ్యక్షుడు పుప్పాల గోపి -
రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపిక
భీమవరం: ఈనెల 28 నుంచి మూడు రోజులపాటు అనంతపురంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలకు విష్ణు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ముగ్గురు ఎంపికయ్యారని కళాశాల ఫిజికల్ డైరెక్టర్ ఎం.శ్రీనివాసరావు చెప్పారు. తాడేపల్లిగూడెంలో ఈనెల 23న జరిగిన ఎంపిక పోటీల్లో తమ విద్యార్థులు ఎన్ శ్రీమాన్సాత్విక్, డి లీలాప్రవీణ్నాయక్, డి సత్యదేవిశ్రీసంతోష్ ప్రతిభ కనబరిచి జిల్లా టీమ్కు ఎంపికయ్యారన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ప్రిన్సిపాల్ ఎం.వేణు, వైస్ ప్రిన్సిపాల్ ఎం.శ్రీలక్ష్మి, పీడీ శ్రీనివాసరావు అభినందించారు. -
ఆగని మట్టి దోపిడీ
కొయ్యలగూడెం: అధికార గణం చేతులెత్తేయడంతో మట్టి దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. ఎర్రంపేట శరత్ చంద్ర చెరువు నుంచి మట్టి అక్రమ రవాణా 8వ రోజైనా శనివారం కూడా కొనసాగింది. భారీగా టిప్పర్లను ఏర్పాటు చేసి ఇటుక బట్టిలకు సాగునీటి చెరువు మట్టిని తరలించారు. దీంతో ఎర్రంపేట, ఆరిపాటి గ్రామాల మధ్య అంతంతమాత్రంగా ఉన్న రహదారి ఛిద్రమైందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి మట్టి అక్రమ రవాణా నిరోధించాలని ప్రజలు కోరుతున్నారు. కై కలూరు: ఆటపాక పక్షుల విహార కేంద్రంలో సంచరిస్తున్న మైనర్ ప్రేమజంటకు ఐసీడీఎస్ అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారు. కై కలూరుకు చెందిన ఇంటర్ చదువుతున్న బాలిక, ఇదే గ్రామానికి చెందిన యువకుడు (19) ఆటపాక పక్షుల విహార కేంద్రంలో సంచరిస్తుండగా జిల్లా ఐసీడీఎస్ పీడీ పీ.శారద వారిని చూసి ఇరువురికి కౌన్సిలింగ్ ఇచ్చి బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా పీడీ శారద మాట్లాడుతూ నిర్మానుష్య ప్రదేశాలలో జంటలు ఎవరైనా కనిపిస్తే 181 లేక 1098 టోల్ ఫ్రీ నెంబర్లకు తెలియజేయాలని కోరారు. జిల్లా బాలల సంరక్షణ అధికారి డాక్టర్ సీహెచ్.సూర్యచక్రవేణి, మిషన్ కోఆర్డినేటర్ ఈ. తులసి, కై కలూరు సీడీపీవో దీప్తి, సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా ఈ ఘటనపై అటవీశాఖ రేంజర్ కె.రామలింగాచార్యులను వివరణ కోరగా పర్యాటకుల పేరుతో టిక్కెట్లు తీసుకుని లోపలకి వెళుతున్నారని, వారి మధ్య అనుబంధం తెలీయడం లేదన్నారు. ఇకపై సిబ్బందితో నిఘాను పటిష్టం చేస్తామన్నారు. భీమవరం: నరసాపురం ప్రభుత్వాసుపత్రిలో గైనకాలజిస్ట్గా పనిచేస్తున్న డాక్టర్ పొన్నమండ వెంకట మహాలక్ష్మి (40) శుక్రవారం రాత్రి భీమవరం పట్టణంలోని తన నివాసంలో సీలింగ్ ఫ్యాన్కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు భీమవరం టూటౌన్ ఎస్సై రహమాన్ చెప్పారు. గుంటూరుకు చెందిన పి విజయలక్ష్మి కుమార్తె వెంకట మహాలక్ష్మికి రాజమహేంద్రవరానికి చెందిన పొన్నమండ చంద్రశేఖర్తో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులున్నారు. వెంకట మహాలక్ష్మి నరసాపురం ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తుండగా చంద్రశేఖర్ భీమవరం టూటౌన్ పరిధిలో సొంతంగా ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. అయితే శుక్రవారం రాత్రి 1 గంట సమయంలో వారు నివాసముంటున్న ఇంటిలో ఆమె ఉరివేసుకోగా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందింది. తల్లి విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రహమాన్ చెప్పారు. డాక్టర్ వెంకట మహాలక్ష్మి మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. -
బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం
నేడు వరుడు కానున్న శ్రీవారు ద్వారకాతిరుమల: చిన వెంకన్న వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలకు ద్వారకాతిరుమల క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలు వచ్చేనెల 3తో ముగియనున్నాయి. ఆలయాన్ని, పరిసరాలను విద్యుద్దీప తోరణాలతో అలంకరించారు. ఆలయ ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన స్వామివారి భారీ విద్యుత్ కటౌట్ చూపరులను ఆకట్టుకుంటోంది. ఉత్సవాలను పురస్కరించుకుని ఇప్పటికే ఆలయ పరిసరాల్లో చలువ పందిళ్లను నిర్మించారు. ప్రతి రోజు ఉదయం, రాత్రి వేళల్లో నిర్వహించే శ్రీవారి తిరువీధి సేవలకు స్వామివారి వాహనాలను ముస్తాబు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ నిమిత్తం ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలోని శ్రీహరి కళాతోరణ వేదికను సుందరీకరించారు. ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వ అక్స్ అఫీషియో కార్యదర్శి డాక్టర్ ఎం.హరి జవహర్లాల్కు, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుకు బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఆదివారం ఉదయం 10.30 గంటలకు స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలను చేయడంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయని ఆలయ ఈఓ తెలిపారు. -
భక్తులతో పోటెత్తిన ద్వారకాతిరుమల
ద్వారకాతిరుమల: సదా వేంకటేశం.. స్మరామి.. స్మరామి అంటూ శ్రీవారిని భక్త జనం మనసారా కొలిచింది. చిన్నతిరుపతిగా పేరొందిన ద్వారకాతిరుమల క్షేత్రం శనివారం భక్తులతో పోటెత్తింది. స్వామివారికి ప్రీతికరమైన రోజు, అందులోనూ వేసవి సెలవులు కావడంతో వేలాది మంది భక్తులు క్షేత్రానికి తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తుల రాక మొదలవడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. దర్శనం క్యూలైన్లు, వైకుంఠం క్యూకాంప్లెక్స్, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, ఉచిత ప్రసాద వితరణ క్యూలైన్లు, తూర్పురాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, కల్యాణకట్ట తదితర విభాగాలు భక్తులతో కిక్కిరిసాయి. పలు భజన మండలి సభ్యులు అనివేటి మండపంలో ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను అలరించాయి. -
మెట్టలో జల సంక్షోభం
చింతలపూడి: జిల్లాలోని మెట్ట ప్రాంతంలో వేసవి పూర్తిగా మొదలవ్వకముందే నీటి కష్టాలు మొదలయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా భూగర్భ జల మట్టాలు పడిపోయాయి. జలవనరులు అడుగంటిపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సాగునీరు అందక పంటలు ఎండిపోతుంటే, ఇటు పశువుల దాహం తీర్చేందుకు గుక్కెడు నీరు దొరకని పరిస్థితి ఏర్పడేలా ఉంది. నియోజకవర్గ పరిధిలో దాదాపు 450కి పైగా చెరువులు, కుంటలు ఉన్నాయి. సాధారణంగా ఈ సమయంలో కళకళలాడాల్సిన ఈ వనరులు ఇప్పుడు ఎడారిని తలపిస్తున్నాయి. వేలాది ఎకరాలకు జీవనాడి అయిన ఆంధ్ర కాలువ, ఎరక్రా లువలు పూర్తిగా ఎండిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. బోర్లలో నీరు పడిపోవడంతో రైతులు భారీగా పెట్టుబడులు పెట్టిన తోటలు, పంటలు కళ్లముందే ఎండిపోయే పరిస్ధితి ఏర్పడింది. పశువుల పరిస్థితి మరీ ఘోరం రైతుకు చేదోడు వాదోడుగా ఉండే పశుగ్రాసం, పశువుల తాగునీటి సమస్య ఇప్పుడు జటిలంగా మారింది. చెరువులు, కుంటల్లో నీరు లేకపోవడంతో మూగజీవాలు దాహంతో అలమటిస్తున్నాయి. పశువుల దాహం ఎలా తీర్చాలనేది ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో అతిపెద్ద ప్రశ్నగా మారింది. మెట్ట ప్రాంత ప్రజల కష్టాలను తీర్చడానికి తక్షణమే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మెట్ట ప్రాంతానికి శాశ్వత పరిష్కారం చూపే చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. ఇది పూర్తయితేనే వేలాది ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు అందుతుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చి రెండేళ్ళు కావస్తున్నా చింతలపూడి పథకం వైపు కన్నెత్తి చూడడం లేదని రైతులు విమర్శిస్తున్నారు. అడుగంటుతున్న భూగర్భ జలాలు చెరువుల్లో నీరు ఎండి పోవడంతో ప్రభుత్వం పశువుల తాగునీటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. చెరువుల సమగ్ర సర్వే చేపట్టి ఆక్రమణలో ఉన్న చెరువులకు విముక్తి కలిగించాలి. ఉపాధి హామీ నిధులతో చెరువుల పూడికను పూర్తి స్థాయిలో తీయిస్తే వర్షాకాలంలో చెరువుల్లో నీరు నిల్వ చేసుకోవచ్చు. – ఖాదర్బాబు రెడ్డి, నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతుల సమస్యలను పరిష్కరించాలి. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి మెట్ట ప్రాంతానికి గోదావరి జలాలను మళ్ళించాలి. రైతులకు శాశ్వత సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించాలి. –కంభం విజయరాజు, వైఎస్సార్సీపీ చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జి -
పాలిసెట్కు సర్వం సిద్ధం
● నేడు జిల్లా వ్యాప్తంగా 16 కేంద్రాల్లో పరీక్ష ● పరీక్షలు రాయనున్న 5278 మంది విద్యార్థులు ఏలూరు(ఆర్ఆర్పేట): పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ పరీక్ష జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నిర్వహించనున్నారు. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్షల నిమిత్తం జిల్లా వ్యాప్తంగా మొత్తం 15 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. పరీక్ష ఏర్పాట్లపై జాయింట్ కలెక్టర్ అన్ని శాఖల అధికారులతో సమీక్షించి సౌకర్యాల కల్పనపై ఆదేశాలు జారీ చేశారు. ఏలూరులోని సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల, సీఆర్ఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో ఏ, బీ సెంటర్లు, సీఆర్ఆర్ జూనియర్ మహిళా కళాశాల, డిగ్రీ మహిళా కళాశాల, సీఆర్ఆర్ అటానమస్ కళాశాల, సీఆర్ఆర్ ఇంటర్మీడియట్ బ్లాక్, సీఆర్ఆర్ పబ్లిక్ స్కూల్, ఏలూరులోని సెయింట్ థెరిస్సా అటానమస్ కళాశాల ఉన్నాయి. వీటితో పాటు జంగారెడ్డిగూడెంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, సూర్య జూనియర్ కళాశాల, శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్, నూజివీడులోని ఎస్ఆర్ఆర్ జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా ఈ పరీక్షలకు మొత్తం 5,278 మంది విద్యార్థులు హాజరుకానున్నట్టు అధికారులు తెలిపారు. వీరిలో ఏలూరులోని 9 పరీక్షా కేంద్రాల్లో 3,183 మంది విద్యార్థులు ఉండగా, జంగారెడ్డిగూడెంలోని 3 పరీక్షా కేంద్రాల్లో 1,270 మంది రాయనున్నారు. నూజివీడులోని మరో మూడు పరీక్షా కేంద్రాల్లో 825 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. అన్ని శాఖల సమన్వయంతో పరీక్షలు ఈ పరీక్షలను అన్ని శాఖల సమన్వయంతో నిర్వహించడానికి జాయింట్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. పోలీసు, ట్రెజరీ, వైద్య ఆరోగ్య శాఖలతో పాటు విద్య, విద్యుత్, రెవెన్యూ, ఆర్టీసీ శాఖలు సమయ్వనం చేసుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద రక్షణ చర్యలు తీసుకోవాలని, ప్రాథమిక చికిత్సకు శిబిరాలను ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖకు సూచించారు. దీనితో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్గా వ్యవహరించడానికి మండల విద్యాశాఖాధికారులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. విద్యార్థులు పరీక్షా సమయానికి అందుకునేలా తగిన బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. ఈ పాలిసెట్ పరీక్షలకు కూడా ఒక్క నిమిషం నిబంధన అమలులో ఉంది. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షా కేంద్రంలోకి అనుమతించం. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పరీక్ష జరుగుతుంది. ఉదయం 10 గంటల లోపు విద్యార్థులంతా పరీక్షా కేంద్రంలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. పీ. సుబ్రహ్మణ్యం, పాలిసెట్ ఏలూరు జిల్లా కో–ఆర్డినేటర్ -
రేపటి నుంచి బ్రహ్మోత్సవ వైభవం
● 30న రాత్రి తిరుకల్యాణం, మే 1న రాత్రి రథోత్సవం ● రోజుకో ప్రత్యేక అలంకారంలో శ్రీవారి దర్శనం ద్వారకాతిరుమల: చిన్నతిరుపతిలో జరిగే బ్రహ్మోత్సవాలు ఇలలో ఓ అద్భుతం.. బ్రహ్మోత్సవాలను ఈనెల 26 నుంచి వచ్చేనెల 3 వరకు ద్వారకాతిరుమల దేవస్థానం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనుంది. ఏటా వైశాఖ మాసంలో వెలసిన స్వామికి, ఆశ్వయుజ మాసంలో ప్రతిష్ఠ స్వామికి బ్రహ్మోత్సవాలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నెల 26 నుంచి శ్రీవారి వైశాఖమాస బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. స్వామివారు ఉభయ దేవేరులతో కలసి ఉదయం, సాయంత్రం వేళల్లో పలు వాహనాలపై తిరువీధుల్లో విహరించనున్నారు. రోజుకో విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. శ్రీహరి కళాతోరణ వేదికపై పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఉత్సవ విశేషాలు ● ఈ నెల 26న ఉదయం 10.30 గంటలకు శ్రీవారిని పెండ్లికుమారుడిగా, అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగా చేసి ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. రాత్రి 7 గంటల నుంచి గజ వాహనంపై గ్రామోత్సవం జరుగుతుంది. ● 27న రాత్రి 7 గంటల నుంచి అంకురారోపణ, ధ్వజారోహణ, అనంతరం రాత్రి 9 గంటల నుంచి హంస వాహనంపై గ్రామోత్సవం జరుగుతుంది. ● 28న ఉదయం 7 గంటల నుంచి సూర్యప్రభ, రాత్రి 7 గంటల నుంచి చంద్రప్రభ వాహనాలపై గ్రామోత్సవాలు జరుగుతాయి. ● 29న ఉదయం 7 గంటల నుంచి హనుమద్వాహనంపై గ్రామోత్సవం, రాత్రి 7.30 గంటల నుంచి ఎదుర్కోలు ఉత్సవం, అనంతరం వెండి శేష వాహనంపై శ్రీవారి గ్రామోత్సవం జరుగుతుంది. ● 30న రాత్రి 8 గంటల నుంచి శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవం, అనంతరం వెండి గరుడ వాహనంపై గ్రామోత్సవం, అదే రోజు ఉదయం 7 గంటల నుంచి సింహ వాహనంపై గ్రామోత్సవం జరుగుతుంది. ● మే 1న రాత్రి 8 గంటల నుంచి క్షేత్ర పురవీధుల్లో రథోత్సవం జరుగుతుంది. ● 2న ఉదయం 9 గంటల నుంచి చక్రవారి–అపభృధోత్సవం, మధ్యాహ్నం 3 గంటల నుంచి వేద సభ, రాత్రి 9 గంటల నుంచి పూర్ణాహుతి, మౌనబలి, ధ్వజావరోహణ, అనంతరం అశ్వ వాహనంపై శ్రీవారి గ్రామోత్సవం జరుగుతుంది. ● 3న ఉదయం 9 గంటల నుంచి చూర్ణోత్సవం, వసంతోత్సవం, రాత్రి 7 గంటల నుంచి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీపుష్పయాగము–పవళింపుసేవ కార్యక్రమాలతో ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయి. పూర్తయిన ఏర్పాట్లు బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి వాహనాలను సిబ్బంది ముస్తాబు చేస్తున్నారు. చలువ పందిళ్లు నిర్మించారు. రాజగోపురాలు, పరిసరాలకు విద్యుద్దీప అలంకారాలు చేశారు. రూ. 29 కోట్లతో నిర్మించిన అనివేటి మండప విస్తరణ, శాశ్వత క్యూ కాంప్లెక్స్, శివాలయం రాజగోపురాన్ని ఈ నెల 30 న ప్రారంభించనున్నారు. ఈనెల 26న శ్రీ మహావిష్ణువు అలంకారం 27న సత్యా కృష్ణుడి అలంకారం 28న అహల్య శాపం విమోచన అలంకారం 29న శ్రీనివాస కల్యాణం అలంకారం 30న మోహిని అలంకారం మే 1న శ్రీ కూర్మ అలంకారం 2న నవనీత కృష్ణ అలంకారం 3న శయన మహావిష్ణువు అలంకారం శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఉత్సవాల్లో పాల్గొనే సామాన్య భక్తుల నుంచి వీవీఐపీల వరకు అందరికీ అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. 30న శ్రీవారి కల్యాణం, మే 1న రథోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తాం. ఉత్సవాల్లో భాగంగా ఈనెల 26 నుంచి, వచ్చేనెల 3 వరకు నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నాం. – వేండ్ర త్రినాథరావు, శ్రీవారి దేవస్థానం ఈఓ -
చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు
కుక్కునూరు: విద్యుత్ కోతలతో పోలవరం నియోజకవర్గ రైతులు అల్లాడుతున్నా చంద్రబాబుకు చీమకుట్టినట్టు లేదని పోలవరం వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి తెల్లం బాలరాజు విమర్శించారు. శుక్రవారం కుక్కునూరు పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు తాండ్ర రాజేష్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో బాలరాజు మాట్లాడారు. విద్యుత్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. విద్యుత్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు కట్ చేస్తారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొందన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో రైతులు తాము పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర అందక కన్నీరు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ పాలనలో రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతులు పండించిన పంటకు సరైన మద్దతు ధర అందించడంతో పాటు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వం రైతులను అన్ని విధాల ఆదుకుందని, నేడు ఆ పరిస్థితి లేదన్నారు. పత్తి, మొక్కజొన్న, పొగాకు పంటలకు సరైన మద్దతు ధర అందక రైతులు ఇబ్బంది పడుతున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మేల్కొని రైతులకు మంచి చేసేలా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, విద్యుత్ సరఫరాను సక్రమంగా అందించాలని, రైతులు పండించిన ఇతర పంటలకు మద్దతు ధర అందేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వైఎస్సార్సీపీ మండల ఉపాధ్యక్షుడు రాయి సత్యనారాయణ, ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి గాడిద రాంబాబు, వైస్ ఎంపీపీ గాడిద రామచంద్రం, మండల యువజన విభాగం అధ్యక్షుడు చేకూరి నవీన్ వర్మ, నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ మల్లెల చంటి నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
షార్ట్ సర్క్యూట్తో లారీ దగ్ధం
ఏలూరు – జంగారెడ్డిగూడెం రోడ్డు పుట్లగట్లగూడెం సమీపంలోని లారీ ఇంజిన్లో నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో లారీ పూర్తిగా దగ్ధమైంది. 8లో uఏలూరు (ఆర్ఆర్పేట): ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల్లో 2026–27 విద్యా సంవత్సరంలో వివిధ తరగతుల్లో ప్రవేశాల నిమిత్తం జరిగే ప్రవేశ పరీక్షలు శుక్రవారం ప్రశాంత వాతావరణంలో జరిగాయి. నగరంలోని 6 కేంద్రాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, తిరిగి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకూ నిర్వహించారు. 5, 6, 7, 8 తరగతుల్లో ప్రవేశాలకు జరిగిన పరీక్షకు 901 మందికి 714 మంది హాజరయ్యారు. గురుకుల జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఆర్జేసీ పరీక్షకు 1604 మందికి 1440 మంది హాజరు కాగా 164 మంది గైర్హాజరయ్యారు. గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఆర్జేసీ సెట్ పరీక్షకు 26 మందికి 23 మంది హాజరు కాగా ముగ్గురు గైర్హాజరయ్యారు. -
ఎంటీఎస్ టీచర్ల సమస్యలు పరిష్కరించాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): మినిమం టైమ్ స్కేల్ (ఎంటీఎస్) ప్రాతిపదికన పని చేస్తున్న ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఎంటీఎస్ టీచర్స్ అసోసియేషన్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు తోట ఎడ్వర్డ్ డిమాండ్ చేశారు. శుక్రవారం అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఎడ్వర్డ్ మాట్లాడుతూ ఎంటీఎస్ టీచర్లలో చాలామందికి 50 సంవత్సరాల వయసు వచ్చిన తరువాత ఉద్యోగాలు వచ్చాయని, అందువల్ల వారి పదవీ విరమణ వయస్సును కనీసం 62 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే అందరు రెగ్యులర్ టీచర్లతో సమానంగా ఎంటీఎస్ టీచర్లూ పని చేస్తున్నారని వారికి ఇప్పటి వరకూ ప్రభుత్వం ఏడాదికి 11 నెలల జీతాలు మాత్రమే ఇస్తోందని, ఇకపై తమకూ 12 నెలల జీతాలూ ఇవ్వాలని కోరారు. పదవీ విరమణ చేసిన ఎంటీఎస్ టీచర్లకు కనీస పెన్షన్ విడుదల చేయాలని, అలాగే మినిమం టైమ్ స్కేల్ నుంచి తమను కూడా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఈ నెల 26న విజయవాడలో ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిర్వహించే రిలే నిరాహార దీక్షల నిరసన కార్యక్రమానికి ఎంటీఎస్ టీచర్ల సంఘం మద్దతు పలుకుతూ తీర్మానం చేశారు. ఈ మేరకు జిల్లాలో పని చేస్తున్న ఎంటీఎస్ టీచర్లు ఈ నెల 26న విజయవాడకు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎంటీస్ టీచర్ల సంఘం నాయకులు కె.స్వామిదాసు, కె.కరుణానిధి, వీవీ రాజు, ఎండీ పాషా, బాజీ పాల్గొన్నారు. -
ఫిర్యాదుదారుల నుంచి స్టేట్మెంట్ నమోదు
జంగారెడ్డిగూడెం: సొసైటీలో అవినీతి, అక్రమాలు, అధికారుల విచారణ తదితర అంశాలపై పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసిన ఫిర్యాదుదారుల నుంచి జిల్లా సహకార అధికారి ఎ.శ్రీనివాస్ స్టేట్మెంట్ నమోదు చేశారు. స్థానిక డీసీసీబీ బ్యాంకు కార్యాలయ భవనంలో శుక్రవారం ఫిర్యాదుదారులను విచారించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని డీసీసీబీ పరిధిలో ఉన్న పెనుగొండ, టి.నరసాపురం, జంగారెడ్డిగూడెం సొసైటీలతో పాటు 11 సొసైటీల్లో జరిగిన అవినీతి, అక్రమాలపై 2023–24లో అప్పటి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ 51 ఎంకై ్వరీ ఆర్డర్తో విచారణకు ఆదేశించారన్నారు. దీనిలో భాగంగా విచారణాధికారులగా నియమించిన వారు సరిగా విచారణ చేయలేదని టి.నరసాపురం మండలం వెలగపాడుకు చెందిన న్యాయవాది బొడ్డు శ్రీనివాసరావు 2025లో పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారన్నారు. అలాగే జంగారెడ్డిగూడేఇకి చెందిన నేట్ర గణపతిరావు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఏలూరులో ఏజీఎంగా పనిచేస్తున్న జి.శ్రీనివాస్ 2008లో తన ఉద్యోగానికి రాజీనామ చేసిన తర్వాత కూడా తిరిగి విధుల్లోకి ఏ నిబంధనలు అనుసరించి తీసుకున్నారు? ఏ నిబంధనలు ప్రకారం పదోన్నతి ఇచ్చారు? అని తెలపాలని పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై ఫిర్యాదుదారులను విచారించామని, విచారణ నివేదికలను ఉన్నతాధికారులకు అందజేస్తామని ఆయన తెలియజేశారు. -
విద్యుత్ తీగల ఏర్పాటులో డ్రోన్ సాయం
పట్టణంలోని ప్రభుత్వాసుపత్రికి దగ్గరలో ఉన్న ఇండోర్ విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలో కొత్త విద్యుత్ తీగల ఏర్పాటును శుక్రవారం డ్రోన్ సహాయంతో వేయడం ఆకట్టుకుంది. రోడ్డు వెంబడి ఉన్న చెట్ల కొమ్మలను తొలగించి కొత్త విద్యుత్ తీగలను విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా డ్రోన్ సహాయంతో తీగలను ఏర్పాటు చేయడంతో తీగలను డ్రోన్ ఎత్తులో ఉన్న స్తంభాలకు చేర్చడం వాటిని సిబ్బంది ఒక క్రమంలో ఏర్పాటు చేయడాన్ని ప్రజలు ఆసక్తిగా తిలకించారు. - భీమవరం -
ఈఎస్జెడ్ ప్రతిపాదనల ఖరారుపై సమీక్ష
భీమవరం (ప్రకాశంచౌక్): కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధిలో ఈఎస్జెడ్ ప్రకటన ప్రక్రియలో భాగంగా ప్రతిపాదనల ఖరారు కోసం శుక్రవారం భీమవరం కలెక్టరేట్లోని వశిష్ట సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో స్థానిక ప్రజల నుంచి అందిన విజ్ఞాపనలు, అభ్యంతరాలు, సూచనలను సమగ్రంగా పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం చుట్టూ ఉన్న పర్యావరణ సున్నిత మండలి పరిధిలోకి వచ్చే పెంటపాడు, గణపవరం, ఉండి, కాళ్ల, ఆకివీడు మండలాల్లో 2025 జనవరి 6 నుండి 8 వరకు గ్రామసభలు నిర్వహించి ప్రజాభిప్రాయాలను సేకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు పాక వెంకట సత్యనారాయణ, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి, ఏలూరు జిల్లా అటవీ శాఖ వైల్డ్ లైఫ్ అధికారి, మెంబర్ కన్వీనర్ డాక్టర్ ఎ.త్రిమూర్తులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తాడేపల్లిగూడెంలో సినీ హీరో అడవి శేష్ సందడి
తాడేపల్లిగూడెం: సినీ హీరో అడవి శేష్ శుక్రవారం పట్టణంలో సందడి చేశారు. పట్టణంలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఓ కంప్లెక్స్లో డెకాయిట్ సినిమాను ప్రేక్షకులతో కలిసి చూసిన అనంతరం మాట్లాడారు. మరో మూడు చిత్రాలలో నటిస్తున్నానని, గూఢచారి–2 మేకింగ్లో ఉందన్నారు. ప్రేక్షకులతో కలిసి సందడి చేశారు. థియేటర్ నిర్వాహకులు గన్నమనేని శ్రీనివాసరావు, చలంచర్ల హరి, సౌమ్య, ఆడిటర్ ఎన్వీ రమణరావు, డాక్టర్ సందీప్ ఉన్నారు. కాళ్ల: మండలంలోని కాళ్లకూరులో ఉన్న వేంకటేశ్వరస్వామి తిరుకల్యాణ మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం నుంచి ప్రారంభించే ఈ ఉత్సవాలు మే 3వ తేదీ వరకు నిర్వహిస్తామని ఆలయ చైర్మన్ అడ్డాల శివరామరాజు, ఈఓఅరుణ్ కుమార్ శుక్రవారం విలేకరులకు తెలిపారు. కల్యాణ మహోత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ ప్రాంగణం, వెలుపల ఇప్పటికే చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్లాత్ డెకరేషన్ భక్తులను ఆకర్షిస్తుంది. 27న కల్యాణం, మే 1న స్వామి వారి రథోత్సవం, 9న అఖండ అన్నసమారాధన నిర్వహిస్తారు. తాడేపల్లిగూడెం: బయో ఫెర్టిలైజర్ల వినియోగం ద్వారా నేల ఆరోగ్యం మెరుగుపడుతుందని రైతులకు శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. ఐసీఏఆర్ , అటారీ జోన్ పది ఆధ్వర్యంలో శుక్రవారం వెంకట్రామన్నగూడెంలోని కేవీకేలో ఖరీఫ్ 2026 పంటలలో సమతుల్య ఎరువుల వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పచ్చి రొట్టల పంటల ద్వారా నేలలో సేంద్రియ పదార్థం పెరిగి పంట ఉత్పాదకత మెరుగుపడుతుందన్నారు. వెంకట్రామన్నగూడెం గ్రామ పంచాయతీ వద్ద నిర్వహించిన రచ్చబండలో రైతుల సమస్యలకు సమాధానలిచ్చారు. తాడేపల్లిగూడెం (టీఓసీ): ఇంజనీరింగ్, వైద్య విద్యలో చేరాలనుకునే విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు ఈనెల 26న (ఆదివారం) 6, 7, 8, 9, 10, 10+1 విద్యార్థులకు ఐఐటీ, నీట్ విద్యపై విశాఖపట్నం సంగివలసలోను, తాడేపల్లిగూడెం కడకట్ల క్యాంపస్లోను అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని శశి విద్యాసంస్థల చైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ, వైస్ చైర్మన్ మేకా నరేంద్రకృష్ణ శుక్రవారం విలేకరులకు తెలిపారు. నిష్ణాతులైన సీనియర్ అధ్యాపక బృందం సందేహాలను నివృత్తి చేస్తారని పేర్కొన్నారు. సదస్సులకు వచ్చేవారు ముందుగా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.శశిస్కూల్.కామ్లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో ఉదయం 9 గంటల నుంచి సదస్సులు నిర్వహిస్తామని, భోజన వసతి కల్పిస్తామని శశి విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మేకా కాంత్రి సుధ పేర్కొన్నారు. -
ట్రాక్టరు బోల్తా.. ఒకరి మృతి
గణపవరం: మండలంలోని కోమర్రు గ్రామ పరిధిలో ఓ ట్రాక్టరు పంట కాలువలో తిరగబడింది. ఈ ప్రమాదంలో వట్టిప్రోలు జగదీశ్ (43) అనే కౌలురైతు అక్కడికక్కడే మరణించాడు. జగదీష్ సాగుచేసిన తన పొలంలో వరికోత యంత్రంతో కోతకోయించి ధాన్యాన్ని ట్రాక్టర్మీద సమీప పుంతగట్టుకు చేరవేయించాడు. అనంతరం ట్రాక్టర్పై తిరిగి వస్తుండగా ట్రాక్టర్ అదుపు తప్పి ప్రక్కనే ఉన్న పంట కాలువలోకి తిరగబడింది. ఈ ప్రమాదంలో ట్రక్కులో కూర్చున్న రైతు జగదీశ్పై ట్రక్కు పడడంతో కింద ఊపిరాడక అక్కడికక్కడే మరణించాడు. ఈ మేరకు ఎస్సై మణికుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏలూరు రూరల్: శాప్ లీగ్ పోటీల్లో భాగంగా ఈనెల 28వ తేదీ నుంచి 30 వరకూ అనంతపురంలో రాష్ట్రస్థాయి పుట్బాల్ పోటీలు జరుగుతాయని ఏలూరు జిల్లా డిఎస్డీఓ ఎస్ఏ చెప్పారు. శుక్రవారం ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో అండర్–15, అండర్–21 బాలబాలికల జిల్లా జట్టు ఎంపిక పోటీలు నిర్వహించారు. అండర్ –15 బాలికల విభాగంలో ఎస్.సౌమ్య, సీహెచ్ బ్లెస్సీ, ఎ.మౌనిక, వి.లిషిత, టి.సుభశ్రీ, ఎం.చైత్రవల్లి, పి.చందు, సీహెచ్ హిమవర్షిణి, డి.రిషితసాయి, డి.చరణ్య్, ఎ.చంద్రిక, ఎస్.తేజశ్రీ, ఎం.సహస్త్ర, కె.కార్తిక, పి.గాయత్రి ఉన్నారు. బాలుర విభాగంలో ఎన్.రావణఉదయ్, ఎ.అఖిల్వర్మ, ఎన్.తేజస్వినయ్, ఎస్.మణ్య, జె.రామ్, వేవన్, తవన్, భువన్, కిన్నీ ఎలిజా, రిషేంద్ర, అమ్నాజ్, గంగాధర్, రిషబ్, ముస్తఫా, ప్రణీత్ తదితరులు సభ్యులుగా ఉన్నారు. -
ప్రేమ వివాహం.. జంటపై దాడి
● కుమార్తెను కిడ్నాప్ చేసిన తండ్రి , మరో ముగ్గురు ● కేసు నమోదు చేసిన పోలీసులు ద్వారకాతిరుమల: ప్రేమ పెళ్లి చేసుకున్న కుమార్తెను ఆమె తండ్రి, బంధువులు కలిసి కిడ్నాప్ చేశారు. ఆ సమయంలో అడ్డు వచ్చిన ఆమె భర్త, అత్తమామలపై విచక్షణారహితంగా ఇనుప రాడ్లతో దాడి చేసి, గాయపరిచారు. మండలంలోని ఐఎస్ రాఘవాపురంలో గురువారం వేకువజామున జరిగిన ఈ ఘటనపై స్థానిక పోలీస్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం. ద్వారకాతిరుమల మండలం ఐఎస్ రాఘవాపురానికి చెందిన సంజిత్, కామవరపుకోట మండలం వెంకటాపురానికి చెందిన పద్మ ఏడేళ్లుగా ప్రేమించుకున్నారు. వీరి వివాహానికి పద్మ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. దాంతో గతనెల 20న ఏలూరులోని అంబేడ్కర్ నవ సమాజ్ సొసైటీలో వారు పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి ఐఎస్ రాఘవాపురంలోనే కాపురం ఉంటున్నారు. ఇదిలా ఉంటే పద్మ తండ్రి వెంకటకృష్ణ, కుటుంబ సభ్యులు వెంకటేశ్వరరావు, దుర్గారావు, వెంకటరమణలు గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో సంజిత్ ఇంటికి వెళ్లారు. తలుపులు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం వారు పద్మను బలవంతంగా తీసుకెళ్లిపోతుండగా సంజిత్, అతని తల్లిదండ్రులు సలోమోను, శ్యామల అడ్డుకున్నారు. ఆ సమయంలో వారిపై ఇనుప రాడ్లతో దాడి చేసి, పద్మను బలవంతంగా కారులో తీసుకెళ్లిపోయారు. గాయాలపాలైన సంజిత్, అతని తల్లిదండ్రులు జరిగిన విషయాన్ని ద్వారకాతిరుమల పోలీస్టేషన్లో తెలిపి, ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందారు. అనంతరం సంజిత్ తండ్రి సలోమోను ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాడి చేసిన వారిపై కిడ్నాప్, తదితర సెక్షన్ల కింద ఎస్సై టి.సుధీర్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
షార్ట్ సర్క్యూట్తో లారీ దగ్ధం
జంగారెడ్డిగూడెం: సిమెంట్ విద్యుత్ స్తంబాల లోడుతో వెళుతున్న 16 చక్రాల లారీ అగ్నిప్రమాదానికి గురైంది. లారీ పూర్తిగా కాలిపోగా డ్రైవర్, క్లీనర్లు సురక్షితంగా బయటపడ్డారు. వివరాల ప్రకారం విజయవాడ నుంచి విద్యుత్ స్తంభాల లోడుతో బయలుదేరిన లారీ టి.నరసాపురంలో కొన్ని స్తంభాలు దించి, అక్కడ నుంచి జంగారెడ్డిగూడెం వచ్చి ఇక్కడ మరికొన్ని స్తంభాలు దించింది. అలాగే తడికలపూడిలో మరికొన్ని విద్యుత్ స్తంభాలు దించాల్సి ఉంది. మండలంలోని ఏలూరు – జంగారెడ్డిగూడెం రాష్ట్ర ప్రధాన రహదారి పుట్లగట్లగూడెం సమీపంలోని పెట్రోల్ బంక్ వద్దకు వచ్చేసరికి లారీ ఇంజిన్లో నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రమాదం గుర్తించిన తాడేపల్లి మండలం వడ్డేశ్వరం గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ పాతూరి పౌల్రాజు, క్లీనర్ శామ్యుల్ లారీ నుంచి దూకేశారు. లక్కవరం ఎస్సై షేక్ జబీర్, ఏఎస్సై భాస్కర్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక వాహనాన్ని రప్పించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే లారీ పూర్తిగా దగ్ధమైంది. ఇంజిన్లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. -
అటు కొరత.. ఇటు కోత
● ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అనే చందాన ఆక్వా రైతుల పరిస్థితి ● వేధిస్తున్న విద్యుత్ కోత, డీజిల్ కొరత భీమవరం: ఆక్వా రంగాన్ని అందలమెక్కిస్తాం... రైతులను ఆదుకుంటామంటూ గొప్పగా చెప్పుకునే చంద్రబాబు ప్రభుత్వ పాలనలో విద్యుత్ కోతలు, డీజిల్ కొరతతో ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో రాష్ట్రంలో ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతుంటే ఆక్వా రంగంపై మరింత ప్రభావం చూపుతోంది. ఒక పక్క డీజిల్ కొరతతో సతమతమవుతున్న రైతులు ఇటీవల విద్యుత్ కోతలు అధికం కావడంతో తీవ్ర సంక్షోభాన్ని సృష్టిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా పెట్రోల్ బంకుల్లో డీజిల్ కొరత ఏర్పడింది. ఆయిల్ కంపెనీలు రేషన్ పద్ధతిలో బంక్లకు డీజిల్ సరఫరా చేస్తున్నాయి. దీంతో చాలా చోట్ల బంక్ల వద్ద నోస్టాక్ బోర్డులు ప్రత్యక్షమవుతున్నాయి. రొయ్యల సాగుకు ఈ సమయమే కీలకం రొయ్యల సాగులో వేసవికాలం రైతులకు ఎంతో కీలకం. మార్చి నెల నుంచి అనుకూల వాతావరణంతో రొయ్యల పెంపకానికి రైతులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. రొయ్యల చెరువులో ఎక్కువ సంఖ్యలో సీడ్ వేసి మంచి దిగుబడులు సాధించడానికి కృషి చేస్తారు. వేసవిలో రొయ్యల ఎదుగుదల బాగుండడం, పెద్దగా తెగుళ్లు లేకపోవడం వల్ల పెట్టుబడులు తగ్గి మంచి ఆదాయం పొందుతారు. ఇదే ఆశతో రైతులంతా జిల్లాలో దాదాపు 1.30 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తుండగా దీనిలో రొయ్యల సాగు 90 వేల ఎకరాల వరకు ఉంటుందని అంచనా. రైతులంతా రొయ్యల సాగుపై ఆశలు పెట్టుకున్న దశలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఏరియేటర్స్ను ఎక్కువగా వినియోగించాల్సి ఉన్నందును విద్యుత్, డీజిల్ వాడకం అధికమైంది. ఇటువంటి తరుణంలో డీజిల్ కొరత ఏర్పడడం దానికి తోడు విద్యుత్ కోతలు పెరగడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ప్రధానంగా రాత్రి సమయంలో విద్యుత్ కోత ఏర్పడితే రొయ్యలు చనిపోతాయని రైతులు చెబుతున్నారు. కొంతమంది ఆక్వా రైతులకు సంబంధించిన విద్యుత్ కనెక్షన్న్లు, ఐస్ ఫ్యాక్టరీస్ ఇండస్ట్రియల్ ఫీడర్లు కింద ఉండడం ఇతర ఇండస్ట్రీస్తో పాటు రైతులు, ఐస్ ఫ్యాక్టరీలు కూడా విద్యుత్ కోతల బారిన పడుతుండడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. ఆక్వా రైతులను డీజిల్ కొరత, విద్యుత్ కోతల నుంచి కాపాడాలంటూ ఆక్వా రైతుల సంఘం నాయకులు శుక్రవారం జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందజేశారు. కలెక్టర్ చదలవాడ నాగరాణి, విద్యుత్శాఖ ఎస్ఈ పి ఉషారాణి, రాజ్యసభ సభ్యుడు పాకా వెంకటసత్యనారాయణ తదితరులను కలిసి తమ గోడు చెప్పుకున్నారు. ఇప్పటికే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టినందున తక్షణం చర్యలు తీసుకోకుంటే తీవ్రంగా నష్టపోతామని వాపోతున్నారు. రొయ్యల పట్టుబడిలో ఐస్కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే ఇండస్ట్రీయల్ పవర్ కట్ చేసే సమయంలో ఐస్ ఫ్యాక్టరీలకు విద్యుత్ కోత విధించడం వల్ల ఐస్ కొరత ఏర్పడి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యేకంగా ఆక్వా రైతులకు విద్యుత్ కోతల నుంచి మినహాయింపు, డీజిల్ కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – గాదిరాజు వెంకటసుబ్బరాజు, వెస్ట్గోదావరి ప్రాన్ఫార్మర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ కార్యదర్శి రొయ్యల సాగుకు కీలమైన వేసవిలో విద్యుత్ కోతల వద్ద రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటున్నందున ఎక్కువ సమయం ఏరియేటర్స్ తిప్పాల్సివుంటుంది. ఇలాంటి సమయంలో విద్యుత్ కోతలు విధిస్తే ఏరియేటర్స్ తిరగక రైతులు నష్టపోతారు. – మళ్ల తులసీరామ్, వెస్ట్గోదావరి ప్రాన్ఫార్మర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు -
పోలీసు స్టేషన్ ఎదుట ఏటీఎం చోరీకి యత్నం
కై కలూరు: సర్కిల్ పోలీసు స్టేషన్ ఎదురుగా ఉన్న కేడీసీసీ బ్యాంకు ఏటీఎంలో చోరీ యత్నం జరగడం కై కలూరులో శుక్రవారం తీవ్ర చర్చనీయాంశమైంది. బ్యాంకు మేనేజర్ సత్యనారాయణ టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి భుజానికి బ్యాగ్ తగిలించుకుని వచ్చి ఏటీఎం కార్డ్ రీడర్, డయల్ ప్యాడ్ను పగలుగొట్టాడు. నైట్ వాచ్మెన్ అప్పటి వరకు విధులు నిర్వహించి సమీపంలో నిద్రకు ఉపక్రమించడంతో ఈ ఘటన జరిగింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఉదయం ఏటీఎంను శుభ్రం చేయడానికి వచ్చిన స్వీపర్ గమనించి మేనేజర్కు చెప్పడంతో విషయం బయటపడింది. ఈ ఘటనపై ఎస్సై డి.వెంకట్కుమార్ కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఏలూరు క్లూస్టీం వచ్చి వేలిముద్రలు సేకరించారు. ఇదిలా ఉంటే నిందితుడు ఏటీఎం కార్డు మిషన్లో ఇరుక్కుపోవడంతో డయల్ ప్యాడ్ను పగలుగొట్టి కార్డు తీసుకువెళ్లాడా? అనే అనుమానాలు కలుగుతుంది. ముఖానికి ఎటువంటి మాస్క్ కట్టుకోలేదని, మెషీన్ మిషన్ను ఊడదీయడానికి ఎటువంటి పరికరాలు ఉపయోగించినట్లు సీసీ కెమెరా ఫుటేజ్లో కనిపించడం లేదని పోలీసులు చెబుతున్నారు. నిందితుడి ఆచుకీ తెలిస్తే 94407 96434, 94407 96433 నంబర్లకు ఫోన్ చేయాలని కోరారు. -
చలివేంద్రంపై కక్ష సాధింపు సిగ్గుచేటు
ఏలూరులో వైఎస్సార్సీపీ నేతల ధర్నా ఏలూరు టౌన్: ఏలూరు నియోజకవర్గంలో పాలకులకు ప్రజలకు మేలు చేయటం చేతకాదనీ.. కనీసం మంచిచేసే వారినైనా ప్రోత్సహించేలా వ్యవహరించాలని వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు అన్నారు. నగరంలోని 45వ డివిజన్ ఆదివారపుపేట మార్కెట్ ప్రాంతంలో పార్టీ యువజన నేత పసుపులేటి దినేష్ ఇటీవల చలివేంద్రాన్ని ఏర్పాటుచేశారు. గురువారం వేకువజామున రాజకీయ కక్షలతో కొందరు ఈ చలివేంద్రాన్ని తొలగించారు. దీనిపై పార్టీ శ్రేణులు మండిపడ్డారు. పాతబస్టాండ్ ప్రాంతంలోని అంబేడ్కర్ విగ్రహం సెంటర్ ప్రాంతంలో నగర అధ్యక్షుడు శ్రీనివాసరావు ఆధ్వ ర్యంలో శాంతియుత నిరసన, ధర్నా చేపట్టారు. నగర పాలకులు ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పా ల్పడటం సిగ్గుచేటని ఆయన అన్నారు. చలివేంద్రా న్ని తొలగించడాన్ని ప్రజలు హర్షించరని గుర్తుచేశా రు. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవ చేసేందుకు అందరూ ముందుకు రావాలని, రాజకీయ కక్షలతో ప్రజలకు ఉపయోగపడే చలివేంద్రాన్ని చెప్పకుండా తొలగించటం సరైన విధానం కాదన్నారు. నగర మహిళ అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల మాట్లాడుతూ ఏలూరులో కూటమి నేతలు వైఎస్సా ర్సీపీ అంటే భయపడుతున్నారనీ, అందుకే చలివేంద్రం పెట్టినా తట్టుకోలేకపోయారని విమర్శించారు. బెల్టు షాపులకు అనుమతులు ఇస్తారు కానీ.. చలివేంద్రానికి అనుమతులు లేవా అంటూ ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శి నూకపెయ్యి సుధీర్బాబు, జిల్లా ప్రధాన కా ర్యదర్శి లంకపల్లి గణేష్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, జిల్లా అధికార ప్రతినిధి ము న్నుల జాన్గురునాథ్, రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, జిల్లా మహిళ ఉపాధ్యక్షురాలు చిలకపాటి డింపుల్, జిల్లా కార్యదర్శులు కంచుమర్తి తులసీ, రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి భాస్కర్ల బాచి, నగర బీసీ సెల్ అధ్యక్షుడు కిలాడి దుర్గారావు, బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లిపాక సురేష్, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గాజుల బాజీ, జిల్లా కార్యదర్శి సాసుపల్లి యుగంధర్, ఆర్టీఐ జిల్లా అధ్యక్షుడు స్టాన్లీ బాబు, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు రాజేష్, వైఎస్సార్టీయూ నగర అధ్యక్షులు గంటా రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం టూటౌన్ పోలీసులకు వినతిపత్రం అందజేసి, చలివేంద్రం తొలగింపుపై విచారణ చేయాలని కోరారు. -
శ్రీవారి వైభవాన్ని చాటేలా బ్రహ్మోత్సవాలు
● 26 నుంచి చినవెంకన్న వైశాఖ మాస దివ్య బ్రహ్మోత్సవాలు ● 30న ఆలయ కట్టడాలు ప్రారంభోత్సవం ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న వైభవాన్ని చాటేలా ఈనెల 26 నుంచి వచ్చేనెల 3 వరకు వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలను అట్టహాసంగా నిర్వహిస్తామని ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. గురువారం ఆయన తన చాంబర్ లో ఈఈ డీవీ భాస్కర్, ఏఈఓ ఎం.దుర్గారావుతో క లిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చినవెంకన్న బ్రహ్మోత్సవాల విశేషాలు, ఈనెల 30న జరిగే ఆలయ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారం, పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ వివరాలను వెల్లడించారు. బ్రహ్మోత్సవాల్లో వేలాది మంది భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. సామాన్య భక్తుల నుంచి వీవీఐపీల వరకు అందరికీ అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ప్రస్తుతం క్షేత్రంలో ఉత్సవ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నా యని అన్నారు. ఉత్సవాల తొలి రోజు 26న స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలను చేయడం, 27న ధ్వజారోహణం, 28న సూర్య, చంద్ర ప్రభ వాహన సేవలు, 29న ఎదుర్కోలు ఉత్సవం, 30న రాత్రి శ్రీవారి తిరుకల్యాణం, వచ్చేనెల 1న రాత్రి రథోత్సవం, 2న చక్రస్నానం, ఆఖరి రోజు 3న ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీపుష్పయాగం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తామన్నా రు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా రథోత్సవాన్ని జరుపుతామని తెలిపారు. గరుడ ప్రసాదం స్వీకరించాలి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు రాత్రి ఆలయంలో జరిగే ధ్వజారోహణ అనంతరం అర్చకులు భక్తులకు ధ్వజ ప్రసాదాన్ని అందిస్తారని ఈఓ తెలిపారు. సంతానం లేని మహిళలు ఈ ప్రసాదాన్ని తింటే పిల్లలు పుడతారన్న నమ్మకం ఉందని, దీంతో సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారన్నారు. ప్రారంభోత్సవాలు ఇలా.. ఈనెల 30న దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దేవస్థానానికి రానున్నారని, ఆలయ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకార మహోత్సవం నిర్వహిస్తారన్నా రు. రూ.12 కోట్లతో విస్తరించిన అనివేటి మండపా న్ని, రూ.12.50 కోట్లతో నిర్మించిన క్యూ కాంప్లెక్స్ ను, రూ.4.50 కోట్లతో నిర్మించిన శివాలయం రాజగోపురాన్ని మంత్రి ప్రారంభిస్తారని చెప్పారు. -
అక్రమ చెరువుల జాతర
సాక్షి టాస్క్ఫోర్స్: పచ్చని పొలాలు ఆక్వా చెరువులుగా మారిపోతున్నాయి. ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోవడం లేదు. రెవెన్యూ, మత్స్యశా ఖాధికారులు ప్రజాప్రతినిధుల సిఫార్సులను కాదనలేకపోతున్నారు. అక్రమ చెరువులను ఆపండని జిల్లా అధికారులకు గ్రామస్తులు మెరపెట్టుకున్నా పొక్లయిన్లతో విధ్వంసం కొనసాగుతూనే ఉంది. వేసవి దాటితే తవ్వకాలకు అడ్డంకులని భావించి రాత్రి, పగలూ తేడా లేకుండా వందలాది ఎకరాల్లో చెరువుల జాతర మొదలయ్యింది. ప్రధానంగా ఆక్వారంగానికి ఆయువుపట్టుగా పేరొందిన కై కలూరు నియోజకవర్గంలో తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత చెరువులు అన్న చందంగా యంత్రాల మోత మోగిస్తున్నారు. ఇష్టారాజ్యంగా తవ్వుతూ.. ఉమ్మడి జిల్లాలో చేపలు 1.80 లక్షలు, రొయ్యలు 1.10 లక్షలు కలిపి మొత్తం 2.90 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. కై కలూరు నియోజకవర్గం కై కలూరు, కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి మండలాలు కలిపి 84,775.88 ఎకరాల్లో ఆక్వా సాగు ఉంది. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత కైకలూరు నియోజకవర్గం నాలుగు మండలాల్లో ఆక్వా చెరువులు వందల ఎకరాల్లో తవ్వేస్తున్నారు. కొందరు మత్స్యశాఖ అనుమతులు ఉన్నాయని, మరికొందరు మరమ్మతులు చేసుకుంటున్నామని, ఇంకొందరు ఏకంగా ఎమ్మెల్యే పేరు చెప్పి దాబాయిస్తూ ఇష్టానుసారంగా చెరువులు తవ్వుతున్నారు. అప్సడా చట్టం.. అభాసుపాలు : ఆక్వారంగం అభివృద్ధితో పాటు పర్యావరణానికి విఘాతం లేకుండా ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) చట్టాన్ని తీసుకొచ్చారు. ఆక్వా జోన్ల వ్యవస్థ అందుబాటులో ఉంది. నూతన చెరువు తవ్వాలంటే ముందుగా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. జిల్లాస్థాయి కమిటీ (డీఎల్సీ)లో కలెక్టర్ అనుమతులు మంజూరు చేయాలి. ఇక డివిజన్, మండల స్థాయి కమిటీల్లో రెవెన్యూ, వ్యవసాయం, పొల్యుషన్ కంట్రోల్ బోర్డు, ఇరిగేషన్, భూగర్భశాఖ ఇలా అన్ని శాఖలు తనిఖీలు చేసి ఓకే అంటేనే చెరువులు తవ్వుకోవాలి. ఇంత తతంగం ఉంటే ఇవేమీ మాకు వర్తించవంటూ ప్రజాప్రతినిధులు అండతో వందలాది ఎకరాలు తవ్వుతున్నారు. ముదినేపల్లి ముందంజ పచ్చని వరి పైర్లతో కళకళలాడే ముదినేపల్లి మండలం ఇప్పుడు సర్వం ఆక్వా చెరువులు మయంగా మారుతోంది. మండలంలో చేవూరు, ములకలపల్లి, వైవాక, చినపలపర్రు, పెయ్యేరు, పెదగొన్నూ రు, కాకరవాడ, కొత్తపల్లి, వణుదుర్రు, వాడవల్లి, కొత్తపల్లి, పెదపాలపర్రు, గోగినంపాడు గ్రామాలు, కలిదిండి మండలంలో మూలలంక, పెదలంక, గోపాలపురం, తాడినాడ, పుట్లపూడి, భాస్కరరావుపేట, సానారుద్రవరం, కోరుకొల్లు గ్రామాలు, మండవల్లిలో నందిగామలంక, కై కలూరు మండలంలో ఆలపాడు, శీతనపల్లి గ్రామాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెరువులు తవ్వారు. కొల్లేరును కొల్లగొడుతూ.. కొల్లేరు అభయారణ్యంలో ఫారెస్టు, అక్రమార్కుల మధ్య దోబూచులాట కొనసాగుతోంది. ఇటీవల చటాకాయి గ్రామంలో కొల్లేరులో బొదె పేరు చెప్పి ఏకంగా పెద్ద కాల్వనే తవ్వేశారు. ఇదే అదునుగా చటాకాయి గ్రామస్తులు అక్రమ గట్లుకు ఉపక్రమించారు. మీడియాలో కథనాలు రావడంతో చేసేది లేక బోదె పనులు 90 శాతం పూర్తయిన తర్వాత ఫారెస్టు అధికారులు ఆపేశారు. ఇప్పటివరకు గట్లును తొలగించలేదు. కొద్దిరోజుల క్రితం మండవల్లి మండలంలో కొల్లేరు ప్రాంతంలో చెరువు తవ్వకానికి పొక్లయిన్ దిగింది. ఫారెస్టు అధికారులు అతికష్టం మీద ఆపారు. కొత్తగా చెరువులు తవ్వాలంటే కచ్చితంగా నిబంధనలు పాటించాలి. రైతులు ఆన్లైన్లో దరఖాస్తులు పంపితే వివిధ శాఖల అధికారుల కమిటీ అనుమతులు ఇస్తుంది. కై కలూరు నియోజకవర్గంలో కొన్ని చెరువులకు అనుమతులు ఇచ్చాం. అప్పడా నిబంధనలు అందరూ పాటించాలి. – ఎం.రవికుమార్, మత్స్యశాఖ సహాయ సంచాలకుడు, కై కలూరు అడ్డంగా తవ్వేయ్! తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత చెరువులు పచ్చని పొలాలు ఆక్వా చెరువులుగా రూపాంతరం ఆక్వా రంగానికి చెందిన అప్సడా చట్టానికి తూట్లు అక్రమాలపై ప్రజలు తిరగబడుతున్నా ఆగని వైనం కొల్లేరు అభయారణ్యంలోనూ ఇదే తంతు -
పేరు మోసిన దొంగ అరెస్ట్
రెండు రాష్ట్రాల్లో 100కు పైగా కేసులు ఏలూరు టౌన్: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీగా చోరీ కేసుల్లో నిందితుడిగా పేరు మోసిన దొంగ ఏలూరు త్రీటౌన్ పోలీసులకు చిక్కాడు. 100కు పైగా చోరీ కేసులు అతడిపై నమోదు కావడం గమనార్హం. నిందితుడిని అరెస్ట్ చేసి గురువారం విలేకరుల సమావేశంలో ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్కుమార్ వివరాలు వెల్లడించారు. విశాఖలోని మద్దిలపాలెం ప్రాంతానికి చెందిన శీల అనిల్కుమార్ జల్సాలు, విలాసాలకు అలవాటుపడ్డాడు. కొన్నేళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో చోరీలకు పాల్పడుతుండగా.. కేసులు నమోదయ్యాయి. ఇటీవల ఏలూరు త్రీటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో నమోదైన కేసు 28/2026ను సీఐ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్సై అప్పారావు దర్యాప్తు చేపట్టారు. కేసును విచారిస్తున్న పోలీస్ బృందం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని అదుపులోకి తీసుకుంది. విచారణ చేయగా ఏలూరుతోపాటు పలు ప్రాంతాల్లో నేరాలకు పాల్పడినట్టు అంగీకరించాడు. నిందితుడి నుంచి సుమారు 7 కాసుల బంగారు ఆభరణాలు, కిలోన్నర వెండి వస్తువులు, రూ.5 లక్షల నగదు, నేరాలకు వినియోగిస్తున్న రెండు మోటారు సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకోవటం ద్వారా ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, ద్వారకాతిరుమల, మచిలీపట్నం, కొవ్వూరు, సర్పవరం, తెలంగాణలోని సత్తుపల్లి ప్రాంతాల్లో నమోదైన కేసుల్లో పురోగతి సాధించినట్లేనని డీఎస్పీ శ్రావణ్కుమార్ చెప్పారు. కేసును ఛేదించి నిందితుడిని పట్టుకోవటంలో ప్రతిభ చూపిన త్రీటౌన్ ఎస్సై అప్పారావు, సిబ్బందిని జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్, డీఎస్పీ శ్రావణ్కుమార్ అభినందించారు. -
గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్టు
అత్తిలి: మండలంలోని మంచిలి గ్రామం వద్ద గంజాయి తరలిస్తున్న కాళ్ల మండలం జక్కరంగరువుకు చెందిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు అత్తిలి ఎస్సై కేఎన్ విశ్వనాథ్ గురువారం విలేకరులకు తెలిపారు. పముజుల పవన్న్కుమార్, ఎజ్జర్ల జీవరాణిలను అరెస్టు చేసి వారి వద్ద 2.1 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఆయన తెలిపిన వివరాలు ప్రకారం బుధవారం రాత్రి మంచిలి గ్రామం వద్ద గంజాయి మత్తులో పవన్కుమార్ వీరంగం సృష్టించడంతో ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారన్నారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు పవన్కుమార్ తో పాటు అతని వెంట ఉన్న జీవరాణిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. విచారణలో వారు విశాఖ జిల్లా పాడేరులో గంజాయి కొనుగోలు చేసి వస్తుండగా మంచిలి వద్ద పవన్కుమార్ గంజాయి మత్తులో అలజడి సృష్టించాడని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
రైలు ఢీకొని ఇద్దరు మహిళల మృతి
భీమడోలు: మండలంలోని సూరప్పగూడెం, పాతూరు గ్రామాల మధ్య ఉన్న రైలు పట్టాలు దాటుతున్న ఇద్దరు మహిళలను గురువారం ఓ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో సూరప్పగూడేనికి చెందిన వెజ్జు లక్ష్మీ(50), నిడమర్రు గ్రామానికి చెందిన సకినిశెట్టి సత్యవతి(59) మృతి చెందారని ఏలూరు రైల్వే ఎస్సై దానం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం సూరప్పగూడెంలో ఆలయ ప్రతిష్ఠ వేడుకలు నిర్వహిస్తుండడంతో గ్రామస్తులు ఈ సంబరానికి బంధువులను ఆహ్వానించారు. ఈ క్రమంలో వెజ్జు లక్ష్మీ బంధువు నిడమర్రు మండలం సకినిశెట్టి సత్యవతి సూరప్పగూడెం వచ్చేందుకు పాతూరు గ్రామంలో బస్సు దిగింది. అక్కడ నుంచి సూరప్పగూడెం గ్రామంలోని ఆలయం వద్దకు రావడానికి చిరునామా తెలియక వెజ్జు లక్ష్మీకి ఫోన్ చేసింది. దీంతో ఆమెను తీసుకుని రావడానికి లక్ష్మీ పాతూరు వెళ్లి అక్కడ నుంచి సత్యవతిని వెంటబెట్టుకుని తీసుకుని వస్తుంది. ఈ క్రమంలో పాతూరు, సూరప్పగూడెం గ్రామాల మధ్య రైల్వే అండర్ ట్రన్నెల్ బ్రిడ్డి నుంచి వీరు రావాల్సి ఉండగా, వారిద్దరు ఇంటిని ముందుగా చేరుకునేందుకు మూసి ఉన్న రైల్వే గేటు పక్క నుంచి ట్రాక్ దాటుతుండగా అతివేగంగా వస్తున్న ఎక్స్ప్రెస్ వారిద్దరినీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారిద్దరికీ తలకు బలమైన గాయాలుతో పాటు చేతులు, కాళ్లు ఛిద్రంగా మారాయి. ఈ సమాచారం అందుకున్న ఏలూరు రైల్వే ఎస్సై దానం సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాలను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అయితే ఈ రెండు కుటుంబాలు పేద కుటుంబాలు కావడంతో పెద్ద దిక్కులను కోల్పోయమంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వెజ్జు లక్ష్మీ(ఫైల్) సకినిశెట్టి సత్యవతి(ఫైల్) -
ఆస్తి పన్ను వసూళ్లలో రెండో స్థానం
తాడేపల్లిగూడెం (టీఓసీ): పట్టణ పురపాలక సంఘంలో 2025–26 ఆర్ధిక సంవత్సరానికి ఆస్తిపన్ను వసూళ్లలో డిమాండ్ రూ.21.85 కోట్లుకు గానూ కలెక్షన్ రూ.14.83 కోట్లు (67.86 శాతం) వసూళ్లు చేసి ఏపీ రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (విజయవాడ)లో గురువారం 123 పురపాలక సంఘాల మునిసిపల్ కమిషనర్ల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంఈ అండ్ యూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సురేష్ కుమార్, పుర పరిపాలన శాఖ కమిషనర్ అండ్ సంచాలకుడు పి.సంపత్ కుమార్ చేతుల మీదుగా తాడేపల్లిగూడెం మునిసిపల్ కమిషనర్ ఎం.ఏసుబాబును సన్మానించి అవార్డును అందించారు. టి.నరసాపురం : స్థానిక పాత పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న ఎల్ఈఎఫ్ ప్రార్థనా మందిరాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారని, చర్చి సంఘ విశ్వాసులు, పాస్టర్లు అంబేడ్కర్ సెంటర్లో గురువారం రాత్రి ఆందోళన చేపట్టారు. ప్రధాన సెంటర్లో బైఠాయించి చర్చి కూల్చివేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంఘానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి జేసీబీ సహాయంతో కూల్చివేశారని ఇది సంఘవిద్రోహ చర్యగా అభివర్ణించారు. చర్చి కూల్చివేత వెనుక కొందరు రాజకీయ నేతలు హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. కార్యక్రమంలో పాస్టర్లు డి.సామ్యూల్ రాజు, రేమల్లి జాషువా, రాజేష్ రావు యోహాను తదితరులు పాల్గొన్నారు. భీమవరం: పట్టణంలో ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని టూటౌన్ ఎస్సై రామరావు గురువారం విలేకరులకు తెలిపారు. వివరాల ప్రకారం భీమేశ్వరస్వామి కాలనీలో నివాసం ఉంటున్న మిండాల మోజేష్(25) పెయింట్ పని చేస్తూ జీవనం సాగించేవాడు. అయితే ఈ నెల 22న అతనికి స్నేహితులు ఫోన్ చేసినా ఎత్తకపోవడం, ఇంటి తలుపులు వేసి ఉండడంతో రామకృష్ణ అనే వ్యక్తి ఇంటి కిటికిలో చూడగా సీలింగ్ ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకున్నట్లు గుర్తించారు. దీనిపై నక్కా వరప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామరావు తెలిపారు. కామవరపుకోట: మద్యం తాగి వాహనం నడుపుతున్న వ్యక్తికి చింతలపూడి మెజిస్ట్రేట్ రెండు నెలల జైలు శిక్ష విధించినట్లు తడికలపూడి ఎస్సై వల్లి పద్మ తెలిపారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం కామవరపుకోటలో గురువారం తన సిబ్బందితో వాహనాలు తనిఖీలు చేస్తుండగా కామవరపుకోటకు చెందిన బొల్లి బోయిన పోసి నాగేంద్ర అనే వ్యక్తి వాహనం ఆపి పరీక్షించగా మద్యం తాగినట్లు నిర్ధారించినట్లు తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి చింతలపూడి కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్ ఆ వ్యక్తికి 2 నెలలు జైలు శిక్ష, రూ.300 జరిమానా విధించినట్లు ఆమె తెలిపారు. భీమవరం : ఆకివీడు రైల్వే స్టేషన్ కు సమీపంలో గురువారం గుర్తు తెలియని రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు భీమవరం రైల్వే ఎస్సై సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మృతుని వివరాలు తెలిసిన వారు భీమవరం రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు. ఉండి: బైక్ను ట్రాక్టర్ ఢీకొట్టిన ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని యండగండి గ్రామ శివారు ప్రాంతమైన రాయనివానిగూడెంకు చెందిన తంగెళ్ళ వెంకటేశ్వర్లు తన కుమార్తె వివాహ శుభలేఖలు పంచేందుకు ఈ నెల 21న సాయంత్రం 4 గంటల సమయంలో తన ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. యండగండి ప్రభుత్వసుపత్రి వద్దకు వచ్చేసరిగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ వేగంగా అతడి ని ఢీ కొట్టడంతో తలకు బలమైన గాయమైంది. దీంతో కుటుంబ సభ్యులు అతనిని వైద్య చికిత్స నిమిత్తం భీమవరం తరలించారు. అక్కడ ఆసుపత్రి నుంచి అందిన సమాచారం మేరకు ఏఎస్సై శ్రీనివాసరావు కేసు నమోదు చేస్తున్నారు. -
లక్ష్యం ఎక్కువ.. సంచులు తక్కువ
భీమవరం: అన్నదాతలను ఆదుకుంటామంటూ గొప్పగా ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు అవసరమైన గోనె సంచులను సైతం అందించలేకపోతుంది. రైతులకు అందించే సంచుల్లో ఎక్కువ శాతం చిరిగిపోవడంతో ధాన్యం కారిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లాలో దాళ్వా వరి మాసూళ్లు ముమ్మరంగా సాగుతున్న సమయంలో గోనె సంచుల సరఫరా ఇబ్బందికరంగా మారింది. జిల్లాలోని 20 మండలాల్లో దాదాపు 2.30 లక్షల ఎకరాల్లో దాళ్వా వరిని పండించారు. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి పంటను గట్టుకు చేర్చుతున్నా ధాన్యం రైసుమిల్లులకు తరలించడానికి అష్టకష్టాలు పడుతున్నారు. దిగుబడి అంచనా 9.50 లక్షల మెట్రిక్ టన్నులు జిల్లాలో ప్రస్తుత దాళ్వా సీజన్లో 9.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. దీనిలో 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. దీనికి గానూ దాదాపు 1.90 కోట్ల గోనె సంచులు అవసరమవుతాయని నిర్ణయించగా, కేవలం 1.25 కోట్లు సంచులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీనితో రైస్ మిల్లుల నుంచి రైతులకు ఎక్కువగా చిరిగిన పాత సంచులను మాత్రమే చేరుతుండడంతో పట్టుబడి పట్టిన ధాన్యం చిల్లుల నుంచి కారిపోయి తూకంలో తేడాలు రావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. గోనె సంచుల విషయంలో గత మూడు సీజన్లుగా ఇదే పరిస్థితి నెలకొని ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్నదాతలను వేధిస్తున్న గోనె సంచుల కొరత డిమాండ్.. 1.90 కోట్లు.. ఇచ్చింది 1.25 కోట్లు మాత్రమే జిల్లాలో 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం రైతులను నుంచి ధాన్యం దిగుమతి చేసుకున్న రైస్మిల్లర్లు మరపట్టించిన తరువాత బియ్యాన్ని ఎఫ్సీఐ గోదాములకు పంపిస్తారు. దిగుమతి చేసుకున్న వెంటనే ధాన్యం మరపట్టిస్తే గోనె సంచులు ఖాళీ అయి తిరిగి రైతులకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుత సీజన్లో కేంద్రప్రభుత్వం బియ్యంలో నూక శాతంలో మార్పులు తీసుకురానుండడంతో ఎఫ్సీఐ అధికారులు బియ్యం దిగుమతి నిలిపివేశారు. గతంలో బియ్యంలో నూక 15 శాతం ఉన్నా మిల్లర్ల నుంచి బియ్యం దిగుమతి చేసుకునేవారు. అయితే కేంద్రం కొత్తగా నూక శాతాన్ని 10 శాతానికి తగ్గించడం దానికి సంబంధించి ఎఫ్సీఐకి పూర్తిగా ఆదేశాలు అందకపోవడంతో మిల్లర్ల నుంచి బియ్యం దిగుమతులు నిలిచిపోయాయని మిల్లర్లు చెబుతున్నారు. దీంతో ధాన్యాన్ని మరపట్టించకపోవడంతో సంచులు ఖాళీ కావడం లేదని అధికారులు సంచులు కోసం ఒత్తిడి చేస్తున్నారని వాపోతున్నారు. మొత్తం మీద కేంద్రప్రభుత్వం నిబంధనలు రాష్ట్రప్రభుత్వ వైఖరి కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా పూర్తిస్థాయిలో చిరుగులులేని సంచులు సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. -
అక్రమ వ్యాపారంపై కఠిన చర్యలు
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లాలో నాటుసారా, ఎస్డీపీఎల్ లిక్కర్, స్పూరియస్ లిక్కర్, కల్తీ కల్లు వంటివాటిపై పటిష్టమైన నిఘాతో నిరంతర తనికీలతో నిరోధించేందుకు చర్యలు చేపట్టాలని ఏపీ ఎకై ్సజ్, ప్రొహిబిషన్ శాఖ డైరెక్టర్ శ్రీధర్ చామకూరి ఆదేశంలో ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల ఎకై ్సజ్ శాఖ అధికారులతో ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో ప్రత్యేకంగా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమ డిప్యూటీ ఎకై ్సజ్ కమిషనర్ బి.శ్రీలత ఆధ్వర్యంలో చేపట్టిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని మద్యం షాపుల్లోనూ ప్రతీ లిక్కర్ బాటిల్ విధిగా ఏపీ సురక్ష యాప్తో స్కాన్ చేశాక మాత్రమే మద్యం విక్రయాలు చేయాలని ఆదేశించారు. అనంతరం నగరంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం సమీపంలోని అజయ్ వైన్స్లో ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ బీ.శ్రీలతతో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సురక్ష యాప్లో మద్యం బాటిళ్ళను స్కాన్ చేసి పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో ఎకై ్సజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రభుకుమార్, ఏలూరు జిల్లా ఎకై ్సజ్ అధికారి ఎ.అవులయ్య, పశ్చిమగోదావరి జిల్లా ఎకై ్సజ్ అధికారి బి.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
యథేచ్ఛగా మట్టి అక్రమ రవాణా
ముసునూరు : మండలవ్యాప్తంగా మట్టి దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. మట్టి దోపిడీ కోసమే మేమున్నాం అన్నట్టుగా అధికార పార్టీకి చెందిన నాయకులు అందరికీ అభయం ఇచ్చేసి, పగలు రాత్రి తేడా లేకుండా అనుమతులతో పని లేకుండా, రోజుకో చెరువులో మట్టిని కొల్లగొడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం, నేతల ధనార్జనే ధ్యేయంగా సహజ సంపదైన మట్టిని కొల్లగొడుతూ లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. నూజివీడు డివిజన్కు సబ్ కలెక్టర్గా ఐఏఎస్ అధికారి ఉన్నప్పటికీ, యథేచ్ఛగా జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలపై నియంత్రణ లేదని విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. దూరాన్ని బట్టి రేటు మండల కేంద్రం ముసునూరులోని చోటా నాయకులు రెవెన్యూ, నీటి పారుదల, గనుల శాఖల అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా, దూరాన్ని బట్టి ట్రాక్టర్ ట్రక్కుకు రూ.800 నుంచి రూ.1000 వరకు రేటు నిర్ణయించి, నల్లచెరువు, ఊర చెరువు, ముత్తర బోయిన కుంటల్లో నుంచి మట్టిని అక్రమంగా తరలించి, విక్రయిస్తూ తమ జేబులు నింపుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఏకంగా జేసీబీలు పెట్టి రేయింబవళ్లు తేడా లేకుండా వందలాది ట్రాక్టర్లతో విలువైన మట్టిని తరలిస్తున్నారు. నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పేరు చెప్పి, వాణిజ్య అవసరాలకు, భూస్వాముల తోటలు, పొలాలకు వేలాది ట్రాక్టర్ల మట్టి తరలిస్తూ, అక్రమాలకు పాల్పడుతున్నట్లు పలువురు బాహాటంగా విమర్శిస్తున్నారు. అధికారులు మాత్రం గృహావసరాలు అని చెప్పి, తప్పించుకుంటున్నారే గానీ చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు చెబుతన్నారు. ఈ తవ్వకాలపై తహసీల్దార్ డి.ప్రశాంతిని వివరణ కోరగా, తక్షణం వీఆర్ఓను పంపి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ముసునూరులో ప్రధాన రహదారి పక్కనే డంప్ చేసిన మట్టి ముసునూరు నల్ల చెరువులో నుంచి మట్టి తరలిస్తున్న దృశ్యం -
ఈత విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి
బుట్టాయగూడెం: వేసవి వచ్చిందంటే చిన్నారుల్లో ఎక్కడలేని ఆనందం ఉంటుంది. ఏడాది పొడవునా బడిలో చదువుకుంటూ గడిపిన విద్యార్థులు సెలవుల్లో వారి ఉత్సాహంగా గడపాలని కోరుకుంటారు. ముఖ్యంగా పట్టణాల్లో చదివిన విద్యార్థులు తమ స్వగ్రామాలకు వచ్చి వేసవిని ఆశ్వాదిస్తారు. శుక్రవారం నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ఇచ్చారు. అయితే సెలవు రోజుల్లో చిన్నారులు చెరువులు, బావులు, ప్రాజెక్టుల్లో ఈత కొట్టాలని కోరకుంటూ ఉంటారు. అయితే సరదాగా ఈతకు దిగుతున్న చిన్నారులు మృత్యువాత పడుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఈతపై అప్రమత్తంగా లేకుంటే తల్లిదండ్రులకు గుండె కోత తప్పదంటున్నారు నిపుణులు. జాగ్రత్తలు తీసుకోవాల్సిందే పోలవరం నియోజకవర్గంలో పరిధిలో గిరిజన మండలాల్లో గల గ్రామాల్లో సుమారు 128 చెరువులు ఉన్నాయి. వీటిలో 40 పెద్ద చెరువులు, చిన్న చెరువులు 81 ఉన్నాయి. గుబ్బల మంగమ్మతల్లి జల్లేరు జలాశయం, కొవ్వాడ ప్రాజెక్టు, పోగొండ రిజర్వాయర్ ఉన్నాయి. ఆయా చెరువుల్లో, ప్రాజెక్టుల్లో కొంతమేర నీరు ఉంది. అనేక మంది గ్రామాల్లో ఉంటున్న ప్రజలు దుస్తులు ఉతకడానికి వెళ్తుంటారు. అలాగే సరదాగా ఈతకు వెళ్లి మృత్యువాత పడిన సంఘటనలు జరిగాయి. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల్సిందే ఈత రానివారు ఈతకు వెళ్లే ప్రతీ ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కచ్చితంగా మనిషి నీటిలో మునిగిపోకుండా మునగ, కలబంద కట్టెలను కట్టుకోవాలి. ఈత నేర్పిచాలనుకునేవారు ఈత రాని వారి నడుముకు తాడుట్టి గట్టుపై ఒకరు ఉండి ఈత నేర్పించాలి. ఈతకు వెళ్లే వారు తప్పనిసరిగా తమ వెంట మునగ కట్టెలు, ఈత వచ్చిన వారిని వెంట తీసుకుని వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈత రాని వారిని ఈత నేర్చుకుంటున్న వారు ఒక కంట కనిపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈత కొట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే ● ఈత కోట్టేటప్పుడు శరీర నిర్మాణానికి అనువైన స్మిమింగ్ సూట్ వేసుకోవాలి. ● తల వెంట్రుకలు తడవ కుండా మాస్క్ లాంటిది ధరించాలి. ● నీటిలో తడవటం వల్ల చర్మ సంబంధింత వ్యాధులు రాకుండా వాజిలిన్ వంటివి పూసుకోవాలి. ● ముఖాన్ని పైకి ఉంచి ఈదాలి. ఊపిరి పీల్చుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ● బావి, చెరువులోకి దూకేటప్పుడు కాళ్లు ముందుగా నీళ్లను తాకేలా చూసుకోవాలి. తలకిందులుగా డైవింగ్లా దూకడం ప్రమాదం. ● అడుగుభాగంలో బండరాళ్లు, చెరువుల్లో ఎండిన కొమ్మలు ఉంటాయి. అలాంటి వాటిలో లోతును ముందుగా అంచనా వేయకపోతే ప్రమాదం. ● అరగంట కంటే ఎక్కువసేపు ఈత కొట్టకూడదు. గంటల కొద్దీ ఈదడం వల్ల ఊపిరి ఆడదు. ఈతకొట్టే సమయంలో ఇతరులు మునిగిపోయినట్లు గమనిస్తే ఎంతటి నిపుణులైనా ఈత కొట్టేందుకు దూకకూడదు. కర్రలు, తాడు పరికరాల సహాయంతో కాపాడాలి. జాగ్రత్తలు తీసుకోవడం ద్వారానే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. సరదాకు వెళ్లి ప్రాణాలు కోల్పోతున్న విద్యార్థులు, యువకులు -
నవధాన్యాల సీడ్ కిట్లు సిద్ధం
ద్వారకాతిరుమల: మండలంలోని గుండుగొలనుకుంటలో మెగా బయో ఇన్ఫుట్స్ రిసోర్స్ సెంటర్ (బీఆర్సీ)లో గురువారం ప్రకృతి వ్యవసాయానికి ఉపయోగపడే పీఎండీ నవధాన్యాల సీడ్ కిట్ల తయారీ కార్యక్రమం నిర్వహించారు. తొలి విడతగా 800 పీఎండీ కిట్లు సిద్ధం చేశారు. ప్రతి కిట్లో 15 కిలోల బరువైన 25 రకాల విత్తనాలు ఉన్నాయి. ఒక్కో కిట్ను రూ. 1,400 కు రైతులకు అందిస్తున్నారు. కార్యక్రమాన్ని జిల్లా ప్రాజెక్టు మేనేజర్ బి.వెంకటేష్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఎండీ నవధాన్యాల విత్తనం వల్ల రైతులకు అనేక లాభాలు కలుగుతాయన్నారు. నవధాన్యాల పంటలు వేసుకోవడం ద్వారా నేల ఎర్రదనం తగ్గి, సంవత్సరం పొడవునా భూమి పచ్చగా కప్పబడి ఉంటుందన్నారు. 365 రోజులు భూమి కప్పబడి ఉండటం వల్ల నేల నష్టం తగ్గి, భూతాపాన్ని తగ్గించడంలోనూ, ప్రకృతి విపత్తులను తట్టుకునే శక్తిని పెంచడంలోనూ పీఎండీ నవధాన్యాల కిట్లు కీలక పాత్ర పోషిస్తాయని వెంకటేష్ తెలిపారు. దెందులూరు: మండలంలోని గోపన్నపాలెంలో ఈ నెల 25న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. గురువారం గోపన్నపాలెంలోని శ్రీసీతారామ ప్రభుత్వ వ్యాయామ విద్యా కళాశాల గ్రౌండ్, సోమరప్పాడుకాలనీ, పీఈటీ గ్రౌండ్, గాలాయిగూడెం, తదితర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీఎం జనాభా నిర్వహణ–ప్రతిపాదిత గ్రామసభ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, బడేటి చంటి, జేసీ ఎంజే అభిషేక్ గౌడ, జంగారెడ్డిగూడెం ఏఎస్పీ ఆర్.సుస్మిత, ట్రైనీ ఐపీఎస్ జయశర్మ పాల్గొన్నారు. -
చలివేంద్రం తొలగింపుపై వైఎస్సార్సీపీ ఆందోళన
ఏలూరు: మండే ఎండలో దాహార్తిని తీర్చే చలివేంద్రం ఏర్పాటు అంశాన్ని కూడా కూటమి ప్రభుత్వం రాజకీయం చేస్తోంది. ఏలూరులోని 45వ డివిజన్ ఆదివారంపేటలో వైఎస్సార్సీపీ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కూటమి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో తొలగించారు అధికారులు.ఏలూరు వైఎస్సార్సీపీ ఇంచార్జ్ జయప్రకాశ్ ఆదివారంపేటలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. అయితే మున్సిపల్ అధికారులు ఆ చలివేంద్రాన్ని తొలగించి కూటమి ప్రభుత్వం గురుభక్తి చాటుకున్నారు. అధికారులను అడ్డుపెట్టుకుని కక్షపూరిత రాజకీయాలు చేయడంపై వైఎస్సార్సీపీ ధ్వజమెత్తింది. చలివేంద్రం ఏర్పాటు చేయడాన్ని కూడా తొలగించడంపై వైఎస్సార్సీపీ శ్రేణులు పాత బస్టాండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశాయి. ఎర్రటి ఎండల్లో ప్రజల దాహం తీర్చే చలివేంద్రం మూసివేయడం అమానుషమని వైఎస్సార్సీపీ విమర్శించింది. -
Eluru: ప్రేమ జంటను చితక్కొట్టిన తల్లిదండ్రులు
సాక్షి, ఏలూరు జిల్లా: ద్వారకా తిరుమల మండలం ఐఎస్ రాఘవాపురంలో ప్రేమ పెళ్లి చేసుకున్న జంటపై తల్లిదండ్రుల దాడికి పాల్పడ్డారు. యువతిని తల్లిదండ్రులు, బంధువులు బలవంతంగా తీసుకెళ్లిపోయారు. ఐఎస్ రాఘవపురానికి చెందిన సంజిత్, కామవరపుకోట మండలం వెంకటాపురానికి చెందిన పద్మ.. గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పద్మ తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించడంతో గత నెల 20న ఏలూరు అంబేద్కర్ నవ సమాజ్ సొసైటీలో ప్రేమజంట వివాహం చేసుకున్నారు.అనంతరం పోలీస్ స్టేషన్లో తమకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు. అయితే గత రాత్రి ఐఎస్ రాఘవపురంలోని సంజిత్ ఇంటికి వెళ్లి వారిపై ఇనుప రాడ్లతో దాడి చేసిను పద్మ తల్లిదండ్రులు, బంధువులు ఆమెను బలవంతంగా తీసుకెళ్లారు. తన భార్యను తన వద్దకు చేర్చాలని బాధితులు సంజిత్ కోరుతున్నాడు. తమపై దాడి చేసి తన భార్యను ఎత్తుకెళ్లిన వారిపై చర్యలు తీసుకోవాలని ద్వారకా తిరుమల పోలీసులకు భర్త ఫిర్యాదు చేశాడు. -
కాలువ గట్టు.. కొల్లగొట్టు !
● తాడిపూడి గట్లను యథేచ్ఛగా తవ్వేస్తున్న మాఫియా ● పట్టించుకోని అధికారులు తాడేపల్లిగూడెం రూరల్: శివారు భూముల రైతులకు మూడో పంటకు సాగు నీరు అందించేందుకు దివంగత నేత డాక్టర్ వైఎస్.రాజశేఖర్రెడ్డి తాడిపూడి కాలువ నిర్మాణం చేశారు. తాడేపల్లిగూడెం మండలంలోని వీరంపాలెం, జగ్గన్నపేట, వెంకట్రామన్న గూడెం గ్రామాల మీదుగా తాడిపూడి కాలువ ఉంది. కాలువ నీరు ఉప్పొంగిన సమయంలో సమీప పొలాలను ముంచెత్తకుండా కాలువ తవ్విన కంకరను తాడి చెట్టు ఎత్తున గట్లు వేశారు. ప్రభుత్వాలు మారడంతో మైనింగ్ బకాసురులు గట్లనే వ్యాపారంగా మార్చుకున్నారు. దీంతో గట్లను రాత్రింబవళ్లు తవ్వేసి కంకరను బయట ప్రాంతాలకు తరలిస్తూ లక్షలాది రూపాయలు వెనకేసుకుంటున్నారు. ప్రస్తుతం జగ్గన్నపేట ప్రాంతంలో తాడిపూడి కాలువ గట్లను జేసీబీలతో రేయింబవళ్లు తవ్వేస్తున్నారు. ప్రత్యేకించి రాత్రి సమయాల్లో లైట్ల కాంతుల్లో కంకర గట్లను తవ్వేసి పెద్ద ఎత్తున లారీల్లో తరలిస్తున్నారు. రాత్రి సమయాల్లో లారీల చక్రాలకు బ్రేక్లు ఉండటం లేదని, ఇష్టారీతిగా లారీలను నడుపుతున్నారని స్థానికులు వాపోతున్నారు. ఈ సమయంలో ఏ జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత శాఖ అధికారులు మిన్నకుండటంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారా ? అనే అనుమానాలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు ఏ మేరకు చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి మరి. -
పారా క్రీడాకారుల ప్రతిభ
అత్తిలి: అంతర్జాతీయ స్థాయి పోటీల్లో అత్తిలికి చెందిన పారా క్రీడాకారుడు యడ్లపల్లి సూర్యనారాయణ ప్రతిభ కనబరిచాడు. థాయ్లాండ్లోని శ్రీరాచా పట్టణంలో ఈనెల 17 నుంచి 19 వరకు జరిగిన వరల్డ్ మాస్టర్స్ స్పోర్ట్స్ చాంపియన్ షిప్స్–2026లో అథ్లెటిక్స్ విభాగంలో శారీరక వికలాంగుల కేటగిరీ షాట్పుట్లో బంగారు పతకం, జావెలిన్ త్రోలో కాంస్య పతకం సాధించారు. పాలకొల్లు సెంట్రల్: థాయ్లాండ్లో జరిగిన వరల్డ్ మాస్టర్స్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2026 పోటీల్లో పాలకొల్లు పట్టణానికి చెందిన ఎం నళిని రాజశేఖర్ ప్రతిభను చాటారు. వీల్చైర్ కేటగిరి పారా పికిల్బాల్ డబుల్స్లో నళిని రాజశేకర్ కోన ఏసుబాబుతో కలిసి కాంస్య పతకం సాధించారు. అథ్లెటిక్స్ విభాగంలో షాట్పుట్లో స్వర్ణ పతకం, జావెలిన్ త్రోలో కాంస్య పతకం సాధించాడు. రోడ్డు ప్రమాదంలో మరో యువకుడి మృతి కాలువలో లభ్యమైన మూడు చక్రాల వాహనం -
తాగునీటి సౌకర్యం ఏర్పాటు
ఆగిరిపల్లి: స్థానిక బస్టాండ్ ఆవరణలో ఉన్న వాటర్ కూలర్ వద్ద తాగునీరు ఏర్పాటు చేశారు. మంగళవారం ‘నిరుపయోగంగా చలివేంద్రం’ కథనం సాక్షిలో ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి బస్టాండ్ ఆవరణలో తాగునీరు ఏర్పాటు చేశారు. ఏలూరు(టూటౌన్): వృద్ధుల చట్టాలు, పథకాలపై అవగాహన కలిగి ఉండాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. రత్నప్రసాద్ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో విభిన్న ప్రతిభావంతుల, వయోవృద్ధుల సంక్షేమ విభాగం వయోవృద్ధుల చట్టాలు, పథకాలపై అవగాహన సదస్సును బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ మాట్లాడుతూ.. వయోవృద్ధుల సంక్షేమం కోసం అనేక చట్టాలను రూపొందించారని, పిల్లల నుంచి నిరాదరణకు గురైనప్పుడు సంబంధిత శాఖ అధికారులను గానీ లేదా న్యాయ సేవాధికార సంస్థలను గాని సంప్రదించవచ్చని సూచించారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల, వయోవృద్ధుల శాఖ అదనపు డైరెక్టర్ బి.రామకుమార్, న్యాయవాది పి.రత్నరాజు, పోలీసు అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రంలో సమగ్రశిక్ష ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మే నెల 15వ తేదీన సమగ్రశిక్ష ఉద్యోగులు తమ కుటుంబాలతో సహా పాదయాత్ర నిర్వహించనున్నట్లు సమగ్ర శిక్ష ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర వైస్ ఛైర్మన్ వాసా శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఏలూరు సమగ్రశిక్ష కార్యాలయం వద్ద పాదయాత్రకు సంబంధించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సమగ్రశిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం అందించాలని, హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని, విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి సమగ్రశిక్ష ఉద్యోగులపై చిన్నచూపు తగదని, పెరగని జీతాల గురించి ఎన్నోసార్లు విద్యాశాఖ మంత్రికి వినతిపత్రం ఇవ్వడంతో పాటు, అనేకసార్లు కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరామన్నారు. అయినప్పటికీ ఆయన నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో మే 15వ తేదీన విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుండి మంత్రి నివాసం వరకు తమ ఉద్యోగ భద్రత కోసం పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ద్వారకాతిరుమల: శ్రీవారి రూ.200 నకిలీ దర్శనం టికెట్ల స్కామ్ కేసులో ముగ్గురు నిందితులకు భీమడోలు కోర్టు న్యాయమూర్తి ఎస్.ప్రియదర్శిని నూతక్కి బుధవారం బెయిల్ మంజూరు చేశారు. ఇద్దరికి బెయిల్ నిరాకరించారు. ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో గతనెల 15న రూ. 200 నకిలీ టికెట్ల విక్రయాల స్కామ్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటి వరకు పోలీసులు 9 మందిని అరెస్టు చేసి, రిమాండ్కు పంపగా, అందులో నలుగురు నిందితులకు గత మంగళవారం బెయిల్ మంజూరయ్యింది. మిగిలిన ఐదుగురిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఐఎస్జే రాజు, ఎం.రమేష్కు మినహా మిగిలిన ముగ్గురు నిందితులకు బుధవారం బెయిల్ మంజూరయ్యింది. -
ఆటస్థలాల అభివృద్ధికి మీనమేషాలు
ఏలూరు నగరంలో ఆట స్థలాలు కరువయ్యాయి. కార్పొరేషన్ పరిధిలో ఆడేందుకు ఆట స్థలాలు లేకపోవడంతో యువత తీవ్ర నిరాశకు గురవుతున్నారు. 8లో uగురువారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026సాక్షి, భీమవరం: ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల మధ్య ఉప్పుటేరు మేజర్ డ్రెయిన్. కొల్లేరు నుంచి మొదలై ఆకివీడు, కాళ్ల, భీమవరం మండలాల మీదుగా 67 కి.మీ ప్రయాణించి కృష్ణా జిల్లా గొల్లపాలెంవద్ద కడలిలో కలుస్తుంది. కొల్లేరుకు అవుట్లెట్గా ఉన్న ఉప్పుటేరులో రెండు జిల్లాల్లోని 120 వరకు బుడమేరు, రామలేరు, తమ్మిలేరు, యనమదుర్రు, బొండాడ తదితర మేజర్, మైనర్ డ్రెయిన్లు, పంట కాలువలు కలుస్తుంటాయి. వీటిద్వారా గుర్రపుడెక్క, కిక్కిస ఉప్పుటేరులోకి చేరుతోంది. ఏళ్ల తరబడి ప్రక్షాళనకు నోచుకోక ఎక్కడికక్కడ డ్రెయిన్ పూడికతో మేటలు వేసింది. ఆక్రమణల చెరలో.. డ్రెయిన్ వెంబడి 70 వేలకు పైగా ఎకరాల్లో ఆక్వా చెరువులు సాగవుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని లోసరి, దొంగపిండి, మాలవానితిప్ప, కృష్ణా జిల్లాలోని గొల్లపాలెం, లక్ష్మీపురం, మాట్లం తదితర పలుచోట్ల పీడబ్ల్యూడీ (డ్రెయిన్ మార్జిన్) భూమి వంద మీటర్ల నుంచి 500 మీటర్లకు వరకు ఉంటుంది. సారవంతమైన భూమి కావడంతో చాలా చోట్ల డ్రెయిన్ మార్జిన్ను ఆక్రమించి ఆక్వా చెరువులుగా మార్చేశారు. కూటమి హయాంలో చెరువుల అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. వారం రోజుల క్రితం లోసరి వద్ద ఉప్పుటేరు మార్జిన్ ఆక్రమించి ఆక్వా చెరువులు తవ్వేశారు. దీనిపై స్థానికులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని పరిస్థితి. కొల్లేరు నుంచి గొల్లపాలెం వరకు డ్రెయిన్ మార్జిన్ ఎంతమేర ఆక్రమణలకు గురైంది అధికారుల వద్ద వివరాలు లేకపోవడం ఉప్పుటేరు దుస్థితికి అద్దం పడుతుంది. వానా కాలంలో ముప్పు ఆక్రమణలు, పూడికలతో ఉప్పుటేరు సామర్థ్యం నానాటికీ తగ్గుతోంది. మూడు నుంచి ఆరు మీటర్లు వరకు ఉండాల్సిన డ్రెయిన్ లోతు కొన్నిచోట్ల మీటరు మాత్రమే ఉంది. గతంలో 25 వేల క్యూసెక్కుల సామర్థ్యం కాగా ఎనిమిది క్యూసెక్కులకు తగ్గిపోయింది. అధిక వర్షాలు, వరదల సమయంలో ముంపు ముప్పు వెంటాడుతోంది. ఏటా రెండు జిల్లాల్లోని పరివాహక గ్రామాలు, చెరువులు, పంటపొలాలు ముంపు బారిన పడి అపారనష్టం వాటిల్లుతోంది. తండ్రీకొడుకుల చొరవ కొల్లేరు సరస్సు ప్రక్షాళన సమయంలో ఉప్పుటేరు అభివృద్ధికి దివంగత వైఎస్సార్ చర్యలు చేపట్టారు. పూడిక తొలగింపు కోసం ఆకివీడు వద్ద డ్రెడ్జింగ్ పనులు చేపట్టారు. జువ్వ కనుమ నుంచి ఆర్అండ్బీ వంతెన సమీపం వరకు కొంతమేర పనులు పూర్తిచేయగా తర్వాత వాతావరణం అనుకూలించక అప్పట్లో పనులు వాయిదా పడటంతో తర్వాత పట్టించుకునే వారు కరువయ్యారు. 2019–24 మధ్యకాలంలో జగన్ ప్రభుత్వం స్వచ్ఛ కొల్లేరులో భాగంగా ఉప్పుటేరు ముంపు బెడద పరిష్కారానికి నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవ చూపారు. ఆకివీడు మండలం దుంపగడప, మొగల్తూరు మండలం పడతడిక, మోళ్లపర్రు వద్ద మూడు రెగ్యులేటర్ల నిర్మాణానికి రూ.412 కోట్ల కేటాయింపులు చేసి టెండర్ల ప్రక్రియను చేపట్టారు. ముప్పుటేరుపూడికతో నిండిన ఉప్పుటేరు ఉప్పుటేరు మార్జిన్ ఆక్రమించి ఆక్వా చెరువులు తవ్వుతున్న దృశ్యం కొల్లేరుకు ప్రధాన డ్రెయిన్గా ఉన్న ఉప్పుటేరుపై చంద్రబాబు ప్రభుత్వం శీతకన్ను వేసింది. రూ.525 కోట్లతో డ్రెడ్జింగ్ పనులు చేపట్టేందుకు డ్రెయినేజీ శాఖ పంపిన డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్)ను అటకెక్కించింది. ఆక్రమణలు, పూడికతో డ్రెయిన్ కుచించుకుపోగా ఉమ్మడి పశ్చిమ, కృష్ణా జిల్లాలకు ఉప్పుటేరు ముంపు బెడదకు ఈ ఏడాది మోక్షం కలిగేలా లేదు. కొల్లేరు ప్రధాన అవుట్లెట్గా ఉప్పుటేరు ఆక్రమణలు, పూడికతో నీటి ప్రవాహానికి ఆటంకం 25 వేల నుంచి 8 వేల క్యూసెక్కులకు పడిపోయిన సామర్థ్యం డ్రెడ్జింగ్ కోసం రూ.525 కోట్లతో డీపీఆర్ ఏడాదవుతున్నా అతీగతీ లేని వైనం -
శ్రీవారి కొండపై గోబర్ధన్ ప్లాంట్
● రూ.50 లక్షల ఎస్బీఎం 2.0 నిధులతో ఏర్పాటు ● గో సంరక్షణ శాలకు గ్యాస్, విద్యుత్ ఖర్చులు ఆదా ద్వారకాతిరుమల: శ్రీవారి దేవస్థానం రోజూవారీ ఖర్చులను తగ్గించుకునేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంంది. గతంలో దేవస్థానం అధికారులు కొండపైన పాత గోసంరక్షణశాల వద్ద గోబర్ గ్యాస్ ప్లాంట్ను నిర్మించి, దాన్ని సమర్ధవంతంగా నిర్వహించారు. గో వ్యర్ధాల ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేసి, నిత్యావసరాలకు వినియోగించేవారు. ధర్మఅప్పారాయ నిలయం (120 గదుల సత్రం)కు ఆ విద్యుత్ను సరఫరా చేసేవారు. దాని ద్వారా దేవస్థానానికి ప్రతి నెలా వేలాది రూపాయల విద్యుత్ బిల్లు ఆదా అయ్యేది. అభివృద్ధిలో భాగంగా గోసంరక్షణశాలను 2018లో శివాలయానికి సమీపంలో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి గోపోషణ అక్కడే నిర్వహిస్తున్నారు. పాత గోసంరక్షణ శాల ప్రదేశంలో నిత్యాన్నదాన భవనం, అంబరుఖానా (ప్రసాదాల తయారీ శాల)ను నిర్మించే సమయంలో గోబర్ గ్యాస్ ప్లాంట్ను తొలగించారు. అప్పటి నుంచి గో వ్యర్ధాలను సేంద్రీయ ఎరువుగా మార్చి, వేలం ద్వారా విక్రయించి, వచ్చిన ఆదాయాన్ని దేవస్థానానికి జమ చేసేవారు. 1.0 టీపీడీ సామర్ధ్యంతో.. స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) 2.0 గ్రాంట్ రూ.50 లక్షలతో గోసంరక్షణశాల వద్ద నిర్మించిన 1.0 టీపీడీ సామర్ధ్యం గల గోబర్ధన్ ప్లాంట్ వాడుకలోకి వచ్చింది. దాంతో గోసంరక్షణ శాలలోని 350 గోవుల నుంచి వచ్చే వ్యర్ధాల(పేడ)ను ఈ గోబర్ధన్ ప్లాంట్కు వినియోగిస్తున్నారు. రోజుకు 500 కేజీల పేడను వేయడం ద్వారా వచ్చే గ్యాస్, విద్యుత్ను ప్రస్తుతం గోసంరక్షణశాలకు వినియోగిస్తున్నారు. విద్యుత్, గ్యాస్ ఆదా ఆవులు, గుర్రానికి పెట్టే దాణాను ఉడకబెట్టేందుకు మూడు రోజులకు ఒక గ్యాస్ సిలెండర్ ఖర్చు అయ్యేది. ఈ నూతన గోబర్ధన్ ప్లాంట్ ఏర్పాటుతో ఇప్పుడు గ్యాస్ సిలెండర్లతో పనిలేకుండా పోయింది. ఆవుల షెడ్లలో నిరంతరాయంగా తిరిగే ఫ్యాన్లకు ఈ ప్లాంట్ ద్వారా సరఫరా అయ్యే విద్యుత్ను వినియోగిస్తున్నారు. దాంతో విద్యుత్ ఖర్చు కూడా ఆదా అవుతోంది. ఉత్పత్తి సామర్ధ్యం ఇలా నూతన ప్లాంట్ నుంచి రోజుకి బయోగ్యాస్ 30–40 క్యూబిక్ మీటర్లు, విద్యుత్ రోజుకు 60–70 యూనిట్లు, సేంద్రీయ ఎరువు 700–800 కేజీలు ఉత్పత్తి అవుతుంది. ప్లాంట్ నుంచి విద్యుత్ సరఫరా చేసేందుకు జనరేటర్, గ్యాస్ను సరఫరా చేసేందుకు కంప్రెషర్ను ఏర్పాటు చేశారు. గోసంరక్షణశాల సిబ్బందికి ప్లాంట్ నిర్వహణపై అవగాహన కల్పించారు. గోబర్ధన్ గ్యాస్ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. కొండపై నిర్మించిన ఈ ప్లాంట్ ద్వారా బయోగ్యాస్, విద్యుత్, సేంద్రీయ ఎరువులు ఉత్పత్తి అవుతున్నాయి. దాంతో గో సంరక్షణ శాలలో గ్యాస్, విద్యుత్ ఖర్చు అదా అవుతోంది. ఈ ప్లాంట్ల ఏర్పాటుతో పర్యావరణం పరిరక్షణ జరుగుతోంది. – వేండ్ర త్రినాథరావు, శ్రీవారి దేవస్థానం ఈఓ -
అక్రమ తవ్వకాలకు అడ్డుకట్టే లేదు
ముదినేపల్లి (కై కలూరు): లైంగిక దాడికి యత్నంపై ముదినేపల్లి పోలీస్ స్టేషన్లో బుధవారం కేసు నమోదైంది. ప్రొద్దువాక గ్రామానికి చెందిన ఓ మహిళ భర్త ఇద్దరు పిల్లలతో కలసి బడ్డి కొట్టు నిర్వహిస్తోంది. ఇదే గ్రామానికి చెందిన కూర్మా దేవదాసు బడ్డికొట్టు వద్దకు అప్పుడప్పుడు వస్తుండేవాడు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం భర్త, అత్తా లేని సమయంలో దేవదాసు మద్యం సేవించి వచ్చి ఆ మహిళను ఇంట్లోకి లాక్కువెళ్లి లైంగికదాడికి యత్నించాడు. ఆమె గట్టిగా కేకలు వేయగా చుట్టుపక్కల వారు రావడంతో పరారయ్యాడు. భార్యభర్తల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వీరభద్రరావు తెలిపారు. -
అవినీతి, జూదం ఆదాయ వనరులు
ప్రశ్నిస్తున్న కారుమూరిపై కేసుల పర్వం: సాయిబాబా రెడ్డి తణుకు అర్బన్: కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండేళ్ల కాలంలో జూదాలు, ఇతర అవినీతి మార్గాలనే కూటమి నేతలు తమ ఆదాయ వనరులుగా మార్చుకున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెలగల సాయిబాబారెడ్డి విమర్శించారు. వీటిపై ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావును టార్గెట్ చేసి, కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేయాలని తణుకు టీడీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. బుధవారం తణుకు వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ నేతలు తమ ఆనందం కోసం అదే నోటీసు పత్రాలను సిట్ అధికారుల వేషంలో వచ్చి కారుమూరి నివాసానికి అతికించి సంబరాలు చేసుకోవడం దారుణమని విమర్శించారు. కారుమూరిపై పెట్టిన కేసులకు ఆయన ఎప్పుడూ భయపడలేదని, ఇంట్లోని మహిళలపై కూడా కేసులు పెట్టడంపైనే ఆయన బాధపడ్డారని తెలిపారు. అత్తిలి మండలం ఆరవల్లిలో టీడీపీ నాయకులు 50 మంది నిరుద్యోగులను నమ్మించి, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ. 3 కోట్లకు పైగా వసూలు చేయడం దుర్మార్గమన్నారు. ఆరవల్లిలోని టీడీపీ నాయకులే ఈ మోసంలో ప్రధాన పాత్ర పోషించి, మళ్లీ వారే పోలీసులకు ఫిర్యాదు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జూద కేంద్రంగా అత్తిలి కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండేళ్లలో తణుకు నియోజకవర్గాన్ని జూద కేంద్రంగా మార్చారని సాయిబాబారెడ్డి ఆరోపించారు. ముఖ్యంగా అత్తిలిలో తాజాగా కూటమిలోని జనసేన నాయకులు క్రికెట్ బుకీలుగా అరెస్టు కావడం సంచలనం సృష్టించిందని, వారి వివరాలు పూర్తిగా బయటపెట్టకుండా స్థానిక ప్రజాప్రతినిధి పోలీసులపై ఒత్తిడి చేస్తున్నారని విమర్శించారు. అత్తిలి టీడీపీ ప్రధాన నాయకుడి బంధువు ఇంట్లోనే పేకాట క్లబ్బులు నడుస్తున్నాయని, తణుకు పట్టణంలో 12 ప్రాంతాల్లో పేకాట నిర్వహిస్తున్నారని, ఆ కమిషన్లతోనే పార్టీని నడపడం దౌర్భాగ్యమని విమర్శించారు. ఆరవల్లిలో టీడీపీ దౌర్జన్యాలను నిలదీస్తున్న వైఎస్సార్సీపీ నేత రొయ్యల చెరువులో విషప్రయోగం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ సేవలో పోలీసులు ఆరవల్లిలో జరిగిన ఉద్యోగాల మోసానికి గురైన నిరుద్యోగుల సమస్యను వెలుగులోకి తెచ్చిన జర్నలిస్టుల కథనాలు ప్రశంసనీయమని సాయిబాబారెడ్డి కొనియాడారు. దువ్వ గ్రామంలో ఒక నిరుద్యోగికి ప్రజాప్రతినిధి సమక్షంలో సెటిల్మెంట్ చేసి డబ్బులు తిరిగి ఇచ్చారని, నవుడూరు బాధితులకు స్థలం రాసిస్తామని నమ్మబలికారన్నారు. ఉద్యోగాల మోసంపై వార్తలు రాసిన మీడియా ప్రతినిధులను పోలీసులు టార్గెట్ చేయడం వారి విధి నిర్వహణలోని లోపాలను చూపిస్తోందన్నారు. ఉప ముఖ్యమంత్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి మోసం చేసినా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని, అధికార పార్టీకి ఇబ్బంది కలగకుండా పోలీసులు ప్రాధాన్యత ఇస్తున్నారని దుయ్యబట్టారు. సమావేశంలో పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, పంచాయతీరాజ్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరి సీతారాం, నాయకులు జల్లూరి జగదీష్, మెహర్ అన్సారీ, జంగం ఆనంద్కుమార్, పెనుమాల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
సంచి నిండా చిల్లులే
పాత సంచులు సరఫరా చేయడంతో వాటి నిండా చిల్లులే ఉంటున్నాయి. ఒక్కో సంచిలో 45 కేజీల ధాన్యం నింపాల్సి ఉండగా, కేవలం 35 నుంచి 40 కేజీలే పడుతున్నాయి. సంచుల తేడాతో రైతులు తీవ్ర నష్టానికి గురికావాల్సి వస్తోంది. ప్రభుత్వం తక్షణమే నాణ్యమైన సంచులను సరఫరా చేయాలి. – గంధం మధుసూధనరావు, రైతు, మాదివాడ, ఆకివీడు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పాత సంచులు ఇస్తున్నారు. అవి సకాలంలో అందడం లేదు. రైతులు సంచుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాళ్వా కోతలు ముమ్మరంగా సాగుతున్నందున సంచుల కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. – తుంపుళ్ల సూర్యనారాయణ, రైతు, ఆకివీడు -
చిరిగిన సంచులే దిక్కు
దాళ్వా కోతల నేపథ్యంలో రైతులకు ఇక్కట్లు ఆకివీడు: రైతులకు సంచుల బెడద తీవ్రమైంది. దాళ్వా కోతలు ముమ్మరమవుతుంటే, ప్రభుత్వం రైతులకు సంచుల సరఫరాలో పూర్తిగా విఫలమైంది. రైస్ మిల్లర్లు సంచులను సరఫరా చేస్తారని చెప్పడంతో రైతుల ఆందోళన చెందుతున్నారు. సకాలంలో మిల్లర్లు సంచులు సమకూర్చలేకపోతున్నారు. ఆయా గ్రామాల్లోని రైతులకు కేటాయించిన మిల్లుల వద్ద నుంచి వచ్చే సంచులలో 60 శాతానికి పైగా చినిగినవి ఇవ్వడంతో రైతులు అయోమయంలో ఉన్నారు. స్థానిక మాదివాడ ఆయకట్టులో రైతులు కోతలు ముమ్మరం చేశారు. అయితే చినిగిన సంచులతో సతమతమవుతున్నామని, ధాన్యం పూర్తిస్థాయిలో మిల్లులకు ఏ విధంగా చేరుతుందోనన్న భయంతో ఉన్నామని పలువురు రైతులు వాపోతున్నారు. పాత సంచులే ఇస్తున్నారని, వాటిలో చిల్లులు ఉన్న సంచులకు ప్యాచ్ వర్కులు వేసి సరఫరా చేయడంతో ధాన్యం నింపిన వెంటనే కారిపోతున్నాయని లబోదిబోమంటున్నారు. మరికొన్ని సంచులు చిన్నవిగా ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఒక్కో సంచిలో 45 కేజీల ధాన్యం నింపాల్సి ఉండగా, ఈ సంచుల నాణ్యత లేకపోవడం వల్ల కేవలం 35 నుంచి 40 కేజీలు మాత్రమే నింపుతున్నారు. దీనివల్ల అదనపు బస్తాలను వాడాల్సి వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. గత ప్రభుత్వంలో రైతులకు కొత్త సంచులు సరఫరా చేసేవారని, కనీసం చిరుగులు లేని సంచులు సరఫరా చేస్తే ధాన్యం భద్రంగా ఉంటుందని రైతులు మొరపెట్టుకుంటున్నారు. చిరిగిన సంచుల్లోనే ధాన్యం చిల్లుల వల్ల కారిపోతున్న ధాన్యం -
సప్త కోటేశ్వరునికి వెండి ఆభరణాల సమర్పణ
పెనుమంట్ర: నత్తరామేశ్వరం గ్రామంలో గోస్తనీ నదిలో కొలువైయున్న (సప్త కోటేశ్వర) శ్రీ రామలింగేశ్వర స్వామికి దాతలు రూ.36 లక్షలు విలువ చేసే వెండి ఆభరణాలను సమర్పించారు. గ్రామానికి కర్రి అచ్చిరెడ్డి, లక్ష్మి తులసి దంపతులు 6 కిలోల వెండితో కవచం, కర్రి అప్పిరెడ్డి, లక్ష్మీ కాంతం దంపతులు 6 కిలోల వెండితో నాగాభరణాన్ని తయారు చేయించి స్వామికి సమర్పించారు. సోమవారం ప్రత్యేక పూజల అనంతరం వాటిని స్వామికి అలంకరించారు. కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ ద్వారంపూడి సుబ్బారెడ్డి, ఎంపీటీసీ సభ్యులు తమలపూడి నాగ వెంకట సత్యనారాయణ రెడ్డి, ట్రస్ట్ బోర్డ్ సభ్యులు పాల్గొన్నారు. తొలి సోమవార పూజలు : గోస్తని నదిలో వేంచేసి ఉన్న శ్రీ సప్త కోటేశ్వర లింగానికి వైశాఖమాస పర్వదినం పురస్కరించుకుని తొలి సోమవార పూజలు ఘనంగా నిర్వహించారు. ఉదయం పంచామృతాలతో మహా రుద్రాభిషేకాలు, విశేష అలంకరణలు జరిగాయి. ఏలూరు టౌన్: ఏలూరు శివారు క్రాంతి కళ్యాణమండపం సమీపంలో ఖాళీ స్థలంలో మహిళ మృతదేహం లభ్యమైంది. మృతదేహం పూర్తిగా కుళ్లిన స్థితిలో ఉంది. పశువుల కాపరులు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఏలూరు త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు, ఎస్సై రాంబాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్ ప్రత్యేకంగా ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించటంతోపాటు, క్లూస్టీం, డాగ్ స్క్వాడ్ను రంగంలోకి దించి దర్యాప్తు చేపట్టారు. ఏలూరు త్రీటౌన్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏలూరు టౌన్: మహిళా పోలీస్స్టేషన్ పట్ల మహిళలకు అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీస్ శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయ సమీపంలో ఇటీవల నూతనంగా నిర్మించిన మహిళ పోలీస్స్టేషన్కు మంగళవారం ఉదయం 7 గంటల నుంచీ రంగులు వేసేందుకు మహిళలు, విద్యార్థులు, యువత, చిత్రకారులు, సృజనాత్మకత కలిగిన ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. మహిళల భద్రత, చైతన్యం, గౌరవాన్ని ప్రతిబింభించేలా గోడలను తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు. -
శ్రీవారి క్షేత్రంలో తోటమాలి నిజాయతీ
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో ఓ తోటమాలి నిజాయతీ కారణంగా ఒక మహిళ పోగొట్టుకున్న పర్సు తిరిగి ఆమెకు దక్కింది. వివరాల ప్రకారం. డీఆర్డీఏలో పనిచేస్తున్న ద్వారకాతిరుమల మండలం దొరసానిపాడు గ్రామానికి చెందిన నాగలక్ష్మి సోమవారం కొండపైన సీతా నిలయంలో ఉన్న అధికారులను కలిసేందుకు వెళ్లిన సమయంలో పర్సు పొగొట్టుకున్నారు. ఆ పర్సులో రూ.5 లక్షల విలువైన నాలుగు కాసుల బంగారు గొలుసు, కొంత నగదు ఉంది. అక్కడ గార్డెన్లో పనిచేస్తున్న తోటమాలి సీతయ్యకు ఆ పర్సు దొరకగా దేవస్థానం ఎలక్ట్రికల్ డీఈ టి.సూర్యనారాయణకు అందజేశాడు. ఈ విషయాన్ని ఆయన మైక్ ద్వారా చెప్పడంతో నాగలక్ష్మి సూర్యనారాయణను సంప్రదించగా, ఆ పర్సును తోటమాలి సీతయ్య చేతుల మీదుగా ఆమెకు అప్పగించారు. ఈ సందర్భంగా సీతయ్య నిజాయతీని పలువురు అభినందించారు. పోగొట్టుకున్న పర్సును మహిళకు అప్పగింత -
నవధాన్యాలతో జవసత్వాలు
భీమవరం: వ్యవసాయమే జీవనాధారమైన జిల్లాలో రైతులు గతంలో ఆరుగాలం కష్టపడి ఏటా మూడు పంటలు పండించేవారు. సార్వా, దాళ్వా వరిసాగే కాకుండా దాళ్వా పంట అనంతరం ఆరుతడి పంటలుగా మినుము, పెసర, మొక్కజొన్న, బొబ్బర్లు, నువ్వులు వంటివాటితోపాటు పశుగ్రాసానికి పిల్లిపెసర, జనుము, జొన్న వంటివాటిని పండించేవారు. మూడవ పంటగా అపరాలు, పశుగ్రాసం పండించడం వల్ల భూమికి సహజంగా పోషకపదార్థాలు లభించేవి. అయితే కొన్నేళ్లుగా వరిసాగులో జాప్యం కారణంగా దాళ్వా వరి పంట ఏప్రిల్, మే నెలల్లో చేతికి రావడంతో మూడవ పంట వేయడానికి సమయం సరిపోవడం లేదు. దీంతో మిగిలిన రెండు పంటల్లో దిగుబడి పెంచుకునేందుకు రైతులు పెద్ద మొత్తంలో ఎరువులు వేయాల్సి రావడంతో పెట్టుబడుడులు పెరిగి రైతులు నష్టపోతున్నారు. అయితే పాత విధానంతో మూడు పంటలు పండించడానికి వ్యవసాయశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. మూడో పంటకు ప్రోత్సాహం జిల్లాలోని 20 మండలాల పరిధిలో దాదాపు 2.30 లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తుండగా దీనిలో మూడవ పంట పండించేందుకు రైతులను ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుత దాళ్వా సీజన్ ఊపందుకుంటున్న తరుణంలో అపరాల సాగుతోపాటు పశుగ్రాసం పెంచేందుకు రైతులకు ఏపీ అగ్రికల్చర్ కమ్యూనిటీ నేషనల్ ఫార్మింగ్ సిస్టం ద్వారా 50 శాతం సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేస్తున్నారు. దీనికిగాను వ్యవసాయశాఖ, డ్వాక్రా సంఘాలతో ప్రత్యేకంగా సేకరించిన మినుము, పెసర, జీలుగు, రాగి, సజ్జలు, నువ్వులు, వేరుశెనగ, ఆవాలు, పిల్లిపెసర, జనుము, మొక్క వంటివాటితోపాటు ఆరుకూరలైన తోటకూర, పాలకూర, మెంతుకూర, చుక్కుకూర, గొంగూర, బీర, అనప, దోస వంటి సుమారు 12 రకాలు కలిగిన 12 కిలోల విత్తనాలను కిట్లుగా తయారుచేసి పంపిణీ చేశారు. ప్రయోజనం ఏమిటంటే.. భూమిలో సారాన్ని సహజంగా పెంచడానికి వేరు వ్యవస్థ ఎంతగానో దోహదం చేస్తుంది. అందువల్ల వివిధ రకాల విత్తనాలు కలగలిపి చేలలో వేయడం వల్ల రైతులకు కొంతమేరకు ఆదాయంతోపాటు ఇంటి అవసరాలు తీర్చుకునే అవకాశం ఏర్పడుతుంది. ప్రధానంగా వివిధ రకాల తీగ, ఆకుజాతి మొక్కల వేర్లు వల్ల భూమిలో బ్యాక్టీరియా వృద్ధిచెంది సహజ సిద్ధంగా భూసారం పెరుగుతుంది. దీనితో వరి పండించడానికి ఎక్కువ మోతాదులో ఎరువులు వాడే అవసరం లేకపోవడమేగాక తెగుళ్లు కూడా తగ్గే అవకాశముంటుంది. భూమిలో బ్యాక్టీరియా వృద్ధి చెందడం వల్ల రైతులు పంటలకు కొద్దిమొత్తంలో ఎరువులు వేసినా వాటి సామర్ధ్యం పెరిగి పంటకు ప్రయోజనం కలుగుతుంది. దాళ్వా మాసూళ్లు వరికోత యంత్రాలతో చేస్తున్నా విత్తనాలు వేసుకోడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. వరిపైరు కోత కోసేముందు భూమిలో కొద్దిపాటి తేమ ఉండే విధంగా చూసుకుంటే విత్తనాలు జల్లుకోడానికి అనువుగా ఉంటుంది. దాళ్వా అనంతరం నవధాన్యాల సాగు గతేడాది ప్రయోగాత్మకంగా చేపట్టాం. దీనివల్ల రైతులకు కొంత ఆదాయం రావడమేగాక భూసారాన్ని సహజసిద్ధంగా పెంచుకునే అవకాశం ఏర్పడుతుంది. ప్రస్తుత సీజన్లో దాదాపు 40 వేల మంది రైతులకు విత్తనాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అన్ని రైతు సేవాకేంద్రాలు, డ్వాక్రా సంఘాల వద్ద విత్తనాల కిట్లు అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఎక్కువమంది రైతులకు కావాలన్నా సరఫరా చేయిస్తాం. దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. – జెడ్ వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయశాఖాధికారి నవధాన్యాల సాగుకు 50 శాతం సబ్సిడీపై విత్తన కిట్ల పంపిణీ 40 వేల మంది రైతులకు లక్ష్యం భూసారం పెరగడంతోపాటు రైతులకు ఆదాయం -
కరెంటు తీగే యమపాశమై..
కొయ్యలగూడెం: విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. దిప్పకాయలపాడు దళితవాడకు చెందిన కూనపాము లాజరు (62) కౌలుకి వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నాడు. సోమవారం ఉదయం ఇంటి వద్ద బట్టల తీగ నుంచి టవల్ తీసుకుంటుండగా సర్వీస్ వైర్ నుంచి విద్యుత్ సరఫరా కావడంతో విద్యుదాఘాతానికి గురై కుప్పకూలిపోయాడు. బంధువులు కొయ్యలగూడెం ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించగా అప్పటికే లాజర్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. రెవెన్యూ, విద్యుత్ శాఖల అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యుదాఘాతానికి రాజస్థాన్ వ్యక్తి మృతి కై కలూరు: భార్య కళ్ల ఎదుటే భర్త విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన ఘటన కైకలూరులో సోమవారం చోటుచేసుకుంది. టౌన్ ఎస్సై డి.వెంకట్కుమార్ తెలిపిన వివరాలు ప్రకారం రాజస్థాన్ రాష్టం బిల్వివార్ జిల్లాకు చెందిన ఓప్రకాష్ బిలే ఐస్క్రీమ్, బాదంపాలు తయారు చేసి కై కలూరులో రోజూ బండిపై విక్రయిస్తుంటాడు. కై కలూరు రామాలయం వద్ద భార్య పుఫ్ప్ బిలేతో నివసిస్తోన్నాడు. వీరికి 9 నెలల కిత్రమే వివాహమైంది. రోజూవారీ క్రమంలో భాగంగా ఐస్క్రీం తయారు చేస్తుండగా సోమవారం మోటారుపై పడడంతో అతడు విద్యుదాఘానికి గురయ్యాడు. భార్య చీపురు కట్టతో వైర్ను తొలగించినా ప్రయోజనం లేకుండా పోయింది. స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మరణించినట్లు తెలిపారు. భార్య పుఫ్ప్ బిలే ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తన్నారు. ఏలూరు రూరల్: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సత్యసాయి సీపీడబ్ల్యూఎస్ పథకం ద్వారా తాగునీరు అందించే గ్రామాల్లో సమస్యలను సత్వరం పరిష్కరించాలని జెడ్పీ చైర్మన్ ఘంటా పద్మశ్రీ అన్నారు. సోమవారం ఏలూరు జెడ్పీ చాంబర్లో అధికారులతో కలిసి ఆమె సత్యసాయి పథకం పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవిలో తాగునీటి సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పైప్లైన్ సమస్యల తలెత్తినప్పటికీ తాగునీరు సరఫరాలో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడాలన్నారు. -
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు
● ఈనెల 26న ప్రారంభం కానున్న ఉత్సవాలు ● 30న రాత్రి శ్రీవారి తిరుకల్యాణం, మే 1న రథోత్సవం ద్వారకాతిరుమల: క్షేత్రంలో శ్రీవారి వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈనెల 26 నుంచి మే 3 వరకు జరగనున్న చినవెంకన్న తిరుకల్యాణ మహోత్సవాల్లో భాగంగా 30న రాత్రి స్వామివారి కల్యాణం, వచ్చేనెల 1న రాత్రి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని జరుగుతున్న ఏర్పాట్లలో భాగంగా ఆలయ ధ్వజస్తంభం వద్ద ఐరన్ పందిరిని నిర్మిస్తున్నారు. గతంలో ఇక్కడ కర్రల పందిరి ఉండేది. అయితే భక్తుల రక్షణలో భాగంగా దీన్ని ఐరన్తో నిర్మిస్తున్నారు. పందిరి నిర్మాణ పనులు పూర్తయిన తరువాత దానిపై తాటాకులు వేయనున్నారు. ఇదిలా ఉంటే గోపురాలపై మొలిచిన రావి, మర్రి మొక్కలను పారిశుధ్య కార్మికులు తొలగిస్తున్నారు. సోమవారం ఈ పనులు శరవేగంగా జరిగాయి. -
ఎఫెక్ట్
కుక్కునూరు: ఆంధ్ర–తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో మండలంలోని సీతారామ నగరం రెవెన్యూ పరిధిలోని కిన్నెరసాని వాగు నుంచి ఇసుక అక్రమ తరలింపుపై ఈనెల 9న సాక్షి కథనం ప్రచురిచంది. దీంతో పోలీసులు నిఘా పటిష్టం చేశారు. ఆదివారం రాత్రి 20 టిప్పర్లలో ఆంధ్ర ప్రాంత ఇసుకను అక్రమంగా తరలించినట్టు వచ్చిన సమాచారం మేరకు సోమవారం పోలీసులు మధ్యవర్తులతో కలిసి వాగు వద్ద పరిశీలించారు. అక్కడ గుంతల ఆధారంగా ఇసుకను అక్రమంగా తవ్వి తెలంగాణ రాష్ట్రానికి తరలించినట్లు గుర్తించామని ఎస్సై రాజారెడ్డి తెలిపారు. ఇసుక తవ్వే యంత్రాన్ని స్వాధీనం చేసుకొని, బూర్గంపాడు మండలానికి చెందిన బత్తా అచ్చయ్య యాదవ్, పోతనబోయిన చంద్రరావు, వాహన డ్రైవర్పై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. భీమవరం: మాయమాటలు చెప్పి తన కుమారుడు గంధం రామకృష్ణ వద్ద రూ.13.50 లక్షలు కాజేశారంటూ భీమవరం పట్టణానికి చెందిన గంధం హరిప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వన్టౌన్ ఎస్సై బీవై కిరణ్కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన హరిప్రసాద్ రిటైర్డ్ ఉద్యోగి. ఆయన అనేక పర్యాయాలు పట్టణంలోని ఎడ్వర్డ్ట్యాంక్ ప్రాంతంలో జిరాక్స్ షాపు నిర్వహిస్తున్న పెన్నాడ శ్రీసత్యకిరణ్ వద్దకు వెళ్లడంతో హరిప్రసాద్ కుమారుడు రామకృష్ణకు పరిచయమయ్యాడు. దీనిని ఆసరాగా తీసుకుని శ్రీసత్యకిరణ్ అతని భార్య హరిత, అశోక్సామ్రాట్ నెట్సెంటర్, ఏటీఎం మెషీన్ ఏర్పాటుచేస్తామని మాయమాటలు చెప్పి రామకృష్ణ నుంచి పలు దఫాలుగా రూ.13.50 లక్షలు కాజేశారు. అంతేగాకుండా పి రామరావు, గన్నాబత్తుల వెంకటేశ్వరరావు వద్ద కూడా సుమారు రూ.17 లక్షలు కాజేశారని హరిప్రసాద్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. 24న శాప్ సెలెక్షన్స్ ఏలూరు రూరల్: శాప్ లీగ్స్ పోటీల్లో భాగంగా రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీ నుంచి 30 వరకూ విశాఖపట్టణంలో బాక్సింగ్, అనంతరపురంలో ఫుట్బాల్ రాష్ట్రస్థాయి పోటీలు జరగనున్నాయని ఏలూరు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి ఎస్ఏ అజీజ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్ల ఎంపిక ఈ నెల 24న ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో చేపడతామన్నారు. బాక్సింగ్ విభాగంలో అండర్–15, 19, ఫుట్బాల్ విభాగంలో అండర్–15, 21 బాలబాలికల జట్లు ఎంపిక జరుగుతుందని వెల్లడించారు. వివరాలకు 94927 01324 సంప్రదించాలని సూచించారు. భీమవరం (ప్రకాశం చౌక్) : రెడ్క్రాస్ గవర్నర్ అవార్డుకు పశ్చిమగోదావరి కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఎంపికయ్యారు. జిల్లాలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాల్లో విశేష కృషికి గుర్తింపుగా ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి తెలిపారు. వచ్చేనెల 8న విజయవాడలో జరిగే కార్యక్రమంలో అవార్డు అందిస్తారన్నారు. -
ఉరి వేసుకుని వివాహిత మృతి
తణుకు అర్బన్ : ఉరి వేసుకుని ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పైడిపర్రులో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పైడిపర్రుకు చెందిన లక్ష్మీనారాయణకు, పెరవలి మండలం కానూరు అగ్రహారం గ్రామానికి చెందిన అనుమోలు దేవిలకు 11 ఏళ్ల క్రితం వివాహం కాగా వీరికి ఇద్దరు ఆడపిలల్లలు సంతానం ఉన్నారు. లక్ష్మీనారాయణ హైదరాబాదులో పండ్ల వ్యాపారం చేసుకుంటూ ఉండగా దేవి స్థానికంగా మోటారు సైకిళ్ల షోరూంలో పని చేస్తోంది. దాదాపు 20 రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చిన లక్ష్మీనారాయణ కొద్దిరోజులుగా భార్యతో గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలో మనస్తాపం చెందిన దేవి భర్త ఇద్దరు పిల్లలను స్కూలుకు తీసికెళ్లిన సమయంలో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటికి వచ్చిన లక్ష్మీనారాయణ దేవిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. భర్త వేధింపుల కారణంగానే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఇన్చార్జి రూరల్ ఎస్సై జానా సతీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అదుపు తప్పి కారు బోల్తా
దెందులూరు: అదుపు తప్పి కారు బోల్తా పడిన ఘటనలో విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన 16వ నంబర్ జాతీయ రహదారిపై సోమవారం చోటుచేసుకుంది. ఆగిరిపల్లికి చెందిన ప్రైవేట్ కళాశాల విద్యార్థులు 8 మంది ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి కారులో వెళుతున్నారు. దెందులూరు వద్ద కారు అదుపుతప్పి గుండేరు గట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న విద్యార్థులకు స్వల్ప గాయాలతో బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. క్షతగాత్రులను వైద్య చికిత్స నిమిత్తం ఏలూరు వైద్యశాలకు తరలించారు. -
నిలువునా ముంచిన నీటి నిర్లక్ష్యం
కై కలూరు: ఆక్వారంగం ఆర్థిక ప్రగతికి దోహదపడుతున్నప్పటికీ అంతే పర్యావరణ కాలుష్యానికీ కారణమవుతోంది. చేపల, రొయ్యల చెరువుల్లో నీటిని బయటకు పంపడానికి సరైన డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడంతో పంట కాల్వలోకి సైతం రసాయనాలు కలిసిన ఆక్వా చెరువుల నీరు చేరుతోంది. దీంతో ఎగువ గ్రామాల ప్రజలకు కలుషిత నీరే దిక్కవుతోంది. ప్రధానంగా చెరువుల సమీపంలో రహదారులు ఆక్వా రైతుల నిర్లక్ష్యానికి దెబ్బతింటున్నాయి. వరహాపట్నం గ్రామంలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రొయ్యల చెరువు నీరు రోడ్లపైకి.. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ స్వగ్రామం వరహాపట్నం నుంచి రామవరం వెళ్లే రహదారిలో వరహాపట్నం పంచాయతీ పరిధిలో సుమారు 8 ఎకరాల రొయ్యల రైతు సాగు దెబ్బతినడంతో ఆదివారం రాత్రి నుంచి పైపుతో నీటిని రోడ్డుపై వదులుతున్నాడు. దీంతో సోమవారం ఉదయం రోడ్డు పెద్ద చెరువులాగా మారింది. నిండు వేసవిలో రహదారి మునగడంపై వాహనదారులు మండిపడ్డారు. రోడ్డుపై గుంతలు పడటంతో అనేక మంది అతికష్టం మీద భయంభయంగా ప్రయాణించారు. రైతు శ్రీనివాసరావును నీటిని వదలడంపై వివరణ కోరితే ముందు రైతులు డ్రెయిన్కు అడ్డుగా వేయడంతోనే నీరు నిలిచాయని చెప్పుకొచ్చాడు. పాత సమస్య పునరావృతం వరహాపట్నం పరిధిలో అన్నవా డ్రెయిన్ సమీపంలో సుమారు 350 ఎకరాల విస్తీర్ణంలో ఆక్వా చెరువులు సాగు చేస్తున్నారు. చెరువుల్లో నీటిని డ్రెయిన్ ద్వారా పంపించాలి. ఇందుకు అనేక మంది అవకాశం లేకపోవడంతో పంట కాల్వలోకి వదులుతున్నారు. ఇటీవల వరహాపట్నంలో చెరువుల రైతులు నీటిని రోడ్డుపైకి వదలడంతో అడుగు నీటిలో రోడ్డు ముంపుబారిన పడింది. దీంతో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ స్వయంగా వెళ్లి రహదారిని పరిశీలించారు. ఆక్వా రైతులు పూడుకుపోయిన డ్రెయిన్లకు మరమ్మతులు చేసుకుని నీటిని వదలాలని హెచ్చరించారు. ఇది జరిగి 6 నెలలు దాటుతున్నా రోడ్డు వెంబడి డ్రెయిన్లకు ఆక్వా రైతులు మరమ్మతులు చేసుకోలేదు. ఈ రహదారిలో మరికొందరు రైతులు చెరువుల నీటిని వదిలితే వరహాపట్నం – రామవరం రహదారి పూర్తిగా మునిగి ప్రయాణాలు నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. వరహాపట్నంలో అన్నవా డ్రెయిన్ మరమ్మతులు చేయించాం. వరహాపట్నం – రామవరం రహదారిలో రోడ్డుకు ఇరువైపుల ఆక్వా రైతులు జేసీబీ యంత్రంతో బోదెలను మరమ్మతులు చేసుకోవాలి. సమస్యను ఎమ్మెల్యే కామినేని దృష్టికి తీసుకువెళతాం. రహదారుల సమీపంలో ఆక్వా రైతులు నీటిని రోడ్లపైకి విడిచిపెడితే చర్యలు తీసుకుంటాం. –ఎం.రామకృష్ణ, డ్రెయినేజీశాఖ, డీఈఈ, కై కలూరు రొయ్యల చెరువు నీరు రహదారిపైకి ఎమ్మెల్యే కామినేని స్వగ్రామంలో వీడని సమస్య వరహాపట్నం – రామవరం రహదారిలో ప్రజల అవస్థలు పంట కాల్వలకు చేరుతున్న అక్వా చెరువుల కలుషిత నీరు -
నకిలీ విత్తనాలతో నిండా మునిగాం
ముంచిన నీటి నిర్లక్ష్యం చేపల, రొయ్యల చెరువుల్లోని నీరు పంట కాల్వలోకి చేరడంతో తాగునీరు కలుషితమవుతోంది. రహదారిపైకి చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. 8లో uఏలూరు (టూటౌన్): నకిలీ విత్తనాల వల్ల మోసపోయిన రైతులను ఆదుకోవాలంటూ సీపీఐ ఆధ్వర్యంలో రైతులు పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు. అంతకముందు కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేశారు. వేలేరుపాడు మండలం కట్కూర్ పంచాయతీ చిగురుమామిడి. నార్లవరం రైతులు నాసిరకం విత్తన కంపెనీపై చర్యలు తీసుకోవాలని కోరారు. మిరప విత్తనాలు ఎకరానికి 25 నుంచి 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని చెప్పారని, 70 ఎకరాలపైన సాగు చేశామన్నారు. ఎకరానికి రూ.2 లక్షలు చొప్పున పెట్టుబడి పెట్టామని, పంట చేతికి వచ్చే సమయానికి చిన్న చిన్న మిరపకాయలు కాయడంతో దిగుబడి రాలేదదన్నారు. ఎకరానికి కేవలం 2, 3 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చిందన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, కంపెనీ సిబ్బంది మిరప చేలు పరిశీలించి విత్తనాల వల్లే ఈ నష్టం జరిగిందని చెప్పి ఎకరానికి రూ.లక్ష చొప్పున నష్టపరిహారం ఇచ్చేలా ఒప్పందం చేసుకుని వెళ్లిన తరువాత ఇంతవరకూ స్పందించలేదన్నారు. నూజివీడు: నూజివీడు కేంద్రీయ విద్యాలయంలో నాలుగు, ఐదో తరగతిలో మిగిలిన సీట్ల భర్తీకి అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సోమవారం తెలిపారు. మిగిలిన సీట్లు ఎస్టీ కేటగిరి కావడంతో ఆ కేటగిరికి చెందిన విద్యార్థులు ఈనెల 28లోగా దరఖాస్తులను కేంద్రీయ విద్యాలయంలో అందజేయాలని విజ్ఞప్తి చేశారు. -
వంట ఏజెన్సీలను తొలగించేందుకు కుట్రలు
నూజివీడు: మధ్యాహ్న భోజన పథకం ఏజన్సీ నిర్వాహకులను తొలగించేందుకే ప్రభుత్వం స్మార్ట్ కిచెన్ను తీసుకొస్తోందని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డీ హరినాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఏఐసీసీటియూ ఆధ్వర్యంలో సోమవారం ఏజెన్సీ నిర్వాహకులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 1.50 లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ విద్యార్థులకు రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్న వంట ఏజెన్సీలను తొలగించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వేముల బక్కయ్య, దుర్గం పుల్లారావు, పరికల కళావతి, పల్లెపాం భవాని, మేకల కుమారి, సీతామహాలక్ష్మి, భూతం మారయ్య, కలపాల రాణి తదితరులు పాల్గొన్నారు. పోలవరం రూరల్: ఏలూరు జిల్లా పోలవరం మండలం నుంచి పెద్దపులి గోదావరి దాటి తూర్పుగోదావరి జిల్లా వైపునకు చేరుకుంది. గత పది రోజులుగా పాపికొండల అభయారణ్య ప్రాంతంలో సంచరించిన పెద్దపులి ఆదివారం కొత్తూరు గ్రామ సమీపం నుంచి గోదావరి నది దాటి వెళ్లినట్లు పోలవరం రేంజ్ అధికారి ఎస్కే వలీ తెలిపారు. గత 10 రోజులుగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన పెద్దపులి, నది దాటి వెళ్ళడంతో ఏజెన్సీ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెల 10న తూర్పుగోదావరి జిల్లా నుంచి ఏలూరు జిల్లాలోకి గోదావరి నది దాటి ప్రవేశించిన పెద్ద పులి పోలవరం మండలంలో రెండు ఆవు దూడలపై దాడి చేసింది. అటవీశాఖ అధికారులు పులికి అమర్చిన రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాకర్ ద్వారా ఎప్పటికప్పుడు పులి కదలికలను గమనిస్తున్నారు. గోదావరి నది దాటి వెళ్ళినప్పటికీ దీని పయనం ఏవిధంగా ఉంటుంది, ఎటు వైపునకు తిరుగుతుందని అంచనా వేయలేని పరిస్థితి ఉందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. మళ్లీ గోదావరి నది దాటి ఏలూరు జిల్లాలోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సఖినేటిపల్లి: మండలంలో వేర్వేరు ఆలయాల్లో వరుస దొంగతనాలకు పాల్పడిన ఇద్దరిని సోమ వారం అరెస్టు చేసి రాజోలు కోర్టులో హాజరుపరిచినట్టు ఎస్సై కె.దుర్గా శ్రీనివాసరావు తెలిపారు. ఈనెల 17న అర్థరాత్రి సఖినేటిపల్లి శివాలయం, అయ్యప్పస్వామి ఆలయం, కన్యకాపరమేశ్వరీ ఆలయం, గీతామందిరం వద్ద హనుమాన్ ఆలయం, ఆబోతు ఆలయం వద్ద హుండీలను పగులగొట్టి, అందులో ఉన్న నగదును గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. సదరు కేసులోని ముద్దాయిలు భీమవరానికి చెందిన నారా ధనుష్, చలపాక ప్రవీణ్లను సోమవారం అప్పనరామునిలంకలో అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.11,022 నగదు, యమహా బైక్ స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై పేర్కొన్నారు. ముద్దాయిలకు 14 రోజులపాటు రిమాండ్ విధించినట్టు, తదుపరి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించామని ఎస్సై అన్నారు. భీమవరం: దీర్ఘకాలికంగా అపరిస్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యల పరిస్కార కోసం ఫ్యాప్టో ఆధ్వర్యంలో మూడోదశ పోరాటంలో భాగంగా ఈ నెల 25 నుంచి మూడు రోజులపాటు విజయవాడ ధర్నా చౌక్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు జిల్లా ఫ్యాప్టో సన్నాహక సమావేశం జిల్లా చైర్మన్ పీఎస్.విజయ రామరాజు, సెక్రటరీ జనరల్ జి.ప్రకాశం చెప్పారు. సోమవారం భీమవరంలో మాట్లాడుతూ 25న జిల్లా నుంచి 1000 మంది ఉపాధ్యాయులు రిలే నిరాహార దీక్షకు హాజరుకానున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ సెక్రటరీ జనరల్ కేవీ.రామచంద్రరావు, కో–కన్వీనర్లు శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, ట్రెజరర్ పట్టాభిరామయ్య తదితరులు పాల్గొన్నారు. -
కబ్జాను అడ్డుకోండి
కలెక్టర్కు వైఎస్సార్సీపీ నాయకుల వినతిఏలూరు(టూటౌన్): స్థానిక 41వ డివిజన్ చోడిదిబ్బ వద్ద 500 గజాల మున్సిపల్ కార్పొరేషన్ స్థలం కబ్జాకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు కలెక్టర్ వెట్రిసెల్వికి వినతి పత్రం అందజేశారు. కామన్ సైట్ను కొందరు ప్రైవేట్ వ్యక్తులు చదును చేస్తూ అక్రమంగా లీజుకు తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అన్ని రకాలుగా ఉపయోగించుకునేలా కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టాలని కోరారు. వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కలెక్టర్ని కలిసి ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో నూకపెయ్యి సుధీర్ బాబు, తుమ్మరాడ స్రవంతి, జిజ్జువరపు విజయనిర్మల, రియాజ్, ఇమ్మానుయేల్ జైకర్, డింపుల్ జాబ్, నెరుసు చిరంజీవి, జాన్ గుర్నాథ్, కిలాడి దుర్గారావు, లంకలపల్లి గణేష్, ఇనపనూరి జగదీష్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
పోటీతత్వంతో పనిచేయాలి
కలెక్టర్ వెట్రిసెల్వి ఏలూరు (టూటౌన్): జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టరు కె.వెట్రిసెల్వి నిర్వహించారు. కలెక్టరుతో పాటు జాయింటు కలెక్టరు ఎంజె అభిషేక్ గౌడ, ఇన్చార్జి జిల్లా రెవెన్యూ అధికారి యల్.దేవకీదేవి, ఇన్చార్జి ఆర్డీవో ఐ.కిషోర్ తదితరులు అర్జీలు స్వీకరించారు.ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరించిన పీజీఆర్ఎస్ అర్జీలు, రెవెన్యూ క్లినిక్ల్లో వచ్చిన దరఖాస్తులుపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టి సత్వర పరిష్కారం చూపాలని ఆదేశించారు. ప్రతి అర్జీని సంబంధిత శాఖల అధికారులు క్షుణ్నంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. అర్జీదారులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా, కాలయాపన చేయకుండా పరిష్కారం చూపాలని అన్నారు. ఏ ఒక్క అర్జీ రీ–ఓపెన్ కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని, అవసరం అయితే క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో 257 అర్జీలను స్వీకరించారు. -
గంజాయి కలకలం.. వృద్ధురాలి మృతి
ద్వారకాతిరుమల: గంజాయి కేసులో ఇరుక్కున్న తన కుమారుడి భవిష్యత్తు ఎక్కడ నాశనం అవుతుందోనన్న భయంతో తూర్ల లక్ష్మీపురానికి చెందిన వృద్ధురాలు సెనగన స్వరాజ్యం(76) గుండె పోటుతో సోమవారం మృతి చెందింది. దీనికి స్థానిక కూటమి నాయకుడు, రౌడీ షీటర్ సుంకర ఆంజనేయులే కారణమంటూ బాధిత కుటుంబసభ్యులు వృద్ధురాలి మృతదేహాన్ని అతని ఇంటి ముందు ఉంచి ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న ఎస్సై టి.సుధీర్ సిబ్బందితో కలసి రంగప్రవేశం చేసి, ఆందోళనకారులకు హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. స్థానికుల కథనం ప్రకారం.. సెనగన శ్రీనివాసరావు ఇంటి వద్ద గంజాయి ఉందని ఈనెల 16న గుర్తు తెలియని వ్యక్తి 112కు కాల్చేసి సమాచారం ఇచ్చాడు. దాంతో భీమడోలు సీఐ పి.కృష్ణ, ఎస్సై సుధీర్ సిబ్బందితో కలసి శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి తనిఖీలు చేశారు. ఇంటికి దక్షిణం వైపు ఉన్న ప్రహరీ గోడ సందులో ఒక సంచిలో రూ.40 వేలు విలువైన గంజాయి ప్యాకెట్లు, రూ.6,501 విలువైన 5 మద్యం బాటిళ్లను గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. తనిఖీ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. ఆ తరువాత శ్రీనివాసరావు వచ్చి తన తండ్రికి, సుంకర ఆంజనేయులకు మద్య గొడవలు ఉన్నాయని, అతనే వీటిని ఇక్కడ పెట్టించి ఉంటాడని పోలీసులకు చెప్పాడు. దీనిపై కేసు నమోదు చేసిన ఎస్సై సుధీర్ దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసు వల్ల తన కుమారుడికి ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో శ్రీనివాసరావు తల్లి గుండె పోటుతో మృతి చెందింది. ఆంజనేయులు కేసు బనాయించేందుకు ప్రయత్నించడం వల్లే స్వరాజ్యం మృతి చెందిందిని ఆరోపిస్తూ, అతని ఇంటి ముందు శవ పేటికతో బైఠాయించి, ధర్నా చేశారు. గంజాయి కలకలం రేగి మూడు రోజులైనా పోలీసులు ఆంజనేయులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని మృతురాలి కుటుంబసభ్యులు ప్రశ్నించారు. సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై సుధీర్ ఆందోళనకారులతో మాట్లాడారు. రెండు రోజుల్లో ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడంతో బాధిత కుటుంబసభ్యులు ఆందోళన విరమించారు. రోడ్డుపై మృతదేహంతో ధర్నా -
ఆక్వా విలవిల
ఆక్వా రంగాన్ని అధిక ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో ఎండలు తీవ్రత ఎక్కువగా ఉంటుందనే హెచ్చరికల నేపథ్యంలో ఆందోళన వ్యక్తమవుతోంది. ● ఎండల దెబ్బకు చుట్టుముడుతున్న వ్యాధులు ● కొల్లేరులో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు ● ఉమ్మడి జిల్లాలో సుమారు 3 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు కై కలూరు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లో సుమారు 3 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు. చెరువులకు నీటి వనరులు సమృద్ధిగా అందకపోవడంతో ప్రస్తుతం నీటి స్థాయిలు తగ్గాయి. ఎండాకాలంలో వాతావరణ మార్పుల వల్ల చేపలు చనిపోతే సమ్మర్ కిల్ అంటారు. మరోపక్క చేపలు, రొయ్యల్లో వ్యాధులు పెరగుతోన్నాయి. ఈ నేపథ్యంలో అధిక ఉష్ణోగ్రతలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. చేపలు 20 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ మధ్య బాగా పెరుగుతాయి. కొద్ది రోజులుగా కొల్లేరు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలకు చేరింది. ఈ పరిణామం చేపల, రొయ్యల రైతులను కలవరపెడుతోంది. చెరువుల్లో నీరు ఆవిరవడం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగి ఆక్సిజన్ లేమి, నీటి కాలుష్యం, విషవాయువుల ఉత్పతి వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో నీటి నాణ్యతలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీనికి తోడు వేసవి కాలం చివరలో వచ్చే తొలి వర్షాల వల్ల ఆక్సిజన్ లేమి సమస్యతో రూ.కోట్లలో ఆక్వా రైతులు నష్టపోతున్నారు. చుట్టుముడుతున్న వ్యాధులు : చేపల, రొయ్యల చెరువులకు నీటి వనరులు సమృద్ధిగా లేకపోవడంతో నీటిలో మార్పులు సంభవిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో చేపల్లో జిగురు, జలగ, శంఖుజలగ, సన్న జలగ, తాటాకు తెగుళు, పొట్టఉబ్బు వ్యాధి, ఎర్ర మచ్చల వ్యాధి, రొయ్యల సాగులో వైట్ స్పాట్, ఈహెచ్సీ, ఆర్ఎంఎస్ వ్యాధులు ఆందోళన కలిగిస్తున్నాయి. వేసవిలో సూర్యరశ్మి పెరగడం వల్ల చెరువుపై భాగంలో రెండడుగుల మేర నీరు వేడెక్కుతోంది. వేడి నీరు తేలికగా ఉంటుంది. అడుగు భాగాన చల్లగా ఉన్న నీరు బరువుగా ఉంటుంది. ఇదే సమ్మర్ కిల్లింగ్కు దారితీస్తోంది. రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఆక్వా రైతులు తీసుకోవల్సిన జాగ్రత్తల్ని మత్స్యశాఖ అధికారులు వివరిస్తున్నారు. వేసవిలో ఆక్వా సాగు రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలి. మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఆక్వా సాగు ప్రాంతాల్లో వేసవిలో తీసుకోవల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నాం. కై కలూరు ప్రభుత్వ మత్స్య లేబోరేటరీలో నీటి, మట్టి పరీక్షలు రైతులకు అందుబాటులో ఉన్నాయి. సద్వినియోగం చేసుకోవాలి. –సీహెచ్ గణపతి, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి, కై కలూరు -
పత్తాలేని సోపానం
లైసెన్స్ సర్వేయర్లు రెన్యువల్ చేసుకోవాలి ‘పాలకొల్లుకు చెందిన ఒకరు కాపు కార్పొరేషన్ సబ్సిడీ రుణానికి దరఖాస్తు చేసుకుని ఇంటర్వ్యూకు హాజరయ్యారు. రుణ సాయానికి ఎంపికయ్యారని, త్వరలో రుణం మంజూరవుతుందని అధికారులు చెప్పారు. ఇది జరిగి ఏడాదైనా ఇంతవరకు అతనికి రుణం మంజూరుకాలేదు. అధికారులను అడిగితే సబ్సిడీ సొమ్మును ప్రభుత్వం విడుదల చేయలేదని, ఎప్పుడు వస్తుందో ఇంకా స్పష్టత లేదని చెబుతున్నారు’.ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలో లైసెన్స్ సర్వేయర్లు లైసెన్సులను రెన్యువల్ చేసుకోవాలని ఏలూరు జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ షేక్ అన్సారీ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన రుసుం రూ. 750 చెల్లించాలన్నారు. ఆధునిక సర్వే పరికరాలపై శిక్షణ ఉంటుందని, శిక్షణ అనంతరం లైసెన్స్ జారీ చేస్తారన్నారు. ఈ నెల 30 లోపు పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. సాక్షి, భీమవరం: ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలు అందజేయనున్నట్టు గత ఏడాది మార్చిలో కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ‘స్వయం ఉపాధి సోపానం’ పేరిట దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారుల ఎంపిక పేరిట అప్పట్లో రెండు నెలల పాటు పెద్ద తతంగమే నడిచింది. మండల, మున్సిపల్ స్థాయిలో బ్యాంకుల ప్రతినిధులు, అధికారులు కలిసి దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ ప్రక్రియ కోసం జిల్లా యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించిన ప్రభుత్వం తర్వాత స్వయం ఉపాధిని అటకెక్కించింది. ఏడాది దాటినా చర్యలు శూన్యం ఎస్సీ, బీసీ–ఏ, బీసీ–బీ, బీసీ–డీ, బీసీ–ఇ, ఈడబ్ల్యూఎస్ వర్గాల్లోని రెడ్డి, కమ్మ, వైశ్య, బ్రాహ్మణ తదితరులకు స్వయం ఉపాధి, జనరిక్ ఫార్మసీలు, ఎంఎస్ఎంఈ యూనిట్ల ఏర్పాటు పేరిట సబ్సిడీ రుణాల మంజూరుకు గత ఏడాది మార్చిలో కూటమి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు దాదాపు రూ.260 కోట్ల విలువైన 10,554 యూనిట్లు కేటాయించింది. వీటిలో పశ్చిమకు రూ.122.5 కోట్ల విలువైన 3,728 యూనిట్లు, మిగిలినవి ఏలూరు జిల్లాకు కేటాయించారు. రూ.రెండు లక్షలు, రూ. 2 నుంచి రూ. 3 లక్షలు, అలాగే రూ. 3 నుంచి రూ. 5 లక్షల కేటగిరీలుగా విభజించారు. జనరిక్ మెడికల్ షాపుల యూనిట్ ధర రూ.8 లక్షలుగా ఉంది. యూనిట్ వ్యయం మొత్తంలో 40 శాతం వరకు ప్రభుత్వ సబ్సిడీ, మిగిలింది బ్యాంకు రుణంగా ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత గత ఏడాది మార్చి నెలాఖరు నాటికి యూనిట్లను గ్రౌండ్ చేయాలని భావించగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో మే నెలాఖరు వరకు పొడిగించింది. ఎంపిక చేసిన వారికి మార్చి చివరి వారం నుంచి ఏప్రిల్ మొదటి వారం మధ్యలో ఇంటర్వ్యూలు నిర్వహించి త్వరలోనే రుణాలు మంజూరవుతాయని అధికారులు చెప్పుకొచ్చారు. త్వరలోనే కార్పొరేషన్ రుణాలు మంజూరవుతాయని కూటమి నేతలు చెబుతున్నట్టు సమాచారం. కొద్ది నెలల్లో మున్సిపల్ ఎన్నికలు వస్తాయన్న ప్రచారం నేపథ్యంలో కావాల్సిన వారికి సబ్సిడీ రుణాలు కట్టబెట్టే ఆలోచన చేస్తున్నట్టు కూటమి నేతలు చర్చించుకుంటున్నారు. కార్పొరేషన్ రుణాల విషయమై బీసీ కార్పొరేషన్ అధికారులను సంప్రదించగా ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కావాల్సి ఉందని అంటున్నారు. పేరుకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించినప్పటికి లబ్ధిదారుల ఎంపిక అంతా అధికార పక్షాల నేతల కనుసన్నల్లోనే జరిగింది. నియోజకవర్గాలకు కేటాయించిన యూనిట్లను కూటమి నాయకులు పంచుకుని కావాల్సిన వారిని ఎంపికలు చేసుకున్నారన్న విమర్శలున్నాయి. చాలాచోట్ల సింహభాగం టీడీపీనే తన్నుకు పోయిందన్న అసంతృప్తిలో జనసేన, బీజేపీ నాయకులు ఉన్నారన్న ప్రచారం జరిగింది. ఒక్కో గ్రామానికి మంజూరైన యూనిట్లు ఐదు నుంచి పదిలోపే ఉండగా దరఖాస్తులు మాత్రం పదుల సంఖ్యలో వచ్చాయి. లబ్ధిదారుల ఎంపిక జరిగి ఏడాదైనా ఇప్పటి వరకు ఒక్క యూనిట్ గ్రౌండ్ కాకపోవడం గమనార్హం. రుణాల మంజూరు కోసం గత వార్షిక బడ్జెట్లో నిధులు కేటాయింపులు చేసినట్టు ప్రజాప్రతినిధులు ప్రకటించినప్పటికీ వాటిని దారి మళ్లించారన్న విమర్శలున్నాయి. సబ్సిడీ రుణాల పేరిట కొందరు నాయకులు చెక్కులు పంపిణీ చేసిన ఘటనలు ఉన్నాయి. కాగా రుణాలు రాని వారి అసంతృప్తి కూటమికి చేటు చేస్తుందన్న భావనలో సోపానంపై ప్రభుత్వం సైలెంటై పోయి ఉండవచ్చని, మరోపక్క సబ్సిడీ సొమ్ములు జమచేసేందుకు ప్రభుత్వం వద్ద నిధులు లేకపోవడం కారణమన్న అనుమానాలు ఉన్నాయి. లబ్ధిదారుల జాబితాలను ప్రస్తుతానికి హోల్డ్లో ఉంచారు. సబ్సిడీ రుణాల ఊసెత్తని సర్కారు ఉమ్మడి జిల్లాకు రూ.260 కోట్ల విలువైన రూ.10,554 యూనిట్ల కేటాయింపు దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూల పేరిట హడావుడి ఏడాదైనా కార్యరూపం దాల్చని వైనం -
పోలీసు అధికారులు కావలెను!
స్టేషన్లలో ఇన్చార్జిలే దిక్కు ● కేసుల్లో పురోగతి కరువు ● స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న బాధితులు ● అర్ధంతర బదిలీలు, ఆరోపణలతో వీఆర్కు అధికారులు ● జిల్లాలోని పలు స్టేషన్లలో ఇదే పరిస్థితి తణుకు అర్బన్: పోలీస్స్టేషన్లలో అధికారులు లేక బాధితులకు అందాల్సిన సేవలు కునారిల్లుతున్నాయి. జిల్లాలోని కొన్ని పోలీస్స్టేషన్లలో బాస్లుగా ఇన్చార్జిలకు బాధ్యతలు అప్పగించడంతో స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులు, బాధితులు ఇబ్బంది పడుతున్నారు. అధికారులతోపాటు సిబ్బంది కొరతతోపాటు వివిధ బందోబస్తులకు వేరే ప్రాంతాలకు వెళ్తుండడంతో ప్రజానీకం తమ ఇబ్బందులను చెప్పుకునేందుకు పడిగాపులు పడాల్సి వస్తుంది. క్రైమ్ రేటు అధికంగా ఉండే తణుకు రూరల్, పట్టణ స్టేషన్లలో స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ అందుబాటులో లేకపోవడంతో బాధితులకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఖాళీలు ఇలా.. జిల్లాలో తణుకు పట్టణ, ఆకివీడు స్టేషన్లలో సర్కిల్ ఇన్స్పెక్టర్లు లేకపోవడంతో క్షేత్రస్థాయి పర్యవేక్షణ లేకుండా పోయింది. తణుకు రూరల్, తణుకు పట్టణ స్టేషన్లలో ఇద్దరు ఎస్సైల స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది. ఈ కారణంగా సీఐలు చేయాల్సిన బాధ్యతలు ఎస్సైలు చేస్తుండటం, ఎస్సైల బాధ్యతలు కిందిస్థాయి సిబ్బంది నిర్వహించాల్సి వస్తుందంటూ సిబ్బంది సైతం గుసగుసలాడుకుంటున్నారు. అధికారులు నిర్వర్తించాల్సిన పనులు కింది స్థాయి సిబ్బంది చేయాల్సి రావడంతో కొన్ని కేసుల్లో పూర్తిస్థాయి న్యాయం జరగడం లేదనేది ఫిర్యాదుల వాదన. జిల్లావ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో దీర్ఘకాలంగా తిష్ట వేసిన కొందరు సిబ్బంది సైతం అధికారుల విధులను తామే చేస్తుండటంతో కిందిస్థాయి సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. వివాదాస్పదంగా తణుకు స్టేషన్లు తణుకు పట్టణ స్టేషన్లో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఏసీబీ దాడి సంచలనం రేకెత్తించింది. అప్పటివరకు అవినీతి కంపు కొట్టిన స్టేషన్లో రైటర్ సుబ్బారావు రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏబీసీ అధికారులకు దొరికిపోగా, మరి కొందరు బతికి బయటపడ్డారు. అయితే ఈ ఘటన తర్వాత పోలీసు శాఖ ఉన్నతాధికారుల పరిశీలనలో మరి కొందరిపై వచ్చిన ఆరోపణల మేరకు అప్పటి సీఐతోపాటు ఎస్సైను రేంజ్ వీఆర్కు పంపించారు. కొందరు కిందిస్థాయి అధికారులను సైతం బదిలీపై పంపించారు. ఆ ఘటన తరువాత సీఐ, ఎస్సై పోస్టులు భర్తీ కాకుండా పోయాయి. ప్రస్తుతం ఒక్క ఎస్సైతోనే స్టేషన్ను నెట్టుకురావాల్సి వస్తోంది. తణుకు రూరల్ సర్కిల్ అధికారుల వ్యవహారం అత్యంత వివాదాస్పదంగా మారింది. సర్కిల్లో ఫ్లెక్సీల వివాదాలు, ఇతర వ్యవహారాలతోపాటు కొన్ని కారణాలతో సీఐతోపాటు తణుకు రూరల్ ఎస్సై, అత్తిలి ఎస్సైలు రెండు రోజుల వ్యవధిలో మెడికల్ లీవుల్లోకి వెళ్లడం అప్పట్లో వివాదాస్పదమైంది. జనవరి నెల 25న రూరల్ సీఐ బి.కృష్ణకుమార్, ఎస్సై చంద్రశేఖర్లు సెలవులోకి వెళ్లగా అదేనెల 27న అత్తిలి ఎస్సై ప్రేమ్రాజ్ సైతం మెడికల్ లీవులోకి వెళ్లారు. దీంతో సర్కిల్ సగానికిపైగా ఖాళీ అయ్యింది. ఇటీవల అత్తిలి స్టేషన్ ఎస్సై పోస్టు భర్తీ అయ్యింది. తణుకు రూరల్ సీఐగా దేశంశెట్టి వెంకటేశ్వరరావు ఫిబ్రవరి 7న బాధ్యతలు స్వీకరించారు. పట్టణ ఇన్చార్జ్ సీఐగా కూడా ఆయనే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆకివీడులో సైతం ఈ ఏడాది కొన్ని కారణాలతో సీఐని బదిలీ చేయడంతో అప్ప టి నుంచి ఇన్చార్జ్ పాలన సాగుతోంది. అత్యంత వివాదాస్పదంగా మారిన తణుకు పట్టణ, రూరల్ స్టేషన్లలో విధి నిర్వహణకు అధికారులు వచ్చేందుకు కూడా వెనుకంజ వేసే పరిస్థితులు కనిపిస్తున్నాయని పోలీసు వర్గాలే చెబుతున్నారు. -
ఆక్రముంచేస్తున్నారు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఏలూరులో అధికార పార్టీ నేతలు పేట్రేగిపోతున్నారు. ఇరిగేషన్ స్థలాలు, చెరువులు, పోరంబోకు స్థలాలను టార్గెట్గా చేసి మరీ వాటి సమీపంలో కొద్దిభూమి కొనుగోలు చేయడం అది కూడా బెదిరింపులతో అడ్డగోలు వ్యవహారాలతో అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకుని ప్రభుత్వ భూములను కలుపుకుని దర్జాగా వెంచర్లు వేసి మధ్యతరగతి ప్రజలకు అంటకట్టి కోట్లు గడిస్తున్నారు. స్థలం కొనుగోలు చేసి చివరికీ బ్యాంకు లోన్కు వెళ్లి ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నిస్తే రెడ్మార్క్లో ఉందని, లోన్ రాదు.. అనుమతి ఉండదని అసలు సంగతి తెలుసుకుని షాక్ అవుతున్న పరిస్థితి. ఇదే కోవాలో ఏలూరు శివారులోని వెంకటాపురం బ్లాక్–3లో రూ.3 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసి సమీపంలోని వివాదాస్పద భూమిని దౌర్జన్యంగా దురాక్రమించి ప్లాట్లు వేసి మరీ సొమ్ములు చేసుకున్నారు. అడ్డగోలుగా.. అనుమతులు లేకుండా.. ఏలూరు నగర శివారులో అనుమతులు లేకుండా అడ్డగోలుగా పొలిటికల్ వెంచర్లు కొలువు తీరుతున్నాయి. డీటీసీపీ అనుమతులుగాని, నగరపాలక సంస్థలో ప్లాన్ అప్రూవల్గాని, ఇడాలో అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా పొలిటికల్ అండదండలతో కొందరు అధికార పార్టీ నాయకులు ప్రత్యక్ష భాగస్వాములుగా మారి రియల్ దందాకు తెరదీశారు. ప్రతి వెంచర్లోనూ ఇరిగేషన్ కాల్వ, ప్రభుత్వ పోరంబోకు, సర్కారు బాటలను కలుపుకుని వెంచర్లు వేసి మరీ విక్రయిస్తున్నారు. ఏలూరు శివారులోని వెంకటాపురం బ్లాక్–3లో ఇదే తరహా వెంచర్ దందా కొనసాగింది. సుంకరవారితోట వంతెన సమీపంలో మూడు కుటుంబాలు ప్రైవేట్ శ్మశానవాటికగా వినియోగించుకోవడానికి వీలుగా 2.05 ఎకరాల భూమిని సర్వే నంబర్ 872లో కేటాయించుకుని వందేళ్ల నుంచి వినియోగించుకున్నారు. దాని సమీపంలోని 874 సర్వే నంబర్లో 50 సెంట్ల ప్రభుత్వ భూమి ఉంది. అయితే కాలక్రమేణా ప్రాంతం పెరగడం, నగరపాలక సంస్థ పరిధిలోకి రావడం చుట్టుపక్కల నివాసాలు ఏర్పడటంతో సుమారు 40 ఏళ్ల నుంచి శ్మశాన వాటికగా వినియోగించుకోవడాన్ని నిలిపివేసి భూమిని ఆధీనంలో తీసుకున్నారు. అయితే వారసత్వపు భూమి కావడంతో అడంగల్ రికార్డులో నమోదైంది. అలాగే ఏళ్ల తరబడి సదరు కుటుంబాల ఆధీనంలోనే 2.05 ఎకరాల సెంట్ల భూమి ఉంది. సదరు కుటుంబాల ఆధీనంలోని భూమిపై పొలిటికల్ కన్ను పడి ముక్కలుగా విడిదీసి హద్దులు మార్చి ఏలూరులో కాకుండా ఇతర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఒక రిజిస్ట్రేషన్తో మొదలుపెట్టి అన్నిచోట్ల భారీ వ్యవహారాలతో చక్కపెట్టి వెంచర్ను సిద్ధం చేసేశారు. వెంచర్లో భవన నిర్మాణం వెంచర్లో రహదారిపొలిటికల్ వెంచర్ కాలువ, పోరంబోకు కలుపుకుని వెంచర్ డీటీసీపీ, ఇడా అనుమతులు లేకుండా స్థలాల విక్రయాలు సర్వే నంబర్లు మార్చి మరీ రిజిస్ట్రేషన్లు అధికార పార్టీ నేతల అండతో అడ్డగోలు తంతు రూ.3 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా ఏలూరు శివారు వెంకటాపురంలో ఆక్రమణలు కాలువ పొంగితే చెరువుగా స్థలాలు -
అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని గవర్నమెంట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పాణ్యం వేణు, ఏలూరు, పశ్చి మగోదావరి జిల్లాల ఏపీ జేఏసీ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్, యూవీ పాండురంగారావు డిమాండ్ చే శారు. సంఘ ఏలూరు జిల్లాస్థాయి ఉద్యోగుల ఆత్మీ య సమావేశం ఆదివారం స్థానిక జెడ్పీ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై అవగాహన ఉందని వారికి హెచ్ఆర్ పాలసీని అమలుచేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన జీతాలు ఇవ్వాలని, పని భా రం తగ్గించాలని, 12వ పీఆర్సీ అమలు చేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పాండు రంగారావు మాట్లాడుతూ అవుట్ సోర్సింగ్ వ్యవస్థకి జీతాలు తక్కువే ఇస్తున్నారన్నారు. ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్ఎస్ హరనాఽథ్ మాట్లాడుతూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను ఆప్కాస్ ద్వారా కూడా సరైన విధానంలో భర్తీ చేయడం లేదని, జీతాలు పెంచి సామాజికంగా వారి స్థాయిని పెంచాలని కోరారు. పాణ్యం వేణు మాట్లాడుతూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అతి తక్కువ వేతనానికి అంకితభావంతో పనిచేస్తూ అభద్రతాభావానికి గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచాలన్నారు. జిల్లా నూతన కమిటీ ఏర్పాటు గవర్నమెంట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అ సోసియేషన్, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు సంబంధించి నూతన కమిటీ ఎన్నికయ్యింది. ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా నాగభూషణం (గృహనిర్మాణ శాఖ), జిల్లా ప్రధాన కార్యదర్శిగా సుబ్బారావు (పశుసంవర్ధక శాఖ), మరో 20 మందితో జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. అనంతరం నూతనంగా ఎంపికై న జిల్లా కమిటీ సభ్యులను ముఖ్య అతిథులు సన్మానించారు. -
కష్టపడి పనిచేస్తే సముచిత స్థానం
చింతలపూడి: పార్టీ కోసం అంకితభావంతో, కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు, నాయకుడికి భవిష్యత్తులో సముచిత స్థానం లభిస్తుందని శా సనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు అ న్నారు. ఆదివారం చింతలపూడి పర్యటనలో భాగంగా వైఎస్సార్సీపీ మున్సిపల్ విభాగం ఏలూరు జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకటేశ్వరరావు నివాసానికి విచ్చేశారు. పార్టీ పట్టణ నాయకులు ఆయన్ను మర్యాదపూర్వకంగా క లుసుకున్నారు. మోషేన్రాజు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కోసం క్షేత్రస్థాయిలో కష్టపడే వారిని పార్టీ ఎల్లప్పుడూ గుర్తిస్తుందన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కార్యకర్తలు, నాయకులు అధైర్యపడకుండా ఐ క్యమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో పార్టీకి తిరిగి మంచి రోజులు వ స్తాయని అన్నారు. జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు త్సల్లాబత్తుల శ్రీనివాసరావు, నాయకులు సీహెచ్ జానారెడ్డి, కొప్పుల నాగేశ్వరరావు, కనుమ రెడ్డి చండీప్రియ, ఎం. దుర్గారావు, డోకల రాము తదితరులు ఉన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): పూర్వ పశ్చిమగోదావరి జిల్లాలోని జెడ్పీ, మండల పరిషత్, మున్సిపాలిటీలు–మున్సిపల్ కార్పొరేషన్ల కింద పనిచేస్తున్న ఉపాధ్యాయుల సాధారణ సీనియార్టీ జాబిత రూపొందించి మూడు విడతల్లో అభ్యంతరాలు తీసుకుని సరిచేశామని ఏలూరు డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. సాధారణ సీనియార్టీ, సబ్జెక్టు వారీగా సీనియార్టీ జాబితాలు సంబంధిత పూర్వ పశ్చిమగోదావరి జిల్లా, పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో, నోటీసు బోర్డుల్లో సోమవారం నుంచి అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఏ మైనా అభ్యంతరాలు ఉంటే 25వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు సంబంధిత డీవైఈఓ, ఎంఈఓల ద్వారా పూర్వ పశ్చిమగోదావరి జిల్లా వి ద్యాశాఖ కార్యాలయం, ఏలూరులో సమర్పించాలని సూచించారు. గడువు తర్వాత వచ్చిన వినతులు స్వీకరించబోమని, ఇదే చివరి అవకాశంగా భావించాలని డీఈఓ తెలిపారు. ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న క్షేత్రంలో జరిగిన రూ.200 నకిలీ దర్శనం టికెట్ల స్కామ్ కేసులోని నిందితులకు కోర్టు ఇచ్చిన రెండు రోజుల పోలీస్ కస్టడీ ఆదివారంతో ముగిసింది. భీమడోలు స్టేషన్లో సీఐ పి.కృష్ణ ఐదుగురు నిందితులను విచారించి స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. ఆదివారం సాయంత్రం వారి ని భీమడోలు కోర్టు న్యాయమూర్తి ఎస్.ప్రియదర్శిని నూతక్కి ముందు హాజరుపరిచారు. అనంతరం రిమాండ్కు తరలించారు. కేసుకు సంబంధించి తొమ్మిది మంది నిందితుల్లో ఐఎస్జే రాజు, ఎం.రమేష్, ఎస్.శేషుబాబు, ఎం.సతీష్, టి.సత్యనారాయణను పోలీసులు కస్టడీకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా కస్టడీకి సంబంధించిన అంశాలు, కేసు పురోగతి తదితర అంశాలపై క్షేత్రంలో చర్చ జరుగుతోంది. అలాగే 2025 జనవరి 1 నుంచి శ్రీవారి ఆల యంలో రూ.100, రూ.200 టికెట్ కౌంటర్లలో పనిచేసిన సిబ్బంది వివరాలను తెలపాలని పో లీసులు ఆదివారం దేవస్థానానికి లేఖ రాశారు. దీనిని బట్టి చూస్తే విచారణ ఇంకా కొనసాగుతున్నట్టు స్పష్టమవుతోంది. సాఫ్ట్వేర్ సంగతేంటి.. కేసులో ఎ–9 నిందితుడిగా ఉన్న సాఫ్ట్వేర్ ఉ ద్యోగి డేటాబేస్ లేకుండా కేవలం టికెట్ ప్రింట్ వచ్చేలా సాఫ్ట్వేర్ను రూపొందించాడు. అయితే తన స్నేహితుడు రమేష్ అడగడం వల్ల దేవస్థానానికి అనుకుని సాఫ్ట్వేర్ తయారు చేశానని పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఉన్నతాధికారుల ఆథరైజేషన్ లేకుండా సాఫ్ట్వేర్ ఎలా తయారుచేస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఉన్నతాధికారులు మరింత దృష్టి సారించా లని భక్తులు కోరుతున్నారు. ఉంగుటూరు: బాదంపూడిలోని మత్స్య శిక్షణా కేంద్రం (మంచినీటి చేపల కేంద్రం)లో మూ డు నెలల శిక్షణ కోర్సుకు ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి బి.రాజకుమార్ ప్రకటనలో తెలిపారు. ఈనెల 23లోపు దరఖాస్తు చేసుకోవాలని, 28న ముఖాముఖీగా అభ్యర్థులను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. వచ్చేనెల 1 నుంచి జూలై 31 వరకు శిక్షణ ఇ స్తామన్నారు. చేపల పెంపకంలో మెలకువలు, సాగుపై అవగాహన, వ్యాధులు, నివారణ, చేప నారు ఉత్పత్తి వంటి అంశాలపై శిక్షణ ఇస్తామన్నారు. ఐదో తరగతి చదివి 18 నుంచి 30 ఏళ్ల వయసున్న యువత అర్హులన్నారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్లు ప్రదానం చేస్తామని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు సెల్ 95733 37484, 7286993033, 9492337649 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
అభయారణ్యంలోనే పెద్దపులి
శ్రీశైలం నుంచి ప్రత్యేక రెస్క్యూ టీమ్పోలవరం రూరల్: పాపికొండల అభయారణ్య ప్రాంతంలోని రిజర్వు అటవీ ప్రాంతంలోనే పెద్దపులి సంచారం కొనసాగుతోంది. పోలవరం ప్రాజెక్టు సమీపంలోని ముంపు గ్రామాలైన సింగన్నపల్లి, కొత్తూరు పరిసర ప్రాంతాల్లోని గోదావరి నదీ తీరంలో కూడా పులి సంచరించినట్లు అడుగు జాడలను బట్టి అటవీ శాఖాధికారులు గుర్తించారు. ప్రాజెక్టు ప్రాంతంలో కార్మికులు అప్రమత్తంగా ఉండాలని, అటవీ ప్రాంతం వైపు ఎవరూ వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. చీఫ్ కన్జర్వేటర్ నీలకాంతనాథరెడ్డి, జిల్లా అటవీశాఖ అధికారి సందీప్రెడ్డిలు ప్రాజెక్టు ప్రాంతంలో పులి సంచరించిన ప్రాంతాలను పరిశీలన చేశారు. పులి దూడపై దాడి చేసిన ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. రిజర్వు ఫారెస్ట్లో తాగునీటి వసతితో పాటు చల్లని దట్టమైన అటవీ ప్రాంతం ఉండటంతో ఈ ప్రాంతంలోనే కదలికలు ఉన్నట్టు పేర్కొన్నారు. పులి జనావాస ప్రాంతాల్లోకి సంచరించడం లేదని తెలిపారు. పులి మెడకు అమర్చిన శాటిలైట్ రేడియో ఫ్రీకెన్సీ ద్వారా నిరంతరం అటవీశాఖ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారన్నారు. పులి అటవీ ప్రాంతంలో ఉన్నప్పుడు సిగ్నల్స్ అందని పరిస్థితులు కూడా ఉన్నాయన్నారు. సబ్ డీఎఫ్ఓ వెంకట సుబ్బయ్య, రేంజర్ ఎస్కే వలీ, సిబ్బందితో కలిసి ఎప్పటికప్పుడు పులి అడుగు జాడలను కదలికలను గుర్తిస్తున్నట్టు చెప్పారు. పులిని పట్టుకోవడం కోసం శ్రీశైలం అటవీ శాఖ నుంచి ప్రత్యేక రెస్క్యూ సిబ్బందిని ట్రాక్వలైజర్ గన్స్ వలలు, ఇతర సామగ్రిని కూడా అందుబాటులో ఉంచామన్నారు. -
వెంచర్ దందా మొదలైంది ఇలా..
ఈ క్రమంలో రెండేళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన అధికార పార్టీ నేత ఈ భూమిపై కన్నేశాడు. హక్కుదారులుగా ఉన్న వాళ్ల దగ్గర అడంగల్లో ఒకరి పేరు మినహా ఎలాంటి రికార్డు లేదని తెలుసుకుని భూమిని అమ్మకానికి పెట్టడం, అధికారాన్ని అడ్డం పెట్టుకుని వారిని బెదిరించి హ ద్దులు మార్చి సర్వే నంబర్లు మార్చి, కాగితాలు సృష్టించి మరీ వెంచర్ సిద్ధం చేశారు. ఏడాదిన్నర క్రితమే వెంచర్ను ఏర్పాటు చేసి ఎలాంటి అనుమతులు లేకుండా గజం రూ.14 వేల చొప్పున అనేక మందికి విక్రయించేశారు. ప్రభుత్వ భూమి 50 సెంట్లను కూడా వెంచర్లో కలిపేశారు. ఏడుగురు హక్కుదారులను తమదైన శైలిలో బెదిరించి మీ ఎవరికీ ఎలాంటి హక్కు లేదని.. ఉంటే ఒరిజినల్ కాగితాలు తీసుకుని రావాలని హడావుడి చేసి, లేని స మస్యను సృష్టించి చివరికి భూమిని తనకే అప్పగించేలా దారికి తెచ్చుకున్నాడు. వీరిలో అందరూ కాకుండా ఇద్దరు సదరు అధికార పార్టీ నేతతో భాగస్వాములుగా మారి భూమి సరిహద్దులను మార్చి సరికొత్త డాక్యుమెంట్లను సృష్టించి విక్రయించారు. ప్రభుత్వ భూమి ఉన్న సర్వే నం.874లోని భూమిని కూడా 872లో ఉన్న ట్లుగా చూపించి విక్రయించారు. -
పెళ్లి చేసుకుంటానని నమ్మించి..
ఏలూరు (ఆర్ఆర్పేట): పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి ద్వారకాతిరుమల తీసుకువెళ్లిన యువకుడు, అత్యాచారానికి పాల్పడి పరారయ్యాడు. ఈ ఘటనపై ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రూరల్ మండలం పోణంగికి చెందిన 21 ఏళ్ల యువతి పదో తరగతిలో ఉండగానే నక్క దీపక్ ప్రేమిస్తున్నానని వెంటపడేవాడు. అతని వేధింపులు తాళలేక తల్లిదండ్రులు చదువు మాన్పించి దుకాణంలో పనికి పెట్టారు. కొంతకాలం క్రితం నుంచి దీపక్ వెంట పడడం ప్రారంభించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అతని మాటలు నమ్మింది. ఈనెల 13వ తేదీన దీపక్ పెద్దలు మన పెళ్లికి ఒప్పుకోవడం లేదని ద్వారకాతిరుమల వెళ్లి పెళ్లి చేసుకుందామని యువతిని ఒప్పించాడు. స్నేహితుడి ద్విచక్ర వాహనంపై ద్వారకాతిరుమల రావాలని ఆమెకు సూచించాడు. ఆమె ద్వారకాతిరుమల వెళ్లిన తర్వాత ఓ ప్రైవేట్ లాడ్జిలో రూమ్ తీసుకున్నాడు. ఆ రాత్రి ఆమెకు మాయ మాటలు చెప్పి ఆమైపె అత్యాచారానికి పాల్పడ్డాడు. ఉదయం లేచి చూసేసరికి అతను కనబడలేదు. దీంతో యువతి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం దీపక్ ఇంటికి వెళ్లి విషయం చెప్పగా దీపక్ తల్లిదండ్రులు తమ కుమారుడు హాస్టల్లో ఉన్నాడని నీతో ఆరోజు రాత్రి ఉన్నది ఎవరో సరి చూసుకోమని హేళనగా మాట్లాడారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి నిందుతుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భీమడోలు: ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులదేనని జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ్ అన్నారు. జాతీయ రహదారి సూరప్పగూడెం వద్ద రోడ్డుపై ఆరబోసిన ధాన్యాన్ని శనివారం ఆయన పరిశీలించారు. రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం తరలింపు, గోనె సంచుల విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేవని రైతులు చెప్పడంతో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రబీ కోతలు ముమ్మరంగా సాగుతున్నందున ధాన్యం కొనుగోలుకు అవసరమైన నాణ్యమైన సంచులను అందుబాటులో ఉంచామన్నారు. తేమ శాతం, ధాన్యం రవాణా విషయంలో రైతులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ, సివిల్ సప్లైస్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. -
మెరుగైన సేవలందించడమే లక్ష్యం
శ్రీవారి దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాథరావు ద్వారకాతిరుమల: భక్తులకు మెరుగైన సేవలు అందించడమే తన లక్ష్యమని ద్వారకాతిరుమల శ్రీవారి దేవస్థానం నూతన ఈఓ వేండ్ర త్రినాథరావు అన్నారు. అన్నవరం దేవస్థానం నుంచి బదిలీపై వచ్చిన ఆయన శనివారం చినవెంకన్న దేవస్థానంలో ఈఓగా బాధ్యతలు చేపట్టారు. తొలుత త్రినాధరావు దంపతులు స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో అర్చకులు, పండితులు ఆయనకు శ్రీవారి శేష వస్త్రాన్ని కప్పి, వేద ఆశీర్వచనాన్ని పలికారు. ఆ తరువాత ఆలయ కార్యాలయంలో డీఈఓ వై.భద్రాజీ నుంచి ఆయన చార్జ్ స్వీకరించారు. ఈ సందర్బంగా సాక్షితో మాట్లాడుతూ.. ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుబంధం ఉందని గుర్తి చేసుకున్నారు. మరోసారి ఈ ఆలయానికి ఈఓగా రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని.. ఇన్ని సార్లు ఈఓగా రావడానికి శ్రీవారి కృపా, కటాక్షాలే కారణమని నమ్ముతున్నానని చెప్పారు. 2017–2018 మధ్య సుమారు రూ.70 కోట్లతో వకుళమాత నిత్యాన్నదాన భవనం, పవర్ హౌస్, బుకింగ్ కౌంటర్లు, కల్యాణకట్ట, ఘాట్ రోడ్లు, ధర్మఅప్పారాయ నిలయం, శ్రీవారి నిత్య కల్యాణ మండపం, క్యాంటీన్, సెంట్రల్ స్టోర్స్ వంటి భవనాలను ఈఈ డీవీ భాస్కర్ సహాయంతో నిర్మించామని ప్రస్తుతం ప్రారంభానికి సిద్ధంగా ఉన్న అనివేటి మండప విస్తరణ, క్యూ కాంప్లెక్స్ భవనం, ధర్మ అప్పారాయ నిలయం భవనంపైన మరో అంతస్తు నిర్మాణాలకు తన హయాంలోనే శంకుస్థాపనలు జరిగాయన్నారు. ఆలయ పరువు, ప్రతిష్ఠలను కాపాడుకోవాల్సిన బాధ్యత అధికారులు, సిబ్బందిపైనే ఉందని, ప్రతి ఒక్కరూ మరింతగా కృషి చేయాలని సూచించారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యమే మొక్కజొన్న రైతుకు శాపం
దెందులూరు: ఆంధ్రప్రదేశ్లో మొక్కజొన్న రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నారని, కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల దళారుల చేతిలో మోసపోతున్నారని దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.2,400 ఉండగా, రైతులు రూ.1,400 నుంచి రూ.1,600 మధ్యలోనే అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఈ రబీలో వరి తర్వాత 12.35 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరిగిందని, సుమారు 35 లక్షల టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని, ఈ క్రమంలో రైతులు సుమారు రూ.2,500 కోట్ల వరకు నష్టపోతారని అంచనా వేశారు. గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మార్క్ఫెడ్ ద్వారా మూడు సంవత్సరాల్లో సుమారు 8 లక్షల టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేసి రైతును ఆదుకున్నారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి దళారుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఏలూరు (ఆర్ఆర్పేట)/దెందులూరు : జిల్లా ఉమ్మడి పరీక్షల నిర్వహణ సంస్థ (డీసీఈబీ) కార్యదర్శిగా పి.సురేష్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకూ ఆ స్థానంలో తడికలపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఏ.సర్వేశ్వరరావు బాధ్యతలు నిర్వహించారు. ఆయన మూడు సంవత్సరాల పదవీ కాలం ముగియడంతో, దెందులూరు మండలం మేదినరావుగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్న సురేష్ను నియమించారు. సురేష్ను జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటలక్ష్మమ్మ, ఏలూరు ఉప విద్యాశాఖాధికారి, ఇతర అధికారులు, ఉపాధ్యాయులు అభినందించారు. ఆగిరిపల్లి: మండలంలోని వడ్లమానుకు చెందిన రెడ్డి సులేమాన్ రాజు(40) కృష్ణా జిల్లా ఉప్పులూరు వద్ద ఉన్న ఏలూరు కాలువలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సులేమాన్ రాజు విజయవాడలోని ఓ ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం ఒక వ్యక్తి దగ్గర కోర్టుకు సంబంధించిన పేపర్లు తీసుకుని వెళ్తూ.. నెక్కలం గొల్లగూడెం వద్ద ఉన్న కూల్డ్రింక్ షాపు వద్ద ఆగాడు. ఆ తర్వాత నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. శనివారం ఉదయం ఉప్పులూరు వద్ద ఉన్న ఏలూరు కాలువలో సులేమాన్ రాజు మృతదేహం లభ్యమైంది. మృతదేహంపై గాయాలు ఉండటంతో పాటు, ద్విచక్ర వాహనంలో ఉన్న కోర్టుకు సంబంధించిన పేపర్లు కూడా అదృశ్యమయ్యాయి. దీంతో సులేమాన్ రాజును ఎవరైనా హత్య చేశారా అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మృతదేహాన్ని ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భీమవరం: భీమవరం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయ ఆవరణలో శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి పరిసరాలను శుభ్రపర్చారు. ఈ సందర్భంగా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అనారోగ్యం దరి చేరకుండా చూసుకోవచ్చన్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ప్రతినెల మూడో శనివారం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆర్మర్డ్ రిజర్వ్ డీఎస్పీ ఎంవీవీ సత్యనారాయణ, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కెవీవీఎన్ సత్యనారాయణ పాల్గొన్నారు. -
ఏలూరు క్రాంతినగర్లో ఉద్రిక్తత
ఏలూరు (టూటౌన్): ఏలూరు కార్పొరేషన్ పరిధిలోని బీడీ కాలనీ క్రాంతినగర్లో శనివారం ఉదయం ఉద్రిక్తత చోటుచేసుకుంది. గత 15 సంవత్సరాలుగా ప్రభుత్వ పోరంబోకు భూమిలో ఇళ్లు నిర్మించుకుని ఉంటున్న వారిని ఖాళీ చేయాలని, వారి ఇళ్లను కూల్చివేసేందుకు నగరపాలక సంస్థ సిబ్బంది శనివారం ప్రయత్నించారు. దీన్ని అడ్డుకున్న స్థానికులు పెట్రోలు డబ్బాలతో పొక్లెయిన్కు ఎదురు నిలవడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. దీంతో మున్సిపల్ సిబ్బంది ఇళ్ల కూల్చివేతను తాత్కాలికంగా నిలుపుదల చేసి వెనుదిరిగారు. స్థానికుల వివరాల ప్రకారం.. బీడీ కాలనీ క్రాంతినగర్లో దాదాపు 90 కుటుంబాలకు చెందిన వారు గత 15 సంవత్సరాలుగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ పోరంబోకు భూమిలో ఇళ్లను నిర్మించుకున్నారు. సమీపంలో వేస్తున్న రియల్ ఎస్టేట్ వెంచర్కు వెళ్లేందుకు వీలుగా కామన్ సైట్లో ఇళ్లు నిర్మించారంటూ వాటిని తొలగించాలని శుక్రవారం నోటీసులు జారీ చేశారు. నోటీసులను ఇళ్ల వద్ద ఎవరూ లేని సమయంలో ఇంటి తలుపులకు అంటించారు. శుక్రవారం నోటీసులు అంటించి శనివారం ఉదయం ఇళ్లను కూల్చివేసేందుకు యంత్రాలతో సహా చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికలకు ముందు స్థానిక టీడీపీ నాయకుడొకరు తమ పార్టీ అధికారంలోకి వస్తే మీ అందరికీ పట్టాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారని, తీరా అధికారంలోకి వచ్చాక ఉన్న గూడును తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పోరంబోకు భూమి రియల్ ఎస్టేట్కు సంబంధించిన కామన్ సైట్ ఎలా అవుతుందంటూ బాధితులు నిలదీస్తున్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా తక్షణం తమకు పక్కా పట్టాలిచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు. తమలాంటి నిరుపేదలపై జులుం ప్రదర్శించడం ఎంతవరకు సమంజసమంటూ వారు ప్రశ్నిస్తున్నారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకుని తమకు పట్టాలిచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక బాధిత ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు. పెట్రోల్ డబ్బాలతో స్థానికుల ఆందోళన -
అభయారణ్యంలోనే పులి
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతంలోని మామిడిగొంది, దేవరగొంది ట్విన్ టన్నెల్స్ ప్రాంతంలో ఉన్న కుడి ప్రధాన కాలువ, హెడ్ రెగ్యులేటర్ సమీపంలో ఉన్న రిజర్వు అటవీ ప్రాంతంలో పులి మకాం వేసింది. శాడిల్ డ్యామ్ నుంచి స్పిల్వే దిగువకు చేరుకుని అక్కడకు మేతకు వెళ్లిన ఆవు దూడపై దాడి చేసి చంపి తిరిగి వచ్చిన దారినే వెళ్ళినట్లు పాదముద్రలు ఉన్నాయని అటవీశాఖాధికారులు చెబుతున్నారు. పులి కదలికలపై ట్రాక్టర్ ద్వారా గుర్తిస్తున్నారు. పులి సంచరించిన ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు అమర్చారు. పులిని పట్టుకోవడానికి రెస్క్యూ టీంను సిద్దం చేసినట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టులోకి పర్యాటకుల రాకపోకలు, కొత్త వ్యక్తుల సంచారం నిషేధించారు. ప్రాజెక్టులోకి పనులు నిమిత్తం వెళ్ళే కార్మికులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రాజెక్టు ప్రాంతంలో పశువులను మేపుకునే వారు తమ పశువులను మైదాన ప్రాంతాలకు తరలించాలని అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రాజెక్టు ప్రాంతంలో దూడపై పెద్ద పులి దాడి చేయడంతో ప్రాజెక్టు ప్రాంతంలోని కార్మికులు, మైదాన ప్రాంతంలోని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. శుక్రవారం రాత్రి పెద్దపులి కొండపై నుంచి దిగువకు చేరి గోదావరి నది ప్రాంతంలో ఆవుదూడను చంపి నీరు తాగి వెళ్ళినట్లు చెబుతున్నారు. ట్రాకర్ ద్వారా పులి సంచరించే ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. 8 ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అటవీ శాఖ రేంజ్ అధికారి ఎస్కే వలీ తెలిపారు. గత వారం రోజులుగా పోలవరం మండలంలోని అభయారణ్య ప్రాంతంలో పులి సంచరిస్తూ ఇప్పటి వరకు 2 ఆవు దూడలపై దాడి చేసింది. -
దమ్మున్న కార్యకర్తలు వైఎస్సార్సీపీ సొంతం
కై కలూరు: గ్రామ గ్రామాన దమ్ము, దైర్యం కలిగిన కార్యకర్తలు వైఎస్సార్సీపీకి సొంతమని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) అన్నారు. కై కలూరు పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ నాలుగు మండలాల గ్రామ పార్టీ అధ్యక్షులు, కమిటీ సభ్యులను శనివారం అభినందించారు. కై కలూరు మండల పార్టీ అధ్యక్షుడు శింగంశెట్టి రాము అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డీఎన్నార్ మాట్లాడుతూ నియోజకవర్గం నుంచి 18,000 కార్యకర్తల డేటాను డిజిటలైషన్ చేసి రాష్ట్రంలోనే నెంబర్వన్గా నిలిచామన్నారు. కష్టపడే కార్యకర్తలు ఉండటం వల్లే ఈ ఘనత సాధించానన్నారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి పుట్టిన రోజు డిసెంబర్ 21 తర్వాత వైఎస్సార్సీపీ సత్తా చూపిస్తూ నియోజకవర్గంలో గేర్ మారుస్తానన్నారు. అధికంగా పార్టీ కమిటీలను పూర్తి చేసిన వారి జాబితాను ప్రకటించి డీఎన్నార్ అభినందించారు. ముదిరాజుల విభాగ పార్టీ అధ్యక్షుడు కోమటి విష్ణువర్ధనరావు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో సీఎంగా జగన్ మోహన్రెడ్డి ఎన్నికవ్వడం ఖాయమన్నారు. పార్టీ ఉపాధ్యక్షుడు చేబోయిన వీరరాజు మాట్లాడుతూ అందరం పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. వైఎస్సార్సీపీ ఎంపీపీలు రామిశెట్టి సత్యనారాయణ, పెద్దిరెడ్డి శ్రీరామదుర్గాప్రసాద్, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి గుమ్మడి వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు కూసంపూడి కనకదుర్గారాణి, ఘంటా సంధ్య, బలే నాగరాజు, గాదిరాజు వెంకట కిషోర్ మణికంఠ వర్మ, మండల పార్టీ అధ్యక్షులు బేతపూడి ఏసేబురాజు, బోయిన రామరాజు, తిరుమాని రమేష్, దుగ్గిరాల నాగు, సమయం అంజి, పెంటా అనిల్కుమార్, రాచూరి రాధ, వలవల రామారావు, కందుల వెంకటేశ్వరరావు, చాన్ బాషా, వేణుగోపాలరావు, గుడివాడ తంబిస్వామి, కొల్లేటి సత్యనారాయణ, జయమంగళ కాసులు తదితరులు పాల్గొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ -
కోకో రైతు కకావికలం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కోకో కాంక్లేవ్ పేరుతో రెండు రోజులు సదస్సులు నిర్వహించి కోకో రైతులను దేశంలోనే ఆదర్శ రైతులుగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం హడావుడి చేసింది. దెందులూరు నియోజకవర్గంలోని రామశింగవరంలో 500 ఎకరాల్లో కోకో సిటీ ఏర్పాటు చేసి దేశం రామశింగవరం వైపు చూసేలా చేస్తామని ప్రకటించారు. ప్రసంగాలు, ఆర్భాటాలే తప్ప కోకోకు కనీస ధర దక్కేలా చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గత రెండేళ్లుగా ధర తిరోగమన బాట పట్టి అన్నదాతకు లక్షల్లో నష్టాలను మిగిలిస్తుంటే, ఆదుకోమని తీవ్రస్థాయిలో ఆందోళనలు చేసినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేకపోవడం గమనార్హం. ఏలూరు జిల్లాలో గత మూడు దశాబ్దాలుగా కోకో సాగు జరుగుతోంది. గోదావరి– కృష్ణా డెల్టా పరివాహక ప్రాంతంలో జిల్లా ఉండటంతో వాతావరణం పంట సాగుకు పూర్తి అనుకూలంగా ఉంటుంది. దీంతో దేశంలోనే అత్యధికంగా కోకో సాగు జరిగే జిల్లాగా ఏలూరు ఖ్యాతిగాంచింది. జిల్లాలో పామాయిల్, కొబ్బరిలో అంతర పంటగా, అలాగే విడిగానూ కోకోను సాగుచేస్తున్నారు. ఒక్క ఏలూరు జిల్లాలోనే 46 వేల ఎకరాల్లో సాగు జరుగుతోంది. రెండేళ్ల క్రితం రికార్డు స్థాయి ధరలతో లాభం పొందిన రైతు నేడు ఢీలా పడిపోయాడు. 2024లో కిలో రూ.1040 పలికిన కోకో, ప్రస్తుత సీజన్లో కిలో రూ.270 నుండి రూ.300కు అమ్ముడుపోతోంది. కౌలు రూ.70 వేల నుంచి లక్ష పైమాటే గత మూడు దశాబ్దాల్లో జిల్లాలో కోకో ప్రస్థానం కొనసాగింది. కిలో రూ.15–20తో మొదలైన ధర 2023లో రూ.900, 2024లో రూ.1,040కి చేరింది. ఐవరీ కోస్ట్, ఘనా దేశాల్లో అత్యధికంగా కోకో సాగు జరుగుతుంది. గత మూడేళ్లలో ఈ రెండు దేశాల్లో ఉత్పత్తి తగ్గడంతో పాటు పంట పాడవడంతో గతంలో భారీగా డిమాండ్ ఏర్పడింది. దీంతో కోకో ధర ఎప్పుడైతే జిల్లాలో సగటున రూ.600 దాటిందో, కోకో తోటల కౌలు ధరలను భూ యజమానులు భారీగా పెంచారు. రూ.30 వేల వరకు ఉన్న కోకో తోట కౌలు ధర, ప్రాంతాన్ని బట్టి, దిగుబడిని బట్టి రూ.70 వేల నుండి 1.20 లక్షల వరకు పెరిగిపోయింది. రేటు పూర్తిగా పడిపోవడంతో ఇప్పుడు కోకో రైతు కకావికలమవుతున్నాడు. ప్రైస్ పాలసీ కావాలి ఆయిల్ పామ్ ధర నిర్ణయించడానికి ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేషియో (ఓఈఆర్), అలాగే అంతర్జాతీయ ధరను ప్రామాణికంగా తీసుకుని ప్రతి నెల ఆయిల్ ఫెడ్ మద్దతు ధర నిర్ణయిస్తుంది. అదే తరహాలో కోకో కంపెనీలు కొనుగోలు చేసే బీన్స్కు సంబంధించి ధర నిర్ణయం చేయాలని కోకో రైతులు డిమాండ్ చేస్తున్నారు. ధర రూ. వెయ్యి నుంచి 300లకు పడిపోవడంతో ఏటా రూ.600 కోట్లకు పైగా జిల్లాలో నష్టం వాటిల్లుతున్నట్లు అంచనా. ఆరుగాలం శ్రమించి లక్షలాది రూపాయలు రైతు పంటలపై పెట్టుబడి పెడుతున్నాడు. ధర నిర్ణయించే స్వేచ్ఛ రైతుకు ఎంతమాత్రం లేదు. ఈ విధానం మారాలి. పంట పండించే రైతుకు న్యాయం జరిగేలా శాశ్వత విధానం రూపొందించాలి. – భూక్యా శ్రీనివాస్ నాయక్, రైతు, నామవరం కోకో పంట ధర నిర్ణయం విషయంలో రైతులు వివక్షకు గురవుతున్నారు. దశాబ్దాలు గడిచినా ధర్నాలు, నిరసనలు, రాస్తారోకోలు చేస్తే గానీ గిట్టుబాటు ధర పొందలేని దుస్థితి ఉంది. ధరల స్థిరీకరణలో కోకో రైతులను భాగస్వాములను చేయాలి. – ఎరుకులపాటి సాంబశివరావు, రైతు సమాఖ్య రాష్ట్ర నాయకుడు సిండికేట్ చక్రంలో రైతులు బలి రెండేళ్ల క్రితం కిలో రూ.1,040.. నేడు రూ.270 మాత్రమే నాణ్యత పెరుగుతున్నా దక్కని మద్దతు ధర రెండేళ్లుగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం జిల్లాలో 46 వేల ఎకరాల్లో కోకో సాగు కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత దాదాపు వంద రోజులకు పైగా కోకో రైతులు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద, రాష్ట్ర ఉద్యానవన శాఖ కార్యాలయం వద్ద, కోకో కొనుగోలు చేసే కంపెనీల వద్ద ఆందోళనలు నిర్వహించారు. రైతు నష్టపోకుండా కనీసం గిట్టుబాటు ధరలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నుంచి ముఖ్యమంత్రి వరకు అందరినీ కలిసి కోరారు. దీనిపై ఎలాంటి స్పందన లేదు. జనవరిలో ఉద్యానవన శాఖ నిర్వహించిన కోకో కాంక్లేవ్ సదస్సులో హాజరైన మంత్రి, 15 రోజుల్లోగా మద్దతు ధర నిర్ణయించడానికి కమిటీని ఏర్పాటు చేస్తామని, ఈ సీజన్లో ఇబ్బందులు లేకుండా చేస్తామని ప్రకటించారు. ఆ హామీని మరిచిపోయి, ఇప్పుడు కొత్తగా రామశింగవరంలోని 500 ఎకరాల అటవీ ప్రాంతంలో కోకో సిటీ ఏర్పాటు చేస్తామంటూ బ్రాండ్ ఇమేజ్ గురించి మాట్లాడుతున్నారు. -
నోట్ల కట్టల వెనుక మిస్టరీ.. గోదావరి జిల్లాల్లో సంచలనం
నరసాపురం: నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామంలో ఓ పాస్టర్ ఇంట్లో రూ.2,27,94,000 పోలీసులు స్వాధీనం చేసుకోవడం గోదావరి జిల్లాల్లో సంచలనంగా మారింది. కొద్దినెలల క్రితం వరకూ సాధారణ జీవితం గడిపిన పాస్టర్ గంటా జాన్ బాబూరావు ఒక్కసారిగా విలాసవంతమైన జీవితంలోకి మారడమే కాకుండా, పెద్ద సంఖ్యలో ఆస్తుల కొనుగోలు చేయడం, ఈ క్రమంలో ఆయన ఇంట్లో కోట్లలో నోట్ల కట్టలు లభ్యం కావడం హాట్టాపిక్గా మారింది. ఇంట్లో లభ్యమైన నగదుకు ఆధారాలు చూపని కారణంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నరసాపురం డీఎస్పీ సుధాకర్ నేతృత్వంలో రూరల్ సీఐ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో రెండు బృందాలు విస్తృతంగా దర్యాప్తు చేపట్టాయి. శుక్రవారం ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. జాన్ బాబూరావు నివాసంలో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. పలు దస్తావేజులు, ఆస్తి పత్రాలు స్వా«దీనం చేసుకున్నట్టు సమాచారం. ఇటీవల బాబూరావు తనతో పాటు అతని అల్లుడు, కుమార్తె పేరుతో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్టుగా ఐటీ అధికారులు ప్రాథ«మికంగా గుర్తించారు. తమ వద్ద ఉన్న నగదుకు అన్ని ఆధారాలు ఉన్నట్టు పాస్టర్ కుమార్తె ఫోన్ ద్వారా ఐటీ అధికారులకు తెలిపినట్టు సమాచారం. లక్ష్మణేశ్వరం గ్రామానికి చెందిన జాన్బాబూరావు గ్రామంలో చిన్న చర్చి నడిపేవారు. ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్కు చెందిన వ్యక్తితో తన కుమార్తె వివాహం చేశారు. అప్పటి నుంచి పరిస్థితిలో మార్పు వచ్చిందని గ్రామస్తులు చెబుతున్నారు. -
పెద్దవాగు ప్రాజెక్టుపై నిర్లక్ష్యం తగదు
వేలేరుపాడు: పెద్దవాగు ప్రాజెక్టు పునర్నిర్మాణానికి రూ.500 కోట్లు కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఐ ఏలూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం తెలంగాణలోని అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి సమీపంలో పెద్దవాగు ప్రాజెక్టు నుంచి వేలేరుపాడు మండల తహసీల్దార్ కార్యాలయం వరకు 21 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ వేలాది ఎకరాల పంటలు ఎండిపోతున్నా, వేలాది కుటుంబాలు దాహానికి అల్లాడిపోతున్నా, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారన్నారు. ఏడు మండలాలను పట్టించుకోవాలి రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో 7 మండలాలను ఆంధ్ర రాష్ట్రంలో కలుపుకున్న పాలకులకు వారి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత లేదా..? ప్రశ్నించారు. ప్రాజెక్టు మరమ్మతులు చేపట్టాలని కోరుతూ ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా ప్రతినిధులు చుట్టూ తిరుగుతూ రెండు సంవత్సరాలుగా కుక్కునూరు, వేలేరుపాడు మండలాల ప్రజలు గగ్గోలు పెడుతున్నా కూటమి ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందన్నారు. ప్రాజెక్టు ఆవశ్యకత తెలిసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ చైతన్య, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు కారం దారయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి కూలీలకు ఫేస్ యాప్ రద్దు చేయాలి
తణుకు అర్బన్: ఉపాధి హామీ పనుల్లో కొత్తగా తీసుకువచ్చిన ఫేస్యాప్ను తక్షణమే రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బళ్ళ చిన వీరభద్ర రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని తేతలి గ్రామం కొండయ్య పాలెం రోడ్డులో పని చేస్తున్న ఉపాధి కూలీలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వీరభద్ర రావు మాట్లాడుతూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఉపాధి పనులు చేస్తున్న కూలీలకు ముఖ గుర్తింపు హాజరు అమలు చేస్తున్న కారణంగా చాలా చోట్ల పని ప్రదేశాల్లో హాజరు నమోదు కాకపోవడంతో అత్యధిక మంది కూలీలు పని కోల్పోయి తిరిగి ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్పష్టం చేశారు. కూలీలు చేసిన పనికి ఇచ్చే నామమాత్రపు వేతనానికి రెండు పూటలా పని చేయాలని షరతులు విధించడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 20న విజయవాడ కమిషనర్ ఆఫీస్ వద్ద జరిగే ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.ద్వారకాతిరుమల: మండలంలోని తూర్ల లక్ష్మీపురం గ్రామంలో ఓ ఇంటి ప్రహరీ సందులో గంజాయి ప్యాకెట్లు దొరకడం కలకలాన్ని రేపింది. దీనిపై స్థానిక పోలీస్టేషన్లో గురువారం రాత్రి కేసు నమోదైంది. ఎస్సై టి.సుధీర్ తెలిపిన వివరాల ప్రకారం తూర్ల లక్ష్మీపురంలోని సెనగన శ్రీనివాసరావు ఇంటి వద్ద గంజాయి, మద్యం బాటిళ్లు ఉన్నాయని గుర్తు తెలియని వ్యక్తి 112కి కాల్ చేసి, సమాచారం ఇచ్చాడు. దీంతో ఎస్సై సుధీర్ సిబ్బందితో కలసి ఘటనా స్థలానికి చేరుకుని, శ్రీనివాసరావు ఇంటికి దక్షిణం వైపు ఉన్న ప్రహరీ సందులో ఒక సంచిలో రూ. 40 వేలు విలువ చేసే 40 గంజాయి చిన్న ప్యాకెట్లు (ఒక్కో ప్యాకెట్ బరువు 8 గ్రాములు, మొత్తం బరువు 320 గ్రాములు), అలాగే రూ.6,501 విలువైన 5 విస్కీ (180 ఎంఎల్) బాటిళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విచారణ జరిపారు. అయితే వీటి గురించి తనకేమీ తెలియదని, కావాలని అదే గ్రామానికి చెందిన సుంకర ఆంజనేయులు అనే వ్యక్తి పెట్టి ఉంటాడని శ్రీనివాసరావు అనుమానం వ్యక్తం చేశాడు. అనంతరం పోలీసులు గంజాయి, మద్యం బాటిళ్లను మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేశారు. -
గ్రీన్ఫీల్డ్ హైవేపై రోడ్డు ప్రమాదం
టి.నరసాపురం: గ్రీన్ఫీల్డ్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం గ్రీన్ఫీల్డ్ హైవేపై వెళ్తున్న లారీకి డీజిల్ అయిపోవడంతో మండలంలోని శ్రీరామవరం సమీపంలో అకస్మాత్తుగా ఆగిపోయింది. లారీ ఒక్కసారిగా ఆగిపోవడంతో వెనుక వేగంగా వస్తున్న లారీ ఆగిన లారీ వెనుక భాగంలో ఢీకొంది. ఆ వెనుకే వస్తున్న మరో లారీ ముందు లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో చివరిగా ఢీకొన్న లారీలోని డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం అటవీశాఖ లాగింగ్ రేంజ్ ఎఫ్ఎస్వో నాగ వాసునాయుడు అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను మరోసారి చాటారు. శుక్రవారం థాయ్లాండ్లో జరిగిన వరల్డ్ మాస్టర్స్ గేమ్స్ ఛాంపియన్షిప్లో 5 కిలోమీటర్ల రేస్ వాక్లో విజేతగా నిలిచారు. ఆయనకు అటవీ శాఖ అధికారులు, నాయకులు అభినందనలు తెలిపారు. కుక్కునూరు: ఇసుకను తీసుకెళుతున్న లారీల నుంచి ఇసుక రోడ్డుపై పడి వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాచారం గ్రామస్తులు శుక్రవారం ఇసుక లారీలను అడ్డుకున్నారు. శుక్రవారం ఉదయం నుంచి లారీల్లో ఇసుక రోడ్డుపై పడుతుందని, గ్రామాల్లో లారీలను నెమ్మదిగా నడపాలని గ్రామస్తులు లారీ డ్రైవర్లకు చెప్పినా వినకుండా వేగంగా నడపడంతో రోడ్డుపై ఇసుక పడి ద్విచక్ర వాహనదారులు ఇద్దరు ప్రమాదాలకు గురవడంతో ఆగ్రహించిన గ్రామస్తులు తమ రహదారి గుండా ఇసుక లారీలను నడవనివ్వమని అడ్డుకున్నారు. దీంతో లారీ యజమానులు ఈ సారి అటువంటి పొరబాటు జరగకుండా చూసుకుంటామని హామీ ఇవ్వడంతో లారీలను వదిలిపెట్టారు. ఉండి: తలనొప్పి తట్టుకోలేక ఓ మహిళ ఆత్యహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉండి గ్రామానికి చెందిన గోడి సురేఖ(29)కు సుమారు 15 ఏళ్లుగా మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతుంది. అయితే ఆసుపత్రిలో చూపించుకోకుండా ట్యాబ్లెట్స్ వేసుకుంటుంది.అయితే ఈ నెల 16న, గురువారం ఉదయం 11 గంటల సమయంలో తలనొప్పి విపరీతంగా రావడంతో దానిని తట్టుకోలేక మజ్జిగలో ఎలుకల మందు కలిపుకుని తాగింది. కొద్దిసేపటికి ఆమెకు కళ్లు తిరుగుతున్నట్లు ఉండడంతో పరిస్థితిని గమనించిన ఆమె భర్త ఆరా తీయగా తాను ఎలుకలమందు తాగినట్లు చెప్పింది. దీంతో హుటాహుటిన ఆమెను భీమవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అయితే మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం విజయవాడకు తరలించారు.అక్కడ చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం మృతి చెందిందిం. ఈ మేరకు మృతురాలి చెల్లెలు దిడ్ల రమ్య ఫిర్యాదుతో హెడ్ కానిస్టేబుల్ ఏసయ్య కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో స్వమిత్వ సర్వే పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి శుక్రవారం ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మండల సర్వేయర్లతో స్వమిత్వ, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, ఈ–కేవైసీ తదితర అంశాలపై మండలాల వారీగా ప్రగతిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇంకా పూర్తి చేయాల్సిన స్వమిత్వ సర్వే పనులను తక్షణమే ప్రారంభించి వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఎంపీడీఓలు క్షేత్రస్థాయిలో పనులను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. -
రెండు వేర్వేరు చోరీ కేసుల్లో ఇద్దరి అరెస్టు
జంగారెడ్డిగూడెం: రెండు వేర్వేరు చోరీ కేసుల్లో ఇద్దరిని అరెస్టు చేసినట్లు జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ తెలిపారు. జంగారెడ్డిగూడెం సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం ఆమె చోరీకి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ మండలంలోని కేతవరంలో ఓ ఇంట్లో జరిగిన చోరీకి సంబంధించి జంగారెడ్డిగూడెం పట్టణం వైఎస్సార్ కాలనీకి చెందిన ముగ్గళ్ల శ్రీనివాసరావు అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు చెప్పారు. అతన్ని నుంచి 102 గ్రాముల బంగారు వస్తువులు, రూ.12820 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడు ముగ్గళ్ల శ్రీనివాసరావుపై జంగారెడ్డిగూడెం, లక్కవరం, ద్వారకాతిరుమల పోలీస్స్టేషన్లలో 20 కేసులు ఉండగా, జంగారెడ్డిగూడెం స్టేషన్లో సస్పెక్ట్ షీట్ కూడా ఉందన్నారు. అలాగే మోటార్ సైకిల్చోరీ కేసులో మరో వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఆమె చెప్పారు. మండలంలోని మద్ది ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఈ నెల 14న పార్క్ చేసి ఉంచిన తన మోటార్సైకిల్ చోరీకి గురైంది. దీనిపై బాధిడుతు ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టామన్నారు. విచారణలో భాగంగా తెలంగాణ రాష్ట్రం సత్తుపల్లి గ్రామానికి చెందిన షేక్ రహీమ్ అనే వ్యక్తి చోరీ చేసినట్లు తేలిందన్నారు. ఇతను ప్రస్తుతం చింతలపూడిలో నివాసం ఉంటున్నట్లు ఏఎస్పీ తెలిపారు. నిందితుడు రహీమ్ను విచారించగా, 6 మోటార్సైకిళ్లు, ఒక ఆటో చోరీ చేసినట్లు తెలిపాడన్నారు. లక్కవరం, జంగారెడ్డిగూడెం, ద్వారకాతిరుమల, తడికలపూడి పోలీస్స్టేషన్ల పరిదిలో 4 మోటార్ సైకిళ్ల, తెలంగాణ రాష్ట్రం అశ్శారావుపేటలో ఒక మోటార్సైకిల్, భద్రాచలం ఒక ఆటోను రహీమ్ చోరీ చేశాడన్నారు. మొత్తం ఈ వాహనాలన్నీ నిందితుడి వద్ద నుంచి రికవరీ చేశామన్నారు. కాగా, నిందితుడు రహీమ్ ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురానికి చెందిన తిక్కిరెడ్డి శ్రీను వద్ద 3 మోటార్ సైకిళ్లు తాకట్టు పెట్టినట్లు తెలిపారు. దీంతో తాకట్టు పెట్టుకుని తిక్కిరెడ్డి శ్రీనుపై కూడా కేసు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు. సమావేశంలో జంగారెడ్డిగూడెం సీఐ ఎంవీ సుభాష్, జంగారెడ్డిగూడెం, లక్కవరం ఎస్సైలు ఎన్వీ ప్రసాద్, షేక్ జబీర్, సిబ్బంది పాల్గొన్నారు. అయితే ఈ రెండు కేసులను చేధించిన సీఐ, ఎస్సైలు, ఏఎస్సై ఎన్వీ సంపత్కుమార్, కానిస్టేబుళ్లు ఎన్.రమేష్, షేక్ షానుబాబు, బి.మంగారావు, కె.మహేష్లను అభినందించి వీరికి రివార్డు కోసం జిల్లా ఎస్పీకి సిఫార్సు చేసినట్లు తెలిపారు. -
నోట్ల కట్టల కలకలం
నరసాపురం: నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామంలో ఓ పాస్టర్ ఇంట్లో రూ.2,27,94,000 పోలీసులు స్వాధీనం చేసుకోవడం గోదావరి జిల్లాల్లో సంచలనంగా మారింది. కొద్దినెలల క్రితం వరకూ సాధారణ జీవితం గడిపిన పాస్టర్ గంటా జాన్ బాబూరావు ఒక్కసారిగా విలాసవంతమైన జీవితంలోకి మారడమే కాకుండా, పెద్ద సంఖ్యలో ఆస్తుల కొనుగోలు చేయడం, ఈ క్రమంలో ఆయన ఇంట్లో కోట్లలో నోట్ల కట్టలు లభ్యం కావడం హాట్టాపిక్గా మారింది. ఇంట్లో లభ్యమైన నగదుకు ఆధారాలు చూపని కారణంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నరసాపురం డీఎస్పీ సుధాకర్ నేతృత్వంలో రూరల్ సీఐ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో రెండు బృందాలు విస్తృతంగా దర్యాప్తు చేపట్టాయి. శుక్రవారం ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. జాన్ బాబూరావు నివాసంలో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. పలు దస్తావేజులు, ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఇటీవల బాబూరావు తనతో పాటు అతని అల్లుడు, కుమార్తె పేరుతో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్టుగా ఐటీ అధికారులు ప్రాథఽమికంగా గుర్తించారు. తమ వద్ద ఉన్న నగదుకు అన్ని ఆధారాలు ఉన్నట్టు పాస్టర్ కుమార్తె ఫోన్ ద్వారా ఐటీ అధికారులకు తెలిపినట్టు సమాచారం. లక్ష్మణేశ్వరం గ్రామానికి చెందిన జాన్బాబూరావు గ్రామంలో చిన్న చర్చి నడిపేవారు. ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్కు చెందిన వ్యక్తితో తన కుమార్తె వివాహం చేశారు. అప్పటి నుంచి పరిస్థితిలో మార్పు వచ్చిందని గ్రామస్తులు చెబుతున్నారు. -
అధ్యాపకుల చిల్లర వేషాలు
నూజివీడు: విద్యాబుద్ధులు నేర్పాల్సిన అధ్యాపకులు విద్యార్థినులతో అనుచితంగా ప్రవర్తించిన వ్యవహారంలో ప్రేమ కవితలు పంపడం తాజాగా బయటపడింది. నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థునులతో అనుచితంగా వ్యవహరించిన ముగ్గురు అధ్యాపకుల్లో ఓ అధ్యాపకుడు పీయూసీ విద్యార్థినికి వాట్సాప్లో పంపిన కవిత వెలుగుచూసింది. ఇలా ముగ్గురు అధ్యాపకులు పీయూసీకి చెందిన ముగ్గురు విద్యార్థునులతో నిర్వహించిన ప్రేమ కవితల పాఠాలు చూసి ప్రతిఒక్కరూ ముక్కున వేలేసుకుంటున్నారు. అందాన్ని పొగడటం, మార్కులు వేస్తామంటూ ప్రలోభపెట్టడం, ఆపై లొంగదీసుకోవడం.. ఇవీ ట్రిపుల్ఐటీ ఇంటర్నల్ కంప్లయింట్ కమిటీ (ఐసీసీ) నిర్వహించిన విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూసినట్టు సమాచారం. విచారణ నివేదిక సమర్పణ విద్యార్థినులపై అనుచితంగా వ్యవహరించిన ముగ్గురు అధ్యాపకులపై నియమించిన ఇంటర్నల్ కంప్లయింట్ కమిటీ విచారణ నిర్వహించి, తమ నివేదికను ఈనెల 15న ట్రిపుల్ఐటీ డైరెక్టర్ ఆచార్య ఎస్ఎస్ఎస్వీ గోపాలరాజు ద్వారా చాన్సలర్ ఆచార్య కొత్తా మధుమూర్తికి పంపారు. ఈ నివేదికను పరిశీలించిన అనంతరం ఆ ముగ్గురిపై చర్యలు తీసుకోనున్నారు. అయితే కమిటీ నిర్వహించిన విచారణలో అనేక విషయాలు కమిటీ దృష్టికి వచ్చినట్టు సమాచారం. తమకు లొంగిన విద్యార్థినులకు అనేక విధాలుగా ముగ్గురు అధ్యాపకులు సాయపడుతున్నట్టు తెలిసింది. ఐటీ మెంటార్, ఇంగ్లిష్, కెమిస్ట్రీ అధ్యాపకులుండగా విద్యార్థినులకు మార్కులు ఎక్కువ వేయడం, పరీక్షకు హాజరు కాకపోయినా మార్కులు వేసేవారని ప్రచారం సాగుతోంది. ఒక సెక్షన్ విద్యార్థులకు ఎక్కువ మార్కులు వస్తుండటంతో మరో సెక్షన్ విద్యార్థులు తమకు తక్కువ మార్కులు వేస్తున్నారని వారికి బోధించే అధ్యాపకులపై, మెంటార్లపై ఒత్తిడి చేసేవారు. బయటపడిందిలా.. పీయూసీకి బోధించే ఒక మెంటార్ తరగతి గదిలో విద్యార్థినులతో ఒంటరిగా జీవించే మహిళలపై, భర్త లేని మహిళలపై అసభ్యకరంగా మాట్లాడుతుండటంతో ఒక విద్యార్థిని తమ హాస్టల్ రూమ్ వద్దకు వచ్చిన డీఎస్డబ్ల్యూఓకు ఆ విషయాన్ని తెలియజేసింది. అంతేగాకుండా అదే రూమ్లో ఉండే తోటి విద్యార్థినితో చేస్తున్న వాట్సాప్ చాటింగ్ గురించి సైతం తెలిపింది. దీంతో డీఎస్డబ్ల్యూఓ, చీఫ్ వార్డెన్ (బాలికలు) కలిసి ఫోన్ను తీసుకుని పరిశీలించగా అనుచితంగా చేసిన చాటింగ్ బయటపడింది. దీంతో మరో ఇద్దరు విద్యార్థినులతో మరో ఇద్దరు అధ్యాపకులు సైతం ఇలాగే చాటింగ్ చేసిన వ్యవహారం వెలుగు చూసింది. దీంతో ఆ విద్యార్థినులు దీనిపై డైరెక్టర్కు ఫిర్యాదు చేయగా విచారణ కమిటీని నియమించారు. విచారణ కమిటీ మరింత లోతుగా విచారించడంతో అనేక విషయాలు వెలుగుచూశాయి. తమ బండారం బయటపడటంతో ఈ ముగ్గురు అధ్యాపకులు తమ కాంట్రాక్టు ఉద్యోగాలకు రాజీనామా చేసి క్యాంపస్ నుంచి వెళ్లిపోయారు. అలాగే ట్రిపుల్ఐటీ అధికారులు కూడా వారిని సస్పెండ్ చేశారు. ఈ ముగ్గురిలో ఒకరు నాలుగేళ్ల క్రితం హౌస్ కీపింగ్, సెక్యూరిటీ సిబ్బంది హాజరు నమోదులో అవకతవకలకు పాల్పడి ఆరు నెలల పాటు సస్పెండ్కు గురయ్యాడు. అయినా తన ప్రవర్తనలో మార్పు తెచ్చుకోకుండా ఇప్పుడు విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తించి దొరికిపోయాడు. ఈ పరిస్థితుల్లో ట్రిపుల్ఐటీ యాజమాన్యం ఏమి చర్యలు చేపడుతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రేమ కవితలతో విద్యార్థినులతో చాటింగ్ మార్కులు ఎక్కువ వేస్తూ ప్రలోభాలు నూజివీడు ట్రిపుల్ ఐటీలో ముగ్గురు అధ్యాపకుల నిర్వాకం -
ఆలయ గోపురాలు శుభ్రం
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయ గోపురాలపై మొలి చిన మొక్కల తొలగింపునకు అధికారులు శుక్రవారం చర్యలు చేపట్టారు. రావి, మర్రి మొక్కలతో ఆలయ రాజగోపురాలు కళావిహీనంగా దర్శనమిస్తున్నాయని, శిల్ప సంపద ధ్వంసం కావడానికి కారణం అవుతు న్నాయని సాక్షి దినపత్రికలో శుక్రవారం ‘మొక్క’వోని నిర్లక్ష్యం శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన అధికారులు గోపురాలపై ఉన్న మొక్కల తొలగింపు పనులు చేప ట్టారు. తొలిరోజు ఈ పనులు ముందుకు సాగలేదు. ప్రధాన(దక్షిణ) రాజగోపురానికి నిచ్చెన వేసుకుని మొక్కలు తొలగించడం సిబ్బందికి సాధ్యం కాకపోవడమే ఇందుకు కారణం. ఏలూరు (ఆర్ఆర్పేట): ఏపీఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో విద్యుత్ వినియోగ సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు విద్యుత్ ఖర్చులను తగ్గించేందుకు చర్యలపై పరిశ్రమలు, వాణిజ్య వినియోగదారులలో అవగాహన కల్పనకు ఈ నెల 18న రాజమహేంద్రవరంలో వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు ఈపీడీసీఎల్ ఏలూరు ఆపరేషన్ సర్కిల్ ఎస్ఈ పీ.సాల్మన్ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఐఐటీ మద్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటైన స్టార్టప్ సంస్థ ఎలిమెంట్స్ ఎనర్జీ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నామన్నారు. బుట్టాయగూడెం: మండలంలోని కొవ్వాడ ప్రాజెక్టులో మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. నేషనల్ హైవే నిర్మాణానికి అనుమతులు తీసుకున్నామని చెబున్నప్పటికీ కన్నాపురం, కొవ్వాడ, లక్ష్మీపురం గ్రామ సమీపంలోని పలు చోట్లకు మట్టి యథేచ్ఛగా టిప్పర్లతో తోలుతున్నారు. ఉన్నతాధికారులు మట్టి అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టి వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు. భారీ జేసీబీలను ఏర్పాటు చేసి యథేచ్ఛగా తవ్వకాలు జరుగుతున్నా కనీసం అటువైపు అధికారులు కన్నెత్తి చూడకపోవడం బాధాకరమని పలువురు విమర్శిస్తున్నారు. చింతలపూడి: మండల న్యాయ సేవ కమిటీ చైర్మన్, జూనియర్ సివిల్ జడ్జి సీహెచ్ మధుబాబు శుక్రవారం స్థానిక సబ్ జైలును సందర్శించారు. సబ్ జైలులో నిందితుల కేసు వివరాలు, అందిస్తున్న ఆహార పదార్థాలు, మంచినీటి సౌకర్యాలు, అనారోగ్యంగా ఉన్నవారికి అందించే వైద్య సదుపాయాలు తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఉచిత న్యాయ సహాయంపై ఆరా తీశారు. నిందితుల పట్ల జైలు సిబ్బంది బాధ్యతగా ఉండాలని ఈ సందర్భంగా సూచించారు. అనంతరం రికార్డులను పరిశీలించి, వంటశాల స్టోర్ రూంను తనిఖీ చేశారు. ఏలూరు(టూటౌన్): జిల్లాలో ఈ నెల 25న జరగనున్న పాలిటెక్నిక్ ప్రవేశపరీక్షకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. పాలిసెట్ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో శుక్రవారం కలెక్టరేట్ నుంచి అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఏలూరులో 9 కేంద్రాలు, నూజివీడులో 3, జంగారెడ్డిగూడెంలో 3 కేంద్రాలలో పరీక్షలకు 5,278 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. కేంద్రాల వద్ద పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. -
అభయారణ్యంలోనే పెద్దపులి
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామమైన చేగొండిపల్లి సమీపంలోని రిజర్వు అటవీ ప్రాంతంలోకి పెద్ద పులి చేరింది. కొత్తూరు, గుంజవరం, మెత్తాపుకోట, చేగొండిపల్లి గ్రామాల పరిధి లోని అభయారణ్య ప్రాంతంలో కదలికలు సాగిస్తోంది. గత ఐదు రోజులుగా పులి కదలికలపై ఎప్పటికప్పుడు ప్రత్యేక సిబ్బందితో నిఘా పెట్టి అడుగు జాడలను గుర్తిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పెద్దపులిని పట్టుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అటవీశాఖాధికారి ఎస్కే వలీ పేర్కొన్నారు. పులులు సంరక్షణ కేంద్రం నుంచి వచ్చిన సిబ్బందితో పాటు ట్రాన్క్విలైజర్ గన్మెన్లు, రెస్క్యూ బృందాలతో పాటు, ప్రాజెక్టు ప్రాంతంలో స్పెషల్ ఫోర్స్తో పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. పులికి అమర్చిన రేడియో ట్రాకర్ ద్వారా కదలికలను గుర్తిస్తున్నారు. శుక్రవారం ప్రాజెక్టు సమీప ప్రాంతంలో కనిపించినట్లు వచ్చిన సమాచారం మేరకు అటవీశాఖ ప్రత్యేక టాస్క్ఫోర్స్ సిబ్బందితో వెళ్లింది. ఒకవేళ మైదాన ప్రాంతానికి చేరుకుంటే పులిని పట్టుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. -
కేవీకే ఉత్పత్తులకు కేంద్రం పేటెంట్లు
తాడేపల్లిగూడెం: డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యానవన వర్శిటీ పరిధిలోని పశ్చిమగోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెంలోని కృషి విజ్ఞాన కేంద్రం ఉత్పత్తులు తేనెపట్టు, మైనం ఆధారిత ఉత్పత్తులకు ఉద్యాన కళాశాలకు కేంద్రం మూడు పేటెంట్లు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం పరిధిలోని ఇండియన్ పేటెంట్ ఆఫీసు మూడు పేటెంట్లు జారీ చేసింది. ఈ విషయాన్ని ఉద్యానవన వర్సిటీ వీసీ కె.ధనుంజయరావు శుక్రవారం స్థానిక విలేకరులకు తెలిపారు. వీఆర్గూడెం ఉద్యాన కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఎన్,ఇమ్మానుయేల్ ఆధ్వర్యంలో హర్టీకల్చర్ బీఎస్సీ చివరి సంవత్సరం విద్యార్థులు ఎక్స్పీరియెన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్లో భాగంగా తేనెపట్టు, మైనం ఆధారంగా రూపొందించిన తేనెపట్టు పెయిన్బామ్, తేనెపట్టు మైనం దోమల నివారణ క్రీమ్, తేనెపట్టు మైనం మాయిశ్చరైజింగ్ క్రీమ్ మూడు వినూత్న ఉత్పత్తులు ఈ పేటెంట్ సాధించాయి. కార్యక్రమంలో అసోసియేట్ డీన్ ఎన్బీవి.చలపతిరావు ,డీన్ ఆఫ్ హార్టీకల్చర్ డాక్టర్ ప్రసన్నకుమార్, వర్సిటీ రిజిస్ట్రార్ ఎం.మాధవి, పరిఽశోధనా సంచాలకులు ఎం.రామానందం తదితరులు పాల్గొన్నారు. -
చోరీ కేసుల్లో ఇద్దరి అరెస్టు
రెండు వేర్వేరు చోరీ కేసుల్లో ఇద్దరిని అరెస్టు చేసినట్లు జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ తెలిపారు. నిందితుల నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. 2లో uస్మార్ట్ కిచెన్ల పేరుతో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించ డాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెలలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నాం. ఈ నెల 24వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద, ఈ నెల 29వ తేదీన విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద ధర్నాలు నిర్వహిస్తాం. మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాన్ని రూ. 10 వేలకు పెంచాలి. ప్రతీ నెలా 5వ తేదీ లోపు వేతనాలు చెల్లించాలి. ఎం. నాగమణి, మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం జిల్లా కార్యదర్శి కూటమి ప్రభుత్వం అస్మదీయులకు దోచి పెట్టడానికే స్మార్ట్ కిచెన్ల వ్యవస్థను తీసుకువస్తోంది. గతంలో వంట ఏజన్సీలకు ఎలాంటి సౌకర్యాలూ కల్పించని ప్రభుత్వం ఇప్పుడు స్మార్ట్ కిచెన్లకు ప్రభుత్వ స్థలం ఇవ్వడంతో పాటు కిచెన్ల నిర్మాణానికి రూ.55 లక్షలు ఆర్థిక సహాయం చేస్తాననడం దేనికి సంకేతమో అందరికీ స్పష్టంగా తెలిసిపోతోంది. వెంటనే స్మార్ట్ కిచెన్ల ఆలోచనను విరమించుకోవాలి. పాతినవలస రాజేష్, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు -
కొల్లేరులో అక్రమ గట్లు
● చంద్రబాబు ప్రభుత్వంలో పెచ్చుమీరిన తవ్వకాలు ● అడ్డుకున్న అటవీ అధికారుల బదిలీ సాక్షి, టాస్క్ఫోర్స్: కొల్లేరుకు కూటమి పాలనలో తూట్లు పొడుస్తున్నారు. ముఖ్యంగా కై కలూరు నియోజకవర్గంలో తవ్వుకున్నోడికీ తవ్వుకున్నన్ని చెరువులు. ప్రభుత్వానికి సమాంతరంగా ఇక్కడ చట్టాలు మారిపోతున్నాయి. సుప్రీంకోర్టు నిబంధనులు కొల్లేరులో కలిపేస్తున్నారు. చేపల, రొయ్యల చెరువులు తవ్వాలంటే సవాలక్ష నిబంధనలు ఉన్నాయి. క్యూబిక్ మీటరు మట్టిని తీసినా ప్రభుత్వానికి సీనరేజ్ చెల్లించాలి. ఈ నియోజకవర్గంలో ఇవేమీ పనిచేయవు. ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నా డొంట్కేర్. కూటమి అధికారంలో కొల్లేరు అక్రమార్కులకు పంట పండింది. ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనకు వచ్చినప్పుడు, అటవీ ఉన్నతాధికారుల సమావేశంలో కొల్లేరు నియోజకవర్గాల నాయకులు ఇక్కడ ప్రజల తరఫున మాట్లాడటం, అటవీ అధికారులు కొల్లేరు ప్రజలను వేధిస్తున్నారని ఫిర్యాదులు చేయడం సర్వసాధారణంగా మారింది. ఆనక కొల్లేరులో ఆక్రమణలకు పచ్చజెండా ఊపేస్తున్నారు. ఇది తప్పని చెబుతున్న వారిపై కొల్లేరు ప్రజలతో మా కడుపులు కొడుతోన్నారని తిట్టడానికి రంగంలోకి దించుతున్నారు. మాట వినని అటవీ అధికారులను కొల్లేరు నుంచి పంపించేస్తున్నారు. చటాకాయలో అక్రమ తవ్వకాలు కొల్లేరు అభయారణ్యంలో అక్రమ చెరువుల సాగునకు అడ్డాగా పేరొందిన చటాకాయ గ్రామంలో సమీప భుజబలపట్నంకు చెందిన రైతులు డ్రెయిన్కు మరమ్మతులు చేస్తున్నారు. వాస్తవానికి మరమ్మతులకు కాగిత రూపంలో అనుమతులు లేవు. కొల్లేరులో 120 జీవో ప్రకారం అగ్గిపెట్టె తీసుకెళ్ళినా నేరమే. అలాంటిది డ్రెయిన్ల మరమ్మతుల పేరుతో పెద్దపెద్ద గట్లు వేస్తున్నారు. ఇదే అదునుగా చటాకాయ గ్రామస్తులు అక్రమ తవ్వకాలకు తెరలేపారు. అటవీ అధికారులకు ఈ పరిణామం పెద్ద తలనొప్పిగా మారింది. కొల్లేరులో పాత సీన్ రిపీట్ రాజకీయ నేతల అండతో కొల్లేరులో అక్రమాలు కొనసాగుతున్నాయి. రెండ్రోజులు సద్దుమణిగిన తర్వాత రాత్రి సమయంలో మిగిలిన పని పూర్తి చేసి అక్రమ సాగు చేసేస్తారు. అటవీ అధికారులు పనులు ఆపామని చెప్పుకోడానికి ముందు హడావుడి చేసి ఫొటోలు మీడియాకు పంపుతారు. ఇదే చటాకాయలో జరిగింది. జిల్లా అటవీశాఖ అధికారి శుక్రవారం వచ్చి అక్రమ బోదె పనులు పరిశీలించారు. చర్యలు మాత్రం అంతంతమాత్రమే. గట్లను కొంత తొలగిస్తామని చెబుతున్నారు. కొల్లేరు అభయారణ్యంలో ఇకపై అక్రమణలను చేయని వ్వం. చటాకాయలో పనులను నిలుపుదల చేశాం. నిబంధనలకు విరుద్ధంగా వేసిన గట్లును కొంత తొలగిస్తాం. పనులు జరగకుండా సిబ్బందితో గస్తీని ముమ్మరం చేస్తాం. – కె.రామలింగాచార్యులు, అటవీ శాఖ రేంజర్, కై కలూరు -
జాతరలో ఘర్షణ.. వృద్ధుడి మృతి
యలమంచిలి: ప్రశాంతంగా ఉండే గోదావరి తీరంలో కొందరి అల్లరిమూకలు మత్తు పదార్థాలు తీసుకుని చేసిన అల్లరి వల్ల దేవరపు వీరాస్వామి (75) అనే వృద్ధుడు మృతి చెందాడు. వివరాల ప్రకారం బూరుగుపల్లి గ్రామ దేవతలు బూరుగులమ్మ, మారెమ్మ, నూకాలమ్మ అమ్మవార్ల జాతర గురువారం రాత్రి చేశారు. ఈ జాతరలో ఇరు వర్గాల మధ్య తలెత్తిన వివాదం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన బోనం శ్రీరామకృష్ణ, బోనం గణేష్ల మధ్య వ్యక్తిగత వివాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గణేష్ భీమవరం ప్రాంతం నుంచి కొంతమంది రౌడీషీటర్లను తీసుకుని జాతరలో గొడవలు సృష్టించడానికి ప్రయత్నం చేశాడు. జాతర ప్రారంభమవుతున్న సమయంలో రోడ్డుపై కార్లు నిలపడంతో స్థానికులు కారులు తీయాలని కోరారు. కారులు తీయకపోగా మత్తు పదార్థాలు తీసుకుని కారు పైకి ఎక్కి కొంత సమయం హల్చల్ చేశారు. దీంతో ఎస్సై కర్ణీడి గుర్రయ్య, పోలీసులు రంగప్రవేశం చేసి కారు తీయాలని చెప్పిన పట్టించుకోలేదు. పోలీసులు అక్కడ ఉండగానే ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఆ సమయంలో కారు డ్రైవర్ పలివెల భరత్ కారును మితిమీరిన వేగంతో నడిపి దేవరపు వీరాస్వామి(75)ని ఢీ కొట్టాడు. దీంతో గాయపడిన వీరాస్వామిని దొడ్డిపట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. వాహనంపై రాళ్లు రువ్విన వైనం వీరాస్వామిని మెరుగైన చికిత్స కోసం పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా తాడిమెరక వద్ద ఆసుపత్రికి వెళ్తున్న వాహనంపై రాళ్లు మద్యం సీసాలతో మరొకసారి దాడి చేశారు. ఆఖరికి దాడి నుంచి తప్పించి వీరాస్వామిని పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతను మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడు వీరాస్వామికి భార్య, కుమార్తె ఉన్నారు. పోలీసుల సమక్షంలో రాళ్లతో రువ్వుకోవడం, కారుతో ఢీ కొట్టడం, ఆసుపత్రికి తరలిస్తున్న వాహనంపై కూడా దాడి చేయడం వంటి ఘటన పూర్తిగా పోలీసుల వైఫల్యం వల్లే అని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై బోనం గణేష్తో పాటు మరో 14 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ వీరిలో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పాలకొల్లు రూరల్ సీఐ గుత్తుల శ్రీనివాస్ తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్సై కర్ణీడి గుర్రయ్యపై సస్పెన్షన్ విధిస్తూ ఎస్పీ నయీం అస్మీ ఆదేశాలిచ్చినట్లు ఆయన వివరించారు. -
ఊపందుకోని దాళ్వా మాసూళ్లు
● మూడో పంటకు అవకాశం లేక రైతుల ఆందోళన ● జిల్లాలో 2.35 లక్షల ఎకరాల్లో దాళ్వా సాగు భీమవరం: ధాన్యాగారంగా పేరొందిన జిల్లాలో దాళ్వా మాసూళ్లు ఇంకా ఊపందుకోలేదు. దీంతో ప్రతి ఏటా మూడవ పంటగా వేసే పైరు పంటలు చేతికి వచ్చే అవకాశంలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయమే జీవనాధారమైన జిల్లాలోని 20 మండలాల్లో దాదాపు 2.35 లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తున్నారు. ప్రతిఏటా సార్వా, దాళ్వా వరి పంటతో పాటు దాళ్వా మాసూళ్లు అనంతరం మూడో పంటగా మినుము, పెసర, మొక్కజొన్న, నువ్వులు వంటి పంటలతోపాటు పశుగ్రాసంగా పిల్లిపెసర, జనుము వంటి పంటలను పండించేవారు. అయితే ఈ ఏడాది దాళ్వానాట్లు ఆలస్యం కావడంతో ఇప్పుడిప్పుడే మాసూళ్లు ప్రారంభమయ్యాయి. ఈ నెలాఖరుకుగానీ మాసూళ్లు ఊపందుకునే పరిస్థితి కన్పించడం లేదు. ఈనెల 20వ తేదిన కాలువలకు నీటి సరఫరా నిలుపుదల చేయనుండడంతో చేలల్లో పదునులేక పైరు, పశుగ్రాసం పంటలు వేసుకునే అవకాశం లేకుండా పోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 10 శాతమే వరి కోతలు పూర్తి జిల్లా వ్యాప్తంగా 2.35 ఎకరాల్లో రైతులు ఎక్కువగా ఎంటీయూ 1121, పీఆర్ 126 వంటి వరి రకాలను పండిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలోని తాడేపల్లిగూడెం, పెంటపాడు, తణుకు, గణపవరం ప్రాంతాల్లో పంట మాసూళ్లు ముమ్మరంగా సాగుతుండగా మిగిలిన ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే మాసూళ్లు ప్రారంభమయ్యాయి. ఎకరాకు 50 బస్తాల ధాన్యం దిగుబడి వస్తున్నందున జిల్లాలో సుమారు 9.5 లక్షట మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని దానిలో 7.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. మూడో పంటకు విరామం దాళ్వా వరి పంట పెట్టుబడులు పెరగడంతోపాటు రైతులకు ఎంతో కొంత ఆదాయం వచ్చే మూడో పంటకు అవకాశం లేకపోవడంతో దాళ్వాలో నష్టాలు తప్పవని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
కార్యకర్తలకు న్యాయ సహాయం చేయండి
కై కలూరు: వైఎస్సార్సీపీ కార్యకర్తలకు న్యాయ సహాయం అందించడానికి పార్టీ లీగల్ సెల్ సభ్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) సూచిం చారు. వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడిగా ఏలూరుకు చెందిన చెల్లె రాజేంద్రప్రసాద్ను పార్టీ అధిష్టానం నియమించింది. ఈ నేపధ్యంలో కై కలూరు పార్టీ కార్యాలయంలో డీఎన్నార్ను రాజేంద్రప్రసాద్ పార్టీ లీగల్ సెల్ న్యాయవాదులతో కలసి శుక్రవారం మర్వాదపూర్వకంగా కలిశారు. చంద్రబాబు ప్రభుత్వంలో కార్యకర్తలపై తప్పుడు కేసులను ఎదుర్కొడానికి అందరూ సిద్దంగా ఉంటూ, న్యాయ సహాయం అందించాలన్నారు. అనంతరం డీఎన్నార్ను న్యాయవాదులు సన్మానించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ న్యాయవాదులు బి.జగన్నాథరెడ్డి, ఆచంట వెంకటేశ్వరరావు, డి.రామాంజనేయులు, పీ.తంబి, ఓ.సుజాత, సౌజన్య, వాసుదేవరావు, మధు, సంధ్య పాల్గొన్నారు. -
మహిళల ఉపాధికి ఎసరు
అధ్యాపకుల చిల్లర వేషాలు నూజివీడు ట్రిపుల్ ఐటీలో అధ్యాపకులు విద్యార్థినులతో అనుచిత ప్రవర్తన చర్చనీయాంశంగా మారింది. విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. 2లో uశనివారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026ఏలూరు (ఆర్ఆర్పేట): వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రక్షాళన చేశారు. వారంలో ఆరు రోజులూ విభిన్న వంటకాలతో వడ్డించేలా గోరుముద్ద పథకాన్ని అమలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మధ్యాహ్న భోజన పథకాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంగా మార్చారు. అయితే డొక్కా సీతమ్మ పేరును చెడగొట్టేలా కూటమి ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్ పరం చేయడానికి అడుగులు వేస్తోంది. ఇంతవరకూ వంట ఏజన్సీలతో పథకాన్ని అమలు చేస్తూ ఉండగా ఇప్పుడు స్మార్ట్ కిచెన్ల పేరుతో వారి పొట్టకొట్టడానికి సిద్ధమైపోయిది. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఏక్తాశక్తి అనే సంస్థకు మధ్యాహ్న భోజన పథకాన్ని అప్పగించి విద్యార్థులకు భోజనం అందకుండా చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం కుట్ర పన్నింది. దీని కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యాశాఖాధికారుల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానించింది. 3,195 మంది కుక్, హెల్పర్ల ఉపాధికి గండి వేడివేడిగా విద్యార్థులకు పెట్టడానికి మధ్యాహ్న భోజన ఏజన్సీలు ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో డ్వాక్రా మహిళలకు ఈ పథకం ద్వారా ఉపాధి కల్పించారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 1,709 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన ఏజన్సీలు పని చేస్తున్నాయి. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడానికి మొత్తం 3,195 మంది కుక్, హెల్పర్లు పని చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి బిల్లులు ఆలస్యమైనా తమ సొంత డబ్బులతో వంటలు చేసి పిల్లలకు ఆకలి లేకుండా భోజనం అందించేవారు. గతంలో వారికి రూ.1000 గౌరవ వేతనంగా అందించేవారు. ఆ మొత్తం వారికి ఏమాత్రం సరిపోదని గ్రహించిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక్కొక్కరికీ రూ.3 వేలు చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు. 3195 మంది కుక్ హెల్పర్ల కుటుంబాలను రోడ్డున పడేసేలా కూటమి ప్రభుత్వం స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేయబోతోంది. 58 స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు.. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖాధికారులు జిల్లాలో 58 స్మార్ట్ కిచెన్లు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు. ఒక్కో మండలంలో రెండు స్మార్ట్ కిచెన్ల చొప్పున జిల్లాలోని 27 మండలాల్లో 58 స్మార్ట్ కిచెన్లు (పెద్ద మండలంలో 3 స్మార్ట్ కిచెన్లు) ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరిగిపోతున్నట్టు సమాచారం. ఈ స్మార్ట్ కిచెన్ల ద్వారానే వచ్చే విద్యా సంవత్సరంలో మధ్యాహ్న భోజనం పంపిణీ చేయబోతున్నారు. గతంలో విఫలమైన ఈ విధానాన్ని తిరిగి కూటమి ప్రభుత్వం తెరపైకి తీసుకురావడం కేవలం తమ సామాజికవర్గానికి చెందిన, అలాగే తమ పార్టీకి చెందిన వారికి ఆర్థిక ప్రయోజనం చేకూర్చడానికే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటీకరణ దిశగా మధ్యాహ్న భోజన పథకం జిల్లాలో 58 స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు 3,195 మంది కుక్, హెల్పర్ల ఉపాధికి ముప్పు వేడి వేడి భోజనానికి విద్యార్థులు దూరం ఇంతవరకూ తమ కళ్ళెదుటే వంట చేసి పెడితే వేడివేడిగా తినే విద్యార్థులకు స్మార్ట్ కిచెన్ల వ్యవస్థ అర్థాకలినే మిగల్చబోతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత విద్యా సంవత్సరం జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో రోజుకు సగటున 10,492 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తిన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేస్తే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని స్పష్టం చేస్తున్నారు. కేంద్రీకృత వంటశాలలు ఏర్పాటు చేసి అక్కడ చేసిన వంటలను మండలంలోని పాఠశాలలకు పంపుతారు. గతంలో ఇలానే ఏక్తాశక్తి అనే సంస్థకు వంటశాలలు ఏర్పాటు చేయడానికి అనుమతులిచ్చి వాటి ద్వారా మధ్యాహ్న భోజనం పంపిణీకి చేసిన ప్రయత్నం వికటించింది. విమర్శల కారణంగా ఏక్తాశక్తి సంస్థకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాల్సి వచ్చింది. అదే కోవలో స్మార్ట్ కిచెన్ల వ్యవస్థ సైతం విఫలమయ్యే అవకాశం ఉంటుందని విద్యారంగ నిపుణులు అబిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
ఉద్యోగులను ప్రభుత్వం పట్టించుకోవాలి
● పేరుకుపోయిన బకాయిలు తక్షణం చెల్లించాలి ● వైఎస్సార్సీపీ ఎంప్లాయీస్, పెన్షనర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి బోట్క్లబ్ (కాకినాడ సిటీ): తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు బకాయిలు పూర్తిగా చెల్లిస్తామన్న హామీని చంద్రబాబు ప్రభుత్వం గాలిలో కలిపేసిందని వైఎస్సార్సీపీ ఎంప్లాయీస్, పెన్షనర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నల్లమర్రు చంద్రశేఖర్రెడ్డి మండిపడ్డారు. కాకినాడ వైఎస్సార్ సీపీ కార్యాలయంలో వైఎస్సార్ సీపీ ఎంప్లాయీస్, పెన్షనర్స్ విభాగం రీజనల్ సమావేశం శుక్రవారం నిర్వహించారు. బకాయిలు ఏటా కొండలా పేరుకుపోతున్నాయని, రూ.30 వేల కోట్లకు రూ.7,900 కోట్లు మాత్రమే ఇచ్చారని, అవికూడా పూర్తిస్థాయిలో చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులు ప్రయోజనాలు అందక వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. పెండింగ్ డీఏలు ఎప్పుడిస్తారు? చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు డీఏలు పెండింగ్ పెట్టిందని, అవి ఎప్పుడు ఇస్తుందో చెప్పాలని చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. కార్పొరేట్ ఆస్పత్రులకు బకాయిలు పేరుకుపోవడంతో హెల్త్కార్డులు నిరుపయోగంగా మారిపోయాయన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగులతో వెట్టి చాకిరీ చేయించడం వల్ల సుమారు 250 మంది వరకు చనిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. పదవీ విరమణ చేసిన అధికారిని అదే శాఖలో అదే పోస్టులో ఉంచడం వల్ల చాలా మంది ఉద్యోగుల పదోన్నతులు నిలిచిపోతున్నాయన్నారు. ఒకటో తేదీన ఎప్పుడైనా జీతం ఇచ్చావా..? ఉద్యోగులుకు, పెన్షనర్స్కు ఒకటో తేదీన జీతాలు ఇస్తానని చెప్పిన చంద్రబాబు ఈ 22 నెలల్లో ఎవరికై నా ఒకటో తేదీన జీతం ఇచ్చారా అని నిలదీశారు. వెంటనే పీఆర్సీ కమిషన్ వేయాలని, ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ ఇవ్వాలన్నారు. సీపీఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చి ఈ దశగా ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదన్నారు. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు అమలు చేయాలన్నారు. పెన్షన్ కార్పొరేషన్ ఊసే లేదన్నారు. జగన్మోహన్రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవడమే లక్ష్యంగా అందరూ పనిచేయాలని పార్టీ నాయకులను ఆయన కోరారు. వైఎస్సార్ సీపీ ఎంప్లాయీస్, పెన్షనర్స్ విభాగం రాష్ట్ర సెక్రటరీ శివారెడ్డి, జాయింట్ సెక్రటరీ చిలకమర్తి సాయి ప్రసాద్, ఉభయగోదావరి జిల్లాల కో–ఆర్డినేటర్ లావణ్య పాల్గొన్నారు. -
శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.70 కోట్లు
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయ హుండీల నగదు లెక్కింపు గురువారం స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో, ఏలూరు జిల్లా దేవాదాయశాఖ అధికారి కె.శ్రీనివాసు పర్యవేక్షణలో నిర్వహించారు. గడచిన 17 రోజులకు గాను నగదు రూపేణా రూ. 1,70,80,167 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ వై.భద్రాజీ తెలిపారు. అలాగే కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 116 గ్రాముల బంగారం, 2.135 కేజీల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. అదేవిధంగా లెక్కింపులోకి రాని రద్దయిన పాత రూ. 2,000, రూ.500 నోట్ల ద్వారా రూ.3,500 లభించినట్టు చెప్పారు. ఇదిలా ఉంటే హుండీల ఆదాయాన్ని పరిశీలిస్తే సగటున రోజుకి శ్రీవారికి రూ.10,04,716 ఆదాయం వచ్చినట్టు ఈఓ పేర్కొన్నారు. ఈ లెక్కింపులో శ్రీవారి దేవస్థానం అధికారులు, సిబ్బంది, సేవాదళం సభ్యులు పాల్గొన్నారు. -
సీనియర్లకు ఉద్వాసన
తోటకు తీవ్ర అవమానం సాక్షి ప్రతినిధి, ఏలూరు: టీడీపీ కమిటీలో సీనియర్లకు ఉద్వాసన పలికారు. తమ్ముళ్లూ.. మీ సేవలు ఇక చాలు.. సర్దుకోండని పొమ్మనకుండా పొగపెట్టారు. రాష్ట్ర స్థాయి పదవుల్లో పనిచేసిన నేతలకు సైతం చంద్రబాబు షాక్ ఇచ్చారు. పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోసిన కార్యకర్తలను పక్కనపెట్టి కరెన్సీ, పరపతి బలంగా ఉన్న నేతలకు పదవులు కట్టబెట్టడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ పర్యాయం మరీ ముఖ్యంగా రాజ్యసభ సభ్యురాలు, పొలిట్ బ్యూరో సభ్యురాలుగా పనిచేసిన తోట సీతారామలక్ష్మిని పూర్తిగా పక్కన పెట్టడం, ఏలూరు జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేనిని సైడ్ చేయడం ఇలా కీలక నేతలందరిని పక్కకు సర్దేయడంపై అసమ్మతి స్వరం రేగింది. కీలక నేతలకు దక్కని పదవులు టీడీపీ జాతీయ, రాష్ట్ర స్థాయి కమిటీల్లో జిల్లాలో కీలక నేతలకు పార్టీ పదవులు దక్కలేదు. సామాజిక కోణంలో కరెన్సీ లాబీయింగ్ చేసే కొందరు నేతలకు, అలాగే నియోజకవర్గాల్లో పెద్ద పరిచయాలు లేకుండా పార్టీ కార్యాలయాల్లోనే మకాం వేసే నేతలకు పదవులు దక్కాయి. మళ్లీ యథావిధిగా యూజ్ అండ్ త్రో అనే పాలసీ ప్రకారమే పార్టీలో పదవుల పంపిణీ జరిగిందనే ప్రచారం తెరలేచింది. ఉమ్మడి పశ్చిమలో ఏలూరు, ఉంగుటూరు నియోజకవర్గాల్లో సిఫార్సులకు నామమాత్రపు ప్రాధాన్యత లేకపోవడం, జిల్లాలో బడా నేతలుగా హడావిడి చేస్తూ పార్టీలో పదవులు పొందే విషయంలో కొందరికి పరపతి లేకపోవడం హాట్టాఫిక్ మారింది. సామాజిక కోణంలో అన్ని వర్గాలను కలుపుకుని పదవులు ఇచ్చామని ప్రకటించుకున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తి భిన్నం. ఇక టీడీపీలో సర్వం తామే అంటూ నిత్యం వివాదాల్లో ఉండే ఎమ్మెల్యేలను అసలు పట్టించుకోకపోవడం విశేషం. ఇక ఎవరూ ఊహించని రీతిలో జిల్లాకు చెందిన కొందరు జాతీయ కమిటీలో పదవులు పొందడంపై సదరు నేతలు కూడా అవాక్కవడం గమనార్హం. ఇక అధికార పార్టీలో మరో చర్చ కొనసాగుతోంది. నూజివీడు టిక్కెట్ ఆశించి భంగపడ్డ ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ, అన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేసి యథావిధిగా హ్యాండ్ ఇచ్చారు. చివరికి జాతీయ ఉపాధ్యక్షుడిగా పార్టీ పదవి ఇచ్చామంటూ కొత్త కలరింగ్తో హడావిడి చేస్తున్నారు. మాజీ మంత్రి పీతల సుజాతకు సామాజిక కోణంలో భీమవరం కోటా నుంచి జాతీయ ఉపాధ్యక్ష పదవి దక్కింది. అలాగే టీడీపీలో మొదటిసారి గెలిచిన జూనియర్ ఎమ్మెల్యే మద్దిపాటికి రీజనల్ కోఆర్డినేటర్ను సామాజిక కోణంలో కట్టబెట్టారు. ఉమ్మడి పశ్చిమ నుంచి పొలిట్ బ్యూరోలో నిమ్మల రామానాయుడు, మహహ్మద్ షరీఫ్, మంతెన రామరాజు, పితాని సత్యనారాయణలకు చోటు దక్కింది. తెలుగు తమ్ముళ్లకు ఝలక్ సీనియర్లూ.. ఇక సర్దుకోండి భీమవరంలో తోట సీతారామలక్ష్మి, దెందులూరులో చింతమనేనికి మొండిచేయి ఎంపీ పుట్టా సిఫార్సులూ.. బుట్టదాఖలే ఎన్నికల వరకే సామాజిక కోణంలో పదవుల పంపిణీ టీడీపీలో కొనసాగుతున్న యూజ్ అండ్ త్రో పాలసీ ఏలూరు, ఉంగుటూరు నియోజకవర్గ నేతలకు దక్కని పదవులు టీడీపీ కమిటీపై సర్వత్రా విమర్శల వెల్లువ మాజీ ఎంపీ, పొలిట్బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మిని పూర్తిగా పక్కన పెట్టారు. జాతీయ కమిటీ మొదలుకొని రాష్ట్ర స్థాయి కమిటీ వరకు దేనిలోనూ ప్రాధాన్యం దక్కలేదు. భీమవరం కేంద్రంగా సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో కొనసాగుతూ కాపు సామాజిక కోణంలో ఆమె బలమైన నేతగా పశ్చిమలో ఉన్నారు. మున్సిపల్ చైర్మన్గా ప్రస్తానం ప్రారంభించి ఎంపీ వరకు పనిచేసి ప్రస్తుతం ఏ పదవి లేకుండా మిగిలిపోయారు. ఇక నర్సాపురంలోనూ ఇదే పరిస్థితి. మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్న బండారు మాధవనాయుడు, రామరాజుకు పూర్తిగా మొండిచెయ్యి చూపారు. అలాగే ఏలూరు జిల్లాలో 4 వ సారి గెలిచిన చింతమనేనికి రాష్ట్ర కమిటీలో చిన్నపాటి పదవి కూడా పేరు పరిగణనలోనికి తీసుకోకపోవడం జిల్లాలో చర్చగా మారింది. అలాగే పాలకొల్లు నుంచి రెండుసార్లు ఎమ్మెల్సీగా పార్టీలో సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్న అంగర రామ్మోహన్కు గతంలో ఇరిగేషన్ బోర్డు సభ్యుడిగా పదవిని ప్రకటించిన నేపథ్యంలో బహిరంగ లేఖ ద్వారా తాను ఈ పదవి తీసుకోలేనని తన స్థాయికి తగిన పదవి కాదంటూ చంద్రబాబుకు లేఖ రాశారు. మళ్లీ యథావిధిగా రాష్ట్ర కమిటీలో అంగర రామ్మోహనరావును అవమానించి 59 మంది రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శుల్లో ఒకరిగా నియమించారు. ఇక ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులుకు మొండిచెయ్యి చూపారు. నిత్యం పార్టీ కండువా వేసుకుని తిరిగే గన్నిని పార్టీ పట్టించుకోకపోవడం విశేషం. అలాగే ఏలూరు నియోజకవర్గంలో ఏ ఒక్కరికీ పదవి దక్కలేదు. ఏలూరు ఎమ్మెల్యే ప్రతిపాదనలను కనీసం పట్టించుకోలేదని చర్చ సాగుతోంది. ఇక అంతా తానే అన్నట్లు నిన్న, మొన్నటి వరకు హడావిడి చేసిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ కేసులో అడ్డంగా బుకై ్క నియోజకవర్గంలో తలెత్తుకు తిరిగే పరిస్థితి లేకపోవడంతో ఏలూరుకు పూర్తిగా దూరంగా ఉన్నారు. అయితే కొద్ది నెలల ముందే పదవులకు సంబంధించి ఎంపీ కొన్ని సిఫార్సులు చేశారని వాటన్నింటిని బుట్టదాఖలు చేసినట్లు సమాచారం. -
పులి పయనం అటా..? ఇటా..?
నంది వాహనంపై ఊరేగిన శివయ్య ద్వారకాతిరుమల: మాసశివరాత్రి పురస్కరించుకుని క్షేత్రపాలకుడు శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారు గురువారం నంది వాహనంపై క్షేత్ర పురవీధుల్లో ఊరేగారు. పోలవరం రూరల్: పెద్ద పులి సంచారం పోలవరం మండలంలో కొనసాగుతోంది. తూర్పుగోదావరి జిల్లా నుంచి ఏలూరు జిల్లాలోకి ప్రవేశించిన పులి తిరిగి అదే ప్రాంతంలో సంచరిస్తోంది. మరలా గోదావరి నది దాటి తూర్పుగోదావరి జిల్లాకు చేరుకుంటుందేమోనని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం పోలవరం మండలంలోని కోండ్రుకోట పంచాయతీ పరిధిలోని కొత్తూరు గ్రామ సమీపంలో ముంపు గ్రామాల్లో సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. గత ఐదు రోజులుగా పోలవరం మండలంలో వివిధ ప్రాంతాల్లోని అభయారణ్య ప్రాంతాల్లో సంచరించింది. ఒక దూడపై దాడి చేసిన సంఘటన కూడా చోటు చేసుకుంది. అయితే ఇది ఎటువైపు నుంచి వచ్చిందో అటువైపు తిరిగి ప్రయాణం సాగించే పరిస్థితి ఉన్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. పులికి అమర్చిన రేడియో ప్రీక్వెన్సీ ట్రాకర్ ద్వారా అటవీశాఖ అధికారులు ఎప్పటికప్పుడు పులి అడుగుజాడలను గుర్తిస్తున్నారు. దీనిపై పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే పులి గురువారం నాటికి గోదావరి నదీ తీరంలోని కొత్తూరు ప్రాంతానికి చేరుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. తిరిగి గోదావరి నది దాటి వెళ్లే పరిస్థితి ఉందా? లేదా? మరలా వెనక్కి వస్తుందా అనేది తెలియని పరిస్థితులు ఉన్నాయని అటవీశాఖాధికారులు చెబుతున్నారు. పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్ట్లో కేంద్ర మట్టి, పదార్థాల పరిశోధనా సంస్థ(సీఎస్ఎంఆర్ఎస్) బృందం గురువారం రెండో రోజు పరీక్షలు నిర్వహించింది. బృంద సభ్యులు లలిత్కుమార్ సోలంకి, హనుమాన్ ప్రసాద్ మీనా పోలవరం ప్రాజెక్ట్లో రాతి కట్టడాలను, వాటి నిర్మాణానికి వినియోగిస్తున్న కాంక్రీట్ను పరిశీలించారు. జీహిల్లో జరుగుతున్న గ్రౌటింగ్ను తనిఖీ చేశారు. అక్కడ వినియోగిస్తున్న కాంక్రీట్ పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు. జలవనరుల శాఖ ఈఈ డి.శ్రీనివాస్, ఎంఈఐఎల్ జీఎం గంగాధర్, డీజీఎం మురళి పమ్మి, నాణ్యతా విభాగం డీజీఎం శంకరయ్య శాస్త్రవేత్తలకు వివరాలు అందించారు. -
శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.70 కోట్లు
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయ హుండీల నగదు లెక్కింపు గురువారం స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో, ఏలూరు జిల్లా దేవాదాయశాఖ అధికారి కె.శ్రీనివాసు పర్యవేక్షణలో నిర్వహించారు. గడచిన 17 రోజులకు గాను నగదు రూపేణా రూ. 1,70,80,167 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ వై.భద్రాజీ తెలిపారు. అలాగే కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 116 గ్రాముల బంగారం, 2.135 కేజీల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. అదేవిధంగా లెక్కింపులోకి రాని రద్దయిన పాత రూ. 2,000, రూ.500 నోట్ల ద్వారా రూ.3,500 లభించినట్టు చెప్పారు. ఇదిలా ఉంటే హుండీల ఆదాయాన్ని పరిశీలిస్తే సగటున రోజుకి శ్రీవారికి రూ.10,04,716 ఆదాయం వచ్చినట్టు ఈఓ పేర్కొన్నారు. ఈ లెక్కింపులో శ్రీవారి దేవస్థానం అధికారులు, సిబ్బంది, సేవాదళం సభ్యులు పాల్గొన్నారు. -
బిడ్డ కోసం.. ‘తల్లి’డిల్లే హృదయం
సాక్షి టాస్క్ఫోర్స్: బిడ్డ కోసం ఓ కన్నతల్లి కంటి నిండా ఒత్తులతో ఎదురుచూస్తోంది. కన్నపేగు కనిపించక గర్భశోకాన్ని అనుభవిస్తోంది. ఏ చిన్న అలికిడి వినిపించినా తీసుకొచ్చారా.. నా బాబూను అంటూ కన్నీళ్లతో దేవులాడుతోంది. బుడిబుడి అడుగులతో చలాకీగా ఇంటి బయట ఆడుకుంటున్న రెండున్నరేళ్ల ఆకేటి మోక్షిత్ కనిపించకుండా పోయి మూడు నెలలు కావస్తోంది. ముదినేపల్లి మండలం శ్రీహరిపురంలో మోక్షిత్ మిస్సింగ్ కేసు పోలీసు వ్యవస్థకు సవాల్ విసురుతోంది. సాంక్షేతిక పరిజ్ఞానంతో పెద్ద కేసులను ఇట్టే పట్టేసుకుంటున్న పోలీసులకు కనీసం చిన్న ‘క్లూ’ కూడా మోక్షిత్ కేసులో లభించలేదు. ముద్దుముద్దు మాటలతో ముచ్చట గొలిపే ఆకేటి మోక్షిత్ ఆటలాడుకుంటూ ఈ ఏడాది జనవరి 20న శ్రీహరిపురం ఇంటి బయట కనిపించలేదు. తల్లి శిరీష వెంటనే ముదినేపల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ముందుగా ఇంటి వద్ద పెద్ద కాల్వలో పడి కొట్టుకుపోయాడనే అనుమానాలు పెరిగాయి. ఇదే కాల్వలో కొద్ది రోజులు ముందు ఓ వృద్ధుడు కొట్టుకుపోయి మరణించాడు. పోలీసులు, బంధువులు కాల్వ లాకులు దింపు మరీ జల్లిడ పట్టినా బాబు జాడ లేదు. పోలీసులు సమీపంలో సీసీ కెమెరాలను పరిశీలించినా మోక్షిత్ అనవాళ్లు కనిపించలేదు. స్థానిక ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) బాధితురాలిని పరామర్శించి జిల్లా ఎస్పీతో మాట్లాడారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, డీఎస్పీలు స్వయంగా వచ్చి విచారణ చేశారు. అయినా ఇంకా మిస్టరీ వీడలేదు. భర్తను కోల్పోయి.. బిడ్డను పోగొట్టుకుని.. బిడ్డను పోగొట్టుకున్న తల్లి శిరీష దీనాగాథ మనసును కలిచివేస్తోంది. వరసుకు మేనత్త కుమారుడు కానుకొల్లుకు చెందిన అకేటి శ్రీహరితో 2020లో ముదినేపల్లి మండలం శ్రీహరిపురం గ్రామానికి చెందిన శిరీషకు వివాహం జరిగింది. వీరికి ఆకాష్ (5), మోక్షిత్ (రెండున్నర) సంతానం. భర్త శ్రీహరి ఆక్వా చెరువుల సాగు చేసేవాడు. అన్యోన్యంగా సాగుతున్న ఆ కుటుంబంలో పెద్ద విషాదం చోటుచేసుకుంది. గతేడాది జూన్ 21న పేయ్యేరు సమీప కానుకొల్లు రోడ్డులో ఆగివున్న లారీని ఢీకొట్టి శిరీష భర్త శ్రీహరి మృతి చెందాడు. పిల్లలతో శిరీష పుట్టిళ్లు శ్రీహరిపురంలో ఉంటుంది. భర్త చనిపోయిన దాదాపు 7 నెలలకే చిన్న కుమారుడు మోక్షిత్ మిస్సింగ్ కేసుగా మారాడు. అటు భర్త పోయి పుట్టెడు దుఖఃంతో పాటు కన్న బిడ్డ కనిపించకపోవడంతో ఆ మాతృమూర్తి తల్లిడిల్లిపోతుంది. పెద్ద కుమారుడు చదువు సైతం ప్రశ్నార్థకంగా మారింది. అనుమానాలు ఆజ్యం పోసిన పసిపిల్లల విక్రయాలు కేసు మోక్షిత్ మిస్సింగ్ కేసు దుమారం రేపుతోంటే ముదినేపల్లి మండలంలో పసిపిల్లల విక్రయాలు కేసు పలు అనుమానాలకు అజ్యం పోసింది. నియోజకవర్గంలో అన్నవరం, కానుకొల్లు, మండవల్లి వంటి ప్రాంతాల్లో ఐదుగురు పిల్లల విక్రయాలు జరిగాయని 9 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఈడేపల్లికి చెందిన అబ్బిశెట్టి వీరాకుమారి(వీరమ్మ)ను ఏ–1 ముద్దాయిగా చేర్చారు. ఆమె ఓ రాజకీయ నేత తల్లికావడంతో ఇది పెద్ద చర్చకు దారితీసింది. ఇదిలా ఉంటే పిల్లల విక్రయాల్లో పలు పర్యాయాలు జైలు జీవితం అనుభవించిన విజయవాడకు చెందిన ఫరానాతో ఈ ప్రాంతంలో కొందరికి సంబంధాలు ఉన్నాయి. అయితే పోలీసులు మాత్రం పిల్లల విక్రయాలకు మోక్షిత్ కేసునకు సంబంధం లేదంటున్నారు. మరొపక్క మోక్షిత్ జాడ చూపించాలని శ్రీహరిపురం గ్రామస్తులు రోడ్లుపై ఆందోళనలు సైతం చేస్తున్నారు. మిస్టరీగా మారిన శ్రీహరిపురం చిన్నారి మోక్షిత్ మిస్సింగ్ కేసు మూడు నెలలు కావస్తున్నా పురోగతి నిల్ ఆగ్రహం కట్టలు తెంచుకుని గ్రామస్తుల నిరసన ముదినేపల్లి పిల్లల మిస్సింగ్ కేసుతో పెరిగిన అనుమానాలుబిడ్డను పోగొట్టుకున్నాను. దాదాపు మూడు నెలలు కావస్తోంది. మోక్షిత్ జ్ఞాపకాలు కలిచివేస్తున్నాయి. ముదినేపల్లి పోలీసుల శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. నా బిడ్డను నాకు అప్పగించండి. మాకు ఎవరితోనూ విభేదాలు లేవు. ఒక తల్లి పడే ఆవేదన అర్థం చేసుకుని నా బిడ్డను నా చెంతకు చేర్చండి. –ఆకేటి శిరీష, మోక్షిత్ తల్లి, శ్రీహరిపురం మోక్షిత్ తల్లి ఫిర్యాదు చేసినప్పటి నుంచి బాలుడి ఆచూకీ కోసం పోలీసు వ్యవస్థ మొత్తం నూరుశాతం ప్రయత్నాలు చేస్తోంది. బిడ్డ కనిపించని రోజున పెద్ద కాల్వలో నీటి ప్రవాహం అధికంగా ఉంది. దీంతో కాల్వలో గాలించాం. ఈ కేసులో ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అన్ని కోణాల నుంచి కేసును దర్యాప్తు చేస్తున్నాం. – వీరభద్రరావు, ఎస్సై, ముదినేపల్లి. -
విద్యావికాస్ ప్రభంజనం
జంగారెడ్డిగూడెం: ఇంటర్ ఫలితాల్లో జంగారెడ్డిగూడెం విద్యావికాస్ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సాధించినట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది. ప్రథమ సంవత్సరం ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు కె.సాయి లక్ష్మి, యు.తౌషిక్, సీహెచ్ తేజశ్రీ 466 మార్కులు సాధించినట్లు చెప్పారు. 460 మార్కులకు పైబడి 50మంది సాధించారన్నారు. అలాగే బైపీసీ విభాగంలో 455 మార్కులకు ఎం.కేతన్శ్రీనాగ్, ఎ.లక్ష్మీ సత్యసాయిరిషిత్ 450 మార్కులు సాధించారని, 400 మార్కులకు పైబడి 60 మంది సత్తాచాటారన్నారు. ద్వితీయ సంవత్సరంలో 1000 మార్కులకు గాను పి.మాలిని 991 మార్కులు సాధించి రికార్డు సృష్టించినట్లు చెప్పారు. 900కు పైబడి ఎంపీసీ విభాగంలో 147 మంది, బైపీసీలో 26 మంది సాధించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా విద్యావికాస్ యాజమాన్యం పి.సతీష్చంద్, వి.శ్రీనివాస్, వి.ప్రసన్నలక్ష్మి, పి.లక్ష్మీప్రసన్న, అధ్యాపకులు విద్యార్థులను అభినందించారు. -
వెంకటేశ్వర విద్యార్థుల ప్రతిభ
జంగారెడ్డిగూడెం: ఇంటర్ ఫలితాల్లో జంగారెడ్డిగూడెం శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించినట్లు కళాశాల యాజమాన్యం ఎస్.సత్యనారాయణ, కె.నాగేశ్వరరావు, జి.శ్రీధర్ తెలిపారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు ఈహెచ్ హరిణి 466 మార్కులు, పి.యశస్విని, ఎన్.దీపిక 465 మార్కులు సాధించినట్లు చెప్పారు. బైపీసీ విభాగంలో 455 మార్కులకు కె.సుశ్రిత 449 మార్కులు సాధించిందన్నారు. సీనియర్ ఇంటర్లో 1000 మార్కులకు గాను ఎంపీసీలో ఎన్.జ్యోతిక 990 మార్కులు, బైపీసీలో పి.లాస్య 988 మార్కులు సాధించారన్నారు. ఈ సందర్భంగా కళాశాలలో అభినందన సభ ఏర్పాటు చేసి విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
వంక నాగమణి జీవితం ఆదర్శనీయం
● మాజీ మంత్రి అంబటి రాంబాబు ● తణుకులో నాగమణి సంస్మరణ సభ తణుకు అర్బన్: మాజీ ఎమ్మెల్యే వంక సత్యనారాయణ సతీమణి వంక నాగమణి జీవితం ఆదర్శనీయమని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తణుకు కమ్మ కల్యాణ మండపంలో బుధవారం నిర్వహించిన వంక నాగమణి సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. సీపీఐ తరపున స్వాతంత్య్ర పోరాటం నుంచి ఇతర ఉద్యమాల్లో భర్త సత్యనారాయణ అకుంఠిత దీక్ష వెనుక మహిళా శక్తి రూపంలో నాగమణి ప్రోత్సాహం ఎంతో ఉందన్నారు. కుటుంబ వ్యవస్థను మంచి క్రమశిక్షణతో నడుపుతూ తల్లిగా పిల్లలను ఉన్నత స్థానాలకు చేర్చేందుకు ఆమె వ్యవహరించిన తీరు అజరామరమన్నారు. కమ్యూనిస్టు సిద్ధాంతాలతో.. కమ్యూనిస్టు సిద్ధాంతం పట్ల అంకిత భావం, కుటుంబ బాధ్యతలను సమన్వయం చేసుకున్న వంక నాగమణి జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె.నారాయణ అన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు అధ్యక్షతన నిర్వహించిన సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. 1948లో బెజవాడలో జరిగిన శిక్షణ తరగతుల్లో పోలీసుల లాఠీచార్జీని ఎదుర్కొని అరెస్టు అయ్యారని ప్రస్తుత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మహిళా సమాఖ్యను బలోపేతం చేయడంలో ఆమె పాత్ర చిరస్మరణీయమని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ మాట్లాడుతూ మా అమ్మ నేర్పిన క్రమశిక్షణే మా ఉన్నతికి మార్గదర్శకమని అన్నారు. ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే వంక సత్యనారాయణ, వంక నాగమణి దంపతులు సమాజానికి ఎంతో సేవచేశారని వారి పేరుమీద తణుకులో పార్కు నిర్మాణం చేసి వారి విగ్రహాలను నెలకొల్పుతానని స్పష్టం చేశారు. సభకు హాజరైన మాజీ మంత్రి చెరకువాడ శ్రీరంగనాథరాజు, భీమవరం వైఎస్సార్సీపీ ఇన్చార్జి చినిమిల్లి వెంకటరాయుడు, వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు చీర్ల రాధయ్య, భీమవరం పట్టణ అద్యక్షుడు గాదిరాజు రామరాజు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్, సీపీఐ నేతలు ముప్పాళ్ల నాగేశ్వరరావు, అక్కినేని వనజ, పెన్మెత్స దుర్గా భవాని, డేగా ప్రభాకర్, దారిదీపం సంపాదకులు డీవీవీఎస్ వర్మ, సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలన్, వంక రవీంద్రనాథ్, వంక రాజకుమారి, వంక రామదాసు, వంక మోహన్, కుటుంబసభ్యులు నాగమణి చిత్రపటం వద్ద నివాళులర్పించారు. -
ఉత్తమ ప్రదర్శనగా ‘అగ్నిసాక్షి’ ఎంపిక
భీమవరం: పట్టణంలో కళారంజని నాటక అకాడమి 15వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన జాతీయస్థాయి తెలుగు నాటిక పోటీల్లో చైతన్య కళాస్రవంతి విశాఖపట్నం వారి ‘అగ్నిసాక్షి’ నాటిక ఉత్తమ ప్రదర్శనగా బహుమతి అందుకుంది. పోటీల్లో విజేతల వివరాలను బుధవారం పోటీల న్యాయనిర్ణేత గంటా ముత్యాలరావునాయుడు విలేకర్లకు తెలిపారు. ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా శ్రీరమణకళానిలయం గుంటూరు వారి ‘మాతృత్వం’ ఎంపికై ంది. ఉత్తమ నటులుగా ఫొటో నాటికలోని సోములు పాత్రధారి చిల్లర సుబ్బారావు, అందరూ మంచివారే కానీ.. నాటికలో సౌజన్య పాత్రధారిణి సురభి పూజిత, మాతృత్వం నాటికలో సంతోష్ పాత్రధారి పొగర్తి నాగేశ్వరరావు, మరో పుత్తడిబొమ్మ నాటికలో కమల పాత్రధారిణి అమృతవర్షిణి ఎంపికయ్యారు. ఉత్తమ దర్శకుడిగా బాలాజీ నాయక్, ఉత్తమ రచయితగా జరుగుల రామారావు, ఉత్తమ సంగీత దర్శకుడిగా లీలామోహన్ ఎంపికయ్యారు. ఉత్తమ ఆహార్యం ఇవి కదా ముగింపు నాటిక, ఉత్తమ రంగాలంకరణకు అందరూ మంచివారే కానీ.. నాటికకు లావు అనిల్చౌదరి, జ్యూరీ అవార్డులను ఇది కదా ముగింపు నాటికలో వై వాసు, యశోద కై వసం చేసుకున్నారని ముత్యాలరావునాయుడు చెప్పారు. కార్యక్రమంలో అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు జవ్వాది దాశరధీ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మెంటే పూర్ణచంద్రరావు, కార్యదర్శి మల్లుల సీతారామప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి చట్టం రక్షణకు 20న ధర్నా
ఏలూరు (టూటౌన్): కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పేదలకు ఉపాధి పనులు కల్పించకుండా కొత్త పద్ధతులు పెట్టి తీవ్ర నష్టం కలిగిస్తోందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ కొత్తగా పెట్టిన ఫేస్ యాప్ వల్ల పని ప్రదేశాల్లో హాజరు పడక జిల్లాలో వేల మంది ఉసూరుమంటూ ఇంటికి తిరిగి వస్తున్నారని తెలిపారు. నేడు ఉదయం 6 గంటల కెళ్లి 11 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల కెళ్లి సాయంత్రం 5 గంటల వరకు పనిచేయాలని బీజేపీ ప్రభుత్వం పేదల గొంతుపై కత్తి పెట్టిందని వాపోయారు. ఫేస్ యాప్, రెండు పూటలా పని రద్దు, అడిగిన అందరికీ పని, పెండింగ్ వేతనాలు, పేస్లిప్స్, పనిముట్లు, ప్రమాదంలో చనిపోతే రూ.25 లక్షల సష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యపై ఈనెల 20న విజయవాడ రాష్ట్ర కమిషనర్ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎ.రవి, కరీముల్లా, షాహినా, తదితరులు పాల్గొన్నారు. -
వేడుకగా శ్రీపుష్ప యాగోత్సవం
ముగిసిన శ్రీనివాసుని కల్యాణ మహోత్సవాలు ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి ఉపాలయమైన లక్ష్మీపురంలోని శ్రీ సంతాన వేణుగోపాల జగన్నాథ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీనివాసునికి జరుగుతున్న కల్యాణ మహోత్సవాలు బుధవారం జరిగిన విశేష కార్యక్రమాలతో ముగిశాయి. ఈ సందర్భంగా ఉదయం ఆలయంలో శ్రీనివాసునికి, పద్మావతి, అండాళ్ అమ్మవార్లకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ యజ్ఞశాలలో హోమాది కార్యక్రమాలను జరిపారు. రాత్రి ఆలయంలో ద్వాదశ కోవెల ప్రదక్షిణలను ఆలయ అర్చకులు, పండితులు, ఆగమ విద్యార్థులు వైభవోపేతంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి, అమ్మవార్లకు శ్రీ పుష్పయాగోత్సవాన్ని అర్చకులు వేద మంత్రోచ్ఛరణలతో జరిపారు. ఈ వేడుకల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పాలకొల్లు సెంట్రల్: ప్రేమించి పెళ్లి చేసుకున్న నూతన వరుడిపై కత్తితో దాడి చేసిన ఘటన పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే పట్టణంలోని 31వ వార్డు క్రిస్టియన్ పేటలో చందక సాయికుమార్, గుడిమెట్ల శ్రీసాయిదుర్గ ఇరువురూ గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో వారు తామిద్దరమూ వివాహం చేసుకుంటామని గత శుక్రవారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆదివారం నరసాపురంలోని ఓ గుడిలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం మంగళవారం పెళ్లికూతురు కుటుంబ సభ్యులు వివాహ రిసెప్షన్ ఏర్పాటుచేశారు. ఈ వేడుక జరుగుతుండగా అదే ప్రాంతానికి చెందిన గోగులమండ శ్రీను నూతన దంపతులకు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చి వరుడు సాయికుమార్ భుజంపై చేయి వేసి చాకుతో కంఠంపై కోశాడు. ఈ ఘటనను చూసిన స్థానికులు వెంటనే అప్రమత్తపై శ్రీనును స్టేజీపై నుంచి గెంటివేసి సాయికుమార్ను హుటాహుటిన పట్టణ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పట్టణ ఎస్సై జీజే ప్రసాద్ శ్రీనుపై కేసు నమోదు చేశారు. శ్రీనును కోర్టులో హజరుపరచగా జైలుకు తరలించినట్లు తెలిపారు.


