breaking news
Eluru
-
వేప చెట్లకు ‘డై బ్యాక్’ముప్పు
● మెట్ట ప్రాంతంలో విస్తరిస్తున్న శిలీంధ్ర వ్యాధి ● నివారణకు శాస్త్రవేత్తల సూచనలుచింతలపూడి: గత కొద్ది రోజులుగా మెట్ట ప్రాంతంలోని వేప చెట్లు నిలువునా ఎండిపోతుండడం స్థానికంగా కలకలం రేపుతోంది. పచ్చగా ఉండాల్సిన చెట్లు అకస్మాత్తుగా కొమ్మల పైభాగం నుంచి ఎండిపోతూ వస్తుండటంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఉగాది పండుగ సమీపిస్తున్న తరుణంలో ఇలా జరగడం ఏదైనా అరిష్టమా అని కొందరు చర్చించుకుంటున్నారు. అయితే, ఈ ప్రచారంలో నిజం లేదని, ఇది కేవలం ‘డై బ్యాక్’ అనే శిలీంద్ర వ్యాధి మాత్రమేనని ఉద్యాన శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఏమిటీ డై బ్యాక్ వ్యాధి? ఇది ఫోమోప్సిస్ అజాడిరక్టే అనే ఫంగస్ (శిలీంధ్రం) వల్ల వస్తుంది. ఈ వ్యాధి సోకినప్పుడు చెట్టు కొమ్మలు పైనుండి కిందికి ఎండిపోతూ వస్తాయి. ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోవడం, పూత రాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వాతావరణంలో తేమ పెరగడం వల్ల ఈ శిలీంధ్రం వేగంగా విస్తరిస్తుంది. శాసీ్త్రయ నివారణ మార్గాలు మూఢనమ్మకాలతో చెట్లను వదిలేయకుండా, సరైన సమయంలో చికిత్స అందిస్తే వేప చెట్లను కాపాడుకోవచ్చని ఉద్యానాధికారిణి ఎండి షాఫియ సూచిస్తున్నారు. ఒక లీటరు నీటిలో 1 గ్రాము కార్బెండిజం లేదా 2 గ్రాముల మాంకోజెబ్ కలిపి చెట్టు మొత్తం తడిచేలా పిచికారీ చేయాలి. ఎండిపోయిన కొమ్మలను కత్తిరించి, ఆ భాగంలో బోర్డో పేస్ట్ను పూయడం వల్ల వ్యాధి మరింత వ్యాపించకుండా ఆపవచ్చు. చెట్టు మొదట్లో తగినంత నీరు పోస్తూ, పోషకాలు అందించినట్లయితే మళ్లీ కొత్త చిగుళ్లు వచ్చే అవకాశం ఉంది. వేప చెట్లు ఎండిపోవడం అనేది పూర్తిగా జీవశాస్త్ర పరమైన సమస్య. దీనికి గ్రహగతులకు లేదా అరిష్టాలకు ఎటువంటి సంబంధం లేదు. రైతులు, ప్రజలు ఆందోళన చెందకుండా ఉద్యాన అధికారుల సలహాల మేరకు నివారణ చర్యలు చేపట్టాలని ఉద్యాన శాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
ఆ పంచాయతీల్లో నిధుల గోల్మాల్
● రూ.కోట్ల నిధులు స్వాహా ● అక్రమార్కులపై లోకాయుక్త విచారణ ● కొత్తగా మరో రూ.80 లక్షల బిల్లుల గోల ఏలూరు టౌన్: ఏలూరు జిల్లాలోని పంచాయతీల్లో అవినీతిపరుల పనిపట్టాల్సిన పరిస్థితి వచ్చింది. రూ.కోట్ల నిధులు దుర్వినియోగం చేస్తూ తమ జేబులు నింపుకోవడం.. అవినీతి ఆరోపణలపై విచారణ అధికారులను సైతం పక్కదారి పట్టిస్తూ ... అక్రమార్కులకు అండగా నిలిచిన జిల్లా అధికారి ‘పంచాయితీ’ నడుస్తోంది. నిధుల దుర్వినియోగంపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవటంతో ఇక లోకాయుక్తను ఆశ్రయించారు. అవినీతి ఆరోపణలపై లోకాయుక్త ఏకంగా డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమించి విచారణకు ఆదేశించింది. ఏలూరు జిల్లాలోని భీమడోలు, పూళ్ల గ్రామ పంచాయతీల్లో కోట్ల నిధులు దుర్వినియోగంపై రహస్య, ఒక్కో వ్యక్తిని విచారణ చేపట్టారు. అటు అధికారులతోపాటు, ఇటు ఫిర్యాదుదారులను విచారణకు పిలిచి వారినుంచి ఆధారాలు, వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. భారీగా నిధుల దుర్వినియోగం భీమడోలు పంచాయతీలో ఫిర్యాదుదారులు రూ.2కోట్లు నిధులు దుర్వినియోగం చేశారనీ ఆరోపిస్తూ ఆధారాలు చూపిస్తుంటే గతంలో విచారణ చేసిన అధికారులు రూ.1.36 కోట్లు మాత్రమే దుర్వినియోగం అయ్యాయంటూ తేల్చడం... మరోవైపు అవినీతి జరిగిందనేది వెల్లడైనా డీపీఓ అక్రమార్కులకు వత్తా సుపలికినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక గుండుగొలను గ్రామ పంచాయతీలోనూ సుమారు రూ.70 లక్షలు నిధులు, పూళ్ళ గ్రామ పంచాయతీలో సుమారు రూ.90 లక్షలు నిధులు, పెయ్యేరు పంచాయతీలో సుమారు రూ.1.5కోట్లు కై ంకర్యం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా నాలుగు గ్రామ పంచాయతీల్లో ఏకంగా రూ.5.16 కోట్లు నిధులు అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లాయనే ఆరోపణలు ఉన్నాయి. లోకాయుక్త డిప్యూటీ డైరెక్టర్ దర్యాప్తు ఏలూరు జిల్లా పంచాయతీ కార్యాలయంలో అవినీతి ఆరోపణలపై లోకాయుక్త డిప్యూటీ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి ప్రత్యేకంగా దర్యాప్తు ప్రారంభించారు. గ్రామ పంచాయతీల్లో కోట్లలో నిధుల దుర్వినియోగంపై జిల్లాస్థాయిలో సాగుతున్న విచారణ బోగస్గా మారిందని, విచారణ అధికారులే అవినీతి పందికొక్కుల నుంచి భారీగా డబ్బులకు కక్కుర్తి పడుతూ నివేదికలను తొక్కిపడుతూ వచ్చారు. దీనిపై ఫిర్యాదుదారుడు బి.భాస్కర్ లోకాయుక్తను ఆశ్రయించగా ఏలూరు డీపీఓ అనురాధపై లోకాయుక్త ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశాలు జారీచేసింది. అవినీతి సొమ్ముతో జేబులు నింపుకున్న అధికారులపై చర్యలు ఏవిధంగా ఉంటాయనేదానిపై సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది. అవినీతి అధికారుల భరతంపట్టే లోకాయుక్త విచారణతో అక్రమార్కుల గుండెల్లో గుబులు పట్టుకుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఫిర్యాదుదారులతో పాటు గతంలో విచారణ చేసిన అధికారులు ఏలూరు డీఎల్పీవో అమ్మాజీ, జంగారెడ్డిగూడెం డీఎల్పీవో సుబ్బరాయన్, ఏలూరు డీపీవో అనురాధను ..ఒక్కొక్కరిగా గదిలోనే విచారణ చేపట్టినట్లు చెబుతున్నారు. మొత్తానికి అవినీతి బాగోతంలో పాత్రదారులైన అధికారులపై చర్యలు ఏమిటనే చర్చ జోరుగా సాగుతుంది. నకిలీ బిల్లులు సృష్టించి లోకాయుక్త విచారణ సాగుతోన్న తరుణంలో భీమడోలు పంచాయతీలో మరికొన్ని అక్రమాలు వెలుగులోకి రావటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అక్రమార్కులంతా ఒక రిటైర్డ్ కార్యదర్శిని సంతకాల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని తెలుస్తోంది. సరికొత్త స్కామ్లో ఏకంగా రూ.80 లక్షలు నకిలీ బిల్లులు సృష్టించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. గతంలో పనిచేసి పదవీవి రమణ చేసిన కార్యదర్శి పేరుతో నకిలీబిల్లులు సృష్టించగా... వాటిపై సదరు రిటైర్డ్ కార్యదర్శిని సంతకాలు చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. తనకు ఎలాంటి సంబంధం లేదనీ, ఇలా వేధింపులకు గురిచేయటం సరికాదంటూ రిటైర్డ్ కార్యదర్శి ఉన్నతాధికారులకు ఇప్పటికే ఉత్తరం కూడా రాసినట్లు సమాచారం. -
గ్రావెల్ అక్రమ తవ్వకాలు దుర్మార్గం
నూజివీడు: ఆగిరిపల్లి మండలంలో అధికారపార్టీ నాయకులు అత్యంత దారుణంగా పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూముల్లో వాటి యజమానులకు తెలియకుండానే మామిడి చెట్లు నరికివేసి గ్రావెల్ తవ్వకాలు జరిపి తరలించడం అత్యంత దుర్మార్గమని నూజివీడు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఆందోళన వ్యక్తం చేశారు. కలటూరుకు చెందిన గుద్దేటి వరదానానికి 30 ఏళ్ల క్రితం ప్రభ్వుత్వం 1.96ఎకరాలు అసైన్మెంట్ భూమి ఇవ్వగా, ఆమె మరణించిన తర్వాత దానిని ఆమె ముగ్గురు కుమారులు సాగు చేసుకుంటున్నారు. అందులో 50 మామిడి చెట్లు ఉన్నాయి. ఆమె కుమారుల్లో ఒకరైన గుద్దేటి రమేష్ తన భార్య అనారోగ్యానికి గురవ్వగా నాలుగు రోజుల పాటు విజయవాడలోని ఆసుపత్రిలో ఉండి చికిత్స చేయించి తీసుకొచ్చేసరికి 50 చెట్లు నరికివేయడంతో పాటు అందులోకి అక్రమంగా ప్రవేశించి గ్రావెల్ను తవ్వేశారు. దీనిపై బాధిత రమేష్ ప్రతాప్ అప్పారావును ఆశ్రయించగా మంగళవారం బాధితుడిని వెంటబెట్టుకుని సబ్కలెక్టర్ కార్యాలయంకు తీసుకెళ్లగా నక్కనబోయిన వేణు, దాసరి శేషగిరిరావు గ్రావెల్ అక్రమ తవ్వకాలకు పాల్పడ్డారని సబ్కలెక్టర్ బొల్లిపల్లి వినూత్నకు బాధితుడు ఫిర్యాదు చేశారు. తారాస్థాయికి అక్రమ తవ్వకాలు అనంతరం ప్రతాప్ అప్పారావు విలేకర్లతో మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఆగిరిపల్లి, నూజివీడు మండలాల్లో మంత్రి అండదండలతో కొందరు నాయకులు గుట్టలు, చెరువులు కొల్లగొడుతున్నారన్నారు. ఆగిరిపల్లి మండలంలో అయితే కొల్లగొట్టడం తారాస్థాయికి చేరిందన్నారు. ప్రకృతి సంపదైన గుట్టలన్నీ కనుమరుగైపోయే పరిస్థితి నెలకొందన్నారు. దళితుడి భూమిలోని గ్రావెల్ను తవ్వి టిప్పర్లలో విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాలకు తరలించారన్నారు. గ్రావెల్ అక్రమ తవ్వకాలపై గ్రామస్థులు ఎన్నిసార్లు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తున్నా తహసీల్దార్లు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగిరిపల్లి మండలంలో కనసానపల్లి, అమ్మవారిగూడెం, నర్సింగపాలెం తదితర గ్రామాల్లో ఇష్టారాజ్యంగా గ్రావెల్ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయన్నారు. కనసానపల్లిలో అనుమతినిచ్చిన క్వారీ ఉండగా అందులో అనుమతి ఇచ్చిన విస్తీర్ణం కంటే రెండు రెట్లు ఎక్కువగా తవ్వేసి గ్రావెల్ను తరలించారని, దీనిని తనిఖీలు చేసి అదనంగా తవ్విన దానికి నిబంధనల ప్రకారం క్వారీ అనుమతి పొందిన వ్యక్తికి జరిమానా విధించాలని డిమాండ్ చేశారు. గతంలో ఎమ్మార్ అప్పారావు, కోటగిరి హనుమంతరావు, పాలడుగు వెంకట్రావు, తాను, చిన్నం రామకోటయ్యలు ఎమ్మెల్యేలుగా పనిచేశారని, ఏ ఒక్కరి హయాంలో కూడా ఇంత పెద్ద ఎత్తున అక్రమ గ్రావెల్ తవ్వకాలు జరగలేదని, వారు ఎన్నడూ ప్రోత్సహించలేదన్నారు. రాత్రి 10గంటల నుంచి తెల్లవారుజామున 5గంటల వరకు టిప్పర్లతో ఇష్టారాజ్యంగా గ్రావెల్ను తరలిస్తూ కొండలను, గుట్టలను, చెరువులను కొల్లగొడుతున్నారని, ఈ అక్రమ గ్రావెల్ దందాను కచ్ఛితంగా నిలువరించాలని అధికారులను డిమాండ్ చేశారు. ప్రతాప్ అప్పారావుతో పాటు వైఎస్సార్ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఈలప్రోలు వెంకట సుబ్బయ్య, కలటూరు సర్పంచి సురేష్ తదితరులు ఉన్నారు. మేకా వెంకట ప్రతాప్ అప్పారావు -
విద్యుత్ స్తంభాల క్రమబద్ధీకరణ
కొయ్యలగూడెం: మండలంలోని కన్నాపురం రోడ్డులో తంగళ్ళగూడెం వద్ద ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలను అధికారులు క్రమబద్ధీకరించారు. సాక్షి పత్రికలో ఈ నెల 11న ప్రచురితమైన ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు కథనానికి స్పందించి సిబ్బందితో వెళ్లి రెండు చోట్ల ఉన్న స్తంభాలను సరి చేశామని రామారావు తెలిపారు. మెయిన్ రోడ్ లో ఒకటి ఓ రైతు వ్యవసాయ క్షేత్రంలో మరొకటి రెండు రోజులపాటు శ్రమించి క్రమబద్ధీకరించామని తెలిపారు. ఈ సందర్భంగా రైతులు అదే విధంగా ప్రయాణికులు విద్యుత్ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. -
ఏఐపై ఎస్పీ శివకిషోర్ ప్రజెంటేషన్
ఏలూరు టౌన్: హైదరాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ)పై ప్రత్యేకంగా ప్రజెంటేషన్ ఇచ్చారు. నేర పరిశోధన, పోలీసింగ్ వ్యవస్థలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానించే లక్ష్యంతో జాతీయ పోలీస్ అకాడమీలో చేపట్టిన ఉన్నతస్థాయి వర్క్షాప్లో ఆయన తనదైన శైలిలో కీలక ప్రసంగం చేశారు. పోలీస్ వ్యవస్థలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం జోడిస్తూ తన అపార అనుభవంతో ఏఐతో నేర పరిశోధనలో విప్లవాత్మక మార్పులను తెచ్చిన విధానాలపై జిల్లా ఎస్పీ శివకిషోర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. డేటా విశ్లేషణతో నేరాలు జరగక ముందే పసిగట్టటం, అత్యాధునిక పరికరాలతో డిజిటల్ సాక్ష్యాధారాలను పగడ్భందీగా సేకరించటం వంటివాటిని వివరించారు. జిల్లాలో ఏఐను వినియోగిస్తున్న తీరును వివరించారు. -
తణుకులో వాహనాలతో మైనర్ల రచ్చ
తణుకు అర్బన్: ఇంటర్మీడియేట్ పరీక్షలు ముగిసిన నేపథ్యంలో మంగళవారం ఉదయం తణుకు రహదారుల్లో మైనర్లు తమ వాహనాలతో చేసిన సౌండ్ పొల్యూషన్ తాకిడికి ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. రకరకాల ద్విచక్ర వాహనాలపై మైనర్లు ముగ్గురేసి ఎక్కి వాహనాలు నడిపిన తీరు భయబ్రాంతులకు గురిచేసింది. వాహనాలకు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన సైలెన్సర్ల నుంచి విపరీతమైన శబ్దాలు వచ్చే విధంగా నడిపిన తీరుతో పాదచారులు భయపడిపోయారు. బండి వెనుక బండితో మైనర్లు రేస్లు పెట్టుకున్నట్లుగా ప్రయాణించడంతో తణుకులో ప్రధాన రహదారులైన రాష్ట్రపతి రోడ్డు, సొసైటీ రోడ్డు, పెరవలి రోడ్డు, ఉండ్రాజవరం రోడ్డు, వేల్పూరు రోడ్డులో ప్రయాణికులు గగ్గోలెత్తిపోయారు. కళాశాలల వద్ద పరీక్షలు అయిన తరువాత మైనర్లు, ఆకతాయిలు ఆడపిల్లల వెనుక వాహనాలతో ప్రయాణించిన తీరుతో చూసేవారికి చమటలు పట్టించాయి. ఇటీవల కాలంలో ఈ తరహా వాహనాల జోరు అధికం కాగా పోలీసులు వాహనాలను ఆపి నిలువరించిన వెంటనే రాజకీయ సిఫార్సులు నిముషాల వ్యవధిలోనే వస్తుండడంతో కేవలం కౌన్సెలింగ్లతో సరిపెట్టాల్సిన దుస్థితి నెలకొంది. అంతేకాకుండా నేనెవరో తెలుసా అంటూ పోలీసులనే ప్రశ్నించే పరిస్థితుల్లో మైనర్లు ఉండడం శోచనీయం. మంగళవారం మధ్యాహ్నం తణుకు శివారు ఉండ్రాజవరం రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉండ్రాజవరం మండల పరిషత్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ధూళిపాల వీవీసీఎస్ శర్మ ఘటనా ప్రాంతంలోనే మృతిచెందారు. భోజన విరామ సమయంలో తణుకులోని నివాసానికి వస్తున్న శర్మను ద్విచక్ర వాహనంపై త్రిబుల్ రైడ్ చేస్తూ వేగంగా వస్తున్న యువకులు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు చెబుతున్నారు. కొరడా ఝళిపించిన పోలీసులు ఉదయం నుంచి మైనర్లు వాహనాలతో చేసిన రచ్చతో విసుగెత్తిన పోలీసు అధికారులు మంగళవారం సాయంత్రం తణుకు రాష్ట్రపతి రోడ్డులో యువకులు, మైనర్లు ప్రయాణించే వాహనాలను పదుల సంఖ్యలో నిలువరించి వాహనాల తాలూకా దస్త్రాలను తనిఖీలు నిర్వహించారు. రూరల్ సీఐ దేశంశెట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్సైలు డి.ఆదినారాయణ, కె.శ్రీనివాస్ సిబ్బందితో కలిసి వాహనాలను నిలువరించారు. మైనర్లకు బైక్లు ఇచ్చే తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామని తణుకు ట్రాఫిక్ ఎస్సై డి.ఆదినారాయణ హెచ్చరించారు రాష్ట్రపతి రోడ్డులోని డిగ్రీ కళాశాల వద్ద మైనర్లు, విచిత్ర శబ్ధాలు చేస్తూ సైలెన్సర్లు లేకుండా నడుపుతున్న మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. ఉండ్రాజవరంలో వాహనం ఢీకొని ప్రభుత్వ ఉద్యోగి మృతి -
వైభవంగా బలుసులమ్మ జాతర
తాడేపల్లిగూడెం (టీఓసీ): పట్టణ ఇలవేల్పు బలుసులమ్మ అమ్మవారి మహాకుంభాభిషేక పూర్వక జాతర మహోత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారికి విశేష పుష్పార్చన ఘనంగా నిర్వహించారు. యాగశాల వద్ద ఉదయం నుంచి వేదపండితులు వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. రాత్రి మధు ఈవెంట్స్ ఆర్డీఎక్స్ టీమ్ (వైజాగ్), మణిపూర్ స్టంట్స్, డాన్స్ బేబి డాన్స్ నిర్వహించారు. ప్రేక్షకులు, భక్తులు విశేషంగా హాజరైయారు. ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజిబాబు పర్యవేక్షించారు. వేలేరుపాడు: మండల పరిధిలోని జిన్నెల గూడెం గ్రామానికి చెందిన తురసం ధనుష్ అనే మూడేళ్ల గిరిజన బాలుడు మంగళవారం మధ్యాహ్నం పాము కాటుకు గురై మృతి చెందాడు. తల్లిదండ్రులు రవి, లక్ష్మిలు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ధనుష్ ఆడుకుంటున్నాడు. ఈ సమయంలో నాగుపాము మోకాళ్ల దగ్గర కాటు వేసింది. దీన్ని గమనించిన తల్లిదండ్రులు నాగుపామును కొట్టి చంపారు. అనంతరం వేలేరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమంగా మారడంతో ధనుష్ మృతి చెందాడు. రవి, లక్ష్మిలకు ముగ్గురు సంతానంలో కుమారుడు మృతి చెందడంతో వారు కన్నీరుమున్నీరయ్యారు. తాడేపల్లిగూడెం (టీఓసీ): ప్రముఖ వచన కవి పట్టణానికి చెందిన వేమూరి శ్రీనివాస్కు పరాభవనామ ఉగాది సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ మేరకు మంగళవారం స్థానిక విలేకరులకు ఆయన వివరాలు వెల్లడించారు. వేమూరి వృత్తి గణిత శాస్త్ర బోధన కాగా ప్రవృత్తి కవితా రచన. తెలుగు భాషకు చేస్తున్న సేవలకు గాను ఉగాది పురస్కారం అందుకోనున్నారు. గణపవరం: పిప్పరలో ఉండిపంటకాలువలో ఈతకు దిగి మృతిచెందిన వారిలో ప్రమోద్వర్మ మృతదేహం మంగళవారం ఉదయం లభించింది. మూడు రోజులుగా రెస్క్యూ టీం సభ్యులు ఉండి పంటకాలువ పొడవునా కిలోమీటర్ల దూరం వరకూ మృతదేహం కోసం గాలించినా ఆచూకీ దొరక్కపోవడంతో గాలింపు చర్యలు కొనసాగించారు. ఎట్టకేలకు మంగళవారం ఉదయం ప్రమోద్వర్మ మృతదేహం లభించినట్లు గణపవరం ఎస్సై ఆకుల మణికుమార్ తెలిపారు. ఆదివారం సాయంత్రం పిప్పర గ్రామానికి చెందిన భూపతిరాజు సుశాంతవర్మ(10), ఇందుకూరి ప్రమోద్వర్మ(11) అనే ఇద్దరు స్నేహితులు సరదాగా ఈతకోసం కాలువలోకి దిగి గల్లంతైన విషయం తెలిసిందే. ప్రమోద్వర్మ మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గణపవరం: ఏలూరు జిల్లా గణపవరం సెంటర్లో ఎస్సై ఆకుల మణికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. వారిని మంగళవారం తాడేపల్లిగూడెం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చగా మెజిస్ట్రేట్ కె.లలితాదేవి ముగ్గురికీ ఒక్కొక్కరికీ పదివేల రూపాయల చొప్పున జరిమానా విధించినట్లు ఎస్సై తెలిపారు. నరసాపురం రూరల్: చేపల వేటకోసం వెళ్లిన ఓ యువకుడు విగతజీవిగా తేలడంతో స్థానికంగా విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే మొగల్తూరు మండలం కోమటితిప్ప గ్రామానికి చెందిన తిరుమాని రాము (19) ఆదివారం ఉదయం వేటకోసం ఉప్పుటేరుకు వెళ్లాడు. అయితే సాయంత్రం దాటినా రాము ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు గాలించినా అతని ఆచూకీ లభ్యం కాలేదు. సోమవారం ఉదయం కాళీపట్నం ఈస్ట్ లోని లాంచీల రేవువద్ద రాము మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై ఎస్సై వాసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పర్యవేక్షణ లోపం వల్లే..
నకిలీ టికెట్ల విక్రయాలపై భక్తులు, స్థానికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అధికారుల పర్యవేక్షణా లోపం కారణంగానే ఈ వ్యవహారం ఎప్పటి నుంచో జరుగుతోందని అంటున్నారు. ఆలయ పరువు, ప్రతిష్ఠలు రోడ్డుపైకి రావడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబధిత అధికారులే కారణమని భక్తులు ధ్వజమెత్తుతున్నారు. వాడపల్లి వెంకన్న ఆదాయం ఎక్కువగా కనబడడానికి.. చిన్నవెంకన్న ఆదాయం దోపిడీకి గురికావడమే కారణమని అంటున్నారు. ఈ కేసులో లోతైన దర్యాప్తు జరిపితే మరికొంత మంది ఉద్యోగుల పాత్రలు బయటపడే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. విషయం సద్దుమణగక ముందే వేగంగా విచారణ జరపాలని, ఈ అక్రమాలతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. -
ఏసీబీ వలలో మున్సిపల్ సర్వేయర్
తాడేపల్లిగూడెం అర్బన్: లంచం తీసుకుంటూ తాడేపల్లిగూడెం మునిసిపాలిటీ సర్వేయర్ ఏసీబీ వలకు చిక్కారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ ప్రాంతానికి చెందిన కొమ్ముల రాధకు తాడేపల్లిగూడెం కడకట్ల ప్రాంతంలో స్థల ఉంది. ఆ స్థలం రీ సర్వే చేయించుకొని మ్యుటేషన్ సర్టిఫికెట్ కోసం మున్సిపల్ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయంపై కొమ్ముల రాధ కుటుంబ స్నేహితులు, తాడేపల్లిగూడెంకు చెందిన సింగిరి ఎడ్వెర్డ్ కెనడి మున్సిపల్ అధికారులను కలిశారు. ఆ స్థలంలో పోరంబోకు భూమి కలిసి ఉందని దానిని సరిచేసి మ్యుటేషన్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు మున్సిపల్ సర్వేయర్ రౌతు రామకృష్ణ రూ.50 వేలు లంచం డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని సింగిరి అడ్వర్డ్ కెనడి స్థలం యజమాని కొమ్ముల రాధకు తెలియజేయడంతో ఆమె విజయవాడ ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. అక్కడ అధికారుల ఆదేశాలతో జిల్లా ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. కెనడీ నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటున్న సర్వేయర్ రామకృష్ణను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ దాడిలో ఏసీబీ డీఎస్పీ జీవీ కృష్ణారావు, సీఐలు ఎం బాలకృష్ణ, కె శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. -
22ఏ భూ సమస్యలపై చర్యలు
ఏలూరు (టూటౌన్): కై కలూరు నియోజకవర్గంలో 22ఏ భూ సమస్యలపై సర్వే నంబర్ల వారీగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. మంగళవారం జిల్లాలో 22 ఏ భూ సమస్యల పరిష్కారాలపై భూపరిపాలన శాఖ ముఖ్య కమిషనర్ జి.జయలక్ష్మితో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాల పునర్విభజన సమయంలో కైకలూరు నియోజకవర్గం ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ఏలూరు జిల్లాలో చేరిందని, కై కలూరు నియోజకవర్గంలోని ముదినేపల్లి, మండవల్లి మండలాల్లోని 22 ఏ భూ సమస్యలకు సంబంధించి ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అందుబాటులో ఉన్న రికార్డులను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి సీఎస్కి తెలియజేశారు. -
పెండింగ్లో ఉన్న డీఎలు చెల్లించాలి
భీమవరం: పెండింగ్లో ఉన్న డీఎలు, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయుల పోరుబాట కార్యక్రమంలో భాగంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ మంగళవారం కలెక్టర్ చదలవాడ నాగరాణికి వినతపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్టీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాకర శ్యాంసుందర్ క్రైస్ట్ సన్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మురాల సుధాకర్, వై రమేష్ బాబు మాట్లాడుతూ తక్షణమే ఐఆర్ ప్రకటించి పీఆర్సి వేయాలని డిమాండ్ చేశారు. అన్ని పెండింగ్ డీఏలు తక్షణమే చెల్లించాలని, సంపాదిత సెలవులకు ఎన్క్యాష్మెంట్ చెల్లించాలని, రిటైర్డ్ ఉద్యోగుల అన్ని బెనిఫిట్స్ ఇవ్వాలని కోరారు. ఉద్యోగుల అవసరాల నిమిత్తం పీఎఫ్ రుణాలు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు గారపాటి నారాయణ, జిల్లా ట్రెజరర్ టీ పల్లయ్య, అత్తిలి, ఇరగవరం, తణుకు మండలాల అధ్యక్షులు తేన్నైటి నవీన్, కప్పల పాలస్మిత్, కొల్లి జయరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు పి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాను అభివృద్ధి బాటలో నిలుపుతాం
ఏలూరు (టూటౌన్): ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి బాటలో నిలిపేందుకు ప్రజాప్రతినిధులందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్తామని జిల్లా ఇన్చార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. కలెక్టరేట్లో మంగళవారం జిల్లా అభివృద్ధికి తీసుకోవాల్సిన అంశాలపై సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ ఉద్యానవన పంటలపై ప్రత్యేక దృష్టి పెట్టి రాష్ట్రంలో జిల్లాను అభివృద్ధిలో 5 నుంచి 3వ స్థానంలో నిలిపామన్నారు. ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజల సంతృప్తి స్థాయిని పెంచేందుకు, ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించేందుకు చర్యలపై చర్చించామన్నారు. వేసవిలో తాగునీటి కొరత లేకుండా చర్యలు, జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి కనెక్షన్లు, పంచాయతీ రోడ్లు, ఆర్ అండ్ బీ రోడ్లు, ఆర్టీసీ బస్టాండ్లు తదితర అంశాలపై చర్చించామన్నారు. జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ‘టెంపుల్ టూరిజం సర్క్యూట్’ అభివృద్ధి చేస్తున్నామన్నారు. వంట గ్యాస్ కొరత లేదని, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ నెల 20న విశాఖపట్టణం పోర్ట్కు వంట గ్యాస్ నౌక చేరుకుంటుందన్నారు. ఆహార పదార్థాలు కల్తీలపై దాడులు నిర్వహిస్తున్నామన్నారు. ఖాళీగా ఉన్న 59 ఫుడ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), చింతమనేని ప్రభాకర్, రోషన్ కుమార్, పత్సమట్ల ధర్మరాజు, కామినేని శ్రీనివాస్, చిర్రి బాలరాజు, మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు. -
తిరుమల పవిత్రతను కాపాడాలి
● బీఆర్ నాయుడిని టీడీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలి ● ఏలూరులో వైఎస్సార్ సీపీ నేతల భారీ ధర్నా ఏలూరు టౌన్: తిరుమల పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందనీ.. బీఆర్ నాయుడిని టీటీడీ ఛైర్మన్ పదవి నుంచి తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ ఏలూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ధర్నా చేపట్టారు. పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై టీడీపీ ప్రభుత్వ విధానాలపై నిరసన తెలిపారు. పార్టీ కార్యాలయం నుంచీ భారీ ర్యాలీగా ఏలూరు పాతబస్టాండ్ సెంటర్కు చేరుకున్నారు. అనంతరం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అంబేద్కర్ విగ్రహం ఎదుట రోడ్డుపై బైఠాయించి కూటమి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ బీఆర్ నాయుడు టీడీడీ చైర్మన్గా పదవి చేపట్టిన నాటినుంచీ అంతా వివాదాస్పదమేననీ... తిరుమల తిరుపతిలో అన్నీ అపచారాలే చోటుచేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహిళతో సాన్నిహిత్యంగా ఉన్న వీడియోలు, ఫొటోలతో దొరికినా యావత్ భక్తులు, మహిళా లోకం తప్పుబట్టినా... విపక్షాలు ఎత్తి చూపినా సీఎం చంద్రబాబు మాత్రం చెవులు గట్టిగా మూసుకుని తనకేమీ పట్టనట్లు వ్యవహరించటాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. బీఆర్ నాయుడ్ని పదవినుంచి తప్పించాలని మహిళలు తిరుపతిలో ఆయన బసచేసిన హోటల్ వద్ద నిరసన వ్యక్తం చేస్తే తన గూండాలతో నిర్ధాక్షిణ్యంగా దాడి చేయించడం అతడి అహంకారానికి నిదర్శనమని అన్నారు. పోలవరం మాజీ ఎమ్మెల్యే, సమన్వయకర్త తెల్లం బాలరాజు మాట్లాడుతూ ఆలయ పవిత్రతను దృష్టిలో పెట్టుకుని బీఆర్ నాయుడు టీటీడీ ఛైర్మన్ పదవి నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. కూటమి నేతల ఆగడాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. పార్టీ చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త కంభం విజయరాజు మాట్లాడుతూ సీఎం చంద్రబాబుకు నిజంగా శ్రీ వేంకటేశ్వరస్వామిపై భక్తి, భయం ఉంటే తక్షణమే బీఆర్ నాయుడ్ని టీటీడీ చైర్మన్గా తొలగించి తన చిత్తశుద్దిని చాటుకోవాలన్నారు. ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ మాట్లాడుతూ టీడీపీ నేతలు నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చినట్టు కనిపిస్తున్నారనీ, కనీసం తాను తప్పు చేశాననే ఆలోచన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయడికి లేకపోవటం ఆయన నైతికతకు నిదర్శనం అన్నారు. ఆందోళన కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శులు నూకపెయ్యి సుధీర్బాబు, దాసరి రమేష్, బీవీఆర్ చౌదరి, వెజ్జు వెంకటేశ్వరరావు, ముదిరాజ్ కార్పొరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కోమటి విష్ణువర్థన్, వడ్డీల కార్పొరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ముంగర సంజయ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సొంగ సందీప్, జెడ్పీ వైస్ చైర్మన్ కృష్ణంరాజు, దెందులూరు జెడ్పీటీసీ నిట్టా లీలా నవకాంతం, నిడమర్రు జెడ్పీటీసీ కాశీ, జిల్లా ఉపాధ్యక్షురాలు జగ్గవరపు జానకిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్గురునాథ్, అర్జున్రావు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కామిరెడ్డి నాని, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు తేరా ఆనంద్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, వైఎస్సార్టీయూ జిల్లా అధ్యక్షుడు పల్లి శ్రీనివాస్, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు వాసిరెడ్డి మధు, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పీ.రాజేష్, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఏలూరు పాతబస్టాండ్ సెంటర్లో అంబేడ్కర్ విగ్రహం వద్ద రోడ్డుపై నిరసన తెలుపుతున్న వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, సమన్వయకర్తలు కంభం విజయరాజు, మామిళ్ళపల్లి జయప్రకాష్, పార్టీ శ్రేణులు, ఫ్లెక్సీలతో నినాదాలు చేస్తున్న మహిళా నేతలు -
ఉత్తమ నాటికగా ‘అగ్నిసాక్షి’
వీరవాసరం: వీరవాసరం కళాపరిషత్ సేవా సంఘం ఆధ్వర్యంలో అఖిల భారత స్థాయి నాటక పోటీల బహుమతి ప్రదానోత్సవం జరిగింది. ఉత్తమ నాటికగా చైతన్య కళాస్రవంతి ఉక్కునగరం వారి అగ్నిసాక్షి నాటిక, ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా శ్రీసాయి ఆర్ట్స్ కొలకలూరి వారి జనరల్ బోగీలు, తృతీయ ఉత్తమ ప్రదర్శనగా కృష్ణా కల్చరల్ అసోసియేషన్ గుడివాడ వారి ద్వారబందాల చంద్రయ్యనాయుడు నాటికలు ఎంపికయ్యాయి. ఉత్తమ రచన మాడభూషి దివాకర్ బాబు, ఉత్తమ దర్శకత్వం పి.బాలాజి నాయక్, ఉత్తమ నటుడిగా ఆర్వీఎల్ నర్సింహరావు, ఉత్తమ నటిగా అమృత వర్షిణి, ఉత్తమ ప్రతినాయకుడిగా గోపరాజు విజయ్, ఉత్తమ హాస్యనటుడిగా ఎస్.సుబ్రహ్మణ్యం ఎంపికయ్యారు. న్యాయనిర్ణేతలుగా అల్లు రామకృష్ణ, గంటా రామ్మోహనరావు, గంటా కళ్యాణి నాయుడు వ్యవహరించారు. -
కోటి ఆశల ‘ఉగాది’ పండుగ
● శ్రీవారికి.. ఇదే తొలి ఉత్సవం ● రేపు చినవెంకన్న క్షేత్రంలో ఉగాది వేడుకలు ద్వారకాతిరుమల: పెద్ద పండుగల్లో అత్యంత విశిష్టమైన పండుగ ఉగాది. ఈ రోజుతోనే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇది ముఖ్యంగా తెలుగువారి పండుగ. కర్ణాటక ప్రజలు కూడా మనతో పాటే ఉగాది పండుగను జరుపుకుంటారు. ఇతర రాష్ట్రాల వారు సైతం వారివారి కాలమాన ఆచార వ్యవహారాలను అనుసరించి ఉగాదిని జరుపుకుంటారు. ఆంగ్ల సంవత్సరం ముగింపు, ప్రారంభంలో పర్యావరణంలోను, పరిసరాల్లోను ఏ విధమైన మార్పు కనిపించదు. కానీ తెలుగు సంవత్సరాది అలా కాదు. ప్రకృతిలోనూ, వాతావరణంలోనూ స్పష్టమైన మార్పు కనబడుతుంది. శిశిర రుతువు ఫల్గుణ అమావాస్యతో తెలుగు సంవత్సరం ముగుస్తుంది. మరునాడు చీకట్లు పోయి వెలుగులు పెరిగే శుక్లపాడ్యమితో కొత్త సంవత్సరం మొదలవుతుంది. పాత సంవత్సరపు చీకటి అనుభవాల నుంచి అనందపు వెలుగుల్లోకి వెల్లువలా మనం అడుగు వేస్తాం. వృక్షాలు కొత్త చిగుళ్లతో, ఆకుపచ్చ శోభతో ప్రకృతి ఆహ్లాదపరుస్తూ ఉంగా పక్షుల కిలకిల రావాలు, కోయిల పాటలు వీనుల విందు చేస్తూ వినిపిస్తాయి. శ్రీవారికీ ఇదే తొలి ఉత్సవం.. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్నకు ఉగాది పండుగే తొలి ఉత్సవం. అందుకే ఈ పండుగకు క్షేత్రంలో ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి ఏటా శ్రీవారి వైభవాన్ని చాటేలా ఈ ఉత్సవాలను ఆలయ అధికారులు వైభవంగా నిర్వహిస్తారు. అందులో భాగంగా ఈనెల 19న సాయంత్రం 6 గంటలకు ఉభయ దేవేరులతో స్వామివారు ఆలయం నుంచి వెండి శేషవాహనంపై బయల్దేరి, ఉగాది మండపం వద్దకు చేరుకుంటారు. అనంతరం మండపంలో శ్రీవారు, అమ్మవార్లను వేంచేపుచేసి అర్చకులు, పండితులు పంచాంగ శ్రవణాన్ని జరిపి, రాశి ఫలాలను చదివి వినిపిస్తారు. ఆ తర్వాత పండిత సత్కారాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ వేడుకలను పురస్కరించుకుని ఉగాది మండపం, పరిసరాలు విద్యుద్దీప కాంతులీనుతున్నాయి. -
అధినేత వైఎస్ జగన్తోమర్యాదపూర్వక కలయిక
ఏలూరు టౌన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ (జేపీ) మర్యాదపూర్వకంగా కలిశారు. ఏలూరు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ, పార్టీ కమిటీల నియామకం, డిజిటలైజేషన్ వంటి అంశాలపై అధినేత వైఎస్ జగన్ పార్టీ సమన్వయకర్త జేపీని ఆరా తీశారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు మరింత ఉత్సాహంగా, క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారని జేపీ తెలిపారు. ఏలూరు (టూటౌన్): పెండింగ్లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం సుధీర్ ఆధ్వర్యంలో మంగళవారం ఏలూరు డీఆర్ఓ వి విశ్వేశ్వరరావుకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరిస్తామని, మెరుగైన పీఆర్సీ, ఐఆర్ ఇస్తామని నమ్మబలికి ఇప్పటికీ ప్రకటించకపోవడం దారుణమన్నారు. నాలుగు డీఏలను పెండింగ్ పెట్టడం, పీఆర్సీ కమిటీని వేయకపోవడం, ఉద్యోగ ఉపాధ్యాయులను తీవ్ర ఇబ్బందులకు గురి చేయటం బాధాకరం అన్నారు. ఏలూరు (టూటౌన్): భారత్ అలీన విధానానికి కట్టుబడి ఉండాలని, యుద్ధోన్మాదాన్ని వ్యతిరేకించాలని, పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.బలరాం, కే.ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఏలూరు సీపీఎం విస్తృత స్థాయి సమావేశం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె.శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఇరాన్పై దాడితో ఇండియా పరిస్థితి దెబ్బతినే అవకాశం ఉందన్నారు. మోదీ ఇరాన్ తరఫున కాకుండా.. అమెరికా వ్యూహంలో భాగస్వామి అయ్యారని, ఇజ్రాయెల్ తరఫున స్పందించి దేశ ప్రతిష్టను దిగజార్చారని తెలిపారు. వంట గ్యాస్ సిలిండర్ రూ.60, వాణిజ్య సిలిండర్ రూ.115 పెంచడాన్ని ఖండించారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి ఏ.రవి, కార్యదర్శి వర్గ సభ్యులు డీఎన్వీడీ ప్రసాద్, ఆర్. లింగరాజు తదితరులు పాల్గొన్నారు. పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను సీఎస్ ఎంఆర్ఎస్ బృందం సభ్యులు మంగళవారం పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పనులు జరుగుతున్న తీరు, మట్టి, రాయి నాణ్యతను పరిశీలించారు. సీఎస్ ఎంఆర్ఎస్ న్యూఢిల్లీ నుంచి వచ్చిన బృందం డైరెక్టర్ చిత్ర, జాయింట్ డైరెక్టర్ మనీష్ గుప్త, పీపీఏ జలవనరుల శాఖ వాప్కోస్, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పనులను నాణ్యతను పరిశీలించారు. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కంట్రోలింగ్ విభాగం ఇంజనీరింగ్ అధికారులకు మెటీరియల్ నాణ్యత, కొలతలు, సాంకేతిక విషయాలపై అవగాహన కల్పించారు. జరుగుతున్న ప్రతి పనిపై మట్టి, రాయి నాణ్యతను పరిశీలించి, స్థానిక ల్యాబ్లో కొన్ని పరీక్షలు జరిపారు. మరికొంత మెటీరియల్ను ఢిల్లీలో పరీక్షలు నిర్వహించేందుకు తీసుకువెళుతున్నట్లు ఇంజనీరింగ్ అధికారులు పేర్కొన్నారు. -
తవ్వేకొద్దీ నకిలీలలు
పంచాయతీ నిధుల గోల్మాల్ పంచాయతీల్లో నిధులు దుర్వినియోగంపై లోకాయుక్త ఏకంగా డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమించి విచారణకు ఆదేశించింది. 8లో uబుధవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2026ద్వారకాతిరుమల: చిన్నవెంకన్న ఆలయంలో తవ్వేకొద్దీ నకి‘లీలలు’ బయటపడుతున్నాయి. రూ. 200 నకిలీ దర్శనం టికెట్ల విక్రయాలు దేవాలయ ప్రతిష్ఠను దెబ్బతీశాయి. ఈ కేసు విచారణ శరవేగంగా జరుగుతోంది. దాంతో రోజుకో ఉద్యోగి అక్రమాలు బయట పడుతున్నాయి. మొదటి నుంచి దర్శనం టికెట్ల గోల్మాల్పై ‘సాక్షి’లో ప్రచురితమవుతున్న వరుస కథనాలు సంచలనంగా మారాయి. ఈ నెల 15న టికెట్ కౌంటర్లో ఐఎస్జే రాజు రూ.200ల 61 నకిలీ దర్శనం టికెట్లు విక్రయించినట్టు ఆలయ అధికారులు గుర్తించారు. దేవస్థానానికి సంబంధం లేని మరో సాఫ్ట్వేర్ ద్వారా తయారు చేసిన టికెట్లను పెన్డ్రైవ్లో వేసుకొచ్చి, వాటిని ప్రింట్లు తీసి భక్తులకు విక్రయిస్తున్నట్టు తెలుసుకున్నారు. దీనిపై ఆలయ ఈఓ యర్రంశెట్టి భద్రాజీ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్సై టి.సుధీర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే రాజు, సెక్యురిటీ గార్డు మేకా సతీష్పై కేసు నమోదు చేసిన ఎస్సై, మరో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఎ.వీరబాబును విచారించారు. మరికొందరి పాత్రపై ఆరా మరి కొందరు ఉద్యోగుల పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ‘సాక్షి’లో మంగళవారం శ్రీవారి సొమ్ము ‘అవుట్’ సోర్సింగ్ శీర్షికన కథనం ప్రచురితమైంది. వెంటనే స్పందించిన ఆలయ అధికారులు రూ.200 దర్శనం టికెట్ల కౌంటర్లోని పాత సీసీ ఫుటేజీలను పరిశీలిస్తుండగా, ఈ ఏడాది జనవరి 31న ఉదయం సుమారు 11.20 గంటల సమయంలో శేషు పెన్డ్రైవ్ పెట్టి నకిలీ టికెట్లు ప్రింట్ తీయడాన్ని గుర్తించారు. అధికారుల సమాచారంతో పోలీసులు శేషుని టికెట్ కౌంటర్ వద్ద మధ్యాహ్నం అదుపులోకి తీసుకుని, పోలీస్టేషన్కు తరలించారు. పెన్డ్రైవ్ అందించిన వ్యక్తి ఎవరు? నిందితులు వినియోగిస్తున్న సాఫ్ట్వేర్ ఎవరు తయారు చేశారు.. దాని మూలాలు ఎక్కడ ఉన్నాయి.. ఈ నకిలీ టికెట్ల వ్యవహారంలో ఇంకెంత మంది పాత్ర ఉందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది జనవరి 19న ఓ వ్యక్తి క్యూలైన్లో టికెట్ కౌంటర్ వద్దకు వెళ్లి నిందితుడికి పెన్డ్రైవ్ అందించినట్టు గుర్తించారు. అయితే ఎవరా వ్యక్తి.. ఎక్కడి నుంచి వచ్చాడనే విషయాలు తెలియరాలేదు. ఆ డబ్బు ఎవరిది? రూ.100 టికెట్ కౌంటర్లో మంగళవారం మధ్యాహ్నం సుమారు 12.45 గంటలకు రూ.4,500 నగదుకు లబ్బరు చుట్టి ఓ మూలన ఉండడాన్ని ఓ ఉద్యోగి గుర్తించాడు. అతడి ద్వారా విషయం తెలుసుకున్న అధికారులు ఆ నగదును స్థానిక పోలీస్టేషన్లో అప్పగించేందుకు వెళ్లగా, డిపార్ట్మెంట్ ఎంక్వయిరీ జరిపించి, అనుమానితులను గుర్తించి ఫిర్యాదు చేయాలని ఎస్సై వారికి సూచించారు. దాంతో అధికారులు వెనుదిరిగారు. నకిలీ టికెట్ల వ్యవహారంలో విచారణ జరుగుతోంది. ఇప్పటికే ఇద్దరిపై కేసు నమోదు చేశాం. మరో ఇద్దరు అనుమానితులను విచారిస్తున్నాం. త్వరితగతిన దర్యాప్తును పూర్తి చేస్తాం. – టి.సుధీర్, ద్వారకాతిరుమల ఎస్సై శ్రీవారి కొండపై బయటపడుతున్న అక్రమాలు రూ.200 నకిలీ దర్శనం టికెట్ల కేసు దర్యాప్తు ముమ్మరం మరో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు -
ఉత్తమ ప్రదర్శనగా అమ్మ చెక్కిన బొమ్మ
పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లు కళాపరిషత్ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా జరిగిన జాతీయ స్థాయి నాటికల పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. ఈ మూడు రోజులు ప్రదర్శనలో ఏడు నాటికలను ప్రదర్శించారు. వీటిలో గోవాడ క్రియేషన్స్ హైదరాబాద్ వారి అమ్మ చెక్కిన బొమ్మ ఉత్తమ ప్రదర్శనగా నిలిచింది. ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా చైతన్య కళాభారతి కరీంనగర్ ఖరీదైన జైళ్లు, తృతీయ ఉత్తమ ప్రదర్శనగా అభినయ ఆర్ట్స్ సహన, జ్యూరీ ప్రదర్శనగా ఉషోదయ కళానికేతన్ కట్రపాడు వారి మంచి మనసులు నాటికలు ఎంపికయ్యాయి. ఉత్తమ నటుడిగా గంగోత్రి సాయి, ఉత్తమ నటిగా బి.నాగరాణి, ప్రతి నాయకుడిగా అద్దేపల్లి లక్షణశాస్త్రి, ఉత్తమ హాస్యనటుడిగా టి.సుబ్బారావు ఎన్నికయ్యారు. న్యాయ నిర్ణేతలుగా లండ రుద్రమూర్తి బిలాయి, గెద్ద వరప్రసాద్ విజయనగరం, గుత్తు చిన్నారావు, శ్రీకాకుళం వ్యవహరించారు. కళాపరిషత్ అధ్యక్షులు కేవీ కృష్ణవర్మ, మానాపురం సత్యనారాయణ, మేడికొండ శ్రీనివాసరావు, విఠాకుల రమణ, జక్కంపూడి కుమార్, కొనిజేటి గుప్త, రెడ్డి వాసు పాల్గొన్నారు. -
అధికారం అండతో పొట్టగొట్టారు
● దళిత రైతుపై దారుణం ● మామిడి తోట నరికేసి.. గ్రావెల్ తరలించుకుపోయిన వైనం ఆగిరిపల్లి (ఏలూరు): అధికారం ఉందనే అహంకారంతో, మంత్రి పార్థసారథి అండ చూసుకుని నిరుపేద దళిత రైతు రమేష్ మామిడి తోట నరికేయడంతోపాటు అందులోని గ్రావెల్ అక్రమంగా తవ్వేసి లారీల్లో తరలించుకుని సొమ్ము చేసుకోవడం దారుణమని వైఎస్సార్సీపీ నేత, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గుడిమళ్ల కృష్ణంరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత రైతుకు మద్దతుగా టీడీపీ నేతల దురాగతాన్ని తీవ్రంగా ఖండించారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం చొప్పరమెట్ల రెవెన్యూ పరిధిలో వలస గట్టు దిగువన ఉన్న దళిత రైతు గుడ్డేటి రమేష్కు చెందిన ఎకరం 96 సెంట్ల మామిడి తోటను రైతు ఊరిలో లేని సమయంలో అధికార పార్టీ నాయకులు వారం రోజుల నుంచి నరికేసి... జేసీబీలతో గ్రావెల్ తవ్వి లారీల్లో తరలించి సొమ్ము చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సమాచారం తెలుసుకున్న నూజివీడు నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకులు సోమవారం రైతు భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ రైతు మామిడి తోటను నాశనం చేసిన అధికార పార్టీ నాయకులను వెంటనే అరెస్ట్ చేసి, బాధితుడికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పల్లగాని నరసింహారావు, రైతు సంఘం అధ్యక్షుడు ఈలప్రోలు సుబ్బయ్య మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు మంత్రి అండదండలు చూసుకుని మండలంలో విచ్చలవిడిగా గ్రావెల్ తరలిస్తున్నారని ఆరోపించారు. అక్రమ మైనింగ్తో లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నా రెవెన్యూ, మైనింగ్, పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మామిడి తోట ఎందుకు నరికారని రైతు ప్రశ్నిస్తే.. ‘మామిడి తోట కొన్నాను.. ఇది నాది’ అంటూ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు నక్కనబోయిన వేణు బాధిత రైతును బెదిరిస్తున్నాడని చెప్పారు. ‘ఒకవేళ వేణు కొంటే రైతు దగ్గర పట్టాదారు పాసుపుస్తకం ఎలా ఉంది’ అని వారు ప్రశ్నించారు. ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి మామిడి తోటను ధ్వంసం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసు నమోదు చేయించి, నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఘటనాస్థలిని సందర్శించినవారిలో వైఎస్సార్సీపీ నేతలు శీలం రాము, పావన జ్యోతి సుజన కుమారి, పోలిమెట్ల శివ, పిల్లా చరణ్, భాస్కర్ ప్రసాద్, గుర్రం శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
రొయ్యల ధరలపై యుద్ధ ప్రభావం
భీమవరం: ఇజ్రాయిల్, అమెరికా, ఇరాన్ యుద్ధం కారణంగా ఆక్వా రంగానికి తీవ్ర నష్టం ఏర్పడిందని ఫీడ్ ధరలు పెంచేసి రొయ్యలు, చేపలు రేట్లు తగ్గించేశారని ఆంధ్రప్రదేశ్ రైతు కార్యాచరణ సమితి అధ్యక్షుడు పాతపాటి మురళీరామరాజు ఆవేదన వ్యక్తం చేశారు. భీమవరంలో సమితి గౌరవాధ్యక్షుడు కలిదిండి గోపాలకృష్ణంరాజు నివాసం వద్ద నిర్వహించిన రైతు కార్యాచరణ సమితి సమావేశంలో ఆయన మాట్లాడారు. రొయ్యలు, చేపల ఎగుమతులు నిలిచిపోవడాన్ని సాకుగా చూపి వ్యాపారులు ధరలు తగ్గించారన్నారు. మరో పక్క మేత ధరలు రోజు రోజుకు పెరిగిపోవడం పెట్టుబడులు పెరిగి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మురళీరామరాజు ఆందోళన వ్యక్తం చేశారు. యుద్దం మరిన్ని రోజులు కొనసాగుతాయంటూ వ్యాపారులు ప్రచారం చేసి తక్కువ కౌంట్లోనే రొయ్యల పట్టుబడిపట్టే విధంగా ప్రోత్సహిస్తున్నారన్నారు. ఆక్వా రైతులందరికీ సబ్సిడీపై విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చినా ఎక్కడా సక్రమంగా అమలు కావడం లేదన్నారు. ఆక్వారంగాన్ని ఆదుకోవాలని మురళీరామరాజు కోరారు. ఈ సమావేశంలో పీఎ రామకృష్ణరాజు, సమితి ప్రధాన కార్యదర్శి తమ్మినీడి నాగేశ్వరరావు, కోశాధికారి గొట్టుముక్కల భీమరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఇలాగైతే నిత్యం ప్రమాదాలే..
ఉండి: ఒకవైపు జిల్లా ఉన్నతాధికారులు ఆక్వాచెరువుల తవ్వకానికి అనుమతులు లేవంటున్నా.. మండలంలో చెరువుల తవ్వకం మాత్రం ఆగడం లేదు. ఇదేంటని ఎవరైనా అడిగితే మాత్రం ఎప్పుడో చెరువు తవ్వుకునేందుకు అనుమతులు తీసేసుకున్నాం అంటున్నారు. ఉండి మండలం పెదపుల్లేరులో ఇటీవలే ఆక్వాచెరువు తవ్వారు. ఏకంగా ఆర్అండ్బీ రోడ్డు మార్జిన్ వరకు తవ్వకం చేశాడు. చెరువు రోడ్డు మార్జిన్ను ఆనుకుని ఉండటంతో వాహనదారులు ఆందోధోళన చెందుతున్నారు. రాత్రి సమయంలో చీకటిగా వుండటంతో ఆటోలు, ద్విచక్రవాహనాలు, కార్లు ప్రమాదానికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయని వాపోతున్నారు. ఈ రహదారి పెదపుల్లేరు గ్రామం నుంచి ప్రారంభమై శివారు ప్రాంతం మేడవరం మీదుగా కాళ్ళ మండలం కోమటిగుంట, సీసలి గ్రామాలలో నుంచి జువ్వలపాలెం రాష్ట్ర రహదారికి చేరుకుంటుంది. కాళ్ళ మండలంలోని రెండు గ్రామాలతో పాటు ఉండి, భీమవరం తదితర ప్రాంతాలకు వెళ్ళే వాహనదారులు ఈ రోడ్డులో ప్రయాణాలు సాగిస్తుంటారు. దీనిపై సిబ్బందిని ఆరాతీయగా సదరు రైతుకు అనుమతి ఉందంటూ సమాధానమిచ్చారు. సదరు రైతు కూటమి పార్టీకి చెందినవారని సమాచారం. సాధారణ ప్రజలు రోడ్డు పక్కగా నివాసముంటేనే ఆక్రమణలు అంటూ తొలగించేస్తున్నారు.. మరి కూటమి నాయకులు రోడ్డుకు చేర్చి చెరువులు తవ్వేస్తే పట్టించుకోరా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనిపై మత్స్యశాఖ అధికారి ఎఫ్డీఓ సీహెచ్ రాంబాబును ఆరా తీయగా తాను ఎవరికీ అనుమతి ఇవ్వలేదని గతంలో అనుమతి తెచ్చుకుంటే మాత్రం ఐదేళ్ళ వరకు వ్యాలిడిటీ ఉంటుందని తెలిపారు. నిబంధనల మేరకు తవ్వకం చేయాలని లేకుంటే చర్యలు తీసుకుంటామని అన్నారు. పెదపుల్లేరు చెరువును పరిశీలిస్తానని అన్నారు. -
ఉత్తమ హాస్య నాటికగా ఎంపిక
పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లు) పట్టణానికి చెందిన విశ్రాంత డిప్యూటీ తహశీల్దార్, రచయిత వీరా పోతన రచించిన భలేటి నమూనా జూస్కో నాటిక ఆరవింద ఆర్ట్స్ సంస్థ ఎంపిక చేసిన 50 ఉత్తమ హాస్య, వ్యంగ్య నాటికల్లో ఒకటి ఎంపికై ంది. 50 నాటికల్లో తాను రచించిన వ్యంగ్య నాటిక ఎంపికవడం అదృష్టంగా భావిస్తున్నానని పోతన తెలిపారు. ఆదివారం రాత్రి హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీలో పుస్తకాన్ని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ చేతుల మీదుగా ఆవిష్కరించారన్నారు. పోతన నాటిక ఎంపిక పట్ల పట్టణంలో కళాకారులు, కళాభిమానులు, అభినందనలు తెలిపారు. దెందులూరు: అనుమానాస్పద స్థితిలో యువతి మృతి చెందింది. సానిగూడెం గ్రామానికి చెందిన వేముల తిరుపతమ్మ(19) ఇంటి వద్ద ఎవరూ లేరు సమయంలో సోమవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. గమనించిన బంధువులు ఆమెను ఏలూరు సర్వజన ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. భీమవరం: యూత్ హాస్టల్స్ అసోసియేషన్ అఫ్ ఇండియా(వైహెచ్ఏఐ) భీమవరం యూనిట్ వరుసగా మూడేళ్లుగా రాష్ట్ర స్థాయి అత్యుత్తమ సంఘంగా ఎంపికై ంది. ఈ సందర్బంగా ఆదివారం అరకు సమీపంలో గిరిజన గ్రామదర్శినిలో భీమవరం యూనిట్కు ఉత్తమ యూత్ హాస్టల్ పురస్కారం అందించినట్లు భీమవరం డిస్ట్రిక్ట్ యూనిట్ చైర్మన్ మట్లపూడి సత్యనారాయణ చెప్పారు. ఉండి: అసలే మండుటెండలు ఆపై మొరాయిస్తున్న ఆర్టీసీ బస్సులు... ఆదివారం ఒకటి, సోమవారం మరొకటి. సోమవారం ఉండి సెంటర్లో భీమవరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నిలిచిపోయింది. చేసేది లేక బస్సులోని ప్రయాణికులు బస్సును నెట్టడంతో కొంతసేపటికి నెమ్మదిగా స్టార్ట్ అయ్యింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని అధికారులు బస్సు కండీషన్ను పరిశీలించాలని బస్సులు ఆగిపోతే ప్రయాణికుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. పాలకోడేరు: ఇంటికి తాళాలు వేసి పెళ్లికి వెళ్లి వచ్చేసరికి బంగారం, వెండి అపహరించుకుపోయారు. బాధితుల కథనం ప్రకారం శృంగవృక్షంలోని సాయిబాబా గుడి పక్కన ఉంటున్న కచ్చెట్టి అలివేలు మంగతాయారు, భర్త, కూతురితో కలిసి ఈ నెల 10న బంధువుల ఇంటికి పెళ్లికి వెళ్ళారు. మళ్లీ 13న వచ్చేసరికి ఇంటి తాళాలు బద్ధలుకొట్టి, బంగారం, వెండి, నగదు అపహరించుకు పోయినట్లు గుర్తించారు. 7 కాసుల బంగారం వస్తువులు, 40 తులాల వెండి ఆభరణాలు, 17 వేల నగదు అపహరించుకు పోయారని వీటి విలువ రూ.10 లక్షలు ఉంటుందని బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఎస్సై రవివర్మ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ద్వారకాతిరుమల: మండలంలోని తిరుమలంపాలెంలోని ఓ ఇంట్లో సోమవారం మధ్యాహ్నం చోరీ జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మిడతా లక్ష్మణరావు స్థానికంగా ఉన్న గుడికి వెళ్లాడు. అతని భార్య గేదెలను మేపేందుకు పొలానికి వెళ్లగా.. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో చిలుకూరి కొండయ్య లక్ష్మణరావుకు ఫోన్ చేసి, మీ ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పాడు. దీంతో లక్ష్మణరావు ఇంటికి వెళ్లి చూడగా ఇంటి పైకప్పు నుంచి గుర్తు తెలియని వ్యక్తులు లోపలికి ప్రవేశించినట్టు గుర్తించారు. బీరువా పగులగొట్టి అందులోని రూ.70 వేల నగదు, 10 తులాల వెండి వస్తువులను చోరీ చేసినట్టు గుర్తించాడు. లక్ష్మణరావు ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై టి.సుధీర్ తెలిపారు. -
ఓవరాల్ చాంపియన్గా వెంకట్రామన్నగూడెం
తాడేపల్లిగూడెం: మూడు రోజుల పాటు ఉద్యాన వర్సిటీ వెంకట్రామన్నగూడెంలో జరిగిన 12వ అంతర్ కళాశాలల పోటీల్లో వెంకట్రామన్నగూడెం జట్లు ఓవరాల్ చాంపియన్గా నిలిచాయి. రిలే పోటీలు, బాస్కెట్బాల్, కబడ్డీ, జావెలిన్ త్రో, డిస్కస్ త్రో వంటి అన్ని పోటీల్లో అత్యుత్తమ కనపర్చిన వీఆర్గూడెం ఉద్యాన కళాశాల జట్లు విజయకేతనం ఎగురవేశాయి. ఆదివారం రాత్రి ముగింపు సందర్బంగా ట్రోఫీలను ఉద్యానవర్సిటీ ఉపకులపతి డాక్టర్ కె.ధనుంజయరావు, రిజిస్ట్రార్ ఎం.మాధవి, డాక్టర్ చలపతిరావు తదితరులు అందజేశారు. -
జూన్లో రైతు సంఘం మహాసభలు
ఏలూరు (టూటౌన్): జూన్ 3, 4, 5 తేదీల్లో ఏలూరులో రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్ రెడ్డి చెప్పారు. సోమవారం ఏలూరులో మాట్లాడుతూ జూన్ 3న వేలాది మంది రైతులతో భారీ ప్రదర్శన, బహిరంగ సభ, మూడు రోజులపాటు 500 మంది రైతు ప్రతినిధులతో ప్రతినిధుల సభ ఉంటుందని చెప్పారు. జిల్లాలో అన్ని పంటల రైతుల సమస్యలపై, సాగునీటి ప్రాజెక్టులు, ఇతర రైతాంగ సమస్యలపై సదస్సులు, సెమినార్ లు నిర్వహిస్తామని చెప్పారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రచార జాతా కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. రైతు ఉద్యమాల కేంద్రంగా ఉన్న ఏలూరులో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అమెరికా సామ్రాజ్యవాదం సాగిస్తున్న యుద్ధం ఫలితంగా ఎగుమతులు నిలిచిపోయి రాష్ట్రంలోని వివిధ పంటల రైతులు నష్టపోతున్నారని ఆందోళన చేశారు. ఆక్వా, మామిడి, మొక్కజొన్న, కోకో, పొగాకు, అరటి తదితర పంటల రైతులు నష్టపోతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. వివిధ పరిశ్రమలు, పారిశ్రామిక కారిడార్లు, జాతీయ రహదారులు, ఇంకా అనేక రూపాలలో రాష్ట్రంలో లక్షలాది ఎకరాల రైతుల భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుందని విమర్శించారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలోని రైతు సమస్యలు పరిష్కరించాలని కోరారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా ఆగిరిపల్లి మండలంలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన పరిహారం ఇవ్వాలన్నారు. సమావేశంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు, సీనియర్ నాయకులు గుత్తికొండ వెంకటకష్ణారావు, ఉపాధ్యక్షుడు సిరి బత్తుల సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ వివాహిత మృతి
జంగారెడ్డిగూడెం: చికిత్స పొందుతూ వివాహిత మృతిచెందినట్లు ఎస్సై ఎన్వీ ప్రసాద్ తెలిపారు. పట్టణానికి చెందిన నాయుడు దుర్గారావు, మధుశ్రీ(26)లు స్థానిక ఎస్సీపేటలో ఉంటుంన్నారు. ఈ నెల 8వ తేదీన మధుశ్రీ పిల్లలు మట్టి తింటుండగా చూసిన అత్త పార్వతి మధుశ్రీని మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన మధుశ్రీ ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆతహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన భర్త దుర్గారావు, కుటుంబసభ్యులు మధుశ్రీని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మధుశ్రీని గుంటూరు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మధుశ్రీ మృతిచెందింది. భర్త ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
హ్యాండ్బాల్ పోటీలకు ఎంపిక
భీమవరం: సౌత్జోన్ హ్యాండ్బాల్ పోటీలకు భీమవరం విష్ణు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్ధి షేక్ ఖాసిం ఎంపికై నట్లు కళాశాల ఫిజికల్ డైరెక్టర్ ఎం.శ్రీనివాసరావు చెప్పారు. కళాశాలలో సోమవారం విద్యార్థిని అభినందించారు. ఈనెల 15న జెఎన్టీయూకే హ్యాండ్బాల్ సెలక్షన్స్ నిర్వహించగా తమ విద్యార్ధి ఎంపికై నట్లు తెలిపారు. ఈ నెల 17 నుంచి వారం రోజుల పాటు తమిళనాడులో నిర్వహించే సౌత్జోన్ హ్యాండ్బాల్ పోటీల్లో పాల్గొంటాడన్నారు. పాలకోడేరు: మండలంలోని కొండేపూడి శివారు వరిపొలాల్లో పేకాట ఆడుతుండగా పోలీసులు దాడి చేసి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం కొండేపూడి శివారులో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు ఎస్సై తన సిబ్బందితో దాడి చేసి 8 మంది జూదరులను అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ.4,200 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ఎం.రవివర్మ తెలిపారు. -
ప్రమోద్వర్మ ఆచూకీ కోసం గాలింపు
గణపవరం: పిప్పరలో ఉండి పంట కాల్వలో ఈతకు దిగి గల్లంతైన ప్రమోద్వర్మ ఆచూకీ కోసం గాలింపు ముమ్మరంగా జరుగుతుంది. ఆదివారం సాయంత్రం పిప్పర గ్రామానికి చెందిన భూపతిరాజు సుశాంతవర్మ(10), ఇందుకూరి ప్రమోద్వర్మ(11) సరదాగా ఈతకోసం కాల్వలోకి దిగి గల్లంతైన విషయం తెలిసిందే. చీకటిపడినా ఇంటికి రాకపోవడంతో గ్రామంలో వెతికిన కుటుంబసభ్యులకు వీరు కాల్వలో ఈతకుదిగి మునిగిపోయిన విషయం తెలిసింది. వలలతో కాల్వలో గాలించగా సుశాంత్వర్మ మృతదేహం రాత్రి ప్రమాద ప్రదేశానికి కొద్దిదూరంలోనే లభించింది. ప్రమోద్వర్మ ఆచూకీ కోసం గాలించినా లభించలేదు. సోమవారం ఉదయం నుంచి గాలింపు కొనసాగిస్తున్నారు. గణపవరం ఎస్ఐ సంఘటనా స్థలంలో ఉండి గాలింపు చర్యలు పర్యవేక్షిస్తున్నారు. యండగండి లాకులను మూసివేశారు. పిప్పరనుంచి దాదాపు ఏడెనిమిది కిలోమీటర్ల దూరం వరకూ గాలింపు కొనసాగుతుంది. ఉండి పంటకాల్వలో ఈతకు దిగి మృతిచెందిన, గల్లంతైన బాలుర కుటుంబ సభ్యులను ఉంగుటూరు ఎమ్మెల్యే పి.ధర్మరాజు సోమవారం పరామర్శించారు. -
నరసాపురంలో నయా దందా
నరసాపురం: నరసాపురం పాత అంబేశ్వరా థియేటర్ సమీపంలో కనకం సత్యవాణి తన ఇంటికి తాళం వేసి గుమ్మం ఎదుట మూడురోజులుగా కాపలా కాయడం చర్చనీయాంశమైంది. ఒంటరి మహిళలు టార్గెట్గా కొన్ని కబ్జా ముఠాలు తీరప్రాంతంలో ఎలా పేట్రేగిపోతున్నాయో దీంతో వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళ పోలీసులు, అధికార పార్టీ నేతలను కలిసి తన బాధ వెళ్లబోసుకున్నా.. నీ ఇల్లు కబ్జా అయ్యింది, ఏదోరకంగా సెటిల్ చేసుకో అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. భర్త పోయి ఇద్దరు ఆడపిల్లలతో బతుకుతున్న తన ఇంటిని కాపాడాలని సత్యవాణి వేడుకుంటుంది. సత్యవాణి భర్త చనిపోవడంతో తన ఇల్లు 2023లో బేరం పెట్టింది. లిఖితపూడికి చెందిన యాదంరెడ్డి లక్ష్మి, ఆమె భర్త ఇల్లు కొనుగోలు చేస్తామని రూ.63 లక్షలకు బేరం కుదుర్చుకుని రూ.2 లక్షలు అడ్వాన్స్గా ఇచ్చినట్టు సత్యవాణి చెప్పారు. నెలరోజుల తరువాత రిజిస్ట్రేషన్ పెట్టుకుంటామని అప్పటివరకూ ఇంట్లో ఇద్దెకు ఉంటామని దిగి అప్పటి నుంచి ఇంటి ఇద్దె ఇవ్వకుండా, రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా, ఇళ్లు ఖాళీ చేయకుండా ఏడిపిస్తున్నారు. తన ఇల్లు ఖాళీ చేయంచేందుకు సత్యవాణి అనేక ప్రయత్నాలు చేసింది. ఆర్డీవోకు ఫిర్యాదు చేయడంతో పాటు పోలీసులను ఆశ్రయించారు. అయినా ఫలితం లేకపోయింది. పైగా ఎదురు కేసులు పెట్టిస్తున్నారని సత్యవాణి చెబుతున్నారు. కొందరు స్థానిక టీడీపీ నాయకులను కలిస్తే.. నీ ఇల్లు కబ్జా అయ్యిందమ్మా.. సెటిల్ చేసుకోమని సలహాలు ఇస్తున్నారని వాపోయింది. తాజాగా మూడురోజుల క్రితం రూ 1.50 లక్షలు ఇస్తే ఇళ్లు ఖాళీ చేస్తామని చెప్పి డబ్బులు తీసుకుని కొన్ని సామాన్లు తీసుకుని మళ్లీ అడ్డం తిరిగి రూ.5 లక్షలు డిమాండ్ చేయడమే కాకుండా తనపై కేసు పెట్టారన్నారు. దీంతో ఇంటికి తాళం వేసి మూడురోజులుగా కాపలా కూర్చుంటానని వాపోయారు. తీరంలో ఒంటరి మహిళలను టార్గె చేసుకుని రాజకీయ అండదండలతో కొన్ని ముఠాలు ఇస్టానుసారం కబ్జాల పర్వం సాగిస్తున్నారు. ఇళ్లలో అద్దెకు దిగి కబ్జాలు చేయడంతో పాటు దూరప్రాంతాల్లో స్థిరపడిన వారి ఖాళీ స్థలాలు ఆక్రమించడం, వివాదాల్లో ఉన్న భూములను అన్యాక్రాంతం చేసుకోవడం చేస్తున్నారు. ఈ వ్యవహారం మరింత ముదరక ముందే అధికారులు చర్యలు చేపడతారా? ఒత్తిళ్లకు తలొగ్గి ఊరుకుంటారా? అనేది వేచి చూడాలి. ఒంటరి మహిళలే టార్గెట్గా ఇళ్లు కబ్జా -
ఎంపీ పుట్టాను సస్పెండ్ చేయాలి
ఏలూరు (టూటౌన్): డ్రగ్స్ మాఫియాను అరికట్టాలని, డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్కుమార్యాదవ్పై కఠిన చర్యలు తీసుకోవాలని, తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఏలూరులో సోమవారం నిరసన చేపట్టారు. నగరంలో ర్యాలీ నిర్వహించారు. జిల్లా కార్యదర్శి ఎ.రవి అధ్యక్షత వహించగా, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.బలరాం, కె.ప్రభాకరెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్ను అడ్డుకోవాల్సిన ప్రజాప్రతినిధులే డ్రగ్స్ పార్టీలకు వెళ్లడం, పట్టుబడటం సిగ్గుచేటని విమర్శించారు. దీనిపై చంద్రబాబు ప్రభుత్వం మౌనం వహించడం ఏంటని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ విచారణ చేపట్టాలని, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఎంపీలపై వేటు వేస్తున్న బీజేపీ ప్రభుత్వం కూటమి ఎంపీ పుట్టాపై ఎందుకు చర్య లు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. నాయకులు డీఎన్వీడీ ప్రసాద్, ఆర్. లింగరాజు, కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
పసిపిల్లల విక్రయ కేసు దర్యాప్తు ముమ్మరం
సాక్షి టాస్క్ఫోర్స్: పసిపిల్లల విక్రయ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అబ్బిశెట్టి వీరమ్మతో సహా మరో 8 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో ఎవరి పాత్ర ఎంత? సహకరించింది ఎవరూ? సెల్ఫోన్ కాల్డేటా ను సైతం నిశితంగా పరిశీలిస్తున్నారు. ఏలూరు డీ ఎస్పీ శ్రావణ్కుమార్ ఆధ్వర్యంలో కైకలూరు రూరల్ సీఐ వి.రవికుమార్ ఇప్పటికే పోలీసు బృందాలుగా ఏర్పడి కేసు చేధిస్తున్నారు. శిశు సంరక్షణ కేంద్రానికి పిల్లలు నియోజకవర్గంలో మొత్తం ఐదుగురు పిల్లల విక్రయాలు జరిగినట్టు ప్రాథమికంగా అధికారులు తే ల్చారు. వీరిలో ముదినేపల్లి మండలం అన్నవరంలో దంపతులకు విక్రయించిన ఏడాది మూడు నె లల పాప, మండవల్లి మండలం కానుకొల్లులో 15 నెలల బాబు తల్లిదండ్రుల వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ముదినేపల్లి మండలం పెయ్యేరు లో అన్నవరం, కానుకొల్లులో జరిగిన పసిపిల్లల వి క్రయాలపై ముదినేపల్లి తహసీల్దార్ లతీఫ్పాషా, కై కలూరు ఐసీడీఎస్ సీడీపీఓ ఎన్.దీప్తి, ముదినేపల్లి ఎస్సై వీరభ్రదరావులు సోమవారం విచారణ చేశా రు. ఇద్దరు పిల్లలను ఏలూరు శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. విశ్వసనీయ సమాచారం మేరకు పిల్లల్లో ఒకరి అసలు తల్లిదండ్రుల జాడ పోలీసులు గుర్తించారు. అలాగే ముదినేపల్లి మండలం శ్రీహరిపురంలో రెండు నెలల క్రితం ఆడుకుంటూ అదృశ్య మైన ఆకేటి మోక్షిత్ కేసు చిక్కుముడి వీడలేదు. బా లుడి ఆచూకీ పోలీసులు గుర్తించలేకపోతున్నారు. -
అటవీ ప్రాంతాల్లో వసతులపై సమీక్ష
ఏలూరు (టూటౌన్): జిల్లా లోని రిజర్వ్ అటవీ, అభ యారణ్య ప్రాంతాల్లో నివసించే ప్రజలకు తాగునీటి బోర్లు, పైపులైన్లు, రోడ్లు వంటి కనీస సౌకర్యాలు కల్పించే అవకాశాలను పరిశీలించి ని వేదికలను సమర్పించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో సోమవారం రిజ ర్వ్ అటవీ ప్రాంతాలు, అభయారణ్య ప్రాంతాల్లో ప్రజలకు ప్రాథమిక సౌకర్యాల కల్పనపై జేసీ అభి షేక్ గౌడ, జిల్లా అటవీ శాఖాధికారి సందీప్రెడ్డితో కలిసి అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ నూజివీడు, పోలవరం నియోజకవర్గాల్లోని రిజర్వ్ ఫారెస్ట్, అభయారణ్య ప్రాంతాలు, కొల్లేరు అభయారణ్య ప్రాంతాల్లో వసతుల కల్పన, గిరిజన ప్రాంతంలో పీఎం జగన్మన్ కార్యక్రమంలో పేదలకు ఇళ్ల నిర్మాణం, సౌకర్యాల కల్పనకు చర్యలు తీ సుకోవాలన్నారు. డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, ఎస్ఈ లు జెడ్.రమేష్, రమేష్, త్రినాథ్బాబు, హౌసింగ్ అ ధికారి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీవారి సొమ్ము అవుట్ సోర్సింగ్
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న క్షేత్రంలో అధికారుల తీరుపై భక్తులు మండిపడుతున్నారు. నగదు లావాదేవీలు జరిగే ప్రదేశాల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించరాదని దేవదాయ శాఖ కమిషనర్ సర్క్యులర్ ఉన్నా.. అధికారులు బేఖాతరు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఆలయంలో అక్రమాలు, అవకతవకలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. శ్రీవారి క్షేత్రంలో పర్మినెంట్ ఉద్యోగులు సు మారు 70 మంది, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు 160 మంది వరకు పనిచేస్తున్నారు. వీరిలో కొందరు అవుట్ సోర్సింగ్ సిబ్బందిని అధికారులు నగదు లావాదేవీలు జరిగే కీలక విధుల్లో నియమిస్తున్నారు. సర్క్యులర్ ఏం చెబుతోందంటే.. 2020లో జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం.. రాష్ట్రంలో కంప్యూటరైజ్డ్ టికెటింగ్ విధానం అమలులో ఉన్న ఆర్జేసీ, డీసీ, ఏసీ కేడర్ ఆలయాల్లో నగదు లావాదేవీలు జరిగే అన్ని ప్రదేశాల్లో తప్పనిసరిగా రెగ్యులర్ సిబ్బందిని నియమించాలి. అయితే చిన వెంకన్న క్షేత్రంలో మాత్రం కీలక ప్రదేశాల్లో రెగ్యులర్ సిబ్బందిని నియమించే అవకాశం ఉన్నా.. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బందితో పనిచేయిస్తున్నారు. అలాగే ప్రతి ఆరు నెలలకోసారి ఉద్యోగులందరినీ రొటేషన్ పద్ధతిలో అంతర్గత బదిలీలు చేయాలన్న నిబంధనలు ఇక్కడ సక్రమంగా అమలు కావడం లేదు. రాత్రికి రాత్రే ఆర్డర్ మార్చి.. గతంలో కొందరు ఉద్యోగులతో పాటు ఆలయ ప్రధాన కార్యాలయంలోని అకౌంట్స్ విభాగంలో పనిచేసి, ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఎస్జే రాజు, రూ.200 దర్శనం టికెట్ల కౌంటర్లో పనిచేసిన శేషు అనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని మూడు నెలల క్రితం మనమిత్రా ప్రసాదం కౌంటర్ వద్ద నియమించారు. ఆ ఆర్డర్ కాపీని సదరు ఇద్దరు ఉద్యోగులకు, అంతర్గత బదిలీ అయిన మిగిలిన వారికి కూడా ఇచ్చారు. అయితే రాత్రికి రాత్రే మళ్లీ ఆర్డర్ను మార్చి రాజును రూ.100 టికెట్ కౌంటర్కు, అలాగే శేషును రూ.200 కౌంటర్కు (అంటే పాత స్థానానికి) మార్చిన వ్యవహారం ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతోంది. కావాలనే ఓ ఉద్యోగి తనకు నచ్చిన వారిని ఇలాంటి కీలక ప్రదేశాల్లో నియమించి దందాకు సహకరిస్తున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేయాల్సి ఉంది.శ్రీవారి ఆలయంలో అవినీతిని ప్రక్షాళన చేస్తున్నాం. స్వామివారి సొమ్మును స్వాహా చేసే ఏ ఒక్కరినీ విడిచిపెట్టం. రాష్ట్రంలో అవినీతిరహిత ఆలయంగా చిన్నవెంకన్న దేవస్థానాన్ని తీర్చిదిద్దుతాం. – ఎస్వీ సుధాకరరావు, శ్రీవారి దేవస్థానం చైర్మన్ నగదు లావాదేవీలు జరిగే చోట అవుట్ సోర్సింగ్ సిబ్బంది వారిని నియమించొద్దని గతంలోనే సర్క్యులర్ జారీ అయినా పట్టించుకోని ఆలయ అధికారులు రాత్రికి రాత్రే అంతర్గత బదిలీల ఆర్డర్ మార్చేసిన వైనం అధికారుల తీరుతో కొందరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు శ్రీవారి ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. అవినీతి బయటపడిన సందర్భాల్లో కొద్ది రోజులు తాత్కాలికంగా విధుల నుంచి తొలగించి, మళ్లీ పెద్దల సిఫార్సులతో విధుల్లో చేర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే రూ.500 అంతరాలయ దర్శనం టికెట్ల రీప్రింట్పై గతనెల 15న ‘సాక్షి’లో ‘దొడ్డిదారిన శ్రీవారి దర్శనాలు’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన అధికారులు, ఆలయ చైర్మన్ నిఘాను పెంచడంతో అక్రమాలకు చెక్ పడి దేవస్థానం ఆదాయం కూడా పెరిగింది. ఇదే క్రమంలో గత ఆదివారం రూ.200 టికెట్ కౌంటర్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఐఎస్జే రాజు సుమారు 61 నకిలీ దర్శనం టికెట్టు విక్రయించినట్టు గుర్తించిన అధికారులు అతడిని విధుల నుంచి తొలగించారు. అయితే రూ.100 టికెట్ కౌంటర్లోని సీసీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తే మరిన్ని అక్రమాలు బయటపడొచ్చని పలువురు అంటున్నారు. -
ఆచూకీ కోసం గాలింపు
గణపవరం మండలం పిప్పరలో పంట కాలువలో ఈతకు దిగి గల్లంతైన బాలుడు ప్రమోద్వర్మ ఆచూకీ కోసం గాలింపు ముమ్మరంగా జరుగుతోంది. IIలో uమంగళవారం శ్రీ 17 శ్రీ మార్చి శ్రీ 2026సాక్షి ప్రతినిధి, ఏలూరు: పరువు పోయింది.. కేడర్కు ఏం చెప్పుకోవాలో తెలియని పరిస్థితి.. ఎమ్మెల్యేలకు, ఓటు వేసి గెలిపించిన ప్రజలకు ఏం చెప్పాలో అర్థంకాని స్థితి.. ఇదంతా అబద్ధమని చెప్పడానికి ఒక్క ఎమ్మెల్యేగాని, కనీసం బాగా స్నేహం చేస్తున్న జిల్లా మంత్రులుగాని ముందుకు రాకపోవడంతో ఉమ్మడి పశ్చిమలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్కుమార్ పరువు పూర్తిగా పోయింది. జాతీయస్థాయిలో ఏలూరు పరువు తీశారంటూ కార్యకర్తలే సైటెర్లు వేస్తున్న పరిస్థితి. ఇక సోషల్ మీడియాలో అయితే ఎంపీ పుట్టాను తారాస్థాయిలో ఆడుకుంటున్నారు. రాష్ట్రస్థాయిలో హాట్ టాపిక్గా.. ఏలూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మహేష్ శనివారం మొయినాబాద్లో ఫామ్హౌస్లో డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా చిక్కా రు. వైద్యపరీక్షల్లో డ్రగ్స్ తీసుకున్నట్లు తెలంగాణపోలీసులే అధికారికంగా ప్రకటించి అరెస్టు చేసి స్టేషన్ బెయిల్ ఇవ్వడం రాష్ట్రస్థాయిలోనే హాట్టాఫిక్గా మారింది. మరోవైపు జాతీయ స్థాయిలో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన తొలి ఎంపీగా, అదేవిధంగా డ్రగ్స్ కేసులో స్టేషన్ బెయిల్ వచ్చిన మొదటి వ్యక్తిగా ఎంపీ పుట్టా ఖ్యాతి గడించారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్గా మారాయి. ఇక ఎంపీగా గెలుపొందిన నాటి నుంచి జిల్లా రాజకీయాల్లో ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుని కొద్దొగొప్పొ హవా సాగిస్తున్న ఎంపీ పరువు ఒక్క ఘటనతో పూర్తిగా పోయింది. జిల్లాలో లోకేష్ సొంత మనిషి అంటూ కేడర్లో ప్రత్యేక గుర్తింపు పొందిన పుట్టా మహేష్ తలెత్తుకోలేని పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఈ క్రమంలో ఎంపీకి మద్దతుగా మంత్రి కొలుసు పార్థసారథి మొదలు బీజేపీ, జనసేన ఎమ్మెల్యేల వరకూ ఏ ఒక్కరూ కనీసం నోరు మెదపకపోగా పరువు తీశాడంటూ తీవ్రస్థాయిలో సైటెర్లు వేస్తుండటం గమనార్హం. జిల్లాకు ఏం మాత్రం పరిచయం లేకపోయినా తెలుగుదేశం పార్టీలో కీలక నేతల రాజకీయ వారుసుడు కావడంతో జిల్లాకు చెందిన మాగంటి బాబును పక్కన పెట్టి మరీ పుట్టా మహేష్కు రెడ్కార్పెట్ వేశారు. లోకేష్ సొంత మనిషి అంటూ హడావుడి చేశారు. పుట్టా మహేష్ తండ్రి సుధాకర్ ప్రస్తుతం మైదుకూరు ఎమ్మెల్యే, గతంలో టీటీడీ చైర్మన్గా పనిచేశారు. అలాగే టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కు మార్తెను మహేష్యాదవ్ వివాహం చేసుకోవడం, దీంతో పాటు తెలంగాణలోని తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబంతో బంధుత్వం ఉండటంతో తెలుగుదేశం టికెట్ సునాయాసంగా వచ్చింది. అంతే సునాయాసంగా పార్లమెంట్ నియోజకవర్గంలో పుట్టా మహేష్ గెలుపొందిన పరిస్థితి. డ్రగ్స్ వద్దంటూ తన అఫీషియల్ ఖాతాలోపోస్టు పెట్టిన ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ ఎన్నికల ప్రచారంలో డ్రగ్స్ బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందామంటూ నిత్యం సోషల్ మీడియాలో పోస్టులు, ప్రసంగాలతో హడావుడి చేశారు. గడిచిన ఐదేళ్లల్లో 2,107 మంది డ్రగ్స్బారిన పడి మృతి చెందారని, డ్రగ్స్ నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలంటూ విస్తృతంగా ప్రచారం చేశారు. కట్చేస్తే.. అదే డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు పట్టుబడటంతో సోషల్ మీడియాలో ఎంపీని మీమర్స్ ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు. ఘన కీర్తి ఉన్న ఏలూరు పార్లమెంట్ స్థానం నుంచి సూపర్స్టార్ కృష్ణ, కేంద్ర మంత్రులుగా పనిచేసిన బోళ్ల బుల్లిరామయ్య, కా వూరు సాంబశివరావు వంటి వ్యక్తులు పార్లమెంట్ ఖ్యాతిని పెంచితే ప్రస్తుత ఎంపీ పుట్టా చర్యలతో పరువు పోయిందంటూ సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతుండటం గమనార్హం. చెప్పేవి నీతులు.. చేసేవి డ్రగ్ల్బాజీ పనులు పరువు పోయిందిగా..! జాతీయ స్థాయిలో ఏలూరు పార్లమెంట్ పరువు గోవిందా నో డ్రగ్స్ అంటూనే డ్రగ్స్ తీసుకున్న ఎంపీ పుట్టా అడ్డంగా దొరికిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఎంపీ వర్గం ఎంపీ ఘటనపై నోరుమెదపని జిల్లా మంత్రి, టీడీపీ ఎమ్మెల్యేలు ఉమ్మడి పశ్చిమలో హాట్ టాపిక్గా పుట్టా డ్రగ్స్ వ్యవహారం జిల్లాలో తలెత్తుకోలేకపోతున్నామంటూ టీడీపీ నేతల అసహనం -
తొలిరోజు 97.82 శాతం హాజరు
పది పరీక్షలు ప్రారంభం ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలో పదోతరగతి పరీక్షలు సోమవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. తొలిరోజు తెలుగు పరీక్షకు 23,636 మంది విద్యార్థులకు 23,120 మంది హాజరయ్యారు. విద్యార్థుల హాజరు శాతం 97.82గా నమోదైందని డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ తెలిపారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు 50, డిస్ట్రిక్ట్ లెవెల్ అబ్జర్వర్ 5, తాను 6, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ 9 మొత్తంగా 71 కేంద్రాలను తనిఖీ చేసినట్టు చెప్పారు. ఏలూరు (టూటౌన్): కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లు రద్దయ్యేంత వరకూ పోరాడాలని ఐఎఫ్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకటరావు అన్నారు. ఐఎఫ్టీయూ జాతీయ కమిటీ పిలుపు మేరకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా కార్మికశాఖ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించారు. ఏలూరు డీసీఎల్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నానుద్దేశించి ఆయన మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లు దుర్మార్గమన్నారు. లేబర్ కోడ్లు రద్దు చేసే అధికారం మోదీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. అనంతరం జేసీఎల్ ఎ.గణేష్కు వినతిపత్రం అందించారు. ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు కేవీ రమణ, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఈ.గ్రీష్మకుమార్, ఎం.నాగరాజు, నగర ఐఎఫ్టీయూ ప్రధాన కార్యదర్శి యర్రా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
సమాజ ఉద్ధరణకు నాటక రంగం కీలకం
వీరవాసరం: సమాజ ఉద్ధరణకు నాటక రంగం కీలకమని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, వైఎస్సార్సీపీ భీమవరం ఇన్చార్జి చినమిల్లి వెంకటరాయుడు అన్నారు. వీరవాసరం కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అఖిల భారత స్థాయి నాటక పోటీలు ముగింపు సభ సోమవారం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వారు మాట్లా డుతూ సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి నాటకాలు దోహదపడతాయని అన్నారు. నాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని శాసనమండలిలో ప్రస్తావించినట్టు ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ అన్నారు. నాటక సినీ నటి అమృత వర్షిణి, కరాటే క్రీడాకారిణి కవురు అభిలాషను సత్కరించారు. కళాపరిషత్ అధ్యక్షుడు గుండా రామకృష్ణ, మెంటే పార్థసారథి, చవాకుల సత్యనారాయణమూర్తి, గాదిరాజు రామరాజు తదితరులు పాల్గొన్నారు. సందేశాత్మకంగా పోటీలు చిలకమర్తి కళా ప్రాంగణంలో నాటక ప్రదర్శనలు సందేశాత్మకంగా సాగాయి. సాయి ఆర్ట్స్ కొలకలూరు వారి జనరల్ భోగీలు, మానవతా యడ్లపాడు వారి అందరూ మంచి వారే కాని, శ్రీరమణ కళానిలయం గుంటూరు వారి మా తృత్వం నాటికలు ఆకట్టుకున్నాయి. -
రెండో తరగతి బాలికపై వృద్ధుడి అఘాయిత్యం
చింతలపూడి: సభ్య సమాజం తలదించుకునే ఘటన ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఆడుకుంటూ ఉండగా అదే గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండో తరగతి చదువుతున్న ఓ చిన్నారి రెండు రోజుల క్రితం తన ఇంటి ఆవరణలో ఆడుకుంటోంది. అదే గ్రామానికి చెందిన రాముడు (53) ఆ బాలికకు మాయమాటలు చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆ చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. నిందితుడి బారి నుంచి బయటపడిన బాలిక జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. చింతలపూడి పోలీసులు రాముడుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడిని రిమాండ్కు తరలించినట్టు సీఐ క్రాంతికుమార్ తెలిపారు. -
వైభవంగా నూకాలమ్మ జాతర
● 16 కేజీల వెండి చీరతో అమ్మవారి దర్శనం ● 1,008 మంది ముత్తైదువులచే శోభాయాత్ర జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం గ్రామ దేవత నూకాలమ్మ 62వ వార్షిక ఉగాది జాతర ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ (పండు), వెంకట రామలక్ష్మి దంపతులు, ఆలయ చైర్మన్ రొంగల నాగేశ్వరరావుతో కూడిన ఆలయ కమిటీ సారథ్యంలో ఉదయం 6:45కు గరగలు తీయడంతో పాటు ప్రధానార్చకులు కాళ్ళకూరి శంకర మహేష్ శర్మ ఆధ్వర్యంలో పలువురు దంపతులతో కలశస్థాపన చేయించడంతో జాతర వేడుక ప్రారంభమైంది. గ్రామదేవత శ్రీ గంగానమ్మ అమ్మవారి దివ్యాలయం నుంచి శ్రీ గంగానమ్మ అమ్మవారు సింహవాహనంపై 1,008 మంది ముత్తైదువులతో శోభయాత్రగా మంగళవాయిద్యాలు, బాజాభజంత్రీలు, వేదమంత్రాల మధ్య సంప్రదాయ సారెను శోభాయాత్రగా నూకాలమ్మ అమ్మవారికి ఆలయానికి తీసుకువచ్చారు. బ్రహ్మశ్రీ కాళ్ళకూరి సూర్య సత్యశర్మ(సూరిపండు, ఆలమూరు) ముఖ్యఅతిథిగా పాల్గొని పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. కార్యక్రమంలో శ్రీ గంగానమ్మ ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజు, చింతా నాగరాజు, కందుల సురేష్తో కూడిన ఆలయ కమిటీ సభ్యులతోపాటు వీరంపాలెం శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠం ఆధ్యాత్మిక సేవాప్రతినిధి ఈమని శశికుమార్, కేఎల్ఎన్ ధనకుమార్తదితరులు పాల్గొన్నారు. సారెను వేదమంత్రాల నడుమ అందజేసి, అమ్మవార్లకు పూజ, హారతి సమర్పించారు. సుమారు 16 కేజీల వెండి చీర అలంకరణతో అమ్మవారు దర్శనమిచ్చారు. జెడ్పీ చైర్పర్సన్ దంపతులు, పూర్వపు మున్సిపల్ చైర్మన్ దంపతులు ఆలయ శాశ్వత చైర్మన్ దంపతులు అమ్మవారిని దర్శించారు. డాక్టర్ కొమ్మోజు వంశీ కృష్ణ దంపతులు ఈ రోజు అమ్మ వారి ఆలయానికి వచ్చిన భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. వస్త్రాలంకరణ, పుష్పాలంకరణకు యర్రా ప్రసాదరెడ్డి, నాగ స్వరాజ్య లక్ష్మీ దంపతులు, అంకనబోయిన రామచంద్ర వెంకట లక్ష్మి దంపతులు సహకరించారు. సాయంత్రం ఆరుగంటలకు నాలుగు మాడవీధుల్లో గ్రామోత్సవం జరిగింది. అభినయ కూచిపూడి నాట్య అకాడమీ వ్యవస్థాపకురాలు శీలా రూపాదేవి శిష్యబృందంచే కూచిపూడి, భరతనాట్య, జానపద, శాసీ్త్రయ నృత్యప్రదర్శన జరిగింది. -
మండుటెండలో తిప్పలు
ఉండి: భీమవరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జంగారెడ్డిగూడెం బయల్దేరగా.. ఉండి బస్టాండ్ దాటి సెంటర్కు రాగానే ఆగిపోయింది. స్టీరింగ్ పట్టేయడంతో పాటు లోపలి నుంచి ఆయిల్ కారిపోవడంతో స్టీరింగ్ బిగిసిపోయింది. దీంతో మిట్టమధ్యాహ్నం ఉండి సెంటర్లో బస్సు ఆగిపోయింది. ఆ సమయంలో రోడ్డుపై ఎలాంటి వాహనాలు రాకపోవడంతో ప్రయాణికులు పడిగాపులు కాశారు. బస్సు డ్రైవర్ చాలా సేపు కష్టపడి సమస్యను తాత్కాలికంగా పరిష్కరించడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. చాలాసేపటి తరువాత ఉండి సెంటర్ నుండి ఆర్టీసి బస్సు బయల్దేరింది. అధికారులు బస్సుకు రిపేర్ చేయించకపోవడం.. బస్సు కండిషన్ చెక్ చేయకపోవడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. గృహ వినియోగ గ్యాస్ సిలెండర్లు స్వాధీనం ఏలూరు టౌన్: గృహాల్లో వినియోగించే సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే చర్యలు తప్పవని రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి కే.నాగేశ్వరరావు హెచ్చరించారు. ఆయన ఆదేశాలతో ఏలూరు నగరంలో పలు ప్రాంతాల్లోని హోటల్స్లో విజిలెన్స్, రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఏలూరు నగరంలో కార్తికేయ సాయి హోటల్, డాల్ఫిన్ హోటల్, సాయిదుర్గ టిఫిన్స్, శ్రీలక్ష్మి గణపతి కేటరర్స్లో తనిఖీలు చేశారు. 18 గృహ అవసరాలకు వినియోగించే సిలెండర్లను గుర్తించారు. యజమానులపై నిత్యావసరాల చట్టం 1955 మేరకు కేసులు నమోదు చేశామని తెలిపారు. -
ఎండలతో జర భద్రం
● రోజు రోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ● ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలంటున్న డాక్టర్లు బుట్టాయగూడెం: వేసవి ప్రారంభంలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. రానున్న రోజుల్లో ఎండలు మండిపోతాయని ఆందోళన చెందుతున్నారు. ఈ అయితే వేసవిలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సున్నితంగా ఉండేవారు ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఎండల కారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో మనిషి శరీరంలోని అవయవాలు అలసటకు గురై క్షీణించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. వేసవిలో తీసుకోవాల్సిన పండ్లు వేసవికాలంలో పుచ్చకాయ, ఖర్జూరం, దానిమ్మ, కమల, ద్రాక్షతో పాటు తాటిముంజులు కూడా తీసుకోవచ్చు. మసాలా లేని లేదా తక్కువ వేసిన వంటకాలు మాత్రమే తీసుకోవాలి ● సాధారణ రోజుల్లో మనిషి 2–3 లీటర్ల నీరు తాగితే సరిపోతుంది. వేసవిలో 4 నుంచి 5 లీటర్ల నీరు తాగాలి. క్లోరినేషన్ చేసిన నీటిని మాత్రమే తాగాలి. గుంటల్లో, చెరువుల్లో నీరు కలుషితంగా ఉంటుంది. గ్లాసుడు చల్లటి నీటిలో చిటికెడు ఉప్పు, పంచదార, నిమ్మరసం కలుపుకుని తాగాలి. మజ్జిగలో నిమ్మరసం, ఉప్పు తగిన మోతాదులో కలుపుకుని తాగాలి. గంజి, పెసర కడుగులో నిమ్మరసం, ఉప్పు కలుపుకుని తాగితే ఉష్ణ తాపాన్ని చల్లారుస్తుంది. ప్రస్తుతం ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మధ్యాహ్నం సమయంలో ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రజలు ఆహార అలవాట్లు మార్చుకోవాలి. చల్లని పానీయాలు సేవిస్తూ ఉండాలి. అవసరమైతే తప్ప ఎండల సమయంలో బయటకు రాకపోవడం మంచిది. డాక్టర్ ఎస్. నందిని, దొరమామిడి పీహెచ్సీ, బుట్టాయగూడెం మండలం -
ముగిసిన జాతీయ స్థాయి నాటిక పోటీలు
పాలకొల్లు సెంట్రల్: అప్పట్లో ప్రజల్లో చైతన్యం రప్పించడానికి నాటక రంగం ఎంతో ముఖ్య భూమిక పోషించిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఆదివారం పట్టణంలో పాలకొల్లు కళాపరిషత్ ఆధ్వర్యంలో మూడు రోజులు పాటు నిర్వహించిన జాతీయ స్థాయి నాటిక పోటీలు ముగిశాయి. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ పాలకొల్లు అంటేనే కళాకారులకు నిలయమన్నారు. నాటిక పోటీల నేటి యువతరానికి నాటక రంగానికి సంబంధించిన విశిష్టతను అందించేలా కళాపరిషత్ సభ్యులు ప్రోత్సహించాలన్నారు. త్వరలో పట్టణంలో బొండా వెంకట్రాజుగుప్త కళాక్షేత్రాన్ని అందుబాటులోకి తీసుకువస్తానని హామి ఇచ్చారు. ఈ సందర్భంగా భీమవరం చైతన్య భారతి సంగీత నృత్య నాటక పరిషత్ అధ్యక్షుడు రాయప్రోలు భగవాన్ను మంత్రి చేతులుమీదుగా ఘనంగా సత్కరించారు. గత 17 సంవత్సరాలుగా నిర్విరామంగా నాటిక పోటీలు నిర్వహిస్తున్న పాలకొల్లు కళాపరిషత్ సభ్యులను అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో కళాపరిషత్ అధ్యక్షుడు కేవీ కృష్ణవర్మ, మానాపురం సత్యనారాయణ, కర్నేన గౌరునాయుడు, పెచ్చెట్టి బాబు, జివి, మేడికొండ శ్రీనివాసరావు, గోపాలకృష్ణ, కొల్లి నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. అగ్నిసాక్షి నాటిక దృశ్యం వీరవాసరం: వీరవాసరం కళాపరిషత్ సేవా సంఘం ఆధ్వర్యంలో స్వర్గీయ శ్రీమతి గుండా లక్ష్మీ రత్నావతి కళావేదికపై చిలకమర్తి కళా ప్రాంగణంలో నిర్వహిస్తున్న అఖిల భారత స్థాయి నాటిక పోటీల ప్రదర్శనలు సందేశాత్మకంగా సాగుతున్నాయి. భార్యాభర్తల మధ్య ఉండాల్సిన అన్యోన్యత, ప్రేమ చిరస్థాయిగా నిలిచిపోతాయనే కథనంతో చైతన్య కళా స్రవంతి ఉక్కునగరం– విశాఖ వారి అగ్నిసాక్షి నాటక ప్రదర్శన సాగింది. రచన మాడభూషి దివాకర్ బాబు, దర్శకత్వం పి.బాలాజీ నాయక్ వహించారు. క్రాంతి ఆర్ట్స్ థియేటర్– నెల్లూరు వారి ఫోటో నాటిక ద్వితీయ ప్రదర్శనగా సాగింది. రచన తాళాబత్తుల వెంకటేశ్వరరావు, దర్శకత్వం తంబు సురేష్ బాబు వహించారు. ఎస్వీ రంగారావు కళా స్రవంతి –కాకినాడ వారి ఆచమనం నాటిక తృతీయ ప్రదర్శనగా సాగింది. రచన దర్శకత్వం పి వెంకన్న బాబు వహించారు. -
ఉమ్మడి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఎన్నిక
ఏలూరు రూరల్: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహించామని రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, ఎన్నికల అధికారి టి.అప్పారావు ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో అధ్యక్షుడిగా గోకరాజు ఆదిత్య, ఉపాధ్యక్షుడిగా ఎం వీరభద్రరావు, కార్యదర్శిగా వీవీఎస్ఎం శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శిగా కె.సంజీవరావు, కోశాధికారిగా ఎస్వీ సుబ్బారావు, కౌన్సిలర్గా కె బాలజ్శేఖర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని చెప్పారు. బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మండలం కామవరం సమీపంలో అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ప్రత్యేక బస్సుల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. అనంతరం దూపదీప నైవేద్యాలతో అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కై కలూరు: అమ్మా.. పెద్దింట్లమ్మా.. నీ చల్లని ఆశీస్సులు మాపై ప్రసరించవమ్మా.. అంటూ భక్తులు పెద్దింట్లమ్మను ఆర్తీతో వేడుకున్నారు. సమీప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని ఆదివారం దర్శించుకున్నారు. ప్రధానంగా పది పరీక్షలు ప్రారంభం కావడంతో పిల్లల తరపున తల్లిదండ్రులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం వద్ద శ్రీక్యూశ్రీ లైన్లలో భక్తులు వేచివున్నారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఒక్క ఆదివారం రోజున పత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డు ప్రసాదం, గదుల అద్దెలు, అమ్మవారి చిత్రపటాల అమ్మకం, విరాళాలు, వాహనపూజల ద్వారా రూ.2,12,840 ఆదాయం వచ్చిందని తెలిపారు. దెందులూరు: లారీ డ్రైవర్కు కరెంట్ షాక్ కొట్టి మృతి చెందిన వైనమిది. ఈ సంఘటనకు సంబంధించి దెందులూరు ఎస్సై ఆర్.శివాజీ తెలిపిన వివరాల ప్రకారం.. నిడదవోలు గ్రామానికి చెందిన ఎం.అన్నవరం లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. గాలాయిగూడెం మొక్కజొన్న ఫ్యాక్టరీకి లోడు లారీ తీసుకొచ్చాడు. శనివారం రాత్రి లారీ పైకెక్కి మోకు సర్దుతుండగా పైన ఉన్న విద్యుత్ వైర్లు తగిలి కరెంట్ షాక్ తగిలింది. తోటి లారీ డ్రైవర్ చికిత్స నిమిత్తం ఏలూరు వైద్యశాలకు తీసుకు వెళుతుండగా మధ్యలో లారీ డ్రైవర్ అన్నవరం మృతి చెందాడు. మృతుడికి, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తాడేపల్లిగూడెం: మూడు రోజులపాటు డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన వర్సిటీలో జరిగిన 12వ అంతర్ కళాశాల పోటీలు ఆదివారం ముగిశాయి. మహిళల త్రోబాల్లో అనంతరాజుపేట, వెంకట్రామన్నగూడెం జట్లు విజేతలుగా నిలిచాయి. బాస్కెట్బాల్ పురుషుల విభాగంలో వీఆర్ గూడెం, అనంతరాజు పేట రన్నరప్గా నిలిచింది. మహిళల విభాగంలో అనంతరాజుపేట, మార్కాపురం జట్టు జయకేతనం ఎగురవేశాయి. వాలీబాల్ పురుషుల విభాగంలో పులివెందుల, అనంతరాజు పేట జట్లు విజయం సాధించాయి. మహిళల విభాగంలో అనంతరాజు పేట, పార్వతీపురం జట్లు విజేతలుగా నిలిచాయి. రిలే పురుషుల విభాగంలో అనంతపురం. మార్కాపురం జట్లు ప్రతిభ కనపర్చాయి. మహిళల విభాగంలో వెంకట్రామన్నగూడెం ఉద్యాన కళాశాల జట్టు గెలుపొందింది. -
వేరుశెనగ కోతలో జాగ్రత్తలు
చింతలపూడి: భారతదేశంలో పండించే నూనె గింజల పంటల్లో వేరుశెనగ అతి ముఖ్యమైంది. వేరుశెనగ కోతలు పూర్తయ్యాక సరైన జాగ్రత్తలు పాటిస్తే విత్తనాలు రాబోయే కాలంలో పనికి వస్తాయి. లేదంటే పుచ్చుపట్టి పనికి రాకుండా పోతాయి. వేరుశెనగలో కోసిన పంటను తగిన తేమ (9 శాతం) వచ్చే వరకు మొక్క నుంచి కాయలను వేరు చేయడానికి ముందు ఎండ బెట్టాలి. మెట్ట ప్రాంతంలో ప్రస్తుతం వేరుశనగ పంటను భద్రపరుచుకునే పనిలో రైతులు ఉన్నారు. ఈ ఏడాది చింతలపూడి సబ్ డివిజన్లో 200 ఎకరాల్లో రైతులు పంటను వేశారు. విత్తనాలను భద్ర పరుచుకుని వచ్చే పంటకు ఉపయోగించుకోవడంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు వై.సుబ్బారావు సూచనలు చేస్తున్నారు. వేరుశెనగ ఎండబెట్టే విధానం ఇది రెండు రకాలుగా చేయొచ్చు. వేరుశెనగ కాయలు పై భాగానికి వచ్చేటట్లు చెట్లను చిన్న, చిన్న కుప్పలుగా వేయాలి. లేదా మొక్కలను కర్రలకు కట్టి కాయలను పక్కకు వచ్చేలా ఎండబెట్టుకోవచ్చు. తేమశాతం తగ్గించాలి కాయల్లో తేమ శాతం ఎక్కువగా ఉంటే ఎండలో ఆరబెట్టకుండా తేమను 7 నుంచి 8 శాతానికి తీసుకురావాలి. వేడి గాలులను వదిలే పరికరాలను ఇందుకు ఉపయోగించవచ్చు. వేరుశెనగ పంటను నిల్వ చేయడానికి ఒకసారి వాడిన సంచులను మళ్లీ వాడకూడదు. పాలిథీన్ పేపర్ ఉన్న గోనె సంచులు బాగా ఎండిన వేరుశనగ కాయలను నిల్వ చేయడానికి ఉపయోగం. ఎండలో ఆరబెట్టకూడదు రబీ కాలంలో పీకేటప్పుడు ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉంటుంది. కాయలను నేరుగా ఎండలో ఆరబెట్టకూడదు. నీడలో ఆరబెట్టాలి. ఎండతీవ్రత ఉదయం 11 గంటల వరకు సాయంత్రం 4 గంటల తరువాత తక్కువగా ఉంటుంది. ఆయా సమయాల్లో ఆరబెట్టుకోవాలి. ఎండబెట్టే సమయంలో వేరే రకాల కాయలు కలవకుండ చూసుకోవాలి. నిల్వ చేసుకునే విధానం వేరుశెనగ విత్తనం కోసం బాగా ముదిరిన కాయలను నిల్వ చేసుకోవాలి. కాయలను కదిలిస్తే ఘల్లుమని శబ్దం రావాలి, అప్పుడే బాగా ఎండినట్లు అర్థం. కాయలను నిల్వ చేసుకోవడానికి శుభ్రమైన పాలిథీన్ లైనింగ్ ఉన్న గోనె సంచులను వాడాలి. గోనె సంచులను 0.5 శాాతం మలాథియాన్ ద్రావణంలో ముంచి బాగా ఆరబెట్టుకోవాలి. దీని వల్ల కాయల్లోని గింజలకు శిలీంధ్రాల బెడద ఉండదు. వై.సుబ్బారావు, సహాయ వ్యవసాయ సంచాలకుడు -
గ్రావెల్ మాఫియా ఆగడాలు
ఆగిరిపల్లి: మండలంలో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతుంది. అధికారం మాది.. తవ్వేస్తాం.. అధికారులు మమ్మల్ని ఏమి చేయలేరు అన్న రీతిలో బరితెగిస్తున్నారు. కొన్ని రోజుల నుంచి పగలూ రాత్రి తేడా లేకుండా మండలంలోని పలు గ్రామాల్లో అధికార పార్టీ నాయకులు అనుమతులు లేకుండా కొండలను పిండి చేస్తున్నారు. లారీలలో వందలాది ట్రిప్పులను తరలించి జేబులు నింపుకుంటున్నారు. గత మూడు రోజులుగా మంత్రి అనుచరులు అని చెప్పి ఎలాంటి అనుమతులు లేకుండా కల్లుటూరు శివారులో ఉన్న అసైన్మెంట్ భూమిలో కొండను తవ్వి లారీల్లో గ్రావెల్ను బయట ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మంత్రి పార్థసారథి ఫొటోతో కూడిన వాటర్ ట్యాంకర్ తవ్వకాలు జరుగుతున్న ప్రదేశంలో నీటిని చల్లుతున్న వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండడంతో మండల ప్రజలు అవాక్కవుతున్నారు. ఆదివారం ఉదయం పత్రికా విలేకరులు గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లారని సమాచారంతో రెవెన్యూ అధికారులు హుటాహుటిన వెళ్లి సంఘటన స్థలంలో ఉన్న పొక్లెయిన్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అమ్మవారి గూడెంలో మాలగట్టును అక్రమార్కులు కొన్ని నెలల నుంచి ప్రతిరోజు రాత్రి తవ్వేయడంతో అక్కడ తాడిచెట్టు లోతులో గొయ్యి ఏర్పడింది. మైనింగ్ అధికారులు మాత్రం మాఫియాపై చర్యలు తీసుకోవడం లేదు. కొన్ని రోజుల క్రితం తవ్వకాలు జరుగుతున్నాయని సమాచారం రావడంతో మహిళా రెవెన్యూ అధికారి అక్కడికి వెళ్లగా.. తవ్వకాలు ఆపం, ఏం చేసుకుంటావో చేసుకో అని బెదిరించారు. పోతవరప్పాడుచెరువు, ఆగిరిపల్లిలోని అగ్గిరాయి చెరువులో ఇష్టానుసారంగా మట్టిని తవ్వేస్తున్నారు. సామాన్య ప్రజలు ఇంటి కోసం ట్రాక్టర్ మట్టిని తవ్వుకుంటే అధికారులు వచ్చి ట్రాక్టర్లు సీజ్ చేస్తారు. అధికార పార్టీకి చెందిన నాయకులు గ్రావెల్, మట్టిని అక్రమంగా తరలిస్తున్న పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. -
పోలీసుల కార్డన్ సెర్చ్
తణుకు అర్బన్: ఆపరేషన్ వజ్ర ప్రహార్లో భాగంగా తణుకు పట్టణంలోని ఇరగవరం కాలనీలో ఆదివారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తణుకు రూరల్ సీఐ దేశంశెట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో 60 మంది పోలీసులు పాల్గొన్నారు. పత్రాలు లేని 14 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనుమానిత వ్యక్తులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. స్థానిక ప్రజలకు గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించారు. పెదవేగి: రాట్నాలకుంటలో వేంచేసిన రాట్నాలమ్మను ఆదివారం జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలు, వివిధ సేవల రూపేణా మొత్తం రూ.114,938, ఆదాయం లభించిందని దేవస్థాన ఉత్సవ కమిటీ చైర్మన్ చెప్పారు. -
అక్షరాంధ్రలో మొదటి స్థానంలో నిలవాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): అక్షరాంధ్ర అభ్యాసకులు ఫైనల్ పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆకాంక్షించారు. స్థానిక 23వ డివిజన్ ఫిరంగులదిబ్బ శ్రీ సాయీశ్వరి మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో ఆదివారం అక్షరాంధ్ర పరీక్షలను ఆమె పరిశీలించారు. జిల్లాలోని 588 కేంద్రాల్లో 97,200 మంది అభ్యాసకులు పరీక్షలు రాస్తున్నారని, 2,117 మంది పరీక్షల నిర్వాహకులను నియమించామని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో పటిష్ట ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్షల నిర్వహణలో నియమ, నిబంధనలు కచ్చితంగా పా టించాలని, పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలన్నారు. వయోజన విద్యాశాఖ ఉప సంచాలకులు జీసీహెచ్ ప్రభాకర్, మెప్మా పీడీ ఎం.రాజబాబు, తహసీల్దార్ కె.గాయత్రీదేవి పాల్గొన్నారు. -
ఏలూరు పరువు తీశారు
ఏలూరు టౌన్: రాష్ట్రంలో డ్రగ్స్ తీసుకుంటా రో... డ్రగ్స్ విక్ర యాలు చేస్తారో అ లాంటి వారి ఆస్తులు జప్తులు చేస్తామంటూ స్వయంగా సీఎం చంద్రబాబు చెప్పారు. టీడీపీ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యా దవ్ డ్రగ్స్ పార్టీలో దొరికిపోయారు, ఎంపీ పుట్టా మహేష్ ఆస్తులు జప్తు చేస్తారా ? చంద్రబాబూ అంటూ వైఎస్సార్సీపీ ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జి, యువజన విభాగం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జోన్ అధ్యక్షుడు కా రుమూరి సునీల్కుమార్ యాదవ్ తీవ్రస్థాయి లో ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఏలూరు ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, దేశ చరిత్రలో తొలిసారిగా డ్రగ్స్తో ఒక ఎంపీ దొరికిపోవటం బాధాకరమన్నారు. కూటమిలో టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎలాంటి నీచమైన పనులు చేసినా సీఎం చంద్రబాబు నోరు మెదపటం లేదని, హోమంత్రి సైతం డ్రగ్స్ను నిరోధిస్తామని చెబుతున్నారని, అయితే ఎంపీ పుట్టా విషయంలో ఏమి చెబుతారో వేచి చూడాలన్నారు. ఎంపీ పుట్టా ఏలూరు పరువు తీశారని, నైతికత ఉంటే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బుట్టాయగూడెం: డ్రగ్స్ పార్టీలో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్యాదవ్ దొరకడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నా రు. దుద్దుకూరులో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే ఎంపీ ఇక్కడ కొకై న్తో విందులు చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. రా జ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి ఇదెక్కడి బా ధ్యతారాహిత్యం అని ప్రశ్నించారు. ఎంపీ సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. ఎంపీ ప దవి నుంచి మహేష్ను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి నిజానిజాలు బయట పెట్టాలని అన్నారు. ప్రజాప్రతినిధులు సమాజానికి ఆదర్శంగా నిలవాలని, ప్రజల నమ్మకానికి ద్రోహం చేసేలా ప్రవర్తించకూడదని అన్నారు. ఇటువంటి సంఘటనలు ప్రజల్లో రాజకీయ వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తాయని భవిష్యత్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని బాలరాజు కోరారు. అభిషేక్ గౌడ, జేసీ ఏలూరు (టూటౌన్): జిల్లాలో వంట గ్యాస్ సిలిండర్లకు ఎటువంటి కొరత లేకుండా సరఫరాకు పటిష్ట చర్యలు చేపట్టామని జేసీ ఎంజే అభిషేక్ గౌడ తెలిపారు. జిల్లా పౌరసరఫరాల అధికారి (డీసీఎస్ఓ) కార్యాలయంలో జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేశామని, సమస్యలు ఉంటే తెలియజేయవచ్చన్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సెల్ 7569296272 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. ఏలూరు (టూటౌన్): ఏలూరులో సోమవారం శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు సందర్భంగా కలెక్టరేట్లో నిర్వహించాల్సిన పీజీఆర్ఎస్ను రద్దు చేశారు. ఈ మేరకు డీఆర్వో వి.విశ్వేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో పూర్తిగా విఫలమైందని వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి గెడ్డం సుధీర్ ప్రకటనలో తెలిపారు. పీఆర్సీ, ఐఆర్, పెండింగ్ బకాయిల చెల్లింపులో నిలువునా మోసం చేశారని విమర్శించారు. నాలుగు డీఏలు పెండింగ్లో ఉన్నాయని, పీఆర్సీ ఊసే లేదని, ఐఆర్ విషయంలో కూడా మీనమేషాలు లెక్కిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పీఎఫ్, ఏపీజీఎల్ఐ లోన్లు, మెడికల్ బిల్లులు, సరెండర్ లీవ్స్ అన్నీ పెండింగ్లో ఉన్నాయన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్ రాక ఇబ్బంది పడుతున్నారన్నారు. సీపీఎస్ విషయంలోనూ ప్రభు త్వం మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఉపాధ్యాయుల యాప్ భారం తొలగించాలని, ఆటోమేషన్ విధానంతో గందరగోళం నెలకొందన్నారు. సమస్యల పరిష్కారానికి త్వరలో రాష్ట్ర, జిల్లాస్థాయిలో ఉద్యమ కార్యా చరణ చేపట్టనున్నామని వివరించారు. -
ఎంపీ పుట్టాకు నైతిక విలువలు లేవా?
వైఎస్సార్సీపీ చింతలపూడి కన్వీనర్ కంభం విజయరాజు చింతలపూడి కన్వీనర్ విజయరాజు మాట్లాడుతూ నైతిక విలువలు లేని వ్య క్తులకు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం, వారంతా అనైతిక, అసాంఘిక కార్యకలాపాల్లో నిమగ్నమై దొరికిపోవటం రాజకీయాలు భ్రష్టుపట్టాయనేందుకు ని దర్శనంగా ఉందన్నారు. రాష్ట్ర హోం మంత్రి అనిత ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఏలూరు పార్లమెంట్ పరిధిలో ప్లకార్డులు పట్టుకుని డ్రగ్స్ లేకుండా చేస్తామంటూ ప్రచారాలు చేసిన ఎంపీ పుట్టా ప్రజలను తలదించుకునేలా చేశారని విమర్శించారు. టీడీపీ నేతలు ఇప్పటికే రాష్ట్రాన్ని ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారనీ, యువతను మత్తుపదార్థాలకు, మద్యానికి బా నిసలుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారా అంటూ నిలదీశారు. పోలీసులపైనే గన్తో కాల్పులు జ రిపారంటే... డ్రగ్స్ రాకెట్, మాఫియాతో ఎంపీ మహేష్కు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శులు నూకపెయ్యి సుధీర్బాబు, దాసరి రమేష్, వెజ్జు వెంకటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు చేబోయిన వీర్రాజు, నాయకులు మున్నుల జాన్, నెరుసు చిరంజీవి, నాయకులు పల్లి శ్రీనివాస్, తుమరాడ స్రవంతి, జిజ్జువరపు విజయనిర్మల, భాస్కర్ల బాచి తదితరులు పాల్గొన్నారు. -
పారదర్శకత ప్రశ్నార్థకం
ప్రైవేట్ టీచర్లకు ఇన్విజిలేషన్ బాధ్యతలు అనాలోచిత చర్య. 20 ఏళ్లుగా ఇన్విజిలేషన్ విధులు నిర్వహిస్తూ అనుభవజ్ఞులైన ప్రభుత్వ ఉపాధ్యాయులు అందుబాటులో ఉండగా ప్రైవేట్ టీచర్లను భాగస్వాములను చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది. పరీక్షల నిర్వహణలో పారదర్శకతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. –గెడ్డం సుధీర్, వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇన్విజిలేషన్ ఆటోమేషన్ విధానం పూర్తిగా విఫలమైంది. పలు లోపాలు తలెత్తాయి. వాటిని సరిచేయడానికి తిరిగి మండల విద్యాశాఖాధికారులనే ఆశ్రయించాల్సి వచ్చింది. అప్పటికప్పుడు మార్పులు, చేర్పులతో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆటోమేషన్ విధానం లోపభూయిష్టమని ఉపాధ్యాయ సంఘాలు ముందే చెప్పాయి. –గుగ్గులోతు కృష్ణ, ఏపీటీఎఫ్ 1938 రాష్ట్ర అకడమిక్ కన్వీనర్ -
పరీక్షల నిర్వహణ పదిలమేనా..?
ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి చంద్రబాబు ప్ర భుత్వం తీసుకున్న నిర్ణయాలు, విధానాలు అపహా స్యానికి గురయ్యాయి. ఆటోమేషన్, ప్రైవేట్ టీచర్ల ఇన్విజిలేషన్ విమర్శలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో బాలారిష్టాల మధ్య పరీక్షల నిర్వహణ సాగనుందని ఉపాధ్యాయ సంఘాలు విమర్శిస్తున్నాయి. తేలిపోయిన ఆటోమేషన్ ఆటోమేషన్ ఇన్విజిలేషన్ను తొలి నుంచి ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. అయి నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకుండా అ మలు చేసింది. సాఫ్ట్వేర్ నిర్దేశిత ఇన్విజిలేషన్ వి ధుల జాబితాను విడుదల చేయగా పలు లోపాలు బయటపడ్డాయి. ఒక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడిని అదే పాఠశాలలో ఇన్విజిలేషన్ విధులకు కేటాయించడం, ఒక పాఠశాల నుంచి అసలు ఒక్క ఉపాధ్యాయుడికీ విధులు కేటాయించకపోవడం, కొందరిని దూర ప్రాంతాలకు కేటాయించడం వంటి లోపాలు అధికారులకు తలనొప్పిగా మారాయి. చివరికి ఈ జాబితాలోని లోపాలను సరిచేయాలని మళ్లీ డీఈఓలను, ఎంఈఓలను పూరమాయించడంతో ఆటోమేషన్ విధానం తేలిపోయింది. ‘ప్రైవేట్’ ఇన్విజిలేషన్పై అనుమానాలు ప్రైవేట్ టీచర్లను ఇన్విజిలేషన్ విధుల్లోకి తీసుకోవడం అనాలోచిత నిర్ణయమనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో ఎందరో సీని యర్లు ఉండగా ప్రైవేట్ టీచర్లను ఎందుకు తీసుకుంటున్నారనే ప్రశ్నిస్తున్నారు. దీని వల్ల పరీక్షల నిర్వహణ పారదర్శకత ప్రశ్నార్థకం కానుందనే అభిప్రాయం వ్యక్తం మవుతోంది. కార్పొరేట్ విద్యాసంస్థలకు మేలు చేసేలా ఇది ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 24,019 మంది విద్యార్థులు జిల్లాలో 24,019 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 22,990 మంది రెగ్యులర్, 1,029 మంది ఫెయిలైన విద్యార్థులు ఉన్నారు. మొత్తంగా 133 కేంద్రాలను సిద్ధం చేశారు. వీటిలో ఏ కేటగిరీ కేంద్రాలు 41, బీ కేటగిరీ కేంద్రాలు 58, సీ కేటగిరీ కేంద్రాలు 34 ఉన్నాయి. కాగా 8 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి వాటిలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. దూరవిద్య పరీక్షలకు 803 మంది విద్యార్థులకుగాను 11 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం నుంచి ఏప్రిల్ 1 వరకు జరుగనున్నాయి. ఏప్రిల్ 4 నుంచి 13 వరకు ఏలూరులోని సెయింట్ గ్జేవియర్ ఉన్నత పాఠశాలలో మూల్యాంకనం జరుగుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో దూరవిద్యా విధానంలో 10వ తరగతి పరీక్షలు సైతం సోమవారం ప్రారంభమై ఈనెల 28 వరకు జరుగనున్నాయి. తేలిపోయిన ఆటోమేషన్ విధానం ప్రైవేట్ టీచర్ల ఇన్విజిలేషన్పై అనుమానాలు నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు జిల్లాలో 24,019 మంది విద్యార్థులు -
పసిప్రాణం వెలవిల
సాక్షి టాస్క్ఫోర్స్: పసిపిల్లల విక్రయాల ఘటనలతో కై కలూరు నియోజకవర్గ పరువుపోతోంది. ముదినేపల్లి మండల కేంద్రంగా సాగుతున్న దందా గుట్టురట్టవడంతో జిల్లావ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈడేపల్లికి చెందిన ఓ మహిళ విక్రయాల్లో కీలకంగా వ్యహరించడంతో ఆమెను మొదటి ముద్దాయిగా చేర్చారు. లోతైన విచారణ కొనసాగుతోంది. ముదినేపల్లి మండలం శ్రీహరిపురంలో దాదాపు రెండు నెలల క్రితం ఆకేటి మోక్షిత్ అనే రెండున్నరేళ్ల బాబు మిస్సింగ్ కేసుగా నమోదయ్యింది. ప్రస్తుతం పిల్లల విక్రయాల ఘటన వెలుగులోకి రావడంతో మోక్షిత్ అంశం తెరపైకి వచ్చింది. ఐదుగురు పిల్లలు నియోజకవర్గంలో మొత్తం ఐదుగురు పిల్లల విక్రయాలు జరిగినట్టు గుర్తించారు. వీరిలో ముగ్గురు పిల్లల బంధువుల నుంచి దత్తత తీసుకున్నారు. ము దినేపల్లి మండలం అన్నవరం, మండవల్లి మండ లం కానుకొల్లులో ఇద్దరు పిల్లల తల్లిదండ్రుల వివరాలు తెలియాల్సి ఉంది. సంతానలేమితో బాధపడుతున్న మహిళలను గుర్తించి ఆడపిల్లకు రూ.4 లక్షలు, మగపిల్లాడికి రూ.5 లక్షలకు విక్రయిస్తున్నారని సమాచారం. దీంతో ఏలూరు బాలల సంరక్షణ యూనిట్ ఆఫీసర్ డాక్టర్ సీహెచ్ సూర్యచక్రవేణి విచారణ చేపట్టారు. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణిగా రిజిస్టర్ కా కుండా పిల్లలను తీసుకొచ్చిన త ల్లుల వివరాలు సేకరించారు. డొంక కదిలింది ఇలా.. ముదినేపల్లి మండలం అన్నవరానికి చెందిన దూలం రాంప్రసాద్, సునీత దంపతులకు పిల్లలు లేరు. దీంతో దగ్గర బంధువు గోపి ద్వారా ఈ డేపల్లికి చెందిన అబ్బిశెట్టి వీరాకుమారి (వీరమ్మ), రెడ్డమ్మ, ఫరీనా వీరిని కలసి 8 నెలల వయసున్న యషనాశ్రీ అనే పాపను అందించారు. ఇందుకు గాను సునీత దంపతులు వీరమ్మ ద్వారా రూ.3 లక్షలు చెల్లించారు. పాపకు బొమ్మినంపాడు సచివాలయంలో 2024 డిసెంబరు 1న జన్మించినట్టు బర్త్ సర్టిఫికెట్ పొందారు. అలాగే వీరమ్మ ఏలూరు జనని హాస్పటల్లో 2024 సెప్టెంబరు 29న నర్సు మాధురి ద్వారా మగపిల్లాడిని తీసుకుంది. ఇందుకు గాను రూ.30 వేలు చెల్లించారు. ఆ సమయంలో వీరమ్మతో పాటు గోపి, పరసా రాము ఉన్నారు. బాబుకు పరసాత యశ్వంత్ శివరాము అనే పేరు కూడా పెట్టారు. రెండు విక్రయాల్లో కీలకంగా వ్యవహరించిన వీరమ్మ ముదినేపల్లి మండలంలో ఓ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకుడి తల్లి కావడం చర్చనీయాంశమైంది. పిల్లల భవిష్యత్తుకు భరోసా ఎవరూ? పిల్లల మార్పిడితో సంతానం లేని దంపతులకు పెద్ద ఊరట కలగవచ్చు. సమాజంలో ఛీత్కారాలకు ఫుల్స్టాప్ పడవచ్చు. కానీ పసిపిల్లలుగా తీసుకొచ్చి పెంచుకుంటున్నా పిల్లలకు ఇప్పుడు ఆలోచన జ్ఞానం వచ్చింది. వీరు మీ అసలు తల్లిదండ్రులు కాదని బయట వ్యక్తుల ద్వారా తెలిస్తే వారి భవిష్యత్తు ఏంటని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి లేత మనసు పొరల్లో పెంచిన ప్రేమ, కన్న ప్రేమ అనే ఆలోచనలు రేకెత్తుతాయి. పిల్లలను విక్రయించుకున్నారనే అపవాదు సైతం సమాజంలో జీవిస్తున్న వారి తల్లిదండ్రులపై పడుతోంది. చట్టప్రకారం దత్తత ద్వారా పిల్లలను పెంచుకోవడం ఉత్తమ మార్గమని నిపుణులు చెబుతున్నారు. ఇదేం ‘పాప’ం ముదినేపల్లి కేంద్రంగా పసిబిడ్డల విక్రయాలు 9 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు అంగన్వాడీ కేంద్రాల వారీగా పిల్లల ఆరా రెండు నెలలుగా ఆచూకీ తెలియని మోక్షిత్ పిల్లల విక్రయాల ఘటనలో ఏ–1గా అబ్బిశెట్టి వీరమ్మ, అలాగే గోపి, రెడ్డమ్మ, ఫరీనా, పిల్లలను కొనుగోలు చేసిన తల్లిదండ్రులు, ఏలూరు జనని హాస్పటల్ నర్సు మాధురి వంటి 9 మందిపై బీఎన్ఎస్ సెక్షన్ 81, 87 జేజే యాక్టు ప్రకారం కేసును ముదినేపల్లి ఎస్సై వీరభద్రరావు నమోదు చేశారు. ఈ కేసులో ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్కుమార్ మాట్లాడుతూ హిందూ దత్తత యాక్డు, చైల్డ్ ప్రొటెక్షన్ యాక్డు ప్రకారం పిల్లలను దత్తత తీసుకున్నప్పుడు కచ్చితమైన నిబంధనలు పాటించాలన్నారు. కేసు నమోదు చేసి అనుమానితులను విచారిస్తున్నామన్నారు. -
శ్రీవారి క్షేత్రంలో నకిలీ టికెట్ల విక్రయాలు
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమలలోని చినవెంకన్న ఆలయంలో నకిలీ దర్శనం టికెట్ల వ్య వహారం ఆదివారం బయటపడింది. టికెట్ కౌంటర్లో రూ.200 నకిలీ టికెట్లను విక్రయించిన అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఐఎస్జే రాజు (దేవస్థా నంలో కీలక అధికారి కుమారుడు) టికెట్ స్కా నర్, నిఘా నేత్రానికి చిక్కాడు. దీనిపై విచారణ చేపట్టిన దేవస్థానం అధికారులు సుమారు 61 నకిలీ టికెట్లను విక్రయించినట్టు గుర్తించారు. వి వరాలిలా ఉన్నాయి.. రూ.200 క్యూలైన్ వద్ద టి కెట్లు స్కాన్ చేస్తున్న సిబ్బంది మధ్యాహ్నం రెండు టికెట్లు స్కాన్ అవడం లేదని అధికారులకు చెప్పారు. రీసైక్లింగ్ టికెట్లు అయితే ‘టికెట్ ఆ ల్రెడీ స్కాన్డ్’ అని రావాలి. అయితే ‘నాట్ ఫౌండ్’ అని రావడంతో అధికారులకు అనుమానం వచ్చింది. ఈఓ యర్రంశెట్టి భద్రాజీ, ఎగ్జిక్యూ టివ్ ఇంజనీర్ డీవీ భాస్కర్, ఏఈఓ ఎం.దుర్గారావు, సూపరింటెండెంట్ ఐవీ రామారావు విచారణ చేపట్టి, రాత్రి వరకు టికెట్ కౌంటర్లలోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. అయితే ఆ కౌంటర్లో ఆ టికెట్లు విక్రయించిన సదరు ఉ ద్యోగి టికెట్ల విక్రయం నిమిత్తం దేవస్థానం వి నియోగిస్తున్న సాఫ్ట్వేర్కు సమాంతరంగా మరో సాంకేతికతను వినియోగించినట్టు గుర్తించారు. అందువల్లే టికెట్పై పీఓఎస్–3 అని రావాల్సిన కోడ్కు బదులు, పీఓఎస్–1 అని వచ్చినట్టు తె లుసుకున్నారు. ఈ ఘటనపై ఈఓ భద్రాజీ స్థా నిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఐఎస్జే రాజును అధికారులు విధుల నుంచి తొల గించారు. టికెట్లు స్కాన్ కాకపోవడంతో బయటపడ్డ దందా -
ఎంపీ పుట్టా రాజీనామా చేయాలి
ఏలూరు టౌన్: నాడు డ్రగ్స్ రహిత ఏలూరు పార్లమెంట్ చేస్తానంటూ నీతి వాక్యాలు వల్లించిన ఎంపీ పుట్టా మ హేష్ నేడు డ్రగ్స్ తీసుకుని పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారనీ.. వెంటనే ఆయన పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ ఏలూరు కన్వీ నర్ మామిళ్లపల్లి జయప్రకాష్ డిమాండ్ చేశారు. ఏలూరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) నేతృత్వంలో విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. ఎంపీ పుట్టాకు తొలుత ర్యాపిడ్ టెస్ట్లో నెగిటివ్ రాగా... రక్తపరీక్షలో పాజిటివ్ వచ్చిందని ఈగల్ ఎస్పీ గిరిధర్ స్పష్టం చేశారని తెలిపారు. ఈ కేసులో నుంచి ఎంపీ మహేష్ను తప్పించేందుకు శాయశక్తులా ప్రయత్నాలు చేసినా హైదరాబాద్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఉండటంతో సాధ్యం కాలేదన్నారు. గంజాయి, మత్తు పదార్థాలు పూర్తిగా నిరోధిస్తున్నామని సీఎం చంద్రబాబు తరచూ ప్రకటనలు చేస్తున్నారనీ, అయితే వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. సాక్షాత్తు ఒక ఎంపీ ఇలా డ్రగ్స్ కేసులో పట్టుబడటం ఇదే తొలిసారి అన్నారు. ఇలాంటి వ్యక్తి ఏలూరు ఎంపీగా ఉండటం ప్రజల దురదృష్టం అన్నారు. యువతకు ఆదర్శంగా నిలవాల్సిన ఎంపీ మహేష్ డ్రగ్స్ తీసుకుని పట్టుబడటాన్ని ఎలా తీసుకోవాలో చంద్రబాబు చెప్పాలని జేపీ డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ ఏలూరు కన్వీనర్ జేపీ -
జాతీయ స్థాయి నాటిక పోటీలు ప్రారంభం
వీరవాసరం: వీరవాసరం కళాపరిషత్ సేవా సంఘం ఆధ్వర్యంలో చిలకమర్తి లక్ష్మీ నరసింహం కళా ప్రాంగణంలో గుండా లక్ష్మీ రత్నావతి కళా వేదికపై నిర్వహిస్తున్న అఖిల భారత స్థాయి నాటిక పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. నాటక రంగాన్ని ప్రతిఒక్కరూ ఆదరించాలని వక్తలు కోరారు. అనంతరం గుడివాడ వార్ఙి ద్వార బంధాల చంద్రయ్య నాయుడ్ఙు నాటికను ప్రదర్శించారు. స్వాతంత్య్ర పోరాటానికి పునాది వేసిన ద్వారబందాల చంద్రయ్యనాయుడు జీవిత చర్రితను కళ్లకు కట్టినట్లు చూపించిన నాటిక ఆద్యంతం ఆకట్టుకుంది. సమావేశంలో వీరవాసరం కళాపరిషత్ అధ్యక్షుడు గుండా రామకృష్ణ, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పోలిశెట్టి సత్యనారాయణ, వైస్ ఎంపీపీ అడ్డాల శ్రీరామచంద్రమూర్తి, టీవీ సీరియల్ నటి కనకదుర్గ, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ ఆకుల లీలా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
అదరగొట్టిన విద్యార్థులు
తాడేపల్లిగూడెం: వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం వెంకట్రామన్నగూడెంలో జరుగుతున్న 12వ అంతర్ కళాశాలల క్రీడల పోటీల్లో విద్యార్థులు తమ క్రీడా ప్రతిభతో అదరగొట్టారు. బ్యాడ్మింటన్ పోటీలు పురుషుల విభాగంలో ఉద్యానకళాశాల వెంకట్రామన్నగూడెం జట్టు విజేతగా నిలిచింది. అనంతరాజుపేట కళాశాల రన్నర్అప్ అయ్యింది. మహిళల విభాగంలో వెంకట్రామన్నగూడెం జట్టు విజేతగా నిలిచింది. అనంతరాజుపేట జట్టు ద్వితీయ జట్టుగా నిలిచింది. జావెలిన్ త్రోలో పార్వతీపురం ఉద్యాన కళాశాల విద్యార్థి నాని శ్రీహర్ష విజేతగా నిలువగా, పులివెందుల కళాశాల విద్యార్థి ప్రశాంత్ ద్వితీయ స్థానం, వీఆర్గూడెం కళాశాల విద్యార్థి రాహుల్ మూడో స్థానం పొందారు. మహిళల విభాగంలో పార్వతీపురం విద్యార్థి మౌనిక , వీఆర్గూడెం విద్యార్థి అంబిక రెండో స్థానం, పార్వతీపురం విద్యార్థి తృతీయ స్థానంలో నిలిచారు. 800 మీటర్ల పరుగు పందెంలో అనంతరాజుపేట, వీఆర్ గూడెం విద్యార్థులు తర్వాత రెండు స్థానాల్లో నిలిచారు. విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంచడానికి క్రీడలు దోహదం చేశాయని అసోసియేట్ డీన్ డాక్టర్ చలపతిరావు అన్నారు. క్రీడలను ఉపకులపతి ధనుంజయరావు, తదితరులు ఆసక్తిగా తిలకించారు. -
వర్క్ ఇన్స్పెక్టర్ల సస్పెన్షన్పై విచారణ
నూజివీడు : మండలంలోని సుంకొల్లులో గృహ నిర్మాణాలకు సంబంధించిన అవకతవకల విషయంలో మండలంలోని పని చేస్తున్న ఐదుగురు వర్కు ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేసిన విషయమై ఎస్సీ కమిషన్ సభ్యులు సుంకొల్లులో విచారణ నిర్వహించారు. సస్పెండ్కు గురైన వర్క్ ఇన్స్పెక్టర్లు అవకతవకల్లో తమ పాత్ర లేకపోయినా అన్యాయంగా తమను తొలగించారని, తమకు న్యాయం చేయాలని ఎస్సీ కమిషనర్కు అర్జీ పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఎస్సీ కమిషన్ సభ్యులు మేకల భిక్షం, ఆర్.సీతారామ్, పి.గౌతం సుంకొల్లు వచ్చి గృహనిర్మాణశాఖ అధికారులను విచారించారు. అయితే ఈ గ్రామంలో గతంలో పని చేసిన హౌసింగ్ అధికారులు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు కలిసి 42 పాత గృహాలకు బిల్లులు చేసి రూ.59 లక్షల వరకు దుర్వినియోగం చేసినట్లు గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు చేసిన విచారణలోనే తేలింది. ఈ నేపథ్యంలో విచారణకు వచ్చిన ఎస్సీ కమిషన్ సభ్యులు హౌసింగ్ ఈఈ రామోజీ నాయక్, పీడీ సత్యన్నారాయణలపై ప్రశ్నల వర్షం కురిపించారు. స్టీలు, సిమెంట్, ఇసుక కూపన్లు, బిల్లులు జనరేట్ చేసే అధికారం ఎవరికి ఉందంటూ ప్రశ్నించారు. తప్పంతా అధికారులు చేసి వర్క్ ఇన్స్పెక్టర్లను బలిపశువులను చేయడంపై విస్మయం వ్యక్తం చేశారు. ఈ విచారణకు గతంలో సుంకొల్లులో పని చేసిన గ్రామ సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గైర్హాజరవ్వడంపై కమిషన్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
గ్యాస్ ఏజెన్సీలపై విజిలెన్స్ తనిఖీలు
ఏలూరు టౌన్ : జిల్లాలో గృహావసరాల గ్యాస్ సిలిండర్ల వినియోగంలో కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ కే.నాగేశ్వరరావు గ్యాస్ ఏజెన్సీలకు హెచ్చరికలు జారీ చేశారు. ఆయన ఆదేశాలతో ఏలూరు, భీమడోలు గ్రామాల్లో విజిలెన్స్, పౌర సరఫరాలు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా ఏకకాలంలో నాలుగు బృందాలుగా ఏర్పడి గ్యాస్ ఏజెన్సీలపై దాడులు చేశారు. గ్యాస్ ఏజెన్సీల్లో ఆకస్మిక తనిఖీలు చేయగా, నిల్వల్లో ఎలాంటి వ్యత్యాసాలు లేవని అధికారులు తెలిపారు. గృహ వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా సకాలంలో గ్యాస్ సరఫరా చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ఏలూరు నగరంలో మయూర్ హోటల్, వసంతమహాల్ సెంటర్, సితార హోటల్, మౌలాలి ఫాస్ట్ఫుడ్స్ వంటి పలు చోట్ల తనిఖీలు చేయగా... 13 గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తున్నట్లు గుర్తించి కేసులు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ డీఎస్పీ సింగులూరి వెంకటేశ్వరరావు, విజిలెన్స్ సీఐ ప్రసాద్కుమార్, తహసీల్దార్ బీ.కన్యాకుమారి, ఎస్సై సీహెచ్.రంజిత్కుమార్, కే.నాగరాజు, పౌర సరఫరాలు, రెవెన్యూ అధికారులు ఉన్నారు. ఏలూరులో హోటల్స్పై దాడులు -
భక్తులతో శ్రీవారి క్షేత్రం కిటకిట
ద్వారకాతిరుమల: శ్రీవారికి ప్రీతికరమైన రోజు, అందులోనూ రెండో శనివారం కావడంతో చిన్నతిరుపతి క్షేత్రం భక్తులతో పోటెత్తింది. సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనార్ధం ఆలయానికి తరలివచ్చారు. దాంతో క్షేత్ర పరిసరాలు భక్తులతో కిక్కిరిశాయి. ముఖ్యంగా దర్శనం క్యూలైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కల్యాణకట్ట తదితర విభాగాలు భక్తులతో రద్దీగా కనిపించాయి. 140 జంటలు శ్రీవారి నిత్యార్జిత కల్యాణంలో పాల్గొన్నారు. వేలాది మంది భక్తులు స్వామి వారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే అనివేటి మండపంలో పలు భజన మండళ్ల సభ్యులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను అలరించాయి. జంగారెడ్డిగూడెం: మనస్థాపానికి గురై కలుపు మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు హెచ్సీ ఎన్.ఉమామహేశ్వరరావు తెలిపారు. వివరాల ప్రకారం మండలంలోని కేతవరం గ్రామానికి చెందిన కారిశెట్టి వెంకటరెడ్డి (54) వ్యవసాయ కూలీ. ఆరు నెలల క్రితం వెంకటరెడ్డి తన కుమారుడితో కలిసి మోటార్సైకిల్పై వెళుతుండగా, ఇద్దరూ రోడ్డు ప్రమాదానికి గురై గాయపడ్డారు. గాయాల కారణంగా నడవలేని స్థితిలో అప్పటి నుంచి వెంకటరెడ్డి ఇంటి వద్దే ఉంటున్నాడు. దీంతో మానసికంగా కుంగిపోయిన వెంకటరెడ్డి శనివారం ఉదయం పొలానికి వెళ్లి కలుపు మందు తాగాడు. గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే వెంకటరెడ్డిని జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనిపై మృతుని భార్య సుబ్బలక్ష్మి ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్సీ తెలిపారు. వెంకటరెడ్డికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. -
ఉత్సాహంగా నెట్బాల్ సెలెక్షన్లు
భీమవరం: నెట్బాల్ జూనియర్ బాల బాలికలు, సీనియర్ పురుషులు, మహిళల ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా క్రీడాకారుల ఎంపిక భీమవరంలో శనివారం సీఎస్ఎన్ కళాశాలలో నిర్వహించారు. జూనియర్ బాలికల జట్టుకు పి.మానస, పి.అజగవ, ఐ.కీర్తన, ఎ.సంజన, కె.సంజు, జి.లిఖిత, కె.మౌనిక, కె.రాము ఎంపికయ్యారు. మహిళల జట్టుకు కె.భారతి, పి.అక్షయ, జి.శ్రావణి, బాలురు జట్టుకు డి.ఫణింద్ర కుమార్, కె.బాలసాయి రామకృష్ణ, బి.రాజేష్, కె.హనుక్, టి.కేశవ మణికంఠ ఎంపికయ్యారు. పురుషులు జట్టుకు డి.బాల సత్య, జీఎన్వీఎస్ విజయ్ కుమార్ ఎంపికై నట్లు జిల్లా నెట్బాల్ సంఘ కార్యదర్శి పి.దావూద్ఖాన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎస్ఎన్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎండి సలీం ఖాన్, స్కూల్ ప్రిన్సిపాల్ నిర్మలాదేవి, నెట్బాల్ సంఘ సభ్యులు ఎన్.విజయలక్ష్మి, పి.శ్రీనివాస్, జీఎన్వీఎస్ విజయకుమార్ పాల్గొన్నారు. -
గొర్రెల మందపైకి దూసుకెళ్లిన లారీ
ఏలూరు టౌన్ : స్థానిక పెద్ద రైల్వే స్టేషన్ ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక సుమారు 2గంటల సమయంలో గొర్రెల మందపైకి ఒక డీసీఎం లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో గొర్రెలమంద కాపరి తీవ్ర గాయాలపాలై విజయవాడ హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా, ఐదు గొర్రెలు మృత్యువాత పడ్డాయి. వివరాల ప్రకారం కృష్ణాజిల్లా, ఏలూరు జిల్లా ఉంగుటూరు ప్రాంతానికి చెందిన గొర్రెల కాపరులు తమ గొర్రెల మందను మేపుకుంటూ ఏలూరు శివారు పాలగూడెం చేరుకున్నారు. అనంతరం వారంతా కృష్ణాజిల్లా గుడివాడ ప్రాంతానికి వెళ్లేందుకు ఏలూరు వైపు వస్తున్నారు. గొర్రెలతో ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్ ప్రాంతానికి చేరుకునేసరికి రాజమండ్రి వైపు నుంచి ఏలూరు నగరంలోకి వస్తోన్న డీసీఎం లారీ అధిక వేగంతో వస్తూ గొర్రెల మీద నుంచి దూసుకువెళ్ళింది. ఈ ప్రమాదంలో గొర్రెలు కాచే బి.నరసింహకు తీవ్ర గాయలయ్యాయి. వెంటనే ఏలూరు జీజీహెచ్కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అతడిని విజయవాడ తరలించారు. ప్రస్తుతం విజయవాడలోని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఇక ఐదు గొర్రెల మృత్యువాతపడగా, మరో 10 గొర్రెలకు గాయాలయ్యాయి. ఈ మేరకు ఏలూరు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 5 గొర్రెలు మృతి, కాపరికి తీవ్ర గాయాలు -
సామాన్యుల నెత్తిన గుదిబండ
ఆకివీడు: అమెరికా–ఇరాన్ యుద్ధ సెగలు సామాన్యుడి వంటింటిని తాకాయి. గ్యాస్ కొరత ప్రచారాలతో సామాన్యుడు ఉలిక్కిపడుతున్నాడు. ముఖ్యంగా వివాహాది శుభకార్యక్రమాలకు గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడుతోంది. గ్యాస్ వినియోగంలో వాణిజ్య అవసరాలు అధికంగా ఉన్నప్పటికీ వాణిజ్య సిలిండర్లు సరఫరాను ప్రభుత్వం నిలిపివేసింది. గత ఐదు రోజులుగా వాణిజ్య సిలిండర్ల సరఫరా నిలిపివేయండంతో కాఫీ హోటళ్లు, రెస్టారెంట్లు, టీ స్టాల్స్ వంటి చిరు వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో చిరు వ్యాపారాలు మూతపడ్డాయి. కట్టెల కోసం పరుగులు గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, బిర్యానీ పాయింట్ల వ్యాపారస్తులు కట్టెల కోసం పరుగులు తీస్తున్నారు. కట్టెల పొయ్యిలతో బిర్యానీలు తయారు చేసి అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. పుల్లల ధరలు కూడా పెరిగిపోతున్నాయని వాపోతున్నారు. ఫంక్షన్లుకు అవసరమయ్యే గ్యాస్ లభించే అవకాశం లేదని ఆవేదన చెందుతున్నారు. ఓటీపీతో అక్రమార్కులకు కళ్లెం గ్యాస్ బుకింగ్ చేసుకున్న వినియోగదారుడికి 24 గంటల్లో గ్యాస్ సరఫరా చేసే విధంగా ఓటీపీ విధానాన్ని గ్యాస్ కంపెనీలు తీసుకువచ్చాయి. దీంతో అక్రమ వ్యాపారానికి కళ్లెం వేసినట్లు అయ్యింది. గ్యాస్ సిలిండర్ల అక్రమ అమ్మకాలపై కూడా గట్టి నిఽఘా వేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే సిలిండర్లను గ్యాస్ ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవాలని సూచించడంతో వినియోగదారులు తొందరపడుతున్నారు. దీంతో గృహావసరాల బుకింగ్కు ఓటీపీ అమలుజేసి, 45 రోజుల వ్యవధి ప్రకటించారు. దీనివల్ల వినియోగదారులు గ్యాస్ కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. వ్యాపారస్తులు మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాలంటున్నారు. చిరువ్యాపారులకు వారానికి ఒక వాణిజ్య గ్యాస్ బండ సరఫరా చేయాలి. కట్టెల పొయ్యిలతో బిర్యానీ పాయింట్ నడుపుకుంటున్నాం. గ్యాస్ ఇబ్బందులతో తినుబండారాలు, టీ స్టాల్స్, బిర్యానీ పాయింట్లు వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరికొన్ని రోజులు ఇలాగే ఉంటే, ఉపాఽధి కోల్పోయి వీధిన పడాల్సి వస్తుంది. – భీమవరపు ఆలామ్, బిర్యానీ పాయింట్, ఆకివీడు రోజు రోజుకూ పెరుగుతున్న గ్యాస్ గుబులు జిల్లాలో కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిపివేత చిరు వ్యాపారుల విలవిల -
వైభవంగా శోభనాచలుడి శాంతి కల్యాణం
ఆగిరిపల్లి : శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీనరసింహస్వామి వారికి శనివారం శాంతి కల్యాణాన్ని ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. అనంతరం సుదర్శన హోమాన్ని ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం శేషుబాబు, అనంత కృష్ణ ఆధ్వర్యంలో చేశారు. ఉభయ దాతలుగా ఆగిరిపల్లికి చెందిన నంజం రామకృష్ణ, శ్రీ లక్ష్మీ దంపతులు, తిరువూరుకు చెందిన కృష్ణ స్వామి దంపతులు వ్యవహరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. నరసాపురం రూరల్ : మండలంలోని వేములదీవి గ్రామం కాపులకొడపలో ఉన్న శ్రీ వైభవ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో శనివారం స్వామి వారిని లక్ష్మీ నరసింహస్వామిగా అలంకరించారు. ఆలయ అర్చకులు పెద్దింటి అరుణ్కుమార్ ఆచార్యులు స్వామి వారికి విశేష సేవలు, అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అలాగే మధ్యాహ్నం ఆలయ ఆవరణలో అన్నసమారాధన నిర్వహించారు. ఆగిరిపల్లి: ట్రాక్టర్పై కూలీలు ఎక్కించుకుని అతివేగంగా నడిపే డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై శుభశేఖర్ హెచ్చరించారు. శనివారం ఉదయం ఆగిరిపల్లిలో వ్యవసాయ కూలీలను ట్రాక్టర్ ఎక్కించుకుని ప్రమాదకరంగా నడుపుతున్న డ్రైవర్ను ఎస్సై శుభ శేఖర్ వెంబడించి కూలీలను కిందకి దింపి ట్రాక్టర్ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ట్రాక్టర్లను వ్యవసాయ పనుల కోసం మాత్రమే ఉపయోగించాలని, వాటిలో కూలీలను ఎక్కించుకుని రహదారులపై ప్రయాణించడం ప్రమాదకరమన్నారు. మండలంలో ప్రజలను ఎక్కించుకొని ప్రమాదకరంగా వాహనాలు నడిపితే వారి లైసెన్సులు రద్దు చేసి, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పాలకొల్లు సెంట్రల్ : పాలకొల్లు రసధుని సాహితీ సంస్థ సహాయ కార్యదర్శి, రచయిత, కవి మామిడిశెట్టి శ్రీనివాసరావు రచించిన పడి లేచిన కెరటం కథకి ప్రత్యేక బహుమతి లభించింది. ఈ సందర్భంగా రచయిత శ్రీనివాసరావు మాట్లాడుతూ హైదరాబాద్కు చెందిన వాసా ఫౌండేషన్, సాహితీ కిరణం సంయుక్తంగా నిర్వహించిన డాక్టర్ వాసా ప్రభావతి స్మారక కదల పోటీల్లో తన కథకు ప్రత్యేక బహుమతి లభించిందన్నారు. ఈ పోటీలకు 218 కథలు పోటీ పడగా తన కథకు ప్రత్యేక బహుమతి వచ్చిందన్నారు. ఈ సందర్భంగా రసధుని సభ్యులు కొట్టి భాస్కరరావు, యర్రంశెట్టి వెంకటరత్నం, గుడాల హరిబాబు, వంగా నరసింహరావు తదితరులు శ్రీనివాసరావుకు అభినందనలు తెలియజేశారు. ఏలూరు (టూటౌన్): చెక్బౌన్స్ కేసులో నిందితుడికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ శనివారం న్యాయమూర్తి తీర్పునిచ్చారు. వివరాల ప్రకారం ఏలూరు కొత్తపేట గిలకల గేట్ ప్రాంతానికి చెందిన కె. ప్రసాద్ ఆన్లైన్ కొరియర్ బుకింగ్ ఏజెంట్గా పని చేస్తుంటాడు. ఇతను తన కుటుంబ అవసరాల నిమిత్తం ఏలూరు శాంతి నగర్కు చెందిన గూడవల్లి విద్యాసాగర్ వద్ద 2022 అక్టోబర్ నెలలో రూ.6,80,000 అప్పుగా తీసుకున్నారు. ఆ బాకీ తీర్చే నిమిత్తం 2023 సెప్టెంబర్ నెలలోప్రసాద్ బ్యాంక్ చెక్ను అందచేశాడు. ఆ చెక్ ను అందుకున్న విద్యాసాగర్ దాన్ని బ్యాంకులో జమ చేయగా అది బౌన్స్ అయ్యింది. దీంతో బాధితుడు విద్యాసాగర్ తనకు న్యాయం చేయాలంటూ కోర్టును ఆశ్రయించాడు. దీంతో మోసానికి పాల్పడినందుకు నిందితుడు ప్రసాద్కు ఏడాది జైలు శిక్ష విధించి, రూ.6,80,000ను బాధితుడికి చెల్లించాలని ఆదేశించారు. -
శ్రీవారి క్షేత్రంలో కియోస్క్ యంత్రాలు
ద్వారకాతిరుమల : ప్రముఖ దేవాలయాల్లో ఆన్లైన్ సేవలను విస్తృత పరిచేందుకు కియోస్క్ యంత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. కరూర్ వైశ్యా బ్యాంక్ సహకారంతో ప్రభుత్వం 100 కియోస్క్లను భక్తులకు అందుబాటులోకి తెస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ద్వారకాతిరుమల చిన్నవెంకన్న ఆలయంలోని పలు విభాగాల్లో ఏర్పాటు చేసిన ఈ కియోస్క్ యంత్రాలు అతి త్వరలో ప్రారంభం కానున్నాయి. వీటి ద్వారా డిజిటల్ చెల్లింపులు జరిపి సులువుగా దర్శనం, సేవ, ప్రసాదం, కేశఖండన, ఇ–హుండీ, వసతి టికెట్లతో పాటు, ఆలయ సమాచారాన్ని భక్తులు పొందొచ్చని ఆలయ ఈఓ యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. అదేవిధంగా గంటల తరబడి క్యూలైన్లలో నిలబడే అవసరం ఉండదన్నారు. ప్రస్తుతం ఈ కియోస్క్ యంత్రాలను కొండ కింద సమాచార కేంద్రం, కేశ ఖండనశాల, శ్రీ ధర్మ అప్పరాయ నిలయం, ప్రసాదాల కౌంటర్ల సముదాయం, అనివేటి మండపం, పీఆర్వో కార్యాలయం, నిత్య కల్యాణమండపం వద్ద వీటిని ఏర్పాటు చేశారు. భీమవరం: మద్యం మత్తులో భవనంపైనుంచి దూకుతానంటూ యువకుడు హల్చల్ చేశాడు. వివరాల ప్రకారం ఒడిస్సాకు చెందిన కపిలేంద్రనాయక్ శుక్రవారం తల్లి, సోదరితో కలసి రైలులో విజయవాడ బయలుదేరాడు. రాత్రి సమయంలో రైలు భీమవరం వచ్చేసరికి తల్లి, సోదరిని వదిలి దిగిపోయాడు. రాత్రి అంతా స్టేషన్ పరిసర ప్రాంతాల్లో గడిపిన కపిలేంద్రనాయక్ శనివారం ఉదయం పట్టణ పరిధిలోని బైపాస్ రోడ్డులోని ఒక భవనంపైకి ఎక్కి దూకుతానంటూ బెదిరించాడు. దీంతో స్థాని కులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతనికి నచ్చచెప్పి కిందికి దించారు. కపిలేంద్రనాయక్ అతిగా మద్యం సేవించడమేగాక ఖైనీ వంటివి తినడంతో పాటు మతిస్థిమితం లేకపోవడంతో ఈ విధంగా ప్రవర్తించాడని చెబుతున్నారు. నూజివీడు: మండలంలోని రామన్నగూడెం సమీపంలోని పెట్రోలు బంకు వద్ద శనివారం బైక్లు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. వివరాల ప్రకారం పట్టణంలోని బంగినపల్లితోట ప్రాంతానికి చెందిన ఖండవల్లి భానుబాబు(37), దాసరి సత్తిబాబు(50) కలిసి ఉదయం 11.30 గంటల సమయంలో నూజివీడు నుంచి రామన్నగూడెం వెళ్తున్నారు. పెట్రోలు బంకు సమీపంలోకి వెళ్లేసరికి ఎదురుగా వట్టిగుడిపాడుకు చెందిన నాగేశ్వరరావురావు నూజివీడు వెళ్తుండగా రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ఖండవల్లి భానుబాబు మృతిచెందగా దాసరి సత్తిబాబు, నాగేశ్వరరావులకు గాయాలయ్యాయి. మృతదేహాన్ని, క్షతగాత్రులను నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. రూరల్ ఎస్సై ఎన్.లక్ష్మణ్బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నిమ్మదించిన ఎగుమతులు
సామాన్యుల నెత్తిన గుది‘బండ’ అమెరికా–ఇరాన్ యుద్ధ సెగలు సామాన్యుడి వంటింటిని తాకాయి. గ్యాస్ కొరత ప్రచారాలతో సామాన్యుడు ఉలిక్కిపడుతున్నాడు. 8లో uఆదివారం శ్రీ 15 శ్రీ మార్చి శ్రీ 2026ద్వారకాతిరుమల: ఈ ఏడు జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు నిమ్మకాయల ఎగుమతులు నిమ్మదించాయి. ప్రతికూల వాతావరణం కారణంగా సకాలంలో చెట్లు కాపు కాయకపోవడం వల్లే నిమ్మకాయలకు కొరత ఏర్పడింది. ఫలితంగా డిమాండ్ ఏర్పడి నిమ్మకాయల ధరలు పెరిగాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నుంచి ప్రతి ఏటా మార్చి నెలలో రోజుకు 330 టన్నుల నిమ్మకాయలు కలకత్తా, కరగపూర్, బీహార్, భువనేశ్వర్, కటక్, ఒరిస్సా రాష్ట్రాలకు ఎగుమతి అయ్యేవి. కానీ ఈ ఏడు మార్చి ప్రారంభం నుంచి రోజుకు 90 టన్నులు మాత్రమే ఎగుమతి అవుతున్నాయి. గరిష్ట ధర రూ.110 ఏలూరు జిల్లాలో 6,951 ఎకరాల 63 సెంట్లలో నిమ్మ పంట సాగు అవుతోంది. అయితే గతేడాది చివరి వరకు వర్షాలు పడటం, దానికి తోడు ఈ ఏడు మంచు విపరీతంగా కురవడంతో తోటల్లో నిమ్మకాయల దిగుబడి బాగా తగ్గింది. దాంతో కాయల ధరలు ఈనెల మొదటి నుంచి తగ్గుతూ.. పెరుగుతూ, పెరుగుతూ.. తగ్గుతున్నాయి. ఈ క్రమంలో ఈనెల 9 నుంచి 11 వరకు కిలో నిమ్మకాయల ధర గరిష్టంగా రూ.110 పలికింది. ప్రస్తుతం వాటి ధర రూ.75 నుంచి రూ.85 పలుకుతోంది. తీవ్ర సంక్షోభంలో రైతులు ఈ ఏడాది ధరలుంటే.. కాయలు లేక, కాయలుంటే.. ధరలు లేక నిమ్మ రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఆరేళ్ల క్రితం సీజన్లో నిమ్మదిగబడులు విపరీతంగా పెరిగినప్పుడు, సరైన ధరలు లేక రైతులు కాయలను కోసి, రోడ్ల పక్కన పారబోశారు. అయితే ఇప్పుడు పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. కాయల ధర భారీగా ఉన్నా.. తోటల్లో పంట దిగుబడి లేక నిమ్మ ధరలు ఆకాశాన్నంటాయి. దాంతో రైతులు తెల్లముఖం వేస్తున్నారు. సన్న, చిన్నకారు రైతులు ఆందోళన చెందుతున్నారు. అతి పెద్ద ఏలూరు మార్కెట్ నుంచి.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరు, ద్వారకాతిరుమల, గొపన్నపాలెం, జంగారెడ్డిగూడెం, యాదవోలులో నిమ్మకాయల మార్కెట్ యార్డులు ఉన్నాయి. అందులో ఏలూరు మార్కెట్ అంతర్జాతీయ స్థాయిలోనే అతి పెద్దది. రెండవ అతిపెద్ద మార్కెట్ నెల్లూరు జిల్లాలోని గూడూరులో ఉంది. ఏలూరు మార్కెట్ నుంచి ప్రతి ఏటా మార్చి నెలలో రోజుకు 250 టన్నుల నిమ్మకాయలు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అయ్యేవి. ఇప్పుడు అదే మార్కెట్ నుంచి రోజుకు కేవలం 75 టన్నుల నిమ్మకాయలు మాత్రమే ఎగుమతి అవుతున్నాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థమవుతోంది. మండలం విస్తీర్ణం (ఎకరాల్లో) ఆగిరిపల్లి 58.24 బుట్టాయగూడెం 21.36 చాట్రాయి 46.46 చింతలపూడి 208.63 దెందులూరు 754.77 ద్వారకాతిరుమల 1,989.77 ఏలూరు(అర్బన్) 22.74 జంగారెడ్డిగూడెం 768.63 జీలుగుమిల్లి 38.95 కామవరపుకోట 465.17 మండలం విస్తీర్ణం (ఎకరాల్లో) కొయ్యలగూడెం 93.62 కుక్కునూరు 8.28 లింగపాలెం 121.49 ముసునూరు 224.65 నూజివీడు 134.31 పెదపాడు 4.97 పెదవేగి 702.43 టి.నరసాపురం 1,274.79 ఉంగుటూరు 12.37 కాపులేక నిమ్మకాయల ఎగుమతులు ఢమాల్ ప్రతికూల వాతావరణంతో తగ్గిన దిగుబడులు ప్రస్తుతం హెచ్చు తగ్గులతో కొనసాగుతున్న అధిక ధరలు తోటల్లో కాయలు లేక నిమ్మ రైతుల దిగాలు నిమ్మకాయల ఎగుమతులు బాగా పడిపోయాయి. గతేడాది చివర్లో చలి ఎక్కువగా ఉండటం, ఈ ఏడు అధిక మంచు కారణంగా తోటల్లో కాయలు సకాలంలో కాయలేదు. మార్చి మొదట్లో రావాల్సిన దిగుబడులు, ఏప్రిల్ నెలాఖరులో వచ్చేట్టున్నాయి. దాంతో నిమ్మకాయలు లేక ప్రస్తుతం మార్కెట్లు కుదేలయ్యాయి. ఓ పక్క వేసవి ఎండలు ముదురుతుండటంతో ఇళ్లల్లో, వ్యాపార దుకాణాల్లో, పరిశ్రమల్లో నిమ్మకాయల వినియోగం బాగా పెరిగింది. – ముత్తిన సత్యన్నారాయణ, నిమ్మకాయల ఎగుమతుల వ్యాపారి, గొల్లగూడెం, ద్వారకాతిరుమల మండలం నాకు 80 సెంట్ల నిమ్మతోట ఉంది. ప్రతి ఏటా మార్చి సీజన్లో రోజుకు రెండు బస్తాల నిమ్మకాయలు కోతకు వచ్చేవి. కానీ ఇప్పుడు వారానికి ఒక బస్తా నిమ్మకాయలు మాత్రమే కోతకు వస్తున్నాయి. ప్రస్తుతం ధర బాగుంది. నిమ్మకాయలు బాగా కాచి ఉంటే లబ్ధిపొందేవాడిని. ఎక్కువ నిమ్మకాయలు కాస్తే ధర ఉండటం లేదు. తక్కువ కాచినప్పుడు మాత్రమే ధర పలుకుతోంది. – బంటుమెల్లి సుబ్బారావు, నిమ్మరైతు, సత్తెన్నగూడెం, ద్వారకాతిరుమల మండలం గతేడాది డిసెంబర్ నెలలో అత్యల్ప ఉష్ణోగ్రతలు కారణంగా, ఈ ఏడాది మంచు ఎక్కువగా కురవడం వల్ల నిమ్మ పూత మాడిపోయింది. వేసవి ఎండలు ముందు నుంచే ఎక్కువగా ఉండటంతో వచ్చిన కాస్త పిందెలు కూడా రాలిపోయాయి. దాంతో నిమ్మ దిగుబడి తగ్గింది. ఈ ఏడు కాపు ఆలస్యం అవుతుంది. ఏలూరు జిల్లాలో ఎక్కువగా ద్వారకాతిరుమల మండలంలోనే నిమ్మ సాగవుతోంది. – పీబీఎస్ అమర్నాథ్, ఉద్యానశాఖ ద్వారకాతిరుమల మండల అధికారి -
నాణ్యమైన బేళ్లు తీసుకురావాలి
వర్జీనియా రైతులు వేలం కేంద్రానికి నాణ్యమైన బేళ్లను తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలి. ఆకు రెలుపు నుంచి బేళ్లను కట్టే వరకు ప్రతి దశలోనూ నాణ్యమైన పొగాకు ఉత్పత్తి అయ్యేలా పర్యవేక్షించుకోవాలి. ముఖ్యంగా అన్య పదార్థాలు లేకుండా చూసుకోవాలి. శాస్త్రవేత్తలు సూచించిన విధంగా బేళ్లను తయారు చేసుకోవాలి. తద్వారా మంచి ధర పొందేందుకు అవకాశం ఉంటుంది. – జె.సురేంద్ర కుమార్, పొగాకు బోర్డు రీజనల్ మేనేజర్ గత సీజన్లో వచ్చిన ధరల నేపథ్యంలో బ్యారన్ ధరలు, కౌలు ధరలు బాగా పెరిగాయి. దానికి తోడు సాగు ఖర్చులు కూడా పెరగడంతో ఈ ఏడాది వేలం ప్రారంభ ధర రూ.300 పైబడి పలికితే రైతుకు మేలు జరుగుతుంది. అలాగే సీజన్ ముగిసే నాటికి రూ.330 నుంచి రూ.350 వరకు సరాసరి ధర రావాలి. బయ్యర్లు కుమ్మకై ్క ధర తగ్గించే పరిస్థితులు రాకుండా అధికారులు పర్యవేక్షణ పటిష్టంగా చేయాలి. – పరిమి రాంబాబు, వర్జీనియా పొగాకు సంఘ రైతు నాయకుడు -
కేసుల రాజీతో సమయం ఆదా
ఏలూరు (టూటౌన్): జాతీయ లోక్ అదాలత్లో కేసుల రాజీతో సమయం, డబ్బు ఆదా అవుతుందని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి అన్నారు. జాతీయ న్యాయ సేవాదికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలూరులో నిర్వహించిన ప్రారంభ సభలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి మాట్లాడారు. శనివారం సాయంత్రం 7 గంటల వరకు జరిగిన జాతీయ లోక్అదాలత్లో 8,815 కేసులు రాజీ కాగా, అందులో 111 ప్రీ లిటిగేషన్ కేసులు, 147 మోటారు వాహన ప్రమాద బీమా కేసులు, 166 సివిల్, 94 చెక్బౌన్స్ కేసులు, 36 కుటుంబ వివాదాల కేసులు, 8,261 క్రిమినల్, ఇతర కేసులను రాజీ చేశారు. వాహన ప్రమాద బీమా కేసుల్లో రూ.6 కోట్లు పైబడి పరిహారంగా చెల్లించినట్లు చెప్పారు. కార్యక్రమంలో రెండో అదనపు జిల్లా జడ్జి యు.ఇందిరా ప్రియదర్శిని, ఐదో అదనపు జిల్లా జడ్జి ఆర్వీవీఎస్.మురళీకృష్ణ, ఏడో అదనపు జిల్లా జడ్జి వై.శ్రీనివాసరావు, 8వ అదనపు జిల్లా జడ్జి ఐ.శ్రీనివాసమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాదు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంటు కొనే సీతారాం, పీపీ ఏవీ నారాయణ, ప్రభుత్వ న్యాయవాది సుబ్రహ్మణ్యం, లోక్ అదాలత్ సభ్యులు తమ్మినేని విజయకుమార్, ఏఎస్పీ నక్కా సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. -
వర్జీనియా ధరపైనే ఆశలు
జంగారెడ్డిగూడెం: ఈ ఏడాది వర్జీనియా సీజన్ అధిక అంచనాలతో ప్రారంభం కానుంది. ఉమ్మడి పశ్చిమలో 5 వేల కేంద్రాల్లో ఈ నెల 25 నుంచి కొనుగోళ్లు ప్రారంభించనున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. గడచిన రెండు సీజన్లలో వర్జీనియా పొగాకు చరిత్రలోనే రికార్డు ధరలు లభించడంతో రైతులు ఈ సీజన్లో అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం–1, –2, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లి వేలం కేంద్రాలు ఉన్నాయి. 2024–2025 సీజన్కు కేజీ అత్యధిక ధర రూ. 456 లభించింది. ఎన్ఎల్ఎస్ పరిధిలో సరాసరి ధర రూ.297.50 కేజీకి లభించింది. 2023–2024 సీజన్కు కేజీకి అత్యధిక ధర రూ. 411 లభించగా, సరాసరి ధర రూ. 300 లభించింది. ఈ సీజన్లో కొత్త రికార్డులు నమోదు చేస్తూ గరిష్ట ధర రూ.456 పైబడి, సరాసరి ధర రూ.300 పైబడి లభిస్తుందనే ఆశతో రైతులు ఉన్నారు. అనుమతికి మించి.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్ఎల్ఎస్ పరిధిలో 12,021 మంది వర్జీనియా రైతులు 13,864 బ్యారన్లు రిజిస్ట్రేషన్ చేయించుకోగా, 29,074 ఎకరాల్లో రైతులు సేద్యం చేశారు. బోర్డు అనుమతించిన దానికన్నా అధికంగా 6,880 హెక్టార్లలో రైతులు వర్జీనియా వేశారు. ఎన్ఎల్ఎస్ పరిధిలో 2025–26 సీజన్కు గాను 48.75 మి.కిలోల పంటకు పొగాకు బోర్డు అనుమతించింది. అయితే పంట అధికంగా వేయడం వల్ల ఈ సీజన్లో 31.25 మి.కిలోల మేర పంట అధికంగా పండవచ్చని అధికారులు వేస్తున్నారు. పెరుగుతున్న ఖర్చులు వర్జీనియా సాగుకు ప్రతి ఏటా సేద్యపు ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి. పొలం దుక్కిదున్నిన నాటి నుంచి పచ్చిరొట్ట విత్తనం, దుక్కి, లైనింగ్, నారు, తోట వేసేందుకు కూలీలు, పురుగుమందులు, ఎరువులు, అంతర్గత యాజమాన్యం, కలుపు తీత, కలుపు మందు, ఆకు రెలుపు, బ్యారన్ క్యూరింగ్, కలప, రవాణా ఖర్చులు, బ్యారన్ లీజు అన్ని కలుపుకుని ప్రతి ఏటా ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి. విపరీతంగా పెరిగిన కౌలు, బ్యారన్ లీజు 2025–26 పంట కాలానికి పొలం కౌలు, బ్యారన్ లీజులు విపరీతంగా పెరిగిపోయాయి. రైతులు పోటీపడి మరీ కౌలు, బ్యారన్ లీజులు పెంచి మరీ వర్జీనియా సేద్యానికి దిగారు. పొలం కౌలు ఎకరానికి రూ.70 వేలు, రూ.90వేలు నేల సారవంతాన్ని బట్టి ఉండగా, బ్యారన్ లీజు రూ.3 లక్షల నుంచి రూ.3.50 లక్షల వరకు పలికింది. ఇటీవల పొగాకు బోర్డు ఉన్నతాధికారులు, బయ్యర్లు, రైతులతో సమావేశం నిర్వహించారు. దీంతో బయ్యర్లు మార్కెట్ పరిస్థితిని బట్టి ధర ఇస్తామని చెప్పినట్లు తెలిసింది. దీనికి తోడు పొగాకు ఉత్పత్తులపై పెంచిన పన్నుల కారణంగా పొగాకు పంటపై ధర ప్రభావం చూపే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 25 నుంచి వర్జీనియా కొనుగోళ్లు -
అసెంబ్లీ పరిశీలకుల నియామకం
ఏలూరు టౌన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఏలూరు జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ నాయకులను పరిశీలకులుగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవైపు పార్టీని క్షేత్రస్థాయి నుంచీ బలోపేతం చేస్తూనే మరో వైపు స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేస్తూ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏలూరు నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్బాబును కై కలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకుడిగా నియమించారు. అలాగే ఏలూరు నగరానికి చెందిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి దాసరి రమేష్కు చింతలపూడి నియోజకవర్గ పరిశీలకుని బాధ్యతలు అప్పగించారు. మరోవైపు చింతలపూడి నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకుడు బీవీ చౌదరికి మెట్ట ప్రాంతంలో ప్రాముఖ్యమైన పోలవరం నియోజకవర్గ పరిశీలకుడిగా, దెందులూరు ప్రాంతానికి చెందిన డొప్పాలపూడి వెంకట రామకృష్ణ చౌదరి (డీవీఆర్కే)ను జిల్లా కేంద్రం ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
పచ్చని పొలాల మధ్య ఆయుధ డిపో వద్దు
కొయ్యలగూడెం: పచ్చని పంటలు పండే వ్యవసాయ భూముల్లో ఆయుధ డిపో ఏర్పాటు చేసి ప్రజల జీవితాల్లో చిచ్చు పెట్టవద్దని సీపీఐ మండల కన్వీనర్ తాడిగడప ఆంజనేయరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మంగపతిదేవిపేట, బోడిగూడెం గ్రామాల ప్రజలతో కలసి వ్యవసాయ పొలాల్లో డిపో నిర్మాణానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. రెండు పంటలు పండే సారవంతమైన వ్యవసాయ భూముల్లో ప్రమాదకరమైన నేవీ డిపో ఏర్పాటు చేయాలనుకోవడం అన్యాయం అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కృషి చేసిన తమ గ్రామాల ప్రజలను రోడ్డుపాలు చేస్తుంది అన్నారు. తాజాగా ప్రజాప్రతినిధులు రైతుల్లో విభేదాలు సృష్టిస్తూ డిపో వ్యతిరేక ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కుతంత్రాలు పన్నారన్నారు. అసలు భూమిలేని రైతులతో తాము భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారన్నారు. చిన్న, సన్నకారు రైతుల వ్యవసాయ భూములను లాక్కోవద్దని కోరారు. కార్యక్రమంలో బోడిగూడెం, మంగపతిదేవిపేట, ఊట్లగూడెం గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా శనివారం ప్రథమ సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన సివిక్స్–1, బ్రిడ్జికోర్సు మ్యాథ్స్–1 పరీక్షలకు మొత్తం 2,810 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 52 పరీక్షా కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు జనరల్ విద్యార్థులు 3,172 మందికి గాను 2,810 మంది విద్యార్థులు హాజరు కాగా 362 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని, మాల్ ప్రాక్టీస్ కేసులూ నమోదు కాలేదని ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కే. యోహాన్ తెలిపారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ప్రభుత్వం ఉపాధ్యాయుల సాధారణ సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు ఏమైనా ఉంటే ఈ నెల 16 నుంచి 21వ తేదీ లోపు పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో తెలియజేయాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎం. వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ ఆధారంగా గతంలో రూపొందించిన జాబితాపై మొదట విడత అభ్యంతరాలను తీసుకోని వాటిని సరిచేశామన్నారు. సరిచేసిన జాబితాలు సంబంధిత పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో, నోటీసు బోర్డుల్లో ఈ నెల 15వ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయన్నారు. నిర్థిస్టమైన గడువు తరువాత వచ్చిన వినతులు స్వీకరించబడవని, ఇదే చివరి అవకాశముగా భావించాలని డీఈవో తెలిపారు. ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేశామని డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు. శనివారం తన కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. సోమవారం నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లాలో 133 కేంద్రాల్లో 24,019 విద్యార్థులు హాజరుకానున్నారని చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో దూరవిద్య పదో తరగతి పరీక్షలకు ఏర్పాటుచేశామని, 803 మంది విద్యార్థులకు గాను 11 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా 94913 95377 నంబరులో తెలియజేయాలన్నారు. విద్యార్థులు హాల్టికెట్ చూపించి ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయవచ్చునన్నారు. స్టోరేజీ పాయింట్స్ 31, పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు 133, డిపార్ట్మెంటల్ అధికారులు 133, అదనపు డిపార్ట్మెంటల్ అధికారులు 02, ఫ్లయింగు స్క్వాడ్లు 06, సీ సెంటరు రూటు ఆఫీసర్లు 20 మందిని నియమించామని తెలిపారు. జిల్లాలో సమస్యాత్మక పరీక్షా కేంద్రాలుగా గుర్తించిన 8 కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ పరీక్షల నిర్వహణ సహాయ కమిషనరు ఆర్.ఆశ పాల్గొన్నారు. -
కైకలూరు కేంద్రంగా పిల్లల విక్రయం కేసులో ట్విస్ట్
సాక్షి, కైకలూరు: ఏలూరు జిల్లా కైకలూరు కేంద్రంగా ఇటీవల నమోదైన పిల్లల విక్రయం కేసులో ట్విస్ట్ ఎదురైంది. పిల్లల విక్రయంలో కీలక సూత్రధారి జనసేన నేత తల్లిగా గుర్తించారు. మీడియాలో వచ్చిన కథనాలపై ఉన్నతాధికారుల ఆదేశాలతో ఐసీడీఎస్ అధికారులు విచారణ చేపట్టారు. గర్భిణీగా రిజిస్టర్ కాకుండా పిల్లలను తెచ్చి, తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారిపై ఆరా తీశారు. ఇద్దరు పిల్లల్ని విక్రయించినట్లు విచారణలో ఐసీడీఎస్ అధికారులు గుర్తించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అబ్బిశెట్టి వీరమ్మ, గోపి, చిన్ని, రెడ్డెమ్మ, ఫరీనా పిల్లల విక్రయాలకు పాల్పడినట్లు గుర్తించారు. వారిపై కైకలూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. పిల్లల విక్రయాల్లో సూత్రధారిగా కైకలూరు జనసేన నేత ఏఎన్ బాబు తల్లి అబ్బిశెట్టి వీరమ్మ (@వీరాకుమారి, @ఈడేపల్లి ఆంటీ) ఉన్నారు. 2024లో ఇద్దరు పిల్లల్ని అబ్బిశెట్టి వీరమ్మ విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. పది రోజుల క్రితం ముదినేపల్లి మండలం శ్రీహరిపురానికి చెందిన ఆకేటి మోక్షిత్ (రెండున్నరేళ్లు) అదృశ్యమయ్యాడు. ఆకేటి మోక్షిత్ అదృశ్యం వెనుక అబ్బిశెట్టి వీరమ్మ ముఠా హస్తం ఉందేమోననే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
బకాయిల భారం.. ‘వైద్యసేవ’ దూరం
భీమవరం (ప్రకాశం చౌక్): ఎన్టీఆర్ వైద్య సేవ (ఆరోగ్యశ్రీ)ని నీరుగార్చే విధంగా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ సేవలకు గాను నెట్వర్క్ ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకపోగా మరో భారం మోపేందుకు సిద్ధమవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నెట్వర్క్ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించకుండా కోట్లాది రూపాయిల బకాయిలు పెట్టింది. దీంతో ఆయా ఆసుపత్రుల్లో పేదలకు అందాల్సిన వైద్యసేవలపై నీలినిడలు కమ్ముకుంటున్నాయి. ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం నెట్వర్క్ ఆసుపత్రులపై యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అంటూ మరో భారం వేసేందుకు సిద్ధమైంది. దీంతో మేము వైద్యసేవలు అందించలేమంటూ నెట్వర్క్ ఆసుపత్రులు కూటమి ప్రభుత్వానికి అల్టీమేటం జాజుఠీ చేశాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పటల్స్ ఆసోసియేషన్ (ఆశ) నిర్ణయం తీసుకుంది. కొత్త వైద్య స్కీమ్ మా వల్ల కాదు వచ్చేనెల నుంచి యూనివర్సల్ హెల్త్ స్కీమ్ను కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ఈపథకం విధి విధానాలు రూపొందించడంలో నెట్వర్క్ ఆస్పత్రులు వైద్యులతో గానీ అసోసియేషన్తో గానీ చర్చించకుండా ఈ పథకం రూపొందించి బలవతంగా వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటుంది. దాంతో నూతన పథకంలో సేవలందించేందుకు తాము సిద్ధంగా లేమని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ కూటమి ప్రభుత్వానికి తేల్చిచెప్పింది. ఆరోగ్యశ్రీకి సంబంధించి నెలల తరబడి బకాయిలు చెల్లించకుండా కొత్త పథకాలు నెట్వర్క్ ఆస్పత్రులపై రుద్దడానికి కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుండడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని నెట్వర్క్ ఆస్పత్రులకు రూ.100 కోట్లు బకాయిలు జిల్లాలో అన్ని కలుపుకుని దాదాపు 30 వరకు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెట్ వర్క్ ఆస్పత్రులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోయాయి. దీంతో మూడు నెలల క్రితం వైద్యసేవలు అందించలేక నెట్వర్క్ ఆస్పత్రులు సమ్మెకు దిగాయి. అప్పుడు బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు చెల్లించలేదు. జిల్లాలో 30 నెట్వర్క్ ఆస్పత్రులకు రూ.100 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. ఒక్కో ఆస్పత్రికి రూ.3 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. సాధారణ ఆస్పత్రికి రూ.3 కోట్లు వరకు బకాయి ఉంటే మల్టీస్పెషాల్టీ ఆస్పత్రులకు రూ.10 నుంచి రూ.30 కోట్లు వరకు బకాయిలు ఉన్నాయి. దీంతో అప్పులు చేసి మరీ ఆస్పత్రుల నిర్వహణ చేయాల్సి వస్తోందని అసోసేయేషన్ నాయకులు చెబుతున్నాయి. డిస్కాంట్ కోసం ప్రభుత్వం బేరాలు నెట్వర్క్ ఆస్పత్రులకు కోట్ల రూపాయిలు బకాయిలు పెట్టడంతో ఆయా ఆస్పత్రులు నిర్వహణ భారంగా మారింది. దీంతో మా బకాయిలు చెల్లించండి అడుగుతున్న నెట్వర్క్ ఆస్పత్రులతో కూటమి ప్రభుత్వం డిస్కాంట్ ఇవ్వాలి అంటూ బేరాలు అడుతోంది. 10 నుంచి 15 శాతం డిస్కాంట్ ఇస్తే బకాయిలు చెల్లిస్తామంటే నెట్వర్క్ ఆస్పత్రులు చేసేది లేక 4 శాతం డిస్కాంట్కు సరేనన్నా 15 శాతం డిస్కాంట్ ఇస్తేనే దఫదఫాలుగా చెల్లిస్తామని కూటమి ప్రభుత్వం తెగేసి చెబుతుండడంతో నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు తలలు పట్టుకుంటున్నాయి. నెట్వర్క్ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించని ప్రభుత్వం వచ్చేనెల నుంచి మరో కొత్త స్కీమ్ అమలు తమ వల్ల కాదంటూ చేతులెత్తేసిన నెట్వర్క్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలపై ప్రజల్లో కలవరం కూటమి ప్రభుత్వం నిరంకుశ వైఖరితో విసుగు చెందుతున్న నెట్వర్క్ ఆస్పత్రులు బకాయిల కోసం మళ్లీ సమ్మెకు దిగి వైద్య సేవలు నిలుపుదల చేస్తాయేమోనని ప్రజల్లో కలవరం రేగుతోంది. గతంలో నెట్వర్క్ ఆస్పత్రులు సమ్మె చేయడంతో పేద ప్రజలు వైద్యం కోసం విలావిల్లాడి అప్పులు చేసి ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం పొందారు. జిల్లాలో మెడికల్ కళశాల పూర్తికాకపోవడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పూర్తిస్థాయి వైద్యులను ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడంతో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల సమ్మెకు దిగిన సమయంలో జిల్లా ప్రజలు వైద్యం కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మళ్లీ ఆ రోజులను ఈ కూటమి ప్రభుత్వం తీసుకువస్తుందా? అనే ఆందోళన జిల్లా ప్రజల్లో ఉంది. -
అంగన్వాడీ కేంద్రాలకు ధరల మంట
నూజివీడు: మాతా శిశుమరణాలను తగ్గించడంతో పాటు, బాలల భవిష్యత్కు పునాదులు వేసే అంగన్వాడీ కేంద్రాలపై చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు పౌష్టికాహారం అందించాల్సిన అంగన్వాడీ కేంద్రాలకు ఇచ్చే మెనూ చార్జీలను పెంచకుండా తాత్సారం చేస్తోంది. నిత్యావసరాల ధరలు, కూరగాయల ధరలు పెరుగుతున్నా అందుకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచకపోవడంతో ప్రతి నెలా అంగన్వాడీ వర్కర్లపై భారం పడుతోందని వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, అభివృద్ధికి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఉన్న ధరలకు అనుగుణంగా చెల్లింపులు చేయకపోవడంతో కేంద్రాల నిర్వహణలో వర్కర్లకు చేతి చమురు వదులుతోంది. వీటికి తోడు అంగన్వాడీ వర్కర్ల, జీతాల పెంపుదల విషయంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తమవుతోంది. దీంతోనే ఇటీవల ఆందోళనలు సైతం చేశారు. 10 ప్రాజెక్టులు.. 2,226 కేంద్రాలు మహిళాభివృద్ధి, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా వ్యాప్తంగా 10 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 2226 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 1,01,224 మంది లబ్ధిదారులున్నారు. వీరిలో 6 నెలలలోపు పిల్లలు 7,210 మంది, 6 నెలల నుంచి మూడేళ్లలోపు పిల్లలు 41,277 మంది, మూడు నుంచి ఆరేళ్లలోపు పిల్లలు 37,174 మంది, గర్భిణులు 8,179 మంది, బాలింతలు 7,384 మంది ఉన్నారు. మూడు నుంచి ఆరేళ్లలోపు పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల్లోనే వంట చేసి పెడుతుండగా.. గర్భిణులు, బాలింతలకు, మూడేళ్లలోపు పిల్లలకు ఇంటికే రేషన్ పంపిస్తున్నారు. అందుకు గాను అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం బియ్యం, నూనె, కందిపప్పు, కోడిగుడ్లు, పాలు సరఫరా చేస్తోంది. అంగన్వాడీ కేంద్రంలో భోజనం చేసే చిన్నారులు ఒక్కొక్కరికీ ఐదు గ్రాముల చొప్పున నూనెను ఇస్తోంది. కాలానుగుణంగా నిత్యావసరాల ధరలు, కూరగాయల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో పాటు వంట గ్యాస్ సిలిండర్ ధర సైతం పెరుగుతోంది. వీటికి అనుగుణంగా ప్రభుత్వం మెనూ చార్జీలను పెంచకుండా గత ప్రభుత్వంలో 2023లో నిర్ణయించిన ధరలనే ఇప్పటికీ అమలు చేస్తోంది. పెరిగిన ధరలతో నిర్దేశించిన మెనూ ప్రకారం చిన్నారులకు వండి వడ్డించాలంటే వర్కర్లు నానా పాట్లు పడుతున్నారు. మూడు నుంచి ఆరేళ్లలోపు పిల్లలకు అంగన్వాడీ కేంద్రంలోనే వండాల్సి ఉండటంతో కూరగాయలు, పసుపు, కారం, ఆకుకూరలు, ఉల్లిపాయలు, పోపు దినుసులు తదితర సామగ్రిని ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలి. మూడు నుంచి ఆరేళ్లలోపు పిల్లలకు ఒక్కొక్కరికి రోజుకు కేవలం ట్రాన్స్పోర్ట్ ఖర్చుతో కలిపి రూ.2.10 మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇందులోనే 50 పైసలు గ్యాస్కు, రేషన్ దుకాణాల నుంచి సరుకులు తెచ్చుకునేందుకు 10 పైసలు కేటాయించింది. అంటే కూరగాయలు తదితర సామగ్రి కోసం ఒక్కో పిల్లవాడికి రోజుకు కేటాయించింది కేవలం రూ.1.50 పైసలు మాత్రమే. దీంతో పిల్లవాడికి పౌష్టికాహారం పెట్టడం ప్రశ్నార్థకంగా మారింవది. దీనికి తోడు గ్యాస్ సిలిండర్కు ప్రభుత్వం ఇచ్చే సొమ్ము సరిపోవడం లేదని వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరకొరగా ఇచ్చే మెనూ చార్జీల బిల్లులు కూడా రెగ్యులర్గా రావని, ఆరు నెలలు, ఏడాదికోసారి ఇస్తుండటంతో వర్కర్లు తమ జేబులో నుంచే పెట్టుబడి పెట్టాల్సిన దుస్థితి ఎదురవుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఇచ్చే మెనూ చార్జీలు ఎందుకూ చాలడం లేదని వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంట.. తంటా పెరగని మెనూ చార్జీలు పెరిగిన నిత్యావసరాల ధరలు కేంద్రాల నిర్వహణ భారం ఇప్పటికీ 2023లో ధరలే.. -
చిన్నారుల విక్రయ ఆరోపణలపై దర్యాప్తు ముమ్మరం
డీఎస్పీ శ్రావణ్కుమార్ కై కలూరు: చిన్నపిల్లల విక్రయ ఆరోపణల నేపథ్యంలో కై కలూరు పోలీసు సర్కిల్ కార్యాలయంలో ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్కుమార్, జిల్లా చైల్డ్ ప్రొడక్షన్ ఆఫీసర్ డాక్టర్ సూర్యచక్రవేణి, రూరల్ సీఐ వి.రవికుమార్ శుక్రవారం విలేకరులకు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రావణ్కుమార్ మాట్లాడుతూ ముదినేపల్లి మండలంలో మెక్షిత్ అనే బాబు రెండు నెలలుగా కనిపించడం లేదన్నారు. మండవల్లి మండలం కానుకొల్లు గ్రామంలో ఒకరు కనిపించడం లేదని తెలిసిందన్నారు. ఐసీడీఎస్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామన్నారు. నియోజకవర్గంలో 13, 5, 4 సంవత్సరాలతో పాటు ఈ ఏడాది పిల్లలు లేని కుటుంబాలకు కొందరు పిల్లలను ఇచ్చారన్నారు. ఇది బంధువుల మధ్య జరిగిందన్నారు. చట్ట ప్రకారం పిల్లలను దత్తత తీసుకోవాలని డీఎస్పీ చెప్పారు. హిందూ దత్తత యాక్టు, చైల్డ్ ప్రొటెక్షన్ యాక్టుతో పాటు ఐపీసీ ప్రకారం నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ఐసీడీఎస్ ద్వారా ఇటీవల పిల్లలు పెంచుకుంటున్న వారి వివరాలు సేకరిస్తున్నామన్నారు. అనుమానితులను ఇప్పటికే గుర్తించామని కేసు నమోదు చేసి విచారిస్తామన్నారు. ప్రధానంగా నగదు లావాదేవీలు ఏమైనా జరిగాయా? అనే కోణంలో ధర్యాప్తు చేస్తామన్నారు. బాధితుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. జిల్లా చైల్డ్ ప్రొడక్షన్ ఆఫీసర్ డాక్టర్ సూర్యచక్రవేణి మాట్లాడుతూ అంగన్వాడీల పరిధిలో గర్భం దాల్చి పిల్లలు లేకుండా పెంచుకుంటున్న వారి వివరాలు సేకరించామన్నారు. -
బలుసులమ్మకు ప్రత్యేక పూజలు
తాడేపల్లిగూడెం (టీఓసీ): బలుసులమ్మ మహాకుంభాభిషేక పూర్వక జాతర మహోత్సవాల సందర్భంగా శుక్రవారం అమ్మవారికి పసుపు కొమ్ములతో అర్చన చేశారు. అనంతరం అష్టలక్ష్మి ఆరాధన పూర్వక సామూహిక సౌభాగ్య కుంకుమ పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని వందలాదిగా మహిళలు ఈ పూజలలో పాల్గొన్నారు. సాయంత్రం మూలమంత్ర హోమాలు, లక్ష్మీహోమం, రుద్ర హోమాలు, పల్లకి ఉత్సవం ఘనంగా చేశారు. ఏర్పాట్లను శ్రీరంగం అంజి పర్యవేక్షించారు. తాడేపల్లిగూడెం: యువత ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని శాప్ చైర్మన్ ఎ.రవినాయుడు పిలుపునిచ్చారు. వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో శుక్రవారం 12వ అంతర్ కళాశాల క్రీడా పోటీలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రవినాయుడు మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, క్రమ శిక్షణ, జట్టు భావనను పెంపొందిస్తాయన్నారు. ఉద్యానవర్సిటీ వీసీ డాక్టర్ కె.ధనుంజయరావు మాట్లాడుతూ విద్యార్థుల సమగ్రాభివృద్ధిలో క్రీడలకు సముచిత స్థానం ఇవ్వాలన్నారు. ఈ పోటీల్లో ఉద్యాన విశ్వ విద్యాలయానికి అనుబంధంగా ఉన్న ఎనిమిది కళాశాలల నుంచి సుమారు 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అథ్లెటిక్స్ సహా 25కు పైగా ట్రాక్ , ఫీల్డ్ ఈవెంట్లు మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. ముందుగా విద్యార్థులు ఫ్లాగ్ మార్చ్ చేశారు. కార్యక్రమంలో డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ సి.మధుమతి, డీన్ ఆఫ్ హార్టీకల్చర్ డాక్టర్ ప్రసన్నకుమార్, ఎస్.సూర్యకుమారి, విజయపద్మ, రామానందం, రిజిస్ట్రార్ మాధవి, సి.రూత్ తదితరులు పాల్గొన్నారు. -
జీఎస్టీతో కార్యకలాపాల్లో పారదర్శకత
ఏలూరు (ఆర్ఆర్పేట): జీఎస్టీ అమలు తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పుల వల్ల వ్యాపార కార్యకలాపాలు మరింత పారదర్శకంగా మారాయని ఏలూరు వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్ బి.నాగార్జున రావు తెలిపారు. స్థానిక సీఆర్రెడ్డి ఇంజినీరింగ్ కళాశాల ఎంబీఏ విభాగం ఆధ్వర్యంలో దక్షిణ భారత రాష్ట్రాలలో జీఎస్టీ సంస్కరణలు, వాటి సామాజిక–ఆర్థిక ప్రభావం అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు శుక్రవారం కళాశాల లైబ్రరీ సెమినార్ హాల్లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ జీఎస్టీ ద్వారా దేశవ్యాప్తంగా ఒకే విధమైన పన్ను విధానం అమలులోకి వచ్చి ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. కీనోట్ స్పీకర్ రమణారావు, కంపెనీ చార్టర్డ్ అకౌంటెంట్ డీవీ సుబ్బారావు మాట్లాడుతూ జీఎస్టీ విధానం, వ్యాపార సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లు, పన్ను సంస్కరణల అవసరం, భవిష్యత్తు అవకాశాలపై సమగ్రంగా వివరించారు. కార్యక్రమంలో యువ ఆడిటర్ రమణ చైతన్య, నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ బట్టు నాగరాజు, ఎంబీఏ విభాగాధిపతి కేవీ శ్రీధర్, కళాశాల కరస్పాండెంట్ జాస్తి మల్లికార్జునుడు పాల్గొన్నారు. -
ముగిసిన రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలు
నూజివీడు: నూజివీడులోని సారథి ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్లో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఏలూరు జిల్లా నూజివీడులో మూడు రోజుల పాటు నిర్వహించిన 15వ అండర్–15, 2వ అండర్–13, 7వ అండర్–10 అంతర్ జిల్లాల ఆర్చరీ చాంపియషన్ షిప్ పోటీలు శుక్రవారంతో ముగిశాయి. ఏపీ ఆర్చరీ అసోసియేషన్, చెరకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీ, కృష్ణాజిల్లా ఆర్చరీ అసోసియేషన్, స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఏపీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహించారు. కాంపౌండ్ విభాగంలో పోటీల్లో 100మంది క్రీడాకారులు పాల్గొన్నారు. శుక్రవారం రికర్వ్ విభాగంలో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారు ఈ నెల 26నుంచి ఏప్రిల్ 7 వరకు గుంటూరు జిల్లా నంబూరులోని వీవీఐటీలో నిర్వహించే జాతీయ స్థాయి ఆర్చరీ చాంపియన్షిప్ పోటీల్లో ఏపీ తరుఫున ప్రాతినిధ్యం వహిస్తారు. ముగింపు కార్యక్రమంలో కొత్త రావిచర్ల సర్పంచ్ కాపా శ్రీనివాసరావు, మున్సిపల్ కౌన్సిలర్ చెరుకూరి దుర్గాప్రసాద్, సారధి ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ సూరానేని శ్రీధర్, చెరుకూరి సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ కోశాధికారి చెరుకూరి కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు. పాలకొల్లు సెంట్రల్ : కళలకు నిలయం కళాకారులకు ఆలయం వంటి క్షీరపురిలో కళానైపుణ్యానికి ఇక్కడి కళాభిమానులు, కళాకారులు ఎంతో వన్నె తెస్తున్నారని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇంచార్జ్ గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి) అన్నారు. శుక్రవారం పాలకొల్లు కళాపరిషత్ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్ వద్ద అడబాల థియేటర్స్ వెనుక ఉన్న ఖాళీ స్థలంలో 17వ జాతీయ స్థాయి నాటికల పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో కళాకారులను అందించిన ఘనత ఈ క్షీరపురిదన్నారు. నాటిక రంగం నుండి ఎంతోమంది కళాకారులు సినీ ఇండస్ట్రీలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి పాలకొల్లు కీర్తి ప్రతిష్టలను నలుదిశలా వ్యాపింపజేశారన్నారు. మొదటి రోజు ఉషోదయ కళానికేతన్ కట్రపాడు ఆధ్వర్యంలో మంచి మనసులు నాటిక, అరవింద్ ఆర్డ్స్ తాడేపల్లి వారు నిర్వహించిన దేవుణ్ణి చూసా నాటికలు కళాభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో చైతన్య భారతి సంగీత నృత్య నాటక పరిషత్ భీమవరం అధ్యక్షుడు రాయప్రోలు భగవాన్, కళాపరిషత్ అధ్యక్షుడు కేవీ కృష్ణవర్మ, యడ్ల తాతాజీ, జక్కంపూడి కుమార్, కోరాడ శ్రీనివాసరావు, మానాపురం సత్యనారాయణ, ఖండవల్లి వాసు, మేడికొండ శ్రీనివాసరావు పాల్గొన్నారు. తండ్రీకొడుకుల నిజాయితీ జంగారెడ్డిగూడెం: మహిళ చేజార్చుకున్న పర్సు, అందులోని నగదు, సెల్ఫోన్ను తండ్రీ కొడుకులు నిజాయితీగా సదరు మహిళ కుటుంబ సభ్యులకు శుక్రవారం అందజేశారు. వివరాల ప్రకారం తూర్పుగోదావరి జిల్లా జేగూరుపాడుకు చెందిన ఒక మహిళ రాజమండ్రి షాపింగ్కు వెళ్లింది. ఆటోలో తిరిగి వస్తుండగా, ఆటోలో నుంచి సెల్ఫోన్, కొంత నగదు ఉన్న హ్యాండ్బ్యాగ్ జారిపడిపోయింది. అయితే ఈ బ్యాగ్ జంగారెడ్డిగూడెం మండలం వేగవరం బీసీ కాలనీకి చెందిన రెల్లి దాలి నాయుడికి దొరికింది. సదరు బ్యాగ్ను పట్టుకుని వేగవరం ఇంటికి వచ్చాడు. తన కుమారుడు రెల్లి చైతన్య లక్ష్మణ్కు బ్యాగ్ను దొరికిన విషయం చెప్పగా, చైతన్య లక్ష్మణ్ బ్యాగులోని వస్తువులను పరిశీలించి, అందులోని ఆధార్కార్డును తీసి, ఆధార్లో ఉన్న ఫోన్ నెంబర్కు ఫోన్చేసి నేను జంగారెడ్డిగూడెం మండలం వేగవరం నుంచి ఫోన్ చేస్తున్నాను. మీరు పొగొట్టుకన్న బ్యాగ్ దొరికింది.. అది నా వద్ద ఉంది, ఎవరైనా వస్తే ఇస్తానని చెప్పాడు. దీంతో సదరు మహిళ కుటుంబసభ్యులు జంగారెడ్డిగూడెం రాగా, చైతన్య లక్ష్మణ్ రూ. 3500 నగదు, సెల్ఫోన్, ఆధార్కార్డు, ఇతర స్లిప్పులు ఉన్న హ్యాండ్ బ్యాగ్ను జంగారెడ్డిగూడెం ఎస్సై ఎన్వీ ప్రసాద్ సమక్షంలో మహిళ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా తండ్రి కొడులను నిజాయితిని మెచ్చి రూ. 1000 నగదు బహుమతి ఇచ్చారు. -
సర్పంచ్గా తిరిగి విధుల్లోకి..
కై కలూరు: కై కలూరు పంచాయతీ సర్పంచ్ గా తిరిగి దానం మేరీ నవరత్నకుమారి విధుల్లో శుక్రవారం చేరారు. వైఎస్సార్సీపీ పాలనలో ఎస్పీ రిజర్వేషన్లో సర్పంచ్గా ఎ న్నికై న రత్నకుమారిని నిధుల దుర్వినియో గం అంశంపై గతేడాది జూన్ 19న కలెక్టర్ కె.వెట్రిసెల్వి సస్పెండ్ చేశారు. అంతకు ముందు 2025 జనవరి 18న చెక్పవర్ను రద్దు చేశారు. దీంతో ఆమె న్యాయపోరాటం చేసింది. ప్రముఖ న్యాయ వాది జడ శ్రావణ్కుమార్ సర్పంచ్ తరఫున హైకోర్టులో వాదనలు వినిపించారు. గతనెలలో తిరిగి విధుల్లో చేరాలని పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఆమె విధుల్లో చేరే ముందు కై కలూరు తాలూకా సెంటర్లో దళిత నాయకులతో కలిసి అంబేడ్కర్ వి గ్రహానికి నివాళి అర్పించారు. ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లావ్యాప్తంగా శుక్రవారం 54 కేంద్రాల్లో జరిగిన ఇంటర్ ఫిజిక్స్–2 పరీక్షలకు 11,841 మంది విద్యార్థులు హాజరయ్యారు. 12,037 మందికి 196 మంది గైర్హాజరయ్యారు. ముగిసిన దూరవిద్య పరీక్షలు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో దూరవిద్యా విధానంలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు ముగిశాయని డీఈఓ వెంకటలక్ష్మమ్మ తెలిపారు. -
అన్నదాత గుండెకోత
శనివారం శ్రీ 14 శ్రీ మార్చి శ్రీ 2026సాక్షి ప్రతినిధి, ఏలూరు: చెప్పేది కొండంత.. చేసేది గోరంతా ఇది కూటమి సర్కారు తీరు. అన్నదాత సుఖీభవ పేరుతో ప్రతి రైతుకు రూ.20 వేలు ఇస్తామని సూపర్సిక్స్తో కూడిన మేనిఫెస్టోలో ప్రకటించి ఇంటింటికీ ష్యూరిటీ బాండ్లో ఐదేళ్లలో కలిపి ఎంత వస్తుందో అంకెలతో సహా వివరించి పత్రాలు పంచారు. కట్చేస్తే.. అధికారంలోకి రాగానే మొదటి ఏడాది ఎగనామం.. రెండో ఏడాది నుంచి రూ.20 వేల నుంచి 14 వేలకు కుదించారు. అది కూడా ఎంపిక చేసిన కొందరికే పరిమితం. ఇది జిల్లాలో అన్నదాత సుఖీభవ పథకం అమలవుతున్న తీరు. నిలువునా వంచన : అన్నదాత సుఖీభవ పేరుతో అన్నదాతను సర్కారు నిలువునా మోసం చేసింది. రూ.20 వేలు ఏటా ఇస్తామని చెప్పి రూ.14 వేలతో సరిపెట్టింది. అది కూడా మూడు విడతల్లో ఇవ్వడం, అలాగే ఎంపిక చేసిన రైతులకు మాత్రమే వర్తింపజేయడం, కౌలురైతులను మాత్రం యథావిధిగా గాలికి వదిలేయడంతో అగచాట్లు పెరిగాయి. ఇప్పటికే ప్రకృతి విపత్తులతో అన్నదాత పూర్తిగా నష్టపోతూ ఆర్థిక కష్టాలను అధిగమించి అప్పులతో సాగు చేస్తే గిట్టుబాటు ధరలు లేక పూర్తిగా కుంగిపోతున్న పరిస్థితి. కనీసం పంట పెట్టుబడులకై నా ఉపయోగపడేలా అన్నదాత సుఖీభవ ఉంటుందని ఆశించిన రైతులు మరోమారు కూటమి సర్కారు మాటలు నమ్మి భంగపడ్డారు. జిల్లాలో శుక్రవారం అన్నదాత సుఖీభవ మూడో విడత నగదు పంపిణీ సభ ముసునూరు మండలం చెక్కపల్లిలో జరిగింది. జిల్లా వ్యాప్తంగా 1,60,968 మంది రైతులకు రూ.6 వేల చొప్పున రూ.89.85 కోట్లు పంపిణీ చేసి రైతులను పూర్తిస్థాయిలో ఆదుకున్న ప్రభుత్వమని, అన్నదాతలకు సర్కారు ఉగాది కానుక అంటూ ప్రకటించుకున్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నం. జిల్లాలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రైతుభరోసా, సున్నా వడ్డీ, ఇన్పుట్ సబ్సిడీ ఇలా ప్రతి సందర్భంలోనూ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులను ఆదుకున్నారు. ప్రధానంగా పంటల పెట్టుబడుల సమయంలో రైతుభరోసాతో ఆర్థిక ఇబ్బంది తగ్గించడంతో పాటు నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాల కోసం క్యూలో నిలబడి లాఠీచార్జ్లకు గురికాకుండా ఆ యా గ్రామాల్లోనే అందించేలా రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి సమర్థవంతంగా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం గత సర్కారు ఏర్పాటు చేసిన వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి పాత రోజులను పునరావృతం చేస్తుంది.విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చు కలిపి ఎకరాకు రూ.70 వేల నుంచి రూ.80 వేలు ఖర్చవుతోంది. పంటలకు గిట్టుబాటు ధర లేక పెట్టుబడి కూడా వెనక్కి రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అన్నదాత సుఖీభవ పథకం అమలు కావడం లేదు. గతేడాది కేంద్రం ఇచ్చిన రూ.2 వేలు మినహా చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి సాయం చేయలేదు. అకాల వర్షాలు, చీడపీడల వల్ల నష్టపోయినప్పుడు ప్రభుత్వం నుంచి ఎలాంటి బీమా లేదా పరిహారం అందడం లేదు. – మాగసాని గురుబ్రహ్మం, రైతు, బాలువారిగూడెం, చింతలపూడి మండలం కౌలు రైతులకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. చాలా అన్యాయం. మూడేళ్లుగా నష్టపోతున్నాం. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో న్యాయం జరిగింది. ఈ ప్రభుత్వంలో ఆర్థికంగా నష్టపోయాం. రైతులకు ఎంతో మేలు చేస్తుంది అనుకున్న చంద్రబాబు ప్రభుత్వం ప్రధానంగా కౌలు రైతులు విషయంలో చాలా ఇబ్బందులు గురిచేస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆంక్షలు ఏమీ లేకుండా కై లు రైతులకు న్యాయం చేశారు. – కోమటి నాగేశ్వరరావు బాదంపూడి, కౌలు రైతు, ఉంగుటూరు మండలందగాపడ్డ రైతన్న అరకొరగా అన్నదాత సుఖీభవ తొలి ఏడాది ఎగనామం జిల్లాలో 1.60 లక్షల మంది రైతులు గత ప్రభుత్వంలో రూ.1,830 కోట్లు అందజేత కూటమి పాలనలో ధరల పతనం, నష్టపరిహారాలు అందక విలవిల కౌలు రైతులకు మొండిచేయి కూటమి ప్రభుత్వం సూపర్సిక్స్లో హామీ ఇచ్చిన విధంగా ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు అన్నదాత సుఖీభవ అందించాల్సి ఉంది. దీనిద్వారా ఏటా జిల్లాలోని 2,35,847 మంది రైతులకు ఏడాదికి రూ.471.69 కోట్లు జమ కావాల్సి ఉంది. అయితే సాయాన్ని రూ.14 వేలకే పరిమితం చేసి మూడు విడతలు కలిపి సుమారు రూ.300 కోట్లు పంపిణీ చేస్తూ రూ.171 కోట్లకుపైగా ఎగనామం పెట్టారు. అది కూడా సర్కారు కొలువుతీరిన మొదటి ఆర్థిక సంవత్సరం ఎగ్గొట్టారు. ఈ ఆర్థిక సంవత్సరానికిగాను శుక్రవారం మూడో విడత పంపిణీ చేశారు. జిల్లాలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2,35,847 మంది రైతులకు రూ.1,830.24 కోట్లు జమ చేస్తే కూటమి ప్రభుత్వం వివిధ ఆంక్షల పేరుతో అర్హుల జాబితాను భారీగా కుదించి 1,60,968 మందికే పరిమితం చేసింది. ఇక కౌలురైతులకు గుర్తింపుకార్డులు, పథకాలు ఇస్తామని ప్రకటించి కౌలురైతులకు గుర్తింపు కార్డులు, పంట నష్టపరిహారంతో సహా ఏ పథకం అమలుకాని పరిస్థితి. -
కట్టెల పొయ్యిలు వచ్చేశాయ్
ద్వారకాతిరుమల: వంట గ్యాస్కు కొరత ఏర్పడటంతో చిన వెంకన్న క్షేత్రంలో కట్టెల పొయ్యిలను వినియోగించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం రెండు బ్లోయర్ ఇనుప కట్టెల పొయ్యిలను కొనుగోలు చేసి తీసుకొచ్చారు. నిత్యాన్నదాన భవనం వద్ద ఈఓ యర్రంశెట్టి భద్రాజీ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డీవీ భాస్కర్, ఏఈఓ వాసు, డీఈ టి.సూర్యనారాయణ సమక్షంలో ట్రయిల్రన్ వేశారు. కట్టెలను మండించడానికి ఎలక్ట్రికల్ మోటర్తో ఉన్న బ్లోయర్ను అమర్చారు. పొయ్యిల పనితీరుపై అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. పూర్తిగా గ్యాస్ సరఫరా నిలిచిపోయినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో, నిత్యాన్నదాన భవనంలో వంటలను వండేందుకు వీటిని వినియోగించనున్నారు. మరికొన్ని పొయ్యిలను కొనుగోలు చే యాలని అధికారులు నిర్ణయించారు. -
సంచలనంగా కానుకల చోరీ కేసు
● నిందితుడిని అన్ని కోణాల్లో విచారిస్తున్న పోలీసులు ● బయటపడుతున్న ఆలయాల్లోని భద్రతా వైఫల్యాలు ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చిన్నవెంకన్న ఆలయంలో ఈనెల 11న జరిగిన హుండీ కానుకల చోరీ కేసు సంచలనంగా మారింది. ఇందులోని నిందితుడు పలు ప్రముఖ ఆలయాల్లో జరుగుతున్న హుండీల నగదు లెక్కింపులో సైతం కొన్నేళ్లుగా పాల్గొంటున్నాడు. దీంతో పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం సూరంపూడి గ్రామానికి చెందిన బొల్లా సురేష్ సేవ పేరుతో గత 8 ఏళ్ల నుంచి శ్రీవారి హుండీల నగదు లెక్కింపులో పాల్గొంటున్నాడు. గత బుధవారం జరిగిన లెక్కింపులో పాల్గొన్న సురేష్ 59.700 గ్రాముల బరువైన బంగారపు గొలుసు, రెండు మంగళ సూత్రాలు, నాలుగు యూఎస్ డాలర్ల నోట్లను తస్కరించి అధికారులకు పట్టుబడ్డ విషయం తెలిసిందే. సురేష్ ద్వారకాతిరుమలతో పాటు అన్నవరం, సింహాచలం, విజయవాడ, వాడపల్లి ఆలయాల్లో సై తం జరిగే హుండీల నగదు లెక్కింపుల్లో పాల్గొంటున్నట్టు స్పష్టమైంది. అయితే సురేష్ చిన వెంకన్న ఆలయంలో చోరీ చేయడం ఇదే మొదటిసారా.. లేక అంతక ముందు ఎప్పుడైనా చోరీలు చేశాడా.. అన్నదానితో పాటు, ఇతర ఆలయాల్లో కూడా ఏమైనా చోరీలకు పాల్పడ్డాడా.. అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ పది మంది ఎవరూ.. పోలీసుల విచారణలో కొంత సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగా గురువారం నిందితుడిని తీసుకుని మండపేట, అమలాపురంలో తిరిగారు. ఇదిలా ఉండగా హుండీల లెక్కింపుల్లో పాల్గొనే వారిలో మరో పది మంది బ్యాచ్ చోరీలకు పాల్పడుతున్నట్టు చెబుతున్న సురేష్ వారి పూర్తి వివరాలు తెలియవని చెబుతున్నట్టు సమాచా రం. ప్రస్తుతం ఆ పది మంది ఎవరూ.. వారికి ఇంకెవరైనా సహకరిస్తున్నారా.. అన్నదానిపై క్షేత్రంలో చర్చ జరుగుతోంది. అలాగే సురేష్ గతంలో రెండు చెవి దిద్దెలను ఓ వ్యక్తికి ఇచ్చినట్టు చెబుతున్నాడని సమాచారం. అందులో వాస్తవం ఎంతా అనే దా నిపై విచారణ జరుపుతున్నారట. భద్రతలో డొల్లతనం నిందితుడు సురేష్కు సంబంధించిన వివరాలేమీ దేవస్థానం రికార్డుల్లో లేవని తెలుస్తోంది. పట్టుబడ్డ తరువాతే అతడి వివరాలు బయటకొచ్చాయని పలువురు అంటున్నారు. హుండీ లెక్కింపులో పాల్గొనే సేవకుల నుంచి ఆధార్ కార్డులు, వారి ఫొటోలు, సేవా సంఘం హెడ్ సిఫార్సు లేఖను అధికారులు తీసుకోవాలి. అయితే ఈ నిబంధనలేవీ ఇక్కడ పాటించలేదని తెలుస్తోంది. అలాగే పూర్తిస్థాయిలో తనిఖీలు చేయకపోవడంతో ఇక్కడ చోరీ సులువుగా జరిగిందని స్థానికులు, భక్తులు అంటున్నారు. హోం గార్డులను మార్చాలని.. హుండీల నగదు లెక్కింపులో పాల్గొనే వారిని హోంగార్డులు తనిఖీ చేస్తున్నారు. అయితే చోరీ ఘటన తర్వాత వారిని మార్చాలని దేవస్థానం అధికారులు పోలీస్ ఉన్నతాధికారులను కోరినట్టు తెలిసింది. హుండీల నగదు లెక్కింపునకు కానిస్టేబుళ్లను నియమించాలని భక్తులు సూచిస్తున్నారు. -
ఏప్రిల్లో నూజివీడు కేంద్రీయ విద్యాలయం ప్రారంభం
నూజివీడు: నూజివీడులో కేంద్రీయ విద్యాలయాన్ని ఏ ప్రిల్లో ప్రారంభిస్తున్నట్టు కేంద్రీయ విద్యాలయ సమితి ఉత్తర్వులు జారీ చేసినట్లు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ పట్టణంలోని ఎంప్లాయిస్ కాలనీలో ఉన్న తాత్కాలిక భవనంలో తరగతులు నిర్వహిస్తారన్నారు. ప్రభుత్వం మార డం వల్ల కేంద్రీయ విద్యాలయం ప్రారంభం ఆలస్యమైందని, లేకపోతే గతేడాదే ప్రారంభించాల్సింద న్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఒక్కో త రగతికి 40 మంది విద్యార్థులను తీసుకుంటా రన్నారు. దీనిని సాధించడానికి ఎందరో తనకు తోడ్పాటునందించారన్నారు. దీని గురించి టీడీపీ వాళ్లకు అవగాహన లేదని, ఇలాంటి స్కూల్ ఒకటి ఉందని కూడా వాళ్లకు తెలీదన్నారు. దీని కోసం తాను 2020 నుంచి హైదరాబాద్, ఢిల్లీలోని కార్యాలయాలకు పలుమార్లు వెళ్లానన్నారు. నూజివీడులో కేంద్రీయ విద్యాలయానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ట్రిపుల్ఐటీకి పక్కనే ఉన్న సర్వే నం. 483–5బీ1లో ఏడెకరాల స్థలాన్ని కేటాయించిందని ప్రతాప్ అప్పారావు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు -
సర్వజన కష్టాలు
ఏలూరు టౌన్: ఏలూరు సర్వజన ఆస్పత్రిలో వైద్య సేవల దుస్థితిపై జనం గగ్గోలు పెడుతున్నారు. తీవ్ర అనారోగ్యం వస్తే రోగుల కష్టాలు వర్ణనాతీతం. గుండెపోటు, కిడ్నీ, ఊపిరితిత్తులు, కాలేయ సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక రోగాల బారిన పడితే సామాన్యుడి కుటుంబం రోడ్డున పడాల్సిన దుస్థితి నెలకొంది. ఏలూరు జీజీహెచ్లో కీలకమైన విభాగాల్లో నిపుణులైన వైద్యులు కరువయ్యారనే అపవాదు ఉంది. ఇక రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై అత్యవసర విభాగానికి వస్తే.. ‘మీ చావుకు మా బాధ్యత లేదు’ అంటూ రిఫర్ చేస్తూ చేతులు కడిగేసుకుంటున్నారు వైద్యులు. రక్త పరీక్షల నుంచి వైద్య చికిత్స, శస్త్రచికిత్సల వరకూ ఎక్కడా ప్రజలకు సంతృప్తికరంగా సేవలు అందటం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా వైద్యసేవలను మెరుగుపరిచేందుకు ఏ మాత్రం ప్రయత్నం చేయటం లేదంటూ రోగులు వాపోతున్నారు. ఐసీయూలో బెడ్స్ ఉన్నా.. రోజూ జీజీహెచ్లో ఓపీ, అత్యవసర విభాగానికి సుమారు 1,800 నుంచి 2 వేల మంది వరకు రోగులు వస్తుంటారు. జీజీహెచ్లో మొత్తం బెడ్స్ 580 వరకూ ఉండగా ఐసీయూ బెడ్స్ 50 ఉన్నాయి. అత్యవసర విభాగానికి సంబంధించి ఐసీయూ బెడ్స్ మరిన్ని పెంచాల్సి ఉంది. బెడ్స్ ఖాళీగానే ఉన్నా ఆయా విభాగాల హెచ్ఓడీల నిర్లక్ష్యంతో రోగులను ఇన్ పేషెంట్లుగా చేర్చుకోవటం లేదని చెబుతున్నారు. బెడ్స్ ఖాళీగానే ఉంచుతున్నారు తప్ప రోగులకు వైద్యసేవలు అందించాలనే ఆలో చన లేదనీ, విజయవాడ, గుంటూరు రిఫర్ చేస్తూ చేతులు దులుపేసుకుంటున్నారని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యసేవలు, సౌకర్యాలు నిల్పేరు గొప్ప...ఊరు దిబ్బ అన్న చందంగా సర్వజన ఆస్పత్రిలో వైద్యసేవలు ఉన్నాయి. ఎంసీహెచ్ విభాగంలో గర్భిణులు, బాలింతల కష్టాలు వర్ణణాతీతంగా ఉన్నాయి. గైనకాలజిస్ట్ వైద్యుల వద్ద గంటల తరబడి వేచి చూడాల్సి ఉంటుంది. ప్రసూతి ఆప రేషన్లు సైతం నిర్లక్ష్యంగా చేయటంతో కుట్లు విడిపోవటం, రెండుసార్లు శస్త్రచికిత్స చేయాల్సి రావటంతో గర్భిణులు భయపడుతున్నారు. రోగుల సహాయకులు, బంధువులు హాస్పిటల్కు వస్తే చెట్ల నీడనే ఆశ్రయించాల్సి వస్తోంది. వేసవిలో తీవ్రమైన ఎండలో సహాయకులు మాడిపోవటం ఖా యమంటున్నారు. మరోవైపు రోజూ మధ్యాహ్నం వ రకూ ఓపీ సేవలకు సంబంధించి రోగులు ఎండలోనే ఒక షెడ్డులో కూర్చొని నిరీక్షించాల్సి వస్తుంది. రక్త పరీక్షలకు రోగులు రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్లో వీల్చైర్లపై రోగుల సహాయకులే తోసుకుంటూ వెళ్లాల్సిన దృశ్యాలు కనిపిస్తున్నా యి. వృద్ధులు, చదువురాని వారికి ఏ రోగానికి ఏ వార్డులో చూపించుకోవాలో చెప్పేవారు లేరు. జీ జీహెచ్ భవనం, డ్రెయినేజీ వ్యవస్థ, పైప్లైన్స్ శి థిలావస్థకు చేరటంతో మరుగుదొడ్లులోని మురుగునీరు బయటకు వస్తుంది. రోజూ క్లీన్ చేసినా ఉ పయోగం లేదని రోగులు అంటున్నారు. వైద్యం.. పూజ్యం ఏలూరు జీజీహెచ్లో అందని సేవలు ఎమర్జెన్సీ వార్డుల్లో బెడ్స్ ఉన్నా ఫలితం లేదు చెత్తకుప్పలా తయారైన వార్డులు గర్భిణులు, బాలింతలకు తప్పని తిప్పలు సహాయకులకు చెట్ల నీడే ఆశ్రయం శిథిలావస్థలో డ్రెయినేజీ వ్యవస్థ చెత్తకుప్పలా వార్డులు ? ఏలూరు జీజీహెచ్ను వైద్య అధికారులు చెత్తకుప్పలా మార్చివేస్తున్నారని రోగులు అంటున్నారు. ఇటీవల రూ.5 కోట్ల విలువైన ఫర్నీచర్ వచ్చింది. మెరుగైన సౌకర్యాలతో బెడ్స్, టేబుల్స్, ఆపరేషన్ థియేటర్ పరికరాలు ఇలా సామగ్రి వచ్చింది. ఇక కొంత కొత్త, పాత సామగ్రిని, ఫర్నీచర్ను ఇష్టారాజ్యంగా వార్డుల్లోనూ, హాస్పిటల్ ప్రధాన ద్వారం వద్ద, ఎమర్జెన్సీ వార్డుల వద్ద పెట్టడంతో అవన్నీ చెత్తకుప్పలా మారిపోయాయి. రోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో డీఎంఈ నుంచి ఫర్నీచర్ వస్తే వాటిని ఏ విధంగా వినియోగించాలో తెలియక నిరుపయోగంగా వదిలేశారు. -
దేశంలో గ్యాస్ సంక్షోభం
ఏలూరు (టూటౌన్): అమెరికా ప్రయోజనాలకు లొంగిపోతూ దూరదృష్టి లేకుండా ప్రధాని మోదీ దేశ ప్రతిష్టను తాకట్టు పెట్టారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డేగా ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని కోరుతూ శుక్రవారం స్థానిక పాత బస్టాండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద సీపీఐ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభాకర్ మాట్లాడుతూ యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా గ్యాస్ సంక్షోభం నెలకొందన్నారు. గ్యాస్ కొరతతో హోటళ్లు, వీధుల్లో అంగళ్లు పెట్టుకొని జీవనోపాధి పొందే అసంఘటిత రంగ కార్మికులు ఉపాధి కోల్పోతున్నారన్నారు. రాష్ట్రంలో గృహ వినియోగం 80 శాతం వరకు ఉండగా వాణిజ్యపరంగా 15 శాతం, ఇతర అవసరాలకు ఐదు శాతం ఉందన్నారు. అయినా గృహ వినియోగదారులకు సిలిండర్ కోసం బుక్ చేసిన 25 రోజులకు కూడా అందుబాటులో ఉండే అవకాశం లేదన్నారు. జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్, సమితి సహాయ కార్యదర్శి కురెళ్ళ వరప్రసాద్, కార్యవర్గ సభ్యుడు కొల్లూరు సుధారాణి తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (టూటౌన్): ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శనివారం జరిగే జాతీయ లోక్అదాలత్లో ఎ క్కువ కేసులు పరిష్కారం అయ్యేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి కోరారు. శుక్రవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి చాంబర్లో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈ ఏడాదిలో తొలి జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని, రాజీయోగ్యమైన కేసులను రాజీ చేస్తామన్నారు. గత డిసెంబర్లో జరిగిన లోక్ అదాలత్లో 10,798 కేసులను రాజీ చేశా మని చెప్పారు. ఈ లోక్ అదాలత్లో 9,345 కేసులు రాజీయోగ్యమైనవి గుర్తించామన్నారు. కక్షిదారులు సౌకర్యార్థం హెల్ప్డెస్క్లను ఏర్పాటు చేశామని, కేసుల పరిష్కారంలో సందేహాలు ఉంటే 08812 2245 నంబర్లో సంప్రదించాలని సూచించారు. ఏలూరు బార్ అసోసియేషన్ ప్రె సిడెంట్ కోనే సీతారాం, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ పాల్గొన్నారు. ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రైల్వే రిక్రూట్మెంట్ గ్రూప్–డి 2026 పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తున్నామని, ఈ మేరకు అభ్యర్తుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ఏలూరు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమధికారి ఆర్వీ నాగరాణి, శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఈనెల 20లోపు దరఖాస్తులు సమర్పించాలని, 100 మంది అభ్యర్థులకు రెండు నెలలపాటు ఉచిత శిక్షణతో పాటు స్టయిఫండ్, స్టడీ మెటీరియల్ ఇస్తామన్నారు. మరిన్ని వివరాలకు 8686180018, 9030211920 నంబర్లలో సంప్రదించాలని కోరారు. ఏలూరు (టూటౌన్): జిల్లాలో గృహ వినియోగదారులకు వంట గ్యాస్ కొరత లేదని జేసీ ఎంజే అభిషేక్ గౌడ తెలిపారు. గ్యాస్ కొరతపై ని రాధారమైన వదంతులను నమ్మవద్దని కోరా రు. జిల్లాలో సిలిండర్ల నిరంతర సరఫరాను ని ర్ధారించడానికి పటిష్ట చర్యలు చేపట్టామన్నా రు. జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ను ఏర్పాటుచేశామన్నారు. గ్యాస్ సరఫరాలో సమస్యలు ఎ దురైనా, ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించినా ఫోన్ చేసి తెలియజేయాలన్నారు. అసిస్టెంట్ సప్లయ్ ఆఫీసర్ (ఏఎస్ఓ) ఏలూరు– 8919887013, ఎం.సంధ్యాకుమారి (జూనియర్ అసిస్టెంట్,డీసీఎస్ఓ కార్యాలయం) –9652892425, పి.నాగదుర్గ (సీనియర్ అసిస్టెంట్, డీసీఎస్ఓ కార్యాలయం)– 79812 22542 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు. ముసునూరు: అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం రైతులకు వరం అని రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ మూడో విడత పంపిణీ కార్యక్రమాన్ని మండలంలోని చెక్కపల్లిలో శుక్రవారం రాత్రి నిర్వహించారు. నూజివీడు నియోజక వర్గంలో 35,529 మంది రైతులకు రూ.19.77 కోట్లు, ముసునూరు మండలంలోని 8,205 మంది రైతులకు రూ.4.64 కోట్ల విలువైన నమూనా చెక్కులను అందజేశారు. కలెక్టర్ కె.వెట్రిసెల్వి, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న తదితరులు పాల్గొన్నారు. -
ఎదురులేని మట్టి మాఫియా
ద్వారకాతిరుమల: ఖద్దరు చొక్కా అండ.. అధికారుల మద్దతు ఉన్నంత వరకు మట్టి మాఫియాకు ఎదురేలేదు. ద్వారకాతిరుమల మండలం గుణ్ణంపల్లిలోని పోలవరం కుడి కాలువ గట్టుపై పెద్ద ఎత్తున జరుగుతున్న క్వారీ మట్టి అక్రమ తవ్వకాలను చూస్తున్నవారు ఎవరైనా.. నిజమే అనక మానరు. పట్టపగలు బహిరంగంగా జరుగుతున్న మట్టి దోపిడీని అరికట్టాలని ప్రజలు గగ్గోలు పెడుతున్నా, అధికారులకు కనీసం చీమకుట్టినట్టు లేదంటే.. అవినీతి ఏ స్థాయిలో జరుగుతుందో అర్థమవుతోందని స్థానికులు అంటున్నారు. వివరాల్లోకి వెళితే. గుణ్ణంపల్లి వద్ద పోలవరం కుడి కాలువకు ఇరుపక్కలా గట్లుపై క్వారీలను ఏర్పాటు చేసి, ఎంతో విలువైన మట్టిని దోచేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా, దూబచర్లలో రహదారుల అభివృద్ధికి అంటూ వందలాది టిప్పర్ల మట్టిని బయటకు తరలించి, అమ్ముకుంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా జరుగుతున్న ఈ మట్టి మాఫియాను అడ్డుకోవాల్సిన అధికారులు కనీసం ఆవైపు కన్నెత్తి చూడకపోవడం పట్ల ప్రజలు మండిపడుతున్నారు. అసలు ప్రభుత్వం ఉందా.. ప్రజాధనాన్ని కాపాడాల్సిన అధికారులు ఏం చేస్తున్నారని ఓ పక్క స్థానికులు ప్రశ్నిస్తుంటే.. అక్రమార్కులు మాత్రం తమకు అడ్డేలేదు.. తగ్గేదే లేదని అంటున్నారు. హడలిపోతున్న రైతులు కాలువ గట్లపై నుంచి పొలాలకు వెళ్లే రైతులు టిప్పర్ల వేగాన్ని చూసి హడలిపోతున్నారు. మట్టి లోడుతో టిప్పర్ వెళ్లే సమయంలో దుమ్ము భారీగా లేస్తోంది. దాంతో టిప్పర్ వెనుక వెళ్లే వాహనదారులకు దారి కనబడక అష్టకష్టాలు పడుతున్నారు. దుమ్మూ.. దూళిలో పడుతూ లేస్తూ రైతులు ప్రయాణాలు సాగిస్తున్నారు. ఇదిలా ఉంటే టిప్పర్ల రాకపోకలతో కాలువ గట్లు సైతం ధ్వంసమయ్యాయి. కాలువ గట్లు రాసిచ్చారా.. ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారంతో పాటు, కాలువ గట్లను రాసిచ్చారా.. అని గుణ్ణంపల్లి మాజీ సర్పంచ్ బాలం వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. అధికార పార్టీ ప్రముఖులు నిత్యం వందలాది టిప్పర్ల మట్టిని అమ్ముకుని కోట్లు గడిస్తుంటే, అధికారులు కళ్లకు గంతలు కట్టుకుని కూర్చోవడం దారుణమని అంటున్నారు. కాలువ గట్లపై తవ్వుతున్న పెద్దపెద్ద గోతులు భవిష్యత్తులో పెను ప్రమాదాలకు దారితీస్తాయని, అప్పుడు ప్రభుత్వం, అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ కూడా ఈ అక్రమ మట్టి తవ్వకాలను పట్టించుకోకపోవడం దారుణమని వెంకటేశ్వరరావు అంటున్నారు. పోలవరం కుడి కాలువ గట్టుపై కొనసాగుతున్న క్వారీ మట్టి అక్రమ తవ్వకాలు గట్లపై ప్రయాణించేందుకు భీతిల్లుతున్న రైతులు కళ్లకు గంతలు కట్టుకున్న అధికారులు -
బైక్ల చోరీ ముఠా అరెస్ట్
ఏలూరు టౌన్ : మోటార్సైకిళ్ల చోరీకి పాల్పడుతున్న దొంగల ముఠాను ఏలూరు టూటౌన్ పోలీసులు పట్టుకున్నారు. ఏలూరు డీఎస్పీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్ వివరాలు వెల్లడించారు. ఏలూరు పవర్పేట డీఎన్టీ బాలుర వసతిగృహం సెల్లార్లో ఉన్న మోటారు సైకిల్ను గుర్తు తెలియని వ్యక్తులు ఈనెల 7న అపహరించుకుపోయారు. దీంతో ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు ఏలూరు డీఎస్పీ శ్రావణ్కుమార్ పర్యవేక్షణలో ఏలూరు టూటౌన్ సీఐ కే.అశోక్కుమార్, ఎస్సైలు కే.రామకృష్ణ, బీఎం వెంకట రాజా, ఏఎస్ఐ బీ.యేసు, హెచ్సీ కే.రవి ప్రత్యేక బృందంగా దర్యాప్తు చేపట్టారు. ఈనెల 11న ఏలూరు తంగెళ్ళమూడి సెంటర్ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. బాలుర వసతిగృహంలో చోరీతోపాటు, పలు దొంగతనం కేసుల్లోనూ ఆ ముగ్గురు నిందితులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు పెదపాడు మండలం కలపర్రు గ్రామానికి చెందిన చిల్లా విజయ్కుమార్, ఏలూరు తాపీమేసీ్త్ర కాలనీ 5వ రోడ్ ప్రాంతానికి చెందిన బైక్, కారు మెకానిక్ తుతిక శ్రీనివాస్, కృష్ణాజిల్లా మచిలీపట్నం చింతగుంటపాలెం గ్రామానికి చెందిన బొమ్మసాని లక్ష్మీశ్రీనివాస్పై ఏలూరు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వీరినుంచి 7 మోటారు సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఏలూరు టూటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో నాలుగు, త్రీటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో రెండు, వన్టౌన్ స్టేషన్ పరిధిలో ఒక మోటారు సైకిల్ చోరీ కేసు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఏడు మోటారు సైకిళ్లు స్వాధీనం -
మొరాయించిన బస్సు
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు మరోసారి మొరాయించింది. గురువారం జంగారెడ్డిగూడెం నుంచి చింతలపూడి సర్వీసు మండలంలోని తాడువాయి సెంటర్ వద్ద ఆగిపోయింది. ఆర్టీసీ సిబ్బంది ఎంత కష్టపడినా స్టార్ట్ కాలేదు. దీంతో ప్రయాణికులు ఒక దశలో అసహనం వ్యక్తం చేశారు. మిట్టమధ్యాహ్నం మండుటెండలో బస్సు ఆగిపోవడంతో అవస్థలు పడ్డారు. అరగంట కష్టపడిన తరువాత ఎట్టకేలకు బస్సు స్టార్ట్ అయ్యి చింతలపూడి బయలుదేరడంతో ఊపిరి పీల్చుకున్నారు. నిడమర్రు: అక్రమంగా నిల్వ ఉంచిన 12 గ్యాస్ సిలిండర్లను ఏలూరు విజిలెన్స్ అధికారులు సీజ్ చేసినట్లు విజిలెన్స్ తహసీల్దారు బి, కన్యాకుమారి తెలిపారు. ఏలూరు విజిలెన్స్ ఎస్పీ కె.నాగేశ్వరరావుకు గురువారం అందిన విశ్వసనీయ సమాచారం మేరకు తోకలపల్లి గ్రామంలో బలే ఏడుకొండలు నివాసంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించగా 12 గృహ అవసరాలకు సంబంధించిన సిలిండర్లను గుర్తించారు. దీంతో ఏడుకొండలపై నిత్యవసర చట్టం 1955 ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తనిఖీల్లో ఎస్సై సీహెచ్ రంజిత్, సీఎస్డీటీ ఎస్కే జరీనా తదితరులున్నారు. ఏలూరు రూరల్: జాతీయస్థాయి పారా ఒలింపిక్స్ పోటీలకు కామవరపుకోట మండలం రావికంపాడు క్రీడాకారుడు శొంఠి రాంబాబు అర్హత సాధించాడు. జనవరి 27వ తేదీన నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో రాష్ట్రస్థాయి పారా ఒలింపిక్స్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో ఏలూరు జిల్లాకు ప్రాతినిధ్యం వహించిన రాంబాబు షాట్పుట్ విభాగంలో 8.05 మీటర్ల దూరం విసిరి బంగారు పతకం సాధించాడు. దీంతో ఈ నెల 17 నుంచి 21 వరకూ ఒరిస్సా రాష్ట్రం భువనేశ్వర్లో జరిగే జాతీయ పారా ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యాడు. చాట్రాయి: విద్యార్థి మృతిపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం చాట్రాయి సెంటర్లో మృతుడి బంధువులు రాస్తారోకో నిర్వహించారు. మండలంలోని చాట్రాయి గ్రామానికి చెందిన అంబటి దీప్(16) బుధవారం రాత్రి చెరువులో పడి మృతి చెందాడు. అతడు విస్సన్నపేటలోని ప్రైవేట్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం ఇంటర్ చదువుతున్నాడు. ప్రేమ వ్యవహారమే అతడి మృతికి కారణమంటూ గురువారం అంబటి దీప్ బంధువులు చాట్రాయి సెంటర్లో రాస్తారోకో చేశారు. విచారణ చేసి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. పోస్టుమార్టం నివేదక ఆధారంగా విచారణ చేయనున్నట్లు ఎస్సై డి రామకృష్ణ తెలిపారు. -
మినీ వ్యాన్ అదుపు తప్పి పలువురికి గాయాలు
తాడేపల్లిగూడెం రూరల్: డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా మినీ వ్యాన్ అదుపు తప్పి పంట బోదెలోకి దూసుకెళ్లిన ఘటన మండలంలోని చినతాడేపల్లి జాతీయ రహదారి నెం.16పై గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జార్ఖండ్కు చెందిన సుమారు 27 మంది తీర్థయాత్రల నిమిత్తం ఈ నెల 9వ తేదిన బయల్దేరారు. దీనిలో భాగంగా దైవ దర్శనానినికి చైన్నె వెళ్తుండగా తాడేపల్లిగూడెం మండలం చినతాడేపల్లి జాతీయ రహదారిపై వచ్చేసరికి గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో వ్యాన్ డ్రైవర్కు నిద్ర మత్తు రావడంతో వ్యాన్ అదుపు తప్పి పంట బోదెలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో సుమారు 15 మందికి గాయాలు కాగా మూడు అంబులెన్స్లలో తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరో 11మంది ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
నేటినుంచి జాతీయ స్థాయి నాటికల పోటీలు
పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లు కళాపరిషత్ ఆధ్వర్యంలో 17వ జాతీయ స్థాయి నాటిక పోటీలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజులపాటు స్థానిక బస్టాండ్ సెంటర్ వద్ద అడబాల థియేటర్ పక్కన ఉన్న ప్రాంగణంలో ఈ పోటీలను నిర్వహించనున్నారు. ఈనెల 13 శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి అరవింద్ ఆర్ట్స్, తాడేపల్లి వారి ‘దేవుణ్ణి చూశా’, ఉషోదయ కళానికేతన్, కట్రపాడు వారి ‘మంచి మనసులు’, 14న విజయవాడ సాంస్కృతిక సమితి, విజయవాడ వారి ‘మమ్మల్నీ బ్రతకనివ్వండి’, చైతన్య కళాభారతి, కరీంనగర్ వారి ‘ఖరీదైన జైళ్లు’, పరమాత్ముని క్రియేషన్స్ భాగ్యనగరం (హైదరాబాద్) వారి ‘ఎక్కడో ఏదో’, 15న అభినయ ఆర్ట్స్ గుంటూరు వారి ‘సహన’, గోవాడ క్రియేషన్స్ హైదరాబాద్ వారి ‘అమ్మ చెక్కిన బొమ్మ’, శ్రీ హర్షా క్రియేషన్స్ విజయవాడ వారి ‘భువి కోరని భ్రమణం’ నాటికలు ప్రదర్శించనున్నారు. అనంతరం బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఓపెన్ ఎయిర్ థియేటర్ ఎప్పుడో నిర్మించాలి కళలకు నిలయమైన క్షీరపురిలో కళాపరిషత్కు వేదిక లేకుండా పోయింది. సుమారు పదేళ్లుగా పాలకొల్లు కళాపరిషత్ నిర్వహిస్తున్న నాటిక పోటీలు ఎక్కడ ఖాళీ ఉంటే ఆ స్థలంలో నిర్వహిస్తూ వస్తున్నారు. ఒకప్పుడు నాటిక పోటీలంటే ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉండేది. అభివృద్ధి పనుల్లో భాగంగా దాన్ని తొలగించడంతో నాటి నుంచి నేటి వరకూ నాటికల పోటీలు నిర్వహించడానికి సరైన వేదికే లేకుండా పోయింది. కొన్నాళ్లు అద్దేపల్లి వారి సత్రం ఖాళీ స్థలంలో నిర్వహించగా అక్కడ కాంప్లెక్స్ నిర్మించడంతో అవకాశం లేకుండా పోయింది. అనంతరం బస్టాండ్ వద్ద అడబాల థియేటర్ వెనుక ఉన్న ఖాళీ స్థలంలో నిర్వహిస్తున్నారు. వేదికతో సహా అన్ని ఏర్పాట్లు చేయాల్సి రావడంతో నిర్వహణ ఖర్చులు అధిక మవుతున్నాయని, త్వరగా ఓపెన్ ఎయిర్ థియేటర్ నిర్మాణ పనులు పూర్తిచేయాలని కళాకారులు కోరుతున్నారు. -
ఫీడ్ కంపెనీల ఆగడాలను అరికట్టాలి
పాలకొల్లు సెంట్రల్: ఆక్వాకు సంబంధించిన ప్రాసెసింగ్, ఫీడ్ కంపెనీల ఆగడాలను అరికట్టకపోతే భవిష్యత్లో రొయ్య మనుగడే లేకుండా పోతుందని జై భారత్ క్షీరా రామ ఆక్వా సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్రాజు అన్నారు. గురువారం మండలంలోని పూలపల్లి గ్రామంలో ఎస్ఎస్ఎస్ కళ్యాణ మండపంలో తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాల ఆక్వా రైతులు, రైతు సంఘం నాయకులతో సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా గాంధీభగవాన్ రాజు మాట్లాడుతూ సిండికేట్ వ్యవస్థను నియంత్రించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. ఈ నెల 22న వీరవాసరంలో రాష్ట్ర స్థాయి ఆక్వా రైతులు, రైతు సంఘాలతో భారీ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. గత కొన్ని రోజులుగా కౌంట్ రేట్లు తగ్గించారన్నారు. రొయ్యలు కొనుగోలు చేసే పరిస్థితి లేకపోవడంతో రైతులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం రైతులకు మేలు చేసేలా పెండింగ్లో ఉన్న వివిధ అంశాలను పరిశీలించాలన్నారు. ఈ నెల 22న వీరవాసరంలో తులసి కళ్యాణ మండపంలో జరగనున్న సభను విజయవంతం చేసేలా ఆక్వా రైతులందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మూడు జిల్లాల నుంచి ఆక్వా సంఘం సభ్యులు, రైతులు పాల్గొన్నారు. -
అటవీ భూముల్లోనూ గ్రావెల్ దందా
నూజివీడు: గ్రావెల్ కనబడితే చాలు కూటమి అక్రమార్కులు గద్దల్లా వాలిపోతున్నారు. వారి ముందు చిన్నసైజు గుట్టలు రాత్రికి రాత్రే కరిగిపోతున్నాయి. అర్ధరాత్రి గ్రావెల్ అక్రమ తవ్వకాలు మొదలుపెట్టి తెల్లవారేసరికి గుట్టు చప్పుడు కాకుండా సర్దుకొని పోతున్నారు. ప్రభుత్వ బంజరు భూమి, చెరువులు, అటవీ భూముల్లోని గ్రావెల్ వారి ముందు ఆగే పరిస్థితి కనిపించడం లేదు. ఈ దందా నూజివీడు మండలం ఓగిరాల తండా పంచాయతీ పరిధిలో గత వారం రోజులుగా యథేచ్ఛగా కొనసాగుతోంది. గ్రామ పరిధిలోని అటవీశాఖకు చెందిన భూపతి గట్టు వద్ద ఉన్న గ్రావెల్ను రాత్రి 10 గంటలు దాటితే చాలు పదుల సంఖ్యలో భారీ టిప్పర్లు వచ్చి గ్రావెల్ను లోడు చేసుకొని నూజివీడు, విజయవాడ తదితర ప్రాంతాలకు తరలించుకుపోతున్నారు. టిప్పర్ల మోతతో, దుమ్ము,ధూళీతో ఓగిరాల తండా, వెంకటాయపాలెం గ్రామాల ప్రజలకు రాత్రి పూట నిద్ర ఉండటం లేదు. ప్రకృతి సంపదను దోచుకెళ్తున్నా దానికి రక్షణగా ఉండాల్సిన ప్రభుత్వ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. పట్టించుకోని అధికారులు ఈ దారుణమైన దోపిడీపై ఓగిరాల తండా గ్రామస్తులు పలువురు సబ్కలెక్టర్ కార్యాలయంలో ఈనెల 9న నిర్వహించిన పీజీఆర్ఎస్లో అర్జీని సైతం ఇచ్చినప్పటికీ గ్రావెల్ దోపిడీకి బ్రేక్ పడలేదు. ప్రజా సంపద దోపిడీకి గురవుతున్నా సబ్కలెక్టర్ స్థాయి అధికారి కూడా దోపిడీని ఆపకపోవడంపై గ్రామస్తుల్లో విస్మయం వ్యక్తమవుతోంది. భూపతిగట్టు వద్ద దాదాపు 2 ఎకరాల విస్తీర్ణంలో వేలాది క్యూబిక్ మీటర్ల గ్రావెల్ను కొల్లగొట్టి తరలించినా పట్టించుకోవాల్సిన అటవీశాఖ అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేదలు ఎవరైనా అడవిలోకి వెళ్లి పొయ్యిలోకి ఎండుపుల్లలు కట్టుకొని సైకిల్పై తెచ్చుకుంటుంటే సైకిళ్ల టైర్లు కోసేయడం వంటి పనులకు పాల్పడే అటవీశాఖ అధికారులు ఈ దందాను ఎందుకు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. గ్రావెల్ దందాను ఇప్పటికై నా నిలువరించాలని గ్రామస్తులు జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేస్తున్నారు. -
వాండ్రం నుదుటిన క్రికెట్ తిలక్ం
● అంతర్జాతీయ క్రికెట్లో రాణిస్తున్న తిలక్వర్మ ● సంబరాలు చేసుకుంటున్న అమ్మమ్మ, తాతయ్యఉండి : క్రికెట్లో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న తెలుగు తేజం నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ తమ మనవడే అంటూ ఉండి మండలం వాండ్రంకు చెందిన తాతయ్య భూపతిరాజు సుబ్బరాజు, అమ్మమ్మ సుందరమ్మ ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు. ఇటీవల టీ20 ప్రపంచకప్, గతంలో ఆసియా కప్ గెలుపులో తమ మనవడు కీలక పాత్ర పోషించాడంంటూ వారు సంబంరాలు చేసుకుంటున్నారు. గురువారం వారు తిలక్వర్మ గురించి పలు విషయాలు విలేకరులతో పంచుకున్నారు. మనవడు తిలక్ క్రికెట్లో రాణించేందుకు అల్లుడు నంబూరి నాగరాజు, కుమార్తె గాయత్రి ఎంతో కష్టపడ్డారని చెప్పారు. అలాగే తిలక్ గెలుపులో అతని చిన్ననాటి కోచ్ సలీమ్ పాత్రకూడా ఎంతో ఉందన్నారు. తమ ఒడిలో ఆడుకున్న మనవడు దేశం గర్వించేస్థాయికి ఎదగడం తమకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. 2021లో తిలక్వర్మ ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. టి20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో తాము జంగారెడ్డిగూడెంలో ఉన్నామని, అక్కడ భారీ స్క్రీన్ ఏర్పాటు చేసి మ్యాచ్ చూశామని, భారత్ గెలుపు సంబరాలతో తమ సంతోషానికి అవధులు లేవని తెలిపారు. తమ మనవడు క్రికెట్లో మరింతగా రాణించి దేశ ఖ్యాతిని పెంచాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. త్వరలోనే వాండ్రం రాబోతున్న తిలక్కు స్వాగత ఏర్పాట్లపై అలోచిస్తున్నామన్నారు. వాండ్రంలో తమ సంతోషాన్ని పంచుకుంటున్న తిలక్వర్మ అమ్మమ్మ సుందరమ్మ, తాతయ్య సుబ్బరాజు, అమ్మమ్మ ఇంట్లో తిలక్వర్మ చిన్ననాటి ఫొటోలు -
14 నుంచి టెన్నిస్ టోర్నమెంట్
భీమవరం: భీమవరం కాస్మోపాలిటీన్ క్లబ్లో ఈనెల 14 నుంచి వారం రోజులపాటు ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నట్లు టోర్నమెంట్ డైరెక్టర్ యూఆర్పీఆర్ వర్మ, క్లబ్ సహాయ కార్యదర్శి రుద్రరాజు సుబ్బరాజు తెలిపారు. గురువారం క్లబ్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. మెన్స్ డబుల్స్ 35+, 45+, 55+, 65+, 70 విభాగంలో సింగిల్స్, డబుల్స్, 75 + విభాగంలో డబుల్స్ టోర్నమెంట్ జరుగుతాయన్నారు. ఈ పోటీల్లో పలు రాష్ట్రాల నుంచి 175 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారన్నారు. 14, 15 తేదిల్లో క్వాలిఫైయింగ్ పోటీలు 16 నుంచి 20వ తేదీ వరకు ముఖ్య పోటీలు జరుగుతాయని వర్మ, సుబ్బరాజు తెలిపారు. అలాగే స్థానిక క్రీడాకారుల్లో టెన్నిస్ క్రీడలో ప్రతిభను ప్రోత్సహించడానికి అండర్ –30 పురుషుల చాంపియన్షిప్ నిర్వహిస్తున్నామని, 8 సింగిల్స్, 4 డబుల్స్ జట్లు 18, 19, 20 తేదీల్లో పోటీల్లో పాల్గొంటాయన్నారు. భీమవరం: ఈనెల 13వ తేదీ నుంచి ప్రారంభం కానున్న చర్లపల్లి–కామాఖ్య అమృత్ భారత్ వీక్లీ ఎక్స్ప్రెస్కు జిల్లాలో హాల్ట్ కల్పించినట్లు కేంద్ర ఉక్కు, భారీపరిశ్రమలశాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. చర్లపల్లి (తెలంగాణ) నుంచి కామాఖ్య (అస్సాం) మధ్య నడిచే నెం. 15673/15674 రైలుకు జిల్లాలోని భీమవరం టౌన్, తణుకు రైల్వే స్టేషన్లలో హాల్టింగ్ కల్పించినట్లు పేర్కొన్నారు. ఈ రైలు శుక్రవారం చర్లపల్లిలో ప్రారంభం అవుతుండగా తణుకులో రాత్రి 10.50 గంటలకు, భీమవరం టౌన్లో రాత్రి 11.30 గంటలకు చేరుకుని తిరిగి 15వ తేదీన చర్లపల్లి స్టేషన్కు ఉదయం 8.30 గంటలకు చేరుకుంటుందన్నారు. ఈనెల 18 నుంచి వీక్లీ ఎక్స్ప్రెస్ రెగ్యులర్ సర్వీస్గా నడుస్తుందని శ్రీనివాసవర్మ ప్రకటనలో వివరించారు. ఏలూరు రూరల్: గిరిజన ప్రాంతాల బాలబాలికల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు శాప్ ఆధ్వర్యంలో ట్రైబల్ స్పోర్ట్స్ టాలెంట్ హంట్ పేరిట పోటీలు, శిక్షణ నిర్వహించనున్నామని జిల్లా డీఎస్డీఓ ఎస్ఏ అజీజ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 1, 2012 నుంచి మార్చి 31, 2018 మధ్య 8 ఏళ్ల నుంచి 14 ఏళ్ల వయస్సు కల్గిన బాలబాలికలకు ప్రత్యేక పోటీలు చేపట్టనున్నామని వివరించారు. ఇందులో భాగంగా ఈ నెల 16, 17 తేదీల్లో రంపచోడవరం ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ పాఠశాల ఆవరణలో 400, 800, 3కేఎం, 5కేఎం, జావలిన్త్రో, లాంగ్జంప్తో పాటు బాలికలకు ఆర్చరీ, వెయిట్లిఫ్టింగ్, హాకీ, ఖోఖో, ఫుట్బాల్, బాక్సింగ్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఇందులో ప్రతిభ చాటిన వారిని గుర్తించి శాప్ ఆధ్వర్యంలో మెరుగైన శిక్షణ అందిస్తామన్నారు. పోటీదారులు ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతూ స్టడీ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని సూచించారు. పోలవరం పరిసర 12 మండలాల్లో బాలబాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉంగుటూరు: మోటార్సైకిల్ను కారు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల ప్రకారం ఉంగుటూరుకు చెందిన మానేపల్లి సత్యనారాయణ (75) గురువారం రాత్రి మోటార్సైకిల్పై నారాయణపురం వెళ్లి తిరిగి వస్తుండగా ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం వెళుతున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో మోటార్సైకిల్పై వెళుతున్న సత్యనారాయణ డివైడర్పై పడి మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ఎస్సై సూర్యభగవాన్ ఘటనా స్థలానికి చేరుకుని సత్యనారాయణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారును చేబ్రోలు పోలీస్టేషన్కు తరలించారు. -
కూల్డ్రింక్ అనుకుని పురుగు మందు తాగి..
ఐదేళ్ల చిన్నారి మృతి బుట్టాయగూడెం: కూల్డ్రింక్ అనుకుని పురుగు మందు తాగి ఐదేళ్ల బాలిక మృతిచెందిన ఘటన అంతర్వేదిగూడెంలో చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు బాలి క ప్రాణాన్ని తీశాయి. వివరాలిలా ఉన్నాయి.. అంతర్వేదిగూడేనికి చెందిన నాగేంద్రబాబు, కుమారి దంపతులకు రితిక (5), శివ (2) సంతానం. రెండు రోజులుగా భార్యాభర్తలు గొడవ పడుతున్నారు. ఈ నేపథ్యంలో కుమారి భర్తను బెదిరించేందుకు చిన్న బాటిల్లో కూల్డ్రింక్లో పురుగుమందు కలిపి ఇంటి వద్ద ఓ ప్రదేశంలో ఉంచింది. అయితే రితిక కూల్డ్రింక్ అనుకుని బాటిల్లోని ద్రవాన్ని తాగేసింది. కొద్దిసేపటికి గొంతు మంట వస్తుందని తల్లికి చెప్పింది. అలాగే రితిక నోట్లో నుంచి నురుగ రావడంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం బుట్టాయగూడెం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. చిన్నారి అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పురుగుల భోజనం తినలేం
కొయ్యలగూడెం: మధ్యాహ్న భోజనం అన్నంలో పురుగులు వస్తున్నాయని, ఈ భోజనం తి నలేం అంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చే స్తున్నారు. దీంతో ఇళ్ల వద్ద నుంచి క్యారియర్ల తెచ్చుకుంటున్నామని అంటున్నారు. కన్నాపు రం జెడ్పీ హైస్కూల్లో మధ్యాహ్న భోజన పథకంలో వడ్డిస్తున్న ఆహార పదార్థాల్లో పురుగులు కనిపిస్తున్నాయని ఆరోపించారు. ఇటీవల ఎంపీడీఓ తనిఖీల్లో సైతం పథకం నిర్వహణపై అ సంతృప్తి వ్యక్తం చేశారు. అయినా పథకం ని ర్వాహకుల తీరు మారకపోవడంతో పాటు వి ద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లోపంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలవరం రూరల్: బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించినట్టు ఎస్సై ఎస్ఎస్ పవన్కుమార్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. 2018లో పోలవరం మండలం పాత గాజులగొందిలో ఐదేళ్ల గిరిజన బాలికపై అదే ప్రాంతానికి చెందిన నేరం శేఖర్ అనే వ్యక్తి మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్ప డ్డాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోక్సో కోర్టు న్యాయమూర్తి కె.వాణిశ్రీ విచారణ అనంతరం నిందితుడికి 20 ఏళ్ల జైలు, రూ.10 వేల జరిమానా విధించారు. అలాగే బాధితురాలికి ప్రభుత్వం తరఫున రూ.2 లక్షల నష్టపరిహారం అందించాలని కోర్టు ఆదేశించిందన్నారు. ఏలూరు(మెట్రో): జిల్లాలో పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ యూనిట్లతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి సీఎం చంద్రబాబుకు వివరించారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం రెండో రోజు జరిగిన కలెక్టర్ల సదస్సులో ఏలూరు జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను కలెక్టర్ వివరించారు. ఉంగుటూరు: వ్యసనాలకు బానిసై చోరీలకు పాల్పడుతున్న నలుగురు యువకులు పోలీసులకు పట్టుబడ్డారు. గురువారం బాదంపూడి బైపాస్ వద్ద నిడమర్రు సీఐ రజనీకుమార్, చేబ్రోలు ఎస్సై సూర్యభగవాన్ తనిఖీలు చేస్తుండగా నలుగురు యువకులు అనుమానాస్పదంగా వ్యవహరించడంతో వారిని పట్టుకున్నారు. వీరి నుంచి మో టార్ సైకిళ్లు, బంగారు, వెండి వస్తువులు, గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చేబ్రోలు స్టేషన్లో డీఎస్పీ శ్రావణ్కుమార్ వివరాలు వెల్లడించారు. తంగెళ్లమూడికి చెందిన తాడి షణ్ముకరావు, రాంచరణ్ తేజ, భీమడోలుకు చెందిన దత్తి నవీన్, తూర్పుగోదవరి జిల్లా మండపేట మండల కేశవరానికి చెందిన పొందుగల అరవింద్ జులాయిగా తి రుగుతూ ఒటరి మహిళల మెడల్లోని బంగారు నగలను చోరీ చేస్తున్నారు. అలాగే గంజాయికి కూడా అలవాటు పడ్డారు. వీరి నుంచి నాలుగు ద్విచక్ర వాహనాలు, 5.320 కిలోల గంజాయి, బంగారం, వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ చెప్పారు. వ్యసనాలకు బా నిసై చోరీలకు పాల్పడుతున్నారని, ఒడిసా ప్రాంతంలో గంజాయి కొనుగోలు చేసి విశాఖ తదితర ప్రాంతాల్లో ఎంజాయి చేసి ఈ ప్రాంతంలో పట్టుబడ్డారన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత బస్సు ప్ర యాణం కల్పిస్తున్నట్టు జిల్లా ప్రజారవాణా అ ధికారి ఎస్.గిరిధర్కుమార్ తెలిపారు. ఈనెల 16 నుంచి 28 వరకు హాల్టికెట్ చూపించి పరీక్షా కేంద్రాలకు ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. -
ప్రజా సంక్షేమమే అజెండా
ప్రజా సంక్షేమమే అజెండాగా.. అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా.. కారుచీకట్లలో కాంతిరేఖలా.. ప్రజాహితమే లక్ష్యంగా పుట్టిన వైఎస్సార్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవాలను గురువారం జిల్లావ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. భారీ ర్యాలీలు, జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. దివంగత వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్లు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కక్ష రాజకీయాలు, కూటమి ప్రభుత్వ కుట్రలను ఎండగడుతూ.. గత వైఎస్సార్సీపీ జనరంజక పాలనను గుర్తుచేశారు. నూజివీడు: వేడుకల్లో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు ఏలూరు: వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేస్తున్న కన్వీనర్ జయప్రకాష్ గణపవరం: బువ్వనపల్లిలో వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు సాక్షి ప్రతినిధి,ఏలూరు: కై కలూరు: కై కలూరు సంత మార్కెట్ వద్ద పార్టీ జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో దివంగత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ జెండాను ఎగురవేసి 16 కేజీల కేక్ను కట్ చేశారు. ఈ సందర్బంగా డీఎన్నార్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే వలంటీర్లతో కూడిన న్యాయమైన పాలన అందిస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నూజివీడు: నూజివీడులో మాజీ ఎమ్మెల్యే, సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో బాపూనగర్లో వైఎస్సార్ విగ్రహం వద్ద పార్టీ జెండాను ఎగురవేసి అనంతరం దివంగత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ను కట్ చేసి పార్టీ శ్రేణులతో కలిసి కార్యక్రమం నిర్వహించారు. ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ నిరంతరం ప్రజాపక్షమే ఊపిరిగా పో రాడుతుందని, అధికారం ఉన్నా, లేకున్నా ప్రజల పక్షాన ఉంటూ ముందుకు సాగుతామన్నారు. పోలవరం: బుట్టాయగూడెంలో మాజీ ఎమ్మెల్యే, పోలవరం నియోజకవర్గ సమన్వయకర్త తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ చరిత్రలో వైఎస్సార్సీపీ ప్రస్థానం ప్రత్యేకమని బాలరాజు అన్నారు. ఉంగుటూరు: గణపవరం మండలం బువ్వనపల్లిలో పార్టీ పీఏసీ సభ్యుడు, ఉంగుటూరు నియోజకవర్గ సమన్వయకర్త పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమ పథకాలను ప్రజలకు నేరుగా అందించిన ఘనత వైఎస్సార్సీపీకే చెందుతుందన్నారు. ఏలూరు: ఏలూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. వైఎస్సా ర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించా రు. అనంతరం నగరంలోని కోడేలు, వెన్నవల్లివారిపేట, ఫిల్హౌస్పేట, చిరంజీవి బస్టాండ్ సెంటర్, వంగాయగూడెం సెంటర్, ఏలూరు ఫైర్స్టేషన్ సెంటర్లలో వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పోరాటాలతో పుట్టిన పార్టీ వైఎస్సార్సీపీ అని జయప్రకాష్ అన్నారు. చింతలపూడి: చింతలపూడిలో నియోజకవర్గ సమన్వయకర్త కంభం విజయరాజు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ప్రజల కోసం పుట్టిన పార్టీ వైఎస్సార్సీపీ అని, ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజలంతా జగన్ వెంటే ఉన్నారని విజయరాజు అన్నారు. కామవరపుకోట, లింగపాలెం మండలాల్లో నాయకులు, కార్యకర్తలు కార్యక్రమాలు నిర్వహించారు. ద్వారకాతిరుమల:పేదల అభ్యున్నతి కోసమే వైఎస్సార్సీపీ పుట్టిందని మాజీ హోం మంత్రి, గోపాలపురం నియోజకవర్గ ఇన్చార్జి తానేటి వనిత అన్నారు. ద్వారకాతిరుమల మండలం తిరుమలంపాలెంలో వేడుకలు నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేశారు. దెందులూరు: దెందులూరులోని పార్టీ యు వ జన విభాగ జిల్లా అధ్యక్షుడు కామిరెడ్డి నాని ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సేవే లక్ష్యంగా.. ఘనంగా వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం జిల్లావ్యాప్తంగా సంబరాలు ఏలూరులో 10 చోట్ల వేడుకలు కై కలూరులో భారీ కేక్ కట్ చేసిన జిల్లా అధ్యక్షుడు -
శ్రీవారి క్షేత్రానికి ‘గ్యాస్’ సెగ
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయానికి వంట గ్యాస్ కొరత ఏర్పడుతోంది. దీంతో ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు. యుద్ధం ప్రభావంతో వాణిజ్య సిలిండర్ల సరఫరా దాదాపు నిలిచిపోయింది. దీంతో చిన వెంకన్న ఆలయ అధికారులు గ్యాస్కు ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నారు. తిరుమల తిరుపతిలో వినియోగిస్తున్న ఎలక్ట్రిక్ స్టౌవ్ల పనితీరును తెలుసుకుంటున్నారు. అలాగే కట్టెల పొయ్యిలపై వంటలకు సిద్ధమవుతున్నారు. గ్యాస్ వినియోగం ఇలా.. భక్తుల రద్దీని బట్టి అన్నప్రసాదాన్ని వండేందుకు నిత్యం 25 నుంచి 30 గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను దేవస్థానం వినియోగిస్తోంది. ఈ ఒక్క అన్నదాన సదనంలోనే నెలకు 800 గ్యాస్ సిలిండర్లను వాడుతున్నారు. అలాగే లడ్డూ, పులిహోర, శర్కర పొంగలి ప్రసాదాల తయారీకి అంబరుఖానాలో రోజుకు 15 నుంచి 20 వాణిజ్య సిలిండర్లను వినియోగిస్తున్నారు. ఆలయంలో స్వామివారి నివేదన ప్రసాదాలు, భక్తులకు అందించే ఉచిత ప్రసాదాల తయారీకి నిత్యం 2 వాణిజ్య సిలిండర్లను వాడుతున్నారు. ఉప, దత్తత ఆలయాల్లో పడితరాలకు నెలకు 15 వాణిజ్య సిలిండర్లను వినియోగిస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలపై.. కట్టెలు పొయ్యిలపై వంటలు వండితే పదార్థాలు పొగ వాసన రావడం, బూడిద వాటిలో పడటం వంటివి జరిగే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అయితే కట్టెలను వినియోగిస్తూనే.. అటువంటి సమస్యలు తలెత్తకుండా వంటలను ఎలా వండాలనే అంశాలను పరిశీలిస్తున్నారు. తిరుమల తిరుపతిలో వాడుతున్న ఎలక్ట్రిక్ స్టౌవ్ల పనితీరు బాగుంటే వాటిని కూడా కొనుగోలు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. అలాగే బ్లోయర్ల ద్వారా కట్టెల పొయ్యిలను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు. ఇప్పటికే వంటల తయారీకి అవసరమయ్యే కట్టెలను అధికారులు అంబరుఖానా వద్ద సిద్ధం చేశారు. అధికారుల పరిశీలన ఈఓ యర్రంశెట్టి భద్రాజీ గురువారం ఏఈఓ మె ట్టపల్లి దుర్గారావు, సూపరింటెండెంట్ కోటగిరి కిషోర్తో కలిసి వకుళమాత నిత్యాన్నదాన భవనంలోని వంటశాలలో వంటలు వండుతున్న తీరు, సి లిండర్ల నిల్వలను పరిశీలించారు. అంబరుఖానాలో ప్రసాదాల తయారీని, గ్యాస్ వినియోగాన్ని, వంటలకు సిద్ధం చేసిన కట్టెలను పరిశీలించారు. వంటల తయారీని పరిశీలిస్తున్న ఈఓ భద్రాజీ అంబరుఖానా వెనుక సిద్ధం చేసిన కట్టెలుగ్యాస్ సిలిండర్ల కొరతను అధిగమించి, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా నిరంతరాయంగా అన్నప్రసాదాన్ని, ప్రసాదాలను అందజేస్తాం. బుధవారం వరకు గ్యాస్ సిలిండర్ల కొరత లేదు. అయితే గురువారం చింతలపూడి నుంచి రావాల్సిన సిలిండర్లు రాలేదు. సిలిండర్ల సమస్యపై వరుసగా రెండురోజుల పాటు ఆలయ ఏఈఓలు, సూపరింటెండెంట్లు, ఇంజనీరింగ్ విభాగ అధికారులతో చర్చించాను. విజయవాడ నుంచి కొన్ని ప్రత్యేకమైన పొయ్యిలను కూడా రప్పిస్తున్నాం. ప్రస్తుతం గ్యాస్ను వినియోగించి స్టీమ్ ద్వారా ఎలా వంటలు వండుతున్నారో, అదేవిధంగా కట్టెల పొయ్యిల ద్వారా వచ్చే స్టీమ్తో వంటలు చేయించాలని అనుకుంటున్నాం. అత్యవసర ప రిస్థితుల్లో మాత్రమే కట్టెల పొయ్యిలను వి నియోగిస్తాం. గ్యాస్ ఏజెన్సీలతో కలెక్టర్ మా ట్లాడి శ్రీవారి దేవస్థానానికి సిలిండర్ల కొరత లేకుండా చూడాలని కోరుతున్నాం. – యర్రంశెట్టి భద్రాజీ, ద్వారకాతిరుమల శ్రీవారి దేవస్థానం ఈఓ అమెరికా–ఇరాన్ యుద్ధం ప్రభావం నిలిచిన వాణిజ్య సిలిండర్ల సరఫరా శ్రీవారి ప్రసాదం, అన్నప్రసాదాల తయారీకి ప్రత్యామ్నాయ మార్గాలు కట్టెల పొయ్యిల ఏర్పాటుకు చర్యలు -
కైకలూరు కేంద్రంగా పసిపిల్లల విక్రయం!
ఏలూరు: జిల్లాలోని కైకలూరు కేంద్రంగా పసిబిడ్డలను విక్రయిస్తున్న ఘటన కలకలం రేపుతోంది. పసిబిడ్డలను అంగడి సరుకుగా మార్చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. ముదినేపల్లి మండలం శ్రీహరిపురానికి చెందిన రెండున్నరేళ్ల బాలుడు అకేటి మోక్షిత అదృశ్యమయ్యాడు. గత 13 రోజుల నుంచి మోక్షిత్ ఆచూకీ కనిపించడం లేదు. ఇంటిముందు ఆడుకుంటున్న మోక్షిత్ను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. కైకలూరు, ముదినేపల్లి సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. దీనిపై జనసేన నేత ఏఎన్ బాబుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పసిపిల్లలను విక్రయిస్తున్నడని ఏఎన్ బాబుపై ఆరోపణులు వస్తున్నాయి. దాంతో ఏఎన్ బాబు పాత్రపై పోలీసులు విచారణ చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఏఎన్ బాబు షాపు వద్దకు వెళ్లారు పోలీసులు. అయితే ఏఎన్ బాబు పరారీలో ఉండటంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
జెడ్పీలో ఏకపక్ష పాలన
సాక్షి ప్రతినిధి, ఏలూరు: జిల్లా పరిషత్ పాలన గాడి తప్పింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రజాపరిషత్ సమావేశం ఎప్పుడు నిర్వహిస్తారో.. ఏఏ అజెండాతో నిర్వహిస్తారో.. వేటిని ఆమోదిస్తారో.. జెడ్పీ చైర్పర్సన్, సీఈఓకు తప్ప ఎవరికీ తెలియని పరిస్ధితి. జెడ్పీటీసీల ప్రతిపాదనలు, ప్రమేయం లేకుండా పనులు ఖరారు చేయడం పశ్చిమగోదావరి జెడ్పీ ప్రత్యేకత. చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ఏకపక్షపాలన సాగిస్తూ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారంటూ జెడ్పీటీసీలు ఫిర్యాదులు చేశారు. జిల్లా కలెక్టర్ మొదలుకొని ఏసీబీ, పంచాయితీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ వరకు అందరికీ వరుస ఫిర్యాదులు చేయడం జిల్లాలో హాట్టాఫిక్గా మారింది. అడ్డగోలుగా పనుల కేటాయింపు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ పాలకవర్గం పదవీ కాలం ఈ ఏడాది సెప్టెంబర్లో ముగియనుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలనే చందంగా అడ్డగోలుగా పనులు కేటాయింపు, టెండర్లు లేకుండా ఎవరికీ తెలియకుండా నామినేషన్లపై నచ్చిన వారికి పర్సంటేజీలతో పనులు కేటాయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్సార్సీపీ నుంచి పెదపాడు జడ్పీటీసీగా గెలుపొందిన గంటా పద్మశ్రీ గత ప్రభుత్వ హయాంలో జెడ్పీ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతో టీడీపీలో చేరారు. అయినప్పటికీ జెడ్పీలో వైఎస్సార్సీపీ సభ్యుల బలం ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో జెడ్పీ చైర్పర్సన్ ఏకపక్ష పోకడపై సర్వత్రా విమర్శలు రేగుతున్నాయి. జెడ్పీ సీఈఓ సైతం అడ్డగోలుగా వ్యవహరిస్తూ ప్రజలు ఎన్నుకున్న జెడ్పీటీసీల హక్కులు కాలరాస్తున్నారు. అడుగడుగునా సభ్యులను అవమానిస్తున్న వైనం అజెండా ఇవ్వకుండా ఇచ్చినట్లు రసీదులపై సంతకాలు సభ్యులకు తెలియకుండా పనులు ఖరారు, టెండర్లు జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ తీరుపై జెడ్పీటీసీల ఫిర్యాదు -
ఎన్ని ఫిర్యాదులు చేసినా స్పందించని వైనం
15వ ఆర్థిక సంఘం నిధులు, సాధారణ నిధులను ఏకపక్షంగా జెడ్పీటీసీల మద్దతు లేకపోయినా కొందరు కాంట్రాక్టర్లకు కేటాయించినట్లు ఆరోపణలున్నాయి. గతేడాది నవంబర్ 27న జరిగిన సర్వసభ్య సమావేశంలో జెడ్పీటీసీలకు అజెండా కాపీ ఇవ్వకుండా సమావేశం నిర్వహించారు. దీనిపై 15 మంది కలెక్టర్ కే.వెట్రిసెల్వి, జెడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ శ్రీహరికి డీసెంట్ కాపీ రాతపూర్వకంగా ఇచ్చినా స్పందన లేదు. ఈ క్రమంలో 15 మంది జెడ్పీటీసీలు పంచాయితీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శికి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీపీకి, కలెక్టర్కు, ప్రిన్సిపల్ సెక్రటరీకి రాతపూర్వకంగా ఫిర్యాదులు చేశారు. సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరితే 30 రోజుల్లో జెడ్పీ సీఈఓ ఇవ్వాల్సి ఉన్నా ఇప్పటి వరకు ఇవ్వకపోవడంపై ఫిర్యాదు చేశారు. జెడ్పీటీసీలు ఇచ్చిన డీసెంట్ను రికార్డుల్లో నమోదు చేయకుండా జెడ్పీ సీఈఓ జడ్పీటీసీలను అవమానిస్తున్నారని ఫిర్యాదు చేశారు. జెడ్పీ చైర్పర్సన్ భర్త తీరుపైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్టాండింగ్ కౌన్సిల్ సమావేశాల్లో జెడ్పీ చైర్పర్సన్ భర్త ప్రత్యక్షంగా పాల్గొనడం, పనుల విషయంలోనూ, ప్రతిపాదనల విషయంలోనూ అన్నింటిలోనూ తీవ్ర స్థాయిలో జోక్యం చేసుకుంటూ అధికారులను, జెడ్పీటీసీలను ఇబ్బందులు పెడుతున్నారంటూ వైఎస్సార్సీపీ జెడ్పీటీసీలు కర్రి గౌరి సుభాషిణి, గుంటూరు పెద్దిరాజుతో సహా 15 మంది సభ్యులు ఫిర్యాదు చేశారు. -
నేడు ఘనంగా వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం
కై కలూరు: వైఎస్సార్సీపీ పార్టీ 16వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా ప్రతి గ్రామంలోనూ దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాల వద్ద నివాళి, సేవా కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) బుధవారం చెప్పారు. గురువారం ఉదయం 9 గంటలకు కై కలూరు సంత మార్కెట్ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి విగ్రహం వద్ద పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తామన్నారు. నాలుగు మండలాల పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, వివిధ హోదాల్లో నాయకులు తప్పక హాజరు కావాలని కోరారు. అనంతరం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీ మండల కేంద్రాలలో పార్టీ జెండాలు ఎగురవేసి, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలతో నివాళులర్పించాలని డీఎన్నార్ కోరారు. ఏలూరు(మెట్రో): రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న చేయూతను సద్వినియోగం చేసుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆర్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ అభిషేక్ కుమార్ పిలుపునిచ్చారు. స్థానిక టూటౌన్ హోటల్ ఎన్లో బుధవారం ఆర్బీఐ ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ అవగాహన కార్యక్రమంలో అభిషేక్ కుమార్ మాట్లాడుతూ సూక్ష్మ, మధ్యతరహా, చిన్న పారిశ్రామికవేత్తల అభివృద్ధి కోసం ఎంఎస్ఎం యూనిట్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, పరిశ్రమల స్థాపనకు రుణాలతో పాటు రాయితీలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. ప్రభుత్వం అందించే ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని, అందుకు బ్యాంకర్లు సహకారం అందిస్తారన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు(మెట్రో): జిల్లాలో గ్యాస్ సిలెండర్ల కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జాయింటు కలెక్టరు మాట్లాడుతూ ఏలూరు జిల్లా వ్యాప్తంగా గృహ అవసరాలు, ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలకు వినియోగించే వంట గ్యాస్ సిలెండర్ల కొరత ఏమాత్రం లేదని, ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. గృహ వినియోగ దారులకు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల పంపిణీ ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతోందని తెలిపారు. గ్యాస్ ఏజెన్సీలు వద్ద తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని, జిల్లాలోని అన్ని ప్రభుత్వ, సంక్షేమ వసతి గృహాలకు అవసరమైన సిలిండర్ల పంపిణీలో జాప్యం జరగడం లేదని అన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా బుధవారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన కామర్స్– 2 పరీక్షలకు మొత్తం 3,113 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 55 పరీక్షా కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు జనరల్ విద్యార్థులు 2,109 మందికి 2,010 మంది విద్యార్థులు హాజరు కాగా 99 మంది గైర్హాజరయ్యారు. 1,238 మంది ఒకేషనల్ విద్యార్థులకు 1,103 మంది విద్యార్థులు హాజరుకాగా 1235 మంది గైర్హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో దూర విద్యా విధానంలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా నిర్వహించిన గణితం, చరిత్ర, వ్యాపార గణక శాస్త్రాల పరీక్షలకు 267 మంది విద్యార్థులు హాజరయ్యారు. గణితం పరీక్షకు 134 మందికి గాను 113 మంది హాజరు కాగా 21 మంది గైర్హాజరయ్యారు. చరిత్ర పరీక్షకు 176 మందికి గాను 152 మంది హాజరుకాగా 24 మంది గైర్హాజరయ్యారు. వ్యాపార గణక శాస్త్రం పరీక్షకు ముగ్గురు విద్యార్థులకు గాను ఇద్దరు హాజరు కాగా ఒకరు గైర్హాజరయ్యారు. ఏలూరు(మెట్రో): దాళ్వా సీజన్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన ముందస్తు ఏర్పాట్లపై జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ సంబంధిత అధికారులు, కమిటీ సభ్యులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమాలు ద్వారా ధాన్యం కొనుగోళ్లపై గ్రామస్థాయిలో రైతులందరికీ అవగాహన కల్పించాలన్నారు. -
మిర్చి పంటను పరిశీలించిన శాస్త్రవేత్తలు
ఎకరాకు రూ.లక్ష నష్ట పరిహారం అందేలా అంగీకారం వేలేరుపాడు: వేలేరుపాడు మండలంలోని చిగురుమామిడి గ్రామ సమీపంలో రైతుల పొలాల్లో కాపు కాయని మిర్చి పంటను ఉద్యాన వన శాస్త్రవేత్తలు బుధవారం పరిశీలించారు. గత ఏడాది అక్టోబర్లో భదాద్రికొత్తగూడెం జిల్లా జూలూరుపాడుకు చెందిన మహేష్ సీడ్స్ విత్తనాల దుకాణం యజమాని నుంచి విత్తనాలు కొనుగోలు చేశారు. చిగురుమామిడి, బోళ్ళపల్లి, ఎడవల్లి, నార్లవరం, తాట్కూరుగొమ్ము తదితర గ్రామాల రైతులు 70 ఎకరాల్లో ఈ రకం సాగు చేసి మునిగిపోయారు. గుంటూరులోని లామ్ఫామ్ ఉద్యాన వన పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సీ, వెంకటరమణ, డాక్టర్ శిరీష పరిఽశీలించారు. నష్టపోయిన రైతుల వివరాలు సేకరించారు. సమగ్ర నివేదిక సమర్పించనున్నట్లు శాస్ట్రవేత్తలు వెల్లడించారు. పంటల పరిశీలనకు వీరితో పాటు వచ్చిన మైసూర్లోని విత్తన కంపెనీ డైరెక్టర్ భాస్కరరెడ్డిని ఈ ప్రాంత రైతులు పురుగు మందు డబ్బాలు చేతబట్టి అడ్డగించారు. తమకు ఎకరాకు రెండు లక్షల నష్టపరిహారం అందించాలని ఆందోళనకు దిగారు. చివరకు మండల వైఎస్సార్సీపీ సీనియర్ నేత కామినేని వెంకటేశ్వరావు చొరవతో ఎకరాకు రూ.లక్ష పరిహారం ఇచ్చేలా డైరెక్టర్తో రైతుల సమక్షంలో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. -
నగదు లెక్కింపులో భద్రత డొల్ల
● ఓ సేవకుడు నిఘాపెట్టి పట్టిస్తేనే గాని.. పట్టుకోలేని వైనం ● మెటల్ డిటెక్టర్లు, స్కానర్ల జాడ లేదు ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి హుండీల నగదు లెక్కింపులో భద్రతా వైఫల్యాలపై భక్తులు మండిపడుతున్నారు. అత్యాధునిక స్కానర్లు అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో కూడా ఇంకా.. లెక్కింపులో పాల్గొనే అధికారులు, సిబ్బంది, సేవకులను చేతులతో తడుముతూ తనిఖీలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. భద్రతా సిబ్బందిని మార్చకుండా.. ఏళ్ల తరబడి వారితోనే తనిఖీలు చేయించడం సరికాదని అంటున్నారు. చిన్నవెంకన్న ఆలయంలో ప్రతి 15–20 రోజుల మధ్యలో హుండీల నగదు లెక్కింపును స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో నిర్వహిస్తారు. మొత్తం 150 మంది వరకు పాల్గొంటారు. వివిధ ప్రాంతాలకు చెందిన సేవకులు 100 మంది వరకు హాజరవుతారు. లుంగీ, బనియన్, లేదా కండువా ధరించిన వారిని మాత్రమే లెక్కింపులోకి అనుమతిస్తారు. ఒంటిపై ఎలాంటి బంగారం, వెండి ఆభరణాలు ఉండకూడదు. అధికారులు మినహా ఎవరూ సెల్ఫోన్లు లోపలికి తీసుకెళ్లకూడదు. లెక్కింపులో పాల్గొనే వారందరినీ కల్యాణ మండపం ముఖ ద్వారం వద్ద భద్రతా సిబ్బంది చేతులతో తడుముతూ తనిఖీలు చేస్తారు. తడిమినా దొరకలేదు పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం, సూరంపూడి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ బొల్లా సురేష్ ఐదేళ్ల క్రితం నుంచి ప్రతిసారీ జరిగే హుండీల నగదు లెక్కింపులో పాల్గొంటున్నాడు. ఎప్పటిలాగే బుధవారం లెక్కింపులో పాల్గొన్న సురేష్ హుండీల్లోని నగదు, కానుకలను మెషిన్పై జల్లిస్తుండగా చేతివాటాన్ని ప్రదర్శించాడు. మరో సేవకుడు పమ్మి వెంకటేశ్వరరావు అతడి కదలికలపై నిఘా పెట్టాడు. వెంకటేశ్వరరావు ఆలయ అధికారుల వద్దకు వెళ్లి, సురేష్ బంగారం పట్టుకుని వెళిపోతున్నాడని చెప్పాడు. దాంతో అధికారులు, సెక్యురిటీ సిబ్బంది సమీపంలోని బాత్రూమ్లోకి వెళ్లిన సురేష్ను అదుపులోకి తీసుకుని, తనిఖీలు చేశారు. కమోడ్లోని ప్రెస్ ట్యాంక్లో దాచిపెట్టిన బంగారు వస్తువులు, డాలర్లను స్వాధీనం చేసుకున్నారు. భీమడోలు సీఐ పి.కృష్ణ ఘటనా స్థలాన్ని, సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఆలయ ఈఓ వై.భద్రాజీ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. సురేష్ ఇక్కడ చోరీ చేయడం ఇదే మొదటి సారా.. లేక గతంలో ఏమైనా చేశాడా అన్నది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఘటన జరిగిన తరువాత కౌంటింగ్ హాల్లోకి, బయటకు వెళ్లే ప్రతి ఒక్కరినీ అండర్వేర్ తీయించి మరీ భద్రతా సిబ్బంది తనిఖీలు చేశారు. ఇకపై ఇలానే తనిఖీలు జరుగుతాయని అంటున్నారు. మెటల్ డిటెక్టర్లు, స్కానర్లు ఎక్కడ? తిరుమల తిరుపతిలో ప్రతి ఒక్కరినీ భద్రతా సిబ్బంది మెషిన్లతో స్కాన్ చేసిన తరువాతే శ్రీవారి హుండీల నగదు లెక్కింపుకు అనుమతిస్తారు. బయటకు వచ్చే సమయంలోనూ స్కాన్ చేస్తారు. అలాంటి మెషిన్లు, మెటల్ డిటెక్టర్లను గానీ ఇక్కడ వినియోగించక పోవడంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. హుండీల లెక్కింపులో పాల్గొనే భద్రతా సిబ్బంది ఏళ్లతరబడి ఇక్కడే పనిచేస్తున్నారు. దేవస్థానం అధికారుల కనుసన్నల్లోనే వారు విధులు నిర్వర్తిస్తున్నారు. అలాంటిది వారు అధికారులను ఎలా తనిఖీలు చేయగలరన్న ప్రశ్నలు ఇక్కడ తలెత్తుతున్నాయి. కొన్ని అవకతవకలకు ఇవి కూడా ఒక కారణం కావొచ్చని కొందరు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ప్రతి హుండీ లెక్కింపునకు భద్రతా సిబ్బందిని మార్చాలని, ఒకరికొకరు సంబంధం లేని పోలీసులను నియమించి, తనిఖీలు ముమ్మరం చేసి భక్తుల కానుకలను రక్షించాలని స్థానికులు, పలువురు భక్తులు కోరుతున్నారు. ఇటీవల వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో జరిగిన హుండీల నగదు లెక్కింపులో పాల్గొన్న బొల్లా సురేష్ చేతివాటం ప్రదర్శించినట్టు నాకు అనుమానం కలిగింది. అప్పటి నుంచి అతడి కదలికలను గమనిస్తున్నాను. ఇక్కడ సురేష్ బంగారం అండర్వేర్లో వేసుకుని బయటకు వెళ్తూ.. వాటిని లోపలికి నెట్టేశాడు. అందువల్లే భద్రతా సిబ్బంది తడిమినా దొరకలేదు. దీన్ని గమనించిన నేను వెంటనే విషయాన్ని అధికారులకు చెప్పి, సురేష్ను పట్టించాను. సేవ పేరుతో ఇలాంటివి చేయడం సరికాదు. – పమ్మి వెంకటేశ్వరరావు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, అంబాజీపేట మండలం, మొసలపల్లి గ్రామం శ్రీవారి హుండీల నగదు లెక్కింపును సీసీ కెమెరాల పర్యవేక్షణలో పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. దేవదాయ శాఖ ప్రధాన కార్యాలయ అధికారులు సైతం ఈ లెక్కింపును సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. కౌంటింగ్ హాల్లోకి వెళ్లి వచ్చే ప్రతీ ఒక్కరినీ భద్రతా సిబ్బందితో తనిఖీలు చేయిస్తున్నాం. స్కానర్లు ఏర్పాటు చేయిస్తాం. – యర్రంశెట్టి భద్రాజీ, ద్వారకాతిరుమల శ్రీవారి దేవస్థానం ఈఓ -
పురిటిలోనే పసికందు మృతి
● ఏలూరు జీజీహెచ్లో మరో దారుణం ● ఆస్పత్రి వద్ద బంధువుల ఆందోళన ● వైద్య బృందంపై మంత్రి సీరియస్ ఏలూరు టౌన్: ఏలూరు సర్వజన ఆసుపత్రిలో పురిటిలోనే ఓ పసికందు ప్రాణం విడిచింది. వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి బిడ్డ ప్రాణాన్ని బలి తీసుకున్నారని బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పెదవేగి మండలం నడిపల్లికి చెందిన నాగలక్ష్మి, ముసునూరు మండలం గోపవరంనకు చెందిన శ్రీనివాసరావు దంపతులు. నాగలక్ష్మి గర్భిణి కాగా ఏలూరు జీజీహెచ్లోని ఎంసీహెచ్ బ్లాక్లో గైనకాలజీ వైద్యులకు చూపిస్తున్నారు. ఆమెను కాన్పు కోసం ఈనెల 7న జీజీహెచ్కు తీసుకురాగా రెండు రోజుల అనంతరం తీసుకు రావాలని వైద్యులు సూచించారు. దీంతో మంగళవారం రాత్రి 8 గంటలకు ఎంసీహెచ్లో చేర్పించారు. రాత్రి వేళ నాగలక్ష్మికి తీవ్రమైన నొప్పులు రావటంతో బంధువులు వెళ్లి వైద్య సిబ్బందికి చెప్పగా వారు నిర్లక్ష్యం చేశారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో నొప్పులు మరింత ఎక్కువైనా ఎవరూ పట్టించుకోలేదు. ఈ క్రమంలో బుధవారం ఉదయం 8 గంటలకు ఆపరేషన్ చేయగా నాగలక్ష్మి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే కొద్దిసేపటికే పసికందు చనిపోయిందని చెప్పటంతో వారంతా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో వైద్యులు ఆపరేషన్ చేసి ఉంటే బిడ్డ చనిపోయేది కాదంటూ బాధిత బంధువులు జీజీహెచ్ వద్ద ఆందోళకు దిగారు. ఇలాంటి పరిస్థితి ఇతర కుటుంబాలకు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు. ఈ విషయంపై మంత్రి కొలుసు పార్థసారథి సీరియస్ అయ్యారు.ఎంసీహెచ్ విభాగంలో తరచుగా ఇదే తరహా ఘటనలు చోటుచేసుకోవటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏలూరు జీజీహెచ్ ఆర్ఎంఓను ఫోన్లో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
దళిత క్రైస్తవులను ఎస్సీలుగా పరిగణించాలి
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయ హుండీల నగదు లెక్కింపు స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో బుధవారం దేవాదాయశాఖ జిల్లా అధికారి కె.శ్రీనివాసు పర్యవేక్షణలో జరిగింది. 20 రోజులకు గాను నగదు రూపేణా స్వామికి రూ. 1,95,82,968 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ వై.భద్రాజీ తెలిపారు. కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 327 గ్రాముల 700 మిల్లీ గ్రాముల బంగారం, 2.714 కేజీల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. లెక్కింపులోకి రాని పాత రూ.2,000, రూ.1,000, రూ.500 నోట్ల ద్వారా రూ.7 వేలు లభించినట్టు చెప్పారు. ఏలూరు (టూటౌన్): దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని, క్రైస్తవులపై దాడులను అరికట్టి రక్షణ కల్పించాలని, మత మార్పిడి నిరోధక చట్టాలను ఎత్తివేయాలని క్రిస్టియన్ కో–ఆర్డినేషన్ కౌన్సిల్ రాష్ట్ర నాయకులు ప్రొఫెసర్ ఎన్ఏడి పాల్ కోరారు. స్థానిక ఎన్ఆర్పేటలోని ఎస్సీఆర్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో డాక్టర్ మెండెం సంతోష్కుమార్ అధ్యక్షతన బుధవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన పాల్ మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీన రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో క్రిస్టియన్ కో–ఆర్డినేషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్లకు వినతి పత్రం అందజేస్తామన్నారు. దీనికి సంబంధించిన బ్రోచర్లను ఆవిష్కరించారు. -
గట్లు కొట్టి.. కోట్లు మెక్కి..
పచ్చ నేతల కాసుల కక్కుర్తికి పోలవరం కుడికాలువ గట్టు కనుమరుగవుతోంది. దర్జాగా క్వారీలను ఏర్పాటు చేసి రాత్రి, పగలు తేడా లేకుండా ఇష్టారాజ్యంగా కాలువ గట్టును కొల్లగొట్టి మట్టిని అమ్ముకుంటున్నారు. నిత్యం వందలాది టిప్పర్ల మట్టిని పలు ప్రాంతాలకు రవాణా చేస్తూ కోట్లు గడిస్తున్నారు. ఈ అక్రమ తవ్వకాలను ఎవరైనా ప్రశ్నిస్తే.. వారిని బెదిరిస్తున్నారు. ఏలూరు జిల్లాలోని ద్వారకాతిరుమల మండలం గుణ్ణంపల్లిలో పోలవరం కుడి కాలువ గట్టుపై జరుగుతున్న ఈ మట్టి క్వారీ తవ్వకాలపై సాక్షి ప్రత్యేక కథనం.ద్వారకాతిరుమల: ఏలూరు జిల్లా గుణ్ణంపల్లిలోని పోలవరం కుడి కాలువకు రెండు పక్కల గట్లపై టీడీపీ నాయకులు మట్టి క్వారీలను ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండా దర్జాగా తవ్వకాలు జరుపుతు న్నారు. కాలువ ఎడమ గట్టుపై రాత్రీ, పగలు, కుడి గట్టుపై కేవలం రాత్రి వేళల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. రోజుకి 100 నుంచి 150 టిప్పర్ల మట్టి భీమడోలు, గుండుగొలను, ఆగడాల లంక, పోతునూరు, ఏలూరు, దూబచర్ల, కైకరం, భీమవరం తదితర ప్రాంతాలకు తరలిపోతోంది. రియల్ ఎస్టేట్ వెంచర్లు మెరక చేయడానికి, చేపలు, రొయ్యల చెరువుల గట్లకు, ద్వారకాతిరుమల మండలంలోని ఓ పరిశ్రమకు, ఇతర పనులకు ఈ మట్టిని వినియోగిస్తున్నారు. దూరాన్ని బట్టి టిప్పర్ మట్టిని రూ. 10 నుంచి 12 వేలకు విక్రయిస్తున్నారు. రోజుకు 15 వందల క్యూబిక్ మీటర్ల చోరీ రోజుకి 15 వందల క్యూబిక్ మీటర్ల మట్టి చోరీకి గురవుతోంది. మట్టి తవ్వి, రవాణా చేసుకోవాలంటే ఒక క్యూబిక్ మీటర్కు ఇరిగేషన్కు రూ.160, మైనింగ్ డిపార్ట్మెంట్కు రూ.120 మొత్తం రూ.280 చెల్లించాలి. ప్రభుత్వం నుంచి ఏవిధమైన అనుమతులు పొందకుండా, చెల్లింపులు జరపకుండా పచ్చ నేతలు ఈ క్వారీ తవ్వకాలను యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. ఒక్కో టిప్పర్లో 6 యూనిట్ల మట్టి, అంటే 15 క్యూబిక్ మీటర్ల మట్టి పడుతుంది. అంటే రోజుకి 100 టిప్పర్ల మట్టి రవాణా జరిగితే 15 వందల క్యూబిక్ మీటర్ల మట్టి బయటకు తరలిపోయినట్టే. దీని వల్ల ప్రభుత్వానికి రోజుకి రూ.28 వేలు గండి పడుతోంది. పచ్చ నేతలు రోజుకి 100 టిప్పర్ల మట్టిని విక్రయించడం ద్వారా రూ. 10 లక్షలకు పైగా ఆదాయాన్ని పొందుతున్నారు. ఇలా పచ్చ నేతలు కోట్లు గడిస్తున్నారు. పెద్దల కనుసన్నల్లోనే.. పెద్దల కనుసన్నల్లోనే ఈ అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అందుకే పట్టపగలు, పొక్లెయిన్లతో పెద్ద ఎత్తున క్వారీ తవ్వకాలు జరుపుతున్నా.. అధికారులెవరూ ఆ వైపు కన్నెత్తి చూడటం లేదని స్థానికులు ధ్వజమెత్తుతున్నారు. ఇదేంటని ప్రశి్నస్తున్న వారిని నేతలు బెదిరిస్తున్నారని అంటున్నారు. గోతులు తవ్వి మరీ.. గ్రావెల్ మట్టి కోసం కాలువ గట్టుపై పెద్దపెద్ద గోతులు తవ్వి మరీ మట్టిని రవాణా చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఆ ప్రాంతాలు అగాధాలను తలపిస్తున్నాయి. భవిష్యత్తులో వర్షాలు కురిసినప్పుడు ఆ గోతులు నీటితో నిండి, అటుగా వెళ్లే రైతులు, పశువులు అందులో పడి ప్రాణాలను కోల్పోయే ప్రమాదం ఉంది. ఇదిలా ఉంటే ఈ అక్రమ రవాణా కారణంగా ఇప్పటికే కాలువ గట్టు రోడ్లు సైతం ధ్వంసమయ్యాయి. అధికారులు గప్చుప్ గోపాలపురం నియోజకవర్గ పెద్దల ఆధ్వర్యంలోనే ఈ మట్టి దందా జరుగుతోంది. జిల్లా అధికార యంత్రాంగం సైతం మామ్మూళ్ల మత్తులో జోగుతోంది. అందుకే ఈ వైపు ఎవరూ కన్నెత్తి చూడటంలేదు. అంతా గప్చుప్గా ఉన్నారు. మూడు పొక్లెయిన్లతో కాలువ గట్లను ఎడాపెడా తవ్వేస్తున్నారు. రోజుకి వంద టిప్పర్లకు పైగా మట్టి బయటకు తరలిపోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మా గ్రామంలో అక్రమ మట్టి తవ్వకాలు ఆగలేదు. కొందరు టీడీపీ నాయకులు సంపాదనే ధ్యేయంగా ఈ దందాకు పాల్పడుతున్నారు. అధికార బలం ఉంది కధా అని, ప్రజాధనాన్ని దోచుకు తింటున్నారు. ఇదేంటని గట్టిగా అడిగితే బెదిరిస్తున్నారు. – బాలం వెంకటేశ్వరరావు, గుణ్ణంపల్లి మాజీ సర్పంచ్ -
యథేచ్ఛగా మట్టి అరకమ రవాణా
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. జంగారెడ్డిగూడెం మండలం ఎ.పోలవరంలో చిన్నపెద్ద చెరువులో మట్టిని తవ్వేసి అక్రమంగా రవాణా చేస్తున్నారు. భారీ జేసీబీలు పెట్టి, పదుల సంఖ్యలో టిప్పర్లు పెట్టి అక్రమ రవాణా చేస్తున్నారు. దీంతో గ్రామస్తులు సోమవారం అర్థరాత్రి జేసీబీలు, టిప్పర్లను అడ్డుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా, జంగారెడ్డిగూడెం పోలీసులు 8 టిప్పర్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి రెవెన్యూ శాఖకు అప్పగించారు. రెవెన్యూ అధికారులు విచారణ చేసి అక్రమ మట్టి రవాణాకు అనుమతులు లేవని నిర్ధారించారు. దీంతో ఒక్కొక్క వాహనానికి రూ.7500 జరిమానా విధించారు. ఇటీవలే అదే చెరువులో ఒక రైతు తన పొలాన్ని ఎత్తు పెంచుకునేందుకు మట్టి తోలుకుంటుండగా, అధికారులు ట్రాక్టర్ను సీజ్ చేసి రూ. 25 వేలు జరిమానా విధించారని తెలిసింది. రైతు సేద్యం కోసం మట్టి తోలుకుంటుంటే భారీ పెనాల్టీ విధించి, అక్రమ రవాణా చేస్తున్న మట్టి మాఫియాకు మాత్రం తక్కువ జరిమానా విధించడం పట్ల విమర్శలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే తమ టిప్పర్లను సీజ్ చేసినంత మాత్రాన తమకు ఏమవుతుందని, మళ్లీ అదే చెరువులో మట్టి రవాణా చేస్తామని మట్టి మాఫియా సవాల్ చేస్తోంది. 8 టిప్పర్ల సీజ్ -
ప్రజా వ్యతిరేక పాలనపై 24 నుంచి నిరసనలు
ఏలూరు (టూటౌన్): కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా మార్చి 24 నుంచి రాష్ట్రంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. మంగళవారం సాయంత్రం ఏలూరులోని సీపీఐ జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత సార్వభౌమాధిపత్యంపై దాడులు చేస్తుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికాకు పూర్తిగా సహకరించడానికి తప్పు బట్టారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం 22 నెలలు గడిచినప్పటికీ ప్రజలకు ప్రయోజనం శూన్యమన్నారు. పోలీస్ శాఖ అధికార పార్టీకి కొమ్ము కాస్తూ అత్యుత్సాహం ప్రదర్శించడం సరికాదన్నారు. రాష్ట్రంలో మెడికల్ మాఫియాని నియంత్రించడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే వంట గ్యాస్ ధరలు రూ.60 నుంచి రూ.116లు పెరిగితే వాటిని నియంత్రించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు మహిళలను, పిల్లలను యంత్రాలుగా భావించి రాయితీలు ప్రకటించడం దారుణం అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన రూ.32 వేల కోట్లు విడుదల చేయించుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని విమర్శించారు. పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహార శైలి సరైంది కాదన్నారు. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పనులను సైతం యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలన్నారు. -
ఫ్లెక్సీ ధ్వంసం కేసులో తొమ్మిది మందిపై కేసు
టి.నరసాపురం: బొర్రంపాలెం గ్రామం కరాటం కృష్ణమూర్తి జలాశయం వద్ద కట్టిన ఫ్లెక్సీని కాల్చి ధ్వంసం చేసిన తొమ్మిది మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎం.జయబాబు తెలిపారు. జలాశయంలో కొందరు వ్యక్తులు అనధికారికంగా రొయ్యలు వేసి పట్టుకోవడంతో జంగారెడ్డిగూడెం మండలం చక్రదేవరపల్లి గ్రామానికి చెందిన జలాశయం లస్కర్ పాకనాటి లక్ష్మణరావు జలాశయం ఏఈ అనిల్ ఉత్తర్వులు మేరకు రొయ్యలు పట్టరాదని తెలియజేసే విధంగా అధికారికంగా కట్టారు. అయితే ఈ ఫ్లెక్సీని కొందరు కాల్చి ధ్వంసం చేశారు. దీనిపై లస్కర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. ఉంగుటూరు: ఏలూరు గోదావరి కాలువలో నాచుగుంట వద్ద ఓ యువకుడి మృతదేహం మంగళవారం లభ్యమైంది. అతడు తాడేపల్లిగూడెం మండలం యాగర్లపల్లికి చెందిన గొంగడ లక్ష్మణ్గా గుర్తించారు. లక్ష్మన్ ఈనెల 6వ తేదీ నుంచి కనిపించడం లేదు. ఈ క్రమంలో అతని మృతదేహం ఉంగుటూరు మండలం నాచుగుంట రేవు సమీపంలో తక్కుకు అడ్డుపడి ఉండటాన్ని గుర్తించారు. ఈ మేరుకు వీఆర్వో పెద్దిరాజు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా మృతుడు ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయాడా లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనే విషయం పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. పెనుగొండ: పెళ్లి చేసుకుంటానని చెప్పి బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు తీర్పు వెలువరించింది. 2021లో పెనుగొండ మండలం నడిపూడికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన చిల్లే చరణ్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమైపె లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం అతడు పెళ్లికి ముఖం చాటేయడంతో గ్రామ పెద్దల సమక్షంలో విషయాన్ని పెట్టగా, ఇద్దరూ మేజర్ అయిన తర్వాత వివాహం జరిపిస్తామని నిందితుడు తల్లిదండ్రులు, పెద్దల సమక్షంలో ఒప్పుకున్నారు. తరువాత నిందితుడు రహస్యంగా గల్ఫ్ దేశానికి పారిపోయాడు. బాధితురాలు మేజర్ అయిన తర్వాత వివాహం విషయం తీసుకొచ్చినా పట్టించుకోకపోవడంతో బాధితురాలు ఫిర్యాదు మేరకు పెనుగొండ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ శ్రీహరి కేసు నమోదు చేశారు. అప్పటి సీఐ జీవీ నాగేశ్వరరావు కేసును దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి, కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. కోర్టు విచారణ అనంతరం మంగళవారం ముద్దాయి చిల్లే చరణ్కు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించి, బాధితురాలికి రూ.లక్ష నష్టపరిహారం చెల్లించాలని భీమవరం పోక్సో కోర్టు న్యాయమూర్తి లక్ష్మీనారాయణ తీర్పు వెలువరించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 3 నెలల జైలు శిక్ష అనుభవించవలసి ఉంటుందన్నారు. ప్రాసిక్యూషన్ తరఫున వి.రమేష్నాయుడు వాదనలు వినిపించారు. జీడిమామిడి తోట దగ్ధం ద్వారకాతిరుమల: గుణ్ణంపల్లి రెవెన్యూ పరిధిలోని లక్ష్మీనగర్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంగళవారం ఒక జీడిమామిడి తోట దగ్ధమైంది. గ్రామానికి చెందిన ఉండ్రాజవరపు బ్రహ్మమ్మ, ఎర్రయ్య దంపతులకు అదే గ్రామంలో ఒక ఎకరం జీడిమామిడి తోట ఉంది. అయితే తోట పైనుంచి వెళ్లిన విద్యుత్ మెయిన్లైన్ వైర్లు షార్ట్ సర్క్యూట్ అవడంతో, తోటకు నిప్పంటుకుందని బాధితురాలు బ్రహ్మమ్మ తెలిపారు. మంటలు వేగంగా విస్తరించడంతో తోట మొత్తం దగ్ధమైందన్నారు. ఈ ప్రమాదంలో రూ. 4 లక్షల మేర నష్టం వాటిల్లినట్టు చెప్పారు. చేతికందొచ్చిన పంట బుగ్గిపాలు కావడంతో బాధిత కుటుంబం కన్నీరుమున్నీరు అయ్యింది. నూజివీడు: నాణ్యమైన మామిడి పండిస్తేనే రాష్ట్ర ప్రభుత్వం తరుఫున ఇతర రాష్ట్రాల్లోని మామిడి కొనుగోలుదారులను ఇక్కడకు రప్పించి మంచి ధర వచ్చేలా చూస్తామని రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ సెక్రటరీ చిరంజీవి చౌదరి పేర్కొన్నారు. పట్టణంలోని టీటీడీ కళ్యాణమండపంలో ఉద్యానశాఖ ఆధ్వర్యంలో మంగళవారం మామిడి అమ్మకందారులు, కొనుగోలుదారుల సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న చిరంజీవి మాట్లాడుతూ రైతులు ఉద్యాన అధికారుల సూచనలు, సలహాలు పాటించి మంచి నాణ్యత కలిగిన మామిడి కాయలను ఉత్పత్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమాన్ని నూజివీడు ఉద్యాన అధికారి హేమ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఏలూరు జిల్లా మైక్రో ఇరిగేషన్ పీడీ రామ్మోహనరావు, నూజివీడు మామిడి పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త బీ కనకమహాలక్ష్మి జిల్లా ఉద్యాన శాఖ అధికారి షాజ నాయక్ , రైతు సేవా కేంద్రాల సిబ్బంది, పాలిటెక్నిక్ విద్యార్థులు పాల్గొన్నారు. నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీలో కెమికల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన రెండురోజుల వర్క్షాప్ మంగళవారంతో ముగిసింది. ఈ జాతీయ వర్క్షాప్లో మొత్తం 414 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ట్రిపుల్ ఐటీకి చెందిన కెమికల్, మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రత్యక్షంగా ఈ వర్క్ షాప్లో పాల్గొనగా పలు ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆన్లైన్ ద్వారా వర్క్షాప్నకు హాజరయ్యారు. రెండోరోజు వర్క్షాపులో తాడేపల్లిగూడెం నిట్ కెమికల్ ఇంజినీరింగ్ అధ్యాపకులు గరిమెళ్ల సాయి మణికిరణ్ పాల్గొని ‘ఫ్లూయిడ్ ఫ్లో రిలేటెడ్ ప్రాబ్లంస్ ఆన్ కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్’ అనే అంశంపై ప్రసంగించారు. కెమికల్ బ్రాంచి విభాగాధిపతి, వర్క్షాప్ కన్వీనర్ మైథిలి, జాయింట్ కన్వీనర్ రామకృష్ణ, కెమికల్ విభాగ అధ్యాపకులు పాల్గొన్నారు. పోలవరం రూరల్: గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ప్రాజెక్టు పనుల ప్రగతిని మంగళవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇంజనీరింగ్ నిపుణులు, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త డయాఫ్రం వాల్ 1372 మీటర్లకు గాను 1300 మీటర్లు నేటికి పూర్తయిందని చెప్పారు. ఈ నెలాఖరుకు మొత్తం పూర్తవుతుందన్నారు. కుడి, ఎడమ కాలువలను ఈ ఏడాది జూన్ కల్లా పూర్తి చేస్తామన్నారు. జలవనరుల శాఖ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, ప్రాజెక్ట్ అడ్మిన్ అభిషేక్, కాంట్రాక్టు ఏజెన్సీల ప్రతినిధులు, ఇతర ప్రాజెక్ట్ అధికారులు పాల్గొన్నారు. కై కలూరు: యూత్ నేషనల్ వాలీబాల్ రిఫరీగా కై కలూరు మండలం రెడ్డినగర్కు చెందిన డాక్టర్ ఎం.శ్రీనివాసరెడ్డి ఎంపికయ్యారు. ఈ మేరకు వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ జనరల్ రామానంద్ చౌదరీ నుంచి నియామక ఉత్తర్వులు అందాయి. ఒడిశా రాష్ట్ర భువనేశ్వర్ కలింగ యూనివర్సిటీ ఆఫ్ ఇండస్ట్రీరియల్ టెక్నాలజీ(కిట్స్)లో ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకు 26వ యూత్ నేషనల్ బాలుర, బాలికల వాలీబాల్ చాంపియన్షిప్ జరగనుంది. శ్రీనివాసరెడ్డి తెలంగాణలో కోచ్గా విధులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి శ్రీనివాసరరెడ్డికి మాత్రమే రిఫరీగా అవకాశం దక్కడంపై కై కలూరులో పలువురు అభినందనలు తెలిపారు. -
నేతలకు కోట్లు.. ప్రజలకు పాట్లు
మాజీ ఎమ్మెల్యే బాలరాజు కొయ్యలగూడెం: దగా ప్రభుత్వాల పాలనలో కోట్లు నేతలకి, పాట్లు ప్రజలకి అనే రీతిలో ఉందని పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పేర్కొన్నారు. మంగళవారం బోడిగూడెం, మంగపతిదేవిపేట పంచాయతీ పరిధిలోని వ్యవసాయ భూములను ఆయన వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మంతెన సోమరాజుతో కలిసి పరిశీలించారు. నేవీ ఆయుధ డిపో ఏర్పాటు చేస్తే వేలాది కోట్ల రూపాయలను కాంట్రాక్టుల రూపంలో చేజిక్కించుకునేందుకు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రణాళికలు సిద్ధం చేశారన్నారన్నారు. దాదాపు 1500 ఎకరాల వ్యవసాయ భూములు నేవీ ఆయుధ డిపో కర్మాగారానికి ఇవ్వడం వల్ల రెండువేల మందికి పైగా రైతులు, పరోక్షంగా ఇరవై వేల మందికి జీవనోపాధి పోతుందన్నారు. సుమారు రెండు నెలలుగా రైతాంగం చేస్తున్న ఆందోళనకు వారికి మద్దతుగా నిలుస్తున్న ప్రజలకు ప్రభుత్వం స్పష్టమైన జవాబు ఇవ్వకపోవడం అనుమానాలకు తావునిస్తోందన్నారు. ఎంపీ ఎమ్మెల్యేలు గ్రామాలలో దళారులను ఏర్పాటు చేసి రాత్రి వేళల్లో రెవెన్యూ కార్యాలయాల వద్ద రైతుల భూములను నిబంధనలకు విరుద్ధంగా ఆన్లైన్లో నమోదు ప్రక్రియ నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఆయుధ డిపో నిర్మాణానికి 90 శాతం రైతులు అనుకూలంగా ఉన్నారని అంటుంటే కనీసం 9 శాతం మంది కూడా భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరనేది వైఎస్సార్సీపీ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో స్పష్టం అయింది అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ బీసీ సెల్ సంయుక్త కార్యదర్శి గంటా శ్రీనివాస్, సర్పంచ్ కడకట్ల గడ్డియ్య తదితరులు పాల్గొన్నారు. -
మద్ది క్షేత్రంలో విశేష పూజలు
జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో ఆంజనేయస్వామికి మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. జంగారెడ్డిగూడెం మండలంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన తమలపాకులతో అర్చకులు అష్టోత్తరం పూజలు నిర్వహించారు. ఆలయానికి వివిధ సేవల ద్వారా రూ.2,09,929 ఆదాయం వచ్చినట్లు ఆలయ సహాయ కమిషనరు, కార్యనిర్వహణాధికారిణి ఆర్వీ చందన తెలిపారు. అలాగే సుమారు 1,719 మంది భక్తులు స్వామి వారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు తెలియజేశారు. -
గట్లు కొట్టి.. కోట్లు మెక్కి..
నిలకడ లేని కోకో ధర కోకో రైతుకు కడగండ్లు తప్పడం లేదు. ఏడాది పొడవునా పంట పండించే అవకాశం ఉండటం, ధర స్థిరంగా లేకపోవడంతో రైతులు సతమతమవుతున్నారు. IIలో uపచ్చ నేతల కాసుల కక్కుర్తికి పోలవరం కుడికాలువ గట్టు కనుమరుగవుతోంది. దర్జాగా క్వారీలను ఏర్పాటు చేసి రాత్రి, పగలు తేడా లేకుండా ఇష్టారాజ్యంగా కాలువ గట్టును కొల్లగొట్టి మట్టిని అమ్ముకుంటున్నారు. నిత్యం వందలాది టిప్పర్ల మట్టిని పలు ప్రాంతాలకు రవాణా చేస్తూ కోట్లు గడిస్తున్నారు. ఈ అక్రమ తవ్వకాలను ఎవరైనా ప్రశ్నిస్తే.. వారిని బెదిరిస్తున్నారు. ఏలూరు జిల్లాలోని ద్వారకాతిరుమల మండలం గుణ్ణంపల్లిలో పోలవరం కుడి కాలువ గట్టుపై జరుగుతున్న ఈ మట్టి క్వారీ తవ్వకాలపై సాక్షి ప్రత్యేక కథనం. బుధవారం శ్రీ 11 శ్రీ మార్చి శ్రీ 2026ద్వారకాతిరుమల: గుణ్ణంపల్లిలోని పోలవరం కుడి కాలువకు రెండు పక్కల గట్లపై టీడీపీ నాయకులు మట్టి క్వారీలను ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండా దర్జాగా తవ్వకాలు జరుపుతు న్నారు. కాలువ ఎడమ గట్టుపై రాత్రీ, పగలు, కుడి గట్టుపై కేవలం రాత్రి వేళల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. రోజుకి 100 నుంచి 150 టిప్పర్ల మట్టి భీమడోలు, గుండుగొలను, ఆగడాల లంక, పోతునూరు, ఏలూరు, దూబచర్ల, కై కరం, భీమవరం తదితర ప్రాంతాలకు తరలిపోతోంది. రియల్ ఎస్టేట్ వెంచర్లు మెరక చేయడానికి, చేపలు, రొయ్యల చెరువుల గట్లకు, ద్వారకాతిరుమల మండలంలోని ఓ పరిశ్రమకు, ఇతర పనులకు ఈ మట్టిని వినియోగిస్తున్నారు. దూరాన్ని బట్టి టిప్పర్ మట్టిని రూ. 10 నుంచి 12 వేలకు విక్రయిస్తున్నారు. రోజుకు 15 వందల క్యూబిక్ మీటర్ల చోరీ రోజుకి 15 వందల క్యూబిక్ మీటర్ల మట్టి చోరీకి గురవుతోంది. మట్టి తవ్వి, రవాణా చేసుకోవాలంటే ఒక క్యూబిక్ మీటర్కు ఇరిగేషన్కు రూ.160, మైనింగ్ డిపార్ట్మెంట్కు రూ.120 మొత్తం రూ.280 చెల్లించాలి. ప్రభుత్వం నుంచి ఏవిధమైన అనుమతులు పొందకుండా, చెల్లింపులు జరపకుండా పచ్చ నేతలు ఈ క్వారీ తవ్వకాలను యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. ఒక్కో టిప్పర్లో 6 యూనిట్ల మట్టి, అంటే 15 క్యూబిక్ మీటర్ల మట్టి పడుతుంది. అంటే రోజుకి 100 టిప్పర్ల మట్టి రవాణా జరిగితే 15 వందల క్యూబిక్ మీటర్ల మట్టి బయటకు తరలిపోయినట్టే. దీని వల్ల ప్రభుత్వానికి రోజుకి రూ.28 వేలు గండి పడుతోంది. పచ్చ నేతలు రోజుకి 100 టిప్పర్ల మట్టిని విక్రయించడం ద్వారా రూ. 10 లక్షలకు పైగా ఆదాయాన్ని పొందుతున్నారు. ఇలా పచ్చ నేతలు కోట్లు గడిస్తున్నారు. పెద్దల కనుసన్నల్లోనే.. పెద్దల కనుసన్నల్లోనే ఈ అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అందుకే పట్టపగలు, పొక్లెయిన్లతో పెద్ద ఎత్తున క్వారీ తవ్వకాలు జరుపుతున్నా.. అధికారులెవరూ ఆ వైపు కన్నెత్తి చూడటం లేదని స్థానికులు ధ్వజమెత్తుతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తున్న వారిని నేతలు బెదిరిస్తున్నారని అంటున్నారు. గోతులు తవ్వి మరీ.. గ్రావెల్ మట్టి కోసం కాలువ గట్టుపై పెద్దపెద్ద గోతులు తవ్వి మరీ మట్టిని రవాణా చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఆ ప్రాంతాలు అగాధాలను తలపిస్తున్నాయి. భవిష్యత్తులో వర్షాలు కురిసినప్పుడు ఆ గోతులు నీటితో నిండి, అటుగా వెళ్లే రైతులు, పశువులు అందులో పడి ప్రాణాలను కోల్పోయే ప్రమాదం ఉంది. ఇదిలా ఉంటే ఈ అక్రమ రవాణా కారణంగా ఇప్పటికే కాలువ గట్టు రోడ్లు సైతం ధ్వంసమయ్యాయి. ద్వారకాతిరుమల మండలం గుణ్ణంపల్లిలో పోలవరం కుడి కాలువ గట్టుపై మట్టి అక్రమ తవ్వకాలు తవ్వకాలు జరిగిన ప్రాంతం గోపాలపురం నియోజకవర్గ పెద్దల ఆధ్వర్యంలోనే ఈ మట్టి దందా జరుగుతోంది. జిల్లా అధికార యంత్రాంగం సైతం మామ్మూళ్ల మత్తులో జోగుతోంది. అందుకే ఈ వైపు ఎవరూ కన్నెత్తి చూడటంలేదు. అంతా గప్చుప్గా ఉన్నారు. మూడు పొక్లెయిన్లతో కాలువ గట్లను ఎడాపెడా తవ్వేస్తున్నారు. రోజుకి వంద టిప్పర్లకు పైగా మట్టి బయటకు తరలిపోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మా గ్రామంలో అక్రమ మట్టి తవ్వకాలు ఆగలేదు. కొందరు టీడీపీ నాయకులు సంపాదనే ధ్యేయంగా ఈ దందాకు పాల్పడుతున్నారు. అధికార బలం ఉంది కధా అని, ప్రజాధనాన్ని దోచుకు తింటున్నారు. ఇదేంటని గట్టిగా అడిగితే బెదిరిస్తున్నారు. – బాలం వెంకటేశ్వరరావు, గుణ్ణంపల్లి మాజీ సర్పంచ్ పోలవరం కాలువ గట్టును చెరబట్టిన పచ్చ నేతలు నిత్యం 15 వందల క్యూబిక్ మీటర్ల మట్టి అక్రమ రవాణా రోజుకి రూ.10 లక్షలకు పైగా ఆదాయం మామూళ్ల మత్తులో జోగుతున్న అధికార యంత్రాంగం -
రోడ్ల గతి ఇంతేనా!
కూటమి ప్రభుత్వం వచ్చాక వచ్చే సంక్రాంతికి రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు చూస్తారని మైక్ పట్టుకుని ఉపన్యాసాలే తప్పా ఆచరణలో మాత్రం కనపడడం లేదు. గద్దెనెక్కి రెండు సంక్రాంతులైనా ఏలూరు నగరంలో రోడ్లు మాత్రం అలానే ఉన్నాయి. ఈ రోడ్లపై తరుచూ వాహనదారులు అదుపు తప్పి పడిపోయి ప్రమాదాలకు గురవుతున్నా పాలకులు, అధికారులు మాత్రం కన్నెత్తి చూడటం లేదు. పాండురంగా థియేటర్ నుండి గజ్జెలవారిచెరువు వరకు రోడ్డు మరీ అధ్వాన్నంగా తయారైంది. ఈ రోడ్డు మీదుగానే కై కలూరు, భీమవరం, పాలకొల్లు, నర్సాపురానికి బస్సులు వెళ్తుంటాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్/ఏలూరు బెనర్జీపేటలో రోడ్డు ఇలా బుద్ధా పార్కు ఎదురుగా -
నిలకడ లేని కోకో ధర
● గతేడాది రూ.700 పలికిన ధర ● నేడు రూ.330 నుంచి రూ.350 వరకు పతనం ● ధర పతనంతో రైతులు సతమతంతాడేపల్లిగూడెం రూరల్: వాణిజ్య పంటగా ఉన్న కోకో సాగు చేసిన రైతుకు కడగండ్లు తప్పడం లేదు. ఏడాది పొడవునా పంట పండించే అవకాశం ఉండటం, ధర స్థిరంగా లేకపోవడంతో రైతులు సతమతమవుతున్నారు. ఒక్క తాడేపల్లిగూడెం మండలంలోనే 4,219 ఎకరాల్లో కోకో పంట పండిస్తున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఎకరం పంటకు సాగు చేస్తే ఏడాదికి రూ.50వేలు పెట్టుబడి అవుతుంది. ఎకరానికి మూడు క్వింటాళ్లు దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. డిసెంబరు నుంచి ఏప్రిల్ మధ్యలో అత్యధిక పంట వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. కోకో గింజలు కిలోకు 2024 జనవరిలో 800 నుంచి రూ.వెయ్యి ధర లభించింది. 2025 జనవరిలో రూ.700, అదే ఏడాది మార్చిలో రూ.600 వరకు ధర పలికింది. ప్రస్తుతం కిలో రూ.330 నుంచి రూ.350 మాత్రమే ధర లభిస్తుందని రైతులు వాపోతున్నారు. గత ఏడాది మార్చితో పోల్చుకుంటే కిలోకు రూ.250 తగ్గిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేను మూడెకరాల్లో కోకో పంట సాగు చేశాను. ప్రస్తుతం పంట చేతికొస్తుంది. మార్కెట్లో కోకో గింజలు కిలోకు రూ.300 నుంచి రూ.350కు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. పంట పెట్టుబడులకు, ప్రస్తుతం ఉన్న ధరకు ఏ మాత్రం పొంతన లేదు. కంపెనీలు కిలోకు రూ.500 చెల్లిస్తే గిట్టుబాటు అవుతుంది. – మేకా రామారావు, కోకో రైతు, కృష్ణాపురం, తాడేపల్లిగూడెం మండలం కొబ్బరిలో అంతర పంటగా కోకో పంటను పదెకరాల్లో సాగు చేశాను. పంట చేతికొచ్చినా ధర మాత్రం గిట్టుబాటు కావడం లేదు. ఎరువులు, పురుగు మందుల పెట్టుబడులతో పాటు కూలీ ఖర్చులు వెరసి సాగు భారంగా మారుతోంది. కంపెనీలు రైతును దృష్టిలో ఉంచుకుని ధర పెంచాలి. – యలమాటి విశ్వేశ్వరరావు, కోకో రైతు, నీలాద్రిపురం, తాడేపల్లిగూడెం మండలం కోకో రైతులకు అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా ధర చెల్లించాలి. కోకో గింజలకు అంతర్జాతీయంగా ధర ఎక్కువగా ఉన్న సమయంలోనూ ఇక్కడి రైతులకు సరైన ధర లభించడం లేదు. తగ్గినప్పుడు మాత్రం ధర తగ్గించడం ఎంత వరకు సమంజసం. కిలో గింజలకు రూ.500 చెల్లించాలి. – బోళ్ళ వెంకటసుబ్బారావు (సబ్బి), కోకో రైతుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
గిరిజన ఉత్పత్తులను కొనుగోలు చేయాలి
బుట్టాయగూడెం: అడవుల్లో గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులను జీసీసీ ద్వారా కొనుగోలు చేయాలని ఐటీడీఏ పీఓ కె.రాములు నాయక్ అన్నారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో మంగళవారం జీసీసీ అధికారులు, సేల్స్మెన్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులు సేకరించే తేనె, చింతపండు, కరక్కాయ, కొండచీపుళ్లు, ఇప్పపువ్వు వంటి 100కు పైగా చిన్నతరహా అటవీ ఉత్పత్తులు ఉన్నాయన్నారు. వాటన్నింటికీ మద్దతు ధర కల్పించి గిరిజన ఉత్పత్తులపైనే ఆధారపడిన గిరిజనుల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు. దళారుల చేతుల్లో మోసపోకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఐటీడిఏ పరిధిలోని గ్రామాల్లో గిరిజనులు తయారు చేసే ఉత్పత్తుల వివరాలు, వారి పేర్లు సేకరించాలని సూచించారు. అలాగే గిరిజనులు తయారు చేసే ఉత్పత్తులను కొనుగోలు చేసి వారి ఉత్పత్తులకు సంబంధించిన డబ్బులను నేరుగా వారి ఖాతాలోనే జమ చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎం విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
పేదల నెత్తిన బండ
సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న నిత్యావసరాల ధరల చెంతన వంట గ్యాస్ చేరింది. డొమెస్టిక్ సిలిండర్పై రూ.60, కమర్షియల్ సిలిండర్పై రూ.110 చొప్పున ధరలు పెరిగాయి. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలతో పేదలు ఇబ్బంది పడుతుండగా గ్యాస్ ధరల పెంపు గుబులు పుట్టిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని గృహ వినియోగదారులపై ఏడాదికి రూ.50.84 కోట్ల మేర అదనపు భారం పడనుంది. మంగళవారం శ్రీ 10 శ్రీ మార్చి శ్రీ 2026సాక్షి, భీమవరం: పశ్చిమగోదావరి జిల్లాలో ఐఓసీకి చెందిన 20, హెచ్పీసీ 18, బీపీసీ గ్యాస్ ఏజెన్సీలు నా లుగు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 6,21,626 గృహావసరాలు (డొమెస్టిక్) కనెక్షన్లు ఉన్నాయి. మొన్నటివరకు 14.20 కిలోల డొమెస్టిక్ సిలిండర్ రూ.892లు, అలాగే 19 కిలోల వాణిజ్య (కమర్షియ ల్) సిలిండర్ రూ. 1850.50 ధర ఉంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం డొమెస్టిక్పై రూ.60, కమర్షియ ల్పై రూ.110లు పెంచింది. శుక్రవారం రాత్రి నుంచి ఈ ధరలు అమల్లోకి వచ్చాయి. సగటున ఒక్కో కుటుంబం ఏడాదికి ఏడు సిలిండర్లు చొప్పున జిల్లాలోని వినియోగదారులు 43.5 లక్షల డొమెస్టిక్ సిలిండర్లు వినియోగిస్తారని అంచనా. వంట గ్యాస్ కోసం ఇప్పటివరకు ఏడాదికి రూ.6,244 లు వెచ్చిస్తే, ప్రస్తుత ధర ప్రకారం రూ.6,664 చెల్లించాలి. జిల్లాలో ఉజ్వల కనెక్షన్లు దాదాపు 27,420 ఉండగా వీటిపై పెంపు లేదని ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. పెరిగిన ధరల మేరకు జిల్లా వాసులపై రూ.24.94 కోట్లు అదనపు భారం పడుతుందని అంచనా. అలాగే ఏలూరు జిల్లాలోని గ్యాస్ వినియోగదారులు ఏడాదికి 45.2 లక్షల సిలిండర్లు వినియోగిస్తారని అంచనా. ఉజ్వల, ఐదు కిలోల గ్యాస్ సిలిండర్లు మినహాయించగా రూ.25.9 కోట్ల భారం పడుతుందని అంచనా. బుకింగ్ నిబంధనల్లో మార్పు గ్యాస్ బుకింగ్ విషయంలో కేంద్రం పరిమితులు విధించింది. గ్యాస్ కంపెనీలు సేల్స్ పెంచుకునే క్రమంలో ఇప్పటివరకు పరిమితి లేకుండా వినియోగదారులకు సిలిండర్లు ఇస్తూ వచ్చాయి. ఈ క్రమంలో డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు దా రి మళ్లిస్తున్నారు. జిల్లాలోని హోటళ్లు, స్వీట్షాపులు, బేకరీలు, రెస్టారెంట్లు, కర్రీ పాయింట్లు తదితర ఎక్కడ చూసినా కమర్షియల్కు బదులుగా డొమెస్టిక్ సిలిండర్లనే వినియోగిస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీల నుంచి నేరుగా డొమెస్టిక్ సిలిండర్లు వాణిజ్య అవసరాలకు తరలిపోతున్నాయన్న ఆరోపణలు ఉన్నా యి. తాజా పరిస్థితుల నేపథ్యంలో సింగిల్ సిలిండర్ వినియోగదారులు బుకింగ్ కోసం 21 రోజులు, డబుల్ సిలిండర్లు ఉన్నవారు 30 రోజుల వ్యవధిలో బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. పేదలపై పెనుభారం 2024 అక్టోబరులో రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పు పంపిణీ ప్రారంభించిన కూటమి ప్రభుత్వం నాలుగు నెలలు తిరక్కుండానే చేతులెత్తేసింది. గతే డాది ఫిబ్రవరిలో అంతంతమాత్రంగా సరఫరా చేసి తర్వాత నెల మొత్తం నిలిపివేసింది. ఒక్కో కార్డుపై రూ.20లకు కిలో గోధుమ పిండి అందజేస్తామని చెప్పి జనవరి నుంచి పైలెట్ ప్రాజెక్టు పేరిట నగరా లు, ముఖ్య పట్టణాలకు మాత్రమే పరిమితం చేసింది. పశ్చిమగోదావరి జిల్లాలో 1,052 రేషన్ డిపోల పరిధిలో 5,67,700 రేషన్ కార్డులకు గాను భీమవరంలోని 49 రేషన్ దుకాణాల్లోని 33,363 కార్డులకు మాత్రమే గోధుమ పిండి ఇస్తున్నారు. సిలిండర్ గ్యాస్ ధరల పెంపుతో అదనపు భారం ‘పశ్చిమ’లో 6.21 లక్షలు, ఏలూరు జిల్లాలో 6.45 లక్షల కనెక్షన్లు ఇకపై బుకింగ్ ని‘బంధనాలు’ 21 రోజుల తర్వాతే మరో సిలిండర్ జారీ వాణిజ్య అవసరాలకు డొమెస్టిక్ సిలిండర్లు వినియోగిస్తున్నా చర్యలు శూన్యంసరుకుల ధరల మంట మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. కంది, మినుము, పెసరపప్పులు నాణ్యత రకాన్ని బట్టి కిలో రూ.125లు నుంచి రూ.132లు వరకు ఉన్నాయి. పామాయిల్ ప్యాకెట్ రూ.137లు ఉండగా, సన్ఫ్లవర్ ఆయిల్ రూ.170లు వరకు ఉంది. అదేమాదిరి ఇతర నూనెల ధరలు పెరిగాయి. నిత్యావసర సరుకులు లేనిదే రోజు గడవని పరిస్థితి. తాజాగా గ్యాస్ ధరలు పెరగడం పేదవర్గాల వారికి మరింత భారం కానుంది. పేదలపై భారం పడకుండా నిత్యావసర వస్తువుల ధరలను తగ్గిస్తామని ఎన్నికల్లో చెప్పారు. ఇప్పుడు ఇష్టానుసారంగా అన్ని ధరలను పెంచేస్తున్నారు. రేషన్ దుకాణాల్లో నిత్యావసర సరుకులు ఇస్తామని మూడు నెలలు మాత్రమే కందిపప్పు ఇచ్చారు. – కొరపాటి అనిత, గృహిణి, చెరుకువాడ నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయి ప్రజలు తీవ్ర ఇ బ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో వంట గ్యాస్ ధరలు పెంచడం సరికాదు. దీనివలన ప్రజలపై మరింత భారం పడుతుంది. పెంచిన ధరలు తగ్గించాలి. – రేకపల్లి అమ్మాజీ, గృహిణి, రాయకుదురు -
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
తణుకు అర్బన్: తాళం వేసి ఉన్న ఇళ్లు గుల్ల చేసిన ఘటన తణుకు మండలం వేల్పూరులో చోటుచేసుకుంది. తణుకు మండలం వేల్పూరు పరిధిలోని విష్ణుప్రియ నగర్లోని ఇంట్లో జరిగిన చోరీ సోమవారం వెలుగు చూసింది. ఈ చోరీలో బంగారు నగలతోపాటు కిలో వెండి వస్తువులు, రూ.20 వేల నగదు అపహరణకు గురైనట్లు తెలుస్తోంది. విష్ణుప్రియ నగర్లోని 8వ నంబరు రోడ్డులో ఉంటున్న వరద వెంకటరమణ కుటుంబసభ్యులతో కలిసి ఇటీవల కాశీకి వెళ్లారు. సోమవారం ఉదయం ఇంటి తలుపు తెరిచి ఉండటంతో స్థానికులు ఇచ్చిన సమాచారంతో వారి కుటుంబ సభ్యులు తణుకు రూరల్ పోలీసులకు విషయం తెలపగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు. ఇంట్లోని రెండు బీరువాలను పగలగొట్టి బంగారం, వెండి ఆభరణాలతోపాటు రూ. 20 వేలు వరకు నగదును అపహరించుకుపోయారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇంటి యజమానులు వస్తేనే గానీ ఆభరణలు ఎన్ని ఉండాలి, ఎంత చోరీకి గురయ్యాయనే విషయం స్పష్టత రాదని తణుకు రూరల్ ఇన్చార్జ్ ఎస్సై జానా సతీష్ తెలిపారు. -
ఏలూరు కలెక్టరేట్కు క్వాలిటీ సిస్టమ్స్ ధ్రువీకరణ
ఏలూరు(మెట్రో): ఏలూరు కలెక్టరేట్లో ప్లాస్టిక్ వినియోగం నియంత్రణను విజయవంతంగా అమలు చేసినందుకుగాను ఇండియన్ రిజిస్టర్ క్వాలిటీ సిస్టమ్స్ సంస్థ ధ్రువీకరణ పత్రాన్ని అందజేసింది. సోమవారం కలెక్టరేట్లోని ఆ సంస్థ ప్రతినిధి టీఎన్ అనంత్ కలెక్టర్ కె.వెట్రి సెల్వికి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ప్లాస్టిక్ వినియోగం నియంత్రణ, స్థిరమైన ప్లాస్టిక్ నిర్వహణ, రీసైక్లింగ్ తదితర అంశాలను పరిశీలించిన అనంతరం సర్టిఫికెట్ జారీ చేసింది. డీఆర్వో వి.విశ్వేశ్వరరావు పాల్గొన్నారు. ఏలూరు (టూటౌన్): దేశంలో లేబర్ కోడ్లు అమలయితే శ్రామిక మహిళలకు తీవ్ర నష్టం తప్పదని రిటైర్డ్ జిల్లా జడ్జి అడబాల లక్ష్మి ఆందోళన వ్యక్తం చేశారు. లేబర్ కోడ్లు రద్దు చేసి 29 కార్మిక చట్టాలను కొనసాగించాలని ఆమె కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని శ్రామిక మహిళా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సదస్సులో ఆమె మాట్లాడారు. కార్మిక చట్టాల పరిరక్షణ కోసం శ్రామిక మహిళలు ఉద్యమించాలని పి లుపునిచ్చారు. ఏపీఎన్జీవో అసోసియేషన్ మాజీ జిల్లా నాయకురాలు కాగిత నాగమణి, ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షురాలు కె.రమాదేవి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ మహిళా వి భాగం అధ్యక్షురాలు బండి భవాని, హాస్టల్స్ వ ర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకురాలు ఎస్. లక్ష్మి తదితరులు మాట్లాడారు. ఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి యు.వెంకటేశ్వరరావు, ఏలూరు నగర అధ్యక్షుడు బి.సోమయ్య తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని 55 కేంద్రాల్లో సోమవారం జరిగిన ఇంటర్ సెకండియర్ గణితం–బీ2 పరీక్షకు 9,596 మంది విద్యార్థులు హాజరయ్యారు. జనరల్ విద్యార్థులు 8,588 మందికి 8,486 మంది, 1,236 మంది ఒకేషనల్ విద్యార్థులకు 1,110 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోహాన్ తెలిపారు. దూరవిద్య పరీక్షలకు.. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం దూరవిద్య ఇంటర్ భౌతిక, రాజనీతి శాస్త్రాల పరీక్షలకు 556 మంది విద్యార్థులు హాజరయ్యారు. భౌతిక శాస్త్రం పరీక్షకు 224 మందికి 198 మంది, రాజనీతిశాస్త్రం పరీక్షకు 391 మందికి 348 మంది హాజరయ్యారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ తెలిపారు. ఏలూరు (టూటౌన్): పోలవరం ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన నిర్వాసిత గ్రామాల్లో 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ ప్యాకేజీ ఇవ్వాలని, ఇప్పటివరకూ జరిగిన అవినీతి అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీపీఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ.రవి డిమాండు చేశారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కాగ్ రిపోర్టుపై మాట్లాడు తూ పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులకు అ న్యాయం జరుగుతోందని సీపీఎం ఏదైతే చెబుతుందో అదే వెల్లడయ్యిందన్నారు. పెద్దఎత్తున అవినీతి జరుగుతోందని, అనర్హులకు వందల కోట్లు కట్టబెట్టారని, కాంట్రాక్టర్లు దోచుకున్నా రని వీటిపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. తణుకు అర్బన్: తణుకుకు చెందిన ప్రముఖ చిత్రకారుడు డాక్టర్ వెంపటాపు దృశ్య కళా వైభవ పురస్కారం అందుకున్నారు. కళాతపస్వి దామెర్ల రామారావు 130వ జయంతి పు రస్కరించుకుని రాజమండ్రి చిత్ర కళానికేతన్ ఆధ్వర్యంలో దామెర్ల ఆర్ట్ గ్యాలరీలో నిర్వహించిన ప్రత్యక్ష చిత్ర రచనా విన్యాసం ప్రదర్శనలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి 30 మంది చిత్రకారులు పాల్గొన్నారు. వెంపటాపు శివో హం శీర్షికతో ప్రత్యేక చిత్ర రచన చేశారు. తాను ప్రదర్శించిన గాంధీ గమనం నమో అంతర్ముఖి చిత్రాలకు ప్రశంసలు అందాయన్నారు. అనంతరం పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ ఉపాధ్యక్షుడు డి.మునిరత్నం నాయుడు చేతులమీదుగా పురస్కారం అందుకున్నానన్నారు. -
అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
రూ.45 లక్షల చోరీ సొత్తు స్వాధీనం ఏలూరు టౌన్ : తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు ఏడాది కాలంగా రెచ్చిపోతున్నారు. ఏలూరు జిల్లాలోనూ ఇతర ప్రాంతాల్లోనూ ఇంటి తాళాలు పగులగొట్టి బంగారు, వెండి వస్తువులు, విలువైన సామగ్రి, నగదును చోరీ చేస్తోన్న ఇద్దరు దొంగలను కై కలూరు రూరల్ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. సుమారు రూ.45 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు జిల్లా ప్రధాన కార్యాలయంలో ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ వివరాలు వెల్లడించారు. కై కలూరు రూరల్ సర్కిల్ పోలీస్స్టేషన్ పరిధిలోని ముదినేపల్లి, కలిదిండి, మండవల్లి, బంటుమిల్లి, కృష్ణా జిల్లా పెడన, పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మరికొన్ని మండలాల్లో తాళాలు వేసిన ఇళ్ళను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్నారు. ఈ చోరీ కేసులపై ప్రత్యేక దృష్టి సారించిన ఎస్పీ శివకిషోర్ ఆదేశాలతో ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్ పర్యవేక్షణలో కై కలూరు రూరల్ సీఐ వి.రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి, దర్యాప్తు చేసి నిందితులను గుర్తించారు. ఇద్దరు వ్యక్తులు గత ఏడాది కాలంగా నేరాలకు అలవాటుపడి, వ్యసనాలకు బానిసలై చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. కలిదిండి మండలం గురవాయిపాలెం గ్రామానికి చెందిన గొల్ల వంశీ, ప్రస్తుతం కలిదిండి శివారు మిలటరీపేటలో ఉంటోన్న భాస్కరరావుపేటకు చెందిన కాల దేవీవరప్రసాద్ను సోమవారం ముదినేపల్లిలో అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఆస్తి సంబంధిత 7 కేసుల్లో భారీ ఎత్తున సుమారు 45 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు దొంగల నుంచి సుమారు 200 గ్రాముల బంగారు ఆభరణాలు, మరో 3 కిలోల వెండి వస్తువులు, మూడు ఎల్ఈడీ టీవీలు, మూడు గ్యాస్ సిలిండర్లు, మూడు మోటారు సైకిళ్ళను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులను ఛేదించటంలో ప్రతిభ చూపిన కై కలూరు రూరల్ సీఐ రవికుమార్, ముదినేపల్లి ఎస్ఐ వీఎస్వీ భద్రరావు, కలిదిండి ఎస్ఐ వీ.వెంకటేశ్వరరావు, కానిస్టేబుల్స్ బీ.నాగబాబు, పీ.నాగరాజు, పీ.పవన్కుమార్, హోంగార్డు జీ.శివకోటయ్య, ఏలూరు డీఎస్బీ సెల్ట్రాక్ హెచ్సీ పీవీ సత్యనారాయణను ఏలూరు జిల్లా ఎస్పీ శివకిషోర్ ప్రత్యేకంగా అభినందించారు. -
గ్యాస్ ధరల పెంపుపై మండిపాటు
ఏలూరు (టూటౌన్): మోదీ సర్కార్ పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని కోరుతూ కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఏలూరు మార్కెట్ యార్డ్ వద్ద వీవీ నగర్ ఆవరణలో ఇఫ్టూ నగర కమిటీ, మార్కెట్ యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేశారు. ఇఫ్టూ నగర ప్రధాన కార్యదర్శి యర్రా శ్రీనివాస్ రా వు అధ్యక్షత వహించగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, ఇఫ్టూ నగర అధ్యక్షుడు బి.సోమయ్య మాట్లాడారు. ధరలను అరికట్టేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని, ఏడాదిలో గ్యాస్ సిలిండర్పై రూ.122 పెంచడం దారుణమన్నారు. నిత్యావసర సరుకుల ధరలు నియంత్రించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్ప టికే ప్రజలు సరైన ఉపాధి, ఉద్యోగ భద్రత లేక జీవ నం సాగిస్తున్నారని, ఈ సమయంలో గ్యాస్ ధరల పెంపు సరికాదన్నారు. యుద్ధాలను నివారించేలా ప్రయత్నించాలని కోరారు. -
టీడీపీ కార్యకర్త భార్య అనుమానాస్పద మృతి
ద్వారకాతిరుమల: మండలంలోని రామసింగవరంలో ఓ టీడీపీ కార్యకర్త భార్య సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త కాలసాని సత్యన్నారాయణకు, తూర్పుగోదావరి జిల్లా, దేవరపల్లి మండలం యాదవోలుకు చెందిన గెడ నాగదుర్గ(23)కి 2020లో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు సంతానం. ఇంటికి మంచి నీటి కుళాయి లేకపోవడంతో నాగదుర్గ కుళాయి వేయించమని భర్తతో పలుమార్లు చెప్పింది. ఈ విషయంపై తరచు చిన్నచిన్న గొడవలు జరుగుతున్నాయి. దాంతో మృతురాలి తండ్రి దండిరాజు, ఆమె సోదరుడు ఆదివారం రామసింగవరంకు వచ్చి, సర్ధిచెప్పారు. సోమవారం ఉదయం మృతురాలి తల్లి కనకమహాలక్ష్మి ఫోన్ చేయగా, నాగదుర్గ ఇంకా నిద్ర లేవలేదని చెప్పారు. ఉదయం నీటి కుళాయి విషయంలో మళ్లీ భార్య, భర్తలకు మద్య గొడవ జరగ్గా, నాగదుర్గ మనస్థాపంతో ఫ్యాన్కు ఉరి వేసుకుని మృతి చెందినట్టు ఆమె తల్లి కనక మహాలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. భీమడోలు సీఐ పి.కృష్ణ, ద్వారకాతిరుమల ఎస్సై టి.సుధీర్లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. నూజివీడు: పట్టణంలోని ఎస్ఆర్ఆర్ హైస్కూల్లో 8వ తరగతి విద్యార్ధి ఆచూకీ నేటికీ లభ్యం కాలేదు. ఆగిరిపల్లి మండలం పిన్నమరెడ్డిపల్లికి చెందిన విద్యార్ధి స్థానిక ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు. గత నెల 23న హాస్టల్ నుంచి హైస్కూల్కు వెళ్లిన విద్యార్థి సాయంత్రం 4 గంటలకు హైస్కూల్ వదిలిన తరువాత తిరిగి హాస్టల్కు రాలేదు. దీంతో అదేరోజు సాయంత్రం 6 గంటల తరువాత గమనించి అతని తల్లికి ఫోన్ చేశారు. పట్టణంలోని అజరయ్యపేటలోని అక్క ఇంటికి వెళ్లాడని, రేపు తీసుకువస్తామని వార్డెన్కు బాలుడి తల్లి సమాధానం చెప్పింది. 24న హైస్కూల్కు వచ్చిన విద్యార్ధి మధ్యాహ్నం వరకు ఉండి పాఠశాలలోనే మధ్యాహ్న భోజనం తిని పుస్తకాల బ్యాగ్ స్కూల్లోనే వదిలేసి వెళ్లిపోయాడు. సాయంత్రానికి విద్యార్థి రాకపోవడంతో హాస్టల్ వార్డెన్ మరల బాలుడి తల్లిదండ్రులకు సమాచారమిచ్చాడు. స్థానికంగాను, బంధువుల ఇళ్ల వద్ద వెతికినా కనబడకపోవడంతో ఈ నెల 1న పట్టణ పోలీస్స్టేషన్లో వార్డెన్ ఫిర్యాదు చేశారు. -
హెల్త్ సెక్రటరీల ఆందోళన
ఏలూరు (టూటౌన్): వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న హెల్త్ సెక్రటరీలకు జీఓ 124ను అమలు చేసి వైద్యారోగ్య శాఖకు సంబంధించిన పనులకే పరి మితం చేయాలని కోరుతూ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సీఐటీయూ) జి ల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్.లింగరాజు మాట్లాడుతూ హెల్త్ సెక్రటరీలు పని ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారని, వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. హెల్త్ సెక్రటరీ యూనియన్ జిల్లా కార్యదర్శి శ్రీలక్ష్మి మా ట్లాడుతూ హెల్త్ సెక్రటరీలను వైద్యారోగ్యశాఖలో విలీనం చేయాలని కోరారు. పని భారాన్ని తగ్గించాలని, ఇతర శాఖల పని నుంచి విముక్తి కల్పించాలని కోరారు. జిల్లాలో తక్షణమే పదోన్నతుల రెండో జా బితా విడుదల చేయాలని, నేషనల్ ఇంక్రిమెంట్ అలవెన్స్ ఇప్పించాలని కోరారు. అనంతరం డీఆర్వో, డీఎంహెచ్ఓకు వినతిపత్రాన్ని అందజేశారు. సంఘ నాయకులు నీలాదేవి, నాగమణి, పోశమ్మ తదితరులు పాల్గొన్నారు. -
జాతర వెలుగులు
పట్టణ ఇలవేల్పు బలుసులమ్మ తల్లి జాతర వెలుగులతో తాడేపల్లిగూడెం విద్యుత్ కాంతులతో ధగధగలాడుతోంది. విద్యుత్ దీపాలతో పాటు దేవతామూర్తుల కటౌట్లు ఆకట్టుకుంటున్నాయి. జయలక్ష్మీ ఽ సెంటర్ సమీపంలో త్రిలోక సంచారి శివయ్య లైట్ల కాంతులతో ఆకర్షిస్తున్నారు. పోలీసు ఐలాండ్ సెంటర్లో గోవా సుందర దృశ్యాన్ని స్పురణకు తెస్తూ పెట్టిన లైటింగ్ కనులవిందు చేస్తోంది. ఫ్లైఓవర్ బ్రిడ్జికి ఒక భాగంలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, మరోపక్క నాగలోకం ఆకట్టుకుంటోంది. – తాడేపల్లిగూడెం -
జనం రాని సభపై ఎమ్మెల్యే ఫైర్
● ‘మాకు పనిలేక వచ్చామా?’ అంటూ నాయకులపై ఆగ్రహం ● జగన్ సర్కారుపై అక్కసు వెళ్లగక్కిన నరసాపురం ఎమ్మెల్యే నాయకర్ నరసాపురం రూరల్: మండలంలోని కొత్త నవరసపురం గ్రామంలో సోమవారం ఉదయం జరిగిన ఓ కార్యక్రమం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం వచ్చిన నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ కొత్త నవరసపురం సచివాలయం వద్ద సభా ప్రాంగణంలో జనం లేకపోవడంతో కూటమి నాయకులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎక్కడ చూసినా ఖాళీ కుర్చీలే కనిపించడంతో విస్మయానికి గురయ్యారు. ప్రజలు ఎందుకు రాలేదని ఎమ్మెల్యే ప్రశ్నించగా అందరూ పొలం పనుల నిమిత్తం బయటకు వెళ్లారని స్థానిక నాయకులు సమాధానమిచ్చారు. దీంతో మరింత ఆగ్రహించిన ఎమ్మెల్యే ‘ప్రజలు వస్తారో రారో చూసుకోకుండా కార్యక్రమం ఎలా ఏర్పాటు చేస్తారు? మేమేమన్నా ఇక్కడ ఖాళీగా ఉన్నామా? మాకు వేరే పనులు లేక వచ్చామా?’ అంటూ మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో నాయకులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయకర్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘మీరంతా జగన్ మాయలోనే ఉంటానంటే మీ ఊరిని ఎవరూ బాగు చేయలేరు’ అంటూ ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపైనా అసహనాన్ని వెళ్ల గక్కారు. ఎమ్మెల్యే నాయకర్ ప్రజల సమస్యలను పట్టించుకోకుండా సభకు జనం రాలేదని మాట్లాడటం విడ్డూరంగా ఉందంటూ పలువురు కూటమి నేతలు ఎమ్మెల్యే తీరును తప్పు పడుతున్నారు. ఎమ్మెల్యే గారూ ఇదేం పద్ధతి నరసాపురం: కొత్త నవరసపురంలో ఎమ్మెల్యే నాయకర్ వ్యవహరించిన తీరు సరికాదని వైఎస్సార్సీపీ ఐటీ వింగ్ జిల్లా కన్వీనర్ బుడితి సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎ మ్మెల్యే కార్యక్రమానికి జనం రాకపోతే మాజీ సీఎం జగన్ కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. జనం మెచ్చే పనులు చేస్తే ఎమ్మెల్యే నాయకర్కు ఇలా తన కార్యక్రమానికి ప్రజాస్పందన కరువయ్యే పరిస్థితి ఉండదన్నారు. ఎమ్మెల్యే నాయకర్ నైజాన్ని కూటమి నాయకులు ఇప్పటికై నా తెలుసుకోవాలని సూచించారు. -
‘పాలిటెక్నిక్’ని పట్టించుకునేవారేరీ?
● నిరుపయోగంగా బోధన సామగ్రి ● కళాశాల నిర్వహణపై అధికారుల నిర్లక్ష్యం గిరిజన విద్యార్థులకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన పాలిటెక్నిక్ కళాశాల నామమాత్రంగా ఉన్నప్పటికీ కనీసం ఐటీడీఏ అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరం. గిరిజన విద్యార్థులు ఎంతగానో ఉపయోగపడే ఈ కళాశాల నిర్వహణను సక్రమంగా నిర్వహించేలా అధికారులు కృషి చేయాలి. పాలిటెక్నిక్ విద్యను విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకోవాలి. – బన్నే వినోద్, పీడీఎస్యూ జిల్లా నాయకుడు, బుట్టాయగూడెం పాలిటెక్నిక్ కళాశాల నిర్వహణను మెరుగుపర్చేలా చర్యలు తీసుకుంటున్నాం. విద్యార్థులు కళాశాలలో చేరేలా చూస్తున్నాం. ప్రస్తుతం గ్రామాల్లో పర్యటించి కళాశాలలో చేరే విధంగా చూస్తున్నాం. అధ్యాపకుల ఖాళీ పోస్టులు భర్తీ కాగానే నిర్వహణ చేపడతాం. విద్యార్థుల తల్లిదండ్రులు మాకు సహకరించాలి. – చంద్రశేఖర్, పాలిటెక్నిక్ కళాశాల ఓఎస్డీ– కేఆర్పురం బుట్టాయగూడెం: గిరిజన విద్యార్థుల బంగారు భవిష్యత్కు బాటలు వేయాలనే ఉద్దేశంతో బుట్టాయగూడెం మండలం కోటరామచంద్రపురం ఐటీడీఏ సమీపంలో ఏర్పాటు చేసిన పాలిటెక్నిక్ కళాశాల ఉన్నట్టా? లేనట్టా? అనే చందంగా ఉంది. గిరిజన ప్రాంతంలోని విద్యార్థులకు తక్కువ ఖర్చుతో విద్య, ఉద్యోగ అవకాశాలను స్వయం ఉపాధి చేపట్టేందుకు పాలిటెక్నిక్ విద్య ఉత్తమ మార్గమని 2015లో పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేశారు. ఈ కళాశాల నిర్వహణ రెండేళ్ల పాటు విజయవాడలో నిర్వహించారు. గిరిజన విద్యార్థులకు కళాశాల అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వ గురుకుల పాలిటెక్నిక్ కళాశాలగా పేరు మార్చి విజయవాడ నుంచి బుట్టాయగూడెం మండలం కేఆర్పురం ఐటీడీఏ సమీపంలోనే ఒక భవనంలో పాలిటెక్నిక్ కళాశాలను మార్చి ఇక్కడ ఏర్పాటు చేశారు. 2020 వరకూ ఈ కశాళాలలో కోర్సులు బాగానే నిర్వహించినా తర్వాత కరోనా కారణంగా కళాశాల నిర్వహణ అంతంత మాత్రంగానే ఉంది. కరోనా తర్వాత ఈ కళాశాలలో చేరేందుకు విద్యార్థులు రాకపోవడం, విద్యార్థులను చేర్పించేందుకు సంబంధింత అధికారులు శ్రద్ధ చూపకపోవడంతో ఇప్పడు విద్యార్థులే లేని కళాశాలగా ఉంది. నిరుపయోగంగా బోధన సామగ్రి పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన బోధనా సామగ్రి నేడు నిరుపయోగంగా ఉంది. ఈ కళాశాలను సివిల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోర్సులతో గిరిజన ప్రాంతంలో ప్రారంభించారు. ఈ కళాశాలలో ప్రిన్సిపాల్తో సహ అధ్యాపకులు, కార్యాలయ సిబ్బంది ఉద్యోగ పోస్టులు భర్తీ కాకపోవడంతో బయట కళాశాల నుంచి డిప్యుటేషన్పై ఆయా పోస్టులకు సంబంధించిన వారిని నియమించారు. రాజమండ్రి పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ను ఇక్కడ ఇన్చార్జిగా నియమించారు. అయన ఇక్కడ పని చేస్తున్న సమయంలో అప్పట్లో రూ. 10 లక్షలతో ఫిజిక్స్ ల్యాబ్లు, కంప్యూటర్లు, మూడు డిజిటల్ తరగతి విభాగాలను ఏర్పాటు చేసి బోధనా సామగ్రిని ఏర్పాటు చేశారు. ఈ కళాశాల సొంత భవనం ఏర్పాటు చేసేందుకు భూసేకరణ ప్రక్రియ కూడా చేశారు. రెగ్యులర్ అధ్యాపకుల నియామకానికి ప్రయత్నాలు చేశారు. కరోనా తర్వాత పోస్టుల భర్తీతోపాటు భూసేకరణ పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ల్యాబ్లు, సామగ్రి నిరుపయోగంగా మారాయి. అధ్యాపకులు లేకపోవడంతో కళాశాలలో చేరేందుకు ఆసక్తి చూపడంలేదు. ఇటీవల ఇద్దరు అధ్యాపకుల నియామకం కేఆర్పురం ఐటీడీఏ సమీపంలో ఉన్న పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణానికి సంబంధించి ఇటీవల ఇద్దరు అధ్యాపకులను నియమించినట్లు ప్రస్తుతం కళాశాల ఓఎస్డీగా పనిచేస్తున్న సీనియర్ అధ్యాపకులు చంద్రశేఖర్ తెలిపారు. తాత్కాలిక పద్ధతిన వాచ్మెన్ కూడా ఈ కళాశాలలో ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం తాను ఐటీడీఏ పరిధిలో ఉన్న 18 పాఠశాలల నుంచి విద్యార్థులను ఈ పాఠశాలలో చేర్పించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులకు అతి తక్కువ ఖర్చుతో విద్య, ఉద్యోగ అవకాశాలు, స్వయం ఉపాధి పాలిటెక్నిక్ విద్యతోనే అందుతాయి. ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ చేసిన విద్యార్థుల కంటే పాలిటెక్నిక్ ద్వారా ఇంజనీరింగ్ చేసిన విద్యార్థుల్లో థియరీ, ప్రాక్టికల్స్ పరిజ్ఞానం, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు ఎక్కువగా ఉండడం వల్ల ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయని చెబుతున్నారు. ఇలాంటి విద్య గిరిజన విద్యార్థులకు అందుబాటులోకి వచ్చినప్పటికీ కళాశాల నిర్వహణ సక్రమంగా నిర్వహించడంతో అధికారులు విఫలమవుతున్నారని పిల్లల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘ నాయకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా నామమాత్రంగా నిర్వహిస్తున్న పాలిటెక్నిక్ కళాశాల నిర్వహణ పూర్తి స్థాయిలో నిర్వహించేలా ఐటీడీఏ అధికారులు చొరవ తీసుకోవాలని వారు కోరుతున్నారు. -
సైబర్ నేరం కేసులో రూ.4.50 లక్షల రికవరీ
ఏలూరు టౌన్ : సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి మోసపోవద్దని జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ అన్నారు. ఏలూరు జిల్లా కై కలూరుకు చెందిన ఒక మహిళ సైబర్ నేరగాళ్ళు ఉచ్చులో పడి పోగొట్టుకున్న రూ.4.50 లక్షల నగదును బాధితురాలికి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ చేతులమీదుగా అందజేశారు. కై కలూరు టౌన్ ఎన్జీవో కాలనీకి చెందిన పెనుమాల ప్రసన్నను వాట్సప్లో గుర్తు తెలియని వ్యక్తులు సంప్రదించారు. ఇండియా నివేష్ షేర్స్ అండ్ సెక్యూరిటీస్ పేరుతో కంపెనీ ప్రతినిధులమంటూ నమ్మించారు. నివ్ ప్రో నకిలీ యాప్ను డౌన్లోడ్ చేయించారు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే అత్యధిక లాభాలు ఆర్జించే అవకాశాలు ఉన్నాయంటూ ఆశచూపారు. సైబర్ నేరగాళ్ళ మాయమాటలు నమ్మిన బాధిత మహిళ 2025 నవంబర్ 5 నుంచి 2025 డిసెంబర్ 4 వరకూ దఫదఫాలుగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు. అనంతరం మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది. సైబర్ సెల్ సీఐ దాసు ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. నగదును ట్రాన్స్ఫర్ చేసిన బ్యాంకు ఖాతాలను గుర్తించి గతంలోనే రూ.లక్ష నగదును ఆన్లైన్లో రిఫండ్ చేయించారు. లోతైన దర్యాప్తు చేస్తూ తమిళనాడు వేలూరు ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్ ఖాతాకు డబ్బులు వెళ్ళినట్లు గుర్తించారు. పోలీస్ అధికారులు తమిళనాడు వేలూరు ప్రాంతానికి వెళ్ళి సొమ్మును రికవరీ చేశారు. సోమవారం రూ.4.50 లక్షల నగదును బాధితురాలి చేతికి ఎస్పీ శివకిషోర్ చేతులమీదుగా అందజేశారు. మొత్తం రూ.5.50 లక్షల సొమ్మును రికవరీ చేసినట్లు తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు సైబర్ నేరగాళ్ళు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్లే స్టోర్లో లేని అనధికార ఇన్వెస్ట్మెంట్ యాప్లను ప్రజలు నమ్మవద్దని ఆయన కోరారు. సైబర్ మోసాల బారిన పడిన వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలన్నారు. -
పొగాకు సాగులో బిందు సేద్యం
బుట్టాయగూడెం: పొగాకు సాగులో యాంత్రీకరణ అభివృద్ధి కోసం రూపొందించిన వివిధ రకాల టెక్నాలజీల ద్వారా రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని ప్రాజెక్టు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె.రాజశేఖర్, జీలుగుమిల్లి పరిశోధనా కేంద్రం హెడ్ డాక్టర్ వైవీ సుబ్బయ్య అన్నారు. జాతీయ వాణిజ్య పంటల పరిశోధన కేంద్రం జీలుగుమిల్లిలో సుస్థిర వ్యవసాయం ద్వారా రైతులను శక్తివంతంగా చేయడంపై సోమవారం రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వర్జీనియా పొగాకు సాగులో సెన్సార్ ఆధారిత బిందుసేద్యం వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాల సామర్థ్యం, నిర్మాణం అంశాలపై ఐసీఏఆర్ ఎన్ఐఆర్సీఏ డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ ఆదేశాల మేరకు రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. సెన్సార్ ఆధారిత డ్రిప్ ఇరిగేషన్, డ్రోన్ స్ప్రేయింగ్ పద్దతులపై కూడా రైతులకు అవగాహన కలిగించినట్లు చెప్పారు. ముసునూరు: ఈ నెల 11న కాకినాడలో జరుగనున్న వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ విస్తృత స్థాయి సమావేశాన్ని జయప్రదం చేయాలని పార్టీ స్టేట్ ఎస్సీ సెల్ జాయింట్ సెక్రటరీ కంబాల రాంబాబు పిలుపు నిచ్చారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీని బలోపేతం చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు, ప్రణాళికలను కాకినాడ సమావేశంలో సిద్ధం చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో అన్ని వర్గాలపై నేడు జరుగుతున్న కక్ష పూరిత పాలనకు చరమగీతం పాడేందుకు సమావేశం వేదిక కానుందని తెలిపారు. తణుకు అర్బన్: ఏటీఎం సెంటర్లో డబ్బులు తీసి ఇమ్మన్న వ్యక్తి కార్డు నుంచి నగదు కాజేసిన ఘటన తణుకు పట్టణంలో చోటుచేసుకుంది. ఎన్ఎస్సీ బోస్ రోడ్డులో ఉంటున్న బచ్చు సుబ్బారావు సోమవారం ఉదయం ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఏటీఎంలో డబ్బులు తీసుకునేందుకు వెళ్లారు. అక్కడ ఉన్న వ్యక్తిని తన కార్డుపై డబ్బులు తీసి పెట్టమని అడిగి ఏటీఎం కార్డు ఇచ్చి పిన్ నంబరు చెప్పారు. ఆ అగంతకుడు రెండుసార్లు కార్డును మిషన్లో పెట్టి తీసి కార్డు పనిచేయడంలేదని కార్డు ఇచ్చి వెళ్లిపోయాడు. సుబ్బారావు ఇంటికి వెళ్లి బ్యాంక్ పాస్ బుక్ తీసుకుని బ్యాంక్కు వెళ్లి ఆరాతీయగా.. తన అకౌంట్ నుంచి మూడు దఫాలుగా రూ.23,430 డ్రా చేశారని ఇంకా రూ.35 మాత్రమే ఉన్నాయని చెప్పడంతో బాధితుడు ఆందోళన చెందారు. తన ఏటీఎం కార్డు చూపించగా అది మీ కార్డు కాదని చెప్పడంతో అప్పుడు అసలు మోసం తెలిసింది. డబ్బులు రాలేదని కార్డు తిరిగి ఇచ్చే క్రమంలో అగంతకుడు కార్డును మార్చి వేరు కార్డు ఇచ్చాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాడేపల్లిగూడెం: గ్రాఫ్టింగ్ పద్ధతిలో అధిక దిగుబడులను సాధించవచ్చని ఏపీ నిట్లో సోమవారం బృందావనం క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన హైడ్రోగ్రాఫ్ట్పై అవగాహన కల్పించారు. నాణ్యమైన మొక్కల కోసం అంటుకట్టే పద్ధతులు మేలని నర్సరీ నిర్వాహకులు బ్రహ్మాజీ తెలిపారు. మొక్కలను పెంచే హైడ్రోఫోనిక్స్ పద్ధతి గురించి తెలియచేశారు. జంగారెడ్డిగూడెం: చికిత్స పొందుతూ ఒక వ్యక్తి మృతిచెందినట్లు హెచ్సీ ఎన్.ఉమామహేశ్వరరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన ఎస్కే ఖాలీసా (55) బుట్టాయగూడెం మండలం రెడ్డిగణపవరంలో పొగాకు గొట్టాల వ్యాపారం చేసేవాడు. ఫిబ్రవరి 22న దర్భగూడెంలో జరిగిన తిరునాళ్ళకు వెళ్ళాడు. తిరిగి రెడ్డిగణపవరం వెళుతుండగా, తాడువాయి సమీపంలో మోటార్సైకిల్ స్కిడ్ అయ్యి పడిపోయాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ఏరియా ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేసి గుంటూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ అక్కడ మృతిచెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి
తణుకు అర్బన్: అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి చెందిన ఘటన సోమవారం వెలుగు చూసింది. తణుకు మండలం వీరభద్రపురం గ్రామానికి చెందిన ఆకుల ఐశ్వర్య (13) నిడదవోలులో మృతి చెందిన ఘటన మిస్టరీగా మారింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరభద్రపురానికి చెందిన ఆకుల ప్రసాద్, శాంతి దంపతులకు ఇద్దరు సంతానం కాగా ఐశ్వర్య 9వ తరగతి, నిర్మల 10వ తరగతి తణుకు జాస్తి సీతామహాలక్ష్మి బాలికోన్నత పాఠశాలలో చదువుతున్నారు. 2019 నుంచి వీరిద్దరూ స్థానికంగా ఎస్సీ వసతి గృహంలో ఉంటున్నారు. తల్లిదండ్రులు శాంతి, ప్రసాద్ మనస్పర్థలతో ఎనిమిదేళ్లుగా వేర్వేరుగా జీవిస్తున్నారు. ప్రసాద్ నారాయణపురంలో, శాంతి నిడదవోలులో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 7న ఐశ్వర్య పుట్టినరోజు కావడంతో తల్లి శాంతి తణుకు వచ్చి ఐశ్వర్యను నిడదవోలు తీసుకువెళ్లింది. పాఠశాలలో తోటి విద్యార్థులకు చాక్లెట్లు పంచిన తర్వాత ఐశ్వర్య తల్లితో కలిసి వెళ్లింది. ఇదిలా ఉండగా ఆదివారం తాను చర్చికి వెళ్లానని, ఇంటికి తిరిగి వచ్చేసరికి ఐశ్వర్య ఉరి వేసుకుని చనిపోయిందని తల్లి శాంతి చెబుతోంది. బాలిక మృతదేహాన్ని వీరభద్రపురం తీసుకువచ్చిన కుటుంబసభ్యుల సాయంతో సోమవారం అంత్యక్రియలు చేసేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న తండ్రి ప్రసాద్ కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ పోలీసులకు సమాచారం ఇచ్చి అంత్యక్రియలను అడ్డుకున్నారు. బాలిక మృతదేహాన్ని తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకురాగా తణుకు రూరల్ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు నిడదవోలు పోలీసులు మృతదేహాన్ని నిడదవోలుకు తరలించారు. పుట్టినరోజున స్నేహితుల మధ్య.. తల్లితోపాటు పాఠశాలకు వచ్చిన ఐశ్వర్య తోటి విద్యార్థులతో ఉల్లాసంగా గడిపిందని ఉపాధ్యా యులు చెబుతున్నారు. బాలిక చదువులోనూ చు రుగ్గా ఉంటుందని తెలుస్తోంది. కుమార్తె మృతి ఘ టనలో భార్య శాంతిపై ప్రసాద్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉరి వేసుకుని ఉంటే అందుకు సంబంధించిన ఆనవాళ్లు మృతదేహంపై లేవని ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిడదవోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తణుకు బాలిక నిడదవోలులో ఆత్మహత్య! -
హెచ్పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం
భీమవరం (ప్రకాశంచౌక్): సర్వైకల్ క్యాన్సర్ నుంచి రక్షణకు హెచ్పీవీ వ్యాక్సిన్ దోహదపడుతుందని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. భీమవరం ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం హెచ్పీవీ వ్యాక్సినేషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆడపిల్ల ఆరోగ్యంగా ఉంటేనే భవిష్యత్తు బాగుంటుందన్నారు. ఈ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఉండవన్నారు. ఈ వ్యాక్సిన్పై అవగాహన పెంచుకోవాలని, 9 నుంచి 45 ఏళ్ల వయసున్న బాలికలు, మహిళలు తప్పక వేయించుకోవాలని కోరారు. ముందుగా ఆస్పత్రిలో వ్యాక్సినేషన్ గదిని ఆమె ప్రారంభించారు. ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు మాట్లాడారు. డీఎంహెచ్ఓ జి.గీతాబాయి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి దేవ సుధాలక్ష్మి, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ లక్ష్మణ్జిత్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
ట్రిపుల్ ఐటీలో వర్క్షాప్
నూజివీడు : నూజివీడు ట్రిపుల్ ఐటీలో కెమికల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్–ఓపెన్ఫోమ్ సాఫ్ట్వేర్ వినియోగం’ అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించనున్న జాతీయ స్థాయి వర్క్షాప్ సోమవారం ప్రారంభమైంది. ఈ వర్క్షాప్ను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజినీర్స్(ఐఐసీహెచ్ఈ) అమరావతి రీజినల్ సెంటర్, ఐఐసీహెచ్ఈ ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ చాప్టర్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. దీనిలో పాల్గొన్న ఐఐటీ తిరుపతి మెకానికల్ ఇంజనీరింగ్ అధ్యాపకులు శ్రీనివాస కృష్ణ అద్దేపల్లి మాట్లాడుతూ ఓపెన్ ఫోమ్ ఇంజినీరింగ్ సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగించే ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అని అన్నారు. ఈ సాఫ్ట్వేర్ ద్వారా సంక్లిష్టమైన భౌతిక సమస్యలను తక్కువ ఖర్చుతో అధ్యయనం చేయవచ్చని పేర్కొన్నారు. ఐఐటీ బాంబే మాజీ ప్రొఫెసర్, ఐఐసీహెచ్ఈ అమరావతి రీజినల్ సెంటర్ చైర్మన్ వీ గోవర్ధనరావు అధ్యక్షత వహించారు. నూజివీడు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్, ఏఓ బీ.లక్ష్మణరావు, డీన్ అకడమిక్స్ సాధు చిరంజీవి, ఫైనాన్స్ ఆఫీసర్ బీ శ్రీనాథ్ పాల్గొన్నారు. -
ప్రణాళికతో దశ మారే..
ఏలూరు (ఆర్ఆర్పేట): విద్యార్థి జీవితంలో కీలకమైన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు వస్తున్నాయంటే విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకూ టెన్షనే.. ఈ గట్టు ఎక్కితే విద్యార్థి ఉన్నత విద్యకు చక్కని సోపానం ఏర్పడుతుంది. కనీసం ఉత్తీర్ణత సాధిస్తే చాలని కొందరు భావిస్తే, పదికి పది సాధించాలని మరికొందరు పట్టుదలతో ఉంటారు. అయితే పరీక్షలంటే ఎక్కడో చిన్న ఒత్తిడితో సాధించలేమేమోననే అనుమానం సహజం. అయితే ఎటువంటి ఒత్తిళ్లు లేకుండా టెన్త్లో పదికి పది సాధించాలంటే ఇలా చేస్తే సులభమని నిపుణులైన సబ్జెక్టు టీచర్లు చెబుతున్నారు. ఇప్పటికే జరిగే ఎఫ్ఏ–1, 2, 3, స్లిప్ టెస్ట్లు, ప్రీ ఫైనల్, గ్రాండ్ టెస్ట్ పేపర్లను ప్రాక్టీస్ చేయడం ద్వారా పూర్తి అవగాహన వస్తుందని సూచిస్తున్నారు. ఈనెల 16 నుంచి జరిగే పదో తరగతి పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 465 పాఠశాలల నుంచి 24,314 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ‘టెన్’షన్ వద్దు ఒత్తిడిని అధిగమించాలి అన్ని సబ్జెక్టులపై పట్టు ప్రధానం నిపుణులైన ఉపాధ్యాయుల సూచనలు 16 నుంచి పదో తరగతి పరీక్షలు జిల్లాలో 24,314 మంది విద్యార్థులు గణితం.. సృజనాత్మక వ్యూహం బీఆర్వీ కుమార్, గణితం టీచర్, ఎం.నాగులపల్లి హైస్కూల్ గణితం ప్రశ్నాపత్రంలో సృజనాత్మకతకు ప్రాధాన్యమిస్తూ కొన్ని మార్పులు జరిగాయి. వెనుకబడిన విద్యార్థులు వాస్తవ సంఖ్యలు, బహుపదులు, రేఖీయ సమీకరణాల జత, నిరూపక రేఖాగణితం, సంఖ్యాక శాస్త్రం, సంభావ్యతపై దృష్టి సాధించడం ద్వారా 63 మార్కుల వరకు సాధించవచ్చు. ముఖ్యంగా 1, 3, 7, 13, 14 అధ్యాయాలు మిగతా వాటితో పోలిస్తే సులభంగా ఉండటమే కాకుండా, ఎక్కువ మార్కులను తెచ్చిపెడతాయి. ఎస్ఎస్ అహ్మద్, ఫిజికల్ సైన్స్ టీచర్, భీమడోలు జెడ్పీ హైస్కూల్ ముందుగా 8 మార్కులు, తర్వాత 4 మార్కులు, 2 మార్కులు, చివరిగా ఒక మార్పు ప్రశ్నలకు సమాధానాలు స్పష్టంగా రాయాలి. 8 మార్కుల ప్రశ్నల విభాగంలో పట్టు కోసం బ్లూప్రింట్ పాఠాలు చదవాలి. 4 మార్కుల ప్రశ్నల విభాగంలో ముఖ్యంగా చిత్రపటాలు, రేఖా చిత్రాల పాఠాలపై పట్టు సాధించాలి. 2, 1 మార్కుల ప్రశ్నల విభాగంలో ప్రశ్నలను క్షుణ్ణంగా సిద్ధం చేసుకోవాలి. ఎం.మంజుల, తెలుగు టీచర్, భీమడోలు హైస్కూల్ అవగాహన–ప్రతిస్పందన విభాగంలో సమాధానాలను పూర్తి వాక్యాలతో స్పష్టంగా రాయాలి. పద్య, గద్యభాగం, ఉపవాచకంపై ప్రశ్నల స్వభావాన్ని బట్టి పరిధి మేరకు సమాధానాలు రాయాలి. పాఠ్యపుస్తకంలో ప్రతి పాఠం చివర ఉండే అభ్యాసాలను క్షుణ్ణంగా చదవాలి. చక్కని దస్తూరి, విరామ చిహ్నాలను పాటిస్తూ అక్షర దోషాలు లేకుండా రాస్తే ఎక్కువ మార్కులు సాధించవచ్చు. -
మహిళా సాధికారతకు కృషి
ఏలూరు (ఆర్ఆర్పేట) : మహిళల సాధికారతకు ప్రభుత్వం పథకాలను అమలు చేస్తోందని, వాటిని వినియోగించుకుని బలోపేతం కా వాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. స్థానిక సీఆర్ రెడ్డి కళాశాల ఆడిటోరియంలో ఆదివారం జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల ఆర్థికాభివృద్ధికి జిల్లాలోని స్వయం సహాయక సంఘాలకు రూ.1,398 కోట్లను బ్యాంకు లింకేజీ రుణాలు మంజూరు చేశామన్నారు. మహిళలు ఆపద సమయంలో 181, 1098 టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి రక్షణ పొందవచ్చన్నారు. పనిచేసే ప్రదేశంలో మహిళల భద్రతకు ఆయా కార్యాలయాల్లో సంక్షేమ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ మాట్లాడుతూ మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామన్నారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడారు. ట్రైనీ ఐపీఎస్ అధికారి జయశర్మ, డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, పీఓ కె.అనురాధ, డీఎంహెచ్ఓ శోభ, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి ఆర్వీ నాగరాణి, ఐసీడీఎస్ పీడీ పి.శారద, డీఈఓ ఎం. వెంకటలక్ష్మమ్మ, ఆర్టీసీ డీపీటీఓ షేక్ షబ్నం, వడ్డీల కార్పొరేషన్ చైర్పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి, తహసీల్దార్ కె. గాయత్రి తదితరులు పాల్గొన్నారు. పలు రంగాల్లో సేవలందించిన, విజయాలు సాధించిన మహిళలను కలెక్టర్ సత్కరించారు. -
పప్పన్నాలకు వెళుతూ రోడ్డు ప్రమాదం
నూజివీడు : ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం దొడ్డదేవరపాడు నుంచి పప్పన్నాల నిమిత్తం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం వెళ్తుండగా నూజివీడు బైపాస్ రోడ్డులో ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో టాటా మ్యాజిక్ వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి రోడ్డు పక్కన పొలంలో బోల్తా పడింది. ఈ సంఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ఎనిమిది మంది స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. వివరాలిలా ఉన్నాయి.. దొడ్డదేవరపాడు నుంచి పప్పన్నాల నిమిత్తం టాటా మ్యాజిక్ వాహనంలో వెళ్తుండగా నూజివీడు బైపాస్ రోడ్డులో ముసునూరు క్రాస్ రోడ్డు వద్దకు వచ్చే సరికి ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి ద్విచక్ర వాహనాన్ని ఢీకొని పక్కనే పంట పొలంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బైక్పై వస్తున్న పట్టణంలోని ఎంప్లాయీస్ కాలనీకి చెందిన గోపిశెట్టి అజయ్కుమార్ (21)కి కాలు విరగ్గా, మ్యాజిక్ వాహనంలో ఉన్న ఊట్ల సామ్రాజ్యం (43) చెవి తెగి రక్తం వస్తుండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ తరలించారు. టాటా మ్యాజిక్లో ఉన్న టి.సరస్వతి (65), ఎం.లలిత (35), సీహెచ్ ఉపేంద్ర (42), సీహెచ్ బిందూష (20), జి.అనిల్కుమార్ (36), వి.శ్రీనివాసరావు (29), వి.లక్ష్మీ తులసి (26), సీహెచ్ అరుణ (35)లకు స్వల్పగాయాలవ్వగా చికిత్స చేయించుకుని వెళ్లిపోయారు. ఇద్దరికి తీవ్రగాయాలు -
అర్ధరాత్రిళ్లు హద్దులు దాటిస్తూ..
యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా కుక్కునూరు: మండలంలోని ఇసుక ర్యాంపుల నుంచి తెలంగాణకు రాత్రి వేళ ఇసుక అక్రమ తరలింపు యథేచ్ఛగా సాగుతోంది. రెండు రో జుల క్రితం మండలంలోని ఇబ్రహీంపేట ర్యాంపు నుంచి తెలంగాణకు అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని అందిన ఫిర్యాదు మేరకు విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. ఈ క్రమంలో లారీలు ర్యాంపులోకి వెళ్లకుండా కేవలం ట్రాక్టర్లు మాత్రమే వెళ్లేందుకు దారిని ఉంచి తక్కిన మార్గాన్ని తవ్వించేశారు. అలాగే అక్రమ రవాణా జరగకుండా చూడాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే అధికారుల ఆదేశాలతో తమకేం పని అన్నట్టు ఇసుక మాఫియా శనివారం రాత్రి సమయంలో తెలంగాణకు ఇసుక అక్రమ రవాణా చేపట్టినట్టు సమాచారం. చోద్యం చూస్తున్న అధికారులు ఇసుక అక్రమ రవాణాపై ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలం నుంచి వెళ్తున్న ఇసుక లారీలను గత రెండు నెలల్లో తెలంగాణలోని అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి పోలీసులు పట్టుకొని కేసులు నమోదు చేశారంటే ఇక్కడి అధికారుల పనితీరు ఎలా ఉందో స్పష్టం అవుతుంది. ఇకనైనా అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపి రాష్ట్ర సంపదను సరిహద్దులు దాటకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
పెద్దింట్లమ్మా పాహిమాం
కై కలూరు : కొల్లేటకోట పెద్దింట్లమ్మ దేవస్థానం వద్ద ఆదివారం భక్తులు రద్దీ కనిపించింది. సమీప జిల్లాల నుంచి వచ్చిన భక్తులతో దేవస్థానం కిటకిటలాడింది. ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పేటేటి పరమేశ్వరశర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈఓ కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఆలయానికి పలురూపాల్లో ఒక్కరోజు ఆదాయం రూ. 2,64.707 వచ్చిందని తెలిపారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ప్రతిభ ఉండి ఆర్థిక స్థోమత, సరైన మార్గదర్శకం లేని అట్టడుగు వర్గాల అనాథలు, సింగిల్ పేరెంట్స్ ఉన్న పిల్లలకు ఉన్నత విద్య అందించనున్నట్టు స్పృహ ఎడ్యుకేషనల్ ఎంపర్మెంట్ ట్రస్ట్ ప్రతినిధులు ఎ.సర్వేశ్వరరావు, టీటీఎఫ్ రూజ్వెల్ట్ ప్రకటనలో తెలిపారు. రానున్న పదేళ్లలో 100 మంది ఐఐటీయన్లు, 50 మంది డాక్టర్లను తయారు చేయాలని సంకల్పించామన్నారు. ఈ మేరకు 2026–27 విద్యా సంవత్సరంలో కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్మీడియెట్ ఉచిత విద్య కోసం విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ట్టు పేర్కొన్నారు. పదో తరగతి సిలబస్ ఆధారంగా రాజమండ్రిలో రాత పరీక్ష నిర్వహిస్తామని, ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 2న ఉదయం 10 గంటలకు నిర్వహిస్తామని, తెలిపారు. ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయ ఆవరణలో ఆదివారం రాత్రి ఓ భక్తురాలి బంగారపు ఉంగరాన్ని గుర్తుతెలియని వ్యక్తి చోరీ చేశాడు. బాధితురాలి కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రామచంద్ర బంజర్కు చెందిన అనంతోజ్ సౌమ్య కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారి క్షేత్రానికి వచ్చారు. సాయంకాలార్చన అనంతరం రాత్రి 7 గంటల సమయంలో క్యూ లైన్లోకి వెళ్లేటప్పుడు ఆమె చేతికున్న ఉంగం చోరీకి గురైంది. ఆ ప్రాంతంలో భక్తులు గుంపుగా ఉండటంతో చోరీ చేసిన వ్యక్తిని గుర్తించలేకపోయారు. భీమవరం: భీమవరంలోని వోల్గా ఆర్చరీ అకా డమీలో ఆదివారం రాష్ట్రస్థాయి అండర్–15, 13, 10 ఆర్చరీ పోటీలకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జట్టు ఎంపికకు పోటీలు నిర్వహించారు. సుమారు 40 మంది బాలబాలికలు ఇండియన్ రౌండ్, కాంపౌండ్, రికవరీ కేటగిరీల్లో తలపడ్డారు. జిల్లా జట్లను ఎంపిక చేశారు. వీ రు ఈనెల 11 నుంచి 13 వరకు నూజివీడులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని ఆ ర్చరీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎల్.జయ రాజు తెలిపారు. జిల్లా స్పోర్ట్స్ అధికారి మోహన్దాస్ క్రీడాకారులను అభినందించారు. కోచ్ లు ఈ.సాహిత్, కమల్ కిశోర్, జయలక్ష్మి పోటీలను పర్యవేక్షించారు. కాళ్ల: చెరువులో పడి యువకుడు మృతిచెందిన ఘటన ఆదివారం కాళ్లలో చోటుచేసుకుంది. ఎ స్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. దొ డ్డనపూడికి చెందిన గుండా సురేష్ (21) కొంతకాలంగా మానసికంగా బాధపడుతూ, తల్లిదండ్రులను హింస్తూ ఇంట్లో సామాన్లు నాశనం చే స్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద చెరువులో పడి మునిగిపోతుండగా అక్కడ క్రికెట్ ఆడుతున్నవారు కేకలు వేశారు. విషయం గమనించిన కొల్లి సాయిరాజేష్ మరికొందరు చెరువులో దూకి సురేష్ను బయటకు తీసుకురాగా అప్పటికే మృతి చెందాడు. మృతుడి తండ్రి పెద్దిరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. భీమవరం: యుద్ధం ముసుగులో రొయ్యల ధరలను తగ్గించడాన్ని ఆపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలన్ అన్నారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ఇరాన్ యుద్ధాన్ని పురస్కరించుకుని సంబంధం లేకపోయినా రొయ్యల ధరలను అమాంతంగా తగ్గించారని విమర్శించారు. 100 కౌంట్కు రూ.25 వరకు తగ్గించారన్నారు. వ్యా పారులు ఇష్టారీతిలో ధరలు ఇస్తున్నారన్నారు. -
దడ పుట్టిస్తున్న దెయ్యం చేపలు
● చెరువుల్లో ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న వైనం ● కట్టడి చేయలేక రైతుల గగ్గోలు గణపవరం: అసలే నష్టాల్లో ఉన్న చేపల సాగు రైతులకు దెయ్యం చేపల బెడద తలపోటుగా తయారైంది. తినడానికి పనికిరాని, అమ్మకానికి పనికిరాని ఈ చేపలు చెర్వుల్లో ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయి అసలు చేపలకు పోటీగా తయారయ్యాయి. వీటివల్ల రైతులకు కలిగే నష్టం అంతా ఇంతా కాదు. గత దశాబ్ద కాలంగా వీటి బెడద ఆక్వా రైతులను వీడటం లేదు. పెంచుతున్న చేపలకు వేసిన మేతలను ఇవి దర్జాగా తింటూ అసలు చేపలకు అందకుండా చేస్తున్నాయి. దీనితో అసలు చేపల్లో సరైన ఎదుగుదల లేకపోగా, రైతులకు మేతల ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ చేపలు చూడటానికి అందంగానే కనిపిస్తాయి. ఆక్వేరియాలలో సైతం వీటిని ఆసక్తిగా చూస్తుంటాం. అయితే ఇవి చేపల చెర్వులలోకి ఎలా చేరాయోకాని అనతికాలంలోనే సంతానోత్పత్తి పెంచుకుని రైతులకు గుదిబండల్లా తయారయ్యాయి. చేపల పట్టుబడి చేస్తే అసలు చేపలకు సమానంగా ఈదెయ్యం చేపలు వలలో వస్తున్నాయి. వీటిని ఊరి చివరకు తరలించి, గొయ్యి తీసి పాతిపెట్టాల్సి ఉండటంతో రైతులకు మరికొంత ఖర్చు తప్పడంలేదు. ఈ దెయ్యం చేపలు పంట, మురుగుకాల్వల ద్వారా చేపల చెర్వులలోకి ప్రవేశించినట్లు రైతులు చెబుతున్నారు. పడిపోతున్న దిగుబడులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 1.50 లక్షల ఎకరాల్లో చేపల సాగు జరుగుతుంది. 50 శాతం విస్తీర్ణంలో కట్ల, శీలావతి వంటి తెల్ల చేపలు సాగుచేస్తుండగా మిగిలిన 50 శాతం విస్తీర్ణంలో రూప్చంద్, ఫంగస్, పండుగొప్ప వంటి చేపల సాగు జరుగుతుంది. ఈ చెర్వులో దెయ్యం చేపల సంఖ్య విపరీతంగా ఉండటం వల్ల అసలు చేపల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చెర్వులలో వేసే మేతలను ఈదెయ్యం చేపలే ఎక్కువగా తినేస్తున్నాయి. ఈ చేపలకు ముళ్లు ఉండటంతో అసలు చేపలు వీటి దరిదాపులకు వచ్చే అవకాశం ఉండదు. దీనితో దెయ్యం చేపలు తినగా మిగిలిన మేతలే పెంపకం చేపలకు దక్కుతుంది. అందువల్ల అసలు చేపల్లో ఎదుగదల క్షీణించి దిగుబడి తగ్గిపోతుంది. చెర్వులలో 100 గ్రాముల చేపపిల్ల వేస్తే పట్టుబడి సమయానికి కనీస సైజు కిలోనుంచి కిలోన్నర వరకూ ఉండాలి. అయితే దెయ్యం చేపలు ఎక్కువగా ఉన్న చెర్వులలో ఈసైజు పావుకిలో వరకూ తక్కువగా ఉండటంవల్ల రైతులకు నష్టం వస్తుంది. దీనితో ఎకరాకు కనీస స్థాయిలో టన్ను వరకూ దిగుబడి తగ్గిపోతుందని రైతులు చెబుతున్నారు. డెల్టా ప్రాంతంలో ప్రతి చెర్వులోనూ వీటిబె దడ ఉన్నా, కొల్లేరు ప్రాంతంలో మాత్రం మరీ ఎక్కువగా ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో ముఖ్య విషయం ఏమిటంటే వీటిని చెర్వులలోకి చేరకుండా నియంత్రించడమే మార్గమని, వీటికి నివారణ అంటూ ఏమీలేదని మత్స్యశాఖ నిపుణులు చెబుతున్నారు. ఎన్ని మందులు వాడినా ఇవి చావడం జరుగదని, పట్టుబడి సమయంలో వచ్చినవాటిని గోతిలో పాతిపెట్టాలని రైతులకు సూచిస్తున్నారు. చెర్వులలో నీరు నింపే సమయంలో కాల్వలు, మోటార్ల వద్ద మెష్లు ఏర్పాటు చేసి నీటిని ఫిల్టర్ చేస్తే కొంతవరకూ ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు. అలాగే చేపలు పట్టివేసిన తర్వాత అడుగునీటిలోనూ, ఎలుక కలుగులలోను వీటి ఉనికి ఉందోమో గుర్తించి, ఉంటే వాటిని పట్టివేసిన తర్వాతే కొత్త నీరు నింపుకోవాలని సూచిస్తున్నారు. -
ఆక్వా రైతులకు లైసెన్సులు తప్పనిసరి
కై కలూరు: ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ(అప్సడా) నిబంధనల ప్రకారం ఆక్వా రైతులు తప్పనిసరిగా లైసెన్సులు పొందాలని మత్స్యశాఖ అడిషనల్ డైరెక్టర్ చంద్రశేఖర్రెడ్డి చెప్పారు. కై కలూరు మత్స్యశాఖ సహాయ సంచాలకుల కార్యాలయంలో మత్స్యశాఖ జారీ చేసే అప్సడా అనుమతులపై శనివారం నియోజకవర్గ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కై కలూరు నియోజకవర్గంలో మొత్తం 84 వేల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోందన్నారు. అందులో కేవలం 37 వేల ఎకరాలకు మాత్రమే అప్సడా చట్టం ప్రకారం అనుమతులు పొందారన్నారు. ఇంకా 47 వేల ఎకరాలకు అప్సడా అనుమతులు తీసుకోవాలన్నారు. మత్స్యశాఖ గ్రామ సహాయకులు, మత్స్యశాఖ అభివృద్ధి అధికారులు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి, అనుమతులు పొందని రైతుల నుంచి ఆధార్ కార్డు, పాస్బుక్లను సచివాలయంలో నమోదు చేయించాలన్నారు. కేవలం 15 రోజుల్లో మిగిలిన టార్గెట్ను పూర్తి చేయాలని ఆదేశించారు. డీకేటీ భూముల్లో సాగుచేసే రైతులు 11 నెలలకు ఇచ్చే సాగు అనుమతి పత్రాలు పొందవచ్చని చెప్పారు. కార్యక్రమంలో ఏలూరు జిల్లా మత్స్యశాఖ అధికారి బి.రాజ్కుమార్, స్థానిక ఫిషరీస్ ఏడీ ఎం.రవికుమార్, మత్స్యశాఖ అభివృద్ధి అధికారులు సీహెచ్ గణపతి, శ్రీనివాస్, సతీష్కుమార్, వీఎఫ్ఏలు పాల్గొన్నారు. మత్స్యశాఖ అడిషనల్ డైరెక్టర్ చంద్రశేఖర్రెడ్డి -
డిప్యూటీ స్పీకర్పై న్యాయపోరాటం చేస్తా
ఉండి: తన ఇల్లు, టీడీపీ కార్యాలయం, వంటశాలతో పాటు తన ఆస్తిపాస్తులను ధ్వంసం చేసి తనను నడిరోడ్డుపై నిలబెట్టిన డిప్యూటీ స్సీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజును, అతనికి సహకరించిన అనుచరులు, నాయకులు, అధికారులందరినీ కోర్టు బోనులో నిలబెడతానని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి (ఇతని వ్యతిరేకులు సస్పెండ్ చేశామని చెబుతున్నారు) పొత్తూరి వెంకటేశ్వరరాజు (బుడ్డియ్యరాజు) స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం వెలివర్రులో కూలగొట్టిన ఇల్లు, పార్టీ కార్యాలయ శిథిలాల వద్ద శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆధారాలతో ఫిర్యాదు.. గత కొద్దిరోజులుగా డిప్యూటీ స్పీకర్ వెనుక ఉండి తనపై చేయించిన దురాగతాలను సీసీ ఫుటేజీలు, ఫొటోలు, డాక్యుమెంట్లు సహా ఆధారాలతో జిల్లా ఎస్పీకి శనివారం ఫిర్యాదు చేసినట్టు వెంకటేశ్వరరాజు తెలిపారు. తాను ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న పమయంలో తనపై దాడి చేసి, పీకపై కాలువేసి తొక్కేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా అన్నింటినీ సహించి తన బాధనంతటినీ అధినాయకత్వానికి చెప్పుకొన్నానని తెలిపారు. అందుకే తాను న్యాయపోరాటానికి దిగానని చెప్పారు. అవసరమైతే హైకోర్టు వరకు వెళతానని, అక్కడ కూడా తేలకపోతే సుప్రీం కోర్టుకు కూడా వెళతానని తేల్చిచెప్పారు. తనపై ఇంత కక్షగట్టి తనను సర్వనాశనం చేసిన డిప్యూటీ స్సీకర్ను కోర్టులో నిలబెడతానని తెలిపారు. ఈ పోరాటంలో తన ప్రాణాలు పోతాయని తెలిసినా తన న్యాయపోరాటం ఆపనని స్పష్టం చేశారు. నేరుగా ఎస్పీ కార్యాలయానికి.. శుక్రవారం అమరావతిలో అసెంబ్లీ వద్ద ఎన్టీఆర్ విగ్రహం పట్టుకుని నిరసన తెలిపిన తనను సీఎం చంద్రబాబు సూచనల మేరకు పలువురు పార్టీ ఉన్నత నాయకులు రాష్ట్ర కార్యాలయానికి తీసుకువెళ్ళి మాట్లాడినట్టుగా వెంకటేశ్వరరాజు చెబుతున్నారు. అమరావతి నుంచి వచ్చిన అనంతరం ఆయన స్వరం పెంచడమే కాకుండా పనిలో మరింత వేగం పెంచారు. వచ్చీ రాగానే శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేసినట్టు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఫిర్యాదు కాపీని ఈ సందర్భంగా మీడియాకు విడుదల చేశారు. దాని ప్రకారం డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు, అతని అనుచరులు కొత్తపల్లి నాగరాజు, నడింపల్లి విజయరామరాజు, పవన్, డీసీ చైర్మన్ తోట ఫణి, కరిమెరక నాగరాజు, కళ్లేపల్లి సతీష్రాజు తదితరులతో పాటు తహసీల్దార్, ఆయన సిబ్బంది, ఆకివీడు సీఐ జగదీశ్వరరావు (ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నారు), ఉండి ఎస్ఐ ఎండీ నసీరుల్లా, ఆయన సిబ్బంది, ఇరిగేషన్ అధికారులు, వారి సిబ్బంది తదితరులపై ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. టీడీపీ నేత వెంకటేశ్వరరాజు -
శ్రీవారి క్షేత్రంలో భక్తుల రద్దీ నామమాత్రం
ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య క్షేత్రంలో శనివారం భక్తుల రద్దీ నామమాత్రంగా ఉంది. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ప్రతి వారం వేలాది మంది భక్తులు చినవెంకన్నను దర్శించేవారు. ఈ వారం అంతంత మాత్రంగానే భక్తులు స్వామివారిని దర్శించారు. ప్రస్తుతం ఇంటర్మీడియెట్ పరీక్షలు జరుగుతుండటం, పదవ తరగతి పరీక్షల సమయం దగ్గర పడటమే భక్తుల రద్దీ తగ్గడానికి కారణమని ఆలయ వర్గాలు భావిస్తున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని విభాగాల్లో భక్తుల రద్దీ స్వల్పంగానే ఉంది. ఏలూరు (టూటౌన్) : పెదవేగిలో ఆధునీకరణ టెక్నాలజీతో మరో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని ఇఫ్టూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ప్రస్తుత ఫ్యాక్టరీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ ఆయిల్ ఫెడ్ వారు లేఖలు రాస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. భీమడోలు: మోటార్సైకిల్ చోరీపై భీమడోలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈతకోట వారి వీధిలోని బుక్కా దుర్గాప్రసాద్కు చెందిన మోటార్సైకిల్ను ఇంటి వద్దే గత నెల 11వ తేదీన గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. బాధితుడు బైక్ ఆచూకీ కోసం గాలించగా ఫలితం లేకపోవడంతో శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై ఎస్కే మదీనా బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏలూరు (టూటౌన్): వంట గ్యాస్ సిలిండర్కు రూ.60, వాణిజ్య సిలిండర్ కు రూ.115 కేంద్ర ప్రభుత్వం పెంచడాన్ని సీపీఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ.రవి తీవ్రంగా ఖండించారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి, రష్యా నుంచి ఆయిల్ కొనుగోలుపై ఆంక్షల నేపథ్యంలో ఈ ధరల పెంపుదల ప్రజలపై శరాఘాతంగా మారిందని అన్నారు. ఈ యుద్ధాన్ని ఖండించి నిలుపుదల చేయించడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీతో కలిసి కూటమిగా పరిపాలిస్తున్న తెలుగుదేశం, జనసేన పార్టీలు గ్యాస్ భారాన్ని తగ్గించే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): పేదలకు మెరుగైన వైద్య చికిత్సలను అందించాలని, రోగి వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ నాగరాణి హెచ్చరించారు. కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో శనివారం ఎన్టీఆర్ వైద్య సేవ ఫిర్యాదులపై డిస్ట్రిక్ట్ డిసిప్లినరీ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఎన్టీఆర్ వైద్య సేవ కింద ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలు, రోగుల నుంచి ఫిర్యాదులను అడిగి తెలుసుకున్నారు. -
శ్రమిస్తేనే విజయం
భీమవరం: శారీరక శ్రమ, మానసిక వికాసంతో విజయాలు అందుకోవాలని అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ అన్నారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల 46వ వార్షికోత్సవంలో శనివారం ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తాను 21వ సంవత్సరం నుంచే సినిమాలు, వినోదాలు వదిలేసి.. దేశానికి విజయాలు అందించడమే లక్ష్యంగా భావించి ఈ స్థాయికి చేరినట్టు ఆమె తెలిపారు. గురువులు, తల్లిదండ్రులు చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకొని కఠోర శ్రమ చేస్తే సాధించలేని విజయం అంటూ ఉండదని సూచించారు. ఎంపీ పాకా వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో విజయాలు అందుకోగలరని చెప్పారు. తొలుత సైనా నెహ్వాల్ జ్యోతిప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభానంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు బంగారు పతకాలను అందజేశారు. కార్యక్రమంలో కాలేజీ కరస్పాండెంట్ ఎస్ఆర్కే నిశాంత్వర్మ, పాలకవర్గ సభ్యులు, ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు. -
●శ్రీవారి భక్తులకు ‘చల్లని’ ఏర్పాట్లు
ద్వారకాతిరుమల: భానుడి భగభగలతో శ్రీవారి భక్తులు అల్లాడుతున్నారు. మార్చిలోనే ఎండలు మంట పుట్టిస్తున్నాయి. రోజురోజుకు వేడి, ఉక్కబోత తీవ్రం అవుతుండటంతో ద్వారకాతిరుమల క్షేత్రానికి వస్తున్న భక్తులకు రక్షణ కల్పించే దిశగా దేవస్థానం అధికారులు పలు ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా క్యూలైన్ల వద్ద కూలర్లను, అనివేటి మండపంలో తాగునీటిని ఏర్పాటు చేశారు. అలాగే జంటగోపురాల ప్రాంతం నుంచి ఆలయం వరకు పీచు మ్యాట్లను ఏర్పాటు చేసి, నిరంతరం వాటిని వాటర్ ట్యాంకర్తో తడుపుతున్నారు. అలాగే ఆలయ ప్రధాన రాజగోపుర మెట్ల మార్గంలో నీరు పారేలా ఏర్పాటు చేశారు. వీటి వల్ల భక్తుల పాదాలకు రక్షణ కలుగుతోంది. ఈ చర్యలతో భక్తులు కాస్త ఉపశమనం పొందుతున్నారు. -
కమ్యూనికేషన్ స్కిల్స్పై పట్టు సాధించాలి
నూజివీడు: విద్యార్థులు తమ కోర్ సబ్జెక్టులలో పటిష్టమైన పునాది ఏర్పరచుకోవడంతో పాటు కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని ఐఐటీ మద్రాస్కు చెందిన ప్రొఫెసర్ కొట్టాడ రవిశంకర్ సూచించారు. నూజివీడు ట్రిపుల్ఐటీలో శనివారం ఐఐటీ మద్రాస్ మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్ (ఎంఎంఈ) విభాగం ఆధ్వర్యంలో అవుట్రీచ్ కార్యక్రమం నిర్వహించారు. ఉన్నత విద్య, పరిశోధన అవకాశాలపై రవిశంకర్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. గేట్ అర్హత కలిగిన, బీటెక్లో 8.0 సీజీపీఏ, అంతకంటే ఎక్కువ సాధించిన విద్యార్థులకు ఐఐటీ మద్రాస్లో అందుబాటులో ఉన్న డైరెక్ట్ పీహెచ్డీ, ఎంటెక్ కోర్సుల గురించి, విద్యార్థులకు అందించే ఆర్థిక సహాయం గురించి వివరించారు. డైరెక్ట్ పీహెచ్డీ విద్యార్థులకు మొదటి రెండేళ్లపాటు నెలకు రూ.36 వేలు, తరువాత మూడేళ్ల పాటు నెలకు రూ.41 వేలు స్టైఫండ్ అందుతుందన్నారు. ఎంటెక్ విద్యార్థులకు నెలకు రూ.12 వేలు స్కాలర్షిప్ అందిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఎంఈ విభాగానికి చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఏఓ బీ లక్ష్మణరావు, విభాగాధిపతి ఏ వీరశ్రీను, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి పావని, అధ్యాపకులు డీ మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఆగిరిపల్లి: చెరువులో మునిగి పశువుల కాపరి మృతి చెందిన ఘటన శనివారం ఈదులగూడెం గ్రామంలో చోటుచేసుకున్నట్లు ఎస్సై శుభశేఖర్ తెలిపారు. గ్రామానికి చెందిన కొలకలూరి రోశయ్య (45) పశువుల కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం యథావిధిగా గేదెలను మేపడానికి తోలుకువెళ్లగా అవి గ్రామంలో ఉన్న కొత్త చెరువులోకి దిగాయి. వాటిని బయటకు తరిమేందుకు చెరువులోకి దిగిన రోశయ్య చెరువులో ఉన్న గుంతలో ఇరుక్కుపోయి నీటమునిగి మృతి చెందాడు. రోశయ్య ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి గాలించిన ఆచూకీ లభ్యం కాలేదు. శనివారం ఉదయం గ్రామస్తులు, పోలీసుల సహకారంతో కొత్త చెరువులో గాలించగా రోశయ్య మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏలూరు (టూటౌన్): ప్రపంచ శాంతిని భగ్నం చేస్తున్న అమెరికా సామ్రాజ్యవాద యుద్దోన్మాద దురహంకార వైఖరిని ఖండించాలంటూ శనివారం సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయం నుంచి కొత్త బస్టాండ్ వరకు నిరసన ప్రదర్శన చేశారు. అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్ లింగరాజు మాట్లాడుతూ ఆయిల్ నిక్షేపాల కోసం, ప్రపంచ ఆధిపత్యం కోసం అమెరికా చేస్తున్న దుర్మార్గాలను వ్యతిరేకించాలన్నారు. అమెరికాను నిలవరించకపోతే మన దేశంపై కూడా దాడి చేసే అవకాశం ఉంటుందని, ప్రభుత్వం ఇప్పటికై నా మేల్కొని సామ్రాజ్యవాద వ్యతిరేక వైఖరి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయుకులు డీఎన్వీడి ప్రసాద్, ఎం.ఇస్సాక్, వైఎస్ కనకారావు తదితరులు పాల్గొన్నారు. -
సిద్ధాపురంలో రోడ్డు ఆక్రమణల తొలగింపు
● పంట గట్టుపై లబోదిబోమంటున్న బాఽధితులు ● బాధితులకు బియ్యం, నూనె, కూరగాయల పంపిణీ ఆకివీడు : ఆకివీడు సిద్ధాపురంలో రోడ్డు ఆక్రమణల తొలగింపులో భాగంగా అధికారులు ఇళ్లను సైతం తొలగించారు. దీంతో రోడ్డున పడ్డ బాధితులు పంట గట్టుపై సామాన్లు వేసుకుని లబోదిబోమంటున్నారు. సుమారు 11 కుటుంబాల వారు ఇక్కడ రేకుషెడ్లు, కిక్కిస దడులు వేసుకుని నివసిస్తూ రెక్కల కష్టంతో బతుకుతున్నారు. తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని, కనీసం అద్దె ఇళ్లు చూసుకుంటామని చెప్పినా జేసీబీతో తొలగించాని మహిళలు కన్నీరు మున్నీరయ్యారు. చిన్న పిల్లలు, వృద్ధులతో ఇప్పుడు ఎక్కడకు వెళ్లాలంటూ గుండెలవిసేలా రోదించారు. ఒకరిద్దరికి మాత్రమే అద్దె ఇళ్లు దొరికాయని మిగిలినవారి పరిస్థితి అయోమయంగా ఉందని వారు వైఎస్సార్సీపీ నాయకుల వద్ద వాపోయారు. బాధిత కుటుంబాలకు మండల పరిషత్ ఉపాధ్యక్షుడు కిల్లి రామకృష్ణ, గ్రామ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు భూపతిరాజు బుజ్జిరాజుల ఆర్థిక సహకారంతో 25 కేజీల బియ్యం, మంచినూనె, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు నంద్యాల సీతారామయ్య మాట్లాడుతూ ఆక్రమణల తొలగింపునకు వైఎస్సార్సీపీ అడ్డుకాదని, బాఽధితులకు ఇళ్ల స్థలం కేటాయించాలని, అద్దె ఇళ్లు దొరికేంతవరకూ అవకాశం కల్పించాలని మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. బాధితులకు ఇళ్ల స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కిళ్లి రామకృష్ణ, బుజ్జిరాజు, పళ్ళెం పండు, మద్దా ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
‘పబ్లిసిటీ మాత్రం ఉంటుంది.. ప్రజలకు చేసేదేమీ ఉండదు’
ఏలూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ప్రజలకు చేసేదేమీ ఉండదని, కేవలం పబ్లిసిటీ కోసమే తపిస్తూ ఉంటారని ధ్వజమెత్తారు. చంద్రబాబు మాటలతో కాలం గడుపుతారని, ప్రజలకు చేసేది మాత్రం శూన్యమని విమర్శించారు. ఈరోజు(శనివారం, మార్చి 7వ తేదీ) ఏలూరు జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి మాట్లాడిన కురసాల కన్నబాబు.. ‘ కాగ్ నివేదిక చూస్తే.. రాష్ట్ర పరిస్థితి ఎంత దిగజారిపోయిందో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని చెబితే... చంద్రబాబు మాత్రం ప్రజలను అసెంబ్లీలో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో అరాచకంగా ఆర్థిక వ్యవస్థ నడిపిస్తున్నారు.. అప్పు చేయని రోజు అంటూ లేదు. యుద్ధాలతో సంక్షోభంలో ఉన్న దేశాల కన్నా... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతకన్నా దారుణమైన స్థితిలో ఉంది. ఆర్బీఐ వద్ద అప్పుచేసి 300 కోట్ల పైనే వడ్డీ కట్టారు. వాహనాల పన్ను జీఎస్టీని కేంద్రం తగ్గిస్తే... అది కూడా రోడ్ టాక్స్ కింద మలిచి ప్రజలపై బారాలు మోపుతున్నారు చంద్రబాబు. ఎఫ్ఆర్ఎంబి చట్టం నిబంధనలను ఉల్లంగించారు చంద్రబాబుపరిమితికి మించి అప్పులు చేయడం ద్వారా రాష్ట్ర అధోగతి పాలుఅవబోతున్నది. ఎఫ్ఆర్ఎంబి లోటు 2.7 శాతం ఉండాల్సింది 3.75 గా ఉంది. మూడు లక్షల 18 వేల కోట్లు రూపాయలు అప్పులు చంద్రబాబు చేసి పెద్ద ఘనతగా చెబుతున్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఆటపాటలతో ఎంజాయ్ చేస్తున్నారు.రాజమండ్రిలో కల్తీ పాలతో ప్రజలు చనిపోతే పట్టించుకోవడం లేదు. వేట్లపాలెంలో అనేకమంది చనిపోతే వారి ఊసే పాలకులకు పట్టడం లేదు. శ్రీకాకుళంలో నీరు కలుషితమై ఆరుగురు చనిపోయిన వీరికి పట్టడం లేదు. అసెంబ్లీలో ప్రజాప్రతినిధులు పేదల సమస్యలు చర్చించకుండా... ఏకపాత్రాభినయాలు, పేదల పెన్షన్లపై కూడా స్కిట్లు చేస్తూ ప్రజలను మభ్యపెట్టి గడిపేస్తున్నారు. చంద్రబాబు అప్పులు చేసిన డబ్బు ఏ సంక్షేమ పథకానికి ఖర్చు చేశారు. సూపర్ సిక్స్ హామీలకు ఖర్చు చేశారా చూపండి’ అంటూ సవాల్ చేశారు.‘జగన్మోహన్రెడ్డిన తట్టుకోవడం కష్టం అని ఒకే ఒక కారణంతో మీరు కలిసి ఉంటున్నారు. జగన్పై ఉన్న భయం ఒకటే మిమ్మల్ని కలిపి ఉంచుతుంది. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ నీడ్ శాతం 41.8 శాతం తగ్గిపోయింది. కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా నిధులు తీసుకురాలేకపోతున్నారు. అంచనాలే అందుకోలేని విధంగా.... మీ బడ్జెట్ ఉంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు ఇచ్చే గ్రాంట్లు రూ. 10వేల 620 కోట్లు తగ్గిపోయాయి. మూలధన వ్యయం రూ. 45 కోట్లు చేస్తామని రూ. 16 కోట్లు చేశారు. రాష్ట్రం దివాళా తీసే దిశగా ఆర్థిక వ్యవస్థ ఉందని కాగ్ నివేదిక వేదిక చెప్పింది.రెవెన్యూలో లోటు పెరిగిపోయింది...365 రోజుల్లో 364 రోజులు అప్పులు చేసే పరిస్థితికి.. రాష్ట్రాన్ని దిగజార్చారు’ అంటూ విమర్శించారు. -
నక్కల డ్రెయిన్ను పరిరక్షించాలి
పెనుగొండ: నక్కల డ్రెయిన్ను అక్రమ మట్టి మాఫియా కోరల నుంచి పరిరక్షించాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ అడ్వైజరీ కమిటీ సభ్యుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు డిమాండ్ చేశారు. ఆచంట వేమవరంలో అక్రమ మట్టి తవ్వకాలపై సర్పంచ్ జక్కంశెట్టి చంటి, పలువురు నాయకులు, రైతులు ఇచ్చిన ఫిర్యాదుతో శుక్రవారం సాయంత్రం మట్టి తవ్వక ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ గతేడాది ఇదే ప్రాంతంలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపారన్నారు. దీనిపై రాష్ట్ర మంత్రి రామానాయుడుకు సమాచారం ఇచ్చామన్నారు. అక్రమ తవ్వకాలపై రాజకీయం చేయడం కాదని, కేవలం రైతులను దృష్టిలో పెట్టుకునే పరిశీలనకు వచ్చామన్నారు. నక్కల డ్రెయిన్ వలన వర్షాకాలంలో ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గంలోని వందలాది ఎకరాలు ముంపు భారీన పడుతూ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఈ తరుణంలో నక్కల డ్రెయిన్ గట్టులనుతవ్వడం వల్ల మరింత ముంపు ప్రమాదం ఉంటుందన్నారు. ఈ స్థాయిలో అక్రమ తవ్వకాలు జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఆచంట మండల వైఎస్సార్ సీపీ కన్వీనరు జక్కంశెట్టి శ్రీరామ్, సీనీయర్ నాయకులు సుంకర సీతారామ్, ముత్యాల నాగేశ్వరరావు, కోటే శశిమధు, పిల్లిరుద్ర ప్రసాద్, దొమ్మేటి రాంబాబు, కుక్కల కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
కులాల కుంపట్లు.. ప్రసాదాలపై దుష్ప్రచారం
సాక్షి, భీమవరం: కులాల కుంపట్లు పెట్టి ప్రజల్ని విడదీయడం, హిందూ దేవాలయాలు, ప్రసాదాలపై విషం చిమ్మి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా కూటమి ప్రభుత్వం దుర్మార్గ పాలన సాగిస్తోందని వైఎస్సార్సీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. రాజకీయాల్లో ఉన్నవారు ప్రజలకు మేలు చేయాలని, లేదంటే రాజీనామాలు చేసి ఇంట్లో కూర్చోవాలని సూచించారు. భీమవరంలోని పంచారామ క్షేత్రం సోమేశ్వరస్వామిని శుక్రవారం రోజా దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ఆమె మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందించారు. అసెంబ్లీకి రావడం లేదంటూ ఆరోపిస్తున్న కూటమి నేతలు అసెంబ్లీ, మండలికి వైఎస్సార్సీ సభ్యులు హాజరైతే ఏవిధంగా వ్యవహరిస్తున్నారో అంతా చూస్తున్నారన్నారు. ఈ ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టడం లేదని చెప్పారు. వాగ్దానాలు, అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేకపోగా రాజకీయ స్వలాభం కోసం హిందూ ఆలయాలు, ప్రసాదాలపై దుష్ప్రచారాలు చేస్తున్నారన్నారు. ఏ హిందువు కూడా స్వామివారిని, ప్రసాదాన్ని దిగజార్చే విధంగా రాజకీయాల్లోకి లాగి భక్తుల మనోభావాలను దెబ్బతీయరని చెప్పారు. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న సీఎం, డిప్యూటీ సీఎంల తీరు చూస్తుంటే వారు హిందువులేనా అనే అనుమానం కలుగుతోందన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని సీబీఐ సిట్ నివేదిక ద్వారా సుప్రీంకోర్టు నిర్ధారించి దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని చెప్పినా సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి దిగజారి మాట్లాడుతున్నారని రోజా విమర్శించారు. శాసనమండలిలో చర్చను పక్కదారి పట్టించేందుకు చివరికి మండలి చైర్మన్ కులం, మతం గురించి ప్రస్తావన చేసే స్థాయికి కూటమి దిగజారడం దురదృష్టకరమని రోజా అన్నారు. మండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజు పెద్ద మనసుతో క్షమించినా, రాష్ట్రంలోని దళితులు, క్రిస్టియన్లు, పేదలు కూటమి నేతలను క్షమించరన్నారు. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఆ పదవిని సక్రమంగా నిర్వర్తిస్తున్నారా లేదా అనేది చూడాలి తప్ప కులాలు, మతాలను కాదన్నారు. మంత్రి స్థానంలో ఉన్న అచ్చెంనాయుడు గాడిద లాగా అడ్డంగా పెరిగారే గానీ ఏ రోజూ సక్రమంగా మాట్లాడింది లేదని మండిపడ్డారు. తప్పు చేయనప్పుడు చర్చకు రావాలేగానీ చైర్మన్ మత ప్రస్తావన ఎందుకు తేవాలని ప్రశ్నించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూటమికి గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని రోజా స్పష్టం చేశారు. అభివృద్ధిని విస్మరించిన కూటమి చంద్రబాబు, పవన్కళ్యాణ్ తీరు చూస్తుంటే హిందువులేనా అనే అనుమానం కలుగుతోంది భీమవరంలో మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శలు -
ఉత్సాహంగా ఎకై ్సజ్ శాఖ జిల్లా స్పోర్ట్స్ మీట్
ఏలూరు టౌన్: నిత్యం విధులు నిర్వర్తించడంలో ఒత్తిడితో ఉండే ఎకై ్సజ్ శాఖ అధికారులు, సిబ్బందికి మానసిక ఉల్లాసం, శారీరక ఆరోగ్యానికి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ బీ.శ్రీలత అన్నారు. స్థానిక అల్లూరి సీతారామరాజు స్టేడియంలో ఎకై ్సజ్ శాఖ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా స్పోర్ట్స్మీట్ను ఎకై ్సజ్ డీసీ జెండా ఊపి ప్రారంభించారు. రెండు రోజులపాటు నిర్వహించే ఈ స్పోర్ట్స్మీట్లో సిబ్బందిలో ఉత్సాహాన్ని నింపేందుకు కొద్దిసేపు వివిధ క్రీడల్లో పాల్గొన్నారు. సరదాగా కొంతసేపు క్రికెట్ ఆడారు. అనంతరం శ్రీలత మాట్లాడుతూ ఒత్తిడికి గురవుతూ ఉండే సిబ్బందికి ఇలా ఆటల్లో పాల్గొనే అవకాశం కల్పించడం ద్వారా పునరుత్తేజంతో విధులను సక్రమంగా నిర్వర్తిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఈఎస్ ఆవులయ్య, పశ్చిమగోదావరి జిల్లా ఇన్చార్జ్ ఈఎస్ ప్రసాద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హరీరా.. సేవించు మనసారా..!
● రంజాన్ మాసంలో ప్రత్యేక పానీయం ● తక్షణ శక్తినిచ్చే దివ్య ఔషధం చింతలపూడి: రంజాన్ మాసం అంటే అందరికీ టక్కున గుర్తు వచ్చేది హలీం. అయితే మన ప్రాంతంలోని ముస్లింలకు మాత్రం వెంటనే హరీరా గుర్తుకు వస్తుంది. రంజాన్ మాసంలో ముస్లింలు పగటి సమయమంతా అన్నపానీయాలు, ఆహార పదార్థాలుతీసుకోకుండా ఉపవాస దీక్ష చేస్తారు. సాయంత్రం ఇఫ్తార్ ప్రార్థనల అనంతరం దీక్ష విరమిస్తారు. నిర్ణీత వేళల్లో పండ్లు, పలహారాలతో దీక్ష విరమిస్తారు. ఈ సందర్భంగా ఇఫ్తార్కు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఉమ్మడిగా కూర్చుని ఉపవాసాన్ని విరమిస్తారు. ఇఫ్తార్లో మన జిల్లావాసులకు పోషకాహారంతో హరీరా తప్పనిసరి. చింతలపూడి మసీదులో 62 ఏళ్ల క్రితం రోజుకు 3 రూపాయలతో అప్పటి జమాతె ఇస్లామి హింద్ నాయకులు బషార్తుల్లా హరీరా తయారు చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం రోజుకు రూ.5 వేల ఖర్చుతో హరీరాను తయారు చేస్తున్నారు. దూరప్రాంతాల నుండి కూడ వచ్చి ఇక్కడ హరీరా సేవిస్తారు. పోషకాలకు నెలవు ఉపవాస దీక్ష విరమణలో వినియోగించే హరీరా (గంజి)కి ఈ ప్రాంతంలో ఎంతో విశిష్టత ఉంది. గత 67 ఏళ్లుగా చింతలపూడి హరీరాకు ప్రత్యేకత స్ధానం ఉంది. శ్రీహరీరాశ్రీ. కేవలం ఒక పానీయంగానే కాకుండా, రోజంతా అలసిపోయిన శరీరానికి తక్షణ శక్తినిచ్చే దివ్య ఔషధంగా దీనిని పరిగణిస్తారు. హరీరాను సాధారణ భాషలో దీనిని శ్రీగంజిశ్రీ అని పిలిచినప్పటికీ ఇది పోషకాలతో నిండిన ఒక ప్రత్యేక మిశ్రమం. రోజంతా ఉపవాసం ఉన్న వాళ్లు ఈ హరీరా తాగితే తిరిగి శక్తిని పొందవచ్చు. ఇందులో ఉపయోగించే పదార్థాలన్నింటిలోనూ పోషకాలు ఎక్కువగా ఉండటం విశేషం. ముఖ్యంగా కేలరీలు ఎక్కువగా ఉండే ఈ హరీరా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే పీచు పదార్థం కారణంగా పొట్ట నిండుగా ఉన్న భావన కలుగుతుంది. ఇందులో ఉపయోగించే మసాలా దినుసులు, డ్రై ఫ్రూట్స్ అధిక రక్తపోటు, మధుమేహంతో బాధపడే వారికి ఉపశమనం కలిగిస్తాయి. హరీరా తయారు చేయడానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. కట్టెల పొయ్యి మీద తయారు చేయడంతో దీని రుచి అద్భుతంగా ఉంటుంది. హలీంకు తీసిపోని వంటకం హరీరా తయారీలో సుమారు 20 రకాల బియ్యం రవ్వ, మటన్ ఖైమా, వేరుశనగ నూనె, డాల్డా, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, పొదీన, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు, టమాటా, లవంగాలు, దాల్చిన చెక్క, పెసరపప్పు, కారం, పసుపు, జీలకర్ర, ఇలాచి, డ్రై ఫ్రూట్స్ ఇలా రకరకాల వస్తువులతో హరీరా తయారు చేస్తారు. అనేక రకాల సుగంధ ద్రవ్యాలను వేసి తయారు చేయడం వల్ల ఇది హైదరాబాద్ హలీంకు ఏ మాత్రం తీసి పోకుండ రుచికరంగా ఉంటుంది. చింతలపూడి హరీరాకు ప్రత్యేక రుచి ఉంటుంది. ఐదు దశాబ్దాలుగా ఈ ప్రాంత ముస్లింలకు రంజాన్ నెల వచ్చిందంటే హరీరాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా హరీరా మంచి ఆహారం. ఉపవాసదీక్షలో తప్పనిసరిగా ముస్లింలు హరీరా సేవించి దీక్షను విరమిస్తారు. ఇది రుచికరంగా ఉండటమే కాక పగలంతా ఉపవాసాలు ఉన్న వారికి తక్షణ శక్తిని ఇస్తుంది. – ఎండీ ఇస్మాయిల్, జామియ మసీద్, చింతలపూడి ప్రతి సంవత్సరం రంజాన్ నెలలో 30 రోజులపాటు ఉపవాసాలు ఉండి హరీరా సేవించడం ఆరోగ్యానికి మంచిది. రోజంతా పచ్చి మంచినీళ్లు కూడా సేవించకుండా ఉపవాస దీక్షలో ఉండే ముస్లింలు భగవంతుని కృప కోసం ఇఫ్తార్ సమయంలో హరీరా (గంజి )సేవిస్తారు. తక్షణ శక్తినిచ్చే హరీరాను అందరూ ఇష్టంగా సేవిస్తారు. ఎండీ అక్బర్ అలీ, జామియ మసీద్ కమిటీ కార్యదర్శి -
భారీగా గంజాయి పట్టివేత
జంగారెడ్డిగూడెం: రూ. 2.99 కోట్ల విలువైన 598 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ కేపీఎస్ కిషోర్ తెలిపారు. గురువారం జంగారెడ్డిగూడెం సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో నిర్వహిస్తున్న ఆపరేషన్ వజ్రప్రహార్ మంచి ఫలితాలను ఇస్తోందన్నారు. దీనిలో భాగంగా జంగారెడ్డిగూడెం – అశ్వారావుపేట జాతీయ రహదారి ఎన్హెచ్ 516డీపై జీలుగుమిల్లి మండలం తాటియాకులగూడెం సమీపంలోని ఆంధ్రప్రదేశ్–తెలంగాణ బోర్డర్ చెక్పోస్టు వద్ద జీలుగుమిల్లి ఎస్సై వి.క్రాంతి కుమార్, సిబ్బందినిత్యం వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారన్నారు. ఈ తనిఖీల్లో అశ్వారావుపేట వైపు వెళుతున్న టాటా డీజీఎం వ్యాన్లో 598 కిలోల గంజాయిని గుర్తించి, జీలుగుమిల్లి సీఐ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిందితులు ఒరిస్సా రాష్ట్రం, గంజాం జిల్లా బీజ్పూర్ గ్రామానికి చెందిన దిలీప్కుమార్ మొహంతి, బ్రహ్మపూర్ గ్రామానికి చెందిన జనార్ధన్ ప్రాదాన్ను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిని విచారించగా, సదరు గంజాయిని రాజమండ్రి శివారులోని బూరుగుపూడి నుంచి లోడ్ చేసుకుని మహారాష్ట్రలోని బీడ్ ప్రాంతానికి తరలిస్తున్నట్లు తెలిపారన్నారు. వీరిపై ఎన్డీపీఎస్ యాక్ట్–1985 ప్రకారం కేసు నమోదు చేశామన్నారు. నిందితుల నుంచి రూ. 2,98,96,500 విలువైన 598 కేజీల గంజాయితో పాటు, గంజాయి రవాణాకు వినియోగించిన రూ.16లక్షలు విలువైన టాటా డీసీఎం వ్యాన్, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. మొత్తం స్వాధీన సొత్తు విలువ సుమారు రూ. 3,14,96,500 ఉంటుందని స్పష్టం చేశారు. జీలుగుమిల్లి సీఐ బి.వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించినట్లు తెలిపారు. ఈ ఆపరేషన్లో ప్రతిభ కనబరిచిన జీలుగుమిల్లి ఎస్సై కె.క్రాంతికుమార్, హెచ్సీ కె.నాగేశ్వరరావు, కానిస్టేబుళ్ళు పి.శ్రీరామ్, మణికంఠ, డి.లక్ష్మణరావు, ఎం.రవికుమార్, బి.మహేష్బాబు, టి.శ్రీనివాసరెడ్డి, ఎం.సురేష్లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో ఏఎస్పీ సుస్మిత రామనాథన్, ట్రైనీ ఐపీఎస్ జయశర్మ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి
ద్వారకాతిరుమల : ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.హరినాఽథ్ గురువారం రాత్రి సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు తొలుత దేవస్థానం అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం ఆలయ ముఖమండపంలో అర్చకులు, పండితులు న్యాయమూర్తికి శ్రీవారి శేష వస్త్రాన్ని కప్పి వేద ఆశీర్వచనాన్ని పలుకగా, దేవస్థానం ఈఓ యర్రంశెట్టి భద్రాజీ చినవెంకన్న చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. న్యాయమూర్తి వెంట భీమడోలు కోర్టు జడ్జి ఎస్.ప్రియదర్శిని నూతక్కి, ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్, ఆలయ ఏఈఓ ఎం.దుర్గారావు తదితరులున్నారు. ఏలూరు టౌన్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలతో పోలీస్ శాఖ వారోత్సవాలు నిర్వహిస్తోంది. మహిళ పోలీస్స్టేసన్లో విద్యార్థినులకు ప్రత్యేకంగా పోలీస్ ఓపెన్ హౌస్ నిర్వహించారు. మహిళ పోలీస్స్టేషన్ డీఎస్పీ యు.రవిచంద్ర పర్యవేక్షణలో ఎస్ఐ నాగమణి, పోలీస్ సిబ్బంది ఓపెన్ హౌస్లో పోలీసులు వినియోగించే వివిధ రకాల ఆయుధాలను చూపిస్తూ వివరించారు. మహిళ పోలీస్ స్టేషన్లో బాధితులకు మనోధైర్యాన్ని కల్పించే కౌన్సెలింగ్ రూంను విద్యార్థినిలకు చూపించారు. కుటుంబ సమస్యలు, వేధింపుల నేపథ్యంలో సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తారో డీఎస్పీ రవిచంద్ర వివరించారు. పోలవరం రూరల్ : ఎంపీపీ, ఎంపీటీసీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం తాడేపల్లి పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించినట్లు ఏలూరు జిల్లా ఎంపీపీల సంఘం అధ్యక్షుడు సుంకర వెంకటరెడ్డి తెలిపారు. రాష్ట్ర ఎంపీపీల సంఘం అధ్యక్షుడు మేకల హనుమంతరావు ఆధ్వర్యంలో 26 జిల్లాల నుంచి ఎంపీపీలు సమస్యలు పరిష్కరించాలని నిరసన కార్యక్రమం చేపట్టారన్నారు. ఎంపీపీ, ఎంపీటీసీలకు గౌరవ వేతనాలు చెల్లించడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసన వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో శుక్రవారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన జువాలజీ, ఎకనామిక్స్ –2 పరీక్షలకు మొత్తం 7,806 మంది హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 56 పరీక్షా కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు జనరల్ విద్యార్థులు 6,156 మందికి 5,945 మంది హాజరు కాగా 211 మంది గైర్హాజరయ్యారు. 1,997 మంది ఒకేషనల్ విద్యార్థులకు 1,861 మంది హాజరుకాగా 136 మంది గైర్హాజరయ్యారు. ఏలూరు (టూటౌన్) : ఈ నెల 7న మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరు గాంధీనగర్ అన్నే భవనంలో కోకో రైతుల సంఘం రాష్ట్ర సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొల్లు రామకృష్ణ, కె.శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని కోకో సాగు చేసే అన్ని జిల్లాల నుంచి కోకో రైతుల సంఘం ప్రతినిధులు పాల్గొనవలసిందిగా కోరారు. -
నిర్మాణ పనులు పర్యవేక్షించాలి
ఏలూరు(మెట్రో): జిల్లాలో ఇంజనీరింగ్ శాఖల ద్వారా చేపట్టిన నిర్మాణ పనులు, బిల్లుల అప్లోడ్ పనులు ఈ నెల 15 లోగా పూర్తి చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. పంచాయతీ రాజ్, ఉపాధి హామీ, ఆర్డబ్ల్యూఎస్, సమగ్ర శిక్ష, హౌసింగ్, ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్, తదితర ఇంజనీరింగ్ శాఖల ద్వారా చేపట్టిన నిర్మాణ పనుల ప్రగతిపై శుక్రవారం సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న దృష్ట్యా జిల్లాలో ఇంజనీరింగ్ శాఖల ద్వారా చేపట్టిన నిర్మాణ పనులు, బిల్లులు అప్లోడ్ పనులు ఈనెల 15 లోగా పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ఆక్వా సాగు చేసే చెరువులన్నీ ఏపి సడా చట్టం కింద నమోదు కావాలని కలెక్టర్ చెప్పారు. కలెక్టరేట్లో శుక్రవారం రెవెన్యూ, మత్స్య శాఖాధికారులతో సడా చట్టం అమలుపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 64,193 ఎకరాలు నమోదు చేయాల్సి ఉండగా, కేవలం 4693 ఎకరాలు మాత్రమే నమోదు కావడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాస్ కాపీయింగ్ జరగకుండా నిఘా ఏలూరు (ఆర్ఆర్పేట): ఇంటర్ పరీక్షలలో మాస్ కాపీయింగ్ జరగకుండా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. స్థానిక అశోక్ నగర్లోని పీడీబీటీ కళాశాలలో శుక్రవారం ఇంటర్ పరీక్షల నిర్వహణను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎక్కడా మాస్ కాపీయింగ్ జరగకుండా ఇన్విజిలేటర్లు పర్యవేక్షించాలన్నారు. -
కోకో ధర పతనం
గత కొన్ని నెలలుగా కోకో ధర దిగజారిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కిలో రూ.800 నుంచి రూ.1200 వరకు ధర పలికింది. ఇప్పుడు కిలో రూ.260 నుంచి రూ.350 వరకు దిగజారింది. రైతులు ఎరువుల ఖర్చుతోపాటు కూలీల ఖర్చు అధికమవడం, సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో పెట్టుబడి పెరిగి ఆదాయం తగ్గి నష్టపోతున్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించేలా చర్య తీసుకోవాలి. – సాయిన కనకరాజు, రైతు, కామవరపుకోట కొబ్బరి తోటలో అంతర పంటగా కోకో సాగు చేస్తున్నాం. ఎరువుల ఖర్చుతో పాటు కూలీల ఖర్చు అధికమవుతుంది, గతంలో కిలో రూ.800 నుంచి రూ.1200 వరకు పలికింది. ఈ ఏడాది కిలో రూ.320కు దిగజారింది. దీంతో సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో పెట్టుబడి పెరిగి ఆదాయం తగ్గి ఆర్థికంగా నష్టపోతున్నాం. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కోకో గింజలకు కిలో రూ.900 గిట్టుబాటు ధర కల్పించి, గింజలను వెంటనే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి. – తూత బాలాజీ కుమార్, తడికలపూడి, కామవరపుకోట మండలం సాక్షి ప్రతినిధి, ఏలూరు : కోకో ధరలు రికార్డు స్థాయిలో పతనమయ్యాయి. గత నాలుగేళ్ళలో ఎన్నడూ లేని విధంగా కిలో కోకో ధర రూ.260 నుంచి రూ.300కు చేరింది. గతంలో రికార్డు స్థాయిలో ధరలు రావడంతో లక్షలకు కౌలు ధర చేరడం, పెట్టుబడులు గణనీయంగా పెరిగినా ఆశాజనకమైన ధరతో రైతుకు కొంతమేర గిట్టుబాటు అయిన పరిస్ధితి. ఈ ఏడాది మాత్రం పూర్తి భిన్నంగా భారీగా పతనం కావడంతో కనీసం కౌలు ధర కూడా దక్కని స్థితికి కోకో రైతులు చేరారు. దేశంలో ఏపీ కోకో సాగులో మొదటి స్థానంలో ఉంటే రాష్ట్రంతో పాటు దేశంలో ఏలూరు జిల్లా కోకో సాగులో మొదటి స్థానంలో ఉంది. 46 వేల ఎకరాల్లో ఈ ఏడాది కోకో సాగు చేశారు. 10 నుంచి 12 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా కాగా జనవరి నుంచి కోకో సీజన్ ప్రారంభమై ప్రస్తుతం కీలక దశకు చేరుకుంది. జనవరి నుంచి జూన్ వరకు ఆరు నెలల పాటు కోకో పంటకు కీలకం. నాణ్యమైన గింజ కూడా ఈ సీజన్లోనే లభ్యమవుతుంది. గతేడాది అంతర్జాతీయ మార్కెట్లో నిల్వలు ఉండటం, ప్రపంచ వ్యాప్తంగా కోకోకు కొంత డిమాండ్ తగ్గడంతో సీజన్ ప్రారంభమై కిలో రూ.550 అంతర్జాతీయ ధరకు ప్రారంభమైంది. స్థానికంగా ఉన్న మూడు కోకో కొనుగోలు కంపెనీలు సిండికేటై కిలో రూ.100 మేర తగ్గించి కొనుగోలు చేస్తున్నాయి. జనవరిలో అంతర్జాతీయ ధర రూ.500 నుంచి రూ.550 ఉంటే స్థానికంగా ధర రూ.400, ఫిబ్రవరిలో రూ.350 స్థానిక ధర నిర్ణయించి కొనుగోలు చేశారు. ఈ నెల మరింత పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్ రూ.300 ఉంటే రూ.250 నుంచి రూ.280కి కొనుగోలు చేస్తున్నారు. కోకో సాగుదారులు ఈ తరహా సంక్షోభం గతంలో ఎన్నడూ చూడలేదు. గతేడాది సీజన్ ప్రారంభంలో కిలో ధర రూ.750తో ప్రారంభమై స్థానిక మార్కెట్లో మార్చికి రూ.500 నుంచి రూ.550గా ఉంది. ఏప్రిల్లో మరో వంద తగ్గి రూ.400కు కంపెనీలు కొనుగోలు చేసిన క్రమంలో రైతులు ఉద్యమబాట పట్టడంతో ప్రభుత్వం కిలోకు రూ.50 ధర చెల్లించి మే 15 నుంచి జూన్ వరకు కొనుగోలు చేసింది. గతేడాది కోకో రైతులు ముట్టడి, నిరసనలు పెద్ద ఎత్తున కొనసాగించడంతో పలు దఫాల చర్చల అనంతరం రైతులకు ఇబ్బంది కలగకుండా చూస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆయిల్ఫెడ్ తరహాలో కోకో గింజల కొనుగోలు పాలసీని నిర్ణయిస్తామని, ధరను నిర్ణయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. దీనిపై ఏడాది దాటినా ఎలాంటి కదలిక లేదు. ఈ ఏడాది జనవరిలో కోకో కాంక్లేవ్ను రాష్ట్ర ఉద్యానవన శాఖాధికారులు పెద్ద ఎత్తున నిర్వహించి కోకో సాగు సూచనలు మొదలుకొని యంత్ర పరికరాల వినియోగం, కంపెనీల కొనుగోలుకు అవసరమైన నాణ్యతా ప్రమాణాలు కోకో సాగు విస్తీర్ణం పెంపొందించేలా రెండు రోజులు పాటు సదస్సు నిర్వహించారు. అయితే హామలు అమలు చేయలేదు. మరో 3 నెలల పాటు సీజన్ కొనసాగునున్న నేపధ్యంలో ధరలు మరింత పతనమవుతాయనే ఆందోళన సర్వత్రా కొనసాగుతుంది. గత నాలుగేళ్లలో ఇదే అతి తక్కువ ధర సీజన్ సమయంలో కిలో రూ.260 నుంచి రూ.300కు కొనుగోలు గత ప్రభుత్వ హయాంలో రూ.900 పలికిన ధర వ్యాపారుల సిండికేట్తో స్థానికంగా ధర పతనం


