breaking news
Eluru
-
డిమాండ్ల పరిష్కారంలో అలసత్వం వీడాలి
నూజివీడు: ట్రిపుల్ ఐటీలో పనిచేస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల న్యాయమైన డిమాండ్ల పరిష్కారంలో ఆర్జీయూకేటీ అధికారులు అలసత్వం వీడాలని కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు పేర్కొన్నారు. నూజివీడు ట్రిపుల్ఐటీలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఆందోళన మంగళవారం ఆరో రోజుకు చేరింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాన్సలర్తో సమావేశం ఏర్పాటు చేస్తానని నమ్మబలికిన డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ టెక్జైట్ ప్రారంభోత్సవం తర్వాత పత్తా లేకుండా పోయారన్నారు. తమ జీవితాలతో ఉన్నతాధికారులు దోబూచులాడడం బాధాకరమన్నారు. ప్రస్తుత చాన్సలర్ తమను కనీసం మనుషులుగా కూడా చూడకపోవడం దారుణమన్నారు. తమ జీతాల పెంపు ఫైల్ను చాన్సలర్ మూడు నెలల నుంచి తన దగ్గర పెట్టుకుని ఏ నిర్ణయం తీసుకోకపోవడం గర్హనీయమన్నారు. ఏఓ బీ లక్ష్మణరావు, సెంట్రల్ ఏఓ బండి ప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయ ఈఓగా వై.భద్రాజి నియమితుల య్యారు. ప్రస్తుత ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి ఈనెల 31న బుధవారం పదవీ విరమణ పొందనున్నారు. శ్రీవారి దేవస్థానంలో ఉప కార్యనిర్వాహణాధికారిగా విధులు నిర్వర్తిస్తున్న భద్రాజిని పూర్తి అదనపు బాధ్యతలతో ఈఓగా నియమిస్తూ ప్రభుత్వ ఎక్స్ అఫీషియో కార్యదర్శి డాక్టర్ ఎం.హరి జవహర్లాల్ మంగళవారం జీఓ జారీ చేశారు. ఏలూరు(మెట్రో): జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ, పోలింగ్ కేంద్రాల మార్పు, అదనపు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, తదితర అంశాలపై రెవెన్యూ అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణపై అందిన ఫారం–6, 7, 8 దరఖాస్తులను పరిశీలించి, నిర్దేశించిన సమయంలోగా నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని, వీటి పరిష్కారంపై ప్రతీరోజు పోలింగ్ బూత్ స్థాయి అధికారులతో సమీక్షించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. జంగారెడ్డిగూడెం డివిజన్లోని పోలవరం, జీలుగుమిల్లిలో కొత్తగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై వెంటనే నివేదిక అందజేయాలన్నారు. ఫొటో ఓటరు గుర్తింపు కార్డులను నూరుశాతం పంపిణీ చేయాలన్నారు. సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, నూజివీడు సబ్ కలెక్టర్ బి.వినూత్న, ఆర్డీఓలు అచ్యుత్ అంబరీష్, రమణ, కలెక్టరేట్ సూపరింటెండెంట్ చల్లన్న దొర, తహసీల్దార్లు, రెవిన్యూ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కొయ్యలగూడెం: ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. బయ్యన్నగూడెం సెక్టార్ ఆధ్వర్యంలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. సీఐటీయు 18వ అఖిలభారత మహాసభలు విజయవంతం చేయాలంటూ ప్రదర్శన చేపట్టారు. అంగన్వాడీ వర్కర్లకు కనీస వేతనాలు 26,000 చేయాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని జనవరి 4న జరిగే బహిరంగ సభలో పాల్గొనాలని సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడు శుక్లబోయిన రాంబాబు కోరారు. ఏలూరు టౌన్: ఏలూరు జిల్లాకు చెందిన డ్రగ్ ఇన్స్పెక్టర్ మహిళను వేధింపులకు గురిచేయటంతో ఆమె రాష్ట్ర మహిళ కమిషన్ను ఆశ్రయించగా... విచారణకు ఆదేశించారు. మెడికల్ షాపులో పనిచేస్తున్న మహిళతో డ్రగ్ ఇన్స్పెక్టర్ అబిద్ ఫోన్లో సంభాషిస్తూ వేధింపులకు గురిచేయగా, ఆమె జిల్లా కేంద్రంలోని ఔషధ నియంత్రణ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెబుతున్నారు. అనంతరం బాధిత మహిళ రాష్ట్ర మహిళ కమిషన్ ఆశ్రయించడంతో విచారణ చేసి సమగ్రమైన నివేదిక ఇవ్వాలని పోలీస్ అధికారులకు మహిళ కమిషన్ మంగళవారం ఆదేశించింది. -
కీచక ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు
పెనుగొండ, పాలకొల్లు (సెంట్రల్), భీమవరం : విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు పడింది. పోడూరులోని మండల ప్రజా పరిషత్ మెయిన్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు ఎం నాగేశ్వరరావు నాలుగు రోజులు క్రితం అదే పాఠశాలలో 4, 5వ తరగతులు చదువుతున్న ఇద్దరు విద్యార్థినులను పాఠశాల భవనంపైకి పిలిచి అసభ్యకరంగా ప్రవర్తించాడు. వెంటనే ఆ చిన్నారులు భయంతో కేకలు వేసుకుంటూ కిందకు వచ్చి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో సోమవారం రాత్రి ఓ విద్యార్థిని తల్లి పోడూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కారణంగా ఉపాధ్యాయుడు ఎం నాగేశ్వరరావును సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఇవీవీఎస్ఎస్ఎస్ఎస్ బీఎల్ నారాయణ మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఉండి: ఉండి మండలం చెరుకువాడ గ్రామానికి చెందిన బాలిక దివ్యాన్ ఫణిశ్రీ వెలిగట్ల గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకుంది. ఈ నెల 27వ తేదీన హైదరాబాద్లోని గచ్చిబౌలీ స్టేడియంలో ఏడు వేల మందితో నిర్వహించిన సామూహిక కూచిపూడి నృత్య ప్రదర్శన పోటీల్లో దివ్యాన్ ఫణిశ్రీ పాల్గొని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో భాగమైనట్లు బాలిక తండ్రి సత్యప్రసాద్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు బాలికకు గిన్నిస్ వరల్డ్ రికార్డు సర్టిఫికెట్తో పాటు జ్ఞాపికను అందజేసినట్లు చెప్పారు. కొంతకాలంగా కూచిపూడి నాట్యం నేర్చుకుంటూ హైదరాబాద్లోనే ఉండి చదవుకుంటున్న తన కుమార్తె ప్రపంచ రికార్డు సాధనలో భాగం అయినందుకు గర్వపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఫణిశ్రీకి పలువురు అభినందనలు తెలిపారు. జంగారెడ్డిగూడెం: వైకుంఠ ఏకాదశి, మంగళవారం సందర్భంగా గురవాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రీ స్వామి వారి దేవస్థానమునకు ఉపాలయం అయిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ స్వామి వారిని భక్తులు ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్నారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పి.ధర్మరాజు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ సేవల రూపేణా ఆలయానికి రూ.4,45,370 ఆదాయం సమకూరినట్టు ఈవో తెలిపారు. 4,950 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారని ఈవో ఆర్వీ చందన చెప్పారు. తాడేపల్లిగూడెం (టీఓసీ): పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగిన 28వ ఐపీఎస్జీఎం–2025 రీజనల్ మీట్ క్రీడా పోటీల్లో ఓవరాల్ చాంపియన్షిప్ను ఏలూరు సర్ సీఆర్రెడ్డి పాలిటెక్నిక్ విద్యార్థులు కై వసం చేసుకున్నారు. ప్రధానాచార్యులు డి.ఫణీంద్ర ప్రసాద్ అధ్యక్షతన వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్, కోకో, షటిల్, అథ్లెటిక్స్ పోటీలు జరిగాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 2 ప్రభుత్వ, 10 ప్రైవేట్ పాలిటెక్నిక్లలోని 550 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీలకు నిట్ రిజిస్ట్రార్ దినేశ్ శంకరరెడ్డి హాజరుకాగా కాకినాడ ఆర్జేడీటీఈ పి.సుబ్రహ్మాణ్యం, సివిల్ హెచ్ఓడీ జీవీవీఎల్ సత్యనారాయణ, మెకానికల్ హెచ్ఓడీ ఎ.గోపి, పీడీ కమల్ బాషా, విశ్రాంత పీడీ కె.రవికుమార్ పర్యవేక్షించారు. రీజనల్ మీట్లో ప్రతిభ చూపిన క్రీడాకారులు జనవరి నెలలో తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు వివరించారు. -
ఆయుధ డిపోకు వ్యతిరేకంగా ధర్నా
కొయ్యలగూడెం: నేవీ ఆయుధ కర్మాగార డిపో ఏర్పాటుకు వ్యతిరేకంగా తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతులు మంగళవారం ధర్నా నిర్వహించారు. బోడిగూడెం పంచాయతీ పరిధిలో బర్కెట్నగర్ ప్రాంతంలో నేవీ డెక్ నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతున్నందుకు నిరసనగా నిరసన వ్యక్తం చేశారు. ఒకప్పుడు బీడు భూములుగా ఉన్న తమ పొలాల్లో పోలవరం ప్రాజెక్టు వల్ల బోరులు పడుతున్నాయని రెండు పంటలు పండే భూములను డిపో ఏర్పాటు వల్ల కోల్పోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కర్మాగార డిపో నిర్మాణానికి 1200 ఎకరాలు అవసరం కాగా అందులో 400 ఎకరాల భూములు సన్న చిన్న కారు రైతులకు చెందినవేనన్నారు. భూములు కోల్పోతే కుటుంబాలతో సహా నడిరోడ్డున పడతామంటూ గోడు వెళ్లబోసుకున్నారు. నేవీ డాక్ యార్డ్ స్థాపించడానికి స్థానికంగా ఉన్న రైతులందరూ ఒప్పుకున్నట్టు త్వరలో భూసేకరణ జరుగుతున్నట్లు వార్త వచ్చిందని, ఇది పూర్తిగా అసత్యమని, రైతులు వద్దకు ఎవరు సంప్రదింపులకు రాలేదని ఖండించారు. కనీసం గ్రామసభ కూడా నిర్వహించకుండా ప్రచారం చేయడాన్ని రైతులంతా తప్పుబట్టారు. బోడిగూడెం పరిధిలో ఉన్న భూములు చిన్న సన్నకారు రైతులవని, ఈ భూములు ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని రైతులు పేర్కొన్నారు. -
14 నుంచి జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు
నరసాపురం: నరసాపురం రుస్తుంబాదలో గోగులమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జాతీయస్థాయి పురుషుల, మహిళల కబడ్డీ పోటీలు జనవరి 14 నుంచి 18వతేదీ వరకూ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఏడాది వలె 32వ జాతీయస్థాయి ఇన్విటేషన్ కప్ కబడ్డీ పోటీలు ఈ ఏడాది మరింత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మంగళవారం గోగులమ్మ ఆలయం వద్ద విలేకరుల సమావేశంలో పోటీల కన్వీనర్ మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకీరామ్, జాతీయ కబడ్డీ అసోసియేషన్ మాజీ కార్యదర్శి వి.వీర్లెంకయ్య టోర్నమెంట్ వివరాలు వెల్లడించారు. వివిధ రాష్ట్రాల నుంచి పురుషుల విభాగంలో 20, మహిళల విభాగంలో 20 మొత్తం 40 జట్లకు ఆహ్వానం పంపామని చెప్పారు. ఫ్రొకడ్డీ పోటీల్లో ఆడిన ఆటగాళ్లు కూడా పాల్గొంటున్నారని చెప్పారు. లీగ్కమ్ నాకౌట్ పద్ధతిలో మ్యాచ్లు జరుగుతుతాయన్నారు. విజేతలకు మొదటి బహుమతిగా రూ.1.50 లక్షలు, రెండో బహుమతిగా రూ.లక్ష, మూడవ బహుమతిగా రూ.75 వేలు, నాల్గో బహుమతిగా రూ.50 వేలు పురుషులు, మహిళల విభాగాల్లో అందిస్తామన్నారు. 50 మంది రిఫరీలు, ఆటగాళ్లు, సిబ్బంది కలిపి 500 మంది పాల్గొంటారని చెప్పారు. ఈ సమావేశంలో గోగులమ్మ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
పండగ పూటా పస్తులే?
శానిటరీ కార్మికుల ఆవేదన జంగారెడ్డిగూడెం: వేతనాలు లేక పండుగ పూట కూడా పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఏరియా ఆసుపత్రి శానిటరీ కార్మికులు తెలిపారు. మంగళవారం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రి వద్ద ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో శానిటరీ కార్మికులు విధులు బహిష్కరించి సమ్మె నిర్వహించారు. ఆసుపత్రి వద్ద నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ క్రిస్మస్ నాటికి మూడు నెలల బకాయిలు అందకపోవడంతో క్రిస్మస్ నాడు కూడా పస్తులు ఉండే పరిస్థితి ఏర్పడిందన్నారు. కాంట్రాక్టర్ల సమన్వయ లోపం కార్మికుల పాలిట శాపమై పస్తులు ఉండే పరిస్థితికి తీసుకొచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్పిటల్ లో పనిచేస్తున్న శానిటరీ కార్మికులకు మూడు నెలల వేతనాలు, 20 నెలల ప్రావిడెంట్ ఫండ్ కార్మికుల ఖాతాలకు జమ చేయలేదు. వేతనాలు విడుదల చేసేంతవరకు విధులు బహిష్కరిస్తామని తెలిపారు. ఏపీ మెడికల్ కాంటాక్ట్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ ఏఐటీయూసీ గౌరవాధ్యక్షుడు జంపన వెంకటరమణ రాజు మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఏజెన్సీని తొలగించి ప్రభుత్వమే ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా పరిగణించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయుసీ నాయకులు దయామణి, మేరీ, చంద్రకళ, చల్లాలు, జె.దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. -
ఆహ్లాదం.. పాపికొండల విహారం
పాపికొండల దగ్గరగా అటవీశాఖ నిర్మించిన కాటేజీలు బుట్టాయగూడెం: చుట్టూ ఎత్తయిన పర్వతశ్రేణులు.. వాటి మధ్యలో గలగలా గోదావరి ప్రవాహం. ఆ కొండల్లో పచ్చటి వృక్షాలు, పక్షుల కిలకిలరావాలు, ఎటు చూసినా ప్రకృతి రమణీయత, సుందర దృశ్యాల సమాహారం పాపికొండల విహారం. ఏలూరు, రంపచోడవరం జిల్లాల నడుమ తూర్పు కనుమల్లో దట్టమైన అడవుల్లో కూడిన పర్వతశ్రేణి పాపికొండలు. ఇంతటి విశిష్టత కలిగిన పాపికొండల పర్యాటకంపై అటవీశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. పర్యాటకంగా ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కొరుటూరు సమీపంలో ఉడెన్ కాటేజీలు నిర్మించి పర్యాటకులు ఆహ్లాదకరమైన వాతావరణంలో పాపికొండల అందాలను తిలకించేలా ఏర్పాట్లు చేసింది. దేవీపట్నం మండలం గండిపోచమ్మ అమ్మవారి గుడి సమీపంలో ఉన్న బోటు పాయింట్ నుంచి కొరుటూరు ఫారెస్ట్ కాటేజీలకు చేరుకున్న పర్యాటకులు బస చేసి ప్రకృతి రమణీయమైన అందాలను తిలకించవచ్చు. 15 పర్యాటక కాటేజీలు పాపికొండల పర్యాటకుల కోసం కొరుటూరు సమీపంలోని ఎత్తయిన కొండప్రాంతంలో 15 కాటేజీలు నిర్మించారు. వీటిలో ఉడెన్ కాటేజీలు 5, బేంబో కాటేజీలు 5, టెంట్ హౌస్లు 5 చొప్పున ఏర్పాటు చేశారు. వీటితోపాటు శివగిరి సమీపంలో పర్యాటకుల సౌకర్యార్థం కాటేజీలు ఏర్పాటు చేయనున్నారు. ఈ కాటేజీలు మొత్తం పాపికొండలకు అతిసమీపంలోనే ఉన్నాయి. ఎత్తయిన కొండపై వీటిని నిర్మించడంతో అక్కడి నుంచి పాపికొండల అందాలతోపాటు గోదావరి నదిపై బోట్లను, ప్రకృతి అందాలను కూడా తిలకించవచ్చు. అదేవిధంగా పర్యాటకులు ట్రెక్కింగ్ చేసేందుకు కూడా అధికారులు ఏర్పాటు చేశారు. ట్రెక్కింగ్ చేసే సమయంలో ఇద్దరు ఫారెస్ట్ సిబ్బంది వారితోపాటు కొండపైకి వెళ్లే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. పాపికొండల పర్యాటకుల కోసం ఫారెస్ట్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కాటేజీలు ఏర్పాటు చేశాం. కాటేజీలకు సోలార్ ద్వారా విద్యుత్ సదుపాయం కూడా కల్పించాం. పర్యాటకుల మనసుదోచేలా కాటేజీల నిర్మాణం జరిగింది. అందరికీ అందుబాటులో ఉండే విధంగానే కాటేజీల ధర నిర్ణయించారు. – ఎస్కె వల్లి, అటవీశాఖ అధికారి, పోలవరం రేంజ్ కొరుటూరు సమీపంలో ఫారెస్ట్ శాఖ నిర్మించిన ఉడెన్ కాటేజీలు అటవీశాఖ ఏర్పాటు చేసిన టెంట్ హౌస్లు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు అటవీశాఖ ఆధ్వర్యంలో కాటేజీల ఏర్పాటు పర్యాటకులకు ట్రెక్కింగ్కు కూడా అవకాశం -
తాళ్లతో కట్టేసి.. నగలు దోచేసి!
అల్లిపురం: ఇంటి యజమానురాలిని తాళ్లతో కట్టేసి.. 10 తులాల బంగారు ఆభరణాలు, 8 తులాల వెండి వస్తువులను దోచుకుపోయిన కేసులో తల్లీకూతుళ్లు సహా మొత్తం నలుగురు నిందితులను ఆరిలోవ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి 10 తులాల బంగారు ఆభరణాలు, రూ.10 వేల నగదు, 4 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నగర పోలీస్ కమిషనరేట్లో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రైం డీసీపీ కె.లతామాధురి ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఈ నెల 14వ తేదీ రాత్రి 9.50 గంటల సమయంలో ధారపాలెం, బంగారుతల్లి లే–అవుట్లో నివసిస్తున్న మొండు వసంత తన ఇంట్లో నిద్రకు ఉపక్రమించారు. ఆమె లోపల గడియ పెట్టుకుని నిద్రించగా, రాత్రి 10 గంటల సమయంలో కాళ్ల వద్ద ఎవరో సంచరిస్తున్నట్లు అలికిడి అయింది. వెంటనే ఆమె లేచేందుకు ప్రయత్నించగా.. ఒక వ్యక్తి ఆమె కాళ్లను గట్టిగా పట్టుకుని తాడుతో కట్టేశాడు. ఆమె అరవకుండా నోటిని అక్కడే ఉన్న లంగాతో కట్టేశారు. అనంతరం ఆమె మెడలోని 5 తులాల బంగారు పలక సరలు, నెమలి బిల్ల గల రెండు పేటల గొలుసు, చేతులకు ఉన్న 4 తులాల బంగారు గాజులు, లాకెట్తో కూడిన మరో గొలుసు, తులం బరువుగల రెండు ఉంగరాలు, 8 తులాల వెండి ఆభరణాలను బలవంతంగా తీసుకున్నారు. అనంతరం నిందితులు బయటకు వెళ్లి, తలుపులకు బయటి నుంచి గడియపెట్టి పారిపోయారు. తర్వాత బాధితురాలు అతికష్టం మీద కట్లు విప్పుకుని ఆరిలోవ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు, సెల్ఫోన్ టవర్ లోకేషన్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. దాదాపు వెయ్యి సెల్ఫోన్ల డేటాను విశ్లేషించి నిందితులను గుర్తించారు. పశ్చిమ గోదావరి జిల్లా రామాయణపురానికి చెందిన నెల్లి నిర్మల కుమారి, ఆమె కుమార్తె నెల్లి లిఖిత, అంబేడ్కర్ కోనసీమ జిల్లా సోంపల్లి (ఇందిరాకాలనీ)కి చెందిన భూపతి అభిరామ్, బి.సావరం గ్రామానికి చెందిన నల్లి మణిరత్నంలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. బంధువుల పరిచయంతో.. ప్రధాన నిందితురాలు నెల్లి నిర్మల కుమారి.. ఆరిలోవలోని బంగారుతల్లి లే–అవుట్లో నివాసం ఉంటున్న తన పెదనాన్న కుమారుడు దుర్గాప్రసాద్ ఇంటికి తరచూ వచ్చి వెళ్తుండేది. ఆ సమయంలో దుర్గాప్రసాద్ ఇంటి యజమానురాలైన వసంత మెడలో ఎక్కువ బంగారు ఆభరణాలు ఉండటం గమనించింది. తనకు ఉన్న అప్పులు తీర్చుకోవడానికి ఆమెను దోచుకోవాలని పథకం వేసింది. భీమవరం కలెక్టర్ ఆఫీస్లో క్యాంటీన్ నడుపుతున్న నిర్మల కుమారి.. తన కుమార్తె లిఖితకు, క్యాంటీన్లో పనిచేస్తున్న అభిరామ్, మణిరత్నంలకు డబ్బు ఆశ చూపించి విశాఖ తీసుకువచ్చింది. 13వ తేదీన దొంగతనం చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. మరుసటి రోజు బాధితురాలికి ‘సెండాఫ్’ చెప్పే నెపంతో నిర్మల కుమారి, లిఖిత ఆమెను బయటకు పిలిచారు. ఆ సమయంలోనే అభిరామ్, మణిరత్నం రహస్యంగా ఇంట్లోకి దూరి దాక్కున్నారు. రాత్రి బాధితురాలు ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుని నిద్రపోయాక, లోపల ఉన్న నిందితులు ఆమెను బంధించి చోరీకి పాల్పడ్డారు. ఈ కేసును ఛేదించడంలో చొరవ చూపిన ద్వారకా సబ్ డివిజన్ క్రైం సీఐ వి.చక్రధర్, ఆరిలోవ క్రైం ఎస్సై ఎ.హరికృష్ణ, ఎంవీపీ క్రైం ఎస్సై సీహెచ్.రామదాసు, ద్వారకా క్రైం ఎస్సై ఎల్. శ్రీనివాసరావు, సీసీఎస్ ఇన్స్పెక్టర్లు రామారావు, చంద్రశేఖర్లను నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి అభినందించారు. మహిళను బంధించి ఆభరణాలు దోచుకెళ్లిన ముఠా తల్లీకూతుళ్లు సహా నలుగురి అరెస్ట్ 10 తులాల బంగారం, రూ.10 వేలు స్వాధీనం -
రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు..
ఏలూరు ఆర్ఆర్పేటకు చెందిన ఒక వృద్ధురాలు తన బ్యాంకు ఖాతా నుంచి రూ.58 లక్షల నగదు కాజేశా రంటూ ఈ ఏడాది సెప్టెంబర్లో టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సైబర్ నేరాలను ఎస్పీ కొమ్మి శివకిషోర్ చాలెంజింగ్ తీసుకున్నారు. డీఎస్పీ పర్యవేక్షణలో4 పోలీస్ దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. ఏడు రాష్ట్రాల్లో 14 వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ జిల్లా పోలీసులు నేరగాళ్ల మూలాలను గుర్తించి నిందితులను అరెస్ట్ చేశారు. 11మంది సైబర్ నేరగాళ్లను గుర్తించగా 8 మందిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఏలూరు జిల్లాలో ఈ ఏడాది సుమారు 263 చోరీ కేసులు నమోదు కాగా, పోలీస్ అధికారులు భారీగా రికవరీ చేశారు. అనేక కేసుల్లో నిందితులైన నలుగురు దొంగలను భీమడోలు సర్కిల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు తంగెళ్ళమూడి ప్రాంతానికి చెందిన విశాఖ వసంతను అరెస్ట్ చేసి 184.37 గ్రాముల బంగారు ఆభరణాలు, మూడు కేటీఎం బైక్స్, ఇతర సొత్తుతో కలిపి మొత్తం రూ.35 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నూజివీడు పట్టణం, పరిసర ప్రాంతాల్లో మోటారు సైకిళ్ల చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను నూజివీడు టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 12 మోటారు సైకిళ్లను పోలీసులు రికవరీ చేశారు. -
నేరాల అడ్డుకట్టలో విఫలం
బుధవారం శ్రీ 31 శ్రీ డిసెంబర్ శ్రీ 2025ఏలూరు టౌన్: ఏలూరు జిల్లాలో పోలీసులు ఈ ఏడాది నేరస్తులకు కఠిన శిక్షలు విధించేలా న్యాయవ్యవస్థతో సంయుక్తంగా చేపట్టిన చర్యలు బాగున్నా.. నేరాలను నిరోధించటంలో విఫలమయ్యారనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. ఇళ్లు, బంగారు షాపుల్లో చోరీలు భారీగా జరిగాయి. సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయి లక్షలు కాజేశారు. జూద శిబిరాలు విచ్చలవిడిగా ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారులు రక్తంతో తడిసాయి. ఏలూరు నగరంలో మావోయిస్టుల అరెస్టు సంచలనంగా మారింది. ఏడాదిలో జిల్లాలో ఏకంగా 32 హత్యలు జరిగాయి. నెత్తురోడిన రహదారులు : ఏలూరు జిల్లాలోని జాతీయ రహదారులు, ప్రధాన రోడ్లన్నీ నెత్తురోడాయి. ఈ ఏడాది ఏకంగా 600 రోడ్డు ప్రమాదాలు జరిగితే... వాటిలో 380 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏలూరు జాతీయ రహదారి చొదిమెళ్ళ బ్రిడ్జి సమీపంలో లారీని వెనుకనుంచి ట్రావెల్స్ బస్సు ఢీకొట్టగా నలుగురు మృత్యువాత పడ్డారు. రత్నాస్ హోటల్ ప్రాంతంలో ఏడాదిలో 15 ప్రమాదాలు జరిగితే 8 మంది మృతి చెందారు. ఈ నెల 27న భీమడోలు బ్రిడ్జి వద్ద ఘోర ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఏలూరులో మావోయిస్టుల కలకలం ఏలూరు నగరంలోని మినీ బైపాస్ సమీపంలో గ్రీన్ సిటీ ప్రాంతంలో ఒక ఇంట్లో మావోయిస్టులు షెల్టర్ తీసుకున్నారనే సమాచారంతో ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్కుమార్, జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ అప్రమత్తమయ్యారు. ఎస్పీ శివకిషోర్ రంగంలోకి దిగారు. 100 నుంచి 150 మందికి పైగా పోలీస్ బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. డ్రోన్లతో సాంకేతిక నిపుణులు పర్యవేక్షణ చేస్తూ.. పోలీస్ యాక్షన్ టీం ఇంటిపై ఆకస్మిక దాడులు చేసింది. 15 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. వారిని మావోయిస్ట్ కీలకనేత హిడ్మా అనుచరులుగా గుర్తించారు. భారీగా ఆయుధాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. మద్యం మత్తులో ప్రాణాలు బలి ఆర్ఆర్పేట రోడ్డులోని వైన్స్లో ఒక వ్యక్తి మద్యం తాగుతూ మృతిచెందాడు. ఏలూరు జిల్లాలో మద్యం ఏరులై పారిస్తున్నారు. నెలకు సగటున రూ.9.50 కోట్ల మద్యం వ్యాపారం జిల్లాలో సాగుతోంది. జిల్లాలో బెల్ట్ షాపులకు కొదవేలేదు. మద్యం దుకాణాలన్నీ పాలకపక్ష నేతల కనుసన్నల్లోనే సాగుతున్నాయి. ప్రమాదాలతో నెత్తురోడిన ప్రధాన రహదారులు జిల్లాలో విచ్చలవిడిగా జూద శిబిరాలు జనాలను వణికిస్తున్న సైబర్ నేరగాళ్లు ఏలూరులో మావోయిస్టుల కలకలం -
అండర్–14 క్రికెట్ జట్టుకు దీపక్ ఎంపిక
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా పోలీస్ విభాగంలో హోంగార్డుగా పనిచేస్తున్న కే.సూరిబాబు కుమారుడు కే.సాయిదీపక్ అండర్–14 జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో మంగళవారం ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ శివకిషోర్ బాలుడు దీపక్ను ప్రత్యేకంగా అభినందిస్తూ... క్రికెట్ బ్యాట్ను బహూకరించారు. హోంగార్డు కుటుంబం నుంచి రాష్ట్రానికి అండర్–14 క్రికెట్ జట్టులో స్థానం సాధించటం సంతోషంగా ఉందనీ, మరింత ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆర్ఐ పవన్కుమార్, తండ్రి సూరిబాబు ఉన్నారు. -
స్మార్ట్ మీటర్లతో మీటర్ రీడర్ల ఉపాధికి ప్రమాదం
తాడేపల్లిగూడెం (టీఓసీ): స్మార్ట్ మీటర్లు బిగించడంతో మీటర్ రీడర్లు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మీటర్ రీడర్ల సమావేశం స్థానిక ఏఐటీయూసీ కార్యాలయంలో గౌరవాధ్యక్షుడు ఎం.నాగేశ్వరరావు అధ్యక్షతన మంగళవారం జరిగింది. వక్తలు మాట్లాడుతూ విద్యుత్ సంస్థను నమ్ముకుని మీటర్ రీడర్లు 20 సంవత్సరాలు పైబడి బిల్లింగ్ చేస్తూ కుటుంబాలు పోషించుకుంటారని, ఇప్పుడు స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో జిల్లాలోని 356 మంది మీటర్ రీడర్లు పని లేక రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని వాపోయారు. తమను ఆదుకోవాలని గత రెండేళ్లుగా ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నా పట్టించుకోవడం లేదన్నారు. దీనిపై రానున్న రోజుల్లో మీటర్ రీడర్ల యూనియన్ ఆధ్వర్యంలో వైజాగ్, విజయవాడలో జరిగే కార్యాచరణ రూపొందిస్తారని, మీటర్ రీడర్లు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జి.దుర్గారావు, మల్లేశ్వరరావు, ఆశోక్, ప్రకాష్, శశిధర్, వెంకటరత్నం, మహేష్, శ్రీను, మోజేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఇల వైకుంఠం
ద్వారకాతిరుమల: చిన్నతిరుపతి క్షేత్రం మంగళవారం వైకుంఠాన్ని తలపించింది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారు ఉత్తర ద్వారం వద్ద భక్తులకు దర్శనమిచ్చారు. భానుడి లేలేత కిరణాలు పుడమిపై ప్రసరించే వేళ.. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణలు, భక్తుల గోవింద నామస్మరణల నడుమ ఉభయ దేవేరులతో శ్రీవారు ఉత్తర ద్వారం వద్ద వెండి గరుడ వాహనంపై సాక్షాత్కరించారు. ఈ వేడుక ఆద్యంతం భక్తులకు నేత్రపర్వమైంది. ముందుగా సిబ్బంది ఉత్తర ద్వారాన్ని పచ్చిపూలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వెండి గరుడ వాహనంపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను వేంచేపు చేసి, విశేషంగా అలంకరించారు. తెల్లవారుజాము 4.15 గంటలకు ఉత్తర ద్వారాలను తెరవగా, దేవస్థానం ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి, ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్వీఎన్ఎన్ నివృతరావు, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తదితరులు తొలి దర్శనం చేసుకుని, పూజాదికాలు జరుపుకున్నారు. అనంతరం భక్తులకు సర్వదర్శన భాగ్యాన్ని కల్పించారు. ఊహించని విధంగా వేలాది మంది భక్తులు, గోవింద స్వాములు స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని వీక్షించి పరవశించారు. ఉదయం 7.30 గంటల సమయంలో స్వామి, అమ్మవార్లు ఉత్తర ద్వారం నుంచి వెండి గరుడ వాహనంపై గ్రామోత్సవానికి బయల్దేరి వెళ్లారు. గజ, అశ్వ సేవల నడుమ ఈ వేడుక అట్టహాసంగా జరిగింది. ఆ తరువాత ఉత్తర ద్వారం వద్ద వెండి శేష వాహనంపై కొలువైన స్వామి, అమ్మవార్లు రాత్రి 9 గంటల వరకు భక్తులకు దర్శనమిచ్చారు. సుమారు 50 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించినట్టు ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే గోవింద దీక్షాదారులు తెల్లవారుజామున ఆలయ ప్రధాన రాజగోపుర మెట్ల మార్గంలో కర్పూరంతో స్వామివారి శంఖు, చక్ర, నామాలను ఏర్పాటు చేసి, వాటిని వెలిగించారు. అనంతరం ఇరుముడులతో స్వామివారి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. రూ. 40 లక్షల ఆదాయం.. శ్రీవారి రూ. 500 ప్రత్యేక దర్శనం టికెట్లు మధ్యాహ్నం వరకే విక్రయించారు. మొత్తం 2 వేల టికెట్లను విక్రయించారు. రాత్రి వరకు రూ. 200 టికెట్లు దాదాపు 3,500, రూ.100 టికెట్లు 3,500, 50 వేలకు పైగా లడ్డూ ప్రసాదాలు, 27,600 పులిహోర ప్యాకెట్లు, 10,530 శర్కర పొంగలి ప్యాకెట్లు విక్రయించారు. స్వామివారికి సుమారు రూ. 40 లక్షల మేర ఆదాయం లభించింది. తోపులాటలో కింద పడిన భక్తులు తెల్లవారుజామున క్యూకాంప్లెక్స్ వద్ద గేటు ఒక్కసారిగా తెరవడంతో తోపులాట జరిగి, కొందరు భక్తులు కింద పడిపోయారు. రూ. 500 టికెట్లు కొనుగోలు చేసిన భక్తులను, అలాగే గ్రామస్తులను, గోవింద స్వాములను ఒకే దర్శనం క్యూలైన్లో పంపడం వివాదాస్పదమైంది. వీఐపీల పేరుతో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులను తూర్పు రాజగోపురం మీదుగా తీసుకెళ్లి, ధ్వజస్తంభం వద్ద ఉన్న మెయిన్ గేటులోంచి ఆలయంలోకి పంపారు. దాంతో క్యూలైన్లలో ఉన్న భక్తులు పలుమార్లు అరుపులు, కేకలు వేయడంతో ఆలయం గందరగోళంగా మారింది. టీడీపీ నాయకులకు, వీఐపీలకు ఉన్న విలువ తమకు లేదంటూ కొందరు సిబ్బంది గుసగుసలాడారు. సాయంత్రం 5 గంటలకు సాయంకాలార్చన నిమిత్తం నిలుపుదల చేయాల్సిన స్వామివారి దర్శనాన్ని, భక్తులు గొడవ చేయడంతో గంట అదనంగా కొనసాగించి, 6 గంటలకు నిలుపుదల చేశారు.ఉత్తర ద్వారం వద్ద వెండి గరుడ వాహనంపై కొలువైన స్వామి, అమ్మవార్లు ఆలయంలో భక్తుల తోపులాట గరుడ వాహనంపై గ్రామోత్సవంద్వారకాతిరుమల: ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని మంగళవారం ఉదయం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి.కృష్ణమోహన్, జస్టిస్ వి.గోపాలకృష్ణారావు వేర్వరుగా సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన వారికి ముందుగా దేవస్థానం ఈఓ అర్చకులు మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. న్యాయమూర్తులు ఉత్తర ద్వారం వద్ద స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ద్వారకాతిరుమలలో వైభవంగా శ్రీవారి ఉత్తర ద్వార దర్శనం 50 వేల మందికిపైగా స్వామిని దర్శించిన భక్తులు, గోవింద స్వాములు గరుడ వాహనంపై నేత్రపర్వంగా గ్రామోత్సవం -
యూరియా కోసం తప్పని పాట్లు
పెనుగొండ: యూరియా సమృద్ధిగా ఉందంటూ వ్యవసాయాధికారులు, జిల్లా స్థాయి అధికారులు పదేపదే ప్రకటనలు గుప్పిస్తున్నా క్షేత్ర స్థాయిలో యూరియా కోసం రైతన్నలకు పాట్లు తప్పడం లేదు. సొసైటీల్లో యూరియా కావాలంటే ఇతర రకాలు తీసుకోవాలని మెలిక పెడుతుండడంతో సార్వాలో నష్టపోయిన రైతన్నలు అదనపు భారం భరించలేక అష్టకష్టాలు పడుతున్నారు. ఇదే పరిస్థితి సోమవారం ఆచంటలోని మృత్యుంజయ సొసైటీ వద్ద నెలకొంది. తొలుత యూరియా కావాలంటే ఇతర రకాలు తీసుకోలంటూ మెలికపెట్టడంతో ఉదయం సొసైటీ వద్ద గందరగోళం నెలకొంది. యూరియా మాత్రమే ఇవ్వాలంటూ రైతులు పట్టుబట్టి కొద్దిసేపు వాగ్విదానానికి దిగారు. దీంతో ఉన్నతాధికారులు కలగజేసుకొని సమస్యను సర్దుబాటు చేసి, యూరియాపై నియంత్రణ విధించారు. పూర్తి స్థాయిలో ఇవ్వకుండా కోటాగా సరఫరా చేయడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. కేటాయించిన మేర యూరియా తీసుకువెళ్లడానికి రైతులు గంటలు తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. కాగా కొందరు కూటమి నాయకులు యూరియా అందరికీ అందనివ్వకుండా అడ్డుకొంటున్నారని రైతులు ఆరోపించారు. రైతులకు అందించాల్సిన యూరియాలోనూ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. -
సంతృప్తికర దర్శనం కలిగేలా చూడాలి
ద్వారకాతిరుమల: ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం తెల్లవారుజామున 5 గంటల నుంచి నిర్వహించే శ్రీవారి ఉత్తర ద్వార దర్శనంలో ప్రతి ఒక్క భక్తుడుకి సంతృప్తికరమైన దర్శనం కలిగేలా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి దేవస్థానం అధికారులను ఆదేశించారు. చినవెంకన్న ఆలయంలో ఉత్తర ద్వార దర్శనానికి చేసిన ఏర్పాట్లను సోమవారం ఉదయం ఎస్పీ కె.ప్రతాప్ శివ కిశోర్, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. కొండపైన అతిథి గృహంలో అధికారులతో దర్శన ఏర్పాట్లపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ శ్రీవారి ఉత్తర ద్వార దర్శనానికి 35 వేల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని, భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అందుకు తగిన విధంగా ప్రణాళికలు రూపొందించు కోవాలన్నారు. తోపులాటలు జరగకుండా చూడాలని, గర్భిణీలు, చిన్న పిల్లలు, వయోవృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలని, భక్తుల సంఖ్యకు తగ్గట్టు తాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాట్లు చేయాలన్నారు. ఎక్కడైనా తోపులాట జరిగితే వెంటనే భద్రతా సిబ్బంది పరిస్థితిని నియంత్రించి, సాధారణ స్థితికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ ఉత్తర ద్వార దర్శనానికి వచ్చే భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సీసీ కెమెరాల ద్వారా అన్ని ప్రదేశాలలో పరిస్థితిని పర్యవేక్షించాలని, ఎక్కడైనా అవాంచనీయ ఘటనలు జరిగే అవకాశం ఉందని అనుమానం కలిగితే, వెంటనే భద్రతా సిబ్బంది నియంత్రణ చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవీ రమణ, డీఎంహెచ్ఓ డాక్టర్ పీజే అమృతం, డీఎస్పీ శ్రావణ్ కుమార్, ట్రైనీ ఐపీఎస్ జయశర్మ, తహసీల్దార్ జేవీ సుబ్బారావు, ఎంపీడీఓ ప్రకాష్ తదితరులున్నారు. -
సైడ్ లైట్స్
● సెయింట్గ్జేవియార్ పాఠశాల వద్దకు వచ్చేసరికి ఎదురుగా వాహనాలు రావడంతో భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. సెక్యూరిటీ విఫలమైనట్టు కొట్టొచ్చినట్టు కనిపించింది.● గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తుల పాదాల రక్షణ నిమిత్తం దారి పొడవునా పరచిన ఎండు గడ్డిలో కొందరు భక్తులకు ముళ్లు గుచ్చుకోవడంతో ఇబ్బంది పడ్డారు. ● మంచినీరు, అల్పాహారం, పండ్లు, టీలు అందించే స్టాల్స్ వద్ద సిబ్బంది సరిపోకపోవడంతో స్టాల్స్ వద్ద తోపులాటలు జరిగాయి. దాంతో అవి భక్తులకు సక్రమంగా అందలేదు. ● భక్తులు నడిచేటప్పుడు గడ్డిలోంచి దుమ్ము విపరీతంగా పైకి లేవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ● మధ్యాహ్నం 3.30 గంటలకు ఆలయ ప్రధాన కూడలిలో గిరి ప్రదక్షిణ వేడుకను ప్రారంభించారు. ● గతంలో వలె ఈ ఏడు గిరి ప్రదక్షిణ వేడుకలో విచిత్ర వేషధారణలను ఏర్పాటు చేయలేదు. ● గిరి ప్రదక్షిణను వేగంగా ముగించారు. సాయంత్రం సుమారు 6.15 గంటకే ఈ వేడుక పూర్తయ్యింది. -
అటకెక్కిన సంక్షేమం
వేతనాలు పెరగక వెతలు ట్రిపుల్ ఐటీలోని కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వేతనాలు పెరగక.. ఉద్యోగ భద్రత లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 8లో uమంగళవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్ శ్రీ 2025పెదపాడు: సర్పంచ్పై దాడి కేసులో పెదపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. పెదపాడు పోలీసుల వివరాల ప్రకారం పెదపాడు మండలంలోని ఏపూరు సర్పంచ్ చోడగిరి రామకృష్ణ నూజివీడులోని దేవరగుట్ట నుంచి ఏపూరుకు వస్తుండగా పెదపాడు మండలంలోని ఏపూరు శ్రీలక్ష్మీరైస్ మిల్ వద్ద పెదకడిమికి చెందిన కొసరాజు వంశీకృష్ణ, మట్టా వినయ్లు వైఎస్ జగన్మోహనరెడ్డి, కొఠారు అబ్బయ్యచౌదరిల ఫొటోలు చూసి ఆపి బూతులు తిట్టి, కిందపడేసి కొట్టి, చంపుతామని బెదిరించినట్లు రామకృష్ణ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏలూరు టౌన్: సోషల్ మీడియాతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ అన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి పోలీసు అధికారులకు ఫోన్ చేసి ఆదేశాలు జారీ చేశారు. జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ట్రైనీ ఐపీఎస్ అధికారి జయశర్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 45 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. ఆన్లైన్లోనూ ఫిర్యాదులు నమోదు చేసే అవకాశం ఉందని, ఫిర్యాదుల స్థితిని తెలుసుకునేందుకు 1100 టోల్ఫ్రీ నెంబర్ను సంప్రదించాలని ఆయన తెలిపారు. ఇటీవల కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్న తరుణంలో ప్రజలు సోషల్మీడియా పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. సైబర్ నేరగాళ్ళు అనేక రకాలుగా మోసాలు చేస్తూ డబ్బులు కాజేస్తారని తెలిపారు. సైబర్ నేరాలపై వెంటనే 1930కు సమాచారం అందించి, ఫిర్యాదు చేయాలన్నారు. ఏలూరు(మెట్రో): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల స్థాయి మెరుగుపరిచి, నూరుశాతం ఉతీర్ణత సాదించేందుకు రూపొందించిన 100 రోజుల ప్రణాళిక అమలుపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో సోమవారం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు 100 రోజుల ప్రణాళిక అమలుపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నూరు శాతం ఉతీర్ణత సాధన దిశగా చేపట్టిన ప్రణాళిక విజయవంతంగా అమలు చేసి విద్యాభివృద్ధిలో ఏలూరు జిల్లాను ముందు వరసలో నిలిపి ఉత్తమ ఫలితాల సాధనకు కృషిచేసిన వారిని సన్మానించి గౌరవిస్తామని కలెక్టర్ చెప్పారు. వేలేరుపాడు: విద్యుత్ వెలుగులకు నోచుకోని గిరిజన గ్రామం మోదెలు గ్రామం విషయంలో కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులతో సమీక్షించి, మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు. ముందుగా గ్రామంలోని 23 ఇళ్లకు విద్యుత్ అందించేందుకు రూ.12.5 లక్షలతో గ్రిడ్ ఏర్పాటుచేసి ప్రతి ఇంటికీ సౌర విద్యుత్ను అందించారు. తమకు విద్యుత్ వెలుగులు అందించిన జిల్లా యంత్రాంగాన్ని కలిసి గ్రామస్తులు సోమవారం కృతజ్ఞతలు తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఎం.జె.అభిషేక్ గౌడ, విద్యుత్ శాఖ ఎస్ఈ సాల్మన్ రాజును ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. భీమవరం(ప్రకాశం చౌక్): దివ్యాంగులకు ప్రతినెల మూడో శుక్రవారం ప్రత్యేక గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో సోమవారం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్లో ప్రతి నెల మూడో శుక్రవారం ప్రత్యేక గ్రీవెన్స్ డే ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. దివ్యాంగులు తమ సమస్యలను మూడో శుక్రవారం ప్రత్యేక గ్రీవెన్్స్ డే రోజున అందజేసి సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. విజువల్లీ చాలెంజ్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రూపొందించిన వికలాంగుల హక్కుల చట్టం–2016 పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. ఏలూరు (టూటౌన్): గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో సంక్షేమ పథకాలు పరవళ్లు తొక్కాయి. మహిళలే మహరాణులుగా వెలుగొందారు. ప్రతి ఇంట్లో ఏటా దాదాపు రూ.లక్ష వరకు లబ్ధి చేకూరింది. వ్యాపారాల కోసం ఇతరుల వద్దకు అప్పు కోసం పరుగులు తీయకుండా ప్రభుత్వ ఆర్థిక సహాయం ప్రజలకు అక్కరకు వచ్చింది. దానికి భిన్నంగా ప్రస్తుత చంద్రబాబు కూటమి ప్రభుత్వ హయాంలో అన్ని సంక్షేమ పథకాలను అటకెక్కించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా సంక్షేమం వెలవెలబోయింది. సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజల జీవన విధానంలో కష్టాల కడగళ్లు ప్రారంభమయ్యాయి. నాటి ప్రభుత్వ హయాంలో ప్రధాన పండుగల రోజుల్లో ప్రజల అవసరాలు తీర్చేలా ప్రభుత్వం ఏదో ఒక పథకం రూపంలో ఆర్థిక సహాకారం అందించేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో నాడు లబ్ధి పొందిన ప్రజలు నేడు ఉసూరుమంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏలూరు జిల్లాలోని 1,75,118 మంది విద్యార్థులకు రూ.450.77 కోట్లు విద్యాదీవెన ద్వారా అందజేశారు. జగనన్న వసతి దీవెన పథకంలో 1,73,246 మంది విద్యార్థులకు రూ.171.38 కోట్లు అందజేసారు. ఈ రెండు పథకాల్లో ఇంత వరకు కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటనలు చేస్తుంది తప్ప క్షేత్ర స్థాయిలో విడుదల చేయలేదు. వృత్తిదారులకు అందని చేదోడు వైఎస్సార్సీపీ పాలనలో చేదోడు పథకంలో ఏటా రూ.10 వేలు చొప్పున వరుసగా నాలుగేళ్లు అందజేసారు. నాలుగు విడతల్లో 53,999 మందికి దాదాపుగా రూ.54 కోట్ల మేర అందించారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ పథకాన్ని అటకెక్కించింది. ఎన్నికల ముందు వృత్తిదారులకు ఉచిత విద్యుత్ను అందిస్తామని ఇచ్చిన హామీని చంద్రబాబు ప్రభుత్వం మర్చిపోయింది. డ్వాక్రా మహిళలకు షాక్ నాటి ప్రభుత్వంలో డ్వాక్రా మహిళా రుణాలు పూర్తిగా రద్దుచేసి నాలుగు విడతల్లో ఆ మొత్తాన్ని ఆసరా కార్యక్రమం పేరుతో క్రమం తప్పకుండా అందించేవారు. ప్రతి డ్వాక్రా మహిళకు ఏటా రూ.10 వేల నుంచి రూ.80 వేల వరకు లబ్ధి చేకూరింది. దీంతో మహిళల జీవితాల్లో వెలుగులు నిండాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక డ్వాక్రా మహిళలకు ఎలాంటి నూతన పథకాన్ని ప్రారంభించకపోవడంతో మహిళలు మళ్ళీ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఆసరా పథకంలో 39,539 గ్రూపులకు చెందిన 3,89,801 మందికి రూ.1,448.41 కోట్ల మేరకు ఆర్థికంగా లబ్ది చేకూరింది. భీమవరం (ప్రకాశం చౌక్): మావుళ్లమ్మ వారి 62వ వార్షికోత్సవం సందర్భంగా అలంకరణ పనుల కోసం ఈ నెల 17న మూల విరాట్ దర్శనాన్ని నిలిపివేశారు. అలంకరణ పనులు పూర్తి చేయడంతో సోమవారం ఉదయం ఆలయ ప్రధాన అర్చకుడు మద్దిరాల మల్లికార్జున శర్మ కళాన్యాసం ప్రత్యేక పూజలను నిర్వహించగా అమ్మవారి మూల విరాట్ పునః దర్శనం భక్తులకు కల్పించారు. అమ్మవారి ఆలయ సన్నిధిలో ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహించారు. అమ్మవారిని స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ అమ్మవారి ఉత్సవాల్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనం కల్పించాలన్నారు. కొండపైకి చేరుకునేందుకు దేవస్థానం ఉచిత బస్సు ఎక్కుతున్న భక్తులు ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనానికి సర్వం సిద్ధమైంది. మంగళవారం తెల్లవారుజామున 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉత్తర ద్వారం వద్ద స్వామివారి దర్శనం భక్తులకు కల్పించనున్నట్టు ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. అందులో భాగంగా ఆలయ పరిసరాలను, ఉత్తర ద్వారాన్ని సోమవారం రాత్రి పచ్చిపూలతో శోభాయమానంగా అలంకరించారు. ఉత్తర ద్వారంలో స్వామివారు ఆసీనులయ్యే ప్రాంతాన్ని అలంకరించి, ప్రత్యేక మండపాన్ని నిర్మించారు. అర్ధరాత్రి వరకు ఈ పనులు సాగాయి. స్వామివారి వాహన సేవకు వెండి గరుడ, శేష వాహనాలను సిద్ధం చేశారు. సోమవారం రాత్రి 7 గంటల నుంచి నిజరూపంలో ఉన్న శ్రీవారిని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. క్షేత్రానికి చేరుకున్న దీక్షాధారులు తొలి ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు దూరప్రాంతాల నుంచి గోవింద స్వాములు సోమవారం రాత్రి ఆలయానికి చేరుకున్నారు. మంగళవారం ఉదయం స్వామిని దర్శించిన తరువాత ఇరుముడులు సమర్పించనున్నారు. రెండు వాహనాలపై.. ముక్కోటి పర్వదినాన స్వామి వారు ఉత్తర ద్వారం వద్ద ఉదయం 10 గంటల వరకు వెండి గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. ఆ తరువాత అదే వాహనంపై గ్రామోత్సవానికి వెళతారు. ఆ సమయం నుంచి రాత్రి 9 గంటల వరకు ఉత్తర ద్వారం వద్ద స్వామి, అమ్మవార్లు వెండి శేష వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. అలాగే సాయంత్రం వరకు స్వామివారు గర్భాలయంలో నిజరూప దర్శనంలో భక్తులను కటాక్షిస్తారు. గిరిజనులపై దాడులు దుర్మార్గమని వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు అన్నారు. గిరిజనులపై తప్పుడు కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. 8లో uగత ప్రభుత్వం హయాంలో జిల్లాలో దాదాపుగా 5 లక్షలకు పైగా కుటుంబాలు ఉండగా వీరిలో 75 శాతం కుటుంబాలకు ప్రయోజనం కలిగింది. జిల్లాలోని మెజార్టీ మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. చిన్నాచితకా అవసరాలకు మగవారిపై ఆధారపడాల్సిన అవసరం ఉండేది కాదు. గత 18 నెలల చంద్రబాబు ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకు చెల్లు చీటీ ఇవ్వడంతో క్రమంగా మహిళల ఆర్థిక పరిస్థితి దిగజారుతూ వస్తుంది. కూటమి పార్టీల కల్లబొల్లి మాటలు, అబద్దపు హామీలు నమ్మి మోసపోయామని జిల్లాలోని మహిళలు అంటున్నారు. ప్రస్తుత చంద్రబాబు కూటమి ప్రభుత్వం మహిళలకు సంబంధించి సంక్షేమ పథకాల ఊసే ఎత్తడం లేదు. గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన కాపు నేస్తం, చేయూత, ఈబీసీ నేస్తం, నేతన్న నేస్తం, సున్నా వడ్డీ వంటి పథకాలు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో నిలిచిపోయాయి. వైఎస్సార్ కాపు నేస్తం పథకంలో మొదటి నాలుగు విడతల్లో ఏటా రూ.15 వేల చొప్పున ఏలూరు జిల్లాలో 66,488 మందికి రూ.99.73 కోట్లు అందించారు. వైఎస్సార్ చేయూత పథకంలో నాలుగు విడతల్లో ఏటా రూ.18,750 చొప్పున 2,76,653 మందికి రూ.518.72 కోట్లు అందించారు. ఈబీసీ నేస్తం పథకంలో వెనుకబడిన అగ్రవర్ణ పేద మహిళలకు ఏటా రూ.15 వేల చొప్పున అందించారు. నేతన్న నేస్తం పథకంలో సొంత మగ్గం ఉన్న చేనేత కార్మికుడికి నెలకు రూ.2 వేల చొప్పున ఏడాదికి ఒకే విడతలో రూ.24 వేల ఆర్థిక సాయం అందించారు. విద్యార్థులకు అందని వసతి దీవెన, విద్యా దీవెన సాయం రీయింబర్స్మెంట్ది అదే పరిస్థితి చేదోడు, జగనన్న తోడు పథకాలకు మంగళం బ్యాంకు రుణాలు అంతంత మాత్రమే ఆసరా, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం పథకాలు కనుమరుగు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏటా ఇంటికి రూ.లక్ష వరకు లబ్ధి గత ప్రభుత్వ హయాంలో ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో రికార్డు స్థాయిల్లో డ్వాక్రా రుణాలను బ్యాంకుల ద్వారా అందజేశారు. రెండు జిల్లాల పరిధిలో నాలుగున్నరేళ్లల్లో మొత్తం రూ.11,336.53 కోట్లు రుణాలుగా ఇచ్చారు. ఏలూరు జిల్లా పరిధిలో 1,32,707 గ్రూపులకు రూ.6,428.88 కోట్లు, పశ్చిమగోదావరి జిల్లాలో 99,393 గ్రూపులకు రూ.4,907.70 కోట్లు రుణాలు అందించారు. గత ప్రభుత్వ హయాంలో ఏలూరు జిల్లా వ్యాప్తంగా 2.65 లక్షల మందికి పింఛన్లు అందించే వారు. ఇప్పుడు జిల్లాలో 2.59 లక్షల మందికే పింఛన్లు అందిస్తున్నారు. దాదాపు ఆరు వేల పింఛన్లకు మంగళం పాడేశారు. ఫింఛన్లలో అనర్హులు ఉన్నారని వీటిని మరింత కుదించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మరో 10 వేల మంది పింఛన్లు తీసేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. గత ప్రభుత్వంలో చిరు వ్యాపారులకు జగనన్న తోడు పథకంలో రూ.10 వేలు ఆర్థిక సాయం అందించేవారు. పెట్టుబడుల కోసం చిరు వ్యాపారులు ప్రైవేటు అప్పులు చేసే పనిలేకుండా నేరుగా బ్యాంకుల ద్వారానే రుణాలు ఇచ్చేవారు. నెలనెలా కొద్దిగా రుణం చెల్లించే వెసులుబాటు కల్పించారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ పథకాన్ని అటకెక్కించింది. మహిళలకు చిరు వ్యాపారాలు, గొర్రెల, మేకల పెంపకం, కోళ్ళ పెంపకం, ఇతర కుటీర పరిశ్రమలు పెట్టుకునేందుకు గతంలో రుణాలను అందించారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కన్పించడం లేదు. నేడు తెల్లవారుజామున 5 గంటల నుంచి స్వామి దర్శనం రెండు వాహనాలపై దర్శనమివ్వనున్న శ్రీవారు ముందు రోజు రాత్రే వేలాదిగా ఆలయానికి చేరుకున్న భక్తులు -
గుండెల నిండా గోవిందుడు
తరిస్తూ.. చినవెంకన్నను స్మరిస్తూ.. ● అట్టహాసంగా శ్రీవారి గిరి ప్రదక్షిణ ● 30 వేల మందికి పైగా భక్తుల రాక ● మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమైన ధర్మప్రచార రథం రథాన్ని జెండా ఊపి ప్రారంభిస్తున్న దేవస్థానం ఈఓ మూర్తి, ఆలయ అనువంశిక ధర్మకర్త నివృతరావు ద్వారకాతిరుమల: భక్తవత్సలుడైన ఆ ఏడు కొండల వాడిపై గుండెల నిండి అపారమైన భక్తితో.. అచంచలమైన విశ్వాసంతో.. భక్తులు, గోవింద దీక్షాదారులు సోమవారం గిరి ప్రదక్షిణ చేశారు. ఇసుకేస్తే రాలనంత భక్తజన సందోహం నడుమ జరిగిన ఈ వేడుకతో ద్వారకాతిరుమల క్షేత్రం పులకించింది. తొలుత ఆలయ ప్రధాన కూడలి (గుడి సెంటర్)లో ప్రత్యేక రథంలో కొలువైన స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు దేవస్థానం ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి, ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్వీఎన్ఎన్ నివృతరావు పూజలు నిర్వహించారు. ఆ తరువాత ఆ రథం వెనుక విశేష పుష్పాలంకారాల్లో ఉన్న శ్రీవారి ధర్మప్రచార రథాన్ని వారు జెండా ఊపి ప్రారంభించారు. దాంతో గిరి ప్రదక్షిణ వేడుక ప్రారంభమైంది. గజ, వృషభ, అశ్వాలు ప్రచార రథం ముందు నడువగా, వాటి వెనుక భక్తులు, గోవింద స్వాములు, గ్రామస్తులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ భక్తి ప్రపత్తులతో గిరి ప్రదక్షిణ చేపట్టారు. ఈ యాత్ర మల్లేశ్వరం (దొరసానిపాడు), రాళ్లకుంట, కొండపైన ఆశ్రమం, లింగయ్య చెరువు, ఉగాది మండపం మీదుగా సాగుతూ ఆలయానికి చేరుకుంది. సుమారు 5 కిలోమీటర్లు మేర 30 వేల మందికి పైబడిన భక్తులతో జరిగిన ఈ వేడుక చినవెంకన్న వైభవాన్ని చాటింది. శ్రీనివాసా గోవిందా.. శ్రీ వేంకటేశా గోవిందా.. అంటూ భక్తులు చేసిన గోవింద నామస్మరణలు క్షేత్ర పరిసరాల్లో మార్మోగాయి. ఇదిలా ఉంటే గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తుల సౌకర్యార్థం దాతల సహకారంతో ఏర్పాటు చేసిన పండ్లు, టీలు, పాలు, ట్యాబ్లెట్లు, మంచి నీరు సక్రమంగా అందక భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఏదేమైనా ఎన్నడూ లేని విధంగా ఈసారి గిరి ప్రదక్షిణలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనడం విశేషం. -
వేతనాలు పెరగక వెతలు
నూజివీడు: ట్రిపుల్ ఐటీలోని కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వేతనాలు పెరగక.. ఉద్యోగ భద్రత లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీల్లో 2011 నుంచి 2014 వరకు ఇంజినీరింగ్ విద్యార్థులకు బోధన చేసేందుకు నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీల్లో 200 మంది కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించారు. అప్పట్లో ఆర్జీయూకేటీ వీసీ వి.రాజ్కుమార్ ఐఐటీలకు, ఎన్ఐటీలకు, సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లి అక్కడే ఇంటర్వ్యూలు నిర్వహించి మెరిట్ ఉన్న వారిని ఎంపిక చేసుకొని వారిని నియామక పత్రాలు ఇచ్చి నియమించారు. మీ అందరిని పర్మినెంట్ చేయిస్తాననే హామీతో అప్పట్లో వీరిని తీసుకువచ్చారు. అయితే పర్మినెంట్ సంగతేమో గాని కనీస వేతనాలను సైతం చెల్లించడం లేదని కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు వాపోతున్నారు. తమకు వేతనాలు పెరిగి ఏడేళ్లు అవుతోందని, గతంలో పలుమార్లు అడిగినా వేతనాలు పెంచకుండా తమకేమీ పట్టనట్టు ఆర్జీయూకేటీ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారని కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడేళ్లుగా కేవలం రూ.49 వేల వేతనానికే వారు పనిచేస్తున్నారు. ప్రస్తుతం నూజివీడు ట్రిపుల్ ఐటీలో 38 మంది, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో 12 మంది పనిచేస్తున్నారు. వీరంతా బోధన చేయడమే కాకుండా అదనపు బాధ్యతలను సైతం నిర్వర్తిస్తున్నారు. 200ల నుంచి 50 మందికి తగ్గిన వైనం వేతనాలు పెంచక.. పర్మినెంట్ చేయకుండా అనేక బాధ్యతలు అప్పగిస్తూ 24 గంటలూ పనిచేయించుకుంటున్న నేపథ్యంలో అత్యధిక శాతం మంది వేరే ప్రైవేటు సంస్థలు, ఇనిస్టిట్యూట్లలో అత్యధిక శాలరీ లభిస్తుండటంతో ట్రిపుల్ ఐటీలో ఉద్యోగాలు మానేశారు. ఇలా 200 మందిలో 150 మంది కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఇతర ఉద్యోగాలు చూసుకొని బయటకు వెళ్లిపోయారు. వెళ్లిపోయిన వారంతా రూ.లక్షల్లో వేతనాలను పొందుతూ ఆర్థికంగా ఉన్నత స్థానంలోకి వెళ్లడంతో తామెందుకు ఇక్కడ ఉన్నామా అని మిగిలిన వారు ఆవేదన చెందుతున్నారు. నల్ల రిబ్బన్లతో నిరసన కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు తమ వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ గత ఐదు రోజులుగా ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో నిరసన ప్రదర్శన చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సోమవారం నల్ల రిబ్బన్లు ధరించి విధులకు హాజరయ్యారు. మధ్యాహ్నం భోజన విరామం సమయంలో కొద్దిసేపు డైరెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ను కలిసి వేతనాలను పెంచాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఏడేళ్లుగా చాలీచాలని వేతనాలతో అవస్థలు ఇతర ఉద్యోగాలకు వెళ్లిపోయిన 150 మంది ఆందోళనకు దిగిన కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రభుత్వ టీచర్ ఉద్యోగం మానేసి భవిష్యత్ బాగుంటుందేమోనని ట్రిపుల్ ఐటీలో చేరా. టీచర్ ఉద్యోగంలోనే ఉండి ఉంటే నేడు రూ.1.50 లక్షల పైగా జీతం వచ్చేది. రిటైర్ అయ్యాక పింఛన్ వచ్చేది. ఇక్కడ జీతం లేదు, ఉద్యోగ భద్రత లేదు. – జాడ సీతాపతిరావు, తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ నాది ఉత్తరప్రదేశ్ కాగా గౌహతీ ఐఐటీలో పీహెచ్డీ చేశా. పర్మినెంట్ చేస్తామని హామీ ఇవ్వడంతో 2013లో ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరా. కానీ ఇంతవరకు పర్మినెంట్ చేయకపోగా.. వేతనాలు కూడా చాలా తక్కువ ఇస్తున్నారు. – విజయ్కుమార్ మిశ్రా, బయోసైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ -
పాము కాటు మరణంపై విచారణ
కలిదిండి(కై కలూరు): ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంతో తన భార్య మరణించిందని కలెక్టర్కు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఇటీవల ఫిర్యాదు అందింది. దీనిపై వైద్యాధికారులు కలిదిండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం విచారణ చేపట్టారు. కలిదిండి మండలం వెంకటాపురం గ్రామంలో అక్టోబరు 30న సిద్దాబత్తుల విజయ(32) దుకాణ ప్రిజ్లో పాలప్యాకెట్ విక్రయానికి తీస్తుండగా కింద నక్కిన నాగుపాము కాటు వేసింది. విషయాన్ని భర్త దుర్గారావుకు చెప్పడంతో కలిదిండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాడు. అక్కడ నుంచి కై కలూరు, చివరకు ఏలూరు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఆమె మరణించింది. సకాలంలో వైద్యం అందలేదనే దుర్గారావు ఫిర్యాదుతో వైద్యశాఖ జిల్లా ఫొగ్రాం ఆఫీసర్ నరేంద్ర కృష్ణ తన బృందంతో విచారణ చేశారు. దుర్గారావు మాట్లాడుతూ పాము కాటు నిమిత్తం తన భార్యను కలిదిండి పీహెచ్సీకి తీసుకువెళ్లినప్పుడు డాక్టర్ అందుబాటులో లేరన్నారు. నర్సు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి రెండు ఇంజక్షన్లు చేశారన్నారు. అక్కడ నుంచి కై కలూరు సీహెచ్సీకి వెళ్లామని, చికిత్స అనంతరం పరిస్థితి విషమించడంతో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి పంపారన్నారు. అక్కడ తన భార్య మరణించిందని, వైద్యుల నిర్లక్ష్యమే కారణమని వీడియో, లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. నివేదికను ఉన్నతాధికారులకు వివరిస్తామని విచారణ బృందం తెలిపింది. వ్యక్తిపై దాడి.. 15 మందిపై కేసు నమోదు ఉండి: ఓ వ్యక్తిపై జరిగిన దాడికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం చెరుకువాడ గ్రామానికి చెందిన ఆరేపల్లి శివనాగువెంకట సర్వేశ్వరరావు అనే వ్యక్తి బడ్డీకొట్టు, మాంసం వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 28వ తేదీన ఆకివీడు గ్రామానికి చెందిన జేమ్స్ అనే వ్యక్తి దుకాణానికి వచ్చి సిగరెట్ కావాలని అడిగాడు. ఈ విషయంలో ఇరువురి మద్య వాగ్వివాదం ఏర్పడింది. దీంతో జేమ్స్ మళ్లీ మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో మరో 15 మందిని వెంటబెట్టుకుని వచ్చి షాపు ధ్వంసం చేసి, తనను, తన తల్లిని, కుమారుడిని, అతని వద్ద పనిచేస్తున్న పిల్లి దుర్గా వెంకటరావులను కొట్టినట్లు సర్వేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఏలూరు రైల్వేస్టేషన్లో హెల్ప్లైన్ ఏర్పాటు
ఏలూరు (టూటౌన్): యలమంచిలి రైల్వే స్టేషన్లో సోమవారం ఉదయం జరిగిన టాటానగర్–ఎర్నాకులం రైలు ఫైర్ యాక్సిడెంట్కు సంబంధించి ఏలూరు రైల్వే స్టేషన్ నందు హెల్ప్లైన్ ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. హెల్ప్లైన్ నెంబర్ 75693 05268 కు కాల్ చేసి ప్రమాద వివరాలు, ప్రయాణ వివరాలు తెలుసుకోవచ్చునని తెలిపారు. సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు సంక్రాంతి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. జనవరి 8న రైలు నెం.07460 కాకినాడ టౌన్–వికారాబాద్, 9, 11 తేదీల్లో రైలు నెం.07461 పార్వతీపురం–వికారాబాద్, 10న ట్రైన్ నెం.07462 పార్వతీపురం–వికారాబాద్, 12న ట్రైన్ నెం.07463 పార్వతీ పురం–కాకినాడ టౌన్ ప్రత్యేకరైళ్లు నడుపనున్నారు. అలాగే జనవరి 8న ట్రైన్ నెం.07464 సికింద్రాబాద్–పార్వతీపురం, 9న ట్రైన్ నెం.07465 పార్వతీపురం–సికింద్రాబాద్, 7, 9 తేదీల్లో ట్రైన్ నెం.07186 కాకినాడ టౌన్–వికారాబాద్, 8న ట్రైన్ నెం.07185 వికారాబాద్–కాకినాడ టౌన్, 10న ట్రైన్ నెం.07187 వికారాబాద్–కాకినాడ మధ్య ప్రత్యక రైళ్లు నడుస్తాయని తెలిపారు. భీమవరం: వచ్చే నెల 3వ తేదీ నుంచి నాలుగు రోజులపాటు జరుగనున్న సౌత్జోన్ బ్యాడ్మింటన్ పోటీలకు భీమవరం విష్ణు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి బి జాయ్కుమార్ ఎంపికై నట్లు కళాశాల ఫిజికల్ డైరెక్టర్ ఎం శ్రీనివాసరావు చెప్పారు. ఈ నెల 26, 27 తేదీల్లో విజయవాడ వీఆర్ సిద్దార్ధ ఇంజనీరింగ్ కళాశాలలో జేఎన్టీయూకే బ్యాడ్మింటన్ సెలక్షన్స్లో తమ విద్యార్థి జాయ్కుమార్ ఎంపికయ్యాడన్నారు. ఈ సందర్భంగా ఎంపికై న విద్యార్థిని కళాశాల ప్రిన్సిపాల్ ఎం వేణు, వైస్ ప్రిన్సిపాల్ ఎం శ్రీలక్ష్మి, శ్రీనివాసరావు అభినందించారు. తాడేపల్లిగూడెం రూరల్: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని ఎల్.అగ్రహారం రాళ్ల సాహెబ్ల కాలనీ సమీపంలో సోమవారం జరిగింది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తాడేపల్లిగూడెం పట్టణం వీకర్స్ కాలనీకి చెందిన ఈగల గణేష్ (20) తాపీ పని చేస్తుంటాడు. ఆదివారం రాత్రి ఇంటికి రాకపోవడంతో ఎల్.అగ్రహారం జగనన్న కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇంటిని పరిశీలించగా ఫ్యాన్ హుక్కు ఉరివేసుకుని ఉండటాన్ని బంధువులు గుర్తించారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్లుగా రూరల్ పోలీసులు తెలిపారు. మృతుని సోదరుడు సతీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, రూరల్ ఎస్సై జేవీఎన్. ప్రసాద్ దర్యాప్తు చేస్తున్నారు. నైపుణ్యాలను పెంపొందించుకోవాలి నూజివీడు: పరిశ్రమలకు అవసరమైన స్కిల్స్ను చదువుకునేటప్పుడే పెంపొందించుకోవడంపై విద్యార్థులు దృష్టి పెట్టాలని ఎక్స్ ఐబీఎం, ఇండియా క్వాంటమ్ లీడ్ ఎల్ వెంకట సుబ్రహ్మణ్యం అన్నారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో సాంకేతిక మహోత్సవం టెక్జైట్ 25–2.0 ను సోమవారం రాత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ క్వాంటమ్ టెక్నాలజీ భవిష్యత్లో పరిశ్రమ రూపురేఖలను మార్చే శక్తిని కలిగి ఉందన్నారు. ఈ రంగంలో నైపుణ్యం సాధించిన విద్యార్థులకు ప్రపంచ వ్యాప్తంగా విస్తృత అవకాశాలుంటాయన్నారు. ఏపీ క్వాంటం మిషన్ డైరెక్టర్ సీవీ శ్రీధర్ మాట్లాడుతూ క్వాంటమ్ మిషన్ ద్వారా శాసీ్త్రయ పరిశోధనలకు ప్రోత్సాహం అందిస్తున్నామని, దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్, ఏఓ బీ లక్ష్మణరావు, డీన్ అకడమిక్స్ సాదు చిరంజీవి, టెక్జైట్ కన్వీనర్ పీ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. -
గిరిజనులపై దాడులు దుర్మార్గం
జంగారెడ్డిగూడెం: గిరిజనులపై దాడులు దుర్మార్గమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు అన్నారు. ఇనుమూరు గిరిజనులపై దాడులను ఖండించాలని, తప్పుడు కేసులు ఎత్తివేయాలని, గిరిజన భూ సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆదివాసీ గిరిజన సంఘం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో స్థానిక రెవెన్యూ డివిజనల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. గిరిజన సంఘం జిల్లా నాయకులు మొడియం నాగమణి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి, ఏజెన్సీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కుంజా రామారావు మాట్లాడారు. ఇనుమూరు గ్రామంలో మొత్తం 57 గిరిజన కుటుంబాల వారు సాగు చేసుకుంటున్న మొక్కజొన్న పంటను నాశనం చేయడంతోపాటు గిరిజన మహిళలపై విచక్షణారహితంగా దాడి చేసిన పోలీసు, రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే ఈ దాడులను ప్రోత్సహిస్తున్ననట్లు స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు. గిరిజనులపై తప్పుడు కేసులు ఎత్తివేయాలని, దాడికి పాల్పడ్డ తహసీల్దార్, ఎస్సై, భూస్వాములపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ యాక్ట్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్యాలయం సూపరిండెంట్కు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. వ్య.కా.స.జిల్లా అధ్యక్షురాలు తామా ముత్యాలమ్మ, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కారం భాస్కర్, మడకం సుధారాణి, బొరగం భూచంద్రరావు, తెల్లం సంకురుడు, రైతు సంఘం, డీవైఎఫ్ఐ, ఏజెన్సీ గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు. -
బాధ్యతతో అర్జీలు పరిష్కరించాలి
ఏలూరు(మెట్రో): జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజాసమస్యలు పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టరు ఎం.జె.అభిషేక్ గౌడ నిర్వహించారు. రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, ఆర్డీఓ అచ్యుత అంబరీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టరు మాట్లాడుతూ దరఖాస్తుల పరిష్కారంపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టి వారం వారం ప్రత్యేక రివ్యూ చేస్తున్నారని తెలిపారు. పీజీఆర్ఎస్ ఫిర్యాదులను నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలన్నారు. మండల స్థాయిలో జరిగే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదుదారులతో చిరునవ్వుతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కార చర్యలు తీసుకోవాలన్నారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఫిర్యాదుదారులు సంతృప్తి పడేలా సమస్యలు పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలన్నారు. అంగన్వాడీలను ఈఎస్ఐలో చేర్చాలి ఏలూరు (టూటౌన్): జిల్లాలోని అంగన్వాడీలందరినీ ఈఎస్ఐ పథకంలో చేర్చాలని ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్– హెల్పర్స్ యూనియన్(ఇఫ్టూ) జాయింట్ కలెక్టర్కు సోమవారం వినతిపత్రం సమర్పించింది. -
గొంతెత్తితే.. అణిచేస్తాం!
● 108 ఉద్యోగులపై వేధింపులు ● సమ్మె నోటీసు ఇచ్చిన యూనియన్ నేతలు ఏలూరు టౌన్: అపర సంజీవనిలా ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలిచిన 108 అత్యవసర సేవల అంబులెన్స్లు ఒకవైపు రోడ్లపై పరుగులెత్తలేక నీరసించిపోగా...మరోవైపు 108 అత్యవసర సేవల ఉద్యోగుల కష్టాలు వర్ణణాతీతం. తమకు జరుగుతోన్న అన్యాయాన్ని ధైర్యంగా బాహాటంగా గొంతు ఎత్తలేని దైన్యస్థితిలో ఉన్నారు. మాకు న్యాయం చేయమని అడిగితే.. రేపటి నుంచి ఉద్యోగం లేనట్లేనని చెబుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సదరు నిర్వహణ సంస్థ చెప్పిందే వేదంగా మారిందని, ఎన్నో ఏళ్లుగా సేవలు అందిస్తోన్న సీనియర్ సిబ్బందిని సైతం విధులకు హాజరుకావద్దంటూ చెప్పడం పరిస్థితికి అద్దం పడుతోంది. గొంతెత్తితే అణచివేస్తామనే ధోరణిలో 108 అత్యవసర సేవల నిర్వహణ సంస్థ వ్యవహరిస్తోందని సిబ్బంది బావురుమంటున్నారు. సిబ్బందిపై వేధింపులు? ఏలూరు జిల్లాలో 28 అత్యవసర సేవల అంబులెన్స్లు ఉన్నాయి. టీడీపీ సర్కారు పాలనలో 108 సేవల నిర్వహణ బాధ్యతలను గత 7 నెలలుగా భవ్య హెల్త్ సర్వీసెస్ సంస్థకు అప్పగించారు. సదరు సంస్థ పాలకులకు సంబంధించి సన్నిహిత వర్గానికి చెందటంతో ... ప్రశ్నించే వారు ఉండకూడదనే రీతిలో సిబ్బందిని అణచివేసే ధోరణి అవలంభించడం విమర్శలకు తావిస్తోంది. గతానికి భిన్నంగా 108 సిబ్బంది యూనియన్ను సైతం భయపెట్టేలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కనీసం తమ బాధను చెప్పుకునే స్వేచ్చ లేకపోవటంపై సిబ్బంది మానసికంగా తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. జీతాలు, సమస్యల పరిష్కారంపై కొందరు సిబ్బంది గట్టిగా నిలదీయంతో లేని కారణాలు సాకుగా చూపుతూ విధుల నుంచి తొలగిస్తూ పొట్టకొడుతున్నారని అంటున్నారు. అసలు జీతాల్లోనూ కోతలే ఏలూరు జిల్లాలో 108 అంబులెన్స్ సేవల్లో మెడికల్ టెక్నీషియన్లు, పైలట్లు (డ్రైవర్స్) సుమారుగా 140 మంది వరకూ విధులు నిర్వర్తిస్తూ ఉంటారు. 108 అత్యవసర సేవల్లో గతం నుంచి వస్తోన్న విధానాలను అవలంభించకుండా కొత్త సంస్థ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని సిబ్బంది ఆరోపిస్తున్నారు. 10 ఏళ్ళుగా మెడికల్ టెక్నిషియన్లుగా పనిచేస్తున్న వారికి నెలవారీ జీతం రూ.30 వేల వరకూ ఉంటుంది. డ్రైవర్ (పైలట్)కు జీతం రూ.28 వేలు చెల్లిస్తారు. 5 ఏళ్ళ పైబడిన టెక్నీషియన్లకు జీతం రూ.25 వేలు, డ్రైవర్కు రూ.23 వేలు. కొత్తగా చేరితే రూ.20 వేలు, డ్రైవర్కు రూ.18 వేల వరకూ నిర్వహణ సంస్థ చెల్లిస్తుంది. కొంత కాలం క్రితం 108 ఉద్యోగులు రాష్ట్ర స్థాయి యూనియన్ ఆధ్వర్యంలో పోరాటం చేసేందుకు సిద్ధంపడగా ... సీఎం చంద్రబాబు సిబ్బందికి రూ.4 వేలు చెల్లించేలా జీవో ఎంఎస్ నెంబర్ 49ను విడుదల చేశారు. కొత్త నిర్వహణ సంస్థ బాధ్యతలు స్వీకరించి 7 నెలలు కావస్తున్నా నేటికీ అమలుకు నోచుకోలేదని సిబ్బంది చెబుతున్నారు. సిబ్బందికి పెంచిన సొమ్ము రూ.4 వేలు ఇవ్వకుండా రూ.2 వేలు కోత వేశారని అంటున్నారు. అసలు జీతంలో రూ.2 వేలు కోతవేశారని, అదనంగా ఇవ్వాల్సిన సొమ్ములు కలిపి సీనియర్ టెక్నీషియన్కు రూ.28 వేలు మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో సీనియర్ టెక్నీషియన్కు సుమారు రూ.6 వేల వరకూ కోత వేశారని చెబుతున్నారు. -
బైక్పై ఫొటోలుంటే దాడి చేసేస్తారా..?
దెందులూరు: బైక్పై మా ఫొటోలు ఉంటే దాడి చేసేస్తారా.. అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోందని దెందులూరు మా జీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెదపాడు మండలం ఏపూరు సర్పంచ్ రామకృష్ణ తన బైక్ నంబర్ ప్లేట్పై మాజీ సీఎం వైఎస్ జగన్, కొఠారు ఫొటోలు పెట్టుకోవడంతో రామకృష్ణపై టీడీపీ నేతలు చేసిన దాడిన ఖండించారు. దాడులు, దౌర్జన్యాలు అక్రమ కేసులు పెట్టి వేధించడం మంచి సంప్రదాయం కాదన్నారు. ప్రజలతో ఎన్నుకున్న సర్పంచ్కి పట్టపగలే గ్రామంలో రక్షణ లేకపోతే చంద్రబాబు ప్రభుత్వం ఇంక ఎవరికి రక్షణ కల్పిస్తుందని ప్రశ్నించారు. ఈ తరహా దాడులు, దౌర్జన్యాలను తానెప్పుడూ చూడలేదన్నారు. దెందులూరు నియోజకవర్గంలో తెలుగుదేశం శ్రేణు లు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త సంప్రదాయాన్ని తీసుకువచ్చి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు, అభిమానులను వేధి స్తున్నారని మండిపడ్డారు. బాధిత సర్పంచ్ రామకృష్ణని అబ్బయ్యచౌదరి ఫోన్లో పరామర్శించి ధైర్యం చెప్పారు. వైఎస్సార్సీపీతోపాటు పార్టీ లీగల్ సెల్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రామకృష్ణపై జరిగిన దాడిని జిల్లా ఎస్పీకి వివరించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరానన్నారు. రామకృష్ణ కేసును దగ్గరుండి పర్యవేక్షించాలని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ సభ్యులకు అబ్బయ్య చౌదరి సూచించారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే అనుమానం ఏపూరు దళిత సర్పంచ్పై టీడీపీ నాయకుల దాడి పాశవికం మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి ఆగ్రహం -
అతిరుద్ర మహాయజ్ఞం.. సంపూర్ణం
ఘనంగా ముగిసిన క్రతువునిడమర్రు: మందలపర్రు ఉమానీలకంఠేశ్వరస్వామి పంచాయతన క్షేత్రంలో ఈనెల 22 నుంచి నిర్వహిస్తున్న అతిరుద్ర మహాయజ్ఞ కార్యక్రమాలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ప్రవాస భారతీయుడు, యజ్ఞకర్త అక్కినప్రగడ శ్రీరాఘవేంద్ర సాయి శర్మ మాట్లాడుతూ స్వదేశం సుభిక్షంగా ఉండాలని కోరుతూ యజ్ఞం చేపట్టామని, ఈ హో మాల నుంచి వచ్చే వాయువుతో గాలి మరింత స్వచ్ఛత సంచరించుకుంటుందన్నారు. అందుకు సంబంధించిన వాయుకాలుష్య నమోదు యంత్రాలు యాగశాలలో, గ్రామంలోని పలువురి నివాసాలపై ఏర్పాటు చేశామన్నారు. ఈ వారంలో రిపోర్టులు అందుతాయన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో సుమారు 5 వేల మంది భక్తులు పాల్గొన్నారు. పూడిపెద్ది నరసింహశర్మ, వింజమూరి సత్యనారాయణమూర్తి శర్మ పర్యవేక్షణలో పండితులు యజ్ఞ పూజలు నిర్వహించారు. -
పుట్టింటికి వెళ్లొస్తూ మృత్యుఒడికి..
● అక్కాతమ్ముళ్లు దుర్మరణం ● భర్తకు తీవ్ర గాయాలు ● సత్తుపల్లి శివారులో ఘటన చింతలపూడి: పెళ్లయి ఐదు నెలలే అయ్యింది.. పుట్టింటిపై మమకారంతో భర్తతో కలిసి వెళ్లి తిరిగి మెట్టింటికి తోడబుట్టిన తమ్ముడితో కలిసి ద్విచక్ర వాహనంపై వస్తుండగా లారీ రూపంలో మృత్యువు వారిని కబళించింది. ఆదివారం తెలంగాణలోని సత్తుపల్లి శివారులోని తమ్మిలేరు బ్రిడ్జిపై ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీ కొట్టిన ప్రమాదంలో అక్కాతమ్ముడు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, భర్తకు తీవ్రగాయాలయ్యాయి. పెనుబల్లి మండలం సూరయ్య బంజరు గ్రామానికి చెందిన పుచ్చ కృష్ణయ్య, రమాదేవి దంపతుల కుమార్తె తేజస్విని (18)కి ఏలూరు జిల్లా చింతలపూడి మండలం కండ్రికగూడెం గ్రామానికి చెందిన తోట మధుతో ఐదు నెలల క్రితం వివాహమైంది. పుట్టింటికి వచ్చిన కొత్త దంపతులు తిరిగి కండ్రికగూడెం బయలుదేరారు. దమ్మపేట మండలం చీపురుగూడెం ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న తేజస్విని తమ్ముడు పుచ్చా దేవేందర్ (13)ను కూడా ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని పయనమయ్యారు. మార్గమధ్యంలో సత్తుపల్లి శివారు తమ్మిలేరు బ్రిడ్జిపై వస్తుండగా వెనుక నుంచి వస్తున్న లారీ ఢీ వీరిని కొట్టింది. దీంతో అక్కాతమ్ముడు తేజస్విని, దేవేందర్ అక్కడికక్కడే మృతిచెందారు. భర్త తోట మధు తీవ్రంగా గాయపడటంతో అంబులెన్స్లో సత్తుపల్లి ఆస్పత్రికి తీసుకువెళ్లగా ప్రథమ చికిత్స అందించి విజయవాడ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించి సత్తుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో కుమార్తె, కుమారుడు ఒకేసారి చనిపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తేజస్విని, దేవేందర్ల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతులు తేజస్విని, దేవేందర్ (ఫైల్) -
నడిరోడ్డుపై విద్యుత్ స్తంభం
● ఇప్పటికే ట్రాఫిక్తో సతమతం ● వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు, ప్రజలు మండిపాటు నూజివీడు: హైమాస్ట్ వీధి లైట్ల ఏర్పాటు పేరుతో మున్సిపల్ పాలకవర్గం, అధికారులు తీసుకున్న నిర్ణయంపై వైఎస్సార్సీపీ కౌన్సిలర్లతో పాటు పట్టణ ప్రజలు సైతం మండిపడుతున్నారు. పట్టణంలోని చిన్నగాంధీబొమ్మ సెంటర్ జంక్షన్లో వీధిలైట్ల ఏర్పాటు కోసం తారురోడ్డు మధ్యలో విద్యుత్ స్తంభం ఏర్పాటు చేసేందుకు గుంతను తవ్వడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అసలే ఇరుకు రోడ్లతో ఎదురెదురుగా వాహనాలు వస్తేనే తప్పుకోవడానికి వీలేలేని పరిస్థితిలో వి ద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేస్తే జంక్షన్ రోడ్డు నుంచి బస్టాండు రోడ్డుకు బస్సులు, లారీలు ఏవీ కూడా మలుపు తిరగడానికి వీలుండదని అంటున్నారు. ఇప్పటికే ట్రాఫిక్ స్తంభించిపోయి ప్రజలు అవస్థలు పడుతుంటే ఇక్కడ విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేస్తే గంటలు తరబడి వాహనాలు నిలిచిపో తాయని చెబుతున్నారు. రోడ్డు మధ్యలో విద్యుత్ స్తంభమా? చిన్నగాంఽధీ బొమ్మ సెంటర్లో సర్కిల్ లేకుండా రోడ్డు మధ్యలో విద్యుత్ స్తంభాన్ని ఎలా ఏర్పాటు చేస్తారని మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ప్రశ్నించారు. ప్రజలను ఇబ్బందులు పాలుచేయడానికే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. అంతగా లైట్లు పెట్టాలనుకుంటే ఉన్న విద్యుత్ స్తంభాలకు ఏర్పాటు చేస్తే సరిపోతుందన్నారు. వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు, కౌన్సిలర్ అయిన శీలం రాము, మున్సిపల్ వైస్ చైర్మన్ కొమ్ము వెంకటేశ్వరరావు ఆదివారం మాట్లాడుతూ రోడ్డు 30 అడుగుల వెడల్పు కూడా లేని చిన్నగాంధీబొమ్మ సెంటర్లో రోడ్డు మధ్యలో విద్యుత్ స్తంభాన్ని ఏలా ఏర్పాటు చేస్తారని, ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలన్నారు. -
కొనసాగిన అధ్యాపకుల నిరసన
నూజివీడు: తమకు వేతనాలు పెంచాలని డి మాండ్ చేస్తూ నూజివీడు ట్రిపుల్ఐటీలోని కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు నాలుగో రోజైన ఆదివారం నిరసన కొనసాగించారు. పలు వురు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లపై ఆర్జీయూకేటీ ఉన్నతాధికారులు సత్వరమే స్పందించాలని డిమాండ్ చేశారు. ఏడేళ్లుగా తాము ఒకే జీతంతో పనిచేస్తున్నామని, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినా తమ వేతనాలను మాత్రం పెంచలే దని వాపోయారు. పలువురు మెంటార్ల వీరికి సంఘీభావం తెలిపారు. కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు రుద్రం చింతయ్యనాయుడు, సతీష్, మధుసూదన్రెడ్డి, వేణుగోపాల్, భరత్, సుబ్బారావు, విజయశ్రీ, భవాని, దీప్తి సాహూ, లక్ష్మణరావు, సీతాపతిరావు పాల్గొన్నారు. ఆకివీడు: స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ నుంచి మూలలంక బోదె వరకు డ్రెయిన్ నిర్మాణానికి ఎట్టకేలకు లైన్ కట్టి నిర్మాణ పనులు చేపట్టారు. ఇటీవల ‘సాక్షి’లో వచ్చిన కథనానికి స్పందించి ట్రాన్స్ఫార్మర్లు, రిలయన్స్ మార్ట్ వద్ద వంకర్లు లేకుండా లైన్ లాగి ముగ్గువేసి పనులు నిర్వహిస్తున్నారు. స్థానికంగా జాతీయ రహదారికి చేర్చి ఉన్న వ్యాపార సంస్థలు, ఇళ్ల దారుల వద్ద నుంచి కొంత సొమ్ము సేకరించి నిర్మాణ పనులు చేపట్టారు. పనులు పీపీపీ పద్ధతిపై జరుగుతుండటం, నాణ్యతలేమిపై స్థానికులు పెదవి విరుస్తున్నారు. పక్కాగా డ్రెయి నేజీ నిర్మించాలని కోరుతున్నారు. యలమంచిలి: కుమారుడిపై కన్నతండ్రి కత్తితో దాడి చేసిన సంఘటన మండలంలోని కొంతేరులో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. కొంతేరులో సిర్రా సుబ్బారావుకు రెండు పోర్షన్ల ఇల్లు ఉంది. ఒక పోర్షన్లో సుబ్బారావు, మరో పోర్షన్లో కుమారుడు మధు ఉంటున్నారు. కొన్నాళ్లుగా కుమారుడిని ఇల్లు ఖాళీ చేయమని తండ్రి చెబుతున్నా ఖాళీ చేయడం లేదు. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం సుబ్బారావు బండ కత్తితో మధుపై దాడి చేశాడు. మధు తలపై మోదడంతో గాయమైంది. మధును పాలకొల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. యలమంచిలి హెడ్ కానిస్టేబుల్ వై.మనోహర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తణుకు అర్బన్: వైఎస్సార్ విగ్రహానికి టీడీపీ నాయకులు చంద్రబాబు ఫ్లెక్సీ ఏర్పాటుచేసి వి వాదాస్పదం చేసిన ప్రాంతంలో తణుకు రూ రల్ పోలీసులు 144 సెక్షన్ విధించినట్టు ప్రకటించారు. తణుకు వై.జంక్షన్లోని వైఎస్సార్ విగ్రహం వద్ద 144 సెక్షన్ ఏర్పాటుచేశామని, ప్రజలు గుంపులుగా చేరడం, ర్యాలీలు, సమావేశాలు, ధర్నాలు, ప్రదర్శనలు తదితర కార్యక్రమాలు నిర్వహించడం నిషేధమంటూ ఆదివారం రాత్రి ఫ్లెక్సీ ఏర్పాటుచేశారు. అలాగే ఆటోలో మైక్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. భీమవరం(ప్రకాశంచౌక్): జిల్లా కలెక్టరేట్తో పాటు మండల, మున్సిపల్ కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అర్జీలు స్వీకరిస్తామన్నారు. అలాగే ప్రజలు 1100 టోల్ఫ్రీ నంబర్కు సంప్రదించి సమస్యలను తెలియజేయవచ్చని సూచించారు. -
వైఎస్సార్టీఏ జిల్లా కమిటీ ఎన్నిక
ఏలూరు (ఆర్ఆర్పేట): వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ ఏలూరు జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక ఆదివారం స్థానిక ఏఆర్డీజీకే హైస్కూల్లో జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి గెడ్డం సుధీర్ హాజరయ్యారు. రాష్ట్ర కార్యదర్శి సు న్నం శ్రీను, రాష్ట్ర మహిళా ప్రతినిధి శారద సమక్షంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నా రు. జిల్లా అధ్యక్షునిగా వడ్లమూడి రామ్మోహనరా వు, ప్రధాన కార్యదర్శిగా పగడాల సాంబశివరావు, గౌరవ అధ్యక్షుడిగా బి. సువర్ణ రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్గా బి.జోసఫ్ రాజు, కె.ప్రకాష్, ఉ పాధ్యక్షుడిగా ఎల్.కుమార్, కార్యదర్శిగా భూక్య హనుమంతరావు, కోశాధికారిగా కె.అర్జున రావు, మహిళా కా ర్యదర్శిగా పి.శ్రీలత, ఆడిట్ కమిటీ సభ్యుడిగా పి. సోమరాజులను ఎన్నుకున్నారు. అనంతరం సుధీర్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగం అస్తవ్యస్తంగా మారిందన్నారు. యాప్లు, బోధనేతర కార్యకలా పాలతో ఉపాధ్యాయులను వేధించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన అధ్యక్షుడు రామ్మోహనరావు మా ట్లాడుతూ జిల్లాలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం, విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సమస్యలపై పోరాటాలకు వెనకాడబోమన్నారు. ఉపాధ్యాయులు సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. జిల్లాలో వైఎస్సార్టీఏను బలోపేతం చేసే దిశగా భవిష్యత్ కార్యాచరణ చేపడతామని, మండల స్థాయిలో కూడా అసోసియేషన్ను నిర్మించి ఉపాధ్యాయులను ఏకతాటిపైకి తీసుకురావడానికి కృషి చేస్తామన్నారు. -
జీవనోపాధికి శిక్షణలు దోహదం
నరసాపురం రూరల్: యువత, మహిళల జీవనోపాధికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ దోహదపడుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆదివారం మండలంలోని పెదమైనవానిలంకలో ఆమె పర్యటించారు. డిజిటల్ భవనంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్–ఫ్యూచర్ స్కిల్స్ హబ్ను ఆమె ప్రారంభించారు. తమ ఫౌండేషన్ 120కి పైగా ప్రభుత్వ పాఠశాలలను డిజిటలైజ్ చేసి 35,000 మందికి పైగా విద్యార్థులకు డిజిటల్ అక్షరాస్యతతో చేరువైందని సైయెంట్ వ్యవస్థాపక చైర్మన్ బీవీఆర్ మోహన్రెడ్డి తెలిపారు. అభివృద్ధి పనులకు శ్రీకారం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి శ్రీకారం చుట్టారు. సముద్ర కోతకు గురికాకండా చే పట్టిన రక్షణ గోడ నిర్మాణ పనులు త్వరలోనే పూర్తవుతాయన్నారు. 146 మందికి పీఎం ఆవాస్ యో జన కింద ఏడాదిలోపు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆదేశించారు. మత్స్యకారులకు బోట్లు, వలల కోసం దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని త్వర గా మంజూరు చేయాలన్నారు. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రులు ప య్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు మా ట్లాడారు. సభలోఎమ్మెల్యేలు బొమ్మిడి నాయకర్, పితాని సత్యనారాయణ, కలెక్టర్ నాగరాణి తదితరులు పాల్గొన్నారు. -
ఫ్లవర్ ఫుల్ జోష్
గులాబీలు.. లిల్లీలు.. తులీప్లు.. వంటి పూలతో చేసిన బొకేలు ఇచ్చి కొత్త సంవత్సరానికి హార్ట్ ఫుల్గా వెల్కమ్ చెప్పేందుకు జిల్లావాసులు సిద్ధమయ్యారు. సాధారణంగా మ్యారేజ్ ఫంక్షన్లు, పబ్లిక్ మీటింగ్లు, బర్త్డే పార్టీలు, సన్మానాలు ఇలా ఏ అకేషన్ అయినా శుభాకాంక్షలు చెప్పేందుకు బొకేలు ఇస్తుంటారు. ముఖ్యంగా న్యూఇయర్ గ్రీటింగ్స్ చెప్పేందుకు ఎక్కువ మంది బొకేలపై ఆసక్తి చూపడంతో వీటికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో ముందస్తు బుకింగ్లు జోరుగా సాగుతున్నాయి. ఏలూరులో కొత్త సంవత్సర వేళ బొకేల వ్యాపారం సుమారు రూ.2 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. పుష్పగుచ్ఛం.. స్వాగతిద్దాం పూల బొకేలకు యమ డిమాండ్ న్యూ ఇయర్కు ముందస్తు బుకింగ్లు ఏలూరులో జోరుగా వ్యాపారం -
గిరి ప్రదక్షిణకు సర్వం సిద్ధం
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో స్వామి గిరి ప్రదక్షిణకు, ఉత్తర ద్వార దర్శనానికి సర్వం సిద్ధమైంది. ఏటా ముక్కోటి ఏకాదశి పర్వదినం ముందు రోజు గిరి ప్రదక్షిణను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ క్రమంలోనే ఈ సారి కూడా ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 5 కిలోమీటర్ల మేర జరిగే గిరి ప్రదక్షిణలో పాల్గొనే గోవింద స్వాములు, భక్తుల పాదాల రక్షణకు మార్గంలో ఎండు గడ్డిని పరిచారు. దారి పొడవున టెంట్లు నిర్మించి, ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేశారు. గిరి ప్రదక్షిణ మహోత్సవం సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు స్వామివారి తొలిమెట్టు (పాదుకా మండపం) వద్ద ప్రారంభం అవుతుంది. గజ, అశ్వ, వృషభ సేవలు, చిత్రవిచిత్ర వేషధారణలు, డప్పు వాయిద్యాలు, కోలాట నృత్యాల నడుమ ఈ గిరి ప్రదక్షిణ మల్లేశ్వరం(దొరసానిపాడు రోడ్డు) మీదుగా గిరి చుట్టూ తిరిగి ఆలయానికి చేరుతుంది. ఉత్తర ద్వార దర్శనానికి దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. క్యూలైన్ల వద్ద షామియానా పందిళ్లు నిర్మించారు. సప్తగోకులం పక్కన ఉత్తర ద్వార దర్శనం స్వాగత ద్వారం ఏర్పాటు చేశారు. విద్యుద్దీప అలంకారాలు పూర్తి కాగా.. క్షేత్రం కాంతులీనుతోంది. ధర్మప్రచార రథాన్ని ముస్తాబు చేస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున 5 గంటల నుంచి శ్రీవారు దర్శనమిచ్చే ఉత్తర ద్వారం వద్ద పూల అలంకరణ పనులు సోమవారం సాయంత్రం నుంచి ప్రారంభం కానున్నాయి. సేవకు సిద్ధం గిరి ప్రదక్షిణ, ఉత్తర ద్వార దర్శనంలో పాల్గొనే భక్తులకు సేవలందించేందుకు 400 మంది సేవకులు సిద్ధంగా ఉన్నారు. గిరి ప్రదక్షిణలో దారి పొడవున భక్తులకు మంచినీరు, బిస్కెట్లు, పండ్లు, పాలను అందించనున్నారు. గిరి ప్రదక్షిణ, ఉత్తర ద్వార దర్శనంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలోని 110 మంది పోలీస్ సిబ్బందిని ఈ ఉత్సవాల్లో నియమిస్తున్నారు. నేటి రాత్రి నుంచి నిజరూప దర్శనం.. గిరి ప్రదక్షిణ అనంతరం భక్తులకు శ్రీవారి నిజరూప దర్శన భాగ్యం కలగనుంది. ఏడాదిలో ఒకసారి మాత్రమే స్వామివారు ఎలాంటి అలంకరణలు లేకుండా, దీపపు వెలుగుల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఈ దర్శనం సోమవారం రాత్రి 7 గంటల నుంచి మంగళవారం సాయంత్రం వరకు ఉంటుంది. గిరి ప్రదక్షిణ మార్గంలో పరిచిన ఎండు గడ్డి దారి పొడవునా టెంట్లు, ఫ్లడ్ లైట్ల ఏర్పాటు నేడు రాత్రి 7 గంటల నుంచి స్వామి నిజరూప దర్శనం 110 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు -
గంజాయి పట్టివేత
బుట్టాయగూడెం: ద్విచక్ర వాహనంపై గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి సుమారు 10.150 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలవరం డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. ఆదివారం సాయంత్రం జీలుగుమిల్లి సర్కిల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ జీలుగుమిల్లి మండలం సరిహద్దు ప్రాంతంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను ఆపి తనిఖీ చేసినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో ద్విచక్ర వాహనం సీటు కింద గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా.. నిందితులిద్దరూ ఒడిశా బోర్డర్ పరిసర ప్రాంతం నుంచి గంజాయి కొనుగోలు చేసి కామారెడ్డి వైపు అక్రమంగా తరలిస్తున్నట్లు వెల్లడైందని అన్నారు. పట్టుబడిన ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు. రాజ్పుత్ కమల్సింగ్, ఆకుల వంశీలను గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు. గంజాయి సరఫరా వెనుక ఉన్న ముఠా, ఇతరుల పాత్రపై విచారణ చేస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. భీమడోలు: పూళ్లలో వివాహిత అదృశ్యం కేసుపై భీమడోలు పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. గ్రామానికి చిగురుపాటి హరిబాబు తన భార్య శనివారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిపోయిందని, ఆచూకీ దొరకలేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్యాభర్తలు గొడవ పడడంతో ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయిందని తెలిసింది. పరిసర గ్రామాల్లో వెదికినా ఆచూకీ లభించలేదని ఫిర్యాదులో భర్త పేర్కొన్నాడు. -
మంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు
బుట్టాయగూడెం : కోర్కెలు తీర్చే తల్లిగా, వరాలిచ్చే అమ్మగా, గిరిజన ఆరాధ్య దేవతగా పూజలందుకుంటున్న గుబ్బల మంగమ్మ తల్లి గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. చలికాలం అయినప్పటికీ, మంచు కురుస్తున్నప్పటికీ తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు మంగమ్మ తల్లి గుడికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. వివిధ జిల్లాల నుంచి ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, బస్సుల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. ముదినేపల్లి రూరల్ : సింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్లోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉదయానికే జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామి పుట్టలో పాలుపోసి దర్శించుకున్నారు. మహిళలు పాలపొంగళ్ల శాల వద్ద నైవేద్యాలు తయారుచేసి స్వామికి సమర్పించారు. నాగబంధాల వద్ద అధిక సంఖ్యలో భక్తులు పూజలు చేశారు. గోకులంలోని గోవులకు మహిళలు పసుపు,కుంకుమలతో పూజలు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అదనపు ప్రసాదాల కౌంటర్లను ఏర్పాటుచేశారు. కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మను ఆదివారం ఎక్కువ సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. భక్తులు సమీప కోనేరులో స్నానాలు ఆచరించి వేడి నైవేద్యాలు సమర్పించారు. విరాళాలు, వాహన పూజలు, వివిధ సేవల రూపంలో రూ.34,125 వచ్చింది. నూజివీడు : నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఈ నెల 29న ప్రారంభం కానున్న టెక్జైట్ 25–2.0లో భాగంగా విద్యార్థులకు హ్యాకథాన్ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. కృత్రిమ మేథస్సు, మెషిన్ లెర్నింగ్ రంగాల్లో నూతన ఆలోచనలు, సృజనాత్మక పరిష్కారాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా హ్యాకథాన్ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎస్ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ పీ శ్యామ్ మాట్లాడుతూ నేటి సాంకేతిక యుగంలో కృత్రిమ మేథస్సు, మిషన్ లెర్నింగ్ వంటి ఆధునిక సాంకేతికతలు యువత భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. ఇలాంటి హ్యాకథాన్లు విద్యార్థులలో ఆవిష్కరణ శక్తిని, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం: నకిలీ కంపెనీ పెట్టి మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడు వీరంకి శ్రీరాములను అరెస్టు చేసినట్లు ఎస్సై ఎన్వీ ప్రసాద్ తెలిపారు. తాళ్లపూడి మండలం తిరుగుడు మెట్టకు చెందిన వీరంకి శ్రీరాములు, వంకాయల సతీష్, పట్టణానికి చెందిన మండపాక వినోద్కుమార్లు జంగారెడ్డిగూడెంకు చెందిన ఒక కంపెనీలో పనిచేస్తున్నారు. వీరు కంపెనీ నుంచి బయటకు వచ్చిన తరువాత అదే కంపెనీ పేరు వచ్చేలా మరో కంపెనీ పెట్టారు. ఖాతాదారులను, రైతులను మభ్య పెట్టి మోసం చేయడంతో వీరు పనిచేసే కంపెనీ చైర్మన్ బాలకృష్ణ ఫిర్యాదు చేశారు. ఈ కేసులో గతంలో సతీష్, వినోద్కుమార్ను అరెస్టు చేయగా.. కోర్టు రిమాండ్ విధించింది. ప్రధాన నిందితుడైన శ్రీరాములు పరారీలో ఉన్నాడు. ఆదివారం జీలుగుమిల్లి చెక్పోస్టు వద్ద నిందితుడు శ్రీరాములను చేసి కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు 15 రోజులు రిమాండ్ విధించినట్లు చెప్పారు. -
‘పోలవరం’ లేకుండానే కొత్త జిల్లా
బుట్టాయగూడెం: జిల్లాల పునర్విభజన నేపథ్యంలో రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కసరత్తు కొలిక్కి వచ్చింది. గత నెల 27న తొలి నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగానే చింతూరు, రంపచోడవరం డివిజన్ల పరిధిలో ఉన్న 11 మండలాలతో రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుకు ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసి ఆయా ప్రాంతాల ప్రజల అభ్యంతరాలు తెలిపేందుకు నెల రోజులు వ్యవధి ఇచ్చింది. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను సీఎం సమీక్షించిన అనంతరం పోలవరం జిల్లా ఏర్పాటులో ఎలాంటి మార్పులు, చేర్పులు లేవని ప్రాథమికంగా ప్రభుత్వం తెలిపింది. దీనితో పోలవరం లేకుండానే రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించి ఈ నెల 31న తుది నోటిఫికేషన్ జారీ కానుంది. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న పోలవరం జిల్లా పోలవరం లేకుండా ఏర్పాటు చేయడంపట్ల నియోజకవర్గంలోని మండలాల్లో గిరిజన సంఘాల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. తమ అభిప్రాయాలను తెలియజేస్తూ పలువురు నాయకులు కలెక్టర్ కె. వెట్రిసెల్వికి, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందజేశారు. అభ్యంతరాల గడువు ముగియడంతో వాటిని పరీశీలించిన ప్రభుత్వం డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ విడుదల చేయనుంది. -
ఆట అదరగొట్టారు
నవంబర్ నెలలో నరసరావుపేటలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆద్వర్యంలో జరిగిన పోటీల్లో ధనుష్ సాయి 50, 100 మీటర్ల బట్టర్ఫ్లై విభాగంలో రెండు గోల్డ్ మెడల్స్, 100 మీటర్ల ఫ్రీ స్టయిల్లో సిల్వర్ మెడల్ సాధించారు. మరో క్రీడాకారిణి పూర్వి 50 మీటర్ల బటర్ ఫ్లై, 200 మీటర్ల ఐవీ విభాగంలో రెండు గోల్డ్మెడల్స్, 200 మీటర్ల ఫ్రీ స్టయిల్లో బ్రాంజ్మెడల్ సొంతం చేసుకోగా, మోక్ష ప్రియ 50, 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ విభాగంలో రెండు సిల్వర్ మెడల్స్, 200 మీటర్ల ఐఎం విభాగంలో బ్రాంజ్ మెడల్ చేజిక్కించుకున్నారు. డిసెంబర్లో ఏలూరులో 7వ పారా స్విమ్మింగ్ చాంపియన్షిప్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో పాల్గొన్న దివ్యాంగులు అద్భుత ప్రతిభ చాటారు. ఏలూరు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ స్విమ్మింగ్ కోచ్ బలగా గణేష్ పాక్ జలసంఽధి ఈధి అరుదైన ఘనత సాదించాడు. శ్రీలంక, భారతదేశం సరిహద్దుల మధ్య 31 కిలోమీటర్ల మేర సముద్రంలో పాక్ జలసంధిలో ఈత కొట్టారు. ఏలూరు రూరల్: 2025వ సంవత్సరం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా క్రీడాకారులకు కొత్త అనుభూతినిచ్చింది. 2025లో సైతం ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా క్రీడాకారులు ఉమ్మడి జిల్లా జట్లగానే పోటీపడ్డారు. బాస్కెట్బాల్, అథ్లెటిక్స్, వెయిట్లిఫ్టింగ్, స్విమ్మింగ్, బాక్సింగ్ తదితర క్రీడల్లో జిల్లా బాలబాలికలు జాతీయ, రాష్ట్ర స్థాయిలో రాణించారు. క్రీడా వికాస కేంద్రాలు అభివృద్ధి చేస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించినప్పటికీ పనులు ముందుకు సాగలేదు. క్రీడా ప్రాంగణాలు, ఆట స్థలాలు, మౌలిక వసతులు అభివృద్ది కాలేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టిన వైఎస్ఆర్ క్రీడా పురస్కారాలు, ఆడుదాం ఆంధ్ర పోటీలను కూటమి ప్రభుత్వం అటకెక్కించింది. జాతీయ పోటీలకు ఎంపిక ఏప్రిల్ నెల 9వ తేదీ నుంచి 16 వరకూ పాండిచ్చేరిలో జరిగిన 40వ జాతీయస్థాయి అండర్–16 యూత్ బాస్కెట్బాల్ పోటీల్లో రాష్ట్ర జట్టుకు ఏలూరుకు చెందిన ఏ రుత్విక, ఎం.సోమశేఖర్, కస్తూరిబా బాలికల పాఠశాల విద్యార్థిని నందిని ప్రాతినిథ్యం వహించారు. ఏలూరు సాయ్ సెంటర్లో శిక్షణ పొందుతున్న పి.దివ్య వెయిట్ లిఫ్టింగ్లో రాణించింది. ఏప్రిల్లో జూనియర్ నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో సిల్వర్ చేజిక్కించుకుంది. స్కేటింగ్లో పతకాలు జూన్ 13 నుంచి 15 వరకూ కాకినాడలోని జోనల్ స్థాయి స్కేటింగ్ పోటీలు జరిగాయి. ఇందులో పాల్గొన్న శిఖా సహస్ర అండర్–12 విభాగంలో మూడు సిల్వర్ మెడల్స్, ఒక బ్రాంజ్ మెడల్ సాధించింది. అండర్–10 విభాగంలో శిఖా రమేష్బాబు బ్రాంజ్ మెడల్ చేజిక్కించుకున్నాడు. అథ్లెటిక్స్లో విజయాలు ఆగస్టులో డిసెంబరు 9 నుంచి 11 వరకూ బాపట్ల జిల్లా చీరాలలో జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో సాకిల్బాబు 100 మీటర్ల పరుగు పందెంలో విజేతగా నిలిచాడు. కొన్నేళ్లుగా నిలకడగా రానిస్తున్న సాకిల్ బాబు బెస్ట్ అథ్లెట్గా అవార్డు అందుకున్నాడు. డిసెంబర్ 7న తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ కరాటే చాంపియన్షిప్ పోటీల్లో ఏలూరు అమలొద్బవి పాఠశాల విద్యార్థి లక్కపాము సుహాన్ బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకున్నాడు. బాక్సింగ్లో పతకాలు డిసెంబర్ 21, 22 తేదీల్లో పిఠాపురంలో జరిగిన ఎలైట్ సీనియర్ ఉమెన్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొనన ఆశ్రం వైధ్య కళాశాల విద్యార్థిని భావన లక్ష్మీ సిల్వర్ మెడల్ సాధించింది. సెయింట్ జోసఫ్ డెంటల్ కళాశాల విద్యార్థిని వాణి 65 కేజీల కేటగిరిలో బ్రాంజ్ మెడల్ చేజిక్కించుకుంది. ఆంధ్ర క్రికెట్ జట్టులో మునీష్వర్మ జిల్లా క్రికెటర్ బి.మునీష్వర్మ ఆంధ్ర టీ20 క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. డిసెంబర్లో జరిగిన అంతర జిల్లాల పోటీల్లో పాస్ట్ బౌలర్, బ్యాట్స్మెన్గా ప్రతిభ చాటిన మునీష్వర్మను సెలక్టర్లు ఆంధ్ర జట్టుకు ఎంపిక చేసారు. ఈ ఏడాది వివిధ క్రీడాంశాల్లో సత్తాచాటిన ఉమ్మడి జిల్లా క్రీడాకారులు బాస్కెట్బాల్ పోటీల్లో విజేతగా నిలిచిన పశ్చిమ జట్టు వెయిట్లిఫ్టింగ్, స్విమ్మింగ్ పోటీల్లో పతకాలు రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ పోటీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బాస్కెట్బాల్ బాలికల జట్టు జయకేతనం ఎగరేసింది. విజయవాడలో బాస్కెట్బాల్ అసోసియేషన్ మొట్టమొదట సారి నిర్వహించిన అండర్–23 చాంపియన్షిప్ టోర్నీ సొంతం చేసుకుంది. ఫైనల్లో తూర్పుగోదావరి జట్టుపై 47–17 స్కోర్తో గెలిచి విజేతగా అవతరించింది. నవంబర్ 7 నుంచి 10 వరకూ విశాఖపట్నంలో జరిగిన ఇంటర్ డిస్ట్రిక్ట్ మహిళల, పురుషుల బాస్కెట్బాల్ చాంపియన్షిప్ పోటీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి మహిళల జట్టు జయకేతనం ఎగరేసింది. విశాఖపట్నంతో హోరాహోరీగా తలపడింది. ఫైనల్ పోరులో 54–52 స్కోర్తో విజేతగా నిలిచింది. -
బాడీ బిల్డింగ్లో సత్తా చాటిన భానుప్రకాష్
ఈ ఏడాది మార్చిలో ఏలూరుకు చెందిన భానుప్రకాష్ బాడీ బిల్డింగ్లో పతకం సాధించాడు. షిర్డీలో జరిగిన సీనియర్, జూనియర్ ఇండియన్ బాడీ బిల్డింగ్, ఫిట్నెస్ ఫెడరేషన్ నిర్వహించిన పోటీల్లో 55 కేజీల విభాగంలో బంగారు పతకం సొంతం చేసుకున్నాడు. భానుప్రకాష్ ఏలూరు, భీమవరం, ఆకివీడు, రాజమండ్రి, కడప, శ్రీకాకుళం, చింతలపూడి, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో జరిగిన జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయి పోటీల్లో పదుల సంఖ్యలో గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ చేజిక్కించుకున్నాడు. వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో మహిళలు అద్భుత ప్రతిభ, ప్రదర్శించారు. ఏలూరు ఖేలో ఇండియా సెంటర్ బాలికలు 15 పతకాలు సాధించారన్నారు. ఇందులో 10 గోల్డ్మెడల్స్, 5 సిల్వర్ మెడల్స్ ఉన్నాయి -
ముగిసిన నృత్యోత్సవాలు
ఏలూరు (ఆర్ఆర్పేట): నగరంలోని వైఎంహెచ్ఏ హాలులో రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో మూడు రోజులుగా నిర్వహిస్తున్న అభినయ నృత్యభారతి 30వ జాతీయ స్థాయి నృత్యోత్సవాలు, నృత్య పోటీలు ఆదివారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు 150 వారి ప్రతిభా పాటవాలు ప్రదర్శించారు. విజేతలకు జ్ఞాపికలు, నగదు బహుమతులు అందించారు. లయన్స్ జిల్లా గవర్నర్ ఎన్వీవీఎస్ పాపారావు నాయుడు నృత్యోత్సవాలను ప్రారంభిస్తూ భవిష్యత్తులో ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో యూత్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రాంలు నిర్వహిస్తామని తెలిపారు. గాయత్రి కూచిపూడి నృత్యం, కుమారి తులిక రెడ్డి ఒడిస్సీ నృత్యం, డీ.చక్రవర్తి కూచిపూడి నృత్యం, సంతోష్ పేరిణి శివతాండవం, చక్రవర్తుల పవన్ కుమార్ కూచిపూడి, వరంగల్లుకు చెందిన వైష్ణవి పేరిణి లాస్యం, కాకినాడకు చెందిన బీ. మల్లిఖార్జునరావు ప్రదర్శించిన భరతనాట్యం ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశాయి. వీరికి సంస్థ తరపున నృత్య కౌముది అవార్డులు అందించారు. ప్రఖ్యాత కూచిపూడి నృత్య గురువు పసుమర్తి శేషుబాబును భరత కళాప్రపూర్ణ కోరాడ నరసింహారావు స్మారక నృత్య రంగ సేవా తపస్వి అవార్డుతో సత్కరించారు. అనంతరం జాతీయ స్థాయి నృత్య పోటీల్లో విజేతలకు అతిథుల ద్వారా బహుమతులు అందచేశారు. -
ప్రభుత్వ స్థలాలపై అక్రమార్కుల కన్ను
సాక్షి నెట్వర్క్: పేదలకు ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం సేకరించిన భూమిపై అక్రమార్కుల కన్ను పడింది. ఇంకేముంది రాత్రి పూట అక్రమంగా చేపల చెరువుల కోసం తవ్వకాలు మొదలు పెట్టేశారు. విషయం తెలుసుకున్న అధికారులు వెళ్లి అడ్డుకుని వాటిని నిలుపుదల చేశారు. అయినా తవ్వకాలు జరుగుతుండడంతో సాక్షాత్తూ తహసీల్దార్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. వివరాల ప్రకారం వడ్డిగూడెం గ్రామ శివారు ఆర్పీ పాలెంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకుగాను అదే గ్రామానికి చెందిన రాళ్లపల్లి అచ్యుతరావు నుంచి ఎకరం భూమిని, వారి సోదరులకు చెందిన మరికొంత భూమిని ప్రభుత్వం సేకరించింది. గత కొంతకాలంగా ఖాళీగా ఉన్న ఆ భూమిలో కొందరు చేపల చెరువు తవ్వేందుకు ఈనెల 11వ తేదీన ఉపక్రమించారు. విషయం తెలిసిన అచ్యుతరావు పెదపాడు పోలీసులకు, తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు చేపల చెరువు తవ్వుతున్న పొక్లెయిన్లను బయటకు పంపి తవ్వకాలు నిలుపుదల చేశారు. మా ఎమ్మెల్యేగారు తవ్వుకోమన్నారు.. ఎవరు వచ్చినా తవ్వకాలు ఆపం అంటూ అక్రమార్కులు బదులివ్వడంతో జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ చెరువు తవ్వకం ఆగకపోగా, కూటమి నాయకుల అండదండలతో చెరువు తవ్వకం పూర్తి చేశారని అచ్యుతరావు ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమి అని ఎలాంటి చర్యలు చేపట్టరాదని బోర్డు పెట్టినా.. ఆ బోర్డును తొలగించి మరీ తవ్వకాలు చేపట్టారంటూ వాపోయారు. దీంతో పెదపాడు తహసీల్దార్ కూడా పోలీసులకు రాత పూర్వకమైన ఫిర్యాదు చేసి సంబంధిత కాపీలను ఉన్నతాధికారులకు నివేదించారు. చేపల చెరువుల కోసం అక్రమంగా తవ్వకాలు ఇళ్ల స్థలాల కోసం ఆ భూమి సేకరణ అక్రమ తవ్వకాలపై పోలీసులకు తహసీల్దార్ ఫిర్యాదు చేపల చెరువు తవ్విన భూమి ప్రభుత్వ భూమి. అక్కడ చెరువు తవ్వకూడదని చెప్పినా రాత్రి సమయాల్లో తవ్వకాలు చేశారు. దీంతో సంబంధిత వ్యక్తులపై పెదపాడు పోలీసులకు ఫిర్యాదు చేశాను. వీఆర్వోకు షోకాజ్ నోటీస్ జారీచేశాం. – ఏ కృష్ణ జ్యోతి, పెదపాడు తహసీల్దార్ -
ట్రిపుల్ఐటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నిరసన
నూజివీడు: ఎనిమిదేళ్లుగా జీతాలను పెంచకుండా ట్రిపుల్ఐటీ యాజమాన్యం తమకు తీరని అ న్యాయం చేస్తోందని కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొ ఫెసర్లు ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలను పెంచాలని డిమాండ్ చేస్తూ శనివారం డైరెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. తమకు 6వ వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా వేతనాన్ని ఫిక్స్ చేశారని, చివరిసారిగా 2018లో జీతాలను పెంచారన్నారు. అప్పటినుంచి జీతాలు పెంచకపోవడంపై ట్రిపుల్ఐటీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోయారు. 2010–14 కాలంలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ఎంతమంది చేరారు, వారి నియామకం ఎలా జరిగిందనే వాటికి సమాధానం ఇవ్వమని ప్రభుత్వం కోరినా ట్రిపుల్ఐటీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మూడు నెలలుగా సమాధానం రాసి ప్రభుత్వానికి పంపకుండా జాప్యం చేయడమేంటని ప్రశ్నించారు. ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్ సూచన మేరకు రెండు రోజుల పాటు నిరసన ప్రదర్శనను వాయిదా వేసుకున్నామని, అయినా ఉన్నతాధికారులను కలిసే అవకాశం రా లేదని వాపోయారు. తమ న్యాయమైన డిమాండ్లను ఆర్జీయూకేటీ పరిష్కరించాలని కోరారు. -
మృత్యువు మాటేసి.. తీరని శోకాన్ని మిగిల్చి..
ద్వారకాతిరుమల: తమకు ఆసరాగా ఉంటారనుకున్న కుమారులు మృత్యువాత పడటం ఆ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది.. ఇప్పుడే వచ్చేస్తానంటూ బయటకు వెళ్లిన పిల్లలు విగత జీవులుగా పడి ఉండటాన్ని చూసి కన్నపేగు కన్నీళ్లు పెడుతోంది.. దేవుడా ఇంత అన్యాయం చేశావేంటయ్యా.. ఆశలన్నీ పిల్లలపైనే పెట్టుకున్నామంటూ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ద్వారకాతిరుమల, తిమ్మాపురం గ్రామాల్లో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. ద్వారకాతిరుమలకు చెందిన సయ్యద్ రఫీ (22), కొయ్యగూర శ్రీరామ్ (బన్నీ)(21), తిమ్మాపురానికి చెందిన మాండ్రాజు చరణ్ (25) స్నేహితులు. వీరంతా స్థానికంగా డెకరేషన్ పనులు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ద్వారకాతిరుమలలో జరిగే ఓ ఫంక్షన్కు డెకరేషన్ కోసం పూలు కొనేందుకు చరణ్ తమ్ముడు రాజేష్కు చెందిన బైక్పై వీరు ముగ్గురు శుక్రవారం రాత్రి ఏలూరు వెళ్లారు. రాత్రి 1 గంట సమయంలో చరణ్కు రాజేష్ ఫోన్ చేసి ఎక్కడున్నావని అడగ్గా, వచ్చేస్తున్నానని చెప్పాడు. ఎంతకీ రాకపోయే సరికి శనివారం వేకువజామున 4 గంటలకు రాజేష్ మళ్లీ ఫోన్ చేశాడు. అయితే ఆ ఫోన్ లిఫ్ట్ చేసిన కానిస్టేబుల్ భీమడోలు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చరణ్, మరో ఇద్దరు మృతి చెందిన విషయాన్ని చెప్పారు. బైక్ చరణ్ నడుపుతున్నట్టుగా నిర్ధారించారు. ఇది లా ఉంటే పోలీసులు మరో మృతుడు శ్రీరామ్ ఫోన్ తీసి, అతడి ఫింగర్ ప్రింట్ ద్వారా లాక్ తీసి, పూల డెకరేషన్ యజమాని మొయ్యే శివకు సమాచారం అందించారు. దీంతో ద్వారకాతిరుమల, చుట్టుపక్కల గ్రామాలకు చెందిన మృతుల స్నేహితులు హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లారు. పోస్టుమార్టం అనంతరం ఆంబులెన్స్లో గ్రామానికి చేరుకున్న మృతదేహాలను స్నేహితులు భారీ బైక్ ర్యాలీతో ఇళ్లకు చేర్చారు. కంగారుగా వెళుతూ.. ప్రమాదానికి గురై.. తన అన్న కుమారుడు శ్రీరామ్ మృతి చెందాడన్న వార్త తెలుసుకున్న కొయ్యగూర రవి కంగారుగా బైక్పై భీమడోలు వెళుతుండగా కుక్క అడ్డురావడంతో కింద పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఘటనా స్థలంలో శ్రీరామ్ కొన ఊపిరితో ఉన్నట్టు తనకు తెలిసిందని, వెంటనే ఆస్పత్రికి తీసుకెళితే బతుకుతాడన్న ఆశతో వెళుతుండగా ప్రమాదం జరిగిందని రవి చెప్పాడు. అయితే ఘటనా స్థలానికి అంబులెన్స్ చేరుకున్న తరువాతే శ్రీరామ్ మృతి చెందాడని అన్నాడు. తల్లిదండ్రుల ఆశలు ఆవిరి చేతికందొచ్చిన కొడుకులు దూరం రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం తిమ్మాపురం, ద్వారకాతిరుమలలో విషాద ఛాయలు సయ్యద్ రఫీ తల్లిదండ్రులు షేక్ సలీమా, షుకూర్లు 20 ఏళ్ల నుంచి వేరుగా ఉంటున్నారు. సలీమా స్థానికంగా ఓ చెప్పుల షాపులో పనిచేస్తోంది. 10వ తరగతితో చదువు మానేసిన రఫీ పూల డెకరేషన్ పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి డెకరేషన్ పనికి వెళుతున్నట్టు రఫీ తన తల్లికి చెప్పి బయటకు వెళ్లాడు. తెల్లవారే సరికి కొడుకు మరణవార్త విని సలీమా కుప్పకూలిపోయింది. ఆధారంగా ఉంటాడనుకున్న కొడుకు దూరమయ్యాడంటూ తల్లడిల్లిపోతోంది. కొయ్యగూర సుబ్బారావు, కుసుమకుమారి దంపతులకు శ్రీరామ్ రెండో సంతానం. డిగ్రీ మధ్యలో ఆపేసి పూల డెకరేషన్ పని చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో బయటకు వెళుతున్నానని ఇంట్లో చెప్పాడు. తల్లి కుసుమ కుమారి, అక్క శిరీష వద్దన్నా వినకుండా.. వెంటనే వచ్చేస్తానంటూ వెళ్లాడు. తిరిగి విగతజీవిగా ఇంటికి చేరాడు. శ్రీరామ్ అకాల మరణాన్ని కుటుంబ సభ్యులు, బంధువులు జీర్ణించుకోలేక పోతున్నారు. మండ్రాజు సర్వేశ్వరరావు, సుజాత దంపతులకు ఇద్దరు సంతానం కాగా చరణ్ పెద్దవాడు. ఇంటర్ మధ్యలో ఆపేసి పూల డెకరేషన్ పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి తమ్ముడి కొత్త బైక్ను తీసుకుని రఫీ, శ్రీరామ్ లతో కలసి ఏలూరు వెళ్లాడు. అదే బైక్ నడుపుతూ ప్రమా దానికి గురై మృత్యువాత పడ్డాడు. వీరి కుటుంబానికి తెల్లవారు 4 గంటలకు విషయం తెలియగా.. బంధువులతో పాటు తిమ్మాపురం ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. -
ప్రమాదం.. అంచున!
● అధ్వానంగా రోడ్డు మార్జిన్లు ● 16 నెలలుగా మరమ్మతుల్లేవు ● మంత్రి ఇలాకాలోనూ పనులు కరువు నూజివీడు: నూజివీడు ప్రాంతంలో రహదారుల మార్జిన్లు కొట్టుకుపోయి 16 నెలలు గడిచినా మరమ్మతులకు నోచుకోవడం లేదు. గతేడాది ఆగస్టు 31న సంభవించిన వరదలకు మండలంలోని పలు రోడ్డు మార్జిన్లు కోతకు గురయ్యాయి. దీంతో వా హనచోదకులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా రాత్రిపూట ప్రమాదాల ముప్పు పొంచి ఉందని ఆవేదన చెందుతున్నారు. రాష్ట్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన చోట్ల పరిస్థితి చెప్పాల్సిన పనిలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పలుచోట్ల కోత నూజివీడు నుంచి సుంకొల్లు వెళ్లే రహదారిపై ఈదుల చెరువు కట్టపై మార్జిన్ కోతకు గురై ప్రమాదకరంగా మారింది. ఏమాత్రం ఆదమరిచినా 20 అడుగుల లోతులో ఉన్న చెరువులోకి పడాల్సిందే. రాత్రిళ్లు కారు, ట్రాక్టర్ వంటి వాహనాలు ఎదురైతే ద్విచక్ర వాహనదారులు ప్రమాదానికి గురికావడం ఖాయం. అలాగే నూజివీడు నుంచి బోర్వంచ వెళ్లే రోడ్డులో పట్టణంలోని సెయింట్థామస్ హైస్కూల్ వెనుక భాగంలోని మలుపు వద్ద పెద్ద అగాధం ఏర్పడింది. ఇక్కడా ఏదైనా భారీ వాహనం ఎదురైతే ప్రమాదం పొంచి ఉంది. సుంకొల్లు చెరువుకట్టపై ఉన్న తారురోడ్డు మార్జిన్ కోతకు గురై ప్రమాదకరంగా ఉంది. 16 నెలలుగా మరమ్మతులు చేయించడం లేదు. కార్లు, ట్రాక్టర్లు ఎదురైనప్పుడు సైకిల్పై గడ్డిమోపు తీసుకెళ్లడానికి కూడా వీలుండటం లేదు. – కలపాల రవి, సుంకొల్లు రహదారి మార్జిన్ ధ్వంసమై 16 నెలలు అయినా పట్టించుకోకపోవడం దారుణం. ప్రజా సమస్యల పరిష్కారంపై పాలకుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం. అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేయించాలి. – జి.రాజు, సీపీఎం నేత, నూజివీడు -
పట్టిసం శివరాత్రి ఏర్పాట్లపై మొదటి సమావేశం
పోలవరం రూరల్: మహాశివరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఉత్సవ కమిటీ చైర్మన్, జంగారెడ్డిగూడెం ఆర్డీవో ఎంవీ రమణ అధికారులను ఆదేశించారు. శనివారం పోలవరం మండలం పట్టిసం రేవులో ఫిబ్రవరి 15న జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు సంబంధించి చేసే ఏర్పాట్లపై తొలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ గతంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో జరిగిన లోటుపాట్లను సరిచేసుకుంటూ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టాలన్నారు. 2వ సమావేశం నాటికి అధికారులందరూ చేసే ఏర్పాట్లపై ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు. జమా ఖర్చుల విషయంలో నిబద్ధతతో వ్యవహరించాలన్నారు. డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు పోలీసు శాఖ నిర్వహించే విధులపై వివరించారు. ప్రధానంగా గతేడాది ఇసుక తిన్నెలు, శివక్షేత్రం వైపు విద్యుత్ అలంకరణ విషయంలో కొంత లోటు కనబడిందని అది సరిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. లడ్డూ ప్రసాదం వేలం నిర్వహించడం లేదు ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి మాట్లాడుతూ గతేడాది ఉత్సవాలకు ముందు రూ.10 టిక్కెట్ ధర పెంచారని, ఈ మేరకు వచ్చిన ఆదాయాన్ని ఎందుకు ఖర్చు చేశారనే విషయాన్ని తెలియజేయలేదన్నారు. అలాగే దేవస్థానం వద్ద లడ్డూ ప్రసాదం వేలం నిర్వహించడం లేదని, గతంలో వేలం నిర్వహించడం వల్ల లడ్డూలో నాణ్యతను పాటించేవారని పేర్కొన్నారు. లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు సంతృప్తికరంగా అందించాలన్నారు. ఉత్సవాలకు ఆదాయం సమకూరడం లేదు సర్పంచ్ సబ్బారపు శ్రీరామమూర్తి మాట్లాడుతూ పట్టిసం ఫెర్రీ వేలం పాట ఆదాయం రూ.13 లక్షలు చేకూరుతుందని, ఖర్చులు రూ.25 లక్షల వరకు అవుతున్నాయని, ప్రతి ఏటా ఉత్సవాలకు ఖర్చు చేసిన ఆదాయం సమకూరడం లేదని, పంచాయతీలో ఏర్పాట్లు చేసిన వారికి బకాయిలు ఉన్నాయన్నారు. దేవస్థానం అధికారులు కొంత సొమ్ము ఇస్తామని ప్రకటించినా గత రెండేళ్లుగా ఒక్క రూపాయి కూడా పంచాయతీకి చెల్లించలేదన్నారు. అన్ని విషయాలను చర్చించామని, ఏర్పాట్ల విషయంలో ఏ విధమైన రాజీ పడవద్దని ఉత్సవ కమిటీ చైర్మన్ ఆదేశించారు. కార్యక్రమంలో పోలవరం సీఐ బాల సురేష్బాబు, ఎస్సై ఎస్ఎస్ పవన్కుమార్, దేవస్థానం ఈవో సీహెచ్ వెంకటలక్ష్మి, డీఎల్పీవో సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు ఇలా..
● స్వామివారి తొలిమెట్టు (పాదుకా మండపం) వద్ద సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఆలయ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు, అనువంశిక ధర్మకర్త ఎస్వీఎన్ఎన్ నివృతరావు, ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ డీవీ భాస్కర్, తదితరులు కొబ్బరికాయలు కొట్టి, జెండా ఊపి గిరి ప్రదక్షిణ వేడుకను ప్రారంభిస్తారు. ● ఈ యాత్ర మల్లేశ్వరం (దొరసానిపాడు రోడ్డు) మీదుగా గిరి చుట్టూ తిరిగి కొండపైన ఆశ్రమం వద్దకు చేరుతుంది. అక్కడి నుంచి ఉగాది మండపం మీదుగా ఆలయానికి చేరుకుంటుంది. ● 5 కిలోమీటర్లు మేర సాగే ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు మార్గ మధ్యలో మంచినీరు, పండ్లు, అల్పాహారాలు, టీలు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ● అలాగే ఆంబులెన్స్, నడవలేని భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ఉచిత బస్సును ఏర్పాటు చేస్తున్నారు. గిరి ప్రదక్షిణ అనంతరం భక్తులకు శ్రీవారి నిజరూప దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. ఏడాదికి ఒకసారి మాత్రమే ఉండే ఈ నిజరూప దర్శనం మంగళవారం సాయంత్రం వరకు ఉంటుంది. ఉచిత దర్శనం భక్తులు, అలాగే రూ.100, రూ.200 టికెట్లు ద్వారా వెళ్లేవారు షాపింగ్ కాంప్లెక్స్ వెనుక ఉన్న క్యూలైన్ల ద్వారా తాత్కాలిక క్యూ కాంప్లెక్స్లోకి చేరుకుంటారు. అక్కడి నుంచి ఉత్తర రాజగోపురం మీదుగా ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఆన్లైన్లో రూ.100, రూ.200 టికెట్లు తీసుకున్న వారు షాపింగ్ కాంప్లెక్స్ వెనుక నుంచి ప్రత్యేక క్యూలైన్ ద్వారా ఆలయంలోకి వెళ్తారు. రూ.500 టికెట్లు తీసుకున్నవారు, అలాగే గోవింద స్వాములు, గ్రామస్తులు కొత్త అనివేటి మండపం నుంచి కొత్త క్యూ కాంప్లెక్స్లోకి ప్రవేశిస్తారు. అక్కడి నుంచి దక్షిణ రాజగోపురం మీదుగా ఆలయంలోకి చేరుకుంటారు. గ్రామస్తులు ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుంది. వీవీఐపీలు, వీఐపీలు, ప్రజాప్రతినిధులు తూర్పురాజగోపురం మీదుగా ఆలయంలోకి చేరుకుంటారు. నిత్యార్జిత కల్యాణంలో పాల్గొన్న భక్తులు పడమర రాజగోపురం పక్కనున్న ప్రత్యేక క్యూలైన్ ద్వారా, ఉత్తర రాజగోపురం నుంచి ఆలయంలోకి వెళ్తారు. దర్శనానంతరం భక్తులంతా ఆలయంలోంచి తూర్పు రాజగోపురం మీదుగా బయటకు వెళ్తారు. అక్కడ ఉచిత ప్రసాదాన్ని స్వీకరిస్తారు. పడమర రాజగోపురం నుంచి ఆలయ అర్చకులు, పండితులకు మాత్రమే ప్రవేశం. దర్శనం టికెట్లను క్యూలైన్లలోనే విక్రయిస్తారు. -
దళిత సర్పంచ్పై టీడీపీ మూకల దాడి
సాక్షి టాస్క్ఫోర్స్: దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ రౌడీ మూకలు దళిత సర్పంచ్పై దాడికి తెగబడ్డారు. బాధిత సర్పంచ్ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. పెదపాడు మండలం ఏపూరి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ దళిత సర్పంచ్ చోటగిరి రామకృష్ణ శనివారం ద్విచక్ర వాహనంపై నూజివీడు వెళ్లొస్తుండగా టీడీపీ నేతలు అడ్డగించారు. రామకృష్ణ బైక్ నంబర్ ప్లేట్పై ఉన్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి ఫొటోలు చూసిన టీడీపీకి చెందిన కొసరాజు వంశీ, అతని స్నేహితుడు బైక్ నుంచి రామకృష్ణను కిందకు లాగి కాళ్లతో తన్ని గాయపర్చారు. అలాగే అసభ్య పదజాలంతో దూషించారు. తనపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రామకృష్ణ పెదపాడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏలూరు(మెట్రో): పోలవరం ఆర్అండ్ఆర్ భూ సేకరణకు భూమి గుర్తింపు పనులు నెల రోజుల్లోగా పూర్తిచేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి శనివారం సాయంత్రం ఆర్అండ్ ఆర్ పునరావాస కార్యక్రమాలు, జాతీయ రహదారులు, రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం, సెల్ఫోన్ టవర్ల ఏర్పాటు నిమిత్తం భూసేకరణపై జూమ్ ద్వారా అధికారులతో సమీక్షించారు. భూసేకరణకు సంబంధిత గ్రామాల్లో పీసా కమిటీ సమావేశాలు నిర్వహించి ఆమోదం తీసుకోవాలన్నారు. మోదెలులో సెల్ఫోన్ ట వర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని బీఎస్ ఎన్ఎల్ అధికారులను ఆదేశించారు. దొరమామిడిలో పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల కాలనీ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని హౌసింగ్ పీడీకి సూచించారు. ఎన్హెచ్–165, గ్రీన్ఫీల్డ్ హైవే, జీలుగుమిల్లి–పట్టిసీమ, పెడన–లక్ష్మీపురం, పట్టిసీమ–గూటాల రహదారుల భూసేకరణ, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి ఏలూరు జిల్లాలో చేపట్టే భూసేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలన్నారు. జేసీ అభిషేక్ గౌడ, పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ అ భిషేక్, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఐటిడిఏ పీఓ రాములు నాయక్, ఆర్డీఓలు ఎం.అచ్యుత అంబరీష్, రమణ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): స్థానిక వైఎంహెచ్ఏ హాల్ లో అభినయ నృత్యభారతి సంస్థ 30వ వార్షిక జా తీయ స్థాయి నృత్యోత్సవాలు, నృత్య పోటీలు రెండో రోజు శనివారం ఆకట్టుకున్నాయి. టి.కావ్యారా వు (హైదరాబాద్) భరతనాట్యం, నిధికా లూంభా (బెంగళూరు) కథక్, వైష్ణవి మార్గం (వరంగల్) కూచిపూడి, రామ కౌండిన్య శ్రీభాష్యం (శ్రీకాకుళం)కూచిపూడి, ఛార్మిళా వెంకట్ (హైదరాబాద్) కూచిపూడి నృత్యాలతో అలరించారు. వీరందరికీ సంస్థ నిర్వాహకులు నృత్యకౌముది పురస్కారాలు అందించి సత్కరించారు. వీరితో పాటు సేవామూర్తులు ఆ లపాటి నాగేశ్వరరావు (మానవత సేవలు), బీవీ రమణ మూర్తి (విద్యారంగం), ఎంఎస్ చౌదరి (సినీ, నాటక రంగం), కమ్ముల ఆదినారాయణ (యోగా గురువు), పిలగల కొండలరావు (ప్రభుత్వసేవలు), లయన్ చిల్లపల్లి రామమోహనరావు (లయనిజం), ఎస్ఎం ఖాసీం ( సంగీతం), సాలా భోగేశ్వరరావు (సామాజిక సేవ), సాతుపాటి శ్యాంబాబు (స్వచ్ఛంద సేవలు)లకు సేవా తపస్వి అవార్డులు అందించినట్టు సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి దువ్వి హేహసుందర్ తెలిపారు. ద్వారకాతిరుమల: చినవెంకన్న క్షేత్రానికి శనివారం భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచి భక్తుల రాక మొదలవగా క్షేత్ర పరిసరాలు కిటకిటలాడాయి. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, ప్రసాదం ఇతర విభాగాల వద్ద రద్దీ కనిపించింది. -
విద్యారంగానికి గడ్డుకాలం
ప్రభుత్వ స్థలాలపై కన్ను పేదలకు ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం సేకరించిన భూమిపై అక్రమార్కుల కన్ను పడింది. చేపల చెరువుల కోసం తవ్వకాలు మొదలు పెట్టారు. 8లో uవిద్యారంగం తీవ్ర గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది.. విద్యారంగంపై చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపడం విమర్శలకు తావిస్తోంది.. పాఠశాలల అభివృద్ధి అడుగు కూడా ముందుకు పడకపోవడం, విద్యార్థి మిత్ర పథకంలో ఇచ్చిన స్కూల్ బ్యాగులు నాణ్యత లేకపోవడం, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, తల్లికి వందనంలో కోతలు, ఉపాధ్యాయులపై బోధనేతర భారం, డీఏల చెల్లింపులో ప్రభుత్వ నిర్లక్ష్యం.. మొత్తంగా 2025లో విద్యారంగం అస్తవ్యస్తంగా మారింది. ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్ శ్రీ 2025ఏలూరు (ఆర్ఆర్పేట): రెండేళ్లుగా విద్యారంగం అత్యంత గడ్డు పరిస్థితులను చూస్తోంది. భావిభారత పౌరులను తీర్చిదిద్దాల్సిన విద్యారంగంలో కూడా అవినీతి పేరుకుపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఈ ఏడాదిలో సర్వేపల్లి రాధాకష్ణన్ విద్యార్థిమిత్ర పథకం కింద చంద్రబాబు ప్రభుత్వం సరఫరా చేసిన స్కూల్ బ్యాగులు నాణ్యత లేక రెండు నెలలకే చిరిగిపోయాయి. అలాగే నాణ్యత లేని బూట్లు ఇప్పటికే పాడైపోవడంతో విద్యార్థులు చెప్పులతోనే తరగతులకు హాజరవుతున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు పంపిణీ చేయగా ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ట్యాబ్ కూడా ఇవ్వలేదనే విమర్శలు ఉన్నా యి. చంద్రబాబు సర్కారు ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి కార్పొరేట్ విద్యారంగంపై మమకారం చూపుతోందని విద్యారంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హామీల అమలెప్పుడో..? ఎన్నికలకు ముందు ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను 2025లోనూ చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలేసింది. 12వ పీఆర్సీ కోసం గత ప్రభుత్వం వేసిన కమిటీని రద్దు చేసిన ప్రభుత్వం ఇప్పటివరకూ నూతన కమిటీని వేయలేదు. కనీసం ఐఆర్ కూడా ప్రకటించకపోవడంతో ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే డీఏల చెల్లింపుపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపింది. 2024 జూలై, 2025 జనవరి, 2025 జూలైలో ఇవ్వాల్సిన డీఏల బకాయిలు ఉన్నాయి. నాలుగు రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో మరో డీఏ అంటే మొత్తంగా నా లుగు డీఏలను ప్రభు త్వం చెల్లించాలని ఉపాధ్యాయులు అంటున్నారు. గురువులకు బోధనేతర భారం ఉపాధ్యాయులకు బోధనేతర బాధ్యతలు అప్పగించడం ద్వారా విద్యార్థులను విద్యాభ్యాసానికి ప్రభుత్వం దూరం చేసిందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. యాప్ల భారాన్ని తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మరిన్ని యాప్ల భారాన్ని మోపింది. హాజరు నమోదు, ఇన్స్పెక్షన్, యూనిఫాం, పరిశుభ్రత, మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజనం, సాసా, కర్మయోగి ఇలా పలురకాల యాప్ల బాధ్యతలు అప్పగించింది. దీంతోపాటు పేరెంట్ టీచర్స్ కమిటీ సమావేశాలు ఉపాధ్యాయులకు భారంగా మారాయి. గురువులు తమ జేబుల్లోని సొమ్ములను సమావేశాల కోసం వెచ్చించాల్సి వస్తోంది. నిర్మాణాలు ఎక్కడికక్కడే.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మనబడి నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేయగా.. చంద్రబాబు ప్రభుత్వం ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. 2025లో జిల్లాలోని పాఠశాలల అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. దీంతో గత ప్రభుత్వంలో చేపట్టిన నిర్మాణాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పేదలకు ఉన్నత చదువులు దూరం పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలనే ఉన్నతాశయంతో ప్రారంభించిన ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది ఒక్క రూపాయి కూడా ఫీజు రీయింబర్స్మెంట్ నిమిత్తం చెల్లించలేదు. రెండో ఏడాది 2025లో అయినా నిధులు విడుదల చేస్తుందని ఎదురుచూసిన విద్యార్థులకు నిరాశే ఎదురైంది. ప్రభుత్వం కంటితుడుపు చర్యగా కొందరు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మాత్రమే నిధులు విడుదల చేసినట్టు ప్రచారం చేసుకుంది. అయితే వాస్తవంగా చాలామంది విద్యార్థులు నిధులు విడుదల కాక చదువులు మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. కొందరు తల్లిదండ్రులు అప్పులు చేసి ఫీజులు కట్టారని విద్యార్థి సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. పట్టిసంలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై తొలి సమావేశం జరిగింది. ఫిబ్రవరి 15న ఉత్సవాలు నిర్వహించనున్నారు. 8లో uచంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది తల్లికి వందనం సాయాన్ని ఎగ్గొట్టింది. తీవ్ర విమర్శలు రావడంతో 2025లో పథకాన్ని అమలు చేసినా నిధుల్లో భారీగా కోత విధించింది. జిల్లాలో 2,44,113 మంది తల్లులకు రూ.366.17 కోట్లు జమచేసినట్టు చెబుతున్నా అదంతా బూటకమనే విమర్శలు ఉన్నా యి. కొందరు తల్లులకు రూ.8 వేలు, మరికొందరికి రూ.9 వేలు, ఇంకొందరికి రూ.11 వేల చొప్పున మాత్రమే ఖాతాల్లో జమయ్యాయి. మిగిలిన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే తల్లుల ఖాతాల్లో జమచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పి తల్లులకు పంగనామం పెట్టింది. ప్రభుత్వ విద్య.. అంతా మిథ్య పాఠశాలల అభివృద్ధి పట్టని ప్రభుత్వం గురువులకు ఇచ్చిన హామీలు గాలికి.. బోధనేతర పనులతో ఒత్తిడి ‘తల్లికి వందనం’లో కోతలు ఫీజు రీయింబర్స్మెంట్కు ఎగనామం 2025లో విద్యారంగం అస్తవ్యస్తం -
మహిళ హత్యకేసును ఛేదించిన పోలీసులు
బుట్టాయగూడెం: మర్లగూడెం అటవీప్రాంతంలో జరిగిన మహిళ హత్యకేసును పోలవరం సబ్ డివిజన్, జీలుగుమిల్లి సర్కిల్ పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. నిందితుడు యడ్లపల్లి గణేష్ను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. శనివారం బుట్టాయగూడెం పోలీస్ స్టేషన్లో జీలుగుమిల్లి సీఐ వెంకటేశ్వరరావు వివరాలను వెల్లడించారు. బుట్టాయగూడెం మండల పరిధిలోని మర్లగూడెం అటవీప్రాంతంలో ఈనెల 24న గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. కేసు నమోదు చేసిన పోలీసులు హత్యా కోణంలో దర్యాప్తు చేశారు. మృతురాలు నల్లజర్ల మండలం పోతవరం గ్రామానికి చెందిన పామర్తి శిల్పారాణి(25)గా గుర్తించారు. భర్త వెంకటేశ్వరరావు మరణించడంతో శిల్పారాణి తన స్వగ్రామం కొయ్యలగూడెం మండలం సరిపల్లిలో తల్లిదండ్రుల వద్ద నివసిస్తోంది. ప్రస్తుతం జంగారెడ్డిగూడెం పాతబస్టాండ్ సమీపంలో ఉన్న దళితవాడలో నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తోంది. కొయ్యలగూడెం మండలం రామానుజపురంనకు చెందిన యడ్లపల్లి గణేష్ అనే యువకుడు, మృతురాలికి మధ్య ఉన్న వ్యక్తిగత తగాదాల కారణంగా ఆమెను అటవీ ప్రాంతానికి తీసుకువచ్చి తలపై కర్రతో మోది హత్యకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందని సీఐ చెప్పారు. మృతదేహం వద్ద ఆధారాలు లభించకపోయినా సాంకేతిక ఆధారాలతో కేసు చేధించామన్నారు. కేసును ఉన్నతాధికారుల సహకారంతో త్వరితగతిన చేధించిన బుట్టాయగూడెం ఎస్సై డి.దుర్గామహేశ్వరరావు, జీలుగుమిల్లి ఎస్సై, సిబ్బంది తదితరులను ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్, పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు అభినందించారన్నారు. -
ఇనుమూరు గిరిజనులకు న్యాయం చేయాలి
ఏలూరు (టూటౌన్): బుట్టాయగూడెం మండలం ఇనుమూరు గిరిజనులపై దాడులు, నిర్బంధాలు, అక్రమ పోలీసు కేసులు ఆపాలని, గిరిజన భూసమస్యలు పరిష్కరించి న్యాయం చే యాలని ఆదివాసీ గిరిజన, వ్యవసాయ కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. ఇనుమూరు గిరిజనులకు అండగా ఈనెల 29న జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం, 30న ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నాలు నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. శనివారం ఏ లూరు అన్నే భవనంలో ఏపీ రైతు సంఘం జి ల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రామ్మోహనరా వు, సీపీఐ జిల్లా నాయకుడు కన్నబాబు, ఎంసీపీఐ (యు) జిల్లా కార్యదర్శి నాగరాజు, ఆల్ ఇండియా లా యర్స్ యూనియన్ జిల్లా నాయకుడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): నగరానికి చెందిన ప్రముఖ కూచిపూడి నా ట్య గురువు, కళారత్న కేవీ సత్యనారాయణకు ఆంధ్ర సారస్వత పరిషత్తు పూర్ణకుంభ పురస్కారాన్ని ప్రకటించింది. జనవరి 3 నుంచి గుంటూరులో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలు కార్యక్రమాల్లో కేవీఎస్కు పురస్కారం ప్రదానం చేయనున్నట్టు ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ ప్రకటనలో తెలిపారు. -
గ్రీన్ ఫీల్డ్ హైవే వద్ద రైతుల నిరసన
కొయ్యలగూడెం: వ్యవసాయ పొలాలు ముంపు బారిన పడకుండా గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రాంతం వద్ద వరద నీటి సరఫరాకి తూరలు ఏర్పాటు చేయాలని రైతులు శనివారం ఆందోళన చేశారు. పొంగుటూరు–కన్నాయిగూడెం గ్రామాల సమీపంలో గ్రీన్ ఫీల్డ్ హైవే స్మాల్ వెహికల్ అండర్ పాస్ (ఎస్వీయూపీ) వంతెన నిర్మాణం జరిగిందని అయితే వరద సమయంలో హైవేకి ఇరువైపులా ఉండే నీటి పారుదలకు వీలు లేకుండా నిర్మాణం చేశారని రైతులు ఆరోపించారు. దీనివల్ల వర్షాల సమయంలో, వరదలు సంభవించినప్పుడు నీరు పారుదల లేక ఎగువన ఉన్న పొలాలు ముంపు బారిన పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఇప్పటికే గ్రీవెన్స్ ద్వారా కలెక్టర్కి రెండు సార్లు ఫిర్యాదు చేసినా పరిష్కారం లభించలేదని తెలిపారు. పొంగుటూరు, కన్నాయగూడెం, యాదవోలు రోడ్డు సైతం గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం వలన అధ్వానంగా తయారైందని, దానికి కూడా హైవే నిర్వాహకులు బాధ్యత వహిస్తామని చెప్పి, ఆపై నిర్లక్ష్యం చేశారని రైతులు, ప్రజలు పేర్కొన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏలూరు(మెట్రో)/ భీమవరం (ప్రకాశం చౌక్): రాష్ట్రంలో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ అధికారులపై జీఎస్డబ్ల్యూఎస్ అధికారులు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని ఒత్తిడి చేయడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్ర రాజు శనివారం ఒక ప్రకటనలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకపక్క రెవెన్యూలో అనేక విధులతో వీఆర్వోలు ఇబ్బందులు పడుతూ ఉంటే, మరో పక్క గ్రామ, వార్డు, సచివాలయల అధికారులు ఇచ్చిన సర్వేలు, బయోమెట్రిక్, ఇతర ఆదేశాలు అమలు చేయాలని ఒత్తడి చేయడం తగదన్నారు. ఈ నెల 19న రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ దృష్టికి వీఆర్వోల సమస్యలను తీసుకువెళ్లామని, 24న ఆయన ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారన్నారు. అయినా ఉన్నతాధికారులు ఆదేశాలు ఇవ్వకపోగా, రెవెన్యూ విధులతో పాటు జీఎస్డబ్ల్యూఎస్, సర్వేలు, ఇతర విధులు చేయాలని ఒత్తిడి చేయడం జరుగుతుందన్నారు. తమ సమస్యల పరిష్కారంపై రెవెన్యూ ఉన్నత అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతామన్నారు. ప్రకటన విడుదల చేసిన వారిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలనాయుడు ఉన్నారు. -
చిన వెంకన్నా.. వస్తున్నాం
ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రంక్యూలైన్లలో ప్రతి 30 అడుగులకు ఒక అత్యవసర ఎగ్జిట్ గేటును ఏర్పాటు చేశారు. అడుగడుగునా మంచినీటి సౌకర్యం, అల్పాహారం, స్నాక్స్ అందించేందుకు 400 మంది సేవా సిబ్బందిని వినియోగించనున్నారు. అలాగే ప్రథమ చికిత్సా కేంద్రాన్ని అనివేటి మండపం వద్ద ఏర్పాటు చేస్తారు. ద్వారకాతిరుమల: శ్రీవారి గిరి ప్రదక్షిణకు సమయం ఆసన్నమైంది. మల్లేశ్వరం మీదుగా 5 కిలోమీటర్ల కొండ చుట్టూ ప్రదక్షిణ చేసే సమయం వచ్చింది. ముక్కోటి ఏకాదశి పర్వదినం ముందు రోజు సోమవారం గిరి ప్రదక్షిణ వేడుక అట్టహాసంగా జరగనుంది. ఈ ఏడాది వేలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారని ఆలయ అధికారులు అంచనా వేశారు. ఇదిలా ఉంటే గిరి ప్రదక్షిణ మరుసటి రోజు మంగళవారం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారు ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఉత్తర ద్వార దర్శనం ఆరోజు తెల్లవారుజామున 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుందని ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. గిరి ప్రదక్షిణ, ఉత్తర ద్వార దర్శనానికి క్షేత్రంలో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే క్యూలైన్ల నిర్మాణం, ఉత్తర ద్వారాల ముస్తాబు, విద్యుత్ అలంకారాల పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం భక్తులు, గోవింద స్వాముల పాదాల రక్షణ కోసం గిరి ప్రదక్షిణ మార్గంలో గడ్డిని పరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దారి పొడవునా విద్యుత్ లైట్లు, సేదతీరేందుకు షామియానా పందిళ్లను నిర్మించనున్నారు. గిరి ప్రదక్షిణలో శ్రీవారు కొలువుదీరనున్న ధర్మప్రచార రథాన్ని ముస్తాబు చేస్తున్నారు. ఉత్సవాల ఏర్పాట్లను జంగారెడ్డిగూడెం ఆర్డీవో ఎంవీ రమణ శనివారం సాయంత్రం పరిశీలించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు రైల్వే మార్గం గుండా ద్వారకాతిరుమలకు 17 కిలో మీటర్ల దూరంలో ఉన్న భీమడోలు రైల్వేస్టేషన్కు చేరుకొని, అక్కడినుంచి ఆర్టీసీ బస్సులు, ఆటోల ద్వారా క్షేత్రానికి చేరుకోవాలి. అలాగే జిల్లాలోని ఏప్రాంతం నుంచి అయినా బస్బుల ద్వారా క్షేత్రానికి చేరుకోవచ్చు. -
మృత్యువులోనూ వీడని స్నేహం
భీమడోలు: ఆ యువకులు ముగ్గురూ మంచి స్నేహితులు.. ముగ్గురూ కలిసి శుభకార్యాలకు ఫ్లవర్ డెకరేషన్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పనిలో భాగంగా ముగ్గురూ కలిసే వెళ్తారు. శనివారం తెల్లవారుజామున డెకరేషన్ పుష్పాల కోసం వెళ్లి బైక్పై తిరిగి వస్తున్న వారిని ఏలూరు జిల్లా భీమడోలు వద్ద జాతీయ రహదారిపై ఓ గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే చనిపోయారు. ఏలూరు నుంచి పొలసానిపల్లి వైపుగా ముగ్గురు యువకులు కలిసి వెళ్తుండగా వీరి బైక్ భీమడోలు వద్ద ప్రమాదానికి గురై ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. వీరిలో ద్వారకాతిరుమల మండలం తిమ్మపురానికి చెందిన మాండ్రోజు చరణ్కుమార్ (26), ద్వారకాతిరుమల గ్రామానికి చెందిన సయ్యద్ రఫీ (22), కొయ్యగర శ్రీరాములు అలియాస్ బన్నీ (21) ఉన్నారు. ఘటనాస్థలంలో నెత్తుటి మడుగులో ఉన్న బిడ్డలను చూసి కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. భీమడోలు సీఐ యూజే విల్సన్, ఎస్ఐ ఎస్కే మదీనా బాషా ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.దట్టమైన పొగమంచే కారణమా ?ద్వారకాతిరుమలలో ఆదివారం జరిగే ఓ ఫంక్షన్కు డెకరేషన్ కోసం పువ్వుల కొనుగోలుకు చరణ్కుమార్ తన తమ్ముడి కొత్త బైక్పై రఫీ, బన్నీతో కలిసి శుక్రవారం రాత్రి బయలుదేరి వెళ్లాడు. ఏలూరులో ఫ్లవర్స్ ఆర్డర్ ఇచ్చి తిరిగి వస్తున్న వీరు భీమడోలు ఫ్లైఓవర్ సమీపంలో చనిపోయారు. దట్టమైన పొగమంచు కురుస్తుండడం కూడా ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భీమడోలు సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దెందులూరులో టీడీపీ గూండాల అరాచకం
సాక్షి,ఏలూరు: దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ గూండాలు రెచ్చిపోతున్నాయి. పెదపాడు మండలం ఏపూరి గ్రామ వైఎస్సార్సీపీ దళిత సర్పంచ్ చోటగిరి రామకృష్ణ పై పచ్చ మూకలదాడి చేశాయి.ద్విచక్ర వాహనంపై నూజివీడు వెళ్లివస్తున్న రామకృష్ణను టీడీపీ మూకలు అడ్డగించి దాడి చేశాయి. బాధితుడి బైక్ నెంబర్ ప్లేట్పై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఫోటోలు ఉన్నాయని దాడికి దిగారు. బైక్పై వెళ్తున్న రామకృష్ణను కిందకి లాగి దాడి చేశారు. ఆపై అసభ్యంగా దూషించారు. తనపై టీడీపీ నేతలు దాడి చేసి, అసభ్యంగా దూషించారని రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
తిరు వీధుల్లో శ్రీవారి దివ్య దర్శనం
ద్వారకాతిరుమల: తిరువీధుల్లో శ్రీవారి దివ్య దర్శనాన్ని పొందుతున్న భక్తులు తన్మయత్వం చెందుతున్నారు. ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని నిత్యం ఉభయ దేవేరులు, గోదాదేవితో పాటు శ్రీవారు క్షేత్ర పుర వీధుల్లో ఊరేగుతున్నారు. శుక్రవారం ఉదయం జరిగిన గ్రామోత్సవం నేత్రపర్వంగా సాగింది. ముందుగా ఆలయంలో విశేషంగా అలంకరించిన తొళక్క వాహనంపై సామి, అమ్మవార్లు, గోదాదేవి ఉత్సవ మూర్తులను ఉంచి, అర్చకులు విశేష పూజలు జరిపారు. ఆ తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అశ్వ, గజ సేవల నడుమ స్వామివారి వాహనం ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా క్షేత్ర పుర వీధులకు పయనమైంది. ప్రతి ఇంటి ముంగిట పెద్ద ఎత్తున భక్తులు శ్రీవారికి నీరాజనాలు సమర్పించారు. అనంతరం స్థానిక ధనుర్మాస మండపంలో స్వామి, అమ్మవార్లకు అర్చకులు, పండితులు ప్రత్యేక పూజలు జరిపి, భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. చాట్రాయి: మండలంలోని నరసింహారావుపాలెం పీఏసీఎస్లో గురువారం రాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు షట్టరు తాళాలు పగలకొట్టి బీరువాలో ఉన్న రూ.1.80 లక్షలు ఎత్తుకుపోయారు. శుక్రవారం ఉదయం స్వీపర్ చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై రామకృష్ణ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ వచ్చి ఆధారాలను సేకరించింది. ఈ మేరకు ఘటనపై విచారణ చేస్తున్నామని ఎస్సై రామకృష్ణ పేర్కొన్నారు. భీమడోలు: పూళ్ల గ్రామంలో బహిరంగంగా మద్యం సేవించి వాహనం నడుపుతున్న వ్యక్తికి ఏలూరు సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ జైలు శిక్షను విధిస్తూ శుక్రవారం తీర్పు ఇచ్చారు. అతన్ని 14 రోజుల పాటు రిమాండ్కు పంపారు. వివరాల ప్రకారం పూళ్ల గ్రామానికి చెందిన గెట్టం నాగసాయి అనే వ్యక్తి మద్యం సేవించి వాహనం నడుపుతుండడంతో గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకుని ఆతనిపై డ్రంక్ అండ్ డ్రైవ్, న్యూసెన్స్ కేసు నమోదు చేశారు. నిందితుడ్ని ఏలూరులో కోర్టులో హాజరుపర్చగా కేసును విచారించిన జడ్జి ఆతనికి జైలు శిక్షను విధించారు. ద్వారకాతిరుమల: శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్ట్కు విజయవాడకు చెందిన పలువురు దాతలు ఐదు టన్నుల కూరగాయలను శుక్రవారం విరాళంగా అందజేశారు. అవ్వారు వెంకటలక్ష్మి, అరవపల్లి సుబ్రహ్మణ్యం, బాలాజీ ఎలక్ట్రానిక్స్ అన్నపరెడ్డి లింగారెడ్డి, సాడి శ్రీనివాసరెడ్డి, స్వాతిలు ఈ కూరగాయలను అన్నదాన ట్రస్ట్ సూపరింటెండెంట్ కోటగిరి కిషోర్కు అందజేశారు. ఈ నెల 30న ముక్కోటి ఏకాదశి పర్వదినం నాడు శ్రీవారిని దర్శించే భక్తులకు అందించే అన్నప్రసాదంలో వీటిని వినియోగించాలని దాతలు కోరారు. -
ద్వారకాతిరుమల ఈఓ నియామకంపై ఉత్కంఠ
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న దేవస్థానం కొత్త ఈఓ నియామకంపై ఇంకా ఉత్కంఠత కొనసాగుతోంది. ప్రస్తుత ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి ఈనెల 31న ఉద్యోగ విరమణ పొందనున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ఈఓ ఎవరొస్తారన్న దానిపై ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. గతంలో జంగారెడ్డిగూడెం ఆర్డీఓగా పనిచేసి, ప్రస్తుతం ఒంగోలు జీజీహెచ్లో పరిపాలనాధికారి (డిప్యుటీ కలెక్టర్)గా విధులు నిర్వర్తిస్తున్న కె.అద్దయ్య ఈఓగా నియమితులవుతారని కొందరు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం అన్నవరం దేవస్థానం ఇన్చార్జి ఈఓగా పని చేస్తున్న ఆర్జేసీ వేండ్ర త్రినాథరావు వస్తారని మరికొందరు అంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం శ్రీవారి దేవస్థానంలో డీఈఓగా విధులు నిర్వర్తిస్తున్న వై.భద్రాజీని కొద్దిరోజుల పాటు ఇన్చార్జి ఈఓగా నియమిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఏది ఏమైనా ఈఓ నియామకంపై మరో రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే చివరి రోజుల్లో ప్రస్తుత ఈఓ పాలన గాడి తప్పుతుందన్న భక్తులు ఆరోపిస్తున్నారు. నూతన క్యూ కాంప్లెక్స్ను భక్తుల రద్దీ అధికంగా ఉండే ముక్కోటి రోజున ట్రయల్రన్ వేసేందుకు చేస్తున్న ప్రయత్నమే ఆరోపణలకు ప్రధాన కారణంగా ఉంది. జరగరానిది ఏదైనా జరిగితే.. ఆలయ అనివేటి మండపం పక్కన రూ. 12.50 కోట్లతో నూతనంగా శాశ్వత క్యూ కాంప్లెక్స్ను నిర్మించారు. అది ఇంకా ప్రారంభం కాలేదు. అయితే ఈనెల 30న ముక్కోటి ఏకాదశి నాడు ఆ క్యూ కాంప్లెక్స్ను ట్రయల్ రన్ వేసేందుకు ఇంజనీరింగ్ విభాగ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వేలాది మంది భక్తులు వచ్చే పర్వదినం నాడు ట్రయల్రన్ వేయడం ఏంటి? పలువురు విమర్శిస్తుంటే, కనీసం విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం కూడా చేయకుండా ట్రయల్ రన్ చేయడం మంచిది కాదని అంటున్నారు. 2002 మార్చి నెలలో శ్రీవారి ఆలయ నూతన తూర్పురాజగోపురం ప్రారంభం కాకుండానే అప్పటి లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగిని కొందరు నాయకులు ఆ గోపురంలో నుంచి ఆలయంలోకి తీసుకెళ్లారు. మరుసటి రోజు ఆయన ప్రమాదానికి గురై మృతి చెందాడు. దాన్ని గ్రామస్తులు, భక్తులు ఇప్పటికీ మరచిపోలేదు. అది సెంటిమెంట్గా మిగిలిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం పూజలు నిర్వహించకుండా ట్రయల్ రన్ పేరుతో క్యూ కాంప్లెక్స్ను ప్రారంభిస్తే.. ఆ తరువాత జరగరానిది ఏదైనా జరిగితే దానికి పూర్తి బాద్యత ఈఓనే వహించాల్సి వస్తుందని మండిపడుతున్నారు. శ్రీవారి ఆలయ రాజగోపురాల సముదాయం ఈ విషయంపై ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తిని విరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. అయితే ఏఈఓ మెట్టపల్లి దుర్గారావును వివరణ కోరగా ముక్కోటి ఏకాదశి నాడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో నుంచి గ్రామస్తులను, గోవింద దీక్షాదారులను, రూ.500ల ప్రత్యేక దర్శనం చేసుకునే భక్తులను పంపించాలనే ప్రతిపాదన ఉందని, అది ఇంకా ఫైనల్ కాలేదని స్పష్టం చేశారు. మరో నాలుగు రోజుల్లో రిటైర్ కానున్న ప్రస్తుత ఈఓ క్యూ కాంప్లెక్స్ ట్రయల్ రన్పై ఈఓపై భక్తుల మండిపాటు -
పాలకొల్లులో సినిమా షూటింగ్ సందడి
పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లులో హరి గాడి హరికథ చిత్రం నిర్మాణం షూటింగ్తో సందడి వాతావరణం నెలకొంది. శుక్రవారం స్థానిక యడ్లబజారు సెంటర్ వద్ద పశువులు ఆసుపత్రిలో మాంటెజ్ సాంగ్ షూటింగ్ చేశారు. సురభి ఎంటర్టెయిన్మెంట్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నూతనంగా హరి యడ్లపల్లి, ప్రియా హెగ్డేలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి రచయిత వైవీ సర్వేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా సర్వేష్ మాట్లాడుతూ పాలకొల్లు , అడవిపాలెం, శిరగాలపల్లి, చించినాడ, పేరుపాలెం ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకూ 50 శాతం చిత్ర షూటింగ్ పూర్తయ్యిందని పేర్కొన్నారు. ఆర్ట్ డైరెక్టర్ పెద్దిరాజు అడ్డాల, నిర్మాత సురభి హరినాఽథరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పూజ్యం శ్రీరామచంద్రమూర్తి పాల్గొన్నారు. -
అటవీ ప్రాంతంలో జామాయిల్ చెట్ల నరికివేత
కుక్కునూరు: అటవీ భూముల్లో చెట్లకు రక్షణ కరువైంది. అటవీశాఖ నిర్లక్ష్యం మూలంగా అటవీ భూముల్లోని జామాయిల్ చెట్లను కొందరు వ్యక్తులు అడ్డగోలుగా నరికివేసి వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలోని అమరవరం అటవీరేంజ్ పరిధిలోని కొండపల్లి గ్రామ సమీపంలోని అటవీప్రాంతంలో జామాయిల్ చెట్లను నరికేసి తరలించినట్లు సమాచారం. గతంతో ఇదే రేంజ్ పరిధిలో అటవీప్రాంతంలోని మారుజాతి కలపను, మాధవరం టేకు ప్లాంటేషన్లోని టేకు చెట్లను కొందరు వ్యక్తులు నరికి తరలించికెళ్లినట్టు ఆరోపణలొచ్చాయి. అంతేకాక ఇదే రేంజ్ పరిధిలో అటవీభూముల్లో జామాయిల్ నర్సరీలను నిర్వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇలా అటవీప్రాంతంలో అక్రమాలు, ఆక్రమణలు జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. -
బ్యారన్ సామగ్రి చోరీ
బుట్టాయగూడెం: తమ బ్యారన్లో ఉన్న సామగ్రిని గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించినట్లు మహిళా రైతు బళ్లా భూలక్ష్మి తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆమె ముప్పినవారిగూడెంలో విలేకరులతో మాట్లాడుతూ గ్రామ సమీపంలో తనకు, నందిన సతీష్కు చెందిన ఆరు బేరన్లు ఉన్నాయని చెప్పారు. అయితే ఐదు నెలల క్రితం పొగాకు సీజన్ పూర్తయిన తర్వాత ఆరు బ్యారన్ల సామాగ్రిని గొట్టాలు, పొయ్యిలు, కర్రలు అన్నీ కలిపి ఒక బ్యారన్లో దాచిపెట్టినట్లు చెప్పారు. శుక్రవారం ఉదయం బ్యారన్లను పరిశీలించేందుకు వెళ్లగా అక్కడ తాళాలు పగలకొట్టి ఉండటాన్ని గమనించి, లోపలికి వెళ్లి చూడగా సామగ్రి లేదని చెప్పారు. అయితే ఈ సామాగ్రి ఖరీదు రూ. 4 లక్షల వరకూ ఉంటుందని చెప్పారు. ఈ చోరీ ఘటనపై పోలీసులను ఆశ్రయిస్తామని వెల్లడించారు. నూజివీడు: మండలంలోని తుక్కులూరులో శుక్రవారం వృద్ధురాలి మెడలో బంగారు గొలుసును దుండగులు చోరీ చేశారు. వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పొన్నం నాగేశ్వరమ్మ(65) మెయిన్రోడ్డులో బడ్డీకొట్టు పెట్టుకుని జీవిస్తుంది. సాయంత్రం 4 గంటల సమయంలో బైక్పై ఇద్దరు వ్యక్తులు వచ్చి సిగరెట్లు కొనుగోలు చేసి ఫోన్పే ద్వారా రూ.50 చెల్లించారు. ఆ తర్వాత అదును చూసి మెడలో మూడు కాసుల గొలుసును తెంపుకుని పరారయ్యారు. ఘటనపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో రూరల్ ఎస్సై లక్ష్మణ్బాబు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఏలూరు (టూటౌన్): 500 జనాభా ఉన్న ప్రతి గిరిజన తండాలను, గూడాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా విభజించాలని ఎస్టీ బంజారా సుగాలి లంబాడి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి.కృష్ణ నాయక్, డి.రాజా బాబు నాయక్ డిమాండ్ చేశారు.ఈ మేరకు శుక్రవారం వారు ఒక ప్రకటనలో విడుదల చేశారు. ఏలూరు జిల్లాలోని చింతలపూడి మండలంలోని నామవరం, రేచర్ల, పంతంగుల గూడెం తండాలను, టి.నర్సాపురం మండలంలోని కృష్ణాపురం తండాను, చాట్రాయి మండలంలోని పోతనపల్లి ( గంటిపాడు) తండాలను పరిపాలన సౌలభ్యం కోసం, గిరిజన ప్రజల అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీఓ ఎంఎస్ నెంబర్ 97 ప్రకారం మేజర్ పంచాయతీల నుండి విభజించి ప్రత్యేక గ్రామపంచాయతీలుగా ప్రకటించాలని కోరారు. -
పుష్కరాలకు 43 ఘాట్ల ఏర్పాటు
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ పరిధిలో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో రానున్న పుష్కరాలకు 43 పుష్కర ఘాట్లు ఏర్పాటు చేస్తున్నట్లు జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవీ రమణ తెలిపారు. 2027 పుష్కరాలకు సంబంధించి ఆయా పనులకు అంచనాలు, సన్నాహక కార్యక్రమాలపై శుక్రవారం ప్రాథమిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలవరంలో 35 ఘాట్లు, కుక్కునూరులో 3 ఘాట్లు, వేలేరుపాడులో 5 ఘాట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. టూరిజం శాఖ ద్వారాకాతిరుమల, మద్ది ఆంజనేయస్వామి, పారిజాతగిరి, జీలకర్రగూడెం బౌద్దాలాయాలు, గుబ్బలమంగమ్మ గుడి, పలు ఆలయాలను కలుపుతూ టూరిజం ప్యాకేజీలు ప్రకటిస్తుందని స్పష్టం చేశారు. ఆయా శాఖల చేపట్టే పనులపై అంచనాలు తయారు చేసి జిల్లా కలెక్టర్కు నివేదించనున్నట్లు ఆర్డీఓ వెల్లడించారు. పోలవరం డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గోదావరి పుష్కరాలకు సంబంధించి పోలీసు శాఖను సన్నద్ధం చేస్తున్నామన్నారు. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రమాదాలు జరగకుండా సీసీ కెమేరాలు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని నియమిస్తామని లైఫ్ జాకెట్లతో గోదావరిపై బోట్లను 24 గంటలు మూడు షిప్టులుగా నియమించి యాత్రికుల భద్రతే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ కేవీ రమణ, విద్యుత్ డీఈ యు.సుబ్బారావు, ఆర్టీఓ ఎస్ఎస్ రంగనాయకులు పాల్గొన్నారు. -
బెంబేలెత్తిస్తున్న నకిలీ ఈ–చలాన్లు
ఆగిరిపల్లి: మండలవాసులను నకిలీ ట్రాఫిక్ ఈ– చలాన్లు బెంబేలెత్తిస్తున్నాయి. రెండు రోజుల క్రితం మండలంలో కొంతమందికి సైబర్ నేరస్తులు నకిలీ ఈ–చలాన్ లింకు వాట్సాప్నకు పంపి దోపిడీకి పాల్పడ్డారు. ఆగిరిపల్లికి చెందిన పల్లగాని కోటేశ్వరరావు అనే వ్యక్తికి వాట్సాప్ ద్వారా రెండు రోజుల క్రితం సైబర్ నేరగాళ్ల నుంచి ఈ –చలాన్ లింకు వచ్చింది. లింకు వచ్చిన కాసేపటికి సైబర్ కేటుగాళ్లు అతడి ఖాతాను హ్యాక్ చేసి తన ప్రమేయం లేకుండానే ఓటీపీలు వచ్చి అకౌంట్లో ఉన్న రూ.50 వేలను దోచుకున్నారు. అలాగే గ్రామానికి చెందిన మరో ఇద్దరు వ్యక్తులు లింకును క్లిక్ చేయగానే రూ.60 వేలు, మరో యువకుడివి రూ.5 వేలు కేటుగాళ్లు దోచేశారు. అంతేకాకుండా మండలంలో అనేకమంది ఫోన్లు కూడా హ్యాక్ అయ్యాయి. దీంతో ఫోన్కి ఏదైనా కొత్త మెసేజ్ వస్తేనే హడలిపోతున్నారు. ఈ విషయంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే విషయమై ఎస్సై శుభ శేఖర్ మాట్లాడుతూ నకిలీ వెబ్సైట్లపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే లింకుల ద్వారా నగదు చెల్లించవద్దని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా సైబర్ మోసాలు గురైతే వెంటనే 1930 కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. -
ఓబీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం మెడలు వంచాలి
పాలకొల్లు సెంట్రల్: కూటమి ప్రభుత్వం మెడలు వంచి ఓబీసీ రిజర్వేషన్లు సాధించాలని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి) అన్నారు. శుక్రవారం పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శుక్రవారం తూర్పుకాపు సామాజికవర్గం సభ్యులు ఓబీసీ రిజర్వేషన్ అంశంపై వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతూ గుడాల గోపితో పాటు పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణంరాజులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గుడాల గోపి మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో తూర్పు కాపుల ఓబీసీ రిజర్వేషన్ల కోసం ప్రయత్నం చేయగా ఎన్నికల కోడ్ రావడంతో ఆగిపోయిందని వివరించారు. అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 18 నెలలు గడిచినా ఇప్పటికీ ఓబీసీ రిజర్వేషన్ విషయాన్ని తేల్చలేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం కూడా కలిసే ఉంది కాబట్టి తూర్పుకాపులు పార్టీలకతీతంగా కలిసిమెలసి పోరాటం చేస్తే ఓబీసీ రిజర్వేషన్లు సాధించవచ్చని అన్నారు. అనంతరం ముదునూరి మురళీకృష్ణంరాజు గతంలో ఓబీసీ రిజర్వేషన్లు 50 శాతం ముందుకు తీసుకువెళ్లిన ఘనత జగన్నన్నదేనని అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పార్లమెంటు రాష్ట్ర కార్యదర్శి యడ్ల తాతాజీ, కోరాడ శ్రీనివాస్, తూర్పుకాపు సంఘ సభ్యులు లోపింటి చిరంజీవి, వాకాడ అప్పారావు, ఇజ్జాడ చినబాబు, జమ్ము కాశీ విశ్వనాథ్, జామాను బుజ్జి పాల్గొన్నారు. -
విద్యుత్ షాక్తో యువకుడి మృతి
నరసాపురం రూరల్: క్రిస్మస్ వేడుకల కోసం ఏర్పాట్లు చేస్తుండగా విద్యుత్ షాక్కు గురై యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని సీతారామపురంసౌత్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం సీతారామపురం వెంకట్రావుతోటలో శుక్రవారం రాత్రి జరుగనున్న క్రిస్మస్ వేడుకలకు సంబంధించి విద్యుత్ దీపాలను అలంకరించే పనులు చేస్తుండగా శీలం అభిరామ్ (19) అనే యువకుడికి 11 కేవీ విద్యుత్ వైర్లు తగలడంతో కిందపడ్డాడు. వెంటనే బాధితుడిని నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పాలకొల్లు మండలంలోని దిగమర్రు గ్రామానికి చెందిన వీరి కుటుంబం కొంతకాలంగా మొగల్తూరు మండలంలోని జెట్టిపాలెం గ్రామంలోని అమ్మమ్మ ఇంటి వద్దనే ఉంటున్నారు. మృతుని తల్లిదండ్రులు ఇరువురూ ఉపాది నిమిత్తం విదేశాల్లో ఉంటున్నారు. తల్లి నెల రోజులక్రితమే విదేశాలకు వెళ్లింది. మృతుని సోదరుడు సాయి శరత్ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నామని మొగల్తూరు ఎస్సై వై నాగలక్ష్మి తెలిపారు. ఏలూరు(ఆర్ఆర్పేట): నగరంలోని అభినయ నృత్యభారతి 30వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం జాతీయ నృత్యోత్సవాలు, నృత్య పోటీలు నిర్వహించారు. స్థానిక వైఎంహెచ్ఏ హాలులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో నిర్వహించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన యువ నర్తకులు రాత్రి మానిక్ మణిపురి నృత్యం, కొప్పరపు సౌజన్య కూచిపూడి , శ్రీవల్లి కథక్ నృత్యం, దేబంజనా బిస్వాస్ గౌడియా నృత్యం, సంజన కూచిపూడి నృత్యం, బిజినా సురేంద్రనాధ్ మోహినియాట్టం వంటి భారతీయ సాంప్రదాయ నత్యాలు ప్రేక్షకులను అబ్బుర పరిచాయి. వీరికి సంస్థ తరఫున నృత్యకౌముది అవార్డులు అందించారు. వీరికి అంబికా రాజా, కానాల శ్రీనివాస్, లేళ్ల వెంకటేశ్వరరావు, దువ్వి రామారావు, నాట్యాచార్య దువ్వి హేమసుందర్ పత్రాలు అందించారు. కార్యక్రమంలో కళారత్న కేవీ సత్యనారాయణ, నందుల రమణి, పోడూరి కనక దుర్గ, రావి పద్మకుమారి తదితరులు పాల్గొన్నారు. -
వైద్య రంగం నిర్వీర్యం
ఈఓ నియామకంపై ఉత్కంఠ చినవెంకన్న దేవస్థానం కొత్త ఈఓ నియామకంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుత ఈఓ ఉద్యోగ విరమణతో కొత్త ఈఓ ఎవరొస్తారన్న దానిపై చర్చ జరుగుతోంది. 8లో uచంద్రబాబు సర్కారు పాలనలో వైద్యసేవలకు సుస్తీ చేసింది. సామాన్యుడికి ఆరోగ్య భరోసా కరువైంది. గత ప్రభుత్వ పాలనలో రూపాయి ఖర్చు లేకుండా వైద్య చికిత్సలు, సేవలు ప్రజలకు చేరువలో ఉండేవి. నేటి టీడీపీ సర్కారు పాలనలో సుస్తీ చేస్తే వైద్యం సరిగా అందని దైన్యస్థితిలో ప్రజలు అల్లాడుతున్నారు. శనివారం శ్రీ 27 శ్రీ డిసెంబర్ శ్రీ 2025ఏలూరు టౌన్: ఆరోగ్యశ్రీ పథకానికి టీడీపీ సర్కారు తూట్లు పొడుస్తోంది. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో కార్పొరేట్ హాస్పిటల్స్ సేవలు సక్రమంగా అందడం లేదు. వైఎస్సార్సీపీ హయాంలో ఆరోగ్య ఆసరా పేరుతో శస్త్రచికిత్సల అనంతరం ఇంటికి వెళ్ళిన రోగుల జీవనానికి ఇచ్చే ఆరోగ్య ఆసరా పథకాన్ని రద్దు చేశారు. ఆరోగ్యశ్రీలో 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకూ గత ప్రభుత్వం 20,826 మందికి వైద్యసేవలు అందించగా.. రూ.47.26 కోట్లు ఖర్చు చేసింది. నేటి టీడీపీ హయాంలో గత ఏడాది కాలంలో కేవలం 9,127 మందికి మాత్రమే సేవలు అందించగా... రూ.16.73 కోట్లు ఖర్చు చేశారు. జీజీహెచ్లో వైద్యసేవలు నిల్ ఏలూరు సర్వజన ఆసుపత్రిలో అత్యవసర వైద్యసేవలు అందే పరిస్థితి లేదు. ప్రాణాపాయ స్థితిలో ఏలూరు జీజీహెచ్కు తరలిస్తే.. వెంటనే విజయవాడ, గుంటూరుకు రిఫర్ చేస్తూ చేతులు కడిగేసుకుంటున్నారని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకపక్ష నేతలు వార్నింగ్ ఇచ్చినా పట్టించుకునే స్థితిలో వైద్య అధికారులు, సిబ్బంది లేరు. గుండె సంబంధిత వ్యాధుల సేవలను ప్రైవేటు హాస్పిటల్స్కు అప్పగించడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనం. ఏలూరు జీజీహెచ్కు సుమారు 900 నుంచి 1200 మంది రోగులు ఆయా అనారోగ్య సమస్యలతో వస్తుంటారు. కంటి విభాగం, ఆర్థోపెడిక్, ఈఎన్టీ పరవాలేదు అనిపించినా మిగిలిన విభాగాల సేవలు దారుణంగా ఉన్నాయంటున్నారు. మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ భూతం ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 3వ ఏడాది వైద్య విద్యార్థులు తమను ర్యాగింగ్ చేస్తున్నారంటూ 2వ ఏడాది వైద్య విద్యార్థులు ఫిర్యాదు చేశారు. దీంతో సీనియర్స్, జూనియర్స్ మధ్య ఘర్షణ నెలకొంది. జూనియర్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్ వార్డెన్ సైతం పట్టించుకోకపోవడంతోనే పరిస్థితి రోజురోజుకూ దిగజారుతుందని వైద్య విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. టూటౌన్ పోలీస్స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు చేశారు. టూటౌన్ సీఐ అశోక్కుమార్ సిబ్బందితో జీజీహెచ్లోని హాస్టల్కు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వైద్య విద్యార్థినులపై ఎలుకల దాడి జీజీహెచ్ ప్రాంగణంలో వైద్య విద్యార్థులకు హాస్టల్ ఏర్పాటు చేయగా.. గత నెలలో ఆరుగురు వైద్య విద్యార్థులపై ఎలుకల దాడితో హాస్టల్ నిర్వహణ లోపాలు బహిర్గమయ్యాయి. విద్యార్థినిలను ఎలుకలు కరవడంతో జీజీహెచ్ ఎమర్జెన్సీలో వారికి చికిత్స అందించారు.ఆరోగ్యశాఖ మంత్రి, డీఎంఈ ఉన్నతాధికారులు స్పందించి ఇద్దరు సిబ్బందిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. రోడ్డెక్కిన పీహెచ్సీ వైద్యాధికారులు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు పీహెచ్సీ వైద్యాధికారులు మెరుగైన రీతిలో వైద్యసేవలు అందిస్తూ ఉంటారు. అయితే పీహెచ్సీ వైద్యాధికారులు రోడ్డెక్కారు. జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తోన్న వైద్యులు విధులను బహిష్కరించారు. పీజీ సీట్లలో కోటాకు కోత వేసిన ప్రభుత్వం, గత ఏడాది ఇచ్చిన హామీని సైతం పక్కన బెట్టి పాత విధానాన్ని తెరపైకి తేవడంతో పీహెచ్సీ వైద్యుల అసోసియేషన్ పిలుపుతో ఉద్యమబాట పట్టారు. మెడికల్ కాలేజీ భవన నిర్మాణాల్లో జాప్యం ఏలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల శాశ్వత భవన నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంది. 2023, అక్టోబర్లో భవన నిర్మాణ పనులు ప్రారంభించగా.. నేటికీ సాగుతూనే ఉన్నాయి. 2.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సుమారు రూ.90 కోట్లతో జీ ప్లస్ 3 అంతస్తులతో భవన నిర్మాణం చేపట్టారు. మెడికల్ సర్వీస్ అండ్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పనులు చేస్తున్నారు. ఒకవైపు ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభమై మూడో ఏడాది కాగా.. నేటికీ భవనాన్ని అందుబాటులోకి తేకపోవడంతో విద్యార్థులకు అవస్థలు తప్పటం లేదు. ఆరోగ్యశ్రీ పథకం సేవలందక ఇక్కట్లు పడకేసిన గ్రామీణ వైద్య సేవలు 108 అత్యవసర వాహనాలకు బ్రేకులు ఏలూరు జీజీహెచ్లో వైద్యసేవలు అంతంతమాత్రం మెడికల్ కాలేజీ భవనాల నిర్మాణాల్లో జాప్యం -
దొరమడుగు.. కనుమరుగు
తిమ్మాపురం పచ్చనేతల కబంధ హస్తాల్లో భూమి ద్వారకాతిరుమల: పచ్చనేతల భూ కబ్జా తారాస్థాయికి చేరింది. దొరమడుగు భూమి 9 ఎకరాల మేర కబ్జా అయ్యిందని బహిరంగంగా చెబుతున్నా, నిజాన్ని నిగ్గు తేల్చాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టున్నారు. మండలంలోని తిమ్మాపురంలో ఆర్ఎస్ నెంబర్ 220లో 9 ఎకరాల దొరమడుగు పోరంబోకు భూమిని టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు గంటా శ్రీనివాసరావు కబ్జా చేశాడని అదే పార్టీకి చెందిన తూంపాటి పద్మవరప్రసాద్ ఆరోపించడంతో పాటు, అధికారులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఎక్స్ సర్వీస్ మెన్ నుంచి గంటా శ్రీనివాసరావు 5 ఎకరాల భూమిని కొనుగోలు చేయగా, మిగిలిన భూమిని తూంపాటి పద్మవరప్రసాద్ కబ్జా చేశాడని శ్రీనివాసరావు వర్గీయులు ఆరోపణలు చేస్తున్న విషయం విధితమే. పద్మవరప్రసాద్ తాత ఘంటా వెంకయ్య 1961లో ఈ భూమి తనదంటూ నెల్లూరులోని సెటిల్మెంట్ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశాడు. దీనిపై అప్పటి సెటిల్మెంట్ కోర్టు ఆర్ఎస్ నెంబర్ 220 లోని 1.90 ఎకరాల భూమి ఘంటా వెంకట్రామయ్యదని, మిగిలిన భూమి దొరమడుగు పోరంబోకని తీర్పు ఇచ్చింది. ఈ దొరమడుగు భూమిలోని సుమారు 5 ఎకరాలను ఎక్స్ సర్వీస్మెన్ నుంచి కొనుగోలు చేసినట్టు శ్రీనివాసరావు చెబుతున్నాడు. మిగిలిన 4 ఎకరాల పైగా భూమిలో చెరువు తవ్వుతున్నారు.. అది ఎవరి స్వాధీనంలో ఉంది.. వారికి ఉన్న హక్కులేమిటి అని నిగ్గు తేల్చాల్సిన అధికారులు కిమ్మనడం లేదు. రెవిన్యూ అధికారులకు పెద్ద మొత్తంలో ముడుపులు అందాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. -
నరసాపురం కూటమిలో విభేదాలు
● వేర్వేరుగా జనవాణి, ప్రజావాణి కార్యక్రమాలు ● అయోమయంలో ప్రజలు, కార్యకర్తలునరసాపురం: నరసాపురం నియోజకవర్గంలో జనసేన, టీడీపీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎవరికి వారే అన్నట్లుగా ఆ రెండు పార్టీల నేతలకు పడడం లేదు. ఇప్పటికే రెండు పార్టీలు కలిసి నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో నాయకులు మధ్య విభేదాలు తెరమీదకు వచ్చాయి. ఏఎంసీ, ఇతర నామినేడెట్ పోస్టుల నియమకాల్లో పార్టీ నేతల మధ్య విభేదాలు రోడ్డెక్కాయి. శుక్రవారం పట్టణంలో టీడీపీ, జనసేన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కరించే కార్యక్రమం చేపట్టాచి. ఈ కార్యక్రమాన్ని రెండు పార్టీలు పోటాపోటీగా రెండు చోట్ల నిర్వహించడం చర్చనీయాంశమైంది. ప్రజలు ఎక్కడ తమ ఫిర్యాదులివ్వాలో తెలియక తలలు పట్టుకున్నారు. ఒకరికిస్తే మరొకరు అలుగుతారోమోనని.. అర్ధంకాక చివరికి ఎవరికీ ఇవ్వకుండానే నిట్టూరుస్తూ వెనుదిరిగారు. ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ స్థానిక జనసేన కార్యాలయంలో ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం పేరుతో జనవాణి కార్యక్రమం నిర్వహించారు. ఇదే కార్యక్రమాన్ని పేరుమార్చి టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పొత్తూరి రామరాజు స్థానిక టీడీపీ కార్యాయంలో ఏర్పాటు చేశారు. ఒకరేమో ఎమ్మెల్యే, మరొకరేమో టీడీపీ ఇన్చార్జ్. నియోజకవర్గంలో అనధికార ఎమ్మెల్యే. దీంతో ప్రజలకు ఎవరికి ఫిర్యాదులు ఇవ్వాలో అర్ధంకాలేదు. ఎవరికిస్తే తమ సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయోనని ఆలోచనలో పడ్డారు. అధికారులు ఎమ్మెల్యే మాట విని తమ పనులు చేస్తారా? లేక టీడీపీ ఇన్చార్జ్ చెబితే స్పందిస్తారా? అనే సందిగ్ధంలో పడ్డారు. విభేదాలు తారాస్థాయికి ఈ రెండు పార్టీల్లోని నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని నాయకులు, కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. నియోజకవర్గంలో టీడీపీ నేతల పెత్తనం ఏంటనే అభిప్రాయం జనసేన శ్రేణుల్లో ఉంది. ఇక రెండు నెలల క్రితం ఏఎంసీ కమిటీ ప్రమాణ స్వీకార సమయంలో ఆహ్వాన పత్రికలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు పేరువేయలేదని ఆయన వర్గీయులు పెద్ద గొడవే చేశారు. పొత్తూరిని ఇన్చార్జ్ బాధ్యతల నుంచి తొలగించాలని నిరసన తెలిపారు. ముందుగాా ఏఎంసీ చైర్మన్గా జనసేన నాయకుడి పేరును ప్రకటించారు. దీనిపై రెండు పార్టీల్లో పెద్ద గొడవే జరిగింది. మళ్లీ టీడీపీ నాయకుడికి ఈ పదవి కట్టబెట్టారు. దీంతో టీడీపీ ఆధిపత్యం ముందు జనసేన ఎమ్మెల్యే మాట నెగ్గలేదనే చర్చసాగుతోంది. కాపు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న కొత్తపల్లి సుబ్బారాయుడు ఎమ్మెల్యే చేపడుతున్న కార్యక్రమాలకు హాజరుకావడంలేదు. బండారు మాధవనాయుడు ఇంకా అలకవీడలేదు. ఇన్చార్జ్ బాధ్యతలు ఎలాగైనా పొత్తూరి నుంచి లాక్కుని తిరిగి తన రాజకీయ ప్రయాణం పరిగెట్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. సీనియర్ నేత కొత్తపల్లి నుంచి పొంచి ఉన్న ప్రమాదాన్ని ఎలా తప్పించకోవాలా? అతని ఎమ్మెల్యే నాయకర్ తంటాలు పడుతున్నట్టుగా చెబుతున్నారు. మరోవైపు టీడీపీ కీలకపేత, ఎన్నారై కొవ్వలి యతి రాజరామ్మోహన్నాయుడు అమెరికా నుంచి వచ్చి పట్టణంలోనే ఉన్నారు. ఆయన రెండు చోట్లకు హాజరుకాకపోవడంపై చర్చ సాగుతోంది. ప్రభుత్వ మైనార్టీ సలహాదారుగా ఎంఏ షరీఫ్ తన మార్కు రాజకీయంతో టీడీపీని గందరగోళంలోకి నెడుతున్నారు. మొత్తానికి నియోజకవర్గంలో కూటమిలో రసవత్తర రాజకీయం నడుస్తోంది. -
రేపు ఆర్థిక శాఖ మంత్రి సీతారామన్ పర్యటన
నరసాపురం రూరల్: ఈ నెల 28న నరసాపురం మండలం పెదమైనవానిలంకలె కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటిస్తారని, పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంగా శుక్రవారం పెదమైనవానిలంకలో ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ పెదమైనవానిలంకలో సముద్రపు కోత అడ్డుకట్ట పనులను పరిశీలిస్తారని, అనంతరం మన్కీ బాత్ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. డిజిటల్ భవన్లో ఏర్పాటుచేసిన డ్రోన్, ఏఐ నైపుణ్య శిక్షణ తరగతులు ప్రారంభిస్తారన్నారు. వికసిత్ భారత్.. డిజిటల్ ఇండియాపై విద్యార్థులకు నిర్వహించిన పెయింటింగ్ పోటీలు, వందేమాతరం పాటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తారన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేసి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. -
రౌడీషీటర్ల కదలికలపై నిఘా
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లాలో నేరాల నిరోధం... శాంతిభద్రతలకు విఘాతం లేకుండా చేసేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆదేశించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, పోలవరం, నూజివీడు సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో శాంతిభద్రతలపై ప్రత్యేకంగా సమీక్షించారు. జిల్లాలో పోలీస్స్టేషన్ల వారీగా రౌడీషీటర్ల సమాచారాన్ని, ప్రస్తుతం వారంతా ఏం చేస్తున్నారనే అంశాలపై పూర్తి వివరాలు సేకరించాలని ఆదేశించారు. రౌడీషీటర్ల కదలికలపై నిత్యం నిఘా ఉంచాలని, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పారు. రౌడీషీటర్లు సామాన్య ప్రజల జీవనానికి విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. -
టెట్ షరతు ఉపసంహరించాలి
ఏలూరు (టూటౌన్): ఇన్–సర్వీస్లో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు రెండేళ్లలోపు టెట్ పరీక్ష పాస్ కావాలన్న నిబంధనపై ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని ఆంధ్రప్రదేశ్ మాల ఉద్యోగుల సంఘం ఏలూరు జిల్లా శాఖ పేర్కొంది. ఈ మేరకు డీఈవోకు శుక్రవారం మెమోరాండం స్పందించారు. ఈ నిబంధనను వెంటనే ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లాలని డీఈవోని కోరారు. ఇన్–సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపునివ్వాలని, లేదా ఈ నిబంధనను పూర్తిగా ఉపసంహరించాలని, అందుకోసం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని సంఘం ప్రభుత్వాన్ని కోరింది. కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు బేతాళ సుదర్శనం, సహా అధ్యక్షుడు అంగుళూరు సర్వేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు కాకర్ల దొరబాబు, కోశాధికారి కుర్మా ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు(మెట్రో): సంక్రాంతి వరకు రైతులకు ఏ మేరకు ఎరువులు అవసరమో తెలుసుకుని ఎలాంటి కొరత లేకుండా సరఫరా చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. జిల్లాలో రబీ సీజన్లో ఎరువుల సరఫరాపై అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎరువులు అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా సరఫరా చేయాలన్నారు. సాగు జరిగే అధిక ప్రాంతాలను ముందుగానే గుర్తించి, ఈ–పంట నమోదుకు అనుగుణంగా ఆయా ప్రాంతాలకు అవసరమైన ఎరువులను ముందుగానే సరఫరా చేయాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి జిల్లాలో ఏ ప్రాంతంలో ఎరువులకు కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వారం చివరిలో వచ్చే వారానికి అవసరమయ్యే ఎరువులు ముందుగానే సొసైటీలలో నిల్వ ఉండేలా వ్యవసాయాధికారులు పర్యవేక్షించాలన్నారు. జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె.అభిషేక్ గౌడ, జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ బాషా, సహకారశాఖాధికారి ఆరిమిల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కొయ్యలగూడెం: కన్నాయిగూడెం–పొంగుటూరు రోడ్డు దుస్థితిపై గ్రామస్తులు నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. శుక్రవారం రహదారిపై బిందెలతో నీళ్లు పోసి నిరసన తెలిపారు. పొంగుటూరు నుంచి కన్నాయిగూడెం మీదుగా ఎర్నగూడెం వెళ్లే రోడ్డు సుమారు రెండున్నర కిలోమీటర్ల మేర పూర్తిగా దెబ్బతినడంతో గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ సేవలు గ్రామానికి చేరుకోలేని పరిస్థితి నెలకొందని వారు ఆరోపించారు. మూడు సంవత్సరాలుగా కన్నాయిగూడెం శివారులో, పొంగుటూరుకు ఆనుకుని గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనుల కోసం మెటీరియల్ తరలించేందుకు ఈ మార్గంలో వంద టన్నులకు మించి బరువుతో లారీలు రాకపోకలు సాగించడంతో రహదారి మరింత దెబ్బతిందని గ్రామస్తులు తెలిపారు. ఈ రహదారి నిర్మాణానికి నిధులు మంజూరైనప్పటికీ పనులు ప్రారంభించకపోవడం అన్యాయమన్నారు. ఏలూరు(మెట్రో): వంట గ్యాస్ డెలివరీ సమయంలో చార్జీల పేరుతో వసూలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె.అభిషేక్ గౌడ హెచ్చరించారు. కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో శుక్రవారం మహిళలకు ఉచిత గ్యాస్ పంపిణీ, రేషన్ సరుకుల పంపిణీపై పౌర సరఫరాల శాఖ అధికారులు, సిబ్బంది, రేషన్ షాప్ డీలర్లు, గ్యాస్ కంపెనీల డీలర్లతో జేసీ సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ వంట గ్యాస్ అందించే డెలివరీ బాయ్స్ ప్రతి వినియోగదారుడితో మర్యాదగా ప్రవర్తించేలా డీలర్లు పర్యవేక్షించాలని, రసీదు కంటే ఒక్కరూపాయి డిమాండ్ చేసినా, వసూలు చేసినా సంబంధిత డెలివరీ సిబ్బందితోపాటు, గ్యాస్ కంపెనీల డీలర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. గిరిజన ప్రాంతాల్లోని 5 కేజీల ఎల్పీజీ కనెక్షన్లను 14.2 కేజీల కనెక్షన్లుగా మార్చే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఏజెన్సీలను జేసీ ఆదేశించారు. -
దుస్థితిలో 108 అంబులెన్స్లు
ఒకప్పుడు 108కు ఫోన్ చేస్తే... క్షణాల్లో అంబులెన్స్ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాణాలు కాపాడేది. నేడు కుయ్... కుయ్ అంటూ పరుగులు పెట్టలేక కుయ్యో.. మొర్రో అంటూ కదల్లేని స్థితిలో ఉంది. ప్రాణాపాయ స్థితిలో ఫోన్ చేస్తే.. ప్రాణాలు పోయినా రావడం లేదంటున్నారు. జిల్లాలో 28 అంబులెన్స్లకు గానూ ప్రజలకు అందుబాటులో ఎన్ని వాహనాలు ఉన్నాయో.. ఎవరికీ తెలియని దుస్థితి. 2023 జనవరి నుంచి 2023 డిసెంబర్ 31 వరకూ 46,935 మంది బాధితులకు అంబులెన్స్లు సేవలు అందిస్తే.. ఈ ఏడాది 108 వాహనాలతో 12,698 మందికి మాత్రమే సేవలు అందడం చంద్రబాబు సర్కారు పనితీరు ఎలా ఉందో తెలుస్తోంది. ఏలూరు సర్వజన ఆసుపత్రి తల్లీబిడ్డా ఎక్స్ప్రెస్ సిబ్బంది, డ్రైవర్లు నిర్లక్ష్య ధోరణితో బాలింతలు, కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల జీజీహెచ్ ఎంసీహెచ్ బ్లాక్ వద్ద ఒక బాలింత తన చిన్నారితో గంటల తరబడి కూర్చున్నా.. ఎక్స్ప్రెస్ వాహనం రాలేదు. బాలింత చలిలో బిడ్డతో ఏడుస్తూ ఉండడంతో అక్కడి వారంతా చలించిపోయారు. మీడియాకు, అధికారులకు సమాచారం ఇవ్వడంతో రాత్రి సమయంలో వాహనం డ్రైవర్ వచ్చాడు. -
రహదారి ప్రమాదాల నివారణే లక్ష ్యం
జంగారెడ్డిగూడెం: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఏఎస్పీ సుస్మిత రామనాథన్ అన్నారు. రహదారి ప్రమాదాల నివారణే లక్ష్యంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. హెల్మెట్లు ధరించకుండా, నంబర్ ప్లేట్లు లేకుండా తిరిగే వాహనాలను నిలుపుదల చేసి, జరిమానాలు విధించడంతో పాటు, సదరు వాహదారులతో హెల్మెట్లను కొనుగోలు చేయించారు. ఇకపై ఎవరైనా నబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడిపితే వాహనాలను సీజ్ చేస్తామని ఏఎస్పీ సుచిత్ర రామనాథన్ హెచ్చరించారు. హెల్మెట్ లేని వాహనదారులకు, సరైన పత్రాలు లేని వారికి రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ సుచిత్ర రామనాథన్ మాట్లాడుతూ రహదారి ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో అత్యధికులు యువతే ఉండటం ఆందోళనకరమని పేర్కొన్నారు. ఈ తనిఖీలో జంగారెడ్డిగూడెం ఇన్స్పెక్టర్ ఎంవీ సుభాష్, ఎస్సై వీర ప్రసాద్, ట్రాఫిక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
భీమవరం డీఎస్పీగా రఘువీర్ విష్ణు
భీమవరం: భీమవరం డీఎస్పీ రావూరి గణేష్ జయసూర్య బదిలీ అ య్యారు. ఆయన స్థానంలో కాకినాడ నుంచి రఘువీర్ విష్ణు డీఎస్పీగా నియమితులయ్యారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో జయసూర్యపై విచారణకు అక్టోబర్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించిన సంగతి తెలిసిందే. జయసూర్య తన పరిధిలో పేకాట క్లబ్బుల నిర్వహణ, కోడి పందేలు, ప్రైవేట్ సెటిల్మెంట్లు చేస్తున్నారంటూ ఫి ర్యాదులు అందాయి. ఈ క్రమంలో ఆయనపై ప్ర భుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇటీవల స త్యసాయి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన బందో బస్తుకు వెళ్లిన జయసూర్య గాయం కావడంతో సెలవులో ఉన్నారు. ఈ తరుణంలో జయసూర్యను వీఆర్కు పంపిస్తూ మంగళగిరి డీఐజీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించినట్టు తెలిసింది. -
ఆడుకుంటూ మాయమై అనంత లోకాలకు
పెనుగొండ: ఆడుతూ..పాడుతూ కానరాని లోకాలకు చేరి తల్లిదండ్రులకు పుత్ర శోకాన్ని మిగిల్చాడో బాలుడు. గురువారం పెనుగొండ పంచాయతీ పార్కు వద్ద ఆటలాడుతూ మాయమై చివరికి చెరువులో శవమై తేలాడు. వివరాల్లోకి వెళితే ఇరగవరం మండలం తూర్పువిప్పరు శివారు ఆర్ ఖండ్రికకు చెందిన జొన్నల ధనరాజు పెనుగొండ పంచాయతీ పార్కు వద్ద స్వీట్సు, బేకరీ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ధనరాజుకు కుమారుడు, కుమార్తే సంతానం. గురువారం క్రిస్మస్ సెలవుకు కావడంతో కుమారుడు ఈశ్వర దుర్గా సత్య వెంకటేష్ అలియాస్ ఈశ్వర్ (5)ను తీసుకువచ్చి పార్కులో కుమారుడుతో కలసి ఆటలాడాడు. ఇంతలో బేకరీలో బేరం రావడంతో ధనరాజు పనిలో నిమగ్నం కాగా తరువాత బాలుడి కనిపించలేదు. ఎంత వెతికినా కపించకపోవడంతో గ్రామ సర్పంచ్ నక్కా శ్యామలాసోనీ చొరవతో, పెనుగొండ ఎస్సై కే గంగాధర్ సిబ్బంది చెరువులో గాలించగా బాలుడి మృతదేహం లభ్యమైంది. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించడంతో పార్కు వద్ద తీవ్ర విషాదం నెలకొంది. కాగా బాలుడు మాయం కావడంతో పెనుగొండలో కిడ్నాప్ అంటూ ప్రచారం జరిగింది. ఈ తరుణంలో అనుమానంతో చెరువులో గాలింపు చర్యలు చేపట్టగా బాలుడి మృతదేహం లభ్యం కావడంతో కిడ్నాప్ ప్రచారానికి తెరపడింది. -
బంగారయ్యకు రాష్ట్ర స్థాయి అవార్డు
ఆకివీడు : వినియోగదారులకు విశిష్ట సేవలందిస్తున్న జిల్లా వినియోగదారుల సంఘాల అధ్యక్షుడు బొబ్బిలి బంగారయ్య గురువారం రాష్ట్ర స్థాయి అవార్డును అందుకున్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన జాతీయ వినియోగదారుల దినోత్సవంలో సివిల్ సప్లయ్ ఎండీ ఢిల్లీరావు, డైరెక్టర్ గోవిందరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా చేతుల మీదుగా అవార్డు అందుకున్నట్లు బంగారయ్య చెప్పారు. గత 36 ఏళ్లుగా వినియోగదారులకు చేసిన సేవల్ని గుర్తించి ఈ అవార్డు బహుకరించారన్నారు. ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రం గురువారం భక్తజన సంద్రమైంది. క్రిస్మస్ పండుగ సందర్భంగా సెలవు కావడంతో వేలాది మంది భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయానికి తరలివచ్చారు. దాంతో క్షేత్ర పరిసరాలు సందడిగా మారాయి. మధ్యాహ్నం అనుకోకుండా భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. దాంతో ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతం, దర్శనం క్యూలైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు, కేశఖండనశాల ఇతర విభాగాలు భక్తులతో పోటెత్తాయి. కొండపైన ఘాట్ రోడ్లు భక్తుల వాహనాలతో నిండిపోయాయి. రాత్రి వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. పాలకొల్లు సెంట్రల్: తండ్రి అంతిమ సంస్కారాల్లో కుమార్తె తలకొరివి పెట్టిన ఘటన పాలకొల్లులో చోటుచేసుకుంది. పట్టణంలోని గుత్తులవాని పేటకు చెందిన పంపన నరసింహస్వామి (రాజు) (43) ఎలక్ట్రిషీయన్గా పని చేస్తుంటాడు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజు గురువారం మృతి చెందాడు. అతనికి భార్య, కుమార్తె ఉన్నారు. అంతిమ సంస్కారాల్లో భాగంగా అబ్బాయిలు లేకపోవడంతో కుమార్తె ముందుకు వచ్చి తండ్రి రాజుకు తలకొరివి పెట్టింది. ఈ ఘటన చూసిన పలువురు కంటతడి పెట్టారు. భీమవరం: రాష్ట్రస్థాయి పురోహిత క్రికెట్ పోటీల్లో మరో 2 జట్లు క్వార్టర్స్ దశకు చేరాయి. భీమవరంలో జరుగుతున్న పోటీల్లో భాగంగా గురువారం అమలాపురం, తిరుపతి జట్లు క్వార్టర్స్కు చేరుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గురువారం జరిగిన పోటీల్లో వైజాగ్ జట్టుపై తిరుపతి, భీమవరంపై అమలాపురం, వైజాగ్పై చైన్నె, కాకినాడ కార్తికేయ టీమ్పై కాకినాడ రుద్ర టీమ్, ఖమ్మంపై తిరుపతి, విజయవాడపై చైన్నె కాకినాడపై వైజాగ్, వైజాగ్పై అమలాపురం జట్లు విజయం సాధించాయి. ఆకివీడు: రెండు మోటార్సైకిళ్లు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానిక ఐ భీమవరం రహదారిలో మూడు తుమ్ముల వద్ద గురువారం సాయంత్రం రెండు మోటార్ సైకిళ్లు వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో భీమవరంనకు చెందిన సుదీప్ కాలు విరగడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరో వ్యక్తి 108లో వెళ్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులు మద్యం సేవించి వాహనాలను నడుపుతున్నట్లు స్థానికులు చెప్పారు. -
కనుల పండువగా శ్రీవారి తిరువీధి సేవ
ద్వారకాతిరుమల: చిన వెంకన్న దివ్య క్షేత్రంలో గురువారం శ్రీవారి తిరువీధి సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని నిత్యం ఆలయంలో విశేష కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఉదయం స్వామి, అమ్మవార్లు, గోదాదేవి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన తొళక్క వాహనంపై ఉంచి విశేష పుష్పాలంకారాలు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణలు, గజ, అశ్వ సేవల నడుమ స్వామి వారి వాహనం క్షేత్ర పురవీధుల్లో తిరుగాడింది. ఆ తరువాత స్థానిక ధనుర్మాస మండపంలో శ్రీవారు, అమ్మవార్లకు అర్చకులు విశేష పూజలు చేసి, భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. -
పీయూసీ విద్యార్థులకు గ్రాఫిక్ డిజైనింగ్ వర్క్షాప్
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీలో పీయూసీ విద్యార్థులకు గురువారం గ్రాఫిక్ డిజైనింగ్ వర్క్షాపును నిర్వహించారు. ఈ వర్క్షాప్కు హాజరైన ప్రముఖ గ్రాఫిక్ డిజైనర్ కేవీ ప్రతాప్ గ్రాఫిక్ డిజైనింగ్ రంగానికి సంబంధించిన అనేక అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. డిజైన్ అనేది ఒక బ్రాండ్కు మౌన రాయబారి అనే భావనతో విద్యార్థులకు ప్రేరణ కల్పించారు. వర్క్షాప్లో భాగంగా గ్రాఫిక్ డిజైన్, దాని మౌలిక సూత్రాలు, గ్రాఫిక్ డిజైన్ ఉపయోగించే రంగాలు, వివిధ డిజైనింగ్ టూల్స్, కాన్సెప్ట్, స్ట్రాటజీ వంటి అంశాలను సులభమైన ఉదాహరణలతో వివరించారు. విద్యార్థుల సందేహాలకు ప్రత్యక్షంగా సమాధానాలు ఇవ్వడంతో పాటు, డిజైన్ రంగంలో ఉన్న అవకాశాలు, కెరీర్ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై కూడా స్పష్టత ఇచ్చారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను మరిన్ని రంగాల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల్లో నూతన ఆలోచనలు, సాంకేతిక అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఇలాంటి వర్క్షాపులు నిర్వహిస్తున్నామన్నారు. భీమవరం: కాలువలోకి దూకి ఓ వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడింది. భీమవరం రెండో పట్టణానికి చెందిన డి.పద్మావతి(62) లోసరి– గూట్లపాడు కాలువలో పడి ఆత్మహత్య చేసుకుంది. కొంతకాలం నుంచి ఆమె మానసిక అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ చికిత్స పొందుతుందని, బుధవారం రాత్రి నుంచి ఆమె కనిపించడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎస్సై రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
క్రీస్తును హృదయంలో కొలవడమే క్రిస్మస్
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ కై కలూరు: క్రీస్తును హృదయంలో కలిగి ఉండటమే క్రిస్మస్ అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్య క్షుడు, నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) అన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా మండలంలోని భుజబలపట్నం సీబీసీఎన్సీ చర్చిలో జరిగిన వేడుకల్లో గురువారం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థన అనంతరం డీఎన్నార్ మాట్లాడుతూ ప్రేమ, కరుణ, జాలి, దయ వంటి గుణాలను మానవాళికి అందించిన మహోన్నత వ్యక్తి ఏసుక్రీస్తు అని కొనియాడారు. ఆయన చూపిన మార్గం మానవాళికి ఆదర్శమన్నారు. నియోజకవర్గ క్రైస్తవ సోదరలందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. చర్చి నిర్వాహకులు డీఎన్నార్ సన్మానించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర మైనారిటీ విభాగ కార్యదర్శి ఎండీ గాలిబ్ బాబు, మండల పార్టీ అధ్యక్షుడు సింగంశెట్టి రాము, నియోజకవర్గ ఎస్సీ సెల్ విభాగ అధ్యక్షుడు ఉచ్చుల చినరాజు, జిల్లా మేధావుల విభాగ కార్యదర్శి సోమాల శ్యాంసుందర్, వివిధ హోదాల్లో నాయకులు సమయం అంజి, పెంటా అనిల్ కుమార్, దాసరి శ్యాంబాబు, సుధాకర్, జంగం మధు సుందరబాబు, మత్తె జంగం నిర్మల జ్యోతి, ఫిర్దోస్ ఖాన్, కన్నా బాబు, సుంకర శివ, ఈతకోట శీను, వల్లూరి నాగేంద్ర, జంగం జయచంద్రపాల్, దాసరి సుధీర్, పెనుగొండ దానియేలు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని కొవ్వలికి చెందిన కొవ్వలి వినియోగదారుల సేవా మండలికి రాష్ట్ర ఉత్తమ వినియోగదారుల సంఘం అవార్డు లభించింది. జాతీయ వినియోగదారుల దినోత్సవం–2025ను పురస్కరించుకుని రాష్ట్ర కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ సివిల్ సప్లయీస్ శాఖ ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన వినియోగదారుల దినోత్సవ కార్యక్రమంలో పలువురు రాష్ట్రస్థాయి అధికారులు ఈ సంఘ ప్రతినిధి కట్టా సత్యనారాయణకు పురస్కారాన్ని అందించారు. భీమవరం: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి, సుపరిపాలన దినోత్సవం సందర్భంగా నరసాపురం పార్లమెంట్ పరిధిలో సంసద్ ఖేల్ మహోత్సవ్ ముగింపు వేడుకలు భీమవరం విష్ణు కాలేజీ ఆడిటోరియంలో గురువారం నిర్వహించారు. దేశవ్యాప్తంగా 300పైగా పా ర్లమెంట్ స్థానాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులతో ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో పాల్గొని ప్రసంగించారు. ప్రధాని మాట్లాడుతూ 2014కు ముందు క్రీడాకారుల ఎంపికలో అవినీతి, బంధుప్రీతి రాజ్యమేలేవని, గత దశాబ్ద కాలంలో ఆ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి పారదర్శకతను తీసుకువచ్చామని పేర్కొన్నారు. క్రీడాకారులు కేవలం వ్యక్తిగత విజయం కోసమే కాకుండా దేశ గౌరవం కోసం, మువ్వన్నెల జెండా కీర్తిని విశ్వవ్యాప్తం చేయడం కోసం ఆడాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమలశాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఆధ్వర్యంలో నరసాపురం పార్లమెంట్ పరిధిలోని వివిధ ప్రాంతాలలో ఈనెల 23 నుంచి సంబరాల్లో భాగంగా క్రీడాకారులకు చెస్, వాలీబాల్, బాస్కెట్బాల్, కబడ్డీ పోటీలను నిర్వహించారు. ముగింపు వేడుకల్లో పోటీల్లో విజేతలకు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి బహుమతులు అందించారు. దెందులూరు: భక్తుల పాలిట కొంగు బంగారం గాలాయగూడెంలోని అచ్చమ్మ పేరంటాలు తల్లి ఉత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఆలయం వద్ద విద్యుత్ దీపాల కటౌ ట్లు ఏర్పాటుచేస్తున్నారు. ఉత్సవాలపై ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. షాపుల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. -
గోదావరి మాత పురస్కారాల ప్రదానం
గణపవరం: గణపవరానికి చెందిన రుద్రరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కన్యకాపరమేశ్వరి వర్తకసంఘ భవనంలో గురువారం గోదావరి మాత అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా సర్వోదయ మండలి కార్యదర్శి ఇందుకూరి ప్రసాదరాజు మాట్లాడుతూ ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారిని గుర్తించి, సత్కరించడం ద్వారా నేటి తరానికి వారి సేవలను పరిచయం చేసే అవకాశం లభిస్తుందన్నారు. గణపవరంలో గోదావరి మాత పేరిట మూడు దశాబ్దాలుగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాల్లో లబ్దప్రతిష్టులైన పలువురు ప్రముఖులను సన్మానించడం అభినందనీయమని అన్నారు. ఈకార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రుద్రరాజు ఫౌండేషన్ చైర్మన్ ఆర్వీఎస్ రాజు దంపతులను అభినందించారు. ఈఏడాది డీవీడీ సత్యనారాయణ (పద్యకవిత రంగం), జి.అన్నపూర్ణ (సంగీతం), బత్తులు రాజు (చిత్రకళారంగం, పిప్పర), చిలువూరి రామకృష్ణంరాజు (సినీ నాటకరంగం దర్శకులు)లకు గోదావరి మాత అవార్డులు, నగదు, జ్ఞాపికలను అందచేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో వర్తక సంఘ భవనం ఉపాధ్యక్షుడు వంకాయల రామారావు, కార్యదర్శి నడింపల్లి రాంపండు, త్యాగరాజ కళాక్షేత్రం కార్యదర్శి మాదేటి సురేష్, తెలుగు రచయితల సంఘం జిల్లా కార్యదర్శి తెన్నేటి లక్ష్మీనర్సింహమూర్తి, యండపల్లి పాండు రంగారావు తదితరులు పాల్గొన్నారు. -
బరితెగింపు ఆగేనా..?
శురకవారం శ్రీ 26 శ్రీ డిసెంబర్ శ్రీ 2025సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉమ్మడి పశ్చిమలో సంక్రాంతి కోడిపందేల సన్నాహాలకు తెరలేచింది. గ్రామాలవారీగా నిర్వహించుకునే చిన్నపాటి పందెం బరులు మొదలు కూటమి నేతలు ఏర్పాటు చేసే భారీ బరులు, అలాగే కొన్నిచోట్ల ప్రజాప్రతినిధులే తెరచాటు నిర్వాహకులుగా ఏర్పాటు చేసే పందెంబరులపై పోలీసులు దృష్టి సారించలేదు. ఇప్పటికే పల్లెల్లో సంక్రాంతి సందడి ప్రారంభమై వచ్చే వారం నుంచి అక్కడక్కడా కోడిపందేల నిర్వహణకు సన్నద్ధమవుతున్నా పోలీసులు మాత్రం కట్టడి దిశగా కనీస కార్యాచరణ ప్రారంభించలేదు. రాష్ట్రంలోనే ఖ్యాతి : ఉమ్మడి పశ్చిమ కోడిపందేల నిర్వహణకు రాష్ట్రంలో ఖ్యాతిగాంచింది. తీవ్రస్థాయి అడ్డంకులు, కోర్టు ఉత్తర్వులు ఇలా ఎన్ని ఉన్నా చట్ట పరిధిలోబడి అంటూ ముసుగులో భారీ ఎత్తున కోడిపందేలు, పేకాట, గుండాట జూద క్రీడలు నిర్వహిస్తుంటారు. సాధారణంగా సంక్రాంతి మూడు రోజులు అంత సీరియస్గా తీసుకోకపోయినా మిగిలిన రో జుల్లోనైనా కట్టడి చేయాల్సిన పరిస్థితి. అయితే పోలీసులు మాత్రం స్టేషన్ల వారీ వ్యవహారాలకు బైండోవరై యథేచ్ఛగా పందేల నిర్వహణకు పరోక్షంగా సహకరిస్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ప్రధానంగా సంక్రాంతి సీజన్ ప్రారంభంలో పందెంకోళ్ల పెంపకందారులపై కేసులు, గతంలో పందెం బరులు నిర్వహించినవారిపై, బెట్టింగ్రాయుళ్లు, కోడికత్తులు తయారీదారులపై బైండోవర్ కేసులు నమోదు చేసి విచ్చలవిడి క్రీడలు కొంత మేరకై నా కట్టడి చేసేవారు. ఈసారి అలాంటి చర్యలేవీ తీసుకోని పరిస్థితి. దీంతో అన్ని నియోజకవర్గాల్లో భారీ బరులకు మంతనాలు తీవ్రస్థాయిలో జరుగుతున్నా యి. పేకాటకు, గుండాటకు కోడిపందేల బరులకు ఇ లా ఒక్కోదానికి ఆటస్థాయి బట్టి రేట్లు ఖరారు చేసి స్థానిక స్టేషన్ మొదలు ప్రజాప్రతినిధి వరకూ ఒక మొత్తాన్ని ఇచ్చేలా చర్యలు జోరుగా సాగుతున్నా యి. ఇక అధికార పార్టీ నాయకులే పూర్తిగా కోడిపందేల బరులు నిర్వహించేలా ఇప్పటికే మండలాల్లో ఖరారు చేసుకుని ముందుకు సాగుతున్నారు. ప్ర ధానంగా తాడేపల్లిగూడెంలో ఒక బరి కేవలం రా యలసీమ నుంచి వచ్చే అతిథుల కోసం సన్నద్ధం చేస్తుండగా ఉండి, పాలకొల్లు, భీమవరం, ఉంగుటూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో భారీ బరులను వివిధ రకాల ఆకర్షణలతో ఏర్పాటు చేసేలా హడావుడి చేస్తున్నారు. కోడి.. రెఢీ పల్లెల్లో సంక్రాంతి బరులకు సన్నాహాలు పొలిటికల్ బరులపై రెగ్యులర్ పంచాయితీలు మొక్కుబడి కేసులకే పోలీసు శాఖ పరిమితం ముందస్తు బైండోవర్లపై దృష్టి సారించని వైనం కోడికత్తుల తయారీదారులపై తీసుకోని చర్యలు వచ్చే వారం నుంచి పందేల నిర్వహణకు ప్రయత్నాలు గతంలో హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం కోడిపందేల నిర్వహణను సీరియస్గా తీసుకుని నెల రోజుల ముందు నుంచే కనీస నియంత్రణకు చర్యలు తీసుకునేది. డిసెంబర్ 15 నుంచే పందెం నిర్వాహకులు, పేకాట, గుండాట, కోడికత్తుల తయారీదారులపై కేసులు నమోదు చేసేది. ఉమ్మడి పశ్చిమలో 2022లో 3,783 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసి 374 మందికి నోటీసులు జారీ చేసి 4,900 కోడికత్తులను స్వాధీనం చేసుకున్నారు. 2023లో 1,390 బైండోవర్ కేసులు, 2,700 కోడికత్తులు, 195 మంది నోటీసులు జారీ చేశారు. 2024లో ఉమ్మడి జిల్లాలో 187 కేసులు, 360 మందికి నోటీసులు, 700ల మందికిపైగా బైండోవర్లు, 1,856 కోడికత్తులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఏడాదిలో ఇంకా బైండోవర్లపై జిల్లా అధికారులు దృష్టి సారించని పరిస్థితి. -
శోభనాచలుని సొమ్ము అప్పగించాల్సిందే
ఆగిరిపల్లి : శోభనాచలుని సొమ్ము వడ్డీతో సహా చెల్లించిన తర్వాతే మాఘమాస రథసప్తమి ఉత్సవాలు జరిపించాలని గ్రామస్తులు, కుల సంఘాల వారు డిమాండ్ చేశారు. జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రమైన శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి మాఘ మాస రథసప్తమి ఉత్సవాలపై గురువారం ఆలయ ఆవరణలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్య నిర్వహణ అధికారి సాయి మాట్లాడుతూ ఉత్సవాలు జనవరి 19 నుంచి 29 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కుల సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ గత 20 ఏళ్ల నుంచి స్వామివారి అన్నదానానికి భక్తుల నుంచి వసూలు చేసిన లక్షలాది రూపాయల చందాలు వివరాలు, నగదును అప్పచెబుతామని చెప్పి ఏడాది అవుతున్న అన్నదాన కమిటీ సభ్యులు ఇప్పటివరకు వివరాలు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. అన్నదాన చందాలకు వసూలు చేసిన డబ్బులతో కొందరు వ్యక్తులు వడ్డీ వ్యాపారం చేయటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్ల క్రితం అప్పటి ఎమ్మెల్యే, ఆలయ వంశపారంపర్య ధర్మకర్త మేకా వెంకట ప్రతాప్ అప్పారావు చొరవ తీసుకొని గ్రామ పెద్దలతో కమిటీ ఏర్పాటు చేసి అన్నదానం నిర్వహించారు. రెండు సంవత్సరాలకు ఖర్చులు పోను రూ.5.75 లక్షలు మిగలగా వాటిని బ్యాంక్ ఖాతాలో జమ చేశారు. మరి 20 సంవత్సరాలకి ఎన్ని లక్షలు ఉండాలో చెప్పాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. స్వామివారికి అన్నదాన కమిటీ సభ్యులు ఇవ్వాల్సిన లక్షలాది రూపాయలకు వడ్డీతో సహా చెల్లించిన తర్వాతే మాఘమాస రథసప్తమి ఉత్సవాలు జరిపించాలని గ్రామస్తులు, కుల సంఘాల వారు డిమాండ్ చేశారు. డిమాండ్ చేసిన గ్రామస్తులు -
భూ కబ్జాపై టీడీపీ నేతల దొంగాట
● ఆక్రమణలపై ఆరోపణలు ● పట్టించుకోని రెవెన్యూ అధికారులు ద్వారకాతిరుమల: ప్రభుత్వ పోరంబోకు భూమి కబ్జా వ్యవహారంపై టీడీపీ నేతలు దొంగాట ఆడుతున్నారు. భూకబ్జా నువ్వే చేశావంటే.. కాదు నువ్వే చేశావంటూ ఆరోపణలు చేసుకుంటున్నా రెవెన్యూ అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నా రు. వివరాల్లోకి వెళితే.. ద్వారకాతిరుమల మండ లం తిమ్మాపురంలోని ఆర్ఎస్ నం.220లో 9 ఎకరాల ప్రభుత్వ పోరంబోకు భూమిని టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు గంటా శ్రీనివాసరావు అధికారాన్ని అడ్డంపెట్టుకుని కబ్జా చేశారని అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు తూంపాటి పద్మవరప్ర సాద్ ఆరోపించారు. భూమిలో చేపల చెరువు తవ్వతున్నారని అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. దీనిపై ‘సాక్షి’లో గురువారం ‘ఈ భూ కబ్జాను అడ్డుకునేదెవరూ?’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో శ్రీనివాసరావు వర్గీయులు అసలు కబ్జాదారుడు పద్మవరప్రసాదే అంటూ ఆరోపణాస్త్రాలను సంధిస్తున్నారు. వరప్రసాద్ తన తల్లి సత్యవతి పేరున ఈ ఏడాది అక్టోబర్లో వివాదాస్పద భూమి తనదేనంటూ రెవెన్యూ అధికారులు, కలెక్టర్కు పెట్టిన అర్జీ పత్రాన్ని శ్రీనివాసరావు వర్గీయులు బహిర్గతం చేశారు. హైకోర్టులో సైతం దీనిపై కేసు వేశారని చెబుతున్నారు. శ్రీనివాసరావు కబ్జా చేశారని చెబుతున్న అదే భూమి తనదంటూ వరప్రసాద్ తల్లి సత్యవతి పేరున అర్జీ ఎలా పెట్టారని ప్రశ్నిస్తున్నారు. ఆర్ఎస్ నం.220లోని 11 ఎకరాల భూమిలో 5 ఎకరాల భూమిని దశాబ్దాల క్రితం శ్రీనివాసరావు ఒక ఎక్స్ సర్వీస్మెన్ నుంచి కొనుగోలు చేశారని, భూమిలో కొంత దారులకు పోగా, మిగిలిన భూమిని వరప్రసాద్ కబ్జా చేశారని ఆరోపిస్తున్నారు. ఏదిఏమైనా వీరి గొడవల కారణం ప్రభుత్వ భూమి కబ్జా వ్యవహారం బయటపడిందని స్థానికులు అంటున్నారు. వివాదాస్పద భూమి తనదేనంటూ వరప్రసాద్ తల్లి సత్యవతి పెట్టిన అర్జీ -
అన్నదాతపై ‘ఎరువు’ దరువు
నిడమర్రు: సార్వాలో అధిక వర్షాల కారణంగా దిగుబడులు పడిపోయి రైతన్నలు కుదులేయ్యారు. ప్రస్తుతం రబీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మకై ్క ఎరువుల ధరలు పెంచడంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కాంప్లెక్స్ ఎరువుల ధరలు భారీగా పెంచడం వలన రైతు నెత్తిన అదనంగా పెట్టుబడి భారం పడుతోంది. ఎరువుల నుంచి డీజిల్, పెట్రోల్ ధరల పెరుగుదల రైతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రబీ సీజన్లో ఉంగుటూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 48,883 ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారు. మరో రూ.30 వేల ఎకరాల్లో పాయాయిల్, మామిడి, కూరగాయలు వంటి ఇతర పంటలు సాగవుతున్నాయి. వరి సాగులో రైతులు ఎకరాకు 6 నుంచి 7 బస్తాల వరకూ ఎరువులు ఉపయోగిస్తారు. ఇందులో మూడు బస్తాల కాంప్లెక్స్ ఎరువు ఉంటుంది. దీంతో నియోజకవర్గంలో అధికారుల గణాంకాల ప్రకారం 26 వేల బస్తాల వరకూ కాంప్లెక్స్ ఎరువులు వినియోగిస్తున్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. రైతులు ఎక్కువగా 28–28–0, 10–26–26, వంటి కాంప్లెక్స్ ఎరువులను వినియోగిస్తారు. బ్లాక్ మార్కెట్లోనే యూరియా అధికారులు రైతు భరోసా కేంద్రాలు, సొసైటీల ద్వారా రైతులకు అవసరమైన యూరియా అందిస్తున్నట్లు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితిలేదని రైతులు చెబుతున్నారు. సొసైటీల ద్వారా ఇచ్చే యూరియాను మొదటి కోటా అంటూ ఎకరాకు 1 బస్తా చొప్పునే ఇస్తున్నారు. దీంతో మిగిలిన బస్తాలను ప్రైవేట్ మార్కెట్లో కొనుగోలు చేస్తున్నారు. యూరియా బస్తా ఎంఆర్పీ రూ.266 ఉంటే హోల్ సెల్ మార్కెట్లో రూ.290తో పాటు రవాణా కిరాయి రూ.41 కలుపుకుంటున్నారు. దీంతో రూ.266కు బదులు అదనంగా రూ.350 వరకూ పెట్టి రైతులు కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీంతో యూరియాపై బస్తాకు రూ.90 అదనపు భారం పడుతోందని రైతులు చెబుతున్నారు. మరి కొందరు డీలర్లు మిశ్రమ ఎరువులతోపాటు జింక్, దుబ్బుగుళికలు తప్పనిసరిగా తీసుకోవాలని రైతులపై ఒత్తిడి తెస్తున్నట్లు వాపోతున్నారు. ధరల నియంత్రణలో చంద్రబాబు సర్కారు మరోసారి రైతులను మోసం చేసిందంటూ స్థానిక రైతులు విమర్శిస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో రైతులకు ఊరట 2019 నుంచి 2024 వరకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ సమయంలో రసాయన ఎరువుల ధరలు ఒక్కసారి కూడా పెరిగిన ధాఖలాలు లేవు. ఎరువుల ధరలు నిలకడగా ఉంటంతో రైతులకు ఊరట లభించింది. కానీ ప్రస్తుతం ఎరువుల ధరలు పెంచడంలో టీడీపీ, జనసేనలు కేంద్రానికి పూర్తి మద్దతు ఇచ్చాయనే ప్రచారం సాగుతోంది. ధర రూ. ధర రూ. 14–35–14 1,800 1,900 20–20–0–13 1,350 1,450 28–28––0 1,750 1950 10–26–26 1,700 1,800 16–16–16 1450 1,600 16–20–0–13 1,150 1,250 పొటాష్ 1,700 1,800గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడూ బీజేపీ సర్కారు ఎరువుల ధరలు పెంచినా వ్యతిరేకించలేదు. నేడు ఎరువుల ధరలు పెరిగి రైతులు ఆందోళన చెందుతున్నా పట్టించుకోవడం లేదు. ఎన్నికల్లో మాత్రం రైతు పక్షపాతిని అంటూ ఊదరగొట్టి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరలో 3 సార్లు ఎరువుల ధరలు పెంచి రైతుల నడ్డివిరచడం దారుణం. – అలుమోలు గంగారాం, రైతు, బువ్వనపల్లి సార్వాలో వరుస తుపాన్లు, అధిక వర్షాల కారణంగా దిగుబడి గణనీయం పడిపోయింది. దీంతో కౌలు రైతులకు పెట్టుబడులు కూడా రాని పరిస్థితి. ఇప్పుడు అమాంతం ఎరువుల ధరలు పెంచడం వలన రబీలో పెట్టుబడి మరింత పెరుగుతోంది. పెరిగిన ధరను రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. – మచ్చకర్ల సాయిబాబా, కౌలు రైతు, బువ్వనపల్లి అడ్డగోలుగా ధరలు పెంచిన ఎరువుల కంపెనీలు బస్తాపై రూ.100 నుంచి రూ.200 వరకు పెంపు యూరియా బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేస్తున్న రైతులు -
వైఎస్సార్ విరగహం వద్ద చంద్రబాబు ఫ్లెక్సీ
● తణుకులో ఉద్రిక్తత ● నిరసన తెలిపిన వైఎస్సార్సీపీ శ్రేణులు ● ధ్వజమెత్తిన మాజీ మంత్రి కారుమూరితణుకు అర్బన్: రాష్ట్రంలో ఎవరి ఇంట్లోకై నా వెళ్లిపో వచ్చన్నట్టుగా ఈ ప్రభుత్వం ఉందని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విమర్శించారు. మహానేత వైఎస్సార్ విగ్రహానికి చంద్రబాబు ఉన్న ఫ్లెక్సీ కట్టారంటే ఈ ప్రభుత్వం ఏ స్థాయికి దిగజారిపోయిందో అర్థమవుతుందని మండిపడ్డారు. ఏనాడైనా తాము ఎన్టీఆర్ విగ్రహానికి తమ నాయకుడి ఫ్లెక్సీ పెట్టామా అని ప్రశ్నించారు. తణుకు–తేతలి వై.జంక్షన్లోని వైఎస్సార్ విగ్రహం వద్ద చంద్రబా బు, స్థానిక ఎమ్మెల్యే ఉన్న ఫ్లెక్సీ కట్టిన ప్రాంతంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మా ట్లాడారు. చంద్రబాబు ఫ్లెక్సీ విప్పనీయకుండా, తమ ఫ్లెక్సీ ఏర్పాటుచేయకుండా పోలీసులు కాప లా కాస్తున్నారని ఇది మరింత సిగ్గుచేటని మండిపడ్డారు. ఎమ్మెల్యే ఆదేశాలతో ఫ్లెక్సీని తీయనీయకుండా పోలీసులు కాపలా కాస్తున్నారని, ఇదే తరహాలో అత్తిలి ఎంపీపీ ఎన్నికల్లో సైతం తన ఇంటి ముందు ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడినా ఒక్క పోలీసు కూడా రాకుండా ఆరోజు ఎమ్మెల్యే చెప్పినట్టుగా నడుచు కుని పోలీసులు లా అండ్ ఆర్డర్ సమస్య తీసుకువచ్చారని విమర్శించారు. తణుకులో లా అండ్ ఆర్డర్ సమస్య అంతా పోలీసుల కారణంగానే వస్తుందని విమర్శించారు. ఫ్లెక్సీ తొలగించకపోతే రోడ్డుపైనే ఉంటామని తమ రాష్ట్ర నాయకులు అంతా తణుకు వస్తారని హెచ్చరించారు. ఎటువంటి ఫ్లెక్సీలు లేకుండా చేస్తే విగ్రహం వద్ద నిర్మాణ పనులు చేసుకుంటామని చెప్పారు. ఉద్రిక్తంగా తణుకు తణుకు–తేతలి వై.జంక్షన్లోని మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద క్రిస్మస్, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపే ఫ్లెక్సీ పెట్టుకునేందుకు గురువారం సాయంత్రం వచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులకు అప్పటికే చంద్రబాబు, ఎమ్మెల్యే తదితరులు ఉన్న ఫ్లెక్సీ ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయడంతో నిరసనకు దిగారు. వైఎస్సార్సీపీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసేందుకు పార్టీ శ్రేణులు దిగడంతో పోలీసులు ఫ్లెక్సీని లాక్కుని స్వాధీనం చేసుకున్నారు. దీంతో వివాదం ముదరడంతో పార్టీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించారు. విషయం తీవ్రత తెలుసుకున్న మాజీ మంత్రి కారుమూరి హుటాహుటిన హైదరాబాద్ నుంచి రాత్రి సమయంలో తణుకు ఘటనా ప్రాంతానికి చేరుకుని పార్టీ శ్రేణులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. అంతకుమందు పోలీసులు వైఎస్సార్సీపీ శ్రేణులతో చర్చలు జరిపి నిరసన విరమించాలని కోరినా చంద్రబాబు ఫ్లెక్సీ తీయాల్సిందేనని నాయకులు పట్టుబట్టారు. ఘటనా ప్రాంతానికి తాడేపల్లిగూడెం డీఎస్పీ విశ్వనాథ్, తణుకు పట్టణ రూరల్ సీఐలు ఎన్.కొండయ్య, కృష్ణకుమార్, తాడేపల్లిగూడెం సీఐ బాదం శ్రీనివాస్, ఎస్సైలు తమ సిబ్బందితో కలిసి మొహరించారు. నిరసన కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, పంచాయతీరాజ్ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరి సీతారామ్, పబ్లిసిటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు జల్లూరి జగదీష్, జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ యిండుగపల్లి బలరామకృష్ణ, తణుకు నియోజకవర్గ ప్రచార కమిటీ అధ్యక్షుడు గెల్లా జగన్, ఎస్సీసెల్ అధ్యక్షుడు పెనుమాల రాజేష్, ఎడ్వర్డ్ పాల్, పైడి సాయిసూర్య, యారబాటి రామకృష్ణ, గెద్దా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ముగిసిన వివాదం మాజీ మంత్రి కారుమూరి పోలీసులతో తీవ్ర వాగ్వాదాల నడుమ చంద్రబాబు ఫ్లెక్సీ ముందు వైఎస్సార్సీపీ ఫ్లెక్సీ ఏర్పాటుచేయడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు శాంతించారు. శుక్రవారం సాయంత్రం రెండు ఫ్లెక్సీలు తొలగింపచేసేలా పోలీసులు, వైఎస్సార్సీపీ శ్రేణుల మధ్య ఒప్పందం కుదరడంతో వివాదానికి తాత్కాలికంగా తెరపడింది. -
గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు
ఎరువు దరువు ప్రస్తుత రబీ సీజన్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మకై ్క ఎరువుల ధరలు పెంచడంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కాంప్లెక్స్ ఎరువుల ధరలు భారీగా పెరిగాయి. 8లో uద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీవారి గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. గిరి ప్రదక్షిణ మార్గంలోని రాళ్లను తొలగించి, మట్టి తో వాటిని పూడ్చివేశారు. ప్రస్తుతం బ్లేడ్ ట్రాక్టర్తో చదును చేసే పనులు చేస్తున్నారు. గోవింద స్వాము లు, భక్తులు నడిచేందుకు వీలుగా ఈ మార్గంలో ఎండు గడ్డి వేయాలని అధికారులు నిర్ణయించారు. గోవింద స్వాములు ఇరుముడులు సమర్పించేందు కు బుకింగ్ కౌంటర్ల వద్ద హోమగుండాన్ని నిర్మించా రు. దానికి పందిరి వేస్తున్నారు. గిరి ప్రదక్షిణ, స్వా మివారి ఉత్తర ద్వార దర్శనం ఏర్పాట్లపై దేవస్థానం ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి ఐదు రోజుల క్రితం ఆల య ప్రధానార్చకులు పీవీఎస్ఎస్ఆర్ జగన్నాథాచార్యులు, ఈఈ డీవీ భాస్కర్, డీఈఓ వై.భద్రాజీ, డీఈ టి.సూర్యనారాయణ, ఏఈఓలు మెట్టపల్లి దు ర్గారావు, పి.నటరాజారావు, ఐ.రమణరాజు, జి.ఉమాపతి, సూపరింటెండెంట్లతో సమావేశం నిర్వహించి సూచనలు ఇచ్చారు. ఈనెల 29న శ్రీవారి గి రి ప్రదక్షిణ స్వామివారి తొలిమెట్ట (పాదుకా మండపం) వద్ద ప్రారంభమవుతుందని ఈఓ తెలిపారు. అదేరోజు రాత్రి 7 గంటల నుంచి స్వామివారి నిజ రూప దర్శనం, మరుసటిరోజు 30న ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉత్తర ద్వార దర్శన భాగ్యాన్ని భక్తులకు కల్పిస్తామన్నారు. -
సస్యరక్షణ చేపట్టాలి
పెనుగొండ : గత కొన్నిరోజులుగా మంచు శాతం అధికంగా ఉండడంతో నారుమడులపై ప్రభావం చూపుతుందని, రైతులు తక్షణం రక్షణ చర్యలు చేపట్టాలని మండల వ్యవసాయాధికారి పి స్పందన సూచించారు. సాగుకు ఆదిలోనే హంసపాదు శీర్షికన శ్రీసాక్షిశ్రీలో ప్రచురితమైన కథనానికి ఆమె స్పందించి, పలు సూచనలు చేశారు. మంచు తీవ్రంగా ఉన్నందున నారుమడి ఎదుగుదలపై ప్రభావం చూపుతుందని వివరించారు. మంచు ప్రభావం నుంచి బయట పడడానికి 5 సెంట్లు నారుమడికి 4.4 కేజీ 6.25 కేజీ సింగిల్ సూఫర్ ఫాస్పెట్, 1.6 కేజీ పాటాష్ ఎరువులు అందించడం ద్వారా నారుమడి ఎదుగులకు ఇబ్బందులు లేకుండా, వేగంగా పెరుగుతుందన్నారు, వాటితో పాటు జింక్ సల్ఫేట్ 2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు. నారుమడికి పలుచగా తాజా నీరు అందిస్తుండాలన్నారు. అయినా నారుమడి సరైన ఎదుగుదల లేనిచో 17–17–17 ను 10 గ్రాముల నీటికి బూస్టర్ మోతాదుగా పిచికారీ చేయాలన్నారు. రాజమహేంద్రవరం రూరల్: స్థానిక ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కార్యాలయం పరిధిలో ఈ నెల 29న నిధి ఆప్ కే నికత్ జిల్లా ఔట్రీచ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ యు.శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి రామచంద్రపురంలోని వీఎస్ఎం ఇంజినీరింగ్ కళాశాల, కాకినాడ జిల్లాకు వాకలపూడిలోని ప్యారీ షుగర్స్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి అయినవిల్లి మండలం పోతుకుర్రులోని త్రీ సీజన్స్ ఎగ్జిమ్ లిమిటెడ్లోను, ఏలూరు జిల్లాకు దేవరపల్లి గ్రామంలోని గోపాలపురం రోడ్డులో ఉన్న పరమేశు బయోటెక్లోను, పశ్చిమగోదావరి జిల్లాకు పాలకోడేరులోని ఆనంద ఎంటర్ప్రైజెస్లోను, అల్లూరి సీతారామరాజు జిల్లాకు మారేడుమిల్లి కేజీబీవీ స్కూల్లోనూ ఈ కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. అంతర్జాతీయ కార్మికుల ప్రయోజనాలు, కవరేజ్ సర్టిఫికెట్, ఈపీఎఫ్, సభ్యుడు తనిఖీ చేయాల్సిన అంశాలు, 15జి/15హెచ్, పన్ను సంబంధిత ఈపీఎఫ్ గురించి ఈ సందర్భంగా వివరిస్తారని తెలిపారు. పీఎఫ్ సభ్యులు, పింఛనుదార్లు, వివిధ సంస్థలు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలన్నారు. పీఎఫ్ అంశాలపై ఈ సందర్భంగా ఫిర్యాదులు సమర్పించవచ్చన్నారు. పింఛనుదారులు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ కూడా ఈ శిబిరాల్లో అందించవచ్చని శ్రీనివాసరావు తెలిపారు. -
కుక్కను తప్పించబోయి వ్యక్తి దుర్మరణం
మండవల్లి: కుక్కను తప్పించబోయి మోటార్సైకిల్పై వెళుతున్న ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముదినేపల్లి మండలం వడాలి గ్రామానికి చెందిన మట్టా ఏడుకొండలు (36) స్క్రాప్ వ్యాపారం చేసుకుని జీవిస్తుంటాడు. తాడేపల్లి సమీపంలోని జగన్నాధపురంలో నివాసముంటున్న భార్యను తీసుకురావడానికి ఈనెల 23వ తేదీన వడాలి నుంచి మోటార్ సైకిల్పై మండవల్లి వైపుకు వస్తున్నాడు. కానుకొల్లు జాతీయ రహదారిపై కుక్క అడ్డురావడడంతో తప్పించబోయే క్రమంలో వాహనం అదుపు తప్పి రోడ్డుపై పడిపోయాడు. తీవ్ర గాయాలైన అతడ్ని స్థానికులు 108 వాహనంపై గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి అన్నయ్య సత్యప్రసాద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తాటాకిల్లు దగ్ధం
చాట్రాయి: విద్యుత్ షార్ట్సర్క్యూట్తో తాటాకిల్లు దగ్ధమైన ఘటన జనార్థనవరంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నడిపింటి రాంబాబు తాటాకింటిలో బుధవారం సాయంత్రం మంటలు చెలరేగాయి. వంట సామాగ్రి, పిల్లల సర్టిఫికెట్లతోపాటు బంగారం, నగదు, ధాన్యం దగ్ధమవ్వడంతో బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. విద్యుత్ షార్ట్సర్క్యూట్ వల్ల ప్రమాదం చోటుచేసుకుందని, సుమారు రూ.10 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు చెబుతున్నారు. భీమవరం: భీమవరంలోని ఓ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని అధ్యాపకుడు కొట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది. ఈ విషయాన్ని అడిగేందుకు సంబంధిత కళాశాలకు వెళ్లిన విద్యార్థి సంఘ ప్రతినిధులపై ప్రైవేటు వ్యక్తులు దాడి చేశారంటూ ఆరోపించారు. ఎస్సై రామారావు, సిబ్బంది సంఘటన జరిగిన ప్రాంతానికి బుధవారం వెళ్లి వివరాలు సేకరించారు. విద్యార్థిని కొట్టిన అధ్యాపకుడ్ని సస్పెండ్ చేశామని యాజమాన్యం చెప్పింది. ఏలూరు (టూటౌన్): ఉంగుటూరు మండలం బాదంపూడిలోని దేశీయ జల మత్స్య సంవర్థన శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందుటకు ఈనెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మత్స్య శాఖ అధికారి బి.రాజ్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులకు ఈ నెల 31వ తేదీ ఉదయం 11 గంటలకు బాదంపూడిలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. మత్స్య క్షేత్రాలు, రిజర్వాయర్లలో చేపల పెంపకం గురించి బోధనా, ప్రాక్టికల్స్తో కూడిన కోర్సు బోధించడం జరుగుతుందని, శిక్షణానంతరం పరీక్షలు నిర్వహించి, ఉతీర్ణులైనవారికి సర్టిఫికెట్లు జారీ చేస్తారన్నారు. 5వ తరగతి ఆపైన చదువుకున్న 18 నుంచి 30 సంవత్సరాల లోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 95733 37484, 72869 93033, 94923 37469 నంబర్లలో సంప్రదించాలన్నారు. -
సైన్స్ ఫెయిర్లో ప్రథమ స్థానం
ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రస్థాయిలో నిర్వహించిన సైన్స్ ఫెయిర్లో జిల్లాకు చెందిన విద్యార్థినిలు ప్రథమ స్థానంలో నిలిచారు. విజయవాడ పోరంకిలోని మురళి రిసార్ట్స్లో నిర్వహించిన సైన్స్ ఫెయిర్లో చాటపర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న సువ్వా శరణ్య, బండారు గాయత్రిలు అభివృద్ధి చెందుతున్న సాంకేతికాలు అంశంపై ప్రాజెక్టు రూపొందించారు. ఈ ప్రాజెక్టు అధికారులు మన్ననలు పొంది రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి పొందింది. విద్యార్థినిలు వచ్చే జనవరిలో హైదరాబాద్లో నిర్వహించే దక్షిణ భారత స్థాయి సైన్స్ ఫెస్టివల్కు అనంతరం జాతీయ స్థాయిలో నిర్వహించే రాష్ట్రీయ బాల వైజ్ఞానిక్ ప్రదర్శనకు ఎంపికయ్యారు. ప్రాజెక్టును ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఎంవీ కృష్ణారెడ్డి, టాటా కంపెనీ ప్రతినిధులు, ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఆచార్యులు, ఏలూరు జిల్లా సైన్స్ అధికారి సోమయాజులు తదితరులు ప్రత్యేకంగా అభినందించారు. -
భూ సమస్యల పరిష్కారంలో విఫలం
ఏజెన్సీ ప్రాంతంలో నెలకొన్న భూ సమస్యల పరిష్కారంలో రెవెన్యూ యంత్రాంగం పూర్తి విఫలమైంది. 1/70, ఎల్టీఆర్ కింద నమోదైన భూముల్లో గిరిజనులు ఏళ్ల తరబడి సాగు చేసుకుంటుంటే గిరిజనులకు న్యాయం చేయకపోగా గిరిజనేతరుల పక్షాన రెవెన్యూ, పోలీస్ అధికారులు ఉంటూ గిరిజనులపైనే అక్రమ కేసులు పెడుతున్నారు. కోర్టు వివాదాలు, ఎల్టీఆర్, 1/70 పరిధిలో ఉన్న భూములను ఆర్ అండ్ ఆర్ భూములుగా కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. – తెల్లం రామకృష్ణ, ఆదివాసీ గిరిజన సంఘ జిల్లా అధ్యక్షుడు, బుట్టాయగూడెం -
డైట్ బిల్లుల కోసం ఎదురుచూపులు
● రెండు నెలలుగా అందని వైనం ● సుమారు రూ.కోటి వరకూ విడుదల కావాల్సిన నిధులు బుట్టాయగూడెం: ఐటీడీఏ పరిధిలో నిర్వహిస్తున్న గిరిజన సంక్షేమ పాఠశాలల్లోని విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు ఇస్తున్న డైట్ బిల్లులు గత రెండు నెలలుగా అందక నిర్వాహకులు అవస్థలు పడుతున్నారు. ఈ బిల్లులు ప్రతి నెలా 4, 5 తేదీల్లోపు సంబంధిత నిర్వాహకులు పంపుతున్నప్పటికీ అవి జమకాని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం తమకు అక్టోబర్, నవంబర్ నెలలకు సంబంధించి రెండు నెలల బిల్లుల బకాయిలు జమ కావాల్సి ఉందని, డిసెంబర్ మాసం కూడా ముగుస్తున్నందున ఈ నెల బిల్లు కూడా వస్తుందో లేదో అని నిర్వాహకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలకు సరుకుల సరఫరా ఇలా బుట్టాయగూడెం మండలం కేఆర్పురం ఐటీడీఏ పరిధిలోని బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు, టి. నర్సాపురం మండలాల పరిధిలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు 25, కళాశాల వసతిగృహాలు 9 ఉన్నాయి. ఆశ్రమ పాఠశాలల్లో 5,965 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. కాలేజీ వసతిగృహాల్లో 1,219 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు సంబంధించి నెలకు ఒక్కో విద్యార్థికి రూ.1,400, కళాశాల విద్యార్థులకు నెలకు రూ. 1,600 చొప్పున ప్రభుత్వం అందజేస్తుంది. 2022 సంవత్సరంలో రూపొందించిన ఆహార పట్టిక(మెనూ)ను ప్రస్తుతం అమలు చేస్తున్నారు. దీనిప్రకారం ఆదివారం, మంగళవారాలు చికెన్, ఆరురోజులపాటు గుడ్డు, ప్రతిరోజూ ఉదయం అల్పాహారం విద్యార్థులకు ఇవ్వాలి. దీనికి సంబంధించి నిత్యవసర సరుకులు, బియ్యాన్ని ప్రభుత్వమే జీసీసీ ద్వారా సరఫరా చేస్తుంది. అయితే గ్యాస్ను మాత్రం నిర్వాహకులే కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే వీటికి సంబంధించి నిర్వాహకులు డైట్ బిల్లులు పెట్టుకున్నప్పటికీ అక్టోబర్, నవంబర్ నెల నుంచి మంజూరు కాలేదు. రెండు నెలలకు సంబంధించి సుమారు రూ.కోటి వరకూ బిల్లులు మంజూరు కావాల్సి ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. అలాగే డిసెంబర్ నెల కూడా పూర్తి కావొచ్చింది. ఈ నేపద్యంలో 3 నెలల బిల్లు రావాల్సి ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా రాని బిల్లులు ప్రస్తుతం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో 2022 నాటి మెనూ ప్రకారమే విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నప్పటికీ గత రెండేళ్లుగా పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలకు, ప్రభుత్వం ఇచ్చే ధరలకు చాలా వ్యత్యాసం ఉందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో గుడ్డు రూ.ఏడున్నర ఉండగా ప్రభుత్వం రూ.ఐదున్నర మాత్రమే ఇస్తుందని చెబుతున్నారు. అలాగే నిత్యవసర సరుకుల ధరలు కూడా పెరిగాయని, ప్రభుత్వం మాత్రం కేజీ రూ.30 కు మించి బిల్లులు ఇవ్వడంలేదని వాపోతున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వం బిల్లులు పెంచి ఇవ్వాలని వారు కోరుతున్నారు. -
గిరిజనులతో చెలగాటం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పశ్చిమ ఏజెన్సీలో గిరిజనులతో రెవెన్యూ అధికారులు చెలాగాటమాడుతున్నారు. రెండు దశాబ్దాల క్రితం సద్దుమణిగిన భూ వివాదాలకు ఆజ్యం పోస్తున్నారు. కొన్ని చోట్ల గిరిజన భూములపై గిరిజనేతరులకు హక్కులున్నాయంటూ అధికారులు ఏకపక్షంగా వ్యవహారించడం ఘర్షణలకు దారితీస్తు్నాయి.. 1994 తర్వాత ఈ ప్రాంతంలో సద్దుమణిగిన భూవివాదాలు వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో ఎక్కడా కనిపించలేదు. మళ్లీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలవరం నిర్వాసితుల భూసేకరణ భూవివాదాలు రగులుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఎల్టీఆర్ 1/70 పరిధిలో ఉన్న గిరిజనులు సాగుచేసుకుంటున్న, కోర్డు పెండింగ్లో ఉన్న భూములను రెవెన్యూ అధికారులు సేకరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఏళ్ల తరబడి గిరిజన ప్రాంతంలో 1/70, ఎల్టీఆర్లో నమోదైన భూములు పెండింగ్లో ఉన్నప్పటికీ వాటి పరిష్కారానికి కనీసం రెవెన్యూ అధికారులు శ్రద్ధ చూపకపోవడం వల్లే భూవివాదాలు తలెత్తుతున్నాయని పలువురు భావిస్తున్నారు. బుట్టాయగూడెం మండలం అంతర్వేదిగూడెం రెవెన్యూ పరిధిలో ఉన్న ఇనుమూరు భూ వివాదానికి సంబంధించి సుమారు 42 ఎకరాల భూమిని 57 కుటుంబాలు తమ పూర్వీకుల నుంచి సాగు చేసుకుంటున్నా వాటికి పట్టాలు మంజూరు చేయడంలో అటు అధికారులు, ఇటు పాలకులు శ్రద్ధ చూపడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. ఇటీవల పోలవరం నిర్వాసితుల కోసం సేకరిస్తున్న భూముల్లో కోర్టు వివాదాలు, 1/70, ఎల్టీఆర్ భూములు సేకరిస్తున్నట్లు గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. బుట్టాయగూడెం మండలం రెడ్డిగణపవరం గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వేనంబర్ 186/2ఏ, సర్వే నెంబర్ 153, 154, 155 భూములు సుమారు 20 కుటుంబాలు ఎంతోకాలంగా సాగు చేసుకుంటుండగా ఆ భూములను అధికారులు అక్రమంగా ఆర్ అండ్ ఆర్లో దళారుల ప్రమేయంతో కొనుగోలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. బుట్టాయగూడెం మండలం రెడ్డిగణపవరంలో 493 ఎకరాలు, దొరమామిడిలో 97 ఎకరాలు, కేఆర్పురంలో 25 ఎకరాలు, కె.కన్నప్పగూడెంలో 14 ఎకరాల చొప్పున ఎల్టీఆర్ భూములు ఉన్నాయని ఈ భూములన్నింటిని కూడా గిరిజనులు దశాబ్దాలుగా సాగు చేసుకుంటుంటే ఆ భూములను రెవెన్యూ అధికారులు అక్రమంగా రికార్డులు తారుమారు చేస్తూ ఆర్ అండ్ ఆర్లో కొనుగోలు చేస్తున్నారని సీపీఎం గిరిజన సంఘ నాయకులు తెల్లం రామకృష్ణ, పోలోజు నాగేశ్వరరావు తెలిపారు. వివాదాస్పద భూముల పరిష్కారానికి అధికారులు కృషి చేయకపోతే గిరిజన ప్రాంతంలో భూపోరాటాలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుట్టాయగూడెం: ఇనుమూరులో గిరిజనులు వేసిన మొక్కజొన్న పంటను ధ్వంసం చేసి అడ్డొచ్చిన గిరిజన మహిళలపై దాడి చేసిన రెవెన్యూ, పోలీస్ అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.సూర్యనారాయణ డిమాండ్ చేశారు. బుధవారం ప్రజా సంఘాల ప్రతినిధుల బృందం ఇనుమూరులో పర్యటించారు. ఈ సందర్బంగా మొక్కజొన్న పంటను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ 5వ షెడ్యూల్డ్ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులకు చట్టానికి మించి భూమి ఎలా వస్తుందని ప్రశ్నించారు. గిరిజనులకు చట్టాలు, హక్కులు ఉన్నా వాటిని అమలు చెయ్యవలసిన అధికారుల నిర్లక్ష్యం వల్లే భూ సమస్యలు వస్తున్నాయని ఆరోపించారు. పంటను ధ్వంసం అడ్డుకున్న గిరిజనులను కొట్టడం, విచక్షణారహితంగా ప్రవర్తించడం హేయమైన చర్య అని అన్నారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి హరిబాబు, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తామా ముత్యాలమ్మ, పిల్లి రామకృష్ణ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. ఏజెన్సీలో ఏళ్ల తరబడి భూవివాదాలు గిరిజనుల ఫిర్యాదులు పట్టించుకోని అధికార యంత్రాంగం 30 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమి స్వాధీనానికి యత్నం -
ఎరువుల దుకాణాల తనిఖీ
అత్తిలి: మండలంలోని ఎరువుల దుకాణాలను మండల వ్యవసాయ అధికారి టీకే రాజేష్ బుధవారం తనిఖీ చేశారు. ఎరువుల డీలర్లు స్టాక్ నిల్వలను ఎప్పటికప్పుడు స్టాక్ బోర్డులపై రాయాలని, ఈపాస్ నందు నమోదు చేసి బిల్లులు కచ్చితంగా ఇవ్వాలని ఆదేశించారు. అత్తిలి మండలంలో 210 టన్నుల యూరియా అందుబాటులో ఉందని, అవసరమైన యూరియా సొసైటీల ద్వారా, ప్రైవేటు డీలర్ల ద్వారా రైతులకు సరఫరా చేస్తామన్నారు. విత్తనశుద్ధి తప్పనిసరి దాళ్వాసాగులో రైతులు ఖచ్చితంగా విత్తన శుద్ధి చేయాలని మండల వ్యవసాయశాఖ అధికారి టీకే రాజేష్ అన్నారు. బుధవారం అత్తిలి మండలం వరిఘేడు గ్రామంలో ఎరువుల యాజమాన్యంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్బన్డిజమ్ ఒక లీటర్ నీటికి ఒక గ్రాము కలిపి అందులో విత్తనం నానబెట్టాలన్నారు. విత్తనశుద్ధి అనంతరం నారుమడి చల్లుకోవాలని, కచ్చితంగా మురగదమ్ములు చేయాలన్నారు. -
రోగాల బారిన పడుతున్నారు
నియోజకవర్గంలో అన్ని పంటకాలువల పరిస్థితి దారుణంగా ఉంది. కనీసం ప్రధాన పంటకాలువను బాగు చేయాలన్న ఆలోచన కూడా ప్రజాప్రతినధులకు, అధికారులకు లేకపోవడం దారుణం. అందరూ ఈ కాలువ ద్వారా వచ్చేనీటినే తాగి రోగాల బారిన పడుతున్నారు. సాగునీరు సరఫరా కాక రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. –కడలి పెద్దిరాజు, న్యాయవాద గుమస్తా, 3 లక్షల జనాభాకు తాగునీరు, 10 వేల ఎకరాలకు సాగునీరు అందించే కాలువను ప్రతి ఏటా వేసవిలో బాగు చేసేవారు. ఇంత ముఖ్యమైన కాలువను ఈ ఏడాది ఎందుకు బాగు చేయలేదు. ప్రజల ఆరోగ్యం, సాగు, తాగునీటి సమస్యలు ప్రజాప్రతినిధులకు, అధికారులకు పట్టావా? వెంటనే కాలువ బాగు చేయాలి. – బర్రి శంకరం, నరసాపురం -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
చెక్ డ్యామ్లో పడి రైతు దుర్మరణం పెదపాడు: అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతి చెందింది. పెదపాడు పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం తిరువూరుకు చెందిన రెడ్డి అనీల్ హనుమాన్కు, జ్యోతి అలియాస్ హారిక(19)తో ఏడు నెలల క్రితమే వివాహం అయింది. వీరు హనుమాన్ జంక్షన్లోని పశువుల సంత ఎదురుగా అద్దెకు ఉంటూ జీవనం సాగిస్తున్నారు. అనీల్ హనుమాన్ జంక్షన్లో సుజుకి షోరూమ్లో మెకానికల్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. ఈనెల 23 తేదీ రాత్రి 10.45 గంటల సమయంలో తన భార్య అనుమానాస్పద రీతిలో మృతి చెందిందని స్థానికులకు అనీల్ చెప్పడంతో వారు పెదపాడు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు క్లూస్టీమ్ సహాయంతో వివరాలు సేకరించారు. మృతురాలి సోదరి చింతా శ్రావ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెదపాడు ఎస్సై కట్టా శారదా సతీష్ తెలిపారు. ఏలూరు (ఆర్ఆర్పేట): జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా జరిగిన వివిధ పోటీల్లో ఏలూరు జిల్లా విద్యార్థులు రాష్ట్రస్థాయిలో విజేతలుగా నిలిచి బహుమతులు సాధించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం నిర్వహించిన పోటీల్లో ఉంగుటూరు మండలం నారాయణపురం జెడ్పీహెచ్ స్కూల్ విద్యార్థి జీవీ మహీధర్ తెలుగు మీడియం వక్తృత్వ పోటీల్లో ద్వితీయ స్థానం సాధించాడు. ఏలూరులోని శ్రీ శర్వాణి హైస్కూల్కు చెందిన విద్యార్థిని టీ.శ్రావ్య ఇంగ్లీష్ మీడియం వక్తృత్వ పోటీల్లో తృతీయ స్థానంలో నిలిచింది. అలాగే ఏలూరు సెయింట్ థెరిసా కళాశాలకు చెందిన ఎస్కే రేష్మ కళాశాల విద్యార్థుల విభాగంలో ఇంగ్లీష్ మీడియం వక్తృత్వ పోటీల్లో తృతీయ స్థానంలో నిలిచింది. వీరికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా, మరో ఐఏఎస్ అధికారి ఎన్.ఢిల్లీ రావు బహుమతులు అందించి అభినందించారు. జిల్లా విద్యాశాఖాధికారి ఎం. వెంకట లక్ష్మమ్మ మాట్లాడుతూ జిల్లాకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి బహుమతులు సాధించడం అభినందనీయమని అన్నారు. భీమవరం: భీమవరం డీఎన్నార్, కేజీఆర్ఎల్ కళాశాలలోని క్రీడా మైదానంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి పురోహిత క్రికెట్ లీగ్ క్వార్టర్స్ దశకు చేరుకున్నాయి. హైదరాబాద్, రాజమండ్రి, గుడివాడ, ఐ భీమవరం టీమ్స్ క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్నాయని నిర్వాహకులు తెలిపారు. బుధవారం 8 మ్యాచ్ లను నిర్వహించారు. ఖమ్మం –అమలాపురం మధ్య జరిగిన హోరాహోరి పోటీలో అమలాపురం విజయం సాధించగా, భీమవరం – వైజాగ్ మ్యాచ్ టై అవ్వగా సూపర్ ఓవర్ లో భీమవరం గెలిచింది. రాజమండ్రి – శ్రీకాకుళం మధ్య మ్యాచ్లో రాజమండ్రి విజయం సాధించగా, తిరుపతి – అమలాపురం మధ్య జరగిన మ్యాచ్లో తిరుపతి, రాజమండ్రి – గుడివాడ మ్యాచ్లో రాజమండ్రి కాకినాడ – చైన్నె మధ్య పోటీలో కాకినాడ విజయం సాధించినట్లు నిర్వాహకులు తెలిపారు. భీమవరం: చెట్టు కొమ్మలు కొట్టేందుకు చెట్టు ఎక్కిన వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. టూటౌన్ ఎస్సై కె రామారావు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక గొల్లవానితిప్ప రోడ్డుకు చెందిన కుంచాల వెంకన్న (40), అతని సోదరుడు నర్సింమూర్తి కలిసి డీఎన్ఆర్ కళాశాల సమీపంలో ఒక నివాసం వద్ద చెట్టును కొట్టేందుకు బుధవారం మధ్యాహ్నం వెళ్లారు. చెట్లు కొట్టే సమయంలో ప్రమాదవశాత్తు వెంకన్న చెట్టు నుంచి కింద పడిపోయాడు. తీవ్ర గాయాలు కావడంతో 108కు సమాచారం అందించారు. వారు వచ్చి పరిశీలించి అప్పటికే వెంకన్న మృతి చెందినట్లుగా నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామారావు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించడానికి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. -
మరియ తనయ.. కరుణ హృదయ
ఏలూరు మన్నా చర్చిలో కొవ్వొత్తులతో ప్రార్థనలు కరుణ, శాంతి, సహనానికి ప్రతీక క్రిస్మస్. లోకరక్షకుడు ఏసుక్రీస్తు జననాన్ని స్వాగతిస్తూ క్రైస్తవ మందిరాలు కాంతులీనాయి. క్రిస్మస్ ట్రీలు, స్టార్లు, ఏసు జనన వృత్తాంతాన్ని తెలిపే సెట్టింగులతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. బుధవారం రాత్రి నుంచి క్రిస్మస్ వేడుకలు ప్రారంభం కాగా.. విశ్వాసులు చర్చిల్లో కేక్ కటింగ్లు, గీతాలాపనలు నిర్వహించారు. కొవ్వొత్తులతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. –సాక్షి ఫొటోగ్రాఫర్/ఏలూరు -
ఈ భూ కబ్జాను అడ్డుకునేదెవరూ?
● టీడీపీ నేత ఆగడాలపై అదే పార్టీకి చెందిన మరో నేత ఫిర్యాదు ● నిమ్మకు నీరెత్తినట్టుగా రెవెన్యూ యంత్రాంగం ద్వారకాతిరుమల: ఓ టీడీపీ నేత దౌర్జన్యాన్ని అదే పార్టీకి చెందిన మరో నాయకుడు ఎండగట్టడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఆ నేత ప్రభుత్వ పోరంబోకు భూమిని ఆక్రమించుకోవడమే కాకుండా, చేపల చెరువు తవ్వుతూ, పరిసర ప్రాంత రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఇప్పటికే పలుమార్లు అధికారులకు సదరు నాయకుడు ఫిర్యాదు చేశాడు. అయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఆ నాయకుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నాడు. ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురంలో ఓ టీడీపీ నాయకుడు గత ఐదు రోజులుగా ఆర్ఎస్ నెంబర్ 220లో పొక్లెయిన్ సహాయంతో మట్టి తవ్వకాలు జరుపుతున్నాడు. ఆ నాయకుడు 9 ఎకరాల ప్రభుత్వ పోరంబోకు భూమిని కబ్జా చేసి, అందులో చేపల చెరువును తవ్వుతున్నాడని అదే పార్టీకి చెందిన ఒక వర్గం నేతలు ఆరోపిస్తున్నారు. తవ్విన మట్టిని గట్టులా వేస్తుండటంతో చుట్టుపక్కల పొలాలకు వెళ్లే దారులు మూసుకు పోతున్నాయని, దీని కారణంగా రైతులతో పాటు, బయటకు వెళ్లే మార్గం లేక పశువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు చెబుతున్నారు. అంతా తనదే అన్నట్టు రైతులు వెళ్లే దారిలో ముళ్లకంచెలు అడ్డంపెట్టి, రాకపోకలు బంధించి, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పటికే 100, 112 నెంబర్లకు ఫిర్యాదు చేసినట్టు సదరు నాయకుడు, బాధిత రైతులు పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ఏవిధమైన చర్యలు తీసుకోకుండా, కేసు పెట్టండని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనిపై స్థానిక రైతులు మండిపడుతున్నారు. కన్నెత్తి చూడని రెవెన్యూ అధికారులు మండల కేంద్రానికి సమీప గ్రామమైన తిమ్మాపురంలో ఇంత తతంగం జరుగుతుంటే.. కనీసం రెవెన్యూ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడకపోవడంపై బాధిత రైతులు, ఫిర్యాదుదారు మండిపడుతున్నారు. పార్టీ అండ, అధికర బలంతో ఏకంగా 9 ఎకరాల ప్రభుత్వ పోరంబోకు భూమి కబ్జాకు గురైనా.. రెవెన్యూ యంత్రాంగానికి చీమకుట్టినట్టు కూడా లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్హులైన నిరుపేదలకు సెంటు భూమి ఇచ్చేందుకు సవాలక్ష ఆంక్షలు పెట్టే అధికారులు, ఎంతో విలువైన భూమి ఇలా కబ్జాకు గురైనా పట్టించుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతా నా ఇష్టం అన్నట్టుగా వ్యవహరిస్తున్న కబ్జా నాయకుడి తీరును చూస్తే అసలు ప్రభుత్వం ఉందా.. లేదా? అనే సందేహం కలుగుతోందని పలువురు రైతులు అంటున్నారు. అతడి అరాచకాలకు అడ్డుకట్ట వేయకపోతే ప్రజలకు సైతం ఇబ్బందులు తప్పవని ఫిర్యాది నాయకుడి వర్గం అంటోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి కబ్జా నాయకుడి ఆగడాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు, ఆక్రమిత భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
ఏసు బోధనలు అనుసరణీయం
డీఎన్నార్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కైకలూరు : మానవాళికి ఏసు బోధనలు అనుసరణీయమని వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు, కై కలూరు నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) బుధవారం చెప్పారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి కుటుంబానికి దీవెనలు కలగాలని ఆకాంక్షించారు. ఏలూరు (టూటౌన్): సంక్రాంతి సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాకినాడ టౌన్–వికారాబాద్ మధ్య వచ్చే నెల 19న, వికారాబాద్–కాకినాడ టౌన్ మధ్య వచ్చే నెల 20న, నాందేడ్–కాకినాడ టౌన్ మధ్య వచ్చే నెల 12న, కాకినాడ టౌన్–నాందేడ్ మధ్య వచ్చే నెల 13న ప్రత్యేక రైళ్లు నడుస్తాయన్నారు. మచిలీపట్నం–వికారాబాద్ మధ్య వచ్చే నెల 11 నుంచి 18 మధ్య, వికారాబాద్–మచిలీపట్నం మద్య వచ్చే నెల 11 నుంచి 18 మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయని తెలిపారు. కాకినాడ టౌన్–మైసూర్ మధ్య వచ్చే నెల 16, 19, 23, 26, 30 మధ్య సోమ, శుక్రవారాల్లో ఐదు సర్వీసులు నడుస్తాయన్నారు. మైసూర్–కాకినాడ టౌన్ మధ్య వచ్చే నెల 17, 20, 24, 27, 31 తేదీల్లో మంగళ, శనివారాల్లో ఐదు సర్వీసులు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. -
క్రీస్తు బోధనలు అనుసరణీయం
ఏలూరు (ఆర్ఆర్పేట): శాంతియుత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ ఏసుక్రీస్తు బోధనలను అనుసరించాలని బిషప్ పొలిమేర జయరావు సూచించారు. స్థానిక బిషప్ హౌస్లో బుధవారం రాత్రి క్రిస్మస్ వేడుకను ఘనంగా నిర్వహించారు. జయరావు క్రీస్తు బోధనలను వివరించారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం కేక్ను కట్ చేసి ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో సెయింట్ మైఖేల్ చర్చి ఫాదర్ దిరిసిన ఆరోన్, ఏలూరు మేత్రాసనం ప్రోక్యురేటర్ ఫాదర్ బేతంపూడి రాజు, నిర్మలగిరి నిత్య అన్నదాన కాంట్రాక్టర్ కల్లే నాగేశ్వరరావు, ఏలూరు మేత్రాసనం ఛాన్సలర్ ఫాదర్ ఇమ్మానియేల్, ఫాదర్ మైఖేల్ ఇంజమాల తదితరులు పాల్గొన్నారు. -
ప్రధాన పంట కాలువనూ పట్టించుకోరా?
నరసాపురం: నిడదవోలు–నరసాపురం ప్రధాన పంటకాలువ నరసాపురం ప్రాంతంలో కాలుష్య కోరల్లో చిక్కుకుంది. కాలువ పొడవునా గుర్రపు డెక్క, చెత్త పేరుకుపోయి అధ్వానంగా ఉన్నా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టనట్లు వ్యవహించడం విమర్శలకు తావిస్తోంది. ప్రతిఏటా వేసవిలో ఈ కాలువను బాగు చేస్తారు. తూడు, చెత్త తొలగించి పూడికతీత చేస్తారు. కానీ ఈ వేసవిలో కాలువ శుభ్రం చేసే పనులు చేపట్టలేదు. దీంతో కాలువ పొడవునా చెత్త పేరుకుపోయింది. పూర్తిగా తూడుతో కాలువ నిండిపోయింది. ప్రధాన కాలువ ఎంతో ప్రాధాన్యం నరసాపురం నుంచి మొగల్తూరు వరకూ 12 కిలోమీటర్లు మేర కాలువ అధ్వానంగా ఉంది. నరసాపురం మున్సిపాలిటీలోని 31 వార్డులకు, నరసాపురం మండలంలోని 28 పంచాయతీలకు, మొగల్తూరు మండలంలోని 17 పంచాయతీలకు సంబంధించి మంచినీటి చెరువును ఈ కాలువ నీటిద్వారానే నింపుతారు. సుమారు 6 లక్షల జనాభా తాగునీటికి ఈ కాలువ నీటినే సరఫరా చేస్తున్నారు. కాలువ పూర్తిగా కాలుష్యం భారిన పడటంతో పాటు, అటు మున్సిపాలిటీలోనూ, గ్రామాల్లోని మంచినీటి ప్రాజెక్టుల్లో మంచినీటి శుద్ధిప్రక్రియ సవ్యంగా సాగడంలేదు. దీంతో కాలుష్య నీటితో ప్రజలు రోగాల భారిన పడుతున్నారు. చెత్త కూడా కాలువలోనే పోస్తున్నారు కొన్ని నెలలుగా మున్సిపాలిటీలో డంపింగ్యార్డ్ సమస్యతో చెత్తవేసే జాగాలేక ఎక్కడి చెత్తను అక్కడే వదిలేస్తున్నారు. దీంతో కొందరు ఇళ్లలోని చెత్తను రాత్రివేళల్లో కాలువలో పోస్తున్నారు. దీంతో కాలువ మరింత కాలుష్య కారకంగా తయారైంది. ఈ కాలువ ద్వారా 10 ఎకరాలకు సాగునీరు అందుతుండగా, చెత్త పేరుకుపోవడంతో నీరు పారే అవకాశం లేక సాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. దీంతో రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. కాలుష్య కోరల్లో నరసాపురం ప్రధాన పంట కాలువ 3 లక్షల మందికి కలుషిత జలమే దిక్కు సాగునీటి సరఫరాలోనూ తప్పని ఇబ్బందులు -
తహసీల్దార్ కళ్లలో కారం.. 3 గంటలు నిర్బంధం
బుట్టాయగూడెం: ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం ఇనుమూరులో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంతర్వేదిగూడెం రెవెన్యూ పరిధిలో ఉన్న ఈ మారుమూల గ్రామంలో సర్వే నంబర్ 218లోని 7.17 ఎకరాలపై 30 ఏళ్లుగా వివాదం నెలకొంది. ఈ భూమి 1/70లోకి వస్తుందని, చాలాకాలంగా సాగు చేస్తున్నామని గిరిజనులు వాదిస్తున్నారు. కానీ, యాండ్రప్రగడ సత్యనారాయణ, అతడి కుటుంబం, ఒట్టికూటి ఝాన్సీరాణి, యాండ్రప్రగడ రామాంజనేయులు మాత్రం ఆ భూమిపై అన్ని హక్కులు కలిగి ఉన్నామని, రక్షణ కల్పించాలని ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆర్డీవో ప్రొటెక్షన్ ఆర్డర్ అమలు చేసేందుకు తహసీల్దార్ పీవీ చలపతిరావు వీఆర్వోలు, సర్వేయర్లు, పోలీసులతో కలిసి బైక్లపై ఇనుమూరు వెళ్లారు. గిరిజనులు సాగు చేసిన మొక్కజొన్నను ట్రాక్టర్తో దున్నే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు, గిరిజనులకు మధ్య తోపులాట జరిగింది. స్థానికులు చంద్రశేఖర్, మహిళకు గాయాలయ్యాయి. ఇది తెలిసి ఇతర గిరిజనులు కత్తులు, కర్రలు, కారంతో వచ్చారు. అధికారుల మోటార్సైకిళ్లలో గాలి తీసేశారు. ఓ వీఆర్వో బైక్ అద్దాలను పగులగొట్టారు. పంటను పాడుచేసినందుకు సమాధానం చెప్పాలంటూ... తహసీల్దార్ కంట్లో కారం చల్లి చుట్టుముట్టి నిర్బంధించారు. దీంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు భయాందోళనకు గురయ్యారు. చేసేదేమీ లేక తహసీల్దార్తో పాటు, ఎస్ఐ దుర్గామహేశ్వరరావు, ఆరుగురు కానిస్టేబుళ్లు, రెవెన్యూ సిబ్బంది మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6.30 వరకు అక్కడే ఉండిపోయారు. పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ బాలసురేష్ అక్కడికి చేరుకుని నచ్చజెప్పడంతో గిరిజనులు శాంతించారు. కాగా, బైక్లను ధ్వంసం చేయడంతో రెవెన్యూ అధికారులు ఇనుమూరు నుంచి కాలినడకన పందిరిమామిడిగూడెం వచ్చారు. బుట్టాయగూడెంకు చెందిన రైతు తాటినాడ హరిబాబుకు ఫోన్ చేయగా ఆయన కారు తీసుకెళ్లి తహసీల్దార్ను రాత్రి 7:30కు తీసుకొచ్చారు. రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
వైద్య సేవల్లో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం
వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సౌరభ్ గౌర్ ఏలూరు టౌన్: ఏలూరు సర్వజన ఆసుపత్రిలో పేదలకు వైద్యసేవలు అందించటంలో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదని.. విధుల్లో అలసత్వం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సౌరభ్ గౌర్ హెచ్చరించారు. కలెక్టర్ వెట్రిసెల్వితో కలిసి జీజీహెచ్ను మంగళవారం రాత్రి ఆయన తనికీ చేశారు. హాస్పిటల్లోని వివిధ విభాగాలను పరిశీలించారు, వార్డుల్లో రోగులకు ఏ విధమైన వైద్యసేవలు అందుతున్నాయో ఆరా తీశారు. రోగులను ఆయనే స్వయంగా అడిగి వివరాలు తెలుసుకున్నారు. జీజీహెచ్లోని ప్రతి విభాగంలోనూ వైద్య చికిత్సలు, సౌకర్యాలు, సిబ్బంది సేవలపై వైద్య అధికారులను ఆరా తీశారు. ప్రసూతి, చిన్నపిల్లల వార్డులు, క్యాజువాలిటీ వార్డులను పరిశీలించి సేవలపై రోగుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం ఏటా వేల కోట్లు ఖర్చు చేస్తోందని, దానికి అనుగుణంగా వైద్య సిబ్బంది జవాబుదారీతనంతో పనిచేయాల్సిందేనని స్పష్టం చేశారు. సర్వజన ఆసుపత్రికి వచ్చే రోగులు సంతృప్తిగా ఇంటికి వెళ్ళే పరిస్థితి రావాలని, వైద్యులు, సిబ్బంది దానికి తగినట్లు సేవలు అందించాలని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై రోగులు ఫిర్యాదు చేస్తే వెంటనే విచారణ చేసి శాఖాపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు. హాస్పిటల్ పరిసరాలను, మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పీజే అమృతం, హాస్పిటల్స్ సేవల సమన్వయాధికారి డాక్టర్ పాల్సతీష్, జీజీహెచ్ సూపరింటిండెంట్ డాక్టర్ ఎంఎస్ రాజు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
యూరియా కొరతతో రైతులకు ఇక్కట్లు
ట్రిపుల్ ఐటీలో అధ్యాపకుల నిరసన వేతనాలను పెంచాలని కోరుతూ నూజివీడు ట్రిపుల్ ఐటీలో పనిచేస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు మంగళవారం నిరసన ప్రదర్శన చేశారు. 8లో uవైఎస్సార్సీసీ రైతు విభాగం (ఆక్వా కల్చర్) వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డి రఘురాం తాడేపల్లిగూడెం: రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉన్నా, రైతులు ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా రైతుల జీవితాలతో ఆటలాడుకుంటోందని వైఎస్ఆర్సీపీ రైతు విభాగం (ఆక్వా కల్చర్) వర్కింగ్ ప్రెసిడెంటు వడ్డి రఘురాం ధ్వజమెత్తారు. సోమవారం విలేకర్లతో మాట్లాడుతూ.. యూరియా విషయంలో ప్రభుత్వం వాస్తవాలు దాస్తోందన్నారు. మార్క్ఫెడ్ వద్ద ఎంత నిల్వలు ఉన్నాయి, ప్రైవేటు డీలర్లకు ఎంత కేటాయించారనే విషయాలను బహిరంగంగా వెలువరించడంలేదన్నారు. సాగు మొదలవ్వకముందే యూరియా కొరత ఎలా ఏర్పడిందని.. నానో యూరియా కొనాలని ఒత్తిడి చేసే డీలర్లపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. యూరియా బ్లాక్ మార్కెట్కు తరలిపోతోందని విమర్శించారు. డిసెంబర్ చివరి నాటికి 3.93 లక్షల టన్నుల యూరియా అవసరమని అంచనావేస్తే.. ఇప్పటికే 3.23 లక్షల టన్నులు అమ్మినట్టు రికార్డుల్లో చూపించడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. రాష్ట్రంలో యూరియా వాడకం, నిల్వలపై ప్రభుత్వం వాస్తవాలు వెల్లడించాలన్నారు. రబీ సీజన్కు 5.5 నుంచి ఆరు లక్షల టన్నుల యూరియా అవసరమవగా, ప్రభుత్వం 9.38 లక్షల టన్నుల యూరియా డిమాండ్ ఉన్నట్టు చూపిస్తోందన్నారు. రబీ ప్రాఽథమిక దశలోనే యూరియా కొరత రావడం వెనుక ఏదో మతలబు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. యూరియా కట్ట కావాలంటే, రూ.450 విలువైన గుళికలు లేదా నానో యూరియా కొనాలని డీలర్లు రైతులను వేధిస్తున్నారన్నారు. -
మంటగలుస్తున్న నూజివీడు ప్రతిష్ట
జూదాలపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు నూజివీడు: ఏలూరు జిల్లాలో ప్రసిద్ధిగాంచిన నూజివీడు చరిత్ర కూటమి ప్రభుత్వ హయాంలో జూదాల నిర్వహణతో మంట గలిసిపోయిందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ధ్వజమెత్తారు. ఆగిరిపల్లి మండలం పోతవరప్పాడులోని మ్యాంగో బే కల్చరల్ రిక్రియేషన్ సొసైటీలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా భారీ ఎత్తున పేకాట జరుగుతున్న తీరుపై మంగళవారం ప్రతాప్ అప్పారావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం తరువాత నూజివీడుకు ఎందరో ప్రముఖులు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేశారని, ఏనాడూ పేకాటను, ఇతర జూదాలను ప్రోత్సహించలేదని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నియోజకవర్గంలోని గ్రామాల్లో పేకాట, కోడి పందేలు, చిత్తులాటలు పబ్లిక్గా నిర్వహిస్తున్నారన్నారు. గోవాలోని క్యాసినోలను తలపించేలా పోతవరప్పాడులోని మ్యాంగో బే కల్చరల్ రిక్రియేషన్ సొసైటీలో పేకాట నిర్వహించడం చూస్తుంటే జూదాలను అరికట్టడంలో టీడీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నది స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఇంత పెద్ద ఎత్తున జూదాలు నిర్వహిస్తుంటే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఏం చేస్తున్నారో? తెలియడం లేదని దుయ్యబట్టారు. మూడేళ్ల క్రితం మ్యాంగో బేలో పేకాట నిర్వహించుకుంటామని కొందరు తన చుట్టూ తిరిగారని, దానికి తాను అంగీకరించలేదని చెప్పారు. 281 మంది జూదరులు, 140 కార్లు, 40 ద్విచక్ర వాహనాలు దొరకడం రాష్ట్రంలో ఇదే ప్రథమమని మేకా ప్రతాప్ తెలిపారు. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే మూడేళ్లలో నూజివీడు నియోజకవర్గంలో ఎంత పెద్ద స్థాయిలో జూదాలు జరుగుతాయోనని ఆందోళన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో గ్రావెల్, మట్టి అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నా పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారని విమర్శించారు. జూదాలు, గ్రావెల్, మట్టి తవ్వకాలపై గతంలో పలుమార్లు తాము జిల్లా కలెక్టర్ దృష్టికి సైతం తీసుకెళ్లామన్నారు. జూదాలు, అక్రమ తవ్వకాలను ప్రభుత్వం నిలువరించకపోతే చూస్తూ ఊరుకునేది లేదని వైఎస్సార్సీపీ తరఫున పోరాటం చేస్తామని స్పష్టంచేశారు. -
పండుగ రోజుల్లోనూ పస్తులే?
బుధవారం శ్రీ 24 శ్రీ డిసెంబర్ శ్రీ 2025ఏలూరు (టూటౌన్): కొత్త సంవత్సరం, సంక్రాంతి పండుగ సమీపిస్తున్నా తమకు ఇప్పటికీ వేతనాలు చెల్లించరా అని పంచాయతీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఉద్యోగులు, కార్మికులకు గత మూడు నుంచి ఏడు నెలల వేతన బకాయిలు పేరుకుపోయాయి. తమకిచ్చే కొద్ది పాటి వేతనాలను సైతం చెల్లించకపోవడం పట్ల ఉద్యోగ, కార్మికులు ఆవేదన చెందుతున్నారు. పంచాయతీ సర్పంచ్ల ద్వారా తమ బకాయి వేతనాలు చెల్లించేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలంటూ వేడుకుంటున్నారు. ఏలూరు జిల్లాలో 517 గ్రామ సచివాలయాల పరిధిలో మొత్తం 547 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో 2 వేల మంది వరకు వివిధ రకాల కార్మికులు పనిచేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో 380 సచివాలయాల పరిధిలో 409 గ్రామ పంచాయతీలు ఉండగా వీటి పరిధిలో దాదాపు 1,400 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో బిల్లు కలెక్టర్లు, పంప్ ఆపరేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్లు, ట్రాక్టర్ డ్రైవర్లు, స్వీపర్లు పనిచేస్తున్నారు. వీరంతా కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్, టెండర్ పద్ధతిలో పనిచేస్తున్నారు. వీరికి ఉద్యోగ భద్రత లేకపోగా, కనీస వేతనాలు కూడా అమలు కావడం లేదు. మైనర్ పంచాయతీల్లో రూ.5 నుంచి రూ.7 వేలు, మేజర్ పంచాయతీలు రూ.10 వేల నుంచి రూ.13 వేల జీతాలు ఇస్తున్నారు. జాతీయ లేబర్ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఒక కుటుంబం బతకాలంటే కనీసం రూ.26 వేల నెలవారీ జీతం ఇవ్వాలని నిర్ణయం ఉంది. గ్లౌజులు, యూనిఫాంలకూ కొరతే.. గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న స్కావెంజర్లకు కనీసం రక్షణకు చేతి గ్లౌజులు, చెప్పులు, కొబ్బరి నూనె వంటివి ఇవ్వడం లేదు. పంచాయతీ కార్మికులందరికీ ప్రతి సంవత్సరం యూనిఫాం అందించాలి. అది కూడా ఎక్కడా అమలు కావడం లేదు. వారికి ఇస్తున్న కొద్దిపాటి వేతనాలు రెగ్యులర్గా ఇవ్వడం లేదు. జిల్లాలో మూడు నెలల నుంచి ఏడు నెలల వరకు బకాయిలు పేరుకుపోయాయి. ఇటీవల కై కలూరు పంచాయతీలో ఏడు నెలల జీతాల బకాయిలు చెల్లించాలని కార్మికులంతా పనిని ఆపి రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. పంచాయతీ కార్మికులకు మద్దతుగా వైఎస్సార్సీపీ నాయకులు కూడా మద్దతు తెలిపారు. ప్రస్తుతం క్రిస్మస్, సంక్రాంతి పండుగలు దగ్గర పడ్డాయి. జీతాలు రాకపోవడంతో పండగ పూట కూడా పస్తులు ఉండాల్సి వస్తోందని కార్మికులు చెబుతున్నారు. గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయం నుంచి మొదట పంచాయతీ సిబ్బంది జీతాలు చెల్లించాలనే నిబంధనను అమలు చేయాలని కోరుతున్నారు. పంచాయతీల్లో గ్రామ పంచాయతీ కార్మికులకు నెలనెలా సక్రమంగా జీతాలు రావడం లేదు. జిల్లా కేంద్రం దగ్గరలో ఉన్న పెదపాడు పంచాయతీలో బకాయిలు ఇప్పటికీ రాని పరిస్థితి. ఏలూరు రూరల్ మండలం జాలిపూడి పంచాయతీలో నాలుగు నెలలు జీతాలు బకాయిలు ఉన్నాయి. అత్యధిక పంచాయతీల్లో ఇదేవిధంగా నెలల తరబడి జీతాల బకాయిలు పేరుకుపోయాయి. కార్మికులకు జాతీయ లేబర్ కమిషన్ సిఫారసు ప్రకారం కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలి. గ్రామ పంచాయతీ కార్మికులకు మరీ తక్కువగా రూ.10 వేల లోపు జీతాలు ఇస్తున్నారు. పంచాయతీల ఆదాయంలో కార్మికుల జీతాలకు మొదటి ప్రాధాన్యత కల్పించాలి. పండుగ రోజుల్లో కూడా పస్తులతో కార్మికులు పనిచేస్తున్నారు. దీనిపై జిల్లా అధికారులు దృషి సారించి వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. – రెడ్డి శ్రీనివాస డాంగే, ప్రధాన కార్యదర్శి, ఏఐటీయూసీ, ఏలూరు జిల్లా జిల్లా వ్యాప్తంగా పంచాయతీ కార్మికులకు బకాయిలు ఉన్న వేతనాలను తక్షణం చెల్లించాలి. పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాల్సిన చెప్పులు, కొబ్బరినూనె, సేఫ్టీ పరికరాలు, కార్మికులందరికీ యూనిఫాం వంటివి అందజేయాలి. చాలా పంచాయతీల్లో కార్మికులకు ఎరియర్స్ పెండింగ్లో ఉన్నాయి. వాటిని జీతాలతో పాటు చెల్లించాలి. పండుగ వేళల్లో చిరు ఉద్యోగులను ఉసూరు మన్పించడం పాలకులకు తగదు. – పి.కిషోర్, పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి వేతనాల కోసం పంచాయతీ కార్మికుల ఎదురుచూపులు జిల్లా వ్యాప్తంగా పేరుకుపోయిన 3 నుంచి 7 నెలల బకాయిలు తక్షణం బకాయిలు చెల్లించాలని డిమాండ్ -
ముస్తాబవుతున్న శ్రీవారి ఆలయ ఉత్తర ద్వారాలు
క్షేత్రంలో ఊపందుకున్న ముక్కోటి ఏర్పాట్లు ద్వారకాతిరుమల: ముక్కోటి ఏకాదశి పర్వదినం దగ్గర పడటంతో క్షేత్రంలో శ్రీవారి ఉత్తర ద్వారదర్శనానికి ఏర్పాట్లు ఊపందుకున్నాయి. అందులో భాగంగా ఆలయ ఉత్తర ద్వారాలను ముస్తాబు చేసే పనులు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. యంత్రాల సహాయంతో ద్వారాలను సిబ్బంది శుభ్రం చేస్తున్నారు. అలాగే ఆలయ ప్రాకారంలో విద్యుద్దీప అలంకారాల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. షాపింగ్ కాంప్లెక్స్ వెనుక ప్రాంతంలో నిర్మించిన తాత్కాలిక క్యూలైన్లకు రంగులు వేస్తున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ నెల 30న ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్వామివారి ఉత్తర ద్వార దర్శన భాగ్యం భక్తులకు కలగనుంది. ముందురోజు 29న మధ్యాహ్నం 2.30 గంటలకు తొలిమెట్టు (పాదుకా మండపం) వద్ద గిరి ప్రదక్షిణ ప్రారంభం అవుతుందని ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. గిరి ప్రదక్షిణ అనంతరం రాత్రి 7 గంటల నుంచి భక్తులకు స్వామివారి నిజరూప దర్శనాన్ని కల్పిస్తామన్నారు. ఉత్తర ద్వార దర్శనానికి ప్రత్యేక రూ.500 టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచుతామని, భక్తులు గమనించాలని ఈఓ కోరారు. -
అన్ని సేవలూ ఆన్లైన్లోనే
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న దర్శనార్ధం ఆలయానికి విచ్చేసే భక్తులకు దేవస్థానం అధికారులు గత శనివారం నుంచి అన్ని ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. అందులో భాగంగా ఆలయ తూర్పు ప్రాంతంలోని మొబైల్ కౌంటర్ సమీపంలో తాత్కాలికంగా టెంటు వేసి, అందులో ఓ కౌంటర్ను ఏర్పాటు చేశారు. రెండు కంప్యూటర్లు, రెండు ప్రింటర్ల ద్వారా భక్తులకు సిబ్బంది ఆన్లైన్ సేవలను అందిస్తున్నారు. కొందరు భక్తులు ఇప్పటి వరకు కేవలం వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్ సేవలను పొందారు. తాజాగా ఫోన్పే, గూగుల్పే వంటి ఆన్లైన్ సేవలను భక్తులకు చేరువ చేశారు. పారదర్శకమైన, వేగవంతమైన సేవలను భక్తులకు అందించడానికి ఆన్లైన్ సేవలను మరింత విస్తృతం చేయాలని ఇటీవల రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ దేవాలయాల అధికారులకు సూచించారు. ఈ క్రమంలోనే చిన్నతిరుపతి దేవస్థానం అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పుడు అన్నీ సేవలూ.. మనమిత్రా వాట్సప్ (9552300009) నెంబర్కు హాయ్ అని పంపి ఆలయంలో అన్ని సేవలను పొందొచ్చు. అలాగే www. aptemples.ap.gov.in వెబ్సైట్ ద్వారా, ఏపీ టెంపుల్ మొబైల్ యాప్ ద్వారా శ్రీవారి దర్శనం, ప్రత్యక్ష – పరోక్ష సేవలు, ప్రసాదాలు ఇతర ఆన్లైన్ సేవలను సులభంగా పొందొచ్చని అధికారులు చెబుతున్నారు. ఆన్లైన్, మనమిత్ర వాట్సప్ ద్వారా టికెట్లు పొందిన భక్తులకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా దర్శన సదుపాయం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. విశేష స్పందన : ప్రస్తుతం అధిక శాతం మంది ప్రజలు ఫోన్పే, గూగుల్పేను ఎక్కువగా వాడుతున్నారు. మార్కెట్లో ఏ చిన్న వస్తువు కొన్నా.. వాటి ద్వారానే చెల్లింపులు జరుపుతున్నారు. శ్రీవారి ఆలయంలో కూడా ఈ సేవలు మొదలవడంతో ఆన్లైన్ సేవలకు విశేష స్పందన లభిస్తోంది. అధిక శాతం మంది భక్తులు రూ.100, రూ.200 దర్శనం టికెట్లతో పాటు, నిత్యార్జిత కల్యాణం, అంతరాలయ దర్శనం రూ.500 టికెట్లు, ప్రసాదం, వసతి టికెట్లను ఆన్లైన్ ద్వారా పొందుతున్నారు. గోపూజ, కుంకుమార్చన, గరుడసేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలు, సహస్రదీపాలంకరణ సేవ, స్నపన టికెట్ల విక్రయాలు ఆన్లైన్ ద్వారా తక్కువగా జరుగుతున్నాయి. ఆన్లైన్ సేవలు ఎలా పొందాలి, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను భక్తులకు కౌంటర్లోని సిబ్బంది వివరిస్తున్నారు. శ్రీవారి ఆలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు -
ఉత్సాహంగా పోలీస్ స్పోర్ట్స్ మీట్
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా వార్షిక పోలీస్ స్పోర్ట్స్ మీట్ ఉత్సాహకర వాతావరణంలో సాగింది. మూడు రోజులపాటు పోలీసు అధికారులు, సిబ్బంది ఉల్లాసంగా వివిధ పోటీల్లో తమ సత్తా చాటారు. మంగళవారం రాత్రి పోలీస్ స్పోర్ట్స్ మీట్ ముగింపు వేడుకల్లో ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్కుమార్ హాజరుకాగా, జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ పుష్పగుచ్ఛం అందజేసి సాదరంగా ఆహ్వానం పలికారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, పోలవరం, నూజివీడు పోలీస్ సబ్ డివిజన్ అధికారులు, ఆర్మ్డ్ రిజర్వ్ క్రీడాకారులు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆయా క్రీడా పోటీల్లో విజేతలకు ఐజీ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ పోటీల్లో ఓవరాల్ చాంపియన్గా జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బంది, ఓవరాల్ సింగిల్ చాంపియన్గా ఏఆర్ కానిస్టేబుల్ కిషోర్ ఎంపికయ్యారు. జిల్లా ఎస్పీ, ఏలూరు రేంజ్ ఐజీ టగ్ ఆఫ్ వార్లో పాల్గొని సిబ్బందిలో ఉత్సాహాన్ని నింపారు. ఐజీ మాట్లాడుతూ నిత్యం తీవ్రమైన పని ఒత్తిడిలో క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయం అన్నారు. నేటి ఆధునిక విధానంలో ఒత్తిడి, శారీరక వ్యాయామం లేకపోవటంతో చిన్న వయస్సులోనే గుండెపోటు వ్యాధులకు బలికావటం బాధాకరమని, ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఖర్చు లేని వ్యాయామం నడకను ఎంచుకోవాలని సూచించారు. జిల్లా ఎస్పీ శివకిషోర్ మాట్లాడుతూ.. పోలీస్ సిబ్బంది ఎంతో ఒత్తిడితో విధులను నిర్వర్తిస్తుంటారని, క్రీడా పోటీలు మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వానికి దోహదం చేస్తాయని చెప్పారు. అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు ఎఎస్పీ సుస్మిత, ఏఆర్ అదనపు ఎస్పీ జీ.మునిరాజా, డీఎస్పీలు శ్రావణ్కుమార్, వెంకటేశ్వరరావు, కేవీవీఎన్వీ ప్రసాద్, యు.రవిచంద్ర, సీహెచ్ ప్రసాద్, చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
జూదం కేసులో 281 మందికి నోటీసులు
ఆగిరిపల్లి: మండలంలోని పోతవరప్పాడు మ్యాంగో బే కల్చర్ అసోసియేషన్లో ఆదివారం పోలీసులు దాడిలో పట్టుబడిన 281 మందిని డీఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో ఐదు బస్సులలో తరలించి నూజివీడు కోర్టులో హాజరు పర్చారు. స్వాధీనం చేసుకున్న రూ.32 లక్షలను కోర్టుకు అప్పగించారు. జడ్జి ఆదేశాల మేరకు వారికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఏలూరు (మెట్రో): గిరిజన ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమం, ఇతర సమస్యలపై అధికారులతో కలెక్టరు కె.వెట్రిసెల్వి మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ జిల్లా పర్యటనలో లేవనెత్తిన అంశాల విషయంలో నూరుశాతం లక్ష్యాలు సాధించాలన్నారు. మోదెల గ్రామ ప్రజల కోరిక ప్రకారం బుట్టాయిగూడెం మండలంలోకి మోదెల గ్రామాన్ని కలిపేందుకు ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. రెడ్డిగూడెం, రాజానగరం, కోటరామచంద్రపురంలో సెల్ ఫోన్లు సిగ్నల్స్ లేవని ఫిర్యాదులు వస్తున్నాయని, అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సెల్ టవర్స్ రిపేర్లు ఉంటే చేయించి, కొత్తగా అవసరమైన చోట టవర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గిరిజన ప్రాంతాలు అభివృద్ధి కార్యక్రమాలకు భూసేకరణలో భూమికి భూమి ఇవ్వాలని, అర్హత ఉన్నవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, జాబు మేళా ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని అన్నారు. హెల్త్ సబ్ సెంటర్లకు 108 వాహనం వెళ్ళేలా రహదారుల ఏర్పాటుపై దృష్టి పెట్టాలన్నారు. సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు, ఐటీడీఏ పీఓ కె.రాములు నాయక్, పాల్గొన్నారు. ఏలూరు (మెట్రో): ఎరువులు పంపిణీ, ఎరువులు, విత్తనాల నాణ్యతపై వ్యవసాయాధికారులతో జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి మంగళవారం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయాధికారులు వారి పరిధిలో కావలసిన ఎరువులు తదితర అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని, ప్రస్తుత వ్యవసాయ సీజన్లో జిల్లాలోని రైతులకు ఎరువుల కొరత లేకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. రానున్న 10 రోజులకు అవసరమైన ఎరువులు నిల్వ ఉండేలా చూసుకోవాలన్నారు. ఎక్కడైనా ఎరువుల కొరత ఎదురైతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు. ఎరువులు, విత్తనాల నాణ్యతను వ్యవసాయ, అనుబంధ రంగాల శాఖల సిబ్బంది పరిశీలించాలని, కల్తీ విత్తనాలు, ఎరువులు ఎక్కడా పంపిణీ కాకుండా ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. ఆయిల్ పామ్, కోకో వంటి ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని, జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని లక్ష్యం కన్నా ఎక్కువగా పెంచామన్నారు. జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ బాషా, ఉద్యానవన శాఖాధికారి షాజా నాయక్, మైక్రో ఇరిగేషన్ అధికారి రామ్మోహన్, వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు, మండల వ్యవసాయాధికారులు పాల్గొన్నారు. ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా పోలీస్ సిబ్బంది, కుటుంబ సభ్యులు సంయుక్తంగా ఐక్య క్రిస్మన్ వేడుకలు జరుపుకున్నారు. సోమవారం రాత్రి ఏఆర్ పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన వేడుకల్లో ఐజీ జీవీజీ అశోక్కుమార్, ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ పాల్గొన్నారు. క్యాండిల్స్ వెలిగించి క్రీస్తును ఆరాధించారు. ఐజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ ... ఏసుక్రీస్తులా ప్రేమ, శాంతి బోధనలు అవలంబిస్తూ తోటి వారికి సహాయం చేయాలన్నారు. ఎస్పీ కొమ్మి శివకిషోర్ మాట్లాడుతూ.. క్రీస్తు జీవించిన విధానం కరుణ, దయ, త్యాగం, ఎదుటి వ్యక్తుల పట్ల ప్రేమ చూపించే అంశాలను ప్రతి ఒక్కరికీ ఆచరణీయం అన్నారు. -
మొక్కుబడిగా ఇంధన పొదుపు వారోత్సవాలు
● జిల్లాలో కానరాని అవగాహన కార్యక్రమాలు ● వారోత్సవాల బడ్జెట్.. మోంథా ఖర్చులు రాక నీరసం తణుకు అర్బన్: విద్యుత్ శాఖ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు చంద్రబాబు సర్కారులో మొక్కుబడిగా నిర్వహించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు పొదుపు వారోత్సవాలు నిర్వహించాల్సి ఉండగా ఎటువంటి అలికిడి లేకుండానే గడిచిపోయాయని అంటున్నారు. వారోత్సవాల కోసం ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు అందకపోవడం కూడా కారణంగా చెబుతున్నారు. మొత్తానికి సర్కారు పర్యవేక్షణ లోపమో, విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యమో కానీ జిల్లాలోని కొన్ని విద్యుత్ సబ్ డివిజన్లలో వారోత్సవాలు అరకొరగాను, మొక్కుబడిగాను నిర్వహించారని, వినియోగదారులకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని ప్రజానీకం ఆరోపిస్తున్నారు. గతంలో అట్టహాసంగా.. గత ప్రభుత్వ హయాంలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలకు ఎంతో ప్రాధాన్యతనిచ్చేవారు. వారోత్సవ నిర్వహణలో భాగంగా విద్యుత్ శాఖ అధికారులు వారంరోజుల పాటు సబ్ డివిజన్ కార్యాలయాల్లో వివిధ కార్యక్రమాలు, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, ర్యాలీలు నిర్వహించి ప్రజలకు తెలిసే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇంధన పొదుపుతోపాటు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించేవారు. ఇంధనం పొదుపు చేద్దాం.. భావితరాలకు వెలుగునిద్దాం. విద్యుత్ విలువైనది.. వృథా కాకుండా ఆదా చేద్దాం. మూడు లేక అంతకన్నా ఎక్కువ స్టార్లు ఉన్న గృహోపకరణాలు వాడుదాం.. 30 శాతానికిపైగా విద్యుత్ బిల్లు ఆదా చేద్దాం అంటూ వినియోగదారులకు అవగాహన కల్పించేవారు. కానీ ఈ ఏడాది ఎక్కడా అవగాహన కార్యక్రమాలు కానరాకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బడ్జెట్ అందకపోవడమే కారణమా? జాతీయ ఇంధన వారోత్సవాల నిర్వహణకు జిల్లాకు కొంత మొత్తం బడ్జెట్ను కేటాయిస్తుంటారు. జిల్లాకు సుమారుగా రూ.లక్ష నిధులు కేటాయింపులు చేసి ఆయా సబ్ డివిజన్ కార్యాలయాలకు కొంత మొత్తం చొప్పున అందించాల్సి ఉంది. అయితే ఈ ఏడాది ఇంకా సదరు బడ్జెట్ నిధులు అందకపోవడంతో కొన్ని సబ్ డివిజన్లలో తూతూ మంత్రంగా నిర్వహించి చేతులు దులిపేసుకున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే మోంథా తుపాను కారణంగా విద్యుత్ శాఖ నిర్వహించిన పనులకు గాను ఆయా సబ్ డివిజన్లకు చేసిన ఖర్చుల తాలూకా నిధులు అందలేదని దీంతో విద్యుత్ శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నట్లుగా తెలుస్తోంది. వారోత్సవాల విషయంమై తాడేపల్లిగూడెం విద్యుత్ డివిజనల్ ఇంజనీరు కె.నరసింహమూర్తిని శ్రీసాక్షిశ్రీ వివరణ కోరగా తాడేపల్లిగూడెం డివిజన్ అంతా జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించామని చెప్పారు. అయితే బడ్జెట్ ఇంకా రావాల్సి ఉందని చెప్పారు. ఇంధన పొదుపు వారోత్సవాల పేరుతో గతంలో విద్యుత్ వాడకం, పొదుపుపై అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు నిర్వహించే వారు. కానీ ఈ ఏడాది వారోత్సవాలపై వినియోగదారులకు సమాచారం లేదు. అసలు ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించినట్లు కనిపించలేదు. – పి.సాయిసూర్య, వినియోగదారుడు, తణుకు -
ట్రిపుల్ ఐటీలో అధ్యాపకుల నిరసన
నూజివీడు: వేతనాలను పెంచాలని కోరుతూ నూజివీడు ట్రిపుల్ ఐటీలో పనిచేస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు మంగళవారం వారు నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిష్టాత్మక ఐఐటీలు, సెంట్రల్ యూనివర్సిటీలలో చదువుకుని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా 2010–14 సంవత్సరాల మధ్య కాలంలో ట్రిపుల్ ఐటీలో చేరామని, అయితే తమకు వేతనాలను పెంచి ఎనిమిదేళ్లయిందన్నారు. ఈ విషయంపై ఎన్నిసార్లు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా అదిగో ఇదిగో అంటూ జాప్యం చేస్తున్నారని వాపోయారు. గతంలో ఆర్జీయూకేటీ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం ద్వారా సంస్థాగత స్థాయిలోనే నేరుగా అధ్యాపకుల జీతాలను పెంచేవారని, ప్రస్తుతం జీతాల పెంపు విషయాన్ని ఉన్నత విద్యాశాఖ ద్వారా ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని అధికారులు చెబుతున్నారన్నారు. ఉన్నత విద్యా శాఖ లేవనెత్తిన పలు అంశాలకు సంబంధించి ట్రిపుల్ ఐటీ అధికారులు రెండు నెలలుగా ఎలాంటి సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. యాజమాన్యం నుంచి సరైన స్పందన లేకపోవడంతో ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనకు దిగామన్నారు. అనంతరం డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్కు వినతిపత్రాన్ని అందజేశారు. -
పెద్దింట్లమ్మ హుండీ ఆదాయం రూ.6.60 లక్షలు
కై కలూరు: జిల్లాలో ప్రసిద్ధి చెందిన కొల్లేటికోట పెద్దింట్లమ్మ హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. భక్తులు హుండీలో వేసిన కానుకలు 97 రోజులకుగాను రూ.6,60,853 ఆదాయం వచ్చిందని ఈవో కూచిపూడి శ్రీనివాస్ చెప్పారు. లెక్కింపు కార్యక్రమంలో రెవెన్యూ, పోలీసు, దేవాలయ సిబ్బంది, గ్రామ పెద్దలు హాజరయ్యారని తెలిపారు. పోలవరం: పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ముఖ్య కార్యనిర్వహణాధికారి యోగేష్ పైదస్కార్ బుధవారం పోలవరం సందర్శనకు వస్తున్నట్లు జలవనరుల శాఖాధికారులు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు పునరావస కాలనీని సందర్శించి, అనంతరం ప్రాజెక్టు క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖాధికారులతో సమీక్షించనున్నారు. మండలంలోని ఎల్ఎన్డీ పేట పునరావాస కేంద్రంలో నిర్వాసితులకు నిర్మించిన గృహాలు, మౌలిక వసతులు కూడా పరిశీలించనున్నారు. -
విషాదం నింపిన రోడ్డు ప్రమాదం
+ మోటార్సైకిల్ను ఢీకొన్న కారు + భార్యాభర్తలు మృతి కంకిపాడు: రోడ్డు ప్రమాదం ఆ కుటుంబంలో విషాదం నింపింది. కంకిపాడులో మోటార్సైకిల్ను కారు ఢీకొన్న ఘటనలో భర్త మృతి చెందగా, భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఏలూరు జిల్లా మండవల్లి మండలం కానుకొల్లు గ్రామానికి చెందిన పాలెపు వెంకన్న (45), తన భార్య గృహలక్ష్మితో కలిసి మోటరుసైకిల్పై పరిటాలలో ఇంజినీరింగ్ చదువుతున్న కుమార్తెను చూసేందుకు ఈ నెల 21న బయలుదేరారు. మార్గమధ్యంలో వీరి మోటార్సైకిల్ను కంకిపాడు నుంచి గుడివాడ వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఘటనలో తీవ్రంగా గాయపడ్డ పాలెపు వెంకన్న విజయవాడ ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో మృతి చెందాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్న వెంకన్న భార్య గృహలక్ష్మిని వైద్యం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు ఇద్దరూ మృత్యువాత చెందడంతో ఆ కుటుంబాల్లో విషాదం అలముకుంది. ఘటనపై ఆసుపత్రి వర్గాల సమాచారంతో పోలీసులు వివరాలు సేకరించారు. మృతదేహాలకు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసులు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పాలకొల్లు సెంట్రల్: స్థానిక శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో సప్త సోమవార ప్రదక్షిణల్లో భాగంగా ఏడు సోమవారాలు ఏడు ప్రదక్షిణలు పూర్తి చేసుకున్న భక్తులు మంగళవారం శివసహస్రనామ పూజలు జరుపుకున్నారు. ఆలయంలో అభిషేకాలు నిర్వహించుకుని మండపంలో ఏర్పాటుచేసిన పూజా కార్యక్రమాల్లో 12 మంది భక్తులు పాల్గొన్నారు. ఆలయ అభిషేక పండిట్ భమిడపాటి వెంకన్న బ్రహ్మత్వంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావు, ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ వాసు, అర్చకులు కిష్టప్ప, అనిల్, వీరబాబు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య క్షేత్రంలో చినవెంకన్న తిరువీధి సేవ మంగళవారం నేత్రపర్వంగా జరిగింది. పద్మావతి, ఆండాళ్ అమ్మవార్లు, గోదాదేవితో కలసి స్వామివారు ఉదయం క్షేత్ర పురవీధుల్లో అట్టహాసంగా ఊరేగారు. ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని ముందుగా ఆలయంలో ప్రత్యేకంగా అలంకరించిన తొళక్క వాహనంపై శ్రీవారు, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఉంచి విశేష పుష్పాలంకారాలు చేశారు. పూజాధికాల అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణలు, అశ్వ, గజ సేవల నడుమ స్వామివారి వాహనం క్షేత్ర పురవీధుల్లో తిరుగాడింది. ప్రతి ఇంటి ముంగిటా భక్తులు స్వామివారికి నీరాజనాలు సమర్పించారు. ఆ తరువాత స్థానిక ధనుర్మాస మండపంలో స్వామి, అమ్మవార్లు, గోదాదేవికి అర్చకులు విశేష పూజలు జరిపి, భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. -
గ్రామసభను అడ్డుకున్న గిరిజన సంఘాలు
బుట్టాయగూడెం: రెడ్డిగణపవరంలో పోలవరం నిర్వాసితుల కోసం సేకరిస్తున్న భూములకు సంబంధించి మంగళవారం రెవెన్యూ అధికారులు గ్రామ సభ నిర్వహించారు. అయితే ఈ గ్రామసభను ఆదివాసీసేన, సీపీఎం, గిరిజన సంఘాల నాయకులు అడ్డుకున్నారు. ఆదివాసీ సేన నాయకుడు మడకం వెంకటేశ్వరరావు, సీపీఎం నాయకుడు పి.మంగరాజు, గిరిజన సంఘం నాయకులు పోలోజు నాగేశ్వరరావు మాట్లాడుతూ పోలవరం నిర్వాసితుల కోసం వివాదంలో ఉన్న భూములను సేకరిస్తున్నారని గతంలో గ్రామసభను అడ్డుకున్నట్లు తెలిపారు. రెడ్డిగణపవరం పరిధిలో సుమారు 400 ఎకరాలకు పైగా భూములను రెవెన్యూ అధికారులు సేకరిస్తున్నారని, వీటిలో అత్యధికంగా ఎల్టీఆర్, 1/70 చట్ట పరిధిలో ఉన్నవని, ఎంతోకాలంగా గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములను చెప్పారు. మళ్లీ ఆ వివాదస్పద భూములకు సంబంధించి గ్రామ సభ నిర్వహించడం తగదన్నారు. దీనిపై ఎస్డీసీ ఆంజనేయులు మాట్లాడుతూ ప్రతి భూమిని సర్వే చేసిన తర్వాత, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి వివాదంలేని భూములను మాత్రమే సేకరిస్తామని చెప్పారు. అయితే అప్పటివరకూ గ్రామసభ జరపవద్దని చెప్పడంతో గ్రామసభ నిలిచిపోయింది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పీవీ చలపతిరావు, డీటీలు, పలువురు రైతులు, తదితరులు పాల్గొన్నారు. -
రబీ మొక్కజొన్న సాగుకు ఇదే అదును
చింతలపూడి: మొక్కజొన్న పంటను ఆహార పంటగానే కాకుండా దాణా రూపంలోను, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగాను ఉపయోగిస్తున్నారు. రబీ సీజన్లో మొక్కజొన్న పంటను విత్తుకోవడానికి ఇదే సరైన సమయమని వ్యవసాయ సబ్ డివిజన్ సహాయ సంచాలకులు వై సుబ్బారావు రైతులకు సూచిస్తున్నారు. ఎలాంటి నేలలు అనువు మొక్కజొన్న సాగుకు మురుగు పొయే లోతైన ఎర్ర గరప, మధ్యస్థ నేలలు బాగా అనుకూలం. రబీ సీజన్లో అక్టోబర్ 15 నుంచి నవంబర్ 30 లోగా విత్తితే ఎక్కువ దిగుబడులు పొందడానికి అవకాశం ఉంది. వరి మాగాణి తరువాత జీరో టిల్లేజ్ పద్ధతిలో డిసెంబర్ చివరి వరకు రైతులు విత్తుకోవచ్చు. హైబ్రీడ్ విత్తనాలైతే ఎకరానికి 8 కేజీలు సరిపోతాయి. విత్తటానికి ముందు నేలను 3, 4 సార్లు నాగలితో దుక్కి దున్నాలి. ఎకరానికి 10 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నాలి. తరువాత బోదె నాగలితో బోదెలు, కాలువలు చేసుకోవాలి. 8 కేజీల విత్తనానికి 24 గ్రాముల మాంకోజెబ్ పొడి మందుతో విత్తన శుద్ధి చేసుకుంటే లేత దవలో తెగుళ్ల బారి నుంచి కాపాడుకోవచ్చు. విత్తనాలను చేళ్ల మధ్య 60 సెం.మీటర్ల దూరంలో, మొక్కల మధ్య 20 సెం.మీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకోవాలి. మొలకెత్తిన 10 రోజుల తరువాత ఒక మొక్కను ఉంచి మిగిలిన మొక్కలను తీసివేయాలి. భూసార పరీక్షల ఆధారంగా.. భూసార పరీక్షల ఫలితాలను అనుసరించి ఎరువులను వాడితే నాణ్యమైన దిగుబడులకు అవకాశం ఉంటుంది. ఎకరానికి 20 కేజీల జింక్ సల్ఫేట్, 96 కేజీల నత్రజని, 32 కేజీల భాస్వరం, 32 కేజీల పొటాష్ ఇచ్చే ఎరువులను వాడుకోవాలి. మొక్కల్లో జింక్ లోపం కనిపించినప్పుడు లీటర్ నీటికి 2 గ్రా చొప్పున జింక్ సల్ఫేట్ కలిపి పైరుపై పిచికారీ చేయాలి. కలుపు నివారణ పంట విత్తిన 2, 3 రోజుల్లోపు అట్రాజిన్ అనే కలుపు మందును ఎకరాకు 800 గ్రా 200 లీటర్ల నీటిలో కలిపి తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయడం వలన కలుపు మొక్కలను నెల రోజుల వరకు అదుపు చేయవచ్చు. విత్తిన 30 రోజుల్లోపల వెడల్పాటి కలుపు మొక్కలను గమనిస్తే 2, 4–డీ సోడియం సాల్ట్ ఎకరానికి 500 గ్రాముల పొడి మందు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కాండం తొలుచు పురుగు మొక్కజొన్న పంట మొలకెత్తిన 10, 20 రోజులకు కాండం తొలుచు పురుగు ఆశిస్తుంది. పిల్ల పురుగులు మొదట ఆకులపై పత్రహరితాన్ని గోకి తింటాయి. తరువాత ముడుచుకుని ఉన్న ఆకుల ద్వారా కాండం లోపలకు చేరతాయి. ఈ ఆకులు విచ్చుకున్న తరువాత గుండు సూది మాదిరి రంధ్రాలు లేదా పొడవాటి చిల్లుల వరుస క్రమంలో కనిపిస్తాయి. లార్వాలు ఎదిగే అంకురాన్ని తినడం వల్ల మొవ్వ చనిపోతుంది. దీనిని డెడ్హార్ట్ అంటారు. కాండం లోపల గుండ్రని లేదా ఎస్ ఆకారంలో సొరంగాలు ఏర్పరుస్తుంది. ఇవి కంకిని ఆశించడం వలన దిగుబడి తగ్గిపోతుంది. నివారణ మొక్కజొన్న నాటిన 20–30 రోజులకు కార్బోఫ్యూరాన్ 3 జి గుళికలను ఎకరాకు 3 కిలోల చొప్పున ఆకుల సుడులలో వేయడం ద్వారా కాండం తొలిచే పురుగును సమర్థవంతంగా నిలువరించవచ్చు. -
‘పుడమి పుత్ర’ అవార్డుతో సత్కారం
పెదవేగి: జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ప్రకృతి వ్యవసాయంలో ఉత్తమ పంటలు పండించిన రైతులను గాంధీ హైదరాబాద్కు చెందిన గ్లోబల్ ఫ్యామిలీవారు పుడమి పుత్ర అవార్డుతో సత్కరించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేసే రైతులను జిల్లాకు ఒక రైతును ఎంపిక చేశారు. ఇందులో భాగంగా ఏలూరు జిల్లా నుంచి పెదవేగి మండలం అంకన్నగూడెం గ్రామానికి చెందిన కొత్త జయకళాచంద్రరావును పుడమి పుత్ర అవార్డుతో సత్కరించారు. ఈ సందర్భంగా జయకళాచంద్రరావు మాట్లాడుతూ 4 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్స్, నిత్యం 25 రకాల కూరగాయ పంటలను ఎటువంటి రసాయన పురుగు మందులు లేకుండా ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు మంచి ఆరోగ్యం, మంచి ఆహారాన్ని అందించాలనే సంకల్పంతో కృషి చేస్తున్నంందుకుగాను తనకు ఈ అవార్డు లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జయకళాచంద్రరావు, లావణ్య దంపతులను పలువురు అభినందించారు. -
గంగానమ్మ అమ్మవారి సేవలో స్పీకర్
ఏలూరు (ఆర్ఆర్పేట): నగరంలో జరుగుతున్న శ్రీ గంగానమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా స్థానిక దక్షిణపు వీధిలోని మేడల్లో కొలువై ఉన్న గంగానమ్మ అమ్మవారిని మంగళవారం రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శతాబ్దకాలానికి పైగా హేలాపురి ఇలవేల్పుగా పూజలందుకుంటోన్న గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో ఈ ప్రాంతంతో పాటు రాష్ట్రమంతటా సంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. తొలుత ఆయనకు దక్షిణపు వీధి జాతర కమిటీ అధ్యక్షుడు అద్దేపల్లి శ్రీనివాసరావు, ఇతర సభ్యులు స్వాగతం పలికారు. అనంతరం జాతర కమిటీ సభ్యులు స్పీకర్ను ఘనంగా సన్మానించారు. ఉండి: అదనపు కట్నం వేధింపులపై కేసు నమోదైంది. ఉండి మండలం వెలివర్రు శివారు ప్రాంతం గరువులో తాటిపర్తి చిట్టెమ్మను ఆమె భర్త అదనపు కట్నం తీసుకురావాలంటూ శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
26 నుంచి జాతీయస్థాయి నృత్య పోటీలు
ఏలూరు (ఆర్ఆర్పేట): ఈ నెల 26, 27, 28 తేదీల్లో ఏలూరుకు చెందిన ప్రముఖ నృత్య సంస్థ అభినయ నృత్యభారతి 30వ వార్షిక జాతీయ స్థాయి నృత్యోత్సవాలు, నృత్యపోటీలు నిర్వహించనున్నట్టు సంస్థ గౌరవ అధ్యక్షుడు అంబికా కృష్ణ, వ్యవస్థాపక అధ్యక్షుడు మనోహర్ గోపాల్ లునాని, వ్యవస్థాపక కార్యదర్శి నాట్యాచార్య దువ్వి హేమసుందర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు, కళా సంస్థల సహకారంతో నిర్వహించనున్న ఈ కార్యక్రమాల్లో యువ నర్తకులకు, నాట్యాచార్యులకు, సేవా మూర్తులకు అవార్డులు అందజేస్తామన్నారు. అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన చిన్నారి నర్తకులకు కూచిపూడి, జానపద, బృంద నృత్య పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమాలకు ముందుగా ఈ నెల 25వ తేదీ సాయంత్రం తూర్పు వీధి శ్రీ గంగానమ్మ అమ్మవారి జాతరలో అభినయ నృత్యభారతి ఆధ్వర్యంలో ప్రత్యేక నృత్యోత్సవం నిర్వహించనున్నట్టు చెప్పారు. అంతకు ముందు ఈ కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను అంబికా కృష్ణ ఆవిష్కరించారు. -
వాజ్పేయి విగ్రహం ఆవిష్కరణ
దెందులూరు: కాంగ్రెసేతర ప్రభుత్వంతోనూ దేశంలో అద్భుతమైన సుపరిపాలన అందించడం సాధ్యమని నిరూపించిన ధీశాలి అటల్ బిహారీ వాజ్ పేయి అని తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై కొనియాడారు. సోమవారం ఏలూరు రూరల్ మండలం మల్కాపురం ఆశ్రం హాస్పిటల్ సెంటర్ వద్ద మాజీ ప్రధాని వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని అన్నామలై, కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆవిష్కరించారు. అనంతరం శ్రీఅటల్–మోడీ సుపరిపాలన యాత్రశ్రీలో భాగంగా నిర్వహించిన సభలో కేంద్ర మంత్రితో పాటు మంత్రి కొలుసు పార్థసారథి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గారపాటి సీతారామాంజనేయ చౌదరి, తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (టూటౌన్): అగ్రవర్ణాల వేధింపులు, అరాచకాల నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ కై కలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలం పేరూరుకు పుట్టి శివభాస్కర్ తన కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టరేట్ వద్ద సోమవారం నిరసన వ్యక్తం చేశారు. బాధితుడు మాట్లాడుతూ తన 6.64 ఎకరాల భూమి హద్దులను రైతులు బొప్పన రామలింగేశ్వరరావు, అతని అనుచరులు తొలగించి అక్రమంగా ప్రవేశించి చేపల చెరువు త్రవ్వే ప్రయత్నం చేశారని, తన చెరువును వారికి లీజుకి ఇవ్వాలని ఒత్తిడి చేశారని ఆరోపించారు. నిరాకరించడంతో స్థానిక ఎస్సై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. సంబంధిత రైతులతో రాజీ కుదుర్చుకోవాలని బెదిరిస్తున్నారన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ద్వారకాతిరుమల: లారీ, బైక్ పరస్పరం ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మండలంలోని దొరసానిపాడు శివారులో ఓ దాబా ముందు సోమవారం మధ్యాహ్నం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం... కామవరపుకోట మండలం తాడిచర్లకు చెందిన కొప్పుల రాజేష్(20) వ్యాన్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. రాజేష్, ఆడమిల్లిలోని ఓ పెట్రోల్ బంకులో పనిచేస్తున్న అదే గ్రామానికి చెందిన తన స్నేహితుడు సర్వేపల్లి నవదీప్లు బైక్ సైలెన్సర్ రిపేర్ నిమిత్తం ద్వారకాతిరుమలకు వచ్చారు. అనంతరం స్వగ్రామానికి వెళుతున్నారు. కామవరపుకోట నుంచి ద్వారకాతిరుమల వైపుకు వెళుతున్న లారీ, వీరి బైక్ పరస్పరం వేగంగా ఢీకొన్నాయి. రాజేష్ తల భాగం నుజ్జునుజ్జయ్యి అక్కడికక్కడే మృతి చెందగా, నవదీప్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని 108లో పీహెచ్సీకి తరలించారు. అనంతరం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. మృతుడి తండ్రి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
గంగానమ్మను దర్శించుకున్న ‘చాంపియన్’ టీం
ఏలూరు (ఆర్ఆర్పేట): నగరంలో జరుగుతున్న గంగానమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా సోమవారం చాంపియన్ చిత్ర హీరో, హీరోయిన్లు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిత్రం ప్రమోషన్ యాత్రలో భాగంగా నగరానికి విచ్చేసిన హీరో రోషన్, హీరోయిన్ అనస్వర రాజన్ అమ్మవారి మేడల వద్దకు చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారికి పసుపు, కుంకుమలు, సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పెదవేగి: తాగి వస్తున్నావంటూ భార్య నిలదీయడంతో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పెదవేగి ఎస్సై హరిగోపాల్ తెలిపిన వివరాల ప్రకారం.. పెదవేగి మండలం సీతారామపురం గ్రామానికి చెందిన గొర్రెల అప్పారావు(44) రోజు మద్యం తాగి వస్తుండటంతో భార్య మాధఽవి ప్రశ్నించింది. దీంతో అతను ఈ నెల 21న పురుగులమందు తాగడంతో స్థానికులు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పారావు సోమవారం మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఊపాధి హామీ పథకానికి తూట్లు
భీమవరం: జీ రామ్ జీ పేరుతో కొత్త చట్టం పేదలకు ఉపాధి గ్యారెంటీ లేకుండా చేయడమేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బి.బలరాం అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టానికి సవరణ చేయడంపై నిరసనగా సోమవారం భీమవరంలో సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పార్టీ జిల్లా కార్యదర్శి జెఎన్వీ గోపాలన్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టం వంటి వాటిని నేడు మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. గ్రామీణ పేదల ఉపాధికి నష్టం కలిగించే జీ రామ్ జీ చట్టం అమలుకు చేసే ప్రయత్నాలను ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పాతపాటి హరికుమార్ రాజు మాట్లాడుతూ వలసల నివారణకు యూపీఏ ప్రభుత్వం చట్టాన్ని తెస్తే నేడు జాతిపిత గాంధీ పేరు తొలగించి రాంజీ పేరు పెట్టడం పేదలను మోసం చేయడమేనన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి కామన నాగేశ్వరరావు మాట్లాడుతూ పార్లమెంట్లో వైఎస్సార్సీపీ ఎంపీలు స్టాండింగ్ కమిటీ ముందు చర్చ పెట్టాలని డిమాండ్ చేసినా కేంద్రం మొండిగా చట్టాన్ని ఆమోదింప చేసిందని విమర్శించారు. రానున్న రోజుల్లో ఉపాధి హామీ చట్టాన్ని రక్షించే పోరాటంలో వైఎస్సార్సీపీ పూర్తి సహకారం అందిస్తుందన్నారు. ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి లంక కృష్ణమూర్తి. ఎంసీపీఐయు జిల్లా నాయకుడు గురుగుబెల్లి రాంబాబు, బీఎస్పీ జిల్లా నాయకులు మురాల రత్నంరాజు, ఈది శేఖర్బాబు, దళిత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందరకుమార్, కోన జోసప్, ఈది రవికుమార్, బోకూరి విజయరాజు, బి.వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. -
రియల్.. ఢమాల్
మంగళవారం శ్రీ 23 శ్రీ డిసెంబర్ శ్రీ 2025సాక్షి, భీమవరం: జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగం నేలచూపులు చూస్తోంది. క్రయవిక్రయాలు మందగించి రిజిస్ట్రేషన్ల శాఖ రాబడి లక్ష్యాన్ని చేరుకోవడం గగనమవుతోంది. గతంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్లు గణనీయంగా తగ్గినట్టు గణాంకాలు చెబుతున్నాయి. అమ్మేవారున్నా ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోవడమే స్థిరాస్తి రంగం కుదేలవ్వడానికి కారణమని రియల్ ఎస్టేట్ వర్గాలంటున్నాయి. జిల్లాలోని పట్టణ, మండల కేంద్రాలు, సమీప గ్రామాల్లో వెయ్యికి పైగా లేఅవుట్లు ఉన్నాయి. ఎక్కడికక్కడ అపార్ట్మెంట్లు పుట్టుకొచ్చాయి. స్థలాలు, ప్లాట్లు క్రయ విక్రయదారులతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కళకళలాడేవి. పశ్చిమగోదావరి జిల్లాలోని 15 సబ్ రిజిస్ట్రార్ కా ర్యాలయాల పరిధిలో నెలకు 10 వేలకు పైగా రిజిస్ట్రేషన్లు జరుగుతాయని అంచనా. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వీటి సంఖ్య 15 వేలకు పైబడి ఉండగా గత ఆర్థిక సంవత్సరంలో 10 వేలలోపే జరిగాయి. చంద్రబాబు ప్రభుత్వం సంక్షేమ పథకాలను అటకెక్కించడంతో జనం వద్ద డబ్బుల్లేక మార్కెట్లో మనీ రొటేషన్ తగ్గింది. వ్యాపారుల పరిస్థితి దిగజారింది. ప్రతికూల వాతావరణం, దళారుల దోపిడీతో జిల్లాలో ప్రధానమైన ఆక్వా, వరిసాగులో రైతులు నష్టాలు చవిచూస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో క్రయవిక్రయాలు గణ నీయంగా తగ్గిపోయాయి. సైట్లు అమ్ముడుపోక అప్పులు చేసి వెంచర్లు వేసిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పిల్లల చదువులు, వివాహాలు, ఇతర అవసరాల నిమిత్తం ఉన్న కాస్త ఆస్తిని అమ్మకానికి పెట్టినా కొనే వారు లేక సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో నెలకు రెండు, మూడు ప్లాట్లు అయినా విక్రయించే వారు కొంతకాలంగా ఒక్క ప్లాటు కూడా విక్రయించలేని పరిస్థితి ఉందని మీడియేటర్స్ అంటున్నారు. రిజిస్ట్రేషన్ శాఖలో గత ఆర్థిక సంవత్సరంలో కేవలం 63 శాతం మాత్రమే ఆదాయం లక్ష్యం నమోదైంది. ఎనీవేర్ రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగే ఉండి, మొగల్తూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు మినహా జిల్లాలోని మిగిలిన 13 చోట్ల ఆదాయం లక్ష్యం 48 శాతం నుంచి 70 శాతంలోపే ఉంది. మూలిగేనక్కపై తాటికాయ పడ్డట్టు ఫిబ్రవరి నుంచి భూముల విలువను 10 నుంచి 40 శాతం వరకు పెంచడం రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత దెబ్బతీసింది. చార్జీల పెంపుతో ఉన్న అరకొర మొత్తాన్ని ప్రజలు బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతుండటం రిజిస్ట్రేషన్లు మందగించడానికి కారణంగా చెబుతున్నారు. 2019 నుంచి 2024 మధ్య కాలం స్థిరాస్థి రంగానికి స్వర్ణయుగం అయ్యింది. విద్య, వైద్యం, ఉపాధి తదితర రంగాల్లో గత ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచింది. అన్నివర్గాల వారికి మేలుచేసేలా అమలుచేసిన సంక్షేమ పథకాలు వారి ఆదాయాన్ని మరింత పెంచాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడం, వ్యవసాయం, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు రాయితీలు, ప్రోత్సాహకాల రూపంలో ప్రభుత్వ సహకారంతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడి స్థిరాస్థి రంగంలో కొనుగోళ్లు పెరిగాయి. గత ఐదేళ్లలో ఏటా ప్రభుత్వం నిర్దేశించిన రాబడి లక్ష్యం 70 శాతానికి తగ్గలేదు. కరోనా విలయతాండవం చేసిన 2020, 2021లో సైతం 76 శాతం నుంచి 95 శాతం వరకు లక్ష్యాన్ని చేరుకుంది. నేలచూపులు చంద్రబాబు సర్కారులో రియల్ ఎస్టేట్ పతనం స్థిరాస్తి రంగంలో మందగించిన క్రయవిక్రయాలు జిల్లాలో తగ్గిన రిజిస్ట్రేషన్లు గత ఆర్థిక సంవత్సరంలో 63 శాతమే చేరుకున్న లక్ష్యం సంవత్సరం రిజిస్ట్రేషన్లు ఆదాయం లక్ష్యం వచ్చిన మొత్తం శాతం (రూ.కోట్లల్లో) (రూ.కోట్లల్లో) 2020–21 85,620 318.9 241.26 76 2021–22 1,23,536 365.59 361.68 99 2022–23 1,39,731 486.79 380.37 78 2023–24 1,83,180 517.13 399.66 70 2024–25 98,790 616.76 388.22 63 -
18 రోజులు.. రూ.1.75 కోట్లు
చినవెంకన్న హుండీ ఆదాయం లెక్కింపు ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయ హుండీల ఆదాయాన్ని స్థానిక ప్ర మోద కల్యాణ మండపంలో సోమవారం లె క్కించారు. శ్రీవారికి విశేష ఆదాయం సమకూ రింది. గత 18 రోజులకు గాను నగదు రూపేణా రూ.1,75,47,176 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. అలాగే కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 138 గ్రాముల బంగారం, 4.574 కేజీల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. లెక్కింపులోకి రాని రద్దయిన పాత రూ.500, రూ.2,000 నోట్ల ద్వారా రూ.1,13,000 లభించాయన్నారు. ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఏలూరు(ఆర్ఆర్పేట): ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే భవిష్యత్లో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.అజయ్కుమార్ హె చ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక (జేఏసి) పిలుపులో భాగంగా సోమవారం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు వద్ద ధర్నా నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అజయ్కుమార్ మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలు తక్షణమే అమలు చేయాలన్నారు. సొసైటీ ఉద్యోగులకు జీఓ 36 అమలు చేయాలని, వేతన సవరణ వెంటనే చేయాలని, గ్రాట్యూటీ చెల్లించాలని, పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని, సొసైటీల ప్రైవేటీకరణ, సిబ్బందిని కుదించే ఆలోచనలు మానుకోవాలన్నారు. ఉమ్మడి జిల్లా యూనియన్ నాయకులు కేవీవీ సత్యనారాయణ, టి.గంగరాజు, సీహెచ్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ డిసిసిబి, ఆప్కాబ్ తమ వంతు నిధులు సమకూర్చడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఐటీయూ నాయకులు సీహెచ్ సుందరయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, యూనియన్ ప్రధాన కార్యదర్శి పూజారి సుబ్బారావు, కోశాధికారి జి.వీరయ్య, తూర్పుగోదావరి జిల్లా యూనియన్ ఉపాధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ రామచంద్రరావు పాల్గొన్నారు. ఏలూరు (టూటౌన్): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని, కేంద్రం తీసుకొచ్చిన వికసిత్ భారత్ జీ రామ్ జీ పథకాన్ని రద్దు చేయాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ఏలూరు కలెక్టరేట్ వద్ద సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్)న్యూడెమోక్రసీ, సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా వామపక్ష నాయకులు మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టాన్ని మోదీ సర్కారు మతం ముసుగులో జీ రామ్ జీ పథకంగా మార్చడాన్ని ఖండించారు. కేంద్రం ఉపాధి పథకాన్ని 11 ఏళ్లుగా నీరుగార్చడానికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. కేంద్రం వాటా 90 శాతం నుంచి 60 శాతానికి కుదించడం, ఉపాధి హామీ చట్టాన్ని రానున్న రోజుల్లో రద్దు చేసే ఆలోచనే అన్నారు. రాష్ట్రం వాటాను 40 శాతానికి పెంచడాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించాలని కోరారు. జీ రామ్ జీ పథకాన్ని రద్దు చేసే వరకూ వామపక్ష పార్టీలు కలిసొచ్చే పార్టీలను, సంఘాలతో ఉద్యమిస్తాయని హెచ్చరించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డేగా ప్రభాకర్, ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి.రామకృష్ణ, కె.శ్రీనివాస్, సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ జిల్లా కార్యదర్శి ఎస్కే గౌస్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నగర నాయకులు కాకి నాని, బీకేఎయు జిల్లా ప్రధాన కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు మాట్లాడారు. -
రబీకి నీటి కష్టాలు తప్పవా?
● గోదావరి డెల్టాలో 8.99 లక్షల ఎకరాల్లో సాగు ● మొత్తం 93 టీఎంసీలు అవసరం కాగా.. 19 టీఎంసీల కొరత ఆకివీడు: ఈ ఏడాది వేసవిలో సాగు, తాగు నీటి అవసరాలకు కొరత తప్పేలా లేదు. ఇప్పటికే శివారు ప్రాంతాలకు సాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జనవరి నెలాఖరునాటికి నీటి సరఫరాలో కొరత ఉండే అవకాశం ఉందని జలవనరుల శాఖ చెబుతోంది. ఫిబ్రవరి మొదటి వారంలో వంతుల వారీగా నీటిని సరఫరా చేయాలని ప్రణాళికలు రూపొందించారు. గోదావరి డెల్టా ప్రాంతంలో ఈ రబీ సీజన్లో సుమారు 8.99 లక్షల ఎకరాల్లో వరి సాగు చేపడుతుండగా.. సాగు పూర్తయ్యేవరకూ 93 టీఎంసీల నీటి అవసరాల్ని జలవనరుల శాఖ గుర్తించింది. గోదావరి, సీలేరు నుంచి నీటిని సరఫరా చేసేందుకు నిర్ణయించారు. గోదావరి వెస్ట్రన్ డివిజన్లో 4.62 లక్షల ఎకరాలు, సెంట్రల్ డివిజన్లో 1.72 లక్షల ఎకరాలు, ఈస్ట్రన్ డివిజన్లో 2.65 లక్షల ఎకరాల్లో రబీ సాగు చేపట్టనున్నారు. వీటితో పాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోని గ్రామాల్లో మంచినీటి అవసరాలు, ఇతర అవసరాలకు నీటి వినియోగం ఉంటుంది. ప్రస్తుత రబీ సీజన్కు 19 టీఎంసీల నీటి కొరత ఉన్నట్లు జలవనరుల శాఖ నిర్ధారించింది. నీటి కొరతను అధిగమించేందుకు వంతుల వారీ విధానాన్ని ఫిబ్రవరి మొదటి వారం నుంచి అమలుజేయనున్నారు. మంచినీటికీ ఇక్కట్లు? రానున్న రోజుల్లో మంచినీటి సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఏర్పడింది. గోదావరి, పోలవరం, సీలేరు ప్రాంతాల్లో నీటి నిల్వలు అంతంత మాత్రంగానే ఉన్నట్లు అధికారులు స్పష్టంచేశారు. దీంతో సాగునీటికి, తాగునీటికి, చెరువులకు నీటి కష్టాలు తప్పేలా లేవు. పోలవరం ప్రాజెక్టుతో నీటి కష్టాలు తీరుతాయని భావించిన రైతులకు, ప్రజలకు ఆదిలోనే హంసపాదులా మారింది. ఈ ఏడాది ఖరీఫ్లోనే కొన్నిచోట్ల నీటి సమస్య తలెత్తింది. ఇప్పటికే గ్రామాల్లోని మంచినీటి చెరువుల్లో నీరు నిండుకుంటోంది. చేపలు, రొయ్యల చెరువులకు, ఇతర అవసరాలకు నీరు ఏవిధంగా అందుతుందోననే ఆందోళనలో ప్రజలు, రైతులు ఉన్నారు. -
అర్జీలు పునరావృతం కాకూడదు
ఏలూరు(మెట్రో): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో అర్జీలు పునరావృతం కాకుండా చూడాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. సోమవారం కలెక్టర్లో జేసీ ఎంజే అభిషేక్ గౌడ, డీఆర్వో వి.విశ్వేశ్వర రావు, ఆర్డీఓ ఎం.అచ్యుత అంబరీష్, కేఆర్సీసీ డిప్యూటీ కలెక్టర్ ఎల్.దేవకీదేవితో కలిసి పీజీఆర్ఎస్లో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పీజీఆర్ఎస్లో అర్జీలపై ప్రతి వారం సమీక్షిస్తామన్నారు. ఒకే ఫిర్యాదుపై అర్జీలు పునరావృతం అవుతున్నాయని, కాకుండా చూడాలన్నారు. మొత్తంగా 352 అర్జీలు స్వీకరించారు. అర్జీల్లో కొన్ని.. ● మండవల్లి మండలం నిచ్చుమిల్లికి చెందిన గొంతుకుపులి జయరాజు తమ గ్రామంలో 37 ఎకరాలు పంచాయతీ కరకట్టు పుంత ఆక్రమణకు గురైందని ఫిర్యాదు చేశారు. ● టి.నరసాపురం మండలం మధ్యాహ్నపువారిగూడేనికి చెందిన ఆళ్ల వెంకటరామారావు తాను పెద్ద పేగు క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్నారని, సదరం సర్టిఫికెట్ ఇప్పించాలని కోరారు. ● పోలవరం మండలం పైడాకులమామిడికి చెందిన కొవ్వాసు గంగాధరరావు చెక్ డ్యాములకు నిధులు మంజూరు చేయాలని వినితపత్రం అందించారు. ● నాచుగుంటకు చెందిన కాజ సత్యనారాయణ పంచాయతీని విభజన చేయాలని కోరారు. పుష్కరాలకు ప్రణాళికలుజిల్లాలో గోదావరి పుష్కరాల నిర్వహణకు ప్రణాళిక లు సిద్ధం చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించా రు. పుష్కరాల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించారు. పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో 29 స్నాన ఘట్టాలు ఏర్పాటు చేస్తామన్నారు. -
పోలీస్ శాఖకు పేరు తెచ్చేలా పనిచేయాలి
పెదవేగి: పోలీస్ కానిస్టేబుల్గా ఎంపిక కావడం అదృష్టమని, విధి నిర్వహణలో పోలీస్ శాఖకు పేరు తెచ్చేలా పనిచేయాలని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్కుమార్ అన్నారు. సోమ వారం పెదవేగి డీటీసీ ట్రైనింగ్ సెంటర్లో చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన 142 మంది ట్రైనింగ్ కానిస్టేబుళ్లు రిపోర్ట్ చేశారు. ముఖ్య అతిథిగా ఐజీ జీవీజీ అశోక్కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ఏ చిన్న పొరపాటు జరిగినా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. గోదావరిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు ప్రతిఒక్కరూ ఆయా విషయాలపై అవగాహనను కల్పించుకోవాలన్నారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ కొత్త చట్టాలు, సైబర్ క్రైమ్, ఐటీ కోర్లో ఉద్యోగ నిర్వహణపై అవగాహన పెంచుకోవాలన్నారు. డీటీసీ ప్రిన్సిపాల్, ఏఎస్పీ సూర్యచంద్రరావు మాట్లాడుతూ ప్రజలకు నేరుగా సేవ చేసే అవకాశం ఒక్క పోలీస్ శాఖకు మాత్రమే ఉందన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ షేక్ మస్తాన్, డీఎస్పీలు ఎం.వెంకటేశ్వరరావు, యు.రవిచంద్ర, డి.శ్రావణ్కుమార్, ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
ట్రిపుల్ఐటీ విద్యార్థులకు అవగాహన సదస్సు
నూజివీడు: ట్రిపుల్ ఐటీ మెటలర్జికల్ విద్యార్థులు ప్రదర్శిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, నేర్చుకోవాలనే ఆసక్తి అభినందనీయమని మురుగప్ప అసోసియేట్ ఉపాధ్యక్షుడు, టెక్నికల్ హెడ్ సూర్యనారాయణ అన్నారు. స్థానిక ట్రిపుల్ఐటీలో మురుగప్ప గ్రూపు ఆధ్వర్యంలో ఎంఎంఈ విద్యార్థులకు సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సూర్యనారాయణ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థులు పరిశ్రమల అంచనాలను ప్రారంభదశలోనే తెలుసుకోవడానికి సాయపడతాయన్నారు. మురుగప్ప గ్రూపు హెచ్ఆర్ అండ్ సేఫ్టీ హెడ్ అరుణాచలం మాట్లాడుతూ ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి పరిశ్రమలకు ఉపయోగపడేలా వారిలో నైపుణ్యాలను పెంపొందించడానికి తగిన శిక్షణ ఇస్తామన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్, ఎంఎంఈ, కెమికల్ ఇంజినీరింగ్ అధ్యాపకులు పాల్గొన్నారు. ఎంఎంఈ విద్యార్థులకు ఉత్తమ భవిష్యత్ కోసం నూతన మిశ్రమలోహాలు అనే అంశంపై వర్క్షాపు నిర్వహించారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్య కోటేశ్వరరావు విద్యార్థులకు అనేక అంశాలపై అవగాహన కల్పించారు. నరసాపురం రూరల్: పేరుపాలెం బీచ్లో పర్యాటకుల భద్రతను మెరుగుపరచడానికి డ్రోన్ల వినియోగం విప్లవాత్మక మార్పని, వీటి సహకారంతో సముద్ర తీరాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు వేగంగా సహాయం చేసేందుకు వీలు పడుతుందని ఎస్సై జి.వాసు అన్నారు. మొగల్తూరు మండలంలోని పేరుపాలెం సౌత్, కేపీ పాలెం సౌత్ గ్రామాలలో బీచ్లో పర్యాటకుల రక్షణ కోసం సమకూర్చిన డ్రోన్ను ప్రొఫెసర్ జయశంకర్ ఆధ్వర్యంలో సిబ్బంది సోమవారం పరిశీలించారు. ప్రొఫెసర్ జయశంకర్ మాట్లాడుతూ రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గమనిస్తూ, ప్రమాదకరమైన ప్రాంతాలకు పర్యాటకులు వెళ్లకుండా హెచ్చరించవచ్చన్నారు. దాతలు అందే కాశీ విశ్వేశ్వరరావు రూ.5 లక్షలు, పోలిశెట్టి శ్రీనివాస్ రూ.లక్ష రూపాయలు విరాళంగా అందించిన నిధులతో సమకూర్చిన డ్రోన్ను బీచ్లో ఎగరవేసి పరిశీలించారు. వీరవాసరం: కొమ్మిరెడ్డి క్రియేషనన్స్ బ్యానర్పై కొమ్మిరెడ్డి శ్రీనివాస్ నిర్మాతగా, రచయిత అడబాల లక్ష్మీనారాయణ దర్శకత్వం వహించిన చిన్ని చిన్ని మనసులు లఘు చిత్రం ప్రత్యేక అవార్డు గెలుచుకుంది. డిసెంబర్ 21న రాజమండ్రిలో జరిగిన అభినయ గోదావరి కళానికేతన్ అంతర్జాతీయ తెలుగు లఘు చిత్రాల పోటీలలో బెస్ట్ అఫ్ టెన్ ఫిల్మ్ అవార్డుతో పాటు, ఉత్తమ సంగీతం అవార్డును గెలుచుకుంది. ఈ అవార్డులను డైరెక్టర్, కో–డైరెక్టర్ అందుకున్నారు. షార్ట్ ఫిల్మ్ బృందాన్ని సర్పంచ్ గెడ్డం భారతి, వైస్ ఎంపీపీ అడ్డాల శ్రీరామచంద్రమూర్తి, కె.సర్వేశ్వరరావు, గెడ్డం భాస్కరరావు అభినందించారు. -
నేషనల్ గేమ్స్లో మధురశ్రీకి ద్వితీయ స్థానం
కొయ్యలగూడెం: నేషనల్ లెవల్ సెపక్ తక్రా పోటీల్లో తమ కళాశాల విద్యార్థిని ద్వితీయ స్థానం సాధించిందని వీఎస్ఎన్ కళాశాల ప్రిన్సిపాల్ స్వామి సోమవారం తెలిపారు. జూనియర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న పాక మధురశ్రీ జోధ్పూర్లో అండర్–17 విభాగంలో పోటీల్లో పాల్గొని విజయం సాధించిందన్నారు. మధురశ్రీని ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు అభినందించారు. బుట్టాయగూడెం: జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం సమీపంలో నాటుసారా స్థావరంపై ఎకై ్సజ్ అధికారులు సోమవారం దాడి చేశారు. నాటుసారా తయారీకి సిద్ధంగా ఉన్న 200 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్లు ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ కె.శ్రీనుబాబు తెలిపారు. ఇద్దరిపై కేసు నమోదు చేశామన్నారు. ద్వారకాతిరుమల: తమ ఇంటి ముంగిటకు వచ్చిన శ్రీవారికి భక్తులు సోమవారం పూజలు నిర్వహించి, నీరాజనాలు సమర్పించారు. చినవెంకన్న దివ్య క్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా నిర్వహించిన తిరువీధి సేవ భక్తులకు నేత్రపర్వమైంది. తొలుత ఆలయంలో స్వామి, అమ్మవార్లు, గోదాదేవి ఉత్సవ మూర్తులను తొళక్క వాహనంపై ఉంచి ప్రత్యేక పుష్పాలంకారాలు చేశారు. అనంతరం మేళతాళలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణలు, గజ, అశ్వ సేవల నడుమ తిరువీధి సేవను కన్నులపండువగా జరిపారు. ఆ తరువాత ఆలయ ప్రధాన కూడలిలోని ధనుర్మాస మండపంలో శ్రీవారికి, అమ్మవార్లకు అర్చకులు విశేష పూజలు నిర్వహించి, భక్తులకు తీర్ధప్రసాదాలను పంపిణీ చేశారు. తణుకు అర్బన్: శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో ఈ నెల 21న అమలాపురంలో నిర్వహించిన 160వ శతాధిక కవి సమ్మేళనంలో తణుకు పట్టణానికి చెందిన ప్రముఖ కవి వీఎస్వీ ప్రసాద్ ప్రతిభ చూపించారు. నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పేరుతో ఆయన రాసి చదివి వినిపించిన కవితకు కవితా హృదయాల నుంచి విశేష స్పందన లభించింది. కళావేదిక అంతర్జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కత్తిమండ ప్రతాప్, జాతీయ అధ్యక్షుడు జి.ఈశ్వరి భూషణం, డాక్టర్ కావూరి శ్రీనివాసశర్మ, బొంతు వీవీ సత్యనారాయణ తదితరులు కవి ప్రసాద్ను ఘనంగా సత్కరించారు. కై కలూరు: మద్యం మత్తులో స్నేహితుడిపై బీరు సీసాతో దాడి చేసిన ఘటన వరహాపట్నం మద్యం దుకాణం వద్ద సోమవారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం రాచపట్నంకు చెందిన పెనుమాల వాసు, వరహాపట్నానికి చెందిన తోట రాజేష్ స్నేహితులు. రాజేష్ వరహాపట్నం బ్రాందీ దుకాణం వద్ద మద్యం మత్తులో మరొకరితో గొడవ పడుతుండగా.. అటుగా వెళ్తున్న వాసు రాజేష్కు సర్ది చెప్పాడు. కోపంతో బీరు సీసాతో వాసు తలపై రాజేష్ కొట్టాడు. తీవ్ర గాయాలైన వాసును కై కలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి, అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం ఏలూరు తీసుకెళ్ళారు. పెదవేగి: కడుపు నొప్పి భరించలేక పురుగుల మందు తాగిన వ్యక్తి మృతిచెందాడు. ఎస్సై హరిగోపాల్ తెలిపిన వివరాల ప్రకారం.. పెదవేగి మండలం పెదకడిమి గ్రామానికి చెందిన కొలుసు ఉమామహేశ్వరరావు(30) కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఈ నెల 21న తీవ్ర కడుపునొప్పి రావడంతో పురుగుల మందు తాగాడని, చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. భార్య ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు. -
వైజ్ఞానిక ప్రదర్శనలతో సైన్స్పై ఆసక్తి
ఏలూరు(ఆర్ఆర్పేట): విద్యార్థులకు సైన్స్పై ఆసక్తిని పెంచి భావిభారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. సోమవారం స్థానిక సుబ్బమ్మదేవి నగరపాలక ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన జిల్లాస్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనను ఎమ్మెల్యే బడేటి చంటితో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, శాస్త్ర సాంకేతిక రంగాలపై ఉన్న అవగాహన ఎగ్జిబిట్లతో కనిపిస్తుందన్నారు. 7 విభాగాల్లో 141 ప్రాజెక్టులు, వ్యక్తిగత ప్రాజెక్టులు 42, టీచర్ ప్రాజెక్టులు 15, మొత్తం 324 మంది విద్యార్థులు, 198 మంది టీచర్లు హాజరయ్యారు. రాష్ట్రస్థాయికి ఎంపిక : పి.రేవతి, కె.విజయలక్ష్మి (ప్రగడవరం హైస్కూల్), కె.పవన్కుమార్, జె.సిరి (గార్లమడుగు జీహెచ్), కె.నవ్యశ్రీ, ఎ.అనుశ్రీ (కొత్తపల్లి హైస్కూల్), బి.గాయత్రి, ఎస్.శరణ్య (చాటపర్రు హైస్కూల్), కె.నాగదుర్గా శ్రీ (బుసరాజుపల్లి ఏపీటీడబ్ల్యూర్ ఎస్జీహెచ్ఎస్), బి.భానుశ్రీ, ఎం.భార్గవి (నూజివీడు హైస్కూల్), ఎస్. చందు, ఎం.మోహన పవన్కుమార్ (రావికంపాడు), ఎన్.హేమశ్రీ (శోభనాపురం హైస్కూల్), జి.లోకేష్ (కై కరం హైస్కూల్) రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అలాగే టీచర్ల విభాగంలో దెందులూరు హైస్కూల్కు చెందిన ఎండీ హసీనాబేగం, కోరుకొల్లు హైస్కూల్కు చెందిన పి.శ్రీలక్ష్మి ఎంపికయ్యారు. డీఈఓ వెంకటలక్ష్మమ్మ పాల్గొన్నారు. -
మన్యం బంద్ ప్రశాంతం
కుక్కునూరు: పోలవరం నియోజకవర్గంలోని మండలాల్ని పోలవరం జిల్లాలో కలపాలని కోరుతూ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. బంద్ సందర్బంగా మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంక్లు, వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. ఈ సందర్భంగా బంద్ను ఉద్దేశించి ఆదివాసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ, పోలవరం జిల్లాలో పోలవరం నియోజకవర్గంలో ఉన్న మండలాలు లేకపోవడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. బంద్లో సీపీఎం మండల కార్యదర్శి యర్నం సాయికిరణ్, ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూరం సంజీవరావు, మండల అధ్యక్షుడు వేణుగోపాల్, గిరిజన సంఘం మండల ఉపాధ్యక్షులు కాక ఆనంద్, నవదీప్, తదితరులు పాల్గొన్నారు. వేలేరుపాడు మండలంలో.. వేలేరుపాడు: రంపచోడవరం కేంద్రంగా ప్రకటించిన పోలవరం జిల్లాలో పోలవరం నియోజకవర్గ లేకపోవడంతో మండలంలో జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. మండల కేంద్రం నుంచి సాధన కమిటీ ఆధ్వర్యంలో గుల్లవాయీ సెంటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్లో సదస్సు జిల్లా సాధన కమిటీ సభ్యుడు మడివి దుర్గారావు అధ్యకతన జరిగింది. నాయకులు ధర్ముల రమేష్, ఊకె ముత్యాలరావు, సొడే సీతారామయ్య, కారం వెంకట్రావు, మడకం ఏసుబాబు, పొట్ల మోహన్, మిరియాల శ్రీను, కట్టి ఉదయ్లు మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వాసిత ప్రాంతం అంతా ఒక జిల్లాగా ప్రకటిస్తానని ఇచ్చిన హామీ విస్మరించి, పోలవరం జిల్లాని ప్రకటించటం నియోజకవర్గ ప్రజలను నిరాశ పరచడమేనని విమర్శించారు. నియోజకవర్గంలో నిర్వాసితుల సమస్యలు పరిష్కారం అవ్వాలన్నా, ఈ ప్రాంతం అభివృద్ధి అవ్వాలంటే పోలవరం నియోజకవర్గంని కలిపి పోలవరం జిల్లా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కరాటం ప్రకాష్, కుడియం రాజు, రాంబాబు, ప్రేమ కుమార్, కొత్త వెంకటేశ్వర్లు, మల్లేష్, నాగు రాముడు తదితరులు ఉన్నారు. పోలవరం మండలంలో.. పోలవరం రూరల్: పోలవరం నియోజకవర్గాన్ని పోలవరం జిల్లాలో కలపాలని సీపీఎం మండల కార్యదర్శి కారం భాస్కర్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఏజెన్సీ బంద్ కార్యక్రమంలో మండలంలో షాపులను మూయించి నిరసన వ్యక్తం చేశారు. ఏటిగట్టు సెంటర్లో నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు పోలవరం జిల్లా కేంద్రంగా పోలవరం జిల్లా ప్రకటిస్తానని మాటిచ్చి మాట తప్పారని, పోలవరం నియోజకవర్గం లేకుండా పోలవరం జిల్లా ఏర్పాటు చేయడం అన్యామన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా జిల్లాను ఏర్పాటు చేయడం తగదన్నారు. సీపీఎం నాయకులు బొరగం భూ చంద్రరావు, సముద్రాల సాయికృష్ణ, తామా బాలరాజు తదితరులు పాల్గొన్నారు. టి.నరసాపురం మండలంలో.. టి.నరసాపురం: మండలంలో ఉన్న 18 గిరిజన గ్రామాలు షెడ్యూల్ ఏరియాలో కలపాలని సీపీఎం జిల్లా నాయకులు గుడెల్లి వెంకట్రావు డిమాండ్ చేశారు. పోలవరం నియోజకవర్గంలో ఏజెన్సీ మండలాలను రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు చేసే పోలవరం జిల్లాలో కలపాలని ఏజెన్సీ మండలాల బంద్లో భాగంగా సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో టి.నరసాపురంలో బంద్కు మద్దతు తెలిపారు. మల్లప్పగూడెం గ్రామంలో ధర్నా నిర్వహించారు. సీపీఎం జిల్లా నాయకులు గుడెల్లి వెంకటరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పోలవరం జిల్లాలో పోలవరం లేదని ఇప్పుడైనా ఏజెన్సీ ప్రాంతం కలుపుతూ టి.నరసాపురం, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, గోపాలపురం మండలాల్లో ఉన్న 28 గిరిజన గ్రామాలను రంపచోడవరం పోలవరం జిల్లాలో కలపాలని గ్రామాలన్నింటికి గిరిజన భారత ప్రాంతంగా చేయాలని డిమాండ్ చేశారు. -
వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు
● చంద్రబాబు పాలనపై విసుగు చెందిన కూటమి నేతలు ● వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్న టీడీపీ, జనసేన నాయకులు కుక్కునూరు: చంద్రబాబు ప్రభుత్వ పాలనపై విసుగు చెందిన టీడీపీ, జనసేన శ్రేణులు ఆయా పార్టీలను వీడుతున్నారు. ప్రజాసంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా సాగుతున్న వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పార్టీలో చేరికలు భారీగా జరిగాయి. కుక్కునూరు మండలం గణపవరం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు టి.శేషుకుమార్, జి.మోహన్రావుకు వైఎస్సార్సీపీ పోలవరం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. అలాగే మాధవరం పంచాయతీలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాక తిరుపతిరావు, సున్నం బాబురావు, మల్లం సత్యం, సున్నం వీరభద్రం, తుర్సం రాఘవయ్య, సారంగి కృష్ణ వైఎస్సార్సీపీ మండల యువజన విభాగం అధ్యక్షుడు చేకూరి నవీన్వర్మ, గ్రామ కన్వీనర్ గంజిశ్రీను, కుండా అశోక్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీలో చేరారు. కామవరపుకోటలో.. కామవరపుకోట: కామవరపుకోటలోని కొండగూడెంలో తెలుగుదేశం పార్టీకి చెందిన 10 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరినట్టు మండల కన్వీనర్ రాయంకుల సత్యనారాయణ తెలిపారు. చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జి కంభం విజయరాజు వారికి కండువాలు వేసి వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు. యాదవుల కాలనీలో దొడ్డకుల చెన్నారావు, ములకాల అశోక్, ములకాల నాగార్జున, పాత కొండగూడెంలో మల్లెల్లి రాఖీ, గూట్ల నాని, బండి చిన్న, గుడిపూడి నంది రాజు, ఆడమిల్లి చక్రవర్తి, కూసుమీ బాలు వైఎస్సార్సీపీలో చేరారు. కొన్నేళ్లుగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నా ఎ లాంటి గుర్తింపు లేకపోగా, తమ ప్రాంతానికి ఎ లాంటి మంచి జరగలేదని వారు అన్నారు. కూటమి ప్రభుత్వ నాయకులతో ఇమడలేక వైఎస్సార్సీపీలో చేరామన్నారు. పాలకొల్లులో.. పాలకొల్లు సెంట్రల్: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూటమి పార్టీలకు చెందిన నేతలు వైఎస్సార్సీపీలో చేరుతున్నారంటే పాలన ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతుందని వైఎస్సార్సీపీ పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్జి గుడాల గోపి అన్నారు. పాలకొల్లులో జరిగిన కా ర్యక్రమంలో జనసేన, టీడీపీకి చెందిన పది మంది కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. వారికి గోపి పార్టీ కండువాలు వేసి సాదరంగా స్వాగతించారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారో అందరికీ గుర్తుందన్నారు. అబద్ధాలతో చంద్రబాబు మోసం చేసిన విషయం ప్రజలు ఇప్పడిప్పుడే గ్రహిస్తున్నారన్నారు. మజ్జి ప్రసాద్, తాడి సింహాచలం, తాడి శ్రీను తదితరులు వైఎస్సార్సీపీలో చేరారు. అలాగే జోగాడ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పార్టీ నాయకులు యడ్ల తాతాజీ, వీరా మల్లికార్జునుడు, శంకరాపు శ్రీను పాల్గొన్నారు. పాలకొల్లు సెంట్రల్: కండువా వేసి ఆహ్వానిస్తున్న నియోజకవర్గ ఇన్చార్జి గుడాల గోపి కుక్కునూరు: కండువా వేసి ఆహ్వానిస్తున్న మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు -
ఎన్హెచ్ 165 విస్తరణకు మోక్షమెప్పుడో..!
● ఏళ్ల తరబడి సాగుతున్న పనులు ● ఆకివీడు–దిగమర్రు మార్గంలో మొదలు కాని వైనం ● డీపీఆర్ మార్పుతో సరిపెట్టిన ప్రభుత్వం ఆకివీడు: జాతీయ రహదారి 165 విస్తరణ పనులకు మోక్షమెప్పుడో అని జిల్లావాసులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. 2019లో అప్పటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆకివీడులో పనులకు శంకుస్థాపన చేశారు. అయితే రహదారి విస్తరణపై కొందరు కోర్టుకు వెళ్లడంతో పనులు నిలిచాయి. ఆ తర్వాత డీపీఆర్ మార్చి ఆకివీడులోని ఉప్పుటేరు వద్ద నుంచి అయిభీమవరం మీదుగా ఆకివీడు, కలిసిపూడి, పెదపుల్లేరు, సీసలి, జక్కరం, పెదమిరం, చిన అమిరం, రాయలం, గునుపూడి, తాడేరు, విస్సా కోడేరు శివారు వంకాయలపాలెం, పెన్నాడు శివా రు పెన్నాడుపాలెం, శృంగవృక్షం, వీరవాసరం కలిసేలా కొత్త మార్గానికి అనుమతి ఇచ్చారు. నిర్మాణం కోసం గతంలో రూ.1,400 కోట్లు కేటాయించగా, ప్రస్తుతం అడ్డదారులు, అష్టవంకర్లుగా వెళుతున్న నాలుగు లైన్ల రోడ్డుకు రూ.3,200 కోట్లు కేటాయించారు. ఆకివీడు ప్రాంతంలో భూసేకరణ పనులు పూర్తయ్యాయి. అయితే ఉప్పుటేరు వద్ద నుంచి పనులు ప్రారంభించాల్సి ఉండగా ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదు. ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేలా.. జాతీయ రహదారిలో ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ప్ర త్యామ్నాయంగా బైపాస్ రోడ్డు నిర్మించాల్సి ఉంది. అయితే జాతీయస్థాయిలో డీపీఆర్ రెండోసారి మార్చడం విమర్శలకు తావిచ్చింది. కొందరికి లబ్ధి చేకూర్చేందుకు ఈ డీపీఆర్ రూపొందించారనే ఆరోపణలు ఉన్నాయి. జాతీయ రహదారి అంటే ప్ర యాణం సాఫీగా సాగాలని, అయితే ఈ డీపీఆర్ ప్ర కారం మార్గం అలా లేదనే విమర్శలు ఉన్నాయి. పాలకొల్లు–పామర్రు రోడ్డుగా ఉన్న సమయంలోనే నాలుగు లైన్లకు సరిపడా రోడ్డుకు స్థలం ఉంది. పట్టణాల మధ్యలో కిలోమీటరు మేర డబుల్ లైన్గా ఉంది. అయినా నాలుగైన్ల బైపాస్ కోసం రూ.3,200 కోట్లు కేటాయించడంలో ఆంతర్యమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎప్పటికీ పూర్తయ్యేనో.. జాతీయ రహదారి బైపాస్ రోడ్లుతో కలిపి నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం ఎప్పటికి పూర్తయ్యేనో అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వేల కోట్లు కేటాయించినా ఈ రోడ్డు నిర్మాణ పనుల ప్రారంభోత్సవం ఎండమావిగానే ఉందని, ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి పనులు వేగిరపర్చాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. ఉప్పుటేరుపై తుప్పుపట్టిన వంతెన నిర్మాణాలు ఆకివీడులో నిలిచిన పనులు -
‘పచ్చ’గా.. యథేచ్ఛగా ‘అశోక’ వనంలో పేకాట
సాక్షి ప్రతినిధి, ఏలూరు/నూజివీడు: తెలుగు తమ్ముళ్ళు పేకాట డాన్లుగా మారిపోయారు. పచ్చని మామిడి తోటల మధ్య రిక్రియేషన్ క్లబ్ ముసుగులో భారీ జూద శిబిరం నిర్వహణకు తెరతీశారు. స్థానికుల నిరసనలు, ఇతరత్ర అంశాలను లెక్కచేయకుండా లోకేశ్ బాబు టీమ్ అంటూ హడావుడి చేశారు. స్థానిక మంత్రి నుంచి లోకేశ్ వరకు అందరి అండదండలతోనే క్లబ్ నిర్వహిస్తున్నామంటూ జూదరుల వద్ద ప్రచారం చేశారు. పోలీసుల దాడులు, కేసులు ఉండవని చెప్పడంతోపాటు హైకోర్టు ఉత్తర్వులకు లోబడి పేకాట నిర్వహిస్తామంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి మరీ నిర్వహిస్తున్న క్లబ్పై ఆదివారం సాయంత్రం పోలీసులు మెరుపుదాడి చేశారు. కట్ చేస్తే.. 4 జిల్లాలకు చెందిన 281 మంది జూదరులు అరెస్టయ్యారు.130 కార్లు, 40 బైక్లను సీజ్ చేసిన పోలీసులు చివరికి రూ.32 లక్షలు నగదును మాత్రమే గుర్తించినట్టు ప్రకటించారు. ఆగిరిపల్లి మండలం పోతవరప్పాడులో 20 ఎకరాల మామిడి తోటలో మ్యాంగో బై కల్చరల్ అండ్ రిక్రియేషన్ సొసైటీ కిలారు అప్పారావు అధ్యక్షుడిగా ఏర్పాటైంది. 2011 నుంచి 2018 వరకు రిక్రియేషన్ ముసుగులో అడపాదడపా పేకాట శిబిరాలు నిర్వహించారు. 2019 ప్రారంభంలో రెండు మూడు సార్లు పోలీసులు దాడులు చేసి కేసులు నమోదు చేయడంతో క్లబ్ను మూసివేశారు. అనంతరం వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 2019లో రిట్ పిటిషన్ 18807/2019 నంబర్తో పేకాటకు అనుమతించాలని కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకువచ్చారు. ఉత్తర్వులను సాకుగా చూపి భారీ జూద శిబిరం ఏర్పాటుకు సన్నాహాలు చేశారు.అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం జూదశిబిరం ప్రారంభం కాకుండా ఉక్కుపాదం మోపింది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే క్లబ్ ప్రారంభించడానికి భారీ లాబీయింగ్కు తెర తీశారు. ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా ఉన్న కాట్రగడ్డ అశోక్ కుమార్ రింగ్ లీడర్గా మారి పేకాట క్లబ్ను ఈ ఏడాది అక్టోబర్ 28న ప్రారంభించడానికి సన్నాహాలు చేశాడు. ఈ క్రమంలో ఆగిరిపల్లి యువకులు నిరసనలు, ఆందోళనలు చేయడంతో నిలిచిపోయింది. మళ్ళీ వారం రోజుల వ్యవధిలో నవంబర్ మొదటి వారంలో ప్రారంభించారు. ప్రారంభానికి ముందే నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి కొలుసు పార్థసారథి మొదలుకొని స్థానిక పోలీసుల వరకు అందరితో మాట్లాడేసి అందరినీ చక్కబెట్టామని చెప్పి పేకాట ప్రారంభించారు. జూదరులు క్లబ్కు రావడానికి వీలుగా క్లబ్ వద్ద హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం కల్చరల్ రిక్రియేషన్ సొసైటీ నడుస్తోందంటూ కోర్టు కేసుల నంబర్ల వివరాలు సహా క్లబ్ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.ఈ క్రమంలో కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలతోపాటు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా నుంచి జూదరులకు ప్రత్యేకంగా సమాచారమిచ్చి క్లబ్కు వచ్చేలా ఏర్పాటు చేసి దాదాపు 55 రోజులకుపైగా నిర్వహిస్తున్నారు. రూ.10 వేల నుంచి లక్ష వరకు వారాంతాల్లో వీటితో పాటు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు 26 టేబుళ్లు ఏర్పాటు చేశారు. నగదు స్వీకరించి కాయిన్స్ ఇవ్వడానికి వీలుగా ఏడు డిపాజిట్ కౌంటర్లను ఏర్పాటు చేసి రోజూ కోట్లలో పేకాట నిర్వహిస్తున్నారు. దీనికి గాను స్థానిక ఎస్ఐ నుంచి మంత్రి వరకు నెలవారీ ముడుపులు చెల్లిస్తున్నామని క్లబ్లో బహిరంగంగా చెబుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పక్కా సమాచారంతో పోలీసులు మెరుపుదాడి చేసి సొసైటీ అధ్యక్షుడు కిలారు అప్పారావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ కాట్రగడ్డ అశోక్కుమార్తోపాటు 281 మంది జూదరులను అరెస్టుచేశారు. లోకేశ్ సన్నిహితుడిగా ప్రచారంవిజయవాడ నగరానికి చెందిన కాట్రగడ్డ అశోక్కుమార్ టీడీపీలో క్రియాశీలక నాయకుడు. మంత్రి లోకేశ్ సొంత మనిషినంటూ ఆగిరిపల్లిలో విస్తృత ప్రచారం చేసుకున్నాడు. గతంలో యువగళం పాదయాత్రలో కూడా పాల్గొన్నాడు. అరెస్టు నేపథ్యంలో 15 రోజుల్లో మళ్ళీ క్లబ్ ప్రారంభిస్తానని, అందరికీ తన సంగతి తెలుసునంటూ పోలీసుల వద్ద మాట్లాడినట్టు సమాచారం. ఆదివారం రాత్రి మెరుపు దాడి నిర్వహించి రూ.32 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. జూదరుల పూర్తి వివరాలు అన్నీ క్లబ్లోనే పూర్తి చేసి సోమవారం రాత్రి కోర్టుకు హాజరుపరిచారు.జూదరుల తరఫున ఆందోళనజూదరులపై సెక్షన్ 3 అండ్ 4 గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ కేవీవీఎన్వీ ప్రసాద్ తెలిపారు. అక్కడ ఉన్న సామగ్రిని స్వాధీనం చేసుకుని కోర్టు ముందు ప్రవేశపెడతామని పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ మ్యాంగో బే క్లబ్ వద్దకు వచ్చి ఐదు బస్సుల్లో జూదరులను నూజివీడు కోర్టుకు తరలించారు. కాగా, అంతకముందు 24 గంటలు గడిచినా మ్యాంగో బే క్లబ్లో పేకాట ఆడుతూ పట్టుబడిన వారిని కోర్టులో హాజరు పరచకపోవడంపై జూదరుల తరఫున కొందరు రోడ్డుపై ఆందోళనకు దిగారు. -
మంత్రి పార్థసారథి ఇలాకాలో జోరుగా పేకాట
ఏలూరు జిల్లా: మంత్రి పార్థసారథి ఇలాకాలో జోరుగా పేకాట జరుగుతుంది. ఆగిరిపల్లి మండలంలోని పోతవరప్పాడు శివారులో ఉన్న మ్యాంగో రిక్రియేషన్ క్లబ్లో యథేచ్ఛగా జూదం నిర్వహిస్తున్నారనే సమాచారంతో ఆదివారం డీఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు చేశారు. కృష్ణ, గుంటూరు జిల్లాల నుంచే కాకుండా తెలంగాణ నుంచి సైతం ఇక్కడకు పేకాట రాయుళ్లు భారీగా తరలి వచ్చారు.రిక్రియేషన్ క్లబ్లో 13 ముక్కల పేకాట జోరుగా సాగుతోందని నిఘా వర్గాల ద్వారా సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. దాడుల సమయంలో 120 మందికి పైగా పేకాట ఆడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. క్లబ్ ప్రాంగణం మొత్తం పేకాటగాళ్లతో నిండిపోయినట్లు తెలుస్తోంది.దాడుల్లో భాగంగా పోలీసులు రూ.18 లక్షల నగదు, 120 కార్లు, 50 బైకులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పేకాటలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది అధికార పార్టీకి చెందిన వారేనని సమాచారం. ఈ నేపథ్యంలో పోలీసులు కఠిన చర్యలు తీసుకోకుండా, వారి వివరాలు నమోదు చేసుకుని పంపించేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.అలాగే, పేకాట ఆడేందుకు తెలంగాణ నుంచి కూడా పలువురు వచ్చారని పోలీసులు గుర్తించారు. రిక్రియేషన్ క్లబ్ పేరుతో అక్రమంగా పేకాట నిర్వహిస్తున్నారన్న ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు బ్రేకింగ్మంత్రి పార్థసారథి ఇలాకాలో జోరుగా పేకాట ఆగిరిపల్లి మండలం సింహాద్రి అప్పారావు పేట మ్యాంగో బే రిక్రియేషన్ క్లబ్ పై పోలీసుల మెరుపు దాడులు120 మందికి పైగా పేకాట ఆడుతున్నట్లు గుర్తింపు ఎక్కువ మంది అధికార పార్టీకి చెందినవారే కావడంతో వివరాలు నమోదు చేసుకుని పంపించేస్తున్న… pic.twitter.com/PZHROKgZhB— Telugu Feed (@Telugufeedsite) December 21, 2025 -
లోక కల్యాణం కోసమే..
మనం స్వార్థ రహితంగా చేసే త్యాగం యజ్ఞం. యజ్ఞాల్లో సమ్రతం అనేది ప్రతి చోట వ్యక్తిగతంగా నిర్వహించేంది. శ్రోతం అంటే కేవలం లోక కల్యాణం నిమిత్తం మాత్రమే నిర్వహించేంది. లండన్లో స్థిరపడినా భారత్ దేశం సుభిక్షంగా ఉండాలనే లక్ష్యంతో ఈ యజ్ఙం నిర్వహిస్తున్నాం. దీనికి గ్రామస్తులు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారు. – అక్కినప్రగడ శ్రీరాఘవేంద్రసాయి శర్మ, వైదిక జ్యోతిష్య పరిశోధకుడు, లండన్ యజ్ఞాలు చేయడం వెనుక సైంటిఫిక్ కారణాలు ఉన్నాయి. యజ్ఞం చేసేటప్పుడు అగ్ని హోమాల్లో నెయ్యి, పాలు వేయడం వల్ల వచ్చే పొగ గాలిలో కలుస్తోంది. అగ్నిహోత్రం నుంచి వెలువడే ఔషధీయుక్త వాయువు అది. మనలోని అనారోగ్య సమస్యలను తొలగిస్త్తుంది. ప్రకృతి సమతుల్యతను కాపాడేందుకు దోహదం చేస్తుంది. – పూడిపెద్ది నరసింహ శర్మ, వేదపండితుడు, విశాఖపట్నం విదేశాల నుంచి వచ్చి వ్యక్తిగతంగా ఏమి ఆశించకుండా కేవలం లోక కల్యాణం కోసం నిర్వహిస్తున్న ఈ అతిరుద్ర యజ్ఞంకు అన్ని రకాల సహాయ సహకారాలు మా గ్రామ పెద్దలు, మహిళలు అందిస్తున్నాం. వచ్చే భక్తులకు ఉచిత భోజన వసతి ఏర్పాటు చేశాం. ఈ యజ్ఞంతో మా ప్రాంతంలో వివిధ కారణాల వల్ల ఏర్పడే గాలి కాలుష్యం నివారించి వాతావరణ సమతుల్యతలను కాపాడతాయని చెబుతున్నారు. – సరిపల్లె శంకరం, గ్రామస్తుడు, మందలపర్రు -
సీనియర్ నెట్బాల్ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక
భీమవరం: ఈనెల 27 నుంచి 29వ తేదీ వరకు తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం వెదిరేశ్వరం జిల్లా పరిషత్ హైస్కూల్లో జరగనున్న 10వ రాష్ట్రస్థాయి సీనియర్ నెట్ బాల్ పోటీలకు పురుషుల, మహిళల జట్ల ఎంపిక భీమవరం బ్రౌనింగ్ జూనియర్ కళాశాలలో నిర్వహించినట్లు నెట్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి విజయలక్ష్మి తెలిపారు. ఎంపిక పోటీలను బ్రౌనింగ్ కళాశాల సెక్రెటరీ మేడిది ఎస్తేరు ప్రియాంక ప్రారంభించారు. ఎంపికై న క్రీడాకారులను బ్రౌనింగ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ప్రెసిడెంట్ శ్రీ మేడిది జాన్సన్, సెక్రటరీ ఎస్తేర్ ప్రియాంక , వైస్ ప్రెసిడెంట్ అబ్రహం, ప్రిన్సిపాల్ కే నవీన్ కుమార్ అభినందించారు. కార్యక్రమంలో నెట్ బాల్ కోచ్ అసోసియేషన్ సభ్యుడు పి దావూద్ ఖాన్, వి.వినీత్ జోసఫ్ కుమార్ పాల్గొన్నారు. ఎంపికై న పురుషుల జట్టు జీఎన్వీఎస్ విజయ్ కుమార్ (కెప్టెన్), పి శ్రీనివాసు (వైస్ కెప్టెన్) ఏ.వెంకటేష్, ఎస్.దానియలు, బి.లీల మురళీకృష్ణ, కె.మణికంఠ, పీ మిన్ను, డి.ఫణీంద్ర కుమార్, ఎం.ఎర్నెస్ట్, టి దుర్గాప్రసాద్, జి.త్రినాథ్ ఎన్.విలియం. స్టాండ్ బైస్ : కె బాల సాయి రామకృష్ణ, కే.భాస్కర్రావు, కె.దుర్గాగణేష్ , కేఎస్వీ మణికంఠ, కే.హనోక్ ఎంపికై న మహిళల జట్టు జి.వరలక్ష్మి (కెప్టెన్), డి.నాగ నవ్య (వైస్ కెప్టెన్), కె.అక్షయ, కె.మానస, కే.శ్రీదేవి, ఎం.ఎస్తేరు, ఎన్.గంగాభవాని, టి.ఉమాభవాని, డి.జ్యోత్స్న నాగ సాయి, కె.రాము, కే.మౌనిక, పి.జ్యోతి స్టాండ్ బైస్: కే.భారతి, ఎన్.వర్షిత నాగ భద్ర, జి.లిఖిత, ఎం.బేబీ రాణి, ఎన్.వెంకట రేష్మ. -
మహానేత వైఎస్సార్ను మరువలేం
ముదినేపల్లి రూరల్: మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డిని రాష్ట్ర ప్రజలు ఎన్నటికి మరువలేరని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) అన్నారు. మండలంలోని పెనుమల్లి శివారు సింగారంలో పార్టీ స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వైఎస్ నూతన విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. అలాంటి మహానేత భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో మాత్రం సజీవంగా నిలిచిపోయారన్నారు. అనంతరం పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి జన్మదిన కేక్ను కట్ చేసి అభిమానులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ, మండల శాఖ అధ్యక్షుడు బోయిన రామరాజు, పార్టీ ముదిరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కోమటి విష్ణువర్ధన్, జిల్లా అధికార ప్రతినిధి మోట్రు ఏసుబాబు, పుట్టి సుబ్బారావు, బేతపూడి వెంకటరమణ, వెంకటేశ్వరరావు,పృద్వీ, కొండా, నాగు, తదితరులు పాల్గొన్నారు. -
రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
తాడేపల్లిగూడెం అర్బన్ : రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. జీఆర్పీ ఎస్సై పి అప్పారావు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం ఉదయం నిడదవోలు – నవాబుపాలెం మధ్య మారంపల్లి సమీపంలో రైల్వే ట్రాక్ పక్కన గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. మృతుడి వయసు సుమారు 30 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండవచ్చని, మృతుడు గ్రీన్ కలర్ టీషర్టు, నాచురంగు ఫ్యాంటు ధరించి ఉన్నాడన్నారు. వివరాలు తెలిసినవారు 9490617090, 8019157528 నంబర్లలో సంప్రదించాలన్నారు. మృతదేహాన్ని తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు భద్రపరిచినట్లు ఎస్సై అప్పారావు తెలియజేశారు. -
జనాభిమానం ఉప్పొంగే
సాక్షి ప్రతినిధి, ఏలూరు: జనాభిమానం ఉప్పొంగింది. జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా సంబరంలా నిర్వహించారు. 7 నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో వైఎస్సార్సీపీ సమన్వయకర్తల నేతృత్వంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రక్తదాన శిబిరాలు, అన్నదానాలు, రోగులకు పండ్ల పంపిణీ ఇలా అనేక సేవా కార్యక్రమాలతో జననేతపై అభిమానం పంచుకున్నారు. కై కలూరు నియోజకవర్గంలోని ముదినేపల్లి మండలం సింగారం గ్రామంలో దివంగత వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఏలూరులో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొని రక్తదానం చేశారు. కై కలూరు నియోజకవర్గంలో.. కై కలూరు నియోజవకర్గంలో ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు, నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముదినేపల్లి మండలం సింగారంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. నాలుగు మండలాల్లోని వివిధ గ్రామాల్లో వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కై కలూరు పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో భారీగా నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ నేతలు విష్ణువర్ధన్ రాజు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. నూజివీడు నియోజకవర్గంలో.. నూజివీడు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. దీనిలో భాగంగా చినగాంధీ బొమ్మ సెంటర్లో కేక్ కట్ చేశారు. అనంతరం ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ అందచేశారు. నూజివీడు, ఆగిరిపల్లి, చాట్రాయి, ముసునూరు మండలాల్లో గ్రామ గ్రామాన వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ కొమ్ము వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలో.. ఉంగుటూరు నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్చార్జి పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. బువ్వనపల్లి పార్టీ కార్యాలయం, పెదనిండ్రకొలను ఆరోగ్య కేంద్రం, తోకలపల్లి, మళ్లపరాజు పేట, మొయ్యేరు, రాచూరు, నల్లమాడు, గొల్లగూడెం గ్రామాల్లో జన్మదిన వేడుకల్లో వాసుబాబు పాల్గొని కేక్ కట్ చేశారు. రోగులకు పండ్లు, రొట్టెలు, దుప్పట్లు పంపిణీ చేశారు. నిడమర్రు మండలం పత్తేపురంలో పార్టీ బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నౌడు వెంకటరమణ నేతృత్వంలో కేక్ కట్ చేసి పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. దెందులూరు నియోజకవర్గంలో.. దెందులూరు నియోజకవర్గంలో ఇన్చార్జి కొఠారు అబ్బయ్యచౌదరి ఆధ్వర్యంలో మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. దెందులూరు మండలం దోసపాడులో పార్లమెంట్ ఇన్చార్జి కారుమూరి సునీల్ కుమార్ పాల్గొని కేక్ కట్ చేశారు. విజయరాయిలో అబ్బయ్యచౌదరి పాల్గొని కేక్ కట్ చేశారు. జెడ్పీటీసీ లీలా నవకాంత్, జెడ్పీ వైస్ చైర్మన్ పి.విజయ్బాబు, పార్టీ జెడ్పీటీసీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. పోలవరం నియోజకవర్గంలో.. పోలవరం నియోజకవర్గంలో ఇన్చార్జి తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడకలు ఘనంగా నిర్వహించారు. బుట్టాయగూడెంలో జరిగిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. కుక్కునూరులో జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. పోలవరంలో వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. నాయకులు ఆరేటి సత్యనారాయణ, సయ్యద్ బాబ్జి, జగ్గురోతి మోహనరావు తదిరులు పాల్గొన్నారు. చింతలపూడి నియోజకవర్గంలో.. చింతలపూడి నియోజకవర్గంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా చింతలపూడిలో మెగా రక్తదాన శిబిరం, పేదలకు అన్నదానం, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్లు పంచిపెట్టారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, నియోజకవర్గ ఇన్చార్జి కంభం విజయరాజు కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు పాల్గొన్నారు. ఏలూరు నియోజకవర్గంలో పార్లమెంట్ ఇన్చార్జి, యువజన విభాగం జోన్–2 వర్కింగ్ ప్రెసిడెంట్ కారుమూరి సునీల్కుమార్, నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. రక్తదానం, అన్నదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. సత్రంపాడు అంబేద్కర్ నగర్లో రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్ బాబు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ నిర్వహించారు. ద్వారకాతిరుమల మండలంలోని జాజులకుంట, తూర్ల లక్ష్మీపురం, ఐఎస్ రాఘవాపురం, రామానుజాపురం, ఐఎస్ జగన్నాథపురంలో జరిగిన వేడుకల్లో మాజీ మంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. జాజులకుంటలో పార్టీ నాయకుడు ముమ్మడి సత్యనారాయణ (సింగ్), సుశీల దంపతుల సౌజన్యంతో 12 పేద కుటుంబాలకు రూ.5 వేల చొప్పున రూ.60 వేలు ఆర్థిక సాయం, పండ్లు వనిత అందించారు. జననేతకు జేజేలు అట్టహాసంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు జిల్లావ్యాప్తంగా రక్తదాన శిబిరాలు ప్రతి నియోజకవర్గంలో అన్నదానం, సేవా కార్యక్రమాలు ముదినేపల్లి మండలంలో వైఎస్సార్ విగ్రహావిష్కరణ -
అటవీ భూమి ఆక్రమణకు సన్నాహాలు
నూజివీడు: నూజివీడు మండలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణ అడ్డూ అదుపూ లేకుండా ఉంది. ప్రభుత్వ భూముల ఆక్రమణ అడ్డుకోవాల్సిన అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు తీవ్ర విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని జంగంగూడెంలో గత 40 ఏళ్లుగా ఎస్సీలు తమ గ్రామ అవసరాలకు ఉపయోగించుకుంటున్న అటవీ భూమిని అధికార పార్టీ నాయకుల అండతో గత ఆరు రోజులుగా కొందరు ఆక్రమించేందుకు అందులోని కంప, తుప్పలను జేసీబీ, ట్రాక్టర్తో తొలగిస్తున్నారు. ఆక్రమణలపై గ్రామస్తులు రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులకు తెలియజేసినా పట్టించుకోకపోవడంతో ఎస్సీలందరూ ఆదివారం ఆక్రమణలు జరుగుతున్న భూమి వద్దకు వెళ్లారు. ఆక్రమణదారులకు, అడ్డుకోవడానికి వెళ్లిన వారికి వాగ్వివాదం చోటుచేసుకుని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపధ్యంలో అటవీశాఖ సిబ్బంది అక్కడకు వచ్చి ఇరువర్గాలను పంపించి వేశారు. దీనిపై ఎఫ్ఆర్ఓ సత్యనారాయణ మాట్లాడుతూ ఆక్రమించుకోవడానికి సన్నాహాలు చేస్తున్న భూమి అటవీ భూమేనని, గత నలభై ఏళ్లుగా గ్రామానికి చెందిన ఎస్సీల అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నారన్నారు. ఆక్రమణకు పాల్పడుతున్న వారిపై పోలీస్ కేసు పెట్టనున్నట్లు తెలిపారు. -
నేత్రపర్వం.. గ్రామోత్సవం
ద్వారకాతిరుమల : ఉభయ దేవేరులు, గోదాదేవితో శ్రీవారు తొళక్క వాహనంపై క్షేత్ర పురవీధుల్లో ఆదివారం ఊరేగారు. ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి నిర్వహించిన ఈ ఉత్సవం భక్తులకు నేత్రపర్వమైంది. ముందుగా ఆలయంలో శ్రీవారు, అమ్మవార్లు, గోదాదేవి ఉత్సవమూర్తులను తొళక్క వాహనంపై ఉంచి అర్చకులు విశేష పూజలు జరిపారు. ఆ తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణలు, గజ, అశ్వ సేవల నడుమ స్వామివారి గ్రామోత్సవం క్షేత్ర పురవీధుల్లో అట్టహాసంగా సాగింది. అనంతరం ఆలయ ప్రధాన కూడలిలోని ధనుర్మాస మండపంలో స్వామి, అమ్మవార్లకు అర్చకులు విశేష పూజలు నిర్వహించి, భక్తులకు తీర్ధప్రసాదాలు పంపిణీ చేశారు. నూజివీడు: ట్రిపుల్ ఐటీలో లిటరరీ క్లబ్ ఆధ్వర్యంలో భక్తి వేదాంత సహకారంతో ఆదివారం ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్పై సెమినార్ నిర్వహించారు. ఐఐటీ గౌహతీ డైరెక్టర్ ఆచార్య ఉప్పులూరి రామ్గోపాల్, తిరుపతి ఐఐటీకి చెందిన జయనారాయణ పాల్గొని పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఏఐ వినియోగం, ఉపయోగం వంటి అంశాలపై చర్చించారు. లిటరరీ క్లబ్ ద్వారా విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. వ్యాసరచన పోటీల్లో ప్రథమ బహుమతి పొందిన అఖిలేశ్వరికి రూ.5 వేలు, రెండో బహుమతి పొందిన షేక్ హాసియాకు రూ.3 వేలు, మూడో బహుమతి పొందిన హర్షవర్ధన్కు రూ.2 వేలను ఐఐటీ డైరెక్టర్ రామ్గోపాల్ చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో నూజివీడు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్, అసోసియేట్ డీన్ అకడమిక్స్ దుర్గాబాబు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (టూటౌన్): చిన్నారులు పోలియో వ్యాధి బారిన పడకుండా వాక్సిన్ వేయించాల్సిన బాధ్యత ప్ర టట తల్లితండ్రులపై ఉందని కలెక్టర్ కె.వెట్రిసెల్వి చెప్పారు. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా జేవియర్ నగర్లోని ఫిరంగులదిబ్బలో ఆదివారం పల్స్ పోలియో కేంద్రంలో చిన్నారులకు పోలియో వ్యాక్సిన్ వేశారు. కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఈనెల 21 నుంచి 23 వరకు జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తారని, 5 సంవత్సరాల లోపు వయసు కలిగిన ప్రతి చిన్నారికి వ్యాక్సిన్ వేస్తారన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డా.అమృతం తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లా కేంద్రం ఏలూరులో జరుగుతున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు ఆదివారం 10 మంది అభ్యర్థులు హాజరయ్యారు. నగరంలోని సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ జరిగిన పరీక్షకు 11 మందికి 10 మంది హాజరుకాగా ఒకరు గైర్హాజరయ్యారు. ఈ పరీక్షలను ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పర్యవేక్షించారు. ఏలూరు (టూటౌన్): కొత్తగా తీసుకొచ్చిన జీ రాం జీ బిల్లు వల్ల పేదలకు ఎలాంటి ఉపయోగం లేదని, గ్రామీణ ఉపాధి హమీ చట్టాన్ని కొనసాగించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి.బలరాం డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిల్లి రామకృష్ణ అధ్యక్షతన ఆదివారం ఏలూరులో జరిగిన పార్టీ జిల్లా సెక్రటేరియట్ సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో పని గ్యారంటీ ఉండేదని, ఇప్పుడు కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఉండేలా చేశారని తెలిపారు. పథకంలో నిధులు గతంలో కేంద్రానికి 90 శాతం రాష్ట్రానికి 10 శాతం వాటా ఉండేదని, ప్రస్తుతం 60, 40గా మార్చారని తెలిపారు. ఆకలిచావులు, వలసలు నివారించేందుకు ఉపయోగపడిన ఈ చట్టాన్ని రద్దు చేయడం వల్ల మరలా ఆకలిచావులు పెరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. -
జగన్ ఫ్లెక్సీపై పోలీసుల హుకుం
ద్వారకాతిరుమల: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని తిమ్మాపురంలో బ్రహ్మంగారి ఆలయం వద్ద వైఎస్సార్ సీపీ నాయకులు భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీని తొలగించాలని పోలీసులు సదరు నేతలను హెచ్చరించారు. టీడీపీ నాయకులు ఓర్వలేక పోలీసులను తమపైకి ఉసిగొలుపుతున్నారని వైఎస్సార్ సీపీ నేతలు ధ్వజమెత్తారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ ప్రతాపనేని వాసు, పార్టీ తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షుడు బొండాడ వెంకన్నబాబు ఘటనా స్థలానికి చేరుకుని ఎస్సై టి.సుధీర్తో ఫోన్లో మాట్లాడారు. రాత్రి 10 గంటల తరువాత ఫ్లెక్సీని తొలగిస్తామని చెప్పారు. రామసింగవరంలో పలువురిపై కేసు నమోదు స్థానిక అంబేడ్కర్ విగ్రహ కూడలిలో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు రాయడంతోపాటు అవి నిజం చేస్తామని బెదిరించారని టీడీపీ కార్యకర్త దొప్పసాని బాబురావు ద్వారకాతిరుమల పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దాంతో ఆరుగురితో పాటు, ఫ్లెక్సీని తయారు చేసిన వ్యక్తిపై కూడా కేసు నమోదు చేశారు. -
లోక కల్యాణార్థం.. అతిరుద్ర మహాయజ్ఞం
నిడమర్రు: మందలపర్రు శ్రీ ఉమా నీలకంఠేశ్వరస్వామి పంచాయితన క్షేత్రం నేటి నుంచి సుగంధ ద్రవ్య సువాసనలతో.. వేద మంత్రోచ్ఛారణతో మార్మోగనుంది. లోక కల్యాణార్థం హైదరాబాదుకు చెందిన ప్రవాస భారతీయుడు, వైదిక జ్యోతిష్య పరిశోధకుడు అక్కినప్రగడ శ్రీరాఘవేంద్రసాయి (ఇంగ్లాండ్) యజ్ఞ కర్తగా అతిరుద్ర మహాయజ్ఞం సోమవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు మందలపర్రు గ్రామ పెద్దలు తెలిపారు. అమెరికాలో స్థిరపడి, హిందూ ధార్మిక ప్రచారకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ వెంకట చాగంటి ఆశీస్సులతో ఈ యజ్ఞ, హోమాలు ఈనెల 28వ తేదీ వరకూ ప్రతి రోజూ 10 గంటల పాటు నిర్వహించనున్నారు. దీని కోసం పంచాయితన క్షేత్రం ప్రాంగణంలో ప్రత్యేక యాగ శాల నిర్మాణం చేశారు. తొలిరోజు సోమవారం 66 మంది వేదపండితులు ముందస్తు యజ్ఞ పూజలు నిర్వహించి యాగశాల ప్రవేశం ఉంటుందన్నారు. అనంతరం గణపతి పూజ, శుద్ధి పుణ్య హవచనం, ఋత్విక్ వర్ణం, చతుర్వేద పారాయణం, యాగశాల ప్రదక్షణ, గో, ఆశ్వం, మేషం పూజలు నిర్వహిస్తామన్నారు. సూర్యోదయం మొదలుకొని.. సూర్యాస్తమయం వరకూ ప్రతి రోజు 10 గంటల పాటు ఈ యజ్ఞ క్రతువులు జరుగనున్నాయి. ఇంగ్లాండ్లో స్థిరపడినా స్వదేశమైన నా భారత దేశం సుభిక్షం ఆశించి మాత్రమే మందలపర్రు గ్రామస్తుల సహకారంతో ఈ అతిరుద్ర మహా యజ్ఞం సంకల్పించినట్లు యజ్ఞ కర్త రాఘవేంద్రశర్మ తెలిపారు. 108 రకాల సుంగధ ద్రవ్యాలతో.. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన 108 రకాల సుంగధ ద్రవ్యాలు, వివిధ చెట్ల వేర్లు, మూలికలు ఆవు నెయ్యితో 250 కిలోల చూర్ణం గుళికలుగా చేసి ఈ యజ్ఞ పూజల్లో వినియోగించనున్నారు. ప్రత్యేకంగా తెప్పించిన 750 కిలోల స్వచ్ఛమైన ఆవు నెయ్యి, 350 కిలోల రావి సమిదలు (పుల్లలు) ఈ 7 రోజుల పాటు ఈ హోమంలో వేయనున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 6 మంది ఋత్విజులు ఈ పూజల్లో పాల్గొననున్నారు. హోమ వాయువు గాల్లో కలిసేలా.. అతిరుద్ర మహాయజ్ఞం పూజల కోసం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకమైన యాగశాలను నిర్మించారు. ఈ హోమం నుంచి వచ్చే వాయువు గాల్లో కలసేలా యాగశాల నిర్మించారు. దీంతోపాటు ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా ఏర్పాట్లు చేశారు. ఈ యాగశాల ప్రవేశ ద్వారాలుగా నాలుగు వేదాల పేర్లను నామకరణం చేశారు. ఈ యాగశాల లోపల వివిధ రకాలుగా 9 హోమకుండీలు నిర్మించి 66 మంది వేదపండితులు హోమాల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. ముగింపు రోజున అన్ని కుండీల్లో ఏకకాలంలో పూర్ణాహుతి ఉంటుందని, ఆ వాయువుతో మనం పీల్చేగాలిలో కలసి స్వచ్ఛత ఏర్పడుతుందని యజ్ఞ కర్త రాఘవేంద్రశర్మ తెలిపారు. మందలపర్రు పంచాయితన క్షేత్రంలో నేటి నుంచి యజ్ఞ హోమాలు ఈనెల 28 వరకూ ప్రతి రోజూ 10 గంటల పాటు నిర్వహణ వచ్చే భక్తులకు అన్న సమారాధన ఏర్పాట్లు -
వ్యాన్ బోల్తా.. ఇద్దరు మృతి
కలిదిండి (కై కలూరు): పొట్టకూటి కోసం చేపల పట్టుబడికి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి చెందగా నలుగురు గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం కలిదిండి మండలం సున్నంపూడి గ్రామం నుంచి ఇదే మండలం కోరుకొల్లు సమీప చైతన్యపురంలో చేపల పట్టుబడి నిమిత్తం 6 గురు కూలీలు ఆదివారం ఉదయం వెళ్లారు. మధ్యాహ్నం పట్టుబడి అయిన తర్వాత తిరిగి వస్తుండగా మద్వానిగూడెం వద్ద ఎదురుగా వాహనాన్ని తప్పించే క్రమంలో వ్యాన్ బోల్తా పడింది. ఇందులో క్యాబిన్లో ముగ్గురు, టాప్పై ముగ్గురు ఉన్నారు. వీరిలో పైన కూర్చున్న సున్నంపూడికి చెందిన తిరుమలశెట్టి ఆంజనేయులు (50) అక్కడికక్కడే మృతి చెందాడు. వలసకూలీగా వచ్చిన భీమవరం మండలం కొత్తపూసలమర్రుకు చెందిన కొత్త వెంకటేశ్వరరావు (53) కలిదిండి ఆస్పత్రికి చికిత్స చేయించడానికి తీసుకొస్తుండగా మరణించాడు. అదే విధంగా మృతుడు ఆంజనేయులు కుమారుడు వెంకటకృష్ణకు సైతం తీవ్ర గాయాలయ్యాయి. ఇతన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మిగిలిన వారికి స్పల్పగాయాలయ్యాయి. కలిదిండి ఎస్సై వి.వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కై కలూరు తరలించారు. తండ్రి మరణం, కుమారుడికి తీవ్ర గాయాలతో సున్నంపూడిలో విషాదచాయలు అలుముకున్నాయి. డీఎన్నార్ పరామర్శ ప్రమాద ఘటన తెలుసుకుని వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) హుటాహుటీన కలిదిండి పీహెచ్సీకి వెళ్ళారు. మృతల కుటుంబ సభ్యులను పరామర్శించారు. మరణించిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. -
తమ్మిలేరు నుంచి రబీకి నీటి విడుదల
చింతలపూడి: మధ్యతరహా ప్రాజెక్టు అయిన తమ్మిలేరు నుంచి నియోజకవర్గంలోని ప్రాజెక్టు కింద రబీ పంటకు 9,169 ఎకరాలకు సాగు నీరు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఈనెల 16న జరిగిన జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశంలో అధికారులు తీర్మానించారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 345.81 అడుగుల నీటి నిల్వలు ఉన్నాయి. జలాశయం పూర్తి సామర్థ్యం 355 అడుగులు. ఈ ఏడాది కురిసిన అధిక వర్షాలకు జలాశయంలో పూర్తి స్థాయిలో నీరు చేరింది. ప్రాజెక్టు కింద 9,169 ఎకరాలు అధికారికంగా సాగు చేస్తున్నారు. ఆయకట్టు రైతులు వరికి బదులు ఆరు తడి పంటలు వేసుకుంటే ఇచ్చే నీరు సరిపోతుందని ఇరిగేషన్ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. పూర్తిస్థాయిలో నిండిన ప్రాజెక్టు ఈ ఏడాది కురిసిన వర్షాలకు జలాశయంలోకి పూర్తి స్థాయిలో నీరు చేరింది. రాష్ట్ర విభజనతో గత 8 సంవత్సరాలుగా జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నీటిపై రెండు జిల్లాల రైతులు ఆశలు వదులుకున్నారు. గత ఏడాది, ఈ ఏడాది కూడా ఊహించని విధంగా అధిక వర్షపాతం నమోదు అవ్వడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. తమ్మిలేరు ప్రాజెక్టు నిర్మించి 40 ఏళ్లు దాటి పోయింది. రిజర్వాయరు ఎగువ భాగంలో 20 వేల ఎకరాలు, దిగువ భాగంలో ఏలూరు వెళ్లే కాల్వకు ఇరుపక్కలా 15 ఏటి కాలువల ద్వారా 14,200 ఎకరాలు సాగవుతున్నాయి. జిల్లాలోని తలార్లపల్లి, యర్రంపల్లి, యడవల్లి, కళ్యాణంపాడు, తువ్వచెలక రాయుడుపాలెం, గ్రామాలకు చెందిన 475 ఎకరాల పల్లం భూములకు, 3,769 ఎకరాల మెరక భూములకు నీటి సరఫరా జరుగుతుంది. అదే విధంగా జిల్లాల పునర్విభజనతో ఏలూరు జిల్లాలో చేరిన పోలవరం, చాట్రాయి, తుమ్మగూడెం, మంకొల్లు, సోమవరం గ్రామాల్లో 1,855 ఎకరాల పల్లం భూములకు, 3,070 ఎకరాల మెరక భూములకు సాగునీరు లభిస్తుంది. ప్రాజెక్టులో ఉన్న నీటి సామర్థ్యాన్ని దష్టిలో పెట్టుకుని రైతుల అభ్యర్థన మేరకు జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ ఎస్ఈల ఆదేశాల మేరకు జిల్లా ఇరిగేషన్ అడ్వయిజరీ బోర్డు మీటింగ్లో రబీలో సాగు నీరు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రబీకి ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల నుంచి నీరు విడుదల చేశాం. – లాజరుబాబు, ఏఈ, తమ్మిలేరు ప్రాజెక్టు ఇరిగేషన్ అడ్వయిజరీ బోర్డు మీటింగ్లో అఽధికారుల నిర్ణయం 9,169 ఎకరాలకు రబీ సాగు నీరు ఈ ఏడాది భారీ వర్షాలతో పూర్తిగా నిండిన ప్రాజెక్టు -
హనుమద్ హోమం
జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో ఆదివారం హనుమద్ హోమం నిర్వహించారు. అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ఈవో ఆర్వీ చందన మాట్లాడుతూ ప్రతి ఆదివారం ఆర్జీత సేవగా హనుమద్ హోమ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు పాల్గొనాలని కోరారు. బుట్టాయగూడెం: కోర్కెలు తీర్చే తల్లిగా, గిరిజన ఆరాధ్య దేవతగా పూజలందుకుంటున్న గుబ్బల మంగమ్మ తల్లి గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. చలికాలం, మంచు కురుస్తున్నప్పటికీ తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు మంగమ్మ తల్లి గుడికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. వివిధ జిల్లాల నుంచి ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, బస్సుల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. పెద్దింట్లమ్మకు పూజలు కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మ తల్లికి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమీప జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మను దర్శించుకున్నారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు పేటేటి పరమేశ్వరశర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం ఒక్క రోజు వివిధ రూపాల్లో రూ.41,115 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు తెలిపారు. నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీకి చెందిన ఎన్ఎస్ఎస్ యూనిట్ 2, 4, 8, 9ల ఆధ్వర్యంలో మండలంలోని సుంకొల్లు, గొడుగువారిగూడెం, యానాదికాలనీ, యనమదల గ్రామాల్లో ఈనెల 22 నుంచి సేవా శిబిరాలను నిర్వహించనున్నట్లు డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనిలో భాగంగా ఇంటింటి సర్వే నిర్వహించి ప్రజల సమస్యలను వాలంటీర్లు నమోదు చేస్తారన్నారు. ఈ శిబిరాలు ఏడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు వివరించారు. నూజివీడు: కృష్ణా యూనివర్సిటీ అంతర్ కళాశాలల బాస్కెట్బాల్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. రెండురోజులుగా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో భాగంగా ఫైనల్ మ్యాచ్లో నూజివీడు సిద్ధార్ధ జట్టు విజయవాడ కేబీఎన్ జట్టుపై 56–28 స్కోర్ తేడాతో విజయం సాధించి యూనివర్సిటీ చాంపియన్గా నిలిచింది. దీంతో వరుసగా రెండోసారి విజేతగా నిలిచినట్లయింది. రెండో స్థానంలో కేబీఎన్ కళాశాల జట్టు, మూడో స్థానంలో విజయవాడ ఆంధ్రా లయోలా కళాశాల జట్టు, నాలుగో స్థానంలో విజయవాడ పీబీ సిద్ధార్ధ కళాశాల జట్టు నిలిచాయి. విజేతగా నిలిచిన సిద్ధార్ధ కళాశాల జట్టు క్రీడాకారులను ఫిజికల్ డైరెక్టర్లు సత్యన్నారాయణ, అంజాద్ఆలీ, ట్రిపుల్ ఐటీ పీడీ సూర్య, సిద్ధార్ధ కళాశాల కరస్పాండెంట్ గొల్లపూడి రవిబాబు, డైరెక్టర్లు తోటకూర సాంబశివరావు, మోరంపూడి సత్యన్నారాయణ తదితరులు అభినందించారు. -
మాజీ సీఎం వైఎస్ జగన్కు వినూత్న రీతిలో శుభాకాంక్షలు
ఏలూరు (టూటౌన్): మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకుని ఏలూరుకు చెందిన సూక్ష్మ కళాకారుడు మేతర సురేష్బాబు తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలియజేశారు. సూది దారం గుచ్చే ప్రాంతంలోనూ, అగ్గిపుల్లపైనా వైఎస్ జగన్ చిత్రాలను రూపొందించారు. ఈ విధంగా తన అభిమాన నాయకుడికి శుభాకాంక్షలు తెలపడం పట్ల మైక్రో ఆర్టిస్ట్ సురేష్ బాబు సంతోషాన్ని వ్యక్తం చేశారు. గణపవరం: వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా గణపవరం మండలం పిప్పర గ్రామానికి చెందిన కాకర శ్యాంసుందర్ క్రెస్ట్సన్ నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్ర వైఎస్సార్ టీఏ అధ్యక్షుడు కె.జాలిరెడ్డి నియమాక ఉత్తర్వులు పంపారు. కేశవరం ఆదర్శ ప్రాధమిక పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్న శ్యాంసుందర్ గతంలో వైఎస్సార్ టీఎఫ్ జిల్లా శాఖలో పనిచేశారు. శ్యాంసుందర్ నియామకం పట్ల జిల్లా వైఎస్సార్ టీఏ జిల్లా అధ్యక్షుడు మూరాల సుధాకర్, ప్రధాన కార్యదర్శి బొడ్డు రాంబాబు, గౌరవాధ్యక్షుడు రమేష్బాబు అభినందనలు తెలిపారు. తనను నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు జాలిరెడ్డికి శ్యాం సుందర్ కృతజ్ఞతలు తెలిపారు ఉపాధ్యాయుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తానని చెప్పారు. ఏలూరు(మెట్రో): భూ సర్వేలు, భూ రికార్డులు, ఉప విభజనలు తదితర ప్రజాసేవలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచడంలో ఆర్టీఐ చట్టం కీలక పాత్ర పోషించిందని డిస్ట్రిక్ట్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ షేక్ మహ్మద్ అన్సారీ అన్నారు. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ఏర్పడి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా డిస్ట్రిక్ట్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ, ఏలూరు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించినట్లు చెప్పారు. గత రెండు దశాబ్దాలుగా ఈ చట్టం ద్వారా శాఖ కార్యకలాపాల్లో పారదర్శకత పెరిగి, ప్రజల నమ్మకం మరింత బలపడిందన్నారు. ఆర్టీఐ దరఖాస్తులను నిర్ధేశిత గడువులోగా పరిష్కరించాల్సిన అవసరం, చట్టంలోని నిబంధనల పట్ల అవగాహన, సెక్షన్–4 ప్రకారం ముందస్తు సమాచార ప్రకటన ప్రాధాన్యతపై అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించారు. అలాగే సరైన రికార్డు నిర్వహణతో పాటు డిజిటల్ వేదికల వినియోగం ద్వారా సేవల వేగం, పారదర్శకత పెంపుదలపై దృష్టి సారించాలన్నారు. చాట్రాయి: మండలంలోని చిత్తపూరు జెడ్పీ హైస్కూలు విద్యార్థి ఎ.సంపత్కుమార్ జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యాడు. 9వ తరగతి చదువుతున్న సంపత్ కుమార్ ఈ నెల 16, 17, 18 తేదీల్లో నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన అండర్ 14 వాలీబాల్ పోటీల్లో సత్తా చాటి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడని హెచ్ఎం జి సౌభాగ్యం తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని హెచ్ఎంతోపాటు పీఈటీ శివ నాగరాజు, ఉపాధ్యాయులు అభినందించారు. అత్తిలి: మంచిలి గ్రామంలో డ్రెయినేజీ మురుగు నీరుపారుదల విషయమై ఏర్పడిన వివాదానికి సంబంధించి పరస్పరం చేసుకున్న ఫిర్యాదులకుగాను ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు అత్తిలి ఎస్సై పి.ప్రేమరాజు శనివారం తెలిపారు. మంచిలి గ్రామానికి చెందిన బొక్క ధనలక్ష్మి ఇంటి పక్కన గల మురుగు డ్రెయిన్ నుంచి నీరు ఎక్కువగా రావడంతో ఇంటి పక్కనున్న కౌరు వెంకటరమణ దౌర్జన్యం చేసిందని ధనలక్ష్మి ఫిర్యాదు చేసింది. ఇదే విషయంలో ధనలక్ష్మి తనపై దౌర్జన్యం చేసినట్లు కౌరు వెంకటరమణ ఫిర్యాదు చేసింది. దీంతో ఇరువురిపై తహసీల్దార్ కోర్టులో బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు ఎస్సై ప్రేమరాజు చెప్పారు. తహసీల్దార్ దశిక వంశీ ఇరువర్గాలను రప్పించి బైండోవర్ పత్రాలు రాయించుకున్నట్లు తెలిపారు. సూది మొదలులో, అగ్గిపుల్లపై వైఎస్ జగన్ చిత్రాన్ని రూపొందించిన దృశ్యం -
ఆర్వో ప్లాంట్లకు మోక్షం ఎప్పుడో?
● నాటి జగనన్న ప్రభుత్వంలో మంజూరైన ఆర్వో ప్లాంట్లు ● నేటికీ పాఠశాలల్లో మూలన పడి ఉన్న వైనం పాలకొల్లు సెంట్రల్: నాటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నాడు నేడు రెండో విడతలో కొన్ని పాఠశాలలకు ఆర్వో ప్లాంట్ మెటీరియల్స్ను పంపించారు. అవి పంపించి దాదాపు రెండేళ్లు కావస్తున్నా నేటికీ ఆయా పాఠశాలల్లో అవి సీల్ కవర్లలోనే ఉండడం గమనార్హం. ఆర్వో ప్లాంట్ సిస్టం అమర్చడానికి టెక్నీషియన్లు దొరకలేదని చెబుతుండడం విశేషం. గతంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నాడు నేడు కార్యక్రమంలో ఆర్వో ప్లాంట్లను ఇన్నోవేటివ్ ఆక్వా ఏజెన్సీ సంస్థ సప్లయి చేసిందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఆ ఆర్వో ప్లాంట్ మెటీరియల్స్ పాఠశాలల్లో బిగించాల్సి ఉంది. ఆ సమయంలో ఎన్నికల కోడ్ రావడంతో వాటిని పాఠశాలల్లో అమర్చే పనులు తాత్కాలికంగా నిలుపుదల చేశారు. అప్పటి నుంచి నేటివరకు కూటమి ప్రభుత్వం వాటిని పాఠశాలల్లో అమర్చలేకపోయింది. ప్రధానోపాధ్యాయులపై అభాండం వేసే ఉద్దేశమా..? కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఆర్వో ప్లాంట్లు పాఠశాలల్లో మూలకు చేరి ఉన్నాయి. వాటిని అమర్చాలంటే టెక్నీషియన్లు ఉండాలి. దీనిపై జిల్లా నోడల్ ఆఫీసర్లు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తుంది. వీటిపై నేడు కదలిక వచ్చి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాలతో గత 20 రోజులు క్రితం సమావేశం ఏర్పాటుచేశారు. ఆ సమావేశంలో ఆర్వో ప్లాంట్లకు సంబంధించిన ఏజెన్లీ వాళ్లు కాంట్రాక్ట్ అయిపోయిందని ముందుకు రావడంలేదు. కాబట్టి ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులే ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆర్వో ప్లాంట్లను ఏర్పాటుచేసే విదంగా కృషి చేయాలని మండల విద్యాశాఖాధికారులు సూచించినట్లు సమాచారం. ఒకవేళ ఉపాధ్యాయులు వాటిని పాఠశాలల్లో అమర్చలేకపోతే ఓ రెండు నెలలు తరువాత ఆర్వో ప్లాంట్లను ఎందుకు అమర్చలేకపోయారని హెచ్ఎంలను బాధ్యులను చేస్తూ నిలదీసే అవకాశం ఉంటుందని కొందరు హెచ్ఎంలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా మండలంలో సుమారు 16 వరకూ పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్ మెటీరియల్స్ బాక్స్ల్లో భద్రంగా మూలన ఉన్నాయి. నేటి మనబడి మన భవిష్యత్లో భాగంగా పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లను ఏర్పాటుచేయడానికి కృషి చేస్తున్నాం. వాటిని అమర్చే టెక్నీషియన్లు దొరకకపోవడం వల్ల ఆలస్యం అవుతుంది. ఓ వారం పది రోజుల్లో ఆర్వో ప్లాంట్లను బిగించడం జరుగుతుంది. మండలంలో 20 ఆర్వో ప్లాంట్లు మంజూరుకాఆ ఎనిమిది పాఠశాలల్లో అమర్చాల్సి ఉంది. – ఆర్ఎన్వీవీ శర్మ, ఎంఈవో 2, పాలకొల్లు మండలంప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ప్రతి విద్యార్థి తాను కూడా కార్పొరేట్ స్థాయి పాఠశాలల్లో చదువుకుంటున్నాననే భరోసా కల్పించేలా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాడు – నేడు ద్వారా పాఠశాలలను కోట్లాది రూపాయల వ్యయంతో ఆధునీకరించారు. అలాగే మంచి పోషకాహారంతో మధ్యాహ్న బోజనం ఏర్పాటుచేశారు. స్కూల్ పిల్లలకు దుస్తులు, పుస్తకాలు, బ్యాగ్లు, బల్లలు, డిజిటల్ బోర్డులు, ట్యాబ్లు ఇలా అనేక వసతులు కల్పిస్తూ పాఠశాలల రూపురేఖలను మార్చేశారు. దానితో నాడు ఎందరో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల నుంచి తీసుకువచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. ఒకానొక సమయంలో పట్టణంలో ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హౌస్పుల్ బోర్డు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. నాటి అభివృద్ధి అలా ఉండేది. -
జీ రామ్ జీ బిల్లు రద్దు చేయాలి
ఏలూరు (టూటౌన్): గ్రామీణ పేదల జీవన విధాన్నాని పూర్తిగా మార్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వికసిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ (వీబీ జీ రామ్ జీ) బిల్లును రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. శనివారం వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ, రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి 197 జీవో కాపీలను ఏలూరు కలెక్టరేట్ వద్ద దహనం చేశారు. గతంలో వేతనాలు వంద శాతం కేంద్రమే భరించేదని, ఇప్పుడు రాష్ట్రాలపై 40 శాతం భారం వేయడం వల్ల ఏపీకి సుమారు రూ.5 వేల కోట్ల నిధులు తగ్గి, పథకం అటకెక్కే ప్రమాదం ఉందని అన్నారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి కే శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షడు ఏ.రవి, ఎం.జీవరత్నం, జిల్లా నాయకులు లాజర్ మణి, డి.నాగేంద్ర, పి.అనందరావు, జాన్ రాజు, బాలయ్య, సుబ్బారావు, లక్ష్మి, దీవెనమ్మ, ఏసుమణి తదితరులు పాల్గొన్నారు. ప్రజలను మభ్య పెట్టేందుకే పని దినాల పెంపు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన శ్రీజి రామ్ జిశ్రీ బిల్లులో 125 రోజుల పని కల్పిస్తామనటం ప్రజలను మభ్యపుచ్చడమే అని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ బాషా శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఉపాధి హామీ పథకంలో 100 రోజుల పనిదినాలే కష్టతరంగా ఉంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ పథకాన్ని శ్రీవికసిత్ భారత్ –గ్యారంటీ ఆఫ్ రోజ్ గార్ అండ్ అజీవకా మిషన్ –గ్రామీణ్ శ్రీ(వీబీ –జీ రామ్ జీ)గా పేరు మార్పు, అనేక సవరణలతోపాటు 125 రోజుల పని కల్పిస్తామనటం ప్రజలను మభ్యపెట్టడానికే అన్నారు. ఉపాధి హామీ పథకంలో చెల్లించాల్సిన వేతనాలను ఇప్పటివరకు 90 శాతం కేంద్రం, 10 శాతం ఆయా రాష్ట్రాలు భరిస్తుండగా.. ప్రస్తుతం ప్రతిపాదించిన బిల్లులో 60 శాతం మాత్రమే కేంద్రం భరిస్తామనటం...రాష్ట్రాలపై మరింత భారాన్ని మోపటమే అన్నారు. ఇరగవరం: ఉపాధి కూలీలతో కలిసి 197 జీవో కాపీలను దహనం చేస్తున్న నాయకులు ఏలూరు (టూటౌన్): ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు ఇరగవరం: ఉపాధి హామీ చట్టం పేరు మార్పు మహాత్మా గాంధీని అవమానపరచడమేనని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కేతాగోపాలన్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బళ్ళ చిన వీరభద్రరావు విమర్శించారు. ఉపాధి కూలీల పొట్ట కొట్టడానికి జారీ చేసిన 197 జీవో కాపీలను శనివారం యర్రాయి చెరువు గ్రామంలో ఉపాధి కూలీలతో కలిసి ప్రజా సంఘాల నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అనేక పోరాటాలు చేసే సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవడానికి కూలీలంతా ఐక్యంగా పోరాడాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ జుత్తిగ రామాంజనేయులు, పితాని నాగేశ్వరరావు, జుత్తిగ వెంకటలక్ష్మి, పితాని లక్ష్మీ, జుత్తిగ గౌరీ, కుడిపూడి ఆనంద కుమారి, జుత్తిగ కోమలి దుర్గ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీవారి క్షేత్రం.. ముక్కోటికి ముస్తాబు
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రం ముక్కోటికి ముస్తాబవుతోంది. ఈ ఏడు స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి వేలాది మంది భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్న ఆలయ అధికారులు అందుకు అనుగుణంగా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో తాత్కాలిక క్యూలైన్ల నిర్మాణం, ఆలయానికి, పరిసరాలకు విద్యుద్దీప అలంకారాలు చేసే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం నుంచి ఆలయ దక్షిణ (ప్రధాన) రాజగోపురం వరకు భక్తులు రాకపోకలు సాగించేందుకు వీలుగా ఆ ప్రాంతంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని నిర్మిస్తున్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం ఈనెల 30న కావడంతో, ముందు రోజు 29న మధ్యాహ్నం 2.30 గంటల నుంచి నిర్వహించే గిరి ప్రదక్షిణకు సైతం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఉత్తర ద్వార దర్శనానికి వచ్చే వీఐపీలతో పాటు, సాధారణ భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించే దిశగా ఏర్పాటు చేస్తున్నారు. గోవింద స్వాములు, స్థానికుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేస్తున్నారు. రూ. 100, రూ.200 టికెట్లతో పాటు, శ్రీవారి ఉత్తర ద్వార దర్శనం ప్రత్యేక రూ.500 టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచినట్టు ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. భక్తులు గమనించాలని ఆయన కోరారు. శరవేగంగా విద్యుద్దీప అలంకారాలు, క్యూలైన్ల నిర్మాణాలు -
కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే అధీక్షక్ బిల్లు
ఏలూరు (ఆర్ఆర్పేట): కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ శిక్షా అధీక్షక్ బిల్లు 2025ను తీసుకువచ్చిందని ఎస్ఎఫ్ఐ నాయకులు మండిపడ్డారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శనివారం స్థానిక కోటదిబ్బ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద బిల్లు ప్రతులను దహనం చేశారు. ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ గతంలో 2018లో ప్రవేశపెట్టిన హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా బిల్లును, ఇప్పుడు వికసిత్ భారత్ శిక్షా అధీక్షక్ పేరుతో మార్చి ఒకే నియంత్రణ సంస్థను తీసుకురావడం ద్వారా ఉన్నత విద్యా రంగాన్ని కేంద్రీకరించడమే ఈ బిల్లు లక్ష్యమన్నారు. రాష్ట్రాల్లోని విద్యా సంస్థలపై కేంద్రం తన భావజాలాన్ని రుద్దడానికి, వాటిపై పట్టు సాధించడానికి ఈ బిల్లును ఒక సాధనంగా ఉపయోగించుకునే ప్రమాదం ఉందన్నారు. తక్షణమే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షుడు ఎస్.శివాజీ, ఉపాధ్యక్షుడు ఎం.జయంత్, సహాయ కార్యదర్శి ఎం.శివ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
చర్చి నిర్మాణంపై న్యాయం చేయండి
ఉండి: చర్చి నిర్మాణం కూల్చివేతపై పాస్టర్ దంపతులు కన్నీటి పర్యంతమయ్యారు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. పాస్టర్ కొయ్యగర్ల దానియేలు దంపతులు తెలిపిన వివరాల ప్రకారం ఉండి శివారు రామాపురం, పాములపర్రు సరిహద్దులో 13 ఏళ్లగా సీయోను రారాజు ప్రార్థనా మందిరం ఉందని, సుమారు 70 మంది విశ్వాసులతో ప్రార్థనలు జరుపుకుంటున్నామని చెప్పారు. గతేడాది నవంబర్ 7న పాములపర్రుకు చెందిన కూటమి నాయకులు తమకు మాయమాటలు చెప్పి గ్రామాభివృద్ధి కోసం పక్కనే కాలువ కల్వర్టు నిర్మాణం చేయాలంటూ చెప్పి చర్చి కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో చర్చి తొలగించేందుకు అనుమతిస్తే రూ.50 వేలు ఇచ్చి, మరో ప్రాంతంలో 2 సెంట్లు భూమి ఇప్పించి, చర్చి నిర్మాణానికి సహకరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కానీ చర్చి తొలగింపు అనంతరం వారేవరూ పత్తా లేకుండా పోయారని, కనీసం ఫోన్ చేసినా స్పందించేవారు కాదని వాపోయారు. క్రిస్మస్ పండుగ జరుపుకునేందుకు పాములపర్రు గ్రామ పెద్దలకు సమాచారం ఇచ్చి గతంలో చర్చి ఉండే పక్కనే ఖాళీస్థలంలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి చిన్న చర్చి నిర్మాణం చేసుకుంటున్నట్లు చెప్పారు. అయితే శనివారం ఉండి పంచాయతీ అధికారులు, పోలీసులు, ఇరిగేషన్ సిబ్బంది చర్చి నిర్మాణాన్ని కూల్చివేశారని, తమకు న్యాయం చేయాలని కోరారు. ఇదే ప్రాంతంలో ఎన్నో ఆక్రమణలు ఉన్నా అధికారులు వాటివైపు కన్నెత్తి చూడకపోవడం కొసమెరుపు. పోలీస్ వార్షిక క్రీడా సంబరాలు ప్రారంభం ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా పోలీస్ వార్షిక క్రీడా సంబరాలు ఉత్సాహంగా ప్రారంభం అయ్యాయి. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం ప్రాంగణంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆకాశంలోకి రంగురంగుల బెలూన్లు ఎగురవేసి క్రీడా పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. నిత్యం పోలీస్ సిబ్బంది ప్రజలకు ఉత్తమ సేవలు అందించటంలో తీవ్ర ఒత్తిడితో విధులను నిర్వర్తిస్తూ ఉంటారని, ఇటువంటి క్రీడా సంబరాలు వారికి శారీరక దృడత్వంతోపాటు, మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఏఎస్పీ సుస్మిత ఉన్నారు. అనంతరం పోలీస్ అధికారులు, సిబ్బంది వివిధ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని తమ సత్తా చాటుకున్నారు ఏలూరు టౌన్: పోగొట్టుకున్న బంగారు గొలుసును బాధితురాలికి పోలీసులు అప్పగించారు. పోస్టల్ కాలనీకి చెందిన గోవాడ విజయలక్ష్మి తన బంగారు గొలుసును తాకట్టు పెట్టేందుకు ఏలూరు వన్టౌన్ ప్రాంతానికి వెళుతుండగా... హాయ్ హోటల్ సమీపంలో గొలుసు జారిపడిపోయింది. దీనిపై బాధితురాలు ఏలూరు వన్టౌన్ సీఐ జీ.సత్యనారాయణకు ఫిర్యాదు చేసింది. కోడేలు ప్రాంతానికి చెందిన అడ్డగార్ల లక్ష్మీ ఇందిర తనకు రోడ్డుపై దొరికిన బంగారు గొలుసుని వన్టౌన్ పోలీస్స్టేషన్లో అప్పగించడంతో వెంటనే డీఎస్పీ శ్రావణ్కుమార్ ఆ బంగారు గొలుసును బాధితురాలు విజయలక్ష్మికి అందజేశారు.


