breaking news
Eluru
-
పాఠశాలలు, రేషన్ షాపుల తనిఖీ
641 కిలోల గంజాయి ధ్వంసం జిల్లా వ్యాప్తంగా వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న సుమారు 641 కిలోల గంజాయిని ధ్వంసం చేసినట్లు పశ్చిమ గోదావరి జిల్లా పోలీసు వర్గాలు తెలిపాయి. 4లో uఏలూరు (టూటౌన్): జిల్లాలో పలు పాఠశాలలు, రేషన్ షాపులు, ఎంఎల్ఎస్ పాయింట్లను బుధవారం రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ చిత్త విజయప్రతాప్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏలూరు, భీమడోలు, ద్వారకాతిరుమల మండలాల్లో పర్యటించారు. తొలుత ఏలూరు జ్యోతిబా పూలే బాలికల పాఠశాలలో వంటశాల స్టోర్ రూమ్ పరిశీలించారు. కొన్ని గుడ్లు కేవలం 31 గ్రాముల ఉండడం గమనించి సప్లయర్ను సంప్రదించి తక్కువ బరువు ఉన్న గుడ్లను వెంటనే మార్చాలని, ఇకనుంచి ఇలాంటి పొరపాట్లు జరగకూడదని చెప్పారు. భీమడోలు మండలం గుండుగోలనులో రేషన్ షాపు, మండల పరిషత్ పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. పాతూరు ఎమ్ఎల్ఎస్ పాయింట్ పరిశీలించారు. ద్వారకా తిరుమల మండలంలో బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు. వంటశాల, స్టోర్ రూం తనిఖీలు నిర్వహించారు. 682 మంది విద్యార్థులకుగాను కేవలం నలుగురు వంటవాళ్లు మాత్రమే ఉన్నారని పాఠశాల ప్రిన్సిపల్ చైర్మన్ దష్టికి తీసుకురాగా ఈ విషయంపై అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామన్నారు. -
నన్ను చంపాలని చూస్తున్నారు
దెందులూరు: కొల్లేరు వాసులకు ఒక్క రూపాయి బాకీ ఉన్నానని నిరూపించినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి అన్నారు. బుధవారం ఏలూరు జిల్లా కొండలరావుపాలెంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, అబ్బయ్యచౌదరిని ఇబ్బంది పెడితే దెందులూరులో రాజకీయంగా పెత్తనం చేయవచ్చని భావిస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే అబ్బయ్యచౌదరి ఇంటికి వెళ్లండి.. ముట్టడించండి, వంటావార్పు చేయండని ఎమ్మెల్యే చింతమనేని పిలుపునిచ్చారని మండిపడ్డారు. తనను బెదిరించి హతమార్చాలని చూస్తున్నారని ఆరోపించారు. తాను ఉన్నత ఉద్యోగాన్ని వదిలి మంచి చేసేందుకే రాజకీయాల్లో వచ్చానని అన్నారు. ఐదేళ్లు శాసనసభ్యుడిగా ప్రజలకు ఎంతో సేవ చేశానని.. ఏ ఒక్కరి దగ్గర రూపాయి కూడా తీసుకునే ఆలోచన తమకు లేదన్నారు. నాలుగు దశాబ్దాలుగా సేవ చేసే కుటుంబంగా ప్రజలతో కొఠారు కుటుంబానికి అనుబంధం ఉందన్నారు. తన హయాంలో టీడీపీ కార్యకర్తలకు సైతం మంచి చేశానన్నారు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కుటుంబంతో కూడా సమయం గడపకుండా నిత్యం ప్రజల్లోనే ఉంటున్నానన్నారు. దెందులూరు నియోజకవర్గంలో 20 ఏళ్ల తర్వాతైనా తాను చేసిన మంచి కనిపిస్తుందన్నారు. అలాంటి తన ఇంటిపై రాళ్లు వేసి, వంటావార్పులు పెట్టించి ఇబ్బందులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు చెరువులు, పొలాలు ఆక్రమిస్తున్నారని, పెట్రోల్ బంకులు, ఇల్లు ధ్వంసం చేస్తున్నారన్నారు. రౌడీషీటర్లను పంపి భయపెట్టాలని చూశారని.. 144 సెక్షన్ ఉన్నా, పోలీసులు ఆపుతున్నా దెందులూరు నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ కార్యకర్తలు తన ఇంటికి వచ్చి అండగా నిలిచారని అబ్బయ్యచౌదరి అన్నారు. కొల్లేరులో వికృత రాజకీయ క్రీడ కొల్లేరు ప్రాంతంలో వికృత రాజకీయ క్రీడ జరుగుతుందని అబ్బయ్యచౌదరి అన్నారు. తన తండ్రి రామచంద్రరావు సహకారంతోనే చింతమనేని ఎంపీపీ అయ్యారని గుర్తు చేశారు. కొల్లేరు వాసులను బెదిరించి, తమపై ఉసిగొల్పుతున్నారని.. మీకు గాని, మీ గ్రామానికి గాని బాకీ ఉన్నానని నిర్ధారించేందుకు తాను కమిటీ వేస్తానని, మీరు కూడా ఒక కమిటీ వేసి నిజనిర్ధారణకు రావాలని ఏలూరు కోటదిబ్బ వద్ద నిరసన తెలుపుతున్న వారిని ప్రశ్నించారు. కలెక్టర్, ఎస్పీ కూడా కమిటీలో భాగస్వాములై నిజాలు నిగ్గు తేల్చాలన్నారు. సమావేశంలో జెడ్పీ వైస్ చైర్మన్ పెనుమాల విజయబాబు, వడ్డీల కార్పొరేషన్ రాష్ట్ర మాజీ చైర్మన్ ముంగర సంజీవ్ కుమార్, దెందులూరు, పెదవేగి, పెదపాడు, ఏలూరు రూరల్ మండలాల పార్టీ అధ్యక్షులు కామిరెడ్డి నాని, జానంపేట ప్రసాద్బాబు, అప్పన్న ప్రసాద్, తేరా ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఏఎస్పీకి ఫిర్యాదు : నియోజకవర్గంలో పరిణామాలతో పాటు రెండు రోజులుగా జరుగుతున్న సంఘటనలపై కొఠారు అబ్బయ్యచౌదరి ఏలూరులో ఏఎస్పీ నక్కా సూర్య చంద్రరావుకు లిఖితపూర్వకంగా వినతిపత్రం అందచేశారు. మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి -
వరద గోదావరి
మత్స్యం.. కొల్లేరు ప్రత్యేకం చేపల గుడ్ల ఉత్పత్తి పెంచేందుకు చేసిన ప్రయోగం విజయవంతమైన సందర్భంగా ఏటా జూలై 10న చేప రైతుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. 4లో uగురువారం శ్రీ 10 శ్రీ జూలై శ్రీ 2025సాక్షి ప్రతినిధి, ఏలూరు: వరద గోదావరి మళ్లీ పోటెత్తుతుంది. ఎగువ రాష్ట్రాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు గోదావరిలో జలకళ మొదలైంది. గత వారం రోజులుగా రోజుకు సగటున 2 లక్షల క్యూసెక్కుల నీరు పోలవరం ప్రాజెక్టు నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో తీవ్రత మరింత పెరుగుతుందని దానికనుగుణంగా 9.32 లక్షల క్యూసెక్కుల నీరు 15 కల్లా వస్తుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు వరద ప్రవాహంతో ముంపు మండలాల్లో అలజడి మొదలైంది. గోదావరికి వరదల సీజన్ ప్రారంభమైంది. వాస్తవానికి జూలై మొదటి వారం నుంచి వరద హడావుడి ప్రారంభమై ఆగస్టు వరకు రెండు సార్లు ముంపు మండలాల్ని అతలాకుతలం చేస్తోంది. ఈ ఏడాది వర్షాలు కొంత ఆలస్యం కావడం, ఇతర కారణాలతో వరద ఉధృతి గతంతో పోల్చితే తక్కువగానే ఉంది. ఈ నెల 2 నుంచి ప్రారంభమైన వరద నీరు క్రమేపీ పెరుగుతూ వచ్చింది. మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల్లో వారం రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురవడంతో గోదావరి ఉపనది శబరి పోటెత్తుతుంది. ఈ క్రమంలో ఈనెల 2న 1.06 లక్షల క్యూసెక్కుల నీరు పోలవరం స్పిల్వే నుంచి దిగువకు విడుదల చేశారు. 5వ తేదీ నాటికి 2.09 లక్షల క్యూసెక్కులు, 9 నాటికి 2.27 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. వరద పోటెత్తే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అధికారులు అంచనా వేశారు. ఈ నెల 15 కల్లా 9,32,288 క్యూసెక్కుల నీరు పోలవరానికి చేరుతుందని, అదే విధంగా భద్రాచలం వద్ద 43 అడుగుల నీటిమట్టంతో మొదటి ప్రమాదహెచ్చరిక జారీ చేయవచ్చని చెబుతున్నారు. ఈ నేనపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. దిగువకు విడుదలవుతున్న నీటిని పోలవరం నుంచి పూర్తి స్థాయిలో డిశ్చార్జ్ చేస్తున్నారు. న్యూస్రీల్ముంపు మండలాల్లో భయం.. భయంపోలవరం ముంపు మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడుకు వరద ప్రమాదం పొంచి ఉంది. ఈ క్రమంలో 9.32 లక్షల క్యూసెక్కులు దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఈ దశలో రహదారులపైకి నీరు చేరుతుంది. 11.44 లక్షల క్యూసెక్కులు దాటితే రెండవ ప్రమాద హెచ్చరికకు రహదారులు నీటముగి రాకపోకలు నిలిచిపోయి పదుల సంఖ్యలో గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్ళలోకి నీరు చేరుతుంది. 14.26 లక్షల క్యూసెక్కులు దాటితే మూడో ప్రమాద హెచ్చరికతో రెండు మండలాల్లో 18 గ్రామాలు పూర్తిగా జలదిగ్భందంలోకి వెళ్తాయి. ఈ క్రమంలో అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కే.వెట్రిసెల్వి ఆదేశించారు. ఇప్పటివరకు కుక్కునూరు మండలం గొమ్ముగూడానికి చెందిన 15 కుటుంబాలను మాత్రమే దాచారంలోని పోలవరం పునరావాస కాలనీకి తరలించారు. కొనసాగనున్న ఉధృతి బుధవారం మధ్యాహ్నానికి భద్రాచలంలో 22.40 అడుగుల మేర నీటిమట్టం ఉంది. ఎగువ నుంచి ఇన్ఫ్లో ఎక్కువగా ఉండటంతో గురువారానికి 3 నుంచి 4 అడుగులు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 1986లో 75.60 అడుగుల మేర నీటి మట్టం ఉండటంతో 27 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలైంది. ఇంతవరకు అత్యధికంగా వచ్చిన వరద ఇదే. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో అత్యధిక గ్రామాలు భారీగా నష్టపోయాయి. ఆ తరువాత 2022లో 71.30 అడుగుల నీటిమట్టంతో 21.78 లక్షల క్యూసెక్కుల నీరు పోలవరానికి ఒకేసారి విడుదలైంది. ఈ క్రమంలో ముంపు మండలాలతో పాటు పశ్చిమలోని లంక గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. 2022లో జూలై 6న, 2023లో జూలై 20న 2024 జూలై 19న వరదలు ప్రారంభమై సుమారు వారం రోజులు పాటు ఇన్ఫ్లో కొనసాగింది. ముంపు మండలాల్లో అప్రమత్తం ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పోటెత్తుతున్న గోదావరి, శబరి 8 రోజుల వ్యవధిలో పోలవరం నుంచి 13.88 లక్షల క్యూసెక్కులు విడుదల మరో వారం కొనసాగనున్న గోదావరి ఉధృతి గోదావరి ఉధృతి ఇలా (పోలవరం నుంచి నీటి విడుదల) తేదీ విడుదలైన నీరు (క్యూసెక్కుల్లో) జూలై 5 2,09,733 6 2,023,309 7 1,95,294 8 2,02,463 జూలై 9 2,27,066 -
కదం తొక్కిన కార్మికులు
ఏలూరు (టూటౌన్): కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్త సమ్మె ఏలూరులో బుధవారం విజయవంతంగా జరిగింది. వివిధ రంగాల కార్మికులతో పాటు బ్యాంకులు, బీమా, పోస్టల్ ఉద్యోగులు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, మున్సిపల్ కార్మికులు తదితర రంగాలకు చెందిన వారు సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏలూరులో భారీ ప్రదర్శన నిర్వహించారు. పవర్ పేట రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమైన ప్రదర్శన రమా మహల్ సెంటర్ మీదుగా ఆర్ఆర్ పేట పార్క్ వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కార్మికులందరికీ కనీస వేతనం రూ.26,000 అమలు చేయాలని, పని గంటల పెంపును రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని, ధరలను అరికట్టాలని, నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ పేట పార్కు వద్ద బహిరంగ సభ నిర్వహించారు. సభకు డీఎన్వీడి ప్రసాద్, బి.వెంకటరావు, ఆర్.శ్రీనివాస డాంగేలు అధ్యక్షత వహించారు. -
టీడీపీ మూకల అరాచకం
నూజివీడు: ఏలూరు జిల్లా నూజివీడు మండలంలోని పల్లెర్లమూడిలో మంగళవారం రాత్రి నిర్వహించిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతి కార్యక్రమంలో టీడీపీ మూకలు అడుగడుగునా రెచ్చగొట్టి గొడవలకు విశ్వప్రయత్నాలు చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో ముందుకు సాగగా చివరకు వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలను చించివేశారు. ఇంత జరిగినా పట్టించుకోని పోలీసులు బుధవారం మాత్రం వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పోలిమెట్ల శివను ఉదయం నుంచి పోలీస్స్టేషన్లో ఉంచారు. వైఎస్ జయంతి సందర్భంగా పల్లెర్లమూడిలో కేక్ కటింగ్ ఏర్పాటు చేసి మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావును ఆహ్వానించారు. సాయంత్రం 6.30 గంటల సమయంలో రాట్నాలగూడెంలో కేక్ కట్చేసి అక్కడి నుంచి పల్లెర్లమూడి వెళ్లారు. పల్లెర్లమూడిలోకి ర్యాలీ ప్రవేశించిన దగ్గర నుంచి రాటాలు అనే అతను ట్రాక్టర్తో ర్యాలీ చేస్తున్న వారిని గుద్దించాలని మీదకు పోనిచ్చాడు. పక్కన వాళ్లు లాగడంతో బతికి బయటపడ్డారు. పల్లెర్లమూడిలోని దళితవాడకు వెళ్లి అక్కడ వైఎస్ విగ్రహానికి ప్రతాప్ అప్పారావు పూలమాల వేసి కేక్ కట్ చేసిన అనంతరం శివాలయం సెంటర్కు ర్యాలీగా రాగా అక్కడ డీజే బండికి బైక్లు అడ్డం పెట్టడంతో పాటు మహిళలను అడ్డం కూర్చోబెట్టి కులంపేరుతో వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను దూషించారు. ర్యాలీని అడ్డుకొని అరాచకంగా వ్యవహరించారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు, వైఎస్సార్సీపీ నాయకులు వచ్చి ఘర్షణ వాతావరణం పెరగకుండా అడ్డుకున్నారు. టీడీపీ మూకలు గ్రామంలో వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలను చించివేశారు. దాడిలో గాయపడ్డ నలుగురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు నూజివీడు ఏరియా ఆసుపత్రిలో చేశారు. గ్రామంలోని టీడీపీ ఫ్లెక్సీలను చించారంటూ బుధవారం ఉదయం వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పోలిమెట్ల శివను పోలీసులు తీసుకొచ్చి పోలీస్స్టేషన్లో ఉంచారు. దీనిపై జెడ్పీ వైస్ చైర్మన్ గుడిమళ్ల కృష్ణంరాజు, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షులు శీలం రాము, మండలంలోని, పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు పోలీస్స్టేషన్ వద్దకు చేరుకున్నారు. కవ్వింపునకు పాల్పడిందే టీడీపీ వాళ్లే.. కవ్వింపు చర్యలకు దిగి రెచ్చగొట్టింది టీడీపీ వాళ్లేనని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు రూరల్ సీఐకు తెలిపారు. పోలిమెట్ల శివను స్టేషన్కు తీసుకురావడంతో ఆయన స్టేషన్కు వచ్చారు. బైక్ ర్యాలీ చేసుకుంటూ ప్రశాంతంగా వెళ్తుంటే రాటాలు అనే అతను ట్రాక్టర్తో గుద్దించడానికి ప్రయత్నించాడని చెప్పారు. వైఎస్సార్ జయంతి ర్యాలీకి ట్రాక్టర్ అడ్డుపెట్టి కవ్వింపు చర్యలు పల్లెర్లమూడిలో వైఎస్సార్సీపీ ఫ్లెక్సీల చించివేత -
టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిక
ఆగిరిపల్లి: ఆగిరిపల్లి మండలంలోని శోభనాపురం గ్రామంలో టీడీపీని వీడి రెండు కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరాయి. నూజివీడు నియోజకవర్గ తెలుగు యువత సభ్యుడు పెనుముచ్చు మహేష్, కాకి భాగ్యరాజు కుటుంబ సభ్యులు టీడీపీని వీడి వైఎస్సార్సీపీ నాయకులు బోయపాటి శ్రీనివాసరావు, రావి విష్ణువర్ధన్రావుల సమక్షంలో కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీలో దళిత నాయకులంటే చిన్న చూపని, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టారని త్వరలోనే తెలుగుదేశం పార్టీకి దళితుల సత్తా ఏంటో చూపిస్తామని, నూజివీడు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ బలోపేతానికి శాయిశక్తుల కృషి చేస్తామని పెనుముచ్చు మహేష్, కాకి భాగ్యరాజు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు దాసరి రామారావు, గ్రామ పార్టీ అధ్యక్షులు నక్కనబోయిన సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. బ్యాంకు ఉద్యోగుల నిరసన ఏలూరు (టూటౌన్): సార్వత్రిక సమ్మెకు మద్దతుగా బుధవారం నాడు బ్యాంకు ఉద్యోగులు సామూహిక ప్రదర్శనలు నిర్వహించారు. ఆర్ఆర్పేట యూనియన్ బ్యాంక్ ప్రాంతీయ కార్యా లయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఏలూరు, ఏలూరు చుట్టు పక్కల బ్యాంకు శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బ్యాంకు ఉద్యోగుల సమన్వయ సంఘం అధ్యక్షుడు దుగ్గిరాల శ్రీనివాస్ మోహన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల విలీనం పేరుతో బ్యాంకింగ్ సెక్టార్ను నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. కార్మిక వర్గం ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాస్తూ 44 చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చిందన్నారు. ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసించాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకుడు లక్ష్మణరావు, ఇండియన్ బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకుడు రామకోటి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రీన్ఫీల్డ్ హైవేపై నిరసన చింతలపూడి: చింతలపూడి మండలం శెట్టివారిగూడెం–వెంకటాపురం గ్రామానికి అనుసంధానంగా ఉన్న రోడ్డును తక్షణం నిర్మించాలని కోరుతూ గ్రీన్ఫీల్డ్ హైవేపై బుధవారం గ్రామస్తులు టెంట్ వేసి నిరసనకు దిగారు. గతంలో గ్రీన్ ఫీల్డ్ హైవే కాంట్రాక్టర్ హైవే నిర్మాణం సమయంలో రోడ్డు ధ్వంసం అవ్వడంతో ప్రత్యా మ్నాయంగా తమ గ్రామాల మధ్య రోడ్డు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారని ఇప్పటి వరకు నిర్మాణం చేపట్టక పోవడంతో తప్పనిసరి పరిస్ధితుల్లో నిరసన చేపట్టామని గ్రామస్తులు తెలిపారు. మాట ఇచ్చి వారికి సంబంధం లేనట్టుగా ప్రవర్తించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు ధ్వంసం చేయడంతో సుమారు 600 ఎకరాలకు దారి లేకుండా పోయిందని వాపోయారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సతీష్ కుమార్ సంఘటనా స్ధలానికి చేరుకుని కాంట్రాక్టర్, గ్రామస్తులతో చర్చలు జరిపారు. అక్షరాస్యత పెంచేందుకు కృషి చేయాలి ఏలూరు(మెట్రో): వయోజనుల్లో అక్షరాస్యత పెంచడమే లక్ష్యంగా చేపట్టిన ఉల్లాస్–అక్షరాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు. బుధవారం కలెక్టర్ బంగ్లాలో వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో 2025–26 సంవత్సరానికి ఉల్లాస్ – అక్షరాంధ్ర జిల్లా స్థాయి అధికారులతో సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 100 గంటల శిక్షణతో ఈ ఏడాది 97,200 నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే ఉల్లాస్–అక్షరాంధ్ర కార్యక్రమాన్ని సంబంధిత అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు. -
నాణ్యమైన ఆహారం అందించాలి
ఏలూరు (టూటౌన్): వసతి గృహాంలోని విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ సూచించారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్ అమీనాపేట ఏటిగట్టున ఉన్న సాంఘిక సంక్షేమ సమీకృత బాలుర వసతి గృహాన్ని బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాలలకు అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. వసతి గృహం కిటికీలకు దోమల మెష్ లేకపోవడం వల్ల దోమల బెడద ఉంటుందని విద్యార్థులు తెలిపారని, ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. వసతి గృహానికి రాని విద్యార్థుల వివరాలు సేకరించి, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి, తిరిగి పాఠశాలకు పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు. -
మామిడి తోటల్లో కొమ్మ కత్తిరింపులు చేపట్టాలి
నూజివీడు: కోతలు పూర్తయిన నేపథ్యంలో మామిడి తోటల్లో రైతులు కొమ్మ కత్తిరింపులు చేసుకోవాలని నూజివీడు మామిడి పరిశోధన స్థానం శాస్త్రవేత్త కె.రాధారాణి పేర్కొన్నారు. మండలంలోని కొత్తరావిచర్లలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో బుధవారం మామిడి రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా రాధారాణి మాట్లాడుతూ కొమ్మ కత్తిరింపులు చేయడం వల్ల చెట్ల గాలి వెలుతురు ప్రసరణ బాగా జరిగి పూత, కాపు సరిగ్గా వస్తాయని, తెగుళ్లు, పురుగుల బెడద తగ్గుతుందన్నారు. చెదురుమదురుగా ఉన్న కొమ్మలను ఏటవాలుగా కత్తిరించి కత్తిరించిన చోట బ్లైటాక్స్ను పూయాలన్నారు. తోటల్లో దుక్కులు చేపట్టి చెట్టుకు చుట్టూ పాదులు చేసి పదేళ్ల వయస్సు పైబడిన చెట్లకు యూరియా 2 కిలోలు, సింగిల్ సూపర్ ఫాస్పేట్ 4 కేజీలు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 1.5కేజీలు, బోరాన్ 100గ్రాములు, జింక్ సల్ఫేట్ 100గ్రాములు చొప్పున ఒక్కొక్క చెట్టుకు వేయాలన్నారు. ఆమె వెంట ఉద్యానశాఖ అధికారి ఆర్.హేమ, సర్పంచి కాపా శ్రీనివాసరావు ఉన్నారు. -
మత్స్యం.. కొల్లేరు ప్రత్యేకం
అవగాహన కల్పిస్తాం ప్రేరేపిత ప్రయోగం విజయవంతం ద్వారా డాక్టర్ హీరాలాల్ చౌదరీ నీలి విప్లవానికి పితామహుడిగా మారారు. ఆయన 1994లో వరల్ట్ ఆక్వాకల్చర్ అవార్డు అందుకున్నారు. ప్రతి ఏటా మత్స్యశాఖ ద్వారా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కై కలూరు ప్రభుత్వ ఆక్వా ల్యాబ్లో రైతులకు గురువారం అవగాహన కలిగిస్తాం. – సీహెచ్ గణపతి, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి, కై కలూరుకై కలూరు: చేపల గుడ్లు(స్పాన్) ఉత్పత్తికి సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి చేసిన ప్రయోగ ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ ఆక్వారంగం అగ్రభాగాన నిలుస్తోంది. ఒడిశా రాష్ట్రం కటక్ సెంట్రల్ ఇన్ల్యాండ్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనన్స్టిట్యూట్ (ఐసీఏఆర్)లో 1957 జూలై 10న డాక్టర్ హీరాలాల్ చౌదరీ, డాక్టర్ అలికున్హి శాస్త్రవేత్తలు కలిసి భారతదేశ మేజర్ కార్ప్స్పై విజయవంతమైన ప్రేరిత పెంపక ప్రయోగాన్ని(ఇన్డ్యూసిడ్ బ్రీడింగ్) చేపట్టారు. సాధారణ చేపల్లో ఉదాహరణకు ఐదు లక్షల స్పాన్ ఉత్పత్తి చేస్తే ప్రేరిత ప్రయోగం వల్ల ఆ సంఖ్య 10 నుంచి 20 లక్షలకు చేరింది. అప్పటి నుంచి నీలి విప్లవం తారా స్థాయికి పాకింది. బ్రీడింగ్ ప్రయోగం విజయవంతమైన సందర్భంగా జాతీయ చేపల రైతుల దినోత్సవం జూలై 10న జరుపుకుంటారు. ఉమ్మడి జిల్లాల్లో మత్స్యశాఖ ఆధ్వర్యంలో రైతులకు గురువారం అవగాహన కార్యక్రమాలన నిర్వహిస్తున్నారు. రికార్డు స్థాయిలో ఆక్వా సాగు ఉమ్మడి జిల్లాలో 2.90 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. ఆక్వా రంగం నుంచి వార్షిక ఉత్పత్తి 4 లక్షల టన్నులు ఉండగా, వార్షిక టర్నోవర్ రూ.18 వేల కోట్లు ఉంది. దాదాపు ఆక్వా రైతులు 75 వేల మంది ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఈ జిల్లాల నుంచి 3.5 లక్షల టన్నులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇక రాష్టం విషయానికి వస్తే 974 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం ఉంది. రాష్ట్రంలో మొత్తం ఆక్వా సాగు 2.26 హెక్టార్లులలో కొనసాగుతుంది. దిగుబడులు 10 లక్షల టన్నులుగా ఉంది. అమెరికాకు ఎగుమతి చేసే రొయ్యలు 3.27 లక్షల టన్నులుగా నమోదైంది. దేశంలోనే సింహభాగం ఉత్పత్తులకు ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలు మణిహారంగా మారాయి. నీలి విప్లవంతో రికార్డులు ఆక్వా సాగులో 1955 పూర్వం చేపల సాగు చేయాలంటే నదులు, సముద్రాలలో చేప పిల్లలను సేకరించాల్సి వచ్చేది. దీన్ని వైల్ట్ కలక్షన్ అంటారు. డాక్టర్ హీరాలాల్ చౌదరీ భారతీయ మేజర్ కార్ప్స్ (కట్లా, రోహు, మ్రిగల్)పై హార్మోన్ ప్రేరేపిత ప్రయోగం చేశారు. దీంతో కోట్లలో చేప స్పాన్ అందుబాటులోకి వచ్చింది. తర్వాత అన్యదేశ కార్ప్స్(కామన్ కార్ప్, గ్రాస్ కార్ప్, సిల్వర్ కార్ప్), టిలాపియా, పంగాసియస్ వంటి ఇతర చేపలు, మంచినీటి రొయ్యలైన మాక్రోబ్రాకియం, రోజెంబర్గి(స్కాంపీ) కూడా అభివృద్ధి చెందాయి. ఒక్క ప్రయోగం భారతీయ మత్స్య పరిశ్రమను సమూలంగా మార్చివేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నర్సరీలు, పెంపక చెరువులు నాణ్యమైన చేప విత్తనాల సరఫరాలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ఇవి రాష్ట్రానికి మాత్రమే కాక, దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా చేప విత్తనాలను సరఫరా చేస్తున్నాయి.కొల్లేరులో చేపల పట్టబడులు చేస్తున్న దృశ్యం (ఫైల్) నేడు జాతీయ చేపల రైతు దినోత్సవం ఉమ్మడి జిల్లాలో 2.90 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు ఆక్వా అంటేనే కొల్లేరు ఆక్వా పరిశ్రమకు కొల్లేరు లంక గ్రామాలు పెట్టింది పేరుగా ఉన్నాయి. ఉమ్మడి జిల్లాల్లో 9 మండలాల్లో కొల్లేరు విస్తరించి ఉంది. చిత్తడి నేలల కారణంగా చేపల, రొయ్యల పెరుగుదల అధికంగా ఉంటుంది. ఇక చేప పిల్లలను ఉత్పత్తి చేసే ప్రభుత్వ హేచరీ ఏలూరు జిల్లా బాదంపూడిలో ఉంది. చేప నారును సాగు చేసే మత్స్యశాఖనకు చెందిన సీడ్ ఫాంలు ఏలూరు, కొవ్వలిలో ఉన్నాయి. ఉమ్మడి జిల్లాల నుంచి ప్రతి రోజూ 240 లారీలు ఎగుమతులు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాయి. రాష్ట్రంలో ఆక్వాకు సంబంధించి ప్రాసెసింగ్ ప్లాంట్లు 106, ఐస్ ప్లాంట్లు 258, ఏడాదికి 60,000 మినియన్ల ఉత్పత్తి చేసే రొయ్యల హేచరీస్, ప్రతి రోజూ 9,750 టన్నుల ఉత్పత్తి చేసే మేతల ఫ్యాక్టరీలు 429, ఆక్వాషాపులు 1104, ఆక్వా ల్యాబ్లు 237 ఉన్నాయి. -
పోలీసు సిబ్బందికి వైద్య పరీక్షలు
ఏలూరు టౌన్: జిల్లాలో పోలీస్ సిబ్బంది ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహిస్తున్నామనీ, సిబ్బంది సంక్షేమం, ఆరోగ్య భరోసాకు ఉచిత మెగా హెల్త్ చెకప్ ఏర్పాటు చేసినట్లు ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ చెప్పారు. ఏలూరు పత్తేబాదలోని కామినేని హాస్పిటల్లో ప్రత్యేకంగా పోలీస్ సిబ్బందికి ఉచితంగా హెల్త్ చెకప్ క్యాంపును ఆయన ప్రారంభించారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు, పోలవరం పోలీస్ సబ్ డివిజన్లలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో పని చేస్తోన్న పోలీస్ సిబ్బంది, ఏఆర్ సిబ్బంది, మినిస్టీరియల్ సిబ్బంది, హోంగార్డులకు ఆరోగ్య పరీక్షలు ఉచితంగా అందించేలా చర్యలు చేపట్టారు. బీపీ, షుగర్, ఈసీజీ, లివర్ ఫంక్షనింగ్ టెస్ట్, కిడ్నీ టెస్ట్, లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్, విటమిన్ డీ, బీ12, సీబీపీ, వంటి ముఖ్యమైన పరీక్షలు నిర్వహించారు. ఈ నెల 30 వరకూ ప్రతి రోజూ 100మంది చొప్పున 1969 మంది సిబ్బందికి వైద్య పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశామన్నారు. కార్యక్రమంలో కామినేని హాస్పిటల్స్ డాక్టర్ కొడాలి రామ్ ప్రసీన్, ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్కుమార్, ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, ఆర్ఐ పవన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కుమారుడిపై తల్లి ఫిర్యాదు
ముదినేపల్లి రూరల్: మద్యం మత్తులో తనపై దాడి చేస్తున్నాడంటూ కుమారుడిపై తల్లి స్థానిక పోలీసుస్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం మండలంలోని వాడవల్లికి చెందిన నిమ్మగడ్డ నాగేశ్వరరావు, మేరమ్మ దంపతులకు నలుగురు కుమారులున్నారు. తండ్రి నాగేశ్వరరావు అనారోగ్యంతో మంచంపై ఉన్నాడు. చివరి కుమారుడైన విజయకుమార్ భార్యను వదిలేసి తల్లిదండ్రుల వద్దనే ఉంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి విజయకుమార్ మద్యం మత్తులో కత్తిపీటతో తనపై దాడి చేసినట్లు మేరమ్మ ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు ఫిర్యాదు చేయగా ఎస్సై వీరభద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ అధికారుల బదిలీలు ఏలూరు (ఆర్ఆర్పేట): తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలో పని చేస్తున్న అధికారులను బదిలీ చేస్తూ ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వీతేజ్ ఇమ్మడి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల నిర్వహించిన పదోన్నతుల్లో నిడదవోలు విద్యుత్ రెవెన్యూ కార్యాలయానికి జేఓగా నియమితులైన సీహెచ్ శ్రీనివాసరావును పరిపాలనా సౌలభ్యం కోసం రామచంద్రాపురం విద్యుత్ రెవెన్యూ కార్యాలయానికి బదిలీ చేశారు. అలాగే రామచంద్రాపురం విద్యుత్ రెవెన్యూ కార్యాలయానికి ఇటీవల పదోన్నతిపై వెళ్ళిన ఎంవీఎస్ఎస్వీ ప్రసాద్ను నిడదవోలు విద్యుత్ రెవెన్యూ కార్యాలయానికి బదిలీ చేశారు. జెడ్పీ ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీ ఇరగవరం : మండలంలోని ఇరగవరం జిల్లా పరిషత్ హైస్కూల్ను బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ స్కూలు ఆవరణ అంతా తిరిగి పరిశీలించారు. విద్యార్థులు అమ్మ పేరుతో నాటేందుకు సిద్ధపరిచిన మొక్కలను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం పథకంలో తయారు చేసే వంటశాలకు వెళ్లి వండిన వంటకాలను, స్టాక్ రూములో ఉన్న స్టాకును పరిశీలించారు. గురువారం నిర్వహించే మెగా పేరెంట్స్ టీచర్స్ డే మీట్ కార్యక్రమం పండుగ వాతావరణంలో నిర్వహించాలని ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీఓ ఖతీబ్ కౌసర్ భానో, తహసీల్దార్ ఎం.సుందర్ రాజు ఉన్నారు. విద్యాసంస్థల బస్సులపై 18 కేసులు ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లావ్యాప్తంగా బుధవారం వాహన తనిఖీ అధికారులతో విద్యా సంస్థల బస్సులను తనిఖీ చేయించినట్టు ఏలూరు ఇన్చార్జ్ రవాణా శాఖాధికారి ఎస్బీ శేఖర్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా మొత్తం వివిధ విద్యా సంస్థలకు చెందిన 63 బస్సులను తనిఖీ చేసినట్టు తెలిపారు. వాటిలో పన్నులు చెల్లించని, ఇన్సూరెన్స్, పొల్యూషన్, డ్రైవింగ్ లైసెన్స్ లేని, పలు నిబంధలను అతిక్రమించిన 18 బస్సులపై కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. జిల్లాలో విద్యా సంస్థలు పూర్తి స్థాయిలో ప్రారంభమైన కారణంగా విద్యా సంస్థల యాజమాన్యాలు నిర్వహించే బస్సులన్నీ నిబంధనలకు లోబడి తిప్పాలని, అన్ని బస్సులు పూర్తి ఫిట్నెస్తో, ఇన్సూరెన్స్తో, డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన డ్రైవర్లతో మాత్రమే తిప్పాలని సూచించారు. -
చికిత్స పొందుతూ యువకుడి మృతి
చింతలపూడి: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు మృతి చెందినట్లు ఎస్సై సతీష్కుమార్ బుధవారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లింగంపాలెం గ్రామానికి చెందిన తులిమెల్లి త్రినాథ్ (24) చింతలపూడి వైష్ణవి మెడికల్ షాప్లో సేల్స్మేన్గా పని చేస్తున్నాడు. ఈ నెల 5న రాత్రి మెడికల్ షాప్ కట్టి ద్విచక్రవాహనంపై స్వగ్రామం లింగపాలెం బయలుదేరాడు. చింతలపూడి బైపాస్ రోడ్డు వద్ద పెట్రోల్ బంక్ సమీపంలో బైక్ అదుపుతప్పి గుంతలో పడిపోవడంతో తలకు బలమైన గాయమైంది. స్థానికులు యువకుడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించి మెరుగైన చికిత్సకోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ త్రినాథ్ చనిపోవడంతో మృతుని తండ్రి తులిమెల్లి సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. భార్య, పిల్లలు కనిపించడం లేదని భర్త ఫిర్యాదు భీమవరం: తన భార్య బెల్లం రమ్య, తన పిల్లలు కన్పించడం లేదంటూ భీమవరం మండలం రాయలం గ్రామానికి చెందిన బొల్లం సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసినట్లు భీమవరం టూటౌన్ ఎస్సై రామరావు చెప్పారు. వివరాల ప్రకారం ఈ నెల 5న సుబ్బారావు పనికివెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి భార్య, పిల్లలు కన్పించలేదు. దీంతో చుట్టుపక్కల, బంధువుల ఇళ్ల వద్ద వెతికిన ప్రయోజనం లేకపోవడంతో సుబ్బారావు పోలీసులను ఆశ్రయించాడు. -
641 కిలోల గంజాయి ధ్వంసం
భీమవరం : జిల్లా వ్యాప్తంగా వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న సుమారు 641 కిలోల గంజాయిని ధ్వంసం చేసినట్లు జిల్లా పోలీసు కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు బుధవారం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆధ్వర్యంలో జిల్లాలోని 23 పోలీస్ స్టేషన్ల పరిధిలో 64 కేసుల్లో సుమారు 641 కిలోల గంజాయిని బుధవారం గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం కొండవీడు గ్రామపరిధిలోని జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ వద్ద ధ్వంసం చేసినట్లు తెలిపారు. ధ్వంసం చేసిన గంజాయిని ముందుగా ఈనెల 8న భీమవరం పోలీస్ హెడ్ క్వార్టర్స్లోని రిసెప్షన్ హాల్లో మధ్యవర్తుల సమక్షంలో కేసుల వారీగా తూకం వేసి పరిశీలించి దానిని ప్రత్యేక కవర్లు, సంచులలో పెట్టి సీలు వేసి పోలీసు బందోబస్త్ మధ్య గుంటూరు తరలించినట్లు పేర్కొన్నారు. -
ఆర్టీసీ ఖాళీ స్థలాల్లో వ్యాపారాలతో అభివృద్ధి
ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆర్టీసీకి సంబంధించి ఖాళీగా ఉన్న స్థలాలను ఔత్సాహిక వ్యాపారవేత్తలకు లీజుకు ఇవ్వడం ద్వారా వారి ఆర్థిక అభివృద్ధికి ఆర్టీసీ కృషి చేస్తోందని ఏలూరు జిల్లా ప్రజా రవాణా అధికారి షేక్ షబ్నం అన్నారు. బుధవారం స్థానిక జిల్లా ప్రజా రవాణా అధికారి కార్యాలయంలో ఔత్సాహిక వ్యాపారులతో ఆమె అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె జిల్లాలోని కలిదిండి, భీమవరం, ఆకివీడు ప్రాంతాల్లోని ఆర్టీసీ ఖాళీ స్థలాలను 15 సంవత్సరాలకు లీజుకు ఇవ్వడానికి టెండర్లు ఆహ్వానించామన్నారు. ఈ టెండర్లకు సంబంధించిన వివరాలు, లీజుకు ఉండే నియమ నిబంధనలను వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు డిపో మేనేజ్ బీ. వాణి, డీఈ బీవీ రావు, ఏఈ సీహెచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఉర్దూ పాఠశాల వివాదంపై ఆర్జేడీ విచారణ ఏలూరు (ఆర్ఆర్పేట): నగరంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ (మాకా) ఉర్దూ పాఠశాల, తూర్పువీధి ఉర్దూ పాఠశాలల్లో జరుగుతున్న వివాదాలపై పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ జి.నాగమణి బుధవారం విచారణ నిర్వహించారు. తొలుత ఆ రెండు పాఠశాలల్లోని ఉపాధ్యాయులతో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి పాఠశాలలోనూ రెండు మాధ్యమాల్లో విద్యాబోధన చేయాల్సిన పరిస్థితి ఉందని, ఈ రెండు పాఠశాలల్లో సైతం అదే విధానం అమలు చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు అర్థమయ్యే మాధ్యమంలోనే ఉపాధ్యాయులు బోధించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మేరకు ఉపాధ్యాయుల నుంచి రెండు మాధ్యమాల్లో బోధిస్తామని లేఖలు రాయించుకున్నారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకుంటామని ఈ విచారణలో జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటలక్ష్మమ్మ పాల్గొన్నారు. రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి భీమవరం: ఉండి మండలం చెరుకువాడ వద్ద గుర్తుతెలియని రైలు నుంచి జారిపడి గాయపడి చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందినట్లు భీమవరం రైల్వే ఎస్సై ఎం.సుబ్రహ్మణ్యం బుధవారం చెప్పారు. ఈ నెల 1న గుర్తు తెలియని 50 ఏళ్ల వ్యక్తి రైలు నుంచి జారిపడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని చికిత్స కోసం ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్చగా బుధవారం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. -
ఆధ్యాత్మిక చింతనలో అతివలు
ద్వారకాతిరుమల: మానసిక ఒత్తిడిని దూరం చేసి ప్రశాంతతనిచ్చేది ఆధ్యాత్మిక చింతన. ఆ దిశగా అడుగులు వేస్తూ తమ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, దేవుని సేవలో తరిస్తున్నారు వందలాది మంది మహిళలు. బృందాలుగా ఏర్పడి, దేవాలయాల్లో భగవద్గీత పారాయణలు చేస్తున్నారు. అందులో భాగంగా తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ద్వారకాతిరుమల శ్రీవారి సన్నిధిలో శ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ శిష్య బృందం భగవద్గీత పారాయణం, స్వామివారి గానామృతం చేశారు. ఇందులో రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసిన 500 మంది మహిళలు పాల్గొన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కామవరపుకోట మండలం జలపవారిగూడెంకు చెందిన కామిశెట్టి రాంబాబు, ఉషారాణి దంపతుల ఆధ్వర్యంలో సామాన్య భక్తులు సైతం భాగస్వాములయ్యారు. దూరాన్ని లెక్కచేయకుండా.. ఏలూరు జిల్లాకు చెందిన మహిళలతో పాటు బెంగళూరు, హైదరాబాద్, ఖమ్మం, వైర, సత్తుపల్లి, అశ్వారావుపేట, భద్రాచలం, పాల్వంచ, అలాగే విశాఖపట్నం, నూజివీడు, తిరువూరు, విసన్నపేట, భీమవరం తదితర ప్రాంతాలకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మహిళా భక్తులకు శ్రీవారి దేవస్థానం ఈఓ ఎన్వీ సత్యనారాయణ మూర్తి ఆదేశాల మేరకు స్వామి వారి ఉచిత దర్శనంతో పాటు, అన్నప్రసాదాన్ని అందజేశారు. ఏర్పాట్లను ఆలయ ఏఈఓలు పి.నటరాజారావు, రమణరాజు, సూపరింటెండెంట్లు కోటగిరి కిషోర్, గోవాడ సుబ్రహ్మణ్యం, దుర్గాప్రసాద్ పర్యవేక్షించారు. శ్రీవారి క్షేత్రంలో భగవద్గీత పారాయణం, స్వామివారి గానామృతం రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేస్తున్న మహిళలు 500 మందితో జరిగిన కార్యక్రమాలు సంతృప్తినిచ్చింది ఆన్లైన్లో భగవద్గీత పారాయణం నేర్చుకున్నాను. తొలిసారిగా శ్రీవారి సన్నిధిలో, అది కూడా తొలి ఏకాదశి రోజున భగవద్గీత పారాయణం, గానామృతం చేయడం సంతృప్తినిచ్చింది. ఈ కార్యక్రమాల నిర్వహణకు దేవస్థానం అధికారులు పూర్తి సహకారాన్ని అందించారు. – కామిశెట్టి ఉషారాణి, కామవరపుకోట మండలం జలపవారిగూడెం ప్రశాంతత లభిస్తుంది ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటే మానసిక ప్రశాంతత లభిస్తుంది. అందుకే హైదరాబాద్ నుంచి వచ్చాను. తొలి పండుగ నాడు అధిక సమయం శ్రీవారి సన్నిధిలో గడపడం, ఆ స్వామివారిని దర్శించుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. – కొమ్మూరి గాయత్రి, హైదరాబాద్. ఏడు వందల శ్లోకాలు కంఠస్థం భగవద్గీత పారాయణను ఆన్లైన్ ద్వారా నేర్చుకున్నాను. గోల్డ్మెడల్ కూడా వచ్చింది. శ్రీవారి సన్నిధిలో జరిగిన ఈ కార్యక్రమంలో 700 శ్లోకాలు కంఠస్థం చేసిన సుమారు 200 మంది గోల్డ్మెడలిస్టులం పాల్గొన్నాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరంతరాయంగా పారాయణం, గానామృతం చేశాం. – సెనగపల్లి పూర్ణిమ, విజయవాడ -
వరద 'గోదావరి'
సాక్షి ప్రతినిధి, ఏలూరు: వరద గోదావరి మళ్లీ పోటెత్తుతుంది. ఎగువ రాష్ట్రాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు గోదావరిలో జలకళ మొదలైంది. గత వారం రోజులుగా రోజుకు సగటున 2 లక్షల క్యూసెక్కుల నీరు పోలవరం ప్రాజెక్టు నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో తీవ్రత మరింత పెరుగుతుందని దానికనుగుణంగా 9.32 లక్షల క్యూసెక్కుల నీరు 15 కల్లా వస్తుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు వరద ప్రవాహంతో ముంపు మండలాల్లో అలజడి మొదలైంది. గోదావరికి వరదల సీజన్ ప్రారంభమైంది. వాస్తవానికి జూలై మొదటి వారం నుంచి వరద హడావుడి ప్రారంభమై ఆగస్టు వరకు రెండు సార్లు ముంపు మండలాల్ని అతలాకుతలం చేస్తోంది. ఈ ఏడాది వర్షాలు కొంత ఆలస్యం కావడం, ఇతర కారణాలతో వరద ఉధృతి గతంతో పోల్చితే తక్కువగానే ఉంది. ఈ నెల 2 నుంచి ప్రారంభమైన వరద నీరు క్రమేపీ పెరుగుతూ వచ్చింది. మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల్లో వారం రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురవడంతో గోదావరి ఉపనది శబరి పోటెత్తుతుంది. ఈ క్రమంలో ఈనెల 2న 1.06 లక్షల క్యూసెక్కుల నీరు పోలవరం స్పిల్వే నుంచి దిగువకు విడుదల చేశారు. 5వ తేదీ నాటికి 2.09 లక్షల క్యూసెక్కులు, 9 నాటికి 2.27 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. వరద పోటెత్తే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అధికారులు అంచనా వేశారు. ఈ నెల 15 కల్లా 9,32,288 క్యూసెక్కుల నీరు పోలవరానికి చేరుతుందని, అదే విధంగా భద్రాచలం వద్ద 43 అడుగుల నీటిమట్టంతో మొదటి ప్రమాదహెచ్చరిక జారీ చేయవచ్చని చెబుతున్నారు. ఈ నేనపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. దిగువకు విడుదలవుతున్న నీటిని పోలవరం నుంచి పూర్తి స్థాయిలో డిశ్చార్జ్ చేస్తున్నారు. ముంపు మండలాల్లో భయం.. భయం పోలవరం ముంపు మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడుకు వరద ప్రమాదం పొంచి ఉంది. ఈ క్రమంలో 9.32 లక్షల క్యూసెక్కులు దాటితే మొదటి ప్రమాద హెచ్చరికకు రహదారులపైకి నీరు చేరడం, 11.44 లక్షల క్యూసెక్కులు దాటితే రెండవ ప్రమాద హెచ్చరికకు రహదారులు నీటముగి రాకపోకలు నిలిచిపోయి పదుల సంఖ్యలో గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్ళలోకి నీరు చేరుతుంది. 14.26 లక్షల క్యూసెక్కులు దాటితే మూడో ప్రమాద హెచ్చరికతో రెండు మండలాల్లో 18 గ్రామాలు పూర్తిగా జలదిగ్భందంలోకి వెళ్తాయి. ఈ క్రమంలో అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కే.వెట్రిసెల్వి ఆదేశించారు. కొనసాగనున్న ఉధృతి బుధవారం మధ్యాహా్ననికి భద్రాచలంలో 22.40 అడుగుల మేర నీటిమట్టం ఉంది. ఎగువ నుంచి ఇన్ఫ్లో ఎక్కువగా ఉండటంతో గురువారానికి 3 నుంచి 4 అడుగులు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 1986లో 75.60 అడుగుల మేర నీటి మట్టం ఉండటంతో 27 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలైంది. ఇంతవరకు అత్యధికంగా వచ్చిన వరద ఇదే. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో అత్యధిక గ్రామాలు భారీగా నష్టపోయాయి. ఆ తరువాత 2022లో 71.30 అడుగుల నీటిమట్టంతో 21.78 లక్షల క్యూసెక్కుల నీరు పోలవరానికి ఒకేసారి విడుదలైంది. ఈ క్రమంలో ముంపు మండలాలతో పాటు పశ్చిమలోని లంక గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. 2022లో జూలై 6న, 2023లో జూలై 20న 2024 జూలై 19న వరదలు ప్రారంభమై సుమారు వారం రోజులు పాటు ఇన్ఫ్లో కొనసాగింది. -
పునరావాస కేంద్రం పరిశీలన
కుక్కునూరు: గోదావరి వరదల దృష్ట్యా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశాల మేరకు మంగళవారం పలువురు అధికారులు మండలంలోని దాచారం ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన పునరావాస సహాయక కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వరద బాధితులకు పునరావాస కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు అందేలా చర్యలు చేపట్టారు. దాచారం ఆర్ అండ్ ఆర్ కాలనీని సందర్శించిన వారిలో పంచాయతీరాజ్ ఎస్ఈ కె.శ్రీను, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ జి.త్రినాథ్బాబు, గృహనిర్మాణ శాఖ పీడీ జి.సత్యనారాయణ తదితరులున్నారు. ఉపాధ్యాయులను నియమించాలి ఏలూరు (ఆర్ఆర్పేట): నగరంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ పాఠశాలలో ప్రస్తుతం ఎస్ఏ ఉర్దూ, ఎస్ఏ గణితం, ఎస్ఏ పీఎస్ ఉపాధ్యాయులు లేనందున వెంటనే అర్హత కలిగిన ఉపాధ్యాయులను నియమించాలని మంగళవారం జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మకు వినతిపత్రం సమర్పించారు. కొన్ని పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు పూర్తిస్థాయిలో అందనందున పూర్తిస్థాయిలో చేరేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో పాటు తూర్పువీధి ఉర్దూ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల, తల్లిదండ్రుల కోరిక మేరకు ఇంగ్లీషు మీడియంలోనే బోధన కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. డీఈఓకు వినతిపత్రం సమర్పించిన వారిలో ఏపీటీఎఫ్ ఆడిట్ కమిటీ సభ్యుడు ఎస్కే రంగావలి, రూరల్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రామశేషు కుమార్, శ్రీనివాస్ తదితరులున్నారు. బంద్ను జయప్రదం చేయాలి భీమడోలు: కార్మికులను బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 9న దేశ వ్యాప్తంగా తలపెట్టిన భారత్ బంద్ను విజయవంతం చేయాలని సీఐటీయు జిల్లా అధ్యక్షుడు ఆర్.లింగరాజు కోరారు. పూళ్ల రై్స్ మిల్లు వర్కర్లతో కలిసి గోడ పత్రికలు, కరపత్రాలను మంగళవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అసంఘటిత రంగంలో పని చేస్తున్న కోట్లాది మంది కార్మికులు కనీస వేతనాలు లేక పీఎఫ్, ఈపీఎఫ్ పింఛన్ ప్రమాద బీమా లాంటివి లేనందున అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించాలన్నారు. పరిశ్రమల్లో పని చేసే కార్మికులకు భద్రత కల్పించాలని కోరారు. వివిధ శాఖల్లో పని చేసే ఉద్యోగులు, ఆశావర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు వెంకటేశ్వరరావు, బెండి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ముగ్గురు అధికారులకు రాష్ట్ర స్థాయి అవార్డులు భీమవరం (ప్రకాశంచౌక్): పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ముగ్గురు జిల్లా అధికారులు జూలై 9న విజయవాడలో గవర్నర్ చేతుల మీదుగా రెడ్క్రాస్ అవార్డులు అందుకోనున్నారు. అవార్డులు పొందిన వారిలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, గ్రామీణ అభివద్ధి శాఖ అధికారి ఎం.ఎస్.ఎస్.వేణుగోపాల్, మాజీ విద్యా శాఖ అధికారి ఆర్.వెంకటరమణ ఉన్నారు. వీరు 2022–23, 2023–24 ఆర్థిక సంవత్సరాల్లో రెడ్క్రాస్ కోసం రూ.5 లక్షలకుపైగా నిధులు సమీకరించారన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, రెడ్క్రాస్ అధ్యక్షురాలు చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, రెడ్క్రాస్ చైర్మన్ డా.ఎం.ఎస్.వి.ఎస్.భద్రిరాజు, వైస్ చైర్మన్ వబిలిసెట్టి కనకరాజు తదితరులు అభినందనలు తెలిపారు. -
మహిళ దారుణ హత్య
కలిదిండి(కై కలూరు): భార్య వివాహేతర సంబంధానికి ఎదురింటి మహిళ సహకరిస్తోందనే అనుమానంతో వివాహితను హత్య చేసిన ఘటన కలిదిండి మండలం పోతుమర్రు శివారు గొల్లగూడెంలో మంగళవారం జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కట్టా రామాంజనేయులు, కృష్ణవేణి భార్యభర్తలు. వీరికి ఇద్దరు సంతానం. రామాంజనేయులు చెరువులు సాగు చేస్తున్నాడు. ఇంటి ఎదురుగా నంగెడ్డ వరలక్ష్మీదేవీ(37) భర్తతో కలసి జీవిస్తోంది. ఆమె భర్త ఆటో నడపుతుంటాడు. గ్రామానికి చెందిన కట్టా నాగమల్లేశ్వరరావు(48) తరుచుగా రామాంజనేయులు ఇంటి వద్దకు వస్తున్నాడు. ఆ సమయంలో ఎదురింటి వరలక్ష్మీదేవితో మాట్లాడేవాడు. రామాంజనేయులు తన భార్య కృష్ణవేణికి నాగమల్లేశ్వరరావుతో వివాహేతర సంబంధం ఉందని, దీనికి మధ్యవర్తిగా వరలక్ష్మీదేవి వ్యవహరిస్తోందని అనుమానించాడు. మంగళవారం మధ్యాహ్నం వరలక్ష్మీదేవి కూలి పనుల నుంచి ఇంటికి వచ్చింది. ఆమె భర్త కుమార్తె టీసీ నిమిత్తం వెంకటాపురం స్కూల్ వద్దకు వెళ్ళాడు. వరలక్ష్మి ఇంట్లో ఒంటరిగా భోజనం చేస్తోంది. ఇదే అదనుగా వెళ్ళి కత్తితో ఆమె మెడపై నరికి రామాంజనేయులు పరారయ్యాడు. ఆమె రక్తపు మడుగులో కొట్టుకుని మరణించింది. కొన్ని గంటలకు భర్త వచ్చి చూసేసరికి అప్పటికే ఆమె మరణించింది. భర్త ఫిర్యాదుపై ఏలూరు డీఎస్పీ శ్రావణ్కుమార్, రూరల్ సర్కిల్, టౌన్ సీఐలు వి.రవికుమార్, పి.కృష్ణ, ఎస్సైలు వెంకటేశ్వరరావు, రాంబాబు, వీరభ్రదరావు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. డీఎస్పీ మాట్లాడుతూ భార్యపై అనుమానం.. ఎదురింటి వరలక్ష్మీదేవి అందుకు సహకరిస్తోందనే హత్యకు పాల్పడినట్లు చెప్పారు. నిందితుడిని త్వరలో పట్టుకుంటామన్నారు. మృతదేహాన్ని కై కలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భార్య వివాహేతర సంబంధానికి సహకరిస్తోందని ఘాతుకం కలిదిండి మండలం గొల్లగూడెంలో ఘటన -
సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన
ఏలూరు (ఆర్ఆర్పేట): ఎంటీఎస్, హెచ్ఆర్ పాలసీ, సమ్మె అగ్రిమెంట్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఏపీ సమగ్ర శిక్షా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా జిల్లా జేఏసీ చైర్మన్ కే.వినోద్ కుమార్ మాట్లాడుతూ విద్యా శాఖ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులకు పని భారం తగ్గించాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, ఈపీఎఫ్ వర్తింప చేసి, హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మెడికల్ లీవులు, పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా ఇచ్చిన హామీలను మాత్రమే అమలు చేయాలని తాము అడుగుతున్నామని స్పష్టం చేశారు. -
బాబు మోసాన్ని ఇంటింటికీ వివరించాలి
ఇరగవరం: ప్రజలకు మోసపూరిత హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి నాయకులు ఏ ఒక్క హమీ కూడా నేరవేర్చకుండా ప్రజలను దగా చేశారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఇరగవరం మండలంలోని కొత్తపాడు గ్రామంలో శ్రీబాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీశ్రీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మహిళలను, యువతను, ఉద్యోగులను మోసం చేశారన్నారు. చంద్రబాబు మోసపూరిత హమీలపై క్యూఆర్ కోడ్తో కూడిన బ్రోచర్ను ఇంటింటికీ అందించాలన్నారు. ప్రజలను మోసం చేయడలో చంద్రబాబును మించిన వారు లేరన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కొప్పిశెట్టి అలివేలు మంగతాయారు, మాజీ డీసీఎంస్ డైరెక్టర్ పెన్మెత్స సుబ్బరాజు, పెన్మెత్స రాంభద్ర రాజు, పార్టీ మండల అధ్యక్షుడు కొప్పిశెట్టి దుర్గారావు, సత్తి వెంకట రెడ్డి, గుడిమెట్ల వీర్రెడ్డి, మేట్ల కిరణ్మయి, వీరమల్లు ఫణీంద్ర, కోవ్వూరి శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ బొక్కా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
వరద ముప్పును ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు
వేలేరుపాడులో కలెక్టర్ సమీక్ష వేలేరుపాడు: గోదావరి వరదలు ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ కె.వెట్రిసెల్వి పేర్కొన్నారు. వరదలు ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. వేలేరుపాడు తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం వరదలపై ముందస్తు ప్రణాళిక సమావేశంలో అన్ని శాఖల అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ రానున్న 3 రోజుల్లో భద్రాచలం నుంచి గోదావరి వరద నీరు 9 లక్షల క్యూసెక్కులపైగా పైగా దిగువకు వచ్చే అవకాశం ఉందని, పెద్దవాగు, ఎద్దువాగుల నుంచి కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు వరద ముంపు ప్రభావం పొంచి ఉన్నందున, ఆయా ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రణాళిక రూపొందించాలన్నారు. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీకి ముందుగానే సహాయక చర్యలకు సిద్ధం కావాలన్నారు. ముంపు ప్రమాద ప్రాంతాల్లో గర్భిణులు, పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కొయిదా వంటి కొండ ప్రాంతాల గ్రామాల ప్రజలకు, వరద ముంపు ప్రభావిత ప్రాంతాల ప్రజలకు టార్పాలిన్ల పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. 3 నెలలకు సరిపడా నిత్యావసరాలు సిద్ధం చేయాలని పౌర సరఫరాల శాఖాధికారులను కలెక్టర్ ఆదేశించారు. -
మరపురాని మహానేత
బుధవారం శ్రీ 9 శ్రీ జూలై శ్రీ 2025సాక్షి ప్రతినిధి, ఏలూరు: జనహృదయ నేత దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి 76వ జయంతిని ఏలూరు జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా అభివృద్దికి ఆ మహానేత చేసిన సేవలు స్మరించుకుని నివాళులర్పించారు. వాడవాడలా వైఎస్సార్ విగ్రహాలకు పూల మాలలు వేసి కేక్లు కట్ చేశారు. రక్తదాన, అన్నదాన శిబిరాలతో పాటు చీరలు, దుప్పట్లు, పండ్ల పంపిణీ సేవా కార్యక్రమాలతో అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ పేదల సంక్షేమమే పరమావధిగా ఆయన పాలనను కొనియాడారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఇందిరమ్మ ఇళ్లు, 108 వంటి పథకాల లబ్ధితో పేదల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. రాజన్న స్మృతిలో.. ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ నేతృత్వంలో ఏలూరులో 10 ప్రాంతాల్లో 8 వేల మందికి అన్నదానం నిర్వహింశారు. నగరంలోని అన్ని ప్రధాన సెంటర్లల్లో ఉన్న మహానేత విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పండ్లు పంపిణీ చేయడంతో పాటు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ● నూజివీడు నియోజకవర్గంలో వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు. నూజివీడులోని చినగాంధీబొమ్మ సెంటరులో వైఎస్సార్ జయంతి వేడుకలు నియోజకవర్గ ఇన్చార్జి మేక వెంకట ప్రతాప అప్పారావు ఆధ్వర్యంలో జరిగాయి. ఆయన కేక్ కట్ చేసి, అనంతరం ఏరియా ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. ● దెందులూరులో నియోజకవర్గ ఇన్ఛార్జి కొఠారు అబ్బయ్యచౌదరి క్యాంపు కార్యాలయంలో, పెదపాడు మండలం అప్పనవీడులో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ● పోలవరం నియోజకవర్గంలోని బుట్టాయగూడెంలో వైఎస్సార్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సీహెచ్సీలో రోగులకు పాలు, పళ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. కొయ్యలగూడెం, టీ.నర్సాపురం, జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం మండలాల్లో జరిగిన వైఎస్సార్ జయంతి కార్యక్రమాల్లో పార్టీ నాయకులు పాల్గొన్నారు. ● ఉంగుటూరు నియోజకవర్గం గణపవరంలో నియోజకవర్గ ఇన్చార్జి పుప్పాల వాసుబాబు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. నిడమర్రు, భీమడోలు, ఉంగుటూరు మండలాల్లో జరిగిన కార్యక్రమాల్లో మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ● చింతలపూడి నియోజకవర్గంలోని చింతలపూడి, లింగపాలెం, జంగారెడ్డిగూడెం కామవరపుకోటల్లో జరిగిన వైఎస్సార్ జయంతి కార్యక్రమాల్లో నియోజకవర్గ ఇన్చార్జి కంభం విజయరాజు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ● కై కలూరు నియోజకవర్గం కై కలూరులో వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కై కలూరు సంత మార్కెట్ వద్ద వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కై కలూరు నియోజకవర్గ ఇన్చార్జి దూలం నాగేశ్వరరావు కుమారుడు వినయ్ కేక్ కట్ చేశారు. రాష్ట్ర ముదిరాజుల సంఘ అధ్యక్షుడు కోమటి విష్ణువర్ధన్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. న్యూస్రీల్ ఊరూరా వైఎస్సార్కు ఘన నివాళులు అన్ని నియోజకవర్గాల్లో ఘనంగా జయంతి వేడుకలు ఏలూరులో 10 ప్రాంతాల్లో అన్నదానం దెందులూరులో రక్తదాన శిబిరం -
కొబ్బరి ధర అదుర్స్
దెందులూరు: గత నాలుగైదేళ్లుగా సరైన ధర లేక నిరాశ చెందిన కొబ్బరి రైతులకు ఈ ఏడాది పంట పండింది. కొబ్బరి బొండాలకు మంచి ధర పలకడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 33 వేల ఎకరాల్లో కొబ్బరి తోటల సాగు జరుగుతుండగా దిగుబడిలో 60 శాతాన్ని హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తారు. మిగిలిన 40 శాతం దిగుబడిన దేవాలయాలకు, తాగడానికి ఉపయోగిస్తున్నారు. ఒక ఎకరానికి రూ.50 వేలు నుంచి రూ.60 వేలు సాగు ఖర్చు అవుతుండగా 9 వేల కొబ్బరికాయలు దిగుబడి లభిస్తుంది. ఈ ఏడాది కొబ్బరికాయ ధర రూ.17 పలకడంతో కొబ్బరి రైతులు లాభాలను చూస్తున్నారు. దీనికితోడు వారు అంతర పంటలు సాగు చేస్తున్నారు. కొబ్బరిలో అంతరపంటలుగా కోకో తోటలు, మిరియాలు, జాజీ సాగు చేసి అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. అలాగే ఈ ఏడాది చీడపీడల వ్యాధుల ప్రభావం కూడా లేకపోవడం రైతులకు కలిసివచ్చింది. జిల్లాలో 200 ఎకరాల్లో మిరియాలు, 36 వేల ఎకరాల్లో కోకో, జాజి 15 ఎకరాల్లో అంతర పంటలుగా రైతులు పండిస్తున్నారు. కోకో నట్ ఫారం రైతులకు వరం కొబ్బరి విస్తరణ పథకంలో భాగంగా పెదవేగి మండలం వేగివాడలో కేంద్ర ప్రభుత్వం కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోకోనట్ ఫారం కొబ్బరి రైతులకు వరంగా మారింది. ఈ ఫారంలో కొబ్బరి సాగుకు అనువైన ఈస్ట్ కోస్ట్, వెస్ట్ కోస్ట్, మల్కన్ గ్రీన్ చౌగాన్ ఆరెంజ్ వంటి రకాల మొక్కలను రైతులకు నిర్ణీత ధరకు విక్రయిస్తున్నారు. మొక్కలను బయట కొనుగోలు చేసి ఈ ఫారంలో బిల్లు చూపించి ఆయా గ్రామాల్లో రైతు సేవ కేంద్రంలో నమోదు చేసుకున్న 50 శాతం రాయితీ ఇస్తున్నారు. యాజమాన్య పద్ధతులు పాటిస్తే మరిన్ని లాభాలు జిల్లాలో కొబ్బరి తోటల సాగు లాభదాయకంగా ఉంది. గత నాలుగైదేళ్లుగా పోలిస్తే ఈ ఏడాది సంతృప్తికరమైన దిగుబడులు వచ్చి మంచి ధర కూడా పలకడంతో లాభాలను ఇచ్చింది. రైతులు ఉద్యానవన శాఖ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు పాటించి యాజమాన్య పద్ధతులు పాటిస్తే మరిన్ని లాభాలు సాధించవచ్చు. – మోహనరావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి -
సమన్వయంతో కేసుల సత్వర పరిష్కారం
ఏలూరు (టూటౌన్): మధ్యవర్తులు తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి పిలుపునిచ్చారు. మంగళవారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని శిక్షణ పొందిన మధ్యవర్తులతో ఒకరోజు దిశా నిర్దేశ (ఓరియంటేషన్) కార్యక్రమాన్ని ఏలూరు బార్ అసోసియేషన్ హాలు నందు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి మాట్లాడుతూ గౌరవ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మధ్యవర్తిత్వము ద్వారా కేసుల పరిష్కారానికి 90 రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని, అందుకు శిక్షణ పొందిన మధ్యవర్తులకు నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి ఒక రోజు దిశా నిర్దేశ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. కక్షిదారులకు త్వరితగతిన న్యాయ పరిష్కారం అందించే దిశగా అందరూ కృషి చేయాలని కోరారు. రెండవ అదనపు జిల్లా జడ్జి యు ఇందిరా ప్రియదర్శిని మాట్లాడుతూ ఇరు పార్టీలను సమన్వయం చేసి మధ్యవర్తిత్వం నిర్వహించడం ద్వారా కేసులను త్వరితగతిన పరిష్కరించవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్ ప్రసాద్, ఏలూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోనె సీతారాం, జాతీయ న్యాయ సేవాధికార సంస్థ రిసోర్స్ పర్సన్ సుదర్శన సుందర్, విజయ కమల, న్యాయవాదులు పాల్గొన్నారు. -
పైసలిస్తేనే మీటర్లు..!
బ్యాంక్ కాలనీలో రూ.10 వేలు డిమాండ్ తణుకు బ్యాంక్ కాలనీలో ఒక భవనానికి రెండు మీటర్లు ఇచ్చే క్రమంలో గత నెలలో రూ.10వేలు డిమాండ్ చేసిన అవినీతి భాగోతం ప్రస్తుతం తణుకులో చర్చనీయాంశమైంది. మీటరుకు రూ.5 వేలు చొప్పున రెండు మీటర్లకు రూ. 10 వేలు ఇవ్వాలన్న డిమాండ్ను వినియోగదారుడు గట్టిగానే ఎదుర్కొనడంతో మెల్లగా జారుకున్నారు. పైగా ఈ వసూళ్ల పర్వంలో నేను ఒక్కడినే తినేయనని మాపై అధికారులకు కూడా ఇవ్వాలంటూ ఘరానాగా వసూళ్లకు దిగుతుండడం శోచనీయం. అపార్టుమెంట్లలో ట్రాన్స్ఫార్మర్లు,, మీటర్లు ఇచ్చే క్రమంలో జరుగుతున్న అవినీతిలో వినియోగదారులు, అధికారుల మధ్య వారధిగా ప్రైవేటు వ్యక్తుల జోక్యం కూడా ఉండడంతో విషయం బయటకు పొక్కకుండా లక్షల్లో దోచేస్తున్న వైనాన్ని విద్యుత్ శాఖ ఉద్యోగులే చర్చించుకుంటున్నారు. సాధారణ ఇంటికి మీటరు బిగించాలంటే రూ.5 వేలు అడుగుతున్నారంటే మేమెక్కడి నుంచి తేవాలంటూ వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులివ్వకపోతే ఏదోక కొర్రీలు వేసి మీటర్ల పంపిణీలో జాప్యం చేస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. తణుకు అర్బన్: తణుకు విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయ సేవలకు అవినీతి మరకలు అంటుతున్నాయి. అత్యవసరంగా అందాల్సిన విద్యుత్ శాఖ సేవలు వినియోగదారులకు కరెంట్ షాకిస్తున్నాయి. సబ్ డివిజన్ పరిధిలోని కిందిస్థాయిలో అవినీతి తిమింగలాల మాదిరిగా ఉన్న కొందరు ఉద్యోగుల తీరుతో వినియోగదారులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అవినీతికి సంబంధించి జరుగుతున్న పంపకాల్లో తేడాలు ఇటీవల ఆ అవినీతి వ్యవహారాన్ని బయటపెడుతున్నాయి. పైసలిస్తేనే మీటరు అనే స్థాయిలో కొందరు కిందిస్థాయి ఉద్యోగులు వినియోగదారుల నుంచి అందినకాడికి గుంజేసే పరిస్థితి నేడు దాపురించిందని పలువురు వాపోతున్నారు. ఇందుకు ఉదాహరణగానే ఇటీవల డీ 2 సబ్ స్టేషన్లో పంపకాల్లో వాటాలు తెగకపోవడంతో ఒకరిపై ఒకరు వాగ్వాదాలు, ఘర్షణలు, దాడులకు పాల్పడుతున్నట్లుగా సాక్షాత్యూ విద్యుత్ శాఖ ఉద్యోగులే చర్చించుకుంటున్నారు. మీటరు బిగించాలంటే.. మీటరు బిగించాలంటే పైసలివ్వాల్సిందే అనే రీతిలో కొందరు ఉద్యోగులు ఖరాకండిగా తెగేసి చెబుతుండడం వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఎందుకు డబ్బులివ్వాలని నిలదీస్తుంటే ఇంత డబ్బు పెట్టి ఇళ్లు కట్టుకున్నారు కదా మాకు ఇవ్వడానికి చేతులు రావడంలేదా అని నిలదీసే పరిస్థితి తణుకులో దాపురించిందని వినియోగదారులు వాపోతున్నారు. ఏళ్ల తరబడి కిందిస్థాయిలో పాతుకుపోయిన కొందరు ఉద్యోగులు ఇక్కడే తిష్టవేసి జబర్దస్త్గా అందినకాడికి గుంజేస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం ఈ విషయంపై తణుకు సబ్ డివిజన్ డీఈఈ బోడపాటి దివాకర్ను శ్రీసాక్షిశ్రీ వివరణ కోరగా ఇటీవల డీ2 సబ్స్టేషన్లో జరిగిన గొడవపై విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపించానని, మీటర్లపై డబ్బులు వసూలు చేస్తున్న వ్యవహారం తన దృష్టికి రాలేదని చెప్పారు. తాను గతనెల 27న విధుల్లో చేరానని డబ్బులు డిమాండ్ చేసే వ్యవహారంపై వినియోగదారులు ఫిర్యాదు చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యుత్ శాఖలో అవినీతి తిమింగలాలు అపార్టుమెంట్లకు ట్రాన్స్ఫార్మర్లు, మీటర్ల మంజూరులో లక్షల్లో చేతులు మారుతున్న వైనం డబ్బులివ్వకపోతే మీటర్ల జారీలో కొర్రిలు -
ఏలూరు వేగా జ్యూయలర్స్ లక్కీ డ్రా విజేతలు వీరే
ఏలూరు (ఆర్ఆర్పేట): వేగా జ్యుయలర్స్ గత నెలలో తమ 5వ షోరూంను ఏలూరులో ప్రారంభించిన సందర్భంగా ఖాతాదారులకు అద్భుతమైన ఆఫర్లను ప్రవేశ పెట్టిందని, దానిలో భాగంగా మంగళవారం లక్కీడ్రాను ఖాతాదారుల సమక్షంలో నిర్వహించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. లక్కీ డ్రాలో గెలుపొందిన అయిదుగురికి ఒక్కొక్కరికి రూ. 2 లక్షల విలువైన డైమండ్ నెక్లస్ను యాజమాన్యం అందజేసినట్లు చెప్పారు. లక్కీ డ్రా విజేతలుగా టీ ఆరుణశ్రీ (గన్ బజార్, ఏలూరు), ఏ.శారదా దేవి (హనుమాన్ జంక్షన్), (వీ.రాంబాబు, ఏలూరు), గండికోట నాగలక్ష్మి (ఏలూరు), టీ.శత్రుఘ్నకుమార్ (పవర్ పేట, ఏలూరు) నిలిచారన్నారు. లక్కీ డ్రా సందర్భంగా విజేతలకు వేగా జ్యుయలర్స్ చైర్మన్ బండ్లమూడి రామ్మోహన్, మేనేజింగ్ డైరెక్టర్ వనమా నవీన్ కుమార్, డైరెక్టర్లు వనమా సుధాకర్, చిట్లూరి నాగేశ్వరరావు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖాతాదారుల కోరిక మేరకు ప్రస్తుతం అందిస్తున్న ఆఫర్లు కొనసాగిస్తున్నామని రూ.లక్ష కొనుగోలుపై ఉచిత బంగారు నాణెం, పాత బంగారం మార్పిడిపై గ్రాముకు రూ.100 అదనంగా చెల్లించటం, డైమండ్ ధర క్యారెట్కు రూ.51,999 మాత్రమే అని తెలిపారు. ఈ ఆఫర్లు ఏలూరు షోరూమ్లో ఈ నెల 25 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయన్నారు. -
తడి బట్టలు ఆరేస్తూ విద్యుత్ షాక్తో మృతి
కై కలూరు: ఉతికిన తడి బట్టలు దండెంపై ఆరేస్తుండగా ఇనుప రాడ్డుకు తాకి విద్యుదాఘాతానికి గురై వివాహిత మృతి చెందిన ఘటన పెంచికలమర్రు గ్రామంలో సోమవారం జరిగింది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెంచికలమర్రుకు చెందిన జయమంగళ చిన సుబ్బరావు డ్రైవర్గా పని చేస్తున్నాడు. భార్య గంగ(50) గృహిణి. మంగళవారం ఇంటి దగ్గర ఉతికిన తడి బట్టలు దండెంపై ఆరేస్తుండగా సమీపంలో ఉన్న ఇనుప రాడ్డుకు ఉన్న మెయిన్ వైరు కారణంగా విద్యుత్ షాక్కు గురై మృతి చెందింది. ఆమెకు భర్త, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహానికి మంగళవారం పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. -
మద్ది క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. వేకువజాము నుంచే అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ, నిత్యార్చన పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించి, ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. బొర్రంపాలెం పీహెచ్సీ వైద్యశిబిరం సిబ్బంది ఆలయ ప్రాంగణంలో భక్తులకు వైద్య సేవలు అందించారు. ఏలూరు జిల్లా పంచాయతీ అధికారిణి కె.అనురాధ స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ మండపం వద్ద వేదపండితులు, అర్చకులు వేదాశీర్వచనం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. మద్యాహ్నం వరకు దేవస్థానమునకు వివిధ సేవలు, విరాళాల ద్వారా రూ.1,99,207 సమకూరినట్లు ఈవో ఆర్వీ చందన తెలిపారు. సుమారు వెయ్యి మంది భక్తులు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాదం స్వీకరించారు. -
అన్నదాత సుఖీభవ అర్హతను పోర్టల్లో చూసుకోవాలి
తణుకు అర్బన్: అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హత వివరాలపై పోర్టల్ వెబ్సైట్లో చూసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి జెడ్ వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం తణుకు మండలం దువ్వలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అర్హులైన రైతులకు అనర్హత వస్తే తమ అర్హతకు సంబంధించిన పత్రాలను గ్రామ వ్యవసాయ సహాయకుల వద్దకు వెళ్లి గ్రీవెన్స్ పోర్టల్లో ఈనెల 12వ తేదీలోపు నమోదు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో ఎక్కడా యూరియా కొరత లేదని ప్రస్తుతం 44,792 మెట్రిక్ టన్నుల ఎరువులు జిల్లాలోని ప్రైవేటు, మార్క్ఫెడ్స్లో అందుబాటులో ఉన్నాయన్నారు. ఎరువల కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దువ్వ గ్రామంలో 3,530 ఎకరాలు వరి సాగు చేస్తున్నారని దీనిలో సుమారు 40 శాతం మిషన్ ద్వారా నాట్లు వేస్తున్నారని ఇది చాలా శుభ పరిణామం అన్నారు. త్వరలో ధాన్యం డబ్బులు రైతులు గత సీజన్కు సంబంధించిన మిగిలిన ధాన్యం డబ్బులు రాబోయే మూడు నుంచి నాలుగు రోజుల్లో రైతుల ఖాతాలకు జమవుతాయని జిల్లా వ్యవసాయాధికారి జెడ్ వెంకటేశ్వరరావు తెలియజేశారు. దువ్వ గ్రామానికి చెందిన కొందరు రైతులు గత సీజన్లో ట్రాక్టర్లు, లారీల ద్వారా రైస్ మిల్లులకు రైతుల ధాన్యాన్ని చేరవేశామని దీనికి సంబంధించి ఇప్పటి వరకు మాకు రవాణా సొమ్ము అందలేదని అడగ్గా, ఈ సమస్యను సివిల్ సప్లయి విభాగ దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని చెప్పారు. అనంతరం యాంత్రీకరణ ద్వారా రైతులు నాట్లు చేస్తున్న తీరును స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తణుకు ఎంపీపీ రుద్రా ధనరాజు, తణుకు వ్యవసాయ సహాయ సంచాలకులు జి నరేంద్ర, డీఆర్సీ వ్యవసాయ అధికారిణి జి. బాల నాగేశ్వరమ్మ, మండల వ్యవసాయ అధికారి కే రాజేంద్రప్రసాద్, దువ్వ పీఏసీఎస్ సెక్రటరీ కిరణ్ వీఏఏలు మల్లికార్జున్, అరుణ్, పుష్ప, ఏపీసీఎన్ఎఫ్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వరరావు -
మందుల షాపుల్లో విస్తృతంగా తనిఖీలు
జంగారెడ్డిగూడెం: పట్టణంలో మంగళవారం పలు మందుల షాపుల్లో ఔషద నియంత్రణ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి బిల్లులు లేని మందులను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా డ్రగ్ కంట్రోల్ ఏడీ డి,కళ్యాణ చక్రవరి, డ్రగ్ ఇన్స్పెక్టర్ షేక్ అబిద్ ఆలీ విలేకరులతో మాట్లాడుతూ జంగారెడ్డిగూడెంలో జ్యోతి మెడికల్స్, వాసవీ మెడికల్స్, లక్ష్మీసూర్య గణేష్ మెడికల్ షాపులను సీజ్ చేసినట్లు చెప్పారు. అలాగే లక్ష్మీ శ్రీనివాస మెడికల్స్ షాపులో తనిఖీ చేయగా, షాపు యజమాని కొయ్యలగూడెం షాపునకు బిల్లులు లేకుండా మందులు సరఫరా చేస్తున్నట్లు గుర్తించామన్నారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. గత నాలుగు రోజులుగా బుట్టాయగూడెం, కొయ్యలగూడెం మండలాల్లో తనిఖీలు నిర్వహించామన్నారు. బుట్టాయగూడెంకు చెందిన కె.గణేష్ హైదరాబాద్ నుంచి బిల్లులు లేకుండా గర్భ విచ్ఛిత్తి, వయాగ్రా లాంటి మందులు కొనుగోలు చేసి మోటార్సైకిల్పై తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో విక్రయిస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో బుట్టాయగూడెంలో లక్ష్మీదుర్గ, కార్తికేయ మెడికల్ షాపులు, కొయ్యలగూడెంలో మురళీకృష్ణ మెడికల్ షాపును సీజ్ చేశామని, వీరికి నోటీసులు జారీ చేసి లైసెన్సులు రద్దు చేస్తామని చెప్పారు. త్వరలో మరికొన్ని మండలాల్లో దాడు లు చేస్తామన్నారు. ఇప్పటి వరకు రూ.లక్ష విలువైన మందులను సీజ్ చేశామన్నారు. నూజివీడు, ద్వారకాతిరుమల, అత్తిలిలో మూడు మెడికల్ షాపుల లైసెన్సులు రద్దు చేస్తున్నట్లు చెప్పారు. దాడుల్లో తణుకు డీఐ మల్లికార్జున్ పాల్గొన్నారు. స్కూల్ బస్సు ఢీకొని వ్యక్తి మృతి కామవరపుకోట: స్కూల్ బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన తడికలపూడిలో జరిగింది. ఎస్సై చెన్నారావు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు మండలం జాలిపూడి గ్రామానికి చెందిన గండికోట నవీన్ (40) గండిగూడెం గ్రామంలో పదేళ్ల నుంచి వ్యవసాయ పనులు చేసుకుంటూ అత్తవారింటిలో ఉన్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం సొంతూరు జాలిపూడి వెళ్లే నిమిత్తం ద్విచక్ర వాహనంపై వెళుతుండగా తడికలపూడి గ్రామంలో శ్రీనివాస వే బ్రిడ్జి దగ్గరకు వచ్చేసరికి ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొట్టింది. దీంతో నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. నవీన్కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, నవీన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించినట్లు ఎస్సై చెన్నారావు తెలిపారు. -
ట్రిపుల్ ఐటీలో కొరవడిన భద్రత
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీలో భద్రత కొరవడింది. ట్రిపుల్ ఐటీలోని శ్రీకాకుళం ఇంజినీరింగ్ విద్యార్థులు ఉంటున్న ఐ1 హాస్టల్ భవనంలోని మూడో అంతస్తులో ఉన్న హాస్టల్ గదులను ఆగంతకులు లూటీ చేశారు. ఇంజనీరింగ్ తృతీయ సంవత్సర విద్యార్థులు వేసవి సెలవులకు వెళ్లి జూలై ఐదో తేదీ నుంచి తిరిగి రావడంతో హాస్టల్ గదుల్లో చోరీ జరిగిన విషయం వెలుగు చూసింది. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీకి చెందిన ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం, మూడో సంవత్సరం విద్యార్థులకు నూజివీడు ట్రిపుల్ ఐటీలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. దీంతో ఐ1 హాస్టల్ వసతి గృహంలోని రెండో ఫ్లోర్లో నాలుగో సంవత్సరం విద్యార్థులు, మూడో అంతస్తులో తృతీయ సంవత్సర విద్యార్థులు ఉంటున్నారు. మే 15 నుంచి వేసవి సెలవులు ఇవ్వడంతో ఈ 4 విద్యార్థులు తమ సామగ్రినంతా తీసుకొని హాస్టల్ గదులను ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఈ3 విద్యార్థులు మాత్రం తమ దుస్తులను, ట్రాలీ బ్యాగ్లను, పుస్తకాలను, షూలను ఇతర సామగ్రిని తమ గదుల్లోనే ఉంచి తాళాలు వేసుకొని ఇళ్లకు వెళ్లారు. అయితే ఈ విద్యాసంవత్సరం నుంచి ఈ4 విద్యార్థులకు తరగతులు శ్రీకాకుళంలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్లోనే నిర్వహిస్తున్నామని, నూజివీడులో ఈ3 పూర్తి చేసుకున్న విద్యార్థులందరూ శ్రీకాకళం ట్రిపుల్ ఐటీ క్యాంపస్కు వచ్చేయాలని ట్రిపుల్ ఐటీ అధికారులు ఫోన్లకు మెసేజ్లు పెట్టారు. దీంతో వారంతా తమ సామగ్రిని తీసుకెళ్లేందుకు నూజివీడు ట్రిపుల్ ఐటీకి వచ్చి తమ రూమ్లకు వెళ్లగా తాళాలు పగులగొట్టి, లోపలి దుస్తులను, పుస్తకాలను చిందరవందరగా పడేసి ఉండటం చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. మూడో అంతస్తులో దాదాపు 100 గదులు ఉండగా 30 గదుల వరకు తాళాలు పగులగొట్టి, గడులు పగుల గొట్టి విద్యార్థుల పుస్తకాలను, దుస్తులను చిందరవందరగా పడేయడంతో పాటు సూట్కేసులు, ట్రాలీ సూట్కేసులు, కొందరి ల్యాప్ట్యాప్లు, విద్యార్థుల బూట్లు చోరీ చేశారు. ఇంత పెద్ద ఎత్తున లూటీ జరిగినా సమాచారం బయటకు పొక్కకుండా ట్రిపుల్ ఐటీ అధికారులు అది విషయమే కానట్లుగా వ్యవహరిస్తున్నారు. తమ గదుల్లోని వస్తువులు చోరికి గురికావడంపై విద్యార్థులు మెయిల్ ద్వారా యూనివర్సిటీ ఛాన్సలర్ దృష్టికి సైతం తీసుకెళ్లారు. హాస్టల్ గదులకు కూడా భద్రత లేకపోతే ఎలాగని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. సెక్యూరిటీ వ్యవస్థ నిద్రపోతోందా..! ట్రిపుల్ ఐటీలో 24 గంటలూ సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. షిఫ్టుకు 55 మంది చొప్పున మూడు షిఫ్టులు విధుల్లో ఉంటారు. అలాగే హాస్టల్ భవనంలో నూజివీడు ట్రిపుల్ ఐటీకి చెందిన కేర్ టేకర్, శ్రీకాకుళంకు చెందిన కేర్ టేకర్లు విధుల్లో ఉంటారు. హాస్టల్ భవనం వద్ద సైతం 24 గంటలూ సెక్యూరిటీ సిబ్బంది కాపలా కాస్తూ ఉంటారు. అంతేగాకుండా ట్రిపుల్ ఐటీలో పోలీస్ అవుట్పోస్టు సైతం ఉంది. అయినప్పటికీ విద్యార్థుల రూమ్ల తాళాలు పగులగొట్టి, గడులను విరగ్గొట్టి చోరీలకు పాల్పడటం సంచలనంగా మారింది. గతంలో రెండు సార్లు ఫ్యాకల్టీ గృహాల్లో సైతం దొంగతనాలు జరిగాయి. వాటికి సంబంధించి దర్యాప్తు ఇంత వరకు అతీగతీ లేదు. ఇప్పుడు తాజాగా విద్యార్థుల హాస్టల్ గదుల్లో జరగడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఇప్పటికై నా చోరీకి పాల్పడిన వారు ఎవరో నిగ్గు తేల్చాల్సిన బాధ్యత యాజమాన్యంపైన, పోలీసులపైనా ఉంది. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ విద్యార్థుల హాస్టల్ గదుల లూటీ పలు రూమ్ల తాళాలు పగులగొట్టి, గడులు విరగ్గొట్టి చోరీ విద్యార్థులు వేసవి సెలవులకు వెళ్లి వచ్చాక వెలుగు చూసిన వైనం -
వైఎస్ పాలనలో ఏజెన్సీలో అభివృద్ధి పరుగులు
బుట్టాయగూడెం: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో అభివృద్ధి పరుగులు పెట్టిందని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. సోమవారం సాయంత్రం దుద్దుకూరులో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ వైఎస్సార్తో ఆయనకున్న అనుబంధం, వైఎస్సార్ చేసిన అభివృద్ధి పనులను వివరించారు. గిరిజన విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమై డ్రాప్ఔట్స్గా మిగులుతున్న సమయంలో జూనియర్, డిగ్రీ, ఐటీఐ, పాల్టెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేసి ఉన్నత విద్యల్లో ముందుకు సాగే విధంగా వైఎస్ కృషి చేశారన్నారు. అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో 70 వేల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించిన ఘనత వైఎస్సార్దే అని అన్నారు. 400 కిలోమీటర్ల మేర బీటీ రోడ్ల నిర్మాణానికి కృషి చేసి రహదారుల సమస్య లేకుండా చేశారన్నారు. అదేవిధంగా అటవీ హక్కుల చట్టంలో సుమారు 10 వేల ఎకరాలకు పైగా భూములను పేదలకు వైఎస్సార్ పంచడం జరిగిందని గుర్తుచేశారు. రూ. 26 కోట్ల వ్యయంతో గిరిజనుల బీడు భూములకు సాగు నీరు అందించే విధంగా పోగొండ రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. ప్రతి ఏటా కొండ కాలువల ప్రవాహానికి అనేక మంది గిరిజనులు మృతి చెందుతుంటే వాటిని నివారించేందుకు రూ.26 కోట్లతో నాలుగు ప్రదేశాల్లో హైలెవెల్ బ్రిడ్జిల నిర్మాణానికి కృషి చేశారన్నారు. వైఎస్ చలువతోనే పోలవరం ప్రాజెక్టు పోలవరం మండలంలో ప్రతి ఏటా గోదావరి వరదనీరు ప్రవాహానికి 50 వేల ఎకరాల పంట భూములు ముంపునకు గురై రైతులు అనేక ఇబ్బందులు పడేవారన్నారు. దీంతో చిరకాల స్వప్నమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వైఎస్ చలువతోనే ప్రారంభమైందని చెప్పారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సుమారు రూ.70 కోట్లతో కొవ్వాడ ఔట్పాల్స్ క్లూయిస్ పనులకు శ్రీకారం చుట్టారని చెప్పారు. అలాగే గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని 5 ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు జంగారెడ్డిగూడెంలో 100 పడకల నిర్మాణానికి కృషి చేశారని తెలిపారు. ఇలా వైఎస్సార్ పాలనలో తాము ఏ సమస్య అయినా దరఖాస్తు రూపంలో అందజేస్తే వెనువెంటనే నిధులు మంజూరు చేసేవారని చెప్పారు. నాడు వైఎస్సార్ చేసిన అభివృద్ధి పనులను చూసి రాజశేఖరరెడ్డిని దేవుడిగా కొలుచుకుంటున్నారని చెప్పారు. మళ్లీ అదే రీతిలో తండ్రి బాటలో పాలన చేస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గిరిజన ప్రాంత అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని చెప్పారు. -
సామాన్యులకు వెజిట్రబుల్స్
గణపవరం: కూరగాయల ధరలు సామాన్యులను కంగారు పుట్టిస్తున్నాయి. కిలో ఉల్లి రూ.20 నుంచి రూ.50కు చేరి కన్నీళ్లు తెప్పిస్తోంది. ఇదే బాటలో మిగిలిన కూరగాయల ధరలు ఉన్నాయి. సోమవారం గణపవరం సంతలో కిలో ధరలు ఇలా ఉన్నాయి. ఉల్లి రూ.40 నుంచి రూ.50, పచ్చిమిర్చి రూ.70, బీర రూ.60, వంకాయలు రూ.60, బెండ రూ.50, క్యారెట్ రూ.50, బీట్రూట్ రూ.50, దోస రూ.30, దొండ రూ.40, కాకర రూ.60, ఆకాకర రూ.80, కీరదోస రూ.80, కంద రూ.50, చిక్కుడు రూ.120, టమాట రూ.60, అల్లం రూ.120, మునగ రూ.10, ఆనబ రూ.30, బీన్స్ రూ.80, క్యాప్సికం రూ60, క్యాబేజీ రూ. 50, కాలిఫ్లవర్ రూ.50 చొప్పున పలికాయి. ఆకుకూరలు ధరలు అదేబాటలో ఉన్నాయి. తోటకూర, గోంగూర, పాలకూర, చుక్కకూర తదితర రకాలు కట్ట రూ.20 చొప్పున విక్రయించారు. -
అపర భగీరథ.. అభివృద్ధి ప్రదాత
పుణ్యక్షేత్రాల వైపు ఆర్టీసీ అడుగులు ఆర్టీసీ ఆదాయం పెంచుకునే మార్గంలో పుణ్యక్షేత్రాల వైపు అడుగులు వేస్తోంది. ప్రముఖ పుణ్యక్షేత్రాలకు బస్సు సర్వీసులను నడుపుతోంది. 8లో uట్రిపుల్ ఐటీలో కొరవడిన భద్రత నూజివీడు ట్రిపుల్ ఐటీలో భద్రత కొరవడింది. శ్రీకాకుళం ఇంజినీరింగ్ విద్యార్థులు ఉంటున్న హాస్టల్ గదులను అగంతకులు లూటీ చేశారు. 8లో uమంగళవారం శ్రీ 8 శ్రీ జూలై శ్రీ 2025సాక్షి ప్రతినిధి, ఏలూరు: మెట్ట ప్రాంత అభివృద్ధికి బీజం వేశారు.. విద్య, వైద్యం, వ్యవసాయానికి ప్రాధాన్యతమిచ్చారు.. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన సాగునీటి వ్యవస్థను గాడిలో పెట్టే బృహత్తర ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. లక్షలాది ఎకరాలకు సాగునీరిచ్చి మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి అపర భగీరథుడిగా రైతుల హృదయాల్లో నిలిచిపోయారు దివంగతం ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి. జిల్లాలో గిరిపుత్రులకు పోడుభూములకు పట్టాలిచ్చి సాగుదిశగా మళ్లించారు. ప్రతిష్టాత్మకమైన ఆరోగ్యశ్రీ పథకాన్ని ఏలూరులో ప్రారంభించి జిల్లాపై ఎనలేని అభిమానాన్ని చూపారు. ఆయన మరణించి ఏళ్లు గడుస్తున్నా జిల్లావాసుల మదిలో చిరస్మరణీయంగా నిలిచిపోయారు. తమ్మిలేరు వరదలను అడ్డుకునేలా.. 2004–2009 వైఎస్సార్ హయాంలో జిల్లాలో అభివృద్ధి పరుగులు తీసింది. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు మోక్షం లభించింది. ఏలూరులో ముంపు సమస్యను తీర్చేలా 2005లో రూ.17 కోట్లతో తమ్మిలేరు రిటైనింగ్ వాల్కు శంకుస్థాపన చేయగా 2024లో వైఎస్ జగన్ హయాంలో రూ.90 కోట్లతో పూర్తయ్యింది. ఉమ్మడి పశ్చిమలో నూజివీడులో ట్రిపుల్ఐటీ, తాడేపల్లిగూడెంలో హార్టికల్చ ర్ యూనివర్సిటీ, పోలవరం ప్రాజెక్టు, చింతల పూడి ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపనలు ఇలా కీలక ప్రాజెక్టులకు ఆయన హయాంలోనే అంకురార్పణలు జరిగాయి. జరిగాయి. పోడుభూముల పంపిణీ : గిరిపుత్రులను వ్యవసాయం వైపు మళ్లించాలన్న ఉద్దేశంతో 2,200 మంది గిరిజనులకు 4,500 ఎకరాల పోడుభూములను పంపిణీ చేశారు. ఇప్పటికీ వేలాది మంది గిరిజనులు పోడు వ్యవసాయం చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. మళ్లీ 15 ఏళ్ల తర్వాత వైఎస్ జగన్ హయాంలో 2,700 మంది గిరిజనులకు 3,500 ఎకరాల పోడు భూమిని పంపిణీ చేశారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం డెలివరీ పాయింట్ న్యూస్రీల్రాజన్నా.. నిను మరువలేమన్నా.. మెట్ట సస్యశ్యామలంలో రాజన్న ముద్ర నూజివీడులో ట్రిపుల్ఐటీతో విద్యావిప్లవం తమ్మిలేరు రిటైనింగ్ వాల్కు చర్యలు గిరిపుత్రులకు పోడు భూముల పంపిణీ ఏలూరు సమగ్రాభివృద్ధికి బీజం నేడు వైఎస్సార్ జయంతి చింతలపూడి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చింతలపూడి ఎత్తిపోతల పథకానికి వైఎస్సార్ హయాంలో శంకుస్థాపన చేశారు. పూర్వ కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లోని 15 మెట్ట ప్రాంతా మండలాల్లో 2.10 లక్షల ఎకరాల సాగునీరు అందించే లక్ష్యంతో రూ.1,701 కోట్ల వ్యయంతో ప్రాజెక్టును ప్రారంభించారు. ఏజెన్సీ ముఖద్వారంగా ఉన్న జంగారెడ్డిగూడెంలో 100 పడకల ఆస్పత్రి నిర్వాణానికి శంకుస్థాపన చేశారు. ఇలా ప్రతి నియోజకవర్గంలో శాశ్వత రీతిలో నిలిచిపోయే కీలక అభివృద్ధి పనుల్లో రాజశేఖరరెడ్డి చెరగని ముద్ర వేశారు. ట్రిపుల్ఐటీతో వెలుగు రేఖలు రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలో భాగంగా రాష్ట్రంలో మూడు ట్రిపుల్ఐటీలను ప్రారంభించారు. నూజివీడులో 120 ఎకరాల విస్తీర్ణంలో ఏటా 2 వేల అడ్మిషన్లతో అధునాతన భవనాలను ట్రిపుల్ఐటీని ఏర్పాటుచేశారు. 6 వేల సీట్లతో ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్సును ఇక్కడ పేద పిల్లలు చదువుతున్నారు. సుమారు 5 వేల మందికిపైగా విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉన్నత కొలువులు సాధించారు. అలాగే ఎన్ఐటీ, ఐఐటీ, ఐఐఎన్లో అడ్మిషన్లతో పాటు గ్రూప్–2 మొదలు పంచాయతీరాజ్, ఇరిగేషన్లో ఇంజనీర్లుగా సేవలందిస్తున్నారు. ప్రాణదాత వైఎస్సార్ ముదినేపల్లికి చెందిన ఈ మహిళ పేరు నగడం రాములమ్మ. రోజువారి కూలి. 2007లో ఆమెకు ప్యాంక్రీయాసిస్ వ్యాధి రాగా రూ.లక్షకు పైగా ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమెకు ఆరోగ్యశ్రీ అపర సంజీవనిలా ఆదుకుంది. విజయవాడలోని కార్పొరేట్ ఆస్పత్రిలో ఆమెకు ఉచిత చికిత్స అందింది. అప్పటినుంచి తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని, మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి తనకు పునఃజన్మనిచ్చారని, ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానని ఆమె తెలిపింది. పోడు భూములకు పట్టాలిచ్చారు నాకు 3.70 ఎకరాల పోడు భూమి ఉంది. పట్టాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగాను. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చలువతో అటవీహక్కుల చట్టంలో నా భూమికి పట్టా ఇచ్చారు. నాతోపాటు మా గ్రామంలో మరో 35 కుటుంబాలకు కూడా వైఎస్సార్ హయాంలో పోడుభూములకు పట్టాలిచ్చారు. ఆయన్ను మేం దేవుడిగా కొలుచుకుంటున్నాం. – ఎం.రవిభాస్కర్, పోడు వ్యవసాయ రైతు, లక్ష్మీపురం, బుట్టాయగూడెం మండలం ఇంటి నిర్మాణానికి సాయం వైఎస్ రాజశేఖరరెడ్డి వల్ల నాకు ఎంతో మేలు చేకూరింది. మాది పెరికెగూడెం గ్రా మం. నా పేరు పెరుమాళ్ల స త్యనారాయణ. నా భార్య పద్మ పెరికెగూడెం సర్పంచ్గా ఉంది. మాకు ఇద్దరు కుమారులు. మా ఇంటి నిర్మాణానికి రాజశేఖరరెడ్డి పాలనలో నాకు రూ.1.30 లక్షలు సాయం అందించారు. నాలా మా ఊరిలో చాలా కుటుంబాలు వైఎస్ రాజశేఖరరెడ్డి వల్ల లబ్ధి పొందాయి. – పెరుమాళ్ల సత్యనారాయణ, పెరికెగూడెం, మండవల్లి మండలం -
తహసీల్దార్కు వీఆర్ఏల సమ్మె నోటీసులు
కుక్కునూరు: ఈనెల 9న జరిగే దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటునట్లు వీఆర్ఏలు సోమవారం కుక్కునూరు తహసీల్దార్కు నోటీసు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేవలనం రూ.10 వేల వేతనంతో జీవితాలను నెట్టుకొస్తున్న వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని, పనిభారం తగ్గించాలని, జీతాలు పెంచాలని, లేబర్కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి యర్నం సాయికిరణ్, వీఆర్ఏ యూనియన్ అధ్యక్షుడు పోచారపు వెంకన్నబాబు, కురాకుల మోహన్రావు, వీఆర్ఏలు ఇరకం సుజాత, వర్క శివ, శేఖర్, కాంతారావు తదితరులు పాల్గొన్నారు. రాబోయే 3 రోజులు భారీ వర్షాలు ఏలూరు(మెట్రో): గోదావరి బేసిన్లో రాబోయే 3 రోజులు భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ, జలవనరుల శాఖల అంచనా మేరకు కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను అప్రమత్తం చేశారు. ప్రస్తుత అంచనా ప్రకారం సర్దార్ కాటన్ బ్యారేజీలో ఈనెల 12వ తేదీ నాటికి 9 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు చేరే అవకాశం ఉందనీ జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ చెబుతున్నారని, అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేయాలన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై దృష్టి పెట్టాలి రాష్ట్ర, జిల్లా ఆర్థిక పురోగతికి దోహదపడే వ్యవసాయ అనుబంధ రంగాలపై పూర్తి దృష్టి పెట్టాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు, సిబ్బందితో నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్లో ఆయిల్పామ్ ప్లాంటేషన్, మైక్రోఇరిగేషన్, అన్నదాత సుఖీభవ, సీసీఆర్సీ కార్డులు, ఈ పంట, ఎరువుల పంపిణీ, మామిడి పంట, పంటల బీమా, వ్యవసాయ ఆధునీకరణ యంత్రాలు తదితర అంశాలపై కలెక్టర్ వెట్రిసెల్వి సమీక్షించి అధికారులకు దిశా, నిర్ధేశం చేశారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
యలమంచిలి: లారీ ఢీకొని మోటార్సైక్లిస్టు మృతి చెందాడు. వివరాల ప్రకారం అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం రామరాజులంక గ్రామానికి చెందిన మేడిచర్ల పూర్ణచంద్ర ఉదయభాస్కర్ (64) తాపీమేసీ్త్రగా జీవనం సాగిస్తున్నాడు. పని నిమిత్తం చించినాడ వచ్చి తిరిగి బైక్పై వెళ్తుండగా చించినాడ వశిష్ట గోదావరి నది వంతెనపై సిమెంట్ లారీ వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో భాస్కర్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భాస్కర్ సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై గుర్రయ్య వివరించారు. హత్య కేసులో 8 మంది అరెస్ట్ దెందులూరు: మండలంలోని వీరభద్రపురం వద్ద ఇటీవల జరిగిన హత్య కేసులో 8 మందిని పెదవేగి సీఐ రాజశేఖర్ అరెస్ట్ చేసినట్లు దెందులూరు ఎస్సై ఆర్ శివాజీ తెలిపారు. 8 మంది నిందితులను భీమడోలు కోర్టులో హాజరుపరచుగా మేజిస్ట్రేట్ రిమాండ్ విధించినట్లు ఎస్సై చెప్పారు. నాటుసారా కేంద్రాలపై దాడులు కుక్కునూరు: మండలంలోని నాటుసారా తయారీ కేంద్రాలపై సోమవారం జంగారెడ్డిగూడెం ఎకై ్సజ్ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో సీతారామనగరం గ్రామ పరిధిలోని అటవీ ప్రాంతంలో సారా తయారు చేసేందుకు సిద్ధంగా ఉంచిన 600 లీటర్ల బెల్లం ఊటను స్వాధీనం చేసుకోని ధ్వంసం చేసినట్టు ఎకై ్సజ్ సీఐ కే శ్రీనుబాబు తెలిపారు. అంతేకాక మండలంలోని మారేడుబాక, శ్రీధరవేలేరు గ్రామాల్లో సారా వలన దుష్ఫలితాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యుత్ స్తంభాన్ని ఢీకొని గిరిజనుడి మృతి వేలేరుపాడు: ద్విచక్ర వాహనం అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొని గిరిజన యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రామవరం గ్రామానికి చెందిన మడకం ప్రకాష్ మొహర్రం (పీర్లపండుగ)ను పురస్కరించుకొని సోమవారం మధ్యాహ్నం కన్నాయిగుట్ట గ్రామానికి తన ద్విచక్రవాహనంపై బయలు దేరాడు. వేలేరుపాడు మండల పరిధిలోని విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో ద్విచక్రవాహనం అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టగా తలకు తీవ్ర గాయమైంది. వైద్యం నిమిత్తం జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ప్రకాష్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వేలేరుపాడు ఎస్సై నవీన్ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నిట్లో సీట్లు ఫుల్
తాడేపల్లిగూడెం: జాయింట్ సీట్ అలొకేషన్ అఽథారిటీ (జోసా) పర్యవేక్షణలో జాతీయ విద్యాసంస్థలైన నిట్ తదితర సంస్థల్లో సీట్ల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు రెండు రౌండ్లు ముగియగా మరో ఆరు రౌండ్లు మిగిలాయి. తొలి విడతలోనే ఏపీ నిట్లో ఉన్న 480 సీట్లకు ఆప్షన్లను విద్యార్థులు ఎంపిక చేసుకున్నారు. మొదటి రౌండ్లోనే సీట్లు భర్తీ అయ్యాయి. నిట్లో ఉన్న ఎనిమిది బ్రాంచిలలో చేరడానికి విద్యార్థులు ఫ్లోట్ ( బ్రాంచి మారడానికి వీలుగా) ఫ్రీజింగ్ ( సీటు నిర్ధారణ చేసుకోవడం)వంటి ఐచ్ఛికాలను ఎంపిక చేసుకున్నారు. హోమ్ స్టేట్ కోటా కింద 240 మంది, అదర్ స్టేట్ కోటా కింద 240 మంది ఆప్షన్లను ఎంపిక చేసుకోగా, మిగిలిన నాలుగు రౌండ్లు ముగిసిన తర్వాత వెరిఫికేషన్ కేంద్రాల్లో జోసా నుంచి తుది జాబితా వచ్చిన తర్వాత సర్టిఫికెట్లను పరిశీలన చేసిన తర్వాత నిట్లో విద్యార్థులు చేరే ప్రక్రియ పూర్తి కానుంది. తర్వాత ఇండక్షన్, తరగతుల ప్రారంభం కార్యక్రమాలు జరగాల్సి ఉంది. ఆగస్టు నెల వరకు విద్యార్థులు ప్రాంగణానికి వచ్చే అవకాశాలు లేవు. ఎంటెక్ సీట్ల భర్తీ ప్రక్రియ షురూ కొంతకాలం విరామం తర్వాత ఏపీ నిట్లో ఎంటెక్ కోర్సు ప్రారంభం కానుంది. ఎంటెక్ కోర్సులో ఇక్కడ 99 సీట్లు ఉన్నాయి. ఈ కోర్సు కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించే ప్రక్రియ ప్రారంభమైంది. వంద సీట్లు పైన ఉంటేనే ఆయా నిట్కు వెరిఫికేషన్ సెంటర్ ఇస్తారు. ఏపీ నిట్లో 99 సీట్లు ఉండటంతో ఇక్కడకు వచ్చిన దరఖాస్తుల పరిశీలన కార్యక్రమం నిట్ రాయపూర్లో ఏర్పాటుచేశారు. హెఫా నిధుల కోసం నిరీక్షణ ఏపీ నిట్లో రెండోదశ పనుల కోసం రూ.430 కోట్ల ప్రతిపాదనతో కెనరా బ్యాంకు ద్వారా హైర్ ఎడ్యుకేషన్ ఫండింగ్ ఏజన్సీ(హెఫా) నుంచి నిధుల కోసం కేంద్ర ఉన్నత విద్యాశాఖకు వినతులు పంపారు. ఏపీ నిట్కు బోర్డు ఆఫ్ గవర్నెన్సు(బీఓజీ) చైర్మన్ లేకపోవడం, పాత చైర్పర్సన్ పదవీకాలం ముగిసి ఏడాది గడుస్తున్నా , ఇంకా ఆ స్థానంలో చైర్మన్ ఎంపిక జరుగలేదు. నిధుల్లో కదలిక లేకపోవడానికి ఇది ఒక కారణంగా తెలుస్తోంది. ఆరో రౌండ్ తర్వాత చేరికలు ఎంటెక్ తరగతులు త్వరలో ప్రారంభం హెఫా నిధుల కోసం నిరీక్షణ -
కౌన్సిల్లో ప్రొటోకాల్ పాటించేలా చూడాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల్ల పట్ల ప్రొటోకాల్ పాటించడం లేదని, కౌన్సిల్లో మాట్లాడే అవకాశం కల్పించడం లేదని, నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం వైఎస్సార్సీపీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ మామిళ్లపల్లి జయప్రకాష్ (జేపీ) ఆధ్వర్యంలో కార్పొరేటర్లు కలెక్టర్ వెట్రిసెల్వికి వినతిపత్రం సమర్పించారు. జేపీ, కార్పొరేటర్లు మాట్లాడుతూ ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశంలో నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. ప్రజాసమస్యలు చర్చించకుండా అడ్డుకుంటున్నారని, చులకనగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశాల్లో కో–ఆప్షన్ సభ్యులు మాట్లాడేందుకు అనుమతి లేకపోయినా సభా మర్యాద పాటించకుండా ప్రతిపక్ష సభ్యులను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి స్థానిక కార్పొరేటర్లకు కనీస సమాచారం ఇవ్వడం లేదని వీటిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ నాయకులు గుడిదేశీ శ్రీనివాసరావు, నెరుసు చిరంజీవులు, గంట మోహన్ రావు, మున్నుల జాన్ గుర్నాథ్, నూకపెయ్యి సుధీర్ బాబు, తుమరాడ స్రవంతి, జి.విజయనిర్మల, కేదారేశ్వరి డింపుల్ తదితరులు ఉన్నారు. రెయిలింగ్కు అనుమతివ్వాలి ఏలూరులోని ఫైర్స్టేషన్ సెంటర్లో 2010లో ఏర్పాటు చేసిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద గ్రానైట్, రెయిలింగ్ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని పార్టీ ఇన్చార్జి జయప్రకాష్ (జేపీ) ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు. 2023లో కార్పొరేషన్ ఆధ్వర్యంలో విగ్రహం చుట్టూ అభివృద్ధి పనులు, రెయిలింగ్ పనులు మొదలుపెట్టారని, అయితే అనివార్య కారణాల వలన పనులు నిలిపివేశారన్నారు. దీంతో వైఎస్సార్ అభిమానులు విగ్రహం వద్ద కార్యక్రమాలు నిర్వహించినప్పుడు ఇబ్బంది పడుతున్నారన్నారు. విగ్రహం వద్ద గ్రానైట్, రెయిలింగ్ పనులు చేయించుకోవడానికి అనుమతి ఇవ్వాలని కలెక్టర్ను కోరారు. వైఎస్సార్సీపీ ఇన్చార్జి జేపీ వినతి -
ధీమా ఇవ్వని బీమా
ఏలూరు (మెట్రో): అన్నదాతకు కష్టాలు వెంటాడుతున్నాయి. గతంలో సాగు అంటే పండుగ అనేరీతిలో ప్రతి సీజన్ను ఉత్సాహంగా రైతులు మొదలుపెట్టేవారు. అయితే ప్రస్తుత కూటమి పాలనలో అడుగడుగునా ఇబ్బందులతో అవస్థలు పడుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్సార్ రైతు భరోసా, ఉచిత పంటల బీమాతో రైతులకు అండగా నిలవగా.. ప్రస్తుత కూటమి సర్కారు ఉచిత పంటల బీమాకు మంగళం పాడింది. పెట్టుబడి సాయంగా అన్నదాత సుఖీభవ పథకాన్ని ఇప్పటికీ అమలు చేయలేదు. దీంతో సీజన్ ప్రారంభంలో పెట్టుబడులకు రైతులు అప్పులు చేయాల్సి వస్తోంది. జిల్లాలో 99,515 హెక్టార్లలో రైతులు పలు పంటలు సాగుచేస్తున్నారు. రైతులే చెల్లించాలని.. ప్రకృతి విపత్తుల సమయంలో రైతులను ఆదుకునేలా గత జగన్ సర్కారు ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేసింది. రైతుల తరఫున బీమా ప్రీమియాన్ని ప్రభుత్వం చెల్లించేది. దీంతో రైతులకు భారం ఉండేది కాదు. అలాగే విపత్తుల సమయంలో నష్టపరిహారం సులభంగా అందేది. అయితే ప్రస్తుతం బీమా ప్రీమియం రైతులే చెల్లించాలని కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రూ.25 కోట్ల మేర భారం జిల్లాలో వరి, మినుములు, పత్తి, నిమ్మ పంటలకు ప్రీమియం చెల్లించేందుకు చివరి తేదీలు సైతం ప్రభుత్వం ఖరారు చేసింది. జిల్లాలో ఎకరా చొప్పున వరికి రూ.840, మినుముకు రూ.300, పత్తికి రూ.1,900, నిమ్మకు రు.2,500 చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. వరికి ఆగష్టు 15, మినుముకు జూలై 31, పత్తి, నిమ్మకు జూలై 15న చివరి తేదీగా గడువు విధించింది. ఈ మేరకు జిల్లా వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాంకులో రైతులకు ఇచ్చే పంట రుణాల్లోనే ప్రీమియం సొమ్ము మినహాయించుకునేలా ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో సుమారు 99 వేల హెక్టార్లలో పలు రకాల పంటలను రైతులు సాగు చేస్తున్నారు. సుమారు 4.50 లక్షల మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. వీరిపై సుమారు రూ.25 కోట్ల మేరకు బీమా ప్రీమియం భారం పడనుంది. ఉచిత పంటల బీమాకు తిలోదకాలు ప్రీమియం చెల్లించేందుకు రైతుల అవస్థలు ఇప్పటికీ అందని ‘అన్నదాత సుఖీభవ’ జిల్లాలో 99 వేల హెక్టార్లలో సాగు -
మదినిండా పెద్దాయనే..
ఏలూరు (ఆర్ఆర్పేట): ముఖ్యమంత్రిగా, ప్రజానేతగా వైఎస్ రాజశేఖర రెడ్డి అందించిన సేవలు ఇప్పటికీ ప్రజల హదయాల్లో పదిలమే. అందుకే ఆయన్ను రాష్ట్రమంతా పెద్దాయనగా పిలుచుకుంటుంది. ఆ మహానీయుడి జయంతి సందర్భంగా నగరానికి చెందిన మైక్రో ఆర్టిస్టులు తమ కళ ద్వారా వైఎస్కు ఘనంగా నివాళులర్పించారు. ఏలూరుకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ ప్రసాద్ వైఎస్ చిత్రపటాన్ని రావి ఆకుపై చిత్రించి తన అభిమానాన్ని చాటుకోగా, మరో మైక్రో ఆర్టిస్ట్ మేతర సురేష్ అగ్గిపుల్లపై వైఎస్ చిత్రాన్ని చిత్రించి కృతజ్ఞత చాటుకున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఎందరికో ప్రాణభిక్ష పెట్టడమే కాకుండా, ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా పేద విద్యార్థులు ఉన్నత చదువులకు కృషి చేసిన మహామనిషి వైఎస్సార్ అని మైక్రో ఆర్టిస్టులూ తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. -
ఆటో బోల్తా.. 10 మందికి గాయాలు
దెందులూరు: గోపన్నపాలెం గ్రామంలో ఆదివారం ఆటో బోల్తా పడిన సంఘటనలో పెదపాడు మండలం కొత్తూరు గ్రామానికి చెందిన ఇద్దరు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. ఎనిమిది మంది కూలీలకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని 108 అంబులెన్స్లో ఏలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తీవ్రంగా గాయపడిన డి.సాయికుమారి, సీహెచ్ నాగబాబులు ఏలూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. కూలి పని కోసం కొత్తూరు నుంచి గోపన్నపాలెం గ్రామానికి వచ్చి పని ముగించుకొని తిరిగి వెళ్తుండగా ప్రమాదవశాత్తు కూలీల ఆటో బోల్తా పడింది. -
పిచ్చికుక్క స్వైరవిహారం
బుట్టాయగూడెం : జీలుగుమిల్లి మండలం తా టాకులగూడెంలో పిచ్చికుక్క 9 మందిపై దాడి చేసింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారంఆదివారం వేకువజాము నుంచి ఉదయం 10 గంటల వరకు ఓ పిచ్చికుక్క గ్రామంలో స్వైరవిహారం చేస్తూ 9 మందిని గాయపర్చింది. దీంతో గ్రామస్తులు దానిని హతమార్చారు. ఎస్.భద్రమ్మ, ఎస్.నాగేశ్వరమ్మ, పి.కవలమ్మ, కె.రాణి, ఎం.దావీదుతోపాటు మరో నలు గురికి తీవ్ర గాయాలు కాగా వారిని జీలుగుమిల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు సకాలంలో వైద్యం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధితులు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు దృష్టికి తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే అక్కడికి చేరుకుని బాధితులను పరామర్శించడంతోపాటు వైద్యుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూటీ దగ్ధం ఏలూరు టౌన్: జిల్లాలోని 16వ నంబర్ జా తీయ రహదారిపై వెళుతున్న స్కూటీ దగ్ధమైంది. పెదవేగి మండలం అమ్మపాలేనికి చెందిన మెడంకి ఏసుపాదం కుమారుడు, స్నేహితుడు కలిసి ఏలూరు వెళుతుండగా చుట్టుగుంట బ్రిడ్జి సమీపంలో స్కూటీ నుంచి పొగలు రావడంతో వారు అక్కడే నిలిపివేశారు. అనంతరం మంట లు చెలరేగి స్కూటీ పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. మంటలకు గల కారణాలపై స్పష్టత లేదు. స్కూటీని 2021లో కొనుగోలు చేసినట్టు తెలిసింది. పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎస్సై కుటుంబానికి చేయూత నరసాపురం : తూర్పుగోదావరి జిల్లా ఆలమూ రు ఎస్సైగా పనిచేస్తూ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎస్సై ఎం.అశోక్ కుటుంబానికి సహచర పోలీసు అధికారులు అండగా నిలిచారు. ఉమ్మడి రాష్ట్రంలోని 2009 బ్యాచ్కు చెందిన 1,100 మంది సీఐలు, ఎస్సైలు 2009 బ్యాచ్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా రూ.26 లక్షలు సేకరించారు. సోమవారం నరసాపురంలోని అశోక్ ఇంటి వద్ద జరిగిన సంతాప కార్యక్రమంలో ఈ మొత్తాన్ని ఆయన కుటుంబానికి అందించారు. తర్వాత ఆలమూరు వెళ్లి ఎస్సైతో పాటు మృతి చెందిన కానిస్టేబుల్ బ్లెన్సన్ జీవన్ కుటుంబానికి రూ.5 లక్షలు అందించారు. నరసాపురం టౌన్ సీఐ బి.యాదగిరి మాట్లాడుతూ 2009 బ్యాచ్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా ఎలాంటి ఆపద వచ్చినా స్పందిస్తున్నామన్నారు. ఇప్పటివరకూ రూ.2 కోట్లకుపైగా ఆర్థిక సాయం అందించినట్టు చెప్పారు. ఉరకలేస్తున్న గోదావరి పెనుగొండ/నరసాపురం : వశిష్టా గోదావరి వరద నీటితో ఉరకలేస్తోంది. రెండు రోజు లుగా గోదావరిలోకి ఎర్రనీరు వచ్చి చేరుతోంది. పెనుగొండ మండలం దొంగరావిపాలెం, చినమల్లం, పెదమల్లం, కోడేరు, భీమలాపురం వద్ద గోదావరి నిండుగా ప్రవహిస్తుంది. సిద్ధాంతంలో మధ్య లంకను నీరు తాకింది. ఆచంట మండలంలో అయోధ్యలంక, పెదమల్లంలంక, పల్లిపాలెం, పుచ్చల్లంక వద్ద పల్లపు ప్రాంతాలకు నెమ్మదిగా నీరు చేరుతోంది. రైతులు రాకపోకలు సమయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. నరసాపురంలో.. నరసాపురం: నరసాపురంలోని వశిష్ట గోదావరిలో నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. వలంధర్ రేవు వద్ద పరవళ్లు తొక్కుతూ గోదావరిలో నీటి ప్రవాహం కనిపిస్తోంది. గోదావరి క్రమేపీ ఎర్ర రంగులోకి మారుతోంది. -
కూటమి వంచనపై నిలదీద్దాం
నూజివీడు : ఎన్నికల ముందు సూపర్సిక్స్ అని చె ప్పి అధికారం చేపట్టాక సూపర్సిక్స్ను పక్కన పెట్టి ప్రజలను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని నిలదీసేలా ప్రజలను చైతన్యవంతులను చేయాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నూజివీడు నియోజకవర్గ ఇన్చార్జి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు పిలుపునిచ్చారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ అనే అంశంపై నియోజకవర్గస్థాయి విస్తృత స్థాయి సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయకుండా కల్లబొల్లి మాటలు చెబుతోందన్నారు. ఏడాదిలో రూ.1.50 లక్షల కో ట్లు అప్పుచేసిన చంద్రబాబు ఈ సొమ్మును ఎక్కడ ఖర్చు చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి, రూ.1,500 ఆడబిడ్డ నిధి ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. రైతులకు అన్నదాత సుఖీభవ సాయం, మహిళలకు ఉచిత బస్సు ఎప్పుడని నిలదీశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాటంతో విద్యార్థులకు తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వం అమలు చేసిందని, లేకపోతే అది కూడా ఉండేది కాదన్నారు. రూ.10 వేలు జీతం అంటూ వలంటీర్లను నమ్మించి వెన్నుపోటు పొడిచారన్నారు. రేషన్ వాహనాలు తొలగించి మహిళలకు కష్టాలు తెచ్చిపెట్టారన్నారు. నూజివీడు ప్రజల సంక్షేమం కోసమే.. నూజివీడు ఏరియా ఆసుపత్రిని రూ.21 కోట్లతో అభివృద్ధి చేస్తే దానిని ఉపయోగించడం కూడా ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదని మాజీ ప్రతాప్ అప్పారావు అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే జిల్లా ఆసుపత్రిగా మారుస్తామన్నారు. నూజివీడులో కేంద్రీయ విద్యాలయం కోసం మూడేళ్లు కష్టపడి మంజూరు చేయిస్తూ కూటమి ప్రభుత్వ పాలకులు ఇప్పటివరకూ దానిని ప్రారంభించలేకపోయారని మండిపడ్డారు. తాను గెలిచినా, ఓడినా నూజివీడు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సంక్షేమం కోసమే పనిచేస్తానన్నారు. మామిడి ధర పతనమై రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, ఎన్నడూ లేనివిధంగా కలెక్టర్ రకం టన్ను రూ.3 వేలకు, బంగినపల్లి రకం రూ.9 వేలకు పడిపోయిందన్నారు. కోత ఖర్చులు కూడా రావడం లేదని కలెక్టర్ రకం కాయలను కోయకుండా రైతులు తోటల్లోనే వదిలేశారన్నారు. ప్రభుత్వం టన్నుకు రూ.12 వేలు ఇస్తుందని చెబుతుందే తప్ప ఇప్పటివరకూ ఒక్క రైతుకూ ఇవ్వలేదని ప్రతాప్ అప్పారావు అన్నారు. చంద్రబాబు పాలనంతా మోసమే ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి కారుమూరి సునీల్కుమార్ యాదవ్ మాట్లాడుతూ చంద్రబాబు పాలనంతా మోసపూరితమేనని ధ్వజమెత్తారు. ప్రశ్నిస్తా, నిలదీస్తా అని చెప్పిన పవన్కల్యాణ్ సినిమాలు తీసుకుంటున్నారే గాని రాష్ట్రంలోని ప్రజల బాధలు పట్టడం లేదన్నారు. 50 ఏళ్లకే ఎస్సీ,ఎస్టీ, బీసీలకు పింఛన్లు మంజూరు చేస్తామని ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీయాలని కోరారు. ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాఽథ్ మాట్లాడుతూ హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. హామీలను అమలు చేయాలంటూ బాధ్యతాయుత ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటుందన్నారు. కూటమి ప్రభుత్వ మోసాలను వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. జెడ్పీ వైస్ చైర్మన్ గుడిమళ్ల కృష్ణంరాజు, జెడ్పీటీసీలు వరికూటి ప్రతాప్, పిన్నిబోయిన వీరబాబు, ఎంపీపీలు కొండా దుర్గాభవాని, గోళ్ల అనూష, వైఎస్సార్సీపీ పట్టణ, మండలాల అధ్యక్షులు శీలం రాము, పోలిమెట్ల శివ, బెజవాడ రాంబాబు, మూల్పూరి నాగవల్లేశ్వరరావు, పుచ్చకాయల సుబ్బారెడ్డి, సీనియర్ నాయకులు దేశిరెడ్డి రాఘవరెడ్డి, నాయకులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు -
సుబ్బారాయుడిని దర్శించుకున్న భక్తులు
ముదినేపల్లి రూరల్: ప్రసిద్ధి చెందిన సింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్లోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం భక్తులు పోటెత్తారు. సదూర ప్రాంతాల నుంచి భారీసంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామి వారి పుట్టలో పాలు పోశారు. పాలపొంగళ్ల శాల వద్ద మహిళలు నైవేద్యాలు తయారుచేసి స్వామికి సమర్పించారు. నాగబంధాల వద్ద స్వామివారి మూర్తులను ప్రతిష్ఠించేందుకు అర్చకులతో పూజలు చేయించి ప్రతిష్ఠ తంతు నిర్వహించారు. నాగబంధాల వద్ద, గోకులంలోని గోవులకు మహిళలు పసుపు కుంకుమలతో పూజలు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నప్రసాద ఏర్పాట్లు చేశారు. స్వామిని దర్శించుకునే భక్తులు అన్నప్రసాదం కార్యక్రమంలో పాల్గొంటే మేలు జరుగుతుందనే విశ్వాసం ఉంది. గుబ్బల మంగమ్మ గుడికి పోటెత్తిన భక్తులు బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన కాపవరం సమీపంలోని అటవీప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, మచిలీపట్నం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వాహనాలతో తరలివచ్చి అమ్మవారికి దూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. తెల్లవారు జాము వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఆలయ కమిటీ వారు ఆలయంలో సోలార్ విద్యుత్ సదుపాయం, కల్పిచడం, ఫ్యాన్లు ఏర్పాటు చేయడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే నెలలో షార్ట్ ఫిలిం పోటీలు పాలకొల్లు సెంట్రల్: తెలుగు సాహిత్యం, సంస్కృతిని ప్రోత్సహిస్తూ పలు కార్యక్రమాలు నిర్వహించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని జాతీయ తెలుగు సారస్వత పరిషత్ అధ్యక్షుడు ముత్యాల శ్రీనివాస్ అన్నారు. ఆదివారం స్థానిక రోటరీ క్లబ్ భవనంలో మాట్లాడుతూ.. జాతీయ తెలుగు సారస్వత పరిషత్ షార్ట్ ఫిలిమ్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పరిషత్కు మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య గౌరవ సలహాదారుగా వ్యవహరిస్తున్నారన్నారు. సంఘ పరిషత్ సభ్యులుగా కెఎస్పిఎన్ వర్మ, కె.రాంప్రసాద్, చేగొండి సత్యనారాయణమూర్తి, రాజా వన్నెంరెడ్డి, గుడాల హరిబాబు, బోణం వెంకట నర్సయ్య, విన్నకోట వెంకటరమణ, యిమ్మిడి రాజేష్ను నియమించినట్లు తెలిపారు. పోటీలు ఆగస్టు నెలాఖరులో నిర్వహిస్తామని చెప్పారు. ఆగస్టు 10 లోపు అప్లికేషన్స్ పంపించాలన్నారు. ఫిలిం 15 నిమిషాలు మించి ఉండరాదని అన్నారు. పోటీలకు దర్శకులు వీర శంకర్, రేలంగి నరసింహరావు, రాజా వన్నెంరెడ్డి, ఏఎన్ ఆదిత్య, రచయిత రాజేంద్రకుమార్లు జడ్జిలుగా వ్యవహరించనున్నట్లు తెలిపారు. -
ప్రాణాంతకం.. గొంతువాపు
భీమవరం: పాడి రైతులు సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉంటూ పాడిని అభివృద్ధి చేసుకోవడం ద్వారా ఆదాయాన్ని పొందేందుకు అవకాశముంటుంది. వర్షాకాలంలో పశువులకు గొంతువాపు, గుది పెట్టు వ్యాధులు సోకే ప్రమాదమున్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. జిల్లాలో 1,78,137 గేదేలు, 45,539 ఆవులున్నాయి. పశువులకు సోకే వ్యాధుల పట్ల రైతులకు పెద్దగా అవగాహన లేకపోవడంతో వ్యాధి తీవ్రత ఎక్కువై పశు మరణాలు సంభవించడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. వ్యాధులపై రైతులు సంపూర్ణ అవగాహన కలిగి ఉంటే ఇంటి వద్దనే నిరోధించేందుకు వీలుంటుందని పశు వైద్యులు చెబుతున్నారు. వర్షాకాలంలో గేదెలకు సోకే ప్రాణాంతక వ్యాధుల్లో గొంతువాపు ఒకటి. ఈ వ్యాధి పందుల్లో తరచుగా, గొర్రెలు, మేకల్లో చాలా అరుదుగా కనిపిస్తుంది. ఈ వ్యాధి ఏడాది పొడవునా ఎప్పుడైనా వ్యాపించే అవకాశం ఉంది. ఎక్కువగా వర్షాకాలంలో దీనిని గుర్తించవచ్చు. నదీ పరివాహక ప్రాంతాలు, డెల్టాలు, వరిసాగు అధికంగా ఉన్న ప్రదేశాల్లో ఉండే గేదెలకు ఈ వ్యాధి ఎక్కువగా సోకుతుంది. ఇది ఒక రకమైన సూక్ష్మజీవి ద్వారా పశువులకు వ్యాపిస్తుంది. వ్యాధి లక్షణాలు ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండి వ్యాధి సోకిన 8 నుంచి 24 గంటల వ్యవధిలో పశువు చనిపోయే ప్రమాదముంది. వ్యాధి ప్రారంభ దశలో పశువు నీరసంగా ఉంటుంది. తరువాత నడవలేక పోవడం, అధిక జ్వరం, నోటి నుంచి సొంగ కారడం, ముక్కు నుంచి చిక్కటి ద్రవం స్రవించడం, కళ్లు ఎరబ్రడి నీరు కారుతూ ఉండటం లక్షణాలు. ముందుగా గొంతు భాగంలో వాపు ఉండి తరువాత వాపు చెంపలు, మెడ, ముందుకాళ్ల మధ్య భాగం, పొట్ట కింద భాగం వరకూ విస్తరిస్తుంది. పశువు ఆయాసపడుతూ శ్వాస పీలుస్తుంది. సాధారణంగా ఈ దశలో పశువు నాలుక బయటకు తీస్తూ శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఈ దశ తరువాత కొన్ని గంటల వ్యవధిలో పశువు చనిపోతుంది. వ్యాధి వ్యాప్తి ఇలా.. వ్యాధి సోకిన పశువుల నుంచి కారే సొంగ, ముక్కు నుంచి స్రవించే ద్రవాల ద్వారా వ్యాధి బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది. తరచుగా వ్యాధి సోకే ప్రాంతాల్లో నివసించే ఐదు శాతం పశువులు ఈ వ్యాధికి వాహకాలుగా ఉంటాయి. అలసిపోయిన, ఒత్తిడికి గురైన పశువులకు ఈ వ్యాధి త్వరగా వ్యాపిస్తుంది. సాధారణంగా కలుషితమైన మేత, గాలి ద్వారా వ్యాధి కారకం పశువుల శరీరంలోకి ప్రవేశిస్తుంది. శరీరంలోకి ప్రవేశించిన క్రిమి త్వరగా విభజన చెంది ఎండోక్సిన్స్ అనే విష పదార్థాలను విడుదల చేస్తుంది. ఇది రక్తంలోకి ప్రవేశించిన అనంతరం వ్యాధి లక్షణాలు బయటపడతాయి. పశువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం వర్షాకాలంలో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. వర్షాకాలానికి ముందు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. వ్యాధి సోకిన పశువులను మంద నుంచి వేరు చేయాలి. పశువుల పాకలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి. క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు విధిగా వేయించాలి. పశువైద్యుడి సలహా మేరకు సల్ఫాన్మైడ్స్, టెట్రాసైక్లినన్స్, పెన్సులిన్, క్లోరామ్ ఫినికాల్ వంటి యాంటి బయోటిక్ మందులు ముందుగా వాడితే ఫలితం ఉంటుంది. వ్యాధి ముదిరిన తరువాత చికిత్స పెద్దగా ఫలితం ఇవ్వదు. పి.సుధీర్బాబు, పశుసంవర్ధశాఖ సహాయ సంచాలకుడు, భీమవరం -
పెద్దింట్లమ్మా చల్లంగా చూడమ్మా
కై కలూరు: అమ్మా.. పెద్దింట్లమ్మా.. నీ చల్లని దీవెనలు అందించమ్మా.. అంటూ భక్తులు ఆర్తితో వేడుకున్నారు. కొల్లేటికోట పెద్దింట్లమ్మను సమీప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆదివారం దర్శించుకున్నారు. వేడి నైవేద్యాలను సమర్పించారు. ఆలయ అర్చకులు పేటేటి పరమేశ్వరశర్మ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఒక్క ఆదివారం ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డూ ప్రసాదం, గదుల అద్దెలు, అమ్మవారి చిత్రపటాలు, విరాళాలు, వాహన పూజల ద్వారా మొత్తం రూ.65,580 ఆదాయం వచ్చిందని తెలిపారు. -
తాగిస్తాం.. తూలిస్తాం
ఏలూరు (టూటౌన్): కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం మద్యాంధ్రప్రదేశ్గా మారింది. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగడంతో పాటు వీధివీధినా బెల్టుషాపులు దర్శనమిస్తున్నాయి. ఏలూరులో మద్యం మత్తులో యువత జోగుతోంది. మందుబాబులు ఫూటుగా మద్యం సేవించి ఎక్కడపడి తే అక్కడ దొర్లుతున్నారు. నగరంలో పదుల సంఖ్య లో మద్యం షాపులు వీటికి తోడు అనధికారంగా నిర్వహించే బెల్టు షాపుల్లో ఎనీ టైమ్ మందు అందుబాటులో ఉంటోంది. ఫుల్గా మద్యం తాగిన మందుబాబులు ఎటు వెళ్లాలో తెలియక రోడ్లపై, షాపుల మెట్ల వద్ద, ఖాళీ ప్రదేశాల్లో, పార్కుల్లో మద్యం మత్తులో పడి దొర్లుతున్నారు. గత ప్రభుత్వంలో సమయం మేరకే.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహించింది. దీంతో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకే విక్రయాలు జరిపేవారు. అలాగే బెల్టుషాపులకు పక్కాగా అడ్డుకట్ట వేశారు. ప్రభుత్వ షాపుల్లో మాత్రమే విక్రయా లు జరపడం, అక్కడ సిట్టింగులు లేకపోవడం, బెల్టుషాపులు ఉండకపోవడంతో యథేచ్ఛగా అమ్మకాలు జరిగేవి కాదు. దీంతో మందుబాబులు ఫుల్గా మద్యం తాగి రోడ్లపై దొర్లే దృశ్యాలు కనిపించేవి కావు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఇందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. సందు సందునా.. కూటమి ప్రభుత్వం మద్యం దుకాణాల నిర్వహణను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించింది. ఈ షాపులకు అనుబంధంగా అనధికారికంగా బెల్టుషాపులు వెలిశా యి. బెల్టుషాపులను అడ్డుకుంటామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. మద్యం, బెల్టుషాపులు అధికార పార్టీ నాయకులు, అనుచరులవి కావడంతో అధికారులు అటుగా కన్నె త్తి చూడటం లేదు. నామమాత్రపు దాడులతో సరి పెడుతున్నారు. ఏలూరులో గుడి, బడి తేడా లేకుండా బెల్టుషా పులు నిర్వహిస్తుండటంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. విచ్చలవిడిగా అమ్మకాలు ఏలూరు నగరం పరిధిలో మద్యం షాపుల ఏర్పాటు, బెల్టు షాపుల నిర్వహణకు వ్యతిరేకంగా ఎన్ని ఆందోళనలు చేపట్టినా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారులకు సైతం వీటికి వ్యతిరేకంగా వినతి పత్రాలు అందజేశాం. ఓపక్క మహిళలు, బాలికలపై అత్యాచారాలు పెరిగిపోవడానికి యథేచ్చగా మద్యం అమ్మకాలు కారణంగా కనిపిస్తోంది. తక్షణమే విచ్చలవిడి మద్యం అమ్మకాలను నిలుపుదల చేయాలి. – ఎ.రాణి, ఐద్వా జిల్లా కార్యదర్శి, ఏలూరు●ఇంటింటా మద్యం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇంటింటా విద్య, వైద్యం, సంక్షేమ పథకాలు అందేవి. ఇందుకు భిన్నంగా కూటమి ప్రభుత్వ పాలనలో ఇంటింటా మద్యం విచ్చలవిడిగా దొరుకుతుంది. ప్రతి టీడీపీ నాయకుడు, కార్యకర్త ఇళ్లల్లో మద్యం ఫుల్గా లభిస్తోందంటే అతిశయోక్తి లేదు. ఇంటింటా రేషన్ సరుకులను అందించే వాహనాల్లో ఇప్పుడు మద్యం సరఫరా చేయడం సిగ్గుచేటు. – జుజ్జువరపు విజయనిర్మల, వైఎస్సార్సీపీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు, ఏలూరుమద్యం ఏరులు.. బెల్ట్ బారులు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు వేళాపాళా లేకుండా విక్రయాలు ఏలూరులో వీధివీధినా బెల్టు షాపులు మద్యం మత్తులో జోగుతున్న యువత కూటమి ప్రభుత్వంలో ‘ఎనీ టైమ్ మందు’ యువత పెడదోవ యథేచ్ఛగా విక్రయాలతో నగరంలోని యువత మద్యానికి బానిసవుతున్నారనే ఆందోళన వ్యక్త మవుతోంది. దీంతో అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతున్నాయని మహిళా సంఘాలు అంటున్నాయి. గతంలో రోడ్డుకు 200 మీటర్ల దూరంలో మద్యం షాపును నిర్వహించే వారు. కూటమి ప్రభుత్వంలో ఈ నిబంధన లేకపోవడంతో రోడ్లను ఆనుకుని దుకాణాలు ఏర్పాటుచేశారు. దీంతో అటుగా వెళుతున్న వాహనచోదకులు, మహిళలు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. -
జగన్నాథ..మోక్షప్రదాత
జై జగన్నాథ.. జయహో జగన్నాథ స్మరణలు మార్మోగాయి. ఆదివారం మండలంలోని లక్ష్మీపురం, తిమ్మాపురం గ్రామాల్లో జగన్నాథ రథయాత్ర అట్టహాసంగా నిర్వహించారు. చినవెంకన్న క్షేత్ర దత్తత ఆలయం లక్ష్మీపురంలోని సంతాన వేణుగోపాల జగన్నాథ, వేంకటేశ్వరస్వామి ఆలయంలో జగన్నాథుని దివ్య రథోత్సవాల ముగింపును పురస్కరించుకుని రథోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. సుభద్ర, బలభద్ర, జగన్నాథుని దారు విగ్రహాలను రథంలో వేంచేపు చూసి ప్రత్యేక పూజల అనంతరం రథయాత్ర ప్రారంభమైంది. రథం లక్ష్మీపురం నుంచి తిమ్మాపురం వరకూ వెళ్లి తిరిగి ఆలయానికి చేరుకుంది. ఆలయ డీఈఓ వై.భద్రాజీ పర్యవేక్షించారు. – ద్వారకాతిరుమల -
పేరెంట్స్ మీట్పై టీచర్లకు షరతులు
నిడమర్రు: పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 10న నిర్వహించనున్న మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 2.ఓ కార్యక్రమం నిర్వహణపై విద్యాశాఖ అధికారులు షరతు విధించారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభించి మధ్యాహ్నం 12.30 వరకూ జరుగుతుందీ లేనిది ఇతర శాఖ ఉద్యోగి పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఆ ఉద్యోగి మెగా పీటీఎం రోజున 30 సెకన్ల వీడియో, నాలుగు ఫొటోలు, మొత్తం సమాచారాన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ప్రధానోపాధ్యాయులు ఉపయోగిస్తున్న లీప్ యాప్లో సాక్షిగా వచ్చిన వ్యక్తి అప్లోడ్ చేయాని గురువులకు విద్యాశాఖ అధికారులు షరుతు విధించారు. దీని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. యాప్ల భారంతో సతమతం ఉపాధ్యాయులకు యాప్ల భారం తగ్గించి అన్ని యాప్లను ఒకే వేదికపైకి తీసుకొచ్చి, సరికొత్త యాప్ రూపొందిస్తామని విద్యా శాఖ మంత్రి లోకేష్ ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన తొలి సమావేశంలో ప్రకటించారు. లీప్ యాప్ను రూపొందించినా.. రోజూ మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజనం నిర్వహణ వంటి కార్యక్రమాలతోపాటు స్టాక్ అందిన ప్రతిసారి పాత ఐఎంఎంఎస్లో నమోదు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇటీవల పాఠశాలలకు అందిస్తున్న సన్నబియ్యంపై ఉన్న క్యూఆర్ కోడ్ను స్టాక్ అందిన వెంటనే స్కాన్ చేయాలి. తర్వాత బస్తా ఓపెన్ చేసిన వెంటనే స్కాన్ చేయాలి. విద్యార్థులకు మొక్కలు, అపార్ ఐడీ క్రియేట్ వంటి అనేక అన్లైన్ కార్యక్రమాలతో బోధనకు దూరమవుతున్నామంటూ ఉపాధ్యాయులు అందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కుంటుపడుతున్న బోధన పాఠశాల తెరిచిన నాటి నుంచి పాఠశాలల్లో సంసిద్ధతా కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది. 1, 2 తరగతులకు 45 రోజులు, మిగిలిన ప్రాథమిక తరగతులకు 30 రోజులుగా అధికారులు షెడ్యూల్ ప్రకటించారు. ఇంతవరకూ గమనిస్తే ప్రారంభంలో బదిలీలు, జాయినింగ్లు, రిలీవింగ్లతో 10 రోజులు గడిచిపోయాయి. తర్వాత గిన్నిస్ రికార్డ్ కోసం అంటూ యోగాంధ్ర కార్యక్రమాలు, విద్యార్థుల రిజిస్ట్రేషన్లతో మరికొన్ని రోజులు గడిచాయి. జులై 1 నుంచి పూర్తిస్థాయిలో బోధనపై దృష్టి పెడతామంటే మరో గిన్నిస్ రికార్డు పేరుతో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.ఓ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మొక్కల కోసం విద్యార్థుల వివరాలు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, కమిటీల ఏర్పాటు, ఆహ్వానాలు, మండల స్థాయి నుంచి, పాఠశాల స్థాయి వరకూ ముందస్తు సమావేశాలతో ఉపాధ్యాయులంతా బిజీగా ఉండటతో, బోధనా కార్యక్రమాలు కుంటుపడినట్లు ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. కార్యక్రమం నిర్వహణపై ఇతర శాఖల ఉద్యోగులు సాక్ష్యంగా ఉండాలి విద్యా శాఖ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న టీచర్ సంఘాలు ఇతరుల పర్యవేక్షణ అంగీకరించం ఈ నెల 10న జరిగే మెగా పీటీఎంకు ఇతర శాఖల ఉద్యోగుల పర్యవేక్షణ ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. గత పీటీఎంను విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజల సహకారంతో విజయవంతం చేశాం. ఇప్పడు బాహ్య పరిశీలకుల పేరిట ఇతర శాఖ ఉద్యోగుల నియమించడం పాఠశాల నిర్వహణ వ్యవస్థను, ఉపాధ్యాయుల పనితీరు కించపరచడమే. –షేక్ రంగా వళి, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి, ఏపీటీఎఫ్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే.. మెగా పీటీఎంను విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విద్యాశాఖకు సంబంధం లేని ఓ వ్యక్తిని బాహ్య పరిశీలకుడిగా నియమించుకోవాలని ఉన్నత అధికారుల ఆదేశాల మేరకే అమలు చేస్తున్నాం. సాక్షి సంతకం నిబంధన గిన్నిస్ బుక్ రికార్డు కోసమే అని, గిన్నిస్ రికార్డుల నమోదు బృందం సూచనల మేరకే సాక్షి సంతం తీసుకుంటున్నట్లు ఉన్నత అధికారులు తెలిపారు. ఏవీఎస్ఎస్ భాస్కర కుమార్, ఎంఈవో–2, నిడమర్రు -
కూటమి మోసాలను నిలదీద్దాం
కామవరపుకోట: సూపర్ సిక్స్ పథకాలతో రాష్ట్ర ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వ మోసాన్ని నిలదీద్దామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. శనివారం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో చింతలపూడి వైఎస్సార్సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నియోజకవర్గ కన్వీనర్ కంభం విజయరాజు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో ‘బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ’ అని నాయకులు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ సందర్భంగా డీఎన్నార్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. వైఎస్సార్సీపీ నాయకులనే టార్గెట్గా చేసుకుని అక్రమ కేసులు పెడుతూ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ రాష్ట్రంలో అలజడలు సృష్టిస్తున్నారని వీరి మోసాలను గడపగడపకు వెళ్లి ప్రజలకు వివరించాలన్నారు. ఏలూరు పార్లమెంట్ కో–ఆర్డినేటర్ కారుమూరి సునీల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు సంపద సృష్టిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్కు, పవన్ కల్యాన్కు సంపద సృష్టించి పెడుతున్నారన్నారు. అన్నదాత సుఖీభవ పేరుతో రైతులను దగా చేశారన్నారు. కంభం విజయరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో రాష్ట్ర ప్రజలు విసుగు చెంది తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారన్నారు. వారి మోసపూరిత హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఇంటింటికీ వెళ్లి చంద్రబాబు మోసాలను వివరించాలన్నారు. జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు సరిత భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలతో మహిళలను మోసం చేసి ఓట్లు వేయించుకున్నారన్నారు. వీరి మోసాలను ప్రతి మహిళ గమనించాలన్నారు. ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ జయప్రకాష్, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకుడు జెట్టి గురునాథరావు, పార్టీ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు జగ్గవరపు జానకి రెడ్డి, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు డాక్టర్ రామకృష్ణ, జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన లక్ష్మి, అంగన్వాడీ విభాగం జిల్లా అధ్యక్షురాలు సాయిలు స్వాతి, లింగపాలెం, చింతలపూడి, కామవరపుకోట,జంగారెడ్డిగూడెం మండల అధ్యక్షులు అన్నపనేని శాంతారావు, కొప్పుల నాగేశ్వరరావు, రాయంకుల సత్యనారాయణ, ఓరుగంటి నాగేంద్ర, జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షుడు కర్పూరం గురవయ్య తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు -
నష్టాల ఊబిలో మామిడి రైతు
నూజివీడు: లాభాలు పంచుతుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్న మామిడి రైతుకు ఏటా నష్టాలు తప్పడం లేదు. ఈ ఏడాది మామిడి కాపు తగ్గిపోయినప్పటికీ మార్కెట్లో ధర ఏమాత్రం పెరగకుండా పడిపోవడంతో రైతులకు ఆదాయం లేక నష్టాల ఊబిలోకి కూరుకుపోయారు. పండ్లలో రారాజుగా మామిడికి పేరున్నా ఏటా మామిడి పరిస్థితి దారుణంగా దిగజారుతోంది. ఎకరాకు వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టిన మామిడి రైతులు పెట్టుబడులు కూడా రాక నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. మామిడి సీజన్లో మామిడి ధరలు గతంలో ఎప్పుడూ లేనంతగా దారుణంగా పతనమవ్వడంతో రైతులకు కోత కూలి, కిరాయి రాని పరిస్థితుల్లో కొందరు రైతులు చెట్లకే కాయలు వదిలేశారు. దీంతో మామిడిపై రైతులు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. మామిడి మార్కెట్ను కమిషన్ వ్యాపారులు, కాయలను కొనుగోలు చేసే ఢిల్లీ వ్యాపారులు కలిసి తమ గుప్పెట్లో ఉంచుకోవడంతో మామిడికి ధర లేకుండా పోతోంది. దీంతో మామిడి ధర రోజురోజుకు దిగజారుతుందే తప్ప ఒక్క రూపాయి కూడా పెరగడం లేదు. పట్టించుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉందే తప్ప గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోకుండా మిన్నకుండిపోయింది. జిల్లాలో 45 వేల ఎకరాల్లో మామిడి ఏలూరు జిల్లాలో 45 వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించాయి. నూజివీడు డివిజన్లోనే దాదాపు 40 వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో బంగినపల్లి, తోతాపురి, రసాలను రైతులు ఎక్కువగా సాగుచేస్తున్నారు. కాపు బాగా తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది ధర బాగా లభిస్తుందని రైతులు ఆశించగా ధర లేక వారి ఆశలు అడియాశలయ్యాయి. ఇతర పంటల సాగు వైపు దృష్టి ఒకప్పుడు మామిడి తోటలే జీవనాధారంగా ఉన్న నూజివీడు డివిజన్లో నేడు మామిడి తోటలంటే అయిష్టత కనబరుస్తున్నారు. మామిడి తోటలలో తెగుళ్ల ఉధృతి పెరగడం, సస్యరక్షణ చర్యలు చేపట్టినా నివారణ అంతంత మాత్రంగానే ఉండటంతో దిగుబడిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. దీనికి తోడు మామిడి ఎగుమతులు క్షీణిస్తూ ఉండటంతో రైతులు నష్టాలు చవిచూస్తున్నారు. వ్యయ ప్రయాసలకోర్చి కాయలను మార్కెట్కు తరలిస్తే అక్కడ సరైన ధర లభించకపోగా రైతులు దోపిడీకి గురవుతున్నారు. ధర ఉన్నా లేకపోయినా మామిడి కాయలను రైతులు ఏదో ఒక రేటుకు అమ్ముకోవాల్సి వస్తోంది. దీంతో మామిడి సాగు తలకు మించిన భారంగా పరిణమించింది. గతంలో రైతులు తమకున్న మామిడితోటల నుంచి వచ్చే ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసుకునేవారు. నేడు ఆ పరిస్థితులు కనుమరగయ్యాయి. మామిడితోటలు తొలగించిన తరువాత సారవంతమైన భూముల్లో స్వల్పకాలిక పంటలను సాగుచేయడం ద్వారా మామిడిలో వచ్చే ఆదాయం కన్నా ఎక్కువ ఆదాయాన్ని గడించవచ్చనే ఆలోచనకు రైతులు వచ్చారు. గత రెండేళ్ల కాలంలో తోటలను నరికివేసిన భూముల్లో మొక్కజొన్న, పత్తి, మిరప, నాటు పొగాకుతో పాటు వేరుశనగ, కూరగాయలు తదితర పంటలను సాగుచేస్తున్నారు. మరికొందరైతే ఆయిల్పామ్ సాగువైపు వెళ్తున్నారు. ఖర్చులు రావడం లేదు మామిడి ధరలు దారుణంగా పడిపోయాయి. కోత కోస్తే ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు పడిపోయినప్పటికి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహ రిస్తోంది. పరిస్థితులు ఇలాగే ఉంటే మామిడి సాగు పట్ల రైతుల్లో ఆసక్తి తగ్గిపోతుంది. నూజివీడు ప్రాంతంలో మామిడి పంట కనుమరుగయ్యే పరిస్థితులు ఎదురవుతాయి. – శీలం రాము, నూజివీడు ఈ ఏడాది పతనమైన మామిడి ధరలు కోత ఖర్చులు రాక చెట్లకే కాయలు వదిలేసిన రైతులు మామిడి రైతును ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం పట్టించుకోని ప్రభుత్వం ప్రధాన వాణిజ్య పంటగా ఉన్న మామిడిని రాష్ట్ర ప్రభుత్వం ఎంతమాత్రం పట్టించుకోవడం లేదు. మంత్రులు, ప్రభుత్వం కల్లబొల్లి కబుర్లు చెప్పడం తప్పితే మామిడి రైతును ఆదుకున్న దాఖలాలు లేవు. మామిడికి గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రైతులు విమర్శిస్తున్నారు. మార్కెటింగ్ శాఖ అధికారులు కూడా మామిడి మార్కెట్లో ధరలు పెరిగేలా ఎంత మాత్రం చర్యలు చేపట్ట లేదు. ఇప్పటికై నా ప్రభుత్వం ఆదుకోవాలని మామిడి రైతులు కోరుతున్నారు. మామిడి ధరలు (టన్ను సగటు ధర) రకం గతేడాది ఈ ఏడాది బంగినపల్లి రూ.30 వేలు రూ.12వేలు తోతాపురి రూ.15 వేలు రూ.4 వేలు బంగినపల్లికి దక్కని ధర బంగినపల్లి రకం కాయలకు ప్రారంభంలో టన్నుకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ధర లభించింది. సీజన్ గడిచిన కొద్దీ ధర తగ్గుముఖం పట్టి సీజన్ ముగిసే సమయానికి టన్ను రూ.8 వేల నుంచి రూ.12 వేలకు పడిపోయింది. దీంతో కోత కూలి, కిరాయి ఖర్చులు కూడా రాని పరిస్థితి. అయినప్పటికీ కాయలను అలాగే ఉంచి చూస్తూ ఊరుకోలేక ఎంతో కొంత డబ్బులు వస్తాయనే ఆశతో కాయలు కోసి మార్కెట్కు తరలించారు. తోతాపురి పరిస్థితి దారుణం తోతాపురి(కలెక్టర్) రకానికి కూడా ఈ ఏడాది ధర లేదు. గతేడాది సీజన్ ముగిసే వరకు టన్ను ధర రూ.9 వేలకు పైగానే లభించగా ఈ ఏడాది మాత్రం టన్ను ధర రూ.3 వేలకు పడిపోయింది. మామిడి సేఠ్ల సిండికేట్, చిత్తూరు జిల్లాలోని జ్యూస్ ఫ్యాక్టరీలు తెరవక కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో తోతాపురి ధరలు పతనమయ్యాయి. టన్ను రూ.3 వేలకు పడిపోవడంతో కోత కూలి, కిరాయి ఖర్చులు కూడా రాని పరిస్థితుల్లో రైతులు తోతాపురి కాయలను చెట్లకే వదిలేశారు. -
స్కాంలకు సహకారం
భక్తుల రద్దీ సాధారణం ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారికి ప్రీతికరమైన రోజు అయినప్పటికీ ఆషాఢ మాసం కావడంతో రద్దీ తగ్గింది.ఆదివారం శ్రీ 6 శ్రీ జూలై శ్రీ 2025సాక్షి ప్రతినిధి, ఏలూరు: రైతులకు తెలియకుండా రైతుల పేరుతో కోట్లలో రుణాలు తీసుకుంటారు. రైతుల నుంచి డిపాజిట్లు సేకరించి విచారణ పేరుతో కాలపరిమితి ముగిసినా తిరిగి చెల్లించరు. కార్యదర్శులు మినిట్ బుక్లో రాసిందే శాసనం. విచారణాధికారులే కింగ్ మేకర్లుగా మారి సమస్య సృష్టించి దానిని ఫిర్యాదుగా మలిచి దాని మీద విచారణ చేసి కావాల్సిన మేరకు దండుకుంటారు. ఇదీ జిల్లా సహకార శాఖ పరిధిలోని కొన్ని సొసైటీల్లో జరుగుతున్న అవినీతి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలోని కొన్ని సొసైటీల్లో రూ.కోట్ల అవినీతి జరుగుతున్నా ఉన్నతాధికారులు సైతం దృష్టి సారించడం లేదు. దీనిని బట్టి అవినీతి ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా టి.నర్సాపురం సొసైటీలో రూ.15 కోట్లకుపైగా డిపాజిట్లను తిరిగి ఇవ్వాలని రైతులు ఆందోళన నిర్వహించి సొసైటీకి తాళం వేయించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 258 సహకార సంఘాలున్నాయి. వీటి పరిధిలో ఏటా సుమారు రూ.5 వేల కోట్ల మేర టర్నోవర్ జరుగుతుంది. ఐదారు గ్రామాలు కలిపి సొసైటీగా ఏర్పడి రైతులను సభ్యులుగా చేర్చుకుని సొసైటీ ద్వారా ఎరువులు, పురుగు మందులు విక్రయించడం, రైతుల నుంచి డిపాజిట్లు స్వీకరించడం, రైతులకు రుణాలు ఇస్తూ కార్యకలాపాలు నిర్వహిస్తుంటాయి. రూ.50 కోట్ల పైగా టర్నోవర్ జరిగే సొసైటీలు ఉమ్మడి జిల్లాలో అనేకం ఉన్నాయి. ఆదాయం పెరిగి వృద్ధిలోకి వస్తే సేవలు విస్తరించాలి. ఆదాయం పెరిగే ప్రతి సొసైటీలో అవినీతి పెరగడం స్థానిక ఉద్యోగులు మొదలుకొని జిల్లా స్థాయి అధికారుల వరకు పెంచి పోషిస్తూ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. రూ.100 కోట్లకుపైగా అవకతవకలు జిల్లాలో గంగన్నగూడెం, విజయరాయి, జోగన్నపాలెం, చింతలపూడి, రాఘవాపురం, పోతునూరు, టీ. నర్సాపురం ఇలా సుమారు 25కుపైగా సొసైటీల్లో అవకతవకలు జరిగాయి. కొద్దిమందిపై విచారణ, సస్పెన్షన్లతో కోట్లాది రూపాయల అవినీతిని మరుగున పడేస్తున్నారు. కొన్నిచోట్ల వ్యవహారం బయటకు వచ్చినా ఇబ్బంది లేకుండా రికార్డులను తమదైన శైలిలో మార్చి మొక్కుబడి ఎంకై ్వరీ పేరుతో ఫైల్స్ మూసేస్తున్నారు. చింతలపూడి సొసైటీలో రూ.30 కోట్ల మేర అవినీతి జరిగింది. 8,928 మంది సభ్యులున్న సొసైటీలో ఏటా సగటున రూ.61.22 కోట్ల మేర టర్నోవర్ జరుగుతుంది. గతంలో ఈ సొసైటీలో రైతులకు తెలియకుండా రూ.కోట్ల రుణాలు సొసైటీ, శాఖలోని కీలక వ్యక్తులే తీసుకున్నారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో విచారణ నిర్వహించారు. నిబంధనల ప్రకారం ఆరు నెలల్లోపు పూర్తి చేసి చర్యలు తీసుకోవాలి. గురుకుల విద్య.. భద్రత మిథ్య శిథిలావస్థకు చేరిన భవనాల్లోనే గురుకుల విద్య తరగతులు నిర్వహిస్తుండడంతో ఏ క్షణాన ఏ భవనం కూలిపోతుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 8లో uఅక్రమాలకు సహకరిస్తున్న విచారణాధికారులు విచారణాధికారి అన్ని విధాలా సహకారం అందించి ఆరు నెలల్లో జరగాల్సిన విచారణను నిలుపుదల చేస్తూ.. సొసైటీ సభ్యులు కోర్టుకు వెళ్లి స్టే తీసుకువచ్చేలా సాయపడుతున్నారు. సీజ్ చేసిన సొసైటీ రికార్డులు విచారణాధికారి వద్ద ఉంటాయి. దాంట్లో ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62కు మార్చి కమిటీ తీర్మానం చేసినట్లు రికార్డు ట్యాపరింగ్ చేసి మరీ ప్రత్యేకంగా ఉత్తర్వులు తెచ్చారు. అనేక సొసైటీల్లో ఇదే తరహా వ్యవహారాలు జరిగాయి. గంగన్నగూడెంలో రూ.25 లక్షలు, జోగన్నపాలెంలో రూ.75 లక్షలు, చింతలపూడిలో రూ.30 లక్షలు, రాఘవాపురంలో రూ.40 లక్షలు, పోతునూరులో రూ.30 లక్షలకుపైగా జరిగిన అవినీతిలో కొద్ది మందిని సస్పెండ్ చేశారు. కీలక విచారణాధికారి మాత్రం విచారణ నిర్వహించి రిపోర్టును మాత్రం ప్రత్యేక వ్యవహారాలతో పెండింగ్లో ఉంచారని ఆరోపణలు ఉన్నాయి. సదరు విచారణాధికారికి ప్రత్యేకంగా నలుగురు అసిస్టెంట్ రిజిస్ట్రార్లు, ఒక సీనియర్ ఇన్స్పెక్టర్తో బృందం ఉంటుంది. సదరు బృందమే సొసైటీల్లోని తప్పులు తెలుసుకుని సొసైటీ కార్యదర్శులను పిలిచి మాట్లాడి రూ.లక్ష నుంచి రూ.5 లక్షలు, తీవ్రతను బట్టి రూ.20 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ప్రతి సొసైటీలో ఆడిట్ పూర్తి చేసి బేరం కుదిరితేనే సర్టిఫికెట్ ఇచ్చేలా వ్యవహారం సాగిస్తున్నారు. సొసైటీల్లో జరుగుతున్న అవినీతి వ్యవహారంపై ఇటీవల కొందరు ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేసి సహకార శాఖకు సంబంధం లేని వ్యక్తితో విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు. న్యూస్రీల్ రైతుకు తెలియకుండానే రైతుల పేరుతో రుణాలు పలు సహకార సొసైటీల్లో అవినీతి విచారణాధికారులే కింగ్ మేకర్లుగా మారుతున్న వైనం చింతలపూడి సొసైటీలో గతంలో రూ.30 కోట్ల మేర అవినీతి డిపాజిట్లు ఇవ్వాలంటూ టి.నర్సాపురం సొసైటీ వద్ద రైతుల ఆందోళన అవకతవకలు పరిశీలిస్తాం సహకార సొసైటీలో జరిగిన అవినీతి, విచారణలు పూర్తిగా మా దృష్టికి రాలేదు. కొత్తగా ఇన్చార్జి బాధ్యతలు స్వీకరించాను. అన్నింటిని పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదించి చర్యలు తీసుకుంటామం. – కే.వెంకటేశ్వరరావు, జిల్లా సహకార శాఖ ఇన్చార్జి టి.నర్సాపురం సొసైటీకి తాళం టి.నర్సాపురం సొసైటీలో గతంలో భారీ కుంభకోణం వెలుగుచూసింది. కొన్నేళ్లుగా త్రిసభ్య కమిటీతో సొసైటీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. 370 మందికి సంబంధించి రూ.15 కోట్ల మేర మెచ్యూరిటీ పూర్తయినా డబ్బు ఖాతాల్లో జమ చేయలేదని ఆగ్రహించిన రైతులు డిపాజిట్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం సొసైటీ సిబ్బందితోనే తాళాలు వేయించి సొసైటీ వద్ద నిరసన వ్యక్తం చేశారు. -
రాజీ మార్గమే ఉత్తమం
ఏలూరు (టూటౌన్)/ఏలూరు(ఆర్ఆర్పేట): రాజీ మార్గమే ఉత్తమమని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి అన్నారు. శనివారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. లోక్ అదాలత్ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి మాట్లాడుతూ కక్షిదారులకు త్వరితగతిన కేసుల పరిష్కారం నిమిత్తం జాతీయ లోక్అదాలత్ నిర్వహిస్తున్నామని చెప్పారు. కక్షిదారులు సౌలభ్యం కోసం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా 35 బెంచీలు ఏర్పాటు చేసి త్వరితగతిన కేసుల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తున్నామని తెలిపారు. రెండో అదనపు జిల్లా జడ్జి యు.ఇందిరా ప్రియదర్శిని, ఐదో అదనపు జిల్లా జడ్జి ఆర్వీవీఎస్ మురళీకృష్ణ, ఏడో అదనపు జిల్లా జడ్జి వై.శ్రీనివాసరావు, ఎనిమిదో అదనపు జిల్లా జడ్జి ఐ.శ్రీనివాస మూర్తి, పోక్సో జడ్జి కుమారి శ్రీవాణి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ పాల్గొన్నారు. లోక్ అదాలత్లో 6324 పెండింగ్ కేసులను, 141 ప్రీ లిటిగేషన్ కేసులను రాజీచేసినట్టు జిల్లా జడ్జి ఎస్.శ్రీదేవి తెలిపారు. రాజీ కేసుల్లో మోటార్ వాహన ప్రమాద కేసులు 129, సివిల్ కేసులు 219, క్రిమినల్ కేసులు 5,976 ఉన్నాయన్నారు. వైఎస్సార్టీయూసీ కార్యదర్శిగా పల్లె రవీంద్రరెడ్డి నూజివీడు: రాష్ట్ర వైఎస్సార్టీయూసీ సెక్రటరీగా నూజివీడుకు చెందిన పల్లె రవీంద్రరెడ్డిని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ప్రకటన విడుదల చేసింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రవీంద్రరెడ్డిని నియమించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో రవీంద్ర రెడ్డి మార్కెట్ యార్డు చైర్మన్గా, రైతు సలహా సంఘం జిల్లా సభ్యుడిగా, వైఎస్సార్టీయూసీ జిల్లా సెక్రటరీగా పనిచేశారు. నిండుకుండలా గోదావరి కుక్కునూరు: ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద నీరు చేరింది. శనివారం భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం 20 అడుగులకు చేరుకుంది. కుక్కునూరు వద్ద నిండుకుండను తలపిస్తోంది. వరద ప్రవాహం పెరగడంతో శనివారం ఉదయం వరకు గోదావరి ఇసుక తెన్నెల మీద ఉన్న జాలర్లు సామన్లు, వలలతో సహా ఒడ్డుకు చేరుకున్నారు. గోదావరి వరద ప్రవాహంగా స్వల్పంగా పెరిగిందని కుక్కునూరు తహసీల్దార్ కె.రమేష్బాబు అన్నారు .రానున్న రోజుల్లో ప్రవాహం మరింత పెరిగినా బాధిత గ్రామాల ప్రజలు ఇబ్బంది పడకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. వరద ప్రభావిత గ్రామాల ప్రజలకు పునరావాస సహాయక కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. 1.87 లక్షల క్యూసెక్కులు విడుదల పోలవరం రూరల్: గోదావరి వరద పెరుగుతూ ఉభయగోదావరి జిల్లాల మధ్య లంక ఒడ్డులను తాకుతూ ప్రవహిస్తోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద 27.920 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. స్పిల్వే నుంచి దిగువకు 1.87 లక్షల క్యూసెక్కులకు పైగా వరదనీరు చేరుతోంది. పాఠశాల లాగిన్కు ఎస్ఎస్సీ జవాబు పత్రాలు ఏలూరు (ఆర్ఆర్పేట): ఇటీవల నిర్వహించిన ఎస్ఎస్సీ ఎస్ఈ పరీక్షలకు సంబంధించి రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల జవాబుపత్రాలు సంబంధిత పాఠశాలల లాగిన్కు విడుదల చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు జిల్లాలోని ప్రధానోపాధ్యాయులు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల జవాబు పత్రాలు వెంటనే సదరు విద్యార్థులకు ప్రింట్ తీసి అందచేయాలని ఆదేశించారు. -
జగన్ 2.0 లో కార్యకర్తలదే పాలన
కొయ్యలగూడెం: జగన్మోహన్రెడ్డి 2.0 పాలనలో కార్యకర్తలే పాలకులు అని, ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు కార్యకర్తల ద్వారానే కొనసాగిస్తామని వైఎస్సార్సీపీ ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి కారుమూరి సునీల్ పేర్కొన్నారు. శనివారం కొయ్యలగూడెంలో మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అధ్యక్షతన నిర్వహించిన ‘రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో’ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాధరావు, చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జి కంభం విజయరాజుతో కలసి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రతి అంశాన్ని జగన్ మోహన్ రెడ్డి నిశితంగా పరిశీలిస్తున్నారని, కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయాన్ని తప్పనిసరిగా గుర్తుపెట్టుకుని రిటర్న్ గిఫ్ట్ అందిస్తారన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రాష్ట్రంలో గెలుచుకోబోయే మొట్టమొదటి స్థానం పోలవరం అని చెప్పారు. వైఎస్సార్సీపీకి రక్షణ కార్యకర్తలు అని జెట్టి గురునాథరావు పేర్కొన్నారు. సంవత్సరం వ్యవధిలోనే ప్రజా వ్యతిరేకత ఉప్పెనలా మారిందని, పోలవరం నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి తారాస్థాయిలో ఉందన్నారు. చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గాన్ని వైఎస్సార్సీపీ కంచుకోటగా మలుస్తూ విజయరాజు పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి కృషి చేస్తున్నారని బాలరాజు పేర్కొన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు మంతెన సోమరాజు, అధికార ప్రతినిధి దాసరి విష్ణు, ఎంపీపీలు సుంకర వెంకటరెడ్డి, గంజిమాల రామారావు, చందా ప్రసాద్, వైఎస్సార్సీపీ నియోజకవర్గ మండలాల అధ్యక్షులు తుమ్మలపల్లి గంగరాజు, కెఎస్ఎస్ శ్రీను రాజు, బుగ్గ మురళి, అల్లూరి రత్నాజీ, తాండ్రు రాజేష్, తదితరులు పాల్గొన్నారు. -
పోలవరంపై చంద్రబాబు వాస్తవాలు బయట పెట్టాలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చింతలపూడి : పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు వాస్తవాలు బయటపెట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. చింతలపూడిలో ఏలూరు జిల్లా సీపీఐ ద్వితీయ మహాసభలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ పోలవరం ఎత్తు 41.15 మీటర్లు తగ్గించినట్లు కేంద్ర ప్రభుత్వమే తెలిపిందని, దీనిపై చంద్రబాబు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. పోలవరం నివాసితులకు న్యాయం జరిగే వరకూ ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. చంద్రబాబు ఇప్పుడు కొత్తగా పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు అంటూ ప్రజలను ఏమారుస్తున్నారన్నారు. సూపర్ సిక్స్ ఎక్కడ బాబూ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా ప్రజలకు ఒరిగిందేమీ లేదని, సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 20 ఏళ్లపాటు రూ.1.10 లక్షల కోట్ల భారాన్ని విద్యుత్ చార్జీల పెంపు రూపంలో ప్రజలపై ప్రభుత్వం మోపుతుందని ఆరోపించారు. గత ప్రభుత్వంలో స్మార్ట్మీటర్లను ఏర్పాటు చేస్తే తప్పు అన్న చంద్రబాబు, లోకేష్ ఇప్పుడు ఎందుకు స్మార్ట్మీటర్లు ఏర్పాటు చేయాల్సి వస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మహాసభలకు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య అధ్యక్షత వహించగా జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, రాష్ట్ర కార్యదర్శి కేవీపీ ప్రసాద్, రాష్ట్ర సమితి సభ్యులు, మండల కార్యదర్శి టి.బాబు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. మద్యం మత్తులో కాలువలో పడి రౌడీషీటర్ మృతి ఏలూరు టౌన్: ఏలూరు వన్టౌన్ పరిధిలో ఒక రౌడీషీటర్ మద్యం మత్తులో ఒక మురికి కాలువలో పడి ఊపిరాడక మృతిచెందాడు. వివరాల ప్రకారం.. ఏలూరు వన్టౌన్ ప్రాంతంలోని వంగాయగూడేనికి చెందిన బలిరెడ్డి విజయసాయి (36) సెంట్రింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. విజయసాయిపై వన్టౌన్ పోలీస్స్టేషన్లో ప్రస్తుతం రౌడీషీట్ కొనసాగుతోంది. మద్యం సేవించిన సాయి శనివారం తెల్లవారుజామున వంగాయగూడెం వైపు నుంచి వస్తూ అక్కడి మురికి కాలువపై ఉన్న గట్టుపై పడుకున్నాడు. పూటుగా మద్యం సేవించి ఉండడంతో ప్రమాదవశాత్తు కాలువలో పడి ఊపిరాడక మృతిచెందాడు. ఈ విషయంపై పోలీసులు సీసీ కెమెరాల పుటేజ్ పరిశీలించి మృతుడు కాలువ గట్టుపై పడుకుని ప్రమాదవశాత్తు జారిపడినట్లు గుర్తించారు. అనంతరం సాయి మృతదేహానికి జీజీహెచ్లో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఏలూరు వన్టౌన్ సీఐ జీ.సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎస్సై నాగబాబు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మందుల షాపుల్లో తనిఖీలు
కొయ్యలగూడెం: మండలంలోని పలు మెడికల్ షాపుల్లో శనివారం ఏలూరు నుంచి వచ్చిన డ్రగ్ ఇన్స్పెక్టర్ అబిద్ ఆలీ షేక్ నేతృత్వంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. కన్నాపురం రోడ్డులోని మురళీకృష్ణ మెడికల్స్ షాపులో తనిఖీలు నిర్వహించి ఆరు రకాల నిషేధిత ఔషధాలను స్వాధీనం చేసుకొని షాపును సీజ్ చేశారు. అలాగే బుట్టాయగూడెంలోని లక్ష్మీ దుర్గ మెడికల్ స్టోర్స్, కార్తికేయ మెడికల్ స్టోర్స్, కృష్ణ మెడికల్ స్టోర్స్లలో కూడా తనిఖీలు జరిపారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ అబిద్ ఆలీ షేక్ మాట్లాడుతూ ఓ వ్యక్తి ముసుగు, కళ్లజోడు ధరించి బండిపై తిరుగుతూ ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఏలూరు జిల్లాలోని పలు మెడికల్ షాపులకు నిషేధిత ఔషధాలను (వయాగ్రా టాబ్లెట్లు, అబార్షన్ కిట్లు) సరఫరా చేస్తున్నాడని, అతడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. -
గురుకుల విద్య.. భద్రత మిథ్య
భీమడోలు: అధికారుల నిర్లక్ష్యం.. గురుకుల విద్యార్థినుల పాలిట శాపంగా మారింది. శిథిలావస్థకు చేరిన భవనాల్లోనే గురుకుల విద్య తరగతులు నిర్వహించడంపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో గుబులు రేపుతోంది. ఏ క్షణాన ఏ భవనం కూలిపోతుందోనని, తమ పిల్లల పరిస్థితి ఏమిటని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పోలసానిపల్లిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల భవనంలోని రెండు ల్యాబ్లకు చెందిన శ్లాబ్లు మే 30వ తేదీన రాత్రి సమయంలో కూలిపోయాయి. అయితే వేసవి సెలవులు కావడం, రాత్రి పూట కూలడంతో పెను ప్రమాదమే తప్పింది. ఈ నేపథ్యంలో విద్యార్థినుల భద్రతపై ప్రశ్నలు తలెత్తిన నేపథ్యంలో సంబంధిత గురుకుల సొసైటీ అధికారులు పరిస్థితిని సమీక్షించారు. పాత భవనాలు క్షేమం కాదని కళాశాలను తాత్కాలికంగా వేరే ప్రదేశానికి మార్చాలని అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. భీమడోలు, ద్వారకాతిరుమల, నల్లజర్ల మండలాల్లో ఎక్కడైనా అద్దె భవనాన్ని తీసుకుని విద్యార్థినులకు తరగతులు నిర్వహించేలా తగు చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇందుకు రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తూ పోలసానిపల్లిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు 710 మంది విద్య అభ్యసిస్తున్నారు. టీచర్లు, కార్యాలయ సిబ్బంది, ఇతర సిబ్బందితో కలిసి 100 మందికి పైగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరడం, తరచూ వంటశాల, భోజన శాల, డార్మిటరీల్లో శ్లాబ్లు ఊడి కింద పడుతుండడం, అంతేగాకుండా హాస్టల్ ఆవరణలో విష సర్పాలు సంచరించడంతో విద్యార్థినులు, సిబ్బంది బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. దీంతో జూన్ 12వ తేదీ నుంచి తరగతులు పునఃప్రారంభమైనా విద్యార్థినులను ఎక్కువ మంది ఇక్కడ చదివించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు. ఏడు వందల మందికిగాను కేవలం 180 మంది బాలికలు మాత్రమే హాజరవుతున్నారు. బడ్జెట్ కేటాయింపులేవి? ప్రతి ఏటా గురుకులాల్లో మౌలిక వసతులు, మరమ్మతులకు బడ్జెట్లో గురుకుల సొసైటీ ఉన్నతాధికారులు నిధులు కేటాయించకపోవడమే ఈ పరిస్థితికి కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రమాదం పొంచి ఉన్నా శిథిలావస్థకు చేరిన భవనాలకు కనీసం మరమ్మతులు నిర్వహించకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలిన రెండు ల్యాబ్లు (ఫైల్) పోలసానిపల్లి గురుకులంలో శిథిలావస్థకు చేరిన భవనాలు విద్యార్థినుల భద్రత దృష్ట్యా వేరే ప్రాంతానికి తరలింపు చర్యలు రాష్ట్ర స్థాయి అధికారుల నిర్ణయం కోసం ఎదురు చూపుఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం పోలసానిపల్లి గురుకుల కళాశాల పరిస్థితిపై రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు డీసీవో బి.ఉమాకుమారి తెలిపారు. కళాశాలను వేరే ప్రాంతానికి తరలించే నిర్ణయంపై వారం రోజుల్లో ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. అలాగే భవనాల్లోని పటుత్వాన్ని గుర్తించేందుకు ఉన్నతాధికారులతో సంప్రదిస్తుమని, వారిచ్చే నివేదికను సొసైటీ ఉన్నతాధికారులకు సమర్పిస్తామన్నారు. విద్యార్థినుల భద్రతే లక్ష్యంగా తమ వంతు కృషి చేస్తున్నామని, బాలికల తల్లిదండ్రులు ఆందోళన చెందనవసరం లేదని వెల్లడించారు. -
ప్రేమ వివాహం.. గ్రామాల మధ్య వివాదం
ప్రేమికుడిపై దాడి చేసిన యువతి బంధువులు కై కలూరు: ఓ ప్రేమ వివాహం ఇరు గ్రామాల మధ్య వివాదానికి దారితీసింది. ప్రేమికుడు, అతని బంధువులపై యువతి బంధువులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన కై కలూరులో శనివారం జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కై కలూరు మండలం చటాకాయి గ్రామానికి చెందిన ఘంటసాల రోజాకుమార్(22), నత్తగుళ్ళపాడు గ్రామానికి చెందిన నబిగారి లక్ష్మీ ప్రసన్న(22) కై కలూరు కాలేజీలో చదువుతూ ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. రోజాకుమార్ కుటుంబం కొన్ని నెలలుగా నెల్లూరులో చేపల చెరువులు సాగు చేస్తూ అక్కడే ఉంటున్నారు. ఇంట్లో వివాహం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ప్రసన్న చెప్పడంతో రోజాకుమార్ ఆమెను తీసుకువెళ్లి నెల్లూరు సమీప బుచ్చిరెడ్డిపాలెం కామాక్షి దేవాలయంలో తాళి కట్టి దండలు మార్చుకున్నారు. అక్కడ పోలీసు స్టేషన్కు వెళ్లారు. విషయం తెలుసుకున్న రోజాకుమార్ గ్రామ పెద్దలు కారులో ప్రేమ జంటను తీసుకువస్తుండగా రాత్రి సమయంలో ఒంగోలు వద్ద యువతికి చెందిన నత్తగుళ్ళపాడు గ్రామస్తులు తారసపడ్డారు. అందరూ కలసి వస్తుండుగా ఏలూరు రూరల్ మండలం శ్రీపర్రు వంతెన వద్ద యువతి మేనమామ ఘంటసాల చందు, బంధువులు మరో నలుగురు బయట వ్యక్తులతో కలిసి యువకుడి కారుపై దాడి చేసి యువతిని తీసుకువెళ్లారు. ఈ దాడిలో రోజాకుమార్తోపాటు చటాకాయికి చెందిన ఘంటసాల సుబ్బరాజు, ముంగర గంగాథరరావు, జల్లూరు శ్రీను, ఘంటసాల నారాయణ, డ్రైవర్ సైదు హేమ కిరిటీలకు దెబ్బలు తగిలాయి. వీరు కై కలూరు ప్రభుత్వాసుపత్రిలో చేరగా వీరిని ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, వడ్డి కార్పొరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బలే ఏసురాజు పరామర్శించారు. అనంతరం ఆస్పత్రి వద్ద, పోలీసు స్టేషన్ వద్ద ఇరు గ్రామాల పెద్దలు గొడవకు దిగారు. ఈ విషయంపై కై కలూరు రూరల్ సర్కిల్ సీఐ వి.రవికుమార్ మాట్లాడుతూ బయట వ్యక్తులు దాడి చేసిన ప్రాంతం శ్రీపర్రు కావడంతో అక్కడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారన్నారు. తల్లిదండ్రులతోనే ఉంటానని యువతి చెప్పడంతో ఇరు గ్రామస్తులతో మాట్లాడామన్నారు. విభేదాలు పడవద్దని గ్రామస్తులకు తెలిపామన్నారు. -
జంతువుల వ్యాధులతో జర జాగ్రత్త..!
కై కలూరు/కొయ్యలగూడెం : మనుషుల నుంచి జంతువులకు, జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులను జూనోటిక్ వ్యాధులు అంటారు. పిచ్చికుక్క కరిచిన ఓ బాలుడికి 1885లో ఫ్రెంచ్ జీవశాస్త్రవేత్త లూయిస్ పాశ్చర్ రేబీస్ టీకాను ప్రయోగించి, విజయం సాధించిన సందర్భంగా ప్రతి ఏటా జూలై 6న జూనోసిస్ దినోత్సవం జరుపుతారు. జూనోసిస్ డే సందర్భంగా జిల్లాలో పశువైద్యశాలల్లో ఆదివారం కుక్కలకు ఉచిత రేబీస్ టీకాలు వేస్తారు. జూనోటిక్ వ్యాధులపై అప్రమత్తత జంతువుల నుంచి సోకే వ్యాధులపై అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని పశువైద్యులు సూచిస్తున్నారు. జంతువుల లాలాజలం, రక్తం, మూత్రం, శ్లేష్మం, మలం, ఇతర శరీర ద్రవాల కారణంగా మనుషులకు జూనోటిక్ వ్యాధులు సోకుతాయి. వీటిలో పాడి పశువుల నుంచి ఆంత్రాక్స్, బ్రూసిల్లోసెస్, లప్టిరియోసిస్, రింగ్ వార్మ్ వ్యాధులు, గొర్రెలు, మేకలు నుంచి హైడాటిడోసిస్, సార్కోసిప్టిస్, ఆంత్రాక్స్, బ్రూసిల్లోసెస్, లప్టిరియోసిస్, సాల్మోనెల్లోసిస్, క్యూ–పివర్, మేంజ్ వ్యాధులు, కుక్కల నుంచి రేబీస్, లీష్మీనియా, బద్దెపురుగుల వ్యాధి, రింగ్ వార్మ్, హైడాటిడోసెస్, మీసిల్స్, మంప్స్, మేంజ్ వ్యాధులు సోకుతున్నాయి. జూనోటిక్ వ్యాధులు ఎక్కువగా కేన్సర్ వ్యాధిగ్రస్తులు, వృద్ధులు, గర్భిణీ రోగులు, 5వ సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగిన పిల్లలు, అడవిలో జంతువులతో సహజీవనం చేసే వ్యక్తులకు సోకే అవకాశం ఉంది. జిల్లాలో 25 వేల ఉచిత రేబీస్ టీకాలు ఏలూరు జిల్లాలోని 7 నియోజకవర్గాలకు కలిపి మొత్తం 25 వేల ఉచిత రేబీస్ టీకాలు వచ్చాయి. జిల్లాలో ప్రాంతీయ పశువైద్యశాలలు 11, వెటర్నరీ డిస్పెన్సరీలు 66, గ్రామీణ పశు వైద్యశాలలు 57, రైతు సేవాకేంద్రాలు 315 ఉన్నాయి. వీటి పరిధిలో ఆవులు, గేదెలు కలిపి 6,01,589, మేకలు, గొర్రెలు కలిపి 8,06,374, కుక్కలు 15,222 (వీధి కుక్కలు మినహాయించి)గా గుర్తించబడ్డాయి. ఆదివారం ఉదయం నుంచి ఆయా కేంద్రాల్లో పశువైద్యులు ఉచితంగా రేబీస్ టీకాలు అందిస్తారు. అదే విధంగా జూనోటిక్ వ్యాధులపై పెంపుడు జంతువుల యజమానులకు అవగాహన కలిగిస్తారు. 46 వేల బ్రూసెల్లా ఉచిత టీకాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేషనల్ యానిమల్ డీసీస్ కంట్రోల్ ప్రోగ్రాం(ఎన్ఏడీసీపీ)లో భాగంగా బ్రుసెల్లా వ్యాధిని 2030 నాటికి నిర్మూలించాలనే ధ్యేయంతో మూడేళ్లగా ఉచిత వ్యాధి నిరోధక టీకాలు అందిస్తున్నారు. ఏలూరు జిల్లాలో మూడు విడతల్లో 46 వేల బ్రుసెల్లా వ్యాధి నిరోధక టీకాలు 4–8 నెలల మధ్య వయస్సు కలిగిన ఆడ దూడలకు మాత్రమే ఉచితంగా అందించారు. అది జీవితకాలం వ్యాధి సోకకుండా రక్షణ ఇస్తుంది. నేడు ప్రపంచ జూనోసిస్ దినోత్సవం ఏలూరు జిల్లాకు 25 వేల ఉచిత రేబీస్ వ్యాక్సిన్లు బ్రూసెల్లోసిస్ అంటువ్యాధిపై ప్రజలకు అవగాహన జిల్లాలో 134 పశు వైద్యశాలల్లో కుక్కలకు ఉచిత టీకాలు మనుషులకు సోకుతున్న బ్రూసెల్లోసిస్ వ్యాధి బ్రూసెల్లోసిస్ వ్యాధి జంతువుల నుంచి మనుషులకు సోకే ఒక ముఖ్యమైన జూనోటిక్ వ్యాధి. వ్యాధి సోకిన జంతువులు, కలుషితమైన జంతు ఉత్పత్తులు, ప్రయోగశాలలో బ్రూసెల్లోసిస్ సోకిన జంతువుల ద్రావములను తాకడంతో మానవులకు ఇది వ్యాపిస్తోంది. పశువైద్యులు, పాడి రైతులు, కబేళాల కార్మికులకు ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. ఇదే కాకుండా పాశ్చరైజ్ చేయని పాల ఉత్పత్తులు, వ్యాధి సోకిన జంతువుల నుంచి ఉడికించని మాంసం తీసుకోవడం వల్ల కూడా ఇది సోకుతోంది. జ్వరం, కీళ్ల నొప్పులు, అలసట, నీరసం. మగవారిలో వృషణాల వాపు, కుచించుకుపోవడం, వంధ్యత్వానికి గురవుతున్నారు. రేబీస్ వ్యాధి సులభంగా వ్యాపిస్తుంది ఇది కేవలం కుక్క కాటుతోనే కాక, వ్యాధిసోకిన జంతువు లాలాజలం గాయాల మీద పడితే కూడా వ్యాపిస్తుంది. రేబీస్ అనేది ఒక ప్రాణాంతకమైన వ్యాధి. కాబట్టి, కుక్కలు, పిల్లుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం, టీకాలు వేయించడం చాలా ముఖ్యమైనది. కాటు సంభవించినప్పుడు వెంటనే వైద్యుని సంప్రదించి రేబీస్ వ్యాధి వ్యాప్తిని నిరోధించడం చాలా అవసరం. – బీఆర్ శ్రీనివాస్, పశు వైద్యాధికారి, కొయ్యలగూడెంటీకాలు తప్పనిసరి పెంపుడు జంతువులతో మానవులకు అవినాభవ సంబంధం ఉంది. ప్రతి ఒక్కరూ పెంపుడు జంతువులకు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలి. జూనోటిక్ వ్యాధులపై అందరూ అవగాహన పెంచుకోవాలి. పశుసంవర్థకశాఖ ద్వారా ఏటా జూనోసెస్ డే సందర్భంగా ఉచిత రేబీస్ టీకాలు వేస్తున్నాం. అందరూ సద్వినియోగం చేసుకోవాలి. – డాక్టర్ పఠాన్ ముస్తాఫా ఖాన్, పశుసంవర్థకశాఖ సహాయ సంచాలకులు, కై కలూరు -
తొలి ఏకాదశి.. పుణ్యాల రాశి
ద్వారకాతిరుమల: ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి నుంచే పండుగలన్నీ మొదలవుతాయి కాబట్టి దీన్ని తొలి పండుగ అని పిలుస్తారు. ఈ ఏకాదశిని శయన ఏకాదశి, దేవశయన ఏకాదశి, పద్మ ఏకాదశి అని కూడా అంటారు. ఆదివారం తొలి ఏకాదశి కాగా పండుగ విశిష్టతను శ్రీవారి దేవస్థానం ఆగమ పండితులు సుదర్శనం శ్రీనివాసాచార్యులు మాటల్లో తెలుసుకుందాం. తొలి ఏకాదశి విశిష్టత ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు (కార్తీక మాసం శుక్ల ఏకాదశి (ప్రబోధిని ఏకాదశి) వరకు) విష్ణుమూర్తి పాలకడలిపై నిద్రిస్తారు. ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాసం అంటారు. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లోనూ ఈ రోజు మొదటిది. అందుకే ఈ రోజు ఉపవాసం ఉంటే విష్ణుమూర్తి అనుగ్రహం తప్పక లభిస్తుంది. అందుకోసం దశమి రాత్రి నుంచే నిరాహారంగా ఉండాలి. ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్రలేచి విష్ణుమూర్తిని తులసీదళాలతో పూజించాలి. రాత్రి అంతా జాగరణ చేస్తూ భాగవతం లేదా విష్ణుసహస్రనామ పారాయణం చేయాలి. మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు దగ్గరలోని ఆలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి. దీనినే తొలి ఏకాదశి వ్రతం అని అంటారు. ఈ రోజున అన్నం, మాంసాహారం తినకూడదు. తులసి ఆకులు కోయడం, జుట్టు, గోర్లు కత్తిరించుకోవడం, గొడవలు, దుర్భాషలాడటం, పగలు నిద్రపోవడం, ఇతరులను అవమానించడం, చెడుగా ఆలోచించడం, దానం నిరాకరించడం వంటివి చేయరాదు. శ్రీవారి క్షేత్రంలో.. ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం విశేష కార్యక్రమాలు జరగనున్నాయి. అందులో భాగంగా రాత్రి స్వామివారి గ్రామోత్సవం క్షేత్ర పురవీధుల్లో కన్నుల పండువగా జరుగనుంది. తొలి పండుగ కావడంతో వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శిస్తారని ఆలయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నేడు శ్రీవారి క్షేత్రంలో ప్రత్యేక పూజలు -
26 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
నూజివీడు: మండలంలోని మొర్సపూడిలో అక్రమంగా రవాణా చేస్తున్న రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లయిస్ డీటీ జీ వెంకటేశ్వరరావు, వీఆర్వో నాగరాజు గ్రామస్తులతో కలిసి శనివారం పట్టుకున్నారు. రేషన్ షాపులోని బియ్యాన్ని ట్రక్కు వాహనంలోకి లోడు చేస్తుండగా గ్రామస్తులు అధికారులకు సమాచారం అందించడంతో హుటాహుటిన మొర్సపూడికి చేరుకొని ట్రక్కు వాహనంలో ఉన్న 26 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న రేషన్ డీలర్ గొడవర్తి అచ్చయ్య, రేషన్ బియ్యం అక్రమ వ్యాపారి సోలా రాములపై 6ఏ కేసు నమోదు చేశారు. అనుమతి లేని బస్సులపై అపరాధ రుసుం తాడేపల్లిగూడెం: అనుమతులు లేకుండా నడుపుతున్న విద్యాసంస్థలకు చెందిన బస్సులకు మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లు జరిమానా విధించారు. డీటీఓ ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు స్కూల్ బస్సులను తనిఖీ చేశారు. పిప్పర పరిధిలోని స్కూల్స్ బస్సుల్లో ఒకటి టాక్స్ లేకుండా, మరొకటి ఎఫ్సీ లేకుండా తిరుగుతున్నట్టుగా గుర్తించారు. ఈ మేరకు ఆ బస్సుల యజమానుల నుంచి రూ.39 వేల అపరాధ రుసుంను వసూలు చేశారు. గూడెం మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ నాయక్, అసిస్టెంటు ఇన్స్పెక్టర్ సుబ్బలక్ష్మి సిబ్బంది పాల్గొన్నారు. -
ఇరువర్గాల ఘర్షణతో ఉద్రిక్తత
కామవరపుకోట : స్థానిక గుర్రాల చెరువు గట్టు వినాయక గుడి వెనుక శుక్రవారం రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో మండల కేంద్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది. గత కొంత కాలంగా ఈ ప్రాంతంలో రెండు వర్గాల మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలు చినికి చినికి తీవ్రంగా మారాయి. గురువారం రెండు వర్గాల మధ్య చిన్నపాటి వివాదం జరగ్గా శుక్రవారం మధ్యాహ్నం దానికి కొనసాగింపుగా ఓ వర్గం వారు చేసిన దాడుల్లో ఓ కుటుంబానికి చెందిన టిప్టాప్ సామగ్రి ధ్వంసమై భారీ నష్టం జరిగిందని బాధితులు చెబుతున్నారు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు.రవిచంద్రతో ఆధ్వర్యంలో నలుగురు ఎస్సైలు, పలువురు పోలీసు సిబ్బంది పరిసర ప్రాంతాల్లో భారీగా మోహరించారు. డీఎస్పీ రవిచంద్ర రాత్రి 8 గంటలు అయినా కూడా అక్కడే ఉండి పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. ఈ సంఘటనపై డీఎస్పీని వివరణ కోరగా వివాదం పూర్తి వివరాలను పరిశీలించి చెబుతానని తెలిపారు. అయితే ఈ వివాదం జరిగిన ప్రాంతంలో ఉన్న భూమిని దేవదాయ శాఖ అధికారులు శుక్రవారం రాత్రి రంగంలోకి దిగి స్వాధీనం చేసుకునే పనులు మొదలు పెట్టారు. ఆ స్థలంలో ఉన్న తూములను కూలీలతో పక్కకు తొలగిస్తున్నారు. -
వైద్యుడి ఇంట్లో భారీ చోరీ
ఏలూరు టౌన్: ఏలూరు శివారు ఆశ్రం హాస్పిటల్లో పనిచేస్తున్న వైద్యుడి ఇంట్లో శుక్రవారం పట్టపగటే భారీ చోరీ జరిగింది. ఏలూరు రూరల్ ఆరఽశం ఆస్పత్రిలో దాసరి లోకనాథం సీనియర్ వైద్యుడిగా పని చేస్తున్నారు. ఆయన భార్యతో కలిసి ఆశ్రం హాస్పిటల్ క్వార్టర్స్లోని ఇంట్లో నివాసం ఉంటున్నారు. వ్యక్తిగత పనులపై భార్య ఊరు వెళ్లగా ఆయన ఒక్కరే ఉంటున్నారు. ఈ నేపథ్యం శుక్రవారం ఉదయం యథావిధిగా వైద్యుడు లోకనాథం విధులకు వెళ్లారు. అనంతరం ఇంటికి తిరిగి వచ్చి చూసుకునే సరికి ఇంటి తాళం చెవులు కనిపించలేదు. కొంతసేపు వెదికిన అనంతరం ఆయనే ఇంటి తాళాలు స్వయంగా పగులగొట్టి లోనికి వెళ్లి చూసేసరికి బీరువా పగులగొట్టి ఉంది. బీరువా లోని సుమారు 70 కాసుల బంగారు ఆభరణాలు, వజ్రాలు, ఇతర విలువైన వస్తువులు, నగదు అపహరణకు గురైనట్లు గుర్తించారు. వేసిన తాళాలు వేసినట్లే ఉండి లోపల చోరీకి గురికావటంపై ఆయన షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఏలూరు వన్టౌన్ సీఐ సత్యనారాయణ, రూరల్ ఎస్సై దుర్గాప్రసాద్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చోరీకి గురైన బంగారు ఆభరణాలు విలువ భారీగా ఉంటుందని, ఇక వజ్రాలు విలువ సుమారు రూ.కోటికి పైగా ఉంటుందని సహచర వైద్యులు గుసగుసలాడుతున్నారు. ఈ వజ్రాలు చోరీ ఇంటి దొంగల పనేనా? లేక బయట నుంచి వచ్చిన దొంగలా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వృద్ధుడైన డాక్టర్ తన జీవితకాలం సంపాదించిన బంగారు ఆభరణాలు, నగదు అపహరణకు గురి కావడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. 70 కాసుల బంగారు ఆభరణాలు, వజ్రాలు, నగదు అపహరణ -
కండిగలమ్మ ఆలయంలో భారీ చోరీ
ద్వారకాతిరుమల: మండలంలోని గుండుగొలనుకుంట గ్రామంలో ఉన్న కండిగలమ్మ, పోతురాజు స్వామి వార్ల ఆలయంలో గురువారం అర్ధరాత్రి సమయంలో భారీ చోరీ జరిగింది. ఈ ఘటనలో అమ్మవారి మూలవిరాట్ మీద ఉన్న బంగారు, వెండి ఆభరణాలతో పాటు, హుండీలోని నగదు చోరీకి గురైంది. ఆలయ కమిటీ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సుమారు రాత్రి 1 గంట సమయంలో ఆలయం గేట్లకు ఉన్న తాళాలను, ద్వారాలను పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం అమ్మవారి మూలవిరాట్పై ఉన్న రెండున్నర కేజీల వెండి కిరీటం, ఒక వెండి కనురెప్ప, ఒక కాసు బంగారపు కళ్లు, అరకాసు బంగారు మంగళ సూత్రం, ముప్పావు కాసు బంగారు ముక్కుపుడక, బీరువా లోని విలువైన పట్టు చీరలను చోరీ చేశారు. అలాగే హుండీని పగలగొట్టి అందులోని సుమారు లక్ష రూపాయలను చోరీ చేశారు. ఆ తరువాత ఖాళీ హుండీని, అమ్మవారి మెడలోని గిల్టు మంగళ సూత్రాలను, చోరీకి ఉపయోగించిన సమిట, పలుగును ఆలయం పక్కనున్న కోకో తోటలో పడేశారు. రోజూలానే శుక్రవారం ఉదయం ఆలయాన్ని తెరిచేందుకు వెళ్లిన ఆలయ కమిటీ చైర్మన్ చిలుకూరి ధర్మారావు చోరీ జరిగినట్టు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై టి.సుధీర్ ఆలయాన్ని, పరిసర ప్రాంతాలను, తోటలో దుండగులు పడవేసిన హుండీని, చోరీకి ఉపయోగించిన ఆయుధాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పోలీస్ జాగిలంతో తనిఖీలు జరిపారు. అలాగే క్లూస్ టీమ్ వేలిముద్రలను సేకరించింది. ధర్మారావు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సుధీర్ తెలిపారు. -
మెడికల్ షాప్, ల్యాబ్, క్లినిక్లలో తనిఖీలు
కామవరపుకోట: స్థానిక ప్రభుత్వ వైద్యాధికారి స్కే బీబీ జాన్, డీఎంహెచ్ఓ కార్యాలయ అడ్వకేట్ వడ్డీ సత్యా రవి స్థానిక కొత్తూరులో ఉన్న మందులు షాపు, క్లినిక్, ల్యాబ్లో శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. సాయిరాం క్లినిక్, దుర్గా మెడికల్ షాప్, శ్రీ సాయిరాం డయాగ్నస్టిక్ సెంటర్, సాయిరాం క్లినిక్, సాయిరాం మెడికల్ షాప్లో తనిఖీలు చేయగా సాయిరాం క్లినిక్లో 20 ఏళ్లుగా వైద్యం చేస్తున్న వ్యక్తికి సరైన సర్టిఫికెట్లు లేవని, అతను వైద్యం చేసేందుకు అనర్హుడని గుర్తించారు. శ్రీ సాయిరాం డయగ్నొస్టిక్ సెంటర్ టెక్నీషియన్కు రిజిస్ట్రేషన్ లేదని తెలిపారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఈ తనిఖీలు చేస్తున్నట్టు ఆమె తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ల్యాబ్లు, క్లినిక్లు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఈ మేరకు అధికారులు నివేదికి ఇస్తామని వైద్యాధికారి పి.బీబీ జాన్ తెలిపారు. -
స్నాతకోత్సవానికి గవర్నర్కు ఆహ్వానం
తాడేపల్లిగూడెం: రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ను డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ కె.గోపాల్ రాజ్భవన్లో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 10న కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం, ఆత్కూర్లోని స్వర్ణభారతి ట్రస్ట్లో నిర్వహించనున్న ఉద్యానవర్సిటీ ఆరో స్నాతకోత్సవానికి హాజరు కావాలని ఆహ్వానించారు. ఉద్యాన వర్సిటీ సాధించిన ప్రగతిని వీసీ గవర్నర్కు వివరించారు. ఆయన వెంట రిజిస్ట్రార్ బి.శ్రీనివాసులు ఉన్నారు. పార్సిల్ కార్యాలయాల తనిఖీ తాడేపల్లిగూడెం: పట్టణంలోని పార్సిల్ కార్యాలయాలను శుక్రవారం ఎకై ్సజ్ అధికారులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఎకై ్సజ్ సీఐ స్వరాజ్యలక్ష్మి మాట్లాడుతూ పార్సిల్స్ ద్వారా స్పిరిట్, గంజాయి, డ్రగ్స్ వంటివి తరలించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ తనిఖీలు చేస్తున్నామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పార్సిల్ కార్యాలయాలు, కొరియర్ కార్యాలయాలు చట్ట విరుద్ధమైన వస్తువులు రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్ఆర్ఎంటీ, నవత, వీఆర్ఎల్ లాజిస్టిక్ , బ్లూడార్ట్, ఆర్టీసీ, రైల్వే పార్సిల్ కార్యాలయాలు, డీటీడీసి, ప్రొఫెషనల్ కొరియర్ సర్వీసుల కార్యాలయాలను, గోదాములను తనిఖీ చేశారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి ముదినేపల్లి రూరల్: చేపల పట్టుబడికి వెళ్లి అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని పెదగొన్నూరులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన ఎ.హేమంతరావు ఈ నెల 1న చేపల పట్టుబడికి వెళ్లి ప్రమాదవశాత్తూ తల తిరిగి జారిపడిపోయాడు. చికిత్స నిమిత్తం పెదఅవుటుపల్లి ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం గురువారం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికి త్స పొందుతూ శుక్రవారం మరణించాడు. మృతుడి భార్య రాఘవమ్మ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
వృద్ధులే టార్గెట్గా దాడులు, చోరీలు
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లాలో వృద్ధులను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తూ చోరీలకు పాల్పడుతున్న కేసులను పోలీస్ యంత్రాంగం ఛేదించింది. కై కలూరు రూరల్ పరిధిలో వృద్ధులను కొట్టి బంగారు ఆభరణాలు దోచుకెళ్ళిన దొంగలను పట్టుకున్న పోలీసులు, భారీగా చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఊలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ కేసుల వివరాలు వెల్లడించారు. కై కలూరు మండలం రామవరంలో ఒంటరిగా జీవిస్తోన్న వృద్ధ మహిళలను టార్గెట్ చేస్తూ వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను కై కలూరు రూరల్ సీఐ వి.రవికుమార్ పట్టుకున్నారు. రామవరం గ్రామంలో భర్త చనిపోయి గూడూరు నాగలక్ష్మి ఒంటరిగా ఉంటుంది. మే నెల 28తేదీ రాత్రి 9.20గంటల సమయంలో ఇంట్లోకి చోరబడిన ఇద్దరు దొంగలు ఆమె తలకు ముసుగు వేసి చేతులతో ముఖంపై తీవ్రంగా కొట్టి గోడకు తలను కొట్టారు. ఆమె సృహతప్పి పడిపోవటంతో మెడలోని ఐదు కాసుల బంగారు చైన్, రెండు చేతులకు ఉన్న రెండు బంగారపు గాజులు లాక్కుని చనిపోయిందనే ఉద్దేశ్యంతో పరారయ్యారు. కొంతసేపటికి కోలుకున్న వృద్ధురాలు చుట్టుపక్కల వారి సహాయంతో పోలీస్స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు కేసును దర్యాప్తు చేశారు. ఏలూరు డీఎస్పీ శ్రావణ్కుమార్ పర్యవేక్షణలో రూరల్ సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. కై కలూరు మండలం రామవరం గ్రామానికి చెందిన పంతగాని జాన్కుమార్, గరికిముక్కు రాజ్కుమార్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 40 గ్రాముల బంగారు చైన్, 24గ్రాముల రెండు బంగారు గాజులు రికవరీ చేశారు. బంగారు గాజుల చోరీ కై కలూరు మండలం రామవరంలో సోము సీతామహాలక్ష్మి ఒంటరిగా ఉంటూ కిరాణా కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తోంది. అయితే 2024 ఫిబ్రవరి 13న పగటి వేళ ఆమె దుకాణం వద్దకు వెళ్లి ఎవ్వరికీ అనుమానం రాకుండా లోనికి వెళ్లిరెండు బంగారు గాజులు చోరీ చేసి పరారయ్యారు. దీనిపై కై కలూరు రూరల్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీస్ అధికారులు రామవరం గ్రామానికి చెందిన భూపతి ప్రదీప్ అలియాస్ బన్ను, కురెళ్ళ సుబ్బారావు అలియాస్ సుబ్బు అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితుల నుంచి రూ.1 లక్ష నగదును స్వాదీనం చేసుకున్నారు. రికవరీ సొమ్ము అందజేత కై కలూరు రూరల్ సర్కిల్ పరిధిలో మూడు కేసులు, మండవల్లి స్టేషన్ పరిధిలో మూడు కేసులు, ముదినేపల్లి స్టేషన్ పరిధిలో రెండు కేసుల్లో మొత్తంగా సుమారు రూ.12,21,126 విలువైన బంగారు ఆభరణాలు, ఒక ఆటో, నగదును పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. ఈ రికవరీ నగదు, నగలు, వస్తువులను బాధితులకు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ చేతులమీదుగా అందజేశారు. సైబర్ నేరగాళ్ళబారిన పడి పోగొట్టుకున్న మరో రూ.2లక్షల నగదును సైబర్ సెల్ సీఐ దాసు, కానిస్టేబుల్ శివ ఆధ్వర్యంలో రికవరీ చేసి బాధితులకు అందజేశారు. ఈ సమావేశంలో ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్కుమార్, ఎస్బీ సీఐ మల్లేశ్వరరావు, డీసీఆర్బీ సీఐ అభీబ్ భాషా ఉన్నారు. నలుగురు నిందితుల అరెస్ట్, భారీగా రికవరీ -
జల్లేరు ఆధునికీకరణ పనులు ప్రారంభం
బుట్టాయగూడెం: మండలంలోని దొరమామిడి సమీపంలో ఉన్న గుబ్బల మంగమ్మతల్లి జల్లేరు జలాశయం నిర్వహణ పనుల నిమిత్తం రూ. 20 లక్షల నిధులు మంజూరు చేసినట్లు మైనర్ ఇరిగేషన్ ఏఈ టి.సురేష్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఈ నిధులతో గేట్లు, రంగులు వేయడం, ఇరువైపులా జంగిల్ క్లియరెన్స్, ఆయిల్, గ్రీజు పనులు ఏడాది పాటు నిర్వహిస్తామని తెలిపారు. ప్రస్తుతం పనులు జరుగుతున్నట్లు, గతంలో రూ. 8 లక్షల వ్యయంతో స్పిల్వే గేట్లు మరమ్మతులు కూడా పూర్తి చేశామని తెలిపారు. వినియోగదారులకు మెరుగైన సేవలందించాలి బుట్టాయగూడెం: విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందేలా అధికారులు, సిబ్బంది, కృషి చేయాలని ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ సాల్మన్రాజు అన్నారు. స్థానిక విద్యుత్ సబ్స్టేషన్ వద్ద సిబ్బందితో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుట్టాయగూడెం సబ్స్టేషన్ పరిధిలో ప్రజలకు అందించే సేవలపై పలు ఫిర్యాదులు అందుతున్నాయని అన్నారు. తీరు మార్చుకుని సక్రమంగా పని చేయాలని లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ జిల్లాలో 9.2 మిలియన్ యూనిట్ల కరెంట్ వినియోగం జరుగుతున్నట్లు తెలిపారు. రీవెంప్డ్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ద్వారా జిల్లాలోని ప్రతి గ్రామంలో 3 ఫేస్ కరెంట్ సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం జిల్లాలో నూతనంగా 24 సబ్స్టేషన్లతోపాటు 5 నుంచి 10 పవర్ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలు, మధ్యతరగతి వినియోగదారుల కోసం పీఎం సూర్యఘర్ పథకాన్ని అమలు చేస్తుందని అన్నారు. ఈ పథకంలో వినియోగదారులు తమ విద్యుత్ను తామే తయారు చేసుకునే విధంగా ఇళ్లపై సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేస్తారన్నారు. ఇప్పటివరకూ 2600 యూనిట్లను రిలీజ్ చేశామని ఈ పథకం అమలులో ఏలూరు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. -
●ఇరుకు వంతెనతో యాతన
గరగపర్రులో భీమవరం–తాడేపల్లిగూడెం ప్రధాన రహదారిపై ఉన్న వంతెనపై భారీ కంటైనర్ శుక్రవారం సుమారు రెండు గంటల ప్రాంతంలో ఇరుక్కుపోయింది. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి, భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. వంతెన శిథిలావస్థకు చేరడంతో ఈ వంతెనపై భారీ వాహనాలను అనుమతించేది లేదని గతంలో అధికారులు ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పట్టించుకోకపోవడంతో యథావిధిగా వాహనాలు తిరుగుతున్నాయి. – పాలకోడేరు -
కలల తీరాలకు తొలి అడుగు
ఏలూరు (ఆర్ఆర్పేట): ఎన్నో ఆశయాలు, మరెన్నో లక్ష్యాలు నిర్దేశించుకుంటున్న విద్యార్థులు వాటిని సాధించడానికి, చేరుకోవడానికి వేయి ఆశలతో ఎదురు చూస్తున్న వారికి శుభవార్త. తమ లక్ష్యాలను సాధించడానికి తొలి అడుగు వేసే తరుణం వచ్చేసింది. ఇంటర్మీడియట్ పూర్తి చేసి, ఈఏపీ సెట్లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రులు వెబ్ ఆప్షన్లపై పూర్తి స్థాయిలో ఆలోచించుకుని తుది నిర్ణయం తీసుకోవాలని విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు. ఏపీ ఈఏపీ సెట్ పరీక్షల్లో ఏలూరు జిల్లా నుంచి 4700 మంది పరీక్ష రాయగా వారిలో ఇంజనీరింగ్ కోర్సుకు 3409 మంది మాత్రమే అర్హత సాధించారు. ఈ కోర్సుల గురించీ తెలుసుకోండి.. ఇంజనీరింగ్లో సంప్రదాయ కోర్సులతో పాటు కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈసీఈ, మెకానికల్, ఈఈఈ, సీఎస్ఈ, సివిల్ వంటి సంప్రదాయ కోర్సులు ఇప్పటికే ఉన్నాయి. కొత్తగా సీఎస్ఈలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ (వీఎల్ఎస్ఐ) డిజైన్, అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఏరోస్పేస్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్, నెట్ వర్కింగ్, అల్గారిథమ్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ప్రోగ్రామ్ డిజైన్, కంప్యూటర్ సాఫ్ట్వేర్, కంప్యూటర్ హార్డ్వేర్, ఆపరేటింగ్ సిస్టమ్స్, అగ్రికల్చరల్, మైరెన్, మైనింగ్, స్కిల్ అండ్ టెక్స్టైల్ వంటి కొత్త బ్రాంచిలు వచ్చాయి. ఈ కోర్సుల్లో నైపుణ్యం సాధించినా అపార అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో ఆరు ఇంజనీరింగ్ కళాశాలలు ఏలూరు జిల్లాలో ఆరు ఇంజనీరింగ్ కళాశాలలు ఉండగా మొత్తం 4,920 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఏలూరు సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 1,200 సీట్లు, ఏలూరు రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాలలో 900 సీట్లు, ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో 660 సీట్లు, హేలాపురి ఇంజనీరింగ్ కళాశాలలో 420 సీట్లు, ఆగిరిపల్లిలో ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కళాశాలలో 1,320 సీట్లు, నూజివీడు సారథి ఇంజనీరింగ్ కళాశాలలో 420 సీట్లు ఉన్నాయి. ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియ షురూ 7 నుంచి షెడ్యూల్ ప్రారంభం 10 నుంచి వెబ్ ఆప్షన్లకు అవకాశం ఆగస్టు 4 నుంచి తరగతులు ప్రారంభం షెడ్యూల్ ఇలా.. తొలి విడత కౌన్సెలింగ్ జూలై 7 నుంచి 16 వరకూ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు జూలై 7 నుంచి 17 వరకూ ఆన్లైన్లో విద్యా ర్థులు అప్లోడ్ చేసిన సర్టిఫికెట్ల వరిశీలన జూలై 10 నుంచి 18 వరకూ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే అవకాశం జూలై 19న వెబ్ ఆప్షన్లు మార్చుకునేందుకు అవకాశం జూలై 22న సీట్ల కేటాయింపు. జూలై 23 నుంచి 26 వరకూ కళాశాలలో ప్రవేశాలు ఆగస్టు 4 నుంచి తరగతుల ప్రారంభం మలివిడత కౌన్సెలింగ్ జూలై 25 నుంచి 27 వరకూ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు జూలై 26 నుంచి 28 వరకూ ఆన్లైన్లో విద్యార్థులు అప్లోడ్ చేసిన సర్టిఫికెట్ల పరిశీలన జూలై 27 నుంచి 29 వరకూ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే అవకాశం జూలై 30న వెబ్ ఆప్షన్లు మార్చుకునేందుకు అవకాశం ఆగస్టు 1న సీట్ల కేటాయింపు ఆగస్టు 2 నుంచి 5 వరకూ కళాశాలలో ప్రవేశాలు -
ఐచ్ఛిక సెలవులకు అనుమతి ఇవ్వండి
ఏలూరు (ఆర్ఆర్పేట): నగరంలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు క్యాలెండర్ సంవత్సరం ప్రకారం ఐచ్ఛిక సెలవులకు అనుమతులివ్వాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మకు ఫ్యాప్టో నాయకులు గురువారం వినతిపత్రం సమర్పించారు. ఈ నెల 5వ తేదీన మొహర్రం, అక్టోబర్ 9న యజ్దహుకు షరీఫ్, నవంబర్ 5న కార్తీక పౌర్ణమి, డిసెంబర్ 26న బాక్సింగ్ డేలను పురస్కరించుకుని ఐచ్ఛిక సెలువులు తీసుకునేందుకు అనుమతులివ్వాలని కోరారు. వినతిపత్రం సమర్పించన వారిలో ఫ్యాప్టో ఛైర్మన్ జీ మోహన్రావు, సెక్రటరీ జనరల్ ఎం.ఆదినారాయణ, ఫ్యాప్టో నాయకులు ఆర్.రవికుమార్, టీ రామారావు, సీహెచ్ శివరామ్ తదితరులున్నారు. మెనూ ప్రకారం భోజనం అందించాలి ఏలూరు (టూటౌన్): హాస్టల్లోని విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని సోషల్ వెల్ఫేర్ జాయింట్ డైరెక్టర్ వై.విశ్వమోహాన్ రెడ్డి ఆదేశించారు. ఏలూరు నగరంలోని బాలికల హాస్టల్ నెంబర్ 1 ను గురువారం సాయంత్రం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లో వసతులను, విద్యార్థినులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. హాస్టల్లో సమస్యలపై విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. డ్రాప్ ఔట్ లేకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని హాస్టల్ వార్డెన్కు సూచించారు. డ్రాపవుట్స్ను పాఠశాలల్లో చేర్పించాలి ఏలూరు(మెట్రో): జిల్లాలో 6 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలందరూ విధిగా పాఠశాలలకు వెళ్లేలా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులతోపాటు ఉపాధ్యాయులు, అధికారులపై కూడా ఉందని కలెక్టర్ కె.వెట్రిసెల్వి స్పష్టం చేశారు. గురువారం స్థానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో నేను బడికి పోతా కార్యక్రమం అమలుపై జిల్లాస్థాయి అవగాహన పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోడ పత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. డ్రాపవుట్స్కు సంబంధించి సమాచారం ఇచ్చేందుకు 95333 99981 నంబరుతో హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పంటల బీమా పథకంపై అవగాహన ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టం జరిగినపుడు రైతును ఆర్ధికంగా ఆదుకునేందుకు ప్రధాన మంత్రి ఫసల్ బీమా పథకాన్ని అమలు చేస్తున్నట్లు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. జిల్లాలో సార్వా 2025కి వరి పంటకు గ్రామ యూనిట్గా, మినుములు పంటకు జిల్లా యూనిట్గా, పత్తి యాసిడ్ లైన్ పంటలకు మండల యూనిట్గా పంట బీమా అమలు చేయడం జరుగుతుందన్నారు. నేడు మునిసిపల్ కార్మికుల మహాధర్నా ఏలూరు (టూటౌన్): విజయవాడలో శుక్రవారం నిర్వహించనున్న మహాధర్నాకు మునిసిపల్ ఇంజనీరింగ్, పారిశుధ్య విభాగాల కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఏపీ మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.సోమయ్య ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. మునిసిపల్ ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంచాలని, పారిశుద్ధ్య విభాగం వారికి 17 రోజుల సమ్మె కాలంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ ఉదయం 10 గంటలకు విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నాచౌక్లో ఈ మహాధర్నా జరుగుతుందని ఆయన తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షన్ బృందం పర్యటన భీమవరం (ప్రకాశంచౌక్): స్వచ్ఛ సర్వేక్షన్ ఉత్తమ పంచాయతీలు ఎంపికలో భాగంగా జిల్లాలో 25 గ్రామ పంచాయతీల్లో నేటి నుంచి స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ సెంట్రల్ టీం పర్యటిస్తున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. రోజుకి రెండు గ్రామాల చొప్పున జిల్లాలోని 25 గ్రామాల్లో 20 రోజులు ఈ బృందం పర్యటిస్తోందన్నారు. -
బాబు వంచనపై పోరుబాట
రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో ఆవిష్కరణ శురకవారం శ్రీ 4 శ్రీ జూలై శ్రీ 2025సాక్షి ప్రతినిధి, ఏలూరు: కూటమి ప్రభుత్వం వంచనపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరుబాటకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం కొలువుదీరి ఏడాది గడిచినా ఇచ్చిన హామీలుగాని, సూపర్సిక్స్ హామీలు అమలు చేయని వైనంపై ప్రజా క్షేత్రంలో నిరంతర ఉద్యమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో పార్టీ పిలుపుమేరకు బాబు ష్యూరిటీ– మోసం గ్యారంటీ పేరుతో ఉమ్మడి పశ్చిమగోదావరిలోని అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి విస్తృత ప్రచారం నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా జిల్లాస్థాయి సన్నాహాక సమావేశాలు శుక్రవారం ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో నిర్వహిస్తున్నారు. ఉభయగోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ రెండు జిల్లాలో జరిగే సమావేశాల్లో పాల్గొని దిశానిర్దేశం చేయనున్నారు. బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ పేరిట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న కార్యక్రమంపై సన్నాహక సమావేశం శుక్రవారం ఉదయం 9.30 గంటలకు ఏలూరు జిల్లాలోని పెదవేగి మండలం కొండలరావుపాలెంలో దెందులూరు నియోజకవర్గ ఇన్చార్జి కొఠారు అబ్బయ్యచౌదరి క్యాంపు కార్యాలయంలో నిర్వహించనున్నారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లా సమావేశం మధ్యాహ్నం 2 గంటలకు భీమవరంలోని ఆనంద్ ఇన్లో నిర్వహించనున్నారు. ఉభయగోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ, ప్రకాశం జిల్లా రీజనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఏలూరు పార్లమెంట్ పరిశీలకులు వంకా రవీంద్ర, మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్, పార్లమెంట్ ఇన్చార్జి కారుమూరి సునీల్, పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, నియోజకవర్గ సమన్వయకర్తలు మేకా వెంకట ప్రతాప అప్పారావు, పుప్పాల వాసుబాబు, తెల్లం బాలరాజు, మామిళ్ళపల్లి జయప్రకాష్, కంభం విజయరాజుతోపాటు పార్టీ ముఖ్యులు, మండల నియోజకవర్గ నేతలు పాల్గొంటారు. అలాగే మధ్యాహ్నం పశ్చిమగోదావరిలో జరిగే సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజుతో పాటు పార్లమెంట్ ఇన్చార్జి గూడూరి ఉమాబాల, పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణంరాజు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, మాజీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, నియోజకవర్గ సమన్వయకర్తలు గుడాల గోపి, చినమిల్లి వెంకట్రాయుడు, పీవీఎల్ నర్సింహరాజుతో పాటు పార్టీ ముఖ్యులు హాజరుకానున్నారు. న్యూస్రీల్దెందులూరులో టీడీపీ చిల్లర రాజకీయాలు ఏలూరు జిల్లా స్థాయి సమావేశాన్ని అడ్డుకోవడానికి అధికార టీడీపీ చిల్లర రాజకీయాలకు తెరతీసింది. తొలుత పెదపాడు మండలంలోని వట్లూరులోని శ్రీకన్వెన్షన్లో సమావేశాన్ని ఖరారు చేసి ఏర్పాట్లు పూర్తి చేశారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధి చిల్లర రాజకీయాలతో కన్వెన్షన్ నిర్వాహకులపై ఒత్తిడి తెచ్చి సమావేశాన్ని అక్కడ జరగకుండా అడ్డుకున్నారు. అలాగే మరో రెండు ఫంక్షన్ హాల్స్కు కూడా ముందుస్తు హెచ్చరికలు జారీ చేసి అడ్డుకున్నారు. ఈ క్రమంలో వేదికను పెదవేగి మండలంలోని కొండలరావుపాలెంలోని మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేశారు. దగాపై ధర్మాగ్రహం ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ’ పేరిట వైఎస్సార్ సీపీ నిలదీత నేడు జిల్లాస్థాయి సమావేశాలకు రీజనల్ కోఆర్డినేటర్ బొత్స హాజరు ఉదయం కొండలరావుపాలెంలో ఏలూరు జిల్లాస్థాయి.. మధ్యాహ్నం భీమవరంలో ‘పశ్చిమ’ జిల్లాస్థాయి సమావేశం రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో ఆవిష్కరణ ఇంటింటికీ వైఎస్సార్సీపీ శ్రేణులు ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని 14 నియోజకవర్గాల్లో రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో కార్యక్రమాన్ని నిర్వహించడానికి వీలుగా రెండు జిల్లాల్లో జరిగే సమావేశాల్లో మేనిఫెస్టో పోస్టర్ను ఆవిష్కరించి కార్యక్రమం నిర్వహించాల్సిన తీరు విధి విధానాలపై శ్రేణులకు వివరించనున్నారు. సూపర్ సిక్స్ పేరుతో హామీలు, రాష్ట్రస్థాయిలో లెక్కకు మించిన హామీలు, జిల్లా స్థాయిలో పదుల సంఖ్యలో హామీలిచ్చి ఏడాది గడిచినా ఒక్క హామీ కూడా అమలు చేయకపోవడం, చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరిత రాజకీయాలు, ఎన్నికల సమయంలో ప్రతి పథకానికి ఎంత నగదు కుటుంబానికి జమ అవుతుందో వివరిస్తూ టీడీపీ ఇచ్చిన ఎన్నికల బాండ్ల మోసాన్ని ప్రజలకు కళ్లకు కట్టినట్లు వివరించేలా ఐదు వారాలు పాటు ఈ కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా 4వ తేదీన దెందులూరు, 5న చింతలపూడి, పోలవరం, 6న నూజివీడు, 7న ఉంగుటూరు, 8న కై కలూరు, 10వ తేదీన ఏలూరులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేలా పార్టీ ముఖ్యులు నిర్ణయించారు. -
సొసైటీ కార్యాలయానికి తాళాలు
టి.నరసాపురం: డిపాజిట్లు చెల్లించడం లేదని ఆగ్రహించిన రైతులు టి.నరసాపురం సహకార సంఘ కార్యకలాపాలను గురువారం స్తంభింపజేశారు. కార్యాలయ సిబ్బందిని బయటకు రప్పించి వారితోనే సంఘ కార్యాలయానికి తాళాలు వేయించారు. ఉన్నతాధికారులు స్పందించి డిపాజిట్లు చెల్లించేవరకు తమ నిరసన కొనసాగుతుందని, సంఘ కార్యకలాపాలు జరగనివ్వబోమని స్పష్టం చేశారు. టి.నరసాపురం సహకార సంఘంలో అవకతవకలు బయట పడటంతో రెండేళ్ల క్రితం సహకార సంఘ పాలకవర్గాన్ని తొలగించి అప్పటి సీఈవోను సస్పెండ్ చేశారు. కొద్ది మంది సిబ్బందిని విధుల నుంచి తొలగించారు. ప్రభుత్వ అధికారులను త్రిసభ్య కమిటీగా నియమించి సంఘ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. అయితే దాదాపు 370 డిపాజిట్లకు సంబంధించి రూ.15 కోట్లకు పైగా రైతులకు చెల్లించాల్సి ఉంది. రైతులకు ఆ బాండ్లకు సంబంధించి మెచ్యూరిటీ సొమ్ము చెల్లించడం గాని, బాండ్లు క్యాన్సిల్ చేసుకున్న సొమ్ము చెల్లించడం గాని, ఎస్బీ ఖాతాల్లో ఉన్న సొమ్ము నిల్వలు చెల్లించడం గాని చేయడం లేదు. గత మార్చి వరకు డిపాజిట్ల సొమ్మును బాకీదారుల బకాయిల్లో జమ చేసుకునేవారు. ఏప్రిల్ నుంచి ఆ డిపాజిట్ల సొమ్మును కూడా బాకీలకు జమ చేసుకోవడం నిలిపివేశారు. దాంతో ఆగ్రహించిన రైతులు తమ డిపాజిట్ల సొమ్ములు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేరేవరకు కార్యాలయ కార్యకలాపాలు జరగనివ్వబోమని స్పష్టం చేశారు. సీఈవో అగస్టీన్ మాట్లాడుతూ ఇక్కడ పరిస్థితి ఉన్నతాధికారుల దృష్టిలో ఉందని, మరోసారి ఆయా అధికారుల దృష్టికి తీసుకువెళతానన్నారు. టి.నరసాపురం సొసైటీ వద్ద రైతుల నిరసన డిపాజిట్ల సొమ్ములు చెల్లించడం లేదని ఆగ్రహం -
కొల్లేరును 3వ కాంటూరుకు కుదించాలి
రౌండ్టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్ కృష్ణలంక (విజయవాడ తూర్పు): కొల్లేరును 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరుకు కుదించాలని, కొల్లేరు ప్రజలకు ఉరితాడుగా మారిన 120 జీఓను రద్దు చేయాలని, పర్యావరణంతో పాటు స్థానికుల జీవనోపాధిని కాపాడాలని రౌండ్టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. గవర్నర్పేటలోని బాలోత్సవ భవన్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో రైతు సంఘం సీనియర్ నాయకుడు వై.కేశవరావు అధ్యక్షతన గురువారం కొల్లేరు ప్రజల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొల్లేరు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కొల్లేరు ప్రజల ప్రస్తుత సమస్యలను పరిష్కరించడానికి బదులుగా వారు కొత్త సమస్యలను సృష్టిస్తున్నారని విమర్శించారు. కొల్లేరు ప్రజలకు హానికరమైన ఎకో సెన్సిటివ్ జోన్ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కొల్లేరు ప్రజల సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. కొల్లేరు ప్రజలకు సీపీఎం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రైతు సంఘం సీనియర్ నాయకుడు వై.కేశవరావు మాట్లాడుతూ.. మూడో కాంటూరు నుంచి ఐదో కాంటూరు వరకు పది కిలోమీటర్ల దూరంలో సున్నితమైన పర్యావరణ ప్రాంతం పేరుతో 26 నిబంధనలు విధించి మొత్తం కొల్లేరును పూర్తిగా అటవీ శాఖ చేతుల్లో పెట్టబోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీని ప్రభావం నిడమర్రు, ఉంగుటూరు, భీమడోలు, దెందులూరు, ఏలూరు, పెదపాడు, మండవల్లి, కై కలూరు, ఆకివీడు మండలాల్లోని కొల్లేటి ప్రాంతంలోని 89 గ్రామాలపై పడుతుందన్నారు. అధికారులు తూతూ మంత్రంగా ప్రజాభిప్రాయాలను సేకరించి నివేదికలు పంపించడం దారుణమన్నారు. ఎకో సెన్సిటివ్ జోన్పై ప్రజలకు వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేసి ఆమోదించారు. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు తదితరులు మాట్లాడారు. -
గడువు తీరిన కందిపప్పు సరఫరా
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి జూలై నెలకు సంబంధించిన అంగన్వాడీ సరుకుల్లో గడువు తీరిన కందిపప్పును రేషన్ దుకాణాలకు చేరవేశారు. ప్రతినెలా రేషన్ దుకాణాలకు చెందిన సరుకులతో పాటు అంగన్వాడీ కేంద్రాలకు చెందిన బియ్యం, కందిపప్పు, నూనె ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి సరఫరా చేస్తారు. అయితే ఈనెల పంపిన సరుకుల్లో కందిపప్పు ప్యాకెట్లు గడువు తీరిపోయినట్టు అంగన్వాడీ అధికారులు గుర్తించి సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. ఇప్పటికే జంగారెడ్డిగూడెం మండలంలోని 54 రేషన్ దుకాణాలకు గత నెల 20 నుంచి అంగన్వాడీ సరుకులతో పాటు కందిపప్పును కూడా పంపించేశారు. కందిపప్పు ప్యాక్ చేసిన 5 నెలలలోపు వాడాలని ప్యాకెట్పై రాసి ఉంది. గత నెలలో డిసెంబర్లో ప్యాక్ చేసిన కందిపప్పును అంగన్వాడీ కేంద్రాలకు పంపగా అంగన్వాడీ అధికారులు గుర్తించి మార్చి తీసుకువచ్చారు. ఈ నెలలోనూ జనవరి నెలలో ప్యాక్ చేసిన కందిపప్పు ప్యాకెట్లను పంపించారు. ఈ కందిపప్పునూ వెనక్కి పంపాలని ఎంఎల్ఎస్ పాయింట్ అధికారులు డీలర్లకు తెలిపారు. గడువు తీరిన కందిపప్పును డీలర్లకు పంపడం విమర్శలకు తావిస్తోంది. కాగా కొత్త కందిపప్పు కూడా ఎంఎల్ఎస్ పాయింట్కు చేరుకుందని అధికారులు తెలిపారు. -
దోమలపై దండెత్తరే?
వర్షపు నీరు నిలిచిపోయి దోమల ఉత్పత్తి కేంద్రాలుగా తయారయ్యాయి. దోమల విజృంభణతో విష జ్వరాల బెడద ఆందోళనకు గురిచేస్తోంది. 8లో uనేడు ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’ ప్రారంభం కై కలూరు: ఎన్నికల హామీలను నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసంపై ప్రజలకు వివరించేందుకు ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’ కార్యక్రమాన్ని పెదవేగి మండలం కొండలరావుపాలెం గ్రామంలో శుక్రవారం ప్రారంభిస్తున్నామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) చెప్పారు. దెందులూరు పార్టీ ఇన్చార్జి కొఠారు అబ్బయ్య చౌదరి క్యాంప్ కార్యాలయంలో ఉదయం 9 గంటలకు జిల్లా విస్తృత స్థాయి సమావేశం, దెందులూరు నియోజకవర్గ సమావేశం జరుగుతోందన్నారు. కై కలూరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఉదయం 8.00 గంటలకు కై కలూరు ఏలూరు రోడ్ పార్టీ కార్యాలయానికి చేరుకోవాలన్నారు. పట్టిసీమ నీరు విడుదల పోలవరం రూరల్: పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గురువారం నీటిని విడుదల చేశారు. ముందుగా 24 పంపులకు పూజలు నిర్వహించి కుడి కాలువలోకి నీరు విడుదల చేసి ట్రయల్ రన్ నిర్వహించారు. అనంతరం రెండు పంపుల ద్వారా కుడి కాలువలోకి నీరు విడుదల చేస్తున్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నీటి విడుదలను క్రమేపీ పెంచే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు పేర్కొన్నారు. అనంతరం డెలివరీ సిస్టమ్ వద్ద గోదావరి నీటికి పూజలు నిర్వహించారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. -
ఆన్లైన్ బిజినెస్ పేరిట మోసం
ఏలూరు టౌన్: ఆన్లైన్ బిజినెస్ పేరుతో ప్రకటనలు చూసి పెట్టుబడి పెట్టిన ఓ మహిళ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంది. ఆమె నుంచి సైబర్ నేరగాళ్లు భారీగా సొమ్ములు కాజేశారు. తాను మోసపోయాయని గ్రహించిన బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించగా కేసును ఛేదించి సొమ్ము రికవరీ చేశారు. ఏలూరు టూటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఒక మహిళ సోషల్ మీడియాలో వాట్సాప్, టెలీగ్రామ్ గ్రూపుల్లో వచ్చిన ట్రేడింగ్, బిట్కాయిన్, క్రిప్టోకరెన్సీ పేర్లతో అధిక లాభాలు వస్తాయనే ఆశతో సొమ్ములు పెట్టుబడి పెట్టింది. బాధిత మహిళ నుంచి రూ.2,56,000 సైబర్ నేరగాళ్లు కాజేశారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసు 290/2024 సెక్షన్ 318(4) బీఎన్ఎస్, 66(సీ)(డీ) ఐటీ యాక్ట్ నమోదు చేశారు. ఏలూరు టూటౌన్ సీఐ కే.అశోక్కుమార్, ఎస్సై మధు వెంకటరాజా ఆధ్వర్యంలో సైబర్ సెల్ సీఐ దాసు, మహిళా ఎస్సై వల్లీపద్మ కేసును ఛేదించారు. సొమ్మును ఫ్రీజ్ చేయించి, తిరిగి రికవరీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ శివకిషోర్ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్ల మాయమాటలకు మోసపోవద్దని సూచించారు. ఏదైనా ఆన్లైన్ మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని చెప్పారు. నకిలీ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ పేరుతో జరిగే మోసాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. రూ.2.56 లక్షలు పొగొట్టుకున్న మహిళ కేసును ఛేదించి సొమ్ము రికవరీ చేసిన పోలీసులు మహిళకు సొమ్ము అందజేసిన ఎస్పీ -
మొరాయిస్తున్న బస్సులతో అవస్థలు
జంగారెడ్డిగూడెం: ఆర్టీసీ బస్సులు తరచూ మొరాయిస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జంగారెడ్డిగూడెంకు చెందిన బస్సులు ఇటీవల మార్గమధ్యలో ఆగిపోతుండడంపై ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అత్యవసర పనులపై వెళ్లే వారు ఆర్టీసీ అంటనే హడలెత్తిపోతున్నారు. తరచూగా ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నా ఆర్టీసీ అధికారులు కొత్త బస్సులు ఏర్పాటు చేయడం లేదని, బస్సులకు సరైన మరమ్మతులు నిర్వహించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రయాణం నరకప్రాయం ఏపీఎస్ ఆర్టీసీ అంటే పేద, బడుగు, బలహీన వర్గాల సొంత వాహనంగా పేరుంది. కాని నేడు ఆ బస్సుల్లో ప్రయాణించాలంటే నరకం చూడాల్సిన పరిస్థితి. నిత్యం ఎక్కడో చోట ఏదో ఒక బస్సు రోడ్డుపై ఆగిపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ ప్రకటనలు గుప్పిస్తోంది. కానీ తరచుగా బస్సులు బ్రేక్డౌన్ కావడంతో ఉచిత బస్సు ప్రయాణం దేవుడెరుగు, కనీసం మంచి కండీషన్లో ఉన్న బస్సులను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఆమ్మో ఆర్టీసీ ● ఇటీవల జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం నుంచి పెదవేగి మండలం కొండలరావుపాలెం పెళ్లి నిమిత్తం పెళ్లివారు బస్సును మాట్లాడుకున్నారు. మార్గమధ్యలో వడ్లపల్లి వద్ద బస్సు ఆగిపోయింది. దీంతో పెళ్లి సమయానికి బంధువులు వెళ్లలేకపోయారు. కాలం చెల్లిన బస్సులు పెళ్లి వారికి పంపించడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. ● జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరు వెళుతున్న ఆర్టీసీ బస్సు కామవరపుకోట మండలం తడికలపూడి వద్ద గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఆగిపోయింది. డ్రైవర్ గేరు మార్చుతుండగా గేర్ రాడ్ ఊడి డ్రైవర్ చేతిలోకి వచ్చేసింది. దీంతో బస్సు ఆగిపోయింది. రాత్రి సమయంలో బస్సు ఆగిపోవడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. అరగంట తర్వాత జంగారెడ్డిగూడెం నుంచి వచ్చిన మరో బస్సులో ప్రయాణికులు ఏలూరు చేరుకుని ఊపిరి పీల్చుకున్నారు. -
ఇంటి స్థలం వివాదం.. ఇద్దరిపై దాడి
నూజివీడు: మండలంలోని గొల్లపల్లిలో ఇంటి స్థలం విషయంలో జరిగిన గొడవలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, మరొకరి చేతికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బోనాల నాగేంద్రబాబు(34), బోనాల దశరథ రామాంజనేయులు ఇద్దరూ అన్నదమ్ములు. వీళ్లతో పాటు వాళ్ల బాబాయ్ బోనాల శ్రీనివాసరావులకు కలిపి ఏడు సెంట్ల ఇళ్ల స్థలం ఉంది. దీనిలో చెరి సగం కాగా బోనాల శ్రీనివాసరావు మొత్తం నాదేనంటూ బోనాల నాగేంద్రబాబు, దశరథ రామాంజనేయులను రానీయడం లేదు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో ఇళ్ల స్థలంలోకి వెళ్లగా బోనాల శ్రీనివాసరావుతో పాటు అతని కుమారులు, భార్య కలిసి నాగేంద్రబాబు, బోనాల దశరథ రామాంజనేయులపై కత్తితో దాడి చేసి కొట్టారు. దీంతో నాగేంద్రబాబుకు తలపై తీవ్ర గాయమైంది. దశరథరామాంజనేయులకు చేతిపై దెబ్బ తగిలింది. దీంతో స్థానికులు వారిని హుటాహుటిన నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స అందిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 51 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత నూజివీడు: పట్టణంలోని బైపాస్ రోడ్డులో బుధవారం అర్ధరాత్రి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ట్రక్కు వాహనంలో తరలిస్తున్న అక్రమ బియ్యాన్ని పట్టుకున్నారు. వారికి వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు బైపాస్ రోడ్డులో వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ వాహనంలో 51 క్వింటాళ్లు రేషన్ బియ్యం ఉన్నట్లుగా గుర్తించారు. ఈ బియ్యం ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట ఏరియా నుంచి హనుమాన్ జంక్షన్కు రవాణా చేస్తున్నారు. దీంతో వాహనాన్ని స్వాధీనం చేసుకుని, బియ్యాన్ని సీజ్ చేశారు. వాహన డ్రైవర్ నక్కా శివ, రేషన్ బియ్యం సరఫరాదారులు ధనికొండ గోపిరాజు, ధనికొండ గణేష్, వారికి సాయం చేస్తున్న ఖాసీంబాబు, వాహన యజమాని నక్కా నాగగోపాలకృష్ణలపై 6ఏ, 7(1)కేసులను నమోదు చేశారు. విజిలెన్స్ ఎస్సై నాగరాజు, హెచ్సీ వెంకటేశ్వరరావు, సీఎస్ డీటీ జి.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రైలు నుంచి జారిపడి ఉపాధ్యాయుడి మృతి ఏలూరు టౌన్: నగరంలోని ఫిల్హౌస్ పేటకు చెందిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు నేతల చంద్రశేఖర్ ఆజాద్ (51) రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. ఏలూరు రైల్వే ఎస్సై పి.సైమన్ తెలిపిన వివరాల ప్రకారం వన్టౌన్ ఫిల్హౌస్ పేటకు చెందిన చంద్రశేఖర్ ఆజాద్ శ్రీపర్రు జెడ్పీస్కూల్లో బయాలజీ టీచర్గా పనిచేస్తున్నారు. బుధవారం రాత్రి విజయవాడలోని తన సోదరుడి ఇంటికి వెళ్లేందుకు ఏలూరు రైల్వేస్షేషన్లో కాకినాడ–తిరుపతి రైలు ఎక్కాడు. రైలు వట్లూరు సమీపానికి వచ్చేసరికి రైలు నుంచి ప్రమాదవశాత్తూ జారిపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఆజాద్ విజయవాడ చేరుకోలేదని తెలియడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది పోలీసులను ఆశ్రయించారు. గురువారం మధ్యాహ్నం రైల్వే గ్యాంగ్మెన్ ఓ మృతదేహాన్ని గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే ఎస్సై సైమన్ మృతుడిని గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు జీజీహెచ్ మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. -
సోలార్ లైట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు
బుట్టాయగూడెం : మండలంలోని ప్రసిద్ధ గుబ్బల మంగమ్మ గుడికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గురువారం సోలార్ ద్వారా లైట్స్, ఫ్యాన్లు, సీసీ కెమెరాలతోపాటు మంచినీటి సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధి కొర్సా గంగరాజు మాట్లాడుతూ తెల్లవారుజామునే ఇక్కడికి చేరుకునే భక్తులు చీకటిగా ఉండడంతో మంగమ్మతల్లిని దర్శించుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో టెల్ టవర్స్ సోలార్ కంపెనీ ద్వారా మంగమ్మతల్లి ఆలయం వద్ద సోలార్ కరెంట్ సదుపాయం, సీసీ కెమెరా, ఫ్యాన్లు, మంచినీటి సదుపాయం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 14 నెలల తర్వాత బంగారం చోరీపై కేసు నమోదు కై కలూరు: బంగారు గాజులు చోరీ జరిగిన 14 నెలల తర్వాత ఓ మహిళ కై కలూరు రూరల్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేసింది. రామవరం గ్రామానికి చెందిన సోము సీతామహాలక్ష్మీ(62) భర్త ఆరేళ్ల క్రితం మరణించాడు. కుమారుడు ఇతర ప్రాంతంలో ఉంటాడు. ఆమె ఇంటి వద్ద కిరాణా దుకాణం నడుపుతోంది. అయితే 2024 ఫిబ్రవరి 13న ఆమె రెండు బంగారు గాజులు గల్లా పెట్టెలో వేసి స్నానానికి వెళ్లింది. తిరిగి వచ్చి చూసుకునేసరికి కనిపించలేదు. కొన్నాళ్లు వెతికి ఊరుకుంది. ఇటీవల కుమారుడు ఇంటికి రావడంతో అతడికి విషయం చెప్పింది. దీంతో అతని సలహా మేరకు ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు రూరల్ ఎస్సై రాంబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో వ్యక్తిపై బ్లేడుతో దాడి భీమవరం: స్థానిక టూ టౌన్ ఏరియా బైపాస్ రోడ్డు దగ్గర ఓ వ్యక్తిని బ్లేడుతో గొంతుకోసిన సంఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లంకపేటకు చెందిన సీహెచ్ సాయిబాబు, ఎస్కే వినోద్ ఇద్దరూ ఓ చోట మద్యం తాగుతున్నారు. ఆ సమయంలో ఇద్దరూ సరదా కబుర్లతో కోడిగుడ్లు విసురుకున్నారు. అంతలోనే వినోద్ కోపోద్రిక్తుడై బ్లేడుతో సాయిబాబు గొంతు కోసి పారిపోయాడు. బాధితుడు ప్రస్తుతం భీమవరం ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సీఐ జి.కాళీచరణ్, పోలీసులు బృందాలుగా వెళ్లి నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
అప్రమత్తతతో రక్తహీనత దూరం
పాడి–పంటజంగారెడ్డిగూడెం: రక్తహీనత అనేది మనుషులతో పాటు పశువులనూ ఇబ్బంది పెట్టే ప్రధాన వ్యాధి. పశువుల విషయానికి వస్తే ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గడం లేదా హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గడం వల్ల రక్తంలో ఆమ్లజనకం సరఫరా తగ్గిపోవడం వల్ల రక్తహీనత వేధిస్తుంది. రక్తహీనత వల్ల పశువులు మేత మానేసి, పనిలో బలహీనత ఉంటాయి. దీంతో ఆవులు, గేదెల రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపుతుంది. రక్తహీనత తగ్గించే చర్యలు చేపట్టి పాడి అభివృద్ధిని మెరుగుపరిచే సూచనలు, సలహాలు పశువైద్యాధికారి బీఆర్ శ్రీనివాసన్ వివరించారు. రక్తహీనత లక్షణాలు బలహీనత, అలసట, తెల్లబడ్డ లేదా పసుపు కొమ్ములు, మేత, నీరు తీసుకునే అలవాటు తగ్గిపోవడం, శ్వాసకష్టం, బరువు తగ్గడం, పని సామర్థ్యం తగ్గిపోవడం చికిత్స విధానాలు ● అల్లోపతి విధానంలో : తీవ్ర రక్తహీనతకు రక్త మార్పిడి అవసరం కావచ్చు. ● ఐరన్ లోపం కారణంగా రక్తహీనత ఉన్నప్పుడు ఐరన్ సప్లిమెంట్స్ ఇవ్వాలి. ● కీటకాల నివారణ, పరాన్నజీవాల మీద కట్టడి చేయడం ద్వారా రక్తహీనత నివారించవచ్చు. ● బాక్టీరియా లేదా పకిటీరియా సంక్రమణకు యాంటీబయోటిక్స్ ఇవ్వాలి. నేచురోపతి విధానంలో.. ● పచ్చ కూరలు, ఆకుకూరలు, ఆహారంలో ఇనుమును ఐరన్ను చేర్చాలి. ● హెర్బల్ చికిత్సా విధానంలో నెటిల్, స్పిరులినా వంటి ఐరన్ అధికంగా ఉన్న ఉత్పత్తులు ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని పెంచడంలో సహాయపడతాయి. ● ఆక్యు పంక్చర్ విధానంలో చికిత్స రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. హోమియోపతి విధానం ఫెర్రఫోస్పోరికమ్ చికిత్సలో రక్తహీనత ప్రారంభ దశలో ఉత్పత్తి స్థాయిలు పెంచడానికి ఉపయోగపడుతుంది. చైనా ఆఫిసినాలిస్ చికిత్సలో రక్త పోత తర్వాత రక్తహీనత ఉన్న జంతువులకు ఇది ఇవ్వవచ్చు. నాట్రమ్ మురియాటికమ్ చికిత్సలో జిగురు తగ్గిన రక్తహీనతకు ఉపయోగపడుతుంది. ఆర్సెనికమ్ ఆల్బమ్ చికిత్సలో తీవ్ర బలహీనత, శ్వాసకష్టం ఉన్న రోగులకి ఇది ఇవ్వవచ్చు. చికిత్సతో రక్తహీనత దూరం రక్తహీనతకు సమయానుకూలంగా చికిత్స ఇవ్వడం చాలా ముఖ్యం. అల్లొపతి, నాచురోపతి, హోమియోపతి పద్ధతులను సమ్మిళితం చేసి, వెటర్నరీ డాక్టర్ సలహా మేరకు జాగ్రత్తలు తీసుకుంటే, రోగం నుంచి కోలుకోవడం సులభం. – బీఆర్ శ్రీనివాసన్, పశు వైద్యాధికారి -
ఆటో, బ్యాటరీల దొంగల అరెస్ట్
భీమవరం: జల్సాలకు, చెడు వ్యసనాలకు అలవాటు పడి ఆటోలు, బ్యాటరీ దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి సుమారు రూ. 23 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నటు ఏఎస్పీ వి భీమారావు చెప్పారు. గురువారం భీమవరం వన్టౌన్ పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడించారు. వీరవాసరం గ్రామానికి చెందిన కంచర్ల శ్రీరామ్కుమార్ లారీలను కిరాయికి తిప్పుతుంటాడు. ఈ క్రమంలో పట్టణంలోని మెంటేవారితోట బైపాస్ రోడ్డులోని లారీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయం వద్ద జూన్ 14న తన మూడు లారీల పార్క్చేసి ఉంచగా వాటిలోని 6 బ్యాటరీలు దొంగిలించారంటూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్టౌన్ ఎస్సై ఎస్వీవీఎస్ కృష్ణాజీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసులో పట్టణానికి చెందిన తీగల నరేంద్రభవాని, పైలా రాకేష్, యలగడ కోదండశివసాయివెంకట సత్యనారాయణలను అదుపులోనికి తీసుకుని విచారించగా భీమవరం వన్ టౌన్, భీమవరం టూ టౌన్, కాళ్ల, ఆకివీడు, ఉండి, వీరవాసరం, పాలకోడేరు పోలీసుస్టేషన్ల పరిధిలో దొంగిలించిన 65 బ్యాటరీలు దొంగతనం చేసినట్లు గుర్తించారు. దీంతో వారి వద్ద నుంచి సుమారు రూ. 6 లక్షల విలువైన 65 బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ భీమారావు చెప్పారు. ఇద్దరు ఆటోల దొంగల అరెస్టు భీమవరం పోలీసు సబ్డివిజన్ పరిధిలో ఇటీవల ఆటో దొంగతనాలు ఎక్కువ జరగడంతో భీమవరం టుటౌన్ పోలీసుస్టేషన్ సిబ్బందితో నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఈ నెల 2న కృష్ణా జిల్లా మండవల్లి మండలం పేరికిగూడెం గ్రామానికి చెందిన పరస నాగరాజును అరెస్ట్ చేసి విచారించారు. విచారణలో భీమవరం పట్టణంలోని వన్టౌన్, టూటౌన్, రూరల్, ఆకివీడు, అమలాపురం, వైజాగ్ వన్టౌన్, టూటౌన్, మండవల్లి ప్రాంతాల్లో 13 ఆటోలను దొంగతనాలు చేశానని నేరం అంగీకరించారు. దీంతో నాగరాజుతో పాటు అనకాపల్లి మండలం సబ్బవరం గ్రామానికి చెందిన పోలిశెట్టి గణేష్లను అరెస్టు చేసి వారి నుంచి సుమారు రూ. 17 లక్షల విలువైన 10 ఆటోలు స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ భీమారావు చెప్పారు. సమావేశంలో భీమవరం డీఎస్పీ ఆర్జీ జయసూర్య, సీఐలు ఎం.నాగరాజు, జి.కాళీచరణ్, ఎస్సై కృష్ణాజీ తదితరులు పాల్గొన్నారు. 10 ఆటోలు, 65 బ్యాటరీల స్వాధీనం -
దోమలపై దండెత్తరే?
వైఎస్సార్ సీపీ హయాంలో.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పట్టణాలు, పల్లెల్లో ప్రత్యేక పారిశుద్ధ్య నిర్వహణ ద్వారా దోమల నిర్మూలన చర్యలు చేపట్టేవారు. డ్రెయినేజీల్లో ఆయిల్బాల్స్, స్ఫ్రేయింగ్ చేయించేవారు. క్రమం తప్పకుండా ఫాగింగ్ జరిగేది. జ్వరపీడితులను గుర్తించేందుకు వలంటీర్లు, ఆరోగ్య సిబ్బందితో ఇంటింటా ఫీవర్ సర్వే చేయించి రోగులకు వైద్య సాయం అందించేవారు. దోమల నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై వలంటీర్లతో ఇంటింటా అవగాహన కల్పించేవారు. ప్రస్తుతం ఆ దిశగా చర్యలు కానరావడం లేదని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో ఇండస్ట్రీయల్ ఏరియా, చినరంగనిపాలెం, బందరుపుంత, గంగమ్మగుడి ఏరియా, హౌసింగ్బోర్డు కాలనీ, మెంటే వారితోట, టిడ్కో ప్లాట్లు తదితర డ్రైనేజీలు అధ్వానంగా ఉన్నాయి. పలుచోట్ల మురుగునీరు నిలిచిపోయి అపారిశుద్ధ్యంతో దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారాయి. తమ వార్డుల్లో పారిశుద్ధ్య నిర్వహణ సరిగ్గా లేదని, వారం పది రోజులకు డ్రెయినేజీలను శుభ్రం చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోమల నిర్మూలనకు పురపాలక సంఘం రూ. 10 లక్షలు బడ్జెట్లో కేటాయిస్తుండగా నివారణ చర్యలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయంటున్నారు. దోమల బెడదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు.సాక్షి, భీమవరం : ప్రస్తుతం రుతుపవనాల రాకతో జిల్లా అంతటా వర్షాలు కురుస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా పట్టణాలు, పంచాయతీల్లో ప్రత్యేక పారిశుద్ధ్య నిర్వహణ జరుగుతున్న దాఖలాలు లేవు. ఎక్కడికక్కడ డ్రెయినేజీలపై గడ్డి, పిచ్చిమొక్కలతో అధ్వానంగా ఉన్నాయి. ఖాళీ స్థలాల్లో వర్షపు నీరు నిలిచిపోయి దోమల ఉత్పత్తి కేంద్రాలుగా తయారయ్యాయి. దోమల విజృంభణతో విష జ్వరాల బెడద ఆందోళనకు గురిచేస్తోంది. భీమవరం, నరసాపురం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు పట్టణాలు, ఆకివీడు నగర పంచాయతీల్లో దోమల నిర్మూలన పేరిట రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షలు వరకు బడ్జెట్లో కేటాయిస్తున్నారు. జిల్లాలోని 20 మండలాల పరిధిలో 409 పంచాయతీలు ఉండగా పెద్ద పంచాయతీల్లో రూ.రెండు లక్షలు వరకు, చిన్న పంచాయతీల్లో రూ. 25 వేలు నుంచి రూ. లక్ష వరకు వెచ్చిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా రూ. 5 కోట్లకు పైగానే కేటాయిస్తున్నట్టు అంచనా. కానరాని నిర్మూలన చర్యలు దోమల నిర్మూలన చర్యల్లో భాగంగా లార్వా దశలోనే వాటిని నిర్మూలించేందుకు డ్రెయినేజీలు, నీరు నిల్వ ఉండే ఖాళీ ప్రదేశాలను శుభ్రం చేయించి ఆయిల్ బాల్స్, కెమికల్స్ స్ప్రేయింగ్, సాయంత్ర వేళల్లో ఫాగింగ్ చేయించాలి. డ్రెయినేజీల్లో నీరు నిల్వ ఉండకుండా మురుగునీరు పారే విధంగా ప్రతిరోజూ శుభ్రం చేయించాలి. క్షేత్రస్థాయిలో ఈ చర్యలు తూతూమంత్రంగానే ఉంటున్నాయి. నిధుల లేమితో పంచాయతీల్లో ఫాగింగ్ ఊసే ఉండటం లేదు. పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం పట్టణాల్లోనూ ఫాగింగ్ జరగడం లేదని స్థానికులు అంటున్నారు. దీంతో పట్టణాలు, గ్రామాల్లో దోమలు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దండయాత్ర ఊసేది? ‘దోమలపై దండయాత్ర’ అంటూ గతంలో టీడీపీ అధికారంలో ఉండగా సీఎం చంద్రబాబు హడావుడి చేసిన విషయం విధితమే. పట్టణాలు, గ్రామాల్లో డ్రెయినేజీలను శుభ్రం చేయడం, తుప్పలు తొలగించడం, చెత్తను ఎత్తడం తదితర కార్యక్రమాలకు అప్పట్లో పిలుపునిచ్చారు. ప్రత్యేక పారిశుద్ధ్య నిర్వహణకు నిధులు కేటాయించకపోవడంతో ఎక్కడికక్కడ ప్రచార ఆర్భాటంగానే దండయాత్ర సాగింది. పారిశుద్ధ్య కార్మికులతో పనులు చేయించి, ఉపాధ్యాయులు, విద్యార్థులతో ర్యాలీలు చేయించి మమ అనిపించడంతో అప్పట్లో ఈ కార్యక్రమంపై విమర్శలు వెల్లువెత్తాయి. రోజుకు రూ.50 లక్షలకుపైగా ఖర్చు జిల్లా జనాభా 18.48 లక్షలు. అర్బన్, రూరల్ ఏరియాల్లో నాలుగు లక్షలకు పైగా నివాస గృహాలు ఉన్నాయి. దాదాపు 4.62 లక్షల కుటుంబాలు నివసిస్తుండగా ఉపాధి కోసం ఒరిస్సా, బీహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారు మరో లక్షకు పైగా ఉంటారు. దోమల బెడద నుంచి ఉపశమనం కోసం కాయిల్స్, స్టిక్స్, కెమికల్స్ తదితర వాటిపై సగటున ఒక్కో కుటుంబం రోజుకు రూ.10 చొప్పున జిల్లావ్యాప్తంగా రూ.50 లక్షలకు పైగానే వెచ్చిస్తున్నట్టు అంచనా. ఇప్పటికై నా మున్సిపల్, పంచాయతీ అధికారులు స్పందించి దోమల నివారణకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రతికూల వాతావరణంలో పడకేసిన పారిశుద్ధ్యం గతంలో దోమలపై దండయాత్ర పేరిట హడావుడి చేసిన టీడీపీ ప్రభుత్వం డ్రెయినేజీలు శుభ్రం చేయడం లేదు వర్షాకాలం కావడంతో ప్రస్తుతం దోమలు బెడద చాలా ఎక్కువగా ఉంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వర్షాకాలంలో డ్రెయిన్లు శుభ్రం చేసేవారు. దోమల మందు, బ్లీచింగ్ పౌడర్ క్రమం తప్పకుండా చల్లేవారు. ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదు. పగలు, రాత్రి తేడా లేకుండా దోమలు దండయాత్ర చేస్తున్నాయి. – నలభ పోతురాజు, ఎనంఆర్పీ అగ్రహారందోమల బెడద ఎక్కువగా ఉంది భీమవరం టిడ్కో ప్లాట్లలో నివాసం ఉంటున్నాం. మా ప్రాంతంలో దోమలు బెడద ఎక్కువగా ఉండడంతో ఇబ్బందులు పడుతున్నాం. దోమల నివారణకు ఫాగింగ్ చేయడంగాని, నివారణ చర్యలు తీసుకోవడం లేదు. దోమలతో రాత్రిళ్లు కంటిమీద కునుకు ఉండటం లేదు. రాత్రిళ్లు రెండు కాయిల్స్ వెలిగిస్తున్నా తర్వాత మామూలుగా వచ్చేస్తున్నాయి. – వై.వీర్రాజు, భీమవరం -
ఎస్వీ రంగారావుకు భారతరత్న ఇవ్వాలి
తాడేపల్లిగూడెం (టీఓసీ): విశ్వనట చక్రవర్తి స్వర్గీయ ఎస్వీ రంగారావుకు భారతరత్న ఇవ్వాలని పలు సంఘాలు డిమాండ్ చేశాయి. స్థానిక ఎస్వీఆర్ సర్కిల్లో గురువారం ఎస్వీ రంగారావు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎస్వీఆర్ సేవా సమితి అధ్యక్షుడు భోగిరెడ్డి రాము మాట్లాడుతూ తెలుగు సినీ ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పిన తొలి తెలుగు నటుడు ఎస్వీ రంగారావు అని కొనియాడారు. కాపునాడు అధ్యక్షుడు మాకా శ్రీనివాసరావు మాట్లాడుతూ అద్భుత నటనతో ప్రపంచాన్ని మెప్పించిన నటుడు ఎస్వీ రంగారావుకు తక్షణమే భారత రత్న అవార్డును ప్రకటించాలని డిమాండ్ చేశారు. తొలుత ఎస్వీ రంగారావు సర్కిల్ నుంచి ర్యాలీగా పోస్టాఫీస్ వరకు చేరుకున్నారు. భారతరత్న ఇవ్వాలనే విన్నపాన్ని రిజిస్టర్ పోస్టులో ప్రధాని నరేంద్ర మోదీ అడ్రస్కు పంపారు. కార్యక్రమంలో శ్రీకృష్ణదేవరాయ సేవా సంఘం అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్, బండి రామస్వామి, గంధం రాజశేఖర్, జంగా రామ్రాయ్, పి.కుమార్స్వామి, సామినేటి రంగారావు, బాకా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
అగ్గిపుల్లపై అల్లూరి
ఏలూరు (టూటౌన్) : అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని ఏలూరుకు చెందిన సూక్ష్మ కళాకారుడు మేతర సురేష్ అగ్గిపుల్లపై ఆయన చిత్రాన్ని నిర్మించి అబ్బుర పరుస్తున్నారు. వివిధ సందర్భాల్లో ఆయా నాయకుల చిత్రాలను తనదైన శైలిలో నిర్మించి నివాళులర్పించడం సురేష్కు పరిపాటి. ఈ క్రమంలోనే ఈ నెల 4వ తేదీ అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయన చిత్రాన్ని అగ్గిపుల్లపై నిర్మించి నివాళి అర్పించారు. ఏలూరులో ఈగల్ టీమ్ తనిఖీలు ఏలూరు టౌన్ : గంజాయి, మత్తు పదార్థాల రవాణా అడ్డుకునేందుకు ఈగల్ టీమ్, రైల్వే పోలీస్, జిల్లా పోలీస్ సంయుక్తంగా గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఏలూరు రైల్వే స్టేషన్లో ఈగల్ టీమ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవికృష్ణ స్వయంగా తనిఖీల్లో పాల్గొన్నారు. ఆయనతో పాటు ఈగల్ టీమ్ ఎస్పీ నాగేశ్వరరావు, ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్, అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు ఉన్నారు. ఏలూరు రైల్వే స్టేషన్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. డాగ్ స్క్వాడ్తో రైల్వే స్టేషన్లో క్షుణ్ణంగా తనికీలు చేశారు. కోరమాండల్ ఎక్స్ప్రెస్తో సహా పలు రైళ్ళలో తనిఖీలు చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్, రైల్వే పోలీస్ డీఎస్పీ రత్నరాజు, టూటౌన్ సీఐ అశోక్కుమార్, త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు, ఎకై ్సజ్ సీఐ ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
లైసెన్స్ లేని వ్యక్తుల నుంచి మద్యం కొనుగోలు ప్రమాదకరం
భీమవరం: రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ ద్వారా లైసెన్స్ పొందిన రిటైల్ మద్యం దుకాణాల నుంచి మాత్రమే మద్యం కొనుగోలు చేయాలని జిల్లా ఎకై ్సజ్శాఖ సూపరింటెండెంట్ ఆర్ఎస్ కుమరేశ్వరన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. లైసెన్స్ లేని వ్యక్తుల నుంచి మద్యం కొనుగోలు ప్రమాదకరమన్నారు. వేడుకలకు మద్యాన్ని తక్కువ ధరకు సరఫరా చేస్తామని చెప్పి మోసంచేసే అవకాశముందని హెచ్చరించారు. మద్యం అమ్మకాల్లో అనుమానిత వ్యక్తుల వివరాలను టోల్ఫ్రీ నంబర్: 14405, లేదా సెల్: 98482 03823 నంబర్కు సంప్రదించాలని కుమరేశ్వరన్ తెలిపారు. చికిత్స పొందుతూ వివాహిత మృతి జంగారెడ్డిగూడెం: మండలంలోని లక్కవరం గ్రామానికి చెందిన ఓ వివాహిత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. లక్కవరం ఎస్సై బి.శశాంక తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన గౌతు వెంకట రామకృష్ణకు, నాగ వెంకట శిరీష (39)కు 19 ఏళ్ల క్రితం వివాహమైంది. మంగళవారం శిరీష, ఆమె అత్త కోడిపిల్లల విషయమై గొడవపడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన శిరీష కలుపు మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించగా, చికిత్స పొందుతూ శిరీష మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. లోక్ అదాలత్తో సత్వర పరిష్కారం ఏలూరు (టూటౌన్): కేసుల సత్వర పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి కోరారు. జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవా సదన్ భవన్ నందు బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిలాల్లోని అన్ని కోర్టుల్లో ఈనెల 5వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 4,633 రాజీకాదగిన కేసులు గుర్తించామని, వీటిలో 1,891 క్రిమినల్, 2,501 సివిల్, 241 ఇతర కేసులు ఉన్నాయన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ మాట్లాడుతూ ఈనెల 5న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ నిర్వహణకు జిల్లాలో 34 బెంచ్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కక్షిదారులు ఆన్లైన్ ద్వారా కూడా తమ కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. సమావేశంలో ఏలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కోనే సీతారాం పాల్గొన్నారు. -
బిడ్డకు జన్మనిచ్చి తల్లి మృత్యు ఒడికి
పాలకొల్లు సెంట్రల్: పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో డెలీవరి సమయంలో బిడ్డకు జన్మనిచ్చి తల్లి మృత్యు ఒడికి చేరింది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని 28వ వార్డుకు చెందిన సంగినీడి మనోజ్, జయశ్రీ (28) దంపతులు. ఎనిమిదేళ్ల క్రితం వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆరేళ్ల క్రితం వీరికి ఒక బాబు జన్మించాడు. అనంతరం మరో బిడ్డకు జన్మనిస్తూ జయశ్రీ దురదృష్టవశాత్తూ మృతి చెందింది. మంగళవారం స్కానింగ్ తీసుకుని రమ్మని వైద్యులు సూచించడంతో స్కానింగ్ తీసుకువెళ్లారు. అంతాబాగానే ఉందని, నార్మల్ డెలీవరికి రిపోర్టులు కూడా అనుకూలంగానే ఉన్నాయని వైద్యులు చెప్పడంతో మంగళవారం ఆసుపత్రిలో చేర్చారు. బుధవారం ఉదయం డెలీవరి చేస్తుండగా పాప జన్మించినా తల్లి జయశ్రీకి అధికంగా బ్లీడింగ్ అవ్వడంతో మృతి చెందింది. దీంతో మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. శిశువు పరిస్థితి ఆందోళన కరంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం పిల్లల ఆసుపత్రికి తరలించారు. ఎంతో ఇష్టపడి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నామని, ఇటీవల ఆమె డీఎస్పీ పరీక్షలకు కూడా హాజరైందని, ఇంతలోనే ఇలా మృతి చెందిందని భర్త కన్నీరు మున్నీరుగా విలపించాడు. -
ఇంజనీరింగ్ కోర్సులు.. భవితకు బాటలు
ఏలూరు (ఆర్ఆర్పేట): ఇంటర్మీడియెట్ తరువాత డిగ్రీ కోర్సుల వైపు వెళ్లడం గత రెండు దశాబ్దాల క్రితం ఉండేది. అప్పట్లో డిగ్రీలు, పీజీలు చేసిన వారికి మంచి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉండేవి. దానికి తోడు సివిల్స్, ఏపీపీఎస్సీ, బ్యాంకింగ్, రైల్వే ఉద్యోగాలకు క్రేజ్ ఉండేది. అనంతరం విద్యారంగంలో సమూల మార్పు వచ్చింది. సమాజంలో సాంకేతిక విప్లవం వేగంగా వ్యాప్తి చెందడంతో ఆ రంగంలో ఉపాధి అవకాశాలు అత్యధికంగా లభిస్తున్నాయి. దీనితో ఇంటర్మీడియెట్ తరువాత విద్యార్థుల తొలి ప్రాధాన్యత సాంకేతిక ఉన్నత విద్య ఇంజనీరింగ్ వైపే మొగ్గు చూపింది. కృత్రిమ మేథ (ఏఐ) వైపు చూపు రానున్నది కృత్రిమ మేథ శకమని నిపుణులు అంచనా వేస్తున్న తరుణంలో విద్యార్థులు అటువైపు ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తునట్టు తెలుస్తోంది. గత నాలుగేళ్లుగా ఏఐ బ్రాంచ్లు అందుబాటులో ఉన్న అన్ని కళాశాలల్లోనూ, సీఎస్ఈతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోని మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్ తదితర బ్రాంచ్లు సైతం పూర్తి సీట్లు భర్తీ కావడం చూస్తుంటే విద్యార్థులు ఏఐ వైపు ఎంత ఆసక్తిగా ఉన్నారో గ్రహించవచ్చు. ఎవర్గ్రీన్గా మెకానికల్ బ్రాంచ్ ఏ కోర్సు తీసుకుంటే తేలికగా ఉత్తీర్ణులవడంతో పాటు చదువు పూర్తి కాగానే ఉద్యోగాలు లభిస్తాయా అనేది విద్యార్థులను వేధిస్తున్న ప్రధాన ప్రశ్న. ముఖ్యంగా మెకానికల్ ఇంజనీరింగ్కు ఎవర్ గ్రీన్ బ్రాంచ్గా గుర్తింపు ఉంది. ద్విచక్ర వాహనాల నుంచి విమానాల తయారీ వరకూ మెకానికల్ ఇంజనీర్ల ప్రాతే కీలకంగా ఉంటుంది. అలాగే కెమిస్ట్రీ, ఫిజిక్స్, గణితం సమ్మిళితంగా ఉండే కెమికల్ ఇంజనీరింగ్కు సైతం మంచి భవిష్యత్ ఉందని తెలుస్తోంది. డీఎన్ఏ సీక్వెన్సింగ్, మానవ జీనోమ్ ప్రాజెక్టు, జెనెటిక్ ఇంజనీరింగ్ వంటివి కెమికల్ ఇంజనీరింగ్లో మార్పులకు తెరతీశాయి. సీఎస్ఈకే తొలి ప్రాధాన్యత ఈఏపీ సెట్లో మంచి ర్యాంకు సాధించిన విద్యార్థుల్లో ఎక్కువమంది సీఎస్ఈలో చేరడానికే ఆసక్తి చూపుతారు. ఈ బ్రాంచ్తో ఐటీ కొలువులు, ఆకర్షణీయ ప్యాకేజీలు లభిస్తాయనే నమ్మకమే కారణం. అందుకు తగ్గట్టుగానే క్యాంపస్ రిక్రూట్మెంట్లలో ఐటీ రంగ కంపెనీలు ముందుగా సీఎస్ఈ విద్యార్థులకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. నాలుగేళ్ల కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ బ్రాంచ్లో ముఖ్యంగా కంప్యూటర్ ప్రోగ్రామింగ్, నెట్ వర్కింగ్, అల్గారిథమ్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ప్రోగ్రామ్ డిజైన్, కంప్యూటర్ సాఫ్ట్వేర్, కంప్యూటర్ హార్డ్వేర్, ఆపరేటింగ్ సిస్టమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా బేస్, డేటా స్ట్రక్చర్స్ తదితర అంశాలను అధ్యయనం చేస్తారు. ఈసీఈతో రెండురకాల లాభం ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకు రెండో ప్రాధాన్యంగా ఈసీఈ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూ నికేషన్ ఇంజినీరింగ్) నిలుస్తోంది. ఈ బ్రాంచ్లో ప్రధానంగా ఎలక్ట్రికల్ పరికరాలు, అనలాగ్ ఇంటిగ్రేటేడ్ సర్క్యూట్స్, శాటిలైట్ కమ్యూనికేషన్, మైక్రోవేవ్ ఇంజినీరింగ్, మైక్రో ప్రాసెసర్స్, మైక్రో కంట్రోలర్స్, ట్రాన్స్మీటర్, రిసీవర్, ఎలక్ట్రానిక్, కమ్యూనికేషన్ పరికరాల తయారీ, యాంటెన్నా, కమ్యూనికేషన్ సిస్టమ్స్ గురించి అవగాహన కలిగిస్తారు. ఈ బ్రాంచ్లో చేరడం వల్ల కోర్ సెక్టార్తో పాటు సాఫ్టవేర్ రంగాల్లోనూ కొలువులు సొంతం చేసుకునే అవకాశం ఉంది. ట్రిపుల్ ఈలో 2 లక్షల ఉద్యోగాలు రెడీ ప్రైవేట్ రంగంలో ఏర్పాటవుతున్న హైడల్ పవర్ ప్రాజెక్ట్ కారణంగా రానున్న నాలుగేళ్లలో రెండు లక్షల మంది ఈఈఈ ఇంజినీర్ల కోసం ఉద్యోగాలు ఎదురు చూస్తాయని నిపుణుల అంచనా. ఈఈఈ ద్వారా అటు ఎలక్ట్రికల్, ఇటు ఎలక్ట్రానిక్స్ రెండింటిపైనా పట్టు లభిస్తుంది. ఫలితంగా రెండు రంగాలకు చెందిన పరిశ్రమల్లో ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. అందుకే ఇంజినీరింగ్ విద్యార్థుల భవిష్యత్తుకు ఈ కోర్సు భరోసాగా నిలుస్తోంది. ఎలక్ట్రికల్ టెక్నాలజీ, మెషీన్, మోటార్లు, జనరేటర్లు, సర్క్యూట్ అనాలసిస్, పవర్ ఇంజినీరింగ్ తదితర అంశాలను ఇందులో చదువుతారు. జిల్లాలో 6 ఇంజనీరింగ్ కళాశాలలు ఏలూరు జిల్లాలో మొత్తం 6 ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఏలూరులోని సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 1,200 సీట్లు, రామచంద్ర కళాశాలలో 900, ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలో 600, హేలాపురి కళాశాలలో 360 సీట్లు, ఆగిరిపల్లిలోని ఎన్ఆర్ఐ కళాశాలలో 1,360, నూజివీడులోని సారథి కళాశాలలో 420 సీట్లు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ఈ సీట్ల కోసం జిల్లా విద్యార్థుల నుంచి పోటీ తక్కువగానే ఉంటుంది. కాకపోతే ఇతర జిల్లాల విద్యార్థులు కూడా ఇక్కడి కళాశాలల్లో చేరేందుకు ఉత్సాహం చూపడంతో సీట్లు లభించడం కష్టతరంగా మారింది. ఈ ఏడాది నిర్వహించిన ఏపీ ఈఏపీ సెట్ పరీక్షల్లో ఏలూరు జిల్లా నుంచి 4,700 మంది పరీక్ష రాయగా వారిలో ఇంజనీరింగ్ కోర్సుకు 3,409 మంది మాత్రమే అర్హత సాధించారు. జిల్లాలో 6 కాలేజీలు.. 4,840 సీట్లు కృత్రిమ మేథ (ఏఐ) వైపు అందరి చూపు సీఎస్ఈకి తగ్గని క్రేజ్ బ్రాంచ్ ఏదైనా పట్టు సాధిస్తే విజయ తీరాలకు సృజనాత్మకతతో అద్భుతాలు పదును పెట్టి నూతన ఆవిష్కరణల దిశగా విద్యార్థులు అడుగులు వేయాల్సిన తరుణం ఆసన్నమైందని గుర్తించాలి. విద్యార్థులు తమ సృజనాత్మకతకు సానపెడితే అద్భుతాలు సాధ్యమౌతాయి. అటువంటి విద్యార్థులు వారి అబివృద్ధితో పాటు దేశాభివృద్ధిలో కూడా తమ భాగస్వామ్యాన్ని ఘనంగా చాటిచెప్పే అవకాశం ఉంటుంది. –డాక్టర్ కే వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్, సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల, ఏలూరు -
6న ఉచితంగా రేబిస్ నిరోధక టీకాలు
భీమవరం: ఈనెల 6వ తేదీన జంతు సంక్రమణ వ్యాధి నిరోధక దినం (జూనోసిస్ డే) సందర్భంగా భీమవరంలోని ప్రాంతీయ పశువైద్యశాఖలో ఉదయం 9 గంటల నుంచి రేబిస్ వ్యాధి నిరోధక టీకాలు ఉచితంగా వేస్తామని పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పి సుధీర్బాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు ప్రధానంగా రేబిస్వ్యాధి సోకుతుందని, ఈ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని రైతులు, జంతుప్రేమికులు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ సుధీర్బాబు కోరారు. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం పంట కాలువలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు నరసాపురం రూరల్: ఓ ప్రైవేటు స్కూల్ బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన మొగల్తూరు మండలం రామన్నపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. నరసాపురం పట్టణానికి చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు బుధవారం సాయంత్రం స్కూల్ నుంచి విద్యార్థులను ఇంటికి తీసుకెళ్లే సమయంలో మొగల్తూరు మండలం రామన్నపాలెం గ్రామంలో అదుపుతప్పి పక్కనే ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ సమయంలో బస్సులో ఉన్న 33 మంది విద్యార్థులు ఆర్తనాదాలు చేయడంతో అక్కడకు చేరుకున్న స్థానికులు స్పందించి పిల్లలను బస్సు నుంచి దించేశారు. ఈ ఘటనతో విద్యార్థులు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పలువురు స్థానికులు పేర్కొంటున్నారు. -
వేగవరం వద్ద భారీ రోడ్డు ప్రమాదం
జంగారెడ్డిగూడెం: జాతీయ రహదారి 516డి పై జంగారెడ్డిగూడెం మండలం వేగవరం వద్ద బుధవారం భారీ రోడ్డు ప్రమాదం సంభవించింది. ఒక లారీని మరో లారీ వెనుక నుంచి ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసమయ్యాయి. దీనికి సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నుంచి వైజాగ్కు సిమెంటు లోడుతో వెళుతున్న లారీని, ముంబయి నుంచి రాజమండ్రికి పేపర్ లోడ్తో వెళుతున్న లారీ మండలంలోని వేగవరం ప్రధాన సెంటర్ వద్ద వెనుక నుంచి ఢీకొంది. దీంతో సిమెంట్ లోడు లారీ అదుపు తప్పి రోడ్డు ఎడమపక్క ఉన్న దుకాణాల్లో దూసుకుపోయింది. ఇదే సమయంలో పేపర్ లోడ్ లారీ కుడి పక్కన దుకాణాల్లోకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో పేపర్ లోడ్ లారీ డ్రైవర్ పప్న పిన్నెబాయ్, అలాగే రోడ్డుపక్కనే ఉన్న కొప్పర్తి నాగేంద్రబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, సీఐ సుభాష్ ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను తన వాహనంలో జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో రోడ్డు పక్కనే నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. గ్రామస్తుల ఆందోళన రహదారికి ఇరువైపులా దుకాణాలు ముందుకు వచ్చేయడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వేగవరం గ్రామస్తులు ఆందోళన చేశారు. జాతీయరహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రజలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. వెంటనే అధికారులు స్పందించి అక్రమణలను తొలగించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఆందోళనకారులతో సీఐ సుభాష్ మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు. దుకాణాల్లోకి దూసుకెళ్లిన లారీలు పదుల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు ధ్వంసం ఇద్దరికి గాయాలు -
స్నేహితుడే హంతకుడు
● కీలకమైన హత్య కేసును ఛేదించిన పోలీసులు ●● డీఎన్ఏ రిపోర్టు ఆధారంగా దర్యాప్తు ● వివరాలు వెల్లడించిన ఎస్పీ నయీం అస్మి నరసాపురం: గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించి, సదరు వ్యక్తి హత్య చేయబడ్డాడని నరసాపురం పోలీసులు నిర్ధారించారు. లోతైన దర్యాప్తు జరిపి హత్యగా తేల్చడమే కాకుండా డీఎన్ఏ రిపోర్టు ఆధారంగా మృతుడిని గుర్తించడం విశేషం. దీనికి సంబంధించి వివరాలను బుధవారం ఎస్పీ నయీం అస్మి నరసాపురం డీఎస్పీ కార్యాలయంలో వెల్లడించారు. పంట కాలువలో లభించిన మృతదేహం నరసాపురం మండలం కొప్పర్రు గ్రామంలో డంపింగ్ యార్డ్ సమీపంలో పంట కాలువలో ఈ ఏడాది జనవరి 27వ తేదీన సుమారు 30 నుంచి 40 సంవత్సరాల వయస్సు ఉన్న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడి తొడ ఎముక, మరికొన్ని లోపలి అవయవాలను పోస్టుమార్టం సమయంలో భధ్రపరిచారు. పోస్టుమార్టం నివేదికలో అతను నీటిలో పడిపోవడం వల్ల చనిపోలేదని తేలింది. పొట్టలో కుడివైపు గాయాలు కూడా ఉండటంతో హత్యచేసి పడేశారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఫోరెన్సిక్ ఆధారాలతో మృతుడి గుర్తింపు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి హత్యపై కూపీ లాగారు. ముందుగా ఉభయగోదావరి జిల్లాలు, పక్క జిల్లాల్లో నమోదైన మిస్సింగ్ కేసులు, అందులో గుర్తించిన వారి వివరాలు సేకరించారు. పెరవలి పోలీసు స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదై గుర్తింపు లభించని చుక్కల శ్రీనివాస్ విషయంలో దృష్టి పెట్టారు. శ్రీనివాస్ తల్లితండ్రుల డీఎన్ఏలను సేకరించి, మృతుడి భధ్రపరిచిన ఎముక డీఎన్ఏ ద్వారా సరిచూసి మృతుడు శ్రీనివాస్గా నిర్ధారించారు. హత్యగా గుర్తించింది ఇలా పెరవలి మండలం నడిపల్లి గ్రామానికి చెందిన చుక్కల శ్రీనివాస్ (37) డీఎస్సీకి ప్రిపేరవుతున్నాడు. అయితే అతని స్నేహితులు, దినచర్య వంటి అంశాలపై పోలీసులు దృష్టిపెట్టి విచారణ చేశారు. శ్రీనివాస్తో అత్యతం సన్నిహితంగా ఉండే పెరవలి మండలం కాకరపర్రుకు చెందిన పూల వ్యాపారి మల్లెపూడి శ్రీనివాస్ను అనుమానంతో అదపులోకి తీసుకుని విచారించగా అతడే చంపినట్టు తెలిసింది. స్నేహితుడే చంపేసి కాలువలో పడేశాడు చుక్కల శ్రీనివాస్ డీఎస్సీకి ప్రిపేర్ కావడానికి రాజమండ్రి వెళతానని స్నేహితుడు మల్లెపూడి శ్రీనివాస్కు చెప్పాడు. అయితే వెళ్లొద్దని స్నేహితుడితో ఓసారి గొడవపడ్డాడు. మళ్లీ 2025 జనవరి 3వ తేదీన రాత్రి 8 గంటల సమయంలో దువ్వ గ్రామం నుంచి ఒకే మోటార్సైకిల్పై వెళుతుండగా ఇదే విషయంపై మళ్లీ ఇద్దరూ వాదులాడుకున్నారు. పెరవలి సమీపంలో ప్లేబాయ్ ఫ్యాక్టరీ వద్ద నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతానికి మోటార్సైకిల్ను తీసుకెళ్లి అక్కడ కొంతసేపు వాదులాకున్నారు. ఈ క్రమంలో మల్లెపూడి శ్రీనివాస్ బీర్బాటిల్ పగలకొట్టి చుక్కల శ్రీనివాస్ పొట్టలో కుడివైపుపొడిచి హత్య చేశాడు. కాళ్లు, చేతులు కట్టి, దుస్తులు తొలగించి శవాన్ని పెరవలి కాలువలోకి తోసేశాడు. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే హత్య చేసిన ప్రదేశం నుంచి శవాన్ని కాలువలోకి నెట్టిన ప్రాంతం 3 కిలోమీటర్లు. 24 రోజుల తరువాత శవం దాదాపు 42 కిలోమీటర్లు దూరంలో కొప్పర్రు గ్రామంలో బయటపడటం మరో అంశం. ఇది దాదాపు అసాధ్యమైన కేసని వైద్య పరిజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి కేసు ఛేదించినట్లు ఎస్పీ చెప్పారు. విలేకరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ భీమారావు, నరసాపురం డీఎస్పీ డాక్టర్ బి.శ్రీవేద ఉన్నారు. -
రొయ్య పిల్లా.. సిద్ధం చేయండిలా..
కై కలూరు: రొయ్యల సాగును పసిబిడ్డను అమ్మ జాగ్రత్తగా సాకిన విధానంతో పోల్చుతారు. హేచరీలో రొయ్య విత్తనం కొనుగోలు నుంచి తిరిగి చెరువులో రొయ్య పిల్లలను వదలడం ఎంతో కీలకమైన ప్రక్రియ. పెనాయిస్ మోనోడాన్ (టైగర్ రొయ్యలు), లటోపెనియస్ వన్నామీ (వైట్ లెగ్ పసిఫిక్ రొయ్యలు) వంటి జాతుల పెంపకం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యమైన రొయ్యల పరిశ్రమగా ఏపీ గుర్తింపు పొందింది. నాలుగు గోడల మధ్య తయారీ చేసిన రొయ్య విత్తనాలను ఆరుబయట చెరువుల్లో విడుదల చేస్తున్నప్పుడు యాజమాన్య పద్ధతులు పాటించకపోవడంతో రొయ్య పిల్లలు మరణించి, రైతులకు నష్టాన్ని మిగుల్చుతున్నాయి. రాష్ట్రంలో 5.75 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆక్వా సాగు చేస్తున్నారు. వీరిలో రొయ్యల సాగు రైతులు 1.5 లక్షలు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 2.90 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతుండగా వీటిలో రొయ్యల సాగు 1.10 లక్షల ఎకరాల్లో సాగువుతోంది. ఉమ్మడి జిల్లాలో ఆక్వారంగం నుంచి వార్షిక ఉత్పత్తి 4 లక్షల టన్నులు ఉండగా, వార్షిక టర్నోవర్ రూ.18 వేల కోట్లుగా నమోదవుతోంది. రాష్ట్రంలో రెండు నెలల వ్యవధిలో సుమారు రూ.60 కోట్ల విలువైన రొయ్యలు చనిపోయాయి. రొయ్యల సాగులో ప్రధానంగా ఎంటెరోసైటటోజాన్ హెపాటోపెనాయ్(ఈహెచ్పీ), రన్నింగ్ మోర్టాలిటీ సిండ్రోమ్(ఆర్ఎంఎస్), వైట్ స్పాట్ సిండ్రోమ్ వైరస్(డబ్ల్యూఎస్ఎస్వీ), లూస్ షెల్ సిండ్రోమ్(ఎల్ఎస్ఎస్) వ్యాధుల వల్ల రూ.కోట్లలో రైతులు నష్టాల బారిన పడుతోన్నారు. ఎక్లిమైటెజేషన్ అంటే.. రొయ్యలు చెరువుల్లో సీడ్(రొయ్య విత్తనాలు)ను అలవాటు చేసే ప్రక్రియను ఎక్లిమైటెజేషన్ అంటారు. రొయ్యల ఆరోగ్యం చెరువు నీటి నాణ్యత, నిర్వహణ, వదిలే పిల్లల సంఖ్య, మేత నాణ్యత వంటి అంశాలపై ఆధారపడి ఉంటోంది. హేచరీలో రొయ్య విత్తనాలు అక్కడ ఉష్ణోగ్రత, సెలినిటీ(లవణీయత), పీహెచ్లకు అలవాటు పడి ఉంటాయి. వీటిని చెరువుల్లో వదిలే ముందు చెరువు నీటిలో ఉష్ణోగ్రత, పీహెచ్లకు తగ్గట్టుగా అలవాటు చేయాలి. హేచరీ నుంచి తెచ్చిన విత్తన సంచులను చెరువు నీటిలో అర్ధగంట కర్ర,తాడుతో కట్టివేయాలి. తర్వాత హేచరీ నుంచి తెచ్చిన సంచుల్లో స్థానిక చెరువు నీటిని నింపుతూ రెండు పర్యాయాలు చేయాలి. ఈ పక్రియ అనంతరం విత్తనాలను చెరువులో వదలాలి. ఇలా చేయకుండా అనేక మంది రైతులు నేరుగా రొయ్య విత్తనాలను చెరువులో వదలడం వల్ల ఉష్ణోగ్రతలకు అలవాటు పడక రొయ్య పిల్లలు మరణిస్తున్నాయి. రొయ్యల రైతులు ఇలా చేయండి ● రొయ్య విత్తనాలను చెరువులో వదిలేటప్పుడు ఉష్టోగ్రత 28– 32 డిగ్రీల సెంటీగ్రేట్, పీహెచ్ 7.5–8.5, లవణీయత 15–35 పీపీటీ (స్థానిక పరిస్థితులను బట్టి), కరిగిన ఆక్సిజన్ 5 పీపీఎం కంటే ఎక్కువ ఉండాలి. ● రవాణా సమయంలో ఒత్తిడి తగ్గించడానికి రొయ్యల సీడ్ను శుభ్రమైన, ఆక్సిజన్ బ్యాగులు, సింటెక్స్ కంటైనర్లలో రవాణా చేయండి. ● ప్రతి 10–20 నిమిషాలకు 10–20 శాతం చొప్పున కంటైనర్, బ్యాగ్లలో చెరువు నీటిని కలపండి. ఇది రొయ్యలు క్రమంగా పీహెచ్, ఉష్టోగ్రత, లవణియతలో తేడాలకు అనుగుణంగా మారడానికి సహకరిస్తుంది. ● ఉష్ణోగ్రతను ట్రాక్ చేయడానికి ధర్మామీటర్, లవణీయత కోసం రిఫ్రాక్టోమీటర్, నీటి విలువల కోసం పీహెచ్ మీటర్ను ఉపయోగించండి. ● సీడ్ను ఒకేసారి డంప్ చేసే బదులు చెరువు వాతావరణానికి సమర్థవంతంగా అనుగుణంగా ఉండేలా, వాటిని కొంత వ్యవధిలో చిన్న బ్యాచ్లుగా విడుదల చేయటం మంచిది. ● చెరువు నీటి నాణ్యత, ఉష్ణోగ్రత, లవణీయత, ఆక్సిజన్ స్థాయిలో మార్పులు ఎప్పటికప్పుడు గమనించాలి. రికార్డు చేయాలి. ● ఒత్తిడిని తగ్గించడానికి తక్కువ సంఖ్యలో రొయ్యలు విడుదల చేయాలి. ● వాతావరణానికి బాగా సర్దుబాటు అవుతున్నాయని నిర్ధారించుకోడానికి కొన్ని రోజుల పాటు రొయ్యల ఆరోగ్యం, ప్రవర్తన నిశితంగా గమనించండి. రొయ్యల సాగులో ఎక్లిమైటెజేషన్ ప్రక్రియ తప్పనిసరి హేచరీ నుంచి రొయ్య విత్తనం సరఫరా కీలకం నిర్లక్ష్యంతో నష్టాల బారిన పడుతున్న రైతులు ఉమ్మడి జిల్లాలో 1.10 లక్షల ఎకరాల్లో రొయ్యల సాగు బతుకు రేటు 90 శాతం మంచిది హేచరీ నుంచి చెరువులో రొయ్య పిల్లలు వేసే సమయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలి. హోపా(విత్తనాల నిల్వ తొట్టె) బతుకుదలను 24 గంటలు కంటే 48 గంటల తర్వాత మాత్రమే తనిఖీ చేయాలి. సుమారు 200 విత్తనాలకు హోపాలో 180 విత్తనాలు జీవిస్తే అటువంటి వాటిని విడుదల చేయాలి. రొయ్య విత్తనాలను నేరుగా చెరువులో విడదల చేయకూడదు. పంట విజయానికి చెరువు నీటికి రొయ్య విత్తనాలను అలవాటు చేయడమే ఉత్తమ మార్గంగా రైతులు భావించాలి. – డాక్టర్ పి.రామమోహనరావు, మాజీ డెప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్, కాకినాడ -
కోకో రైతుల నిరసన
పెదవేగి: ఈ నెల 15 వరకు కిలో కోకో గింజలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.50 ప్రోత్సాహంతో రూ.500 ధర రైతులకు వచ్చేలా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో కొండలరావుపాలెంలో జరిగిన సమావేశంలో డిమాండ్ చేశారు. కొండరాలవు పాలెం,రైతు సేవా కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పాలడుగు నరసింహారావు అధ్యక్షతన కోకో రైతుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ రైతు సేవా కేంద్రాల్లో అనేక చోట్ల కోకో రైతుల నుంచి సక్రమంగా దరఖాస్తులు తీసుకోకుండా ఇబ్బందులకు గురి చేయడం వల్ల ఇంకా గింజలు అమ్ముకోలేని పరిస్థితి ఉందన్నారు. కోకో రైతులు చేసిన పోరాట ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ పథకం వర్తింపజేసి కిలో కోకో గింజలకు రూ.50 ప్రోత్సాహం ఇస్తుందని, కంపెనీలు ఇస్తున్న ధర కిలోకు రూ.450 కలిపి రూ.500గా నిర్ణయించి జూన్ 30 వరకు కొనుగోలు చేశారని, మిగిలిన గింజలు కొనుగోలు చేసేలా ఈనెల 15 వరకు రైతుల నుంచి కోకో గింజలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర వచ్చేలా ఫార్ములా రూపొందించాలని కోరారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం నాయకులు గుదిబండి వీరారెడ్డి,పాలడుగు నరసింహారావు, యరకరాజు శ్రీనివాసరాజు, కోనేరు సతీష్ బాబు, కరెడ్ల సత్యనారాయణ, బింగిన శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు -
పంట చేతికొచ్చిన ఆనందం లేదు
గత ప్రభుత్వంలో నీటి తీరువా ఊసే ఉండేది కాదు. ఈ ప్రభుత్వం వచ్చాక పాత బకాయిలంటూ వడ్డీలు వేసి మరీ చెల్లించాలని రెవెన్యూ ఉద్యోగులు చెబుతున్నారు. మూడేళ్లకు కలిపి నీటితీరువా రూ. 21 వేలు చెల్లించాను. పంట డబ్బులు చేతికొచ్చాయన్న ఆనందం లేకుండా పన్నుకే సరిపోయింది. – వెలగల వెంకటేశ్వరరెడ్డి, రైతు, పెనుమంట్ర రైతులపై భారం మోపుతున్నారు రైతులను ఆదుకోవాల్సింది పోయి ఏదో రూపంలో ఈ ప్రభుత్వం మాపై భారం మోపుతోంది. ఉచిత పంటల బీమాను రద్దుచేయడంతో ప్రీమియం రైతులే చెల్లించుకోవాల్సి వస్తోంది. కొన్నేళ్లుగా నీటి తీరువా ఊసులేకుండా ఉంది. ఇప్పుడు వడ్డీలు, జరిమానాలు అంటూ రైతులపై భారం మోపుతున్నారు. – కందుల సత్యనారాయణ, రైతు, వీరవాసరం -
కేరళ డీజీపీగా రావాడ చంద్రశేఖర్
స్వస్థలం వీరవాసరంలో ఆనందోత్సాహాలు వీరవాసరం: కేరళ రాష్ట్ర పోలీస్ బాస్గా పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరానికి చెందిన రావాడ ఆజాద్ చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరించారు. కేరళ నూతన డీజీపీగా ఆయనను నియమిస్తున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన విషయం తెలియడంతో చంద్రశేఖర్ స్వగ్రామం వీరవాసరంలో ఆయన బంధుమిత్రులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. 1991లో ఐపీఎస్కు ఎంపికై న చంద్రశేఖర్ కేరళ క్యాడర్లో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. కేరళలో పోలీస్ ఉన్నతాధికారిగా పలు కీలక బాధ్యతల్లో పనిచేసి రాష్ట్రపతి నుంచి ఉత్తమ సేవల అవార్డును అందుకున్నారు. అక్కడ నుంచి డిప్యుటేషన్పై కేంద్ర సర్వీసుల్లోకి వెళ్ళారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో స్పెషల్ డైరెక్టర్ హోదాలో పనిచేస్తున్న చంద్రశేఖర్ను ఇటీవలే సెంట్రల్ క్యాబినెట్ సెక్రటేరియట్ (స్పెషల్ సెక్యూరిటీ) కార్యదర్శిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆ బాధ్యతల్లో చేరకముందే.. కేరళ ప్రభుత్వం చంద్రశేఖర్ను డీజీపీగా ప్రకటించింది. ఒక రాష్ట్రానికి పోలీస్ బాస్ తమ ఊరి వ్యక్తి కావడంతో చంద్రశేఖర్ బంధుమిత్రులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రశేఖర్కు ఆత్మీయులైన జీవీవీ ప్రసాద్, నేతల జ్ఞాన సుందర్రాజు, పీతల సుబ్రహ్మణ్యం, బాజింకి కృష్ణారావు, రాయపల్లి వెంకట్, నక్కెళ్ల వెంకట్, గూడూరి ఓంకార్, వీరవల్లి చంద్రశేఖర్, గుండా రామకృష్ణ, వీరవల్లి రామకృష్ణ తదితరులు మాట్లాడుతూ.. కష్టపడే తత్వం ఉన్న ప్రతి ఒక్కరూ మహోన్నత వ్యక్తిత్వం గల చంద్రశేఖర్లా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని చెప్పారు. చంద్రశేఖర్ నలుగురు అన్నదమ్ములు, ముగ్గురు అక్కాచెల్లెళ్లలో చిన్నవారు. ఇంటర్ వరకూ వీరవాసరంలోనే చదివారు. బాపట్లలో అగ్రికల్చర్ బీఎస్సీ, హైదరాబాద్లో అగ్రికల్చర్ ఎమ్మెస్సీ పూర్తి చేశారు. బంధువులు ఇళ్లలో వివాహాలు, ఇతర ఫంక్షన్లకు, సంక్రాంతికి తప్పనిసరిగా వీరవాసరం వస్తుంటారు. వీరవాసరంలోని కమ్యూనిటీ హాల్, రామాలయం, చర్చికి కుటుంబ సభ్యుల పేరిట పెద్ద మొత్తాల్లో ఆర్థిక సాయం చేశారు. రావాడ ఆజాద్ చంద్రశేఖర్ ఐపీఎస్ అధికారిగా ఎదగడం వీరవాసరానికి గర్వకారణమని, అందరితో చనువుగా ఉంటూ, చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా మనసు విప్పి మాట్లాడే మంచి మనిషని ఆయన స్నేహితుడు నేతల జ్ఞాన సుందర్రాజు అన్నారు. -
కేరళ డీజీపీగా రావాడ చంద్రశేఖర్
స్వస్థలం వీరవాసరంలో ఆనందోత్సాహాలు వీరవాసరం: కేరళ రాష్ట్ర పోలీస్ బాస్గా పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరానికి చెందిన రావాడ ఆజాద్ చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరించారు. కేరళ నూతన డీజీపీగా ఆయనను నియమిస్తున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన విషయం తెలియడంతో చంద్రశేఖర్ స్వగ్రామం వీరవాసరంలో ఆయన బంధుమిత్రులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. 1991లో ఐపీఎస్కు ఎంపికై న చంద్రశేఖర్ కేరళ క్యాడర్లో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. కేరళలో పోలీస్ ఉన్నతాధికారిగా పలు కీలక బాధ్యతల్లో పనిచేసి రాష్ట్రపతి నుంచి ఉత్తమ సేవల అవార్డును అందుకున్నారు. అక్కడ నుంచి డిప్యుటేషన్పై కేంద్ర సర్వీసుల్లోకి వెళ్ళారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో స్పెషల్ డైరెక్టర్ హోదాలో పనిచేస్తున్న చంద్రశేఖర్ను ఇటీవలే సెంట్రల్ క్యాబినెట్ సెక్రటేరియట్ (స్పెషల్ సెక్యూరిటీ) కార్యదర్శిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆ బాధ్యతల్లో చేరకముందే.. కేరళ ప్రభుత్వం చంద్రశేఖర్ను డీజీపీగా ప్రకటించింది. ఒక రాష్ట్రానికి పోలీస్ బాస్ తమ ఊరి వ్యక్తి కావడంతో చంద్రశేఖర్ బంధుమిత్రులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రశేఖర్కు ఆత్మీయులైన జీవీవీ ప్రసాద్, నేతల జ్ఞాన సుందర్రాజు, పీతల సుబ్రహ్మణ్యం, బాజింకి కృష్ణారావు, రాయపల్లి వెంకట్, నక్కెళ్ల వెంకట్, గూడూరి ఓంకార్, వీరవల్లి చంద్రశేఖర్, గుండా రామకృష్ణ, వీరవల్లి రామకృష్ణ తదితరులు మాట్లాడుతూ.. కష్టపడే తత్వం ఉన్న ప్రతి ఒక్కరూ మహోన్నత వ్యక్తిత్వం గల చంద్రశేఖర్లా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని చెప్పారు. చంద్రశేఖర్ నలుగురు అన్నదమ్ములు, ముగ్గురు అక్కాచెల్లెళ్లలో చిన్నవారు. ఇంటర్ వరకూ వీరవాసరంలోనే చదివారు. బాపట్లలో అగ్రికల్చర్ బీఎస్సీ, హైదరాబాద్లో అగ్రికల్చర్ ఎమ్మెస్సీ పూర్తి చేశారు. బంధువులు ఇళ్లలో వివాహాలు, ఇతర ఫంక్షన్లకు, సంక్రాంతికి తప్పనిసరిగా వీరవాసరం వస్తుంటారు. వీరవాసరంలోని కమ్యూనిటీ హాల్, రామాలయం, చర్చికి కుటుంబ సభ్యుల పేరిట పెద్ద మొత్తాల్లో ఆర్థిక సాయం చేశారు. రావాడ ఆజాద్ చంద్రశేఖర్ ఐపీఎస్ అధికారిగా ఎదగడం వీరవాసరానికి గర్వకారణమని, అందరితో చనువుగా ఉంటూ, చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా మనసు విప్పి మాట్లాడే మంచి మనిషని ఆయన స్నేహితుడు నేతల జ్ఞాన సుందర్రాజు అన్నారు. -
ఇదేం తీరువా బాబూ !
బాదుడే.. బాదుడు గురువారం శ్రీ 3 శ్రీ జూలై శ్రీ 2025నీటి తీరువా డివిజన్ల వారీగా రెవెన్యూ రైతు నీటి తీరువా డివిజన్ ఖాతాలు మొత్తం భీమవరం 99,329 రూ. 11.83 కోట్లు తాడేపల్లిగూడెం 90,475 రూ. 4 కోట్లు నరసాపురం 1,41,365 రూ. 5.98 కోట్లు సాక్షి, భీమవరం: సూపర్ సిక్స్లోని అన్నదాత సుఖీ భవ సాయం అందించకపోగా రైతులపై భారం మోపడమే పనిగా కూటమి పాలన సాగుతోంది. ఇప్పటికే గత ప్రభుత్వం తెచ్చిన ఉచిత పంటల బీమా పథకానికి ఎసరుపెట్టి ఏడాదికి దాదాపు రూ.28 కోట్ల ప్రీమియంను రైతులపై మోపింది. మరుగున పడిన నీటితీరువాను తాజాగా తెరపైకి తెచ్చి పన్నుల రూపంలో రూ.21.81 కోట్లు రైతుల నుంచి వసూలు చేసే పనిలో పడింది. తొలకరికి పెట్టుబడులకు సొమ్ముల్లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు వేలకు వేలు నీటి తీరువా చెల్లించాల్సి రావడం భారంగా మారింది. సాగునీటి సరఫరాకు గతంలో నీటి తీరువా పేరిట రెవెన్యూ శాఖ రైతుల నుంచి పన్ను వసూలు చేసేది. క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది ఈ సొమ్ములు వసూలు చేసేవారు. ఈ విధానంలో అక్రమాలు జరుగుతున్నట్టు ఆరోపణలు ఉండటంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆన్లైన్ విధానం తీసుకురావాలని భావించినప్పటికీ రైతులకు ఊరటనిస్తూ ఆ ప్రక్రియను పక్కన పెట్టేసింది. వెబ్సైట్ సిద్ధం కాకపోవడంతో గత మూడేళ్లుగా నీటి తీరువా ఊసేలేకుండా పోయింది. నీటి తీరువా భారం రూ.21.81 కోట్లు అన్నదాత సుఖీభవ పథకం కింద ఏటా రూ.20 వేల సాయం అందిస్తామని చెప్పి గద్దెనెక్కిన కూటమి మొదటి ఇంతవరకూ చిల్లిగవ్వ ఇవ్వలేదు. తొలకరి పెట్టుబడుల కోసం సొమ్ముల్లేక రైతులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో వారి నుంచి నీటి తీరువా వసూళ్ల కోసం రెవెన్యూ శాఖకు ఆదేశాలిచ్చింది. ఆన్లైన్ ప్రక్రియ పూర్తిచేయడం ద్వారా రెండు పంటలు పండే వ్యవసాయ భూములైతే ఎకరానికి మొదటి పంటకు రూ.200, రెండవ పంటకు రూ.150 వంతున మొత్తం రూ.350, ఆక్వా చెరువులకు ఏడాదికి ఒకే పంట లెక్కన ఎకరానికి రూ.500 వసూలుకు ఆదేశాలిచ్చింది. జిల్లాలోని 3,31,169 మంది రైతుల ఖాతాల నుంచి పాత బకాయిలు రూ.5.62 కోట్లకు వడ్డీ రూ.33.77 లక్షలు, ప్రస్తుత డిమాండ్ రూ.15.84 కోట్లు కలిపి రూ. 21.81 కోట్లు నీటితీరువా వసూలు చేయాల్సి ఉంది. ఈ మేరకు ఆర్డీఓలు, తహసీల్దార్లకు ఉత్తర్వులు రావడంతో పన్నుల వసూళ్లలో నిమగ్నమయ్యారు. మూడేళ్లకు పాత బకాయిలు, వడ్డీలతో కలిపి ఒక్కసారే రైతుల నుంచి వేలల్లో వసూలు చేస్తున్నారు. పంట పెట్టుబడులకు సొమ్ములు లేక ఇబ్బందులు పడుతుంటే మూడేళ్ల బకాయి ఒక్కసారే కట్టాలని రెవెన్యూ సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఆలస్యం చేస్తే పెనాల్టీతో చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. అయినకాడికి అప్పులు చేసి చెల్లిస్తున్నామంటున్నారు. నీటి తీరువా మొత్తం రూ.21.81 కోట్లకు గాను ఇంతవరకు రూ.8.36 కోట్లు వసూలైనట్లు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. సర్వీస్ ట్యాక్స్ అదనం నీటి తీరువాతో పాటు రైతుల నుంచి సర్వీస్ ట్యాక్స్ వసూలు చేస్తుండటం గమనార్హం. పన్ను చెల్లింపు కోసం చేసే ప్రతి ట్రాన్సాక్షన్్కు అదనంగా రూ.35 సర్వీసు టాక్స్ వసూలు చేస్తున్నారు. గతంలో ఎప్పుడు ఇలాంటి ట్యాక్స్లు చూడలేదని రైతులు వాపోతున్నారు. న్యూస్రీల్ రైతులపై కక్ష కట్టిన కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఉచిత పంటల బీమాకు ఎసరు తాజాగా నీటి తీరువా వసూలుకు ఆదేశం రైతుల నుంచి రూ. 21.81 కోట్లు వసూలు చేసే పనిలో రెవెన్యూ యంత్రాంగం నీటి తీరువా వసూలు చేయని గత వైఎస్సార్సీపీ సర్కారు పంట చేతికొచ్చిన ఆనందం లేదు గత ప్రభుత్వంలో నీటి తీరువా ఊసే ఉండేది కాదు. ఈ ప్రభుత్వం వచ్చాక పాత బకాయిలంటూ వడ్డీలు వేసి మరీ చెల్లించాలని రెవెన్యూ ఉద్యోగులు చెబుతున్నారు. మూడేళ్లకు కలిపి నీటితీరువా రూ. 21 వేలు చెల్లించాను. పంట డబ్బులు చేతికొచ్చాయన్న ఆనందం లేకుండా పన్నుకే సరిపోయింది. – వెలగల వెంకటేశ్వరరెడ్డి, రైతు, పెనుమంట్ర రైతులపై భారం మోపుతున్నారు రైతులను ఆదుకోవాల్సింది పోయి ఏదో రూపంలో ఈ ప్రభుత్వం మాపై భారం మోపుతోంది. ఉచిత పంటల బీమాను రద్దుచేయడంతో ప్రీమియం రైతులే చెల్లించుకోవాల్సి వస్తోంది. కొన్నేళ్లుగా నీటి తీరువా ఊసులేకుండా ఉంది. ఇప్పుడు వడ్డీలు, జరిమానాలు అంటూ రైతులపై భారం మోపుతున్నారు. – కందుల సత్యనారాయణ, రైతు, వీరవాసరం జగన్ సర్కారు 2019 ఖరీఫ్ నుంచి ఉచిత పంటల బీమా పథకాన్ని తెచ్చిన విషయం విదితమే. ఈ క్రాప్ నమోదు ప్రామాణికంగా సాగు విస్తీర్ణం అంతటికి రైతులు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తూ వచ్చింది. కూటమి వచ్చాక ఈ పథకాన్ని ఎత్తివేయడంతో ప్రీమియం వాటాను రైతులే చెల్లించాల్సి వస్తోంది. ఎకరాకు పంట విలువ రూ. 41,000లో ప్రీమియంగా రెండు శాతం మొత్తం రూ. 820 బీమా కంపెనీకి చెల్లించాలి. దీనిలో ప్రభుత్వ వాటా 0.5 శాతం (రూ.205) కాగా, మిగిలిన 1.5 శాతం (రూ.615లు) రైతులే చెల్లించాలి. ఏడాదికి ప్రీమియం రూపంలో వరి రైతులపై రూ.28 కోట్ల భారం పడుతున్నట్టు అంచనా. -
త్వరలో పోలీస్ అకాడమీ సెంటర్కు శంకుస్థాపన
ఆగిరిపల్లి: పోలీస్ అకాడమీ సెంటర్ నిర్మాణం కోసం త్వరలో శంకుస్థాపన చేస్తామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్కుమార్ గుప్తా తెలిపారు. ఏపీ పోలీస్ అకాడమీ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు కోసం బుధవారం మండలంలోని నూగొండపల్లి గ్రామంలో ఉన్న 94.49 ఎకరాల భూమిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూగొండపల్లిలో పోలీస్ శిక్షణ సదుపాయాల కోసం త్వరలో అధునాతన ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహిస్తామని తెలిపారు. పోలీస్ అకాడమీ సెంటర్ రాష్ట్ర పోలీస్ శాఖకు చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. లా అండ్ ఆర్డర్ అదనపు డీజీపీ మధుసూదన్ రెడ్డి, డీఐజీలు జీవీజీ అశోక్ కుమార్, ఎం.రవి ప్రకాష్, సత్య ఏసుబాబు, ఎస్పీ కే. ప్రతాప్ శివ కిషోర్, నూజివీడు సబ్ కలెక్టర్ స్మరణ్ రాజ్, డీఎస్పీ ప్రసాద్ పాల్గొన్నారు. నేడు రౌండ్ టేబుల్ సమావేశం ఏలూరు (టూటౌన్): కొల్లేరు ప్రజల సమస్యలపై ఈనెల 3న విజయవాడలో రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయా సంఘాల నాయకులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర నాయకులు బి.బలరాం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.రవి, జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు విజయవాడ రాఘవయ్య పార్కు ఎదురుగా ఉన్న బాలోత్సవ భవనంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పీఆర్టీయూ నాయకులు బుధవారం జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మకు వినతిపత్రం సమర్పించారు. ఇటీవల బదిలీ అయినా.. రిలీవర్ లేక పాత స్థానాలలోనే కొనసాగుతున్న వివిధ కేడర్ల ఉపాధ్యాయులను ప్రత్యామ్నాయ విధానాలు వెంటనే విడుదల చేయాలని కోరారు. సెలవు పెట్టుకునే విషయంలో పెట్టిన సమయ నిబంధనలు సవరించాలన్నారు. నోట్బుక్స్తో పాటు, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్లు కొత్తగా అడ్మిషన్ పొందిన విద్యార్థులకు కూడా త్వరితగతిన అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు పువ్వుల ఆంజనేయులు, రాష్ట్ర కార్యదర్శి బీ.త్రినాథ్ ఉన్నారు. ముగిసిన డీఎస్సీ పరీక్షలు ఏలూరు (ఆర్ఆర్పేట): ఉపాధ్యాయ నియామకాల కోసం నిర్వహిస్తున్న డీఎస్సీ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. వివిధ పరీక్షా కేంద్రాల్లో చివరి రోజు బుధవారం నిర్వహించిన డీఎస్సీ పరీక్షలకు మొత్తం 961 మంది అభ్యర్థులు హాజరయ్యారు. సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో ఉదయం సెషన్ పరీక్షలకు 180 మందికి 177మంది హాజరు కాగా ముగ్గురు గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 180 మందికి 168 మంది హాజరు కాగా, ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం సెషన్లో 140 మందికి 136 మంది, మధ్యాహ్నం సెషన్లో 140 మందికి 133 మంది, సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 200 మందికి 194 మంది, మధ్యాహ్నం సెషన్లో 156 మందికి ను 153 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రారంభమై నాటి నుంచి ఇప్పటి వరకూ మొత్తం 17386 మందికి 16154 మంది పరీక్షలు రాయగా 1232 మంది గైర్హాజరయ్యారు. నేడు మహిళా కమిషన్ చైర్మన్ పర్యటన ఏలూరు(మెట్రో): రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ డాక్టర్ రాయపాటి శైలజ నేడు జిల్లాలో పర్యటిస్తారు. ముసునూరు, ఏలూరు, దెందులూరులో ఆమె పర్యటన ఉంటుంది. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న వన్ స్టాప్ సెంటర్ను సందర్శిస్తారు. -
అబద్ధాల్లో బాబుది గిన్నిస్ రికార్డ్
లింగపాలెం: అలవిగాని హామీలతో గద్దెనెక్కడం తరువాత, వాటిని పక్కన పెట్టడం బాబు నైజమని, ఆయన అబద్ధపు హామీలు లెక్కేస్తే గిన్నిస్ రికార్డుకు ఎక్కడం ఖాయమని చింతలపూడి వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ కంభం విజయరాజు అన్నారు. ధర్మాజీగూడెంలో బుధవారం శ్రీరీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో – బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీశ్రీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయరాజు మాట్లాడుతూ చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు చేస్తూ ఈనెల 4న ఏలూరులో జిల్లా స్థాయి విస్తృత స్థాయి సమావేశం జరుగుతుందన్నారు. మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల ముందు 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మహిళలకు ప్రతి నెలా రూ.1500 చొప్పున ఇస్తామన్న బాబు అధికారంలోకి వచ్చాక మొహం చాటేశారన్నారు. దీపం పథకంలో ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తామన్నారని, సగం మందికి కూడా పథకం డబ్బులు అందడం లేదని విమర్శించారు. ధాన్యం సొమ్ములు నేటికి జమకాకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. చింతలపూడి నియోజకవర్గంలో రోడడ్లు అధ్వానంగా ఉన్నాయని ఇంతవరకు మరమ్మతులు చేయకపోవడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చింతలపూడిలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారే తప్ప ఇంతవరకు అమలు కాలేదని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి, ధర్మాజీగూడెం సొసైటీ మాజీ అధ్యక్షుడు ఉప్పలపాటి వరప్రసాద్, మండల ముఖ్యనేత ముసునూరి వెంకటేశ్వరరావు, వైస్ ఎంపీపీ మట్టా సురేష్, కొత్తూరి రమేష్, భూపతి పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఇదేం తీరువా బాబూ !
బాదుడే.. బాదుడు గురువారం శ్రీ 3 శ్రీ జూలై శ్రీ 2025సాక్షి, భీమవరం: సూపర్ సిక్స్లోని అన్నదాత సుఖీ భవ సాయం అందించకపోగా రైతులపై భారం మోపడమే పనిగా కూటమి పాలన సాగుతోంది. ఇప్పటికే గత ప్రభుత్వం తెచ్చిన ఉచిత పంటల బీమా పథకానికి ఎసరుపెట్టి ఏడాదికి దాదాపు రూ.28 కోట్ల ప్రీమియంను రైతులపై మోపింది. మరుగున పడిన నీటితీరువాను తాజాగా తెరపైకి తెచ్చి పన్నుల రూపంలో రూ.21.81 కోట్లు రైతుల నుంచి వసూలు చేసే పనిలో పడింది. తొలకరికి పెట్టుబడులకు సొమ్ముల్లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు వేలకు వేలు నీటి తీరువా చెల్లించాల్సి రావడం భారంగా మారింది. సాగునీటి సరఫరాకు గతంలో నీటి తీరువా పేరిట రెవెన్యూ శాఖ రైతుల నుంచి పన్ను వసూలు చేసేది. క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది ఈ సొమ్ములు వసూలు చేసేవారు. ఈ విధానంలో అక్రమాలు జరుగుతున్నట్టు ఆరోపణలు ఉండటంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆన్లైన్ విధానం తీసుకురావాలని భావించినప్పటికీ రైతులకు ఊరటనిస్తూ ఆ ప్రక్రియను పక్కన పెట్టేసింది. వెబ్సైట్ సిద్ధం కాకపోవడంతో గత మూడేళ్లుగా నీటి తీరువా ఊసేలేకుండా పోయింది. న్యూస్రీల్ రైతులపై కక్ష కట్టిన కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఉచిత పంటల బీమాకు ఎసరు తాజాగా నీటి తీరువా వసూలుకు ఆదేశం రైతుల నుంచి రూ. 21.81 కోట్లు వసూలు చేసే పనిలో రెవెన్యూ యంత్రాంగం నీటి తీరువా వసూలు చేయని గత వైఎస్సార్సీపీ సర్కారు జగన్ సర్కారు 2019 ఖరీఫ్ నుంచి ఉచిత పంటల బీమా పథకాన్ని తెచ్చిన విషయం విదితమే. ఈ క్రాప్ నమోదు ప్రామాణికంగా సాగు విస్తీర్ణం అంతటికి రైతులు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తూ వచ్చింది. కూటమి వచ్చాక ఈ పథకాన్ని ఎత్తివేయడంతో ప్రీమియం వాటాను రైతులే చెల్లించాల్సి వస్తోంది. ఎకరాకు పంట విలువ రూ. 41,000లో ప్రీమియంగా రెండు శాతం మొత్తం రూ. 820 బీమా కంపెనీకి చెల్లించాలి. దీనిలో ప్రభుత్వ వాటా 0.5 శాతం (రూ.205) కాగా, మిగిలిన 1.5 శాతం (రూ.615లు) రైతులే చెల్లించాలి. ఏడాదికి ప్రీమియం రూపంలో వరి రైతులపై రూ.28 కోట్ల భారం పడుతున్నట్టు అంచనా. -
● నయనానందకరం.. జగన్నాథుని రథోత్సవం
ఏలూరు నగరంలో జగన్నాథుని రథోత్సవం నయనానందకరంగా సాగింది. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) ఆధ్వర్యంలో నిర్వహించిన జగన్నాథ రథోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. వందలాది మంది భక్తులు నృత్యాలు, కీర్తనలు, గానాలు, కోలాట ప్రదర్శనలతో నగర వీధుల్లో ఆనందోత్సాహాల నడుమ రథం వెంట నడిచారు. రథంపై ఊరేగిన జగన్నాథుడు, బలదేవ్, సుభద్ర మహారాణి ఉత్సవ విగ్రహాలను భక్తులు సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం నిర్వహించిన అన్నప్రసాద విందు కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రసాదం స్వీకరించారు. – ఏలూరు (ఆర్ఆర్పేట) -
పిడుగులతో అప్రమత్తం
పాలకొల్లు సెంట్రల్: వర్షాకాలంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తుంటాయి. ఆ సమయంలో ఎక్కువగా పిడుగులు పడుతుంటాయి. పిడుగుల మూలంగా ఏటా సుమారు రెండువేల మంది చనిపోతున్నట్లు అంచనా. అలాగే పిడుగుల మూలంగా గృహోపకరణాలు కాలిపోతుంటాయి. ఈ నేపథ్యంలో వర్షాకాలంలో పిడుగుల పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ నిపుణులు సూచిస్తున్నారు. ఉరుములు, మెరుపులను చూసి కొందరు చాలా భయపడతారు. దీనిని అస్ట్రఫోబియా అంటారు. పిడుగు ఒకసారి పడినచోట రెండోసారి మళ్లీ పడదనుకోవడం అపోహ మాత్రమే. ఒకే చోట ఒకే ప్రదేశంలో ఎన్నిసార్లయినా పడే అవకాశం ఉంటుంది. పిడుగు పడిందంటే... పిడుగు శబ్ధం వినగలమే తప్ప చూడాలంటే మాత్రం చాలా అరుదుగా కనిపిస్తుంటుంది. పిడుగు పడే సమయంలో మెరుపు మేఘాల నుంచి భూమికి తాకినట్టుగా కనిపిస్తుంది. అలా తాకినప్పుడు మేఘాలలో తయారైన పాజిటివ్ శక్తి, భూమిలోని నెగెటివ్ శక్తిని చేరుతుంది. ఒకవేళ మేఘాలలో నెగటివ్ శక్తి తయారైతే అప్పుడు భూమిలో ఉన్న పాజిటివ్ శక్తిని చేరుతుంది. ఏ విధంగానైనా సర్క్యూట్ పూర్తవుతుంది. పిడుగు పడిన సమయంలో ఆ ప్రదేశంలో ఉష్ణోగ్రత కొన్ని వేల డిగ్రీల ఫారన్హీట్ ఉంటుందని నిపుణులు అంటున్నారు. కాపర్ ఎర్త్ ముఖ్యం పిడుగుల ప్రమాదాల నుంచి రక్షించుకోవాలంటే ఎత్తయిన భవనాల నుంచి లేదా టవర్లు, పొగ గొట్టాలు ఇలా ఏదైనా సరే పై నుంచి భూమిలోపలి వరకూ కాపర్ ఎర్త్ను తప్పనిసరిగా ఏర్పాటుచేసుకోవాలి. ఇది దాదాపుగా కిలో మీటరు దూరంలో పడిన పిడుగును సైతం నేరుగా భూమిలోకి లాక్కునే అవకాశం ఉంటుంది. కాపర్ ఎర్త్ వేసే ముందు ఉప్పు, కర్పూర బొగ్గు, నీటి మిశ్రమాలతో రాగి వైరు కలిగిన రాడ్ను భూమిలోపలకు ఏర్పాటుచేయడం వల్ల ప్రమాదాలను నివారించుకునే అవకాశం ఉంటుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ● విపత్తుల నిర్వహణ సంస్థ నుంచి పిడుగులు పడే అవకాశం ఉందని సమాచారం రాగానే ప్రధానంగా పశువులు లేదా మేకలను చెట్లకింద కట్టకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలి. ● రహదారులపై హోర్డింగ్లు, ఎత్తయిన, బలహీనమైన చెట్లు కింద నిలబడరాదు. ● ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతున్నప్పుడు ఆరు బయట తిరగకూడదు. ● ఇంట్లో కేబుల్ టీవీ, కంప్యూటర్లు, ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను వాడకుండా కనెక్షన్లు తొలగించాలి. ● పొలం దగ్గర మైదాన ప్రాంతంలో ఉన్నట్లయితే ఎత్తయిన చెట్ల కింద నిలబడకూడదు. ట్రాక్టర్లతో పనులు నిలుపుదల చేసుకోవాలి. లేదంటే పిడుగు పడితే వాహనాల్లో ఉన్న లోహపు పరికరాలను ఆకర్షించే ప్రమాదం ఉంటుంది. ● హైటెన్షన్ వైర్లు, సెల్ టవర్లు కింద ఉండకుండా చూసుకోవాలి. ● చెరువు, కొలనులు ఉన్నట్లయితే దూరంగా ఉండాలి. ● మోటార్సైకిల్, స్కూటర్, సైకిల్ వంటి వాటికి దూరంగా ఉండాలి. ప్రయాణం చేసే సమయాల్లో వాహనాలు పక్కకు ఆపి ఎత్తయిన చెట్లు పక్కన కాకుండా నిలబడడం మేలు. ● ఉరుములతో వర్షం కురుస్తున్న సమయంలో ఇంట్లో షవర్బాత్ చేయడం, నీళ్లతో పాత్రలు శుభ్రం చేయడం వంటి పనులను చేయకూడదు. పైపుల గుండా పిడుగు ప్రయాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రధానంగా ఇంటికి ఎర్తింగ్ ఉండేలా చర్యలు తీసుకోవాలి. లైట్నింగ్ అరెస్టర్ అవసరం పిడుగు విద్యుత్ ప్రవాహం అధికంగా ఉండడం వల్ల విద్యుత్ పరివర్తకాలు, సామగ్రిని కాపాడుకోవడానికి లైట్నింగ్ అరెస్టర్ (పిడుగును అరెస్ట్ చేసేది) ఉపయోగిస్తుంటాము. ఎత్తయిన భవనాలకు కూడా ఇది అమర్చుకోవడం వల్ల ఉపయోగంగా ఉంటుంది. సోలార్ ప్యానల్లకు లైట్నింగ్ అరెస్టర్ ఏర్పాటుచేసుకోవాలి. సోలార్ ప్యానల్లోనే వీటిని బిగిస్తున్నారు. – చిటికెన రామకృష్ణ, డీఈఈ తూర్పు ప్రాంత విద్యుత్ శాఖ, పాలకొల్లు -
నల్ల అద్దాలపై నిర్లక్ష్యమేల?
తణుకు అర్బన్ : నల్ల అద్దాలు కలిగిన కార్లు రోడ్లపై చక్కర్లు కొడుతున్నా రవాణా శాఖ, పోలీసు అధికారులు చోద్యం చూస్తుండడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. నల్ల అద్దాలు కలిగి ఉన్న కార్లలో అసాంఘిక కార్యకలాపాలు.. మద్యం అక్రమ రవాణా.. పిల్లల కిడ్నాప్లు.. సంఘ విద్రోహశక్తుల కదలికలను గుర్తించేందుకు వీలు పడదు. దీంతో ఈ తరహా అద్దాలను వాడకూడదని సుమారుగా పదేళ్ల క్రితమే ఉన్నత న్యాయస్థానం ఆదేశాలివ్వడంతో అప్పట్లో రవాణా శాఖ, పోలీసు శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. కార్లకు ఉన్న నల్ల అద్దాలు, నల్ల ఫిల్మ్లను తొలగింపజేశారు. కానీ ఇటీవల రహదారులపై తిరుగుతున్న కార్లు, ట్యాక్సీల్లో 30 శాతంపైగా నల్ల అద్దాలు, నల్ల ఫిల్మ్ ఏర్పాటుచేసుకుని లోపల ఉన్నవారు బయటకు కనిపించకూడదనే ఉద్ధేశ్యంతో హల్చల్ చేస్తున్నారు. మోటారు వెహికల్ యాక్ట్ 1989/100, సీఆర్పీసీ 188 ప్రకారం నలుపు రంగు ఫిల్మ్ వాడకూడదనే నిబంధనలు ఉన్నాయి. ఒకవేళ వేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నా బయటవారికి 70 శాతం విజిబులిటీ ఉండేలా ఏర్పాటుచేసుకోవాలని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. నల్ల అద్దాలతో యథేచ్ఛగా తిరుగుతున్న కార్లు ప్రస్తుతం జిల్లాలో తిరుగుతున్న సుమారు లక్షన్నరకుపైగా ఉన్న కార్లలో 30 శాతం కార్లకు నల్ల అద్దాలతో తిరుగుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. మద్యం అక్రమ రవాణాలో కార్లకు నూరు శాతం నల్ల రంగు అద్దాలతో కార్లు తిరుగుతున్న పరిస్థితులు నేడు కనిపిస్తున్నాయి. గతనెలలో యానాం నుంచి వస్తున్న కారులో తణుకు ఎకై ్సజ్ శాఖ అధికారులు అక్రమ మద్యాన్ని గుర్తించి పట్టుకున్న ఘటనలో సదరు కారుకు పూర్తిస్థాయిలో నల్ల అద్దాలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం కారు తణుకు ఎక్సైజ్ శాఖ కార్యాలయం ముందే సీజ్ చేయబడి ఉంది. రహదారుల్లో ప్రయాణించే కార్లలో ఉన్న వారు రోడ్డుపై ప్రయాణించే వారికి పూర్తిగా బహిర్గతం కావాలని న్యాయస్థానం ఇచ్చిన నిషేదాజ్ఞలు కొందరు కార్ల యజమానులు పట్టించుకోకుండా యథేచ్ఛగా అదే కార్లలో తిరుగుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలే కాకుండా కార్లలో చిన్నారులు ఆడుకుంటూ డోర్ లాక్ అయిపోయి లోపల ఇరుక్కుని ప్రాణాలు వదలిన ఘటనలు ఇటీవల చోటుచేసుకున్నాయి. యథేచ్ఛగా తిరుగుతున్న నల్ల అద్దాల కార్లు అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం ఉండే ప్రమాదం అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు అమలు కాని వైనం చర్యలు తీసుకోవాలంటున్న ప్రజానీకం జెడ్ ప్లస్కు ఓకే ప్రముఖుల భద్రతా ప్రమాణాల్లో భాగంగా జెడ్ప్లస్ కేటగిరీలో ఉన్న వారికి మాత్రమే బ్లాక్ ఫిల్మ్ వినియోగించుకునే వెసులుబాటును న్యాయస్థానం కల్పించింది. చివరకు మంత్రులు, ఎంపీలు, ప్రముఖులు, వ్యాపారవేత్తలు సైతం బ్లాక్ ఫిల్మ్లేని వాహనాలనే వినియోగించాలనే నిబంధనలు సైతం రవాణా శాఖ నియమావళిలో పొందుపరిచారు. తప్పనిసరి పరిస్థితుల్లో గోప్యంగా ప్రయాణం చేయాల్సి ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర హోం సెక్రటరీ ఆధ్వర్యంలో డీజీపీతోపాటు ఇతర ప్రముఖ అధికారులతో కూడిన కమిటీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తుది నిర్ణయం ఆ కమిటీలో ఉన్న వ్యక్తులపై ఆధారపడి ఉంది.నిబంధనలు మీరితే చర్యలు తప్పవు కార్లకు ఉండే నల్ల అద్దాల విషయంలో కారులో ఉన్న వారిని బయటనుంచి చూసేవారికి 70 శాతం కనిపించే విధంగా ఏర్పాటుచేసుకోవాలి. నిబంధనలు మీరి వంద శాతం నల్ల అద్దాలు కలిగి ఉన్న వాహనాలకు రూ. వెయ్యి జరిమానా విధించి నల్ల అద్దాలు, నల్ల ఫిల్మ్ను తొలగింపజేస్తాం. నిబంధనలు పాటించకుండా రహదారులపై తిరిగే కార్లపై రానున్న రోజుల్లో స్పెషల్ డ్రైవ్ల ద్వారా చర్యలు తీసుకుంటాం. – ఎస్. శ్రీనివాస్, తణుకు మోటారు వెహికల్ ఇనస్పెక్టర్ -
మద్ది క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
జంగారెడ్డిగూడెం: గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామివారికి ఆలయ అర్చకులు ప్రభాతసేవ, నిత్యార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. స్వామివారికి ప్రీతికరమైన మంగళవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో బారులుదీరి స్వామివారిని దర్శించి, 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవలు, విరాళాల ద్వారా రూ.1,75,143 సమకూరినట్లు ఈవో ఆర్వీ చందన తెలిపారు. సుమారు 1400 మంది భక్తులకు నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేసినట్లు చెప్పారు. ఆలయం వద్ద బొర్రంపాలెం ప్రాథమిక ఆరోగ్యకేంద్రం సిబ్బంది వైద్య శిబిరం నిర్వహించారు. తాడేపల్లిగూడెంలో చోరీ తాడేపల్లిగూడెం అర్బన్ : పట్టణంలోని ఝాన్సీరాణి ఆస్పత్రి సమీపంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడి రూ.7 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు అపహరించారు. వివరాల ప్రకారం సుబ్బారావు పేటలో ఉంటున్న బల్ల వేణువర్మ, లలిత గత నెల 24వ తేదీన తిరుమల తిరుపతి వెళ్లి మంగళవారం వచ్చారు. ఇంటికి వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉండడం, ఇంటిలోని వస్తువులు చిందర వందరగా పడి ఉండడంతోపాటు బీరువాలో దాచిన ఆరు కాసుల బంగారు నగలు, కిలో వెండి సామగ్రి కనిపించలేదు. దీంతో బాధితురాలు బల్ల లలిత స్థానిక పట్టణ పోలీస్స్టేసన్లో ఫిర్యాదు చేయగా ఎసై నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం నరసాపురం: పట్టణ పరిధిలోని నరసాపురం–నిడదవోలు ప్రధాన పంట కాలువలో మంగళవారం సాయంత్రం గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. పంటకాలువలో మహిళ మృతదేహం ఉన్నట్టుగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో టౌన్ సీఐ బి.చాదగిరి, ఎస్సై జయలక్ష్మి అక్కడికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు. మృతురాలి వయస్సు సుమారు 53 సంవత్సరాలు ఉంటుందని సీఐ వివరించారు. పోస్టుమార్టం నిమిత్తం మహిళ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వివరించారు. -
వయ్యారిభామతో ముప్పు
యలమంచిలి: రైతులు తెగుళ్ల కంటే అధికంగా భయపడేది వయ్యారిభామ (పార్థీనియం) కలుపు మొక్కకే. ఎక్కడైనా పెరగడం ఈ మొక్క లక్షణం. ఈ కలుపు మొక్క ప్రధాన పంటకు నష్టం కలిగిస్తుంది. మొలిచిన నెల రోజుల్లోనే పూతకు వస్తుంది. ఒక్కో మొక్క 50 వేల విత్తనాలను ఉత్పత్తి చేయడంతో పాటు గాలి పాటుకు దూర ప్రాంతాలకు సైతం తేలికగా విస్తరిస్తుంది. ఈ కలుపు మొక్క గురించి మండల వ్యవసాయాధికారి షేక్ అబ్దుల్ రహీమ్ తెలిపిన వివరాలు.. జీవరాశికి ప్రమాదమే వయ్యారిభామ వల్ల పంటలకే కాదు మనుషులు, పశువులకూ ముప్పే. మనుషులకు జ్వరం, ఉబ్బసం వంటి వ్యాధులతో పాటు చర్మ సంబంధిత అలర్జీ వస్తుంది. జలుబు, కళ్లు ఎర్రబడడం, కనురెప్పల వాపు తదితర సమస్యలు వస్తాయి. ఈ మొక్కలను తింటే పశువులు అయితే హైపర్ టెన్షన్కు గురవుతాయి. ఇక పంటలకు నీరు, పోషకాలు అందకుండా వాటి కన్నా ముందుగా ఇవే శోషించుకుంటాయి. తద్వారా దిగుబడులు 40 శాతం వరకు తగ్గుతాయి. వంగ, మిరప, టమాట, మొక్కజొన్న పైర్లు పూత దశలో ఉన్నప్పుడు వాటిపై వయ్యారిభామ పుప్పొడి పడితే ఉత్పత్తి తగ్గుతుంది. పైర్లకు మొవ్వ, కాండం కుళ్లు తెగుళ్లు సోకే ప్రమాదముంది. ఈ మొక్కలు పశుగ్రాస పంటలకు కూడా నష్టం కలిగిస్తాయి. ఈ మొక్క ల్ని నిర్మూలించాలంటే రైతులు తప్పనిసరిగా సమగ్ర యాజమాన్య, సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఇలా తొలగించాలి వయ్యారిభామ మొక్కలు తక్కువ సంఖ్యలో ఉంటే చేతితో పీకేయాలి. మొక్కలు పూతదశకు రాక ముందే పీకి తగలబెట్టాలి. లేకపోతే వాటి వ్యాప్తిని నివారించడం కష్టం. ఒకవేళ పూత దశకు చేరుకున్న తర్వాత మొక్కలను పీకినట్లయితే వాటిని వెంటనే కుప్పగా వేసి తగలబెట్టాలి. రసాయనాలతో.. మొక్కజొన్న, జొన్న, చిరుధాన్యాల పంటల్లో విత్తనాలు మొలక రాకముందు లీటరు నీటికి 4 గ్రాముల చొప్పున అట్రాజిన్ కలిపి పిచికారీ చేస్తే వయ్యారిభామ మొక్కల బెడద ఉండదు. విత్తనాలు మొలకెత్తిన 15–20 రోజులకు లీటరు నీటికి 2 ఎంఎల్ పేరాక్వాట్ మందును కలిపి పిచికారీ చేసుకోవచ్చు. పశుగ్రాసం వేసేవారు పైరు వేయకముందే లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున అట్రాజిన్ కలిపి పిచికారీ చేయాలి. ఈ కలుపు మొక్కతో పంటకు నష్టం, జీవరాశికీ ప్రమాదమే పూతకు ముందే తొలగించాలి కంపోస్ట్ తయారీ చేయవచ్చు వయ్యారిభామ మొక్కలు ఎంతో హానికరమైనప్పటికీ వాటిని ఉపయోగించి కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. ఇందుకు నీరు నిలవని చోట 3 మీటర్ల లోతు, 6 మీటర్ల వెడల్పు, 10 మీటర్ల పొడవు ఉండేలా గుంత తవ్వాలి. ఇందులో 50 కిలోల వయ్యారిభామ మొక్కలను వేసి, వాటిపై 5 కిలోల యూరియా, 50 గ్రాముల ట్రైకోడెర్మావిరిడి కూడా చల్లాలి. ఈ విధంగా పొరలు, పొరలుగా గుంతను డోము ఆకారంలో నింపుకోవాలి. పొరల పైన పేడ, మట్టి, ఊక మిశ్రమాన్ని వేసి కప్పేయాలి. నాలుగైదు నెలల్లో కంపోస్ట్ తయారవుతుంది. దానిని జల్లెడ పట్టి పంటకు వేసుకోవాలి. ఈ కంపోస్టులో నత్రజని, భాస్వరం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం పోషకాలు అధికంగా ఉంటాయి. ఇలా తక్కువ ఖర్చుతో తయారు చేసుకుని అన్ని పంటలకు వేసుకోవచ్చు. – షేక్ అబ్దుల్ రహీమ్, యలమంచిలి మండల వ్యవసాయాధికారి -
అరకొరగా మందు బిల్లలు
అరకొరగా మందు బిళ్లలుబుధవారం శ్రీ 2 శ్రీ జూలై శ్రీ 2025సాక్షి, భీమవరం: వృద్ధుల్లో రక్తపోటు అదుపునకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు ఎటన్లాల్ 50 మాత్రలను ఎక్కువగా సిఫార్సు చేస్తుంటారు. గతంలో పీహెచ్సీలకు క్రమం తప్పకుండా ఈ మాత్రలు సరఫరా జరిగేవి. కొన్ని నెలలుగా వీటి పంపిణీ అంతంత మాత్రంగానే ఉండడంతో రోగులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. నొప్పులు తగ్గేందుకు వినియోగించే ప్రిగాబ్లిన్ టాబ్లెట్లు, రోగికి సత్తువ కోసం పెట్టే మెట్రోజిల్ సైలెన్లు, జ్వరాలు, నొప్పులకు వివిధ రకాల వ్యాధులను తగ్గించేందుకు వినియోగించే పారాసిటమాల్ 500 ఎంజీ, ఇన్సులిన్, అమాక్సిలిన్ టాబ్లెట్స్, అమాక్స్లినన్ ఇంజెక్షన్లు, సిట్రజన్, సిల్వర్ ఎక్స్ తదితర మందులది అదే దారి. ఏ రకం మందులు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అరకొర మందులతో తప్పనిసరి పరిస్థితుల్లో రోగులు మెడికల్ షాపులను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత వేధిస్తోంది. జిల్లాలో ఒక జిల్లా ఆరోగ్య కేంద్రం, మూడు సీహెచ్సీలు, ఐదు ఏరియా ఆస్పత్రులు, 34 వరకు పీహెచ్సీలు, 18 యూపీహెచ్సీల వరకూ ఉన్నాయి. రోజుకు 15,500 వరకూ ఓపీ నమోదవుతుంది. ప్రతి మూడు నెలలకు ప్రభుత్వ ఆస్పత్రులకు అవసరమైన మందులను వైద్యారోగ్య శాఖ అందిస్తుంది. కొంతకాలంగా క్వార్టర్ కోటా విడుదలతో ప్రభుత్వం కోత పెడుతోంది. మూడు నెలలకు అవసరమైన డ్రగ్స్తో ఇండెంట్ పెడుతుండగా సెంట్రల్ డ్రగ్స్ స్టోర్స్ నుంచి పూర్తిస్థాయిలో మందులు రావడం లేదని వైద్య సిబ్బంది చెబుతున్నారు. గతంతో పోలిస్తే మందులకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు తగ్గాయి. పత్తాలేని సురక్ష శిబిరాలు జగనన్న సురక్ష ద్వారా పేద వర్గాల వారికి రూపాయి ఖర్చు లేకుండా స్పెషలిస్ట్ వైద్యసేవలు పొందే సౌలభ్యాన్ని గత ప్రభుత్వం కల్పించింది. వైద్య సిబ్బంది, వలంటీర్లు ఇంటింటికి వెళ్లి బీపీ, సుగర్, హిమోగ్లోబిన్, అవసరాన్ని బట్టి మలేరియా, డెంగీ, కఫం పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సమస్యలున్న వారిని గుర్తించేవారు. జిల్లాలోని విలేజ్ క్లినిక్లు, పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి రక్తం, మూత్రం, ఈసీజీ తదితర 14 రకాల వైద్య పరీక్షలతో పాటు 172 రకాల మందులను అందుబాటులో ఉంచేవారు. స్పెషలిస్ట్ వైద్యులు, మెడికల్ ఆఫీసర్లు, ఇతర ఆరోగ్య సిబ్బంది వైద్యసేవలు అందించేవారు. పేదలకు వైద్య భరోసా కల్పించిన ఈ శిబిరాల నిర్వహణను కూటమి ప్రభుత్వం పక్కన పెట్టేసింది. గత్ర ప్రభుత్వంలో తమ సమీప ఆరోగ్య కేంద్రంలో స్పెషలిస్ట్ వైద్యసేవల్ని ఉచితంగా పొందిన గ్రామీణ ప్రాంత ప్రజలు ఇప్పుడు వాటి కోసం ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పట్టణాలకు పరుగులు తీయాల్సి వస్తోంది. న్యూస్రీల్అలంకారప్రాయంగా హెల్త్ క్లినిక్లు సాధారణంగా యూనివర్శల్ (యూ), సబ్ డివిజనల్ (ఎస్), టెరిసరీ (టి) కేటగిరీల్లో విలేజ్ హెల్త్ క్లినిక్లు, పీహెచ్సీలు, సీహెచ్సీలు, జిల్లా ఆస్పత్రులు, వైద్య కళాశాలలకు మందుల కేటాయింపు చేస్తుంటారు. స్థాయిని బట్టి అలాట్మెంట్, బడ్జెట్ కేటాయింపు లుంటాయి. రోజువారీ ఓపీ అధికశాతం నమోదయ్యే పీహెచ్సీలకు పూర్తిస్థాయిలో మందుల సరఫరా జరగక వీటికి అనుబంధంగా పనిచేసే హెల్త్ క్లినిక్లో్ూల్న మందుల కోరత వేధిస్తోంది. హెల్త్ క్లినిక్లకు రావాల్సిన మందులు అరకొరగానే సరఫరా అవుతున్నాయి. ఆస్పత్రుల్లో మందులకు కొరత లేదని, అలాట్మెంట్ మేరకు పూర్తిస్థాయిలో మందులు సరఫరా చేస్తున్నట్టు వైద్యారోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. కొన్ని మందులు నిలిపివేసిన ప్రభుత్వం పీహెచ్సీలకు 172 రకాలు ఉంచాల్సి ఉండగా కొన్ని మందులను నిలిపివేసిన వైద్య ఆరోగ్యశాఖ మరికొన్ని అరకొరగానే అందజేస్తోంది. సీహెచ్సీల్లో 325 రకాల మందులకు 240 రకాలనే సరఫరా చేస్తున్నట్టు తెలుస్తోంది. బీపీ, సుగర్, దీర్ఘకాలిక వ్యాధులకు మందుల పంపిణీ అరకొరగానే ఉండటంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వ్యాధిని నయం చేసేందుకు సరైన డ్రగ్ లేక బయట మెడికల్ షాపుల్లో కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటోందని రోగులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన సర్వేలో ఉచిత మందులు సక్రమంగా అందడం లేదని 46 శాతం చెప్పగా, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలపై 30 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ప్రభుత్వ ఆస్పత్రులకు పూర్తిస్థాయిలో అందని వైనం మెడికల్ షాపులను ఆశ్రయిస్తున్న రోగులు అలంకార ప్రాయంగా హెల్త్ క్లినిక్లు గత ప్రభుత్వంలో అందుబాటులో అన్ని రకాల మందులు జగనన్న సురక్ష శిబిరాలతో చెంతకే మందులు -
ఆనందం ‘ట్రిపుల్’
నూజివీడు: రోజువారీ కూలీ కుమారుడు ఒకరు... ఆటో డ్రైవర్ కొడుకు మరొకరు.. తండ్రి లేని నిరుపేద బాలిక ఇంకొకరు.. ఇలా అందరూ గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులే. అద్భుత ప్రతిభ కలిగిన వీరంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని పదో తరగతిలో సత్తా చాటారు. గ్రామీణ పేద పిల్లలకు సైతం సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అత్యుత్తమ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన ట్రిపుల్ ఐటీల్లో సీట్లు పొందారు. తమ లక్ష్యానికి అనుగుణంగా తొలి అడుగు పడిందనే ఆనందంతో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లు పొందిన కొందరు విద్యార్థుల మనోగతం వారి మాటల్లోనే.. నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీట్లు పొందిన గ్రామీణ పేద విద్యార్థులు కష్టానికి తగిన ప్రతిఫలం లభించిందని సంతోషం -
వైఎస్సార్సీపీ బలోపేతానికి కృషి చేయాలి
ఏలూరు టౌన్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో రాబోయే కాలంలో ఏలూరు జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ.. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై సమష్టిగా పోరాటం చేసి ప్రజలకు అండగా నిలవాలని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ నాయకుడు కోటగిరి శ్రీధర్ అన్నారు. ఏలూరులోని ఆయన ఇంట్లో దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి, ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో వైఎస్సార్సీపీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఏలూరు పార్లమెంట్లో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేసేలా పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కూటమి అరాచకాలు, పార్టీ నేతలపై అక్రమ కేసులు, దాడులు, దౌర్జన్యాలపై ప్రజలంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. కూటమి నేతలు సూపర్ –6 హామీలు అమలు చేయలేక, ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, గత వైఎస్సార్సీపీ హయాంలో ప్రజలకు ఏ విధంగా మేలు చేశామనేది ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్బాబు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు నెరుసు చిరంజీవి, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్ గురునాథ్, బీసీ సెల్ నగర అధ్యక్షులు కిలాడి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. -
పిడుగులతో అప్రమత్తం
వర్షాకాలంలో పిడుగుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రాణాపాయంతో పాటు గృహోపకరణాలు కాలిపోయే ముప్పు ఉందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 10లో uవరదను ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలి ఏలూరు(మెట్రో): గోదావరి వరదను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు విపత్తు నియంత్రణ కార్యాచరణను పటిష్టంగా చేపట్టాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో గోదావరి వరద నియంత్రణ, సహాయక చర్యలపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయడంతోపాటు మండల స్థాయిలో రెవెన్యూ, పోలీసు, విద్యుత్, ఫైర్, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారుల పేర్లు, అత్యవసర ఫోన్ నెంబర్లు సిద్ధంగా ఉంచాలన్నారు. కుక్కునూరు, వేలేరుపాడులో మొదటి, రెండవ, మూడో వరద ప్రమాద హెచ్చరికలకు అనుగుణంగా పునరావాస కార్యక్రమాలు చేపట్టాలన్నారు. నెలలు నిండిన గర్బిణీల జాబితాను సిద్ధం చేసి సమీప ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. నాటుసారా రహిత జిల్లాగా ఏలూరు : జిల్లాలో 140 గ్రామాల్లో నాటుసారా తయారీ, అమ్మకాలు పూర్తిగా అరికట్టినందున ఏలూరు జిల్లాను నాటుసారా రహిత జిల్లాగా కలెక్టర్ ప్రకటించారు. మంగళవారం కలెక్టరేట్లో సంబంధిత పోస్టర్లను కలెక్టర్ వెట్రిసెల్వి ఆవిష్కరించారు. ప్రజల్లోకి టోల్ ఫ్రీ నెంబరు 14405పై విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. పింఛన్ల పంపిణీ పరిశీలన : మంగళవారం ఏలూరులో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు.జూలై 1న పింఛన్లు ఏదైనా కారణంతో తీసుకోని వారికి జూలై 2న పంపిణీ చేస్తామన్నారు. -
కూలికి వెళ్తూ చదివించారు
మాది ప్రకాశం జిల్లా మార్కాపురం. మా ఊరిలోని ఏపీ మోడల్ స్కూల్లో పదో తరగతి చదివా. 591 మార్కులు రావడంతో నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీటు లభించింది. మా నాన్న కొండయ్య కూలి పనులకు వెళుతూ నన్ను చదివించారు. ట్రిపుల్ ఐటీలో సీటు లభించడం ఎంతో ఆనందంగా ఉంది. – బొప్పరాజు సాత్విక, మార్కాపురం, ప్రకాశం జిల్లా నా కల నెరవేరింది మాది ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం గొట్టిపడియ. మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ శాఖ స్కూల్లో చదువుకుని పదో తరగతిలో 580 మార్కులు సాధించా. మా అమ్మ చాలా కష్టపడి నన్ను చదివించింది. ట్రిపుల్ ఐటీలో చేరాలనే నా కల నెరవేరింది. ఎంతో సంతోషంగా ఉంది. – సాల్వ హిమచంద్రిక, గొట్టిపడియ, ప్రకాశం జిల్లా కష్టపడి చదువుతా మా నాన్న ఆటో నడిపి కుటుంబాన్ని పోషించేవాడు. అమ్మ కూలి పనులకు వెళ్తుంది. నేను జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ శాఖ స్కూల్లో పదో తరగతి చదివి 592 మార్కులు సాధించా. ఇక్కడ సీటు రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఇక ముందు కూడా కష్టపడి చదువుతా. – వాసిరెడ్డి వెంకటలక్ష్మి, పరవాడ మండలం, అనకాపల్లి జిల్లా ఉన్నత స్థానమే లక్ష్యంగా.. అమ్మ, నాన్న ఇద్దరూ కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్నారు. జెడ్పీ హైస్కూల్లో పదో తరగతిలో 590 మార్కులు సాధించా. తల్లిదండ్రుల కష్టాన్ని రోజూ చూస్తుండేవాడిని. ట్రిపుల్ ఐటీలో సీటు సాధించినందుకు ఆనందంగా ఉంది. బాగా చదువుకుని ఉన్నత స్థానాలకు ఎదగడమే లక్ష్యం. – దామా చైతన్య, నలదలపూర్, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంతోషంగా ఉంది నా తండ్రి కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్నారు. బీఎంఆర్ బాలికల హైస్కూల్లో చదివి పదో తరగతిలో 587 మార్కులు సాధించాను. నూజి వీడు ట్రిపుల్ ఐటీలో సీటు రావడం సంతోషంగా ఉంది. ఉన్నత స్థానాలకు చేరుకుని తల్లిదండ్రులను ఆనందంగా ఉండేలా చూడటం నా బాధ్యత. – మరుకుర్తి శ్రీకీర్తన, పిఠాపురం, కాకినాడ జిల్లా ఉన్నత విద్యకు అవకాశం మా నాన్న కూలికి వెళ్తేనే మా కుటుంబం గడిచేది. నేను కావలి మున్సిపల్ హైస్కూల్లో చదివి పదో తరగతిలో 582 మార్కులు సాధించాను. ఇక్కడ సీటు రావడంతో ఎంతో ఆనందంగా ఉంది. పేద కుటుంబానికి చెందిన నాకు ఉన్నత చదువుకు అవకాశం రావడం సంతోషంగా ఉంది. – బొగ్గవరపు తనూజ, లింగనపాలెం, నెల్లూరు జిల్లా ● -
ట్రిపుల్ ఐటీ కౌన్సెలింగ్ తొలిరోజు ప్రశాంతం
నూజివీడు: ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో పీయూసీ ప్రథమ సంవత్సరానికి నిర్వహించిన ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ సోమవారం ప్రశాంతంగా జరిగింది. నూజివీడు ట్రిపుల్ ఐటీకి 1,010 మందిని ఎంపిక చేయగా వారిలో తొలిరోజు 505 మందిని కౌన్సెలింగ్కు ఆహ్వానించారు. ఉదయం 8 గంటల కల్లా కౌన్సెలింగ్ ప్రారంభించారు. ఈ కౌన్సెలింగ్లో ఎంపికై న విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలించి ప్రవేశాలు కల్పించారు. దీనికి సంబందించిన ఫీజులను కూడా కట్టించుకున్నారు. తొలిరోజు 446 మంది అభ్యర్థులు కౌన్సెలింగ్కు హాజరవ్వగా వారందరికీ అడ్మిషన్లు కల్పించారు. ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ల కన్వీనర్, ఇన్చార్జి డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్, సీఏఓ బండి ప్రసాద్, సెంట్రల్ డీన్ దువ్వూరు శ్రావణి, అకడమిక్స్ డీన్ సాదు చిరంజీవి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ మేరుగ అర్జునరావుల పర్యవేక్షణలో ఎలాంటి అవాంతరాలూ లేకుండా కౌన్సెలింగ్ జరిగింది. పలువురు మెంటార్లు, లెక్చరర్లు నిరంతరం కౌన్సెలింగ్ హాలులో ఉండి సర్టిఫికెట్ల పరిశీలనలో సిబ్బందికి కలిగే సందేహాలను నివృత్తి చేశారు. కౌన్సెలింగ్లో భాగంగా సర్టిఫికెట్ల పరిశీలన కోసం 20 కౌంటర్లను ఏర్పాటు చేసి 100 మంది సిబ్బందిని నియమించి కౌన్సెలింగ్ ప్రక్రియను తొలిరోజు ప్రశాంతంగా ముగించారు. ఎస్సీ, బీసీ, ఎస్టీ సంక్షేమ అధికారులను ఏర్పాటు చేసి విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. తాగునీరు, ప్రథమ చికిత్స కౌంటర్లు, ఎన్సీసీ క్యాడెట్ల సేవలు అందుబాటులో ఉండటంతో అంతా సజావుగా సాగింది. వచ్చిన అభ్యర్థులకు, వారి తల్లిదండ్రులకు తక్కువ ధరకే భోజన సదుపాయాన్ని కల్పించారు. కవలలకు సీట్లు ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లకు చెందిన ఇద్దరు కవలలకు నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీట్లు లభించాయి. సోమవారం కౌన్సెలింగ్ కోసం నూజివీడు ట్రిపుల్ ఐటీకి వచ్చిన నందికట్ల కుందన్ వెంకట నాగశ్రీ సాయి, నందికట్ల కుందన వెంకట నాగశ్రీ కంచికచర్లలోని జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుకున్నారు. కుందన్కు 587 మార్కులు, కుందనకు 584 మార్కులు వచ్చాయి. వారిద్దరూ ట్రిపుల్ ఐటీలో సీట్ల కోసం దరఖాస్తు చేయగా, ఇద్దరికీ నూజివీడు ట్రిపుల్ ఐటీలోనే సీట్లు వచ్చాయి. దీంతో సోమవారం వారిద్దరూ పీయూసీలో చేరారు. ఈ సందర్భంగా వారిని డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ అభినందించారు. 446 మందికి ప్రవేశాలు -
కాట్రేనిపాడు విద్యార్థికి శ్రేష్ఠ ప్రవేశ పరీక్షలో 4వ ర్యాంకు
ముసునూరు: కేంద్ర ప్రభుత్వం నిర్వహించే శ్రేష్ఠ ప్రవేశ పరీక్షలో ముసునూరు మండలం కాట్రేనిపాడుకు చెందిన దేవరపల్లి మోక్షజ్ఞ అక్షిత్ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో నాలుగో ర్యాంకును సాధించినట్లు తండ్రి సురేష్ తెలిపారు. తమ కుమారుడు విజయనగరం జిల్లాలోని కోరుకొండ సైనిక్ స్కూల్లో 8వ తరగతి చదువుతూ ఎస్సీ విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ లెవెల్ శ్రేష్ఠ ప్రవేశ పరీక్ష రాశాడన్నారు. నాలుగవ ర్యాంకుతో సీబీఎస్ఈ ఇంటర్నేషనల్ స్కూల్లో 9వ తరగతిలో ప్రవేశానికి అర్హత సాధించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థి మోక్షజ్ఞ అక్షిత్కు పలువురు అభినందనలు తెలియజేశారు.లారీ ఢీకొని మోటార్సైక్లిస్టు మృతిపాలకోడేరు: లారీ ఢీకొని మోటార్సైకిల్పై వెళుతున్న వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన గొల్లలకోడేరులో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. పాలకోడేరు తూర్పు పేటకు చెందిన ఆవాల వెంకటేశ్వరరావు (40) మోటార్సైకిల్పై గొల్లలకోడేరు వెళ్లి తిరిగి వస్తుండగా గొల్లలకోడేరు బ్రిడ్జి దాటిన వెంటనే ఎదురుగా టిప్పర్ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకటేశ్వరరావు తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108కి సమాచారం అందించగా భీమవరం నుంచి వచ్చిన 108 అత్యవసర వాహన సిబ్బంది పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. వెంకటేశ్వరరావు భార్య దేవి ఆశా కార్యకర్తగా పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. వెంకటేశ్వరరావుకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.చికిత్స పొందుతూ మహిళ మృతిఏలూరు టౌన్ : ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడిన మహిళ విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. వివరాల ప్రకారం ఏలూరు బీడీకాలనీకి చెందిన లావేటి సోమేశ్వరరావు, మోహనమ్మకు 2024 ఆగస్టులో వివాహమైంది. కొంతకాలం కాపురం సజావుగా సాగినా అనంతరం ఇద్దరి మద్య విభేదాలతో గొడవలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమె ఏలూరు మహిళా పోలీస్స్టేషన్లో భర్తపై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. కానీ భర్తను జైలులో పెట్టలేదంటూ ఈనెల 26న మోహనమ్మ జిల్లా జైలు సమీపంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తీవ్ర గాయాలైన ఆమెను ఏలూరు జీజీహెచ్కు తరలించగా వైద్యులు చికిత్స అందించి, అనంతరం మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం విజయవాడ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మోహనమ్మ మృతిచెందింది. -
మొక్కజొన్న సాగులో మెలకువలు ఇలా..
చింతలపూడి : మొక్కజొన్న పంటను వర్షాధారంగాను, సాగునీటి కింద పండిస్తారు. మొక్కజొన్న ఆహార పంటగానే కాకుండా దాణా రూపంలో పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగాను, పేలాల పంటగాను, కాయగూర రకంగాను రైతులు సాగు చేస్తున్నారు. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో 48 వేల హెక్టారుల్లో రైతులు మొక్కజొన్న సాగు చేస్తున్నారు. ఏటా 4.40 లక్షల టన్నుల దిగుబడి సాధిస్తున్నారు. ఖరీఫ్ మొక్కజొన్న సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సాగు వివరాలను వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వై సుబ్బారావు రైతులకు సూచించారు. విత్తే సమయం సాధారణంగా జూన్ 15 నుంచి జూలై లోగా విత్తుకోవాలి. అయితే వర్షాలు ఆలస్యంగా కురిస్తే నీటి వసతి కింద స్వల్పకాలిక హైబ్రీడ్ రకాలు ఆగస్టు రెండో వారంలో కూడా విత్తుకోవచ్చు. అనువైన రకాలు ● దీర్ఘకాలిక రకాలు: (100–120 ) రోజులు డీహెచ్ఎం –113, 900 ఎం గోల్డ్, బయో 9861, ప్రో–311, 30బి07 ● మధ్య కాలిక రకాలు : (90–100 రోజులు) డీహెచ్ఎం–111, 117, 119, కేహెచ్–510, బయో– 9657, కేఎం–9541, ఎంసీహెచ్–2 ● స్వల్పకాలిక రకాలు : (వీటి కాల పరిమితి 90 రోజుల కంటే తక్కువ) డీహెచ్ఎం– 115, ప్రకాశ్ కేహెచ్–5991, జేకేఎంఎచ్–1701 డీకేసీ–7074 ఆర్, ఎంఎంహెచ్–1701, డీకేసీ– 7074 ఆర్, ఎంఎంహెచ్– 133, 3342. ప్రత్యేక రకాలు ● తీపి మొక్కజొన్న (స్వీట్ కార్న్): మాధురి, ప్రియ, విన్ ఆరెంజ్, అల్మోరా స్వీట్ కార్న్ రకాలు, సుగర్–75, బ్రైట్జేన్ సంకర రకాలు. విత్తే విధానం ఎకరాకు సంకర రకాలైతే 7–8 కిలోల విత్తనం వాడి 60 సెం.మీ ఎడంగా బోదెలు చేసి సాళ్లలో 20 సెం.మీ ఎడంగా విత్తాలి. ఇలా విత్తితే ఎకరాకు సుమారు 33,333 మొక్కలు వస్తాయి. విత్తే ముందు కిలో విత్తనానికి 3 గ్రాముల కాస్టాన్ లేదా డైధేన్ ఎం.45 చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసి బోదెకు ఒక పక్కగా విత్తాలి. ఎరువుల వాడకం ఖరీఫ్ పంటలో ఎకరాకు 72–80 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్నిచ్చే ఎరువులు వాడాలి. మొత్తం పొటాష్, భాస్వరం ఎరువులను పంట విత్తే సమయంలోనే వేసుకోవాలి. ఒకవేళ జింక్ లోపం ఉంటే ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ వేయాలి. పైరుపై జింక్లోపం గమనిస్తే జింక్ సల్ఫేట్ (20 గ్రా) పిచికారీ చేయాలి. కలుపు నివారణ పంట విత్తాక 45 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. మొక్కజొన్న పంటను ఏక పంటగా వేసినప్పుడు నేల రకాన్ని బట్టి ఎకరాకు 800–1200 గ్రా, అట్రాజిన్ పొడి మందును 200 లీటర్ల నీటిలో కలిపి పంట విత్తిన వెంటనే లేదా 2–3 రోజుల్లోగా పిచికారీ చేసి కలుపును నివారించవచ్చును. వెడల్పాటి కలుపు మొక్కల నివారణకు విత్తిన 30 రోజుల తర్వాత ఎకరాకు అరకిలో 2, 4–డి సోడియం సాల్ట్తో పిచికారీ చేయాలి. నీటి తడులు వర్షాధారంగా సాగు చేసినా పూత దశలో వర్షాభావ పరిస్థితులేర్పడితే వీలున్న చోట నీరు తడిపితే మంచి దిగుబడులు వస్తాయి. పూత దశ, గింజలు ఏర్పడే దశల్లో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. పైరు తొలి దశలో పొలంలో నీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సస్యరక్షణ పైరు తొలి దశలో ఆశించే మొవ్వ తొల్చే పురుగు నివారణకు ముందు జాగ్రత్తగా విత్తిన 10–12 రోజులకు పైరుపై మోనోక్రోటోఫాస్ (1.6 మి.లీ) లేదా కోరా.ఎన్ (03 మి.లీ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలను ఎకరాకు 3 కిలోల చొప్పున పైరు 25–30 రోజుల దశలో ఆకు సుడుల్లో వేయాలి. ఆకు మాడు తెగులు నివారణకు మాంకో జెట్ (2.5 గ్రా) లీటర్ నీటిలో కలిపి వారం, పది రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. పొడ తెగులు లక్షణాలు కనిపిస్తే మొక్క దిగువనున్న 2–3 ఆకులు తుంచివేసి ప్రొపికొనజోల్ (1 మి,లీ) లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. మొక్క ఎండు, కాండం మసికుళ్లు తెగుళ్లు రాకుండా ముందు జాగ్రత్తగా ఎదుర్కొనే రకాల సాగు, పంట మార్పిడి, వేసవిలో లోతు దుక్కులు, పూత దశ తర్వాత నీటి ఎద్దడి పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తలు చూసుకోవాలి. పాడి–పంట -
మునిసిపల్ కార్మికుల పోరు ఉద్ధృతం
పోటీ కార్మికులను దింపడంపై అభ్యంతరం తాడేపల్లిగూడెం (టీఓసీ): మునిసిపాలిటీ ఆధ్వర్యంలో పాతూరు శివారు హెడ్ వాటర్ వర్క్స్, ఫిల్టర్ ప్లాంట్లు వద్ద పోటీ కార్మికులను దింపారన్న విషయాన్ని తెలుసుకున్న ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు సాయంత్రం నిరసన శిబిరం వద్ద నుంచి బైక్ ర్యాలీగా స్థానిక హెడ్ వాటర్స్ వర్క్స్ గేటు వద్దకు చేరుకున్నారు. పోటీ కార్మికులను తీసుకురావడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. నిరసన కార్యక్రమం వద్దకు పోలీసులు చేరుకుని వాటర్ సప్లయ్ను అడ్డుకోవడం సరికాదని, ప్రజలు ఇబ్బందులను గుర్తించాలని, లేని పక్షంలో అరెస్ట్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె నుంచి వెనక్కి తగ్గబోమని, ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. తొలుత స్థానిక పురపాలక సంఘం కార్యాలయం వద్ద మునిసిపల్ ఇంజనీరింగ్ అవుట్ సోర్సింగ్ కార్మికులు సోమవారం 8వ రోజు చేపట్టిన నిరసన దీక్షలకు సీఐటీయూ నేతలు సంఘీభావం తెలిపారు. ఏలూరు (టూటౌన్): రాష్ట్రంలోని నగరపాలక సంస్థల్లో, పురపాలక సంఘాల్లో, నగర పంచాయతీల్లో పనిచేస్తున్న ఇంజనీరింగ్ విభాగంలోని అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని మునిసిపల్ ఇంజినీరింగ్ అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులు డిమాండ్ చేశారు. స్థానిక ఆర్ఆర్ పేట ఎస్ ఆర్ టు వద్ద ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన గేటు మీటింగ్లో వారు మాట్లాడారు. ఏళ్ల తరబడి అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నా ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగ సిబ్బందిని పర్మినెంట్ చేస్తామని టీడీపీ ఇచ్చిన ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని ఏఐటీయూసీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ డాంగే, జిల్లా ఉపాధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ ఏలూరు ఏరియా కార్యదర్శి ఏ అప్పలరాజు, ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు బి నాగేశ్వరరావు, కోశాధికారి బి నారాయణరావు, యూనియన్ నాయకులు నారా శ్రీను, కందుల శ్రీనివాస్, అప్పారావు తదితరులు నాయకత్వం వహించారు. నరసాపురంలో అర్ధనగ్నంగా జలదీక్ష నరసాపురం: స్థానిక వశిష్టగోదావరి వలంధర్రేవు గోదావరిమాత విగ్రహం వద్ద కార్మికులు సోమవారం వినూత్నరీతిలో ఆందోళన చేశారు. అర్ధనగ్నంగా గోదావరిలో దిగి జలదీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రవమానికి జేఏసీ కమిటీ నాయకులు ఆర్ రత్నం, వి.ఫణి, ఎం.సత్యనారాయణ, కె.కాశీ, సీహెచ్ వాసు, ఎ.మధుబాబు, ఎం.సుజాత, టి.కళ్యాణి, ఎస్ దేవి, కె.అనంతలక్ష్మి నాయకత్వం వహించారు. ఇకపై పూర్తిస్థాయి సమ్మె తణుకు అర్బన్: ఇకపై పూర్తి స్థాయి సమ్మెకు దిగుతున్నట్లు మునిసిపల్ ఇంజనీరింగ్ అవుట్ సోర్సింగ్ జేఏసీ అధ్యక్ష, కార్యదర్శులు ఉండ్రాజవరపు శ్రీను, గెల్లా విజయ్కుమార్ తెలిపారు. ఈ మేరకు సోమవారం మునిసిపల్ కమిషనర్ టి.రామ్కుమార్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం సమ్మెలో భాగంగా మునిసిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన శిబిరంలో కార్మికులు తమ నిరాహారదీక్షలను కొనసాగించారు. ఈ కార్యక్రమంలో దాసరి సత్యనారాయణ, పిండి పెద్ధిరాజు, కాంతారావు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ మద్దతు జంగారెడ్డిగూడెం: న్యాయమైన కోర్కెల కోసం మునిసిపల్ ఇంజనీరింగ్ వర్కర్లు చేపట్టిన ఆందోళనలకు వైఎస్సార్ సీపీ నాయకులు మద్దతు తెలిపారు. ఆందోళనల్లో భాగంగా యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం కమిషనర్కు సమ్మె నోటీస్ ఇచ్చినట్లు యూనియన్ అధ్యక్షుడు కంతేటి వెంకట్రావు తెలిపారు. ఇకపై పట్టణంలో వీధిదీపాలు నిలుపుదల చేస్తామని, దశలవారీగా మంచినీటి సప్లయ్ కూడా నిలుపుదల చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సమ్మెకు మద్దతుగా మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, వైస్ చైర్పర్సన్ కంచర్ల వాసవి నాగరత్నం, ముప్పిడి వీరాంజనేయులు, వైఎస్సార్సీపీ టౌన్ ప్రెసిడెంట్ చిటికెల అచ్యుతరామయ్య, కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. ఉద్యోగ భద్రత కోసం మునిసిపల్ ఇంజనీరింగ్, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులు చేపట్టిన పోరు ఉద్ధృతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు వాటర్వర్క్స్, లైటింగ్ విభాగాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఒక్కరి చొప్పున సహకరించామని, ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారంలో శ్రద్ధ చూపకపోవడంతో ఇకపై పూర్తిస్థాయి ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. అధికారులకు సమ్మె నోటీసులు ఇచ్చారు. తమను పర్మినెంట్ చేసి టీడీపీ ఇచ్చిన ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరాహార దీక్షలు, అర్ధ నగ్న ప్రదర్శనలు అధికారులకు సమ్మె నోటీసులు ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ ప్రభుత్వం దిగిరాకపోతే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరిక -
పీజీఆర్ఎస్ వికేంద్రీకరణ
● జిల్లాతో పాటు డివిజన్, మండల, మున్సిపల్ స్థాయిల్లో నిర్వహణ ● ఆన్లైన్లోనూ ఫిర్యాదుల స్వీకరణ ● టోల్ఫ్రీ నంబర్ 1100 ఏర్పాటు ఏలూరు(మెట్రో): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)ను వికేంద్రీకరించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. దీని ద్వారా వేగంగా సమస్యలు పరిష్కారమవుతాయని అంటు న్నారు. మండల, డివిజన్, మున్సిపల్ స్థాయిలకు పీజీఆర్ఎస్ను విస్తరించారు. ఈ మేరకు కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఆన్లైన్లో సైతం ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు, ఫిర్యాదుల పరిష్కార స్థితిని తెలుసుకునేందుకు ప్రత్యేకంగా టోల్ఫ్రీ నంబర్ 1100ను ఏర్పాటు చేశారు. ఇకపై ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్తో పాటు డివిజన్, మండల, డివిజన్ స్థాయి ల్లో పీజీఆర్ఎస్ను నిర్వహించనున్నారు. తాకిడిని తగ్గించేలా.. జిల్లాలోని దూర ప్రాంతాల నుంచి కలెక్టరేట్లో జరి గే పీజీఆర్ఎస్కు హాజరయ్యేందుకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అదేక్రమంలో అర్జీల తాకిడి కూ డా ఎక్కువగా ఉండటంతో కలెక్టర్ కార్యక్రమం వి కేంద్రీకరణకు నిర్ణయించారు. స్థానికంగా పీజీఆర్ఎస్ నిర్వహించడం వల్ల ప్రజలకు వ్యయ ప్రయా సలు తగ్గడంతో పాటు సమస్యలు వేగంగా పరిష్కారమవుతాయని భావిస్తున్నారు. పీజీఆర్ఎస్ను పారదర్శకంగా, మరింత సమర్థవంతంగా నిర్వహించే వీలుంటుందని, స్థానిక సమస్యల పరిష్కారానికి అక్కడి అధికారులు ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉంటుందని జిల్లా అధికారులు అంటున్నారు. స్థానికంగా అర్జీలు స్వీకరించడం వల్ల జిల్లాస్థాయిలో పని ఒత్తిడి తగ్గుతుందని, అర్జీలపై పర్యవేక్షణ పెరుగుతుందని చెబుతున్నారు. ఆన్లైన్ ద్వారా కూడా.. పీజీఆర్ఎస్కు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు. హెచ్టీటీపీఎస్://మీకోసం డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్లో ఫిర్యాదు చేయవచ్చు. అలాగే ఫిర్యాదు నమోదు, ఫిర్యాదుల స్థితి సమాచారం తెలుసుకునేందుకు ట్రోల్ ఫ్రీ 1100 నంబర్లో సంప్రదించవచ్చు. -
పేగు బంధం కాదన్నా.. మానవత్వం చాటి..
వృద్ధురాలికి అంత్యక్రియలు నిర్వహించిన ఆశ్రమ నిర్వాహకుడుజంగారెడ్డిగూడెం: పేగు బందం కానరాలేదు. ఒడిదుడుకులు ఎదుర్కొని కుటుంబాన్ని నిలబెట్టిన వృద్ధురాలిని అనాథగా వదిలేశారు. ఆమె ఆఖరి మజిలీలోనూ పట్టించుకోకపోగా మాన వత్వం చాటుతూ ఆశ్రమ నిర్వాహకుడు అంత్యక్రియలు నిర్వహించారు. వివరాలిలా ఉన్నాయి.. కోడూరి శకుంతల అనే వృద్ధురాలిని నాలుగేళ్ల క్రితం జంగారెడ్డిగూడెంలోని సీతామహాలక్ష్మి వృద్ధుల, వికలాంగుల, అనాథ ఆశ్రమంలో కుటుంబసభ్యులు చేర్పించారు. అప్పటి నుంచి ఆశ్రమంలోనే ఆమె జీవనం సాగిస్తోంది. ఇటీవల శకుంతల అనారోగ్యం పాలుకాగా కుటుంబసభ్యులు పట్టించుకోలేదు. దీంతో ఆశ్రమ నిర్వాహకుడు జయవరపు శేఖర్ ఆమెను ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబసభ్యులకు తెలియజేసినా స్పందించలేదు. చివరకు చికిత్స పొందుతూ శకుంతల (94) ఆదివారం కన్నుమూశారు. ఆమెకు అంత్యక్రియలు నిర్వహిస్తామని అప్పటివరకు చెప్పిన కుటుంబసభ్యులు చివరి నిమిషంలో ముఖం చాటేశారు. దీంతో ఆశ్రమ నిర్వాహకుడు శేఖర్ అన్నీ తానై వృద్ధురాలి అంత్యక్రియలను కుటుంబసభ్యులు, బంధువుల మధ్య నిర్వహించి సేవాతత్పరతను చాటారు. -
చట్టాలపై అవగాహన అవసరం
చింతలపూడి: చింతలపూడి సబ్ జైలును ఆదివారం ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎస్.శ్రీదేవి సందర్శించారు. జైలులో ముద్దాయిలకు అందిస్తున్న ఆహారం, వసతి సదుపాయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఖైదీలకు చట్టాలపై అవగాహన కల్పించారు. హింసా మా ర్గాన్ని వీడాలని, సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. వంటశాల, స్టోర్ రూమును తనిఖీ చేసి ఆహారాన్ని పరిశీలించారు. సబ్జై లు ప్రాంగణంలోని ఉచిత న్యాయ సహాయ కేంద్రాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్త కార్యదర్శి కె.రత్నప్రసాద్, జూనియర్ సివిల్ జడ్జి సీహెచ్ మధుబాబు, సబ్ జైలు సూపరింటెండెంట్ కృపానందం, ప్యా నల్ లాయర్ టోకూరి వెంకటేష్, పీఎల్వీటీవీఎస్ రాజు, సీఐ క్రాంతికుమార్, ఎస్సై సతీష్కుమార్ ఉన్నారు. జిల్లాలో అమలుకాని విద్యాహక్కు చట్టం ఏలూరు (ఆర్ఆర్పేట): విద్యాహక్కు చట్టం ప్రైవేట్ పాఠశాలల్లో పక్కాగా అమలయ్యేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి ప్రకటనలో డిమాండ్ చేశారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాల్సి ఉండగా.. జిల్లాలో పూ ర్తిస్థాయిలో అమలైన దాఖలాలు లేవని పేర్కొన్నారు. కొన్ని పాఠశాలల్లో పిల్లలను చేర్పించుకుంటున్నా వివక్ష చూపుతున్నారని, తల్లిదండ్రుల నుంచి అనధికారికంగా రుసుములు వ సూలు చేస్తున్నారని తెలిపారు. ఫీజుల విషయంలో ఇబ్బందులు పెడుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయని, జిల్లా విద్యాశాఖాధికారులు సమగ్ర విచారణ జరపాలని రవి కోరారు. ‘జన సురక్ష’పై ప్రచారం ఏలూరు(మెట్రో): జన సురక్ష పథకాల ద్వారా సామాన్యులకు భద్రత కల్పిస్తున్నట్టు లీడ్ బ్యాంక్ మేనేజర్ డి.నీలాద్రి తెలిపారు. కలెక్టర్ కె.వెట్రిసెల్వి సహకారంతో ఏలూరు జిల్లావ్యాప్తంగా మూడు నెలల పాటు పథకాల నమోదు కార్యక్రమంపై ప్రచారం నిర్వహించనున్నామన్నారు. అటల్ పెన్షన్ యోజన ద్వారా 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.1,000 నుంచి రూ.5,000 వరకు పెన్షన్ లభిస్తుందన్నారు. పీఎం సురక్ష బీమా యోజనలో చేరితే రూ.2 లక్షల వరకూ ప్రమాద బీమా వర్తిస్తుందన్నారు. పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన కింద రూ.2 లక్షల బీమా కవరేజీ ఉంటుందన్నారు. బ్యాంకు మిత్ర ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను సులభంగా పొందే అవకాశం ఉందన్నారు. ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తామన్నారు. -
సాగు.. జాగు
ఈ ఫొటోను గమనించారా? పాలకోడేరు మండలం మోగల్లులోని రేలంగి చానల్ దుస్థితి. తణుకు రూరల్ మండపాక నుంచి అత్తిలి, ఇరగవరం మండలాల మీదుగా పాలకోడేరు మండలం మోగల్లు వరకు దాదాపు 27 కి.మీ పరిధిలో వేల ఎకరాల ఆయకట్టుకు ఈ రేలంగి చానల్ ద్వారా సాగునీరు అందుతుంది. ముందస్తు సాగు కోసం పశ్చిమ డెల్టాకు జూన్ 1నే సాగునీటిని విడుదల చేసినట్టు ప్రభుత్వం ప్రకటించగా ఇప్పటికీ శివార్లకు సాగు నీరందని దుస్థితికి ఈ చిత్రం అద్దం పడుతుంది. పూర్తిస్థాయిలో సాగు నీరందక కాలువ పరిధిలోని తొలకరి పనులకు ఆటంకం కలుగుతోంది. సాక్షి, భీమవరం : జిల్లాలో ఖరీఫ్ సాగు నత్తను తలపిస్తోంది. ధాన్యం బకాయిలు విడుదల కాకపోవడం, పంట పెట్టుబడులకు సర్కారు నుంచి సాయం కొరవడటం, శివారు భూములకు సాగునీరు అందకపోవడం తదితర కారణాలతో జూన్ ముగిసిపోతున్నా తొలకరి పనులు ఇంకా జోరందుకోలేదు. జిల్లాలో 2.08 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు జరుగనుండగా 50 శాతం విస్తీర్ణంలో ఎంటీయూ 1318 రకం, 25 శాతం విస్తీర్ణంలో ఎంటీయూ 7029 రకం, మిగిలిన విస్తీర్ణంలో ఎంటీయూ 1293, పీఎల్ఏ 1100 తదితర రకాలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా. నవంబరు చివరిలో వచ్చే తుపానుల బారిన పడకుండా ముందుగానే పంటను ఒబ్బిడి చేసుకునే దిశగా గతంలో జూలై 15లోగా నాట్లు పూర్తిచేసే లక్ష్యంతో పనులు వేగవంతం చేసేవారు. జూన్ నెలాఖరుకు నారుమడులు వేయడం చాలా వరకు పూర్తికావడంతో పాటు ముందుగా వరి కోతలు జరిగే తాడేపల్లిగూడెం ప్రాంతంలో నాట్లు జోరందుకునేవి. ఈ సీజన్లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. జూన్ నెల ముగిసిపోతున్నా ఇంకా పనులు ముమ్మరం కావడం లేదు. ఇప్పటివరకు 3,120 ఎకరాలకు సంబంధించి నారుమడులు వేయగా, 2,680 ఎకరాల్లో మా త్రమే నాట్లు పడ్డాయి. విడుదల కాని ధాన్యం సొమ్ములు ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే చెల్లింపులు చేస్తున్నట్టు కూటమి ప్రభుత్వం చెబుతుండగా నెల రోజులైనా సొమ్ములు చేతికందక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. రబీ సీజన్లో జిల్లాలో దాదాపు 77 వేల మంది రైతుల నుంచి రూ.1,650 కోట్ల విలువైన 7.17 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. వీటిలో రూ.1,360 కోట్లు రైతుల ఖాతాలకు జమచేయగా రూ.250 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. ధాన్యం విక్రయించి నెల రోజులు దాటినా ప్రభుత్వం నుంచి బకాయిలు రాలేదని రైతులు వాపోతున్నారు. తొలకరి పెట్టుబడుల కోసం చేతిలో సొమ్ముల్లేక అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. ఆదుకోని ‘అన్నదాత సుఖీభవ’ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తొలకరి ప్రారంభంలోనే రైతు భరోసాగా రూ.7,500 మొత్తాన్ని పెట్టుబడి సాయంగా అందించారు. విత్తనాలు, నారుమడుల తయారీ, ఎరువుల కొనుగోలుకు రైతులు అప్పులు చేయాల్సిన పని ఉండేది కాదు. తాము అధికారంలోకి వస్తే పెట్టుబడి సాయంగా ఏటా రూ.20 వేల చొప్పున అందిస్తామని హామీ ఇచ్చిన కూటమి నాయకులు మొదటి ఏడాది సాయానికి ఎగనామం పెట్టారు. ఈ ఏడాదీ సాయం విడుదలపై స్పష్టత లేదు. దీంతో రైతులు పంట పెట్టుబడులకు దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది. సాగునీరు.. అందని తీరు జిల్లాలో 11 ప్రధాన పంట కాలువల ద్వారా ఆయకట్టుకు సాగునీటి సరఫరా జరుగుతోంది. క్లోజర్లో భాగంగా సుమారు రూ.77 కోట్ల విలువైన 150 పనులతో అధికారులు ప్రతిపాదనలు పంపారు. వీటిలో కొన్నింటికి అనుమతులు రాగా సకాలంలో పనులు పూర్తికాకపోవడం తొలకరి పనులపై ప్రభావం చూపుతోంది. ముందస్తు కోసమంటూ జూన్ 1న కాలువలకు నీరు విడుదల చేస్తున్నట్టు ప్రకటించినా క్లోజర్ పనులు పూర్తికాకపోవడంతో ఇప్పటికీ పలుచోట్ల శివారు ప్రాంతాలకు సాగునీరు అందడం లేదు. కొన్ని ప్రాంతాల్లో తొలకరి వర్షాలపైనే సాగుకు సిద్ధమైన పరిస్థితులు ఉన్నాయి. ఖరీఫ్.. లేదు రిలీఫ్ జిల్లాలో నత్తనడకన తొలకరి పనులు జూన్ ముగుస్తున్నా జోరందుకోని నారుమడులు సర్కారు నుంచి కొరవడిన సహకారం సాగునీటి సరఫరాలో జాప్యం రూ.250 కోట్ల మేర ధాన్యం బకాయిలు జిల్లాలో 2.08 లక్షల ఎకరాల్లో సార్వా సాగు -
డీఎస్సీ పరీక్షకు 455 మంది హాజరు
ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరులో ఆదివారం జరిగిన డీఎస్సీ పరీక్షలకు 455 మంది అభ్యర్థులు హాజరయ్యారు. సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో ఉదయం 100 మందికి 83 మంది, మధ్యాహ్నం 101 మందికి 94 మంది హాజరయ్యారు. సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 115 మందికి 95 మంది, మధ్యాహ్నం 201 మందికి 183 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు. 94 శాతం హాజరు భీమవరం: జిల్లాలోని రెండు కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన మెగా డీఎస్సీ పరీక్షకు 94 శాతం అభ్యర్థులు హాజరయ్యారని డీఈఓ ఈ.నారాయణ తెలిపారు. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షకు 210 మందికి 199 మంది హాజరయ్యారన్నారు. ఎక్కడా మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని చెప్పారు. -
సిఫార్సులబదిలీలలు
ఏలూరు (ఆర్ఆర్పేట) : రాష్ట్రంలో బదిలీలు అంటేనే ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇటీవల కూటమి ప్రభుత్వం పలు శాఖల్లో బదిలీలకు కౌన్సెలింగ్లు నిర్వహించింది. అయితే ఎక్కడా సజావుగా సాగలేదు. ఆచరణ సాధ్యం కాని నిబంధనలతో ఉద్యోగులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి. తాజాగా గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న వె ల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ సెక్రటరీలు సైతం బ దిలీల కౌన్సెలింగ్ కేంద్రం వద్ద ధర్నా చేయడం ప్రభుత్వ విధానానికి అద్దం పడుతోంది. వీరి బదిలీల్లో ఎమ్మెల్యేలు పెత్తనం చేయాలని చూడటంతో ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. స్థానిక నాయకుల చెప్పుచేతల్లో పెట్టేలా.. గ్రామ సచివాలయాల్లో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ సెక్రటరీల బదిలీలకు సంబంధించి ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలకు ప్రాధాన్యమివ్వాలని అధికారులకు ప్రభుత్వ పెద్దలు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఎమ్మెల్యేలు సచివాలయ ఉద్యోగులు పనిచేసే ప్రాంతంలోని స్థానిక కూటమి నాయకుని సిఫార్సు ఉంటేనే లేఖలు ఇస్తున్నట్టు సమాచారం. స్థానిక నాయకుల సిఫార్సులు తీసుకుంటే ఆ తర్వాత తమ ఉద్యోగాలు ఆ స్థానిక నాయకుల వద్దే చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, దీని వల్ల అర్హులైన లబ్ధిదారులకు తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదముందని సెక్రటరీలు అంటున్నారు. అదీ కాక ఎంత మందికి స్థానిక నాయకులతో సత్సంబంధాలు ఉంటాయని, అర్హత ఉన్న ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ర్యాంకులు పట్టించుకోరా? నియమ నిబంధనలు కాదని బదిలీల్లో సిఫార్సులపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము సాధించిన ర్యాంకుల ఆధారంగా ఉద్యో గాలు ఎలా కేటాయించారో అలాగే బదిలీలు చేపట్టాలని, జాబితాలు సిద్ధం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే తాము ర్యాంకులు సాధించి ఏం ప్రయోజనమని వాపోతున్నారు. ప్రతిభను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు చేపట్టడానికి ప్రయత్నించడం దారుణమని ఆవేదన చెందుతున్నారు. సీనియార్టీ జాబితా లేకుండానే.. ఏ శాఖలో అయినా సీనియార్టీ జాబితా ప్రదర్శించి దాని ఆధారంగానే బదిలీలు చేస్తారని, అయితే సచివాలయ ఉద్యోగుల విషయంలో అలా ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. సీనియార్టీ జాబితా రూపొందించకుండా తమను మూడు ప్రాంతాలు కోరుకోమని, వాటిని ఫారంలో నింపి వెళ్లిపోవాలని సూచించడం నిబంధనలకు విరుద్ధమని మండిపడుతున్నారు. తాము కోరుకున్న మూడు ప్రాంతాలనే మరో పది మంది కోరుకుంటే తమకు ఎక్కడి స్థానాలు కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నారు. అలాగే బదిలీల్లో ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, స్పౌజ్ కేటగిరీల్లో కూడా జాబితా రూపొందించకుండా తమతో ఫారాలు నింపించుకుని ఇష్టానుసారంగా బదిలీలు చేస్తే తమ కుటుంబాల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. సచివాలయ ఉద్యోగుల గగ్గోలు బదిలీల్లో ఎమ్మెల్యేల పెత్తనం స్థానిక నాయకుల సిఫార్సుల మేరకే లేఖలు కూటమి నేతల చుట్టూ ఉద్యోగుల ప్రదక్షిణలు ర్యాంకుల ఆధారంగా బదిలీలు చేపట్టాలని డిమాండ్ సీనియార్టీ జాబితా లేకపోవడంపై ఆగ్రహం పారదర్శకంగా చేపట్టాలి గ్రామ సచివాలయ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ల బదిలీలు పారదర్శకంగా నిర్వహించాలి. ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలకు ప్రాధాన్యమిస్తే అర్హులు నష్టపోతారు. బదిలీలకు సీనియార్టీ జాబితా తయారు చేయకుండా అధికారులు ఇష్టమొచ్చిన చోటుకు బదిలీ చేస్తామనడం నిబంధనలకు విరుద్ధం. సొంత మండలాల్లోకి బదిలీలు చేయమనే నిబంధన అమలు చేస్తున్నప్పుడు ఇతర నిబంధనలు కూడా అమలు చేయాలి. – కె.అజయ్బాబు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్గదర్శకాలు మర్చిపోయారు ప్రభుత్వం బదిలీలపై జీఓ ఇచ్చి మార్గదర్శకాలు మర్చిపోయింది. గత 30, 40 ఏళ్లలో ఇలాంటి బదిలీలు చూడలేదు. ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లో బదిలీలు ముగిసినట్టు ప్రచారం జరుగుతుండటం సెక్రటరీలను కలవరపెడుతోంది. ఎమ్మెల్యేల లేఖలకే ప్రాధానమిస్తే ఇక బదిలీలకు కౌన్సెలింగ్ ఎందుకు. లేఖలు పొందిన వారు మినహా మిగిలిన వారంతా ఆందోళనలో ఉన్నారు. – ఈ.నరేష్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ సెక్రటరీవిధులకు దూరం.. ప్రదక్షిణల పర్వం సచివాలయాల వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ సెక్రటరీలు స్థానిక కూటమి నాయకుల ఇళ్ల వద్ద ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ క్రమంలో వారి విధులకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొందరు ఉద్యోగులకు స్థానిక నాయకులతో నేరుగా సంబంధాలు ఉండటంతో వారు తొలి ప్రాధానత్యగా ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు అందుకున్నారు. మరికొందరు స్థానిక నాయకులతో బంధుత్వమో, స్నేహమో ఉన్న వారిని వెంటబెట్టుకుని వారి చుట్టూ తిరిగి ఇప్పటికే ఎమ్మెల్యేల లేఖలను సంపాదించి సాంఘిక సంక్షేమ అధికారులకు పంపినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే 19 మంది అభ్యర్థులతో కూడిన సిఫార్సు లేఖను జిల్లా పంచాయతీ అధికారికి పంపినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
మున్సిపల్ కార్మికుల సమ్మె ఉధృతం
నరసాపురం/తణుకు అర్బన్/తాడేపల్లిగూడెం (టీఓసీ): మున్సిపల్ ఇంజనీరింగ్ సెక్షన్లో అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న కార్మికులు సమ్మెను ఉధృతం చేశారు. ఆదివారం నుంచి వీధి దీపాల నిర్వహణ, మంచినీటి సరఫరా పనులను సైతం బహిష్కరించారు. తమ సమస్యలపై ప్రభు త్వం సానుకూలంగా స్పందించే వరకూ ఆందోళన విరమించేది లేదని హెచ్చరించారు. నరసాపురం మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న తమకు న్యాయం చేయడంలో ప్రభు త్వం తాత్సారం చేయడం దారుణమన్నారు. కోటిపల్లి కాశీ, ఎం.రత్నం, సీహెచ్ సత్యనారాయణ, ఫణి నాయకత్వం వహించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి తణుకు అర్బన్: తణుకులో కార్మికుల దీక్షలు కొనసాగుతున్నాయి. ఆదివారం శిబిరంలో జేఏసీ అధ్యక్షుడు ఉండ్రాజవరపు శ్రీను, కార్యదర్శి గెల్లా విజయ్కుమార్ మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనాలు చెల్లించే విధానం అమల్లోకి రావాలని కోరారు. 25 ఏళ్లకు పైబడి విధుల్లో ఉంటున్నా రూ. 13 వేల వేతనాలే అమల్లో ఉండటం బాధాకరమన్నారు. నాయకులు దాసరి సత్యనారాయణ, రాపాక సురేష్, ప్రసాద్, రాపాక రవి తదితరులు పాల్గొన్నారు. గూడెంలో ఏడో రోజుకు చేరిన దీక్షలు తాడేపల్లిగూడెం (టీఓసీ): తాడేపల్లిగూడెంలో కా ర్మికుల దీక్షలు ఆదివారం ఏడో రోజూ కొనసాగా యి. జేఏసీ నాయకులు మర్రిపూడి సతీష్ కుమార్, అవిడి కుమార్, ఎర్రంశెట్టి నాగేశ్వరరావు, బండారు శ్రీను, అడ్డాల చలపతి, ప్రత్తి రమేష్ మాట్లాడుతూ తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకుంటే సమ్మె మరింత ఉధృతం చేస్తామని అన్నారు. -
టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి చేరిక
నూజివీడు: కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేసి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నూజివీడు నియోజకవర్గ ఇన్చార్జ్ మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ధ్వజమెత్తారు. మండలంలోని సుంకొల్లులో ఆదివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో టీడీపీ నుంచి 10 కుటుంబాలు వైఎస్సార్సీపీలో ప్రతాప్ అప్పారావు సమక్షంలో చేరాయి. వారికి ప్రతాప్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. గ్రామానికి చెందిన కొనకాల సీతారామయ్య, కొనకాల అజయ్, బుడిపూడి శ్రీనివాసరావు, బుడిపూడి శ్రీరాములు, పలగాని జమలయ్య, కొనకాల రమేష్, కొనకాల రామకోటేశ్వరరావు, వలిపి గోపి, లంకా పెదబాబు, గుడివాడ ఏసు లు వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తల్లికి వందనం అమలు చేశానని చెప్తున్నప్పటికీ వాస్తవంగా తూతూ మంత్రంగా అమలు చేసిందని విమర్శించారు. ఒకటో తరగతి విద్యార్థులు, పదో తరగతి పూర్తయిన విద్యార్థులకు, ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తయిన విద్యార్థులకు ఇవ్వకుండా ఎగ్గొట్టిందన్నారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈనెల 20న అమలు చేస్తున్నామని, రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తున్నామని చెప్పిన ప్రభుత్వం ఇంత వరకు అమలు చేయలేదన్నారు. కౌలు రైతులకు ఈ పథకం లేదని చెబుతూ ప్రభుత్వం కోతలు పెడుతోందన్నారు. తాము అధికారంలోకి వస్తే వలంటీర్లకు రూ.10 వేలు జీతం ఇస్తానని చెప్పి, తీరా అధికారంలోకి వచ్చాక వారిని తొలగించారన్నారు. ఇంటింటికి రేషన్ సరుకులను అందిస్తున్న రేషన్ వాహనాలను ప్రభుత్వం తొలగించి ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టిందన్నారు. కొన్ని చోట్ల మూడు, నాలుగు కిలోమీటర్లు వెళ్లి రేషన్ సరుకులు తెచ్చుకోవాల్సి వస్తోందన్నారు. మహిళలకు నెలకు రూ.1500, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు ఎక్కడని, మహిళలకు ఉచిత బస్సు ఎప్పుడని ప్రతాప్ నిలదీశారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు క్యాలండర్ను ప్రకటించి దాని ప్రకారం చెప్పిన తేదీకి పథకాన్ని అమలు చేశారన్నారు. ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాం గాని ప్రజలను ఇంత దారుణంగా మోసం చేసే ముఖ్యమంత్రిని ఎన్నడూ చూడలేదన్నారు. రాష్ట్రంలో ఈరోజు ఎన్నికలు నిర్వహిస్తే కూటమి పార్టీలను రాష్ట్ర ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించడం ఖాయమన్నారు. మట్టిని, ఇసుకను దోచేస్తున్నారన్నారు. తాను ఓడినా, గెలిచినా నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. కార్యక్రమానికి ప్రతాప్ అప్పారావును బైక్ ర్యాలీతో గ్రామంలోకి తీసుకెళ్ళారు. కార్యక్రమంలో సర్పంచి దుడ్డు నాగమల్లేశ్వరరావు, జడ్పీ వైస్ చైర్మన్ గుడిమళ్ల కృష్ణంరాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ కొమ్ము వెంకటేశ్వరరావు, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షులు శీలం రాము, నాయకులు గబ్బర్, బసవా వినయ్, కంచర్ల లవకుమార్, బసవా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు -
విద్యార్థుల సంఖ్య పెరిగేందుకు గడువు అవసరం
ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రంలో నూతన పాఠశాలల వ్యవస్థలో భాగంగా ఏర్పాటు చేసిన మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచుకోవడానికి వచ్చే ఏడాది వరకూ గడువు ఇవ్వాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు పువ్వుల ఆంజనేయులు ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. నూతన పాఠశాలల వ్యవస్థలో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు చొప్పన నియమిస్తూ మోడల్ ప్రైమరీ పాఠశాలలను ఏర్పాటు చేశారని, ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 60 కంటే ఎక్కువ ఉండాలని నిబంధన విధించారన్నారు. వేసవి సెలవుల్లోనే ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించుకున్నారని, బదిలీలు అనంతరం కొత్తగా వెళ్ళిన ఉపాధ్యాయులకు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్చుకోవడానికి పిల్లలు లేరన్నారు. ఇప్పుడిప్పడే ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు నియమించారన్న విషయాలను గ్రామ పెద్దలకు, గ్రామస్తులకు, తల్లిదండ్రులకు తెలియజేసి, ప్రైవేటు పాఠశాలల నుంచి తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని, అందువల్ల మోడల్ ప్రైమరీ స్కూల్లో 60 పైబడి ఉండాలన్న నిబంధన/లక్ష్యం వచ్చే విద్యాసంవత్సం వరకు పొడించాలన్నారు. ఉపాధ్యాయులు కొత్తగా ఆయా పాఠశాలల్లో ఈ నెల 16న జాయిన్ అయ్యారని, అంటే వారు చేరి కేవలం పదమూడు రోజులు మాత్రమే అయ్యిందని, ఇంతలోనే పని సర్దుబాటు ద్వారా ఇప్పటి విద్యార్థుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయులను ఉంచుతామన్న విధానం సరైంది కాదన్నారు. శ్రీవారి నిత్యాన్నదాన పథకానికి విరాళాలు ద్వారకాతిరుమల: శ్రీవారి నిత్యాన్నదాన పథకానికి ముగ్గురు భక్తులు వేరువేరుగా ఆదివారం రూ. 3,11,351 విరాళంగా అందజేశారు. అందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంనకు చెందిన దండుబోయిన వీరవెంకట సర్వేశ్వరరావు రూ.1,00,116, ఖమ్మం జిల్లా సత్యన్నారాయణపురంనకు చెందిన చాపలమడుగు దానేశ్వరరావు రూ.1,00,116, ఏలూరుకు చెందిన మారుశీళ్ల కృష్ణారావు రూ.1,11,119 ఆలయ కార్యాలయంలో జమ చేశారు. ఈ సందర్భంగా దాతలకు ఆలయ ఏఈఓ పి.నటరాజారావు, సూపరింటెండెంట్ హయగ్రీవాచార్యులు విరాళం బాండ్ పత్రాలను అందించారు. అనంతరం దాత కుటుంబాలకు స్వామివారి ప్రత్యేక దర్శన సౌకర్యాన్ని కల్పించారు. గుంతల రోడ్డుపై వరి నాట్లు కలిదిండి(కై కలూరు): గుంతల రహదారికి మరమ్మత్తులు చేయాలంటూ సీపీఎం నాయకులు వినూత్నంగా నిరసన తెలిపారు. కలిదిండి మండలం మూలలంక నుంచి పెదలంక రోడ్డును వెంటనే నిర్మించాలంటూ ఆదివారం పెదలంక వరి నాట్లు వేశారు. సీపీఎం కలిదిండి ప్రాంతీయ కార్యదర్శి శేషపు మహంకాళిరావు మాట్లాడుతూ పాడైపోయిన రోడ్లు మొత్తం బాగు చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందన్నారు. మూలలంక– పెదలంక రోడ్డు గుంతల మయంగా మారి అత్యంత ప్రమాదకరంగా ఉందన్నారు. -
వరాహావతారంలో జగన్నాథుడు
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్ర దత్తత దేవాలయమైన లక్ష్మీపురంలోని శ్రీ సంతాన వేణుగోపాల జగన్నాథ, వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం జగన్నాథుడు శ్రీ వరాహావతారంలో సాక్షాత్కరించారు. జగన్నాథ రథయాత్ర ఉత్సవాల్లో భాగంగా స్వామివారు రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అందులో భాగంగా శంకు చక్రాలను ధరించి, అమ్మవార్లతో ఆశీనులై ఉన్న స్వామివారి అలంకారం భక్తులకు కనువిందు చేసింది. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. పెద్దింట్లమ్మా.. చల్లంగా చూడమ్మా కై కలూరు: పెద్దింట్లమ్మా.. నీ ఆశీస్పులు అందించమ్మా అంటూ భక్తులు అమ్మవారిని ఆర్తీతో వేడుకున్నారు. కొల్లేటికోట పెద్దింట్లమ్మను సమీప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆదివారం దర్శించుకున్నారు. పవిత్ర కోనేరులో స్నానాలు చేసి వేడి నైవేద్యాలు సమర్పించారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఒక్క ఆదివారం ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డు ప్రసాదం, గదుల అద్దెలు, అమ్మవారి చిత్రపటాలు, వాహన పూజలు, విరాళాల ద్వారా రూ.68,010 ఆదాయం వచ్చిందని తెలిపారు. జూదరుల అరెస్టు దెందులూరు: దెందులూరులో పేకాట రాయుళ్లపై పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి దెందులూరు ఎస్సై ఆర్.శివాజీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి దెందులూరు యందంవారి వీధి డంపింగ్ యార్డ్ వద్ద పేకాడుతున్న ఆరుగురిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.6100 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు. -
ప్రమాదాలకు ఎదురెళ్లి..
తాడేపల్లిగూడెం రూరల్: వాహనదారులు తమ ప్రాణాలు పణంగా పెట్టి రైల్వే లెవల్ క్రాసింగ్లు దాటుతున్నారు. తాడేపల్లిగూడెం మండలంలో ప్రత్తిపాడు, మారంపల్లి, నవాబుపాలెం వద్ద రైల్వే లెవల్ క్రాసింగ్లున్నాయి. రైలు రాకపోకలను గుర్తించిన వెంటనే సంబంధిత సిబ్బంది లెవల్ క్రాసింగ్ల వద్ద ముందస్తుగానే గేట్లను మూసివేస్తుంటారు. కొందరు వాహనదారులు మాత్రం అడ్డదిడ్డంగా రాకపోకలు సాగిస్తున్నారు. గేటు వేసినా గేటు కింద నుంచి క్రాసింగ్లను దాటుతున్నారు. ఈ క్రమంలోనే రైల్వే లెవల్ క్రాసింగ్లను దాటుతున్న సమయంలో రెప్పపాటులో ప్రమాదాలు తప్పించుకున్న సంఘటనలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. -
నష్టాల ఊబిలో రొయ్య రైతు
గణపవరం: ఆక్వా రైతులను ప్రతికూల వాతావరణం ఇంకా వెంటాడుతోంది. దీంతో వేల ఎకరాలలో సాగులో ఉన్న రొయ్యలు వ్యాధుల బారిన పడుతున్నాయి. ఈ నెలారంభం నుంచి ప్రతికూల వాతావరణ ప్రభావంతో రొయ్యలకు వైట్స్పాట్ (తెల్ల మచ్చ) వ్యాధితో పాటు ఈహెచ్పీ వ్యాధి కూడా తోడవడంతో రొయ్యలు మృత్యువాత పడ్డాయి. కొద్దిరోజులుగా ఉష్ణోగ్రతల్లో భారీ హెచ్చుతగ్గుల వల్ల రైతులు నష్టపోతున్నారు. ఈ ఏడాది ఆరంభం నుంచి రొయ్యసాగు అంతంత మాత్రంగానే ఉంది. గత జనవరిలో చెరువులలో సీడ్ వేసిన రైతుల్లో 80 శాతం కౌంట్కు రాకుండానే పట్టేశారు. దీంతో రైతులు నష్టాల పాలయ్యారు. మే, జూన్ నెలల్లో ప్రతికూల వాతావరణం ఈ వేసవిలో రైతుల అంచనాలు తారుమారయ్యాయి. మే నెలలోనే వర్షాలు కురిసి వాతావరణం చల్లబడిపోయింది. దీనితో రొయ్యలకు రకరకాల వైరస్లు సోకడంతో అర్ధాంతరంగా పట్టేసి అయినకాడికి అమ్ముకున్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలో సుమారు పదివేల ఎకరాలలో రొయ్య సాగు చేయగా సుమారు 8వేల ఎకరాలలో కనీసం 100 కౌంట్కు రాకుండానే పట్టేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆక్వాను ఆదుకుంటామని ఊదరగొట్టారు. రొయ్యలకు కనీస ధరలు ప్రకటించింది. మేతల ధరలు కూడా తగ్గిస్తున్నట్లు హంగామా చేశారు. ఇవేవీ రొయ్య రైతులకు అక్కరకు రాలేదు. ప్రభుత్వం ప్రకటించిన ధరకు వ్యాపారులు కొనుగోలు చేసిన దాఖలా లేదు. గత్యంతరం లేక అడిగిన ధరకే అమ్ముకోక తప్పని పరిస్థితి. 100 కౌంట్ రొయ్య రూ.220కు కొనాల్సి ఉన్నా రూ.200 లోపే కొనుగోలు చేస్తున్నారు. అన్ని రకాల కౌంట్ ధరలోనూ రూ.50 నుంచి రూ.70 వరకూ తగ్గించేశారు. వైరస్ విజృంభణతో రైతు కుదేలు ఈ ఏడాది వ్యాధులు విజృభించి ఆక్వా సాగును కుదేలు చేశాయి. ఏదైనా ఆయకట్టులో ఒక చెరువుకు వైరస్ వస్తే క్షణాల్లో ఆయకట్టులో మొత్తం చెరువులకు వ్యాపిస్తుంది. తక్షణం పట్టుబడి చేయకపోతే వ్యాధి సోకిన రొయ్యతోపాటు ఆరోగ్యంగా ఉన్న రొయ్యలూ దక్కకుండా పోతాయి. దీంతో రైతులంతా రొయ్యలు పట్టేసి అడిగిన ధరకు అమ్ముకున్నారు. గత పది రోజుల్లో గణపవరం, నిడమర్రు మండలాలలో వందల ఎకరాలలో చెరువులు ఖాళీ అయ్యాయి. వ్యాధులకు తోడు ఎడాపెడా విద్యుత్ కోతల కారణంగా ఏరియేటర్లు తిప్పడానికి రైతులు ఇబ్బంది పడుతున్నారు. వ్యాధుల విజృంభణతో అర్ధాంతరంగా పట్టేస్తున్న రైతులు వ్యాపారులు సిండికేటు మారి గిట్టుబాటు ధర ఇవ్వని వైనం ప్రభుత్వం ఆదుకోవాలి రెండేళ్లుగా రొయ్యల సాగు రైతులను కుదేలు చేస్తుంది. నాణ్యత లేని సీడ్, వ్యాధుల వ్యాప్తితో ఆక్వా రైతులు నష్టాల పాలవుతున్నారు. ప్రభుత్వం హడావుడిగా రొయ్యలకు ధర నిర్ణయించినా తర్వాత పట్టించుకోకపోవడంతో వ్యాపారులు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొనడంలేదు. ఒక పక్క లీజులు, నిర్వహణ ఖర్చులు, విద్యుత్ బిల్లులు, డీజిల్ వినియోగం విపరీతంగా పెరిగిపోయాయి. ఒకవేళ పంట బాగుంటే వ్యాపారులు సిండికేట్గా తయారై రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వడంలేదు. సంకు నాని, రొయ్య రైతు నాణ్యమైన సీడ్ వేయాలి ప్రస్తుత వాతావరణంలో వైరస్ వ్యాధులు తీవ్రంగా వ్యాప్తి చెందుతున్నాయి. రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రొయ్య సాగు ఆరంభంలోనే సర్టిఫైడ్ హేచరీస్ నుంచి నాణ్యమైన సీడ్ తెచ్చుకోవాలి. వైట్స్పాట్, ఈహెచ్పీ పరీక్షలు చేయించుకున్నాకే సీడ్ తీసుకోవాలి. సక్రమ యాజమాన్య పద్ధతులతో కొంతవరకూ వ్యాధులు రాకుండా చూడవచ్చు. వైట్స్పాట్ వస్తే ఇమ్యూనిటీ పెంచడానికి విటమిన్ సీ, ప్రోబయోటిక్స్ వాడాలి. ఈహెచ్పీ వస్తే వెంటనే పట్టుబడి చేసుకోవాలి. – శివరామకృష్ణ, ఎఫ్డీవో, గణపవరం -
అప్పులు తప్ప హామీల అమలేదీ?
భీమవరం: కూటమి ఏడాది పాలనలో అభివృద్ధి శూన్యమని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. భీమవరంలో ఆదివారం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ జిల్లా సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ఏడాది పాలనలో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. రాష్ట్రంలో ఉన్నది డబుల్ ఇంజిన్ కాదని, ట్రబుల్ ఇంజిన్ అని విమర్శించారు. చంద్రబాబు సూపర్ సిక్స్ పేరుతో పాలనను సూపర్ ఫ్లాప్ చేశారని, ప్రజలకు గ్యాస్ సిలిండర్ ఒక్కటిచ్చి పథకాలన్నీ అమలు చేశామని చెబుతున్నారని దుయ్యబట్టారు. తల్లికి వందనం పథకం కింద 20 లక్షల మంది పిల్లలను మోసం చేశారని మండిపడ్డారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని అన్నదాత దుఃఖీభవ చేశారని విమర్శించారు. ప్రజలకు ఈ ఏడాది కాలంలోనే రూ.1.50 లక్షల కోట్ల అప్పులు మిగిల్చారన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ఇన్చార్జి పాలక్ వర్మ, జిల్లా అధ్యక్షుడు పాతపాటి హరికుమారరాజు, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. -
సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): జూలై 9న జరగనున్న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ ఏలూరు ఏరియా అధ్యక్షుడు కే.కృష్ణమాచార్యులు, జిల్లా అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ డాంగే, జిల్లా ఉపాధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం స్థానిక స్ఫూర్తి భవనంలో ఏఐటీయూసీ ఏలూరు ఏరియా సమితి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ గత మే 20న జరగాల్సిన దేశవ్యాప్త సమ్మె యుద్ధ వాతావరణం వల్ల వాయిదా పడిందని గుర్తు చేశారు. తిరిగి జూలై 9న జరుగుతుందని తెలిపారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్వం నుంచి కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను తుంగలో తొక్కి 4 లేబర్ కోడ్లుగా మార్చిందన్నారు. కార్మిక సంఘం పెట్టుకునే హక్కు నుంచి, వేతన ఒప్పందాల వరకు యజమానులకు అనుకూలంగా, కార్మికులకు కఠినతరంగా లేబర్ కోడ్లు ఉన్నాయని విమర్శించారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యావత్తు కార్మిక వర్గం సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్మిక సమస్యలే కాకుండా రైతు, వ్యవసాయ కార్మిక, ప్రజా సమస్యలపై జరుగుతున్న ఈ సమ్మెలో రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో ఏఐటీయూసీ ఏలూరు ఏరియా కార్యదర్శి ఏ.అప్పలరాజు, జిల్లా కోశాధికారి పుప్పాల కన్నబాబు, జిల్లా నాయకులు పి.కిషోర్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి భజంత్రీ శ్రీనివాస్ మాట్లాడారు. సమావేశంలో ఏరియా నాయకులు బరగడ పోతురాజు, ఎలగాడ శివకుమార్ , పుప్పాల శ్రీనివాస్, బోడెం వెంకట్రావు, వీ. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
గళమెత్తిన పంచాయతీ కార్యదర్శులు
ఏలూరు (టూటౌన్): తమ సమస్యలను పరిష్కరించాలంటూ గ్రామ పంచాయతీ కార్యదర్శులు శనివారం ఆందోళనకు దిగారు. జిల్లావ్యాప్తంగా పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులు పెద్ద సంఖ్యలో ఏలూరు తరలివచ్చి ఫైర్స్టేషన్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. అనంతరం అక్కడ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేశారు. ధర్నా చేసి కలెక్టర్, డీపీఓకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులకు గ్రామ సచివాలయ సిబ్బందికి మధ్య విధుల్లో సమన్వయం కుదరడం లేదని, సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యాలకు తాము బలి అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నిసార్లు సచివాలయ సిబ్బంది తమకు అందుబాటులో ఉండటం లేదన్నారు. ఉన్నతాధికారులు తమను బాధ్యులను చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ధర్నాలో సుమారు 200 మంది పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. చింతలపూడి మండలంలో మూకుమ్మడి సెలవు చింతలపూడి: ఏలూరులో నిరసన, కలెక్టర్కు వినతిపత్రం సమర్పణ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శనివారం మండలంలోని పంచాయతీ కార్యదర్శులు మూకుమ్మడిగా సెలవు కావాలంటూ ఎంపీడీఓ మురళీకృష్ణకు వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర సంఘ పిలుపు మేరకు మూకుమ్మడి సెలవు పెట్టామన్నారు. రోజూ ఉదయం 6 గంటలకే విధులకు హాజరై ఫొటో దిగి పంచాయతీ పోర్టల్లో అప్లోడ్ చేయాలంటూ మౌకికంగా ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. -
అంతా మా ఇష్టం
● వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో అధికారుల పెత్తనం ● ఉద్యోగులతో ఆప్షన్ ఫారాలపై సంతకాలు ● పీహెచ్ ఉద్యోగుల విన్నపాలు బుట్టదాఖలు తాడేపల్లిగూడెం: వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల వ్యవహారంలో అధికారుల పెత్తనాన్ని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఒకే చోట ఐదేళ్లు పనిచేసిన వారిని కచ్చితంగా బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రాతిపదికన మున్సిపాలిటీలు, ఏలూరు కార్పొరేషన్లో బదిలీల ప్రక్రియకు ఐచ్ఛికాలను ఇవ్వడానికి ఈనెల 28న ఏలూరులోని ప్రక్రియ ఇన్చార్జి వద్దకు ఉద్యోగులు నేరుగా హాజరు కావాలనేది ఉత్తర్వుల సారాంశం. రాష్ట్రవ్యాప్తంగా శనివారం బదిలీల ప్రక్రియ చేపట్టగా ఆయా జిల్లాల ప్రక్రియ ఇన్చార్జి వద్దకు ఉద్యోగులు నే రుగా హాజరయ్యారు. అయితే ఇందుకు భిన్నంగా జిల్లాలో బదిలీ ల ప్రక్రియ నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది. ఉద్యోగులు నేరుగా హాజరై ఆప్షన్లు ఇవ్వాల్సి ఉండగా ఇక్కడ మాత్రం బదిలీల ఐచ్ఛిక పత్రాలపై ఉద్యోగుల సంతకాలు తీసుకుని ఇన్చార్జి అధికారికి ఆయా మున్సిపల్ కమిషనర్లు సమర్పించారు. కమిషనర్లకు బాధ్యతలు ఉమ్మడి జిల్లాలో నరసాపురం, పాలకొల్లు, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం ము న్సిపాలిటీలు, ఏలూరు కార్పొరేషన్ పరిధిలో బదిలీల ప్రక్రియను పర్యవేక్షించే బాధ్యతను మున్సిపల్ కమిషనర్లకు ప్రభుత్వం అప్పగించింది. వార్డు సచివాలయంలో ఉండే ప్లానింగ్ సెక్రటరీ, ఎమినిటీస్ సెక్రటరీ, అడ్డిన్, వార్డు ప్లానింగ్ రెగ్యులేషన్ కార్యదర్శి, ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి, వెల్ఫేర్ సెక్రటరీ, శానిటేషన్ సెక్రటరీలను బదిలీ చేయాల్సి ఉంది. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్లకు బాధ్యతలు అప్పగించారు. భీమవరం కమిషనర్కు వెల్ఫేర్ సెక్రటరీలు, తణుకు కమిషనర్కు అడ్మిన్ సెక్రటరీలు, నిడదవోలు కమిషనర్కు డేటా ప్రాసెసింగ్ కార్యదర్శులు, పాలకొల్లు కమిషనర్కు శానిటేషన్ కార్యదర్శి బదిలీల ప్రక్రియను అప్పగించి, మిగిలిన కార్యదర్శుల బదిలీల ప్రక్రియను ఏలూరులోని ఇన్చార్జి అధికారి చూస్తున్నారు. సీనియార్టీ, మెరిట్, ఫిజికల్లీ ఛాలెండ్జ్ ప్రాతిపదికన జాబితాలు తయారు చేసి అధికారులకు నివేదించడంతో పాటు, ఆప్షన్ల కోసం అభ్యర్థులు నేరుగా హాజరు కావాల్సి ఉంది. అంతా తూచ్ అభ్యర్థులు నేరుగా ఏలూరులోని ప్రక్రియ ఇన్చార్జి వద్దకు హాజరుకాకుండానే మున్సిపల్ కమిషనర్లు తమతో ఆప్షన్ ఫారాలపై సంతకాలు చేయించి జాబితాలను ఏలూరు పంపించినట్టు ఉద్యోగులు చెబుతున్నారు. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉద్యోగుల అభ్యర్థలను బుట్టదాఖలు చేశారని అంటున్నారు. ప్రస్తుత మున్సిపాలిటీలో పనిచేయాలంటే మూడు ఆప్షన్లను ఎంచుకోవాలని, మిగిలిన విషయాలు పర్యవేక్షక అధికారులు చూసుకుంటారని ఉన్నతాధికారులు చెప్పినట్టు సమాచారం. ఆప్షన్ ఫారమ్స్ ఇవ్వని ఉద్యోగులకు వారి ఆప్షన్లతో సంబంధం లేకుండా బదిలీ చేస్తారని అధికారులు స్పష్టం చేశారు. పొలిటికల్ రిఫరెన్స్ లేఖలు, మెడికల్ సర్టిఫికెట్లు, స్పౌజ్ సర్టిఫికెట్లను ఆప్షన్ ఫామ్స్కు జత చేసి ఇవ్వాలని ఆదేశించారు. -
పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం
ఏలూరులోని తమ్మిలేరులో దిగి ఓ మహిళ తన ముగ్గురు చిన్నారులతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా స్థానికులు రక్షించారు. 8లో uగిరిజన ఆర్ఎస్కేఐల ధర్నా ఏలూరు (ఆర్ఆర్పేట): గిరిజన ప్రాంతాల్లోపని చేసే విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్లు, విలేజ్ హార్టీ కల్చర్ అసిస్టెంట్ల (రైతు సేవా కేంద్రం ఇన్చార్జ్లు) (ఆర్ఎస్కేఐ)ను గిరిజన ప్రాంతాల్లోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలోని కేఆర్పురంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఏలూరులోని జిల్లా వ్యవసాయ శాఖాధికారి కార్యాలయం వద్ద శనివారం రాత్రి 10 గంటల నుంచి ధర్నాకు దిగారు. దీనిపై జిల్లా వ్యవసాయ అధికారి ఎస్కే హబీబ్ బాషా వివరణ కోరగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో 461 రైతు సవా కేంద్రాలు ఉండగా, ఏలూరు జిల్లా పరిధిలో 172 అగ్రికల్చరల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయని, రేషనలైజేషన్ ప్రకారం వాటిలో 140 ఏలూరు జిల్లాకు, మిగిలిన 32 పోస్టులు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు వెళ్లాయన్నారు. ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి తప్పనిసరి బదిలీలు నిర్వహించాల్సి ఉన్నందున నిబంధనల మేరకే బదిలీల కౌన్సెలింగ్ తలపెట్టామని వివరణ ఇచ్చారు. -
ఉద్యోగం ఒకచోట.. పెత్తనం మరోచోట
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఆయన జిల్లాస్థాయి అధికారి.. సర్వీసులో ఎక్కువ కాలం ఒక్క పోస్టింగ్తో పాటు మరో రెండు ఇన్చార్జులు తీసుకోవడం ఆయనకున్న అలవాటు.. అయితే పదవులన్నీ ఏలూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చుట్టూనే తిరుగుతుంటాయి.. అలా అని ఆయన ఆ బ్యాంకులో పనిచేసే అధికారి కాదు.. కాని ఏలూరు జిల్లా సహకార శాఖలో మాత్రం ఎప్పుడూ కీలక బాధ్యతల్లోనే ఉంటారు. మూడు రోజుల క్రితం డీసీసీబీ బ్యాంకులో జరిగిన మహాజన సభతో సంబంధం లేకపోయినా హాజరై ప్రసంగించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. సంబంధం లేకపోయినా.. ఏలూరు జిల్లా కో–ఆపరేటివ్ ఆడిట్ అధికారిగా ఉన్న ఆరిమిల్లి శ్రీనివాస్ను ఈనెల 9న బదిలీల్లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా డివిజనల్ కో–ఆపరేటివ్ అధికారిగా నియమించారు. ఇప్పటికే ఆయన విజయవాడలో హౌస్ఫెడ్లో సేల్స్ ఆఫీసర్ గా ఇన్చార్జి హోదాలో చాలా కాలం నుంచి కొనసాగుతున్నారు. గతంలో జిల్లాలో అసిస్టెంట్ రిజిస్ట్రార్గా, ఆడిట్ ఆఫీసర్గా, డిప్యూటీ రిజిస్ట్రార్గా ఏళ్ల తరబడి పనిచేశారు. ఇటీవల భీమవరం బదిలీ అయ్యారు. గతేడాది అప్పటి జిల్లా సహకారశాఖ అధికారి పదవీ విరమణ అయితే ఏడాది కాలం ఇన్చార్జిగా శ్రీనివాసే పనిచేశారు. జిల్లా సహకార శాఖకు, డీసీసీబీకి ఎటువంటి సంబంధం ఉండదు. అయినా జిల్లా సహకార శాఖ అధికారి హోదాలో బ్యాంకులోనూ ఆయన హవానే కొనసాగుతోంది. అవినీతి ఆరోపణలు ప్రస్తుతం భీమవరంలో పనిచేస్తున్నా మళ్లీ ఏలూరు జిల్లా అధికారిగా ఇన్చార్జి బాధ్యతలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ పరిణామాల క్రమంలో ఈనెల 27న ఆప్కాబ్ రాష్ట్ర చైర్మన్ గన్ని వీరాంజనేయులు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో మొదటి మహాజన సభ నిర్వహించారు. వాస్తవానికి సమావేశానికి జిల్లా కో–ఆపరేటివ్ అధికారి, డిప్యూటీ రిజిస్ట్రార్, ఇతర కో–ఆపరేటివ్ సిబ్బందికి ఆహ్వానం కాని, హాజరుకావాల్సిన అవసరం కాని ఉండదు. గతంలో ప్రభుత్వ షేర్ బ్యాంకులో ఉన్న క్రమంలో ప్రతి మహాజన సభకు జిల్లా కో–ఆపరేటివ్ అధికారి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యేవారు. ప్రభుత్వం దానిని ఉపసంహరించుకోవడంతో బ్యాంకు వ్యవహారంలో సహకార శాఖ పాత్ర ఉండటం లేదు. అయినా భీమవరం డివిజనల్ కో– ఆపరేటివ్ అధికారి మాత్రం ప్రత్యేక శ్రద్ధతో బ్యాంకులో మహాసభకు హాజరుకావడంతో పాటు సమావేశాన్ని పూర్తిగా నిర్వహించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో పనిచేసిన సమయంలో అనేక అవినీతి ఆరోపణలున్నాయి. కొద్దిరోజుల క్రి తం కొందరు సదరు అధికారి తీరుపై ముఖ్యమంత్రి కే ఫిర్యాదు చేయడంతో జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించింది. గతంలో సదరు అధికారి ఏలూరులో ఉన్నప్పుడు పలు సొసైటీల్లో జరిగిన అవకతవకలపై విచారణాధికారిగా వెళ్లి విచారణ పూర్తయినా నివేదిక ప్రభుత్వానికి సమర్పించలేదనే పేరు ఉంది. 258 సొసైటీలు జిల్లాలో ఉంటే సు మా రు 30 సొసైటీల్లో అవకతవకలు జరిగాయని గుర్తించి, విచారణ నిర్వహించి మధ్యలోనే నిలిపివేశారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధికి సమీప బంధువు కావడంతో సంబంధం లేకపోయినా బ్యాంకులో హడావుడి కొనసాగిస్తుండటం గమనార్హం. డీసీసీబీలో షాడో చైర్మన్ డీసీసీబీలో సహకార అధికారి పెత్తనం బ్యాంకులో సిబ్బంది వద్ద హడావుడి ఇప్పటికే రెండు పోస్టుల్లో సదరు అధికారి జిల్లా కో–ఆపరేటివ్ అధికారిగా మరో పోస్టు కోసం ప్రయత్నాలు ఆడిట్ విచారణల వ్యవహారంలోనూ పెద్ద పాత్ర -
రాజీకి వెళితే తల పగలగొడతారా?
దెందులూరు: గతంలో జరిగిన గొడవ పరిష్కారం నిమిత్తం రాజీకి వెళితే తల్లిదండ్రుల ఎదుటే కొడుకు తలపగలగొట్టడం ఏం సంప్రదాయమని దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ వర్గీయుల తీరు మారదా అని ఆయన ప్రశ్నించారు. శనివారం టీడీపీ వర్గీయుల దాడిలో తలపగిలి తీవ్రంగా గాయపడిన ఈదా భార్గవ్ను, అతని కుటుంబ సభ్యులను రాయన్నపాలెంలోని వారి నివాసంలో అబ్బయ్య చౌదరి కలిసి పరామర్శించారు. సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయాలను పరిశీలించారు. మెరుగైన వైద్య సేవలు తీసుకోవాలని, వ్యక్తిగతంగా, పార్టీ పరంగా బాధితులకు, వారి కుటుంబాలకు అండగా ఉంటామని అబ్బయ్య చౌదరి చెప్పారు. అసలేం జరిగిందంటే.. గత ఆదివారం పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలోని రాట్నాలమ్మ ఆలయం వద్ద జరిగిన శుభకార్యానికి యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ మహేష్ యాదవ్ స్నేహితులు వెళ్లి తిరిగి వస్తుండగా రాయన్నపాలెం గ్రామం వద్ద కొంతమంది యువకులతో ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. దీంతో మహేష్ యాదవ్ తనపై, తన కారు డ్రైవర్పై రాయన్నపాలెం యువకులు వెంటబడి దాడి చేసి గాయపరిచారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మహేష్ యాదవ్పై దాడి చేసిన వారి తల్లిదండ్రులు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని వద్దకు వెళ్లి సమస్యను పరిష్కరించాలని కోరడంతో మహేష్ యాదవ్ను వ్యక్తిగతంగా కలిసి క్షమాపణ చెప్పి రాజీ చేసుకోవాలని ఎమ్మెల్యే చెప్పారు. ఈ క్రమంలో శనివారం దెందులూరులోని మహేష్ యాదవ్కు చెందిన దాబా వద్దకు దాడి చేసిన యువకులు, వారి తల్లిదండ్రులు వెళ్లారు. వారిపై టీడీపీ నాయకులు మన్నే శ్రీనివాసరావు, బొద్దు సురేంద్ర, మహేష్ యాదవ్ అనుచరులు దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచారు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హోటల్ వద్దకు వెళ్లి గాయపడిన బాధితులను పరామర్శించారు. తరువాత ఏలూరు ప్రభుత్వాసుపత్రికి వారిని చికిత్స నిమిత్తం తరలించారు. పెదవేగి సీఐ రాజశేఖర్ ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేయాల్సిందిగా దెందులూరు ఎస్సైని ఆదేశించారు. టీడీపీ వర్గీయుల తీరు మారదా? దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి ధ్వజం -
ఆషాఢం ఎఫెక్ట్
ద్వారకాతిరుమల: చినవెంకన్న క్షేత్రంపై ఆషాఢం ఎఫెక్ట్ పడింది. దీంతో శనివారం భక్తుల రద్దీ బాగా తగ్గింది. సాధారణంగా భక్తుల రాక ఎక్కువగా ఉండాల్సి ఉండగా సాధారణంగానే కనిపించింది. ఆలయంలో అన్ని విభాగాల్లో భక్తులు నామమాత్రంగా కనిపించారు. క్షేత్రంలో వ్యాపారాలన్నీ మందకొడిగా సాగాయి. కేంద్ర గ్రంథాలయానికి కొత్త భవనం ఏలూరు(మెట్రో): ఏలూరులోని జిల్లా కేంద్ర గ్రంథాలయ నూతన భవన నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించి, గ్రంథాలయ సంస్థల డైరెక్టర్ నుంచి అనుమతిని తీసుకుని నిర్మాణ పనులు చేపట్టాలని జేసీ, జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్చార్జ్ పి.ధాత్రిరెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం జిల్లా కేంద్ర గ్రంథాలయం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రంథాలయ భవనం శిథిలావస్థలో ప్రమాద స్థితిలో ఉన్న కా రణంగా కొత్త భవనం నిర్మించాల్సి ఉందన్నా రు. అలాగే గ్రంథాలయంలో వసతులు కల్పించాలని, స్థానిక సంస్థలు, వివిధ సంస్థల నుంచి గ్రంథాయాల సెస్సు బకాయిల వసూలుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎమ్.శేఖర్బాబు, డీపీఓ కె.అనురాధ, వయోజన విద్య ఉపసంచాలకుడు ప్రభాకర్, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి యు.సురేంద్రనాథ్, డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. డీఎస్సీ పరీక్షలకు 275 మంది హాజరు ఏలూరు (ఆర్ఆర్పేట): నగరంలోని శనివారం జరిగిన డీఎస్సీ పరీక్షలకు 275 మంది అభ్యర్థులు హాజరయ్యారు. నగరంలోని సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో ఉదయం సెషన్కు 100 మందికి 93 మంది, సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 201 మందికి 182 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు. వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు జంగారెడ్డిగూడెం: లైంగిక దాడులు, వేధింపులు వంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ యు.రవిచంద్ర అన్నారు. పోక్సో కేసులో నిందితుడికి శిక్ష ఖరారైన నేపథ్యంలో శనివారం ఆయన కేసు వివరాలను వెల్లడించారు. గతేడాది ఫిబ్రవరిలో పట్టణంలోని మందుల షాపు నిర్వాహకుడు షేక్ ఇబ్రహీం ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడన్నారు. ఇబ్రహీంపై కేసు నమోదు చేయగా ఏలూరు స్పెషల్ స్పీడ్ ట్రైల్, పోక్సో న్యాయమూర్తి శిక్ష ఖరారు చేశారన్నారు. ఇబ్రహీంకు 20 ఏళ్ల జైలు, రూ.5 వేల జరిమానా విధించారని, అలాగే బాధితురాలికి రూ.50 వేలు పరిహారం అందించాలని న్యాయ స్థానం ఆదేశించిందన్నారు. తల్లితండ్రులు పర్యవేక్షించాలి బాలికలు, యువతులను తల్లితండ్రులు ఎప్ప టికప్పుడు పర్యవేక్షిస్తూ, వారికి జాగ్రత్తలు నే ర్పాలని డీఎస్పీ సూచించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి వివరించాలన్నారు. ఎవరైనా హద్దు మీరి ప్రవర్తిస్తే 112 లేదా శక్తి బృందానికి సమాచారం ఇవ్వాలన్నారు. గీత వృత్తిపై ప్రభుత్వం కక్ష తణుకు అర్బన్: బెల్టు షాపులను అరికట్టి అక్రమ మద్యం అమ్మకాలను నిలుపుదల చేయాలని ఏపీ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి అన్నారు. శనివారం స్థానిక అమరవీరుల భవనంలో నిర్వహించిన ఏపీ కల్లుగీత సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రకృతి సిద్ధమైన తాటికల్లుపై ప్రభుత్వం కక్ష కట్టి అక్రమ మద్యం, ఊరువాడా బెల్టు షాపుల్లో అమ్మకాలు చేస్తూ కల్లు అమ్మకాలను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. గీత వృత్తిపై ప్రభుత్వం కక్ష కట్టిందన్నా రు. జిల్లా అధ్యక్షుడు కామన మునిస్వామి మా ట్లాడుతూ మద్యం విచ్చలవిడి అమ్మకాలతో ప లు కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయన్నారు. జూలై 14న కల్లుగీత కార్మికుల వెతలు కలెక్టర్కు చెప్పుకుందాం కార్యక్రమానికి భీమవరం తరలిరావాలని కోరారు. -
చీటీల పేరుతో రూ.5 కోట్లకు టోకరా
భీమవరం అర్బన్: చీటీల పేరుతో తోకతిప్ప గ్రామానికి చెందిన పొన్నాల వీర వెంకట సత్యనారాయణ రూ.5 కోట్ల వరకు మోసం చేసి పరారయ్యాడంటూ భీ మవరం రూరల్ స్టేషన్ ఎస్సై ఐ.వీర్రాజుకు శనివారం బాధితులు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ వీర వెంకటరమణ గ్రామంలో నమ్మకంగా ఉంటూ 15 ఏళ్ల నుంచి చీటీల వ్యాపారం చేస్తున్నాడన్నారు. తోకతిప్పతో పాటు చుట్టుపక్కల 10 గ్రామాల్లో ఆయన చీటీల వ్యాపారం చేస్తున్నాడని, ఆయన కుమారుడు, కుమార్తె ప్రతినెలా వాయిదా సొమ్ములు వసూళ్లు చేసేవారన్నారు. ఇటీవల ఒక్కొక్కరూ 2 నుంచి 5 చీటీల వరకూ వేశామని, చీటీల గడువు ముగియగా వాయిదా ల సొమ్ము ఇవ్వమని అడిగితే రేపు మాపు అంటూ రోజులు గడుపుతున్నాడన్నా రు. కొద్ది రోజులుగా వెంకటరమణ కనిపించడం లేదని, ఆయన భార్య పద్మా వతిని అడిగితే సమాధానం చెప్పకపోగా పోలీసు కేసు పెడతానని హెచ్చరించిందన్నారు. ఈ నేపథ్యంలో వెంకటరమణ కుటుంబంతో సహా కనిపించకుండా పో యాడని, చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని ఎస్సైను అభ్యర్థించారు. కేసు విచారణ చేసి చర్యలు తీసుకుంటానని ఎస్సై వీర్రాజు హామీ ఇచ్చారు. -
మౌలిక వసతుల కోసం గిరిజనుల మొర
బుట్టాయగూడెం/ఏలూరు (మెట్రో): కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రాజెక్టు అధికారి రిషబ్ చతుర్వేది శనివారం ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన గ్రామాల్లో పర్యటించారు. ముంజులూరు, పులిరామన్నగూడెం, చింతపల్లి తదితర గ్రామాల్లో జనభాగీదరీ అభియాన్, పీఎం జన్మాన్ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో గిరిజనులు తమ సమస్యలను ఆయన వద్ద మొరపెట్టుకున్నారు. రోడ్డు సౌకర్యం కల్పించాలని, ఇళ్ల నిర్మాణం వేగిరపర్చాలని, వ్యక్తిగత మరుగుదొడ్లతో పాటు మెడికల్ సబ్సెంటర్ భవనానికి మరమ్మత్తులు చేయించాలని పులిరామన్నగూడెం గిరిజనులు కోరారు. తమకు అదనపు ఓహెచ్ఎస్ఆర్ కావాలని, అంతర్గత రోడ్లు నిర్మించాలని చింతపల్లి గిరిజనులు అభ్యర్థించారు. అలాగే పులిరామన్నగూడెం నుంచి చింతగూడెం రోడ్డు నిర్మించాలని కోరారు. బుట్టాయగూడెం కొల్లుమామిడి గ్రామంలో మల్టీపర్పస్ సెంటర్, అంగన్వాడీ సెంటర్ను ఆయన సందర్శించారు. అనంతరం కేఆర్పురం ఐటీడీఏలో అధికారులతో సమావేశం నిర్వహించి ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈనెల 30 వరకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఐటీడీఏ పీఓ కె.రాములు నాయక్, ఎంపీడీఓ కె.జ్యోతి, తహసీల్దార్ పీవీ చలపతిరావు ఉన్నారు. సాయంత్రం ఏలూరు కలెక్టరేట్లో కలెక్టర్ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. తన పర్యటన, గిరిజన గ్రామాల్లో సమస్యలను కలెక్టర్కు తెలియజేశారు. -
ఎస్సీ క్రైస్తవులు, పాస్టర్లపై దాడులు హేయం
ఏలూరు(టూటౌన్): దేశంలో, రాష్ట్రంలో ఎస్సీ క్రైస్తవులు, పాస్టర్లపై దాడులు హేయమని, దాడులను నిరసిస్తూ ఈ నెల 30న విజయవాడలో నిర్వహించే ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆల్ ఇండియా అంబేడ్కర్ యువజన సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మెండెం సంతోష్కుమార్ పిలుపు నిచ్చారు. స్థానిక ఇండోర్ స్టేడియం ఎదురుగా లేడీస్ క్లబ్లో ఎస్సీ క్రైస్తవులు, పాస్టర్ల ఆత్మీయ సమావేశాన్ని శనివారం నిర్వహించారు. సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్సీ క్రైస్తవులు, పాస్టర్లు, చర్చిలపై దాడులు రాజ్యాంగ విరుద్ధమైన చర్యని ఇలాంటి సంఘటనలు ఖండిస్తున్నామన్నారు. ఫాదర్ ఇంజమాల మైఖేల్, కె.శాంతి సాగర్లు మాట్లాడుతూ రిజర్వేషన్ల పేరుతో దళితులకు మత స్వేచ్ఛ లేకుండా చేయడం దళితుల ఆత్మ గౌరవాన్ని కించపరచడమే అన్నారు. సమావేశంలో ప్రొఫెసర్ ఎన్ఏడీ పాల్, పెరికె వరప్రసాదరావు, దోమతోటి అబ్రహం, నూకపెయ్యి కార్తీక్ పాల్గొన్నారు. బైక్పై నుంచి పడిన వ్యక్తి మృతి ద్వారకాతిరుమల: కుక్క అడ్డు రావడంతో బైక్పై నుంచి పడి తీవ్ర గాయాలు పాలైన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానిక పోలీస్టేషన్లో శనివారం కేసు నమోదైంది. ఎస్సై టి.సుధీర్ తెలిపిన వివరాలు ప్రకారం.. మండలంలోని దేవినేనివారిగూడెంకు చెందిన కూచింపూడి నాగు(45) ఈనెల 23 న ఇసీ్త్ర పెట్టెలోని బొగ్గుల కోసమని పంగిడిగూడెంకు వెళ్లాడు. తిరిగి సాయంత్రం బైక్పై స్వగ్రామానికి వెళుతుండగా, ఘటనా స్థలమైన సూర్యచంద్రరావుపేట జెర్సీ పార్లర్ వద్దకు వచ్చేసరికి అకస్మాత్తుగా కుక్క అడ్డువచ్చింది. దాంతో కుక్కను ఢీకొట్టి రోడ్డుపై పడిపోయిన నాగుకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఏలూరు ఆశ్రం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నాగు శుక్రవారం రాత్రి మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. సొమ్ముల రికవరీకి చర్యలు వీరవాసరం: నందమూరి గరువులో డ్వాక్రా సంఘాల్లో జరిగిన స్కాం నగదును రికవరీ చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఏపీఎం కే.జ్యోతిరాణి శనివారం తెలిపారు. 2022 నుంచి 2025 మార్చి వరకు ఖాతాల నుంచి గ్రూపు సభ్యులకు తెలియకుండా పోతుల నాగ స్వాతి, బోడపాటి సత్యవాణి నగదును కాజేశారని వివరించారు. సుమారు రూ.85 లక్షల మేర అవినీతి చోటుచేసుకుందని, బోడపాటి సత్యవాణి నుంచి సుమారు రూ.18 లక్షల మేర రికవరీ చేశామన్నారు. నాగస్వాతిపై వీరవాసరం పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయించామన్నారు. యంత్రాలు ఇప్పిస్తానని మోసం భీమవరం: వ్యవసాయ యంత్రాలు రాయితీపై ఇప్పిస్తానని రూ.8 లక్షలు తీసుకుని మోసగించినట్లు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ ఎం.నాగరాజు తెలిపారు. పాలకొల్లుకు చెందిన కత్తుల వెంకటేశ్వరరావు భీమవరానికి చెందిన యింకి వెంకటేశ్వరరావు దగ్గర నాలుగు దఫాలుగా నగదు తీసుకున్నారన్నారు. రాయితీపై యంత్రాలు ఇప్పించలేదని ఫిర్యాదులో పేర్కొనగా ఎస్సై కృష్ణాజీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం
రక్షించిన నిమ్మకాయల యార్డు ముఠా కార్మికులు ఏలూరు టౌన్: ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్ సమీపంలో ఒక మహిళ తన ముగ్గురు చిన్నారులతో తమ్మిలేరులో దిగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. వెంటనే నిమ్మకాయల యార్డు ముఠా కార్మికులు స్పందించి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. రైల్వే ఎస్సై సైమన్ తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేట, డొంకరోడ్డు ప్రాంతానికి చెందిన పందల లక్ష్మి, జాన్పాల్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. భార్యాభర్తలు శుక్రవారం రాత్రి గొడవపడ్డారు. భర్తతో వివాదం నేపథ్యంలో పిల్లలను తీసుకుని శనివారం మధ్యాహ్నం జన్మభూమి రైలు ఎక్కిన లక్ష్మి ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్లో దిగింది. సమీపంలోని తమ్మిలేరుులో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. కార్మికులు వెంటనే స్పందించి ఆమెను, పిల్లలను బయటకు తీసుకొచ్చారు. పిల్లలు నీళ్ళు తాగారేమో అనే అనుమానంతో ఏలూరు జీజీహెచ్కు తరలించగా.. ఆరోగ్యంగానే ఉన్నట్లు నిర్ధారించారు. ఈ లోగా భర్త జాన్పాల్, మహిళ అన్న ఏలూరు చేరుకున్నారు. రైల్వే పోలీసులు జీజీహెచ్కు చేరుకుని లక్ష్మి, ఆమె ఇద్దరు చిన్నారులను భర్త జాన్పాల్కు అప్పగించారు. -
శాశ్వత బ్రిడ్జి కోసం ప్రతిపాదనలు
ఉంగుటూరు: నారాయణపురం ఆర్ అండ్ బీ బ్రిడ్జి నిర్మాణ పనులు మూడు నెలల్లో మొదలు పెట్టేందుకు చర్యలు చేపడతామని రోడ్లు, భవనాల శాఖ చీఫ్ ఇంజినీర్ ఎల్.శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. శనివారం ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజనీరు ఎల్.శ్రీనివాస్రెడ్డి రంధ్రాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. రూ. 20 లక్షలతో తాత్కాలికంగా ఐరన్ షీట్ వేసి బెయిలీ బ్రిడ్జి నిర్మించడం వల్ల ఉపయోగం ఉండదన్నారు. శాశ్వత బ్రిడ్జి నిర్మించాల్సిన అవసరముందని తెలిపారు. ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి పంపుతామని, అనుమతి రాగానే పనులు మొదలుపెడతామని చెప్పారు. 11 మీటర్ల రోడ్డు, ఇరువైపులా పాదచారులు నడిచేందుకు పుట్పాత్ డిజైన్ రూపొందిస్తామని తెలిపారు. పాడైపోయిన బ్రిడ్జిని పరిశీలించిన అనంతరం రూ.60 లక్షల చేబ్రోలు –తల్లాపురం రోడ్డులో కలిసే పుంత రహదారి అభివృద్ధి కోసం తయారచేసిన ప్రతిపాదిత రహదారిని పరిశీలించారు. చేబ్రోలు పోలీస్టేషన్ నుంచి నారాయణఫురం ఊరిలోకి కాలువగట్టు రహదారిని పరిశీలించారు. త్వరలో పంపుతామని చీఫ్ ఇంజినీర్ వెల్లడి -
దిగుబడిలో విత్తన శుద్ధి కీలకం
భీమవరం: సార్వా వరి నారుమడి పనుల్లో రైతులు నిమగ్నయ్యారు. గత రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వెన్ను దన్నుగా నిలబడి అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడంతో రైతులు ఉత్సాహంగా వరి సాగు పట్ల ఆసక్తి చూపించారు. రైతులకు వరి కోత యంత్రాలు, ట్రాక్టర్లకు పెద్ద మొత్తంలో సబ్సిడీ ఇవ్వడమేగాక పంటల బీమా పథకం, ఇన్ఫుట్ సబ్సిడీ వంటివి అమలు చేశారు. ప్రస్తుతం సార్వా సాగుకు సిద్ధమవుతున్న రైతులకు రైతు భరోసా, గత సార్వాసీజన్లో వర్షాలు కారణంగా దెబ్బతిన్న రైతులకు ఇన్ఫుట్ సబ్సిడీ ఇవ్వకపోవడంతో ప్రస్తుత సీజన్లో వరి సాగుకు ఇబ్బందులు పడుతున్నారు. పథకాల మాటేలా ఉన్నా వరి సాగులో విత్తన ఎంపిక, విత్తనశుద్ధి, సస్యరక్షణ వంటి వాటిపై రైతులు దృష్టి పెట్టాలని వ్యవసాయశాఖ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లో సుమారు సుమారు 5.40 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేయనున్నారు. దీనిలో పశ్చిమగోదావరి జిల్లాలో 2.08 లక్షల ఎకరాలు, ఏలూరు జిల్లాలో సుమారు 3 లక్షలకు పైగా ఎకరాల్లో సాగు చేయాల్సి ఉంది. వరి నారుమళ్లు వేయడానికి ఎకరాకు 30 కిలోల వరకు విత్తనాలు అవసరమవుతాయి. విత్తన సేకరణ ఇలా పురుగులు, తెగుళ్లు ఆశించని పాలం నుంచి విత్తనాన్ని సేకరించుకోవాలి. రైతులు తమ సొంత విత్తనాన్నే వాడుకుంటుంటే పంట కోత కోసిన తరువాత విత్తనాలతో పాటు కలిసిపోయిన మట్టి, శీలీంద్ర బీజాలు, పురుగు తుట్టెలను తీసివేసి శుభ్రం చేసి నిలువ చేసుకోవాలి. బయట విత్తనాన్ని కొనుగోలు చేసే సమయంలో విత్తన శుద్ధి చేశారో లేదో నిర్ధారించుకోవాలి. కొనుగోలు చేసిన విత్తనానికి సంబందించిన బిల్లును తప్పనిసరిగా తీసుకోవాలి. విత్తనాల మొలక శాతం తప్పనిసరిగా పరీక్షించుకోవాలి. నాణ్యమైన విత్తనం అయినా ఎక్కువ ముంది రైతులు సొంతంగా విత్తనాలను పండించుకోవడం లేదా తోటి రైతుల నుంచి విత్తనాలను కొనుగోలు చేస్తుంటారు. విత్తనాలతో పాటు కొన్ని తెగుళ్లను కలుగచేసే శీలీంద్రాలు, బ్యాక్టీరియా, వైరస్ వంటివి పంటలను ఆశించి తీవ్రమైన నష్టాన్ని కలుగచేస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో నాణ్యమైన విత్తనం అయినప్పటికీ భూమి నుంచి, వివిధ రకాల పురుగుల నుంచి తెగుళ్లు ఆశించి పంటను నష్టపరుస్తూ ఉంటాయి. అందువల్ల పంటను తొలిదశలోనే రక్షించుకోవడానికి సిఫారసు చేసిన శీలీంద్ర నాశినులతో గానీ, పురుగు మందులు లేదా జీవ శీలీంద్ర నాశినులతో తప్పని సరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ విత్తన శుద్ధి మందులు పొడి, ద్రవ రూపంలో, కాన్సస్ట్రేట్స్ రూపంలో మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. విత్తన శుద్ధి పద్ధతులు ● పొడి విత్తన శుద్ధి : డ్రమ్ముల్లో మూడింట రెండొంతులు విత్తనం వేసి సిఫార్సు చేసిన మోతాదులో మందు వేసి బాగా తిప్పితే విత్తనానికి మందు పట్టుకుంటుంది. కొన్ని రకాల విత్తనాలకు జిగురు, బెల్లం ద్రావణం, చిక్కటి గంజి ద్రావణం వంటివి కలపడం వల్ల మందు బాగా పట్టుకుని విత్తనానికి రక్షణ కవచంగా ఏర్పడి చీడ పీడల నివారణకు సాధ్యమవుతుంది. ● తడి విత్తన శుద్ధి : ముఖ్యంగా వరి విత్తన శుద్ధికి తగినంత నీటిని తీసుకుని ఆ నీటిలో సిఫార్పు చేసిన మందు కలుపుకుని నీటిలో విత్తనాలను నానబెట్టడం ద్వారా చీడ పీడల నుంచి పంటలను రక్షించుకోవచ్చు. జీవ శిలీంద్ర నాశినులతో కొన్ని రకాల జీవ శీలీంద్ర నాశినులతో ముఖ్యంగా ట్రైకోడెర్మావిరిడి. సూడోమోనాస్ వంటి వాటితో విత్తన శుద్ధి చేయడం వల్ల తెగుళ్లను కలుగచేసే శీలీంధ్రాలను నాశనం చేయడమేగాక వంట చివరి వరకు కూడా రక్షణ కల్పిస్తాయి. ఈ మందులు భూమిలోనే అభివృద్ధి చెంది తరువాత వేసే పంటలకు కూడా ఉపయోగపడతాయి. వీటి మోతాదు కిలో విత్తనానికి 8 నుంచి 30 గ్రాముల వరకు వాడుకోవాలి. సిఫార్సు చేసిన మందులతో విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా తక్కువ ఖర్చుతో పంటలను చీడపీడల బారి నుంచి రక్షించుకోవచ్చు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 5.40 లక్షల ఎకరాల్లో వరి సాగు విత్తన శుద్ధితో పంటకు రక్షణ వరిసాగులో విత్తనశుద్ధి ద్వారా పురుగుమందుల ఖర్చు తగ్గడమేగాక పంటలో అధిక దిగుబడులు సాధించవచ్చు. సార్వా సాగుకు సిద్ధమవుతున్న రైతులు తప్పనిసరిగా విత్తన శుద్ధిపై దృష్టిపెట్టాలి. విత్తనశుద్ధికి అవసరమైన సమాచారం కోసం అందుబాటులోని వ్యవసాయశాఖాధికారులను సంప్రదించాలి. – డాక్టర్ ఎంవీ కృష్ణాజీ, వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధానశాస్త్రవేత్త, మార్టేరు -
అంజన్నకు అభిషేక సేవ
జంగారెడ్డిగూడెం : గురవాయిగూడెం గ్రామంలో తెల్ల మద్ది చెట్టు తొర్రలో స్వయంభువై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయం వద్ద ప్రతి శనివారం నిర్వహించే అభిషేక సేవ సందర్భంగా ఆలయ ముఖమండపంపై స్వామివారి ఉత్సవమూర్తికి అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వివిధ సేవలు, విరాళాల ద్వారా రూ.1,42,813 సమకూరినట్లు ఈవో ఆర్వీ చందన తెలిపారు. పోక్సో కేసు కొట్టివేత బుట్టాయగూడెం: 13 ఏళ్ల క్రితం నమోదైన పోక్సో కేసు నేరారోపణ రుజువు కాకపోవడంతో జిల్లా జడ్జి కొట్టివేసినట్లు న్యాయవాది ఉద్దండం ఏసుబాబు తెలిపారు. శనివారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ బుట్టాయగూడెం మండలం ముప్పినవారిగూడెంకు చెందిన టి. పోతురాజు అదే గ్రామానికి చెందిన 13 సంవత్సరాల బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు 2017 ఆగస్టులో ఎఫ్ఐఆర్ నమోదైందని చెప్పారు. మొత్తం 18 మందిని విచారించి నేరారోపణ చేశారన్నారు. ఈ కేసుకు సంబంధించి శనివారం పోక్సో స్పెషల్ కోర్టులో విచారణ జరిగిందని, ముద్దాయిపై నేరారోపణ రుజువు చేయలేకపోయినందున, ముద్దాయిపై పెట్టిన పోక్సో కేసును కొట్టి వేస్తూ జిల్లా జడ్జి కుమారి వాణిశ్రీ తీర్పు వెలువడించారని ఏసుబాబు పేర్కొన్నారు. మద్యం మత్తులో వ్యక్తిపై దాడి ముదినేపల్లి రూరల్: మద్యం మత్తులో దాడి చేసి వ్యక్తిని గాయపరచిన సంఘటన మండలంలోని సింగరాయపాలెంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన గుజ్జు లాజర్బాబు కూలి పనికి వెళ్లి రాత్రి తిరిగి వస్తుండగా సాంబశివరావు మద్యం సేవించి లాజర్బాబును దూషించాడు. దీనిపై నిలదీసి అడగగా రాయితో తలపై దాడి చేసి గాయపరిచినట్లు లాజర్బాబు తెలిపాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గ్రామీణ విద్యార్థులకు బంగారు భవిత
కౌన్సెలింగ్కు ఏం కావాలి? పదో తరగతి హాల్ టిక్కెట్, మార్కుల లిస్టు, టీసీ, కాండక్ట్ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్(4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు), ఎస్సీ, ఎస్టీ, బీసీలు కుల ధృవీవకరణ పత్రం, ఆదాయ ధ్రువ పత్రం, ఈడబ్ల్యుఎస్ కోటాలో సీటు పొందిన వారు ఈడబ్ల్యుఎస్ సర్టిఫికెట్, అభ్యర్థి, అతని తండ్రిది గాని, తల్లిది కాని రెండు పాసుపోర్టు ఫొటోలు, రేషన్ కార్డు, అభ్యర్థి ఆధార్ కార్డు, విద్యార్థులకు ఎవరికై నా బ్యాంకు లోన్ అవసరమైతే పైన పేర్కొన్న సర్టిఫికెట్లన్నీ నాలుగు సెట్లు, అభ్యర్థి తండ్రి ఉద్యోగి అయితే ఎంప్లాయి ఐడెంటీ కార్డు, శాలరీ సర్టిఫికెట్, అభ్యర్థి తండ్రి పాన్కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు తెచ్చుకోవాలి. ఎలా రావాలంటే ● ప్రకాశం, గుంటూరు జిల్లా వైపు నుంచి వచ్చేవారు విజయవాడ బస్టాండుకు చేరుకున్న తరువాత అక్కడి నుంచి ప్రతి పది నిమిషాలకు నూజివీడుకు బస్సులు ఉన్నాయి. విజయవాడ నుంచి నూజివీడుకు 40 కి.మీ. దూరం మాత్రమే. నూజివీడు బస్టాండులో దిగిన తరువాత అక్కడి నుంచి మైలవరం రోడ్డులో ఉన్న ట్రిపుల్ ఐటీకి నిత్యం ఆటోలు ఉంటాయి. ● శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి వచ్చే విద్యార్థులు హనుమాన్జంక్షన్ బస్టాండులో గాని, రైల్వేస్టేషన్లో గాని దిగితే అక్కడి నుంచి నూజివీడుకు నిత్యం బస్సులు, ఆటోలు ఉన్నాయి. బస్సు ప్రయాణమే తక్కువ శ్రమ, సురక్షితం అనేది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గమనించాలి. నూజివీడు: గ్రామీణ పేద వర్గాలకు చెందిన ప్రతిభా వంతులైన విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ఇంజినీరింగ్ విద్యను అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆలోచనకు రూపమే ట్రిపుల్ ఐటీలు. ఈ ట్రిపుల్ ఐటీలను ఆర్జీయూకేటీ నిర్వహిస్తోంది. ఆరు సంవత్సరాల సమీకృత ఇంజినీరింగ్ విద్యా బోధనకు నిలయమైన ట్రిపుల్ ఐటీలో ఆహ్లాదకరమైన వాతావరణం, క్రమశిక్షణ, ఉత్తమ విద్యాబోధన నూజివీడు ట్రిపుల్ ఐటీ సొంతం. విద్యతో పాటు విద్యార్థుల మానసిక, శారీరక వికాసానికి ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, క్రీడలు, శాసీ్త్రయ సంగీతం, నాట్యం, యోగా వంటి వాటిల్లో కూడా శిక్షణనిస్తారు. ఉదయం అల్పాహారం అనంతరం అసెంబ్లీ, 8 నుంచి 12 గంటల వరకు తరగతులు, 12 నుంచి 1గంట వరకు భోజన విరామం, మళ్ళీ ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు, అనంతరం టీ, స్నాక్స్, 6 గంటల వరకు ఆటలు, రాత్రి 7 గంటలకు భోజనం, అనంతరం రాత్రి 10 గంటల వరకు స్టడీ అవర్స్.. ఇవీ ట్రిపుల్ ఐటీ విద్యార్థుల దైనందిన కార్యక్రమాలు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఈ నెల 30, వచ్చే నెల ఒకటిన 2025–26 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రవేశం పొందనున్న విద్యార్థుల, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు ‘సాక్షి’ అందిస్తున్న సమగ్ర కథనం. కౌన్సెలింగ్కు ఏర్పాట్లు పూర్తి నూజివీడు ట్రిపుల్ ఐటీలో ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహిస్తున్న కౌన్సిలింగ్లో భాగంగా ఈనెల 30న 550 మంది అభ్యర్థులకు, వచ్చే నెల 1న 550 మంది అభర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ కౌన్సెలింగ్కు రాష్ట్రంలోని నలుమూలల నుంచి సీట్లు వచ్చిన అభ్యర్థులు పాల్గొననున్నారు. కౌన్సెలింగ్కు రావాల్సిన అభ్యర్థులందరికీ ఇప్పటికే ట్రిపుల్ ఐటీ అధికారులు కాల్లెటర్లు పంపడంతో పాటు వారి సెల్ఫోన్లకు మెసేజ్లు కూడా పంపారు. ట్రిపుల్ ఐటీ ఆవరణలోని స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్లో కౌన్సెలింగ్ నిర్వహణకు ఏర్పాటు చేశారు. ● ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్ విద్యలో మొదటి రెండు సంవత్సరాలు ఇంటర్కు సమానమైన పీయూసీ కోర్సును, తరువాత నాలుగు సంవత్సరాలు ఇంజినీరింగ్ విద్యను బోధిస్తారు. ● ట్రిపుల్ ఐటీలో చేరిన తరువాత విద్యార్థులు మొదటి రెండు సంవత్సరాలు ఏడాదికి రూ.45 వేలు, తరువాత నాలుగు సంవత్సరాలు ఏడాదికి రూ.50 వేలు చొప్పున చెల్లించాలి. ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హత కలిగిన విద్యార్థులకు ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రభుత్వం చెల్లించిన నగదు పోను మిగిలిన సొమ్మును విద్యార్థులే చెల్లించాల్సి ఉంటుంది. ● అన్ని సబ్జెక్టులకు ప్రతి నెలా పరీక్షలు ఉంటాయి. నాలుగు నెలల తరువాత సెమిస్టర్ పరీక్షలు ఉంటాయి. ప్రతి సెమిస్టర్ 24 వారాలు ఉంటుంది. జులై 15 నుంచి తరగతులు ప్రారంభమై నవంబరు 30 వరకు తరగతులు జరుగుతాయి. అనంతరం సెమిస్టర్ పరీక్షలు ఉంటాయి. పీయూసీలో ఎంపీసీ, ఎంబైపీసీ స్ట్రీమ్లుంటాయి. ఇంజినీరింగ్లో కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, సీఎస్ఈ, ఈసీఈ, ట్రిపుల్ ఈ, సీఎస్ఈ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్, మెకానికల్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజినీరింగ్ బ్రాంచిలున్నాయి. ● సెలవు రోజులలో తల్లిదండ్రులు వచ్చి తమ పిల్లలతో గడపడానికి అవకాశం ఉంటుంది. అత్యవసర పరిస్థితులలో పిల్లలను అవసరమైతే ఇళ్ళకు పంపుతారు. ఇచ్చిన గడువులోగా తిరిగి రాకపోతే ఫైన్ విధిస్తారు. ● విద్యార్థుల ఆరోగ్యంకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. దీనికి ట్రిపుల్ఐటీ ఆవరణలోనే 30 పడకల ఆసుపత్రి ఉంది. ఇందులో 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉంటారు. ● ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కిందకు రాని అభ్యర్థులు మొత్తం ఫీజును చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి శ్రీ డైరెక్టర్, ఆర్జీయూకేటీ ట్రిపుల్ఐటీ నూజివీడుశ్రీ పేరున డీడీని ఏజాతీయ బ్యాంకు నుంచైనా తీసుకుని ఇవ్వాలి. ● రిజిస్ట్రేషన్ ఫీజు కింద వెయ్యి రూపాయలు, ఎస్సీ ఎస్టీలు రూ.500 చెల్లించాలి. గ్రూపు ఇన్సూరెన్స్ కింద రూ.1200, రిఫండబుల్ కాషన్ డిపాజిట్ కింద ప్రతి అభ్యర్థి వెయ్యి రూపాయలు, హాస్టల్ మెయింట్నెన్స్ చార్జి వెయ్యి రూపాయలు అడ్మిషన్ సమయంలో చెల్లించాలి. ఈ నెల 30, జూలై 1న నూజివీడు ట్రిపుల్ ఐటీలో కౌన్సెలింగ్ -
ఒకే ఒక్కడు
పెనుమంట్ర: పెనుమంట్ర మండలంలో విద్యా శాఖ నిర్లక్ష్యంతో పాఠశాలలు మూసివేసే పరిస్థితి నెలకొంది. సరిగా పాఠశాలల విభజన జరగకపోవడంతో కొన్ని స్కూళ్లలో కేవలం ఒకరిద్దరు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. మండలంలో 47 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అందులో వెలగలవారిపాలెం (ఆర్) పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు, ఎంపీపీ నాగళ్లదిబ్బ, కొయ్యేటిపాడు స్పెషల్ పాఠశాలల్లో ఒక్కో విద్యార్థి ఇప్పటి వరకు చేరారు. వెలగలవారిపాలెం పాఠశాలలో సింగిల్ టీచర్ ఉన్నప్పటికీ నాగళ్ల దిబ్బ, కొయ్యేటిపాడు పాఠశాలలకు ఉపాధ్యాయులు లేకపోవడంతో ఈ పాఠశాలల్లో ఆన్లైన్ ద్వారా ఒక్కో విద్యార్థి చేరారు. ఈ పాఠశాలలకు వేరే పాఠశాల నుంచి ఉపాధ్యాయులను డిప్యుటేషన్పై పంపుతున్నట్లు ఎంఈవో యు.నాగేశ్వరరావు శనివారం తెలిపారు. వెలగలవారిపాలెం పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు ఉన్నట్లు హాజరు చూపుతున్నప్పటికీ శనివారం ఆ పాఠశాలలో ఒక్క విద్యార్థిని మాత్రమే ఉన్నారు. దళితవాడలో పాఠశాలకు నాడు–నేడులో అధునాతన భవనాలు నిర్మించారు. గత ఏడాది ఈపాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు, 30 మంది వరకు విద్యార్థులు ఉండగా, ఈ ఏడాది ఇద్దరు ఉపాధ్యాయులతో 12 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఇదే పరిస్థితి మండలంలో అనేక ప్రభుత్వ పాఠశాలల్లో ఉంది. ఇందుకు విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమని పలువురు తల్లిదండ్రులు విమర్శిఽస్తున్నారు. -
డీఈడీ ప్రవేశ పరీక్షలో ప్రతిభ
భీమవరం: భీమవరానికి చెందిన సంగడి ఏదిత హాసిని డీఈడీ (టీచర్స్ ట్రైనింగ్) కోర్సు ప్రవేశ పరీక్షలో రాష్ట్రస్థాయిలో ఏడో ర్యాంక్ సాధించింది. ఆమె తండ్రి శ్రీకృష్ణ మావుళ్లయ్య ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. 8లోవిలీనం.. అవస్థల మయం ● కై కలూరు మండలంలో గతంలో 12 అప్పర్ ప్రైమరీ పాఠశాలలుండగా నేడు ఆ సంఖ్య 1కి చేరింది. మండలంలో వింజరం, గోపవరం, రామవరం, ఆచవరం, వెలంపేట, కై కలూరులో రెండు పాఠశాలలు ఇలా యూపీ స్కూల్స్లో 6,7,8 తరగతులను హైస్కూళ్లలో విలీనం చేశారు. దీని వల్ల విద్యార్థులకు దూరాభారం పెరిగింది. గోపవరం యూపీ స్కూల్లో గతేడాది వరకు 6,7,8 తరగతుల్లో చదివిన విద్యార్థులు ఈ ఏడాది 5 కిలోమీటర్ల దూరంలోని ఆరుతెగళ్లపాడు హైస్కూల్కు వెళ్లాల్సి వస్తోంది. కై కలూరు మండలం అయి నా రైల్వేట్రాక్, హైవే రహదారి కావడంతో ఇబ్బందులు పడుతూ కొందరు స్కూళ్లకు వెళ్తుండగా మరికొందరు అటువైపు కన్నెత్తి చూడని పరిస్థితి. ఒక్క గోపవరం ప్రాథమికోన్నత పాఠశాలలోని విద్యార్థులే 70 మంది దూర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ● ముదినేపల్లి మండలంలో 9 అప్పర్ ప్రైమరీ పాఠశాలలను రెండు హైస్కూళ్లుగా అప్గ్రేడ్ చేసి 7 పాఠశాలలను సమీప హైస్కూళ్లలో విలీనం చేశారు. వీటిలో కోడూరు, కొరగుంటపాలెంకు చెందిన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కోడూరులోని 6, 7, 8 తరగతుల విద్యార్థులు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెదపాలపర్రు లేదా ముదినేపల్లి హైస్కూళ్లకు వెళ్తున్నారు. కొరగుంటపాలెం యూపీ పాఠశాలలను ఎత్తివేయడంతో 5 కిలోమీటర్ల దూరంలో అల్లూరు లేదా బొమ్మినంపాడు హైస్కూళ్లకు వెళ్లాల్సి పరిస్థితి. ఇలా జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో గందరగోళం నడుమ విలీన ప్రక్రియ నిర్వహించి ప్రభుత్వం కొత్త సమస్యలను సృష్టించింది. -
కాలువలోకి దూసుకెళ్లిన టూరిస్టు బస్సు
పెదకాకాని: ప్రయాణికులతో వస్తున్న బస్సు కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాదం తృటిలో తప్పింది. తణుకు నుంచి అరుణాచలం తీర్థయాత్రకు 39 మంది ప్రయాణికులతో టూరిస్టు బస్సు బయలు దేరింది. వారు శుక్రవారం రాత్రి పెదకాకాని మండలం నంబూరు అరబిక్ స్కూల్ సమీపంలోకి చేరుకునే సరికి డ్రైవర్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. బస్సు అదుపుతప్పి జాతీయ రహదారి పక్కనే ఉన్న కల్వర్టు వంతెనపైకి ఎక్కి ఆగింది. ప్రయాణికులంతా భయంతో కేకలు వేశారు. పలు వురి స్వల్ప గాయాలయ్యాయి. సంఘటనా స్థలా నికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. -
కోకో గింజలను పూర్తిగా కొనాలి
పెదవేగి:కోకో రైతులు వద్ద ఉన్న కోకో గింజలు పూర్తిగా కొనుగోలు చేయాలని, ప్రభుత్వం ప్రోత్సాహంతో కలిపి లక్ష్యాలతో నిమిత్తం లేకుండా జూలై 15 వరకు కంపెనీలు కోకో గింజలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం డిమాండ్ చేసింది. శుక్రవారం విజ యరాయి గాంధీనగర్లోని సీతారామ కల్యాణ మండపంలో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ముందుగా కోకో గింజల కొనుగోలు సమస్యలపై నిరసన కార్యక్రమం చేపట్టారు. కోకో రైతులను ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ కోకో రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలోని పలుచోట్ల రైతులు దరఖాస్తులు ఇచ్చినా కంపెనీలు గింజలు కొనుగోలు చేయ డం లేదన్నారు. కొన్ని రైతు సేవా కేంద్రాల్లో దరఖాస్తులు తీసుకోవడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహంతో కిలో కోకో గింజలకు రూ.500 ధర చెల్లించేలా చూడాలన్నారు. కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర ఇచ్చేలా వెంటనే ఫార్ములా రూపొందించాలని కోరారు. ఆయిల్పామ్ రైతులకు సంఘీభావం పెదవేగి ఆయిల్ఫెడ్ కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయిల్పామ్ రైతులు చేస్తున్న పోరాటానికి కోకో రైతు సంఘం తరఫున సంఘీభావం ప్రకటించారు. ఆయిల్ ఫెడ్ కర్మాగారం ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలని కోరారు. విజయరాయి ప్రాంతీయ కొబ్బరి రైతుల సంఘం ఉపాధ్యక్షుడు మున్నంగి సుబ్బారెడ్డి, కోకో రైతు సంఘం నాయకులు పాలడుగు నరసింహారావు, గుదిబండి వీరారెడ్డి, కోనేరు సతీష్బాబు పాల్గొన్నారు. -
గ్రీన్ఫీల్డ్ పనులను అడ్డుకున్న రైతులు
జంగారెడ్డిగూడెం: గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణంలో పొలాలకు వెళ్లేందుకు దారి ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బంది పడుతున్నామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మండలంలోని పుట్లగట్లగూడెం గ్రీన్ఫీల్డ్ హైవే వద్ద రైతులు రాస్తారోకో చేసి పనులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైవే సర్వీస్ రోడ్డు పక్క నుంచి పొలాలకు వెళ్లే దారి ఇస్తామని చెప్పి, ఇవ్వకుండా సర్వీసు రోడ్డు నిర్మాణం చేపట్టారన్నారు. అలాగే హైవే పక్కనే ఉన్న కొంగల చెరువు సర్ప్లస్ వాటర్ దిగువ ప్రాంతాలకు వెళ్లే మురుగు కాలువను పూడ్చడంతో వరద నీరు పొలాలను ముంచెత్తుతోందన్నారు. వ్యవసాయ పనులకు సీజన్ ప్రారంభమైందని, పొలాలకు వెళ్లే మార్గం లేకుంటే నష్టపోతామన్నారు. రైతులు వామిశెట్టి హరిబాబు, గొల్లపూడి శ్రీనివాసరావు, సీలం వెంకటరాజు, బొచ్చు శ్రీను పాల్గొన్నారు. పాఠశాలల్లో ప్రవేశాలపై ప్రత్యేక శ్రద్ధ ఏలూరు(మెట్రో): అంగన్వాడీ కేంద్రాల్లోని ఐదేళ్లు నిండిన పిల్లలందరినీ ప్ర భుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. శుక్రవారం జీరో ఎన్రోల్మెంట్ కలిగిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, ఐసీడీఎస్ అధికారులతో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జీరో నమోదు ఉన్న పాఠశాలల హెచ్ఎంలు అంగన్వాడీ కేంద్రాల్లో ఐదేళ్లు నిండిన పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు చేసేందుకు కృషి చేయాలన్నారు. హేబిటేషన్లో పిల్లలు లేరని పేర్కొన్న మండల విద్యాశాఖ అధికారులు, సీడీపీఓలు ఈ మేరకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఐసీడీఎస్ పీడీ పి.శారద, డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ, డీవైఈఓలు, ఎంఈఓలు సీడీపీఓలు పాల్గొన్నారు. డీఎస్సీ పరీక్షలకు 503 మంది హాజరు ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరులో శుక్రవారం జరిగిన డీఎస్సీ పరీక్షలకు 503 మంది అభ్యర్థులు హాజరయ్యారు. సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో ఉదయం 100 మందికి 74 మంది, మధ్యాహ్నం 100 మందికి 81 మంది, సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 204 మందికి 173 మంది, మధ్యాహ్నం 205 మందికి 175 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు. మీటర్ రీడర్ల సమస్యలు పరిష్కరించాలి ఏలూరు (టూటౌన్): విద్యుత్ మీటర్ రీడర్ల సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ డాంగే డిమాండ్ చేశారు. శుక్రవారం ఏపీ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సమావేశాన్ని ఏలూరులో యూనియన్ జిల్లా కోశాధికారి మల్లేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. జిల్లా గౌరవ అధ్యక్షుడు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ డాంగే, జిల్లా నాయకులు పి.కిషోర్ మాట్లాడుతూ ఎస్క్రో అకౌంట్ను తక్షణమే ఓపెన్ చేయాలని, మీటర్ రీడర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి చూ పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షుడు పి.జాకబ్ మాట్లాడుతూ మీటర్ రీడర్లు కాంట్రాక్టర్లు, విద్యుత్ శాఖ అధికారులతో పలు సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. సహాయ కార్యదర్శులు ఎ.దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. కోకో రైతులకు ప్రోత్సాహం ఏలూరు(మెట్రో): ప్రభుత్వం అందిస్తున్న ప్రో త్సాహం ద్వారా కోకో గింజలు అమ్మే రైతులు ఈనెల 30లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఎస్.రామ్మోహన్ ప్రకటనలో తెలిపారు. కిలోకు కిలో కంపెనీలు రూ.450, ప్రభుత్వ ప్రోత్సాహం రూ.50 మొత్తంగా రూ.500 చెల్లిస్తారన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 1,536 టన్నుల కోకో గింజలను కొనుగోలు చేశారన్నారు. రైతులు ప్రభుత్వ ప్రోత్సాహాన్ని వినియోగించుకోవాలన్నారు. -
జయ జయహో జగన్నాథ
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల చిన వెంకన్న క్షేత్ర దత్తత ఆలయం లక్ష్మీపురంలోని సంతాన వేణుగోపాల జగన్నాథ, వేంకటేశ్వర స్వామి ఆలయంలో జగన్నాథరుని దివ్య రథోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏటా పూరీలో మాదిరిగా ఇక్కడ రథయాత్రను నిర్వహిస్తారు. ఈ ఏడాది ఉత్సవాల ప్రారంభాన్ని పురస్కరించుకుని ఆలయం నుంచి ద్వారకాతిరుమల క్షేత్రానికి రథయాత్ర నిర్వహించారు. సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథుని దారు విగ్రహాలను రథంలో వేంచేపు చేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ రథం ముందుకు సాగింది. ఆలయ యాగశాలలో స్వామివారు మత్స్యావతార అలంకారంలో దర్శనమిచ్చారు. ఉదయం ఈఓ ఎన్వీ సత్యనారాయణమూర్తి దంపతులు ఆలయంలో పూజలు చేయించారు. వచ్చేనెల 6 వరకు రోజుకో అలంకారంలో స్వామివారు దర్శనమివ్వనున్నారు. -
మాజీ ఎమ్మెల్యే దృష్టికి కొల్లేరు సమస్యలు
దెందులూరు: కొల్లేరులోని పలు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరికి వడ్డీల కార్పొరేషన్ రాష్ట్ర మాజీ చైర్మన్ ముంగర సంజీవ్కుమార్, కొల్లేరు నాయకులు తెలియజేశారు. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే కార్యాలయంలో కొల్లేరు నాయకులు ఆయన్ను కలిశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల్లో వివక్ష, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై వేధింపులు, అక్రమ కేసులను అబ్బయ్యచౌదరి దృష్టికి తీసుకువచ్చారు. పార్టీ శ్రేణులతో పాటు ప్రజలందరికీ వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని అబ్బయ్యచౌదరి భరోసా ఇచ్చారు. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు తేరా ఆనంద్, కార్పొరేషన్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ ప్రభాకర్ రావు, మాదేపల్లి సర్పంచ్ కొరపాటి ప్రభుదేవా, పార్టీ జిల్లా కార్యదర్శి ప్రేమ్బాబు, కొల్లేరు నాయకులు ఉన్నారు. -
బడి దూరం.. చదువు భారం
జల విద్యుత్ కేంద్ర పనుల పరిశీలన పోలవరం ప్రాజెక్ట్ పూర్తయ్యే సమయానికి జల విద్యుత్ కేంద్రాన్ని కూడా సిద్ధం చేయాలని ఏపీ జెన్కో డైరెక్టర్ (హైడల్) ఎం.సుజయ్కుమార్ అన్నారు. 8లో uశనివారం శ్రీ 28 శ్రీ జూన్ శ్రీ 2025సాక్షి ప్రతినిధి, ఏలూరు: విలీనం పేరుతో విద్యాలయాలు విచ్ఛిన్నం చేశారు. చెట్టుకొకరు.. పుట్టకొకరు అనే రీతిలో ఒక్కో విద్యార్థిని ఒక్కో బడిలో చేర్చారు. అది కూడా సమీపంలో కాదు 5, 8, 10 కిలోమీటర్ల దూరంలోని పాఠశాలల్లో విలీనం చేయడంతో పేద విద్యార్థులకు కష్టాలు మొదలయ్యాయి. పూర్వంలో కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లి చదువుకున్నారనే విషయాన్ని పెద్దలు చెబుతుంటారు.. మళ్లీ కూటమి ప్రభుత్వం ఆచరణలో చూపడంతో విద్యార్థుల తల్లిదండ్రులు మొదలు టీచర్ల వరకూ సర్వత్రా మండిపడుతున్నారు. విలీనం పేరుతో ఏలూరు జిల్లాలో 297 పాఠశాలలను విజయవంతంగా మాయం చేశారు. 1,788 బడులు.. 1,27,699 మంది పిల్లలు జిల్లాలో 1 నుంచి 10వ తరగతి వరకు 1,788 ప్రభుత్వ పాఠశాలల్లో 1,27,699 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ క్రమంలో గత ప్రభుత్వ హయాంలో విద్యారంగానికి పెద్దపీట వేశారు. వందల కోట్లతో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చి పాఠశాలల రూపురేఖలు మొదలు బోధనా రంగం వరకు అన్ని వ్యవస్థల్లో గుణాత్మక మార్పులు తీసుకువచ్చారు. ప్రధానంగా బడికి పిల్లలు వెళితే తల్లుల ఖాతాల్లో ఏటా అమ్మఒడి పేరుతో నాలుగేళ్ల కాల వ్యవధిలో రూ.1,069.26 కోట్లకుపైగా జమ చేశారు. జగనన్న విద్యాకానుక పేరుతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు షూ మొదలు యూనిఫామ్స్ వరకు ఉచితంగా అందజేశారు. నాడు–నేడు పేరుతో జిల్లాలో రెండు విడతల్లో రూ.414.48 కోట్ల వ్యయంతో 1,488 పాఠశాలల రూపురేఖలను మార్చారు. ఇవి కాకుండా విద్యార్థులకు ట్యాబ్లు, ఇంగ్లిష్ విద్యాబోధన, డిజిటల్ క్లాస్రూమ్లు ఇలా అన్నింటినీ అందుబాటులోకి తెచ్చి సమూల మార్పులు తీసుకువచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యారంగంపై కక్ష కట్టింది. కొత్త కొత్త నియమ నిబంధనలు, అడ్డగోలు విఽధి విధానాలతో పాఠశాలల విలీనానికి తెరతీసింది. న్యూస్రీల్ఇష్టానుసారం విలీనం.. విద్యార్థులకు దూరాభారంజిల్లాలో 297 పాఠశాలలను అడ్డగోలు నిబంధనల పేరుతో విలీనం చేశారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలను 9 రకాల పాఠశాలలుగా మార్చారు. వీటిలో శాటిలైట్ పాఠశాలలు 7, ఫౌండేషన్ పాఠశాలలు 127, బేసిక్ ప్రైమరీ పాఠశాలలు 928, మోడల్ ప్రైమరీ పాఠశాలలు 297, ప్రాథమికోన్నత పాఠశాలలు 78, ఉన్నత పాఠశాలలు 241లుగా మార్చారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని, ఒకే ఊరిలో రెండు స్కూల్స్ ఉంటే వాటిలో విద్యార్థులను, ఉపాధ్యాయులను ఒకే స్కూల్కు మార్చడం ఇలా ఇష్టానుసారంగా మార్చడంతో విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే సమస్యలు మొదలయ్యాయి. దీనిపై మండల స్థాయిలో తల్లిదండ్రులు అభ్యంతరాలు తెలిపి స్థానిక అధికారులకు ఫిర్యాదులు చేసినా ఎవరూ స్పందించని పరిస్థితి.విద్యార్థులకు విలీన కష్టాలు విలీనం పేరుతో పాఠశాలలు విచ్ఛిన్నం జిల్లాలో 297 బడులు విలీనం కిలోమీటర్ల దూరంలో ఉన్న హైస్కూళ్లల్లోకి కొన్ని.. 5 నుంచి 10 కిలోమీటర్ల దూరంలోకి మరికొన్ని.. విలీన వ్యవహారంపై సర్వత్రా మండిపాటు ఫిర్యాదుల వెల్లువ.. స్పందించని అధికారులు