breaking news
Eluru
-
శ్రీవారి తిరువీధి సేవలు ప్రారంభం
ఉభయ దేవేరులు, గోదాదేవితో ఊరేగిన స్వామివారు క్షేత్ర పురవీధుల్లో తొళక్క వాహనంపై ఉభయ దేవేరులు, గోదాదేవితో ఊరేగుతున్న శ్రీవారు ధనుర్మాస మండపంలో స్వామి, అమ్మవార్లకు హారతులిస్తున్న అర్చకులు ద్వారకాతిరుమల: ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి తిరువీధి సేవలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు ఉభయ దేవేరులు, గోదాదేవితో కలసి తొళక్క వాహనంపై క్షేత్ర పురవీధుల్లో అట్టహాసంగా ఊరేగారు. ముందుగా ఆలయంలో అర్చకులు స్వామి, అమ్మవార్లు, గోదాదేవి ఉత్సవ మూర్తులను తొళక్క వాహనంపై ఉంచి ప్రత్యేక పుష్పాలంకారాలు చేశారు. పూజాధికాలు అనంతరం హారతులిచ్చారు. ఆ తరువాత శ్రీవారి వాహనం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణలు, గజ, అశ్వ సేవలు, భక్తుల గోవింద నామస్మరణల నడుమ ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా పురవీదులకు పయనమైంది. ప్రతి ఇంటి ముంగిట భక్తులు శ్రీవారు, అమ్మవార్లకు నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రధాన కూడలిలోని ధనుర్మాస మండపంలో స్వామి, అమ్మవార్లు, గోదాదేవికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు తీర్ధ ప్రసాదాలను పంపిణీ చేశారు. -
అకడమిక్ సంస్కరణలు అమలు చేయాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రవేశపెట్టిన అకడమిక్ సంస్కరణలను అన్ని కళాశాలల్లో అమలు చేయాలని బోర్డు అసిస్టెంట్ ప్రొఫెసర్ జీ.నరసింహరావు సూచించారు. అకడమిక సంస్కరణలు, ప్రశ్నా పత్రాల కూర్పు, పరీక్షల నిర్వహణ, విధి విధానాలకు సంబంధించి జిల్లాలోని అన్ని జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్, జూనియర్ లెక్చరర్లకు, బోధనేతర సిబ్బందికి బుధవారం స్థానిక సెయింట్ థెరిస్సా జూనియర్ కళాశాలలో ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కే యోహాను అధ్యక్షతన అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. నరసింహరావు మాట్లాడుతూ మొదటి సంవత్సరం విద్యార్థులందరికి ఈ అకడమిక్ సంస్కరణలు ప్రకారం మారిన సిలబస్, మార్కుల నమూనాలను వివరించారు. వచ్చే జనవరి 21 నుంచి జరగబోయే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలలో విధుల్లో పాల్గొనే సిబ్బందికి పరీక్షల నిర్వహణ, ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాల ఏర్పాటు, బోర్డు నియమ నిబంధనలపై పలు సూచనలు ఇచ్చారు. -
గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి
బుట్టాయగూడెం: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల, వసతిగృహాల్లో చదువుతున్న గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బుజ్జిరెడ్డి అన్నారు. తొలిసారి బుట్టాయగూడెం మండలంలోని గిరిజన గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కేఆర్పురం ఐటీడీఏను సందర్శించి పథకాలపై ఆరా తీశారు. అదేవిధంగా మండలంలోని రాజానగరం ఆశ్రమ పాఠశాలను సందర్శించి 10వ తరగతి విద్యార్థులతో పాఠ్యాంశాల వివరాలను, మెనూ అమలుపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేఆర్పురం సచివాలయంను సందర్శించారు. అలాగే ఐటీడిఏ సమీపంలో ఉన్న గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో జరిగే పరీక్షల్లో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలన్నారు. అలాగే వసతిగృహాల్లో ఏఎన్ఎంల ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. వసతిగృహాల్లో పాఠశాలలో ఉన్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. కేఆర్పురం ఐటీడిఏ డీడీ పి.జగన్నాథరావు, డీవైఈఓ కె.రవిప్రసన్న కుమార్, సీఎంఓ సున్నం శ్రీనివాస్, ఏటీడబ్ల్యూఓ జి.జనార్థన్ పాల్గొన్నారు. ఎస్టీ కమిషనర్ చైర్మన్ రాత్రి ఐటీడీఏలోని గెస్ట్హౌస్లో బస చేశారు. గురువారం కూడా బుట్టాయగూడెం మండలంలోని గురుకుల పాఠశాల, తెల్లంవారిగూడెం, దొరమామిడి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను సందర్శిస్తారని అధికారులు తెలిపారు. మౌలిక వసతులు సక్రమంగా అందాలిపోలవరం రూరల్: గిరిజన విద్యార్థులకు వసతి గృహాల్లో మౌలిక వసతులు సక్రమంగా అందాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బొజ్జిరెడ్డి అన్నారు. బుధవారం పోలవరం మండలంలోని ఇటికలకోట, బోడిగూడెం, చేగొండిపల్లి గిరిజన సంక్షేమ వసతి గృహాలను ఆయన సందర్శించారు. ఆయన్ను ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. -
ప్రారంభమైన ఆస్పత్రి నిర్మాణ పనులు
బుట్టాయగూడెం: బుట్టాయగూడెం శివారు పద్మవారిగూడెం అల్లికాల్వ సమీపంలో నిలిపోయిన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పనులు ఎట్టకేలకు మొదలయ్యాయి. గత వైఎస్సార్సీపీ పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ఆస్పత్రి నిర్మాణానికి సుమారు రూ.50 కోట్లతో 146 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని మంజూరు చేశారు. 2020 అక్టోబర్ 2వ తేదీన పనులు ప్రారంభించేందుకు శంకుస్థాపన చేశారు. ఫేజ్–1లో ఆస్పత్రి భవనం, ఫేజ్–2లో స్టాఫ్ క్వార్టర్స్, ఫేజ్–3 పేషెంట్స్ అటెన్డెన్స్ భవనాల నిర్మాణం చేపట్టారు. మొదటి ఫేజ్ భవనం స్లాబ్ వరకూ పూర్తి అయ్యింది. మిగిలిన పనులు వివిధ స్థాయిల్లో ఉన్నాయి. జరిగిన పనులను సుమారు రూ. 12 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు తెలిపారు. అగిపోయిన పనులు చేపట్టాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు జెట్టి గురునాథరావు, సర్పంచ్లు, ఎంపిటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రి నిర్మాణం ప్రారంభమైంది. సరిహద్దు పనులు, అలాగే ఫేజ్ –2లో నిలిచిన స్టాఫ్ క్వార్టర్స్, పేషెంట్స్, అటెన్డెన్స్ భవనాల పనులు జరుగుతున్నాయి. -
బైక్ల చోరీ ముఠా అరెస్ట్
ద్వారకాతిరుమల: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో బైక్లను చోరీ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేసి, వారి నుంచి 12 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్స్టేషన్లో ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్ కుమార్, ఎస్సై టి.సుధీర్ బుధవారం వివరాలను వెల్లడించారు. ద్వారకాతిరుమలకు చెందిన పెద్దింటి రామ కిషోర్ ఈనెల 12న రాత్రి పంచాయతీ కార్యాలయం ఎదురుగా ఉన్న తన వెల్డింగ్ షాపు ముందు బైక్ను పార్క్ చేశాడు. అది చోరీకి గురవడంతో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన ఎస్సై సుధీర్ భీమడోలు సీఐ యూజే విల్సన్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా భీమడోలుకు చెందిన అడ్డాల ప్రవీణ్ కుమార్, పాగోలు శివ నాగు, భీమవరం మండలం గొల్లవానితిప్పకు చెందిన దోనాద్రి సాయి వంశీ ద్వారకాతిరుమల పోలీస్స్టేషన్ పరిధిలో 3 బైక్లు, ఏలూరు వన్టౌన్, దెందులూరు, పెదపాడు, చేబ్రోలు, నిడమర్రు, తాడేపల్లిగూడెం, ఆకివీడు పోలీస్టేషన్ల పరిధిలో మరో 9 బైక్లు చోరీ చేసినట్టు గుర్తించారు. ఆ ముగ్గురిని అరెస్టు చేసి, రూ.9 లక్షలు విలువైన 12 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా దోనాద్రి వంశీపై భీమవరం పోలీస్స్టేషన్లో పలు కొట్లాట కేసులు, ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్నట్టు నిర్ధారించారు. కేసు దర్యాప్తుకు సహకరించిన సీఐ విల్సన్, ఎస్సై సుధీర్, సిబ్బంది సీహెచ్ లక్ష్మీనారాయణ, ఎం.వెంకటేశ్వరరావు, వి.జయప్రకాష్ బాబులను డీఎస్పీ శ్రావణ్ కుమార్ అభినందించారు.రూ.9 లక్షల విలువైన 12 బైక్లు స్వాధీనం -
ఏపీపీఆర్ఎంఈఏ కార్యవర్గం ఎన్నిక
ఏలూరు(మెట్రో): జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయ ప్రాంగణంలోని పంచాయత్ రాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ భవనంలో ఏపీపీఆర్ఎంఈఏ పరిషత్ యూనిట్కు 2025–28 పదవీకాలానికి నూతన కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల అధికారిగా కె.యోహాను, పరిశీలకులుగా ఎం.యజ్ఞసంతోష్ వ్యవహరించారు. 07 పదవులకు, 04 జిల్లా కౌన్సిల్ సభ్యుల పదవులకు ఒక్కొక్క నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. అధ్యక్షుడిగా కేవీ జాన్సన్ (పరిపాలనాధికారి), అసోసియేట్ అధ్యక్షుడిగా కె.ప్రసన్న (సీనియర్ అసిస్టెంట్), ఉపాధ్యక్షురాలు ఎం.అన్నపూర్ణ (జూనియర్ అసిస్టెంట్), ప్రధాన కార్యదర్శి కె.డేవిడ్ హనన్య (జూనియర్ అసిస్టెంట్), ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏఎస్ఎన్.మల్లేశ్వరరావు (టైపిస్ట్), అదనపు కార్యదర్శి ఆర్.కళ్యాణి (సీనియర్ అసిస్టెంట్), ట్రెజరర్ బి.శ్రావ్య యాదవ్ (జూనియర్ అసిస్టెంట్), జిల్లా కౌన్సిల్ సభ్యులుగా (కో–ఆప్షన్) పి.సాయిరాజేష్, యు.నాగలక్ష్మి, జె.శ్రీనివాసరావు, ఎం.స్నేహ ఎన్నికయ్యారు. భీమవరం: భీమవరం పట్టణంలోని ఏవీజీ సినిమాస్లో బుధవారం మోగ్లీ చిత్ర యూనిట్ సందడి చేసింది. నటీనటులు రోషన్ కనకాల, సాక్షి మండోల్కర్, హర్ష ప్రేక్షకులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా రోషన్, సాక్షి మాట్లాడుతూ మూడు రోజుల క్రితం విడుదలైన ఈ చిత్రం విశేష ఆదరణ పొందుతుండడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ముందుగా చిత్రబృందం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) నివాసానికి వెళ్లి కొద్దిసేపు గడిపారు. చింతలపూడి: జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత ఆదేశాలపై సీఐ క్రాంతి కుమార్ పర్యవేక్షణలో చింతలపూడి మండలం, ఎరగ్రుంటపల్లి అడవి ప్రాంతంలో నాటుసారా స్థావరాలపై చింతలపూడి పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. నాటుసారా కాస్తున్న యర్రగుంటపల్లి గ్రామానికి చెందిన కటారి కోటేశ్వరరావు, గొల్ల మంగరావు, వనం కొండలరావులను అదుపులోకి తీసుకుని, 40 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై సతీష్ కుమార్ తెలిపారు. 200 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశామన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. భీమవరం: కర్ణాటకలోని మంగళూరులో నిర్వహించే 69వ జాతీయస్థాయి అండర్–19 స్కూల్ గేమ్స్ నిర్మల్ పోటీలకు రాష్ట్ర జట్టుకు భీమవరం బ్రౌనింగ్ కళాశాల విద్యార్థినులు జి లిఖిత, ఎన్ వర్షితలక్ష్మీ భద్ర ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపాల్ కె నవీన్ కుమార్ బుధవారం తెలిపారు. ఈనెల 24 నుంచి ఆరు రోజులపాటు జరగనున్న నెట్ బాల్ అండర్–19 జాతీయస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారన్నారు. -
తీరంలో మళ్లీ విషపు ఈగల పంజా
నరసాపురం: నరసాపురం తీరప్రాంత గ్రామాల్లో విషపుటీగలు మళ్లీ పంజా విప్పుతున్నాయి. దీంతో గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. బుధవారం నరసాపురం మండలం సారవలో తాటిచెట్ల ఆకుల మధ్య పెద్ద విషపుటీగల పుట్టలను గ్రామస్తులు గురించారు. రెవిన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు ఏమాత్రం స్పందించలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల క్రితం తీరగ్రామాలైన వేములదీవి, తూర్పుతాళ్లు, పేరుపాలెం, కేపీపాలెం ప్రాంతాల్లో విషపుటీగలు భయపెట్టాయి. దాడిచేసి కుట్టడంతో గ్రామాలకు చెందిన 30 మంది తీవ్రమైన జ్వరం, తలనొప్పి, వాపులతో ఇబ్బందులు పడ్డారు. విషపుటీగల భయం లేకుండా చర్యలు చేపట్టాలని తీర గ్రామాల వాసులు డిమాండ్ చేస్తున్నారు. -
శ్రీవారి ఉత్తర ద్వార దర్శనానికి చురుగ్గా ఏర్పాట్లు
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 30న జరగనున్న చినవెంకన్న ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఇప్పటికే ఆలయ తూర్పు ప్రాంతంలోని షాపింగ్ కాంప్లెక్స్ వెనుక చేపట్టిన తాత్కాలిక క్యూలైన్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ప్రాంతంలో ఈ క్యూలైన్ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్ కుమార్ బుధవారం భీమడోలు సీఐ యూజే విల్సన్, ద్వారకాతిరుమల ఎస్సై టి.సుధీర్తో కలసి ఏర్పాట్లను పరిశీలించారు. -
మట్టి అరకమ రవాణా
బైక్ల చోరీ ముఠా అరెస్ట్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో బైక్లను చోరీ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేసి, వారి నుంచి 12 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 8లో uకొయ్యలగూడెం: మట్టి రవాణా అక్రమార్కులకు చింతలపూడి ఎత్తిపోతల పథకం కాలువ గట్టు అక్షయపాత్రలా మారింది. దీంతో గత మూడు రోజుల నుంచి రాత్రి వేళల్లో లారీ టిప్పర్లను ఏర్పాటు చేసి జేసీబీల సహాయంతో మట్టి రవాణా చేస్తున్నారు. దిప్పకాయలపాడు గ్రామానికి చెందిన గంగరాజు, విజయకుమార్లు ఏర్పాటు చేసిన లారీ టిప్పర్లలో భారీగా మట్టిని తరలిస్తున్నాయి. మంగపతిదేవిపేట గ్రామానికి చెందిన రామకృష్ణ జేసీబీ కాలువ గట్టును కొల్లగొడుతొందని రైతులు పేర్కొంటున్నారు. ఇప్పటికే అరవై శాతానికి పైగా కాలువ గట్టును అక్రమార్కులు మింగేసారని బుల్లింపేట, యర్రాయిగూడెం గ్రామాలకు చెందిన గిరిజనలు ఆరోపించారు. మంగపతిదేవిపేట రెవెన్యూ అధికారులు, సిబ్బంది లేని సమయాన్ని చూసి అక్రమార్కులు తెల్లవారుజాము వరకు మట్టిని టిప్పర్లలో తరలించడం వలన గ్రామాలలో పశువులు బెదిరి పారిపోతున్నాయని రైతులు పేర్కొన్నారు. టిప్పర్ల వల్ల రోడ్లు దెబ్బతింటున్నాయని, పండిన పంట ధాన్యాన్ని తెచ్చుకోలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు. -
పారా గేమ్స్లో ప్రతిభ
జంగారెడ్డిగూడెం: ఇటీవల దుబాయ్లో జరిగిన ఏషియన్ యూత్ పారా గేమ్స్–2025లో జంగారెడ్డిగూడెంకు చెందిన బుడిగిన రవి కార్తీక్ ఆరు పతకాలు సాధించారు. బుధవారం స్థానిక సాయిబాలాజీ టౌన్ షిప్లో విలేకరుల సమావేశంలో రవి కార్తీక్, ఆయన తండ్రి నాగేంద్ర కుమార్ వివరాలు వెల్లడించారు. స్విమ్మింగ్ 100 మీటర్ల బ్రెస్ట్, బ్యాక్ స్ట్రోక్, 200 మీటర్ల ఐఎం విభాగాల్లో మూడు గోల్డ్ మెడల్స్, 50, 100 మీటర్ల ఫ్రీ స్టైల్, 100 మీటర్ల బ్యాక్ స్ట్రో విభాగాల్లో వెండి పతకాలను రవికార్తీక్ సాధించాడన్నారు. 2028 ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించడమే తన ప్రధాన లక్ష్యమని రవి కార్తీక్ తెలిపారు. ఏలూరు రూరల్: జనవరి 5వ తేదీ నుంచి 10 వరకూ దాదర్, హవాలీనగర్తో పాటు డామన్, డయులో ఇండియా బీచ్గేమ్స్ జరగనున్నాయని ఏలూరు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి ఎస్ఏ అజీజ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా బీచ్ వాలీబాల్, సపక్తక్ర, బీచ్ కబడ్డీ పోటీలు జరుగుతాయని వివరించారు. ఈ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్లును విజయవాడలో ఓపెన్ కేటగిరిలో ఈ నెల 19వ తేదీన ఎంపిక చేస్తారన్నారు. వివరాలకు 98661 34016 నంబరులో సంప్రదించాలని సూచించారు. -
పరిహారంలో గందరగోళం
గురువారం శ్రీ 18 శ్రీ డిసెంబర్ శ్రీ 2025సాక్షి ప్రతినిధి, ఏలూరు: పోలవరం నిర్వాసితుల పట్ల అధికారుల నిర్లక్ష్య ధోరణి పరాకాష్టకు చేరింది. నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పోలవరం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ పంపిణీ తీవ్ర గందరగోళానికి దారి తీసింది. ఇంటి విలువ (స్ట్రక్చర్ వాల్యూస్) పరిహారం పంపిణీలో నిజమైన నిర్వాసితులను అధికారులు నిలువునా ముంచుతున్నారు. కొంతమంది నిర్వాసితులకు రావాల్సిన ఇంటి విలువల పరిహారాన్ని కుదించి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నారు. మరికొంతమంది ఒకే ఇంటి విలువను రెండు సార్లు జమచేస్తూ, మళ్ళీ రికవరీ చేస్తూ నిర్వాసితుల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో మొత్తం 3,500 నిర్వాసితులకు ఇంటి విలువ పరిహారం రూ.105 కోట్లు మంజూరు చేశారు. ఇందులో 3002 మంది నిర్వాసితులకు బిల్లు పెట్టగా, 498 మందికి ఇంకా బిల్లులు పెట్టాల్సి ఉంది. అసలు పూర్తి పరిహారం పొందాల్సిన నిర్వాసితుడి ఇంటికి అరకొరగా నష్ట పరిహారం చెల్లిస్తున్నారు. మరోచోట అసలు పరిహారం కన్నా ఇంటి పరిహారాన్ని రెండు సార్లు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నారు. తిరిగి మళ్ళీ రికవరీ చేస్తున్నారు. గందరగోళంలో నిర్వాసితులు వేలేరుపాడు సంత బజారులో అవార్డు నంబర్ 328, 329, 330, 331, 332లో కోటా శాంతిశ్రీ పేర ఉన్న పక్కా భవనాలకు రూ.49.22 లక్షలు రావాల్సి ఉండగా నవంబర్ 18న రూ.74.19 లక్షలు పేమెంట్ చేసి, నవంబర్ 25న రూ.24.93 లక్షలు రికవరీ చేశారు. జగన్నాధపురంలో అవార్డు నంబర్ 32లో పాడుగుల ఈశ్వరికి చెందిన పక్కాభవనానికి రూ.26.88 పరిహారం చెల్లించాల్సి ఉండగా, రూ.6 లక్షల పరిహారాన్ని నవంబర్ 28న చెల్లించారు. మిగతా పరిహారం ఈ నెల 2న చెల్లించారు. కుక్కునూరు మండలంలో ఏడుగురు నిర్వాసితుల ఇళ్లకు డబుల్ పేమెంట్ చేసి పదిరోజుల తర్వాత రికవరీ చేశారు. ఇక్కడ మరో నిర్వాసితుడి ఇంటికి పది లక్షలు చెల్లించాల్సి ఉండగా రూ. 20 లక్షలు చెల్లించారు. అధికారులు ఎక్కడ రికవరీ చేస్తారో అని సదరు నిర్వాసితుడు ఊరి వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. చీరవల్లి మాధారంలో ఎస్ఈఎస్ నంబర్ 2/96లో ఇంటికి రూ.1.02 లక్షలు ఇంటి పరిహారం చెల్లించాల్సి ఉండగా, రూ.14 లక్షలు చెల్లించారు. ఇదే గ్రామంలో ఎస్ఈఎస్ నంబర్ 1/45 లో ఉన్న ఇంటికి 1,49,068 చెల్లించాల్సి ఉండగా రూ.14 లక్షలు చెల్లించారు. ఇకనైనా అధికారులు మేల్కొని నిర్వాసితులకు చెల్లించాల్సిన అసలు పరిహారం అందించి, న్యాయం చేయాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. జమ, రికవరీలతో నిర్వాసితుల్లో తీవ్ర ఆందోళన ఇంటి విలువ, పరిహారాల్లో భారీ కోతలు మునిగిపోతున్న నిర్వాసితులు అధికారుల నిర్లక్ష్యంతోనే అసలు సమస్య వేలేరుపాడు మండల కేంద్రంలో ఎస్ఈఎస్ నంబర్ 230, అవార్డు నంబర్ 390లో తుమ్మల రాజశేఖర్కు చెల్లించాల్సిన ఇంటి విలువ రూ.21.36 లక్షలు ఉండగా, అధికారులు చేసిన తప్పిదం వల్ల రూ.2 లక్షలు మాత్రమే జమ చేశారు. మిగతా రూ. 19.36 లక్షలు చెల్లించలేదు. అదేంటని ప్రశ్నిస్తే సరైన సమాధానం ఇవ్వడం లేదని బాధితుడు వాపోతున్నాడు. వేలేరుపాడులో అవార్డు నంబర్ 621లో పొంగులూరి సాంబశివరావు ఇంటికి రూ.9.59 లక్షలు పరిహారం జమచేయాల్సి ఉండగా, రూ.19.18 లక్షలు జమచేశారు. మళ్ళీ హడావుడిగా రికవరీ చేశారు. అదే గ్రామంలో అవార్డు నంబర్ 578లో షేక్ మహుబూబున్నిసా ఇంటికి రూ.6.18 లక్షలు వేయాల్సి ఉండగా, రూ.12.36 లక్షలు జమ చేసిమళ్ళీ రికవరీ చేశారు. అవార్డు నంబర్ 547లో కరకా వెంకమ్మకు రూ.2.53 లక్షలు జమ కావాల్సి ఉండగా రూ. 5.6 లక్షలు జమ చేశారు. రూ. 1.3 లక్షలు మాత్రమే రికవరీ చేశారు. మిగతా సొమ్ములు బాధితులు ఖర్చు చేయడంతో అధికారులు ఏమీ చేయలేకపోతున్నారు. -
పది పరీక్షల కార్యాచరణ సవరించాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): పదో తరగతి పబ్లిక్ పరీక్షల నేపధ్యంలో విద్యార్థులకు అమలు చేస్తున్న నూరు రోజుల కార్యాచరణ ప్రణాళిక అసంబద్ధంగా ఉందని, సవరణలు చేయాలని ఏపీటీఎఫ్ నాయకులు విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మను కోరారు. బుధవారం ఏపీటీఎప్ నాయకులు డీఈఓకు వినతిపత్రం సమర్పించారు. సెలవు రోజుల్లో కూడా తరగతులు నిర్వహించాల్సి వస్తోందని, సెలవు రోజుల్లో విధులకు హాజరైన ఉపాధ్యాయులకు సీసీఎల్ మంజూరు చేయాలని కోరారు. అదనపు సమయంలో పరీక్ష నిర్వహించి విద్యార్థులకు వచ్చిన మార్కులను ఆన్లైన్ చేయడం వల్ల ఉపాధ్యాయులకు అదనపు భారం తప్ప విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఒకే కార్యాచరణ కాకుండా విద్యార్థుల స్థాయిని బట్టి బోధించే అవకాశాన్ని ఉపాధ్యాయులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం సమర్పించిన వారిలో ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తాళ్ళూరి రామారావు, బీ రెడ్డిదొర, ఉపాధ్యక్షుడు డీకేఎస్ఎస్ ప్రకాష్, ఎం.వెంకటేశ్వర రావు, ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి అబ్బదాసరి శ్రీనివాస్, నగర అధ్యక్షుడు ఆనంద్ కుమార్ తదితరులు ఉన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లా కేంద్రం ఏలూరులో జరుగుతున్న టెట్ పరీక్షకు బుధవారం 323 మంది అభ్యర్థులు హాజరయ్యారు. నగరంలోని సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో ఉదయం జరిగిన పరీక్షకు 175 మందికి గాను 159 మంది హాజరు కాగా మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 176 మందికి గాను 164 మంది హాజరయ్యారు. ఈ పరీక్షలను ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పర్యవేక్షించారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులూ నమోదు కాలేదని విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు. ఏలూరు (టూటౌన్): బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో వంద రోజుల పాటు నిర్వహించే బాల్య వివాహాల నిరోధ చట్టాలపై అవగాహన సదస్సుల నిర్వహణ నిమిత్తం ఏలూరు పారా లీగల్ వాలంటీర్లతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కె.రత్న ప్రసాద్ మాట్లాడుతూ వలంటీర్లను గ్రామాలకు పంపి విచారణ జరిపి, కౌన్సిలింగ్ నిర్వహిస్తారని చెప్పారు. బాల్య వివాహాల సమాచారం తెలిస్తే 1098 లేదా 15200 నెంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఆర్టీసీ కార్గో సర్వీస్లో డోర్ డెలివరీ మాసోత్సవాలు ఈ నెల 20 నుంచి జనవరి 19 వరకు నిర్వహించనున్నట్టు జిల్లా ప్రజా రవాణా అధికారి షేక్ షబ్నం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిధిలోని ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు డిపోల నుంచి ఆంధ్రప్రదేశ్లోని 84 పట్టణాలలో 50 కేజీల వరకు బరువైన వస్తువులను 10 కి.మీ దూరం వరకు డోర్ డెలివరీ సౌకర్యం ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేశారు. క్రిస్మస్, జనవరి 1, సంక్రాంతి సందర్భంగా తమకు నచ్చిన వ్యక్తులకు కోరిన ప్రదేశాలకు సురక్షితంగా, వేగంగా డోర్ డెలివరీ చేస్తారని, చెప్పారు. తాడేపల్లిగూడెం: రైతులకు ఉపకరించే పరిశోధనలు చేయాలని కొత్తగా ఎంఎస్సీ హార్టీకల్చర్ కోర్సులో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఉద్యాన వర్సిటీ ఇన్చార్జి వీసీ డాక్టర్ కె.ధనుంజయరావు కోరారు. వెంకట్రామన్నగూడెంలోని ఉద్యాన కళాశాల, అనంతరాజుపేట ఉద్యాన కళాశాలల్లో ఎంఎస్సీ హార్టీకల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి ఇక్కడ బుధవారం కౌన్సిలింగ్ జరిగింది. ఐసీఏఆర్ జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా కౌన్సిలింగ్ జరిగింది. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ క్షేత్ర స్థాయి అవగాహన పెంపొందించుకోవాలన్నారు. 110 సీట్లకు కౌన్సెలింగ్ జరగగా 81 మంది చేరారు. మిగిలిన 29 సీట్లకు తదుపరి కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. -
శ్రీవారి క్షేత్రం.. హిమ శోభితం
హిమ వర్షంలో.. సప్తగోకుల ప్రాంతం కొండపైన జంట గోపురాల ప్రాంతంలో మంచు తెరలుహిమ వర్షంలో ద్వారకాతిరుమలలోని శ్రీవారి క్షేత్రం తడిసి ముద్దవుతోంది. మంచు తెరల్లో క్షేత్రంలోని ప్రకృతి సోయగాలు చూపరుల మనస్సును హత్తుకుంటున్నాయి. బుధవారం ఉదయం 9 గంటల వరకు కూడా మంచు తెరలు వీడకపోవడంతో క్షేత్రానికి వివిధ వాహనాలపై విచ్చేసిన భక్తులు వాహన లైట్ల వెలుగుల్లోనే రాకపోకలు సాగించారు. పొగ మంచులోనే భక్తులు ఆలయానికి చేరుకుని శ్రీవారిని దర్శించారు. ఆలయ రాజగోపురాలు, కొండపైన సప్తగోకులం, జంట గోపురాల ప్రాంతం, సెంట్రల్ పార్కింగ్, శివాలయం, ఘాట్ రోడ్లు మంచు తెరలు కమ్ముకోవడంతో భక్తులు ఆ సోయగాలను చూసి ఆనంద పరవశం చెందారు. – ద్వారకాతిరుమల వాహన పూజల వద్ద మంచు పరదా కొండపైన లైట్ల వెలుగుల్లో వాహనాల రాకపోకలు -
● బేబీ కిట్స్ ఎక్కడ?
ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం చేయించుకుంటే శిశువులకు ప్రభుత్వం ఇచ్చే బేబి కిట్స్ ఇవ్వడం కూటమి ప్రభుత్వం మరిచిపోయింది. ప్రస్తుతం చలికాలం కావడంతో చేసేదేమిలేక రూ.400 నుంచి రూ.600 పెట్టి పేదలు బయట కొనుగోలు చేస్తున్నారు. మేము పేదలం... కూలీ నాలీ చేసుకుని బతికేవాళ్ళం.. అంత డబ్బు పెట్టి ఎలా కొనుగోలు చేసుకుంటామంటూ బాలింతల బంధువులు వాపోతున్నారు. ఏలూరు జీజీహెచ్ వద్ద బుధవారం కనిపించిన దృశ్యాలివి. – సాక్షి ఫొటోగ్రాఫర్/ఏలూరుటవల్లోనే నవశిశువు -
మన్యంలో వర్జీనియా పొగాకు సాగు
బుట్టాయగూడెం: ఏజెన్సీ, మెట్ట ప్రాంతంలో కాసులు కురిపించే వర్జీనియా పొగాకు పంట సాగు మన్యం ప్రాంతంలో ముమ్మరంగా సాగుతుంది. ప్రస్తుతం గిరిజన ప్రాంతంలో రైతులు జీడిమామిడి తోటలు తొలగించి పొగాకు సాగు చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం–1, 2, కొయ్యలగూడెం వేలం కేంద్రాల పరిధిలో ఇప్పటి వరకూ సుమారు 5,563 హెక్టార్లలో పొగాకు పంట సాగు చేస్తున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. జంగారెడ్డిగూడెం–1 పరిధిలో 2330 హెక్టార్లు, జంగారెడ్డిగూడెం–2 పరిధిలో 1,338 హెక్టార్లు, కొయ్యలగూడెం వేలం కేంద్రం పరిధిలో 1895 హెక్టార్లలో రైతులు వర్జీనీయా పంట సాగు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. బుట్టాయగూడెం మండలంలో అత్యధికంగా పొగాకు సాగు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఒక్కొక్క రైతు 100 నుంచి 200 ఎకరాల వరకూ వర్జినీయా పొగాకు సాగు చేస్తున్నారు. మన్య ప్రాంతంలో రబీ సీజన్కు సంబంధించి సాగుకు సిద్ధమయ్యారు. ప్రత్తి, మొక్కజొన్న పంటలు వేయగా అత్యధికంగా పొగాకు పంటను సాగు చేస్తున్నారు. -
అబ్బురపరుస్తున్న అరటి గెల
బుట్టాయగూడెం: అరటి చెట్టుకు గెలలు కాయడం కొత్తేమీ కాదు. సాధారణంగా అరటి గెలలు చెట్టు చివర్లో కొమ్మల మధ్య నుంచి పొడుచుకుని వస్తాయి. కాయలు పైకి చూస్తున్నట్టున్నా గెల కిందకు వేలాడుతూ ఉంటుంది. కానీ ఈ చిత్రం చూశారా? అరటిగెల కాండం మధ్యలో నుంచి వచ్చింది. పైగా గెల ఆకాశంవైపు ఎగబాగుతున్నట్లు పైకి చూపుతుంది. బుట్టాయగూడెం మండలం బూసరాజుపల్లిలోని ఐటీడీఏ ఉద్యోగుల క్వార్టర్స్లో నివాసం ఉంటున్న బుచ్చిరాజు అనే ఉద్యోగి ఇంట్లోని ఆవరణలో ఇలా అరటి చెట్టు కాండం మధ్య నుంచి పూతవచ్చి గెల వచ్చి అబ్బురపరుస్తోంది. -
పశువుల సంచారం.. ప్రాణ సంకటం
● విచ్చలవిడిగా సంచరిస్తున్న మూగజీవాలు ● నిత్యం ఏదో చోట వాహన ప్రమాదాలు ● పట్టించుకోని ప్రభుత్వం ఉండి: గోవులను పూజించడం మన ఆచారం. గృహప్రవేశాలకు సైతం మనిషికంటే ముందు గోమాత ఉండాలి. అలాంటి గోవుల సంరక్షణపై ఎవ్వరూ శ్రద్ధ వహించకపోవడం విచారకరం. ప్రభుత్వం సైతం పశువుల సంరక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం లేదు. దీంతో పశువులు విచ్చలవిడిగా రోడ్లపై సంచరిస్తున్నాయి. వాటి వల్ల కూడా నిత్యం ఏదో ఒక చోట ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వాహనాల వల్ల పశువులు కూడా మృత్యువాత పడుతున్నాయి. రోడ్లపైనే సంచారం.. నియోజకవర్గంలోని ఎన్నార్పీ అగ్రహారం నుంచి ఆకివీడు శివారు వరకు అలాగే కాళ్ల మండలం పెదఅమిరం మొదలుకొని జువ్వలపాలెం వరకు ఇలా ఎక్కడ చూసినా రోడ్లపై పదుల సంఖ్యలో ఆవులు దయనీయ పరిస్థితుల్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జాతీయ రహదారి 165తో పాటు పలు గ్రామాల్లోని ప్రధాన కూడళ్లలో నడిరోడ్డుపైనే జీవిస్తున్నాయి. దీంతో ప్రతి రోజూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఆవులను ఢీకొని పలువురు వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఆయా ప్రమాదాల్లో ఆవులు కూడా మృత్యువాత పడుతున్నాయి. వాటిని ఆయా పంచాయతీల వారు ఖననం చేయడం తప్ప వాటిని తీసుకువచ్చి వదిలేసిన వారు గానీ, జంతు ప్రేమికులు గానీ పట్టించుకోకపోవడంతో వాటి పరిస్థితి దారుణంగా ఉంది. మరికొన్ని గోవులు రోడ్డు ప్రమాదాల్లో గాయపడి అవయవాలు కోల్పోవడంతో వాటిని చూసేందుకు కూడా భయపడేంత దారుణ పరిస్థితుల్లో గోవులు ఉంటున్నాయి. ఆహారం లభించక ప్లాస్టిక్ కవర్లు తిని మృత్యువాత పడుతున్నాయి. పశువులకు హాస్టళ్లు ఎక్కడ? రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పశువులకు హాస్టళ్లు ఏర్పాటు చేస్తామని గతంలో ఓమాట చెప్పి ఊరకున్నారే తప్ప.. పశువుల కోసం చేసిందేమీ లేదు. ఇప్పటికై నా పశువుల కోసం హాస్టళ్లు ఏర్పాటు చేస్తే ఇలా బహిరంగ ప్రదేశాల్లో ఉండే పశువులను, గోమాతలను హాస్టళ్లలో ఉంచి కనీసం కడుపునిండా మంచి ఆహారం పెట్టే అవకాశం ఉంటుందని పలువురు సేవాసంస్థల ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఖాళీగా ఉండే ప్రభుత్వ స్థలాల్లో షెడ్లు ఏర్పాటు చేస్తే వాటికి నివాసస్థానమైనా ఏర్పడి ఎవరైనా వాటి ఆలనాపాలనా చూస్తారని పలువురు అభిప్రాయపడుతున్నారు. గోవులను రోడ్లపై విడిచిపెట్టే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. మూగజీవాలను బాధించడం మానవత్వం కాదు. పెంచుకోలేకపోతే మరెవ్వరికై నా అప్పగించాలే తప్ప ఇలా నడిరోడ్డుపై విడిచిపెట్టి అపచారం చేయకూడదు. లయన్స్క్లబ్, మానవత సేవాసంస్థ ఆధ్వర్యంలో అప్పుడప్పుడు గోవులకు మేతపెట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దాతల సహకారం దొరికితే మరింతగా కార్యక్రమాన్ని చేడతాం. – డాక్టర్ గాదిరాజు రంగరాజు, ఉండి మానవత సేవాసంస్థ అధ్యక్షుడు, చెరుకువాడ ఉండి సెంటర్, బస్టాండ్, ఆకివీడు రోడ్డులో పదుల సంఖ్యలో గోవులు, పశువులు దర్శనమిస్తాయి. వీటి సంఖ్య రోజురోజుకు పెరగడంతో రోడ్డు ప్రమాదాలు కూడా అధికంగా చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల లారీ ఢీ కొట్టడంతో గాయపడిన అవు దూడకు వైద్యం చేయించి సాధారణ స్థితికి తీసుకువచ్చాను. గోసంరక్షకులు పశువులను పట్టించుకోవాలి. – గుండాబత్తుల సుబ్బారావు, సీనియర్ రాజకీయవేత్త, ఉండి -
చిన్నారిపై కుక్క దాడి
జంగారెడ్డిగూడెం: కుక్క దాడిలో ఓ చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక శిఖామణి చర్చి సమీపంలో సాయిబాబ, పూర్ణిమ దంపతులు నివసిస్తున్నారు. వీరు బుధవారం పశువుల ఆసుపత్రి సమీపంలో ఉన్న చర్చి వద్ద ప్రేయర్ చేసుకుంటున్నారు. వారి మూడేళ్ల చిన్నారి శ్రీహరిత బయట ఆడుకుంటుండగా, ఆమైపె కుక్క దాడిచేసింది. దీంతో శ్రీహరిత ముఖంపై కంటి భాగంలోను తీవ్రంగా గాయాలయ్యాయి. చిన్నారి కేకలు విని బయటకు వచ్చి కుక్క దాడి నుంచి కాపాడారు. వెంటనే స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసి చిన్న పిల్లలు వైద్యులు అందుబాటులో లేకపోవడంతో స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లి మెరుగైన వైద్యం అందించారు. తాడేపల్లిగూడెం రూరల్: కుంచనపల్లిలోని ఓ ఇంట్లో జరిగిన చోరీపై కేసు నమోదు చేసినట్టు బుధవారం రూరల్ ఎస్సై జేవీఎన్.ప్రసాద్ తెలిపారు. కుంచనపల్లి వాసవి టౌన్ షిప్కు చెందిన వెలివెల లీలారాణి ఈ నెల 8వ తేదీన నల్లజర్ల మండలం పోతవరం కోకో తోట పనుల నిమిత్తం వెళ్లారు. తిరిగి బుధవారం ఉదయం లీలారాణి తన భర్త రాంబాబుతో ఇంటికి వచ్చే సరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడంతో లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని సుమారు 10 కాసుల బంగారం, వెండి సామాన్లు కనిపించలేదు. దీంతో బాధితురాలు లీలారాణి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
సైబర్ నేరంలో నిందితుడి అరెస్ట్
భీమవరం: డిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధ దంపతులను వేధించి రూ.99 లక్షలు మోసం చేసిన కేసులో నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు భీమవరం వన్టౌన్ సీఐ ఎం నాగరాజు చెప్పారు. మంగళవారం స్థానిక పోలీసుస్టేషన్లో ఎస్సై కే మోహనవంశీతో కలసి వివరాలను వెల్లడించారు. మహరాష్ట్రకు చెందిన 19 ఏళ్ల యువకుడు ప్రీతమ్ ధర్మేంద్రమౌర్య ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన భీమవరంలోని గంధం అపార్ట్మెంట్కు చెందిన వృద్ధ దంపతులకు ఫోన్ చేసి మీ పిల్లలను తీవ్రమైన కేసుల్లో ఇరికిస్తామంటూ బెదిరించాడు. డిజిటల్ అరెస్ట్ పేరుతో సుమారు రూ.99 లక్షలు కాజేశాడు. దీనితో సెప్టెంబర్ 10వ తేదీన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు ప్రీతమ్ ధర్మేంద్రమౌర్యను ఈనెల 15వ తేదీన అరెస్ట్ చేసి విచారించగా అంతర్జాతీయ సైబర్ నేరాల్లో కీలకంగా పనిచేసినట్లు తేలిందని సీఐ నాగరాజు చెప్పారు. ఈ కేసులో వివిధ బ్యాంక్ ఖాతాల్లో సుమారు రూ.14.11 లక్షలు ఫ్రీజ్ చేశామన్నారు. కేసును ఛేదనలో డీఎస్పీ ఆర్జీ జయసూర్య నేతృత్వంలో భీమవరం, ఉండి ఎస్సైలు కె మోహనవంశీ, నసీరుల్లా, రహమాన్, సిబ్బంది పి శ్రీనివాసరావు, ఎం.రామకృష్ణ, యోహోషువ కీలకంగా వ్యవరించినట్లు నాగరాజు చెప్పారు. -
రీసర్వేలో అవకతవకలపై రైతుల అసహనం
కాళ్ల: రీ సర్వేలో అవకతవకలపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. భూముల్లో విస్తీర్ణం తగ్గడంపై ఉన్నత అధికారులను ఆశ్రయించడంతో వారి ఆదేశాల మేరకు వచ్చిన సర్వే సిబ్బందికి తమగోడును వెళ్లబుచ్చుకున్నారు. రీసర్వేలో తమ పొలాల విస్తీర్ణం తగ్గిందని, ఇది భూమి యాజమాన్య హక్కులను ప్రభావితం చేస్తోందని మండల కేంద్రమైన కాళ్ల గ్రామానికి చెందిన తోట కృష్ణారావుతో పాటు పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ మంగళవారం విలేకరులతో మాట్లాడారు. వాస్తవంగా తమ భూమి క్షేత్రస్థాయిలో సక్రమంగానే ఉందని, తమ దగ్గర అన్ని రికార్డులు ఉన్నా, భూమిలో కొంతభాగం తగ్గించి చూపిస్తున్నారని, ఇది ముమ్మాటికీ అధికారులు తప్పిదమేనని ఆరోపించారు. గత 30 ఏళ్లుగా తగ్గని భూమి ఇప్పుడు ఎలా తగ్గిందని ప్రశ్నించారు. తాము ప్రైవేటు సర్వే చేయించుకుంటే తమ భూమి ఖచ్చితంగానే ఉందని, అప్పుడు లోపం ఎక్కడుందో తెలపాలన్నారు. ఏ సర్వే నెంబర్లో విస్తీర్ణం తగ్గితే ఆ సర్వే నెంబర్కు మాత్రమే ఇది వర్తింపజేయాలని మిగతా వారికి ఎలా వర్తింప చేస్తారని ప్రశ్నించారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు ఉన్నత అధికారులకు తమ సమస్యలను విన్నవించుకున్నామని, వారి ఆదేశాల మేరకు విచారణకు వచ్చిన అధికారులు సైతం తూతుమంత్రంగా వచ్చి మమ్మల్ని మభ్యపెట్టేందుకు చూస్తున్నారే తప్ప సమస్య పరిష్కారానికి కృషి చేయడం లేదన్నారు. గతంలో ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నట్లుగా తమ భూమి తమకు ఉండే విధంగా చేయాలని, లేనిపక్షంలో న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. -
నారసింహునికి పంచామృతాభిషేకాలు
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన ఐఎస్ జగన్నాధపురంలోని సుందరగిరిపై కొలువైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో మంగళవారం విశేష కార్యక్రమాలు జరిగాయి. నారసింహుని జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకుని ముందుగా ఆలయ యాగశాలలో వేద పండితులు విఘ్నేశ్వర పూజ, పుణ్యహవాచనం, మండపారాధనను నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్ఛరణల నడుమ సుదర్శన నారసింహ, ధన్వంతరీ, గరుడ, ఆంజనేయ, అనంత సుబ్రహ్మణ్య మూలమంత్ర హోమాలను జరిపారు. ఆ తరువాత గర్భాలయంలో కొలువైన స్వామివారి మూలవిరాట్కు పంచామృతాభిషేకాలు నిర్వహించి, నక్షత్ర హారతులిచ్చారు. అనంతరం జరిగిన అన్నసమారాధనలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ద్వారకాతిరుమల: గుంటూరు జిల్లా పెదనందిపాడులో గత శనివారం జరిగిన 45వ మాస్టర్ అథ్లెటిక్స్ రాష్ట్రస్థాయి పోటీల్లో తిరుమలంపాలెం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల సైన్స్ ఉపాధ్యాయురాలు పైడి రాజేశ్వరమ్మ సత్తా చాటారు. 60 ప్లస్ ఏజ్ గ్రూప్లో జరిగిన 100 మీటర్ల పరుగు పందెంలో రాజేశ్వరమ్మ ప్రథమ బహుమతి, 800 మీటర్ల పరుగు పందెంలో ద్వితీయ బహుమతి, 3 కిలో మీటర్ల నడక పోటీలో ప్రథమ బహుమతిని సాధించి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శేషు కుమారి, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది రాజేశ్వరమ్మను అభినందించారు. బుట్టాయగూడెం: ఇటీవల అంకన్నగూడెం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న బాలిక గర్భవతి అయ్యిందనే నెపంతో బాధ్యులు కాని ప్రధానోపాధ్యాయిని, డిప్యూటీ వార్డెన్లను సస్పెండ్ చేయడం సరైన చర్య కాదని, వెంటనే వారి సస్పెన్షన్ను రద్దు చేసి విధుల్లోకి తీసుకోవాలని ఏటీఏ రాష్ట్ర అధ్యక్షుడు జలగం రాంబాబు మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. వేసవి సెలవుల్లో పాఠశాల బయట జరిగిన ఘటనకు బాధ్యులను చేస్తూ ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న వారిని సస్పెండ్ చేయడం సబబు కాదన్నారు. -
బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడి అరెస్ట్
జంగారెడ్డిగూడెం: బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడిని 36 గంటల్లో అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ సుస్మిత రామనాథన్ తెలిపారు. మంగళవారం కేసుకు సంబంధించిన వివరాలను ఆమె వెల్లడించారు. మండలంలోని నాగులగూడెం గ్రామానికి చెందిన పదేళ్ల బాలికపై మారుటి తండ్రి బోడ రవి లైంగిక దాడికి పాల్పడ్డాడన్నారు. గత మూడు నెలలుగా తల్లి లేని సమయంలో బాలికపై మారు తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడుతూ, ఎవరికై నా చెబితే చంపుతానని బెదిరించాడన్నారు. ఈ విషయం తెలిసి బాలిక తల్లి, మేనమామ సోమవారం ఫిర్యాదు చేయడంతో లక్కవరం పోలీస్స్టేషన్లో కేసు నమోదుచేసి విచారణ చేశామన్నారు. సీఐ ఎంవీ సుభాష్, ఎస్సై జబీర్, సిబ్బందితో కలిసి దర్యాప్తు చేస్తుండగా, స్థానిక రామచంద్రాపురం సాయిబాబ స్థూపం వద్ద నిందితుడు బోడ రవిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. తాడేపల్లిగూడెం: ఇస్రో ఆధ్వర్యంలో గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించిన స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ పోటీల్లో ఏపీ నిట్ విద్యార్థులు సత్తా చాటారు. 36 గంటలపాటు నిర్విరామంగా జరిగిన ఈ పోటీల్లో ఏపీ నిట్ విద్యార్థుల బృందం అద్భుత ప్రతిభను కనబర్చి మూడోస్థానాన్ని కై వసం చేసుకుని రూ.50వేల నగదు బహుమతిని అందుకున్నారు. ఫైనల్ పోటీలకు అర్హత సాధించిన 55 టీమ్లలో ఏపీ నిట్కు చెందిన దక్షిణ లోకోవర్స్టీమ్ ఒకటిగా నిలిచింది. విద్యార్థులను నిట్ ఇన్చార్జి డైరెక్టర్ ఎన్వీ రమణరావు, రిజిస్ట్రార్ దినేష్ శంకరరెడ్డి అభినందించారు. -
రోడ్డు ప్రమాదంలో వీఆర్ఏ మృతి
జంగారెడ్డిగూడెం: రోడ్డు ప్రమాదంలో వీఆర్ఏ మృతి చెందిన ఘటన జంగారెడ్డిగూడెంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు, బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బుట్టాయగూడెం మండలం అంతర్వేదిగూడెం గ్రామానికి చెందిన పట్టెల మంగ (50) బుట్టాయగూడెం రెవెన్యూ కార్యాలయంలో వీఆర్ఏగా పనిచేస్తోంది. మంగళవారం బుట్టాయగూడెంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పాల్గొంది. అంతర్వేదిగూడెం సచివాలయ గుమస్తా, మృతురాలికి మరిది అయిన తగరం వెంకట్రావు కూడా జనవాణిలో పాల్గొన్నాడు. కార్యక్రమం అనంతరం పంచాయతీ మోటార్కు సంబంధించి సామాగ్రి కొనేందుకు వెంకట్రావు మోటార్సైకిల్ జంగారెడ్డిగూడెం వస్తుండగా, మంగ కూడా వచ్చింది. పని ముగించుకుని తిరిగి వెళుతుండగా, స్థానిక బుట్టాయగూడెం రోడ్డులోని ఎస్బీఐ వద్దకు వచ్చే సరికి వీరి మోటార్సైకిల్ను వెనుక నుంచి లారీ ఢీకొంది. ఆమైపె లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందింది. వెంకట్రావుకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా మంగ భర్త మృతిచెందడంతో కారుణ్య నియామకం కింద బుట్టాయగూడెం వీఆర్ఏగా ఆమె విధులు నిర్వహిస్తున్నారు. మృతురాలికి డిగ్రీ చదువుతున్న కుమార్తె సౌజన్య ఉంది. తల్లిదండ్రులను కోల్పోడంతో కుమార్తె అనాథగా మిగిలింది. కాగా, ప్రమాద ఘటన తెలుసుకున్న ట్రాఫిక్ ఎస్సై కుటుంబరావు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించి, ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ద్వారకాతిరుమల: మండలంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన బైక్ల చోరీలపై స్థానిక పోలీస్టేషన్లో మంగళవారం కేసులు నమోదయ్యాయి. లక్ష్మీనగర్ జాతీయ రహదారిపై, ఓ పెట్రోల్ బంకులో పనిచేస్తున్న రాజమండ్రికి చెందిన ఏలూరి విజయభాస్కర్ తన బైక్ను ఈనెల 15న బంకు వద్ద పార్క్ చేశాడు. 16 న ఉదయం చూస్తే బైక్ కనిపించలేదు. అలాగే ద్వారకానగర్కు చెందిన నన్నపనేని వెంకటేశ్వరరావు తన బైక్ను ఈనెల 14న రాత్రి గ్రామంలోని రామాలయం వద్ద పార్క్ చేయగా మరుసటి రోజు ఉదయం కనిపించలేదు. బాధితులు స్థానిక పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసులు నమోదు చేసిన ఎస్సై టి.సుధీర్ దర్యాప్తు చేపట్టారు. -
దాళ్వాకు నీటి ఎద్దడి ముప్పు
● సాగునీటి సంఘాల నిర్లక్ష్యంపై ఆరోపణలు ● రైతుల ఇక్కట్లు పట్టని ప్రభుత్వం పెంటపాడు: డెల్టాలో దాళ్వాకు ఆదిలోనే హంసపాదు ఎదురైందా అన్న ప్రశ్న రైతుల్లో వ్యక్తమవుతోంది. నారుమడులకు సైతం నీరు లేక రైతన్నలు అయోమయంలో పడుతున్నారు. పలు గ్రామాల్లో నారుమడులకు సిద్ధమై దుక్కిలు చేపడుతున్నా కొన్ని గ్రామాల్లో నీటి ఎద్దడి వల్ల సరిపడా నీరందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇంకా వంతులవారీ విధానం కూడా చేపట్టలేదు. నారుమడుల సమయంలోనే ఇలా ఉంటే రానురాను ఎలా ఉంటుందోనని రైతులు బెంబేలెత్తుతున్నారు. దీనికి ప్రధాన కారణం కాలువలు పూడిక తీత లేకపోవడమే అని చెబుతున్నారు. కాలువలు శుభ్రం చేసేదెప్పుడో? ప్రధానంగా పెంటపాడు మండలంలోని అలంపురం, ప్రత్తిపాడు, రాచర్ల, రావిపాడు, వల్లూరుపల్లి, బోడపాడు, దర్శిపర్రు, జట్లపాలెం, పెంటపాడు, కె. పెంటపాడు, విప్పర్రుతో పాటు, తణుకు ప్రాంతంలోని కోనాల, గూడెం మండలంలోని కృష్ణాయపాలెం, ఉంగుటూరు మండలంలోని బొమ్మిడి, బాదంపూడి ప్రాంతాల మీదుగా ప్రధాన పంట కాలువలైన మిడ్లెవిల్, లోలెవిల్ కాలువలు ప్రవహిస్తున్నాయి. అయితే ఈ రెండు కాలువల ద్వారా వేలాది ఎకరాలు పంట సాగవుతున్నాయి. ఎన్నో గ్రామాలకు తాగునీరు అందుతోంది. ఇదిలా ఉంటే ఆ కాలువల్లో కిలోమీటర్ల మేర గుర్రపుడెక్క, కర్రనాచు, తూడు పేరుకుపోయింది. గత దాళ్వా సమయంలో ఈ సమస్య ఉన్నా వంతుల వారీ విధానం, రైతులు స్వచ్ఛందంగా కాలువలు బాగుచేత కారణంగా నీటి ఎద్దడి లేకుండా ఏదోలా గట్టెక్కారు. అయితే రాబోయే పంట విషయంలో అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. సార్వాలో ఆధునికీకరణ లేక ముంపు సమస్య ఏర్పడింది. పంట నష్టం జరిగింది. కాగా దాళ్వా సమయంలో సాగునీటి విడుదల కావాలంటే కాలువలు శుభ్రంగా ఉండాలి. అడ్డులు, అవాంతరాలు లేకుండా చూడాలి. ఈ పని సాగునీటి యాజమాన్యాలదే. అయితే సాగునీటి సంఘాల సమావేశాలు ఎక్కడా కానరావడంలేదు. ప్రస్తుతం దాళ్వా ప్రారంభంలో సాగునీటి ఇబ్బందులు లేకుండా సాగునీటి యాజమాన్యాలు చూడాల్సి ఉంది. పంట కాలువలు డ్రెయినేజీలు పూడిక తీత తీయాల్సి ఉంది. తూడు, గుర్రపుడెక్క తీయించాలి. ఈ విషయంపై సాగునీటి సంఘాల యజమానులు సమావేశాలు నిర్వహించుకొని ఉపాది, డ్రెయినేజీ, ఇరిగేషన్ శాఖల అధికారుల సమన్వయంతో పూడిక తీత తీయించుకొంటే రాబోయే ముప్పునుంచి గట్టేక్కే అవకాశం ఉంది. ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని రైతులు, ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. తాగునీటికి ఇబ్బందే ఇటీవల కాలువలు కాలుష్య కాసారాలుగా తయారవుతున్నారు. సమీప గ్రామాల్లో చెత్తను కాలువల్లో వేస్తున్నారు. జంతు కళేబారాలు ఈ కాలువల్లో కొట్టుకువస్తున్నాయి. కాలువల సమీప గ్రామాల్లో డ్రెయినేజీలు, సెప్టిక్ ట్యాంకుల మురుగు నేరుగా ఈ కాలువలో కలుపుతున్నారు. ప్రధానంగా మిడ్లెవిల్ సమీప గ్రామాలైన అలంపురం, రాచర్ల, వల్లూరుపల్లి, దర్శిపర్రు, లో లెవిల్ కాలువ సమీప గ్రామాలైన కె.పెంటపాడు గ్రామాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఈ వేసవిలో డ్రెయినేజీ, ఇరిగేషన్ శాఖల అధికారులు దీనిపై ఏమేరకు తనఖీలు చేపడతారో చూడాలి. -
చైన్ స్నాచర్ల అరెస్ట్
ముదినేపల్లి రూరల్: చైన్స్నాచింగ్లకు పాల్పడుతున్న ఇద్దరిని స్థానిక పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి చోరీ సొత్తు రికవరీ చేశారు. ఏలూరు డీఎస్పీ డి శ్రావణకుమార్ స్థానిక పోలీసుస్టేషన్లో మంగళవారం వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన మత్స వెంకటేష్, పటాస్ సలీంబాషా కలిసి మండలంలోని వడాలి, పెయ్యేరు, గురజ గ్రామాల్లో ద్విచక్ర వాహనంపై వెళుతూ మహిళల మెడల్లోని గొలుసులు తెంపుకుపోయారన్నారు. వీరిని కైకలూరు రూరల్ సీఐ వి రవికుమార్ ఆధ్వర్యంలో ముదినేపల్లి పోలీసులు పట్టుకుని చోరీ సొత్తు 6.5 కాసుల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. గతంలో మత్స వెంకటేష్పై 18 కేసులు, సలీంబాషాపై 9 కేసులు ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా సీఐ రవికుమార్, ఎస్సై వీరభద్రరావు, కానిస్టేబుళ్లు బి పెద్దిరాజు, బి నాగబాబు, ఎ నాగరాజు, బి పవన్కుమార్, జి శివకోటయ్యలను ఎస్పీ అభినందించినట్లు చెప్పారు. -
బాధితులకు భరోసాగా ప్రాజెక్ట్ రీస్టోర్
● రికవరీ చేసిన చోరీ సొత్తు బాధితులకు అప్పగింత ● ఏలూరు జిల్లాలో రూ.2.93 కోట్ల ఆస్తి అందజేత ఏలూరు టౌన్: ప్రజలకు సంబంధించిన నగదు, బంగారం, వెండి ఆభరణాలు, వస్తువులు, సెల్ఫోన్లు, మోటార్సైకిళ్లు చోరీలకు గురైతే పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేస్తుంటారు. ఆయా కేసులను దర్యాప్తు చేసిన పోలీసులు నేరగాళ్ల నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకుంటారు. కానీ వాటిని తిరిగి బాధితులకు అందించేందుకు న్యాయస్థానంలో మరో ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. చివరిదశలోని ఆ అంతరానికి ఏలూరు జిల్లా ఎస్పీ శివకిషోర్ చెక్పెట్టారు. బాధితులు పోలీస్స్టేషన్లు, కోర్టులకు తిరగాల్సిన ఇబ్బందులను తగ్గిస్తూ ప్రాజెక్ట్ రీస్టోర్కు రూపకల్పన చేశారు. నేరస్తుల నుంచి రికవరీ చేసిన చోరీ సొత్తును మంగళవారం జిల్లాలోని పోలీసులు బాధితులకు అప్పగించారు. 729 మంది బాధితులకు అప్పగింత ఏలూరు జిల్లాలో ఏకంగా 729 మంది బాధితులకు రూ.2 కోట్ల 93 లక్షల 60 వేల విలువైన ఆస్తిని పోలీసులు బాధితులకు ఇళ్లకు వెళ్లి అప్పగించారు. వీటిలో 1,020 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.కోటి 32 లక్షల నగదు, 30 మోటారు సైకిళ్లు, 2 నాలుగు చక్రాల వాహనాలు, 647 మొబైల్ ఫోన్లు ఉన్నాయి. వీటిని బాధితులకు అప్పగించడంతో వారు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. టి.నరసాపురం మండలంలోని మధ్యాహ్నపువారిగూడెం, బొర్రంపాలెం గ్రామాల్లో జరిగిన చోరీలకు సంబంధించి నిందితుల నుంచి రికవరీ చేసిన 2.5 గ్రాముల బంగారం, 400 గ్రాముల వెండి, ఎల్ఈడీ టీవిలను రికవరీ చేసి బాధితులకు నేరుగా అప్పగించారు. నిడమర్రు మండలంలోని గుణపర్రులో 48 గ్రాముల బంగారు ఆభరణాలను బాధితుతులకు అందించారు. అలాగే 7 స్మార్ట్ఫోన్లు పోగొట్టుకున్న తోకలపల్లి, మందలపర్రు, బువ్వనపల్లి, పత్తేపురం గ్రామాల్లోని ఫిర్యాదుదారులకు అప్పగించారు. గణపవరం మండలంలోని ఎస్.కొందేపాడులో 11 కాసుల బంగారు ఆభరణాన్ని అప్పగించగా, ఆ మండలంలో వివిధ కేసుల్లో రికవరీ చేసిన 11 మోటార్సైకిళ్లు, 13 సెల్ఫోన్న్లను బాఽధితులకు వారి ఇళ్లవద్దనే పోలీసులు అందజేశారు. భీమడోలు మండలంలోని పూళ్ల, దుద్దేపూడి గ్రామాల్లోని బాధితులకు 17 కాసుల బంగారం, వెండి ఆభరణాలను అప్పగంచారు. ద్వారకాతిరుమలలో బాధితులకు 7 కాసుల బంగారు ఆభరణాలను, రూ. 2 లక్షల నగదును అప్పగించారు. అదేవిధంగా 28 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశారు. పోలీసులపై విశ్వాసం పెంచడమే లక్ష్యంగా... ప్రజల్లో పోలీస్ వ్యవస్థ పట్ల విశ్వాసం, గౌరవాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రాజెక్ట్ రీస్టోర్ను చేపట్టినట్లు ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. నేరస్తులు చోరీ చేసిన ఆస్తి బాధిత కుటుంబాల జీవనోపాధి, సంక్షేమంలో ఎంతో కీలకమైందిగా ఉంటుందన్నారు. బాధితులు పోలీస్స్టేషన్లకు, కోర్టులకు పదేపదే తిరుగుతూ మోసగాళ్ల బారిన పడకుండా, నష్టాన్ని భర్తీ చేస్తూ భరోసా కల్పించటం ప్రథమ లక్ష్యం అని చెప్పారు. బాధితులు మానవీయ కోణంలో పోలీసింగ్ను రుచిచూస్తే... పోలీస్, న్యాయవ్యవస్థపై ఉన్న భయాన్ని విడిచిపెట్టి ఆయా కేసుల్లో విచారణకు సహకరిస్తాన్నారు. నేరస్తులకు కఠిన శిక్షలు పడే శాతం మెరుగుపడుతుందన్నారు. -
విశాఖ ఉక్కును కాపాడుకోవాలి
భీమవరం: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ప్రైవేటీకరణ చేసేవిధంగా అడుగులు వేస్తోందని, ఎందరో ప్రాణ త్యాగాలతో సాధించుకున్న తెలుగు జాతి హక్కు విశాఖ ఉక్కును మనమంతా కాపాడుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బి.బలరామ్ అన్నారు. మంగళవారం భీమవరంలో బి వాసుదేవరావు అధ్యక్షతన జరిగిన సీపీఎం విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయకుండా సెయిల్లో విలీనం చేస్తే రాష్ట్రాభివృద్ధికి, దేశాభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. మెడికల్ కళాశాలల నిర్మాణం, నిర్వహణ ప్రభుత్వమే చేపట్టాలని, పీపీపీ పద్ధతిని వెంటనే రద్దుచేయాలని బలరామ్ డిమాండ్ చేశారు. రైతుల పంటలకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. డెల్టా ఆధునికీకరణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని, ఇళ్లు, ఇళ్ళస్థలాల సమస్యని, శ్మశానవాటికల సమస్యను తక్షణం పరిష్కరించాలన్నారు. పార్టీ రాష్ట్ర నాయకుడు మంతెన సీతారామ్ మాట్లాడుతూ లేబర్ కోడ్లు తీసుకువచ్చి కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కేంద్ర ప్రభుత్వం రద్దుచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి జేఏవీ గోపాలన్న్, జిల్లా సెక్రేరియట్ సభ్యులు కౌరు పెద్దిరాజు, కర్రా నాగేశ్వరరావు, పీవీ ప్రతాప్, పార్టీ జిల్లా సీనియర్ నాయకులు జుత్తిగ నర్సింహమూర్తి, కె రాజారామ్మోహన్న్రాయ్ తదితరులు పాల్గొన్నారు. -
19న సర్టిఫికెట్ల పరిశీలన
ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఏలూరు టౌన్: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పోలీస్ కానిస్టేబుళ్లుగా ఎంపికై న సివిల్ మెన్ అండ్ విమెన్ అభ్యర్థులు ఈనెల 19న ఏలూరు అమీనాపేటలోని పోలీస్ కల్యాణ మండపంలో ఉదయం 10 గంటలకు హాజరుకావాలని జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ చెప్పారు. ముఖ్యమైన సర్టిఫికెట్లు, పత్రాలతో హాజరుకావాలనీ, సివిల్ కానిస్టేబుల్స్గా ప్రత్యేక శిక్షణకు వెళ్ళేందుకు ఈనెల 20న ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కేంద్రం ప్రాంగణంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్కు హాజరుకావాలని ఎస్పీ చెప్పారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని అభ్యర్థులు విజయనగరం, అనంతపురం పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపల్కు ఈ నెల 21న రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నారు. పోలీస్ శిక్షణ కేంద్రాలకు వెళ్ళేందుకు ఏలూరు పోలీస్పరేడ్ గ్రౌండ్స్ నుంచి రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. 9 నెలలపాటు కొనసాగే ఇండక్షన్ శిక్షణ తరగతులు ఈ నెల 22 నుంచి ప్రారంభం అవుతాయని ఎస్పీ తెలిపారు. నిర్ణీత తేదీల్లో శిక్షణకు హాజరుకాని అభ్యర్థులు పేర్లు పోలీస్ శాఖ నిబంధన మేరకు ఎంపిక జాబితా నుంచి తొలగిస్తారన్నారు. ప్రతి అభ్యర్థి రూ.5 వేల భద్రతా బాండ్, సెక్యూరిటీ బాండ్ను రూ.100 నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్పై సమర్పించాలన్నారు. అభ్యర్థులు శిక్షణకు వెళ్ళేందుకు దిండు, ప్లాస్టిక్ బకెట్, మగ్, అరోగ్య భద్రత కార్డుల కోసం 3 పాస్ పోర్ట్సైజు ఫొటోలు తీసుకువెళ్ళాలని చెప్పారు. విజయవాడకు కానిస్టేబుళ్లుపెదవేగి: కానిస్టేబుళ్ల ఉద్యోగాలు పొందిన 5,757 మంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందించేందుకు పెదవేగి జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రం నుంచి మంగళవారం పంపించారు. బుధవారం సాయంత్రం యువగళం కార్యక్రమంలో వీరికి విజయవాడలో నియామక పత్రాలు అందిస్తారు. -
టెట్ పరీక్షకు 208 మంది హాజరు
ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరులో జరుగుతున్న టెట్ పరీక్షకు మంగళవారం 208 మంది హాజరయ్యారు. నగరంలోని సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో ఉదయం 9.30 గంటల నుంచి 12 గంటల వరకూ జరిగిన పరీక్షకు 177 మందికి 155 మంది హాజరు కాగా 22 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ జరిగిన పరీక్షకు 54 మందికి 53 మంది హాజరు కాగా ఒకరు గైర్హాజరయ్యారు. పరీక్షలను ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పర్యవేక్షించారు. ఏలూరు (టూటౌన్): నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న స్కూల్ స్వీపర్లు, శానిటేషన్ వర్కర్లకు ఫుల్ టైం వేతనాలు ఇవ్వాలని కోరుతూ స్కూల్ స్వీపర్లు, శానిటేషన్ వర్కర్ల యూనియన్(ఐఎఫ్టీయు) ఆధ్వర్యంలో మంగళవారం ఇన్చార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్కు వినతిపత్రం సమర్పించారు. స్కూల్ స్వీపర్లు, శానిటేషన్ వర్కర్లు నెలంతా పనిచేసినా రూ.4 వేలు, రూ.6 వేలు మాత్రమే ఇస్తున్నారని వాపోయారు. చాలీచాలని జీతాలతో తాము బతకలేక పోతున్నామని, ఫుల్ టైం వర్కర్లుగా గుర్తించి, ఫుల్ టైం వేతనాలు ఇప్పించాలని మొరపెట్టుకున్నారు. దానిపై మంత్రి అధికారులతో మాట్లాడి మీకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఐఎఫ్టీయూ నగర అధ్యక్షుడు బి.సోమయ్య, మున్సిపల్ యూనియన్ నాయకులు దేవరపల్లి రత్నబాబు తదితరులున్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరు నగరానికి సంగీత, నృత్య కళాశాల మంజూరుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామని పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. స్థానిక వన్టౌన్లో రూ. 5.25 కోట్లతో ఏర్పాటు చేసిన పురావస్తు ప్రదర్శన శాలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర గొప్పతనాన్ని తెలిపేలా మ్యూజియం ఏర్పాటు చేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు. మ్యూజియంకు సంపూర్ణ సహకారం అందిస్తామని, 3వ అంతస్తు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ జిల్లా ఘన చరిత్రను ఈ మ్యూజియం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పే బాధ్యతను నగర ప్రజలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జాయింటు కలెక్టరు ఎంజే అభిషేక్ గౌడ, మేయరు షేక్ నూర్జహాన్, ఆర్టీసీ రీజినల్ –2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, వడ్డీలు కార్పొరేషన్ చైర్పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మీ, సామాజిక కార్యకర్త బీకేఎస్ఆర్ అయ్యంగార్ తదితరులు పాల్గొన్నారు. పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లు మున్సిపాలిటీ స్పెషల్ గ్రేడ్గా ఎంపికై ంది. ఇంతవరకూ ఫస్ట్ గ్రేడ్ ఉన్న పాలకొల్లును స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఎంపిక చేస్తున్నట్లు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ మంగళవారం జీవో విడుదల చేసింది. భీమవరం (ప్రకాశంచౌక్): రిజిస్ట్రేషన్లపై అవగాహన సదస్సును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. భీమవరం, గునుపూడి సబ్ రిజిస్టర్ కార్యాలయం–1లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై మంగళవారం ప్రజలకు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సభలో మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ కార్యాలయాల ద్వారా ఏ విధమైన సేవలు ప్రజలకు అందుతాయి, రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏ విధంగా చేసుకోవాలి సంబంధిత అంశాలను ఈ సదస్సుల ద్వారా వివరిస్తారన్నారు. భీమవరం గునుపూడి గ్రామంలోని ఇళ్ళు, ఖాళీ స్థలాలకు రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే పన్ను రసీదు మ్యుటేషన్ జరుగుతుందన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో దళారులు ప్రమేయం లేకుండా స్వయంగా రిజిస్ట్రేషన్లు చేసుకునే విధంగా ఈ అవగాహన సదస్సుల ద్వారా తెలుసుకోవాలన్నారు. -
22ఏ భూ సమస్యల పరిష్కారం
ఏలూరు(మెట్రో): రాష్ట్రంలోనే మొదటిసారిగా ఏలూరు జిల్లాలో 22 ఏ భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారని, ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఏలూరు జిల్లా మార్గదర్శకం అవుతుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో మంగళవారం శ్రీమెగా 22ఏ భూ సమస్యల పరిష్కార వేదికశ్రీ కార్యక్రమంలో పాల్గొని ప్రజలు, రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. మంత్రితో పాటు కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జేసి అభిషేక్ గౌడ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ జిల్లాలోని 27 మండలాలకు చెందిన రైతులు, ప్రజలు 22 ఏ జాబితాలో పొరపాటుగా నమోదైన భూముల వివరాలను సదరు యజమానుల నుంచి స్వీకరించేందుకు మంగళవారం కలెక్టరేట్లో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశామని, ప్రతి అర్జీని పరిశీలించి 90 శాతం వరకు అదేరోజు పరిష్కరిస్తున్నామన్నారు. సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో 1 లేదా 2 వారాలలో తప్పనిసరిగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. ఒక్కరోజులోనే 1,147 కేసులు పరిష్కరించాం కార్యక్రమం అనంతరం పాత్రికేయులతో మంత్రి మాట్లాడుతూ సుపరిపాలన అంటే సామాన్య ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించడమన్నారు. రాష్ట్రంలో 22 ఏ భూ సమస్యల పరిష్కారానికి ఏలూరు జిల్లా కేంద్రంగా మొదటి అడుగు పడిందన్నారు. ఒక్కరోజులోనే 1,199 దరఖాస్తులు అందగా, వాటిలో 1,147 దరఖాస్తులను పరిష్కరించి 142.04 ఎకరాల భూములను 22 ఏ జాబితా నుండి తొలగించామన్నారు. మరో 32 ఎకరాలకు సంబంధించి 11 కేసులు పెండింగ్ ఉన్నాయని, వాటిలో 8 కేసులను వారంలోగా, 2 కేసులు 2 వారాలలోగా పరిష్కారానికి చర్యలు తీసుకోవలసిందిగా అధికారులను ఆదేశించామన్నారు. దేవాదాయ శాఖకు సంబంధించి ఒక కేసును రికార్డులు పరిశీలించి నెలరోజులలోగా తప్పనిసరిగా పరిష్కరించాలని ఆదేశించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా కేసులు పరిష్కారమైన ప్రజలకు పరిష్కార ఉత్తర్వులను మంత్రి అందించారు. సమస్యల పరిష్కారానికి కృషిచేసిన కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ ఎంజె అభిషేక్ గౌడ, రెవెన్యూ అధికారి, ఆర్డీఓలు, రెవెన్యూ సిబ్బందిని మంత్రి అభినందించారు.ఏలూరు(మెట్రో): రానున్న రబీ సీజన్లో సాగునీటికి, వేసవిలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాగునీటి సలహా మండలి సమావేశం మంత్రి అధ్యక్షతన జరిగింది. తాగునీటి కొరత లేకుండా సీలేరు నుంచి నీటి సరఫరా, మీడియం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్ట్ కుడి ప్రధాన కాలువ, పట్టిసీమ, తాడిపూడి, తదితర ఎత్తిపోతల పథకాల నుంచి సాగు, తాగునీటి సరఫరాకు సంబంధిత శాఖల అధికారులందరూ సమన్వయంతో పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు రూపొందించి సమర్పించాలని మంత్రి ఆదేశించారు. -
డ్వాక్రా మహిళల ఆందోళన
ఆకివీడు: నష్టపోయిన డ్వాక్రా బాధితులు తమకు న్యాయం చేయాలని యూనియన్ బ్యాంక్కు క్యూ కడుతున్నారు. స్థానిక సంతపేట, సమతానగర్ ప్రాంతంలోని యానిమేటర్లు డ్వాక్రా మహిహిళల సొమ్ము కొట్టేశారు. విషయం తెలుసుకున్న ఆయా సంఘాల మహిళలు బ్యాంకుల వద్ద పడుగాపులు పడుతున్నారు. యానిమేటర్ల ఇంటికి వెళ్లి ఆందోళన చేసినా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు. మంగళవారం స్థానిక సమతానగర్లోని యానిమేటర్ ఇంటికి వెళ్లి ఆందోళన చేస్తుండగా ఆమె పోలీస్స్టేషన్కు పరారయ్యారని మహిళలు పేర్కొన్నారు. స్థానిక యూనియన్ బ్యాంకు విజిలెన్స్ అధికారి గంగాధరరావు మాట్లాడుతూ బ్యాంక్ పరిధిలో 32 గ్రూపులకు చెందిన డ్వాక్రా సంఘాల నిధులు దుర్వినియోగం అయ్యాయని, ఫిర్యాదుల మేర విచారణ చేస్తున్నామని చెప్పారు. -
వైద్య విద్య ప్రైవేటీకరణ నష్టాలపై సెమినార్
ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రంలో వైద్య విద్య ప్రైవేటీకరణ – సమాజంపై దాని ప్రభావం అనే అంశంపై విజయవాడలో జరిగే రాష్ట్ర సెమినార్ను విజయవంతం చేయాలని కోరుతూ పీడీఎస్ఓ నాయకులు మంగళవారం నగరంలోని ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాల, జిల్లా ఆసుపత్రి వద్ద ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇటీవల 17 కొత్త వైద్య కళాశాలల్లో పదింటిని పీపీపీ పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించడం దారుణమన్నారు. గత ప్రభుత్వం రూ.8,500 కోట్లతో 17 కళాశాలల నిర్మాణాన్ని ప్రారంభించిందని, అందులో ఐదు మాత్రమే ప్రారంభమయ్యాయన్నారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ప్రభుత్వం హామీలను తుంగలో తొక్కి, ప్రజాధనంతో నిర్మిస్తున్న మెడికల్ కళాశాలలను పీపీపీ పేరిట ప్రైవేటు యాజమాన్యానికి అప్పగించేందుకు పూనుకుందని, దీని వల్ల ప్రభుత్వ కళాశాలలో కేవలం రూ.5 లక్షలతో పూర్తయ్యే కోర్సుకు రూ. 27.5 లక్షల నుంచి రూ.1.10 కోట్ల వరకు ఖర్చవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 21వ తేదీన విజయవాడలోని బాలోత్సవ్ భవన్లో ఈ అంశంపై పీడీఎస్ఓ రాష్ట్ర సెమినార్ను నిర్వస్తుందన్నారు . -
పండక్కి రోడ్ షో
భరోసా ప్రాజెక్టు రీస్టోర్ స్వాధీనం చేసుకున్న చోరీ సొత్తు కోసం బాధితులు పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఏలూరు ఎస్పీ ప్రాజెక్ట్ రీస్టోర్కు రూపకల్పన చేశారు. 8లో uబుధవారం శ్రీ 17 శ్రీ డిసెంబర్ శ్రీ 2025సాక్షి, భీమవరం: రోడ్ల అభివృద్ధి పేరిట చంద్రబాబు ప్రభుత్వం కనికట్టు చేస్తోంది. పండక్కి జిల్లాకు వచ్చే వారి ముందు రోడ్లు బాగుచేస్తున్నట్టు షో చేసేందుకు ఆపసోపాలు పడుతోంది. నాబార్డ్, ప్లాన్, ఎస్సీసీ వర్క్స్, అడిషనల్ ఫండ్స్ రూ.141 కోట్లతో జిల్లాలో 37 పనులు మంజూరు చేయగా 16 మాత్రమే పట్టాలెక్కాయి. గత ఏడాది సంక్రాంతికి ముందు హడావుడిగా చేసిన పనులు నాణ్యతలేక మూన్నాళ్ల ముచ్చటయ్యాయి. జిల్లాలో ఆర్అండ్బీ పరిధిలో స్టేట్ హైవే, మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్లు 1,568 కిలోమీటర్లు పొడవున విస్తరించి ఉన్నాయి. రోడ్లను అభివృద్ధి చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన కూటమి గత ఏడాది ప్యాచ్ వర్క్లతో సరిపెట్టింది. విద్య, ఉద్యోగం, వ్యాపారం నిమిత్తం దేశ విదేశాల్లో ఉంటున్న వారు సంక్రాంతి పండుగలకు జిల్లాకు రావడం పరిపాటి. బంధుమిత్రులను వెంట తీసుకువస్తుంటారు. ఇక్కడ జరిగే కోడిపందేలు, అమ్మవార్ల జాతరలను చూసేందుకు ఇతర జిల్లాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. వేలాదిగా జిల్లాకు వచ్చే సందర్శకులతో రోడ్లన్ని కిక్కిరిసిపోతాయి. పండుగ చుట్టాల ముందు తమ పాలనను గొప్పగా చూపించుకునేందుకు గత ఏడాది రూ.42.57 కోట్లతో ప్యాచ్ వర్కులు, అత్యవసర మరమ్మతులు చేపట్టారు. సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లు చూస్తారంటూ ప్రకటనలు గుప్పించి కేవలం రూ.18.5 కోట్ల విలువైన 45 శాతం పనులు మాత్రమే పూర్తిచేయగలిగారు. కొన్నిచోట్ల పండుగల మూడు రోజులు మన్నితే చాలన్నట్టు ప్రమాణాలు పాటించకుండా నాసిరకంగా పనులు చేయగా, మరికొన్నిచోట్ల గుంతల్లో మెటల్, చిప్స్ వేసి తారు వేయకుండా వదిలేయడంతో కొద్ది రోజులకే రాళ్లుపైకి లేచిపోయి ప్రమాదభరితంగా తయారయ్యాయి. కాగా గత సంక్రాంతి సీజన్లో చేసిన పనులకు సంబంధించి సుమారు రూ.20 కోట్ల మేర కాంట్రాక్టర్లకు బకాయిలు ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో పనులు చేసేందుకు వారు వెనుకడుగేస్తున్నారు. ఇప్పటికే మొదలైన పనులు త్వరితగతిన పూర్తిచేయాలని, మిగిలిన వాటిని త్వరగా ప్రారంభించాలని ఉన్నతస్థాయి నుంచి ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. కాంట్రాక్టర్లను ఒప్పించి పనులు చేపట్టేందుకు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో మరోమారు షో ప్రయత్నాలు మొదలయ్యాయి. నాబార్డ్, ప్లాన్, ఎస్సీసీ వర్క్స్, అడిషనల్ ఫండ్స్ రూ.141 కోట్లతో జిల్లాలో మార్టేరు–పక్కిలంక, పాలకొల్లు –దొడ్డిపట్ల, పెనుమంట్ర–వీరవాసరం, పాలకొల్లు– ఆచంట, దువ్వ–ఆరుళ్ల, ఉద్దలపాలెం–దువ్వ, నరసాపురం–మేడపాడు, తాడేపల్లిగూడెంలోని విజయవాడ–విశాఖ తదితర రోడ్ల అభివృద్ధికి సంబంధించి 37 వర్క్లు మంజూరు చేసింది. వీటిలో రూ.53 కోట్లు విలువైన 16 వర్క్లు మాత్రమే టెండర్లు పూర్తిచేసుకుని పనులు మొదలయ్యాయి. రూ.46 కోట్ల విలువైన 12 పనులు టెండర్ల దశలో, మిగిలిన వాటికి టెండర్లు పిలిచారు. యాన్యువల్ మెయింటినెన్స్ నిధులు రూ.మూడు కోట్లుతో 650 కిలోమీటర్లు మేర ప్యాచ్ వర్క్లు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దేశ, విదేశాల నుంచి వచ్చే వారికి రోడ్లు బాగుచేశామని చెప్పుకునే ప్రయత్నం రూ.141 కోట్లుతో జిల్లాలో 37 పనులు టెండర్ల దశలో 21, నిర్మాణంలో 16 పనులు రూ. 3 కోట్లతో ప్యాచ్ వర్క్లు త్వరితగతిన పూర్తిచేయాలని ఉన్నతస్థాయి నుంచి ఒత్తిడి గతేడాది సంక్రాంతికి ముందు రూ.42 కోట్లతో హడావుడి పనులు మూన్నాళ్ల ముచ్చటైన ప్యాచ్ వర్క్లు -
నెలగంట మోగింది
● శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన ధనుర్మాస ఉత్సవాలు ● నెలరోజులపాటు తిరుప్పావై సేవలుద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో మంగళవారం నెలగంట మోగింది. అర్చకులు, పండితులు ధనుర్మాస ఉత్సవాలను మధ్యాహ్నం 1.27 గంటలకు ఘనంగా ప్రారంభించారు. ఉత్సవాల ప్రారంభాన్ని పురస్కరించుకుని ముందుగా దేవస్థానం సిబ్బంది ఆలయాన్ని, పరిసరాలను శుభ్రం చేసి, మామిడి తోరణాలు, అరటి బోదెలు, పుష్పమాలికలతో అలంకరించారు. ఆలయ ప్రధాన కూడలిలోని ధనుర్మాస మండపాన్ని రంగులతో సుందరీకరించారు. ఈ పనులు అర్థరాత్రి వరకు సాగాయి. శ్రీవారి పాదుకా మండప ప్రాంతాన్ని రంగవల్లులతో తీర్చిదిద్దారు. పలువురు మహిళా భక్తులు ఆలయ ప్రధాన రాజగోపురమెట్లకు పసుపు, కుంకుమలతో పూజలు చేశారు. రంగవల్లులతో మెట్లదారిని అలంకరించి, దీపారాధన చేశారు. నెలరోజుల పాటు ధనుర్మాస ఉత్సవాలను నేత్రపర్వంగా క్షేత్రంలో నిర్వహించనున్నారు. ప్రతినిత్యం ఆలయంలో తెల్లవారుజామున సుప్రభాత సేవకు బదులుగా తిరుప్పావై సేవా కాలాలను జరుపనున్నారు. అలాగే బుధవారం నుంచి స్వామివారి గ్రామోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అందులో భాగంగా ఉదయం స్వామివారు ఉభయ దేవేరులు, గోదాదేవితో కలసి క్షేత్ర పురవీదుల్లో అట్టహాసంగా ఊరేగి, ధనుర్మాస మండపం వద్దకు చేరుకుంటారు. అక్కడ అర్చకులు స్వామి, అమ్మవార్లను మండపంలో ఉంచి పూజాధికాలను జరిపి, భక్తులకు తీర్ధ ప్రసాదాలను అందిస్తారని ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. -
బాల కార్మికుల గుర్తింపునకు ప్రత్యేక డ్రైవ్
ఏలూరు (టూటౌన్): బాల కార్మికుల గుర్తింపునకు మంగళవారం నుంచి 22 వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్టు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్థ ప్రధాన కార్యదర్శి కె.రత్నప్రసాద్ తెలిపారు. స్థానిక న్యాయసేవా సదన్ భవన్లో ప్రత్యేక డ్రైవ్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యులు ప్రత్యేక తనిఖీలు చేపడతారన్నారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ శ్రీనివాసరావు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ పుచ్చల వెంకటేశ్వరరావు మా ట్లాడుతూ పశ్చిమబెంగాల్, ఒడిసా, చత్తీస్గఢ్ నుంచి బాల కార్మికులను గుర్తించి వారికి విద్యపై అవగాహన కల్పించాలన్నారు. క్రాప్ జిల్లా కో–ఆర్డినేటర్ ఆర్.వినోద్కుమార్ మాట్లాడుతూ జిల్లాని బా ల కార్మికరహిత జిల్లాగా తీర్చిదిద్దుదామని పిలుపునిచ్చారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ జి.నాగేశ్వరరావు, లేబర్ ఆఫీసర్ జీవీ రమణ, జె.గోపాలృష్ణ, ఏఎల్ఎస్ కో–ఆర్డినేటర్ ఎస్.నాగేశ్వరరావు చైల్డ్ హెల్ప్లైన్ కోఆర్డినేటర్ వై.వెంకట్ రాజు, జి.రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. -
గళమెత్తిన భవన నిర్మాణ కార్మికులు
ఏలూరు (టూటౌన్): భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులకు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద సోమవారం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఫైర్స్టేషన్ సెంటర్ నుంచి భారీ ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకున్నారు. ధర్నానుద్దేశించి ఇఫ్టూ అనుబంధ ఏపీ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీ రమణ మాట్లాడుతూ చంద్రబాబు సర్కారు గద్దెనెక్కి 17 నెలలు గడుస్తున్నా ఎన్నికల హామీలను అమలు చేయలేదన్నారు. సంక్షేమ బోర్డును పునర్నిర్మాణం చేయాలని, 25 లక్షల మంది కార్మికులకు ప్రయోజనాలు చేకూర్చాలని డిమాండ్ చేశారు. తన సొంత డబ్బులు రూ.కోటి (బీఓసీ) బోర్డుకు విరాళంగా ఇస్తానని ఎన్నికల సభలో ప్రకటించిన డిప్యూ టీ సీఎం ఇప్పటివరకు బోర్డుకు జమ చేయలేదన్నారు. ఇఫ్టూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్,రామ్మోహన్, నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి బి. సోమయ్య, యర్రా శ్రీనివాసరావు, ఏపీ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం నగర అధ్యక్ష, కార్యదర్శులు కాకర్ల శ్రీనివాస్, నవడు నెహ్రూ బాబు తదితరులు పాల్గొన్నారు. -
294 అర్జీల స్వీకరణ
ఏలూరు(మెట్రో): ఏలూరు కలెక్టరేట్లో సోమ వారం జరిగిన జిల్లాస్థాయి ప్రజా సమస్యల పరి ష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి అర్జీలు పోటెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వినతులు సమర్పించారు. మొత్తంగా 294 అర్జీలను కలెక్టర్ కె.వెట్రిసెల్వి, అధికారులు తీసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ వహించి నిర్ణీత గడువులోపు నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. జాయింట్ కలెక్టర్ యంజే అభిషేక్ గౌడ, డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, ఆర్డీఓ ఎం.అచ్యుతఅంబరీష్, డిప్యూటీ కలెక్టర్ ఎల్.దేవకీదేవి పాల్గొన్నారు. అర్జీల్లో కొన్ని.. ● దెందులూరు మండలం రామారావుగూడేనికి చెందిన అరిగెల అమరనాథ్ తన 2.44 ఎకరాల పంట భూమి ఆన్లైన్ రికార్డుల్లో నమోదు చే యాలని అర్జీ అందించారు. ● నూజివీడు మండలం మొఖాసానరసన్నపాలేనికి చెందిన నువ్వుల రామమోహనరావు రీసర్వేలో తన భూమి 10 సెంట్లు తక్కువ చూపారని, న్యాయం చేయాలని కోరారు. ● బుట్టాయగూడెం మండలం చీమలవారిగూడేనికి చెందిన అన్నిక వెంకటలక్ష్మి తన పట్టా భూమిలో అనుమతి లేకుండా రోడ్డు నిర్మిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ● వేలేరుపాడు మండలం ఒంటిబండ గ్రామానికి చెందిన కుంజా రామకృష్ణ తాము సాగు చేసుకుంటున్న భూములకు హక్కు పత్రాలు ఇప్పించాలని వినతిపత్రం అందించారు. -
టీచర్ల ఆత్మ గౌరవ దీక్ష
ఏలూరు (టూటౌన్): సీఆర్ఎంటీలను విద్యాశాఖలో విలీనం చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఏపీ సీఆర్ఎం ఉపాధ్యాయు లు సోమవారం కలెక్టరేట్ వద్ద ఆత్మ గౌరవ దీక్ష నిర్వహించారు. ఏపీసీఆర్ఎం టీచర్స్ యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలో వక్తలు మాట్లాడుతూ కచ్చితమైన జాబ్చార్ట్ అమలు చేయాలని, తమకు ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న సీఆర్ఎం, ఎంటీఎస్ పోస్టులను భర్తీ చేయాలని, వేతనాలు పెంచాలని కోరారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో సీఆర్ఎంలు తరలివచ్చారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరులో జరుగుతున్న జాతరలో భాగంగా వివిధ ప్రాంతాల్లోని మేడల్లో కొలువైన అమ్మవార్లను హోం మంత్రి వంగలపూడి అనిత కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం దర్శించుకున్నారు. స్థానిక తూర్పువీధి గంగానమ్మ ఆలయంలో అమ్మవార్లను ద ర్శించి ప్రత్యేక పూజలు చేయించారు. అలాగే ప డమర వీధి ప్రాంతంలోని అమ్మవారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే బడేటి చంటి, మేయర్ షేక్ నూర్జహాన్ ఉన్నారు. ఏలూరు(మెట్రో): జిల్లాలో యూరియా, ఎరువుల కొరత లేదని జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ బాషా తెలిపారు. రబీ సీజన్కు జిల్లాలో పూర్తిస్థాయిలో యూరియా నిల్వలు ఉన్నాయ న్నారు. డీలర్లు ఎరువులను ఎంఆర్పీ కంటే ఎ క్కువ ధరలకు విక్రయించినా, కృత్రిమ కొరత సృష్టించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులు ఎరువుల సంబంధిత ఫిర్యా దులు ఉంటే సమీప వ్యవసాయ కార్యాల యాన్ని లేదా తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. ఏలూరు(మెట్రో): జిల్లాలో 22ఏ కేసుల పరిష్కారానికి ఈనెల 16న ఏలూరులో మెగా పరి ష్కార వేదికను నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ కె.వెట్రిసెల్వి ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్లో ఉదయం 9 గంటల నుంచి రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు. ఇన్చార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు హాజరవుతారన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరులో జరుగుతున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు సో మవారం 66 మంది అభ్యర్థులు హాజరయ్యా రు. సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో మధ్యాహ్నం పరీక్షకు 66 మందికి 66 మంది హాజరయ్యారు. ప రీక్షలు ప్రశాంతంగా జరిగాయని డీఈఓ ఎం. వెంకటలక్ష్మమ్మ తెలిపారు. పశ్చిమలో 96 శాతం హాజరు భీమవరం: జిల్లాలో ఏపీ టెట్ పరీక్షలకు 96 శాతం అభ్యర్థులు హాజరయ్యారని డీఈఓ ఈ. నారాయణ తెలిపారు. ఉదయం 95 మందికి 90 మంది, మధ్యాహ్నం 100 మందికి 97 మంది హాజరయ్యారన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లోని ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పోరాటంలో భాగంగా మంగళవారం ఏలూరు జిల్లా సహకార అధికారి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు రాష్ట్ర స హకార సంఘాల ఉద్యోగుల సంఘం జిల్లా అ ధ్యక్షుడు కాళంగి వీరవెంకట సత్యనారాయణ ప్రకటనలో తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఉన్న స హకార సంఘాల ఉద్యోగులు పెద్ద ఎత్తున హాజరుకానున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. -
గర్జించిన జనకోటి
ప్రజాగళం నినదించింది.. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక్క సంతకంతో ప్రారంభమైన ప్రస్థానం కోటి సంతకాలకు చేరి కోటి గొంతుకలుగా గర్జించింది. చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు పూనుకోగా.. నిరసనగా వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ జిల్లాలో మహోద్యమంలా సాగింది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చిన కోటి సంతకాల పత్రాలతో ఏలూరులో భారీ ర్యాలీ నిర్వహించి ప్రత్యేక వాహనంలో తాడేపల్లికి పంపారు. సాక్షి ప్రతినిధి,ఏలూరు: వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కీలక ఘట్టం సోమవారం ముగిసింది. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు ర్యాలీగా జిల్లా పార్టీ కార్యాలయానికి తరలివచ్చారు. అనంతరం అక్కడ నుంచి రైల్వేస్టేషన్ సెంటర్కు చేరుకుని ఫ్లై ఓవర్ మీదుగా పాతబస్టాండ్ సెంటరులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వరకు భారీ నిరసన ర్యాలీ కొనసాగింది. వేలాదిగా హాజరైన భారీ ర్యాలీలో ఏలూరు పార్లమెంట్ పార్టీ పరిశీలకుడు, ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్, పార్లమెంట్ ఇన్చార్జి కారుమూరి సునీల్తో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, నియోజకవర్గ సమన్వయకర్తలు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, కొఠారు అబ్బయ్యచౌదరి, పుప్పాల వాసుబాబు, తెల్లం బా లరాజు, మామిళ్లపల్లి జయప్రకాష్, కంభం విజయరాజుతో పాటు పార్టీ ముఖ్యనేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రజా ఉద్యమంతో నూతనోత్తేజం ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమం పార్టీ కేడర్లో నూతనోత్తేజం నింపింది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు భారీ ర్యా లీలో పాల్గొన్నారు. తొలుత కోటి సంతకాల ప్రతులను ప్రత్యేక వాహనంలో ఏర్పాటు చేసి ర్యాలీని పార్లమెంట్ పరిశీలకుడు రవీంద్రనాథ్, జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్, పార్లమెంట్ ఇన్చార్జి, యుజన విభాగం జోన్–2 వర్కింగ్ ప్రెసిడెంట్ కారుమూరి సునీల్కుమార్, ఏలూరు ఇన్చార్జి జయప్రకాష్, బీసీ సెల్ జోన్–2 వర్కింగ్ ప్రెసిడెంట్ నౌడు వెంకటరమణ జెండా ఊపి ప్రారంభించారు. భారీ ర్యాలీని వందలాది ద్విచక్రవాహనాలు, కార్లు అనుసరించాయి. రైల్వేస్టేషన్ సెంటర్లో ప్రారంభమైన ర్యాలీ సీఎస్ఐ చర్చి సెంటర్, రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి మీదుగా ఏలూరు పాతబస్టాండ్ సెంటర్ వరకూ కొనసాగింది. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మెడికల్ కళాశాలను చూపిస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2023లో ఏలూరులో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలను పార్టీ నేతలు ర్యాలీలో ప్రత్యేకంగా చూపించారు. ఇది జగనన్న కట్టిన మెడికల్ కాలేజీ, వందల మంది వైద్య విద్యార్థులకు ఉపయోగపడుతుందంటూ.. ఇప్పటికై నా పద్ధతి మార్చుకో చంద్రబాబు అంటూ నినదించారు. అనంతరం భారీ ర్యాలీకి ఏలూరు న్యాయవాదులు మద్దతు పలికి బైక్ ర్యాలీ నిర్వహించారు. భారీ నిరసన ర్యాలీలో వైఎస్సార్సీపీ ఎస్ఈసీ సభ్యుడు దయాల నవీన్బాబు, బూత్ కమిటీ జోన్–2 అధ్యక్షుడు బీవీఆర్ చౌదరి, వడ్డీల కార్పొరేషన్ మాజీ చైర్మన్ ముంగర సంజయ్కుమార్, రాష్ట్ర కార్యదర్శులు నూకపెయ్యి సుధీర్బాబు, డీవీఆర్కే చౌదరి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సొంగా సందీప్, జిల్లా మహిళ అధ్యక్షురాలు కేసరి సరితారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షురాలు జానకిరెడ్డి, రాష్ట్ర యువజన విభా గం అధికార ప్రతినిధి కందుల దినేష్రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్గురునాథ్, రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, జిల్లా మహిళ ఉపాధ్యక్షురాలు చిలకపాటి డింపుల్, ఏలూరు మహిళ అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు తేరా ఆనంద్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, వైఎస్సార్టీయూసీ జిల్లా అధ్యక్షుడు పల్లి శ్రీనివాస్, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు వాసిరెడ్డి మధు, జిల్లా యువజన అధ్యక్షుడు కామిరెడ్డి నాని, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పాతినవలస రాజేష్, డాక్టర్ వింగ్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కేవీఎస్ రామకృష్ణ, పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు పుప్పాల గోపి, అంగన్వాడీ వింగ్ జిల్లా అధ్యక్షుడు స్వాతి యాదవ్, జెడ్పీటీసీలు మండల సరస్వతి, నిట్టా లీలానవకాంతం, బత్తుల రత్నకుమారి, అప్పన ప్రసాద్, జానంపేట బాబు, జడ్పీ వైస్ చైర్మన్ పెనుమాల విజయ్బాబు, పార్టీ నాయకులు కాశీ, తాళ్లూరి ప్రసాద్, చిక్కాల దుర్గాప్రసాద్, దొంతశెట్టి సత్యనారాయణ, యూనిస్ పాషా, పిల్ల చరణ్, జిజ్జు వెంకటేశ్వరరావు,చింతా అనిల్, స్టాన్లీ బాబు తదితరులు పాల్గొన్నారు. నృత్యాలు చేస్తున్న యువకులు వైఎస్సార్సీపీ జెండాలతో యువతులు ర్యాలీలో పాల్గొన్న ముస్లిం సోదరులుప్రైవేటుపై నిరసన ‘సంతకం’ వైద్య విద్య ప్రైవేటీకరణపై నినదించిన ప్రజాగళం కదంతొక్కిన వైఎస్సార్సీపీ కేడర్ ఏలూరులో భారీ ర్యాలీ మెడికల్ కళాశాలను చూపిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చంద్రబాబు ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తిన నేతలు జిల్లాలోని కోటి సంతకాల ప్రతులు తాడేపల్లికి తరలింపు మెడికల్ కళాశాలలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు కట్టపెట్టడం నీతిమాలిన చర్య. ప్రజా సమస్యలపై వైఎస్సార్సీపీ అలుపెరుగని పోరాటాలు చేస్తోంది. కేవలం కమీషన్ల కోసమే చంద్రబాబు సర్కారు ప్రైవేటీకరణకు పూనుకుంది. కోటి గొంతుకుల నిరసన చూసైనా తక్షణమే ప్రైవేటీకరణ నిలిపివేయాలి. లేకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తాం. దేశచరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో 17 కళాశాలలు రా ష్ట్రానికి మంజూరై 5 కళాశాలలు పూర్తయ్యాయి. – దూలం నాగేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు సీఎం చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఒక్క మెడికల్ కళాశాల కూడా తీసుకురాలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పాలనలో తెచ్చిన 17 కళాశాలల్లో 10 కళాశాలల ప్రైవేటీకరణకు పూనుకోవడం దారుణం. ఈ కళాశాలలను ప్రభుత్వమే పూర్తి చేస్తే క్రెడిట్ వైఎస్ జగన్కు వస్తుందని, క్రెడిట్ చోరీలో భాగంగా ప్రైవేటుకు అప్పగించి కమీషన్ల రూపంలో లబ్ధి పొందాలని చూస్తున్నారు. – వంకా రవీంద్రనాథ్, ఎమ్మెల్సీ, పార్లమెంట్ పరిశీలకుడు -
ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టం చేయాలి
ఏలూరు (టూటౌన్): కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని మరింత పటిష్ట పరచాలని, చట్టాన్ని చట్టంగానే కొనసాగించాలని, పథకంగా మార్పు చేయరాదని, సీపీఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ.రవి సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకం చట్టాన్ని ఇప్పుడు పూజ్య బాపుజీ గ్రామీణ రోజ్ గారి యోజన పథకంగా పేరు మార్చి పేదలు, వ్యవసాయ కార్మికుల పొట్ట కొట్టేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. కేవలం పేరు మాత్రమే మారుస్తున్నారని అనుకుంటే పొరపాటేనని, చట్టంగా ఉన్న దానిని కేవలం పథకంగా మార్పు చేయడం వల్ల భవిష్యత్తులో ఈ గ్రామీణ ఉపాధి హామీ చట్టం నీరు గారే ప్రమాదం ఉందన్నారు. ఈ చట్టానికి కేంద్ర ప్రభుత్వం రూ.2,50,000 కోట్ల కేటాయింపులు చేయాల్సి ఉండగా కేవలం రూ.60,000 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుంటుందని విమర్శించారు. సంవత్సరానికి 100 రోజులు పనులు చూపించాల్సి ఉండగా ఏలూరు జిల్లాలో కేవలం 38 నుంచి 50 రోజుల మధ్య మాత్రమే పనులు చూపించారని తెలిపారు. భవిష్యత్తులో ఉపాధి హామీలో కూడా కొలతలను గంటల పద్ధతితో ముడివేసి పని భారాన్ని పెంచే ప్రమాదం ఉందన్నారు. కామవరపుకోట: మండలంలోని గుంటుపల్లి పంచాయతీకి చెందిన ఏలూరు జిల్లా వైఎస్సార్సీపీ యువజన విభాగం నేత కొమ్మిన నరేష్(46) సోమవారం ఉదయం చెరువులో పడి మృతి చెందారు. గుంటుపల్లి పక్కనే ఉన్న చెరువులో చేపలకు మేత వేసేందుకు వెళ్లిన నరేష్ ప్రమాదవశాత్తు తెప్ప తిరగబడడంతో మృతిచెందారు. అందరితోనూ కలివిడిగా ఉండే నరేష్ మృతితో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. పంచాయతీలో కీలక నాయకుడిగా ఉండడంతో పాటు జిల్లా స్థాయిలో పార్టీ పరంగా యాక్టివ్గా ఉంటున్నాడు. పోస్టుమార్టం అనంతరం నరేష్ మృతదేహాన్ని కొల్లివారిగూడెంలోని స్వగృహానికి తరలించారు. నరేష్ మృతదేహానికి నియోజకవర్గ కన్వీనర్ కంభం విజయరాజు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కీసరి సరితా విజయ్ భాస్కర్రెడ్డి, దెందులూరు మండల అధ్యక్షుడు, శ్రీరామవరం సర్పంచ్ కామిరెడ్డి నానితో పాటు పలు పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు నివాళులు అర్పించారు. జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం మండలం వేగవరం సమీపంలో సోమవారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. విజయవాడ నుంచి జంగారెడ్డిగూడెం మీదుగా వేలేరుపాడు మృతదేహంతో వెళ్తున్న కేఆర్పురం ఐటీడీఏ అంబులెన్స్ ఎదురుగా మోటార్సైకిల్పై వస్తున్న చింతలపాటి శంకర్ వాహనాన్ని ఢీకొంది. దీంతో శంకర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే జంగారెడ్డిగూడెం ఎస్సై ఎన్వీ ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ట్రాఫిక్ను అదుపు చేశారు. మృతిచెందిన శంకర్కు భార్య కరుణకుమారి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్యాభర్తలు కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. తాడువాయి నుంచి జంగారెడ్డిగూడెం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. కామవరపుకోట: జాతీయస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చెందిన విద్యార్థిని ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు గవర్రాజు తెలిపారు. పాఠశాలకు చెందిన విద్యార్థిని బోల్లిబోయిన శ్రావణి ఇటీవల వీరవాసరంలో జరిగిన అండర్–17 విభాగం సాఫ్ట్బాల్ పోటీలో విశేష ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. శ్రావణిని, శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయురాలు, శ్యామలాదేవిని పాఠశాల సిబ్బంది, గ్రామస్తులు అభినందించారు. -
జాతీయ పోటీలకు పెదవేగి విద్యార్థులు
పెదవేగి: రాష్ట్ర స్థాయి అండర్–17 సాఫ్ట్బాల్ పోటీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రథమ స్థానం సాధించింది. దీనిలో పెదవేగి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులు తొమ్మిది మంది పాల్గొన్నారు. దుర్గారావు, సంపత్లు జాతీయ స్థాయి పోటీలకు, రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపికయ్యారు. విద్యార్థులను ప్రిన్సిపాల్ ఎం.రమేష్బాబు, వైస్ ప్రిన్సిపాల్ నిర్మలకుమారి, జేసీ వై.శ్రీనివాసరావు, పీడీ కె.జయరాజు అభినందించారు. కొయ్యలగూడెం: అతి వేగం, నిర్లక్ష్యం రెండు ప్రాణాలను బలిగొంది. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం – జంగారెడ్డిగూడెం జాతీయ రహదారిపై కొత్తూరు క్రాస్ రోడ్డు (పులి వాగు శివాలయం) వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయారు. ఎస్సై వి.చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గాడాల గ్రామానికి చెందిన ప్రత్తి జయరాజు (50), అతని భార్య సత్య (42) బైక్పై జంగారెడ్డిగూడెంలోని తమ కుమార్తె బిడ్డ బారసాలకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ట్రక్ ఆటో ఢీకొట్టింది. భార్యాభర్తలు ఇద్దరికీ తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ట్రక్ డ్రైవర్ మితిమీరిన వేగంతో పాటు నిర్లక్ష్యంగా ఆటోను నడపడం వల్ల ప్రమాదం సంభవించిందని చెబుతున్నారు. మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
ప్రియుడి ఇంటి ముందు నిరసన
ఉండి: పెళ్ళి చేసుకుంటానని నమ్మించి అనంతరం ముఖం చాటేయడంతో యువతి కుటుంబంతో కలిసి ప్రియుడి ఇంటిముందు న్యాయం చేయాలంటూ సోమవారం నిరసన తెలిపారు. ఉండి మండలం మహదేవపట్నం గ్రామంలోని రామచంద్రాపురం ప్రాంతాని చెందిన యువతి అదే ప్రాంతానికి చెందిన కరణం భానుప్రకాష్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఎనిమిది నెలల క్రితం యువతికి చేబ్రోలు గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం నిశ్చయమై కట్నకానుకలు ఇచ్చి పుచ్చుకున్నారు. అయితే తాను వివాహం చేసుకుంటానని చెప్పి యువకుడు ఆ పెళ్ళి చెడగొట్టాడు. దీంతో విషయం తెలుసుకున్న ఇరు కుటుంబాల వారు పెద్దల సమక్షంలో యువతీ, యువకుడికి దండలు మార్చి సంబంధం ఖాయం చేసుకున్నారు. యువకుడికి అన్నయ్య ఉండటంతో అతనికి వివాహమైన అనంతరం చిన్నవాడైనన భానుప్రకాష్కు వివాహం చేస్తానని యువకుడి తండ్రి చెప్పడంతో పెద్దలు ఆరునెలల గడువిచ్చారు. ఈ ఆరు నెలల్లో పెద్దకుమారుడికి వివాహం చేయకపోగా అతనిని గల్ఫ్ దేశం పంపించేసారు. పరిస్థితిని గమనించిన యువతి గత కొంతకాలంగా యువకుడిని నిలదీస్తుంది. యువకుడు ముఖం చాటేయడంతో చేయిదాటిపోతుందని ఆమె కుటుంబ సభ్యులు సోమవారం యువకుడి ఇంటికి వెళ్ళి మాట్లాడటంతో వారంతా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దీంతో ప్రియుడి ఇంటిముందే యువతి కుటుంబంతో సహా నిరసనకు దిగింది. పెద్దల సమక్షంలో దండలు మార్చి వివాహం ఖాయం చేసారని తనకు న్యాయం చేయాలంటూ యువతి కన్నీటి పర్యంతమైంది. -
జిల్లా చరిత్రకు సజీవ సాక్ష్యం
● నేడు ఏలూరులో పురావస్తు మ్యూజియం ప్రారంభం ● పురావస్తు సంపద అంతా ఒకే చోట ● రూ.5 కోట్లతో నిర్మాణం ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరు నగరంతో పాటు జిల్లాకూ గొప్ప చరిత్ర ఉంది. క్రీస్తు పూర్వమే మన జిల్లాలో ఆదిమానవుడు నడయాడినట్టు చరిత్ర చెబుతోంది. దానిని పురావస్తు శాఖ నిరూపించింది. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఆదిమానవుడి ఆనవాళ్లకు స్పష్టమైన ఆధారాలు దొరికాయి. ఆదిమానవుడు వినియోగించిన అనేక ఉపకరణాలను శోధించి సాధించింది. అవి ఇప్పుడు మన కళ్ళముందే ప్రత్యక్షమయ్యాయి. అక్కడి నుంచి రాచరికపు వైభవాన్ని చవిచూసిన ఈ ప్రాంతానికి చెందిన గురుతులను కూడా వెతికిపట్టుకుంది. వాటినీ మన కళ్ళముందుకు తీసుకువచ్చింది. నగరంలో ఏర్పాటు చేసిన పురావస్తు ప్రదర్శన శాలలో ఇవన్నీ సాక్షాత్కరిస్తున్నాయి. పోలవరం సమీపంలోని రుద్రమకోట ప్రాంతంలో 10 లక్షల సంవ్సరాల నాటి ఆదిమానవుడి సమాధుల్లో లభ్యమైన పనిముట్ల నుంచి పురాతన పూసలు, రాజులు వాడిన కత్తులు, డాళ్ళు, శిరస్త్రాణాల వరకూ ఈ మ్యూజియంలో ఆకర్షిస్తున్నాయి. పురాతన కాలం నాటి రాతి చెక్కడాలు, దేవతా మూర్తుల ప్రతిమలు, వేల ఏళ్ళనాటి బంగారు, వెండి నాణేలు, టెర్రకోట పాత్రలు, పింగాణి పాత్రలు, ఇలా పాత రాతి యుగం నుంచి నవీన శిలా యుగం వరకూ మన చారిత్రక ఆనవాళ్ళు ఇక్కడ దర్శనమిస్తున్నాయి. దీనితో పాటు మన ప్రాంత సాహిత్య సంపదగా చెప్పుకోవడానికి తామ్ర పత్రాలు, తాళపత్ర గ్రంథాలు, లోహాలతో చేసిన వంట పాత్రలు, కాంస్యంతో చేసిన దేవతామూర్తుల ప్రతిమలు ఇలా అనేక పురాతన వస్తువులు కనువిందు చేస్తున్నాయి. ఈ ప్రదర్శన శాల మనను విష్ణుకుండినులు, ఇక్ష్వాకులు, వేంగి చాళుక్యులు, రెడ్డి రాజులు, నిజాం పాలకుల కాలానికి తీసుకు వెళ్తుందనడంలో సందేహం లేదు. మరో ముఖ్యమైన విషయమేమిటంటే ఈ ప్రదర్శన శాలలో బంగారు అక్షరాలతో లిఖించిన ఖురాన్ గ్రంథం ఆకర్షిస్తోంది. రూ.5 కోట్లతో నిర్మాణం ఈ మ్యూజియం ఏర్పాటుకు అప్పటి ఎమ్మెల్యే బడేటి బుజ్జి, నగర మేయర్ షేక్ నూర్జహాన్ స్థానిక అగ్రహారంలోని నగరపాలక సంస్థకు చెందిన సుమారు 1500 గజాల స్థలాన్ని కేటాయించగా అప్పటి చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు, ఆర్కియాలజీ శాఖ కమిషనర్ జీ. వాణీమోహన్ సహకారంతో రూ.5 కోట్ల నిధులతో నిర్మించారు. కేవలం గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే కాక మొదటి అంతస్తులో సైతం పలు వస్తువులను ఏర్పాటు చేశారు. రాజమండ్రి, కాకినాడల్లోని మ్యూజియంలలో ఉన్న కొన్ని వస్తువులను జిల్లా ప్రజల కోసం ఇక్కడికి తరలించారు. నేడు అధికారికంగా ప్రారంభం ఏడాది క్రితమే నిర్మాణం పూర్తి చేసుకున్నా వివిధ సాంకేతిక కారణాలతో అప్పటి నుంచి ఈ పురావస్తు ప్రదర్శన శాల ప్రారంభానికి నోచుకోలేదు. ప్రజలు, విద్యార్థుల అవగాహన కోసం ఏడాది నుంచే సందర్శకులను ఈ ప్రదర్శన శాలకు అనుమతిస్తున్నారు. ఎట్టకేలకు సాంకేతిక ఇబ్బందులన్నింటినీ తొలగించుకుని ఈ మ్యూజియం అధికారికంగా ప్రారంభోత్సవానికి సిద్ధమయింది. ఈ నెల 16 రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మ్యూజియంను అధికారికంగా ప్రారంభించనున్నారు. ఏలూరులో మంగళవారం ప్రారంభించనున్న మ్యూజియం నగర ప్రజలకు పండుగగా, విద్యార్థులకు విజ్ఞానాన్ని పంచే ఆలయంగా నిలువనుంది. ఈ మ్యూజియంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చాం. మ్యూజియంలో ఏర్పాటు చేసిన కొన్ని చిత్రపటాలను క్యూఆర్కోడ్ ద్వారా స్కాన్ చేస్తే ఆ పటానికి సంబంధించిన చరిత్ర మన అరచేతిలోకి వస్తోంది. ఈ మ్యూజియంతో ఏలూరు కూడా పర్యాటక ప్రాంతంగా అబివృద్ధి చెందుతుంది. కే.తిమ్మరాజు, పురావస్తు శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఏలూరు జిల్లా చరిత్రను, ప్రాచీనత్వాన్ని ప్రజలకు వివరించే ఏకై క సాధనమైన మ్యూజియంను ఏలూరులో ఏర్పాటు చేయడానికి పలువురు సామాజికవేత్తలు ఎన్నో ఏళ్ళుగా విశేష కృషి చేశాం. పురావస్తు శాఖాధికారులతో నిరంతరం సంప్రదింపులు జరిపి, మ్యూజియం నిర్మాణానికి నిధులు విడుదల చేయించడంతో పాటు, వివిధ ప్రాంతాల్లో ఉన్న ఏలూరుకు చెందిన పురాతన వస్తువులను ఇక్కడకు రప్పించడంలో అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారం మరువలేనిది. ఇప్పుడు ఈ ప్రాంతానికి చేరువగానే మ్యూజియం అందుబాటులోకి వచ్చింది. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. బీకేఎస్ఆర్ అయ్యంగార్, సామాజిక వేత్త -
ఇండోర్ కళకళలు ఏనాటికో?
ఏలూరు ఇండోర్ స్టేడియం పేరు చెబితే బాలబాలికలు, సీనియర్ క్రీడాకారుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తుంది. రెండేళ్ల క్రితం వరకు పిల్లలు, పెద్దల ఆటలతో ఇండోర్ కళకళలాడేది. పదుల సంఖ్యలో బాలబాలికలు బ్యాడ్మింటన్, జూడో ఇతర క్రీడల్లో సాధన చేసేవారు. జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలతో స్డేడియం సందడిగా ఉండేది. ఇక్కడ నిర్వహించిన జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో జిల్లా పిల్లలు రాణించారు. మెడల్స్, షీల్డ్స్, పతకాలతో పాటు పేరు, ప్రఖ్యాతలు తీసుకువచ్చారు. ఇదంతా గతం. సుమారు 70 ఏళ్ల క్రితం నిర్మించిన ఇండోర్ గత ఏడాది వర్షాలకు తడిచి రాత్రివేళ పైకప్పు కూలిపోయింది. అప్పటి నుంచి ఇందులో పోటీల నిర్వహణ, సాధన నిలియిపోయాయి. అధికారులు స్టేడియం శిథిలాలు తొలగించి మిన్నుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు పూర్తి కావస్తున్నా నేటికీ స్టేడియం నిర్మాణం చేపట్టకపోవడంపై క్రీడాభిమానులు నిరుత్సాహం చెందుతున్నారు. ఇప్పటికై నా ఇండోర్ స్టేడియం నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు. – ఏలూరు రూరల్ ఇండోర్ స్టేడియం పునర్నిర్మించకపోవడం విచారకరం. ప్రభుత్వం ఆటలకు ప్రాధాన్యత ఇస్తాం అంటుంది కాని, పనులు కనిపించడం లేదు. నేనే ప్రతిరోజూ వాకింగ్ చేసేన తర్వాత ఇందులో ఉన్న జిమ్లో కొద్దిసేపు సాధన చేసేవాడిని. జిమ్ కూడా మూసివేశారు. ఇక గత్యంతరం లేక ఇతర ప్రాంతాల్లో వాకింగ్ చేస్తున్నాను. – సుభాని, వాకర్మా సీనియర్స్ ఇండోర్లో ఆడుకుని మంచి ప్లేయిర్స్ అయ్యారు. మా ఇంటి దగ్గరి స్టేడియంకు వెళ్లి ఆడుకోమంటున్నారు. ఆదివారం, సెలవు రోజుల్లో ఆరుబయటే ఆడుకుంటున్నాను. బయట షటిల్ కాక్ గాలికి అటు, ఇటు పోతోంది. ఇండోర్లో చక్కగా ఆడుకోవచ్చు. – పగ్నేష్ -
గంట సేపు నిలిచిన ప్యాసింజర్
ఆకివీడు: నర్సాపురం నుంచి చైన్నె వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు కోసం ఆకివీడు రైల్వేస్టేషన్లో ప్యాసింజర్ రైలును సుమారు గంటసేపు ఆపారు. భీమవరం నుంచి విజయవాడ వెళ్లే పాసింజర్ రైలు ఇటీవల సకాలంలో గమ్యానికి చేరుతుంది. అయితే సోమవారం వందేభారత్ రైలు కోసం ప్యాసింజర్ రైలును గంటపైగా ఆపడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నివాసం సమీపంలో యనమదుర్రు డ్రైన్ నుంచి పంట పొలాలకు నీరు తోడే తూములో భారీ కొండచిలువ కనిపించడంతో స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇన్చార్జ్ డీఎఫ్ఓ ప్రభాకర్ ఆదేశాలతో అటవీ శాఖ అధికారులు స్నేక్ క్యాచర్స్ కలిసి రెండు గంటల శ్రమించి 12 అడుగుల భారీ కొండ చిలువను పట్టుకున్నారు. భీమవరం రేంజ్ అటవీ శాఖ అధికారి ఎం.కరుణాకర్ మాట్లాడుతూ కొండచిలువ 12 అడుగుల పొడవు 80 కిలోల బరువు ఉందని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలోని రిజర్వ్ ఫారెస్ట్కు కొండచిలువను తరలించినట్లు ఆయన తెలిపారు. -
నత్తాలోవ డ్రైన్ వెంటనే తవ్వాలి
నరసాపురం రూరల్: నరసాపురం మండలంలోని సరిపల్లి, లిఖితపూడి, రుస్తుంబాద గ్రామాల్లోని పంటపొలాల్లో నీరులాగే ప్రధాన కాలువ నత్తాలోవ డ్రైన్ వెంటనే తవ్వాలని సోమవారం రైతులు, కౌలు రైతులు సరిపల్లి వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా కౌలురైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు మాట్లాడుతూ నత్తాలోవ డ్రైన్ ఏళ్లుగా తవ్వడం లేదన్నారు. ఈ డ్రెయిన్పై మూడు గ్రామాల పరిధిలో వేలాది ఎకరాల్లో పంట సాగవుతుందని ఏళ్ళ తరబడి కాలువ తవ్వకపోవడంతో ప్రతి సార్వా పంటకు పంట వేయకుండా నిరుపయోగంగా వదిలేసి తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. వరద సమయంలో పోటు నీరు పొలాల్లోకి వెళ్లి తిరిగి బయటకు లాగక పోవడంతో ప్రస్తుతం కనీసం దాళ్వా సాగు చేపట్టే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తంచేశారన్నారు. ప్రభుత్వం, నీటిసంఘాల కమిటీలు పట్టించుకోకపోవడంతో ఇప్పటికే పంటలు కోల్పోయి కష్టాల్లో ఉన్న రైతులు సొంతంగా చందాలు వేసుకుని కాలువ తవ్వుకునే దుస్థితి ఏర్పడిందని తెలిపారు. ప్రభుత్వం, నీటి సంఘాలున్నా నిధులు కేటాయించి తవ్వకపోవడం దారుణమన్నారు. సమస్యపై డ్రైనేజీ డీఈ మోహన్ కృష్ణ, నీటి సంఘం డైరెక్టర్ అందే రామకృష్ణతో మాట్లాడగా వెంటనే వర్క్ అంచనా వేసి తీర్మానం చేసి త్వరలోనే కాలువను తవ్వుతామని హామీ ఇచ్చారన్నారు. కార్యక్రమంలో రైతులు మండా రమేష్, గన్నాబత్తుల ఏడుకొండలు, గన్నాబత్తుల నాగేశ్వరరావు, గమిడి మధుబాబు, కొక్కిరిమెట్టి వెంకటేష్, రాంబాబు, యర్రంశెట్టి సత్యనారాయణ, కేదాసు వీరన్న తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తల దుర్మరణం
ఏలూరు: జిల్లాలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణం చెందారు. కొయ్యలగూడెం శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్పై వెళుతున్న దంపతులు మృత్యువాత పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గాడాల గ్రామం నుండి మనవరాలి అన్నప్రాసనకై జంగారెడ్డిగూడెం బైక్పై వస్తున్న ప్రత్తి జయరాజు(52), భార్య సత్యవతి(45) దంపతులు.. ట్రాలీ ఆటోని ఢీకొట్టి మృతిచెందారు. కొయ్యలగూడెం శివారు పులి వాగు సమీపంలో బైక్ను ట్రాలీ ఆటో ఢీకొట్టింది. దాంతో ఘటనా స్థలంలోనే భార్యాభర్తలిద్దరూ మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
భారీ ర్యాలీకి తరలిరండి
జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ కై కలూరు : ఏలూరులో సోమ వారం జరిగే శాంతి ర్యాలీని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) పిలుపునిచ్చారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ‘కోటి సంతకాల సేకరణ–ప్రజాఉద్యమం’ కా ర్యక్రమం ద్వారా ప్రజల నుంచి సేకరించిన సంతకాల పత్రాలను ఏలూరులోని జిల్లా పార్టీ కా ర్యాలయం నుంచి తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి పంపనున్నామన్నారు. కై కలూరు నియోజకవర్గ నాలుగు మండలాల పార్టీ శ్రేణులు ఉద యం 8 గంటలకు కై కలూరు మండలం ఆటపాక వినాయక ఐస్ ప్లాంట్ నుంచి ఏలూరు వెళ్లే కా ర్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ప్రతి గ్రా మంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కేటాయించిన వాట్సాప్ గ్రూపుల్లో బయలుదేరే వీడియోలు అప్లోడ్ చేయాలన్నారు. -
పాపికొండలకు రోడ్డు మార్గం
బుట్టాయగూడెం: పాపికొండల విహార యాత్రకు గతంలో పట్టిసీమ, పోలవరం, సింగన్నపల్లి, వాడపల్లి గ్రామాల సమీపంలో లాంచీల బోటు పాయింట్లు ఉండేవి. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన పర్యాటకులు ఈ గ్రామాల నుంచే బోటులో పాపికొండల విహార యాత్రకు వెళ్లేవారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు చేపట్టడంతో పై గ్రామాలలో ఉన్న బోటు పాయింట్లను తీసివేసి దేవిపట్నం మండలం గండి పోచమ్మతల్లి గుడి సమీపం నుంచి విహార యాత్రకు బోటు పాయింటు ఏర్పాటు చేశారు. పాపికొండల విహార యాత్రకు వెళ్లాలంటే రాజమండ్రి మీదగా గండిపోచమ్మ తల్లి గుడికి చేరుకుని అక్కడ నుంచి గోదావరి నదిపై లాంచీలు, బోటుపై ప్రయాణం చేస్తూ పాపికొండల అందాలను చూసే అవకాశం ప్రస్తుతం ఉంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఆ అవకాశం ఉండకపోవచ్చని తెలుస్తుంది. పాపికొండల విహారయాత్రకు వచ్చే పర్యాటకులు బోటుపాయింటు దూర భారంగా ఉందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా ఏలూరు జిల్లాలో పశ్చిమ ఏజెన్సీ అటవీ ప్రాంతం మీదగా పాపికొండలు సమీపంలోని కొరుటూరు వరకూ సుమారు 83 ఏళ్ల క్రితం బ్రిటీష్ కాలంలో రాళ్లను పేర్చి నిర్మించిన దాసన్ రోడ్డు మార్గాన్ని అభివృద్ధి చేసేలా ప్రభుత్వం కృషి చేయాలని పర్యాటకులు కోరుతున్నారు. ఈ మార్గం అభివృద్ధి చేస్తే అడవి అందాలను ఆస్వాదిస్తూ పాపికొండల సందర్శనకు వెళ్లొచ్చు. పాపికొండల సందర్శనకు ఇలా.. బుట్టాయగూడెం మండలం పులిరామన్నగూడెం నుంచి ముంజులూరు మీదుగా చింతపల్లి వరకూ సుమారు 6.5 కిలోమీటర్ల బీటీ రోడ్డు ఉంది. ఈ రోడ్డు పాడైపోయింది. గడ్డపల్లి నుంచి రాళ్లు పరిచిన దారి ఉంటుంది. ఇదే మార్గం ధారవాడ, కొరుటూరు వరకు వెళ్తుంది. గడ్డపల్లి దాటిన తర్వాత కొట్రుపల్లి మీదుగా చిలకలూరు, రావిగూడెం బంగ్లా రహదారి మీదుగా కొరుటూరు వరకూ సుమారు 15.49 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ మార్గాన్ని 3.5 మీటర్ల వెడల్పున నిర్మించాలని ప్రతిపాదన ఉంది. ఈ దాసన్ రోడ్డు మార్గాన్ని అభివృద్ధి చేస్తే అన్ని రకాల వాహనాలతో ప్రయాణం చేస్తూ అడవి అందాలు ఆస్వాదిస్తూ నేరుగా కొరుటూరు చేరుకుని అక్కడ పాపికొండలను చూడొచ్చు. బ్రిటిష్ కాలంలో నిర్మించిన రోడ్డు మార్గం బ్రిటిష్ కాలంలో దాసన్ అనే ఇంజనీరు ఈ రహదారిని నిర్మించారు. గడ్డపల్లి దాటిన తర్వాత కొట్రుపల్లి మీదగా కొరుటూరు వరకూ సమారు 15.49 కిలోమీటర్ల మేర రాళ్లను పేర్చి 1936–37 సంవత్సరంలో ఈ రహదారిని నిర్మించారు. ఎత్తయిన కొండలపై నుంచి 13 మలుపులతో ఉండే ఈ మార్గం మీదుగా ప్రయాణం ఎంతో మధురానుభూతి కలిగిస్తుంది. ఈ మలుపులు తిరుమల కొండపై ప్రయాణాన్ని తలపిస్తాయి. ఈ మార్గాన్ని అభివృద్ధి చేస్తే పర్యాటకంగానే కాకుండా అటవీ ప్రాతంలో జీవనం సాగిస్తున్న గిరిపుత్రులకు జీవనోపాధి మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతుంది. ఈ మార్గంలో జలతారు వాగు కనువిందు చేస్తుంది. రోడ్డు నిర్మాణం పూర్తయితే ప్రతి ఒక్కరూ జలపాతాన్ని చూసే అవకాశం ఉంటుంది. వైఎస్సార్సీపీ పాలనలో రూ.10 కోట్లతో ప్రతిపాదన పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ప్రాజెక్టు నుంచి కొరుటూరు వరకూ ఉండే రోడ్డు మార్గం పూర్తిగా నిలిచిపోయింది. రోడ్డు మార్గంలో ఉన్న 19 గ్రామాల్లోని ప్రజలకు బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాల్లో పునరావాస గ్రామాలు ఏర్పాటు చేసి వారిని అక్కడకు తరలించారు. కొరుటూరు, పాపికొండలు చేరుకోవడానికి ప్రస్తుతం దాసన్ రోడ్డు ఒక్కటే మార్గం ఉంది. ఈ నేపథ్యంలో ఇటు పర్యాటకంగా అటు అటవీ ప్రాతంలో జీవిస్తున్న గిరిజనులు జీవనోపాధి మెరుగుపర్చేలా వైఎస్సార్సీసీ పాలనలో నాటి కలెక్టర్ రేవు ముత్యాలరావు ఆధ్వర్యంలో ఐటీడీఏ, అటవీశాఖ, పోలవరం ప్రాజెక్టు పోలీసు అధికారులతో పాటు అప్పటి ఎమ్మెల్యే తెల్లం బాలరాజు దాసన్ రోడ్డు మార్గాన్ని స్వయంగా పరిశీలించారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే వెనుకబడి ఉన్న గిరిజన గ్రామాలు అభివృద్ధి చెందుతాయని గిరిపుత్రులకు జీవనోపాధి కూడా లభిస్తుందని భావించి సుమారు రూ.10 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. బ్రిటీష్ కాలంలోనే కొండపై దాసన్ రోడ్డు ఈ రోడ్డు అభివృద్ధికి గతంలో రూ.10 కోట్లతో ప్రతిపాదనలు నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేయాలంటున్న స్థానికులు -
ఎరువు.. బరువు
ఏలూరు (మెట్రో): ప్రభుత్వ సాయం శూన్యం.. ప్రకృతి కనికరం లేదు.. దళారుల దోపిడీ.. ఇలా ప్రతి సీజన్ లోనూ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ఖరీఫ్ సీజన్లో ప్రకృతి వైపరీత్యాలు, యూరియా కష్టాలు, ప్రభుత్వ వంచనతో దగా పడ్డ రైతన్నలు రబీ సాగుకు సిద్ధమవుతున్నాడు. అయితే ఎరువుల ధరలు వీరిని బెంబేలెత్తిస్తున్నాయి. 2.38 లక్షల ఎకరాల్లో.. జిల్లాలో వరి, మొక్కజొన్న ప్రధాన పంటలు కాగా పొగాకు, అపరాలు మొత్తం 2.38 లక్షల ఎకరాల్లో రబీ సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో గత సీజన్ కంటే అధికంగా పెట్టుబడులు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత సీజన్ లో వరికి మద్దతు ధర లేకపోవడం, మోంథా తుపానుతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎకరా సాగుకు పంటను బట్టి రూ.35 వేల నుంచి రూ.80 వేల వరకు ఖర్చవుతోంది. ఈ ఏడాది ఎరువులు, కూలీల ధరలు సైతం పెరగడంతో ముఖ్యంగా ఈ రబీ సీజన్లో ఎకరాకు మరో రూ.15 వేలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం పంట ఉత్పత్తుల ధరల సైతం పూర్తిగా పతనం కావడం రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఎరువుల ధరలతో బెంబేలు ఎరువుల ధరలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. చంద్రబాబు సర్కారులో ఎరువుల ధరలకు కళ్లెం వేసే నాథుడే కరువయ్యాడు. గత వైఎస్సార్సీపీ పాలనలో (2019–24) ఎరువుల ధరలు నిలకడగా ఉన్నాయి. గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంచుతూ సరసరమైన ధరలకు అందిచేవారు. అయితే చంద్రబాబు ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం కావడంతో డిమాండ్ ఉన్న యూరియా వంటి ఎరువులను కృత్రిమ కొ రత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇలా వ్యాపారుల దోపిడీతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అలాగే ఏటా ఎరువుల ధరలు పెరగడంతో అప్పులపాలవుతున్నారు. ఎరువుల ధరలు (బస్తా 50 కిలోలు) రకం గతంలో ప్రస్తుతం 20–20–0 రూ.1,250 రూ.1,350 10–26–26 రూ.1,470 రూ.1,850 15–15–15 రూ.1,450 రూ.1,650 14–35–14 రూ.1,700 రూ.1,850 పొటాష్ రూ.1,550 రూ.1,800 28–28–0–28 రూ.1,700 రూ.1,850 20–20–0–13 రూ.1,300 రూ.1,450 డీఏపీ రూ.1,350 రూ.1,350 యూరియా రూ.266 రూ.270 రైతు నెత్తిన దరువు ప్రతి సీజన్లో భారీగా పెరుగుతున్న పెట్టుబడులు ప్రభుత్వ సాయం శూన్యం జిల్లాలో 2.38 లక్షల ఎకరాల్లో రబీ సాగు దాళ్వాకు సిద్ధమైన అన్నదాతలు జిల్లాలో రబీ సీజన్ ప్రారంభమైంది. వ్యాపారులు ప్రభుత్వ నిర్ణయించిన ధరల మేరకే ఎరువులు విక్రయించాలి. అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అలాగే ఏ ఒక్క ఎరువుకైనా కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవు. ఎరువులు, పురుగు మందుల పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలను సైతం ఏర్పాటుచేసి రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం. – హబీబ్ బాషా, జిల్లా వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ -
ధనుర్మాసం.. ఆధ్యాత్మిక శోభితం
విష్ణుమూర్తికి ప్రీతికరమైన ధనుర్మాసం ఎంతో శుభప్రదమైంది. విష్ణు, వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో నెల రోజుల పాటు తిరుప్పావై పాశురాలను పఠిస్తారు. ధనుర్మాస ఉత్సవాలు నిర్వహిస్తారు. పెళ్లికాని యు వతులు ఇంటి ముందు ముగ్గులు, గొబ్బిళ్లతో పూజలు చేస్తే కోరుకున్న వరుడు దొరుకుతాడని ప్రతీతి. ధనుర్మాస వ్రతాన్ని ఆచరించిన వారికి అంతా శుభం జరుగుతుంది. – సుదర్శనం శ్రీనివాసాచార్యులు, ఆగమ పండితుడుద్వారకాతిరుమల: శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమైన ధనుర్మాస ఉత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. విష్ణుచిత్తుని కుమార్తె గోదాదేవి సాక్షాత్తు శ్రీరంగనాథుడిని వివాహం చేసుకుంటానని దీక్ష పూనుతారు. తన అనుభూతిని, భావాలను పాశురం రూపంలో రచించి 30 పాశురాలను విష్ణువుకు అంకితం చేస్తారు. ఆమె భక్తికి ముగ్ధుడైన శ్రీరంగనాథుడు గోదాదేవిని పరిణయమాడతారు. ఈ ఉత్సవాల కోసం జిల్లాలో వైష్ణవ ఆలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో ఒకటైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ధనుర్లగ్న ప్రవేశాన్ని అనుసరించి ఈనెల 16న మధ్యాహ్నం 1.27 గంటలకు ఘంటానాదం (నెలగంట) జరుగుతుంది. పవిత్ర మాసం వేదాల్లో సామవేదం, మాసాల్లో మార్గశిరం అత్యంత పవిత్రమైనవని భగవద్గీత చెబుతోంది. ఈ మాసంలో రంగనాథుడిని గోదాదేవి వరించి, తన భక్తిని చా టుకుంది. సూర్యుడు వృశ్చిక రాశి నుంచి ధనురాశిలోకి ఈ నెలలోనే ప్రవేశిస్తాడు. ఈ 30 రోజుల కాలాన్ని ధనుర్మాసంగా పిలుస్తూ, విష్ణువును ప్రసన్నం చేసుకునేందుకు గోదాదేవి రోజుకో రీతిలో తిరుప్పావై పాశురాలను ఆలపించడం విశేషం. రోజుకో విన్నపం శ్రీవైష్ణవులకు తిరుప్పావై వ్రతం ముఖ్యమైంది. వ్రత నిర్వహణలో భాగంగా నెలరోజుల పాటు రోజుకో పాశురం చొప్పున విన్నపం చేస్తారు. ఒకటి నుంచి 5 పాశురాల్లో వ్రత విధానం, 6 నుంచి 15 పాశురాల్లో తన తోటి చెలికత్తెలను నిద్రలేపి నందగోపుని గృహానికి వెళ్లడం, 16, 17, 18 పాశురాల్లో నందగోపుడు, యశోద, బలరాములను మేల్కొలపడం, 23వ పాశురంలో మంగళాశాసనం, 25, 26 పాశురాల్లో స్వామికి అలంకారాలైన ఆయుధాల్లో పరా అనే వాయిద్యాన్ని తమ శరణాగతి అనుగ్రహించి, తమ సంకల్పాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తారు. ఆఖరి రోజున గోదా రంగనాథుల కల్యాణాన్ని అట్టహాసంగా నిర్వహిస్తారు. నూతన అనివేటి మండపంలో విష్ణుమూర్తి, గోదాదేవి శిల్పాలు ద్వారకాతిరుమల క్షేత్ర ప్రధాన కూడలిలో ధనుర్మాస మండపం రేపటి నుంచి శ్రీవారి క్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాలు 17 నుంచి ఆలయంలో సుప్రభాత సేవ రద్దు తిరుప్పావై సేవాకాలాలు, గ్రామోత్సవాలు ప్రారంభం వచ్చేనెల 14న గోదా, రంగనాథుల కల్యాణం 17 నుంచి గ్రామోత్సవాలు శ్రీవారి ఆలయంలో ఈనెల 16న మధ్యాహ్నం నె లపట్టడంతో ప్రారంభమయ్యే ఉత్సవాలు, జన వరి 14 వరకు సాగుతాయి. నిత్యం ఆలయంలో తిరుప్పావై గానం, ఆండాళ్ కోవెల సేవలను నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం గోదాదేవికి కుంకుమా ర్చన చేస్తారు. 17 నుంచి రోజూ ఉదయం స్వామి, అమ్మవార్లు, గోదాదేవికి గ్రామోత్సవాలు నిర్వహిస్తారు. ఆలయ ప్రధాన కూడలిలోని మండపంలో పూజలు చేస్తారు. జనవరి 14న భోగి పండుగ నాడు శ్రీవారి నిత్య కల్యాణంతో పాటు, గోదా రంగనాథు కల్యాణాన్ని అర్చకులు అట్టహాసంగా నిర్వహిస్తారు. ఈనెల రోజులు ఆలయంలో సుప్రభాత సేవను రద్దు చేసి, ఆ సమయంలో తిరుప్పావై సేవను అర్చకులు నిర్వహిస్తారని ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి వెల్లడించారు. -
లోక్ అదాలత్లో 10,798 కేసుల పరిష్కారం
ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 13న నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 10,798 కేసులు పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 34 బెంచీలు ఏర్పాటు చేశామన్నారు. 10798 పెండింగ్ కేసులు, 238 ప్రీ లిటిగేషన్ కేసులు రాజీ చేశామని, పెండింగ్ కేసులలో 10,351 క్రిమినల్ కేసులు, 153 మోటార్ వాహన ప్రమాద బీమా కేసులు, 294 సివిల్ కేసులను రాజీ చేశామన్నారు. ఏలూరులో 1,988, భీమవరంలో 974, చింతలపూడిలో 1,248 జంగారెడ్డిగూడెంలో 971, కొవ్వూరులో 1,092, నర్సాపురంలో 434, పాలకొల్లులో 458, తాడేపల్లిగూడెంలో 1,433, తణుకులో 1,082, నిడదవోలులో 919, భీమడోలు 153 పెండింగ్ కేసులను పరిష్కరించామని తెలిపారు. కేసుల పరిష్కారానికి తోడ్పడిన న్యాయవాదులకు, పోలీస్ అధికారులకు, రెవెన్యూ సిబ్బందికి, బీమా, బ్యాంకు అధికారులు, ఇతర విభాగాల అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కొయ్యలగూడెం: అచ్యుతాపురం గ్రామ సరిహద్దులలో నిర్వహిస్తున్న డీజిల్ అక్రమ విక్రయాలలో ఓ రెవెన్యూ అధికారి పాత్ర ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. డిసెంబర్ మూడున సాక్షిలో ప్రచురితమైన డీజిల్ అక్రమ విక్రయాలపై అధికారులు దృష్టి పెట్టి విచారణ చేశారు. గోపాలపురం మండలంలోని రెవెన్యూ అధికారి ఒకరు విచారణకు వెళ్లిన అధికారులను పక్కదోవ పట్టిస్తున్నట్లు తెలిసింది. ఏలూరు జిల్లాకు చెందిన అధికారులు వెళ్లినప్పుడు పరిధి తూర్పుగోదావరి జిల్లాలోకి వస్తుందని, తూర్పుగోదావరి అధికారులు వెళ్ళినప్పుడు పరిధి మనది కాదు ఏలూరు జిల్లా పరిధిలోనిదని తప్పుదోవ పట్టిస్తున్నట్లు తెలిసింది. ఇలాంటి కారణాలతోనే సుమారు రెండు సంవత్సరాల నుంచి అక్రమ డీజిల్ విక్రయదారులపై ఏ విధమైన కేసులు నమోదు కాలేదని తెలుస్తోంది. ఏలూరు (టూటౌన్): యూపీఏ ప్రభుత్వంలో తెచ్చిన ఉపాధి హామీ చట్టంలో మహాత్మా గాంధీ పేరు తీసి పూజ్య బాపుగా మార్చినంత మాత్రాన ఉపాధి హామీ కూలీలకు ఒరిగింది ఏంటని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఆఫీస్ బేరర్ల సమావేశం పేర్కొంది. పట్టణంలోని స్ఫూర్తి భవన్లో ఆఫీస్ బేరర్ల సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ కోటేశ్వరరావు అధ్యక్షతన ఆదివారం జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ మాట్లాడుతూ చట్టం పదం వాడకుండా పథకం అనే పదం వాడడానికి ప్రయత్నం చేస్తున్నారని, అందువల్ల పని అనే గ్యారెంటీ అనేది తీసివేస్తారేమోనని అనుమానం ఉందన్నారు. గత యూపీఏ ప్రభుత్వంలో చట్టం తెచ్చినప్పుడు కేంద్రం 90 శాతం నిధులు, రాష్ట్రాలు 10 శాతం నిధులు ఉపాధి హామీకి కేటాయించాలని నిర్ణయిస్తే, మోదీ ప్రభుత్వం రాష్ట్రాల మీద భారం పెంచేలా అడుగులు వేస్తుందని అనుమానించవలసి వస్తుందన్నారు. ఉపాధి హామీ పథకంలో మోసాన్ని అరికట్టడానికి ఈ నెల 22న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్లకు మెమోరాండాలు సమర్పించాలని తీర్మానించినట్లు తెలిపారు. జంగారెడ్డిగూడెం: చోరీ కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఏఎస్పీ సుస్మిత రామనాథన్ తెలిపారు. ఆదివారం స్థానిక ఫైర్స్టేషన్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా.. కారులో వస్తున్న ఇద్దరు వ్యక్తులను, బైక్పై వస్తున్న ఒక వ్యక్తిని ఆపి, ప్రశ్నించగా చోరీ కేసులు బయట పడ్డాయి. అరెస్టు చేసిన వారిలో మండలంలోని పుట్లగట్లగూడెం గ్రామానికి చెందిన ముత్యాల గణేష్, శీలం ఆంజేయులు, కటూరి సుబ్రహ్మణ్యం ఉన్నారు. వీరిపై జంగారెడ్డిగూడెం, లక్కవరం, ఏలూరు రూరల్, టి.నరసాపురం, ద్వారకాతిరుమల, తడికలపూడి పోలీస్స్టేషన్లో కేసులు ఉన్నాయన్నారు. తిరుపులాపురం కేసులో రూ.50 వేల చోరీ సొత్తు, ఏలూరు రూరల్ స్టేషన్ కేసులో కారు దొంగతనం కేసులో రూ. 1.70 లక్షల విలువైన కారును, టీ.నరసాపురంలో జరిగిన రెండు కేసుల్లో రూ.లక్ష విలువైన చోరీ సొత్తు, ద్వారకాతిరుమల కేసులో రూ.50 వేలు విలువైన బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ద్వారకాతిరుమల: స్థానిక విర్డ్ ఆస్పత్రిలో ఈనెల 11 నుంచి 14 వరకు అమెరికా, ఇండియాకు చెందిన వైద్యుల బృందం నిర్వహించిన ప్రత్యేక వైద్య శిబిరంలో 56 మంది రోగులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్టు ఆస్పత్రి ట్రస్ట్ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు ఆదివారం తెలిపారు. అందులో భుజం, మోచేయి, తుంటి సమస్యలతో బాదపడుతున్న 20 మంది రోగులకు ఉచితంగా, అత్యాధునిక పద్ధతిలో విజయవంతంగా శస్త్ర చికిత్సలు చేసినట్టు చెప్పారు. ఇవి తమ వైద్య సాఫల్యానికి ఉదాహరణగా నిలుస్తాయన్నారు. ఈ సందర్భంగా వైద్యుల బృందాన్ని చైర్మన్ అభినందించారు. ఈ శిబిరంలో వైద్యులు శ్రీనాధ్ కామినేని (యూఎస్ఎ), భవ్య చాంద్, కృష్ణ కిరణ్, శ్రీనివాస్ కంభంపాటి (ఇండియా), విర్డ్ ఆస్పత్రి ట్రస్ట్ సభ్యులు వి.నారాయణ మూర్తి, ఎస్వీఎన్ఎన్ నివృతరావు, శ్రీవారి దేవస్థానం ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి, వైద్యులు హమీద్, బాలాజీ, పీవీ నాగేంద్ర బాబు, సింధు, రమ్య, మహిత తదితరులు పాల్గొన్నారు. -
కోటి సంతకాల ఉద్యమానికి తరలిరావాలి
గణపవరం: మెడికల్ కాలేజిల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల పత్రాలను తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి తరలించే కార్యక్రమానికి పార్టీ నేతలు, కార్యకర్తలంతా తరలిరావాలని పార్టీ పీఏసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు పిలుపునిచ్చారు. ఈ నెల 15 సోమవారం ఉదయం 9.30 గంటలకు ఏలూరులో పెద్ద రైల్వే స్టేషన్ వద్దకు చేరుకోవాలని, అక్కడి నుంచి జిల్లా వ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల పత్రాల బండిల్స్ ర్యాలీగా గన్బజార్, ఫ్లై ఓవర్ వంతెన మీదుగా తాడేపల్లికి తరలిస్తారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అఽధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, జిల్లా పరిశీలకుడు ఎమ్మెల్సీ వంకా రవీంద్ర, అన్ని నియోజకవర్గాల కన్వీనర్లు, పార్టీ ప్రముఖులు పాల్గొంటారని ఉంగుటూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి పార్టీ శ్రేణులంతా ఏలూరు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. కై కలూరు: అమ్మా.. కొల్లేటికోట పెద్దింట్లమ్మ నీ చల్లని దీవెనలు అందించమ్మా అంటూ భక్తులు ఆర్తీతో వేడుకున్నారు. అమ్మవారిని సమీప జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు ఆదివారం సందర్శించారు. ఆలయ ప్రధాన అర్చకులు పేటేటి పరమేశ్వరశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రూ.52,355 ఆదాయం వచ్చిందని ఈవో చెప్పారు. జంగారెడ్డిగూడెం: మండలంలోని గుర్వాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో ఆదివారం హనుమద్ హోమం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా హోమ కార్యక్రమాన్ని జరిపించినట్లు ఆలయ ఈవో ఆర్వీ చందన తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు. ఏలూరు టౌన్: ఏలూరు సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు వచ్చిన రోగి అదృశ్యమయ్యాడంటూ రోగి బంధువులు ఏలూరు టూటౌన్ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. ఉండ్రాజవరం మండలం పసలపూడి గ్రామానికి చెందిన జీ.వెంకటేశ్వరరావును కొద్దిరోజుల క్రితం కుక్క కరవటంతో ఏలూరు జీజీహెచ్కు తీసుచారు. వైద్యులు విజయవాడ తీసుకువెళ్ళాలని చెప్పగా.. ఈ క్రమంలో రోగి ఆకస్మికంగా అదృశ్యం అయ్యాడు. అతని సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
భయం పోయేలా.. భవితకు బాట వేసేలా
● ఆంగ్ల భాషపై పట్టుకు స్పెల్బీ దోహదం ● ‘సాక్షి’ ఆధ్వర్యంలో స్పెల్బీ సెమీఫైనల్స్ ● ఉత్సాహంగా పాల్గొన్న 490 మంది విద్యార్థులు రాజమహేంద్రవరం రూరల్: ‘సాక్షి’ మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెల్బీ సెమీ ఫైనల్స్ పరీక్షలు ఆదివారం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. రాజమహేంద్రవరంలోని ఆదిత్య తక్ష్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించిన ఈ పరీక్షకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని వివిధ ప్రాంతాల నుంచి 490 మంది విద్యార్థులు నాలుగు కేటగిరీల్లో పరీక్షలు రాశారు. తమ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ‘సాక్షి’ స్పెల్బీ పరీక్షలు ఎంతగానో దోహదపడతామని తల్లిదండ్రులు పేర్కొన్నారు. స్పెల్బీ ద్వారా ఆంగ్ల భాషపై మంచి పట్టు సాధించడానికి అవకాశం ఏర్పడిందని ఆనందం వ్యక్తం చేశారు. ‘సాక్షి’ స్పెల్బీ పరీక్ష ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ జరిగింది. కేటగిరీలుగా విభజించి.. కేటగిరీ–1లో 1, 2 తరగతులకు చెందిన విద్యార్థులు, కేటగిరీ–2లో 3, 4 తరగతులు, కేటగిరీ–3లో 5, 6, 7 తరగతులు, కేటగిరీ–4లో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించడానికి ఈ పరీక్షలు ఉపయోగపడతాయని తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా పరీక్షల్లో పాల్గొనడం ద్వారా నూతనోత్తేజం తీసుకురావడానికి అవకాశం ఏర్పడుతుందని అన్నారు. స్పెల్బీ నిర్వహించిన ‘సాక్షి’ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పరీక్షలను ‘సాక్షి’ రీజినల్ మేనేజర్ (అడ్మిన్) ఎస్.రమేష్రెడ్డి, ఆదిత్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కోఆర్డినేటర్ వి.రాజేష్, ఆదిత్య తక్ష్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ లీజా పర్యవేక్షించారు. పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. స్పెల్బీకి డ్యూక్స్ వేఫీస్ మెయిన్ స్పాన్సరర్గా, ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ (రాజమహేంద్రవరం) అసోసియేట్ స్పాన్సరర్గా వ్యవహరిస్తున్నాయి. ఆదిత్య ఇంటర్నేషనల్ స్కూల్ సహకారం అందించింది.స్పెల్బీ పరీక్ష ద్వారా ఇంగ్లిష్పై అవగాహన పెరిగింది. గతంలో ఈ భాష అంటే భయంగా ఉండేది. చదవాలన్నా, రాయాలన్నా అయిష్టంగా ఉండేది. స్పెల్బీ ద్వారా ఇంగ్లిష్ పదాలను స్పెల్లింగ్తో సహా నేర్చుకున్నాను. ప్రస్తుతం ఏ సబ్జెక్టయినా సునాయసంగా చదవగలుగుతున్నా. –ఎన్ఎస్ఎస్ ఆరాధ్య, 8వ తరగతి, దిప్యూచర్ కిడ్స్ స్కూల్, రాజమహేంద్రవరం విద్యార్ధుల భవిష్యత్తును నిర్దేశించడానికి ‘సాక్షి’ స్పెల్బీ పరీక్ష ఉపయోపడుతుంది. ఇంగ్లిష్ భాషంటే భయం దూరం చేస్తోంది. పోటీతత్వం అలవాటు పడుతుంది. ఇంగ్లిష్లో ఒకాబులరీ చాలా ముఖ్యం. దీనిపై అవగాహన పెరుగుతుంది. ‘సాక్షి’ యాజమాన్యం ఇలాంటి పరీక్షలు మరిన్ని నిర్వహించాలి. –డాక్టర్ టీవీ ప్రసాద్, విద్యార్థిని తండ్రి, రాజమహేంద్రవరం ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆంగ్ల భాష ప్రాధాన్యం పెరిగింది. విద్యార్థుల్లో చిన్నతనం నుంచి ఆంగ్లంపై పట్టు సాధించేందుకు స్పెల్బీ పరీక్ష దోహదపడుతుంది. ‘సాక్షి’ స్పెల్బీ ద్వారా ఇంగ్లిష్లో ఒకాబులరీ, లాంగ్వేజ్ స్కిల్స్ పెంపొందుతాయి. విద్యార్థులు ఆంగ్ల భాషా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. –డాక్టర్ దీప్తి చిగుళ్లపల్లి, విద్యార్థి తల్లి, రాజమహేంద్రవరం స్పెల్బీ పరీక్ష విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంది. ఈ పరీక్షతో స్పెల్లింగ్లు, పదాలకు అర్థాలు చెప్పే సామర్థ్యం పెరుగుతుంది. ఆదిత్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ గత పదేళ్లుగా స్పెల్బీ పరీక్షల్లో పాల్గొంటున్నాయి. అలాగే తమ ఆదిత్య విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ‘సాక్షి’ స్పెల్బీ ద్వారా విద్యార్థుల్లో ఉత్సాహం పెరుగుతోంది. పోటీ పరీక్షల్లో రాణించడానికి దోహదపడుతుంది. –వి.రాజేష్, కో–ఆర్డినేటర్, ఆదిత్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్‘సాక్షి’ స్పెల్బీ పరీక్ష రాయడం ఆనందంగా ఉంది. ఇంగ్లిష్ భాషపై సంపూర్ణ అవగాహన ఏర్పడింది. పోటీ పరీక్షలు అంటే భయం పోయింది. స్పెల్లింగ్, వ్యాకరణంలో చాలా విషయాలు తెలుసుకున్నాను. ఇది నా భవిష్యత్కు బాటలు వేస్తోంది. –వేగుంట నమస్వి, ఆరో తరగతి, ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్, రాజమహేంద్రవరం ఇంగ్లిష్ భాషలో ఒకాబులరీ పట్ల అవగాహన ముఖ్యం. ఇది ‘సాక్షి’ స్పెల్బీ పరీక్ష ద్వారా అవగతం చేసుకున్నాను. పరీక్ష ద్వారా తర్ఫీదు పొందాను. వర్డ్స్, స్పెల్లింగ్స్ పట్ల అవగాహన కలిగింది. ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంది. –గారపాటి రుద్రనాగ్ చౌదరి, 9వ తరగతి, లారల్ హైగ్లోబల్ స్కూల్, గాడాల విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి ‘సాక్షి’ స్పెల్బీ పరీక్ష బాట వేస్తోంది. ఇంగ్లిష్లో స్పెల్లింగ్, ఒకాబులరీ చాలా ముఖ్యం. దీనిని నేర్చుకోవడానికి ఈ పరీక్ష దోహదపడుతుంది. పరీక్ష బాగా రాశాను. దీనివల్ల ఎంతో ఉత్సాహం వచ్చింది. –కాసర ప్రతిభ, 8వ తరగతి, ప్రతిభ స్కూల్, జంగారెడ్డిగూడెం విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వెలికితీసేలా ‘సాక్షి’ స్పెల్బీ పరీక్ష ఉంది. పోటీ పరీక్షల్లో రాణించడానికి ఇదో మంచి మార్గం. ఈ పరీక్షతో అనేక అంశాలు తెలుసుకున్నాను. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే అనేక పోటీ పరీక్షల్లో ప్రతిభ చాటడానికి మార్గం సుగమమైంది. –పెన్మెత్స సాత్విక, 8వ తరగతి, ఆదిత్య స్కూల్, తాడేపల్లిగూడెం ‘సాక్షి’ స్పెల్బీ పరీక్ష రాయడం ద్వారా ఇంగ్లిష్ భాష అంటే భయం పోయింది. పలకడం, రాయడం సులభతరం అయ్యింది. ఇక నుంచి సులభంగా ఇంగ్లిష్ నేర్చుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఈ పరీక్ష రాయడంతో ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. –కఠారి చరిష్మా, 9వ తరగతి, కోనసీమ విద్యాశ్రమ్, ముక్తేశ్వరం నేను ముందుగా స్పెల్బీ నిర్వహిస్తున్న ‘సాక్షి’ యాజమాన్యానికి థ్యాంక్స్ చెబుతున్నా. నాలో ఉన్న నైపుణ్యాలను బయటకు తీసేందుకు ఈ పరీక్ష దోహదపడింది. నేను స్పెల్బీ పరీక్ష రాశాను. సెమీ ఫైనల్లో మంచి మార్కులు వస్తాయని ఆశిస్తున్నాను. పరీక్ష నా భవిష్యత్తుకు పునాది లాంటిది. –దాట్ల దీక్షిత, 7వ తరగతి -
కాపులకు మంచి చేసింది జగనే
తణుకు అర్బన్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనలో కాపు సామాజిక వర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించారని, ఎన్నో సంక్షేమ పథకాల్లో కాపు వర్గాలకు లబ్ధి చేకూర్చారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. తణుకు సీఎం ఫంక్షన్ హాలులో ఆదివారం నిర్వహించిన కాపు రిజర్వేషన్ పోరాట సమితి (కేఆర్పీఎస్) ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యాదవ కులస్థుడైన నన్ను రెండు పర్యాయాలు తణుకులో ఎమ్మెల్యేగా గెలవడంలో కాపులంతా సహకరించారని, అదే కాపుల ప్రోత్సాహంతోనే మంత్రిగా పదవి దక్కిందని అన్నారు. కాపులపై ఉన్న గౌరవంతోనే కాపు నేత వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని తణుకులో ఏర్పాటుచేయగలిగానని అన్నారు. వంగవీటి రంగా విప్లవాత్మక మార్పు కోసం ఉద్యమిస్తే ఆ ఉద్యమం కొనసాగితే రాష్ట్రంలో తమ పెత్తనం, దోపిడీ అంతమవుతుందనే ఆయనను హత్య చేశారని భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) అధినేత బోడె రామచంద్రయాదవ్ అన్నారు. సమాజంలో అత్యధిక జనాభా కలిగిన బీసీల మాదిరిగానే కాపు సామాజిక వర్గం కూడా దశాబ్ధాలుగా వివక్షకు, అణచివేతకు గురవుతుందని అన్నారు. భవిష్యత్తులో బీసీలు, కాపులు, దళితులు ఏకంకావాల్సిన చారిత్రాత్మక సమయం ఆసన్నమైందని అన్నారు. కేఆర్పీఎస్ రాష్ట్ర కన్వీనర్ రావి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు, కాపు నాడు జాతీయ అధ్యక్షుడు గల్లా సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. మాజీ మంత్రి కారుమూరి -
ఫీజుల చెల్లింపునకు గడువు పొడిగింపు
ఏలూరు (ఆర్ఆర్పేట): ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో టెన్త్, ఇంటర్ కోర్సుల పబ్లిక్ పరీక్షలకు ఫీజుల చెల్లింపు గడువు పొడిగించినట్టు డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ ప్రకటనలో తెలిపారు. ఒక్కో సబ్జెక్టుకు ఇంటర్కు రూ.150, ప్రాక్టికల్స్కు రూ.100, టెన్త్కు రూ.100 చెల్లించాలన్నారు. అపరాధ రుసుం లేకుండా ఈనెల 19 వరకూ, రూ.25 అపరాధ రుసుంతో 20 వరకు, రూ.50 అపరాధ రుసుంతో 22వరకూ, తత్కాల్లో ఈనెల 24 వరకు ఫీజులు చెల్లించవచ్చన్నారు. టెన్త్ పరీక్షలు వచ్చే మార్చి 16 నుంచి 28 వరకు, ఇంటర్ పరీ క్షలు మార్చి 2 నుంచి 13 వరకూ, ఇంటర్ ప్రాక్టికల్స్ ఏప్రిల్ 11 నుంచి 18 వరకు జరుగుతాయని పేర్కొన్నారు. -
రాట్నాలమ్మకు ప్రత్యేక పూజలు
పెదవేగి: రాట్నాలమ్మ దేవస్థానం భక్తులతో కళకలలాడింది. పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలో వేంచేసిన శ్రీ రాట్నాలమ్మకు ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి మొక్కుబడులను తీర్చుకున్నారు. ఈ వారం పూజా రుసుం వల్ల రూ.35,980, విరాళంపై రూ.1,664, లడ్డూ ప్రసాదంపై రూ.18,945, ఫోటోల అమ్మకంపై రూ.1,445 , మొత్తం రూ.58,034 ఆదాయం లభించిందని దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎన్.సతీష్కుమార్ తెలిపారు. బుట్టాయగూడెం: కోర్కెలు తీర్చే తల్లిగా, వరాలిచ్చే అమ్మగా, గిరిజన ఆరాధ్య దేవతగా పూజలందుకుంటున్న గుబ్బల మంగమ్మ తల్లి గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆలయ కమిటీ గుబ్బల మంగమ్మ తల్లిని పూలతో ప్రత్యేక అలంకరణ చేయగా.. భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. చలికాలం అయినప్పటికీ మంచు కురుస్తున్నప్పటికీ తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు మంగమ్మ తల్లి గుడికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. వివిధ జిల్లాల నుంచి ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, బస్సుల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. ఏలూరు టౌన్: ఏలూరు ఆర్ఆర్పేటలోని నిత్య డార్మిటరీలో పేకాట శిబిరం నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో టూటౌన్ ఇన్చార్జ్ సీఐ, నగర ట్రాఫిక్ సీఐ లక్ష్మణరావు తన సిబ్బందితో ఆకస్మికంగా దాడి చేశారు. ఆదివారం సాయంత్రం పోలీసులు చేసిన దాడుల్లో పేకాట ఆడుతున్న 15 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. పేకాట రాయుళ్ల నుంచి రూ.52,233 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సొమ్మును డార్మిటరీ బాత్రూమ్లో పేకాటరాయుళ్ళు దాచే ప్రయత్నం చేయగా పోలీసులు తనిఖీ చేసి పట్టుకున్నారు. -
ప్రశ్నిస్తే దేశద్రోహులంటారా..?
దెందులూరు : ప్రతిపక్షంగా ప్రశ్నిస్తే ప్రశ్నించిన వైఎ స్సార్సీపీ నేతలను దేశద్రోహులనడం ఎంతవరకు సబబు అని దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నియోజకవర్గంలోని క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు కావస్తుందని, నిర్మాణాత్మక విషయాలపై ప్రశ్నిస్తామని వాటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించాలి తప్ప వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడం, వేధించడం తగదన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పారదర్శకంగా పాలన అందించామ ని, సేవాభావంతో సొంత ఖర్చులతో నాయకులు మూడుసార్లు గడపగడపకూ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారన్నారు. ఆరు నెలల్లో పోలవరం పూర్తి చేస్తామని చెప్పి చంద్రబాబు, పవన్కల్యాణ్ అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తున్నా పూర్తి కాలేదని, ప్రాజెక్టు ఎప్పటిలోపు పూర్తిచేస్తారో చెప్పా లని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలో 25 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ రాక ఇబ్బందులు పడుతున్నారన్నారు. దెందులూరు నియోజకవర్గంలో సుమారు 12 వేల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకా యిలు ఉన్నాయన్నారు. గత ప్రభుత్వంలో పక్కాగా ఫీజు రీయింబర్స్మెంట్ అందించామన్నారు. అలా గే ప్రస్తుతం పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజనంపై ఫిర్యాదులు వస్తున్నాయని, వైఎస్సార్సీపీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు బడులకు వెళ్లి భోజనాన్ని రుచి చూడాలని సూచించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నియోజకవర్గంలోని నా లుగు మండలాల్లో 17 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామని, 169 కాలనీలు ఏర్పడగా ఇప్పటికీ రోడ్ల నిర్మాణం ఎందుకు చేపట్టలేదని నిలదీశారు. అలాగే మౌలిక వసతులను కల్పించలేదన్నారు. కొల్లేరు నుంచి వలసలు చంద్రబాబు ప్రభుత్వంలో కొల్లేరు నుంచి నివాసితులు వలస వెళ్లే పరిస్థితి వచ్చిందని అబ్బయ్యచౌ దరి అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉండగా ఇతర ప్రాంతాల నుంచి స్వగ్రామానికి వచ్చి కొల్లేరులో ఉపాధి పొందేవారని గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం కొల్లేరు నుంచి వలస వెళ్లే పరిస్థితులు వచ్చాయన్నారు. రెండు వేల ఎకరాల్లో ఎస్సీ, బీసీల సొసైటీ భూములకు అన్యాయం జరుగుతోందన్నారు. వలసలు ఆపాలని, సొసైటీలో చెరువులు ఉన్న వారికి న్యాయం చేయాలని కోరారు. అలాగే నియోజకవర్గంలో పలు రోడ్లకు గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, కొన్ని ప్రతిపాదనలు పంపామని, ఇప్పుడు అవన్నీ ఎందుకు పూర్తికాలేదని అబ్బ య్యచౌదరి ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి ఆగ్రహం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన ఉద్యమంలో భాగంగా నియోజకవర్గంలో 52 వేల సంతకాల సేకరించామన్నారు. సోమవారం ఉదయం 9 గంటలకు ఏలూరు అశోక్నగర్లోని పార్టీ క్యాంపు కార్యాలయానికి పార్టీ శ్రేణులు తరలిరావాలని, అ క్కడి నుంచి ర్యాలీగా జిల్లా కార్యాలయం నుంచి తాడేపల్లికి సంతకాల ప్రతులు పంపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ పెనుమాల విజయబాబు, పెదపాడు ఎంపీపీ బత్తుల రత్నకుమారి, పార్టీ మండల అధ్యక్షులు కామిరెడ్డి నాని, అప్పన ప్రసాద్ , జానంపేట బాబు, పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి నిట్ట గంగరాజు, ఫారెస్ట్ కార్పొరేషన్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ పల్లెం ప్రసాద్, న్యాయవాది లక్ష్మీనారాయణ, నాయకులు ఉన్నారు. -
ప్రైవేటుపై నిరసన ‘సంతకం’
● నేడు ఏలూరులో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ ● కోటి సంతకాల ప్రతులు తాడేపల్లి తరలింపు ఏలూరు టౌన్ : రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడా న్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమం తుది దశకు చేరుకుంది. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో సేకరించిన కోటి సంతకాల ప్రతులను ఏలూరులోని పార్టీ జిల్లా కా ర్యాలయానికి చేర్చగా.. సోమవారం ఏలూరు నుంచి వీటిని తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి భారీ ర్యాలీతో తరలించేలా రంగం సిద్ధం చేశారు. పెద్ద రైల్వేస్టేషన్ నుంచి.. ఏలూరులో భారీ ర్యాలీకి నాయకులు సన్నాహాలు చేశారు. ఉదయం 10 గంటలకు పెద్ద రైల్వేస్టేషన్ ప్రాంతం నుంచి ర్యాలీ ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి సీఎస్ఐ చర్చి, రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి మీదుగా పాతబస్టాండ్ సెంటర్, ప్రధాన రహదారి, వసంత్మహల్ సెంటర్, జూట్మిల్లు ప్రాంతం, మినీ బైపాస్ మీదుగా ఏలూరు నగర శివారు వరకు ర్యాలీ కొనసాగుతుంది. కోటి సంతకాల ప్రతులను ప్రత్యేక వాహనంలో ఉంచి పార్టీ శ్రేణులు, అభిమానులు ర్యాలీగా తరలివెళతారు. జిల్లాలో 3.60 లక్షలకు పైగా.. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో రెండు నెలలపాటు కోటి సంతకాల ప్రజా ఉద్య మం సాగింది. మొత్తంగా 3.60 లక్షలకు పైగా సంతకాలు సేకరించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దూ లం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో చేపట్టే భారీ ర్యాలీలో ఏలూరు పార్లమెంట్ పరిశీలకుడు, ఎమ్మెల్సీ వంకా రవీంద్ర, ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జి, జోనల్–2 యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కారుమూరి సునీల్కుమార్, బీసీసెల్ జోనల్–2 వర్కింగ్ ప్రెసిడెంట్ నౌడు వెంకటరమణ, సమన్వయకర్తలు మామిళ్లపల్లి జయప్రకాష్ (ఏలూరు), కొఠారు అబ్బయ్యచౌదరి (దెందులూరు), మేకా వెంకట ప్రతాప్ అప్పారావు (నూజివీడు), పుప్పా ల వాసుబాబు (ఉంగుటూరు), తెల్లం బాలరాజు (పోలవరం), కంభం విజయరాజు (చింతలపూడి) హాజరవుతారు. అలాగే పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్యదర్శులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, పార్టీ కార్యకర్తలు వేలాదిగా తరలిరానున్నారు. -
30న ఉత్తర ద్వార దర్శనం
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయంలో వైకుంఠ (ముక్కోటి) ఏకా దశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈనెల 30 న శ్రీవారి ఉత్తర ద్వార దర్శనాన్ని నిర్వహించనున్నట్టు ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి ఆ దివారం తెలిపారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తామన్నారు. రూ.100, రూ.200, రూ.500ల ప్రత్యేక దర్శనం టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. అలాగే ముక్కోటి ముందు రోజు ఈనెల 29న గిరి ప్రదక్షిణను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఆ రోజు మ ధ్యాహ్నం 2.30 గంటలకు స్వామి వారి తొలిమెట్టు (పాదుకా మండపం) వద్ద గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుందన్నారు. గిరి ప్రదక్షిణ అ నంతరం భక్తులకు స్వామివారి నిజరూప దర్శనాన్ని కల్పిస్తామన్నారు. ఈనెల 30 నుంచి వచ్చేనెల 9 వరకు ఆలయంలో అధ్యయనోత్సవాలను నిర్వహిస్తామని, ఆయా రోజుల్లో సా యంత్రం వేళ ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టు చెప్పారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని 15న స్వామివారి నిత్యార్జిత కల్యాణా న్ని రద్దు చేస్తున్నట్టు ఈఓ వివరించారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరులో ఆదివారం జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) 179 మంది అభ్యర్థులు హాజరయ్యారు. సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల కేంద్రంలో 200 మందికి గాను 179 మంది హాజరు కాగా 21 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, ఎక్కడా మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ తెలిపారు. ఏలూరు టౌన్: జిల్లాలో నేరాలను నిరోధించేందుకు పటిష్ట భద్రతా ప్రణాళికలు రూపొందించి అమలు చేసేందుకు చర్యలు చేపట్టామని జి ల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ తెలిపారు. స్థానిక జి ల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సోషల్ సర్వీస్ రెస్పాన్స్బులిటీ (సీఎస్ఆర్)లో భాగంగా నగరంలోని వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులకు స్కోర్–10 సంస్థతో ప్రత్యేకంగా అవగాహన సదస్సు ఏర్పాటు చేశామన్నారు. ఈ సంస్థ తన సీఎస్ఆర్లో భాగంగా ఏలూరులో ఆటో డ్రైవర్లకు రూ.లక్ష ఉచిత బీమా పథకాన్ని అమలు చేస్తోందన్నారు. అలాగే నగరంలోని మాల్స్లో పనిచేసే సిబ్బంది, లాడ్జీల్లో వసతి పొందే వ్యక్తులు, అద్దె ఇళ్లలో నివసించే వ్యక్తుల వివరాలు సేకరించటంలో స్కోర్–10 సంస్థ ప నిచేస్తుందన్నారు. ఆయా వ్యక్తుల వివరాలను ఈ సంస్థ యాజమాన్యం దర్యాప్తు చేసి నిమిషాల వ్యవధిలోనే పూర్తి వివరాలు, నేర చరిత్ర ఉంటే తెలియజేస్తారని స్పష్టం చేశారు. సమాజంలో నేరగాళ్లను అడ్డుకునేందుకు ఇదో అవకాశంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. డీఎస్పీ డి.శ్రావణ్కుమార్, ఎస్బీ సీఐ మల్లేశ్వరరావు, ట్రాఫిక్ సీఐ, టూటౌన్ ఇన్చార్జి సీఐ లక్ష్మణరా వు, త్రీటౌన్ సీఐ వి.కోటేశ్వరరావు, స్కోర్–10 సంస్థ డైరెక్టర్ నారాయణ, స్వరూప్ పాల్గొన్నారు. సాక్షి, టాస్క్ఫోర్స్: తెలుగుదేశం పార్టీ నాయకుడు వావి వరుసలు మరిచి పిన్ని వరుస అయి న మహిళతో రాసలీలలు సాగిస్తున్న విషయం వెలుగు చూడటంతో ఆ మహిళ కుటుంబసభ్యులు అతనికి దేహశుద్ధి చేసినట్టు విశ్వసనీయ సమాచారం. పాలకొల్లు నియోజకవర్గంలోని ఒక మండలానికి చెందిన ఆ నాయకుడు గతంలో అదే మండలంలో టీడీపీ నుంచి జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయాడు. ఇటీవల అతను పిన్ని వరుస అయిన మహిళతో రాసలీలలు సాగిస్తున్నాడు. ఈ విషయం ఆమె కుటుంబసభ్యులకు తెలియడంతో వారు ఆ నాయకుడిని నిలదీశారు. వావి వరుసలు మరిచి ఈ నీచ పనులు ఏమిటంటూ ప్రశ్నించారు. ఈ క్ర మంలోనే ఆవేశం తట్టుకోలేక ఆ నాయకుడికి దేహశుద్ధి కూడా చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆ మహిళను లోబరుచుకోవడానికి అత ను అంగన్వాడీలో పోస్టు ఇప్పిస్తానని ఆశ చూపించినట్టు ఆమె బంధువులు ఆరా తీయగా తెలిసింది. కావలసిన వాడివి అయ్యుండి ఇంత నీచానికి పాల్పడతావా అంటూ వారు ఆ నా యకుడికి దేహశుద్ధి చేసి పెద్ద రాద్ధాంతమే చేసినట్టు సమాచారం. చివరికి కాళ్ల బేరానికి వచ్చిన సదరు నాయకుడు తప్పయిపోయిందని, రాజకీయంగా ఎదుగుతున్న తనను అల్లరి చేయొద్దని, క్షమించి వదిలేయండని వారి కాళ్లు ప ట్టుకుని రాజీ చేసుకున్నట్టు తెలిసింది. మంత్రి ఇలాకాలోని టీడీపీ నాయకుడి విషయంలో ఈ ఘటన జరగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సదరు నాయకుడికి గతంలో నియోజకవర్గంలోని ప్రధాన నాయకుల కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారని టీడీపీ నాయకులు చెబుతున్నారు. -
కూటమి పాలనలో రైతులకు ఇబ్బందులు
నిడమర్రు: కూటమి ప్రభుత్వంలో తాము ఇ బ్బందులు పడుతున్నామంటూ గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వద్ద కొల్లేరు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం తోకలపల్లిలో జరిగిన సమావేశంలో పలువురు కొల్లేరు రైతులు మంత్రి వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. రైతు బలే ఆదినారాయణతోపాటు ప లువురు మాట్లాడుతూ 3వ కాంటూరులో తా తల కాలం నుంచి హక్కుగా వస్తున్న భూము ల్లో సంప్రదాయబద్ధంగా వ్యవసాయం చేసు కుంటున్నామని, ఇప్పటివరకూ ఏ ప్రభుత్వంలో తమకు ఇబ్బందులు లేవన్నారు. అయితే ఇ టీవల అటవీ శాఖ అధికారులు సంప్రదాయ వ్యవసాయం చేసుకుంటున్న రైతులపై కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి రైతుల సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకుని వెళ్తానని మంత్రి పార్థసారథి హామీ ఇచ్చారు. ముందుగా పత్తేపురంలో ఇంటి నిర్మాణాల కాలనీని మంత్రి ప్రారంభించారు. అలాగే విద్యుత్ సబ్స్టేషన్ పనుల భూమి పూజల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు ఉన్నారు. -
సంక్రాంతి కోట్లాటకు 'పుంజు'కుంటున్నాయ్
ద్వారకాతిరుమల/బుట్టాయగూడెం: సంక్రాంతి పందేలకు కోడి పుంజులు సిద్ధమవుతున్నాయి. బరుల్లో కత్తులు దూసేందుకు కఠోర సాధన చేస్తున్నాయి. ఈత, బలవర్ధక ఆహారం, ప్రత్యేక శిక్షణతో శిబిరాల్లో నువ్వా నేనా.. అన్నట్టు తలపడుతున్నాయి. పెద్ద పండగకు నెల రోజులు మాత్రమే సమయం ఉండటంతో వీటి అమ్మకాలు ఊపందుకున్నాయి. నెమలి, డేగ, అబ్రాసు, సీతువ, కాకి, పర్ల, రసంగి, కెక్కిరాయి.. ఇలా పలు జాతుల పుంజులు ‘కోట్లా’టకు రెడీ అవుతున్నాయి. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలంలోని రాళ్లకుంట, కొమ్మర, మలసాని కుంట, ద్వారకాతిరుమల, దొరసానిపాడు, పంగిడిగూడెం, గుణ్ణంపల్లి, బుట్టాయగూడెం ప్రాంతాల్లో పుంజుల శిబిరాలు ఉన్నాయి. మెలకువలతో శిక్షణ: పందెం పుంజుల్లో పలు రకాల జాతులు ఉన్నాయి. ముఖ్యంగా డేగ, కాకి, పూల, పర్ల, కెక్కిరాయి, సీతువ, రసంగి, నెమలి బరుల్లో తలపడుతుంటాయి. లక్షలాది రూ పాయలు చేతులు మారే పందేల్లో ఆషామాషీ కోళ్లు తలపడవు. వాటికి శక్తి, సామర్థ్యం ఎంతో అవసరం. అందుకే పందెం పుంజుకు బలవర్ధక ఆహారం అందిస్తున్నారు. ప్రత్యేక తరీ్ఫదు ఇవ్వడంలో భాగంగా మెలకువలు నేరి్పస్తున్నారు. పోరాడే సత్తా ఉన్న పుంజులను ఎంపిక చేసి మరీ వాటికి శిక్షణ ఇస్తున్నారు. ఆహా ఏమి భోగం: బాదంపప్పు, జీడిపప్పు, మటన్ కైమా, తాటి బెల్లం నువ్వుల నూనె ఉండలు వంటి బలవర్ధక ఆహారాన్ని వుంజులకు అందిస్తున్నారు. వీటి పెంపకం రాజభోగాన్ని తలపిస్తుంది. ఉదయం 6 గంటలకు పందెం రాయుళ్లు వాటిని చెరువుల్లోను, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నీటి తొట్టెల్లో ఈదిస్తున్నారు. అలాగే మూలికలు, ఆకులతో మరిగించిన నీటిని వాటికి పోతపోస్తున్నారు. ఆ తర్వాత వాకింగ్ చేయించి కొద్దిసేపు ఎండలో కడుతున్నారు. 9 గంటలకు అల్పాహారంగా బాదంపప్పు, జీడిపప్పు, మటన్ కైమా పెడుతున్నారు. తాటి బెల్లాన్ని నువ్వుల నూనెతో కలిపి ఉండలుగా చేసి వాటికి తినిపిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు చోళ్లు, గంట్లు, వడ్లుతో కూడిన మేతను పెడుతున్నారు. వాటికి ఎండ తగలకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్లలో, చెట్ల కింద ఏర్పాటు చేసిన గాబుల్లో ఉంచుతున్నారు. సాయంత్రం 6 గంటలకు పొయ్యిపై అట్లపెనం ఉంచి, దా నిపై జల్లిన వేడి నీటిని పుంజుల దేహంపై పూస్తున్నారు. ఆ తర్వాత రెవిటాల్ పంటి బలవర్దక మందులు వేస్తున్నారు. ఇలా రోజుకు ఒక్కో పుంజుకు రూ.100 వరకు ఖర్చు చేస్తున్నారు. శిబిరాల వద్ద ఒక్కో పుంజును రూ.10 వేల నుంచి రూ.లక్షకు పైగా విక్రయిస్తున్నారు. శిక్షకులకు డిమాండ్ కోడి పుంజులకు శిక్షణ ఇచ్చే వారికి డిమాండ్ ఏర్పడింది. పుంజులకు శిక్షణ ఇచ్చే వారి ఎంపిక లోనూ పందెంరాయుళ్లు జాగ్రత్తలు పాటిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి శిక్షకులను తీసుకొచ్చి, పుంజులకు ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. కత్తులు నూరుతూ.. పందేల్లో పుంజులకు కత్తులు కట్టే వారి హవా మామూలుగా ఉండదు. బరిని బట్టి వారు ధరను నిర్ణయిస్తారు. అస్లీ పందేలు మి నహా మిగిలిన అన్ని పందేలు కత్తిలేనిదే జరగవు. అందుకే కత్తులు కట్టేవారు ఇప్పటినుంచే కత్తులను నూరేందుకు సిద్ధమవుతున్నారు. గెలుపు మాదే.. ఏటా పందేలు జరగనివ్వమని బీరాలు పలికే పోలీసులు చివరకు రాజకీయ నా యకుల సిఫార్సులతో పండుగ మూడు రోజులు చూసీచూడనట్టు వదిలేయడం పరిపాటిగా వస్తోంది. పందేల నిర్వహణ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ బాసులు పండుగ ముందు నెల రోజుల నుంచి చెప్పడం సర్వసాధారణంగా మారింది. ఇదంతా ఏటా జరిగే తంతేనని, పండుగ రోజుల్లో పందేలు మామూలే అని పందెంరాయుళ్లు ధీమా వ్యక్తం చేస్తూ.. పుంజులను బలంగా తయారు చేస్తున్నారు. -
సైబర్ నేరగాళ్ల అరెస్ట్
ఆకివీడు: సైబర్ నేరగాళ్ల ముఠాలోని నలుగుర్ని పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేసి కోర్టుకు హాజరపర్చారు. ఆకివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో జిల్లా అదనపు ఎస్పీ బీ.భీమారావు శనివారం వివరాలు వెల్లడించారు. సైబర్ నేరగాళ్లు ఆకివీడుకు చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలు కాకర్ల రాజరాజేశ్వరిని డిజిటల్ అరెస్టు పేరుతో బెదిరించి, ఆమె బ్యాంక్ ఖాతాల నుంచి దపదపాలుగా సుమారు రూ.93 లక్షలు కాజేశారు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి నాలుగు ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించారు. ఆకివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ జగదీశ్వరరావు నాయకత్వంలోని బృందం బ్యాంక్ లావాదేవీలను విశ్లేషించి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కేసును ఛేదించింది. నిందితులు తమ బ్యాంక్ ఖాతాలను మనీ మ్యూల్ అకౌంట్లుగా ఉపయోగించారని అదనపు ఎస్పీ తెలిపారు. సైబర్ నేరగాళ్ల బృందంలో మొదటి స్టెప్లో పనిచేస్తున్న వ్యక్తులు నలుగురిని అరెస్టు చేసినట్లు వివరించారు. విశాఖపట్నం మధురవాడకు చెందిన జబ్బి జగదీష్ రెడ్డి ఖాతాకు రూ.5 లక్షలు జమ చేయగా, మహారాష్ట్రలోని ముంబాయి ప్రాంతంలోని గాడి అడ్డ కు చెందిన ఆరీఫ్ మహ్మద్ ఖాతాకు రూ.5 లక్షలు, హైదరాబాద్ దిల్షుక్ నగర్కు చెందిన పూసునూరి రాధారాణి ఖాతాకు రూ.11 లక్షలు, మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లా, రామానంద్ నగర్కు చెందిన షాహిద్ లతీఫ్ షేక్ ఖాతాకు రూ.10 లక్షలు బదిలీ కావడంతో వారిని అరెస్టు చేసినట్లు చెప్పారు. ఆయా ఖాతాల్లో ఉన్న సొమ్ము రూ. 7,34,240 రికవరీ చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్బంగా సీఐ జగదీశ్వరరావు, ఎస్సై హనుమంతు నాగరాజు, భీమవరం వన్టౌన్ ఇన్స్పెక్టర్ ఎం.నాగరాజు, ఉండి ఎస్సై ఎండీ.నజీరుల్లా, కాళ్ల ఎస్సై ఎన్.శ్రీనివాసరావు, భీమవరం టౌన్ ఎస్సై వంశీ, రెహ్మన్, వీర్రాజు, కానిస్టేబుళ్లను అభినందించారు. -
మద్దిలో అభిషేక సేవ
జంగారెడ్డిగూడెం: గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి దేవస్థానంలోని ఆలయ ముఖ మండపంపై శనివారం స్వామి వారికి పంచామృత అభిషేకం ఆలయ అర్చకులు, వేద పండితులు ఆధ్వర్యంలో నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం 3.30 గంటల వరకు వివిధ సేవల రూపేణా రూ.1,58,432 ఆదాయం సమకూరినట్లు ఈవో ఆర్వీ చందన తెలిపారు. అలాగే, స్వామి వారి నిత్యాన్నదాన సత్రం నందు సుమారు 2,127 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారన్నారు. భక్తులు 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. తణుకు అర్బన్: తణుకు మండలం ముద్దాపురం గ్రామానికి చెందిన రెండేళ్ల చిన్నారి కొయ్యలమూడి బృహతి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించింది. మహాభారతానికి సంబంధించిన జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంతోపాటు మహాభారతంలోని పాత్రలను గుర్తుచేసుకోవడం, అనర్ఘళంగా సంస్కృత శ్లోకాలు, తెలుగు నర్సరీ రెయిమ్స్ పఠించడం, గృహోపకరణాలను, శరీరంలోని భాగాలు, క్రియలు, జంతువులు, ఆకారాలు, కూరగాయలు గుర్తించి వాటి పేర్లు చెప్పడం, ఆంగ్లం, తెలుగులో 1 నుంచి 10 వరకు సంఖ్యలను లెక్కించడం వంటివి చిన్న వయసులోనే చేసినందుకు గాను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్చే ‘ఐబీఆర్ అచీవర్’ గా నవంబర్ 17, 2025న గుర్తింపు పొందింది. ఈ విషయాన్ని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఈనెల 10వ తేదీన తమ వెబ్సైట్లో పొందుపరిచారు. ఈ సందర్భంగా చిన్నారి బృహతితోపాటు తల్లిదండ్రులు అనూష, గోవర్థన్లను పలువురు అభినందించారు. అప్పుల బాధ తాళలేక అంబులెన్స్ డ్రైవర్ ఆత్మహత్య జంగారెడ్డిగూడెం: అప్పుల బాధ తట్టుకోలేక ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకుంది. ఎస్సై ఎన్.వీరప్రసాద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. టి.నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామానికి చెందిన పప్పవరపు శివ (32) జంగారెడ్డిగూడెంలో ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అప్పుల బాధ తట్టుకోలేక ఈ నెల 6వ తేదీన ఆసుపత్రుల్లో క్లీన్ చేసే పారాగాట్ లిక్విడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించగా, అనంతరం మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. శివకు భార్య, కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. భీమడోలు: జాతీయ రహదారి భీమడోలులోని అయ్యప్ప స్వామి గుడి వద్ద గురువారం ఆర్ధరాత్రి లారీలోని నగదు చోరీకి గురైంది. తెలంగాణ రాష్ట్రం నందివాడ మండలం పాలకొండ గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ కమ్ గుమాస్తా బొమ్మనపల్లి శ్రీనివాస్ లారీ క్లీనర్లతో కలిసి తూర్పు గోదావరి జిల్లా మల్కీపురం నుంచి గుడివాడకు లారీలో వెళ్తున్నారు. మార్గమధ్యమైన భీమడోలు అయ్యప్ప స్వామి ఆలయం వద్దకు వచ్చేసరికి నిద్ర వస్తుండడంతో లారీ ఆపి వారి వద్ద గల రూ.1.50 లక్షల నగదును సీటు కింద పెట్టుకుని నిద్రించారు. ఉదయం లేచి చూసేసరికి ఆ నగదు కనిపించలేదు. దీనిపై లారీ డ్రైవర్ శ్రీనివాస్ భీమడోలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై మదీనా బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెనుగొండ: సిద్ధాంతం జాతీయ రహదారిలో అక్రమంగా తరలిస్తున్న 30 క్వింటాళ్ల రేషన్ బియ్యంను, వాహనాన్ని స్వాధీనం చేసుకొన్నట్లు విజిలెన్స్ ఎస్సై కే.నాగరాజు తెలిపారు. శనివారం రీజనల్ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారి కే నాగేశ్వరరావుకి అందిన సమాచారంతో స్థానిక రెవెన్యూ, పౌర సరఫరా అధికారులతో కలసి ఈ తనిఖీలు నిర్వహించామన్నారు. పీడీఎస్ రైన్ యజమాని గెల్లి విశ్వనాథగుప్తా, నేతేటి వెంకటేష్, లంక వెంకట్రావు, చోడపనేని సాయి దుర్గ ప్రవీణ్, గోవరపు అవినాష్లపై నిత్యవసర వస్తువుల చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు చెప్పారు. -
దండగలా మారిన వ్యవసాయం
● ఓ వైపు ప్రకృతి నష్టం.. మరోపక్క దిగుబడి శూన్యం ● తీవ్రంగా నష్టపోయిన కౌలు రైతు ● మోంథా నష్టపరిహారం ఎప్పుడో?తణుకు అర్బన్: వ్యవసాయం పండుగలా జరిగిన రోజుల నుంచి వ్యవసాయం దండగ మాదిరిగా మారిన నేటి రోజుల్లో అన్నంపెట్టే రైతాంగం అతలాకుతలమైపోయింది. ప్రకృతి వైపరీత్యాలు, దిగుబడి తగ్గడం వంటి కారణాలతో రైతు పరిస్థితి దీనంగా మారింది. ఈ ఖరీఫ్ సీజన్లో వచ్చిన మోంథా తుపాను తాకిడికి పంట నీట మునిగి రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. స్వర్ణరకం పూర్తిగా నేలకొరగగా, 1318 రకం మాత్రం నిలబడి ఉన్నా గింజ నూకతోపాటు పలు సమస్యలు తలెత్తి నష్టపోయామని రైతులు చెబుతున్నారు. అన్నం పెట్టే రైతు కష్టంలో ఉన్నప్పుడు కనీసం పరామర్శలకు కూడా ప్రజాప్రతినిధులు వెళ్లకపోగా వ్యవసాయ శాఖ అధికారులు సైతం పంట నష్టాన్ని సరిగ్గా నమోదు చేయలేదని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ ఖరీఫ్ సీజన్లో పంట నష్టపోయామని అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు. తణుకు నియోజకవర్గంలోని తణుకు, అత్తిలి, ఇరగవరం మండలాలకు సంబంధించి 39,876 ఎకరాల్లో రైతులు వరిసాగు చేయగా సుమారుగా 3,321 ఎకరాల్లో పంట నష్టం నమోదు చేసినట్లుగా వ్యవసాయాధికారులు చెబుతున్నారు. మోంథా నష్టపరిహారం ఏదీ? మోంథా తుపాను నష్టాన్ని వ్యవసాయ అధికారులు ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం అంటూ అరకొరగా నమోదుచేశారని పంట దిగుబడి పూర్తిస్థాయిలో రాలేదని ఆరోపిస్తున్నారు. నష్టం పూర్తిగా నమోదు చేయమంటే శాటిలైట్ అదీ ఇదంటూ కారణాలు చెప్పారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నష్టం నమోదుచేసిన దానికి కూడా ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదని, వ్యవసాయాధికారులను అడిగినా పట్టించుకోవడంలేదని రైతులు చెబుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన ఏ పంట నష్టం ఆ పంట సమయంలోనే రైతుకు అందేదని, బీమా చెల్లించకుండానే నష్టపరిహారం బ్యాంకు ఖాతాల్లో జమయ్యే పరిస్థితి ఉండేదని నేడు రైతును పట్టించుకునే నాధుడే లేడని వాపోతున్నారు. ఖరీఫ్ సీజన్లో వచ్చిన మోంథా తుపాను తాకిడికి రైతు పూర్తిగా నష్టపోయాడు. చేలు నేరకొరిగిపోయి తడిచిపోవడంతో దిగుబడి తగ్గిపోయి రైతు నష్టాల ఊబిలో కూరుకుపోయాడు. ముఖ్యంగా కౌలు రైతుకు గింజ కూడా మిగలని దుస్థితి నెలకొంది. ఎకరాకు రూ. 30 వేలు పెట్టుబడి పెట్టి 25 బస్తాలు దిగుబడి వచ్చిన పరిస్థితిలో మగతాకు ఏమివ్వాలి, కౌలు రైతుకు ఏం మిగలాలి. తడిచిన ధాన్యం నష్టంగా నమోదుచేయమంటే వ్యవసాయశాఖ అధికారులు చొరవ చూపలేదు. గత ప్రభుత్వ హయాంలో రైతు భరోసా పెట్టుబడిగా ముందే అందించడంతోపాటు ఏ పంట నష్టం ఆ పంట సమయంలోనే అందించి రైతును ఆదుకున్నారు. – ఆడారి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ రైతు విభాగం అత్తిలి మండల అధ్యక్షుడు వ్యవసాయరంగంలో వ్యవసాయం చేసేది అధికశాతం కౌలు రైతులే కావడంతో ఈ మోంథా తుపాను దెబ్బకి భారీగా నష్టపోయామని కౌలు రైతులు చెబుతున్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో పంట దిగుబడి తగ్గడంతోపాటు ధాన్యం తడిచిపోయి చివరి గింజ వరకు చేతికి అందకపోగా రైతుకు మగతా ఇచ్చేయగా చేతికి ధాన్యం గింజ రాలేదని వాపోతున్నారు. అన్నదాతా సుఖీభవా పథకం కౌలు రైతుకు కూడా అందిస్తామని ఎన్నికల ముందు కూటమి నేతలు హామీ ఇచ్చినప్పటికీ అమలు చేయలేదని కౌలు రైతులు ఆరోపిస్తున్నారు. గత ప్రభ్వుతంలో ఇన్పుట్ సబ్సిడీ, పంట నష్టం వెంటనే అందేవని నేడు రైతుకు ఎటువంటి ప్రోత్సాహ ం లేకుండా పోయిందని రైతులు ఆరోపిస్తున్నారు. -
వ్యాపారం విలవిల
ఉత్సాహంగా బాలోత్సవం ట్రిపుల్ ఐటీని గాలికొదిలేసిన ప్రభుత్వం ఏలూరు (ఆర్ఆర్పేట): విద్యార్థుల్లో కులాలు, మతాలు ప్రాంతాలకు అతీతంగా జాతీయ సమైక్యతా భావాన్ని బాలోత్సవాలు పెంపొందిస్తాయని ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి అన్నారు. సిద్ధార్థ క్వెస్ట్ విద్యా సంస్థల ఆవరణలో హేలాపురి బాలోత్సవం 2వ రోజు ఉత్సాహపూరితమైన వాతావరణంలో జరిగింది. ప్రధాన కార్యదర్శి దేవరకొండ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. ఎమ్మెల్సీ గోపిమూర్తి మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను, కళా నైపుణ్యాలను, శాస్త్ర సాంకేతిక ఆలోచన విధానాన్ని పెంపొందించే విద్యా వ్యవస్థ ఏర్పడాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాము సూర్యారావు, సెట్వెల్ సీఈఓ కేఎస్ ప్రభాకర్, బాలోత్సవం అధ్యక్షుడు ఆలపాటి నాగేశ్వరరావు, అకడమిక్ అంశాల సమన్వయకర్త ఎస్కే ముస్తఫా అలీ, సిద్ధార్థ విద్యాసంస్థల అధినేత కోనేరు సురేష్ బాబు, ఎన్జీవో అసోసియేషన్ నాయకుడు చోడగిరి శ్రీనివాస్, పూర్వ జిల్లా అధ్యక్షుడు లాం విద్యాసాగర్, హెయిర్ ఇండస్ట్రీస్ చైర్మన్ కేకే గుప్త, జీఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బాలోత్సవంలో కథలు చెప్పడం, మైక్రో ఆర్ట్, క్విజ్, జానపద నృత్యాలు, ఏకపాత్రాభినయాలు, లఘు నాటికలు, చిత్ర సమీక్ష తదితర అంశాలు ఆకట్టుకున్నాయి. నూజివీడు: పట్టణంలోని ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం, ఆర్జీయూకేటీ అధికారులు విఫలమయ్యారని ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు డీ శివకుమార్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులు తింటున్న భోజనాలు సరిగా లేకపోవడంతో విద్యార్థులు అర్ధాకలితో చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. అనేక మంది విద్యార్థులను ఉన్నతస్థాయిలో నిలబెట్టిన విద్యాసంస్థ నేడు పూర్తిగా సమస్యలతో నిండిపోయిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఇక్కడకు వచ్చి చదువుకుంటున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం కూడా అందించలేని పరిస్థితి నెలకొందన్నారు. ఇంత వరకు పీయూసీ విద్యార్థులకు ల్యాప్ట్యాప్లు, యూనిఫాం అందించలేదన్నారు. సాక్షి, భీమవరం: భీమవరంలోని జువ్వలపాలెం రోడ్డు, పీపీ రోడ్డు, మల్టీఫ్లెక్స్ ఏరియా, నరసాపురంలోని స్టీమర్ రోడ్డు, తణుకులోని వేల్పూర్ రోడ్డు, రాష్ట్రపతి రోడ్డు, పాలకొల్లులోని బస్టాండ్ సెంటర్, టెంపుల్ రోడ్డు, తాడేపల్లిగూడెం కేఎన్ రోడ్డు, తాలుకా ఆఫీస్ రోడ్లు వ్యాపారాలకు పేరొందాయి. దసరా, దీపావళి, క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి, రంజాన్, పెళ్లిళ్ల సీజన్లలో రెడీమేడ్, ఫ్యాన్సీ, కిరాణ, బంగారం, హోంగూడ్స్ తదితర వాటిపై రూ.2 వేల కోట్లకు పైనే వ్యాపారం జరుగుతుందని అంచనా. చిన్న వ్యాపారులు సైతం ఆయా సీజన్లకు నెల ముందే ఢిల్లీ, ముంబై, చైన్నె తదితర నగరాల నుంచి స్టాకులు పెట్టుకునేవారు. కొంతకాలంగా మార్కెట్లో వినియోగదారులు లేక అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. అద్దెలు కట్టలేని పరిస్థితుల్లో నష్టాలతో నడపలేక కొందరు వ్యాపారాలను మూసివేస్తుండటంతో షాపులు ఖాళీ అవుతున్నాయి. ప్రధాన సెంటర్లలో సైతం షాపుల ముందు టు–లెట్ బోర్డులు కనిపిస్తున్నాయి. మరోపక్క ఉపాధి కోసం రోడ్లు పక్కన చిరు వ్యాపారాలు పెరుగుతున్నాయి. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సీజన్ మొదలుకానుండగా వ్యాపార వర్గాల్లో ఆ జోష్ కనిపించడం లేదు. జనం దగ్గర డబ్బుల్లేక మార్కెట్లో మనీ ట్రాన్సాక్షన్న్ తగ్గడం వ్యాపారాలపై ప్రభావం చూపిందని, మునుపటితో పోలిస్తే గత ఏడాది సీజన్లో 60 శాతం వ్యాపారం తగ్గినట్టు తాడేపల్లిగూడెం చాంబర్ ఆఫ్ కామర్స్కు చెందిన నేత ఒకరు తెలిపారు. నరసాపురం: చైన్నె నుంచి విజయవాడ వరకూ నడుస్తున్న ఎంజీఆర్ చైన్నె సెంట్రల్–విజయవాడ వందే భారత్ ఎక్స్ప్రెస్ రేపటి నుంచి జిల్లాలో పరుగులు పెట్టనుంది. సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు నరసాపురం రైల్వేస్టేషన్లో ఈ రైలును కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ సహాయ మంత్రి శ్రీనివాసవర్మ ప్రారంభించనున్నారు. విజయవాడ రైల్వే డివిజన్కు చెందిన పలువురు ఉన్నతాధికారులు, రాష్ట్ర మంత్రులు కూడా హాజరవుతున్నారు. నరసాపురం–చైన్నె మధ్య ఈ రైలు ప్రతి రోజు రాకపోకలు సాగించనుంది. 20678 నెంబరుతో రైలు నరసాపురంలో మధ్యాహ్నం 2.50 గంటలకు బయలుదేరి రాత్రి 12.45 గంటలకు చైన్నె చేరుకుంటుంది. 20677 నెంబరుతో చైన్నెలో ఉదయం 5.35 గంటలకు చైన్నెలో బయలుదేరి మధ్యాహ్నం 2.10 గంటలకు నరసాపురం చేరుకుంటుంది. నరసాపురం, భీమవరం టౌన్, గుడివాడ స్టేషన్లో మాత్రమే ఆగుతుంది. పశ్చిమ డెల్టా వాసులు ఎంతోకాలంగా ఈ రైలు కోసం ఎదురు చూస్తున్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని నవోదయ విద్యాలయాల్లో 2026–27 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాల కోసం శనివారం పరీక్షలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 11 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకూ నిర్వహించిన ఈ పరీక్షకు 2,311 మందికి 1,184 మంది హాజరయ్యారు. ఈ పరీక్షలకు 1127 మంది గైర్హాజరయ్యారు. ఉద్యోగాలు, ట్రాన్స్ఫర్లు కోసం ఎమ్మెల్యేలు, మంత్రుల రికమండేషన్లకు డిమాండ్ ఉండటం చూస్తుంటాం. తణుకులో షాపులు ఖాళీ అయితే వాటికి కూడా రికమండేషన్ల కోసం వ్యాపారులు ఎగబడేవారు. అంతలా వ్యాపారాలు బాగుండేవి. ఇప్పుడు ఎక్కడ చూసినా షాపులు టు–లెట్ బోర్డులతో కనిపిస్తున్నాయి. – కారుమూరి వెంకటనాగేశ్వరరావు, మాజీ మంత్రి ఎన్నో ఏళ్లుగా వస్త్ర వ్యాపారం చేస్తున్నాం. గతంలో పండుగల వ్యాపారం బాగా జరిగేది. గత ఏడాది అమ్మకాలు తగ్గిపోయాయి. మార్కెట్ డల్గా ఉండటంతో చిన్నవ్యాపారులు చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది. జగదీష్, రెడీమేడ్ వస్త్రవ్యాపారి, తణుకు తణుకులోని వేల్పూరు రోడ్డు.. క్లాత్, రెడీమేడ్, ఫ్యాన్సీ, ఫుట్వేర్, హోమ్నీడ్స్, షాపింగ్ మాల్స్కు ప్రసిద్ధి. గతంలో ఈ రోడ్డులో అద్దెకు షాపు కోసం మంత్రి స్థాయిలో సిఫార్సులు ఉండేవంటే వ్యాపారాలు ఎంత బాగుండేవో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ రోడ్డులోని కప్పల అప్పన్న సెంటర్ నుంచి రాజీవ్చౌక్ సెంటర్ వరకు కేవలం 550 మీటర్ల పరిధిలో 30కు పైనే షాపులు టు–లెట్ బోర్డులతో ఖాళీగా కనిపిస్తున్నాయి. జగన్ ప్రభుత్వంలో అమ్మ ఒడి, వైఎస్సార్ ఆసరా, చేయూత, రైతు భరోసా, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, నేతన్న నేస్తం.. అన్ని వర్గాల వారికి మేలు చేస్తూ ప్రతీనెల ఏదొక సంక్షేమ పథకం చేతికంది మార్కెట్లో మనీ రొటేషన్ జరిగేది. ఉదాహరణకు 2023 జనవరి నుంచి డిసెంబరు వరకు సంక్షేమం రూపంలో రూ. 1,191 కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమచేశారు. గ్రామగ్రామాన జగనన్న కాలనీల్లో రూ.1263 కోట్లతో చేపట్టిన పక్కా ఇళ్లు, రూ.260 కోట్లతో సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ సెంటర్లు నిర్మాణాలు, నాడు–నేడులో రూ. 369 కోట్లతో పాఠశాలల అభివృద్ధి, రూ. వందల కోట్లతో జిల్లాలో ఆక్వా వర్శిటీ, మెడికల్ కళాశాల, ఆస్పత్రుల అభివృద్ధి పనులు, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీతో విద్య, వైద్యానికి భరోసా, మరోపక్క రియల్ ఎస్టేట్ జోరుతో భవన నిర్మాణం, అనుబంధ రంగాల్లోని కార్మికులు, వ్యాపారులకు ఏడాది పొడవునా పని దొరికి చేతినిండా డబ్బులతో వ్యాపారాలు కళకళలాడేవి. సూపర్ సిక్స్ అంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం గత ఏడాది సంక్షేమాన్ని విస్మరించింది. 2025 జనవరి నుంచి డిసెంబరు వరకు ఏడాది కాలంలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, గ్యాస్ సబ్సిడీ, మత్య్సకార భృతి, వాహన సేవ పథకాల ద్వారా జిల్లా వాసులకు జమచేసింది కేవలం రూ.409 కోట్లు మాత్రమే. గత ప్రభుత్వం చేసిన మేలులో ఇది కేవలం మూడో వంతు మాత్రమే. మరోపక్క విద్యుత్ చార్జీలు, ఇంటిపన్నులు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. నరసాపురం–పాలకొల్లు రోడ్డులో గతంలో అక్కడక్కడ శీతల పానీయాలు, పండ్లు, కూరగాయల దుకాణాలు కనిపించేవి. కొంతకాలంగా రోడ్డుకు ఇరువైపులా దారిపొడవునా గృహోపకరణాలు, సీజనల్ పండ్లు, కాయలు తదితర చిరువ్యాపారాలు చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. జిల్లాలోని భీమవరం–తణుకు, ఉండి – ఏలూరు, తణుకు–తాడేపల్లిగూడెం హైవే, తదితర రద్దీ రోడ్లలో పదుల సంఖ్యలో చిరు వ్యాపారాలు వెలుస్తున్నాయి. మార్కెట్లో తగ్గిపోయిన మనీ రొటేషన్ బేరాల్లేక షాపులు ఖాళీ చేస్తున్న వ్యాపారులు బిజినెస్ ఏరియాల్లోనూ షాపుల ముందు టు–లెట్ బోర్డులు గత ప్రభుత్వంలో సంక్షేమ పరవళ్లతో వ్యాపారాల జోరు 2023లో పేదలకు చేకూరిన సంక్షేమ లబ్ధి రూ.1,191 కోట్లు 2025లో చేకూరిన లబ్ధి కేవలం రూ.409 కోట్లు -
●మంచు కురిసే వేళలో..
మెట్ట ప్రాంతంలో ఉదయం విపరీతమైన పొగ మంచు కురుస్తోంది. ఉదయం 8 గంటలకు కూడా మంచు తెరలు వీడడం లేదు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. మెట్ట ప్రాంతంలో గత కొద్ది రోజులుగా చలిగాలుల తీవ్రత పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల కంటే దిగువకు పడిపోవడం, దీనికి తోడు చల్లటి గాలులు వీస్తుండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వచ్చేందుకు వణికిపోతున్నారు. చలి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చింతలపూడిలో శనివారం ఉదయం మంచు తెరలు వీడని దృశ్యాలివి. – చింతలపూడి -
నాకౌట్ దశకు సాఫ్ట్బాల్ పోటీలు
వీరవాసరం : వీరవాసరం ఎంఆర్కే జడ్పీహెచ్ఎస్ పాఠశాల క్రీడా ప్రాంగణంలో జరుగుతున్న 69వ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ అండర్ 17 సాఫ్ట్ బాల్ పోటీలు నాకౌట్ దశకు చేరుకున్నాయని పశ్చిమగోదావరి జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి పీఎస్ఎన్ మల్లేశ్వరరావు, దాసరి సునీత తెలిపారు. రెండవ రోజు బాలికల జట్ల ఫలితాలు విజయనగరం జిల్లా బాలికల జట్టు గుంటూరు జట్టుపై 02:01 తేడాతో, ప్రకాశం జిల్లా జట్టు విశాఖపట్నం జట్టుపై 11:01 తేడాతో, అనంతపురం జట్టు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జట్టుపై 11:01 తేడాతో, వైఎస్సార్ కడప జట్టు శ్రీకాకుళం జట్టుపై 08:04 తేడాతో, పశ్చిమగోదావరి జిల్లా జట్టు తూర్పుగోదావరి జిల్లా జట్టుపై 02–01 తేడాతో, విజయనగరం జట్టు కృష్ణా జిల్లా జట్టుపై 04–01 తేడాతో గెలుపొందాయి. బాలికల క్వార్టర్ ఫైనల్ ఫలితాలు పశ్చిమగోదావరి జిల్లా జట్టు ప్రకాశం జట్టుపై 19– 09 తేడాతో , విజయనగరం జట్టు శ్రీకాకుళం జట్టుపై 12–01 తేడాతో, తూర్పుగోదావరి జిల్లా జట్టు అనంతపురం జట్టుపై 05–01 తేడాతో , కడప జట్టు గుంటూరు జట్టుపై విజయం సాధించి సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. బాలుర ఫలితాలు విజయనగరం జట్టు విశాఖ జట్టుపై 03–00 తేడాతో, తూర్పుగోదావరి జిల్లా జట్టు నెల్లూరు జట్టుపై 02–00 తేడాతో, గుంటూరు జట్టు కర్నూలుపై 13–00 తేడాతో, పశ్చిమగోదావరి జిల్లా జట్టు అనంతపురం జట్టుపై 07–01 తేడాతో, కడప జట్టు కృష్ణా జిల్లా జట్టుపై 01–00 తేడాతో , విజయనగరం జట్టు చిత్తూరు జట్టుపై 05–00 తేడాతో విజయం సాధించాయి. బాలుర క్వార్టర్ ఫైనల్ ఫలితాలు విజయనగరం జట్టు ప్రకాశంపై, గుంటూరు జట్టు కడప జట్టుపై, పశ్చిమగోదావరి జిల్లా జట్టు విశాఖ జట్టుపై గెలిచి సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. ఆదివారం ముగింపు కార్యక్రమం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ బాల బాలికల జట్లను ఎంపిక చేయడం జరుగుతుందని పశ్చిమగోదావరి జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శులు పీఎస్ఎన్ మల్లేశ్వరరావు, దాసరి సునీత, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బాచింకి శ్రీనివాస్ తెలిపారు. -
మెటీరియల్ నాణ్యత పరిశీలన
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో వినియోగించే మెటీరియల్ నాణ్యత పరిశీలన కార్యక్రమం రెండవ రోజు కొనసాగింది. సీఎస్ఎంఆర్ఎస్ (సెంట్రల్ సాయిల్ మెటీరియల్ రీసెర్చ్ సెంటర్) శాస్త్రవేత్తల బృందం హరేంద్ర ప్రకాష్, ఉదయ్భాను చక్రబోర్తి, సిద్దార్ద్ పి.హెడవూలు శనివారం ప్రాజెక్టులోని మట్టి, రాతి నాణ్యత పరీక్షలను నిర్వహించారు. గ్యాప్–1, –2 ప్రాంతాలు, ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాంలో వినియోగించే మట్టి, రాతి నాణ్యత ప్రమాదాలను వారు పరిశీలన చేశారు. అలాగే నిర్మాణ ప్రాంతంలోని నీటి ఇంకుడు స్వభావాన్ని, మట్టి సాంద్రత పరీక్షలు చేశారు. అదేవిధంగా ఆయా మెటీరియల్స్ శాంపిల్స్ను సేకరించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తల బృందం మాట్లాడుతూ ప్రాజెక్టు ప్రాంతంలో నిర్వహించిన పరీక్షలతో పాటు, మరికొన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నందున శాంపిల్స్ సేకరించిట్లు చెప్పారు. ఇదే విషయాన్ని వారు ఇంజనీరింగ్ చీఫ్ ఎన్.నరసింహమూర్తికి తెలియజేశామన్నారు. కాగా, శాస్త్రవేత్తల బృందం ఆదివారం ఢిల్లీ వెళ్లనుంది. తమ పర్యటనలో భాగంగా నిర్వహించిన పరీక్షల వివరాల నివేదికను జలవనరుల శాఖకు నివేదించనుంది. ఈ కార్యక్రమంలో ఈఈలు డి.శ్రీనివాస్, బాలకృష్ణ, మేఘా ఇంజనీరింగ్ జనరల్ మేనేజర్ ఎ.గంగాధర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ మురళి పమ్మి, మేనేజర్లు వెంకటేష్, గణపతి తదితరులు పాల్గొన్నారు. భీమడోలు, పొలసానిపల్లి గ్రామాల్లో దొంగతనాలు భీమడోలు: భీమడోలు, పొలసానిపల్లి గ్రామాల్లో తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగలు చోరీలకు పాల్పడ్డారు. శనివారం తెల్లవారుజామున మూడు ఇళ్లలో చొరబడి 9 కాసులకు పైగా బంగారు అభరణాలు, రూ.2 లక్షల నగదును అపహరించారు. వివరాలు ఇలా ఉన్నాయి. పొలసానిపల్లిలోని జీవీ హోమ్స్లోని గంజి సుబ్బారావు కుటుంబ సభ్యులు తన ఇంటికి తాళాలు వేసి విజయవాడలోని కుమారుడి ఇంటికి వెళ్లారు. అలాగే పక్క ఇంటిలోని పాస్టర్ వాసే యోషయా క్రైస్తవ సభలకు వెళ్లారు. ఈ రెండు ఇళ్లలోకి చొరబడిన దొంగలు లాకర్స్ను సైతం పగల కొట్టారు. గంజి సుబ్బారావు ఇంటిలోని 9 కాసుల బంగారు అభరణాలు, రూ.50వేల నగదు దొంగిలించగా, పాస్టర్ వాసే యోషయా ఇంటిలో బంగారు చెవిదిద్దులు, జత పట్టీలను అపహరించారు. ఇదే తరహాలో భీమడోలు గొలుసు గేటులోని తవ్వా రత్న ప్రభాకరావుకు చెందిన బంధువులు తమ ఇంటికి తాళాలు వేసి అమెరికా వెళ్లారు. అదును చూసిన దొంగలు ఆ ఇంట్లోకి ప్రవేశించి లాకర్ను ధ్వంసం చేసి రూ.1.5 లక్షల నగదుతో పరారయ్యారు. సమాచారం అందుకున్న ఎస్సై ఎస్కే మదీనా బాషా ఘటనా స్థలాలను పరిశీలించారు. క్లూస్ టీంలు తనిఖీ చేశాయి. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్సై ఎస్కే మదీనా బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చలికాలం.. ఆరోగ్యం పదిలం
భీమడోలు: శీతల గాలులు ప్రజలను వణిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. సాయంత్రం ఐదు గంటల నుంచి ఉదయం పొద్దుపోయినా చలి పులి ప్రజలను భయపెడుతోంది. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఎక్కువగా అనారోగ్యాల బారిన పడుతున్నారు. జిల్లాలోని ఆసుపత్రుల్లో రోగుల తాకిడి అధికంగా ఉంది. గతం కన్నా ఓపీ పెరగడంతో ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యం పదిలంగా ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు జాగ్రత్త ప్రస్తుతం ఉష్ణోగ్రతలు ఊహించని స్థాయిలో పడిపోతున్నాయి. గుండె జబ్బులు, బీపీ, మధుమేహం, ఆస్తమా వ్యాధిగ్రస్తులకు శీతాకాలం శత్రువే. శరీరం వ్యాధుల బారిన పడేది ఈ సీజన్లోనే. ఎప్పుడైనా గుండె నొప్పిగా ఉందని చెప్పినా వెంటనే సమీపంలోని వైద్యులు వద్దకు తీసుకుని వెళ్లాలి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఉదయం, రాత్రి వేళల్లో పిల్లలకు బయటకు వెళ్లనివ్వకుండా చూడాలి. పెంపుడు జంతువులకు దూరంగా.. ఈ సీజన్లో పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలి. వైరస్ల వ్యాప్తికి పెంపుడు జంతువులు ప్రధాన కారణంగా వైరాలజీ నిపుణులు చెబుతున్నారు. ఈ కాలంలో వాటిని బెడ్రూమ్, వంట గదిలోకి రానివ్వకుండా అదుపు చేయడం మంచిది. పిల్లలు, వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్న వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు పెంపుడు జంతువులను దరి దాపుల్లోకి కూడా వెళ్లకూడదని వైద్యులు సూచిస్తున్నారు. బయట ఆహారం తినొద్దు : వాతావరణం చల్లగా ఉంటే వేడి వేడిగా ఉండే పకోడి, బుజ్జీలు, బొండాలను విపరీతంగా అరగిస్తుంటాం. ఈ సీజన్లో అలాంటి ఆహార పదార్థాలకు కొన్ని రోజులు విరామం ఇవ్వాలి. లేనిపక్షంలో ఆరోగ్యానికి చేటును తెస్తాయి. ఫైబర్ అధికంగా ఉండే కూరగాయాలు, ఆకుకూరలు, ఏ, సీ, కే, విటమిన్లు పుష్కలంగా లభించే పదార్థాలనే తినాలి. బీటా కెనోటిన్, నైట్రస్ వంటివి ఉండే బీట్రూట్, క్యారెట్లను, నైట్రస్ వంటివి తినాలి. మసాలా ఫుడ్కు దూరంగా ఉంటే మేలు. గోరువెచ్చని నీటితో ఉపశమనం చల్లదనంతో ఊపిరితిత్తుల్లోని పొరలు అతిగా స్పందిస్తాయి. కూల్డ్రింక్స్లు, ఫ్రిజ్ల్లో పెట్టిన వాటిని తాగడం ప్రమాదకరం. జలుబు, దగ్గు, జ్వరం బారిన పడిన వారు గోరు వెచ్చని నీటిని తాగితే కాస్త ఉపశమనం కలుగుతుంది. అలాగే ధూమపానానికి దూరంగా ఉండడం ఎంతో శ్రేయస్కరం. వేడి, తాజా ఆహారం తీసుకోవాలి. కూరగాయాలు, పప్పులు మంచివి, నీరు తక్కువ కాకుండా తాగాలి. గోరువెచ్చని నీటితో మాత్రమే స్నానం చేయాలి. చలిలో పిల్లలను బయటకు తీసుకు వెళ్లవద్దు. పాలు, గుడ్లు, పండ్లు, కూరగాయాలు ఇవ్వాలి. వయస్సుకు తగిన టీకాలు పూర్తి వేసి ఉండాలి. శీతాకాలంలో దీర్ఘకాలిక రోగులు, సాధారణ ప్రజలు జాగ్రత్తలు పాటించాలి. సరైన నిద్ర, సమయానికి భోజనం అవసరం. చల్లని వాతావరణంలో ఎక్కువ సమయాన్ని గడపకుండా తగు జాగ్రత్తలను తీసుకోవాలి. వేకువ జామున, సాయంత్రం వేళల్లో బయటకు రాకుండా ఉండాలి. ఏమాత్రం ఆనారోగ్యం తలెత్తినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మరింత అప్రమత్తంగా ఉండాలి. శ్వాస తీసుకోవడంంలో తీవ్ర ఇబ్బంది, బీపీ, షుగర్ ఎక్కువగా రావడం, మాట తడబడటం, చేతి కాలి బలహీనత, తీవ్ర దగ్గు లేదా జ్వరం వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. – డాక్టర్ యాసం జేఎం సాయి, జనరల్ మెడిసిన్, సీహెచ్సీ, భీమడోలు -
శ్రీవారి క్షేత్రంలో పోటెత్తిన భక్తులు
ద్వారకాతిరుమల: శ్రీనివాసా గోవిందా.. శ్రీ వేంకటేశా గోవిందా, జై భవానీ.. జైజై భవానీ నామస్మరణలతో చిన్నతిరుపతి క్షేత్రం శనివారం మార్మోగింది. శ్రీవారికి ప్రీతికరమైన రోజు కావడంతో వేలాది మంది భక్తులు క్షేత్రానికి విచ్చేశారు. అలాగే విజయవాడ దుర్గమ్మ ఆలయంలో జరుగుతున్న చంఢీ హోమంలో పాల్గొని, ఇరుముడులు సమర్పించి, దీక్షలు విరమించిన భవానీ మాలదారులు పెద్ద ఎత్తున తిరుగు ప్రయాణంలో ద్వారకాతిరుమలకు చేరుకున్నారు. దాంతో ఆలయ పరిసరాలు భక్తులు, భవానీ దీక్షాదారులతో కళకళలాడాయి. దర్శనం క్యూలైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, అనివేటి మండపం, కల్యాణకట్ట తదితర విభాగాలు భక్తులతో నిండిపోయాయి. స్వామివారి దర్శనార్థం భక్తులు ఆలయ ఆవరణలో బారులు తీరారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని వేదికపై అమలాపురంనకు చెందిన గోకవరపు సూర్యకిరణ్ సతీమణి సులేఖ, భగవద్వాణి శిష్య బృందం చేసిన భగవద్గీత పారాయణతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. -
రబీ సాగుకు రైతన్న సన్నద్ధం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఖరీఫ్లో ప్రకృతి విపత్తులు, అనేక కష్ట నష్టాలు, ఒడిదుడుకులు ఎదురైనా అన్నదాత అన్నింటికి తట్టుకుని రబీ సాగుకు సన్నద్ధమయ్యాడు. ఖరీఫ్ ధాన్యం సొమ్ముల కోసం ఎదురుచూస్తూనే రబీ పనులకు శ్రీకారం చుట్టాడు. జిల్లా వ్యాప్తంగా 2.38 లక్షల ఎకరాల్లో రబీ పంటల సాగు జరగాల్సి ఉండగా ఇంత వరకు 25 వేల ఎకరాల్లో వివిధ పంటలు వేశారు. అత్యధికంగా 96 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ 50 శాతం మేర పూర్తయ్యింది. సుమారు ఖరీఫ్లో 5.50 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడికి 4 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తామని ప్రకటించారు. ఇంత వరకు జిల్లా వ్యాప్తంగా 2,43,310 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్మిల్లర్లు రైతుసేవా కేంద్రాల ద్వారా కొంత, సహకార సొసైటీల ద్వారా, నేరుగా కొనుగోలు చేశారు. సుమారు రూ.475 కోట్లు చెల్లించాల్సి ఉండగా కొంత మేర బకాయిలు ఉన్నాయి. వచ్చే నెల రెండో వారం నాటికి జిల్లా వ్యాప్తంగా కొనుగోళ్లు తుది దశకు చేరే అవకాశం ఉంది. జనవరి మొదటి వారంలో నాట్లు ఈ క్రమంలో మరోవైపు రబీ సీజన్ సన్నాహాలు గ్రామాల్లో మొదలయ్యాయి. వాతావరణం అనుకూలంగా ఉండటంతో జిల్లా వ్యాప్తంగా నారుమడులు మొదలుపెట్టారు. జనవరి మొదటి వారం నుంచి నాట్లు వేసేలా నారుమడులు సిద్ధం చేశారు. రానున్న రబీ సీజన్కు సంబంధించి జిల్లాలో 96,567 ఎకరాల్లో వరి, 121 ఎకరాల్లో జొన్న, 75,917 ఎకరాల్లో మొక్కజొన్న, 14,945 ఎకరాల్లో పెసలు, 24,043 ఎకరాల్లో మినుములు అలాగే 2901 ఎకరాల్లో వేరుశెనగ, 23,680 ఎకరాల్లో వాణిజ్య పంట పొగాకు సాగుతో పాటు ఇతర పంటలు సాగు చేయనున్నారు. వీటిలో ఇప్పటికే 11,974 ఎకరాల్లో మొక్కజొన్న, 3,544 ఎకరాల్లో పెసలు, 1,094 ఎకరాల్లో మినుముల సాగు పూర్తి చేశారు. 9,271 ఎకరాల్లో పొగాకు సాగు పూర్తయ్యింది. ఈ నెలాఖరు నాటికి సాగు విస్తీర్ణం 60 శాతానికిపైగా చేరే అవకాశం ఉంది. జనవరి చివరి నాటికి పూర్తి సాగు విస్తీర్ణం అందుబాటులోకి రానుంది. జిల్లాలో వరికి సంబంధించి అత్యధికంగా తక్కువ కాల పరిమితి ఉన్న ఎంటీయూ 1121, 1282, 1293, 1426, 1153 రకాలు అత్యధికంగా సాగు చేసే అవకాశం ఉంది. మరోవైపు ఎరువుల కొరత నేపథ్యంలో జిల్లాకు రబీ సీజన్కు సంబంధించి 1.50 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం ఉన్నట్లు అంచనాలు సిద్ధం చేశారు. 16న సాగునీటి సలహా మండలి సమావేశం రబీ సాగు నేపథ్యంలో ఈ నెల 16న జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఏలూరు జిల్లా నీటి పారుదల సలహా మండలి సమావేశం జరగనుంది. గోదావరి పశ్చిమ డెల్లా ఆయకట్టు పరిధిలోని రబీ పంటలకు నీటి లభ్యత, అనంతరం కాల్వల మూసివేసే తేదీలను ఖరారు చేయడం, మీడియం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి సాగు విస్తీర్ణం, నీటి విడుదల చేసే తేదీలను నిర్ణయించడం చేస్తారు. 96 వేల ఎకరాల్లో వరి పంట ఇప్పటికే తుది దశకు ఆకుమడులు వచ్చే నెల మొదటివారం నుంచి నాట్లు 75 వేల ఎకరాల విస్తీర్ణంలో మొక్కజొన్న సాగు -
రాజీ మార్గం.. రాజమార్గం
ఏలూరు (టూటౌన్): రాజీ మార్గమే.. రాజ మార్గమని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి అన్నారు. శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ను ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కేసుల పరిష్కారం కోసం 34 బెంచీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నెల రోజుల నుంచి నిర్వహిస్తున్న ఫ్రీ లోక్ అదాలత్ సిటింగ్స్, మధ్యవర్తిత్వం వల్ల 5 కేసుల్లో 50 లక్షల పైబడి వాహన ప్రమాద బీమా కేసుల్లో పరిహారంగా కక్షిదారులకు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అత్యధికంగా రూ.73 లక్షలను చోళ జనరల్ ఇన్సూరెనన్స్ కంపెనీకి సంబంధించి రాజీచేయడం జరిగిందని తెలియజేశారు. కావున కక్షిదారులు సత్వర పరిష్కారం కోసం లోక్అదాలత్ను వినియోగించుకోవాలన్నారు. జాతీయ లోక్ అదాలత్ నందు 10361 పెండింగ్ కేసులు 165 ప్రీలీటిగేషన్ కేసులను రాజీ చేసినట్లుగా డీఎల్ఎస్ఏ జిల్లా కార్యదర్శి కె.రత్నప్రసాద్ తెలియజేశారు. వీటిలో 147 వాహన ప్రమాద బీమా కేసులను రాజీ చేసి సుమారుగా రూ.14 కోట్ల వరకు పరిహారంగా కక్షిదారులకు అందించినట్లు చెప్పారు. ఇంకా కొన్ని కోర్టులలో కేసుల పరిష్కారం జరుగుతూ ఉన్నందున ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. న్యాయమూర్తులు, లోక్ అదాలత్ సభ్యులు న్యాయవాదులు పాల్గొన్నారు. 987 కేసుల రాజీ భీమవరం: మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో సంస్థ అధ్యక్షుడు, 3వ అదనపు జిల్లా జడ్జిగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి బి.లక్ష్మీనారాయణ అధ్యక్షతన శనివారం భీమవరం అన్ని కోర్టుల ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. 42 సివిల్, 931 క్రిమినల్, 14 బ్యాంకు, బీఎస్ఎన్ఎల్ మొండిబాకీ కేసులు మొత్తం 987 కేసులు పరిష్కరించారు. రాజీ మొత్తం విలువ సుమారు రూ.4 కోట్లు ఉంటుందన్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్లో కేసుల పరిష్కారం నిమిత్తం నాలుగు బెంచ్లు ఏర్పాటు చేశారు. న్యాయమూర్తులుగా ఎం.సుధారాణి, ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) జి.సురేష్ బాబు, 1వ అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పి.హనీషా వ్యవహరించారు. బెంచ్ కోర్టు మేజిస్ట్రేట్ నాగరాజు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యేలేటి యోహాన్ (న్యూటన్), బార్ అసోసియేషన్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులు పాల్గొన్నారు. జాతీయ లోక్అదాలత్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి -
కోటి సంతకాల ర్యాలీని విజయవంతం చేద్దాం
జిల్లా పార్టీ అధ్యక్షుడు డీఎన్నార్ కై కలూరు: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో భాగంగా సేకరించిన వినతిపత్రాలతో ఈ నెల 15న సోమవారం ఏలూరులో జరిగే శాంతియుత ర్యాలీని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) కోరారు. కై కలూరు నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి నాయకులు ఆటపాక వినాయక ఐస్ ప్లాంట్కు సోమ వారం ఉదయం 8 గంటలకు రావాలని కోరారు. అక్కడ నుంచి ఏలూరు వెళ్లి శాంతి ర్యాలీలో అందరూ పాల్గొనాలని డీఎన్నార్ కోరారు. బుట్టాయగూడెం: ఐటీడీఏ ద్వారా చేపట్టిన అన్ని రకాల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఏపీ గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎం నాయక్ ఆదేశించారు. శనివారం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించి ఐటీడీఏ ద్వారా అమలు చేస్తున్న పథకాలపై సమీక్షించారు. పీఎం జన్మన్ పథకంలో చేపట్టిన పనులను ఐటీడీఏ పీవో రాములు నాయక్ను అడిగి తెలుసుకున్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ శాఖ ద్వారా చేపట్టిన భవనాలు, రోడ్లు తదితర పనులన్నీ నిర్ణీత సమయానికి పూర్తిచేయాలన్నారు. బూసరాజుపల్లి గురుకుల పాఠశాలను, వసతి గృహంలోని వంటలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఇన్చార్జి వీసీ కె.ధనుంజయరావు తాడేపల్లిగూడెం: ఉద్యాన వర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తానని, రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా రైతులకు సేవలు అందించడానికి ప్రయత్నిస్తానని ఇన్చార్జి వీసీ డాక్టర్ కె.ధనుంజయరావు తెలిపారు. నూతనంగా నియమితులైన ఆయన శనివారం వెంకట్రామన్నగూడెంలోని పరిపాలనా భవనంలో విలేకర్లతో మాట్లాడారు. రాబోయే రోజుల్లో రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే లక్ష్యానికి అనుగుణంగా ఉద్యాన వర్సిటీ పనిచేస్తుందన్నారు. రాయలసీమ, ప్రకాశం జిల్లాలను హార్టీకల్చర్ హబ్గా రూపొందించి నాణ్యమైన ఉద్యాన ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా వర్సిటీ పనిచేస్తుందన్నారు. ధనుంజయరావుకు ఉద్యాన శాస్త్రవేత్తగా , యూనివర్సిటీ ఆఫీసర్గా 30 సంవత్సరాల అనుభవం ఉంది. సమావేశంలో రిజిస్ట్రార్ బి.శ్రీనివాసులు పాల్గొన్నారు. ఏలూరు(మెట్రో): ఏలూరు జిల్లా నీటి పారుదల సలహా మండలి సమావేశం ఈ నెల 16వ తేదీ సాయంత్రం 4 గంటలకు కలెక్టరేట్ గౌతమీ సమావేశపు హాలులో నిర్వహిస్తారని ఇరిగేషన్ సర్కిల్ పర్యవేక్షక ఇంజనీర్ సీహెచ్. దేవప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు. పశ్చిమ డెల్టా రబీ పంటకు సంబంధించి నీటి లభ్యత, అనంతరం కాలువలు మూసి వేసే తేదీ తదితర అంశాలపై చర్చిస్తారని చెప్పారు. ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లా కేంద్రం ఏలూరులో జరుగుతున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు 4వ రోజున శనివారం 374 మంది అభ్యర్థులు హాజరయ్యారు. నగరంలోని సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల కేంద్రంలో ఉదయం 9.30 గంటల నుంచి 12 గంటల వరకూ జరిగిన పరీక్షకు 200 మందికి 187 మంది హాజరు కాగా 13 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ జరిగిన పరీక్షకు 200 మందికి 187 మంది హాజరు కాగా 13 మంది గైర్హాజరయ్యారు. జంగారెడ్డిగూడెం: ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆర్డీవో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ టి.మణిదివ్య, పరింపూడి వీఆర్వో బి.వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ కలెక్టర్ వెట్రిసెల్వి ఉత్తర్వులు జారీ చేశారని ఆర్డీవో ఎంవీ రమణ తెలిపారు. తిరిగి ఉత్తర్వులు జారీ చేసే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని, హెడ్క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారన్నారు. -
ప్రజా పాలన ఎలా చేయాలో చంద్రబాబు తెలుసుకోవాలి
సాక్షి, ఏలూరు: వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, కార్పొరేటర్లు పాల్గొన్నారు. దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ జరిగింది. అక్టోబర్ 10వ తేదీ నుండి ప్రతి నియోజకవర్గంలో ఉద్యమంలా సాగిన ఈ కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 4 లక్షల 25 వేల సంతకాలు సేకరించగా, రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాలు దాటాయి. ఈ నెల 15వ తేదీన కోటి సంతకాల ప్రతులను పార్టీ నాయకులు, అభిమానులతో కలిసి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపనున్నాము. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లాలోని ప్రతీ వైసీపీ నాయకులు, ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రజా నిర్ణయానికి వ్యతిరేకంగా టీడీపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకుంది. మరో 6 కోట్లు ఖర్చు చేస్తే మిగిలిన మెడికల్ కాలేజీలు పూర్తవుతాయి. 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకోవడం కాదు, ప్రజా పాలన ఎలా చేయాలో చంద్రబాబు తెలుసుకోవాలి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కరోనా కష్టకాలం వచ్చినా సంక్షేమ పథకాలు మాత్రం ఆగలేదు. తూర్పు నియోజకవర్గంలో 600 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయి. మళ్ళీ ఎన్నికలు ఎప్పుడూ వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రజా ప్రభుత్వాన్ని గెలిపించుకోడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ నెల 18వ తేదీన రాష్ట్ర గవర్నర్కు కోటి సంతకాలను మాజీ సీఎం వైఎస్ జగన్ అందజేయనున్నారని అవినాష్ వెల్లడించారు. -
ఆటోను ఢీ కొట్టిన లారీ
దెందులూరు: జాతీయ రహదారిపై శుక్రవారం కొమరేపల్లి సత్యనారాయణపురం సమీపంలో తాడేపల్లిగూడెం నుంచి ఏలూరు వైపు కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో గుండుగొలను గ్రామానికి చెందిన 8 మంది వ్యవసాయ కూలీలు గాయపడ్డారు. గాయపడిన కూలీలను దెందులూరు ఎస్సై ఆర్.శివాజీ, స్టేషన్ సిబ్బంది హైవే పెట్రోలింగ్ అంబున్స్లో పోలీసుల సహాయంతో ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 14 వరకు విర్డ్లో ప్రత్యేక వైద్య శిబిరం ద్వారకాతిరుమల: స్థానిక విర్డ్ ట్రస్ట్ ఆసుపత్రిలో ఈ నెల 11న ప్రారంభమైన ప్రత్యేక వైద్య శిబిరం 14 వరకు కొనసాగుతుందని ట్రస్ట్ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు శుక్రవారం విలేకరులకు తెలిపారు. తొలి రోజు మొత్తం 45 మంది రోగులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి, అందులో 10 మందికి శస్త్ర చికిత్సలు చేసినట్టు చెప్పారు. 13, 14న ప్రముఖ వైద్య నిపుణులు భుజం, మోకాళ్ల సమస్యలకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ఈ శిబిరంలో వైద్యులు శ్రీనాథ్, భవ్యచంద్, శ్రీనివాస్ కంభంపాటి ప్రత్యేక సేవలను అందిస్తున్నారని పేర్కొన్నారు. -
కాంట్రాక్ట్ కార్మికులకు పనిభారం
భీమవరం: ప్రభుత్వాస్పత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలని, వారి అపరిష్కృత సమస్యలను పరిష్కారించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెల్లబోయిన రంగారావు డిమాండ్ చేశారు. మెడికల్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్రవ్యాప్త పిలుపులో భా గంగా శుక్రవారం స్థానిక ప్రభుత్వాస్పత్రి వద్ద కార్మికులు ఆందోళన నిర్వహించి సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మణ్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చెల్లబోయిన మాట్లాడుతూ పారిశుద్ధ్య కా ర్మికులకు పెండింగ్ వేతనాలను జమచేయకపోవ డం దారుణమని, కనీస వేతనం రూ.26 వేలు ఇ వ్వాలని, ఈస్ఐ, పీఎఫ్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. పడకల స్థాయికి అనుగుణంగా కార్మికులను నియమించాలన్నారు. ఫినాయిలు, గ్లౌజులు, చీపుర్లు, మాస్కులు అందించాలని డిమాండ్ చేశా రు. ఏఐటీయూసీ నాయకులు వైవీ ఆనంద్, ఎం. లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. -
క్రమశిక్షణతో ముందుకు సాగాలి
నూజివీడు: మట్టిలో ఉన్న మాణిక్యాలను వెలికితీసే విద్యాసంస్థ ట్రిపుల్ఐటీలని, విద్యార్థులు క్రమశిక్షణతో ముందుకు సాగాలని ఏలూరు ఎస్పీ కొమ్మి ప్రతాప శివకిషోర్ అన్నారు. నూజివీడు ట్రిపుల్ఐటీలో గూగుల్ డెవలపర్స్ గ్రూప్స్ ఆధ్వర్యంలో శుక్రవారం డెవ్ఫెస్ట్ను నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎస్పీ జ్యోతీప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ క్రమశిక్షణతో ముందుకు సాగితే పెద్ద పెద్ద లక్ష్యాలను సైతం సమర్ధవంతంగా సాధించవచ్చన్నారు. ప్రభుత్వం ప్రజాధనాన్ని విద్యకోసం ఖర్చు చేస్తోందని, విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాని సాధన కోసం పట్టుదలగా ముందుకు సాగాలన్నారు. గూగుల్ డెవలపర్స్ గ్రూప్స్ నిర్వహిస్తున్న డెవ్ ఫెస్ట్ ద్వారా తమ విజ్ఞానాన్ని మరింత పెంచుకోవాలని విద్యార్థులకు ఎస్పీ సూచించారు. ట్రిపుల్ఐటీ డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ మాట్లాడుతూ విద్యార్థుల్లో పరిశ్రమల అవసరాలకనుగుణంగా నైపుణ్యాలను పెంచేందుకు అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. అనంతరం గూగుల్ డెవలపర్స్ గ్రూపు ప్రతినిధులు విద్యార్థులతో ముఖాముఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ రీజనల్ ఉపాధి అధికారి తెంటు అనిల్, సైబర్ సెక్యురిటీ కన్సల్టెంట్ కల్యాణ్ దీక్షిత్, ఎంటర్ప్రైజెస్ మైండ్స్ ఏఐ ప్రాక్టీస్ లీడర్ వడ్లమాని మధు, డీఎస్పీ కేవీవీఎన్వీ ప్రసాద్, ఏఓ బీ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. -
క్రాస్ కంట్రీ పోటీల్లో విద్యార్థి ప్రతిభ
కామవరపుకోట: రాష్ట్రస్థాయి స్థాయి క్రాస్ కంట్రీ పోటీలకు ద్వారకాతిరుమల మండలం రామసింగవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని ఎంపికై నట్లు అథ్లెటిక్స్ జిల్లా అధ్యక్షులు జి.ప్రసాద్ తెలిపారు. శుక్రవారం కామవరపుకోటలో నిర్వహించిన జిల్లాస్థాయి క్రాస్ కంట్రీ పోటీల్లో రామసింగవరం పాఠశాల విద్యార్థులు సూదగాని హేమ సత్య విశేష ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు, సందీప్, ఆవల నిర్మల పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందుకున్నట్లు ఆయన తెలిపారు. వీరు ఈనెల 24న తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో జరగబోయే రాష్ట్రస్థాయి క్రాస్ కంట్రీ పోటీల్లో పాల్గొంటారని ఆయన తెలిపారు. వీరికి శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు నార్ని నాగవసంతరావును హెచ్ఎం ఆలూరి వెంకటరత్నం, సీనియర్ అథ్లెటిక్స్ మల్ల రాజు అభినందించారు. తాడేపల్లిగూడెం రూరల్: పెదతాడేపల్లి జాతీయ రహదారిపై కమ్మ కల్యాణ మండపం సమీపంలో శుక్రవారం ఏలూరు వైపు నుంచి తణుకు వైపు రోడ్డు దాటుతున్న గొర్రెలను పాలవ్యాను ఢీకొంది. దీంతో 15 గొర్రెలు మృతి చెందగా, 15 గొర్రెలు గాయాలపాలయ్యాయి. ఈ గొర్రెలను పెదతాడేపల్లి మేకల సంతకు తీసుకువస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని కాపలాదారుడు సూర్యనాగు వాపోయాడు. -
సోలార్ ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయాలి
సాక్షి, విశాఖపట్నం : ఫీడర్ లెవెల్ సోలరైజేషన్ కార్యక్రమం ప్రారంభానికి, వర్చువల్ విధానంలో సీఎం చంద్రబాబు చేపట్టబోయే శంకుస్థాపన కార్యక్రమాలకు ఈ నెలాఖరులోపు ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని 11 జిల్లాలు సిద్ధం కావాలని చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ అధికారులను ఆదేశించారు. సాగర్నగర్లోని సీఓఈఈటీ భవనంలో పీఎం కుసుమ్, పీఎం సూర్యఘర్ పథకం, ఫీడర్ లెవెల్ సోలరైజేషన్, ఎస్సీ, ఎస్టీ రూఫ్ టాప్ సోలార్, పీఎం ఈ డ్రైవ్ పథకాలతో పాటు ఎంఎన్ఆర్ఈ, ఆర్డీఎస్ఎస్ ప్రాజెక్టులపై ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి, నెడ్ క్యాప్ ఎండీ ఎం.కమలాకరబాబు, కలెక్టర్లు, ఈపీడీసీఎల్ అధికారులతో కలసి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈపీడీసీఎల్ చేపట్టిన ప్రాజెక్టుల పురోగతిని సీఎండీ పృథ్వీతేజ్ వివరించారు. నెలకు 10 మెగావాట్ల చొప్పున జరుగుతున్న ఇన్స్టాలేషన్లను రోజుకు ఒక మెగావాట్ సామర్థ్యానికి పెంచేలా పీఎం సూర్యఘర్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వివరించారు. ఈపీడీసీఎల్ పరిధిలో 2 లక్షల ఎస్సీ, ఎస్టీ గృహ విద్యుత్ వినియోగదారుల నుంచి వచ్చే ఏడాది మార్చిలోగా సమ్మతి తీసుకొని వారి ఇళ్లపై రెండు కిలోవాట్ల చొప్పున మొత్తం 400 మెగావాట్ల సామర్థ్యంతో రూఫ్ టాప్ సోలార్ పనులను పూర్తి చేయాలన్నారు. పీఎం కుసుమ్ పథకం కింద ఫీడర్ సోలరైజేషన్లో సంస్థ పరిధిలోని 8 జిల్లాల్లో 220 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్న సోలార్ ప్లాంట్లకు భూసేకరణను వేగవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్లు విజయ కె.ఎస్.రామసుందర రెడ్డి, స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎన్.ప్రభాకర రెడ్డి, ఈపీడీసీఎల్ డైరెక్టర్లు టి.వి.సూర్యప్రకాష్, టి.వనజ, ఎస్.హరిబాబు పాల్గొన్నారు. -
బ్యాగ్ మీద ఒట్టు.. నాణ్యత తీసికట్టు
యథేచ్ఛగా కలప తరలింపు కన్నాపురం అటవీ శాఖ రేంజ్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న అడవిలో చెట్లను కొట్టి కలపను అక్రమార్కులు యథేచ్ఛగా తరలిస్తున్నారు. 10లో uజవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతికి ప్రవేశ పరీక్ష 11 కేంద్రాల్లో శనివారం ఉదయం 11.30 గంటల నుంచి నిర్వహించనున్నారు. 10లో uశనివారం శ్రీ 13 శ్రీ డిసెంబర్ శ్రీ 2025ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత పథకాలను కాపీ కొట్టి, ఆయా పథకాలకు పేరు మార్చి అమలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన జగనన్న విద్యాకానుక పథకానికి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అని పేరు మార్చి అ మలు చేస్తోంది. అంతటి మహోన్నత వ్యక్తి పేరు పె ట్టిన ఈ పథకాన్ని చంద్రబాబు సర్కారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని అంతా భావించారు. అ యి తే ఆ పేరుకే తీవ్ర అవమానం కలిగేలా అమలు చే స్తున్నారంటూ విద్యారంగ నిపుణులు వాపోతున్నారు. మూడు నెలలకే మూలకు.. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకంలో పాఠశాలల విద్యార్థులకు అందించిన స్కూల్ బ్యాగుల నాణ్యతపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి అందించిన బ్యాగులు మూడు నెలలకే మూ లకు చేరాయి. ఏ మాత్రం నాణ్యత లేకపోవడంతో విద్యార్థుల చేతికి వచ్చిన కొద్ది రోజులకే చిరిగిపోయి, జిప్పులు ఊడిపోయి, హ్యాండిల్స్ తెగి పోయి అస్తవ్యస్తంగా మారాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చెల్లించిన ధర కంటే అధికంగా చెల్లించినా ఆ స్థాయి నాణ్యత లేని బ్యాగులు పంపిణీ చేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పెదవి విరుస్తున్నారు. కుట్టించుకున్నా పనిచేయని వైనం సాధారణంగా స్కూల్ బ్యాగులు, ట్రావెల్ బ్యా గులు కొత్తవి కొంటే కనీసం రెండేళ్లపాటు బాగుంటాయి. నాణ్యత తక్కువ ఉన్న బ్యాగులైతే కనీసం ఏడెనిమిది నెలల పాటు పనిచేస్తాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడాది అందించిన బ్యాగులు మాత్రం కేవలం మూడు నెలలకే పాడైపోయాయి. ఈ బ్యాగుల పేరుతో భారీ కుంభకోణమే జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాడైన బ్యాగులను కుట్టించుకుని వినియోగించుకుందామని ప్రయత్నించినా విద్యార్థులకు అది కూడా సాధ్యపడటం లేదు. కొందరు చిరిగిపోయిన ఈ బ్యాగులను కుట్టించుకుని వినియోగించడానికి ప్రయత్నించగా అవి చీకిపోవడంతో కొత్తగా వేయించుకున్న కుట్లు సైతం ఊడిపోవడం, బ్యాగులు చీకిపోవడంతో కుట్లు కూడా పడకపోవడంతో వాటిని దూరంగా విసిరేసి ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. కొందరు కొత్తవి కొని వాడుకుంటున్నారు. చిరిగిపోయిన స్కూల్ బ్యాగులతో పాఠశాలలకు వెళుతున్న విద్యార్థులు జిల్లాలో 2025–26 విద్యా సంవత్సరంలో 1,22,665 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేసినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వాస్తవానికి ఈ విద్యా సంవత్సరంలో జిల్లాలో ప్రభుత్వ రంగానికి సంబంధించిన యాజమాన్యాల్లోని పాఠశాలల్లో మొత్తం 1,19,397 మంది విద్యార్థులే చదువుతున్నారు. అయితే బ్యాగుల పంపిణీ కంటే విద్యార్థుల సంఖ్య 3,268 తక్కువగా ఉండటం గమనార్హం. చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థులకు పంపిణీ చేసిన స్కూల్ బ్యాగులు అస్సలు నాణ్యత లేవు. బ్యాగులను పంపిణీ చేసిన కాంట్రాక్టర్, వాటిని పర్యవేక్షించిన అధికారులు దీనికి బాధ్యత వహించాలి. వచ్చే విద్యా సంవత్సరంలో అయినా విద్యార్థులకు నాణ్యమైన బ్యాగులు పంపిణీ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. – కాకి నాని, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు బ్యాగుల నాణ్యత లేమిపై పూర్తిస్థాయి విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. అలాగే బ్యాగులు పంపిణీ చేసిన కాంట్రాక్టర్కు చెందిన సంస్థను వచ్చే ఏడాది బ్లాక్ లిస్టులో పెట్టి కాంట్రాక్టును ఆ సంస్థకు ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ విశ్వసనీయత ప్రశ్నార్థం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. – కె.లెనిన్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి స్కూల్ బ్యాగ్.. లేదు బాగు మూడు నెలలకే మూలకు చేరిన విద్యార్థి మిత్ర బ్యాగులు కుట్టించుకున్నా పనిచేయని వైనం జిల్లాలో 1,22,665 మందికి పంపిణీ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన బ్యాగులే దిక్కు 2024 కంటే ముందు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన బ్యాగులనే ఇప్పటికీ కొందరు విద్యార్థులు వి నియోగిస్తుండటం గమనార్హం. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత ఇచ్చిన బ్యాగులు చిరిగిపోవడంతో విద్యార్థులు తమ వద్ద ఉన్న గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన బ్యాగులను వినియోగించడం చూస్తుంటే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతటి నాణ్యమైన బ్యాగులు ఇచ్చారో అర్థం చేసుకోవచ్చని విద్యార్థి సంఘాల నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
పుంజుకుంటున్నాయ్
ద్వారకాతిరుమల/బుట్టాయగూడెం: సంక్రాంతి పందేలకు కోడి పుంజులు సిద్ధమవుతున్నాయి. బరుల్లో కత్తులు దూసేందుకు కఠోర సాధన చేస్తున్నాయి. ఈత, బలవర్ధక ఆహారం, ప్రత్యేక శిక్షణతో శిబిరాల్లో నువ్వా నేనా.. అన్నట్టు తలపడుతున్నా యి. పెద్ద పండగకు నెల రోజులు మాత్రమే సమ యం ఉండటంతో వీటి అమ్మకాలు ఊపందుకున్నాయి. నెమలి, డేగ, అబ్రాసు, సీతువ, కాకి, పర్ల, రసంగి, కెక్కిరాయి.. ఇలా పలు జాతుల పుంజులు ‘కోట్లా’టకు రెడీ అవుతున్నాయి. ద్వారకాతిరుమల మండలంలోని రాళ్లకుంట, కొమ్మర, మలసానికుంట, ద్వారకాతిరుమల, దొరసానిపాడు, పంగిడిగూడెం, గుణ్ణంపల్లి, బుట్టాయగూడెం ప్రాంతాల్లో పుంజుల శిబిరాలు ఉన్నాయి. మెలకువలతో శిక్షణ : పందెం పుంజుల్లో పలు రకాల జాతులు ఉన్నాయి. ముఖ్యంగా డేగ, కాకి, పూల, పర్ల, కెక్కిరాయి, సీతువ, రసంగి, నెమలి బరుల్లో తలపడుతుంటాయి. లక్షలాది రూ పాయలు చేతులు మారే పందేల్లో ఆషామాషీ కోళ్లు తలపడవు. వాటికి శక్తి, సామర్థ్యం ఎంతో అవసరం. అందుకే పందెం పుంజుకు బలవర్ధక ఆహారం అందిస్తున్నారు. ప్రత్యేక తర్ఫీదు ఇవ్వడంలో భాగంగా మెలకువలు నేర్పిస్తున్నారు. పోరాడే సత్తా ఉన్న పుంజులను ఎంపిక చేసి మరీ వాటికి శిక్షణ ఇస్తున్నారు. ఆహా ఏమి భోగం : బాదంపప్పు, జీడిపప్పు, మటన్ కై మా, తాటి బెల్లం నువ్వుల నూనె ఉండలు వంటి బలవర్ధక ఆహారాన్ని వుంజులకు అందిస్తున్నారు. వీటి పెంపకం రాజభోగాన్ని తలపిస్తుంది. ఉదయం 6 గంటలకు పందెం రాయుళ్లు వాటిని చెరువుల్లోను, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నీటి తొట్టెల్లో ఈదిస్తున్నారు. అలాగే మూలికలు, ఆకులతో మరిగించిన నీటిని వాటికి పోతపోస్తున్నారు. ఆ తర్వాత వాకింగ్ చేయించి కొద్దిసేపు ఎండలో కడుతున్నారు. 9 గంటలకు అల్పాహారంగా బాదంపప్పు, జీడిపప్పు, మటన్ కైమా పెడుతున్నారు. తాటి బెల్లాన్ని నువ్వుల నూనెతో కలిపి ఉండలుగా చేసి వాటికి తినిపిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు చోళ్లు, గంట్లు, వడ్లుతో కూడిన మేతను పెడుతున్నారు. వాటికి ఎండ తగలకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్లలో, చెట్ల కింద ఏర్పాటు చేసిన గాబుల్లో ఉంచుతున్నారు. సాయంత్రం 6 గంటలకు పొయ్యిపై అట్లపెనం ఉంచి, దా నిపై జల్లిన వేడి నీటిని పుంజుల దేహంపై పూస్తున్నారు. ఆ తర్వాత రెవిటాల్ పంటి బలవర్దక మందులు వేస్తున్నారు. ఇలా రోజుకు ఒక్కో పుంజుకు రూ.100 వరకు ఖర్చు చేస్తున్నారు. శిబిరాల వద్ద ఒక్కో పుంజును రూ.10 వేల నుంచి రూ.లక్షకు పైగా విక్రయిస్తున్నారు. శిక్షకులకు డిమాండ్ కోడి పుంజులకు శిక్షణ ఇచ్చే వారికి డిమాండ్ ఏర్పడింది. పుంజులకు శిక్షణ ఇచ్చే వారి ఎంపిక లోనూ పందెంరాయుళ్లు జాగ్రత్తలు పాటిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి శిక్షకులను తీసుకొచ్చి, పుంజులకు ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. కత్తులు నూరుతూ.. పందేల్లో పుంజులకు కత్తులు కట్టే వారి హవా మామూలుగా ఉండదు. బరిని బట్టి వారు ధరను నిర్ణయిస్తారు. అస్లీ పందేలు మి నహా మిగిలిన అన్ని పందేలు కత్తిలేనిదే జరగవు. అందుకే కత్తులు కట్టేవారు ఇప్పటినుంచే కత్తులను నూరేందుకు సిద్ధమవుతున్నారు. గెలుపు మాదే.. ఏటా పందేలు జరగనివ్వమని బీరాలు పలికే పోలీసులు చివరకు రాజకీయ నా యకుల సిఫార్సులతో పండుగ మూడు రోజులు చూసీచూడనట్టు వదిలేయడం పరిపాటిగా వస్తోంది. పందేల నిర్వహణ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ బాసులు పండుగ ముందు నెల రోజుల నుంచి చెప్పడం సర్వసాధారణంగా మారింది. ఇదంతా ఏటా జరిగే తంతేనని, పండుగ రోజుల్లో పందేలు మామూలే అని పందెంరాయుళ్లు ధీమా వ్యక్తం చేస్తూ.. పుంజులను బలంగా తయారు చేస్తున్నారు. కోట్లాటకు రెడీ కోడి పుంజులకు ప్రత్యేక శిక్షణ బలవర్ధక ఆహారం నెల రోజుల్లో బరిలోకి.. రూ.10 వేల నుంచి రూ.లక్షకు పైగా ధర -
సందడిగా హేలాపురి బాలోత్సవం
ఏలూరు (ఆర్ఆర్పేట): స్థానిక సిద్ధార్థ క్వెస్ట్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో హేలాపురి బాలోత్సవాలు శుక్రవారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. జా తీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మారుమూడి కోటేశ్వరరావు జాతీయ జెండాను, బాలోత్సవ పతాకాన్ని ఇటీవల డీఎస్సీ ఫలితాల్లో ఐదు సబ్జెక్టుల్లో ఉద్యోగాలు సాధించిన వేలేరుపాడుకి చెందిన నాగుల మంగరాణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు అధ్యక్షత వహించిన బాలోత్సవం అధ్యక్షుడు ఆలపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆరేళ్లుగా హేలాపురి బాలోత్సవాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. బాలల్లో సృజనను వెలికితీసేందుకు బాలోత్సవాలు దోహదపడతాయన్నారు. తొలిరోజు 350 పాఠశాలల నుంచి సుమారు 8 వేల మంది విద్యార్థులు తరలివచ్చారు. 53 విభాగాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీలు జరిగాయి. సిద్ధార్థ విద్యాసంస్థల చైర్మన్ కోనేరు సురేష్ బాబు, వీజీఎంవీఆర్ కృష్ణారావు, మహమ్మద్ అలీ, ఎమ్మెస్ కాంతారావు, హేలాపురి కళాకారుల సంఘం అధ్యక్షుడు పెదపాటి రామకృష్ణ, బాలోత్సవం ప్రధాన కార్యదర్శి దేవరకొండ వెంకటేశ్వర్లు, కార్యనిర్వాహక కార్యదర్శి గుడిపాటి నరసింహారావు, మేతర అజయ్బాబు తదితరులు పాల్గొన్నారు. -
కదం తొక్కిన అంగన్వాడీలు
ఏలూరు (టూటౌన్): అంగన్వాడీలకు కనీస వేత నం రూ.26 వేలు ఇవ్వాలని, సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్ప ర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఏలూరులో శుక్రవారం భారీ ప్రదర్శన నిర్వహించి కలెక్టరేట్ వద్ద మహాధర్నా చేశారు. జిల్లా నలుమూలల నుండి వందలాది మంది అంగన్వాడీలు తరలివచ్చారు. ఏలూరు జూట్ మిల్ సెంటర్ నుంచి ప్రదర్శనగా జెడ్పీ సెంటర్ మీదుగా కలెక్టరేట్కి చేరుకున్నారు. జిల్లా అధ్యక్షురాలు పి.భారతి అధ్యక్షతన జ రిగిన ధర్నాలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్. లింగరాజు, ప్రధాన కార్యదర్శి డీఎన్వీడీ ప్రసాద్ మాట్లాడుతూ ఆరేళ్లుగా అంగన్వాడీలకు వేతనాలు పెంచకపోవడం దారుణమన్నారు. ఎన్నికల ముందు అంగన్వాడీల సమ్మె సందర్భంగా పలు వాగ్దానాలు చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన త ర్వాత వాటిని పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. యాప్ల పేరుతో పనిభారం తగ్గించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, వేతనంతో కూడిన ప్రసూతి సెలవు ఇవ్వాలని డిమాండ్ చేశా రు. జిల్లా కార్యదర్శి టి.మాణిక్యం మాట్లాడారు. అనంతరం డీఆర్వోకి వినతిపత్రం అందజేశారు. ఇఫ్టూ ఆధ్వర్యంలో.. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు మూ డు సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా చే శారు. ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్, హెల్ప ర్స్ యూనియన్ (ఐఎఫ్టీయూ) రాష్ట్ర ఉపాధ్యక్షు రాలు బి.శిరోమణి, రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొ మ రం మారమ్మ, జిల్లా కన్వీనర్ పాల్గొని మాట్లాడారు. -
మెట్టలో అంతరిస్తున్న జీడి తోటలు
● సాగుకు రైతన్న నిరాసక్తత ● ఇప్పటికే వేలాది ఎకరాలు కనుమరుగు చింతలపూడి: ఒకప్పుడు మెట్ట ప్రాంతంలో వేల ఎకరాల్లో సాగయ్యే జీడి మామిడి తోటలు క్రమ,క్రమంగా కనుమరుగవుతున్నాయి. ఆశించినస్థాయిలో పంట చేతికి రాక, వచ్చినా సరైన గిట్టుబాటు ధర లభించకపోవడంతో పాటు మార్కెటింగ్ సౌకర్యం కూడా అంతంత మాత్రమే. ఈ ప్రాంతంలో పంట సాగుకు అనువైన వాతావరణం ఉన్నప్పటికీ రైతులకు సూచలను అందించే వారు కరువవ్వడంతో ఏటేటా విస్తీర్ణం తగ్గుముఖం పడుతుంది. ఏటా మెట్ట రైతులకు కోట్లాది రూపాయల రాబడిని ఆర్జించి పెట్టిన జీడి మామిడి తోటలు ప్రస్తుతం అంతరించిపోతున్నాయి. ఓ ఏడాది లాభం, రెండేళ్ల నష్టం వస్తుండడంతో పదేళ్లుగా జీడి తోటలను తొలగించి ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించారు. పెరిగిన భూగర్భ జలాల వినియోగం మెట్ట ప్రాంతంలో ఇటీవల ముఖ్యంగా పామాయిల్, మొక్కజొన్న, వేరుశెనగ, అరటి పంటలను ఎక్కువగా పండిస్తున్నారు. అదీకాక మెట్ట ప్రాంతంలో భూగర్భ జలాల వినియోగం పెరిగాక వాణిజ్య పంటల విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. చింతలపూడి సబ్ డివిజన్లో ఒకప్పుడు వేలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న జీడి తోటలు ప్రస్తుతం 2,000 హెక్టార్లకు చేరుకున్నాయి. గత కొన్నేళ్లు గా జీడి పిక్కల బస్తా రూ. 8 వేల నుంచి రూ.10 వేల వరకు పలుకుంది. ఈ ఏడాది ఇంత వరకు ధర అధికారికంగా వెల్లడి చేయలేదు. జీడి తోటల పెంపకం వల్ల రైతులకు రక,రకాలుగా ఆదాయం లభిస్తుంది. మన ప్రాంతంలో రైతులు జీడి పిక్కలను మాత్రమే సేకరిస్తారు. జీడి పండ్లను చెట్ల కిందే వదిలేస్తారు. అదే ఇతర రాష్ట్రాల్లో అయితే అక్కడి రైతులు పండ్లను కూడ సేకరించి ఆదాయం పొందుతున్నారు. వీటితో జామ్, పండ్ల రసాలు, తయారు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఏటా ఇక్కడి నుంచి కమీషన్ దారులు లారీల్లో జీడి పిక్కలను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. మొత్తం మీద మెట్లలో ఓ వెలుగు వెలిగిన జీడి తోటలు ప్రస్తుతం కనుమరుగైపోతున్నాయి. ప్రభుత్వం జీడితోటల పెంపకం చేపట్టే రైతులకు మరిన్ని ప్రోత్సాహకాలు అందించాలి. ముఖ్యంగా రైతులు పండించిన జీడి పిక్కలను ప్రభుత్వమే గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేయాలి. జీడి పరిశ్రమ అభివృద్ధి కోసం అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలి. – యర్రంశశెట్టి రామకృష్ణారావు, రైతు, నామవరం నాకు గ్రామంలో 4 ఎకరాల జీడిమామిడి తోట ఉండేది. జీడి పంటకు సరైన ప్రోత్సహం లేకపోవడం, ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి సస్యరక్షణ చర్యలు చేపట్టి సాగు చేస్తే పండిన పంటకు సరైన గిట్టుబాటు ధర ఉండటం లేదు. దీంతో జీడి తోటను తొలగించి పామాయిల్ తోట నాటాను. – మాగసాని గురుబ్రహ్మం, జీడి మామిడి రైతు, కనిపెడ -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పోరు
● 15న ఏలూరులో భారీ ర్యాలీ ● పార్టీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ ఏలూరు టౌన్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఏలూరు జిల్లావ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల పరిధిలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయటాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం విజయవంతమైంది. ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లా కేంద్రం నుంచి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం తాడేపల్లికి సంతకాల పత్రాలను అందజేసే కార్యక్రమాన్ని ఏలూరులో భారీగా చేపట్టేందుకు నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావుకు పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, దెందులూరు సమన్వయకర్త కొఠారు అబ్బయ్యచౌదరి, చింతలపూడి సమన్వయకర్త కంభం విజయరాజు, ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ వినతిపత్రం అందజేశారు. శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా అదనపు ఎస్పీని ప్రత్యేకంగా కలిసి ర్యాలీకి అనుమతి కోరారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ మాట్లాడుతూ ఈనెల 15న ఏలూరు జిల్లా కేంద్రం నుంచి తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయానికి సంతకాల పత్రాలను అందజేసే కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. ఏలూరులో చేపట్టే ర్యాలీకి జిల్లావ్యాప్తంగా పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరవుతారన్నారు. శాంతిభద్రతలకు విఘాతం లేకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా కార్యక్రమాన్ని నిర్వహించేలా పోలీస్ అధికారుల తమ వంతు చర్యలు చేపట్టాలని కోరామన్నారు. సభలు, సమావేశాలు ఏమీ లేకుండా ర్యాలీగా ఏలూరు శివా రు వరకూ పత్రాలతో కూడిన వాహనాన్ని పంపేలా ఏర్పాట్లు చేశామన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పార్టీ ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్బాబు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, రాష్ట్ర కార్యదర్శి దాసరి రమేష్, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్గురునాథ్, వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఘంటా మోహనరావు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు తేరా ఆనంద్, లీగల్ సెల్ ఏలూరు అధ్యక్షుడు ప్రత్తిపాటి తంబి, బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లిపాక సురేష్, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు మద్దాల ఫణి, నగర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, రెళ్ల రామకృష్ణ ఉన్నారు. -
అంతర్ జిల్లాల స్కూల్ గేమ్స్ ప్రారంభం
వీరవాసరం: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అంతర్ జిల్లాల 69వ స్కూల్ గేమ్స్ అండర్ 17 బాల బాలికల సాఫ్ట్బాల్ టోర్నమెంట్ కం సెలక్షన్స్ శుక్రవారం వీరవాసరం మద్దాల రామకృష్ణమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. పీఏసీ చైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు క్రీడాజ్యోతిని వెలిగించి క్రీడా పోటీలను ప్రారంభించారు. శాసనమండలి సభ్యులు కవురు శ్రీనివాస్ వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులను పరిచయం పరిచయం చేసుకున్నారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం, మానసిక ఉత్తేజం కలుగుతాయన్నారు. అనంతరం క్రీడా పోటీల నిర్వాహక కమిటీ సభ్యులను, క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు గుండా జయ ప్రకాష్ ఎంపీపీ వీరవల్లి దుర్గ భవాని, సర్పంచ్ చికిలే మంగతాయారు, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పిఎస్ఎన్ మల్లేశ్వరరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి బీవీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
పోలవరంలో సీఎస్ఎంఆర్ఎస్ బృందం పర్యటన
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో సీఎస్ఎంఆర్ఎస్ బృందం పర్యటిస్తోంది. కేంద్ర జలవనరుల శాఖ పరిధిలోని మట్టి, పదార్థాల పరిశోధనా కేంద్రం (సీఎస్ఎంఆర్ఎస్) శాస్త్రవేత్తలు హరేంద్ర ప్రకాష్, ఉదయ్ భాను చక్రబోర్తి, సిద్దార్థ్ పీ హెడవూ ప్రాజెక్ట్ ప్రాంతంలో శుక్రవారం పర్యటించారు. పోలవరం ప్రాజెక్టులోని ప్రధాన ఎర్త్ కం రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ నిర్మాణంలో వినియోగించే మట్టి, రాళ్లు, ఇతర పదార్థాలను ఈ బృందం పరిశీలించి పరీక్షిస్తుంది. ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉపయోగించే మట్టి నిల్వల నుంచి మట్టి నమూనాలను సేకరించి, వాటి లక్షణాల నిర్ధారణ కోసం ప్రయోగశాలలో ఈ బృందం పరీక్షలు నిర్వహిస్తుంది. ఈ బృందం గ్యాప్–1, 2 ప్రాంతాల్లో నాణ్యతా పరీక్షలు కూడా నిర్వహించనుంది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో వినియోగించే మట్టి, రాళ్లు, కంకర తదితరాలను వారు పరిశీలించి అక్కడికక్కడే పరీక్షించారు. కొంత పరిమాణాన్ని మరిన్ని పరీక్షల కోసం సేకరించారు. ఈ బృందం వెంట జలవనరుల శాఖ ఈఈలు డి.శ్రీనివాస్, బాలకృష్ణ, ఎంఈఐఎల్ జనరల్ మేనేజర్ ఎ.గంగాధర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ మురళి పమ్మి, మేనేజర్లు వెంకటేష్, గణపతిరావు ఉన్నారు. -
యథేచ్ఛగా అటవీ కలప తరలింపు
కొయ్యలగూడెం: అటవీ సంపదను అక్రమంగా తరలిస్తున్న అక్రమార్కులకు అద్దూఅదుపు లేకుండాపోతోంది. కన్నాపురం అటవీ శాఖ రేంజ్ కార్యాలయానికి ఎదురుగానే అక్రమంగా అడవిలో నుంచి నరికి వేసిన కలపను ట్రాక్టర్ పై శుక్రవారం అక్రమార్కుల యథేచ్ఛగా తరలించారు. ఇప్పటికే కన్నాపురం రేంజ్ పరిధిలోని రిజర్వ్ ఫారెస్ట్ యథేచ్చగా నరికి వేస్తుండడంతో అక్రమ కలప రవాణా నిరోధించాల్సిన అటవీశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో అటవీ సంపదను అక్రమంగా రాత్రులు మాత్రమే తరలించేవారు. అయితే అధికారుల నైరాస్యం, అలసత్వం, అవినీతి వల్ల పట్టపగలే ట్రక్కుల్లో అక్రమ కలప తరలిపోతున్నా పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. బ్యారన్ క్యూరింగ్ కోసం అటవీ సంపదను తరలిస్తున్నప్పటికీ నామమాత్రంగా కూడా కేసులు నమోదు చేయకపోవడం గమనార్హం. అక్రమార్కులు సందిట్లో సడేమియా అన్నట్లుగా రిజర్వ్ ఫారెస్ట్లోని విలువైన కలపను కూడా యంత్రాలతో నరికి గృహోపకరణాలకు విక్రయిస్తూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. కేవలం నాలుగు నెలల వ్యవధి కాలంలో ఒక్కో బీట్ పరిధిలో రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు అటవీ శాఖ అధికారులకు, సిబ్బందికి మామూళ్లు అందుతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు అక్రమ కలప నిరోధం, చెట్ల నరికివేతను అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
పార్క్ చేసిన కారుకు మంటలు
చింతలపూడి: పార్క్ చేసిన కారు నుంచి మంటలు చెలరేగిన ఘటన చింతలపూడి మోడల్ కాలనీలో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం మోడల్ కాలనీలో రోడ్డు పక్కన గత కొంతకాలంగా పార్కు చేసి ఉంచిన కారుకు మంటలు అంటుకున్నాయి. కారు ఉన్న ప్రదేశంలో చుట్టూ చెట్లు ముళ్ళ కంపలు పెరిగి ఉన్నాయి. పారిశుద్ధ్య సిబ్బంది వాటిని తొలగించి మంట పెట్టడంతో మంటలు కారుకు అంటుకుని ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఏలూరు (టూటౌన్): ఏలూరు అటవీ అభివృద్ధి సమాఖ్య సమావేశం చైర్మన్, ముఖ్య అటవీ సంరక్షణాధికారి బీఎన్ఎన్ మూర్తి అధ్యక్షతన జిల్లా అటవీశాఖ అధికారి కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టులో ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో ఉన్న విలువైన చెట్లను నరుకుటకు, వేలం వేసేందుకు, సదరు వేలం వేయగావచ్చిన ఆదాయం నుంచి 50 శాతం సొమ్ము వన సంరక్షణ సమితులకు ఇచ్చేందుకు, 50 శాతం సొమ్ము ప్లాంటేషన్ పెంచేందుకు తీర్మానం చేశారు. కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖాధికారి పీవీ సందీప్ రెడ్డి, అటవీశాఖ సిబ్బంది, వన సంరక్షణ సమితి సభ్యులు పాల్గొన్నారు. నరసాపురం రూరల్: మండలంలోని పేరుపాలెం సౌత్ గ్రామంలో కొబ్బరితోటలో ఈనులు చీరుకుంటున్న వృద్ధురాలిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి యత్నించిన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు గురువారం మధ్యాహ్న సమయంలో గ్రామంలోని కొబ్బరితోటలో ఈనులు తీసుకుంటుండగా ఆ ప్రాంతంలో సంచరిస్తున్న గుబ్బల పెద్దిరాజు (30) అనే వ్యక్తి ఆమె మూతికొరకడంతో పాటు శరీరం, వంటిపై గాయాలు చేసి లైంగికదాడికి యత్నించాడు. వృద్ధురాలు కేకలు వేయడంతో స్థానికులు వచ్చి పెద్దిరాజును పోలీసులకు అప్పగించారు. బాధితురాలిని వైద్యం నిమిత్తం నరసాపురం ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం చేయిస్తున్నారు. ఆమె నుంచి మొగల్తూరు ఎస్సై నాగలక్ష్మి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై విలేకరులకు తెలిపారు. ఉంగుటూరు: మండలంలోని గొల్లగూడెం పంచాయతీ పరిధిలో తిమ్మయ్యపాలెంలో కోర్లేపర్ల శ్రీను అనే వ్యక్తికి చెందిన పందెం కోళ్ల పెంపకం స్థావరంలో గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం రాత్రి పందెం చోరీ చేశారు. కోళ్ల పెంపకం ప్రాంతం వద్ద ఉన్న కాపలాదారుడిని బెదిరించి సుమారు 45 కోళ్లను పట్టుకుపోయారు. వీటి విలువ సుమారు రూ.6 లక్షలు వరకు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయం పై చేబ్రోలు ఎస్సై సూర్యభగవానుని ప్రశ్నించగా సుమారు 12 కోళ్లు మాత్రమే పోయాయని,కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పారిజాతగిరిలో ధనుర్మాస ఉత్సవాలు జంగారెడ్డిగూడెం: గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానంలో డిసెంబర్ 16వ తేదీ నుంచి 2026 సంవత్సరం జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాస మహోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వహణ అధికారి కలగర శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ధనుర్మాసంలో అనేక విశేష కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ 30వ తేదీ మంగళవారం ఉదయం 5 గంటల నుంచి వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం, 2026 జనవరి 8వ తేదీ గురువారం ఉదయం 6.30 గంటలకు దీపోత్సవం, జనవరి 11వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు కూడా మహోత్సవం, విశేష ప్రసాద నివేదన, జనవరి 14వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు గోదా కల్యాణం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. -
పల్స్పోలియోకు పటిష్ట ఏర్పాట్లు
ఈవీఎం గోడౌన్ తనిఖీ కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగు మెషీన్ల గోడౌన్ను గురువారం కలెక్టరు కె.వెట్రిసెల్వి తనిఖీ చేశారు. భధ్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఏలూరు (మెట్రో): జిల్లాలో ఈనెల 21 నుంచి 23 వరకు జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలనీ కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో గురువారం పల్స్ పోలియో కార్యక్రమం ఏర్పాట్లపై టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులు 2 లక్షలకు పైగా ఉన్నారని, అవసరమైన వాక్సిన్ డోసులు సిద్ధం చేయాలన్నారు. ఈనెల 21న 1,707 వ్యాక్సినేషన్ కేంద్రాలు, 72 మొబైల్ కేంద్రాల ద్వారా పల్స్ పోలియో వాక్సిన్ అందించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద కూడా కేంద్రాలు ఏర్పాటుచేసి పోలియో వాక్సిన్ వేయాలన్నారు. అనంతరం 22, 23 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి వాక్సిన్ తీసుకొని చిన్నారులను గుర్తించి పోలియో వాక్సిన్ అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. పల్స్ పోలియోపై ముద్రించిన వాల్ పోస్టర్లను కలెక్టర్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ డా.పీజే అమృతం, డీసీహెచ్ఎస్ డా.పాల్ సతీష్, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ భీమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చర్యలు తీసుకుంటున్నాం పెన్షన్లు, రేషన్ పంపిణీ, అన్నా క్యాంటీన్ల నిర్వహణ, రైతులకు, ఆసుపత్రుల్లో రోగులకు సేవలు, తదితర అంశాల్లో ప్రజల సంతృప్తి స్థాయిని మరింత పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్కు తెలియజేశారు. గరువారం ఏపీ సచివాలయంలోని సీఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లాల కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. -
మెట్టలో మామిడి పూతకు మంచు దెబ్బ
చింతలపూడి: వాతావరణ ప్రతికూల ప్రభావంతో ఏటా జిల్లాలోని మామిడి రైతులకు మామిడి పూత, పిందెలను రక్షించుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని వాపోతున్నారు. సంవత్సరం పొడవునా తోటల్లో మనం చేపట్టే యాజమాన్య చర్యలన్నీ ఒక ఎత్తయితే ఇప్పుడు పూత సమయంలో పాటించే యాజమాన్యం ఒక ఎత్తు. పూత సమయంలో తోటల్లో పురుగులు, తెగుళ్లు ఆశించకుండా రైతులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితేనే మంచి దిగుబడులు సాధించవచ్చని ఉద్యానవన శాఖాధికారులు చెబుతున్నారు. సాధారణంగా 25–30 డిగ్రీల సెంటీ గ్రేడ్ ఉష్ణోగ్రత, పొడి వాతావరణం మామిడి తోటలకు మెరుగ్గా ఉంటుంది. ఈ దశలో పూత ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో మామిడి తోటల విస్తీర్ణంలో కృష్ణా జిల్లా తరువాత చింతలపూడి ప్రాంతం ద్వితీయ స్థానంలో నిలుస్తుంది. ఈ ఏడాది మెట్ట ప్రాంతంలో మామిడి తోటలు చాలా చోట్ల పూతలు వస్తున్నాయి. అయితే గత రెండు వారాలుగా విపరీతమైన మంచు కురుస్తుండటంతో పూత పూసిన ప్రాంతంలో మామిడి పంట మంచు దెబ్బకు విలవిల్లాడుతూంది. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. సంవత్సరం అంతా సస్యరక్షణ చేపట్టి పంటను కాపాడుకుంటూ వస్తుంటే మంచు కారణంగా పూత మాడిపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూతను కాపాడుకోవాలి మామిడికి వచ్చిన పూతను కాపాడుకోవడానికి రైతులు ఇప్పటి నుంచీ సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలని అధికారులు సూచిస్తున్నారు. 5 గ్రాముల పొటాషియం నైట్రేట్ లేదా 50 గ్రాముల యూరియా ఒక లీటరు నీటిలో కలిపి చెట్లకు స్ప్రే చేస్తే ఫలితం ఉంటుందని ఉద్యానవన అధికారిణి ఎండి షాఫియ ఫర్హీన్ తెలిపారు. ఈ సీజన్లో మామిడి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. తేనె మంచు పురుగు నివారణ ఇలా ప్రస్తుతం మామిడి పూత వచ్చే సమయంలో తేనె మంచు పురుగు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంది. లేత పూమొగ్గలు ప్రారంభంలో తేనె మంచు పురుగు ఆసిస్తుంది. దీని నివారణకు ఇమిడాక్లోప్రిడ్(కాన్ఫిడార్) ద్రావణం 10 లీటర్ల నీటికి 3 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేయాలి. లేదా ధయో మిటాక్జిమ్ 10 లీటర్ల నీటికి 3 గ్రాములు కలిపి పిచికారీ చేసినట్లయితే పురుగు ఉధృతి తగ్గుతుంది. తామర పురుగులు ఇవి కొత్త చిగురు, పుష్ప గుచ్ఛాలు, పిందెలపైన అసంఖ్యాకంగా చేరి గోకి రసం పీలుస్తాయి. వీటి నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీ లీటర్లు, లేదా 03 మిల్లీ లీటర్ల ఇమిడా క్లోప్రిడ్ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. బూడిద తెగులు చల్లని రాత్రులు, పగటి వాతావరణంలో పూత, పిందెలపై తెల్లని పొడిలాంటి బూజు ఏర్పడుతుంది. ఈ శిలీంద్రం ఆశించడం వల్ల పూత, పిందెలు రాలిపోతాయి. వీటి నివారణకు నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా ట్రైడీమార్ఫ్ 1 మిల్లీ లీటర్ లేదా డైనోకాప్ 1 మిల్లీ లీటర్, లేదా హెక్సాకోనజోల్ 2 మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చే యడం వల్ల బూడిద తెగులును నివారించవచ్చు . మెట్ట ప్రాంతంలో పూతమీద ఉన్న లేత మామిడి తోట ఎండీ షాఫియ ఫర్హీన్, ఉద్యానవన శాఖాధికారిణి -
లస్కర్లకు బకాయి వేతనాలు చెల్లించాలి
పెనుగొండ: జలవనరుల శాఖలో గోదావరి కుడి ఏటిగట్టుపై లస్కర్లకు ఏడు నెలలుగా జీతాలు రాక ఇబ్బందులకు గురవతున్నారని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం సిద్ధాంతం సెక్షన్ పరిధిలోని లస్కర్లతో మాట్లాడి వారి సమస్యలపై ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ వరదలు వస్తే నిద్రాహారాలు మాని ఏటిగట్టుపై కాపలా కాసే లస్కర్లకు ప్రతినెలా జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఏడాదిలో 10 నెలలకు మాత్రమే జీతాలు చెల్లించడం దారుణమన్నారు. సిద్ధాంతంలో అయిదుగురు లస్కర్లకుగాను నలుగురితోనే కాలం గడుతున్నారన్నారు. లస్కర్లకు పనిభారం తగ్గించాలని, కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ నాయకులు కే.రత్నంరాజు, లస్కర్లు కడలి చింతారావు, డి.పెదకాపు, జాస్తి ప్రభాకర్, వై.మాధవ రాయుడు పాల్గొన్నారు. -
ఏఓ శ్రీనివాస్పై ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు
పెనుగొండ: విచారణల పేరుతో రికార్డులను దౌర్జన్యంగా డీఎల్పీఓ కార్యాలయానికి తీసుకెళ్లి దళిత సర్పంచ్లను వేధిస్తున్న ఏఓ శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలని కొడమంచిలి సర్పంచ్ సుంకర సీతారామ్, వైఎస్సార్ సీపీ నాయకుడు కోట వెంకటేశ్వరరావులు ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేశారు. గురువారం విజయవాడలోని ఎస్సీ కమిషన్ రాష్ట్ర కార్యదర్శికి ఫిర్యాదును అందించారు. పంచాయతీ రికార్డులను, ఓచర్లను తీసుకెళ్లి ఓచర్లు తారుమారు చేసి వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా సీతారామ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో దళిత సర్పంచ్లను టార్గేట్ చేస్తూ రాజకీయ కక్ష సాధింపులకు తెరలేపారన్నారు. టీడీపీ నాయకుడు రాంబాబు చేస్తున్న ఇసుక అక్రమ దందాపై అధికారులకు ఫిర్యాదు చేయడంతో పంచాయతీ అధికారులను బెదిరించి కొడమంచిలి, ఆచంట, పండిత విల్లూరు, జగన్నాథపురం, మార్టేరు తదితర పంచాయతీలపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాజకీయంగా ఎదుర్కోలేకే రికార్డులు తారుమారు చేసి వేధింపులకు గురిచేస్తున్న మాజీ సర్పంచ్ సీహెచ్ శ్రీను, బి.వెంకట రమణ, రాంబాబు, ఏఓ శ్రీనివాసరావులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యలమంచిలి: మండలంలోని ఏనుగువానిలంక గ్రామానికి చెందిన మందా ఏసురాజు (41) ఈ నెల 9వ తేదీ సాయంత్రం అతని స్నేహితుడు పాలపర్తి సుధాకర్ చించినాడ వద్ద వశిష్ట గోదావరి నదికి స్నానానికి వెళ్లారు. ప్రమాదవశాత్తూ ఏసురాజు నీటిలో మునిగిపోయాడు. వెంటనే సుధాకర్ ఇంటికి వెళ్లి ఏసురాజు కుటుంబ సభ్యులకు ప్రమాద విషయం తెలిపాడు. దీంతో ఏసురాజు భార్య స్వరూపరాణి పోలీసులకు ఫిర్యాదు అప్పటి నుంచి గాలించగా గురువారం చించినాడ వద్ద వశిష్ట గోదావరి నదిలో నిర్మాణంలో ఉన్న రైలు వంతెన సమీపంలో ఏసురాజు మృతదేహం పైకి తేలింది. దీంతో మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చి పంచనామా, పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్సై కర్ణీడి గుర్రయ్య తెలిపారు. ఆర్అండ్ఆర్ కాలనీలో కార్డెన్ సెర్చ్ పోలవరం రూరల్: పోలవరం సర్కిల్ పరిధిలోని పోలవరం మండలంలోని దేవరగొంది ఆర్అండ్ఆర్ కాలనీ వద్ద పోలీసులు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సీఐ బాల సురేష్బాబు, ఎస్సై ఎస్ఎస్ పవన్కుమార్ వాహనాలను తనిఖీ చేశారు. అపరిచిత వ్యక్తుల గురించి విచారణ, పరారీలో ఉన్న నేరస్తుల జాడ తెలుసుకోవడంతో పాటు మోటార్ సైకిల్ దొంగతనం నేరాలు, ఇతర ఇంటి నేరాల్లో పోగొట్టుకున్న వస్తువుల ఆచూకీ కనుగొనేందుకు కార్యక్రమం చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
రిజర్వు ఫారెస్ట్లో విధ్వంసం
శురకవారం శ్రీ 12 శ్రీ డిసెంబర్ శ్రీ 2025సాక్షి ప్రతినిధి, ఏలూరు: రిజర్వ్ ఫారెస్ట్లో పచ్చని విధ్వంసం ప్రారంభమైంది. అడ్డగోలుగా కలపను నరికి బహిరంగంగానే అక్రమ రవాణా చేశారు. అటవీ శాఖ బీట్ మీదుగానే నిత్యం పదుల సంఖ్యలో వాహనాలు అడవి నుంచి కలప లోడుతో వస్తున్నాయి. గిరిజనులను కూలీలుగా మార్చి కొందరు గిరిజనేతరులు తెగబడిన ఈ విధ్వంసానికి అటవీశాఖా ఽఅధికారులు కూడా సహకరం అందిస్తుండటంతో 20 ఏళ్ల పైబడిన చెట్లు నేలకొరుగుతున్నాయి. పొగాకు బేరన్ క్యూరింగ్ కోసం ఈ కలపను వినియోగించడం, స్థానికంగా మార్కెట్ ఉండటంతో అక్రమార్కులు అందరికీ ఇవ్వాల్సిందిచ్చి బహిరంగంగా విక్రయిస్తున్నారు. జిల్లాలో పోలవరం నియోజకవర్గంలో ఏజెన్సీ ప్రాంతం అధికంగా ఉంటుంది. పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల వెంబడి వేలాది ఎకరాలు అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ప్రధానంగా పోలవరంలో అభయారణ్యం ఉండగా మిగిలిన రెండు మండలాల్లో రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. ప్రధానంగా కన్నాపురం రేంజ్లో 17 వేల హెక్టార్ల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం ఉంది. ఈ క్రమంలో సంక్రాంతి నుంచి పొగాకు కోతలు పూర్తయితే బ్యారన్లల్లో క్యూరింగ్ ప్రక్రియ నిర్వహిస్తుంటారు. దీనికి అత్యధికంగా మారుజాతి కలపను వినియోగిస్తుంటారు. దీంతో కొందరు గిరజనేతరులు గిరిజనులను కూలీలుగా మార్చి అటవీ ప్రాంతంలో 20 నుంచి 25 సంవత్సరాల మారుజాతి చెట్లను ఎంపిక చేసి మెషీన్లతో నేలకూల్చి కలపను అక్రమంగా తరలిస్తున్నారు. ఒక్కొక్క లోడ్ కలప రూ.4 నుంచి 6 వేల ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. కన్నాపురం రిజర్వ్ ఫారెస్ట్ రేంజ్లో మారుజాతి, వేగిస, సండ్ర, మద్ది, బండారు తదితర రకాల కలప వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. వందేళ్ల పైబడిన వృక్షాలు కూడా వేల సంఖ్యలో ఉన్నాయి. ఇవి కాకుండా అటవీశాఖ ప్రతి ఏటా విత్తనాలను సీజన్లో చల్లుతుంటారు. హోమ్ ఫర్నీచర్కు ఈ కలపను వినియోగిస్తుండటంతో అధిక డిమాండ్ ఉంటుంది. భారీ వృక్షాల మానులను ఫర్నీచర్కు, మిగిలిన మొత్తాన్ని క్యూరింగ్కు వినియోగిస్తుంటారు. అదే 25 ఏళ్ల పైబడిన మానులకు మంచి డిమాండ్ కూడా ఉంది. ఈ క్రమంలో బుట్టాయగూడెం, కొయ్యలగూడెం, గోపాలపురం, జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెంలో పొగాకు సాగు విస్తీర్ణం అధికంగా ఉంటుంది. ఒక్కొక్క బేరన్లో పొగాకు కాల్చడానికి 5 నుంచి 6 టన్నుల కలపను వినియోగిస్తుంటారు. ప్రతి సీజన్లో ఇదే తరహాలో అడవి నుంచి 500 నుంచి 800 టన్నులను అధికారకంగా నరికి విక్రయిస్తుంటారు. ఈ నెల 8న కన్నాపురం అటవీ శాఖ రేంజ్లోని కోపల్లె బీట్లో 3 హెక్టార్లలో అడవిలో నరికేసి ఉన్న కలప చెట్ల మొదళ్లను కొట్టేసి..అటవీ శాఖ అధికారులకు తెలిసే అక్రమ నరికివేతలు, రవాణా జరుగుతున్నాయనేది బహిరంగ రహాస్యం. ప్రధానంగా కన్నాపురం రేంజ్లో కన్నాపురం మెయిన్ రోడ్డు వద్దే ఫారెస్ట్ బీట్, అలాగే దొండపూడి వద్ద మరో బీట్ ఉంటుంది. నిత్యం పదుల సంఖ్యలో వాహనాలు ఈ బీట్ల మీదుగానే రాకపోకలు సాగిస్తున్నాయి. రెండు రోజుల క్రితం ఒకే రోజు 40 ట్రక్కుల రిజర్వ్ ఫారెస్ట్ కలప యుద్ధ ప్రాతిపదికన తరలించారు. దీనిలో కోపల్లె బీట్ ఏరియాలో 3 హెక్టార్ల విస్తీర్ణంలో చెట్లను మెషీన్లతో నేలకూల్చి 40 ట్రక్కుల్లో తరలించినా కనీసం ఫారెస్ట్ అధికారులు తొంగిచూడని పరిస్థితి. మరోవైపు పొగాకు బేరన్లకు కలప రవాణా చేసే అక్రమార్కుల నుంచి భారీ ప్యాకేజీలు అటవీ శాఖాధికారులకు అందుతాయనే విమర్శ ఉంది. స్థానిక అధికారులు మొదలుకొని ఒక స్థాయి అధికారి వరకు అందరికీ మాముళ్లు ఉంటాయనే ఆరోపణలున్నాయి. దీంతో పొగాకు బేరన్ సీజన్ సమయంలో రెండు నెలల పాటు ఏం జరిగినా అన్నీ తెలిసి కూడా పట్టించుకోరనే అపవాదు ఉంది. కార్యాలయం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ కేసులు గత సంవత్సరం నమోదు కావడం గమనార్హం. కన్నాపురం అటవీ రేంజ్లో అడ్డగోలుగా కలప నరికివేత పొగాకు బేరన్ క్యూరింగ్ పనులకు కలప అక్రమ రవాణా ఫారెస్ట్ బీట్ మీదుగా నిత్యం పదుల సంఖ్యలో వాహనాలు అడ్డగోలుగా దందా కొనసాగిస్తున్న మాఫియా అటవీశాఖ అధికారులకు తెలిసినా పట్టించుకోని వైనం -
జీసీసీ డిపోల్లో అమ్మకాలు పెరగాలి
బుట్టాయగూడెం: జీసీసీ సేల్స్ డిపోల్లో ఏడాదికి ఇచ్చిన టార్గెట్ను సేల్స్మెన్లు మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ఐటీడీఏ పీఓ కె.రాములు నాయక్ అన్నారు. మండలంలోని కేఆర్పురం జీసీసీ కార్యాలయాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా జీసీసీ పరిధిలో ఉన్న 26 మంది సేల్స్మెన్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పీఓ మాట్లాడుతూ అటవీప్రాంతంలో గిరిజనులు సేకరించిన ఉత్పత్తులను తప్పనిసరిగా కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. నిత్యవసర సరుకులు, గిరిజన ఉత్పత్తుల అమ్మకాలను కూడా పెంచాలని ఆదేశించారు. జీసీసీ సీనియర్ మేనేజర్ చెరు కూరి రాజయోగి మాట్లాడుతూ జీసీసీ తయారు చేసిన ఉత్పత్తులకు సంబంధించి కొత్త రకం స్టిక్కర్లతో కూడిన ప్యాకింగ్తో విక్రయాలు నిర్వహిస్తామని, ప్రజలు గమనించాలని కోరారు. -
కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు రూ.26 వేలు కనీస వేతనం అందించాలి. ఈఎస్ఐ, పీఎఫ్, ఉద్యోగ భద్రత, గ్రాట్యూటీ అందించాలి. అంగన్వాడీలపై రాజకీయ వేధింపులను తక్షణం నిలుపుదల చేయాలి. – డీఎన్వీడి ప్రసాద్, ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి, సీఐటీయూ అంగన్వాడీలకు భారంగా మారిన ఎఫ్ఆర్ఎస్ (ముఖ కవళికల గుర్తింపు) విధానాన్ని తక్షణం రద్దుచేయాలి. నాణ్యమైన సెల్ ఫోన్లు, నెట్ కనెక్షన్లు అందించాలి. ఇతర కారణాల వల్ల రిజిస్టర్ కాని లబ్ధిదారులకు మాన్యూవల్గా రేషన్ అందించేందుకు అవకాశం కల్పించాలి. – పి.సుజాత, అధ్యక్షురాలు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అంగన్వాడీల వేతనాలను పీఆర్సీకి అనుసంధానం చేయాలి. అంగన్వాడీల సమస్యల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం తగదు. కేంద్రంతో మాట్లాడి ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయించాలి. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలి. – పి.భారతి, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఇటీవల గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా అంగన్వాడీల వేతనాలు పెంపుదల చేయాలి. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి. తల్లికి వందనం పథకం అంగన్వాడీలకు అమలు చేయాలి. మినీ సెంటర్లను మెయిన్సెంటర్లుగా మార్చాలి. – టి.మాణిక్యం, కోశాధికారి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ -
ఉత్సాహంగా లేగ దూడల అందాల పోటీలు
వీరవాసరం: తరచూ శీతకాలంలో చూడు కట్టని పశువులకు ఉచితంగా చికిత్స అందిస్తామని జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డాక్టర్ ఆర్.కోటలింగరాజు అన్నారు. గురువారం కొణితివాడ వెటర్నరీ పశువుల ఆసుపత్రి వద్ద రాష్ట్ర గోకుల్ మిషన్ క్యాంపులో కేంద్ర ,రాష్ట్ర పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రస్తుగణభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా చూడు కట్టని పశువులకు గర్భస్థ పరీక్షలు, లేగ దూడల అందాల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా కోటలింగరాజు మాట్లాడుతూ పశువులు దీర్ఘకాలికంగా చూడు కట్టని, గర్భస్వావంతో బాధపడే పశువులకు ఉచితంగా చికిత్స అందిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా లేగ దూడల పోషణ సౌకర్యం , ఎదుగుదల ఉన్న దూడలకు అందాల పోటీలు నిర్వహించి గెలుపొందిన యజమానికి బహుమతులు ఇచ్చి ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. వెటర్నరీ అధికారి బి.వరలక్ష్మి మాట్లాడుతూ 40 పశువులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి యజమానులకు మందులను అందించినట్లు తెలిపారు. లేగ దూడల ప్రదర్శనలో మొదటి బహుమతి నాగరాజు, రెండో బహుమతి వాడపల్లి సుబ్బరాజు, మూడో బహుమతి యరకరాజు సత్య హరిహర రాజు పొందారు. కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ డిప్యూటీ డైరెక్టర్లు ఎల్కే సుధాకర్, డాక్టర్ జావన్ హుస్సేన్, పెనుమంట్ర వెటర్నరీ డాక్టర్ జి.రవికాంత్ పాల్గొన్నారు. -
ఏలూరులో పోలీస్ ఫుట్ పెట్రోలింగ్
ఏలూరు టౌన్: ఏలూరులో ట్రాఫిక్ సమస్యలపై ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ స్వయంగా రంగంలోకి దిగారు. నగరంలోని ప్రధాన రోడ్లపై నడుచుకుంటూ వెళుతూ ట్రాఫిక్ పరిస్థితులను పరిశీలించారు. ప్రధాన రద్దీ ప్రాంతాలైన ఫైర్స్టేషన్ సెంటర్, ఆర్ఆర్పేట, కొత్తబస్టాండ్ ప్రాంతాలను డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్తో కలిసి ఆయన పర్యవేక్షించారు. పుట్పాత్లపై వ్యాపారులను సైతం ఆరా తీశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చేపట్టాల్సిన చర్యలపై ఆయన పోలీస్ అధికారులకు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఇష్టారాజ్యంగా రోడ్లపై మోటారు సైకిళ్లు పెట్టడం, వ్యాపారాలు సాగిస్తే తీవ్ర ఇబ్బందులు తప్పవనే హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ శివకిషోర్ మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు భద్రతా భావం పెంపొందించటం, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేకంగా పోలీస్ ఫుట్పెట్రోలింగ్ చేపట్టినట్లు చెప్పారు. రద్దీ ప్రాంతాలు, స్కూల్స్, కాలేజీలు, బస్టాండ్లు వంటి ప్రాంతాల్లోనూ నిఘా మరింత పెంచుతామని ఎస్పీ స్పష్టం చేశారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీస్ ఫుట్పెట్రోలింగ్లో ఏలూరు ట్రాఫిక్ సీఐ లక్ష్మణబాబు, త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది ఉన్నారు. స్వయంగా రంగంలోకి ఎస్పీ శివకిషోర్ -
13న జాతీయ లోక్ అదాలత్
ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈనెల 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. జాతీయ లోక్ అదాలత్ నందు రాజీయోగ్యమైన క్రిమినల్ కేసులు, సివిల్ తగాదాలు, కుటుంబ వివాదాల కేసులు, వాహన ప్రమాద బీమా కేసులు, బ్యాంకు లావాదేవీలు తదితర కేసులను పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 13,800 కేసులను రాజీయోగ్యమైనవిగా గుర్తించడం జరిగిందని, అలాగే 33 బెంచీలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఉపాధ్యాయులపై అదనపు పని భారం తగ్గించడానికి రెండో శనివారం ఈ నెల 13వ తేదీన పాఠశాలలకు సెలవు దినంగా ప్రకటించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరారు. ఈమేరకు గురువారం జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మకు వినతిపత్రం సమర్పించారు. విద్యా క్యాలెండర్ ప్రకారం 220 పనిదినాలకు మించి పనిచేసిన పాఠశాలలకు మాత్రమే ఈ సెలవును అనుమతించాలని కోరారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి, ఫ్యాప్టో చైర్మన్ జీ.మోహన్, సెక్రటరీ జనరల్ ఎం.ఆదినారాయణ, కో–చైర్మన్ జీ. వెంకటేశ్వరరావు, డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఆర్.రవికుమార్, ప్రధానోపాధ్యాయుల సంఘం ప్రధాన కార్యదర్శి జే.రవీంద్ర, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఏలూరు (టూటౌన్): పట్టణ ఎస్హెచ్జీ కుటుంబాల్లోని నిరుద్యోగ యువత కోసం శుక్రవారం జాబ్మేళా నిర్వహించనున్నట్టు మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ పి.మాధవి గురువారం ప్రకటనలో తెలిపారు. ఏలూరు సీఆర్ రెడ్డి అటానమస్ కాలేజ్ ఆడిటోరియంలో ఉదయం 11 గంటలకు జాబ్మేళా ప్రారంభమవుతుందన్నారు. జంగారెడ్డిగూడెం, చింతలపూడి, నూజివీడు, ఏలూరు మునిసిపాలిటీల నుంచి యువత హాజరుకానున్నారని, 15 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటున్నారన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు రెండవ రోజు గురువారం 327 మంది అభ్యర్థులు హాజరయ్యారు. నగరంలోని సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో ఉదయం జరిగిన పరీక్షకు 176 మందికి గాను 166 మంది హాజరు కాగా, మధ్యాహ్నం నుంచి జరిగిన పరీక్షకు 174 మందికి గాను 161 మంది హాజరయ్యారు. పరీక్షల్లో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులూ నమోదు కాలేదని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు. ‘పశ్చిమ’లో 91.98 శాతం హాజరు భీమవరం: జిల్లాలో అయిదు పరీక్షా కేంద్రాల్లో గురువారం నిర్వహించిన ఏపీ టెట్ పరీక్షకు 91.98 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి ఇ నారాయణ తెలిపారు. ఉదయం పరీక్షకు 506 మందికిగాను 466 మంది హాజరుకాగా, మధ్యాహ్నం పరీక్షకు 541 మందికి 497 మంది హాజరయ్యారన్నారు. ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదుకాలేదని డీఈవో తెలిపారు. కై కలూరు: కై కలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన నాయకులు బుసనబోయిన వెంకటేశ్వరరావు(బీవీ రావు), దాసరి అబ్రహం లింకన్ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఇరువురు నేతలను సస్పెండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ సిఫార్సు మేరకు పార్టీ అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. -
మోదెల గ్రామాన్ని సందర్శించిన అధికారులు
వేలేరుపాడు: మండలంలో అత్యంత మారుమూల అటవీ ప్రాంత గ్రామమైన మోదెల గ్రామాన్ని అధికారులు గురువారం సందర్శించారు. ఈ గ్రామంలో ఇటీవల జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు పర్యటించారు. ఈ సందర్భంగా పలు సమస్యలు గ్రామ కొండరెడ్లు ఎస్టీ కమిషన్ సభ్యులకు వివరించారు. దీనిపై స్పందించిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు గ్రామంలో 18 ఇళ్ల కాలనీలను మంజూరు చేయించారు. బీఎస్ఎన్ఎల్ సెల్ ఫోన్ టవర్ను మంజూరు చేశారు. ఈ గ్రామం రిజర్వ్ ఫాస్ట్లో ఉండడంతో హౌసింగ్ కాలనీ నిర్మాణానికి ఆటకంగా ఉంది. దీంతో గ్రామాన్ని కుక్కునూరు రేంజ్ ఆఫీసర్ కె.కృష్ణకుమారి, సెక్షన్ ఆఫీసర్ పెరుమళ్ల, వేలేరుపాడు ఎంపీడీవో శ్రీహరి, విద్యుత్ శాఖ శ్రీనివాస్ వర్మ, డిప్యూటీ తహసీల్దార్ సురేంద్రకుమార్ తదితరులు గ్రామంలో పర్యటించారు. గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని ఎంపీడీవో శ్రీహరి పరిశీలించారు. -
అంగన్వాడీల పోరుబాట
ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలు పోరు బాట పట్టారు. అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గతంలో ఏలూరు కలెక్టరేట్, ఐసీడీఎస్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేపట్టారు. అయినా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వీరి సమస్యల పరిష్కారానికి ముందుకు రాకపోవడంతో మరోసారి తమ గొంతు వినిపించేందుకు సిద్ధమయ్యారు. దీనిలో భాగంగా ఈ నెల 12న ఏలూరు కలెక్టరేట్ వద్ద మూడు కార్మిక సంఘాలు సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ధర్నాకు దిగుతున్నారు. అంగన్వాడీల జీతాలను పీఆర్సీకి అనుసంధానం చేయాలని, ఇటీవల గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా జీతాలను పెంచాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల హామీలను అమలు చేయాలి ఎన్నికల ముందు అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని వాగ్దానం చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా వాటి ఊసే ఎత్తడం లేదని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు. చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న అంగన్వాడీలకు అమ్మకు వందనం, సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎఫ్ఆర్ఎస్(ముఖ గుర్తింపు) విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలను కల్పించాలని కోరుతున్నారు. టేక్ హోం రేషన్కు రిజిస్ట్రేషన్ మెలిక కూటమి ప్రభుత్వం టేక్ హోం రేషన్కు రిజిస్ట్రేషన్ మెలిక పెట్టింది. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు అంగన్వాడీ కేంద్రాల ద్వారా టేక్ హోమ్ రేషన్(టీహెచ్ఆర్) సేవలు పొందాలటే ఎఫ్ఆర్ఎస్ ముఖ గుర్తింపు యాప్ తప్పని చేశారు. యాప్లో రిజిస్టర్ కాకుంటే లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తారు. ఈ నెల ఒకటో తేదీనుంచే దీనిని అమలు చేస్తున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో అంగన్వాడీలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. జీతాలను పీఆర్సీకి అనుసంధానం చేయాలని డిమాండ్ ఎఫ్ఆర్సీని రద్దు చేయాలంటూ ఆందోళన నేడు ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా -
కోయభారతి.. గిరిపుత్రులకు విద్యాధాత్రి
బుట్టాయగూడెం: కేంజాటి (వినండి).. తిరియాటి (మాట్లాడండి).. చదవాటి (చదవండి).. రాసాటి (రాయండి).. అందోరు కలియి కెత్కాటి(అందరూ కలిసి చెప్పండి)... లిపిలేని కోయ భాషలోని పదాలివి. ప్రాథమిక పాఠశాలల్లో చేరే గిరిజన విద్యార్థులకు మాతృ భాషలో తప్ప తెలుగు, ఇతర భాషల్లో ఏ మాత్రం ప్రావీణ్యం ఉండదు. దీనితో వారికి విద్యాబోధన ప్రతిబంధకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో కొండ కోనల్లో అంతరించిపోతున్న అరుదైన కోయ భాషకు తెలుగులోనే అక్షర రూపం ఇచ్చి మన్యం ప్రాంతంలోని గ్రామాల్లోని గిరిపుత్రులకు విద్యా బుద్దులు నేర్పిస్తూ వారిని పాఠశాలలకు ఆకర్షితులనే చేసే విధంగా ఐటీడీఏ అధికారులు కృషి చేస్తున్నారు. గిరిజనులు విద్యకు దూరమై సమాజంలో వెనుకబాటుకు గురవుతున్నారు. ఈ పరిస్థితి నుంచి బయటకు తీసుకువచ్చి వారి జీవితాల్లో విద్య సుగంధాలు నింపేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. గిరిజనుల మాతృభాషను కొనసాగిస్తూనే తెలుగు భాషను అభ్యసించేలా వినూత్న ఆలోచనకు కార్యరూపం ఇచ్చి గిరిపుత్రులను విద్యలో తీర్చిదిద్దేలా కోయభారతి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. 101 పాఠశాలలో కోయభారతి అమలు ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజన మండలాలైన బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం మండలాల పరిధిలో 101 గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలు, కోయభారతి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని కేఆర్పురం ఐటీడీఏలోని ప్రాజెక్టు మోనిటరింగ్, రిసోర్స్ కేంద్రం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. 101 పాఠశాలల పరిధిలో 321 మంది బాలురు, 429 మంది బాలికలు, కోయభాషలో విద్యను అభ్యసిస్తున్నారు. విద్యా వలంటీర్లతో మాతృభాష విద్యాబోధన 101 గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలల్లో గిరిజన విద్యార్థులకు విద్యాబోధన చేసేందుకు 101 మంది మాతృభాష వలంటీర్లను నియమించి విద్యాబోధన అందిస్తున్నారు. సర్వశిక్షా అభియాన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలలో 1, 2 తరగతులు చదివే విద్యార్థులకు మాతృభాష అయిన కోయ భాష ద్వారా పాఠ్యాంశాలను పరిచయం చేసి విద్యాబోధన చేస్తున్నారు. తెలుగు, లెక్కలు, పరిసరాల విజ్ఞానం, తదితర పాఠ్య పుస్తకాలు రూపొందించి పంపిణీ చేస్తున్నారు. గిరిజన భాషను తెలుగు పదాల్లో రూపొందించిన పుస్తకాలతో మాతృభాష విద్యావలంటీర్లు విద్యార్థులకు విద్యాబోధన అందిస్తున్నారు. ఇదిలా ఉండగా బుట్టాయగూడెం మండలంలోని కోయరాజమండ్రి పాఠశాలలో లంబాడీ భాషలో కూడా భాషా వలంటీర్లు విద్యాబోధన చేస్తున్నారు. కోయ భాషలో గిరిపుత్రులకు ప్రాథమిక విద్యా బోధన 101 పాఠశాలల్లో కోయ భారతి అమలు తెలుగు, గణితం, పరిసరాల విజ్ఞానం పుస్తకాలు కోయ భాషలో రూపకల్పన మాతృ భాషా విద్యా వలంటీర్లతో విద్యా బోధన మాతృభాషలో బోధన చేయడం చాలా సంతోషంగా ఉంది. 1, 2 తరగతులు చదివే పిల్లలకు కోయభాష పదాలతో రూపొందించిన పాఠ్యపుస్తకాలను చదివిస్తూ పిల్లలకు పాఠశాలల పట్ల ఆసక్తి పెరిగేలా చూస్తున్నాం. – తెల్లం చెల్లమ్మ, మాతృభాష విద్యావలంటీర్, తూర్పురేగులకుంట ఏజెన్సీ ప్రాంతంలో ఉండే గిరిజన విద్యార్థులకు మాతృభాషలో తప్ప తెలుగు, ఇతర భాషల్లో ఏ మాత్రం ప్రావీణ్యం ఉండదు. ఈ పరిస్థితుల్లో ప్రాథమిక పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కోయభాషలో పదాలను తెలుగు అక్షరాలతో రాసేలా బోధిస్తున్నాం. సుమారు 101 పాఠశాలల్లో కోయభారతి కార్యక్రమం ద్వారా మాతృభాష బోధన అందిస్తున్నాం. – తెల్లం బాబూరావు, ఎంఈఓ, బుట్టాయగూడెం -
కోటి సంతకాలే ప్రజాగ్రహానికి నిదర్శనం
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు జంగారెడ్డిగూడెం: సీఎం చంద్రబాబుపై ప్రజాగ్రహానికి కోటి సంతకాలే నిదర్శనమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు జెట్టి గురునాథరావు అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు కార్పొరేట్ జపం చేస్తూ రాష్ట్రాన్ని ప్రైవేట్వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారని ధ్వజమెత్తారు. కార్పొరేట్ సంస్థలకు మేలు చేయడమే చంద్రబాబు లక్ష్యమన్నారు. అదే రీతిలో ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమానికి విశేష స్పందన లభించిందన్నారు.కోటి సంతకాల సేకరణలో పాల్గొని విజయవంతం చేసిన వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలకు, స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేసిన ప్రజలకు గురునాథరావు కృతజ్ఞతలు తెలిపారు. -
ఇంట్లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం
తణుకు అర్బన్: విద్యుత్ షార్ట్సర్క్యూట్ కారణంగా తణుకు సజ్జాపురంలో ఓ ఇంట్లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన తండ్రి పిల్లలను క్షేమంగా కాపాడి బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సజ్జాపురం శివాలయం వంతెన సమీపంలో ఆకుల రత్తయ్య కుటుంబంతో సహా ఇంట్లో నిద్రిస్తుండగా అర్ధరాత్రి 3.30 గంటల సమయంలో ఇంట్లో మంటలు వ్యాపించి ఇళ్లంతా పొగపట్టి ఉన్నాయి. వెంటనే అప్రమత్తమైన రత్తయ్య ఇంట్లో నిద్రిస్తున్న తన భార్యతోపాటు కుమారులను బయటకు తీసుకువచ్చారు. అప్పటికే పొగ ధాటికి పిల్లలకు స్వల్ప అస్వస్థత ఏర్పడింది. ఈ ప్రమాదంలో కిచెన్లోని సామాగ్రితోపాటు వరండాలో ఉన్న వాషింగ్మెషిన్, ఫ్రిజ్ తదితర సామాగ్రి అగ్నికి ఆహుతైపోయాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించి ఉంటుందని, నష్టం రూ.1.50 లక్షలుగా అగ్నిమాపక సిబ్బంది చెప్పారు. కాగా గత 40 రోజులుగా లారీ కిరాయికి వెళ్లిన రత్తయ్య ఆదేరోజు రాత్రి ఇంటికి రావడంతో తామంతా ఎటువంటి ఇబ్బంది లేకుండా బయటపడినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. పిల్లలను క్షేమంగా కాపాడిన తండ్రి -
మనమే తలో చేయీ వేద్దాం !
ద్వారకాతిరుమల: ఎలాగో గోతులు పూడ్చరని అనుకున్నారో ఏమో.. కొందరు యువకులు క్షేత్రంలోని ప్రధాన రహదారిపై ఉన్న గోతులను బుధవారం స్వచ్ఛందంగా పూడ్చారు. వివరాల్లోకి వెళితే. ద్వారకాతిరుమల–భీమడోలు క్షేత్ర ప్రధాన రహదారి పలు చోట్ల ధ్వంసమైంది. దాంతో వివిధ ప్రాంతాల నుంచి వాహనాలపై వచ్చే భక్తులు నిత్యం ప్రమాదాల భారిన పడుతున్నారు. దీన్ని చూసి ప్రజలు స్వచ్ఛందంగా పలు చోట్ల మరమ్మతులు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం సూర్యచంద్రరావుపేట వద్ద మలుపులో ఉన్న గోతులను స్థానికులు కాంక్రీటుతో పూడ్చారు. తాజాగా బుధవారం ద్వారకాతిరుమలలో రోడ్డుపై ఉన్న గోతులను మండలంలోని తిమ్మాపురంకు చెందిన కొందరు యువకులు కంకర రాళ్లతో పూడ్చారు. కనీసం అధికారులు వీటిపై తారు పోస్తే బాగుంటుందని స్థానికులు అంటున్నారు. భీమవరం అర్బన్: మండలంలోని గొల్లవానితిప్ప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడు సుధీర్బాబుపై భీమవరం రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం అతను విద్యార్థులను అసభ్యకరంగా తాకడంతో పాటు వేధించడంతో జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆయనను సస్పెండ్ చేశారు. ప్రధానోపాధ్యాయుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శ్రీవారి దేవస్థానం ఈఓ పోస్టుకు పైరవీలు
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో ప్రస్తుతం ప్రతి ఒక్కరినోట వినిపిస్తున్న మాట.. నెక్ట్స్ దేవస్థానం ఈఓ ఎవరూ. ఎందుకంటే చినవెంకన్న దేవస్థానం ఈఓ సీటుకు ఉన్న క్రేజ్ అలాంటిది మరి. అయితే రోజుకో అధికారి పేరు తెరమీదకు వస్తుండటంతో దీనిపై చర్చ విస్తృతంగా సాగుతోంది. వివరాల్లోకి వెళితే. ప్రస్తుతం శ్రీవారి దేవస్థానం ఈఓగా పనిచేస్తున్న ఎన్వీఎస్ఎన్ మూర్తి ఈనెలాఖరున పదవీ విరమణ పొందనున్నారు. అయితే ఆ పోస్టును దక్కించుకునేందుకు కొందరు అధికారులు ఇప్పటికే పైరవీలు మొదలుపెట్టారు. ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టూ తిరుగుతూ వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే ఆ పోస్టు ఎవరిని వరిస్తుందనే దానిపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. అయితే తెరమీదకొచ్చిన అధికారులు ఇద్దరు, ముగ్గురు కాగా.. తెరవెనుక మరి కొందరు ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అద్దయ్యకు అదృష్టం అందేనా.. ఈఓ సీటు కోసం ప్రయత్నిస్తున్న వారిలో అద్దయ్య పేరు బలంగా వినిపిస్తోంది. ఈయన గతంలో జంగారెడ్డిగూడెం ఆర్డీవోగా పనిచేశారు. ఆలయంలో కొందరు అధికారుల సహాయంతో అద్దయ్య ఇప్పటికే చురుగ్గా అడుగులు ముందుకేసినట్టు తెలుస్తోంది. గోపాలపురం ఎమ్మెల్యే సైతం అద్దయ్యను సిఫార్సు చేస్తూ దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు లేఖ పంపినట్టు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉంటే అద్దయ్య కాకుండా వాడపల్లి దేవస్థానం ఈఓ చక్రధరరావు, మరో ఆర్డీవో సైతం ఈ పోస్టు కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే అన్నవరం దేవస్థానం ఈఓగా పనిచేసి మంగళవారం బదిలీ అయిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వీర్ల సుబ్బారావు సైతం ఈ పోస్టు కోసం ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఆయన ఇటీవల ద్వారకాతిరుమలలోని ఓ టీడీపీ నేతను కలసి, చర్చించినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా దేవస్థానం చైర్మన్ ఎస్వీ సుధాకరరావు ఆశీస్సులు ఉన్న వారే ఈఓగా వచ్చే అవకాశం ఉందనేది బహిరంగ రహస్యం. శ్రీవారి దేవస్థానంపైనే మక్కువ.. రాష్ట్రంలోని పలు ప్రముఖ దేవాలయాల్లో ఈఓగా పనిచేయడానికి ఇష్టపడని అధికారులు.. ద్వారకాతిరుమల దేవస్థానం ఈఓగా పనిచేయడానికి మక్కువ చూపుతున్నారు. దానికి కారణం.. రాజకీయ నాయకులు, అధికారుల ఒత్తిళ్లు ఇక్కడ తక్కువ. ఈఓగా ఎవరొచ్చినా దేవస్థానం సిబ్బంది తమ సహకారాన్ని పూర్తిగా అందిస్తారు. ఇతర దేవాలయాల్లో ఆ పరిస్థితి లేదు. ఉదాహరణకు అన్నవరం, సింహాచలం, విజయవాడ దేవస్థానాలపై రాజకీయ ఒత్తిళ్లు తీవ్ర స్థాయిలో ఉంటాయి. అక్కడి ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పేదే శాసనం. దాంతో రాజకీయ నాయకులు చెప్పే మాట అధికారులు వినక తప్పదు. అలాగే ఎమ్మెల్యేలు, మంత్రుల అండదండలతో రెచ్చిపోయే కొందరు సిబ్బందిని కూడా ఈఓలు భరించక తప్పదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఒత్తిళ్లను తట్టుకుని సమర్థవంతంగా పనిచేయగలరనే పేరున్న వేండ్ర త్రినాథరావు బుధవారం అన్నవరం దేవస్థానం ఇన్చార్జి ఈఓగా బాధ్యతలు చేపట్టారు. నిన్న మొన్నటి వరకు ద్వారకాతిరుమల దేవస్థానం ఈఓగా త్రినాథరావు వస్తారన్న ఊహాగానాలు వినిపించాయి. ఇప్పటికీ కొందరు సిబ్బంది ఆయనే ఈఓగా వస్తారని అంటున్నారు. మరో పదిహేను రోజుల్లో ఈఓ ఎవరనేదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నెలాఖరున రిటైర్డ్ కానున్న ప్రస్తుత ఈఓ మూర్తి ఆ పోస్టు కోసం ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చైర్మన్ ఆశీస్సులు ఎవరికీ దక్కేనో.. -
ప్రజా ఉద్యమానికి నాంది
● ఏలూరు జిల్లాలో 3.60 లక్షల సంతకాలు ● ఈ నెల 15న ఏలూరు నుంచి తాడేపల్లికి.. ఏలూరు టౌన్: టీడీపీ సర్కారు పునాదులు కదిలేలా వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమానికి నాంది పలికిందని.. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన కోటి సంతకాల సేకరణ నిరసన జ్వాలల సెగ టీడీపీ ప్రభుత్వ కోటకు అంటుకుంటుందని... ప్రజలంతా సీఎం చంద్రబాబు తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు అన్నారు. ఏలూరు పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్టీ జిల్లా కార్యాలయానికి కోటి సంతకాల సేకరణ ప్రత్రాలను అందజేశారు. సుమారు 3.60 లక్షల సంతకాల పత్రాలను జిల్లా అధ్యక్షులు డీఎన్నార్; ఏలూరు పార్లమెంట్ పరిశీలకులు, ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాధ్, ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్, యువజన విభాగం జోనల్–2 వర్కింగ్ ప్రెసిడెంట్ కారుమూరి సునీల్కుమార్, బీసీ సెల్ జోనల్–2 వర్కింగ్ ప్రెసిడెంట్ నౌడు వెంకటరమణకు అందజేశారు. ప్రజలే బుద్ధి చెబుతారు: డీఎన్నార్ దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ.. జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో గ్రామాల్లో ప్రజలకు టీడీపీ విధానాలపై అవగాహన వచ్చిందన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ఐదేళ్ళ పాలనలో కేంద్రాన్ని ఒప్పించి ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతులు తెచ్చారని గుర్తు చేశారు. స్వాతంత్య్రం వచ్చాక కేవలం 12 మెడికల్ కాలేజీలు ఉంటే... గత ఐదేళ్ళలో ఏకంగా 17 మెడికల్ కాలేజీలు తేవటం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. టీడీపీ హయాంలో సీఎం చంద్రబాబు చేస్తున్న దుష్టపన్నాగాలపై ప్రజలకు అవగాహన వచ్చిందని, సరైన రీతిలో బుద్దిచెబుతారని స్పష్టం చేశారు. ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జి కారుమూరి సునీల్కుమార్ మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల సంక్షేమం, ఆరోగ్యం కోసం ఆలోచిస్తూ రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తీసుకువచ్చారని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయటంతోపాటు, తెలుగు జాతికి అత్యంత కీలకమైన స్టీ ల్ప్లాంట్ ప్రైవేటీకరణకు సహకరించడం సిగ్గుచేటన్నారు. మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ ... వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద పిల్లలు డాక్టర్ కావాలనే కలను సాకారం చేసేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకువచ్చారని తెలిపారు. దెందులూరు నియోజకవర్గంలో శాంతియుతంగా ర్యాలీ చేసుకునేందుకు అవకాశం లేకుండా ... రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ హౌస్ అరెస్ట్ చేయటం నీచమైన చర్య అన్నారు. ప్రైవేటీకరణకు ప్రజలు వ్యతిరేకం ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే, సమన్వయకర్త పుప్పాల వాసుబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేయడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ప్రజలకు ఉచిత వైద్యాన్ని దూరం చేసేలా టీడీపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ ఆఽధీనంలోనే మెడికల్ కాలేజీలు ఉండాలని ప్రజలు కోరుతున్నారని చెప్పారు. ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ మాట్లాడుతూ... ప్రజల్లో చైతన్యం వచ్చిందని, ప్రతీ ఒక్కరూ టీడీపీ ప్రభుత్వం చేస్తోన్న కుట్రలను గ్రహిస్తున్నారని తెలిపారు. జగన్మోహన్రెడ్డికి ప్రజల్లో మంచిపేరు వస్తుందనే అక్కసుతోనే మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 15న ఏడు నియోజకవర్గాల నుంచి నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలతో జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహిస్తామని డీఎన్ఆర్ స్పష్టం చేశారు. కోటి సంతకాల పత్రాలను ఒక వాహనంలో ఉంచి సమన్వయకర్తలు, పరిశీలకులతో కలిసి శివారు వరకూ భారీ ర్యాలీ చేపడతామని తెలిపారు. -
ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్కు టీచర్ కళ్యాణి
దెందులూరు: హర్యానాలో పంచకులలో జరుగుతున్న ఆల్ ఇండియా సైన్స్ ఫెస్టివల్కు దెందులూరు గారపాటి హైమావతి దేవి ఉన్నత పాఠశాల సైన్స్ టీచర్ కళ్యాణి డెలిగేట్గా ఎంపికయ్యారు. గురువారం హర్యానా సైన్స్ ఫెస్టివల్లో ఆమె పాల్గొన్నారు. విద్యార్థుల్లో విజ్ఞాన శాస్త్రం పట్ల అభిరుచిని పెంచేందుకు వినూత్న ప్రణాళికలతో, విధానాలతో శిక్షణ పొంది రావడం గొప్ప అనుభూతి అని ఆమె అన్నారు. దేశ, విదేశాల శాస్త్రవేత్తలు హర్యానా ముఖ్యమంత్రి, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి, ఇతర ప్రముఖ విశ్వవిద్యాలయాల పరిశోధకులు, విజ్ఞాన భారతి అధ్యక్ష కార్యదర్శుల మధ్య కార్యక్రమం వైభవంగా జరిగిందన్నారు. దేశవ్యాప్తంగా 200 మంది సైన్స్ టీచర్లు ఎంపికై న ఈ కార్యక్రమంలో తాను కూడా భాగస్వామి కావడం సంతోషం కలిగించిందన్నారు. జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి వారి దేవాలయ హుండీ లెక్కింపు కార్యక్రమం బుధవారం నిర్వహించారు. జిల్లా దేవదాయ శాఖ అధికారికి కూచిపూడి శ్రీనివాస్ పర్యవేక్షణలో ఆదాయాన్ని లెక్కించారు. 63 రోజులకు గాను రూ.48,82,724, అన్నదానం హండీ ద్వారా రూ. 2,08,802 మొత్తం రూ. 50,91,526 ఆదాయం సమకూరినట్లు ఈవో ఆర్వీ చందన తెలిపారు. ఒత్తిడిని జయించేందుకు క్రీడలు దోహదం భీమవరం: పోలీసులకు ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడంలో క్రీడా కార్యక్రమాలు ఒత్తిడిని తగ్గించి నాయకత్వం, పరస్పర గౌరవం, జట్టు భావనను పెంపొందిస్తాయని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అన్నారు. భీమవరం డీఎన్నార్ కళాశాల ఆవరణలో బుధవారం ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందికి క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లు, విభాగాల ప్రతినిధులతో ఏర్పడిన జట్లు క్రీడాస్ఫూర్తితో పోటీపడి ఆకట్టుకున్నారు. క్రికెట్ ఫైనల్ మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగగా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి నేతృత్యంలో ఎస్పీ ఎలెవన్ టీమ్, తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ టీంపై విజయం సాధించింది. కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీ (అడ్మిన్) వి.భీమారావు, నర్సాపురం డీఎస్పీ జి.శ్రీవేద, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కేవీవీఎన్ సత్యనారాయణ, ఆర్మ్డ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ కె.వెంకట్రావు, భీమవరం టూటౌన్, రూరల్ సీఐలు జి.కాళీచరణ్, బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
వ్యాన్ ఢీకొని వృద్ధుడి మృతి
నరసాపురం రూరల్: సైకిల్పై వెళుతున్న వృద్ధుడిని వ్యాన్ ఢీకొట్టడంతో మృతి చెందాడు. మొగల్తూరు ఎస్సై వై.నాగలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం పేరుపాలెం సౌత్ గ్రామానికి చెందిన బోణం నర్సింహరావు (75) గ్రామంలో సైకిల్పై వెళుతుండగా ఎదురుగా వస్తున్న వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నర్సింహరావు అక్కడికక్కడే మృతి చెందాడు. నర్సింహరావు కుమారుడు వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించనున్నట్లు చెప్పారు. -
మర్యాదపూర్వక కలయిక
సాక్షి నెట్వర్క్ : తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని బుధవారం దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, ఏలూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కామిరెడ్డి నాని మర్యాద పూర్వకంగా కలిశారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఈ నెల 21 వరకూ జరుగనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) బుధవారం నగరంలోని సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైంది. ఉదయం 9.30 గంటల నుంచి 12 గంటల వరకూ జరిగిన పరీక్షకు 175 మందికి 159 మంది హాజరు కాగా 16 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ జరిగిన పరీక్షకు 175 మందికి 154 మంది హాజరు కాగా 21 మంది గైర్హాజరయ్యారు. ఈ పరీక్షల్లో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులూ నమోదు కాలేదని విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు. ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని గౌరవ వేతనము పొందుతున్న పాస్టర్లు బ్యాంక్ ఖాతాలు అప్డేట్ చేసుకోవాలని మైనారిటీ సంక్షేమ సహాయ సంచాలకులు కె.ఎస్. ప్రభాకర్ బుధవారం తెలిపారు. బ్యాంక్ ఖాతా, ఫోన్ నెంబరులో తేడాలు వుంటే మైనారిటీ సంక్షేమ శాఖ, ఏలూరు కార్యాలయం వచ్చి సరిచేయించుకోవాలన్నారు. ఏలూరు(మెట్రో): పట్టణ పేదల జీవన ప్రమాణ స్థాయిని పెంచేందుకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (ఎంఈపీఎంఏ) కృషి చేస్తుందని కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. కలెక్టరేట్లో బుధవారం మెప్మా 2024–25 వార్షిక సంచికను కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వెట్రిసెల్వి మాట్లాడుతూ పట్టణ ప్రాంతాలలోని నిరుపేదల జీవనప్రమాణాలను మెరుగుపరిచేందుకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని, మహిళల ఆర్థిక సాధికారత కోసం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.మాధవి, జీవనోపాధుల జిల్లా సమన్వయ కర్త మహాలక్ష్మి, సంస్థాగత నిపుణుడు ఎం.రమేష్ పాల్గొన్నారు. భీమవరం: టెట్ పరీక్షపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ వేయాలని, విద్యా హక్కు చట్టానికి తగు సవరణలు చేయాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పీఎస్ విజయరామరాజు డిమాండ్ చేశారు. భీమవరం యూటీఎఫ్ కార్యాలయం నుంచి బుధవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రాన్ని సమర్పించారు. విజయరామరాజు మాట్లాడుతూ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే సుప్రీంకోర్టులో టెట్పై రివ్యూ పిటిషన్ వేయాలని కోరారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షుడు సీహెచ్ పట్టాభిరామయ్య, జిల్లా కార్యదర్శులు జి.రామకృష్ణంరాజు, కె.రామకృష్ణ ప్రసాద్, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు జి.అబ్రహం తదితరులు పాల్గొన్నారు. -
12 నుంచి సాఫ్ట్బాల్ అంతర జిల్లాల టోర్నమెంట్
వీరవాసరం: ఆంధ్రప్రదేశ్ 69వ స్కూల్ గేమ్స్ అండర్ 17 బాలబాలికల సాఫ్ట్ బాల్ అంతర జిల్లాల టోర్నమెంట్ పోటీలు ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు వీరవాసరం మద్దాల రామకృష్ణమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు నిర్వహించనున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ అధ్యక్షుడు జుత్తిగ శ్రీనివాస్, కార్యదర్శులు పీఎస్ఎన్ మల్లేశ్వరరావు, బాజీంకి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ పోటీల్లో ఉమ్మడి 13 జిల్లాల బాల బాలికల జట్లు నుంచి సుమారు 416 మంది క్రీడాకారులు పాల్గొంటారన్నారు. వీరందరికీ భోజన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. భీమడోలు: ఓ ఇంటిలో చోరీకి పాల్పడిన నేరానికి గాను ముద్దాయి అన్నేవారిగూడెంకు చెందిన గుర్రాల సురేష్కు మూడు నెలల సాధారణ జైలు శిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ భీమడోలు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎన్ఎస్ ప్రియదర్శిని బుధవారం తీర్పునిచ్చారు. దుద్దేపూడి పంచాయతీ పరిధిలోని అన్నేవారిగూడెంకు చెందిన గుర్రాల సురేష్ అదే గ్రామానికి చెందిన తుంగ రాంబాబు ఇంట్లో రాత్రి వేళ చొరబడి దొంగతనానికి పాల్పడ్డాడు. భీమడోలు పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి కోర్టు విచారణలో ఏపీపీ టి.శశికళ వాదనలు వినిపించగా, ఎస్సై ఎస్కే మదీనా బాషా సాక్షులను హాజరుపర్చారు. ఏలూరు (టూటౌన్): రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి డేగా ప్రభాకర్ డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఏలూరు ఏరియా సమితి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయం వద్ద ఽబుధవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ధాన్యం, మొక్కజొన్న, పత్తి పంటలను మద్దతు ధరలకు కొనుగోలు చేయాలని, కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకంతో పాటు బ్యాంకు రుణాలు ఇవ్వాలని, ధరలు పడిపోయి నష్టపోతున్న అరటి, నిమ్మ, బత్తాయి రైతులను ఆదుకోవాలని, వెంటనే ఇన్పుట్ సబ్సిడీ చెల్లించాలని, ఉచిత పంటల బీమా పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, బండి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేట్పై వెల్లువెత్తిన ప్రజాగ్రహం
అర్ధరాత్రి అగ్నిప్రమాదం షార్ట్ సర్క్యూట్తో తణుకు సజ్జాపురంలో ఓ ఇంట్లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. అప్రమత్తమైన తండ్రి పిల్లలను కాపాడి బయటకు తీసుకువచ్చారు. 8లో uఏలూరు జిల్లాలో నేరాలకు పాల్పడిన దొంగల ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను నుంచి రూ.35 లక్షల సొత్తు రికవరీ చేశారు. 8లో uగురువారం శ్రీ 11 శ్రీ డిసెంబర్ శ్రీ 2025సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రజాభిమానం వెల్లువెత్తింది.. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై సామాన్యులు నిరసన గళమెత్తారు. ఒక్కొక్క సంతకంగా ప్రారంభమైన కోటి సంతకాల ప్రజా ఉద్యమం మహోద్యమంలా మారింది. బుధవారం జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కోటి సంతకాల పత్రులతో భారీ ర్యాలీలు నిర్వహించి ప్రత్యేక వాహనాల్లో ఏలూరు జిల్లా పార్టీ కార్యాలయానికి పంపారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమన్వయకర్తల నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ శ్రేణులతో పాటు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష వైఎస్సార్సీపీ కోటి సంతకాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి నియోజకవర్గంలో ప్రతి గడపను పలకరించి ప్రభుత్వం చేస్తున్న అడ్డగోలు వ్యవహారాలను ప్రజలకు వివరించి రాష్ట్రం నష్టపోతున్న తీరును ప్రతి ఒక్కరికీ వివరించారు. పర్యవసనంగా జిల్లాలో లక్షలాది సంతకాల సేకరణ జరిగింది. అనేక నియోజకవర్గాల్లో స్వచ్ఛందంగా ప్రజలే ముందుకు వచ్చి సంతకాలు చేయడం విశేషం. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత రెండు నెలలుగా నిర్వహించిన కోటి సంతకాల కార్యక్రమం ముగింపునకు చేరింది. బుధవారం అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జులు భారీ ర్యాలీలు నిర్వహించారు. అనంతరం కోటి సంతకాల పత్రులను ఏలూరు జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్టా పార్టీ అధ్యక్షులు దూలం నాగేశ్వరరావుకు అందించారు. 7 నియోజకవర్గాల నుంచి వచ్చిన లక్షలాది సంతకాల పత్రాలను నియోజకవర్గాలవారీగా ఏర్పాటు చేశారు. అనంతరం వచ్చే వారంలో జిల్లా నుంచి భారీ ర్యాలీగా తాడేపల్లికి కోటి సంతకాల పత్రులను తరలించనున్నారు. ఈ క్రమంలో బుధవారం అనేక నియోజకవర్గాల్లో పాదయాత్రలు, బైక్ ర్యాలీలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ● కై కలూరు నియోజకవర్గంలో.. కై కలూరు నియోజకవర్గంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు నేతృత్వంలో కోటి సంతకాల పత్రాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. రైల్వేస్టేషన్ రోడ్డులోని పార్టీ కార్యాలయం నుంచి ఏలూరు రోడ్డు సీఎన్ఆర్ రోడ్డు వరకు భారీ బైక్ ర్యాలీ జరిగింది. అనంతరం దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ కోటి సంతకాల ప్రజా ఉద్యమంతో ప్రభుత్వానికి ఇప్పటికై నా కనువిప్పు రావాలని తక్షణమే వైద్యకళాశాల ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ● నూజివీడులో.. నూజివీడు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప అప్పారావు నేతృత్వంలో జరిగిన ర్యాలీలో ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జి కారుమూరి సునీల్ కుమార్ పాల్గొన్నారు. నూజివీడు చినగాంధీబొమ్మ సెంటర్ నుంచి మార్కెట్ యార్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ● పోలవరం నియోజకవర్గంలో.. పోలవరం నియోజకవర్గంలోని కొయ్యలగూడెంలో పార్టీ సమన్వయకర్త తెల్లం బాలరాజు నేతృత్వంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కొయ్యలగూడెం నుంచి గవరవరం వరకు భారీ బైక్ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకుడు జెట్టి గురునాథరావు పాల్గొన్నారు. ● ఉంగుటూరు నియోజకవర్గంలో.. ఉంగుటూరు నియోజకవర్గం గణవపరం మండలం బువ్వనపల్లిలో నియోజకవర్గ సమన్వయకర్త పుప్పాల వాసుబాబు పార్టీ కార్యాలయం నుంచి దివంగత వైఎస్సార్ విగ్రహం సెంటర్ వరకు బైక్ ర్యాలీ, పాదయాత్ర నిర్వహించారు. అక్కడ నుంచి ప్రత్యేక వాహనాల్లో ఏలూరు పార్టీ కార్యాలయానికి కోటి సంతకాల పత్రాలను తీసుకువచ్చి జిల్లా అధ్యక్షుడికి అప్పగించారు. ● దెందులూరు నియెజకవర్గంలో.. దెందులూరు నియెజకవర్గంలో పార్టీ సమన్వయకర్త కొఠారు అబ్బయ్యచౌదరి నేతృత్వంలో భారీ పాదయాత్ర నిర్వహించారు. వేగవరం నుంచి ఏలూరు వరకు పాదయాత్ర నిర్వహించి అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో కోటి సంతకాల పత్రాలను అందచేశారు. ● ఏలూరు నియోజకవర్గంలో.. ఏలూరు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ నేతృత్వంలో భారీ పాదయాత్ర నిర్వహించి కోటి సంతకాల పత్రులను ప్రత్యేక వాహనంలో ఏర్పాటు చేశారు. పవరుపేట రైల్వేస్టేషన్ నుంచి ఆర్ఆర్పేట మీదుగా విజయవిహార్ సెంటర్ వరకు కార్యక్రమం నిర్వహించి పత్రాలు జిల్లా పార్టీ కార్యాలయానికి అప్పగించారు. ● చింతలపూడి నియోజకవర్గంలో.. చింతలపూడి నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త కంభం విజయరాజు నేతృత్వంలో పార్టీ కార్యాలయం నుంచి మార్కెట్ యార్డు వరకు భారీ బైక్, కార్ల ర్యాలీ నిర్వహించారు. కోటి సంతకాల పత్రులను ప్రత్యేక వాహనంలో ఏలూరు తరలించి జిల్లా అధ్యక్షుడికి అందించారు. కుట్రలపై కోటి గర్జన ఏలూరులో భారీ ర్యాలీ 7 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రతులతో భారీ ర్యాలీలు ఏలూరు జిల్లా కార్యాలయానికి చేరిన కోటి సంతకాల పత్రాలు బైక్ ర్యాలీలు, పాదయాత్రలతో నియోజకవర్గాల్లో కొత్త జోష్ -
అబ్బయ్యచౌదరిని అడ్డుకున్న పోలీసులు
పెదవేగి: కోటి సంతకాల ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరిని కొంతసేపు పోలీసులు అడ్డుకున్నారు. పెదవేగి మండలం కొండలరావుపాలెంలోని తన నివాసం నుంచి దెందులూరులో పార్టీ శ్రేణులతో కలసి ఏలూరు పార్టీ కార్యాలయానికి వెళ్లేందుకు సిద్ధమవ్వగా పెదవేగి సీఐ సీహెచ్ రాజశేఖర్ తన పోలీస్ సిబ్బందితో కొంతసేపు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అబ్బయ్యచౌదరి మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శాంతియుత ర్యాలీకు వెళ్లేందుకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారని అని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా లేని రూల్ దెందులూరులోనే ఎందుకు అని పోలీసులను అబ్బయ్యచౌదరి ప్రశ్నించడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. భీమవరం: భీమవరం పట్టణంలోని ఓ ప్రైవేటు విద్యా సంస్థ బస్సు బుధవారం రాత్రి అదుపు తప్పి కాలువలోకి ఒరిగిపోయింది. విద్యా సంస్థ నుంచి విద్యార్థులను తీసుకువెళుతుండగా అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో బస్సులోని విద్యార్థులు బస్సు అద్దాలు పగలకొట్టుకుని బయటపడ్డారు. ప్రమాదంలో విద్యార్థులు సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
నేరాలు చేశారు.. పోలీసులకు చిక్కారు
ఏలూరు టౌన్: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక నేరాలకు పాల్పడిన నలుగురు దొంగల ముఠాను భీమడోలు సర్కిల్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.35 లక్షల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఈమేరకు వివరాలు వెల్లడించారు. ద్వారకాతిరుమలలో చోరీలు ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల గ్రామానికి చెందిన కనిగొళ్ళ లక్ష్మీ కాశీవిశ్వనాథం తన కుటుంబంతో అశ్వారావుపేటలోని తన చెల్లెలు ఇంటికి వెళ్లగా ఈనెల 2న తెల్లవారుజామున దొంగలు ఇంటిలో ప్రవేశించి రూ.1.70 లక్షల నగదు, రెండు కాసుల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. అదేరోజు అదే గ్రామంలోని పోలుబోయిన లక్ష్మయ్య ఇంటిలోనూ జొరబడి సుమారు 7 కాసుల బంగారు ఆభరణాలను చోరీ చేశారు. వీటిపై ద్వారకాతిరుమల పోలీస్స్టేషన్లో కేసులు నమోదు చేశారు. ఈ రెండు కేసులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎస్పీ కేపీ శివకిషోర్ ఆదేశాలతో ఏలూరు డీఎస్పీ శ్రావణకుమార్ పర్యవేక్షణలో భీమడోలు సీఐ యూజే విల్సన్ ఆధ్వర్యంలో ద్వారకాతిరుమల ఎస్సై సుధీర్ తన సిబ్బందితో దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు వీరే.. జంగారెడ్డిగూడెం డాంగే నగర్కు చెందిన పోలవరపు నాగదుర్గాప్రసాద్.. ఇతనిపై గతంలో 90 చోరీ కేసులు, 3 గంజాయి కేసులు ఉన్నాయి. తాడేపల్లిగూడెం వీవర్స్కాలనీకి చెందిన యర్రసాని లక్ష్మణ్.. ఇతనిపై గతంలో 80 చోరీ కేసులు, 3 గంజాయి కేసులు ఉన్నాయి. తాడేపల్లిగూడెం రామారావుపేటకు చెందిన గుత్తుల రవికుమార్.. ఇతనిపై గతంలో 26 చోరీ కేసులు, 3 గంజాయి కేసులు ఉన్నాయి. ఇక ఏలూరు తంగెళ్ళమూడి ప్రాంతానికి చెందిన చోరీ సోత్తు రిసీవర్ విశాఖ వసంత అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరివద్ద నుంచీ రూ.22 లక్షల విలువైన 184.37 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.11 లక్షలు విలువైన మూడు కేటీఎం బైక్లు, ఒక బుల్లెట్ వాహనం, రూ. 2 లక్షల నగదు.. మొత్తంగా రూ.35 లక్షల విలువైన చోరీ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రతిభ చూపిన భీమడోలు సీఐ యూజే విల్సన్, ద్వారకాతిరుమల ఎస్సై టీ.సుధీర్, కానిస్టేబుళ్లు సీహెచ్ లక్ష్మీనారాయణ, ఎన్.శివకృష్ణ, ఎం.వెంకటేశ్వరరావు, హోంగార్డు వీ.జయప్రకాష్బాబును జిల్లా ఎస్పీ అభినందించారు. విలేకరుల సమావేశంలో ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్ ఉన్నారు. చెడు వ్యసనాలకు బానిసగా మారి.. గణపవరంలో చెడు వ్యసనాలకు బానిసైన బల్లారపు శ్యాంబాబు, పోలిమాటి కృష్ణకిషోర్ తమ ఇంటి సమీపంలోని నక్కల కృష్ణ ఇంటిలో చోరీకి పాల్పడి బంగారు, వెండి వస్తువులు అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నిడమర్రు సీఐ ఎన్.రజనీకుమార్ ఆధ్వర్యంలో ఎస్సై ఏ.మణికుమార్ తన సిబ్బందితో కేసును దర్యాప్తు చేశారు. గణపవరం చాణక్య కాలేజీ సమీపంలో బుధవారం నిందితులు శ్యాంబాబు, కృష్ణకిషోర్లను అరెస్ట్ చేసి రూ.2.40 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు ఛేదించటంలో ప్రతిభ చూపిన గణపవరం ఎస్సై మణికుమార్, హెచ్సీ శంకరరావు, కానిస్టేబుల్ శివాజీ, హోంగార్డు జగపతిని ఎస్పీ కేపీ శివకిషోర్ అభినందించారు. చోరీ సొత్తు బాధితులకు అప్పగింత జంగారెడ్డిగూడెం: ఈ ఏడాది సెప్టెంబర్ 22న ఓ ఇంట్లో అర్ధరాత్రి జరిగిన దోపిడీ లక్కవరంలో కలకలం రేపింది. ఆ దొంగల ముఠాను జంగారెడ్డిగూడెం పోలీసులు పట్టుకుని బాధితులకు సొమ్ము అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి. లక్కవరం గ్రామంలోని లక్ష్మీ అంజనికుమారి, రుక్కయ్య దంపతులు సెప్టెంబర్ 22న ఇంట్లో నిద్రిస్తుండగా, అర్ధరాత్రి సమయంలో ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి, వారిపై దాడి చేసి, బీరువాలో ఉన్న 40 కాసుల బంగారం, 2 కిలోల వెండిని చోరీ చేశారు. ఈ కేసును అప్పటి ఇన్చార్జి సీఐ టి.క్రాంతికుమార్ దర్యాప్తు చేసి నలుగురు నిందితులు అంగడి విల్సన్బాబు, గజ్జెలవాసు, దేవర శ్రీరామమూర్తి, షేక్ బాజీను అరెస్టు చేశారు. ఇదే కేసులో మరో నిందితుడు కావేది ప్రసాద్ని నవంబర్ 12, 2025న ప్రసుత్త సీఐ ఎంవీ సుభాష్ అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.40 లక్షలు విలువైన బంగారు వస్తువులు, రూ.3 లక్షలు విలువైన వెండి వస్తువులు, నేరానికి ఉపయోగించిన ఇనుప రాడ్డు, రెండు కర్రలు, మోటార్సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) ఉత్తర్వులు మేరకు బుధవారం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ బాధితులు లక్ష్మీ అంజనికుమారి, రుక్కయ్య దంపతులకు చోరీ సొత్తు అప్పగించారు. కార్యక్రమంలో సీఐ ఎంవీ సుభాష్, ఎస్సైలు ఎన్వీ ప్రసాద్, షేక్ జబీర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో నేరాలకు పాల్పడిన దొంగల ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి చోరీ సొత్తు రికవరీ చేశారు. ద్వారకాతిరుమలలో జరిగిన చోరీల్లో నలుగురు సభ్యుల దొంగల ముఠాను అరెస్ట్ చేసి రూ.35 లక్షల చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. నేరస్తులకు వణుకు పుట్టించేలా వీరిని భీమడోలు జంక్షన్ నుంచి భీమడోలు కోర్టు వరకు ద్వారకాతిరుమల పోలీసులు నడిపించుకుంటూ తీసుకువెళ్లారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో జరిగిన చోరీకి సంబంధించి నిందితులను అరెస్ట్ చేసి బాధితులకు సొమ్ము అప్పగించారు. గణపవరంలో మరో చోరీ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు. భీమడోలు సర్కిల్ పరిధిలో దొంగల ముఠా అరెస్ట్ రూ.35 లక్షల చోరీ సొత్తు స్వాధీనం లక్కవరంలో మరో చోరీ కేసులో నిందితుల అరెస్ట్ రూ.43 లక్షల విలువైన చోరీ సొత్తు బాధితులకు అప్పగింత -
టెట్కు పటిష్ట ఏర్పాట్లు చేయాలి
ఏలూరు (మెట్రో): జిల్లాలో ఈనెల 10 నుంచి 21 వరకు జరగనున్న ‘టెట్’ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె.అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. ‘టెట్’ నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులపై మంగళవారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జాయింట్ కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పరీక్ష ఈనెల 10 నుంచి 21 వరకు రెండు కేంద్రాలలో నిర్వహిస్తామని చెప్పారు. పరీక్ష సమయంలో విద్యుత్కు అంతరాయం లేకుండా ఏర్పాటు చేయాలన్నారు. అభ్యర్థులకు అసౌకర్యం కలగకుండా బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీటి సౌకర్యం ఉండేలా చూడాలని, వైద్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణ సమయంలో అభ్యర్థుల సందేహాల నివృత్తికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలనీ డీఈఓని ఆదేశించారు. ఏలూరు(మెట్రో): జిల్లాలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ప్రగతిని సాధించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో మంగళవారం రైతు ఉత్పత్తిదారుల సంఘాలు జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశం జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ వ్యవసాయం, అనుబంధ రంగాలలో ప్రగతిని సాగిస్తున్నామని, ఆయిల్ పామ్ అధిక విస్తీర్ణంలో సాగవుతుందన్నారు. కోకో అంతర పంటగా సాగవుతుందన్నారు. ఏలూరు జిల్లాలో కోకో, ఆయిల్ పామ్, కొబ్బరి, మామిడి, తదితర ఉత్పత్తులతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని, వ్యవసాయ ఉత్పత్తులకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయని, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాట్లలో జిల్లా మంచి పురోగతి సాధించేలా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు చర్యలు తీసుకోవాలన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): నూతన పారిశ్రామికవేత్తలకు పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక సదుపాయాలు, బ్యాంకు రుణాలు మంజూరుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి, ఇన్వెస్టర్లతో ముఖాముఖి సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయం, ఆక్వా రంగాలలో అభివృద్ధి సంతృప్తికరంగానే ఉందని, పారిశ్రామికంగా అభివృద్ధికి మరింత కృషి చేయాలన్నారు. కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అనేకమంది పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని, నూతన పరిశ్రమల స్థాపనకు అనుమతులు, బ్యాంకు రుణాల మంజూరు, మౌలిక వసతుల కల్పనలో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కలెక్టర్ చదలవాడ నాగరాణి వివిధ రంగాలకు సంబంధించిన ఇన్వెస్టర్లతో మాట్లాడుతూ ప్రస్తుతం కొనసాగుతున్న పరిశ్రమల వివరాలు, కొత్తగా ప్రారంభించబోయే పరిశ్రమలు, వ్యాపారాలు గురించి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లాలో పరిశ్రమల శాఖ ప్రగతిపై సమీక్షించారు. భీమవరం(ప్రకాశం చౌక్): ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు చెల్లించకుండా కాలయాపన చేస్తుంది. 9వ తేదీ దాటినా ఉద్యోగులకు జీతాలు జమ చేయకుండా వారి పట్ల నిర్లక్ష్య వైఖరితో చంద్రబాబు ప్రభుత్వం ఉంది. ఇంకా జీతాలు రాకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతునే విధులకు హాజరువుతున్నారు. ఇంటి అద్దె, ఈఎంఐలకు అప్పులు చేస్తున్నారు. ఈఎంఐలు కట్టపోతే ఫైన్ వేసి మరీ వసూలు చేస్తున్నారని ఆలస్యంగా కట్టడంతో సిబిల్ స్కోర్ పడిపోయి లోను ఇచ్చే పరిస్థితి లేకుండా పొతుందని ఉద్యోగులు వాపొతున్నారు. జీతాలు కోసం ఉద్యోగులు ఎదురుచూస్తునప్పటికీ కూటమి ప్రభుత్వం జీతాలు జమ చేయకుండా రోజులు నెట్టుకొస్తోంది. అధికారంలోకి వస్తే జీతాలు ఒకటో తేదీనే జమ చేస్తామని హమీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మాట తప్పారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ పాలనలో ఒకటి, రెండు సార్లు జీతాలు సమయానికి పడకపోతే విమర్శించిన చంద్రబాబు అండ్ కో ఇప్పుడు గత 16 నెలల పాలనలో నెలనెల జీతాలు సమయానికి జమచేయకపోవడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ, హౌసింగ్, పరిశ్రమల, సవిల్ సప్లై, బీసీ, సోషల్ వెల్ఫేర్, చేనేత, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ, ఇరిగేషన్ తదితర శాఖలకు చెందిన 317 మంది ఉద్యోగులకు జీతాలు అందలేదు. -
ప్రభుత్వ నిర్ణయం మార్చుకోవాల్సిందే
పేదలకు వైద్య విద్యను దూరం చేసే ప్రభుత్వ నిర్ణయం మార్చుకునే వరకూ ఉద్యమం ఆగదు. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కష్టపడి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి వైద్య కళాశాలలను తీసుకు వచ్చారు. ప్రైవేటు పరం చేస్తామంటే ఊరుకోం. – బండారు గోపి, చింతలపూడి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయంపై వైఎస్సార్సీపీ కోటి సంతకాల సేకరణతో ప్రభుత్వానికి సెగ తగిలింది. ప్రభుత్వం దిగిరాక తప్పదు. గ్రామగ్రామాన ప్రజలు పెద్ద ఎత్తున కోటి సంతకాలు సేకరణలో పాల్గొన్నారు. – రఘు సర్పంచ్, చాటపర్రు, దెందులూరు మండలం ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడమంటే పేద వర్గాల పిల్లలకు వైద్య విద్యను దూరం చేయడమే. స్తోమత ఉన్నవారే వైద్య విద్యను చదవగలగుతారు. ప్రజల ఆస్తిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం అత్యంత దారుణం. – పల్లెపాం సూర్య, చింతలవల్లి, ముసునూరు మండలం -
నాయకులు, కార్యకర్తల కృషి అమోఘం
మాజీ మంత్రి కారుమూరి తణుకు అర్బన్: ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేసే చంద్రబాబు సర్కారు కుట్రకు వ్యతిరేకంగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు నిర్వహించిన కోటి సంతకాల సేకరణలో సంతకాలు చేసిన ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. కోటి సంతకాల సేకరణలో పూర్తి సహకారం అందించిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. తణుకు పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు సంపద సృష్టించి సంక్షేమాన్ని అందరికీ అందిస్తానని మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిన చంద్రబాబు నేటికి రూ. 2.66 లక్షల కోట్ల అప్పులు చేశారని, కేవలం రూ.5 వేల కోట్లు వెచ్చిస్తే పూర్తిగా అందుబాటులోకి వచ్చే ప్రభుత్వ వైద్య కళాశాలలను దుర్మార్గంగా ప్రైవేటు పరం చేస్తున్నారని విమర్శించారు. వైద్య కళాశాలలు అందుబాటులోకి రావడం వల్ల జగన్మోహన్రెడ్డికో, కారుమూరికో మంచి జరగడానికి కాదని పేదలకు అందాలనే ప్రధాన ఉద్దేశంతోనే అందుబాటులోకి తీసుకువచ్చారని స్పష్టం చేశారు. -
ప్రైవేటీకరణ నిర్ణయం విరమించుకోవాలి
ప్రభుత్వ వైద్య కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని చూడటం దుర్మార్గమైన చర్య. వైద్య కళాశాలలు ప్రైవేటీకరణ చేస్తే పేదలకు విద్య, వైద్యం కూడా దూరమవుతుంది. ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకపోతే సంఘటితంగా ఉద్యమిస్తాం. – బన్నే వినోద్ కుమార్, పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షుడు కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇంతటి ప్రజాదరణ వస్తుందని ఊహించలేదు. ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎండగడుతూ ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేశారు. తాళ్లూరి ప్రసాద్, వైఎస్సార్సీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు ప్రజలు ఉత్సాహంగా ముందుకు వచ్చి సహకరించారు. మెడికల్ కళాశాలలు ప్రభుత్వమే నిర్వహిస్తే పేద పిల్లలకు మెడికల్ సీట్లతో పాటు వైద్యం కూడా ఉచితంగా అందుతుందని ప్రజలు గ్రహించారు. సంక్షేమం పథకాలు అందక పడుతున్న ఇబ్బందులు ప్రజలు తెలిపారు. – మరడ మంగరావు, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు, ఉంగుటూరు విద్య, వైద్యాన్ని ఈ ప్రభుత్వం వ్యాపారంగా మారుస్తోంది. అందులో భాగంగానే వైద్య కళాశాలలను చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి, పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్య విద్యను దూరం చేస్తున్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే పేద విద్యార్థులు అధిక ఫీజులు చెల్లించాలి. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాలి. – వినుకొండ సూరిబాబు, రేచర్ల, చింతలపూడి మండలం -
వెల్లువెత్తిన ప్రజా చైతన్యం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై ప్రజా పోరుబాట తుది అంకానికి చేరింది. విద్యార్థుల భవిష్యత్ను పణంగా పెట్టి పేద విద్యార్థులకు అన్యాయం చేసేలా సర్కారు తీసుకుంటున్న చర్యలపై సామాన్యుడు సైతం రగిలిపోతున్నాడు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ పిలుపునిచ్చిన కోటి సంతకాల సేకరణకు జిల్లాలో అనూహ్య స్పందన లభించింది. 7 నియోజకవర్గాల్లో లక్షలాది సంతకాలు సేకరించి బుధవారం అన్ని నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు నిర్వహించి ఏలూరు జిల్లా కార్యాలయానికి కోటి సంతకాల పత్రాలు పంపనున్నారు. గ్రామ గ్రామాన స్వచ్ఛందంగా సంతకాలు సేకరించి వైఎస్సార్సీపీ కోటి సంతకాల కార్యక్రమం చేపట్టింది. దీనిలో భాగంగా నియోజకవర్గ ఇన్చార్జి మొదలుకొని సాధారణ కార్యకర్త వరకు అందరూ భాగస్వాములై నిర్మాణాత్మకంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అక్టోబర్లో ప్రారంభమైన కోటి సంతకాల ప్రజాఉద్యమం, రచ్చబండలు గ్రామ స్థాయిలో సమావేశాలు, ఇంటింటికి తిరిగి సంతకాల సేకరణ చేయడంతో పాటు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణతో జరిగిన నష్టాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లారు. ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ముఖ్యంగా యువత, న్యాయవాదులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో మద్దతు పలికారు. జిల్లా కోర్టు వద్ద నిర్వహించిన కోటి సంతకాల సేకరణకు న్యాయవాదుల సంపూర్ణ మద్దతు ఇచ్చారు. పెద్ద ఎత్తున సంతకాలు చేశారు. జిల్లాలో 4 లక్షలకుపైగా సంతకాలు సేకరించి ప్రతి నియోజకవర్గంలోనూ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించారు. నేడు కోటి సంతకాలతో ర్యాలీ : జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ సమన్వకర్తల నేతృత్వంలో కోటి సంతకాల పత్రాలతో ర్యాలీలు నిర్వహించనున్నారు. ప్రధానంగా అన్ని నియోజకవర్గాల్లో కోటి సంతకాల పత్రాలను ప్రత్యేక వాహనంలో ఏర్పాటు చేసి నియోజకవర్గంలో ర్యాలీ నిర్వహించి 7 నియోజకవర్గాల నుంచి పార్టీ జిల్లా కార్యాలయానికి తరలించి జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావుకు అప్పగించనున్నారు. భీమవరంలో మద్దతు తెలుపుతూ సంతకాలు చేస్తున్న ప్రయాణికులు భువనపల్లిలో జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, ఎంఎల్సీ వంకా రవీంద్రలకు కోటి సంతకాల పత్రాలను అందిస్తున్న వైఎస్సార్సీపీ నేతలు జిల్లాలో విజయవంతంగా కోటి సంతకాల సేకరణ చంద్రబాబు సర్కారు ప్రైవేటీకరణ కుట్రలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం నేడు 7 నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు అనంతరం పార్టీ కార్యాలయానికి సంతకాల ప్రతులు -
రోడ్డెక్కిన చిరుద్యోగులు
● కనీస వేతనం రూ.15 వేలు చెల్లించాలని డిమాండ్ ● ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని వినతి ఏలూరు (టూటౌన్): ఏళ్ల తరబడి చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నా ప్రభుత్వం తమపై కనికరం చూపకపోవడం బాధాకరమని స్కూల్ స్వీపర్లు, శానిటరీ వర్కర్లు, నైట్ వాచ్మెన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు 8 నుంచి 10 గంటలు పనిచేస్తున్న తమకు కనీస వేతనాలు ఇవ్వడం లేదని, ఇచ్చే అరకొర జీతాలు సైతం పెండింగ్లో ఉంటున్నాయని చెబుతున్నారు. స్కూలు స్వీపర్లకు నెలకు రూ.4 వేలు, శానిటేషన్ వర్కర్కి నెలకు రూ.6 వేలు మాత్రమే ఇస్తున్నారని వాపోతున్నారు. కనీస వేతనం రూ.15 వేలు ఇవ్వాలని, రెండు నెలలుగా బకాయి ఉన్న జీతాలు ఇవ్వాలని కోరుతున్నారు. ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కూడా అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రెండు నెలల క్రితం ఆందోళన చేపట్టిన వీరు.. ఇప్పటికీ తమ సమస్య పరిష్కారం కాకపోవడంతో మరోసారి ఆందోళనకు దిగారు. ఏలూరు కార్పొరేషన్ ఎదుట రెండు రోజులుగా రిలే నిరాహారదీక్షలు చేస్తున్నారు. జిల్లాలో 1900 మందికి పైనే.. ఏలూరు జిల్లా వ్యాప్తంగా 1900 మందికి పైగా స్కూల్ స్వీపర్లు, శానిటరీ వర్కర్లు, నైట్ వాచ్మెన్లు ఏళ్ళ తరబడి విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో ఒక్క ఏలూరు నగరంలోనే 180 మంది వరకు సిబ్బంది పనిచేస్తున్నారు. రోజంతా పనిచేసినా తమకు కనీస వేతనం దక్కకపోవడం పట్ల వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది వెట్టి చాకిరీ కాదా? పేరుకే పార్ట్టైం కంటింజెంట్ పోస్టు అని, చేయించుకునేది రోజుకు 10 గంటల పని అని చెబుతున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విధుల్లో ఉంటున్నామని పేర్కొంటున్నారు. ఇన్ని పనులు చేసినా తమకు ఇచ్చే వేతనం రూ.4 వేల నుంచి రూ.6 వేలు మాత్రమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కన్ను పడితే కబ్జా
● నరసాపురం మండలం లక్ష్మణేశ్వరంలో రూ.50 కోట్ల భూములు హాంఫట్ ● కూటమి పెద్దల దురాక్రమణలో ప్రభుత్వ భూములు ● నిర్మాణాలు చేసి అద్దెలకు ఇస్తున్న వైనం నరసాపురం: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మున్సిపాలిటీని ఆనుకుని ఉన్న లక్ష్మణేశ్వరం గ్రామంలో విలువైన కోట్లాది రూపాయల ప్రభుత్వ భూములు కొందరు పెద్దల దురాక్రమణలోకి వెళ్లిపోతున్నాయి. కొందరు రాజకీయ నేతలు ప్రభుత్వ భూములపై కన్నేసి యథేచ్ఛగా వ్యవహారాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే లక్ష్మణేశ్వరంలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని కోట్లలో సొమ్ములు చేసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారాలపై గ్రామస్తులు కొందరు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా.. ముడుపుల మత్తు, అధికార పార్టీ భయంతో పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఒకపక్క ప్రభుత్వ అవసరాలకు, అభివృద్ధి పనులకు కనీసం ఓ 10 సెంట్ల భూమి కావాలన్న లభించని స్థితి ఉండగా, మరోపక్క విలువైన ఇలాంటి ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం లేదు. ఆక్రమించుకుని అమ్ముకుంటూ.. నరసాపురం పట్టణ పరిధిలో పీచుపాలెంకు ఆనుకుని ఉన్న లక్ష్మణేశ్వరం గ్రామంలో పెద్ద విస్తీర్ణంలో ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఈ ప్రాంతం మున్సిపాలిటీలో విలీనమయ్యే అవకాశం ఉంది. దీంతో ఈ ప్రాంత భూములపై కొందరు రాజకీయ పార్టీల నేతల కళ్లు పడ్డాయి. దీంతో సదరు భూములను ఎవరి శక్తి మేరకు వారు ఆక్రమించుకుని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు. రియల్టర్లు కొందరు వెంచర్లు వేసి అమ్మేస్తున్నారు. ఆక్రమణకు గురైన భూములపై బ్యాంకుల్లో రుణాలు కూడా భారీగా తీసుకుంటున్నట్టు సమాచారం. పక్కా భవన నిర్మాణాలు, కమర్షియల్ భవన నిర్మాణాలు చేసి, నెలనెలా భారీగా అద్దెలు కూడా దండుకుంటున్నా ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు. మురుగు కాలువను మాయం చేశారు రోడ్డు పక్కన ఆర్అండ్బీ స్థలాలతో పాటు, ఇరిగేషన్కు చెందిన భూములు పెద్ద విస్తీర్ణంలో ఆక్రమణకు గురైనట్టు తెలుస్తోంది. వేములదీవి ఛానల్కు అనుసంధానంగా ఉన్న ఓ మురుగు కాల్వను కబ్జాదారులు పూర్తిగా పూడ్చేసి అక్కడ ఒకప్పుడు కాలువ ఉండేదన్న సంగతి కూడా తెలియకుండా చేశారు. ఓ రియల్ ఎస్టేట్ వెంచర్కు దారిగా మార్చేసి.. ప్లాట్లు మొత్తం అమ్మేసుకున్నా అధికారుల్లో చలనం లేకపోవడానికి కారణం దీని వెనుక అధికార జనసేన నాయకుల అండ ఉండటమేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కొన్ని నెలలుగా ఆర్అండ్బీ స్థలాల్లో అక్రమ కట్టడాలు సాగుతున్నాయి. జనసేనకు చెందిన ఓ మత్స్యకార నేత స్వయంగా నిర్మిస్తున్న కట్టడాలు కొన్ని ఉండగా, మొత్తం అక్రమ కట్టడాల్లో ఎక్కువ కొందరు జనసేన నాయకుల కనుసన్నల్లో సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి విలువైన ప్రభుత్వ భూముల కబ్జాల పర్వం ఇంకెంత కాలం సాగుతుందోనని చర్చ నరసాపురం ప్రాంతంలో విస్తృతంగా సాగుతోంది. ఆర్ అండ్ బి, ఇరిగేషన్ స్థలాల్లో భవన నిర్మాణాలు ఆక్రమిత ప్రభుత్వ భూముల్లో వెంచర్ వేసిన దృశ్యం -
సంపద సృష్టి ఇదేనా?
సంపద సృష్టిస్తానని నమ్మించి, అధికారంలోకి వచ్చిన అనంతరం చంద్రబాబు దారుణంగా మోసం చేస్తున్నారు. వేలకోట్ల విలువైన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంపై ప్రజల్లో అసంతృప్తి ఉంది. ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. – లంకలపల్లి గణేష్, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏలూరు నగరంలో చేపట్టిన ప్రజా ఉద్యమంలో విద్యార్థులు, యువత, మహిళలు, కార్మికులు, వ్యాపారులు అందరూ భాగస్వాములు అయ్యారు. 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకువస్తే.. చంద్రబాబు ప్రైవేటీకరణ చేయటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. – మున్నుల జాన్గురునాథ్, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి సమష్టి కృషితో సాధ్యం లేనిది ఏదీ లేదు. దెందులూరు నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణకు పార్టీ కార్యకర్తలు, నాయకులు అద్భుతంగా స్పందించారు. గ్రామ గ్రామాన పెద్ద ఎత్తున సంతకాల సేకరణ చేపట్టాం. డీవీఆర్కే చౌదరి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం ముమ్మాటికి తప్పే. పేదలకు శాశ్వతంగా ఉచిత విద్య వైద్యం దూరం చేస్తే రాష్ట్రంలో పేదలందరూ తిరగబడతారు. ఇప్పటికే అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైంది. – అంగడాల వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ, మేదినరావుపాలెం -
రూ.15 వేలు ఇవ్వాలి
రాష్ట్రంలోని స్కూల్ స్వీపర్లు, శానిటేషన్ వర్కర్లు, నైట్ వాచ్మెన్లకు కనీస వేతనం నెలకు రూ.15 వేలు అందించాలి. ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలి. వీరికి ఉద్యోగ భద్రత కల్పించాలి. – బి.సోమయ్య, స్కూల్ స్వీపర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఏళ్ళ తరబడి స్కూల్ నైట్ వాచ్మెన్గా విధులు నిర్వహిస్తున్నాను. ఇప్పటికీ వేతనం నెలకు రూ.4 వేలే. కొద్దిపాటి ఆదాయంతో బతకడం కష్టంగా ఉంది. గత పది సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా పెరగలేదు. – జి.రాజా రాంబాబు, నైట్ వాచ్మెన్, ఏలూరు మున్సిపల్/స్కూల్ స్వీపర్లు, శానిటేషన్ వర్కర్లకు ట్రిబ్యునల్ తీర్పు, కౌన్సిల్ తీర్మానాల ప్రకారం జీతాలు పెంచాలి. చాలీచాలని వేతనాలతో ప్రస్తుత రోజుల్లో బతకడం చాలా కష్టంగా ఉంది. చిరు ఉద్యోగులమైన మా పట్ల జాలి, దయ చూపించాలి. –పూతి దుర్గ, శానిటేషన్ వర్కర్, ఏలూరు జిల్లాలోని స్కూల్ స్వీపర్ల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. నెలంతా కష్టపడితే ఇచ్చేది కేవలం రూ.4వేలు మాత్రమే. రోజుకు రూ.133 వేతనంతో ప్రస్తుత రోజుల్లో ఎలా బతకాలో అర్థం కాని పరిస్థితి. – సీహెచ్ లక్ష్మి, స్కూల్ స్వీపర్, ఏలూరు -
టెట్ సందేహాలకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ఏలూరు (ఆర్ఆర్పేట): టెట్ పరీక్షలకు సంబంధించి అభ్యర్థుల కోసం కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎం. వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలకు సంబంధించిన సందేహాలు, సలహాలు, సూచనలు, ఫిర్యాదులు ఇచ్చేందుకు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ను సంప్రదించవచ్చన్నారు. అవసరమైన వారు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ 90523 91111, 95056 44555, 96036 57499 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు. కుక్కునూరు: కుక్కునూరు మండలానికి విద్యుత్ కష్టాలు తీర్చే దిశగా ప్రభుత్వం నూతన విద్యుత్ లైన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు ఆంధ్రప్రదేశ్లో విలీనం అయిన నాటి నుంచి ఈ మండలాలకు జంగారెడ్డిగూడెం 132 కేవీ సబ్స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా జరుగుతుంది. కాగా విద్యుత్ సరఫరా కుక్కునూరు వరకు చేరాలంటే మైసన్నగూడెం, పి నారాయణపురం, రాచన్నగూడెం, వేలేరుపాడు గ్రామాల్లోని 33 కేవీ సబ్స్టేషన్లను దాటుకుని రావాల్సి ఉండడంతో చిన్న గాలికే గంటల తరబడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి విలీన మండలాల వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయమై అల్లూరి జిల్లాలోని ఎటపాక 132 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ నుంచి గోదావరి మీదుగా నూతన విద్యుత్ లైన్ ఏర్పాటు చేసి కరెంట్ సమస్యను పరిష్కరించాలని ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది. దీంతో స్పందించిన ప్రభుత్వం ట్రాన్స్కో సర్వేయర్లను మండలానికి పంపి సర్వే చేయించింది. సర్వే రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం అల్లూరి జిల్లాలోని నెల్లిపాక సబ్స్టేషన్ నుంచి కొత్త 33 కేవీ లైన్ను మంజూరు చేసింది. కాగా ఈ పనులకు త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది. -
అధికారి వస్తున్నారని సెంటు చల్లి..
● లాహం ఫుడ్ ఫ్యాక్టరీ పర్యవేక్షణకు వచ్చిన ఒకే ఒక్క అధికారి ● ముందుగానే తెలిసి ఫ్యాక్టరీ ప్రాంతంలో సెంటుకొట్టిన యాజమాన్యంతణుకు అర్బన్: తణుకు మండలం తేతలి గ్రామ పరిధిలోని లాహం ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రైవేటు లిమిటెట్ సంస్థలో అక్రమ గో పశువధపై కొన్నాళ్లుగా నెలకొన్న వివాదం సంగతి తెలిసిందే. దీనిపై ఇక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ‘సాక్షి’ పత్రిక పలుమార్లు ప్రచురించింది కూడా. తణుకు సజ్జాపురానికి చెందిన బీజేపీ నాయకుడు, ఎలక్ట్రీషియన్ రేపాక సూర్య రామారావు కూడా స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. దీనిని పర్యవేక్షణ చేసేందుకు మంగళవారం పొల్యూషన్ శాఖ అధికారి వస్తున్నారని ముందుగానే సమాచారం తెలుసుకున్న ఫ్యాక్టరీ యాజమాన్యం ఫ్యాక్టరీ లోపల, బయట కూడా శుభ్రం చేయించడమే కాకుండా సెంటు చల్లించారని బాధితులు చెబుతున్నారు. రాత్రి, పగలు ఇక్కడ వస్తున్న దుర్వాసనకు ఇళ్లలో కూడా ఉండలేకపోతున్నామని, అధికారులు, ప్రజాప్రతినిధులు రెండురోజులు తమతో వారి ఇళ్లలో ఉండాలని, అందుకు అయ్యే ఖర్చంతా తామే భరిస్తామని వేడుకొంటున్నారు. పర్యవేక్షణ మొక్కుబడిగా ముఖ్యమంత్రి కార్యాలయానికి అందిన ఫిర్యాదుతో ఏలూరు నుంచి పొల్యూషన్ శాఖ ఫీల్డ్ అసిస్టెంట్ అధికారి ఎన్.వెంకటరమణ వచ్చి ఫిర్యాదుదారుతోపాటు బాధితుల నుంచి సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ వెనుకభాగంలోని పొలాలు, ఫ్యాక్టరీ వెనుక గేటు ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాధితుల సమస్య తెలుసుకున్నానని, ఫ్యాక్టరీ యాజమాన్యానికి 15 రోజుల గడువు ఇచ్చి సమస్యను పరిష్కరించుకునే దిశగా వెళ్లాలని చెప్పనున్నట్లు వివరించారు. కాగా ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదుచేస్తే కేవలం మొక్కుబడిగా ఒకేఒక్క పొల్యూషన్ అధికారిని పంపించారని బాధితులు విమర్శించారు. రాత్రి సమయాల్లో తీవ్ర దుర్వాసన ఫిర్యాది రామారావు మాట్లాడుతూ గత 6నెలల క్రితం ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు పంపానని, నెలరోజుల తరువాత అధికారులు వచ్చి వెళ్లాక సమస్య పరిష్కారం చేసినట్లుగా తనకు సమాచారం వచ్చిందని అన్నారు. సమస్య పరిష్కారం కాకుండా పరిష్కారం అయినట్లుగా మెసేజ్ పంపడంతో మరలా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో పొల్యూషన్ అధికారి వచ్చారని, రాత్రి సమయాల్లో తేతలితోపాటు పైడిపర్రు, తణుకు సజ్జాపురం ప్రాంతాల్లో కూడా దుర్వాసన వస్తుందని చెప్పారు. -
కోకో గింజలు ఆరబెడితే రైతుకు లాభదాయకం
పెదవేగి : కోకో గింజలను ఆర బెడితే గింజల్లో తేమశాతం సమతుల్యంగా ఉంటుందని, దానివల్ల గింజల్లో నాణ్యత పెరిగి రైతుకు లాభదాయకంగా ఉంటుందని విజయరాయి ఉద్యాన శాఖ శాస్త్రవేత్త డాక్టర్ మాధవిలత అన్నారు. పెదవేగి మండలం జగన్నాధపురం, కొండలరావుపాలెం గ్రామాల్లో కోకో రైతులకు మంగళవారం పెదవేగి మండల ఉద్యాన శాఖ అధికారి ఎం.రత్నమాల ఆద్వర్యంలో అవగాహనా సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సుల్లో శాస్త్రవేత్త డాక్టర్ మాధవిలత మాట్లాడుతూ కోకో గింజలను కల్లాల్లో నేలపై టార్ఫాలిన్లు వేసి ఆరబెట్టడం వల్ల గింజ నాణ్యత తగ్గి తూకానికి రాక నష్టాన్ని చవి చూడాల్సి వస్తుందన్నారు. ఇందుకుగాను ఉద్యాన శాఖ అందజేస్తున్న చెక్కతో తయారు చేసిన మినిమల్ ప్రాసెసింగ్ యూనిట్స్ను వినియోగించాలన్నారు. సోలార్ కోకో డ్రయ్యర్లు రూ.లక్షా 40 వేల సబ్సిడీతోను, ప్యాక్ హౌస్లకు రూ. 2 లక్షలు సబ్సిడీ ద్వారా అందజేస్తున్నట్టు మాధవిలత తెలిపారు. చెక్క ప్లాట్పామ్స్ వల్ల గింజల్లో తేమ శాతం కావాల్సినంత ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ఉద్యాన శాఖ సహాయకులు రైతులు పాల్గొన్నారు. -
గిరిజన గ్రామాల్లో బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల గ్రామాల్లో నివసిస్తున్న గిరిజనులకు సైతం బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు అందించేలా కృషి చేస్తున్నామని బీఎస్ఎన్ఎల్ ఆర్జీఎం ఎల్. శ్రీను తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆయన బుట్టాయగూడెంలో విలేకర్లతో మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల ప్రాంతాల్లో 49 బీఎస్ఎన్ఎల్ టవర్లను ఏర్పాటు చేశామన్నారు. ఈ టవర్లు పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారయ్యాయని చెప్పారు. బుట్టాయగూడెం మండలంలోని అటవీప్రాంతంలో ఉన్న తానిగూడెం, వీరన్నపాలెం, రేగులపాడు, రేపల్లె, ఇనుమూరు, తదితర గ్రామాల్లో బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో మరో 35 టవర్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. విలీన మండలాలను సైతం కలుపుకుని అన్ని ప్రాంతాల్లో కూడా బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలను మరింత విస్తృతంగా అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్ సేవలను అందుబాటులో ఉంచామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీజీఎం నలిని, పీజిఎం, డీఈఓపీ, డీఈ 4జీ ఎస్పీ తదితర అధికారులు పాల్గొన్నారు. బీఎస్ఎన్ఎల్ ఆర్జీఎం శ్రీను -
బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం
బుట్టాయగూడెం: స్థానిక బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో మంగళవారం ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు రూ.3 లక్షలు విలువ గల ఎలక్ట్రికల్ పరికరాలు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో బుట్టాయగూడెం మండలంలోని సుమారు 25 బీఎస్ఎన్ఎల్ టవర్ల పరిధిలో సేవలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. అనంతరం సేవల పునరుద్ధరణకు బీఎస్ఎన్ఎల్ అధికారులు చర్యలు తీసుకున్నారు. బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో కాలిపోయిన పరికరాలను ఆర్జీఎమ్, ఏజీఎంతోపాటు ఇతర అధికారులు పరిశీలించారు. రూ. 3 లక్షలు విలువ గల ఎలక్ట్రానిక్స్ పరికరాలు దగ్ధం -
టెట్ అభ్యర్థులకు సూచనలు
ఏలూరు (ఆర్ఆర్పేట): ఈ నెల 10 నుంచి 21వ తేదీ వరకూ నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు హాజరయ్యే అభ్యర్థులకు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ పలు సూచనలు చేశారు. ఈ పరీక్షలు జిల్లాలో రెండు సెంటర్లలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మోడ్లో జరుగుతాయి. హాల్ టికెట్లో అభ్యర్థి పేరు, రిజిస్ట్రేషన్ నంబర్ సరిగ్గా ఉన్నాయో లేదో తనిఖీ చేసుకోవాలి. పరీక్ష ప్రారంభానికి 90 నిమిషాల ముందు అభ్యర్థులను పరీక్షా కేంద్రం లోపలికి అనుమతిస్తారు. హాల్ టికెట్ వెరిఫికేషన్ కోసం కనీసం ఒక ఒరిజినల్, చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు కార్డుతో పాటు సమర్పించాలి. హాల్ టికెట్లో ఫోటో లేని అభ్యర్థి రెండు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజు ఫొటోలను తీసుకురావాలి. అభ్యర్థులు ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను పరీక్ష హాలులోకి తీసుకెళ్లడం పూర్తిగా నిషేధం. పరీక్షా సమయంలో ఏవైనా సాంకేతిక సమస్యలు ఉంటే వెంటనే ఇన్విజిలేటర్కు తెలపాలి. హాల్ టికెట్లో గాని, నామినల్ రోల్లో గాని ఏమైనా తప్పులు ఉంటే సరైన ధ్రువపత్రాలు సంబంధిత డిపార్ట్ మెంటల్ ఆఫీసర్కు అందజేసి సీసీఎన్ఆర్లో నమోదు చేయించుకోవాలి. భీమడోలు: స్థానిక భీమడోలు పోలీస్స్టేషన్లో మంగళవారం రాత్రి వివాహిత ఫిర్యాదు మేరకు గృహహింస కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం.. సూరప్పగూడెంకు చెందిన వినీలకు, ఖమ్మం జిల్లా ఆశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామానికి చెందిన నిర్మల సురేష్తో 15 ఏళ్ల కితం వివాహమైంది. వారికి ఇద్దరు ఆడపిల్లలు. అయితే ఈ ఏడాది జనవరి 28వ తేదీన సురేష్ అనుమానంతో వేధిస్తూ చిత్రహింసలకు గురిచేశాడని, ఇందుకు కుటుంబ సభ్యులు కూడా సహకరించారని వినీల ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై ఆమె అక్కడ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మంగళవారం భీమడోలు పోలీస్స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడంతో సురేష్తో పాటు అతని కుటుంబ సభ్యులపై గృహహింస కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎస్కే మదీనా బాషా తెలిపారు. భీమడోలు: ట్రాన్స్ఫార్మర్లోని రాగి వైరు చోరీపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం ఏలూరుకు చెందిన డాక్టర్ యర్రమిల్లి లక్ష్మీకామేశ్వరికి పొలసానిపల్లి పంచాయతీ శివారు ఆంజనేయనగరంలో ఏడు ఎకరాల కొబ్బరి, ఖోఖో పొలంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఈ నెల 7వ తేదీ రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ట్రాన్స్ఫార్మర్లోని రాగి వైరును అపహరించారు. భీమడోలు ఏఈ శివాజీకి మంగళవారం బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఏఈ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎస్కే మదీనా బాషా తెలిపారు. దెందులూరు: కర్రసాములో ఏపీ చాంపియన్షిష్ – 2025 సింగల్ స్టిక్ (కర్ర) పోటీ విభాగంలో వేగవరం గ్రామానికి చెందిన మోర్ల భగత్ సామ్రాట్ గోల్డ్ మెడల్ సాధించాడు. గుంటూరు జిల్లాలో బుధవారం జరిగిన ఏపీ సౌత్ జోన్ సేలాంబం చాంపియన్షిప్–2025 లో భగత్ తన అద్భుత నైపుణ్యాన్ని ప్రదర్శించి చాంపియన్షిప్ సాధించడం పట్ల కోచ్ వెంకన్న పలువురు అతడిని అభినందించారు. -
కూటమికి పట్టదు.. జనానికి తప్పదు
ద్వారకాతిరుమల: భీమడోలు–ద్వారకాతిరుమల క్షేత్ర ప్రధాన రహదారిలోని సూర్యచంద్రరావుపేట వద్ద రోడ్డు ధ్వంసం కావడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటిని నివారించేందుకు స్థానికులు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు స్వచ్ఛందంగా రహదారికి మరమ్మతులు చేపట్టారు. అయినా సంబంధిత అధికారులు ఆవైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా.. క్షేత్ర ప్రధాన రహదారి ధ్వంసం కావడంతో తరచూ భక్తులు, ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొద్ది నెలల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు పంగిడిగూడెం, లక్ష్మీపురం విర్డ్ ఆస్పత్రి వద్ద రహదారిపై హ్యాష్ ట్యాగ్తో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. అవి ప్రభుత్వాన్ని వేలెత్తి చూపేలా ఉండటంతో గుర్తు తెలియని వ్యక్తులు వాటిని తొలగించారు. ఇదిలా ఉంటే గతనెల 2న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టీస్ జేకే మహేశ్వరి రాకను పురస్కరించుకుని, ముందురోజు ఆర్అండ్బీ అధికారులు భీమడోలు నుంచి ద్వారకాతిరుమల వరకు రోడ్డుపై ఉన్న గోతుల్లో కంకర రాళ్లను వేసి పూడ్చారు. తారు పోయకపోవడంతో ఆ రాళ్లు పైకిలేచి ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. తరచూ సూర్యచంద్రరావుపేట వద్ద మలుపులో ఉన్న గోతుల్లో పడి ద్విచక్ర వాహనదారులు క్షతగాత్రులవుతున్నారు. కార్లు, ఇతర వాహనాలు దెబ్బతింటున్నాయి. ప్రమాదాలను చూడలేక.. ఈ ప్రమాదాలను చూడలేక స్థానికులు ఇటీవల ఎరుపు రంగు పరుపును మలుపులో హెచ్చరికగా ఏర్పాటు చేశారు. గతనెల 22న దాన్ని తప్పించే క్రమంలో ఓ కారు పక్కనే వెళుతున్న ఏలూరు ఆర్టీసీ డిపోకి చెందిన బస్సు మీదకు వెళ్లడంతో, ఆ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన తోటలోకి దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టింది. అయినా ఆర్అండ్బీ అధికారులు ఇప్పటి వరకు ఆ ప్రాంతంలో గోతులను పూడ్చలేదు. దాంతో రెండు రోజుల క్రితం గ్రామస్తులు మలుపు వద్ద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. అలాగే కాంక్రీటుతో ఆ గోతులను పూడ్చి, అటుగా వాహనాలు వెళ్లకుండా కర్రలు పెట్టారు. రోడ్డుపై భక్తులు, ప్రయాణికులు పడుతున్న బాధలను చూసి స్థానికులు చలిస్తున్నారే గానీ.. పాలకులు, అధికారుల్లో మాత్రం చలనం కలగకపోవడం దారుణమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రోడ్లు వేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వంపై, కళ్లకు గంతలు కట్టుకున్న పాలకులు, అధికారులపై భక్తులు, ప్రయాణికులు మండిపడుతున్నారు. అధ్వానంగా ద్వారకాతిరుమల క్షేత్ర ప్రధాన రహదారి తరచూ ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోని అధికారులు విసుగెత్తి స్వచ్ఛందంగా గోతులు పూడ్చుతున్న స్థానికులు -
రతన్టాటా ఇన్నోవేషన్ హబ్తో ఉద్యాన వర్సిటీ ఎంఓయూ
తాడేపల్లిగూడెం: ఉద్యాన పంటల్లో సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు గాను రాజమహేంద్రవరంలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యానవర్సిటీ మంగళవారం ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఉద్యాన వర్సిటీ వెంకట్రామన్నగూడెంలో జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఉద్యాన వర్సిటీ రిజిస్ట్రార్ బి.శ్రీనివాసులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. కలెక్టర్ కీర్తి మాట్లాడుతూ ఉద్యాన పంటల్లో సాంకేతిక పరిజ్ఞానం రైతులకు అందించే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. దీనిలో భాగంగానే ఈ ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. ఉద్యాన ఉత్పత్తులకు బ్రాండింగ్ కల్పించేందుకు తూర్పుగోదావరి జిల్లా ఈ రంగంలో అభివృద్ధి సాధించడానికి ఎంఓయూ ఉపయుక్తంగా ఉంటుందన్నారు. అరటి ఆకుల ఎకో పైబర్, కొబ్బరి పాలు, కొబ్బరి నూనె, జీడిపప్పు వంటి విలువ ఆధారిత ఉత్పత్తులు స్థానిక పరిశ్రమల అభివృద్ధికి దోహదపడుతున్నాయన్నారు. ఉద్యానవర్సిటీ రిజిస్ట్రార్ బి.శ్రీనివాసులు, కె.ధనుంజయరావు పాల్గొన్నారు. -
మద్ది క్షేత్రంలో విశేష పూజలు
జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామి వారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షణలు చేసి, మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన తమలపాకుల (నాగవల్లీ దళములు)తో అష్టోత్తరం పూజలను, అన్నప్రాసనలు, వాహనం పూజలను ఆలయ అర్చకులచే నిర్వహించుకున్నారు. స్వామి వారి దర్శనార్థం వచ్చిన భక్తుల్లో సుమారు 2,295 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు ఆలయ ఈవో ఆర్వీ చందన తెలిపారు. అలాగే స్వామి వారి దేవస్థానానికి వివిధ సేవల రూపేణా రూ.2,20,160 ఆదాయం వచ్చిందన్నారు. సామర్లకోట: జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ ఓపెన్ మీట్లో సామర్లకోటకు చెందిన యాతం నాగబాబు 3 పతకాలు సాధించారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఆది, సోమవారాల్లో ఈ పోటీలు జరిగాయి. ఇందులో 1,500 మీటర్ల పరుగులో ఒక రజతం, 800, 400 మీటర్ల పరుగులో రెండు కాంస్య పతకాలు సాధించారు. ఈ పోటీల్లో 22 రాష్ట్రాల నుంచి 1,254 మంది అథ్లెట్లు పాల్గొన్నారని నాగబాబు ఈ సందర్భంగా తెలిపారు. 2013 నుంచి ఈ ఏడాది వరకూ జరిగిన వివిధ జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ ఓపెన్ మీట్ పరుగు పందెంలో 100, 200, 400, 800, 1,500 మీటర్లతో పాటు రిలే విభాగాల్లో 68 పతకాలు సాధించానని వివరించారు. వీటిలో 20 బంగారు, 23 రజత, 25 కాంస్య పతకాలున్నాయని తెలిపారు. 55 ఏళ్ల వయస్సులోను పతకాలు సాధిస్తున్న నాగబాబును పలువురు అభినందించారు. ఆయన ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వైద్య, ఆరోగ్య శాఖ మలేరియా విభాగంలో పని చేస్తున్నారు. ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా అగ్నిమాపక శాఖ అధికారిగా సీహెచ్ రత్నబాబు బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఏలూరు జిల్లా అగ్నిమాపక అధికారిగా తోట శ్రీనివాసరావు ఇన్చార్జ్గా పనిచేశారు. జిల్లా అగ్నిమాపక అధికారిగా రత్నబాబు గతంలో ఏలూరులో పనిచేశారు. అయితే ఆయనకు రీజనల్ అగ్నిమాపక అధికారిగా ఉద్యోగోన్నతి పొందుతూ... 6 నెలల పాటు ప్రత్యేక శిక్షణకు నాగపూర్కు వెళ్లారు. శిక్షణ అనంతరం ఆయన మరోసారి ఏలూరులో విధుల్లో చేరారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రత్నబాబుకు అగ్నిమాపక సహాయ అధికారి రామకృష్ణ, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. -
డ్వాక్రా మహిళల ఆందోళన
ఆకివీడు: తమకు తెలియకుండా తమ గ్రూపుల పే రున లక్షలాది రూపాయలు కాజేసి, మోసం చేసిన యానిమేటర్పై చర్యలు తీసుకోవాలంటూ డ్వాక్రా మహిళలు సోమవారం స్థానిక జాతీయ రహదారిపై యూనియన్ బ్యాంక్ ఎదుట రాస్తారోకో నిర్వహించారు. 32 గ్రూపులకు చెందిన ఖాతాల్లో సుమారు రూ.62 లక్షలు విత్డ్రా చేసి మోసగించారని, న్యా యం చేయాలని డిమాండ్ చేశారు. ట్రాఫిక్ స్తంభించడంతో ఎస్సై హనుమంతు నాగరాజు ఇక్కడకు వ చ్చి సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. బ్యాంక్ లావాదేవీలను పరిశీలిస్తున్నామని రీజనల్ మేనేజర్ వచ్చి విస్తృత స్థాయి లో విచారణ చేపట్టిన తర్వాత బాధితులకు ఎలా న్యాయం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని ఎస్సైకు బ్యాంక్ మేనేజర్ వివరించారు. ఇదే తరుణంలో స్థానిక సమతానగర్లోని యానిమేటర్ కూడా తమ ఖాతాల్లో సొమ్మును డ్రా చేశారని ఆరోపిస్తూ పలు సంఘాల మహిళలు బ్యాంకు వద్దకు వచ్చారు. -
కోటి ఆశలతో వర్జీనియా సాగు
జంగారెడ్డిగూడెం: కోటి ఆశలతో వర్జీనియా పొగాకు సేద్యానికి రైతన్న సిద్ధమయ్యారు. గతేడాది, ఈ ఏడాది వర్జీనియా పొగాకు చరిత్రలోనే రికార్డు ధరలు లభించడంతో ఉత్సాహంతో సాగుకు శ్రీకారం చుట్టారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది ధర మరింత ఎక్కువ లభించింది. దీంతో రైతులు ఈ ఏడాది మరింత విస్తీర్ణంలో సాగుకు సన్నద్ధమయ్యారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఐదు పొగాకు వేలం కేంద్రాలు ఉన్నాయి. జంగారెడ్డిగూడెం–1, 2, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లి వేలం కేంద్రాలు ఉన్నాయి. ఇప్పటికే రైతులు వర్జీనియా నాట్లు పూర్తి చేసే దశకు చేరుకున్నారు. 2024–2025 సీజన్కు కేజీ అత్యధిక ధర రూ.456 లభించింది. ఎన్ఎల్ఎస్ పరిధిలో సరాసరి ధర రూ. 297.50 కేజీకి లభించింది. 2023–2024 సీజన్కు కేజీకి అత్యధిక ధర రూ.411 లభించగా, సరాసరి ధర రూ.300 లభించింది. రాబోయే సీజన్కు మరింత మంచి ధర లభిస్తుందనే ఆశతో రైతులు వర్జీనియా సాగు చేపట్టారు. వాస్తవానికి ఈ పాటికే నాట్లు పూర్తి కావాల్సి ఉండగా, ఈ ఏడాది వేలం ప్రక్రియ దీర్ఘకాలం కొనసాగడంతో ఆలస్యమైంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్ఎల్ఎస్ పరిధిలో 9267 మంది వర్జీనియా రైతులు 10,516 బ్యారన్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 16,824 ఎకరాల్లో సేద్యం చేసేందుకు నడుం బిగించారు. ఎన్ఎల్ఎస్ పరిధిలో 2526 సీజన్కు 36.96 మి.కిలోల పంటకు పొగాకు బోర్డు అనుమతించింది. ఇప్పటి వరకు 16,524 హెక్టార్లలో నాట్లు పూర్తి చేశారు. దేవరపల్లి వేలం కేంద్రం పరిధిలోకి వచ్చే తూర్పుగోదావరి జిల్లాలోని తొర్రేడు ప్రాంతంలో నల్లరేగడి భూముల్లో పండే పంట కోసం 724 మంది రైతులు 775 బ్యారన్లను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 852 హెక్టార్లలో పంట పండించేందుకు సమాయాత్తమయ్యారు. ఇక్కడ 1.63 మిలియన్ కిలోల పంటకు అనుమతించారు. ఇప్పటి వరకు తొర్రేడు ప్రాంతంలో 418 హెక్టార్లలో నాట్లు వేశారు. వర్జీనియా సాగుకు సేద్యపు ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి. గత ఏడాది కన్నా 10 శాతం ఖర్చులు పెరిగే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. పొలం దుక్కిదున్నిన నాటి నుంచి పచ్చిరొట్ట విత్తనం, దుక్కి, లైనింగ్, నారు, తోట వేసేందుకు కూలీలు, పురుగుమందులు, ఎరువులు, అంతర్గత యాజమాన్యం, కలుపు తీత, కలుపు మందు, ఆకు రెలుపు, బ్యారన్ క్యూరింగ్, కలప, రవాణా, అన్ని రకాల కూలీల ఖర్చులు, బ్యారన్ లీజు అన్ని కలుపుకుని ఏటా ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ ఏడాది ఈ ఖర్చు మరింత పెరుగుతుందని రైతులు చెబుతున్నారు. ఎకరానికి సరాసరిన 10 క్వింటాళ్లు దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. విపరీతంగా పెరిగిన కౌలు, బ్యారన్ లీజు 2025–2026 పంట కాలానికి పొలం కౌలు, బ్యారన్ లీజులు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ ఏడాది వర్జీనియా ధర రికార్డు స్థాయిలో లభించడంతో రైతులు పోటీపడి మరీ కౌలు, బ్యారన్ లీజులు పెంచి మరీ వర్జీనియా సేద్యానికి దిగారు. పొలం కౌలు ఎకరానికి రూ.70 వేలు, రూ.90 వేలు, నేర సారవంతాన్ని బట్టి ఉండగా, బ్యారన్ లీజు రూ.3 లక్షల నుంచి రూ.3.50 లక్షల వరకు పలికింది. వర్జీనియా రైతులంతా ఈ ఏడాది ధరను చూసి కోటి ఆశలతో రానున్న సీజన్కు పంట పండించేందుకు సిద్ధమయ్యారు. వర్జీనియా రైతులు పొగాకు బోర్డు నిర్ణయించిన పంట పరిమితికి మించి పండించరాదు. విదేశాల్లో కూడా వర్జీనియా ఉత్పత్తి పెరిగింది. వినియోగం మాత్రం పెరగలేదు. ఈ ఏడాది ఎక్కువ పంట పండినా విదేశీ ఆర్డర్లు రావడంతో మంచి ధర వచ్చింది. కానీ జింబాబ్వే, బ్రెజిల్ దేశాల్లో వర్జీనియా పంట పెరుగుతోంది. తక్కువ విస్తీర్ణంలో నాణ్యత గత పంట ఎక్కువ దిగుబడి ఇచ్చేలా పండిస్తే లాభదాయకం. ఆర్గానిక్ పద్దతిలో సమతుల ఎరువులు వాడి లోగ్రేడ్ పొగాకు రాకుండా పంట పండిస్తే లాభదాయకం. జీఎల్కే ప్రసాద్, పొగాకు బోర్డు రీజనల్ మేనేజర్ -
జనం చెంతకు గిరిజన ఉత్పత్తులు
బుట్టాయగూడెం: అటవీ ప్రాంతంలో గిరిజనులు సేకరించిన సహజ సిద్ధమైన అటవీ ఉత్పత్తులను ప్రజల చెంతకు చేర్చేందుకు గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ప్రత్యేక కృషి చేస్తుంది. అడవుల్లో గిరిజనులు సేకరించిన ముడి సరుకులను జీసీసీ అధికారులు కొనుగోలు చేసి వాటి ద్వారా రకరకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. తయారు చేసిన ఉత్పత్తులను జీసీసీ ద్వారా ఏర్పాటు చేసిన షాపుల్లో, మొబైల్ వ్యాన్, వారాంతపు సంతల్లో విక్రయిస్తున్నారు. ఎలాంటి రసాయనాలు లేని సరుకులు కావడంతో వీటిని కొనుగోలు చేసేందుకు ఎక్కువ శాతం మంది ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. గిరిజన ఉత్పత్తులకు దేశ వ్యాప్తంగా విశేష ఆదరణ ఉంది. ప్రధానంగా అరకు కాఫీతో పాటు గిరిజన తేనె, త్రిఫల పౌడర్, ఆయిల్, గిరిజన సబ్బులకు మంచి గిరాకీ ఉంది. గిరిజన సహకార సంస్థ కోటరామచంద్రపురం పరిధిలో 26 జీసీసీ చౌక డిపోల్లో గిరిజన ఉత్పత్తులు అమ్మకాలు ఎక్కువగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అటవీ ఉత్పత్తుల విక్రయాలు ఇలా అటవీ ప్రాంతం నుంచి గిరిపుత్రులు సేకరించిన చింతపండు, పుట్ట తేనె, చెట్ల తేనె, నరమామిడి చెక్క, కరక్కాయలు, నల్ల జీడిగింజలు, ముసిడి గింజలు, అడవి ఉసిరి కాయలు, శీకాయలు, కుంకుడు కాయలు వివిధ రకాల పండ్లు సుమారు 30 రకాల వరకూ చిన్న తరహా ఉత్పత్తులు గిరిజన సహకార సంస్థ(జీసీసీ) సేకరిస్తుంది. అరకు కాఫీకి పెరిగిన డిమాండ్ జీసీసీ ద్వారా విక్రమిస్తున్న అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు ఉండడంతో ఈ కాఫీకి డిమాండ్ పెరిగింది. అరకు కాఫీ పశ్చిమ మన్యం ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశ్యంతో జీసీసీ అధికారులు కేఆర్పురం ఐటీడీఏ, బుట్టాయగూడెంలో అరకు కాఫీ విక్రయ షాపులను ఏర్పాటు చేశారు. తాటి బెల్లంతో తయారు చేసిన ఆర్గానిక్ బిస్కెట్లు, ఉండలు ఏర్పాటు చేయడంతో ప్రజలు ఎంతో ఇష్టంగా వాటిని కోనుగోలు చేస్తున్నారు. రూ.19.50 కోట్ల అమ్మకాలు గిరిజన సహకార సంస్థ (జీసీసీ) కేఆర్పురం పరిధిలో గల బుట్టాగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాలతో పాటు సుమారు 26 అటవీ ఉత్పత్తులు, నిత్యవసర సరుకులు విక్రయించే డిపోలు ఉన్నాయి. వీటితో పాటు జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం, ఏలూరు, నర్సాపురం, పాలకొల్లు, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం ప్రాంతాల్లో గిరిజన అటవీ ఉత్పత్తులు షాపుల్లో విక్రయించేలా అధికారులు ఏర్పాటు చేశారు. వీలిలో 2025 –26 ఆర్థిక సంవత్సరానికి రూ.32.54 కోట్ల అమ్మకాలు టార్గెట్ కాగా 2025 డిసెంబర్ వరకూ సుమారు రూ.19.5 కోట్ల అమ్మకాలు జరిగినట్లు జీసీసీ అధికారులు తెలిపారు. మిగిలిన టార్గెట్ మార్చి నెలాఖరుకు పూర్తి చేస్తామని చెబుతున్నారు. అటవీ వస్తువులకు మంచి గిరాకీ జీసీసీ ద్వారా విక్రయిస్తున్న ఉత్పత్తులను ప్రజల చెంతకు చేరేలా కృషి చేస్తున్నాం. కోటరామచంద్రాపురం జీసీసీ పరిధిలోని 26 డిపోల్లో విక్రయాలు చేస్తున్నాం. గిరిజన ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉంది. ఈ ఏడాది సుమారు కేఆర్పురం జీసీసీ ద్వారా అటవీ ఉత్పత్తులు, పెట్రోలు, గ్యాస్ తదితర అన్ని రకాల అమ్మకాలు సుమారు రూ. 19 కోట్ల 50 లక్షల వరకూ జరిగాయి. చెరుకూరి రాజయోగి, కేఆర్పురం జీసీసీ మేనేజర్, బుట్టాయగూడెం మండలం -
రావిపాడులో వైద్య శిబిరం
దెందులూరు: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ద్విచక్ర వాహనదారుడు మృతిచెందాడు. అత్తిలి తేజ (42) సోమవారం గంగన్నగూడెం నుంచి ఏలూరు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగవరం వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న తేజను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అత్తిలి తేజ (42) అక్కడికక్కడే మృతి చెందాడు. పెంటపాడు: సాక్షి పత్రికలో శనివారం ప్రచురితమైన ‘పారిశుద్ధ్యం ఇలా.. ఆరోగ్యం ఎలా’ వార్తకు ఽఅధికారులు స్పందించారు. ముదునూరు వైద్యాధికారులు పూజిత, పవన్కుమార్ ఆధ్వర్యంలో సోమవారం సర్పంచ్ పెన్నాడ సూరిబాబు ఇంటి వద్ద పెన్నాడ, తోట వారి వీధుల్లో వైద్య శిబిరం నిర్వహించారు. జ్వరం అనుమానితుల నుంచి రక్త నమూనాలు సేకరించారు. డ్రెయినేజీ నీటితో కలుషితమైన తాగునీటిని తాగొద్దని, కాచి చల్లార్చిన నీటిని తాగాలని గ్రామంలో ప్రచారం చేశారు. గ్రామంలో ఇంటింటి వైద్య సర్వే కోసం 4 బృందాలను పంపించారు. -
టీడీపీ నేతల శంకుస్థాపనపై ఫిర్యాదు
ద్వారకాతిరుమల: కొందరు టీడీపీ నాయకులు ప్రొటోకాల్ను ఉల్లంఘించి, ఇష్టానుసారంగా పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడంపై వైఎస్సార్సీపీకి చెందిన సత్తాల సర్పంచ్ కొండాబత్తుల సుభద్ర సోమవారం పీజీఆర్ఎస్లో జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్కు ఫిర్యాదు చేశారు. పంచాయతీ సండ్రకుంటలో గత శనివారం ఎంపీడీవో పీవీవీ ప్రకాష్, పంచాయతీ కార్యదర్శి సందీప్ల సమక్షంలో టీడీపీ మండల అధ్యక్షుడు లంకా సత్యనారాయణ, మరికొందరు పంచాయతీ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారని, తనకు ముందు రోజు రాత్రి మొక్కుబడిగా ఫోన్ చేసి ఆహ్వానం పలికారని, ఎంపీపీ బొండాడ మోహినీ వెంకన్నబాబుకు గాని, వార్డు సభ్యులకు గాని కనీసం సమాచారం ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను బలహీన వర్గానికి చెందిన సర్పంచ్ని కావడం వల్లే ఇలా చేశారని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ ఎంపీడీవో, పంచాయితీ కార్యదర్శికి షోకాజ్ నోటీసులు జారీ చేసి, విచారణ జరపాలని డీపీఓని ఆదేశించినట్టు సర్పంచ్ తెలిపారు.గ్రామసభ ద్వారానే స్థలాన్ని నిర్ణయించాలన్న జేసీ -
కనీస వేతనాల కోసం దీక్షలు
ఏలూరు (టూటౌన్): మున్సిపల్ స్కూల్ స్వీపర్లు, శానిటేషన్ వర్కర్లను ఫుల్ టైం వర్కర్లుగా గుర్తించి కనీస వేతనాలు అమలు చే యాలంటూ రిలే దీక్షలు చేపట్టారు. సోమ వారం ఏలూరు నగరపాలక సంస్థ కార్యాల యం వద్ద చేపట్టిన దీక్షలో ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు టి.రామారావు మాట్లాడుతూ స్కూ ల్ స్వీపర్లకు, శానిటేషన్ వర్కర్లకు కనీస వేతనా లు అమలు చేయకపోవడం దారుణమన్నారు. ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ వీరిపై వివక్ష తగదన్నారు. ఐఎఫ్టీయూ నగర ప్రధాన కార్యదర్శి వై.వెంకటేశ్వరరావు మాట్లాడారు. యూనియన్ గౌరవాధ్యక్షుడు, మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.సోమయ్య అ ధ్యక్షత వహించారు. ఐఎఫ్టీయూ నాయకులు పలు సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ప్రజలంతా ధర్మబద్ధులై, దైవ చింతనను అలవర్చుకోవాలని చి త్తూరు జిల్లా ఏర్పేడు శ్రీవ్యాసాశ్రమం పీఠాధి పతి శ్రీ పరిపూర్ణానందగిరి స్వామీజీ హితవు పలికారు. పీఠం ఉత్తరాధికారి శ్రీ అసంఘానంద స్వామీజీతో కలిసి సోమవారం ఆయన స్థానిక పవర్పేటలో గంగానమ్మవార్ల మేడలను సందర్శించారు. జాతర కొలుపుల కమిటీ అధ్యక్షుడు మామిళ్లపల్లి పార్థసారథి, కమిటీ సభ్యులు వారికి మర్యాదపూర్వక స్వాగతం పలికారు. అనంతరం స్వామీజీ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉన్నాడని, ఆ భగవంతుడిని దర్శించడం అంటే ప్రతిఒక్కరిపై ప్రేమ భావం పెంచుకోవడమే అన్నారు. అనంతరం స్వామీజీని కొలుపుల కమిటీ పెద్దలు సత్కరించారు. ఏలూరు (టూటౌన్): ఏలూరు బోధనాస్పత్రి పోస్టుమార్టం విభాగంలో మృతదేహాలను సై తం వదలని దుస్థితి నెలకొందని, భారీగా డ బ్బులు వసూలు చేస్తున్నట్టు వస్తున్న వార్తలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సీపీఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ.రవి సోమవారం ప్రకటనలో డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా ఆస్పత్రి బోధనాస్పత్రిగా మారిన తర్వాత అ త్యంత దారుణంగా మారిందని విమర్శించా రు. చనిపోయిన వ్యక్తి కుటుంబాలు బాధలో ఉంటే పోస్ట్మార్టానికి సంబంధిత వైద్యులు భారీగా డబ్బులు వసూలు చేయడం శోచనీయమన్నారు. అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే పోస్ట్మార్టం ఆలస్యం చేయడం, డెత్ సర్టిఫికెట్ ఇవ్వరనే భయంతో బాధితులు డబ్బులు చెల్లించాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఉపాధ్యాయుడి సస్పెన్షన్భీమవరం అర్బన్: ఇటీవల ఉండి, భీమవరంలో కీచక ఉపాధ్యాయులను సస్పెండ్ చేసిన సంఘటనలు మరువక ముందే మండలంలోని గొల్లవానితిప్ప జెడ్పీ హైస్కూల్లో మరో ఉపాధ్యాయుడు సస్పెన్షన్కు గురయ్యాడు. వివరాలిలా ఉన్నాయి.. గొల్లవానితిప్ప హైస్కూల్లో 192 విద్యార్థులు ఉండగా వారిలో 106 మంది విద్యార్థినులే. 9,10 తరగతులకు గణితం బోధించే ఉపాధ్యాయుడు బోడ సుధీర్బాబు గత 27 రోజుల క్రితం తరగతి గదిలో విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు లైంగికంగా వేధించాడు. విషయాన్ని తల్లిదండ్రులు హెచ్ఎం మల్లికార్జునరావు దృష్టికి తీసుకువెళ్లగా అప్పటినుంచి సుధీర్బాబు విధులకు హాజరు కా వడం లేదు. అయితే ఈ విషయాన్ని జనసేన నాయకులు గుట్టుగా రాజీ చేసేందుకు ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో సుఽధీర్బాబుపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ చిల్లే వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ సురేష్, గ్రామ పెద్దలు డీవైఈఓకు వినతిపత్రం అందించారు. ఇటీవల జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్లో తల్లిదండ్రులు ఈ విషయాన్ని లేవనెత్తారు. దీంతో డీఈఓ ఆదేశాల మేరకు విచారణ చేపట్టారు. ఈనెల 6న నివేదిక అందించడంతో సోమవారం ఉపాధ్యాయుడు సుధీర్బాబును సస్పెండ్ చేసినట్టు డీవైఈఓ రమేష్ తెలిపారు. -
హ్యాండ్బాల్ పోటీలకు ఎంపిక
కామవరపుకోట: జాతీయ స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఆడమిల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎంపికై నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంటా రవిచంద్రమోహన్ సోమవారం తెలిపారు. నవంబర్ 28 నుంచి 30 వరకు చిత్తూరు జిల్లా కలికిరిలో జరిగిన రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ పోటీలలో అండర్ 14 విభాగంలో పాఠశాలకు చెందిన 9 వ తరగతి విద్యార్థిని కొండపర్తి పూజిత విశేష ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు ఈ విద్యార్థిని త్వరలో రాజస్థాన్లో జరగబోయే జాతీయస్థాయి హ్యాండ్బాల్ పోటీలలో పాల్గొననట్లు తెలిపారు. తణుకు అర్బన్: పశ్చిమగోదావరి జిల్లా అండర్ 16, 18, 20 బాలురు, బాలికలు, పురుషులు, సీ్త్రల క్రాస్ కంట్రీ (రోడ్ రన్) జట్ల ఎంపికలు సోమవారం తణుకు డీమార్ట్ ప్రాంతంలో నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి 200 మంది హాజరుకాగా వారిలో అత్యుత్తమ ప్రతిభ చూపిన 22 మందిని ఎంపిక చేసినట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సంకు సూర్యనారాయణ తెలిపారు. పోటీలను అసోసియేషన్ అధ్యక్షుడు చింతకాయల సత్యనారాయణ ప్రారంభించారు. ఎంపికై న జట్లు ఈ నెల 24న పెద్దాపురంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటాయని వివరించారు. ఎంపిక పోటీలను అసోసియేషన్ కోశాధికారి కె.బాబురావు, వ్యాయామ ఉపాధ్యాయురాలు కె.ఈశ్వరి పర్యవేక్షించారు. భీమవరం: భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం శంభాల చిత్ర బృందం సందడి చేసింది. శంభాల సినిమా ఈనెల 25న విడుదలను పురస్కరించుకొని మూవీ ప్రమోషన్లో భాగంగా కళాశాలకు వచ్చిన చిత్ర బృందం విద్యార్థులతో డ్యాన్స్ చేసింది. చిత్ర నిర్మాత రాజశేఖర్ మాట్లాడుతూ తాను ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థినేనని గుర్తు చేశారు. కార్యక్రమంలో చిత్రం హీరో, హీరోయిన్స్ ఆది సాయికుమార్, అర్చన, దర్శకుడు యుగంధర్ ముని తదితరులు పాల్గొన్నారు. నిడమర్రు: ఇటీవల గుణపర్రులో వరుస చోరీల కేసును నిడమర్రు పోలీసులు ఛేదించారు. సోమవారం నిడమర్రు పీఎస్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సీఐ ఎన్.రజనీకుమార్, ఎస్సై ఎస్ఎన్వీవీ రమేష్ కేసు వివరాలు తెలిపారు. గుణపర్రులో సెప్టెంబరు 29 రాత్రి వరుస చోరీలు జరిగాయని, సీసీ పుటేజీ, ఆధునిక సాకేంతికత సహాయంతో నిందితుడిని గుర్తించామన్నారు. అదే గ్రామానికి చెందిన కాకులపాటి పూర్ణ సుభాష్ (26)గా నిందితుడిని గుర్తించారు. సుమారు 6 లక్షల విలువైన 48 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాఽధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఏలూరు (టూటౌన్): ఏలూరు టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2017లో జరిగిన హత్య కేసులో నిందితుడు బత్తిన బ్రహ్మయ్య అలియాస్ రాంబాబుకు 5 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ జిల్లా 2వ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ న్యాయమూర్తి ఇందిరా ప్రియదర్శిని సోమవారం తీర్పు వెలువరించారు. ఈ కేసులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చింతమనేని రమేష్ వాదనలు వినిపించారు. ద్వారకాతిరుమల: తన జీవితం ఆలయ అభివృద్ధికే అంకితమని చినవెంకన్న దేవస్థానం చైర్మన్ ఎస్వీ సుధాకరరావు అన్నారు. సోమవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈవో ఎన్వీఎస్ఎన్ మూర్తి, ఈఈ డీవీ భాస్కర్, డిప్యూటీ ఈవో భద్రాజీ తదితరులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. -
నేరాలకు పాల్పడితే కఠిన చర్యలే
నిందితులను రోడ్డుపై నడిపిస్తూ కోర్టుకు.. ఏలూరు టౌన్: యువతిపై అత్యాచార నిందితులను జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ ఆదేశాలతో డీఎస్పీ డి.శ్రావణ్కుమార్ పర్యవేక్షణలో టూ టౌన్ సీఐ అశోక్కుమార్ ఆధ్వర్యంలో ఎస్సై మధువెంకట రాజా నడిరోడ్డుపై నడిపించుకుంటూ కోర్టుకు తీసుకువెళ్లడం నగరంలో చర్చనీయాంశంగా మారింది. ఏలూరు టూటౌన్ పోలీస్స్టేషన్ నుంచి ఫైర్స్టేషన్, కోర్టు సెంటర్ మీదుగా జిల్లా కోర్టు ప్రాంగణం వరకూ నిందితులు ముగ్గురినీ పోలీస్ బందోబస్తుతో తీసుకువెళ్లి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. నగరంలో సస్పెక్ట్ షీట్ నిందితుడు ఈనెల 4న అర్ధరాత్రి ఓ యువతి ఇంట్లోకి వెళ్లి ఆమెను సమీపంలోని వార్డు సచివాలయానికి లాక్కెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ కేసులో నిందితులు పులిగడ్డ జగదీష్బాబు, లావేటి భవానీకుమార్, వీరికి సహకరించిన కొత్తపేటకు చెందిన ఆకేటి ధనుష్ను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశా రు. అనంతరం ఏలూరులో న్యాయస్థానం ము ందు హాజరుపరిచారు. నగరంలో రౌడీయిజానికి, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదనీ, చట్టం మేరకు కఠిన చర్యలు తప్పవని పోలీస్ అధికారులు హెచ్చరిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ద్వారకాతిరుమల: క్వారీ రాళ్ల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ఎదురుగా వచ్చిన బైక్ను ఢీకొన్న ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని గుండుగొలనుకుంట శివారులో సోమవారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. కామవరపుకోట మండలం వడ్లపల్లికి చెందిన కంచర్ల తనోజ్ కుమార్ (27) ద్వారకాతిరుమల నుంచి బైక్పై స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఘటనా స్థలం వద్దకు వచ్చేసరికి గుండుగొలనుకుంట నుంచి ద్వారకాతిరుమల వైపునకు వెళ్తున్న క్వారీ రాళ్ల లోడు ట్రాక్టర్ బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తనోజ్ కుమార్ తీవ్ర గాయాలు పాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలంలో మృతుడి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ద్వారకాతిరుమల పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉంటే మృతుడు కామవరపుకోటలోని పామాయిల్ కాటా వద్ద గెలలు లోడింగ్ చేసే పని చేస్తున్నాడు. -
ఉద్యోగులకు నరకవేతన
ఏలూరు (మెట్రో): గతనెల 5వ తేదీ.. ఈనెల 8 వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు జమకాలేదు. ప్రతినెలా 1వ తారీఖునే జీతాలు జమచేస్తామన్న కూటమి నాయకుల హామీ లు అమలుకావడం లేదు. నెలంతా కష్టపడినా ప్రతినెలా జీతాల కోసం ఎదురుచూడటం ప్రభుత్వ ఉద్యోగులకు పరిపాటిగా మారింది. దీంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వేలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు అవస్థలు తప్పడం లేదు. ప్రతి నెలా నిర్లక్ష్యమే.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 67 వేల మందికి పైగా ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉన్నారు. ఏలూరు జిల్లా లో 38 వేలు, పశ్చిమగోదావరి జిల్లాలో 29 వేల మంది పలు శాఖల్లో విధులు నిర్వహిస్తున్నారు. వీరితో పాటు సుమారు 20 వేల మందికి పైగా పెన్షనర్లు ఉన్నారు. అలాగే సుమారు 15 వేల మంది అవుట్ సోర్సింగ్, 17 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రతినెలా వీరికి ఒకటో తారీఖున జీతాలు, పెన్షన్లు చెల్లించాల్సి ఉంది. అయితే చంద్రబాబు సర్కారు జీతాల చెల్లింపుల్లో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఒక్కో శాఖకు ఒక్కోలా.. 1వ తేదీన జీతాల చెల్లింపు ప్రక్రియకు చంద్రబాబు ప్రభుత్వం వక్ర భాష్యం చెబుతోంది. అవుట్ సోర్సింగ్, న్యాయశాఖ, పెన్షనర్లకు, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి 1, 3వ తేదీల్లో చెల్లింపులు చేశారు. అయితే రెవెన్యూ, ఇరిగేషన్, జిల్లాపరిషత్, కో–ఆపరేటివ్, బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ ఉద్యోగులు, న్యాయశాఖలో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానాల సిబ్బంది ఇలా పలు శాఖల ఉద్యోగులకు సోమవారం (8వ తేదీ) రాత్రి వరకూ జీతాలు జమ కాలేదు. ఒక్కోశాఖకు ఒక్కో తేదీన చెల్లింపులు చే యడం ఏమిటో ఉద్యోగులకు అర్థం కావడం లేదు. సిబిల్ స్కోర్పై ప్రభావం ప్రస్తుతం ప్రతి వ్యక్తికీ ఆర్థిక క్రమశిక్షణ కీలకంగా మారింది. బ్యాంకులు ఖాతాదారుల పాన్కార్డు ఆధారంగా సిబిల్ స్కోర్ అనేది పరిశీలిస్తున్నారు. రుణాల మంజూరు, ఈఎంఐల చెల్లింపులు, చెక్ బౌన్స్ల తదితరాల ద్వారా సిబిల్ స్కోర్ లెక్కి స్తారు. రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు నిర్వాకంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు సిబిల్ స్కోర్ పడిపోతోంది. ఈఎంఐలకు ఇచ్చిన చెక్లు, రుణాల చెల్లింపులకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో సిబిల్ స్కోర్పై ప్రభావం చూపుతుందని ఉద్యోగులు అంటున్నారు. జీతాలు జమకాక ఖాతాలు ఖాళీగా ఉండటంతో రుణాలకు సంబంధించి బ్యాంకుల్లో ఇచ్చి న చెక్కులు బౌన్స్ అవుతున్నాయని వాపోతున్నా రు. సంవత్సరం చివరి నెల కావడం, క్రిస్మస్ వంటి ప్రధాన పండుగ ఉండటంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగులకు డీఏల చెల్లింపులు, ఇతర ప్ర యోజనాలు అందించడంలో చంద్రబాబు స ర్కారు విఫలమైంది. ఈ నేపథ్యంలో వాటిని ప్రశ్నించడానికి వీలు లేకుండా జీతాలు వస్తే చాలురా ‘బాబూ’ అనే ధోరణికి ప్రభుత్వం తీసుకొస్తోంది. ప్రతి నెలా జీతాల చెల్లింపులో ఆలస్యం కావడం, ఎప్పుడు వస్తాయో తెలియని అయోమయంలో ఉద్యోగులు ఉన్నారు. ఉద్యోగులపై కక్షపూరిత ధోరణిని ప్రభుత్వం అవలంబిస్తోందని ఉద్యోగ సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి. ఇదేం ఖర్మరా బాబూ ! 8వ తేదీ వచ్చినా జీతాలు జమ కాలేదు చరిత్రలో ఎన్నడూ లేదంటున్న ఉద్యోగ సంఘాలు డిఫాల్టర్లుగా మారుతున్న ఉద్యోగులు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేలాది మంది ఎదురుచూపులు రుణాలు సకాలంలో చెల్లించకపోవడంతో ఉ ద్యోగులు డిఫాల్ట్గా మారిపోతున్నారు. బ్యాంకులు ఉద్యోగులకు భవిష్యత్లో రుణాలు మంజూరు చేసే అవకాశమే లేకుండా ప్రభుత్వం చేస్తుంది. గత నెల 6 వచ్చినా జీతాలు జమ కాలేదు. ఈనెల ఇప్పటివరకూ లేవు. నా 33 ఏళ్ల ఉద్యోగ చరిత్రలో ఎన్నడూ ఇలా లేదు. –జి.శ్రీధర్రాజు, జిల్లాపరిషత్ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు ఉద్యోగులు ప్రతి నెలా రుణాలకు ఈఎంఐలు పెట్టుకుంటారు.జీతాలు జమ చేయడంలో ఇలా ఆలస్యం చేయడంతో వారి సిబిల్ స్కోర్పై తీవ్ర ప్రభావం పడుతుంది. దీంతో భవిష్యత్లో రు ణాలు కూడా లభించని పరిస్థితి ఉద్యోగులకు ఎదురవుతుంది. ప్రతి నెలా 1వ తేదీనే జీతాలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలి. –ఆర్ఎస్ హరనాథ్, పీఏఓ రాష్ట్ర అధ్యక్షుడుఈనెల 8వ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాలు చెల్లించపోవడం దారుణం. ప్రతి నెలా జీతాల చెల్లింపులో మాత్రం ప్రభుత్వం ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇప్పటికే పలు రూపాల్లో ఉద్యోగులకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. వాటి కోసం అడగకుండానే జీతాలు కోసం అడగాల్సిన పరిస్థితి. – కె.రమేష్కుమార్, జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు -
గళమెత్తిన సహకార ఉద్యోగులు
ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రంలో సహకార సంఘాల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ రాష్ట్ర సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. సంఘ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సోమవారం స్థానిక జిల్లా సహకార కేంద్ర బ్యాంక్, ఆర్ఆర్పేటలోని డీసీసీబీ బ్రాంచ్ల వద్ద ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ తమ డిమాండ్ల సాధనకు జేఏసీ నిర్ణయించిన అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటామన్నారు. అనంతరం బ్రాంచ్ మేనేజర్లకు వినతిపత్రాలు సమర్పించారు. జిల్లావ్యాప్తంగా డీసీసీబీ శాఖల వద్ద ఉద్యోగులు నిరసనలు తెలిపారు. కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, చాట్రాయి, భీమడోలు, ఆగిరిపల్లి, కామవరపుకోట తదితర బ్రాంచ్ల వద్ద ఆందోళనలు చేసి అధికారులకు విన తిపత్రాలు సమర్పించారు. -
అర్జీల పరిష్కారంపై శ్రద్ధ పెట్టాలి
ఏలూరు(మెట్రో): ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో ప్రజలు సమర్పించిన అర్జీల పరిష్కారానికి అధికారులు శ్రద్ధ పెట్టాలని జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లో సోమవారం జిల్లాస్థాయి పీజీఆర్ఎస్ లో డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, ఆర్డీఓ అచ్యుత అంబరీష్, డీఆర్డీఏ పీడీ ఆర్.విజయరాజు, స్పెషల్ డి ప్యూటీ కలెక్టర్లు ఎం.ముక్కంటి, భాస్కర్, దేవకీదేవి, కార్పొరేషన్ కమిషనర్ ఎ.భానుప్రతాప్, సర్వే ఏడీ అన్సారీతో కలిసి 363 అర్జీలు స్వీకరించారు. అర్జీలను పరిశీలించి నిర్దేశిత గడువులోపు పరిష్కారం చూపాలన్నారు. అర్జీల్లో కొన్ని.. ● జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడేనికి చెందిన ప్రత్తి నాగమణి తనకు వితంతు పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. ● కామవరపుకోట మండలం కళ్లచెరువుకి చెందిన ఉప్పులూరి విజయ తన కుమార్తెకు విభిన్న ప్రతిభావంతుల పెన్షన్ నిలుపుదల చేశారని, న్యాయం చేయాలని కోరారు. ● ముదినేపల్లి మండలం వడలికి చెందిన యార్లగడ్డ లక్ష్మి కనకదుర్గ తన అత్తింటి వారు హింసిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ● కుక్కునూరుకు చెందిన షేక్ సైదాబీ తన భర్త మరణించిన కారణంగా పోలవరం ప్రాజెక్ట్ ఆర్అండ్ఆర్ ప్యాకేజీని తనకు మంజూరు చేయాలనీ కోరారు. ● మండవల్లి మండలం ఇంగిలిపాకలంకకి చెందిన ఘంటసాల విష్ణు తన స్థలాన్ని కబ్జా చేశారని ఫిర్యాదు చేశారు. ● ద్వారతిరుమల మండలం దొరసానిపాడుకి చెందిన రాయపాటి శ్రీనివాసరావు తమ గ్రామంలో రహదారి స్థలాన్ని కొందరు ఆక్రమించి కట్టడాలు చేపడుతున్నారని ఫిర్యాదు చేశారు. -
డివైడర్ను ఢీకొట్టి బోల్తాపడ్డ కారు
ద్వారకాతిరుమల: అడ్డొచ్చిన బైక్ను తప్పించే క్రమంలో ఓ భక్తుడి కారు రోడ్డు మధ్యలోని డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. స్థానిక సంగం డెయిరీ వద్ద సోమవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆకివీడుకు చెందిన ఓ భక్తుడు సోమవారం ద్వారకాతిరుమల చినవెంకన్నను దర్శించి, మొక్కుబడులు తీర్చుకున్నాడు. అనంతరం తన కారులో స్వగ్రామానికి తిరుగు ప్రయాణం అయ్యాడు. ఘటనా స్థలం వద్దకు వచ్చేసరికి ఒక బైక్ అడ్డొచ్చింది. దాన్ని తప్పించే క్రమంలో కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి, రోడ్డు మద్యలో బోల్తా పడింది. జంగారెడ్డిగూడెం: గోకుల తిరుమల పారిజాతగిరి ఈవో కలగర శ్రీనివాస్ అపాయింట్మెంట్, ప్రమోషన్లు తప్పుల తడకగా ఉందని జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన అన్నంరెడ్డి వేణుగోపాలరావు ఆరోపించారు. ఆ మేరకు ఈవోపై దేవదాయ శాఖ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫిర్యాదు కాపీలను విడుదల చేశారు. శ్రీనివాస్ అపాయింట్మెంట్ నుంచి ప్రమోషన్ వరకు అంతా తప్పల తడకగా ఉందని, శ్రీనివాస్ను 2002లో అప్పటి ఆలయ చైర్మన్ పేరిచర్ల జగపతిరాజు జూనియర్ అసిస్టెంట్గా నియమించుకున్నారన్నారు. సర్వీసు రిజిస్టర్లో 1993లో క్లర్క్గా జాయిన్ అయినట్లు నమోదు చేసుకున్నారన్నారు. అప్పటి నుంచి పనిచేస్తున్నట్లుగా జీతం పెంచుకుంటూ వచ్చారన్నారు. శ్రీనివాస్ సర్వీసు రిజిస్టర్లో జగపతిరాజు తప్ప మిగిలిన వారి ఎవరి సంతకాలు లేకపోవడం గమనించాల్సిన విషయమన్నారు. ఆయన సర్వీసుపై విచారణ జరిపించాలన్నారు. ఫిర్యాదు కాపీలను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ తదితరులకు పంపినట్లు తెలిపారు. -
ఉపాధ్యాయులకు వేధింపులు
భీమవరం: ఉపాధ్యాయులు సెలవు రోజున కూడా పనిచేయాలని వేధించడం సరికాదని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.సాయిశ్రీనివాస్ అన్నారు. సోమవారం అంబేడ్కర్ భవన్లో ఎస్టీయు జిల్లా శాఖ 79వ వార్షిక కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు తీవ్రమైన ఒత్తిడితో బోధనేతర పనులు పనిచేస్తున్నప్పటికీ ఆదివారం కూడా పాఠశాలలో పనిచేయాలని వంద రోజుల షెడ్యూల్ అమలు చేయాలని వేధింపులకు గురి చేయడం మానుకోవాలని సాయి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిలు రూ.30 వేల కోట్లు చెల్లించడానికి తక్షణం రోడ్ మ్యాప్ ఇవ్వాలని, 12వ పీఆర్సీ కమిటీని నియమించాలన్నారు. అనంతరం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పీఆర్విఎస్ సాయివర్మ, కెవీ రామచంద్రరావు, ఆర్థిక కార్యదర్శిగా పీవీడి ప్రసాద్, రాష్ట్ర కార్యనిర్వహకులుగా గుత్తుల శ్రీనివాస్, డి దావీదు, తదితరులను ఎన్నుకున్నారు. -
కోటి సంతకాలతో కూటమికి చరమగీతం
గణపవరం: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కూటమి పాలనకు చరమగీతం పా డుతుందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) అన్నారు. సోమవారంమండలంలోని బువ్వనపల్లిలో ఉంగుటూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని మాజీ ఎమ్మెల్యే, పార్టీ పీఏసీ సభ్యుడు పుప్పాల వాసుబాబు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీఎన్నార్ మాట్లాడుతూ పేదలకు ఉచిత వైద్యం, పేద విద్యార్థులకు వైద్యవిద్య అవసరం లేదన్నదే కూటమి ప్రభుత్వ ఉద్దేశమన్నారు. వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన వస్తోందన్నారు. అనుకున్న దాని కన్నా ఎక్కువగా ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చారన్నారు. వైద్యాన్ని పేదలకు దూరం చేసే మోసకారి ప్రభుత్వం మాకొద్దంటూ గళమెత్తుతున్నారని అన్నారు. బీజేపీ వివరణ ఇవ్వాలి ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తే పేదలకు వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణను అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా విమర్శిస్తున్నాయని అయినా బీజేపీ మౌనంగా ఉండటంపై ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యమం ఆగదు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు మాట్లాడుతూ గత అక్టోబర్ 10 నుంచి వైఎస్సార్సీపీ ప్రారంభించిన ఆందోళనలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాయని, ప్రజలంతా మద్దతు పలికారన్నారు. పోస్టర్ ఆవిష్కరణ నుంచి ర్యాలీలు, ధర్నాలు, అధికారులకు వినతి పత్రాల అందజేత, గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమాలకు అనూహ్య స్పందన వచ్చిందన్నారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరించుకునే వరకూ ఉద్యమాన్ని ఆగదని, మరింత తీవ్రతరం చేస్తామన్నారు. బీసీలకే ఎక్కువ నష్టం వైఎస్సార్సీపీ బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నౌడు వెంకటరమణ మాట్లాడుతూ వైద్య కళాశాలలను, వైద్యాన్ని ప్రైవేటుపరం చేస్తే ఎక్కువగా నష్టపోయేది బీసీ వర్గాలేనని, బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి ఈ దుర్మార్గ నిర్ణయాన్ని వ్యతిరేకించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అర్ధవరం రాము, ధనుకొండ ఆదిలక్ష్మి, గంటా శ్రీలక్ష్మి, కనుమాల రామయ్య, జెడ్పీటీసీ దేవారపు సోమలక్ష్మి, కోడే కాశి, కొరిపల్లి జయలక్ష్మి, తుమ్మగుంట రంగాభవాని, నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు దండు రాము, సంకు సత్యకుమార్, మరడ మంగారావు, రావిపాటి సత్యశ్రీనివాస్, పార్టీ సూర్యబలిజ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శెట్టి రాజా, జిల్లా నాయకులు వెజ్జు వెంకటేశ్వరరావు, పుప్పాల గోపి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ -
బకాయిలు వెంటనే చెల్లించాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రంలో ఉపాధ్యాయులకు బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డెమోక్రటిక్ పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ. వెంకటేశ్వర రావు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక డెమోక్రటిక్ పీఆర్టీయూ కార్యాలయంలో ఏలూరు జిల్లా శాఖ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా తలపంటి శ్రీనివాస రావు, ప్రధాన కార్యదర్శిగా శేషపు శ్రీనివాసు, కోశాధికారిగా ఎన్వీకే వీరబాబు, జిల్లా కేంద్రం అధ్యక్షుడిగా రెడ్డి నాగ వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తిరుపతి సందీప్, రాష్ట్ర కార్యదర్శిగా కొత్తపల్లి సూర్యచంద్రరావు, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఆర్.నాగేంద్ర సింగ్, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడిగా గుంపిన గోపి కిషోర్ ఎంపికయ్యారు. -
ఉపాధి హామీ పథకంలో అవినీతి
● అవకతవకలు సరిచేయడానికి వసూళ్లు ● పట్టించుకోని ఉన్నత అధికారులు భీమవరం(ప్రకాశం చౌక్): జాతీయ ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించి నిర్వహించే ఆడిట్ అవినీతి అధికారులకు వరంగా మారింది. ఏడాదిలో జరిగిన పనులకు సంబంధించి ఆడిట్ను ప్రభుత్వం చేపడుతుంది. ఈ ఆడిట్ చేసే కొందరు అధికారులు వసూళ్లు చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారు. గత ఏడాది జిల్లాలో జరిగిన ఉపాధి పనులపై జరిగిన సోషల్ ఆడిట్లో కొందరు డీఆర్పీల అవినీతిపై విచారణ చేసి చర్యలు తీసుకోకుండా వదిలేశారు. దాంతో ఈ ఏడాది కూడా కొందరు ఆడిట్ అధికారులు చేతివాటం చూపుతూ అక్రమ వసూళ్లు మొదలు పెట్టారు. ఆడిట్ సక్రమంగా ఉంటేనే ఉద్యోగం లేకపోతే ఇబ్బంది పడతారంటూ ఫీల్డ్ అసిస్టెంట్లను భయపెట్టి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. 2024–25 ఏడాదికి సంబంధించి జిల్లాలో ఉపాధి హమీ పనులపై సోషల్ ఆడిట్ ప్రారంభించారు. పాలకోడేరు, పెనుగొండ, పోడూరు, పెంటపాడు మండలాలలో ఆడిట్ జరుగుతోంది. ఫీల్డ్ అసిస్టెంట్లు వేసిన మస్తర్లలో తేడాలు, కొట్టివేతలు, పనులు కొలతలు, కూలీల వివరాలు సక్రమంగా లేకపోవడం ఒకరి జాబ్కార్డుపై మరొకరు పనిచేయడం వంటివి అధికారులు గుర్తించి వాటిని సాకుగా చూపించి సరిచేసి సక్రమంగా ఉన్నట్లు చూపడానికి కొందరు అధికారులు ఒక్కో ఫీల్డ్ అసిస్టెంట్ వద్ద రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఆయా మండలాల్లో రూ.2 లక్షల నుంచి రూ.2.50 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఉద్యోగం లేకుండా చేస్తారని భయపడి ఫీల్డ్ అసిస్టెంట్లు అడిగినంతా ఇచ్చుకుంటున్నారు. ఉపాధి పనుల్లో అవకతకల్లో మండల స్థాయిల్లో పనిచేసే కొందరు టీఏల హస్తం కూడా ఉందని, దాంతో వారు కూడా సోషల్ ఆడిట్ అధికారుల అవినీతికి సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఉపాధి హమీ పనుల్లో అవకతవకలు ఉపాధి హమీ పనుల్లో 60 శాతం కూలీలతో పనులు చేసే కార్యక్రమం జరుగుతుంది. కొందరు ఫీల్డ్ అసిస్టెంట్లు పనికి రాని వారి పేరిట మస్తర్లు వేసి డబ్బులు వారి ఖాతాల్లో పడ్డాక పంచుకుంటున్నారు. కొలతల ప్రకారం కాకుండా తక్కువ కొలతలు ఉన్న పనులకు ఎక్కువ కొలతలు చూపించి పనిచేయించడం వల్ల కూలీల సంఖ్య పెంచి మస్తర్లు వేస్తున్నారు. తక్కువ మంది కూలీలు వచ్చినా ఎక్కువ మస్తర్లు వేస్తున్నారు. ఉపాధి పనులు సంబంధించి జరిగే ఆడిట్ సమయంలో గ్రామ సభ నిర్వహించి అక్కడ కూలీల వివరాలు, పనులు గురించి గ్రామస్తుల మధ్య ప్రస్తావిస్తారు. గ్రామ సభల్లో మస్తర్లలో తేడాలు, పెంచిన కొలతలు, ఎక్కువ మస్తర్ల గురించి ప్రస్తావించకుండా రహస్యంగా ఉంచి గ్రామ సభ ముగిస్తున్నారు. జిల్లాలో ఏడాది కాలంలో జరిగిన ఉపాధి హామీ పనులకు సంబంధించి నాలుగు మండలాల్లో ఆడిట్ జరుగుతోంది. ఆడిట్ అధికారులు సక్రమంగా ఆడిట్ చేశారా లేదా ఎక్కడైనా అవినీతికి పాల్పడితే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటాం. –కేసీసీహెచ్ అప్పారావు, డ్వామా పీడీ, భీమవరం


