breaking news
Eluru
-
ఫ్రీ బస్సుతో మా జీవితాలు ఛిన్నాభిన్నం
కై కలూరు: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతో తమ జీవితాలు ఛిన్నాభిన్నమయ్యా యని సీఐటీయూ ఆధ్వర్యంలో నియోజకవర్గం నాలుగు మండలాల ఆటో డ్రైవర్లు ర్యాలీ చేశారు. అనంతరం తహసీల్దారుకు వినతిపత్రం అందించారు. ఏలూరు జిల్లా ఆటో, ట్రాలీ డ్రైవర్స్ యూనియన్(సీఐటీయూ) ప్రధాన కార్యదర్శి జినగం గోపి మాట్లాడుతూ ఫ్రీ బస్సు పథకంతో నష్టపోయిన ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.25,000 అందించాలని డిమాండ్ చేశారు. కరోనా కారణంగా ఇప్పటికే డ్రైవర్లు నష్టపోయారని, ఫైనాన్స్ వాయిదాలు చెల్లించలేక అప్పులు పాలయ్యారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వాహన మిత్ర పథకంలో రూ.10 వేలు ఇవ్వగా తామొస్తే రూ.15 వేలు ఇస్తామని చెప్పిన కూటమి హామీ నెరవేర్చలేదన్నారు. ప్రభుత్వం స్పందించపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ మండలాలకు చెందిన ఫ్రెండ్స్, భరత్, కొండాలమ్మ, శ్యామలాంబ, ఆది వినాయక, భక్తంజనేయ ఆటో వర్కర్ల యూనియన్ల అధ్యక్షులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ఏలూరు (టూటౌన్): విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను ఆపాలని, ప్రజల హక్కును కాపాడాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి.బలరాం డిమాండ్ చేశారు. సీపీఎం పార్టీ జిల్లా విస్తృత సమావేశం కార్యదర్శి వర్గ సభ్యుడు తెల్లం రామకృష్ణ అధ్యక్షతన ఏలూరులో మంగళవారం జరిగింది. సమావేశంలో పలు ప్రజా సమస్యలపై తీర్మానాలు చేశారు. బలరాం మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వెంటనే ఆపాలని, కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు, ప్రతిపక్ష పార్టీ ముక్తకంఠంతో వ్యతిరేకించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రశ్నించడానికి జనసేన పుట్టిందన్న పవన్.. ప్రశ్నిస్తే అణచివేస్తామంటున్న బీజేపీతో కలిసి విశాఖ ఉక్కు పరిశ్రమకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో సీపీఎం కార్యదర్శి వర్గ సభ్యులు డీఎన్వీడీ ప్రసాద్, ఆర్.లింగరాజు, ఎం.నాగమణి, పి రామకృష్ణ, కే శ్రీనివాస్ పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): అంతర్ జిల్లాల బదిలీల కోసం అభ్యర్థనలు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ప్రాసెస్ చేస్తామని, అర్హత, ఆసక్తి కలిగిన ఉపాధ్యాయులు లీప్ యాప్లో అంతర్ జిల్లాల బదిలీల కోసం దరఖాస్తులు సమర్పించవచ్చని జిల్లా విద్యాశాఖాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని దరఖాస్తు ఫారం ప్రింట్ సంబంధిత మండల విద్యాశాఖాధికారికి ఈ నెల 27వ తేదీ వరకూ సమర్పించవచ్చన్నారు. ఏలూరు(ఆర్ఆర్పేట): గణేష్ మండపాలు, నిమజ్జనం రోజున విద్యుత్తు లైన్ల భద్రత, వినియోగంపై ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ప్రమాదాలు సంభవించవని విద్యుత్తు శాఖ ఎస్ఈ పీ.సాల్మన్ రాజు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. అధికారిక విద్యుత్తు కనెక్షన్లు మండపాలకు విద్యుత్తు సరఫరా కోసం అధికారిక తాత్కాలిక కనెక్షన్లు మాత్రమే తీసుకోవాలని, అనధికారిక కనెక్షన్లు లేదా విద్యుత్తు దొంగతనంగా వినియోగించటం చట్టవిరుద్ధమన్నారు. అత్యవసర సమయాల్లో హెల్ప్లైన్ నెంబరు 1912కు ఫోన్ చేయాలన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రంలో ఉపాధ్యాయులకు ప్రభుత్వం బకాయి పడ్డ అన్ని ఆర్థిక ప్రయోజనాలు వెంటనే చెల్లించాలని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ డిమాండ్ చేశారు. స్థానిక యూటీఎఫ్ కేంద్ర కార్యాలయంలో నగర శాఖ అధ్యక్షురాలు షేక్ పర్వీన్ బేగం అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన నగర శాఖ కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రావలసిన ఆర్థిక ప్రయోజనాలు, పీఆర్సీ, డీఎల గురించి వివరించారు. సమావేశంలో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి బీ సుభాషిణి, కోశాధికారి రంగమోహన్ పాల్గొన్నారు. -
● మార్కెట్లో చవితి సందడి
ఊరూవాడా వినాయకచవితి సందడి నెలకొంది. చవితి సామగ్రి విక్రయాలతో జిల్లాలోని మార్కెట్లు కిటకిటలాడాయి. పత్రి, పూలు, పండ్లు, ప్రతిమలు, పూజా ద్రవ్యాల అమ్మకాలు జోరుగా సాగాయి. ఏలూరు నగరంలో పత్రి అమ్మకాలతో బిజీగా ప్రధాన కూడళ్లు ఏలూరులో అమ్మకానికి సిద్ధంగా వినాయకులు ఏలూరులో అమ్మకానికి సిద్ధంగా ఉన్న వినాయకుడు ఏలూరు వన్టౌన్లో పత్రి కొనుగోలు చేస్తూ.. – సాక్షి ఫొటోగ్రాఫర్, ఏలూరువినాయక విగ్రహాన్ని తీసుకువెళ్తున్న భక్తులు -
డిగ్రీ చదువుకు పెరుగుతున్న ఆదరణ
ఏలూరు (ఆర్ఆర్పేట): చదువుకు అంతిమ లక్ష్యం మంచి ఉద్యోగాలు సాధించడమే అన్నట్టుగా యువత ఆలోచనా విధానం మారిపోయింది. ఏ కోర్సులు చేస్తే ఏ ఉద్యోగాలు వస్తాయో? ముందుగానే తెలసుకోవడానికి, అత్యధిక జీతాలు వచ్చే అవకాశాలు ఉన్న కోర్సులను ఎంపిక చేసుకోవడానికి యువత ఆసక్తి చూపుతున్నారు. ప్రధానంగా ఇంజనీరింగ్ కోర్సులతో తక్కువ సమయంలో ఉద్యోగావకాశాలు పొందుతున్న ట్రెండ్ ప్రస్తుతం నడుస్తోంది. అది కూడా కంప్యూటర్ ఆధారిత కోర్సుల వైపే ఎక్కువ మంది దృష్టి సారిస్తున్నారు. అయితే చదువులో వెనుకబడి, ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశ పరీక్షల్లో సరైన ర్యాంకులు సాధించలేకపోయిన వారు తప్పనిసరి పరిస్థితుల్లో డిగ్రీ కోర్సులవైపు వెళ్లక తప్పడం లేదు. అయితే డిగ్రీలో కూడా కొత్త కోర్సులను ప్రవేశపెట్టి డిగ్రీ కోర్సులతో కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సంపాదించేలా విద్యార్థులకు అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం డిగ్రీ ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగుతుండడంతో విద్యార్థులు ఈ కోర్సుల వైపు కూడా అడుగులు వేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. మంగళవారంతో వెబ్ ఆప్షన్ల గడువు ముగియగా, ఈ నెల 29న వెబ్ ఆప్షన్లు మార్చుకునే అవకాశం ఉంటుంది. కొత్త కోర్సుల గురించి తెలియని వారు వాటి గురించి ఆరా తీసి నిపుణుల సలహా మేరకు వెబ్ ఆప్షన్లు మార్చుకోవచ్చు. అందుబాటులోకి ఆనర్స్ డిగ్రీ సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో మార్పులు రావడంతో ఆనర్స్ డిగ్రీ కోర్సులు విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. మూడేళ్ల కాలానికి సాధారణ డిగ్రీ, నాలుగేళ్ల కాలానికి ఆనర్స్ డిగ్రీ సర్టిఫికెట్లు అందుబాటులోకి వచ్చాయి. బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేసి, ఉపాధికి బాటలు వేసే విధంగా కోర్సులను రూపొందించారు. ఈ కోర్సుల్లో భాష, సాంకేతిక నైపుణ్యాలతో పాటు వృత్తి నైపుణ్యాలను పెంచేలా ఇంటర్న్షిప్, పారిశ్రామిక శిక్షణను అంతర్భాగం చేశారు. ఇవి గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు వరంగా మారాయి. సెమిస్టర్ విధానంతో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ప్రభుత్వ కళాశాలల్లోనూ డిగ్రీ కోర్సులు ఆంగ్ల మాధ్యమంలో అందుబాటులో ఉన్నాయి. పదో తరగతి, ఇంటర్మీడియట్ స్థాయిల్లో ఆంగ్ల మాధ్యమంలో చదివిన విద్యార్థులు ఎలాంటి ఇబ్బందీ లేకుండా డిగ్రీలో అదే మాధ్యమాన్ని కొనసాగించవచ్చు. ఆ భాషా నైపుణ్యంతో పాటు భావ వ్యక్తీకరణ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని కార్పొరేట్ కొలువులు సాధించే స్థాయికి చేరుకోవచ్చని విద్యారంగ నిపుణులు తెలుపుతున్నారు. అలాగే సెమిస్టర్ విధానం అమలులోకి రావడం, పరీక్షలు, మూల్యాంకనం ద్వారా విద్యార్థి అభ్యసన స్థాయిని ఎప్పటికప్పుడు అధ్యాపకులు పర్యవేక్షించడం వల్ల విద్యార్థులు ఉత్తమ అవకాశాలను అందుకోవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కంప్యూటర్ ఆధారిత కోర్సులతో కొత్త పుంతలు డిగ్రీలో కంప్యూటర్ ఆధారిత కోర్సులను ప్రవేశపెట్టడంతో డిగ్రీ చదువులు సైతం కొత్త పుంతలు తొక్కుతున్నాయి. సంప్రదాయ కోర్సులతో పాటు కంప్యూటర్ ఆధారిత కోర్సులనూ విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ కోర్సుల్లో చేరి విజయవంతంగా మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే ఇంజనీరింగ్లా నాలుగేళ్ల వరకూ ఆగక్కరలేకుండానే సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించే అవకాశం ఉంటుంది. ఈ మార్పులు గమనించాల్సిందే సంప్రదాయ కోర్సులైన బీఏ, బీఎస్సీ, బీకాం కోర్సుల్లో రాష్ట్ర ఉన్నత విద్యామండలి మార్పులు చేసింది. పీజీలోలా పూర్తిగా ఒక సబ్జెక్టు చదివేలా డిగ్రీ కరిక్యులమ్తోపాటు సిలబస్లో మార్పులు చేసింది. బీఎస్సీ లైఫ్సైన్సెస్లో బోటనీ, జువాలజీ, ఆక్వా కల్చర్, బయోకెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, హోమ్ సైన్స్, న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ కోర్సులతో పాటు బీఎస్సీ ఫిజికల్ సైన్సెస్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్ వంటి ఆధునిక కోర్సులను అందుబాటులోకి తెచ్చింది. బీఏలో ఫైనాన్షియల్ ఎకనామిక్స్, టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరరీ స్టడీస్, తెలుగు భాష–సాహిత్యం, పొలిటికల్ సైన్స్ కోర్సులను తీర్చిదిద్దింది. బీకాంలో జనరల్, కంప్యూటర్ అప్లికేషన్స్ అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, బీబీఏ రిటైల్ ఆపరేషన్స్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. నూతన కోర్సులతో లక్షల వేతనాలతో ఉద్యోగాలు విద్యార్థులను ఆకర్షిస్తున్న వినూత్న కోర్సులు -
పంటు ప్రయాణికులపై బాదుడు
● చించినాడ వంతెన మూసివేతతో పంటుపై పెరిగిన రద్దీ ● జేబులు నింపుకుంటున్న కాంట్రాక్టర్ నరసాపురం: వశిష్ట గోదావరి రేవులో పంటు ప్రయాణికుల నుంచి ఇష్టానుసారం చార్జీలు వసూలు చేస్తున్నారు. పంటు ఎక్కిన ప్రయాణికుల జేబులు గుల్ల చేస్తున్నారు. పంటు కాంట్రాక్టర్ చార్జీలు పెంచి వసూలు చేస్తున్నా అధికారులు మౌనంగా ఉండడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాలను కలుపుతూ యలమంచిలి మండలంలో ఉన్న చించినాడ వంతెన మరమ్మతుల కారణంగా గత నాలుగురోజుల నుంచి మూసేశారు. దీంతో గోదావరి జిల్లాల మధ్య ప్రయాణించడానికి నరసాపురం వశిష్ట గోదావరి రేవు దాటడం తప్ప మరో మార్గం లేదు. దీంతో రేవు వద్ద నాలుగురోజులుగా రద్దీ పెరిగింది. దీనిని పంటు నిర్వాహకులు డబ్బులు దండుకోవడానికి మంచి అవకాశంగా మలుచుకున్నారు. మామూలుగా మోటార్సైకిల్కు రూ.30 వసూలు చేయాలి. నాలుగు చక్రాల వాహనానికి రూ.130 వసూలు చేయాలి. బైక్కు రూ.50 నుంచి రద్దీని బట్టి రూ.100 వరకూ వసూలు చేస్తున్నారు. కారుకు రూ.200 నుంచి రూ.300 వరకూ వసూలు చేస్తున్నారు. వినాయక విగ్రహాలు వంటివి లోడుతో తీసుకెళుతున్న వాహనాలకు రూ.500 వరకూ వసూలు చేస్తున్నారు. రాత్రి 11 గంటల వరకూ పంటు నిర్వహణ ప్రత్యామ్నాయ మార్గం లేక, ప్రయాణికులు పంటులోనే ప్రయాణించాల్సి వస్తోంది. వినాయకచవితి పండుగ నేపథ్యంలో రద్దీ పెరిగింది. దీంతో చార్జీలు పెంచి వసూలు చేస్తూ దండుకుంటున్నారు. రేవులో రెండు పంటులు మాత్రమే నడపడానికి అనుమతి ఉంది. రేవు నిర్వాహకులు ప్రమాదకర పరిస్థితుల్లో ఏకంగా మూడు పంటులు తిప్పుతున్నారు. పంటుపై పరిమితికి మించి జనాలను ఎక్కిస్తున్నారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా రాత్రి పూట పంటు తిప్పడానికి అనుమతిలేకున్నా, రాత్రి 11 గంటల వరకూ కూడా పంటు నడుపుతున్నారు. పంటుపై లైఫ్ జాకెట్లు లాంటి రక్షణ పరికరాలు సరిపడా లేకుండా ప్రయాణికుల భద్రతను గాలికొదిలేశారు. సొమ్ములు దోచుకుంటున్నా.. అధికారులు ఉలుకూపలుకూ లేకుండా ఉండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోజుకు ప్రయాణికుల నుంచి గత నాలుగు రోజులుగా రూ.10 లక్షల వరకూ అదనంగా దోచుకున్నట్లు సమాచారం. అధికారులకు ఈ మొత్తంలో 20 శాతం వరకూ ముట్టజెప్పుతున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. -
కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి
సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. అంగన్వాడీకు నెలకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి. టార్గెట్ల పేరుతో అంగన్వాడీలను తీవ్రంగా వేధిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అంగన్వాడీలపై వేధింపులు తక్షణం ఆపాలి. లేని పక్షంలో వారికి అండగా సీఐటీయూ పోరాటం చేస్తుంది. – డీఎన్విడి ప్రసాద్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ప్రస్తుతం చెల్లిస్తున్న చాలీ చాలని వేతనాలు, మరో పక్క పెరిగిన నిత్యావసరాల ధరలతో అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఫేస్ క్యాప్చర్తో నిమిత్తం లేకుండా రేషన్ అందించే వెసులుబాటును అధికారులు కల్పించాలి. నెట్, సిగ్నల్స్ లేకపోవడం, సర్వర్ పనిచేయకపోవడం వల్ల లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. – పి.సుజాత, అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలు గత కాలపు సమ్మె ఒప్పందాలను తక్షణం అమలు చేయాలి. గ్రాట్యూటీ కోసం ఇచ్చిన జీవోల్లో మార్పులు చేయాలి. పాత ఫోన్లలో రెగ్యులర్గా చేయాల్సిన యాప్ల అప్లోడ్తో అవస్థలు పడుతున్నాం. అసలు ఫోన్లలో లేని స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్ర యాప్లను అధికారులు చేయిస్తున్నారు. మరో పక్క పాత ఫోన్లలో పీడీఎఫ్ ఫైల్స్ ఓపెన్ కావడం లేదు. – పి.భారతి, అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి -
అంగన్వాడీల సమస్యలు పట్టవా?
ఏలూరు (టూటౌన్): సమస్యలు పరిష్కరించాలని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అయినా పాలకులు పట్టించుకోకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, గత సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతున్నారు. 2014 తర్వాత కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీలకు వేతనాలు పెంచలేదని గుర్తు చేస్తున్నారు. గత సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలు తక్షణం అమలు చేయాలని కోరుతున్నారు. పనిచేయని సెల్ఫోన్లతో ఎలా పనిచేయాలి? పనిచేయని సెల్ ఫోన్లతో ఎలా విధులు నిర్వర్తించాలని ప్రశ్నిస్తున్నారు. పని భారం విపరీతంగా పెంచిన ప్రభుత్వాలు వేతనాలు మాత్రం పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచడానికి మీన మేషాలు లెక్కిస్తున్నాయని విమర్శిస్తున్నారు. గ్రాట్యుటీ కోసం ఇచ్చిన జీవోలో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కనీస వేతనం నెలకు రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. సెల్ఫోన్ల అప్పగింత ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల వ్యాప్తంగా పెద్ద ఎత్తున అంగన్వాడీలు పనిచేయని తమ సెల్ఫోన్లను ఐసీడీఎస్ కార్యాలయాల్లో అప్పగించారు. కొత్త ఫోన్లు ఇవ్వాలని లేదంటే యాప్లు రద్దు చేయాలని వేడుకుంటున్నారు. యాప్లపై కనీస శిక్షణ ఇవ్వకుండా, యాప్లు సపోర్టు చేసే ఫోన్లు అందించకుండా మెడపై కత్తి పెట్టి పని చేయమంటే ఎలా చేసేదంటూ ఆక్రోశిస్తున్నారు. అంగన్వాడీలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన రెండు యాప్లలో అప్లోడ్ చేయాల్సి ఉంది. సిగ్నల్స్ పనిచేయక, పాత ఫోన్లు కావడంతో అప్లోడ్ చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 3,851 మంది అంగన్వాడీలు ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలో మొత్తం 3,851 మంది అంగన్వాడీలు పనిచేస్తున్నారు. అదే సంఖ్యలో సహాయకులు పనిచేస్తున్నారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా పది ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 2,225 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 1,959 మెయిన్ సెంటర్లు, 206 మినీ సెంటర్లు ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఏడు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 1626 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా వీటిలో 1556 మెయిన్ సెంటర్లు, 70 మినీ సెంటర్లు పనిచేస్తున్నాయి. లబ్ధిదారులకు ఇబ్బందులు ఫేస్ క్యాప్చర్ అయితేనే లబ్ధిదారులకి ఆహారం ఇవ్వాలి. దీని వల్ల లబ్ధిదారులు నష్టపోతున్నారు. గతంలో కుటుంబంలో ఎవరు వచ్చినా ఇవ్వడానికి ఉండేది. ఇప్పుడు లబ్ధిదారురాలు మాత్రం వస్తేనే ఇవ్వాలి.. ఒకపక్క కేంద్ర ప్రభుత్వం ఐసీడీఎస్కు నిధులు తగ్గించుకుంటూ పోతుంది. నాణ్యమైన ఆహారం ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వం నిధులు తగ్గించుకోవడం కోసం లబ్ధిదారులకు పౌష్టికాహారంపై కోత పెడుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీల ఆందోళన కొత్త ఫోన్లు ఇస్తేనే పనిచేయగలమంటున్న అంగన్వాడీలు -
హెచ్ఐవీ నియంత్రణకు కృషి చేయాలి
గంజాయి నిందితుల అరెస్టు పెదపాడు మండలం కలపర్రు టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీల్లో గంజాయిని గుర్తించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2లో uఏలూరు(మెట్రో): హెచ్ఐవీ వ్యాప్తిని అరికట్టేందుకు సంబంధింత శాఖల అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలులో జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 8,680 మందిని హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులుగా గుర్తించారని, వారికి ఆ వ్యాధి ఎవరి నుంచి సోకిందో మూల కారణాలు తెలుసుకుని, వారికి కూడా ఏఆర్టి చికిత్స అందించినప్పుడే వ్యాధి వ్యాప్తిని అరికట్టగలమన్నారు. వ్యాధిగ్రస్తులు మధ్యలో చికిత్స మానేయకుండా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో వైద్యశాఖాధికారి పి.జె.అమృతం, ఐసీడీఎస్ పీడీ శారద తదితరులు పాల్గొన్నారు. అనంతరం హెచ్ఐవీ నియంత్రణపై గోడ పత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. కిశోర వికాసం కార్యక్రమంలో కౌమార దశలో ఉన్న బాలికలకు వారి హక్కులు, భద్రతలపై అవగాహన కలిగించాలని కలెక్టర్ సూచించారు. కిశోర వికాసం కార్యక్రమంలో తీసుకోవాల్సిన అంశాలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని పేర్కొన్నారు. -
ఆటోలకు క్యూఆర్ డిజిటల్ స్టిక్కర్లు
ఏలూరు టౌన్: ఏలూరు నగరంలోని ఆటోలకు ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్తో కూడిన డిజిటల్ స్టిక్కర్లను జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ చేతుల మీదుగా ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో అందజేశారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో మంగళవారం ఆటోలకు డిజిటల్ స్టిక్కర్లు, డ్రైవర్లకు గుర్తింపు కార్డుల మంజూరు కార్యక్రమాన్ని ట్రాఫిక్ సీఐ లక్ష్మణరావు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. నగరంలోని సుమారు 2 వేల ఆటోలకు క్యూఆర్ కోడ్ డిజిటల్ స్టిక్కర్లు, ఆటో డ్రైవర్లకు గుర్తింపు కార్డులు అందజేశారు. నగరంలో సుమారుగా 4 వేల ఆటోలు ఉండగా, తొలి దశలో రెండువేల ఆటోలకు డిజిటల్ స్టిక్కర్లు అందించేలా చర్యలు చేపట్టామని ఎస్పీ స్పష్టం చేశారు. డ్రైవర్లు క్యూఆర్ కోడ్తో కూడిన డిజిటల్ స్టిక్కర్లు పొందేందుకు వెంటనే ట్రాఫిక్ పోలీసులను సంప్రదించాలని చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు సెప్టెంబర్ నెలాఖరు వరకూ గడువు ఇస్తున్నామన్నారు. కొందరు డ్రైవర్లు ట్రాఫిక్కు అంతరాయం కలిగించేలా రోడ్లపైనే ఆటోలను నిలుపుదల చేస్తున్నారని, ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్ చెప్పారు. ఆటో డ్రైవర్లకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. -
గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్
పెదపాడు: గంజాయి రవాణా చేస్తున్న నిందితులను అరెస్టు చేశామని, మరికొంతమందిని త్వరలో పట్టుకుంటామని నూజివీడు డీఎస్పీ కేవీవీఎన్వీ ప్రసాద్ తెలిపారు. ఆగస్టు 25న కలపర్రు టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులు ఓ వ్యానులో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ వాహనంలో ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని దర్వాసి గ్రామానికి చెందిన మహ్మద్ రాజు, మహ్మద్ ఇమ్రాన్లను అరెస్ట్ చేశారు. హైదరాబాదుకు చెందిన వహీద్ఖాన్ చెప్పిన ప్రకారం రాజమండ్రి దగ్గరలోని కోరుకొండ డొంక వద్ద ఉన్న గుమ్మాలదొడ్డి గ్రామానికి వెళ్లి అక్కడ వంతల గాసీరామ్ అందించిన 65 కేజీల గంజాయిని తీసుకుని హైదరాబాద్ తరలిస్తున్నట్లు నిందితులు అంగీకరించారు. మహ్మద్ రాజు 2014లో కొవ్వూరు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ స్టేషన్లో కేసు నమోదు కావడంతో 2015లో సంబంధిత కేసుల్లో తొమ్మిది సంవత్సరాలు రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించి 2024లో విడుదలయ్యాడు. మిగిలిన ముద్దాయిలను కూడా రాజమండ్రి, విశాఖ ఏజెన్సీలో ఉన్నట్లు గుర్తించామని వారిని పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో హెచ్సీ సుదర్శన్, పీసీలు కృష్ణప్రసాద్, నరసింహరావు, నాగార్జున పాల్గొన్నారు.కొయ్యలగూడెం: పిచ్చికుక్క స్వైర విహారం చేయడంతో మంగళవారం పలువురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వాటర్ ట్యాంక్ రామాలయం ప్రాంతంలో అలిమేలు శ్రీనివాస్ అనే వృద్ధుడిపై తొలుత నల్లగా ఉండే కుక్క ఒకటి దాడి చేసి శరీరంపై పలుచోట్ల తీవ్రంగా కరిచింది. దీంతో రక్తస్రావంతో పడి ఉన్న శ్రీనివాసుని స్థానికులు ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లి జాయిన్ చేశారు. అదే కుక్క కన్నాపురం రోడ్డులో చిట్టిబాబు, వీరబాబు అనే ఇద్దరు యువకులపై కూడా దాడి చేసి గాయపరిచింది. మొత్తంగా మంగళవారం ఒక్క రోజునే ప్రభుత్వాస్పత్రిలో కుక్క కరవడం వల్ల ఎనిమిది మంది వ్యక్తులు చికిత్స తీసుకున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. నూజివీడు: చెల్లని చెక్కు కేసులో నూజివీడు మండలం రావిచర్లకు చెందిన పురాణం రామలక్ష్మికి ఆరు నెలల జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానా విధిస్తూ నూజివీడు స్పెషల్ మెజిస్ట్రేట్ వేల్పుల కృష్ణమూరి మంగళవారం తీర్పును వెలువరించారు. పట్టణానికి చెందిన మద్దిరాల కోటేశ్వరరావు రామలక్ష్మికి 2020 ఆగస్టు 20న రూ.5లక్షలు, 2021 ఫిబ్రవరిలో రూ.4 లక్షలు అప్పుగా ఇచ్చాడు. ఆ తరువాత బాకీ తీర్మానం నిమిత్తం 2022 ఫిబ్రవరి 4న రామలక్ష్మి రూ.9 లక్షలకు కోటేశ్వరరావుకు చెక్కును ఇచ్చారు. ఆ చెక్కును నగదు నిమిత్తం బ్యాంకులో వేయగా రామలక్ష్మి ఎక్కౌంట్లో నగదు లేదని చెక్కును వెనక్కు తిప్పి పంపారు. దీనిపై కోటేశ్వరరావు కోర్టులో కేసు వేయగా న్యాయమూర్తి జైలుశిక్ష, జరిమానా విధించారు. చెల్లని చెక్కు కేసులో నూజివీడుకు చెందిన పెనిమల నాగమల్లేశ్వరరావుకు ఆరు నెలల జైలు శిక్ష, రూ.7లక్షల జరిమానా విధిస్తూ నూజివీడు స్పెషల్ మెజిస్ట్రేట్ వేల్పుల కృష్ణమూరి మంగళవారం తీర్పును వెలువరించారు. పట్టణానికి చెందిన నెల్లిమర్ల విఘ్నేశ్వరరావు 2019 డిసెంబరు 18న నాగమల్లేశ్వరరావుకు రూ.7లక్షలు, అప్పుగా ఇచ్చారు. ఆ తరువాత బాకీ తీర్మానం నిమిత్తం నాగమల్లేశ్వరరావు రూ. 6లక్షలకు చెక్కును ఇచ్చారు. ఆ చెక్కును నగదు నిమిత్తం బ్యాంకులో వేయగా అకౌంట్లో నగదు లేదని చెక్కును వెనక్కు తిప్పి పంపారు. దీనిపై విఘ్నేశ్వరరావు కోర్టులో కేసు వేయగా న్యాయమూర్తి జైలుశిక్ష, జరిమానా విధించారు. -
కలెక్టరేట్ తరలింపును అడ్డుకుంటాం
భీమవరం: భీమవరం నుంచి కలెక్టరేట్ను తరలించే ప్రయత్నాలను వైఎస్సార్సీపీ అడ్డుకుంటుందని, కలెక్టరేట్ను తరలించాలని చూస్తే ప్రజా ఉద్యమం చేపడతామని వైఎస్సార్సీపీ నాయకులు స్పష్టం చేశారు. మంగళవారం రాయలంలోని వైఎస్సార్సీపీ భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు నివాసంలో విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, వెంకటరాయుడు, పార్టీ నరసాపురం పార్లమెంట్ ఇన్చార్జ్ గూడూరి ఉమాబాల మాట్లాడారు. అప్పట్లో అన్ని నియోజకవర్గాల ప్రజాప్రతినిధుల ఆమోదంతో భీమవరం జిల్లా కేంద్రంగా ఏర్పడితే నేడు తరలించే ప్రయత్నాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తాయన్నారు. కలెక్టరేట్ భవన నిర్మాణాలకు 20 ఎకరాల భూమి, రూ.100 కోట్ల నిధులు మంజూరు జరిగితే ఎందుకు మార్చాలని చూస్తున్నారో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే దురుద్దేశంతోనే మార్పు అంశం తెరపైకి తీసుకువచ్చారని ఆరోపించారు. కాళ్ల మండలం పెదఅమిరం గ్రామంలో ట్యాంక్ పోరంబోకు స్థలంలో కలెక్టరేట్ భవనాల నిర్మాణ ప్రతిపాదించడం నిబంధనలకు, సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. కలెక్టరేట్ తరలింపు వ్యవహారంపై స్థానిక ఎమ్మెల్యే నోరు మెదకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కామన నాగేశ్వరరావు, జెడ్పీటీసీ కాండ్రేగుల నర్సింహరావు, ఎంపీపీ పేరిచర్ల విజయనర్సింహరాజు, పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సులో ఆటో డ్రైవర్ల భిక్షాటన
పోలవరం రూరల్: మహిళలకు ఉచిత బస్సు పథకం ఆటో కార్మికుల పాలిట శాపంగా మారిందంటూ ఆటో డ్రైవర్లు ఆర్టీసీ బస్సుల్లో భిక్షాటన చేసి నిరసన తెలిపారు. ఏలూరు జిల్లా పోలవరంలో మంగళవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. పోలవరం ఏటిగట్టు సెంటర్లో నిరసన తెలుపుతూ ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని డిప్యూటీ తహసీల్దార్ కె.శ్రీనివాస్కు వినతిపత్రం సమర్పించారు.ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతంలో పోలవరం ప్రాజెక్టు పేరుతో ముంపు గ్రామాలను ఇతర మండలాలకు తరలించారని, ఆ ప్రాంతానికి ఆటోల రాకపోకలు నిలిచిపోయాయని చెప్పారు. మిగిలిన ప్రాంతాల్లో ఉచిత బస్సులు తిరుగుతుండటంతో ఆటోలు ఎక్కేవారు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు.మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు తమ పరిస్థితి ఉందన్నారు. ఈఎంఐలు, ఆటో అద్దెలు, కుటుంబ పోషణ తదితర సమస్యలతో అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం ఆటో డ్రైవర్లు, ఓనర్లకు న్యాయం చేయకపోతే రోడ్డున పడే పరిస్థితి ఉందన్నారు. -
టీడీపీ నేతల అడ్డాగా ఫెర్రీ
యలమంచిలి: పశ్చిమ గోదావరి జిల్లా అబ్బిరాజుపాలెం, అంబేడ్కర్ కోనసీమ జిల్లా సోంపల్లి గ్రామాల మధ్య గోదావరిలో పడవ ప్రయాణానికి అనుమతి లేకపోయిన టీడీపీ నాయకులు దౌర్జన్యంగా పడవలు నడుపుతున్నారు. అనధికారికంగా పడవలు తిప్పుతూ కనీస వసతులు కల్పించడం లేదు. సోమవారం ఒక పడవపై పదుల సంఖ్యలో మోటార్ సైకిల్స్ వేసి పడవ నడిపారు. పడవలో ఉన్న వారికి కనీసం లైఫ్ జాకెట్స్ ఇవ్వలేదు. దీనిపై ఇద్దరు ప్రయాణికులు అడిగిన పాపానికి వారిపై టీడీపీ నాయకుడు విచక్షణా రహితంగా దాడి చేశాడు. లైఫ్ జాకెట్స్ ఉండవు.. చస్తామనే భయముంటే పడవ ఎక్కకండి అంటూ వారిపై విరుచుకుపడ్డాడు. దీంతో ఆ ఇద్దరి యువకులు రాజోలు పోలీస్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వరదకు ముందు నుంచే.. ఒకవైపు వరద.. మరో వైపు మరమ్మతుల పేరిట చించినాడ వంతెనపై రాకపోకలకు ఆంక్షలు. దీంతో కోనసీమ జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో పడవ ప్రయాణాన్ని ఆశ్రయిస్తున్నారు. మండల పరిషత్ అధీనంలో ఉన్న దొడ్డిపట్ల ఫెర్రీకి మాత్రమే పంటు నడపడానికి అనుమతి ఉంది. పంచాయతీ అధీనంలో ఉన్న అబ్బిరాజుపాలెం ఫెర్రీకి రెండు నెలల క్రితమే ఫెర్రీ పాట గడువు ముగిసింది. ఇదే అదునుగా తెలుగుదేశం నాయకులు మంత్రి ద్వారా అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి పాట పెట్టకుండా అనధికారికంగా ఈ ఫెర్రీలో పడవలు నడుపుతున్నారు. కనీస రక్షణ చర్యలు లేకుండా పడవలపై అధిక లోడు వేసి నడపడంపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా పట్టించుకోవడం లేదు. మంత్రి నడుపుకోమన్నారు ఈ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జరిగిన గ్రామ సభలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులను గ్రామస్తులు ఫెర్రీ పాట పెట్టకుండా పడవలు ఎలా నడుపుతున్నారని ప్రశ్నించారు. రేవులో నడుపుతున్న పడవలకు పంచాయతీకి సంబంధం లేదని సర్పంచ్, గ్రామ కార్యదర్శి చెప్పగా, అక్కడే ఉన్న తెలుగుదేశం నాయకులు మంత్రి నిమ్మల రామానాయుడు నడపమని చెప్పడంతో మేమే నడుపుతున్నాం అని చెప్పారు. మంత్రి పేరు చెప్పడంతో మిగిలిన వారు మిన్నకుండిపోయారు. వరద సమయంలో కనీస రక్షణ చర్యలు లేకుండా, అనుమతి లేకుండా ఫెర్రీలో పడవలు నడుపుతున్నా పంచాయతీరాజ్, రెవెన్యూ, కన్సర్జెన్సీ అధికారులు పట్టించుకోకపోవడం వెనుక భారీగా ముడుపులు అందడమే కాకుండా మంత్రి ఒత్తిడి కూడా ఉందని గ్రామస్తులు గుసగుసలాడుతున్నారు. అనుమతులు లేకుండా అబ్బిరాజుపాలెం రేవులో పడవలపై రాకపోకలు మంత్రి అండతోనే నడుపుతున్నామంటున్న నాయకులు తెలిసినా పట్టించుకోని అధికారులు -
పైసలిస్తేనే ఆపరేషన్లు
● తణుకు పీపీ యూనిట్లో నిర్వాకం ● కు.ని. ఆపరేషన్లకు రూ.500 నుంచి రూ.1000 ఇవ్వాల్సిందే తణుకు అర్బన్: తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోవాలంటే చేయి తడపాల్సిందే.. వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించిన పీపీ యూనిట్ విభాగంలో నిర్వహిస్తున్న కుటుంబ నియంత్రణ (కు.ని.) శస్త్రచికిత్సల్లో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయ. కు.ని. ఆపరేషన్ చేయాలంటే రూ.500 ఇవ్వాలని, ఆపరేషన్ చేయడానికి కొంచెం సమయం ఎక్కువైతే మరొక రూ.500 ఇవ్వాలని వైద్యసిబ్బంది డిమాండ్ చేస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. గత జూన్లో బదిలీపై వచ్చిన వైద్యురాలు తమ వైద్య సిబ్బంది ద్వారా ఈ తరహాలో డబ్బులు వసూలు చేస్తున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శస్త్రచికిత్సలు పూర్తయిన తరువాత వైద్యసిబ్బంది వచ్చి డబ్బులు వసూలు చేసి వైద్యురాలికి ఇస్తున్నట్లుగా బాధితులు చెబుతున్నారు. మందులు అక్కడే కొనాలి.. పీపీ యూనిట్ విభాగంలో కుని శస్త్రచికిత్సకు వచ్చిన వారు సదరు వైద్యురాలి ప్రైవేటు ప్రాక్టీస్గా ఉన్న ఆస్పత్రిలోని మందుల దుకాణంలోనే మందులు కొనుగోలు చేయాల్సివస్తుందని బాధితులు చెబుతున్నారు. జిల్లా కేంద్ర ఆస్పత్రికి ఎదురుగా కూతవేటు దూరంలో ఉన్న ఒక ప్రైవేటు ఆస్పత్రిలోని మందుల దుకాణం నుంచి మందులు తీసుకువచ్చిన తరువాత శస్త్రచికిత్స చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. శస్త్రచికిత్సలకు వచ్చిన వారికి వైద్యురాలు తన ప్రైవేటు ఆస్పత్రి పేరుమీద ఉన్న విజిటింగ్ కార్డును ఇచ్చి అక్కడ మాత్రమే మందులు కొనుగోలు చేయాలని చెబుతుండడం విశేషం. ఏదైనా తేడా వస్తే ఏదోక కొర్రీలు వేసి డిశ్చార్జ్ను జాప్యం చేస్తారని బాధితులు వాపోతున్నారు. కు.ని. శస్త్రచికిత్సలకు సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత నిర్లక్ష్య ధోరణి కనబరుస్తున్నారు. కూటమి ప్రభుత్వం జనాభా పెంచాలనే యోచనలో కుని శస్త్రచికిత్సలపై పట్టు వదిలేసిన దుస్థితి. గతంలో ప్రతి పీహెచ్సీలో కుని శస్త్రచికిత్సలు చేయాలంటూ వైద్యులకు టార్గెట్లు పెట్టి మరీ చేయించే పరిస్థితి ఉండేది. నేడు అలాంటి పరిస్థితి లేకపోవడంతో కొందరు వైద్యులు నిర్లక్ష్య ధోరణిని అవలంభిస్తూ ఇదే అదనుగా అవినీతి మార్గంలో అందినకాడికి దోచేసుకుంటున్నారని వైద్యసిబ్బంది సైతం చెబుతున్నారు. కొందరు వైద్యులు అవినీతికి పాల్పడుతున్నా, విధుల్లో అలసత్వం వహిస్తున్నా వైద్యారోగ్య శాఖ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి అవినీతి ఎన్నడూ లేదని వైద్యసేవలన్నీ పారదర్శకంగా జరిగేవని రోగులు చెబుతున్నారు. వైద్య సిబ్బందికి రూ. 500 ఫోన్ పే ప్రైవేటు ఆస్పత్రిలో మందుల కొనుగోలు బిల్లు నా భార్యకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించేందుకు ఆస్పత్రిలోని పీపీ యూనిట్ విభాగంలోని వైద్యురాలిని సంప్రదించగా సోమవారం శస్త్రచికిత్స చేస్తామని రమ్మన్నారు. వచ్చిన తరువాత వైద్యురాలు మందులు చీటీ రాసి ఆస్పత్రికి ఎదురుగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రిలోని మందుల దుకాణంలోనే మందులు కొనాలని చెప్పారు. వైద్యురాలి పేరుతోనే ఉన్న విజిటింగ్ కార్డు ఇచ్చారు. శస్త్రచికిత్స అనంతరం వైద్యసిబ్బంది వచ్చి రూ.500 ఇమ్మంటే ఇచ్చాను. ఆ తరువాత ఆపరేషన్ సమయంలో మత్తు రెండోసారి ఇవ్వాల్సి వచ్చిందని.. మరో రూ. 500 ఇమ్మంటే వైద్యసిబ్బంది నెంబరుకు ఫోన్పే ద్వారా చెల్లించాను. – అంజిబాబు, వేలివెన్ను, ఉండ్రాజవరం మండలం -
కూటమిలో డిష్యూం.. డిష్యూం
ఆకివీడు: మండలంలోని అజ్జమూరు జనార్థనస్వామి దేవస్థానం నూతన కమిటీ ప్రమాణస్వీకారం రసాభాసగా ముగిసింది. దేవస్థాన కమిటీ చైర్మన్ పదవిని జనసేనకు కేటాయించారు. చైర్మన్గా నాని, డైరెక్టర్లు ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో బీజేపీ మండల అధ్యక్షురాలు ముదునూరి నాగమణి అభ్యంతరం చెప్పారు. తమకు తెలియకుండా బోర్డును ఎన్నుకోవడం సమంజసం కాదన్నారు. నియామకంలో తమకు ఎందుకు ప్రాతినిధ్యం కల్పించలేదని నిలదీశారు. మరో బీజేపీ నాయకుడు వర్ధినేని లక్ష్మీ వర ప్రసాద్ మాట్లాడుతూ చైర్మన్ పదవిని రూ.3 లక్షలకు కొనుగోలు చేశారనే ఆరోపణలు గ్రామంలో వెల్లువెత్తుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాణం చేయడానికి తాను సిద్ధమని అన్నారు. హిందూ దేవాలయాల్లో అన్య మతస్తుల్ని నియమించకూడదన్న నిబంధన ఎందుకు పాటించలేదని ప్రసాద్ నిలదీశారు. మతం తీసుకున్న వ్యక్తులు హిందూ దేవాలయ కమిటీల్లో ఉండకూడదని పట్టుబట్టారు. దీనిపై చర్యలు తీసుకోకపోతే దేవాలయ శాఖ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తానని హెచ్చరించారు. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకదశలో జనసేన నియోజకవర్గ ఇన్చార్జి జుత్తిగ నాగరాజు బీజేపీ నాయకుడు వర ప్రసాద్పై మండిపడ్డారు. ఇలాంటి వారిపై ఎందుకు చర్య తీసుకోరని బీజేపీ మండల అధ్యక్షురాల్ని ప్రశ్నించారు. తమకు తెలియకుండా బోర్డు వేయడం తప్పు కాదా! అని ఆమె ఎదురు ప్రశ్నవేశారు. ఇరు పార్టీల నాయకుల మధ్య వాగ్వాదం పెరగడంతో గ్రామ పెద్దలు కలుగజేసుకుని సర్దిచెప్పారు. రసాభాసగా అజ్జమూరు దేవస్థాన కమిటీ ప్రమాణస్వీకారం -
ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా వేధింపులు
కై కలూరు: గ్రామ ప్రథమ పౌరుడైన సర్పంచ్గా తనకు ఏ మాత్రం గౌరవం లేకుండా కూటమి సానుభూతిపరులతో ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమని నత్తగళ్లుపాడు సర్పంచ్ ముంగర రామకృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు. కై కలూరులో విలేకరుల సమావేశంలో సోమవారం మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ పాలనలో జగనన్న లేఅవుట్లో 42 మంది పేదలకు నత్తగుళ్లపాడులో స్థలాలకు 3 ఎకరాలు రూ.40 లక్షలతో పూడిక చేశానన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటి స్థలాలను పంపిణీ చేయడం లేదన్నారు. దీని సమీపంలో 37, 38 39, 40 సర్వే నెంబర్లలో కొల్లేరు అభయార్యణంలో అక్రమ చేపల సాగు చేస్తోన్నారన్నారు. అన్ని అనుమతులతో పూడ్చిన భూమిని పంపిణి చేయని అధికారులు అక్రమ సాగుపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అక్రమ సాగు సమస్యలపై అర్రజీ ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. కూటమి పార్టీకి చెందిన బలే ఏసురాజు తనపై కక్ష కట్టారని.. తన వాహనాల టైర్లను అతని సానుభూతిపరులు ధ్వంసం చేశారన్నారు. కొల్లేరులో ఏసు బుక్ రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు. నత్తగుళ్లపాడు సర్పంచ్ ఆవేదన -
మిగులు భూములు పంచాలంటూ ధర్నా
ఏలూరు (టూటౌన్): మిగులు భూములను గిరిజన, దళిత, పేదలకు పంచాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం ఏలూరు కలెక్టరేట్ వద్ద మహాధర్నా నిర్వహించారు. భూ సమస్యలు ఎదుర్కొంటున్నటు గిరిజనులు, దళితులు, పేదలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నినాదాలు చేశారు. ధర్నానుద్దేశించి సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బి.బలరాం, జిల్లా కార్యదర్శి ఎ.రవి మాట్లాడారు. జిల్లాలోని అన్నిరకాల భూ సమస్యలు పరిష్కరించాలని, 1/70 చట్టం అమలు చేయాలని, ఎల్టీఆర్, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని, అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని అర్హులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అమలు చేయాలని, 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని, నిర్వాసిత కాలనీల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలని, కొల్లేరును 3వ కాంటూరుకు కుదించాలని డిమాండ్ చేశారు. కొల్లేరులో జిరాయితీ భూములు పేదలకు పంచాలని, ప్రభుత్వ భూములను కొల్లేరు ప్రజలకు పంచాలని కోరారు. అనంతరం కలెక్టర్కి వినతిపత్రం సమర్పించారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు ఎం.నాగమణి, సభ్యులు డీఎన్వీడీ ప్రసాద్, ఆర్.లింగరాజు, పిల్లి రామకృష్ణ, కె.శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు. -
పీజీఆర్ఎస్కు వినతుల వెల్లువ
ఏలూరు(మెట్రో): ఏలూరు కలెక్టరేట్లో సోమ వారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 411 అర్జీలను కలెక్టర్ కె.వెట్రిసెల్వి స్వీకరించారు. అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులను ఆదేశించారు. జేసీ పి.ధాత్రిరెడ్డి, డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, ఆర్డీఓ యం.అచ్యుత అంబరీష్ తదితరులు పాల్గొన్నారు. అర్జీల్లో కొన్ని.. ● ఏలూరు మండలం పత్తేబాద వృద్ధాశ్రమం నివాసి గంధం అంజయ్య తన కాలుకు ఆపరేషన్ చేయించుకునేందుకు సహకారం అందించాలని కోరారు. ● మండవల్లి మండలం అల్లినగరం చెందిన జుజ్జవరపుపాల్ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు. తనకు కొన్ని నెలలుగా జీతం రావడం లేదని, పరిష్కారం చూపాలని అర్జీ అందించారు. ● చింతలపూడి మండలం యర్రగుంటపల్లి చెందిన కొల్లి నర్సారెడ్డి తమ గ్రామంలోని 9వ వార్డులో డ్రెయిన్లు లేక ఇబ్బంది పడుతున్నామని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ● కై కలూరు మండలం ఆటపాక చెందిన తోట శ్రీనివాస నాయుడు తమ రహదారికి అడ్డంగా కరెంటు స్తంభాలు ఉన్నాయని తొలగించాలని విద్యుత్ శాఖ అధికారులను కోరితే డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ● కలిదిండి మండలం మూలలంకకు చెందిన ఎస్ఎన్వీ సత్యనారాయణ తమ గ్రామంలో విద్యుత్ తీగలు కిందకు వేలాడుతున్నాయని, చర్యలు తీసుకోవాలని అర్జీ అందజేశారు. -
దివ్యాంగుల ఉసురు పోసుకుంటున్నారు
ఏలూరు (టూటౌన్): సాఫీగా అందుతున్న పింఛన్లను రీ వెరిఫికేషన్ పేరిట తొలగించి పాలకులు మా ఉసురు పోసుకుంటున్నారని దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దివ్యాంగ పింఛన్ల తొలగింపును నిరసిస్తూ సోమవారం కలెక్టరేట్ వద్ద దివ్యాంగులు ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్కి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు మామిడిపల్లి నాగభూషణం మాట్లాడుతూ పుట్టుకతో వికలాంగులమైన తాము గత 20, 30 ఏళ్ల నుంచి మెడికల్ బోర్డు అథారిటీ మంజూరు చేసినా మెడికల్ సర్టిఫికెట్ను కొనసాగిస్తున్నామన్నారు. అయితే తాజాగా సదరం సర్టిఫికెట్ పేరుతో కొత్త విధానాన్ని తీసుకువచ్చి పుట్టుకతో తమ వైకల్య శాతాన్ని తక్కువ చేసి చూపడం అన్యాయమన్నారు. దీంతో తాము పింఛన్లతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు, పథకాలకు దూరమవుతామని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లావ్యాప్తంగా నాలుగు వేలకుపైగా పింఛన్లు తొలగించడం దుర్మార్గమన్నారు. కూటమి ప్రభుత్యానికి పింఛన్ల కోత విధించేందుకు దివ్యాంగులే కనిపించారా అంటూ నిలదీశారు. 2010లో ఇచ్చిన సదరం సర్టిఫికెట్లు ఆధారంగా తమ పింఛన్లు కొనసాగించాలని డిమాండ్ చేశారు. పెద్ద సంఖ్యలో దివ్యాంగులు పాల్గొన్నారు. -
దివ్యాంగుల పింఛన్ల తొలగింపు దుర్మార్గం
కామవరపుకోట: ఎలాంటి ఆధారం లేకుండా జీవనం సాగిస్తున్న దివ్యాంగుల పింఛన్లు తొలగించం దుర్మార్గమని వైఎస్సార్సీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంభం విజయరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం పింఛన్ల తొలగింపునకు నిరసనగా మండల కన్వీనర్ రాయంకుల సత్యనారాయణ ఆధ్వర్యంలో వాహన ర్యాలీ నిర్వహించారు. మండలవ్యాప్తంగా పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్థానిక కొత్తూరు బంగ్లా నుంచి ఎంపీడీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ నిరసన తెలిపి ఏఓ సత్యవేణికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విజయరాజు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా కూటమి ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్లు తీసివేసి వారి ఉసురు కట్టుకుందన్నారు. కూటమి ప్రభుత్వం దివ్యాంగులను నిలువునా మోసం చేసిందన్నారు. ఇది హేయమైన చర్య అని, ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విజయరాజు డిమాండ్ చేశారు. వైస్ ఎంపీపీలు తమ్మిశెట్టి గిరిజ, కనికెళ్లి రత్నకుమారి, ఎంపీటీసీలు బొల్లు సత్యనారాయణ, మేడంకి పద్మావతి, కనుమూరి అంజిరెడ్డి, ఉప్పలపాటి సాయిబాబు, మహ్మద్ కరీముల్లా, దేవరపల్లి రామ్మోహన్రావు, సాయిన కనక రాజు, గుర్రాల రవికుమార్ నారాయణరాజు, జిల్లా వైద్య విభాగం అధ్యక్షుడు కె.రామకృష్ణ, జిల్లా అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలు సాయిల స్వాతి, నియోజకవర్గ దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు చొక్క నాగరాజు, రుద్రపాక నాగ మల్లేశ్వరావు, కనుమూరి ప్రసాద్ రెడ్డి, ఘంటా భాస్కారావు, టౌన్ ప్రెసిడెంట్ నానాది సాగర్, అంకాలపాడు, ఉప్పలపాడు నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
‘గ్రీన్ఫీల్డ్’ భూ నిర్వాసితుల గళం
ఏలూరు (టూటౌన్): గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని, సర్వీసు రోడ్లను పునరుద్ధరించాలని కోరుతూ బాధిత రైతులు సోమవారం కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం కలెక్టర్ వెట్రిసెల్వికి వినతి పత్రం అందజేశారు. రైతులకు పరిహారం పెంచి ఇవ్వాలని, 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్చేశారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ మా ట్లాడారు. ఈనెల 4న కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను హైవే అథారిటీ అధికారులు, భూసేకరణ అధికారులు తుంగలోకి తొక్కడం దారుణమన్నారు. గ్రీన్ఫీల్డ్ హైవేకు సర్వీస్ రోడ్డు లేకపోవడం వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. సర్వీస్ రోడ్లను తారు రోడ్లుగా నిర్మాణం చేయాలని కోరారు. వచ్చేనెల 2న జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవే దిగ్బంధన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పారు. భూసేకరణలో అతి తక్కువ పరిహారం ఇవ్వడం వలన రైతులు నష్టపోయారని న్యాయం చేయాలని కోరారు. వందనపు సాయిబాబా, గోలి నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నరసాపురం : నరసాపురంలో వశిష్ట గోదావరి శాంతించింది. నాలుగు రోజులుగా ఉధృతంగా ప్రవహించగా సోమవారం నీటిమట్టం భారీగా తగ్గింది. అలాగే వలంధర్రేవు, లలితాంబఘా ట్, పడవలరేవు ప్రాంతాల్లో నీటిమట్టం సా ధారణ స్థాయికి చేరింది. పడవలరేవులో ఐదు రోజులుగా నిలిచిపోయిన పంటు రాకపోకలు పునరుద్ధరించారు. దీంతో పెద్ద ఎత్తున జనం పంటుపై రాకపోకలు సాగించారు. -
మారని పోలీసుల తీరు
సాక్షి ప్రతినిధి,ఏలూరు: తప్పుడు కేసులు.. అక్రమ అరెస్టులు.. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి ఇష్టానుసారంగా కేసుల పేరుతో వేధింపులు.. మరీ కోపం తారాస్థాయికి చేరితే థర్డ్ డిగ్రీ పేరుతో పోలీస్ ట్రీట్మెంట్.. ఇది ప్రస్తుతం ఏలూరు జిల్లాలో సాగుతున్న పోలీసింగ్. అక్రమ అరెస్టులపై న్యాయస్థానాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా పోలీసుల తీరు మారకపోవడం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఇదే తరహాలో ఒక కేసు విషయంలో పెదవేగి ఎస్సైపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేసి మెమో జారీ చేశారు. మళ్లీ అదే ఎస్సైకి అలాంటి కేసు విషయంలోనే మెమో జారీ చేయడంతో పాటు చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా ఎస్పీని ఆదేశించడం పోలీస్ శాఖలో హాట్టాఫిక్గా మారింది. విమర్శలకు తావిస్తూ.. దెందులూరు నియోజకవర్గంలో పోలీసుల తీరు విమర్శలకు తావిస్తుంది. అధికార పార్టీకి పూర్తిగా దాసోహమై అడ్డగోలు కేసులు, సంబంధం లేని వ్యక్తులను స్టేషన్కు పిలిచి కౌన్సెలింగ్లు ఇవ్వడం, అక్రమ అరెస్టులకు కేంద్రంగా మారింది. వ్యక్తిగత వివాదాలు పార్టీ రంగు పూసి వేధించడం, సివిల్ వ్యవహారాల్లోనూ అధికార పార్టీ నేతల ఆదేశాలతో తలొగ్గి పనిచేయడం తరచూ వివాదాస్పదమవుతోంది. చేపల చెరువుల్లో చేపలు పట్టుకోవడానికి రక్షణ కల్పించమని హైకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకుని మరీ చేపలు పట్టే పరిస్థితులు కొన్నిచోట్ల ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. తాజాగా మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి నివాసం వద్ద టీడీపీ, వైఎస్సార్సీపీ శ్రేణుల మధ్య కొనసాగిన ఉద్రిక్తత వాతావరణంలో 15 మందిపై కేసులు నమోదు చేశారు. జిల్లాపరిషత్ వైస్ చైర్మన్తో పాటు ముఖ్యనేతలు, మరికొందరు నాయకులు వీరిలో ఉన్నారు. వీరిలో ఏలూరు రూరల్ మండలం చాటపర్రు సర్పంచ్ గుడిపూడి రఘు ఏ15గా ఉన్నారు. శనివారం ఉదయం ఏలూరు రూరల్ పోలీసులు హడావుడిగా ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రానికి పెదపాడు పోలీస్స్టేషన్కు మార్చారు. ఆదివారం న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా అక్రమ అరెస్టుపై ఆగ్రహం వ్యక్తం చేసి ఎస్సై రామకృష్ణకు మెమో జారీ చేశారు. అలాగే చర్యలు తీసుకోవాల్సిందిగా ఎస్పీని ఆదేశించారు. కట్చేస్తే.. రఘును శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలో మధ్యాహ్నం కుటుంబసభ్యులు, కొందరు పార్టీ నాయకులు పోలీస్స్టేషన్కు చేరుకుని రఘును చూడటానికి పోలీసులతో మాట్లాడానికి ప్రయత్నించగా నిరాకరించారు. పోలీసుల తీరుపై కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు పోలీస్స్టేషన్ వద్ద ఉన్న కుటుంబసభ్యులు, వైఎస్సార్సీపీ నేతలపై సోమవారం ఏలూరు వన్టౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. సర్పంచ్ రఘు తల్లి మార్తమ్మ, భార్య జ్యోతి, సోదరుడు రాజేష్తో పాటు స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు అప్పనప్రసాద్, ముంగర సంజీవ్కుమార్, బత్తుల ఏసురాజులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పదేపదే అక్రమ కేసుల నమోదు సరికొత్త వేధింపులకు తెర తీసిన వైనం పెదవేగి ఎస్సైకు గతంలో మెమో జారీ చేసిన న్యాయమూర్తి మళ్లీ రెండోసారి మెమో జారీ న్యాయస్థానాలు మందలిస్తున్నా మారని నైజం చాటపర్రు సర్పంచ్ కుటుంబ సభ్యులపైనా కేసులు పోలీసులు ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని అరెస్టు చేస్తే అతని తల్లి, తమ్ముడు, భార్య రాకూడదా..? కుటుంబ సభ్యులకు కాకుండా ఇంక ఎవరికి బాధ్యత ఉంటుంది. ఎవరు రావాలి.. ఎవరు రాకూడదనే విషయంపై ఏమైనా నిబంధనలు ఉన్నాయా. తాను బాధ్యత గల సర్పంచ్గా ఉన్నాను. నా తరఫున క్షేమం కోరి కుటుంబసభ్యులు, ప్రజాప్రతినిధులు, స్నేహితులు వస్తారు ఇదెలా తప్పు అవుతుంది. – గుడిపూడి రఘు, చాటపర్రు సర్పంచ్ -
సెల్ టవర్ ఎక్కి హల్చల్
కొయ్యలగూడెం: కొయ్యలగూడెంలో సెల్ టవర్ ఎక్కి ఓ యువకుడు హల్చల్ చేశాడు. టి.అయ్యప్ప అనే యువకుడు అశోక్నగర్లో నివసిస్తున్నాడు. సోమవారం వేకువజామున కొవ్వూరు రోడ్డులోని బీఎస్ఎన్ఎల్ టవర్పైకి ఎక్కి గ్రామ పెద్దలకు ఫోన్ చేసి గ్రామ సమస్యలు పరిష్కరించకపోవడంతో తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ మెసేజ్లు పెట్టడంతో పాటు ఫోన్లు కూడా చేశాడు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు, పోలవరం ఇన్స్పెక్టర్ బాల సురేష్బాబు, కొయ్యలగూడెం ఎస్సై చంద్రశేఖర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన అయ్యప్పకు నచ్చజెప్పి కిందకు దించారు. తర్వాత అతడికి కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబసభ్యులకు అప్పగించారు. గ్రామంలో పలు సమస్యలు ఉన్నాయని సీసీ రోడ్లు, డ్రెయిన్లు నిర్మించాలని, ఆలయాల సొమ్ము దుర్వినియోగం అవుతుందని వీటిపై గ్రామ పెద్దలు పట్టించుకోకపోవడంతో మనస్తాపంతో తాను ఆత్మహత్యకు యత్నించినట్టు అయ్యప్ప అధికారులకు వివరించాడు. -
శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ సోమవారం సందర్శించారు. సతీసమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆ యనకు దేవస్థానం అధికారులు మర్యాద పూ ర్వకంగా స్వాగతం పలికారు. న్యాయమూర్తి స్వామి, అమ్మవార్లను దర్శించి, ప్రత్యేక పూ జలు చేయించారు. పండితులు ఆయనకు శ్రీవారి శేష వస్త్రాన్ని కప్పి వేద ఆశీర్వచనాన్ని పలకగా, ఆలయ ఈఓ ఎన్వీ సత్యనారాయణమూర్తి స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. న్యాయమూర్తి వెంట భీమడోలు కోర్టు జడ్జి ఎస్.ప్రియదర్శిని నూతక్కి, ఏఈఓ పి.నటరాజారావు ఉన్నారు. ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయ హుండీల ఆదాయాన్ని సోమ వారం లెక్కించారు. శ్రీవారికి విశేష ఆదా యం సమకూరింది. 38 రోజులకు నగదు రూ పంలో రూ.3,61,54,678లు, 261 గ్రాముల బంగారం, 6.834 కిలోల వెండితో పాటు అధికంగా విదేశీ కరెన్సీ లభించిందని ఆలయ ఈఓ ఎన్వీ సత్యనారాయణమూర్తి తెలిపారు. అలా గే రద్దయిన పాత రూ.2,000, రూ.1,000, రూ.500 నోట్ల ద్వారా రూ.67 వేలు లభించిందన్నారు. ఆగిరిపల్లి: ఆగిరిపల్లి మూడు రోజులుగా రోడ్లపై పేరుకుపోయిన చెత్తను పారిశుద్ధ్య కార్మికులు తొలగించారు. పారిశుద్ధ్య కార్మికులకు జులై నెల జీతాలు, ఐదు నెలల నుండి పెంచిన జీతాలు ఇవ్వకపోవడంతో వారు మూడు రోజుల నుంచి విధుల్లో పాల్గొనడం లేదు. దీంతో రోడ్లపై చెత్త పేరుకుపోయింది. దీనిపై ఆదివారం ‘సాక్షి’లో ‘వీధుల్లో ఎక్కడ చెత్త అక్కడే’ శీర్షికన కథనం ప్రచురించగా పంచా యతీ ఇన్చార్జి కార్యదర్శి లక్ష్మి స్పందించారు. పారిశుద్ధ్య కార్మికులతో రోడ్లపై చెత్తను తొలగించారు. పారిశుద్ధ్య కార్మికుల జీతాల బుధవారం అందిస్తామని, బకాయిలను రెండు నెలల్లో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మెగా డీఎస్సీ–2025 అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ను ఈనెల 28న ఉదయం ఏలూరు సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించనున్నట్టు డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు. అభ్యర్థులు తమ లాగిన్కు వచ్చిన కాపీలను డౌన్లోడ్ చేసుకుని, సంబంధిత సర్టిఫికెట్లు, డీఎస్సీ హాల్టికెట్ కాపీ, ఆధార్ కార్డు, ఐదు పాస్పోర్టు ఫొటోలు తీసుకురావాలని సూచించారు. అభ్యర్థులు ముందుగా తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను ఏపీడీఎస్సీ సైట్లో అప్లోడ్ చేయాలన్నారు. మరిన్ని వివరాలకు హెల్ప్లైన్ 903073444, 905239111 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఏలూరు(మెట్రో) : వినాయకచవితి ఉత్సవాల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని కలెక్టర్ కె.వెట్రిసెల్విఆదేశించారు. వినాయకచవితి ఉత్సవాలు, ఎరువులు సరఫరా అంశాలపై కలెక్టరేట్ నుంచి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఆమె సమీక్షించారు. బాణాసంచా అనధికార నిల్వలపై ప్రత్యేక ని ఘా పెట్టాలన్నారు. జిల్లాలో ఎవరైనా యూరి యా ఎరువులు, డీఏపీ అక్రమంగా నిల్వ ఉంచి కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవన్నారు. అర్హులెవరికీ పెన్షన్ తొలగించరు అర్హులైన దివ్యాంగులు ఎవరికీ పింఛన్లు తొలగించరని కలెక్టర్ అన్నారు. తమకు నోటీసులు అందాయని దివ్యాంగులు కలెక్టర్ వద్ద బోరుమనగా విచారణ చేసి అర్హులకు యథాతథంగా పింఛన్లు ఇస్తామన్నారు -
సర్కార్పై ఆగ్రహం
సాక్షి, అమరావతి/సాక్షి, రాజమహేంద్రవరం/ఏలూరు (టూటౌన్)/శ్రీకాకుళం పాత బస్టాండ్ : సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, ఆంక్షలు లేకుండా తల్లికి వందనం అందించాలని, హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్ వద్ద ధర్నాకు వచ్చిన విద్యార్థులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. నిరసనకు అనుమతి లేదంటూ ఒక్కసారిగా విద్యార్థులపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు.అక్కడి నుంచి వెళ్లిపోవాలని బెదిరింపులకు దిగారు. దొరికినవారిని దొరికినట్లు రోడ్డు పక్కకు ఈడ్చిపారేశారు. లాఠీలతో కొట్టారు. కొందరిని గొంతు పట్టుకుని తోసేయడంతో ఓ విద్యార్థి రోడ్డు పక్కన పడిపోయాడు. పోలీసుల దౌర్జన్యంతో పలువురు విద్యార్థి సంఘం నేతలు, విద్యార్థులకు గాయాలయ్యాయి. సహనం నశించిన విద్యార్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కలెక్టరేట్ ఎదుట సుమారు నాలుగు గంటలపాటు బైఠాయించారు.చివరకు డీఆర్వో సీతారామయ్య కలెక్టరేట్ బయట గేటు వద్దకు చేరుకుని వినతి పత్రం స్వీకరించడంతో ఆందోళన సద్దుమణిగింది. ఏలూరు కలెక్టరేట్ వద్ద విద్యార్థులు ధర్నా నిర్వహించి.. కలెక్టర్ వెట్రిసెల్వికి వినతి పత్రం ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ వద్ద విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. కాగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర శాఖ సోమవారం విమర్శించింది. -
యోగా..ఉత్సాహంగా..
తాడేపల్లిగూడెం: పెంటపాడు మండలం ప్రత్తిపాడులో నాలుగు రోజులపాటు జరిగిన ఆరో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ చాంపియన్షిప్ పోటీలు ఆదివారం ముగిశాయి. చివరి రోజు యోగ సాధకుల విన్యాసాలు ఆకట్టుకున్నారు. 23 జిల్లాల నుంచి సుమారు 550 మంది యోగ సా ధకులు ఐదు రకాల కేటగిరీల్లో పోటీపడ్డారు. విజేతలు ఛత్తీస్గఢ్, విజయవాడ, ముంబైలో జరిగే పోటీలకు అర్హత సాధించారు. సీనియర్ యోగాసన చాంపియన్షిప్ పోటీలు ఛత్తీస్గఢ్లో, జూనియర్ నేషనల్ యోగాసన పోటీలు విజయవాడలో, సబ్ జూనియర్ నేషనల్ చాంపియన్షిప్ పోటీలు ముంబైలో జరుగనున్నాయి. రాష్ట్రస్థాయి పోటీల్లో 87 మంది స్వర్ణ, 87 మంది రజత, 86 మంది కాంస్య పతకాలు సాధించారు. ముగింపు కార్యక్రమానికి అతిథులుగా హాజరైన ఉద్యాన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ బి.శ్రీనివాసులు, డీఎస్పీ విశ్వనాథ్ మాట్లాడుతూ యోగా అనేది నిత్య జీవితంలో ప్రతిఒక్కరికి అవసరమన్నారు. ఒత్తిళ్లను అధిగమించడానికి ఉపకరిస్తుందన్నారు. ముదిమి వయసులోనూ ఉత్సాహంగా ఉండేందుకు యోగా దోహదపడుతుందన్నారు. జాతీయ పరిశీలకుడు నంద కృపాకర్, అధ్యక్షురాలు అనంతనేని రాధిక, ప్రేమ్కుమార్, రాజశేఖరరెడ్డి, వెంకటరమణ, దుర్గారావు పోటీలను పర్యవేక్షించారు. యోగా పోటీల నిర్వాహకులు మాధవరావు, కరిబండి రామకృష్ణ , కోశాఽధికారి వెంకటేశ్వరరాజులు పాల్గొన్నారు. అతిథులు చేతులమీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. యోగా బృంద సభ్యులు పాల్గొన్నారు. ముగిసిన రాష్ట్రస్థాయి పోటీలు -
చవితి కళ..ఉపాధి భళా
ద్వారకాతిరుమల: దండాలయ్యా.. ఉండ్రాళ్లయ్యా.. జై జై గణేషా.. అంటూ పూజలందుకునేందుకు గణనాథులు సిద్ధమవుతున్నారు. ఊరూవాడా నవరాత్రి వేడుకలకు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా గణేష్ ఉత్సవ కమిటీలు చందాల వసూలు, పందిళ్ల నిర్మాణాలు, వినాయక విగ్రహాలను కొనుగోలు చేసి తీసుకువచ్చే పనుల్లో బిబీబిజీగా ఉన్నారు. పట్టణాల్లోని ప్రధాన కూడళ్లల్లో, గ్రామీణ ప్రాంతాల్లోని వీధుల్లో పందిళ్లు నెలకొల్పుతున్నారు. శనివారం అమావాస్య కావడంతో పందిళ్ల నిర్మాణాలు, ఇతర పనులను ఆదివారం నుంచి ప్రారంభించారు. ప్రస్తుతం అన్నిచోట్లా ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వినాయక చవితి భక్తితో పాటు ఎందరికో భుక్తిని ప్రసాదిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఉత్సవాల నిర్వాహకులు గణేష్ విగ్రహాలను ఇప్పటికే తమకు అనుకూలమైన చోట్లకు తరలించారు. పండుగ రోజు ఉదయం వాటిని తీన్మార్ డప్పు వాయిద్యాలు, బాణసంచా కాల్పుల నడుమ మందిరాల్లోకి చేర్చనున్నారు. అందరికీ ఉపాధి కులమతాలతో సంబంధం లేకుండా అందరికీ ఉ పాధి కల్పించే పండుగ వినాయక చవితి. పురోహి తులు, విగ్రహాల తయారీదారులు, షామియానా పందిళ్లు, టెంట్లు నిర్మించే వారు, పత్రి విక్రయించే వారు, తీన్మార్ వాయిద్యకారులు, ఊరేగింపుల్లో వేషాలు వేసే కళాకారులు, డీజే బాక్సుల యజమానులు, డెకరేషన్ వారు, నవరాత్రుల సమయంలో అన్నదానాల్లో వంటలు వండే కార్మికులు ఇలా ఎందరికో ఉపాధి కల్పిస్తుంది. ముఖ్యంగా పురోహితులకు డిమాండ్ అధికం. 27 నుంచి గణపతి నవరాత్రులు జిల్లావ్యాప్తంగా జోరుగా ఏర్పాట్లు పందిళ్ల నిర్మాణాల్లో బిజీగా కార్మికులు ఇప్పటికే బుక్ అయిన డీజే, తీన్మార్ కళాకారులు, పురోహితులు -
దివ్యాంగులకు అండగా ఉంటాం
భీమవరం అర్బన్: కూటమి ప్రభుత్వంలో కొత్త పెన్షన్లు ఇవ్వక పోగా ఉన్న పెన్షన్లు తీసేయడం దారుణమని వైఎస్సార్ సీపీ భీ మవరం ఇన్చార్జి చినమిల్లి వెంకటరాయు డు అన్నారు. మండలంలోని గొల్లవానితిప్పలో ఆదివారం దివ్యాంగుడు ఆయనకు సమస్యలు విన్నవించారు. ఈ సందర్భంగా చినమిల్లి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబు సూపర్ సిక్స్ పేరుతో ప్ర జలను మోసం చేశారన్నారు. అధికారం చే పట్టాకా పెన్షన్లు పెంచాల్సింది పోయి ఉన్న దివ్యాంగుల పింఛన్లను రీ వెరిఫికేషన్ పేరు తో తొలగిస్తున్నారని, దీంతో రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులు గగ్గోలు పెడుతున్నారన్నారు. ముఖ్యంగా కక్షగట్టి వైఎస్సార్ సీపీకి చెందిన దివ్యాంగుల పెన్షన్లు తొలగిస్తున్నారని, దివ్యాంగులకు పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నరసాపురం పార్లమెంట్ ఇన్చార్జి గూడూరి ఉమాబాల ఉన్నారు. -
హెచ్ఎంల సంఘ కార్యవర్గం ఎన్నిక
ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరు జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘ నూతన కార్యవర్గ ఎన్నిక కార్యక్రమాన్ని ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలోని పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ సంఘ భవనంలో నిర్వహించారు. సంఘ అధ్యక్షుడిగా వడ్లపట్ల మురళి, ప్రధాన కార్యదర్శిగా జంగం రవీంద్ర, కోశాధికారిగా బుర్ర శ్రీధర్, గౌరవాధ్యక్షుడిగా గారపాటి ప్రకాష్, రాష్ట్ర కౌన్సిలర్లుగా వి.శ్రీనివాసరావు, ఆర్.శైలజ, వి.హరి సీతారామయ్య ఎన్నికయ్యారు. ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎ.సర్వేశ్వరరావు, హెడ్ క్వార్టర్ సెక్రటరీగా పి.సురేష్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల పరిశీలకుడిగా ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈఎల్సీ కేశవరావు వ్యవహరించారు. జిల్లాలో ప్రధానోపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వము, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని, ఏకీకృత సర్వీస్ రూల్స్ సాధించి, ప్రధానోపాధ్యాయుల పదోన్నతికి కృషి చేస్తామని నూతనంగా ఎన్నికై న కార్యవర్గ సభ్యులు తీర్మానించారు. ఏలూరు (టూటౌన్): జిల్లాలోని భూ సమస్యలపై సోమవారం కలెక్టర్ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేయనున్నట్టు జిల్లా కార్యదర్శి ఎ.రవి ఆదివారం ప్రకటనలో తెలిపారు. భూ సమ స్యలు ఎదుర్కొంటున్న గిరిజనులు, దళితులు, పేదలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ భూముల సమస్యలను పరిష్కరించాలని, గిరిజనులు, దళితులు, పేదలకు హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టనున్నామన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మెగా డీఎస్సీ–2025కు సంబంధించి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు ఆదివారం డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. నరసాపురం: నిబద్ధత, అంకితభావంతో పనిచేసి ప్రజలకు సత్వర న్యాయం అందించడానికి కృషి చేయాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ న్యాయవాదులకు సూ చించారు. ఆదివారం నరసాపురం వచ్చిన ఆయన న్యాయవాదుల సంఘం బార్ అసోసియేషన్ హాల్లో సమావేశం నిర్వహించారు. రోజురోజుకూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా న్యాయవాదులు తమ న్యాయ పరి జ్ఞానాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నా రు. న్యాయవాదులు న్యాయపరమైన అంశాలపై, చట్టాలపై, న్యాయశాస్త్ర సూత్రాల పై చర్చా వేదికలు నిర్వహించి అవగాహన పెంచుకోవాలని సూచించారు. న్యాయస్థానాల్లో క్రమశిక్షణతో వ్యవహరిస్తూ న్యాయస్థానాలు, న్యాయవాదుల మధ్య సత్సంబంధాలు కలిగి ఉండాలన్నారు. నరసాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బూసి విశ్వేశ్వరరావు అధ్యక్షత వహించారు. జిల్లా అదనపు న్యాయమూర్తి ఎ. వాసంతి, సీనియర్ సివిల్ జడ్జి జి.గంగరాజు, ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) ఆర్.వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. భీమవరం: శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి, పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ జీవితంలో సైక్లింగ్ను భాగంగా చేసుకోవా లని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అన్నారు. ఆదివారం ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని ఎస్పీ ప్రారంభించి మాట్లాడారు. వాహనాల వాడకంతో కాలుష్యం పెరుగుతుందని, పరిష్కారంగా సైకిల్ను ఉపయోగించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చన్నారు. గుండె సంబంధిత రోగాల నివారణ, మధుమేహ నియంత్రణ, ఒత్తిడిని తగ్గించడం, శరీర బరువు నియంత్రణ వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు సైక్లింగ్ ద్వారా చేకూరుతాయన్నారు. అనంతరం పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బందితో కలిసి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి పెద అమిరం ఎస్పీ క్యాంపు కార్యాలయం వరకు సైకిల్పై ర్యాలీ నిర్వహించారు. అదనపు ఎస్పీ వి.భీమారావు తదిత రులు పాల్గొన్నారు. -
న్యాయం గెలిచింది
చాటపర్రు సర్పంచ్ గుడిపూడి రఘు అక్రమ అరెస్ట్, రిమాండ్ విషయంలో న్యాయం గెలిచింది. అక్రమ కేసులు, అరెస్ట్లు ఎన్నటికీ నిలబడవు. అండగా నిలిచిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలకు రుణపడి ఉంటాం. – తేరా ఆనంద్, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పోలీసుల తీరు మారాలి. న్యాయస్థానాలు వరుసగా ఆగ్రహం వ్యక్తం చేసి మెమోలిస్తున్నా ఒకే విధానంలో కే సులు నమోదు చేయడం బాధాకరం. పోలీస్ శాఖ నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వహించాలి. – అప్పన ప్రసాద్, దెందులూరు ఏఎంసీ మాజీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బ య్యచౌదరి తోటల్లోకి టీడీపీ శ్రేణులు అక్రమంగా చొరబడ్డారు. పంటను నష్టపరిచి, దాడులు చేశారు. తిరిగి వైఎస్సార్సీపీ నాయకులపైనే కేసులు పెడుతున్నారు. ఇదేం పాలన. – బత్తుల యేసు రాజు, వైఎస్సార్సీపీ పెదపాడు మండల నేతటీడీపీ శ్రేణుల దాడులు, దౌర్జన్యాలను ప్రజలంతా గమనిస్తున్నారు. అధికారం ఉంటే ఎదుటివారిపై అక్రమ కేసులు బనాయిస్తారా. గతంలో మేం ఎవరి తోటల్లోకైనా వెళ్లామా, దాడు లు, దౌర్జన్యాలు చేశామా. – అక్కినేని రాజశేఖర్, పెదపాడు సొసైటీ మాజీ చైర్మన్ -
ఆదివాసీ జిల్లాలు ఏర్పాటు చేయాలి
వేలేరుపాడు: షెడ్యూల్ ప్రాంత పరిపాలన సౌలభ్యం కోసం ఆదివాసి జిల్లాలు ఏర్పాటు చేయాలని గిరిజన సంక్షేమ పరిషత్ ప్రధాన కార్యదర్శి బంధం ప్రసాద్ అన్నారు. ఆదివారం గిరిజన సంక్షేమ పరిషత్ ముఖ్య నాయకుల సమావేశం వేలేరుపాడులో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఏలూరు ఏజెన్సీ ప్రాంతం పోలవరం జిల్లాగా, తూ.గో. జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన రంపచోడవరం ప్రత్యేక ఆదివాసి జిల్లాగా ఏర్పాటు చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చాలని కోరారు. 5 షెడ్యూల్ ప్రాంతంలో హక్కులకు తీవ్రమైన విఘాతం కలుగుతుందని, ఇప్పటికీ ఏజెన్సీ ప్రాంతంలో బయట ప్రాంతాల వారి వలసలు పెరిగిపోవడం వల్ల ఆదివాసులు తీవ్రమైన అన్యాయానికి గురి అవుతున్నారన్నారు. ఆదివాసి హక్కులు చట్టాలు అమలు చేయడం కష్టమవుతుందని దీనివల్ల ఆదివాసులు తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ మంత్రుల బృందం తూర్పు ఏజెన్సీ ప్రాంతంలో అక్కడ పర్యటించి ఆదివాసి గిరిజన సంఘాల ప్రజాభిప్రాయ సేకరణ వినతులు స్వీకరించాలని కోరారు. సమావేశంలో గిరిజన సంక్షేమ పరిషత్ నాయకులు మిర్యాల శ్రీనివాసరావు, పైదా రమేష్, వెంకట వినోద్, కుడియం శివరాజు, కుంజా బోజి తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 29న జాబ్ మేళా నిర్వహించనున్నట్టు ఏలూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎన్.జితేంద్ర బాబు ఒక ప్రకటనలో తెలిపారు. కై కలూరు మెయిన్ రోడ్లోని ట్రావెలర్స్ బంగ్లాలో ఈ జాబ్ మేళా నిర్వహిస్తామన్నారు. ఈ జాబ్ మేళాలో 10కి పైగా కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని, సుమారు 700కు పైగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశలు కల్పించే అవకాశం ఉందన్నారు. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, పీజీ వంటి విద్యార్హతలు ఉండి 18–30 సంవత్సరాల వయసు గల వారు అర్హులని తెలిపారు. ఇతర వివరాలకు 6281119575, 9676140314 నెంబర్లతో పాటు (కమాండ్ కంట్రోల్ నంబర్స్ – 9988853335, 8712655686, 8790118349, 8790117279)లలో సంప్రదించవచ్చన్నారు. ఉండి: తల్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తాననడంతో మనస్తాపంతో కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం ఉండి పడవలరేవుకు చెందిన బొబ్బాది కృష్ణ(45) భార్యతో విడిపోయి తల్లి దగ్గరే ఉంటున్నాడు. మద్యానికి బానిసైన అతను తల్లిని కూడా హింసిస్తుండటంతో ఆమె ఈ నెల 23న పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో మనస్తాపానికి గురైన అతను పురుగుల మందు మద్యంలో కలిపి తాగడంతో పరిస్థితి విషమించింది. అతనిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. తణుకు అర్బన్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఫెన్సింగ్ వ్యక్తిగత, టీం విభాగాల్లో బాలురు, బాలికలకు ఎంపికలు ఈనెల 26న తణుకు మండలం తేతలిలోని స్టెప్పింగ్స్టోన్ స్కూలులో నిర్వహించనున్నట్లు జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి జీఎస్వీ కృష్ణమోహన్ తెలిపారు. ఉదయం 10 గంటలకు నిర్వహించే ఈ ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు 2025 డిసెంబరు 31కి 17 సంవత్సరాల్లోపు వయసు ఉండాలని, ఫెన్సింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారి గుర్తింపు కార్డుతో వ్యక్తిగత ఫెన్సింగ్ క్రీడా పరికరాలతో హాజరుకావాలని కోరారు. -
మోదేలు.. ఎన్నాళ్లీ ఎదురుచూపులు?
బుట్టాయగూడెం: మారుమూల ప్రాంతమైన మోదేలు గ్రామానికి మంజూరైన గృహాలు నిర్మించడంతోపాటు రోడ్డు, విద్యుత్ సదుపాయం కల్పించాలని ఆ గ్రామ గిరిజనులు కోరుతున్నారు. బ్రిటిష్ కాలంలోనే అటవీ, పోడు భూముల వ్యవసాయం కోసం తమ గ్రామాన్ని ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నామని ప్రస్తుతం రిజర్వ్ ఫారెస్ట్లో ఉండకూడదంటూ తమకు మంజూరైన ఇళ్ల నిర్మాణం, విద్యుత్, రోడ్డు నిర్మాణం పనులను ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడం పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎన్నో దశాబ్దాలుగా ఉంటున్న తమను అక్కడి నుంచి ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారని దీనివల్ల తీవ్రంగా నష్టపోతామంటూ కొండరెడ్డి గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండ దిగి వస్తే సౌకర్యాలు కల్పిస్తాం మోదేలు గ్రామం పాపికొండల అభయారణ్యం పరిధిలోకి వస్తుందని అందువల్లే అక్కడ ఇళ్లు నిర్మాణానికి, గ్రామానికి రోడ్డు, విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు అనుమతులు ఇవ్వడం లేదని అధికారులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఆయా ప్రాంతాల్లో వన్యప్రాణులు స్వేచ్ఛగా తిరగాలనే ఉద్దేశంతోనే అభయారణ్యం పరిధిలో ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం లేదంటూ అధికారులు చెబుతున్నారు. కొండదిగి వస్తే దిగువ ప్రాంతంలో ఇళ్లు నిర్మించి వారికి మౌలిక సదుపాయాలు కల్పించేలా కృషి చేస్తామని ఐటీడీఏ పీఓ రాములు నాయక్ చెబుతున్నారు. ఢిల్లీకి లేఖ రాసిన మోదేలు గిరిజనులు స్వాతంత్య్రం రాకముందే ఏర్పడిన తమ గ్రామానికి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అధికారులు కృషి చేయడం లేదని తమను అక్కడి నుంచి ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారని తామున్న ప్రదేశంలోనే తమకు మంజూరైన 23 ఇళ్లు నిర్మాణంతోపాటు రోడ్డు నిర్మాణం, విద్యుత్ సదుపాయం కల్పించాలని కోరుతూ రాష్ట్రపతికి ఒక లేఖ రాశారు. జాతీయ గిరిజన కమిషన్కు కూడా లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఇక్కడి పరిస్థితిని పరిశీలించేందుకు సెప్టెంబర్ 1న జాతీయ ఎస్టీ కమిటీ బృందం పర్యటిస్తున్నట్లు గిరిజనులు చెబుతున్నారు. కమిటీ రాకతో తమ సమస్య తీరుతుందనే ఆశతో అడవి బిడ్డలు ఎదురు చూస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నిధుల మంజూరు వైఎస్సార్సీపీ పాలనా సమయంలో మోదేలు గ్రామానికి సుమారు రూ.70 లక్షల వ్యయంతో విద్యుత్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేశారు. రూ.3 కోట్లతో రోడ్డు నిర్మాణానికి నిధులు కూడా మంజూరు చేశారు. ఫారెస్ట్ అధికారుల అభ్యంతరాలతో ఆ పనులు నిలిచిపోయాయి. గత ఏడాది పీఎంజేఎస్వై నిధులతో సుమారు 23 ఇళ్లు మంజూరయ్యాయి. వీటి నిర్మాణాలకు ఫారెస్ట్ అధికారులు అభ్యంతరాలు చెప్పడంతో అవి కూడా నిలిచిపోయాయి. మోదేలు గ్రామానికి నిలిచిన రహదారి, విద్యుదీకరణ పనులు రిజర్వ్ ఫారెస్టు కారణంగా అనుమతి లేదంటున్న అధికారులు కొండ దిగి వస్తే సౌకర్యాలు కల్పిస్తామంటున్న ఐటీడీఏ పీఓ సెప్టెంబర్ 1న మోదేలును సందర్శించనున్న ఎస్టీ కమిషన్ బృందం -
సుబ్బారాయుడిని దర్శించుకున్న భక్తులు
ముదినేపల్లి రూరల్: ప్రసిద్ధి చెందిన సింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్లోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం భక్తులు పోటెత్తారు. స్వామివారి పుట్టలో పాలు పోసి స్వామివారిని దర్శించుకున్నారు. పాలపొంగళ్ళశాల వద్ద మహిళలు నైవేద్యాలు తయారుచేసి స్వామికి సమర్పించారు. కై కలూరు: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఏలూరు జిల్లా, కలిదిండి, సానారుద్రవరం రంగా విగ్రహాలను పేడతో అవమానించిన దుండగులను పట్టుకోడానికి పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాలతో 5 ప్రత్యేక బృందాలు జల్లెడ పడుతోన్నాయి. ఇప్పటికే సీసీ పుటేజ్లను పోలీసులు సేకరించారు. మొత్తం 10 మంది పోలీసు ఉన్నతాధికారులు, 30 మంది పోలీసు సిబ్బంది కేసు చేధించే పనిలో ఉన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు కలిదండి సమీప గ్రామాలకు చెందిన యువకులే ఈ ఘటనకు పాల్పడినట్లు భావిస్తున్నారు. కొంత మంది అనుమానితులను కై కలూరు పోలీసు స్టేషన్లో విచారిస్తోన్నట్లు తెలిసింది. సోమవారం సాయంత్రానికి కేసు కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయని సీఐ వి.రవికుమార్ ఆదివారం చెప్పారు. ఆకివీడు: ఉప్పుటేరు వంతెన వద్ద శనివారం రాత్రి స్థానిక శ్రీరాంపురానికి చెందిన మజ్జి గాంధీ(57) అనే వ్యక్తి ఉప్పుటేరులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం గాలింపు చర్యలు చేపట్టగా వంతెన సమీపంలో మృతదేహం లభ్యమైంది. ఇంటి నుంచి శనివారం రాత్రి సైకిల్పై బయటకు వెళ్లాడు. ఎంతసేపటికీ రాకపోవడంతో వెతకడం ప్రారంభించారు. ఉప్పుటేరు వంతెనపై అతని సైకిల్ కన్పించడంతో దూకేసి ఉంటాడని భావిస్తున్నారు. ఏఎస్ఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బయటకు వెళ్లాలంటే భయమేస్త్తోంది
ఈ ప్రాంతంలో అసాంఘిక కార్యక్రమాలు పెరిగిపోయాయి. రాత్రి ఒంటి గంట వరకు మద్యం తాగి హల్చల్ చేస్తున్నారు. అడిగితే దాడికి పాల్పడుతున్నారు. గత వినాయక చవితికి చాలా గొడవలు జరిగాయి. మళ్లీ ఏగొడవలు జరుగుతాయోనని భయంగా ఉంది. శనివారం రాత్రి సైరన్ మోగుతోందని పోలీసులు వచ్చారనుకున్నాం. ఓ యువకుడు బైక్పై పోలీసు సైరన్లో హడావుడి చేశాడు. ఇదంతా టీడీపీ నాయకులే నడిపిస్తున్నారు. – భారతి, లేఅవుట్ కాలనీ, జంగారెడ్డిగూడెం కూటమి అధికారంలో వచ్చిన తరువాత టీడీపీ నాయకుడు వచ్చి ఇక్కడ తాను చెప్పిందే చేయాలని హుకుం జారీ చేస్తున్నారు. శనివారం రాత్రి యువకులతో కలిసి వచ్చి నా తల పగులగొట్టారు. వినాయకుడి గుడి కట్టిస్తుంటే అవినీతి అంటూ ఆరోపిస్తున్నారు. నేను చిన్న ఫ్యాక్టరీ పెట్టుకుంటే నా నుంచి రూ. 50 వేలు లంచం తీసుకున్నారు. మరో రూ.50 వేలు అడుగుతున్నారు. – పకీర్ నాయుడు, లేఅవుట్ కాలనీ, జంగారెడ్డిగూడెం -
టీడీపీ నేత అరాచకంపై ఆగ్రహం
జంగారెడ్డిగూడెం: కూటమి ప్రభుత్వంలో సాక్షాత్తు తమ నాయకులతో సహా మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. జంగారెడ్డిగూడెంలో బాట గంగానమ్మ లేఅవుట్ కాలనీకి చెందిన ఓ సీనియర్ టీడీపీ నాయకుడిపై అదే కాలనీకి చెందిన ఓ టీడీపీ నేత, అతని కుటుంబసభ్యులు, మరికొంతమంది దాడి చేసి గాయపరిచారు. అడ్డు చెబితే చంపేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. బాటగంగానమ్మ లే అవుట్ కాలనీకి చెందిన ఎం.ఫకీర్ నాయుడు టీడీపీలో ఉంటూ కొన్ని సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆ ప్రాంతంలో స్థానికుల సహకారంతో పార్టీలకు అతీతంగా వినాయకుడి గుడిని నిర్మిస్తున్నారు. ఆ ప్రాంతంలో కొత్తగా టీడీపీ వార్డు ప్రధాన కార్యదర్శిగా పదవి చేపట్టిన ఒక నాయకుడు ఫకీర్ నాయుడు వద్దకు వచ్చి ఉత్సవాలు చేయడానికి వీల్లేదని బెదిరించడమే కాకుండా రాళ్లతో దాడి చేశారు. మహిళలపై దాడులు ఆ ప్రాంతంలో కూటమికి చెందిన మహిళలు సైతం అక్కడ టీడీపీ నేత అరాచకాలకు ఏం చేయాలో తెలియక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రయితే ఇంటి నుంచి బయటకు రావాలంటే భయం వేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా టీడీపీ నాయకుడే చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మద్యంతోపాటు, గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు సేవిస్తూ, సైరన్ శబ్దాలతో కాలనీ వాసులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఇదేంటని అడిగిన పెద్దలపై దాడులకు తెగబడటమే కాకుండా మహిళల మీద కూడా దాడులు చేస్తున్నారన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆరేడు నెలలుగా కాలనీలో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నామన్నారు. పోలీసులు జోక్యం చేసుకుని తమకు ఈ ప్రాంతంలో రక్షణ ఏర్పాటు చేయాలని, ఉత్సవాలలో ఎలాంటి గొడవలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జంగారెడ్డిగూడెం లేఅవుట్ కాలనీ వాసుల ఆందోళన అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన కాలనీ -
సర్వీస్ రోడ్లు నిర్మించాలి
టి.నరసాపురం: గ్రీన్ ఫీల్ హైవేకు సర్వీస్ రోడ్ల ప్రొవిజన్ కల్పించాలని.. పరిహారం పెంచాలని, భూ నిర్వాసిత రైతుల సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం ఉధృతం చేస్తామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ హెచ్చరించారు. ఆదివారం టి.నరసాపురం శివాలయం ప్రాంగణంలోని కాశీ విశ్వేశ్వర కల్యాణ మండపంలో హైవే భూ నిర్వాసిత రైతుల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు రైతుల పోరాట కమిటీ నాయకులు దేవరపల్లి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 2న జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం వద్ద హైవే దిగ్బంధం చేపట్టాలని సదస్సు నిర్ణయించింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన కె.శ్రీనివాస్ మాట్లాడుతూ 2013 భూ సేకరణ చట్టాన్ని తుంగలో తొక్కి రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారని విమర్శించారు. సర్వీస్ రోడ్లు ప్రొవిజన్ కల్పించాలని డిమాండ్ చేశారు. అన్ని గ్రామాలకు ఎగ్జిట్స్ నిర్మించాలన్నారు. కార్యక్రమంలో రైతుల పోరాట కమిటీ నాయకులు వామిశెట్టి హరిబాబు, పర్వతనేని మురళి, మాలెంపాటి హరిబాబు, చీకటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
మిస్టర్ భీమవరం బాడీ బిల్డింగ్ పోటీలు
భీమవరం: మిస్టర్ భీమవరం బాడీ బిల్డింగ్ పోటీలు న్యూ ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భీమవరం త్రీ టౌన్లోని ఓ.12 జిమ్లో ఆదివారం నిర్వహించారు. పోటీలను దాసి వరప్రసాద్ ప్రారంభించగా, బాడీ బిల్డింగ్ మొదటి గ్రూపు విజేతలకు మానవతా సంస్థ భీమవరం శాఖ అధ్యక్షులు చింతలపాటి రామకృష్ణంరాజు, కో చైర్మన్ కారుమూరి నరసింహమూర్తి బాబు, విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాసు బహుమతులు అందించారు. నిర్వాహకుడు న్యూ ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఖాసిం మాట్లాడుతూ బాడీ బిల్డింగ్ విభాగంలో మిస్టర్ భీమవరం విజేతగా ఎస్కె యాసీన్, ఫిజిక్ మోడలింగ్ విభాగంలో మిస్టర్ భీమవరం విజేతగా సతీష్ నిలిచారని తెలిపారు. -
ఉన్న చోటే ఇళ్లు నిర్మించాలి
మేం ఉంటున్న మోదేలు గ్రామంలోనే మాకు మంజూరైన 23 ఇళ్లు నిర్మించాలి. విద్యుత్ సదుపాయం కల్పించాలి. రోడ్డు పనులు పూర్తి చేయాలి. అక్కడి నుంచి కదలం, కొండ దిగం. మా వ్యవసాయ భూములన్నీ అక్కడే ఉన్నాయి. కెచ్చెల బాలిరెడ్డి, మోదేలు పోడు భూముల కోసమే మోదేలు గ్రామాన్ని బ్రిటిష్ కాలంలోనే ఏర్పాటు చేసుకున్నాం. అప్పటి నుంచి ఆహార ఉత్పత్తులు పండించుకుంటూ జీవనం సాగిస్తున్నాం. ఇప్పుడు రిజర్వ్ ఫారెస్ట్లో ఇళ్ల నిర్మాణం కుదరదంటూ ఫారెస్ట్ అధికారులు అభ్యంతరాలు చెప్పడం వల్ల మాకు అన్యాయం జరుగుతుంది. కెచ్చెల భవాని, మోదేలు -
మద్దిలో హనుమద్ హోమం
జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమద్ హోమం ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్దర్యంలో వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ఈవో ఆర్వీ చందన మాట్లాడుతూ స్వామి వారి సన్నిధిలో హోమం ప్రతి ఆదివారం భక్తులకు ఆర్జిత సేవగా దేవస్థానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమాలను జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు పర్యవేక్షిస్తున్నట్లు ఈవో తెలిపారు. కై కలూరు: అమ్మా.. కొల్లేటి పెద్దింట్లమ్మా.. మొక్కులు తీర్చుకుంటున్నాం.. మా కోర్కెలు తీర్చమ్మా.. అంటూ భక్తులు అమ్మను ఆర్తితో వేడుకున్నారు. కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం వద్ద సమీప జిల్లాల నుంచి భక్తులు ఆదివారం పెద్ద ఎత్తున విచ్చేశారు. పవిత్ర కోనేరులో స్నానాలు ఆచరించి అమ్మవారికి వేడి నైవేద్యాలు, పొంగళ్లను సమర్పించారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు పేటేటి పరమేశ్వరశర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ప్రసాదాలు అందించారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు ఆలయానికి రూ.76,651 ఆదాయం వచ్చిందని చెప్పారు. పోలవరం రూరల్: సత్యసాయి మంచినీటి పథకం కార్మికులు గత మూడు రోజులుగా చేస్తున్న సమ్మెను ఆదివారం రాత్రి విరమించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీని ఆదివారం కలిసి వర్కర్ల సమస్యలను తెలిపారు. జెడ్పీ సీఈవో శ్రీహరి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ త్రినాథ్ల సమక్షంలో యూనియన్ సభ్యులకు హామీ ఇచ్చారు. రెండు రోజుల్లో జిల్లా పరిషత్ నిధుల నుంచి ఒక నెల జీతం చెల్లిస్తామని, మిగిలిన పెండింగ్ జీతాలు 15 రోజుల్లో చెల్లించేందుకు కృషిచేస్తామన్నారు. వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు జి.శివసత్యనారాయణ, కార్యదర్శి ఆచంట సత్యనారాయణలు మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సమ్మె విరమిస్తున్నట్లు తెలిపారు. -
దెందులూరు అక్రమ కేసులు.. పోలీసులకు ఎదురుదెబ్బ
సాక్షి, ఏలూరు: ఏలూరు జిల్లాలోని దెందులూరులో అక్రమ కేసుల్లో స్థానిక పోలీసులకు ఎదురుదెబ్బ తగిలింది. అక్రమ కేసులో చాటపర్రు దళిత సర్పంచ్ గుడిపూడి రఘుకు ఏలూరు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. ఈ క్రమంలో ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు.వివరాల ప్రకారం.. పెదవేగి ఎస్ఐ రామకృష్ణ చాటపర్రు దళిత సర్పంచ్ గుడిపూడి రఘును అక్రమంగా అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పొలంలో టీడీపీ నేతలు దౌర్జన్యం చేసినప్పటికీ రివర్స్లో రఘు సహా మరికొందరిపై పోలీసులు కేసులు పెట్టారు. ఈ క్రమంలో సర్పంచ్ రఘును ఏలూరు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరుచగా పోలీసుల అక్రమ కేసుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా అక్రమ అరెస్ట్ను ఖండిస్తూ రఘు సొంత పూచికత్తు 10వేలతో బెయిల్ మంజూరు చేశారు. రఘును అరెస్ట్ చేసిన ఎస్ఐ రామకృష్ణపై మెజిస్ట్రేట్ మండిపడ్డారు. మరోసారి ఆయనకు మెమో జారీ చేశారు. ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఆదేశాలు జారీచేశారు. -
దెందులూరులో పచ్చ కుట్రలు.. వైఎస్సార్సీపీ నేతలు అరెస్ట్
సాక్షి, ఏలూరు: ఏపీలో కూటమి ప్రభుత్వంలో అక్రమ అరెస్ట్ల పర్వం కొనసాగుతోంది. దెందులూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నేతలను అక్రమంగా అరెస్టు చేశారు. దాదాపు 15 మంది వైఎస్సార్సీపీ నేతలపై అక్రమంగా పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు.వివరాల ప్రకారం.. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పొలం దగ్గర దౌర్జన్యం చేసి టీడీపీ నేతలు పోలీసులతో రివర్స్ కేసులు పెట్టించారు. ఈ క్రమంలో 15 మంది వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేశారు. నిన్న సాయంత్రం నుండి చాటపర్రు దళిత సర్పంచ్.. గుడిపూడి రఘుని పలు పోలీస్ స్టేషన్ల చుట్టూ పోలీసులు తిప్పుతున్నారు. ఏలూరు రూరల్ నుండి రాత్రి పెదపాడు స్టేషన్కు పోలీసులు తీసుకువెళ్లారు. పెదపాడు పోలీస్ స్టేషన్ నుండి డీఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లారు. దీంతో, వైఎస్సార్సీపీ శ్రేణులు, కుటుంబ సభ్యులు రాత్రంతా పెదపాడు స్టేషన్ వద్దే ఉన్నారు. అక్రమ అరెస్టులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
సేవాతత్పరత..సామాజిక బాధ్యత
‘నా’ అనే స్వార్థాన్ని విడిచి.. ‘మన’ అనే దృక్పథాన్ని పెంచేలా ఏలూరు పోలీసులు సేవాతత్పరత చాటుతూ ‘మోడల్ పోలీస్’గా నిలుస్తున్నారు. మానవత్వ స్ఫూర్తిని పెంపొందిస్తూ సామాజిక బాధ్యతపై అవగాహన పెంచేలా వినూత్న కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. సమాజంలో అభాగ్యులకు ఆపన్నహస్తం అందించేలా జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ కై ండ్నెస్ వాల్, టేక్ ఏ బుక్.. లీవ్ ఏ బుక్ కార్యక్రమాలు చేపట్టి ఆదర్శంగా నిలుస్తున్నారు. ● ఏలూరులో ‘మోడల్’ పోలీస్ ● కై ండ్నెస్ వాల్, టేక్ ఏ బుక్ కార్యక్రమాలు ● పోలీసుల ఆధ్వర్యంలో పర్యవేక్షణ పిల్లలకు చిన్నతనం నుంచే సామాజిక పరిస్థితు లపై అవగాహన, బాధ్యత పెంచాలి. ఇదంతా ఇంటి నుంచి ప్రారంభించాలి. దానం చేశామనే ఫీలింగ్ మనలో ఉండకుండా, తీసుకున్నామనే ఆలోచన మనసును బాధించకుండా డిగ్నిటీ ఆఫ్ కై ండ్నెస్ ప్రతి ఒక్కరిలో పెంపొందించాలి. కరుణ, దయాగుణం పిల్లల్లో అలవర్చుతూ సంస్కృతి, సంప్రదాయాలను పాటించేలా చూడాలి. దీంతో కక్షలు, ద్వేషాలు, కోపాలు, దాడులు, దౌర్జన్యాలు నిరోధించే అవకాశం ఏర్పడుతుంది. – కొమ్మి ప్రతాప్ శివకిషోర్, ఏలూరు జిల్లా ఎస్పీ ఏలూరు టౌన్ : ఓ వైపు చట్టానికి లోబడి శాంతిభద్రతలను పరిరక్షించడంతో పాటు మరోవైపు సామాజిక బాధ్యతగా ఏలూరు అమీనాపేట పోలీస్ పెట్రోల్స్టేషన్ వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన కై ండ్నెస్ వాల్ మన్ననలు పొందుతోంది. ఇంట్లో మనం ఉపయోగించని వస్తువులు చాలా ఉంటాయి. సమాజంలో ఆ వస్తువులు అవసరమైన వారూ ఉంటారు. అయితే వాటిని వారికి ఎలా అందించాలో చాలా మందికి తెలియదు. సా యం చేయాలన్న ఆలోచన ఉన్నా మార్గం లేక వదిలేస్తారు. అలాంటి వారు ఎ లాంటి ఇబ్బంది లేకుండా ఆయా వస్తువులను పోలీసులు ఏర్పాటుచేసిన కై ండ్నెస్ వాల్ అల్మారాలో పెట్టవచ్చు. వాటిని అవసరమైన వారు తీసుకుని వినియోగిస్తారు. ఈ విధానంలో డిగ్నీటీ.. కై ండ్నెస్.. కేరింగ్.. ఒక్కచోటే ఉంటాయి. ఈ ఆలోచనలతో పోలీసులు ఏర్పాటుచేసిన కై ండ్నెస్ వాల్ మన్ననలు పొందుతోంది. పలువురు దుస్తులు, ఆటబొమ్మలు, షూష్, చెప్పులు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఇలా పలురకాల వస్తువులను ఇక్కడ ఉంచుతున్నారు. వీటిని పిల్లలు, పెద్దలు, కార్మికులు వచ్చి ఆనందంగా తీసుకువెళుతున్నారు. కై ండ్నెస్ బాస్కెట్స్ పేరుతో ఇదే విధానం పలు దేశాల్లో మన్ననలు పొందింది. టేక్ ఏ బుక్కు మంచి ఆదరణ ఏలూరు ఎస్పీ క్యాంపు కార్యాలయం బయట రోడ్డుపైనా, ట్రాఫిక్ పార్కులో టేక్ ఏ బుక్.. లీవ్ ఏ బుక్ అనే నూతన విధానాన్ని ప్రారంభించారు. జిల్లా జేసీ ధాత్రిరెడ్డి ఆలోచనతో వీటిని ఏర్పాటుచేశారు. పాఠశాలలు, కళాశాలలు పునః ప్రారంభమైన సమయంలో మంచి స్పందన వస్తోంది. చాలామంది విద్యార్థులు పుస్తకాలు ఈ ర్యాక్లో పెడితే, అవసరమైన వారు తీసుకుంటున్నారు. ఇప్పటికీ విద్యార్థులు అల్మారాలోని విలువైన పుస్తకాలు తీసుకుని చదివి, వారి వద్ద ఉన్న పుస్తకాలను అక్కడ పెడుతున్నారు. ఈ పుస్తకాల ర్యాక్కు విద్యార్థులు, లెక్చరర్స్, ఉపాధ్యాయుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. -
ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలి
కామవరపుకోట: సీ్త్ర శక్తి పథకం ద్వారా నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు రూ.50 వేలు అందించి వారి కుటుంవాలను ఆదుకోవాలని శ్రీ కోట వీరభద్ర ఆటో వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు కంకిపాటి బుచ్చిబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం కామవరపుకోట పాసింజర్ ఆటో వర్కర్స్ యూనియన్ సభ్యులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి తహసీల్దార్ జి.ఎలీషాకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బుచ్చిబాబు మాట్లాడుతూ ఒకపక్క ఆటో ఫైనాన్స్ కిస్తీలు, మరోపక్క ఆటో మరమ్మతులు, చాలీచాలని ఆదాయంతో జీవనం సాగిస్తున్న ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని, యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఆటో కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి ఇప్పటివరకు నెరవేర్చలేదన్నారు. ప్రభు త్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం ద్వారా ఆటో వర్కర్స్ ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉందని, వెంటనే కార్మికులను ఆదుకునేలా చర్యలు తీసుకో వా లని డిమాండ్ చేశారు. కామవరపుకోట ఆటో యూ నియన్ సభ్యులు బంగారు రమణ, దొంత నాగ శిరోమణి రాజు, లింగాల నాగేశ్వరరావు, గుద్దేటి శ్రీనివాసరావు, కరిని శ్రీనివాసరావు, షేక్ ఇమామ్ సాహెబ్, హరీష్ బాబు, మల్ల మురళి పాల్గొన్నారు. -
వరద తగ్గుముఖం
పోలవరం రూరల్: గోదావరి వరద శాంతిస్తోంది. దీంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. సుమారు 12 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు చేరడంతో దిగువన వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. క్రమేపీ ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చే నీరు తగ్గుముఖం పట్టడంతో పోలవరంలో వరద తగ్గుతోంది. శనివారం సాయంత్రానికి పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద 32.270 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. స్పిల్వే 48 గేట్ల నుంచి 9.14 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు చేరుతోంది. ఎగువ భద్రాచలం వద్ద కూడా వరద పూర్తిగా తగ్గి 36.20 అడుగులకు చేరుకుంది. నరసాపురంలో ఉధృతంగా.. నరసాపురం: నరసాపురంలో వశిష్ట గోదావరి ఉధృతి కొనసాగుతోంది. శనివారం కొంతమేర నీటి మట్టం తగ్గినా వలంధర్రేవు, లలితాంబఘాట్, పడవల రేవు వద్ద పరిస్థితి ప్రమాదకరంగానే ఉంది. రేవులన్నీ నీటమునిగే ఉన్నాయి. బాపూ ఘాట్ వద్ద నీటిమట్టం తగ్గలేదు. ఎగువ ప్రాంతం నుంచి భారీగా వచ్చి చేరుతున్న వరద నీరు అంతే వేగంతో సముద్రంలోకి వెళుతోంది. మాధవాయిపాలెం ఫెర్రీ వద్ద పంటు రాకపోకలు పునరుద్ధరించలేదు. మరో రెండు మూడు రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని అంచనా. -
కుయ్ కుయ్.. కుయ్యోమొర్రో !
ఆదివారం శ్రీ 24 శ్రీ ఆగస్టు శ్రీ 2025ప్రభుత్వం వెంటనే 108 అంబులెన్స్లను అదనంగా ఏర్పాటు చేయాలి. తీవ్ర అనారోగ్యం, రోడ్డు ప్రమాదాలు జరిగితే క్షతగాత్రులను హాస్పిటల్స్కు తరలించేందుకు 108కు ఫోన్ చేస్తే ఎవరూ స్పందించటం లేదు. ఏలూరులో సైతం సంఘటనా స్థలానికి చేరుకోవటానికి కనీసం 40 నిమిషాల సమయం పడుతుంది. గతంలో 108 అంబులెన్స్ 10 నిమిషాల్లోపే ఘటనా స్థలానికి చేరుకుని క్షణాల్లో హాస్పిటల్స్కు చేర్చటంతో ప్రాణాలు రక్షించేవారు. – ఎచ్చెర్ల ఉమామహేష్, ఏలూరు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో కొత్త అంబులెన్స్ వాహనాలు కొనుగోలు చేయటంతో కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజలకు సేవలు అందించాయి. అయితే ప్రస్తుతం అంబులెన్స్లు మరమ్మతులతో మూలనపడ్డాయి. బ్రేకులు, లైట్లు కూడా లేని వాహనాలను పంపాల్సిన దుస్థితి ఏర్పడింది. ఏలూరు జిల్లా ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది. – ఎం.గణేష్, ఏలూరు ఏలూరు టౌన్: దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2005లో దేశానికే ఆదర్శంగా 108 అంబులెన్స్లను తీసుకువచ్చారు. అనంతరం కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు వాటిని నిర్వీర్యం చేశాయి. 2019లో అధికారం చేపట్టిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 2020లో 108 అంబులెన్స్ వాహనాలను కొత్తవి కొనుగోలు చేసి ఏలూరు జిల్లాకు 27 వాహనాలు అందించారు. వీటితో పాటు మరో 9 పాత వాహనాలు సేవలు అందించేవి. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో పూర్తిస్థాయిలో సేవలందించి అపర సంజీవనిలా నిలిచాయి. అయితే ప్రస్తుతం 108 అంబులెన్స్లు మృత్యుశకటాలుగా మారిపోయాయి. కూటమి ప్రభుత్వం 108 సేవలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండటంతో అత్యవసర స్థితిలో రోగుల ప్రాణాలకు భరోసా లేకుండా పోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. రిఫరల్స్తో ప్రాణసంకటం ఏలూరు జీజీహెచ్తోపాటు దెందులూరు, భీమడోలు, నూజివీడు ప్రాంతాల్లోని 108 అంబులెన్స్ లు నిత్యం విజయవాడ, గుంటూరుకు రిఫరల్స్కు వెళుతూ ఉన్నాయని చెబుతున్నారు. ఏలూరు జిల్లాతోపాటు, పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు, భీమవరం, పాలకొల్లు, ఆకివీడు వంటి ప్రాంతాల నుంచి రోగులను ఏలూరు జీజీహెచ్కు వైద్యులు రిఫర్ చేస్తున్నారు. ఏలూరు జీజీహెచ్లో అత్యవసర కేసులకు వైద్య చికిత్సలు అందించే నిపుణులైన వైద్యులు లేకపోవటంతో ఏలూరు నుంచి 108 అంబులెన్స్ల్లో విజయవాడ, గుంటూరు జీజీహెచ్లకు తరలిస్తున్నారు. ఉదయం వెళ్లిన అంబులెన్స్లు తిరిగి ఏలూరు చేరుకునే సుమారు 4–5గంటల సమయం పడుతుందనీ, ఈలోపు ఏదైనా అత్యవసర స్థితిలో క్షతగాత్రులను, అనారోగ్య బాధితులను హాస్పిటల్స్కు తరలించేందుకు అంబులెన్స్లు ఉండటం లేదని సిబ్బంది అంటున్నారు. ఏలూరులో మరమ్మతులతో నిలిచిపోయిన 108 అంబులెన్స్లు 108పై కూటమి నిర్లక్ష్యం రోగులకు ప్రాణసంకటం అత్యవసర స్థితిలో రాని అంబులెన్స్లు మరమ్మతులు, బ్రేక్ డౌన్లో వాహనాలు బాధితుల ప్రాణాలు పోతున్న వైనం ఏలూరు వన్టౌన్ ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల యువకుడు వారం క్రితం ఏలూరు మినీ బైపాస్లో బ్రెయిన్ స్ట్రోక్ రావటంతో కూలబడ్డాడు. 108కు ఫోన్ చేస్తే వివరాలన్నీ తీసుకుని 15 నిమిషాల తర్వాత తాపీగా 40 నిమిషాలు పడుతుందని సమాధానమిచ్చారు. ఏదోవిధంగా బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. ఏలూరు జీజీహెచ్లో వైద్యసేవలు దూరం కావటంతో ఆశ్రం హాస్పిటల్కు తీసుకువెళ్లారు. అప్పటికే నష్టం జరిగిపోయింది. మూడు రోజుల అనంతరం బాధితుడిని గుంటూరు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం కన్నుమూశాడు. ఏలూరు వన్టౌన్ నాగేంద్ర కాలనీకి చెందిన 20 ఏళ్ల గోపీకృష్ణ అనే యువకుడు జంగారెడ్డిగూడెం నుంచి మోటారు సైకిల్పై వస్తుండగా శుక్రవారం రాత్రి కామవరపుకోట మండలం ఆడమిల్లి వద్ద మరో బైక్ను ఢీకొట్టి తీవ్రగాయాల పాలయ్యాడు. 108కు ఫోన్ చేస్తే.. 30 నిమిషాల అనంతరం కామవరపుకోట పీహెచ్సీ నుంచి డొక్కు వాహనం పంపారు. బ్రేకులు, లైట్లు, సైరన్ కూడా లేని అంబులెన్స్లో గోపీకృష్ణను తీసుకురావటానికి 2 గంటల సమయం పట్టింది. ఏలూరు ఆంధ్రా హాస్పిటల్కు తీసుకువెళ్లగా వైద్యులుపరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. -
‘సత్యసాయి’ కార్మికులకు జీతాలివ్వాలి
బుట్టాయగూడెం: సత్యసాయి మంచినీటి పథకం కార్మికులకు 9 నెలలుగా రావాల్సిన జీతాలను వెంటనే చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు డిమాండ్ చేశారు. దుద్దుకూరులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మెట్ట ప్రాంతంలో తాగునీటి సరఫరాలో కీలకంగా ఉన్న కార్మికులకు జీతాలు ఆపడం సరికాదన్నారు. సత్యసాయి వాటర్ నిర్మాణం పనుల సమయంలో తాను ఎంతో కృషి చేశానని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా మూడు నియోజకవర్గాల పరిధిలోని 17 మండలాల్లో సుమారు 6 లక్షల మంది వరకూ మంచినీరు సరఫరా అవుతుందన్నారు. అయితే కార్మికులు సమ్మెకు వెళ్లడంతో నీటి సరఫరాకు ఆటంకం కలగవచ్చని, శుద్ధి జలాలు ప్రజలకు అందక అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందన్నారు. కూటమి ప్రభుత్వ పాలకులు, అధికారులు వెంటనే సమస్య పరిష్కారానికి కృషిచేయాలని కోరారు. కార్మికులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. గతంలో కార్మికుల సమస్యలపై మాజీ సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లగా జీతాలు, మెయింటెనెన్స్ కోసం సుమారు రూ.13 కోట్లు మంజురు చేశారని గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం 9 నెలలుగా కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడం బాధాకరమని అన్నా రు. సమస్య పరిష్కారమయ్యే వరకూ అన్ని మండలాల్లో కార్మికులకు మద్దతుగా ఆందోళనలు చేపడతామని బాలరాజు హెచ్చరించారు. -
నాకు పింఛన్ అర్హత లేదా?
లింగపాలెం: తనకు ఒక కాలు లేదని, కర్ర లేదా మరో వ్యక్తి సాయంతో నడవాలని.. అయినా దివ్యాంగ పింఛన్కు అర్హత లేదా అని లింగపాలెం మండలంలోని ధర్మాజీగూడెంకు చెందిన దువ్వూరి నాగరాజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. పింఛన్ సొమ్ముతో జీవనం సాగిస్తున్న నాగరాజుకు పింఛన్ తొలగిస్తున్నట్టు ప్రభుత్వం నోటీసు ఇవ్వడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. అలాగే మండలంలో 103 మంది దివ్యాంగులకు సచివాలయ ఉద్యోగులు నోటీసులు అందించారు. మరలా సర్టిఫికెట్ల ద్వారా ఎంపీడీఓ కార్యాలయం నుంచి రీవెరిఫికేషన్ చేయించుకోవాలని సచివాలయ సిబ్బంది అనడంతో లబోదిబోమంటున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల మండలంలో 83 మందిని ఆస్పత్రికి వెళ్లి పింఛన్ వెరిఫికేషన్ చేయించుకోవాలని సచివాలయ ఉద్యోగులు తెలియజేశారు. -
యూరియా సరఫరాలో విఫలం
తాడేపల్లిగూడెం: రాష్ట్రంలో రైతులకు యూరియాను సరఫరా చేయడంలో అధికార యంత్రాంగం విఫలమైందని వైఎస్సార్సీపీ రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డి రఘురాంనాయుడు అన్నారు. శనివారం ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతులకు అన్నింటా అండగా నిలిచిందన్నారు. సకాలంలో ఎరువులు, పురుగు మందులు అందించడంతో పాటు ఆర్బీకేలతో భరోసా కల్పించిందన్నారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని, నీరు నిలిచిన మెట్ట పంటలకు, ముంపునకు గురైన మాగాణి పొలాలకు యూరియాను వెంటనే వాడాల్సి ఉందని, పదును దాటిన తర్వాత వాడినా ఉపయోగం ఉండదన్నారు. ఈ కారణంతో యూరియా వాడకం పెరిగినా తగిన స్థాయిలో అందుబాటులో లేదన్నారు. యూరియా నిల్వలపై వ్యవసాయ శాఖ చేస్తున్న ప్రకటనలకు, క్షేత్రస్థాయి స్థితికి సంబంధం లేదన్నారు. శాసీ్త్రయంగా నిరూపణ కాని నానో యూరియా డబ్బాను రైతులతో బలవంతంగా కొనిపిస్తున్నారన్నారు. సెప్టెంబరు మొదటి వారం దాటాకా కాని యూరియా రాష్ట్రానికి రాని పరిస్థితులు ఉన్నాయని, వెంటనే యూరియా కొరత తీర్చాలని డిమాండ్ చేశారు. -
చెక్ పవర్ రద్దుపై హైకోర్టు స్టే
పెనుగొండ: కుట్రతో రద్దు చేయించిన చెక్ పవర్ రద్దును నిలిపివేస్తూ హైకోర్టు స్టే విధించిందని పోడూరు మండలం పండిత విల్లూరు సర్పంచ్ ఇళ్ల లక్ష్మీ చంద్రిక తెలిపారు. శనివారం హైకోర్టు ఉత్తర్వులను కలెక్టరు చదలవాడ నాగరాణి, డీపీఓ రామ్నాథ్రెడ్డిలకు పోడూరు జెడ్పీటీసీ గుంటూరి పెద్దిరాజు, ఆచంట ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ గుబ్బల వీరబ్రహ్మం, వైఎస్సార్సీపీ నాయకుడు గెద్దాడ ఏకలవ్యలతో కలిసి అందించినట్లు తెలిపారు. ఈ పోరాటానికి సహకరించిన మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఇతరులకు కృతజ్ఞతలు తెలిపారు. ఏలూరు (టూటౌన్) : తన పొలం చుట్టూ సిమ్మెంట్ దిమ్మలతో ఫెన్సింగ్ వేస్తే ఇటీవల కొన్ని దిమ్మెలు అపహరణకు గురయ్యాయని దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని దెందులూరు మండలం శ్రీరామవరం గ్రామానికి చెందిన కామిరెడ్డి వీర వెంకట సత్య సతీష్ శనివారం కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. శ్రీరామవరంలో తన పొలం అన్యాక్రాంతం కాకూడదని పొలం చుట్టూ సిమెంట్ దిమ్మెలతో ఫెన్సింగ్ వేసినట్లు తెలిపారు. ఆ సిమెంట్ దిమ్మెలు వేరే వ్యక్తి పొలంలో దర్శనమిచ్చాయని దీనిపై దెందులూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినందుకు కొందరు తనను బెదిరించి కులం పేరుతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరు (టూటౌన్): బీఎస్ఎన్ఎల్ ఆధ్వర్యంలో ఫైబర్ టీవీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా టెలికం ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ ఎల్.శ్రీను తెలిపారు. స్థానిక టెలికం జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫైబర్ టీవీ కేవలం రూ.400లకే అందిస్తున్నామని, రూ.260 ఇంటర్నెట్, రూ.140కి కాల్స్ ప్లస్ తో 400 ఛానల్స్, 9 ఓటీటీ చానల్స్ ఇస్తారన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బీఎస్ఎన్ఎల్ ఒక్క రూపాయికే 4జీ సిమ్ ఉచితంగా ఇవ్వడంతో పాటు 30 రోజుల కాలవ్యవధితో కొత్త ఫ్రీడం ప్లాన్ను ప్రవేశ పెట్టినట్లు చెప్పారు. ముదినేపల్లి రూరల్: పురుగులమందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ శనివారం ఉదయం మృతి చెందింది. స్థానిక పోలీసుల కథనం ప్రకారం కలిదిండి మండలం కోరుకొల్లుకు చెందిన సిరివెళ్ల సుబ్బారావు కుమార్తె కామాక్షిని(31) చల్లపల్లి మండలం మంగలాపురం గ్రామానికి చెందిన పేరం శ్రీనుకు ఇచ్చి 12 ఏళ్ల క్రితం వివాహం చేశారు. శ్రీను మద్యానికి బానిసై తరచూ భార్యను వేధించేవాడు. దీంతో కామాక్షి పుట్టింటికి వచ్చింది. 20 రోజుల కిందట శ్రీను కోరుకొల్లు వచ్చి హాస్టల్లో ఉండి చదువుకుంటున్న ఇద్దరు పిల్లల్ని తనవెంట తీసుకువెళ్లాడు. దీంతో మనస్తాపం చెందిన కామాక్షి ముదినేపల్లిలోని కనకదుర్గమ్మ ఆలయం వద్దకు వచ్చి పురుగులుమందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. చికిత్స నిమిత్తం గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లగా మెరుగైన వైద్య నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి పంపారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలవరం రూరల్: శ్రీసత్య సాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్, వర్కర్స్ వేతన బకాయిలు తక్షణమే ఇవ్వాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మొడియం నాగమణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం పట్టిసం వద్ద వర్కర్స్ బకాయిల కోసం చేపట్టిన నిరసన కార్యక్రమానికి సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు తెల్లం రామకృష్ణ తదితరులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 11 నెలల వేతనాలు బకాయిలు ఉంటే కార్మికులు కుటుంబాలు ఎలా గడుస్తాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. ఎస్సై షేక్ జబీర్ తెలిపిన వివరాల ప్రకారం.. టి.నరసాపురం మండలం అప్పలరాజుగూడానికి చెందిన తొమ్మిదేళ్ల వెంకటాచలం, అతని భార్య కృష్ణకుమారి (50) బైక్పై జంగారెడ్డిగూడెం వస్తున్నారు. తాడువాయి సమీపంలో వెనుక నుంచి లారీ బైక్ను ఢీకొంది. వెనుక కూర్చొన కృష్ణకుమారి జారి పడిపోయింది. ఆమె లారీ టైర్ల కింద పడిపోగా, ఆమెను కొంత దూరం లారీ ఈడ్చుకుపోయింది. ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. వెంకటాచలానికి స్వల్ప గాయాలయ్యాయి. -
శ్రీవారి సేవలోహైకోర్టు న్యాయమూర్తి
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్ వి.సుజాత శనివారం సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆమెకు ముందుగా దేవస్థానం అధికారులు మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి స్వామి, అమ్మవార్లను దర్శించి, ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం శ్రీవారి శేష వస్త్రాన్ని కప్పి, వేద ఆశీర్వచనాన్ని పలికి స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. మద్ది అంజన్న సేవలో.. జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో ఆంజనేయస్వామికి అభిషేక సేవ నిర్వహించారు. ఆలయ ముఖమండపంపై స్వామి ఉత్సవమూర్తికి అర్చకులు శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకం నిర్వహించారు. మద్ది అంజన్నను హైకోర్టు న్యాయమూర్తి వి.సుజాత కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆలయ ఈవో, అర్చకులు స్వాగతం పలికి ప్రత్యేక పూజ ఏర్పాట్లు చేశారు. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు హనుమద్ హోమం నిర్వహిస్తున్నట్లు, ఈవో తెలిపారు. గన్నవరానికి చెందిన పాలడుగు సత్యసాయి కుమార్ జ్ఞాపకార్ధం వారి కుటుంబ సభ్యులు రూ.1,00,116లు విరాళంగా అందజేసినట్లు తెలిపారు. -
ఇప్పుడు నిషేధమంటే ఎలా?
భీమవరం : వినాయక చవితి ఉత్సవాల్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్(పీఓపీ)తో తయారుచేసిన విగ్రహాలను నిషేధించాలంటూ కలెక్టర్ చేసిన ప్రకటనతో విగ్రహాల తయారీదారుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికే వందలాది విగ్రహాలను తయారుచేసి అమ్మకాలకు సిద్ధం చేసిన సమయంలో కలెక్టర్ ప్రకటన తమ పొట్టకొట్టేలా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సంప్రదాయ ఉత్సవాల్లో వినాయక చవితికి అత్యంత ప్రాధాన్యత ఉంది. చవితి పండుగకు ఏడెనిమిది నెలల ముందు నుంచే అనేక ప్రాంతాల్లో విగ్రహాల తయారీలో నిమగ్నమయ్యారు. దీనికి గాను లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టారు. విగ్రహాలు అమ్మి చేసిన అప్పులు తీర్చుకుని మిగిలిన కాస్తో కూస్తో సొమ్ములతో జీవించాలని ఆశతో ఎదురుచూస్తున్న విగ్రహాల తయారీదారులకు పీఓపీ విగ్రహాల అమ్మకాలు నిలిచిపోతే తమ పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మట్టి విగ్రహాల తయారీ కష్టం కావడంతో పాటు పీఓపీ విగ్రహాల పట్ల మోజు పెరగడంతో కొన్ని ఉత్సవ కమిటీలు పోటీలు పడి పెద్ద పెద్ద విగ్రహాలను ఏర్పాటు చేసి భారీ స్థాయిలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దీంతో వినాయక విగ్రహాల తయారుదారులు సైతం వివిధ రకాల సైజులు, ఆకారాల్లో ఆకర్షణీయమైన రంగుల్లో విగ్రహాలను తయారుచేస్తున్నారు. దీనికిగాను ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వచ్చే వినాయక చవితికి జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే విగ్రహాల తయారీ ప్రారంభిస్తున్నారు. కొంతమంది పెద్ద మొత్తంలో సొమ్ములు అప్పులు చేసి ప్రత్యేకంగా కార్మికులను పెట్టుకుని విగ్రహాల తయారీ ద్వారా ఉపాధి కల్పించడంతోపాటు జీవనోపాధి పొందుతున్నారు. వర్షాకాలంలో సైతం విగ్రహాలు తడిచిపోకుండా షెల్టర్స్ ఏర్పాటుచేసి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భీమవరం, పాలకొల్లు, పెనుగొండ, సిద్దాంతం, తాడేపల్లిగూడెం, తణుకు, అత్తిలి, ఆకివీడు, విస్సాకోడేరు తదితర ప్రాంతాల్లో పీఓపీ విగ్రహాలు తయారు చేస్తున్నారు. వినాయక విగ్రహాలతోపాటు దసరా సందర్బంగా కనక దుర్గమ్మ విగ్రహాలను తయారుచేసి విక్రయిస్తుంటారు. అయితే పీఓపీ విగ్రహాల నిషేధమని కలెక్టర్ ప్రకటించడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి పర్యావరణ పరిరక్షణ పట్ల చిత్తశుద్ది ఉంటే పీఓపీ విగ్రహాల తయారీ ప్రారంభ సమయంలోనే అడ్డుకుని ఉంటే తాము ప్రత్యామ్నాయ ఉపాధిని వెదుక్కుని దానిలో స్థిరపడేవాళ్లమని, పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి పెద్ద సంఖ్యలో విగ్రహాలు తయారుచేసిన తరువాత నిషేధం ఏంటంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివిధ రంగులు, ఆకారాల్లో వినాయక విగ్రహాలు నేను ఏటా వినాయక విగ్రహాల తయారీ ద్వారా జీవనోపాధి పొందడమేగాక మరొక 50 మందికి ఉపాధి కల్పిస్తున్నాను. ఏటా చవితికి దాదాపు ఆరేడు నెలల ముందుగానే విగ్రహాలు తయారుచేస్తాం. ఇప్పటికే మా వద్ద 200 వరకు విగ్రహాలున్నాయి. అప్పులు తెచ్చి దాదాపు రూ.60 లక్షల వరకు పెట్టుబడి పెట్టాం. ఇలాంటి తరుణంలో పీఓపీ విగ్రహాలు నిషేధంమంటే మా పరిస్థితి ఏంటి.? – ఇంటి ప్రసాద్, విగ్రహాల తయారీదారుడు, వరిధనం, పాలకొల్లు మండలం వినాయక చవితి, దసరా ఉత్సవాలకు విగ్రహాలను తయారుచేయడం ద్వారా ఉపాధి పొందుతున్నాం. విగ్రహాల తయారీపై ఆధారపడి జీవిస్తున్నాం. గతంలో మట్టి విగ్రహాలు తయారుచేసినా నేడు పీఓపీ విగ్రహాలకు ఆదరణ పెరగడంతో వాటిని తయారుచేస్తున్నాం. ఫిబ్రవరి నెలలోనే విగ్రహాల తయారీ ప్రారంభించాం. ఇప్పుడు పీఓపీ విగ్రహాలు నిషేధం అంటూ ప్రకటనలు చేయడం ఎంతవరకు న్యాయం. – కె మల్లిఖార్జునరావు, విగ్రహాల తయారీదారుడు, పూలపల్లి పీఓపీ విగ్రహాల తయారీదారుల ఆందోళన రూ.లక్షల పెట్టుబడితో పెద్ద సంఖ్యలో విగ్రహాల తయారీ ఇప్పుడు కలెక్టర్ ప్రకటనతో ఆందోళనలో తయారీదారులు -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి
భీమవరం: కేంద్రం ప్రభుత్వం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి పిలిచిన ప్రైవేటు టెండర్లను తక్షణం ఉపసంహరించుకోచాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బి.బలరాం డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలో నిర్వహిస్తున్న పార్టీ జిల్లాస్థాయి శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని 35 భాగాలుగా విడదీసి ప్రైవేట్ టెండర్ పిలిస్తే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. ఫ్యాక్టరీ కార్మికులు అనేక పోరాటాలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని, ఇప్పటికే ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉక్కు పరిశ్రమ ప్రైవేటుపరం కాకుండా కాపాడుతామని చెప్పి నేడు నోరు మెదపకపోవడం దారుణమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కాపాడే చర్యలు చేపట్టాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని బబలరామ్ హెచ్చరించారు. ఏలూరు (ఆర్ఆర్పేట): జీఎన్ఎం/బీఎస్సీ నర్సింగ్ చదివి 35 ఏళ్ల లోపు వున్న షెడ్యూల్డు కులాలకు చెందిన యువతులకు జర్మనీలో నర్సింగ్ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ సహకారంతో రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఉచిత శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోందని నైపుణ్యాభివృద్ధి అధికారి ఎన్.జితేంద్ర బాబు ఒక ప్రకటనలో తెలిపారు. 8 నెలల నుంచి 10 నెలల వరకు శిక్షణ ఉంటుందని, శిక్షణ సమయములో ఉచిత వసతి, భోజన సదుపాయం ఏర్పాటు చేస్తామన్నారు. శిక్షణానంతరం జర్మనీలో నర్సింగ్ ఉద్యోగం కల్పిస్తారన్నారు. ఈ శిక్షణకు జీఎన్ఎం/బీఎస్సీ నర్సింగ్ చేసిన వారు అర్హులన్నారు. ఇతర వివరాలకు 8333040217, 9885609777, 9346890335 నెంబర్లలో సంప్రదించాలన్నారు. ఆగిరిపల్లి: తన సోదరుడు కనబడడం లేదని అక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శుభశేఖర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని నెక్కలం గొల్లగూడెంలో అక్క ఇంటి వద్ద ఉంటున్న బొక్కినాల నరేష్ ఈనెల 18 నుంచి కనిపించడం లేదు. శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎరువుల షాపులపై దాడులు
లింగపాలెం : లింగపాలెం మండలంలోని పలు గ్రామాల్లో శనివారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, వ్యవసాయ, రెవిన్యూ శాఖల అధికారులు ఎరువుల షాపులపై దాడులు నిర్వహించారు. ములగలంపాడులోని శ్రీవిజయదుర్గా ట్రేడర్స్లో దాడులు నిర్వహించగా ఎరువులు తేడా వచ్చిట్లు అధికారులు తెలిపారు. ఈ తేడాలకు సంబంధించి రూ.5.80 లక్షల ఎరువులను సీజ్ చేసి కేసునమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎరువుల విక్రయాలు పారదర్శికంగా నిర్వహించాలని షాపుల యజమానులకు అధికారులు సూచించారు. అక్రమాలకు పాల్పడితే సహించేదిలేదని హెచ్చరించారు. ఏలూరు (ఆర్ఆర్పేట): జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపిన, పాఠశాలలకు అందించే స్కూల్ ఆఫ్ సోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డులకు జిల్లాలోని 5 పాఠశాలలు ఎంపికయ్యాయని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటలక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. తొలి స్థానంలో పెదవేగి బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల, ద్వితీయ స్థానంలో ఏలూరు సెయింట్ థెరిసా బాలికల ఉన్నత పాఠశాల, తృతీయ స్థానంలో ఏలూరులోని ఏఆర్డీజీకే నగరపాలక ఉన్నత పాఠశాల ఉన్నాయన్నారు. 4వ స్థానంలో వట్లూరులోని బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల, 5వ స్థానంలో కొవ్వలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉన్నాయన్నారు. -
ఉత్సాహంగా యోగా పోటీలు
తాడేపల్లిగూడెం (టీఓసీ): రాష్ట్ర స్థాయి యోగాసన స్పోర్ట్స్ చాంపియన్షిప్ పోటీలు మూడో రోజుకు చేరాయి. శనివారం వ్యక్తిగత, జంట పోటీలు నిర్వహించారు. వ్యక్తిగత విభాగంలో భాగంగా ట్రెడిషనల్ యోగాసన, ఫార్వర్డ్ బెండ్ ఇండివిడ్యువల్, బాక్వర్డ్ బెండ్ ఇండివిడ్యువల్, ట్విస్టింగ్ ఇండివిడ్యువల్, ఆర్టిస్టిక్ యోగా విభాగాలలో పోటీలు నిర్వహించారు. ఐదు విభాగాలలో జరిగిన పోటీలలో మహిళలకు, పురుషులకు వేర్వేరు పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో 23 జిల్లాల నుంచి యోగా సాధకులు పాల్గొన్నారు. యోగాసనాలలో ప్రతిభ కనబరిచిన 48 మందికి బంగారు, వెండి పతకాలు అందజేశారు. సెషన్స్ కోర్డు న్యాయమూర్తి షేక్ సికిందర్ బాషా చేతుల మీదుగా ప్రశంస పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి, రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయికి, అక్కడనుండి ప్రపంచ స్థాయికి ఎదుగుతున్న యోగాను ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షురాలు రాధిక, సహాయ కార్యదర్శి వెంకటరమణ, కోశాధికారి మల్లికార్జున రావు, ఎగ్జిక్యుటివ్ మెంబర్, కాంపిటేషన్ మేనేజర్ కరిబండి రామకృష్ణ, నిర్వహణ డైరెక్టర్ రాఘవేంద్ర, అరా ఫౌండేషన్ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడు అపర్ణ ప్రసాద్, లయన్ త్రిమూర్తి, బాలగోపాల రామాంజనేయ రాజు, సుభద్ర, ద్వారంపూడి భాను ప్రసాద్, మల్లికార్జున రావు, సుజాత, నున్న నాగేశ్వరరావు, సూరిబాబు, ముత్యాల కృష్ణ, నరసింహరావు, వెంకటేశ్వర్లు, వై.వెంకటేశ్వరరావు, మురళీకృష్ణ, తిరుపతి రాయి, త్రిమూర్తులు పాల్గొన్నారు. వివిధ యోగాసనాలు -
రంగా విగ్రహాలకు అవమానం
కైకలూరు/కలిదిండి: ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని కలిదిండి, సానారుద్రవరం గ్రామాల్లో దివంగత ఎమ్మెల్యే, కాపు నేత వంగవీటి మోహనరంగా విగ్రహాలకు అవమానం జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి మాస్్కలు ధరించిన ఇద్దరు దుండగులు కలిదిండి, సానారుద్రవరం గ్రామాల్లో రంగా విగ్రహాలకు పేడపూసి అవమానించారు. పోలీసులు సేకరించిన సీసీ టీవీ ఫుటేజీలలో ఈ దృశ్యాలు నమోదయ్యాయి. కలిదిండి మూడు కూడళ్ల సెంటర్లో రంగా విగ్రహం వద్ద శుక్రవారం సినీ నటుడు చిరంజీవి పుట్టిన రోజు వేడుక నిర్వహించారు. శనివారం ఉదయం రెండు ప్రాంతాల్లో విగ్రహాలకు పేడ ఉండటాన్ని గమనించిన రంగా అభిమానులు కోపంతో రగిలిపోయారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేశారు. నిందితుల్ని గుర్తించేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు. సీసీటీవీ ఫుటేజీలను సేకరించి.. నిందితుల్ని గుర్తించేందుకు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సాయంతో దర్యాప్తు చేపట్టారు. పథకం ప్రకారమే.. ముదినేపల్లి మండలం ఈడేపల్లిలో రెండు, కైకలూరు మండలం ఆలపాడులో ఒకచోట స్థాపించిన రంగా విగ్రహాలను ఆయన తనయుడు వంగవీటి రాధా ఆదివారం ఆవిష్కరించనున్నారు. కలిదిండి, సానారుద్రవరం గ్రామాల మీదుగానే ఆయన వెళ్లాల్సి ఉంది. అందుకే దుండగులు ఈ మార్గాన్ని ఎన్నుకున్నట్టు తెలుస్తోంది. సీసీ టీవీ ఫుటేజీల్లో ఈ దుశ్చర్యకు పాల్పడిన ఇద్దరూ 18 ఏళ్లలోపు వారిగా కనిపిస్తున్నారు. మాస్క్ పెట్టుకుని ఒక యువకుడు విగ్రహానికి పేడ పూయగా, తర్వాత మరో యువకుడు బైక్పై రావడంతో అతనితో కలిసి పరారయ్యాడు. రాధా రానుండటంతో పక్కా పథకం ప్రకారమే విగ్రహాలకు పేడ పూసినట్టు స్థానికులు భావిస్తున్నారు. విగ్రహాలను శుద్ధి చేసిన వైఎస్సార్సీపీ నేతలు దుండగుల దుశ్చర్యను తెలుసుకుని శనివారం రంగా విగ్రహాలను శుద్ధి చేసేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలపై కూటమి కార్యకర్తలు కవ్వింపు చర్యలకు దిగారు. వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) శనివారం కలిదిండిలోని రంగా విగ్రహం వద్దకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో వచ్చారు. రంగా విగ్రహానికి క్షీరాభిషేకం చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో కూటమి పార్టీకి చెందిన వ్యక్తులు డీజే వ్యాన్ను పెద్ద శబ్దంతో విగ్రహం వైపు తిప్పారు. అక్కడితో ఆగకుండా కూటమి కార్యకర్తలు బైక్లపై నినాదాలు చేస్తూ కవ్వింపు చర్యలకు దిగారు. దీంతో డీఎన్నార్ సీఐ రవికుమార్కు ఫిర్యాదుచేశారు. కూటమి కార్యకర్తల కవ్వింపు చర్యలను నిరసిస్తూ వైఎస్సార్సీపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా డీఎన్నార్ మాట్లాడుతూ.. నాలుగు రోజుల్లోగా దోషులను గుర్తించాలని, లేదంటే 3వేల మంది కార్యకర్తలతో కలిదిండిలో నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. ఎమ్మెల్యేను చుట్టుముట్టిన జనం విగ్రహాలను అవమానించిన విషయం తెలుసుకున్న బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఘటనా స్థలాలను శనివారం పరిశీలించారు. దీంతో.. స్థానికులు ఆయనను చుట్టుముట్టారు. నిందితులను తక్షణమే పట్టుకోవాలని పట్టుబట్టారు. ఎమ్మెల్యే కామినేని ఐజీ జీవీజీ అశోక్కుమార్తో ఫోన్లో మాట్లాడారు. ఆంధ్రా–తెలంగాణ రాధా, రంగా మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు కాళ్లపాలెం బుజ్జి మాట్లాడుతూ దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కాగా.. సీఎం చంద్రబాబు కార్యాలయం ‘ఎక్స్’ వేదికగా స్పందించింది. ఈ ఘటనను సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారని, దోషులను గుర్తించి కఠిన చర్యలు తీసు కోవాలని అధికారులను ఆదేశించారని పేర్కొంది. దుండగుల సమాచారమిస్తే బహుమతి రంగా విగ్రహాలకు పేడ పూసిన దుండగుల సమాచారం చెబితే బహుమతి అందిస్తామని ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్కుమార్ శనివారం ప్రకటించారు. కలిదిండి పోలీస్స్టేషన్లో శనివారం ఆయన మాట్లాడుతూ.. ప్రజల మధ్య విభేదాలు సృష్టించడానికే దుండగులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారని చెప్పారు. -
నూలి అరాచకాల నుంచి రక్షించండి
నరసాపురం: నరసాపురంలోని పద్మశ్రీ అద్దేపల్లి సర్విశెట్టికి చెందిన బీజీబీఎస్ మహిళా కళాశాల పాలకవర్గం వ్యవహారాలపై రోజురోజుకూ వ్యతిరేకత పెరుగుతోంది. కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ నూలి శ్రీనివాస్ రౌడీలను పెట్టి తమను ఇల్లు కదలకుండా చేస్తున్నారని, స్థలాన్ని, ఇంటిని దౌర్జన్యంగా ఖాళీ చేయిస్తున్నారని వెలిగట్ల కిన్నెర, శ్రీను దంపతులు శుక్రవారం ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, తమకు ఆత్మహత్యే శరణ్యమని విలేకరుల వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. కళాశాల కాంట్రాక్ట్ అధ్యాపకులు 55 రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పట్టణం నడిబొడ్డున విజయలక్ష్మి కంటి ఆస్పత్రి వద్ద కళాశాల యా జమాన్యం 99 ఏళ్లకు లీజుకిచ్చిన స్థలాన్ని హస్తగ తం చేసుకుని 30 ఏళ్లుగా నివాసం ఉంటున్న త మను రోడ్డు పాలు చేయాలని చూస్తున్నారని కిన్నెర దంపతులు వాపోయారు. ఇదిలా ఉండగా సర్విశెట్టి ఆస్తుల విషయంలో జరుగుతున్న అన్యాయంపై అధికారులు చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పీడీ రాజు డిమాండ్ చేశారు. 30 ఏళ్లుగా ఉంటున్న వారికి కనీసం నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యం చేయడం తగదన్నారు. మరోవైపు కళాశాల ఆస్తులు నూలి శ్రీనివాస్ అమ్ముకుంటుంటే తాము ఆందోళన చేసి నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. దళిత ఉద్యమ నేత చింతపల్లి గురుప్రసాద్ మాట్లాడుతూ నరసాపురంలో మహిళలపై అరాచకాలు, దౌర్జన్యాలు జరుగుతుంటే పవన్కల్యాణ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే అండదండలతోనే ఇవన్నీ జరుగుతున్నాయన్నారు.బీజీబీఎస్ మహిళా కళాశాల వ్యవహారంలో రోడ్డెక్కిన మరో కుటుంబం -
ఉచిత బస్సుతో ఉపాధికి గండి
ఏలూరు (టూటౌన్): రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో ఆటో డ్రైవర్లు కిరాయిలు లేక తీవ్రంగా నష్టపోతున్నారని, ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని ఏలూరు జిల్లా ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జె.గోపి, చక్రాల అమర్కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఏలూరు పాత బస్టాండ్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకూ ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. అనంతరం డీఆర్వో విశ్వేశ్వరరావుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లైసెన్స్ ఉన్న ప్రతి ఆటో డ్రైవర్కు ఏడాదికి రూ.25 వేల ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్.లింగరాజు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు ప్ర త్యామ్నాయ ఉపాధి కల్పించాలని వారి కుటుంబాలకు భరోసా ఇచ్చేలా వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. రవాణా రంగం ద్వారా ప్రభుత్వా నికి కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నా రవాణా రంగ కార్మికులకు, ఆటో డ్రైవర్లకు సంక్షేమ చ ట్టాన్ని అమలు చేయకపోవడం ప్రభుత్వాల అసమర్థతకు నిదర్శనమన్నారు. భారీగా ఆటోలతో ర్యా లీని నిర్వహించడంలో బొడ్డేపల్లి చంద్రశేఖర్, బి.శ్రీనాథ్, అడ్డాల రాజు, నల్లమిల్లి నాగరాజు, బాష, శ్రీనివాసరావు, రాము ఇతర ఆటో యూనియన్ నాయకులు నాయకత్వం వహించారు. సీఐటీయూ నగర నాయకులు వైఎస్ కనకారావు, ఎం.ఇస్సాకు, పి.రవి మద్దతు తెలిపారు. -
రాయితీ ఎగ్గొట్టేందుకు కుట్ర
అయ్యా.. యూరియా ● యూరియా దొరక్క రైతుల అవస్థలు ● సొసైటీల వద్ద పడిగాపులు ● పట్టించుకోని కూటమి సర్కారు శనివారం శ్రీ 23 శ్రీ ఆగస్టు శ్రీ 2025ఏలూరు (మెట్రో): జిల్లాలో యూరియా కొరతతో రైతులు అల్లాడుతున్నారు. సొసైటీల వద్ద పడిగాపులు, రోజంతా నిరీక్షణలు అన్నదాతలకు నిత్యకృత్యమయ్యాయి. యూరియా కొరత లేదని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. గతేడాది నుంచి రైతులకు సరఫరా తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతూనే ఉంది. దీనిలో భాగంగా ఏటా అందించే యూరియా కోటాలో 1,000 టన్నులను గతేడాది తగ్గించింది. ఇలా యూరియాపై సబ్సిడీని ఎగ్గొట్టేందుకే కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఏలూరులో జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో యూరియా కొరత, కౌలు రైతుల దయనీయ పరిస్థితులపై ప్రజాప్రతినిధులు ధ్వజమెత్తడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. కాల‘కూటమి’ విషం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి అధ్వానంగా మారింది. రైతు భరోసా సాయాన్ని ఏడాది పాటు నిలిపివేయడంతో పెట్టుబడుల కోసం రైతులు అవస్థలు పడ్డారు. అలాగే గ్రామాల్లో పూర్తిస్థాయిలో సేవలందిస్తున్న రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేస్తోంది. దీంతో రైతులకు సకాలంలో ఎరువులు, పురుగు మందులు అందడం లేదు. ప్రధానంగా సీజన్ ప్రారంభంలో రైతులకు సమృద్ధిగా అందించాల్సిన యూరియాను సరఫరా చేయడంలో కూటమి సర్కారు ఘోరంగా విఫలమైంది. గతమెంతో ఘనం.. ప్రస్తుతం ఎగనామం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా 2022–23లో జిల్లాలో 26,591 ట న్నులు, 2023–24లో 26,090 టన్నుల యూరియాను రైతులకు అందించారు. అయితే కూటమి ప్రభుత్వం ఈ సీజన్లో 33,762 టన్నుల యూ రియా అవసరమని గుర్తించగా ఇప్పటివరకూ కేవలం 8 వేల టన్నుల మాత్రమే సరఫరా చేశారు. ఇక ఈ నెలలో 10,183 టన్నుల అవసరం అని అధికారిక గణాంకాలు చెబుతుంటే 5,496 టన్నుల యూరియా మాత్రమే అందుబాటులో ఉంచారు. రోజంతా ఉన్నా ఒక్క బస్తానే.. రైతులకు ఎరువులు, పురుగు మందులు అందించడంతో కూటమి ప్రభుత్వం అలసత్వం వహిస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో రైతులకు ఎంత కావాలంటే అంత యూరియా అందుబాటులో ఉంచారు. యూరియా బస్తా ధర రూ.2,500కుపైగా ఉండగా రైతులకు రూ.266కు మాత్రమే ప్రభుత్వం సబ్సిడీపై అందించాల్సి ఉంది. ఈ మేరకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పూర్తిస్థాయిలో రైతులకు యూరియాను సరఫరా చేశారు. అయితే ప్రస్తుతం ఆ సబ్సిడీ భారం తగ్గించుకునేందుకు కూటమి సర్కారు రైతులను ముప్పుతిప్పలు పెడుతుంది. రైతులు క్యూలో నిలబడి సొసైటీల వద్ద రోజంతా పడిగాపులు పడితే ఒక్క బస్తా మాత్రమే ఇస్తున్నారు. అది కూడా రైతు మొబైల్కు ఓటీపీ వస్తేనే పంపిణీ చేస్తున్నారు. పోలవరం రూరల్: పోలవరం మండలం గూటాల సొసైటీ వద్ద శుక్రవారం రైతులు బారులు తీరారు. యూరియా వచ్చిందన్న సమాచారంతో తమకు ఇస్తారో లేదోనన్న ఆందోళనలో క్యూ కట్టారు. నాట్లు వేసిన పొలాలకు కలుపు తీసి యూరియాను చల్లుతున్నారు. ఈ సమయంలో యూరియా అవసరం అధికంగా ఉండటంతో రైతులు పెద్ద ఎత్తున సొసైటీ వద్దకు చేరుకున్నారు. రైతులకు యూరియాతో పాటు నానో యూరియా వాడకంపై అవగాహన కల్పించినట్టు వ్యవసాయాధికారి తెలిపారు. 1,500 ఎకరాలకు సరిపడా యూరియా, నానో యూరియా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. గతంలో జిల్లాలో యూరియా ఇబ్బందులు లేవు. ప్రస్తుతం ఒక్క యూరియా బస్తా కావాలన్నా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సొసైటీల వద్ద పడిగాపులు తప్పడం లేదు. మొబైల్కు ఓటీపీ వస్తేనే రైతులకు యూరియా ఇవ్వాలన్న నిబంధనతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. – కోన శ్రీనివాసరావు, అడవికొలను జిల్లాలో రైతులకు యూరియా అందించేందుకు చర్యలు తీసుకోవాలి. లేదంటే ఆందోళనకు సిద్ధమవుతాం. గతంలో ఎన్నడూ లేనివిధంగా జిల్లాలో యూరియా కొరత నెలకొంది. నానో ఎరువుల పేరుతో అధికారులే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని అనుమానంగా ఉంది. – కె.శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి -
సమస్యలు పరిష్కరించాలని వినతి
కై కలూరు: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ న్యాయవాదులు న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. కై కలూరు కోర్టులో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గురజాడ ఉదయశంకర్ అధ్యక్షతన నిర్వహించిన న్యాయవాదుల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయవాదులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. న్యాయవాదుల ప్రమాద బీమా నగదు రూ.4 లక్షలకు ప్రభుత్వం మరో రూ.6 లక్షలు కేటాయించాలన్నారు. జూనియర్ కోర్టు పరిధి కేసులను రూ.20 లక్షల నుంచి తగ్గించాలన్నారు. న్యాయవాదులకు హెల్త్ బీమా స్కీంను వర్తింపచేయాలన్నారు. స్థానిక సబ్కోర్టు నిర్మాణానికి ఎస్టిమేట్ సరిపోలేదని దీనిని రూ.కోటి 77లక్షలకు పెంచాలన్నారు. మంత్రి స్పందిస్తూ ప్రాధాన్యత క్రమంలో సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. సాక్షి, టాస్క్ఫోర్స్: భీమడోలు పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై శుక్రవారం ఏలూరు డీఎల్పీవో బృందం విచారణ నిర్వహించింది. ఐదు నెలల కాలంలో రూ.కోటికి పైగా నిధులు పంచాయతీ కార్యదర్శి దుర్వినియోగం చేసినట్లు పంచాయతీ పరిధిలోని నాచేటిగుంటకు చెందిన కొత్తపల్లి చంద్రమౌళి రాష్ట్ర, జిల్లా స్థాయి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసారు. ఈ నేపథ్యంలో భీమడోలు పంచాయతీ కార్యాలయంలో డీఎల్పీవో అమ్మాజీ విచారణ చేశారు. పంచాయతీలోని రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించారు. కార్యదర్శి కేవీ తనూజ, ఫిర్యాదుదారుడైన, దళిత నాయకుడు కొత్తపల్లి చంద్రమౌళిల నుంచి వేర్వేరుగా స్టేట్మెంట్లు స్వీకరించారు. అనంతరం డీఎల్పీవో మాట్లాడుతూ రిజిస్టర్లు, రికార్డులను క్షుణ్నంగా పరిశీలించి, తగు నివేదికను కలెక్టర్కు నివేదిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పాము సునీతా, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
● వరలక్ష్మీ.. వరప్రదాయినీ
అనివేటి మండపంలో వేదికపై వ్రత వేడుక జరిపిస్తున్న అర్చకులుఅమ్మవారికి నీరాజనాలు అర్పిస్తున్న భక్తులు ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న క్షేత్రంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తూర్పురాజగోపుర ప్రాంతంలోని అనివేటి మండపంలో ప్రత్యేక వేదికపై అమ్మవారిని వేంచేపు చేశారు. అర్చకులు, పండితులు ఉత్సవమూర్తికి విశేష పుష్పాలంకారాలు చేసి వ్రత పూజ ప్రారంభించారు. అనివేటి మండపం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో సుమారు 3 వేల మందికి పైగా మహిళలు వ్రత వేడుకల్లో పాల్గొని అమ్మవారిని పూజించారు. వేడుక అనంతరం మహిళలకు పసుపు, కుంకుమ, గాజులు, రవికలు, ప్రసాదాన్ని అర్చకులు అందించారు. ముందుగా ఈఓ ఎన్వీ సత్యనారాయణమూర్తి సతీమణి అమ్మవారికి పసుపు, కుంకుమలు, పూలు, పండ్లను అందజేశారు. ఈఓ సత్యనారాయణమూర్తి, డీఈఓ భద్రాజీ, ఏఈఓలు పి.నటరాజారావు, మెట్టపల్లి దుర్గారావు, సూపరింటెండెంట్లు జి.సుబ్రహ్మణ్యం, దుర్గాప్రసాద్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ద్వారకాతిరుమలలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు -
యోగాతో ఆరోగ్యం..ఆహ్లాదం
రాష్ట్ర స్థాయి యోగాసన స్పోర్ట్స్ చాంపియన్షిప్ పోటీలు రెండో రోజు శుక్రవారం పెంటపాడు మండలంలోని ప్రత్తిపాడు సరస్వతి విద్యాలయంలో కొనసాగాయి. వ్యక్తిగత, జంట విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఐదు రకాల వయసు విభాగాల్లో జరిగిన ఈ పోటీల్లో 23 జిల్లాల నుంచి యోగ సాధకులు పాల్గొన్నారు. 24 మందిని విజేతలను ప్రకటించారు. వీరికి నిట్ డీన్ జీఆర్కే శాస్త్రి చేతుల మీదుగా ప్రశంస పత్రాలు జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు యోగాసనాల ప్రాముఖ్యతను వివరించారు. పోటీలు 24 వరకు జరగనున్నాయి. – తాడేపల్లిగూడెం(టీఓసీ) -
‘ఆరోగ్యశ్రీ’ నిలిపివేతపై ఆందోళన
● భీమవరం వర్మ ఆస్పత్రిలోసేవలు నిలిపివేస్తూ ఉత్తర్వులు ● కలెక్టరేట్కు చేరిన డయాలసిస్ రోగులు, బంధువులు భీమవరం(ప్రకాశం చౌక్): భీమవరంలోని వర్మ ఆస్పత్రి (ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ ఆస్పత్రి)లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తూ ఎన్టీఆర్ వైద్య ట్రస్ట్ సీఈఓ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో శుక్రవారం నుంచి ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. కేసుల విషయంలో అవకతవకలు జరిగినట్టు ఆడిట్, రాష్ట్రస్థాయి కమిటీ విచారణలో గుర్తించడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీలో ఉచిత సేవలు పొందుతున్న సుమారు 200 మంది డయాలసిస్ రోగులు తీవ్ర ఆందోళన చెందారు. వైద్య సేవలు నిలిపివేస్తే తమ ప్రాణాలకు ముప్పు తప్పదని భయపడ్డారు. రోగులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి భీమవరంలోని కలెక్టరేట్కు వెళ్లి జాయింట్ కలెక్టర్, డీఎంహెచ్ఓను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రి నిర్లక్ష్యం, అధికారుల నిర్లిప్తత కారణంగా తమ ప్రాణాలను పణంగా పెట్టవద్దని బోరుమన్నారు. అకస్మాత్తుగా సేవలు నిలిపివేస్తే తమ పరిస్థితి ఏంటని వాపోయారు. తమకు అక్కడే సేవలు కొనసాగించాలని కోరారు. ఇదిలా ఉండగా ఆస్పత్రికి వచ్చిన పలువురు రోగులు సేవలు నిలిపివేయడంతో ఇబ్బందులు పడ్డారు. సేవలు కొనసాగించేందుకు చర్యలు: డీఎంహెచ్ఓ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రస్తు తం వర్మ ఆస్పత్రిలో ఎన్టీఆర్ వైద్య సేవలో డయాలసిస్ సేవలు పొందుతున్న వారికి అక్కడే డయాలసిస్ సైకిల్స్ పూర్తయ్యే వరకూ సేవలందించేందుకు చర్యలు తీసుకున్నామని డీఎంహెచ్ఓ గీతాబాయి తెలిపారు. తర్వాత జిల్లాలో రోగులకు సమీపంలో ఉన్న డయాలసిస్ యూనిట్లకు తరలిస్తామని, డయాలసిస్కు సంబంధించి కొత్త కేసులకు వర్మ ఆస్పత్రిలో అడ్మిషన్లు ఉండవని చెప్పారు. -
సాంకేతికతతో సాధికారత
తాడేపల్లిగూడెం: సాంకేతిక నైపుణ్యాలతోనే యువత సాధికారత సాధించవచ్చని ఏపీ నిట్ డీన్ స్టూడెంట్స్ కెరీర్ అలుమ్ని అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ డాక్టర్ జీబి.వీరేశ్కుమార్ అన్నారు. నిట్లో శుక్రవారం కార్పొరేట్ ఫెస్టు జరిగింది. వీరేశ్కుమార్ మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో రాణించడానికి సమకాలీన, సృజనాత్మకత ఆవిష్కరణలపై దృష్టి సారించాలన్నారు. మెర్సిడెస్ బెంజ్ సీనియర్ ఇంజనీర్ అయ్యర్ భట్టాచార్య మాట్లాడుతూ సమాజాభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర కీలకం అన్నారు. టి.హబ్ డైరెక్టర్ అవినాష్ కేదార్ అంకుర పరిశ్రమలు ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయని వాటిని అందిపుచ్చుకోవాలన్నారు. ఫ్యూజీటెక్ ఉపాధ్యక్షుడు చాణిక్య, ప్లేస్మెంటు ఆఫీసర్ శంకర్, 23 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. శనివారం ప్రాజెక్టు ఎక్స్పో నిర్వహించనున్నారు. -
ప్రాణం తీసిన కూటమి నిర్లక్ష్యం
ఏలూరు టౌన్ : 108 అంబులెన్స్లు మృత్యు శకటాలుగా మారాయి. బ్రేకులు లేకపోవటంతో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రుడు ఏలూరు జీజీహెచ్కు తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. 25 కిలోమీటర్ల లోపు దూరం వెళ్లేందుకు 2 గంటలకు పైగా సమయం పట్టటంతో క్షతగాత్రుడు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అంబులెన్స్లు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో నడవలేని స్థితికి చేరాయి. ఈ నేపథ్యంలో ఏలూరు జీజీహెచ్ వద్ద మృతుడి బంధువులు, స్నేహితులు శుక్రవారం రాత్రి ఆందోళన చేపట్టారు. బాధితుల కథనం మేరకు.. ఏలూరు వన్టౌన్ నాగేంద్రకాలనీకి చెందిన వీ.గోపీకృష్ణ (20) నగరంలోని మెడికల్ ఏజెన్సీలో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరు వస్తుండగా.. కామవరపుకోట మండలం ఆడమిల్లి వద్ద ప్రమాదం జరిగింది. వెంటనే స్థానికులు 108కు ఫోన్ చేశారు. తాపీగా స్పందించిన 108 జిల్లా అధికారులు కామవరపుకోట పీహెచ్సీ నుంచి సంఘటనా స్థలానికి బ్రేకులు లేని అంబులెన్స్ను పంపించారు. బ్రేకులు లేకపోవటం, లైట్లు వెలగని దుస్థితిలో డ్రైవర్ చేసేదేమీ లేక మెల్లగా డ్రైవ్ చేస్తూ వచ్చాడు. కనీసం సైరన్, హారన్ కూడా లేకపోవటం గమనార్హం. ఈ లోగా మృతుడి స్నేహితులు, బంధువులు ప్రశ్నించగా బ్రేకులు లేవని డ్రైవర్ చెప్పాడు. దీంతో స్నేహితులంతా 108 అంబులెన్స్కు ముందు పైలట్స్గా వ్యవహరిస్తూ వాహనానికి అడ్డులేకుండా నగరంలోని ఆంధ్రా హాస్పిటల్కు తీసుకువెళ్ళారు. పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్లు నిర్ధారించారు. అనంతరం బాధితుడి బంధువులు, స్నేహితులు అంబులెన్స్ను ఏలూరు జీజీహెచ్కు తీసుకువచ్చారు. డోర్స్ను గుడ్డతో కట్టిన దృశ్యం అంబులెన్స్ లైట్ల వద్ద తాళ్ళతో కట్టిన వైనంకనీసం డోర్ హ్యాండిల్స్ లేని 108 అంబులెన్స్ ప్రమాదం జరిగిన వెంటనే 108 అంబులెన్స్ సంఘటనా స్థలానికి చేరుకుని ఉంటే.. తమ స్నేహితుడు ప్రాణాలతో ఉండేవాడని మృతుడి స్నేహితుడు మనోహర్ వాపోయాడు. సుమారు 2గంటలకు పైగా సమయం పట్టిందని, ఇలాంటి వాహనాలను ఏ విధంగా వినియోగిస్తారో చెప్పాలంటూ ప్రశ్నించాడు. క్షతగాత్రుడిని రక్షించేందుకు బ్రేకులు, లైట్లు, సైరన్ లేని అంబులెన్స్ ఎలా పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృత్యుశకటాలుగా 108 అంబులెన్స్లు రోడ్డు ప్రమాద క్షతగాత్రుడితరలింపునకు 2 గంటలు సమయం అంబులెన్స్కు బ్రేకులు, లైట్లు, డోర్లు తాళ్ళతో కట్టిన వైనం ఏలూరు జీజీహెచ్కు చేరేలోపే యువకుడి మృతి -
మొక్కజొన్న సాగులో మెలకువలు
చింతలపూడి: మొక్కజొన్న పంటను వర్షాధారంగా, సాగునీటి కింద పండిస్తారు. ఆహార పంటగానే కాకుండ దాణా రూపంలో పశువులకు మేతగా, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగా, పేలాల పంటగా, కాయగూర రకంగా రైతులు సాగు చేస్తున్నారు. ఖరీఫ్ మొక్కజొన్న సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సాగు వివరాలను సహాయ వ్యవసాయ సంచాలకులు వై.సుబ్బారావు రైతులకు సూచించారు. ఎలాంటి నేలలు అనుకూలం ● మురుగునీరు పోయే లోతైన ఎర్రగరప, మధ్యస్థ నల్ల నేలలు బాగా అనుకూలం. నేలలో తేమను పట్టి ఉంచే గుణం ఉండాలి. ● నీరు నిల్వ ఉండే ముంపు నేలలు, చౌడు నేలల్లో మొక్కజొన్న దిగుబడి సరిగా రాదు. నేల ఉదజని సూచిక 6.5 నుంచి 7.5 మధ్య ఉండాలి. విత్తే సమయం సాధారణంగా జూన్ 15 నుంచి జూలై నెలాఖరులోగా విత్తుకోవాలి. వర్షాలు ఆలస్యంగా కురిస్తే నీటి వసతి కింద స్వల్పకాలిక హైబ్రీడ్ రకాలు ఆగస్టు నెలలో కూడ విత్తుకోవచ్చు. అనువైన రకాలు ● దీర్ఘకాలిక రకాలు (100–120 ) రోజులు: డీఎచ్ఎం –113, 900 ఎం గోల్డ్, బయో 9861, ప్రో–311, 30బి07 ● మధ్య కాలిక రకాలు (90–100 రోజులు) : డీఎచ్ఎం–111, 117, 119, కెహెచ్–510, బయో– 9657, కెఎం–9541, ఎంసిహెచ్–2 ● స్వల్పకాలిక రకాలు ( కాల పరిమితి 90 రోజుల కంటే తక్కువ) : డీఎచ్ఎం– 115, ప్రకాశ్ కెహెచ్–5991, జెకెఎంఎచ్–1701–డికెసి–7074 ఆర్, ఎంఎంఎచ్–1701, డికెసి– 7074 ఆర్, ఎంఎంఎచ్– 133,3342. ● ప్రత్యేక రకాలు తీపి మొక్కజొన్న (స్వీట్ కార్న్): మాధురి, ప్రియ, విన్ ఆరెంజ్, అల్మోరా ● స్వీట్ కార్న్ రకాలు : సుగర్–75, బ్రైట్జేన్ సంకర రకాలు విత్తే విధానం ఎకరాకు సంకర రకాలైతే 7–8 కిలోల విత్తనం వాడి 60 సెంటీమీటర్లు ఎడంగా బోదెలు చేసి సాళ్ళలో 20 సెం.మీ ఎడంగా విత్తాలి. ఇలా విత్తితే ఎకరాకు సుమారు 33,333 మొక్కలు వస్తాయి. విత్తే ముందు కిలో విత్తనానికి 3 గ్రాముల కాస్టాన్ లేదా డైధేన్ ఎం .45 చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసి బోదెకు ఒక పక్కగా విత్తాలి. ఎరువుల వాడకం ఖరీఫ్ పంటలో ఎకరాకు 72–80 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులు వాడాలి. మొత్తం పొటాష్, భాస్వరం ఎరువులను పంట విత్తే సమయంలోనే వేసుకోవాలి. ఒకవేళ జింక్ లోపం ఉంటే ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ వేయాలి. పైరుపై జింక్లోపం గమనిస్తే జింక్ సల్ఫేట్ (20 గ్రా) పిచికారీ చేయాలి. కలుపు నివారణ పంట విత్తాక 45 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. మొక్కజొన్న పంటను ఏక పంటగా వేసినప్పుడు నేల రకాన్ని బట్టి ఎకరాకు 800–1200 గ్రా, అట్రాజిన్ పొడి మందును 200 లీటర్ల నీటిలో కలిపి పంట విత్తిన వెంటనే లేదా 2–3 రోజుల్లోగా పిచికారీ చేసి కలుపును నివారించవచ్చు. వెడల్పాటి కలుపు మొక్కల నివారణకు విత్తిన 30 రోజుల తర్వాత ఎకరాకు అరకిలో 2,4–డి సోడియం సాల్ట్తో పిచికారీ చేయాలి. నీటి తడులు వర్షాధారంగా సాగు చేసినా పూత దశలో వర్షాభావ పరిస్థితులేర్పడితే వీలున్న చోట నీరు తడిపితే మంచి దిగుబడులు వస్తాయి. పూత దశ, గింజలు ఏర్పడే దశల్లో నీటి ఎద్దడి లేకుండ చూసుకోవాలి. పైరు తొలి దశలో పొలంలో నీరు నిల్వ లేకుండ జాగ్రత్తలు తీసుకోవాలి. సస్యరక్షణ పైరు తొలి దశలో ఆశించే మొవ్వ తొల్చే పురుగు నివారణకు ముందు జాగ్రత్తగా విత్తిన 10–12 రోజులకు పైరుపై మోనో క్రోటోఫాస్ (1.6 మి.లీ) లేదా కోరా.ఎన్ 3 మి.లీ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా కార్బో ఫ్యూరాన్ 3జి గుళికలను ఎకరాకు 3 కిలోల చొప్పున పైరు 25–30 రోజుల దశలో ఆకు సుడుల్లో వేయాలి. ఆకు మాడు తెగులు నివారణకు మాంకోజెట్ (2.5 గ్రా) లీటర్ నీటిలో కలిపి వారం, పది రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. పొడ తెగులు లక్షణాలు కనిపిస్తే మొక్క దిగువనున్న 2–3 ఆకులు తుంచివేసి ప్రొపికొనజోల్ (1 మి.లీ) లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. మొక్క ఎండు, కాండం మసికుళ్ళు తెగుళ్ళు రాకుండా ముందు జాగ్రత్తగా ఎదుర్కొనే రకాల సాగు, పంట మార్పిడి , వేసవిలో లోతు దుక్కులు , పూత దశ తర్వాత నీటి ఎద్దడి పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పాడి–పంట -
చింతమనేని.. నీ ఉడత ఊపులకు భయపడం: పేర్ని నాని
సాక్షి, పశ్చిమ గోదావరి: ఏపీలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. టీడీపీ గూండాల దాడులు తారాస్థాయికి చేరాయన్నారు. అబ్బయ్య చౌదరిని చంపాలని చూస్తున్నారు. ఇప్పటికే అబ్బయ్య చౌదరి ఆస్తులను ధ్వంసం చేశారు. దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. చింతమనేని ఉడత ఊపులకు భయపడేది లేదు. అబ్బయ్యచౌదరివ వెంట జగన్, పార్టీ మొత్తం ఉంది’’ అని పేర్ని నాని అన్నారు.దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం కొండలరావుపాలెంలో అబ్బయ్య చౌదరి పొలంలో చింతమనేని ప్రభాకర్ అనుచరుల దౌర్జన్యకాండను వైఎస్సార్సీపీ నేతలు ఖండించారు. కొఠారు అబ్బయ్య చౌదరిని ఆయన నివాసంలో వైఎస్సార్సీపీ ప్రతినిధుల బృందం పరామర్శించింది. మాజీ మంత్రులు పేర్ని నాని, సాకే శైలజానాథ్, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, కవురు శ్రీనివాస్, చంద్రశేఖర్ రెడ్డి, బొమ్మి ఇజ్రాయిల్, ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి తదితరులు.. పచ్చ మూకలు ధ్వంసం చేసిన పొలాలను పరిశీలించారు.. అనంతరం మీడియాతో మాట్లాడారు.రాబోయేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే.. అన్నీ లెక్కలు సరిచేస్తాం: సాకే శైలజానాథ్సాకే శైలజానాథ్ మాట్లాడుతూ.. ప్రత్యర్థుల ఆస్తులను ధ్వంసం చేస్తూ.. భయాన్ని క్రియేట్ చేయాలని చూస్తున్నారంటూ టీడీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్త మీ దౌర్జన్యాన్ని ఎదుర్కొంటారు. రాయలసీమ వాసులుగా దెందులూరులో జరిగిన ఘటనలు చూస్తుంటే భయమేస్తుంది. ఆర్థిక మూలాలు దెబ్బతీసి.. బలహీనపరచాలని చూస్తున్నారు. వైఎస్సార్సీపీ క్యాడర్ను భయపెట్టి రేపు అడ్డం లేకుండా చూసుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు.వైఎస్సార్సీపీ కార్యకర్తలను భయపెట్టాలని చూస్తే చింతమనేనికి అది భ్రమ మాత్రమే.. పచ్చని చెట్లను నరికి వేయడం దారుణం. పోలీసులు స్వామి భక్తితో పని చేస్తున్నారు. రక్తం వచ్చేలాగా టీడీపీ వాళ్ళు దాడులు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?. డీఎస్పీనే టీడీపీ మూకలు తోసేస్తుంటే ఏం చేస్తున్నారు?. ప్రతి వాటిని గుర్తు పెట్టుకుంటాం?. టీడీపీ నేతలు.. వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు వచ్చి వీరంగం సృష్టించడం దారుణం. ఇప్పటికైనా పోలీసులకు సోయి ఉండాలి. ఎమ్మెల్యే మీకు జీతాలు ఇవ్వడు. రాబోయేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే.. అన్ని లెక్కలు సరిచేస్తాం..దెందులూరులో పోలీసుల సాయం ధృతరాష్ట్ర కౌగిలి. నిలబడి సమాధానం చెప్పే రోజు వస్తుంది.. డేట్ నోట్ చేసుకోండి. అరాచకాలు చేసే వాళ్లని కేసులు పెట్టి లోపల వేయాల్సింది పోయి మా వాళ్లపై కేసులు పెడుతున్నారు. పోలీసుల ప్రభుత్వ అధికారులను గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ వైఎస్సార్సీపీ నాయకుడు ఒంటరి కాదు. బాడుగకు తెచ్చిన వారితో కార్యక్రమాలు చేస్తే మంచి పద్ధతి కాదు. జాగ్రత్తగా ఉండండి. మంచికి మంచి.. చెడుకు చెడు లెక్కలు సరిచేసే కాలం ఉంటుంది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక లెక్కలు సరిచేస్తాం’’ అని సాకే శైలజానాథ్రెడ్డి హెచ్చరించారు. -
అమెరికాలో యువ ఆస్ట్రోనాట్గా జాహ్నవి దంగేటి
భీమవరం : అమెరికాలోని ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్’ 2029లో నిర్వహించే అంతరిక్ష యాత్రకు ఆస్ట్రోనాట్ కాండిడేట్గా పాలకొల్లుకు చెందిన యువతి జాహ్నవి దంగేటి ఎంపికై ంది. ఈ సందర్భంగా గురువారం ఢిల్లీ కార్యాలయంలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మను ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమెను శాలువాతో సత్కరించి మంత్రి అభినందనలు తెలిపారు. 2022లో పోలాండ్లోని క్రాకోవ్లో ఉన్న అనలాగ్ ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ సెంటర్ లో చిన్న వయసులోనే విదేశీ అనలాగ్ ఆస్ట్రోనాట్గా, మొదటి భారతీయ మహిళగా కూడా ఆమె చరిత్ర సృష్టించారు. ఏలూరు (ఆర్ఆర్పేట), ఏలూరు రూరల్ : స్థానిక ఆదివారపు పేట ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య (ఏఆర్డీజీకే) నగరపాలక ఉన్నత పాఠశాల విద్యార్థులు ఇటీవల విజయనగరం జిల్లా కొండవెలగాడలో జరిగిన అస్మిత్ ఖేలో ఇండియా వెయిట్ లిఫ్టింగ్ క్రీడా పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ చూపారని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వీ. కాంతి జయకుమార్ తెలిపారు. విద్యార్థిని ఎం.పావని 44 కేజీల విభాగంలో బంగారు పతకం, ఎం. దీక్షిత 44 కేజీల విభాగంలో రజత పతకం, సీహెచ్.కీర్తన 58 కేజీల విభాగంలో రజత పతకం, కే.భార్గవి 58 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించారని తెలిపారు. వీరు ఈనెల 23వ తేదీన విశాఖపట్నంలో జరిగే జోనల్ స్థాయి పోటీలలో పాల్గొంటారని పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు తోట శ్రీనివాస్ కుమార్, అబ్బ దాసరి జోజిబాబు తెలిపారు. విద్యార్థులకు గురువారం పాఠశాలలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. తాడేపల్లిగూడెం రూరల్: అదనపు కట్నం కోసం భర్త వేధిస్తున్నాడంటూ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై జేవీఎన్.ప్రసాద్ తెలిపారు. పెదతాడేపల్లికి చెందిన పుట్టా గోపీ అయ్యప్ప, స్వాతిలకు వివాహం కాగా, కొంతకాలం కాపురం సజావుగా సాగింది. అనంతరం అదనపు కట్నం రూ.10 లక్షలు తీసుకురావాలంటూ శారీరకంగా, మానసికంగా వేధించడంతో పాటు భర్త గోపీ అయ్యప్ప, అతని కుటుంబ సభ్యులు తిట్టి, కొట్టినట్లు బాధితురాలు స్వాతి గురువారం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
రాష్ట్రస్థాయి యోగాసన పోటీలు ప్రారంభం
తాడేపల్లిగూడెం (టీఓసీ): ఏపీ రాష్ట్రస్థాయి ఆరోవ యోగాసన స్పోర్ట్స్ చాంపియన్ షిప్ పోటీలు గురువారం పెంటపాడు మండలం ప్రత్తిపాడులోని సరస్వతి విద్యాలయంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథులుగా యోగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఏపీ తరుఫున గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, డైరెక్టర్ రాధిక, రవీంద్రనాఽథ్, మునిసిపల్ కమిషనర్ యేసుబాబు, ఆరోగ్యశ్రీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ పల్లవి, లయన్స్ క్లబ్ తరుపున గట్టిం మాణిక్యాలరావు, డాక్టర్ కొలనువాడ పెద్ద కృష్ణంరాజు హాజరయ్యారు. పోటీలను యోగా కోచ్ కరిబండి రామకృష్ణ పర్యవేక్షించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన యోగా సభ్యులు కోడ్ ఆఫ్ బుక్ ప్రకారం వివిధ యోగాసనాలు వేశారు. వక్తలు మాట్లాడుతూ యోగాతో ఆరోగ్యం, మానసిక వికాసం, ఉన్నత ఆలోచనలు కలుగుతాయని చెప్పారు. ప్రతి ఒక్కరు యోగా చేయాలని కోరారు. పోటీల్లో విజేతలు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో యోగా సభ్యులు అపర్ణప్రసాద్, త్రిమూర్తులు, రాజా, నాగేశ్వరరావు, రాంబాబు, సుజాత, సుభద్ర, లక్ష్మి, యోగా గురువులు, కోచ్లు, జడ్జిలు పాల్గొన్నారు. -
నేత్రపర్వం.. నారసింహుని శాంతి కల్యాణం
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన ఐఎస్ జగన్నాధపురంలోని సుందరగిరిపై కొలువైన శ్రీ కనకవల్లి సమేత లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో దివ్య పవిత్రోత్సవాల ముగింపును పురస్కరించుకుని గురువారం విశేష కార్యక్రమాలు జరిగాయి. అందులో భాగంగా స్వామివారి శాంతి కల్యాణం, గరుడ వాహన సేవ, పవిత్రావరోహణ, మహా పూర్ణాహుతి వేడుకలు కన్నులపండువగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో బంగారు శేష వాహనంపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఉంచి శాంతి కల్యాణాన్ని మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణల నడుమ నేత్రపర్వంగా జరిపారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు బంగారు గరుడ వాహనంపై కోవెల ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆలయ ఈఓ ఎన్వీ సత్యన్నారాయణ మూర్తి, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. హైదరాబాద్కు చెందిన కొచ్చర్లకోట సత్యవెంకట లక్ష్మీనరసింహ గురూజీ సూచనల మేరకు తొలిసారి నిర్వహించిన దివ్య పవిత్రోత్సవాలు స్వామివారి వైభవాన్ని చాటాయి. సుందరగిరిపై ముగిసిన దివ్య పవిత్రోత్సవాలు -
అడవిలో అన్నీ ఔషధాలే
● ప్రతి మొక్కలో ఆరోగ్య గుణాలు ● ఆయుర్వేద వైద్యంలో వినియోగం ● వాటితో స్వల్ప, దీర్ఘకాలిక వ్యాధులు నయం ఇది పూర్తి ఔషధ గుణాలు కలిగిన మొక్క. ఈ మొక్క విరిగిన కాళ్లకు, పుచ్చిపోయిన పళ్లకు, కాలి గాయాల నివారణకు ఉపయోగపడతాయి. ఇది అటవీ ప్రాంతంలో అందరికీ కనిపిస్తుంటుంది. కానీ ఇది ఒక ఔషధ మొక్క అని మనం గ్రహించలేం. ఆయుర్వేద వైద్యులు మాత్రం సమస్య వచ్చినప్పుడు ఆ మొక్కను చూపిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. ఏజెన్సీ ప్రాంతంలో మాత్రమే లభించే పులివావిలి చెట్టులో ఆరోగ్య వైద్య గుణాలు ఎక్కువగా ఉన్నాయి. కీళ్ల నొప్పులతో పాటు జ్వరం, శరీరంలో నొప్పులను తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుంది. ఆకు దంచి వేడి చేసి నొప్పి ఉన్న చోట రుద్దడం, నీళ్లలో వేసి వేడిచేసి స్నానం చేస్తే నొప్పులు తగ్గుతాయి. అడవుల్లో లభించే ప్రతి మొక్కలో ఔషధాలు ఉన్నాయి. నేను గత 22 ఏళ్లుగా గిరిజన ప్రాతంలో మూలికా వైద్యం చేస్తూ ఎంతో మందికి ఎన్నో జబ్బులను నయం చేశాను. సుగర్కు సంబంధించి 8 రకాల మొక్కలతో తయారు చేసిన ఔషధం ఎంతోమందికి ఉపయోగపడింది. ప్రతి మొక్క ఎంతో ప్రయోజనకరం. – కుర్సం దుర్గారావు, మూలికా వైద్యుడు, ఎర్రాయిగూడెం, బుట్టాయగూడెం మండలం బుట్టాయగూడెం: ప్రకృతిలో లభించే వస్తువులకు ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది. అందంగా కనిపించే మొక్కలు, నోరూరించే పండ్లు, ఇంటికి వినియోగించే కలప ఇలా ఒకటేంటి అన్నీ మనకు ఉపయోగపడేవే. అడవిలో దర్శనమిచ్చే చెట్లు ఆహ్లాదాన్ని పంచడంతో పాటు వివిధ రకాల వ్యాధులను నయం చేస్తాయని ఆయుర్వేద వైద్యులు పేర్కొంటున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో సహజసిద్ధంగా లభిస్తున్న ఔషధ మొక్కలు, చెట్లు ఎన్నో ఆరోగ్య గుణాలను కలిగి ఉంటాయంటున్నారు. పూర్వం మన మహర్షులు మనుషుల్లో వ్యాధులను నివారించే మొక్కలు, వాటి ఔషధ గుణాలను వివరిస్తూ రుగ్వేదంలో పొందుపరిచారు. నేటి ఆధునిక కాలంలో ఎన్నో రకాల యాంటీబయాటిక్లు మందులు తయారవుతున్నప్పటికీ వాటికి నయం కాని రోగాలు ఆయుర్వేదం ద్వారా తగ్గించవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో విరివిగా లభించే ఆయుర్వేద మొక్కలు వాటి ప్రత్యేకతలను తెలుసుకుందాం. రక్తశుద్ధి, నులిపురుగుల నివారణకు ఉపయోగపడే సుగంధ వేరు తీగ ఔషధ మొక్క పసుపు తంగేడు చెట్టు ఆయుర్వేద శాస్త్రంలో శతావరిగా పేరొందిన మొక్కను పిల్లి పీచరగా పిలుస్తారు. ఈ మొక్కకు సన్నటి ఆకులు, ముళ్లు కూడా ఉంటాయి. ఇది తీగ జాతికి చెందిన మొక్క. ఈ మొక్క వేసవిలో సైతం పచ్చగా ఉంటుంది. ఎండాకాలంలో పచ్చగా ఉండేందుకు తన వేళ్లలో కొంతనీటిని దాచుకుంటుంది. అందుకు వేర్లు ఉబ్బి గడ్డలుగా తయారవుతాయి. ఆ గడ్డల్లో ఎన్నో విలువైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఒక కంపెనీ శెతవరెక్స్ పేరుతో గ్రాన్సుల్స్ విడుదల చేసిందంటే దీని విలువ అర్థం చేసుకోవచ్చు. బాలింతలకు పాలు రావడానికి, మూత్రంలో ఇన్ఫెక్షన్ తొలగించి సక్రమంగా పనిచేసేందుకు ఈ మొక్క ఉపయోగపడుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. సరస్వతీదేవితో పాటు సరస్వతీ ఆకు కూడా పూజ్యనీయమే. ఈ ఆకుకు అంతటి విలువ ఉంది. సరస్వతీ ఆకు మొక్కను చక్కని అలంకరణ మొక్కగా కూడా పెంచుకోవచ్చు. ఇది కేవలం పాకాల బుడుగు ప్రాంతాల్లో మాత్రమే లభిస్తుంది. ఈ ఆకులో ఉండే ఒక రకమైన యాసిడ్ జ్ఞాపక శక్తిని పెంపొందించడంలో, మెదడుకు సంబంధించిన వ్యాధులను నివారించేందుకు పనిచేస్తుంది. పొత్తిదుంప మొక్క సైంటిఫిక్ పేరు గ్లోరియాసిస్ సుపర్బ. ఈ మొక్క కేవలం అటవీ ప్రాంతంలోనే కనిపిస్తుంది. ఐదువేళ్ల ఆకారంలో ఐదు రంగుల్లో ఉంటుంది. దీనిపూత వినాయక చవితికి ముందు పూస్తుంది. ఈ మొక్క విత్తనాల నుంచి తీసే మందు కీళ్ల నొప్పులకు ఎక్కువగా వాడుతుంటారు. ఈ మొక్కకు కింద గడ్డం ఉంటుంది. గిరిజనులు అడవిలోకి వెళ్లినప్పుడు జెర్రి, తాడి జెర్రిలాంటి విషపురుగులు కుడితే మొక్క కింద గడ్డ తీసి గాయంపై పెడితే విష ప్రభావం, మంట, నొప్పి కూడా తగ్గుతుంది. అలాగే పశువుల్లో వచ్చే జబ్బువాపు రోగానికి గడ్డను దంచి పెడితే ఆ వ్యాధి తగ్గుతుంది. ఇది అడవిలో విరివిగా కనిపించే మొక్క. ఈ మొక్క రసం పాముకాటుకు, కాళ్లపై వచ్చే ఇన్ఫెక్షన్కు ఉపయోగపడుతుంది. శరీరంపై వచ్చే గడ్డలను కూడా నివారిస్తుంది. ఈ మొక్కలు ఎక్కువగా ఔషద గుణాలను కలిగి ఉంటాయి. -
కొత్త వీసీ ఎవరో?
తాడేపల్లిగూడెం: డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పనిచేస్తున్న డాక్టర్ కె.గోపాల్ పదవీ కాలం ఈనెల 31వ తేదీతో ముగియనుంది. కొత్త వీసీ ఎవ్వరనేది ఇంకా స్పష్టం కాలేదు. కొత్త వీసీ నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేయలేదు. అధికారికంగా వీసీ నియామకానికి గాను ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. వాస్తవానికి వీసీ నియామకానికి గాను సెర్చ్ కమిటీని ఏర్పాటుచేయాలి. వారు పరిశీలించిన దరఖాస్తుల్లో మూడు పేర్లను గవర్నర్కు పంపించాలి. ఆయన ఒకరి పేరును ప్రభుత్వానికి పంపించిన తరువాత వీసీని ప్రకటించాలి. కానీ ఇలాంటి తంతు ఏమీ లేకుండానే వీసీ నియామకానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఆశావహుల ప్రయత్నాలు ప్రస్తుత వీసీ కె.గోపాల్ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా విశ్వసనీయ సమాచారం. వాస్తవానికి ఈ పోస్టు కోసం గతంలో వర్సిటీలో అధికారులుగా పనిచేసిన దిలీప్బాబు, బి.శ్రీనివాసులు తదితరులు కూడా రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. 12 ఏళ్లుగా ఇన్చార్జిలే గతి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) నుంచి 2007 నుంచి ఎస్డీ.శిఖామణి, బీఎంసీ.రెడ్డి, తోలేటి జానకీరామ్ రెగ్యులర్ వీసీలుగా వచ్చి పనిచేశారు. ఆ తరువాత నుంచి 12 ఏళ్లుగా ఇన్చార్జి అధికారులనే నియమిస్తున్నారు. మరోసారి ఇన్చార్జి వీసీగా ఎవ్వరినైనా నియమిస్తారా లేదంటే ప్రస్తుత వీసీనే కొనసాగిస్తారా అనేది చర్చనీయాంశంగా ఉంది. -
చైన్స్నాచర్ అరెస్టు
కై కలూరు: వృద్ధురాలి మెడలో 3 కాసుల బంగారు నానుతాడును లాక్కుని పారిపోయిన వ్యక్తిని కై కలూరు టౌన్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పట్టణ సీఐ పి.కృష్ణ, ఎస్సై ఆర్.శ్రీనివాస్లు స్టేషన్లో కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 15న వేమవరప్పాడు గ్రామానికి చెందిన బోడావుల గంగామహాలక్ష్మి (70) మెడలో నానుతాడును అదే గ్రామానికి చెందిన బొడ్డు మోజేష్ పల్సర్ బైక్పై వచ్చి లాక్కుని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు గురువారం వాహన తనిఖీల్లో భాగంగా నిందితుడు మోజేష్ పారిపోతుండగా పట్టుకున్నారు. అతని వద్ద నుంచి గొలుసు స్వాధీనం చేసుకున్నారు. కేసు చేధనలో కృషి చేసిన కై కలూరు టౌన్ ఎస్సై ఆర్.శ్రీనివాస్, కానిస్టేబుళ్లు దుర్గాప్రసాద్, నాగార్జున, రాములకు ఏలూరు డీఎస్సీ శ్రావణ్కుమార్ నగదు ప్రోత్సహాకాలు అందించారు. ద్వారకాతిరుమల: శ్రీవారి విమానగోపుర స్వర్ణమయ పథకానికి ఒక భక్తుడు గురువారం రూ.5 లక్షలు విరాళంగా అందజేశారు. భీమవరంనకు చెందిన కొప్పిరెడ్డి పెద్దిరాజు ముందుగా స్వామి, అమ్మవార్లను దర్శించారు. అనంతరం ఈ విరాళాన్ని ఆలయ కార్యాలయంలో జమ చేశారు. దాతకు ఆలయ ఏఈఓ పి.నటరాజారావు విరాళం బాండ్ పత్రాన్ని అందించారు. -
బస్సులు ఢీ.. విద్యార్థులకు గాయాలు
కాళ్ల: ఆగి ఉన్న కాలేజీ బస్సును మరో కాలేజీ బస్సు ఢీకొనడంతో రెండు బస్సుల్లో ఉన్న విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం కాళ్లలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం భీమవరంలోని ప్రైవేట్ జూనియర్ కాలేజ్ బస్సు విద్యార్థుల కోసం కాళ్లలో రోడ్డు పక్కన ఆగి ఉండగా, పెన్నాడలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజ్ బస్సు అతివేగంగా వచ్చి ఢీకొంది. ప్రమాద సమయంలో రెండు బస్సుల్లోనూ కలిపి 60 మంది విద్యార్థుల వరకు ఉన్నారు. ప్రమాదంతో రెండు బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి. కొందరు విద్యార్థినులకు తీవ్ర గాయాలు కాగా మరికొందరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను ఆటోలో ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ల నియామకంలో కళాశాల యాజమాన్యం సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తంచేశారు. -
●కాలువ గట్టు కబ్జా
ఉండిలో కాలువగట్టు ఆక్రమణలకు గురవుతోంది. ఏకంగా కాలువ గట్టుకు గేటు పెట్టి తాళం వేసి మరీ ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ఉండి సెంటర్కు సమీపంలో కొత్తగా నిర్మాణం చేస్తున్న అన్న క్యాంటీన్ వెనుక ఓ రైతు తన చెరువులు, హ్యాచరీకి వెళ్లేందుకు పాములపర్రు పంట కాలువపై గతంలో వంతెన నిర్మాణం చేసుకున్నాడు. అయితే ఏమైందో ఏమో కానీ గణపవరం రోడ్డును ఆనుకుని వంతెనకు గేటు పెట్టి దానికి తాళం వేసేశారు. దీంతో ఆయన చెరువుల క్షేమం సంగతి అటుంచితే పాములపర్రు కాలువ గట్టును పూర్తిస్థాయిలో ఆక్రమించేశారు. దీనిపై అధికారులు దృష్టి సారించి పంటకాలువ గట్టును ఆక్రమణల నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. – ఉండి -
ఆక్వా రైతులను ఆదుకోవాలి
ఉండి: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలతో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఆక్వా రైతులను ఆదుకోవాలని రాష్ట్ర వ్యవసాయ రైతు సంఘ మాజీ అధ్యక్షుడు బి.బలరాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఉండి ఏఎంసీ ప్రాంగణంలో రైతు సంఘ జిల్లా నాయకుడు జీను ఆదినారాయణ ఆధ్వర్యంలో ఆక్వా రైతు జిల్లా సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యవసాయ సంఘ అధ్యక్షుడు వి.కృష్ణయ్య, కౌలు రైతు సంఘ రాష్ట్ర కార్యదర్శి ఎ.హరిబాబు, జిల్లా కార్యదర్శి ఆకుల హరే రామ్ మాట్లాడుతూ దేశంలో ఆక్వా సాగు వి స్తరించాలని పిలుపునిచ్చిన ప్రభుత్వాలు ఇప్పు డు ఆక్వా రైతు కష్టాల్లో ఉంటే ఎందుకు భరోసా ఇవ్వడం లేదన్నారు. రైతులను ఆదుకోకుంటే ఆక్వా రంగం మరింత కుదేలవుతుందన్నారు. రైతుల భాగస్వామ్యం లేకుండా అమరావతిలో అడ్వయిజరీ కమిటీని వేయడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఆక్వా రైతులను వెంటనే ఆదుకోకుంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చెరుకువాడ సర్పంచ్ కొండవేటి సాంబశివరావు, నాయకులు ధనికొండ శ్రీనివాస్, మంగిన శ్రీహరి, ఆక్వా రైతులు పాల్గొన్నారు. -
పడకేసిన పల్లె ప్రగతి
శురకవారం శ్రీ 22 శ్రీ ఆగస్టు శ్రీ 2025పంచాయతీల్లో పనులు చేయాలంటే 15వ ఆర్థిక సంఘం నిధులే కీలకం. ఈ నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో పనులు చేయాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. దీంతో పంచాయతీ పాలన కుంటుపడుతోంది. గ్రామస్తులు అడిగిన ఏ పనినీ చేయలేకపోతున్నాం. వెంటనే నిధులు విడుదల చేయాలి. – డి.నాగమల్లేశ్వరరావు, సర్పంచ్, సుంకొల్లు, నూజివీడు మండలం వర్షాకాలం కావడంతో బ్లీచింగ్ చల్లుదామన్నా నిధులు లేవు. మురుగుకాల్వల్లో పూడిక తీద్దామన్నా, వీధిలైట్లు కొత్తవి ఏర్పాటు చేద్దామన్నా ఇబ్బందిగా ఉంది. 15వ ఆర్థిక సంఘం నిధులను జాప్యం చేయకుండా విడుదల చేస్తేనే గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయగలుగుతాం. – పల్నాటి అనూష, సర్పంచ్, దేవరగుంట, నూజివీడు మండలం నూజివీడు: పల్లెలే దేశానికి పట్టుగొమ్మలంటారు. మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధికి చర్యలు తీసుకుంటేనే అవి పరిఢవిల్లేది. ప్రస్తుతం గ్రామాల్లో ఆ పరిస్థితి కనిపించడం లేదు. పల్లెల ప్రగతిలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే 15వ ఆర్థిక సంఘం నిధులు కీలకం. ఏటా రెండు విడతలుగా కేంద్ర ప్రభుత్వం ఈ నిధులను పంచాయతీలకు విడుదల చేస్తుంది. అయితే వీటిని రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు మంజూరు చేయకుండా తీవ్ర జాప్యం చే స్తోంది. దీంతో పంచాయతీల్లో బ్లీచింగ్ కొనుగోలు చేయడానికి కూడా నిధులు లేక సర్పంచ్లు చిన్నపాటి పనులు కూడా చేయలేకపోతున్నారు. దీంతో గ్రామాల్లో అభివృద్ధి పడకేసింది. ఏ గ్రామంలో వీధులు చూసినా మురుగునీటి గుంతలతో, చెత్తాచెదారంతో దర్శనమిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోంది. గ్రామాల్లో ప్రజలకు జవాబుదారీగా ఉండే సర్పంచ్లు ఏ చిన్నపాటి పనీ చేయలేని దుస్థితిలో ఉన్నారు. పంచాయతీల అభివృద్ధికి, అత్యవసర పనులకు ఆర్థిక సంఘం నిధులు భరోసాగా ఉంటాయి. 547 పంచాయతీలు.. రూ.70 కోట్లు జిల్లాలో 27 మండలాల్లోని 547 పంచాయతీలకు 15 ఆర్థిక సంఘం నిధులు దాదాపు రూ.70 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. వీటిని రెండు విడతలుగా ఆయా గ్రామ పంచాయతీలకు విడుదల చేస్తుంది. గ్రామ జనాభా ప్రాతిపదికన ఈ నిధులను మంజూరు చేస్తారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో మొదటి విడత నిధులను గతేడాది నవంబరులో విడుదల చేయగా అవి పంచాయతీలకు జమయ్యాయి. రెండో విడత నిధులు రెండు నెలల క్రితం విడుదల చేసినా ఇప్పటికీ రాష్ట్ర ప్ర భుత్వం పంచాయతీలకు జమ చేయకుండా ప్ర భుత్వ అవసరాలకు వాడేసింది. 15వ ఆర్థిక సంఘం రెండో విడత నిధులు విడుదల కాకపోవడంతో జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో అభివృద్ధి పడకేసింది. ఏ పనులు ముందుకు సాగడం లేదు. గ్రామస్తులు అడిగే పనులు చేద్దామన్నా నిధులు లేక సర్పంచులు మిన్నకుంటున్నారు. వర్షాకాలంలో పారిశుద్ధ్య నిర్వహణ, డ్రైనేజీలు, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణకు ఈ నిధులు చాలా అవసరం. మురుగునీరు నిల్వ ఉండే గుంతల్లో బ్లీచింగ్ కూడా చల్లలేకపోతున్నామని, ఎవరైనా వీధి దీపం పోయిందని కొత్తది వేయమని అడిగినా వేయలేని పరిస్థితిలో ఉన్నామని సర్పంచ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలకు చేరని 15వ ఆర్థిక సంఘం నిధులు కేంద్రం విడుదల చేసినా గ్రామాలకు మంజూరు చేయని రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత నిధుల విడుదలలో జాప్యం నిధుల లేమితో అభివృద్ధికి నోచుకోని గ్రామాలు అసలే వర్షాకాలం.. వ్యాధులు ప్రబలే ప్రమాదం -
కూటమికి దివ్యాంగుల ఉసురు తగులుతుంది
● జిల్లాలో 4,736 పింఛన్ల తొలగింపు ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ ధ్వజం కై కలూరు: కూటమి ప్రభుత్వానికి పింఛన్లు తొలగించిన దివ్యాంగుల ఉసురు తగులుతుందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) అన్నారు. కై కలూరులోని పార్టీ కార్యాలయంలో జిల్లాలో పింఛన్ల తొలగింపుపై గురువారం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 4,736 మంది దివ్యాంగుల పింఛన్లను రద్దు చేశారని, రాష్ట్రవ్యాప్తంగా ఈ సంఖ్య 1.25 లక్షలకు చేరిందన్నారు. దీంతో దివ్యాంగులు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ కన్నీరు కారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కులమతాలు, పార్టీలకు అతీతంగా పథకాలు అందించారన్నారు. అయితే ప్రస్తుత సీఎం చంద్రబాబు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా పథకాలు వర్తింపచేయవద్దని చెప్పారన్నారు. దీంతో గ్రామాల్లో కూటమి నేతలు వైఎస్సార్సీపీ సానుభూతిపరులకు పథకాలను తొలగిస్తున్నారని ఆరోపించారు. 10 ఏళ్ల క్రితం 80 శాతం ఉన్న వికలాంగత్వం నేడు 20 శాతానికి ఏలా చేరిందని ప్రశ్నించారు. జిల్లాలోని కూటమి ఎమ్మెల్యేలు కలుగజేసుకుని దివ్యాంగులకు న్యాయం చేయాలని కోరారు. ఎంపీపీలు పెద్దిరెడ్డి శ్రీరామదుర్గాప్రసాద్, చందన ఉమామహేశ్వరరావు, రామిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ మండవల్లి మండలంలో 104, కలిదిండి మండలంలో 147, ముదినేపల్లి మండలంలో 91, కై కలూరు మండలంలో 128 దివ్యాంగ పింఛన్లు తొలగించారన్నారు. ఎంపీటీసీలు, సర్పంచ్ల గౌరవ వేతనం ఇవ్వకుండా, వారికి సంక్షేమ పథకాలను తీసివేశారన్నారు. పార్టీ ముదిరాజుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కోమటి విష్ణువర్ధనరావు మాట్లాడుతూ సంపద సృష్టించడమంటే దివ్యాంగుల పింఛన్లు ఆపడమా? అని ప్రశ్నించారు. రాష్ట్ర మేధావుల ఫోరం కార్యదర్శి బీవీ రావు మాట్లాడుతూ గతంలో వికలాంగత్వాన్ని నిర్ధారించిన డాక్టర్లు ఇప్పుడు వైకల్య శాతాన్ని తగ్గించడం దారుణమన్నారు. మండల పార్టీ అధ్యక్షులు సింగంశెట్టి రాము, బేతపూడి ఏసేబురాజు, బోయిన రామరాజు, నాయకులు సమయం అంజి, పంజా రామారావు, కన్నా రమేష్, పంజా నాగు, మండా నవీన్, బుసనబోయిన శ్రీనివాస్, కన్నా బాబు పాల్గొన్నారు. -
‘సత్యసాయి’ కార్మికుల సమ్మెబాట
● 9 నెలలుగా నిలిచిన వేతనాలు ● నేటి నుంచి విధులకు దూరం ● 17 మండలాల్లో తాగునీటి సరఫరాకు ఆటంకం కొయ్యలగూడెం: శ్రీ సత్యసాయి తాగునీటి పథకం కార్మికులు శుక్రవారం నుంచి సమ్మె బాట పట్టనున్నారు. 9 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో విధులను బహిష్కరించనున్నారు. 2006లో తాగునీటి పథకం ప్రారంభం కాగా కార్మికుల సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదు. వేతన బకాయిలతో కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా ఉందని పలుమార్లు ప్రాజెక్టు నిర్వాహకులు, ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదు. ఈ నేపథ్యంలో 15 రోజుల క్రితం సమ్మె నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్టు నిర్వహించే కాంట్రాక్టర్కు ప్రభుత్వం నుంచి బకాయిలు రాకపోవడంతో తమకు వేతనాలు చెల్లించడం లేదని కార్మికులు అంటున్నారు. ఈ క్రమంలో నాలుగు నెలలుగా ప్రజాసంఘాల విజ్ఞప్తి మేరకు సామాజిక బాధ్యతతో విధులు నిర్వహించామని, ప్రజాప్రతినిధుల దృష్టికి సమస్య తీసుకువెళ్లినా స్పందించ లేదని యూనియన్ అధ్యక్షుడు జి.శివ సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఎ.సత్యనారాయణ తెలిపారు. మూడు నియోజకవర్గాల పరిధిలో.. సమ్మెతో పోలవరం, చింతలపూడి, గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 17 మండలాల్లోని సుమారు 6 లక్షల మంది ప్రజలకు తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. పోలవరం మండలం కన్నాపురం అడ్డరోడ్డు వద్ద గోదావరి నుంచి జలాలను పంపింగ్ చేసి గోపాలపురం మండలం హుకుంపేటలో ప్రధాన ట్యాంకుకి సరఫరా చేస్తారు. అక్కడ నీటిని శుద్ధి చేసి ఆయా ప్రాంతాల్లోని ట్యాంకులకు సరఫరా చేస్తారు. వేతన బకాయిలతో పాటు పెండింగ్ పీఎఫ్, ఈఎస్ఐ, పథకానికి ప్రత్యేక గ్రాంట్, చనిపోయిన కార్మికుల కుటుంబాలకు సాయం, ఆయా కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని, పథకానికి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాలని సంఘ నాయకులు డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. ప్రజల ఇబ్బందుల దృష్ట్యా కొద్ది నెలలుగా సమ్మె నిర్ణయం వాయిదా వేసుకున్నాం. అయినా మా కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారడంతో ప్రజాసంఘాల మద్దతుతో తప్పని పరిస్థితుల్లో సమ్మె బాట పట్టాం. – అంబటి శ్రీనివాస్, పంపు డ్రైవర్, కన్నాపురం 15 ఏళ్లపాటు విధులు నిర్వహించిన కార్మికుడు అనారోగ్యంతో మృతి చెందితే ఎలాంటి సాయం అందలేదు. దీంతో కార్మికుల్లో అభద్రతా భావం నెలకొంది. నెలల తరబడి వేతనాలు రాకపోవడంతో అప్పులు చేసి బతుకున్నాం. – పిల్లి వీరనాగబాబు, పంపు ఆపరేటర్ -
పోటెత్తిన గోదావరి
పోలవరం రూరల్: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదికి వరద పోటెత్తుతోంది. భద్రాచలం వద్ద 52.10 మీటర్లకు నీటిమట్టం చే రుకుంది. ఎగువ ప్రాంతాల్లో ఉప నదులతో పాటు శబరి నీరు కూడా కలవడంతో వరద ఉధృతి క్రమేపీ పెరుగుతోంది. గురువారం పోలవరం ప్రాజెక్టు స్పి ల్వే వద్ద 33.160 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. సుమారు 11.10 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు చేరుతోంది. ఎగువ ప్రాంతంలో వర్షాలు తగ్గుముఖం పట్టినా దిగువన వరద పెరుగుతోంది. కుక్కునూరు మండలంలో.. కుక్కునూరు: కుక్కునూరు మండలంలో పలు గ్రా మాలను వరద చుట్టుముట్టింది. కుక్కునూరులో శి వాలయం వద్దకు, పాతూరులో రామాలయం సమీపంలోకి నీరు చేరడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వేలేరు నుంచి సీతారామనగరం వెళ్లే రహదారి నీటమునగడంతో వేలేరు–సీతారామనగ రం మధ్య రాకపోకలు స్తంభించాయి. వరద మరో అడుగు పెరిగితే వింజరం వద్ద ఆర్అండ్బీ రహదారిపై నీరు చేరి రాకపోకలు స్తంభించనున్నాయి. ప లు ప్రాంతాల్లో పత్తి, వరి చేలు ముంపు బారిన పడ్డాయి. గుండేటి వాగు సమీపంలో సీతారామనగరం గ్రామం వద్ద ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అధికారులు సిద్ధం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటన వేలేరుపాడు: వేలేరుపాడు మండలంలోని వరద ప్ర భావిత ప్రాంతాల్లో కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జేసీ పి.ధాత్రిరెడ్డి పర్యటించారు. చిగురుమామిడిని సందర్శించి వరద బాధితుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. భద్రాచలంలో గోదావరిలో నీటిమట్టం 51.90 అడుగులుగా నమోదైందన్నారు. ఈ నీరు జిల్లా సరిహద్దులోకి రావడానికి 24 గంటల సమ యం పడుతుందన్నారు. ఈ దృష్ట్యా వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేశామని చెప్పారు. వేలేరుపాడు మండలంలో 23 నివాసిత ప్రాంతాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయన్నారు. కుక్కునూరులోని ఆర్అండ్ఆర్ కాలనీలో పునరావాస కేంద్రం ఏర్పాటుచేసి 150 కుటుంబాలను తరలించామన్నారు. కుక్కునూరు మండలంలో వరద ముంపు గ్రామాలైన కొమ్ముగూడెం, లచ్చుగూడెం ప్రజలను దాచారం సహాయ శిబిరానికి తరలించామన్నారు. కుక్కునూరు మండలంలో మూడు గ్రామాల్లోని ఆరు నివాసిత ప్రాంతాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయన్నారు. మొత్తం 3,690 కుటుంబాలు వరద బాధితులుగా ఉన్నాయన్నారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవీ రమణ, డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఫిషరీస్ డీడీ నరసయ్య, ఎంపీడీవో శ్రీహరి ఉన్నారు. అధికారులూ.. అప్రమత్తం వరద ప్రభావం తగ్గే వరకు అధికారులు అంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. వేలేరుపాడు తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో ఆమె సమీక్షించారు. భద్రాచలం వద్ద 51.90 అడుగులకు నీటిమట్టం జిల్లాలో 3,690 కుటుంబాలపై వరద ప్రభావం పోలవరం ప్రాజెక్టు నుంచి 11.10 లక్షల క్యూసెక్కులు దిగువకు.. -
దెందులూరులో చింతమనేని అనుచరుల వీరంగం
సాక్షి, పశ్చిమగోదావరి: దెందులూరులో చింతమనేని అనుచరులు వీరంగం సృష్టించారు. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఇంటి వద్ద చింతమనేని అనుచరులు హల్చల్ చేశారు. కర్రలు, రాడ్లతో బీభత్సం సృష్టించారు. అబ్బయ్య చౌదరి పామాయిల్ తోటలోకి టీడీపీ నేతలు చొరబడ్డారు. వారిని వైఎస్సార్సీపీ నేతలు అడ్డుకున్నారు. టీడీపీ నేతలు రౌడీయిజం చేస్తున్నారని వైఎస్సార్సీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. -
ఎట్టకేలకు డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్
ఏలూరు (ఆర్ఆర్పేట): ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు డిగ్రీ ప్రవేశాల విషయంలో తాత్సారం చేసి వారి భవిష్యత్ను ప్రశ్నార్థకం చేసిన కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం డిగ్రీ ప్రవేశాలపై సరైన నిర్ణయం తీసుకులేకపోవడంతో విద్యార్థులు గందరగోళ పరిస్థితిని ఎదుర్కొన్నారు. విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైతే సిలబస్ పూర్తి కాకుండానే పరీక్షలను ఎదుర్కోవాల్సి వచ్చే ప్రమాదం ఉంటుందని, ఆ ప్రభావం డిగ్రీ మూడు సంవత్సరాలు పూర్తయ్యేవరకూ ఉంటుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఇంటర్మీడియెట్ పరీక్షల ఫలితాలు వెలువడిన నెలలోపే డిగ్రీ ప్రవేశాలకు ప్రభుత్వాలు చర్యలు తీసుకునేవి. అయితే కూటమి ప్రభుత్వం యువత భవితపై, విద్యారంగంపై చిన్నచూపుతో, ఇంజనీరింగ్, తదితర డిగ్రీ తత్సమాన కోర్సులను నిర్వహిస్తున్న కార్పొరేట్ కళాశాలలకు మేలు చేకూర్చే విధానాలు అనుసరించి డిగ్రీ ప్రవేశాలను ఆలస్యం చేసింది. నాలుగు నెలల తరువాత షెడ్యూల్ విడుదల 2024–25 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియెట్ పరీక్షలు రాసిన విద్యార్థుల ఫలితాలను ప్రభుత్వం గత ఏప్రిల్ 12వ తేదీన విడుదల చేసింది. ఆ ఫలితాల్లో అనుత్తీర్ణులైన విద్యార్థులకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించి ఆ పరీక్షల ఫలితాలను కూడా జూన్ 7వ తేదీన విడుదల చేసేసింది. ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలై నాలుగు నెలలు దాటిపోగా, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలై కూడా 75 రోజులు దాటిపోయింది. గతేడాది కూడా ప్రభుత్వం ఇలానే డిగ్రీ ప్రవేశాలను ఇంటర్ ఫలితాలు విడుదలైన రెండున్నర నెలల తరువాత చేపట్టగా అప్పట్లో ప్రభుత్వం నూతనంగా ఏర్పాటైనందున విధానాలు రూపొందించడంలో ఆలస్యమై ఉంటుందని సరిపెట్టుకున్నారు. అయితే ఈ ఏడాది కూడా డిగ్రీ ప్రవేశాలను మరింత ఆలస్యంగా అంటే నాలుగు నెలల తరువాత చేపట్టడం కూటమి ప్రభుత్వం వైఫల్యమని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. ప్రవేశాల షెడ్యూల్ ఇలా.. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్ట్స్, సైన్స్, సోషల్ సైన్సెస్, కామర్స్, మేనేజ్మెంట్, కంప్యూటర్ అప్లికేషనన్ అండ్ సోషల్ వర్క్, ఆనర్స్ వంటి కోర్సుల్లో సీట్లను భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ, అటానమస్, ప్రైవేటు ఎయిడెడ్, ప్రైవేట్ అన్ ఎయిడెడ్, ప్రైవేట్ అటానమస్ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో ఆన్లైన్ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ మేరకు ఈనెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. 25 నుంచి 28వ తేదీ వరకూ కళాశాలల్లో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల ఎంపికకు, 29వ తేదీన వెబ్ ఆప్షన్లు మార్చుకోవడానికి అవకాశం కల్పించింది. ఈనెల 31న తుది సీట్ల కేటాయింపు పూర్తిచేయనుంది. సీట్లు పొందిన విద్యార్థులకు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభించనున్నారు. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మొత్తం 91 డిగ్రీ కళాశాలలు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏలూరు జిల్లాలో 7 ప్రభుత్వ, 1 ప్రభుత్వ ఎయిడెడ్ అటానమస్, ఒక ప్రైవేట్ అటానమస్, 31 ప్రైవేట్ అన్ ఎయిడెడ్ కళాశాలలు మొత్తం కలిపి 40 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో 4 ప్రభుత్వ, 2 ప్రభుత్వ అటానమస్, 4 ఎయిడెడ్ అటానమస్, ఒక ప్రైవేట్ అటానమస్ కళాశాలున్నాయి. అలాగే ఒక ప్రైవేట్ ఎయిడెడ్, 39 ప్రైవేట్ అన్ ఎయిడెడ్ కళాశాలలు మొత్తం కలిపి 51 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఆయా కళాశాలల్లో మొత్తం వివిధ గ్రూపులకు సంబంధించిన సుమారు 60 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. నాలుగు నెలల తరువాత ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల సిలబస్ పూర్తికాకుండానే పరీక్షలు ఎదుర్కోవాలని విద్యార్థుల ఆందోళన -
ధర తక్కువ.. ఆకర్షణీయం
ఆరు అంగుళాల విగ్రహం నుంచి ఆరున్నర అడుగుల ఎత్తులో మట్టి గణనాథుల్ని తయారు చేస్తారు. పర్యావరణం పట్ల అవగాహనతో మట్టి గణనాథుల విగ్రహాలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. విగ్రహాలు తయారు చేసే వారు తగినంత మంది లేకపోవడం వలన ఉన్నవాళ్లతోనే తయారీ కొనసాగిస్తున్నట్లు సీతారాముడు తెలిపారు. మట్టి గణనాథులు తయారైన పిదప పర్యావరణానికి హాని కలగని విధంగా వాటర్ పెయింట్లు వాడుతున్నామని తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల ధరతో పోల్చితే మట్టి గణనాథుల విగ్రహాల ధర తక్కువగా ఉంటుందని, అదేవిధంగా ఆకర్షణీయంగా కూడా ఉంటాయంటున్నారు. గణపతి నవరాత్రుల ఆర్డర్ల మేరకు ఇరవై నుంచి ముప్ఫై విగ్రహాల వరకు తయారు చేస్తుంటామన్నారు. -
పనిచేయని లిఫ్టులు.. ఉద్యోగుల పాట్లు
నూజివీడు: ఆర్జీయూకేటీలోని అధికారుల అలసత్వం, నిర్లక్ష్యం కారణంగా బోధనా సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు నెలలుగా లిఫ్టులు పనిచేయకపోయినా వాటిని బాగుచేయించాలన్న ఆలోచన కూడా లేకుండా అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఫ్యాకల్టీకి, ఇతర సిబ్బందికి, అధికారులు క్యాంపస్లో ఉండేందుకు బహుళ అంతస్థుల క్వార్టర్స్ ఉన్నాయి. ఐదు అంతస్థులుగా ఉన్న ఈ క్వార్టర్స్కు లిఫ్టులు పనిచేయకపోవడంతో అందులో ఉండే సుమారు 1,500 కుటుంబాలు తీవ్ర అవస్థలు పడుతున్నాయి. పనిచేయని లిఫ్టులు ట్రిపుల్ ఐటీలో బ్యాంకు పక్కనే ఉన్న పీ1 క్వార్టర్స్ లిఫ్ట్ రెండు నెలలుగా పనిచేయడం లేదు. విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని సిబ్బంది వాపోతున్నారు. అలాగే ఎన్1, ఎన్3, ఎం1 క్వార్టర్స్ లిఫ్టులు నెల రోజుల నుంచి పనిచేయడం లేదు. ఎన్1 క్వార్టర్స్ లిఫ్ట్ డోర్ నాలుగైదు నిమషాలకు పడుతుండటంతో అంతసేపు వేచి ఉండలేక ఫ్యాకల్టీ కుటుంబాలు మెట్లనే ఆశ్రయిస్తున్నారు. సరుకులు తెచ్చుకోవాలంటే నరకం మంచినీటి టిన్నులు, బియ్యం బస్తాలు, ఇతర బరువుతో కూడిన బస్తాలు రెండో అంతస్థు దగ్గర నుంచి ఐదో అంతస్థు వరకు తీసుకెళ్లాలంటే ఆయా అంతస్థుల్లో ఉన్న కుటుంబాలు పడుతున్న బాధ అంతా ఇంతా కాదు. 20 లీటర్ల టిన్నులు మోయలేక ఐదు లీటర్ల టిన్నులు కొనుక్కుంటున్నామని అంటున్నారు. కొందరు అధ్యాపకులు నాలుగైదుసార్లు ఎక్కి దిగలేక క్యాంపస్లోనే ఉంటూ మధ్యాహ్న భోజనం క్యారేజీని తీసుకెళ్తున్నారు. లిఫ్టులు పనిచేయకపోవడంతో పాలు పోసేవారు ఫ్లాట్ వద్దకు రావడం లేదని దీంతో కిందకు వెళ్లి పాలు తెచ్చుకుంటున్నామని అంటున్నారు. ఆపరేషన్ చేయించుకున్న వారు, బాలింతలు, వృద్ధులు, దివ్యాంగుల పాట్లు వర్ణనాతీతం. నూజివీడు ట్రిపుల్ ఐటీ సిబ్బంది క్వార్టర్స్లో నెలకొన్న దుస్థితి -
మట్టి గణపయ్యలే మేలు
కొయ్యలగూడెం: మట్టి గణనాథులను తయారు చేస్తూ వారంతా పర్యావరణ ప్రేమికులుగా మన్ననలు అందుకుంటున్నారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం కన్నాపురం సమీపంలో విగ్రహాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి.. గత కొన్నేళ్లుగా మట్టి గణనాథులను తయారీ చేస్తున్నారు. కండ్రికగూడెం గ్రామానికి చెందిన నాగవరపు సీతారాముడు ఆధ్వర్యంలో ఈ మట్టి గణనాథులను తయారు చేస్తున్నారు. కేవలం కలప చెక్కలు, ఎండు గడ్డి, జిగురుమట్టిని బొమ్మల తయారీలో ఉపయోగిస్తూ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. తయారీలో యువత ప్రారంభంలో సీతారాముడు ఈ తయారీని ప్రారంభించారు. అనంతరం బృందంగా ఏర్పడ్డ యువకులు అంబటి రాజారావు, కలిదిండి పద్మ, పొన్నపల్లి సాయికుమార్, అంబటి యశ్వంత్, పొన్నపల్లి సూర్యతేజలు చేరి విగ్రహాల తయారీలో సహకరిస్తూ మట్టి గణనాథులను తయారు చేస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో పోల్చితే మట్టి గణనాధుల విగ్రహాలు శ్రమతో కూడుకున్నవని.. సమయం కూడా ఎక్కువ పడుతుందని సీతారాముడు తెలిపారు. ఇటుక బట్టి నిర్వాహకులైన వీరంతా గణపతి నవరాత్రుల సీజన్లో సాధారణ శిల్పులుగా మారి గణనాథుల విగ్రహాల తయారీని ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణకు యువత చేయూత మట్టి గణనాథుల్ని తయారుచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న వైనం పర్యావరణానికి ప్రాధాన్యతనిస్తున్న యువత ఆదర్శాన్ని గుర్తించి మట్టి విగ్రహాలను తయారు చేసుకోవడానికి నా వంతు సాయంగా .. నాపొలంలోని స్థలాన్ని, గోడౌన్ను ఉచితంగా ఇచ్చాను. ఆరు సంవత్సరాలుగా వారు ఈ పని చేస్తున్నారు. – పాలమోలు శ్రీనివాస్, రైతు, కండ్రికగూడెం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల మాదిరిగానే మట్టి గణనాథుల విగ్రహాలు ఊరేగింపుకి అనువైన విధంగా తయారు చేస్తున్నాం. పర్యావరణంపై ఉన్న అవగాహనతో ఎక్కడా శిక్షణ తీసుకోకుండానే మట్టి విగ్రహాల తయారీ ప్రారంభించాను. – నాగవరపు సీతారాముడు, ప్రధాన శిల్పి, కండ్రికగూడెం -
మాజీ మంత్రి వనిత కుటుంబంలో విషాదం
పాలకొల్లు సెంట్రల్: రాష్ట్ర వైఎస్సార్ సీపీ నాయకురాలు, మాజీ మంత్రి తానేటి వనిత మావయ్య తానేటి బాబూరావు (80) మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. బుధవారం ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామం పాలకొల్లు తీసుకువచ్చారు. కొంతకాలంగా ఆయన కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన పెద్ద కుమారుడు డాక్టర్ టి.శ్రీనివాస్కు చెందిన తాడేపల్లిగూడెం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. బుధవారం పాలకొల్లులో అంతిమ కార్యక్రమాలు జరిపారు. ఈయనకు భార్య జ్యోతమ్మ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మాజీ మంత్రి తానేటి వనిత పెద్ద కోడలు. బాబూరావు మృతిపై వైఎస్సార్ సీపీ నాయకులు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాసు, యడ్ల తాతాజీ, గోపాలపురం, కొవ్వూరు నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు పాల్గొని తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తంచేశారు. -
సుందరగిరిలో వైభవంగా పవిత్రారోహణ
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన ఐఎస్ జగన్నాధపురంలోని సుందరగిరిపై కొలువైన శ్రీ కనకవల్లి సమేత లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో దివ్య పవిత్రోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో రెండవరోజు బుధవారం పవిత్రారోహణ వేడుక కన్నులపండువగా జరిగింది. ముందుగా అర్చకులు, పండితులు ఆలయ యాగశాలలో ఉదయం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణల నడుమ మండప పూజలు, నిత్య హోమాలు, బలిహరణ, మూలవరులకు, ఉత్సవ మూర్తులకు అభిషేకాలు, అలంకరణలు జరిపారు. ఆ తరువాత స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను బంగారు శేష వాహనంపై ఉంచి పూజలు నిర్వహించి అనంతరం దివ్య పవిత్రాలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఆ తరువాత స్వామివారి మూలవిరాట్, ఉత్సవ మూర్తులపై దివ్య పవిత్రాలను వేసి పవిత్రారోహణ వేడుకను కన్నులపండువగా నిర్వహించారు. సాయంత్రం మండప పూజలు, నిత్య హోమములు, మూలమంత్ర హోమములు, బలిహరణ, నీరాజన మంత్రపుష్పాలు నిర్వహించారు. హైదరాబాద్కు చెందిన కొచ్చర్లకోట సత్యవెంకట లక్ష్మీనరసింహ గురూజీ సూచనలు, ఆలయ ఈఓ ఎన్వీ సత్యన్నారాయణ మూర్తి పర్యవేక్షణలో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. గురువారం జరిగే పవిత్రావరోహణతో ఉత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. స్వామివారి మూలవిరాట్పై పవిత్రాలను ఉంచి హారతులిస్తున్న అర్చకుడు బంగారు శేష వాహనంపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు పూజలు నిర్వహిస్తున్న పండితులు -
గోదావరి ఉగ్రరూపం
డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ డిగ్రీ ప్రవేశాల విషయంలో తాత్సారం చేసి వారి భవిష్యత్ను ప్రశ్నార్థకం చేసిన కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. 8లో uగురువారం శ్రీ 21 శ్రీ ఆగస్టు శ్రీ 2025పోలవరం రూరల్/వేలేరుపాడు/కుక్కునూరు: గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇంద్రావతి, ప్రాణహితలు పొంగి ప్రవహిస్తుండటం, దీనికి శబరి తోడు కావడంతో గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. భద్రాచలం వద్ద బుధవారం రాత్రి 10 గంటలకు నీటి మట్టం 48 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో అనేక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. పలుచోట్ల బాధితులను పడవలపై పునరావాస కేంద్రాలకు తరలించారు. పోలవరం వద్ద 32.20 మీటర్లకు నీటి మట్టం గోదావరి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద 32.20 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. స్పిల్వే నుంచి సుమారు 10 లక్షలకు క్యూసెక్కులకు పైగా వరద నీరు దిగువకు చేరుతోంది. నీట మునిగిన వంతెనలు : వరద ప్రభావం వల్ల వేలేరుపాడు మండలంలో మేళ్ల వాగు, ఎద్దెల వాగు, టేకురు వాగు, పెద్దవాగు, వంతెనలు నీట మునిగాయి. దీంతో మండలంలో 26 గ్రామాలకు రాకపోకల స్తంభించాయి. వేలేరుపాడు నుంచి రుద్రమకోట, రేపాక గొమ్ము, కన్నాయగుట్ట, తిర్లాపురం, పాత నార్లవరం వెళ్లే రహదారులు నీట మునిగాయి. అధికారులు మొత్తం మూడు నాటు పడవలు, రెండు లాంచీలు ఏర్పాటు చేశారు. ఎద్దుల వాగు వద్ద నాటు పడవపై ప్రజలు దాటుతున్నారు. ఇంతవరకు 393 కుటుంబాలను కుక్కునూరు మండలంలోని రాయకుంట పునరావాస కాలనీ, తాడువాయిలోని చల్లవారిగూడెం కాలనీలకు తరలించారు వరద ప్రాంతాల్లో ఎస్పీ పర్యటన : వేలేరుపాడు మండలంలో ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలైన రేపాక గొమ్ము గ్రామంలో పర్యటించారు. గ్రామస్తులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు. పశువులను ముందస్తుగా గ్రామం నుంచి తరలించుకోవాలని తెలిపారు. అనంతరం వేలేరుపాడు రుద్రంకోట గ్రామాల మధ్య ఉన్న బ్రిడ్జి వద్ద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నీట మునిగిన రహదారి వరద ఉధృతితో కుక్కునూరు గ్రామ శివారులోని జామాయిల్ తోటలు నీటమునిగాయి. వింజరం పంచాయతీలోని ఎర్రబోరు–ముత్యాలంపాడు గ్రామాల మధ్య రహదారి వరద నీటితో నిండిపోయింది. దీంతో ఆ రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. యంత్రాంగం సన్నద్ధం ఏలూరు(మెట్రో): జిల్లాలో వరద పరిస్థితిని బుధవారం కలెక్టరేట్లో అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్టాడుతూ.. వరద ఉధృతిపై ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగంతో టెలి కాన్ఫరెన్న్స్ నిర్వహిస్తున్నామన్నారు. జాయింట్ కలెక్టర్ కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారన్నారు. కలెక్టరేట్తో పాటు వేలేరుపాడులో 83286 96546, కుక్కునూరు 80962 74662 నెంబర్లతో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశామన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అందించేందుకు మూడు నెలల రేషన్ను ఉంచామన్నారు. 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, లీటరు పామాయిల్, కేజీ పంచదారతో పాటు ఉల్లిపాయలు, బంగాళాదుంపలు బాధిత కుటుంబాలకు అందించేందుకు అందుబాటులో ఉంచామన్నారు. ఎద్దుల వాగు వద్ద పడవ దాటుతున్న ప్రజలు సామగ్రితో తరలిపోతున్న రేపాక గొమ్ము వాసులు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ల ఏర్పాటు వేలేరుపాడు మండలంలో 26 గ్రామాలకు రాకపోకలు బంద్ పునరావాస శిబిరాలకు వరద బాధితులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్, ఎస్పీ భద్రాచలం వద్ద 53 అడుగులకు నీటిమట్టం చేరవచ్చని అంచనా అప్రమత్తమైన యంత్రాంగం.. కంట్రోల్రూమ్ల ఏర్పాటు పోలవరం స్పిల్వే నుంచి 10 లక్షల క్యూసెక్కులు విడుదల ముంపు ప్రాంతాల ప్రజలు అధికారులతో సహకరించి వరద సహాయ కేంద్రాలకు తరలి రావాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ అధికారులతో కలిసి బుధవారం ముంపు గ్రామాలైన కట్కూరు, ఎరత్రోలు, బోళ్లపల్లి,, చిత్తంరెడ్దిపాలెం తదితర గ్రామాలలో పర్యటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. యడపల్లి గ్రామస్తులను పునరావాస కేంద్రాలకు తీసుకొచ్చేందుకు బోట్లను పంపించారు. కలెక్టర్ మాట్లాడుతూ పెద్దవాగు, ఎద్దువాగుల నుంచి కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు వరద ముంపు పొంచి ఉన్నందున, ఆయా ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వరద ముంపు ప్రభావిత ప్రాంతాల ప్రజలకు టార్పాలిన్లు అందించామన్నారు. జిల్లాకు ఇప్పటికే 2 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయని చెప్పారు. ముంపు ప్రాంతాల్లోని గర్భణులు, పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ప్రసవానికి సిద్ధంగా ఉన్న గర్భిణులను దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలన్నారు. వరద సహాయక చర్యలపై కలెక్టరేట్లో 1800 233 1077, 94910 41419 ఫోన్ నెంబర్లతో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామని, జంగారెడ్డిగూడెం, నూజివీడు డివిజన్లో, కుక్కునూరు, వేలేరుపాడులలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశామన్నారు. రవాణా సౌకర్యాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా కూలిన చెట్లను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వేలేరుపాడు తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమావేశమై వరద పరిస్థితిని కలెక్టర్ సమీక్షించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ రమణ, డీఆర్డిఏ పీడీ ఆర్.విజయరాజు తదితరులు ఉన్నారు. -
టీడీపీలో ‘నామినేటెడ్’ ముసలం
సాక్షి, భీమవరం: భీమవరంలో టీడీపీలో నామినేటెడ్ ముసలం రాజుకుంది. నామినేటెడ్ పదవుల్లో ఒక సామాజిక వర్గానికి కొమ్ముకాస్తూ టీడీపీ పొలిట్బ్యూరో సభ్యురాలు, నియోజకవర్గ ఇన్చార్జి తోట సీతారామలక్ష్మి తమను అణగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నారని నియోజకవర్గంలోని ఆ పార్టీకి చెందిన గౌడ, శెట్టిబలిజ సంఘం నేతలు మండిపడుతున్నారు. తమ పట్ల వివక్ష చూపుతున్న నాయకత్వంపై తాడోపేడో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లనున్నట్టు తెలిపారు. టీడీపీ భీమవరం నియోజకవర్గ గౌడ, శెట్టిబలిజ సంఘ సమావేశం బుధవారం స్థానిక సర్ధార్ గౌతు లచ్చన్న కమ్యూనిటీ హాలులో జరిగింది. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరవల్లి చంద్రశేఖర్, రాష్ట్ర శెట్టిబలిజ సాధికారిక కమిటీ డైరెక్టర్ బొక్కా సూర్యనారాయణ, గౌడ సాధికారిక డైరెక్టర్ జంపన ధనరాజు, జిల్లా సాధికారిక కమిటీ కార్యదర్శి వీరమల్లు శ్రీనివాస్, టీడీపీ సీనియర్ నేత కడలి మృత్యుంజయుడు తదితరులు మాట్లాడారు. బీసీల్లో అత్యధిక జనాభాగా ఉన్నా గౌడ, శెట్టిబలిజ సామాజిక వర్గాలకు దేవస్థానం బోర్డు, సొసైటీలు, నీటిసంఘాలు, వ్యవసాయ మార్కెట్ కమిటీ నామినేటెడ్ నియామకాల్లో ఎక్కడా ప్రాధాన్యత కల్పించకుండా తీవ్ర అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పేరుకు బీసీల పార్టీకి చెబుతూ పదవులు మాత్రం ఇతర సామాజిక వర్గాల వారికి పంచుతున్నారని మండిపడ్డారు. ఈ విషయమై ఇప్పటికే పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి సీతారామలక్ష్మి వద్ద తమ అసంతృప్తిని వెళ్లగక్కినా ఫలితం లేదన్నారు. కూటమి పేరు చెప్పి తమను బుజ్జిగిస్తున్నారు తప్ప న్యాయం చేయడం లేదన్నారు. బిస్కెట్ పడేస్తే సరిపోతుందన్న ధోరణీలో స్థానిక నాయకత్వం తీరుందని వారు మండిపడ్డారు. పార్టీ కోసం శ్రమిస్తే తమ పట్ల వివక్ష చూపుతూ గుర్తింపులేకుండా చేస్తున్నారన్నారు. తమ సామాజికవర్గాల పట్ల చిన్నచూపు చూస్తున్న నాయకత్వంపై తాడోపేడో తేల్చుకునే సమయం ఆసన్నమైందని, సమస్యను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లనున్నట్టు తెలిపారు. మరోమారు సమావేశం ఏర్పాటుచేసుకుని భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామన్నారు. భీమవరంలో గౌడ, శెట్టిబలిజ నేతల అసంతృప్తి దేవస్థానం, సొసైటీ, ఏఎంసీ, నీటి సంఘాల్లో ప్రాధాన్యత ఇవ్వలేదని ఆగ్రహం -
అర్హత ఉన్నా పెన్షన్లు తీసేస్తారా?
దెందులూరు: దెందులూరు నియోజకవర్గంలో అర్హత ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం 842 మంది దివ్యాంగ పెన్షన్లు తొలగించడం దారుణమని, ఇది మంచి ప్రభుత్వమా? అని మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. దివ్యాంగులని కూడా చూడకుండా పెన్షన్లు రద్దు చేస్తే వారు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు ఎలా జీవిస్తారని ప్రశ్నించారు. పెదవేగి మండలంలో 342, పెదపాడు మండలంలో 145, దెందులూరు మండలంలో 260 పెన్షన్లు, ఏలూరు రూరల్ మండలంలో 95 పెన్షన్లు రద్దు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు నియోజకవర్గంలో దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసుల బనాయింపు, శిలాఫలకాలు, విగ్రహాలు పగలగొట్టడం చేశారన్నారు. ఏడో మైలురాయి వద్ద ప్రభాకర్ ఎమ్మెల్యే అయినప్పటి శిలాఫలకాలు ఇప్పటికీ ఉన్నాయని, మా శిలాఫలకాలు ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. నియోజకవర్గంలో తన పేరు కనపించినా, ఫోటో కనిపించినా ఎమ్మెల్యే ప్రభాకర్కు నిద్ర పట్టడం లేదన్నారు. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మేక లక్ష్మణరావు, వడ్డీలు కార్పొరేషన్ మాజీ చైర్మన్ ముంగర సంజీవ్ కుమార్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు తేరా ఆనంద్, జెడ్పీటీసీ నిట్టా లీలానవకాంతం, ఎంపీపీ బత్తుల రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. -
ఉచిత సేవలు వినియోగించుకోవాలి
ఏలూరు (టూటౌన్): వీర పరివార్ సహాయత యోజన 2025 పథకం ద్వారా సైనికులు, మాజీ సైనికుల కుటుంబాలు ఉచిత సేవలు పొందాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి అన్నారు. స్థానిక శ్రీరామ్ నగర్ 6వ రోడ్డులోని జిల్లా సైనిక వెల్ఫేరు ఆఫీసులో లీగల్ సర్వీసెస్ క్లినిక్ను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ సైనికులకు ఉచిత సేవలందించాలనే ఉద్దేశంతో అందుబాటులో ఉన్న ప్రతి న్యాయ సేవాధికార సంస్థ పరిధిలో లీగల్ సర్వీసెస్ క్లినిక్ ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ క్లీనిక్లో ప్యానెల్ న్యాయవాది, పారా లీగల్ వలంటీర్లను నియమించామన్నారు. కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోనె సీతారాం తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (టూటౌన్): కృష్ణ జిల్లా మచిలీపట్నంలోని ఆంధ్రప్రదేశ్ మైనార్టీస్ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు అడ్మిషనన్లకు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా మైనారిటీల సంక్షేమ శాఖాధికారి ఎస్.ఎస్.కృపావరం ఒక ప్రకటనలో తెలిపారు. ఉచిత వసతి సదుపాయం కల్పిస్తారని, ఇతర వివరాలకు 8712625035 నెంబర్లో సంప్రదించవచ్చన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఈ నెల 30న తలపెట్టిన స్కూల్ కాంప్లెక్స్ సమావేశం తేదీ మార్చాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ 1938 రాష్ట్ర అకడమిక్ కమిటీ కన్వీనర్ గుగ్గులోతు కృష్ణ, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈ.రామ్మోహన్ రావు, జీ.మోహన్ రావు ఒక ప్రకటనలో కోరారు. ఆగస్టు 30న ఎక్కువమంది ఉపాధ్యాయుల పదవీ విరమణ కార్యక్రమాలు ఉన్నాయని, ఈనెల చివరి పని దినం ఆగస్టు 30న జరిగే స్కూల్ కాంప్లెక్స్కు ఉపాధ్యాయులందరూ హాజరవడం ద్వారా పదవీ విరమణ పొందే ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించడానికి ఇబ్బంది ఏర్పడుతుందన్నారు. ఏలూరు(మెట్రో): గిరిజన ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు గిరిజన ప్రాంతాల్లో సమగ్రాభివృద్ధిని చివరి మైలు వరకు సేవలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకున్నామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆదికర్మయోగి అభియాన్ కార్యక్రమం అమలు తీరును కలెక్టర్ వివరించారు. నూజివీడు, చింతలపూడి, చాట్రాయి, టి.నరసాపురం మండలాలకు చెందిన బ్లాక్ మాస్టర్ ట్రైనర్లకు గత మూడు రోజులుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఉండి: ఈ నెల 19వ తేదీన సాక్షి దినపత్రికలో ప్రచురితమైన ఇదేనా పంటకాలువల ప్రక్షాళన అనే కథనానికి అధికారులు స్పందించారు. బుధవారం ఉండి పాములపర్రు పంటకాలువలో చెత్త, తూడును తొలగించి కాలువను ప్రక్షాళన చేశారు. దీంతో పాములపర్రు గ్రామ ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేశారు. యలమంచిలి: వరుసగా రెండో రోజు కూడా కనకాయలంక కాజ్వే వరద నీటిలో మునిగింది. ధవళేశ్వరం వద్ద బుధవారం సాయంత్రం 8.08 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు వదలడంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. వరద ప్రభావానికి గురైన కనకాయలంకలో తహసీల్దార్ నాగ వెంకట పవన్కుమార్, ఇతర అధికారులు పర్యటించారు. -
జీతాలు మహాప్రభో..!
ట్రిపుల్ ఐటీ కాంట్రాక్టు సిబ్బందికి నేటికీ అందని వైనం నూజివీడు: అధికారంలోకి వస్తే ప్రతినెల ఒకటో తేదీనే జీతాలు ఇస్తాం.. ఇదీ ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పిన మాటలు. పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ఈ నెలలో 19వ తేదీ గడిచినా జీతాలు రాక రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లోని కాంట్రాక్టు ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ఇచ్చే అరకొర వేతనాలను ఇన్ని రోజులు ఇవ్వకుండా ఉంటే జీవనం ఎలాగని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలోని రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు బోధనా సిబ్బందికి ఇంతవరకు వేతనాలు లేవు. గతంలో వేతనాలు ఆలస్యమైతే సిబ్బందికి వారి జీతంలో 50 శాతం సొమ్మును అడ్వాన్సుగా చెల్లించేవారు. అలా తీసుకున్న సొమ్మును జీతాలు ఇచ్చేటప్పుడు మినహాయించేవారు. ఇప్పుడు అడ్వాన్సులు కూడా ఇవ్వకపోవడంతో కుటుంబ ఖర్చులకు, ఇతర అవసరాలకు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈఎంఐలు చెల్లించేందుకు అప్పులు కాంట్రాక్టు అధ్యాపకులందరూ ఆర్ధిక వెసులు బాటును బట్టి గృహావసరాల కోసం రుణాలు తీసుకున్నారు. బ్యాంకుల్లో చేసిన అప్పులకు, క్రెడిట్ కార్డులపై తీసుకున్న వాటికి బ్యాంకు ఖాతాలో తప్పనిసరిగా డబ్బులు సిద్ధంగా ఉంచాలి. దీంతో అప్పులు చేసి ఖాతాలో ఉంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈఎంఐలకు సరిపడా నగదు లేకపోతే సిబిల్ స్కోర్ తగ్గిపోతుందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటికి తోడు కుటుంబం గడవడానికి, పిల్లల ఫీజులు చెల్లించడానికి అనేక అవసరాలకు డబ్బులు అవసరం కాగా అప్పు చేయాల్సి వస్తోంది. సకాలంలో జీతాలు ఇస్తే ఈ తలనొప్పి ఉండదని ఉద్యోగులు పేర్కొంటున్నారు. 700 మంది కాంట్రాక్టు సిబ్బంది నాలుగు ట్రిపుల్ ఐటీల్లో కాంట్రాక్టు పద్ధతిలో మెంటార్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, గెస్ట్ ఫ్యాకల్టీలు, ల్యాబ్ అసిస్టెంట్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఐటీ మెంటార్లు పనిచేస్తున్నారు. వీరందరూ కలిపి 700కు పైగానే ఉంటారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు యూనివర్శిటీనే నెల ప్రారంభంలోనే వేతనాలను చెల్లించింది. నాలుగు ట్రిపుల్ ఐటీల్లోని కాంట్రాక్టు సిబ్బందికి నెలకు రూ.3 కోట్లు జీతాల కింద చెల్లించాలి. ఇంతవరకు వారికి వేతనాలు చెల్లించలేదు. ఇకనుంచైనా సకాలంలో వేతనాలు చెల్లించాలని కోరుతున్నారు. -
పామాయిల్ కార్మికులను ఆదుకోవాలి
ఏలూరు (టూటౌన్): పామాయిల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు పి.రామకృష్ణ డిమాండ్ చేశారు. పామాయిల్ కార్మిక సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. అనంతరం పామాయిల్ కార్మికుల సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్కు అందజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఇటీవల పామాయిల్ కార్మికులు విద్యుత్ షాక్ తగిలి, విష పురుగులు కాటేసి చనిపోతున్నారన్నారు. ఏలూరు ఎంపీ పామాయిల్ రైతుల గురించి మాట్లాడుతున్నారు తప్ప పామాయిల్ కార్మికుల గురించి మాట్లాడకపోవడం సిగ్గు చేటన్నారు. పామాయిల్ కార్మికుల సంక్షేమానికి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో చనిపోయిన కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరారు. వికలాంగులుగా మారిన వారికి ప్రభుత్వం పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పామాయిల్ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి తుమ్మల సత్యనారాయణ, జిల్లా నాయకులు ఎం.సత్యనారాయణ, హరీష్, ఎం.లక్ష్మణ, ఎం.రాంబాబు, టీ సుబ్బారావు పాల్గొన్నారు. -
కొల్లేరు ప్రక్షాళన ప్రశ్నార్థకం
శ్రీవారి భక్తులకు రహదారి కష్టాలు చినవెంకన్న దర్శనానికి వెళ్లే భక్తులు అప్రమత్తంగా లేకుంటే ప్రమాదాల బారిన పడటం ఖాయం. భీమడోలు–ద్వారకాతిరుమల రహదారి అధ్వానంగా మారింది. 8లో uబుధవారం శ్రీ 20 శ్రీ ఆగస్టు శ్రీ 2025కై కలూరు: కొల్లేరు డ్రెయిన్లకు మరమ్మతులు నిర్వహించకపోవడంతో ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో కొల్లేరు లోతట్టు గ్రామాలు జలమయమవుతున్నాయి. వరద నీరు బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు, గుండేరు వంటి భారీ డ్రెయిన్లతో పాటు మరో 31 మీడియం, మైనర్ డ్రెయిన్లు, కాలువలు చానల్స్ ద్వారా పెద్ద ఎత్తున కొల్లేరుకు చేరుతుంది. వరదల సమయంలో 1,10,920 క్యూసెక్కులు కొల్లేరుకు వస్తుందని అంచనా. వీటిలో కేవలం 12 వేల క్యూసె క్కుల నీరు మాత్రమే ఉప్పుటేరు ద్వారా 62 కిలోమీటర్ల ప్రయాణించి బంగాళాఖాతం చేరుతుంది. ఏలూరు జిల్లాలోని కై కలూరు, మండవల్లి, పెదపాడు, ఏలూరు, దెందులూరు, భీమడోలు, ఉంగుటూరు, నిడమర్రు మండలాలతో పాటు పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలంలో విస్తరించిన కొల్లేరులో 71 గ్రామాలు, కొల్లేరు అనుబంధ గ్రామాలు 150 కలిపి మొత్తం 227 గ్రామాలు ఉన్నాయి. కొల్లేరుకు చేరే నీటిని దిగువకు పంపించే మండవల్లి మండలం పెదఎడ్లగాడి వంతెన ఖానాల వద్ద గుర్రపుడెక్క భారీగా పేరుకుపోయింది. దీంతో నీటి ప్రవాహం మందగించి సమీప పెనుమాకలంక గ్రామానికి చేరే రోడ్డుపై నుంచి నీరు పారుతోంది. దీంతో రాకపోకాలు బంద్ చేశారు. ప్రజలు పడవలపై గ్రామాలకు చేరుతున్నారు. కమిటీలు సూచించినా కదలిక : వరదల సమయంలో కొల్లేరుకు వచ్చే నీటితో లాభాల కంటే నష్టాలు ఎక్కువగా జరుగుతున్నాయని 1895లో అప్పటి ఇరిగేషన్ అధికారులు గుర్తించారు. తమ్మిలేరు, బుడమేరుల వల్ల జరుగుతున్న పంట నష్టాల నివారణకు తీసుకోవాల్సిన చర్యని ప్రతిపాదించారు. 1964 వరదల తర్వాత మిత్ర కమిటీ కూడా ఇవే ప్రతిపాదనలు చేసింది. వరదల సమయంలో ఎగువ ప్రాంతాల నుంచి కొల్లేరుకు వచ్చే నీరు 47 టీఎంసీలకు పైనే ఉంటుందని, రిజర్వాయర్ల నిర్మాణం జరిగితే డెల్టాలో మరో 5 లక్షల ఎకరాల సాగులోనికి తీసుకురావడానికి ఈ నీరు పనికొస్తుందని సూచించారు. అటకెక్కిన కొల్లేరు చానలైజేషన్ తొలిదశలో కొల్లేరులో నీటిమట్టం 7 అడుగులు ఉంటే 15 వేల క్యూసెక్కుల నీరు అవుట్ప్లో ఉండేలా ఉప్పుటేరుని ఆధునికరించాలని కమిటీ సూచించింది. రెండో దశలో కొల్లేటి నీటిమట్టం 7 అడుగులు ఉంటే 20 వేల క్యూసెక్కుల నీరు అవుట్ ఫ్లో ఉండేలా పనులు చేపట్టాలని పేర్కొంది. రెండు దశల పనులకు దాదాపు రూ.7 కోట్లు ఖర్చు అవుతోందని అంచనా వేశారు. నిధులు కొరత, కొల్లేరు చుట్టూ ఆక్రమణలు ఇలా రకరకాల కారణాలతో 1981 వరకు పనులు ప్రారంభం కాలేదు. తర్వాత ప్రభుత్వం ప్రకటించిన రూ.40 కోట్లు ఏమాత్రం సరిపోవని తేల్చారు. కొన్ని సంవత్సరాల క్రితం డ్రెడ్జింగ్ పనులు తూతూ మంత్రంగా జరిగాయి. కలగా మారిన డ్రెయిన్ల మరమ్మతులు ఎగువ నుంచి భారీగా వర్షపు నీరు రెగ్యులేటర్ల నిర్మాణంతోనే సమస్యకు చెక్ -
కోర్టుల్లో ఉద్యోగాలకు పరీక్షలు
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కోర్టుల్లో స్టెనోగ్రాఫర్స్, టైపిస్ట్ తదితర పోస్టులకు ఈ నెల 20 నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. 8లో uకొల్లేరులో నీటి ప్రవాహానికి అడ్డంకులు తొలగించడానికి పంట కాల్వల్లో కలాసి వ్యవస్థ మాదిరిగా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఎగువ నుంచి కొట్టుకొస్తున్న గుర్రపుడెక్క గుదిబండగా మారుతోంది. కొల్లేరు, ఉప్పుటేరులో పూడికలు తీయాలి. ఉప్పుటేరు నుంచి సముద్రానికి నీరు పోయేలా అడ్డంకులను తొలగించాలి. – సైదు సత్యనారాయణ, కొల్లేరు ప్రాంతీయ వ్యవసాయ, మత్స్య సంఘాల అభివృద్ధి సంఘం అధ్యక్షుడు ఉప్పుటేరు వద్ద ఆక్రమణలను యుద్ధప్రాతిపాదికన తొలగిస్తున్నాం. ప్రధానంగా ఉప్పుటేరుపై నిర్మించిన రైల్వే బ్రిడ్జి వద్ద గుర్రపుడెక్క, కిక్కిసను 6 పొక్లయిన్లతో తీస్తున్నారు. ప్రతి ఏటా మాదిరిగా కాకుండా ముందస్తు చర్యల్లో ఆక్రమణల తొలగింపు పనులు జరుగుతున్నాయి. – ఎం.రామకృష్ణ, డ్రెయినేజీ డీఈ, కై కలూరు -
ఉచిత బస్సు పేరుతో మోసం
ఏలూరు టౌన్: కూటమి ప్రభుత్వం మహిళలను దారుణంగా మోసం చేసిందని.. రాష్ట్రంలో ఎక్కడికై నా ఉచిత బస్సులో తిరగవచ్చని ఎన్నికల్లో చెప్పిన చంద్రబాబు, ఉచిత బస్సుకు ఆంక్షలు విధించారని, కేవలం 5 రకాల బస్సులకే పరిమితం చేయటం మహిళలను మోసం చేయడం కాదా? అని వైఎస్సార్సీపీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి మండిపడ్డారు. ఏలూరులోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పెట్టిన ఆంక్షలతో గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఒక బస్టాప్కు పల్లె వెలుగు రావాలంటే మూడు గంటలు పడుతుందని, అప్పటి వరకూ మహిళలు వేచిఉండాల్సి రావడం బాధాకరమన్నారు. నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయో చెప్పాలన్నారు. మహిళలకు నెలకి రూ.1500 ఇస్తామని హామీ ఇచ్చి నేటికి 15 నెలలు అవుతున్నా పట్టించుకోలేదని విమర్శించారు. సీ్త్రనిధి పథకంలో ఒక్కో మహిళకు ఏడాదికి రూ.18000 బకాయి ఉన్నారని, ఈ సొమ్ములు ఎప్పుడు మహిళల ఖాతాల్లో జమచేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. విచ్చలవిడిగా మద్యం షాపులకు పర్మిట్ రూమ్స్ ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారని విమర్శించారు. వైఎస్సార్సీపీ ఏలూరు నగర మహిళా అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏ ఒక్క హామీని పూర్తిగా అమలు చేసిన దాఖలాలు లేవన్నారు. విచ్చలవిడిగా బార్లకు లైసెన్సులు మంజూరు చేస్తున్నారని మద్యం ఏరులై పారించేలా చంద్రబాబు అనుమతులు ఇవ్వటం దారుణం అన్నారు. సమావేశంలో ఏలూరు కార్పొరేటర్లు డింపుల్ జాబ్, ఇనపనూరి కేదారేశ్వరి, జిల్లా కార్యదర్శి కంచుమర్తి తులసీ, బట్టు విజయలక్ష్మి, కట్టా ఉమాదేవి, కుమారి, పాలనాటి పరమేశ్వరి, సునీత, రుబీనా భేగం, మోబీనా, అక్షయ, రమ్య తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ ఎండీ ప్రకటన బాధాకరందెందులూరు: విద్యార్థులకు బస్సుల్లో ఉచిత బస్సు పథకం వర్తించదని ప్రకటించడం బాధాకరమని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి తొత్తడి వేదకుమారి అన్నారు. దెందులూరులో మాట్లాడుతూ ఎన్నికల ముందు రాష్ట్రంలో ఎక్కడికై నా మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని పదేపదే చెప్పారన్నారు. షరతులు లేకుండా ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. 5 రకాల బస్సులకే ఉచితం పరిమితం నెలకు రూ.1500 సీ్త్రనిధి హామీ ఏమైంది? -
జీజీహెచ్లో మాయాజాలం
ఏలూరు టౌన్: ఏలూరు సర్వజన ఆసుపత్రిలో నిధుల స్వాహా ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులను తోసిరాజని శానిటరీ వర్కర్లకు అన్యాయం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెతుతున్నాయి. రెండు, మూడేళ్ళుగా ఏలూరు జీజీహెచ్ వైద్యాధికారులు శానిటరీ వర్కర్లకు ఇవ్వాల్సిన ఆరోగ్యశ్రీ ఇన్సెంటివ్స్ ఇవ్వకుండా ఆ నిధులను పక్కదారి పట్టించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏకంగా రూ.24 లక్షలకు పైగా సొమ్ములు ఏమయ్యాయో తెలియడం లేదని, తమకు న్యాయంగా చెల్లించాల్సిన సొమ్ములు ఇవ్వాలని కోరుతున్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో స్టాఫ్ నర్సులకు చెల్లించాల్సిన 15 శాతం ఇన్సెంటివ్స్లోనూ కోత పెట్టారని, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని స్థితిలో ఉన్నామని వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శానిటరీ వర్కర్లపై చిన్నచూపు వైద్య విధాన పరిషత్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నిబంధనల మేరకు.. ఆరోగ్యశ్రీ పథకంలో రోగికి సేవలందిస్తోన్న వైద్యుడు నుంచి కింది స్థాయి ఉద్యోగి ఇన్సెంటివ్స్ చెల్లించాల్సి ఉంది. ఏలూరు జీజీహెచ్లో సుమారుగా 95 మంది వరకూ శానిటరీ వర్కర్లు పనిచేస్తున్నారు. వీరంతా జీజీహెచ్లోని ఆయా విభాగాల్లో రోగులకు సేవలందిస్తున్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో రోగికి ఇచ్చే సొమ్ములో 45 శాతం వివిధ కేటగిరీల్లో ఇన్సెంటివ్ చెల్లించాల్సి ఉంది. దీనిలో 20 శాతం ఎఫ్ఎంఓ, ఎన్ఎన్ఓ, స్ట్రెచర్ బాయ్, తోటి(శానిటరీ వర్కర్), ఆయా, ప్లంబర్, బార్బర్, లిఫ్ట్ అపరేటర్ ఇలా వివిధ కేటగిరీలో పనిచేస్తున్న సిబ్బందికి చెల్లించాలి. ఏపీ వైద్య విధాన పరిషత్ ఏర్పడిన అనంతరం తోటి అనే పదాన్ని రద్దు చేయగా, జూనియర్ శానిటరీ వర్కర్గా మార్చారు. ప్రస్తుతం ఈ పోస్టు శానిటరీ వర్కర్గా మారగా, వీరంతా శానిటరీ కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నారు. హాస్పిటల్లో పనిచేసే శానిటరీ వర్కర్లు ఆరోగ్యశ్రీ వార్డుల్లో రోగులకు సేవలందిస్తూ ఉంటారు. స్టాఫ్ నర్సులకు కోత : రోగికి చెల్లించే సొమ్ములో సేవలు అందించే వైద్యుడు, స్టాఫ్ నర్సులకు పెద్ద మొత్తంలోనే సొమ్ము చెల్లిస్తారు. స్టాఫ్ నర్సుకు సుమారుగా 15 శాతం చొప్పున డబ్బులు ఇవ్వాలి. శస్త్రచికిత్సలు, ఇతర సేవలకు స్టాఫ్ నర్సులకు సుమారుగా రూ.15 వేలకు పైగా ఇవ్వాల్సి ఉంటుంది. ఏలూరు జీజీహెచ్లో కేవలం రూ.4500 మాత్రమే ఇస్తున్నారు. స్టాఫ్ నర్సులకు చెల్లించాల్సిన 15 శాతంలో కేవలం 5 శాతం మాత్రమే ఇస్తూ.. మిగిలిన సొమ్ములు ఎవరి ఖాతాల్లోకి వెళ్తున్నాయనేది సందేహంగా మారింది. స్టాఫ్ నర్సులకు ఇవ్వాల్సిన సొమ్ముల్లో భారీగా అవినీతి జరిగిందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఆరోగ్యశ్రీ ఇన్సెంటివ్స్ చెల్లించకుండా స్వాహా చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఏలూరు జీజీహెచ్లో శానిటరీ వర్కర్లకు కనీసం 6 నెలలకు రూ.4 లక్షల వరకూ ఆరోగ్యశ్రీ ఇన్సెంటివ్స్ సొమ్ములు చెల్లించాలి. మూడేళ్ళ పాటు సుమారుగా రూ.24 లక్షల వరకూ నిధులు ఏమయ్యాయో ప్రశ్నార్థకంగా మారింది. ఒక్కో శానిటరీ వర్కర్కు సుమారుగా రూ.4 వేల వరకూ ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సి ఉంది. మూడేళ్లుగా శానిటరీ వర్కర్లకు అందని ఇన్సెంటివ్ సొమ్ము మొత్తం రూ.24 లక్షలు స్వాహా చేశారని ఆరోపణలు? స్టాఫ్ నర్సులకు ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్లో కోత 15 శాతానికి 5 శాతమే ఇస్తున్నారని ఆవేదన జీజీహెచ్లో శానిటరీ వర్కర్లకు ఆరోగ్యశ్రీ సేవలకు ఇన్సెంటివ్స్ చెల్లించాల్సి ఉంది. మూడేళ్ళుగా చెల్లించడం లేదు. కనీసం రూ.24 లక్షల వరకూ ఇన్సెంటివ్స్ రావాల్సి ఉంది. ఆరోగ్యశ్రీ సేవల్లో భాగంగా రోగులకు ఎన్నో సేవలు అందిస్తున్న శానిటరీ వర్కర్లకు అన్యాయం చేస్తే సహించేది లేదు. జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళి న్యాయం జరిగేలా ఉద్యమిస్తాం. – కే.కృష్ణమాచార్యులు, ఏఐటీయూసీ నగర అధ్యక్షుడు నిత్యం ఏలూరు జీజీహెచ్లో రోగులకు సేవలందిస్తూ ఉంటాం. ఆరోగ్యశ్రీ వార్డుల్లో ఆపరేషన్లు చేసిన రోగులకు, ఇతర వ్యాధులతో బాధపడేవారికి సేవలు అందిస్తున్నాం. ప్రభుత్వం మాకు ఇచ్చే సొమ్ములు మాత్రం ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారు. చాలీచాలని జీతాలతో, ఐదారు నెలలకు ఒకసారి జీతాలు ఇచ్చినా పనిచేస్తున్నాం. న్యాయంగా రావాల్సిన సొమ్ములు ఇచ్చేలా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. – విజయ, శానిటరీ వర్కర్, ఏలూరు జీజీహెచ్ -
నేటినుంచి కోర్టుల్లో ఉద్యోగాలకు పరీక్షలు
ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కోర్టులలో స్టెనోగ్రాఫర్స్, టైపిస్ట్, కాపీయిస్ట్, డ్రైవర్, తదితర పోస్టులకు జారీ చేసిన నోటిఫికేషన్కు 4,207 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని, వీరికి ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి తెలిపారు. స్థానిక జిల్లా జడ్జి ఛాంబర్లో మంగళవారం పరీక్షల నిర్వహణ వివరాలు జిల్లా జడ్జి వెల్లడించారు. ఏలూరులోని సీఆర్ఆర్. ఇంజనీరింగ్ కాలేజీ, సిద్దార్థ క్వెస్ట్ కళాశాల, భీమవరంలోని డీఎన్ఆర్ కళాశాల కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్ష ఆన్లైన్ విధానంలో ఉంటుందన్నారు. ఈనెల 20, 21, 22, 24 తేదీల్లో మూడు షిప్టులలో, 23వ తేదీన రెండు షిప్టులలో పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. అభ్యర్థులను నిర్ధేశించిన సమయానికి 15 నిమిషాల ముందు మాత్రమే పరీక్షా కేంద్రంలోని అనుమతించడం జరుగుతుందన్నారు. విభిన్న ప్రతిభావంతులకు వారి విజ్ఞప్తి మేరకు స్క్రైబ్ని ఏర్పాటుచేయడం జరుగుతుందని, వారిని నిర్ధేశించిన సమయం కన్నా 30 నిమిషాలు అదనపు సమయం ఇవ్వడం జరుగుతుందన్నారు. అభ్యర్థులు హాల్టికెట్తో పాటుగా తప్పనిసరిగా ఫోటో గుర్తింపు కార్డును తీసుకురావాలన్నారు. హాల్టికెట్ డౌన్లోడ్లో సాంకేతిక సమస్యలు, తదితర సమస్యల పరిష్కారం కోసం 0863–2372752 ఫోన్ నెంబర్తో హెల్ప్ లైన్ ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. రత్నప్రసాద్ పాల్గొన్నారు. ఏలూరులో రెండు, భీమవరంలో ఒకటి పరీక్షా కేంద్రాలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి వెల్లడి -
నిరుపేదల బతుకులు రోడ్డు పాలు
ఉండి: డ్రెయిన్ గట్టున ఉంటున్న వారి గుడిసెలను కూలగొట్టి విద్యుత్ మీటర్లు తొలగించి వారిని వెళ్లగొట్టారు. నిరుపేదలైన ఏమీ చేయలేరు కదా అని వారిపై అధికారులు జులుం చేశారు. విద్యుత్ మీటర్లను పట్టుకుపోయారు. సోమవారం ఉదయం ఉండి 33 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ వద్ద కొందరు పేదలు అధికారులను వేడుకుంటూ నిలబడ్డారు. ఈ సందర్భంగా వారి ఆవేదనంతా వెలిబుచ్చారు. కొంతకాలం క్రితం నుంచి ఉండిలో మసీదుకు ఎదురుగా అరుంధతీపేటకు వెళ్ళే దారిలో బొండాడ డ్రెయిన్ పక్కనే గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. వాటికి విద్యుత్ మీటర్లు మంజూరు చేశారు. దీంతో నీడ లేక నానాపాట్లు పడుతున్న వారి జీవితాల్లో వెలుగులు వచ్చాయనుకున్నారు. ఊరూరా తిరిగి వేషాలు వేసుకుని జీవించే వారి జీవితాలకు ఒక స్థిర నివాసం, అడ్రస్సు ఏర్పడింది. రేషన్ కార్డు, ఆధార్ కార్డులు లభించాయి. వారి పిల్లలు ప్రస్తుతం స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. గౌరవప్రదంగా జీవించాలని వారు కన్న కలలు కూటమి నాయకుల రూపంలో దూరమవుతుందని వారు కలలో కూడా అనుకోలేదు. కూటమి నాయకులు చేసిన పనికి నాలుగు గుడిసెల్లో వుంటున్న 8 కుటుంబాలకు చెందిన నిరుపేదలు నిలువనీడ లేక రోడ్డుపై నిలబడ్డారు. స్థానిక ఎమ్మెల్యే ఏదో కడుతున్నారని గుడిసెలను తొలగించారు. ఇప్పటికీ ఏ పని ప్రారంభించలేదు. తమ జీవితాలు చిందర చేశారంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాళ్లావేళ్లా పడ్డా కరుణించని అధికారులు అధికారులను, ప్రజాప్రతినిధులను ఎదురించే ధైర్యం లేక ఎంతో మందిని సహాయం కోసం అర్థించారు. ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో వారికున్న కొన్ని సామాన్లు తీసుకుని ఉండిలోనే విద్యుత్ సబ్స్టేషన్ పక్కనే ఓ ఖాళీస్థలంలో బరకాలు, పాతబట్టలతో గుడిసెలు వేసుకున్నారు. ఒకవైపు విషసర్పాలు, మరోవైపు చిమ్మచీకటితో వారి జీవితాలు దుర్భరంగా మారాయి. పిల్లలు చదువులకు దూరం కావడంతో ఏం చేయాలో పాలుపోక సోమవారం విద్యుత్ అధికారులకు దండాలు పెడుతూ ఆఫీసు ముంగిట భార్య బిడ్డలతో నిలబడ్డారు. మమ్మల్ని కనికరించి మాకు విద్యుత్ మీటర్లు ఇప్పిస్తే మా బతుకులు మేం బతుకుతాం.. మాకు దారి చూపించండి బాబూ అంటూ కాళ్ళా వేళ్లా పడ్డారు. గత ఎన్నికల్లో కూటమి నాయకులు ఎన్నో వాగ్దానాలు చేశారని.. మా జీవితాల్లో చాలా అభివృద్ది వస్తుందని ఊహించిన వారికి నిలువనీడ లేకుండా పోతుందని అనుకోలేదని వారు ఆవేదన చెందుతున్నారు. విద్యుత్ మీటర్లు తొలగించాలని పంచాయతీ కార్యదర్శి అనిల్ లెటర్ పెట్టారని, అందుకే మీటర్లను తొలగించామని ఏఈ పులగం శ్రీనివాస్ తెలిపారు. పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరేందుకు సంప్రదించగా ఆయన అందుబాటులో లేరు. బొండాడ డ్రెయిన్ గట్టుపైన గుడిసెలు కూల్చివేత నీడలేక నానా పాట్లు పడుతున్న పేదలు 15 మంది చిన్నారులు చదువులకు దూరం నా చిన్నతనం నుంచి ఉండిలోనే వుంటున్నాం. బతికేందుకు జాగా లేదు. చివరకు ఉండి బొండాడ డ్రెయిన్ పక్కగా గుడిసెలు వేసుకుని ఒక జీవితాన్ని ప్రారంభించాం. మా పిల్లలకు మా పరిస్థితి రాకుండా మంచి జీవితం ఇవ్వాలనుకున్నాం. ఇప్పుడు మా ఇళ్లు అడ్డొస్తున్నాయని తీసేసారు. తనుకు గొల్లమ్మ, బాధితురాలు, ఉండి మా పిల్లల్లి బాగా చదివించుకోవాలని స్కూళ్ళకు పంపుతున్నాం. మా గుడిసెలు తొలగించి మా పిల్లల చదువులకు అడ్డుపడ్డారు. మా పిల్లలు బడికి రావడం లేదని టీచర్లు ఫోన్లు చేస్తున్నారు. మేము రోజుకొక చోట ఉంటున్నాం. అందుకే మా పిల్లల్ని బడికి ఎలా పంపాలి. తనుకు మరిడమ్మ, బాధితురాలు, ఉండి -
శ్రీనివాసుడి దివ్య పవిత్రోత్సవాలు ప్రారంభం
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన లక్ష్మీపురంలోని శ్రీ సంతాన వేణుగోపాల జగన్నాథ, వేంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీనివాసుడి దివ్య పవిత్రోత్సవాలు సోమవారం రాత్రి అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాన్ని జరిపి, ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఆలయంలో ఏడాది పొడవున తెలిసీ, తెలియక జరిగిన తప్పుల ప్రాయఃశ్చిత్తం నిమిత్తం ఈ పవిత్రోత్సవాలను నిర్వహించడం ఇక్కడ సంప్రదాయం. దివ్య పవిత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం పవిత్రాధివాసం, బుధవారం పవిత్రారోహణ కార్యక్రమాలు జరుగుతాయని, గురువారం జరిగే పవిత్రావరోహణ, మహా పూర్ణాహుతితో ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయని శ్రీవారి ఆలయ ఈఓ ఎన్వీ సత్యనారాయణ మూర్తి తెలిపారు. -
పశువధపై మొద్దు నిద్ర
తణుకు అర్బన్: తణుకు మండలం తేతలి గ్రామం పశు ఘోషతో అల్లాడుతోంది. పశువులను నిర్ధాక్షిణ్యంగా వధిస్తున్నప్పటికీ పట్టించుకునే వారు లేకపోవడంతో బాధితులకు కంఠశోషే మిగిలింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నుంచి పశువధ శాల తెరచుకుంది. అక్కడి నుంచి వస్తున్న దుర్వాసనకు తేతలి గ్రామస్థులు అల్లాడిపోతున్నారు. స్థానికంగా ఇళ్లలో ఉండలేకపోతున్నామని పశువధ శాలను మూయించాలని వేడుకుంటున్నారు. పశువధ శాల చుట్టూ 200పైగా ఇళ్లు ఉన్నా కూటమి ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలపై దాడులకు దిగిన వైనం పశు వధను నిలిపివేయాలని బాధితులు కర్మాగారం వద్ద నిరసనలు తెలుపుతూ వ్యాన్లను అడ్డుకుంటే దాడులు చేశారు. రోడ్డుపై బైఠాయిస్తే కేసులు పెట్టారు. పశువధను నిలిపించమని కాళ్లు పట్టుకుంటామన్నామని, రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేసినప్పటికీ కూటమి ప్రభుత్వానికి కనికరం లేదని బాధితులు మండిపడుతున్నారు. శాంతియుతంగా చేస్తున్న నిరసన శిబిరాలను పోలీసులు తొలగించారని, ఇదంతా కూటమి నేతల కనుసన్నల్లోనే జరుగుతుందని బాధిత వర్గాలు బాహాటంగానే విమర్శిస్తున్నాయి. టీడీపీ, జనసేన కార్యాలయాలకు వెళ్లినా.. పశువధ శాల బాధితులు తాడోపేడే తాడేపల్లిలోనే తేల్చుకుంటామని మంగళగిరిలోని టీడీపీ, జనసేన కార్యాలయాలకు బస్సులు వేసుసుని వెళ్లి వినతిపత్రాలు అందచేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ను కలిసి ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఫలితం లేదు. పశువధకు సంబంధించి తణుకు నియోజకవర్గంలో చోద్యం చూస్తున్న జనసేన, బీజేపీ వర్గాలపైనా బాధితులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీతో అంటకాగుతూ బీజేపీ నాయకులు సైతం పశుఘోషలో భాగస్వామ్యమయ్యారని మండిపడుతున్నారు. మూడు జిల్లాల నుంచి పశువుల తోలకం తణుకు మండలం తేతలి గ్రామ పరిధిలో నిర్వహిస్తున్న పశువధ శాలకు పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు గ్రామాలతోపాటు ఏలూరు, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాల నుంచి పశు బేరగాళ్లు పశువులను రవాణా చేస్తున్నారు. దొంగిలించిన గేదెలు సైతం తేతలిలోని పశువధ శాలకు తోలుకువస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పలు జిల్లాల నుంచి తమ గేదెలు దొంగిలించారంటూ పశుపోషకులు తణుకు ప్రాంతానికి వచ్చి వెతుకులాడే పరిస్థితి తెచ్చారు. గతంలో తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన పశుశాలలో దొంగిలించిన రెండు ఖరీదైన గేదెలు కూడా ఇదే పశువధ శాలకు తరలించారని అందుకే పోలీసులు రికవరీ చేయలేకపోయారనే ఆరోపణలు అప్పట్లో గుప్పుమన్నాయి. ఆందోళనకు మద్దతు పలికిన వైఎస్సార్సీపీ పశువధ శాల నుంచి దుర్వాసన వస్తుందని బాధితులు నిరసన తెలిపిన వెంటనే వైఎస్సార్సీపీ హయాంలో అప్పట్లో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పశువధ శాల నిర్వహణకు తెరదించుతూ తాళాలు వేయించారు. కూటమి ప్రభుత్వం రాగానే తిరిగి పశువధ శాల గేట్లు తెరచుకున్నాయని, నిర్వహణ మొదలుపెట్టడంతో దుర్వాసనతో ఉండలేకపోతున్నామని స్థానిక బాధితులు రోడ్డెక్కగానే వైఎస్సార్సీపీ తరపున కారుమూరి వారికి అండగా నిలిచారు. దుర్వాసనతో ఉండలేకపోతున్నామని బాధితుల ఆందోళన టీడీపీ, జనసేన పార్టీ కార్యాలయాల్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం కర్మాగారానికి నిత్యం వ్యాన్లలో పశువులు గేదెలు అపహరణకు గురవుతున్నాయని పశుపోషకుల ఫిర్యాదు వ్యాపార, వాణిజ్య పరంగా దినదినాభివృద్ధి చెందిన పచ్చని తణుకు పరిసర ప్రాంతంలో పశువధ వద్దంటూ ప్రజలు రోడ్డెక్కినా ప్రభుత్వం దిగి రాలేదు. పశువుల నుంచి చిమ్ముతున్న రక్తం ఈ ప్రాంతానికి మంచిది కాదన్నా వినలేదు. చివరకు ఆ ప్రాంత వాసులు దుర్వాసనతో ఇళ్లలో ఉండలేకపోతున్నామని రోడ్డెక్కితే కేసులు పెట్టారు. పంచాయితీ ఎన్ఓసీ లేదని, ఆ కర్మాగారానికి ఎలాంటి అనుమతులు లేవని, వారు చూపిన సౌకర్యాలు అక్కడలేవని నిర్ధారణ చేసినా కానీ రాజకీయ ప్రోత్సాహంతో పశువధ నేటికీ ముమ్మరంగా సాగుతోంది. – జల్లూరి జగదీష్, గోసేవాసమితి సభ్యులు -
చివరి దశకు గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం
చింతలపూడి: జిల్లాలో ఖమ్మం, దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే రహదారి పనులు చివరి దశకు చేరుకున్నాయి. భూములు ఇచ్చిన రైతులకు సర్వీసు రోడ్లు నిర్మించి అభివృద్ధి చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. హైదరాబాద్– విశాఖ మధ్య దూరం తగ్గించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. హైదరాబాద్– విశాఖపట్నం మధ్య 56 కిలోమీటర్ల దూరం తగ్గడమేకాక ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది. 162 కిలోమీటర్ల నిడివి గల ఈ రహదారిలో 8 నుండి 10 ఇంటర్చేంజ్ పాయింట్లు ఉంటాయి. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో కార్లు, 100 కిలోమీటర్ల వేగంతో భారీ వాహనాలు ప్రయాణించేలా హైవే నిర్మాణం చేపడుతున్నారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖామంత్రి నితిన్ గడ్కడీ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిలు రెండు ఫేజ్లలో చేపట్టనున్న ఈ జాతీయ రహదారి నిర్మాణానికి 2023లో శంకుస్థాపన చేసి పనులకు శ్రీకారం చుట్టారు. ఏలూరు జిల్లాలో 72 కిలోమీటర్ల మేర ఈ జాతీయ రహదారి నిర్మాణం చేపడుతున్నారు. 70 మీటర్ల వెడల్పుతో ఎకనామిక్ కారిడార్గా ఈ రహదారిని వర్గీకరించారు. జిల్లాలో రెండు దశల్లో నిర్మాణం చేపట్టనున్న ఈ ప్రాజెక్టును పూణేకు చెందిన బెకం ఇన్ఫ్రా సంస్ధ చేపట్టింది. ఖమ్మం జిల్లా కృష్ణాపురం, తుంబూరు వద్ద నుంచి ఆంధ్రప్రదేశ్లోకి ఈ జాతీయ రహదారి ప్రవేశిస్తుంది. చింతలపూడి మండలం, రేచర్ల గ్రామం నుంచి గుర్వాయిగూడెం వరకు 4 లేన్ల రహదారి నిర్మాణానికి 569.37 కోట్లు, గుర్వాయిగూడెం నుంచి దేవరపల్లి వరకు 711.94 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. మెట్ట ప్రాంతంలో నేషనల్ హైవే అందుబాటులోకి రానుండడంతో రవాణా సదుపాయాలు మెరుగయ్యే అవకాశం ఉంది. రహదారి కోసం మొత్తం 1,411 ఎకరాల భూమి అవసరమవుతుంది. అందులో 114 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగ, 1,297 ఎకరాలు రైతుల నుంచి సేకరించారు. గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.4,609 కోట్ల అంచనాలతో మొత్తం ఆంధ్ర, తెలంగాణాలో కలిపి 5 దశల్లో రహదారి నిర్మాణ పనులు చేపడుతున్నారు.సర్వీసు రోడ్ల హామీ నెరవేర్చాలి: రైతులుఅయితే తమ వద్ద భూములు సేకరించే సమయంలో అధికారులు పంట పొలాల్లోకి వెళ్ళడానికి సర్వీసు రోడ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారని, తీరా రహదారి నిర్మాణం పూర్తి కావస్తున్నా సర్వీసు రోడ్లు అభివృద్ధి చేయలేదని ఆరోపిస్తున్నారు. చింతలపూడి మండలంలో రేచర్ల, జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం వద్ద తప్ప ఎక్కడా గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఎక్కే ఎంట్రీ పాయింట్ లేదు. దీంతో రైతులు, చిరు వ్యాపారులు తమ ఉత్పత్తులను సరుకులను అటు రాజమండ్రి, ఇటు విశాఖ, ఖమ్మం, హైద్రాబాద్ మార్కెట్లకు తీసుకుపోవాలంటే రేచర్ల , జంగారెడ్డిగూడెం లేదా ఖమ్మం జిల్లా వేంసూరు వద్ద తప్ప ఎక్కడా గ్రీన్ ఫీల్డ్ రోడ్డెక్కే వీలే లేదు. అండర్పాస్ బ్రిడ్జ్లు కూడ ఎత్తు తగ్గించి నిర్మించడంతో పామాయిల్ గెలల లోడ్ ట్రాక్టర్లు, లారీలు , బోర్వెల్స్ లారీలు వెళ్ళ డానికి అవకాశం లేదు. కనీసం అండర్ పాస్ బ్రిడ్జిల ఎత్తు పెంచి నిర్మించినా రైతులకు కొంత మేర ఉపయోగంగా ఉండేది.భూములిచ్చిన రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి. సర్వీసు రోడ్లు అభివృద్ధి చేసి రైతులు పంట భూముల్లోకి వెళ్ళడానికి చర్యలు తీసుకోవాలి. రేచర్ల, వేంసూరు, జంగారెడ్డిగూడెం ఎంట్రీ పాయింట్లకు వెళ్ళి తిరిగి రావాలంటే రైతులు అనేక వ్యయ ప్రయాసలకు గురి కావాలి. గ్రీన్ ఫీల్డ్ రోడ్ పక్కనున్న గ్రామాల ప్రజలకు సైతం రోడ్డు ఎక్కే అదృష్టం లేదు. సమస్యను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలి.– కంభం విజయరాజు, వైఎస్సార్సీపీ నియోజకవర్గ కన్వీనర్, చింతలపూడి -
బస్సుల కోసం పడిగాపులు
మహిళలకు ఫ్రీ బస్సు అని కూటమి నాయకులు ఊదరగొడుతున్నారు. తీరా బస్టాండ్కు వెళితే ఫ్రీ బస్సు దేవుడెరుగు.. అసలు బస్సులే కరువయ్యాయి. ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా ప్లాట్ఫామ్పై గంటల కొద్దీ పడిగాపులు పడాల్సిన పరిస్థితి. ఏలూరు–విజయవాడ నాన్స్టాప్ కౌంటర్ దగ్గరైతే ప్రయాణికుల అవస్థలు చెప్పనవసరం లేదు. వరుసగా మూడు రోజులు సెలవులు రావడం, మహిళలకు ఉచిత ప్రయాణంతో బస్సులు కరువయ్యాయి. సోమవారం ఏలూరు కొత్త బస్టాండ్ వద్ద ప్రయాణికుల పడిగాపుల దృశ్యాలివి. –సాక్షి ఫొటోగ్రాఫర్/ ఏలూరు -
జిల్లాలో అడుగడుగునా సమస్యలే..
ఏలూరు (మెట్రో): జిల్లాలో అడుగడుగునా సమస్యలే.. రైతులకు తీవ్ర ఇబ్బందులే.. ప్రభుత్వం ప్రకటించే పనుల్లోనూ ప్రజలకు కష్టాలే.. ఇవి సా క్షాత్తూ జిల్లా సమీక్షా సమావేశంలో నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు చెప్పిన మాటలు. కలెక్టరేట్లో సోమవారం జిల్లా సమీక్షా సమావేశాన్ని (డీఆర్సీ) ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అ ధ్యక్షతను నిర్వహించారు. జిల్లాలో రైతులు యూ రియా విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కై కలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఒక్క యూ రియా బస్తా కోసం రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొందని, జిల్లాలో ఏర్పాటుచేసిన కోకోనట్ బోర్డు ప్రశ్నార్థకంగా మారిందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు, ఉచి త బస్సు పథకంలో సమస్యలపై ఏలూరు ఎమ్మె ల్యే బడేటి చంటి, చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్కుమార్ మాట్లాడారు. గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్యలపై పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడారు. నారాయణపురం బ్రిడ్జి నిర్మాణం వేగంగా పూర్తిచేయాలని ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు కోరారు. ఇన్చార్జి మంత్రి మనోహర్ మాట్లాడుతూ కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల సరఫరాపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ సాగులో నానో, సేంద్రియ ఎరువుల వినియోగం పెంచాలన్నారు. కలెక్టర్ వెట్రిసె ల్వి, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, జేసీ ధాత్రిరెడ్డి, డీఆర్వో విశ్వేశ్వరరావు పాల్గొన్నారు. 25 నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డులను ఈ నెల 25 నుంచి లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని పౌర సరఫరా ల శాఖ మంత్రి, ఏలూరు జిల్లా ఇన్చార్జి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. డీఆర్సీ సమీక్ష సమావేశానంతరం రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథితో కలసి జిల్లా ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. ఈనెల 25 నుంచి ఏటీఎం కార్డు సైజులో ఉండే రేషన్ కార్డులు అందజేస్తా మని మంత్రి చెప్పారు. అన్నదాత సుఖీభవ ప థకం కింద నమోదు కాని రైతులు ఎవరైనా ఉంటే వారికి మరోసారి అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు. పథకం లోటుపాట్లపై ఈనెల 20 లోపు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఎ మ్మెల్యే చింతమనేని సూచన మేరకు కోకోనట్ బోర్డు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. డీఆర్సీ సమావేశంలో ఎమ్మెల్యేల గళం జిల్లా సమీక్షా సమావేశంలో ప్రధానమైన అంశాలు చర్చించేందుకు అజెండాను ఏర్పాటు చేస్తారు. అయితే అజెండాను అందించడంలో మాత్రం గోప్యత పాటిస్తున్నారు. కనీసం మీడి యా ప్రతినిధులకు అజెండా ప్రతులను అందించాల్సి ఉన్నా లేవని అధికారులు చెప్పడం గమనార్హం. కనీసం అధికారులకు సైతం పూర్తిస్థాయిలో అజెండా ప్రతులను అందించడంలో సంబంధిత శాఖాధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. -
తల్లిడిల్లిన మనసు
సృష్టిలో తల్లి ప్రేమకు మించింది మరొకటి లేదు. అది మనుషుల్లో అయినా.. జంతువుల్లో అయినా ఒక్కటే అనడానికి ఈ దృశ్యం అద్దంపడుతోంది. ద్వారకాతిరుమల శివారు లక్ష్మీపురంలోని ఆర్చిగేటు సమీపంలో రోడ్డుపై సోమవారం ఉదయం ఓ కుక్క పిల్లను కారు ఢీకొట్టడంతో, అది అక్కడే చనిపోయింది. దీంతో తన మరో పిల్లతో కలిసి అక్కడికి చేరుకున్న తల్లి శునకం చనిపోయిన పిల్లకు కాపలా కాసిన తీరు కంటతడి పెట్టించింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రోడ్డుపై పిల్లతో కూర్చుని, చనిపోయిన పిల్లను మరే వాహనం తొక్కకుండా ఒక పూటంతా కాపలా కాసింది. రోడ్డుపై వెళుతున్న వారి వైపు దీనంగా చూస్తూ తల్లడిల్లిపోయింది. చివరికి ఓ వ్యక్తి చనిపోయిన కుక్క పిల్లను దూరంగా తీసుకెళ్లి పడేయడంతో తల్లి శునకం, దాని పిల్ల అక్కడి నుంచి వెళ్లిపోయాయి. – ద్వారకాతిరుమల -
చీకటి జీఓను రద్దు చేయాలి
ఏలూరు టౌన్: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లోకి విద్యార్థి సంఘాల ప్రవేశాన్ని నిషేధిస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన చీకటి జీఓను తక్షణమే ఉపసంహరించుకోవాలనీ, లేకుంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పాతినవలస రాజేష్ అన్నారు. ఏలూరులోని పార్టీ కా ర్యాలయంలో సోమవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి పాలనలో విద్యారంగం నిర్వీర్యం అయ్యిందన్నారు. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లోకి విద్యార్థి సంఘాలకు అనుమతిస్తే ప్రభుత్వ వైఫల్యాలు, డొల్లతనం బయటపడుతుందనే భయంతోనే నిషే ధం విధించారన్నారు. పిల్లలకు ఇచ్చిన బ్యాగులు, మధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉందన్నారు. గత ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్ పేద పిల్లల విద్యాభివృద్ధికి విశేష కృషిచేశారని, నాడు–నేడుతో కార్పొరేట్ వసతులు కల్పించారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో, పాఠశాలల్లో, కాలేజీల్లో కలుషిత ఆహారంతో విద్యార్థులు ఆస్పత్రి పాలవుతున్నా మంత్రి లోకేష్ స్పందించటం లేదన్నారు. రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి దాలి వెంకటేష్, ఏలూరు నియోజకవర్గ వలంటీర్ విభా గం అధ్యక్షుడు ఉయ్యాల గణేష్, ఏలూరు విద్యార్థి విభాగం అధ్యక్షుడు పాతినవలస బాలాజీ, జిల్లా బీసీ సెల్ కార్యదర్శి పల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
గోదావరి వడివడి.. కొల్లేరులో అలజడి
పెదఎడ్లగాడి వంతెన వద్ద యుద్ధప్రాతిపాదికన గుర్రపుడెక్క తొలగింపు పనులు చేపట్టాం. పెదఎడ్లగాడి వద్ద 2.5 అడుగుల నీటిమట్టం ఉంది. ఇది 4 అడుగుల దాటితే గ్రామాలకు నీరు చేరుతుంది. గుర్రపుడెక్క తొలగించడం వల్ల నీరు కిందకు వెళుతుంది. –ఎం.రామకృష్ణ, డ్రెయినేజీ డీఈ, కై కలూరు ఏలూరు డిజాస్టర్ రెస్సాన్స్ ఫోర్సు బృందాలను కొల్లేరు పరీవాహక గ్రామాల వద్ద గస్తీకి ఉంచాం. ఎటువంటి విపత్తులు వచ్చిన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో కొల్లేరు అంత ప్రమాదంగా లేదు. డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నాం. – వి.రవికుమార్, రూరల్ సర్కిల్ సీఐ, కై కలూరు సాక్షి ప్రతినిధి, ఏలూరు/కైకలూరు/పోలవరం/కుక్కునూరు: ఓ వైపు గోదావరి ఉధృతం.. మరోవైపు ప్రధాన కాలువల నుంచి కొల్లేరుకు భారీగా వచ్చి చేరుతున్న నీటితో ఏలూరు జిల్లాను వరద చుట్టుముడుతోంది. ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరువలో గోదావరి, కొల్లేరు నీరు చేరడంతో లంక, ముంపు గ్రామాల్లో ఆందోళన నెలకొంది. అల్పపీడన ప్రభావంతో జిల్లాతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి, శబరి నదులతో పాటు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రెండు రోజుల్లో మొత్తంగా 9 లక్షల క్యూసెక్కుల నీరు ఎగువ ప్రాంతాల నుంచి పోలవరం ప్రాజెక్టుకు చేరింది. సోమవారం భద్రాచలం వద్ద 38 అడుగుల మేర నీటిమట్టం చేరింది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే 31.050 మీటర్ల ఎత్తు నుంచి 6,70,355 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. మరో 48 గంటల పాటు వరద ఉధృతి కొనసాగి మంగళవారం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశం ఉంది. గోదావరి, శబరికి ఎగువ నుంచి 15 లక్షలకుపైగా క్యూసెక్కుల నీటి ప్రవా హం కొనసాగుతుందని అంచనా. ముంపు మండలాల్లో.. వేలేరుపాడు మండలంలోని కొయిదా, కట్కూరు, సిద్ధారం, కాచారం, పూసుకుంది, తాళ్ల గొంది,పేరంటపల్లి, టేకుపల్లి, టేకూరు, బుర్రారెడ్డిగూడెం, ఎర్రమెట్ట, ఎడవల్లి, చిట్టం రెడ్డిపాలెం, మరో ఐదు గ్రామాలకు మండల కేంద్రంతో సంబంధాలు తెగి పోయాయి. ఎద్దుల వాగు వంతెన నీట మునగడంతో నాటు పడవ ద్వారా రాకపోకలు కొనసాగిస్తున్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయితే వేలేరుపాడులో పునరావాస శిబిరం ఏర్పాటు చేసి ఐదు గ్రామాల ప్రజలను తరలించడంపై అధికారులు దృష్టి సారించారు. కుక్కునూరులో గుండేటివాగు వంతెన నీటముగింది. పెనుమాకలంకకు రాకపోకలు బంద్ మండవల్లి మండలం పెదఎడ్లగాడి నుంచి పెనుమాకలంక, నందిగామలకం, ఇంగిళిపాకలంక గ్రామాలకు చేరే రహదారిపై మూడు ప్రాంతాల్లో వరద నీరు ప్రవహిస్తోంది. పెదఎడ్లగాడి నుంచి పడవలపై ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. పెనుమాకలంక రహదారి వద్ద ప్రవేశం లేదని పోలీసులు ఫ్లెక్సీ ఏర్పాటుచేశారు. మండవల్లి మండలంలో పులపర్రు, కొవ్వాడలంక, మణుగునూరులంక, తక్కెళ్లపాడు, చింతపాడు గ్రా మాలు, కై కలూరు మండలంలో పందిరిపల్లిగూడెం, కొట్డాడ, శృంగవరప్పాడు, పెంచికలమర్రు గ్రామా లు నీట మునిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గుబులు పుట్టిస్తున్న గుర్రపుడెక్క కొల్లేరుకు చేరే నీటిని సముద్రానికి పంపించే ప్రధా న పెదఎడ్లగాడి వంతెనకు 56 ఖానాలకు గాను 20 ఖానాల్లో గుర్రపుడెక్క పేరుకుపోయింది. పొక్లెయిన్ తో డెక్కను తొలగిస్తున్నారు. గుర్రపుడెక్క పరిష్కారానికి శాశ్వత చర్యలు తీసుకోవాలని కొల్లేరు పరీవాహక ప్రజలు కోరుతున్నారు. డెక్కతో పచ్చటి తివాచీ పరుచుకున్నట్టు కొల్లేరు కనిపిస్తోంది. పెద ఎడ్లగాడి వంతెన వద్ద గుర్రపు డెక్క తొలగింపు పనులు మండవల్లి మండలంలో నీట మునిగిన పెనుమాకలంక రహదారి జిల్లాను చుట్టుముడుతున్న వరద పరవళ్లు తొక్కుతున్న గోదావరి తమ్మిలేరు, బుడమేరు, రామిలేరు నుంచి కొల్లేరులోకి నీరు పెనుమాకలంకకు రాకపోకలు బంద్ వేలేరుపాడులో ముంపులోనే ఎద్దులవాగు వంతెన పోలవరం నుంచి 6.70 లక్షల క్యూసెక్కులు దిగువకు.. -
పెన్షనర్లకు నోటీసులు
దెందులూరు: కొవ్వలిలో 30 మంది పెన్షనర్లకు సోమవారం అధికారులు నోటీసులు జారీ చేశా రు. పెద్ద కళావతి, మన్నే కొండలరావు, పి.అప్పలనాయుడు నోటీసులను విలేకరులకు చూ పించారు. తమకు పెన్షన్ ఒక్కటే ఆధారమని, పెన్షన్ తొలగిస్తే తమ కుటుంబాల పరిస్థితి అధ్వానంగా మారుతుందని వాపోయారు. పెన్షన్ లబ్ధిదారులు ప్రభుత్వానికి సమర్పించిన వైద్య నివేదికలను రీ వెరిఫికేషన్ చేస్తున్నారని, నోటీసులు అందుకున్న లబ్ధిదారులకు ఎవరికై నా ఇబ్బంది కలిగితే ఉన్నతాధికారులకు అప్పీ లు చేసుకోవచ్చని ఎంపీడీఓ కె.శ్రీదేవి తెలిపారు. పోలవరం రూరల్: గ్రామంలోని కృష్ణారావు పేట పీఏసీఎస్ వద్ద సోమవారం యూరియా కోసం రైతులు క్యూకట్టారు. యూరియా కొరతతో ఇబ్బంది పడుతున్నారు. యూరియాతో పాటు కాంప్లెక్స్ ఎరువులను కూడా కొనాలంటూ సొసైటీ సిబ్బంది చెబుతుంటంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి వందలాది మంది ఎదురుచూడగా రైతుకు రెండు బస్తాల చొప్పున యూరియా దొరికింది. ప్రస్తుతం సరఫరా తక్కువ, వాడకం ఎక్కువగా ఉండటంతో యూరియా దొరకడం లేదని తెలుస్తోంది. గూ టాల, పట్టిసీమ, ప్రగడపల్లి పట్టిసీమ సొసైటీలకు 15 టన్నుల యూరియా ఇండెంట్ పెట్టా మని, వచ్చిన వెంటనే పూర్తిస్థాయిలో అందిస్తామని మండల వ్యవసాయ శాఖ అధికారి కె.రాంబాబు తెలిపారు. ఏలూరు టౌన్: జిల్లాలో నూతన బార్ పా లసీ–25లో భాగంగా 18 బార్ల లైసెన్సుల మంజూరుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ జిల్లా అధి కారి ఎ.అవులయ్య తెలి పారు. స్థానిక ఎకై ్సజ్ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన వివరాలు వెల్లడించారు. జిల్లాలోని 18 బార్లకు దరఖాస్తులు స్వీకరిస్తామని, రిజర్వ్ కేటగిరీలో గీత కులాలకు మరో రెండు బార్లకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. ఏలూరులో 11, నూ జివీడులో 4, జంగారెడ్డిగూడెంలో 2, చింతలపూడిలో ఒక బార్కు అనుమతుల వచ్చాయ న్నారు. ఈనెల 26 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, 28న కలెక్టర్ లాటరీ విధానంలో ఎంపిక చేస్తారన్నారు. రిజర్వు కేటగిరీ బార్లకు లాటరీ ఏలూరు(మెట్రో): రిజర్వు కేటగిరీలకు కేటాయించిన బార్లకు సోమవారం కలెక్టర్ కె.వెట్రిసెల్వి లాటరీ తీశారు. జంగారెడ్డిగుడెంలో ఓ బార్ను గౌడ కులానికి, ఏలూరులో ఓ బార్ను శెట్టి బలిజ కులానికి కేటాయించారు. ఎంపీడీఓకు గ్రామస్తుల ఫిర్యాదు ఉంగుటూరు: మండలంలోని రావులపర్రుకు చెందిన జనసేన నేత తాడిశెట్టి శివప్రసాద్ తమను ఇబ్బందులు పెడుతున్నారని గ్రామానికి చెందిన ఆరుగురు వేర్వేరుగా సోమవారం ఎంపీడీఓ రాజ్మనోజ్కు ఫిర్యాదు చేశారు. నాణ్యత లేని ఫిల్టరు బెడ్లు నిర్మించడంతో శుద్ధి కాని నీటితో అనారోగ్యాలు వస్తున్నాయని యడవల్లి రామకృష్ణ ఫిర్యాదు చేశారు. శివప్రసాద్ తన ఇంటి పక్కన మూడు సెంట్ల స్థలాన్ని ఆక్రమించుకున్నారని, డ్రెయినేజీ నీరు బయటకు వదలడంతో ఇబ్బంది పడుతున్నామని దోనాద్రి దానయ్య ఫిర్యాదు చేశారు. గ్రామంలో కమ్యునిటీ హాలుకు ఆనుకున్న ఉన్న సిమెంట్ రోడ్డుపై మరో సిమెంట్ రోడ్డు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని ఇబ్బా పూజారి అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. గ్రామంలో మంచినీటి చెరువు ను ఆనుకుని ఉన్న చెరువు పోరంబోకులో ఇంటిని నిర్మించి డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా ఆక్రమించుకోవడంతో నీరు వెళ్లకు ఇబ్బంది పడుతున్నామని ఇబ్బా నాగేశ్వరరావు ఫిర్యాదు చేశారు. పంచాయతీ రోడ్డును ఆక్రమించుకుని రేకుల షెడ్డు నిర్మించడంతో రాకపోకలకు ఇబ్బంది పడుతున్నామని ఇబ్బా ముత్యాలరావు ఎంపీడీఓకు ఫిర్యాదు చేశారు. -
శ్రీవారి క్షేత్రం.. భక్త జనసంద్రం
ద్వారకాతిరుమల: శ్రీవారి భక్తులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఆదివారం పెద్దఎత్తున ఆలయానికి వచ్చారు. దాంతో క్షేత్ర పరిసరాలు భక్తజనంతో కళకళలాడాయి. దర్శనం క్యూలైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, అనివేటి మండపం, కల్యాణ కట్ట ఇలా అన్ని విభాగాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తుల రద్దీ కొనసాగింది. వరుస సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో వేలాదిగా భక్తులు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించినట్టు దేవస్థానం అధికారులు తెలిపారు. బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన కాపవరం సమీపంలోని అటవీప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఉమ్మడి పశ్చి మ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, మచిలీపట్నం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వాహనాల్లో తరలివచ్చి అమ్మవారికి దూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉదయం నుంచి వర్షం కురుస్తున్నప్పటికీ భక్తులు వర్షంలోనే తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఆలయ కమిటీ వారు, పోలీసులు ప్రత్యేక చర్యలు చేట్టారు. కై కలూరు: కొల్లేటికోట శ్రీపెద్దింటి అమ్మవారిని భక్తులు ఆదివారం భారీఎత్తున దర్శించుకున్నారు. శ్రావణమాసం కావడంతో అనేకమంది భక్తులు వివిధప్రాంతాల నుంచి వచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలతో పాటు కృష్ణాజిల్లాకు చెందిన అనేక ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. ఈ సందర్భంగా లడ్డూ ప్రసాదం, రూమ్ల అద్దె, ఇతర మార్గాల ద్వారా ఆలయానికి రూ.40,405 ఆదాయం సమకూరినట్లు కార్యనిర్వహణాధికారి కూచిపూడి శ్రీనివాస్ తెలిపారు. -
జోరుగా రేషన్ బియ్యం అక్రమ రవాణా
నూజివీడు: రేషన్ బియ్యం అక్రమ రవాణాకు నూజివీడు అడ్డాగా మారింది. రేషన్ మొబైల్ వాహనాలను ఎత్తేసి నెల రోజులు గడిచిందో లేదో రేషన్ బియ్యం అక్రమ రవాణా జోరందుకుంది. మొబైల్ వాహనాల వల్ల రేషన్ బియ్యం అక్రమ రవాణా పెరిగిందని సాకు చూపిస్తూ వాటిని రద్దు చేసిన ప్రభుత్వం ప్రస్తుతం జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాపై నోరు మెదపడం లేదు. నూజివీడు ప్రాంతంలో గత నెలరోజుల వ్యవధిలోనే అక్రమంగా తరలిస్తున్న 118 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని నూజివీడు, ముసునూరు మండలంలో పట్టుకోవడం సంచలనంగా మారింది. జూలై 3వ తేదీన నూజివీడు బైపాస్ రోడ్డులో తరలిస్తున్న 51 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని, 5న నూజివీడు మండలం మొర్సపూడిలో 26 క్వింటాళ్లు, ఆగస్టు 7న ముసునూరు మండలం గుళ్లపూడిలో రేషన్ బియ్యంను అక్రమ రవాణా చేస్తుంటే విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. దీంతో రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం ఎంత పెద్ద ఎత్తున జరుగుతుందో తెలుస్తోంది. పట్టణానికి చెందిన కొందరు వ్యాపారులు, మండలంలోని బత్తులవారిగూడెంకు చెందిన ప్రజాప్రతినిధి భర్త, టీడీపీకి చెందిన కార్యకర్త పెద్ద ఎత్తున బియ్యం అక్రమ వ్యాపారం చేస్తున్నాడు. అలాగే ఆగిరిపల్లికి చెందిన అధికార పార్టీకి చెందిన ఒక రేషన్ డీలరే యథేచ్ఛగా బియ్యం అక్రమ రవాణాను నిర్వహిస్తున్నాడు. అధికార పార్టీకి చెందిన వీరందరూ తమకు అడ్డుకునే వారెవరూ ఉండరనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. తమ అక్రమ వ్యాపారాన్ని మూడు లారీలు.. ఆరు ఆటోలుగా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ప్రతి నెలా పేదలకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని వీరు కొందరు ఏజంట్ల ద్వారా సేకరించి తమ అడ్డాకు చేర్చుకొని అక్కడ నుంచి లోడులు ఎత్తుతున్నారు. కార్డుదారుల వద్ద రూ.10కు కొనుగోలు చేస్తున్న రేషన్ డీలర్లు డీలర్లు కార్డుదారుల వద్ద నుంచి రేషన్ బియ్యాన్ని కిలో రూ.10కు కొనుగోలు చేస్తున్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా లాభాలు ఎక్కువగా ఉండటంతో కొందరు డీలర్లు ఏకంగా కార్డుదారుడి వద్దకే వెళ్లి బయోమెట్రిక్ వేయించుకొని కిలోకు రూ.10 చొప్పున చెల్లించి వెళ్తున్నారు. ఇలా సేకరించిన బియ్యాన్ని డీలర్ల వద్ద నుంచి అక్రమ రేషన్ బియ్యం వ్యాపారులు కిలో రూ.17కు కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఇక్కడ డీలర్కు కిలోకు రూ.7 లాభం వస్తోంది. డీలర్ల వద్ద కొనుగోలు చేసిన బియ్యాన్ని అక్రమార్కులు కాకినాడ పోర్టుకు తరలించే మరొక పెద్ద వ్యాపారికి కిలో రూ.25 నుంచి రూ.27కు విక్రయించి కిలోకు రూ.7 నుంచి రూ.10 కు సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో పట్టుబడి కేసులు పెట్టినా అక్రమ రేషన్ బియ్యం వ్యాపారాన్ని మానకుండా మళ్లీ అదే దందా నడుపుతున్నారు. బియ్యం దందాను అడ్డుకోవాల్సిన అధికారులు మొక్కుబడిగా 6ఏ కేసు పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో బియ్యం మాఫియా యథేచ్ఛగా అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. దందాకు అడ్డాగా మారిన నూజివీడు -
టెంకాయ అ‘ధర’హో
ద్వారకాతిరుమల: కొబ్బరికాయల ధరలు టాపు లేపుతున్నాయి. ఆలయాల వద్ద సైజును బట్టి రూ.25 నుంచి రూ.40కు విక్రయిస్తుండడంతో భక్తులు షాక్ అవుతున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని నిత్యం వేలాది మంది భక్తులు దర్శిస్తారు. అందులో అధిక శాతం మంది భక్తులు ఆలయంలో కొబ్బరికాయలు కొడతారు. అయితే కొబ్బరి కాయల ఉత్పత్తి తగ్గడంతో గత మూడు నెలల క్రితం వాటి ధరలు రెట్టింపయ్యాయి. ప్రస్తుత శ్రావణమాసంలో వివాహాది శుభకార్యాలు జరుపుకునేవారు, ఆలయాల్లో మొక్కులు తీర్చుకునే సాధారణ భక్తులు కొబ్బరికాయలు కొనేందుకు ఇబ్బంది పడుతున్నారు. ధరలు పెరగక ముందు వ్యాపారులు దళారుల వద్ద రూ.10 లకు కొన్న కొబ్బరి కాయను రూ.15కు, రూ.15 కాయను రూ.20 నుంచి రూ.25కు విక్రయించేవారు. ప్రస్తుతం దళారుల వద్ద రూ.20కు కొన్న కాయను రూ.25కు, రూ.25 కాయను రూ.30 నుంచి రూ.40కు అమ్ముతున్నారు. దాదాపు అన్ని ఆలయాల వద్ద ఇదే పరిస్థితి ఉంది. నెలకు 50 వేలకు పైగా విక్రయాలు శ్రీవారి క్షేత్రంలో చిన్నాపెద్దా మొత్తం 15 వరకు కొబ్బరికాయల దుకాణాలు ఉన్నాయి. వాటి ద్వారా వ్యాపారులు నెలకు 50 వేలకు పైగా కొబ్బరి కాయలు విక్రయిస్తారు. అయితే కొబ్బరికాయలు ధరలు బాగా పెరగడంతో గత మూడు నెలల నుంచి విక్రయాలు బాగా తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం శ్రావణమాసం కావడంతో అవసరమైన వారు తప్పక కొబ్బరికాయలు కొంటున్నారు. కొందరు భక్తులైతే కొబ్బరికాయలు కొనకుండా ఆ డబ్బులను స్వామివారి హుండీల్లో వేసి దండం పెట్టుకుంటున్నారు. ఎండు కొబ్బరి, నూనె ధరలకు రెక్కలు కొబ్బరి కాయల ధరలు పెరగడంతో ఎండు కొబ్బరి, నూనె ధరలు సైతం అమాంతం పెరిగాయి. గత మూడు నెలల క్రితం కిలో ఎండు కొబ్బరి రూ.240 పలికితే, ప్రస్తుత మార్కెట్లో రెట్టింపై రూ.400కు చేరింది. కిలో కొబ్బరి నూనె గతంలో రూ.360 కాగా, ప్రస్తుత మార్కెట్లో రూ.500 పలుకుతుండటం విశేషం. కొబ్బరికాయల ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. టాపు లేపుతున్న కొబ్బరికాయ ధర సైజును బట్టి రూ.25 నుంచి రూ.40 వరకు విక్రయాలు శ్రీవారికి మొక్కు చెల్లించేందుకు క్షేత్రానికి వచ్చాను. కొండ కింద చిన్న కొబ్బరికాయను రూ.25కు కొన్నాను. ఆలయం వద్ద ఉన్న దుకాణంలో అడిగితే రూ.30, పెద్ద కాయ రూ.40 చెప్పారు. శివాలయం వద్ద షాపులో రూ.40కు అమ్ముతున్నారు. ఇదేంటని వ్యాపారులను అడిగితే మార్కెట్లో కొబ్బరికాయల ధరలు పెరిగాయని అంటున్నారు. ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. – తమ్మిరెడ్డి కృష్ణ, భక్తుడు, కై కలూరు దళారుల వద్ద మేము చిన్నకాయను రూ.20కు కొంటున్నాము. వాటిని అమ్మడం చాలా కష్టంగా ఉంది. సామాన్య భక్తులు అంత ధర పెట్టి కొనడానికి ఇష్టపడటం లేదు. మొక్కులు తీర్చేవారు మాత్రమే కొబ్బరి కాయలు కొంటున్నారు. పెద్ద కాయ రూ.30 చెబుతుంటే వారు హడలిపోతున్నారు. విపరీతంగా పెరిగిన ధరల వల్ల విక్రయాలు బాగా తగ్గాయి. – యండపల్లి వీరయ్య, కొబ్బరికాయల వ్యాపారి, ద్వారకాతిరుమల -
సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి
తాడేపల్లిగూడెం (టీఓసీ): భవన నిర్మాణ కార్మికులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేశారు. వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరిస్తామని, కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రయోజనాలు తప్పక అందజేస్తామని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. అప్పటి నుంచి నేటి వరకు ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం పైనే అవుతున్నా, ఎన్నికల హామీలు నేటి వరకు అమలు చేయలేదని, ఇబ్బందులలో ఉన్నామని నిర్మాణ రంగ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 60 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులుండగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 5 లక్షల మంది కార్మికులు ఉన్నారు. వెల్ఫేర్ బోర్డులో సభ్యులుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారుగా 1.20 లక్షల మంది నమోదు చేసుకున్నారు. ఒక వైపు పనులు లేకపోవడం, మరో వైపు నిత్యావసర ధరలు, అన్ని రకాల ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపధ్యంలో ఇప్పటికే కార్మికులు ఆవేదనలో ఉన్నారు. దీంతో చేసేది లేక భవన నిర్మాణ కార్మిక సంఘాలు హక్కుల సాధన కోసం పోరుబాట పట్టాయి. ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని, బోర్డును క్రియాశీలం చేసి పటిష్ట పరచాలని, అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని, భవన నిర్మాణ కార్మికుల సొమ్మును భవన కార్మికులకు ఖర్చు పెట్టాలని, బోర్డులో నెంబర్లును నియమించాలని కార్మికులు కోరుతున్నారు. ఆందోళనలు ఉధృతం ఇప్పటికే వార్డు సచివాలయాలు, తహసీల్దార్ కార్యాలయాలు, అసిస్టెంట్ లేబర్ కార్యాలయాలు వద్ద, జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ధర్నాలు నిర్వహించి అధికారులకు సమస్యలు పరిష్కరించాలని వినతులు ఇచ్చారు. రాష్ట్రంలోని అందరు ఎమ్మెల్యేలకు, వెల్ఫేర్ బోర్డు చైర్మన్కు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విన్నవించారు. పోస్టుకార్డుల ఉద్యమం చేపట్టారు. త్వరలో సమస్యల పరిష్కారం చూపుతామని అంటున్నారు తప్ప సమస్యలు తీర్చే పరిస్థితి కానరావడం లేదని నిర్మాణ రంగ కార్మికులు వాపోతున్నారు. కార్మికుల డిమాండ్లు ● భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును క్రియాశీలం చేసి పటిష్ట పరచాలి. ● బోర్డులో కార్మికుల నమోదు ప్రక్రియను సులభతరం చేసేందుకు వార్డు, గ్రామ సచివాలయంలో నమోదు చేయడానికి అవకాశం కల్పించాలి. ● పెండింగ్లో ఉన్న క్లైయిమ్స్ పరిష్కరించాలి, వెల్ఫేరు బోర్డులో నమోదైన కార్మికులకు వెంటనే గుర్తింపు కార్డులు మంజూరు చేయాలి ● వయోభారం లేదా అనారోగ్యం కారణంగా పని నుంచి విరమించుకున్న కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ద్వారా పెన్షన్ మంజూరు చేయాలి ● ప్రమాదాలు వల్ల అనారోగ్యం వల్ల మంచాన పడిన కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ద్వారా ఈఎస్ఐ తరహాలో ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలి. ● భవన నిర్మాణ కార్మికులకు ఐదు రోజులు ఆసుపత్రిలో ఉండాలనే నిబంధన తొలగించాలి. ఆందోళన బాటలో భవన నిర్మాణ కార్మికులు భవన నిర్మాణ కార్మికులకు అందించే ఏకై క విభాగం వెల్ఫేర్ బోర్డు. బోర్డు ప్రస్తుతం అందుబాటులో లేదు. ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరించి, పెండింగ్ క్లైయింలు పరిష్కారం చేస్తామని చెప్పారు. బోర్డును తక్షణమే పునఃప్రారంభించాలి. వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరించకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. – మైలవరపు శ్రీరాంబాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ, జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం అందించాల్సిన సంక్షేమ పథకాలు నిలిచిపోవడంతో కార్మిక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. బోర్డు నిధులను కార్మికుల సంక్షేమానికి, భద్రతకు, బీమాకు ఖర్చుచేయాలి. చేతినిండా పనులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నాం. సంక్షేమాలు అమలు చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తాం. – సింగవరపు సునీల్, ప్రధాన కార్యదర్శి నవాబుపాలెం భవన నిర్మాణ కార్మిక సంఘం -
ఆక్వాకు వాయు‘గండం’
గణపవరం: వాతావరణంలో తీవ్రమైన మార్పులు ఆక్వా సాగుకు గండంగా మారాయి. భారీవర్షాలు, చల్లబడిన వాతావరణం ఆక్వా సాగుకు ప్రతికూలంగా మారింది. ట్రంప్ సుంకాల దెబ్బతో విలవిల్లాడుతున్న రొయ్య రైతులు ప్రస్తుత వాతావరణ మార్పులతో బెంబేలెత్తిపోతున్నారు. వేసవిలో ఆదుకోవాల్సిన రొయ్యసాగు రైతును కుదేలు చేసింది. ఎడాపెడా తెగుళ్లు ఆశించడంతో రొయ్యల చెరువులు ఖాళీ అయ్యాయి. మరోవైపు చేప ధర తగ్గిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇటీవల రొయ్యల ధర ట్రంప్ సుంకాల పెంపుతో పతనమయ్యాయి. చేప ధర కూడా కిలోకు రూ.10 నుంచి రూ.15 వరకూ పడిపోయింది. రెండు నెలలుగా వాతావరణం ఆక్వా సాగుకు ఏమాత్రం కలిసి రావడం లేదు. మే నెలలో అకాల వర్షాలతో పూర్తిగా చల్లబడగా, జూన్లో వాతావరణం వేసవిని తలపించింది. జూలైలో కూడా రెండు వారాల పాటు విపరీతమైన ఎండలు, ఉక్కబోతతో వేసవిని మించిన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వారం రోజులుగా వాతావరణం చల్లబడింది. పూటకో రకంగా మారుతున్న వాతావరణం వల్ల ఆక్సిజన్ సమస్య తలెత్తుతుంది. చేపలు, రొయ్యలకు సరిపడ ఆక్సిజన్ అందకపోవడంతో నీటి ఉపరితలంపై తిరుగాడుతూ నీరసించిపోతున్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి రైతులు నిరంతరం ఏరియేటర్లు తిప్పుతున్నారు. తెగుళ్ల బారిన చేపలు, రొయ్యలు చెరువులలో ఆక్సిజన్ లోటు పూడ్చడానికి రసాయనాలు చల్లుతున్నారు. రెండు రోజులుగా వాతావరణం పూర్తిగా చల్లబడి, ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోయి చేపలు, రొయ్యలు తెగుళ్ల బారిన పడుతున్నాయి. దీంతో మేతలు సరిగా తినలేక నీరసించి పోతుండటంతో రైతులు చేపలు, రొయ్యలు అర్ధంతరంగా పట్టేసి అయినకాడికి అమ్ముకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 1.25 లక్షల ఎకరాలలో రొయ్య, మరో 1.50 లక్షల ఎకరాలలో చేపల సాగు జరుగుతుంది. వాతావరణం ప్రతికూలంగా మారడంతో రొయ్యలకు వైరస్ వ్యాధులు, చేపలకు మొప్పతెగులు వంటివి సోకుతుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుత పరిస్థితిలో రొయ్య రైతులు నష్టపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఆక్సిజన్ అందక చేపలు, రొయ్యలు ఉక్కిరిబిక్కిరి -
పెన్షనర్లపై ప్రభుత్వం చిన్నచూపు
భీమవరం: రిటైర్డ్ ఉద్యోగులు, కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్న్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే సత్తిరాజు ఆరోపించారు. ఆదివారం స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో టి.గంగరాజు అధ్యక్షతన జరిగిన జిల్లా సదస్సులో మాట్లాడుతూ పెన్షనర్లు తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రతి సంవత్సరం వడ్డీ కింద రూ.54 వేల కోట్లు వస్తుంటే కేవలం రూ.14 వేల కోట్ల రూపాయలతో పెన్షన్లు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం రిటైర్డ్ ఉద్యోగులు, కార్మికుల్ని మోసం చేయడమేనని ఆయన వివరించారు. రిటైర్డ్ ఉద్యోగులకు డీఏ ఇతర సౌకర్యాన్ని ఆపాలని నిర్ణయం తీసుకోవడం దారుణమని విమర్శించారు. ఈపీఎఫ్ పెన్షన్దారులకు కనీసం రూ.9000 పెన్షన్ ఉండాలని దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం నీరెత్తినట్టుగా ఉండడం పాలకుల విధానాలను తెలియజేస్తుందని ఆరోపించారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంటే పాలకులు విస్మరించడం తగదని పేర్కొన్నారు. పెన్షనర్స్ సమస్యలపై ఈ నెల 25న కలెక్టరేట్ల వద్ద జరిగే నిరసన కార్యక్రమాన్ని, సెప్టెంబర్ 13న విజయవాడలో జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. -
●బండి కాదు.. మొండి
ఆర్టీసీ బస్సులు ఎక్కడపడితే అక్కడ ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరు వెళ్తున్న ప్యాసింజర్ బస్సు కామవరపుకోట మండలం కొత్తూరు బస్టాండ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక్కసారిగా ఆగిపోయింది. ప్రభుత్వం ఉచిత బస్సు అంటూ కాలం చెల్లిన బస్సులు తిప్పడమేంటని మహిళలు విమర్శిస్తున్నారు. ప్రయాణికులు ఎంత తోసినా బస్సు ముందుకు కదలకపోవడంతో చేసేది లేక, అక్కడే వదిలిపెట్టి, ప్రయాణికులను వేరే బస్సులో పంపించారు. – కామవరపుకోట -
పశ్చిమాన అందాల కోన
బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో అటవీ ప్రకృతి అందాలు చూపరులను కనువిందు చేస్తున్నాయి. అరకు అందాలకు ఏ మాత్రం తీసిపోకుండా ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. చెట్ల లేలేత పచ్చదనం.. పక్షుల కిలకిలరావాలు ఇక్కడ నిత్యం వసంతాన్ని తలపిస్తాయి. కొండ వాగుల నీటి ప్రవాహాలు, ప్రకృతి వడిలో జలపాతాల హోయలు ప్రకృతి ప్రేమికుల హృదయాల్లో చిరు సవ్వడి చేస్తాయి. బుట్టాయగూడెం మండంలోని పులిరామన్నగూడెం నుంచి గోగుమిల్లి, గిన్నెపల్లి, గడ్డపల్లి, దారావాడ, చిలకలూరు మారుమూల అటవీ ప్రాంతంలో గల గ్రామాలు, ఆయా గ్రామాలకు వెళ్లే ప్రయాణంలో ప్రకృతి అందాలు ఎంతో కనువిందు చేస్తాయి. ప్రస్తుతం ఈ గ్రామాలకు సరైన రహదారి లేదు. ద్విచక్రవాహనాలు మాత్రం ప్రయాణించే సమయంలో రోడ్డుకు ఇరువైపులా పొడవైన పచ్చని చెట్లు, ఎత్తయిన కొండలు మైమరపింపజేస్తాయి. దట్టమైన అటవీప్రాంతంలో సెలయేర్లు, కనువిందుచేసే వాగులు, ఆహ్లాదాన్ని పంచే జలపాతాలు అణువణువు అందం తొణికిసలాడుతుంది. అలాగే గుబ్బల మంగమ్మ గుడి దర్శనం కూడా ఎంతో అనుభూతిని కలిగిస్తుంది. ఈ ప్రాంతాలను అభివృద్ధి చేస్తే అరకు అందాలకు ఏ మాత్రం తీసిపోదు. -
పెరుగుతున్న గోదావరి ఉధృతి
ఏలూరు(మెట్రో): గోదావరి వరద నేపథ్యంలో ఏలూరు కలెక్టరేట్లో 1800–233–1077, 94910 41419 ఫోన్ నెంబర్లతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. గోదావరి వరద పెరుగుతున్న దృష్ట్యా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు నదిలోకి వెళ్లడం గాని, ఈతకు వెళ్లడం గాని, చేపలు పట్టడం గాని చేయవద్దన్నారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఏలూరు జిల్లాలో ఈనెల 18న ప్రజా ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ కార్యక్రమం రద్దు చేశామని జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. తమ్మిలేరులో పెరుగుతున్న నీటిమట్టం చింతలపూడి: జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టుల్లో ఒకటైన తమ్మిలేరు జలాశయంలో నీటిమట్టం పెరుగుతోంది. ఎగువ ప్రాంతమైన తెలంగాణాలో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఏలూరు జిల్లాలో వర్షాలకు తమ్మిలేరుకు వరద నీరు వచ్చి చేరింది. ప్రసుత్తం ఎగువ ఆంధ్రా కాల్వ ద్వారా గంటకు 579 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. తమ్మిలేరు ప్రాజెక్టులో ప్రస్తుతం 339 అడుగుల మేర నీటి మట్టం ఉందని తమ్మిలేరు ఇరిగేషన్ ఇన్చార్జ్ ఏఈ లాజర్ బాబు ఆదివారం తెలిపారు. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 355 అడుగులు. 348 అడుగులకు చేరుకోగానే అధికారులు కాల్వల ద్వారా సాగునీరు విడుదల చేస్తారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 3 టీఎంసీలు. నిలిచిన రాకపోకలు చాట్రాయి: తమ్మిలేరు వాగుకు వరద వచ్చినపడుల్లా రాకపోకలు నిచిపోతున్నాయి. మండలంలోని తమ్మిలేరు వాగు పరిధిలో కోటపాడు–చింతలపూడి మండలం పోతునూరు, చీపురుగూడెం–అగ్రహారం, మర్లపాలెం–యడవల్లి గ్రామాల మద్య తమ్మిలేరు వాగుపై వంతెన సౌకర్యం లేకపోవడంతో వాగుకి వరద వచ్చినపుడల్లా రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఈ గ్రామాల వారికి ఇరు వైపుల వ్యవసాయ భూములు ఉండడంతో ఇబ్బంది పడుతున్నారు. చీపురుగూడెం గ్రామస్తులకు చింతలపూడి కూత వేటు దూరంలో ఉండడంతో ఆస్పత్రికి వెళ్లాలన్నా, నిత్యావసర సరుకులు, రకరకాల పనులకు చింతలపూడి వెళ్లాల్సిన పరిస్థితి. నాలుగు రోజల నుంచి వాగుకు వరద వస్తుండడంతో వ్యవసాయ పనులు నిలిచిపోయాయని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికై నా తమ్మిలేరు వాగుపై వంతెనలు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. మళ్లీ గోదావరికి వరద వేలేరుపాడు: భద్రాచలం వద్ద గోదారి వరద నీటిమట్టం 33 అడుగులకు పెరగడంతో వేలేరుపాడు మండలంలోని ఎద్దుల వాగు వంతెన ఆదివారం నీట మునిగింది. దీంతో దిగువ ప్రాంతంలోని 18 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలోని కోయిదా, కట్కూరు, సిద్ధారం, కాచారం, పూసుకుంది, తాళ్ల గొంది, పేరంటపల్లి, టేకుపల్లి, టేకూరు, బుర్రెడ్డిగూడెం, యర్రమెట్ట, యడవల్లి, చిట్టంరెడ్డిపాలెం, మరో ఐదు గ్రామాలకు మండల కేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి. ఎద్దెల వాగు వద్ద అధికారులు నాటు పడవ ఏర్పాటు చేశారు. -
గుగాంపునకు మెర్లిన్ అవార్డు
పెనుగొండ: అంతర్జాతీయ ఇంద్రజాలికుడు గుగాంపునకు ప్రతిష్టాత్మకమైన అమెరికన్ మెర్లిన్ అవార్డు వరించింది. ఈ మేరకు డాక్టర్ గుగాంపు వివరాలు వెల్లడించారు. అమెరికాలోని లాస్ వెగాస్లో ఆగస్టు 7న జరిగిన కార్యక్రమంలో మెర్లిన్ అవార్డును అందుకున్నట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా దేశవిదేశాల నుంచి ఈ అవార్డుకు 37 మంది అంతర్జాతీయ ఇంద్రజాలికులు ఎంపికయ్యారని తెలిపారు. 2016లో మొదటిసారి ఈ అవార్డు తీసుకున్నట్లు తెలిపారు. ఏలూరు (ఆర్ఆర్పేట): నిబంధనలకు విరుద్ధంగా పెదవేగి మండలం రామచంద్రపురం జెడ్పీ పాఠశాలలో ఉపాధ్యాయుడిని డిప్యుటేషన్పై పెదవేగి పాఠశాలకు పంపిన ఎంఈఓ–1పై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ 1938 అకడమిక్ కమిటీ కన్వీనర్ గుగ్గులోతు కృష్ణ, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రామ్మోహన్ రావు, మోహన్ రావు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రామచంద్రపురం పాఠశాలలో 100 మంది విద్యార్థులకు సోషల్ బోధించే ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆదేశాలు ఇచ్చిన విద్యాశాఖ అధికారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఏలూరు(మెట్రో): రైతులకు ఎరువులు విక్రయించిన తరువాత ఆ వివరాలను ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో నమోదు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ బాషా అన్నారు. ఆదివారం జిల్లాలోని పెదవేగి, కామవరపుకోట మండలాల్లో ఎరువుల షాపులను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డీలర్లు రైతులకు యూరియా, ఇతర ఎరువులను విక్రయించిన తక్షణమే ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో రైతు ఆధార్ సహాయంతో ఈ–పోస్ నందు నమోదు చేయాలన్నారు. డీలర్లు ఎరువులను విక్రయించిన తర్వాత ఆ వివరాలను నమోదు చేయకపోవడం వల్ల జిల్లాకు ఎరువులు కేటాయింపులో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. పోర్టల్లో నమోదు చేయని పక్షంలో డీలర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏలూరు(మెట్రో): జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశం ఏలూరు జిల్లా ఇన్చార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ఈ నెల 18న మధ్యాహ్నం 3.30 గంటలకు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జరగనుంది. సమావేశంలో వ్యవసాయం, ఉద్యానవన, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్ పెండింగ్ పనులు, పౌరసరఫరాలు, సీ్త్ర శక్తి పథకం, గోదావరి వరద రిలీఫ్ ఆపరేషన్స్ తదితర అంశాలపై సమీక్షిస్తారు. -
రోడ్డు ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ మృతి
కొయ్యలగూడెం: కొయ్యలగూడెం– జంగారెడ్డిగూడెం జాతీయ ప్రధాన రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ లారీ డ్రైవర్, క్లీనర్ మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పాలకొల్లు నుంచి తెలంగాణ రాష్ట్రం బైసంకి వెళుతుండగా పవర్ గ్రిడ్ వద్దకు వచ్చేసరికి కొబ్బరికాయల లోడు ఒక వైపునకు ఒరిగింది. దీంతో డ్రైవర్ నవ్వుండ్రి రాజేష్ (30), తొడ దాసి లక్ష్మణరావు (35) లారీని రోడ్డు మార్జిన్ వైపునకు ఆపి లోడును సరి చేస్తుండగా కలకత్తా నుంచి హైదరాబాదు వెళుతున్న మరో లారీ మితిమీరిన వేగంతో వచ్చి ఢీకొట్టింది. దీంతో డ్రైవర్, క్లీనర్ల మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఛిద్రం అయ్యాయి. మృతుల బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వి చంద్రశేఖర్ తెలిపారు. దెందులూరు: ద్విచక్రవాహనంపై వెళుతుండగా ప్రమాదవశాత్తూ ఓ మహిళ జారి పడిపోవడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాల ప్రకారం ఆదివారం ద్విచక్రవాహనంపై ఏలూరు వైపు భార్యభర్తలు వెళుతుండగా జాతీయ రహదారిపై కొవ్వలి వద్దకు వచ్చేసరికి ద్విచక్రవాహనం నుంచి మహిళ ప్రమాదవశాత్తూ పడిపోవడంతో గాయాలపాలైంది. అంబులెన్స్కు ఫోన్ చేసినా సకాలంలో రాకపోవడంతో వారిని ఆశ్రమ వైద్యశాలకు తరలించి వైద్య సేవలు అందించినట్లు దెందులూరు ఎస్సై ఆర్ శివాజీ తెలిపారు. యలమంచిలి: అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం గ్రామానికి చెందిన గోకవరపు కృష్ణ (32) అదృశ్యంపై అతని సోదరుడు నాగ ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ శాంసన్రాజు తెలిపారు. కృష్ణ ఒక ప్రైవేట్ కంపెనీలో చిరుద్యోగి. కృష్ణాష్టమి పండుగ సందర్భంగా శనివారం రాత్రి ఉట్టి వేడుక చూడడానికి ఇంటి నుంచి బయటకు వచ్చాడు. రాత్రి ఇంటికి వెళ్లకపోవడంతో సోమవారం ఉదయం నుంచి గాలిస్తుండగా కృష్ణ బైక్, చెప్పులు చించినాడ వంతెనపై కనిపించాయి. దీంతో అతడి అన్న నాగ ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి కృష్ణ కోసం గోదావరిలో గాలిస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ శాంసన్రాజు తెలిపారు. -
రన్నరప్గా బాలుర బాస్కెట్బాల్ జట్టు
ఏలూరు రూరల్: రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ చాంపియన్షిప్ పోటీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బాలుర జట్టు ద్వితీయస్థానంలో నిలిచింది. ఈ నెల 14వ తేదీ నుంచి 17 వరకూ పిఠాపురంలో ఓబీసీ హైస్కూల్ గ్రౌండ్లో 10వ రాష్ట్రస్థాయి బాలబాలికల జూనియర్ బాస్కెట్బాల్ చాంపియన్షిప్ పోటీలు జరిగాయి. లీగ్ దశలో జిల్లా బాలురు జట్టు శ్రీకాకుళం జట్టుపై 25–08, విజయనగరంపై 31–11, కర్నూల్పై 58–45, గుంటూరుపై 47–31 స్కోర్ తేడాతో గెలిచి సెమీఫైనల్కు చేరింది. ఆదివారం వర్షం కురవడంతో మ్యాచ్లు జరగలేదు. దీంతో నిర్వాహకులు పూర్తిస్థాయి మ్యాచ్కు బదులుగా 5 ఫ్రీ త్రో బాస్కెట్స్ నిర్వహించి విజేతలను ప్రకటించారు. ఇందులో జిల్లా బాలుర జట్టు సెమీఫైనల్లో కృష్ణ జట్టుతో తలపడి 3–2 స్కోర్తో గెలిచింది. తర్వాత ఫైనల్లో అనంతపురం జట్టు చేతిలో 3–4 స్కోర్తో ఓటమి పాలై రన్నరప్గా నిలిచింది. అసోసియేషన్ సభ్యులు కృష్ణారెడ్డి, గవ్వ శ్రీనివాసరావు, కె మురళీకృష్ణ జట్టును అభినందించారు. బాలికల జట్టు లీగ్ దశలో ప్రకాశంపై 32–02, చిత్తూరుపై 39–13 స్కోర్తో గెలిచి, క్వార్టర్ఫైనల్లో విశాఖ జట్టు చేతిలో 57–48 స్కోర్తో ఓడి తిరుగుముఖం పట్టింది. క్వార్టర్ ఫైనల్లో ఓడిన బాలికల జట్టు -
ఎరువుల షాపుల్లో తనిఖీలు
కామవరపుకోట: వ్యవసాయ శాఖ జిల్లా అధికారి షేక్ హబీబ్ బాషా కాపువరపుకోట మండలంలో ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు దుకాణాల్లో ఎరువుల నిల్వల్లో తేడాలున్నట్లు గుర్తించారు. కామవరపుకోటలోని కొండూరు రామ్మోహనరావు ఎరువుల దుకాణం వద్ద రూ.2,56,471 విలువచేసే 5 టన్నుల ఎరువులు, కొండూరు నాగేశ్వరరావు ఎరువుల షాపు వద్ద రూ.3,73,168 విలువచేసే 26.850 టన్నులు, శ్రీ సూర్య ఆగ్రోస్ షాప్లో రూ.20 వేలు విలువ చేసే 2 టన్నుల ఎరువుల నిల్వల్లో వ్యత్యాసాలు ఉండడంతో వాటి విక్రయాలను నిలుపుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ప్రైవేటు డీలర్ల వద్ద యూరియా 98 మెట్రిక్ టన్నులు, సొసైటీల వద్ద 37.5 టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని, కావలసిన రైతులు అవసరం మేరకు వ్యవసాయంలో వినియోగించుకోవాలన్నారు. డీలర్లు ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో చింతలపూడి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు వై. సుబ్బారావు, మండల వ్యవసాయ అధికారి డి.ముత్యాలరావు పాల్గొన్నారు. -
పెద్ద పులులను సైతం హడలెత్తించే కుక్కలు..!
పశ్చిమ గోదావరి జిల్లా: అరుదైన జంతు జాలానికి నిలయమైన పాపికొండల అభయారణ్యంలో క్రూర జంతువులైన అడవి కుక్కలు (వైల్డ్ డాగ్స్) గుంపులుగా సంచరిస్తున్నాయి. ఇవి అటవీ ప్రాంతంలోని అనేక జంతువులను వేటాడుతుంటాయి. పులిని సైతం అడవి కుక్కలు భయపెట్టగలవని చెబుతుంటారు. అడవి కుక్కలు సంచరించే ప్రదేశాల్లో పులులు కూడా సంచరించవని.. వాటి ఉనికిని కనిపెట్టి తప్పించుకుని తిరుగుతాయని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. పరిమాణంలో ఊరకుక్కల కంటే కొంచెం పెద్దవిగా ఉండే వైల్డ్డాగ్స్ వాటి కంటే బరువు, శక్తి కలిగిన పెద్ద పులులను సైతం సమూహ శక్తితో తరిమికొట్టగలవు. అడవిలో సంచరించే అడవి పందిని ఈ వైల్డ్డాగ్స్ చిటికెలో వేటాడి ఆహారంగా మార్చుకుంటాయి. వాటి బరువుతో పోల్చుకుంటే ఎన్నో రెట్లు పెద్దవైన కణితి(సాంబార్ డీర్), మనిమేగం లాంటి పెద్ద జింక జాతి జంతువులను కూడా ఈ అడవి కుక్కల సమూహం వెంటాడి వేటాడతాయి. ఈ వైల్డ్డాగ్ గుంపులు ఒకే ప్రదేశంలో స్థిరంగా ఉండకుండా నిరంతరం వేర్వేరు ప్రాంతాలకు తిరుగుతూనే ఉంటాయి. ఇవి ఊర కుక్కల కంటే కాస్త పెద్దవిగా ఉంటాయి. వీటి తోకకు వెంట్రుకలు కుచ్చుగా ఉంటాయి. ఇవి యూరప్ దేశాల్లో నల్ల మచ్చలతో కనిపిస్తాయి. అభయారణ్యాల్లో అధికంగా సంచారం అభయారణ్యాలుగా ఉన్న పాపికొండలు, నాగార్జున సాగర్, శ్రీశైలం అభయారణ్యం, గుండ్ల బ్రహ్మేశ్వరం అభయారణ్యంలో అడవి కుక్కల సంచారం ఎక్కువగా ఉందని వైల్డ్లైఫ్ అధికారులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో కూడా అడవి కుక్కల సంచారం అధికంగా ఉన్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. పాపికొండల అభయారణ్యంలో సుమారు 200 కుక్కలకు పైగా గుంపులుగా సంచరిస్తున్నట్లు గుర్తించామని ప్రస్తుతం వాటి జాడ అల్లూరి సీతారామరాజు అటవీ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో గ్రామాలు ఖాళీ అవుతున్న నేపద్యంలో ఇవి స్వేచ్ఛగా సంచరించడానికి మరింత అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సమతుల్యతకు ప్రధాన భూమిక వైల్డ్ డాగ్స్ జీవావరణ సమతుల్యతలో ప్రధాన భూమిక పోషిస్తుంటాయి. మాంసాహార జంతువులైన చిరుత పులి, పెద్దపులి, అడవి కుక్కల సంఖ్య తగ్గిపోతే వాటి ఆహార జంతువులైన వివిధ జంతువులు, జింకల సంఖ్య అమాంతంగా పెరిగి అడవిలోని వృక్షాలు తగ్గిపోతాయి. రైతులకు ఇబ్బంది కలిగించే అడవి పందులు, జింకల సంఖ్య పెరుగుదల ప్రమాదకరంగా మారకుండా నియంత్రణలో ఈ అడవి కుక్కలు ప్రధాన భూమిక పోషిస్తాయని అధికారులు అంటున్నారు. -
శ్రీవారి భక్తులకు ‘సెల్’ కష్టాలు
ద్వారకాతిరుమల: దైవ దర్శనార్ధం ఏదైనా ఆలయానికి వెళ్లినప్పుడు దేవుడి దర్శనం కోసం క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండటం సహజం. కానీ ద్వారకాతిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు తమ సెల్ఫోన్లను డిపాజిట్ కౌంటర్లో భద్రపరచుకునేందుకు గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉండాల్సి వస్తోంది. ఇదంతా ఒక ఎత్తయితే కౌంటర్లో ఇచ్చిన ఫోన్లు భద్రంగా ఉన్నాయో లేదోనన్న ఆందోళన భక్తులను వెంటాడుతోంది. వివరాల్లోకి వెళితే.. శ్రీవారి దర్శనం నిమిత్తం ఆలయంలోకి వెళ్లే భక్తులు ముందుగా తమ సెల్ఫోన్లను వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద ఉన్న సెల్ఫోన్ డిపాజిట్ కౌంటర్లో అప్పగించాలి. భద్రపరచినందుకు ఒక్కో ఫోన్కు రూ.5 వసూలు చేస్తారు. శుక్రవారం వరకు ఒక కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో నడిచిన ఈ కౌంటర్ నిర్వహణ బాధ్యతను, శనివారం నుంచి దేవస్థానమే స్వయంగా చేపట్టింది. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన ఆరుగురు సిబ్బంది భక్తుల సెల్ఫోన్లను భద్రపరిచారు. ఇదిలా ఉంటే ఒక భక్తుడు తన రూ.1.50 లక్షలు విలువ చేసే సెల్ ఫోన్ పగిలిపోయిందని, దానికి సమాధానం చెప్పాలని గొడవ చేశాడు. సీసీ కెమెరాలను పరిశీలించిన అధికారులు సెల్ఫోన్ తమ వద్ద డ్యామేజ్ కాలేదని చెప్పారు. దాంతో ఆ భక్తుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సెల్ఫోన్ కౌంటర్ నిర్వహణకు రెండు నెలల క్రితం దేవస్థానం బహిరంగ వేలం నిర్వహించగా, ఒక కాంట్రాక్టర్ ఏడాదికి రూ.కోటి 20 లక్షలు దేవస్థానానికి చెల్లించేలా పాటను దక్కించుకున్నాడు. కౌంటర్ ప్రారంభించకుండానే చేతులెత్తేశాడు. దాంతో ఆ కాంట్రాక్టర్ పాట సమయంలో డిపాజిట్ చేసిన రూ.5 లక్షలను అధికారులు దేవస్థానం అకౌంట్కు జమ చేశారు. ఇదిలా ఉంటే మళ్లీ పాట నిర్వహించే వరకు కౌంటర్ నిర్వహణ బాధ్యతను చేబోలు రాజేష్ అనే కాంట్రాక్టర్కు అప్పగించారు. అతడు నష్టం వస్తోందని వదిలేశాడు. దాంతో భక్తుల సౌకర్యార్ధం, భద్రతా దృష్ట్యా ఆలయంలోకి సెల్ఫోన్లు అనుమతించ కూడదని దేవస్థానమే స్వయంగా ఈ సెల్ఫోన్లు భద్రపరిచే పనిని చేపట్టింది. అనుభవం లేక.. సిబ్బంది చాలక సెల్ ఫోన్ కౌంటర్ నిర్వహణలో దేవస్థానం సిబ్బందికి అనుభవం లేదు. శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో సిబ్బంది కూడా చాల్లేదని తెలుస్తోంది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక కంప్యూటర్ మీదే టికెట్లు కొట్టారు. ఆ తరువాత రెండో కంప్యూటర్ను ఏర్పాటు చేశారు. ఈ సమస్యల వల్ల భక్తులు గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండాల్సి వచ్చింది. స్వామివారి దర్శనానికి కంటే సెల్ఫోన్ భద్రపరచుకోవడానికే ఎక్కువ సమయం పట్టిందని భక్తులు వాపోయారు. కార్లలో దర్శనానికి వచ్చిన భక్తులు తమ ఫోన్లను వారి వాహనాల్లోనే వదిలేశారు. బైక్లపై వచ్చిన వారు క్యూలైన్లలో నిలబడక తప్పలేదు. సెల్ఫోన్లు భద్రపరిచేందుకు కౌంటర్ వద్ద క్యూ గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి కాంట్రాక్టర్లు చేతులెత్తేయడంతో దేవస్థానమే స్వయంగా చేపట్టిన వైనం అనుభవం లేక.. సిబ్బంది చాలక సమస్యలు -
పాపికొండల్లో వైల్డ్ డాగ్స్
బుట్టాయగూడెం: అరుదైన జంతు జాలానికి నిలయమైన పాపికొండల అభయారణ్యంలో క్రూర జంతువులైన అడవి కుక్కలు (వైల్డ్ డాగ్స్) గుంపులుగా సంచరిస్తున్నాయి. ఇవి అటవీ ప్రాంతంలోని అనేక జంతువులను వేటాడుతుంటాయి. పులిని సైతం అడవి కుక్కలు భయపెట్టగలవని చెబుతుంటారు. అడవి కుక్కలు సంచరించే ప్రదేశాల్లో పులులు కూడా సంచరించవని.. వాటి ఉనికిని కనిపెట్టి తప్పించుకుని తిరుగుతాయని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. పరిమాణంలో ఊరకుక్కల కంటే కొంచెం పెద్దవిగా ఉండే వైల్డ్డాగ్స్ వాటి కంటే బరువు, శక్తి కలిగిన పెద్ద పులులను సైతం సమూహ శక్తితో తరిమికొట్టగలవు. అడవిలో సంచరించే అడవి పందిని ఈ వైల్డ్డాగ్స్ చిటికెలో వేటాడి ఆహారంగా మార్చుకుంటాయి. వాటి బరువుతో పోల్చుకుంటే ఎన్నో రెట్లు పెద్దవైన కణితి(సాంబార్ డీర్), మనిమేగం లాంటి పెద్ద జింక జాతి జంతువులను కూడా ఈ అడవి కుక్కల సమూహం వెంటాడి వేటాడతాయి. ఈ వైల్డ్డాగ్ గుంపులు ఒకే ప్రదేశంలో స్థిరంగా ఉండకుండా నిరంతరం వేర్వేరు ప్రాంతాలకు తిరుగుతూనే ఉంటాయి. ఇవి ఊర కుక్కల కంటే కాస్త పెద్దవిగా ఉంటాయి. వీటి తోకకు వెంట్రుకలు కుచ్చుగా ఉంటాయి. ఇవి యూరప్ దేశాల్లో నల్ల మచ్చలతో కనిపిస్తాయి. అభయారణ్యాల్లో అధికంగా సంచారం అభయారణ్యాలుగా ఉన్న పాపికొండలు, నాగార్జున సాగర్, శ్రీశైలం అభయారణ్యం, గుండ్ల బ్రహ్మేశ్వరం అభయారణ్యంలో అడవి కుక్కల సంచారం ఎక్కువగా ఉందని వైల్డ్లైఫ్ అధికారులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో కూడా అడవి కుక్కల సంచారం అధికంగా ఉన్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. పాపికొండల అభయారణ్యంలో సుమారు 200 కుక్కలకు పైగా గుంపులుగా సంచరిస్తున్నట్లు గుర్తించామని ప్రస్తుతం వాటి జాడ అల్లూరి సీతారామరాజు అటవీ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో గ్రామాలు ఖాళీ అవుతున్న నేపద్యంలో ఇవి స్వేచ్ఛగా సంచరించడానికి మరింత అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సమతుల్యతకు ప్రధాన భూమిక వైల్డ్ డాగ్స్ జీవావరణ సమతుల్యతలో ప్రధాన భూమిక పోషిస్తుంటాయి. మాంసాహార జంతువులైన చిరుత పులి, పెద్దపులి, అడవి కుక్కల సంఖ్య తగ్గిపోతే వాటి ఆహార జంతువులైన వివిధ జంతువులు, జింకల సంఖ్య అమాంతంగా పెరిగి అడవిలోని వృక్షాలు తగ్గిపోతాయి. రైతులకు ఇబ్బంది కలిగించే అడవి పందులు, జింకల సంఖ్య పెరుగుదల ప్రమాదకరంగా మారకుండా నియంత్రణలో ఈ అడవి కుక్కలు ప్రధాన భూమిక పోషిస్తాయని అధికారులు అంటున్నారు. అడవిలో సంచరించే వైల్డ్ డాగ్స్ పెద్ద పులులను సైతం ఎదిరించే ధైర్యం ఈ కుక్కల సొంతం ఆహారం కోసం నిరంతరం సంచారం -
గంజాయి తరలిస్తున్న నలుగురి అరెస్టు
భీమడోలు: గంజాయిని తరలిస్తున్న నలుగురు యువకులను భీమడోలు పోలీసులు అరెస్ట్ చేశారు. భీమడోలు సీఐ యూజే విల్సన్ శనివారం కేసు వివరాలను వెల్లడిస్తూ.. శుక్రవారం సాయంత్రం ద్వారకాతిరుమల నుంచి భీమడోలు వైపుగా వస్తున్న వాహనాలను భీమడోలు పోలీసులు తనిఖీ చేస్తున్నారన్నారు. రెండు బైక్లపై ఉంగుటూరు మండలం చేబ్రోలుకు చెందిన మోటూకూరి శామ్యూల్, కై కరానికి చెందిన దొడ్డి లక్ష్మీనారాయణలు, తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పుల్లలపాడుకు చెందిన దిరిసిపాము నిషాంత్, ముసళ్లకుంటకు చెందిన చీర రవిబాబు అనుమానాస్పద స్థితిలో పారిపోతుండగా పోలీసులు పట్టుకుని తనిఖీలు చేశారు. వారి నుంచి రూ. 40 వేల విలువ గల 2.13 కిలోల గంజాయిని పట్టుకున్నారు. రెండు బైక్లు, నాలుగు సెల్ఫోన్లను స్వానం చేసుకుని వారిని అరెస్ట్ చేసారు. వారిని భీమడోలు సివిల్ కోర్టులో హాజరుపర్చగా నిందితులకు రిమాండ్ విధించినట్లు సీఐ పేర్కొన్నారు. నిందితులంతా 19 నుంచి 23 ఏళ్ల లోపు వారేనని సీఐ తెలిపారు. కొయ్యలగూడెం: జేసీబీ డ్రైవర్ నిర్లక్ష్యం కార్మికుడిని బలి తీసుకుంది. ఎస్సై వి.చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం లచ్చూ సింగ్ (42) జేసీబీ కన్వేయర్ గేర్ బాక్స్లో చిక్కుకుని శనివారం ప్రాణాలు కోల్పోఓయాడు. మధ్యప్రదేశ్కు చెందిన లచ్చూ సింగ్ మరో ఇద్దరితో కలిసి గత ఏప్రిల్లో వలస కార్మికులుగా వచ్చి గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు చేస్తున్నారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పనులు నిర్వహిస్తుండగా జేసీబీ రిపేరుకు గురైంది. దీంతో వినోద్ అనే మరొక వ్యక్తితో కలిసి గేర్ బాక్స్ సరి చేస్తున్న సమయంలో జేసీబీ డ్రైవర్ నిర్లక్ష్యంగా ముందుకు నడిపాడు. దీనిని గమనించిన మరొక వ్యక్తి వినోద్ దూకి ప్రాణాలను రక్షించుకోగా లచ్చూ సింగ్ జెసీబీకి, గేర్ బాక్స్ కి మధ్య చిక్కుకుపోయి గాయపడ్డాడు. క్షతగాత్రుడిని గోపాలపురం ప్రభుత్వ హాస్పిటల్కి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఉధృతంగా వరద గోదావరి
ఆదివారం శ్రీ 17 శ్రీ ఆగస్టు శ్రీ 2025సాక్షి ప్రతినిధి, ఏలూరు: గోదావరిలో మళ్లీ వరద మొదలైంది. ఈ సీజన్లో ముచ్చటగా మూడోసారి వరద తీవ్రత ప్రారంభమై నదిలో ఉధృతంగా ప్ర వహిస్తోంది. ఎగువ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలతో గోదావరి, శబరి నదులు రెండు రోజుల నుంచి ఉధృతంగా మారాయి. శనివారం పోలవరం ప్రాజెక్టు నుంచి 4.31 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. మరో మూడు రోజులపాటు వరద ఉధృతి కొనసాగే అవకాశం ఉంది. భద్రాచలం వద్ద 29.80 అడుగులు భద్రాచలం వద్ద శనివారం 29.80 అడుగుల మేర నీరు ప్రవహిస్తుండటంతో పోలవరం ప్రాజెక్టు స్పిల్వే 29.680 మీటర్ల ఎత్తు నుంచి దిగువకు 4,31,813 క్యూసెక్కుల నీటిని సాయంత్రం 6 గంటల సమయానికి విడుదల చేశారు. ఆదివారం రాత్రికి 6 లక్షల క్యూసెక్కులు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే మరో నాలుగు రోజుల పాటు మహారాష్ట్ర, తెలంగాణలో అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు అధికంగా కురుస్తాయని అంచనా వేశారు. దానికి అనుగుణంగా సోమవారం భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశం ఉంది. తర్వాత రెండు రోజుల పాటు 6 నుంచి 7 లక్షల క్యూసెక్కుల నీరు పోలవరం ప్రాజెక్టుకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయితే వేలేరుపాడులో 18 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంది. మళ్లీ వరద హెచ్చరికలతో ముంపు గ్రామాల్లో భయం నెలకొంది. 30 టీఎంసీలు నిల్వ చేస్తూ.. ఏటా జూలై, ఆగస్టు నెలల్లో రెండు సార్లు వరదలు వస్తుంటాయి. అయితే ఈ ఏడాది ఇప్పటికే జూలైలో రెండుసార్లు వరద రాగా తాజాగా మూడోసారి మొదలైంది. గత నెలలో గోదావరి, శబరి మాత్రమే ఉధృతంగా ప్రవహించి 13, 14వ తేదీల్లో 7 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల కావడంతో ఏజెన్సీతో పాటు యలమంచిలిలోని లంక గ్రామాలకు నీరు చేరిన పరిస్థితి. ఈసారి గోదావరి, శబరితో పాటు తమ్మిలేరు, మున్నేరు కూడా భారీ వరద నీటితో ఉధృతంగా మారుతున్నాయి. దీంతో తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులో 30 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ ఉంచి, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటిని యథాతథంగా విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది వర్షాకాలం సీజన్లో గోదావరికి ముచ్చటగా మూడోసారి వరద ప్రారంభమైంది. గత నెలలో రెండుసార్లు వరదలు వచ్చాయి. మళ్లీ శుక్రవారం నుంచి వరద తీవ్రత ప్రారంభమైంది. ఏటా వర్షాకాలం సీజన్లో వరదల నేపథ్యంలో సగటున 1,900 టీఎంసీల నీరు సముద్రం పాలవుతున్నట్టు అధికారిక అంచనా. గత నెలలో రెండుసార్లు వచ్చిన వరదలతో ముంపు మండలాలైన వేలేరుపాడు, కుక్కునూరులో రాకపోకల్లో కీలకంగా ఉండే ఎద్దులవాగు, గుండేటి వాగు వంతెనలు కొన్ని రోజల పాటు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేలేరుపాడులో 18 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. అలాగే 270 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు కూడా తరలించిన పరిస్థితి. దీంతో పాటు జూలై నెలలో వచ్చిన రెండు వరదలకు రోజుకు సగటున 4 లక్షలకు పై గా క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలై మొత్తంగా 420.26 టీఎంసీల నీరు కడలిపాలయ్యింది. నదిలో పెరుగుతున్న ఉధృతి 4.31 లక్షల క్యూసెక్కులు దిగువకు.. గత నెలలో 420 టీఎంసీలు కడలిపాలు ముంపు గ్రామాల్లో భయం.. భయం 18 నాటికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశం -
● శ్రీవారి కొండ.. భక్తజనమే నిండా
భక్తులతో మాట్లాడుతున్న ఈఓ మూర్తి ఉచిత బస్సు వద్ద భక్తులు శ్రీనివాసా గోవిందా.. వేంకట రమణా గోవిందా.. నామస్మరణలు మార్మోగాయి. వేలాదిగా వచ్చిన భక్తులు, నవ దంపతులతో చిన వెంకన్న క్షేత్రం భక్త సాగరాన్ని తలపించింది. శనివారం వేకువజాము నుంచి భక్తుల రాక మొదలైంది. ఆలయ ప్రాంగణం, దర్శనం క్యూలైన్లు, అనివేటి మండపం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, కల్యాణ కట్ట ఇలా అన్ని విభాగాలూ కిటకిటలాడాయి. భక్తులకు అందుతున్న సౌకర్యాల ను ఆలయ ఈఓ ఎన్వీ సత్యనారాయణమూర్తి స్వయంగా పరిశీలించారు. నిత్యాన్నదాన భవనంలో అన్నప్రసాదంపై భక్తులను ఆరా తీశారు. స్వామివారి నిత్య కల్యాణ మండపంలో 192 కల్యాణాలు జరిగాయి. ఆదివారం సైతం భక్తుల రద్దీ కొనసాగనుంది. –ద్వారకాతిరుమల భీమవరం: ఈపీఎస్–95 పెన్షన్దారుల సమస్యలు పరిష్కరించాలని, కనీస పెన్షన్ రూ.9 వేలు ఇవ్వాలని కోరుతూ ఆదివారం ఉదయం 10 గంటలకు భీమ వరం యూటీఎఫ్ కార్యాలయంలో జిల్లా సదస్సు నిర్వహించనున్నట్టు ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ ప ర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎర్ర అజయ్కుమార్, జిల్లా కన్వీనర్ టి.గంగరాజు ఓ ప్రకటనలో తెలిపారు. ఈపీఎఫ్ 95 పెన్షన్దారులు చాలా నష్టపోతున్నారని, ఐదేళ్లకు ఒకసారి రివ్యూ చేస్తామ ని గత ప్రభుత్వాలు హామీలు ఇచ్చినా అమలు జరగలేదని పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ కార్యకర్తలను చిన్నచూపు చూస్తున్నాయని ఏ పీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ సంఘ రాష్ట్ర అ ధ్యక్షురాలు జి.బేబిరాణి అన్నారు. స్థానిక రోటరీ క్లబ్లో శనివారం ఏలూరు జిల్లా అంగన్వాడీ 9వ మహాసభలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ సమస్యను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, ఆన్లైన్ సమస్యలు పరిష్కారం కాలేదని, మినీలను మెయిన్లు చేస్తామన్న జీవో అమలు కావడం లేదన్నారు. 2011 తర్వాత తమకు జీతాలు పెంచలేదని, పనిచేయని సెల్ఫోన్లతో అంగన్వాడీలు అవస్థ లు పడుతున్నారన్నారు. నాణ్యత లేని ఫీడింగ్లు పె ట్టి పోషకాహారమని అంటున్నారన్నారు. తమకు వే తనాలు పెంచాలని, గ్రాట్యుటీ జీఓని మార్చాలని డిమాండ్ చేశారు. ఈనెల 21న దేశవ్యాప్తంగా ఎఫ్ఆర్ఎస్ మీద బ్లాక్డే నిర్వహించనున్నారని, జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షురాలు పి.సుజాత, టి.రజిని, బీజేఎన్ కుమారి, ఇందిర, షకీలా భాను అధ్యక్ష వర్గంగా సభ ప్రారంభమైంది. కోశాధికారి తేళ్లూరు మాణిక్యం, సీఐటీ యూ జిల్లా అధ్యక్షుడు ఆర్.లింగరాజు, జిల్లా ప్రధా న కార్యదర్శి డీఎన్వీడీప్రసాద్, మిడ్డే మిల్స్ జిల్లా కార్యదర్శి మొడియం నాగమణి పాల్గొన్నారు. -
రేకుల షెడ్డు వేసుకుని..
2022 గోదావరి వరదకు నేను ఉండే గుడిసె దెబ్బతింది. దీంతో ఆ ఇంటిని సరిచేసుకుని దాని పక్కనే తాత్కాలికంగా రేకుల షెడ్డు వేసు కుని బరకాలు కట్టుకుని కుటుంబంతో నివసిస్తున్నా. ఇకనైనా ప్రభు త్వం మాకు ఆర్అండ్ఆర్ పరిహారం ఇవ్వాలి. – వేల్పుల రాజయ్య, సీఎం కాలనీ, కుక్కునూరు మండలంలో 45 కాంటూర్లో ఉన్న గ్రామాలకు పరిహారం ఎప్పడిస్తారనే విషయమై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలి. పరిహారం ఇస్తారనే ఉద్దేశంతో నిర్వాసితులు పాత ఇళ్లలోనే ఉంటున్నారు. నిర్వాసితులకు త్వరితగతిన పరిహారం అందించాలి. – వీరమళ్ల ప్రవీణ్, వింజరం పోలవరం నిర్వాసిత గ్రామాల్లో దుర్భర పరిస్థితులున్నాయి. నిర్వాసితులు సరైన ఇళ్లు లేక తంటాలు పడుతున్నారు. పరిహారం స్పష్టత లేదు. ప్రభుత్వానికి నిర్వాసితులపై చిత్తశుద్ధి ఉంటే పరిహారం ఎప్పుడిస్తారనే విషయమై స్పష్టత ఇవ్వాలి. – కొన్నె లక్ష్మయ్య, సీపీఐ మండల కార్యదర్శి -
గౌతు లచ్చన్న ఆదర్శనీయులు
ఏలూరు(మెట్రో): స్వాతంత్య్ర సమరయోధుడు, సర్దార్ గౌతు లచ్చన్న జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. స్థానిక కలెక్టరేట్లో శనివారం గౌతు లచ్చన్న జయంతి వే డుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. గాంధీజీ, వీవీ గిరి, నేతాజీ వంటి ఎందరో నాయకులతో కలిసి గౌతు లచ్చన్న స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని జైలు జీవితం గడిపారన్నారు. అలాగే బడుగు, బలహీనవర్గాల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి లచ్చన్న అని కొనియాడారు. జేసీ పి.ధాత్రిరెడ్డి, డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, బిసి కార్పొరేషన్ ఈడీ పుష్పలత తదితరులు పాల్గొన్నారు. పెనుగొండ: జిల్లాలో 30 వేల ఎకరాల ఆయకట్టు పరిధిలో ముంపునకు కారణమవుతున్న నక్కల కా లువ మురుగు డ్రెయిన్ సమస్యకు శాశ్వత పరిష్కా రం చూపాలని ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లాప్రధాన కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు డి మాండ్ చేశారు. ఆచంట, పెనుగొండ మండలాల్లో ముంపు చేలను శనివారం ఆయన పరిశీలించారు. శేషమ్మ చెరువు, మార్టేరు, తూర్పుపాలెం, నెగ్గిపూడి, కొఠాలపర్రు, సోమరాజు చెరువు గ్రామాల్లో పొలాలు ముంపు బారిన పడ్డాయన్నారు. -
ఉండలేక.. కట్టుకోలేక..!
కుక్కునూరు: పోలవరం ప్రాజెక్ట్లో ముంపునకు గురవుతున్న నిర్వాసిత గ్రామాల్లో ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వం నిర్వాసితులకు పరిహారం చెల్లింపు, పునరావాస ప్రక్రియను చేపట్టకపోవడంతో నిర్వాసితులు అవస్థలు పడుతున్నారు. పరిహారం ఎప్పటిలోగా చెల్లిస్తారన్నది స్పష్టత ఇవ్వకపోవడంతో శిథిలావస్థకు చెందిన ఇళ్లలో ఉండలేక, కొత్త ఇంటి నిర్మాణం చేపట్టలేక నిర్వాసితులు ఇబ్బందులు పడుతున్నారు. విలీన మండలాల్లో ప్రభుత్వం ఇటీవల ప్రాజెక్ట్ 41.15 కాంటూర్ పరిధిలో ముంపునకు గురవుతున్న గ్రామాలకు ఆర్అండ్ఆర్ వ్యక్తిగత, ఇంటి నిర్మాణాలకు పరిహారం చెల్లించింది. అయితే ఇంకా కొందరికి పరిహారం రావాల్సి ఉంది. ప్రభుత్వం 41 కాంటూర్ అంటూ పరిహారం చెల్లించిన గ్రామాలను 2022లో వచ్చిన గోదావరి వరదలకు గిరిజనులు కనీసం ఖాళీ చేసింది లేదు. అయితే అదే వరదలో 45 కాంటూర్ అని పేర్కొన్న గ్రామాలు పూర్తిగా నీటమునిగాయి. అలా వరదలో దెబ్బతిన్న ఇళ్లనే నిర్వాసితులు బాగుచేసుకుని జీవనం సాగిస్తున్నారు. కొందరు వాటి స్థానంలో తాత్కాలికంగా కర్రలు, రేకులతో షెడ్డు వేసుకుని చుట్టూ బరకాలు కట్టుకుని బతుకుతున్నారు. స్పష్టత లేకపోవడంతో.. ప్రభుత్వం 45 కాంటూర్ పరిధి గ్రామాలకు పరిహారంపై స్పష్టత ఇస్తే ఇంటి నిర్మాణంపై ఓ నిర్ణయం తీసుకోవచ్చనే భావనలో నిర్వాసితులు వేచి చూస్తున్నారు. కొత్త ఇళ్లు నిర్మించుకుంటే, కొత్త వాటిని కాదని పాత ఇంటి విలువ ప్రకారం పరిహారం ఇస్తే నష్టపోవాల్సి వస్తుందని నిర్వాసితులు ఆవేదన చెందతున్నారు. ఇలానే 41 కాంటూర్ పరిధిలోని నిర్వాసితులు ఇప్పటికే నష్టాన్ని చవిచూశారు. అదీ కాక పరిహారం ఎప్పుడిస్తారు, గ్రామాలను ఎప్పుడు ఖాళీ చేయిస్తారు, అసలు చేయిస్తారా లేదా అనే విషయాలపై స్పష్టత లేనప్పుడు ఇంటి నిర్మాణాలపై ఎలా ముందుకు వెళతామని అంటున్నారు. 45 కాంటూర్ పరిధికి చెందిన నిర్వాసిత గ్రామాల పరిహారం విషయమై ప్రభుత్వం నిర్ణ యం తీసుకోవాలని కోరుతున్నారు. సంజయ్నగర్ కాలనీలో రేకులతో ఆవాసం కుక్కునూరు బీ బ్లాక్లో బరకాలతో ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక నివాసం ముంపు గ్రామాల్లో తాత్కాలిక ఆవాసాలు పరిహారం చెల్లింపులో ప్రభుత్వ తాత్సారం నిర్వాసితులకు తప్పని అవస్థలు -
వైఎస్సార్సీపీ శెట్టిబలిజ విభాగ అధ్యక్షుడిగా కవురు
పాలకొల్లు సెంట్రల్: వైఎస్సార్ సీపీ రాష్ట్ర శెట్టిబలిజ విభాగ అధ్యక్షుడిగా శాసనమండలి సభ్యుడు కవురు శ్రీనివాస్ను నియమించారు. శనివారం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నియామకం జరిగినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది. కవురు శ్రీనివాస్ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ తనకు పలు పదవులు ఇచ్చి సముచిత స్థానం కల్పించిందన్నారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించిన పార్టీ అధినేత జగన్ మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కమ్యూనిటీ సంఘ పెద్దలు, సభ్యులను కలుపుకుని పార్టీన మరింత బలో పేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. బుట్టాయగూడెం: కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలు పూర్తిగా గమనించాలని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాల రాజు అన్నారు. శని వారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సూపర్సిక్స్ అమలు చేస్తున్నామని కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని, వాటిలో అనేక కొర్రీలు ఉన్నాయని అన్నారు. మహిళల కోసం పెట్టిన ఫ్రీ బస్సు అంతా తుస్సే అని అన్నారు. ఉచిత బస్సుకు ఐదేళ్లలో రూ.8 వేల కోట్లు అవుతుందని ప్రకటించారని, ఇది కేవలం కంటి తుడుపు చర్యగా కనిపిస్తుందన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్ మహిళలకు పెద్దపీట వేశారని, వైఎస్సార్ చేయూత కింద సుమారు రూ.19 వేల కోట్లు, వైఎస్సార్ ఆసరా కింద రూ.27 వేల కోట్లు, ఇళ్ల పథకానికి సుమారు రూ.లక్ష కోట్లు ఖర్చు చేశారన్నారు. ఫ్రీ బస్సుకు కేవలం రూ.8 వేల కోట్లు ఖర్చవుతుందని కూటమి నాయకులు చెప్పుకోవడమే తప్ప ఈ ఫ్రీ బస్సు వల్ల ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. ఏజెన్సీ ప్రాంతంలో ప్రయాణించే పల్లె బస్సులకు సరైన మార్గదర్శకాలు లేవన్నారు. ఇక్కడ పథకం ఉన్నా లేనట్టే అన్నారు. కూటమి పాలకులు పథకాల పేరుతో ప్రజలను దగా చేస్తున్నారన్నారు. దెందులూరు: ‘స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు అధికారులు దూరం’ అన్న శీర్షినక శనివారం ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. దెందులూరులో వేడుకలు నిర్వహించని పశుసంవర్ధక శాఖ ఏడీ, ఎంఈఓలకు పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ గోవిందరావు, డీఈఓ వెంకట లక్ష్మమ్మ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. స్వాతంత్ర దినోత్స వాన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించక పోవడం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమని, సంబంధిత అధికారుల వివరణ అనంతరం తదుపరి చర్యలు ఉంటాయని అన్నారు. ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు నూజివీడుకు చెందిన దాత నక్కా సత్యనారాయణ శనివారం 3 టన్నుల కూరగాయలను విరాళంగా అందజేశారు. దొండ, బెండ, దోస, సొర, టమోటాలు వంటి పలు రకాల కూరగాయలను అందజేసి, స్వామివారి అన్నప్రసాదంలో వినియోగించాలని కోరారు. తాడేపల్లిగూడెం (టీఓసీ): న్యాయవాదులకు ప్రభుత్వం హెల్త్ కార్డులు ఇవ్వాలని ఆలిండియా లాయర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. యూనియన్ జిల్లా కమిటీ సమావేశం శనివారం స్థానిక బార్ అసోసియేషన్ హాల్లో జరిగింది. సంఘ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు దిగుపాటి రాజగోపాల్ మాట్లాడుతూ కూటమి నాయకులు ఎన్నికల ముందు మ్యాచింగ్ గ్రాంట్ కింద మృతి చెందిన న్యాయవాదుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఇస్తానని వాగ్దానం చేశారని, అయితే రాష్ట్రంలో 1,275 మంది న్యా యవాద వృత్తిలో మృతి చెందితే 103 మందికి మాత్రమే ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. -
పాత పెన్షన్ కోసం 25న మహాధర్నా
ఏలూరు(మెట్రో)/ఏలూరు (ఆర్ఆర్పేట): పాత పెన్షన్ విధానం కోసం ఈనెల 25న విజయవాడలో నిర్వహించే మహాధర్నాను జయప్రదం చేయాలని డీఎస్సీ–2003, ఉపాధ్యాయుల ఫోరం పిలుపుని చ్చింది. మహాధర్నా పోస్టర్ను శనివారం ఏలూ రులో జిల్లా ఎన్జీఓ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్, జేఏసీ నాయకులు హరినాథ్, ఫ్యాప్టో జిల్లా చైర్మన్ జి.మోహన్, హెచ్ఎంల సంఘం నాయకులు ప్ర కాష్, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామారావు ఆవిష్కరించారు. రాష్ట్ర కన్వీనర్లు కేఎల్ శ్రీనాథ్, కట్టా శ్రీనివాసరావు మాట్లాడుతూ సీపీఎస్ విధానానికి ముందు నోటిఫికేషన్లు విడుదలై, సీపీఎస్ అమలైన తర్వాత విధుల్లో చేరిన సుమారు 11 వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం మె మో 57 ప్రకారం పాత పెన్షన్ అమలు చేయాలని కోరారు. ఎన్జీఓ అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశంలో మెమో 57 ప్రకారం 16 రాష్ట్రాల్లో పాత పెన్షన్ను పునరుద్ధరించారన్నారు. ఈ మేరకు రాష్ట్రంలో పెన్షన్ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. జిల్లా కన్వీనర్లు వి.జగదీష్, ఈ.శంకర్రావు, ఫోరం సభ్యులు కె.గోపాల్కృష్ణ, బి.శ్రీనివాసరావు, వి.శివకుమార్ పాల్గొన్నారు. -
నీరు లాగక.. వేదన తీరక
గణపవరం: సార్వా పైరు ఇంకా ముంపులోనే ఉంది. బుధవారం రాత్రి కనీవినీ ఎరుగని రీతిలో కురిసిన భారీ వర్షానికి మండలంలోని పలు గ్రామాల్లో సార్వా పైరు నీట మునిగింది. సుమారు 650 హెక్టార్ల విస్తీర్ణంలో పైరు నీట మునిగినట్లు ప్రాథమికంగా అంచనావేశారు. ఈ నష్టం దాదాపు రెట్టింపు ఉంటుందని రైతులు చెబుతున్నారు. కొందేపాడు, పిప్పర, కేశవరం, కోమర్రు, వెంకట్రాజపురం, సరిపల్లె, కొత్తపల్లి, గణపవరం తదితర గ్రామాలలో వరినాట్లు నీటమునిగాయి. చినరామచంద్రపురంలోని పల్లపుభూములలో నాట్లు మొత్తం నీటమునిగాయి. పిప్పర పరిసర గ్రామాలలో వరిపైరు చివరలు కనిపిస్తున్నాయి. పొలాలలో నీరు బయటకు పంపడానికి రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. చుక్కనీరు బయటకుపోయే మార్గం కనిపించడంలేదు. ఇంజిన్లు వేసి నీటిని బయటకు తోడుకుంటున్నారు. కాలువగట్లు పల్లంగా, బలహీనంగా ఉన్న చోట్ల గట్లను రైతులే మట్టి, కంకరతో పటిష్టం చేసుకుంటున్నారు. శుక్ర, శనివారాలలో వర్షం కురియక పోవడంతో పరిస్థితి కొంత కలిసివచ్చింది. -
నిర్వాసితుల సమస్యలపై పార్లమెంట్లో మాట్లాడతా
బుట్టాయగూడెం: సీపీఎం ఫ్లోర్ లీడర్, కేరళ ఎంపీ జాన్ బ్రిట్టాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తులసీదాస్, సీపీఎం నాయకుల బృందం శనివారం ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించింది. బృంద సభ్యులు టేకూరు నిర్వాసిత కాలనీని సందర్శించారు. నిర్వాసితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రెడ్డిగణపవరం వద్ద సభలో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వం కోల్పోయిన నిర్వాసితుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నట్లు కనిపించిందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల లక్ష ఆరువేల గిరిజన కుటుంబాలు ముంపునకు గురువుతున్నాయన్నారు. నిర్వాసితులకు పునరావాసం, వసతులపై ఉత్సాహం చూపించడం లేదన్నారు. 80 శాతం గిరిజనులు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల తమ ఉనికిని కోల్పోతున్నారని వారికి సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు పూర్తి స్థాయిలో పునరావాసం, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. నిర్వాసితుల సమస్యలను పార్లమెంట్లో మాట్లాడతానని చెప్పారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ. రవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి. బలరామ్, తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ బీసీ విభాగం కార్యదర్శిగా ధర్మరాజు
చింతలపూడి: వైఎస్సార్సీపీ బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా జంగారెడ్డిగూడెం మండలానికి చెందిన కుక్కల ధర్మరాజును నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తనకు రాష్ట్ర కార్యదర్శిగా అవకాశం ఇచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్సీసీ బీసీ సెల్ కార్యదర్శిగా సూరిబాబు పెంటపాడు: వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ సెల్ విభాగ కార్యదర్శిగా పెంటపాడుకు చెందిన ఎంపీటీసీ సభ్యుడు రెడ్డి సూరిబాబు నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. తనకు ఈ పదవి ఇచ్చినందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డికి, మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. చింతలపూడి: వైఎస్సార్సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శులుగా చింతలపూడి మండలానికి చెందిన చిలుకూరి జ్ఞానారెడ్డి, జంగారెడ్డిగూడెం మండలానికి చెందిన మల్నీడి మోహనకృష్ణ(బాబి)లను నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తమ సేవలను గుర్తించి రాష్ట్ర కార్యదర్శులుగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తణుకు అర్బన్ : పార్కింగ్ చేసిన కారులో మంటలు చెలరేగిన ఘటన శనివారం తణుకు పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... ఇరగవరం మండలం కంతేరు గ్రామానికి చెందిన రుషి తన కుటుంబ సభ్యులతో తణుకు బ్యాంకు కాలనీలోని ఒక ప్రెవేటు ఆసుపత్రికి వచ్చారు. ఆసుపత్రి సమీపంలోని ఖాళీ స్థలంలో నానో కారు పార్కింగ్ చేసి ఆసుపత్రిలోకి వెళ్లారు. కొద్దిసేపటికే కారు నుంచి పొగలు వ్యాపించి నిమిషాల వ్యవధిలోనే మంటలు అంటుకున్నాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే కారు పూర్తిగా దగ్థమైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు. చింతలపూడి: రాష్ట్ర స్థాయి ఆర్టిస్టిక్ యోగా పోటీలకు నాగిరెడ్డిగూడెం బాలికల గురుకుల పాఠశాల 9వ తరగతి విద్యార్థిని ఎస్.జాస్మిత ఎంపికై నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్.హేమలత తెలిపారు. ఈ సందర్భంగా శనివారం పాఠశాల ఆవరణలో విద్యార్థులను సత్కరించి వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా హేమలత మాట్లాడుతూ ఈనెల 10న ఏలూరు లోని ఓల్డేజ్ హోంలో జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి ఆర్టిస్టిక్ పోటీల్లో ఎస్.జాస్మిత ఉత్తమ ప్రతిభ చూపి మొదటి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించిందని చెప్పారు. మరో విద్యార్థిని అమలారాణి ట్రెడిషనల్ జూనియర్ యోగా పోటీలలో మూడో స్థానంలో నిలిచి మెడల్ సాధించిందన్నారు.మల్నీడి మోహనకృష్ణ(బాబి) చిలుకూరి జ్ఞానారెడ్డి -
ఉచిత బస్సు.. అంతా తుస్సు.. జనసేన నేత ఆడియో సంభాషణ వైరల్
సాక్షి, ఏలూరు జిల్లా: ఉచిత బస్సు పథకంపై ప్రయాణికులు, కూటమి నేతల్లో అయోమయం నెలకొంది. ఏలూరు ఏజెన్సీ ప్రాంతాలలో నడిచే బస్సులలో ఏ బస్సులో ఫ్రీ టికెట్ ఉంటుందో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే అంతర్రాష్ట్ర బస్ సర్వీసులకు ఫ్రీ టికెట్ లేదని ప్రభుత్వం ప్రకటించింది. ఏలూరు ఏజెన్సీ ప్రాంతం తెలంగాణ సరిహద్దుల్లో ఉండడంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు.బోర్డర్ కొంచెం ఏపీలో, కొంచెం తెలంగాణలో ఉండడంతో అవి అంత ర్రాష్ట్ర సర్వీసులుగా గుర్తించారు. దాంతో వాటిలో ఫ్రీ లేదని అధికారులు చెబుతున్నారు. జంగారెడ్డిగూడెం డిపో నుంచి వేలేరుపాడు కుక్కునూరు, మండలాలకు వెళ్లే సర్వీసులన్నీ.. తెలంగాణ నుంచే వెళ్లడంతో స్థానికల్లో అయోమయం ఏర్పడింది. జంగారెడ్డి గూడెం నుంచి భద్రాచలం వెళ్లే బస్సుకి ఫ్రీ టికెట్ లేదని జంగారెడ్డిగూడెం బస్ డిపో డీఎం తెలిపారు. జంగారెడ్డిగూడెం బస్ డిపో డీఎంతో జనసేన నాయకుడి ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.అదే విధంగా అశ్వరావుపేట షటిల్ సర్వీస్ ఫ్రీ టికెట్ వర్తించదని డీఎం చెబుతున్నారు. దాంతో జంగారెడ్డిగూడెం నుంచి వేగవరం, తాడువాయి, దర్భ గూడెం జీలుగుమిల్లి వెళ్లే ప్రయాణికులకు స్త్రీ శక్తి ఎలా ఉపయోగపడుతుందనే అనుమానం నెలకొంది. మరోవైపు, రాష్ట్ర వాప్తంగా మహిళలందరికి ఉచిత బస్సు ప్రయాణం అంటూ హామీలు ఇచ్చిన కూటమి సర్కార్.. ఆచరణలో మాత్రం ఆంక్షలు పెట్టడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తిరుపతి-తిరుమలకు వెళ్లే బస్సులో యాత్రికులకు షరతులు పెట్టారు. ఉచిత పథకం అమలు చేయాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. -
డివైడర్ను ఢీకొని యువకుడి మృతి
ద్వారకాతిరుమల: బైక్పై వేగంగా వెళుతున్న యువకుడు ముందు వెళుతున్న టీవీఎస్ మోపెడ్ను, ఆ తరువాత డివైడర్ను ఢీకొట్టి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మోపెడ్ నడుపుతున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ద్వారకాతిరుమల మండలం సూర్యచంద్రరావుపేటలో శుక్రవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. భీమడోలు గ్రామానికి చెందిన మీసాల జగదీష్(25)కు ఏడాది క్రితం వివాహమైంది. జగదీష్, అతని అన్నయ్య ద్వారకాతిరుమలలోని స్వీట్లు తయారు చేసే పని చేస్తున్నారు. ఉదయం పనికి వెళ్లిన జగదీష్ తరువాత కడుపులో నొప్పిగా ఉందని చెప్పి, రూంకి వెళ్లి పడుకున్నాడు. మధ్యాహ్నం ఇంటికి వెళ్లేందుకు భీమడోలు బయల్దేరాడు. ముందు వెళ్తున్న మోపెడ్ను తప్పించబోయి డివైడర్ను ఢీకొట్టాడు. ఈ క్రమంలో మోపెడ్తో సహా దానిపై వెళ్తున్న ఫణి, అతని తాతయ్య రోడ్డుపై పడిపోయారు. తీవ్రంగా గాయపడ్డ జగదీష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఫణికి తీవ్ర గాయాలుపాలు కాగా, అతని తాతయ్య స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. క్షతగాత్రులను 108 అంబులెన్స్లో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని సీఐ యుజే విల్సన్, ఎస్సై టి.సుధీర్ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. -
నిండా ముంచిన గోస్తనీ
పెనుమంట్ర: బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పెనుమంట్ర మండలంలోని గోస్తిని, గొంతేరు, భగ్గేశ్వరం మురుగు కాల్వలు పొంగి ప్రవహించడంతో వరి నాట్లు నీట మునిగాయి. గోస్తనీ పరివాహక ప్రాంతంలో నత్తారామేశ్వరంలోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం నీట మునగగా, జుత్తిగలో శ్రీ ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామి ఆలయ ఆవరణలోని శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయాల్లోకి వరదనీరు ప్రవేశించింది. గోస్తనీ మురుగు కాలువలో కిక్కిస, గురప్రు డెక్క పెరిగిపోవడంతో మురుగు నీటి ప్రవాహానికి అంతరాయం ఏర్పడి ఎస్.ఇల్లిందలపర్రు, మల్లిపూడి, జుత్తిగ, నత్తా రామేశ్వరం వెలగలవారి పాలెం, పెనుమంట్ర, మాముడూరు గ్రామాలకు చెందిన సుమారు 1000 ఎకరాల్లోని వరినాట్లు నీట మునిగాయి. గోస్తినిలో చెత్త తొలగింపు కార్యక్రమాన్ని 20 రోజుల క్రితం ప్రారంభించినప్పటికీ నత్త నడకన సాగుతోంది. దీంతో దిగువ భాగంలోని నత్త రామేశ్వరం, జుత్తిగ, వెలగలవారిపాలెం, పెనుమంట్ర, గరువు గ్రామాల మధ్య చెత్త పేరుకుపోయి మురుగునీరు వెళ్లకపోవడంతో పల్లపు ప్రాంతాల్లోని పంట పొలాలు నీటమునిగాయి. వరినాట్లు నీట మునిగడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. చెత్త తొలగింపు పనులను త్వరితగతిన పూర్తిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. భగ్గేశ్వరం మురుగు కాలువ కూడా ఆక్రమణకు గురై పూడుకుపోవడంతో ఆలమూరు, వెలగలేరు గ్రామాలకు చెందిన పల్లపు పొలాలు నీట మునిగాయి. జుత్తిగ–పెనుమంట్ర మధ్య గోస్తనీలో పేరుకుపోయిన కిక్కిస, గుర్రపు డెక్క నత్తారామేశ్వరంలో ముంపులో శ్రీరామలింగేశ్వర ఆలయం -
ఘర్షణలో వ్యక్తి మృతి
నూజివీడు: గేదెలు కట్టేయడానికి గుంజ పాతే విషయమై ఇద్దరు ఘర్షణ పడగా అందులో ఒకరు మృతి చెందిన సంఘటన నూజివీడు మండలం జంగంగూడెంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. జంగంగూడెం ఎస్సీ ఏరియాలో తొమ్మండ్రు ఏసోబు(64), ముళ్లపూడి దేవసహాయం(62) కుటుంబాలు పక్కపక్కనే నివసిస్తున్నాయి. ఉదయం 9 గంటల సమయంలో దేవసహాయం స్థలం సరిహద్దులో గుంజను పాతుతుంటే అక్కడ పాతడానికి వీల్లేదంటూ ఏసోబు అడ్డు వెళ్లాడు. దీంతో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. దేవసహాయం భార్య కూడా వచ్చి ఘర్షణకు దిగింది. దేవసహాయం తన చేతిలో ఉన్న గడ్డపలుగును వెనకకు తిప్పి ఏసోబు డొక్కలో పొడవడంతో కింద పడిపోయాడు. ఏసోబు భార్య అక్కడికి వచ్చి తన భర్తను ఇంటిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టగా వెంటనే మృతిచెందాడు. రూరల్ ఎస్ఐ జ్యోతిబసు సంఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. తన భర్తను గడ్డపలుగుతో పొడవడంతో మృతిచెందాడని మృతుడి భార్య ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నీటమునిగిన వరిచేలు
ఉంగుటూరు: ఉంగుటూరు మండలంలో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. మేజరు మురుగుకోడు, పందికోడు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మీడియం డ్రెయిన్లు రంగారావు కోడు, రాచకోడు, సంతకోడు, లింగం కోడు, ఆస్మాకోడు నిండుగా ప్రవహిస్తున్నాయి. దాంతో వేలాది ఎకరాలు నీటమునిగాయి. వీఏ పురం, కాగుపాడు, కాకర్లమూడి, దొంతవరం, రావులపర్రు, రామన్నగూడెం, కై కరం ఆయకట్టులో పంటపొలాలు నీటమునిగి ఉన్నాయి. పంటచేల నుంచి నీరు కొల్లేరు వైపు ప్రవహిస్తోంది. నారాయణపురం ఆర్అండ్బీ రోడ్డు, యర్రమళ్ల, వెల్లమిల్లి, ఎ.గోకవరం రోడ్లపై నీరు ప్రవహిస్తోంది. మెట్ట ప్రాంతంలోని 22 మైనర్ ఇరిగేషన్ చెరువులు నిండిపోయాయి. నాచుగుంట పట్టెమ చెరువు, ఉంగుటూరు ఎర్ర చెరువు, వెల్లమిల్ల చెరువు, నల్లమాడు చెరువు, గోపినాథపట్నం పెద్ద చెరువు నిండి పొంగి పొర్లుతున్నాయి. రెండు రోజుల్లో నీరు లాగితే రైతులు ఊపిరి పీల్చుకుంటారు. లేకుంటే నష్టపోయే పరిస్థితి నెలకొంది. -
సమైక్యతకు పాటుపడాలి
ఏలూరు టౌన్: దేశ సమైక్యత, సమగ్రతకు ప్రతిఒక్కరూ పాటుపడాలని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్కుమార్ అన్నారు. ఏలూరు రేంజ్ ఐజీ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. గాంధీజీ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా పోలీసులు కృషి చేయాలని అన్నారు. ఏలూరు ఎస్పీ క్యాంపు కార్యాలయంలో జేసీ ధాత్రిరెడ్డితో కలిసి జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు జాతీయ జెండాను ఎగురవేసి గౌరవవందనం చేశారు. చాట్రాయి: మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు మండలంలోని తమ్మిలేరు రిజర్వాయర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. మండలంలో గురువారం రాత్రి నుంచి భారీ వర్షం కురవడంతో చెరువులు, కాలువల్లోకి వరద నీరు చేరుతోంది. రేగడి వాగు, నల్లవాగు, ఉప్పువాగుల్లో వరద పెరుగుతోంది. ప్రస్తుతం 3,400 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి చేరుతుందని టీఆర్పీ ఏఈ కడిమె లాజరుబాబు తెలిపారు. ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ఉద్దేశించిన సీ్త్ర శక్తి పథకాన్ని శుక్రవారం ఏలూరు కొత్త బస్టాండులో మంత్రి కొలుసు పార్థసారథి జెండా ఊపి ప్రా రంభించారు. కలెక్టర్ వెట్రిసెల్వి, ఎమ్మెల్యేలు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్, కామినేని శ్రీనివాస్, సొంగా రోషన్కుమార్, పి. ధర్మరా జు, ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అ ప్పలనాయుడు, జిల్లా ప్రజా రవాణా అధికారి షేక్ షబ్నం పాల్గొన్నారు. ద్వారకాతిరుమల: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ద్వారకాతిరుమలకు చెందిన పెద్దిరెడ్డి జ్యోతి శ్రీనివాస్ను పార్టీ రాష్ట్ర యువజన విభాగ సంయుక్త కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. జగన్, తనకు పదవి రావడానికి కారణమైన మాజీ మంత్రి తానేటి వనిత, పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షుడు జక్కంపూడి రాజా, పార్టీ తూర్పుగోదావరి జిల్లా అ ధ్యక్షుడు చెల్లుబోయిన వేణు, పార్టీ మండల అధ్యక్షుడు ప్రతాపనేని వాసుకి పెద్దిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. జంగారెడ్డిగూడెం: జల్లేరు గ్రామంలో ఎర్రకాలువలో చేపల వేటకు వెళ్లిన జాలర్లకు శుక్రవారం 25 కిలోల బొచ్చె చేప వలకు చిక్కింది. దీనిని ఓ వ్యక్తి రూ.5 వేలకు కొనుగోలు చేశాడు. నరసాపురం రూరల్: స్వాతంత్య్ర దినోత్సవం నాడు మొగల్తూరు మండలం పేరుపాలెం నార్త్ గ్రామంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగాయి. అధికారులకు విషయం తెలిసినా కన్నెత్తి చూడలేదు. -
దేశభక్తిని పెంపొందించుకోవాలి
ఏలూరు (టూటౌన్): యువత దేశభక్తితో పాటు స్ఫూర్తిని మరింత పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధా న న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి అన్నారు. ఏలూరు లోని జిల్లా కోర్టు కార్యాలయంలో శుక్ర వారం ఆమె జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముందుగా దేశ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి శ్రీదేవి మాట్లాడుతూ దేశ రక్షణ కోసం సైనికులు నిరంతరం కృషి చేస్తున్నారని, కాని దేశంలో అంతర్గతంగా భద్రత, అభివృద్ధి మరింత మెరుగు పరచాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ప్రతిఒక్కరూ నిబద్ధతతో కృషి చేయాలన్నారు. సైనికుల విజయాలతో యువత స్ఫూర్తిని, దేశభక్తిని మరింత పెంపొందించుకోవాలన్నారు. అమరవీరుల త్యాగాలను ప్రతిఒక్కరూ స్మరించుకోవాలన్నారు. ఏడో అదనపు జిల్లా జడ్జి వై.శ్రీనివాసరావు, ఎనిమిదో అదనపు జిల్లా జడ్జి ఐ.శ్రీనివాసమూర్తి, పోక్సో జడ్జి కుమారి కె.వాణిశ్రీ, న్యాయమూర్తులు, బార్ అసో సియేషన్ అధ్యక్షుడు కోనె సీతారాం, ప్రభుత్వ న్యా యవాది బీజే రెడ్డి, పీనీ ఏవీ నారాయణ, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. -
మహనీయుల త్యాగాలు మరువలేం
ఏలూరు టౌన్/నూజివీడు/గణపవరం: దేశ స్వా తంత్య్ర సాధన కోసం ఎందరో మహనీయులు ప్రా ణత్యాగాలు చేశారని, వారి పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు అన్నారు. ఏలూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం 79వ స్వా తంత్య్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త మా మిళ్లపల్లి జయప్రకాష్, నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీ నివాసరావు, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూ కపెయ్యి సుధీర్బాబు, రాష్ట్ర మైనార్టీ విభాగం కార్యదర్శి షేక్ బాజీ, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, జిల్లా అధికార ప్రతినిధి మున్నల జాన్గురునాథ్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఘంటా మోహనరావు, మైనార్టీ సెల్ నగర అధ్యక్షుడు రియాజ్ ఆలీఖాన్, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు ఇనపనూరి జగదీష్, కార్పొరేటర్ ఇనపనూరి కేదారేశ్వరి, పైడి భీమేశ్వరరావు, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పాతినవలస రాజేష్, గ్రీవెన్స్ సెల్ జిల్లా అధ్యక్షుడు సముద్రాల దుర్గారావు, ఆర్టీఐ జిల్లా అధ్యక్షుడు స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు. నూజివీడులోని పలు ప్రధాన కూడళ్ల వద్ద మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎందరో మహానుభావుల త్యాగఫలమే స్వాతంత్య్రమని అన్నారు. గణపవరంలోని పార్టీ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. దేశ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమరవీరుల ఆశయ సాధన కోసం కంకణ బద్ధులం కావాలని పిలుపునిచ్చారు. -
మురిసిన మువ్వన్నెలు
నిండా ముంచిన గోస్తనీ భారీ వర్షాలకు పెనుమంట్ర మండలంలో గోస్తనీ న ది, గొంతేరు, భగ్గేశ్వరం మురుగు కాలువలు పొంగి పొర్లడంతో వందలాది ఎకరాలు నీటమునిగాయి. 8లో u● అంబరాన్నంటిన సంబరాలు ● పందాగ్రస్టు వేడుకల్లో చిన్నారులు శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025ఏలూరు (మెట్రో): పందాగ్రస్టు వేడుకలు అంబరా న్ని తాకాయి. దేశభక్తి ఉట్టిపడేలా చిన్నారుల నృత్యాలు కనువిందు చేశాయి. ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో శుక్ర వారం జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించా రు. కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ తో కలిసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. భళా.. సాంస్కృతిక వేళ చిన్నారుల దేశభక్తి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. నూజివీడు త్రివిధ హైస్కూల్, భీమడోలు మండలం పోలసానిపల్లి గురుకుల పాఠశాల విద్యార్థుల ప్రదర్శనలతో భళా అనిపించారు. గోపన్నపాలెం ఎస్ఎస్ఆర్ ప్రభుత్వ వ్యాయమ ఉపాధ్యాయ శిక్షణా కళాశాల విద్యార్థులు మల్కం ప్రదర్శన మొదటి బహుమతి, నూజివీడుకు చెందిన రైట్స్ సంస్థకు చెందిన బాలికలు రెండో బహుమతి, ఏలూరులోని కస్తూరిబా మున్సిపల్ బాలికల హైస్కూల్కు మూ డో బహుమతి, కలిదిండి పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు నాల్గో బహుమతి గెలుచుకున్నారు. ఆకట్టుకున్న స్టాల్స్ వ్యవసాయ, ఉద్యాన, జిల్లా గ్రామీణాభివృద్ధి, మ హిళా శిశు సంక్షేమ, పశుసంవర్థక, సమీకృత గిరిజ నాభివృద్ధి శాఖలు, బీసీ కార్పొరేషన్, పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో స్టాల్స్ ఆకట్టుకున్నాయి. డీఆర్డీఏ ఆధ్వర్యంలో 1,935 మహిళా సంఘాలకు చెందిన 8,423 మంది సభ్యులకు సీ్త్రనిధి కింద రూ.66.32 కోట్ల బ్యాంక్ లింకేజ్ రుణాలను మంత్రి పార్థసారథి పంపిణీ చేశారు. ఉన్నతి కింద 231 సంఘాలకు చెందిన 368 మంది సభ్యులకు రూ.2.28 కోట్లు అందజేశారు. వ్యవసాయ రైతు సాధికార సంస్థ, ఉద్యాన శాఖ, ఐసీడీఎస్, గ్రామీణాభివృద్ధి స్టా ల్స్ మొదటి నాలుగు స్థానాల్లో నిలిచాయి. శకటాల ప్రదర్శన : వ్యవసాయ, వైద్యారోగ్య శాఖ, గృహనిర్మాణం, అన్న క్యాంటీన్, అగ్నిమాపక శాఖ తదితర శకటాలు ఆకట్టుకున్నాయి. విద్యా శకటానికి ప్రథమ, వ్యవసాయ శాఖ శకటానికి ద్వితీయ, గృహనిర్మాణ శాఖ శకటానికి తృతీయ బహుమతి వచ్చాయి. వేడుకల్లో జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఎమ్మెల్యేలు బడేటి రాధాకష్ణయ్య, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జేసీ పి.ధాత్రిరెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. పోలవరం జిల్లాకు గర్వకారణం రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ఏలూరు జిల్లాలో ఉండటం గర్వకారణమని, పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు సంతృప్తికరంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందన్నారు. పేదరికం లేని సమాజం కూటమి ప్రభుత్వ విధానమన్నారు. -
పార్టీ కాకినాడ జిల్లా మహిళా విభాగం ఇన్చార్జిగా జయసరిత
పాలకొల్లు సెంట్రల్: వైఎస్సార్ సీపీ కాకినాడ జిల్లా మహిళా విభాగం ఇన్చార్జిగా పాలకొల్లుకు చెందిన రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి క్రరా జయసరితను నియమించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు, ఉన్నత స్థానం తప్పక లభిస్తుందన్నారు. తన సేవలను గుర్తించి పదవి కల్పించిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరుది కళ్యాణి, ఉభయగోదావరి జిల్లాల కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ, పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణంరాజు, జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, నియోజకవర్గ ఇన్చార్జి గుడాల శ్రీహరిగోపాలరావులకు కృతజ్ఞతలు తెలియజేశారు. టి.నరసాపురం: ఒంటరి జీవితాన్ని భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం కె.జగ్గవరంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి హెచ్సీ కె.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని కె.జగ్గవరం గ్రామానికి చెందిన బర్రి రాజేష్ (35) పదేళ్ల క్రితం తన పెద్దక్క కుమార్తెను వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లయిన నెల రోజులకే ఆమె రాజేష్ను విడిచి వెళ్లిపోయింది. ఈ క్రమంలో రాజేష్ తల్లి వద్ద ఉంటున్నాడని అతనికి చిన్నప్పటి నుంచి కొంచెం మతిస్థిమితం సరిగా లేకపోవడం వల్ల అప్పుడప్పుడు ఫిట్స్ వచ్చేదన్నారు. ఈ నేపథ్యంలో ఒంటరి జీవితాన్ని భరించలేక ఈనెల 13న గుర్తు తెలియని మందు తాగి ఇంటివద్ద ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో, స్థానికులు గుర్తించి చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాజేష్ మృతి చెందాడు. ఆసుపత్రి నుంచి సమాచారం, రాజేష్ అన్న ఏలియా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్సీ తెలిపారు. నూజివీడు: దేవాలయాలు, ప్రార్థనా మందిరాల్లో హుండీలను చోరీ చేసిన దొంగను చాట్రాయి పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ కేవీవీఎన్వీ ప్రసాద్ గురువారం నూజివీడులో వివరాలు వెల్లడించారు. ఈనెల 13న సాయంత్రం చాట్రాయి ఊరి చివర పోలవరం వెళ్లే రోడ్డు మలుపులో ఉన్న ఆంజనేయస్వామి గుడి వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా చాట్రాయి వైపు నుంచి పోలవరం వైపునకు మోటార్సైకిల్పై వెళ్తూ అనుమానాస్పదంగా వ్యవరిస్తున్న పటాన్ సలార్ఖాన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఏలూరు నగరంలోని పడమట వీధికి చెందిన పటాన్ సలార్ఖాన్(56)పై ఇప్పటి వరకు 51 దొంగతనం కేసులు ఉండగా ఏలూరు జిల్లాలో 25, నెల్లూరు జిల్లాలో 23, ఎన్టీఆర్ జిల్లాలో 3 చొప్పున కేసులు ఉన్నాయి. ఇతని వద్ద నుంచి రూ.5,900 నగదు, మోటర్ సైకిల్ను రికవరీ చేశారు. నిందితుడిని అరెస్టు చేయడంలో ప్రతిభ చూపిన నూజివీడు సీఐ కొప్పిశెట్టి రామకృష్ణ, చాట్రాయి ఎస్సై డీ రామకృష్ణ, హెడ్కానిస్టేబుళ్లు ఎం విజయ్భాస్కర్, జీ శ్రీనివాసరావు, కానిస్టేబుళ్లు ఎస్ బాలాజీ, ఎం శ్రీనివాసులను డీఎస్పీ ప్రసాద్ అభినందించారు. -
నిండా ముంచేను
గణపవరం: భారీ వర్షంతో గణపవరం, కొత్తపల్లి, చినరామచంద్రపురం, కేశవరం, పిప్పర, మొయ్యేరు, కొందేపాడు తదితర గ్రామాల్లో వరి చేలు ముంపుబారిన పడ్డాయి. బుధవారం రాత్రి భారీ వర్షం కురవగా గణపవరం, చినరామచంద్రపురం ప్రాంతాల్లో చేలల్లో మోకాలి లోతు నిలిచిపోయింది. మండల వ్యవసాయ అధికారి ప్రసాద్, వ్యవసాయ సిబ్బంది నష్టం అంచనాలు తయారుచేస్తున్నారు. 650 హెక్టార్ల విస్తీర్ణంలో వరి నాట్లు నీటమునిగినట్టు అంచనా వేశారు. మండలంలోని పంట, మురుగు కాల్వలు నిండుకుండల్లా ప్రవహిస్తున్నాయి. గట్లు బలహీనంగా ఉన్న చోట్ల రైతులు మట్టితో గట్లను పటిష్టం చేసుకుంటున్నారు. పలుచోట్ల కాలువలకు గండ్లు పడగా రైతులు చేలు మునగకుండా కాపాడుకుంటున్నారు. గణపవరం నుంచి భీమవరం వెళ్లే రోడ్డు గోతులమయంగా మారి ప్రయాణం ప్రమాదకరంగా తయారైంది. అత్తిలి: మంచిలి గ్రామానికి చెందిన దివ్యాంగ సంఘటన సంఘ నాయకుడు నండూరి రమేష్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ నిర్వహించే ఎట్ హోం కార్యక్రమానికి ఎంపికయ్యారు. ఏటా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ప్రముఖులతో ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అందులో భాగంగా దివ్యాంగుల కోట కింద మంచిలి గ్రామానికి చెందిన నండూరి రమేష్ను జిల్లా అధికారులు ఎంపిక చేశారు. దివ్యాంగుల సంక్షేమం కోసం రమేష్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డులు కూడా గతంలో పొందారు. -
ద్వారకాతిరుమలలో లారీ బీభత్సం
● రెండు కార్లను, ఒక ఆటోను ఢీకొట్టిన లారీ ● ఆటో డ్రైవర్కు గాయాలు ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో గురువారం తెల్లవారుజామున ఒక లారీ బీభత్సాన్ని సృష్టించింది. గుడి సెంటర్లో రెండు కార్లను, గరుడాళ్వార్ సెంటర్లో రోడ్డు మధ్యలోని డివైడర్ మీద నుంచి దూసుకెళ్లి ఒక టాటా ఏస్ ఆటోను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతాల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. స్థానికుల కథనం ప్రకారం. ద్వారకాతిరుమల క్షేత్రంలో బుధవారం రాత్రి భారీగా వివాహాలు జరిగాయి. పెదపాడు మండలం అప్పన్నవీడు గ్రామానికి చెందిన మాతంగి వెంకటేష్ తన ఆటోలో పెళ్లి బృందాన్ని క్షేత్రానికి తీసుకొచ్చాడు. వారిని కల్యాణ మండపం వద్ద దింపిన తరువాత గరుడాళ్వార్ సెంటర్లోని దేవస్థానం బస్స్టేషన్ వద్ద ఆటోను నిలిపి, అందులో నిద్రిస్తున్నాడు. అలాగే మచిలీపట్నం, విశాఖపట్నంకు చెందిన పెళ్లి బృందాలు వేసుకొచ్చిన రెండు కార్లను గుడి సెంటర్లో నిలిపి, కల్యాణ మండపాల్లోకి వెళ్లారు. గురువారం తెల్లవారుజాము 2 గంటల సమయంలో చింతలపూడి నుంచి కాకినాడకు వెళుతున్న ఒక లారీ గుడి సెంటర్లో నిలిపి ఉన్న రెండు కార్లను ఢీకొట్టింది. అక్కడి నుంచి ఆగకుండా వెళ్లిన లారీ గరుడాళ్వార్ సెంటర్ వద్ద డివైడర్పైకి దూసుకెళ్లి రోడ్డుకు అవతల వైపు దేవస్థానం బస్ షెల్టర్ వద్ద నిలిపి ఉన్న ఆటోను ఢీకొట్టింది. ఆటో పక్కనే ఉన్న విద్యుత్ స్తంభానికి తగలడంతో స్తంభం కాస్తా విరిగిపోయింది. ఈ ప్రమాదంలో ఆటోలో నిద్రిస్తున్న డ్రైవర్ వెంకటేష్కు గాయాలయ్యాయి. అలాగే రెండు కార్లు, ఆటో ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదానికి లారీ డ్రైవర్ మద్యం మత్తే కారణమని పోలీసులు గుర్తించారు. వర్షం వల్ల తప్పిన పెను ప్రమాదం.. క్షేత్రంలో వివాహాలు జరిగే ప్రతిసారి రహదారులు పెళ్లి జనాలతో రద్దీగా ఉంటాయి. అయితే బుధవారం రాత్రి కుండపోత వర్షం కురవడంతో పెళ్లివారు ఎవరూ రోడ్లపైకి రాలేదు. దాంతో ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదు. గురువారం ఉదయం విద్యుత్శాఖ అధికారులు, సిబ్బంది విరిగిపోయిన విద్యుత్ స్తంభాన్ని తొలగించి, కరెంటు సరఫరాను పునరుద్ధరించారు. ప్రమాదానికి కారణమైన కాకినాడకు చెందిన లారీ డ్రైవర్ చెరుకూరి లక్ష్మీపతిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై టి.సుధీర్ తెలిపారు. -
ఉపాధ్యాయులకూ పరీక్షే
● విద్యార్థి సామర్థ్యానికి మించి ప్రశ్నలు ● సిలబస్లో లేని ప్రశ్నలు ఇస్తుండటంతో తలలు పట్టుకుంటున్న ఉపాధ్యాయులు ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఎఫ్ఏ–1 పరీక్షల గురించి ఆరా తీస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..’ ‘ఎఫ్ఏ1 పరీక్షల స్ట్రాటజీని చూసి హార్వర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీల డీన్స్ సైతం ఆశ్చర్యపోయి ముక్కున వేలేసుకున్న వైనం..’ ఇవీ ఉపాధ్యాయుల, ఉపాధ్యాయుల సంఘాల వాట్సాప్ గ్రూపుల్లో, వాట్సాప్ ఛానల్స్లో చక్కర్లు కొడుతున్నాయి. నూజివీడు : కూటమి ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వ విద్యారంగాన్ని భ్రష్టుపట్టిస్తోందన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికే పాఠశాలల విలీనం చేసి తొమ్మిది రకాల పాఠశాలలను తీసుకురావడమే కాకుండా క్లస్టర్ విధానంను తీసుకువచ్చి అస్తవ్యస్తం చేసిన ప్రభుత్వం ఇప్పుడు పరీక్షల తీరు చూస్తుంటే పరిస్థితులు అత్యంత దారుణంగా ఉందని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సిలబస్లో చెప్పిన పాఠాలు ఒకటైతే పరీక్షల్లో ఇస్తున్న ప్రశ్నలు వేరేగా ఉన్నాయని, గణితం గాని, ఇంగ్లిష్ గాని సిలబస్లో పాఠ్యపుస్తకంలో చెప్పిన లెక్కలు నుంచి ఒక్క ప్రశ్న కూడా ఇవ్వలేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఇలా ఇస్తే విద్యార్థులు ఎలా పరీక్షలు రాయగలరని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ పరీక్షలు చూస్తుంటే విద్యార్థులకు పెట్టినట్లు లేదని, ఉపాధ్యాయులకు పరీక్షలు అన్నట్లు ఉందని వాపోతున్నారు. ఈనెల 11 నుంచి నిర్వహిస్తున్న ఎఫ్ఏ–1 పరీక్షల తీరు, ప్రశ్నాపత్రాల రూపొందించిన విధానం పరిశీలిస్తే ఉపాధ్యాయులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు మార్కులు రాకుండా ప్రభుత్వ పాఠశాలలను మరింత బలహీనం చేసేందుకే ఇలా చేస్తున్నారా అనే అనుమానాలను ఉపాధ్యాయులు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివించిన, ప్రభుత్వం నిర్ధేశించిన సిలబస్ ఒకటైతే ప్రశ్నాపత్రాలలో ఇచ్చింది మరొకటి కావడం గమనార్హం. దీనిపై ఉపాధ్యాయ వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనివల్ల చదివే పిల్లలు కూడా ఉపాధ్యాయులు చెప్పే ప్రశ్నలు చదివినా పరీక్షల్లో రావని చదవకుండా ఉండే అవకాశం ఉందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నాపత్రాలు తయారు చేసే వారు ఒకసారి ఆలోచించి చదివినవి, సిలబస్లోనుంచి ఇస్తే కనీసం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల చదువులు ముందుకు వెళ్తాయని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. అన్ని ప్రశ్నలు కూడా అప్లికేషన్ మెథడ్లో ఇవ్వడం వల్ల చదివే వాళ్లు కూడా చదవకుండా పోయే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. పరీక్షలనేవి విద్యార్థులు నేర్చుకున్న అంశాలను, వివిధ ప్రశ్నల ద్వారా అంచనా వేసే విధంగా ఉండాలే తప్ప వారి స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉండకూడదని అంటున్నారు. ఒకటో తరగతి విద్యార్థికి ఏప్రిల్ నెలలో నేర్చుకోబోయే సిలబస్లో ప్రశ్నలు ఆగస్టులో జరిగే యూనిట్ పరీక్షలు ఇవ్వడంపై ఉపాధ్యాయులు విస్మయానికి గురవుతున్నారు. పరీక్షల్లో ఇచ్చిన కొన్ని ప్రశ్నలు ఇలా.. ఒకటో తరగతి పిల్లలు ఇప్పుడిప్పుడే పాఠశాలలకు అలవాటు అవుతున్నారు. ఇంకా కొందరు పాఠశాలకు రావడానికి మొరాయిస్తున్నారు. వీరు ఇప్పుడిప్పుడే తెలుగు, ఇంగ్లిష్ అక్షరాలను గుర్తు పడుతున్నారు. అలాంటి పిల్లలకు ఇంగ్లిష్లో పేరాగ్రాఫ్ ఇచ్చి దానిని విని ఇంగ్లిష్లోని ప్రశ్నలకు సమాధానాలు రాయడం, పదాలు తయారు చేయడం చేయాలి. అలాగే మూడో తరగతి విద్యార్థి తెలుగులో పుస్తక సమీక్ష చేసి, ఆ సమీక్షను సమర్పణ చేయాలి. అలా చేసినప్పుడే వాటికి మార్కులు ఇవ్వాలి. మూడో తరగతి ఆంగ్ల భాష పరీక్షకు నాలుగో తరగతిలోని పాఠాల నుంచి ప్రశ్నలు ఇచ్చారు. ఎస్సీఈఆర్టీలో ప్రశ్నాపత్రాలు రూపొందించే వారికి విద్యార్థి స్థాయి, సామర్థ్యంపై కనీస అవగాహన ఉండటం లేదని ఉపాధ్యాయులు అభిప్రాయ పడుతున్నారు. ఉపాధ్యాయులను, విద్యార్థులను ఇబ్బంది పెట్టడానికి తప్ప ఈ పరీక్షలు దేనికి ఉపయోగమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
మన్యం వీరుల పోరు అజరామరం
దేశం కోసం ప్రాణాలర్పించిన ధీరులుగిరిజన స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలను గుర్తించి ప్రభుత్వం వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలి. కేఆర్పురం ఐటీడీఏకు కారుకొండ సుబ్బారావు పేరు పెట్టాలి. గిరిజన స్వాతంత్య్ర పోరాట యోధులకు తగిన గౌరవం ఇవ్వాలి. – అయినారపు సూర్యనారాయణ, ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు నేను గిరిజన వీరుడు కారుకొండ సుబ్బారెడ్డి ముని మనవడను. మాది పోలవరం మండలం కోండ్రుకోట. తెల్ల దొరలపై మా తాత చేసిన పోరాటాన్ని మా పెద్దలు మాకు ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. సమరయోధుల కుటుంబానికి చెందిన మాకు ఎటువంటి గుర్తింపు లేదు. ప్రభుత్వం ఇప్పటికై నా గుర్తించి మమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకోవాలి. – కారుకొండ అబ్బాయిరెడ్డి, కోండ్రుకోట బుట్టాయగూడెం: బ్రిటీష్ వారిపై తిరుగుబాటు చేసి ఉరి కొమ్మలకు వేలాడి ప్రాణాలు విడిచిన గిరిజన పోరాట వీరులు ఎందరో ఉన్నారు. వారి పోరాటాలు, త్యాగాలకు చారిత్రక ఆధారాలు లేకపోయినా ఆనాటి శిథిల భవనాల్లో ఆ జ్ఞాపకాలు నేటికీ సజీవంగానే ఉన్నాయి. ఆ అమర వీరులను దేశ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా స్మరించుకుందాం. వెలుగులోకి రాని వీరుల త్యాగం తెల్లదొరలను ఎదురించి ప్రాణాలు పోగొట్టుకున్న వారిలో నలుగురు అజ్ఞాత స్వాతంత్య్ర పోరాట వీరులు పశ్చిమ మన్యానికి చెందిన వారు ఉన్నారు. అల్లూరి సీతారామరాజుకి ముందే వీరు పోరాటం చేసి మృతి చెందినప్పటికీ ఆ గిరిజన వీరుల త్యాగాలు వెలుగులోకి రాలేదు. ఆ నలుగురు వీరులు కారుకొండ సుబ్బారెడ్డి, కుర్ల సీతారామయ్య, కుర్ల వెంకట సుబ్బారెడ్డి, గురుగుంట్ల కొమ్మురెడ్డి. వీరు 1858లో బ్రిటిష్ పాలనకు ఎదురు తిరిగి తమ ప్రాణాలను తృణప్రాయంగా విడిచినట్లు చరిత్ర తెలిసిన పూర్వీకులు చెబుతున్నారు. తిరుగుబాటులో కారుకొండ సుబ్బారెడ్డి కీలకం 1857లో యావత్ భారతదేశంలో స్వాతంత్య్ర సమరం ప్రారంభమైనప్పుడు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో బ్రిటీష్ వారిపై తిరుగుబాటు జరిగింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం కొరుటూరుకు చెందిన కొండరెడ్డి గిరిజన తెగకు చెందిన కారుకొండ సుబ్బారెడ్డి పోలవరం పరిసరాల ప్రాంతంతో పాటు బుట్టాయగూడెం నుంచి యర్నగూడెం వరకూ ఉన్న గిరిజన గ్రామాలకు జమిందారుగా ఉండేవారు. ఆయన స్వాతంత్య్ర సమరం జరుగుతున్న సమయంలో యర్నగూడెంలో ఆంగ్లేయులపై తిరుగుబాటు చేశాడు. ఆ సమయంలో గోదావరి దిగువ ప్రాంతంలో ఉన్న సుమారు 40 గ్రామాలతో బ్రిటీష్ వారిపై దండయాత్ర చేసి విజయం సాధించారు. సుబ్బారెడ్డికి ముఖ్య అనుచరుడిగా కుర్ల సీతారామయ్య ఉండేవారు. అలాగే గురుగుంట్ల కొమ్మురెడ్డి, అప్పటి తూర్పుగోదావరి జిల్లా కొండమొదలు గ్రామానికి చెందిన కుర్ల వెంకటరెడ్డి కలిసి తెల్లదొరలపై వీరోచిత పోరాటం చేశారు. ఆ సమయంలో సుబ్బారెడ్డి తలకు బ్రిటిష్ వారు రూ.2,500 వెల కట్టారు. చివరకు కొందరు గిరిజనులు వెన్నుపోటు పొడిచి కారుకొండ సుబ్బారెడ్డితోపాటు అతని అనుచరులను, మరికొందరు విప్లవ వీరులను 1858 జూన్ 11వ తేదీన బ్రిటీష్ వారికి పట్టించారు. 1858 అక్టోబర్ 7వ తేదీన కోర్టు విచారణ అనంతరం 8 మందిని అండమాన్ జైలుకు పంపారు. 35 మంది గిరిజన వీరుల్ని గుంటూరు దగ్గరున్న జైలులో యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. కారుకొండ సుబ్బారెడ్డి, కుర్ల సీతారామయ్యలను బుట్టాయగూడెంలో ఉరి తీశారు. మిగిలిన ఆరుగురిని పోలవరం సమీపంలో ఉన్న దివానం వద్ద ఉరి తీశారు. కారుకొండ సుబ్బారెడ్డి చేసిన పోరాటానికి కోపోద్రిక్తులైన బ్రిటీష్వారు సుబ్బారెడ్డి మరణించిన తర్వాత అతడి మృతదేహాన్ని చిన్న బోనులో పెట్టి రాజమండ్రి దగ్గర ఉన్న కోటగుమ్మం వద్ద ప్రజలు చూసేవిధంగా వేలాడదీశారు. స్వాతంత్య్రం రావడానికి కొన్నేళ్ల ముందు వరకూ కూడా సుబ్బారెడ్డి మృతదేహం కోటగుమ్మం వద్ద వేలాడుతూ ఉండేదని పాతతరం వారు చెబుతున్నారు. బ్రిటీష్ వారిపై తిరుగుబాటు చేసి ఉరి కొమ్మలకు వేలాడిన ఆ అమర వీరుల పోరు అజరామరం. పాత పోలవరంలో బ్రిటీష్ వారు స్వాధీనం చేసుకున్న రెడ్డిరాజుల భవనం శిథిలావస్థలో ఉన్న దృశ్యం బ్రిటీష్ వారిపై పోరాటం చేసి మరణించిన వీరుల గ్రామం కొరుటూరు ముంపునకు గురై శిథిలావస్థలో ఉన్న దృశ్యం తెల్లదొరలను గడగడలాడించిన మన్యం బిడ్డలు బ్రిటీష్ వారికి పోరాటయోధులను పట్టించిన వెన్నుపోటుదారులు 8 మంది వీరులను ఉరితీసిన బ్రిటీష్ పాలకులు -
తాగునీటి కోసం ధర్నా
మండవల్లి: మండవల్లిలోని స్టేషన్ రోడ్డులో తా గునీటి సమస్య పరిష్కరించాలంటూ గురువా రం జాతీయ రహదారిపై గ్రామస్తులు ధర్నాకు దిగారు. 20 రోజుల నుంచి కుళాయిల నుంచి తాగునీరు రావడం లేదని, తమను పట్టించుకునే నాథుడే లేడంటూ మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. సర్పంచ్, అధికారులు వచ్చి సమాధానం చెప్పాలంటూ భీష్మించారు. కొద్దిసేపటికి పోలీసులు వచ్చి వారికి నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు. తమ గోడు ఎవరూ పట్టించుకోవడం లేదని, ఎన్ని రోజులు ఓపిక పట్టాలని మహిళలు పోలీసుల వద్ద వాపోయారు. ఏలూరు(మెట్రో): ఏలూరు కలెక్టరేట్లో గురువారం వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా స్కూలింగ్–బిల్డింగు బ్లాక్స్ అనే అంశంపై విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ వెట్రిసెల్వి వర్క్షాప్ నిర్వహించారు. దేశం మొదటి స్థానంలో నిలిచే లక్ష్యంగా అన్ని రంగాల్లో నిరంతర లక్ష్యాలు, నిర్దేశం, సాధన చాలా అవసరమన్నారు. మానవ వనరుల అభివృద్ధి యువత, వయోజనులు, మహిళలపై నిర్మించబడి ఉందన్నారు. ఏలూరు(మెట్రో): ఏలూరు జిలాల్లో నీటి నిర్వహ ణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి సీఎం చంద్రబాబునాయుడుకి తెలియజేశారు. నీటి నిర్వహణ, భూగర్భ జలాల పెంపు, నీటి సంరక్షణ, తదితర అంశాలపై రాష్ట్రంలోని కలెక్టర్లు, సాగునీటి సంఘాల, ప్రాజెక్ట్ సంఘాల ప్రతినిధులు, జలవనరుల శాఖ అధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్, అధికారులు హాజరయ్యారు. చాట్రాయి: రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో మండలంలోని తమ్మిలేరు రిజర్వాయర్ ప్రాజెక్టుకు స్వల్పంగా వరద నీరు చే రుతోంది. మండలంలో బుధవారం రాత్రి నుంచి భారీ వర్షం కురవడంతో చెరువులు, కాలువల్లోని నీరు రిజర్వాయర్ ప్రాజెక్టులోకి చేరుతుంది. మండలంలో 55.5 మిల్లీమీటర్ల వర్షపాత నమోదయ్యింది. 850 క్యూసెక్కుల వరద నీరు చేరుతుందని, ప్రాజెక్టు నీటిమట్టం 255 అడుగులు కాగా ప్రస్తుతం 233 అడుగులు ఉందని టీఆర్పీ అధికారులు తెలిపారు. గణపవరం: మహిళలకు ఉచిత బస్సు పథకంతో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఆటోవాలాల పొట్ట కొట్టనుందని, ఈ పథకాన్ని వెంటనే విరమించుకోవాలని గణపవరం మండల ఆటో వర్కర్ల యూనియన్ నాయకులు గళమెత్తారు. గురువారం గణపవరం ఏరియా స్నేహ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. గణపవరం, సరిపల్లె, బువ్వనపల్లి గ్రామాల్లో ఆటోలతో నిరసన ప్రదర్శనలు చేశారు. బస్టాండు నుంచి ఆటో డ్రైవర్లు నినాదాలు చేసుకుంటూ ప్రదర్శనగా గణపవరం సెంటర్లోని మూడు రోడ్ల కూడలి వద్దకు చేరుకుని మానవహారంగా నిలిచారు. ఈ సందర్భంగా యూనియన్ నా యకులు మాట్లాడుతూ తాము ఆటోలు నడుపుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నామని, ప్రతి నెలా ఈఎంఐలు చెల్లించడమే గగనంగా ఉందన్నారు. ఇలాంటి పరిస్థితిలో ఉచిత బస్సు ప్రయాణంతో జీవనం మరింత కష్టం కానుందని వాపోయారు. భీమవరం: జిల్లాలో గురువారం ఉదయం వర కు 20 మండలాల్లో సగటున 90 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా తణుకులో 236.6 మి.మీ., అత్యల్పంగా మొగల్తూరులో 8.6 మి.మీ. వర్షం పడింది. మండలాల వారీ గా వర్షపాతం ఇలా.. తాడేపల్లిగూడెంలో 162.2 మి.మీ, పెంటపాడులో 189 మి.మీ. కురిసింది. -
వాగు ప్రవాహానికి కొట్టుకుపోయిన రోడ్డు
బుట్టాయగూడెం: గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా జీలుగుమిల్లి మండలం వంకవారిగూడెం సమీపంలోని రోడ్డు గురువారం ఉదయం కొట్టుకుపోయింది. దీనితో పై గ్రామాలకు రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు వెంటనే స్పందించి రహదారి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. అత్తిలి: మండలంలోని తిరుపతిపురం, వరిఘేడు ప్రాంతాల్లో నీట మునిగిన పంట పొలాలను గురువారం కలెక్టర్ సీహెచ్ నాగరాణి పరిశీలించారు. రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో బుధవారం ఒక్కరోజు 1799.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. దీంతో సుమారు 400 నుంచి 500 ఎకరాల వరకు పొలాలు ముంపు బారిన పడ్డాయని తెలిపారు. -
● విద్యార్థులతో మట్టి చాకిరీ
● అంతర్రాష్ట్ర బస్సుల్లో అనుమతి నిరాకరణ ● 63 రూట్లకే ఉచితం పరిమితం ● కండిషన్లో లేని బస్సుల్లో ప్రయాణంపై ఆందోళన తాడేపల్లిగూడెం: వెంకట్రామన్నగూడెంలోని ఉద్యా న వర్సిటీలో డిప్లమో హార్టీకల్చర్, డిప్లమో ల్యాండ్ స్కేపింగ్, నర్సరీ మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాలకు తుది విడత స్పాట్ కౌన్సెలింగ్ను ఈనెల 20న నిర్వహించనున్నారు. ఈ మేరకు రిజిస్ట్రార్ బి.శ్రీనివాస్ ప్రకటన విడుదల చేశారు. నాలుగు ప్రభుత్వ, మూడు గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి గతంలో దరఖాస్తు చేసుకున్నా, కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఉద్యాన వర్సిటీ ప్రాంగణంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు ధ్రువీకరణ పత్రాలతో స్వయంగా హాజరుకావాలని సూచించారు. ఏలూరు (ఆర్ఆర్పేట): స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ కార్యాలయంలో గవర్నర్ అబ్దుల్ నజీర్తో జరిగే మీట్ ఎట్ కార్యక్రమానికి ఏలూరు జిల్లా నుంచి నాగేంద్ర సింగ్ ఎంపికయ్యారు. నాగేంద్రసింగ్ ఏలూరు శ్రీరామ్నగర్లోని ఎంపీయూపీ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు. అంతర్జాతీయస్థాయి దివ్యాంగుల క్రికెట్ పోటీలకు అంపైర్గా కూడా సేవలందిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం గవర్నర్ ఇచ్చే తేనీటి విందులో పాల్గొని గవర్నర్ నుంచి సన్మానం అందుకోనున్నారు. హాస్టల్ ప్రాంగణాన్ని మట్టితో చదును చేస్తూ.. చెత్తను ఏరుతూ.. చెత్తను కాల్చుతున్న విద్యార్థులు ఉచిత ప్రయాణానికి కొర్రీలు ఏలూరు (ఆర్ఆర్పేట): ఎన్నికల హామీ ఉచిత బస్సు ప్రయాణం శుక్రవారం అమలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపు ఏడాదిన్నర నుంచి ప్రతిపక్షాలు, మహిళల నుంచి వస్తున్న వ్యతిరేకత తట్టుకోలేక నిర్ణయం తీసుకోక తప్పలేదు. రాష్ట్రంలో ఈ మూల నుంచి ఆ మూల వరకూ ఉచితంగా బస్సు ప్రయాణమని చెప్పిన సర్కారు ఇప్పుడు అనేక ఆంక్షలు పెట్టింది. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పథకాన్ని అమలు చేశాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మాత్రం ఏడాదిన్నరకు ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఆయా రాష్ట్రాల్లో అన్ని బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికై నా ప్రయాణించేలా అనుమతులిచ్చారు. రాష్ట్రంలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మాత్రమే ఉచిత ప్ర యాణమంటూ పెద్ద బాంబు పేల్చారు. జిల్లాలో ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు డిపోల నుంచి మొత్తం 309 బస్సులు నిత్యం ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. ఈ బస్సుల్లో మహిళలు ఎక్కడానికి 177 బస్సుల్లో మాత్రమే అనుమతిస్తారు. ఉచిత బస్సు ప్రయాణంలో విధించిన కొర్రీల్లో భాగంగా జిల్లా మహిళలకు అంతర్రాష్ట్ర రూట్లలో ప్రయాణించే బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించరు. ఈ మేరకు జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతి ఉండదు. ఏలూరు జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్రంలోని సత్తుపల్లి, అశ్వారావుపేట, భద్రాచలం వెళ్లే బస్సులు మొత్తం 14 ఉన్నాయి. ఈ బస్సులు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల మీదుగానే వెళతాయి. ఈ బస్సుల్లో తెలంగాణ సరిహద్దుల వరకూ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించవచ్చు. ప్రభుత్వం ఈ బస్సుల్లో అసలు ఉచిత ప్రయాణాన్ని అనుమతించేది లేదని స్పష్టం చేసింది. సగం మంది మహిళలకు దూరం ఏలూరు జిల్లా నుంచి నిత్యం ఆర్టీసీ బస్సులు 103 రూట్లలో తిరుగుతున్నాయి. వీటిలో ఉచిత బస్సు ప్రయాణం మాత్రం కేవలం 63 రూట్లకే పరిమితం చేశారు. ఏలూరు డిపో నుంచి మొత్తం 41 రూట్లలో ఆర్టీసీ బస్సులు తిరుగుతుండగా 23 రూట్లలో తిరిగే బస్సుల్లో మాత్రమే మహిళలకు అనుమతిస్తారు. జంగారెడ్డిగూడెం నుంచి 33 రూట్లలో తిరుగుతుండగా 22 రూట్లలో మాత్రమే ఉచిత ప్రయాణానికి అవకాశం ఉంటుంది. నూజివీడు డిపో నుంచి 29 రూట్లలో బస్సులు తిరుగుతుండగా వాటిలో 18 రూట్లలో మాత్రమే మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతి లభిస్తుంది. ఏలూరు జిల్లాలోని వివిధ డిపోల నుంచి ఆర్టీసీ బస్సుల్లో నిత్యం సుమారు 80 వేల మంది ప్రయాణిస్తుండగా వారి లో 40 శాతం మంది అంటే సుమారు 32 వేల మంది మహిళలు ఉంటారని ఆర్టీసీ వర్గాలు తెలుపుతున్నాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం విధించిన షర తుల కారణంగా వీరిలో దాదాపు 50 శాతం అంటే 16 వేల మంది మహిళలకు ఉచిత బస్సు ప్ర యాణం అందని ద్రాక్షగానే మిగిలిపోనుంది.