breaking news
Eluru
-
జోరుగా చేపనారు ఉత్పత్తి
ఉంగుటూరు: రాష్ట్రంలోనే పేరుగాంచిన బాదంపూడి ప్రభుత్వ మత్స్య కేంద్రంలో చేపనారు ఉత్పత్తి జోరుగా సాగుతోంది. ఇక్కడ చేపనారు ఉత్పత్తి జూలై నుంచి ప్రారంభించి నవంబరు వరకు కొనసాగిస్తారు. ఈ ఏడాది చేపనారు ఉత్పత్తి లక్ష్యం 24 కోట్లుగా ప్రభుత్వం నిర్ధేశించగా జూలైలో 4 కోట్ల 40 లక్షలు చేపనారు ఉత్పత్తి పూర్తి చేశారు. రాహు, కట్ల, మ్రిగాలా, కామన్ రకాలు పిల్లలు ఇక్కడ ఉత్పత్తి చేస్తారు. ఉత్పత్తి చేసిన చేపనారు పిల్లలను కొవ్వలి, ఏలూరు, తణకు, కర్నూలు, గాజుల దిన్నె, మోటూరు, తదితర ప్రభుత్వ ఫారాలకు సరఫరా చేశారు. ఫారంలో ఒక ఫీల్ట్మేన్, ఒక ఫిషర్మేన్, ఇద్దరు కూలీలు పనిచేస్తున్నారు. రెండు అంగుళాలు ఉన్న చేపపిల్లలు ఫింగర్ లింగ్సు టార్గెట్ ఒక కోటిగా ఉంది. 90 లక్షలు ఇప్పటికే నిల్వ చేసి ఉంచారు. చైనీస్ విధానంలోనే ఉత్పత్తి చేపనారు ఉత్పత్తి చైనీస్ హేచరీస్లోనే ఉత్పత్తి చేయడం జరుగుతోంది. మేలుజాతి తల్లిచేపలను ముందుగానే సేకరించి చెరువుల్లో పెంచుతారు. వాటిలో ముందురోజు సాయంత్రం తల్లి చేపలు మగ, ఆడకు ఓవ సీస్ (తల్లి చేపలకు హర్మోన్) ఇంజక్షన్ ఇస్తారు. ఆ రెండు చేపలు సంయోగ పక్రియ ద్వారా గుడ్లును విడుదల చేస్తాయి. ఈరెండు బాహ్యఫలదీకరణ చెందిన గుడ్డు ఏర్పడుతాయి. ఇవి నీటిని షోచించుకుని ఉబ్బి ఉదయానికి గుడ్లు మధ్యలో స్పష్టమైన కేంద్రకుము ఏర్పడుతుంది. ఈ గుడ్లు తరువాత సమవిభజనతో అబివృద్ధి చెంది వివిధ దశలగా రూపాంతరం చెందుతూ స్పాన్గా తయారవుతుంది. బ్రీడింగును సాయంత్రం వేళలో నిర్వహిస్తారు. తరువాత రోజు ఉదయానికి గుడ్లు ఏర్పడతాయి. ఈ గుడ్లు మరుసటి రోజు సాయంత్రానికి ఒక వయస్సు కలిగిన స్పాన్గా ఉత్పత్తి అవుతాయి. ఇలా అభివృద్ధి చెందిన స్పాన్ మరో రెండురోజులు హేచరీ నందు ఉంచడం జరుగుతుంది. మెత్తంగా మూడురోజులు కలిగిన స్పాన్ను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. 6 గంటల సమయంలో చైనీస్ హేచరీలో వేస్తారు. ఇలాచేపనారు ఉత్పత్తిచేసి ప్రభుత్వ ఫారాలకు సరఫరా చేస్తారు. రాష్ట్రంలోనే ప్రసిద్ధి గాంచింది రాష్ట్రంలోనే పేరు గాంచిన ఈ చేపల ఉత్పత్తి కేంద్రానికి అనుబంధంగా శిక్షణా కళాశాల నడుస్తోంది. ఇందులో మూడు నెలలు కోర్సు ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇక్కడ చదువుకున్న వారికి ఫిషర్మేన్ ఇతర ప్రభుత్వ ప్రైవేట్ ఫారాల్లో పోస్టులు కూడా చేస్తున్నారు. అందువల్ల ఈశిక్షణా కేంద్రానికి ఉమ్మడి రాష్ట్రంలోనే పేరుంది. కాగా బాదంపూడి మత్య్స కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని పలువురు కోరుతున్నారు. ఈ క్షేత్రంలో నూతన భవనాలు లేకపోవడంతో తల్లి చేపలు పెంచడంలేదు. సమయానికి కొనుగోలు చేసి కాలం వెళ్లదీస్తున్నారు. తగినంతమంది సిబ్బంది లేకపోవడం, జిల్లా, రాష్ట్ర స్థాయి మత్స్య శాఖ అధికారుల పర్యవేక్షణా లోపం కూడా ఇక్కడ ఉంది. ఈ ఏడాది ఉత్పత్తి లక్ష్యం 24 కోట్లు ఇప్పటివరకు 4.40 కోట్ల ఉత్పత్తి పూర్తి ఉత్పత్తి చేసిన చేపనారు ప్రభుత్వ ఫారాలకు సరఫరా -
రేషన్ బియ్యం పట్టివేత
ముసునూరు: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుకుని సీజ్ చేసినట్లు నూజివీడు సివిల్ సప్లయి స్పెషల్ డిప్యూటీ తహసీల్దార్ గుండుబోయిన వెంకటేశ్వరరావు తెలిపారు. బాపులపాడు మండలం కాకులపాడు ప్రాంతం నుంచి వాహనంలో మండలంలోని గుళ్ళపూడి మీదుగా అక్రమంగా తరలిస్తున్న 41 క్వింటాళ్ల రేషన్ బియ్యంను ఏలూరు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ఆధ్వర్యంలో గురువారం తెల్లవారుజామున దాడి చేసి పట్టుకున్నామన్నారు. బియ్యాన్ని తరలిస్తున్న కడలి లక్ష్మణరావు, ధనికొండ గోపిరాజు, బండారు నాగబాబు, కొల్లి కాసులు, షేక్ ఖాసింబాబులపై ముసునూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. నేడు ఏలూరులో కోకో రైతుల రాష్ట్ర సమావేశం ఏలూరు (టూటౌన్): ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర సమావేశం ఏలూరు పవర్పేటలోని అన్నే భవనంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కోకో గింజల ధర కిలోకు రూ. 500 నుంచి రూ. 350కు క్రమంగా తగ్గించివేయడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. కోకో రైతుల సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని శ్రీనివాస్ తెలిపారు. బైక్ దొంగల అరెస్టు ఆకివీడు: ఇద్దరు దొంగలను పట్టుకుని వారి నుంచి తొమ్మిది మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆకివీడు రూరల్ సీఐ జగదీశ్వరరావు, ఎస్సై హనుమంతు నాగరాజు తెలిపారు. నిందితులు కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం ఎండపల్లి గ్రామానికి చెందిన కూనసాని నాగాంజనేయులు, ఆకివీడు మండలం చినకాపవరం గ్రామానికి చెందిన కుప్పల రమేష్లను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచామన్నారు. డీఎస్పీ జయ సూర్య పర్యవేక్షణలో ఉండి ఎస్సై నజీరుల్లా, విజయ్, శివ, శంకర్, రత్నంల సహకారంతో కేసును ఛేదిచామన్నారు. 22న సీజీఆర్ఎఫ్ క్యాంపు కోర్టుసీజీఆర్ఎఫ్ చైర్పర్సన్ సత్యనారాయణ సాక్షి, విశాఖపట్నం: ఏపీఈపీడీసీఎల్ శ్రీకాకుళం, అనకాపల్లి, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, పాడేరు సర్కిళ్ల విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 11 నుంచి క్యాంపు కోర్టులు నిర్వహించనున్నట్లు విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (సీజీఆర్ఎఫ్) చైర్మన్ విశ్రాంతి జడ్జి బి.సత్యనారాయణ వెల్లడించారు. ఇందులో భాగంగా ఈనెల 22న భీమవరం డివిజన్ ఉండి సెక్షన్ కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు జరిగే క్యాంపు కోర్టులో వినియోగదారులు పాల్గొనవచ్చని తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, హెచ్చుతగ్గులు, బిల్లుల సమస్యలు, కొత్త సర్వీసుల జారీలో జాప్యం తదితర సమస్యలపై వినియోగదారులు నేరుగా సీజీఆర్ఎఫ్ కమిటీకి తెలియజేయవచ్చన్నారు. సదస్సుల్లో చైర్పర్సన్ బి.సత్యనారాయణతో పాటు సీజీఆర్ఎఫ్ కమిటీ సభ్యులు ఎస్.రాజబాబు, ఎస్.సుబ్బారావు, ఎన్.మురళీకృష్ణ పాల్గొననున్నారు. -
వారం రోజుల తర్వాత ఇంటికి మృతదేహం
కై కలూరు: చేపల లోడ్తో వెళుతూ మధ్యప్రదేశ్ రాష్ట్ర జబ్బల్పూర్ వద్ద వ్యాన్ బోల్తా పడటంతో పందిరిపల్లిగూడెంకు చెందిన వ్యాన్ డ్రైవర్ కర్ణం చిరంజీవి చంద్రమౌళి (27) జూలై 31న మరణించాడు. ఇదే ప్రమాదంలో నత్తగుళ్ళపాడుకు చెందిన క్లీనర్ దావీదుకు తీవ్ర గాయాలయ్యాయి. ఫంగస్ చేపల లోడుతో వెళుతున్నా వ్యాన్ అక్కడ డివైడర్ను ఢీకొట్టడంతో బోల్తా పడింది. విషయం తెలుసుకుని కుటుంబ సభ్యులు వెళ్లగా పోస్టుమార్టం అనంతరం చిరంజీవి మృతదేహాన్ని బుధవారం గ్రామానికి తీసుకొచ్చారు. చిరంజీవికి భార్య, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. రాష్ట్ర వడ్డీ సాధికారిత కమిటీ చైర్మన్ బలే ఏసురాజు, పలువురు కొల్లేరు పెద్దలు చిరంజీవి భౌతికకాయానికి నివాళి అర్పించారు. చిరంజీవి మరణంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. మధ్యప్రదేశ్లో వ్యాన్ బోల్తా.. కొల్లేరు వాసి మృతి -
ఆంధ్రా చేపల సాగు అదుర్స్
జార్ఖండ్ ఆక్వా రైతుల కితాబు కై కలూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొల్లేరు ప్రాంతంలో ఆక్వా సాగు ఆచరణాత్మకంగా ఉందని జార్ఖండ్ రాష్ట్ర ఔత్సాహిక చేపల రైతులు కితాబిచ్చారు. మూడు రోజుల క్షేత్ర స్థాయి పరిశీలనలో భాగంగా కై కలూరు పరిసర ప్రాంతాల్లో రైతుల బృందం గురువారం పర్యటించింది. కై కలూరు మత్స్యశాఖ సహాయ సంచాలకులు బి.రాజ్కుమార్, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి సీహెచ్.గణపతి ఆక్వా సాగు మెలకువలను రైతులకు వివరించారు. ఆటపాక గ్రామంలో ముదునూరి సీతారామరాజు చేపల చెరువును పరిశీలించి సాగు విధానాలను రైతుల నుంచి సేకరించారు. కై కలూరులో పలు ఆక్వా మందుల దుకాణాలను సందర్శించి చేపల సాగులో ఎదురవుతున్నా వ్యాధులు, ఎటువంటి మందులు వినియోగిస్తారు అనే విషయాలు నమోదు చేసుకున్నారు. అక్కడ నుంచి ఆచవరంలో చేపల ప్యాకింగ్ చేసే విధానాన్ని పరిశీలించారు. చివరిగా మండవల్లి మండలం కొర్లపాడులో కొరమేను చేపల సాగును పరిశీలించి రైతు నుంచి సాగు పద్ధతులు, పెట్టుబడి, కొరమేను విత్తనం, మార్కెట్లో రేటు, నీటి వనరులు వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. బృందానికి నాయకత్వం వహించిన జార్ఖండ్ ఫిషరీష్ ఫిల్డ్ ఆఫీసర్ ప్రశాంత్కుమార్ దీపక్ మాట్లాడుతూ నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు(ఎన్ఎఫ్డీఏ), హైదరాబాదు సౌజన్యంతో జార్ఖండ్ ప్రభుత్వ మత్స్య, పశుసంవర్థక, కోఆపరేటివ్శాఖ ఆధ్వర్యంలో 15 మంది రైతులు బృందం వచ్చామన్నారు. ఇక్కడ సేకరించిన ఆక్వా సాగు పద్ధతులను జార్ఖండ్ ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. శుక్రవారం కొల్లేరు ప్రాంతంలో మరింతగా చేపల సాగు పద్ధతులను తెలుసుకుని, శనివారం మచిలీపట్నం వెళతామన్నారు. కార్యక్రమంలో గ్రామ మత్స్యశాఖ సహాయకుడు గోవింద్ తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా శ్రీవారి పవిత్రోత్సవాలు ప్రారంభం
ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య పవిత్రోత్సవాలు గురువారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందుగా ఆలయ యాగశాలలో అర్చకులు విష్వక్సేనపూజ, పుణ్యహవాచనము, అజాప్రదీపారాధన, వాస్తుపూజ, మృత్సంగ్రహణ, అలాగే వాస్తు హోమం, పవిత్ర శుద్ధిని జరిపారు. అనంతరం అంకురార్పణను నిర్వహించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అంతక ముందు అర్చకులు, పండితులు పుట్టమన్నును తెచ్చి సిద్ధంగా ఉంచిన పాలికల్లో పోశారు. ఆ తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణల నడుమ నవధాన్యాలను పాలికల్లో ఉంచారు. దాంతో అంకురార్పణ కార్యక్రమం ముగిసింది. ఆలయంలో ఏడాది పొడవునా తెలిసీ, తెలియక జరిగిన తప్పుల ప్రాయఃశ్చిత్తం నిమిత్తం ఈ పవిత్రోత్సవాలను జరపడం సంప్రదాయంగా వస్తోంది. పంట కాలువకు గండి ఇరగవరం: కాకిలేరు నుంచి కొయ్యేటిపాడు మీదుగా వెళ్లే రాపాక చానల్ పంట కాలువకు బుధవారం సాయంత్రం కురిసిన వర్షానికి గండి పడింది. దీంతో వర్షపు నీరు పొలాల్లోకి చేరడంతో రైతులు ఆందోళన చెందారు. ఇరిగేషన్ అధికారులకు సమాచారం ఇవ్వగా రాపాక చానెల్ నీరు నిలుపుదల చేసి గండి పూడ్చారు. కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూటమి నేతలు పనులు పంచుకుని వేసవిలో కాలువ ఆధునికీకరణ పనులు నాసిరకంగా చేశారని, పర్యవేక్షించాల్సిన అధికారులు ఆలసత్వం వహించడంతో ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోయారు. దీనిపై మార్టేరు ఇరిగేషన్ జేఈ జై శంకర్ని వివరణ కోరగా కాలువను ఆధునీకరిస్తు ఉండగా రైతులు తమ దృష్టికి తీసుకురాకుండా తూర ఏర్పాటు చేసుకున్నారని, దాని చుట్టూ మట్టి నెరలు ఏర్పడ్డాయని, అవి ఇప్పుడు వర్షానికి కరిగిపోయి గండిగా ఏర్పడిందని, మరమ్మతులు చేసినట్లు చెప్పారు. -
కూటమి ప్రభుత్వంలో బీసీలకు అన్యాయం
జంగారెడ్డిగూడెం : కూటమి ప్రభుత్వంలో బీసీలకు తీరని అన్యాయం జరుగుతోందని వైఎస్సార్సీపీ బీసీ నాయకులు, బీసీ ప్రజాప్రతినిధులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం స్థానిక పీపీఎన్ చంద్రరావు స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన లక్ష్మి, పట్టణ వైఎస్సార్సీపీ మాజీ అధ్యక్షుడు, కౌన్సిలర్లు పీపీఎన్చంద్రరావు, చిటికెల అచ్చిరాజు, చనమాల శ్రీనివాస్, బత్తిన చిన్న, భావన రుషి తదితరులు మాట్లాడారు. 50 సంవత్సరాలకు బీసీలకు పింఛన్ ఇస్తానని చంద్రబాబు మోసం చేశారని ధ్వజమెత్తారు. తల్లికి వందనం అందరికీ ఇవ్వలేదన్నారు. బీసీలను ఆకాశానికెత్తేస్తానని కల్లబొల్లి మాటలు చెప్పి చంద్రబాబు మరోసారి మోసం చేశారన్నారు. 2014లో కూడా బీసీలకు ప్రాతినిధ్యం లేదని, ప్రాధాన్యత సీట్లు కూడా ఇవ్వలేదన్నారు. బీసీ మహిళలకు నెలకు రూ.1500 ఇస్తానని చెప్పి ఇవ్వలేదని, బీసీల్లో చేతివృత్తులకు రుణం ఇస్తామని మొండి చేయి చూపించారన్నారు. హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక చేతులు ఎత్తేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. పవన్ కళ్యాణ్ కూడా నిలకడలేని మనస్తత్వం అని, పొంతనలేని మాటలు మాట్లడతారని విమర్శించారు. ఈవీఎంల అక్రమాలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 53 శాతం ఉన్న బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటుందన్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ అంటే హత్యలు, అత్యాచారాలు, అవినీతి, అరాచకాలు, తప్పుడు ప్రచారాలు, తప్పుడు కేసులు పెట్టడమేనా అని ప్రశ్నించారు. చేనేత కార్మికులకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. లోకేష్ మంగళగిరిలో చేనేత కార్మికులకు చేసింది ఏమీ లేదని మండిపడ్డారు. పథకాల అమలు జగన్కే సాధ్యం మాటిస్తే మడమ తిప్పని వైఎస్ జగన్మోహన్రెడ్డికే పథకాలు అమలు సాధ్యమని వైఎస్సార్ సీపీ నేతలు పేర్కొన్నారు. గత వైఎస్సార్ సీపీ పాలనలో బీసీలకు పట్టం కట్టారని, డీసీఎంఎస్, డీసీసీబీ చైర్మన్లు, ఎమ్మెల్సీలు ఆరుగురు, రాజ్యసభ సభ్యుల నలుగురికి పదవులు కల్పించారన్నారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పదవిని బీసీ మహిళకు కేటాయించడంతో జగన్మోహన్రెడ్డి బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యత తెలుస్తుందన్నారు. ఒక్క జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలోనే బీసీలకు న్యాయం జరిగిందన్నారు. చేనేత సొసైటీలకు నూలు, రంగులు సబ్సిడీపై ఇవ్వాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎల్.వెంకటేశ్వరరావు, కేమిశెట్టి మల్లిబాబు, చిప్పాడ వెంకన్న, నేట్రు గణేష్, పెసరగంటి త్రిమూర్తులు, పెప్సీ శ్రీను, చిటికెల అచ్చిరాజు, ఆదినారాయణ, మాధవ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
స్నాతకోత్సవానికి నిట్ సిద్ధం
తాడేపల్లిగూడెం: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఏపీ నిట్) ఏడవ స్నాతకోత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 9వ తేదీ ఉదయం నిట్లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో ఈ వేడుక జరుగనుంది. ఈ వేడుకలో 2021–25 బ్యాచ్ విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేయనున్నారు. ముఖ్యఅతిథిగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రెసిడెంటు వి.రాజన్న హాజరవుతున్నారని ఇన్చార్జి డైరెక్టర్ డాక్టర్ ఎన్వీ.రమణరావు తెలిపారు. రవీంద్ర కళాభారతి ఆడిటోరియంలో అవసరమైన ఏర్పాట్లు చేశారు. 2015లో ఏపీ నిట్ ఏర్పాటుకాగా, ఇప్పటి వరకు నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సును ఏడు బ్యాచ్ల విద్యార్థులు పూర్తి చేసుకున్నారు. ఏడో స్నాతకోత్సవంలో 506 మంది బాలురు, 161 మంది బాలికలకు డిగ్రీలు పట్టాలు ప్రదానం చేస్తారు. వీరితో పాటు పీహెచ్డీ పూర్తి చేసిన 29 మంది పరిశోధక విద్యార్థులకు డాక్టరేట్ పట్టాలను అందచేయనున్నారు. సంస్థలో మొత్తం ఎనిమిది కోర్సులను నిర్వహిస్తుండగా ఆయా కోర్సుల్లో అత్యధిక గ్రేడ్ పాయింట్లు సాధించిన ఒక్కొక్క విద్యార్థి చొప్పున మొత్తం ఎనిమిది మంది విద్యార్థులకు బంగారు పతకం అందిస్తారు. స్నాతకోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని నిట్ అకడమిక్ డీన్ డాక్టర్ ఎన్.జయరామ్ తెలియచేశారు. బంగారు పతకాలు అందుకొనేది వీరే బయో టెక్నాలజీ – శశాంక్, కెమికల్ ఇంజనీరింగ్ –సంగెపు అభినవ్, సివిల్ ఇంజనీరింగ్ – తమ్ము హరిత, సీఎస్ఇ– కలిదిండి పవన్ తేజ సత్యవర్మ, ఈఈఈ– ఆదిత్య ప్రతాప్ సింగ్, ఈసీఇ– చిత్తిడి ధనుషాలక్ష్మి దుర్గ, మెకానికల్ ఇంజనీరింగ్ – వుడుమూడి ప్రియాంక, ఎంఎంఇ– జయస్మిత కే ప్రధాన్ బంగారు పతకాలు అందుకుంటారు. బ్యాచ్లో అత్యధిక గ్రేడ్పాయింట్లు సాధించిన కలిదిండి పవన్ తేజ సత్యవర్మ ఇనిస్టిట్యూట్ తరపున కోర్సు వారీగానే రెండు బంగారు పతకాలను అందుకోనున్నారు. -
ట్రావెల్ బస్సును ఢీకొన్న లారీ
ఒకరి మృతి, బస్సు డ్రైవర్కు గాయాలు భీమడోలు: పొలసానిపల్లి ఫ్లై ఓవర్ వంతెనపై బుధవారం ఆర్ధరాత్రి ప్రైవేటు ట్రావెల్ బస్సును లారీ ఢీకొట్టిన ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అనకాపల్లికి చెందిన కె.గణేష్ (28) కుటుంబ పోషణ నిమిత్తం నెల్లూరులోని ఓ రైస్ మిల్లులో కూలీగా పని చేస్తున్నాడు. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో స్వగ్రామంలోని కుటుంబ సభ్యులను చూసేందుకు గణేష్, తులసి ప్రైవేటు ట్రావెల్ బస్సు టికెట్ను రిజర్వేషన్ చేయించుకున్నాడు. బుధవారం రాత్రి నెల్లూరు నుంచి అనకాపల్లికి బస్లో వెళ్తుండగా మార్గమధ్యమైన పొలసానిపల్లి ఫ్లై ఓవర్ వంతెన వద్దకు వచ్చేసరికి ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా లారీని నడుపుతూ బస్సును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ వెనుక సీటులో కూర్చుని నిద్రిస్తున్న కె.గణేష్ రోడ్డుపై పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్కు కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులను హైవే అంబులెన్స్ సిబ్బంది ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కె.గణేష్ మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఈ ప్రమాదంలో బస్సు ముందుభాగం దెబ్బతింది. ఈ బస్సులో 30 మంది ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగిన వెంటనే వారంతా బెంబేలెత్తిపోయారు. అదృష్టవశాత్తూ వారికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. భీమడోలు ఎస్సై వై.సుధాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జరిమానా భీమవరం: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన వ్యక్తులకు కోర్టు జరిమానా విధించినట్లు సీఐ జి కాళీచరణ్ చెప్పారు. భీమవరం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేడ్కర్ సెంటర్, పద్మాలయ థియేటర్, బీవీ రాజు విగ్రహం ఏరియాల్లో మద్యం సేవించి వాహనాలు నడుతున్న ఆరుగుర్ని అరెస్ట్ చేసి భీమవరం, స్పెషల్ జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ వద్ద హాజరుపర్చగా రూ.10 వేల చొప్పున జరిమానా విధించారన్నారు. బహిరంగంగా మద్యం సేవిస్తున్న ముగ్గురికి రూ.500 చొప్పున జరిమానా విధించారని చెప్పారు. -
●ఇంటికి వెళ్లే దారేది!
ఏజెన్సీప్రాంతంలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దొరమామిడి, అలివేరు, లంకపాకల, ఎర్రాయిగూడెం, అంతర్వేదిగూడెం, కామవరం, తదితర గ్రామాల్లో భారీగా వర్షం కురవడంతో కొండవాగులు పొంగిపొర్లాయి. చింతకొండ వాగుతోపాటు రెడ్డిగణపవరం సమీపంలో ఉన్న జల్లేరువాగు పొంగి పొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సాయంత్రం సమయానికి పనులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు, కూలీలు, రైతులు ఇంటికి చేరే మార్గం లేక జల్లేరు వాగుకు ఇరువైపులా నిలబడిపోయారు. రాత్రి వరకూ వాగులు పొంగుతూనే ఉన్నాయి. – బుట్టాయగూడెం -
రైతుల భూములతో ‘కూటమి’ వ్యాపారం
ఏలూరు (ఆర్ఆర్పేట): రైతుల భూములతో రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారం చేస్తోందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతా మోహన్ విమర్శించారు. గురువారం ఏలూరు నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా 70 వేల ఎకరాలు తీసుకుందని మండిపడ్డారు. రైతుల భూములతో, రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారం చేస్తోందని, ఒకాయన బయట రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖులకు ఫోన్లు చేస్తూ మీకు 100 ఎకరాలు ఇస్తాం.. మాకేం ఇస్తారు అని అడుగుతున్నారన్నారు. భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరగలేదని, రైతులను దగా చేశారని, ఒక రైతు 90 ఎకరాలు ఇచ్చాడని, ఎందుకిచ్చావయ్యా అని అడిగితే, మా ఖర్మకొద్దీ ఇచ్చామని బాధతో వాపోయాడని తెలిపారు. అభివృద్ధి కుంటుపడింది రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, ఏడాదిన్నరలోనే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందని చింతా మోహన్ అన్నారు. గ్రామాల్లో పరిస్థితులు చాలా బలహీనంగా ఉన్నాయని, వీధిలైట్లు, రోడ్లు వేసుకునేందుకు డబ్బులేక, సర్పంచ్లు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని చెప్పారు. లిక్కర్ అమ్మకాల వల్ల కుటుంబాల్లో విభేదాలు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చేనేతలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుందా, ఈ చర్యతో ఓబీసీలకు పెద్దపీట వేసినట్టేనా అని చింతా మోహన్ ప్రశ్నించారు. ఏడాదిన్నరలోనే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ విమర్శలు -
సోమారామంలో ఆదాయం లెక్కింపు
భీమవరం(ప్రకాశం చౌక్): పంచారామ క్షేత్రం గునుపూడి ఉమాసోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం (సోమారామం)లో హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కించారు. రూ.10,50,655 నగదు లభించిన్నట్లు ఈఓ డి.రామకృష్ణంరాజు తెలిపారు.. నిత్యాన్నదానానికి రూ.18,886 లభించిందన్నారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం భీమవరం: గురు పూజోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయులకు అవార్డులు అందించనున్నామని, ఈనెల 8లోపు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ ఈ.నారాయణ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కనీసం పదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్నవారు అర్హులన్నారు. ఽ16న తుది జాబితా రాష్ట్ర కార్యాలయానికి పంపిస్తామని, 21 నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రస్థాయిలో ఎంపికై న ఉపాధ్యాయులకు ఇంటర్వ్యూలు నిర్వహించి 25న ఎంపికై న వారి తుది జాబితాను విడుదల చేస్తారని నారాయణ తెలిపారు. -
ఉద్యోగ, ఉపాధ్యాయులకు నిరాశ
ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్ర కేబినెట్ సమావేశం ఉద్యోగ, ఉపాధ్యాయులకు నిరాశ మిగిల్చిందని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గెడ్డం సుధీర్ ఓ ప్రకటనలో తెలిపారు. పెండింగ్ బకాయిలు, డీఏలు, ఆర్థిక ప్రయోజనాలు, 12వ పీఆర్సీ, ఐఆర్ గురించి ప్రభుత్వం ప్రకటించలేదన్నారు. కూటమి ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలపై మాట్లాడకపోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. 2004లో ఉపాధ్యాయ, ఉద్యోగులకు వ్యతిరేకంగా పనిచేసిన నాటి టీడీపీ ప్రభుత్వాన్ని గద్దెదింపిన విషయాన్ని గుర్తుచేశారు. ఉపాధ్యాయుల బదిలీలు జరిగి మూడు నెలలు కావస్తున్నా కొందరికి జీతాలు రాకపోవడం దురదృష్టకరమన్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయ సంఘాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా బీవీ రావు కైకలూరు: వైఎస్సార్సీపీ ఇంటలెక్చువల్స్ (మేధావుల) ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా బుసనబోయిన వెంకటేశ్వరరావు (బీవీ రావు)ను నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి నియామక ఉత్తర్వులు గురువారం అందాయి. కై కలూరు మండలం వరహాపట్నంకు చెందిన బీవీ రావు సీనియర్ చార్టర్ అకౌంటెంట్గా పనిచేస్తున్నారు. తనకు రాష్ట్రస్థాయి పదవి కేటాయించినందుకు పార్టీ అధినేత జగన్, ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్)కు కృతజ్ఞతలు తెలిపారు. ఘనంగా చేనేత దినోత్సవం ఏలూరు(మెట్రో): దేశ సాంస్కృతిక వారసత్వానికి చేనేతరంగం చిహ్నంగా నిలుస్తుందని కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. గురువారం జిల్లా చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవరం సందర్భంగా నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ పాల్గొన్నారు. ఫైర్స్టేషన్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకూ చేనేత కార్మికులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. చేనేత రంగాన్ని కాపాడాలి ఏలూరు (టూటౌన్): చేనేత రంగాన్ని, నేత కార్మికులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కడుపు కన్నయ్య, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు విమర్శించారు. స్థానిక 36వ డివిజన్లో గురువారం చేనేత దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వాలు బడ్జెట్లో అరకొర నిధులు కేటాయిస్తూ చేనేత పరిశ్రమను చిన్నచూపు చూస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. ఏ ఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ డాంగే, సంఘ కార్యకర్తలు పాల్గొన్నారు. చేనేతకు మరణ శాసనమైన జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పిచ్చుక ఆదిశేషు డిమాండ్ చేశారు. స్థానిక పత్తేబాద మరకవారి వీధిలో చేనేత దినోత్సవాన్ని నిర్వహించారు. బాల పురస్కార్కు దరఖాస్తుల ఆహ్వానం ఏలూరు (టూటౌన్): రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుల కోసం ఈనెల 15లోపు దర ఖాస్తు చేసుకోవాలని డీసీపీఓ సూర్యచక్రవేణి గురువారం ప్రకటనలో తెలిపారు. వివిధ రంగాల్లో అత్యుత్తమ ధైర్యసాహసాలు, ప్రతిభ కనబర్చిన 5–18 ఏళ్లలోపు బాలలు అర్హులని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ 79015 97267లో సంప్రదించాలని కోరారు. బ్యాంకు ఏజెంట్ల పేరుతో మోసం భీమవరం: బ్యాంకు రికవరీ ఏజెంట్లుమంటూ ఇద్దరు వ్యక్తులు భీమవరం ఏడో వార్డుకు చెందిన కె.రామలక్ష్మి నుంచి రూ.2 లక్షలు తీసు కుని మోసగించినట్టు పోలీసులు తెలిపారు. పట్టణంలోని మారుతీనగర్లో భవనానికి మార్టిగేజ్ రుణం తీసుకున్నారు. వాయిదా చె ల్లించాల్సి ఉండగా హైకోర్టులో స్టే వేద్దామని చెప్పి నగదు తీసుకుని ఇప్పటివరకు సమాధా నం చెప్పడం లేదని రామలక్ష్మి ఫిర్యాదు చేశారు. -
రాష్ట్రంలో బీసీలకు రక్షణ కరువు
ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ పాలనలో బీసీలకు రక్షణ కరువైందని, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులపైనే దాడులు జరుగుతుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా బీసీసెల్ నాయకులు ప్రశ్నించారు. పులివెందులలో జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు రమేష్ యాదవ్పై టీడీపీ నేతలు జరిపిన దాడికి నిరసనగా బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవులు ఆధ్వర్యంలో నగరంలో గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బీసీ సెల్ నాయకులు మాట్లాడుతూ పాలనలో విఫలమై, సంక్షేమ పథకాలు అమలు చేయలేక కూటమి ప్రభుత్వ పెద్దలు ప్రజల దృష్టి మళ్లించేందుకు పలు ఎత్తుగడలు వేస్తున్నారన్నారు. హామీలను విస్మరించిన ప్రభుత్వం ప్రజల ఆగ్రహానికి గురవుతామనే భయంతో ప్రతిపక్ష నేతలపై దాడులకు పాల్పడుతూ తిరిగి వారిపైనే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందన్నారు. ప్రజలు కూటమి ప్రభుత్వ విధానాలను నిశితంగా పరిశీలిస్తున్నారన్నారు. కూటమి నేతలు ఇసుక కోసం, మట్టి కోసం ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారని, అలాగే అనేక ప్రాంతాల్లో ప్రొటోకాల్ వి వాదాలు నడుపుతున్నారని, టీడీపీ, జనసేన నేతలు కాలర్లు పట్టుకుని కొట్టుకుంటున్నారన్నారు. తమ పార్టీ నాయకులను నియంత్రించలేకపోతున్న రెండు పార్టీల నేతలు రాష్ట్రంలో శాంతిభద్రతలను ఏమి నియంత్రించగలుగుతారని ఎద్దేవా చేశారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమై ప్రజలు తిరగబడక ముందే కూటమి ప్రభుత్వ పెద్దలు మేలుకోవాలని, లేకుంటే ప్రజలే వారిని తరిమికొట్టే రోజు వస్తుందని హెచ్చరించారు. తొలుత నగరంలోని మహా త్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. వైఎస్సార్సీపీ నాయకులు గుడిదేసి శ్రీనివాసరావు, తుమరాడ స్రవంతి, మోదుగుండు సూర్యనారాయణ, నూకపెయ్యి సుధీర్ బాబు, గురజాల పార్థసారథి, కట్ట ఏసుబాబు, మున్నుల జాన్ గుర్నాథ్, కంచుమర్తి తులసి, కొల్లిపాక సురేష్, బోగాటి ప్రభాకర్, పాటినవలస రాజేష్, స్టాలిన్, సాయిల స్వాతి యాదవ్, గంటా సాయి ప్రదీప్, కిలాడి దుర్గారావు, జుజ్జువరపు విజయనిర్మల తదితరులు పాల్గొన్నారు. -
వేధింపులు ఆపాలి
పనిచేయని ఫోన్లను తిరిగి అప్పగించిన అంగన్వాడీలపై అధికారుల వేధింపులు మానాలి. టార్గెట్ల పేరుతో అధికారులు తీవ్రంగా వేధిస్తున్నారని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపులు ఆపకపోతే సీఐటీయూ ఆధ్వర్యంలో పోరాటం ఉధృతం చేస్తాం. – డీఎన్వీడీ ప్రసాద్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి, ఏలూరు వెసులుబాటు కల్పించాలి ఫేస్ క్యాప్చర్తో నిమిత్తం లేకుండా మాన్యువల్గా రేషన్ ఇచ్చే వెసులుబాటు కల్పించాలి. యాప్ల వల్ల మాతో పాటు లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లబ్ధిదారులు ఓటీపీ చెప్పేందుకు సంబంధిత ఫోన్లు అందుబాటులో ఉండటం లేదు. – పి.సుజాత, జిల్లా అధ్యక్షురాలు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, ఏలూరు జిల్లా అప్లోడ్ కావడం లేదు మాకిచ్చిన ఫోన్లలో యాప్లు అప్లోడ్ అవడం లేదు. పీడీఎఫ్ ఫైల్స్ ఓపెన్ కావడం లేదు. దీనికితోడు స్వర్ణాంధ్ర యాప్ పనులు చేయమంటున్నారు. దీంతో చాలా ఇబ్బంది పడుతున్నాం. అయినా అధికారులు టార్గెట్లు పూర్తిచేయాలని ఒత్తిడి తెస్తున్నారు. – పి.భారతి, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, ఏలూరు జిల్లా 5జీ ఫోన్లు ఇవ్వాలి తక్షణమే అంగన్వాడీలకు 5జీ ర్యామ్ ఉన్న ఫోన్లను ఇవ్వాలి. పాత ఫోన్లలో న్యూవెర్షన్ యాప్లను అప్లోడ్ చేయమంటే ఎలా. ఐసీడీఎస్ అధికారులు అర్థం చేసుకోవాలే తప్ప మాపై కక్ష సాధింపులకు దిగడం సరికాదు. అన్ని యాప్లను కలిపి ఒకే యాప్గా మార్చాలి. – టి.మాణిక్యం, జిల్లా కోశాధికారి,ఏపీ అంగన్వాఢీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్,ఏలూరు జిల్లా ● -
డాక్యుమెంట్ రైటర్లదే హవా
ఏలూరు (ఆర్ఆర్పేట): ప్రభుత్వం డాక్యుమెంట్ రైటర్ల వ్యవస్థను రద్దు చేసి ఏళ్లు గడుస్తున్నా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మాత్రం వీరిదే హవా నడుస్తోంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వచ్చేవారి అవగాహన రాహిత్యం వీరికి ఆదాయ వనరుగా మారింది. దీనికితోడు కార్యాలయాల్లో హెల్ప్డెస్క్ లు నామమాత్రంగా పనిచేస్తుండటంతో ‘రైటర్ల’ రాజ్యంగా మారింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియపై పూర్తిగా అవగాహన లేక 95 శాతం మంది వీరిపైనే ఆధారపడుతున్నారు. క్రయ, విక్రయాల్లో ఆస్తి విలువ ఆధారంగా వీరు సొమ్ములు వసూలు చేస్తున్నారు. 2002లో దస్తావేజు లేఖర్ల వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసింది. అయినా లేఖర్లు రిజిస్ట్రేషన్ కార్యాలయాలను వీడటంలేదు. అన్నీ తామై కార్యాలయా ల్లో రిజిస్ట్రేషన్ వ్యవహరాలు చక్కబెడుతున్నారు. నామమాత్రంగా హెల్ప్డెస్క్లు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోని హెల్డెస్క్లు నామ మాత్రంగా పనిచేస్తున్నాయి. రిజిస్ట్రేషన్లు అధిక సంఖ్యలో జరిగే కార్యాలయాల్లో పని ఒత్తిడి, సిబ్బంది కొరతతో పూర్తిస్థాయిలో సేవలందించలేకపోతున్నాయి. ఉద్యోగులకు బెదిరింపులు ఏలూరులో కొందరు పాత దస్తావేజు లేఖర్లు యూ నియన్గా ఏర్పడి రిజిస్ట్రార్ కార్యాలయ ఉద్యోగులను బెదిరింపులకు గురిచేస్తున్నారు. ఏలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజుకు కనీసం 70 నుంచి 120 వరకూ రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ఇక్కడ జాయింట్–1 సబ్ రిజిస్ట్రార్, జాయింట్–2 సబ్ రిజిస్ట్రార్లు పనిచేస్తున్నారు. అయితే జాయింట్–1 సబ్ రిజిస్ట్రార్ సెలవులో ఉండటంతో మిగిలిన సబ్ రిజిస్ట్రార్పై పనిభారం పెరిగింది. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం ఒక దస్తావేజు లేఖరి గన్నవరంలో ఉన్న ఆస్తిని రిజిస్ట్రేషన్ కోసం ఎనీవేర్ పద్ధతిలో ఆన్లైన్లో ఏలూరు కార్యాలయానికి తీసుకువచ్చారు. ఆస్తికి సంబంధించిన క్రయ, విక్రయదా రులిద్దరూ గన్నవరానికి చెందిన వారు కావడంతో వారిని గన్నవరంలోనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కార్యాలయ అధికారులు సూచించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన డాక్యుమెంట్ రైటర్ కొందరు విలేకరులను కార్యాలయానికి పిలిచి సబ్ రిజిస్ట్రార్పై ఫిర్యాదు కూడా చేశారు. అలాగే మరికొందరు డాక్యుమెంట్ రైటర్లు తమపై ఉన్నతాధికారులకు ఆరోపణలతో ఫిర్యాదులు చేస్తున్నారని, తాము వివరణ ఇవ్వాల్సి వస్తోందని కార్యాలయ ఉద్యోగులు అంటున్నారు. చర్యలు తీసుకుంటాం డాక్యుమెంట్ రైటర్లకు ప్రత్యేక గుర్తింపు లేదు. రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చే వారు ఎవ రైనా సాధారణ కక్షిదారులుగానే రావాలి. కార్యాలయ ఉద్యోగులు, సిబ్బందిపై బెదిరింపులకు, దాడులకు దిగితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేసి కేసులు కూడా నమోదు చేస్తాం. ఏలూరులో జరిగినట్టుగా చెబుతున్న సంఘటన నా దృష్టికి రాలేదు. – కె.శ్రీనివాసరావు, జిల్లా రిజిస్ట్రార్, ఏలూరు అన్నీ తామై పనులు చేస్తున్న రైటర్లు రిజిస్ట్రేషన్లకు రూ.వేలల్లో వసూళ్లు కార్యాలయ ఉద్యోగులకు బెదిరింపులు -
రాజ్యాంగానికి రఘురామ వరకభాష్యం
ఏపీ బహుజన జేఏసీఉండి: రాజ్యాంగం కల్పించిన హక్కులకు వక్రభా ష్యం చెబుతూ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఏపీ బహుజన జేఏసీ రాష్ట్ర నాయకులు అన్నారు. పాములపర్రులో జరిగిన ఘటనపై వివరణ ఇస్తూ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ పాములపర్రు దళితులు, జేఏసీ రాష్ట్ర నాయకులు గురువారం నిరసన తెలిపారు. ఏపీ బహుజన జేఏసీ ఫౌండర్, కన్వీనర్ తాళ్లూరి మధు మాట్లాడుతూ మత స్వేచ్ఛ రాజ్యాంగం ప్రసాదించిన హక్కు అని, దీనిని కాదని క్రైస్తవ మతానికి చెందిన వారు దళితులు కారని ఎమ్మెల్యే ఎలా మాట్లాడతారని మండిపడ్డారు. రాష్ట్రంలో వివిఽ ద కులాలకు చెందిన వారు క్రీస్తును నమ్ముకున్నారు వారిని క్రైస్తవులుగా మార్చేస్తారా? వారి కులాన్ని కాదంటారా? అంటూ ప్రశ్నించారు. కూటమి నాయకుల తప్పుడు సమాచారంతోనే ఎమ్మెల్యే రఘురామ మాట్లాడుతున్నారన్నారు. గతంలో అధికారులు ఇచ్చిన శ్శశాన భూమి రికార్డులు పరిశీలించడంతో పాటు 150 ఏళ్ల నుంచి ఇక్కడ సమాధులున్నాయని గమనించాలన్నారు. స్థానికంగా వరి చేలు లేవని, ఉన్నవి రొయ్యల చెరువులేనన్నారు. నలుగురు రైతుల సంక్షేమం కోసం వందల మంది మనోభావాలు దెబ్బతినేలా దళితులకు ప్రత్యేకమైన శ్శశాన భూమిని పాడుచేసేలా రోడ్డు నిర్మాణం చేస్తారా అని మండిపడ్డారు. పాములపర్రులో దళితులకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామని చెప్పారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్, మాజీ సీఎం జగన్, జాతీయ మానవ హక్కుల సంఘాలకు ఫిర్యాదు చేసినట్టు ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా ఉండిలో ఓ కూటమి నేత ఇంటికి రాత్రి వేళలో ఓ పోలీస్ అధికారి వెళ్లడం, వారితోపాటు శ్శశానంలో రోడ్డు కావాలంటూ ప్రేరేపించిన కూటమి నాయకులు ఉండటం అనుమానాలకు తావిస్తోందని దళితులు చెబుతున్నారు. -
అంగన్వాడీలతో సెల్గాటం
అంగన్వాడీ కేంద్రాలు ఏలూరు పశ్చిమగోదావరి జిల్లా జిల్లా మెయిన్ కేంద్రాలు 1,959 1,556 మినీ కేంద్రాలు 206 70 మొత్తం 2,165 1,626 అంగన్వాడీ కేంద్రాల్లో లబ్ధిదారులు పశ్చిమగోదావరి ఏలూరు ఆరేళ్లలోపు పిల్లలు 43,783 41,116 మూడు నుంచి ఆరేళ్లలోపు పిల్లలు 19,672 19,909 గర్భిణులు 8,596 7,889 బాలింతలు 6,170 5,606 మొత్తం 78,221 74,520 ఏలూరు (టూటౌన్): ‘సిగ్నల్స్ పని చేయవు.. యాప్స్ సపోర్టు చేయవు.. గతంలో 2జీ ఫోన్లు ఇచ్చారు.. ప్రస్తుతం 5జీ యాప్స్ అప్లోడ్ చేయమంటున్నారు.. యాప్ల సాకుతో ఫేస్ రికగ్నైజ్ కాకపోతే రేషన్ కట్ చేస్తామంటున్నారు.. ఇలాగైతే అంగన్ వాడీ కేంద్రాలను నడిపేది ఎలా.. తాము విధులు నిర్వర్తించేది ఎలా..’ అంటూ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఫోన్లు అయినా ఇవ్వండి లేదా యాప్లను రద్దయినా చేయండి అంటూ అంగన్వాడీలు అధికారులను వేడుకుంటున్నారు. యాప్లపై కనీస శిక్షణ ఇవ్వకుండా, యాప్లను సపోర్టు చేసే ఫోన్లను అందించకుండా మెడపై కత్తి పెట్టి మరీ పనిచేయంటే ఎలా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్ర మంలో ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల వ్యాప్తంగా అంగన్వాడీలు ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాల్లో సెల్ఫోన్లను అప్పగిస్తూ నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలను ఐసీడీఎస్ అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని పలు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. రెండు జిల్లాల పరిధిలో 3,851 మంది అంగన్వాడీ కార్యకర్తలు, అదే సంఖ్యలో సహాయకులు పనిచేస్తున్నారు. యాప్లలో అప్లోడ్ తిప్పలు అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి కార్యకలాపాలను బాల సంజీవని, పోషణ ట్రాకర్ యాప్ల ద్వారా నిర్వహించాలి. ఫేస్ యాప్, ఫేస్ క్యాప్చర్, కేవైసీ, ఓటీపీ వంటి పనులు చేసేందుకు ప్రస్తుతం ఉన్న ఫోన్లు సహకరించడం లేదు. ఫేస్ క్యాప్చర్ అయితేనే.. యాప్లలో ఫేస్ క్యాప్చర్ అయితేనే అంగన్వాడీ కేంద్రాల్లో లబ్ధిదారులకు ఆహారం ఇవ్వాలి. దీంతో లబ్ధిదారులకు ముఖ ఆధారిత గుర్తింపుతో ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో కుటుంబంలో ఎవ రూ వచ్చినా రేషన్ ఇచ్చేవారు. ఇప్పుడు లబ్ధిదారుడు తప్పనిసరిగా ఉండాలి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఐసీడీఎస్కు నిధులు తగ్గిస్తోంది. దీంతో అరకొర సౌకర్యాలతో సెంటర్లు నడుస్తున్నారు. నాణ్యమైన ఆహారం అందడం లేదనే విమర్శలు వస్తున్నాయి. దీనికితోడు యాప్లతో ఇబ్బంది పడుతున్నామని, సిగ్నల్స్ సరిగా లేక, సర్వర్ పనిచేయక తిప్పలు పడుతుంటే.. అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని అంగన్వాడీలు అంటున్నారు. పదో తరగతి చదివిన తమను యాప్లలో పనిచేయాలంటే ఎలా అని అంగన్వాడీలు ప్రశ్నిస్తున్నా రు. ఒక లబ్ధిదారుడి ఫేస్ క్యాప్చర్ చేయాలంటే రెండు, మూడు గంటల సమయం పడుతుందంటున్నారు. ఒక్కో కేంద్రంలో సగటున మూడేళ్లలోపు పిల్లలు 50 నుంచి 60 మంది, గర్భిణులు, బాలింతలు 10 నుంచి 15 మంది వరకు, ప్రీ స్కూల్ పిల్లలు 10 నుంచి 20 మంది, కిశోర బాలికలు 10 నుంచి 50 మందిలోపు ఉంటారని అంటున్నారు. వీరందరికీ ప్రతినెలా ఈకేవైసీ, ఓటీపీ, ఫేస్ క్యాప్చర్ చేయాలంటే సమయం సరిపోవడం లేదని అంగన్వాడీలు ఆవేదన చెందుతున్నారు. యాప్ల కత్తి సపోర్టు చేయని ఫోన్లతో ఇబ్బందులు ముఖ ఆధారిత గుర్తింపుతోనే రేషన్ పనిచేయని యాప్లు.. అధికారుల ఒత్తిళ్లు ఐసీడీఎస్ కార్యాలయాల్లో ఫోన్ల అప్పగింత ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిరసనలు -
తవ్వుకో.. తరలించుకో..!
ద్వారకాతిరుమల: పచ్చనేతల అక్రమాలకు అడ్డే లేకుండా పోతోంది. మట్టి కనిపిస్తే చాలు తవ్వుకుని, అమ్ముకుంటున్నారు. అడిగేవారు.. అడ్డుచెప్పే వారు లేకపోవడంతో రోజురోజుకీ వీరి ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. ద్వారకాతిరుమల మండలం వెంకటకృష్ణాపురం గ్రామంలో ఏకంగా జగనన్న కాలనీ ఇళ్ల స్థలాల్లోనే గురువారం గ్రావెల్ తవ్వకాలు జరిపారు. లబ్ధిదారులు వారిని అడ్డుకోవడంతో తవ్వకాలు తాత్కాలికంగా నిలిచాయి. వివరాల్లోకి వెళితే.. గత వైఎస్సార్ సీపీ ప్ర భుత్వంలో వెంకటకృష్ణాపురం గ్రామంలోని వాటర్ ట్యాంక్ సమీపంలో పలువురు లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను ఇచ్చారు. అందులో ఎవరూ ఇళ్లను నిర్మించుకోలేదు. అయితే కొందరు టీడీపీ నాయకులు రెండు పొక్లెయిన్లతో ఆ ఖాళీ ఇళ్ల స్థలాల్లో తవ్వకాలు జరిపి, గ్రావెల్ని రామన్నగూడెం గ్రామానికి టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా తరలించేస్తున్నారు. ఆ గ్రావెల్ని ఎంతకు అమ్ముతున్నారన్నది బయటకు పొక్కనివ్వలేదు. ఇదిలా ఉంటే ఇళ్ల స్థలాల లబ్ధిదారులు ఈ తవ్వకాలను అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న గ్రామ రెవెన్యూ అధికారి కూడా అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో ఓ టీడీపీ నాయకుడు లబ్ధిదారులపై చిందులు వేసినా, అవి అక్రమ తవ్వకాలు కావడంతో నెమ్మదిగా అక్కడి నుంచి జారుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. సంబంధిత అధికారులు అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపే వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. జగనన్న కాలనీ ఇళ్ల స్థలాల్లో గ్రావెల్ అక్రమ తవ్వకాలు వెంకటకృష్ణాపురంలో బరి తెగించిన పచ్చ నేతలు -
మధ్యాహ్నం.. అందని వైద్యం
ప్రైవేటుయాజమాన్యాలే టార్గెట్..? సర్కారు దవాఖానాలకు వచ్చే పేదలకు వైద్యసేవలు అందుతున్నాయా లేదా అని పర్యవేక్షణ చేయాల్సిన ఉన్నతాధికారులు ఇటీవల కేవలం ప్రైవేటు ఆస్పత్రులు, ప్రైవేటు స్కానింగ్ సెంటర్లు మాత్రమే తనిఖీలు చేయడం వెనుక గూడార్ధం ఏంటా అనేది వైద్యవర్గాల్లోను చర్చనీయాంశమైంది. తరచూ వైద్యశాఖ ఉన్నతాధికారులు కేవలం ప్రైవేటు యాజమాన్యాలనే కలుస్తుండడంపై కూడా పలువురు పెదవి విరుస్తున్నారు. ఇక డైరెక్టరేట్ ఆప్ సెకండరీ హెల్త్కు సంబంధించి ఉన్నతాధికారులు సంబంధిత ఆస్పత్రుల్లో ఎటువంటి పర్యవేక్షణ లేకపోవడంతో జిల్లాలో కొందరు వైద్యులు తమ ఇస్టానుసారంగా పనిచేస్తున్నారని తెలుస్తోంది. ఈ సమస్యలపై డీఎంహెచ్వో డాక్టర్ గీతాబాయిని ‘సాక్షి’ వివరణ కోరగా ఆస్పత్రుల్లో వైద్యులు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉండాల్సిందేనని, కొందరు వైద్యులు అదనంగా మరికొన్ని ఆస్పత్రుల్లో ఇన్చార్జులుగా ఉంటున్నారని, వైద్యుల తీరుపై ప్రత్యేక పర్యవేక్షణ చేస్తానని చెప్పారు. తణుకు అర్బన్ : గత ఐదేళ్లపాటు పేదలపాలిట సంజీవనిలా సత్వర వైద్యసేవలందించిన ఆస్పత్రులు నేడు వేళకు రాని వైద్యులతోపాటు, ఆస్పత్రిలో కాలు నిలవక బయటకు వెళ్లే వైద్యుల కారణంగా పేదలకు వైద్యసేవలు కునారిల్లుతున్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆస్పత్రుల్లో ఉండాల్సిన వైద్యులు నేడు విధులకు ఆలస్యంగా కొందరు, ఎఫ్ఆర్ఎస్ వేసేసి ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రాక్టీస్ కోసం వెళ్లే వారు కొందరు, మధ్యాహ్నం పూర్తిగా ఇంటికో, ప్రైవేటు ఆస్పత్రులకో పరిమితమయ్యే మరి కొందరు వైద్యుల కారణంగా ప్రభుత్వ ఆసుప్రతుల్లో వైద్యసేవలు అందడం లేదు. ముఖ్యంగా గ్రామాల్లో ఈ తరహా పరిస్థితులు అధికంగా కనిపిస్తున్నాయని రోగులు ఆరోపిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ విభాగాల్లో వైద్యులు 80 శాతం మంది ఒంటిపూట వైద్యానికి అలవాటుపడ్డారని వైద్య సిబ్బంది బాహాటంగానే చెబుతున్నారు. దూర ప్రాంతాల నుంచి క్యారేజీలు పట్టుకుని వచ్చే వైద్యులు మాత్రమే పూర్తిస్థాయిలో ఆస్పత్రిని అంటిపెట్టుకుని ఉంటుండగా, భోజనానికి ఇంటికెళ్లి వచ్చే వైద్యులు చాలా మంది తిరిగి ఎఫ్ఆర్ఎస్ వేసేందుకు మాత్రమే వస్తున్నట్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు వైద్యులైతే ఉదయం పూట కూడా ప్రైవేటు వైద్యానికి వెళ్లే పరిస్థితులు తలెత్తాయని రోగులు, వైద్య సిబ్బంది చెబుతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాల మాదిరిగానే పట్టణాల్లో కూడా పేదలకు వైద్యసేవలు మరింత చేరువ చేసే ఉద్దేశ్యంతో అర్బన్ హెల్త్ సెంటర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో పట్టణ ప్రాంతాల్లోని పేదలు సైతం దూర ప్రాంతాల్లోని ప్రభుత్వాసుపత్రికి వెళ్లే అవసరం లేకుండానే సమీపంలోని అర్బన్ హెల్త్ సెంటర్లలో వైద్యసేవలు పొందుతున్నారు. దూరమైన సత్వర వైద్యం ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆయా ఆస్పత్రుల్లో ఉండి రోగులకు సత్వర వైద్యం అందించాల్సి ఉండగా ప్రస్తుతం ఆ తరహా సేవలు అందడంలేదని రోగులు చెబుతున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఉదయం ఏదోలా వైద్యం అందుతున్నా ఇక మధ్యాహ్నం 1 గంట తరువాత జిల్లా వ్యాప్తంగా వైద్యులు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండడంలేదనేది వాస్తవమని రోగులు స్వయంగా చెబుతున్నారు. అంతేకాకుండా మధ్యాహ్నం నుంచి పీహెచ్సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లకు వచ్చే రోగులకు అందుబాటులో ఉన్న వైద్య సిబ్బంది వైద్యం అందిస్తున్నారని తెలుస్తోంది. మధ్యాహ్నం వచ్చిన రోగులను మరుసటి రోజు రావాలని, ఇబ్బంది ఎక్కువగా ఉంటే వైద్యులకు ఫోన్ చేస్తామని అప్పుడు సదరు వైద్యుడు వస్తారని వైద్యసిబ్బంది చెబుతుండడం శోచనీయం. జిల్లాలో ప్రభుత్వ ఆస్ప్రతులు ఇలా.. వైద్య ఆరోగ్య శాఖ.. పీహెచ్సీలు 34 యూపీహెచ్సీలు 18 పీపీ యూనిట్ 1 లెప్రసీ వార్డు 1 డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ జిల్లా ఆస్పత్రి 1 ఏరియా ఆస్పత్రులు 5 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు 3 వైద్యులు 200లకుపైగా.. నిత్యం 16 వేలకుపైగా రోగులు.. మధ్యాహ్నం ఇళ్లు.. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉంటున్న వైద్యులు వైద్యులు లేకపోవడంతో సొంత వైద్యం చేస్తున్న సిబ్బంది కునారిల్లుతున్న సర్కారు దవాఖానాలు అర్బన్ హెల్త్ సెంటర్కు ఓ వృద్ధుడు కర్ర చేతపట్టుకుని మధ్యాహ్నం పూట వచ్చాడు. అక్కడే ఉన్న నర్సు ఆ వృద్ధుడిని చూసి.. డాక్టర్ మధ్యాహ్నం ఉండరు తాతా.. రేపు ఉదయం రా అని చెప్పింది. సాయంత్రం 4 గంటల వరకు ఉండాల్సిన డాక్టర్ ఉండకపోతే అడిగేవారే లేకుండా పోయారు అంటూ సణుగుతూ వెనుదిరిగాడు. జ్వరంతో వణుకుతూ ఓ పెద్దావిడ పీహెచ్సీకి మధ్యాహ్నం సమయంలో వచ్చింది. ఆమెను చూసిన నర్సు ఇప్పుడు వచ్చావేంటి డాక్టర్ ఉండరు కదా.. ఉదయం రాకపోయావా అన్నారు. ఉన్నట్టుండి చలిజ్వరం రావడంతో వచ్చానమ్మ అని ఆ పెద్దావిడి సమాధానమిచ్చింది. దీంతో ఆ నర్సు డాక్టర్కు ఫోన్ చేసి విషయం చెప్పగా.. పారాసెట్మాల్, యాంటీబయాటిక్ ఇచ్చి పంపించేయ్.. రేపు ఉదయం రమ్మని చెప్పు.. అని కటువుగా వైద్యుడు చెప్పాడు. -
సీతంపేట వద్ద లారీ బోల్తా
కొయ్యలగూడెం : సీతంపేట సబ్ స్టేషన్ సమీపంలో జాతీయ ప్రధాన రహదారిపై బుధవారం ఓ లారీ అదుపు తప్పి బోల్తా పడింది. రాజమండ్రి వైపు వెళుతున్న లారీ ఎదురుగా వస్తున్న మరో లారీని తప్పించబోయి అదుపుతప్పి రోడ్డు మార్జిన్ వైపు పల్టీ కొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. రోడ్డు పక్కనే ఉన్న చెత్తకి నిప్పు పెట్టడం వల్ల రోడ్డుపై భారీగా పొగ అలుముకోవడంతో ఎదురెదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడం ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆట్యా పాట్యా జిల్లా జట్ల ఎంపిక భీమవరం: పట్టణంలోని ఎస్సీహెచ్బీఆర్ఎం స్కూల్లో బుధవారం ఆట్యా–పాట్యా జిల్లా జట్ల ఎంపిక జరిగింది. క్రీడాకారులు పి గోపీకృష్ణ, డి మోహన్కుమార్, జి యశ్వంత్రమణ, కె సాయిధనుష్, జె అభిషేక్పాల్, వి జయసంతోష్, పి రోహిత్ కుమార్, వి మణికంఠ గణేష్, ఎం తేజమహిమ, ఎం అభిరామ్, బి వెంకన్న, పి ప్రేమ్కుమార్, పి భాస్కరతేజ జిల్లా జట్లకు ఎంపికయ్యారని ఆట్యాపాట్యా జిల్లా అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మంతెన రామచంద్రరాజు, జి కిరణ్వర్మ తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 9వ తేదీ నుంచి ఒంగోలులో నిర్వహించే రాష్ట్రస్థాయి జూనియర్ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొంటారన్నారు. వైభవం.. శోభనాచలుడి పవిత్రోత్సవం ఆగిరిపల్లి: స్థానిక శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారికి వైభవంగా పవిత్రములు సమర్పించారు ఉదయం స్వామివారికి స్నపన, ప్రత్యేక అలంకరణ, శ్రీ లక్ష్మీ నరసింహ సుదర్శన మూలా మంత్ర హోమం, దిగువ సన్నిధిలో ఉన్న స్వామివారికి పవిత్రములు సమర్పణ, నవ కుంభారాధన, శాంతి హోమం ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం శేషుబాబు, అనంత కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయ కార్యనిర్వణాధికారి సాయి కార్యక్రమాలను పర్యవేక్షించారు. నకిలీ డెత్ సర్టిఫికెట్ వ్యవహారంపై విచారణ కుక్కునూరు: నకిలీ డెత్ సర్టిఫికెట్ వ్యవహారంపై భద్రాచలం పోలీసులు విచారణ చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం సారాపాక గ్రామానికి చెందిన భూక్యా శ్రీరాములు పేరిట ఓ ఎల్ఐసీ ఏజెంట్ రూ.10 లక్షల పాలసీకి ఏడేళ్లుగా ప్రీమియం చెల్లిస్తున్నాడు. ఆ వ్యక్తి బతికుండగానే మరణించినట్లుగా కుక్కునూరు పంచాయతీ నుంచి డెత్ సర్టిఫికెట్ పోంది ఎల్ఐసీ నుంచి రూ.10 లక్షలు క్లయిమ్ చేశాడు. ఈ విషయాన్ని గత ఫిబ్రవరి 10వ తేదీన ‘సాక్షి’ దినపత్రిక బహిర్గతం చేసింది. కాగా ఈ వ్యవహారంలో డబ్బును రికవరీ చేసిన ఎల్ఐసీ కార్యాలయ అధికారులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా భద్రాచలం పోలీసులు విచారణ చేపట్టారు. కుక్కునూరులో నకిలీ సర్టిఫికెట్ ఎవరు ఇచ్చారన్న విషయమై గత నాలుగు రోజులుగా కొందరిని స్టేషన్కు పిలిపించి ప్రశ్నించినట్టు తెలుస్తోంది. -
కొండరెడ్డి విద్యార్థిని మృతి
బుట్టాయగూడెం: మండలంలోని పులిరామన్నగూడెం పీహెచ్సీలో ఒక కొండరెడ్డి గిరిజన బాలిక బుధవారం మృతి చెందింది. పోలవరం మండలం దారావాడకు చెందిన బాలిక తల్లిదండ్రులు గురుగుంట్ల సింహాద్రిరెడ్డి, రామలక్ష్మి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గురుగుంట్ల పూర్ణ(6) చిలకలూరులో 1వ తరగతి చదువుతుండగా, బుధవారం కన్నాపురంలో తన తమ్ముడితోపాటు ప్రభుత్వ పథకాలు పొందేందుకు వేలిముద్ర వేయాలని ఒక ట్రాక్టర్లో దారావాడ నుంచి కన్నాపురం వచ్చారు. వేలిముద్ర వేసే సమయంలో పూర్ణ కళ్లుతిరిగి పడిపోయింది. హుటాహుటిన బాలికను పులిరామన్నగూడెం పీహెచ్సీలో ఆస్పత్రిలో చేర్పించారు. అయితే అంతకు ముందు కొండదిగే సమయంలో కూడా చింతపల్లి వద్ద ఉన్న చిలకలగండి సమీపంలో పూర్ణకు ఫిట్స్లా వచ్చాయి. కొద్దిసేపటికి బాగానే ఉండడంతో కన్నాపురం వెళ్లగా అక్కడ వేలిముద్ర వేస్తున్న సమయంలో ఫిట్స్తో పడిపోయింది. ఆస్పత్రిలో చేరిన బాలిక పూర్ణ మృతి చెందింది. బాలికకు ప్రాథనిక వైద్యంతోపాటు సీపీఆర్ కూడా చేసినా ఫలితం లేకుండా పోయిందని డాక్టర్ ఆకాంక్ష తెలిపారు. పూర్ణ మృతదేహాన్ని పీఆర్గూడెం నుంచి గడ్డపల్లి వరకూ మొబైల్ అంబులెన్స్లో తరలించారు. గడ్డపల్లి నుంచి దారావాడ వరకూ రహదారి అధ్వానంగా ఉండడంతో మొబైల్ అంబులెన్స్ కూడా వెళ్లలేని పరిస్థితి. దీంతో గిరిజనులే జోలి కట్టి మోసుకుంటూ దారావాడకు తీసుకువెళ్లారు. బాలిక గురుగుంట్ల పూర్ణ మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. -
మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య
మండవల్లి : భార్యాభర్తల నడుమ చిన్నపాటి విభేదాల కారణంగా మనస్తాపంతో విషం తాగి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం ప్రత్తిపాడులో బుధవారం చోటుచేసుకుంది. మృతురాలు ప్యారా సుధారాణి(35)గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని ఏలూరు ఆస్పత్రిలో భద్రపరిచారు. గ్యాస్ బండ మీద పడి.. డెలివరీ బాయ్ మృతి చింతలపూడి: స్థానిక బోయగూడెం గ్రామానికి చెందిన బందెల హానోక్ (30) గ్యాస్ బండ మీదపడి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హానోక్ స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ గ్యాస్ కంపెనీలో గ్యాస్ డెలివరీ బాయ్గా పని చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం ఊటసముద్రం గ్రామానికి గ్యాస్ బండలు డెలివరీ చేయడానికి వెళ్లి వాహనం నుంచి గ్యాస్ బండలు దించుతుండగా ప్రమాదానికి గురయ్యాడు. దీంతో తలకు బలమైన గాయాలు అవ్వడంతో వెంటనే స్థానికులు చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హానోక్ మృతి చెందడంతో బోయగూడెంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు గ్యాస్ కంపెనీ నిర్వాహకులను కోరగా నిరాకరించడంతో దళిత సంఘాల ఆధ్వర్యంలో గురువారం ఆందోళనకు దిగుతున్నట్లు తెలిపారు. -
పశువుల్లో గురక వ్యాధికి చికిత్స ఇలా..
చింతలపూడి: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పాడి పశువుల పెంపకానికి ప్రసిద్ధి. ఇక్కడి రైతులు పాడి పశువులను పెంచుకుంటూ ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా మార్చుకున్నారు. అయితే వర్షాకాలంలో పశువులు రకరకాల అంటు రోగాల బారినపడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కొత్త నీరు మురుగు నీటితో కలిసి కలుషితం కావడం కారణంగా పశువులు ఆ నీటిని తాగడంతో అంటురోగాలు సోకి విలువైన పశు సంపద కోల్పోయే ముప్పు ఉంది. వర్షాకాలంలో గేదెలు, గేదె దూడలు, పడ్డలకు ఎక్కువగా వచ్చే వ్యాధి గురక వ్యాధి. దీనినే గొంతు వాపు వ్యాధి అని కూడా పిలుస్తారు. పశువుల్లో వచ్చే వ్యాధుల్లో ఇది అత్యంత ప్రమాదకరమైనది. గురకవ్యాధి సోకిన పశువులకు అందించాల్సిన చికిత్సను గురించి పశుసంవర్థక శాఖ ఏడీ డా కె లింగయ్య వివరించారు. ఎలా సంక్రమిస్తుంది పాశ్చురెల్లా మల్టోసిడా అనే బ్యాక్టీరియ వల్ల పశువులు, గొర్రెలు, మేకల్లో వచ్చే ఈ వ్యాధి క్రిములు ఎడతెరపి లేని ముసురు వాతావరణంలో వేగంగా వృద్ధి చెందుతాయి. కలుషితమైన నీరు, మేత, పరికరాలు, విసర్జకాలు, స్రావాలు, కళేబరాలు, మాంసం ద్వారా వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఇందుకు ఈగలు, దోమలు, ఇతర కీటకాలు కూడా దోహదపడతాయి. వ్యాధి క్రిములు శ్వాస, జీర్ణ వ్యవస్థ, దోమ కాట్ల ద్వారా శరీరంలోకి ప్రవేశించి ఎర్ర రక్త కణాలను ధ్వంసం చేసి రక్తం ప్రాణవాయువు ప్రక్రియను దెబ్బ తీస్తుంది. దీంతో ప్రాణ వాయువు సరిగా అందక పశువులు గురక పెట్టడం, రొప్పడం, ఆయాసపడటం వంటి లక్షణాలను ప్రదర్శిస్తుంది. పశువుల శరీర ఉష్ణోగ్రత 106 నుంచి 108 ఫారిన్ హీట్ వరకు పెరగడం, కనుపాపలు ఎర్రగా మారిపోవడం, మేత నెమరు నిలిచిపోవడం, మెడ గొంతు వాయడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి క్రిములు శరీరంలోకి ప్రవేశించిన 12 నుంచి 36 గంటలకు వ్యాధి లక్షణాలు కనిపించి, సకాలంలో సరైన వైద్యం అందకపోతే మరో 12 నుంచి 24 గంటల్లో పశువు మరణిస్తుంది. గురక వ్యాధి చికిత్స వ్యాధిని గుర్తించిన మరుక్షణం రక్త పరీక్షలు నిర్వహించాలి. వ్యాధి సోకిన పశువును ఇతర పశువుల నుంచి వేరు చేయాలి. ప్రశాంత వాతావరణంలో పశువులకు పరీక్షలు చేయిస్తే మంచిది. ఈ పరిస్థితుల్లో పశువులను నిలబెట్టి మాత్రమే వైద్యం చేయడం శ్రేయస్కరం. యాంపిసిల్లిన్, క్లోక్సా సిలిన్, జెంటా మైసిన్, సెఫలాక్సిన్ వంటి యాంటి బయోటిక్ మందుల్ని సరైన మోతాదులో అవసరాన్ని బట్టి రక్తం లోకి ఎక్కిస్తే వేగంగా ఉపశమనం కలుగుతుంది. సాంబ్రాణి ధూపం వేయడం కూడా మంచిదే. వ్యాధి నిరోధక శక్తిని పెంచే మోమెజోల్ ఇంజక్షన్లు, బి–కాంప్లెక్స్ ఇంజక్షన్లు బాగా నీరశించిన పశువుకై తే డెక్ట్స్రోజ్ సైలెన్లు అవసరం కూడా ఉంటుంది. నివారణ గురకవ్యాధి సోకిన పశువులకు రోగ క్రిములను కలిగిన కలుషిత మేత, నీరు పరికరాలు, కళేబరాలను దూరంగా తరలించాలి. కళేబరాలను లోతుగా పూడ్చి వేయడం మంచిది. పరిసరాల్లో క్రిమి కీటకాలు వృద్ధి చెందకుండా పొడిగా ఉంచాలి. డిడిటి, గమాక్సిన్ ,సైపర్ మెధ్రిన్, కార్పొరిల్ వంటి క్రిమి సంహారకాలతో క్రిమి రహితం చేయాలి. పొరుగు ప్రాంతాల నుంచి వచ్చిన పశువులను కనీసం వారం రోజులన్నా వేరుగా ఉంచి వ్యాధి లేదని నిర్ధారించుకున్నాక మిగిలిన పశువులతో కలవనీయ్యాలి. గురకవ్యాధి నివారణకు ప్రభుత్వం ఏటా ఉచితంగా టీకాలు వేయిస్తోంది. ప్రస్తుతం గురకవ్యాధి, జబ్బవాపు, గాలికుంటు వ్యాధుల నిర్మూలనకు ఒకే వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. పశువైద్యల సూచనల మేరకు ఈ టీకాలను తొలకరి తొలి దశలో లేదా ఎండలు ముదరక ముందు వేయిస్తే మంచిది. డా కె లింగయ్య, పశు సంవర్థక శాఖ ఏడీ, చింతలపూడి పాడి–పంట -
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
పాలకొల్లు సెంట్రల్: రోడ్డు ప్రమాదంలో గాయపడి నెలా పదిహేను రోజులుగా చికిత్స పొందుతున్న వ్యక్తి బుధవారం మృతి చెందాడు. వివరాల ప్రకారం.. మండలంలోని ఉల్లంపర్రు గ్రామానికి చెందిన దోస నరసింహస్వామి (56) జూన్ 19వ తేదీన గ్రామం నుంచి పాలకొల్లు పట్టణానికి వస్తుండగా కెనాల్ రోడ్డులో వాటర్ వర్క్స్ ప్రాంతంలో వెనుక నుంచి మినీ వ్యాన్ ఢీకొట్టడంతో తలకు తీవ్రమైన గాయమైంది. స్థానికులు వెంటనే స్పందించి పట్టణ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం భీమవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి గుంటూరు తరలించగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బ్రెయిన్కు చికిత్స చేశారు. అప్పటి నుంచి అపస్మారకస్థితిలోనే ఉన్న స్వామి బుధవారం ఉదయం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. నరసింహస్వామికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇతను పట్టణంలో ఓ ఎడ్యుకేషన్ కోచింగ్ సెంటర్ను నడుపుతుండేవారు. పట్టణ ఎస్సై పృధ్వీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పంచనామా నిర్వహించారు. -
చెట్లకు చేటు
జంగారెడ్డిగూడెం: విద్యుత్ లైన్ పేరు చెప్పి భారీ వృక్షాలను అక్రమంగా నరకివేసి కలప తరలించుకుపోయారు. ఈ ఘటన జంగారెడ్డిగూడెంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం జంగారెడ్డిగూడెం శివారు మార్కండేయపురంలో పంచాయతీ రాజ్ రోడ్డు వెంబడి భారీ వృక్షాలు ఉన్నాయి. వీటిని కొందరు అక్రమార్కులు బుధవారం నరికివేశారు. స్థానికులు ఇదేంటని ప్రశ్నిస్తే విద్యుత్ లైన్ల నిర్మాణం నిమిత్తం చెట్లను నరికినట్లు తెలిపారు. దీంతో అనుమానం వచ్చి ప్రజా సంఘాల నాయకులకు తెలియజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న సీపీఐ నాయకులు జేవీ రమణరాజు, రాధాకృష్ణ చెట్ల నరికివేతపై పంచాయతీ రాజ్ డీఈ సాజుద్దీన్కు ఫిర్యాదు చేయగా చెట్ల నరికివేతకు సంబంధించి ఎవరికీ అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. ఈ విషయంపై విద్యుత్ శాఖ డీఈ యు.సుబ్బారావును వివరణ కోరగా, తాము ఆ ప్రాంతంలో ఎటువంటి విద్యుత్ లైన్లు వేసే పనులు నిర్వహించడం లేదని చెప్పారు. అక్రమార్కులు యథేచ్ఛగా చెట్లను నరికివేస్తూ శాఖల పేర్లు చెప్పి వాటిని తరలించుకుపోవడంపై ప్రజాసంఘాల నాయకులు అభ్యంతరం తెలిపారు. దీనిపై సాజుద్దీన్ స్పందిస్తూ పూర్తి స్థాయి విచారణ చేపట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
సబ్ కలెక్టర్ స్మరణ్రాజ్కు సత్కారం
ఏలూరు (మెట్రో): బదిలీపై వెళుతున్న నూజివీడు సబ్ కలెక్టర్ బి.స్మరణ్రాజ్ను జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఘనంగా సత్కరించారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో బుధవారం రెవెన్యూ అధికారుల సమావేశం అనంతరం నూజివీడు సబ్ కలెక్టర్ బి.స్మరణ్రాజ్ను దుశ్శాలువ, మెమొంటోతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డీఆర్ఓ వి.విశ్వేశ్వరరావు, ఆర్డీఓలు అచ్యుత్ అంబరీష్, రమణ, ఎస్డీసీ భాస్కర్, సర్వే శాఖ ఏడీ అన్సారీ, కలెక్టరేట్ పరిపాలనాధికారి నాంచారయ్య, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు చల్లన్న దొర, విజయ్కుమార్రాజు, జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లు, రీసర్వే డిప్యూటీ తహసీల్దార్లు పాల్గొన్నారు. -
చట్టంపై విద్యార్థులకు అవగాహన
చెట్లకు చేటు విద్యుత్ లైన్ పేరుతో జంగారెడ్డిగూడెంలో భారీ వృక్షాలను నరికి కలప తరలించుకుపోయారు. చెట్ల నరికివేతకు ఎవరికీ అనుమతులు ఇవ్వలేదని అధికారులు తెలిపారు. 8లో uఏలూరు (టూటౌన్): నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ అన్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ, రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ అమరావతి ఆదేశాల ప్రకారం శ్రీజాతీయ న్యాయ సేవాధికార సంస్థ–బాలల స్నేహ పూర్వక న్యాయ సేవల పథకం 2024పై అవగాహన కల్పించేందుకు ఆక్స్ఫర్డ్ ఒలింపియాడ్ స్కూలు విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కె.రత్నప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థి దశలోనే చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు బాధ్యతలు కూడా తెలుసుకుని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయరాదని, గుడ్ టచ్ బాడ్ టచ్ పైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు. బాలలకు అవసరమైన పక్షంలో ఉచిత న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. -
మూల్యాంకన పుస్తకాలపై వ్యతిరేకత
ఇప్పటికే విద్యాశక్తిని బహిష్కరించిన ఉపాధ్యాయులు నూజివీడు: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నిర్వహించే పరీక్షలకు సంబంధించి విద్యాశాఖ ద్వారా పాఠశాలలకు పంపిన మూల్యాకంన పుస్తకాలపై ఉపాధ్యాయుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విద్యాశాఖ ఉన్నతాధికారులు ఇస్తున్న పనులను చేయడానికే ఎక్కువ సమయం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో మూల్యాంకన పుస్తకం ఇచ్చింది. దీంతో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఒక్కో విద్యార్థికి ఆరు మూల్యాంకన పుస్తకాలు ఇవ్వగా, ఫార్మేటివ్ అసిస్మెంట్, సమ్మేటివ్ అసిస్మెంట్ పరీక్షలను ఆ పుస్తకాల్లోనే విద్యార్థులతో రాయించాలి. విద్యార్థులు రాసిన తరువాత పరీక్షలను దిద్ది అందులోనే ఇచ్చిన ఓఎమ్మార్ షీట్లో మార్కులు వేయడంతో పాటు వారి పరీక్ష రాసిన పేజీలను స్కాన్ చేసి విద్యాశాఖ ఇచ్చిన యాప్లో ఆప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసేటప్పుడు సర్వర్ బిజీగా ఉన్నా, నెట్ స్లోగా ఉన్నా అప్లోడ్ చేయడం తీవ్ర జాప్యమయ్యే అవకాశాలున్నాయి. బడిలో దిద్దడానికి సమయమేది : గతంలో విద్యార్థి రాసిన పరీక్ష పేపర్లను ఉపాధ్యాయులు వారి వెసులుబాటును బట్టి బడిలో దిద్దేవారు. సమయం సరిపోకపోతే ఇళ్లకు తీసుకెళ్లి పేపర్లు దిద్దుకొని తీసుకొచ్చేవారు. ఇప్పుడు మూల్యాంకనం పుస్తకాలను ఇంటికి మోసుకొని వెళ్లే పరిస్థితి లేకుండా పోయిందని వాపోతున్నారు. ఆరో తరగతిలో 40 మంది విద్యార్థులుంటే వారందరి మూల్యాకనం పుస్తకాలు ఇంటికి తీసుకెళ్లి దిద్దడానికి వీలవ్వదు. బడిలోనే దిద్ది ప్రతి సబ్జెక్టుకు సంబంధించి విద్యార్థులు రాసిన జవాబు పత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఒక్కొక్క విద్యార్ధి మూడు పేజీలు రాస్తే వంద నుంచి 120 పేజీలను ఒక సబ్జెక్టుకు స్కాన్ చేయాల్సి ఉంటుంది. హైస్కూల్లో ఒక ఉపాధ్యాయుడు నాలుగు తరగతులకు వెళ్లినట్లయితే వారం రోజుల పాటు ఇదే పనిని చేస్తే పూర్తవుతుంది. ఇంత చేసినా విద్యార్థికి ఒనగూడే ప్రయోజనం శూన్యం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ మూల్యాంకనం పుస్తకాలను ఏ సబ్జెక్టుకు ఆ సబ్జెక్టు ఉపాధ్యాయుడు భద్రపరుచుకోవాలి. విద్యాశక్తి నిర్బంధంగా అమలు హైస్కూళ్లలో సాయంత్రం 4 గంటల తరువాత విద్యాశక్తి కార్యక్రమాన్ని విద్యాశాఖ అమలు చేస్తోంది. ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు తప్పనిసరిగా విద్యాశక్తి కార్యక్రమాన్ని అమలు చేయాల్సిందేనని ఉన్నతాధికారులు చెబుతున్నారు. అయితే ఇది ఉపాధ్యాయులకు కొత్త తలనొప్పిలా మారింది. ఉపాధ్యాయ సంఘాలు అడిగినప్పుడు నిర్భంధం కాదని చెబుతున్న ఉన్నతాధికారులు ఆ తరువాత ఉపాధ్యాయులపై మండల స్థాయి అధికారులతో మేం వస్తున్నాం.. తనిఖీ చేస్తాం.. అంటూ ఒత్తిడి చేస్తూ పనిచేయిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు గతంలో ఎన్నడూ లేవని ఉపాధ్యాయులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యాశక్తి కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ఉపాధ్యాయులు గత రెండు రోజులుగా ఫ్యాప్టో ఆధ్వర్యంలో డీఈవోలకు వినతిపత్రాలను సైతం అందజేస్తున్నారు. ప్రశాంతంగా సాగాల్సిన విద్యారంగ కార్యక్రమాలను హడావుడిగా మార్చేసి తీవ్ర ఒత్తిడికి గురయ్యేలా ప్రభుత్వం చేస్తుండటంతో ఎంతో మంది ఉపాధ్యాయులు నేడు అనారోగ్యం పాలవుతున్నారనే ఆందోళన ఉపాధ్యాయుల్లో వ్యక్తమవుతోంది. -
ఉంగుటూరు కూటమిలో కుంపట్లు
నీకు సగం.. నాకు సగం సాక్షి ప్రతినిధి, ఏలూరు: పైకి ఆప్యాయంగా పలకరించుకుని కౌగిలించుకుంటారు.. లోపల మాత్రం కత్తులు దూస్తారు. ఎమ్మెల్యే అధికారిక హోదాలో ఒక కార్యక్రమం చేస్తే.. ఆప్కాబ్ చైర్మన్ ప్రొటోకాల్ హోదాతో మరో కార్యక్రమం నిర్వహిస్తారు. సుపరిపాలన తొలి అడుగు పేరుతో ఉంగుటూరు నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్చార్జి, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు హడావుడి చేస్తుంటే.. పల్లె పల్లెకు పత్సమట్ల పేరుతో ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు మరో కార్యక్రమానికి తెరతీసి పోటాపోటీగా హడావుడి చేస్తున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు సమాంతరంగా హడావుడితో పార్టీ కేడర్ మొదలుకొని అధికారుల వరకు ఇద్దరు నేతల మధ్య నలిగిపోతున్నారు. నిత్యం కూటమిలోని జనసేన, టీడీపీ నేతల మధ్య అసంతృప్తి, అసహనాలతో ఉంగుటూరు రాజకీయం వేడెక్కుతోంది. ఎమ్మెల్యేతో చనువుగా ఉంటే వేటే.. పైకి ప్రేమగా కనిపించినా.. లోపల మాత్రం ఎమ్మెల్యే ధర్మరాజు, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు కత్తులు దూసుకుంటున్నారు. ఎమ్మెల్యే నియోజకవర్గంలో బలపడితే భవిష్యత్లో తన రాజకీయ మనుగడ కష్టమవుతుందనే రీతిలో గన్ని చెక్ పెడుతూ వస్తున్నారు. ఆప్కాబ్ చైర్మన్ పదవి రావడంతో మరింత వేగం పెంచి నియోజకవర్గంలో మండలాల్లో పెత్తనం సాగించడంతో పాటు ఎమ్మెల్యేతో సన్నిహితంగా మెలిగే టీడీపీ నేతలపై వేటు కొనసాగిస్తున్నారు. ఉంగుటూరు మండల అధ్యక్షుడు పాతూరి విజయ్కుమార్ ఎన్నికల సమయంలో ధర్మరాజుకు సహకరించారనే కారణంతో మండల అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. ఎన్నికల ప్రచార సమయంలోనే నారాయణపురంలో విజయ్కుమార్పై టీడీపీ వ్యక్తులే దాడి చేయడం గమనార్హం. భీమడోలు మండల అధ్యక్ష పదవిని సీనియర్లను కాదని నామినేట్ పదవి ఉన్న వ్యక్తికే కేటాయించడంపైన టీడీపీ కేడర్ రగులుతున్నారు. ఖర్చుతో కూడిన భీమడోలు మార్కెట్ యార్డు చైర్మన్ పదవిని తొలుత బీసీ మహిళకు కేటాయించారు. గన్ని వీరాంజనేయులు బీసీ మహిళ నుంచి దాన్ని బీసీ జనరల్ చేసి తన వర్గానికి చెందిన శేషగిరికి దక్కేలా చేశారు. మార్కెట్ యార్డుకు స్థానిక ప్రజాప్రతినిధి గౌరవ చైర్మన్గా వ్యవహరిస్తారు. ప్రొటోకాల్ ఉల్లంఘించి ప్రమాణస్వీకారానికి ఎమ్మెల్యేను పిలవకపోవడం వివాదమైంది. సుపరిపాలన తొలి అడుగు పేరుతో రాష్ట్ర మంత్రులు, జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలను ఆహ్వానించి గన్ని హడావిడి చేస్తున్నారు. మరోవైపు పల్లె పల్లెకు పత్సమట్ల పేరుతో అధికార యంత్రాంగాన్ని మొత్తం తీసుకుని ఎమ్మెల్యే పోటీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే క్యాంపుతో టచ్లో ఉండే సీనియర్ నేతలను వ్యూహాత్మకంగా పక్కన పెట్టేలా గన్ని వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇప్పటికే అధిష్టానానికి ఫిర్యాదు చేసే దిశగా అసంతృప్తి నేతలు పావులు కదుపుతున్నారు. జనసేన ఎమ్మెల్యే వర్సెస్ ఆప్కాబ్ చైర్మన్ సుపరిపాలన తొలి అడుగు పేరుతో గన్ని హడావుడి పల్లె పల్లెకు పత్సమట్ల పేరుతో ఎమ్మెల్యే పోటీ కార్యక్రమం ఎమ్మెల్యేకు సన్నిహితంగా ఉండే టీడీపీ నేతలపై గన్ని వేటు గన్ని తీరుపై టీడీపీలో రగులుతున్న అసంతృప్తి ఉంగుటూరులో జనసేన వర్సెస్ టీడీపీ రగడ తారాస్థాయికి చేరింది. నిన్న మొన్నటి వరకు పనులు, పంపకాలు పర్సంటేజీల మధ్య చాప కింద నీరులా కొనసాగిన అంతర్యుద్ధం నేడు ప్రొటోకాల్ వ్యవహారాలకు పాకింది. మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులను కాదని జనసేన ఇన్చార్జి ధర్మరాజుకు టిక్కెట్ కేటాయించడం, ఎన్నికల్లో ధర్మరాజు గెలవడంతో నియోజకవర్గంలో రగడకు తెరలేచింది. టీడీపీకే ఉంగుటూరు టిక్కెట్ ఇవ్వాలని ఎన్నికలకు ముందు గన్ని వర్గం భారీ ర్యాలీతో టీడీపీ రాష్ట్ర కార్యాలయం వద్ద హడావుడి చేసింది. టీడీపీ అధిష్టానం గట్టిగా చెప్పడంతో సైలెంట్ అయిపోయారు. ధర్మరాజు గెలవడంతో నియోజకవర్గంలో పూర్తి స్థాయి పెత్తనం కోసం హడావుడి మొదలైంది. నీకు సగం.. నాకు సగమంటూ పంచాయితీలకు తెరతీశారు. నామినేట్ పదవులు, వర్క్లు, మద్యం షాపుల ఇలా అన్నింటిని పంపకాలు చేసేలా టీడీపీ కీలక నేతలు ఒత్తిడి తెచ్చి నియోజకవర్గంలో ప్రతి దాంట్లో గన్నికి వాటాలు ఏర్పాటు చేశారు. ఉదాహరణకు నియోజకవర్గంలో 17 సొసైటీలు ఉంటే 8 జనసేన, 8 టీడీపీ, 1 బీజేపీకి కేటాయించారు. ఈ క్రమంలో టీడీపీ నుంచి సొసైటీ చైర్మన్లుగా ఎంపికై న వారికి చాలా ఖర్చయిందనేది నియోజకవర్గంలో అందరికి తెలిసిన బహిరంగ రహస్యం. -
యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా కారుమూరి సునీల్
ఏలూరు (ఆర్ఆర్పేట): వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కారుమూరి సునీల్కుమార్ను నియమించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జోన్ –2 వర్కింగ్ ప్రెసిడెంట్గా సునీల్ కుమార్ను నియమించినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. జోన్ –2 పరిధిలోని కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో సునీల్ పార్టీ యువజన విభాగానికి నాయకత్వం వహించనున్నారు. ఆయన నియామకంతో పార్టీ యువజన విభాగం మరింత బలోపేతమవుతుందని పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి. టీడీపీ గూండాల దాడి హేయం భీమడోలు: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్యాదవ్, నాయకులపై పులివెందులలో టీడీపీ గుండాలు చేసిన దాడి అత్యంత హేయమని పార్టీ రాష్ట్ర బీసీ సెల్ వర్కింగ్ అధ్యక్షుడు నౌడు వెంకటరమణ ఓ పత్రికా ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు తెగబడడం హేయమైన చర్య అన్నారు. టీడీపీలో పెదబాబు, చినబాబుకు భయం పట్టుకుందన్నారు. జగన్మోహన్రెడ్డి రోడ్డుపైకి వస్తే చాలు టీడీపీకి భయమని, అందుకే పార్టీ శ్రేణులపై పచ్చ గుండాలు దాడులు చేస్తున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం తీరును మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. దాడి చేసిన గుండాలను కఠినంగా శిక్షించాలని కోరారు. దాడికి నిరసనగా నేడు రాష్ట్రవ్యాప్తంగా బీసీ సెల్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామన్నారు. అనుబంధ కమిటీలనియామకానికి చర్యలు బుట్టాయగూడెం: జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ పార్టీ అనుబంధ కమిటీల నియామకం పూర్తి స్థాయిలో చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నామని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల అనుబంధ విభాగాల ఇన్చార్జి కొలుసు మోహన్యాదవ్ తెలిపారు. బుట్టాయగూడెం మండలం దుద్దుకూరులో మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తెల్లం రాజ్యలక్ష్మిలను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి అనుబంధ విభాగాల్లో నియమితులైన నాయకులు కృషి చేయాలని కోరారు. కష్టపడి పనిచేసే ప్రతీ కార్యకర్తకు రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీలో సముచిత స్థానం కల్పించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎస్ఎస్సీ పరీక్షల పరిశీలన దెందులూరు: వేగవరం హేలాపురి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో జరుగుతున్న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ స్టెనోగ్రాఫ్ పరీక్షలను ఏలూరు ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్ పరిశీలించారు. బుధవారం వేగవరం కళాశాలను ఆయన పరిశీలించారు. విద్యాసంస్థల బస్సులపై కేసుల నమోదు ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరు జిల్లావ్యాప్తంగా మోటారు వాహనాల తనిఖీ అధికారులు బుధవారం విద్యాసంస్థల బస్సులను తనిఖీ చేశారు. వివిధ ఉల్లంఘనలకు పాల్పడినందుకు 15 కేసులు నమోదు చేసి, రూ.26 వేలు జరిమానా విధించినట్లు ఉప రవాణా కమిషనరు షేక్ కరీమ్ తెలిపారు. వాహనదారులు లైసెనన్స్తో పాటు సంబంధిత వాహన పత్రాలను ఉంచుకోవాలని, రహదారి భద్రతా నియమాలను తప్పక పాటించాలన్నారు. విద్యార్థులను తరలించే విషయములో నిబంధనలను పాటించని విద్యాసంస్థల బస్సులను, ప్రైవేటు వాహనాలను సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. -
నేటి నుంచి శ్రీవారి పవిత్రోత్సవాలు
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం నుంచి స్వామివారి దివ్య పవిత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు ఈ నెల 10 వరకు వైభవంగా జరుగనున్నాయి. ఏడాది పొడవునా ఆలయంలో తెలిసీ, తెలియక జరిగిన తప్పుల ప్రాయశ్చిత్తం నిమిత్తం నాలుగు రోజుల పాటు ఈ పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. అందులో భాగంగా 7న అంకురార్పణ, 8న పవిత్రాధివాసం, 9న పవిత్రావరోహణ, 10న మహా పూర్ణాహుతి వేడుకలను నేత్రపర్వంగా నిర్వహించనున్నట్టు ఆలయ ఈఓ ఎన్వీ సత్యనారాయణ మూర్తి తెలిపారు. ఉత్సవాలు జరిగే ఈ నాలుగు రోజులు ఆలయంలో నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నామని, భక్తులు గమనించాలని ఆయన కోరారు. -
తిరగని రాట్నం
కూటమి పాలనలో చేనేత రంగానికి ప్రోత్సాహం కరువైంది. ఆదరణ లేక మగ్గాలు మూలకు చేరుతున్నాయి. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో చంద్రబాబు సర్కారు నేతన్నల వైపు కన్నెత్తి చూసింది లేదు. నేత మగ్గాలకు 200 యూనిట్ల వరకు, మర మగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అంటూ ఇప్పుడు కంటితుడుపు చర్యలతో సరిపెడుతోంది. సాక్షి, భీమవరం: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఆరు వేల వరకు చేనేత కుటుంబాలున్నాయి. పాలకొల్లు, అత్తిలి, యలమంచిలి, పెంటపాడు, పోడూరు, ఆచంట మండలాల్లో నేత కార్మికులు అధికంగా ఉన్నారు. దివంగత వైఎస్ హయాంలో చేనేత రంగం ఒక వెలుగు వెలిగింది. నేత కార్మికులకు 50 ఏళ్లకే పింఛన్, రుణ మాఫీ, అధిక వడ్డీలతో కార్మికులు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఆర్టిజన్ క్రెడిట్ కార్డుల ద్వారా పావలా వడ్డీకే కొత్తగా రుణ సాయం, చిలపనూలుపై పదిశాతం సబ్సిడీ, ఉచిత వైద్య శిబిరాలు, ఇళ్ల నిర్మాణం తదితర ఎన్నో కార్యక్రమాల ద్వారా చేనేత రంగాన్ని ఆయన ఆదుకున్నారు. తర్వాత పట్టించుకున్న వారు లేక సంక్షోభంలో కూరుకుపోయింది. నేతన్నకు అండగా తండ్రిని మించిన తనయునిగా చేనేత రంగానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలిచారు. సొంత మగ్గం ఉన్న నేత కుటుంబాలకు వైఎస్సార్ నేతన్న నేస్తంగా నెలకు రూ. 2000 చొప్పున ఏడాదికి రూ.24,000 ఆర్థిక సాయం అందించారు. గత ప్రభుత్వంలోని ఐదేళ్లలో ఈ పథకం కింద ఉమ్మడి జిల్లాలో సరాసరి 1,063 కుటుంబాలకు రూ.12.76 కోట్ల లబ్ధి చేకూరింది. ప్రస్తుత పశ్చిమ గోదావరి జిల్లాలో 920 కుటుంబాలకు రూ.10.96 కోట్లు, ఏలూరు జిల్లాలో 150 కుటుంబాలకు రూ. 1.8 కోట్ల సాయం అందించారు. అమ్మఒడి, చేయూత, పింఛన్, వాహనమిత్ర, ఆరోగ్య శ్రీ వైద్యం తదితర పథకాల ద్వారా ఒక్కో కుటుంబానికి లక్షలాది రూపాయల ప్రభుత్వ సాయం అందింది. కంటి తుడుపు చర్యలే : గురువారం జాతీయ చేనేత దినోత్సవంగా సందర్భంగా చేనేతకు వరాల జల్లంటూ కూటమి ప్రచారం విమర్శలకు తావిస్తోంది. నేత మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, జీఎస్టీ మినహాయింపు కంటితుడుపు చర్యలుగా కార్మికులు కొట్టిపారేస్తున్నారు. వీటివల్ల చేనేత రంగానికి ఒనగూరేదేమి లేదంటున్నారు. జిల్లాలో కేవలం 677 నేత మగ్గాలకు మాత్రమే ఈ సాయం పరిమితం కానుంది.గత ప్రభుత్వంలో నేతన్న నేస్తం ద్వారా అందించిన సాయం పశ్చిమగోదావరి జిల్లా : సంవత్సరం లబ్ధిదారులు ప్రభుత్వ సాయం (రూ. కోట్లలో) 2019–20 854 రూ. 2.01 2020–21 1,067 రూ. 2.57 2021–22 779 రూ. 1.87 2022–23 839 రూ. 2.02 2023–24 1,027 రూ. 2.47 ఏలూరు జిల్లా సంవత్సరం లబ్ధిదారులు ప్రభుత్వ సాయం (రూ. లక్షల్లో) 2019–20 142 రూ. 34.10 2020–21 187 రూ. 44.90 2021–22 120 రూ. 28.80 2022–23 149 రూ. 35.76 2023–24 153 రూ. 36.72 ఏడాదిగా నేతన్నల వైపు కన్నెత్తి చూడని కూటమి ప్రభుత్వం ప్రోత్సాహం లేక మూలకు చేరిన మగ్గాలు గతంలోనూ చీర–ధోవతి హామీని అటకెక్కించిన చంద్రబాబు నేతన్న నేస్తంతో అండగా నిలిచిన జగన్ సర్కారు ఉమ్మడి జిల్లాలోని 1,070 కుటుంబాలకు రూ. 12.76 కోట్ల సాయం నేడు జాతీయ చేనేత దినోత్సవం చంద్రబాబుకు ఎప్పుడూ చిన్నచూపే చేనేత అంటే చంద్రబాబుకు ఎప్పుడూ చిన్నచూపే. చేనేత అభివృద్ధికి ఆయన చేసిందేమీ లేదు. నేత కార్మికులను నిజంగా ప్రోత్సహించింది దివంగత వైఎస్సార్. తండ్రిని మించిన తనయుడిగా నేతన్న నేస్తం, సంక్షేమ పథకాలతో మాజీ సీఎం జగన్ నేత కార్మికులను ఆదుకున్నారు. – వీరా మల్లిఖార్జునుడు, వైఎస్సార్సీపీ చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు, పాలకొల్లు ఎన్నికల హామీలు అమలుచేయాలి చేనేత కార్మికుల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇవ్వడం వల్ల నేత కార్మికులకు పెద్దగా మేలు జరిగేది లేదు. చేనేతను ప్రోత్సహించే విధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని అమలుచేయాలి. గత ప్రభుత్వంలో మాదిరి సంక్షేమ పథకాలను అందజేయాలి. నిల్లా బాలవీరయ్య, చేనేత కార్మికుడు, శివపురం మళ్లీ చిన్నచూపే చీర–ధోవతి పథకాన్ని పునరుద్ధరిస్తానని, చేనేత ఉత్పత్తులపై 30 శాతం రిబేటు ఇస్తామంటూ 2014 ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తలేదు. ప్రతామ్నాయ ఉపాధి చూసుకోవాలని నేతన్నలను చిన్నచూపు చూశారు. కూటమి ప్రభుత్వంలోనూ అదే తీరుగా ఉన్నారన్న విమర్శలున్నాయి. ఏడాదిగా ప్రోత్సాహం కరువై చేనేత కుటుంబాలకు పూటగడవడం కష్టంగా మారింది. బతుకుదెరువు కోసం మగ్గాలకు స్వస్తి చెబుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. చాలామంది కార్మికులు నేత పని వీడి వ్యవసాయ కూలీలుగా, ఇతర పనుల్లోకి వెళ్లిపోతున్నారు. ఏడాది క్రితం ఉమ్మడి జిల్లాలో 1187 మగ్గాలు ఉండగా ప్రస్తుతం 677కు తగ్గిపోయినట్టు తెలుస్తోంది. -
సూర్యఘర్ పథకంపై అవగాహన కల్పించాలి
భీమవరం: ప్రతి వినియోగదారుడు సూర్యఘర్ పథకంలో సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని ఏపీఈపీడీసీఎల్ డైరక్టర్ టి. సూర్యప్రకాశ్ ఆదేశించారు. ఏపీఈపీడీసీఎల్ డైరెక్టర్ (ఆపరేషన్)గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మంగళవారం భీమవరం వచ్చిన ఆయన ఎస్ఈ కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీలకు వారి ఇళ్లపై సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలం ఉంటే నెడ్క్యాప్ ద్వారా సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేస్తారని తెలిపారు. ఏ సబ్ స్టేషన్ల పరిధిలో అంతరాయాలు వస్తున్నాయో అడిగి, వినియోగదారులకు అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సూర్యప్రకాశ్ను సిబ్బంది సత్కరించారు. కార్యక్రమంలో ఈఈ ఎన్.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ముఖం చాటేసిన పులస
పెనుగొండ: గోదావరి జిల్లాలకు సంక్రాంతి పండుగ ఎంత ప్రత్యేకమో.. వరదనీటితో ఎగురుకొంటూ వచ్చే అతిథి పులస అంతే విశిష్టతను కలిగి ఉంటుంది. ఎర్రనీరు వచ్చిందంటే చాలు సముద్రం నుంచి ఎగురుకొంటూ గోదావరిలో కలసి నామాంతరం మార్చుకొని పులసగా పిలువబడే చేపలరాజు ఈ ఏడాది చిక్కడం కష్ట సాధ్యంగా మారింది. ప్రతి ఏటా జూన్ నుంచి సెప్టెంబరు వరకూ ఇబ్బడి ముబ్బడిగా దొరికి, దీపావళి వరకూ అరకొరగా దొరికే పులస ప్రస్తుతం దొరకడం కష్టంగా మారింది. దీంతో ఆశలు వదులుకొన్న జాలర్లకు, పులస ప్రియులకు గోదావరికి రెండు మూడు పర్యాయాలు వరద నీరు రావడంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. హిల్సా పులసగా నామాంతరం సముద్రంలో హిల్సాగా పిలవబడే చేపజాతి పసిపిక్ మహాసముద్రంలో జీవిస్తుంటుంది. ప్రతి ఏటా గోదావరికి ఎర్రనీరు వచ్చే సమయానికి ఖండాంతరాలు ఈదుకొంటూ గోదావరికి వచ్చి సంతతిని వృద్ధి చేసుకొని తిరిగి సముద్రంలోకి వెళుతుంటాయి. ఈ సమయంలో జాలర్లకు చిక్కి కాసులు కురిపిస్తాయి. పులసలు వచ్చే సమయానికి రాష్ట్రంలోని నలుమూలల నుంచి జాతీయ రహదారిలో గోదావరి జిల్లాల మీదుగా ప్రయాణించే ప్రతి ఒక్కరూ పులస రుచిని చూడడానికి మక్కువ చూపుతుంటారు. దీంతో దీని ధర ఘనంగానే ఉంటుంది. పులస విరివిగా దొరికే ప్రతి ఏటా కిలో రూ.1500 నుంచి రూ.3 వేల వరకూ పలుకుతుంది. సైజు పెరిగే కొద్దీ ఒక్కో పులసను పోటీ పడి పులస ప్రియలు రూ.25 వేలుకు కొనుగోలు చేసిన దాఖలాలు ఉన్నాయి. అయితే, ఈ ఏడాది వీటి జాడే కరువైంది. దీంతో కిలో రూ.3 వేలు నుంచి అమ్మకాలు సాగిస్తున్నారు. సముద్రపు పోటే కారణమా? పులసల జాడ తగ్గడానికి సముద్రపు పోటు ఓ కారణంగా చెబుతున్నారు. గోదావరి జలాలు సముద్రంలోకి కలిసేటప్పుడు ఉండే తీయదనం, ఎర్రదనం తగ్గడంతో పులసల జాడ తక్కువైందని భావిస్తున్నారు. ఉప్పు జలాలు ప్రస్తుతం ఇటు సిద్ధాంతం వరకూ, అటు జొన్నాడ ఆలమూరు వరకూ ప్రభావం చూపుతుండడంతో పులస మార్గానికి ఆటంకం కారణం కావచ్చునని భావిస్తున్నారు. ఇసుక తవ్వకాలు భారీగా ఉండడంతో సముద్రపు జలాలు గోదావరిలోకి నానాటికీ బాగా చొచ్చుకు వచ్చి గోదావరి ప్రవాహ ప్రాంతం కలుషితమైందని అంటున్నారు. దీంతో పులస మార్గానికి ఆటంకం కలుగుతుందంటున్నారు. ఆగస్టుపైనే ఆశలు సాధారణంగా గోదావరికి ఆగస్టు మధ్యమంలో వరద ఉధృతంగా వచ్చే అవకాశం ఉండడంతో ఇటు పులసల ప్రియులు, అటు జాలర్లు ఆశలు పెట్టుకొన్నారు. అయితే, ఎగువ ప్రాంతాల్లోనూ వర్షాభావ పరిస్థితులు ఉండడంతో వారి ఆశ నిరాశగా మిగిలిపోయే అవకాశాలు ఉన్నాయి. మార్కెట్ను ముంచేస్తున్న ఇలసలు పులస జాడ అంతంతమాత్రంగానే ఉండడంతో జాతీయ రహదారిలో పులసల స్థానంలో ఒడిస్సా నుంచి వచ్చిన ఇలసలు ముంచేస్తున్నాయి. అసలైన పులస ఎర్రనీరులో ఈదుకొంటూ వచ్చినపుడు పులసపై ఎర్రటి జాడ కనిపిస్తూ ఉంటుంది. దీనిని గుర్తించి తీసుకోవలసి ఉంటుంది. పులసలు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం నుంచి ప్రారంభమై ఆత్రేయపురం, విజ్జేశ్వరం, జొన్నాడ ఆలమూరు, సిద్ధాంతం, కోడేరు, యలమంచిలి వరకూ జాలర్ల వలకు చిక్కుతుంటాయి. పులసకు, ఇలసకు తేడాను గోదావరి వాసులు గుర్తించినా, ఇతర జిల్లాల నుంచి జాతీయ రహదారిలో పయనించే వాహనదారులు గుర్తించే అవకాశం లేదు. దీంతో ఇలసలనే పులసలుగా కొందరు అమ్మకాలు సాగిస్తున్నారు. వీటి ధరా అధికంగానే ఉండడంతో ధర చూసి పులసగా భావిస్తూ మోసపోతున్నారు. సిద్ధాంతం, జొన్నాడ ఆలమూరు వంటి ప్రాంతాల్లోనూ పులసలు అరకొరగా దొరుకుతుండడంతో కొందరికి మాత్రమే అసలైన పులస దక్కుతుంది. గోదావరిలో జాడలేని పులస అరకొర లభ్యతతో ఆకాశాన్నంటిన ధరలు పుస్తులమ్ముకొనైనా పులస తినాలనే నానుడు గోదావరి జిల్లాల్లో ఉంది. కానీ ఈ ఏడాది పుస్తులమ్ముకొన్నా.. చేపల రాజు పులస దొరికే పరిస్థితి లేదు. గోదావరికి వరద ఉధృతి అంతంత మాత్రంగా ఉండడంతో పులస జాడ కనిపించడం లేదు. దీంతో పులస ప్రియులు జిహ్వను చంపుకోవాల్సి వస్తోంది. ప్రత్యేక వలలు సైతం ఎంచుకొని, నలుగురైదుగురు జాలర్లు వెళ్లినా ఒకటి రెండు మాత్రమే చిక్కడంతో గిట్టుబాటు కాక జాలర్లు సైతం తీవ్ర నిరాశకు గురవుతున్నారు. కూరా ప్రత్యేకమే పులస కూర తయారీ ప్రత్యేకమే. సాధారణంగా చేపల కూర ఒకటి రెండు రోజులు మించి ఉండే అవకాశాలు ఉండవు. అయితే, పులస కూర వారంకు పైగా నిలువ ఉంటుంది. దీని కోసం ప్రత్యేకంగానే తయారీ చేస్తుంటారు. పులస కూర తయారీలో వెన్నతో పాటు, ఆవకాయ ఊట, కుమ్ముడు ఆముదం వేసి వండుతారు. దీంతో పులస ముక్క కన్నా, పులుసే అమోఘమంటూ లొట్టలు వేసుకొని మరీ తింటారు పులస ప్రియులు. -
పిల్ల జలగలతో గొర్రెలకు ప్రమాదం
జంగారెడ్డిగూడెం: గొర్రెలు, పశువుల్లో పొట్ట జలగల వలన చాలా నష్టాలు కలుగుతాయి. అందులో ముఖ్యంగా పిల్ల పొట్ట జలగల వల్ల గొర్రెల్లో విరేచనాలు కలిగి, నీరసించి మరణాలు సంభవించే ప్రమాదం ఉంది. కుంటలు, చెరువులు పక్కన తేమ గల ప్రాంతాల్లో నాట్లు ఉన్న ప్రాంతాల్లో నత్తలు ఉంటాయి. గొర్రెలను ఆ ప్రాంతాల్లో మేపడం వలన అవి అక్కడి నీరు తాగడం ద్వారా గొర్రెలకు ఈ వ్యాధి సోకుతుందని పశువైద్యాధికారి బీఆర్ శ్రీనివాసన్ తెలిపారు. ఇవి పొట్ట గోడల్లో స్థావరం ఏర్పాటు చేసుకుని పోషక పదార్థాలను పీల్చడం ద్వారా పశువుకు నష్టాన్ని చేకూర్చుతాయని, గొర్రెల పెంపకందారులు జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. వ్యాధి వ్యాప్తి పొట్ట జలగల గుడ్లు పేడ ద్వారా బయటకు విసర్జించబడి, నీటిలోనికి చేరినప్పుడు గుడ్లు పగిలి అందులోని లార్వా దశ (మిరసిడియం) నత్తల శరీరంలోకి ప్రవేశించి, నత్తల్లో కొంత అభివృద్ధి చెంది సర్కేరియా దశలో బయటకు విసర్జించబడతాయి. వీటితో కలుషితమైన గడ్డి, నీటి ద్వారా గొర్రె శరీరంలోనికి ప్రవేశించి, ముందుగా చిన్న ప్రేగుల లోపల పొరలకు చేరుకుని, పోషక పదార్థాలను ఎక్కువగా పీల్చుకుని, 3 నుంచి 5 వారాల్లో పెద్ద జలగలుగా అభివృద్ధి చెందుతాయి. రూమోన్లో స్థావరం ఏర్పరుచుకుని 7 నుంచి 14 వారాల తరువాత గుడ్లు పెడతాయి. ఆ గుడ్లు పేడ ద్వారా బయటకు విసర్జింపబడి ఇతర పశువులకు వ్యాపిస్తాయి. వ్యాధి లక్షణాలు పిల్ల పొట్ట జలగలు చిన్న ప్రేగుల మొదటి భాగమైన డ్యుమోడినము గోడ లోపలి పొరల్లో స్థావరం ఏర్పరుచుకుని, పోషక పదార్థాలను ఎక్కువగా పీల్చుకోవడం వలన గొర్రెలు బాగా క్షీణించి, నీరసించి పోతాయి. గొర్రెల్లో ఆకలి లేమి, నీరు ఎక్కువగా తాగడం, దుర్వాసనతో కూడిన నీళ్ల విరేచనాలు, దవడ కింద భాగంలో నీరు చేరడం, శరీర కుహరంలలో నీరు చేరడం అతిసారం, రక్తహీనత లక్షణాలు కనిపిస్తాయి. దవడ కింద వాపు సాయంత్రం కనబడి ఉదయానికి తగ్గుతుంది. ఈ వ్యాధి వల్ల గొర్రెల మందల్లో 80 శాతం వరకు మరణాలు సంభవించవచ్చు. కొన్ని పర్యాయాలు పిల్ల పొట్ట జలగలు అధిక సంఖ్యలో సోకడం వల్ల నీళ్ల విరేచనాలు కలిగి అకస్మాత్తుగా చనిపోయే అవకాశం ఉంది. కంటి లోపలి మ్యూకస్ పొర రక్తహీనత వల్ల తెల్లగా పాలిపోయి ఉంటుంది. వ్యాధి నిర్ధారణ పిల్ల పొట్ట జలగ వ్యాధి సోకినప్పుడు పేడలో జలగ గుడ్లు కనిపించవు. కాని కొన్ని సందర్భాల్లో పిల్ల పొట్ట జలగలు పేడలో కనిపిస్తాయి. కావున వ్యాధి లక్షణాలు, శవపరీక్ష ద్వారా వ్యాధి నిర్ధారణ చేయవచ్చు. శవ పరీక్ష చేసినప్పుడు డ్యుమోడినం లోపలి మ్యూకస్ పొర పాలిపోయి, అక్కడక్కడ రక్తపు చుక్కలు కనిపిస్తాయి. డ్యుమోడినం లోపలి మ్యూస్ పొరల నుంచి సేకరించిన పదార్ధంను సూక్ష్మదర్శిని ద్వారా పరీక్షించిన కనిపిస్తాయి. చికిత్స సాధారణంగా పొట్ట జలగల నివారణకు ఉపయోగించే మందుల వలన పిల్ల పొట్ట జలగల నివారణ జరగదు. వీటి నివారణకు నిక్లజమైడు 100 మి.గ్రాలు ఒక కిలో శరీర బరువుకు చొప్పున లేదా ఆక్సిక్లోజనైడు 18.7 మి.గ్రాలు ఒక కిలో శరీర బరువుకు చొప్పున రెండు రోజుల వ్యవధిలో రెండు మోతాదులు ఇవ్వాలి. అతిసారం అధిగమించడానికి రక్తంలోనికి సైలెన్లను ఎక్కించాలి. రక్తహీనత నివారించడానికి ఇనుపధాతువుతో కూడిన మందులు ఇవ్వాలి. కాలేయం సాధారణ స్థితికి చేరుకోవడానికి మందులు ఇవ్వాలి. బాక్టీరియా క్రిములు చేరకుండా ఉండటానికి అవసరమైతే యాంటి బయోటిక్ మందులు ఇవ్వాలి. చెరువుల్లోని నత్తలను నాశనం చేయాలి వ్యాధి సోకిన ప్రాంతాల్లోని చెరువులు, కుంటల్లోని నీరు తాగనీయకూడదు. అవసరమైతే చుట్టూ కంచె ఏర్పాటు చేయాలి. పరిశుభ్రమైన తాగునీరు అందుబాటులో ఉంచుకోవాలి. చెరువుల్లోని నత్తలను నాశనం చేయాలి. గొర్రెలకు సమతుల్యమైన పోషకాహారం అందించాలి. పరిశుభ్ర వాతారణం కల్పించాలి. – బీఆర్ శ్రీనివాసన్, పశువైద్యాధికారి -
కారు ఢీకొని ఆటో డ్రైవర్ మృతి
ద్వారకాతిరుమల: ముందు వెళుతున్న ఆటోను కారు అతి వేగంగా ఢీకొట్టడంతో ఆటో డ్రైవర్ తీవ్ర గాయాలపాలై, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన ద్వారకాతిరుమల మండలం, లక్ష్మీపురంలోని విర్డ్ ఆస్పత్రి సమీపంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం. పెదవేగి మండలం కవ్వగుంటకు చెందిన చోదిమెళ్ళ విజయరాజు(40) ఆటో నడుపుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు మంగళవారం మధ్యాహ్నం జేఎంఆర్ హాస్పిటల్ గురించి మైక్ ద్వారా ప్రచారం చేస్తూ, భీమడోలు నుంచి ద్వారకాతిరుమల వైపు వెళుతున్నాడు. ఘటనా స్థలం వద్దకు వచ్చేసరికి చైన్నెకు చెందిన అయిత సురేష్ కారును అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ ఆటోను వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్ విజయరాజును స్థానికులు హుటాహుటీన ఏలూరు ఆశ్రం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. విజయరాజు భార్య దేవమాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై టి.సుధీర్ తెలిపారు. -
వైభవంగా శ్రీవారికి ఏకాదశి ఉత్సవం
ద్వారకాతిరుమల: చినవెంకన్న దివ్య క్షేత్రంలో మంగళవారం రాత్రి శ్రీవారికి తిరువీధి సేవ అంగరంగ వైభవంగా జరిగింది. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుక భక్తులకు నేత్రపర్వమైంది. ముందుగా ఆలయంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను తొళక్క వాహనంపై ఉంచి, సుగంధ భరిత పుష్పమాలికలతో విశేషంగా అలంకరించారు. అనంతరం అర్చకులు పూజాధికాలను జరిపి, హారతులిచ్చారు. ఆ తరువాత స్వామివారి వాహనం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణల నడుమ ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా క్షేత్ర పురవీధులకు పయనమైంది. ప్రతి ఇంటి ముంగిటా భక్తులు స్వామి, అమ్మవార్లకు నీరాజనాలు సమర్పించారు. నేడు ఆట్యా–పాట్యా జిల్లా జట్ల ఎంపిక భీమవరం: పట్టణంలోని ఎస్సీహెచ్బీఆర్ఎం స్కూల్లో ఈనెల 6వ తేదీన జిల్లా స్థాయి ఆట్యా–పాట్యా జూనియర్ బాలురు, బాలికల సెలక్షన్లు నిర్వహిస్తున్నట్లు ఆట్యా–పాట్యా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మంతెన రామచంద్రరాజు, జి కిరణ్వర్మ చెప్పారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించే పోటీల్లో ఎంపికై న క్రీడాకారులు ఈనెల 9, 10 తేదీల్లో ఒంగోలులో జరిగే 10వ జూనియర్ రాష్ట్రస్థాయి ఆట్యా–పాట్యా చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొంటారన్నారు. ఎంపికకు జనవరి 1, 2008 తరువాత పుట్టినవారు అర్హులని, ఆసక్తి కలిగిన క్రీడాకారులు ఆధార్ కార్డు, పుట్టిన తేది ధ్రువీకరణ పత్రం జిరాక్స్ కాపీలు, రెండు పాస్పోర్ట్సైజ్ ఫొటోలతో హాజరుకావాలన్నారు. -
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఐజేయూ నాయకుడు జీవీఎస్ఎన్ రాజు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు కేపీకే కిషోర్ డిమాండ్ చేశారు. వర్కింగ్ జర్నలిస్టుల డిమాండ్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో మంగళవారం నగరంలో ర్యాలీ నిర్వహించి, అనంతరం కలెక్టర్ కే.వెట్రిసెల్వికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా కొత్త అక్రిడిటేషన్లు విడుదల చేయకుండా, పాత అక్రిడిటేషన్ల గడువును ఇప్పటికే మూడుసార్లు పొడిగించారన్నారు. వెంటనే అర్హత ఉన్న జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర, జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీల్లో జర్నలిస్టు సంఘాలకు ప్రాతినిధ్యం ఉండాలని, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందించాలని, ఇన్సూరెన్స్, పెన్షన్ వంటి పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ వెట్రిసెల్వి స్పందిస్తూ జర్నలిస్టుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి టైమ్స్ కిషోర్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.సంజయ్కుమార్, శీర శ్రీనివాస్, ఏపీయూడబ్ల్యూజే నాయకులు షేక్ రియాజ్, ఉర్ల శ్రీనివాస్, సీహెచ్ రామకృష్ణరాజు, డీ.విజయ్ కుమార్, శ్రీధర్, పోతురాజు, బ్రహ్మయ్య, కే.రత్నకుమారి, వాసు తదితరులు పాల్గొన్నారు. -
త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
పాలకొల్లు సెంట్రల్: పూలపల్లి గ్రామంలో ఓ ఇంటిలో గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం సంభవించగా సకాలంలో మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల ప్రకారం గ్రామంలోని గంటాలమ్మ ఆలయం వద్ద నివాసం ఉంటున్న గంట సత్తిబాబు భార్య స్వరాజ్యలక్ష్మి మంగళవారం ఉదయం వంట చేస్తుండగా గ్యాస్ లీకై అగ్నిప్రమాదం సంభవించింది. వెంటనే ఆమె కేకలు వేయగా స్థానికులు పరుగున వచ్చి మంటలతో ఉన్న గ్యాస్ బండను బయటకు తీసుకువచ్చారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, హెచ్పీ గ్యాస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఆలస్యం అయ్యి ఉంటే బండ పేలిపోయేదని స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సుమారు రూ.20 వేలు ఆస్తి నష్టం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఆటల పోటీలు వాయిదా ఏలూరు రూరల్: జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకుని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ చేపట్టిన ఆటల పోటీలు అనివార్య కారణాల వల్ల వాయిదా వేసినట్లు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి బి శ్రీనివాసరావు ప్రకటనలో తెలిపారు. తదుపరి జిల్లా జట్ల ఎంపిక, పోటీల నిర్వహణ తేదీలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో జరిమానా భీమవరం: మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఏడుగురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున జరిమానా విధించినట్లు భీమవరం వన్టౌన్ సీఐ ఎం.నాగరాజు మంగళవారం చెప్పారు. వన్టౌన్ పరిధిలో ఈనెల 4వ తేదీ రాత్రి ఎస్సైలు బి.వై కిరణ్కుమార్, ఎస్వీవీఎస్ కృష్ణాజి సిబ్బందితో కలిసి కొత్త బస్టాండ్ ప్రాంతంలో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించినట్లు చెప్పారు. ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న కారు, ఆటో డ్రైవర్లతోపాటు 9 మంది మోటార్సైకిల్ వాహనదారులపై కేసులు నమోదు చేశామన్నారు. నిందితుల్లో ఏడుగురిని మంగళవారం స్పెషల్ జ్యుడిషియల్ 2వ తరగతి మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి ఎంవీఎన్ రాజారావు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించారన్నారు. వైద్యుల నిర్లక్ష్యంపై ఆసుపత్రి వద్ద ఆందోళన జంగారెడ్డిగూడెం: నిర్లక్ష్యంగా వైద్యం చేయడంతోపాటు తమపై దాడికి పాడ్పడ్డారని పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి వద్ద బాధితులు మంగళవారం ఆందోళన చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై షేక్జబీర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. టి.నరసాపురం మండలం గండిగూడానికి చెందిన యర్రగొర్ల రాజేష్ కుమార్తె పునర్వికశ్రీ జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతుండడంతో జంగారెడ్డిగూడెంలోని ప్రైవేట్ వైద్యశాలకు చికిత్స నిమిత్తం ఈనెల 3వ తేదీన వచ్చారు. ఆసుపత్రి ప్రధాన వైద్యుడు కాకుండా వేరొక వైద్యుడితో గత రెండు రోజులుగా చికిత్స అందిస్తున్నారని, బాలిక కోలుకోకపోవడంతో ప్రధాన వైద్యుడిని ప్రశ్నించగా దురుసుగా ప్రవర్తించడంతో పాటు, ఆసుపత్రి సిబ్బందితో కలిసి రాజేష్ను నిర్భంధించి కొట్టారు. బంధువుల సహాయంతో రాజేష్ బయటకు వచ్చి ఫిర్యాదు చేశాడని, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. -
ఏఆర్డీజీకే విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
ఏలూరు (ఆర్ఆర్పేట): స్థానిక ఆదివారపు పేటలోని ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నగరపాలక ఉన్నత పాఠశాల విద్యార్థులు ఇటీవల ఇండోర్ స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి మహిళా వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వీ. కాంతి జయకుమార్ తెలిపారు. ఈ మేరకు విద్యార్థుల అభినందన కార్యక్రమం మంగళవారం పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీల్లో 8వ తరగతి చెందిన కే. భార్గవి 58 కేజీల విభాగంలో తృతీయ స్థానం, కే.మేఘన 63 కేజీల విభాగంలో ద్వితీయ స్థానం, 9వ తరగతి విద్యార్థిని ఎం.పావని 44 కేజీల విభాగంలో ప్రథమ స్థానం, సీహెచ్. కీర్తన 58 కేజీల విభాగంలో ప్రథమ స్థానం, ఎస్డీ మహీన్ 48 కేజీల విభాగంలో ప్రథమ స్థానం, ఎం.దీక్షిత 44 కేజీల విభాగంలో ద్వితీయ స్థానంలో నిలిచారన్నారు. పదో తరగతి విద్యార్థిని సీహెచ్.హారిక రెడ్డి 63 కేజీల విభాగంలో ప్రథమ స్థానం, ఎన్.విహారిక 77 కేజీల విభాగంలో ప్రథమ స్థానం, జీ. పవిత్ర 58 కేజీల విభాగంలో ద్వితీయ స్థానం, పీ.ఇందు 44 కేజీల విభాగంలో తృతీయ స్థానం, ఎం.అనూష 53 కేజీల విభాగంలో తృతీయ స్థానం, షేక్. ఆశాజ్యోతి 77 కేజీల విభాగంలో ద్వితీయ స్థానం సాధించారన్నారు. అలాగే అథ్లెటిక్స్లో కిలోమీటర్ విభాగంలో జే. పల్లవి ప్రథమ స్థానం సాధించారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాయామ ఉపాధ్యాయులు తోట శ్రీనివాస్ కుమార్, అబ్బ దాసరి జోజి బాబు, ఇతర ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థుల సంఘం నాయకులు అభినందనలు తెలిపారు. -
సీతారాముని ఆలయంలో చోరీ
జంగారెడ్డిగూడెం: పట్టణంలోని శ్రీసీతారామస్వామి ఆలయంలో చోరీ జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని బుట్టాయగూడెం రోడ్డులోని సీతారామస్వామి ఆలయ తలుపులు తెరిచేందుకు మంగళవారం ఉదయం అర్చకులు శ్రీనివాసులు వెళ్లగా తలుపులు తాళాలు పగులగొట్టి ఉండడం, సీసీ కెమెరాలు ధ్వంసం కావడంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. హుండీ కోసం వెతకగా ఆలయానికి ఆనుకుని కున్న ఎంపీయూపీ పాఠశాల ఆవరణలో లభించింది. అలాగే పాఠశాలలోని పలు గదుల తాళాలు సైతం పగులగొట్టి ఉన్నాయి. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలాన్ని ఎస్సై జబీర్ పరిశీలించారు. ఆలయ ఈవో కలగర శ్రీనివాస్ మంగళవారం ఫిర్యాదుచేశారు. కాగా, చోరీ చేసిన హుండీపై వేలి ముద్రలు పడకుండా దొంగలు కోడిగుడ్లు పగులగొట్టి వేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆలయ వాచ్మన్ను ఈవో తన వాహనానికి డ్రైవర్గా వినియోగించుకోవడంతో సోమవారం రాత్రి అతడు విధులకు హాజరు కాలేదని తెలిసింది. ద్విచక్ర వాహనాల చోరీపై ఫిర్యాదు ఉండి: రెండు ద్విచక్ర వాహనాల చోరీపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోడూరు మండలం జగన్నాధపురానికి చెందిన కడలి బాబీ జూన్ 10వ తేదీన మహదేవపట్నలో రొయ్యల పట్టుబడికి వచ్చాడు. పని ముగించుకుని మద్యం దుకాణం వద్ద వాహనాన్ని నిలిపి లోనికి వెళ్లి బయటకు వచ్చేసరికి ద్విచక్రవాహనం కనిపించలేదు. ఆచూకీ లభించకపోవడంతో మంగళవారం ఉండి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై హెడ్కానిష్టేబుల్ కేసు నమోదు చేశారు. అలాగే పెదపుల్లేరులో గత నెల 19వ తేదీ రాత్రి నిచ్చెనకొలను కృష్ణ తన ఇంటివద్ద ద్విచక్రవాహాన్ని పెట్టాడు. మరోసటి రోజు ఉదయానికి వాహనం కనిపించలేదు. ఎస్సై ఎండీ నసీరుల్లా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుత్ షాక్తో ఎలక్ట్రీషియన్ మృతి
తణుకు అర్బన్: విద్యుత్ షాక్తో ఎలక్ట్రీషియన్ మృతి చెందిన ఘటన మంగళవారం తణుకు మండలం కొమరవరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఉండ్రాజవరం మండలం చివటం గ్రామానికి చెందిన పిప్పిరిశెట్టి మణికంఠ (24) కొమరవరం గ్రామంలోని లక్ష్మీ గణేష్ నగర్లో ఒక ఇంట్లో విద్యుత్ లైన్ల పనుల్లో ఉండగా తెగిపడి ఉన్న విద్యుత్ వైరు గమనించకుండా తాకడంతో అతడికి విద్యుత్ షాక్ తగిలింది. దీంతో గాయాలపాలైన మణికంఠను తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. తణుకు పట్టణానికి చెందిన బిల్డర్ వాసుకూరి వెంకట సుబ్బారావు నిర్మిస్తున్న భవనానికి సంబంధించి ప్లంబింగ్, ఎలక్ట్రిషన్ పనుల నిమిత్తం చివటం గ్రామానికి చెందిన కోలా ప్రసాద్ అనే వ్యక్తికి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. అతని వద్ద పనిచేస్తున్న మణికంఠ విధుల్లో ఉండగా విద్యుత్ షాక్ తగిలి మృతిచెందాడు. దీంతో బాధిత కుటుంబసభ్యులు రోదనలు మిన్నంటాయి. తణుకు రూరల్ ఎస్సై చంద్రశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మద్యం కేసులో వ్యక్తి అరెస్ట్ భీమవరం: పాతమద్యం కేసులో ఎండీపీఎల్ ముద్దాయి కాకినాడ జిల్లా తుని పట్టణం సీతారాంపురానికి చెందిన వీర్ల దుర్గా ప్రసాద్ను మంగళవారం అరెస్ట్ చేసినట్లు భీమవరం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ కె.బలరామరాజు చెప్పారు. అతడిని ఫస్ట్ ఏజేఎఫ్సీఎం కోర్టులో హాజరుపర్చగా నరసా పురం సబ్జైల్కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
విద్యా శక్తి కార్యక్రమం బహిష్కరిస్తున్నాం
ఏలూరు (ఆర్ఆర్పేట): ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి పాఠశాల విద్యాశాఖ ప్రవేశ పెట్టిన విద్యాశక్తి అనే కార్యక్రమాన్ని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) బహిష్కరిస్తోందని ఆ సమాఖ్య నాయకులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం జిల్లా విద్యా శాఖాధికారి ఎం. వెంకటలక్ష్మమ్మకు మెమోరాండం ఇచ్చారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో నాయకులు మాట్లాడుతూ విద్యాశక్తి కార్యక్రమం నిర్బంధం కాదని ఇది కేవలం ఐచ్ఛికం మాత్రమేనని తెలిపినప్పటికీ కొంతమంది అధికారులు ఉపాధ్యాయులను విద్యా శక్తి కార్యక్రమం నిర్బంధంగా నిర్వహించవలసిందేనని ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. డీఈఓకు మెమోరాండం ఇచ్చిన వారిలో ఫ్యాప్టో జిల్లా ఛైర్మన్ జీ మోహన్, సెక్రటరీ జనరల్ ఎం.ఆదినారాయణ, డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఆర్.రవికుమార్, బీ రెడ్డి దొర, కేఆర్ పవన్ కుమార్, ఐ.రమేష్ ఉన్నారు. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఏర్పాటుకు అనుమతులు ఏలూరు(మెట్రో): జిల్లాలో వివిధ మొబైల్ టెలికాం కంపెనీలకు 4జీ నెట్వర్క్కు సంబంధించి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఏర్పాటుకు అనుమతులు వెంటనే మంజూరు చేస్తామని కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర సమాచార శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్కు తెలిపారు. సెక్రటేరియట్ నుండి జిల్లా కలెక్టర్లతో కాటంనేని భాస్కర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫైబర్ కేబుల్ అనుమతులను వెంటనే పరిశీలించి, నిబంధనల మేరకు అర్హత కలిగిన వాటికి వెంటనే మంజూరు చేయాలన్నారు. అంగన్వాడీలపై వేధింపులు ఆపాలి ఏలూరు (టూటౌన్): ఫోన్లను అంగన్వాడీ కార్యాలయంలో అప్పగించిన వారిపై వేధింపులు మానుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్. లింగరాజు, ప్రధాన కార్యదర్శి డీఎన్వీడి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు తమ ఫోన్లను ఐసీడీఎస్ కార్యాలయాల్లో అప్పగించారన్నారు. ఫోన్లు పనిచేయడం లేదని చెప్పినా వినకుండా టార్గెట్ల పేరుతో తీవ్రంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నెట్ సిగ్నల్స్ లేకపోవడం, సర్వర్ పనిచేయకపోవడం వల్ల లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారుల బెదిరింపులకు అంగన్వాడీలు లొంగరన్నారు. సమస్య సానుకూలంగా పరిష్కరించాల్సిన అధికారులు ఇంతవరకూ స్పందించకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తక్షణమే అంగన్వాడీలకు 5 జీ ఫోన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రమాదాల నివారణకు ప్రణాళిక కై కలూరు: జాతీయ రహదారులపై ప్రమాదాలు జరగకుండా పక్కా ప్రణాళికతో అధికారులు పనిచేయాలని ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్, జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి చెప్పారు. కై కలూరు నియోజకవర్గంలో ముదినేపల్లి నుంచి కై కలూరు వరకు జాతీయ రహదారిలో ప్రమాదాలు జరిగే ప్రాంతాలను మంగళవారం పరిశీలించారు. ప్రధానంగా ముదినేపల్లి మండలంలో జరుగుతున్న జాతీయ రహదారి విస్తరణ పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. అనంతరం కై కలూరు ట్రావెలర్స్ బంగ్లాలో ఎస్సీ, జేసీలు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులు మాట్లాడుతూ ప్రమాద మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. లీజు జీఓ రద్దు చేయాలి ఏలూరు (ఆర్ఆర్పేట): ఆర్టీసీ స్థలాన్ని లులూ షాపింగ్ మాల్కు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీఓను రద్దు చేయకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు స్పష్టం చేశారు. మంగళవారం ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో రీజనల్ కార్యదర్శి బీ రాంబాబు మాట్లాడుతూ విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న 4.15 ఎకరాలను లులూ షాపింగ్ మాల్కు ప్రభుత్వం కట్టబెట్టడం దారుణమన్నారు. లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తున్న ఆర్టీసీ స్థలాలను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడమంటే సంస్థను ప్రైవేట్ పరం చేయడమేనని, ఉద్యమాల బాట పట్టక ముందే జీఓ రద్దు చేయాలని కోరారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా సరే ఆర్టీసీ ఉద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదన్నారు. ఆర్టీసీని కాపాడుకొనేందుకు పోరాటాలకు సిద్ధంగా ఉంటామని తెలిపారు. -
పశ్చిమలో పేకాట దందా
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లాలో పేకాట దందా మూడు షోలు.. ఆరు ఫుల్లులుగా సాగుతోంది. డ్రాప్నకు రూ.20 వేలు, మిడిల్ డ్రాప్నకు రూ.40 వేలు, ఫుల్ కౌంట్కు రూ.1.60 లక్షలు.. ఇదీ జిల్లా ప్రధాన కేంద్రమైన భీమవరంలో సాగుతున్న ప్రత్యేక పేకాట శిబిరంలోని ప్రధాన గేమ్. టీడీపీ నేతలే నిర్వాహకులు. స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసులకు వారం మామూళ్లు ఫిక్స్ చేసి ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే పేకాట జాతర మరుసటి రోజు తెల్లవారుజామున మూడు గంటల వరకు నిర్విరామంగా సాగుతోంది. భీమవరం సహా పశ్చిమ గోదావరిలోని ప్రధాన పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కాకపోతే నిర్వాహకుల స్థాయిని బట్టి సభ్యులు, ఆట స్థాయి మారుతుంది. భీమవరంలో స్పెషల్ శిబిరం భీమవరంలోని మురుగు కాల్వ గట్టు సమీపంలో ఓ శిబిరం భారీ స్థాయిలో సాగుతోంది. పట్టణంలోని ఓ ప్రముఖ క్లబ్లో సభ్యుడిగా ఉన్న వ్యక్తి నిర్వాహకుడుగా మారి ప్రత్యేక ఏర్పాట్లు చేశాడు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు ఆట సాగుతుంది. 11 మంది సభ్యులతో మూడు కట్టలతో కనష్ట బోర్డు.. ఏడుగురితో మరో బోర్డును ఏర్పాటుచేసి గంటకు 7–10 ఆటలు ఆడిస్తున్నారు. ఓకుకు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు జరిగే బోర్డు అందుబాటులో పెట్టారు. ఓకుకు రూ. 20 వేలు చొప్పున.. ఫుల్ కౌంట్ పడితే రూ.1.60 లక్షలు చెల్లించే గేమ్కు రూ.5 లక్షలు డిపాజిట్, మరో రూ.4.80 లక్షలు అంటే మూడు ఫుల్గేమ్ల మొత్తం వెరసి రూ.9.80 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. డిపాజిట్ మొత్తం కిలోమీటరు దూరంలో ఉండే మరో వ్యక్తి ప్రత్యేకంగా లాకర్లు, ఇతర జాగ్రత్తలతో నగదును సేకరించి టోకెన్లు ఇచ్చి శిబిరానికి పంపుతారు. మరో ప్రత్యేక అంశమేమిటంటే.. సదరు నిర్వాహకుడు సభ్యుడిగా ఉన్న క్లబ్లో గెస్ట్ల పేరుతో కొందరిని అక్కడి ఆటకు పంపించడం, గెలుపోటములు పూర్తయ్యాక వెళ్లే సమయంలో స్లిప్ ద్వారా వసూళ్లు, చెల్లింపులు చేస్తున్నారు. భీమవరంలో పేకాట నిర్వహణలో సుదీర్ఘ అనుభవం ఉన్న సదరు వ్యక్తి ఆటకు రూ.4 వేలు చొప్పున నిర్వహణ ఖర్చులు వసూలు చేస్తున్నాడు. రోజుకు సగటున రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలు శిబిరం నిర్వాహకులకే దక్కుతోంది. వీటిల్లో పోలీసులకు, స్థానిక ప్రజాప్రతినిఽధికి వారం, నెలవారీలు మామూళ్లను ఖరారుచేసి పంపుతూ జోరుగా శిబిరం నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల సన్నిహితులే చూస్తుండటంతో ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణాజిల్లా నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నారు. స్థానిక ఎస్ఐ మొదలుకుని ఉన్నతాధికారుల వరకు ఈ విషయం తెలిసినా పొలిటికల్ గేమ్ పేరుతో పట్టించుకోకపోవడం గమనార్హం. పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదుల పెరగడంతో కొద్ది రోజులుగా శిబిరాల్ని నడపడం లేదు. మరో అనువైన ప్రదేశం కోసం వేట సాగుతున్నట్లు సమాచారంఒక్కొక్కచోట ఒక్కోలా తణుకు మండలంలో అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు ఒకరోజు పైడిపర్రులో, మరోరోజు తేతలి, ఇంకోరోజు వేల్పూరులో.. ఇలా ప్రతిరోజూ ఒక్కో ప్రాంతంలో పెట్టి ఎప్పుడూ వచ్చే వంద మంది జూదరులకు మెసేజ్ల ద్వారా సమాచారం ఇస్తున్నారు. ఉండి, ఆకివీడు, పాలకొల్లులో ఎంపిక చేసిన రొయ్యల చెరువుల వద్ద నిత్యం పెద్దఎత్తున జూదక్రీడ కొనసాగుతోంది. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పెదతాడేపల్లి, పెంటపాడు, రూరల్లో వారానికి రెండు ప్రాంతాల్లో శిబిరాలు నిర్వహిస్తున్నారు. ప్రతిచోటా ప్రజాప్రతినిధుల అండదండలు ఉండటంతో పోలీసుల దాడులు, కేసుల ఊసు లేకపోవడం గమనార్హం. టీడీపీ నేతల కన్నుసన్నల్లో శిబిరాల నిర్వాహకులు భీమవరంలో ఒక్క ఆటకు రూ.1.60 లక్షలు జిల్లాలో నిత్యం రూ.5 కోట్లకు పైగా టర్నోవర్ ఉభయ గోదావరి జిల్లాల నుంచి పేకాటరాయుళ్లకు ప్రత్యేక ఆహ్వానాలు తణుకులో రోజూ మారుతున్న శిబిరాలు పాలకొల్లు, ఉండి, తాడేపల్లిగూడెంలోనూ ఇదే దందా టీడీపీ కూటమి సర్కారు రాగానే.. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, నర్సాపురం, తణుకు, తాడేపల్లిగూడెంలలో పదుల సంఖ్యలో అనధికారిక శిబిరాలు.. అనుమతుల పేరిట పాలకొల్లు, భీమవరంలో క్లబ్బుల్లో పేకాట నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో పేకాటపై ఉక్కుపాదం మోపి క్లబ్లను మూసివేశారు. దీంతోపాటు జూద క్రీడలను పూర్తిగా నిషేధించి వందల కేసులు నమోదు చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీడీపీ నేతలే పేకాట శిబిరాల నిర్వాహకులుగా అవతారమెత్తి మూడు ముక్కలాట మొదలుకుని కనష్ట గేమ్ వరకు భారీగా నిర్వహిస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరితో పాటు కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల నుంచి కూడా పేకాటరాయుళ్లను పెద్దఎత్తున ఆహ్వానించి నిత్యం రూ.5 కోట్లకు పైగా టర్నోవర్ చేస్తూ నిర్వాహకులే నిత్యం లక్షల్లో గడిస్తున్నారు. -
కారు ఢీకొని డ్రైవర్ మృతి
ద్వారకాతిరుమల మండలం లక్ష్మీపురంలో ఆటోను కారు అతి వేగంగా ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. 10లో uతణుకు ప్రభుత్వాసుపత్రిలో పారిశుద్ధ్య పనులుతణుకు అర్బన్: తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రి ఆవరణలో మురుగునీరు తిష్టతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రని సాక్షి దినపత్రికలో ‘సర్కారు దవాఖానాలో మురుగునీరు తిష్ట’ శీర్షికన మంగళవారం ప్రచురితమైన కథనానికి వైద్యాధికారులు స్పందించారు. ఆస్పత్రి సూప రింటెండెంట్ డాక్టర్ కాకర్లమూడి సాయి కిరణ్, ఆర్ఎంవో డాక్టర్ ఎ.తాతారావు సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాన్ని పరిశీలించి జేసీబీ ద్వారా డ్రెయినేజీలో ఉన్న మురుగును తొలగించే చర్యలకు చేపట్టారు. మురుగునీరు ప్రవహించేలా పనులు పూర్తిచేయించడంతోపాటు ఆస్పత్రి ఆవరణలో బ్లీచింగ్ చిమ్మించారు. -
స్మార్ట్ మీటర్లపై ఉద్యమం తీవ్రతరం
జిల్లా వ్యాప్తంగా కదం తొక్కిన ప్రజా సంఘాలు ఏలూరు (ఆర్ఆర్పేట): ప్రజలపై కరెంటు బాదుడు ఉండదని, స్మార్ట్ మీటర్లను బిగిస్తే పగలగొట్టమని నాడు పిలుపునిచ్చిన నారా లోకేష్ ఇప్పుడు స్మార్ట్ మీటర్లు ఎందుకు బిగిస్తున్నారని ప్రజా సంఘాల నాయకులు ప్రశ్నించారు. మంగళవారం స్థానిక విద్యుత్ భవన్ వద్ద ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో విద్యుత్ స్మార్ట్ మీటర్లను బిగించవద్దని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ప్రజా సంఘాల ఐక్య కార్యచరణ వేదిక నాయకులు బద్దా వెంకట్రావు, మన్నవ చైతన్య, ఏ రవి మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ల బిగింపు విషయంలో గత ప్రభుత్వాన్ని విమర్శించిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా అదానీ కంపెనీతో చేసుకున్న ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేసుకోలేదని నిలదీశారు. స్మార్ట్ మీటర్ల బిగింపుపై ప్రజలు ఆగ్రహిస్తూ రోడ్ల మీదకు వచ్చి పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. స్మార్ట్ మీటర్లు బిగించే విధానాన్ని వెనక్కి తీసుకోవాలని లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. ప్రజా సంఘాల నాయకులు యు.వెంకటేశ్వరరావు, బండి వెంకటేశ్వరరావు, ఉప్పులూరి హేమ శంకర్, పంపన రవికుమార్, యర్రా శ్రీనివాస్రావు, డీఎన్వీడీ ప్రసాద్, గడసాల రమణ, మీసాల రమణ, బీ.సోమయ్య, కే.శ్రీను, సంధకం అప్పారావు, కాకర్ల శ్రీను, నౌడు నెహ్రూ బాబు, రెడ్డి శ్రీనివాస డాంగే తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లోనూ ప్రజా వేదిక ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. -
పరాకాష్టకు పీ–4
సాక్షి, భీమవరం: పేదరిక నిర్మూలన కోసమంటూ చంద్రబాబు సర్కారు చేపట్టిన పీ–4 కార్యక్రమం వేధింపులు పరాకాష్టకు చేరాయి. సర్కారు పిలుపునకు సంపన్నుల నుంచి స్పందన రాక ఉద్యోగులను బాధ్యులను చేసే పనిలో ఉంది. మార్గదర్శులుగా మ్యాపింగ్కు ఒత్తిడి తెస్తోంది. పీ–4 అమలులో సర్వే లక్ష్యం చేరుకోలేదంటూ సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అట్టడుగు పేద కుటుంబాలను సంపన్నుల సాయంతో అభివృద్ధి చేసేందుకు పబ్లిక్– ప్రైవేట్ – పీపుల్ పార్టనర్షిప్ (పీ–4) కార్యక్రమం తెచ్చినట్టు ప్రభుత్వం చెప్పుకుంటోంది. పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం 4,92,292 కుటుంబాలకు పలు వడపోతల తర్వాత 64,940 కుటుంబాలను అర్హులుగా ఎంపిక చేశారు. సంపన్నులను మార్గదర్శులుగా చేర్పించి ఆయా కుటుంబాలను వారికి అనుసంధానించాలి. దత్తత తీసుకున్న కుటుంబాలకు ఆర్థిక చేయూత, లేదా జీవనోపాధికి అవసరమైన నైపుణ్యాలను నేర్పించడం ద్వారా వారి అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలి. ఉద్యోగుల పైనే భారం : బంగారు కుటుంబాలు, మార్గదర్శుల గుర్తింపు, అనుసంధానం మొత్తం బాధ్యతలను ప్రభుత్వం ఉద్యోగ వర్గాలపైనే మోపింది. ఈ నెల 15 నాటికి జిల్లాలో 15 వేల మంది మార్గదర్శులను గుర్తించాలని లక్ష్యంగా నిర్ణయించారు. పీ–4లో భాగస్వాములుగా చేరి బంగారు కుటుంబాలను బాగుచేసేందుకు కూటమి పక్షాల్లోని సంపన్న నేతలు ఆసక్తి చూపడం లేదు. శనివారం నాటికి జిల్లాలో 1,700 మంది మాత్రమే మార్గదర్శులుగా రిజిస్టర్ చేసుకున్నారు. వీరికి 35 వేల కుటుంబాలను మ్యాపింగ్ చేశారు. ఉన్నతస్థాయి నుంచి వస్తున్న ఒత్తిడితో త్వరితగతిన మిగిలిన కుటుంబాల మ్యాపింగ్ పూర్తిచేసేందుకు జిల్లా యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో ఉన్నతాధికారులు నిరంతర సమీక్షలు చేస్తున్నారు. పారిశ్రామిక, వ్యాపారవేత్తలు, పెద్ద రైతులు, రైస్ మిల్లర్స్, విద్యాసంస్థలు, కార్పొరేట్ సంస్థలు, మద్యం, ఎరువుల షాపుల యజమానులు, డీలర్లు తదితర వర్గాల వారితో సమావేశాలు ఏర్పాటుచేసి మార్గదర్శులుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరుతున్నారు. పెద్దగా ఫలితం కనిపించకపోవడంతో మార్గదర్శుల భారాన్ని ప్రభుత్వం ఉద్యోగ వర్గాలపై మోపుతోంది. ఒక్కో కుటుంబాన్ని మ్యాపింగ్ చేసుకోవాలంటూ వస్తున్న ఒత్తిళ్లతో ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు. నైపుణ్యాలను నేర్పించే ఆప్షన్లో ఒక్కో ఉద్యోగి ఒక్కో కుటుంబాన్ని దత్తత తీసుకోమంటున్నారని సచివాలయ ఉద్యోగులు అంటున్నారు. ఏడాదికి ఒక్కో ఉద్యోగి కనిష్టంగా దత్తత కుటుంబానికి రూ.5 వేలు సాయం అందించాలని, ఈ మేరకు తమ జీతం నుంచి మినహాయించుకుంటుందన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. ఆదిలోనే తిప్పికొట్టిన ఉపాధ్యాయ సంఘాలు పీ–4 అమలులో టీచర్లను భాగస్వాములను చేసే ప్రయత్నాలను ఉపాధ్యాయ సంఘాలు ఆదిలోనే తిప్పికొట్టాయి. ఉపాధ్యాయుల రిజిస్ట్రేషన్కు ఏలూరు విద్యాశాఖ ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్రవ్యాప్తంగా సంఘ నాయకులు ఖండించారు. సంపన్నవర్గాలకు చెందిన పీ–4 అమలుకు మధ్య తరగతి శ్రేణిలో ఉండే ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాల వారిపై భారం మోపడం సరికాదని, వేరే కుటుంబాలను దత్తత తీసుకుని సాయపడే పరిస్థితి ఉండదనే విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గుర్తించాలంటూ ఫ్యాప్టో చురకలంటించింది. ఉపాధ్యాయ వర్గాలు ఆందోళనలకు సిద్ధంకావడంతో ఉత్తర్వులను విద్యాశాఖ వెనక్కి తీసుకుంది. సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ : పీ–4 సర్వే లక్ష్య సాధనలో నిర్లక్ష్యంగా ఉన్నారంటూ భీమవరం మున్సిపాల్టీకి చెందిన 26 మంది సచివాలయ అడ్మిన్, ఎడ్యుకేషన్, డేటా ప్రాసెసింగ్ ఉద్యోగులకు ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసుల జారీచేయడం చర్చనీయాంశంగా మారింది. పింఛన్ల పంపిణీ, రకరకాల సర్వేల పేరిట క్షణం తీరిక లేకుండా పనిచేస్తుంటే నోటీసులు ఇవ్వడం సరికాదని ఉద్యోగులు వాపోతున్నారు. జిల్లాలోని మిగిలిన మున్సిపాల్టీల్లోనూ ఈ తరహా ఒత్తిళ్లు అధికంగా ఉన్నట్టు చెబుతున్నారు. పేదలకు మేలు చేయాలన్న చిత్తశుద్ది ప్రభుత్వానికి ఉంటే నేరుగా వారిని ఆదుకోవాలని, ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం సరికాదని ఉద్యోగ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. మార్గదర్శులుగా ముందుకురాని కూటమి నేతలు ఉద్యోగులనే మార్గదర్శులుగా మ్యాపింగ్కు ఒత్తిళ్లు భీమవరంలో 26 మంది సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు ఎంపీడీవోలు, ఇతర అధికారులపైనా తీవ్ర ఒత్తిడి -
నా జీవితం తెరిచిన పుస్తకం
బుట్టాయగూడెం: ఇద్దరు కూటమి నాయకులు మాట్లాడుకున్న ఆడియో సంభాషణకు తనకు సంబంధం ఏంటని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ప్రశ్నించారు. పోల వరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఏడాదిలో రూ. 100 కోట్లు సంపాదించారని టీడీపీ, జనసేనకు చెందిన అగ్ర నాయకులు మాట్లాడుకుంటే వారిని ప్రశ్నించకుండా చిర్రి బాలరాజు తనపై బురద చల్లాలని చూడటం ఎంతవరకూ సమజసమని ప్రశ్నించారు. 20 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన తనను ఎంత సంపాదించానో బయటకు తీస్తానని చిర్రి బాలరాజు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తన జీవితం తెరిచిన పుస్తకం లాంటిదని తెల్లం బాలరాజు స్పష్టం చేశారు. తన తండ్రి తెల్లం చిన్నవడ్డీ వార్డు మెంబర్గా, సర్పంచ్గా జెడ్పీటీసీగా, ఎంపీపీగా అనేక పదువులు చెయ్యడమే కాకుండా పోలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారని అన్నారు. తనది రాజకీయ కుటుంబమని చెప్పారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన తనను ఉపఎన్నికల్లో కూడా అత్యధిక మెజారిటీతో ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారని అన్నారు. చిర్రి బాలరాజు నిక్కర్లు వేసుకునే రోజుల్లో తాను ఎమ్మెల్యేగా ప్రజాసేవలో ఉన్నానని తెల్లం బాలరాజు తెలిపారు. తనమీద వచ్చిన ఆరోపణను పక్కదోవ పట్టించేందుకే తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తనకు మద్యం షాపులు లేవని, ఇసుక, మట్టిలో కమిషన్ తీసుకోలేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో చిర్రి బాలరాజు జనసేన తరపున టికెట్టు తెచ్చుకుని పోటీకి రావాలన్నారు. తాను కూడా వైఎస్సార్సీపీ తరపున టికెట్టు తెచ్చుకొని నిలబడతానని ఎవరు ఎటువంటి వారో ప్రజలే తగిన తీర్పు ఇస్తారని చెప్పారు. కూటమి నేతలను నిలదీయలేకే బురదజల్లే ప్రయత్నం చిర్రి బాలరాజుపై మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఫైర్ -
చేయి తిరుగుతోంది!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో పేకాట దందా మూడు షోలు.. ఆరు ఫుల్లులుగా సాగుతోంది. డ్రాప్కు రూ.20 వేలు, మిడిల్ డ్రాప్కు రూ.40 వేలు, ఫుల్ కౌంట్కు రూ.1.60 లక్షలు.. ఇదీ జిల్లా ప్రధాన కేంద్రమైన భీమవరంలో సాగుతున్న ప్రత్యేక పేకాట శిబిరంలోని ప్రధాన గేమ్. టీడీపీ నేతలే నిర్వాహకులు. స్థానిక ప్రజాప్రతిని«ధులు, పోలీసులకు వారం మామూళ్లు ఫిక్స్చేసి ఉ.10 గంటలకు ప్రారంభమయ్యే పేకాట జాతర మరుసటి రోజు తెల్లవారుజామున మూడు గంటల వరకు నిర్విరామంగా సాగుతోంది. భీమవరం సహా పశ్చిమ గోదావరిలోని ప్రధాన పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కాకపోతే నిర్వాహకుల స్థాయిని బట్టి సభ్యులు, ఆట స్థాయి మారడం మినహా మిగతాదంతా సేమ్ టూ సేమ్.టీడీపీ కూటమి సర్కారు రాగానే..పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, నర్సాపురం, తణుకు, తాడేపల్లిగూడెంలలో పదుల సంఖ్యలో అనధికారిక శిబిరాలు.. అనుమతుల పేరిట పాలకొల్లు, భీమవరంలో క్లబ్బుల్లో పేకాట నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో పేకాటపై ఉక్కుపాదం మోపి క్లబ్లను మూసివేశారు. దీంతోపాటు జూద క్రీడలను పూర్తిగా నిషేధించి వందల కేసులు నమోదు చేసిన పరిస్థితి ఉంది. అయితే, టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీడీపీ నేతలే పేకాట శిబిరాల నిర్వాహకులుగా అవతారమెత్తి మూడు ముక్కలాట మొదలుకుని కనిష్టా వరకు భారీగా నిర్వహిస్తున్నారు. అంతేకాక.. ఉమ్మడి పశ్చిమ గోదావరితో పాటు కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల నుంచి కూడా పేకాటరాయుళ్లను పెద్దఎత్తున ఆహ్వానించి నిత్యం రూ.5 కోట్లకు పైగా టర్నోవర్ చేస్తూ నిర్వాహకులే నిత్యం లక్షల్లో గడిస్తున్నారు.ఒక్కొక్కచోట ఒక్కోలా..తణుకు మండలంలో అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు ఒకరోజు పైడిపర్రులో, మరోరోజు తేతలి, ఇంకోరోజు వేల్పూరులో.. ఇలా ప్రతిరోజూ ఒక్కో ప్రాంతంలో పెట్టి ఎప్పుడూ వచ్చే వంద మంది జూదరులకు మెసేజ్ల ద్వారా సమాచారం ఇస్తున్నారు. ఉండి, ఆకివీడు, పాలకొల్లులో అయితే ఎంపిక చేసిన రొయ్యల చెరువుల వద్ద నిత్యం పెద్దఎత్తున జూదక్రీడ కొనసాగుతోంది. అలాగే, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పెదతాడేపల్లి, పెంటపాడు, రూరల్లో వారానికి రెండు ప్రాంతాల్లో శిబిరాలు నిర్వహిస్తున్నారు. ప్రతిచోటా ప్రజాప్రతినిధుల అండదండలు ఉండటంతో పోలీసుల దాడులు, కేసుల ఊసు లేకపోవడం గమనార్హం.భీమవరంలో భారీస్థాయిలో స్పెషల్ శిబిరం..భీమవరంలోని మురుగు కాల్వగట్టు సమీపంలో ఓ శిబిరం భారీస్థాయిలో సాగుతోంది. పట్టణంలోని ఓ ప్రముఖ క్లబ్లో సభ్యుడిగా ఉన్న వ్యక్తి నిర్వాహకుడుగా మారి ప్రత్యేక ఏర్పాట్లుచేశాడు. ఎలా అంటే.. ఉ.10 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు క్రీడ నిర్వహణ. 11 మంది సభ్యులతో మూడు కట్టలతో కనిష్టా బోర్డు.. ఏడుగురితో మరో బోర్డును ఏర్పాటుచేసి గంటకు 7–10 ఆటలు ఆడిస్తున్నారు. ఓకుకు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు జరిగే బోర్డు అందుబాటులో పెట్టారు.ప్రధానంగా ఓకుకు రూ.20 వేలు చొప్పున.. ఫుల్ కౌంట్ పడితే రూ.1.60 లక్షలు చెల్లించే గేమ్కు రూ.5 లక్షలు డిపాజిట్.. మరో రూ.4.80 లక్షలు అంటే మూడు ఫుల్గేమ్ల మొత్తం వెరసి రూ.9.80 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇక డిపాజిట్ మొత్తం కిలోమీటరు దూరంలో ఉండే మరో వ్యక్తి ప్రత్యేకంగా లాకర్లు, ఇతర జాగ్రత్తలతో నగదును సేకరించి టోకెన్లు ఇచ్చి శిబిరానికి పంపుతారు. మరో ప్రత్యేక అంశమేమిటంటే.. సదరు నిర్వాహకుడు సభ్యుడుగా ఉన్న క్లబ్లో గెస్ట్ల పేరుతో కొందరిని అక్కడి ఆటకు పంపించడం, గెలుపోటములు పూర్తయ్యాక వెళ్లే సమయంలో స్లిప్ ద్వారా వసూళ్లు, చెల్లింపులు చేస్తున్నారు.భీమవరంలోని పేకాట నిర్వహణలో సుదీర్ఘ అనుభవం ఉన్న సదరు వ్యక్తి ఒక్కో ఆటకు రూ.4 వేలు చొప్పున నిర్వహణ ఖర్చులు వసూలుచేస్తున్నాడు. ఈ క్రమంలో రోజుకు సగటున రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలు శిబిరం నిర్వాహకులకే దక్కుతోంది. వీటిల్లో పోలీసులకు, స్థానిక ప్రజాప్రతిని«ధికి వారం, నెలవారీలు మామూళ్లను ఖరారుచేసి ఠంఛనుగా పంపుతూ జోరుగా శిబిరం నిర్వహిస్తున్నారు.మరో విషయమేమంటే.. ఇక్కడ పేకాట కోసం వచ్చేవారికి త్రీస్టార్ హోటల్ సౌకర్యాలన్నీ కల్పిస్తున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల సన్నిహితులే పైఎత్తున చూస్తుండటంతో ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణాజిల్లా నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నారు. స్థానిక ఎస్ఐ మొదలుకుని ఉన్నతాధికారుల వరకు ఈ విషయం తెలిసినా పొలిటికల్ గేమ్ పేరుతో పట్టించుకోకపోవడం గమనార్హం. -
జనసేన వర్సెస్ టీడీపీ రగడ..!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పోలవరం ఎమ్మెల్యే అవినీతి వ్యవహారం జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. వంద కోట్ల అవినీతి దేశానికే రోల్మోడల్ అంటూ దేవినేని ఉమ చేసిన వ్యాఖ్యల ఆడియో టేప్ హాట్టాపిక్గా మారిన క్రమంలో జన సైనికులు రగిలిపోతున్నారు. టీడీపీ కోవర్ట్ ఆపరేషన్తోనే ఇదంతా చేసి రాజకీయంగా జనసేనను పోలవరంలో అణచివేయడానికి తెరతీసిందని, దీనికి జనసేన కీలక నేత కరాటం రాంబాబును పావుగా వాడుకున్నారనే ప్రచారం జోరందుకోవడంతో నియోజకవర్గంలో జనసేన వర్సెస్ టీడీపీ రగడ హాట్ హాట్గా మారింది. జనసేన భవితవ్యం గందరగోళం జనసేన, టీడీపీ ఆధిపత్యపోరు కొనసాగిస్తున్న తరుణంలో తాజా ఎపిసోడ్తో జనసేన భవితవ్యం గందరగోళంలో పడింది. ఎమ్మెల్యే ఏడాదిలోనే వంద కోట్లు సంపాదించాడు.. భారీ భవనం కట్టుకున్నాడు.. దేశానికే అవినీతిలో రోల్మోడల్గా నిలిచాడంటూ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వర్గం మండిపడటం మినహా మరేమీ చేయలేని పరిస్థితి. అయితే ఇదంతా అబద్ధపు ప్రచారం, తప్పుడు ఆడియో రికార్డు అని ఎవరూ ఖండించకుండా పెద్ద మనుషుల మధ్య జరిగిన సంభాషణలు టీడీపీ ఎలా బయటపెడుతుందని, దీనిపై స్పందించాలని జనసేన చోటా నేతలు బలంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ మొదలు టీడీపీ జిల్లా అ ధ్యక్షుడు వరకు ఎవరూ స్పందించని పరిస్థితి. మూడు రోజులుగా ఎమ్మెల్యే అవినీతి చేయలేదంటూ.. జనసేన కేడర్ చెప్పడమే కానీ ఎవరూ పట్టించుకోకపోవడంతో ఏం చేయాలనే దానిపై సందిగ్ధం నెలకొంది. దేవినేని ఉమాతో మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ అనుచరుడు పరిమి రాంబాబు చౌదరి అతడి ఫోన్ నుంచే కరాటం రాంబాబుతో మాట్లాడించారు. ఆడియో వాయిస్ రికార్డును టీడీపీ నేత రాంబాబు చౌదరే బయటపెట్టాడని, అతడిపై టీడీపీ చర్యలు తీసుకోవాలని జనసేన డిమాండ్ చేస్తున్నా టీడీపీ లైట్గా తీసుకుంది. టీడీపీ ట్రాప్లో కరాటం మరోవైపు టీడీపీ ట్రాప్లో జనసేన నేత కరాటం రాంబాబు పడటం వల్ల పార్టీకి, ఎమ్మెల్యేకు భారీ డ్యామేజ్ జరిగిందనే అంతర్గత చర్చ కొనసాగుతోంది. పారీ్టపరంగా ఇబ్బందులు వస్తే ఖండించాల్సిన నాయకుడే సంభాషించడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి జనసేనలో నెలకొంది. ఇంకోవైపు దీనిపై కరాటం రాంబాబు స్పందిస్తూ దేవినేని ఉమానే సమాధానం చెప్పాలని ఒక్క మాటతో ముగించడంతో ఎమ్మెల్యే వర్గం మళ్లీ డైలమాలో పడింది. తాజా పరిణామాల క్రమంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అధికారిక కార్యక్రమాల్లో ఆదివారం దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో ఏపీ ట్రైకార్ చైర్మన్, టీడీపీ నేత బొరగం శ్రీనివాస్ అన్నదాత సుఖీభవ సభలో పాల్గొనడం మరో చర్చకు తెరతీసింది. మొత్తంగా ఆడియో టేప్ వ్యవహారంలో జనసేన నేతనే టీడీపీ పావుగా వాడుకుని జనసేన ఎమ్మెల్యేనే అప్రతిష్టపాలు చేసేలా విజయవంతంగా మైండ్ గేమ్ నడిపింది. -
విద్యాసంస్థల్లో ఆంక్షలపై నిరసన
భీమవరం: విద్యా సంస్థల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ, విద్యార్థుల తల్లిదండ్రులు మినహా మరెవరికీ ప్రవేశంలేదంటూ పాఠశాల విద్యాశాఖ ఇచ్చిన ఉత్తర్వులు విద్యార్థుల స్వేచ్చను, ప్రజాస్వామిక హక్కులను హరించేలా ఉన్నాయని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బి.గణేష్ విమర్శించారు. ప్రభుత్వ ఉత్తర్వులను నిరసిస్తూ సోమవారం భీమవరం పట్టణం ప్రకాశం చౌక్ సెంటర్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పాఠశాల విద్యా కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులు మూలంగా విద్యార్థులు తమ స్వేచ్ఛను కోల్పోతారని వారి సమస్యలు తెలుసుకునేందుకు వెళ్లే వారికి ఈ ఉత్తర్వుల ద్వారా అనుమతులుండవన్నారు. ఉత్తర్వులు ద్వారా ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల వ్యాపారం, అన్యాయాలను బయటకు తీసే అవకాశం లేకుండా పోతుందని గణేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తర్వులను ఉపసంహరించకపోతే విద్యార్థులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు ఎస్.లక్ష్మణ్, బి.సింధు, సాయికృష్ణ, హేమంత్, భాగ్యలక్ష్మి, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. ఆంక్షలు విరమించుకోవాలి పాలకొల్లు సెంట్రల్: ప్రభుత్వ పాఠశాలల్లోకి విద్యార్థి సంఘాలకు అనుమతి లేదంటూ విడుదల చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) జిల్లా కార్యదర్శి టి.అప్పలస్వామి డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక ఏఎస్ఎన్ఎం ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద జీవోను రద్దు చేయాలంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అప్పలస్వామి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్ఎంసి కమిటీ సభ్యులకు తప్ప ఇంకెవ్వరికీ అనుమతి లేదంటూ కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోను తక్షణమే రద్దు చేయాలన్నారు. విద్యారంగ సమస్యలపై, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోరుతూ దశాబ్దాలుగా విద్యార్థి సంఘాలు అనేక ఉద్యమాలు చేశాయన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా విద్యారంగంలో గాని విద్యార్థులకు గాని సమస్యలు వస్తే తాము తప్పనిసరిగా న్యాయపోరాటం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్ఏ పట్టణ అధ్యక్షుడు మేడవాల రాజా, తానేటి రంజిత్ కుమార్, సిహెచ్ గణేష్, జి.భానుప్రకాష్, టి.మహేష్ బాబు తదితరులు పాల్గొన్నారు -
జ్వరంతో చికిత్స పొందుతూ చిన్నారి మృతి
కుక్కునూరు: పుట్టిన రోజు జరుపుకోవాల్సిన రోజే జ్వరంతో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందిన ఘటన సోమవారం జరిగింది. చిరవెల్లి గ్రామానికి చెందిన యర్నం ప్రదీప్, కావేరి దంపతులకు సహస్ర(6), స్నేహిత (3) సంతానం. సహస్రకు గత నెల 31న తీవ్రజ్వరం రావడంతో కుటుంబసభ్యులు భద్రాచలం ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ పాపకు పరీక్షలు చేసిన వైద్యులు ప్లేట్లెట్లు తగ్గినట్టు చెప్పి చికిత్సను ప్రారంభించారు. శనివారం పాపకు జ్వరం తగ్గకపోగా ప్లేట్లెట్ల సంఖ్య 15 వేలకు పడిపోయి పరిస్థితి విషమించడంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం ఖమ్మంకు రిఫర్ చేశారు. ఖమ్మం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా చిన్నారి మృతి చెందింది. -
యాప్లతో వేగలేం
పాలకోడేరు: సెల్ఫోన్లు ప్రభుత్వానికి తిరిగిచ్చేయాలనే నిర్ణయంతో సోమవారం విస్సాకోడేరు సీడీపీఓ కార్యాలయం వద్ద సెల్ఫోన్లను అప్పగించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ నాయకురాలు మహాలక్ష్మి మాట్లాడుతూ సిగ్నల్స్ లేక ఫోన్లు పనిచేయక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నామని, అనేకసార్లు ప్రభుత్వ అధికారులకు తెలియచేసినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో యూనియన్ రాష్ట్ర కమిటీ సెల్ఫోన్లు ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయించిందన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని లేదంటే మరింత తీవ్రంగా ఉద్యమిస్తామని అన్నారు. సీఐటీయు జిల్లా నాయకుడు ఎం.ఆంజనేయులు పాల్గొని పోరాటానికి సంఘీభావం తెలిపారు. అంగన్వాడీలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఏలూరులో.. ఏలూరు(టూటౌన్): పనిచేయని స్మార్ట్ఫోన్లు మాకొద్దు అంటూ అంగన్వాడీలు నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ఏఎస్ఆర్ స్టేడియం వెనుకవైపున ఉన్న ఐసీడీఎస్ ఏలూరు ప్రాజెక్టు కార్యాలయం వద్ద సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పని చేయని స్మార్ట్ఫోన్ల తో డేటా వివరాలు నమోదు చేయలేకపోతున్నామన్నారు. 5జీ టెక్నాలజీ యాప్లతో ఓల్డ్ వెర్షన్ ఫోన్లో ఎలా అప్లోడ్ చేయాలన్నారు. ప్రాజెక్ట్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు షేక్ సమీమా, తలారి రజని మాట్లాడుతూ ప్రభుత్వం కొత్త ఫోన్లు ఇచ్చే వరకు మాన్యూవల్ పద్ధతిలోనే పని చేస్తామన్నారు. రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కై కలూరులో.. కై కలూరు: అంగన్వాడీ టీచర్లుకు ఇచ్చిన సెల్ ఫోన్లు పనిచేయడం లేదు. పైగా మూడు యాప్లలో వివరాలు నమోదు చేయడం కష్టమవుతోంది అంటూ అంగన్వాడీ కార్యకర్తలు కై కలూరులో సెక్టార్ ఆఫీసు సూపర్వైజర్ ప్రసన్న లక్ష్మీకి సోమవారం సెల్ఫోన్లు ఇచ్చేశారు. కై కలూరు నియోజకవర్గం నాలుగు మండలాల్లో కలపి మొత్తం 311 సెల్ఫోన్లు వెనక్కి ఇచ్చేశారు. అంగన్వాడీ కార్యకర్తల ప్రాజెక్టు సెక్రటరీ సుజాత మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్లలో యాప్ల గొడవ లేకుండా చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇప్పడు మూడు యాప్లు కలపి ఒక యాప్గా చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికై న సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. సెల్ఫోన్లు తిరిగిచ్చేసిన అంగన్వాడీ కార్యకర్తలు -
లైంగిక వేధింపుల నుంచి రక్షణకు కృషిచేయాలి
భీమడోలు: లైంగిక వేఽధింపుల నుంచి మహిళళల రక్షణకు ఏర్పాటు చేసిన కమిటీలు తమ వంతు కృషి చేయాలని ఉమ్మడి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ అన్నారు. భీమడోలు మండల సమాఖ్య కార్యాలయంలో సోమవారం జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సదస్సును నిర్వహించారు. కె.రత్నప్రసాద్ మాట్లాడుతూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ఉచిత న్యాయ సహాయాన్ని, బాధితులకు తాత్కాలిక, శాశ్వత పరిహారాన్ని అందిస్తాయన్నారు. జిల్లా బాలికా సంరక్షణాధికారిణి సీహెచ్ సూర్యచక్రవేణి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో లింగ నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయని, అలా చేసే వారిని చట్టం తీవ్రంగా శిక్షిస్తుందన్నారు. మహిళలకు అనేక చట్టాలున్నాయని, వాటిని సక్రమంగా వినియోగించుకుంటే రక్షణ పొందుతారన్నారు. పోలసానిపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలను న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సందర్శించి కళాశాలలోని వసతులు, పరిసరాలను పరిశీలించారు. -
క్విజ్లో రాష్ట్ర స్థాయికి ఎంపిక
ఏలూరు (ఆర్ఆర్పేట): రెడ్ రిబ్బన్ క్లబ్ క్విజ్ జిల్లా స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేసినట్లు జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ ఆఫీసర్ డాక్టర్ నరేంద్ర కృష్ణ తెలిపారు. స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశానుసారం జిల్లా ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ హెచ్ఐవీ ఎయిడ్స్ కార్యక్రమం ద్వారా ఏలూరు జిల్లాలోని జూనియర్ ఇంటర్ విద్యార్థులకు రెడ్ రిబ్బన్ క్విజ్ జిల్లా వ్యాప్తంగా ఏలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం నిర్వహించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి ముసునూరు: పురుగుల మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై ఎం.చిరంజీవి తెలిపారు. మండలంలోని వేల్పుచర్ల శివారు అన్నపునేనివారిగూడెంకు చెందిన దుక్కిపాటి నాగరాజు (48)కూలి పనులు చేసేవాడు. తరచూ భార్యభర్తలు గొడవలు పడుతున్నారు. ఇటీవల గొడవలు అధికం కావడంతో మనస్తాపానికి గురై ఈ నెల మూడున పురుగుల మందు తాగాడు. బంధువులు అతనిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడ నుంచి విజయవాడ తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. బీచ్లో యువకుడి గల్లంతు నరసాపురం రూరల్: మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్లో సోమవారం సాయంత్రం యువకుడు గల్లంతయ్యాడు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం విజయవాడకు చెందిన బి.తన్వీర్ భీమవరంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం తన మిత్రులతో కలిసి బీచ్కి వచ్చాడు. అలల ఉధృతికి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న మొగల్తూరు ఎస్సై జి.వాసు సముద్రతీర ప్రాంతంలో గాలిస్తున్నారు. హోటళ్లపై దాడులు తణుకు అర్బన్: గృహ అవసరాలకు మాత్రమే వినియోగించాల్సిన రాయితీ గ్యాస్ సిలిండర్లు వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే కఠినచర్యలు తీసుకుంటామని తణుకు తహసీల్దార్ దండు అశోక్వర్మ హెచ్చరించారు. అక్రమంగా గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తున్న హోటళ్లపై సోమవారం దాడులు నిర్వహించారు. తణుకు పట్టణంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లపై దాడి చేసి మొత్తం 25 రాయితీ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
వర్షాకాలంలో విద్యుత్తో అప్రమత్తం
తణుకు అర్బన్: వర్షాకాలంలో విద్యుత్తో అప్రమత్తంగా ఉండాలని ఆ శాఖ అధికారులు సూచిస్తున్నారు. వర్షాలకు వృక్షాలు కూలినప్పుడు, విద్యుత్ తీగలు తెగిపడినప్పుడు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులకు తెగిపడుతున్న విద్యుత్ తీగలు తగిలి నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. గృహాల్లో సైతం తడిచేతులతో స్విచ్లు వేయడం, వర్షాలకు స్విచ్ బోర్డులు తడిసి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడం వంటివి చూస్తున్నాం. వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ శాఖ పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలి. వర్షాకాలం మొదలైనా ఇంతవరకు విద్యుత్ శాఖ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. వర్షాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ● భారీ వర్షాల సమయాల్లో గృహోపకరణాల స్విచ్లు ఆఫ్ చేసి ఉంచాలి. ● కరెంటు స్విచ్ బోర్డుల్లో స్విచ్లను తడి చేతులతో తాకరాదు. ● చిన్న పిల్లలను కరెంటు వస్తువులకు దూరంగా ఉంచాలి. ● ఇంటి సర్వీసు వైరు తెగినా, జాయింట్స్ కట్ అయినా తాకకుండా వెంటనే విద్యుత్ శాఖకు తెలియచేయాలి. ● విద్యుత్ స్తంభాలు, స్టే వైర్లను తాకరాదు. ● ఇంటి పరిసరాల్లో చెట్లు, కరెంటు స్తంభాలు పడిపోయిన సందర్భాల్లో దగ్గరకు వెళ్లకుండా ముందుగా విద్యుత్ శాఖకు తెలియచేయాలి. ● గృహాల ఆవరణలోని నీళ్ల మోటార్లకు ఉన్న కరెంటు వైర్లను తాకరాదు. ● గాలి, వాన సమయాల్లో కరెంటు లైన్ల కింద నిలబడడం, కూర్చోవడం చేయరాదు. ● రహదారుల్లో విద్యుత్ ప్రసారం జరిగే తీగలు తెగి పడి ఉంటే విద్యుత్ ప్రవాహం ఉన్నట్లుగా భావించి దూరంగా ఉండాలి. ● మోటార్ల స్టార్టర్లు, మోటార్లు వర్షం వలన నీటిలో మునగడం, పూర్తిగా తడవడం వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉంది. రైతులు జాగ్రత్తలు పాటించాలి. ● విద్యుత్ ప్రమాదానికి గురైన వారిని కానీ ఆ విద్యుత్ పరికరాన్ని కానీ నేరుగా తాకరాదు. ● వర్షాలు పడుతున్న సమయాల్లో రహదారులపై ఉన్న విద్యుత్ స్తంభాలను ముట్టుకోరాదు. ● విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం టోల్ప్రీ 1912 నంబరులో సంప్రదించాలి. -
సీహెచ్ఓలపై చిన్నచూపు
పెంటపాడు: గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు(సీహెచ్ఓ)లు నిరాదరణకు గురవుతున్నారు. గత జగనన్న ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో నియమితులైన వీరిని కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఉద్యోగ భద్రత లేక, సకాలంలో జీతాలు అందక, సేవలు అందిస్తున్నా సరైన గౌరవం దక్కక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. జిల్లావ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 368 సీహెచ్ఓలు పనిచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆయుష్మాన్ ఆరోగ్య సేవలో భాగంగా వీరికి 2019 నుంచి పోస్టులు మంజూరయ్యాయి. పీహెచ్సీల కన్నా మొదట వీరు ప్రాథమికంగా వైద్యనిర్ధారణ చేసి వ్యాధి తీవ్రతను బట్టి కేసులపై అధికారులకు రిఫర్ చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో 14 రకాల సేవలు అందిస్తున్నారు. దీంతో పాటు, ప్రభుత్వం చేపడుతున్న ఆరోగ్య సర్వే, ఫ్యామిలీ హెల్త్ ఆరోగ్య సేవలు, ఇంటింటికీ సేవలతో పాటు, అంగన్వాడీ ప్రధానంగా గ్రామీణ ప్రజలకు చేరువగా ఉంటున్నారు. అయినా వారిని పాలకులు పట్టించుకోవడం లేదు. కమ్యూనిటీ హెల్త్ అధికారుల యూనియన్ పిలుపు మేరకు ప్రతి జిల్లా కేంద్రంలోనూ మే నెలలో ఒక నెల పాటు పలు ప్రాంతాలోల సీహెచ్వోలు నిరసనలు తెలిపారు. కలెక్టర్లను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. అయినా వీరి సమస్యలు నేటికీ తీరలేదు. ప్రధాన డిమాండ్లు ● ఆరేళ్లు పూర్తయిన కమ్యూనిటీ హెల్త్ అధికారులు (సీహెచ్ఓ)లను తక్షణం క్రమబద్ధీకరించాలి. ● ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా 23 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలి. ప్రతి సంవత్సరం 5 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలి. ● జీతాలతో పాటు, ఇన్సెంటివ్లు అందించాలి. ● గ్రామాల్లో ప్రభుత్వ క్లినిక్ల అద్దెలను సకాలంలో చెల్లించాలి. రేషనలైజేషన్ పేరుతో కుదింపు చర్యలు వీరిని రేషనలైజేషన్ పేరుతో కుదించేందుకు కూటమి ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో సీహెచ్ఓలు మనోవేదనకు గురౌతున్నారు. 5 వేల జనాభా ఉన్న ప్రాంతంలో ఒక సీహెచ్ఓను నియమించే యోచనలో ఉన్నట్లు సమాచారం. రేషలైజేషన్లో భాగంగా ఏ ప్రాతిపదికన ఈ చర్యలు చేస్తున్నారో తెలియడం లేదని చెబుతున్నారు. పేదలకు ఆరోగ్యం కోసం పాటు పడుతున్న వీరిని ప్రభుత్వం పట్టించుకోక పోవడం విచారం. పొరుగురాష్ట్రాల్లో సీహెచ్వోల సేవలను అక్కడి పాలకులు గుర్తించారు. మన రాష్ట్రంలో వీరిని పట్టించుకోకపోవడం కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యానికి అద్ధం పడుతోంది. సమ్మె చేసినా పట్టించుకోని కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయాలని డిమాండ్ గ్రామంలోనే సేవలు ఎంతో దూరంలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా మా గ్రామంలోనే మందులు అందిస్తున్నారు. ప్రభుత్వం వారి సేవల్ని గుర్తించడం లేదు. – కె. వెంకట్రావు, అలంపురం సకాలంలో వైద్య సేవలు 108,104 కన్నా రోజు మా గ్రామంలో ఆరోగ్యసేవలు అందిస్తున్న సీహెచ్ఓ వల్ల మాకు ఎంతో మేలు కలుగుతోంది. మందులు సకాలంలో అందిస్తున్నారు. జయవరపు విజయదుర్గ, అలంపురం -
వివాదాస్పదంగా ఈవో తీరు
జంగారెడ్డిగూడెం: ఆలయాన్ని స్వాధీనం చేసుకునే క్రమంలో దేవదాయ శాఖ కార్యనిర్వాహక అధికారి తీరు వివాదాస్పదంగా మారింది. పట్టణంలోని బుట్టాయగూడెం రోడ్లో ఉన్న రామాలయానికి స్థానిక సుబ్బంపేటలో 33.65 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కోర్టు తీర్పు అనంతరం ఇటీవలే ఆ భూమిని దేవదాయ శాఖ స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో సదరు భూమిలో ఉన్న ఆలయాన్ని స్వాధీనం చేసుకునేందుకు సోమవారం ఈవో కలగర శ్రీనివాస్ తన సిబ్బందితో వెళ్లారు. ఆలయాన్ని నిర్వహిస్తున్న వ్యక్తులతో ఆలయ తాళాలు ఇవ్వాలని కోరారు. దీనికి వారు ఆలయంలో తమకు సంబంధించిన వస్తువులు ఉన్నాయని, వాటిని తీసుకున్న తరువాత మీకు అప్పగిస్తామని తెలిపారు. ఈ క్రమంలో ఆలయ నిర్వాహకులతో ఈవో దురుసుగా వ్యవహరిస్తూ మాట్లాడటంతో చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. ఆలయాన్ని ఎందుకు అప్పగించరు; వ్యాపారాలు చేసుకుందామనా.. అంటూ ఈవో మాట్లాడటంతో ఆలయ నిర్వాహకులు అభ్యంతరం తెలిపారు. పారిజాతగిరి ఈవోగా వ్యవహరిస్తున్న కలగర శ్రీనివాస్ జంగారెడ్డిగూడెం మండలంలోని 25 ఆలయాలకు ఇన్చార్జిగా వ్యవమరిస్తున్నారు. పలు ఆలయాల్లో పనిచేస్తున్న కింది స్థాయి ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక గ్రేడ్–1 దేవాలయాల పరిరక్షణలో గ్రేడ్–2 అధికారికి ఎలా బాధ్యతలు అప్పగించారో ఉన్నతాధికారులే చెప్పాలని పలువురు పేర్కొంటున్నారు. గ్రేడ్–1 దేవాలయాల పరిరక్షణలో గ్రేడ్–2 అధికారి ఈవోగా ఎలా బాధ్యతలు నిర్వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈవో శ్రీనివాస్ దేవదాయ శాఖలో చేరిన సంవత్సరం, ఎస్ఆర్లో నమోదు చేసిన సంవత్సరంలో కూడా తేడా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆలయం స్వాధీనానికి వెళ్లగా.. దానిని ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తుండగా అడ్డుకున్నానని, దాని వల్లే తనను అల్లరి చేస్తున్నారని ఈవో కలగర శ్రీనివాస్ తెలిపారు. -
టీడీపీ కోవర్ట్ ఆపరేషన్
యాప్లతో వేగలేం పనిచేయని స్మార్ట్ఫోన్లు మాకొద్దు అంటూ అంగన్వాడీలు నిరసన వ్యక్తం చేశారు. ఐసీడీఎస్ కార్యాలయాల్లో సెల్ఫోన్లను అప్పగించారు. 8లో uఆంక్షలపై నిరసన పాఠశాలల్లోకి విద్యార్థి సంఘాలకు అనుమతి లేదంటూ ప్రభుత్వం విడుదల చేసిన జీఓపై విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. 8లో uమంగళవారం శ్రీ 5 శ్రీ ఆగస్టు శ్రీ 2025సాక్షి ప్రతినిధి, ఏలూరు: పోలవరం ఎమ్మెల్యే అవినీతి వ్యవహారం జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. వంద కోట్ల అవినీతి దేశానికే రోల్మోడల్ అంటూ దేవినేని ఉమ చేసిన వ్యాఖ్యల ఆడియో టేప్ హాట్టాపిక్గా మారిన క్రమంలో జన సైనికులు రగిలిపోతున్నారు. టీడీపీ కోవర్ట్ ఆపరేషన్తోనే ఇదంతా చేసి రాజకీయంగా జనసేనను పోలవరంలో అణచివేయడానికి తెరతీసిందని, దీనికి జనసేన కీలక నేత కరాటం రాంబాబును పావుగా వాడుకున్నారనే ప్రచారం జోరందుకోవడంతో నియోజకవర్గంలో జనసేన వర్సెస్ టీడీపీ రగడ హాట్ హాట్గా మారింది. జనసేన భవితవ్యం గందరగోళం జనసేన, టీడీపీ ఆధిపత్యపోరు కొనసాగిస్తున్న తరుణంలో తాజా ఎపిసోడ్తో జనసేన భవితవ్యం గందరగోళంలో పడింది. ఎమ్మెల్యే ఏడాదిలోనే వంద కోట్లు సంపాదించాడు.. భారీ భవనం కట్టుకున్నాడు.. దేశానికే అవినీతిలో రోల్మోడల్గా నిలిచాడంటూ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వర్గం మండిపడటం మినహా మరేమీ చేయలేని పరిస్థితి. అయితే ఇదంతా అబద్ధపు ప్రచారం, తప్పుడు ఆడియో రికార్డు అని ఎవరూ ఖండించకుండా పెద్ద మనుషుల మధ్య జరిగిన సంభాషణలు టీడీపీ ఎలా బయటపెడుతుందని, దీనిపై స్పందించాలని జనసేన చోటా నేతలు బలంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ మొదలు టీడీపీ జిల్లా అ ధ్యక్షుడు వరకు ఎవరూ స్పందించని పరిస్థితి. మూడు రోజులుగా ఎమ్మెల్యే అవినీతి చేయలేదంటూ.. జనసేన కేడర్ చెప్పడమే కానీ ఎవరూ పట్టించుకోకపోవడంతో ఏం చేయాలనే దానిపై సందిగ్ధం నెలకొంది. దేవినేని ఉమాతో మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ అనుచరుడు పరిమి రాంబాబు చౌదరి అతడి ఫోన్ నుంచే కరాటం రాంబాబుతో మాట్లాడించారు. ఆడియో వాయిస్ రికార్డును టీడీపీ నేత రాంబాబు చౌదరే బయటపెట్టాడని, అతడిపై టీడీపీ చర్యలు తీసుకోవాలని జనసేన డిమాండ్ చేస్తున్నా టీడీపీ లైట్గా తీసుకుంది. టీడీపీ ట్రాప్లో కరాటం మరోవైపు టీడీపీ ట్రాప్లో జనసేన నేత కరాటం రాంబాబు పడటం వల్ల పార్టీకి, ఎమ్మెల్యేకు భారీ డ్యామేజ్ జరిగిందనే అంతర్గత చర్చ కొనసాగుతోంది. పార్టీపరంగా ఇబ్బందులు వస్తే ఖండించాల్సిన నాయకుడే సంభాషించడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి జనసేనలో నెలకొంది. ఇంకోవైపు దీనిపై కరాటం రాంబాబు స్పందిస్తూ దేవినేని ఉమానే సమాధానం చెప్పాలని ఒక్క మాటతో ముగించడంతో ఎమ్మెల్యే వర్గం మళ్లీ డైలమాలో పడింది. తాజా పరిణామాల క్రమంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అధికారిక కా ర్యక్రమాల్లో ఆదివారం దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో ఏపీ ట్రైకార్ చైర్మన్, టీడీపీ నేత బొరగం శ్రీనివాస్ అన్నదాత సుఖీభవ సభలో పాల్గొనడం మరో చర్చకు తెరతీసింది. మొత్తంగా ఆడియో టేప్ వ్యవహారంలో జనసేన నేతనే టీడీపీ పావుగా వాడుకుని జనసేన ఎమ్మెల్యేనే అప్రతిష్టపాలు చేసే లా విజయవంతంగా మైండ్ గేమ్ నడిపింది. న్యూస్రీల్ రగులుతున్న జన సైనికులు పోలవరం ఎమ్మెల్యేను ఇరకాటంలో పడేసిన టీడీపీ శ్రేణులు ఉద్దేశ పూర్వకంగానే ఆడియో లీక్ చేశారని అభియోగం ముదురుతున్న జనసేన వర్సెస్ టీడీపీ రగడ -
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించం
ఏలూరులో మహిళలపై దాడి ఘటనలో కేసుల నమోదు ఏలూరు టౌన్: ఏలూరులో ఆదివారం రాత్రి మహిళలపై దాడి చేసిన ఘటనపై ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్కుమార్ సీరియస్ అయ్యారు. శాంతిభద్రతల కు విఘాతం కలిగించేలా ఎవరైనా వ్యవహరిస్తే స హించేది లేదని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏలూరు వన్టౌన్ పోలీస్స్టేషన్లో సోమ వారం రాత్రి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. దాడి ఘటనలో ఇరువర్గాలపై కేసులు నమోదు చేశామని చెప్పారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు రూరల్ పరిధిలో మరడాని రంగారావు కాలనీ, పోణంగి రోడ్డులోని జరుగులమ్మ తల్లి గుడి ప్రాంతానికి చెందిన కాటూరి నిర్మల కుమారుడు లక్కీ అనే యువకుడు తల్లికి టిఫిన్ తెచ్చేందుకు మోటారు సైకిల్పై బయల్దేరాడు. అతడు వీఎస్ఆర్ గ్రాండ్ సిటీ వద్దకు చేరుకునేసరికి పల్లెపు సాయికుమార్, తురక మురళి, గుంజే జాన్ అనే ముగ్గురు వ్యక్తులు.. మోటారు సైకిల్ వేగంగా ఎందుకు నడుపుతున్నావంటూ నిలదీశారు. ఈ విషయంలో వారితో వాగ్వివాదం చోటుచేసుకోగా, లక్కీని కొట్టారని బాధితులు చెబుతున్నారు. అనంతరం మరోసారి ఈ ముగ్గురితో పాటు నిడిగట్టి నాగరాజు, బత్తుల దుర్గారావు, మరికొంతమంది కాటూరి లక్కీ ఇంటి వద్దకు వెళ్లారు. ఇరువర్గాల మధ్య వివాదం చెలరేగగా కొట్టుకున్నారని, ఆ ఘటనపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ రెండు వర్గాలపై ఏలూరు రూరల్ పో లీస్స్టేషన్లో పలు సెక్షన్లలో కేసులు నమోదు చేశా మని డీఎస్పీ వివరించారు. ఈ రెండు వర్గాల వారికీ ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, స్వల్ప వివాదం నేపథ్యంలోనే గొడవ జరిగిందని, పోలీసులు స్పందించి చర్యలు తీసుకోలేదనే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. మహిళల దుస్తులు చించేస్తూ.. భయోత్పాతం బాధితురాలు కాటూరి నిర్మల సోమవారం ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడుతూ తన కుమారుడు లక్కీని ముగ్గురు కలిసి కొట్టారని, లక్కీ ఇంటికి రాగా మరో 15 మంది వ్యక్తులు మహిళలని కూడా చూడకుండా ఇష్టారాజ్యంగా దుర్భాషలాడుతూ కొ ట్టారని, ఇదే సమయంలో మరో 50 మందిని పిలిపించుకుని తమ ఇళ్లపై దాడులు చేస్తూ భయో త్పాతం సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల దుస్తులు చించేస్తూ ఇష్టారాజ్యంగా దాడి చేశారన్నారు. దీనిపై ఏలూరు రూరల్ పోలీస్స్టేషన్కు వెళ్లి ఆదివారం రాత్రి 7.30 గంటల సమయంలో ఫిర్యాదు చేశామని చెప్పారు. అనంతరం రక్షణ కల్పించాలంటూ ఏలూరు చిరంజీవి బస్టాండ్ వద్ద ఆందోళన చేశామని తెలిపారు. పోలీసులు తమకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వటంతో నిరసన విరమించామన్నారు. -
ప్రొటోకాల్ పాటించడం లేదని ఫిర్యాదు
భీమవరం(ప్రకాశం చౌక్): యలమంచిలి మండల పరిధిలో అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని యలమంచిలి ఎంపీపీ ఇనుకొండ ధనలక్ష్మి సోమవారం ఇన్చార్జ్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డికి వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు. మండలంలో జరుగుతున్న శంకుస్థాపనలకు, ప్రారంభోత్సవాలకు తనకు, వైఎస్సార్సీపీ చెందిన సర్పంచులకు, ఎంపీటీసీలకు ఆహ్వానం గాని, ప్రొటోకాల్ పరంగా గౌరవం గానీ ఇవ్వడం లేదన్నారు. ఇలా అనుమానించడం సరైన పద్ధతి కాదన్నారు. మండలంలో తీర్మానాలు చేసిన వర్క్లకు ఆర్డర్స్ ఇవ్వకుండా, మండలాన్ని అభివృద్ధి చేయకుండా అధికారులు అలసత్వాన్ని వీడి, ప్రొటోకాల్ ద్వారా మండ ల అభివృద్ధికి తోడ్పడేలే చర్యలు తీసుకోవాలని ఫి ర్యాదు చేయడంతో పాటు పలు అంశాలపై వినతిపత్రం అందజేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ము దునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, పార్లమెంట్ ఇన్చార్జి గూడూరి ఉమాబాల, పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, స ర్పంచుల చాంబర్ అధ్యక్షుడు కవురు గోపి పాల్గొన్నారు. ఫ్యాక్టరీల్లో నిబంధనలు తప్పనిసరి భీమవరం (ప్రకాశంచౌక్): కార్మిక చట్టాలు, ఉపాధికి సంబంధించిన పలు అంశాల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలి ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి అన్నారు. భీమవరం కలెక్టరేట్లో సోమవారం ప్రాన్ ప్రాసెసింగ్ యూనిట్ రైడింగ్ జిల్లాస్థాయి కమిటీ సభ్యులు, అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ ఫ్యాక్టరీల్లో పనిచేసే మహిళా కార్మికుల సంక్షేమానికి నిబంధనలను విధిగా పాటించాలన్నారు. పని గంటలు, పని పరిస్థితులు మెరుగ్గా ఉండాలన్నారు. ఫ్యాక్టరీల్లో ఎక్కడ బాల కార్మికులు ఉండకూడదన్నారు. -
కూటమి పాలనలో రైతులకు కష్టాలు
ఏలూరు(మెట్రో): కూటమి పాలనలో రైతులు కష్టాలు ఎదుర్కొంటున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, నూజివీడు, చింతలపూడి నియోజకవర్గాల కన్వీనర్లు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, కంభం విజయరాజు అన్నారు. రాష్ట్రంలో యూరియా సహా ఎరువుల కొరత, రైతు లు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏలూరు కలెక్టరేట్లో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్లో వైఎస్సార్సీపీ నాయకులు కలెక్టర్ కె.వెట్రి సెల్వికి వినతిపత్రం అంజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి నాయకులు సూపర్సిక్స్ హామీలను అమలు చేయకపోగా రైతులను కష్టాలు పాలుజేశారన్నారు. రైతులకు పెట్టుబడి సా యం కింద ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని, జూన్ 2024 నుంచి ఈ హామీ అమలు చేస్తామని చెప్పి మాట తప్పారన్నారు. రెండేళ్లకు రూ.40 వేలు ఇవ్వా ల్సి ఉండగా, కేవలం రూ.5 వేలు మాత్రమే ఇచ్చారని, అలాగే పథకం నుంచి 7 లక్షల మంది రైతులను తొలగించారని మండిపడ్డారు. పెట్టుబడి సాయం లేక రైతులు అప్పులపాలవుతున్నారని, పంటలకు గిట్టుబాటు ధరలు లేవని అన్నారు. ఉచిత పంటల బీమాను రద్దు చేశారని, సున్నావడ్డీ పథకాన్ని ఎత్తేశారన్నారు. రైతు భరోసా కేంద్రాలను నీరుగార్చారని, గ్రామస్థాయిలో వ్యవస్థలను ధ్వంసం చేశారని మండిపడ్డారు. ఎరువు.. బరువు : రైతులకు ఎరువుల పంపిణీలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వి మర్శించారు. ముఖ్యంగా యూరియా దొరక్క రైతులు అల్లాడుతున్నారన్నారు. పొటాష్ కలిసిన కాంప్లెక్స్ ఎరువుల ధరలు అమాంతం పెరిగిపోయాయన్నారు. ప్రైవేట్ వ్యాపారులు యూరియా బస్తాపై రూ.60 నుంచి రూ.100 వరకు అదనంగా డిమాండ్ చేస్తున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎరువులను అందుబాటులో ఉంచాలని, యూరియా కొ రతను నివారించాలని, గ్రామాల్లోనే రైతు భరోసా కేంద్రాల్లో నిల్వలు ఉంచి రైతులకు పంపిణీ చే యాలని డిమాండ్ చేశారు. ఉచిత పంటల బీమాను అమలు చేయాలని, గతేడాది రైతు భరోసా బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని కోరారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విత్తు నుంచి ధాన్యం కొనుగోలు వరకూ రైతులకు అన్నింటా అండగా నిలిచామని చెప్పారు. ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్బాబు, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గంటా మోహన్రావు, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి ఇమానైల్ జైకర్, రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ సంయుక్త కార్యదర్శి బసవ లింగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి దాసరి రమేష్, జిల్లా అధికార ప్రతినిధి ఎం.జాన్ గురునాథం, జిల్లా రైతు విభాగ అధ్యక్షుడు వాసిరెడ్డి మధు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షు డు నెరుసు చిరంజీవి, జిల్లా గ్రీవెన్స్ అధ్యక్షుడు సముద్రాల దుర్గారావు, జిల్లా వైఎస్సార్టీయూసీ అధ్యక్షుడు పల్లి శ్రీనివాసరావు, జిల్లా వికలాంగుల విభాగం అధ్యక్షుడు షేక్ షమీం, జిల్లా ఆర్టీఐ విభాగం అధ్యక్షుడు స్టాలిన్, కార్పొరేటర్లు డింపుల్ జాబ్ రిషి, ఏలూరు నియోజవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు జుజ్జువరపు విజయనిర్మల, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఇనపనూరి జగదీష్, గ్రీవెన్స్ అధ్యక్షుడు మద్దాల ఫణి, జిల్లా స్టూడెంట్ విభాగం అధ్యక్షుడు పి.రాజేష్, కన్స్యూమర్ జిల్లా కార్యదర్శి టి.తులసి, పార్టీ నాయకులు పాల్గొన్నారు. యూరియాతో సహా ఎరువుల కొరత పూర్తిగా అందని పెట్టుబడి సాయం కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన వైఎస్సార్సీపీ నాయకుల -
స్మార్ట్ బాదుడు
ఏలూరు (టూటౌన్): నాడు స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగులకొట్టింది అని పిలుపునిచ్చిన కూటమి నాయ కులు.. నేడు అధికారంలోకి వచ్చాక అవే స్మార్ట్ మీటర్లను బిగిస్తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రతిపక్షంలో ఉన్పప్పుడు ఒకలా, అధికారం చేపట్టాక మరోలా వ్యవహరించడం కూటమి నాయకులకే చెల్లిందంటూ ప్రజలు దుయ్యబడుతున్నారు. ట్రూఅప్ చార్జీల పేరుతో అధికారం చేపట్టిన ఏడాది కాలంలోనే రూ.15,485 కోట్ల అదనపు భారాలు మోపి వినియోగదారుల నడ్డి విరిచారని గుర్తుచేస్తున్నారు. తాజాగా అదానీ లాంటి కార్పొరేట్ వ్యక్తులకు మేలు చేసేందుకు స్మార్ట్ మీటర్లను బిగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం సిగ్గుచేటని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లావ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కలిపి ప్రజా సంఘాల ఐక్యకార్యాచరణ వేదిక పేరుతో కొన్ని రోజులుగా స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు, సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. దీనికి కొనసాగింపుగా జిల్లా కేంద్రంలోని విద్యుత్ భవన్ వద్ద, జిల్లాలోని వివిధ సబ్ స్టేషన్ల వద్ద స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా మంగళవారం ధర్నాలకు పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున సంతకాల సేకరణ స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలంటూ ప్రజా సంఘాల ఐక్యకార్యాచరణ వేదిక ఆధ్వర్యంలో జిల్లాలో పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సంతకాల సేకరణ జరుగుతోంది. వారం రోజులుగా ఈ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. అన్నివర్గాల ప్రజలు భాగస్వాములవుతున్నారు. కూటమి నమ్మక ద్రోహం గత ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమని కూటమి నాయకులు హామీలు ఇచ్చారు. ప్రతిపక్షంలో ఉండగా స్మార్ట్ మీటర్లు పగులకొట్టండని లోకేష్ పిలుపు కూడా ఇచ్చారు. గద్దెనెక్కిన కూటమి నాయకులు ప్రజలకు నమ్మక ద్రోహం చేశారు. ఏడాది కాలంలో కరెంటు బిల్లులు భారీగా పెరిగిపోయాయి. ఇప్పుడు స్మార్ట్ మీటర్ల అంశం తెరపైకి తెచ్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఏలూరులో జిల్లా విద్యుత్ భవనం, జిల్లాలోని విద్యుత్ సబ్స్టేషన్ల వద్ద ధర్నాకు ఐక్య కార్యాచరణ వేదిక నాయకులు పిలుపునిచ్చారు. మీటర్ రీడర్లపై కత్తి స్మార్ట్ మీటర్లతో విద్యుత్ మీటర్ రీడర్లు ఉపాధిని కోల్పోనున్నారు. ఏలూరు జిల్లాలో 460 మంది, పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 400 మంది రోడ్డున పడనున్నారు. సర్దుపోటు రూ.15,485 కోట్లు ట్రూఅప్ సర్దుబాటు చార్జీల పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజలపై రూ.15,485 కోట్ల భారం మోపింది. దీంతో పెరిగిన విద్యుత్ బిల్లులతో సామాన్యులు విలవిలలాడుతున్నారు. మరింత దోపిడీకి.. రాష్ట్రంలోని కూటమి సర్కార్ ప్రజలను మరింత దోపిడీ చేసేందుకే స్మార్ట్ మీటర్ల బిగింపును తెరమీదకు తీసుకువచ్చిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అదానీతో ఒప్పందం చేసుకుని ‘స్మార్ట్’గా ప్రజలను దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. స్మార్ట్ మీటర్లతో బిల్లులు మరింత పెరుగుతాయని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. తక్షణం రద్దు చేయాలి ప్రజలపై మరింత భారాలు మోపేలా ఉన్న స్మార్ట్ మీటర్ల బిగింపును తక్షణం రద్దు చేయాలి. పేదల పొట్ట గొట్టి పెద్దలకు పెట్టినట్టు అదానీ లాంటి కార్పొరేట్ శక్తులకు అప్పనంగా దోచి పెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యత్ స్మార్ట్ మీటర్లను తెరమీదకు తీసుకురావడం దారుణం. – డీఎన్వీడీ ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి, సీఐటీయూ, ఏలూరు జిల్లా కమిటీ ప్రజలను మోసగిస్తున్నారు కూటమి ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసగించింది. ఎన్నికలకు ముందు స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి అని పిలుపునిచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక అదే స్మార్ట్ మీటర్లను నిస్సిగ్గుగా బిగించేస్తున్నారు. ఇది ప్రజలను నమ్మించి మోసం చేయడమే. ప్రతిఒక్కరూ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాలి. – బండి వెంకటేశ్వరరావు,జిల్లా ఉపాధ్యక్షుడు, ఏఐటీయూసీ, ఏలూరు జిల్లా కమిటీ ప్రజలపై విద్యుత్ భారాలు స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా జరిగే ధర్నాను అందరూ విజయవంతం చేయాలి. ఎటువంటి చార్జీలు పెంచబోమని, అదనపు భారాలు మోపబోమని నమ్మబలికిన కూటమి నాయకులు తీరా గద్దెనెక్కిన తర్వాత మాట మార్చి ఎడాపెడా విద్యుత్ భారాలు మోపడం దుర్మార్గం. – బద్దా వెంకట్రావు, ఇఫ్టూ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరు సామాన్యులకు షాక్ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తున్న ప్రజాసంఘాలు ఉపాధి కోల్పోతామంటున్న మీటర్ రీడర్లు కూటమి పాలనలో ప్రజలపై విద్యుత్ భారాలు నేడు జిల్లా విద్యుత్ భవన్,సబ్స్టేషన్ల వద్ద ధర్నాలకు పిలుపు -
జనసేన ఎమ్మెల్యేపై ‘ఆడియో’ దుమారం
సాక్షి ప్రతినిధి, ఏలూరు/బుట్టాయగూడెం: తనపై జరిగిన ఆడియో సంభాషణ టీడీపీ కుట్రతోనే లీక్ అయిందని పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు.. అవినీతి లేకపోతే సంభాషణే జరిగేది కాదని టీడీపీ నేతలు.. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మీద వచ్చిన ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ నిర్వహించాలని వామపక్షాలు.. సచీ్ఛలత నిరూపించుకోవాలంటే ఎమ్మెల్యేనే దర్యాప్తు సంస్థతో విచారణ చేయించుకోవాలని వైఎస్సార్సీపీ డిమాండ్.. ఇదీ పోలవరం ఎమ్మెల్యే అవినీతి వ్యవహారంపై సోషల్ మీడియాలో హాట్టాపిక్గా మారిన ఆడియోపై స్పందనలు. ఎమ్మెల్యే ఏడాదిలోనే రూ.వంద కోట్లు సంపాదించాడని టీడీపీ కూటమి పార్టీలోని కీలక నేతలే మాట్లాడిన ఆడియో అటు జనసేన పార్టీతో పాటు జిల్లాలోనూ తీవ్ర కలకలం రేపింది.అన్ని పార్టీల్లోనూ ఇదే హాట్టాపిక్..పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఏడాదిలో రూ.వంద కోట్లు సంపాదించాడని, ఆయన ఘనతను యూట్యూబ్లో చూశానంటూ టీడీపీ నేత, మాజీమంత్రి దేవినేని ఉమ.. జనసేన ముఖ్యనేత, డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు మధ్య జరిగిన ఫోన్ సంభాషణల ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పైగా.. ఇందుకు సంబంధించిన కథనం శనివారం ‘సాక్షి’లో ప్రముఖంగా రావడంతో పోలవరం నియోజకవర్గంలో అన్ని రాజకీయ పార్టీల్లో ఇదే హాట్టాపిక్గా మారింది. చిర్రి బాలరాజు వ్యవహారం మొదటి నుంచి వివాదాస్పదంగా ఉండటంతో పాటు ఆయనపై పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. మద్యం సిండికేట్, బెల్టుషాపులు, ఉద్యోగుల బదిలీలు, ఇసుక అక్రమాలు, ఆర్ అండ్ ఆర్లో అవినీతి.. ఇలా ప్రతి అంశంలో ఎమ్మెల్యే పాత్ర ఉందంటూ టీడీపీ, జనసేన కేడరే తరుచూ సోషల్ మీడియా వేదికగా పరస్పర ఆరోపణలు గుప్పించుకోవడంతో నిత్యం నియోజకవర్గ రాజకీయం హాట్ హాట్గా మారింది. ఈ నేపథ్యంలో.. సదరు ఎమ్మెల్యే గత ఏడాది కాలంలో రూ.వంద కోట్లు సంపాదించాడన్న ఒక వీడియోను ప్రస్తావిస్తూ టీడీపీ నేత దేవినేని ఉమ అదే నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత ఫోన్ నుండి కరాటం రాంబాబుకు ఫోన్చేసి మాట్లాడారు. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఎలా బయటకు వచి్చందనే దానిపైనే తీవ్రంగా చర్చ జరుగుతోంది.ఎమ్మెల్యే విచారణ జరిపించుకోవాలి: తెల్లం బాలరాజుమరోవైపు.. రూ.వంద కోట్ల అవినీతి దేశంలోనే రోల్ మోడల్ వ్యవహారమంటూ సాగిన ఆ ఫోన్ సంభాషణ రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు దీనిపై తీవ్రంగా స్పందించారు. ఎమ్మెల్యే తన నిజాయితీని నిరూపించుకోవాలంటే ఏదైనా దర్యాప్తు సంస్థతో విచారణ చేయించుకోవాలని అన్నారు. రాష్ట్రంలోని పోలవరం నియోజకవర్గానికి మంచి పేరుందని, చిర్రి బాలరాజు దాన్ని పాడుచేస్తున్నారని మండిపడ్డారు.సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి : సీపీఎంఎమ్మెల్యే మీద వచ్చిన ఆరో పణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ. రవి డిమాండ్ చేశారు. గతంలో ఇసుక, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, వైన్షాపుల విషయంలో ఎమ్మెల్యేపై ఆరోపణలు వచ్చాయని.. వీటిపై వార్తలు రాసిన అనేకమంది విలేకరులపై కేసులు పెట్టారని.. వీటన్నింటిపైన సమగ్ర విచారణ జరిపించాలని ఆయన కోరారు.నేను అవినీతికి పాల్పడలేదు: ఎమ్మెల్యే చిర్రి బాలరాజుతనపై సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలపై ఏలూరు జిల్లా పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు స్పందించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. గిరిజనుడైన తాను ఎన్నడూ అవినీతికి పాల్పడలేదని, పాల్పడబోనన్నారు. తన నుంచి ఆరి్థక లబ్ధిని ఆశించి, అందుకు నిరాకరించడంతో సోషల్ మీడియాలో అసత్య ప్రచారానికి పాల్పడ్డారని పేర్కొన్నారు.సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలపై ఇద్దరు నాయకులు మాట్లాడుకున్న మాటలను రికార్డు చేసి రూ.100 కోట్లు ఆర్జించానంటూ ప్రచారం చేసిన మీడియా సంస్థలపై, నాయకులపై న్యాయస్థానంలో కేసులు వేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. దీనిపై ఓ నివేదికను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు కూడా సమరి్పస్తానన్నారు. రూ.100 కోట్ల సంపాదన ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. -
22న సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయంలో ఆఖరి శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని ఈనెల 22న సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించనున్నట్టు ఆలయ ఈఓ ఎన్వీ సత్యనారాయణ మూర్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలోని అనివేటి మండపంలో ఉదయం 9.30 గంటల నుంచి జరిగే ఈ వేడుకలో పాల్గొనాలని ఆయన కోరారు. చిన్న తిరుపతిలో కిటకిటలాడిన భక్తులు ద్వారకాతిరుమల: చిన్నతిరుపతి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం సెలవుదినం కావడంతో పాటు, శ్రావణమాస పర్వదినాలను పురస్కరించుకుని వేలాది మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ఆలయానికి తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తుల రాక మొదలవడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కేశఖండనశాల ఇతర విభాగాలు భక్తులతో పోటెత్తాయి. ఆలయ అనివేటి మండపంలో పలు భజన మండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను అలరించాయి. క్షేత్రంలో సాయంత్రం వరకు భక్తుల రద్దీ కొనసాగింది. గుబ్బల మంగమ్మతల్లి గుడికి పోటెత్తిన భక్తులు బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన కాపవరం సమీపంలోని అటవీప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, మచిలీపట్నం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వాహనాలతో తరలివచ్చి అమ్మవారికి దూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు అధికంగా మంగమ్మతల్లి దర్శనానికి రావడంతో పోలీసులు ప్రత్యేక చర్యలు చేట్టారు. -
అత్యవసర వైద్యం.. అందని దైనం
ఏలూరు టౌన్ : ఏలూరు సర్వజన ఆస్పత్రిలో (జీజీహెచ్)లో అత్యవసర వైద్యం అందనంత దూరంలో ఉంది. ముఖ్యంగా గర్భిణులు ప్రసూతి కోసం వస్తే గైనిక్ విభాగంలో వారి పరిస్థితి దయనీయంగా మా రింది. అలాగే ఆస్పత్రిలో గర్భిణులు, కడుపు నొప్పి తో బాధపడుతూ వచ్చే మహిళలకు ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ చేసేందుకు రెగ్యులర్ టెక్నీషియన్లు లేరు. పీజీ వైద్య విద్యార్థినులు కొందరు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్కానింగ్ చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్ కేంద్రాల్లో స్కానింగ్ తీయించుకోవాల్సి వస్తుందని రోగుల బంధువులు అంటున్నారు. ‘గుండె’కు రక్షణ లేదు జీజీహెచ్కు గుండెపోటుతో ఎవరైనా వెళితే ప్రాణాలకు గ్యారెంటీ లేదు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్యులను బదిలీలు చేయటంతో గుండె వ్యాధి నిపుణులు లేకుండా పోయా రు. గుండె జబ్బుల నిర్ధారణ పరీక్షలను సైతం ప్రైవేట్ ఏజెన్సీకి కట్టబెట్టారు. ఈ ఏజెన్సీకి చెందిన టెక్నీషియన్లు వారానికి మూడు రోజులు ఏలూరు జీజీహెచ్లో 2డీ ఏకో స్కాన్ పరీక్షలు చేయాల్సి ఉండగా సోమవారం మాత్రమే పరీక్షలు చేస్తున్నారు. దీంతో మిగిలిన రోజుల్లో రోగుల పరిస్థితి దైన్యంగా మారింది. ప్రైవేట్ ఏజెన్సీలో టెక్నీషియన్లు, వైద్యు లు రోగులకు పరీక్షలు చేస్తూ విజయవాడలోని కార్పొరేట్ ఆస్పత్రులకు తరలిస్తున్నారని, ఇలా రిఫర్ చేయటం ద్వారా ఏజెన్సీ సిబ్బందికి గుండె ఆపరేషన్లు, ఇతర చికిత్సల్లో వాటాలు వస్తున్నాయ నే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు అత్యవసర మందులు అందుబాటులో ఉండటం లేదు. ‘ట్రామా కేర్’లెస్ అత్యవసర సేవల్లో భాగంగా న్యూరో విభాగంలో ఒక వైద్యుడు మాత్రమే పనిచేస్తుండటంతో రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర వైద్య చికిత్సలు పూర్తిస్థాయిలో అందడం లేదు. అలాగే ట్రామా కేర్ వైద్య నిపుణులు లేరు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ ఉందా! జీజీహెచ్ అభివృద్ధి కమిటీ ఉందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏలూరు జిల్లా కేంద్రంలో కలెక్టర్ వెట్రిసెల్వి, జేసీ, ఏలూరు ఎంపీ, దెందులూరు, ఏలూరు టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నా ఉపయోగం లేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. తూతూమంత్రంగా అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆదేశాలు జారీ చేసినా జీజీహెచ్ అధికారులు, సిబ్బంది వాటిని పట్టించుకోవటం లేదనే సందేహాలు వ్యక్తమవుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో ఏలూరు జిల్లా ఆస్పత్రి, బోధనాస్పత్రిగా అభివృద్ధి చేస్తే నేడు కూటమి ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసిందనే విమర్శలు వస్తున్నాయి. దెందులూరు నియోజకవర్గానికి చెందిన ఓ మహిళ ఏలూరు జీజీహెచ్లోని ఎంసీహెచ్ బ్లాక్లో ప్రసూతికి వచ్చింది. ఆమెకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అయితే కుట్లు సరిగా వేయకపోవటంతో ఆమె ఇంటికి వెళ్లిన తర్వాత ఇన్ఫెక్షన్తో తీవ్ర అస్వస్థతకు గురైంది. ఇదేంటని ఆస్పత్రి వైద్యులను ప్రశ్నించినా పట్టించుకునే నాథుడే లేడు. ఇదే తరహాలో ప్రసూతి కోసం వచ్చే గర్భిణులు వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏలూరుకి చెందిన ఓ వ్యక్తి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ జీజీహెచ్కు వచ్చారు. రాత్రి వేళ కావడంతో ఎమర్జెన్సీ విభాగానికి తీసుకువెళ్లగా అక్కడ వైద్యులు విజయవాడ రిఫర్ చేశారు. పరిస్థితి విషమంగా ఉండటంతో చేసేది లేక ఏలూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా పేద, మద్యతరగతి వర్గాలకు ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే ప్రాణాలు గాల్లో దీపమే అని బాధితులు వాపోతున్నారు. ఏలూరు జీజీహెచ్లో వైద్యసేవలు నిల్ ఒక్కరోజు మాత్రమే ఏకో పరీక్షలు వైద్య నిపుణుల కొరత -
కూటమి నేతల వైఫల్యం
ఏలూరు జీజీహెచ్లో వైద్య సేవలు సరిగా అందటం లేద ని బాధితులు వాపోతున్నా రు. గత ప్రభుత్వంలో ఏలూరుకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ, దానికి అనుసంధానంగా ఏలూరు జీజీహెచ్ను అభివృద్ధి చేస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కనీసం వైద్య నిపుణులను నియమించలేని దుస్థితి నెలకొంది. ప్రజలకు కనీస వైద్య సేవలు అందకపోయినా పట్టించుకునే నాథుడే లేడు. ప్రైవేటు ఏజెన్సీలకు గుండె వ్యాధుల నిర్ధారణ బాధ్యతలు అప్పగిస్తే ఎలా. –గుడిదేశి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ ఏలూరు నగర అధ్యక్షుడు మెరుగైన సేవలు అందించాలి జీజీహెచ్లో గర్భిణులు, బా లింతలకు సరైన వైద్య సేవ లు అందటం లేదని బాధితు లు గగ్గోలు పెడుతున్నారు. ఆపరేషన్లు సక్రమంగా చేయ కపోవటం, కుట్లు సరిగ్గా వే యకపోవటంతో బాలింతలు తీవ్ర అనారోగ్యం బారినపడుతున్నారు. ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయటానికి టెక్నీషియన్లను సైతం నియమించలేని దుస్థితి. జిల్లా ఉన్నతాధికారులు జీజీహెచ్పై ప్రత్యేక దృష్టి సారించాలి. మెరుగైన సేవలు అందించకుంటే ప్రజల తరఫున పోరాటం చేయాల్సి వస్తుంది. –తుమరాడ స్రవంతి, వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
5న స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ ధర్నాలు
దెందులూరు: ప్రజలపై భారాలు మోపేలా కూటమి ప్రభుత్వం విద్యుత్ స్మార్ట్ మీటర్లను బిగిస్తోందని, దీనిని వ్యతిరేకిస్తూ మండల కేంద్రాలు, విద్యుత్ కార్యాలయాల వద్ద ఈనెల 5న ప్రజావేదిక ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించనున్నట్టు ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం దెందులూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నాడు స్మార్ట్ మీటర్లను పగులకొట్టాలని పి లుపునిచ్చిన కూటమి నాయకులు.. నేడు మీటర్లను బిగించాలని ఆదేశాలు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. స్మార్ట్ మీటర్ల ఒప్పందాలను రద్దు చేయకుండా వాటిని కొనసాగించడం రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేయడమే అన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో రూ.15,485 కోట్ల సర్దుబాటు చా ర్జీల భారాన్ని ప్రజలపై మోపిందని విమర్శించారు. స్మార్ట్మీటర్ల ఏర్పాటుతో దుకాణాలు, చిన్న పరిశ్రమలకు 10 రెట్ల విద్యుత్ చార్జీలు పెరిగాయన్నారు. అలాగే మీటర్ ఖర్చులను (రూ.10 వేల నుంచి రూ.17 వేలు) దశల వారీగా వినియోగదారులపై మోపడం దారుణమన్నారు. స్మార్ట్ మీటర్లు, సోలార్ విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాత మీటర్లనే కొనసాగిస్తూ, పాత రీడింగ్ పద్ధతినే అమలు చేయాలని శ్రీనివాస్ కోరారు. -
డిగ్రీ ప్రవేశాలు ఇంకెప్పుడు?
ఏలూరు (ఆర్ఆర్పేట): ఇంటర్ పూర్తయిన విద్యార్థులు డిగ్రీ ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థుల్లో సగం మందికి పైగా ఇంజనీరింగ్ వైపు దృష్టి సారించగా.. మిగిలిన సగం మందికి డిగ్రీ విద్య ప్రత్యామ్నాయం. డిగ్రీలో సైతం పలు సాంకేతిక కోర్సులతో పాటు ఆర్ట్స్, సైన్స్ సబ్జెక్టులతో కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో 50 శాతం మంది విద్యార్థులు డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. డిగ్రీ కోర్సులు పూర్తిచేసి సివిల్స్, సర్వీస్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వేలో ఉద్యోగాలు సాధించే అవకాశం ఉండటంతో ఈ కోర్సులపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయి. అయితే కూటమి ప్రభుత్వంలో 2025–26 విద్యా సంవత్సరంలో ఇప్పటివరకూ డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ఫలితాలు వచ్చి నాలుగు నెలలు ప్రభుత్వం ఇంటర్మీడియెట్ ఫలితాలను ఈ ఏడాది ఏప్రిల్ 12న విడుదల చేసింది. పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా నిర్వహించి జూన్ 7న ఫలితాలు విడుదల చేసింది. ఇంజనీరింగ్ ప్రవేశాలకు కౌన్సెలింగ్ ముగిసి విద్యార్థులు తమకు సీటు వచ్చిన కళాశాలల్లో ఈనెల 4 నుంచి 8వ తేదీ వరకూ రిపోర్టు చేయనున్నారు. తమతో పాటు ఇంటర్మీడియెట్ రాసిన మిత్రుల్లో కొందరు ఇంజనీరింగ్ విద్యకు వెళ్లడం, వారు మరో మూడు, నాలుగు రోజుల్లో తరగతులకు హాజరయ్యే పరిస్థితి ఉంది. వారితో పాటే ఇంటర్ పూర్తి చేసుకుని డిగ్రీ కోర్సుల్లో చేరుదామని ఎదురుచూస్తున్న విద్యార్థులకు మాత్రం ఇప్పటివరకూ నోటిఫికేషనే ఇవ్వకపోవడం చూస్తుంటే ప్రభుత్వం డిగ్రీ విద్యను ఎంతటా నిర్లక్ష్యం చేస్తోందో అర్థమవుతుందని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురు చూపులతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోందని ఆందోళన చెందుతున్నారు. 91 కాలేజీలు.. 60 వేల సీట్లు ఏలూరు జిల్లాలో 40, పశ్చిమగోదావరి జిల్లాలో 51 డిగ్రీ కళాశాలు ఉన్నాయి. వివిధ గ్రూపుల్లో సుమా రు 60 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థుల జీవితాలతో ఆటలా.. డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ ఇవ్వని ప్రభుత్వం ఇంటర్ ఫలితాలు వచ్చి దాదాపు 4 నెలలు డిగ్రీ ప్రవేశాల కోసం విద్యార్థుల ఎదురుచూపులు ఏలూరు, పశ్చిమలో 91 కళాశాలలు విద్యార్థుల భవిష్యత్తో ఆటలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రభుత్వ విద్యావ్యవస్థ నిర్వీర్యమవుతోంది. ఇప్పటికే పలు అసంబద్ధ నిర్ణయాలతో పాఠశాల విద్యను అటకెక్కించారు. ఇప్పుడు డిగ్రీ విద్యను కూడా నాశనం చేయాలని చూస్తున్నారు. ఇంటర్ ఫలితాలు వెల్లడై దాదాపు 100 రోజులు కావస్తోంది. 2025–26 విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడిచిపోతోంది. డిగ్రీ ప్రవేశాలు ఇంకెప్పుడు చేపడతారు. రెండు నెలల పాటు విద్యకు దూరంగా విద్యార్థులు ఉన్నారు. వారి భవిష్యత్తో ఆటలాడటం ప్రభుత్వానికి తగదు. – కాకి నాని, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు ఎదురుచూపులు డిగ్రీలో ఏఏ కోర్సులతో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏ కోర్సులు తేలికగా పూర్తి చేసి, పూర్తి చేసిన వెంటనే ఉద్యోగాలు వచ్చే కోర్సులు ఏమిటి అనే విషయాలపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇప్పటికే తమకు తెలిసిన విద్యాధికులను సంప్రదించి ఒక నిర్ణయానికి వచ్చి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్నారు. సాధారణంగా ఇంటర్మీడియెట్ ఫలితాలు వెలువడిన నెలలోపే డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభించి విద్యా సంవత్సరం ఆరంభం నాటికి విద్యార్థులంతా కళాశాలలకు వెళ్లే ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే కూటమి ప్రభుత్వం ఇప్పటివరకూ ఆ దిశగా ఏ చర్యా తీసుకోకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన పెరిగిపోతోంది. డిగ్రీ కళాశాలలు ఏలూరు జిల్లా పశ్చిమగోదావరి ప్రభుత్వ 7 4 ప్రభుత్వ అటానమస్ – 2 ప్రభుత్వ ఎయిడెడ్ అటానమస్ 1 4 ప్రైవేట్ అటానమస్ 1 1 ప్రైవేట్ ఎయిడెడ్ – 1 ప్రైవేట్ అన్ ఎయిడెడ్ 31 39 మొత్తం 40 51 -
పాపికొండల్లో అడవి దున్నలు
బుట్టాయగూడెం: అరుదైన జంతు జాలానికి నిలయమైన పాపికొండల అభయారణ్యంలో అడవి దున్నల ఉనికిని గుర్తించారు. సింహాలు, పులులు, ఏనుగులను సైతం తరిమి కొట్టే సత్తా ఉన్న జంతువులు ఈ అడవిదున్నలు. అభయారణ్య పరిధిలోని గోదావరి పరీవాహక ప్రాంతంలో ఇవి ఎక్కువగా సంచరిస్తుంటాయి. సుమారు 10 నుంచి 20 వరకూ గుంపులుగా ఈ అడవి దున్నలు మేత కోసం తిరుగుతూ ఉంటాయి. వైల్డ్ లైఫ్ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలకు ఈ అడవి దున్నలు చిక్కాయి. మొత్తం 420 పైగా అడవి దున్నలు పాపికొండల అభయారణ్యంలో సంచరిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అడవుల్లోని గడ్డితోపాటు లేత వెదురు చిగుళ్లను ఇవి ఆహారంగా తీసుకుంటాయి. రాత్రి, పగలు కూడా దురుసుగా తల ఎగరేస్తూ సంచరిస్తాయి. మనుషులు కనిపిస్తే దాడి చేస్తాయి. అడవి దున్నల దాడుల్లో అనేక మంది మృతి చెందిన సంఘటనలు కూడా ఉన్నాయి. అడవి దున్నలు భారత ఉపఖండంలోని భారత్, బంగ్లాదేశ్, నేపాల్లోని అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నట్లు వైల్డ్ లైఫ్ అధికారులు చెబుతున్నారు. మన దేశంలో పశ్చిమ కనుమలు, దండకారణ్యాల్లో వీటి ఉనికి ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం అటవీ ప్రాంతం, పాపికొండల అభయారణ్యంలోనూ అడవి దున్నల సంచారం అత్యధికంగా ఉంది. నల్లమల్ల అటవీ ప్రాంతంలో అడవి దున్నల సంచారం క్రమేపీ అంతరించిపోవడం వల్ల అక్కడ వీటి సంచారంలేదని అధికారులు అంటున్నారు. వన్యప్రాణుల కోసం గడ్డి పెంపకం పాపికొండల అభయారణ్యం పరిధిలో సుమారు 15 హెక్టారుల్లో వన్యప్రాణుల కోసం వైల్డ్ లైఫ్ అధికారులు గడ్డి పంటను పండిస్తున్నారు. ఈ పంట ముఖ్యంగా అడవి దున్నలు, కుందేళ్లు వంటి శాఖాహార జంతువులు తినేలా ఏర్పాటు చేస్తున్నామని అధికారులు అంటున్నారు. పులిని సైతం మట్టికరిపించే దున్న ఆరున్నర అడుగుల ఎత్తు.. 12 అడుగుల పొడవు, 800 నుంచి 1500 కేజీల భారీ బరువుతో అడవి దున్నలు ఉంటాయి. పెద్ద పులులను సైతం మట్టి కరిపించే వణ్యప్రాణి అడవిదున్న. దీని జీవిత కాలం 15 నుంచి 20 సంవత్సరాల వరకూ ఉంటుంది. రాత్రి, పగలు తేడా లేకుండా దురుసుగా తిరిగే జంతువు మనుషులు కనిపిస్తే దాడిచేసే ప్రమాదం -
మండుతున్న ఎండలు
పెంటపాడు: రోజురోజుకు ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఈ ఎండలు మండు వేసవిని తలపిస్తున్నాయి. ఎండ, ఉక్కపోతతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేక పోతున్నారు. వర్షాలు లేక ఎండకు నాట్లు దెబ్బతినే అవకాశం ఉంది. నాట్ల సమయంలో వర్షం వస్తే ఏపుగా ఎదుగుతాయి. ఎండల వల్ల ప్రజలు బయటకు రాక వ్యాపారాలు కూడా దెబ్బతింటున్నాయి. స్కూలుకు వెళ్లే చిన్నారులు ఎండ దెబ్బకు అల్లాడుతున్నారు. గూడెం నియోజకవర్గంలో అప్రకటిత విద్యుత్ కోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి పూట అయితే చెప్పక్కరలేదు. పెంటపాడు, గూడెం ప్రాంతాలలో రోజూ 10 గ్రామాల చొప్పున విద్యుత్ కోత ఉంటోంది. -
మద్యం షాపులో ఘర్షణ
ఇద్దరికి గాయాలు తణుకు అర్బన్: మద్యం దుకాణంలో ముగ్గురు వ్యక్తుల మధ్య జరిగిన వాగ్వివాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. తణుకులో జాతీయ రహ దారిలోని పాత బెల్లం మార్కెట్ ప్రాంతంలో రష్మిక మద్యం షాపు వద్ద ఆదివారం జరిగిన సంఘటనలో బీరు సీసాతో దాడికి తెగబడ్డారు. తణుకు పాతవూరుకి చెందిన సనమండ్ర రాజేష్, ముప్పిడి సత్యనారాయణ, చదలవాడ కిరణ్ మద్యం తాగుతుండగా పాత కక్షల నేపథ్యంలో ఘర్షణ రేగింది. దీంతో రాజేష్ బీరు సీసా పగులకొట్టి సత్యనారాయణ, కిరణ్లపై దాడి చేశాడు. తీవ్ర గాయాలైన ఇద్దరిని తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తణుకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక
ఏలూరు (టూటౌన్): ఏలూరు జిల్లాకు సంబంధించి అథ్లెటిక్స్ జిల్లా జట్ల ఎంపికకు అనూహ్యా స్పందన వచ్చినట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి దేవరపల్లి ప్రసాద్ తెలిపారు. స్థానిక ఏఎస్ఆర్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన అండర్–14, 16, 18, 20 విభాగాల్లో పెద్ద సంఖ్యలో బాలబాలికలు పాల్గొని తమ ప్రతిభ చూపారన్నారు. పోటీలకు జిల్లా అథ్లెటిక్స్ సంఘం అధ్యక్షుడు గుళ్ళా ప్రసాదరావు, జల్లా వీరభద్రరావు, మరడాని అచ్యుతరావు, కోశాధికారి అన్యం శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించినట్లు తెలిపారు. పెద్దింట్లమ్మ దేవస్థానంలో భక్తుల సందడి కై కలూరు: పెద్దింట్లమ్మ దేవస్థానంలో భక్తుల రద్దీ నానాటికి పెరుగుతోంది. ఆదివారం ఉదయం పవిత్ర కోనేరులో స్నానాలు ఆచరించి అమ్మవారికి నైవేద్యాలను సమర్పించారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ రూ.70,414 ఆదాయం వచ్చిందని తెలిపారు. ముగ్గురిపై కేసు నమోదు జంగారెడ్డిగూడెం: భార్యా భర్తల గొడవల నేపథ్యంలో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు హెచ్సీ టి.బాబూరావు తెలిపారు. ఈ నెల 1న పింగుల హరీష్కు, అతని భార్య మధ్య అక్కంపేటలోని వారి ఇంటి వద్ద చిన్న గొడవ జరిగింది. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు హరీష్పై దాడి చేసి కొట్టారు. మరో వ్యక్తి హరీష్ భార్యను దూషించారు. దీంతో హరీష్ భార్య చీమల మందు తినడంతో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. ఆదివారం హరీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెచ్సీ టి.బాబూరావు తెలిపారు. -
కుంగిన వంతెన.. నిలిచిన రాకపోకలు
భీమవరం అర్బన్: భీమవరం మండలంలోని దొంగపిండిలో బందాల చేడు డ్రెయిన్పై నిర్మించిన వంతెన ఆదివారం తెల్లవారుజామున కుంగిపోయింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామంలో సుమారు 6 వేల వరకు జనాభా ఉండగా.. గ్రామం చుట్టూ ఎటు చూసినా కాలువలు ఉన్నాయి. నిత్యం స్కూలు బస్సులు, కూలీలు, కార్మికుల వ్యాన్లు, ఆటోలపై పొరుగూరుకు వెళ్లి వస్తుంటారు. గ్రామంలో చేపలు, రొయ్యలు చెరువులు ఎక్కువగా ఉండటంతో తవుడు లోడులు, పట్టుబడులకు నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. గ్రామం నుంచి పొరుగూళ్లు వెళ్లడానికి ఆర్ అండ్ బీ రోడ్డు ఒక్కటే కావడంతో ఆ మార్గంలో వంతెన కుంగిపోవడంతో ఆంధోళన వ్యక్తం చేస్తున్నారు. 3 దశాబ్దాల నాటి వంతెన సుమారు 3 దశాబ్దాల క్రితం బందాల చేడు డ్రెయిన్పై వంతెన నిర్మించారు. కొంతకాలంగా ఈ వంతెన శిథిలావస్థకు చేరుకుని అడుగుభాగం పెచ్చులూడిపోవడంతో కొంతమంది గ్రామస్తులు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టికి తీసుకువెళ్లారు. ఇంతవరకూ ఎవరూ పట్టించుకోలేదని ఇప్పుడు వంతెన కూలిపోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుంగిపోయిన వంతెన స్థానంలో ఎప్పుడు కొత్త వంతెన నిర్మిస్తారని, అప్పటి వరకు తమకు కష్టాలు తప్పవా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలికంగా వంతెన నిర్మించాలని గ్రామస్తులు, రైతులు కోరుతున్నారు. -
బందా మృతి తీరని లోటు
ఏలూరు (ఆర్ఆర్పేట): నగరానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త వీ.బందా మృతి సాహితీ లోకానికి తీరని లోటని పలువురు వక్తలు అన్నారు. బందా సంతాప సభను సాహిత్య మండలి, గరికిపాటి ఆర్ట్స్, హేలాపూరి కళా పరిషత్, జిల్లా రచయితల సంఘం తదితర సాహిత్య కళా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించారు. సభకు అధ్యక్షత వహించిన తెలుగు రచయితల సంఘం అధ్యక్షుడు లంకా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గొప్ప స్నేహ శీలి, మంచి సాహితీవేత్త బందా అన్నారు. గరికిపాటి కాళిదాసు మాట్లాడుతూ ప్రవచనకారుడు గరికపాటి నరసింహరావు ద్విశత అవధానం కార్యక్రమం బందా నేతృత్వంలో నిర్వహించామని గుర్తుచేసుకున్నారు. లేళ్ళ వెంకటేశ్వరావు, మహమ్మద్ ఖాజావలీ, నాగాస్త్ర పుల్లాభొట్ల పురుషోత్తం, పీ సత్యవాణి, పీ ఆంజనేయులు, సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
సుబ్బారాయుడిని దర్శించుకున్న భక్తులు
ముదినేపల్లి రూరల్: ప్రసిద్ధి చెందిన సింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్లోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం భక్తులు పోటెత్తారు. భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారి పుట్టలో పాలు పోసి స్వామిని దర్శించుకున్నారు. పాలపొంగళ్ల శాల వద్ద మహిళలు నైవేద్యాలు తయారుచేసి స్వామికి సమర్పించారు. నాగబంధాల వద్ద స్వామివారి మూర్తులను ప్రతిష్ఠించేందుకు అర్చకులతో పూజలు చేయించి ప్రతిష్ఠ తంతు నిర్వహించారు. నాగబంధాల వద్ద, గోకులంలోని గోవులకు మహిళలు పసుపు కుంకుమలతో పూజలు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నప్రసాద ఏర్పాట్లు చేశారు. రాట్నాలమ్మకు భక్తిశ్రద్ధలతో పూజలు పెదవేగి: పెదవేగి మండలం రాట్నాలకుంటలో వేంచేసిన రాట్నాలమ్మకు ఆదివారం ప్రీతికరమైన రోజు కావడంతో జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు దేవస్థానానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, వారి మొక్కుబడులు తీర్చుకున్నారు. ఇందులో భాగంగా చిన్నారులకు అక్షరాభ్యాసాలు, నామకరణలు, ఇతర మొక్కుబడులు చెల్లించారు. ఈ వారం అమ్మవారికి మొత్తం రూ 79,053 ఆదాయం లభించిందని దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎన్.సతీష్కుమార్ తెలిపారు. గుర్తుతెలియని మృతదేహం లభ్యం పాలకొల్లు సెంట్రల్: పట్టణంలోని లాకు సెంటర్ వద్ద నిడదవోలు–నరసాపురం కాలువలో గుర్తు తెలియని పురుషుడి మృతదేహం కొట్టుకువచ్చింది. పై నుంచి కొట్టుకొచ్చినట్లుగా స్థానికులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సీఎస్సీ భవన నిర్మాణానికి చర్యలు
కాళ్ల : మండలంలోని బొండాడ గ్రామంలో సచివాలయం వద్ద రూ.లక్షలతో నిర్మించిన మరుగుదొడ్లను ప్రైవేట్ వ్యక్తులు కూ ల్చివేయడంతో అధికారులు తప్పును సరిదిద్దుకునే పనిలో నిమగ్నమయ్యారు. సచివాలయ భవనం ప్రారంభం కాకుండానే మరుగుదొడ్లను కూల్చివేయడంపై గత నెల 27న ‘సాక్షి’లో ప్రచురించిన ‘ప్రభుత్వ భవనాలకే రక్షణ లేదు’ కథనానికి అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించారు. ఎవరైతే భవనాన్ని కూల్చారో వారే కట్టించేలా చూడాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శితో పాటు అధికారులపై డిప్యూటీ స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు కూల్చిన వ్యక్తితోనే భవనాన్ని కట్టిస్తున్నారు. ఆదివారం సీఎస్సీ భవనం (కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్) నిర్మాణానికి ఇంజనీరింగ్ సిబ్బంది మార్కింగ్ వేశారు. మెటీరియల్ సిద్ధం చేశారు. ఆర్డబ్ల్యూఎస్ జేఈ ఫణి పనులను పర్యవేక్షిస్తున్నారు. ఎవరైనా ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి పాల్పడితే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. -
భీమవరం మున్సిపాలిటీలో అవినీతి భాగోతం
భీమవరం(ప్రకాశం చౌక్): కూటమి ప్రభుత్వంలో భీమవరం మున్సిపాలిటీ అవినీతి అధికారులకు అడ్డాగా మారిపోయింది. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ స్థానికంగా ఉన్నా, వారి పర్యవేక్షణ లేకపోవడంతో మున్సిపల్ అధికారులు పేట్రేగి పోతున్నారు. కొందరు అధికారులు పైసా లేకపోతే పని జరగదనే స్థాయికి వెళ్లిపోయారు. టౌన్ప్లానింగ్ అధికారులు భీమవరంలో బిల్డింగ్ నిర్మాణ అనుమతులకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. నిర్మించిన భవనాలకు పన్ను వేయడానికి రెవెన్యూ అధికారులు రూ.15 వేల నుంచి రూ.40 వేల వరకు వసూలు చేస్తున్నారు. సివిల్ పనుల్లో కాంట్రాక్టర్ల నుంచి 2 నుంచి 5 శాతం కమిషన్ ఇంజినీరింగ్ అధికారులు వసూలు చేస్తుండగా.. నెలనెల హోటల్స్, దుకాణాల నుంచి శానిటేషన్ అధికారులు వసూలు చేస్తున్నారు. కుళాయి కనెక్షన్లకు రూ.10 వేలు నుంచి రూ.20 వేలు ఇవ్వాల్సిందే. బర్త్, డెత్ సర్టిఫికెట్లుకు వేలల్లో వసూలు చేస్తున్నారు. భీమవరం మున్సిపాలిటీలో ప్రతి దానిలో అవినీతి రాజ్యమేలుతుంది. ఇటీవల రివ్యూ సమావేశంలో ఎమ్మెల్యే అంజిబాబు టాన్ప్లానింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి ఏసీబీకి పట్టిస్తానని చెప్పారు. మున్సిపాలిటిలో పనులుంటేనే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారికి పేమెంట్లు మున్సిపాలిటీలోని ఉన్నత అధికారికి అన్ని విభాగాల నుంచి నెల నెల పేమెంట్లను ఆయా విభాగాల అధికారులు అందిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. సదరు ఉన్నత అధికారి ఇంటికి భీమవరం నుంచి కాంట్రాక్టర్లతో మెటీరియల్ సరఫరా చేయించుకున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. పేమెంట్లు అందించడం కోసం కొందరు అధికారులు రేటు పెట్టి వసూలు చేస్తున్నారని, అందులో కొంత అధికారికి, మరి కొంత వారికి అన్నట్లు వ్యాపారం సాగిస్తున్నారు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు భీమవరం మున్సిపాలిటీపై దృష్టి సారించి అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలి. ప్రతి సెక్షన్లోనూ వసూళ్ల దందా మున్సిపల్ ఉన్నతాధికారికి నెలనెలా పేమెంట్లు? -
నీరందక ఆక్వా రైతు విలవిల
భీమడోలు: ఆగడాలలంక చానల్ పరిధిలోని ఆక్వా చెరువులకు నీరందక రైతులు ఆందోళన చెందుతున్నారు. 7 వేల ఎకరాల ఆక్వా ఆయుకట్టులోని చేపల సాగు ప్రశ్నార్థకంగా మారింది. సకాలంలో నీరందించకపోవడంతో చేపలు, చేపల పిల్లలు మృత్యువాత పడి తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు లబోదిబోమంటున్నారు. మురుగునీటిని చెరువుల్లో నింపుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోదావరి కాలువలో నీటి లెవెల్స్ ఎక్కువగా ఉన్నందున రెండు అడుగుల మేర నీటిని విడుదల చేయాలని మొరపెట్టుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. చానల్ పరిధిలో భోగాపురం, వడ్డిగూడెం, లక్ష్మీపురం, సీతారామనగరం, ఆగడాలలంక, చెట్టున్నపాడు, మల్లవరంతో పాటు ఏలూరు రూరల్ మండలానికి చెందిన పలు గ్రామాలకు మంచినీరు, సాగునీరు అందిస్తారు. చానల్లో పేరుకుపోయిన తూడు, గుర్రపు డెక్కతో నీరు కిందకు పారడం లేదు. ఈ సమయంలో అడుగు లోపు నీరందించడం వల్ల శివారుకు నీరు చేరడం లేదు. మోటార్లు పెట్టి నీటిని తోడుకుంటున్నారు. నెలకు 10 రోజుల మాత్రమే నీటిని విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు సరిగా లేక రైతులు కాల్వ నీటిపై ఆధారపడి సాగు చేస్తున్నారు. నీరు లేకపోవడంతో చేప పిల్లలు బతికే అవకాశాలు తగ్గిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.33 లక్షల నీటి తీరువా వసూలు చేశారు అర అడుగు నీటి వల్ల వరి రైతులు, ఆక్వా రైతులకు ప్రయోజనం లేదని చెట్టున్నపాడు నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షుడు ఆర్. రామకృష్ణం రాజు విమర్శించారు. గ్రామాల్లోని మంచినీటి చెరువులకు నీటిని తోడుకోవాల్సి ఉందని, ఇరిగేషన్ అధికారులు నీటిని పూర్తి స్థాయిలో అందించడం లేదన్నారు. సార్వా నాట్లు పూర్తయినా నీటి వినియోగం తగ్గినా ఆక్వా చెరువులకు నీరివ్వడం లేదని, నీటి తీరువా కింద రూ.33 లక్షలు రైతులు ప్రభుత్వానికి చెల్లించారని చెప్పారు. శివారుకు చేరని ఆగడాలలంక చానల్ నీరు నీటిని విడుదల చేస్తున్నాం గోదావరి కాల్వలో నీటి లభ్యత ఆధారంగా నీరిందిస్తున్నాం. వరి సాగు, మంచినీటి అవసరాలు తీర్చిన తర్వాతనే ఆక్వాకు నీరందిస్తాం. మంచినీటి చెరువులన్నీ నింపాం. వరి పొలాలకు నీరందించాం. వాతావరణ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో మెరక తూములకు నీరందక రైతులు, ఆక్వా రైతులు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే. అయినప్పటికీ నీటిని సరఫరా చేస్తున్నాం. గుండుగొలను వద్ద నీటి మట్టం 4.6 అడుగుల వరకూ ఉంది. ఆగడాలలంక చానల్కు రెండు అడుగుల నీటిని విడుదల చేస్తే... గోదావరి కాల్వ ఆయకట్టుపై ప్రభావం పడుతుంది. సుబ్రహ్మణ్యం, ఏఈ, ఇరిగేషన్ సెక్షన్, గుండుగొలను -
అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు
ద్వారకాతిరుమల: స్థానిక వెలుగు కార్యాలయ సమీపంలో ఆదివారం ఆర్టీసీ బస్సు టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పింది. డ్రైవర్ అప్రమత్తమై చాకచక్యంగా బస్సును నిలుపుదల చేయడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఏలూరు నుంచి ద్వా రకాతిరుమల మీదుగా జంగారెడ్డిగూడేనికి 40 మంది ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సుకు ఘటనా స్థలం వద్ద ఎత్తు ఎక్కేటప్పుడు ఒక్కసారిగా టైర్ పంక్చర్ అయ్యింది. దీంతో రోడ్డు వెనుక పల్లంగా ఉండటంతో బస్సు అదుపు తప్పింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును గేర్లో నిలుపుదల చేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం వారిని వేరే బస్సులో ఎక్కించి పంపించారు. వైఎస్సార్సీపీ నేతపై టీడీపీ శ్రేణుల దాడి నూజివీడు: వైఎస్సార్సీపీ కార్యక్రమాల్లో చురు గ్గా పాల్గొంటున్నాడనే కక్షతో నూజివీడు మండలం జంగంగూడెంలో వైఎస్సార్సీపీ నేత తొమ్మండ్రు రాజేశ్వరరావుపై అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు ఇద్దరు శనివారం రాత్రి దాడికి పాల్పడ్డారు. రాజేశ్వరరావు రెండు నెలలుగా వైఎస్సార్సీపీ కార్యక్రమాల నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తూ విజయవంతంగా సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఓర్వ లేని టీడీపీ కార్యకర్తలు కొలికపాం వెంకటేశ్వరరావు, తొమ్మండ్రు సింహాద్రి మాట్లాడాలని చెప్పి గ్రామంలోని చెరువు కట్ట వద్దకు రాజేశ్వరరావును తీసుకువెళ్లి రాయితో దాడి చేసి కొట్టారు. రాజేశ్వరరావు వారి నుంచి తప్పించుకుని తుక్కులూరు చేరుకుని 108 వాహనం ద్వారా నూజివీడు ఏరియా ఆస్పత్రిలో చేరా రు. బాధితుడి నుంచి పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ప్రశాంతంగా నీట్ పీజీ పరీక్షలు ఏలూరు (ఆర్ఆర్పేట): వైద్య విద్యలో ఎండీ, ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశల నిమిత్తం ఆదివారం నీట్ పీజీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. నగరంలోని సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల, సి ద్ధార్థ క్వెస్ట్ విద్యాసంస్థల్లో 373 మంది విద్యార్థులకు 343 మంది హాజరయ్యారు. సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 200 మందికి 181 మంది, సిద్ధార్థ క్వెస్ట్లో 173 మందికి 162 మంది హాజరయ్యారు. భీమవరంలోని ఒక కేంద్రంలో..భీమవరం: భీమవరంలో ఆదివారం నీట్ పీజీ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. డీఎన్నార్ అటానమస్ కళాశాలలో ఉదయం 169 మంది విద్యార్థులకు 160 మంది హాజరయ్యారని, మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని కళాశాల పరీక్షల నిర్వాహకుడు తెలిపారు. విద్యార్థుల హక్కులు కాలరాస్తున్న ప్రభుత్వం ఏలూరు (టూటౌన్): కూటమి ప్రభుత్వం వి ద్యార్థుల హక్కులను కాలరాస్తోందని ఎస్ఎఫ్ఐ ఏలూరు నగర కార్యదర్శి బి.మనోజ్ విమర్శించారు. స్థానిక ఎన్ఆర్పేటలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 30/67 జీఓను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ జీఓ ద్వారా కార్పొరేట్ విద్యాసంస్థలకు విచ్చలవిడిగా దోచుకోవడానికి మంత్రి లోకేష్ అవకాశమిచ్చారన్నారు. చైతన్య, నారాయణ విద్యాసంస్థల్లో ఇప్పటికే పలువురు వి ద్యార్థులు ఒత్తిళ్లతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఈ జీఓ వెనక్కి తీసుకోకుంటే రా ష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని మనోజ్ హెచ్చరించారు. ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షుడు ఎస్.శివాజీ మాట్లాడుతూ ఏలూరులోని ప్రభు త్వ హాస్టళ్లలో పలు సమస్యలు ఉన్నాయని, ఎస్సీ బాలుర హాస్టల్లో విద్యార్థులు మత్తుపదార్థాలకు అలవాటు పడ్డారన్నారు. అమీనాపేటలోని బాలికల హాస్టల్కు రక్షణ కరువైందన్నారు. అనంతరం ఎస్ఎఫ్ఐ నగర నూతన కమిటీ ఎన్నికై ంది. బీసీ హాస్టళ్ల తనిఖీ ఏలూరు (టూటౌన్): ఏలూరులోని బీసీ సంక్షేమ హాస్టళ్లను ఆదివారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ సంచాలకుడు డి.చంద్రశేఖరరాజు తనిఖీ చేశారు. ఏలూరులోని వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాలు, బీసీ బాలికల వసతి గృహం నం.1, 2, కళాశాల వసతి గృహం నం. 1,2లను పరిశీలించారు. విద్యార్థుల భోజనాలు, రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం క్లీన్–గ్రీన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన వెంట జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి ఆర్వీ నాగరాణి, సహాయ బీసీ సంక్షేమ అధికారి టి.వెంకటేశ్వర్లు, వసతి గృహ సంక్షేమ అధికారులు ఉన్నారు. -
ఫ్రీ బస్ ఎక్కేసి పుట్టింటికి వెళ్లిపోండి..
ద్వారకాతిరుమల: ఇదివరకటి లాగా ఇంట్లో భర్త విసుక్కున్నా.. కసురుకున్నా ఎవరూ పడాల్సిన పని లేదని, హ్యాపీగా ఫ్రీ బస్ ఎక్కేసి పుట్టింటికి వెళ్లి పోతే, భర్తే వచ్చి తీసుకువెళతారని గోపాలపురం టీడీపీ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం తిరుమలంపాలెం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన స్పౌజ్ పెన్షన్ల కార్యక్రమంలో ఆయన పాల్గొని పై విధంగా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు మహిళలను రెచ్చగొట్టేలా ఉన్నాయని కొందరు మండిపడ్డారు. ఎమ్మెల్యే ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
కొనసాగుతున్న విచారణ
ఉండి: జూనియర్ లైన్మేన్పై వచ్చిన ఆరోపణలపై శనివారం మూడోరోజు కూడా విచారణ కొనసాగింది. ఉండి మండలం చెరుకువాడ, అర్తమూరు గ్రామాలకు జూనియర్ లైన్మేన్గా విధులు నిర్వర్తిస్తున్న దాసరి రాజుపై వచ్చిన ఆరోపణలపై గత మూడు రోజులుగా అధికారులు విచారణ చేస్తున్నారు. శనివారం రెండు గ్రామాల్లోను విద్యుత్ అధికారులు పర్యటించారు. ఆయా గ్రామాల్లో ఆక్వా రైతులు, ప్రజల నుంచి సేకరించిన వివరాలను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు ఉండి ఎలక్ట్రికల్ ఏఈ పులగం శ్రీనివాసరావు తెలిపారు. దర్యాప్తును పూర్తిస్థాయిలో సోమవారం ముగిస్తామన్నారు. పారిజాతగిరిలో ప్రత్యేక పూజలు జంగారెడ్డిగూడెం: స్థానిక గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శనివారం విశేష పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు గోవింద నామస్మరణతో పారిజాత గిరి ప్రదక్షిణ చేశారు. వారికి ప్రత్యేక దర్శనం, ప్రసాదం, అన్న ప్రసాదం ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి కలగర శ్రీనివాస్ తెలిపారు. అన్నదాతలు జంగారెడ్డిగూడెం వాస్తవ్యులు సత్య గణేష్ చౌదరి, మంజుషలకు స్వామివారి వస్త్రాలు, ప్రసాదాలు, వేద పండితుల ఆశీస్సులతో సత్కరించారు. శనివారం ఆలయానికి వివిధ రూపాల్లో రూ.1,01,076 ఆదాయం లభించినట్లు ఈవో శ్రీనివాస్ తెలిపారు. అభివృద్ధి కమిటీ సభ్యులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
అమ్మపాలు బిడ్డకు అమృతం
కై కలూరు: వ్యాధులకు కారణం పోతపాలు.. బిడ్డ సరైన ఎదుగుదలకు కావాలి తల్లిపాలు అంటూ ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు శుక్రవారం నుంచి జిల్లాలో ప్రారంభమయ్యాయి. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం(ఐసీడీఎస్) పర్యవేక్షణలో ఏలూరు జిల్లాలో 2,226 అంగన్వాడీ కేంద్రాల్లో 7వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గర్భిణులు, శిశుతల్లులు, యువతులకు క్విజ్ పోటీలు, బొమ్మలు, పోస్టర్లు, బ్యానర్లతో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. పుట్టిన గంటలోపే ముర్రిపాలు పట్టించడంపై నెలకొన్న తల్లుల అపోహలను తొలగించే దిశగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. తల్లి పాలకు ప్రాధాన్యత ఇవ్వండి ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా శ్రీతల్లిపాలకు ప్రాధాన్యత నివ్వండి, స్థిరమైన మద్దతు వ్యవస్థలను సృష్టించండిశ్రీ అనే నినాదంతో తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రసుత్తం 120 దేశాల్లో తల్లి పాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఏలూరు జిల్లాలో 6 నెలల నుంచి మూడు సంవత్సరాల వయస్సు పిల్లలు 48,563, మూడేళ్ల వయస్సు నుంచి ఆరేళ్ల వరకు 23,499 పిల్లలు ఉన్నారు. ఇక జిల్లాలో గర్భవతులు 8,861, బాలింతలు 6,592, కౌమారదశ బాలికలు 21,498 మంది ఉన్నారు. తల్లిపాల వల్ల బిడ్డ పొందే లాభాలు ● తల్లి పాలలో శిశువు పెరుగుదలకు అవసరమైన ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు ఖనిజాలు సమతుల్యతలో ఉంటాయి. ● తల్లిపాలు తాగే బిడ్డలో 8 ఐ.క్యూ పాయింట్లు తల్లిపాలు తాగని బిడ్డ కంటే ఎక్కువ ఉంటాయి. ● మెదడు అభివృద్ధి చెందడంతో పాటు రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ● బాల్య ఊబకాయం, టైప్– 2 డయాబెటిస్, ఉబ్బసం, కొన్ని రకాల బాల్య ల్యుకేమియా వ్యాధులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది. ● తల్లిపాలు సులభంగా జీర్ణమవుతాయి. బిడ్డకు మలబద్దకం, కడుపునొప్పి రాదు. ● బిడ్డకు కావలసిన ఇనుము, కాల్షియం అందడంతో రక్తహీనత రాదు. ● బిడ్డ చూపు, వాసన, వినికిడి, రుచి, స్వర్శ వంటి జ్ఞానేంద్రియాలు అభివృద్ధి. తల్లికి కలిగే ప్రయోజనాలు ● తల్లి పాలివ్వడం వల్ల తల్లికి రొమ్ము, ఓవరీస్ కాన్సర్లు, ఆస్టియో పోరోసిస్(ఎముకలు పటుత్వం కోల్పోవడం) జబ్బులు రావు. ● తల్లి, బిడ్డ మధ్య బలమైన భావోద్వేగ సంబంధాన్ని ప్రోత్సహిస్తుంది. ● అధిక రక్తపోటు, గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ తగ్గించవచ్చు. ● డయాబెటిక్ తల్లులు బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల ఇన్సూలిన్ తీసుకునే అవసరం తగ్గుతుంది. ● తల్లిపాలు ఇవ్వడం వల్ల ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇది గర్భాశయం సాధారణ పరిమాణానికి తిరిగి రావడానికి సహాయపడుతుంది. ● ప్రసవానంతర రక్తస్రావాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ● తల్లులు గర్భధారణ బరువును క్రమంగా తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రసవించిన గంటలోపే ముర్రిపాలు పట్టాలి బిడ్డ పుట్టిన మూడు రోజుల్లో వచ్చే పాలను ముర్రిపాలు అంటారు. ప్రసవించిన గంట లోపే బిడ్డకు ముర్రిపాలు పట్టడం వల్ల శిశు మరణాలు తగ్గించవచ్చు. ముర్రిపాలలో విటమిన్ ఏ, సీ, డీ, ఇ, కే, ప్రొటీన్స్, మినరల్స్, క్రొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ముర్రిపాలు శిశువు ప్రేగులను శుభ్రం చేసే ప్రభావం కలిగి ఉంటాయి. ప్రేగుల్లోని బెలిరూబిన్ విసర్జింపచేయడం ద్వారా బిడ్డకు కామెర్లు తీవ్రతను తగ్గిస్తోంది. బంగారం వంటి ముర్రిపాలను ఇప్పటికీ కొందరు మహిళలు మూఢ నమ్మకాలతో బిడ్డలకు పట్టడం లేదు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ముర్రిపాల ఆవశ్యకతను చాటిచెబుతున్నారు. ఈ నెల 7 వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జిల్లాలో 6,592 మంది బాలింతలకు అవగాహన బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం మొదటి 6 నెలలు తల్లి పాలే బిడ్డకు సంపూర్ణ పోషకాహారం. తల్లిపాలలో మాంసకృత్తులు, కొవ్వు, విటమిన్లు, కాల్షియం, ఇనుము ఇతర ఖనిజాలు పుష్పలంగా లభిస్తాయి. తల్లిపాల వారోత్సవాలను జిల్లాలో అన్ని కేంద్రాల్లో నిర్వహిస్తున్నాం. బాలింతలు, గర్భిణులు, కౌమారదశ యువతలకు అవగాహన కలిగిస్తున్నాం. తల్లి పాల ప్రయోజనాలను తల్లులు తెలుసుకోవాలి. – పి.శారద, ఐసీడీఎస్. జిల్లా పీడీ, ఏలూరు. వ్యాధుల నుంచి రక్షణ శిశువు జీవితంలో మొదటి తల్లిపాలే ప్రాథమిక వనరుగా ఉంటాయి. తల్లిపాలలో 87 శాతం నీరు, 7 శాతం కార్బోహైడ్రేట్, 4 శాతం లిపిడ్, 1 శాతం ప్రోటిన్, విటమిన్లు ఇతర ఖనిజాలు ఉంటాయి. తల్లి పాలు తీసుకున్నవారికి స్వల్ప, దీర్ఘ కాలిక వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది. పిల్లలకు పాలు ఇవ్వడం వల్ల తల్లులూ ఆరోగ్యంగా ఉంటారు. – డాక్టర్ కె.అన్నపూర్ణ, శీతనపల్లి పీహెచ్సీ -
శ్రీవారి సేవలో..
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని శనివారం స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ జోన్–2 రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ బీఆర్ క్రాంతి కుమారి సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆమెకు ముందుగా దేవస్థానం అధికారులు మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో అర్చకులు, పండితులు వేద ఆశీర్వచనం అందజేసి సత్కరించారు. సెప్టెంబరు 13న జాతీయ లోక్ అదాలత్ ఏలూరు (టూటౌన్): సెప్టెంబర్ 13వ తేదీన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకుని కేసులు పరిష్కరించుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ కోరారు. స్థానిక జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయసేవాసధన్ భవన్ నందు శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ జాతీయ లోక్ అదాలత్ నందు రాజీయోగ్యమైన అన్ని క్రిమినల్ కేసులతో పాటు సివిల్, వాహనం ప్రమాద బీమా, బ్యాంకు లావాదేవీలు, కుటుంబ వివాదాలు, టెలిఫోన్ బకాయిలు, చిట్ ఫండ్ కేసులు, అమలు పిటీషన్లు (ఇ.పి) రాజీ చేయడం జరుగుతుందన్నారు. కేసుల పరిష్కారంలోగానీ, మరి ఏ ఇతర సమస్యలు ఎదురైన 15100 లేదా 08812 224555ను సంప్రదించాలన్నారు. -
శ్రీవారి క్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణం
ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య క్షేత్రంలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారికి ప్రీతికరమైన రోజు అయినప్పటికీ అష్టమి తిధి కావడంతో నామమాత్రంగా భక్తులు ఆలయానికి విచ్చేశారు. దాంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, కల్యాణకట్ట తదితర విభాగాల్లో భక్తుల రద్దీ స్వల్పంగా కనిపించింది. ఆదివారం భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని ఆలయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. శ్రీవిష్ణు డెంటల్ కళాశాలలో రాష్ట్రస్థాయి సదస్సు భీమవరం: పట్టణంలోని శ్రీవిష్ణు డెంటల్ కళాశాలలో 11వ ఐపీఎస్ రాష్ట్ర సమావేశం శనివారం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఏవీ రామరాజు చెప్పారు. ఈ సందర్భంగా ఫ్యాకల్టీ, విద్యార్థుల మార్పిడి, పరిశోధన, ప్రచురణలు, క్లినికల్ శిక్షణ వంటి కార్యకలాపాలకోసం విష్ణు డెంటల్ కళాశాల, వియత్నంలోని కాన్థో యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్ అండ్ ఫార్మసీ మధ్య అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు రామరాజు తెలిపారు. సమావేశంలో రాష్ట్రంలోని వివిధ డెంటల్ కళాశాలలకు చెందిన సుమారు 200 మంది ప్రతినిధులు పాల్గొనగా పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు పరిశోధన పత్రాలను సమర్పించారన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ చైర్మన్ రవిచంద్రన్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులు ర్యాగింగ్కు దూరంగా ఉండాలి
నూజివీడు: విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ర్యాగింగ్కు దూరంగా ఉండి చదువుపైనే దృష్టి సారించాలని సిఐడీ డీఎస్పీ జీ లక్ష్మయ్య పేర్కొన్నారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు ర్యాగింగ్ వల్ల కలిగే అనర్థాలు, చట్టపరంగా తీసుకునే చర్యలపై శనివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ చదువు అంటే అర్థం చేసుకోవడం, అవగాహన చేసుకోవడం అనే విషయాన్ని మనం నిజంగా గ్రహిస్తే ఇతరుల్ని మనం ర్యాగింగ్ చేయడానికి ఇష్టపడమన్నారు. ఇతరుల్ని శారీరకంగా, మానసికంగా వేధించడం మానుకోవాలని, మంచి స్నేహితుల్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇతరులతో ఎగతాళిగా మాట్లాడడం, తోటి విద్యార్థులతో నువ్వు చదవలేవు అని అనడం కూడా ర్యాగింగ్ కిందకు వస్తుందన్నారు. విద్యార్థులు ర్యాగింగ్ వలలో పడకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని నిరంతరం గుర్తు చేసుకుంటూ వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పట్టుదలతో చదువుకొని భవిష్యత్తో ప్రయోజకులవ్వాలన్నారు. దేశానికి ఉపయోగపడే పౌరులుగా మారినప్పుడే దేశం కూడా అభివృద్ధిలో ముందుకు వెళ్తుందన్నారు. అనంతరం డీఎస్పీని మెమొంటో, శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డీఎస్డబ్ల్యూఓలు రాజేష్, దుర్గాభవాని, చీఫ్ వార్డెన్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. సీఐడీ డీఎస్పీ లక్ష్మయ్య -
విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపును ఆపాలి
ఏలూరు (టూటౌన్): విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపును ఆపాలని, ఈనెల 5వ తేదీన విద్యుత్ భవనం వద్ద చేపట్టే ప్రజాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ వేదిక ఆధ్వర్యంలో శనివారం టూటౌన్ తంగేళ్లమూడి సెంటర్, గన్బజార్లలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యుత్ చార్జీలు పెంచము అని కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు హామీ ఇచ్చి, ఇప్పుడు ప్రజలపై ఆర్థిక భారము మోపేలా స్మార్ట్ మీటర్లను బిగించే కార్యక్రమాన్ని చేపట్టడం దారుణమన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలు ఉపాధి లేక,, ఉద్యోగాలు లేక నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఇప్టూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సహాయ కార్యదర్శి యర్రా శ్రీనివాసరావు, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి డేగ ప్రభాకర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, చేతివృత్తిదారుల సంఘం జిల్లా కన్వీనర్ పిచ్చుకల ఆదిశేషు తదితరులు పాల్గొన్నారు. పొగాకు బేళ్లు చోరీ నిందితుల అరెస్ట్ టి.నరసాపురం: పొగాకు బేళ్లు చోరీ నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్సై జయబాబు తెలిపారు. వివరాల ప్రకారం.. మండంలోని కృష్ణాపురం గ్రామానికి చెందిన భూక్యా భాస్కరరావుకు చెందిన 14 పొగాకు బేళ్లు చోరీపై జూలై 28న ఫిర్యాదు చేశాడు. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు శనివారం నలుగురిని నిందితులుగా గుర్తించి వారిని అరెస్ట్ చేసి అనంతరం రిమాండ్కు పంపారు. నిందితులతోపాటు పొగాకు బేళ్లు కలిగిన వాహనాన్ని సీజ్ చేశామన్నారు. -
ప్రాణాలు తీసిన అతివేగం
ద్వారకాతిరుమల: ఒక డ్రైవర్ అతివేగం, అజాగ్రత్త రెండు నిండు ప్రాణాలను బలిగొంది. మృతుల కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. లైన్ గోపాలపురం జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి ముందు వెళుతున్న ఇసుక లారీని, కోళ్లు వ్యాన్ వెనుక నుంచి ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఒకరికి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. పోలీసుల కథనం ప్రకారం. గుంటూరు జిల్లా, వాడేపల్లికి చెందిన షేక్ మీరా మహబూబ్(30) గుంటూరులోని ఏకే చికెన్ పౌల్ట్రీలో గత 9 ఏళ్ల నుంచి డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అదే పౌల్ట్రీలో సౌత్ ఢిల్లీకి చెందిన మహ్మద్ సాజాన్(27), ఎండీ కలిమ్ ఆలాం కూలీలుగా పనిచేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ఈ ముగ్గురు వ్యాన్లో జంగారెడ్డిగూడెం మండలం కొయ్యలగూడెంకు వెళ్లారు. అక్కడ కోళ్లను లోడ్ చేసుకుని, తాడేపల్లికి బయల్దేరి వెళుతున్నారు. ఘటనా స్థలం వద్దకు వచ్చేసరికి బ్రిడ్జి ఎక్కే సమయంలో డ్రైవర్ మీరా మహబూబ్ వ్యాన్ను అతివేగంగా నడిపి ముందు (ఏలూరు వైపునకు) వెళుతున్న ఇసుక లారీని ఢీకొట్టాడు. ప్రమాదంలో మీరా మహబూబ్, సాజాన్ అక్కడికక్కడే మృతి చెందగా, కలిమ్ ఆలాంకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటీన క్షతగాత్రుడిని ఆంబులెన్స్లో ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు మహబూబ్ సోదరుడు షేక్ ఇస్మాయేలు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై టి.సుధీర్ తెలిపారు. -
అధికారులు సమర్థవంతంగా పనిచేయాలి
ఏలూరు(మెట్రో): ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అధికారులు పనిచేయాలని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో ఉమ్మడి పశ్చిమ గోదావరిజిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వేలాది కోట్ల నిధులను అందిస్తుందన్నారు. రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ పూర్తిచేసేందుకు, కొల్లేరు సమస్య పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయన్నారు. రైతులకు అవసరమైన భూసార పరీక్షలను నిర్వహించి ప్రాంతాలను బట్టి సమగ్రమైన ఏవిధమైన పంటలు సాగుకు మేలో అవగాహన కల్పించాలన్నారు. జెడ్పీ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘరామకృష్ణంరాజు, కలెక్టర్ కె.వెట్రిసెల్వి, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు. సమావేశంలో డీఆర్ఓ ఎం.వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈవో ఎం.శ్రీహరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ -
విద్యారంగాన్ని తుంగలో తొక్కుతున్న ప్రభుత్వం
ఏలూరు (టూటౌన్): ప్రభుత్వ విద్యారంగాన్ని కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కుతుందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కె.లెనిన్ దుయ్యబట్టారు. కుక్కునూరు, వేలేరుపాడు పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఎక్కడ? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎస్ఎఫ్ఐ సిటీ ప్లీనరీ సమావేశం ఆగస్టు 2, 3 తేదీల్లో సీఐటీయూ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. శనివారం నిర్వహించిన సిటీ ప్లీనరీ సమావేశంలో లెనిన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ అడ్మిషన్లు ఇప్పటివరకు కూడా విడుదల చేయకపోవడం కారణం ఏంటని ప్రశ్నించారు. గత సంవత్సరం డిగ్రీ అడ్మిషన్లు జులై నెలాఖరులోపు పూర్తయ్యాయని ఈ సంవత్సరం ఆగస్టు వచ్చినా ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదన్నారు. జిల్లా అధ్యక్షుడు బి.మనోజ్, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.శివాజీ, జయం శివ, రాజా తదితరులు పాల్గొన్నారు. నవోదయ ప్రవేశాల దరఖాస్తుకు గడువు పొడిగింపు ఏలూరు (ఆర్ఆర్పేట) : రానున్న విద్యాసంవత్సరంలో జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోడానికి ఆగస్టు 13 వరకు గడువు పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎం. వెంకట లక్ష్మమ్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తులను పరిపాలన కారణాలు, తల్లిదండ్రుల విజ్ఞప్తుల మేరకు గడువు పొడిగించినందున అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రూపాయికే బీఎస్ఎన్ఎల్ సిమ్ ఏలూరు (టూటౌన్): స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బీఎస్ఎన్ఎల్ ఒక్క రూపాయికే ఉచిత సిమ్ అందిస్తుందని టెలికాం జనరల్ మేనేజర్ ఎల్.శ్రీను తెలిపారు. స్థానిక జిల్లా టెలికాం జీఎం కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ఉచిత సిమ్తో పాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 2 జీబీ డేటా, వంద ఎస్ఎంఎస్లు, 30 రోజుల కాల వ్యవధితో అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్లాన్ ఈ నెల ఒకటి నుంచి 31 వరకు అందుబాటులో ఉంటుందన్నారు. ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలి కామవరపుకోట: రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే సాగులో యాంత్రీకరణ, పకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. కామవరపుకోటలోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో శనివారం రైతులతో జరిగిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్తో కలిసి పాల్గొని, రైతులకు అన్నదాత సుఖీభవ చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ పథకంలో జిల్లాలోని 1,60,968 రైతులకు రూ.107.08 కోట్లు అందించామని చెప్పారు. రైతులకు సబ్సిడీపై ఎరువులు విత్తనాలు అందిస్తున్నామని, సాగులో యాంత్రీకరణను ప్రోత్సహిస్తున్నామని, జిల్లాలో ఇంతవరకు 50 డ్రోన్లు సబ్సిడీపై రైతులకు అందించామన్నారు. కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం ఇన్చార్జ్ ఆర్డీఓ దేవకీదేవి, జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. జాయింట్ పట్టా భూముల విభజనకు అవకాశం భీమవరం (ప్రకాశం చౌక్): పశ్చిమ గోదావరి జిల్లాలోని రీసర్వే పూర్తి అయిన గ్రామాలలో వెట్ ల్యాండ్ 2.0 లో జాయింట్ పట్టాదారులుగా నమోదైన భూ యజమానులు, తమ భూములను వ్యక్తిగతంగా విభజించుకొనేందుకు అవకాశం కల్పించారని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. భూ విభజన కోసం సాధారణంగా వసూలు చేసే రూ.500 ప్రభుత్వ రుసుంను పూర్తిగా మాఫీ చేసినట్లు తెలిపారు. భూ యజమానులు కేవలం రూ.50 నామమాత్రపు దరఖాస్తు రుసుంను గ్రామ సచివాలయంలో చెల్లించి, వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ ప్రత్యేక అవకాశం ద్వారా జాయింట్ పట్టాదారులు తమ భూములను విభజించుకుని గ్రామ సచివాలయంలో అర్జీ దాఖలు చేసుకుని సంక్షేమ పథకాలు పొందవచ్చన్నారు. -
నిమ్మల రెడ్బుక్ రాజ్యాంగం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఆయన అత్యంత మంచి వ్యక్తి. బొకేలు, స్వీట్ బాక్సులు బదులు కూరగాయల కవర్లు మాత్రమే తీసుకుంటారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో కార్పెట్లు వేయకుండా అత్యంత సాధారణంగా చేయాలని చెబుతుంటారు. రాష్ట్ర మంత్రయినా అత్యంత నిరాడంబర జీవితం. రోడ్లపైనే టిఫిను తినడం, పగలు, రాత్రి అనే తేడా లేకుండా పనిచేసే గొప్ప రాజకీయ నాయకుడు’ ఇదంతా సోషల్ మీడియాలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గురించి ఆయన సొంత టీం ఊదరగొట్టే వ్యవహారం. పాలకొల్లులో మాత్రం ఆయన పొలిటికల్ రెడ్బుక్ పేరుతో వైఎస్సార్సీపీ లీడర్లను, కేడర్లను వేధింపులకు గురి చేస్తూ వరుస కేసులతో హడావుడి చేస్తున్నారు. ఇందులో ఇంకో ప్రత్యేకత ఏమిటంటే దళిత హక్కులను పరిరక్షించే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దళితులపైనే ప్రయోగించడం. పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు రెడ్బుక్ హడావుడి చాపకింద నీరులా కొనసాగిస్తున్నారు. సమయం, సందర్భం చూసుకుని మరీ ప్రత్యర్థులను టార్గెట్ చేసుకుని ముప్పుతిప్పలు పెట్టేలా వేధింపుల కేసులకు తెర తీశారు. పాలకొల్లు రాజకీయాల్లో మునుపెన్నడూ లేని కొత్త సంస్కృతికి నిమ్మల బీజం వేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 2022లో టిడ్కో ఇళ్ళ గృహ ప్రవేశాల సందర్భంగా జరిగిన చిన్నపాటి వాదనపై తాజాగా సీబీసీఐడీ ఎంకై ్వరీ వేయించడం, కొద్ది నెలల క్రితం జరిగిన యలమంచిలి ఎంపీపీ ఎన్నికల సందర్భంగా ముగ్గురు వ్యక్తుల ఫిర్యాదుతో 42 మందిపై ఒకేరోజు కేసు నమోదు చేయడం ఇంకొక సంచలనం. అధికారంలో ఉంటే ఒకలాగా.. ప్రతిపక్షంలో ఉంటే మరోలా వ్యవహరించే నిమ్మల మంత్రి కావడంతో రెడ్బుక్ పేరుతో వేధింపులను తీవ్రతరం చేస్తున్నారు. ఎంపీపీ ఎన్నికల స్పెషల్ కేసు పాలకొల్లు నియోజకవర్గ పరిధిలోని యలమంచిలి ఎంపీపీ ఎన్నిక మార్చి 26, 27 తేదీల్లో నిర్వహించారు. టీడీపీకి నామమాత్రపు బలం కూడా లేకపోవడంతో వైఎస్సార్సీపీ సభ్యులను టీడీపీలోకి తీసుకోవడానికి మంత్రి నిమ్మల రకరకాాల ప్రయత్నాలు చేసి భంగపడ్డారు. ఈ క్రమంలో ఎన్నిక వాయిదాకు సరికొత్త ప్రయత్నం చేశారు. దీనిలో భాగంగా మార్చి 27న పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కానిస్టేబుల్ ఫిర్యాదుతో 17 మందిపైన, అదేరోజు వీఆర్ఓ విధులకు ఆటంకం కలిగించారని 9 మంది పైన కేసులు నమోదు చేశారు. అదేరోజు టీడీపీ నాయకుడి ఫిర్యాదుతో వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి గూడాల గోపి, కీలక నేతలు గుణ్ణం నాగబాబు, యడ్ల తాతాజీ సహా 9 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. దీనిలో ప్రత్యేకత ఏమిటంటే ముగ్గురు ఎస్సీల పైన, ఒక ఎస్టీ పైన అట్రాసిటీ కేసు నమోదు చేయడం. వైఎస్సార్సీపీ నేతలపై వేధింపుల పర్వం ఎంపీపీ ఎన్నికల సమయంలో ఒకే రోజు 42 మందిపై మూడు కేసులు ఎస్సీ, ఎస్టీలపై పాలకొల్లులో అట్రాసిటీ కేసు 2022 ఘటనపై సీబీసీఐడీ ఎంకై ్వరీ ఆదర్శ ఎమ్మెల్యే, మంత్రి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం బయటికి మాత్రం రాజకీయ వేధింపుల వ్యవహారం వాదులాట ఘటనకు సీబీసీఐడీ కేసా? 2022 ఆగస్టు 5న పాలకొల్లులో టిడ్కో ఇళ్ళ లబ్ధిదారులకు గృహాల పంపిణీ జరిగింది. నిమ్మల రామానాయుడును స్థానిక ఎమ్మెల్యే హోదాలో ప్రొటోకాల్ ప్రకారం కార్యక్రమానికి ఆహ్వానించారు. శిలాఫలకంలో నిమ్మల పేరు పెద్దగా లేదనే కారణంతో 50 మంది కార్యకర్తలతో ప్లకార్డులతో సభలోకి వచ్చి హడావుడి చేశారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ నేతలకు, నిమ్మలకు మధ్య వాగ్వాదం జరిగింది. కట్ చేస్తే... 2024లో టీడీపీ అధికారంలోకి రాగానే డిసెంబర్ 13న తాడి శశిధర్ అనే వ్యక్తితో మంత్రి ఫిర్యాదు చేయించారు. కేసులో 24 మందిపై ఫిర్యాదు అందడంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. కొందరు బెయిల్ తీసుకోగా, మరికొందరు హైకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఈ కేసులో పోలీసులు మే నెలలో చార్జిషీట్ దాఖలు చేయడంతో ఏలూరు జిల్లా కోర్టులో 861/2025 నెంబరుతో కేసు నడుస్తోంది. గురువారం వాయిదా జరిగింది. ఇదే కేసును మంత్రి ఆదేశాలతో గత వారం సీబీసీఐడీకి అప్పగించారు. ఇలా చిన్న ఘటనలకు కూడా భూతద్దంలో చూపి వేధింపులకు తెరతీయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
గళమెత్తిన ఉపాధ్యాయులు
ఏలూరు (టూటౌన్): అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయులు ఫ్యాఫ్టో ఆధ్వర్యంలో శనివారం ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఏపీ ఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ మద్ధతుగా ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. నేడు పిల్లలు బడికి వచ్చేది.. మధ్యాహ్న భోజనం, దుస్తులు, కోడిగుడ్డు, చిక్కీ, రాగి జావ కోసం అన్నట్లు, టీచర్లు ఇవి పిల్లలకు అందించి ప్రభుత్వానికి లెక్క చెప్పేవారు అన్నట్లుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బదిలీలు జరిగి 40 రోజులు దాటినా జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్యలు పరిష్కరించాలని ఎన్నిసార్లు చెప్పినా.. పరిష్కారం దిశగా అధికారులు ఆలోచించడం. లేదన్నారు. 11వ పీఆర్సీ గడువు ముగిసి 2 సంవత్సరాలు పూర్తి అయినా 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయలేదని విమర్శించారు. నూతన ప్రభుత్వం ఏర్పాటై 12 నెలలు గడచినా ఆ ఊసే లేదన్నారు. 2003 డీఎస్సీ ద్వారా నియామకమైన ఉపాధ్యాయులు, పోలీసులు ఇతర ఉద్యోగులు సుమారు 11 వేల మందికి పాతపెన్షన్ విధానం అమలు చేయాల్సి ఉందన్నారు. డీఏ బకాయిలు చెల్లించాలన్నారు. ధర్నా అనంతరం వినతి పత్రాన్ని కలెక్టరేట్లో అందజేశారు. -
ఒలుపులో వైరెటీలెన్నో !
సాక్షి, భీమవరం: కొబ్బరి కాయ ఒలవడం తేలికేనని తీసి పారేయకండి. దానికీ ఓ పద్ధతుంది. బొండాం, ముప్పేట, ముదర కాయ, కురిడీ అంటూ కాయల్లో రకాలున్నట్టే.. పిలక, బొంబాయి సీలు, కసింగలు, పోర్పట్టా, బోరాలు, మూడు నామాలు.. అంటూ ఒలుపుల్లోనూ పదికి పైనే వైరెటీలు ఉన్నాయి. ప్రాంతాన్ని బట్టి ఒలుపులు మారుతుంటాయి. ప్రస్తుతం రికార్డు ధరతో జిల్లా నుంచి రోజుకు దాదాపు వంద లారీల కొబ్బరి కాయలు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. అక్కడి అవసరాలకు తగ్గట్టు ఇక్కడి ఒలుపు కార్మికులు వడివడిగా కాయలను వలుస్తున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని సుమారు 50 వేల ఎకరాల్లో కొబ్బరి సాగవుతోంది. ఆచంట, పాలకొల్లు, నరసాపురంలోని వశిష్ట గోదావరి, సముద్ర తీరం వెంబడి, భీమవరం, ఉండి, ఆకివీడు ప్రాంతాల్లోని ఆక్వా చెరువు గట్లు, తాడేపల్లిగూడెం, ఏలూరు, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు, తణుకు ప్రాంతాల్లో తోటలు సాగు చేస్తున్నారు. జిల్లా నుంచి రాజస్తాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, పశ్చిమబెంగాల్, బీహార్, పంజాబ్, ఢిల్లీ తదితర రాష్ట్రాలకు కొబ్బరి ఎగుమతి అవుతున్నాయి. తమిళనాడు, కేరళ తర్వాత మన కొబ్బరికి దేశ వ్యాప్తంగా గిరాకీ ఉన్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. తమిళనాడులో దిగుబడి తగ్గడంతో నెలన్నర రోజులుగా జిల్లా నుంచి ఎగుమతులకు డిమాండ్ ఏర్పడింది. మునుపెన్నడూ లేనివిధంగా రైతు ధర కాయకు రూ.18 నుంచి రూ.20 మధ్య నిలకడగా ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజుకు వంద లారీల వరకు కాయలు ఎగుమతి అవుతున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. ఒలుపులో రకాలెన్నో.. హిందూ సంప్రదాయంలో కొబ్బరి కాయకు ఎంతో విశిష్టత ఉంది. పూజల్లో కొట్టడం నుంచి హోమాల్లో కాయ పళంగా వేయడం, దిష్టి, దిగదుడుపు తీయడం తదితర ప్రతి పనిలోనూ కొబ్బరికాయ ఉండాల్సిందే. మన ప్రాంతంలో ముచ్చిక, పిలకతో ఒలిచిన వాటిని వినియోగించినట్టే ఇతర ప్రాంతాల్లో వివిధ రూపాల్లో ఒలిచిన కాయలను వాడుతుంటారు. ఈ మేరకు జిల్లా నుంచి ఎగుమతులు జరిగే రాష్ట్రాల్లోని అవసరాలకు తగ్గట్టు కాయలను ఒలుస్తుంటారు. వీటిలో పిలక, బొంబాయి సీలు, రాయపూర్ సీలు, మూడు నామాలు, కసింగలు, బోరాలు, బెల్ట్ పోర్ పట్టా, బెల్ట్ లెస్ పోర్పట్టా, ఐదు పేళ్లు, ఆరు పేళ్లు, ఎనిమిది పేళ్లు తదితర పదికి పైనే ఒలుపుల్లో రకాలున్నాయి. ఎగుమతి అయ్యే ప్రాంతంలో ఆయా ఒలుపులకు ఏ పేర్లున్నా కానీ స్థానికంగా తాము ఈ విధంగా పిలుచుకుంటామని వ్యాపారులు, ఒలుపు కార్మికులు అంటున్నారు. రాయపూర్ సీలును కాయ వెనుక నుంచి మూడు పేళ్లుగా ఒలిస్తే, కసింగలను ముందు నుంచి మూడు, వెనుక నుంచి మూడు పేడులుగా కాయపైన పీచు ఉంచి డొక్కను ఒలుస్తారు. బెల్టు పోర్పట్టా కోసం కాయకు నాలుగు వైపులా మధ్యలో అరంగుల డొక్క ఉంచి మిగిలిన దానిని తీసివేస్తారు. బెల్టు లెస్ కోసం నాలుగు వైపులా స్క్వేర్ ఆకారంలో పీచు ఉండేలా డొక్కను ఒలుస్తారు. అదేమాదిరి ఐదు పేళ్లు, ఆరు పేళ్లు, ఎనిమిది పేళ్లు సంఖ్యను బట్టి అన్ని పేళ్లుగా పైడొక్కను తొలగిస్తారు. మూడు నామాల కోసం కాయకు మూడు వైపులా అంగుళం వెడల్పున పీచు ఉంచి మిగిలిన డొక్కను పీచు సహా తీసేస్తారు. బొంబాయి సీలు కోసం కాయకు సగభాగం పూర్తిగా పీచును ఒలిచేసి మిగిలిన సగభాగం ఉంచేస్తారు. ఇలా వివిధ రకాలుగా కాయలను ఒలుస్తుంటారు. కొబ్బరి ఒలుపులో పదికి పైగా రకాలు పిలక, బొంబాయి సీలు, మూడు నామాలు, కసింగలు, పోర్పట్టా, బోరాలు రాష్ట్రాన్ని బట్టి ఒలుపు మారుతుందంటున్న కార్మికులు ఉమ్మడి పశ్చిమగోదావరిలో 50 వేల ఎకరాల్లో కొబ్బరి సాగు జిల్లా నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు కొబ్బరి ఎగుమతి ఏ ఒలుపు ఎక్కడికి.. బెల్ట్లెస్ పోర్పట్టా కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు ఎక్కువగా ఎగుమతి జరిగితే బోరాలు యూపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు, ఆరు పేళ్లు యూపీ, కర్ణాటక, రాయపూర్ సీలు, ఐదు పేళ్లు మహారాష్ట్రకు, పిలకలు ముంబయి, బిహార్కు, మూడు నామాలు మహారాష్ట్రకు, కసింగలు అన్ని ప్రాంతాలకు ఎగుమతి అవుతుంటాయని వ్యాపారులు చెబుతున్నారు. ఆయా ప్రాంతాల్లో చాలా వరకు కొట్టకుండా వీటిని నేరుగా హోమాల్లో వేస్తారన్నారు. కాయపళంగా కన్నా ఒలిపించడం వల్ల బరువు తగ్గి ఎక్కువ కాయలు తీసుకువెళ్లే వీలుంటుందని అక్కడి అవసరాలకు తగ్గట్టు ఇక్కడే ఒలిపించుకుని తీసుకువెళతారని అంటున్నారు. కావాల్సిన ఆకారంలో వేగంగా కాయలు ఒలవడం అనుభవంతో కూడిన పని. ఒక్కో కాయ ఒలుపునకు రూ.1.50 చొప్పున ఇస్తారు. రోజుకు ఒక్కో కార్మికుడు 800 నుంచి 1000 కాయలను ఒలుస్తుంటారు. గండీర.. గటగట ఉత్తరాది రాష్ట్రాల్లో కురిడీ కొబ్బరి ఆహారంలోనూ భాగంగా ఉంటుంది. ఇవి ఎక్కువగా రాజస్తాన్, మధ్యప్రదేశ్కు వెళుతుంటాయి. బాగా తయారైన కాయలను ఎంపిక చేసి ఎనిమిది పేళ్లుగా ఒలుస్తారు. గోదాముల్లో గాలి తగిలేలా అరలు కట్టి కాయలను నిల్వ చేస్తారు. ఆరు నెలలకు లోపలి నీరు పూర్తిగా ఇంకిపోయి గుడ్డు మాత్రమే ఉంటుంది. మొదట్లో 600 గ్రాముల నుంచి 700 గ్రాములు ఉన్న కాయ బరువు కురిడీ అయ్యేసరికి 80 గ్రా. నుంచి 100 గ్రా.కు తగ్గిపోతుంది. నాణ్యమైన గండీర, సెకండ్ క్వాలిటీని గటగటగా పిలుస్తుంటారు. గండీరకు రూ.30 ఉండగా గటగటకు రూ.28 ధర ఉన్నట్టు చెబుతున్నారు. నాలుగు దశాబ్దాల అనుభవం నలభై ఏళ్లుగా ఒలుపు పని చేస్తున్నాను. ఒక్కో ప్రాంతం నుంచి వచ్చిన వారు ఒక్కో విధంగా ఒలవమని చెబుతుంటారు. ఏ రకంగా ఒలవాలన్నా దాదాపు ఒకే సమయం పడుతుంటుంది. ప్రస్తుతం సీజన్ కావడం వల్ల పని ఎక్కువగా ఉంది. – కొడవటి ఎర్రియ్య, ఒలుపు కార్మికుడు, పాలకొల్లు, పశ్చిమగోదావరి జిల్లా అవసరాన్ని బట్టి ఒలుపు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఒలిచిన కాయలను వినియోగిస్తుంటారు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ఆర్డరు మేరకు వారికి అవసరమైన రీతిలో ఒలిపించి ఎగుమతి చేస్తుంటాం. తమిళనాడులో దిగుబడులు తగ్గడంతో ప్రస్తుతం జిల్లా నుంచి ఎగుమతులు బాగున్నాయి. రైతులకు రికార్డు ధర వస్తోంది. – కాసా సత్యనారాయణ, వ్యాపారి, యలమంచిలి, పశ్చిమగోదావరి జిల్లా -
స్మార్ట్ మీటర్లు వద్దే వద్దు
ఏలూరు (టూటౌన్): ప్రమాదకర స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని కోరుతూ ఈనెల 5న విద్యుత్ భవనం వద్ద జరిగే ధర్నాలో ప్రజలు పాల్గొనాలని ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ వేదిక పిలుపు నిచ్చింది. శుక్రవారం నగరంలోని పత్తేబాద రైతు బజార్ నుంచి ప్రజా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇఫ్టూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు ఏఐటీయూసీ జిల్లా నాయకులు ఉప్పులూరు హేమ శంకర్, సీఐటీయూ నాయకులు పంపన రవి మా ట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలను మరింతగా దోచుకునే ఉద్దేశంతో స్మార్ట్ మీటర్లను తీసుకు వస్తుందన్నారు. ఏడాదిగా కరెంటు బిల్లులు పెరిగి ప్రజలు గగ్గోలు పెడుతున్నా చార్జీలు పెంచలేదంటూ కూటమి ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి కృష్ణ చైతన్య, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు కాకి నాని, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ వర్గీకరణపై మండిపాటు
భీమవరం: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ భీమవరం అంబేడ్కర్ సెంటర్లో శుక్రవారం మాల సంఘాల జేఏసీ అధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణతో మాల సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. మాలలు అన్ని రంగాల్లో అవకాశాలు కోల్పోతున్నారని చెప్పారు. జాతీయ కన్వీనర్ చీకటిమిల్లి మంగరాజు మాట్లాడుతూ మాలలకు వ్యతిరేకంగా పనిచేసే రాజకీయ పార్టీలకు తగిన గుణపాఠం చెబుతామన్నారు. మాల సంఘాల జేఏసీ కన్వీనర్ గంటా సుందరకుమార్ మాట్లాడుతూ అక్టోబర్ 3న కుప్పం నుంచి మాల సంఘాల ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహిస్తున్నామని, దీనిని మాల సంఘాల నాయకులు, సభ్యులు విజయవంతం చేయాలని కో రారు. మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు గుండె నగేష్, సోడదాసి జయపాల్, కొండేటి లాజర్, వర్ధనపు మోషే, పెట్టెం శుభాకర్, కర్ని జోగయ్య, ఉన్నమట్ల శామ్యూల్రాజ్, పరువు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
అన్నదాత దుఃఖీభవ
ఏలూరు(మెట్రో): అన్నదాత సుఖీభవ సాయం కోసం రైతులు ఏడాదిగా ఎదురుచూస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన రైతు భరోసా సాయానికి అదనంగా ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి నాయకులు గద్దెనెక్కిన తర్వాత రైతులను నిలువునా మోసం చేశారు. ఏడాదిపాటు సార్వా, దాళ్వా సీజన్లలో రైతులకు ఆర్థిక సాయాన్ని ఎగ్గొట్టారు. తీరా ఈ ఏడాది నుంచి అమలు చేస్తామన్న ప్రభుత్వం జిల్లాలో సుమారు 40 వేల మంది రైతులకు కోత పెట్టనుంది. గత ప్రభుత్వంలో పక్కాగా.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏటా వ్యవసాయ సీజన్ ప్రారంభంలో వైఎస్సార్ రైతు భరోసా కింద సాయం అందించారు. 2023–24లో జిల్లాలో సుమా రు 2 లక్షల మంది రైతులకు సాయం అందగా.. తాజా గా అన్నదాత సుఖీభవ పథకం కింద సుమారు 1,60,968 మంది అర్హులుగా కూటమి ప్రభుత్వం నిర్ధారించింది. ఈ లెక్కన జిల్లాలో సుమారు 40 వేల మందికి సాయం అందకుండా పోనుంది. సాయంలో మెలిక టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికలకు ముందు ఉమ్మడి మేనిఫెస్టోలో సూపర్సిక్స్లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకూ ఏడాదికి రూ.20 వేలు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6 వేలతో కలిపి రూ.20 వేలు ఇస్తామంటూ మెలిక పెట్టారు. దీనిపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రైతుల అప్పులబాట గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సార్వా, దాళ్వా సీజన్ల ప్రారంభంలో పెట్టుబడి సాయం కింద నగదు అందించేవారు. దీంతో రైతులు ఆనందంగా సాగు ప్రారంభించేవారు. అయితే కూటమి ప్రభుత్వంలో ఇప్పటివరకూ సాయం అందించకపోవడంతో రైతులు అప్పులబాట పడుతున్నారు. దళారు లు, వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తూ నష్టపోతున్నా రు. దీనికి తోడు దాళ్వా సీజన్లో రైతుల నుంచి ప్ర భుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి నెలల తరబడి సొమ్ములు చెల్లించకపోవడంతో రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. ఓ పక్క సాయం అందించకపోగా.. సేకరించిన ధాన్యానికి సకాలంలో సొమ్ములు చెల్లించలేదంటూ రైతులు మండిపడుతున్నారు. సార్వా నాట్ల ముగింపు దశలో.. జిల్లాలో రైతులు అవస్థల నడుమ ప్రస్తుత సార్వా సీజన్లో వరి నాట్లు పూర్తిచేస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ రూ.2 వేలు, రాష్ట్ర ప్రభు త్వం రూ.5 వేలు కలిపి అన్నదాత సుఖీభవ పథకంలో జమచేస్తామని ప్రకటించింది. నారుమడులు, నాట్ల కోసం ఇప్పటికే అప్పులు చేశామని, సొమ్ములు అవసరమైన సమయంలో ఇవ్వకుండా జాప్యం చేయడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు అర్హుల జాబితా నుంచి సుమారు 40 వేల మందిని కుదించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కౌలు రైతులకు ఎగనామం కౌలు రైతులకు సైతం అన్నదాత సుఖీభవ నిధు లను అందిస్తామంటూ కూటమి సర్కారు మభ్యపెడుతోంది. అన్నదాత సుఖీభవ పథకంలో రైతుల సంఖ్య తగ్గించడం దారుణమని, కూటమి ప్రభు త్వం అధికారంలోనికి వచ్చి ఏడాది గడిచిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలుకు శ్రీకారం చుట్టడం రైతులకు అన్యాయం చేయడమే అని రైతు సంఘాల నాయకులు అంటున్నారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని కౌలు రైతులకూ అమలు చేసి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రైతులకు వెన్నుపోటు అన్నదాత సుఖీభవ పథకంలో 40 వేల మంది రైతులకు కోత గతేడాది లబ్ధికి ఎగనామం రైతులందరికీ రూ.20 వేలు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇప్పుడు కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో కలిపి రూ.20 వేలని మెలిక కౌలు రైతులకు రిక్తహస్తంమూడు విడతల్లో పంపిణీకి ఏర్పాట్లు: కలెక్టర్ అన్నదాత సుఖీభవ పథకం కింద జిల్లావ్యాప్తంగా శనివారం 1,60,968 మంది రైతులకు రూ.107.08 కోట్ల లబ్ధి అందించనున్నట్టు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం కింద రైతు కుటుంబానికి ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం ప్రకటించిందని, ఇందులో కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో కలిపి రాష్ట్ర వాటాగా మరో రూ.14 వేలు ప్రభుత్వం ఇవ్వనుందన్నారు. సాయాన్ని మూడు విడతల్లో అందిస్తారని, మొదటి విడతగా రాష్ట్రం వాటా రూ.5 వేలు, కేంద్రం వాటా రూ.2 వేలు మొత్తం రూ.7 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమచేస్తారని చెప్పారు. -
జైళ్ల శాఖ పెట్రోల్ బంక్ ప్రారంభం
భీమవరం : పట్టణంలోని వన్టౌన్ పోలీసుస్టేషన్ సమీపంలో ఆధునికీకరించిన సబ్ జైలు, జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పెట్రోల్ బంక్లను శుక్రవారం జైళ్ల శాఖ డీజీపీ అంజన్కుమార్ ప్రారంభించారు. అనంతరం సబ్ జైల్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట ఎస్పీ అద్నాన్నయీం అస్మి, ఏఎస్పీ వి.భీమారావు, డీఎస్పీ ఆర్జీ జయసూర్య, వన్టౌన్ సీఐ ఎం.నాగరాజు ఉన్నారు. జిల్లాలో ఎరువుల కొరత ఏలూరు (టూటౌన్): జిల్లాలో ఖరీఫ్ రైతులు ఎరువులు దొరక్క ఇబ్బందులు పడుతున్నారని, రైతులకు పూర్తిస్థాయిలో ఎరువులను అందుబాటులో ఉంచాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ కోరారు. శుక్రవా రం స్థానిక అన్నే భవనంలో ఆయన మాట్లాడు తూ రైతులకు యూరియా అందుబాటులో లే దని, దీంతో ప్రైవేట్ వ్యాపారుల వద్ద కొనాల్సి వస్తోందన్నారు. అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్న వ్యాపారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో ఎరువులు నిల్వల వివరాలను అధికారులు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎరువుల కొరత లే కుండా చూడాలని, లేకుంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలో ఉపాధ్యాయు ల నుంచి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 5న సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయుల అవార్డుల వేడుక నిర్వహించనున్నారన్నారు. ఆసక్తి గల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఈనెల 8వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. తర్వా త వచ్చే దరఖాస్తులు స్వీకరించరని పేర్కొన్నారు.అధ్వానంగా ప్రభుత్వ హాస్టళ్లు భీమవరం: పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రభు త్వ హాస్టళ్లలో నిర్వహణ అధ్వానంగా ఉండటంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారని వైఎ స్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ అయినపర్తి రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు జి ల్లాలోని పలు హాస్టళ్లను పరిశీలించిన అనంత రం శుక్రవారం కలెక్టరేట్లో డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లు, వైఎస్సార్సీపీ భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడుకు వినతిపత్రాలు అందించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ హాస్టళ్లలో పారిశుద్ధ్యం క్షీణించిందని, నేలపై నిద్ర, దోమల స్వైర విహారం సర్వ సాధారణమయ్యారన్నారు. పలు హాస్టళ్లలో దుప్పట్లు, దోమ తెరలు పంపిణీ చేయలేదని దీంతో విద్యార్ధులు కంటిపై నిద్రలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు లేక నరకయాతన అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మరుగుదొడ్లకు తలుపులు కూడా లేని దుస్థితి నెలకొందని, కనీస మౌలిక వసతులు కరువై విద్యార్థులు చదువుపై శ్రద్ధ చూపలేకపోతున్నారన్నారు. నిధుల కొరత కారణంగా మెనూ సక్రమంగా అమలవుతున్న దాఖలాలు లేవన్నారు. తరచూ ఆహారం కలుషితమై విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారని అన్నారు. విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అరిగేల అభిషేక్ అర్జున్, కార్యదర్శి జాన్సన్, ఉపాధ్యక్షుడు సూర్య, అనిల్, వివేక్, ప్రదీప్, ప్రభాష్, గణేష్ పాల్గొన్నారు. పక్కాగా భూ సర్వే భీమవరం(ప్రకాశంచౌక్): ప్రభుత్వ భూములకు సంబంధించి ఒక్క సెంటు కూడా తగ్గకుండా సర్వే నిర్వహించాలని ఇన్చార్జ్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ప్రభుత్వ భూములు రీ సర్వేపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని 293 గ్రామాలకు సంబంధించి 194 గ్రామాలు రీ సర్వే పనులను నెలాఖరుకు పూర్తిచేయాలన్నారు. మిగిలిన 72 గ్రామాల్లో ప్రభుత్వ భూములను సర్వే చేసి నిర్ధారణ చేయాలన్నారు. ప్రభుత్వ భూములకు సంబంధించి ఒక్క సెంటు కూడా తగ్గకుండా సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లాలోని 72 గ్రామాల్లో 24,474 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయన్నారు. -
మైన్స్ అధికారులంటూ వసూళ్లు
సాక్షి, భీమవరం : మైన్స్ అధికారులుగా చెప్పుకుంటూ జిల్లాలో వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరి వ్యక్తులపై గురువారం లారీ యూనియన్ నేతలు ఉన్నతా ధికారులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రావూరి రాజా తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మైన్స్ అధికారుల ముసుగులో ఇద్ద రు వ్యక్తులు రెండు రోజులుగా సిద్ధాంతం, పెరవలి, తణుకు, జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కారులో సంచరిస్తున్నారు. లారీలను ఆపి రికార్డులు చూపించమని, కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. పెనాల్టీల పేరిట వసూళ్లు చేసిన సొమ్ములకు రసీదులు కూడా ఇవ్వడం లేదు. గురువారం సిద్ధాంతం సమీపంలో లారీలను ఆపి డబ్బులు డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ఏలూరులోని గనులు, భూగర్భశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్టు రాజా చెప్పారు. మైన్స్ శాఖకు చెందిన ఇద్దరు ఉద్యోగులు రెండు రోజులుగా అందుబాటులో లేకుండా తిరుగుతున్నారని, వారు అయి ఉండవచ్చునని అధికారులు అభిప్రాయపడినట్టు రాజా తెలిపారు. ఈ విషయమై మైన్స్ పశ్చిమగోదావరి జిల్లా ఇన్చార్జి ఏడీని ఫోన్లో సంప్రదించగా ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. భీమవరంలో అలంకారప్రాయంగా ఆఫీస్ భీమవరంలో గనులు, భూగర్భశాఖ జిల్లా కార్యా లయం అలంకారప్రాయంగా మిగిలింది. కార్యాలయ సూపరింటెండెంట్ లాంగ్ లీవ్పై వెళ్లిపోగా, సర్వేయర్ డిప్యూటేషన్పై ఏలూరులో పనిచేస్తు న్నారు. ఒక అసిస్టెంట్ జియాలజిస్ట్ (ఏజీ), ఒక రా యల్టీ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ), ఇద్దరు టెక్నికల్ అసిస్టెంట్ (టీఏ)లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఏఓ), రెండు ఆఫీస్ సబార్డినేట్, చైన్మెన్, డ్రైవర్, స్వీపర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలోని ఇసుక ర్యాంపులు సీఆర్జెడ్ పరిధిలోకి వెళ్లి మైనింగ్ నిలిచిపోవడంతో ఖాళీలను భర్తీ చేయడం లేదు. ఇన్చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారులు ఏలూరు నుంచి అప్పుడప్పుడూ వచ్చి వెళుతున్నారు. పర్యవేక్షణ కరువు జిల్లాలో మైనింగ్ లీజులు లేనప్పటికీ పట్టించుకునే వారు లేక ఆచంట, యలమంచిలి, పెనుగొండ మండలాల్లోని గోదావరి తీరంలో బొండు, ఇసుక, అలాగే నరసాపురం, మొగల్తూరు మండలాల్లో సముద్ర తీరం వెంబడి ఇసుక, తాడేపల్లిగూడెం రూరల్లోని ఆరుగొలనులో గ్రావెల్ అక్రమ తవ్వకాలు సాగిపోతున్నాయి. వీటిపై ఫిర్యాదులు చేస్తే వెళ్లి పరిశీలించే పరిస్థితి ఉండటం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లారీలు ఆపి వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులు ఉన్నతాధికారులకు లారీ యూనియన్ నేతల ఫిర్యాదు -
టీచర్లకు ఈ నెలా ఎగనామమే
ఏలూరు (ఆర్ఆర్పేట): కూటమి ప్రభుత్వం బదిలీ ఉపాధ్యాయులకు ఈ నెలా మొండిచేయే చూపింది. టీచర్ల బదిలీల ప్రక్రియ పూర్తిచేసిన ప్రభుత్వం.. బదిలీలు అయిన ఉపాధ్యాయులకు మాత్రం జీతాల చెల్లింపులో పూర్తిగా విఫలమైంది. దీనిపై ఉపాధ్యాయులు ఆందోళనలు, నిరసనలు చేపట్టినా సర్కారులో చలనం లేదు. ఈనెల 1న జీతాలు వస్తాయని ఎదురుచూసిన ఉపాధ్యాయులకు భంగపాటే ఎదురైంది. కొందరికే పొజిషన్ ఐడీలు సాధారణంగా బదిలీ అయిన ఉపాధ్యాయులు, ఉద్యోగులకు వారు బదిలీ అయిన ప్రాంతాల్లో జీతాలు తీసుకునేలా అక్కడి డీడీఓకు సమాచారం అందించాలి. దీని నిమిత్తం పొజిషన్ ఐడీలు కేటాయించాలి. గత నెల 15వ తేదీ లోపు అన్ని కేడర్ల ఉపాధ్యాయుల బదిలీలను పూర్తి చేశారు. బదిలీలు పూర్తి చేసి నెల రోజులు దా టుతున్నా క్లియర్ వేకెన్సీల్లోకి బదిలీ అయిన వారికి మాత్రమే పొజిషన్ ఐడీలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం కొత్తగా సృష్టించిన పీఎస్ హెచ్ఎం, రీపోర్షన్మెంట్లో కొత్తగా ఏర్పడిన పాఠశాలలకు బదిలీ అయిన ఉపాధ్యాయులకు మాత్రం ఇప్పటికీ పొజిషన్ ఐడీలు కేటాయించలేదు. దీంతో జూన్, జూలై నెలలకు సంబంధించి ఆగస్టు నెలలో రావాల్సిన జీతాలు ఉపాధ్యాయులకు అందలేదు. వచ్చే నెలా అనుమానమే.. ఉపాధ్యాయులను బదిలీ చేసిన తర్వాత కేడర్ స్ట్రెంగ్త్ను నిర్ధారించి ఆ వివరాలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయం డైరెక్టరేట్ ఆప్ ట్రెజరీ అండ్ ఆడిట్కు అందించాలి. అయితే పాఠశాల విద్యాశాఖ ఇప్పటికీ ఆ పని చేయలేదు. కేడర్ స్ట్రెంగ్త్ అయిన తర్వాతే ఉపాధ్యాయులకు పొజిషన్ ఐడీలు కేటాయించే అవకాశం ఉంది. బదిలీ అయిన ఉపాధ్యాయులకు జూన్, జూలై నెలలకు సంబంధించి జీతాలు ఏరియర్ బకాయిలతో ఈనెల 10వ తేదీలోపు ట్రెజరీకి బిల్లులు పెడితేనే ఈ నెలలో జీతాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈనెల 10లోపు ఈ ప్రక్రియ పూర్తికాకుంటే బదిలీ అయిన టీచర్లకు జూన్, జూలైతో పాటు ఆగస్టు నెలకు సంబంధించిన జీతాలు కూడా సెప్టెంబర్లో పడే అవకాశం ఉండదని ఉపాధ్యాయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలలుగా జీతాలు లేకపోవడంతో అప్పులు చేసి కుటుంబాలను పోషించాల్సి వస్తోందని ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. బదిలీ ఉపాధ్యాయులకు రెండు నెలలుగా జీతాల్లేవు ఇప్పటికీ కేటాయించని పొజిషన్ ఐడీలు ప్రభుత్వం విఫలం బదిలీ అయిన ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఒక నెల జీతాలు చెల్లించలేదంటే సాంకేతికలోపమో, పని ఒత్తిడో అని సరిపెట్టుకోవచ్చు. కానీ రెండు నెలల జీతాలు ఆపడం అంటే సీఎస్ఈ నిర్లక్ష్యంగానే భావించాల్సి ఉంటుంది. ఇప్పటికై నా సకాలంలో బిల్లులు చేసి జీతాలు చెల్లించాలి. – గుగ్గులోతు కృష్ణ, ఏపీటీఎఫ్ 1938 రాష్ట్ర అకడమిక్ కన్వీనర్ ఉపాధ్యాయులపై కక్ష రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోంది. బోధనేతర పను లు అప్పగిస్తూ ఇబ్బందులకు గురిచేస్తోంది. అనేక రకాల లక్ష్యలు, యాప్ల అప్లోడ్ వంటి పనులు అప్పగించడం వారిని అవమానించడానికే. జీతాల చెల్లింపులో అలసత్వంపై ఉపా ధ్యాయ లోకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. – గెడ్డం సుధీర్, వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
గ్రంథాలయ ఉద్యోగుల జీతాలు చెల్లించాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రంలో గ్రంథాలయ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులకు 010 పద్దు ద్వారా జీతాలు చెల్లించేలా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని ఏపీ జేఏసీ జిల్లా చైర్మన్ చోడగిరి శ్రీనివాస్ స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘం ఎన్నిక నిర్వహించారు. సంఘ అధ్యక్షుడిగా జీ. రాంబాబు, అసోసియేట్ అధ్యక్షుడిగా పీ రంగారావు, ఉపాధ్యక్షులుగా ఎస్.వెంకటేశ్వరరావు, ఎస్డీ.లతీఫ్, ప్రధాన కార్యదర్శిగా ఎండీ జుల్ఫికర్ అలీ, సహాయ కార్యదర్శిగా కొండే వెంకటేశులు, జిల్లా కోశాధికారి ఎన్సీహెచ్ రామకృష్ణ, కార్యవర్గ సభ్యులుగా ఎం.శోభ, జీ అనిత, బంగారు పాప ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముఖ్య అతిథులుగా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం.శేఖర్ బాబు, జేఏసీ రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఆర్ఎస్.హరనాథ్, ఏపీ ఎన్జీఓ ఏలూరు తాలూకా అధ్యక్షుడు జీ శ్రీధర్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
వర్షాకాలంలో పాముకాటుతో జాగ్రత్త
బుట్టాయగూడెం: వర్షాకాలంలో గ్రామాల్లో ఎక్కువగా ఖాళీ స్థలాలు, బీడు భూముల్లో పచ్చని గడ్డి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. పశువులు బీడు భూములు, ఇంటి వద్ద ఖాళీ స్థలాల్లో మేతకు వెళ్ళినప్పుడు పశువుల పాక చుట్టూ ఉన్న ఖాళీ స్థలాల్లో గడ్డి ఎక్కువగా పెరుగుతుంది. ఈ సమయంలో వర్షాల కారణంగా పచ్చని గడ్డిలో విషసర్పాలు ఉండి పశువులను కాటు వేసే ప్రమాదం ఉంది. పాడి రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని జీలుగుమిల్లి పశు సంవర్ధకశాఖ సహాయ సంచాలకుడు డాక్టర్ మల్లంపల్లి సాయిబుచ్చారావు సూచించారు. రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పాముకాటు నుంచి పశువులను కాపాడుకోవచ్చన్నారు. రక్తపింజర పశవులను రక్తపింజర కాటువేస్తే హీమోటాక్సిన్ విడుదలై రక్త ప్రసరణపై ప్రభావం చూపుతుంది. దీంతో పశువు నోరు, ముక్కు నుంచి రక్తం కారుతుంది. పాము కాటు వేసినచోట వాపు వచ్చి చర్మం రంగు మారుతుంది. మూత్రం ఎరుపురంగులోకి వస్తుంది. సరైన సమయంలో చికిత్స అందకపోతే 10 గంటలలోపు పశువులు మృత్యువాత పడతాయి. తాచు, కట్ల పాములు తాచు, కట్లపాములు పశువులను కాటు వేసినప్పుడు న్యూరోటాక్సిన్ వాటి శరీరంలోకి వెళ్ళి నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీనితో శ్వాస వ్యవస్థ స్థంభిస్తుంది. నోటి నుంచి నురగ వచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్తాయి. సరైన సమయంలో చికిత్స అందించకపోతే పశువు మృతి చెందుతుంది. విషరహిత పాముల్లో కాటు లక్షణాలు విషరహిత పాములు కాటు వేసినప్పుడు రెండు వరుస పళ్లు ముద్రలు ఉంటాయి. గాయాలు చిన్నగా ఉంటాయి. ఎక్కువగా పలుచని రేఖల వంటి ముద్రలుగా ఉంటాయి. కొద్దిగా రక్తం కారవచ్చు. కానీ ఇది ప్రమాదమైన స్థాయిలో ఉండదు. విషపూరిత పాము లక్షణాలు విషపూరిత జాతి పాములు కాటు వేసిన చోట ఉబ్బినట్టు, గాయంలా కనిపిస్తుంది. పశువు తినకుండా నీరసంగా ఉంటుంది. అదుపు తప్పడం(పిచ్చెక్కినట్టుగా అటూ ఇటూ తిరగడం), నోట్లో నురగరావడం, వేగంగా గుండె చప్పుడు, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది, పొట్ట ఉబ్బడం, కింద పడి కాళ్లు కొట్టుకోవడం వంటివి చేస్తాయి. కొన్ని సందర్భాల్లో 3 నుంచి 5 గంటల్లోపు కాటుకు గురైన పశువులు మృతి చెందుతాయి. వైద్యుల సూచనలు ● పాముకాటుకు గురైన పశువులను బయటకు పంపించవద్దు. ఎక్కువగా నడిపించకూడదు. కదలకుండా ఉండాలి. ● కాటు వేసిన ప్రాంతానికి పై భాగంలో గట్టిగా కట్టుకట్టాలి. ఇది పాము విషాన్ని నరాల ద్వారా వ్యాప్తి చెందకుండా ఉపయోగపడుతుంది. 15 నిముషాలకు ఒకసారి నిమిషం పాటు విరమించాలి. లేదంటే నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ● కాటు వేసిన చోట కడగవద్దు. కట్టు తియ్యొద్దు. ఇలా చేస్తే విషం వ్యాప్తి పెరుగుతుంది. ● పశువులను బాగా గాలి తగిలేటట్టు నీడలో ఉంచాలి. ● వెంటనే పశు వైద్యుడిని సంప్రదించి చికిత్స అందిస్తే ప్రాణాపాయ స్థితి నుంచి పశువులను కాపాడుకోవచ్చు. సకాలంలో చికిత్స అందించాలి పశువులను మేతకు తీసుకువెళ్ళినప్పుడు తరచూ గమనించాలి. పాము కాటు వేస్తే కరిచిన చోట గుడ్డతో గట్టిగా కట్టాలి. బ్లేడుతో కోసి రక్తం పిండాలి. 15 నిముషాలకు ఒకసారి కట్టును వదులు చేస్తూ ఉండాలి. స్నేక్ యాంటీ వీనమ్ ఇంజెక్షన్, ఆట్రోసిన్ సల్ఫేట్, ఏవిల్ ఇంజక్షన్ను పశువు రక్తంలోకి ఎక్కించాలి. నొప్పి నివారణకు స్టైరాయిడ్, యాంటీ బయోటిక్స్, అవసరాన్ని బట్టి ఇతర మందులను ఇవ్వాలి. డాక్టర్ మల్లంపల్లి సాయి బుచ్చారావు, పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు, జీలుగుమిల్లి -
ఆలస్యమైతే వెదజల్లే పద్ధతే మేలు
చింతలపూడి: ఇటీవల వరి సాగులో ఖర్చులు బాగా పెరిగాయి. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా ఏటా సకాలంలో వరినాట్లు పడటం లేదు. పోసిన నారు ముదిరిపోవడం, లేదా నారు దెబ్బతినడంతో దిగుబడులు తగ్గుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సాగు ఖర్చును తగ్గించుకుని, కూలీల సమస్యను అధిగమించేందుకు దమ్ము చేసిన పొలంలో నేరుగా వరి విత్తే పద్ధతిని ఆచరించడం మేలని చింతలపూడి సహాయ వ్యవసాయ సంచాలకుడు వై సుబ్బారావు సూచిస్తున్నారు. చింతలపూడి నియోజకవర్గ పరిధిలో 18,384 హెక్టార్లల్లో వరి సాగు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో చింతలపూడి మండలంలో అత్యధికంగా 7,603 హెక్టార్లు, లింగపాలెం మండలంలో 3,072 హెక్టార్లు, కామవరపుకోట మండలంలో 2,457 హెక్టార్లు, జంగారెడ్డిగూడెం మండలంలో 5,252 హెక్టారుల్లో వరి పంటను సాగు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు సుమారు 50 శాతం నాట్లు మాత్రమే పూర్తయ్యాయి. రైతుకు లాభం దమ్ము చేసిన పొలంలో నేరుగా వరి విత్తడం వల్ల నారు పోయడం, నారు తీత, నాట్లు వేసే పని ఉండదు. ఈ విధానం వల్ల ఎకరాకు రైతులకు సుమారు రూ.3,500 రూపాయల ఖర్చు తగ్గుతుంది. ఎకరాకు 15–20 కిలోల విత్తనం ఆదా అవుతుంది. మొక్కల మధ్య సాంద్రత ఉండటంతో ఎకరాకు 15 శాతం దిగుబడి పెరుగుతుంది. ఎక్కువ విస్తీర్ణంలో నాటుకోవడం మాత్రమేకాక , వారం పది రోజుల ముందుగానే పంట కోతకు వస్తుంది. సాగులో మెలకువలు సాధారణంగా అన్ని రకాల నేలల్లో దమ్ము చేసి వరివిత్తే పద్ధతిని అవలంభించవచ్చు. చౌడు, ఆమ్ల, క్షార నేలలు మాత్రం ఈ విధానానికి అనుకూలం కావు. రకాన్ని బట్టి ఎకరాకు 10 నుండి 15 కిలోల విత్తనం అవసరం అవుతుంది. వరిసాగు ఆలస్యమయ్యే పరిస్ధితుల్లో స్వల్పకాలిక వరి విత్తనాలను ఎంచుకోవడం మేలు. విత్తనాలను 24 గంటలు నానబెట్టి, మరో 24 గంటలు మండెకట్టి దమ్ము చేసిన పొలంలో వెదజల్లడం కాని, డ్రమ్ము సీడర్తో కాని విత్తుకోవాలి. డ్రమ్ సీడర్తో డ్రమ్ సీడర్తో లాగితే ఒకేసారి 8 వరుసల్లో విత్తనాలు పడతాయి. సాళ్ళ మధ్య 20 సెం.మీ, మొక్కల మధ్య 5–8 సెం.మీ ఎడంగా గింజలు పడతాయి. ప్రతి 16 వరసలకు ఒక అడుగు కాలిబాట వదలాలి. ఇద్దరు కూలీలు రెండు గంటల్లో ఎకరా విత్తనాలను విత్తవచ్చు. ఎరువుల వాడకం సాధారణ వరికి సిఫార్సు చేసిన విధంగానే దీనికి కూడ ఎరువుల వాడకం చేపట్టాలి. దమ్ములో మాత్రం నత్రజని ఎరువులు వేయకూడదు. వేస్తే కలుపు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువ. భాస్వరం, అర వంతు పొటాష్ను దమ్ములో వేసుకోవాలి. నత్రజని ఎరువులను 3 భాగాలుగా చేసుకుని విత్తిన 15–20, 40–45, 60–65 రోజులకు వేయాలి. మిగిలిన సగభాగం పొటాష్ 60–65 రోజులకు నత్రజనితో పాటు వేసుకోవచ్చు. నీటి వాడకం విత్తిన దగ్గర నుండి పొట్ట దశ వచ్చే వరకు బురదగా ఉంచి పొట్టదశ నుంచి పంట కోత పది రోజుల ముందు వరకు పొలంలో 2 సెంమీ నీరు నిల్వ ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల వేరు వ్యవస్ధ బాగా బలపడి పిలకలు బాగా వస్తాయి. కలుపు నివారణ కలుపు నివారణకు ఎకరాకు 35 గ్రాముల ఆక్సా డయార్జిల్ లేదా 400 మిల్లీ.లీ ప్రిటిక్లాక్లోర్ లేదా 100 గ్రా పైరజో సల్ఫ్యూరాన్ మందును 20 కిలోల పొడి ఇసుకతో కలిపి విత్తిన 3–5 రోజుల మధ్య పొలంలో పలుచగా నీరుంచి చల్లాలి. విత్తిన 20 రోజుల తర్వాత కలుపు సమస్య అధికంగా ఉంటే ఎకరాకు 80–100 మి.లీ బిస్ఫైరిబాక్ సోడియం, ఊద ఎక్కువగా ఉంటే 300–400 మి.లీ సైహలోఫాప్ బ్యూలైట్ను, వెడల్పాటి ఆకు ఎక్కువగా ఉంటే 4డి సోడియం లవణాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వై.సుబ్బారావు, చింతలపూడి సహాయ వ్యవసాయ సంచాలకుడు -
వైఎస్సార్సీపీ పార్టీ పదవులకు ఎంపిక
ఆకివీడు: వైఎస్సార్సీపీ రాష్ట్ర సోషల్ మీడియా జాయింట్ సెక్రటరీగా కమతం మహేష్ను నియమిస్తూ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. నియోజకవర్గ ఇన్చార్జి పీవీఎల్ నర్సింహరాజు సూచనల మేరకు నియామకం జరిగినట్లు మహేష్ తెలిపారు. ● ఉంగుటూరు: వైఎస్సార్సీపీ బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎ.గోకవరానికి చెందిన మిద్దే వెంకటేశ్వరరావును నియమించారు. పార్టీ అధినేత జగన్, మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ● చింతలపూడి: బీసీ విభాగం ఏలూరు జిల్లా కార్యదర్శిగా చింతలపూడి మండలం, రేచర్ల గ్రామానికి చెందిన పెరుగొండ్ర శివరామకృష్ణను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ● పెనుగొండ: వైఎస్సార్సీపీ ప్రచార విభాగం రాష్ట్ర కార్యదర్శిగా ఆచంట నియోజకవర్గం మార్టేరుకు చెందిన మండ విశ్వనాథ నారాయణ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ● దెందులూరు: వైఎస్సార్సీపీ సోషల్ మీడియా రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా దెందులూరు నియోజవర్గం నుంచి చల్లారి హేమంత్ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం నియామక ఆదేశాలు జారీ చేశారు. ● బుట్టాయగూడెం: వైఎస్సార్సీపీ అనుబంధ విభాగం రాష్ట్ర కమిటీ ప్రచార వింగ్ కార్యదర్శిగా పోలవరం నియోజకవర్గం నుంచి కొయ్యలగూడెంకు చెందిన తమిర్చి బ్రహ్మయ్యను నియమిస్తూ శుక్రవారం ఆ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ● చింతలపూడి: చింతలపూడి మండలం వెంకటాద్రిగూడెంకు చెందిన త్సల్లాబత్తుల శ్రీనివాసరావును వైఎస్సార్సీపీ జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడిగా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
గ్రావెల్ అక్రమ తవ్వకాలు ఆగేనా?
ద్వారకాతిరుమల: మండలంలోని పంగిడిగూడెం వద్ద పోలవరం కుడి కాలువ గట్టుపై అక్రమ గ్రావెల్ తవ్వకాలకు అడ్డుకట్ట వేసేందుకు కాలువ ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా శుక్రవారం కాలువ గట్టుపై నుంచి గ్రామంలోకి వెళ్లే పలు మార్గాల్లో ట్రంచ్ (రోడ్డుకు అడ్డంగా) తవ్వకాలు జరిపారు. వివరాల్లోకి వెళితే. కొందరు టీడీపీ నాయకులు కాలువ గట్టును ఆదాయ మార్గంగా ఎంచుకున్నారు. రాత్రి వేళల్లో దొంగతనంగా గ్రావెల్ తవ్వకాలను జరిపి, అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో నాయకుడు ఈ మట్టిని అమ్ముకోవడం ద్వారా నెలకు రూ. 3 లక్షల వరకు కూడబెడుతున్నట్టు సమాచారం. అయితే ఈ పచ్చ ముఠా గట్టుపై ఉన్న మట్టిని కాకుండా, ఏకంగా భూమిని తవ్వి గ్రావెల్ను అమ్మేస్తున్నారు. దాంతో కాలువ గట్టుపై పెద్దపెద్ద గోతులు ఏర్పడి, అగాధాలను తలపిస్తున్నాయి. అవి ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి. ఈ అక్రమ తవ్వకాలను అడ్డుకోవడం సంబంధిత శాఖల అధికారులకు ప్రహసనంగా మారింది. దొంగ దారుల్లో ట్రంచ్లు.. మట్టి దొంగలు అధికార పార్టీకి చెందినవారు కావడంతో కొందరు అధికారులు చూసిచూడనట్టు వదిలేస్తున్నారు. దాంతో వారి మట్టి దందాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. రాత్రి అయితే చాలు.. జేసీబీలతో కాలువ గట్టుపైకి చేరి, తవ్వకాలు జరిపేస్తున్నారు. వీరి తవ్వకాలు ప్రమాదకర స్థాయికి చేరడంతో కాలువ ఇరిగేషన్ అధికారులు అక్రమ గ్రావెల్ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో రవాణా చేస్తున్న ట్రాక్టర్లు, టిప్పర్లను పట్టుకునేందుకు కాలువ గట్టు చివరన కాపలా కాస్తున్నారు. అయితే తెలివిమీరిన మట్టి దొంగలు పలు దొంగ మార్గాల గుండా మట్టిని తరలించేస్తున్నారు. దాంతో కాపలా కాసినా ప్రయోజనం లేదని భావించిన అధికారులు ట్రంచ్ తవ్వకాలను చేపట్టారు. గట్టుపై నుంచి గ్రామంలోకి అక్రమ మట్టి రవాణా జరుగుతున్న పలు మార్గాలను గుర్తించి, పీఐపీఆర్ఎంసీ జేఈ దూర్జటి పర్యవేక్షణలో ట్రంచ్ లను తవ్వారు. ఫలితం ఉంటుందా? ట్రంచ్లు తవ్వడం వల్ల ఫలితం ఉంటుందా అంటే.. గ్రామస్తులు కొందరు ఉండదనే అంటున్నారు. మట్టినే ఆదాయ వనరుగా ఎంచుకున్న ముఠాకు ట్రంచ్లు ఒక లెక్క కాదని చెబుతున్నారు. ట్రంచ్లను పూడ్చి, అక్రమ రవాణాను సాగించినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. అయితే అధికారుల ప్రయత్నం ఏమేరకు ఫలితాలనిస్తుందో వేచి చూడాల్సి ఉంది. అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్న ఇరిగేషన్ అధికారులు పలు మార్గాల్లో ట్రంచ్ల తవ్వకాలు -
చెరువులో పడి వ్యక్తి మృతి
మండవల్లి: ప్రమాదవశాత్తు చెరువులో పడి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన మండలంలోని భైరవపట్నంలో జరిగింది. గ్రామానికి చెందిన పండు జోజి పెద్ద కుమారుడు తరుణ్ అలియాస్ చందు (23) 31న ఒంటి గంట సమయంలో బయటకు వెళ్ళి తిరిగి రాలేదు. శుక్రవారం ఇంటి పక్కనే ఉన్న చేపల చెరువులో జారిపడి మృతిచెందాడు. పోలీసు సిబ్బంది కేసు నమోదు చేశారు. రోడ్ల ఆక్రమణలపై చర్యలు కొయ్యలగూడెం: పరింపూడి పంచాయతీ అంతర్గత రోడ్ల ఆక్రమణలపై చర్యలు తీసుకోనున్నట్లు కార్యదర్శి కే.సురేష్ పేర్కొన్నారు. శుక్రవారం పంచాయితీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహించారు. జూలై 29 సాక్షిలో ప్రచురితమైన అంతర్గత రోడ్ల ఆక్రమణ విషయంపై ప్రజలతో మాట్లాడుతూ స్వమిత్వ కార్యక్రమంలో ప్రజలు ఫిర్యాదు చేసుకోవచ్చనని సూచించారు. సాక్షిలో వచ్చిన కథనంపై విచారణ చేసి ఆక్రమణలను గుర్తించామని వారికి నోటీసులు జారీ చేశామన్నారు. ఈ సందర్భంగా స్వమిత్వ ద్వారా ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను ఆయన పరిశీలించారు. పీఎంశ్రీ స్కూల్గా కొవ్వలి పాఠశాల దెందులూరు: జిల్లాలో బెస్ట్ పీఎం శ్రీ స్కూల్గా కొవ్వలి ఉన్నత పాఠశాల ప్లస్ ఎంపికై ంది. పాఠశాల పీఎం శ్రీగా మారిన తరువాత ఈ పాఠశాలకు ప్రత్యేకంగా ముగ్గురు ఒకేషనల్ ట్రైనర్లను కేటాయిస్తారు. విద్యార్థులకు వ్యవసాయం,, ఆర్థిక వ్యవస్థ, బీమాపై అవగాహన కల్పిస్తారు. ఎన్సీసీ యూనిట్, స్కౌట్స్ గైడ్స్ విభాగాలు ఏర్పాటు చేస్తారు. పాఠశాలకు 200 మీటర్ల రన్నింగ్ ట్రాక్, లాంగ్ జంప్, కోకో కోర్టులు ఏర్పాటు చేశామన్నారు. కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇలా 39 అంశాలు సంతృప్తి చెందడంతో పాఠశాల పీఎం శ్రీ స్కూల్గా ఎంపికై ంది. సిల్వర్ మెడల్ విజేత జెస్సిరాజ్కు సత్కారం దెందులూరు: ఏసియన్ గేమ్స్ 2025 సబ్ జూనియర్ విభాగం సోలో డాన్స్లో సిల్వర్ మెడల్ విజేత ఇంటర్నేషనల్ స్కేటర్ జెస్సీరాజ్ను శుక్రవారం ఆంధ్రప్రదేశ్ శాప్ చైర్మన్ రవి నాయుడు సత్కరించారు. మరిన్ని పురస్కారాలు పొందాలని ఆకాంక్షించారు. కోచ్ సింహాద్రి, ఇండియా టీం కోచ్ సింగ్లను అభినందించారు. -
రుణాలు అందక ఇబ్బందులు
భీమవరం: రైతులకు ఎంతగానో ఉపయోగపడే వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు(సొసైటీ) పూర్తిస్థాయిలో త్రిసభ్య కమిటీలు, ప్రత్యేక అధికారులు లేకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. జిల్లాలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో పూర్తి స్థాయిలో త్రిసభ్య కమిటీలను నియమించకపోగా ప్రత్యేక అధికారుల పాలన గడువు ముగిసిన సంఘాలకు అధికారులను నియమించకపోవడంతో సొసైటీలో రైతులు రుణం పొందే అవకాశాన్ని కోల్పోతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 122 సొసైటీలున్నాయి. రైతులు ఎక్కువ శాతం సొసైటీల్లో రుణాలు తీసుకుని పంటలకు పెట్టుబడులు పెడతారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జీరో వడ్డీకే రైతులకు పంట రుణాలు ఇవ్వడంతో సొసైటీల ప్రాచుర్యం బాగా పెరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సొసైటీలకు నియమించిన త్రిసభ్య కమిటీలను రద్దు చేసి ప్రత్యేక అధికారులను నియమించారు. కూటమి నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఇటీవల కేవలం 50 సొసైటీలకు మాత్రమే త్రిసభ్య కమిటీలు నియమించారు. కూటమిలో పదవులు పందేరంలో తమకు ఎక్కువ శాతం పదవులు కావాలంటూ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పంతాలకు పోవడంతోపాటు ఆయా సొంత పార్టీ నాయకుల మధ్యనే విభేదాలు తలెత్తంతో నామినేటెడ్ పదవుల భర్తీ సందిగ్ధంగా మారింది. ముగిసిన ప్రత్యేక అధికారుల పాలన జిల్లాలో కేవలం 50 సొసైటీలకే త్రిసభ్య కమిటీల నియామకం, మిగిలిన సొసైటీల ప్రత్యేక అధికారుల పాలన జూలై 31తో ముగియడంతో పాలకవర్గాలు లేని దాదాపు 70 సొసైటీల్లోని రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సొసైటీల్లో రుణాలు ఇవ్వాలంటే రుణం పొందే రైతుల జాబితాపై సంఘం చైర్మన్గాని ప్రత్యేక అధికారి సంతకం తప్పనిసరి. ప్రత్యేక అధికారుల పాలన గడువు ముగిసినా ప్రభుత్వం పొడిగించకపోవడంతో రైతులు రుణాలు ఎలా పొందాలో తెలియక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సార్వా సీజన్ ప్రారంభం కావడంతో రైతులకు రుణాలు ఎంతో అవసరం. ఇలాంటి సమయంలో సొసైటీలకు పూర్తి స్థాయిలో కమిటీలను నియమించకపోవడం రైతులు పూర్తి స్థాయిలో రుణాలు పొందే అవకాశం లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సొసైటీల్లో పూర్తి స్థాయిలో లేని త్రిసభ్య కమిటీలు ఇంత వరకు 50 సొసైటీలకే త్రిసభ్య కమిటీల నియామకం -
ట్రంప్ సుంకాల్ని తిప్పికొట్టాలి
ఏలూరు (టూటౌన్): అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలకు దీటుగా కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలోని ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని సీపీఎం ఏలూరు జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ జిల్లా కార్యదర్శి ఎ.రవి శుక్రవారం సీపీఎం జిల్లా కార్యాలయంలో మాట్లాడుతూ ఈ ప్రకటనపై ఇంతవరకు భారతదేశ ప్రభుత్వం గాని, కూటమి ప్రభుత్వం గాని ఎలాంటి స్పందన తెలపకపోవడం బాధాకరమన్నారు. ట్రంప్ సుంకాల ఫలితంగా ఆక్వా రంగం కుదేలైపోతుందని స్పష్టం చేశారు. ఆక్వా రంగం పైనే కాకుండా ఇతర అనేక రంగాలపై కూడా చూపుతుందన్నారు. మావుళ్లమ్మను దర్శించుకున్న క్రికెటర్ నితీష్ కుమార్ భీమవరం (ప్రకాశంచౌక్): ప్రముఖ ఇలవేల్పు మావుళ్ళమ్మ వారిని ఇండియన్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ ప్రధానార్చకుడు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం అందించారు. ఈ నెల 8 నుంచి జరగనున్న ఆంధ్రా ప్రీమియం లీగ్ టీం లో భీమవరం బుల్స్ టీంకు నితీష్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. -
పోలవరం ఎమ్మెల్యే వంద కోట్లు సంపాదించాడట!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘పోలవరం ఎమ్మెల్యే ఏడాది కాలంలోనే రూ.100 కోట్లు సంపాదించాడంట.. ఆయన గొప్పతనం యూట్యూబ్లో ఇప్పుడే కనిపించింది.. ఏడాదిలో ఇంత చెడ్డ పేరు తెచ్చుకుంటే ఎట్లా.. పవన్ కళ్యాణ్ ఏమీ పట్టించుకోరా..’ అంటూ మాజీ మంత్రి, టీడీపీ ముఖ్య నేత దేవినేని ఉమ.. జనసేన కీలక నేత కరాటం రాంబాబుతో వ్యాఖ్యానించారు. ఇద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఏడాదిలో రూ.100 కోట్లు సంపాదించాడనే విషయంతోపాటు, తరచూ వివాదాస్పద నేతగా మీడియాలో హాట్ టాపిక్గా ఉండటం తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు.. అందుకు సంబంధించిన ఓ వీడియో చూసి, మరో టీడీపీ నేత ఫోన్ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్, జనసేన నేత కరాటం రాంబాబుకు ఫోన్ చేశారు. వారిద్దరి మధ్య సాగిన సంభాషణ శుక్రవారం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇదేమి దోపిడీ అన్నట్టు టీడీపీ నేత ఉమా జనసేన నేతను ప్రశ్నించడం.. పవన్ కళ్యాణ్ మిమ్మల్ని ఎప్పుడూ అడగలేదా అని ఆరా తీయడం.. తమకూ చాలా ఇబ్బందిగా ఉందని జనసేన నేత చెప్పడం.. ఏడాదిగా ఏ ఒక్కరూ తనతో మాట్లాడలేదని బదులివ్వడం.. కూటమి పారీ్టల్లో హాట్ టాపిక్గా మారింది. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ప్రధానాంశాలు.. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు: రాంబాబు గారూ.. బాగున్నారా.. ఎక్కడ ఉన్నారు.. ఏదో యూట్యూబ్లో మీ ఎమ్మెల్యే గొప్పతనం కనపడితే మీరు గుర్తుకు వచ్చారు. సంవత్సరంలోనే వంద కోట్లంటే దేశ చరిత్రలోనే గొప్ప విషయం. జనసేన కీలక నేత కరాటం రాంబాబు: ఇప్పుడు వ్యవస్థ అంతా పాడైపోయింది. ఉమా: సంవత్సరంలోనే ఎందుకు ఇంత చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు.. ఇంకా నాలుగేళ్లు ఉందిగా? కరాటం: నాలుగేళ్లు ఉండటమేమిటండీ.. చెడ్డ పేరు తెచ్చుకోవడమేమిటండీ. పార్టీకి ఇంత డ్యామేజీ. ఎమ్మెల్యే నా దగ్గరికి వచ్చినప్పుడు కేకలు వేస్తూనే ఉంటాను. అల్లరి ఎక్కువగా జరుగుతోంది.. ఉమా గారు.. మీరు ఎక్కడ ఉన్నారండీ.. ఉమా: నా మీద 82 కేసులున్నాయి కదా.. కోర్టు పని మీద రాజమండ్రికి వచ్చాను. ఇదంతా యూట్యూబ్లో చూసి ఎలా ఉన్నారు.. ఏమిటని అడుగుదామని ఫోన్ చేశాను. చాలా కష్టపడి మీరు తీసుకువచ్చి పెట్టారు. అందరిని కలుపుకుని మీరు కూడా అంతా తగ్గి ఒప్పించారు. కరాటం: ఇబ్బందిగానే ఉందండి. మాకున్నదే దానం చేశాం.. ఎప్పడూ చెయ్యి చాచడం అంటే తెలియదండీ.. కంట్రోల్ చేస్తున్నానండి. మళ్లీ మాములు స్థితికి తీసుకురావాలి. కూటమి అంతా దెబ్బ తినేస్తుంది. ఉమా: ఇదంతా పవన్ కళ్యాణ్కు తెలుస్తుంది కదా.. కరాటం: ఏమోనండి.. మరీ ఏం జరుగుతుందో.. ఉమా: మిమ్మల్ని కూడా అడగటం లేదా? కరాటం: ఇప్పటి వరకు నాకు ఎవరూ ఫోన్ చేయలేదు. ఉమా: అసలు రాంబాబు గారు ఎలా ఉన్నారని గానీ, ఏమిటని గానీ.. కరాటం: ఇప్పటి వరకు అసలు ఏ ఫోన్ రాలేదు. వాళ్లు ఫోన్ చేయనప్పుడు నేను కూడా సైలెంట్గానే ఉన్నానండి. మీరు ఫోన్ చేసి చెప్పినప్పుడు పని చేసిపెట్టాను. ఆ సోంబాబు ఏం చేశాడు కోటి రూపాయలు తీసుకున్నానని పెట్టాడు. ఉమా: ఆ.. అదంతా పట్టించుకోకండి.. కరాటం: జైలులోకి వెళ్లిపోతాడంటే కాపాడింది నేనండి.. ఉమా: అవునండీ.. నాకు తెలుసండీ.. కలుద్దాం.. అటు వైపు వచ్చినప్పుడు కలుద్దామండీ.. కరాటం: అలాగేనండీ.. -
జనసేన ఎమ్మెల్యే అవినీతిపై.. టీడీపీ నేతల ఫోన్కాల్ సంభాషణ వైరల్
సాక్షి,ఏలూరు: ఏలూరు జిల్లాలో ఇద్దరు టీడీపీ నేతల ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా, డీసీసీబీ మాజీ ఛైర్మన్ కరాటం రాంబాబుల మధ్య ఫోన్ సంభాషణ జరిగింది.ఇరువురి సంభాషణలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అవినీతిపై చర్చకు వచ్చింది. ఈ చర్చలో ఏడాదిలోనే రూ.100 కోట్లు దోచేశారని దేవినేని ఉమా ప్రస్తావించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఇవన్నీ తెలుసా? అని రాంబాబును ఉమ ప్రశ్నించారు. అందుకు రాంబాబు స్పందిస్తూ .. ఇప్పటివరకు పవన్ నాకు ఫోన్ చేయలేదని అన్నారు. -
స్వాతంత్య్ర దినోత్సవాలకు పక్కా ఏర్పాట్లు
ఏలూరు(మెట్రో) : జిల్లాలో ఈనెల 15న జరిగే 79వ స్వాతంత్య్ర దినోత్సవాలకు ప టిష్ట ఏర్పాట్లు చే యాలని జేసీ పి.ధాత్రిరెడ్డి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లపై సమీక్షించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ను సుందరంగా తీర్చిదిద్దాలని, సిట్టింగ్ ఏర్పాట్లు, సాంస్కృతిక ప్రదర్శనలు, శకటాలకు ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఉత్తమంగా పనిచేస్తున్న ఉద్యోగులను గుర్తించి వారి పేర్లను ప్రతిపాదించాలని అధికారులను ఆదేశించారు. డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, సీపీఓ వాసుదేవరావు, ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, డీఆర్డీఏ పీడీ ఆర్.విజయరాజు తదితరులు పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ బీసీ సెల్ కార్యదర్శిగా చిన్న షావుకారుముసునూరు : వైఎస్సార్ సీపీ జిల్లా బీసీ సెల్ కార్యదర్శిగా చెక్కపల్లికి చెందిన సీనియర్ నేత తల్లిబోయిన వెంకటేశ్వరరా వు (చిన్న షావుకారు) నియమితులయ్యారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావుకు ముఖ్య అనుచరుడిగా ఉన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషిచేస్తానన్నారు.రేపు డీడీఆర్సీ సమావేశంఏలూరు(మెట్రో) : ఏలూరు కలెక్టరేట్లో శనివా రం జిల్లా అభివృద్ధి సమీక్షా కమిటీ (డీడీఆర్సీ) సమావేశం నిర్వహించనున్నారు. జిల్లా ఇన్ చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధికారులు పాల్గొంటారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, ఉపాధి హామీ, ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఆర్అండ్బీ తదితర శాఖల పనుల ప్రగతిపై సమీక్షిస్తారు.ఉపాధ్యాయులకు అన్యాయంఏలూరు (ఆర్ఆర్పేట): విద్యారంగంలో ప్రభు త్వం తీసుకుంటున్న అసంబద్ధ నిర్ణయాలతో జిల్లా పరిషత్, మండల పరిషత్ ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఏపీటీఎఫ్ 1938 రాష్ట్ర అకడమిక్ కమిటీ కన్వీనర్ గుగులోతు కృష్ణ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చేరిన ఉపాధ్యాయులకు మాత్రమే ఎంఈఓ, డీవైఈఓలుగా బాధ్యతలు అప్పగిస్తామని అధికారులు ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించారు. జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ యాజమాన్యాల్లో పనిచేసే ఉపాధ్యాయులపై ప్రభుత్వ ఉపాధ్యాయుల పెత్త నం ఏంటని ప్రశ్నించారు. ఉమ్మడి సర్వీసు రూల్స్కు సంబంధించి 72, 73, 74 జీఓల అమలులో పక్షపాత వైఖరి సరికాదన్నారు. వెంటనే ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకుని ఉమ్మడి సీనియార్టీ ద్వారా మాత్రమే ఎంఈఓ–1 పోస్టులను భర్తీ చేయా లని డిమాండ్ చేశారు.పీ4పై సమీక్షఏలూరు(మెట్రో): పీ4 కార్యక్రమంలో మార్గదర్శులు స్వచ్ఛందంగా భాగస్వాములు అయ్యే లా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లకు సూచించారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జేసీ పి.ధాత్రిరెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.రిజిస్ట్రేషన్ ఆదాయంలో ఫస్ట్నూజివీడు: జిల్లాలోని 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా రూ.548.80 కోట్ల రెవెన్యూతో రాష్ట్రంలోనే అత్యధిక ఆదాయాన్ని సాధించినట్టు ఏలూరు జిల్లా రిజిస్ట్రార్ కొమ్మినేని శ్రీనివాసరావు తెలిపారు. గురువారం నూజివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే నూజివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం 80 శాతం వృద్ధి సాధించిందన్నారు. రిజిస్ట్రేషన్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణల్లో భాగంగా కార్డ్ ప్రైమ్ 2.0 విధానంలో రిజిస్ట్రేషన్ జరిగిన రోజే డాక్యుమెంట్ను యజమానికి అందిస్తున్నామన్నారు. ఆగస్టు 1 నుంచి రిజిస్టర్ డాక్యుమెంట్ కాపీని యజమానికి వాట్సాప్ ద్వారా అందిస్తామన్నారు. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కార్డ్ ప్రైమ్ 2.0ను మున్సిపల్ పరిపాలన విభాగంతో అనుసంధానం చేసి, అర్బన్ పరిధిలో ఉన్న ఆస్తులను మ్యూటేషన్ చేసి యజమాని మార్పిడి జరుగుతుందన్నారు. ఏలూరు మున్సిపాలిటీకి అనుసంధానంగా ఉన్న ఏలూరు, వట్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభమవుతుందన్నారు. -
పారిశుద్ధ్య కార్మికుల వేతన వెతలు
ఏలూరు టౌన్: ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు జీతాలు రాక ఇబ్బంది పడుతున్నారు. కాంట్రాక్ట్ సంస్థ ప్రతినెలా జీతాలు చెల్లించాల్సి ఉండగా.. కార్మికులు ఆందోళనలు చేస్తే తప్ప పట్టించుకోవడం లేదు. అది కూడా ఒక నెల జీతం ఇచ్చి సరిపెడుతున్నారు. దీంతో మూడు నెలలుగా జీతాల బకాయిలు ఉన్నాయని, కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా ఉందని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో 189 మంది.. జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో పారిశుద్ధ్య కార్మికుల కాంట్రాక్ట్ను ఫస్ట్ అబ్జెక్ట్ అనే బెంగళూరుకు చెందిన సంస్థ నిర్వహిస్తోంది. ఏలూరు సర్వజన ఆస్పత్రితో పాటు జంగారెడ్డిగూడెం, నూజివీడు జిల్లా ఆసుపత్రి, కై కలూరు, చింతలపూడి, దెందులూరు, భీమడోలు, పోలవరం ప్రాంతాల్లోని ప్రభుత్వాస్పత్రుల్లో పారిశుద్ధ్య కార్మికులు 189 మంది పనిచేస్తున్నారు. వీరందరికీ మూడు నెలల జీతాలు రావాల్సి ఉంది. ఏలూరులో 90 మంది, జంగారెడ్డిగూడెంలో 20, నూజివీడు జిల్లా ఆసుపత్రిలో 30, కై కలూరులో 15, చింతలపూడిలో 10, దెందులూరు, భీమడోలు, పోలవరం ప్రభుత్వాస్పత్రుల్లో ఒక్కో చోట 8 మంది చొప్పున కార్మికులు ఉన్నారు. కాంట్రాక్టర్ మార్పుపై చర్చ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టర్ మార్పుపై తీవ్ర చర్చ సాగుతోంది. ప్రస్తుత కాంట్రాక్టర్ కార్మి కులకు జీతాలు చెల్లించటంలో జాప్యం చేస్తున్నట్టు తెలుస్తోంది. తమకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయటం లేదనీ, తాము మాత్రం ఎక్కడి నుంచి తీసుకువచ్చి ఇస్తామనే ధోరణిలో కాంట్రాక్ట్ సంస్థ యజమానులు వ్యవహరిస్తున్నారని కార్మికులు అంటున్నారు. కార్మికులకు గత నెలలో కొంత బకాయిలు చెల్లించగా మిగిలిన మూడు నెలల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆస్పత్రుల్లో కార్మికులకు 3 నెలలుగా జీత బకాయిలు కాంట్రాక్టర్ జాప్యంతో ఇబ్బందులు బకాయిలు చెల్లించాలి ఆస్పత్రుల్లో పారిశుద్ధ్య కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించాలి. పారిశుద్ధ్య కార్మికులు కష్టమైన పనులు చేస్తున్నా కుటుంబాలను పోషించుకోలేని దుస్థితిలో ఉన్నారు. గతంలో కాంట్రాక్టర్పై అధికారులు ఒత్తిడి తీసుకువచ్చినా ఇంకా మూడు నెలల బకాయిలు ఉన్నాయి. – వి.దత్తాత్రేయ, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీ మెడికల్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ కాంట్రాక్ట్ సంస్థ, అధికారులపైఒత్తిడి తెచ్చాం కాంట్రాక్ట్ సంస్థ యాజమాన్యం, అధికారులతో చర్చించి కొంత బకాయిలు చెల్లించేలా ఒత్తిడి తెచ్చాం. దీంతో ఏలూరు జీజీహెచ్లో కార్మికులకు ఒక నెల జీతం వేశారు. ఇంకా మూడు నెలల జీతాల బకాయిలు ఉన్నాయి. ఇదే పరిస్థితి ఉంటే మరోసారి పోరాటానికి సిద్ధమవుతాం. – కృష్ణమాచార్యులు, ఏపీ మెడికల్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ -
గీత రాత మారేనా?
గత ప్రభుత్వంలో ఆపన్న హస్తం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గీత కార్మికులకు ఆపన్న హస్తం అందించింది. నాటి సీఎం వైఎస్ జగన్ నూతన ఎకై ్సజ్ పాలసీ తీసుకువచ్చారు. గీత పన్ను రద్దు చేశారు. కల్లు గీత కా ర్మిక సొసైటీలు, గీత గీచే వారికి చెట్టు పథకం అమలు చేశారు. కల్లు తీస్తూ ప్రమాదానికి గురై శాశ్వత వైకల్యం పొందితే నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ ఇప్పించి ప్రత్యామ్నాయ ఆదా య మార్గాలను చూపించారు. వైఎస్సార్ బీ మా పథకం ద్వారా నష్టపరిహారం చెల్లించారు. ప్రమాదాల్లో మరణిస్తే ఇచ్చే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. ఎన్ఈఆర్జీఎస్, షెల్టర్ బెడ్ అభివృద్ధి పథకాల ద్వారా తాటి, ఈత వంటి చెట్లు పెంచేలా చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా కాలువ గట్లు, నదీ, సాగర తీరాలను పటిష్టం చేస్తూ కల్లు గీతకు కావాల్సిన తాటి, ఈత చెట్లు సమృద్ధిగా పెరిగేలా చర్యలు తీసుకున్నారని గీత కార్మికులు గుర్తుచేసుకుంటున్నారు. ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కల్లు గీత కార్మికులు తమ రాత మారేనా.. కష్టాలు తీరేనా అని ఎదురుచూస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తమ జీవితాల్లో వెలుగులు నింపితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం వేదనను మిగిలుస్తోందని ఆందోళన చెందుతున్నారు. ఊరూ వాడా బెల్టు షాపులు, విచ్చలవిడిగా మద్యం అమ్మకాలతో గీత వృత్తి మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని అంటున్నారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో సుమారు 9 వేల బెల్టుషాపులు ఉన్నాయని గీత కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు. గత ఎన్నికల సమయంలో హామీలు గుప్పించిన కూటమి నాయకులు గద్దెనెక్కిన తర్వాత తమను పట్టించుకోవడం లేదని అంటున్నారు. కల్లుగీత వృత్తిపై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 25 వేల మంది కార్మికులు ఆధారపడి ఉన్నారంటున్నారు. 9 వేలకు పైగా బెల్టు షాపులు ఏలూరు జిల్లావ్యాప్తంగా సుమారు 5 వేలు, పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా సుమారు 4 వేలు బెల్టుషాపులు ఉన్నాయి. కూటమి నాయకులు, వారి అనుచరులే బెల్టుషాపులను నిర్వహిస్తున్నారని, దీంతో గీత వృత్తి కనుమరుగయ్యే ప్రమాదం గీత కా ర్మికులు ఉందని ఆవేదన చెందుతున్నారు. బెల్టు షాపులపై కొరడా ఝుళిపిస్తామని ముఖ్యమంత్రి, ఎకై ్సజ్ మంత్రి ప్రకటనలు చేయడం తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ సమస్యల పరిష్కారం కోసం గీత కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఇప్పటికే సర్కిల్ వారీగా సభలు, సమావేశాలు నిర్వహించిన కార్మికులు ఆందోళనను ఉధృతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈనెల 18న ఏలూరు కలెక్టరేట్ వద్ద భారీ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. కల్తీ మద్యం హల్చల్! ఉమ్మడి జిల్లాలో కల్తీ మద్యం హల్చల్ చేస్తున్నట్లు గీత కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. గోవా, యానాం నుంచి అక్రమ మద్యం తీసుకు వస్తున్నారని చెబుతున్నారు. అనకాపల్లి, పరవాడ కేంద్రంగా కబళిస్తున్న కల్తీ మద్యం రాకెట్ పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లును స్థావరంగా చేసుకుందని అంటున్నారు. పాలకొల్లులో కల్తీ మద్యం తయారుచేసి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కాకినాడ జిల్లాలకు సరఫరా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నా అధికారులు స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు. బెల్టు షాపుల్లో అధికంగా కల్తీ మద్యం విక్రయిస్తున్నారని, హైదరాబాద్ నుంచి స్పిరిట్ను తీసుకువచ్చి రంగు నీళ్లు కలిపి మద్యంగా తయారు చేసి బ్రాండెడ్ కంపెనీల బాటిల్స్లో నింపి ప్రముఖ బ్రాండ్ల లేబుల్ అతికించి షాపుల్లో విక్రయిస్తున్నారని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ ము ఖ్య నేత అనుచరుడే కల్తీ మద్యం దందా నడుపుతు న్నట్టు విస్తృత ప్రచారం జరుగుతోందని గీత కార్మి కుల నాయకులు ఆరోపిస్తున్నారు. కూటమి మొండిచేయి గీత కార్మికులకు ఇచ్చిన హామీల అమలెప్పుడు? ఏడాది దాటినా పట్టించుకోని కూటమి సర్కారు వాడవాడలా బెల్టు షాపులు ఉమ్మడి జిల్లాలో కల్లుగీత ఛిన్నాభిన్నం సుమారు 25 వేల మంది కార్మికులకు కష్టం -
ధరల మోత
నూజివీడు: కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నిన్నమొన్నటి వరకూ అందుబాటులో ఉన్న ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కిలో రూ.20 ఉన్న ధరలు రూ.40, రూ.60 వరకు పెరిగాయి. రైతు బజారులో ధరలకు మించి బహిరంగ మార్కెట్లో, గ్రామాలు, మండల కేంద్రాల్లో ధరలు ఉంటున్నాయి. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరగ్గా.. తా జాగా కూరగాయల వంతు అయ్యింది. కోడిగుడ్డు ధర కూడా పెరుగుతోంది. రిటైల్ మార్కెట్లో ఒకటి రూ.7, అట్ట రూ.200కు అమ్ముతున్నారు. సొరకాయ ఒకటీ రూ.25కు విక్రయిస్తున్నారు. నిత్యావసర సరుకులు, కూరగాయల ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదని, దీంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెజ్‘ట్రబుల్స్’ నూజివీడు మార్కెట్లో ధరలు (కిలో) రైతుబజారు బహిరంగ మార్కెట్ టమోటా 48 60 బెండ 34 45 బీర 40 50 దొండ 36 45 గోరుచిక్కుడు 37 45 పచ్చిమిర్చి 62 75 కంద 50 60 క్యారెట్ 48 60 చేమదుంప 35 45 పొట్లకాయ (ఒకటి) 20 30 -
విద్యుత్ సంస్థలో పదోన్నతులు
ఏలూరు (ఆర్ఆర్పేట): ఏపీఈపీడీసీఎల్ ఏలూరు ఆపరేషన్ సర్కిల్ పరిధిలోని పలువురు సీనియర్ అసిస్టెంట్లకు జూనియర్ అక్కౌంట్స్ అధికారులుగా పదోన్నతులు కల్పిస్తూ ఎస్ఈ పి.సాల్మన్ రాజు ఉత్తర్వులు జారీ చేశారు. పాలకొల్లు ఈఆర్ఓలోని ఎల్బీవీ సాంబశివరావును భీమవరానికి పదోన్నతిపై బదిలీ చేశారు. ఏలూరు సర్కిల్ కార్యాలయంలోని వై.శ్రీనివాసరావును ఏలూరు సర్కిల్ కార్యాలయంలో ఎల్టీ విభాగానికి బదిలీ చేశారు. భీమవరం ఈఆర్ఓలోని పీఆర్కేవీ ప్రసాద్ను నరసాపురం డివిజన్ అక్కౌంట్స్ కార్యాలయానికి బదిలీ చేశారు. ఏలూరు కనస్ట్రక్షన్స్ విభాగంలోని వి.రాజశేఖర్ను ఏలూరు సర్కిల్ కార్యాలయంలోని సీఏఎస్ విభాగానికి బదిలీ చేశారు. తణుకు డీ1లోని కె.రవీంద్రనాథ్ను తాడేపల్లిగూడెం అక్కౌంట్స్ డివిజన్ కార్యాలయానికి, భీమవరం డివిజన్ కార్యాలయంలోని జి.రామకృష్ణ రాజును భీమవరం సర్కిల్ కార్యాలయానికి బదిలీ చేశారు. ఏలూరు సర్కిల్ కార్యాలయంలోని కేవీఆర్జీ కృష్ణమూర్తిని అదే కార్యాలయానికి, నరసాపురం డివిజన్ కార్యాలయంలోని ఎస్డీ ఆశీర్వాదంను అదే కార్యాలయంలో ఏడీఎం విభాగానికి, ఏలూరు ఈఆర్ఓలోని ఎస్.వెంకటేశ్వరరావును ఏలూరు డివిజన్ కార్యాలయానికి, పెరవలి సెక్షన్ కార్యాలయంలోని ఎ.శ్రీనివాసరావును జంగారెడ్డిగూడెం అక్కౌంట్స్ కార్యాలయానికి బదిలీ చేశారు. నిడదవోలు ఈఆర్ఓలోని ఎండీ అబ్దుల్ అలీంను నిడదవోలు డివిజన్ కార్యాలయానికి, ఉండ్రాజవరం సెక్షన్ కార్యాలయంలోని కేవీపీ విజయకుమార్ను జంగారెడ్డిగూడెం ఈఆర్ఓకు, తంగెళ్లమూడి ఈఆర్ఓలోని కె.పద్మజను అదే కార్యాలయానికి జూనియర్ అక్కౌంట్స్ అధికారిగా పదోన్నతి కల్పించారు. అలాగే తణుకు ఈఆర్ఓలోని కె.బాలకృష్ణకు జూనియర్ అక్కౌంట్స్ అధికారిగా పదోన్నతి కల్పిస్తూ తాడేపల్లిగూడెం డివిజన్ కార్యాలయంలో పోస్టింగ్ ఇచ్చారు. అయితే పరిపాలనా సౌలభ్యం కోసం ఆయన్ను భీమవరం ఈఆర్ఓకు బదిలీ చేశారు. -
స్మార్ట్ మీటర్లతో ప్రజలపై భారం
ఏలూరు (టూటౌన్): ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ వేదిక ఆధ్వర్యంలో మూడోరోజు గురువారం స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని కోరుతూ ఏలూరు ఫైర్స్టేషన్ సెంటర్ నుంచి ప్రజలతో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి యు.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కూటమి నాయకులు ఎన్నికలకు ముందు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించారని, సర్చార్జీల పేరుతో పైసా వసూలు చేయమని చెప్పి గద్దెనెక్కిన తర్వాత చంద్రబాబు సర్కారు ఈ హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం హామీలను నెరవేర్చాలని, స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణచైతన్య, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్వీడీ ప్రసాద్ మాట్లాడారు. ర్యాలీ జిల్లా పరిషత్, ఇండోర్ స్టేడియం మీదుగా కోర్టు సెంటర్ నుంచి తిరిగి ఫైర్స్టేషన్ సెంటర్ వద్ద ముగిసింది. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సంతకాల సేకరణ కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యులు అవుతున్నారన్నారు. -
ఆటో, వ్యాన్ ఢీకొని కూలీ మృతి
నలుగురికి గాయాలు దెందులూరు: ఆటోను వ్యాన్ ఢీకొట్టిన ఘటనలో ఒక కూలీ మృతి చెందగా ఇద్దరికీ తీవ్ర, మరో ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన ఏలూరు రూరల్ మండలంలోని శ్రీపర్రులో గురువారం తెల్లవారుజామున 5.30 గంటలకు చోటుచేసుకుంది. వివరాల ప్రకారం రావులపాలెం నుంచి మండవల్లి రొయ్యల చెరువు పట్టుబడికి కూలీలు ఆటోలో వస్తున్నారు. ఏలూరు రూరల్ మండలం శ్రీపర్రు పెట్రోల్ బంక్ సమీపానికి వచ్చేసరికి ఆటో, భీమవరం నుంచి వస్తున్న వ్యాన్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జయింది. ఆటోలో ఉన్న ఒరిస్సా రాష్ట్రం దేవిరీపల్లికి చెందిన సందీప్ కుమార్ (19) అక్కడికక్కడే మృతి చెందాడు. మిగితావారిలో ఒరిస్సాకు చెందిన రాత్కు, సూరజ్కు తీవ్రగాయాలు కాగా రాంబాబు, లక్ష్మణ్లకు స్వల్ప గాయాలయ్యాయి. ఏలూరు రూరల్ తహసీల్దార్ బి విజయకుమార్రాజు, శ్రీపర్రు వీఆర్ఓ సుబ్రహ్మణ్యం, రెవెన్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఏలూరు జీజీహెచ్కు తరలించారు. ఏలూరు రూరల్ ఎస్సై దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన వ్యాన్
ద్వారకాతిరుమల: ఆగి ఉన్న ట్రాలీ లారీని వెనుక నుంచి వ్యాన్ ఢీకొన్న ప్రమాదంలో వ్యాన్ క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్ తీవ్ర గాయాల పాలయ్యాడు. ఈ ఘటన మండలంలోని ఎం.నాగులపల్లి జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా, జగ్గంపేట మండలం, కాట్రావులపల్లి గ్రామానికి చెందిన వ్యాన్ క్లీనర్ యెరిట సూర్యనారాయణ (21), డ్రైవర్ జి.సురేష్ గతనెల 29న మొక్కజొన్న పొత్తులు లోడింగ్ నిమిత్తం వినుకొండ వెళ్లారు. తిరిగి లోడుతో స్వగ్రామానికి వెళుతున్న క్రమంలో ఘటనా స్థలం వద్దకు వచ్చేసరికి ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో వ్యాన్ క్లీనర్ సూర్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలపాలైన డ్రైవర్ సురేష్ను స్థానికులు హుటాహుటీన ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ద్వారకాతిరుమల ఎస్సై టి.సుధీర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్లీనర్ మృతి, డ్రైవర్కు తీవ్ర గాయాలు -
కొడుకుపై కన్నతల్లి దాడి
కొయ్యలగూడెం: మానసిక, శారీరక వికలాంగుడైన కుమారుడిపై ఓ తల్లి విచక్షణ కోల్పోయి దాడి చేసింది. దీంతో అతను తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి వెళ్లిన ఘటన గురువారం జరిగింది. వివరాల ఇలా ఉన్నాయి. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం రామానుజపురం గ్రామానికి చెందిన తొంట కుమారి భర్త గతంలోనే మృతిచెందాడు. వీరికి కుమార్తె, మానసిక, శారీరక వికలాంగుడైన కుమారుడు ఉన్నారు. కుమార్తెను ఆమె భర్త విడిచిపెట్టడంతో తల్లి దగ్గరే ఉంటోంది. గురువారం తల్లికి, కుమారుడికి మధ్య ఏర్పడిన వివాదంలో తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన తల్లి కుమారుడిని తలపై కర్రతో కొట్టడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్థానికులు అతన్ని 108 అంబులెన్సులో చికిత్స నిమిత్తం జంగారెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తీవ్ర గాయాలపాలైన కుమారుడు -
రైలు నుంచి జారిపడిన వ్యక్తి మృతి
భీమవరం: రైలు నుంచి జారిపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు రైల్వే ఎస్సై ఎం.సుబ్రహ్మణ్యం చెప్పారు. ఈనెల 16వ తేదీన ఆకివీడు – ఉండి రైల్వే స్టేషన్ మధ్య 55 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి రైలు నుంచి జారిపడి గాయపడడంతో చికిత్స నిమిత్తం 108 వాహనం ద్వారా భీమవరం ప్రభుత్వాసుపత్రికి అనంతరం మెరుగైన వైద్యం కోసం ఏలూరు జిల్లా ఆసుపత్రికి తరలించామన్నారు. అక్కడ ఆ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడని చెప్పారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు సెల్ 99084 48729 నంబర్లో సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి దెందులూరు: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఏలూరు రూరల్ ఎస్సై దుర్గా ప్రసాద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు రూరల్ మండలంలోని జాలిపూడి గ్రామంలో కంచర్ల తంబి (40) చేపల చెరువులపై గుమస్తాగా పనిచేస్తున్నాడు. గురువారం ఇంటి వద్దనే మద్యంలో పురుగుల మందు కలుపుకుని తాగాడు. గమనించిన బంధువులు వెంటనే అతడ్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. ఎరువుల పట్టివేత లింగపాలెం: మండలంలోని యడవల్లి గ్రామ సమీపంలో 7 టన్నుల కాంప్లెక్స్ ఎరువులను వ్యాన్లో అక్రమంగా తరలిస్తుండగా వ్యవసాయశాఖ డీఏఓ ఎస్కే అబీబ్ బాషా, ఏడీఏ వై సుబ్బారావు, ఏవో వి ప్రదీప్ కుమార్ పరిశీలించి సీజ్ చేశారు. వీటి విలువ రూ.2 లక్షల 6 వేలు అని తెలిపారు. కృష్ణా జిల్లా మైలవరం నుంచి ఈ ఎరువులను తరలిస్తున్నట్లు చెప్పారు. స్వాధీనం చేసుకున్న ఎరువులను మఠంగూడెం సొసైటీలో భద్రపర్చి, వ్యాన్ను పోలీస్ స్టేషన్కు అప్పగించినట్లు ఏవో ప్రదీప్ కుమార్ విలేకర్లకు తెలిపారు. గురుకుల ఉపాధ్యాయుడికి పురస్కారం నరసాపురం రూరల్: ఎల్బీచర్ల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల గణిత ఉపాధ్యాయుడు బేతపూడి విజయ్కిరణ్ కేంద్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాహుల్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ సంస్కృతుల ప్రోత్సాహంపై ఈ నెల 9 నుంచి 29 వరకూ హైదరాబాద్లో శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విజయ్కిరణ్ ‘ఆంధ్రప్రదేశ్లో చేతి వృత్తుల కళాకారుల జీవన స్థితిగతులు’ అనే అంశంపై ప్రాజెక్టు సమర్పించారు. ఈ ప్రాజెక్టుకుగాను కేంద్ర మంత్రిత్వ శాఖ నుంచి ఆయనకు ప్రశంసలు లభించాయి. ఈ సందర్భంగా గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఎన్.శ్యాంప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ పి.మార్క్, నల్లి సాయిబాబు, రాజా, పాఠశాల సిబ్బంది ఉపాధ్యాయుడు విజయ్కిరణ్ను అభినందించారు. -
ప్రైవేటు ఆక్వా దుకాణాలకు రెక్కలు
కై కలూరు: రాష్ట్ర తలసరి ఆదాయంలో ఏలూరు జిల్లాలో కలిదిండి, కై కలూరు రెండు మండలాలు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలుస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఆక్వా రంగం. ఆక్వా ఉత్పత్తుల రవాణాలోనూ కొల్లేరు ప్రాంతాలు సింహభాగం ఆక్రమించాయి. ఆక్వా ప్రాధాన్యతను గుర్తించి రాష్ట్ర మంచినీటి సంవర్థక రిఫరల్ ల్యాబోరేటరీను కై కలూరు మత్స్యశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. కాకినాడ తర్వాత కై కలూరు ల్యాబ్ మాత్రమే రాష్ట్ర స్థాయిలో రిఫరల్ ల్యాబ్ కావడం విశేషం. కూటమి ప్రభుత్వంలో ఈ ల్యాబ్ పాడుపడ్డా కొంపలా మారింది. కేవలం ఒకే ఒక్క సిబ్బంది పరీక్షలు నిర్వహించడం గమనార్హం. ప్రభుత్వ ఆక్వా ల్యాబ్లో సేవలు సక్రమంగా అందకపోవడంతో రైతులు ప్రైవేట్ ఆక్వా దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. పరికరాలున్నా.. ప్రయోజనం శూన్యం కై కలూరులో మత్స్యశాఖ కార్యాలయంతో పాటు లాబోరేటరీని 2003లో నిర్మించారు. ఫీడ్ అనాలసీస్, మైక్రోబయోలజీ ల్యాబ్ను దివంగత వైఎస్.రాజశేఖరరెడ్డి పాలనలో అప్పటి మంత్రి ఎండీ.ఫరీదుద్దిన్ 2005లో ప్రారంభించారు. ల్యాబ్లో మైక్రోబయోలజీ, హిస్టోపాథాలజీ, నీటి, మట్టి, మేత పరీక్షలు, పీసీఆర్ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. ల్యాబ్లో రూ.20లక్షల విలువ చేసే ఎలిషా పరికరం, అదే విధంగా రూ.13లక్షలు విలువ చేసే పీసీఆర్ మిషన్తో పాటు మేత పరీక్షలకు రూ.లక్షల్లో విలువ చేసే పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటు ల్యాబ్లతో పోల్చితే తక్కువ ధరకు పరీక్షలు చేస్తున్నా ఆక్వా రైతులు ఫిషరీస్ ల్యాబ్కు రావడం లేదు. లైసెన్సులు లేనివి ఎన్నో.. ఆక్వా దుకాణాలు ఏర్పాటు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ(అప్సడా) నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. కోస్టల్ అథారిటీ అనుమతులు ఉండాలి. వీటితో పాటు డ్రగ్ లైసెన్స్, జీఎస్టీ, ఐటీ రిటర్న్, ఆథరైజ్డ్ డీలర్షిప్ లెటర్స్తో దరఖాస్తు చేసుకున్న తర్వాత జాయింట్ కలెక్టర్ అనుమతులు పొందాలి. క్షేత్ర స్థాయిలో తహసీల్దార్, ఫిషరీస్, డ్రగ్ ఇన్స్పెక్టర్ పొల్యూషన్ ఇలా పలు శాఖలు నిరభ్యంతర ధ్రువపత్రం ఇవ్వాలి. ఇంత తతంగం ఉన్నప్పుటికీ కై కలూరు నియోజకవర్గంలో ఏకంగా 130 ఆక్వా దుకాణాలు ఉన్నాయి. వీటిలో కేవలం 39 దుకాణాలకు మాత్రమే లైసెన్సులు ఉన్నాయి. కూటమి ప్రభుత్వంలో రెక్కలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లైసెన్సులు రాకపోయినా రాజకీయ నేతల అండతో ఆక్వా దుకాణాలు తెరుస్తున్నారు. కొన్ని ప్రైవేటు ల్యాబ్లలో సరైన నిబంధనలు పాటించడం లేదు. ఇక పరీక్ష ధరల విషయానికి వస్తే ప్రభుత్వ ల్యాబ్లో నీటి పరీక్ష రూ.100 ఉంటే ప్రైవేటు ల్యాబ్లో రూ.200, మట్టి పరీక్ష రూ.210 ఉంటే ప్రైవేటులో రూ.300, మేతలో అన్ని పరీక్షుల కలిపి ప్రభుత్వ ల్యాబ్లో రూ.680 ఉంటే ప్రైవేటులో రూ.1200, పీసీఆర్ టెస్టు ప్రభుత్వ ల్యాబ్లో రూ.800 ఉండగా ప్రైవేటు ల్యాబ్లలో రూ.2,500 తీసుకుంటున్నారు. ఇక కొన్ని ఆక్వా దుకాణాల్లో మందులు కొనుగోలు చేసి చెరువులో చల్లడం వల్ల సాగు రైతులకు రూ.లక్షల్లో చేప పిల్లలు చనిపోతున్నాయి. నాసిరకం మందులపై ప్రశ్నిస్తే రాజకీయ నేతల అండతో బక్క రైతులపై దుకాణదారులు జులం ప్రదర్శిస్తున్నారు. వైఎస్సార్ సీపీ పాలనలో రూ.18.60 లక్షలు నిధుల కేటాయింపు వైఎస్సార్ సీపీ పాలనలో ల్యాబ్ ఆధునికీకరణకు రూ.18.60 లక్షలు కేటాయించారు. పరికరాలు కొనుగోలుతో పాటు ఎంజైమ్ లింక్ట్ ఇమ్యునోసోర్జెంట్ ఆస్సే(ఎలిషా) టెస్టు గదిని నిర్మించారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం సిబ్బందిని నియమించకపోవడంతో మూతపడింది. ల్యాబ్లో మొత్తం 6గురు సిబ్బందికి గాను కేవలం అశోక్ అనే ఎంపీఈవో సిబ్బంది ఒక్కరే పరీక్షలు చేస్తున్నాడు. ఇక్కడ ల్యాబ్ ఏడీ రాజ్కుమార్ను ఏలూరు ఏడీగా వేయడంతో అయన అక్కడ సేవలకే పరిమితమయ్యారు. గత పాలనలో సచివాలయ ఉద్యోగాల్లో భాగంగా ఇక్కడ మత్స్య సహాయకులను పరీక్షలకు నియమించారు. ఇప్పుడు వీఎఫ్ఏలు సచివాలయాలకు మాత్రమే పరిమితమవుతున్నారు. కూటమి హయాంలో ప్రభుత్వ ల్యాబ్ నిర్వీర్యం పరికరాలు ఉన్నా.. సేవలు శూన్యం సచివాలయాలకే పరిమితమవుతున్న వీఎఫ్ఏలు పెచ్చులూడటం వాస్తవమే కై కలూరు ఆక్వా లేబోరేటరీ బయట శ్లాబ్ పెచ్చులూడడం వాస్తవమే. ఇంజనీరింగ్ అధికారులకు తెలిపాం. ఎలిషా టెస్టుకు కాకినాడలో శిక్షణ పొందిన సిబ్బంది అవసరం. ఆక్వా దుకాణాలకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ క్షేత స్థాయిలో అధికారుల లాగిన్లో నిలిచాయి. దుకాణాల్లో, లేబ్లలో ప్రభుత్వ నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటాం. – బి.రాజ్కుమార్, మత్స్యశాఖ ల్యాడ్, ఏడీ, కై కలూరు పూర్తి స్థాయి సిబ్బందిని నియమించాలి ఫిషరీస్ ల్యాబ్ను రైతులకు అందుబాటులో ఉంచండి. సిబ్బంది లేకపోవడంతో ప్రైవేటు ల్యాబ్లను ఆశ్రయిస్తున్నాం. రాష్ట్ర స్థాయిలో ల్యాబ్ ఉన్నప్పటికీ ఆక్వా రైతుల నమ్మకాన్ని పొందలేకపోతుంది. ప్రభుత్వం ల్యాబ్కు మరమ్మతులతో పాటు పూర్తి స్థాయి సిబ్బందిని నియమించాలి. – సమయం రామాంజనేయులు, ఆక్వా రైతు, కై కలూరు -
సేంద్రియ సాగుతో ఖర్చు ఆదా
చింతలపూడి: రైతులు సేంద్రియ ఎరువులను వాడాలని చింతలపూడి వ్యవసాయ సబ్ డివిజన్ సహాయ సంచాలకులు వై సుబ్బారావు సూచిస్తున్నారు. ప్రస్తుత తరుణంలో రసాయన ఎరువులు అధికంగా ఉపయోగించడం వల్ల సాగు ఖర్చులు పెరిగి రైతులు నష్టాల్లో కూరుకు పోతున్నారని, సేంద్రియ సాగుతో ఖర్చులు తగ్గి లాభాలు చేకూరుతాయని తెలిపారు. సేంద్రియ ఎరువులు అంటే సేంద్రియ ఎరువుల్లో పశువుల ఎరువు, వానపాముల ఎరువు, గొర్రెలు, కోళ్ల ఎరువులు, పచ్చి రొట్ట ఎరువులు ముఖ్యమైనవి. వీటి వాడకం వల్ల భూమి సహజ స్థితిని పొందడమే కాక, పంటకు ప్రధాన పోషకాలు, సూక్ష్మ పోషకాలు లభిస్తాయి. నాణ్యమైన, విష రహితమైన పంటలను పండించవచ్చు. వీటితో పాటు వేరుశనగ, వేప, పొద్దు తిరుగుడు, ఆముదం చెక్కలను వాడడం వలన మొక్కలకు పోషక పదార్థాలు ఎక్కువగా లభిస్తాయి. పచ్చిరొట్ట ఎరువులు: సమగ్ర పోషక యాజమాన్యంలో పచ్చిరొట్ట ఎరువులు ప్రధానమైనవి. పచ్చి రొట్టతో వివిధ పంటల్లో దిగుబడి గణనీయంగా పెరుగుతుంది. పచ్చిరొట్టలో జీలుగ, జనుము, పిల్లి పెసర, అలసంద, పెసర, మినుము ముఖ్యమైనవి. జీవ ఎరువులు: పంటల పెరుగుదలకు కావలసిన పోషకాలను అందించే సూక్ష్మ జీవకణాల సముదాయాలను జీవన ఎరువులు అంటారు. వీటిలో నత్రజనిని స్థిరీకరించేవి రైజోబియం, నీలి ఆకుపచ్చ ఆకు, అజిటో బ్యాక్టీరియ, అజో స్పైరిల్లం, అజొల్లా ఒక రకం కాగా, భాస్వరంను భూమిలో లభ్యమయ్యేలా చేసే ఫాస్ఫో బ్యాక్టీరియ రెండోది. నీలి ఆకుపచ్చ నాచు: ఎకరాకు 4 కిలోల నాచు పొడిని ఇసుకతో కలిపి మడి అంతా సమానంగా పడేటట్లు వేయాలి. 7–10 రోజుల మధ్య మడిలో నీరు పెట్టాలి. నాచు గాలిలోని నత్రజనిని తీసుకుని స్థిరీకరిస్తుంది. దీనివలన ఎకరాకు 8–12 కిలోల నత్రజని పంటకు అంది దిగుబడి పెరుగుతుంది. అజటో బ్యాక్టర్: ఒక ఎకరానికి సరిపడే విత్తనానికి 200–400 గ్రాముల కల్చరును పట్టించాలి. లేదా కిలో కల్చరును 20 కిలోల పశువుల ఎరువుతో కలిపి ఎకరం నేలపై చల్లాలి. వరి, చెరకు, జొన్న, పత్తి, సజ్జ, మిరప పంటల్లో వేసుకుంటే మంచిది. దీని వల్ల ఎకరానికి 8–16 కిలోల నత్రజని పైరుకు అందుతుంది. అజొల్లా: దమ్ములో ఎకరానికి 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను వేసి పలుచగా నీరు పెట్టి 100–150 కిలోల అజొల్లా వేసి 2–3 వారాల తరువాత నేలలో కలియ దున్నాలి. ఎకరానికి 3 టన్నుల పచ్చిరొట్టతో 12 కిలోల నత్రజని అందుతుంది. భాస్వరపు జీవన ఎరువు: ఫాస్ఫో బ్యాక్టీరియ భూమిలో లభ్యంకాని స్థితిలోని భాస్వరాన్ని లభ్యమయ్యేలా చేస్తుంది. ఎకరాకు సరిపడే విత్తనంలో 200–400 గ్రాముల కల్చర్ను పట్టించాలి. లేదా ఒక కిలో కల్చరును 20 కిలోల పశువుల ఎరువుతో కలిపి ఎకరం నేలలో వేయాలి. ఇక రైతులు రసాయనిక ఎరువులను సిఫార్సు చేసిన మోతాదులోనే వాడాలని, అధిక మోతాదులో వాడితే పురుగులు, తెగుళ్లు అధికమై పంట దెబ్బతినే ప్రమాదం ఉందని సుబ్బారావు తెలిపారు. వై సుబ్బారావు, వ్యవసాయ సహాయ సంచాలకులు -
తేనెటీగల పెంపకంతో ఆర్థిక వృద్ధి
తాడేపల్లిగూడెం: తేనె టీగల పెంపకంతో ఆర్థిక స్వయం సమృద్ధి సాధించవచ్చని సీనియర్ సైంటిస్టు డాక్టర్ విజయలక్ష్మి అన్నారు. వెంకట్రామన్నగూడెంలోని కేవీకేలో గురువారం ప్రారంభమైన తేనెటీగల పెంపకం శిక్షణా కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. తేనెను శాసీ్త్రయంగా ఎలా ప్రోసెస్ చేయాలి, నాణ్యమైన తేనెను మిషనరీ ద్వారా కలుషితం లేకుండా బాట్లింగ్ వరకు ఎలా తీసుకురావాలనే విషయాలను విశదీకరిరంచారు. రూ.20 వేలతో ఒక ఎకరానికి నాలుగు బాక్సులు, రూ.5 వేలతో కావాల్సిన పరికరాలు కొనుగోలు చేసి ఉద్యాన పంటల మధ్య ఖాళీ స్థలంలో బాక్సులు ఎలా అమర్చాలనే విషయాల గురించి చెప్పారు. తేనె ఉప ఉత్పత్తులుగా మైనం, పుప్పొడి, జెల్లీ, విషం తయారు చేసి ఎకరాకు రూ.లక్ష ఆదాయం పొందవచ్చన్నారు. గాఢమైన పురుగుమందులు కొట్టే తోటల పక్కన కాని, రైల్వే ట్రాకుల పక్కన, విద్యుత్ స్తంభాల పక్కన తేనెటీగల పెంపకం కోసం బాక్సులు ఏర్పాటు చేయకూడదన్నారు. మూడు రోజుల పాటు శిక్షణలో తేనెటీగల పెంపకం, యాజమాన్య పద్ధతులు, తెగుళ్లు, నివారణ చర్యలు గురించి వివరిస్తామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ దీప్తి, దేవీవరప్రసాదరెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ స్తంభాన్ని ఢీకొని వ్యక్తి మృతితాడేపల్లిగూడెం రూరల్: విద్యుత్ స్తంభాన్ని మోటారు సైకిల్ ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. వివరాల ప్రకారం మండలంలోని జగన్నాథపురం గ్రామానికి చెందిన దండే శ్రీను (21) గురువారం బాదంపూడి నుంచి స్వగ్రామం మోటారు సైకిల్పై వస్తుండగా, నవాబుపాలెం వద్దకు వచ్చే సరికి కుక్కను తప్పించబోయి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. శ్రీను సోదరుడు చందు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై జేవీఎన్.ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వక్ఫ్ ఆస్తులకు నోటీసులు
ఆకివీడు: స్థానిక ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ పరిధిలో ఉన్న ముస్లిం కాంప్లెక్స్, మసీదులకు సంబంధించి బుధవారం జిల్లా వక్ఫ్బోర్డు ఇన్స్పెక్టర్ ఆడిటర్ కేఎండీ.ఆలీమ్ నోటీసులు అందజేశారు. వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్న ఆస్తులకు సంబంధించి అద్దెలు సక్రమంగా జమ కావడంలేదని వచ్చిన ఫిర్యాదుల మేరకు ఇకపై నేరుగా అద్దెలు, ఇతర సొమ్ముల జమను తమకే చెల్లించాలని జిల్లా వక్ఫ్బోర్డు నిర్ణయం తీసుకుందన్నారు. ఈమేరకు వక్ఫ్ ఆస్తులకు సంబంధించి నోటీసులు ఇచ్చినట్లు ఆలీమ్ చెప్పారు. స్థానికంగా మూడు మసీదులకు, ఈద్గా, చౌల్ట్రీ, ఇతర షాపులకు సంబంధించి లావాదేవీలు ఇకపై తమ పరిధిలోనే జరుగుతాయని చెప్పారు. కమిటీ ఏర్పాటు చేసేంతవరకూ ఈ విధానం కొనసాగుతుందన్నారు. నోటీసుల్ని ఆలీమ్తో పాటు సబార్డినేట్ బహుదూర్ షాపు, మసీదు గోడలపై అతికించారు. డిపార్టుమెంట్కే అద్దె చెల్లించాలని సూచన -
కొండ దిగి వస్తే సౌకర్యాలు కల్పిస్తాం
బుట్టాయగూడెం: ఏజెన్సీ ప్రాంతంలోని బాహ్య ప్రపంచానికి దూరంగా మారుమూల అటవీప్రాంతంలో ఉన్న మోదేలు గ్రామాన్ని ఐటీడీఏ పీఓ కె. రాములు నాయక్, వివిధ శాఖలకు చెందిన అధికారులు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా మోదేలు గిరిజనులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మోదేలు గ్రామం ఏర్పడి దశాబ్దాలు గడుస్తున్నా రోడ్డు, విద్యుత్ సౌకర్యం లేక అనే అవస్థలు పడుతున్నామని గిరిజనులు ఇటీవల రాష్ట్రపతికి లేఖ రాశారు. గత ప్రభుత్వంలో మోదేలు గ్రామానికి రోడ్డుతోపాటు విద్యుత్ సౌకర్యం కూడా మంజూరైందని, అయితే పనులు చేపట్టేందుకు ఫారెస్ట్ అధికారులు అభ్యంతరాలు చెబుతున్నారని లేఖలో తెలిపారు. ఈ లేఖకు సంబంధించి తాను కూడా ఢిల్లీ వెళ్లానని, కలెక్టర్ ఆదేశాల మేరకు మోదేలు గిరిజనులతో మాట్లాడేందుకు వచ్చినట్లు పీవో తెలిపారు. మోదేలు గ్రామం వన్యప్రాణుల అభయారణ్యం పరిధిలో ఉందని ఇక్కడ రోడ్డు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించే అవకాశాలు లేవని ఫారెస్ట్ అధికారులు అభ్యంతరాలు చెబుతున్నారని పీఓ చెప్పారు. ఈ నేపథ్యంలో మోదేలు గిరిజనులు కొండదిగి వస్తే బుట్టాయగూడెం మండలం డోలుగండి పరిసర ప్రాంతాల్లో ఇళ్లు నిర్మాణంతోపాటు రోడ్లు, విద్యుత్ సౌకర్యం, ఇతర సౌకర్యాలు కూడా కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. దీనిపై గ్రామస్తులంతా ఆలోచన చేసి ఒక అంగీకారానికి వస్తే సౌకర్యాల ఏర్పాటుకు ముందుకు సాగుతామన్నారు. ఈ కార్యక్రమంలో అలివేరు సర్పంచ్ కారం లక్ష్మి, ఎంపీటీసీ కొవ్వాసి గోవిందరావు, గిరిజన సంక్షేమ శాఖ డీఈ ఎం. శ్రీనివాస్, మాజీ సర్పంచ్ పట్ల చిన్నయ్య, ఏఎంఓ శిరమయ్య, కుక్కునూరు, జంగారెడ్డిగూడెం రేంజ్లకు చెందిన ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ రాములు నాయక్ -
ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అమలు చేయాలి
ఏలూరు (టూటౌన్): పోలవరం కాంటూరు లెక్కలన్నీ కాకి లెక్కలేనని, తక్షణం వాటిని రద్దు చేసి నిర్వాసితులందరికీ ఒకే విధమైన పరిహారం అందించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ కోరారు. న్యూఢిల్లీలో జరిగిన భూమి అధికార్ ఆందోళన జాతీయ సమావేశంలో ఏలూరు జిల్లా నుంచి రామకృష్ణ పాల్గొని మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు, భూ సమస్యలు, ఇళ్ల స్థలాల సమస్యలు, పేదల సమస్యలపై మాట్టాడినట్లు చెప్పారు. పోలవరం నిర్మాణంలో భూములు, ఇళ్లు కోల్పోతున్న వారికి ఇళ్లు ఖాళీ చేయించే నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరినీ యూనిట్గా గుర్తించి రూ.10 లక్షలు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అమలు చేయాలని కోరారు. మార్కెట్ రేటుకు 4 రెట్లు అదనంగా పరిహారం ఇవ్వాలని, ఇళ్లు, పశువులు, చెట్లకు సంబంధించి పరిహారం ఇవ్వాలని, రవాణాకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. పునరావాస కాలనీల్లో ఇళ్లను నాణ్యంగా నిర్మించాలని, రోడ్లు, తాగునీరు, మురుగు కాలువలు, విద్యుత్తు సరఫరా వంటి మౌలిక వసతులు కల్పించాలన్నారు. -
నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
ఏలూరు(మెట్రో): ఉత్పత్తుల తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం వల్ల వినియోగదారుల సంతృప్తితో బ్రాండ్ విలువ పెరుగుతుందని కలెక్టర్ కె. వెట్రిసెల్వి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో పరిశ్రమల శాఖ, ఎఫ్ఎస్ఎంఈతో కలిసి భారతీయ నాణ్యతా ప్రమాణాలపై(బీఐఎస్) నిర్వహించిన వర్క్ షాప్ను కలెక్టర్ ప్రారంభించారు. పరిశ్రమలకు సంబంధించి ఎంఎస్ఎంఈ స్కీంలపై ఎంపీ పుట్టా మహేష్ కుమార్ రూపొందించిన పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశ అనంతరం ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలకు మంజూరు పత్రాలను అందజేశారు. ఎఈపం పుట్టా మహేష్ కుమార్ పార్లమెంటు నుంచి వర్చువల్గా ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం నిర్వహించి పరిశ్రమలు రావడానికి కృషి చేస్తామని అన్నారు. ఎఫ్ఎస్ఎంఈ జాతీయ అధ్యక్షుడు ఏపీకె రెడ్డి, బీఐఎస్ డైరెక్టర్ శ్రీమతి ప్రేమ్ సజనీ పట్నాల తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో నానో ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడంతోపాటు ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వ్యవసాయాధికారులను ఆదేశించారు. ఎరువుల లభ్యత, నానో ఎరువుల వినియోగం, కౌలు రైతులకు రుణాలు, ఉద్యానవనాల విస్తరణ, పాడి పశువులకు వ్యాక్సినేషన్, బీమా, మత్స్య శాఖల కార్యక్రమాలపై అధికారులతో కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్న్సె ద్వారా కలెక్టర్ సమీక్షించారు. అలాగే పురపాలక సంఘాల్లో పౌర సేవలపై ప్రజలలో సంతృప్తి స్థాయిని పెంచేందుకు కృషి చేయాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. -
ట్రిపుల్ ఐటీలో ముగిసిన ప్లేస్మెంట్ స్కిల్స్ శిక్షణ
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీకి చెందిన ఈ4 విద్యార్థులకు ప్లేస్మెంట్ స్కిల్స్ పెంపొందించేందుకు గాను విద్యార్థులకు గత పదిరోజులుగా నిర్వహిస్తున్న నైపుణ్యాల పెంపుదల శిక్షణ బుధవారంతో ముగిసింది. యునైటెడ్ వే సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా కెరీర్ డెవలప్మెంట్ అండ్ ప్లేస్మెంట్ సెల్ (సీడీపీసీ) ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించగా దీనిలో మొత్తం 300మంది విద్యార్థులు పాల్గొన్నారు. సాఫ్ట్స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు అప్టిట్యూడ్, రీజనింగ్ వంటి అంశాల్లో శిక్షణ ఇచ్చారు. ముగింపు సందర్భంగా డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ ఫ్యాకల్టీలకు మొమెంటోలు అందజేశారు. కార్యక్రమంలో ఏఓ లక్ష్మణరావు, ప్లేస్మెంట్ సెల్ ఇన్చార్జి రుద్రం చింతయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ చెక్ పవర్ రద్దు ముదినేపల్లి రూరల్: పెయ్యేరు పంచాయతీ సర్పంచ్ చెక్పవర్ రద్దు చేస్తూ డీపీవో కె అనురాధ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీ నిధుల వినియోగంలో అవకతవకలు జరగడంతో పాటు పాలనా పరమైన అంశాల్లో అక్రమాలు చోటుచేసుకున్నట్లు గ్రామానికి చెందిన కొందరు గతంలో ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలపై విచారణ అనంతరం నివేదిక ఆధారంగా కలెక్టర్ ఆదేశాల మేరకు సర్పంచ్ చెక్పవర్ను రద్దు చేసినట్లు సమాచారం. చెక్పవర్ రద్దుపై వారం రోజుల లోపు సర్పంచ్ కలెక్టర్కు అప్పిల్ చేసుకోవచ్చని డీపీవో ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జాతీయస్థాయి క్రీడల్లో సత్తా చాటిన తన్మయ పెంటపాడు: జాతీయస్థాయి క్రీడా పోటీల్లో పెంటపాడు ప్రభుత్వ పోస్ట్ బేసిక్ హైస్కూల్ ప్లస్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని సత్తి తన్మయ శ్రీదేవి సత్తా చాటింది. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా స్పెషల్ ఒలింపిక్స్ భారత్ నిర్వహించిన బేస్బాల్ జాతీయ స్థాయి పోటీల్లో మహిళల వ్యక్తిగత విభాగంలో బంగారు పతకాన్ని గెలుచుకోవడంతోపాటు పార్ట్నర్ విభాగంలో సాధారణ బాలికతో కలిసి కాంస్య పథకాన్ని కూడా అందుకుంది. ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలో బిలాస్పూర్ అటల్ బిహారీ వాజ్పేయి విశ్వవిద్యాలయంలో ఈనెల 24 నుంచి 28 వరకు జరిగిన జాతీయ స్థాయి బేస్బాల్ చాంపియన్షిప్లో పోటీల్లో తన్మయ శ్రీదేవి ప్రతిభ కనబరిచింది. -
స్మార్ట్ మీటర్లు వద్దు
ఏలూరు (టూటౌన్): విద్యుత్ చార్జీల నిలువు దోపిడీ ఆపాలి, ప్రమాదకర స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు బుధవారం ఏలూరు పవర్ పేట రైల్వే స్టేషన్ నుంచి ఆర్ఆర్పేట మెయిన్ రోడ్డు వరకు ప్రజలతో సంతకాలు సేకరణ చేపట్టారు. సీఐటీయూ జిల్లా నాయకుడు పంపాన రవి, ఏఐటీయూసీ నేత ఉప్పులూరి హేమ శంకర్ మాట్లాడుతూ కరెంటు చార్జీలు పెంచే కార్యక్రమం ఉండదని కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చారని, ప్రతిపక్షంలో ఉండగా స్మార్ట్ మీటర్లు పగలగొట్టాలని లోకేష్, చంద్రబాబు బాబు కూటమి నేతలకు పిలుపునిచ్చారన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాట తప్పి నమ్మక ద్రోహం చేసిందన్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని లేని పక్షంలో ప్రజా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని కుటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు కాకి నాని మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అదానీ వ్యాపారానికి మరింత భరోసా కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలపై పెను భారం మోపుతూ స్మార్ట్ మీటర్లు బిగించే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ప్రజలపై సర్దుబాటు భారం రూ.15,485 కోట్లు, ట్రూఅప్ చార్జీల పేరుతో రూ.3 వేల కోట్లు కూటమి సర్కారు మోపిందన్నారు. ఏపీ రైతు సంఘం కార్యదర్శి డేగ ప్రభాకర్, ఇఫ్టూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.రవి మాట్లాడుతూ ఆగస్టులో ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో చేపట్టనున్న చలో విద్యుత్ భవన్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. ఐక్య కార్యాచరణ నాయకులు యర్రా శ్రీనివాసరావు, పల్లి గంగరాజు, ఈ శ్రీను, హనుమంత స్వామి, ఏఐటీయూసీ నాయకులు సాయన్న అభిలాష్ కుమార్, గొర్లి స్వాతి, ఉప్పులూరి లక్ష్మ తదితరులు పాల్గొన్నారు. -
మానవ అక్రమ రవాణా నిరోధానికి చర్యలు
ఏలూరు (టూటౌన్): మానవ అక్రమ రవాణా నిరోధానికి పటిష్ట చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ ఆదేశించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో బుధవారం అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా న్యాయ సేవాధికార సంస్థ అధికారులు, సామాజిక కార్యకర్తలు, సంఘ స్థాయి సభ్యులతో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా కె.రత్నప్రసాదు మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా సమాజంలో పెనుసవాల్గా మారిందని, సమాజం సమష్టి కృషితో నిరోధించాలని సూచించారు. ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యవంతులు చేయడం కోసం అవగాహన సదస్సులు ఏర్పాటు అక్రమ రవాణా నిరోధించడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. అక్రమ రవాణాకు గురైన బాధితులకు రక్షణ, పునరావాస సౌకర్యాలు కల్పిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల మహిళా పోలీసు ఇన్స్పెక్టర్లు సీ్త్ర శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ శారద తదితరులు పాల్గొన్నారు. -
మెట్ట ప్రాంత రైతులను ఆదుకోవాలి
కోట్లాది రూపాయల నిధులు కేటాయించి చేపట్టిన ఎత్తిపోతల పథకం నిర్మాణం నిరుపయోగంగా ఉంది. మెట్ట ప్రాంతంలో సన్న, చిన్నకారు రైతుల వేలాది ఎకరాలు వర్షాధారం మీద ఆధారపడి ఉన్నాయి. ప్రభుత్వం ఎర్రకాలువ ఎత్తిపోతల పథకాన్ని ఉపయోగంలోకి తీసుకొచ్చి రైతులను ఆదుకోవాలి. – కంభం విజయరాజు, వైఎస్సార్ సీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ ప్రభుత్వం చొరవ తీసుకోవాలి గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలోని, చెరువు ఆయకట్టు కింద రైతులు సాగునీరు అందక నానా అవస్థలు పడుతూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం నిరుపయోగంగా ఉన్న ఎత్తిపోతల పథకాన్ని ఉపయోగంలోకి తీసుకొచ్చి రైతులకు సాగునీరు అందించాలి. – మద్దుకూరి సత్యనారాయణ, రైతు, ఈస్ట్ యడవల్లి -
సంపద లేని కేంద్రాలు
బుట్టాయగూడెం: గ్రామాల్లో చెత్తాచెదారాన్ని సేకరించి స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు చెత్త నుంచి సంపద వచ్చేలా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా గ్రామ పంచాయతీలకు ప్రధాన ఆదాయ వనరుగా సాలిడ్ వేస్టు మేనేజ్మెంట్ సిస్టమ్ ఉపయోగపడుతుందన్న లక్ష్యంతో ప్రతి గ్రామ పంచాయతీ కేంద్రంలో ఈ షెడ్లను నిర్మించారు. గత ప్రభుత్వ పాలన సమయంలో రూ.లక్షల వ్యయంతో నిర్మించిన చెత్త నుంచి సంపద కేంద్రాలు నేడు పట్టించుకునే నాథుడు లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి. చాలాచోట్ల నిరుపయోగంగా.. జిల్లావ్యాప్తంగా చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల్లో చాలా వరకు నిరుపయోగంగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వంలో అధికారుల నిర్వహణా లోపం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో వీటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. తడి, పొడి చెత్త సేకరణకు సరైన సిబ్బందిని కూడా కేటాయించకపోవడంతో సంపద కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. ఉదాహరణకు.. బుట్టాయగూడెం మండలంలో మొత్తం 21 గ్రామ పంచాయతీలు ఉండగా వీటిని 18 గ్రామ సచివాలయాలుగా గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో చెత్త నుంచి సంపద తయారు చేయడానికి షెడ్లను నిర్మించారు. అయితే వీటిలో కేవలం మూడు మినహా మిగిలిన కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. ఆయా గ్రామ పంచాయతీల్లో చెత్త సేకరణలో సిబ్బంది కొరత కూడా ఉన్నట్లు తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు స్వచ్ఛాంధ్ర– స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నా చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలపై మాత్రం దృష్టి పెట్టడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా ఆయా పంచాయతీల పరిధిలో అవసరమైన మేరకు గ్రీన్ అంబాసిడర్లను ఏర్పాటు చేసి సంపద కేంద్రాల నిర్వహణకు కృషి చేయాలని పలువురు కోరుతున్నారు. చెత్త రాదు.. ఎరువు తయారు కాదు నిరుపయోగంగా చెత్త నుంచి సంపద కేంద్రాలు కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ రెడ్డిగణపవరంలో నిరుపయోగంగా.. బుట్టాయగూడెం మండలం రెడ్డిగణపవరంలో ఏర్పాటు చేసిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం నిరుపయోగంగా ఉంది. తోపుడు రిక్షాలు కూడా మూలన పడ్డాయి. కనీసం అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా తడి, పొడి, చెత్త సేకరణ చేసి సంపద కేంద్రాలను ఉపయోగంలోకి వచ్చే విఽ దంగా చర్యలు తీసుకోవాలి.–అందుగుల ఫ్రాన్సిస్, కేవీపీఎస్ నాయకులు, రెడ్డిగణపవరం పంచాయతీలో ఆదాయం లేదు గత ఆరు నెలలుగా పంచాయతీలకు రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు రావడంలేదు. దీనితో గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు అనేక అవస్థలు పడుతున్నాం. కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లలేని పరిస్థితిలో ఉన్నాం. గ్రీన్ అంబాసిడర్లు నెలకు రూ.15 వేలు అడుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో సిబ్బంది కొరతతో అనేక అవస్థలు పడుతున్నాం. –ఉయికే బొజ్జి, సర్పంచ్, కేఆర్పురం -
పాము కాటుతో రైతు మృతి
ముసునూరు: పాము కాటుకు ఓ రైతు బలయ్యాడు. వివరాల ప్రకారం అక్కిరెడ్డిగూడెంకు చెందిన రైతు ముత్తంశెట్టి భాస్కరరావు(65) బుధవారం తన పొలంలో పని చేస్తుండగా పాము కాటుకు గురయ్యాడు. స్థానికులు అతడ్ని హుటాహుటీన నూజివీడు ఏరియా ఆస్పత్రికి తరలిస్తూ ఉండగా, మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి మండవల్లి: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. వివరాల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా ఉండికి చెందిన మత్తె మణికంఠ(21) తన తాతయ్యకు అనారోగ్యంగా ఉండటంతో మోటారుసైకిల్పై ఉయ్యూరు వెళుతున్నాడు. బుధవారం తెల్లవారుజాము 3 గంటల సమయంలో లింగాల డ్రాప్ వద్ద ప్రమాదవశాత్తు బైక్ నుంచి కింద పడిపోయాడు. తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లి కుమారి ఫిర్యాదుపై ఏఎస్సై శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. జ్యూయలరీ వర్క్ షాప్లో చోరీ ద్వారకాతిరుమల: స్థానిక పసరుకోనేరు వద్ద ఉన్న జ్యూయలరీ వర్క్ షాపులో చోరీ జరిగింది. బాధితుడి కథనం ప్రకారం. తిమ్మాపురం గ్రామానికి చెందిన వి.హనుమంతరావు ద్వారకాతిరుమలలోని పసరుకోనేరు వద్ద జ్యూయలరీ వర్క్ షాపు నిర్వహిస్తున్నాడు. రోజూలానే మంగళవారం రాత్రి దుకాణానికి తాళం వేసి ఇంటికి వెళ్లిపోయాడు. తిరిగి బుధవారం ఉదయం షాపునకు వచ్చి చూడగా తాళం పగలగొట్టి ఉండడాన్ని గమనించాడు. తలుపులు తెరచి చూడగా షాపులోని 4 గ్రాముల బంగారం, పావుకేజీ వెండి, అలాగే రూ.2 వేలు నగదు పోయినట్లు గుర్తించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు. చర్చి కానుకల హుండీ చోరీ చాట్రాయి: మంకొల్లు గ్రామంలో ఆర్సీఎం చర్చి హుండీని మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. సమీపంలో ఉన్న తమ్మిలేరు ప్రాజెక్టు కాలువ వద్ద హుండీ పగల కొట్టి అందులో ఉన్న నగదును కాజేశారు. ఎకై ్సజ్ పోలీసులమంటూ బురిడీ అత్తిలి: ఎకై ్సజ్ పోలీసులమంటూ బురిడీ కొట్టించిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అత్తిలి ఎస్సై పి.ప్రేమరాజు తెలిపిన వివరాల ప్రకారం కంచుమర్రు గ్రామంలో కూల్డ్రింక్ షాపు నిర్వహిస్తున్న డి.నాగ వెంకట అశోక్ వద్దకు బుధవారం నలుగురు వ్యక్తులు కారులో వచ్చి ఎకై ్సజ్ పోలీసులమని నమ్మబలికి రూ.2 వేలు బలవంతంగా వసూలు చేసి వెళ్లిపోయారు. బాధితుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మంచిలి రోడ్డులో కారులో ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేటకు చెందిన వారు కాగా, ఒకరిది కృష్ణాజిల్లా కృత్తివెన్ను గ్రామం అని గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై చెప్పారు. -
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 2వ తేదీన ఫ్యాప్టో ఆధ్వర్యంలో తలపెట్టిన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఫ్యాప్టో నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక పవర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో ధర్నా సన్మాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయులను బోధనకు మాత్రమే పరిమితం చేయాలని, ఉద్యోగ ఉపాధ్యాయుల బకాయిలను వెంటనే చెల్లించాలని, 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని తదితర 18 డిమాండ్లతో ధర్నా తలపెట్టినట్టు చెప్పారు. ఏలూరు కలెక్టరేట్ వద్ద ఆగస్టు 2న నిర్వహించే ధర్నా కార్యక్రమంలో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఫ్యాప్టో చైర్మన్ జీ.మోహన్, సెక్రటరీ జనరల్ ఎం.ఆదినారాయణ, కో చైర్మన్ జి.వెంకటేశ్వరరావు, జి. ప్రకాష్రావు, డిప్యూటీ సెక్రటరీ జనరల్ కె.రవికుమార్, పవన్ కుమార్, సీహెచ్ శివరాం, ఐ.రమేష్, టి.రామరావు కార్యవర్గ సభ్యులు కె.కాంతారావు, ఈ.రామ్మోహన్, ఎన్.ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మర్యాదపూర్వక కలయిక
నూజివీడు: నూజివీడు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు బుధవారం మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయానికి వెళ్లిన ప్రతాప్ అప్పారావు జగన్ను కలిశారు. గుడ్ టచ్– బ్యాడ్ టచ్పై అవగాహన ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా శక్తి టీం సభ్యులు బుధవారం నగరంలోని పలు పాఠశాలల్లో, కాలేజీలలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించారు. శక్తి టీం సభ్యులు డ్రోన్ గస్తీ నిర్వహించారు. డ్రోన్ కెమెరాల సహాయంతో పాఠశాలలు, కళాశాలలు పరిసరాల్లో గస్తీ నిర్వహిస్తూ, అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులపై పర్యవేక్షణ కొనసాగించారు. వేధింపులు జరిగిన సందర్భంలో డయల్ 112, 181కు లేదా శక్తి టోల్ ఫ్రీ నెంబర్ 7993485111కు కాల్ చేయాలన్నారు. ముగిసిన ట్రిపుల్ఐటీ కౌన్సెలింగ్ నూజివీడు: రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ఐటీల్లో మూడు విడతల కౌన్సెలింగ్ అనంతరం మిగిలిన సీట్ల భర్తీకి బుధవారం తుది విడత కౌన్సెలింగ్ను నూజివీడు ట్రిపుల్ఐటీలో నిర్వహించారు. నాలుగు ట్రిపుల్ఐటీలలో కలిపి 143 సీట్లు ఖాళీగా ఉండగా వాటిని భర్తీ చేసేందుకు ఒక్కో సీటుకు ముగ్గురు చొప్పున 1:3 నిష్పత్తిలో మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థులను కౌన్సెలింగ్కు ఆహ్వానించారు. కౌన్సెలింగ్ ప్రక్రియ పొద్దుపోయే వరకు కొనసాగింది. 123 సీట్లు భర్తీ కాగా, 20 సీట్లు మిగిలాయి. కౌన్సెలింగ్ ప్రక్రియను అడ్మిషన్ల కన్వీనర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ పర్యవేక్షించారు. నిబంధనలకు విరుద్ధంగా పరీక్ష పెనుగొండ: పెనుగొండలోని ఎస్వీకేపీ అండ్ కోట్ల వెంకట్రామయ్య బాలికోన్నత ఎయిడెడ్ పాఠశాలలో కాంట్రాక్టు ఉపాధ్యాయులకు డీఈఓ అమలు చేసిన ఆన్లైన్ పరీక్షా విధానం నిబంధనలకు విరుద్ధంగా ఉందని పాఠశాల సెక్రటరీ, కరస్పాండెంట్ డాక్టర్ కే.రామచంద్రరాజు అన్నారు. బుధవారం విలేకర్లతో మాట్లాడుతూ జీఓలో పేర్కొన్న మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నట్లు యాజమాన్యం గుర్తించిందన్నారు. పరీక్షా విధానం, అభ్యర్థుల జాబితా విడుదలకు సంబంధించి నేరుగా యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదని వివరించారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అన్లైన్ పరీక్షా ఫలితాలు, నియమాకాలు తుది తీర్పు వెలువడిన తరువాత మాత్రమే ప్రకటించాల్సి ఉందన్నారు. పేద వర్గాలకు చేయూత నివ్వాలి భీమవరం (ప్రకాశంచౌక్): పీ4లో భాగంగా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో బుధవారం జాయింట్ కలెక్టర్ ఛాంబరులో రైస్ మిల్లర్స్, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఇన్చార్జి జిల్లా కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో దిగువ పేద వర్గాల వారిని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పీ4 కార్యక్రమాన్ని ప్రారంభించిందని, కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. మార్గదర్శకులు బంగారు కుటుంబాలను దత్తత తీసుకొని వారికి చేయూతనిస్తే వారు ఆర్థికంగా ఎదుగుతారన్నారు. జిల్లాలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తమ వంతు సేవా కార్యక్రమాల్లో ముందుంటున్నారన్నారు. -
ద్వారకాతిరుమలలో భారీ వర్షం
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమలలో బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. సాయంత్రం జల్లులు పడగా, రాత్రికి వర్షం ఊపందుకుంది. గంటపాటు ఎడతెరపి లేకుండా భారీగా వర్షం కురిసింది. దీంతో చినవెంకన్న ఆలయ మెట్ల మార్గంలోంచి నీరు వరదలా ప్రవహించింది. కొండపైన తూర్పు ప్రాంతంలోకి భారీగా వర్షం నీరు చేరింది. వర్షం ఆగిన తర్వాత నీరు దిగువ ప్రాంతానికి ప్రవహించింది. వ్యాయామ విద్య ప్రాంతీయ పర్యవేక్షకుడిగా జాన్సన్ దెందులూరు : వ్యాయామ విద్య ప్రాంతీయ పర్యవేక్షకుడిగా జాన్సన్ నియమితులయ్యారు. జాన్సన్ గోపన్నపాలెం వ్యాయామ కళాశాలలో ఐదేళ్లుగా లెక్చరర్గా పనిచేశారు. కోనసీమ అంబేద్కర్, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు పర్యవేక్షకుడిగా వ్యవహరించనున్నారు. -
రెండు దశాబ్దాలుగా ట్రయల్ రన్కే పరిమితం
కామవరపుకోట: ఆంధ్రప్రదేశ్ ఎర్రకాలువ ఎత్తిపోతల పథకం రెండు దశాబ్ధాలుగా ట్రయల్ రన్కే పరిమితమైంది. అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 9 కోట్లు కేటాయించినా పనులు సక్రమంగా పూర్తిచేయకపోవడంతో ఎత్తిపోతల పథకం నిరుపయోగంగా మారింది. మెట్ట ప్రాంతంలోని కామవరపుకోట, ద్వారకాతిరుమల మండలాల్లోని కొన్ని గ్రామాల రైతులకు నీటి వసతి కల్పించేందుకు 2003లో అప్పటి టీడీపీ ప్రభుత్వం నీటిపారుదల ఆయకట్టు అభివృద్ధి శాఖ ద్వారా ఆంధ్రప్రదేశ్ ఎర్ర కాలువ ఎత్తిపోతల పథకం చేపట్టింది. రూ.9 కోట్లతో నిర్మాణ పనులు రూ.9 కోట్లు నిధులు కేటాయించి కామవరపుకోట మండలంలోని ఈస్ట్ యడవల్లి సమీపంలో సుమారు 103 ఎకరాల విస్తీర్ణం గల గిరమ్మ చెరువు వద్ద నిర్మాణ పనులు చేపట్టారు. మూడు కిలోమీటర్ల వరకు పైపులైను వేసి అక్కడ నుంచి కాలువను తవ్వారు. ఈ కాలువను తవ్వుతుండగా ద్వారకాతిరుమల మండలం దొరసానిపాడు గ్రామానికి చెందిన కొందరు రైతులు తమ పొలాల మీదుగా కాలువ తవ్వవద్దంటూ అడ్డుకుని హైకోర్టును ఆశ్రయించారు. దీనితో కొంతకాలం పనులు నిలిచిపోయాయి. ఆ తరువాత ఆనాటి జిల్లా కలెక్టర్ నష్టపరిహారం ఇస్తామని రైతులకు నచ్చజెప్పి మరలా పనులు ప్రారంభించారు. ఆ కాలువను ద్వారకాతిరుమల మండలం దోరసానిపాడు వద్ద రెండు పాయలుగా విభజించి ఎడమ కాలువ ద్వారా ద్వారకాతిరుమల మండలంలోని చెలికానివారిపోతేపల్లి, దొరసానిపాడు, కుడి కాలువ ద్వారా కామవరపుకోట మండలంలోని ఈస్ట్యడవల్లి, వెంకటాపురం, రావికంపాడు గ్రామాల్లోని చెరువులను నింపి రైతులకు నీరు అందించేందుకు ప్రణాళిక రూపొందించారు. 7 వేల ఎకరాల సాగు లక్ష్యం ఈ ఎత్తిపోతల పథకం ద్వారా రెండు మండలాల్లోని సుమారు 6 గ్రామాల చిన్న సన్నకారు రైతులకు సాగునీరు అందించి 7 వేల ఎకరాలు సాగులోకి తీసుకురావాలనేది లక్ష్యం. దీనిద్వారా ఆయకట్టు కింద పామాయిల్, కోకో, కొబ్బరి అరటి వంటి పంటల ద్వారా రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. అయితే ఈ ఎత్తిపోతల పథకం పనులను అప్పటి టీడీపీ ప్రభుత్వం సక్రమంగా చేపట్టకపోపవడంతో రెండు దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ ఈ ప్రాజెక్టు నిరుపయోగంగానే మారింది. పైప్లైన్ పనులు సక్రమంగా నిర్వహించకపోవడంతో ఎత్తిపోతల పథకం ద్వారా కాలువలకు సక్రమంగా నీరు చేరడం లేదు. దీంతో అప్పుడప్పుడు అధికారులు రావడం.. ట్రయల్ రన్ వేయడం తప్ప ఎత్తిపోతల పథకాన్ని ఉపయోగంలోకి తీసుకురావడం లేదు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఆ ఎత్తిపోతల పథకాన్ని ఉపయోగంలోకి తీసుకొచ్చి మెట్ట ప్రాంత రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. నిరుపయోగంగా ఎర్రకాలువ ఎత్తిపోతల పథకం -
దిగుబడి లేదు
ధర బాగున్నా.. గణపవరం: నిన్న మొన్నటి వరకూ రొయ్యకు ధర లేదు. సాగు గిట్టుబాటు కావడం లేదని, క్రాప్ హాలిడే ప్రకటిస్తామని రైతులు రోడ్డెక్కారు. ఇప్పుడు రొయ్య ధర కనీవినీ ఎరుగని విధంగా పెరిగిపోయింది. 100 కౌంట్ రొయ్య ధర కిలో రూ.280 పలుకుతుంది. ఈ ధర రూ.300కు చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. రెండు వారాల కిత్రం కిలో రూ.220 పలికిన ఈ కౌంట్ ధర అమాంతం కిలో రూ.190కు పడిపోయింది. ప్రస్తుతం రొయ్య ధర రోజురోజుకు పెరిగిపోతూ రొయ్య రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. వారం వ్యవధిలోనే కిలో రూ.280కు చేరింది. ఈ ధర మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రొయ్య ధర అమాంతం పెరిగిపోతుంది. ఇంకేముంది రొయ్య రైతులకు మంచి రోజులు వచ్చాయని అనుకుంటే పొరపాటే.. రొయ్య ధర పెరిగినా సాగులో ఉన్న చెరువులు మొత్తం వైరస్ దెబ్బకు ఖాళీ అయ్యాయి. ఏదో వేళ్ల మీద లెక్కపెట్టగలిగే అరకొరగా మాత్రమే రొయ్య సాగు జరుగుతుంది. అది కూడా ప్రస్తుతం చాలా తక్కువ కౌంట్ సైజులో మాత్రమే ఉంది. దీంతో ఽరొయ్యధర పెరిగినా తమకు ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయిందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. వైరస్ దెబ్బకు చెరువులు ఖాళీ ఉమ్మడి జిల్లాలో 1.20 లక్షల ఎకరాలలో రొయ్య సాగు జరుగుతుండగా ప్రస్తుతం 25 శాతం చెరువుల్లో మాత్రమే సాగు జరుగుతుంది. గత వేసవిలో రైతులను ఆదుకోవాల్సిన సాగు చావు దెబ్బ తీసింది. అకాల వర్షాలు, వాతావరణ మార్పులతో తెగుళ్లు విజృంభించి చెరువులు ఖాళీ అయ్యాయి. కౌంట్కు రాకుండానే వేల ఎకరాలలో రొయ్యలను పట్టేసి అయినకాడికి అమ్ముకున్నారు. ఒక్కసారిగా 100 కౌంట్ రొయ్యధర రూ.225 నుంచి రూ.200కు పడిపోయింది. గత్యంతరం లేక రైతులు ఆ ధరకే రొయ్యలను అమ్ముకోక తప్పలేదు. వైరస్ దెబ్బకు ఖాళీ అయిన చెరువులలో జూలై నెలారంభం నుంచి మళ్లీ సీడ్ వేయడం ప్రారంభించారు. ఇంకా చాలా చెరువులు ఖాళీగానే ఉన్నాయి. బ్లీచింగ్, సున్నం వంటివి చల్లి ఆరపెట్టి ఉంచారు. ఉంగుటూరు నియోజకవర్గం నాలుగు మండలాలలో రొయ్యసాగు సుమారు ఐదు వేల ఎకరాలలో సాగుతుంది. వేసవిలో వాతావరణ మార్పుల కారణంగా వైట్ స్పాట్ ఇతర వైరస్ వ్యాధులు విజృంభించడంతో 50 శాతం చెరువులు ఖాళీ అయ్యాయి. వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రతలు, అకాల వర్షాల కారణంగా మిగిలిన చెరువులలో ఆక్సిజన్ సమస్యతో రొయ్యలను అర్థాంతరంగా పట్టేసి అయినకాడికి అమ్ముకున్నారు. నియోజకవర్గంలో ఎక్కవగా సన్న, చిన్నకారు రైతులే రొయ్యసాగు చేస్తున్నారు. వీరంతా వైరస్ వ్యాప్తితో ఈ పంట మొత్తం కోల్పోయి, నష్టాలు మూటకట్టుకున్నారు. వైరస్ దెబ్బతో ఆక్వా చెరువులు ఖాళీ లబోదిబోమంటున్న రొయ్య రైతులు దిగుబడి బాగుంటే ధర ఉండదు రొయ్య దిగుబడి బాగున్నప్పుడు ధరలు పతనమవుతాయి. చెరువులు ఖాళీ అయ్యాక ధరలు ఎగిసిపడతాయి. ఇది రొయ్య రైతుల దయనీయ పరిస్థితి. ఏడాది పొడవునా ఇదే పరిస్థితి. ఇది మార్కెట్లో వ్యాపారుల మాయాజాలం. ప్రస్తుతం జిల్లాలో వివిధ కారణాలతో 80 శాతం రొయ్యల చెరువులలో పట్టుబడులు చేసేశారు. ఇప్పుడు పెరిగిన ధరలు ఏ కొద్దిమంది రైతులకో తప్ప ఎక్కువ రైతులకు ఏ మాత్రం ఉపయోగపడవు. రొయ్యల ధర, మేతలు, మందుల ధరలపై ప్రభుత్వ పూర్తి నియంత్రణ ఉంటేనే రైతులకు ఉపయోగం. –కాకర్ల వినాయకం, ఆక్వా రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు -
జెడ్పీ ఉద్యోగులకు పదోన్నతులు
ఏలూరు(మెట్రో): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ యాజమాన్యంలో పనిచేస్తున్న ఎగువ శ్రేణి సహాయకులకు పరిపాలనాధికారులుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు బుధవారం యలమంచిలి మండల పరిషత్లో పనిచేస్తున్న సీహెచ్.ఎ.పద్మజ, కాళ్ల మండల పరిషత్తో పనిచేస్తున్న జి.నాగేశ్వరరావులకు ఉత్తర్వులను అందజేశారు. కాగా ఇప్పటి వరకు 74 మందికి పదోన్నతులు కల్పించామని, వారిలో ఏవోలుగా 29 మంది, సీనియర్ అసిస్టెంట్లుగా 31మంది, జూనియర్ అసిస్టెంట్లుగా ఆరుగురు, రికార్డ్, లైబ్రెరీ, ల్యాబ్ అసిస్టెంట్లుగా 10 మందికి పదోన్నతులు కల్పించినట్లు జెడ్పీ చైర్పర్సన్ పద్మశ్రీ తెలిపారు.గుర్తుతెలియని వ్యక్తి మృతిభీమవరం: స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు వన్టౌన్ సీఐ ఎం.నాగరాజు చెప్పారు. ఈనెల 26వ తేదీన ఆర్టీసీ బస్టాండ్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి సొమ్మసిల్లి పడిపోగా అధికారులు 108 అంబులెన్స్లో చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ఆ వ్యక్తి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుడి ఆచూకీ తెలిసినవారు 94407 96632, 94407 96633 నంబర్లలో సంప్రదించాలని సీఐ నాగరాజు కోరారు. -
భారీగా సెల్ఫోన్ల రికవరీ
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా పోలీస్ శాఖ మరోసారి భారీఎత్తున సెల్ఫోన్లు రికవరీ చేసింది. 16వ దఫాలో ఏకంగా 480 సెల్ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అప్పగించింది. మంగళవారం ఏలూరు అమీనాపేట సురేషచంద్ర బహుగుణ కళ్యాణమండపంలో ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ విలేకరుల సమావేశంలో బాధితులకు వారి సెల్ఫోన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులు సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్(సీఈఐఆర్) పోర్టల్లో చేసిన ఫిర్యాదుల ఆధారంగా ఏలూరు సీసీఎస్, సైబర్ క్రైమ్, పోలీస్ విభాగాలు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టి సెల్ఫోన్లను రికవరీ చేశారని, వీటి విలువ మార్కెట్లో సుమారుగా రూ.57.60లక్షలు ఉంటుందన్నారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా, ఎన్టీఆర్, అంబేద్కర్ కోనసీమ, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలతోపాటు తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ శివకిషోర్ చెప్పారు. చోరీకి గురైన వస్తువు కొనుగోలు చేయటం, విక్రయించటం, దాచిపెట్టటం ఐపీసీ 2023లో 317 సెక్షన్ మేరకు శిక్షకు అర్హులని, ఈ నేరానికి గరిష్టంగా మూడేళ్లు జైలు శిక్ష విధిస్తారని ఎస్పీ స్పష్టం చేశారు. ఏలూరు జిల్లాలో ఇప్పటి వరకూ సుమారుగా 3,456 సెల్ఫోన్లు రికవరీ చేశామనీ, ఈ సెల్ఫోన్ల విలువ సుమారుగా రూ.5 కోట్ల 33 లక్షల 35 వేల 684గా ఉందని ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్, సీసీఎస్ సీఐ వెంకటేశ్వరరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 16వ దఫా 480 ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేత విలువ రూ.57.60 లక్షల అని అంచనా -
అదృశ్యమైన యువకుడు శవమై తేలాడు
ద్వారకాతిరుమల: ఇంటి నుంచి బయటకు వెళ్లి అదృశ్యమైన యువకుడు పంగిడిగూడెం వద్ద పోలవరం కుడి కాలువలో శవమై కనిపించాడు. వివరాల్లోకి వెళితే. మండలంలోని కొమ్మర గ్రామానికి చెందిన పొద్దుటూరి శ్యామ్(21) గత రెండేళ్లుగా ద్వారకాతిరుమలలోని ఈకామ్ ఎక్స్ప్రెస్ కొరియర్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. గత ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంటి నుంచి బైక్పై వెళ్లిన శ్యామ్ తిరిగి ఇంటికి రాలేదు. చుట్టుపక్కల, బంధువుల ఇళ్ల వద్ద వెదికినా ఫలితం లేదు. దాంతో శ్యామ్ తల్లి సంకురమ్మ సోమవారం స్థానిక పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయగా, హెడ్ కానిస్టేబుల్ దుర్గారావు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కాగా మంగళవారం పంగిడిగూడెం వద్ద పోలవరం కుడి కాలువలో మృతదేహం లభించగా అది శ్యామ్గా గుర్తించారు. భీమడోలు సీఐ యుజే విల్సన్, ద్వారకాతిరుమల ఎస్సై టి.సుధీర్, సిబ్బంది శ్యామ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మిస్సింగ్ కేసును అనుమానాస్పద మృతిగా మార్పుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. శ్యామ్ మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అతడికి తల్లి, ఒక అన్నయ్య ఉన్నారు. పంగిడిగూడెం వద్ద పోలవరం కుడి కాలువలో యువకుడి మృతదేహం లభ్యం -
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
టి.నరసాపురం: ఆయిల్పామ్ గెలలు కోస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృతి చెందాడు. టి.నరసాపురంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కె.జగ్గవరం గ్రామానికి చెందిన కొమ్ము రవింద్ర (22) ఆయిల్పామ్ గెలలు నరికే పని చేస్తుంటాడు. మంగళవారం మరో వ్యక్తితో కలిసి టి.నరసాపురం గ్రామానికి చెందిన రైతు పొలంలో ఆయిల్పామ్ గెలలు నరికే పనికి వెళ్లాడు. గెలలు కోస్తుండగా గెలలు కోసే గెడకు విద్యుత్ షాక్ తగిలి రవీంద్ర కిందకు పడిపోయాడు. స్థానికులు వెంటనే రవీంద్రను చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. రూ.10 లక్షలు పరిహారం ఇవ్వాలని ధర్నా చింతలపూడి ఏరియా హాస్పిటల్లో ఉన్న రవింద్ర మృతదేహాన్ని ఆయిల్పామ్ గెలలు నరికే కార్మికులు, సీఐటీయూ నాయకులు సందర్శించారు. అనంతరం ఫైర్ స్టేషన్ సెంటర్లో మృతుని కుటుంబీకులతో కలసి ధర్నా నిర్వహించారు. రవీంద్ర కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఆందోళనకారులతో చర్చించి ఆందోళన విరమింపజేశారు. -
కొబ్బరి ధరహాసం
● రికార్డు స్థాయిలో నీటి కొబ్బరి, కురిడీ ధరలు ● తమిళనాడు, కేరళలో పంట తగ్గడమే కారణం ● వరుస పండుగలతో పెరిగిన కొబ్బరి ధరలు ● కొబ్బరి వ్యాపారులు, రైతుల్లో హర్షం ●అవగాహన అవసరం ప్రస్తుతం మార్కెట్ ధర అత్యధికంగా ఉంది. రైతులు బాగా తయారైన కాయలను దింపు తీయించడం ద్వారా ఽమంచి ధరను పొందవచ్చు. ప్రభుత్వం కోకోనట్ పరిశోధన కేంద్రాలను ఏర్పాటుచేసి మన ప్రాంతంలో కొబ్బరి రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి. – మైగాపుల రాంబాబు, కోకోనట్ సంఘ మాజీ అధ్యక్షుడు, పాలకొల్లు ప్రభుత్వం శ్రద్ధ వహించాలి ప్రస్తుతం ధరను బట్టి రైతుల్లోనూ కొబ్బరి పంటపై ఆసక్తి పెరుగుతుంది. ధరలు లేవని సరైన అవగాహన లేక కొందరు కొబ్బరి చెట్లను నిర్లక్ష్యం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వమే ప్రత్యేక శ్రద్ధ వహించి రైతుల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. – కఠారి నాగేంద్రకుమార్, పాలకొల్లు కోకోనట్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, పాలకొల్లు పాలకొల్లు సెంట్రల్: గత రెండు నెలలుగా రికార్డు స్థాయిలో కొబ్బరి ధరలు పలుకుతుండడంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పశ్చిమగోదావరి జిల్లాలో పచ్చి కొబ్బరి, కురుడి, కొత్త కొబ్బరి కాయ దొరకడమే గగనంగా మారింది. ప్రస్తుతం శ్రావణమాసం ప్రారంభం కావడంతో మార్కెట్లో కొబ్బరికి డిమాండ్ మరింత పెరగడంతో ఇక్కడ కూడా పంటకు కొరత ఏర్పడింది. ధర ఉన్నా సరుకు అందుబాటులో లేకపోవడంతో ధర మరింత పెరిగే అవకాశం ఉంటుందని రైతులు ఎదురు చూస్తున్నారు. జిల్లాలో దాదాపుగా 80 వేల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతుంది. ఉమ్మడి పశ్చిమ జిల్లాలో ఏలూరు, నిడదవోలు, జంగారెడ్డిగూడెం, రెడ్డిసీమ, కోరుమామిడి, చింతలపూడి, ద్వారకాతిరుమల, దేవరపల్లి, పెదవేగి, కొవ్వూరు, నల్లజర్ల, గోపాలపురం, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, భీమవరం, తణుకు, పాలకొల్లు, మొగల్తూరు, పేరుపాలెం వంటి ప్రాంతాల్లో కొబ్బరి పంట అధికంగా కొనసాగుతుంది. జోరుగా కొబ్బరి మార్కెట్ శ్రావణమాసానికి ముందుగానే జిల్లాలో కొబ్బరి మార్కెట్ జోరందుకుంది. కురుడి కొబ్బరికై తే ధర రికార్డు స్థాయిలో ఉండడం గమనార్హం. ప్రస్తుతం మార్కెట్లో పాత కాయల్లో పెద్ద సైజు గిలక కాయలు వెయ్యి కాయల ధర రూ.24,500, చిన్న సైజు కాయలు రూ.20 వేలు వరకూ మార్కెట్ జరిగింది. అలాగే కొత్త రకం కాయల్లో పెద్ద (అరవైబత్తి) సైజు రూ. 22,500, చిన్న సైజు కాయలు రూ.18 వేలు వరకూ ఉంది. నెంబర్ కాయ (అతి చిన్న సైజు) కొబ్బరి రూ.15 నుంచి 18 వేలు పలుకుతుంది. కురుడీ కాయలో పెద్ద సైజు ధర రూ.30 వేల గటగట సైజు రూ.27 వేల వరకూ పలుకుతోంది. పండుగల ప్రభావం మన రాష్ట్రం నుంచి గుజరాత్, మహారాష్ట్ర, చత్తీస్ఘడ్, ఉత్తర ప్రదేశ్, డిల్లీ, పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒరిస్సా, హర్యానా వంటి అనేక రాష్ట్రాలకు ఇక్కడ నుంచి ఎక్కువగా ఎగుమతులు అవుతుంటాయి. శ్రావణమాసంలో దాదాపుగా ఈ ఒక్క నెలలోనే శ్రావణ శుక్రవారాలు, మంగళవారాలు, శుక్ల ఏకాదశి, బహుళ ఏకాదశి, దూర్వాగణపతి హోమం, వరలక్ష్మీ వ్రతం, సంకట హర చతుర్థి, శ్రీకృష్ణాష్టమి, మాసశివరాత్రి రాఖీ పౌర్ణమి, పోలాల అమావాస్య, నాగ పంచమి, ఆగస్టు నెలలో వినాయకచవితి రావడంతో ఆయా రాష్ట్రాల్లో పండుగ వాతావరణం అంతా ఈ నెలలోనే ఉండడంతో కొబ్బరి మార్కెట్ నిలకడగా ఉండడానికి కూడా ఒక కారణంగా చెబుతున్నారు. కాయల్లో నాణ్యత ఉండాలి రైతులు దింపు తీసేటప్పుడు నాణ్యమైన నిక్కర్చి కాయలను మాత్రమే దింపు తీయాలి. బరువైన కాయలు దింపు తీయడం వల్ల అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశం లేక కాయలు కుళ్లిపోతుంటాయి. నిక్కర్చి కాయలు బరువు తక్కువ ఉండే బాగా తయారైన కాయలు దింపు తీయడం వల్ల మార్కెట్ ధర కూడా ఎక్కువగా ఉంటుందని వ్యాపారస్తులు చెబుతున్నారు. దింపు తీసే కార్మికులు అందుబాటులో లేకపోవడంతో రైతులు కొంత ఇబ్బందులు పడుతున్నారు. కొబ్బరి విజ్ఞాన కేంద్రాలు ఉమ్మడి పశ్చిమలో పెదవేగిలో తూర్పు గోదావరిలో అంబాజీపేటలోనే ఉన్నాయి. కొబ్బరి పంటపై రైతుల్లో అవగాహన కల్పించేలా ప్రభుత్వం అవగాహనా సదస్సులు ఏర్పాటుచేయాలి. తమిళనాడు, కేరళలో దిగుబడులు లేకపోవడమే ప్రస్తుతం మార్కెట్లో కొబ్బరి ధరకు ఇంత జోష్ రావడానికి ప్రధాన కారణం తమిళనాడు, కేరళలో కొబ్బరి దిగుబడి తగ్గడమే. ఇటీవల వేసవిలో ఈ రెండు రాష్ట్రాల నుంచి కొబ్బరి బొండాల వ్యాపారం జోరుగా కొనసాగడంతో నేడు పంట దిగుబడి తగ్గి మన రాష్ట్రంలో కొబ్బరికి డిమాండ్ పెరిగింది. అందువల్ల గుజరాత్, ఉత్తర ప్రదేశ్, బీహార్, చత్తీస్ఘడ్, మహారాష్ట్ర వంటి ప్రాంతాలకు మన ప్రాంతం నుంచే కొనుగోలు చేయాల్సి రావడంతో ధరలు ఆకాశాన్నంటాయని వ్యాపారస్తులు చెబుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సీజన్లో రోజుకు సుమారు 80 నుంచి 100 లారీల వరకూ ఎగుమతులు జరుగుతుంటాయి. అన్ సీజన్లో అయితే జిల్లాలో రోజుకు సుమారు 30 నుంచి 40 లారీల వరకూ ఎగుమతులు జరుగుతుంటాయని వ్యాపారస్తులు చెబుతున్నారు. ప్రస్తుతం సీజన్ అయి ఉండి ధర కూడా అధికంగా ఉన్నా సరుకు లేకపోవడం వల్ల రోజుకు సుమారు 60 నుంచి 80 లారీలు వరకూ ఎగుమతులు అవుతున్నాయని అంటున్నారు. -
చోరీ కేసుల్లో నిందితుల అరెస్ట్
ఏలూరు టౌన్: ఏలూరులో రాత్రివేళ ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న కేసులో ఇద్దరు నిందితులను, బైక్ల చోరీలకు పాల్పడుతున్న మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.11.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, 17 మోటార్సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద మంగళవారం విలేకరుల సమావేశంలో ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ వివరాలు వెల్లడించారు. కై కలూరు మినీబైపాస్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను ఏలూరు వన్టౌన్ సీఐ సత్యనారాయణ బృందం అదుపులోకి తీసుకుని విచారించగా పలు ఇంటి చోరీల్లో బంగారు ఆభరణాలు అపహరించినట్లు నిర్ధారించారు. వారివద్ద నుంచి రూ.11.50 లక్షల విలువైన హారం, చంద్రహారం, మురుగులు, ఉంగరాలు, చెవిమాటీలు, నవరత్నాల దిద్దులు, బేబీ రింగులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుల్లో నిందితులైన గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పిల్లి సురేష్ అలియాస్ శివ, పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన నాగళ్ళ ముత్తయ్య గుప్తాలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరిపై చోరీ, కొట్లాట, మోసం కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసును ఛేదించిన సీఐ సత్యనారాయణ, వన్టౌన్ ఎస్సై ఎస్కే మదీనా బాషా, ఎస్సై నాగబాబు, వన్టౌన్ ఏఎస్సై అహ్మద్, హెచ్సీ రమేష్, కానిస్టేబుళ్లు మోహన్, నాగార్జున, నాగరాజు, శేషుకుమార్, రుహుల్లా, సీసీఎస్ ఏఎస్సై గోపి, హెచ్సీ రమణ, పీసీ రజని ఉన్నారు. వీరిని ఎస్పీ అభినందించారు. మోటార్సైకిళ్లు స్వాధీనం ఏలూరు త్రీటౌన్ సీఐ వీ.కోటేశ్వరరావు, భీమడోలు సీఐ యూజే విల్సన్ వారి పోలీస్స్టేషన్ల పరిధిలో ప్రత్యేక నిఘా, తనిఖీలు చేపట్టి భారీగా చోరీకి గురైన మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు, ఎస్సై రాంబాబు, సిబ్బందితో నిఘా ఉంచి ఇద్దరు దొంగలను అరెస్ట్ చేశారు. వారిద్దరి నుంచీ 14 మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకోగా, వాటి విలువ సుమారు రూ.6.68 లక్షలుగా ఉంటుందని అంచనా. ఇక భీమడోలు సీఐ విల్సన్ ఆధ్వర్యంలో ద్వారకాతిరుమల ఎస్సై సుధీర్ తమ సిబ్బందితో తనిఖీలు చేసి 3 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.1.40 లక్షలు ఉంటుందని అంచనా. కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన సయ్యద్ రజాక్, సయ్యద్ కరీముల్లాను అదుపులోకి తీసుకుని విచారించగా మోటారు సైకిళ్ల చోరీ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రతిభ చూపిన పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఇళ్ల దొంగతనాల్లో ఇద్దరు, బైక్ చోరీల్లో మరో ఇద్దరి అరెస్ట్ రూ.11.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, 17 మోటార్సైకిళ్లు స్వాధీనం -
ఫసల్ బీమా.. రైతులకు ధీమా
చింతలపూడి, దెందులూరు : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన (పీఎంఎఫ్బీవై) రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందే వరకు అన్నదాతలకు ఆందోళన తప్పడం లేదు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో రైతన్నలకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రైతులకు ధీమానిస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడలతో పంటలకు నష్టం వాటిల్లితే కర్షకులకు ఇబ్బంది లేకుండా బీమా వర్తించేలా ఈ పథకాన్ని రూపొందించినట్లు సహాయ సంచాలకులు వై సుబ్బారావు, దెందులూరు మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసరాజు తెలిపారు. బీమా ప్రీమియం చెల్లించేందుకు వరి పంటకు ఆగస్టు 15 వరకు సమయం ఉండగా మినుముల పంటకు మాత్రం ఈనెల 31 వరకు మాత్రమే గడువు ఉందని, రైతులు త్వరపడాలన్నారు. రైతులకు కలిగే ప్రయోజనాలు ఖరీఫ్లో ఆహార ధాన్యాలు, చిరు ధాన్యాలు, నూనె గింజలు పండించే రైతులు ఎకరానికి రూ.840 చెల్లించాలి. వరి పంటకు నష్టం సంభవింస్తే ఎకరానికి రూ.42 వేల వరకు బీమా పొందే అవకాశం ఉంటుంది. మినుముల పంటకు రూ.300 చెల్లించాల్సి ఉండగా రూ.20 వేల వరకు బీమా పొందవచ్చు. రుణాలు తీసుకోని రైతులు, కౌలు రైతులు కూడా బీమా కట్టుకోవచ్చు. బీమా వర్తింపు ఇలా.. ముంపు, చీడపీడలు, తుపాన్లు, అగ్ని ప్రమాదాలు, వడగళ్లు, పెను గాలుల ధాటికి పంట నష్టపోయినప్పుడు ఫసల్ బీమా వర్తిస్తుంది. అదేవిధంగా పంట కోసి పనలపై ఉన్నప్పుడు అకాల వర్షాలు, తుపాన్లు కారణంగా పంట దెబ్బతిన్న ఘటనల్లో కూడా బీమా వర్తింపచేశారు. ఒకవేళ తుపాన్లు, వరదలు సంభవించినప్పుడు పంట ముంపుకు గురైతే 48 గంటల్లోగా సంబంధిత బ్యాంక్ వారికి, బీమా కంపెనీకి, వ్యవసాయశాఖ అధికారులకు సమాచారం అందించాలి. గ్రామం యూనిట్గా.. గ్రామంలో పండే ప్రధాన పంటను గ్రామం యూనిట్గా పరిగణిస్తారు. ఏలూరు జిల్లాలో వరి పంటను గ్రామం యూనిట్గా గుర్తించారు. పంట ముంపుకు గురైనప్పుడు, వడగళ్ల వానలకు దెబ్బ తిన్నప్పుడు బీమా వర్తిస్తుంది. 50 శాతానికి పైగా పంట దిగుబడి నష్టం జరిగితే నిబంధనల మేరకు నష్టాన్ని అంచనా వేసి 25 శాతం బీమా సొమ్మును వెంటనే చెల్లిస్తారు. రైతులు కూడా అధిక వర్షాలు, లేదా అనావృష్టి పరిస్థితులు సంభవించినప్పుడు 7 రోజుల్లోగా ప్రభుత్వ అధికారులకు సమాచారం అందించాల్సి ఉంటుంది. ఇదికాక వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కూడా అమల్లో ఉంది. రైతులు ఈ బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ అధికారులు విజ్ఞప్తి చేశారు. -
భవన నిర్మాణ కార్మికుల పోరుబాట
ఏలూరు (టూటౌన్): రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల బిల్డింగ్ వెల్ఫేర్ బోర్డును తక్షణం పునరుద్ధరించాలని వివిధ కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అధికారం చేపడితే సంక్షేమ బోర్డును తక్షణం పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, సంక్షేమ బోర్డుకు రూ.కోటి జమ చేస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు హామీ ఇచ్చి తుంగలోకి తొక్కారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణం బోర్డును పునరుద్ధరించాలని కోరుతూ ఈ నెల 28న ఆయా తహసీల్దార్ల కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించారు. కార్మిక శాఖ కార్యాలయం ఎదుట, జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళ చేపట్టేందుకు సిద్దమవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 2 లక్షల మంది కార్మికులు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల భవన నిర్మాణ రంగ కార్మికులు సుమారు 2 లక్షల మంది వరకు ఉన్నారు. వీరిలో తాపీ పని నుంచి సెంట్రింగ్, ఎలక్ట్రికల్ వర్క్స్, పెయింటర్స్, టైల్స్ వేసేవారు, వీరికి సహాయకులు ఇలా 18 రకాల పనివారు ఈ జాబితాలోకి వస్తారు. కార్మికుల డిమాండ్లివే ● కార్మికుల సంక్షేమానికి బిల్డింగ్ వెల్ఫేర్ బోర్డును పునరుద్దరించాలి. ● పెండింగ్ క్లైయిమ్లు పరిష్కరించాలి. ● వయస్సు రీత్యా పనిచేయలేని వారికి, పనిచేస్తూ ప్రమాదాలకు గురై అంగవైకల్యం పొందిన వారికి సంక్షేమ బోర్డు నుంచి పింఛన్ సౌకర్యం కల్పించాలి. ● సిమెంట్, ఇటుక, ఐరన్, చిప్స్ తదితర మెటీరియల్ ధరలు అదుపు చేయాలి ● కార్మికులకు వెల్ఫేర్ బోర్డు నుండి కై ్లములు చెల్లించకపోవడం వల్ల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలకొద్దీ పెండింగ్లో ఉన్నాయి. సంక్షేమ బోర్డు లేకపోవడం వల్ల 18 రకాల భవన నిర్మాణ రంగ కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందంటున్నారు. వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరించాలని ఆందోళనలు ప్రభుత్వం స్పందించకుంటే ఉధృతం చేసే యోచన -
టీచర్లపై పీ4 ప్రయోగం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: టీచర్లు పీ4 దాతలుగా మారాలి.. ప్రతి మండలంలో 190 మంది ఉపాధ్యాయులు మార్గదర్శకులుగా నమోదై ఒక్కొక్కరూ ఐదు పేద కుటుంబాలను దత్తత తీసుకోవాలి. ఇవి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో డీఈఓ జారీ చేసిన ఉత్తర్వులు. ఉపాధ్యాయ సంఘాల తిరుగుబాటుతో ఆ ఉత్తర్వులను నిలిపివేశారు. పీ4 పథకాన్ని బలవంతంగా జనాలపై రుద్దే ప్రక్రియలో భాగంగా దాతల అన్వేషణ కొనసాగుతూనే ఉంది. జిల్లాలో 99,905 కుటుంబాలను బంగారు కుటుంబాలుగా గుర్తించిన ప్రభుత్వం దాతల సాయం కోసం ఎదురుచూస్తుండగా ఇంతవరకు 4,908 మంది దాతలు రిజిస్టరయ్యారు. దాతలుగా ఆశించిన స్థాయిలో ఎవరూ ముందుకు రాకపోవడంతో దాతల అన్వేషణ కొనసాగుతూనే ఉంది. వివాదాస్పదంగా విద్యా శాఖ ఉత్తర్వులు డబ్బున్న వ్యక్తులు పేదల కుటుంబాలను దత్తత తీసుకుని ఆర్ధిక సహకారం, విద్య ద్వారా పైకి తీసుకువచ్చేలా బాధ్యత తీసుకోవాలని ప్రభుత్వం పీ4 పథకాన్ని అమలు చేస్తోంది. దీనిలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ 11న ఆగిరిపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పథకాన్ని ప్రారంభించి ఎంపిక చేసిన దాతలను కొనియాడి సన్మానం చేశారు. సభ జరిగిన రోజు మండలంలో 206 కుటుంబాలను దత్తత తీసుకున్నారు. మంత్రి కొలుసు పార్ధసారధి కుమారుడు నితిన్ సాయికృష్ణ 22 కుటుంబాలను దత్తత తీసుకున్నారు. అప్పటి నుంచి జిల్లా స్థాయిలో ప్రతి వారం పీ4పై సమీక్ష, డోనర్ల జాబితా పేరిట అంకెలతో కూడిన నివేదికపై సమీక్షలు కొనసాగుతున్నాయి. పైకి తీసుకురావాల్సిన కుటుంబాలు ఎక్కువగా ఉండటం, దాతలు తక్కువగా ఉండటం, డబ్బున్న దాతల నుంచి స్పందన లేకపోవడంతో నిరంతర సమీక్షలు, రకరకాల ఉత్తర్వులతో అధికార యంత్రాంగం జిల్లాలో పీ4 జపం చేస్తోంది. ఈ పరిణామాల క్రమంలో కలెక్టర్ ఆదేశాలతో విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వులు వివాదాస్పదంగా మారాయి. ప్రతి మండలంలో హెచ్ఎంలు, టీచర్లు సగటున 190 మంది ఉంటారని, ఒక్కొక్కరు 2 నుంచి 5 కుటుంబాలను దత్తత తీసుకోవాలని, 24 గంటల వ్యవధిలో అందరూ పీ4 పథకంలో మార్గదర్శకులుగా నమోదు కావాలని సర్క్యులర్ జారీ చేశారు. ఉపాధ్యాయ సంఘాలు మొదలుకొని టీచర్ల వరకు నిరసన గళం విప్పడంతో ఉత్తర్వులు నిలిపివేశారు. ఇప్పటికే ఉపాధ్యాయులు, వివిధ కేడర్లలోని ఉద్యోగులు జీతభత్యాలు సక్రమంగా అందక, ప్రభుత్వ హామీలు అమలుకాక సతమతమవుతుండగా, వారిపై పీ4 ఒత్తిడి తేవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒక్కో టీచర్ 5 కుటుంబాలను దత్తత తీసుకోవాలి ఉపాధ్యాయుల తిరుగుబాటుతో నిలిచిన వ్యవహారం దాతలు దొరక్క అధికారుల తంటాలు ప్రారంభానికి ముందే పీ4 విఫలం టార్గెట్ల పేరుతో వేధింపులు పీ4 అమలుకు సంబంధించి ప్రభుత్వం జిల్లాలకు టార్గెట్లు కేటాయించింది. ఇంట్లో వినియోగించే వస్తువులు, కరెంటు, ఇతర అంశాలను ప్రామాణికంగా తీసుకుని రెండు నెలల క్రితం పీ4 సర్వేను జిల్లా వ్యాప్తంగా నిర్వహించి జిల్లాలో తక్షణమే పైకి తీసుకురావాల్సిన 99,905 బంగారు కుటుంబాలను గుర్తించారు. ఆ కుటుంబాల్లో 2,70,860 మంది ఉన్నారు. ఇంత వరకు జిల్లాలో 4,908 మంది మార్గదర్శకులుగా నమోదై 38,504 కుటుంబాలను దత్తత తీసుకున్నారు. మిగిలిన 61,400 కుటుంబాలకు దాతల అవసరం ఉంది. ఈ క్రమంలో దాతల అన్వేషణలో భాగంగా స్థానిక వ్యాపారులు మొదలుకొని ఎన్ఆర్ఐల వరకు సాయం చేయమని కోరుతున్నా పూర్తి స్ధాయిలో దాతలు ముందుకు రాలేదు. -
ఐకమత్యంతో సాగాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): అందరూ ఐకమత్యంతో ముందుకు సాగాలని తద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర మాజీ హోం శాఖ మంత్రి తానేటి వనిత సూచించారు. మంగళవారం స్థానిక డీసీఎంఎస్ ఫంక్షన్ హాల్లో ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ ప్రారంభోత్సవ సమావేశం జాతీయ అధ్యక్షుడు రెబ్బ ఇమ్మానుయేల్, జాతీయ కార్యదర్శి జీవన్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న తానేటి వనిత మాట్లాడుతూ ప్రతి ఒక్కరు దేవుడి మనస్తత్వాన్ని కలిగి ఉండాలన్నారు. ప్రేమ, క్షమించడం, ఆదరణ లక్ష్యాలుగా జీవిస్తేనే మోక్షమార్గం లభిస్తుందన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయకుమార్ మాట్లాడుతూ ఐకమత్యంతో ప్రతి ఒక్కరు జీవించాలన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను పూర్తిస్థాయిలో పేద బడుగు బలహీన వర్గాలకు అందేలా స్వచ్ఛంద సంస్థల నాయకులు కృషి చేయాలన్నారు. ఆర్సీఎం ఏలూరు పీఠాధిపతి డాక్టర్ పొలిమేర జయరావు మాట్లాడుతూ ఆధ్యాత్మిక అభివృద్ధి ఐక్యత, సేవ, ప్రేమ గుణాలతో ప్రతి ఒక్కరు జీవించాలన్నారు. ఆలిండియా పాస్టర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి పాస్టర్ జీవన్ కుమార్ మాట్లాడుతూ దేశంలోని 28 రాష్ట్రాల పరిధిలో పాస్టర్లు అంతా కలిసి ఆలిండియా పాస్టర్స్ ఫెడరేషన్గా ఏర్పడినట్లు తెలిపారు. జాతీయ అధ్యక్షుడు బిషప్ ఇమ్మానియేల్ మాట్లాడుతూ క్రైస్తవులపై దాడుల నివారణ, పేదలకు సేవ లక్ష్యంగా ఫెడరేషన్ ఏర్పడిందన్నారు. ఈ సందర్భంగా పాస్టర్లు జాతీయ జెండాలు ప్రదర్శించారు. అనంతరం ఫెడరేషన్ లోగోను, జీవన్ కుమార్ రాసిన ఆధ్యాత్మిక పుస్తకాన్ని ఆవిష్కరించారు. సమావేశంలో వైఎస్ థామస్ రెడ్డి, రెక్టార్ జనరల్ పీ బాల, రెక్టార్ ఫాదర్ ఐ.మైఖేల్, సుప్రీంకోర్టు న్యాయవాది, ఏపీ లాయర్స్ ఫోరం చైర్మన్ జీ రోనాల్డ్ రాజు, బిషప్ కారుపాటి శాంతి సాగర్, ఏలూరు నగర మాజీ డిప్యూటీ మేయర్ ఎన్.సుధీర్ బాబు పాల్గొన్నారు. -
పరిహారం లేదు
సంక్షేమ బోర్డు అమల్లో ఉంటే ఏదైనా అనుకోని సందర్భాల్లో ప్రమాదాలు జరిగితే రూ.30 వేల వరకు పరిహారం చెల్లించేవారు. ప్రస్తుతం బోర్డు అందుబాటులో లేకపోవడంతో తాపీ కార్మికులకు ఎలాంటి సహాయ, సహాకారాలు అందడం లేదు. – పుప్పాల భాస్కరరావు, తాపీ మేస్త్రి, దోసపాడు, దెందులూరు మండలం క్లైయిమ్లు పరిష్కరించాలి సంక్షేమ బోర్డు అమలులో లేకపోవడం వల్ల జిల్లాలో వేల కొద్దీ క్లెయిమ్లు పెండింగ్లో ఉన్నాయి. రెండేళ్ల క్రితం నా కుమార్తె డెలివరీ నిమిత్తం బోర్డు నుంచి డబ్బులు రావాల్సి ఉంది. అప్పటి నుంచి పెండింగ్లో ఉంది. సంక్షేమ బోర్డును తక్షణం పునరుద్ధరించి పెండింగ్లో ఉన్న క్లైయిమ్లు వెంటనే పరిష్కరించాలి. సొంగ రంగారావు, సెంట్రింగ్ కార్మికుడు, ఏలూరు బోర్డును పునరుద్ధరించాలి సంక్షేమ బోర్డును తక్షణం పునరుద్దరించాలి. బోర్డును పునరుద్దరించకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్లు కూటమి ప్రభుత్వం తక్షణం సంక్షేమ బోర్డును పునరుద్ధరించి పెండింగ్ క్లైయిమ్లు పరిష్కరించాలి. కార్మికులను ఆదుకోవాలి. – పి.కిషోర్, ఏఐటీయూసీ జిల్లా నాయకుడు, ఏలూరు పోరు బాట పడతాం సంక్షేమ బోర్డును పునరుద్ధరించేంత వరకు కార్మికుల పక్షాన పోరు బాట పడతాం. ఇప్పటికే కార్మిక శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులకు అనేక సార్లు వినతులు అందజేశాం. కార్మికుల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి చిత్త శుద్ది ఉంటే తక్షణం సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి. – బద్దా వెంకట్రావు, ఇఫ్టూ జిల్లా ప్రధానకార్యదర్శి● -
భూ సేకరణ పూర్తి చేయాలి
ఏలూరు(మెట్రో): పోలవరం ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ పనులకు సంబంధించి భూ సేకరణపై కలెక్టరు కె.వెట్రిసెల్వి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి భూములు అందించిన నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో భాగంగా భూమికి భూమి, ఆర్ అండ్ ఆర్ కాలనీల నిర్మాణం, తదితర పనులకు ఏలూరు జిల్లాలో ఇంకా 5 వేల ఎకరాల భూమి అవసరమని, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో 800 ఎకరాలను గుర్తించామన్నారు. మిగతా 4,200 ఎకరాలు వారానికి 500 ఎకరాలు చొప్పున ఆగస్టు15 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. పూర్తిగా గిరిజనేతర భూములు మాత్రమే గుర్తించాలని స్పష్టం చేశారు. భూమిని గుర్తించిన తర్వాత ఆయా గ్రామాలలో గ్రామసభలు నిర్వహించాలని కలెక్టరు ఆదేశించారు. ఆయా రైతులతో ఆర్డీవో, డీఎస్పీ అధికారులు చర్చించి వారి సమక్షంలో గ్రామ సభలు నిర్వహించాలని సూచించారు. భూములకు పరిహారాన్ని ప్రభుత్వ నిబంధనలు ప్రకారం రైతులకు చెల్లించటానికి అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా అధికార యంత్రాంగం వ్యవహరించాలని కలెక్టరు సూచించారు. పోలవరం నుంచి భారీగా నీటి విడుదల ఏలూరు (ఆర్ఆర్పేట): పోలవవరానికి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. తెలంగాణ, మహారాష్ట్రల్లో కురిసిన వర్షాలకు గోదావరి, శబరి నదులు ఉధృతంగా ప్రవహించడంతో గోదావరిలో వరద పోటెత్తుతోంది. గత నాలుగు రోజుల నుంచి రోజుకు సగటున 5 లక్షల క్యూసెక్కుల నీరు పోలవరం నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం 6 గంటల సమయానికి పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే నీటిమట్టం 31.050 మీటర్లుండగా దిగువకు 6,70,335 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భూ కేటాయింపులు రద్దు చేయాలి నూజివీడు: మంత్రి కొలుసు పార్థసారథి కుటుంబ సభ్యులకు చెందిన నితిన్ కృష్ణ కనస్ట్రక్షన్ కంపెనీకి ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో 45.60 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి నిమ్మగడ్డ నరసింహ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎకరం కేవలం రూ.ఐదు లక్షలకే విక్రయించటం దుర్మార్గమన్నారు. వాస్తవానికి ఆగిరిపల్లి ప్రాంతంలో ఎకరం భూమి రూ.50 లక్షలపైగా ఉందని, భూపందేరం వెనుక ఏదో మతలబు ఉన్నట్టు అనిపిస్తుందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమాన్ని, హామీల అమలును విస్మరించి ప్రభుత్వ భూములు, ప్రకృతి సంపదలను కార్పొరేట్ కంపెనీలకు, కేబినేట్ పెద్దలకు అప్పగిస్తూ పాలన చేయటం సబబుకాదన్నారు. అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలి భీమవరం అర్భన్: సమాజం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరు అక్షర జ్ఞానం కలిగి ఉండాలని, జిల్లాలోని నిరక్షరాస్యలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. మంగళవారం వయోజన విద్యా శాఖ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి ‘అక్షర ఆంధ్ర’ అక్షరాస్యత 2025–26పై శిక్షణా తరగతుల ప్రారంభ సభలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 2029 నాటికి నిరక్షరాస్యులు లేని జిల్లాగా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంచేందుకు అధికారులు నిరంతరాయంగా కృషి చేయాలన్నారు. స్వర్ణకార సంఘ కార్యవర్గం ఎన్నిక ఆకివీడు: ఉమ్మడి పశ్చి మగోదావరి జిల్లా స్వర్ణకార సంఘం నూతన కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు కమిటీ చైర్మన్ పట్నాల శేషగిరిరావు చెప్పారు. ఆరోసారి తమను ఎన్నుకోవడంతో డబుల్ హ్యాట్రిక్ సాధించామన్నారు. 25 ఏళ్లపాటు ఒక సంఘం ఏకగ్రీవంగా ఎన్నికవడం ఇదే ప్రథమమన్నారు. స్వర్ణకారులకు, విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులకు సంఘం తరుఫున చేసిన సేవల్ని గుర్తించి ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చెప్పారు. అధ్యక్షుడిగా తనతో పాటు ప్రధాన కార్యదర్శిగా నల్లగొండ వెంకట రామకృష్ణ, కోశాధికారిగా కొమ్మోజు రామకృష్ణ, కార్యవర్గ సభ్యులు కొనసాగుతారని చెప్పారు. -
న్యాయం చేయకపోతే పోరు ఉధృతం
జంగారెడ్డిగూడెం: గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులకు న్యాయం చేయకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని, ఆగస్టు 4న గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల చలో కలెక్టరేట్ నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ హెచ్చరించారు. మంగళవారం జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలోని మానవతా కల్యాణ మండపంలో నిర్వాసిత రైతుల సదస్సు నిర్వహించారు. సదస్సుకు వామిశెట్టి హరిబాబు అధ్యక్షత వహించారు. రైతుల సమస్యలు చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. ఆగస్టు చలో కలెక్టరేట్ కార్యక్రమం చేపట్టాలని, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులకు వినతి పత్రాలు అందజేయాలని సదస్సులో ఏకగ్రీవంగా తీర్మానించారు. కె.శ్రీనివాస్ మాట్లాడుతూ నిర్వాసిత రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేరలేదని, రైతులను మోసగించారని తీవ్రంగా విమర్శించారు. సర్వీస్ రోడ్ల నిర్మాణం చేయకపోవడం వల్ల పొలాలకు వెళ్లే మార్గాలు లేక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఆర్బిట్రేషన్ పిటిషన్ల ద్వారా పరిహారం పెంచి ఇస్తామని హామీ ఇచ్చి కొద్దిమందికి కొద్ది పరిహారం పెంచి మిగిలిన రైతులకు అన్యాయం చేయడం తగదన్నారు. చింతలపూడి, టి.నర్సాపురం, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లి తదితర మండలాల్లో గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం వల్ల తలెత్తిని సమస్యలు పరిష్కారం చేయాలన్నారు. సదస్సులో రైతుల పోరాట కమిటీ నాయకులు వామిశెట్టి హరిబాబు, అల్లూరి రామకృష్ణ, దేవరపల్లి సత్యనారాయణ, శీలం రామచంద్రరావు, ఎలికే తాతారావు, వందనపు సాయిబాబా, కె.నాగేశ్వరావు, కె.రంగారావు, జి.నర్సిరెడ్డి, బొడ్డు రాంబాబు, పి.శ్రీహరి తదితరులు మాట్లాడుతూ సర్వీస్ రోడ్లు లేకపోవడం వల్ల గ్రామాల రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. 2013 భూ సేకరణ చట్ట ప్రకారం పరిహారంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సదస్సుకు ముందుగా గురవాయిగూడెంలో రైతులు ధర్నా చేపట్టారు. గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల తీర్మానం