breaking news
Eluru
-
నిర్వాసితులను గాలికొదిలేశారు
ఏలూరు (టూటౌన్): పోలవరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. ఆ పార్టీ ఏలూరు జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవనంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు విభజిత ఆంధ్రప్రదేశ్కు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టును 2027కి పూర్తి చేస్తామని చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను సకాలంలో వినియోగించి యుటిలైజేషన్ సర్టిఫికెట్ ఇవ్వలేని స్థితిలో ఉండి 2027కి పోలవరం ప్రాజెక్టు ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉన్న ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులను గాలికి వదిలేశారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు ఎత్తు తగ్గిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదని ధ్వజమెత్తారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి ప్రయోజనాలను నెరవేర్చలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో రోజుకో మాట మాట్లాడుతూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని విమర్శించారు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రాధాన్యత క్రమంలో జరిపేందుకు, నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ -
చిరుద్యోగులపై పచ్చ ప్రతాపం
ఏలూరు (టూటౌన్): ప్రభుత్వం ఇచ్చే నామమాత్రపు గౌరవ వేతనం రూ.8 వేలతో కాలం వెళ్లదీస్తున్న వీవోఏలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వారి జీవితాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. తెలుగు తమ్ముళ్ల వేధింపులు, బెదిరింపులు ఎక్కువయ్యాయి. మీరు ఉద్యోగాల్లోంచి తప్పుకుంటే మా మనుషులను పెట్టుకుంటామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కి ధర్నాలు, నిరసనలకు దిగితే ఊరుకునేది లేదని.. మొత్తం అందరినీ విధుల్లోంచి తొలగిస్తామంటూ బెదిరిస్తున్నారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 39,539 డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి. వీటి పరిధిలో 3,89,801 మంది సభ్యులు ఉన్నారు. గ్రామ సమాఖ్యలు 1300 వరకు ఉన్నాయి. వీటి పరిధిలో 1300 మంది వీవోఏలు పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఆరు నెలల వ్యవధిలోనే 150 మందిని ఎలాంటి కారణాలు లేకుండా తొలగించారు. స్థానిక తెలుగు తమ్ముళ్లు చెప్పినట్లు వింటేనే విధుల్లో ఉండండి లేకుండా రాజీనామాలు చేసి వెళ్ళిపోండి అని బెదిరిస్తున్నారు. లింగపాలెం మండల పరిధిలో 11 మందిని తెలుగు తమ్ముళ్ళు విధుల్లోంచి తొలగించేలా చేసారు. వీరిలో ఏడుగురు ఎస్సీలు ఉండటం గమనార్హం. వీరంతా కలిసి కోర్టుకు వెళ్ళారు. కోర్టు సైతం వారిని విధుల్లో కొనసాగించాలంటూ ఉత్తర్వులు ఇచ్చింది. వీరు ఇంతకు ముందు పనిచేసే చోట కొత్తవారిని నియమించేసారు. దీంతో 11 మంది కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని కోరుతూ డీఆర్డీఏ అధికారులు, స్పందనలో కలెక్టర్కు తమ గోడు మొరపెట్టుకున్నారు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పుడు ఇబ్బంది ఏమి ఉంది వెళ్లి మీ విధులు మీరు చేసుకోండి అని చెప్పి పంపించేస్తున్నారు. తీరా అక్కడకు వెళ్ళాక ఆ మండల ఏపీఎం వీరితో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో ఒక్క మాట చెప్పి మిమ్మళ్లను విధుల్లోకి తీసుకుంటామంటూ చెప్పడంతో బాధితులు ఎవ్వరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అందని వేతనాలు జిల్లా వ్యాప్తంగా వీవోఏలకు నెల నెలా వేతనాలు విడుదల చేయడం లేదు. అసలే ఇచ్చేది నామమాత్రపు వేతనం. అదీ నెల నెలా ఇవ్వకపోవడం పట్ల వీవోఏలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గట్టిగా అడిగితే స్థానిక ప్రజాప్రతినిధులు ఇష్టముంటే చేయండి లేకుంటే తప్పుకోండి అంటూ సమాధానం ఇస్తుండటంతో వీవోఏలు మౌనంగానే వేతనాలు రాకపోయినా తమ పని తాము చేసుకుని వెళుతున్నారు. వీఓఏల ప్రధాన డిమాండ్లు బకాయి వేతనాలు చెల్లించాలి. ఆన్లైన్ పని భారం తగ్గించాలి. 5జీ మొబైల్స్ అందించాలి. కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలి. వేతనాలు పెంచాలి. హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి. రూ.10 లక్షల గ్రూప్ బీమా కల్పించాలి. అర్హులైన వారికి సీసీలుగా ప్రమోషన్లు కల్పించాలి. జిల్లాలోని వీవోఏలపై కూటమి నాయకుల వేధింపులు వేధింపులు తట్టుకోలేక రాజీనామాలు తెలుగు తమ్ముళ్లకు వత్తాసు పలుకుతున్న డీఆర్డీఏ ఏపీఎంలు, సీసీలు -
హత్యకేసులో ఆరుగురి అరెస్ట్
● రెండు రోజుల్లోనే కేసును చేధించిన పోలీసులు ● చోరీ సొత్తు పంపకాల్లో విభేధాలే హత్యకు కారణం: పోలీసులు జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం పట్టణంలో జరిగిన హత్యకేసును పోలీసులు రెండు రోజుల్లోనే చేధించారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ యు.రవిచంద్ర వెల్లడించారు. ఆదివారం స్థానిక పోలీసు సర్కిల్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలో చేసిన దొంగతనాలకు సంబంధించి చోరీ సొత్తు పంపకాల విషయంలో జరిగిన విభేదాల కారణంగా పాత నేరస్తుడు కర్రి రాజేష్ (26) హత్యకు దారి తీసినట్లు చెప్పారు. ఈ కేసులో పట్టణానికి చెందిన షేక్ ఖాసిం, అతని అన్నలు షేక్ నాగుల్ మీరా, షేక్ జహీరుద్దీన్ అలియాస్ చోటు, వాసంశెట్టి పవన్కుమార్ అలియాస్ స్కైలాబ్, సమ్మంగి మంగరాజు, మరీదు సాయి అలియాస్ సైకో సాయిలను అరెస్టు చేసినట్లు డీఎస్పీ చెప్పారు. కర్రి రాజేష్, షేక్ ఖాసిం తదితరులు కలిసి దొంగతనాలు చేసేవారని, గతంలో వరంగల్ జిల్లాలో చేసిన దొంగతనాల్లో సొత్తు పంపకాల విషయంలో విభేదాలు తతెత్తినట్లు చెప్పారు. జంగారెడ్డిగూడెంలో పోలీసులు గతంలో రాజేష్ను అరెస్టు చేసినప్పుడు ఖాసిం తదితరుల పేర్లు పోలీసులకు చెప్పడంతో వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపధ్యంలో తమకు కోర్టులో బెయిల్ కోసం రూ.2 లక్షల వరకు ఖర్చు అయ్యాయని, ఖాసిం తదితరులు బెయిల్ కోసం ఖర్చుచేసిన డబ్బులు ఇవ్వాలని రాజేష్ను ఒత్తిడి చేశారు. అప్పటి నుంచి రాజేష్ తప్పించుకుని తిరుగుతుండగా, వీరి మధ్య వివాదం ముదిరింది. గత నాలుగైదు నెలల క్రితం ఖాసింను చంపేందుకు కర్రి రాజేష్ పథకం రూపొందించగా, అది విఫలమైంది. అది తెలుసుకున్న ఖాసిం, అతని సోదరులు నాగుల్ మీరా, జహీరుద్దీన్ రాజేష్ను అంతమొందించాలని పథకం వేశారు. ఈ నెల 3న రాజేష్ను అతని ఇంటికి వెళ్లి వెంబడించి తీసుకువెళ్లి స్థానిక బైనేరు ఒడ్డున ఖాసిం ముఠా హత్య చేసింది. ఆరుగురు కలిసి రాజేష్ను తీవ్రంగా కొట్టి, టవల్తో కాళ్లు కట్టేసి, పలు సార్లు కత్తితో పొడిచి గొంతు కోసి, చాకుతో పొడిచి పేగులు బయటకు వచ్చేలా దారుణంగా హత్య చేశారని డీఎస్పీ వివరించారు. హత్యకు ఉపయోగించిన రెండు చాకులు, రెండు మోటార్సైకిళ్లు, ఒక స్కూటీ, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులపై పలు స్టేషన్లలో కేసులు నిందితులు షేక్ ఖాసింపై సస్పెక్ట్ షీట్ ఉందని, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, నల్లజర్ల, వరంగల్లో పలు కేసులు ఉన్నట్లు చెప్పారు. నాగుల్ మీరాపై జంగారెడ్డిగూడెం, వరంగల్, స్కైలాబ్పై జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెంలలో, మంగరాజు, చోటు, సైకో సాయిలపై జంగారెడ్డిగూడెం స్టేషన్లో కేసు ఉన్నట్లు డీఎస్పీ చెప్పారు. వీరిపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని, అవసరమైతే పీడీ యాక్ట్ అమలు చేస్తామన్నారు. -
మట్టి అక్రమ తవ్వకాలు
కొయ్యలగూడెం: తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత అన్న చందంగా గంగవరం మెట్ట ప్రాంతం సిరులు కురిపిస్తుంది. రాజవరం పంచాయతీ గంగవరం మెట్టగా పిలవబడే ప్రాంతం నాణ్యమైన గ్రావెల్కి పెట్టింది పేరు. దీంతో కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, ద్వారకా తిరుమల మండలాలకు చెందిన అక్రమార్కులు సిండికేటుగా ఏర్పడి గ్రావెల్ తవ్వకాలను భారీగా నిర్వహిస్తున్నారు. గ్రావెల్ తవ్వకాలు లాభసాటిగా ఉండటంతో అక్రమార్కులు ఏకంగా సొంతంగా లారీలనే కొనుగోలు చేసి గ్రావెల్ తవ్వకాలు కొనసాగిస్తున్నారు. తవ్వకాలను నిరోధించాల్సిన వివిధ శాఖల అధికారులకు ముందుగానే అధికార పార్టీ పెద్దలు హుకుం జారీ చేయడంతో వీళ్ళ ఇష్టారాజ్యం సాగుతోంది. భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుండడంతో వ్యవసాయ పొలాలలోకి వెళ్లే రహదారులు అధ్వాన్నంగా మారుతున్నాయని అసలే వర్షాకాలం కావడంతో భారీ గోతులు పడి ప్రమాదాలకు కారణం అవుతున్నాయని రైతులు వాపోతున్నారు. గంగవరం ప్రాంతంలో గట్టి నిఘా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. -
రైతుల భూములు లాక్కోవడం దుర్మార్గం
ఏలూరు (టూటౌన్): ప్రభుత్వం 2013 భూ సేకరణ చట్టాన్ని తుంగలో తొక్కి రైతుల భూములను ప్రాజెక్టుల పేరుతో, పరిశ్రమల పేరుతో బలవంతంగా లాక్కోవడం దుర్మార్గమని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ విమర్శించారు. 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయకపోవడం అన్యాయమన్నారు. స్థానిక అన్నే భవనంలో నిర్వహించిన సంఘ ముఖ్య నేతల సంఘ జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో నెలకొన్న రైతాంగ సమస్యలపై ఈ సందర్భంగా చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేసి అన్ని పంటలకూ మద్దతు ధరలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘ నేతలు ఎస్.సీతారామయ్య, కె.జలపాలు, బి.రాంబాబు, కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆగిరిపల్లి: మండలంలోని శోభనాపురంలో వ్యక్తి విద్యుత్ షాక్తో మృతి చెందాడు. ఎస్సై శుభ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం మేడా తిరుపతిరావు (36) తోట రమేష్కి చెందిన పందుల ఫాంలో సహాయకుడిగా పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం పందుల ఫాంను తిరుపతిరావు నీటితో శుభ్రం చేస్తుండగా పక్కనే ఉన్న విద్యుత్ వైర్లకు తగలడంతో విద్యుత్ షాక్ తగిలి కిందపడిపోయాడు. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది వెళ్లి చూడగా అప్పటికే మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి రావుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అనారోగ్యంతో కొన్ని రోజుల క్రితం అతని కుమారుడు మరణించాడు. ఇంతలోనే తిరుపతిరావు మరణించడంతో ఆ కుటుంబంలో విషాద చాయలు అలముకున్నాయి. -
మద్దిలో హనుమద్ హోమం
జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో పూర్వాభాద్ర నక్షత్రం సందర్భంగా ఆలయంలో శ్రీ సువర్ఛలా హనుమద్ కల్యాణం నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కల్యాణం, అనంతరం హనుమద్ హోమం వైభవంగా నిర్వహించినట్లు ఈవో ఆర్వీ చందన తెలిపారు. ఈ కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ముదినేపల్లి రూరల్: ప్రసిద్ధి చెందిన సింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్లోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం భక్తులు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి భారీసంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామి పుట్టలో పాలు పోసి స్వామివారిని దర్శించుకున్నారు. పాలపొంగళ్ళశాల వద్ద మహిళలు నైవేద్యాలు తయారుచేసి స్వామికి సమర్పించారు. నాగబంధాల వద్ద స్వామివారి మూర్తులను ప్రతిష్ఠించేందుకు అర్చకులతో పూజలు చేయించి ప్రతిష్ఠ తంతు నిర్వహించారు. కై కలూరు: అమ్మా.. పెద్దింట్లమ్మా.. నీ కరుణాకాటాక్షాలు మాపై అందించమ్మా.. అంటూ భక్తులు ఆర్తీతో వేడుకున్నారు. కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానంలో ఆదివారం భక్తులు రద్దీ కనిపించింది. సమీప జిల్లాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి వేడి నైవేద్యాలను సమర్పించారు. ఆలయ ప్రధాన ఉప అర్చకులు పేటేటి పరమేశ్వర శర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఒక్క ఆదివారం రోజున ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డు, అమ్మవారి చిత్రపఠాల విక్రయాలు, వాహనపూజలు, విరాళాల ద్వారా రూ.58,342 ఆదాయం వచ్చిందని తెలిపారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. ఆగిరిపల్లి: ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని సింహాద్రి అప్పారావుపేటలో చోటుచేసుకుంది. ఎస్సై శుభ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం సింహాద్రి అప్పారావు పేటకు చెందిన కళ్యాణి(18), సాయి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. విషయం యువతి తల్లిదండ్రులకు తెలియగా.. తనను పెళ్లి చేసుకోమని సాయిని కళ్యాణి అడిగింది. సాయి పెళ్లికి నిరాకరించాడు. దీంతో మనస్థాపం చెంది శనివారం తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుంది. కుటుంబ సభ్యులు వచ్చి చూసేసరికి అప్పటికే మృతి చెందింది. యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రాజకీయాలతో ముడిపెట్టి వేధింపులు
లింగగూడెంతో గత పదేళ్లుకు పైగా ంఆవోఏగా కొనసాగుతున్నాను. ని భర్త గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీలో తిరిగారనే సాకుతో ఉద్యోగానికి రాజీనామా చేయాలని కోరుతున్నారు. స్థానిక నేతలు నేరుగానే బెదిరింపులకు దిగుతున్నారు. రాజకీయాలతో ముడిపెట్టి వేధింపులు, ఇబ్బందులకు గురిచేయడం ఎంత వరకు సమంజసం. మల్లెల్లి ద్వారకా, లింగగూడెం, చింతలపూడి మండలం ఉంగుటూరు మండలం బొమ్మిడిలో 2009 నుంచి పనిచేస్తున్నారు. ఇటీవల ఎన్నికల అనంతరం గ్రామానికి చెందిన టీడీపీ నేత మానాలని వేధింపులకు దిగారు. దీంతో వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేశాను. బంధువులు సకాలంలో ఆస్పత్రికి తరలించడంతో బతికి బయటపడ్డా. కుటుంబ సభ్యులకు మాత్రం రూ.1.80 లక్షల ఖర్చు మిగిల్చింది. వంపుగడప శారద, బొమ్మిడి, ఉంగుటూరు మండలం విధుల్లోంచి తొలగించిన వీవోఏలను తక్షణం విధుల్లోకి తిరిగి తీసుకోవాలి. వారికి గత ఐదు నెలలుగా బకాయి పడ్డ వేతనాలు విడుదల చేయాలి. ఎక్కడైనా ఎవరైనా తప్పు చేస్తే వారిపై శాఖపరమైన విచారణ చేపట్టి అవసరమైన చర్యలు తీసుకోవాలే తప్ప ఈ విధంగా చేయడం తగదు.రాజకీయ వేధింపులు, కక్ష సాధింపు ధోరణులు అమానవీయం. ఆర్.లింగరాజు, జిల్లా అధ్యక్షుడు, సీఐటీయూ, ఏలూరు వీవోఏలకు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నేరుగా వార్నింగ్లు ఇస్తున్నారు. మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కి ఆందోళనలు, నిరసనలు చేస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. చింతలపూడి మండలంలో ఒక టీడీపీ నాయకుడు ఏకంగా ఎవరూ రోడ్డెక్కడానికి వీల్లేదని అతిక్రమిస్తే ఆ రోజు నుంచి విధుల్లోకి రావాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఎస్కె.సుభాషిణి, వీవోఏల సంఘం జిల్లా కార్యదర్శి, ఏలూరు -
ముంచెత్తిన వాన.. ప్రయాణానికి హైరానా
అకస్మాత్తుగా ఆకాశం మేఘావృతమై జోరు వాన కురిసింది. దాదాపు గంటకు పైగా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు కాలువలను తలపించాయి. ద్వారకాతిరుమల మండలంలోని పలు గ్రామాల్లో వర్షం దంచి కొట్టడంతో పంగిడిగూడెం వద్ద పోలవరం కుడి కాలువ వంతెనపై నీరు భారీగా నిలిచిపోయింది.ద్వారకాతిరుమల క్షేత్ర ప్రధాన రహదారిలోని పంగిడిగూడెం డెయిరీ వద్ద, స్థానిక కుంకుళ్లమ్మ ఆలయ సమీపంలో రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు రాకపోకలకు ఇబ్బంది పడ్డారు. – ద్వారకాతిరుమలపంగిడిగూడెంలో పోలవరం కాలువ వంతెనపై వర్షం నీటిలో రాకపోకలు -
ఉపాధి హామీలో ప్రభుత్వ చర్యలు విడ్డూరం
భీమవరం: ఉపాధి హామీలో అవినీతి నిర్మూలనకు ప్రభుత్వ చర్యలు విడ్డూరంగా ఉన్నాయని ఎమ్మెల్సీ బి.గోపిమూర్తి అన్నారు. ఏపీ వ్యవసాయ కా ర్మిక సంఘం జిల్లా 33వ మహాసభల కరపత్రాన్ని ఆదివారం ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉపాధి హామీలో ఈకేవైసీ ఆధార్ అనుసంధానం పైలెట్ ప్రాజెక్టుగా కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ప్రారంభించారని, అయితే ఎన్ఎంఎంఎస్ యాప్ వల్ల ఇబ్బందులు పడుతున్న ఉపాధి కూలీలకు ఈకేవైసీ విధానం మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టిందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిధులు, పని దినాలు, వేతనాలు, సౌకర్యాలు పెంచాలన్నారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాతిరెడ్డి జార్జి, జక్కంశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ వ్యవసాయ కార్మిక సంఘం 33వ మహాసభ నవంబర్ 10, 11వ తేదీల్లో అత్తిలిలో నిర్వహించనున్నామన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు కవురు పెద్దిరాజు, కండెల్లి సోమరాజు, జె.వెంకటలక్ష్మి, సహాయ కార్యదర్శులు బల్ల చిన వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. -
ఎదుర్కోలు వైభవం
● స్వర్ణ హనుమంత వాహనంపై ఊరేగిన శ్రీవారు ● నేడు స్వామివారి తిరుకల్యాణం ● ఉదయం 7 గంటల నుంచి సింహ వాహనంపై గ్రామోత్సవం ● ఉదయం 8 గంటల నుంచి భజనలు ● ఉదయం 9 గంటల నుంచి భక్తిరంజని ● ఉదయం 11 గంటల నుంచి కూచిపూడి నృత్య ప్రదర్శనలు ● సాయంత్రం 4 గంటల నుంచి నాదస్వర కచేరి ● సాయంత్రం 5 గంటల నుంచి కూచిపూడి నృత్య ప్రదర్శనలు ● రాత్రి 8 గంటల నుంచి శ్రీవారి తిరుకల్యాణం, అనంతరం వెండి గరుడ వాహనంపై గ్రామోత్సవం ● ప్రత్యేక అలంకారం : మోహినీ ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న క్షేత్రంలో స్వామివారి ఆశ్రయుజ మాస దివ్య బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం నూతన స్వర్ణ హనుమంత వాహనంపై స్వామివారు క్షేత్ర పురవీధుల్లో ఊరేగుతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. సాయంత్రం స్వామివారి నిత్య కల్యాణ మండపంలో జరిగిన శ్రీవారి ఎదుర్కోలు ఉత్సవం భక్తులను పరవశింపజేసింది. ఎదుర్కోలు ఉత్సవం ఇలా.. తొలుత స్వామి, అమ్మవార్లను ఆలయం నుంచి వెండి శేష వాహనంపై నిత్యకల్యాణ మండపం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ విశేషంగా అలంకరించిన వేదికపై కల్యాణ మూర్తులను ఉంచి పుష్పాలంకారాలు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వా యిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణల నడుమ ఎదుర్కోలు ఉత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు, అర్చకులు, పండితులు, భక్తులు రెండు జట్లుగా విడిపోయి ఒక జట్టు స్వామివారి గుణగణాలను, విశిష్టతను కొని యాడారు. రెండో జట్టు అమ్మవార్ల గుణగణాలు, కీర్తిని తెలియజేశారు. స్వామి కల్యాణోత్సవానికి ముందు రోజు వధూవరుల తరపు బంధువులు శుభలేఖను పఠించేందుకు జరిపే కార్యక్రమమే ఈ ఎదుర్కోలు ఉత్సవమని పండితులు తెలిపారు. రాత్రి స్వామివారికి జరగాల్సిన వెండి శేష వాహన సేవ వర్షం కారణంగా రద్దయ్యింది. ఆలయ ముఖ మండపంలో భూ వరాహ స్వామి అలంకారంలో స్వామి దర్శనమిచ్చారు. శ్రీహరి కళాతోరణ వేదికపై జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. -
చలో విజయవాడ పోరుబాటకు సన్నద్ధం
ఏలూరు (టూటౌన్) : స్థానిక పవర్పేట మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో రాష్ట్ర ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఈనెల 7న చేపట్టనున్న చలో విజయవాడ పోరుబాట కార్యక్రమానికి సన్నాహక సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఏలూరు జిల్లా నుంచి వెయ్యి మందితో పోరుబాట కార్యక్రమం నిర్వహించాలని జిల్లా కార్యవర్గం నిర్ణయం తీసుకుంది. జిల్లా ప్యాఫ్టో చైర్మన్ జి.మోహన్, సెక్రటరీ జనరల్ ఎం. ఆదినారాయణ, కో–చైర్మన్లు జి.వెంకటేశ్వరరావు, జి.ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఏపీటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.ప్రవీణ్ కుమార్, బీటీఏ అమరావతి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ బి.విద్యాసాగర్లకు జిల్లా ఫ్యాప్టో తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉండగా ఈనెల 7న పాఠశాలల్లో జీఎస్టీ అవగాహన కార్య క్రమాలు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఇచ్చిన ఆదేశాలపై అభ్యంతరం తెలిపారు. ఈ కార్యక్రమం విద్యార్థుల బోధనకు ఏమాత్రం ఉపయోగపడదని అన్నారు. ఏపీఎస్టీఏ మద్దతు ఫ్యాప్టో చేపట్టిన చలో విజయవాడ పోరుబాట ధర్నాకు ఏపీఎస్టీఏ పూర్తి మద్దతు ఇస్తుందని సంఘ రాష్ట్ర సహా అధ్యక్షుడు జీజేఎ స్టీవెన్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాటి వెంకటరమణ, తోట ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. -
పేదల బియ్యం.. కూటమి నిర్లక్ష్యం
ఏలూరు (మెట్రో): పేదలకు రేషన్ బియ్యం పంపిణీలో కూటమి ప్రభుత్వం నిండా నిర్లక్ష్యం చూపుతోంది. అక్టోబర్ నెలకు సంబంధించి ఐదు రోజులు గడిచినా ఇప్పటికీ పూర్తిస్థాయిలో రేషన్ సరకులను డీలర్లకు సరఫరా చేయలేదు. దీంతో పేదలు ఇబ్బంది పడుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పక్కాగా అమలు చేసినా ఇంటింటికీ రేషన్ ప్రక్రియను నిలిపివేసిన కూటమి ప్రభుత్వం.. తాజాగా సరకుల పంపిణీపైనా అశ్రద్ధ చూపుతోంది. ప్రతినెలా ఒకటో తారీఖు నుంచి సరకుల పంపిణీని ప్రారంభించాల్సి ఉండగా ఈనెల 6వ తేదీ వచ్చినా 70 శాతం రేషన్ షాపులకు పూర్తిస్థాయిలో బియ్యం సరఫరా కాలేదు. దీంతో ఈనెల 2న దసరా పండగ నాడూ పేదలకు రేషన్ కష్టాలు తప్పలేదు. జిల్లాలో 6.18 లక్షల మంది.. రేషన్ దుకాణాలు ఎప్పుడు తెరుస్తారో, ఎప్పుడు మూస్తారో తెలియక ప్రతినెలా ప్రజలకు ఎదురుచూపులు తప్పడం లేదు. జిల్లాలో 6,18,864 మంది కార్డుదారులు ఉండగా వీరికి ప్రతినెలా బియ్యం, పంచదార పంపిణీ చేస్తున్నారు. బియ్యం సరఫరా చేయడానికి జిల్లాలోని పౌరసరఫరాల గోదాములు ఉన్నాయి. అక్టోబర్ నెల బియ్యం రేషన్ డిపోల ద్వా రా ప్రజలకు అందించేందుకు సెప్టెంబరు 20 నా టికి గోదాములకు, 25 నుంచి 30లోపు అన్ని రేషన్ దుకాణాలకు పూర్తిస్థాయిలో నిల్వలు చేరుకోవాల్సి ఉంది. ఇలా జరిగితేనే ఒకటో తేదీన డీలర్లు పంపిణీ ప్రక్రియను ప్రారంభిస్తారు. అయితే అక్టోబర్కు సంబంధించి ఇప్పటికీ పూర్తిస్థాయిలో రేషన్ షాపులకు బియ్యం చేర్చడంలో ప్రభుత్వం విఫలమైంది. సాంకేతిక ఇబ్బందులంటూ.. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు మాత్రం రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసే సాంకేతికత వల్ల వచ్చిన ఇబ్బందులతో జిల్లాలో బియ్యం సరఫరాకు తీవ్ర ఆటంకం కలిగిందని చెబుతున్నారు. గత నెల రోజులుగా సాంకేతిక సమస్యల పరిష్కారం కో సం చర్యలు తీసుకుంటున్నారని అయినా సమస్య పరిష్కారానికి మరికొంత సమయం పడుతుందని అంటున్నారు. జిల్లాలో ఇప్పటికే రేషన్ దుకాణాలకు సరకుల పంపిణీ ప్రక్రియ ప్రారంభం అయ్యిందనీ, సోమ, మంగళవారాలకు పూర్తిస్థాయిలో సరకులను సరఫరా చేస్తామని చెబుతున్నారు. 15 వరకూ మాత్రమే.. రేషన్ పంపిణీ ప్రక్రియ ప్రతి నెలా 15వ తేదీ వరకూ మాత్రమే కొనసాగుతుంది. అయితే ఈ నెలలో షాపులకు సరకులు సరఫరా కాని పరిస్థితుల్లో ఎన్ని రోజులపాటు రేషన్ దుకాణాలు తెరుస్తారు, ఎన్నిరోజుల పాటు డీలర్లు సరకులు పంపిణీ చేస్తారో ప్రజలకు అర్థం కాని పరిస్థితి. జిల్లావ్యాప్తంగా 1,123 రేషన్ దుకాణాల ద్వారా 6,18,864 మంది కార్డుదారులు ప్రతి నెలా రేషన్ పొందుతున్నారు. వీటిలో 34,188 మంది ఏఏవై కార్డుదారులు ఉన్నారు. వీరికి ప్రతి నెలా 35 కిలోల చొప్పున బియ్యం అందిస్తారు. ఇక మిగిలిన 5,84,676 మంది కార్డుదారులకు 8,316.525 టన్నుల బియ్యం అందిస్తున్నారు. మొత్తంగా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. రేషన్ బియ్యం పంపిణీలో అలసత్వం జిల్లాలో 70 శాతం దుకాణాలకు చేరని సరకులు 6వ తేదీ వచ్చినా ప్రారంభం కాని పంపిణీ దసరా పండగకూ పస్తులు పెట్టిన సర్కారు జిల్లావ్యాప్తంగా 6.18 లక్షల కార్డుదారులకు ఇబ్బందులు పేదల రేషన్ కష్టాలను తొలగించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎండీయూ వాహనాల ద్వారా ఇంటికే రేషన్ ప్రక్రియను ప్రారంభించారు. ప్రతినెలా ఒకటో తారీఖు నుంచి లబ్ధిదారుల ఇంటి వద్దకే వచ్చి నిత్యావసర సరకులు అందించేవారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ సరకులు అందించే ప్రక్రియను నిలిపివేసి, రేషన్ షాపుల ద్వారా పంపిణీని పునః ప్రారంభించింది. దీంతో పేదలు ప్రతినెలా రేషన్ షాపుల వైపు పరుగులు తీస్తూ దుకాణాల వద్ద బారులు తీరే పరిస్థితి. -
నేను మరొకరికి గాయం కలిగించక ముందే..
● గుంతల రహదారిపై వినూత్న హెచ్చరిక బోర్డులు ● అధ్వానంగా ద్వారకాతిరుమల క్షేత్ర రహదారి ద్వారకాతిరుమల : ‘నెమ్మదిగా వెళ్లండి.. నేను కు టుంబాలతో ప్రయాణించే వ్యక్తులను గాయపరుస్తున్నాను. నేను మరొకరికి గాయం కలిగించక ముందే దయచేసి నన్ను త్వరగా మరమ్మతులు చేయండి’ అంటూ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నట్టుగా ఏర్పాటుచేసిన హెచ్చరిక బోర్డులు భీమడోలు–ద్వారకాతిరుమల క్షేత్ర ప్రధాన రహదారి దుస్థితికి అద్దం పడుతున్నాయి. భారీ గోతులతో ప్రమాదాలకు నిలయంగా మారిన రహదారిపై ఇటీవల ‘సాక్షి’లో కథనం ప్రచురితం కాగా అధికారులు గుంతల్లో మెటల్ డస్ట్ పోయించారు. అయితే రెండు రోజులకే రోడ్డు యథాస్థితికి చేరుకుంది. నిత్యం వందలాది వాహనాలు ఇటుగా ప్రయాణిస్తున్నా పూర్తిస్థాయిలో మరమ్మతులపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు పై వ్యాఖ్యలతో ఉన్న ఇంగ్లిష్ హెచ్చరిక బోర్డులను రహదారిపై పలుచోట్ల ఏర్పాటుచేశారు. బోర్డుల చుట్టూ పసుపు రంగు రేడియం స్టిక్లర్లు కూడా అతికించారు. ఇటుగా వెళుతున్న వాహనచోదకులు ఆగి మరీ బోర్డులను చదివి జాగ్రత్తగా రాకపోకలు సాగిస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరవాలని పలువురు కోరుతున్నారు. -
పీఆర్సీని ప్రకటించాలి
ఏలూరు (టూటౌన్): మున్సిపల్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 12వ పీఆర్సీని ప్రకటించాలని, ఐఆర్ ఇవ్వాలని, మున్సిపల్ ఆప్కాస్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, ఆప్కాస్ ఉద్యోగులకు కూడా ఐఆర్ అమలు చేయాలని కోరుతూ ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఏపీ ఎంఈఎఫ్) ఆధ్వర్యంలో ఈనెల 8న రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించనున్నట్టు ఫెడరేషన్ నాయకులు తెలిపారు. ఆదివారం ఏలూరులోని కార్మిక సంఘాల కా ర్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.రవి మాట్లాడుతూ కూటమి నాయకులు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. నాలుగేళ్లుగా పెండింగ్లో ఉన్న సరెండర్ లీవులు, డీఏ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధర్నాలో ఉ ద్యోగులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.సోమయ్య, గౌరవ సలహాదారులు ఎస్.శంకర రావు, రాష్ట్ర నాయకులు సాంబశివరావు, సుబ్రహ్మణ్యం, జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఏలూరు (టూటౌన్): కూటమి ప్రభుత్వం లైసెన్స్ ఉన్న ఆటో, క్యాబ్, బస్, లారీ, టిప్పర్ డ్రైవర్లందరికీ ఏడాదికి రూ.15 వేలు ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని సీపీఎం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా కార్యదర్శి ఎ.రవి ఆదివారం ప్రకటన విడుదల చేశారు. అలాగే ఎన్నికల హామీలన్నింటినీ అ మలు చేయాలన్నారు. అలాగే కామవరపు కోట మండలం ఆడమిల్లిలో విద్యుత్ షాక్తో గాయపడ్డ ప్రైవేట్ ఎలక్రీషియన్ బి.వంశీకి పూర్తి వైద్యం, ఆర్థిక సహాయం అందించేలా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టాలని కోరారు. ఏలూరు(మెట్రో): ఏలూరు సీఆర్ రెడ్డి కాలేజీ ఆడిటోరియంలో సోమవారం జిల్లాస్థాయిలో స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించనున్నట్టు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. భీమవరం: మినిమమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్) టీచర్లుగా 25 ఏళ్లుగా పనిచేస్తున్న 1998 డీఎస్సీ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ఈనెల 11న విజయవాడలో విజ్ఞాపన సభ నిర్వహించనున్నట్టు ఎంటీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చొల్లంగి కేశవకుమార్ తెలిపారు. విజ్ఞాపన సభ సన్నాహక సమావేశం ఆదివారం స్థానిక లూథరన్ హైస్కూల్లో నిర్వహించారు. టెంపరరీ ఎంటీఎస్ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని, 62 ఏళ్ల వరకు సర్వీస్ పెంచాలని, 12 నెలల జీతం, మినిమమ్ పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన విజ్ఞాపన సభను విజయవంతం చేయాలని కోరారు. కో–ఆర్డినేటర్లు ఎం.రాజలింగం, ఎన్.అనిల్ అరవింద్కుమార్, ఎంవీ కృష్ణారావు, హేమంత్కుమార్, వీఎల్ఎన్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. తణుకు అర్బన్: ఆర్టీసీలో కొత్త బస్సుల కోసం నిధులు కేటాయించకుండా సీ్త్ర శక్తి పథకాన్ని ప్రారంభించారని, కొత్త బస్సులకు నిధులు కే టాయించాలని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్డబ్ల్యూఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ సుందరయ్య అన్నారు. ఫెడరేషన్ పశ్చిమగోదావరి జిల్లా రెండోమహాసభలు ఆదివా రం తణుకు అమరవీరుల స్మారక భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత బస్సు పథకం ప్రారంభమైన నెల రోజుల్లోనే కండక్టర్లు, డ్రైవర్లపై వేధింపులు, కేసులు, 60 మందికిపైగా సస్పెన్షన్లు నమోదయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. పథకం ఉద్యోగులను వేధించే పథకంగా మా రకూడదని, కొత్త బస్సులు వేసి ఉద్యోగులను నియమించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ బస్సుల సాకుతో ఆర్టీసీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే చర్యలు వెంటనే ఆపాలని, తొలి దశలో ప్రధాన నగరాల్లోని 2 డిపోలను, రెండో దశలో 19 డిపోలను ప్రైవేట్ విద్యుత్ బస్సు ఆపరేటర్లకు అప్పజెప్పేలా సన్నాహాలు జరుగుతున్నాయని విమర్శించారు. జిల్లా అధ్యక్షుడు టీవీఎస్ మూర్తి జెండా ఆవిష్కరణ చేసి మహాసభకు అధ్యక్షత వహించారు. జిల్లా కార్యదర్శి ఏఎస్ రాయుడు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి టీపీఆర్ దొర, డిపో కార్యదర్శులు పాల్గొన్నారు. -
హత్య కేసులో ఆరుగురి అరెస్టు
తణుకు అర్బన్: తణుకులో యువకుడి అదృశ్యం ఆపై హత్య కేసును పోలీసులు చేధించారు. పక్కా ప్లాన్ ప్రకారమే తాడేపల్లిగూడెంకు చెందిన మాడుగుల సురేష్ (25)ను హత్యచేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. తాడేపల్లిగూడెం డీఎస్పీ డి.విశ్వనాథ్ తణుకు పట్టణ పోలీస్ స్టేషన్లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించి వివరాలు వెల్లడించారు. న్యాయవాది తిర్రే సత్యనారాయణరాజు భార్య శిరీషతో మృతుడు సురేష్కు ఉన్న వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగిందని, న్యాయవాది సత్యనారాయణరాజు మరో నలుగురి సాయంతో హత్య చేసినట్లుగా విచారణలో తేలిందని వివరించారు. తన భార్యతో సంబంధంపై సురేష్ను పలుమార్లు హెచ్చరించినప్పటికీ మార్పు రాకపోవడంతోనే హత్యకు పాల్పడినట్లుగా సత్యనారాయణరాజు ఒప్పుకున్నట్లు చెప్పారు. ఈ నెల 23న తన తమ్ముడు సురేష్ తణుకు వచ్చాడని తిరిగి తాడేపల్లిగూడెం రాలేదని అతని సోదరి ముచ్చె ప్రశాంతి ఇచ్చిన ఫిర్యాదుతో అదృశ్యం కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా హత్యగా బయటపడినట్లు వివరించారు. శిరీషను కలిసేందుకు తణుకు వచ్చిన సురేష్పై నిందితులు దాడి అనంతరం శవాన్ని గోనెసంచిలో కుక్కి తణుకు నుంచి కారులో తీసుకెళ్లి చించినాడ వద్ద గోదావరిలో పారేసినట్లుగా విచారణలో తేలిందన్నారు. మృతదేహాన్ని సఖినేటిపల్లి సమీపంలోని రామేశ్వరం పరిధిలో గుర్తించినట్లు తెలిపారు. మొత్తం 30 మందికి పైగా సాక్షులను విచారించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు నిందితులు ఉపయోగించిన కియా సెల్టాస్ కారుతోపాటు మరో మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని, కేసు లోతుగా దర్యాప్తుచేసి మరెవరి ప్రమేయమైనా ఉందా అని తేల్చుతామన్నారు. ఈ కేసులో సత్యనారాయణరాజుతో పాటు వల్లూరి పండుబాబు, సరెళ్ల సాయి కృష్ణ, బంటు ఉదయ కిరణ్, గంటా ఫణీంద్ర బాబు, తిర్రే శిరీషలను అరెస్టు చేశారు. వీరికి శనివారం తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు. మృతదేహాన్ని తరలించేందుకు వినియోగించిన కారు యజమాని, నిందితుడి సోదరుడు తిర్రే విజయకృష్ణను ఏ7గా చేర్చామని ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారని చెప్పారు. కేసు దర్యాప్తులో పట్టణ సీఐ ఎన్.కొండయ్య, రూరల్ సీఐ బి.కృష్ణకుమార్, అత్తిలి ఎస్సై ప్రేమ్కుమార్, పట్టణ ఎస్సై కె.ప్రసాద్, ఏఎస్సైలు పి.సంగీత్రావు, పి.సత్యనారాయణ, ఎస్.శ్రీధర్తోపాటు 11 మంది కానిస్టేబుళ్ల చొరవను డీఎస్పీ ప్రశంసించారు. వివాహేతర సంబంధమే కారణమని నిర్ధారణ -
వేద నిలయం.. ఇరగవరం
పాలేశ్వర స్వామివారు కొలువై ఉన్న ఈ గ్రామంలో జన్మించడం పూర్వజన్మ సుకృతం. స్వామి వారి అనుగ్రహంతోనే గ్రామం వేద నిలయంగా పేరొందింది. ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా సామాన్యుల నుంచి సినీ, రాజకీయ ప్రముఖులు, పారిశ్రామిక, వ్యాపార వేత్తలు ఎంతో మందికి జ్యోతిష్యం, వాస్తు సలహాలు చెప్పడం, ఆలయ నిర్మాణాలకు యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించే భాగ్యం కలగడం పరమేశ్వరానుగ్రహంగా భావిస్తాం. – తంగిరాల ప్రదీప్ సిద్ధాంతి, శ్రీపంచముఖి హనుమద్ పీఠం, ఇరగవరం సాక్షి, భీమవరం/ ఇరగవరం: తణుకు నియోజకవర్గంలో మండల కేంద్రంగా ఉన్న ఇరగవరం జనాభా 5585 మంది. కుటుంబాల సంఖ్య 1825. వీరిలో 250 వరకు బ్రాహ్మణ కుటుంబాల వారు ఉన్నారు. చాలా కుటుంబాల్లో వేదం, ఆగమనం, శాస్త్రం, జ్యోతిష్యం, స్మార్థం, మంత్ర శాస్త్రం తదితర కళలను అవపోసన పట్టి వేదపండితులు, ఘనాపాఠీలు, సిద్ధాంతులుగా ప్రసిద్ధి చెందినవారు ఉంటారు. తిరుమల తిరుపతి, విజయవాడ ఇంద్రకీలాద్రి, అన్నవరం సత్యనారాయణస్వామి, సింహాచలం అప్పన్న తదితర రాష్ట్రవ్యాప్తంగా పేరొందిన ఎన్నో దేవాలయాలు, వేద పాఠశాలల్లోని ప్రముఖ వేద పండితుల్లో అధికంగా ఇరగవరం మూలాలు ఉన్నవారే ఉంటారని ప్రసిద్ధి. వేదాభివృద్ధికి చేసిన కృషికి సాంగత్రి వేదాచార్య, అహోరాత్రి పారాయణ, వేద తపస్వి, నిత్యాగ్నిహోత్రులుగా ప్రముఖుల నుంచి సత్కారాలు, పురస్కారాలను, గండభేరుండాలను అందుకున్నవారు ఎంతోమంది ఉన్నారు. ఎందరో మహానుభావులు... వేదాధ్యయనం చేసిన బ్రాహ్మణుడు సాక్షాత్తూ పరమేశ్వర స్వరూపంగా భావిస్తారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకున్న బ్రహ్మశ్రీ తంగిరాల బాలగంగాధరశాస్త్రి, దేశవ్యాప్తంగా అనేక చోట్ల అహోరాత్ర వేదపారాయణలు చేసిన బ్రహ్మశ్రీ గుళ్ల్లపల్లి ఆంజనేయ ఘనాపాటి, యావత్ జీవితాన్ని వేదానికి అంకితం చేసిన గుళ్లపల్లి సీతారామశాస్త్రి, నిత్యాగ్నిహోత్రకులుగా, పంచాంగకర్తలుగా పేరొందిన సోమయాజి, ప్రేసపాటి పాలశంకర అవధాని, సంస్కృతంలోని ఆరు గ్రంథాలను తెలుగులోకి అనువదించిన గుళ్లపల్లి శ్రీరామశర్మ, ప్రముఖ సిద్ధాంతిగా పేరొందిన పీసపాటి వెంకప్ప సోమయాజి తదితర ఎందరో వేద పండితులు ఈ గ్రామానికి చెందినవారే. గ్రామానికి చెందినవారు ఎందరో తంగిరాల కృష్ణానందతిలక, తంగిరాల రామసోమయాజులు, పీసపాటి సుబ్బరాయశాస్త్రిలు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని తామ్రపత్రాలు పొందారు. వీరిలోని తంగిరాల రామసోమయాజులు 36 ఏళ్లు ఏకగ్రీవంగా గ్రామ సర్పంచ్గా సేవలందించారు. 1962లో అష్ట గ్రహ కూటమి వచ్చి అరిష్టాలు సంభవించినప్పుడు ప్రముఖ మంత్రవేత్త తంగిరాల సుబ్రహ్మణ్య సిద్ధాంతి, తంగిరాల బాలగంగాధర శాస్త్రి, పేసపాటి వెంకప్ప సోమయాజి సిద్ధాంతి తదితరులు దేశ క్షేమం కోసం 12 రోజులు స్వామివారికి అతిరుద్ర యాగం నిర్వహించినట్టుగా పెద్దలు చెబుతారు. ప్రస్తుత తరంలోనూ గ్రామానికి చెందిన ఎందరో వేదపండితులు పెద్దలు చూపిన మార్గంలో నడుచుకుంటూ దేశవ్యాప్తంగా జ్యోతిష్య, వాస్తు విషయాలపై ప్రజలకు పరిష్కార మార్గాలను చూపుతూ వేదాభివృద్ధికి కృషి చేస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఎందరో ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకుంటుంటారు. బ్రహ్మశ్రీ గుళ్లపల్లి సీతారామశాస్త్రి కుటుంబ సభ్యులు గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ కామకోటి చంద్రశేఖర వేద పాఠశాల ద్వారా ఎంతోమంది విద్యార్థులు వేద విద్యను అభ్యసిస్తున్నారు. ఇరగవరంలో పూజలు నిర్వహిస్తున్న సినీ నటుడు శ్రీకాంత్ (ఫైల్) వేదపఠనం చేస్తున్న విద్యార్థులుపూర్వం బ్రాహ్మణులు ఇరగవరంలో నిత్యం యజ్ఞయాగాది క్రతువులు చేసేవారు. వేద ప్రియుడైన ఈశ్వరుడు ఈ గ్రామానికి వచ్చి ఆకలితో పిల్లిగా మారి అక్కడి ఉట్టిలోని పాలు, పెరుగు, నెయ్యి ఆరగించేవారని చెబుతారు. పూజకు వినియోగించే ఈ ద్రవ్యాలు రోజూ మాయమైపోతుండటం చూసి గోసంరక్షకుణ్ణి కాపలాగా ఉంచారని, పిల్లి పాలు తాగుతుండటాన్ని గమనించి గొడ్డలితో కొట్టగా తల నాలుగు ముక్కలైందని, పిల్లి శరీరాన్ని విడిచిన ఈశ్వరుడు వేదపండితులు, పెద్దలకు కలలో ప్రత్యక్షమై పిల్లి శరీరం పడిన చోట ఉద్భవించిన శివలింగానికి ఆలయం నిర్మించాలని చెప్పాడని ఇక్కడ బహుళ ప్రాచుర్యంలో ఉంది. పాలగుండం, పాల వృక్షాల వనం, పాలరాతి శివలింగం, పాలబుడ్డి ఆకారంలో గుడి, పాలేశ్వరస్వామి వారి పేర్లతో పంచపాల క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. పాలబుడ్డి ఆకారంలోని శివలింగాన్ని యోగ లింగంగా చెబుతారు. వేదః శివః శివో వేదః వేదాధ్యాయి సదా శివః వేదమే శివుడు. శివుడే వేదం. ఈశ్వరుని ఉచ్ఛ్వాస, నిశ్వాసాలే వేదాలుగా చెబుతారు. ఆ పరమేశ్వరుడే స్వయంభువుగా వెలసి పాలేశ్వరునిగా పూజలందుకుంటున్న గ్రామం. యజ్ఞయాగాదులు, నిత్య వేదఘోషతో వేద నిలయంగా పేరొందింది పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం. గ్రామం నుంచి వేద పండితులుగా, సిద్ధాంతులుగా, ఘనాపాఠీలుగా ఎంతోమంది దేశవ్యాప్తంగా ఖ్యాతి పొందారు. పాలేశ్వరుడు కొలువైన గ్రామం వేదపండితులు, ఘనాపాఠీలు, సిద్ధాంతులకు ప్రసిద్ధి ప్రముఖ ఆలయాల్లోని వేదపండితుల్లో పలువురు ఈ గ్రామ మూలాలు ఉన్నవారే -
మున్సిపల్ కార్మికుడి ఆత్మహత్యాయత్నం
తాడేపల్లిగూడెం అర్బన్ : తాడేపల్లిగూడెం మున్సిపాల్టీలో పారిశుద్ధ్య కార్మికుడిగా ఔట్ సోర్సింగ్ విధానంలో విధులు నిర్వహిస్తున్న పూనకం మునియ్య కలుపు మందు తాగి శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వార్డు శానిటరీ సెక్రటరీ, శానిటరీ ఇన్స్పెక్టర్ తనను వేధిస్తున్నారని వారి వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని బాధితుడు తెలిపాడు. మునియ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పెదపాడు: గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఎనిమిది మందికి గాయాలైన సంఘటన కలపర్రు టోల్గేట్ సమీపంలోని బాపులపాడు మండలం బొమ్ములూరులో పరిధిలో చోటు చేసుకుంది. బాపులపాడు హనుమాన్ జంక్షన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజమండ్రి నుంచి విజయవాడకు ఆటోలో 8 మంది బయలు దేరారు. కలపర్రు టోల్ గేట్ దాటి కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బొమ్ములూరు సమీపంలోకి వచ్చేసరికి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురికి స్వల్ప గాయాలు కాగా, మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో వారిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి అంబులెన్స్లో తరలించారు. -
చిన్నతిరుపతి క్షేత్రం.. భక్తజన సంద్రం
ద్వారకాతిరుమల: చిన్నతిరుపతి క్షేత్రం శనివారం భక్తజన సంద్రమైంది. శ్రీవారికి ప్రీతికరమైన రోజు, అందులోనూ దసరా సెలవులు ముగియడంతో ఊళ్లకు వెళ్తున్న వారు, విజయవాడ దుర్గమ్మ ఆలయంలో ఇరుముడులు సమర్పించిన భవానీ భక్తులు వేలాదిగా ఆలయానికి తరలివచ్చారు. దాంతో తెల్లవారుజాము నుంచి ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. తూర్పురాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కల్యాణ కట్ట, అన్నదాన విభాగాల వద్ద భక్తులు పోటెత్తారు. కొండపై, అలాగే కొండ కింద గుడి సెంటర్లో ఎక్కడ చూసినా భక్తులే కనిపించారు. రాత్రి వరకు ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగింది. పలు భజనల మండలి సభ్యులు అనివేటి మండపంలో ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. -
చంద్రబాబు దళిత ద్రోహి
పెనుగొండ: ముఖ్యమంత్రి చంద్రబాబు దళిత ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారని ఆచంట నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పిల్లి రుద్ర ప్రసాద్ విమర్శించారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవళంపేటలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడంపై నిరసన వ్యక్తం చేస్తూ ఆచంటలో అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు సుంకర సీతారామ్, కోట వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అంబెడ్కర్ భావజాలంపై టీడీపీ మొదటి నుంచి విషం జిమ్ముతుందని అన్నారు. సీఎం సొంత జిల్లాలోనే ఇలాంటి దురగతం జరగడం బాధాకరమన్నారు. ఘటనకు కారణమైన టీడీపీ నేత సతీష్ నాయుడు పై అట్రాసిటీ కేసు నమోదు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు తప్పేట్ల వెంకట్రావు, చదలవాడ ఆనంద్, పీతల అంబేడ్కర్, చదలవాడ ముత్యాల రావు, కొంబోత్తుల దుర్గా ప్రసాద్, పుచ్చకాయల నాగార్జున, వడ్లపాటి అంబేడ్కర్, కోట గిరిధర్, పుచ్చకాయల భీమారావు, వడ్లపాటి నవీన్, వేమన అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
నేవీ డిపోపై పోరుబాట
వంకావారిగూడెం పరిసర ప్రాంతాల్లో సాగు భూ ములు ఎక్కువగా ఉన్నా యి. పత్తి, వేరుశెనగ, ఆ యిల్పామ్ వంటి పంటలు పండించుకుంటున్నాం. ఆ భూములను ప్రభుత్వం తీసుకోవాలని చూస్తే ఊరుకోం. ఆ భూములే మాకు జీవనాధారం. నేవీ డిపో ఏర్పాటును మేం వ్యతిరేకిస్తున్నాం. మా అభిప్రాయాన్ని ప్రభుత్వం గౌరవించాలి. – తెల్లం సోమరాజు, రైతు, వంకావారిగూడెం నాకు రెండున్నర ఎకరాల భూమి ఉంది. వరి, వేరుశనగ పండిస్తూ జీవనం సాగిస్తున్నాను. మా భూములను బలవంతంగా లాక్కునే ప్రయత్నం అధికారులు, పాలకులు చేస్తున్నారు. దీని వల్ల తీవ్రంగా నష్టపోతాం. మా భూములు తీసుకుంటే పూర్తిగా జీవనాధారం కోల్పోతాం. మా నిర్ణయాన్ని గౌరవించకపోతే ఎంతటి పోరాటానికై నా సిద్ధం. – బుద్దుల తులసమ్మ, రైతు, వంకావారిగూడెం సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు జిల్లా గిరిపల్లెల్లో నేవీ డిపో ఏర్పాటుపై నిప్పు రాజుకుంది. గిరిజనులు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తూ గ్రామసభలో వ్యతిరేక తీర్మానాలు చేసినా సర్కారు దూకుడు కొనసాగిస్తూనే ఉంది. ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ ప్రత్యేక ఆసక్తితో పల్లెలు వ్యతిరేకిస్తున్నా ప్రాజెక్టు ఏర్పాటుకు చకచకా ముందుకు సాగడంపై తీవ్ర నిరసనలు కొనసాగుతున్నాయి. జీలుగుమిల్లి మండలం వంకావారిగూడెంలో డిపో ఏర్పాటును నిర సిస్తూ మూడుసార్లు గ్రామసభలు డిపో వద్దంటూ తీర్మానం చేసినప్పటికీ అక్కడే డిపో పెడతామని ముందుకు సాగడంపై గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం వంకావారిగూడెం పంచాయతీలో నేవీ ఆయుధ డిపో ఏర్పాటుకు ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. 1,166 ఎకరాల నాణ్యమైన సాగుభూమిని సేకరించడానికి వీలుగా అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. వంకావారిగూడెం పంచాయతీ పరిధిలో దాట్లగూడెం, రమణక్కపేట, మడకంవారిగూడెం, వంకావారిగూడెం, తదితర గ్రామాల పరిధిలో 1,166 ఎకరాలు సేకరిస్తున్నారు. భూ సేకరణకు, ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మూడుసార్లు గ్రామసభలు నిర్వహించి వ్యతిరేకంగా తీర్మానాలు చేశారు. అయినా సర్కారు హడావుడి కొనసాగుతుండటంతో నిరసన ర్యాలీ, ఆందోళనలు గిరిజన సంఘాలు నిర్వహించిన క్రమంలో సెక్షన్–30తో అడ్డుకునే ప్రయత్నం చేశారు. తాజాగా గ్రామసభలు, పంచాయతీ తీర్మానాలతో నిమిత్తం లేకుండా స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా మండల పరిషత్లో తీర్మానం చేయించే దిశగా ముందుకు సాగుతున్నారు. భూసేకరణకు సిద్ధం చేసిన భూముల్లో ప్రస్తుతం వేరుశనగ, వర్జీనియా పొగాకు, ఆయిల్పామ్ వంటి పంటలు పండే నాణ్యమైన భూములున్నాయి. ఆ భూముల్లోనే పనిచేసుకుంటూ ఆయా గ్రామాల గిరిజన ప్రజలు జీవనం సాగిస్తున్నారు. అయితే ఆ భూములను డిపో ఏర్పాటుకు సేకరిస్తే తమ జీవనం కష్టతరంగా మారుతుందని, తాము డిపోను వ్యతిరేకి స్తున్నామని గిరిజనులు చెబుతున్నారు. వంకావారిగూడెంలో తన భూమిలోని వేరుశనగ పంటను చూపిస్తున్న రైతు మడకం శేషారావు జీలుగుమిల్లి మండలం వంకావారిగూడెంలో గిరిజన రైతుల ఆయిల్పామ్ తోట గిరిజనులు వ్యతిరేకిస్తున్నా దూకుడుగా సర్కారు యత్నాలు గ్రామసభల్లో వ్యతిరేక తీర్మానం చేసినా ముందుకు.. మండల పరిషత్లో తీర్మానం చేసేలా స్థానిక ప్రజాప్రతినిధులపై ఒత్తిళ్లు పొగాకు సహా మంచి పంటలు పండే భూమి సేకరణకు యత్నం నేవీ డిపోపై తీవ్రమైన తిరుగుబాటు నేవీ డిపో ఏర్పాటుకు గ్రామసభల తీర్మానం లేకుండా ప్రభుత్వం యత్నాలు చేస్తుందని గిరిజనులు మండిపడుతున్నారు. ఇప్పటివరకూ మూడుసార్లు వ్యతిరేకంగా 5 గ్రామాల గిరిజనులు తీర్మానం చేశారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున ఆందోళన సైతం కొనసాగించారు. అయినా బలవంతంగా నేవీ డిపోను వంకావారిగూడెం పంచాయతీ పరిధిలోనే ఏర్పాటు చేయాలని మొండిగా ముందుకు సాగుతుందని గిరిజనులు మండిపడుతున్నారు. 5 గ్రామాల ప్రజలు గ్రామ సభల్లో డిపోకు వ్యతిరేకంగా తీర్మానం చేసిన నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా మండల పరిషత్లో ఎంపీటీసీలతో అనుకూలంగా తీర్మానం చేసి ముందుకు సాగాలనే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. నేవీ డిపోకు అనుకూలంగా సంతకాలు చే యాలని రాజకీయ నాయకులు ఎంపీటీసీలకు ఫోన్లు చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. నిబంధలకు వి రుద్ధంగా ముందుకు సాగితే తీవ్ర ప్రతిఘటనలు తప్పవని వంకావారిగూడెం ప్రజలు హెచ్చరిస్తున్నారు. నేవీ ఆయుధ డిపో ఏర్పాటుకు జీలుగుమిల్లి మండల వంకావారిగూడెం పంచాయతీ పరిధిలో రమణక్కపేట, మడకంవారిగూడెం, దాట్లవారిగూడెం, కొత్తచీమలవారిగూడెం గ్రామాల్లో మొత్తం 1,166 ఎకరాల్లో భూములు సేకరించాలని అధికారులు ప్రజాప్రతినిధులు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. అయితే పంట భూములను ఇచ్చేది లేదని గిరిజనులు తెగేసి చెబుతున్నారు. అయినా డిపో ఏర్పాటుపై ఎంపీ పుట్టా మహేష్యాదవ్, ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మొండిగా ముందుకు సాగుతున్నారని గిరిజనులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయం చేసుకునే తమ భూములు కాకుండా అదే మండలంలో గ్రీన్ఫీల్డ్ హైవేకు ఆనుకుని ఉన్న బర్రింకలపాడు అటవీ భూముల్లో గానీ, వేరే ప్రాంతాల్లో కానీ పెట్టుకోవాలని ఇక్కడి గిరిజన ప్రజలు సూచిస్తున్నారు. తాము వద్దంటున్నా ఎంపీ పుట్టా మహేష్ పట్టుబట్టడం పట్ల ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. -
బాలిక అప్పగింత
నరసాపురం రూరల్: పేరుపాలెం బీచ్లో తప్పిపోయిన బాలికను మొగల్తూరు పోలీసులు గంట వ్య వధిలో గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించినట్టు శ నివారం ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఓ ప్రకటనలో తెలిపారు. భీమవరానికి చెందిన ఓ కుటుంబం తమ ఎనిమిదేళ్ల బాలిక తప్పిపోయిందంటూ సా యంత్రం 4 గంటలకు బీచ్ అవుట్ పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అప్రమత్తమైన అవు ట్ పోస్ట్ పోలీసులు బాలిక ఆచూకీ గుర్తించి కుటుంబసభ్యులకు అప్పగించారు. పోలీసుల కృషిని ఎస్పీ అభినందించారు. బీచ్కు వచ్చే సందర్శకులు, ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల మరింత శ్రద్ధ వహించాలని, తక్షణ సహాయం కోసం పోలీసులను సంప్రదించాలని సూచించారు. -
పేదల బియ్యం పక్కదారి
● రేషన్ డీలర్లే కొనుగోలు ● షాపుల్లోనే నిల్వలు.. రాత్రిళ్లు తరలింపు లింగపాలెం: ‘కంచే చేను మేసిన’ చందంగా రేషన్ డీలర్లే పేదలకు అందించాల్సిన బియ్యాన్ని పక్క దారి పట్టిస్తున్నారు. కార్డుదారుల నుంచి నేరుగా కొనుగోలు చేసి రేషన్ షాపుల్లోనే నిల్వ ఉంచుతూ, రాత్రిళ్లు గుట్టుచప్పుడు కాకుండా అక్రమ బియ్యం వ్యాపారులకు ఎగుమతి చేస్తున్నారు. ఇదంతా బహిరంగంగా జరుగుతున్నా విజిలెన్స్, రెవెన్యూ అధికారులు మిన్నకుండిపోతున్నారు. ముఖ్యంగా లింగపాలెం మండలంలో కొందరు డీలర్లు పోటీపడి మరీ కార్డుదారుల నుంచి బియ్యం కొనుగోలు చేస్తున్నారు. బియ్యం కోసం రేషన్ షాపులకు వస్తున్న కార్డుదారులకు కిలోకు రూ.15 చొప్పున చెల్లిస్తున్నారు. బియ్యం కావాలా, డబ్బులు కావాలా అని అడుగుతుండటంతో కార్డుదారులు ఆశ్చర్యపోతున్నారు. గతంలో చాటుమాటున జరిగే ఈ వ్యవ హారం కూటమి ప్రభుత్వ పాలనలో బహిరంగంగానే జరుగుతోంది. లింగపాలెం మండలంలో నెల కు సుమారు 600 టన్నుల వరకూ ఇలా సేకరించడం, రేషన్ మాఫియా ఆగడాలకు అద్దూ అదుపులేకపోవడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. లింగపాలెం, చింతలపూడి మండలాల్లో సుమారు 47 వేలకు పైగా బియ్యం కార్డులు ఉన్నాయి. వీరికి ప్రతినెలా బియ్యం కోసం ప్రభుత్వం రూ.9 కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. ప్రధానంగా రేషన్ బియ్యం వ్యాపారానికి డీలర్లు సహకరిస్తున్నారని, అయినా అధికారులు తనిఖీలు, చర్యలు తీసుకోవడం లేదని మండల ప్రజలు విమర్శిస్తున్నారు. -
అరకొర బస్సులు.. ప్రయాణికుల పాట్లు
● గొడవలు, తోపులాటలతో పోలీసుల రంగప్రవేశం ● రాత్రి వరకూ కొనసాగిన రద్దీ ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రా నికి వచ్చే యాత్రికులకు బస్సు ప్రయాణం.. ప్రహసనంగా మారింది. శనివారం క్షేత్రానికి వేలాది మంది భక్తులు విచ్చేశారు. తిరుగు ప్రయాణమయ్యే క్ర మంలో బస్టాండ్కు చేరుకున్నారు. అయితే బస్సులు అరకొరగా ఉండటంతో బస్సులు ఎక్కేందుకు పోటీపడ్డారు. దీంతో గొడవలు, కేకలతో బస్టాండ్ ప్రాంతం దద్దరిల్లింది. బస్టాండ్లోకి వస్తున్న బస్సులకు ఎదురెళ్లి ఎక్కుతుండటంతో దిగేవారు నానా అవస్థలు పడ్డారు. డ్రైవర్లు, కండక్టర్లు వారిస్తున్నా వినకుండా పలువురు ఫుట్బోర్డులపై నిలిచి మరీ ప్రమాదకర ప్రయాణాలు సాగించారు. చాలీచాలని బస్సులు, యాత్రికుల గొడవలతో స్థానిక ఎస్సై టి.సుధీర్ సిబ్బందితో కలిసి బస్టాండ్కు చేరుకుని ప్రయాణికులను నియంత్రించారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ కొనసాగింది. అయితే కొందరు భక్తులు బస్సులు ఎక్కలేమంటూ ఆటోలు ఎక్కి గమ్యస్థానాలకు చేరుకున్నారు. ప్రభుత్వ నిర్వాకం కారణంగా పోలీసులు బస్టాండుల్లో బస్సుల వద్ద విధులు నిర్వర్తించాల్సి వస్తోందని, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు భయపడాల్సి వస్తోందని పలువురు వాపోయారు. అయినా యాత్రికులకు సురక్షితమైన ప్రయాణం లేదని పలువురు అంటున్నారు. -
దేదీప్యం.. దివ్య తేజం
● సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీవారు ● సరస్వతీదేవి అలంకరణలో దర్శనం ● మూడో రోజుకు చేరిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు బ్రహ్మోత్సవాల్లో నేడు ● ఉదయం 7 గంటల నుంచి హనుమద్వాహనంపై శ్రీవారి తిరువీధి సేవ ● ఉదయం 8 గంటల నుంచి భజన కార్యక్రమాలు ● ఉదయం 9 గంటల నుంచి భక్తిరంజని ● ఉదయం 10 గంటల నుంచి కూచిపూడి నృత్య ప్రదర్శనలు ● సాయంత్రం 4 గంటల నుంచి నాదస్వర కచేరి ● సాయంత్రం 5 గంటల నుంచి కూచిపూడి నృత్య ప్రదర్శనలు ● రాత్రి 7 గంటల నుంచి ఎదుర్కోలు ఉత్సవం, అనంతరం వెండి శేషవాహనంపై గ్రామోత్సవం ● శ్రీవారి ప్రత్యేక అలంకారం : భూ వరాహ స్వామి ద్వారకాతిరుమల: చైతన్యమూర్తినే వాహనంగా మలచుకుని విహరించిన కలియుగ వైకుంఠవాసుడిని వీక్షించిన భక్తజనులు పులకించారు. ద్వారకాతిరుమల శ్రీవారి ఆశ్వయుజమాస దివ్య బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు శనివారం ఉదయం సూర్యప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. సూర్యుడు తేజోనిధి.. సకల రోగాలను నివారిస్తాడు. అందుకే వాహన సేవల్లో ఈ వాహనానికి అత్యంత ప్రాధాన్యం. తొలుత ఆలయంలో పంచాయుధాలను ధరించి నారాయణమూర్తి అలంకరణలో సూర్యప్రభ వాహనాన్ని అధిరోహించిన శ్రీవారికి అర్చకులు విశేష పుష్పాలంకారాలు చేసి హారతులిచ్చారు. అనంతరం ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా వాహనం క్షేత్ర పురవీధులకు పయనమైంది. తిరువీధుల్లో ఊరేగిన శ్రీవారికి భక్తులు నీరాజనాలు అర్పించారు. సూర్యప్రభ వాహనంపై ఉన్న స్వామివారిని దర్శిస్తే సకల విద్య, ఆరోగ్య, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు తెలిపారు. ఇదిలా ఉండగా రాత్రి జరగాల్సిన చంద్రప్రభ వాహన సేవ వర్షం కారణంగా రద్దయ్యింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తున్నాయి. భరత నాట్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. చదువుల తల్లిగా శ్రీవారు : బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీవారు ఆలయ ముఖ మండపంలో చదువుల తల్లి సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అలంకారంలోని స్వామిని దర్శిస్తే ఇతి బాధలు ఉండవని, విద్య అపారంగా కలుగుతుందని పండితులు చెబుతున్నారు. సరస్వతీదేవి అలంకారంలో శ్రీవారు -
మహిళల కబడ్డీ విజేత శ్రీకాకుళం
హత్య కేసులో ఆరుగురి అరెస్ట్ తణుకులో తాడేపల్లిగూడేనికి చెందిన యువకుడి అదృశ్యం ఆపై హత్య కేసును ఛేదించిన పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. 8లో uపురుషుల విజేత తూర్పుగోదావరి నూజివీడు: దసరా సందర్భంగా నూజివీడులో నిర్వహిస్తున్న 73వ అఖిలభారత పురుషుల, మహిళల కబడ్డీ పోటీలు శనివారం రాత్రి ముగిశాయి. మహిళల కబడ్డీ విజేతగా శ్రీకాకుళం జట్టు నిలిచింది. ఫైనల్ మ్యాచ్ శ్రీకాకుళం–చిత్తూరు జట్ల మధ్య జరగ్గా చిత్తూరు జట్టుపై 40–29 స్కోర్తో శ్రీకాకుళం జట్టు గెలుపొందింది. చిత్తూరు జట్టు ద్వితీయస్థానంతో సరిపెట్టుకుంది. పురుషుల ఫైనల్ మ్యాచ్ గుంటూరు–తూర్పుగోదావరి జట్ల మధ్య జరిగింది. తూర్పుగోదావరి జట్టు 59–39 స్కోర్ తేడాతో గుంటూరు జట్టుపై గెలుపొంది విజేతగా నిలిచింది. విజేతలకు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు నగదు బహుమతులను, ట్రోఫీలను అందజేశారు. ఆటలకు నిలయం నూజివీడు: మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ నూజివీడులో పూర్వకాలం నుంచి ఆటలకు గొప్ప పేరుందని అన్నారు. ఆటలు, క్రీడలకు నూజివీడులో లభించే ప్రోత్సాహం జిల్లా లో మరెక్కడా లభించదన్నారు. ప్రతిఒక్కరూ క్రీడలను ప్రోత్సాహించాలన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు చదువుతో పాటు ఆటల గురించి తెలియజేయడంతో పాటు ఆడుకునేలా అవకాశం కల్పించాలన్నారు. క్రీడల్లో ప్రతిభను కనబరిస్తే నలుదిశలా పేరు ప్రఖ్యాతలు లభిస్తాయన్నారు. స్పోర్టింగ్ క్లబ్ అధ్యక్షుడు రామిశెట్టి మురళీకృష్ణ, సెక్రటరీ టీవీ కృష్ణారావు, జాయింట్ సెక్రటరీ మల్లెపూడి రాజశేఖర్, జడ్పీ వైస్ చైర్మన్ గుడిమళ్ల కృష్ణంరాజు, రిటైర్డ్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు కోటగిరి సతీష్, మున్సిపల్ వైస్ చైర్మన్ కొమ్ము వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగిన పీహెచ్సీ డాక్టర్ల దీక్షలు
ఏలూరు టౌన్: జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యులు చేపట్టిన నిరసన దీక్షలు మూడో రోజు కొనసాగాయి. 20 రోజులుగా జిల్లావ్యాప్తంగా పీహెచ్సీల్లోని వైద్యులు దశలవారీ ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఏలూరు పాతబస్టాండ్ సమీపంలోని డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద శుక్రవారం నిరసన దీక్ష కొనసాగించారు. జిల్లాలోని 62 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు పోరాటం చేస్తున్నారు. ఏపీ పీహెచ్సీ వైద్యుల అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా శనివారం చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. పీహెచ్సీ వైద్యుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ భవానీ, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ జ్ఞానేష్ మాట్లాడుతూ పీహెచ్సీ వైద్యులకు ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. ఇన్సర్వీస్ కోటాలో కోత విధించటం దారుణమనీ, తాము ప్రజలకు చిత్తశుద్ధితో సేవ చేస్తున్నా తమ సమస్యల పరిష్కారం పట్ల కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరించటం సరికాదని అభిప్రాయపడ్డారు. తమ సమస్యలను పరిష్కరించే వరకూ పోరాటాన్ని ఆపేది లేదని వైద్యాధికారులు స్పష్టం చేశారు. -
రూప్చంద్ ధర పాతాళానికి
● నష్టాల ఊబిలో రైతులు ● సంక్షోభంలో రూప్చంద్ సాగు ● కిలో రూ.82కు పడిపోయిన ధర గణపవరం: ఏడాది కాలంగా మంచి ధర పలుకుతున్న రూప్చంద్ ధర హఠాత్తుగా పడిపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. రెండు నెలల వ్యవధిలోనే కిలోపై రూ.30 మేర పడిపోగా, గత జనవరితో పోలిస్తే ఏకంగా కిలోకి రూ.45 వరకూ తగ్గిపోయింది. దీంతో రూప్చంద్ రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ప్రస్తుత ధర కిలో రూ.82కు అమ్మితే కనీసం పెట్టుబడులు సైతం దక్కవని రైతులు ఆందోళన చెందుతున్నారు. ధర పెరుగుతుందన్న ఆశతో రైతులు పట్టుబడికి వచ్చిన చేపలను చెరువులలోనే ఉంచి రోజుల తరబడి మేపుతున్నారు. తగ్గిన రూప్చంద్ ఎగుమతులు ధర పడిపోవడంతో రైతులు పట్టుబడులు నిలిపివేశారు. దసరా తర్వాతైనా ధర పెరుగుతుందన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. జిల్లా నుంచి రోజూ సుమారు 30 నుంచి 40 లారీల రూప్చంద్ చేపల ఎగుమతులు జరిగేవి. ప్రస్తుతం రోజుకు 15 లారీలకు మించి జరగడంలేదని చెబుతున్నారు. గత జూలై వరకూ కిలో రూ.112 నుంచి రూ.115 వరకూ పలికిన ధర క్రమంగా తగ్గుతూ వారం రోజుల్లో కిలో రూ.82కు పడిపోయింది. ఎకరాకు లక్ష రూపాయల నష్టం రూప్చంద్ ధర అమాంతం పడిపోవడంతో రూప్చంద్ సాగుచేసిన రైతులు లబోదిబోమంటున్నారు. కరోనా సమయంలో తప్ప ఇంతటి గడ్డు పరిస్థితి ఎప్పుడూ చూడలేదని రైతులంటున్నారు. ప్రస్తుత ధరకు రూప్చంద్ అమ్మితే ఎకరాకు రూ.లక్ష వరకూ నష్టపోవాల్సి వస్తుందంటున్నారు. ఈ ధర ఇంకా తగ్గే అవకాశం ఉందన్న ప్రచారంతో ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత చెరువుల నిర్వహణ రీత్యా రూప్చంద్ ధర కనీసం కిలో రూ.95 ఉంటే పెట్టుబడులతో బయటపడతామని, ఈ ధరకు ఎంత తక్కువకు అమ్మితే ఆ మేరకు నష్టం తప్పదని రైతులు చెబుతున్నారు. ఏడాదిన్నర కాలంగా రూప్చంద్ ధర బాగుండటంతో రైతులు ఎక్కువ మంది రూప్చంద్ సాగులోకి దిగారు. కిలో రూ.110 దాటని ధర ఏడాది కాలంగా పెరుగుతూ కిలో రూ.127 వరకూ పెరిగింది. దీంతో చాలామంది రైతులు లాభపడ్డారు. ఏడాది కాలంగా ఈ ధర నిలకడగా ఉండటంతో ధర బాగుందన్న ఉద్దేశ్యంతో గత అక్టోబర్, నవంబర్ నెలల్లో చాలామంది రూప్చంద్ సాగు చేపట్టారు. అప్పట్లో రొయ్యసాగు చేసి తీవ్రంగా నష్టపోయిన చాలామంది రైతులు రూప్చంద్ సాగు చేపట్టారు. దీంతో రూప్చంద్ సాగు విస్తీర్ణం తెల్లచేపను మించిపోయింది. రాబడి మేతలకే సరి ప్రస్తుత ధరలో చేపను అమ్మితే వచ్చే సొమ్ము మేత ఖర్చులకే సరిపోతుందని, చెరువు లీజులు, సీడ్, మందులు, విద్యుత్ బిల్లులు, కాపలాదారుల ఖర్చు, నిర్వహణ వ్యయం రైతు భరించక తప్పదని వాపోతున్నారు. ఇవన్నీ కలిపితే ఎకరాకు కనీసం రూ.లక్ష వరకూ నష్టం వస్తుందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. కొంతకాలం వేచి చూస్తే చేప ధర పెరుగుతుందన్న ఆశతో రోజుల తరబడి చేపలను చెరువులో ఉంచి మేపడం వల్ల మరింత నష్టం తప్పడం లేదని వాపోతున్నారు. ప్రస్తుతం రూప్చంద్ పట్టుబడులకు సిద్ధంగా ఉంది. ఈ సమయానికి చేప ధర దారుణంగా తగ్గిపోవడంతో రైతుల పరిస్థితి అయోమయంగా తయారైంది. సరిగా పట్టుబడి సమయానికి ధర తగ్గిపోవడాన్ని రైతులు జీర్ణించుకోలేక పోతున్నారు. రెండేళ్ల క్రితం కూడా ఇదే విధంగా రూప్చంద్ ఎక్కువ విస్తీర్ణంలో పట్టుబడికి వచ్చిన సందర్భంగా చేప ధర కిలో రూ.60కు పడిపోయి రైతులు దారుణంగా నష్టపోయారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2.25 లక్షల ఎకరాలలో ఆక్వాసాగు జరుగుతుండగా, సుమారు 1.30 లక్షల ఎకరాలలో చేపల సాగు చేస్తున్నారు. ఆక్వా రంగంలో దళారులు, వ్యాపారులదే రాజ్యం. ప్రభుత్వ కనీస ధరలు నిర్ణయించినా అమలుకు నోచుకోవడం లేదు. నేను 27 ఎకరాలలో రూప్చంద్ సాగుచేస్తున్నాను. ప్రస్తుతం చేపలు పట్టుబడికి సిద్ధంగా ఉన్నాయి. ఈ సమయంలో ధర కిలో రూ.82కు పడిపోవడంతో ఏంచేయాలో పాలుపోవడంలేదు. ఈ ధరలో అమ్మితే రైతులకు పెట్టుబడి కూడా దక్కే పరిస్థితిలేదు. దీనికి తోడు ఆక్వాచెర్వులపై ఎడాపెడా విద్యుత్ బిల్లుల మోత మోగుతుంది. – సంకు శ్రీనివాసరావు, రైతు చేపఽల సాగు నష్టాలలో నడుస్తుండటంతో ఆ ప్రభావం సీడ్, చేప పిల్లపై పడింది. రూప్చంద్కు ధర లేకపోవడంతో మూడేళ్లుగా చేప పిల్లల వ్యాపారం నష్టాలలో నడుస్తుంది. గతంలో ఐదు అంగుళాల సైజు ఉన్న రూప్చంద్ చేపపిల్ల ధర రూ.9 పలికేది. రూప్చంద్ ధర పడిపోవడంతో సాగు తగ్గిపోతుంది. ప్రస్తుతం రూప్చంద్ సీడ్ కొనే నాధుడు కనిపించడంలేదు. – సమయం వీరరాఘవులు, రూప్చంద్ పిల్ల పెంపకందారు ఏడాదిన్నరగా చేపల సాగు నష్టాలతో నడుస్తుంది. వ్యాపారులు ధర తగ్గించేయడం, కంపెనీలు మేత ధర పెంచేయడంతో రైతులు నలిగిపోతున్నారు. ఇటీవల పది ఎకరాలలో రూప్చంద్ సాగుచేసి పది లక్షలు నష్టపోయాను. కొంత కాలంగా రూప్చంద్ ధర బాగుండటంతో మళ్లీ 20 ఎకరాలలో రూప్చంద్ వేశాను. ప్రస్తుతం పట్టుబడి దశకు చేరింది. గత నెలలో మిడిల్ క్రాప్ తీస్తే కిలోలోపు సైజుకు రేటు రూ.90 వచ్చింది. ఇప్పుడు కిలోసైజు చేపధర రూ.80కు పడిపోయింది. – రమేష్రాజు, ఆక్వా రైతు -
సంబరాల దసరా
దసరా సంబరాలు అంబరాన్నంటాయి. ఊరూవాడా అమ్మవార్ల ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ఊరేగింపులు ఘనంగా నిర్వహించారు. దేవీ శరన్నవరాత్రుల ముగింపు సందర్భంగా విజయదశమి నాడు అమ్మవార్లు రాజరాజేశ్వరి అలంకరణలో దర్శనమిచ్చారు. – నూజివీడు/ద్వారకాతిరుమల కొల్లేరులో యథేచ్ఛగా అక్రమ సాగు కొల్లేరుపై సీఈసీ నివేదిక ఎప్పుడు ? పూర్తి సమాచారం ఇవ్వడంలో ప్రభుత్వ శాఖలు విఫలం ఈనెల 8న సుప్రీంకోర్టులో కేసుపై వాదనలు -
సీఈసీనీ లెక్కచేయక..
సుప్రీంకోర్టు ఆదేశాలతో సీఈసీ కమిటీ సభ్యులు పర్యటించినా కొల్లేరులో అక్రమ చేపల సాగు యథేచ్చగా సాగుతోంది. అటవీ శాఖ అధికారులు రాజకీయ నాయకుల ఒత్తిళ్లు తట్టుకోలేక అక్రమ చేపల చెరువులకు గండ్లు కొట్టామని తప్పుడు సమాచారం ఇచ్చారు. చేపల చెరువులకు చిన్నపాటి గండ్లు పెట్టి ఫొటోలు తీసుకున్న తర్వాత అక్రమ సాగుదారులు వెంటనే గండ్లు పూడ్చేశారు. ఏలూరు జిల్లాలో పలు కొల్లేరు గ్రామాల్లో అటవీ శాఖ గండ్లు పెట్టిన చెరువుల్లో దర్జాగా చేపల సాగు జరుగుతోంది. అక్రమ చెరువులు ధ్వంసం చేయడానికి అటవీ సిబ్బంది గ్రామాల్లోకి వెళుతుంటే కొల్లేరులో కూటమి నేతలు మహిళలను ముందు వరుసలో ఉంచి ఆందోళనలు చేయిస్తున్నారు. -
హత్య చేసి.. గోనె సంచిలో కుక్కి..
● వీడిన యువకుడి హత్యకేసు మిస్టరీ ● సఖినేటిపల్లిలో సురేష్ మృతదేహం లభ్యం తణుకు అర్బన్: తణుకులో మొదట అదృశ్యం.. ఆపై హత్యగా మారి సంచలనం సృష్టించిన కేసులో ఎట్టకేలకు మిస్టరీ వీడింది. చించినాడ గోదావరి తీరంలో పోలీసులు ఈతగాళ్ల సాయంతో చేపట్టిన గాలింపు చర్యల్లో భాగంగా ఈనెల 2న తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లిలోని చొదిమెళ్ల గ్రామ పరిధిలో తాడేపల్లిగూడేనికి చెందిన యువకుడు మడుగుల సురేష్ (25) మృతదేహం నీటిపై తేలుతూ కనిపించింది. గత నెల 23న తణుకు వెళ్లిన సురేష్ తిరిగి తాడేపల్లిగూడెం రాలేదని న్యాయవాది తిర్రే సత్యనారాయణరాజుపై అనుమానం వ్యక్తం చేస్తూ 25న తణుకు పట్టణ పోలీస్స్టేషన్లో సురేష్ సోదరి శిరీష ఇచ్చిన ఫిర్యాదుతో అదృశ్యం కేసుగా పోలీసులు నమోదుచేశారు. అయితే పోలీసుల దర్యాప్తులో బయటపడ్డ ఆధారాలతో ముందుగా తణుకు గోస్తనీ కాలువలో, అనంతరం చించినాడ గోదావరిలో రెండురోజులపాటు గాలింపు చేపట్టగా సురేష్ మృతదేహం ఉన్న గోనె సంచి మూట గోదావరిలో లభ్యమైంది. అప్పటికే శవం కుళ్లిపోయి, పురుగులు పట్టిన పరిస్థితుల్లో ఉండగా మృతుడి చేతిపై ఉన్న పచ్చబొట్టుతోపాటు ఒంటిపై ఉన్న దుస్తుల ఆధారంగా బాధిత వర్గాలు గుర్తించిన అనంతరం శుక్రవారం పోలీసులు పంచనామా నిర్వహించి రాజోలు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం చేయించారు. అనంతరం కుటుంబసభ్యులకు సురేష్ మృతదేహాన్ని అప్పగించారు. వివాహేతర సంబంధం వ్యవహారంలో.. వివాహేతర సంబంధం వ్యవహారంలో న్యా యవాది తిర్రే సత్యనారాయణరాజు పట్టణానికి చెందిన నలుగురు యువకుల సాయంతో గతనెల 23న సురేష్పై దాడి చేశారని, దాడి ఘటనలో సురేష్ తలకు తీవ్రగాయమైనట్టు తెలుస్తోంది. మృతి చెందాడని నిర్ధారించుకున్న అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి తణుకు నుంచి ఒక కారులో ఎక్కించుకుని చించినాడ బ్రిడ్జిపై నుంచి గోదావరిలో పారవేసినట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలినట్టు సమాచారం. అయితే నిందితులు అంతా ఒకే మాటపై ఉండి మృతదేహం దొరకకుండా ఉండేందుకు పోలీసులకు తప్పుగా సమాచారం ఇస్తూ వారిని ముప్పుతిప్పలు పెట్టారు. సురేష్ సెల్ఫోన్ను సైతం తాడేపల్లిగూడెంలో పారవేసి పోలీసులను తప్పుదారి పట్టించేందుకు నిందితులు పక్కా ప్లాన్ చేశారని సమాచారం. అయినా పోలీసులు తమదైన రీతిలో విచారణ చేసి చివరకు పదో రోజున మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహం లభ్యం కాని పక్షంలో కేసు వీగిపోతుందనే ఉద్దేశంతో నిందితులు చాకచక్యంగా వ్యవహరించినా చివరకు మిస్టరీ వీడిందని, అయితే మృతదేహం త ర లింపులో నిందితులు విని యోగించిన కారును కూ డా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. మడుగుల సురేష్ (ఫైల్) సఖినేటిపల్లి గోదావరి తీరంలో లభ్యమైన సురేష్ మృతదేహం ఉన్న మూటయువకుడి అదృశ్యం ఘటన గతనెల 25 నుంచి ప్రసార సాధనాలు, సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో తణుకు పోలీసులు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.తణుకు పట్టణ స్టేషన్లో ఇద్దరు ఎస్సైలు, కానిస్టేబుళ్లు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ బందోబస్తుకు వెళ్లిన నేపథ్యంలో స్టేషన్లో సగం సిబ్బంది కూడా లేని పరిస్థితి. అయినా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తణుకు సీఐ ఎన్.కొండయ్య నేర విభాగ పోలీసుల సహకారంతో కేసును ఛేదించారు. అలాగే గతనెల 27న తణుకు వారణాసి వారి వీధిలో వృద్ధురాలిని భయపెట్టి 70 కాసుల బంగారు ఆభరణాల చోరీ కేసులో సైతం పురోగతి లభించినట్టు తెలిసింది. అనుమానితులను గుర్తించి, మహారాష్ట్రకు ప్రత్యేక నేర విభాగం సిబ్బంది వెళ్లి నిందితులను పట్టుకున్నట్టు సమాచారం. చోరీకి సంబంధించిన సొత్తును సైతం సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. -
ఎరువు.. దరువు
ఏలూరు (మెట్రో): ఎరువుల ధరలు పెరుగుదలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే యూరియా కొరతతో అవస్థలు పడుతున్న రైతుల నెత్తిన ఎరువుల ధరల పెరుగుదల మరో పిడుగులా మారింది. ఓ పక్క ధరల పెరుగుదల, మరోపక్క దుకాణాల్లో ఎమార్పీకి మించి విక్రయించడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. జీఎస్టీ తగ్గింపుతో కారులు, ద్విచక్రవాహనాలు, గృహోపకరాణాలు తదితర వస్తువుల ధరలు తగ్గినా రైతులకు అవసరమయ్యే ఎరువుల ధరలు మాత్రం తగ్గలేదు. రైతే దేశానికి వెన్నెముక అని చెబుతున్నా అన్నదాతల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రైతు సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. ఎరువులు వాడాల్సిన పరిస్థితి ఏలూరు జిల్లాలో ప్రధానంగా వరి, మొక్కజొన్న ప్రధాన పంటలు కాగా వేరుశనగ, పెసర, మినుము పంటలను రైతులు సాగు చేస్తున్నారు. జిల్లాలో వ్యవసాయ సాగు 1,97985 ఎకరాలు ఉండగా, ఉద్యాన పంటల సాగు 2,72,939 ఎకరాలు ఉంది. ఉద్యాన పంటల్లో ప్రధానంగా ఆయిల్పామ్, కోకో, కొబ్బరి సాగవుతున్నాయి. ప్రస్తుతం పంటలపై వస్తున్న చీడపీడలను తట్టుకునేందుకు, దిగుబడులు వచ్చేందుకు రైతులు తప్పనిసరిగా ఎరువులపై ఆధార పడాల్సిన పరిస్థితి. అయితే ధరల పెరుగుదల వారికి భారంగా మారింది. దుకాణాల్లో ఎమ్మార్పీకి అదనంగా విక్రయించడం మరింత ఇబ్బంది పెడుతోంది. ఎరువుల ధరల నియంత్రణ, ఎమ్మార్పీకి విక్రయించేలా చర్యలు తీసుకోవడంలో కూటమి సర్కారు విఫలమైందని రైతులు అంటున్నారు. సాగు చేయాలంటేనే ఎరు వుల ధరలు భయపెడుతున్నాయి. వీటిపై నియంత్రణ లేకపోతే ఏటా పెట్టుబడులు పెరిగిపోతాయి. రైతులు పండించిన పంటలకు మాత్రం గిట్టుబాటు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఎరువుల ధరలను నియంత్రణలో ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – రావూరి రవి, రైతు, బాపిరాజుగూడెం ఎరువు రకం గతం ప్రస్తుతం 20–20–0 1,250 1,350 10–26–26 1,470 1,850 15–15–15 1,450 1,650 14–15–14 1,700 1,850 పొటాష్ 1,550 1,800 28–28 1,700 1,850 20–20–0–13 1,300 1,450 24–24 1,700 1,850 రైతులపై ముప్పేట దాడి ధరల పెరుగుదలతో అన్నదాతలు సతమతం పట్టించుకోని కూటమి సర్కారు జిల్లాలో 4.70 లక్షల ఎకరాల్లో సాగు -
చీటీల పేరుతో మోసం
నూజివీడు: నూజివీడులోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన శిరిగిరి వెంకటేశ్వరరావు అలియాస్ మోషే చీటీ పాటల పేరుతో 52 మంది నుంచి రూ.2.50 కోట్లు వసూలు చేసి మోసం చేశాడని పేర్కొంటూ బాధితులు శుక్రవారం పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నూజివీడుతో పాటు హనుమాన్జంక్షన్, ధర్మాజీగూడెం, బంటుమిల్లి, పెడన, చిల్లకల్లు, ప్రగడవరం, కుక్కునూరు, రామాపురం, కొత్తపల్లి గ్రామస్తుల దగ్గర బుడజంగాల సెక్రటరీ అంటూ మాయమాటలు చెప్పి చీటీపాటల పేరుతో మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమను నమ్మించి మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. చీటీ కడితే అవసరానికి ఉపయోగపడతాయని చెప్పి మోసం చేయడం దారుణమని, అతనికి నూజివీడులో రెండు బట్టల షాపులున్నాయని, మూడు ఇల్లు కట్టించాడని, ఇతర ఆస్తులున్నాయని, బంధువుల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఐపీ నోటీసులు ఇచ్చాడని పేర్కొన్నారు. చాట్రాయి: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు సివిల్ సప్లయిస్ డీటీ వెంకటేశ్వరావు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ మండలంలోని గుడిపాడు గ్రామానికి చెందిన ధనికొండ గోపిరాజు, కోట సురేష్ బాబు, తిరువూరుకు చెందిన చారి రేషన్ బియ్యం అక్రమంగా కొనుగోలు చేసి మండలంలోని గుడిపాడు నుంచి చనుబండ మీదుగా తిరువూరు తరలిస్తుండగా 40 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గురువారం రాత్రి పట్టుకున్నట్లు ఆయన చెప్పారు. -
బ్రహ్మాండం.. బ్రహ్మోత్సవం
● తొలిరోజు వరుడైన శ్రీవారు ● రెండో రోజు నేత్రపర్వంగా ధ్వజారోహణం ● ప్రత్యేక అలంకారాల్లో స్వామివారి దర్శనం ద్వారకాతిరుమల: శ్రీవారి ఆశ్వయుజమాస దివ్య బ్రహ్మోత్సవాలు దసరా పండుగ రోజు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామిని పెండ్లి కుమారుడు, అమ్మవార్లను పెండ్లి కుమార్తెలను చేయు వేడుక వైభవంగా జరిగింది. ముందుగా ఉత్సవమూర్తులను ఆలయం నుంచి తొళక్క వాహనంపై తీసుకెళ్లి, నిత్యకల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై వేంచేపు చేశారు. ఆ తరువాత అర్చకులు సర్వాభరణ భూషితులైన శ్రీవారు, అమ్మవార్లకు బుగ్గన చుక్క, కల్యాణ తిలకాలను దిద్దారు. ఈ సందర్భంగా ఆలయ డీఈఓ భద్రాజీ, ఏఈఓ పి.నటరాజారావులు స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, పూలు, పండ్లను సమర్పించారు. ఆ తరువాత పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెను చేసే వేడుకను అట్టహాసంగా నిర్వహించారు. ఆఖరిలో అర్చకులు, పండితులకు అధికారులు నూతన వస్త్రాలను అందజేశారు. తొలిరోజు స్వామివారు ఆలయ ముఖ మండపంలో శ్రీ మహావిష్ణువు అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. చరాచర సృష్టికి ఆహ్వానం.. బ్రహ్మోత్సవాల్లో రెండోరోజు శుక్రవారం రాత్రి ఆలయంలో ధ్వజారోహణ వేడుక వైభవంగా జరిగింది. ఉత్సవాలకు ఇంద్రాది అష్టదిక్పాలకులను, సర్వ దేవతలను, గంధర్వ, కిన్నెర, కింపురుషాది దేవగణాలను, సప్త అధోలోక జీవులను స్వాగతిస్తూ వేద మంత్రోచ్ఛరణలతో అర్చకులు ఆలయ ధ్వజస్తంభంపై గరుడ పటాన్ని ఎగురవేశారు. ఆ తరువాత గరుడ ప్రసాదాన్ని భక్తులకు, సంతానం లేని మహిళలకు అందించారు. అంతకు ముందు రుత్విగ్వరణ, మృద్గ్రహణ, అంకురార్పణ కార్యక్రమాలను జరిపారు. అంకురార్పణలో భాగంగా ఆలయ యాగశాలలో ఏర్పాటు చేసిన పాలికల్లో అర్చకులు పుట్టమన్నును ఉంచారు. ఆ తరువాత వాటిలో నవధాన్యాలను పోసి అంకురార్పణను నిర్వహించారు. రాత్రి హంస వాహనంపై గ్రామోత్సవం కనులపండువగా జరిగింది. ఆలయ ముఖ మండపంలో స్వామివారు మురళీకృష్ణ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 7 గంటల నుంచి సూర్యప్రభ వాహనంపై గ్రామోత్సవం ఉదయం 8 గంటల నుంచి భజన కార్యక్రమాలు ఉదయం 9 గంటల నుంచి భక్తిరంజని ఉదయం 10 గంటల నుంచి కూచిపూడి భరతనాట్య ప్రదర్శనలు సాయంత్రం 4 గంటల నుంచి నాదస్వరకచేరి సాయంత్రం 5 గంటల నుంచి కూచిపూడి భరతనాట్య ప్రదర్శనలు. రాత్రి 7 గంటల నుంచి చంద్రప్రభ వాహనాలపై గ్రామోత్సవం ప్రత్యేక అలంకారం : సరస్వతి -
జంగారెడ్డిగూడెంలో దారుణ హత్య
జంగారెడ్డిగూడెం: పాత కక్షల నేపథ్యంలో పాత నేరస్తుడిని మరికొంతమంది పాత నేరస్తులు కలిసి హత్య చేశారు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. స్థానిక ఉప్పలమెట్టపై నివశిస్తున్న కర్రి రాజేష్ (25)ను శుక్రవారం మధ్యాహ్నం కొందరు వ్యక్తులు పిలవగా, వారిని చూసి రాజేష్ పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో అతన్ని వెంబడించి బైక్పై ఎక్కించుకుని తీసుకెళ్లి కాళ్లు చేతులు కట్టేసి స్థానిక బైనేరు వాగు ఒడ్డున కత్తితో హత్య చేశారు. అతని భార్య నాగేశ్వరి మాట్లాడుతూ తన భర్త రాజేష్ ఇంట్లో ఉండగా, ఖాసిం, చోటులు వచ్చారని, వారిని చూసి రాజేష్ పారిపోగా, అతన్ని వెంబడించారని, అలాగే రెండు బైక్లపై వచ్చిన మరో ఇద్దరు, ముగ్గురు కూడా వెంబడించారన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు.రవిచంద్ర, సీఐ ఎంవీ సుభాష్, ఎస్సై షేక్ జబీర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. రాజేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కర్రి రాజేష్, షేక్ ఖాసిం, షేక్ నాగుల్మీరా, సంపంగి మంగరాజు, వాసంశెట్టి రామచంద్రపవన్, షేక్ జహీరుద్దీన్ అలియాస్ చోటు కలిసి దొంగతనాలు చేసేవారు. రాజేష్, షేక్ ఖాసింపై జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ షీట్లున్నాయి. వీరిపై జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం, తెలంగాణ రాష్ట్రంలోని పోలీస్స్టేషన్లలో పలు దొంగతనాల కేసులు ఉన్నాయి. దొంగతనాలకు సంబంధించి పంపకాల విషయంలో తేడా వచ్చిందని, వరంగల్ జిల్లాలో దొంగతనానికి సంబంధించి కర్రి రాజేష్, మిగిలిన వారి పేర్లు చెప్పాడనే కక్షతో ఈ హత్యకు పాల్పడినట్లు తెలిసింది. సుమారు నెల రోజులుగా రాజేష్ను హతమార్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
గజలక్ష్మి భయపెట్టింది
ద్వారకాతిరుమల: శ్రీవారి గ్రామోత్సవం జరుగుతున్న సమయంలో గుర్రం దగ్గరకు వెళ్లడంతో దాని నీడచూసి భయపడిన దేవస్థానం ఏనుగు గజలక్ష్మి ఒక్కసారిగా అడ్డం తిరిగింది. దాంతో వాద్యకారులు, భక్తులు భయంతో రోడ్డుపై పరుగులు తీశారు. దేవస్థానం ఆటోను అడ్డు పెట్టడంతో గజలక్ష్మి నిలిచిపోయింది. దాంతో అక్కడున్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. శ్రీవారు ఉభయ దేవేరులతో కలసి సెమీ పూజ నిమిత్తం దసరా మండపం వద్దకు గురువారం రాత్రి తరలి వెళుతున్నారు. గుడి సెంటర్ దాటిన తరువాత అశ్వం దగ్గరకు వెళ్లడంతో దాని నీడను చూసి గజలక్ష్మి కంగారుపడింది. -
ఎరుపెక్కిన శ్రీవారి క్షేత్రం
ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య క్షేత్రం శుక్రవారం భవానీ దీక్షాదారులతో ఎరుపెక్కింది. దేవీ శరన్నవరాత్రుల ముగింపును పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయంలో దీక్షలు విరమించిన భక్తులంతా ద్వారకాతిరుమల క్షేత్రానికి చేరుకుంటున్నారు. దాంతో ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయ పరిసరాలు భవానీలు, సాధారణ భక్తులతో కిక్కిరిశాయి. దర్శనం క్యూలైన్లు, ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, పరిసర ప్రాంతాలు, కల్యాణకట్ట తదితర విభాగాలు భక్తులతో పోటెత్తాయి. కొండపై ఎక్కడ చూసినా భవానీ దీక్షాధారులే కనిపించారు. టి.నరసాపురం: దివ్యాంగురాలిపై అత్యాచారం కేసులో నేరం రుజువు కావడంతో ఒక వ్యక్తికి జిల్లా 5వ అడిషనల్ డిస్ట్రిక్, సెషన్స్ జడ్జ్ శుక్రవారం జైలు శిక్ష విధించినట్లు ఎస్సై ఎం.జయబాబు తెలిపారు. మండలంలోని కె.జగ్గవరానికి చెందిన దివ్యాంగురాలు 2018 మార్చి 21న ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అదే గ్రా మానికి చెందిన కుమ్మరి రమేష్ అత్యాచారం చేసి గాయపరిచాడన్నారు. దీంతో దివ్యాంగురాలి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడన్నారు. అప్పటి ఎస్సై వి.రాంబాబు కేసు నమోదు చేయగా, చింతలపూడి సీఐ పి.రాజేష్ దర్యాప్తు చేసి రమేష్ను అరెస్టు చేశారు. నేరం రుజువు కావడంతో 10 సంవత్సరాలు జైలు, రూ. 500 జరిమానా చెల్లించాలని తీర్పునిచ్చారు. పోలవరం రూరల్: గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. ఎగువ ప్రాంతాల నుంచి నదిలోకి చేరే నీరు క్రమేపీ తగ్గుతుండటంతో వరద ఉధృతి తగ్గుతూ ప్రవహిస్తోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద 31.720 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. స్పిల్వే నుంచి 8 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు చేరుతోంది. ఎగువన భద్రాచలం వద్ద కూడా వరద బాగా తగ్గింది. 36.90 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. వేలేరుపాడు: ఏజెన్సీలో సేవలందిస్తున్న వైద్యుల డిమాండ్లు పరిష్కరించాలని ఆదివాసీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాద్యక్షుడు మిడియం సువర్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు శ్రీరాములు డిమాండ్ చేశారు. గత నెల 25 నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్న వైద్యులకు ఇన్ సర్వీస్లో ఉన్న వారికి పీజీ కోటా సీట్లు క్లినికల్ 30 శాతం నుంచి 15 శాతం, నాన్ క్లినికల్ కోటాలో 50 శాతం నుంచి 30 శాతం వరకు తగ్గించారన్నారు. పెదవేగి: పెదవేగి మండలం ముండూరు శివారులోని పోలవరం కాలువలో గుర్తు తెలియని వృద్ధురాలి మృతదేహం శుక్రవారం మధ్యాహ్నం గుర్తించారు. వెంటనే పెదవేగి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పెదవేగి ఎస్సై రామకృష్ణ మృతదేహాన్ని వెలికి తీయించారు. ఆమె వయసు 60 నుంచి 70 సంవత్సరాలు మధ్య ఉంటుందని వివరాలు తెలిసినవారు పెదవేగి ఎస్సై 9440796638 నెంబర్కు సంప్రదించాలని సూచించారు. -
నాకో, ఏపీ శాక్స్, రాష్ట్ర జైలు శాఖ సహకారంతోనే..
నాకో, ఏపీశాక్స్, రాష్ట్ర జైలు శాఖ సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 83 జైళ్లల్లో హెచ్ఐవీ, టీబీ, సుఖవ్యాధులు, హెపటైటిస్ వ్యాధులపై అవగాహన కల్పిస్తూ క్షేత్ర స్థాయిలో పరీక్షలు చేశాం. వ్యాధి నిర్ధారణైన వ్యక్తులకు అవసరమైన మందులను, ఆరోగ్య సదుపాయాలను అందిస్తున్నాం. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, దిశ, జైళ్ల శాఖ సంయుక్త సహకారంతో ఈ కాార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నాం. –ఎం రాధిక, లెప్రసొసైటీ సీనియర్ మేనేజర్, విజయవాడ -
ఖైదీల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు
ఏలూరులో ఖైదీల ఆరోగ్య పరిరక్షణ కోసం వాటర్ ప్లాంట్, మహిళా ఖైదీల నైపుణ్యాలను పెంపొదించేందుకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం ద్వారా బేకరీ ఏర్పాటు చేశాం. జైళ్లశాఖ ఆధ్వర్యంలో పోలవరంలో హెచ్పీసీఎల్ పెట్రోల్ బంక్ను ఏర్పాటు చేశాం. భీమవరంలో కూడా సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఐఓసీఎల్ సహకారంతో ఫీమెల్ ప్రిజనర్ బ్యారెక్స్, కిచెన్, స్టోర్ రూం, డే టాయిలెట్స్, ఇంక్యూబిలేషన్ సెంటర్ కట్టించాం. ఖైదీల రిహాబిలిటేషన్లో భాగంగా ఐఓసీఎస్ ద్వారా పెట్రోల్ బంక్ నిర్మాణం పూర్తి చేశాం. – సీహెచ్ ఆర్వీ స్వామి జిల్లా సబ్జైళ్ల అధికారి, జిల్లా జైల్ సూపరింటెండెంట్ ఏలూరు జిల్లా -
ఆంధ్రా మైసూర్ ముస్తాబు
● నూజివీడులో నేడు దసరా ఉత్సవాలు ● కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు నూజివీడు: జమీందారుల ఏలుబడిలో దసరా ఉత్సవాల నిర్వహణలో రెండో మైసూర్గా నూజివీడు పేరొందింది. గత నెల 22 నుంచి నిర్వహిస్తున్న శరన్నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. గురువారం రాత్రి జరిగే ఉత్సవాలను తిలకించడానికి ప్రజలు భారీగా తరలిరానున్నారు. రాచరికపు కోటలకు నిలయంగా ఉన్న నూజివీడును శత్రువుల బారి నుంచి పరిరక్షించి, ప్రజలందరినీ చల్లగా చూసేందుకు జమిందారులు కోటప్రాకారంలో నిర్మించిన మహిషాసురమర్దని అమ్మవారి ఆలయం దసరా ఉత్సవాలకు ముస్తాబైంది. కోట ప్రాకారంలో ఉండటంతో కోట మహిషాసురమర్దని ఆలయంగా ప్రసిద్ధికెక్కింది. దసరా ఉత్సవాల్లో భాగంగా విజయదశమి రోజున రాత్రి గరుడ వాహనం, ఐరావతం, బుట్టబొమ్మలు, కోలాట నృత్య ప్రదర్శనలు, చిత్ర, విచిత్ర వేషధారణలతో జోరుగా హుషారుగా ఉత్సవాలు సాగనున్నాయి. స్థానిక ఉయ్యూరు ఎస్టేట్ వద్ద జమిందారీ వారసులు జమ్మికొట్టి దసరా ఉత్సవాలను ప్రారంభించనున్నారు. అక్కడ నుంచి ప్రారంభమయ్యే ఊరేగింపు రాత్రంతా పురవీధుల్లో తిరుగుతూ ప్రజల్ని రంజింపచేస్తుంది. శ్రీ కోట మహిషాసురమర్దని అమ్మవారి ఆలయంలో పోలీసు అధికారులతో ఆయుధ పూజ నిర్వహించిన అనంతరం రాత్రి 10 గంటల నుంచి అమ్మవారు హంస వాహనంపై గ్రామోత్సవానికి బయలుదేరతారు. ఈ గ్రామోత్సవంలో గరగ నృత్యం, బేతాళ సెట్టు, కర్రల మీద మనుషుల నడక, శక్తివేషాలు, కోలాటం, కత్తిసాము, కర్రసాము, నారసాల వంటి ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. ఉత్సవాలను పురస్కరించుకొని పట్టణంలో చిన్నగాంధీబొమ్మ సెంటర్ వద్ద నుంచి పెద్దగాంధీబొమ్మ సెంటర్ వరకు బొమ్మల దుకాణాలు వెలిశాయి. స్థానిక హనుమాన్జంక్షన్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ చిన్నారుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. దసరా ఉత్సవాలకు ఉయ్యూరు రాజా నాంది 112 ఏళ్ల క్రితం నూజివీడులో దసరా ఉత్సవాలకు ఉయ్యూరు ఎస్టేట్ రాజా శ్రీకారం చుట్టినట్లు చరిత్ర చెబుతోంది. ఉయ్యూరు ఎస్టేట్ సంస్థానాధీశులైన రాజా రంగయ్యప్పారావువారి సంస్థాన ద్వారం గుర్రాల గేటు వద్ద ఉన్న ఆయుధాగారంలోని ఆయుధాలకు ఎస్టేట్లోని జమ్మిచెట్టు వద్ద పూజ చేసి దసరా ఉత్సవాన్ని ప్రారంభించే ఆనవాయితీ నాటి నుంచి నేటి వరకూ వస్తోంది. ఉయ్యూరు రాజా హయాంలో అన్ని ఎస్టేట్లకు చెందిన ఏనుగులు అంబారీ, ఒంటెలు, గుర్రపు స్వారీలతో పెద్ద ఊరేగింపు జరిగేది. కోలాటాలు, కత్తి సాము, గారడీలతో ఎంతో ఉత్సహ పూరితమైన వాతావరణంలో ఉత్సవాలు జరిగేవి. అమ్మవారితో పాటు శ్రీ వేంకటేశ్వరస్వామి, కోట శివాలయం, రాజగోపాలస్వామి ఉత్సవ మూర్తులను గ్రామోత్సవం నిర్వహించేవారు. రాజా రంగయ్యప్పారావు తదనంతరం రాజా వెంకటాద్రి అప్పారావు మైసూర్ మహారాజా ఆధ్వర్యంలో జరిగే దసరా ఉత్సవాలను మైసూర్ వెళ్లి తిలకించారు. అక్కడి ఉత్సవాల్లో బుట్టబొమ్మలను చూసి మంత్రముగ్ధుడైన ఆయన ఆ తరహాలోనే బుట్టబొమ్మలను ప్రత్యేకంగా తయారు చేయించి నూజివీడులో జరిగే ఉత్సవాల్లో ప్రదర్శింపజేయడం ఆనవాయితీగా మారింది. ఈ ఉత్సవాల్లో బుట్టబొమ్మలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. రాజా మేకా వెంకటాద్రి అప్పారావు 1952లో ఈ దసరా ఉత్సవాల బాధ్యతను స్థానిక పెద్దలకు అప్పగించారు. దీంతో అప్పటి నుంచి పుర ప్రముఖులు స్పోర్టింగ్ క్లబ్ పేరుతో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. భారీ పోలీస్ బందోబస్తు ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. 200 మందిని బందోబస్తు విధులకు నియమించారు. ఆలయంలో తోపులాట చోటుచేసుకోకుండా క్యూలైన్ల వద్ద పోలీసు సిబ్బందితో పాటు ఎన్సీసీ క్యాడెట్లను, ట్రిపుల్ ఐటీ సెక్యురిటీ సిబ్బందిని ఏర్పాటు చేశారు. గురువారం సాయంత్రం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 7 గంటల వరకూ లారీలు, భారీ వాహనాలను పట్టణంలోకి రాకుండా పోలీసు అధికారులు ఏర్పాట్లు చేశారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
జంగారెడ్డిగూడెం: మండలంలోని పేరంపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. వివరాల ప్రకారం పంగిడిగూడెం గ్రామానికి సాదె పెంటమ్మ పట్టణంలోని ఓ బట్టల దుకాణంలో పని చేస్తోంది. బుధవారం విధులు నిమిత్తం పంగిడిగూడెం నుంచి జంగారెడ్డిగూడెం వచ్చేందుకు ఆటో ఛార్జీలు లేకపోవడంతో, గ్రామానికే చెందిన తాపీ పని చేస్తున్న ఎం.సతీష్ పని నిమిత్తం మోటార్సైకిల్పై జంగారెడ్డిగూడెం వస్తుండగా, అతని మోటార్సైకిల్పై పెంటమ్మ ఎక్కింది. మోటార్సైకిల్ పేరంపేట రామాలయం సమీపానికి వచ్చేసరికి అదుపు తప్పడంతో పెంటమ్మ రోడ్డుపై పడిపోయింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఆమైపె నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. స్థానికులు హుటాహుటిన పెంటమ్మను జంగారెడ్డిగూడెంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. మోటార్సైకిల్ నడుపుతున్న సతీష్కు గాయాలు కాగా, ఆసుపత్రిలో చికిత్స అందించారు. పెంటమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి భర్త శ్రీను పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా మృతురాలు పెంటమ్మకు భర్త శ్రీనుతోపాటు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భీమవరం: పట్టణంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారని టూటౌన్ ఎస్సై ఫజుల్ రహమా న్ తెలిపారు. ఓ కారు మోటర్ సైకిల్ను ఢీకొట్టడంతో లంకపేటకు చెందిన బొబ్బనపల్లి హరీష్బాబు, కొరాడ లక్ష్మీనారాయణ గాయ పడ్డారని పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. -
అత్యవసర సేవలు బంద్
● సమ్మెలో రూరల్ పీహెచ్సీ వైద్యులు ● ఏలూరు జిల్లాలో 62 పీహెచ్సీల్లో నిలిచిన సేవలు ● ఈ నెల 3న చలో విజయవాడకు పిలుపు ఏలూరు టౌన్: కూటమి సర్కారు నిరంకుశ... నిర్లక్ష్య ధోరణితో గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు వైద్య సేవలు దూరమయ్యాయి. ఏలూరు జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తోన్న వైద్యులు విధులను బహిష్కరించారు. ఎన్నికల్లో అలవికాని హామీలు గుప్పించి ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయకుండా మోసం చేసిన కూటమి ప్రభుత్వం... పీహెచ్సీ వైద్యులకు సైతం హామీలు ఇచ్చి మరోసారి మోసం చేసింది. పీజీ సీట్లలో కోటాకు కోత వేసిన ప్రభుత్వం, గత ఏడాది ఇచ్చిన హామీని సైతం పక్కన బెట్టి పాత విధానాన్ని తెరపైకి తేవటంతో ఏపీ పీహెచ్సీ వైద్యుల అసోసియేషన్ పిలుపుతో ఉద్యమబాట పట్టారు. పీహెచ్సీల్లో నిలిచిపోయిన వైద్యసేవలు ఏలూరు జిల్లా వ్యాప్తంగా 62 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా.. వాటిలో 110 మందికి పైగా వైద్యులు విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. పీహెచ్సీలతో పాటు 104 సంచార వాహనాల్లో గ్రామాలకు వెళుతూ ప్రజలకు వైద్య చికిత్సలను అందిస్తూ మందులు పంపిణీ చేస్తూ ఉంటారు. ప్రతీ రోజూ ఒక్కో పీహెచ్సీలో 60 మంది నుంచి 100 మంది వరకూ పేదవర్గాల ప్రజలకు వైద్యులు సేవలు అందిస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేదలు దూర ప్రాంతాలకు వెళ్ళకుండా వారి గ్రామంలో పరీక్షలు చేసి మందులు అందిస్తున్నారు. సరైన సౌకర్యాలు లేకున్నా పీహెచ్సీ వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వైద్య సేవలను చేరువ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం పీహెచ్సీ వైద్యుల సమస్యల పరిష్కారానికి ససేమిరా అనడంతో వైద్యులు ఆందోళన బాట పట్టారు. జిల్లా వ్యాప్తంగా బుధవారం నుంచీ పీహెచ్సీల్లో అత్యవసర వైద్యసేవలను సైతం నిలిపివేశారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వైద్యసేవలు నిలిచిపోయాయి. 3న చలో విజయవాడ ఏలూరు జిల్లాలో గత పదిహేను రోజులుగా పీహెచ్సీ వైద్యులు దశలవారీ ఉద్యమాన్ని చేపడుతూ వస్తున్నారు. ఏపీ పీహెచ్సీ వైద్యుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ భవానీ, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తొలుత నల్లబ్యాడ్జీలు ధరించి నిరనస తెలుపగా.. అనంతరం ఓపీ సేవలు నిలిపివేశారు. ఆన్లైన్ రిపోర్టింగ్, అధికారుల గ్రూపుల నుంచి బయటకు వచ్చేశారు. 104 సంచార వైద్యశాల సేవలు ఆగిపోయాయి. గత మూడు రోజులుగా ఏలూరు వైద్య ఆరోగ్యశాఖ జిల్లా కార్యాలయం వద్ద టెంట్లు వేసుకుని నిరనస ప్రదర్శనలు చేస్తున్నారు. బుధవారం రాత్రి ఏలూరులో పీహెచ్సీ వైద్యులంతా కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ, పాతబస్టాండ్ సెంటర్లో మానవహారం నిర్మించి తమ నిరసన తెలిపారు. ఇక గురువారం నోటికి నల్లబ్యాడ్జీలు కట్టుకుని నిరసన తెలుపుతామని చెబుతున్నారు. ఈనెల 3న చలో విజయవాడ పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పీహెచ్సీల వైద్యులు భారీ ఆందోళన చేపట్టేందుకు సిద్ధపడుతున్నారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు వైద్యసేవలను అందిస్తూ... చిత్తశుద్ధితో పనిచేస్తున్న పీహెచ్సీ వైద్యుల పట్ల ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలి. గత ఏడాది పీజీ సీట్ల కోటాలో 20 శాతం ఇస్తామంటూ హామీ ఇచ్చి.. ఈ ఏడాది మళ్ళీ పాత విధానంలోనే 15 శాతం కోటా ఇస్తామంటే సరైన విధానం కాదు. ప్రభుత్వం మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేవరకూ ఆందోళనలు కొనసాగుతాయి. – డాక్టర్ జ్ఞానేష్, ఏపీ పీహెచ్సీ వైద్యుల అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రభుత్వం తక్షణం స్పందించి మా సమస్యలు పరిష్కరించాలి. ముఖ్యంగా పీజీ ఇన్ సర్వీసు కోటాను పునరుద్ధరించాలి. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు ప్రత్యేకంగా ట్రైబల్ అలవెన్స్ను మంజూరు చేయాలి. ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరిస్తే సమ్మె విరమిస్తాం. లేదంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తాం. – డాక్టర్ ఏ అశోక్ కుమార్, వైద్యాధికారి, తాడువాయి పీహెచ్సీ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సమ్మె బాట పట్టడంతో గ్రా మాల్లోని పేద మధ్యతరగతి ప్రజలు ఏదైనా రోగం వస్తే అత్యవసర వైద్యం చేయించు కోవాలంటే డాక్టర్లు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవలు అందించేందుకు చర్య తీసుకోవాలి. – డాక్టర్ రామకృష్ణ, వైఎస్సార్సీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు, కామవరపుకోట ఏలూరు డీఎంహెచ్ఏ కార్యాలయం వద్ద పీహెచ్సీ వైద్యుల నిరసన ఏలూరులో పీహెచ్సీ వైద్యుల కొవ్వొత్తుల ర్యాలీ -
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం
ద్వారకాతిరుమల: శ్రీవారి వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. గురువారం ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు ఈనెల 9 వరకు వైభవంగా జరగనున్నాయి. అందులో భాగంగా ఆలయాన్ని, పరిసరాలను విద్యుత్ దీప తోరణాలతో శోభాయమానంగా అలంకరించారు. దాంతో ఆలయ రాజగోపురాల సముదాయం, అనివెట్టి మండపం, కొండపైన ఘాట్ రోడ్లు పరిసర ప్రాంతాలు విద్యుత్ దీప కాంతులతో మిరమిట్లు గొలుపుతున్నాయి. అలాగే ఆలయ ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన స్వామి, అమ్మవార్ల 40 అడుగుల భారీ విద్యుత్ కటౌట్ చూపరులను ఆకట్టుకుంటుంది. ఆలయంలో పుష్పాలంకరణ పనులు బుధవారం రాత్రి ప్రారంభమయ్యాయి. స్వామివారు ఉదయం, రాత్రి వేళల్లో విహరించే వాహనాలను ముస్తాబు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలోని శ్రీహరి కళాతోరణ వేదిక సిద్ధమైంది. గురువారం ఉదయం 9.30 గంటలకు స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలను చేయడంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. తణుకు అర్బన్ : తణుకులో అదృశ్యమైన తాడేపల్లిగూడేనికి చెందిన మడుగుల సురేష్ (25) కేసులో నెలకొన్న మిస్టరీ ఇంకా వీడలేదు. అదృశ్యమై పది రోజులు గడిచిపోవడం, తణుకు గోస్తనీ కాలువతో పాటు చించినాడ గోదావరిలో సైతం ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా ఎలాంటి ఆనవాళ్లు దొరక్క కేసు కొలిక్కిరాకపోవడంతో పోలీసులు తలలుపట్టుకుంటున్నారు. ఈ కేసులో బాధితవర్గాల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయవాది తిర్రే సత్యనారాయణరాజుతోపాటు పట్టణానికి చెందిన మరొక నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించినప్పటికీ సురేష్ జాడ తెలుసుకోలేకపోవడం గమనార్హం. -
ఖైదీల్లో పరివర్తన.. నైపుణ్య శిక్షణ
ఏలూరు (మెట్రో) : సీసీసీ పేరుతో కస్టడీ, కేర్, కరెక్షన్ పేరుతో జైళ్ల శాఖ ఖైదీల పట్ల అనేక సేవలు అందిస్తుంది. వివిధ రకాల నేరాలు చేసి జైలు శిక్షకు వచ్చిన వారి పట్ల ఉదార స్వభావంతో అధికారులు వ్యవహరించి వారి మానసిక, శారీరక స్థితిగతులను బేరీజు వేసుకుంటారు. వారి నేరప్రవత్తి మార్చేందుకు జైలు అధికారులు ప్రతి ఒక్కరికీ కౌన్సెలింగ్, గ్రూప్ కౌన్సెలింగ్ వంటివి నిర్వహించి తద్వారా వారిలో మార్పు సాధించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా నిరంతరం యోగా సాధనతో ఖైదీలకు తమ దైనందిక జీవితంలో మార్పులు తీసుకొచ్చేందుకు సైతం జైళ్ల సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. ఖైదీలతో పాటు, సిబ్బందిని సమన్వయం చేస్తూ జిల్లా సబ్జైళ్ల అధికారి, జిల్లా జైల్ సూపరింటెండెంట్ సీహెచ్ ఆర్వీ స్వామి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇలా.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జైళ్లశాఖ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా జైలు, భీమవరం స్పెషల్ సబ్జైలు, చింతలపూడి సబ్జైలు, తణుకు సబ్జైల్, నరసాపురం సబ్జైల్, పోలవరం సబ్జైల్లు ఉన్నాయి. జైళ్లలో ఖైదీలకు వారి నైపుణ్యాలను ఆధారంగా ప్రస్తుతం మూడు రకాల వేతనాలను అందిస్తున్నారు. పనిలో ఏ నైపుణ్యం లేని వారికి రోజుకు రూ.160, తక్కువ నైపుణ్యం కలిగిన వారికి రూ.180, నైపుణ్యం కలిగిన వారికి రూ.200 ఇస్తున్నారు. పెట్రోల్ బంక్లో పని చేసే వారికి రూ.200, ముద్దాయిల అంగీకారంతో కిచెన్, క్లీనింగ్, తదితర పనులు చేసే వారికి రోజుకు రూ.160 రూపాయలు ఇస్తూ వారు జైలు శిక్ష అనంతరం వారి భవిష్యత్కు భరోసా ఇచ్చేందుకు జైళ్లశాఖ చర్యలు తీసుకుంటుంది. నేర ప్రవృత్తి మార్చేందుకు కృషి శిక్షానంతరం భవిష్యత్కు బాటలు జైళ్ల శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నేడు ఖైదీల సంక్షేమ దినోత్సవం కఠిన శిక్షలే కాదు... అనేక నేరాలు చేసి వచ్చిన వారిలోనూ సత్ప్రవర్తన తీసుకొచ్చేందుకు తీవ్రంగానే శ్రమిస్తారు. కరుడు కట్టిన నేరస్తులైనా జైలులోకి వచ్చిన తరువాత వారి చేసిన నేరాలు పక్కన పెట్టి వారిలో మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేస్తారు. ఏదో క్షణికావేశంలో చేసిన నేరానికి ఖైదీలు జీవితాన్నే కోల్పోవాల్సిన పరిస్థితి. ఆ జీవితాన్ని కోల్పోకుండా శిక్షానంతరం వారి బంగారు భవితకు బాటలను వేస్తున్నారు జైళ్లశాఖ అధికారులు. నేడు ఖైదీల సంక్షేమ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. -
రెడ్బుక్ రాజ్యాంగానికి వత్తాసు
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్పై కేసు ● అసెంబ్లీలో కూటమి నేతల అనుచిత వ్యాఖ్యలపై చర్యలేవీ ఏలూరు టౌన్: ఏలూరు జిల్లాలో కూటమి నేతల రెడ్బుక్ రాజ్యాంగంలో పోలీసులు తమవంతు పాత్ర పోషిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావుపై ఏలూరు టూటౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, ఏఎస్ఐ బండారు యేసు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు. కూటమి నేతల ఒత్తిడితో పోలీస్ అధికారులు రెడ్బుక్ రాజ్యాంగానికి వత్తాసు పలుకుతున్నారనే అరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్ష పార్టీల నేతలను అక్రమ కేసులతో భయభ్రాంతులకు గురిచేయాలనే ఉద్దేశ్యంతో కక్షపూరిత రాజకీయాలకు ప్రభుత్వం తెరతీసిందని అంటున్నారు. గతంలో మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ఇంటివద్దనే టీడీపీ నేతలు, రౌడీలు అరాచకం సృష్టించగా.. కేసులు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పెడుతూ వేధింపులకు గురిచేశారు. తాజాగా దూలం నాగేశ్వరరావుపైనా అక్రమ కేసు నమోదు చేసి కుట్రపూరిత రాజకీయాలకు తెరతీశారు. రాజకీయ విమర్శలపై కేసులా ఏపీ అసెంబ్లీలో కై కలూరు ఎమ్మెల్యే కామినేని చేసిన అసందర్భ వ్యాఖ్యలతో రాజకీయ విమర్శలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రెస్మీట్లో కై కలూరు ఎమ్మెల్యే అవినీతి, అక్రమాలపై దూలం నాగేశ్వరరావు విరుచుకుపడ్డారు. ఇదే సందర్భంలో కై కలూరు రూరల్ సీఐ రవికుమార్పైనా పలు విమర్శలు, అరోపణలు చేశారు. దీనికి కౌంటర్గా పోలీస్ అధికారుల సంఘం నేతలు, ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ సూర్యచంద్రరావు ప్రెస్మీట్ పెట్టారు. ఏఎస్పీ మాట్లాడుతూ... ఒక మాజీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష పార్టీ జిల్లా అధ్యక్షుడిపై ‘నోటి దూల తీర్చుతామంటూ’ హెచ్చరించటంపైనా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నాయకుల గొంతు నొక్కేందుకే అక్రమ కేసులు బనాయిస్తున్నారు. దూలం నాగేశ్వరరావు విమర్శలపై కేసులు పెట్టిన పోలీసులు, టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధుల ఒత్తిడితోనే డ్యూటీలు చేయటం నిజం కాదా!. పోలీసులు చట్టానికి లోబడి విధులు నిర్వర్తించాలి తప్పా... రాజకీయ నేతల ఒత్తిడులతో కాదు. అసెంబ్లీ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని సైకో అంటూ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకున్నారా?. కూటమి నేతల చేస్తోన్న కుట్ర రాజకీయాలకు ప్రజలే తగిన సమయంలో బుద్ధి చెబుతారు. –కంభం విజయరాజు, చింతలపూడి వైఎస్సార్సీపీ సమన్వయకర్త కూటమి నేతలు ప్రతి రోజూ ఇష్టారాజ్యంగా రాజకీయ విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. వారిపై కేసులు పెడతారా?. నిష్పక్షపాతంగా చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత పోలీస్ అధికారులపై ఉంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఇష్టారాజ్యంగా అసభ్యపదజాలంతో దూషిస్తోన్న వారిపై కేసులు ఎందుకు పెట్టడం లేదు. పోలీస్ అధికారులు రాజకీయ నేతల ఒత్తిడులతో అక్రమ కేసులు పెట్టటం సరికాదు. ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలను బెదిరించేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. –మామిళ్ళపల్లి జయప్రకాష్, ఏలూరు సమన్వయకర్త -
మీటర్ రీడర్స్కు ఉద్యోగ భద్రత కల్పించాలి
ఏలూరు (టూటౌన్): విద్యుత్ మీటర్ రీడర్స్కు ఉద్యోగ భద్రత కల్పించి, విద్యుత్ సంస్థలోని నియామకాలు చేపట్టాలని ఏపీ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఏలూరు స్ఫూర్తి భవనంలో విద్యుత్ మీటర్ రీడర్స్ జిల్లా సమావేశం బుధవారం జరిగింది. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే, ఏఐటీయూసీ జిల్లా నాయకులు పి.కిషోర్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యక్షుడు పి.జాకబ్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కే శేఖర్, జిల్లా కోశాధికారి కే మల్లేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో గత 20 ఏళ్లుగా విద్యుత్ మీటర్ రీడర్స్ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను తీసుకొస్తున్న నేపథ్యంలో మీటర్ రీడర్స్ ఉపాధి ప్రశ్నార్ధకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యుత్ మీటర్ రీడర్స్కు ప్రత్యామ్నాయంగా ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ నాయకులు జి.దుర్గారావు, పి.సూర్య ప్రకాష్, మురళి బాబు తదితరులు పాల్గొన్నారు. -
వరద బాధితులకు నిత్యావసరాల అందజేత
వేలేరుపాడు: వరదల కారణంగా రవాణా మార్గాలు దెబ్బతిన్న గ్రామాలలోని ప్రజలకు నిత్యావసర సరుకులు అందిస్తున్నట్లు జంగారెడ్డిగూడెం ఇన్చార్జ్ ఆర్డీఓ ఎం.ముక్కంటి చెప్పారు. వరద ముంపునకు గురైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాలలోని పలు గ్రామాల ప్రజలకు నిత్యావసరాలను ముక్కంటి బుధవారం అందజేశారు. కుక్కునూరు మండలం ఉప్పరమద్దిగట్ల, వేలేరుపాడు మండలం తాట్కూరుగొమ్ము, గ్రామాల్లో కూరగాయలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముక్కంటి మాట్లాడుతూ కుక్కునూరు, వేలేరుపాడు మండలాలలోని రవాణా మార్గాలు దెబ్బతిన్న 28 గ్రామాల ప్రజలకు నిత్యావసర సరుకులు అందించామన్నారు. వేలేరుపాడు మండలంలోని 24 గ్రామాల్లోని 2511 కుటుంబాలకు 94.16 క్వింటాళ్ల కూరగాయలు, కుక్కునూరు మండలంలోని 4 గ్రామాల్లోని 563 కుటుంబాలకు 21.12 క్వింటాళ్ల కూరగాయలను బుధవారం అందించామని స్పష్టం చేశారు. -
శ్రీకృష్ణా సుజుకీలో దసరా ఆఫర్లు
ఏలూరు టౌన్: ఏలూరులోని శ్రీకృష్ణా సుజుకీ షోరూమ్లో దసరా వేడుకల నేపథ్యంలో సందడి వాతావరణం నెలకొంది. ఒకవైపు జీఎస్టీ తగ్గింపు, మరోవైపు శ్రీకృష్ణా సుజుకీ యాజమాన్యం నారా శేషు కొనుగోళ్లపై ఆఫర్లు ప్రకటించటంతో కొనుగోలుదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సుజుకీ వాహనం కొనుగోళ్లపై సుమారు రూ.15వేల వరకూ జీఎస్టీ ఆదా అవుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. వీటితోపాటు క్యాష్ బ్యాక్ ఆఫర్లు కొనుగోలుదార్లను ఆకర్షిస్తున్నాయి. ప్రతి సుజుకీ యాక్సెస్ కొనుగోలుపై రూ.3వేలు, అవినీస్ కొనుగోలుపై రూ.5వేలు క్యాష్బ్యాక్ ఆఫర్ వర్తిస్తుందని షోరూమ్ ప్రతినిధులు చెబుతున్నారు ప్రతి మోటారు సైకిల్ కొనుగోలుపై ఏకంగా రూ.20 వేల క్యాష్బ్యాక్ ఇస్తుండగా, డౌన్పేమెంట్ సైతం కేవలం రూ.5999 మాత్రమే ఉందని యజమాని నారా శేషు తెలిపారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, కొవ్వూరులోని తమ షోరూమ్స్లో ఆఫర్లు కొనసాగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. కై కలూరు: స్థానిక మాగంటి థియేటర్లో ఈ నెల 30న థియేటర్ సిబ్బందిపై దాడి చేసిన ఘటనలో నలుగురిపై కేసు నమోదు చేసి, తహసీల్దార్ వద్ద బైండోవర్ చేశామని కై కలూరు టౌన్ ఎస్సై డి.వెంకట్కుమార్ బుధవారం విలేకరులకు తెలిపారు. వివరాల ప్రకారం కలిదిండి మండలం పడమటిపాలెంకు చెందిన పాము సూర్యకుమార్(23), గంగుల ధన్రాజ్(29), కలిదిండి హేమంత్కుమార్(30), కరేటి సాయికుమార్(23)లు మద్యం తాగి ప్రక్షుకులతో గొడవకు దిగారని పేర్కొన్నారు. టిక్కెట్లు డబ్బులు వాపసు ఇస్తామని బయటకు వెళ్లాలని థియేటర్ మేనేజర్ గణేష్, సిబ్బంది సుంకర వెంకటేశ్వరరావులు చెప్పారు. దీంతో అక్కడ శుభ్రం చేసే కర్రతో వీరిపై నలుగురు దాడి చేశారు. నిందితులను కై కలూరు తహసీల్దారు మందు హాజరుపర్చగా ఏడాదికి ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు బైండవర్ విధించినట్లు ఎస్సై చెప్పారు. యువకులకు కౌన్సెలింగ్ ఇచ్చి స్టేషన్ బెయిల్పై పంపించామన్నారు. ముదినేపల్లి రూరల్ అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్త, అత్తలపై వివాహిత ఇచ్చిన ఫిర్యా దు మేరకు స్థానిక పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం మండలంలోని పెయ్యేరు శివారు అప్పారావుపేటకు చెందిన డి.ప్రియాంకకు పెడన మండలం కోటవానిపాలెం గ్రామానికి చెందిన పరసా శ్రీకాంత్తో 2018లో వివాహం జరిగింది. వివాహ సమయంలో ఇచ్చిన లాంఛనాలతో పాటు అనంతరం మరికొంత నగదు ముట్టజెప్పారు. అయినప్పటికీ భర్త శ్రీకాంత్తో పాటు అత్త శేషమ్మ అధిక కట్నం తేవాలని తరచూ శారీరకంగా, మానసికంగా వేధిస్తూ కాపురానికి తీసుకువెళ్లడం లేదు. దీంతో బాధితురాలు ప్రియాంక పోలీసులను ఆశ్రయించింది. జంగారెడ్డిగూడెం: వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదుచేసినట్లు రైటర్ పి.బాబురావు బుధవారం విలేకరులకు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని తాడువాయి గ్రామానికి చెందిన చోడెం శివాజీ ఆగస్టు 31న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదన్నారు. అప్పటి నుంచి కుటుంబసభ్యులు శివాజీ ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేకపోవడంతో బుధవారం శివాజీ సోదరుడు వినోద్ పోలీసులను ఆశ్రయించాడని పేర్కొన్నారు. -
వృద్ధులకు న్యాయ సహాయం
ఏలూరు (టూటౌన్): నేటి సమాజంలో నిరాశ్రయులైన వృద్ధుల సంఖ్య నానాటికీ పెరిగిపోతుందని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ అన్నారు. ఏలూరులోని పట్టణ నిరాశ్రయుల వృద్ధుల ఆశ్రమాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సును నిర్వహించారు. చట్టపరంగా సీనియర్ సిటిజెన్స్కు ఉన్న హక్కులు, చట్టాలపై అవగాహన కలిగించారు. వృద్ధులకు అవసరమైన న్యాయ సహాయాన్ని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఉచితంగా అందిస్తుందని, ఉచిత న్యాయ సలహాలకు 15100 నెంబరులో సంప్రదించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ప్యానల్ న్యాయవాది పి.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భీమవరం: భీమవరం ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికుల వేతన బకాయిలు, పీఎఫ్ బకాయిలను తక్షణమే చెల్లిం చాలని, ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి చెల్లబోయిన రంగారావు డిమాండ్ చేశారు. బుధవారం ఏిపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రభుత్వాసుపత్రి, తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించిన సందర్బంగా చెల్లబోయిన మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులకు ఇస్తున్న వేతనాలు అతి తక్కువగా ఉన్నా ప్రతినెలా సక్రమంగా ఇవ్వకపోవడం వల్ల ఆర్ధిక ఇబ్బందులతో విధులు నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పీఎఫ్ సొమ్ము సైతం కార్మికుల పీఎఫ్ ఖాతాలకు జమ చేయడం లేదని ఆసుపత్రి పడకల స్థాయికి అనుగుణంగా పారిశుధ్య కార్మికులు లేక తీవ్ర పనిభారంతో అనారోగ్యం పాలవుతున్నారన్నారు. కార్యక్రమంలో మెడికల్ ఎంప్లాయిస్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. భీమవరం(ప్రకాశం చౌక్): టైమ్ బౌండ్ ప్రమోషన్లు పొరుగు రాష్ట్రాలన్నింటిలో నిరంతరం అమలు జరుగుతున్న హక్కును రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్స్ అసోసియేషన్(ఏపీపీహెచ్సీడీఏ) ఆధ్వర్యంలో భీమవరం కలెక్టరేట్లోని డీఎంఅండ్హెచ్ఓ కార్యాలయం ఎదుట వైద్యాధికారులు బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. వైద్యాధికారులు ఆర్థిక ప్రయోజనాలు కాకుండా మానవ వనరుల పరంగా టైమ్ బౌండ్ ప్రమోషన్లు తమ న్యాయమైన హక్కు అని డిమాండ్ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు కరోనా మహమ్మారి సమయంలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి, ప్రజల ప్రాణాలను రక్షించినప్పటికీ, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వారి హక్కులు సంవత్సరాలుగా అమలు కావడం లేదని వారు గుర్తు చేశారు. ఇప్పటికే పలు సార్లు ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రిని కలిసి విన్నవించుకున్నా సమస్య పరిష్కారం కానందున ఈ నిరసన చేపడుతున్నామన్నారు. యలమంచిలి: గోదావరి వరదను సమర్ధంగా ఎదుర్కొంటామని నరసాపురం ఆర్డీఓ దాసి రాజు చెప్పారు. గోదావరి ఉధృతి నేపథ్యంలో కనకాయలంక కాజ్ వే మునిగిపోవడంతో బుధవారం ఆయన అధికారులతో కలసి వరద తీవ్రతను పరిశీలించారు. అనంతరం స్థానికులతో మాట్లాడుతూ ప్రజలకు తాగునీరు ప్యాకెట్లు సరఫరా చేస్తున్నట్లు వివరించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినా వెంటనే పై అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ గ్రంధి పవన్ కుమార్, ఎస్సై కర్ణీడి గురయ్య్ర, వీఆర్వోలు ఉన్నారు. -
ఆంధ్రా ‘పెరటి’లో ఆఫ్రికా ‘రక్కసి’
తాడేపల్లిగూడెం : పెరటి తోటల రైతులను ఆఫ్రికా నత్తలు వణికిస్తున్నాయి. మొన్నటి దాకా విశాఖ, మన్యం జిల్లా రైతులను కలవరానికి గురిచేసి.. తాజాగా ఉభయగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలపై దాడి చేశాయి. అయితే వీటి ఉనికిని రైతులు ఐదు నెలల తర్వాత గుర్తించడంతో అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బొప్పాయి, జామ వంటి పంటలతో పాటు మినుము పైరుకూ తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ పరిస్థితుల్లో ఆఫ్రికా నత్తల సమస్యకు పరిష్కారం చూపేందుకు డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తోటల బాట పట్టారు. వందేళ్ల కిందటే వలస ఆఫ్రికా నత్తలు వందేళ్ల కిందటే భారత దేశానికి వలసొచ్చాయి. తోట పంటలపై వీటి దాడి మూడేళ్లగా మొదలైంది. ముఖ్యంగా తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఆఫ్రికా నత్తలు విజృంభించాయి. కేరళ నుంచి వక్క చెట్లను ఇక్కడకు దిగుమతి చేసుకోవడంతో ఆఫ్రికా నత్తల ప్రభావం ఉభయగోదావరి, మన్యం, విశాఖ జిల్లాలకు వ్యాపించింది. పార్వతీపురం, మన్యం జిల్లా, విశాఖ జిల్లా ఎస్.కోట ప్రాంతాల్లో ఆఫ్రికా నత్తల దాడిని రైతులు వెంటనే గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని జొన్నాడ ప్రాంతంలోనూ వీటి ఉనికి బయటపడింది. తాజాగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం మినుము తోటపై ఆఫ్రికా నత్తల దాడిని గమనించారు. ఇదే మండలంలోని ఆవపాడులోనూ ఈ నత్తల ఆనవాళ్లను కనిపెట్టారు. ఆఫ్రికా నత్తలు గుడ్లను ఏటా జూలై నుంచి ఫిబ్రవరి వరకు పెడతాయి. ఒక్కో నత్త వంద నుంచి 400 వందల వరకు గుడ్లు పెడుతుంది. నత్త జీవితకాలం ఐదేళ్ల నుంచి ఆరేళ్లు. ఈ సమయంలో ఒక్కో నత్త సుమారు వెయ్యి నుంచి 1,200 పిల్లలకు జన్మనిస్తుంది. తుప్పలు, ఆకుల కింద, వెలుతురు తగలని ప్రాంతాల్లో ఇవి నివశిస్తాయి. బొప్పాయి, అరటి, జామ, కూరగాయలు, మొక్కజొన్న, పత్తి, వక్క, ఆయిల్పామ్ పంటలతో పాటుగా నర్సరీలను ఆశ్రయించి రైతులకు అపార నష్టం కలిగిస్తాయి. ఏమరుపాటుతో భారీ మూల్యం ఇతర ప్రాంతాల నుంచి మొక్కలను ఇక్కడకు తీసుకొచ్చే సమయంలో వాటిపై నత్తల గుడ్లు, చిన్న చిన్న నత్తలు వంటివి ఉన్నాయేమో రైతులు జాగ్రత్తగా గమనించాలి. వాటిని నిర్మూలించాకే వక్క వంటి మొక్కలను ఇక్కడకు తెచ్చుకోవాలి. ఈ విషయాన్ని విస్మరించామో.. ఆ తర్వాత భారీమూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. నీరు ఎక్కువగా ఉండే వరి పంటను ఆఫ్రికా నత్తలు ఆశించవు. వీటికి వాతావరణం అనుకూలించే చిత్తడి నేలల్లోకి వెవెళ్లి ఉంటాయి. జాగ్రత్తలిలా.. ● పంట తోటలను ఒత్తుగా వేసుకోకూడదు. ● తోటల్లో కలుపు, చెత్త పేరుకుపోకుండా చూసుకోవాలి. ● అంతర సేద్యంపై దృష్టి పెట్టాలి. ● రాత్రులు తోటల్లో నీరు పారించకూడదు. ● తోటల్లో కోళ్లు, బాతులను పెంచుకోవాలి. ఆఫ్రికా నత్తల నివారణకు ఒక కిలో ఉప్పును నాలుగు లీటర్ల నీటిలో కలిపి ఆ నీటిలో గోనె సంచిని తడిపి గట్లపై వేస్తే ఈ సంచులపైకి వెళ్లిన నత్తలు ద్రావణం ఘాటుకు చనిపోతాయి. ఆకర్షక ఎర ఏర్పాటులో భాగంగా 25 కిలోల వరి తవుడుకు వంద గ్రాముల థయోడీకార్బ్ గుళికలు, మూడు కిలోల బెల్లం, వంద గ్రాముల ఆముదాన్ని కలిపి చిన్న ఉండలుగా చేయాలి. ఈ ఉండలను బొప్పాయి, క్యాబేజీ ఆకుల కింద పెట్టాలి. వీటిని తిన్న ఆఫ్రికా నత్తలు చనిపోవడం లేదా నిర్వీర్యం అయిపోతాయి. అనంతరం వీటిని ఉప్పు ద్రావణంలో వేస్తే చనిపోతాయి. ఇలా వారానికి రెండు మూడు రోజుల పాటు 15 రోజుల వరకూ చేయాలి. నత్తలను ఏరివేసే సమయంలో చేతికి గ్లౌజులు ధరించాలి. – గోవిందరాజులు, విస్తరణ సంచాలకులు, చలపతిరావు, శాస్త్రవేత్త పెరటి తోటలను కబళిస్తున్న ఆఫ్రికా నత్తలు నిన్న విశాఖ, మన్యం.. నేడు ఉభయగోదావరి జిల్లాలపై దాడి బొప్పాయి, జామ, అరటి, కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వణికిపోతున్న అన్నదాతలు ఉప్పు ద్రావణంతో నిర్మూలన చేయాలంటున్న ఉద్యాన శాస్త్రవేత్తలు -
కొల్లేరు తిప్పలు
● కొల్లేరు ముంపు బారిన పెనుమాకలంక రహదారి ● ప్రమాదం అంచున తప్పని ప్రయాణం కై కలూరు: కొల్లేరు చుట్టూ నీరు ఉంది.. తాగడానికి చుక్క నీరు లేదు. పేరుకే పెనుమాకలంక రహదారి.. ఎగువ నుంచి కొల్లేరుకు నీరొస్తే కనిపించకుండా మునిగిపోతుంది. ఈ పరిస్థితులు కొల్లేరు దుర్భర పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. మండవల్లి మండలం పెదఎడ్లగాడి వంతెన నుంచి పెనుమాకలంక, ఇంగిలిపాకలంక వెళ్లే రహదారి అనేక రోజులుగా నీటిలో నానుతూ, ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది. ఇక్కడ రోడ్డుపై బాగా ఎక్కువ నీరు పారితే పడవలపై ప్రజలు వెళుతున్నారు. కాస్త తగ్గితే ద్విచక్రవాహానాలతో పడుతూ లేస్తూ ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారు. కొత్త వ్యక్తులు ఏ మాత్రం పట్టుతప్పిన కొల్లేరులో మునిగిపోవడం ఖాయం. కలెక్టర్కు ఫిర్యాదు.. పెనుమాకలంక రహదారి నీటిలో మునగడంపై కలెక్టర్ వెట్రిసెల్వికి సోమవారం ప్రజా సమస్యల ఫిర్యాదుల వేదికలో కొందరు ఫిర్యాదులు చేశారు. సుప్రీం కోర్టు అమలు చేస్తున్న 120 జీవో ప్రకారం అక్రమ చేపల సాగు అభయారణ్యంలో నిషిద్దం. పెనుమాకలంక రహదారిలో అక్రమ చెరువుల సాగు యథేచ్చగా సాగుతుంటే పట్టించుకోని ఫారెస్టు అధికారులు ప్రజలకు ఉపయోగపడే రహదారిని నిర్మించడానికి నిబంధనలు అడ్డుచెప్పడం ఏం న్యాయమని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల తెలంగాణలో వర్షాలు అధికంగా కురియడంతో వివిధ డ్రెయిన్ల ద్వారా వచ్చిన నీరు ఏలూరు–కై కలూరు రహదారిలో పెదఎడ్లగాడి ద్వారా కిందకు చేరాలి. వంతెన ఖానాల వద్ద గుర్రపుడెక్క పేరుకుపోవడంతో నీరు వెనక్కి మళ్లీ పెనుమాకలంక రహదారిని ముంచేత్తుతుంది. శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా కై కలూరు దానగూడెం దళితులకు, మరో సామాజికవర్గానికి మధ్య వినాయక నిమజ్జనం ఊరేగింపులో చోటుచేసుకున్న ఘర్షణపై సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీ మాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు బేతాళ సుదర్శనం ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్కు ఫిర్యాదు చేశారు. కొందరు యూట్యూబర్లు, ఇన్ఫ్లూయన్సర్లు ఇష్టారాజ్యంగా వీడియోలు, రీల్స్ చేస్తూ రెండు సామాజికవర్గాల మద్య విభేధాలు, విద్వేషాలు రగిలించేలా సోషల్ మీడియాలో ప్రచారం చేయటాన్ని ఆయన తప్పుబట్టారు. ఎస్సీ, ఎస్టీలను అవమానించేలా, రెచ్చగొట్టేలా, వారి మనోభావాలను కించపరిచేలా సోషల్మీడియాలో పోస్ట్లు పెట్టిన వారిపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం మేరకు కఠిన చర్యలు తీసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పును ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయా యూట్యూబర్ల వివరాలను ఏలూరు డీఎస్పీ శ్రావణ్కుమార్కు అందజేశారు. ఫిర్యాదు చేసిన వారిలో ఏపీ మాల ఉద్యోగుల సంఘం ప్రతినిధులు బేతాళ నాగరాజు, టీఎన్డీవీ ప్రసాద్, ములగల బెన్హర్, బంటుమిల్లి కెనడీ, దండబత్తుల రవికుమార్ ఉన్నారు. ఏలూరు టౌన్: గంజాయి కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఏలూరు వన్టౌన్ సీఐ జీ.సత్యనారాయణ తెలిపారు. ఏలూరు రూరల్ పోలీస్స్టేషన్ ఇన్చార్జి ఎస్సై బి.నాగబాబు తన సిబ్బందితో సెప్టెంబర్ 29న సాయంత్రం 4.30గంటల సమయంలో ఏలూరు తంగెళ్ళమూడి ప్రాంతంలో వాహన తనిఖీలు నిర్వహించగా, ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని తనిఖీ చేయగా 2.396 కిలోల గంజాయి లభించడంతో అరెస్ట్ చేసినట్లు చెప్పారు. నిందితులు ఏలూరు 29వ డివిజన్ తాపీమేసీ్త్ర కాలనీకి చెందిన దుడ్డె ప్రశాంత్కుమార్, బీడీ కాలనీ ద్వారకానగర్కు చెందిన సిద్దాంతపు రాములపై కేసు నమోదు చేసి, న్యాయస్థానం ముందు హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారని తెలిపారు. జంగారెడ్డిగూడెం: స్థానిక సాయి సౌజన్య నగర్లో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగిన ఘటనపై కేసు నమోదైంది. రైటర్ పి.బాబురావు తెలిపిన వివరాల ప్రకారం పెండ్ర మోహనకృష్ణ ప్రైవేట్ టీచర్గా పనిచేస్తున్నాడు. ఆయన కుటుంబ సభ్యులతో సహా సెప్టెంబర్ 19న బుట్టాయగూడెం మండలం గంగవరం గ్రామం వెళ్లాడు. తిరిగి 29న ఇంటికి వచ్చి చూసే సరికి తలుపులు తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు. ఇంట్లోకి వెళ్లి చూసే సరికి బీరువాలో ఉంచిన 60 తులాల వెండి వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించారు. దీనిపై మంగళవారం ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నుట్లు పోలీసులు చెప్పారు. -
హత్యగా మారిన మిస్సింగ్ కేసు?
తణుకు అర్బన్: గత నాలుగు రోజులుగా తణుకులో సంచలనం రేకెత్తించిన యువకుడి అదృశ్యం కేసు కాస్త హత్య కేసుగా మలుపు తిరిగింది. తాడేపల్లిగూడెంకు చెందిన మడుగులు సురేష్ (25) ఆచూకీ కోసం మంగళవారం పోలీసు అధికారులు గోస్తనీ కాలువ, చించినాడ బ్రిడ్జి ప్రాంతాల్లో చేసిన గాలింపు చర్యలు చేపట్టారు. తాడేపల్లిగూడెం డీఎస్పీ డి.విశ్వనాథ్ గాలింపు చర్యలను పరిశీలించారు. ఆజ్ఞాతంలో ఉన్న న్యాయవాది తిర్రే సత్యనారాయణరాజు, నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారిచ్చిన సమాచారంతోనే గాలింపు చర్యలు చేపట్టారంటూ గుప్పుమంది. అయితే సురేష్, న్యాయవాది భార్య శిరీషతో అత్యంత సన్నిహితంగా ఉండేవాడని ఇటీవల గౌరీపట్నం కూడా కలిసివెళ్లారని తెలుస్తోంది. దీంతో వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగిందా అనేది చర్చనీయాంశంగా మారింది. ఇందుకు నిదర్శనంగా సురేష్, శిరీష కలిసి ఉన్న ఫొటోలను సురేష్ కుటుంబ సభ్యులు బయటకు విడుదల చేశారు. 25న వెలుగులోకి మిస్సింగ్.. ఈనెల 23వ తేదీన సురేష్ తణుకు వచ్చి మరలా తాడేపల్లిగూడెం రాలేదని అతడి సోదరి ప్రశాంతి ఈనెల 25న తణుకు పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన మిస్సింగ్ వ్యవహారం తణుకులో సంచలనం రేకెత్తించింది. న్యాయవాది తిర్రే సత్యనారాయణరాజు భార్య శిరీషతో సురేష్ సన్నిహితంగా ఉంటాడని ఆయనపైనే అనుమానంగా ఉందంటూ చేసిన ఫిర్యాదుతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేశారు. అయితే న్యాయవాదితోపాటు తణుకుకు చెందిన మరో నలుగురు వ్యక్తులు అజ్ఞాతంలోకి వెళ్లడంతో ఆరోపణలకు బలం చేకూరింది. పట్టణ సీఐ ఎన్.కొండయ్య ప్రత్యేక బృందాన్ని నియమించి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. మంగళవారం ఉదయం నిందితులను తణుకు తీసుకువచ్చి విచారిస్తున్నట్లుగా సమాచారం. స్టేషన్ వద్ద ఉద్రిక్తత... సురేష్ అదృశ్యంపై ఫిర్యాదు చేసి వారం రోజులు గడిచినా ఇంతవరకు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ తాడేపల్లిగూడెంకు చెందిన బాధితవర్గాలు తణుకు పట్టణ పోలీస్స్టేషన్ ముందు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఒక దశలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. సీఐ కొండయ్య బయటకు వచ్చి విచారణకు సహకరించాలని విజ్ఞప్తి చేయడంతో గొడవ సద్దుమణిగింది. పోలీసులను పక్కదారి పట్టిస్తున్న నిందితులు! పోలీసులను నిందితులు పక్కదారి పట్టిస్తున్నారని సురేష్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మంగళవారం ఉదయం డీఎస్పీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో పోలీసులు ఈతగాళ్లు, బాఽధిత వర్గాల సాయంతో తణుకు గోస్తనీ కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. తీరా మధ్యాహ్నం మరలా చించినాడ బ్రిడ్జి ప్రాంతంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో నిందితులు ముందుగానే పక్కా ప్రణాళిక వేసుకుని పోలీసులను పక్కదారి పట్టిస్తున్నారని అంటున్నారు. ఈనెల 23న కొందరు వ్యక్తులు సురేష్ను తణుకులోని ఒక శ్మశానవాటికలో గట్టిగా కొట్టినట్లుగా తెలిసిందని బాధితవర్గాలు చెబుతున్నారు. -
బ్రహ్మాండనాయకుని ఉత్సవాలకు వేళాయె
ద్వారకాతిరుమల: ద్వారకామహర్షి తపోఫలితం.. శ్రీవారి దివ్య క్షేత్రం. ఈ క్షేత్రంలో గురువారం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలను నేత్రపర్వంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 8 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో శ్రీవారు ఉభయ దేవేరులతో కలసి ఉదయం, సాయంత్రం వేళల్లో పలు వాహనాలపై తిరువీధుల్లో విహరిస్తారు. అలాగే ఆలయ ముఖ మండపంలో స్వామివారు రోజుకో విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలోని శ్రీహరి కళాతోరణ వేదికపై ఉదయం నుంచి రాత్రి వరకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఉత్సవ ఏర్పాట్లకు సంబంధించిన విద్యుద్దీప అలంకారాలు, ఇతర పనులు తుది దశకు చేరుకున్నాయి. రెండుసార్లు బ్రహ్మోత్సవాలు మహర్షి తపస్సుకు మెచ్చిన శ్రీవేంకటేశ్వరస్వామి స్వయంభూ ఈ క్షేత్రంలో పుట్టలో వెలిశారు. అందువల్ల పాదపూజ కోసం పెద్దతిరుపతి నుంచి శ్రీవారిని తెచ్చి స్వయంభూ వెనుక ప్రతిష్టించారు. దాంతో ఒకే అంతరాలయంలో స్వామివారు ద్విమూర్తులుగా కొలువై ఉండటంతో ఏటా వైశాఖ మాసంలో చినవెంకన్నకు, ఆశ్వయుజ వూసంలో ప్రతిష్ఠ స్వామికి ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. తిరుమల తిరుపతి శ్రీవారు ఇక్కడ ఉండటం వల్ల, అక్కడి మొక్కులు ఇక్కడ తీర్చుకునే సాంప్రదాయం ఉంది. కానీ ఇక్కడ మొక్కులు పెద్ద తిరుపతిలో తీర్చకూడదు. పెద్ద వెంకన్న ఉన్న తిరుమల తిరుపతిని పెద్దతిరుపతిగా, చిన్నవెంకన్న ఉన్న ద్వారకాతిరుమలను చిన్నతిరుపతిగా పిలుస్తారు. ఉత్సవ విశేషాలు ఇవీ.. ● 2 న ఉదయం 9.30 గంటలకు శ్రీవారిని పెండ్లి కుమారునిగా, అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగా చేస్తారు. ఆ రోజు రాత్రి 7 గంటలకు గజవాహనంపై స్వామివారి గ్రామోత్సవం. ● 3 న రాత్రి 9 గంటలకు ధ్వజారోహణ, అనంతరం హంసవాహనంపై స్వామివారి గ్రామోత్సవం. ● 4 న ఉదయం 7 గంటలకు సూర్యప్రభ వాహనంపై, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం. ● 5 న ఉదయం 7 గంటలకు హనుమద్వాహనంపై స్వామివారి గ్రామోత్సవం, రాత్రి 7 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం, అనంతరం వెండి శేష వాహనంపై గ్రామోత్సవం. ● 6 న ఉదయం 7 గంటలకు సింహ వాహనంపై శ్రీవారి గ్రామోత్సవం, రాత్రి 8 గంటల నుంచి శ్రీ స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం, అనంతరం వెండి గరుడ వాహనంపై గ్రామోత్సవం. ● 7 న రాత్రి 8 గంటల నుంచి రధోత్సవం. ● 8 న ఉదయం 10.30 గంటలకు చక్రస్నానం, రాత్రి 9 గంటలకు ధ్వజావరోహణ, అనంతరం అశ్వ వాహనంపై గ్రామోత్సవం. ● 9 న ఉదయం 9 గంటలకు చూర్ణోత్సవం, వసంతోత్సవం, రాత్రి 7 గంటలకు ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, పవళింపుసేవ, శ్రీపుష్పయాగం కార్యక్రమాలు జరుగుతాయి. వీటితో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. పెరుగుతున్న భక్తుల తాకిడి దినదినాభివృద్ధి చెందుతున్న ఈ క్షేత్రాన్ని సందర్శించే భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలన్న లక్ష్యంతో అధికారులు పలు అభివృద్ధి పనులు చేపట్టారు. అందులో భాగంగా కోట్లాది రూపాయల వ్యయంతో జరుగుతున్న అనివేటి మండప విస్తరణ, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇవి అందుబాటులోకి వస్తే భక్తులకు మరిన్ని సౌకర్యాలు సమకూరుతాయి. ఈ క్షేత్రంలో 40 అడుగులకు పైగా ఉన్న గరుత్మంతుడు, అభయాంజనేయుడు, అన్నమాచార్యుని విగ్రహాలు భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రేపటి నుంచి ద్వారకాతిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు 6 న రాత్రి తిరుకల్యాణం, 7న రాత్రి రథోత్సవం రోజుకో ప్రత్యేక అలంకారంలో దర్శనమివ్వనున్న శ్రీవారు ఉత్సవాలు జరిగే రోజుల్లో ఆర్జిత సేవలు రద్దు దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులు రైల్వే మార్గంగుండా ద్వారకాతిరుమలకు 17 కిలో మీటర్ల దూరంలో ఉన్న భీమడోలు రైల్వేస్టేషన్కు చేరుకొని అక్కడినుంచి ఆర్టీసీ బస్సులు, ఆటోలు ద్వారా క్షేత్రానికి చేరుకోవాలి. ఏలూరు, నరసాపురం, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, రాజమండ్రి ప్రాంతాల బస్సుల ద్వారా నేరుగా క్షేత్రానికి చేరుకోవచ్చు. ప్రత్యేక అలంకారాలు ఇలా.. 2న మహావిష్ణువు 3న మురళీకృష్ణ 4న సరస్వతి 5న భూ వరాహ స్వామి 6న మోహిని 7న రాజమన్నార్ 8న వైకుంఠ నారాయణుడు 9న శయన మహావిష్ణువు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. 8 రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలను వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలిరావాలి. సాధారణ భక్తులకు పెద్దపీట వేస్తాం. 6న స్వామివారి కల్యాణం, 7న రథోత్సవాన్ని నిర్వహిస్తాం. ఉత్సవాలను పురస్కరించుకుని ఈనెల 2 నుంచి 9 వరకు ఆలయంలో నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నాం. భక్తులు గమనించాలి. – ఎన్వీఎస్ఎన్ మూర్తి, శ్రీవారి దేవస్థానం ఈఓ -
జాతీయస్థాయి బ్యాడ్మింటన్లో రన్నర్స్కు అభినందనలు
తణుకు అర్బన్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సీఐఎస్సీఈ బోర్డ్ 68వ నేషనల్ స్కూల్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పోటీల్లో తణుకు పట్టణానికి చెందిన పోతుల నవ్యగీతిక, తాడేపల్లిగూడెంకు చెందిన కొండ్రెడ్డి రాగ అండర్ 17 డబుల్స్ విభాగంలో రన్నర్స్గా నిలిచారు. పెంటపాడు మండలం అలంపురంలోని సరస్వతీ విద్యాలయ స్కూలులో 10వ తరగతి చదువుతున్న వీరు ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు కొయంబత్తూరులో నిర్వహించిన పోటీల్లో ఈ ఘనత సాధించినట్లు పోతుల నవ్యగీతిక తండ్రి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను పలువురు ప్రముఖులు అభినందించారు. నూజివీడు: పట్టణానికి చెందిన ఎన్వీఎన్ కావ్యశ్రీ, డీ ఇందుప్రియ బాస్కెట్బాల్ ఏపీ జట్టుకు ఎంపికై నట్లు కోచ్ వాకా నాగరాజు మంగళవారం తెలిపారు. ఇటీవల చిత్తూరులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అండర్–14 బాస్కెట్బాల్ పోటీల్లో ఉమ్మడి కృష్ణాజిల్లా జట్టు తృతీయ స్థానంలో నిలిచింది. ఈ జట్టులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కావ్యశ్రీ, ఇందుప్రియలను సెలక్షన్ కమిటీ రాష్ట్ర జట్టులోకి ఎంపిక చేసింది. వీరు ఈనెల 4 నుంచి 10 వరకు డెహ్రడూన్లో నిర్వహించే జాతీయ స్థాయి బాస్కెట్బాల్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు తరుఫున ఆడతారని కోచ్ తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర జట్టుకు ఎంపికై న క్రీడాకారులను, కోచ్ను పలువురు పీడీలు అభినందించారు. జంగారెడ్డిగూడెం: గురవాయిగూడెంలోని శ్రీమద్ది ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో పెద్దసంఖ్యలో భక్తులు, భవానీ దీక్షాదారులు బారులుదీరి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం చుట్టూ 108 ప్రదక్షణలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవలు, విరాళాల ద్వారా రూ.2,70,623 సమకూరినట్లు కార్యనిర్వాహణాధికారిణి ఆర్వీ చందన తెలిపారు. భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారు. బుట్టాయగూడెం: మద్యం మత్తులో భార్యపై కత్తిపీటతో భర్త దాడి చేసిన ఘటన బుట్టాయగూడెం మండలం రావిగూడెంలో మంగళవారం చేసుకుంది. రావిగూడెంకు చెందిన కట్టం మారయ్య నిత్యం మద్యం సేవించి ఇంటికి వచ్చేవాడు. మంగళవారం సాయంత్రం కూడా మద్యం సేవించి వచ్చి భార్య మంగతో గొడవపడి కత్తిపీటతో దాడి చేశాడు. ఆమె మెడ పైన, చేతికి గాయాలయ్యాయి. ఆమెను బుట్టాయగూడెం సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక చికిత్స, అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై నిరసన
నేడు అంబేడ్కర్ విగ్రహాల వద్ద ధర్నా ఏలూరు టౌన్: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ ఈ నెల 30న ఏలూరు పాతబస్టాండ్ సెంటర్లోని బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ఉదయం 9.30 గంటలకు నిరసన చేపడుతున్నామని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు తేరా ఆనంద్ తెలిపారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్తో కలిసి ఆయన సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. జిల్లాలోని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్, అనుబంధ విభాగాల నాయకులు, దళిత సామాజికవర్గంలోని ప్రజా సంఘాల నేతలు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ద్వారా సామాన్యులు, పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు, వారి పిల్లలు నష్టపోతారని గుర్తు చేశారు. ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ మాట్లాడుతూ.. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుమతులు తెచ్చిన ఘనత మాజీ సీఎం జగన్కే దక్కుతుందన్నారు. నేడు కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలని చూడడం సరైన విధానం కాదన్నారు. ఏలూరు(మెట్రో): ప్రజల నుంచి అందిన అర్జీలను రీఓపెన్ కాకుండా నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో సోమవారం జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమ వారం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ కె.వెట్రిసెల్వితో పాటు జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, ఆర్డీఓ ఎం.అచ్యుత అంబరీష్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దేవకిదేవి, డీఆర్డీఏ పీడీ విజయరాజు, సర్వే శాఖ ఏడీ అన్సారీ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్బంగా వివిధ సమస్యల పరిష్కారానికి ప్రజల నుంచి 231 అర్జీలు అందాయి. కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ పీజీఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించిన తరవాత దరఖాస్తుదారులతో పరిష్కార విధానంపై మాట్లాడి వారి సంతృప్తి స్థాయిని తెలుసుకోవాలని తహసీల్దార్లను ఆదేశించారు. ఏలూరు టౌన్: ఏలూరు ఆశ్రం హాస్పిటల్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ కార్డియాలజీ ఆధ్వర్యంలో ప్రపంచ గుండె దినోత్సవాన్ని పురస్కరించుకుని వరల్డ్ హార్ట్డే వాక్థాన్ను సోమవారం నిర్వహించారు. నగరంలో ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ జెండా ఊపి ప్రారంభించారు. వాక్థాన్లో నగరంలో యువత, వాకర్స్ క్లబ్ సభ్యులు, ఆశ్రం హాస్పిటల్స్ వైద్యులు, కార్డియాలజీ విభాగం సిబ్బంది పాల్గొన్నారు. గుండెను పదిలంగా ఉంచుకోవాలంటూ ప్లకార్డులు, నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఎస్పీ శివకిషోర్ మాట్లాడుతూ.. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మంచి ఆహారపు అలవాట్లు, శారీరక వ్యాయామం, ఒత్తిడిని జయించేలా యోగా వంటివి చేయటంతో పాటు వైద్యుల సూచనలు, సలహాలు పాటిస్తూ ఉండాలన్నారు. ఆశ్రం హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఐవీఆర్ తమ్మిరాజు మాట్లాడుతూ.. గుండె వ్యాధులపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. కై కలూరు: అపురూపంగా చూసుకోవాల్సిన కొల్లేరు పక్షులపై ‘విహంగాల స్వర్గంలో వేటగాళ్ల మరణ మృదంగం’ శీర్షికతో పరిశోధనాత్మక కథనం ‘సాక్షి’లో సోమవారం వెలువడిన విషయం పాఠకులకు విధితమే. దీంతో ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వీ అటవీ అధికారులపై ఈ ఘటనపై చర్చించినట్లు తెలిసింది. దీంతో అటవీ అధికారులు కలెక్టర్కు వివరణ ఇచ్చారు. ఏలూరు వన్యప్రాణి యాజమాన్య ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ పి.మోహిని విజయలక్ష్మీ ఈ ఏడాది జూలైలో నిడమర్రు సెక్షన్ పరిధి వెంకట కృష్ణాపురం, ఏలూరు జిల్లా గుడివాకలంక గ్రామాల వద్ద పక్షుల వేటగాళ్లను పట్టుకుని కేసులు నమోదు చేశామని తెలిపారు. -
సాగని దారిలో ఆగిన గుండె!
పోలవరం నిర్వాసితుల కష్టాలు వేలేరుపాడు: ఆ గ్రామాన్ని గోదావరి వరద చుట్టుముట్టింది.. ప్రభుత్వం కనీసం బోట్ కూడా ఏర్పాటు చేయలేదు. ప్రాణాలు దక్కించుకునేందుకు అష్టకష్టాలు పడినా.. ఆ కుటుంబానికి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చివరికి గుండెకోతే మిగిలింది. వేలేరుపాడు మండలంలోని తిర్లాపురం గ్రామానికి చెందిన కాకాని వెంకటేశ్వర్లు (41)ఆదివారం మధ్యాహ్నం గుండెనొప్పి రావడంతో ఇంట్లో అందుబాటులో ఉన్న గ్యాస్ మాత్ర వేసుకున్నాడు. అయినప్పటికీ నొప్పి తగ్గలేదు. నొప్పి ఎక్కువ కావడంతో ఇంట్లోనే సొమ్మసిల్లి పడిపోయాడు. వైద్యం నిమిత్తం వేలేరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలన్నా ఆ ఊరిని గోదావరి వరద చుట్టుముట్టింది. అయినప్పటికీ బంధువులు గోదావరి వరదలో ప్రాణాలకు తెగించి, థర్మాకోల్ షీట్పై పడుకోబెట్టి వరద దాటించి, కన్నాయిగుట్ట వరకు చేరుకున్నారు. కన్నాయిగుట్టకు వెళ్ళాక అంబులెన్స్ కోసం అరగంట సేపు వేచి చూశారు. అంబులెన్స్ రాకపోవడంతో ద్విచక్ర వాహనంపై కూర్చోబెట్టుకొని ఐదు కిలోమీటర్ల దూరంలోని బుర్రతోగు వరకు వెళ్ళారు. అక్కడికి అంబులెన్స్ రావడంతో వేలేరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అప్పటికే వెంకటేశ్వర్లు ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మేళ్ళవాగు వంతెన గోదావరి వరద నీటిలో మునగడం వల్ల చాగరపల్లి, బుర్రతోగు, భూదేవిపేట మీదుగా ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంది. అధికారులు కనీసం ఒక బోట్ కూడా ఏర్పాటు చేయకపోవడం వల్ల వైద్యం అందక నిండు ప్రాణం పోయింది. పోలవరం నిర్వాసితుల పట్ల ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో ఈ సంఘటన రుజువు చేస్తోంది. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో భార్య పుష్పలత కన్నీటి పర్యంతమవుతోంది. -
చదువుల తల్లీ కరుణించమ్మా..
తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం శ్రీబాలాత్రిపుర సుందరీ పీఠంలో అక్షరాభ్యాసాలు ద్వారకా తిరుమలలో సరస్వతీ దేవి అలంకారంపెనుగొండ వాసవీ శాంతి థాంలో చిన్నారుల పూజలుసరస్వతీ దేవి అలంకరణలో మావుళ్లమ్మ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం మూలా నక్షత్రం కావడంతో అమ్మవారు సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. చదువుల తల్లి అనుగ్రహం పొందేందుకు తల్లిదండ్రులు తమ చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. రాష్ట్రంలోనే పేరెన్నికగన్న తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం శ్రీబాలాత్రిపుర సుందరీ పీఠంలో సామూహిక అక్షరాభ్యాసాలు అట్టహాసంగా నిర్వహించారు. బాసర తర్వాత మేధా సరస్వతీ నిలయమైన ఈ పీఠానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆలయాల్లో అక్షరాభ్యాసాలు, సరస్వతీ పూజలు నిర్వహించారు. – సాక్షి నెట్వర్క్ -
1న మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు
ఏలూరు(మెట్రో): స్వస్త్ నారీ సశక్త్ అభియాన్శ్రీ కింద ఏలూరు కలెక్టరేట్లో అక్టోబర్ 1న మహిళా ఉద్యోగులు, వారి కుటుంబంలోని మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి చెప్పారు. కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో సోమవారం వైద్య శిబిరాల నిర్వహణపై అధికారులతో కలెక్టర్ చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం రూపొందుతుందన్నారు. సమాజంలోని మహిళల ఆరోగ్య పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయన్నారు. జిల్లాలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ఈ కార్యక్రమం కింద మహిళలందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. వ్యాధులను ముందుగానే గుర్తిస్తే నియంత్రణకు అవకాశం ఉంటుందని, అందుకే ప్రతీ 6 నెలలు లేదా సంవత్సరానికి ఒక్కసారైనా వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. జీఎస్టీ తగ్గింపు ఫలాలు సమాజంలోని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునేలా పెద్ద ఎత్తున అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. సోమవారం సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్పై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపు ఫలాలు ప్రజలందరూ సద్వినియోగం చేసుకునేలా ఏ వస్తువుపై ఏ మేరకు ధర తగ్గింది అనే విషయాలపై సంబంధిత శాఖలు సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పేరుతో ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలు జోలికి వెళ్తే భవిష్యత్తు అంధకారమని, యువత మాదకద్రవ్యాల జోలికి పోకుండా చూడాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో సోమవారం మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మాదకద్రవ్య రహిత జిల్లాగా ఏలూరును రూపొందించేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. -
పీహెచ్సీ వైద్యుల సమ్మె బాట
ఏలూరు టౌన్: గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు వైద్య చికిత్సలు అందిస్తూ.. విశేష సేవలు చేస్తోన్న పీహెచ్సీ వైద్యుల పట్ల కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోంది. గతేడాది ఇచ్చిన హామీలను మరిచి మరోసారి పీహెచ్సీ వైద్యులను దారుణంగా మోసం చేసింది. వైద్యుల సమస్యలను పరిష్కరించకపోగా పాత విధానాన్నే మళ్ళీ తెరపైకి తేవటంతో వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు పీహెచ్సీ వైద్యులు ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తూ సమస్యలు పరిష్కారం కాకుంటే పూర్తిస్థాయిలో సమ్మెకు వెళ్తామని హెచ్చరికలు జారీ చేశారు. సోమవారం ఏలూరు జిల్లా వ్యాప్తంగా పీహెచ్సీలో వైద్యసేవలు నిలిపేశారు. అత్యవసర చికిత్సలకు మాత్రం నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై తమ ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా పల్లెసీమల్లో పేద వర్గాల ప్రజలకు వైద్యసేవలు నిలిచిపోనున్నాయి. ఎంతో శ్రమించి పీహెచ్సీల్లో వైద్య సేవలు అందిస్తోన్న డాక్టర్ల పట్ల సర్కారు నిరంకుశ వైఖరితో వైద్యులంతా ఆందోళనలకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యులంతా ప్రభుత్వ అధికారిక గ్రూపుల నుంచి బయటకొచ్చారు. ఆన్లైన్ రిపోర్టింగ్, 104 సేవలు నిలిచిపోయాయి. సోమవారం నుంచి ఏలూరు జిల్లా వ్యాప్తంగా 62 పీహెచ్సీల్లో ఓపీ సేవలు నిలిచిపోయాయి. కేవలం అత్యవసర చికిత్సలకు మాత్రమే మినహాయింపునిచ్చారు. నల్లబ్యాడ్జీలు ధరించిన వైద్యులు ఎమర్జెన్సీ సేవలను కొనసాగించారు. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి ఏలూరులోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమానికి సిద్దపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 110 మంది పీహెచ్సీ వైద్యులు నిరసన కార్యక్రమంలో పాల్గొంటారని ఏపీ పీహెచ్సీ వైద్యుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ భవానీ తెలిపారు. పీహెచ్సీ వైద్యుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే వరకూ పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. కూటమి సర్కారు మోసం ప్రజలకు సంక్షేమ పథకాల పేరుతో భారీగా హామీలు గుప్పించి మోసం చేసిన కూటమి సర్కారుకు.. మోసాలు చేయటం వెన్నతో పెట్టిన విద్యగా మారింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్నారు. గతంలో పీహెచ్సీ వైద్యులకు పీజీ సీట్ల కేటాయింపులో 30 శాతం రాయితీ కల్పించేవారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన అనంతరం పీజీ సీట్లలో కేటాయింపుల్లో సగానికి కోత వేసి 15 శాతానికి తగ్గించింది. దీనిపై గతేడాది పీహెచ్సీ వైద్యులు తీవ్రస్థాయిలో ఆందోళనలు, ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేయగా.. 20 శాతం కేటాయిస్తామంటూ హామీ ఇచ్చింది ప్రభుత్వం. పీహెచ్సీ వైద్యుల పలు న్యాయమైన డిమాండ్లను సైతం పరిష్కరిస్తామంటూ నమ్మించారు. మరోసారి పీహెచ్సీ వైద్యులను మోసం చేస్తూ పాత విధానంలోనే 15 శాతం కేటాయింపులు చేస్తామని ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందిస్తోన్న పీహెచ్సీ వైద్యులకు పదోన్నతులు కల్పించకపోవడంతో ఉద్యోగ విరమణ చేసే వరకూ కేవలం మెడికల్ ఆఫీసర్స్గానే ఉండిపోతున్నారు. టైమ్ బాండ్ ప్రమోషన్లు కల్పించాలని వారంతా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. నల్లబ్యాడ్జీలు ధరించి అత్యవసర సేవలను కొనసాగిస్తున్న పీహెచ్సీ వైద్యులు డీఎంహెచ్వో కార్యాలయం వద్ద ఆందోళనలో పీహెచ్సీ వైద్యులు (గతేడాది) రాష్ట్ర ప్రభుత్వం పీహెచ్సీ వైద్యుల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోంది. పీహెచ్సీ వైద్యుల న్యాయమైన డిమాండ్లను సాధించేవరకూ ఆందోళన విరమించేది లేదు. ఓపీ సేవలను ఇప్పటికే నిలిపేశాం. అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చాం. మంగళవారం ఏలూరు డీఎంహెచ్వో కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అక్టోబర్ 3న ఛలో విజయవాడకు పిలుపునిచ్చాం. పీజీ సీట్లలో కోటాను తగ్గించటం సరైన విధానం కాదు. గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తోన్న వైద్యులకు బేసిక్ పేపై 50 శాతం అలవెన్సులు మంజూరుకు ఎప్పటి నుంచో అడుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. – డాక్టర్ జ్ఞానేష్, ఏపీ పీహెచ్సీ వైద్యుల అసోసియేషన్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కూటమి సర్కారు తీరుతో అసంతృప్తి దశలవారీగా నిలిచిపోనున్న వైద్యసేవలు అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు నేడు ఏలూరు డీఎంహెచ్వో కార్యాలయం వద్ద ఆందోళన -
జీజీహెచ్ వైద్యుల నిర్లక్ష్యం
ఏలూరు టౌన్: ఏలూరు సర్వజన ఆసుపత్రిలోని మాతాశిశు వైద్య చికిత్స కేంద్రంలోని వైద్యులు, సిబ్బంది తీరులో మార్పు కనిపించడం లేదు. గర్భిణులు ప్రసూతికి వెళ్ళాలంటే భయంతో వణికిపోతున్నారు. ఆపరేషన్ అనంతరం కుట్లు వేస్తుండగా... కుట్లు విడిపోవటం, ఇన్ఫెక్షన్కు గురికావడంతో బాధిత మహిళల కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ఎర్రంపల్లి గ్రామానికి చెందిన శిరీష 20 రోజుల క్రితం ఏలూరు జీజీహెచ్లో ఎంసీహెచ్ విభాగంలో ప్రసూతి చికిత్స కోసం చేరింది. మహిళ శిరీషకు పరీక్షల అనంతరం ఆపరేషన్ చేయగా...తల్లి బిడ్డా క్షేమంగా ఉన్నారు. కొద్దిరోజుల అనంతరం బాధిత మహిళకు అనారోగ్యంగా ఉండడంతో ఈ విషయాన్ని వైద్య సిబ్బందికి చెప్పారు. శస్త్రచికిత్స చేసిన వైద్యురాలు రావడంతో తనకు ఇబ్బందిగా ఉందని చెప్పగా... ఆమె పొట్టపై చెయ్యి వేసి అదమగానే కుట్లు విడిపోయి మహిళ అనారోగ్యానికి గురైంది. కుట్లు వేసిన ప్రాంతంలో ఇన్ఫెక్షన్ రావటంతో బయటకు వెళ్ళి వేరే హాస్పిటల్లో చికిత్స పొందుతామని చెప్పినా వైద్యులు, సిబ్బంది వినలేదని బాధిత మహిళ వాపోయింది. బాధిత మహిళ తల్లి అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్ళింది. వారు డిశ్చార్జ్ చేయాలని చెప్పినా ఎంసీహెచ్ విభాగం వైద్యులు నిర్లక్ష్యంగా ఉన్నారని తెలిపారు. -
బలవంతపు భూసేకరణ తగదు
ఏలూరు (టూటౌన్): జీలుగుమిల్లి మండలం వంకావారిగూడెంలో నేవీ ఆయుధ డిపో పేరుతో బలవంతపు భూసేకరణ తగదని, ప్రజలు, గిరిజనుల ఆమోదం లేకుండా సర్వే ప్రారంభించడం అన్యాయమని, పంటలు సాగులో లేని భూముల్లో లేదా సమీప అటవీ భూముల్లో ఆయుధ డిపో ఏర్పాటు చేయాలని వివిధ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ ముందు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. పీజీఆర్ఎస్లో కలెక్టర్ వెట్రిసెల్వికి వినతిపత్రం అందజేశారు. ప్రజల ఆమోదం మేరకే ముందుకు వెళ్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె.శ్రీనివాస్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఎస్.రామ్మోహన్, బీకేఎంయు జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, ఐఎఫ్టీయు జిల్లా నాయకులు సాలి రాజశేఖర్, గిరిజన సంఘం నాయకులు కారం దారయ్య, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాస్ డాంగే తదితరులు మాట్లాడారు. జీలుగుమిల్లి మండలం వంకావారిగూడెం పంచాయతీ పరిధిలో 1160 ఎకరాలు భూ సేకరణ చేస్తున్నట్లు అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రకటించారని అక్కడ ప్రజలు ఏమాత్రం ఈ భూ సేకరణను అంగీకరించడం లేదన్నారు. ప్రజల అంగీకారం లేకుండా సర్వే ప్రక్రియ ప్రారంభించడం తగదన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో అక్కడ ప్రజలు వ్యతిరేకించారని, అప్పటి ప్రభుత్వం ఈ డిపో ఏర్పాటును విరమించుకుందని గుర్తు చేశారు. గిరిజనులు, ప్రజల ఆమోదం లేకుండా నేవీ డిపో ఏర్పాటును అంగీకరించమని నేవీ అధికారులే ప్రకటించారని చెప్పారు. ప్రజాభిప్రాయానికి భిన్నంగా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు వ్యవహరిస్తే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కలెక్టరేట్ ముందు నిరసన -
పోలీసుల గురించి మాట్లాడితే.. దూల తీరుస్తాం..!
ఏలూరు టౌన్: పోలీసులపై విమర్శలు చేస్తే కేసులు పెట్టి.. దూల తీరుస్తామని ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ (ఏఎస్పీ) నక్కా సూర్యచంద్రరావు వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు, కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావును బెదిరించారు. ఏలూరులో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో సూర్యచంద్రరావు చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ నెల 5న కైకలూరు మండలం దానగూడెంలో వినాయక నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనపై పోలీస్ అధికారులు పలువురిపై కేసు నమోదు చేసి అరెస్టులు చేశారు. కాగా, మాజీ ముఖ్యమంత్రి జగన్పై విషం చిమ్మడమే లక్ష్యంగా కైకలూరు ఎమ్మెల్యే కామినేని వివాదాస్పద వ్యాఖ్యలు, దీనిపై బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలను ఈ నెల 26న జరిగిన విలేకరుల సమావేశంలో దూలం నాగేశ్వరరావు ఖండించారు. ఈ క్రమంలో కామినేని ఒత్తిడులకు లొంగకుండా కొందరు పోలీసులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. దళితులపై అన్యాయంగా హత్యాప్రయత్నం చేసిన కేసులో కామినేనికి నచి్చనట్లుగా, ఆయన చెప్పిన విధంగా కేసులు రాయలేదని, అరెస్ట్ చేయలేదని టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణను వీఆర్కు పంపించారని తెలిపారు. ఎమ్మెల్యే మనిషిగా పేరొందిన రూరల్ సీఐ రవికుమార్ దీనంతటకీ కారణమని కూడా విమర్శించారు. తనకు కావాల్సిన రవికుమార్ వంటి వారిని కాపాడుకుంటూ, నిజాయితీగా పనిచేసే కృష్ణ అనే ఇన్స్పెక్టర్ను వీఆర్కు పంపించారని పేర్కొన్నారు. సమయం వస్తుందన్న ఏఎస్పీ.. ఈ అంశాలను తాజాగా ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సూర్యచంద్రరావు ప్రస్తావిస్తూ, ‘నోటి దూలెక్కి మాట్లాడితే, దూల తీర్చేసే సమయం వస్తుంది’ అని పేర్కొన్నారు. పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ సాధారణ బదిలీల్లో భాగంగానే సీఐ కృష్ణను బదిలీ చేశారని చెప్పారు. -
దిగుబడిపై దోమ‘పోటు’
మండవల్లి: వరి పంటను ఆశిస్తున్న పురుగులు, తెగుళ్లతో దిగుబడులు తగ్గుతున్నాయి. సుడిదోమ వరి పంటను ఆశించి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుంది. వివిధ రకాల వైరస్ వ్యాధులను కారణమవుతోంది. దీని నివారణకు తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. గోధుమ రంగు సుడి దోమ: గోధుమ రంగు దోమ నీటి వసతి గల ప్రాంతంలో పంటను ఎక్కువగా ఆశిస్తుంది. తల్లి పురుగులు గోధుమ వర్ణం నుంచి ముదురు గోధుమ వర్ణంలో ఉంటాయి. నష్టం: పిల్ల, తల్లి దోమలు కాండంలోని పోషకాలు సరఫరా చేసే కణజాలం నుంచి రసాన్ని పీల్చడం వల్ల పంట క్రమేపి పసుపు రంగుకు మారుతుంది. దీంతో ఎదుగుదల కోల్పోయి గిడస బారిపోతుంది. ఆలస్యంగా పిలకలు వేస్తాయి. అలాగే పిలకల నుంచి వచ్చిన వెన్నులో గింజలు సరిగా రావు. తెల్ల మచ్చ దోమల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి వెన్నును కూడా ఆశిస్తాయి. ఎక్కువ విస్తీర్ణంలో సుడి తెగులులా వ్యాపించడంతో పొలం అంతా ఎండిపోతుంది. నత్రజని ఎరువులు ఎక్కువ మోతాదులో వాడటం, పొటాష్ ఎరువులు వాడకపోవడం, నీటి యాజమాన్య పద్ధతులు సరిగా పాటించకపోవడం వల్ల ఈ దోమ వ్యాపిస్తుంది. యాజమాన్యం: దోమలను తట్టుకునే రకాలను సాగు చేయాలి. ఇంద్ర(ఎంటీయూ 1061), శ్రీ ధ్రుతి (ఎంటీయు 112), చంద్ర (ఎంటీయూ 1153) తరంగిణి రకాలు సాగుచేయాలి. సుడులు సుడులుగా ఎండిపోవడాన్ని సుడితెగులు అని పిలుస్తారు. దోమ ఉధృతి ఎక్కువగా ఉంటే సుడులు ఒకదానితో ఒకటి కలిసి చేనంతా ఎండిపోతుంది. అలాంటి పరిస్థితులో దిగుబడి తగ్గుతుంది. తెల్ల వీపు మచ్చ దోమ: దోమ శరీరం తెల్లగా ఉండి ఉదరం మాత్రం నల్లగా ఉంటుంది. రెక్కల మధ్య స్పష్టమైన తెల్లటి మచ్చ ఉంటుంది. ఈ కారణంగా దీనిని తెల్ల వీపు మచ్చ దోమ అంటారు. నష్టం: పిల్ల, తల్లి దోమలు కాండంలోని మొక్కలకు పోషకాలు సరఫరా చేసే కణజాలం నుంచి రసాన్ని పీల్చడం వల్ల మొక్కలు పసుపు రంగుకు మారి, ఎదుగుదల కోల్పోయి గిడసబారి పోతాయి. ఆలస్యంగా పిలకలు వేస్తాయి. పిలకల నుంచి వచ్చిన వెన్నులో గింజలు సరిగా రావు. తెల్ల మచ్చ దోమ వల్ల ఎక్కువ విస్తీర్ణంలో సుడి తెగులు వ్యాపించి, పొలం అంతా ఎండిపోతుంది. ● నత్రజని ఎక్కువ మోతాదులో వాడటం, పొటాష్ ఎరువులు వాడకపోవడం, నీటి యాజమాన్యం సరిగా లేకపోవడం ఉధృతికి కారణాలు ● దోమ నివారణకు అంకురం ఏర్పడే దశలో కార్బోప్యూరాన్ 3జీ గుళికలు 10 కిలోలు ఒక ఎకరానికి వేయాలి. -
సబ్ జైలు సందర్శన
భీమవరం: భీమవరంలో ప్రత్యేక సబ్ జైలును ఆదివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ ఎస్.శ్రీదేవి, సంస్థ సెక్రటరీ కె.రత్నప్రసాద్ సందర్శించారు. ముద్దాయిలు కోరితే మండల న్యాయ సేవా సంస్థ ద్వారా ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తామన్నారు. ముద్దాయిలు సత్ప్రవర్తన కలిగి ఉండాలని సూచించారు. జైలులో ఏర్పాట్లపై ఆరా తీశారు. రోజూ యోగా చేస్తే మానసికంగా ఉల్లాసంగా ఉంటారన్నారు. జైలు పరిసరాలను, మహిళా బ్యారక్ను, సోషల్ ఇంక్యుబేషన్ సెంటర్, ఉచిత న్యాయ సహాయ కేంద్రాన్ని పరిశీలించారు. స్టోర్ రూమ్ను, వంటశాలను తనిఖీ చేసి, భోజనాన్ని రుచిచూశారు. జైలు సూపరింటెండెంట్ డి.వెంకటగిరి ఉన్నారు. -
వేటగాళ్ల మరణ మృదంగం
● కొల్లేరులో నాటు తుపాకులకు విహంగాల బలి ● గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు ● చేతులెత్తేసిన అటవీశాఖ అధికారులు కై కలూరు: ప్రకృతి సౌందర్యాలకు నిలయమైన కొల్లేరు సరస్సు.. పక్షుల కిలకిలరావాలతో కళకళలాడే విహంగాల స్వర్గధామం. ఇప్పుడు ఆ స్వర్గంలో మరణమృదంగం మోగుతోంది. వేటగాళ్లు విదేశీ పక్షులపై విరుచుకుపడుతున్నారు. తుపాకీ గుండ్లతో మూగజీవాల గుండెలను చీల్చేస్తూ, వలల ఉచ్చులతో ఊపిరి తీయకుండా చేస్తున్నారు. అటవీ అభయారణ్య చట్టాలు కేవలం పుస్తకాలకే పరిమితమైపోయాయి. నియంత్రించాల్సిన అధికారుల కళ్లముందే వేటగాళ్ల దౌర్జన్యం పెరుగుతోంది. కూటమి ప్రభుత్వంలో మరింత బరితెగించి కొల్లేరు ఒడిలో సేదతీరుతున్న పక్షుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. చెరువులపై వాలితే ఆయువు తీరినట్లే ఆక్వా చెరువులపై వాలిన అరుదైన పక్షి జాతులు సైతం వేటగాళ్ల నాటు తుపాకులకు బలవుతున్నాయి. రాష్ట్రంలో 5.75 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతుండగా, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఈ విస్తీర్ణం 2.90 లక్షల ఎకరాలుగా ఉంది. ఎక్కువ విస్తీర్ణం కలిగిన చేపల రైతులు సాగు ప్రారంభంలో చేప పిల్లలను పక్షులు తినకుండా నాటు తుపాకుల వేటగాళ్లను నియమించుకుంటారు. ఇందుకోసం తమిళనాడు, సూళ్లూరుపేట నుంచి వచ్చిన దాదాపు 150 కుటుంబాలు కై కలూరు, ఉండి నియోజకవర్గాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. తుపాకీతో ఒక్క పక్షిని చంపితే వీరికి రూ.200 నుంచి రూ.300 వరకూ పనికి తీసుకెళ్లిన చెరువు రైతులు చెల్లించాలి. ఈ క్రమంలో కొల్లేరులో సంచరించే పక్షులు చెరువులపై వాలితే వేటగాళ్లు కాల్చేస్తున్నారు. చేపలు పెద్దవైన తర్వాత సైతం వేటగాళ్లు తమ పక్షుల వేటను కొనసాగిస్తుండడం గమనార్హం. నాటు తుపాకుల మందు పేలి అనేక మంది వేటగాళ్లు మరణించిన ఘటనలు కొల్లేరు ప్రాంతంలో చోటుచేసుకోవడం గమనార్హం. అక్రమ వేటకు ఎన్నో ఆనవాళ్లు.. ● గుడివాకలంక, నిడమర్రు, అడవి కొలను, శృంగవరప్పాడుతో పాటు నడికొల్లేరులోని అనేక ప్రాంతాల్లో వేట సాగిస్తున్నారు. ● ఆగస్టు 29న ఏలూరు జిల్లా గుడివాకలంక వద్ద కొల్లేరు పక్షులను వేటాడి తెస్తున్న వ్యక్తిని ఫారెస్టు సిబ్బంది పట్టుకున్నారు. కై కలూరు మండలం కొల్లేటికోట ప్రాంతంలో వేటాడానని అతను చెప్పాడు. ఇదే ప్రాంతంలో కొన్ని నెలల క్రితం బతికి ఉన్న పక్షుల తీసుకెళ్తున్న ఒకరిని పట్టుకున్నారు. కేసు నమోదు చేసి మేజిస్ట్రేట్ తీర్పుతో పక్షులను వదిలేశారు. ● సెప్టెంబర్ 4న నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం చేపల మార్కెట్లో విక్రయానికి ఉంచిన 13 మృతి చెందిన పక్షులను, ఏడుగురు వేటగాళ్లను, 3 నాటు తుపాకులను భీమవరం ఫారెస్టు సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ● కొద్దిరోజుల క్రితం వేటగాళ్లు గుళికలతో చంపిన గ్లోసి ఐబీస్ కొల్లేరు పక్షుల ఫొటోలు సామాజిక మాద్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి. కొల్లేరు సరస్సు ముఖ్యాంశాలు ప్రాంతం: 901 చ.కి.మీ. విస్తీర్ణం: 2,22,300 ఎకరాలు అభయారణ్యం: 77,138 ఎకరాలు (9 మండలాలు) గ్రామాలు: 122 f¯é¿ê: 3.50 ÌS„ýSË$ ÑçßæÇ…^ól 糄ìS gê™èl$Ë$: 182 Ð]lÌSçÜ ç³„ýS$Ë$: {ç³™ólÅMýS BMýS-Æý‡Û׿ వేటకు గురవుతున్న ప్రధాన పక్షులు పర్పూల్ శాంఫన్ (కొండింగాయి) కామన్ మోర్హెన్ (జమ్ముకోడి) కామన్ కూట్ (నామాల కోడి) టీల్ (పరజా) గ్లోసీ ఐబీస్ (నల్ల కంకణాల పిట్ట) విజిటింగ్ టీల్ (సిలువ బాతులు) గ్రేహెరాన్ (నారాయణ పక్షి) కార్బోరెంట్ (నీటి కాకులు) కొల్లేరు ప్రాంతంలో పక్షుల వేటగాళ్లపై నిఘాను ముమ్మరం చేశాం. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం వేటాడినా, వాటి ఆవాసాలను నాశనం చేసినా, అభయారణ్యంలో ప్రవేశించినా నేరంగా పరిగణిస్తాం. రెండేళ్లు జైలు, రూ.20 వేల జరిమానాతో పాటు రెండు శిక్షలను ఏకకాలంలో అనుభవించాల్సి ఉంటుంది. నాటు తుపాకులతో అభయారణ్యంలో ప్రవేశం నేరం. –కె.రామలింగాచార్యులు, జిల్లా ఫారెస్టు రేంజ్ ఆఫీసర్, ఏలూరు -
క్షేత్రంలో కొనసాగిన రద్దీ
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో ఆదివారం సైతం భక్తుల రద్దీ కొనసాగింది. దసరా ఉత్సవాలు సందర్భంగా విజయవాడ దుర్గమ్మను దర్శిస్తున్న భవానీ దీక్షాదారులు నేరుగా చిన్నతిరుపతికి చేరుకుంటున్నారు. దాంతో కొండపైన, ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. దర్శనం క్యూలైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, కేశఖండనశాల తదితర విభాగాలు భక్తులతో పోటెత్తాయి. సెల్ఫోన్లు భద్రపరచే కౌంటర్ వద్ద భక్తులు బారులు తీరారు. తిరుగు ప్రయాణంలో వారంతా క్షేత్ర దేవత కుంకుళ్లమ్మ ఆలయాన్ని సందర్శిస్తున్నారు. రాత్రి వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. -
పెద్దింట్లమ్మ దేవస్థానంలో భక్తుల రద్దీ
కై కలూరు: పెద్దింట్లమ్మ దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ కనిపించింది. సమీప జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మను దర్శించుకున్నారు. పవిత్ర కోనేరులో స్నానాలు అచరించి పెద్దింట్లమ్మకు పొంగళ్లు సమర్పించారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఒక్క ఆదివారం ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డూ ప్రసాదం, గదుల అద్దెలు, అమ్మవారి ఫొటోల అమ్మకం, వాహన పూజలు, భక్తుల విరాళాల ద్వారా రూ.33,675 ఆదాయం వచ్చిందని చెప్పారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని ఈవో చెప్పారు. కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానంలో భక్తుల పూజలు -
బుడతడే గానీ ఘటికుడు
పాలకొల్లు సెంట్రల్: ఈ బుడతడు.. ప్రపంచంలో 78 దేశాల జాతీయ జెండాలను గుర్తిస్తాడు. తన టాలెంట్తో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కాడు. పాలకొల్లు పట్టణంలోని 18వ వార్డు పిన్నివారి వీధిలో ఉంటున్న శ్రిఖాకొళ్లపు రాజేష్, లలిత దంపతుల పెద్ద కుమారుడు జెష్విన్ ప్రసాద్. లలితకు చదువుపై మక్కువ కావడంతో పిల్లాడిని కూడా అలాగే తీర్చిదిద్దాలనే సంకల్పంతో అతనికి ఆరు నెలలు వచ్చేసరికి ఇతర దేశాల జాతీయ జెండాలను చూపిస్తూ శిక్షణ ఇచ్చేది. జాతీయ జెండాలతో పాటు, వాహనాలు, జంతువులు, పండ్లు, పక్షులు ఇలా 300 పదాల వరకూ నేర్పించారు. ఏదైనా వస్తువు పేరు, ఆట పేరు, వ్యక్తుల పేర్లు చెపితే వాటిని చూపిస్తాడు. ఇంగ్లీషు, తెలుగులో చెబుతాడు. పిల్లాడికి నేర్పించేందుకు ప్రత్యేక కార్డులు తయారుచేశారు. జెస్విన్ టాలెంట్ను చిత్రీకరించి గిన్నిస్ బుక్ ఇంటర్నేషనల్ రికార్డ్స్, సూపర్ టాలెంటెడ్ కిడ్ పోటీలకు దరఖాస్తు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పిల్లాడి ప్రతిభను గుర్తిస్తూ ప్రశంసాపత్రాన్ని పంపించారు. -
గోపాలకృష్ణకి రాష్ట్రస్థాయి అవార్డు
చింతలపూడి: చింతలపూడికి చెందిన కిసాన్ అంగడి వ్యవస్థాపకుడు మరికంటి గోపాలకృష్ణ ఉత్తమ ప్రకృతి వ్యవసాయ విస్తరణ నిపుణుల రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. ఏరు వాక ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో తాను అవార్డు అందుకున్నట్టు గోపాలకృష్ణ ఆదివారం తెలిపారు. ఎనిమిదేళ్లుగా గోపాలకృష్ణ తన భూమిలోనే ప్రకృతి వ్యవసాయాన్ని అమలు చేస్తూ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కిసాన్ అంగడి ద్వారా ఆంధ్ర–తెలంగాణ రాష్ట్రాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ అవగాహ న, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్ర కృతి వ్యవసాయం మీద నమ్మకంతో ముందుకు సాగుతున్న రైతులందరి విజయం ఈ అవార్డు అని, భవిష్యత్తులో మరింత మంది రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించడానికి కృషి చేస్తానని గోపాలకృష్ణ అన్నారు. ఏలూరు(ఆర్ఆర్పేట): ఉద్యోగ, ఉపాధ్యాయులు సకాలంలో డీఏలు, పీఆర్సీ ప్రయోజనాలు అందక ఇబ్బంది పడుతున్నారని ఏపీటీఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తాళ్లూరి రామారావు, బి.రెడ్డి దొర ఓ ప్రకటనలో తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ నాలుగు డీఏలు పెండింగ్లో ఉన్నాయన్నారు. ఐఆర్, పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే ప్రకటించాలని కోరారు. యలమంచిలి: గోదావరిలో వరద ఉధృతి పెరగడంతో కనకాయలంక వద్ద కాజ్వే మునిగింది. కాజ్వేపై నుంచి సుమారు నాలుగడుగుల నీరు ప్రవహించడంతో అధికారులు ఇంజన్ పడవలు ఏర్పాటుచేశారు. ఈ ఏడాది వరదలకు కాజ్వే మునగడం ఇది నాలుగోసారి. ప్రస్తుతం భద్రాచలం వద్ద 43 అడుగుల నీరు ఉంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో నాలుగు రోజుల వరకూ కాజ్వే ముంపులోనే ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. సిద్ధాంతంలో.. పెనుగొండ: వశిష్ట గోదావరి నిండుగా ప్ర వహిస్తోంది. రెండు రోజుల్లో సుమారు ఏడడుగుల మేర నీరు పెరిగింది. సిద్ధాంతంలో కేదార్ఘాట్, పుష్కర ఘాట్లు పూర్తిగా మునిగిపోవడానికి కేవలం మూడు మెట్లు మాత్రమే ఉన్నాయి. వరద నీరు సిద్ధాంతం పుష్కరాల రేవులను పూర్తిగా ముంచెత్తింది. పడవలపై రాకపోకలు సాగించే లంక రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మధ్యస్థ లంకలోకి రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. -
మంత్రి పదవి కోసమే జగన్పై కామినేని ఆరోపణలు
కై కలూరు: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అసెంబ్లీ వేదికగా తిడితే సీఎం చంద్రబాబు కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్కు మంత్రి పదవి కేటాయిస్తారనే భ్రమలో ఉన్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) విమర్శించారు. కై కలూరు పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సమావేశంలో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్తో కూడిన ప్లకార్డులను ఆదివారం అవిష్కరించారు. ఈ సందర్భంగా డీఎన్నార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో కూటమి పాలనలో జరిగే ప్రతి అన్యాయం, అక్రమాలు, మైనింగ్లను డిజిటల్ బుక్లో నమోదు చేయాలన్నారు. డిజిటల్ బుక్ పోర్టల్లో ఫొటోలు, ఆధారాలు, అప్లోడ్ చేసేందుకు అవకాశం ఉందన్నారు. దీనిలో ఐవీఆర్ఎస్ నంబరు 040–49171718 కాల్ చేసి ఫిర్యా దులు చేయవచ్చన్నారు. డీఎన్నార్ పేరు చెబితే కామినేనికి నిద్ర పట్టడం లేదు తన పేరు చెబితే ఎమ్మెల్యే కామినేనికి నిద్రపట్టం లేదని డీఎన్నార్ అన్నారు. అసెంబ్లీలో మంత్రి పద వి కోసం కాకా పట్టడం కోసమే వైఎస్ జగన్పై కామినేని అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. వీటిపై విదేశాల్లో ఉన్న చిరంజీవి స్పష్టత ఇవ్వడంతో కామినేని పన్నాగం అర్థమయిందన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణకు మంత్రి పదవి కేటాయించకపోవడం, డిప్యూటీ పవన్ కల్యాణ్కు ఉన్న గన్మెన్లు, బౌన్సర్లు చూసి తట్టుకోలేక సైకోలా మాట్లాడుతున్నారని ధ్వ జమెత్తారు. అసలు ఈ గొడవలకు ప్రధాన కారణం కామినేని శ్రీనివాస్ అని విమ్శరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ముదిరాజుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కోమటి విష్ణువర్ధనరావు, పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగ సెక్రటరీ, ముదినేపల్లి ఎంపీపీ రా మిశెట్టి సత్యనారాయణ, ఎస్సీ సెల్ రాష్ట్ర నా యకులు గుమ్మడి వెంకటేశ్వరరావు, జిల్లా ఎంప్లాయీస్ అండ్ ఫెన్సనర్ల విభాగ అధ్యక్షుడు ఎలుగుల వేణుగోపాలరావు, మండల పార్టీ అధ్యక్షుడు శింగంశెట్టి రాము, నాయకులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ -
నేవీ డిపోపై గిరిజన పోరు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : గిరిజనులు మళ్లీ పోరు బాట పట్టారు. ప్రశాంత జీవనం ఉన్న మా పల్లెల్లో నేవీ ఆయుధ డిపో వద్దంటూ తీవ్రస్థాయిలో నిరసన గళం విప్పారు. మూడుసార్లు నిర్వహించిన గ్రామసభల్లో ఆయుధ డిపో వద్దంటూ తీర్మానం చేశారు. అయినా సర్కారు మొండిగా ముందుకెళ్లడం ఆందోళన కలిగిస్తోంది. ఏలూరు జిల్లాలో తలపెట్టిన ఈ నేవీ ఆయుధ డిపోపై వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన గ్రామసభలో గిరిజనులు వ్యతిరేకించారు. దీంతో అప్పట్లో ఉన్నతాధికారులు ప్రజాభీష్టం మేరకు ఆ ప్రాజెక్టు ప్రతిపాదనల్ని నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. కూటమి సర్కారులో మళ్లీ ఆ ఆయుధ డిపో ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. జీలుగుమిల్లి మండలం వంకావారిగూడెం ప్రాంతంలో 1,166 ఎకరాల భూమిని సేకరించి నేవీ ఆయుధ డిపో ఏర్పాటు చేస్తామని ఎంపీ పుట్టా మహేష్యాదవ్ చేసిన ప్రకటనతో గిరిజనులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీనిని నిరసిస్తూ గిరిజనులు ర్యాలీకి పిలుపునిస్తే సెక్షన్–30 అమలు చేసి ఉద్యమాన్ని అణచివేయాలని ప్రభుత్వం ప్రయత్నించటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేవీ డిపో ఏర్పాటుపై ఎంపీ సమావేశం గత వారం ఎంపీ పుట్టా మహేష్యాదవ్ ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వితో కలిసి కలెక్టరేట్లో నేవీ డిపో ఏర్పాటుపై సమావేశం నిర్వహించారు. 1,166 ఎకరాల భూమి సేకరించాలని, 30 ఎకరాల్లో డిపో ఏర్పాటు, మరికొంత స్థలంలో ఆస్పత్రి, స్కూల్, అధికారుల నివాసాలు ఉంటాయని, 2,500 మందికి పైగా స్థానికులకు ఉద్యోగాలిస్తామని ప్రజలకు నచ్చజెప్పాలని ఎంపీ సూచించారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే నేవీలో స్థానికంగా ఉద్యోగాలు ఎలా వస్తాయనే వాదనను గిరిజనులు తెరపైకి తెస్తే.. అధికారుల నుంచి స్పందన లేదు. తాజాగా గ్రామసభతో సంబంధం లేకుండా భూసేకరణకు సమాయత్తం అవుతుండటంపై గిరిజనులు, నేవీ ఆయుధ డిపో వ్యతిరేక పోరాట వేదిక (వామపక్షాలు) నేతలు పోరుబాట పట్టారు. ఆయుధ డిపో వద్దంటూ గత మంగళవారం ఆందోళన నిర్వహించారు. పోలీసు అధికారులు జీలుగుమిల్లి, టి.నర్సాపురం మండలాల్లో సెక్షన్–30 అమలు చేసి నిరసన ర్యాలీలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. గిరిజన, వామపక్ష నేతలను గృహనిర్బంధం చేశారు. మడకంవారిగూడెంలో నిరసనకారులకు, పోలీసులకు తోపులాట జరిగింది. జీలుగుమిల్లి మండలం గిరిజన ప్రాంతం. 1,166 ఎకరాల్లో నేవీకి సంబంధించి ఆయుధ తయారీ డిపోను ఏర్పాటు చేయడానికి ఏలూరు జిల్లాలో గిరిజన ప్రాంతంలో భూములు గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. జీలుగుమిల్లి మండలంలోని వంకావారిగూడెం, రమణక్కపేట, దాట్లగూడెం, కొత్తచీమలవారిగూడెం, మడకంవారిగూడెం గ్రామాల పరిధిలో ఈ పరిశ్రమ ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని అప్పటి అధికార యంత్రాంగం నిర్ధారించడంతో నేవీ ఉన్నతాధికారులు వచ్చి ఆ భూముల్ని పరిశీలించారు. దీనిపై 2023లో అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రామసభ నిర్వహించగా నేవీ డిపో ఏర్పాటును గిరిజనులు వ్యతిరేకించారు. దీంతో ప్రభుత్వం ప్రజల అభీష్టానికి అనుగుణంగా పనిచేస్తుందని, అందువల్ల ఆయుధ డిపో ప్రతిపాదనలను నిలిపేస్తున్నామని ఉన్నతాధికారులు ప్రకటించారు. గతేడాది కూటమి ప్రభుత్వం రాగానే ఆయుధ డిపో వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రధానంగా ఎంపీ పుట్టా మహేష్యాదవ్ వ్యక్తిగత ఆసక్తితో వేలాదిమంది గిరిజనులు వ్యతిరేకించినా ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని హడావుడి మొదలుపెట్టారు. దీనిలో భాగంగా గతేడాది అక్టోబర్ 27న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసుల నేతృత్వంలో గ్రామసభ నిర్వహించి అందరికీ ఉద్యోగాలు వస్తాయని, ఎలాంటి సమస్యా ఉండదని, ఉద్యోగాలన్నీ స్థానికులకే నేవీ ఇస్తుందంటూ రకరకాల మాటలతో నచ్చజెప్పాలని ప్రయత్నించారు. అయినా గిరిజనులు, ప్రజాసంఘాల వారు తీవ్రంగా వ్యతిరేకించారు. తరువాత మరోసారి గ్రామసభ నిర్వహిస్తే నేవీ డిపో వద్దంటూ ప్రజలు ముక్తకంఠంతో నినదించారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు పేరుతో వేలేరుపాడు, కుక్కునూరు, పోలవరం మండలాల్లోని గిరిజనులు ఏజెన్సీకి దూరమయ్యారని, ఈ పరిశ్రమ పేరుతో జీలుగుమిల్లి మండలంలోని గిరిజనులను కూడా తరిమివేయవద్దంటూ నిరసన వ్యక్తం చేశారు. మూడుసార్లు గ్రామసభల్లో వద్దన్నా.. సర్కారు హడావుడి ఏలూరు జిల్లాలో 1,166 ఎకరాల భూసేకరణపై దృష్టి డిపో ఏర్పాటు చేసి తీరతామన్న ఎంపీ పుట్టా మహేష్ ప్రకటనతో రగడ సెక్షన్–30తో గిరిజనుల ఉద్యమాన్ని అణచాలని ప్రయత్నాలు ప్రజాభీష్టం మేరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదనల నిలిపివేత కూటమి సర్కారులో మళ్లీ గిరిజనుల్ని తరిమేసే ప్రణాళిక జీలుగుమిల్లి మండలంలో నేవీ ఆయుధ డిపోను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికే మూడుసార్లు గ్రామసభల ద్వారా డిపో ఏర్పాటు చేయవద్దని తీర్మానం చేశారు. భూసేకరణ జరిగిందని అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పడం అబద్ధం. గ్రామసభ జరగకుండా భూసేకరణ ఎలా చేస్తారు? ప్రజల అభిప్రాయాలను గౌరవించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. – ఎ.రవి, సీపీఎం జిల్లా కార్యదర్శి -
దొంగలు బాబోయ్ దొంగలు
● జిల్లాలోకి మధ్యప్రదేశ్, రాజస్థాన్ గ్యాంగ్ ● వరుస చోరీలతో ప్రజలు బెంబేలు ● అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు తణుకు అర్బన్ : చీకటిపడితే చాలు ఇంటి తలుపు లు భద్రంగా వేసుకున్నా దొంగల భయంతో ప్ర జలు ఆందోళన చెందుతున్నారు. దాడులు చేసి కొందరు, భయపెట్టి మరికొందరు దొంగలు దొరికినకాడికి దోచుకుపోతూ బెంబేలెత్తిస్తున్నారు. తాళం వేసిన ఇళ్లతో పాటు ఒంటరిగా ఉన్న మహిళలు, వృద్ధుల ఇళ్లపై తెగబడుతూ చోరీలకు పాల్పడుతున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో నెల రోజుల వ్యవధిలో జరిగిన పలు చోరీ సంఘటనలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. భయాందోళనలో వృద్ధులు ఇటీవల దొంగల ప్రస్తావన వస్తుండటంతో ఒంటరిగా ఉంటున్న వృద్ధులు భయాందోళన చెందుతున్నారు. దొంగలు డబ్బు, ఆభరణాలు అపహరించడంతో పాటు దాడులు చేయడంతో భయపడుతున్నారు. ము ఖ్యంగా దొంగలు బంగారు ఆభరణాలను దోచుకుంటున్నారు. ఇటీవల బంగారం ధరలు ఆకాశాన్నంటడంతో దొంగలు వీటిపై దృష్టి సారించారు. తణుకులో వాచ్మెన్ను తీవ్రంగా గాయపరచడంతో దుకాణాలు, సంపన్నుల ఇళ్లకు వాచ్మెన్లుగా ఉన్న వృద్ధులు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. చోరీల్లో కొన్ని.. ● తణుకులో ఈనెల 26న రాత్రి వృద్ధురాలు ఒంటరిగా ఉన్నారన్న పక్కా సమాచారంతో ఇంట్లోకి చొరబడి 70 కాసుల బంగారు ఆభరణాలు, రూ.70 వేల నగదు దోచుకుపోయా రు. దొంగలను చూసి భయపడిన వృద్ధురాలు తననేమీ చేయవద్దని ఇంట్లో దాచుకున్నవి, ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు సైతం స్వయంగా ఇవ్వాల్సిన పరిస్థితి. ● ఈనెల 23న రాత్రి జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో ముగ్గురు దొంగలు ఒంటరిగా ఉంటున్న వృద్ధ దంపతుల ఇంట్లోకి ప్రవేశించి వారిపై దాడి చేసి, కాళ్లూ చేతులు కట్టి అందిన కాడికి దోచుకుపోయారు. ● ఈనెల 20న రాత్రి తణుకు సజ్జాపురంలోని జ్యూపిటర్ ఎగ్ ట్రేడర్స్ కార్యాలయంలో విధు ల్లో ఉన్న వాచ్మెన్ను తీవ్రంగా గాయపరిచి రూ.లక్ష నగదు దోచుకున్నారు. ● ఈనెల 15న ఏలూరులో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న మహిళపై ఒక అగంతకుడు కత్తితో తీవ్రంగా దాడి చేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు ఎత్తుకుపోయాడు. పోలీసుల హెచ్చరికలు జిల్లాలో మధ్యప్రదేశ్, రాజస్థాన్కు ఆరుగురు అంతర్జాతీయ దొంగల ముఠా సంచరిస్తున్నట్టు సమాచారం ఉందని పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ నెలలో సదరు గ్యాంగ్ నెల్లూరు జిల్లా కావలి, కాకినాడ జిల్లా పత్తిపాడు, తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో చోరీలకు తెగబడిందని చెబుతున్నారు. వీరంతా తక్కువ అద్దె ఉన్న లాడ్జీల్లో తలదాచుకుంటూ పగలు రెక్కీ నిర్వహించి రాత్రిళ్లు నేరాలకు పాల్పడుతున్నారని, అనుమానాస్పదంగా వ్యవహరించే వారి సమాచారాన్ని 112కి ఫోన్ చేసి తెలియజేయాలని పోలీసులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా పోలీసు అధికారులు రాత్రిళ్లు ప్రత్యేక నిఘా పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
యువకుడిపై గంజాయి బ్యాచ్ దాడి
● తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స ● గ్రామస్తుల భారీ ఆందోళన.. విరమణ సాక్షి, టాస్క్ఫోర్స్: భీమడోలులో శనివారం రాత్రి గంజాయి ముఠా రెచ్చిపోయి దాడి చేయడంతో ఈతకోట రవికిరణ్ అనే యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధిత యువకుడిని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రెండు నెలలుగా గ్రామంలో గంజాయి బ్యాచ్ పేట్రేగిపోతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఆందోళనకు దిగారు. భీమడోలు సీఐ యూజే విల్సన్ వారికి సర్దిచెప్పేందుకు రాగా ఆయన జీపు ను చుట్టుముట్టారు. 10 మంది గంజాయి ముఠా సభ్యుల్లో పలువురు రవికిరణ్పై ఇప్పటికే రెండు సార్లు దాడి చేసినా, చంపేస్తామని బెదరిస్తున్నట్టు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లే దంటూ గ్రామస్తులు మండిపడ్డారు. ఏలూరు డీఎ స్పీ శ్రావణ్కుమార్ ఇక్కడకు వచ్చి ఆందోళన విరమించాలని కోరగా సమస్య తీవ్రతను ఆయనకు తెలియజేశారు. చివరకు అల్లరిమూకలపై కేసులు నమోదుచేస్తామని ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. రాత్రి 10.30 గంటల నుంచి వేకువజాము 2.30 గంటల వరకు ఆందోళన కొనసాగింది. అనంతరం గ్రామస్తుల ఫిర్యాదు మేరకు 10 మందిపై కేసు నమోదు చేసినట్టు సీఐ విల్సన్ తెలిపారు. చవితి ఉత్సవాల్లో గొడవ ప్రారంభం భీమడోలు గణపతి సెంటర్లో నిర్వహించిన వినా యక చవితి ఉత్సవాల్లో భాగంగా నిమజ్జనోత్స వాన్ని పురస్కరించుకుని ఈనెల 6న పోలీసుల ఆదేశాలతో ఉత్సవ కమిటీ సభ్యులు డీజే సౌండ్స్ను నిలిపివేశారు. దీనిపై ఆగ్రహించిన కూటమి నాయకులు (గంజాయి బ్యాచ్) గుబ్బాల శివ, వణుకూరి బాలు, నందవరపు ప్రసాద్, ముదరబోయిన సుధాకర్, పిల్లి రాజశేఖర్, ఖాదా శ్రీను, ననుబోలు జగదీష్, రామకుర్తి సురేష్, ఆడపా మణికంఠ గంజా యి సేవించి ఉత్సవ కమిటీ సభ్యులను దుర్భాషలాడారు. దీనిపై అదేరోజు రాత్రి ఉత్సవ కమిటీ సభ్యు లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో 7న ఉత్సవ కమిటీ సభ్యుడు ఈతకోట రవికిరణ్పై గుబ్బాల శివ, పిల్లి రాజశేఖర్, ఖాదా శ్రీను, ముదరబోయిన సుధాకర్ దాడి చేశారు. దీనిపై ఎంఎల్సీ కేసు నమోదైనా పోలీసులు చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి రవికిరణ్పై గంజాయి బ్యాచ్కు చెందిన ఇద్దరు రాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. గంజాయికి అడ్డాగా భీమడోలు రాష్ట్రంలో గంజాయి తరలింపులో భీమడోలు రెండో స్థానంలో ఉన్నట్టు సోషల్ మీడియాలో ఓ మెసేజ్ చక్కర్లు కొడుతోంది. గంజాయికి అడ్డాగా భీమ డోలు మారిందని, దీంతో విద్యార్థుల నుంచి యు వత వరకూ గంజాయికి బానిసలవుతున్నారని పోలీసులకు పలు ఫిర్యాదులు అందాయి. పోలీసుల అదుపులో నిందితులు రవికిరణ్పై దాడికి కారణమైన 10 మంది యువకులపై భీమడోలు పోలీసులు కేసు నమోదు చేసి ఎని మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. నిందితులు గుబ్బల శివకృష్ణ, జక్కంశెట్టి వీర వెంకట సత్యనారాయణ, ఖాజా శ్రీనివాసరావు, పిల్లి రాజశేఖర్, వణుకూరి బాలకృష్ణ, ముదరబోయిన సుధాకర్, నందవరపు ప్రసాద్, అడపా మణికంఠలను అదుపులోకి తీసుకున్నారు. నానుబోలు జగదీష్, రామిశెట్టి సురేష్ పరారీలో ఉన్నట్టు ఇన్చార్జి ఎస్సై సుధీర్ ఆదివారం రాత్రి తెలిపారు. -
9 ఏళ్లుగా నిలిచిన రిజిస్ట్రేషన్లు
● 138 ఎకరాల విస్తీర్ణంలో ఆస్తులపై చిక్కుముడి ● నూజివీడువాసుల ఇబ్బందులు నూజివీడు: నూజివీడు నడిబొడ్డున ఉన్న 138 ఎకరాల్లోని నివేశన స్థలాలు, ఇళ్లు, అపార్ట్మెంట్లలో ఫ్లాట్లకు సంబంధించి రిజిస్ట్రేషన్లు జరగక పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2016లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో నిలిచిన పట్టణంలోని గ్రామకంఠం భూమి రిజిస్ట్రేషన్లు ఇప్పటికీ జరగడం లేదు. వక్ఫ్బోర్డు సూచనతో అప్పట్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఇష్టారాజ్యంగా పట్టణంలోని 450/1 సర్వే నంబర్లో 138 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గ్రామకంఠం భూమి రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది. వక్ఫ్బోర్డుకు చెందిన భూమి ఏమైనా ఉంటే అంతవరకు చూసుకోవాలే తప్ప 138 ఎకరాల రిజిస్ట్రేషన్ను నిలుపుదల చేయించడమేమిటని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అవసరానికి అక్కరకు రాకుండా.. సర్వే నంబర్ 450/1లో ఉన్న భూమి ప్రైవేటు గ్రామకంఠం భూమి కాగా వందలాది గృహాలు, అపార్ట్మెంట్లు, ఖాళీ స్థలాలు ఉన్నాయి. రిజిస్ట్రే షన్లు నిలిపివేయడంతో క్రయవిక్రయాలు జరగక ఆస్తి అవసరానికి అక్కరకు రావడం లేదని ఈ ప్రాంతవాసులు అంటున్నారు. ఆర్థిక కష్టాలు ఎదురైతే అప్పులు చేయాల్సి వస్తుందని వాపోతున్నారు. ఎందుకు నిలిపివేశారంటే... పట్టణంలోని కోనేరుపేట సమీపంలో వక్ఫ్బోర్డుకు చెందిన 2.50 ఎకరాల స్థలం ఉంది. ఈ స్థలాన్ని ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయాలని ప్రయత్నించవచ్చని, దానిని ఎవరికీ రిజిస్ట్రేషన్ చేయవద్దని వక్ఫ్ బోర్డు ఉన్నతాధికారులు 2016లో రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీకి లేఖ రాసింది. దీంతో ఆ సర్వే నంబర్లోని 138 ఎకరాల మొత్తం విస్తీర్ణంలోని స్థలాలన్నింటినీ రిజిస్ట్రేషన్ చేయడం నిలిపివేశారు. మాజీ ఎమ్మెల్యే అప్పారావు చొరవతో.. రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు అప్పట్లోనే వక్ఫ్బోర్డు సీఈఓతో మాట్లాడి వారి తాలూకా భూమికి సబ్డివిజన్ చేయించమని తహసీల్దార్కు లేఖ పెట్టించారు. దీంతో రెవెన్యూ అధికారులు సబ్ డివిజన్ చేసి వక్ఫ్బోర్డు భూమికి సర్వే నంబర్ 450/7గా ఇచ్చి అందులో 79 సెంట్లు భూమి ఉన్నట్టు ఉత్తర్వులను తిరిగి పంపారు. ఇది జరిగి ఏడున్నరేళ్లు గడిచినా ఇప్పటికీ చలనం లేదు. భూములను రిజిస్ట్రేషన్ చేయాలని ఓ న్యాయవాది హైకోర్టుకు కూడా వెళ్లారు. ఇప్పటికై నా రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి పట్టించుకుని సమస్యను పరిష్కరించాలని పట్టణవాసులు కోరుతున్నారు. -
శ్రీవారి క్షేత్రం.. భక్తజన సంద్రం
ద్వారకాతిరుమల: చినవెంకన్న దర్శనంతో భక్తజన మది పులకించింది. శ్రీవారికి ప్రీతికరమైన రోజు కావడంతో శనివారం వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. అలాగే దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ కనక దుర్గమ్మను దర్శిస్తున్న వివిధ ప్రాంతాలకు చెందిన భవానీ దీక్షాదారులు, తిరుగు ప్రయాణంలో పెద్ద ఎత్తున ఈ క్షేత్రానికి విచ్చేశారు. దాంతో కొండపైన, ఆలయ పరిసరాలు కళకళలాడాయి. మొక్కుబడులు చెల్లించే భక్తులతో కల్యాణకట్ట ప్రాంతం నిండిపోయింది. దర్శనం క్యూలైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో కిక్కిరిశాయి. స్వామి దర్శనం తరువాత ఉచిత ప్రసాదాన్ని స్వీకరించిన భక్తులు, ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతంలోకి చేరుకుని సెల్ఫీలు, ఫొటోలు దిగి సందడి చేశారు. అనివేటి మండపంలో పలు భజన మండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట నత్యాలు చూపరులను అలరించాయి. సాయంత్రం వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. -
తణుకులో భారీ చోరీ
వృద్ధురాలిని భయపెట్టి 70 కాసుల బంగారు ఆభరణాల అపహరణ తణుకు అర్బన్: ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలి ఇంట్లోకి చొరబడి బంగారు ఆభరణాలు దోచుకున్న ఘటన తణుకులో సంచలనం రేకెత్తించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తణుకు లయన్స్ క్లబ్ ప్రాంతంలోని వారణాసి వారి వీధిలో నివసిస్తున్న వాకలపూడి కనకదుర్గ ఇంట్లోకి శుక్రవారం రాత్రి సుమారు 2 గంటల సమయంలో ప్రవేశించిన దొంగలు సుమారుగా 70 కాసుల బంగారు ఆభరణాలు, రూ.70 వేలు నగదు దోచుకున్నారు. నోరెత్తితే చంపేస్తామని బెదిరించిన దొంగలను చూసి హడలెత్తిపోయిన వృద్ధురాలు వారికి సహకరించాల్సిన దుస్థితి నెలకొంది. వృద్ధురాలి భర్త మాజీ కౌన్సిలర్ వాకలపూడి వీరరాఘవులు గతంలోనే మృతిచెందగా కుమారులు ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇంట్లో ఎవరూ లేరనే పక్కా సమాచారంతో ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు వృద్ధురాలిని భయబ్రాంతులకు గురిచేసి అందినకాడికి దోచుకుపోయారు. ఇంటి వెనుక భాగం నుంచి లోపలకు దొంగలు వచ్చారని చోరీలో నలుగురు దుండగులు ఉన్నట్లుగా బాధితవర్గాలు చెబుతున్నారు. తెల్లవారుజామున పోలీసులకు బాధితురాలు సమాచారం ఇవ్వడంతో తాడేపల్లిగూడెం డీఎస్పీ డి.విశ్వనాథ్ హుటాహుటిన వచ్చి ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. తణుకు పట్టణ సీఐ ఎన్.కొండయ్యకు కేసు దర్యాప్తుపై పలు సూచనలు చేశారు. -
కార్యకర్తలకు అండగా డిజిటల్ బుక్
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ ఏలూరు టౌన్: వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలకు అండగా పార్టీ అధ్యక్షుడు డిజిటల్ బుక్ను అందుబాటులోకి తెచ్చారని, అన్యాయం జరిగిన ప్రతి కార్యకర్తకూ న్యాయం చేసే బాధ్యత తీసుకుంటారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు అన్నారు. ఏలూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్తో కూడిన ప్లకార్డులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్సీపీ పాలనలో ప్రజలకు మేలు చేయటమే లక్ష్యంగా పనిచేశారనీ, మరోసారి మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలతో పాటు పార్టీ కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని జగన్మోహన్రెడ్డి చెప్పారన్నారు. కూటమి పాలనలో అన్యాయంగా కేసులు కూటమి పాలనలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేయటం, అక్రమ కేసులతో జైళ్లకు పంపటం, పోలీస్స్టేషన్ల చుట్టూ తిప్పటం, వేధింపులకు గురిచేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారనీ డీఎన్నార్ అన్నారు. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు సరైన రీతిలో న్యాయం చేసేలా డిజిటల్ బుక్ రూపొందించారని చెప్పారు. ఈ డిజిటల్ బుక్ పోర్టల్లో ఫొటోలు, ఆధారాలు అప్లోడ్ చేసేందుకు అవకాశం ఉందన్నారు. దీనిలో ఐవీఆర్ఎస్ నంబర్ 040–49171718కి కాల్ చేసి ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు. ఈ డిజిటల్ బుక్ పోర్టల్పై ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించాలనీ, ముఖ్యంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలు దీనిని వినియోగించుకోవాలని సూచించారు. చింతలపూడి సమన్వయకర్త కంభం విజయరాజు, ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారంటే నూరు శాతం చేసి చూపిస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు, రాజకీయ పార్టీల అధినేతలకు సైతం జగన్ పట్టుదల, కార్యదీక్ష బాగా తెలుసనీ అన్నారు. కూటమి ప్రభుత్వంలోని అధికారులు, పార్టీల నాయకులు ఇష్టారాజ్యంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. తప్పు చేసిన నేతలు, అధికారులను చట్టం ముందు నిలబెట్టి జగన్మోహన్రెడ్డి బాధితులకు న్యాయం చేస్తారని తెలిపారు. ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్బాబు, జిల్లా మహిళా అధ్యక్షురాలు కేసరి సరితారెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్గురునాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి లంకలపల్లి గణేష్, వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఘంటా మోహనరావు, నగర మహిళా అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు చిలకపాటి డింపుల్, క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు జేవియర్ మాస్టర్, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కిలారపు బుజ్జి, బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లిపాక సురేష్, జిల్లా కార్యదర్శి తులసీ, యువజన విభాగం అధ్యక్షుడు ఘంటా సాయి ప్రదీప్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు పాతినవలస రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
నీట మునిగి కుళ్లుతున్న వరి
ఆకివీడు: ఖరీఫ్ పంట సాగుకు మళ్లీ ముంపు బెడద తప్పడంలేదు. ఇటీవల కురిసిన వర్షానికి పలు గ్రామాల్లోని పల్లపు ప్రాంతాల్లోని పంట నీట మునిగింది. కొల్లేరు తీరంలోనూ, ఉప్పుటేరు, వెంకయ్య వయ్యేరు పంట కాల్వకు చేర్చి, చినకాపవరం డ్రెయిన్ ప్రాంత ఆయుకట్టు ముంపునకు గురవుతోంది. మండలంలో అధికారిక లెక్కల ప్రకారం 250 ఎకరాల్లో పంట పూర్తిగా నీట మునిగి పనికిరాకుండా పోయింది. మరి కొన్ని ఎకరాల్లో పంట నీట మునిగి ఉంది. గోదావరి వరద, ఎర్రకాలువ, తమ్మిలేరు, బుడమేరు పొంగడంతో ఈ ప్రాంతానికి ఏ క్షణంలోనైనా వరద వచ్చే ప్రమాదం ఉందని రైతులు, చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఉప్పుటేరు గుండా ముంపు నీరు భారీగా సముద్రంలోకి చొచ్చుకుపోతోంది. ఉప్పుటేరులో రైల్వే ఖానాల వద్ద, బైపాస్ వంతెన నిర్మాణం వద్ద మేటలు వేయడంతో నీటి ప్రవాహానికి కొంత ఇబ్బంది కరంగా ఉంది. ముంపు తీవ్రత అధికంగా ఉంటే మండలంలోని పలు గ్రామాల్లో వరి పంట నీట మునిగే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. -
రసాయన మందుల పిచికారీలో జాగ్రత్తలు
నూజివీడు: పంటలకు ఆశించే తెగుళ్ల నివారణకు రైతులు పురుగుమందులు వాడతారు. రసాయన మందులు విషపూరితమైనవి కావడం వల్ల వీటిని పంటలకు పిచికారీ చేసేటపుడు జాగ్రత్తలు పాటించాలి. వరి, మొక్కజొన్న, మినుము, పెసర, కూరగాయలు తదితర పంటలకు క్రిమిసంహారక మందులను పిచికారీ చేసేటప్పుడు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణపాయం సంభవించే ప్రమాదం ఉంది. అలాగే మామిడి సీజన్లో రైతులు పూత రావడం దగ్గర నుంచి పిందె దశ వరకు విడతలు వారీగా రసాయన మందులను పిచికారీ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో పురుగుమందులను పిచికారీ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వ్యవసాయాధికారి పలగాని చెన్నారావు పలు సూచనలు చేశారు. పాటించాల్సిన జాగ్రత్తలు ● పురుగుమందులను పిచికారీ చేసేటప్పుడు వ్యక్తి ముఖానికి మందంగా ఉండే కండువా లేదా మాస్క్ను ధరించాలి. ● చేతులకు గ్లౌజ్, కాళ్లకు పొడవాటి దళసరి బూట్లు వేసుకోవాలి. నిండుగా దుస్తులు ధరించాలి. ● పురుగు మందులను పిచికారీ చేసిన తరువాత మందు డబ్బాలను భూమిలో పాతిపెట్టాలి. చేతులను శుభ్రంగా రెండుసార్లు సబ్బుతో కడుక్కోవాలి. ● ఏ పంటకు ఎంత మోతాదులో పిచికారీ చేయాలో సంబంధిత అధికారులను గానీ, శాస్త్రవేత్తలను గానీ అడిగి తెలుసుకోవాలి. ● కళ్లు మంట పుట్టడం, దురద పుట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నా నిర్లక్ష్యం వహించకుండా వైద్యుడిని సంప్రదించాలి. ● పురుగుమందుని నీటితో కలిపేటప్పుడు చేతిని కాకుండా కర్రను ఉపయోగించి కలపాలి ● పురుగు మందు డబ్బాల మూతను నోటితో తీయకూడదు. ● మందును పిచికారీ చేసిన చేతులతో బీడీ, సిగరెట్, చుట్ట తాగకూడదు. ● పురుగు మందులను మధ్యాహ్న సమయంలో పిచికారీ చేయకూడదు. ● గాలికి ఎదురుగా పురుగు మందులను పిచికారీ చేయకూడదు. అలా చేయడం వల్ల మందు మొక్కలపై పడకుండా పిచికారీ చేసే వ్యక్తిపైనే పడుతుంది. ● ఒకే వ్యక్తి ఎక్కువ విస్తీర్ణానికి మందులను పిచికారీ చేయకూడదు. ● పురుగు మందులను వేర్వేరుగానే పిచికారీ చేయాలి. ఒక పురుగు మందుని, కలుపు మందుతో కలపకూడదు. తెగులు మందుని, కలుపు మందుని కలపకూడదు. ● పురుగు మందులు శరీరంలోకి స్పర్శ, శ్వాస లేదా నోటి ద్వారా ప్రవేశించే ప్రమాదం ఉంది. ● పురుగు మందులను పిచికారీ చేసేటప్పుడు పురుగుమందు ప్యాకెట్పైన, పాంప్లెట్పైన ముద్రించిన సూచనలను చదివి పాటించాలి. పాడి–పంట -
ఉద్యోగుల సమస్యలు పట్టని ప్రభుత్వం
ఏలూరు (మెట్రో): రాష్ట్రంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై కూటమి సర్కారు స్పందించాలని రెవెన్యూ అసోసియేషన్ నాయకులు అన్నారు. శనివారం స్థానిక రెవెన్యూ అసోసియేషన్లో దివంగత నాయకులు తోట సుధాకర ప్రసాద్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు పీఆర్సీ కమిషన్ వేసి తక్షణమే బకాయిలు చెల్లించాలని, ఒక్క డీఏని కూడా విడుదల చేయకపోవడం చూస్తుంటే ఉద్యోగులపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతోందన్నారు. ఉద్యోగుల సమస్యలపై స్పందించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. రాష్ట్రంలో రెవెన్యూ ఉద్యోగులు అసోసియేషన్ కోసం పాటుపడిన తోట సుధాకర ప్రసాద్ను ఉద్యోగులు స్మరించుకోవాలన్నారు. ప్రజాసేవకు అంకితం కావాలన్నారు. తహసీల్దార్లు రెవెన్యూ ఉద్యోగులందరితో కలిసి ఒక జట్టుగా ఉండాలన్నారు. అధికారులు టీసీలు, వీడి యో కాన్ఫరెన్స్లు వారం అంతా పెట్టకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం సరిపడా సిబ్బందిని, శిక్షణ, నిధులు, సమయం ఇస్తే ఇప్పటికన్నా మెరుగైన, వేగవంతమైన, పారదర్శకమైన పాలనను ప్రజలకు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు కె.రమేష్కుమార్, కార్యదర్శి ప్రమోద్కుమార్, ఆర్.వెంకటరాజేష్, రవిచంద్ర, స్వామి, రాజారత్నకుమార్, తోట కామాక్షి, సుధాకర ప్రసాద్ పాల్గొన్నారు. -
నిందితులు పాత నేరస్తులేనా?
చోరీకి గురైన నివాసంలో దొరికిన ఆనవాళ్లతోపాటు సమీపంలోని సీసీ కెమేరాల పుటేజీల ప్రకారం నిందితులను పోలీసు అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. భీమవరం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి నిందితుడి ఫొటోతోపాటు వారి వివరాలు విడుదల చేశారు. పాత నేరస్తుడైన ఉత్తరప్రదేశ్కు చెందిన నాగేంద్ర సహాని, మహారాష్ట్రకు చెందిన సందీప్ మీరా రామ్ నేరానికి పాల్పడ్డారని, వీరు తెలుపు రంగు కారులో వచ్చి చోరీ సొత్తుతో అదే కారులో ఉడాయించారని వివరించారు. సదరు దొంగలకు సంబంధించిన వివరాలు తెలిస్తే సమాచారం ఇవ్వాల్సిందిగా పోలీసులు కోరుతున్నారు. సీఐ కొండయ్య కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు విడుదల చేసిన నిందితుడి ఫొటో -
ట్రిపుల్ ఐటీలకు నేటినుంచి దసరా సెలవులు
నూజివీడు: రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు ఈనెల 28 నుంచి అక్టోబర్ 5 వరకు యాజమాన్యం దసరా సెలవులను ప్రకటించింది. అక్టోబర్ 6 నుంచి తరగతులు పునఃప్రారంభమవుతాయని పేర్కొంది. దీంతో నూజివీడు ట్రిపుల్ ఐటీ నుంచి విద్యార్థులు శనివారం నుంచే ఇళ్లకు బయలుదేరి వెళ్లారు. విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ నూజివీడు డిపో అధికారులు ట్రిపుల్ ఐటీ నుంచి 41 బస్సులను ఏర్పాటు చేసి దూర ప్రాంతాల విద్యార్థులను వారి గమ్యస్థానాలకు చేర్చారు. కొందరు విద్యార్థులు సమీపంలోని విజయవాడ, హనుమాన్ జంక్షన్లలో గల రైల్వేస్టేషన్లకు చేరుకొని ఇళ్లకు వెళ్తున్నారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ సరికాదు
ఏలూరు టౌన్: కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని నాలుగు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను తొలివిడతలో పీపీపీ పద్ధతిలో నిర్వహించేలా టెండర్లకు నోటిఫికేషన్ జారీ చేయటం సరికాదని, దీనిపై పునరాలోచన చేయాలని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆల్తి శ్రీనివాస్ అన్నారు. శనివారం వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో డీఆర్వో విశ్వేశ్వరరావుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో ప్రజలు తీవ్రంగా నష్టపోతారనీ, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుకు అప్పగించటం సరికాదన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్మించి, ప్రారంభించారని గుర్తుచేశారు. ఆయా కాలేజీల్లో 2023–24లో ఎంబీబీఎస్ తరగతులు కూడా ప్రారంభమయ్యాయన్నారు. ఒక్కో కళాశాలలో 450 మంది వైద్య విద్య అభ్యసిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు తన 15 ఏళ్ల ముఖ్యమంత్రి ప్రస్థానంలో ఏనాడైనా ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని అయినా తీసుకువచ్చారా అని ప్రశ్నించారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం లేదన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం కాకుండా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి, న్యాయవాది మున్నుల జాన్గురునాథ్, ఉంగుటూరు నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షుడు నిమ్మల రాము, దెందులూరు నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షుడు యర్రా సురేష్, జిల్లా లీగల్ సెల్ సభ్యులు కడిమి మోహనచంద్ర తదితరులు ఉన్నారు. -
అభయాంజనేయస్వామి సన్నిధిలో హైకోర్టు జడ్జి
పెదపాడు: అప్పనవీడులోని అభయాంజనేయ స్వామిని హైకోర్టు జడ్జి టి.మల్లికార్జునరావు దంపతులు శనివారం దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. తొలుత అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. రాట్నాలమ్మ సన్నిధిలో.. పెదవేగి: హైకోర్టు జడ్జి టి.మల్లికార్జునరావు దంపతులు రాట్నాలకుంటలోని రాట్నాలమ్మవారిని దర్శించుకుని పూజలు చేయించారు. చింతలపూడి: జిల్లాతో పాటు ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షాలకు తమ్మిలేరు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. శనివారం అధికారులు 403 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నీటిమట్టం ప్రస్తుతం 347.62 అడుగులకు, గోనెల వాగు బేసిన్ 347.42 అడుగులకు చేరుకుందని తమ్మిలేరు ఇరిగేషన్ ఏఈ లాజరుబాబు తెలిపారు. ప్రాజెక్టు సామర్థ్యం 3 టీఎంసీలు కాగా 0.655 టీఎంసీలకు, గోనెల వాగు బేసిన్ 1.105 టీఎంసీలకు చేరుకున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి అలుగుపై నుంచి నీరు ప్రవహిస్తుండటంతో గంటకు 403 క్యూసెక్కుల నీరు ఆంధ్రా కాల్వ ద్వారా ప్రాజెక్టులోకి వస్తోందన్నారు. ప్రాజెక్టులో 350 అడుగుల వరకు నీటిని నిల్వ చేసుకోవచ్చని డీఈ తెలిపారు. బుట్టాయగూడెం: కేఆర్పురం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఖాళీగా ఉన్న సహాయ ఉపాధ్యాయుల పోస్టులను పదోన్నతి ద్వారా భర్తీ చేయడానికి ఎస్జీటీల తాత్కాలిక సీనియార్టీ జాబితాను విడుదల చేసినట్టు డీడీ ఎన్.శ్రీవిద్య శనివారం ప్రకటనలో తెలిపారు. జాబితాపై అభ్యంతరాలు ఉంటే అక్టోబర్ 3లోపు తెలపాలని అన్నారు. తదుపరి వచ్చిన అభ్యంతరాలు స్వీకరించమని, అభ్యంతరాలను పరిశీలించి తుది జాబితా ప్రకటించి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. నూజివీడు: ఆర్జీయూకేటీ అధికారులు నూజివీడు ట్రిపుల్ఐటీలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో పలు సంస్థలతో రెండు అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఫిజిక్స్ వాలా లిమిటెడ్తో ఒప్పందం మేరకు నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ఐటీల విద్యార్థులకు 14 కోర్సులను ఉచితంగా అందుబాటులోకి తీసుకువస్తారు. వీటిలో వీటిలో గేట్, క్యాట్లతో పాటు ప్రొ ఫెషనల్ సర్టిఫికేషన్ ప్రోగ్రాంలు, సెమినార్లు, వెబి నార్లు, మాక్ పరీక్షలు, మెంటార్ షిప్ ఉంటాయి. అలాగే కౌన్సిల్ ఫర్ స్కిల్ అండ్ కాంపెటెన్సీస్తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దీని ద్వారా పారిశ్రామిక అనుభవం, ఇంటర్న్షిప్లు, నిపుణుల ఉపన్యాసాలు, వ్యాపార శిక్షణ, వర్చువల్ లెర్నింగ్ అవకాశాల ద్వారా విద్యార్థుల శిక్షణను మెరుగుపరుస్తా రు. రిజిస్ట్రార్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్, సీఏఓ బండి ప్రసాద్, సెంట్రల్ డీన్ దువ్వూరు శ్రావణి తదితరులు పాల్గొన్నారు. -
జూనోటిక్ వ్యాధుల రక్షణ ఇలా..
జంగారెడ్డిగూడెం: రేబిస్ అనేది ఒక ప్రాణాంతక జూనోటిక్ వ్యాధి. అంటే ఇది జంతువుల నుంచి మనుషులకు సంక్రమిస్తుంది. ముఖ్యంగా కుక్కలు, పిల్లుల్లో రేబిస్ వైరస్ కారణమవుతుంది. ఈ వ్యాధి ఎన్సెఫాలైటిస్ (గుర్తింపు లోపం), మానసిక స్థితి మార్పులకు దారితీస్తుంది. ఇది చివరకు ప్రాణాంతకం అవుతుంది. సెప్టెంబర్ 28న ప్రపంచ రేబిస్ దినోత్సవం సందర్భంగా రేబీస్ వ్యాప్తి, నివారణ చర్యలపై కథనం. రేబిస్ వ్యాధి వ్యాప్తి ● రేబిస్ వ్యాధి ప్రధానంగా వైరస్ సోకిన జంతువుల గోరు, దంతాలు లేదా ముక్కు ద్వారా వ్యాపిస్తుంది. ● కుక్కలు, పిల్లులు లేదా ఇతర రేబిస్–సోకిన వన్య జంతువులు కరిచినప్పుడు రేబిస్ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ● రక్తంలోకి రేబిస్ వైరస్ ప్రవేశించి, నాడీ వ్యవస్థ ద్వారా మెదడుకు చేరి తీవ్ర నాడీ సంబంధిత రుగ్మతలను కలిగిస్తుంది. ఇతర పశువుల్లో... ● మేత తినకపోవడం, డిప్రెషన్, డల్నెస్, కనుపాప పెద్దదవడం, కళ్లు వెంబడి నీరు కారడం, చొంగ, కదలికలో మార్పు, నడవలేకపోవడం, పక్షవాతం, చిక్కిపోవడం, మరణాలు సంభవిస్తాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ● కుక్క కాటు లేదా గాయానికి వెంటనే నీటితో, సబ్బుతో శుభ్రంగా కడగాలి. ● యాంటీసెప్టిక్ లేదా ఆల్కహాల్ ఉపయోగించి కాటు ప్రాంతాన్ని శుభ్రపరచాలి. ● కాటు లేదా గాయానికి వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. రేబిస్ వ్యాధి గురించి ఖచ్చితమైన నిర్ధారణ కోసం వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలి. ● రేబిస్ వ్యాధి సోకిన గాయాల తర్వాత వెంటనే పీఈపీ (పోస్ట్ ఎక్స్పోజర్ ప్రోపీలాక్సిస్) టీకాలు ఇవ్వడం ద్వారా రక్షణ పొందవచ్చు. ● ఒకసారి కాటు గాయం జరిగిన తర్వాత 0వ రోజు, 3వ రోజు, 7వ రోజు, 14వ రోజు, 28వ రోజు టీకాలు వేయించాలి. ● రేబిస్ వ్యాధి సోకకుండా ముందస్తు రక్షణ కోసం ప్రీ ఎక్స్పోజర్ వ్యాక్సిన్ వేయించుకోవడం ఉత్తమం. ముఖ్యంగా జంతువులతో ఎక్కువగా పని చేసే వాళ్లకు అత్యవసరం. పెంపుడు జంతువులకు చేయవలసిన చర్యలు ● పెంపుడు కుక్కలు, పిల్లులకు రేబిస్ వ్యాధికి వ్యతిరేకంగా టీకాలు వేయించడం అత్యంత అవసరం. ● చిన్న వయస్సులోనే (తొలకరి నెల) రేబిస్ టీకా మొదలవుతుంది. తరువాత ప్రతి సంవత్సరం టీకాలు వేయించాలి. ● జంతువులకు బాహ్య, అంతర్గత పరాన్నజీవాలను నివారించడానికి యాంటీ–పరాన్నజీవా మందులు ఇవ్వాలి. ● కీటకాలు, ఫ్లీస్, టిక్స్ వంటి జీవులను పర్యవేక్షించాలి. వ్యాధి లక్షణాలు 14 రోజుల నుంచి ఏడాదిలోపు బయటపడతాయి. ఇది కుక్క కరిచిన ప్రదేశాన్ని బట్టి ఉంటుంది. మనుషులలో వ్యాధి లక్షణాలు రెండు రకాలుగా ఉంటాయి. అవి ప్యారలైటిక్, హైడ్రో ఫోబియా. 80 శాతం కేసుల్లో హైడ్రోఫోబియా లక్షణాలు ఉంటాయి. వీటిలో మనుషులు నీటిని చూసి భయపడటం, కరిచిన చోట జిలగా ఉండటం, గట్టిగా గాలివీచినా, వెలుగు పడినా భయపడుతుండటం కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే 3 నుంచి 5 రోజులు మాత్రమే జీవిస్తారు. ఫ్యారలైటిక్ఫాంలో నీటిని చూసి భయపడటం ఉండదు. గొంతు పడిపోవడం, పక్షవాతం లక్షణాలు కనిపిస్తాయి. ఇక కుక్కల్లో ప్యూరియన్ ఫాం, డంబ్ ఫాం లక్షణాలు ఉంటాయి. ప్యూరియస్ ఫాంలో మేత తినకపోవడం, జ్వరంతో బాధపడటం, పరివర్తనలో మార్పు రావడం, చీకటిలో దాగడం, పరుగులు తీయడం, మనుషులను కరవడానికి ప్రయత్నించడం, వస్తువులను కరవడం, అరుపులో మార్పులు రావడం, చొంగలు కార్చడం, ఏ వస్తువునంటే వాటిని తీసుకుని నోట్లో పెట్టుకోవడం, కదలికలో తేడాలు, కాళ్లకు పక్షవాతం, మరణాలు సంభవిస్తాయి. డంబ్ఫాంలో దవడ కిందకు జారడం, పక్షవాతం, కోమా, మరణం 10 రోజుల లోపు సంభవిస్తుంది. రేబిస్ అనేది ప్రాణాంతకమైన వ్యాధి. కుక్కలు, పిల్లుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం, టీకాలు వేయించడం చాలా ముఖ్యం. కాటు సంభవించినప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించి రేబిస్ వ్యాధి వ్యాప్తిని నిరోధించడం చాలా అవసరం. – బీఆర్ శ్రీనివాసన్, పశువైద్యాధికారి -
ఆది కర్మయోగి అమలుకు కృషి
తణుకులో భారీ చోరీ ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలి ఇంట్లోకి చొరబడి బంగారు ఆభరణాలు దోచుకున్న ఘటన తణుకులో సంచలనం రేకెత్తించింది. IIలో uబుట్టాయగూడెం: జిల్లాలోని 46 గిరిజన గ్రామాల్లో ఆది కర్మయోగి పథకాన్ని అమలు చేసేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నట్టు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. రాజానగరంలోని ఆది సేవా కేంద్రంలో శనివారం ఆది కర్మయోగి అభియాన్ పథకం అమలుపై సమీక్షించారు. మండలాల వారీగా బుట్టాయగూడెంలో 19, పోలవరంలో 5, జీలుగుమిల్లిలో 5, కుక్కునూరులో 2, వేలేరుపాడులో 9, టి. నర్సాపురంలో 1, చాట్రాయిలో 1, నూజివీడులో 2, చింతలపూడిలో 2 మొత్తం 46 గ్రామాల్లో ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలను భాగస్వామ్యం చేస్తామన్నారు. ఐటీడీఏ పీఓ కె.రాములు నాయక్, ఆర్డీఓ ఎంవీ రమణ, ఐటీడీఏ డీడీ ఎన్.శ్రీవిద్య పాల్గొన్నారు. -
పండగ వేళా పస్తులే!
ఏలూరు (ఆర్ఆర్పేట): సమగ్ర శిక్షా అభియాన్లో ఏళ్ల తరబడి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులు కూటమి ప్రభుత్వం నిర్వాకంతో ఆకలితో అలమటిస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నా జీతాలు సక్రమంగా రాక కుటుంబంతో సహా పస్తులు ఉండాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆగస్టు నెల జీతాలు ఇప్పటికీ వారి బ్యాంకు ఖాతాల్లో పడలేదు. అలాగే సెప్టెంబర్ నెల జీతాల విడుదలపై కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టత రాకపోవడంతో వీరు దసరా పండగ వేళ కూడా ప్రభుత్వం తమను పస్తులు పెడుతుందా అనే ఆవేదన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 1,000 మంది.. సమగ్ర శిక్షాలో ఆర్ట్, క్రాఫ్ట్, పీఈటీ వంటి పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్, ఎంఐఎస్ కో–ఆర్డినేటర్లు, క్లస్టర్ రీసోర్స్ పర్సన్లు, పీఈటీలు, ఫిజియోథెరపిస్టులు, సైట్ ఇంజనీర్లు, మెసెంజర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, డ్రైవ ర్లు వంటి అన్ని వర్గాలకు చెందిన కాంట్రాక్టు ఉద్యోగులు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 1,000 మంది ఉన్నారు. వీరందరికీ కలిపి ఒక నెల వేతనం సుమారుగా రూ.7 కోట్లు ఉంటుంది. ఆగస్టు నెల జీతాలు ఇప్పటికీ విడుదల చేయకపోవడం, సెప్టెంబర్ నెల జీతాలపై స్పష్టత ఇవ్వకపోవడం వీరిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. మినిట్స్ అమలుకు డిమాండ్ : తమ డిమాండ్ల సాధన కోసం సమగ్ర శిక్ష ఉద్యోగులు గత ప్రభుత్వ హయాంలో దాదాపు 21 రోజులు సమ్మె చేశారు. ఆ సమయంలో ప్రభుత్వం వీరిని చర్చలకు పిలిచి వీరి డిమాండ్లను పరిష్కరించడానికి సానుకూలంగా స్పందించింది. ప్రభుత్వ ప్రతినిధులు, సమగ్ర శిక్ష రాష్ట్ర ఉన్నతాధికారులు వీరితో చర్చించి మినిట్స్ రూపొందించారు. దాని ప్రకారం వారి గౌరవ వేతనాన్ని 23 శాతం పెంచడానికి అంగీకరించి ఆ మేరకు పెంచిన వేతనాలను అమలు చేసింది. అయితే హెచ్ఆర్ పాలసీ అమలుకు, మినిమమ్ టైమ్ స్కేల్ వర్తింప జేయడానికి గల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయడానికి, పీఎఫ్ అమలు చేయడానికి, జాబ్ చార్ట్ తయారు చేయడానికి, సమగ్ర శిక్షా ఉద్యోగ నియామకాల్లో వీరికి వెయిటేజీ ఇవ్వడానికి, గత అవకాశాలను పరిశీలించడానికి కమిటీలు వేయడానికి అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈలోపు ఎన్నికలు రావడంతో ఆ మినిట్స్ అమలు కాలేదు. ఎన్నికల సమయంలో చంద్రబాబు, లోకేష్ వీరి డిమాండ్లు సమంజసమైనవేనని వాటిని తమ ప్రభుత్వం వచ్చి న తరువాత తప్పకుండా పరిష్కరిస్తామని స్పష్టమైన హామీని కూడా ఇచ్చినట్టు సమగ్ర శిక్షా కాంట్రాక్ట్ ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వం ఆమోదించిన మినిట్స్ను అమలు చేయాలని అప్పట్లో నారా లోకేష్ తన ట్విట్టర్ అకౌంట్లో సైతం ట్వీట్ చేసి సమగ్రశిక్ష ఉద్యోగులను ఆకర్షించారు. ఇదిలా ఉండగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా ఇప్పటివరకూ తమ సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం చొరవ తీసుకోకపోవడం దారుణమని సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాలు రాక సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల ఆకలి కేకలు ఎన్నికల్లో హామీ ఇచ్చిన మినిట్స్ అమలు చేయాలని డిమాండ్ ఆగస్టు నెల జీతం బకాయి సుమారు రూ.7 కోట్లు ఉమ్మడి జిల్లాలో సుమారు వెయ్యి మంది కాంట్రాక్టు ఉద్యోగులు గత ప్రభుత్వం ఆమోదించిన మినిట్స్ తాము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకూ ఆయన స్పందించకపోవడం దారుణం. అక్టోబర్ 12లోపు మా డిమాండ్లు పరిష్కరించకపోతే విజయవాడలో జరిగే ఆవిర్భావ సభలో సమ్మెకు కార్యాచరణ రూపొందిస్తాం. – వాసా శ్రీనివాసరావు, సమగ్ర శిక్షా ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ సమగ్ర శిక్షాలో పని చేస్తున్న అన్ని విభాగాల కాంట్రాక్టు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. మా పని వేళలు, బాధ్యతలకు సంబంధించి స్పష్టత లేకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. కచ్చితమైన జాబ్ చార్ట్, పని సమయాలపై మార్గదర్శకాలు జారీ చేయాలి. హెచ్ఆర్ పాలసీ, పీఎఫ్ వర్తింపజేయాలి. – వినోద్, సమగ్ర శిక్షా ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు -
నేవీ డిపోతో ఆదివాసీలకు ఇక్కట్లు
ఏలూరు (టూటౌన్): ఏజెన్సీ ప్రాంతంలో ప్రాజెక్టులు, ఫ్యాక్టరీల వల్ల ఆదివాసీలకు ఇక్కట్లు తప్ప వని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, సీపీఎంఎల్ (న్యూడెమోక్రసీ) జిల్లా నాయకులు ఎస్.రామ్మోహన్ మండిపడ్డారు. శనివారం స్థానిక అన్నే వెంకటేశ్వరరావు భవనంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నేవీ ఆయుధ డిపోకు వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. జీలుగుమిల్లి మండలం వంకవారిగూడెంలో నిర్మించ తలపెట్టిన నేవీ ఆయుధ డిపోని వెంటనే ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. దీని వల్ల ఐదు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడతారని, ఏడాదికి రెండు పంటలు పండుతున్న భూములను సేకరించడం దుర్మార్గమన్నారు. జిల్లాలోని కొద్దిపాటి ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన చట్టాలను కాలరాస్తున్నారన్నారు. పీసా గ్రామసభల ద్వారా ప్రజలంతా ఏకగ్రీవంగా తిరస్కరించిన ఆయుధ డిపోకు తక్షణం భూసేకరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఏకగ్రీవంగా తిరస్కరించిన నావికా ఆయుధ డిపోకు తక్షణమే భూసేకరణ నిలిపివేయాలని కోరారు. ఏపీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తెల్లం దుర్గారావు, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా నాయకులు కారం దారయ్య, రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు ఈ.భూషణం అధ్యక్షత వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
బాలకృష్ణది కొవ్వెక్కిన భాష
●అసెంబ్లీ సాక్షిగా చిరంజీవికి క్షమాపణ చెప్పాలి ●జనసేన అధికార ప్రతినిధి సజ్జా సుబ్బు తాడేపల్లిగూడెం: బాలకృష్ణ చిరంజీవిని వాడు వీడు అని మాట్లాడటం ఎంత కొవ్వెక్కిన భాష.. ఈ విషయంలో బాలకృష్ణ చిరంజీవికి అసెంబ్లీ సాక్షిగా బేషరతుగా క్షమాపణ చెప్పాలి.. అంటూ జనసేన అధికార ప్రతినిధి సజ్జా సుబ్బు డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో బాలకృష్ణ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రజలంతా చూస్తున్న రికార్డెడ్ ప్రోగ్రాంలో బాలకృష్ణ ఇలా మాట్లాడటం సరికాదన్నారు. బాలకృష్ణ అసలు చిరంజీవి గురించి ప్రస్తావించకూడదన్నారు. కొవ్వెక్కిన భాషను బాలకృష్ణ వాడారన్నారు. జనసేన పార్టీ కూటమిలో ఉన్నందున చిరంజీవి వేరు, పవన్ వేరని బాలకృష్ణ అనుకుంటున్నట్టున్నారని చెప్పారు. చిరంజీవి గురించి బాలకృష్ణ అవాకులు, చవాకులు పేలితే ఆయన అసలు అసెంబ్లీకి రాకపోదురేమో అనిపిస్తోందన్నారు. ఈ విషయంలో జనసేన చాలా సీరియస్గా ఉందన్నారు. బాలకృష్ణ అసెంబ్లీ సాక్షిగా చిరంజీవిపై చేసిన వ్యాఖ్యల విషయంలో క్షమాపణ చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు. ఉండి: కమ్యూనిటీ సైన్స్ (హోం సైన్స్) కోర్సులో ప్రవేశానికి ఈనెల 30వ తేదీ వరకు మాత్రమే గడువు ఉందని ఎన్నార్పీ అగ్రహారం కృషీ విజ్ఞాన కేంద్రం హోంసైన్స్ శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ దెబోరా మెస్సియానా ఒక ప్రకటనలో తెలిపారు. నాలుగేళ్ల కాలపరిమితి గల ఈ డిగ్రీ కోర్సును బీఎస్సీ ఆనర్స్గా పిలుస్తున్నారని, ఇందులో చేరేందుకు ఇంటర్ బైపీసీ, ఎంపీసీ ఉత్తీర్ణులైన విద్యార్థులు, 3 ఏళ్ల హోంసైన్స్, అగ్రికల్చర్ డిప్లమో గ్రూపులో పాసైన విద్యార్థులు అర్హులన్నారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కమ్యూనిటీ సైన్స్ కోర్సులో చేరి విద్యార్థులు తమ భవిష్యత్ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. అభ్యర్థులు ఏఎన్జీఆర్ఏయూ.ఏసీ.ఇన్ అనే వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ద్వారకాతిరుమల: దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ద్వారకాతిరుమల చినవెంకన్న దేవస్థానం అధికారులు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు శనివారం పట్టు వస్త్రాలను సమర్పించారు. ముందుగా శ్రీవారి దేవస్థానం ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి దంపతులు, అలాగే ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్వీఎన్ఎన్ నివృతరావు దంపతులు అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణల నడుమ పట్టు వస్త్రాలతో దుర్గమ్మ సన్నిధికి చేరుకున్నారు. అనంతరం వాటిని దుర్గ గుడి ఈఓ సీనా నాయక్కు అందజేసి, అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ తరువాత ఈఓ మూర్తి, అనువంశిక ధర్మకర్త నివృతరావు దంపతులకు అర్చకులు, పండితులు వేద ఆశీర్వచనాన్ని అందించగా, ఈఓ సీనా నాయక్ దుర్గమ్మ చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. ఏటా దేవీ శరన్నవరాత్రుల్లో దుర్గమ్మకు చినవెంకన్న దేవస్థానం పట్టు వస్త్రాలను అందించడం ఆనవాయితీ. కార్యక్రమంలో ఆలయ ఏఈఓలు పి.నటరాజారావు, రమణరాజు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఉద్యోగులకు మొండిచేయి
ఏలూరు(మెట్రో): కూటమి సర్కారు తీరుతో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర మనోవేదన చెందుతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలు పరిష్కరించకపోవడంతో పాటు ఒక్క డీఏ కూడా మంజూరు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై మండిపడుతున్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నరకు చేరుతున్నా ఇప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించకపోవడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సమస్యల పరిష్కారం, డీఏల మంజూరుపై ఇప్పటికే పలురకాలుగా నిరసనలు తెలుపుతున్నా సర్కారు పట్టించుకోవడం లేదు. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టగా ఏపీ రెవెన్యూ అసోసియేషన్ సైతం ఉద్యమ ఆలోచనలో ఉంది. 2024 జనవరి నుంచి ఇప్పటివరకూ నాలు గు డీఏలు పెండింగ్లో ఉన్నాయని, దసరా సందర్భంగా ఒక్క డీఏ కూడా మంజూరు చేయకపోవడం దారుణమని ఉద్యోగులు అంటున్నారు. ఉమ్మడి జిల్లాలో రూ.4 వేల కోట్ల బకాయిలు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 67 వేలకుపైగా ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉన్నారు. ఏలూరు జిల్లాలో 38 వేలు, పశ్చిమగోదావరి జిల్లా 29 వేల మంది పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో వారికి ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పాలనను వికేంద్రీకరణ చేసి ఉద్యోగులకు ఒత్తిడి లేకుండా, అదే సమయంలో వారికి అందాల్సిన ప్రయోజనాలు సకాలంలో అందించేందుకు కృషి చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే మాజీ సీఎం జగన్ 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) అందజేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల కోసం 12వ పీఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేశారు. పీఆర్సీ కమిషన్ సేవలు ప్రారంభించే సమయంలో ఎన్నికల కోడ్ రావడంతో కమిషన్ ఆగిపోయింది. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం పనిభారం పెంచడంతో పాటు తమను పట్టించుకోవడం లేదనే భావన ఉద్యోగుల్లో ఉంది. ఉమ్మడి జిల్లాలో ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు సుమారు రూ.4 వేల కోట్ల వరకూ ఉ న్నాయి. 2024 జనవరిలో 3.64 శాతం, 2024 జూ లైలో 2.73 శాతం, 2025 జనవరిలో 1.82 శాతం, 2025 జూలైలో 2.73 శాతం మొత్తంగా 10.92 శాతం డీఏ బకాయిలు ఉన్నాయి. ఏపీజీఎల్ఐ లోన్, పైనల్ పేమెంట్లు పూర్తిగా నిలిచిపోయాయి. మూడు సరెండర్ లీవ్లు పెండింగ్. పది నెలల ఎన్క్యాష్మెంట్ ఆఫ్ లీవ్ల పెండింగ్ ముందుకు కదలని 12వ పీఆర్సీ 10 నెలల మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లుల పెండింగ్ 2024 అక్టోబర్ నుంచి ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు గ్రాట్యూటీ బకాయిలు డీఏ, పీఆర్సీ బకాయిల పెండింగ్ ఐఆర్ ఊసెత్తని ప్రభుత్వం జిల్లాలో వేలాది మంది ఉద్యోగులు కూటమి సర్కారు తీరుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం అవేమీ పట్టనట్లు ప్రభుత్వం ప్రవర్తిస్తోంది. దసరా పండగకై నా డీఏలు ప్రకటిస్తారని ఎదురుచూశాం. కానీ అదేమీ లేదు. కనీసం ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఒక్క డీఏ అయినా ప్రకటించాలి. – కె.రమేష్కుమార్, జిల్లా రెవెన్యూ శాఖ అధ్యక్షుడు, ఏలూరు పెండింగ్లో నాలుగు డీఏలు దసరాకూ మంజూరు కాని వైనం! పట్టించుకోని కూటమి ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో 67 వేల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు -
కై కలూరు ఎమ్మెల్యే చేపల దొంగ కాదా?
ఏలూరు టౌన్: కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చేపల దొంగ కాదా అంటూ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) నిలదీశారు. ఏలూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కామినేని, బాలకృష్ణ అసందర్భ ప్రేలాపనలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం తనకు చెందిన వంద ఎకరాల చేపల చెరువును ఎమ్మెల్యే కామినేనికి సంబంధించిన వ్య క్తులతో అక్రమంగా పట్టించి అమ్ముకున్నది నిజం కాదా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఐదేళ్లపాటు సంక్షేమ పాలన అందించి ప్రజల హృదయాల్లో దేవుడిగా నిలిచిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అసెంబ్లీలో పిచ్చి ప్రేలాపనలు చేయడం సరికాదన్నారు. జగన్ గురించి నోరు జారితే సహించేది లేదని హెచ్చరించారు. కామినేని అసెంబ్లీలో అసందర్భంగా కొన్ని విషయాలను ప్రస్తావించారనీ గతంలో ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలను, చిరంజీవి వంటి వ్యక్తిని, మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి అవమానించారనీ ఆవేదన వ్యక్తం చేశారు. కామినేని ఏమైనా సినీ నిర్మాతా, దర్శకుడా అని ప్రశ్నించారు. జగన్ గురించి లేనిపోని ఆరోపణలు ఎందుకు చేశారని డీఎన్నార్ నిలదీశారు. బాలకృష్ణకు కడుపు మంట బాలకృష్ణ మంత్రి పదవి రాలేదని రగిలిపోతున్నాడని, మరోవైపు సినీ రంగంలో ప్రత్యర్థి వర్గమైన పవన్ కల్యాణ్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం, సెక్యూరిటీ, హడావుడి చూసి కడుపు మంట ఎక్కువ అయ్యిందని డీఎన్నార్ అన్నారు. ఎమ్మెల్యేలు కామినేని, బాలకృష్ణ వ్యాఖ్యలపై విదేశాల్లో ఉన్న చిరంజీవి వెంటనే స్పందిస్తూ పూర్తిస్థాయి వివరాలు వెల్లడించారని, ఆనాడు మాజీ సీఎం జగన్ సినీ పెద్దలకు ఏవిధంగా గౌరవం ఇచ్చారో చెప్పడం ద్వారా కామినేనికి చెంప చెల్లుమనిపించారన్నారు. కామినేనికి మంత్రి పదవి కావాలంటే బాబును వేరే విధంగా కాకా పట్టుకోవాలని, అంతేగాని తమ అధినేత వైఎస్ జగన్ గురించి తప్పుగా మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. రౌడీమూకలను పెంచి పోషిస్తూ.. వరహాపట్నంలో గంజాయి బ్యాచ్లకు ఎమ్మెల్యే కామినేని సెటిల్మెంట్లు చేస్తున్నారని డీఎన్నార్ ఆరోపించారు. ఏలూరు–కై కలూరు రోడ్డులో జరిగిన హత్యాయత్నం కేసులోనూ సెక్షన్లు పెట్టకుండా ఉండేలా పోలీసులపై ఒత్తిడి చేసిన మాట వాస్తవం కాదా అని నిలదీశారు. కామినేని పెంచి పోషిస్తున్న రౌడీమూకలు దళితవాడలో ఎస్సీలపై దారుణంగా దాడులకు పాల్పడితే, మాట వినలేదనే కారణంగా కై కలూరు టౌన్ సీఐ కృష్ణను వీఆర్కు పంపింది మీరు కాదా అంటూ విరుచుకుపడ్డారు. మట్టిమా ఫియా, కోడిపందేలు, రౌడీ మూకలకు వత్తాసు ప లుకుతూ కై కలూరు రూరల్ సీఐ రవికుమార్ ఎ మ్మెల్యే కామినేనికి డబ్బులు వసూలు చేసిపెట్టే అధికారిగా ఉన్నారని ఆరోపించారు. కై కలూరు నియోజకవర్గంలో కామినేని చేసే అక్రమాలు, అవినీతిని డిజిటల్ బుక్లో ఎక్కిస్తామని, తాము అధికారంలో కి వచ్చాక చట్టం ముందు నిలబెడతామని అన్నారు. సినీ పరిశ్రమను ఆదుకున్న జగన్ ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సినీ పరిశ్రమ నష్టాల్లో, కష్టాల్లో ఉందని చిరంజీవి చెబితే తప్పకుండా ఆదుకుందామని చెప్పి, పెద్ద మనసుతో టికెట్ రేటు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వటం మర్చిపోయారా బాలకృష్ణ అని ప్రశ్నించారు. జగన్పై అవాకులు, చవాకులు పేలితే ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో పార్టీ ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, జిల్లా అధికార ప్రతినిధి మున్నల జాన్గురునాథ్, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఘంటా మోహనరావు, నాయకులు తులసీ, పల్లి శ్రీనివాస్, బుద్దాల రాము, చిలకపాటి డింపుల్జాబ్, పి.రాజేష్, జి.సాయిప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. గంజాయి సెటిల్మెంట్లు చేయడం లేదా ! వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ నిలదీత అసెంబ్లీలో ఎమ్మెల్యే కామినేని అసందర్భ ప్రేలాపనలపై మండిపాటు -
ఏలూరు క్లబ్బు.. పేకాట గబ్బు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: మహాత్మా మన్నించు.. స్వాతంత్య్ర సమరంలో ప్రజలను ఉద్యమం వైపు నడిపిన గాంధీజీ విడిది చేసిన ప్రాంతమిది. ఇక్కడి నుంచే వందలాది మందిని మహాత్ముడు నడిపించారు. ఏలూరు నగరంలో మహాత్మా గాంధీకి విడదీయరాని అనుబంధం ఉన్న వాటిలో ది ఏలూరు క్లబ్ ఖ్యాతిగాంచింది. అయితే ప్రస్తుతం అంతటి ప్రాధాన్యమున్న క్లబ్ రిక్రియేషన్ ముసుగులో భారీ జూద శిబిరంగా మారిపోయింది. కేవలం సభ్యులు మాత్రమే ఉండాల్సిన క్లబ్లో నిత్యం వందలాది మంది జూదరులు దర్శనమిస్తున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరితో పాటు కృష్ణా, గుంటూరు, తెలంగాణ నుంచి సైతం పదుల సంఖ్యలో జూదరులు వచ్చి నిత్యం రూ.లక్షల్లో పేకాట శిబిరం కొనసాగిస్తున్నారు. కేవలం రోజు వారి మామూళ్లే రూ.6 లక్షల చొప్పున నెలకు రూ.1.80 కోట్లు చెల్లిస్తున్నారంటే క్లబ్లో ఏ స్థాయిలో దందా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. యథేచ్ఛగా జూదం : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో జూదం యథేచ్ఛగా సాగుతోంది. గోవాలో క్యాసినోలను తలపించే రీతిలో భారీ జూద శిబిరాలు జిల్లాలో ఏదొక ప్రాంతంలో నిత్యం కొనసాగుతున్నాయి. తాజాగా నెల రోజుల నుంచి జూదరులకు కేరాఫ్ అడ్రస్గా ఏలూరు క్లబ్ మారిపోయింది. రూ.50 వేలు, 25 వేలు బోర్డులు ఏర్పాటు చేసి 21 ముక్కల పేకాటను నిర్వహిస్తున్నారు. ప్రతి బోర్డులో ఒక గేమ్కు 8 మంది చొప్పున రోజుకు 8 గేమ్లు నిర్వహిస్తున్నారు. అలాగే రూ.10 వేలు, రూ.5 వేలు, రూ.2 వేలు ఇలా రకరకాల గేమ్ల్లో అయితే లెక్కే లేదు. రోజూ రూ.లక్షల ఎంట్రీ ఫీజుల పేరుతో జూదరుల నుంచి టార్గెట్ పెట్టి మరీ రూ.8 లక్షలు వసూలు చేసి రూ.2 లక్షలు క్లబ్ ఖాతాలో జమ చేస్తున్నారు. మిగిలిన రూ.6 లక్షలను పొలిటికల్, పోలీస్, ఇతరులకు రోజువారీ పంపకాలు కొనసాగిస్తున్నారు. మరో విశేషమేమిటంటే రూ.6 లక్షల్లో క్లబ్ నిర్వాహకుడు కూడా ఒక భాగం ఉంచుకుని దానిని కూడా రోజువారి ముడుపుల్లో కలిపి లెక్క చెబుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పేకాట శిబిరాల ద్వారా మొత్తంగా నెలకు రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. ఇక సాధారణంగా రిక్రియేషన్ క్లబ్ అంటే చెస్ మొదలు బ్యాడ్మింటన్ వరకు క్రీడలు ఉంటాయి. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు క్లబ్లో ఆహ్లాదం, ఆరోగ్యం కోసం ఆడుతుంటారు. అయితే ఏలూరు రిక్రియేషన్ క్లబ్లో ఉదయం 8 గంటలకే జూదరులు క్యూ కడుతున్నారు. సమయంతో నిమిత్తం లేకుండా ఉదయం 8 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి వరకూ పేకాట కొనసాగుతోంది. అలాగే జిల్లాలో ఏ క్లబ్లో లేని తరహాలో ఎవరైనా రూ.వెయ్యి చెల్లిస్తే చాలు ఏ పేకాటైనా ఆడటానికి ఇక్కడ అనుమతి ఉంది. మళ్లీ బోర్డును బట్టి డిపాజిట్ తప్పనిసరిగా చెల్లించాలి.మహాత్మా.. మన్నించు.. బాపూజీ నడయాడిన చోట పేకాట క్లబ్ రాష్ట్రంతో పాటు తెలంగాణ నుంచి జూదరులు పొలిటికల్ నుంచి పోలీస్ వరకూ రూ.కోట్లలో మామూళ్లు ఏలూరు క్లబ్లో రిక్రియేషన్ ముసుగులో పేకాట దందా వన్టౌన్ పోలీస్స్టేషన్కు కూతవేటు దూరంలోనే నిర్వహణ అయినా పట్టించుకోని పోలీసు ఉన్నతాధికారులు గోదావరి జిల్లాల్లో కేవలం సంక్రాంతి సమయంలో మూడు రోజులు మాత్రమే కోడిపందేలు, పేకాట కొనసాగుతుంటాయి. మిగిలిన సందర్భాల్లో చెరువు గట్లపైనా, ఊరి బయట నిర్జీవ ప్రాంతాల్లో అక్కడక్కడా పేకాట ఆడుతుంటాయి. పోలీసులు మాత్రం చెరువు గట్టు మొదలు అన్ని చోట్లా హడావుడి చేసి కేసులు నమోదు చేసి జూదరులను అరెస్టు చేసి సగటున రూ.5 వేల నుంచి రూ.40 వేల వరకు నగదు స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటిస్తుంటారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో ఏ ఒక్క క్లబ్కూ అనుమతి లేకుండా జూదంపై సీరియస్గా ఉక్కుపాదం మోపారు. గతంలో పోలీసు ఉన్నతాధికారికి ఒక మహిళ పోస్టుకార్డు రాసింది. కార్డులో జూదంతో వందల కుటుంబాలు ఛిద్రమైపోతున్నాయని, తన మంగళసూత్రాలు పేకాటకు బలికాకుండా కాపాడండి అంటూ రాసిన లేఖ సంచలనం కాగా.. పోలీసు అధికారులు వరుస దాడులతో సీరియస్గా కట్టడి చేశారు. ఇప్పుడు మాత్రం పొలిటికల్ పేరుతో వ్యవహారాలకు తలొగ్గి పోలీసులు పూర్తిగా పట్టించుకోవడం లేదు. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకూ పేకాట వ్యవహారం అందరికి తెలిసే జరుగుతుందనేది నగరంలో హాట్టాఫిక్. మరో విచిత్రమేమిటంటే ఏలూరు వన్టౌన్ పోలీస్స్టేషన్కు వంద మీటర్ల దూరంలోనే ది ఏలూరు క్లబ్ ఉండటం గమనార్హం. -
మళ్లీ వణికిస్తున్న గోదావరి వరద
వేలేరుపాడు: గోదావరి వరద మళ్లీ ఉగ్రరూపం దా ల్చింది. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హె చ్చరిక జారీతో మండలంలోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మూడు నెలల్లో గోదావరిలో నీటిమట్టం పెరగడం ఇది ఆరోసారి. దీంతో మండలంలోని 26 గ్రామాలు జలదిగ్బంధనంలోకి వెళ్లాయి. వేలేరుపాడు నుంచి కొయిదా వెళ్లే రహదారిలో మేళ్లవాగు, ఎద్దెలవాగు, టేకూరు తదితర వా గుల వంతెనలు నీటమునిగాయి. కొయిదా, కాచా రం, పేరంటపల్లి, టేకుపల్లి, తాళ్లగొంది, పూసు గొంది, టేకూరు, కట్కూరు, సిద్దారం, ఎడవల్లి, చి ట్టంరెడ్డిపాలెం, ఎర్రతోగు, చిగురుమామిడి, బోళ్లపల్లి, పా తనార్లవరం, తూర్పుమెట్ట, కొత్తూరుతో పా టు మ రో తొమ్మిది గ్రామాలు జలదిగ్బంధనంలో ఉన్నాయి. కుక్కునూరు మండలంలో.. కుక్కునూరు: మండలంలోని పంట చేలల్లోకి వరద నీరు ప్రవేశించింది. పునరావాస సహాయక కేంద్రాల్లో తలదాచుకుంటున్న నిర్వాసితులు ఇటీవల వరద తగ్గడంతో తమ ఇళ్లకు చేరారు. మరలా వ రద పెరగడంతో ఆందోళన చెందుతున్నారు. -
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆశ్వయుజమాస దివ్య బ్రహ్మోత్సవాలకు క్షేత్రంలో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. వచ్చే నెల 2 నుంచి 9 వరకు జరగనున్న ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ఇప్పటికే ఆలయంలో ధ్వజస్తంభం వద్ద చలువ పందిరిని నిర్మించారు. శుక్రవారం గుడి సెంటర్లో 40 అడుగుల స్వామివారి భారీ విద్యుత్ కటౌట్ నిర్మాణ పనులను ప్రారంభించారు. అలాగే ఆలయ రాజగోపురాలకు, ఆళ్వార్ల మండపాలకు, పరిసర ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు. అలాగే క్షేత్రంలో పలు చోట్ల రంగులు వేసే పనులు చురుగ్గా సాగుతున్నాయి. -
యువకుడి అదృశ్యం
తణుకు అర్బన్: యువకుడు అద్యశ్యమైన ఘటన పట్టణంలో సంచలనం సృష్టిస్తుంది. వివరాల ప్రకారం తాడేపల్లిగూడేనికి చెందిన మడుగుల సురేష్ (29) ఈనెల 23న తెల్లవారుజామున తణుకు వచ్చాడని ఆ రోజు నుంచి తన సోదరుడు కనిపించడం లేదని అతని సోదరి ముచ్చె ప్రశాంతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 25న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సురేష్ గతంలో తణుకు మునిసిపాలిటీ అవుట్ సోర్సింగ్లో పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో పని చేస్తూ రాష్ట్రపతి రోడ్డులోని సాయిబాబా గుడి వెనుక ప్రాంతంలో నివాసం ఉండేవారు. అయితే ఇటీవల తాడేపల్లిగూడెంలో పెయింటింగ్ పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నట్లుగా తెలుస్తోంది. అదృశ్యంపై అనుమానాలు ఈ నెల 23వ తేదీన తనకు సన్నిహితంగా ఉండే స్నేహితురాలిని కలిసేందుకు తాడేపల్లిగూడెం నుంచి తణుకు వచ్చినట్లుగా సురేష్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆ రోజు నుంచి కనిపించకపోవడంతో పాటు మొబైల్ కూడా స్విచ్చాఫ్ అవడంతో ఆ కుటుంబం ఆందోళనతో ఈనెల 25న తణుకు పట్టణ పోలీసులను ఆశ్రయించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి తణుకులో ఒక న్యాయవాది కుటుంబంలో తలెత్తిన వివాదానికి, యువకుడి అదృశ్యానికి సంబంధం ఉన్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు న్యాయవాది కూడా పరారీలో ఉన్నారని పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నట్లుగా సమాచారం. ఐదు రోజులుగా సురేష్ కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. -
పండగల వేళ.. పసిడి పరుగు
నరసాపురం: బంగారం ధరలు ప్రతిరోజూ ఆల్టైం హై నమోదు చేసుకుంటూ దూసుకుపోతున్నాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా రూ.11 వేలు దాటింది. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర కూడా రూ.10 వేలు దాటేసింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా బులియన్ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులు, మరోవైపు షేర్ మార్కెట్ ఒడిదుడుకులు, ఇంకో వైపు ట్రంప్ సుంకాల బాదుడు, రూపాయిలో డాలర్ మారకం విలువ రూ.100కు చేరువుగా ఉండడం వంటి కారణాల నేపథ్యంలో ఇప్పట్లో ధరలు పెరగడమే కానీ, తగ్గేది ఉండదనేది బులియన్ ట్రేడ్ వర్గాల అంచనా వేస్తున్నారు. అందనంత ఎత్తుకు చేరుకున్న బంగారం ధరల ఎఫెక్ట్ అమ్మకాలపై పడింది. పెళ్లిళ్లు వంటి సామాజిక అవసరాల కోసం బంగారం కొనుగోలు చేయాలనుకునే మధ్య తరగతి వారు బంగారం ధరలు చూసి కనీసం గోల్డ్ షాపుల మెట్లెక్కాలన్నా భయపడే పరిస్థితి నెలకొంది. శుక్రవారం నరసాపురం బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,16,910 వద్ద ట్రేడయ్యింది. 22 క్యారెట్ల 916 కేడీఎం బంఽగారం ధర రూ. 1,05,500కు చేరింది. అంటే కాసు ఆభరణాల బంగారం ధర రూ.84,400. కాసు బంగారు వస్తువులు చేయించుకోవాంటే తరుగు, మజూరులను కలుపుకుంటే రూ 90 వేల కంటే పెట్టాలి. పండగల విక్రయాలపై ప్రభావం దసరా, దీపావళి పండగల రోజుల్లో బంగారం విక్రయాలు జోరుగా సాగుతాయి. ఇక క్రిస్మస్, సంక్రాంతి పండగలు కూడా సమీపానే ఉన్నాయి. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కూడా మొదలైంది. అయితే బంగారం ధరల పెరుగుదల బంగారం అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపింది. వరుస పండగలు, పెళ్లిళ్ల సీజన్లో కళకళలాడాల్సిన జ్యూయలరీ షాపులు ఉమ్మడి పశ్చిమలో వెలవెలబోతున్నాయి. గోదావరి జిల్లాలోనే అతిపెద్ద బులియన్ మార్కెట్గా పేరున్న ఒక్క నరసాపురం మార్కెట్లోనే హోల్సేల్, రిటైల్ కలిపి రోజుకు రూ.4 కోట్లు వరకూ బంగారం అమ్మకాలు జరుగుతాయి. ఉమ్మడి పశ్చిమలోని ఏలూరు, తుణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం పట్టణాల్లో పెద్దెత్తున అమ్మకాలు సాగుతాయి. పెరిగిన ధరలతో ఉమ్మడి పశ్చిమలో రోజుకు రూ.2 కోట్లుపైనే అమ్మకాలు తగ్గినట్టుగా అంచనా. దాదాపు 40 శాతం అమ్మకాలు తగ్గిపోయాయయని బులియన్ వర్తకులు చెబుతున్నారు. గోల్డ్ వస్తువులు నరసాపురంలో ఓ జ్యూయలరీ షాపు బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. చాలా నెలలుగా ధరలు పెరగడమే కానీ, తగ్గడం కనిపించలేదు. మధ్యలో ఒకరోజు స్వల్పంగా తగ్గినా, మర్నాడు మళ్లీ రెట్టింపు పెరుగుండడంతో బంగారం ధరలను అంచనా వేయలేకపోతున్నాం. ప్రస్తుతం అమ్మకాలు దాదాపు 40 శాతం తగ్గాయి. లిక్విడ్ క్యాష్తో ఎవరూ బంగారం కొనుగోళ్లు చేయడంలేదు. పాత బంగారం మార్చుకుని కొత్త వస్తువులు ఆర్డర్లు ఇస్తున్నారు. ప్రస్తుతం ఇదే వ్యాపారం ఎక్కువగా సాగుతోంది. – వినోద్కుమార్జైన్, నరసాపురం బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ధరలు దారుణంగా పెరగడంతో ఆభరణాల అమ్మకాలు పడిపోయాయి. పెళ్లిళ్లు వంటి సామాజిక అవసరాలకు బంగారం కొనేవారు కూడా వాయిదాలు వేసుకుంటున్నారు. పెట్టుబడిగా కొనే బిస్కెట్ అమ్మకాలు మాత్రం కాస్త బాగానే సాగుతున్నాయని చెబుతున్నారు. ఇక పాత బంగారం మార్పిడి జోష్ అన్ని పట్టణాల్లో కొనసాగుతోంది. ధరలు హైలో ఉండటంతో పాతబంగారం మార్పిడికి ఇదే అనుకూల సమయంగా కొనుగోలుదారులు భావిస్తున్నారు. ప్రస్తుతం జరుగుత్ను అమ్మకాల్లో 50 శాతం వాటా పాత బంగారం మార్పిడితోనే జరుగుతుందని చెబుతున్నారు. 10 గ్రాముల బంగారం ధర రూ.లక్ష ఎప్పుడో దాటేసింది. సాధారణంగా వాడుకభాషలో జనం మాట్లాడుకుంటే 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర గురించి మాట్లాడుకుంటారు. కాసు బంగారం... ఇవాళ రేటెంతుందని అడుగుతారు. ప్రస్తుతం 22 క్యారెట్ల ఆభరణాల బంగారం కాసు(8గ్రాములు) ధర రూ.84,400గా ఉంది. మరికొన్ని రోజుల్లోనే కాసు ధర కాస్త రూ.లక్ష మార్కును చేరుతుందని భావిస్తున్నారు. అప్పుడు తరుగు, మజూరులతో కాసు బంగారు వస్తువు కొనాలంటే లక్షపైనే చూసుకోవాలి. రూ.11 వేలు దాటిన గ్రాము ధర వెండిదీ.. అదే జోరు తగ్గిన అమ్మకాలు ఉమ్మడి పశ్చిమలో రోజుకు రూ.2 కోట్లకుపైనే అమ్మకాలు డౌన్ అన్ని పట్టణాల్లో పాత బంగారం మార్పిడి జోష్ -
పోలీసుశాఖకు బొలెరో వాహనం అందజేత
ఏలూరు టౌన్ : ప్రజలకు శాంతిభద్రతల పరిరక్షణకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ప్రజారక్షణ పోలీస్ శాఖకు నెక్ట్స్జెన్ కంపెనీ యాజమాన్యం సుబ్రహ్మణ్యం నూతన మహీంద్రా బోలెరో వాహనాన్ని అందజేశారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్కు బొలెరో వాహనం తాళాలను ఆయన అందజేశారు. కార్యక్రమంలో ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్, జంగారెడ్డిగూడెం డీఎస్పీ యూ.రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. -
లక్కవరం చోరీ కేసు ఛేదన
● నలుగురు నిందితుల అరెస్ట్, ఒకరు పరారీ ● 246 గ్రాముల బంగారు వస్తువులు స్వాధీనం ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో ఇంటి తలుపులు పగులగొట్టి బెడ్రూమ్లో నిద్రిస్తోన్న భార్యభర్తను కొట్టి బీరువాలోని సుమారు 40కాసుల బంగారు ఆభరణాలు, 2కిలోల వెండిని దోచుకుపోయారు. ఈ చోరీ కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేసిన, పోలీసులు చోరీ సోత్తును స్వాదీనం చేసుకున్నారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ శుక్రవారం కేసు వివరాలను వెల్లడించారు. లక్కవరంలోని రామాలయం వీధిలో ప్రాంతానికి చెందిన వందనపు లక్ష్మీకుమారి తన భర్తతో కలిసి జీవిస్తోంది. ఈ నెల 23 తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు గది తలుపులు పగులగొట్టి బెడ్రూమ్లోకి ప్రవేశించి, భర్తను నోరుమూసివేసి, కర్రలతో కొట్టి బీరువాలోని సుమారు 40కాసుల బంగారు ఆభరణాలు, 2 కిలోల వెండి వస్తువులు దోచుకువెళ్లారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ప్రారంభించారు. పాత నేరస్తుడే సూత్రదారి ఈ దర్యాప్తులో పాతనేరస్తుడి నిర్వాకం వెలుగులోకి వచ్చింది. లక్కవరం గ్రామానికి చెందిన దేవర శ్రీరామ్మూర్తి అనే వ్యక్తిపై కేడీ షీట్ ఉంది. పాతనేరస్తుడు కాగా వయసు రీత్యా తాను చోరీలకు పాల్పడకుండా తనకు తెలిసిన నేరగాళ్లతో చోరీలు చేయిస్తున్నాడు. బాపట్ల జిల్లా స్టువర్టుపురానికి చెందిన దొంగలను తీసుకువచ్చి చోరీలు చేయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. బాధితురాలు లక్ష్మీకుమారి ఇంటి పక్కనే నివాసం ఉంటోన్న బాజీ అనే వ్యక్తి ఆమె ఇంట్లో డబ్బు, బంగారం భారీగా ఉందని శ్రీరామ్మూర్తికి సమాచారం ఇచ్చాడు. దీంతో శ్రీరామ్మూర్తి బాపట్ల స్టువర్టుపురం నుంచి అంగడి విల్సన్బాబు, గజ్జెల వాసు, కావేటి ప్రసాద్ అలియాస్ రమేష్ అలియాస్ చిన్న అనే ముగ్గురు దొంగలను లక్కవరం గ్రామానికి పిలిపించి చోరీ చేయించాడు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేయగా కావేటి ప్రసాద్ అనే నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ నిందితులపై నల్లజర్ల, పెరవలి స్టేషన్లలోనూ కేసులు ఉన్నాయి. పాత నేరస్తుడు శ్రీరామ్మూర్తిపై ఏకంగా 14 కేసులు ఉండగా, విల్సన్బాబుపై ఆరు కేసులు, వాసుపై ఏడు కేసులు, పరారీలో ఉన్న ప్రసాద్పై 12కేసులు ఉన్నాయని పోలీసు అధికారులు చెబుతున్నారు. నిందితుల నుంచి 246 గ్రాముల బంగారు ఆభరణాలు, ఇనుప రాడ్డు, రెండు కర్రలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ చోరీ కేసును ఛేదించటంలో జంగారెడ్డిగూడెం సీఐ సుభాష్, చింతలపూడి సీఐ క్రాంతికుమార్, ఫింగర్ప్రింట్స్ సీఐ పి.శ్రీనివాసరావు, జంగారెడ్డిగూడెం ఎస్సై ఎస్కే జబీర్, ఏఎస్సై సంపత్కుమార్తో సహా కానిస్టేబుల్స్ను జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ ప్రత్యేకంగా అభినందించారు. -
హరిత హోటల్ ప్రైవేటీకరణ అంశంపై చర్చ
ద్వారకాతిరుమల: రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ పరిధిలోని హరిత హోటల్స్, రిసార్ట్స్ను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసేందుకు టెండర్ ప్రక్రియను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే శ్రీవారి దేవస్థానం గతంలో కొండపైన కోట్లాది రూపాయలు విలువైన భూమిని పర్యాటక అభివృద్ధి సంస్థకు నామమాత్రపు ధరకు విక్రయించగా, అందులో హోటల్ నిర్మించారు. దాన్ని సక్రమంగా నడపలేక గతంలో ఒకసారి ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నించారు. అప్పట్లో దేవస్థానం అధికారులు దాన్ని అడ్డుకున్నారు. మళ్లీ ఇప్పుడు ప్రైవేటీకరణ అంశం తెరమీదకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈనెల 19న సాక్షిలో శ్రీటెంపుల్ జాగా.. ప్రైవేట్ పరం దిశగాశ్రీ శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై దేవస్థానం ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి, ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్వీఎన్ఎన్ నివృతరావులు స్పందించారు. ఈ క్రమంలో టూరిజానికి సంబంధించిన ఫైల్ను పరిశీలించిన ఈఓ, ఈనెల 21న శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ఇచ్చే సమయంలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుతో ఈ అంశంపై చర్చించడంతో ఆయన ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. ఏది ఏమైనా కొండపైన భూమి ప్రైవేట్ వ్యక్తుల పరం కావడం మంచిది కాదని, అది క్షేత్ర పవిత్రతకు, భద్రతకు ముప్పని శ్రీవారి భక్తులు అంటున్నారు. -
కుల బహిష్కరణపై ఫిర్యాదు
పాలకోడేరు: మండలంలోని పెన్నాడ అగ్రహారంలో తమ మాట వినడం లేదని కుల పెద్దలు సుమారు 28 మందిని కులం నుంచి వెలి వేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాలకోడేరు పోలీసులకు అందిన సమాచారం మేరకు గ్రామంలోని శెట్టిబలిజ పెద్దలు దొమ్మేటి వేణుగోపాలం, పంపన వెంకటేశ్వరరావు, పాల శేషు, గుత్తుల కొండలరావు, జక్కంశెట్టి బాలమురళీకృష్ణ, చింతపల్లి రామకృష్ణ తమ మాట వినడం లేదంటూ మూడేళ్ల క్రితం కొంత మందిని, ఏడాది క్రితం కొంత మందిని, ఏడు నెలల క్రితం మరో కొంత మందిని మొత్తం 28 మందిని కులం నుంచి వెలి వేశారు. ప్రేమ పెళ్లి విషయంలోనూ, స్థలం అమ్మకం విషయంలోనూ, డ్రెయినేజీ నిర్మాణ విషయంలోనూ ఇలా మమ్మల్ని బహిష్కరించినట్లు దొంగ నాగలక్ష్మి, దొమ్మేటి వెంకటేశ్వరరావు, పి సురేష్, గుత్తుల నాగరాజు, జక్కం శెట్టి సత్య నాగరాజు, సిహెచ్ సుబ్రమణ్యం, చింతపల్లి శివప్రసాద్, గుత్తుల శ్రీనివాస్, చీరబోయిన శ్రీనివాసరావు, బొక్కా రమేష్, పంపన రవి మొత్తం 28 మందిని బహిష్కరించారు. అప్పటి నుంచి శుభకార్యాలకు పిలవడం లేదు. అంతేగాక ఇళ్లకు వచ్చిన చుట్టాలను కూడా అవమానిస్తున్నారంటూ బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శుక్రవారం భీమవరం రూరల్ సీఐ బి.శ్రీనివాస్, పాలకోడేరు ఎస్సై రవి వర్మ, పంచాయతీ కార్యదర్శి కె.వెంకటరాజు, ఆర్ఐ రాఘవ రాజు, వీఆర్వో సుబ్రహ్మణ్యం తదితరులు స్థానిక పంచాయతీ కార్యాలయంలో బాధితులను విచారించారు. కాగా నిందితులు తాము గ్రామాంతరం వెళ్లామని చెప్పడంతో విచారణ రేపటికి వాయిదా వేశారు. -
బీసీలకు అన్యాయం చేస్తే పోరాటమే
భీమవరం: రాష్ట్రంలో బీసీ కులాలను అణగదొక్కాలని చూస్తున్నారని, బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాటాలు చేస్తామని నేషనల్ బీసీ సమాఖ్య సంక్షేమ సంఘం నేషనల్ ప్రెసిడెంట్ గుత్తుల తులసీగురి, ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ ఎన్ గంగారామ్ అన్నారు. గురువారం భీమవరంలో నేషనల్ బీసీ సమాఖ్య సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీల్లో భాగంగా బీసీ కులాలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించి, బీసీలకు రక్షణ చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జాతీయ అధ్యక్షుడిగా గుత్తుల తులసీగురి, ఉపాధ్యక్షుడిగా మోపాటీ బలపరమేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి దొంగ కృష్ణ, జాయింట్ సెక్రటరీ ఎం.విజయ్ ఎన్నికకాగా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులుగా ఎన్ గంగారామ్, కండిబోయిన సుబ్ర హ్మణ్యం, ఉపాధ్యక్షునిగా కొమ్మోజు కన్నబాబు, జాయింట్ సెక్రటరీ గుబ్బల నాగేశ్వరరావు, ప్రచార కమిటీ చైర్మన్గా వాస రామ ఎన్నికయ్యారు. -
ఆది కర్మయోగి కార్యక్రమంపై సమీక్ష
ఏలూరు (మెట్రో): ఆది కర్మయోగి కార్యక్రమంలో గ్రామ విజన్ ప్లాన్ రూపకల్పనపై ఢిల్లీ లోని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి జిల్లాల కలెక్టర్లతో గురువారం జూమ్ కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో ఆది కర్మయోగి కార్యక్రమంపై గ్రామ విజన్ ప్లాన్ ను సిద్ధం చేస్తున్నామని, ప్రత్యేక గ్రామ సభల్లో ప్రజల ముందు ఉంచి ఆమోదింపజేస్తామన్నారు. అనంతరం ఆది కర్మయోగి కార్యక్రమంలోని గ్రామ విజన్ ప్రణాళిక రూపకల్పనపై జిల్లాలోని ఐటీడీఏ, వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. భూసేకరణ పనులు వేగవంతం చేయాలి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల ఆర్అండ్ఆర్ పనులకు సంబంధించిన భూసేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్ నుంచి అధికారులతో జూమ్ కాన్ఫెరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఏలూరు, తూర్పుగోదావరి, మన్యం జిల్లాలలోని పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు భూమికి భూమి, ఆర్అండ్ఆర్ కాలనీల నిర్మాణాలు, తదితర పనులకు గాను ఏలూరు జిల్లాలో 4,434 ఎకరాల భూమి అవసరం కాగా ఇప్పటికే బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో గుర్తించిన భూములకు సంబంధించి భూసేకరణ ప్రకటనలు జారీ చేయాలన్నారు. మిగిలి ఉన్న భూసేకరణ పనులను వెంటనే పూర్తిచేయాలన్నారు. బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి మండలాలలో భూసేకరణకు అవసరమైన భూములను గుర్తించాలని, తర్వాత ఆయా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జీఎస్టీ తగ్గింపుపై అవగాహన జీఎస్టీ తగ్గింపుతో ప్రతి కటుంబానికి ప్రతి నెలా ఎంత మేర ఆదా అవుతుందో తెలియజేసేందుకు ఈనెల 26 నుంచి అక్టోబర్ 19 వరకు జిల్లాలో ‘సూపర్ జీఎస్టీ... సూపర్ సేవింగ్స్’ పేరుతో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. జీఎస్టీ 2.0 కింద ప్రజలకు కలిగే లబ్ధిపై అవగాహన కార్యక్రమాల నిర్వహణపై జీఎస్టీ అధికారులతో కలిసి గురువారం సాయంత్రం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. -
ఏజెన్సీలో భూసేకరణ నిలుపుదల చేయాలి
బుట్టాయగూడెం: జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మండలాల్లో భూసేకరణ నిలుపుదల చేయాలని, నేవీ ఆయుధ కర్మాగార నిర్మాణం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ డిమాండ్ చేసింది. గురువారం ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుంజా కృష్ణంరాజు అధ్యక్షతన ఆదివాసీ ముఖ్య నాయకుల సమావేశం బుట్టాయగూడెంలో జరిగింది. ఏపీ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ వైస్ చైర్మన్ మొడియం శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇప్పటికే సేకరించి వివాదాల్లో ఉన్న వేల ఎకరాల భూమిని పోలవరం నిర్వాసితులకు కేటాయించడం వల్ల భూవివాదాలతో స్థానిక ఆదివాసీ నిర్వాసితులు, ఆదివాసీలు నిరంతరం గొడవలు పడుతూ అశాంతితో జీవిస్తున్నారని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏడు మండలాల పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులను తీసుకువచ్చి వారికి బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో పునరావాసం కల్పించడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. పెద్ద మొత్తంలో ప్రభుత్వం సొమ్మును దోచుకోవడానికి ఎల్టీఆర్ భూములను సేకరించడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, దళారులు పడుతున్న తాపత్రయం, హడావిడి చూస్తుంటే భారీ కుంభకోణం జరుగుతుందని అర్థమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏటీఏ నాయకులు తెల్లం రాములు, తెల్లం గంగరాజు, కోర్సా నాగేశ్వరరావు, కుంజా రమేష్ పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): డిగ్రీ కళాశాలల్లో రెండో విడత ప్రవేశాలకు ఈ నెల 29వ తేదీ వరకు గడువు ఉందని ఏలూరు జిల్లా నోడల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధానాచార్యుడు గుత్తా గిరిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. 2025 – 26 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ కోర్సుల్లో చేరడానికి ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన పరీక్ష పాసైన విద్యార్థులు రెండో విడత ప్రవేశాల్లో భాగంగా ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, ఈనెల 29 నుంచి అక్టోబర్ 1 వరకు వెబ్ ఆప్షన్ ఇవ్వవలసి ఉంటుందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏలూరు(ఆర్ఆర్పేట): నేవీ ఆయుధ డిపో పేరుతో చేస్తున్న భూసేకరణను వెంటనే నిలిపివేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. గురువారం ఏలూరు పవరుపేటలో పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నేవీ ఆయుధ డిపోకు సంబంధించి భూసేకరణకు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, కలెక్టర్ వెట్రిసెల్వి, నేవీ అధికారులు చేసిన ప్రకటనను వ్యతిరేకిస్తున్నామన్నారు. గిరిజనులు ఆయుధ డిపోను వ్యతిరేకిస్తున్నా భూసేకరణకు ముందుకు సాగడం దారుణమన్నారు. సీపీఎం కేసులకు భయపడదని, ప్రజా సమస్యలపై పోరాడుతుందన్నారు. విలేకరుల సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి సభ్యులు బీ. బలరాం, జిల్లా కార్యదర్శి ఏ. రవి, కార్యదర్శి సభ్యులు తెల్లం రామకృష్ణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి డీఎన్వీడీ ప్రసాద్, ఆర్. లింగరాజు, ఎం.నాగమణి, జీ.రాజు, కే.శ్రీనివాస్, పీ.రామకృష్ణ పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువకులకు రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండీషనింగ్ రిపేర్లలో ఉచిత శిక్షణ అందించనున్నట్టు యూనియన్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ ఎం.ఫణి కిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు. 19–45 సంవత్సరాల మధ్య వయసు కలిగి, 5వ తరగతి ఆ పైన విద్యార్హత కలిగిన నిరుద్యోగులు ఈ శిక్షణకు అర్హులన్నారు. ఈ నెల 27వ తేదీన శిక్షణ ప్రారంభమౌతుందని, శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజన సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా ఫోన్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు 95027 23561, 90140 40780, 95330 79471 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు. -
కై కలూరు.. పొట్టేళ్ల పందేల జోరు
శురకవారం శ్రీ 26 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉమ్మడి పశ్చిమ గోదావరిలో కొత్త ట్రెండ్ ప్రారంభమైంది. కోడిపందేలకు రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే పశ్చిమగోదావరి జిల్లా ఖ్యాతిగాంచింది. గత రెండు, మూడేళ్ల నుంచి జిల్లాలో ఒక ప్రాంతంలో పందులతో పందేలు నిర్వహించిన పందేలరాయుళ్లు తెలంగాణలో నిషేధించిన పొట్టేళ్ల పందాలకు జిల్లాను అడ్డాగా మారుస్తున్నారు. ప్రధానంగా కై కలూరు నియోజకవర్గంలోని కొల్లేరు చెరువు గట్లను పందెం అడ్డాలుగా మారుస్తూ లక్షల్లో పందేలు నిర్వహిస్తూ అధికార పార్టీ నేతలు కాసులు దండుకుంటూ అనేక మంది జేబులు గుల్ల చేస్తున్నారు. జిల్లాలో సంక్రాంతి సమ యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా కోడిపందేలు నిర్వహిస్తుంటారు. హైకోర్టు నిషేధాజ్ఞలు ఉన్నా పోలీసులు హడావిడి చేసినా ఏమీ లెక్కచేయకుండా అధికార పార్టీ ముసుగులో భారీగా కోడిపందేలు నిర్వహిస్తుంటారు. జూన్ నుంచే పందెం కోళ్లకు ప్రత్యేకంగా శిక్షణ శిబిరాలను నిర్వహించి పందెం కోళ్లను సన్నద్ధం చేస్తుంటారు. ముఖ్యంగా ఏలూరు జిల్లాలో కై కలూరు ప్రాంతంలోని కొల్లేరులో ఉన్న చేపల చెరువు గట్ల వద్ద భారీ జీతాలతో ట్రైనర్లను నియమించి ప్రత్యేక బ్రీడ్ పందెం పుంజులను ఎంపిక చేసి శిక్షణ ఇస్తుంటారు. అలాంటి శిక్షణా కేంద్రాలే బెట్టింగ్ అడ్డాలుగా మారుతున్నాయి. పేకాట శిబిరం, కోడి పందేల బదులు పొట్టేళ్ల పందేలకు తెరతీయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. నిర్మానుష్య ప్రాంతాల్లో ఆక్వా చెరువులు ఉండటంతో పోలీసుల హడావిడి ఉండదంటూ ఇతర ప్రాంతాల నుంచి జూదరులను ఆహ్వానిస్తున్నారు. తాజాగా చెరువు గట్లపై పొట్టేళ్ల పందేలను సైతం నిర్వహిస్తూ బరితెగింపునకు తెరలేపుతున్నారు. ఒక్కొక్క పందెం కనీసం రూ.లక్ష నుంచి పొట్టేలు స్థాయిని బట్టి రూ.3 లక్షల వరకు కూడా కాస్తున్నారు. జిల్లాలో సంక్రాంతి వంటి పెద్ద పండుగలకే పరిమితమైన కోడిపందేలు, పేకాట, పొట్టేళ్ల పందేలు కూటమి నేతలకు ఇప్పుడు నిత్య ఆదాయ వనరుగా మారిపోయాయి. చేపల చెరువు గట్లపై గుట్టు చప్పుడు కాకుండా పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారు. కై కలూరులో రోజంతా ప్రజాప్రతినిధి వెంట తిరుగుతూ రాత్రి సమయంలో టిప్పర్ల మైనింగ్ అవతారం ఎత్తే నేత తాజాగా పొట్టేళ్ల పందేలకు శ్రీకారం చుట్టాడు. పోలీసు శాఖపై కూడా ఇతనికే పెత్తనం చేసే పని అప్పగించడంతో ఇతని వైపు పోలీసులు కన్నెత్తి చూడటం లేదు. ఇతని చెరువు గట్టుపై వేసే ఒక్కో పందెం రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు పలుకుతుంది. శని, ఆదివారాల్లో పొట్టేళ్ల పందేలు జరుగుతున్నట్టు సమాచారం. రెండు పొట్టేళ్లు కొమ్ములతో కొట్టుకుంటూ ఏది పారిపోతే అది ఓడిపోయినట్టు లెక్క. కోడిపందేలకు అలవాటు పడిన వ్యసనపరులు తెలియని పొట్టేళ్ల పందేలలో రూ.లక్షలు తగలేసుకుని ఇంటి ముఖం పడుతున్నారు.బెట్టింగులతో పొట్టేళ్ల పందేలు నిర్వహిస్తే తెలంగాణలో కేసులు నమోదు చేస్తారు. దీంతో ఈ ఏడాది సంక్రాంతికి కై కలూరు నియోజకవర్గం చావలిపాడులో కోడిపందేలతో పాటు పొట్టేళ్ల పందేలు నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి 150 పొట్టేళ్లను తీసుకొచ్చారు. గొప్ప కోసం ఓ కూటమి నేత మహిళలతో కూడిన 30 మంది బౌన్సర్లను తీసుకొచ్చి ఆకర్షించాడు. దీంతో పొట్టేళ్ల పందేలకు వచ్చిన క్రేజ్ను కూటమి నేతలు ఉపయోగించుకుంటున్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో సంక్రాంతికి పొట్టేళ్ల పందేలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఏడాది వరకు వాటి జోలికి వెళ్లరు. తాజాగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లో పొట్టేళ్ల సంస్కృతిని తీసుకొస్తున్నారు. కొల్లేరు చెరువు గట్లు కేంద్రంగా నిత్యం నిర్వహణ ఒక్కొక్క పందెం రూ.లక్ష నుంచి ప్రారంభం ఉమ్మడి పశ్చిమలో కొత్త ట్రెండ్కు శ్రీకారం పందేల మాటున భారీగా వసూళ్లకు పాల్పడుతున్న కూటమి నేతలు కోడిపందేల కంటే ముందుగానే పొట్టేళ్ల పందేలతో హడావుడి కృష్ణా, పశ్చిమగోదావరి నుంచి నిత్యం పందేలరాయుళ్లు కై కలూరుకు రాక ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 9 మండలాల్లోని 122 గ్రామాల్లో కొల్లేరు సరస్సు విస్తరించి ఉంది. సరస్సు సమీపంలో లక్షలాది ఎకరాల్లో చేపల చెరువుల సాగు చేస్తున్నారు. ఇవే పేకాట జూదరులకు అవకాశంగా మారుతున్నాయి. చెరువుల్లో వేసే మేతల నిల్వ కోసం, కాపలాదారుల కోసం గృహాలు నిర్మిస్తారు. కొందరు చెరువు వద్ద విశ్రాంతి భవనాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రధానంగా పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు, భీమవరం నుంచి ఏలూరు జిల్లా సరిహద్దు కై కలూరు మండలంలో ఉప్పుటేరు సమీపంలోని చేపల చెరువులపై పేకాట శిబిరాలు జరుగుతున్నాయి. పోలీసులు డ్రోన్లు ఎగురవేసి మమ అనిపిస్తున్నారు. పొట్టేళ్ల పందేల నిర్వహణపై కై కలూరు సీఐ కృష్ణను వివరణ కోరగా.. పొట్టేళ్ల పందేలపై నిఘా ఉంచి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
మరీ ఇంత దారుణమా !
ప్రముఖ క్షేత్రానికి వెళ్లే రహదారి మరీ ఇంత దారుణంగా ఉంటే ఎలా. అధికారులు, ప్రజాప్రతినిధులు కళ్లకు గంతలు కట్టుకున్నారా. కనీసం గుంతలన్నా పూడ్చాలి కధ. కారుల్లో రావడమే ఇంత కష్టంగా ఉంటే.. ఇక బైక్లపై వచ్చే భక్తుల పరిస్థితి ఏమిటి. దీన్ని బట్టి చూస్తే ఆ చినవెంకన్న ఆశీస్సులు ఉంటేనే భక్తులు క్షేమంగా వచ్చి తిరిగి వెళతారు. – ఉప్పాల శ్రీనివాస్, భక్తుడు, విజయవాడ శ్రీవారి క్షేత్రానికి బైక్పై వెళుతున్నాను. గుంతల రహదారిపై ప్రయాణం చాలా ప్రమాదకరంగా ఉంది. పెద్దపెద్ద గుంతల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. దాంతో అవి ఎంత లోతు ఉన్నాయో తెలియడం లేదు. పగటి వేళే ఇలా ఉంటే, రాత్రి వేళల్లో ఈ రోడ్డుపై ప్రయాణం కష్టమే. రోడ్డు మరమ్మతులపై అధికారులు దృష్టి సారించాలి. – కొంకిమళ్ల సతీష్, భక్తుడు, దేవులపల్లి, జంగారెడ్డిగూడెం మండలం రోడ్డు అధ్వానంగా ఉండడంతో శ్రీవారి క్షేత్రానికి బైక్లపై వెళ్లే కొందరు భక్తులు గొల్లగూడెం వద్ద మా కళ్ల ముందే పడిపోతున్నారు. వారం రోజుల క్రితం రోడ్డు మధ్యలోని గుంతను తప్పించబోయి, రోడ్డు పక్కనున్న సిమెంట్ బల్లను కారు ఢీకొట్టింది. రెండు రోజుల క్రితం బైక్పై వెళుతున్న ఒక భక్తుడి కుటుంబం పడిపోవడంతో చిన్నారి తలకు తీవ్ర గాయమైంది. – తోట అయ్యప్ప, గొల్లగూడెం, ద్వారకాతిరుమల మండలం -
ఆదమరిస్తే.. ప్రాణాలు గోవిందా!
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రానికి వివిధ వాహనాలపై వెళుతున్న భక్తుల కష్టాలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. పెద్దపెద్ద గుంతలు పడ్డ ఈ రహదారిపై ప్రయాణం నరక ప్రాయంగా మారింది. బైక్లపై వెళుతున్న వారి ఇక్కట్లు ఇక చెప్పనక్కర్లేదు. తరచూ ప్రమాదాల బారిన పడుతూ క్షతగాత్రులు అవుతున్నారు. వివరాల్లోకి వెళితే. ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రాన్ని నిత్యం వేలాది మంది భక్తులు దర్శిస్తున్నారు. అందులో అధిక శాతం మంది కార్లు, ఆటోలు, బైక్లపై క్షేత్రానికి వెళుతున్నారు. ముఖ్యంగా దేవీ శరన్నవరాత్రులకు క్షేత్రానికి వచ్చే భక్తుల రాక ఎక్కువగా ఉంది. అయితే భీమడోలు–ద్వారకాతిరుమల క్షేత్ర ప్రధాన రహదారి ధ్వంసం కావడంతో బైక్లపై ప్రయాణించే భక్తులకు భద్రత లేకుండా పోయింది. ద్వారకాతిరుమలలోని కుంకుళ్లమ్మ ఆలయ సమీపంలో, నిమ్మకాయల మార్కెట్ యార్డు వద్ద, లక్ష్మీపురంలోని విర్డ్ ఆస్పత్రి వద్ద, గొల్లగూడెం సెంటర్లో, సూర్యచంద్రరావుపేట చెరువు వద్ద, పంగిడిగూడెంలో రోడ్డుపై ఏర్పడ్డ పెద్ద పెద్ద గుంతలు ప్రమాదాలకు నిలయంగా మారాయి. నిత్యం ఎంతో మంది భక్తులు ఈ గుంతల వద్ద ప్రమాదాల బారిన పడుతున్నారు. ఒకే ప్రాంతంలో 9 ప్రమాదాలు గడచిన నెలరోజుల్లో ఒక్క సూర్యచంద్రరావుపేటలోనే 10 ప్రమాదాలు జరిగాయి. అందులో ముగ్గురు మృతి చెందగా, మరో ఆరుగురు క్షతగాత్రులయ్యారు. వారంతా 108 ఆంబులెన్స్లోనే ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. అలాగే విర్డ్ ఆస్పత్రి, గొల్లగూడెం తదితర ప్రాంతాల్లోని గుంతల వద్ద నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా గురువారం ఉదయం విర్డ్ ఆస్పత్రి వద్ద గుంతలను తప్పించే క్రమంలో బైక్ అదుపు తప్పడంతో ఓ భక్తుడు తన భార్యతో సహా రోడ్డుపై పడిపోయాడు. వెంటనే ఆమె లేచి మరికొందరు యాత్రికుల సహాయంతో తన భర్తను పైకి లేపింది. వర్షాల వల్ల మరిన్ని ప్రమాదాలు తరచూ కురుస్తున్న వర్షాల కారణంగా మరిన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. నీటితో నిండిన గుంతల లోతు తెలియక వాహనదారులు వాటిలోకి వేగంగా వెళ్లి ప్రమాదాల బారిన పడుతున్నారు. కొత్త కార్లలో వచ్చే యాత్రికులు తమ వాహనాలు దెబ్బతింటున్నాయని లబోదిబోమంటున్నారు. పట్టించుకోని పాలకులు, అధికారులు పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు తరచూ ద్వారకాతిరుమల క్షేత్రాన్ని సందర్శిస్తున్నారు. అందులో ఏ ఒక్కరూ క్షేత్ర రహదారి అభివృద్ధిని పట్టించుకోవడం లేదు. దాంతో కనీసం ఈ రహదారి మరమ్మతులకు నోచుకోవడం లేదు. ఈ క్రమంలోనే కొందరు భక్తులు కూటమి ప్రభుత్వంపై మండి పడుతున్నారు. రహదారులను అభివృద్ధి చేస్తామని చెప్పి, భక్తుల శ్రేయస్సును ఇలా గాలికొదిలేసిందని ధ్వజమెత్తుతున్నారు. ప్రమాదకరంగా ద్వారకాతిరుమల క్షేత్ర రహదారి గుంతలు పడ్డ రోడ్డుపై.. నిత్యం ప్రమాదాలు స్వామి దర్శనం కాకుండానే.. క్షతగాత్రులవుతున్న భక్తులు -
మావుళ్లమ్మ భక్తులకు అన్నదాన కష్టాలు
● కూర్చొని తినే సౌకర్యం లేక ఇబ్బందులు ● ఏళ్ల తరబడి ఇరుకు గదిలోనే అన్నదానం భీమవరం(ప్రకాశం చౌక్): రాష్ట్రంలోనే ప్రముఖ దేవస్థానం శ్రీమావుళ్లమ్మ వారి దేవస్థానంలో భక్తులను అన్నదాన కష్టాలు వెంటాడుతున్నాయి. కనీసం ముప్పై మంది కూడా పట్టని గదిలో అన్నప్రసాదాన్ని అందించడంతో భక్తులు నిలబడి ఒకరిపై ఒకరూ పడుతూ అన్నప్రసాదం తినాల్సి వస్తుందని వాపోతున్నారు. అమ్మవారి ప్రసాదంగా భావించి భోజనం చేయాలంటే బయట రోడ్డుపై క్యూలైన్లో నుంచి చినపాటి సందులోకి వెళ్లి ఇరుకు గదిలో భోజనం చేసి రావాలి. దీంతో మహిళలు, చిన్న పిల్లలతో వచ్చేవారు, వృద్ధులు చాలా చాలా ఇబ్బందులు పడుతు న్నారు. అమ్మవారి వార్షికోత్సవాలు, దసరా ఉత్సవా ల వంటి సమయంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చినా కొందరికే అమ్మవారి భోజనం దక్కుతుంది. రెండు సెంట్లల్లోనే ఆఫీసు, భోజనశాల మావుళ్లమ్మ దేవస్థానంలో రెండు సెంట్లల్లో నిర్మించిన భవనంలో పైన దేవస్థానం ఆఫీసు, కింద గదిలో భోజనశాల ఉంది. ఈ భవనం ఇరుగ్గా ఉండడం వల్ల అటు ఆఫీసుకు ఇటు భోజనశాలకు కూడా సరిపోక దేవస్థానం సిబ్బంది, భక్తులు ఇబ్బందులుపడుతున్నారు. లోపల భవనంలో కనీసం నిలబడడానికి కూడా వీలు లేకపోవడంతో రోడ్డుపై భక్తులు క్యూలో నిల్చుంటున్నారు. భక్తుల వల్ల ఈ రోడ్డులో ట్రాఫిక్ సమస్య కూడా పెరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. టోకెన్ లెక్కల ప్రకారమే భోజనం మావుళ్లమ్మ దర్శనం కోసం హైదరాబాద్, విశాఖ, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి వంటి దూర ప్రాంతాలతో పాటు ఉభయగోదావరి జిల్లాల నలుమూల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. అయితే ఎంత మంది వస్తే అంత మందికి భోజనం పెట్టకుండా టోకెన్ల ప్రకారమే ఇక్కడ భక్తులకు భోజనం పెడుతున్నారు. సాధారణ రోజుల్లో 170 నుంచి 200 మందికి, ఉత్సవాల సమయంలో 250 నుంచి 300 మందికి మాత్రమే భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. ఆ భోజనం కూడా ఇరుకు గదిలో పెట్టడం వల్ల అవస్థలు పడుతూ తినాల్సి వస్తుందని భక్తులు వాపోతున్నారు. అమ్మవారికి భక్తులు సమర్పించే కానుకలు, శాశ్వత నిత్యన్నదానం కోసం వచ్చే విరాళాలతో మంచి ఆదాయం వస్తున్నప్పటికీ అమ్మవారి భోజన ప్రసాదం కొందరి భక్తులకే దొరుకుతుంది. ఆలయం వద్ద ఇన్ని ఇబ్బందులు ఉన్నా దేవదాయ ఉన్నతాధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. రోడ్డుపై క్యూలైన్లో టోకెన్ల కోసం భక్తుల అవస్థలుఇరుకు గదిలో భోజనం చేస్తున్న భక్తులు మేము ప్రతి ఏడాది దసరా, వార్షికోత్సవాల్లో మావుళ్ల మ్మను దర్శించుకోవడానికి వస్తాం. ప్రతిసారీ కూడా అమ్మవారి భోజన ప్రసాదం కోసం అవస్థలు పడుతున్నాం. చిన్న గదిలో భోజన ప్రసాదం పెట్టడం వల్ల ప్రసాదం ప్రశాంతంగా సంతృప్తిగా తినలేకపోతున్నాం. భోజనశాల విషయంలో అధికారులు చర్యలు తీసుకోవాలి. – కె.భాస్కరలక్ష్మి, హైదరాబాద్దసరా మహోత్సవాల్లో మావుళ్లమ్మ వారిని దర్శించుకోవడానికి ప్రతి ఏడాదీ వస్తాం. అయితే అమ్మవారి భోజన ప్రసాదం సెంటిమెంట్గా భావించి ఇరుకు గదైనా ఇబ్బందిగా ఉన్నా భోజనం చేస్తున్నాం. అయితే పిల్లలతో వచ్చేవారు భోజన గదికి వెళ్లే సందులో, లోపల భోజనం చేయడానికి ఖాళీ సరిపోక చాలా ఇబ్బందులు పడుతున్నారు. – కె.భాగ్యలక్ష్మి, హనుమాన్ జంక్షన్శ్రీ మావుళ్లమ్మ వారి దేవస్థానం వెనుక వైపు సుమారు 3 సెంట్లల్లో ఉన్న మున్సిపల్ స్థలంలో అద్దె ప్రాతిపదికన పలు షాపులు ఉన్నాయి. వాటిని తొలగించి ఆ స్థలం అమ్మవారికి దేవస్థానానికి నిబంధనలు మేరకు అప్పగిస్తే అన్నదాన కష్టాలు తీరుతాయని భక్తులు చెబుతున్నారు. మావుళ్లమ్మ ఆలయం కారణంగానే మున్సిపాలిటీకి షాపుల ద్వారా ఏటా రూ.5.90 లక్షల ఆదాయం సమకూరుతుంది. భక్తుల ఇబ్బందుల దృష్ట్యా మున్సిపల్ అధికారులు, దేవదాయ శాఖ ఉన్నతాధికారులు సమన్వయంతో నిర్ణయం తీసుకుంటే సమస్య పరిష్కారమవుతుందని పట్టణవాసులు చెబుతున్నారు. -
పరిమితి మేరకు వర్జీనియా సాగు చేయాలి
జంగారెడ్డిగూడెం: వర్జీనియా సాగు బోర్డు సూచించిన పరిమితి మేరకు పండిస్తూనే ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు ఆలోచన చేయాలని పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.విశ్వశ్రీ అన్నారు. జంగారెడ్డిగూడెంలోని వర్జీనియా వేలం కేంద్రాలను ఆమె గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పొగాకు పైరుకు ప్రత్యామ్నాయ పంట వైపు రైతు దృష్టి సారించాలన్నారు. 365 రోజుల పచ్చదనం, పంట మార్పిడి, సేద్యంలో మెళకువలపై నిరంతరం అవగాహన కలిగి ఉండాలన్నారు. పొగాకు రైతులు వర్జీనియా పొగాకు మాత్రమే కాకుండా ఇతర వాణిజ్య పంటలను సాగు చేయాలన్నారు. మేలు రకమైన పంటను పండిస్తే మంచి ధర వస్తుందన్నారు. 2025–26 పంట కాలానికి వర్జీనియా పొగాకు బోర్డు 142 మిలియన్ కేజీల పొగాకును అనుమతించిందన్నారు. కాబట్టి రైతులు పరిమితిలోపు పంటను సాగు చేస్తూ మేలు రకమైన పొగాకును ఉత్పత్తి చేయాలని సూచించారు. అనంతరం రైతులు పలు సమస్యలను ఈడి విశ్వశ్రీ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా పొగాకు బోర్డు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను ఆమె పరిశీలించి, శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మాట్లాడారు. కాగా పొగాకు వేలం కేంద్రానికి సంబంధించి ఉద్యోగుల భర్తీ ప్రక్రియను త్వరలోనే నిర్వహిస్తామని విశ్వశ్రీ తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఎం జీఎల్కే ప్రసాద్, ఆక్షన్ మేనేజర్ కేవీ రామాంజనేయులు, ఏఎస్లు శ్రీహరి, సురేంద్ర, రైతు నాయకులు పరిమి రాంబాబు, కరాటం రెడ్డి బాబు, ఘంటసాల గాంధీ, అల్లూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
శ్రమదానంతో ఆరోగ్య సమాజం
ఏలూరు (ఆర్ఆర్పేట): ప్రతిఒక్కరూ రోజూ కనీసం కొంత సమయం పాటు శ్రమదానం చేస్తే ఆరోగ్యవంతమైన పట్టణాలు, గ్రామాలుగా కళకళలాడతాయని ఏపీ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ బి.అనిల్కుమార్రెడ్డి సూచించారు. స్థానిక పంపుల హెడ్ వాటరు వర్క్స్ వద్ద గురువారం స్వచ్ఛతా హీ సేవ – 2025లో భాగంగా ఏక్ దిన్, ఏక్ ఘంటా, ఏక్ సాథ్ అనే థీమ్తో కలెక్టర్ కె.వెట్రిసెల్వితో కలిసి ఆయన ప్రత్యేక శుభ్రతా డ్రైవ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్కుమార్రెడ్డి మాట్లాడుతూ మంచిసేవలు అందించిన క్లాప్ మిత్రలకు అక్టోబరు 02న రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనే విజయవాడలో సభలో బహుమతులు అందించి సన్మానిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ ఎ.భాను ప్రతాప్, జెడ్పీ సీఈఓ ఎం.శ్రీహరి, డిప్యూటీ కమిషనర్ బీ. శివారెడ్డి పాల్గొన్నారు. -
ఫుడ్ పాయిజన్తో ఇద్దరు పిల్లలకు అస్వస్థత
కామవరపుకోట: ఫుడ్ పాయిజన్ వల్ల ఇద్దరు పిల్లలు అస్వస్థతకు గురైన సంఘటన గురువారం కొత్తూరు యానాదుల కాలనీలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం యానాదుల కాలనీకు చెందిన పొట్లూరి రమేష్, రమణ దంపతుల కుమారుడు మనోజ్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతుండగా, కుమార్తె రేణుకమ్మ సమీప అంగన్వాడి కేంద్రానికి వెళుతుంది. ఈ క్రమంలో మనోజ్కి సెలవులు కావడంతో గురువారం అన్నా చెల్లెలు ఇద్దరు ఇంటిదగ్గర భోజనం చేసి అంగన్వాడీ కేంద్రానికి వెళ్లారు. అక్కడ కొంతసేపటికి ఇద్దరికీ వాంతులు కావడంతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి తీసుకువెళ్లగా అక్కడ వైద్యులు ఇద్దరు పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయ్యిందని నిర్ధారించి చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం 108లో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలవరం రూరల్: బ్యాంకు ఖాతా కలిగిన ప్రతి వ్యక్తి బీమా పథకాలు సద్వినియోగం చేసుకోవాలని ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ బషీర్ తెలిపారు. పోలవరం మండలంలోని పాత పట్టిసీమ గ్రామంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గ్రామ స్థాయి జన సురక్ష కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బషీర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బ్యాంక్ ఖాతాలను సమయానికి రీ–కేవైసీ చేయించుకోవాలని, తద్వారా లావాదేవీల్లో ఎటువంటి అంతరాయం లేకుండా సులభంగా సేవలు పొందవచ్చని సూచించారు. బ్యాంకుల్లో అందుబాటులో ఉండే వివిధ బీమా పథకాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎల్డీవో నవీన్, కెనరా బ్యాంక్ డీజీఎం మాధవరావు, ఎస్బీఐ డీజీఎం పంకజ్ కుమార్, ఆర్ఎం రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. తణుకు అర్బన్: చైనాలో నిర్వహించనున్న జూనియర్ ఏషియన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలకు తణుకు శ్రీచిట్టూరి సుబ్బారావు గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ క్రీడాకారుడు సమ్మెట్ల హేమంత్శ్రీ ఎంపికై నట్లు ఎస్కేఎస్డీ మహిళా కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షురాలు చిట్టూరి సత్య ఉషారాణి తెలిపారు. ఈ నెల 13 నుంచి 21 వరకు హర్యానాలో పంచకుల నగరంలో నిర్వహించిన ఆల్ ఇండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ పోటీల్లో విజేతగా నిలిచి చాంపియన్షిప్లో పోటీల్లో పాల్గొనే జట్టులో చోటు సంపాదించినట్లు వివరించారు. అక్టోబర్ 21 నుంచి 26 వరకు చైనాలో జరిగే అంతర్జాతీయ బ్యాడ్మింటన్ పోటీలకు హేమంత్శ్రీ వెళ్లనున్నట్లు అసోసియేషన్ సెక్రటరీ మెంటే వంశీకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా హేమంత్శ్రీని కళాశాల జాయింట్ సెక్రటరీ చిట్టూరి వెంకట కృష్ణారావు, చిట్టూరి రీనాసాయి, కోచ్లు సమ్మెట్ల సతీష్బాబు యు.సుదర్శన్, ఫిజికల్ డైరెక్టర్ ఎం.రత్నకుమారి అభినందించారు. -
ఫార్మాసిస్ట్లు నిబంధనలు పాటించాలి
తణుకు అర్బన్: మందుల విక్రయాల్లో ఫార్మాసిస్ట్లు పూర్తిస్థాయిలో నిబంధనలు పాటించాలని డ్రగ్స్ ఇన్స్పెక్టర్ పి.మల్లికార్జునరావు అన్నారు. ప్రపంచ ఫార్మాసిస్ట్ డే సందర్భంగా తణుకు డ్రగ్గిస్ట్ కెమిస్ట్ అసోసియేషన్ హాలులో గురువారం నిర్వహించిన ఫార్మాసిస్టుల అసోసియేషన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మత్తు మందులు వినియోగించే వారిని గుర్తించి వారికి ఆ మందుల వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలపట్ల అవగాహన కల్పించాలని సూచించారు. ఫార్మాసిస్ట్లు వైద్యులు సూచనల మేరకు మాత్రమే మందులు విక్రయిచాలని సూచించారు. అనంతరం రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో 15 మంది అసోసియేషన్ సభ్యులు రక్తదానం చేశారు. సీనియర్ ఫార్మాసిస్ట్లను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి రామ్చందర్, ఫార్మాసిస్ట్ల సంక్షేమ రాష్ట్ర ఉప కార్యదర్శి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం: డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లుగా పనిచేసే వారి ఉద్యోగ విరమణ వయస్సు 62 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకు పెంచాలనే పంచాయితీలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఆగస్టు 31వరకు పని చేసిన, కె.గోపాల్ తన వయస్సు 65 ఏళ్లు వచ్చే వరకు వీసీ పదవిలో ఉంచాలని హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఉద్యాన వర్సిటీ వీసీ వ్యవహారం 25 రోజులుగా ఇంకా తేలలేదు. తాజాగా ఇటీవల వెంకట్రామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయంలో డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్గా పని చేసి 62 ఏళ్లు ముగియడంతో ఉద్యోగ విరమణ చేసిన డాక్టర్ నారం నాయుడు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రమాదేవి, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పని చేసి తాజాగా ఉద్యోగ విరమణ చేసిన ఓబయ్య అనే వ్యక్తి కూడా ఉద్యోగ విరమణ వయస్సును 62 నుంచి 65 సంవత్సరాలకు పెంచాలని హైకోర్టులో రిట్ పిటిషన్లు వేసినట్టు సమాచారం. ఏలూరు (ఆర్ఆర్పేట): ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్సీటీసీ) ఆధ్వర్యంలో అక్టోబర్ 7 నుంచి భారత్ గౌరవ్ యాత్ర ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు ఐఆర్సీటీసీ విజయవాడ యూనియన్ మేనేజర్ ఎం. రాజా తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఏలూరులో ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ యాత్ర సికింద్రాబాద్ నుండి ప్రారంభమై ద్వారకా, సోమనాథ్, అహ్మదాబాద్, మోథేరా, పటాన్, స్టాట్యూఆఫ్ యూనిటీ వరకు సాగుతుందని పేర్కొన్నారు. ఈ యాత్రలో ద్వారకాదీష్ టెంపుల్, నాగేశ్వర్ టెంపుల్, ద్వారకా, సోమనాథ్ ఆలయం, శబర్మతి ఆశ్రం, మోథేరాజ్ సూర్యదేవాలయం, రాణి కి వాప్ (పటాన్), సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం (ఏక్తానగర్లను సందర్శించవచ్చని వివరించారు. ఈ యాత్రకు స్లీపర్క్లాస్లో పెద్దలకు రూ.18,400లు, 11 సంవత్సరాలోపు పిల్లలకు రూ.17,300లు, థర్డ్క్లాస్ ఏసీలో పెద్దలకు రూ.30,200, పిల్లలకు రూ. 28,900లు, సెకండ్క్లాస్ ఏసీలో పెద్దలకు రూ.39,900, పిల్లలకు రూ. 38,300గా టిక్కెట్ రేటు నిర్ణయించినట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 9281495848, 9281030714 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. తాడేపల్లిగూడెం రూరల్: మోటారు సైక్లిస్ట్ను వెనుక నుంచి కారు ఢీకొన్న ప్రమాదంలో ఒక బాలుడు మృతి చెందినట్లు రూరల్ హెడ్ కానిస్టేబుల్ ఎండీ జిలానీ తెలిపారు. గురువారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని కొండ్రుప్రోలు కేఎస్ఎన్ కాలనీకి చెందిన రెడ్డి నాగబాబు(16) సుజుకీ యాక్సెస్ మోపెడ్పై తణుకు నుంచి ఏలూరు వైపుగా వస్తుండగా కొండ్రుప్రోలు జాతీయ రహదారిపై వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టడంతో మృతి చెందాడు. బుధవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనపై మృతుని తల్లి రెడ్డి మోహన లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్సీ జిలానీ తెలిపారు. -
అదును చూసి దోచేస్తున్నారు!
● రైతులతో ధాన్యం దళారుల ఆటలు ● ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో ఇష్టారీతిగా కొనుగోళ్లుతాడేపల్లిగూడెం రూరల్: వరుస తుఫాన్లు, వాయుగుండాలతో ఒక పక్క రైతు హడలిపోతుంటే మరో పక్క ధాన్యం కమీషన్దారులు మాత్రం పండుగ చేసుకుంటున్నారు. వర్షాల ప్రభావంతో పండించిన ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకునే పనిలో తాడేపల్లిగూడెం మండలంలోని రైతులు నిమగ్నమయ్యారు. అయితే ఈ వర్షాలను సాకుగా చేసుకుని రైతు నుంచి అయినకాడికి ధాన్యాన్ని దళారులు కొనుగోలు చేస్తున్నారు. ఒక్క తాడేపల్లిగూడెం మండలంలోనే ఈ ఖరీఫ్ సీజన్లో 24,300 ఎకరాల్లో వరి సాగు చేశారు. పీఆర్–126 ఏడు వేల నుంచి ఎనిమిది వేల ఎకరాలు కాగా, స్వర్ణ రకం 10 వేల ఎకరాలు, సంపత్ స్వర్ణ 7 వేల ఎకరాల్లో సాగు చేశారు. ప్రస్తుతం పీఆర్–126 రకం వరి చేలు చేతికి రావడంతో రైతులు కోతలు ప్రారంభించారు. నాలుగు వేల ఎకరాల్లో కోతలు పూర్తి ఇప్పటికే మండలంలోని నాలుగు వేల ఎకరాల్లో కోతలు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ధాన్యాన్ని గట్టెక్కించేందుకు రైతులు వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గత నాలుగు రోజుల క్రితం వరకు 75 కిలోల బస్తా ధాన్యం రూ.1190కు కొనుగోలు చేయగా, నేడు రూ.1160కు కమీషన్దారులు కొనుగోలు చేస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. నాలుగు రోజుల వ్యవధిలో బస్తాకు రూ.30 తగ్గించారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ పరిస్థితులను బట్టి రైతుల నుంచి కమీషన్దారులు ఒక్కో రోజు ఒక్కో ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే మెట్ట గ్రామాల్లో వరి కోతలు దాదాపు పూర్తి కావస్తున్నా నేటికీ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు కనుచూపు మేరలో కానరావడం లేదు. ఇదే అదనుగా కమీషన్దారులు ముందస్తుగానే అయిన కాడికి ధాన్యాన్ని కొనుగోలు చేసి, సొమ్ము చేసుకుంటున్నారు. ధాన్యం 75 కిలోల బస్తా వెయ్యి రూపాయలకు కొనుగోలు చేసేది లేదంటూ కమీషన్దారులు భీష్మించుకుని కూర్చున్నారు. ఎట్టకేలకు రూ.1160లకు కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చారు. దీంతో అప్పటికప్పుడు మెషీన్లను పెట్టి వరి కోతలు చేపట్టాం. ఏ క్షణాన వాతావరణం ఎలా ఉంటుందోనని ఆందోళన వెంటాడుతుంది. – మైనం సత్యనారాయణ, లింగారాయుడిగూడెం -
●మాకెందుకీ అవస్థలు!
మెగా డీఎస్సీ ఉద్యోగాల పబ్లిసిటీ కోసం రాష్ట్రంలో ఎంపికై న ఉపాధ్యాయులకు మునుపెన్నడూ లేని విధంగా అమరావతిలో నియామకపత్రాలు అందచేయడానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చేవారికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇస్తామని చేసిన పబ్లిసిటీ నూతన గురువులకు అవస్థలు తెచ్చిపెట్టాయి. ఉమ్మడి జిల్లాలో 1146 మంది ఎంపికై న ఉపాధ్యాయులకు, సహాయకులకు కలిపి ఏలూరు నగరంలో వివిధ పాఠశాలల్లో వసతి ఏర్పాటు చేశారు. తీరా వచ్చి చూస్తే సరైన వసతులు లేక, నేలపైనే టార్పాలిన్పై పడుకున్నారు. పాఠశాలల్లో సుమారు 300 మందికి సరిపడా బాత్రూమ్లు లేక వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏ జిల్లాకు ఆ జిల్లా అధికారులతో నియామకపు పత్రాలు అందచేస్తే ఏ ఇబ్బందులు ఉండవుకదా.. పబ్లిసిటీ కోసం మమ్మల్ని బలి చేస్తారా? అంటూ ఎంపికై న ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. –సాక్షి ఫొటోగ్రాఫర్/ఏలూరు -
మర్యాదపూర్వక కలయిక
జంగారెడ్డిగూడెం: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డిని బుధవారం రాష్ట్ర కార్యదర్శి, మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకుడు జెట్టి గురునాథరావు, పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మెట్ట ప్రాంత రైతుల సమస్యలను జగన్మోహన్రెడ్డికి వారు వివరించారు. అధినేతతో భేటీ ఏలూరు(ఆర్ఆర్పేట): వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఏలూరు నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులపై అధినేతకు వివరించారు. -
ఉప్పొంగిన ఎర్రకాలువ
కొయ్యలగూడెం: ఎర్రకాలువ గేట్లు ఎత్తడంతో కొయ్యలగూడెం మండలం మంగపతిదేవిపాలెం జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామాల మధ్య బుధవారం రాకపోకలు స్తంభించాయి. ఏజెన్సీలోని ఎగువ కురిసిన భారీ వర్షాలతో ఎర్రకాలువ జలాశయం నిండింది. దీంతో ఇరిగేషన్ శాఖ అధికారులు కరాటం కృష్ణమూర్తి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఎర్రకాలువ ఉధృతి కొనసాగింది. రెండు మండలాల మధ్య ఉన్న కల్వర్టుకి ఇరువైపులా రెవెన్యూ సిబ్బందిని గస్తీకి నియమించారు.మధ్యాహ్న భోజన కార్మికుల ఆందోళనఏలూరు (ఆర్ఆర్పేట): బిల్లులు పెండింగ్లో ఉంటే పిల్లలకు వండిపెట్టడం కష్టమని మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.నాగమణి అన్నారు. బుధవారం ఏలూరు కలెక్టరేట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథక కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగమణి మాట్లాడుతూ.. జిల్లాలోని మధ్యాహ్న భోజన కార్మికులు 3,200 మంది పనిచేస్తున్నారని కార్మికుల కుటుంబాలు గడవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉందన్నారు. పెండింగ్లో ఉన్న మూడు నెలల వేతనాలు, బిల్లులు వెంటనే చెల్లించాలని, ప్రతి నెల ఐదో తేదీలోపు బిల్లులు చెల్లించాలన్నారు. పెరుగుతున్న ధరలకనుగుణంగా మినీ చార్జీలు రూ.20కు పెంచాలన్నారు. ధర్నా అనంతరం డీఆర్ఓ విశ్వేశ్వరరావుకు వినతి పత్రం అందించారు. -
భక్తురాలి పట్ల అసభ్య ప్రవర్తన
ద్వారకాతిరుమల: శ్రీవారి దేవస్థానం టీటీడీ సదనంలో ఒక భక్తురాలి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉద్యోగికి భక్తురాలి కుటుంబ సభ్యులు దేహశుద్ధి చేశారు. ఆపై అధికారులకు ఫిర్యాదు చేయగా, సదరు ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున జరిగింది. వివరాల్లోకి వెళితే. విశాఖపట్నంకు చెందిన ఒక భక్తుడి కుటుంబం (15 మంది) స్వామివారి దర్శనార్థం సోమవారం సాయంత్రం క్షేత్రానికి విచ్చేశారు.శ్రీవారి దర్శనానంతరం వారు మద్ది ఆంజనేయ స్వామి క్షేత్రాన్ని సందర్శించారు. తిరుగు ప్రయాణంలో స్థానిక టీటీడీ సదనం వద్దకు చేరుకుని గదులు అద్దెకు తీసుకున్నారు. ఆ సమయంలో అక్కడ గుమస్తాగా విధులు నిర్వర్తిస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నారాయణ వారితో కలివిడిగా మాట్లాడాడు. అదే సమయంలో బాధిత భక్తురాలు జ్వరంతో బాధపడుతున్నట్టు తెలుసుకున్నాడు. కొద్ది సేపటి తరువాత గదిలోంచి బయటకు వచ్చిన ఆమెను ఏమ్మా.. ట్యాబ్లెట్ వేసుకున్నావా అని ఆరా తీశాడు. తిరిగి మంగళవారం తెల్లవారుజామున ఆమె కనబడగా ఏరా.. జ్వరం తగ్గిందా అని చేయి పట్టుకున్నాడు. దాంతో భక్తురాలి భర్త, కుటుంబ సభ్యులు కోపోద్రిక్తులై నారాయణపై దాడి చేశారు. అనంతరం స్వామివారి పాదుకా మండపం వద్ద ఉన్న సమాచార కేంద్రంలో బాధిత భక్తురాలు సదరు ఉద్యోగిపై ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై వెంటనే ఆలయ ఏఈఓ ఐనంపూడి రమణరాజు, సూపరింటెండెంట్ కోటగిరి కిషోర్ ప్రాథమిక విచారణ జరపగా, ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి నారాయణను ఉద్యోగం నుంచి తొలగించారు. కాగా సదరు ఉద్యోగి సుమారు పదేళ్ల నుంచి దేవస్థానంలో పనిచేస్తున్నాడని, ఇప్పటి వరకు అతడిపై ఒక్క ఫిర్యాదు కూడా లేదని, అందరితో కలివిడిగా ఉంటాడని తోటి ఉద్యోగులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ ఘటనపై అధికారులు పూర్తిస్థాయి విచారణ జరపాల్సి ఉంది. -
ఉపాధ్యాయ ఉద్యోగాలకు నియామక పత్రాల పంపిణీని కూటమి ప్రభుత్వం ప్రహసనంగా మార్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం చేసిన మెగా డీఎస్సీ నిర్వహణ, ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియకు కూటమి ప్రభుత్వం దాదాపు ఏడాదిన్నర సమయం తీసుకుంది. పట్టుదలతో చదివి
ఏలూరు (ఆర్ఆర్పేట): డీఎస్సీలో ఎంపికై న వారిలో అటు కుకునూరు, వేలేరుపాడు, ఇటు నరసాపురం, పాలకొల్లు తదితర ప్రాంతాలకు చెందిన వారు కూడా ఉన్నారు. అమరావతిలో ఈ నెల 25న వీరందరికీ నియామకపత్రాలు అందించే కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికోసం వీరందరినీ ముందు రోజు అంటే ఈ నెల 24నే ఏలూరుకు చేరుకోవాలని, అక్కడి నుంచి అమరావతి తీసుకువెళ్తామని జిల్లా విద్యాశాఖాధికారి నుంచి సమాచారం పంపించారు. కుకునూరు, వేలేరుపాడు, నరసాపురం, పాలకొల్లు వంటి ప్రాంతాల నుంచి ఏలూరు చేరుకోవడానికి దాదాపు మూడు గంటలకు పైనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఎంపికై న వీరిలో కొంతమంది గర్భిణులు, మరికొంత మంది చంటి పిల్లల తల్లులు, ఇంకొందరు వికలాంగులు ఉన్నారు. వీరంతా అన్ని గంటల పాటు ప్రయాణం చేయడం కష్టంతో కూడుకున్న పని. జిల్లాలో కొత్తగా ఎంపికై న వారు 1063 డీఎస్సీ–25లో జిల్లాలో 1074 ఖాళీలు ఉన్నట్టు గుర్తించి వాటి భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే 1063 మందిని మాత్రమే ఉద్యోగాలకు ఎంపిక చేశారు. మరో 11 పోస్టులకు అర్హులైన అభ్యర్థులు లేరంటూ ఎంపిక చేయలేదు. గతంలో ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తే అన్ని పోస్టులనూ భర్తీ చేసేవారు. రిజర్వేషన్, రోస్టర్, మెరిట్ ప్రకారం అభ్యర్థి లేకపోతే ఆ తరువాత అర్హత ఉన్న వారిని ఆ పోస్టుకు ఎంపిక చేసేవారు. కానీ కూటమి ప్రభుత్వం సంబంధిత అర్హత లేకుంటే ఆ పోస్టును పక్కన పెట్టి మరో డీఎస్సీలో భర్తీ చేస్తామని చెప్పడాన్ని కూడా విద్యారంగ నిపుణులు తప్పుపడుతున్నారు. నగరంలోని 11 పాఠశాలల్లో పడక ఏర్పాట్లు జిల్లా వ్యాప్తంగా ఎంపికై న ఉపాధ్యాయులకు నగరంలోని 11 ప్రభుత్వ పాఠశాలల్లో బస ఏర్పాటు చేశారు. పాఠశాలల్లో సౌకర్యాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. పాఠశాలల తరగతి గదుల్లోనే వారికి పడకల కోసం పరుపులు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్క తరగతి గదిలో 20 మందికి పడక ఏర్పాట్లు చేస్తున్నారు. తరగతి గదుల్లో దోమలతో ఎలా పాట్లు పడాలో అంటూ అభ్యర్థులు ఇప్పటి నుంచే ఆందోళన చెందుతున్నారు. కస్తూర్బా స్కూల్లో 20 గదుల్లో 300 మందికి, సుబ్బమ్మదేవి స్కూల్లో 12 గదుల్లో 240 మందికి, గాంధీనగర్ నగరపాలక సంస్థ హైస్కూల్లో 10 గదుల్లో 200 మందికి బస ఏర్పాటు చేశారు. సురేష్ చంద్ర బహుగుణ పోలీస్ స్కూల్లో 15 గదుల్లో 300 మందికి, పోలీస్ స్కూల్ ఆడిటోరియంలో 100 మందికి, సెయింట్ గ్జేవియర్ స్కూల్లో 20 గదుల్లో 300 మందికి, సెయింట్ ఆన్స్ బాలికోన్నత పాఠశాలలో 20 గదుల్లో 300 మందికి ఏర్పాటు చేశారు. వీటితో పాటు శనివారపు పేట హైస్కూల్లో 15 గదుల్లో 300 మందికి, వట్లూరు సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో 20 గదుల్లో 400 మందికి, అమీనాపేట సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో 10 గదుల్లో 150 మందికి, బీసీ వెల్ఫేర్ హాస్టల్లో 10 రూముల్లో 150 మందికి ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని దాదాపు 16 వేల మందిని ఒకే చోటకు చేర్చి నియామకపత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం హాస్యాస్పదం. గతంలో ఎప్పుడూ ఇలా చూడలేదు. ఎంపికై న ఉపాధ్యాయుల్లో కొంతమంది గర్భిణులు, చంటిపిల్లల తల్లులు ఉంటారు. అలాగే వికలాంగులు కూడా ఈ పోస్టులకు ఎంపికయ్యారు. వారిని ఒక రోజు ముందుగా ఏలూరుకు రమ్మనడం, మరుసటి రోజు అమరావతికి తీసుకువెళతామని ఇబ్బంది పెట్టడం ఎంత వరకూ సమంజసం. – గుగ్గులోతు కృష్ణ, ఏపీటీఎఫ్ 1938 రాష్ట్ర అకడమిక్ కన్వీనర్ నియామక పత్రాల అందజేతకు కొత్తగా ఎంపికై న టీచర్లకు పిలుపు ఎవరి దుప్పట్లు వాళ్ళే తెచ్చుకోవాలని సూచన మంచినీళ్లు కూడా ఏర్పాటు చేయలేరా ? అని ప్రశ్నిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు ఏలూరులోని 11 పాఠశాలల్లో పడక ఏర్పాట్లు ఎంపికై న కొత్తవారిని అమరావతి తీసుకెళ్లడానికి ముందు రోజు సాయంత్రమే రిపోర్ట్ చేయమని విద్యాశాఖాధికారులు తెలిపారు. ఎంపికై న 1063 మందితో పాటు జోన్ –2లో ఎంపికై న మరో 83 మందిని కూడా ఏలూరులోనే రిపోర్ట్ చేయాలని తెలపడంతో వారందరికీ బస ఏర్పాటు ఇబ్బందికరంగా మారుతుందంటున్నారు. ఎంపికై న వారితో పాటు వారి కూడా మరొకరిని తీసుకురావాలని ఆదేశాలు అందాయి. ఈ మేరకు అమరావతికి తీసుకు వెళ్ళే వారి సంఖ్య 2300 మంది అవుతున్నారు. ఇంతమందికీ ఏలూరులో 10 ప్రభుత్వ పాఠశాలల్లో బస ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా పాఠశాలల్లో వీరికి పడుకోవడానికి పరుపులు ఏర్పాటు చేస్తున్నామని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. ఈ బసకు వచ్చే వారంతా వారి వ్యక్తిగత మెడికల్ సామగ్రి తెచ్చుకోవాలని, ఎవరి బెడ్షీట్ వారే తెచ్చుకోవాలని, తలదిండు, మంచినీటి బాటిల్, గొడుగు, రెయిన్ కోటు, అభ్యర్థితో పాటు వచ్చే వారు కూడా వారి గుర్తింపు కార్డు తెచ్చుకోవాలనడం విడ్డూరంగా ఉందంటున్నారు. బసకు వచ్చే వారికి కనీసం మంచినీళ్ళు కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందా? అంటూ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. -
సరైన వసతి, రవాణా సౌకర్యాలు కల్పించాలి
ఏలూరు(మెట్రో): నియామక పత్రాల స్వీకరణకు వెళ్లే డీఎస్సీ అభ్యర్థులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా చక్కని వసతి, రవాణా సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం ప్రయాణ ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అభ్యర్థులకు ఈ నెల 25న వెలగపూడిలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో నియామక పత్రాలు అందిస్తారని, ఈ కార్యక్రమానికి అభ్యర్థులను తీసుకువెళ్లేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. అభ్యర్థులు బుధవారం బసకు సంబంధించి దుప్పట్లు, తదితర సామాను తెచ్చుకోవాల్సి ఉంటుందన్నారు. -
మడకంవారిగూడెంలో ఉద్రిక్తత
● నేవీ ఆయుధ డిపోను వ్యతిరేకిస్తూ ర్యాలీకి సన్నాహాలు ● నిరసనకారులు, పోలీసుల మధ్య వాగ్వాదం బుట్టాయగూడెం: జీలుగుమిల్లి మండలం మడకంవారిగూడెంలో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వంకవారిగూడెంలో నేవీ ఆయుధ డిపో ఏర్పాటును నిరసిస్తూ నేవీ ఆయుధ డిపో వ్యతిరేక పోరాట వేదిక ఆధ్వర్యంలో ఆ సంఘ నాయకులు, గిరిజనులు భారీ ర్యాలీకి ఏర్పాట్లు చేశారు. జీలుగుమిల్లి సర్కిల్ పరిధిలోని 3 మండలాల్లో ఎలాంటి ర్యాలీలు, సభలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఐక్య పోరాట వేదిక ఆధ్వర్యంలో మడకంవారిగూడెం నుంచి వంకవారిగూడెం మీదుగా జీలుగుమిల్లి వరకూ భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు. గిరిజన గ్రామాల్లో ఈ ర్యాలీకి అనుమతులు లేవంటూ పోలీసులు నిరసన కారులను అడ్డుకున్నారు. ఆ సమయంలో సీఐ వెంకటేశ్వరరావు, ఆందోళనకారుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ర్యాలీ నిర్వహించకుండా గ్రామాల్లో భారీ గేట్లను ఏర్పాటు చేశారు. ర్యాలీ చేసేందుకు ఐక్యపోరాట వేదిక నాయకులు, గిరిజనులు ప్రయత్నం చేశారు. ఆ సమయంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య కొద్దిసేపు గొడవ జరిగింది. ఆందోళనకారులు చొచ్చుకుపోయే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. డిపో ఏర్పాటును తిరస్కరిస్తూ ఇప్పటికే మూడుసార్లు తీర్మానం చేశామని అయినప్పటికీ డిపో ఏర్పాటుకు సన్నాహాలు చేయడం బాధాకరమని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ.రవి అన్నారు. దాట్లవారిగూడెంలో నేవీ ఆయుధ డిపోను వ్యతిరేకిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పోరాట ఐక్యవేదిక నాయకులు తెల్లం రామకృష్ణ, తగరం బాబూరావు, తెల్లం దుర్గారావు, ఈ.భూషణం, బన్నే వినోద్, పాల్గొన్నారు. -
ప్రజాభిప్రాయం ప్రకారం సాగాలి
బుట్టాయగూడెం: జీలుగుమిల్లి మండలంలో ఏర్పాటు చేయనున్న నేవీ ఆయుధ డిపో ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారమే ప్రభుత్వం ముందుకు సాగాలని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. మండలంలోని దుద్దుకూరులో మంగళవారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ 2023లో నేవీ ఆయుధ డిపో మంజూరైన సమయంలో తాను ఐక్యపోరాట వేదిక నాయకులకు, గిరిజనులకు ప్రజాభిప్రాయం ప్రకారమే ముందుకు సాగుతామని చెప్పినట్లు గుర్తు చేశారు. గిరిజన ప్రాంతంలో ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయని వాటిని గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇప్పటికే ఏజెన్సీప్రాంతంలో ఉన్న ఐదు మండలాలకు గానూ రెండు మండలాల్లో గిరిజనులు వివిధ రూపాల్లో భూములు కోల్పోయారని వ్యక్తం చేశారు. నేవీ ఆయుధ డిపో ఏర్పాటు వల్ల మళ్లీ భూములు కోల్పోయే పరిస్థితి వస్తుందని ఆయా గ్రామాల గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. 30 యాక్ట్ అమలులో ఉందని ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం చేయడం సమంజసం కాదని అన్నారు. ప్రజలు, రాజకీయ నాయకుల అభిప్రాయాలను కూడా తప్పనిసరిగా పరిగణంలోకి తీసుకోవాలని అన్నారు. లేకుంటే గిరిజనుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఏలూరు (టూటౌన్): నిరుద్యోగ సమస్యలపై ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని కోరుతూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులపై శ్వేత పత్రం విడుదల చేసి ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఎన్నికల హామీ ప్రకారం నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇవ్వాలని, ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యాలయాల్లో ప్రొఫెసర్, లెక్చరర్, టీచింగ్, నాన్ టీచింగ్, లైబ్రరీలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరారు. వలంటీర్లను కొనసాగించాలని, విద్యార్హత ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో భర్తీకి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు ఏఐవైఎఫ్, విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు. కై కలూరు: కై కలూరు పంచాయతీ దానిగూడెం దళితులపై దాడి ఘటనలో ప్రభుత్వం స్పందించకపోవడం, నిర్లక్ష్యం చేయడం దళితులపై వివక్ష చూపడమే అని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.రవి అభిప్రాయం వ్యక్తం చేశారు. బాధితుల నుంచి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎండి.ఇక్బాల్, ముత్యాల శ్రీనివాసరావులు వాస్తవ విషయాలు మంగళవారం తెలుసుకున్నారు. దళిత యువకులపై రౌడీషీట్ ఓపెన్ చేస్తామని చెబుతున్న వారిపై ఎస్పీ, ఎస్టీ కేసులు నమోదు చేయాలన్నారు. దానిగూడెం దళిత యువకుల దాడి కేసులో బాధితుల పక్షాన వాదించడానికి ప్రముఖ న్యాయవాధి, జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడా శ్రావణ్కుమార్ మచిలీపట్నం కోర్టుకు బుధవారం వస్తున్నారని నాయకులు మంగళవారం తెలిపారు. శ్రవణ్కుమార్ వస్తుండటంతో వాదనలు గట్టిగా వినిపించే అవకాశం ఉందని నాయకులు చెబుతున్నారు. చింతలపూడి: మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు తోడు ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు తమ్మిలేరు రిజర్వాయర్కు వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయం నుంచి 1,072 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. భారీ వర్షాలకు ఎగువ ఖమ్మం జిల్లా నుంచి తమ్మిలేరుకు వరద నీరు చేరుతోంది. తమ్మిలేరు ప్రాజెక్టు నీటిమట్టం ప్రస్తుతం 348.60 అడుగులకు చేరుకుందని, గోనెలవాగు నీటిమట్టం 348.27 అడుగులకు చేరుకున్నట్లు తమ్మిలేరు ఇరిగేషన్ ఏఈ లాజర్బాబు తెలిపారు. -
రోడ్డెక్కిన సచివాలయ ఉద్యోగులు
ఏలూరు (టూటౌన్): తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు మంగళవారం ఏలూరు నగరపాలక సంస్థ ఎదుట నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. హక్కుల సాధన కోసం సెప్టెంబర్ 23 నుంచి ఆందోళన కార్యక్రమాలు ప్రారంభిస్తున్నట్లు జేఏసీ వైస్ చైర్మన్ జీవీఎస్ శ్రీనివాస్ తెలిపారు. 15 రోజుల గడువు ముగిసినప్పటికీ సమస్యల పరిష్కారం కోసం ఎటువంటి స్పందన లేనందున 23 నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్న చెప్పారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల న్యాయమైన సమస్యలకు పరిష్కారం లభించని పక్షంలో ఐక్యవేదిక తరపున విజయవాడ వేదికగా మరోసారి రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించి ఉధృతంగా కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్తామని తెలిపారు. నిరసన కార్యక్రమాలు ఇలా.. 23 నుంచి 25 వరకు రోజూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు.. 26న మధ్యాహ్న భోజన విరామంలో మండల, మున్సిపల్ కార్యాలయాల ముందు ప్ల కార్డుల ప్రదర్శన.. 27న మహాత్మా గాంధీ, బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు వినతి పత్రాల సమర్పణ.. 28న విశాఖపట్నం వేదికగా ప్రాంతీయ సభతో పాటు ఆత్మగౌరవ శంఖారావం పేరిట 26 జిల్లాల్లో స్టీరింగ్ కమిటీల సమావేశాలు.. 29న సామాజిక పింఛన్ పంపిణీ నగదు బ్యాంకుల నుంచి డ్రా చేసిన అనంతరం అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి వైదొలగడం.. అక్టోబర్ 4న జిల్లా స్టీరింగ్ కమిటీల సన్నాహక సమావేశం.. అక్టోబర్ 5న రాజమహేంద్రవరం వేదికగా ప్రాంతీయ సభ. -
మండవ వెంకట్రామయ్య మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: నూజివీడు సీడ్స్ లిమిటెడ్ వ్యవస్థాపకులు మండవ వెంకటరామయ్య మృతిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. నూజివీడు సీడ్స్ను ఏర్పాటు చేసి లక్షలాది మంది రైతులకు నాణ్యమైన విత్తనాలను అందిస్తూ.. భారతదేశంలోని అతి పెద్ద హైబ్రీడ్ సీడ్ కంపెనీలలో ఒకటిగా రూపొందించేందుకు వెంకటరామయ్య చేసిన కృషిని ఎవరూ మరిచిపోలేరు. వెంకటరామయ్య కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.మండవ వెంకటరామయ్య కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. వెంకటరామయ్య కుమారుడు ప్రభాకర్రావుతో ఫోన్లో మాట్లాడారు. హైబ్రీడ్ సీడ్స్ విషయంలో వెంకటరామయ్య చేసిన కృషిని ఎవరూ మరిచిపోలేరన్నారు. వెంకటరామయ్య కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.నూజివీడు మండలంలోని తుక్కులూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, నూజివీడు సీడ్స్ చైర్మన్ మండవ వెంకట్రామయ్య (94) సోమవారం ఉదయం 7.30 సమయంలో తన స్వగృహంలో మృతిచెందారు. ఆయనకు భార్య, ఇరువురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు మండవ ప్రభాకర్రావు నూజివీడు సీడ్స్ ఎండీగా ఉన్నారు. ప్రముఖులు తుక్కులూరు వచ్చి వెంకట్రామయ్య భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. -
అక్రమ నిర్మాణాల తొలగింపు
తాడేపల్లిగూడెం: ‘కూటమి నేతల ఇష్టారాజ్యం’ శీర్షికన గతనెల 14న ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి స్పందన వచ్చింది. తాడేపల్లిగూడెంలోని కామాక్షి కమర్షియల్ కాంప్లెక్సులో పార్కింగ్కు కేటాయించిన స్థలంలో నిర్మించిన అక్రమ నిర్మాణాల్లో కొన్నింటిని ఓ నిర్మాణదారుడు స్వచ్ఛందంగా తొలగించారు. నలుగురు భాగస్వాముల్లో ఒక్కరుగా ఉన్న టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త వలవల బాబ్జీ తన వాటా కింద ఉండాల్సిన పార్కింగ్ స్థలంలో నిర్మించిన మూడు దుకాణాల గోడలను బద్దలు కొట్టించి పార్కింగ్ కోసం ఇచ్చేశారు. ఇదిలా ఉండగా ఈ నిర్మాణాల్లో భాగస్వాములుగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఎరువుల వ్యాపారి, బంగారు నగల వ్యాపారులు మాత్రం స్పందించలేదు. వారి దుకాణాలనూ తొలగించాల్సి ఉంది. -
యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడులు
చింతలపూడి: మేలైన యాజమాన్య పద్ధతుల ద్వారా అధిక దిగుబడులు సాఽధించవచ్చునని చింతలపూడి వ్యవసాయ సబ్ డివిజన్ సహాయ సంచాలకులు వై సుబ్బారావు అన్నారు. ఎంటీయూ 1064 రకం 10,032 ఎకరాలు, ఎంటీయూ 1061 రకం, ఎంటీయూ 1318 రకం , పీఎల్ 1100 రకం , బీపీటీ 5,204 రకాలను రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వరి పిలక దశలో ఉంది. వెదజల్లే పద్ధతిలో ఖర్చు తక్కువ డివిజన్ పరిధిలో వెదజల్లే పద్ధతిలో కూడా రైతులు వరిసాగు చేస్తున్నారు. మెట్టలో ఎక్కువగా నారుడులు, నాట్లు పద్ధతిలోనే సాగవుతుంది. వెదజల్లే పద్ధతిలో ఖర్చు తగ్గుతుంది. నేరుగా వెదజల్లడం వల్ల కలుపు బెడద ఉంటుంది. గడ్డి, కలుపు నిర్మూలనకు ప్రిటెలక్లోర్, సిఫినర్ ఎకరాకు 600 మి.లీ ద్రావణాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి విత్తనాలు వెదజల్లిన 3వ రోజులోపు పిచికారీ చేయాలి లేదా బ్యూటక్లోర్ ఎకరానికి 1.2 లీటర్ల ద్రావణాన్ని 20 కేజీల పొడి ఇసుకతో కలిపి పొలమంతా సమానంగా పడేట్లు విత్తిన 3వ రోజు లోపు చల్లాలి. విత్తిన 20 నుంచి 25 రోజుల లోపు వెడల్పాకు కలుపు సమస్య ఉంటే 3డి సోడియం సాల్డ్ పొడి మందును ఎకరాకు 400 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి సాధారణ పద్ధతిలో సస్యరక్షణ నాట్లు పూర్తయిన పొలానికి చిరు పొట్టదశలో వేయాల్సిన ఎరువులో నత్రజనితో పాటు మ్యూరెట్ ఆఫ్ పొటాష్ని ఎకరానికి 150 నుంచి 200 కిలోల చొప్పున తప్పక వేయాలి. ఆలస్యంగా నాట్లు వేసిన, నీళ్లు నిల్వ ఉండే పల్లపు భూముల్లో జింకు ధాతు లోపం రావడానికి అవకాశం ఉంది. పంటపై జింక్ ధాతు లోపం కనిపించినప్పుడు రెండు దఫాలుగా వారం వ్యవధిలో 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వరిసాగు చేస్తున్న రైతులు నీటి వినియోగం మీద అవగాహన పెంచుకోవాలి. అనవసరంగా ఎక్కువగా నీటిని వాడటం ద్వారా ఎరువుల వినియోగ సామర్ధ్యం తగ్గడమే కాకుండా, నీరు కూడా వృథా అవుతోంది. పిలక దశలో ఒక అంగుళం, చిరుపొట్టదశలో రెండు అంగుళాల నీటిని వినియోగించుకుని మెరుగైన దిగుబడులు సాధించాలి. సార్వాలో ముందుగా ఊడ్చిన పొలాల్లో కాండం తొలుచు పురుగు, ఆకుముడత పురుగు ఆశించే అశకాశం ఉంది. వీటి నివారణకు లీటరు నీటికి కార్టాప్ హైడ్రాక్లోరైడ్ 2 గ్రాములు లేదా క్లోరాంట్రనిలిప్రోల్ 0.3 మి.లీటర్లు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. చిరుపొట్ట దశలో ఎకరానికి కార్టాఫ్ హైట్రాక్లోరైడ్ 4జి గుళికలు 8 కిలోలు లేదా కార్బోప్యూరాన్ 3జి గుళికలు 10 కిలోలు లేదా క్లోరాంట్రనిలిప్రోల్ 0.4జి గుళికలు 4 కిలోలు వేసుకోవాలి. వరిలో ప్రొఫెనోపాస్ను నల్లి నివారణకు కొంత మంది రైతులు పిచికారీ చేస్తున్నారని, వరిలో ప్రొఫెనోపాస్ వాడటం వల్ల దోమపోటు అధికం అవుతుంది. అందువల్ల ప్రొఫెనోపాస్ బదులు ఎసిఫైట్ వాడాలి. వై సుబ్బారావు, సబ్ డివిజన్ సహాయ సంచాలకులు -
బ్రాందీ షాపులను తొలగించాలంటూ ధర్నా
నూజివీడు: మండలంలోని అన్నవరంలో నివాస గృహాలకు దగ్గరగా, పట్టణంలో మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న బ్రాందీ షాపులను వెంటనే అక్కడి నుంచి తొలగించాలని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి నిమ్మగడ్డ నరసింహా డిమాండ్ చేశారు. రెండు షాపులను అక్కడి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ పట్టణంలోని ఎకై ్సజ్ స్టేషన్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నవరంలో ఉన్న బ్రాందీ షాప్ వల్ల ఆకతాయిలు చేస్తున్న చేష్టలతో మహిళలు, విద్యార్థినులు తీవ్ర భయాందోళనలకు గురి అవుతున్నారన్నారు. అలాగే పట్టణ నడిబొడ్డున మున్సిపల్ కార్యాలయం ఎదురుగా మద్యం వ్యాపారం చేస్తూ ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగజేస్తున్నా ప్రభుత్వ అధికారులకు గానీ, ప్రజాప్రతినిధులకు గాని చీమకుట్టినట్టు కూడా లేదన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నివాస గృహాల మధ్య, మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న మద్యం షాపులను తొలగించాలన్నారు. నాయకులు మడుపల్లి నాగేంద్రరావు, చెంగల వెంకటేశ్వరావు, ఆకునూరి విఘ్నేష్, బాధిత మహిళలు పాల్గొన్నారు. -
డీజేలతో గుండె గుబేల్ !
యలమంచిలి: పండుగలు, పెళ్లిళ్లు, ఉత్సవాలు శుభకార్యం ఎలాంటిదైనా సరే డీజే శబ్దాలు ఉండాల్సిందే. డీజే సంగీతానికి దాని దగ్గర ఉండి ఉత్సాహంగా నృత్యం చేసే వారికి ఆనందంగా ఉంటుందేమో గానీ కొందరికి అదే ప్రాణ సంకటంగా మారుతోంది. పలు ప్రాంతాల్లో డీజేల వద్ద నృత్యం చేస్తూ గుండె ఆగి చనిపోయారన్న వార్తలు ఇటీవల తరచూ చూస్తున్నాం. అంతేగాక దీని వల్ల శబ్ద కాలుష్యం పెరగడంతో పాటు చెవిటి, గుండె సమస్యలు, మానసిక సమస్యలు కూడా వస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయినా వీటి నియంత్రణకు అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా డీజే సౌండ్ బాక్స్ వినియోగం బాగా పెరిగింది. వివాహం అనంతరం ఇంటికి నూతన దంపతులను తీసుకొచ్చే తరుణంలో చేసే ఊరేగింపు (మెర్వణి), రాజకీయ నాయకులకు స్వాగతం పలికేందుకు చేసే ఊరేగింపు, ఏదైనా పోటీలో గెలిచినప్పుడు చేసే ఊరేగింపు ఇలా ఒక్కటేమిటి ఆనందం వచ్చినప్పుడు చేసుకునే ఎలాంటి ఊరేగింపునకై నా డీజే బాక్స్తో సంబంరం ఉండాల్సిందే. ఈ సందర్భంగా డీజే సౌండ్ బాక్సులు చేసే శబ్దాలకు యువత ఉత్సాహపు నృత్యాలతో ఆ ప్రాంతం మార్మోగిపోవాల్సిందే. దీని వల్ల అధిక శబ్ద కాలుష్యం వెలువడుతున్నా, హృద్రోగులు, సున్నిత మనస్సు గలవారు, పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నా ఎవ్వరికీ పట్టింపు ఉండదు. వారి ఆనందం వారిదేనన్న విధంగా పరిస్థితులు మారిపోయాయి. విపరీతమైన శబ్దాలతో ఊరేగే డీజే బాక్సులు ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. అధిక శబ్ధాలు ఆరోగ్యానికి చేటు! మనం రోడ్డుపై వెళుతుంటే పెద్దగా శబ్దాలు చేస్తూ వాహనాలు వెళ్తుంటేనే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటిది గంటల తరబడి రోడ్లపై డీజే శబ్దాలతో ఊరేగింపు సాగితే ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కొందరు అర్ధరాత్రి వరకు డీజే శబ్దాలతో చేసే ఊరేగింపుతో ఎంతో మంది తీవ్ర అనారోగ్యానికి గురవున్నారు. డీజే శబ్దాలతో గుండె సమస్యలు, మానసిక సమస్యలు, వినికిడి లోపాలు, చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యానికి ఇబ్బంది ఏర్పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాహనాలకు సౌండ్ హారన్లను నియంత్రిస్తున్న అధికారులు డీజేలను ఎందుకు నియంత్రించలేకపోతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో 10 డెసిబుల్స్కు మించి శబ్దం చేయరాదు. ప్రైవేటు ప్రదేశాల (ఇల్లు, హాళ్లు)లో డీజే శబ్దాలు చేయరాదు. లిఖిత పూర్వక అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్లు, సౌండ్ బాక్సులు వాడకూడదు. నిషిద్ధ ప్రాంతాలుగా గుర్తించిన ప్రదేశాల్లో సంగీత ధ్వనులు, డ్రమ్స్ కొట్టడం, ఇతర శబ్దాలు చేయకూడదు. సినిమా థియేటర్లలో సైతం 65 డెసిబుల్స్కు మించి శబ్దం రాకూడదు. వైద్యశాలలు, విద్యా సంస్థలు, దేవాలయాలు, న్యాయ స్థానాలకు వంద మీటర్ల పరిధిలోని ప్రాంతాలను నిషిద్ధ ప్రాంతాలుగా పరిగణిస్తారు. ఇక్కడ శబ్దాలు చేయడంపై నిషేధం విధించారు. పెరిగిన డీజేల వాడకం అధిక శబ్దాలతో కాలుష్య కాటు గర్భిణులు, చిన్నారులు, వృద్ధులు, గుండె వ్యాధుల వారికి ప్రమాదం పట్టించుకోని అధికారులు -
విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శిగా రాహుల్
నరసాపురం రూరల్ : వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శిగా నరసాపురం మండలం సీతారామపురం గ్రామానికి చెందిన రాహుల్ గంటా నియమితులయ్యారు. రాహుల్ తండ్రి సుందరకుమార్ దళిత సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నారు. రాహుల్ విద్యార్థి సమస్యలపై పోరాడి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వైఎస్సార్సీపీ నాయకులు నల్లిమిల్లి జోసఫ్, ఇంజేటి జాన్ కెనడీ, కాకిలేటి ఆనందకుమార్ (మధు) పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు కోరారు. భీమవరం: పట్టణంలోని కాస్మోక్లబ్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నీస్ ర్యాంకింగ్ పోటీల్లో విజేతలకు క్లబ్ సెక్రటరీ బీవీ రామరాజు బహుమతులు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టేబుల్ టెన్నీస్ ర్యాంకింగ్ పోటీలను నిర్వహించారు. బాలికల అండర్ 17 విభాగంలో మౌపర్ణదాస్, అండర్ 19 విభాగంలో మౌపర్ణదాష్, మహిళల విభాగంలో కాజోల్ సునార్, బాలుర అండర్ 17 విభాగంలో చేతన్ సాయి పటనాన, అండర్ 19 విభాగంలో వపన్ సత్య వెంకటేష్, పురుషుల విభాగంలో తేజా తెలిదేవర సూర్య విజేతలుగా నిలిచినట్లు నిర్వాహకుడు జీపీసీ శేఖరరాజు తెలిపారు. ఆగిరిపల్లి: మండలంలో ఆదివారం రాత్రి భారీ వర్షంతోపాటు కొన్నిచోట్ల పిడుగులు పడ్డాయి. రాజవరంలో రైతు తోట రాజబాబుకు చెందిన పశువుల కొట్టం వద్ద పిడుగు పడింది. దీంతో రెండు గేదెలు మృతి చెందాయి. ఒకొక్క గేదె విలువ సుమారు రూ.లక్ష ఉంటుందని రైతు ఆవేదన చెందుతున్నాడు. కుటుంబ పోషణ కోల్పోయిన రైతును ఆదుకోవాలని సర్పంచ్ జాలాభూషణం ప్రభుత్వాన్ని కోరారు. మోటార్సైకిల్ ఢీకొని వ్యక్తి మృతి అత్తిలి: మోటార్సైకిల్ ఢీకొన్న ప్రమాదంలో కాళ్ల మండలం బండారులంకకు చెందిన ఏలూరి సుబ్బారావు మృతి చెందినట్లు ఎస్సై ప్రేమరాజు తెలిపారు. మోపెడ్పై చికిత్స నిమిత్తం పిప్పర ఆసుపత్రికి వచ్చి సుబ్బారావు తిరిగి వెళుతుండగా మంచిలి వై జంక్షన్ వద్ద మరో బైక్పై వచ్చిన వ్యక్తి ఢీ కొట్టటంతో గాయపడ్డాడు. మంచిలి ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేసి తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే సుబ్బారావు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సుబ్బారావు కుమారుడు అప్పారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు. -
కార్పొరేషన్ పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించండి
ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరు నగరంలోని పలు పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఏపీటీఎఫ్ నాయకులు సోమవారం జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేషన్లో ఉన్న ఏకోపాధ్యాయ ఎలిమెంటరీ పాఠశాలలకు క్లస్టర్లలో ఉన్న మిగులు ఉపాధ్యాయుల నుంచి ప్రతి ఏకోపాధ్యాయ పాఠశాలకు ఒకరినైనా పూర్తి విద్యా సంవత్సరం కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. నగరంలోనే అత్యధిక విద్యార్థులు కలిగిన కస్తూరిబా బాలికోన్నత పాఠశాలకు క్లస్టర్లో మిగులు ఉన్న ఉపాధ్యాయుల నుంచి అవకాశం మేరకు కొందరిని సర్దుబాటు చేస్తే విద్యార్థినులకు మరింత నాణ్యమైన విద్య అందించడానికి అవకాశం ఉంటుందన్నారు. క్లస్టర్ల నుంచి ఎలిమెంటరీలకు సర్దుబాటు చేసే ఉపాధ్యాయుల్లో ప్రతి ఎలిమెంటరీ పాఠశాలకు గణితం, ఇంగ్లీష్ సబ్జెక్టులు కలిగిన ఉపాధ్యాయులను క్లస్టర్లతో సంబంధం లేకుండా సర్దుబాటు చేస్తే విద్యార్థులకు కనీస సామర్థ్యాలు నేర్పే అవకాశం ఉంటుందన్నారు. కొందరు మండల విద్యాశాఖాధికారులు పాఠశాలలకు చెందిన పుస్తకాలు, ఇతర సామగ్రిని మండల కేంద్రానికి వచ్చి తీసుకువెళ్లాలని ప్రధానోపాధ్యాయులకు సూచిస్తున్నారని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాఠశాల వద్దకే సంబంధిత సామగ్రిని చేర్చేలా ఎంఈవోలకు తగు సూచనలివ్వాలని కోరారు. హైస్కూల్ ప్లస్ పాఠశాలల్లోని కొందరు ప్రధానోపాధ్యాయులు పీజీటీ ఉపాధ్యాయులకు వివిధ రకాల సెలవుల విషయంలో అస్పష్టతతో ఉన్నందున వారికి పాఠశాల విద్య నిబంంధనల ప్రకారం సెలవులు ఇవ్వటానికి, ఇంటర్మీడియెట్ అదనపు అధ్యయన తరగతుల విషయంలో పాఠశాల విద్య నిబంధనల ప్రకారం సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయుల మాత్రమే విధులు నిర్వహించేలా తగు సూచనలు జారీ చేయాలని కోరారు. డీఈఓకు వినతిపత్రం సమర్పించిన వారిలో ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు తాళ్ళూరి రామారావు, డీకేఎస్ఎస్ ప్రకాశ రావు, నగర అధ్యక్షుడు కే. ఆనంద కుమార్ తదితరులున్నారు. -
అద్దాల మండప నిర్మాణానికిరూ.కోటి విరాళం
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో అద్దాల మండప నిర్మాణానికి ఒక భక్తుడు రూ.కోటి విరాళం అందించారు. అనకాపల్లికి చెందిన బొండాడ కొండలరావు ముందుగా స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విరాళం చెక్కును ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తికి అందించారు. ఈ సందర్భంగా దాతకు శ్రీవారి శేష వస్త్రాన్ని కప్పి, ప్రసాదాలను అందించడంతోపాటు ప్రత్యేకంగా అభినందించారు. నిత్యాన్నదాన పథకానికి విరాళం ద్వారకాతిరుమల: శ్రీవారి నిత్యాన్నదాన పథకానికి ఒక భక్తుడు సోమవారం రూ.10,01,116 విరాళంగా అందజేశారు. హైదరాబాద్కు చెందిన తాడికొండ శేషగిరిరావు ముందుగా సతీసమేతంగా స్వామి, అమ్మవార్లను దర్శించి, ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం ఈ విరాళం చెక్కును ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తికి అందజేయగా, ఆయన దాతను సత్కరించి, అభినందించారు. దాత వెంట గ్రామానికి చెందిన పుసులూరి శ్రీధర్ తదితరులున్నారు. ఏలూరు (మెట్రో): వాహనమిత్ర పథకం అర్హుడైన ప్రతి లబ్ధిదారుడికి అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఎంపీడీఓలను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి సోమవారం వాహనమిత్ర పథకం కింద అందిన దరఖాస్తులపై జిల్లా పరిషత్ సీఈఓ, ఎంపీడీఓలతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ వాహనమిత్ర పథకం కింద అందిన దరఖాస్తుల పరిశీలన కార్యక్రమం వెంటనే పూర్తిచేయాలన్నారు. జిల్లాలో వాహనమిత్ర పథకానికి 11,770 దరఖాస్తులు అందాయని, వాటిలో 7,581 దరఖాస్తులు ఈ–కేవైసీ పూర్తి అయ్యాయని, మిగిలిన దరఖాస్తుదారుల ఈ–కేవైసీ పనులు వెంటనే పూర్తిచేసి, అర్హులైన దరఖాస్తుదారుల పరిశీలన వెంటనే పూర్తి చేయాలనీ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. భీమవరం: ఆట్యా–పాట్యా సీనియర్స్ జిల్లా స్థాయి సెలక్షన్స్ ఈనెల 23వ తేదీన భీమవరం శ్రీచింతలపాటి బాపిరాజు స్మారకోన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు జిల్లా అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మంతెన రామచంద్రరాజు, జి.కిరణ్ వర్మ తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎంపిక పోటీలు జరుగుతాయ న్నారు. ఎంపికై న జట్లు ఈనెల 25, 26 తేదీల్లో పల్నాడు జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు సెలక్షన్స్కు హాజరుకావాలని కోరారు. -
అర్జీలకు పరిష్కారం చూపాలి
ఏలూరు(మెట్రో): కలెక్టరేటు సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టరు కె.వెట్రిసెల్వి నిర్వహించారు. కలెక్టరు మాట్లాడుతూ ఫిర్యాదుదారులను ఆప్యాయతతో పలకరించి సమస్యలను పూర్తిగా విని పరిష్కారం చూపాలన్నారు. పీజీఆర్ఎస్లో ప్రజలు సమర్పించిన అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అధికారులు క్షేత్రస్థాయిలో అర్జీదారులతో స్వయంగా మాట్లాడి నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలన్నారు. వచ్చిన ప్రతి అర్జీని ఒక చాలెంజ్గా తీసుకుని పరిష్కారం చేస్తే జూనియర్ అధికారులకు మంచి స్పూర్తి కలుగుతుందన్నారు. అర్జీలు రీ ఓపెన్కు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపినప్పుడు అర్జీదారులు సంతృప్తి చెందుతారని అలాంటి పరిష్కారాలను విజయగాథలుగా జిల్లా కార్యాలయానికి పంపించాలని, పీజీఆర్ఎస్ పట్ల ప్రజల్లో మరింత నమ్మకం, గౌరవం కలుగుతుందన్నారు. టి.నరసాపురం: మండలంలో కురిసిన భారీ వర్షానికి ముగ్గురాళ్ళ వాగు, జలవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇటీవల భారీ వర్షాలతో వాగులు ఉధృతంగా ప్రవహించడంతో మండలంలోని బండివారిగూడెం–మక్కినవారిగూడెం, టి.నరసాపురం – మక్కినవారిగూడెం గ్రామాల మధ్య రెండు రోజుల పాటు వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఆదివారం రాత్రి మరోసారి భారీ వర్షం కురవడంతో ముగ్గురాళ్ళవాగు, జలవాగులు వంతెనపై నుంచి పొంగి ప్రవహిస్తుండడంతో ఆ మార్గంలో వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అధికారులు, పోలీసు సిబ్బంది వాగును పరిశీలించి రోడ్ల వద్ద హెచ్చరికలు ఏర్పాటు చేశారు. ఏలూరు(ఆర్ఆర్పేట): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా డీఎస్పీ–2025లో నూతనంగా ఎంపికై న ఉపాధ్యాయులందరూ ఈ నెల 25న అమరావతిలో నియామకపు లేఖ అందిస్తారని జిల్లా విద్యాశాఖాధికారి ఎం. వెంకటలక్ష్మమ్మ తెలిపారు. ఈ నెల 24న సాయంత్రం 4 గంటలకు ఏలూరులో నిర్వహించే వెన్యూకి వచ్చి రిపోర్ట్ చేయాలని, అక్కడి నుంచి 25న ఉదయం 8 గంటలకు బస్సు ద్వారా మధ్యాహ్నం 12 గంటలకు నేరుగా అమరావతిలో జరిగే కార్యక్రమ ప్రాంగణానికి చేరుకుంటారన్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు అమరావతిలో నియామక లేఖ అందచేస్తారన్నారు. ఏలూరు (టూటౌన్): అపరిష్కృతంగా ఉన్న విద్యుత్ ఉద్యోగుల సమస్యలను రిష్కరించాలని, తమ కోర్కెలను పరిష్కరించడంలో యాజమాన్యం మొండి వైఖరిని విడనాడాలని ఏపీఈపీడీసీఎల్ డిస్కం కో–చైర్మన్ తురగా రామకృష్ణ డిమాండ్ చేశారు. విద్యుత్ ఉద్యోగులు ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం విద్యుత్ భవన్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ వెట్రిసెల్వికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ న్యాయమైన కోర్కెలను పరిష్కరించడంలో యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తోందని, ఒప్పుకున్న డిమాండ్స్ను ఆర్డర్స్ రూపంలో ఇవ్వకుండా తాత్సారం చేస్తుందని, తప్పని పరిస్థితుల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. కాంట్రాక్ట్ లేబర్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్నారు. కారుణ్య నియామకాలు కల్పించడంలో కొత్త పేర్లు పెట్టి కన్సాలిడేట్డ్ పే ఇస్తున్న పద్ధతిని వెంటనే రద్దు చేసి గత నాలుగు దశాబ్దాల నుంచి అమలు పద్దతినే కొనసాగించాలన్నారు. తమ డిమాండ్లు నెరవేర్చని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తప్పనిసరి అయితే నిరవధిక సమ్మె చేపడుతామని తెలిపారు. -
వీఆర్ఓలుగా పదోన్నతులు కల్పించాలి
ఏలూరు (టూటౌన్): అర్హులైన వీఆర్ఏలకు వీఆర్ఓలుగా పదోన్నతులు కల్పించడంతో పాటు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వీఆర్ఏలు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఏపీ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ విధి నిర్వహణలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. పేస్కేల్ వర్తించేలా చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కె.సురేష్, ఎస్ఎస్ శ్రీను, ఎన్.షారోన్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డెక్కిన ఉద్యోగులు
ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మా సంఘం ఆధ్వర్యంలో నిరసన వారం నిర్వహించి, రోజుకో రీతిలో ప్రభుత్వానికి నిరసన తెలిపాం. అయినా ప్రభుత్వంలో స్పందన కనిపించలేదు. అక్టోబర్లో రాష్ట్ర స్థాయిలో మా సంఘం ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించడానికి రాష్ట్ర కమిటీ కార్యాచరణ ప్రకటించింది. – తాళ్ళూరి రామారావు, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం బకాయిపడిన 4 డీఏలను వెంటనే విడుదల చేయాలి. హీనపక్షంలో దసరా కానుకగా కనీసం రెండు డీఏలనైనా విడుదల చేయాలి. ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ పీఆర్సీపై తాము అధికారంలోకి వచ్చిన వెంటనే విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీనిపై ఆయన తక్షణమే స్పందించాలి. – గుగ్గులోతు కృష్ణ, ఏపీటీఎఫ్ 1938, రాష్ట్ర అకడమిక్ కన్వీనర్ఏలూరు (ఆర్ఆర్పేట): కూటమి ప్రభుత్వ పాలనలో వ్యవస్థలన్నీ రోడ్డెక్కాయి. కూటమి పాలనలో ఏ వర్గమూ సంతృప్తిగా లేదని ఈ పరిస్థితి స్పష్టం చేస్తోంది. రాష్ట్రంలో ఏ ఒక్కరి నోట విన్నా నిరసన గళాలే వినిపిస్తున్నాయి. ఉద్యోగుల అన్ని సమస్యలనూ పరిష్కరిస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన కూటమి నేతలు ఇప్పుడు వారిని పట్టించుకున్న పాపాన పోవడం లేదనే ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా ఒక్క ఉద్యోగీ కానరావడం లేదు. ప్రజల సమస్యలు ఎక్కడికక్కడే ఉండిపోతున్నాయి. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులను తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతుంటే ఉద్యోగులు తమ సమస్యలే పరిష్కారం కావడం లేదని ప్రజల వద్ద వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ చవి చూడలేదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటలకు తగినంతగా యూరియా సరఫరా చేయడం లేదని రైతులు రోడ్లెక్కారు. పీఆర్సీ, డీఏ బకాయిల కోసం టీచర్లు రోడ్లెక్కారు. దీర్ఘకాలిక సమస్యల సాధనకు విద్యుత్ ఉద్యోగులు రోడ్లెక్కారు. ఆత్మగౌరవంతో ఉద్యోగం చేసుకోనివ్వాలని సచివాలయ ఉద్యోగులు రోడ్లెక్కడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్జీఓలు రోడ్డెక్కుతామని ఇప్పటికే ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. కూటమి ప్రభుత్వ పాలన వైఫల్యానికి ఇంతకన్నా ఇంకేమి నిదర్శనం కావాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వద్ద దాచుకున్న పీఎఫ్, ఏపీజీఎల్ఐ వంటి రుణాలు కూడా ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోంది. పెరుగుతున్న ఉద్యోగుల నిరసనలు ఆర్థిక, విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఉపాధ్యాయ సంఘాలు చేపట్టిన ఉద్యమాలు ఊపందుకున్నాయి. రణభేరి పేరుతో యూటీఎఫ్ ఉద్యమానికి దిగింది. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే ఈ నెల 25న విజయవాడలో పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో రణభేరీ జాతా పేరుతో జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. ఏపీటీఎఫ్ సైతం వివిధ రూపాల్లో ఉద్యమాలు సాగిస్తోంది. ఈ నెల 11న నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. 12న మండల కేంద్రాల్లో నిరసనలు, 13, 14 తేదీల్లో ప్రజా ప్రతినిధులకు వినతులు ఇచ్చారు. 15న డివిజన్ కేంద్రాల్లో, 16న జిల్లా కేంద్రంలో నిరసనలు తెలిపారు. సచివాలయ ఉద్యోగుల డిమాండ్లు విధులకు సంబంధం లేని సర్వేలు, ఇతర పనుల నుంచి విముక్తి కలిగించాలి. శాఖల వారీగా మాతృశాఖలో విలీనం చేయాలి. సచివాలయాల్లోని అన్ని విభాగాల ఉద్యోగులకు ఒకే బేసిక్తో పదోన్నతి కల్పిస్తూ పీఆర్సీ శ్లాబ్ వర్తింపజేయాలి. సెలవు రోజుల్లో బలవంతపు విధుల నుంచి విముక్తి కలిగించాలి. రికార్డు అసిస్టెంట్ కేడర్ను జూనియర్ అసిస్టెంట్ క్యాడర్గా అప్గ్రేడ్ చేయాలి. ప్రొబేషన్ కాలానికి నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి. రోజురోజుకూ పెరుగుతున్న నిరసనలు రణభేరి పేరుతో ఉపాధ్యాయ సంఘాల ఆందోళన కనీసం స్పందించని కూటమి ప్రభుత్వం ఉద్యోగులు దాచుకున్న సొమ్ము ఇవ్వడానికీ నిధుల కొరత విద్యుత్ ఉద్యోగులు ఎన్నో సంవత్సరాలుగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రజలకు అత్యవసర సేవలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి వరకూ శాంతియుతంగా యాజమాన్యాలకు పలుసార్లు వినతిపత్రాలు సమర్పించడం, విద్యుత్ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేయడం వరకే మా పోరు కొనసాగించాం. అయినప్పటికీ యాజమాన్యాల మొండి వైఖరి విడనాడకపోవడంతో రోడ్లెక్కాల్సిన పరిస్థితి ఎదురైంది. – తురగా రామకృష్ణ, ఈపీడీసీఎల్ డిస్కం కో– చైర్మన్ సచివాలయ ఉద్యోగులదీ అదే బాట దాదాపు ఏడాదిన్నరగా ఎన్నో వేధింపులను మౌనంగా భరిస్తూ వచ్చిన సచివాలయ ఉద్యోగుల్లో చివరకు సహనం నశించింది. ఈ నేపథ్యంలో తమ ఆత్మగౌరవాన్ని వదులుకోలేక తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. ఇంటింటికీ వెళ్లి వాట్సప్ సేవలపై ప్రచారం చేసే ప్రసక్తే లేదని, అవసరమైతే నిరవధిక సమ్మెకు సిద్ధమని, తమ సమస్యలు పరిష్కరించక పోతే అక్టోబర్ 1 నుంచి పింఛన్ల పంపిణీ ఆపేస్తామంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విద్యుత్ ఉద్యోగుల దశల వారీ ఆందోళన తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లాలో విద్యుత్ ఉద్యోగులు ఉద్యమబాట పట్టారు. ఈ క్రమంలో విద్యుత్ శాఖలోని అన్ని యూనియన్లు ఏకతాటిపైకి వచ్చి జేఏసీగా ఏర్పడ్డాయి. ఈ నెల 15, 16వ తేదీల్లో నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. 17, 18 తేదీల్లో భోజన విరామ సమయాల్లో ఆందోళనలు చేపట్టారు. 19, 20 తేదీల్లో రిలే నిరాహార దీక్షలు చేశారు. సోమవారం భారీ ఎత్తున ర్యాలీగా వెళ్లి కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. -
వీఆర్ఏల గోడు పట్టదా?
● పని భారం ఎక్కువ.. జీతాలు తక్కువ ● నేడు కలెక్టర్ కార్యాలయాల వద్ద వీఆర్ఏల ధర్నా ● జీతాలు పెంచాలని వేడుకోలు కై కలూరు: కష్టానికి తగిన ప్రతిఫలం గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ)కు దక్కడం లేదు. పెరిగిన జీవన ప్రమాణాలు, నిత్యావసర ధరలతో చాలీచాలని జీతాలు సరిపోక బతుకుబండి లాగుతున్నారు. సర్వీసు రూల్స్ ప్రకారం పార్ట్ టైం ఉద్యోగులుగా పేర్కొన్నప్పటికీ పగలు, రాత్రి విధులు నిర్వహిస్తున్నారు. డిగ్రీలు, పీజీలు చదివిన వీఆర్ఏలకు పదోన్నతి లేక కుమిలిపోతున్నారు. పనిభారంపై ఎదిరించి అడిగితే విధుల నుంచి తొలగిస్తారనే భయం అందరిలోనూ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలకు సిద్దమయ్యారు. ఏలూరు జిల్లాలో 992 మంది వీఆర్ఏలు విధులు నిర్వహిస్తున్నారు. నానాటికీ పనిభారం పెరగడం, తక్కువ జీతాలతో కుటుంబం గడవకపోవడంతో వీఆర్ఏలు ఆందోళనబాటు పట్టారు. ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 18, 19 తేదీల్లో మండల తహసీల్దారు కార్యాలయాల వద్ద ధర్నాలు, వినతిపత్రం అందించడం, 20న ఆర్డీవో కార్యాలయాల వద్ద ధర్నా, విజ్ఞాపన పత్రం అందించడం వంటి కార్యక్రమాలు చేశారు. చివరిగా 22న ఆయా జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలకు పిలుపునిచ్చారు. పదోన్నతుల కోసం పడిగాపులు గ్రామ రెవెన్యూ సహాయకులకు ప్రారంభంలో రూ.3000 జీతం ఉండేది. తర్వాత రూ.6,000, చివరిగా రూ.10,500కి చేరింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి పదో తరగతి చదివిన వీఆర్ఏలకు కండిషన్ ప్రకారం రెండేళ్ళలో ఇంటర్ పూర్తి చేయాలనే షరతుతో వీఆర్వోలుగా రాష్ట్రంలో దాదాపు 7000 మందికి పదోన్నతులు కల్పించారు. 2012, 20214లో రెండు పర్యాయాలు వీఆర్ఏలకు నోటిఫికేన్ ద్వారా ఉద్యోగాలు కల్పించారు. అప్పటి నుంచి వీఆర్ఏల నోటిఫికేషన్ జరగలేదు. 2014 ముందు పనిచేసిన వీఆర్ఏలకు పదవీ విరమణ లేదు. దీంతో వారసులు విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ఉద్యోగ భద్రత లేదు. జీవో నంబరు 104తో వీఆర్వోల నియామకాలకు డిగ్రీ ఉత్తీర్ణత తీసుకొచ్చారు. డైరెక్టు నియామకాల కారణంగా అర్హత ఉన్నప్పటికీ 10 నుంచి 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న వీఆర్ఏలు పదోన్నతులకు దూరమవుతున్నారు. చాలీచాలని జీతాలతో కష్టాలు జిల్లాలోని అనేక మండల కేంద్రాలకు దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటున్నా వీఆర్ఏలను వివిధ పనులకు పిలుస్తున్నారు. రవాణా ఖర్చులను వీఆర్ఏలే భరించాల్సి వస్తోంది. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన వారిని జిల్లా కేంద్రాల్లో సైతం వినియోగిస్తున్నారు. రాష్ట్రంలో వీఆర్వోల కొరత ఉందని అర్హత కలిగిన వీఆర్ఏలకు పదోన్నతి కల్పించాలని ప్రధానంగా వీరు డిమాండ్ చేస్తున్నారు. పే స్కేలు అమలు, నామినీలను వీఆర్ఏలుగా నియమించడం, అర్హులకు పదోన్నతులు, కారణ్య నియామకాలను కోరుతున్నారు. న్యాయమైన కోర్కెలు తీర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని వీఆర్ఏలు వాపోయారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలలో వీఆర్ఏల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పింది. నిత్యావసరాల ధరలు పెరగడంతో రూ.10,500 జీతంలో కుటుంబాన్ని పోషించడం కష్టమవుతోంది. డిగ్రీ, పీజీలు చేసిన వీఆర్ఏలు పదోన్నతులు లేక మగ్గిపోతున్నాం. వీఆర్ఏలకు పదోన్నతులలో 70 శాతం రేషియో కేటాయించాలి. – బలే రాజశేఖర్, వీఆర్ఏ సంఘ అధ్యక్షుడు, కై కలూరు మండలం పేరుకే పార్టు టైం ఉద్యోగం. ఉదయం నుంచి సాయంత్రం వరకు విధులు నిర్వహిస్తున్నాం. మండల కేంద్రాలలో సైతం వివిధ రెవెన్యూ కార్యక్రమాల్లో సేవలు అందిస్తున్నాం. చాలీచాలనీ జీతాలతో ఇబ్బందులు పడుతున్నాం. వీఆర్ఏలుగా 5 సంవత్సరాలు పూర్తి చేసిన అందరికీ అర్హత ప్రకారం పదోన్నతులు కల్పించి, జీతాలు పెంచాలి. – అనిత, భుజబలపట్నం వీఆర్ఏ -
పాము కాటుకు ఇద్దరు మహిళల మృతి
పాలకొల్లు సెంట్రల్: వేర్వేరు ప్రాంతాల్లో పాము కాటుకు ఇద్దరు మహిళలు బలయ్యారు. పాలకొల్లు మండలంలోని వెలివల గ్రామానికి చెందిన కేతా దేవి (30)శనివారం ఓ తోటలో కలుపు మొక్కలు తీయడానికి వెళ్లింది. అక్కడ పాము కాటుకు గురికాగా స్థానికులు వెంటనే పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం భీమవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం దేవి మృతి చెందింది. ఆమెకు భర్త, కుమార్తె, కుమారుడు ఉన్నారు. భర్త కేవీ సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు. కూలి పనికి వెళ్లి.. చాట్రాయి: మండలంలోని చిన్నంపేట గ్రామానికి చెందిన తేళ్లూరి జెసింత(45)ఆదివారం ఉదయం కూరగాయల తోటలో కూలి పని చేస్తుండగా పాము కాటుకు గురైంది. ఆమెను చాట్రాయి పీహెచ్సీకి తరలించి వైద్యం అందించగా అనంతరం మెరుగైన వైద్య నిమిత్తం నూజివీడు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలోనే ఆమె మృతి చెందిందని అక్కడి వైద్యులు ధ్రువీకరించారు. జెసింతకు భర్త, కుమారుడు ఉన్నారు. కాగా చాట్రాయి పీహెచ్సీలో సకాలంలో వైద్యం అందించకపోవడం వలనే జెసింత మృతి చెందిందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. ఏలూరు టౌన్, దెందులూరు: ఏలూరు ఆర్టీవో కార్యాలయం సమీపంలోని ఉండవల్లి అపార్ట్మెంట్లో తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉండవల్లి అపార్ట్మెంట్స్లో ఆశ్రం ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ కే.శైలజ నివాసం ఉంటున్నారు. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి ఈనెల 17న దైవదర్శనం కోసం షిర్డీ వెళ్లారు. తిరిగి 21వ తేదీ ఆదివారం ఇంటికి తిరిగివచ్చి చూసేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా ఇంటిలోని రూ.లక్ష నగదు అపహరణకు గురైందని గుర్తించారు. సమాచారం అందుకున్న ఏలూరు వన్టౌన్ సీఐ జీ.సత్యనారాయణ ఏలూరు రూరల్ ఎస్సై జీ.నాగబాబు సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం క్లూస్ టీమ్ ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏలూరు రూరల్ ఎస్సై నాగబాబు తెలిపారు. చాట్రాయి: చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు. మండలంలోని పర్వతాపురం గ్రామానికి చెందిన చొప్పరపు రాజేష్ (29) ఈ నెల14న భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం మొద్దులగూడెంలో కొబ్బరికాయల దింపు పని నిమిత్తం వెళ్లాడు. చెట్టుపైకి ఎక్కి కాయలు కోస్తుండగా ప్రమాదవశాత్తూ కింద పడి తీవ్ర గాయాల య్యాయి. వెంటనే అతడిని విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆదివారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ముదినేపల్లి రూరల్: అధిక కట్నం తీసుకురమ్మంటూ వేధిస్తున్న భర్తపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముదినేపల్లికి చెందిన షేక్ ఫర్జనాకు ఉయ్యూరు మండలం కాటూరుకు చెందిన కార్తీక్తో నాలుగేళ్ల కిందట పరిచయం కాగా పెద్దల అంగీకారం లేకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. కాగా కార్తీక్ భార్యను తరచూ కట్నం తీసుకురాలేదంటూ మానసికంగా, శారీరకంగా వేధిస్తుండడంతో రెండేళ్ల కిందట ఫర్జనా ముదినేపల్లి వచ్చి నివసిస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం కార్తీక్ ముదినేపల్లి వచ్చి తనను కొట్టడంతో పాటు దూషించినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై వీరభద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
మహీషమ్మకు దసరా శోభ
● నేటినుంచి నూజివీడులో దసరా నవరాత్రులు ప్రారంభం ● 69వ శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు నూజివీడు: దసరా ఉత్సవాలకు పట్టణంలోని శ్రీ కోటమహిషాసురమర్ధని అమ్మవారి ఆలయం ముస్తాబైంది. ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. అలాగే ఇటు పొట్టిశ్రీరాములు బొమ్మ సెంటర్ వరకు, అటు మీసేవా కేంద్రం రోడ్డు వరకు రహదారికి ఇరువైపులా విద్యుద్దీపాలను అలంకరించారు. ఈనెల 22వ తేదీ నుంచి వచ్చేనెల 2వ తేదీ వరకు 69వ శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహించేందుకు దేవాదాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల్లో భాగంగా 22న బాలా త్రిపురసుందరీదేవిగా, 23న శ్రీ గాయత్రీదేవి, 24న శ్రీ అన్నపూర్ణాదేవి 25న శ్రీ కాత్యాయనిదేవి, 26న శ్రీ మహాలక్ష్మిదేవి, 27న శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి, 28న శ్రీ మహాచండీదేవి, 29న శ్రీ సరస్వతీదేవి, 30న శ్రీ దుర్గాదేవి, అక్టోబర్ 1న శ్రీ మహిషాసురమర్ధనిదేవి, 2న శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకరణలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. ఈ నెల 29న మూలానక్షత్రం రోజున విద్యార్థులచే శ్రీ సరస్వతీదేవి పూజ నిర్వహించను న్నారు. వచ్చేనెల 2వ తేదీన రాత్రి 8 గంటల నుంచి పోలీసు అధికారులతో శమీపూజ నిర్వహించి 10గంటల నుంచి మేళతాళాలు, కోయనృత్యాలు, చిత్రవిచిత్ర వేషాలు, కోలాటాలతో అమ్మవారి గ్రామోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవాల ఏర్పాట్లను ఆలయ ఈఓ అలివేణి పర్యవేక్షిస్తున్నారు. -
కొల్లేటికోటలో విద్యుత్ ధగధగలు
కై కలూరు: రాష్ట్రంలో ప్రసిద్ధి గాంచిన కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా దేవస్థాన పరిసరాలు విద్యుత్ దీపాలంకరణలతో కాంతులీనుతున్నాయి. ఈ నెల 22 నుంచి అక్టోబరు 2 వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు చెప్పారు. ఈ నెల 22న శ్రీచక్రార్చన, 23న దేవి ఖడ్గనామ పూజ, 24న ఆవరణపూజ, 25న అష్టోత్తర కలశపూజ, పంచామృతాభిషేకం, పంచగవ్య ప్రాశన, ఖడ్గ నామావళి కుంకుమ పూజ, 26న గులాబీ పుష్పార్చన, 27న చామంతి పూజ, 28న నవ కలశపూజ, 29న పంచామృత, పంచఫల అభిషేకం, 30న సుగంధ పరిమళ ద్రవ్యార్ధన, అక్టోబరు 1న నవమ నవావరణార్ధన, 2న శ్రీలలితా త్రిశథి, సహస్రనామ ఖడ్గమాల పూజ జరుగుతాయని, దీంతోపాటు నిత్యం లలిత సహస్రనామ కుంకుమ పూజ ఉంటుందని, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. -
ఎరువుల కొరతపై నిరసన
తాడేపల్లిగూడెం (టీఓసీ): ఎరువుల కొరత నివారించాలని కోరుతూ ఆదివారం స్థానిక బ్రహ్మానందరెడ్డి మార్కెట్లోని ఉల్లిపాయల మార్కెట్ యూనియన్ కార్యాలయంలో రైతులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చిర్ల పుల్లారెడ్డి, నాయకులు సిరపరపు రంగారావు, కసిరెడ్డి శివలు మాట్లాడుతూ రాష్ట్రానికి రావాల్సిన ఎరువుల కోటాను కేంద్రం నుంచి తెచ్చుకోకుండా రైతులను కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుందని వాపోయారు. మోసకారి మాటలతో ఎరువులు వాడకాన్ని తగ్గించుకుంటే బస్తాకు రూ.800 ఇస్తామని ప్రకటన చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కొన్ని రాష్ట్రాలు పది శాతం తక్కువ ఎరువులకు ఆమోదించాయని, కానీ చంద్రబాబు 20 శాతం తగ్గించుకోవడానికి రూ.500 కోట్లు కేంద్ర ప్రభుత్వం వద్ద ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. యూరియా వాడకం వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. -
ఎరల వాడకం.. రైతులకు లాభం
నూజివీడు: వివిధ పంటలను ఆశించే పురుగుల వల్ల రైతాంగానికి ఏటా తీరని నష్టం వాటిల్లుతోంది. వీటిని అరికట్టేందుకు వేలాది రూపాయలను వెచ్చించి రసాయన మందులను కొనుగోలు చేసి పిచికారీ చేసినా నష్టాన్ని పూర్తిగా అరికట్టలేకపోతున్నాము. ఈ నేపథ్యంలో రైతులు రసాయన మందులపైనే ఆధారపడకుండా సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితే స్థిరమైన, నాణ్యమైన ఉత్పత్తులను సాధించడానికి వీలవుతుందని నూజివీడు వ్యవసాయాధికారి పలగాని చెన్నారావు పేర్కొంటున్నారు. ఈ చర్యల్లో భాగంగా ఎరల వినియోగం గురించి రైతులు అవగాహన కలిగి ఉండాలని చెబుతున్నారు. కీటకాల స్వభావం, వాటిని ఆకర్షించే ఎరలు తదితర అంశాలపై వ్యవసాయాధికారి రైతులకు పలు సూచనలు, సలహాలు అందజేస్తున్నారు. లింగాకర్షక ఎరలు పంటలపై వాలే మగ రెక్కల పురుగుల్ని సహజంగా ఆడ రెక్కల పురుగులు ఆకర్షిస్తాయి. దీనికి గాను ఆడ రెక్కల పురుగుల తల, రెక్కలు, కాళ్లు, జననాంగాల నుంచి కొన్ని రసాయనాలను విడుదల చేస్తాయి. ఈ రసాయనాలనే కృత్రిమంగా తయారుచేసి లింగాకర్షక ఎరలుగా రూపొందిస్తున్నారు. ఈ ఎరలు ప్రధానంగా మగ రెక్కల పురుగుల ఉధృతిని అంచనా వేయడానికి ఉపయోగపడతాయి. వీటిని పాలిథిన్ సంచుల్లో, గరటా ఆకారపు పాత్రల్లో ఉంచి పొలం మధ్యలో నాలుగైదు అడుగుల ఎత్తులో కర్రలు పాతి వాటి చివరన ఎరలను ఉంచుతారు. దీని ద్వారా మగపురుగులు వచ్చి సంచుల్లో పడి చనిపోతాయి. వీటి సంఖ్యను ఆధారంగా పురుగుల ఉధృతి ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. దీపపు ఎరలు గొంగళి పురుగు జాతికి చెందిన రెక్కల పురుగులు, కొన్ని రకాల పెంకు పురుగులు పంటలను ఆశించి తీవ్రంగా నష్ట పరుస్తాయి. వీటిని నాశనం చేసేందుకు తెల్లని కాంతిని విరజిమ్మే విద్యుత్ దీపాల్ని రాత్రిపూల 7 నుంచి 11 గంటల మధ్య పొలంలో అక్కడక్కక్కడా ఏర్పాటు చేస్తే ఈ పురుగులు కాంతికి ఆకర్షితమవుతాయి. వరిలో కాండం తొలిచే పురుగు, ఆకుముడత పురుగు, చెరకులో పీకపురుగు, కాండం తొలిచే పరుగు, పత్తి, కందిలో కాయతొలిచే పురుగు, వేరుశనగలో ఎర్ర గొంగళి పురుగు, వేరు పురుగు దీపపు ఎరల చేత ఆకర్షింపబడతాయి. సాగుచేసే పంటను బట్టి పొలంలో 1.2 మీటర్ల ఎత్తులో దీపాల్ని ఏర్పాటు చేసుకోవాలి. వాటికింద వెడల్పాటి తొట్టిలో క్రిమిసంహారక మందు కలిపిన నీటిని ఉంచాలి. దీపాల వద్దకు చేరుకునే రెక్కల పురుగులు ఈ విషపు ద్రావణంలో పడి చనిపోతాయి. విద్యుత్ బల్బులు ఏర్పాటు చేసుకోలేని రైతులు రాత్రి సమయంలో సామూహికంగా మంటలువేస్తే రెక్కల పురుగులు అందులో పడి చనిపోతాయి. ఎర పంటలు పురుగుల నిర్మూలనకు ఎరపంటలు కూడా బాగా దోహదపడతాయి. పత్తిలో శనగపచ్చ పురుగు నివారణకు బంతి, తలనత్త పురుగు నివారణకు బెండ, పొగాకు లద్దె పురుగు నివారణకు ఆముదం మొక్కలను అక్కడక్కడా వేసుకోవాలి. దీనివల్ల ప్రధాన పంటకు పురగుతాకిడి తగ్గుతుంది. ఎరపంటపైనే పురుగు మందు పిచికారీ చేసి ఆయా పురుగులను తేలికగా నివారించుకోవచ్చు. తద్వారా రైతులకు సస్యరక్షణ నిమిత్తం పెట్టే పెట్టుబడులు కూడా తగ్గుతాయి. పసుపు రంగు ఎరలు పత్తి, మినుము, వంగ వంటి పంటలను ఆశించే తెల్లదోమల నిర్మూలనకు, వాటి ఉధృతిని అంచనా వేయడానికి పసుపు రంగు ఎరలు ఉపయోగపడతాయి. తెల్లదోమ జాతి పురుగులు పసుపు రంగుకు ఆకర్షితమవుతాయి. దీనికి గాను రేకులకు పసుపురంగు వేసి వాటికి జిగురు రాసి ఎకరాకు 5 చొప్పున ఏర్పాటు చేసుకుంటే ఈ తెల్లదోమలు రేకుల వద్దకు వచ్చి వాటికి అతుక్కొని చనిపోతాయి. అంతేగాకుండా రేకుల వద్దకు వచ్చే పురుగుల సంఖ్యను బట్టి వాటి తీవ్రతను అంచనా వేయడానికి వీలవుతుంది. -
2 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
● 6న స్వామివారి తిరుకల్యాణం ● 7న రథోత్సవం ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి ఆశ్వయుజమాస దివ్య బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 2 నుంచి 9 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. వాటిని పురస్కరించుకుని ఉత్సవాల ఆహ్వాన పత్రికలను రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరికి, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుకు ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి వారి క్యాంపు కార్యాలయాల్లో ఆదివారం అందజేశారు. మిగిలిన ప్రజాప్రతినిధులకు, ఉన్నతాధికారులకు అందించనున్నారు. ఇదిలా ఉంటే ఉత్సవ విశేషాలను ఈఓ మూర్తి విలేకర్లకు వెల్లడించారు. వైఖానస ఆగమాన్ని అనుసరించి పాంచాహ్నిక దీక్షతో ఈ ఉత్సవాలను 8 రోజుల పాటు అట్టహాసంగా నిర్వహిస్తామన్నారు. ఉత్సవాలు జరిగే రోజుల్లో శ్రీవారికి ఉదయం, సాయంత్రం వేళల్లో గ్రామోత్సవాలను, శ్రీహరి కళాతోరణ వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలను కనులపండువగా జరుపుతామన్నారు. అలాగే ఆలయ ముఖ మండపంలో స్వామివారు రోజుకో ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అక్టోబర్ 2 నుంచి 9 వరకు ఆలయంలో స్వామివారికి నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టు చెప్పారు. యావన్మంది భక్తులు ఈ వేడుకల్లో పాల్గొని, స్వామివారిని దర్శించి తరించాలని కోరారు. ఉత్సవాలు జరిగేదిలా.. ● వచ్చేనెల 2న ఉదయం 9.30 గంటలకు శ్రీవారిని పెండ్లి కుమారుడిగా, అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగా చేయడంతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. ఆ రోజు రాత్రి 7 గంటలకు గజవాహనంపై స్వామివారి గ్రామోత్సవం. ● 3న రాత్రి 9 గంటలకు ధ్వజారోహణ, అనంతరం హంసవాహనంపై స్వామివారి గ్రామోత్సవం. ● 4న ఉదయం 7 గంటలకు సూర్యప్రభ వాహనంపై, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం. ● 5న ఉదయం 7 గంటలకు హనుమద్వాహనంపై స్వామివారి గ్రామోత్సవం, రాత్రి 7 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం, అనంతరం వెండి శేష వాహనంపై గ్రామోత్సవం. ● 6న ఉదయం 7 గంటలకు సింహ వాహనంపై శ్రీవారి గ్రామోత్సవం, రాత్రి 8 గంటల నుంచి శ్రీ స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం, అనంతరం వెండి గరుడ వాహనంపై గ్రామోత్సవం. ● 7న రాత్రి 8 గంటల నుంచి రథోత్సవం. ● 8న ఉదయం 10.30 గంటలకు చక్రస్నానం, రాత్రి 9 గంటలకు ధ్వజావరోహణ, అనంతరం అశ్వ వాహనంపై గ్రామోత్సవం. ● 9న ఉదయం 9 గంటలకు చూర్ణోత్సవం, వసంతోత్సవం, రాత్రి 7 గంటలకు ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, పవళింపుసేవ, శ్రీపుష్పయాగం కార్యక్రమాలు జరుగుతాయి. వీటితో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రం -
నవరాత్రి కాంతులు
ద్వారకాతిరుమల: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయానికి ఉపాలయమై, క్షేత్ర దేవతగా విరాజిల్లుతోన్న శ్రీ కుంకుళ్లమ్మ అమ్మవారి ఆలయం విద్యుద్దీప అలంకారాలతో కనువిందు చేస్తోంది. ఆలయ ప్రధాన రాజగోపురం, పరిసరాలు కాంతులీనుతున్నాయి. రహదారికి ఇరువైపులా ఏర్పాటు చేసిన విద్యుత్ తోరణాలు, అమ్మవారి భారీ విద్యుత్ కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇదిలా ఉంటే గ్రామంలోని చిలుకూరి మహిళలు ప్రతి ఏటా వలె ఉత్సవాల ప్రారంభం ముందురోజు అయిన ఆదివారం రాత్రి కుంకుళ్లమ్మకు పసుపు, కుంకుమ, పట్టు వస్త్రాలు, పూలు, పండ్లను సమర్పించారు. -
భారీ వర్షంతో ఇక్కట్లు
వీరవాసరం: వీరవాసరం మండలం వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. మూడు గంటల పాటు ఏకధాటిగా వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పల్లపు ప్రాంతాల్లోని డ్రెయిన్లు వర్షపు నీటితో నిండి కాలువలుగా మారాయి. ఈ వర్షాలు వరి రైతులకు ఎంతో అనుకూలంగా ఉంటుందని పేర్కొంటున్నారు. రాయకుదురు–చింతల కోటి గరువు వెళ్లే ప్రధాన రహదారిపై రెండు భారీ కొబ్బరి చెట్లు పడిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మండలంలోని పలుచోట్ల విద్యుత్ స్తంభాలు గాలికి ఒరగడంతో విద్యుత్కు అంతరాయం కలిగింది. సంబంధిత శాఖ అధికారులు తక్షణం స్పందించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. గూడెంలో భారీ వర్షం తాడేపల్లిగూడెం (టీఓసీ): గూడెంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం పడింది. గంటకుపైగా వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ వేడిమితో ఇబ్బంది పడిన ప్రజలు సాయంత్రం కురిసిన భారీ వర్షంతో సేద తీరారు. పల్లపు ప్రాంతాలు నీటమునిగాయి. పలు ప్రాంతాలలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలో సాంకేతిక సమస్యలు, విద్యుత్ లైన్లలో సమస్యలు ఏర్పడ్డాయి. విద్యుత్ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. -
అకాల వర్షంతో తడిసిన ధాన్యం
తాడేపల్లిగూడెం మండలం ఎల్.అగ్రహారంలో తడిసిన ధాన్యం బస్తాలు ఎల్.అగ్రహారంలో ఈదురు గాలులకు నేలకొరిగిన వరి తాడేపల్లిగూడెం రూరల్: అకాల వర్షంతో మండలంలో పలు గ్రామాల్లోని ధాన్యం బస్తాలు తడిసి ముద్దయ్యాయి. ప్రధానంగా ఎల్.అగ్రహారం ఆర్ఎస్కే వద్ద నెట్టు కట్టిన ధాన్యం బస్తాలు, రాశులుగా పోసిన ధాన్యం వర్షానికి తడిసిపోయింది. ఉదయం నుంచి ఎండగా ఉండటంతో రైతు ధాన్యాన్ని బస్తాల్లోకి ఎక్కించి, నెట్టుగా వేశారు. సాయంత్రం ఒక్కసారిగా ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీంతో ధాన్యం బస్తాలు తడిసి తీరని ఆవేదన మిగిల్చింది. ఏటా ఖరీఫ్ సీజన్లో పండించిన పంట గట్టెక్కించుకునే క్రమంలో అకాల వర్షాలు రైతుపై కన్నెర్ర చేయడం పరిపాటిగా వస్తోంది. ఇటుకులగుంట, కుంచనపల్లి సబ్ స్టేషన్ సమీపంలోని వరి చేలు ఈదురు గాలుల ప్రభావానికి నేలకొరిగాయి. మరోవైపు మోదుగగుంట, అప్పారావుపేట, దండగర్ర, మాధవరం తదితర గ్రామాల్లో వర్షం జాడ లేదు. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాల రైతాంగం ఊపిరి పీల్చుకున్నారు. గత రెండ్రోజులుగా ఉదయం ఎండ, సాయంత్రం వర్షంతో ప్రజలు, రైతులు ఇబ్బంది పడుతుఉన్నారు. శనివారం 75 కిలోల బస్తా ధాన్యం రూ.1200కి విక్రయించగా, ఆదివారం పది రూపాయలు తగ్గించి రూ.1190కు కొనుగోలు చేసినట్లు రైతులు తెలిపారు. ఒక్క రోజులోనే బస్తాపై రూ.10 తగ్గించి కమిషన్ వ్యాపారులు కొనుగోలు చేశారు. కడియద్ద గ్రామంలో ధాన్యాన్ని పరిశీలించేందుకు వచ్చిన క్రమంలో త్వరలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రకటించారు. అయితే, నేటికీ ఆచరణ సాధ్యం కాకపోవడంతో కమిషన్దారులు రైతుల నుంచి అయిన కాడికి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. -
చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
నరసాపురం రూరల్: ఒంటరిగా ఇంట్లో ఉన్న మహిళపై దాడి చేసి ఆమె మెడలో బంగారం అపహరించిన నిందితుడిని ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నరసాపురం సీఐ దుర్గాప్రసాద్ వెల్లడించారు. మొగల్తూరు మండలం కాళీపట్నం తూర్పు గ్రామానికి చెందిన బళ్ళ సూర్య ఆదిలక్ష్మి (55) 30 ఏళ్లుగా భర్తను వీడి ఒంటరిగానే జీవిస్తోంది. కొద్దిపాటి మొత్తాలను వడ్డీలకు ఇస్తూ జీవనం సాగిస్తోంది. గ్రామానికి చెందిన మారోజు శ్రీనివాస్ ఆదిలక్ష్మి వద్ద గతంలో రూ.10 వేలు అప్పు తీసుకున్నాడు. ఈ క్రమంలో శనివారం తన ఇంటిలో ఉన్న కలపను విక్రయించేందుకు ఆదిలక్ష్మి శ్రీనివాస్కు చూపిస్తు ఉండగా అతడు అమైపె కరత్రో దాడి చేసి ఆమె మెడలోని బంగారు బొందు, చెవి దిద్దులు లాక్కొని ఇంటి వెనుక భాగం నుంచి పరారయ్యాడు. చుట్టుపక్కలవారు గాయపడిన ఆదిలక్ష్మిని ఆసుపత్రికి తరలించగా బాధితురాలి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆదివారం ఉదయం కాళీపట్నం చేపల చెరువు వద్ద నిందితుడు శ్రీనివాస్ను ఆరెస్ట్ చేసి, చోరీ సొత్తు రికవరీ చేశామని, నిందితుడిని కోర్టుకు హాజరుపర్చగా రిమాండ్ విధించినట్టు సీఐ తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సై జి.వాసు, స్టేషన్ సిబ్బంది ఉన్నారు. -
నారికేళం.. ధరహాసం
స్వామివారి దర్శనానికి వచ్చిన ప్రతిసారి కొబ్బరికాయ కొడుతుంటాను. కానీ ఇంత ధర ఎప్పుడూ చూడలేదు. బాగా చిన్న కాయ రూ. 30, కాస్త పెద్ద కాయ రూ.35 నుంచి రూ.40 చెప్పారు. దేవుడి దగ్గరకు వచ్చి రూ.10, రూ.20 దగ్గర వెనకాడటం ఎందుకని కొబ్బరి కాయ కొన్నాను. – నరసింహశెట్టి శ్రీనివాసరావు, భక్తుడు, విజయవాడశ్రీవారి దర్శనార్ధం క్షేత్రానికి వచ్చాను. కొండపైన దుకాణంలో ఒక్కో కొబ్బరి కాయ రూ.40, రూ.50 చెప్పారు. అంత పెట్టి కొనలేక ఒక్కో కాయకు రూ.30 ఇచ్చి, రెండు చిన్న కాయలను కొనుగోలు చేశాను. మూడు నెలల క్రితం ఈ సైజు కాయ రూ.10 ఉండేది. – కొల్లి జ్యోతి – భక్తురాలు, విజయనగరం ద్వారకాతిరుమల : కొబ్బరికాయల ధర మరింత పెరిగింది. దీపావళి, ఆ తరువాత కార్తీకమాసం సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కొబ్బరి కాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పటికే కనీవినీ ఎరుగని రీతిలో ధరలు పెరగడంతో పలు క్షేత్రాలను సందర్శిస్తున్న భక్తులు కొబ్బరి కాయలు కొనలేక గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం రైతులు వెయ్యి కొబ్బరి కాయలను రూ. 27 వేలకు విక్రయిస్తున్నారు. చిన్నా, పెద్దా, లేత, ముదురు, ఎండు, పచ్చి అనే తేడా లేకుండా అన్ని రకాల కాయలను ఇదే ధరకు అమ్ముతున్నారు. ఇదిలా ఉంటే నెల రోజుల నుంచి రికార్డు స్థాయిలో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో కొబ్బరి కాయకు రూ.20 ధర రావడాన్ని రైతులు చూడలేదు. అలాంటిది ఊహించని విధంగా ఇప్పుడు ఇంత ధర పలుకుతుండటంతో రైతులు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వరుస పండుగలు, ఆ తరువాత కార్తీకమాసం కావడంతో ధర అనూహ్యంగా పెరిగింది. ప్రస్తుత పరిస్థితులను చూస్తే నారికేళం ధర ఇప్పట్లో దిగివచ్చేలా కనిపించడం లేదు. ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు.. ప్రస్తుతం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి రోజుకు 70 లారీలకు పైగా కొబ్బరి కాయలు గుజరాత్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మద్యప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్కు ఎగుమతి అవుతున్నాయి. స్థానికంగా ధరల పెరుగుదలకు ఈ ఎగుమతులు కూడా ఒక కారణమని వ్యాపారులు చెబుతున్నారు. మహారాష్ట్ర నుంచి డిమాండ్ ఉంటే నెల క్రితమే ఒక్కో కొబ్బరికాయ ధర రూ. 28కు చేరేదని అంటున్నారు. మొక్కుబడులు వాయిదా.. కోరిన కోర్కెలు తీరడంతో శ్రీవారి క్షేత్రానికి మొక్కులు చెల్లించేందుకు వస్తున్న భక్తులు కొబ్బరి కాయల ధరలను చూసి హడలిపోతున్నారు. ఈ క్రమంలోనే 101, ఆపై కొబ్బరి కాయల మొక్కుబడి ఉన్న పలువురు భక్తులు తమ మొక్కులను వాయిదా వేసుకుంటున్నారు. సామాన్య భక్తులు సైతం అంత ధర పెట్టి కొబ్బరికాయను కొనేందుకు ఆలోచిస్తున్నారు. దాంతో కొందరు వ్యాపారులు కొబ్బరికాయ రేటు చెబితే భక్తులు కొనడం లేదని గ్రహించి, పూజా సామాగ్రితో కలిపి సెట్టు రూ.100కు విక్రయిస్తున్నారు. కొబ్బరికాయల ధరలు మరింతగా పెరిగితే వ్యాపారాలు సాగడం కష్టమేనని అంటున్నారు పుణ్యక్షేత్రాల్లో వ్యాపారులు ఒక్కో కొబ్బరి కాయను రూ.30 నుంచి రూ.45కు విక్రయిస్తున్నారు. రైతుల నుంచి అన్ని సైజుల కాయలను ఒకే ధరకు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు, వాటిని గ్రేడింగ్ చేసి అతి చిన్న కాయను రూ.30కు, మీడియం సైజు కాయను రూ.35 నుంచి రూ. 40కు, పెద్ద కాయను రూ. 45 నుంచి రూ.50కు విక్రయిస్తున్నారు. దాంతో ద్వారకాతిరుమల దివ్య క్షేత్రాన్ని సందర్శిస్తున్న భక్తులు కొబ్బరి కాయలు కొనేందుకు గగ్గోలు పెడుతున్నారు. వరుస పండుగలతో పెరుగుతున్న కొబ్బరికాయ ధరలు రైతుల వద్ద వెయ్యి కాయలు రూ. 27 వేలు క్షేత్రాల్లో సైజును బట్టి రూ.30 నుంచి రూ.50కి విక్రయాలు ముందెన్నడూ ఇంత ధర లేకపోవడంతో రైతుల హర్షం కొనేందుకు వెనకాడుతున్న భక్తులు.. తగ్గిన విక్రయాలు ఎన్నో ఏళ్ల నుంచి కొబ్బరి తోటలను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాను. కొబ్బరి కాయకు ఇంత ధర వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. గతంలో రూ.7 ఉన్న కొబ్బరి కాయ ధర ఇప్పుడు రూ. 27కు చేరింది. ప్రస్తుతం వ్యాపారులు వెయ్యి కాయలను రూ. 27 వేలకు కొంటున్నారు. హోల్సేల్ వ్యాపారులు వాటిని రూ. 30 వేలకు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. – మానుకొండ రవి – కొబ్బరి కౌలు రైతు, పంగిడిగూడెం, ద్వారకాతిరుమల మండలం గతంతో పోలిస్తే కొబ్బరికాయల విక్రయాలు బాగా తగ్గాయి. అంతెందుకు నెలరోజుల క్రితం రూ.20కు అమ్మిన కాయను, ప్రస్తుతం రూ. 30కు అమ్మాల్సి వస్తోంది. లేకపోతే గిట్టుబాటు కావడం లేదు. ధర ఎక్కువగా ఉందంటూ భక్తులు కొబ్బరి కాయలు కొనేందుకు ఆలోచిస్తున్నారు. – మసిముక్కుల గంగయ్య, కొబ్బరి కాయల వ్యాపారి, ద్వారకాతిరుమల -
వైఎస్సార్సీపీ అనుబంధ కమిటీల్లో నియామకాలు
భీమవరం: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన ఇద్దరి రాష్ట్ర అనుబంధ విభాగాల్లో నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ప్రకటన జారీ చేసింది. స్టూడెంట్ వింగ్ సెక్రటరీగా భీమవరం పట్టణానికి చెందిన గంటా రాహుల్ రిచర్డ్స్, రాష్ట్ర బూత్ కమిటీ వింగ్ జనరల్ సెక్రటరీగా వీరవాసరం మండలం కొణితివాడకు యరకరాజు ఉమా శంకర్రాజు నియమితులయ్యారు. 8 = వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర దివ్యాంగుల విభాగం ప్రధ జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన రాపోలు భావన రుషి రాష్ట్ర వీవర్స్ వింగ్ కార్యదర్శిగా, పంగిడిగూడెంకు చెందిన కొప్పుల రవిచంద్రారెడ్డి రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శిగా, తాడువాయికి చెందిన కనికళ్ల ప్రసాద్ రాష్ట్ర బూత్ కమిటీ విభాగం కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధినేత జగన్మోహన్రెడ్డి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు కృషిచేస్తామని తెలిపారు. మున్సిపల్ విభాగం కార్యదర్శిగా సుబ్బారావు చింతలపూడి: చింతలపూడి నగర పంచాయతీకి చెందిన ఆతుకూరి సుబ్బారావును రాష్ట్ర మున్సిపల్ విభాగం కార్యదర్శిగా నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. దివ్యాంగుల విభాగం ప్రధాన కార్యదర్శిగా రాజు చింతలపూడి: వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల విభాగం ప్రధాన కార్యదర్శిగా చింతలపూడి మండలం మల్లేశ్వరం గ్రామానికి చెందిన తాటిపర్తి రాజుని నియమిస్తూ శనివారం ఉత్తర్వు లు జారీ చేశారు. సాంస్కృతిక విభాగం కార్యదర్శిగా కనకరాజు కామవరపుకోట: వైఎస్సార్సీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం కార్యదర్శిగా కామవరపుకోటకు చెందిన సొసైటీ మాజీ చైర్మన్ సాయన కనకరాజును నియమించారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. టీచర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీగా ప్రతాప్ ముసునూరు/నూజివీడు: వైఎస్సార్సీపీ రాష్ట్ర టీచర్స్ యూనియన్ స్టేట్ జనరల్ సెక్రటరీగా ముసునూరు జెడ్పీటీసీ డాక్టర్ వరికూటి ప్రతాప్ నియమితు లయ్యారు. నూజివీడు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావుకు ముఖ్య అనుచరుడిగా, పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఆయనను స్టేట్ పదవికి ఎన్నుకోవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. శక్తి వంచన లేకుండా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన చెప్పారు. -
ఎరువుల షాపులపై విజిలెన్స్ దాడులు
బుట్టాయగూడెం: మండల కేంద్రమైన జీలుగుమిల్లిలో ఎరువుల డిపోలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, వ్యవసాయ అధికారులు సంయుక్తంగా శనివారం తనిఖీలు నిర్వహించారు. విజయ ట్రేడర్స్లో లైసెన్స్ లేని ఎరువులను గుర్తించినట్లు జీలుగుమిల్లి ఏఓ గంగాధర్ తెలిపారు. విజిలెన్స్ డీఎస్పీ సింగులూరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. షాపును సీజ్ చేయడంతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు చెప్పారు. సాదు ట్రేడర్స్ షాపులో రూ.1,89,414 విలువైన 19.800 టన్నుల ఎరువుల వ్యత్యాసాన్ని గుర్తించి షాపును సీజ్ చేసి, యజమానిపై కేసు నమోదు చేసినట్లు ఏఓ చెప్పారు. -
భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగం
ప్రభుత్వంలోకి వచ్చే ప్రజాప్రతినిధులు పదవీ ప్రమాణ సందర్భంగా గవర్నర్ ముందు చేసిన ప్రమాణానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. రాజ్యాంగంలోని మౌలికసూత్రాలకు భంగం కలిగిస్తున్నారు. పౌర, వ్యక్తిగత స్వేచ్ఛకు ఆటంకం కలిగిస్తున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం ప్రతి వ్యక్తికి భావ వ్యక్తీకరణ, వాక్ స్వాత్రంత్రపు హక్కులు ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లు గడిచినా ఇది ఎక్కడా అమలు కావడంలేదు. పత్రికా స్వేచ్ఛకు అవరోధం కలిగించడం మంచి పరిణామం కాదు. – హరిదాసుల రవీంద్రకుమార్, వైఎస్సార్సీపీ రాష్ట్ర ఇంటెలెక్చువల్ కమిటీ కార్యదర్శి -
శ్రీవారి సేవలో మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి
ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య క్షేత్రాన్ని శనివారం మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ముందుగా దేవస్థానం అధికారులు మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన శ్రీవారు, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో అర్చకులు, పండితులు న్యాయమూర్తికి స్వామివారి శేష వస్త్రాన్ని కప్పి వేద ఆశీర్వచనాన్ని పలుకగా, ఆలయ ఏఈఓ రమణరాజు చినవెంకన్న చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. ఏలూరు టౌన్ : ఏపీ హైకోర్టు న్యాయమూర్తి, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి కే.సురేష్రెడ్డి ఏలూరు పర్యటన నేపథ్యంలో ఏలూరు రెవెన్యూ అతిథి భవనానికి వచ్చారు. హైకోర్టు న్యాయమూర్తి సురేష్రెడ్డిని జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ మర్వాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి, మొదటి అదనపు జిల్లా జడ్జి ఎం.రామకృష్ణంరాజు, రెండో అదనపు జిల్లా జడ్జి ఇందిరా ప్రియదర్శిని, ఐదో అదనపు జిల్లా జడ్జి ఆర్వీవీఎస్ మురళీకృష్ణ, ఏడో అదనపు జిల్లా జడ్జి వై.శ్రీనివాసరావు, ఎనిమిదో అదనపు జిల్లా జడ్జి ఐ.శ్రీనివాసమూర్తి, పోక్సో స్పెషల్ జడ్జి కే.వాణిశ్రీ, పర్మినెంట్ లోక్ అదాలత్ చైర్పర్సన్ మేరీగ్రేస్ కుమారి, జిల్లాలోని ఇతర న్యాయమూర్తులు హాజరయ్యారు. -
టెక్జైట్–25 పోస్టర్ ఆవిష్కరణ
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీలో డిసెంబర్ 18 నుంచి 20 వరకు నిర్వహించనున్న టెక్జైట్–25 కార్యక్రమం పోస్టర్ను శనివారం డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ ఈ టెక్జైట్ను ఈ సారి క్వాంటం టెక్నాలజీస్–షేపింగ్ ద ఫ్యూచర్, వన్ క్యాంటమ్ లీప్ ఎట్ ఏ టైమ్ అనే థీమ్తో నిర్వహిస్తున్నామన్నారు. ఈ టెక్జైట్లో టెక్నికల్ ఈవెంట్స్, ఇన్నోవేషన్ ఎగ్జిబిషన్, రోబోటిక్స్ పోటీలు, పేపర్ ప్రజెంటేషన్లు, హాక్థాన్ పోటీలు, మేనేజ్మెంట్ కార్యకలాపాలతో పాటు సాంస్కృతిక సంబరాలను నిర్వహిస్తారన్నారు. టెక్నాలజీ, మేనేజ్మెంట్, ఇన్నోవేషన్, క్రియేటివిటీని ప్రోత్సహిస్తూ విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు ఈ టెక్జైట్ వేదికగా నిలుస్తుందన్నారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సెంట్రల్ డీన్ దువ్వూరి శ్రావణి, ఏఓ లక్ష్మణరావు, డీన్ సాదు చిరంజీవి, డీఎస్డబ్ల్యుఓ లు రాజేష్, దుర్గాభవాని, హెచ్ఓడీలు పాల్గొన్నారు. -
శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ
ద్వారకాతిరుమల: శ్రీవారికి ప్రీతికరమైనరోజు కావడంతో శనివారం అధిక సంఖ్యలో భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించారు. మద్యాహ్నం నుంచి అమావాస్య మొదలవడంతో ప్రతి వారం కంటే ఈ వారం తక్కువ మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం క్యూలైన్లు మధ్యాహ్నం వరకు భక్తులతో నిండుగా కనిపించాయి. ఆ తరువాత దర్శనం క్యూలైన్లలో, అలాగే అనివేటి మండపం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, కల్యాణకట్ట తదితర విభాగాల్లో సాధారణ భక్తుల రద్దీ కనిపించింది. నెల్లూరు జిల్లా, కందుకూరు మండలం, కమ్మవారిపాలెంకు చెందిన శ్రీ సరస్వతి కోలాట బృంద సభ్యులు 30 మంది ఉదయం అనివేటి మండపంలో ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను అలరించాయి. -
చింతలపూడి కూటమిలో కొట్లాట
చింతలపూడి కూటమిలో కొట్లాటలు, కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. మిగిలిన నియోజకవర్గాల్లో మాదిరిగా జనసేన వర్సెస్ టీడీపీ కాకుండా టీడీపీ వర్సెస్ టీడీపీ, జనసేన వర్సెస్ జనసేనలాగా రగడ సాగుతోంది. ఎమ్మెల్యే సొంగా రోషన్ వ్యవహారంపై టీడీపీ నేతలు సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేయగా, జనసేన ఇన్చార్జి తీరుపై ఆ పార్టీ నేతలు సోషల్ మీడియా వేదికగా బహిరంగంగా ఆరోపణలు గుప్పించడంతోపాటు డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్కు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. ఆదివారం శ్రీ 21 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025సాక్షిప్రతినిధి, ఏలూరు: చింతలపూడి కూటమిలో జరుగుతున్న పరిణామాల క్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ పదవిని సీనియర్లకు కాకుండా జనసేనలో కొత్తగా చేరిన వారికి కట్టపెట్టడం, దాని వెనుక నగదు లావాదేవీలు జరిగాయన్న ఆరోపణలతో నియోజకవర్గ రాజకీయం మలుపు తిరుగుతోంది. మెట్ట రాజకీయాల్లో కీలకంగా.. మెట్ట ప్రాంత రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్గా నిలి చే చింతలపూడి కూటమి వ్యవహారం రోజుకో మ లుపు తిరుగుతోంది. నిన్నమొన్నటి వరకూ సహకార సొసైటీ పదవుల పంపకాల విషయంలో జనసేన, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం, జన సేన ఇన్చార్జి ఏకంగా టీడీపీ ఎమ్మెల్యేను, ము ఖ్యులను పరోక్షంగా విమర్శిస్తూ సోషల్ మీడియా పో స్టులతో హడావుడి చేశారు. పలు సమీకరణాలు, అంతర్గత వ్యవహారాలతో చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్, జనసేన ఇన్చార్జి మేకా ఈశ్వరయ్య సర్దుబాటు చేసుకున్నారు. ఏఎంసీ పదవి చిచ్చు : తాజాగా మార్కెట్ యార్డు పదవి రెండు పార్టీల ముఖ్యుల మధ్య కాకుండా నేతల మధ్య చిచ్చురేపింది. నియోజకవర్గంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డు చైర్మన్ పదవికి మంచి డిమాండ్ ఉంది. ఏటా సుమారు రూ.9 కోట్ల నుంచి రూ.10 కోట్ల వార్షిక ఆదాయం ఉన్న మార్కెట్ యార్డు కావడం, నియోజకవర్గ స్థాయి పదవి తరహాలో ఉండటంతో జనసేన, టీడీపీ నుంచి విపరీతంగా నేతలు పదవి కోసం క్యూ కట్టి పలు రకాల లాబీయింగ్లు నిర్వహించారు. టీడీపీ నుంచి నందిగం తిలక్, సూరానేని గోపి అలాగే జనసేన నుంచి తూము నాగ విజయ్కుమార్, చీదరాల మధుబాబు ఈ పదవిని ఆశించారు. దాదాపుగా 7 నెలలకుపైగా నియామకానికి సంబంధించి తర్జనభర్జనలు, చర్చలు కొనసాగాయి. ఈ క్రమంలో ఏలూరు ఎంపీ కోటాలో తనకు ఖరారు అవుతుందని నందిగం తిలక్ భావించారు. అలాగే జనసేన కోటాలో తనకు అవకాశం వస్తుందని తూము వి జయకుమార్ ఆశించారు. ప్రజారాజ్యం పార్టీ ఆ విర్భావం నుంచి క్రియాశీలక రాజకీయాల్లో ఉంటూ చిరంజీవి రక్తదానం, నేత్రదానం శిబిరాలు నిర్వహిస్తూ జనసేనలో కీలకంగా పనిచేస్తూ జిల్లా సహా య కార్యదర్శిగా ఉన్న తనకు అవకాశం ఇస్తామని పార్టీ పెద్దలు హామీ ఇచ్చారని బలంగా నమ్మడంతో పాటు విజయ్కుమార్ అందరికీ చెప్పుకున్నారు. కట్ చేస్తే.. అనూహ్యంగా కొంత కాలం క్రితమే జన సేనలో చేరిన చిదరాల మధుబాబు సతీమణి దుర్గాపార్వతిని ఎంపిక చేశారు. నియామకం వెనుక ఎమ్మెల్యే, జనసేన ఇన్చార్జితో పాటు మంత్రి నా దెండ్ల మనోహర్ బలంగా పనిచేశారనేది టాక్. దీంతో విజయ్కుమార్ ఇన్చార్జి ఈశ్వరయ్య తీరుపై మండిపడుతూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీ డియో వైరల్గా మారింది. జన సైనికులను సోషల్ మీడియా పోస్టుల పేరిట ఇన్చార్జి అనుచరులు వేధి స్తారని, అలాగే నియామకం వెనుక నగదు లావాదేవీలున్నాయని ఆరోపించడం సంచలనంగా మారింది. నామినేటెడ్ పదవి పొందిన నేత భర్తపైన చీటింగ్ కేసు కూడా ఉందంటూ ఆరోపణలు గుప్పించడంతో జనసేన వర్సెస్ జనసేనగా రగడ సాగుతోంది. ఎమ్మెల్యే సొంగా రోషన్ మండలానికొక ముఖ్యనేతకు పెత్తనం అప్పజెప్పి పార్టీలో సీనియర్లను, మొదటి నుంచి పనిచేస్తున్న వారిని విస్మరించి ఏకపక్షంగా సాగుతుండటం చర్చనీయాంశంగా మారింది. దీంతో ప్రతి మండలంలోనూ ఎమ్మె ల్యే వ్యతిరేక గ్రూపులు బలంగా కొనసాగుతున్నాయి. కామవరపుకోటకు చెందిన కొందరు నేతలు నేరుగా సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చే శారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కొద్దిరోజులు క్రి తం సమావేశం నిర్వహించి తనపై ఎవరు ఫిర్యా దు చేసినా అధిష్టానం పట్టించుకోదని.. తాను, ఎంపీ కలిసే ఉన్నామని తమ ఇద్దరి మీద ఎవరు ఏంచెప్పినా ఉపయోగం లేదంటూ వ్యాఖ్యలు చేయడం టీడీపీలో మరో చర్చకు దారి తీసింది. సొంత పార్టీల్లోనే భగ్గుమంటున్న అసంతృప్తి ఎమ్మెల్యే తీరుపై అధిష్టానానికి టీడీపీ నేతల ఫిర్యాదు జనసేనలో ఇన్చార్జి తీరుపైనా మండిపాటు ఏఎంసీ చైర్మన్ పదవి అమ్ముకున్నారంటూ జనసేన నేత ఆరోపణలు గందరగోళంలో చింతలపూడి కూటమి రాజకీయం