Eluru
-
‘సాక్షి’ కార్యాలయాలపై దాడులు అమానుషం
గళమెత్తిన ఉద్యోగులు పెంటపాడు: రాష్ట్రంలోని ‘సాక్షి’ కార్యాలయాలపై తెలుగుదేశం పార్టీ శ్రేణుల కుట్రపూరిత దాడులను ఖండిస్తూ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం యూనిట్ ఉద్యోగులు గళమెత్తారు. సాక్షి మీడియాపై భౌతిక దాడులకు నిరసనగా పెంటపాడు మండలం ప్రత్తిపాడులోని సాక్షి యూనిట్ కార్యాలయం వద్ద సోమ వారం రాత్రి ఉద్యోగులు కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ‘సాక్షి’పై కుట్రపూరిత, అక్రమ దాడులను ఖండించాలని, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని పెద్ద ఎత్తున నినదించారు. ఉద్యోగులు పాల్గొన్నారు. పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు ‘సాక్షి’ కార్యాలయాలపై దాడిని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. దాడులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీడబ్ల్యూజే జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఏలూరులో డీఎస్పీ డి. శ్రావణ్కుమార్కు, భీమవరంలో సీఐ నాగరాజుకు జర్నలిస్ట్ సంఘాల నాయకులు ఫిర్యాదులు అందజేశారు. దాడులకు తెగబడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నూజివీడులో సీఐ సత్యశ్రీనివాస్ కు, నరసాపురంలో ఎస్సై జయలక్ష్మికి, జంగారెడ్డిగూ డెం స్టేషన్లో ఎస్సై జబీర్కి, తాడేపల్లిగూడెం స్టేషన్లోనూ మీడియా ప్రతినిధులు ఫిర్యాదులు చేశారు. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిరసన ఏలూరు టౌన్: ఏలూరు ‘సాక్షి’ కార్యాలయంపై టీ డీపీ కూటమి నేతలు దాడులపై ఏపీయూడబ్ల్యూజే ఏలూరు జిల్లా కమిటీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్కుమార్కు వినతిపత్రం నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ టీవీ జిల్లా ప్రతినిధి పోతురాజు మాట్లాడుతూ మీడియా కార్యాలయాలపై దాడు లకు పాల్పడటం సరికాదన్నారు. ఏపీయూడబ్ల్యూ జే జిల్లా ప్రధాన కార్యదర్శి బీకే కిషోర్ మాట్లాడు తూ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్య్రాన్ని హరించేలా కూటమి ప్ర భుత్వం సీనియర్ జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించటాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వం తన తీరు మార్చుకోవాలని, ఇదే తరహాలో అక్రమ కేసులు, దాడులు చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు ఉర్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ‘సాక్షి’ టీవీ డిబేట్లో ఒక అంశానికి సంబంధించి దొర్లిన తప్పునకు జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాస్, కృష్ణంరాజు బహిరంగ క్షమాపణలు చెప్పినా ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం సరి కాదన్నారు. దీనిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారని చెబుతున్నారని, ఇలాంటి చర్యలతో జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేయటాన్ని తప్పుబడుతున్నామని చెప్పా రు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు ఎస్.సంజయ్కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు వి.మధుసూర్యప్రకాష్, సీహెచ్ రామకృష్ణరాజు, ఫొటో జర్నలిస్ట్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్కే రియాజ్, సీనియర్ జర్నలిస్టులు గుండిమెడ రామచంద్రశర్మ, కర్రి అప్పలరాజు, వంశీధర్, ఎం.రాజేష్కుమార్, బి.భరత్కుమార్, గంజి చంటి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
గళమెత్తిన కార్మిక సంఘాలు
ఏలూరు (ఆర్ఆర్పేట): విశాఖ స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుల అక్రమ తొలగింపులను తక్షణమే నిలిపివేయాలని, స్టీల్ ప్లాంట్ను పరి రక్షించాలని కోరుతూ సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ఏలూరు పాతబస్టాండ్ సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులు తొలగింపులు ఆపాలని, విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలని, విశాఖ ఉక్కు సొంత గనులు కేటాయించాలని, సెయిల్లో విలీనం చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని పెద్ద పెట్టున నినదించారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్సులు డీఎన్ వీడి ప్రసాద్, కే.బుచ్చిబాబు, ఎర్ర శ్రీనివాస్ పాల్గొన్నారు. జర్నలిస్టులకు న్యాయం చేయాలి ఏలూరు (ఆర్ఆర్పేట): కేంద్రం రద్దు చేసిన రెండు కార్మిక చట్టాలను పునరుద్ధరించి జర్నలిస్టులకు న్యాయం చేయాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కేఎస్ శంకరరావు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి నల్లబ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు ఎస్డీ జబీర్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శనలో సంఘాలకు అతీతంగా పాత్రికేయులు, రైతు సంఘ ప్రతినిధులు పాల్గొని సంఘీభావం తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను అమలు చేయాలని కోరారు. పనిచేసే విలేకరులు అందరికీ ప్రభుత్వ గుర్తింపు అక్రెడిటేషన్ ఇవ్వాలని, మూడు సెంట్ల చొప్పున స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా ఫెడరేషన్ కార్యదర్శి హరీష్, సీనియర్ జర్నలిస్టు కె.బాలశౌరి, ఎం.గంగరాజు, జయరాం, హరీష్ తదితరులు పాల్గొన్నారు. నేడు మద్దిలో యోగాంధ్ర ఏలూరు(మెట్రో): గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించనున్నట్టు కలెక్టర్ తెలిపారు. అలాగే ఈనెల 18న కామవరపుకోట మండలం జీలకర్రగూడెం–గుంటుపల్లి బౌద్ధారామాల వద్ద యోగాసనాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటుచేశామన్నారు. ఏలూరులో ర్యాలీఏలూరు (ఆర్ఆర్పేట): యోగాంధ్ర అవగాహన కార్యక్రమంలో భాగంగా సోమవారం ఏలూరు సీఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్ నుంచి ఇండోర్ స్టేడియం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ వెట్రిసెల్వి, జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఎమ్మెల్యే బడేటి చంటి, జేసీ పి. ధాత్రిరెడ్డి, మేయర్ నూర్జహాన్ పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధిపై దృష్టి సారించాలి ఏలూరు(మెట్రో): జిల్లాలో వృద్ధిరేటు సాధన దిశగా జిల్లా, నియోజకవర్గాల వారీగా అభివృద్ధి, విజన్ ప్లాన్ల అమలుకు అధికారులు ప్రత్యే క దృష్టి సారించాలని రాష్ట్ర పౌర సరఫరాల శా ఖ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను కోరారు. అమరావతి నుంచి సో మవారం రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గాల విజన్ ప్లాన్లను ముఖ్యమంత్రి వర్చువల్గా విడుదల చేశారు. కలెక్టరేట్లో ఈ కార్యక్రమాన్ని వీడి యో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించిన అనంతరం మంత్రి మనోహర్ జిల్లా, నియోజకవర్గ అభివృద్ధి విజన్ ప్లాన్పై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. కలెక్టరేట్లోని ముఖ్య ప్రణాళికాధికారి కార్యాలయంలో ఏర్పాటుచేసిన జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాన్ని మంత్రి మనోహర్ ప్రారంభించారు. కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జేసీ పి.ధాత్రిరెడ్డి, డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, సీపీఓ వాసుదేవరావు పాల్గొన్నారు. డీఎస్సీ పరీక్షలకు 720 మంది హాజరు ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరులో సోమవారం నిర్వహించిన డీఎస్సీ పరీక్షలకు 720 మంది అభ్యర్థులు హాజరయ్యారు. నగరంలోని సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో ఉదయం 180 మందికి 179 మంది, మధ్యాహ్నం 180 మందికి 159 మంది హాజరయ్యారు. సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 200 మందికి 196 మంది, మధ్యాహ్నం 200 మందికి 186 మంది హాజరయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు. -
మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా సెకండరీ గ్రేడ్ టీచర్లకు మాన్యువల్ విధానంలోనే కౌన్సెలింగ్ నిర్వహించాలని, ఉపాధ్యాయుల నిరసనలతో ప్రభుత్వం దిగిరాక తప్పదని ఫ్యాప్టో రాష్ట్ర చైర్మన్ లంకలపల్లి సాయి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పూర్వపు పశ్చిమగోదావరి జిల్లా కార్యాలయం వద్ద సోమవారం ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన నిరాహార దీక్ష శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. బదిలీల అంశంలో ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. తమ డిమాండ్ల సాధన కోసం మంగళవారం పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించనున్నామన్నారు. దీక్షల్లో పాల్గొన్నవారికి ఏపీటీఎఫ్ 1938 రాష్ట్ర అకడమిక్ కన్వీనర్ గుగ్గులోతు కృష్ణ మజ్జిగ ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఎస్టీయూ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కేఆర్ పవన్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ ముస్తఫా అలీ, రవికుమార్ రుద్రాక్షి, యూటీయూ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు విజయ రామరాజు, ఏపీటీఎఫ్ 1938 ఏలూరు జిల్లా అధ్యక్షుడు జి.మోహన్, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు బి.రమణ, ఎస్టీయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి పీబీవీఎన్ఎల్ నారాయణ, వైఎస్ఆర్టీఏ ఏలూరు జిల్లా అధ్యక్షుడు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. -
11న చలో మంగళగిరి
ఏలూరు (ఆర్ఆర్పేట): కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల 11న చేపట్టిన చలో మంగళగిరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కే. శ్రీనివాస్, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ కోరారు. సోమవారం స్థానిక అన్నే భవనంలో కౌలు రైతుల చలో మంగళగిరి కరపత్రాలను ఆవిష్కరించారు. కౌలు రైతుల సమస్యలు పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కౌలు రై తులందరికీ గుర్తింపు కార్డులు మంజూరు చేసి అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం రూ.20 వేలు అందించాలని, వడ్డీ లేని పంట రుణాలు ఇవ్వాలని కోరారు. ఈనెల 11న మంగళగిరిలోని ఎన్నారై ఆస్పత్రి నుంచి ఉదయం 10 గంటలకు ర్యాలీ ప్రారంభమవుతుందని కౌలు రైతులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. -
సంక్షేమానికి తూట్లు.. సంక్షోభం నిండేట్లు
రేపు క్యాంపస్ డ్రైవ్ ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరు ప్రభుత్వ ఐటీఐ, ఇండస్ట్రీయల్ ఎస్టేట్లో ఈనెల 11న క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నారు. 08812–230269లో సంప్రదించవచ్చు. మంగళవారం శ్రీ 10 శ్రీ జూన్ శ్రీ 2025● నాడు.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంక్షేమమే పరమావధిగా పాలన సాగించారు.. పేదల జీవితాల్లో వెలుగులు నింపేలా వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టారు.. ఇంటి ముంగిళ్లలోకే సర్కారీ సేవలను అందించి పాలనలో కొత్త ఒరవడిని సృష్టించారు. విద్య, వైద్యరంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు.. మహిళా సాధికారత లక్ష్యంగా పథకాలు అందించారు.. అన్నదాతలకు స్థానికంగా సేవలందించేలా రైతు భరోసాకేంద్రాలు ఏర్పాటుచేశారు. గిరిపుత్రులకునేనున్నానంటూ.. ఆరోగ్య భరోసా కల్పించారు. నాటి పాలనలో సంక్షేమం, సుభిక్షం పరవళ్లు తొక్కాయి. ఏలూరు టౌన్: కూటమి ప్రభుత్వం రైతుల నడ్డి విరిచింది. ఏడాది పాలనలో పెట్టుబడి సాయం ఒక్క రూపాయి ఇవ్వకపోగా.. పంటలకు గిట్టుబాటు ధరలు కూడా కల్పించలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జిల్లాలో 2,35,847 మంది రైతులకు రైతు భరోసా కింద రూ.1,839.24 కోట్ల లబ్ధి చేకూర్చారారు. అలాగే 97,584 మంది రైతులకు సున్నా వడ్డీ పంట రుణాల కింద రూ.97.29 కోట్లు అందించారు. ఉచిత విద్యుత్ కింద 70,960 సర్వీసులకు రూ.2467.25 కోట్లు ఖర్చు చేశారు. రూ.60.94 కోట్లతో సుమారు 228 రైతు భరోసా కేంద్రాలు నిర్మించి రైతులకు సేవలందించారు. అయితే కూటమి ప్రభుత్వంలో ఈ కేంద్రాలు నిరుపయోగంగా మారుతున్నాయి. గ్రామీణ వైద్యంలో విప్లవం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా ఇంటికే వైద్య సేవలందించారు. కూటమి ప్రభుత్వంలో ఈ విధానం అమలు కావడం లేదు. రూ.39.86 కోట్లతో 178 హెల్త్ క్లినిక్స్ నిర్మాణం చేపట్టి పల్లెల్లో మెరుగైన వైద్య సేవలందించారు. విద్యారంగం.. మహోన్నతం గత ప్రభుత్వంలో విద్యారంగంలో సంస్కరణకు మాజీ సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. జిల్లాలో 2,032 బడులను నాడు–నేడు పథకంలో రూ.270.75 కోట్లతో ఆధునికీకరించారు. ఇంగ్లిష్ మీడియం, డిజిటల్ బోధనలు అమలులోకి తెచ్చారు. నేడు కూటమి సర్కారులో నాడు–నేడు పథకాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రేషన్ వాహనాల రద్దు : జిల్లాలో ప్రతి కుటుంబానికీ తమ ఇంటి సమీపంలోనే రేషన్ అందించేలా 395 వాహనాలను జిల్లాలోని 1,123 రేషన్ షాపులకు గత ప్రభుత్వం అనుసంధానం చేసింది. అలాగే వాహనంలో ఇద్దరికి చొప్పున ఉపాధి కల్పించింది. ఇలా జిల్లాలోని 6,31,044 కార్డుదారులకు ప్రతి నెలా 8,791.03 టన్నుల బియ్యం, 218.75 టన్నుల పంచదార, కందిపప్పు, గోధుమ పిండి, ఆయిల్ ప్యాకెట్లను పంపిణీ చేసింది. అయితే కూటమి ప్రభుత్వం రేషన్ వాహనాలను రద్దు చేసి ప్రజలకు ఇంటి వద్దనే రేషన్ అందుకునే సౌకర్యాన్ని దూరం చేసింది. అందరికీ ‘గృహ’యోగం గత ప్రభుత్వంలో జిల్లాలో 1,16,431 మందికి ఇళ్ల పట్టాలను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించి అందించింది. 98,874 ఇళ్ల నిర్మాణాల కోసం రూ.713.17 కోట్లు ఖర్చు చేశారు. జిల్లాలో 654 మంది రైతులకు 524.116 ఎకరాల భూమి పంపిణీ చేశారు. 2003 నుంచి 22(ఎ)లో ఉన్న 11715.32 ఎకరాల భూమికి విముక్తి కల్పించి 9,172 మందికి మేలు కలిగించారు. నిషేధిత జాబితాలో ఉన్న 391.45 ఎకరాల భూమిని అర్హులైన 611 మందికి ఎస్సీ లబ్ధిదారులకు అందించారు. 26 గ్రామాల్లో 27.31 ఎకరాల భూమిని ఎస్సీ శ్మశాన వాటికలకు కేటాయించారు. ఏలూరులో వైద్య కళాశాల దశాబ్దాల కలగా ఉన్న ఏలూరులో ప్రభుత్వ వైద్య కళాశాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం సాకారం చేసింది. రూ.525 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం రెండేళ్లకు గానూ 300 మంది వైద్య విద్య అభ్యసిస్తున్నారు. మొదటి ఏడాది 150 మందితో ఎంబీబీఎస్ తరగతులు 2023 సెప్టెంబర్ 2న ప్రారంభిస్తే, రెండో ఏడాది 2024 సెప్టెంబర్లో మరో 150 మంది మెడిసిన్లో చేరారు. గిరిపుత్రుల కోసం.. జిల్లాలోని ఏజెన్సీ, మెట్ట ప్రాంతాల్లో మెరుగైన వైద్యసేవలందించేలా గత ప్రభుత్వంలో చింతలపూడిలో 100 పడకల ఆస్పత్రి, బుట్టాయగూడెంలో రూ.55 కోట్ల వ్యయంతో 150 పడకల మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి చర్యలు చేపట్టారు. నూజివీడులో రూ.25 కోట్లతో ఆస్పత్రి సమగ్ర అభివృద్ధికి చర్యలు చేపట్టారు. సప్త ప్రదక్షిణలు ప్రారంభం పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో సప్త సోమవారాల ప్రదక్షిణలు ప్రారంభించినట్టు ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. నేడు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏడాది పాలనలో సం‘క్షామం’, సంక్షోభంతో ప్రజలు అల్లాడుతున్నారు. విద్య, వైద్యరంగాలు పూర్తిగా నిర్వీర్యం కాగా.. ప్రజలకు ప్రభుత్వ సేవలు దూరమవుతున్నాయి. సూపర్ సిక్స్ హామీల అమలును గాలికొదిలేస్తూ సంక్షేమాన్ని దూరం చేస్తున్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతున్నారు. పథకాలు అమలు చేయకుండా మొండిచేయి చూపడంతో మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు భవితవ్యం అయోమయంగా మారింది. ఇలా ప్రజా జీవనాన్ని ఏడాది పాలనలో అస్తవ్యస్తం చేసిన ఘనత కూటమి సర్కారుకే దక్కుతుంది. న్యూస్రీల్కూటమి కక్ష సంక్షేమ, అభివృద్ధి పథకాల్లేవు ఎండీయూ వాహనాలు రద్దు విద్య, వైద్య రంగాలు నిర్వీర్యం సచివాలయ వ్యవస్థపై శీతకన్ను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గ్రామ స్వరాజ్యమే లక్ష్యం సచివాలయాల్లో 543 సేవలు ఇంటింటా సంక్షేమ పరవళ్లు కూటమికి గుణపాఠం తప్పదు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులు, దౌర్జ న్యాలు, అక్రమ కేసులు, జైళ్లకు పంపటంలో బిజీగా ఉంది. సూపర్సిక్స్ హామీలు అమలుకు నోచుకోలేదు. మహిళలను ఘోరంగా మోసం చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుంది. ప్రభుత్వానికి చెప్పుకోవటానికి ఏమీ లేకపోవటంతో ప్రజలు నిలదీస్తారనే భయంతో దౌర్జన్యాలు చేస్తూ అణచివేసే ప్రయత్నాలు చేస్తున్నారు. భవిష్యత్తులో టీడీపీ కూటమికి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. – దూలం నాగేశ్వరరావు, వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు ఉద్యోగాలు పీకేస్తున్నారు ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికిన కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో 3 లక్షల ఉద్యోగులను తొలగించింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వడం లేదు. పేద పిల్లలను చదువులకు దూరం చేస్తున్నారు. నిరుద్యోగ భృతి మాటెత్తడం లేదు. ప్రభుత్వ చర్యలు రైతుల నడ్డివిరిచేలా ఉన్నాయి. సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. వైద్య రంగాన్ని అశ్రద్ధ చేస్తున్నారు. కూట మి ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. – మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, నూజివీడు వైఎస్సార్సీపీ సమన్వయకర్త గత ప్రభుత్వంలో గ్రామ స్వరాజ్యానికి బాటలు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా వలంటీర్, సచివాలయ వ్యవస్థలు ఏర్పాటుచేశారు. జిల్లాలో 605 సచివాలయాల్లో 4,701 మంది ఉద్యోగులను నియమించి ప్రజలకు సేవలందించారు. 443 సచివాలయ భవనాల నిర్మాణాలను రూ.193.15 కోట్లతో మొదలుపెట్టి 284 భవనాలను రూ.120.18 కోట్లతో పూర్తిచేశారు. వలంటీర్ల ద్వారా పౌర సేవలు ఇంటి వద్దకే అందించారు. అయితే ప్రస్తుత కూటమి సర్కారులో ప్రజలు, విద్యార్థులు, యువత సర్టిఫికెట్ల కోసం కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. జేబులు నింపితే కానీ సర్టిఫికెట్ చేతికి రావడం లేదని పలువురు గగ్గోలు పెడుతున్నారు. -
ఆయిల్పామ్ రైతుల ఆక్రందన
ఏలూరు(ఆర్ఆర్పేట): పామాయిల్ దిగుమతి సుంకం 50 శాతానికి పెంచాలని, ఆయిల్పామ్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ ఆయిల్పామ్ రైతుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ముడి పా మాయిల్పై దిగుమతి సుంకాన్ని తగ్గించడంతో ఆ యిల్పామ్ గెలల ధరలు తగ్గి రైతులు నష్టపోతున్నారన్నారు. దేశంలోనే అత్యధిక ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం ఆంధ్రప్రదేశ్లో, రాష్ట్రంలోనే అధిక సాగు ఏలూరు జిల్లాలో ఉందని, రాష్ట్రంలో రైతులు, కూలీలు, కార్మికులు 10 లక్షలకు పైగా కుటుంబాలు ఆయిల్పామ్పై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. కోకో రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కరరావు, జిల్లా సహాయ కార్యదర్శి సిరిబత్తుల సీతారామయ్య, ఆయిల్పామ్ రైతుల సంఘం నాయకులు గంటా పాపారావు, దాసరి జానకిరామరెడ్డి మాట్లా డుతూ తెలంగాణలో ఆయిల్ఫెడ్ కొత్త ఫ్యాక్టరీలు నిర్మాణం చేస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం ఆయిల్ ఫెడ్ కర్మాగారం అభివృద్ధి జరగలేదన్నారు. ఫలితంగా ఆయిల్ రికవరీ శాతం (ఓఈఆర్) తక్కువగా చూపడంతో రైతులు నష్టపోతున్నారని చెప్పారు. అనంతరం డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు. -
ఉద్యాన వర్సిటీతో శశి ఒప్పందం
తాడేపల్లిగూడెం: విద్య, పరిశోధన, శిక్షణ రంగాల్లో పరస్పర సహకారానికి సంబంధించి డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ, శశి ఇంజనీరింగ్ కళాశాల మధ్య సోమవారం ఎంఓయు కుదిరింది. విద్యార్థులకు పరిశోధన అవకాశాలు, పరిశ్రమ ఆధారిత శిక్షణ, ఇంటర్న్షిప్, జాయింట్ ప్రాజెక్టుల ద్వారా ప్రయోజనం పొందే అవకాశాలు ఈ ఎంఓయు ద్వారా కలగనుంది. విద్యారంగ అభివృద్ధి, నూతన ఆవిష్కరణలు, వ్యవసాయ, ఉద్యాన సాంకేతికల్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. రెండు సంస్థల అభివృద్ధికి ఈ ఒప్పందం తోడ్పాటుగా నిలవనుందని ఉద్యాన వర్సిటీ వీసీ కె.గోపాల్, శశి వైస్చైర్మన్ మేకా నరేంద్రకృష్ణలు అన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ కె.గోపాల్, డైరెక్టర్ ప్రోగ్రామ్స్ కె.ధనుంజయరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి సేవలో ‘కేజీఎఫ్’ నటుడు ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయాన్ని కేజీఎఫ్ సినిమాలో విలన్గా నటించిన రామచంద్రరాజు (గరుడారామ్) సోమవారం సాయంత్రం సందర్శించారు. భార్య సుమ, సినీ దర్శకుడు సాయి శివాన్ జంపానతో కలసి ఆలయానికి విచ్చేసిన ఆయన ముందుగా స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా గరుడారామ్ మాట్లాడుతూ ప్రస్తుతం వైరం చిత్రంలో మెయిన్ విలన్గా నటిస్తున్నట్టు చెప్పారు. ఆ చిత్రం వచ్చేనెలలో రిలీజ్ అవుతుందని తెలిపారు. దర్శకుడు సాయి శివాన్ మాట్లాడుతూ వచ్చేనెల మొదటి వారంలో పూరీ జగన్నాఽథ్ సోదరుడు సాయిరామ్ శంకర్ హీరోగా తెరకెక్కనున్న ఇంటికో సైకో చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించనున్నట్టు తెలిపారు. -
తాగునీటి వెతలు
భీమడోలు: గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తింది. మంచినీటి చెరువుల నీటి మట్టాలు అడుగంటాయి. పంచాయతీలు తాగునీటిని సరఫరా చేయలేక గత 10 రోజులుగా బోరు నీరు కలిపిన నీటిని కొన్ని గ్రామాల్లో సరఫరా చేస్తున్నారు. మరిన్ని గ్రామాల్లో బోరు నీటిపైనే ఆధారపడుతున్నారు. గోదావరి కాల్వ మూసి 40 రోజులైంది. చెరువుల్లో అరకొరగా నింపడంతో పాటు వేసవి నీటి వినియోగం పెరగడంతో నీరు అడుగంటింది. దీంతో గ్రామాల్లో దాహం కేకలు వినిపిస్తున్నాయి. గోదావరి కాల్వకు అనుకుని ఉన్న పూళ్ల, పాతూరు, కురెళ్లగూడెం, సూరప్పగూడెం, గుండుగొలను, కొల్లేరు గ్రామాల్లో మంచినీటి చెరువుల్లో నీటి మట్టాలు అడుగంటాయి. ఫిల్టర్ చేసి ఆ నీటిని సరఫరా చేయడంతో దుర్వాసన వస్తోంది. నెల రోజులు దాటితే తాగునీటి తీర్చే సామర్థ్యం తీర్చే చెరువులు లేవు. సమ్మర్ యాక్షన్ ప్లాన్పై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో తాగునీరు ఇవ్వలేని దయనీయ స్థితిలో ఉన్నారని ప్రజలు బాహాటంగా విమర్శిస్తున్నారు. గోదావరి కాల్వ పూడికతీత, కర్రనాచు తొలగింపు పనులు ఇంకా కొనసాగుతున్నాయి. దీంతో వారం రోజులు తర్వాత కాల్వకు నీటిని వదిలే అవకాశాలున్నాయి. ఇప్పటికే గ్రామాల్లో మంచినీటి కోసం అల్లాడిపోతున్నారు. ప్రైవేటు వాటర్ను కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. గుండుగొలనులోని వింధ్యవాసిని, బ్రాహ్మణ చెర్వులోని నీటి మట్టాలు పడిపోయాయి. బోరు నీరు, ఉప్పునీరు ఇవ్వడంతో ఈ నీటిని నిలుపుదల చేసి ట్యాంకర్ల ద్వారా నీటికి పంపిణీ చేయాలని భీమడోలు ఏఎంసీ మాజీ చైర్మన్ వగ్వాల భాస్కర్ సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. గ్రామంలోని ఎస్సీ కాలనీ, ఎస్సీ ఏరియా, ఇతర ప్రాంతాలకు గత పది రోజులుగా బోరు నీరే ఇస్తున్నారని, విషయాన్ని ఇంచార్జి గ్రామ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లగా గోదావరి కాల్వకు నీటిని విడుదల అయ్యే వరకు ఈ సమస్య పరిష్కారం కాదంటున్నారని ఫిర్యాదు చేసారు. ట్యాంకర్ల ద్వారా మంచి నీటిని సరఫరా చేయాలని ఎంపీడీవో, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సమస్యపై గుండుగొలను ఇరిగేషన్ సెక్షన్ ఏఈ సుబ్రహ్మణ్యంను వివరణ కోరగా.. రెండు, మూడు రోజుల్లో గోదావరి నీరు గుండుగొలను సెక్షన్కు చేరుకుంటుందని.. గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నందున ఉన్నతాధికారులు గోదావరి కాల్వకు నీటిని విడుదల చేశారన్నారు. చెరువులలో అడుగంటిన నీరు -
జైలు నిర్మాణ పనులను పరిశీలించిన డీఐజీ
కై కలూరు: కై కలూరులో నిర్మిస్తున్న జైలు, పెట్రోల్ బ్యాంకు నిర్మాణ పనులను జైళ్ల శాఖ డీఐజీ ఎం.వరప్రసాద్ సోమవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ మానవ హక్కుల సంస్థల సూచనలతో ఖైదీలకు అన్ని సౌకర్యాలతో నూతన నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. దాదాపు 60 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. గతంలో కొందరు ఖైదీలు స్నానాల గదుల్లో పైన ఊచలకు ఉరి వేసుకుని ఆత్మహత్యలు చేసుకునేవారన్నారు. అలాంటి సమస్యలు లేకుండా స్నానాల గదుల ఎత్తు తగ్గించి, పైన ఓపెన్గా ఉంచుతామన్నారు. పెట్రోలు బ్యాంకు వచ్చే నెలలో ప్రారంభిస్తామని చెప్పారు. కార్యక్రమంలో విజయవాడ డీఎస్జేవో ఆఫీస్ జైలర్ వి.ఉమామహేశ్వరరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. గ్రామ ఉత్కర్ష అభయాన్ అమలుపై సమీక్ష ఏలూరు(మెట్రో): జిల్లాలో జాతీయ గ్రామ ఉత్కర్ష అభయానన్ పథకం పక్కాగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో పథకం అమలుపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంపై గిరిజనులకు అవగాహన కల్పించేందుకు జూన్న్ 15 నుంచి 30 వరకు జిల్లాలో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. సమావేశంలో ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రాములు నాయక్, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
చోరీ కేసును ఛేదించిన పోలీసులు
ఏలూరు టౌన్: ఏలూరు మండలం తంగెళ్ళమూడి భాగ్యనగర్ కాలనీలో గత నెలలో జరిగిన చోరీ కేసును వన్టౌన్ సర్కిల్ పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయతో ఛేదించారు. నిందితుడ్ని అరెస్ట్ చేసి అతని నుంచి బంగారు ఆభరణాలు, నగదు స్వాదీనం చేసుకున్నారు. డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్ వివరాలు వెల్లడించారు. తంగెళ్ళమూడి భాగ్యనగర్ కాలనీకి చెందిన పడవల వెంకట శ్రీనివాస్ ఏపీ ట్రాన్స్కోలో పనిచేస్తున్నారు. మే నెల 26న కుమారుల చదువుల నిమిత్తం రాజమహేంద్రవరంలో అద్దె ఇల్లు చూసుకునేందుకు కుటుంబంతో కలిసి ఇంటికి తాళాలు వేసి వెళ్ళారు. పనులు ముగించుకుని సాయంత్రం 6 గంటలకు ఇంటికి వెళ్లగా తాళాలు పగులగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూడగా బెడ్రూమ్లో బీరువా తాళాలు పగులగొట్టి దానిలోని బంగారు ఆభరణాలు, నగదును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. శ్రీనివాస్ ఏలూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వన్టౌన్ సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో రూరల్ ఎస్ఐ సీహెచ్కే దుర్గాప్రసాద్ కేసు నమోదు చేశారు. సీసీ టీవీ పుటేజ్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుడు సత్తినపల్లి రాకేష్ను సోమవారం మధ్యాహ్నం ఏలూరు హనుమాన్నగర్లో అదుపులోకి తీసుకున్నారు. పెదపాడు ఇందిరా కాలనీకి చెందిన రాకేష్ చోరీ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. -
బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి
కుక్కునూరు: బైక్ అదుపు తప్పడంతో వైఎస్సార్సీపీ కార్యకర్త మృతిచెందిన ఘటన ఆదివారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కుక్కునూరు గ్రామానికి చెందిన నాగ శ్రీనివాస్ ఆదివారం మధ్యాహ్న సమయంలో పొలం వెళుతుండగా, మోటార్సైకిల్ అదుపు తప్పి రోడ్డు పక్కన పడిపోయాడు. నాగశ్రీనివాస్ తలకు తీవ్ర గాయమైంది. భద్రాచలం ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడకు రిఫర్ చేశారు. ఆదివారం రాత్రి చికిత్స పొందుతూ నాగశ్రీనివాస్ మృతిచెందాడు. వైఎస్సార్సీపీ నాయకులు నాగశ్రీనివాస్ మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి జంగారెడ్డిగూడెం: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ వ్యక్తి మృతిచెందినట్లు హెడ్ కానిస్టేబుల్ ఎన్.ఉమామహేశ్వరరావు తెలిపారు. జంగారెడ్డిగూడెంకు చెందిన బోను లక్ష్మీపతి(49) ఈ నెల 8న పనిమీద బైపాస్ రోడ్డు వద్దకు పనిమీద వెళ్లాడు. పని ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో స్థానిక తపస్ స్కూల్ సమీపంలో ఉన్న స్పీడ్ బ్రేకర్ వద్ద మోటార్సైకిల్ అదుపు తప్పి కింద పడిపోయాడు. తలకు తీవ్ర గాయం కావడంతో స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఏలూరు తరలించారు. చికిత్స పొందుతూ 9వ తేదీ ఉదయం లక్ష్మీపతి మృతిచెందినట్లు హెచ్సీ తెలిపారు. -
నివేదిత విద్యాలయం ఏర్పాటు అభినందనీయం
కాళ్ల: స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో నివేదిత విద్యాలయం ఏర్పాటు అభినందనీయమని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. కాళ్ల మండలం పెద్ద అమిరంలో వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మించిన నివేదిత విద్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సోమవారం కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం విద్యాలయాన్ని కలెక్టర్, గుంటూరు శారద మఠం అధ్యక్షురాలు ప్రవాజిక భవాణి ప్రాణమాతాజీ ప్రారంభించారు. తరగతి గదులలో మౌలిక వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భావితరాలకు విద్యతో పాటు విలువలతో కూడిన మన సంస్కృతి, సాంప్రదాయాలను నేర్పి ఉత్తములుగా తీర్చిదిద్దటమే లక్ష్యంతో బాలికలకు ఉచిత విద్యాలయాన్ని ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. శారద మఠం అధ్యక్షురాలు ప్రవాజిక భవాణి ప్రాణమాతాజీ మాట్లాడుతూ ఎల్కేజీ నుంచి 7వ తరగతి వరకు పేద బాలికలకు మాత్రమే విద్యను అందిస్తామన్నారు. సుమారు 770 మంది బాలికలకు ప్రవేశం కల్పించనునట్లు తెలిపారు. తెలుగుతో పాటుగా ఇంగ్లీష్ మీడియంలో కూడా ప్రత్యేక శిక్షణ ఉంటుందన్నారు. -
డాంగేనగర్లో అగ్నిప్రమాదం
జంగారెడ్డిగూడెం: పట్టణంలో ఉన్న డాంగే నగర్లో ఆదివారం అర్ధరాత్రి విద్యుత్ హైవోల్టేజ్ రావడంతో పలువురి ఇళ్లలో విద్యుత్ పరికరాలు, సామగ్రి దగ్ధమయ్యాయి. దీంతో లక్షలాది రూపాయల నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. పొడుదోలు నాగేంద్రబాబు ఇంట్లో ఫ్రిడ్జ్, కూలర్, ఇన్వర్టర్లు, ఫ్యాన్లు, వైరింగ్, లైట్లు హైవోల్టేజ్ కారణంగా కాలిపోయాయి. ఇంట్లో సామగ్రి కూడా దగ్ధమైంది. సుమారు రూ.2 లక్షలు నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపాడు. శీలం మంగరాజు ఇంట్లో టీవీ, ఫ్యాన్లు, కలపాల శ్రీనివాస్ ఇంట్లో ఫ్యాన్లు, బల్బులు దగ్ధమయ్యాయి. విద్యుత్ శాఖ అధికారులు తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. సోమవారం విద్యుత్ శాఖ డీఈ యు.సుబ్బారావు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. -
విద్యా రంగంలో ఆదర్శంగా నిలపాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): ప్రణాళిక బద్ధంగా విద్యారంగంలో వినూత్న మార్పులతో ఏలూరు జిల్లాను ఆదర్శవంతమైన జిల్లాగా నిలపాలని, అందుకు అనుగుణంగా సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సోమవారం వట్లూరులోని సీఆర్ రెడ్డి ఇంజనీరింగు కాలేజీ ఆడిటోరియంలో ఏర్పాటుచేసిన షైనింగ్ స్టార్ కార్యక్రమాన్ని మనోహర్ ప్రారంభించారు. కార్యక్రమం ద్వారా ఏలూరు జిల్లాలోని 163 ఉన్నత పాఠశాల విద్యార్థులకు రూ 32,60,000, ఇంటర్మీడియట్ విద్యార్థులకు రూ 6.80 లక్షలు చెక్కులు అందించి, సర్టిఫికెట్లతో సత్కరించారు. ఈ సందర్బంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ విద్యారంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చామని, విద్య ఒక్కటే అభివృద్ధికి మార్గమన్నారు. జిల్లాలో 2.78 లక్షలు విద్యార్థులు ఉండగా 1.30 లక్షల మంది మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని, ఈ సంఖ్యను మరింత పెంచేందుకు కృషిచేయాలన్నారు. జిల్లాలో 10 వేల మంది ఉపాధ్యాయులు ఉన్నారని వీరంతా ప్రణాళికాబద్ధంగా మరింత మెరుగైన విద్యను అందించడం ద్వారా జిల్లాను ఆదర్శంగా నిలపాలన్నారు. జూన్ 12 నుంచి పాఠశాలలో మధ్యాహ్నం భోజన పథకంలో పౌష్టికాహారం అందించేందుకు సన్న బియ్యం ప్రవేశపెడుతున్నామన్నారు. కలెక్టరు వెట్రిసెల్వి మాట్లాడుతూ డొక్కా సీతమ్మ పేరున మధ్యాహ్నం భోజనం పథకం ద్వారా మంచి పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ పేరున విద్యార్థులకు పుస్తకాలు తదితర కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ ఘంటా పద్మశ్రీ, ఎమ్మెల్యే బడేటి చంటి, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఆర్టీసీ రీజియన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఎస్పీ కేపీఎస్ కిషోర్, జాయింటు కలెక్టరు ధాత్రిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రేషన్ షాపు తనిఖీ ఏలూరులోని షాపు నెంబర్ 74 చౌక ధరల దుకాణాన్ని, స్ధానిక ఈదర సుబ్బమ్మ నగరపాలక ఉన్నత పాఠశాలను జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డితో కలిసి మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. డీలర్ ఇచ్చే బియ్యం నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. 65 ఏళ్లు దాటిన వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులకు ఇంకా డోర్ డెలివరీ పూర్తిచేయకపోవడంపై మంత్రి డీలర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కొయ్యలగూడెం: కొయ్యలగూడెం–జంగారెడ్డిగూడెం జాతీయ ప్రధాన రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు. నీలాలమ్మ ఆలయ సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం సంభవించిందని ఎస్సై వి.చంద్రశేఖర్ తెలిపారు. యర్రంపేట గ్రామానికి చెందిన రాపాక కల్యాణ్(26) జంగారెడ్డిగూడెం నుంచి టీవీఎస్ ఎక్సెల్ మోపెడ్పై స్వగ్రామం వెళ్లేందుకు కొయ్యలగూడెం వైపునకు వస్తుండగా కారు ఢీకొంది. కల్యాణ్కు తీవ్ర గాయాలు కాగా.. వెంటనే జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రికి అంబులెన్సులో తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనిపై మృతుడి తల్లి రాపాక మరియమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
కదం తొక్కిన ఉపాధ్యాయులు
ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల బదిలీల్లో నెలకొన్న సమస్యలను, ముఖ్యంగా సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలనే డిమాండ్తో ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆదివారం ఏలూరులోని పూర్వపు పశ్చిమగోదావరి జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాన్ని ఉపాధ్యాయులు ముట్టడించారు. డీఈఓ కార్యాలయ గేటు వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. ఉమ్మడి జిల్లా నుంచి సుమారు 500 మంది ఉపాధ్యాయులు హాజరై నిరసన తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి మద్దతుగా నిలిచారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ వెంటనే జోక్యం చేసుకుని తక్షణమే ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదికతో చర్చించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే జరిపిన చర్చల్లో సెకండరీ గ్రేడ్ టీచర్లకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని హామీ ఇచ్చారని, అయితే ఇందుకు భిన్నంగా ఇప్పుడు ఆన్లైన్లో వెబ్ ఆప్షన్లు ఎనేబుల్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది ఉపాధ్యాయులను మోసం చేయడమే అన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె.శ్రీదేవి మాట్లాడుతూ స్కూల్ అసిస్టెంట్లకు నిర్వహించిన వెబ్ కౌన్సెలింగ్లో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయని, ఎస్జీటీలకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తే దాదాపు 2 వేల పాఠశాలలకు ప్రయారిటీ ఆప్షన్లు ఇచ్చుకోవాలని, ఇది తీవ్ర మానసిక ఒత్తిడితో కూడిన పని అన్నారు. ముట్టడి కార్యక్రమానికి యూటీఎఫ్ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రవికుమార్ అధ్యక్షత వహించారు. ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు, రాష్ట్ర బాధ్యులు ఉమ్మడి జిల్లా నుంచి హాజరైన ఉపాధ్యాయులు కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. యూటీఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు షేక్ ముస్తఫా ఆలీ, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పవన్కుమార్, ఏపీటీఎఫ్ 1938 ప్రధాన కార్యదర్శి జి.మోహన్, పీఆర్టీయూ అధ్యక్షుడు పువ్వుల ఆంజనేయులు, పీఈటీస్ అసోసియేషన్ నాయకులు రమేష్, వైఎస్సార్టీఏ మోహనరావు, యూటీఎఫ్ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు పీఎస్ విజయరామరాజు, ప్రధాన కార్యదర్శి ఏకేవీ రామభద్రం, పశ్చిమగోదావరి జిల్లా నుంచి ఎస్టీయూ నాయకులు శ్రీనివాస్ వర్మ, ఏపీటీఎఫ్ గౌరవాధ్యక్షుడు సీహెచ్ పట్టాభిరామయ్య తదితరులు హాజరయ్యారు. అనంతరం డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మని కలిసి సమస్యలను తెలియజేశారు. డీఈఓ కార్యాలయం వద్ద గుమిగూడిన ఉపాధ్యాయులు వెబ్ కౌన్సెలింగ్పై మండిపాటు ఏలూరులో డీఈఓ కార్యాలయం ముట్టడి వెబ్ ఆప్షన్లు అప్రజాస్వామికం వెబ్ ఆప్షన్ల విధానంతో గతంలో చాలామంది ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోయారు. ఆన్లైన్లో కనిపించే రెండు వేలకు పైగా స్థానాలను గుర్తించడం ఉపాధ్యాయులకు కష్టతరమవుతోంది. దీంతో కొందరు 150 కిలోమీటర్లకు పైగా దూరం వెళ్లాల్సి వచ్చింది. మరోసారి ఇలాంటి వి ధానంతోనే నిర్వహిస్తామనడం అప్రజాస్వామికం. ఉపాధ్యాయుల బదిలీలను మాన్యువల్ విధానంలోనే నిర్వహించాలి. లేకుంటే ఉపాధ్యాయుల ఆగ్రహానికి ప్రభుత్వం గురికావాల్సి వస్తుంది. – రవికుమార్ రుద్రాక్షి, యూటీఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు -
ఏడాది నిండా.. దౌర్జన్యకాండ
సాక్షి ప్రతినిధి,ఏలూరు : జిల్లాలో దాడుల సంస్కృతి తారాస్థాయికి చేరింది. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలు ప్రశాంతతకు మారుపేరు. సాధారణంగా ఎన్నికల సమయంలో మాత్రమే ఇక్కడ రాజకీయాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే గత ఏడాది కాలంలో జిల్లాలో పూర్తి భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రజాప్రతినిధులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం, పల్లెల్లో కూటమి నేతలు అడ్డూఅదుపు లేకుండా రెచ్చిపోవడం నిత్యకృత్యంగా కొనసాగింది. ప్రధానంగా దెందులూరు, చింతలపూడి, నూజివీడు, కైకలూరు, పోలవరం నియోజకవర్గాల్లో దా డులు, హత్యాయత్నాలు, హత్యలు వరకు పలు ఘ టనలు నమోదయ్యాయి. తొలిసారిగా జిల్లాలో జర్నలిస్టులు, పత్రికా కార్యాలయాలపై దాడుల సంస్కృతికి కూటమి నేతలు తెరతీశారు. అడ్డూ అదుపూ లేకుండా.. నూజివీడు మండలం తుక్కులూరులో గతేడాది సెప్టెంబర్ 23న టీడీపీ గ్రామ అధ్యక్షుడు అన్నే సురేష్ కార్యకర్తలు శివరామకృష్ణ, కారుమంచి రాజు, కిరణ్లు అదే గ్రామానికి చెందిన అచ్చి నాగరాజు అనే వ్యక్తిని విచక్షణారహితంగా దాడి చేసి కాళ్లు, చేతులను తాళ్లతో కట్టేసి నాగరాజును కారులో పడేసి పోలీస్స్టేషన్లో అప్పగించిన ఘటన సోషల్ మీడియాలో తీవ్ర వైరల్గా మారి టీడీపీ సాగిస్తున్న అరాచకానికి మచ్చుతునకగా నిలిచింది. గతేడాది జూన్ 6న నూజివీడులో అప్పటి వైఎస్సార్సీపీ కౌన్సిలర్ నడకుదురు గిరిష్పై టీడీపీ కార్యకర్త నూకల సాయి అరుణ్ కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి యత్నించిన ఘటన వీడియో వైరల్గా మా రింది. కొద్దిరోజుల క్రితం అధికార పార్టీ ఒత్తిళ్లతో గిరీష్ టీడీపీలో చేరారు. అలాగే వేలేరుపాడు మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్పై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో దాడి చేసి గాయపరచడం, ఆగిరిపల్లి గ్రామ సర్పంచ్ చిమటా శ్రీనివాసరావు టెంట్ హౌస్లో టెంట్లు, కుర్చీలు, కంప్యూటర్లు ధ్వంసం చేయడం, ఆగిరిపల్లి–2 ఎంపీటీసీ సాదం గోపినాథ్, మాజీ ఎంపీటీసీ పండుపై దాడులు, వేలేరుపాడు మండలం తాట్కూరుగొమ్ము ఎంపీటీసీ కొమ్ము రాంబాబు నివాసంపై దాడి చేసి ఇంట్లో ఫర్నీచర్ను ధ్వంసం చేయడం ఇలా వరుస విధ్వంస కాండలు కొనసాగాయి. అక్రమ కేసులు ఎన్నెన్నో.. ● టీడీపీ అరాచకాలకు సోషల్ మీడియా కేసులు పరాకాష్టగా మారాయి. పార్టీ రాష్ట్ర కమిటీ, లోకేష్ ఆదేశాలతో ప్రతి మండలంలో టీడీపీ మండల అధ్యక్షులు పోలీసులకు ఫిర్యాదు చేయడం, వెంటనే కేసులు నమోదు చేయడం, సీరియస్ టార్గెట్ అయితే నాన్ బెయిల్బుల్ కేసులు నమోదు చేయడం యథేచ్ఛగా జరిగింది. ● 2023 జూలై 15న నూజివీడులోని వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ రాజశేఖర్రెడ్డి పోస్టు పెడితే కొద్దినెలల క్రితం టీడీపీ మండల అధ్యక్షుడు ముసునూరు సీతారామాంజనేయ ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడం రెండేళ్ల క్రితం ఘటనపై నాన్ బెయిల్బుల్ సెక్షన్ల కింద అరెస్టు చేసి జైలుకు పంపడం జరిగింది. ● లింగపాలెం మండలం మఠంగూడెంలోనూ ఇదే తరహాలో టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో ముగ్గురు వైఎస్సార్సీపీ నాయకులు అరైస్టె 45 రోజులపాటు రిమాండ్లో ఉన్నారు. ● నిడమర్రు మండలంలో సోషల్ మీడియా కో–కన్వీనర్ బేతు సతీష్ మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి, న్యాయం చేయండని అన్నందుకు అరెస్టు చేశారు. ● బాపట్ల టౌన్ ఇస్లాంపేటకు చెందిన షేక్ సయ్యద్ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు పెట్టాడని చింతలపూడి టీడీపీ మండల కన్వీనర్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ● కొయ్యలగూడెంలో వైఎస్సార్సీపీకి చెందిన మద్దిపాటి కృష్ణ, జింటా వెంకటేశ్వరరావు, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు తోట జయబాబుపై హత్యాయత్నం చేయడమే కాకుండా తిరిగి వారిపైనే కేసులు నమోదుచేశారు. ● కన్నాపురం సర్పంచ్ భర్త కృష్ణపై కూటమి నేతలు దాడి చేసి అతనిపైనే రివర్స్ కేసులు నమోదు చేయించారు. అరాచకం కట్టలు తెంచుకుంది.. రెడ్బుక్ పేరుతో కూటమి నేతల దౌర్జనకాండ సాగింది.. పల్లెల్లో వైఎస్సార్సీపీ శ్రేణులే లక్ష్యంగా భారీస్థాయిలో భౌతికదాడులు మొదలు ఆస్తుల విధ్వంసం కొనసాగింది. ప్రశాంతతకు మారుపేరైన పల్లెల్లో వ్యక్తిగత విద్వేషాలు, దాడులు, అడ్డగోలుగా కేసుల నమోదు, అరెస్ట్లు జరిగాయి. వైఎస్సార్సీపీ నేతల ఇళ్లపై దాడులు, వ్యక్తిగతంగా భౌతిక దాడులు, ఆస్తి నష్టాలపై ఫిర్యాదులు చేసినా పోలీసులు కేసులు నమోదు చేయనిపరిస్థితి. ఇలా కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో జిల్లాలో రెడ్బుక్ రాజ్యాంగమే అమలైంది. అమాత్యులు మొదలు ప్రజాప్రతినిధులంతా వ్యక్తిగత టార్గెట్లను నిస్సిగ్గుగా కొనసాగించారు. దెందులూరులో రెచ్చిపోయిన మూకలు దెందులూరు మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కామిరెడ్డి నాని నివాసంపై గతేడాది జూలై 7న వందల సంఖ్యలో కూటమి కార్యకర్తలు మూకుమ్మడి దాడి చేసి కార్యాలయ అద్దాలు, కుర్చీలు, ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. దాదాపు మూడు రోజుల పాటు పోలీస్ పికెటింగ్ హడావుడి కొనసాగినా కేసులు, అరెస్టులు జరగలేదు. అలాగే పెదవేగి మండలం కవ్వగుంట మాజీ సర్పంచ్ మద్దాల నాగయ్యపై టీడీపీ, జనసేన కార్యకర్తలు దాడి చేసి గాయపరిచారు. పెదపాడు మండలం, ఏలూరు రూరల్ మండలం, పెదవేగిలోనూ పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు, చేపల చెరువు సాగుకు అడ్డంకులు కల్పించడం యథేచ్ఛగా సాగాయి. దెందులూరు జెడ్పీటీసీ నిట్టా లీలా నవకాంతం మామ గాంధీపై దాడి, క్రియాశీలక కార్యకర్త రవీంద్ర ఆటో విధ్వంసం అలాగే దెందులూరులో వైఎస్సార్ విగ్రహాన్ని, ప్రభుత్వ శిలాఫలాకలను ధ్వంసం చేయడం ఇలా టీడీపీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు. కూటమి రెడ్బుక్ రాజ్యాంగం జిల్లాలో అంతులేని అరాచకం వైఎస్సార్సీపీ శ్రేణులే లక్ష్యంగా దాడులు తుక్కులూరులో వ్యక్తిపై దాడి చేసి తాళ్లతో నిర్బంధం నూజివీడు, చింతలపూడి, పోలవరంలో దాడుల పర్వం దెందులూరులో అధికార పార్టీ నేతల విధ్వంసాలు వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు కూటమి ఏడాది పాలనంతా దౌర్జన్యాలే.. -
ఈఏపీసెట్లో మెరిసిన మనోళ్లు
ఏలూరు (ఆర్ఆర్పేట): ఏపీఈఏపీ సెట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు 3,409 మంది, అగ్రికల్చరల్ కోర్సుల్లో ప్రవేశాలకు 1,726 మంది అర్హత సాధించారు. ఇంజనీరింగ్ కోర్సుల్లో పాకలపాటి హర్షవర్ధన్ 85, ఏలూరుకి చెందిన అల్లు హేమంత్ 97, అగ్రికల్చరల్ కోర్సుల్లో పెదపాడు మండలం కొక్కిరపాడుకు చెందిన కోసూరి వల్లీ ప్రియ 59, ఏలూరుకు చెందిన యర్రా శోభ రిషిత 109వ ర్యాంకులతో ప్రతిభ కనబర్చారు. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలకు జిల్లా నుంచి 4,874 మంది దరఖాస్తు చేసుకోగా 4,700 మంది పరీక్షలు రాశారు. వారిలో 1,817 మంది బాలురు, 1,592 మంది బాలికలు అర్హత సాధించారు. అగ్రికల్చరల్ పరీక్షలకు 2,002 మంది దరఖాస్తులు చేసుకోగా 1,899 మంది పరీక్షలు రాశారు. వారిలో 443 మంది బాలురు, 1283 మంది బాలికలు అర్హత సాధించారు. అగ్రికల్చరల్లో.. పెదపాడు మండలం కొక్కిరపాడుకు చెందిన కోసూరి వల్లీప్రియ (59వ ర్యాంకు), ఏలూరుకి చెందిన యర్రా శోభ రిషిత (109), పోలవరానికి చెందిన కొట్టే వెంకట శ్రీ కార్తీక్ (283), కొయ్యలగూడెం మండలం రాజవరానికి చెందిన తిరుమలనాథుని సత్య సృజన్ (313), లింగపాలెం మండలం కొణిజర్లకు చెందిన లక్కపాము కమలాకర్ (318), నూజివీడుకు చెందిన కుప్పాల దేదీప్య సాయి (358), టి.నరసాపురం మండలం సాయంపాలెంకు చెందిన మారిశెట్టి భాగ్యశ్రీ (375), కలిదిండి మండలం పోతుమర్రుకు చెందిన వల్లభుని దినేష్ సాయి (378), ఏలూరుకు చెందిన భీమవరపు హరి ప్రియ రామన్ (447), పెదవేగి మండలం భోగాపురానికి చెందిన యామిని దిమ్మిటి (448) మొదటి పది స్థానాల్లో నిలిచారు. ఇంజనీరింగ్లో 3,409 మంది.. అగ్రికల్చరల్లో 1,726 మంది అర్హత ఇంజనీరింగ్లో తొలి 10 స్థానాల్లో.. ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురానికి చెందిన పాకలపాటి హర్షవర్ధన్ (85వ ర్యాంకు), ఏలూరుకి చెందిన అల్లు హేమంత్ (97), కొయ్యలగూడెం మండలం పరింపూడికి చెందిన బండ్లపల్లి యోగ సాయి శ్రీనివాస్ (162), కామవరపుకోటకు చెందిన ద్వాదశి మోహన (313), నూనె రమేష్ (358), ముత్తంశెట్టి వెంకట్ హనీష్ (378), టి.నరసాపురం మండలం బందంచర్లకు చెందిన అనుమోలు తరుణ్ సాయి (401), లింగపాలెం మండలం యడవల్లికి చెందిన గోల్కొండ జగదీప్ శరణ్ (409), పోలవరానికి చెందిన పడాల జశ్వంత్సాయి చరణ్ (421), చింతలపూడి మండలం రాఘవాపురానికి చెందిన సిరి సంజన మారుమూడి (438) మొదటి పది స్థానాల్లో నిలిచారు. -
శ్రమ పాత్ర కీలకం
ఏలూరు టౌన్: సమాజ పరిమాణం, అభివృద్ధిలో శ్రమ పాత్ర కీలకమని సినీ రచయిత సు ద్దాల అశోక్ తేజ అన్నారు. స్థానిక టుబాకో మర్చంట్స్ కల్యాణ మండపంలో సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన 60వ శ్రమ కావ్యం–గానం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్వీడీ ప్రసాద్ ఆహ్వానం పలకగా జిల్లా అధ్యక్షుడు ఆర్.లింగరాజు అధ్యక్షత వహించారు. అశోక్ తేజ తాను రచించిన శ్రమకావ్యం పుస్తకంలో అనేక ఘట్టాలను ఆల పిస్తూ సవివరంగా విశ్లేషించారు. రిటైర్డ్ రిజిస్ట్రా ర్ లంక వెంకటేశ్వర్లు మాట్లాడుతూ శ్రమ కా వ్యం రచనలో శ్రమను వస్తువుగా తీసుకుని రచన సాహసోపేతం అన్నారు. సీఐటీయూ రా ష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ఉమామహేశ్వరరావు మా ట్లాడుతూ శ్రమకు తగిన ప్రతిఫలం ఇవ్వాలని సీఐటీయూ దేశవ్యాప్తంగా ఉద్య మాలు చేస్తోందన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మంతెన సీతారాం పాల్గొన్నారు. రైల్వేస్టేషన్లో తనిఖీలు ఏలూరు టౌన్: ఏలూరు రైల్వేస్టేషన్లో రైల్వే పో లీసులు ఆదివారం తనిఖీలు చేపట్టారు. విజయవాడ రైల్వే డీఎస్పీ జి.రత్నరాజు పర్యవేక్షణ లో విజయవాడ లైన్ సర్కిల్ సీఐ ఎంవీ దుర్గారావు, ఏలూరు రైల్వే ఎస్సై పి.సైమన్ ఆర్పీఎఫ్ సిబ్బందితో కలిసి తనిఖీలు చేశారు. గంజాయి రవాణా, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించిన రైల్వే పోలీస్ ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలకు ఆదేశాలు ఇచ్చారని ఎస్సై చెప్పారు. డీఎస్సీ పరీక్షలకు 532 మంది హాజరు ఏలూరు (ఆర్ఆర్పేట): డీఎస్సీ పరీక్షలకు రెండో రోజు ఆదివారం జిల్లాలో 532 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఏలూరులోని సిద్ధార్థ క్వెస్ట్లో మధ్యాహ్నం 180 మందికి 156 మంది, సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 208 మందికి 202 మంది, మధ్యాహ్నం 204 మందికి 174 మంది హాజరయ్యారు. 10న ఆందోళనలు ఏలూరు టౌన్: గ్రామీణ పేదల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 10న ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళన, వినతిపత్రాల అందజేతకు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కంచర్ల గురవ య్య, బండి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. నేడు యోగాంధ్ర ర్యాలీలు ఏలూరు(మెట్రో): యోగాంధ్ర కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేయాలనీ కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. సోమవారం ఉదయం గ్రామ, మండల, పట్టణ స్థాయిల్లోలో ర్యాలీలు నిర్వహించాలన్నారు. నేడు పీజీఆర్ఎస్ రద్దు అనివార్య కారణాలవల్ల సోమవారం ఏలూరు కలెక్టరేట్లో నిర్వహించాల్సిన ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు డీఆర్వో వి.విశ్వేశ్వరరావు ప్రకటనలో తెలిపారు. పని వేళల మార్పుపై ఆగ్రహం ఏలూరు టౌన్: కార్మికుల హక్కులను కాలరాస్తూ 10 గంటల పని విధానాన్ని అమలు చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే విర మించుకోవాలనీ, రాత్రి వేళల్లో మహిళలతో పని చేయించవద్దని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఏలూరు ఆర్ఆర్పేట నగరపాలక పార్కు వద్ద ఆదివారం ఆందోళన చేపట్టారు. రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయాల కాపీలను ఏఐటీయూసీ నాయకులు దగ్ధం చేశారు. రూ.69.30 లక్షల ఆన్లైన్ మోసం ఏలూరు టౌన్: తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయంటూ ఒక మహిళను నమ్మించి ఆన్లైన్లో భారీగా నగదును కాజేశారు. ఏ లూరు రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు రూరల్ వెంకటాపురం పంచాయతీ గ్రీన్సిటీ ప్రాంతానికి చెందిన మె యిదా కృష్ణభవానీ (30) గతంలో ఒక ప్రైవేటు స్కూల్లో పనిచేశారు. ఆమె సెల్ఫోన్ వాట్సాప్కు గతనెల 19న అమాన్సా పీటీ ప్రైవేట్ లి మిటెడ్ యాప్ నుంచి ఇన్వెస్ట్మెంట్ లింకు వచ్చింది. లింకును ఓపెన్ చేసిన కృష్ణభవానీ తనపేరుతో అకౌంట్ రిజిస్టర్ చేసుకున్నారు. మరో నంబర్ నుంచి అదే యాప్ డౌన్లోడ్ చేసి చాటింగ్ చేశారు. ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టడం ద్వారా లాభాలు ఆర్జించినట్లు చాటింగ్లో పలువురు చెప్పగా ఆమె నమ్మారు. దీంతో ఆమె పలు దఫాలుగా రూ.69.30 లక్షల పలు ఖాతాలకు చెల్లించారు. అయితే ఎలాంటి లాభాలు లేకపోవడంతో తాను మోసపోయినట్టు గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. ఆదివారం ఏలూరు వన్టౌన్ సీఐ జి.సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏలూరు రూరల్ ఎస్సై సీహెచ్కే దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కక్షతోనే గోడ కూల్చివేత
దెందులూరు : మండలంలోని చల్ల చింతలపూడిలో ఎంపీటీసీ సభ్యురాలు సింహాద్రి పద్మావతి, మాజీ సర్పంచ్ సింహాద్రి శ్రీమన్నారాయణ ఇంటి ప్రహరీ గోడను టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరినందుకే రాజకీయ కక్ష ధోరణితోనే కూల్చివేశారని దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి విమర్శించారు. ఆదివారం ఎంపీటీసీ సింహాద్రి పద్మావతి, మాజీ సర్పంచ్ సింహాద్రి శ్రీమన్నారాయణలను కొఠారు ఫోన్లో పరామర్శించారు. సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని సూచించారు. ఇటువంటి సంఘటనలు ఎంత మాత్రం సరైనవి కాదని, గోడ కూల్చివేతపై ఉన్నతాధికారులతో మాట్లాడతానని ఆయన చెప్పారు. ఈ విషయంలో బాధితులకు అండగా ఉండి న్యాయపోరాటం చేస్తామన్నారు. కూల్చివేతలో విధులు నిర్వహించినవారు కచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరిగితే పార్టీ చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు. వీఆర్వో వివరణ గోడ కూల్చివేతపై వీఆర్వో సుబ్రహ్మణ్యంను వివరణ కోరగా.. చల్ల చింతలపూడి గ్రామంలో రోడ్లకు రెండు వైపులా మూడు అడుగుల మేరకు తొలగించాలని గ్రామ పంచాయతీ తీర్మానం చేసిందని చెప్పారు. పంచాయతీ తీర్మానం మేరకు ప్రహరీ గోడ తొలగించినట్టు చెప్పారు. ఎంపీటీసీ కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే కొఠారు పరామర్శ అధైర్యపడొద్దని.. అండగా ఉంటామని భరోసా -
నేటి నుంచి వేణుగోపాల స్వామి వార్షికోత్సవాలు
చింతలపూడి: మండలంలో యర్రగుంటపల్లిలో సంతాన వేణుగోపాలస్వామి వార్షిక మహోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి, శ్రీ షిరిడీ సాయిబాబా ,అయ్యప్ప స్వామి వైభవంగా విశేష పూజలు ప్రారంభమవుతాయి. ముందుగా గోపూజ, గణపతి పూజతో ఉత్సవాలు ప్రారంభిస్తారు. 1893లో చంద్రగిరి కాశీ అనే భక్తుడికి స్వామివారు స్వప్నంలో కనిపించి యర్రగుంటపల్లి గ్రామంలో వేణుగోపాలస్వామి ఆలయం నిర్మించాలని ఆదేశించడంతో ఆలయ నిర్మాణం చేపట్టినట్లు చెబుతారు. చివరి రోజుల అన్నదానం చేయడానికి ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ధర్మకర్త చంద్రగిరి శేష కిరణ్ తెలిపారు. 23 నుంచి పీ సెట్ ఎంపికలు దెందులూరు: వ్యాయామ కళాశాలలో ప్రవేశాలకు ఫిజికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పీ–సెట్ ) ఎంపికలు ఈ నెల 23 నుంచి ప్రారంభమవుతాయని గోపాన్నపాలెం వ్యాయామ విద్య కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.నతానియల్ అన్నారు. రూ.వెయ్యి అపరాధ రుసుంతో ఈనెల 11 వరకు, రూ.2 వేల అపరాధ రుసుంతో 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. -
ఖర్చంతా గ్రంథ పాలకులదే
దెందులూరు: వేసవి సెలవుల్లో విద్యార్థులకు విజ్ఞానం పెంపొందించి, ఆటలు పాటలు ద్వారా మానసిక, శారీరక దృఢత్వం పెంచేందుకు గ్రంథాలయాల్లో వేసవి విజ్ఞాన శిక్షణ తరగతులు నెలరోజుల పాటు నిర్వహించారు. పుస్తకాలు, పత్రికలు చదివించడం, నీతి కథలు, ప్రముఖుల జీవితాలు వివరించడం, వ్యాసరచన, డ్రాయింగ్, బొమ్మల తయారీ, చెస్, కబడ్డీ, కోకో పోటీలను నెలరోజుల పాటు గ్రంథాలయంలో గ్రంథ పాలకులు, రిసోర్స్ పర్సన్లు నిర్వహించారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వివిధ విభాగాల్లో శిక్షణ ఇచ్చారు. ప్రతిరోజు బిస్కెట్లు, మజ్జిగ ఏదోకటి ఇచ్చారు. ప్రతి గ్రంథాలయంలో చదువరి సంఖ్యను బట్టి 15 మంది నుంచి 20 మంది కొన్ని గ్రంథాలయాల్లో 20 నుంచి 30 వరకు విద్యార్థులు శిక్షణ పొందారు. రోజుకు బిస్కెట్లు, మజ్జిగ నిమిత్తం రూ.150 నుంచి 200 వరకు ఖర్చులయ్యాయి. శిక్షణ అనంతరం వివిధ విభాగాల్లో విజేతలకు మెడల్స్, సర్టిఫికెట్లు, బొకేలు, చాక్లెట్లు ఇచ్చారు. నెల మొత్తం మీద ఒక్కో గ్రంథాలయానికి అన్ని ఖర్చులకు రూ.10 వేల నుంచి రూ.14 వేల వరకు పెట్టుబడి పెట్టారు. జిల్లా గ్రంధాలయ సంస్థ, ఒక రూపాయి కూడా గ్రంథాలయాలకు నిర్వహణ ఖర్చులు మంజూరు చేయలేదు. చాలీచాలని తక్కువ జీతాలతో కాలం నెట్టుకు వస్తుంటే వేసవి శిక్షణ తరగతులు పేరిట నెలకు రూ.10 వేల నుంచి 14 వేలు తాము పెట్టుబడి పెట్టడం తలకు మించిన భారంగా తయారైందని అనేకమంది గ్రంథ పాలకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖర్చుతో కూడుకున్న కార్యక్రమానికి నిర్వహణ నిమిత్తం కూడా డబ్బులు మంజూరు చేయకపోతే తాము ఎలా పెట్టుబడి పెడతామని తక్కువ జీతాలతో చాలా ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. తీరని ఉద్యోగుల సమస్యలు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో గ్రంథాలయ ఉద్యోగుల పీఆర్సీ, డీఏ ఊసెత్తలేదు. డీఎస్సీ ఇతర పోటీ పరీక్షలకు గ్రంథాలయాల్లో ఇదివరకు ఉన్న జీకే పుస్తకాలే తప్ప నూతనంగా కొన్న పుస్తకాలు ఏవీ లేవు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా కొత్త పుస్తకాలు కొనాల్సిన అవసరం ఉంది. శాఖ పరంగా పీఆర్సీ, డీఎ సమస్యలు పరిష్కరించకపోగా డబ్బుతో కూడుకున్న కార్యక్రమాలు తమపై రుద్దితే ఎలాగని గ్రంథాలయ ఉద్యోగుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల పదోన్నతులపై కూడా చర్యలు లేవు. జిల్లాలో అనేకచోట్ల నేటికీ అద్దె భవనాల్లోనే గ్రంథాలయాలు నిర్వహిస్తున్నారు. ఇన్ని సమస్యలతో గ్రంథాలయాలు సతమతమవుతున్నాయి. వేసవి విజ్ఞాన శిక్షణ తరగతులకు పెట్టుబడి పెట్టామని, ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం ఇస్తే చెల్లిస్తాం వేసవి విజ్ఞానశిక్షణ తరగతులు నిర్వహణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదని... నిధులు వస్తే జమ చేస్తామని ఏలూరు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శేఖర్ బాబు అన్నారు. వేసవి తరగతుల నిర్వహణ బిల్లులు చెల్లించని ప్రభుత్వం -
వానాకాలంలో వ్యాధుల ముప్పు
బుట్టాయగూడెం: వర్షాకాలం వచ్చేసింది. మరికొద్ది రోజుల్లో వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో వాతావరణంలో మార్పులతో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని లేకుంటే పలు రోగాల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా విస్తారంగా వర్షాలు కురిసిన సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. నీటి కలుషితం ద్వారా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, మురికి నీటి నిల్వలతో దోమలు కూడా వృద్ధి చెందుతాయని వైద్యాధికారులు అంటున్నారు. వర్షాకాలంలో గిరిజన ప్రాంతంలో ఎక్కువగా వాతావరణ మార్పుల వల్ల మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, డయేరియా, కామెర్లు వంటి వ్యాధులు వ్యాప్తి చెందుతాయని అధికారులు చెబుతున్నారు. ఏ చిన్న లక్షణం కనిపించినా వెంటనే అందుబాటులో ఉన్న ప్రభుత్వాస్పత్రులకు సూచిస్తున్నారు. జిల్లాలో 153 మలేరియా సమస్యాత్మక గ్రామాలు జిల్లాలోని గిరిజన మండలాలైన పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల పరిధిలో సుమారు 153 మలేరియా వ్యాపించే సమస్యాత్మక గ్రామాలుగా అధికారులు గుర్తించారు. గతంలో 143 సమస్యాత్మక గ్రామాలు ఉండగా ఈ సంఖర్య పెరిగింది. ఆయా గ్రామాల్లో ప్రస్తుతం మొదటి విడత మలేరియా స్ప్రేయింగ్ పనులు మే 1 నుంచి ప్రారంభించారు. ఇందుకోసం 53 టన్నుల మలాథియన్ స్ప్రేయింగ్ మందు డబ్బాలు సిద్ధం చేశారు. గ్రామాల్లో మొదటి విడత పనులు పూర్తయినట్లు అధికారులు చెప్పారు. జున్ 15 నుంచి 2వ విడత మలాథియన్ స్ప్రేయింగ్ పనులకు ఏర్పాట్లు చేస్తున్నారు. మలేరియా జ్వరం ఎనాఫిలస్ దోమ కుట్టడం ద్వారా ఈ జ్వరం వస్తుంది. వైవాక్స్ మలేరియా, ఫాల్స్ ఫారమ్ మలేరియా అనే రెండు రకాలు ఉన్నాయి. ఇందులో రెండో రకం అత్యంత ప్రమాదకరమైంది. జ్వరం వచ్చినప్పుడు టెస్ట్లు చేయించుకుని సకాలంలో చికిత్స చేయించుకోకపోతే రోగి చనిపోయే ప్రమాదం ఉంది. తీవ్రమైన జ్వరం, రోజు విడిచి రోజు జ్వరం, తీవ్రమైన తలనొప్పి ఉంటే అవి మలేరియా లక్షణాలు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి రక్త పరీక్షలు చేయించుకోవాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం. మురికినీరు నిల్వలేకుండా చూసుకోవడం. దోమల నివారణకు చర్యలు తీసుకోవడం వంటి పనులు చేయాలి. టైఫాయిడ్ కలుషిత నీటిని తాగడం వల్ల, బహిరంగ మలవిసర్జన వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. జ్వరం త్వరగా తగ్గకపోవడం, ఒంటి నొప్పులు, తలనొప్పి, కడుపులో అల్సర్ను వ్యాధి లక్షణాలుగా గుర్తించాలి. సురక్షిత నీటిని తాగడం, జ్వరం వచ్చిన వెంటనే రక్త పరీక్షలు చేయించుకుని వైద్యం పొందడం ద్వారా నయం కావచ్చు. డయేరియా కలుషిత నీరు తాగడం, కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల డయేరియా వస్తుంది. ఒకరి నుంచి మరొకరికి త్వరగా వ్యాప్తి చెందుతుంది. నిరంతరాయంగా విరోచనాలు, వాంతులు కావడం ఈ వ్యాధి లక్షణాలు. డయేరియా నివారణకు వైద్యులు ఫ్లూయిడ్స్ ఎక్కిస్తారు. సురక్షిత, కాచి చల్లార్చిన నీటిని తాగాలని, పులుపు, కారం ఉండే ఆహారాన్ని తగ్గించడం, ఫాస్ట్ ఫుడ్ వంటివి తినకపోవడం ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తత అవసరం దోమల నివారణకు ముందస్తు చర్యలు జాగ్రత్తలు తప్పనిసరి వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కలుషిత నీటిని తాగడం వల్ల వ్యాధులు ప్రబరిల్లే అవకాశం ఉంది. ఎక్కడడపడితే అక్కడ నీరు తాగకూడదు. జ్వరం వస్తే అందుబాటులో ఉన్న ఆస్పత్రికి వెళ్ళి రక్త పరీక్షలు చేయించుకుని వ్యాధిని బట్టి వైద్యం పొందాలి. దోమతెరలు వాడటం మంచిది. ఎన్ఎస్ఎస్ ప్రసాద్, మలేరియా అధికారి, కేఆర్పురం, బుట్టాయగూడెం మండలం మొదటి స్ప్రేయింగ్ పనులు పూర్తి మలేరియా సమస్యాత్మక గ్రామాల్లో మొదటివిడత స్ప్రేయింగ్ పనులు పూర్తయ్యాయి. ఉన్నతాధికారులు పర్యవేక్షణలో పనులు చేస్తున్నాం. జున్ 15 నుంచి రెండో విడత స్ప్రేయింగ్ పనులు జరుగుతాయి. ప్రజలు పనులకు పూర్తి సహకారం అందించాలి. పి. పెద్దిరాజు, సబ్ యూనిట్ ఆఫీసర్, బుట్టాయగూడెం జిల్లాలో మలేరియా సమస్యాత్మక గ్రామాలు– 153 పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో –117 గ్రామాలు విలీన మండలాలైన వేలేరుపాడు, కుక్కునూరులో – 36 గ్రామాలు మొదటి విడత స్ప్రేయింగ్ పనులకు వచ్చిన మలాథియన్ – 53 టన్నులు -
సంక్షోభంలో మామిడి రైతులు
నూజివీడు: ఈ ఏడాది బంగినపల్లి మామిడి రైతులను, వ్యాపారులను సంక్షోభంలోకి నెట్టేసింది. ప్రతికూల వాతావరణం, నల్లతామర కారణంగా బంగినపల్లి దిగుబడి దారుణంగా తగ్గిపోగా ఉన్న కాస్త కాయలకు మార్కెట్లో ధర లేకుండా పోయింది. దీనికి తోడు సిండికేట్ మాయాజాలంతో మామిడి ధరలు పతనమయ్యాయి. దీంతో పెట్టిన పెట్టుబడులు కూడా రాక రైతులు నష్టాలపాలయ్యారు. జిల్లాలో మామిడితోటలు దాదాపు 40 వేల ఎకరాల్లో సాగవుతుండగా ఒక్క నూజివీడు నియోజకవర్గంలోనే 35 వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. నాలుగు మండలాల్లోని రైతులకు ప్రధాన ఆదాయ వనరు మామిడే. ఖరీఫ్ సీజన్లో సాగుచేసిన పంటలు నష్టపోయినా, మామిడి ఆదుకుంటుందనే ధీమాతో రైతులు మామిడిపై నమ్మకం పెట్టుకుంటారు. బంగినపల్లి రకం తోటలు దాదాపు 25 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతం నుంచి మామిడి కాయలను స్థానికంగా ఉన్న మార్కెట్లతో పాటు నున్న, హైదరాబాద్లలోని మార్కెట్, ముంబాయి, ఇండోర్, అహ్మదాబాద్ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. దిగజారిన ధర మామిడి ధర కూడా దిగజారుతూ వచ్చిందే తప్ప ఈ ఏడాది పెరిగిన దాఖలాలు లేవు. సీజన్ ప్రారంభమైన మార్చి మొదటి వారంలో బంగినపల్లి టన్ను ముంబాయి మార్కెట్లో రూ.80 వేల నుంచి రూ.90 వేల ధర పలకగా స్థానికంగా రూ.40 వేలు పలికింది. రానురాను రూ.30 వేలకు, రూ.20 వేలకు తగ్గుతూ ప్రస్తుతం కాయ బాగుంటే రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ధర లభిస్తోంది. ఏ మాత్రం నాణ్యత లేకపోయినా టన్ను కేవలం రూ.10 వేలకే లభిస్తోందని రైతులు వాపోతున్నారు. మామిడికి ఇంత దారుణమైన పరిస్థితి గత 25 ఏళ్లలో ఎన్నడూ చూడలేదని పేర్కొంటున్నారు. నున్న, హైదరబాద్లలో ఉన్న మామిడి మార్కెట్కు కాయలను కొనుగోలు చేయడానికి వచ్చే ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన సేట్లు సిండికేట్ కావడం వల్ల ధరలు పెరగడం లేదని రైతుల నుంచి వ్యక్తమవుతున్న అభిప్రాయం. రైతులకు నష్టం చేకూరుస్తున్న సిండికేట్ను నిలువరించేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడం, అసలు మామిడి రైతులను ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలే లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మామిడిపై రైతులు పెట్టుకున్న ఆశలు రాలిపోయాయి. అకాల వర్షాలు దెబ్బతీశాయి ఈ ఏడాది మే నెల అంతా కురిసిన అకాల వర్షాల వల్ల బంగినపల్లి మామిడి కాయలు నాణ్యత కోల్పోవడంతో ధర పతనమైంది. కొన్ని రోజులైతే మామిడి కాయలను ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో కోతలను సైతం నిలిపివేశారు. వర్షాలు పడిన దగ్గర నుంచి కాయలను పురుగులు ఆశించడంతో కొనేవారే లేకుండా పోయారు. ఇలా ప్రతికూల వాతావరణంతో పాటు పలు కారణాల వల్ల ఈ ఏడాది మామిడి రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు. ధర లేని బంగినపల్లి మామిడి రూ.60 వేల నష్టం వచ్చింది నాలుగు ఎకరాల మామిడి తోట ఉంది. పెట్టుబడి రూ.1.70 లక్షలైంది. బంగినపల్లి రకం కాయలు కోసి మార్కెట్లో విక్రయిస్తే కోతకూలి, కిరాయి పోను రూ.1.10 లక్షలు మాత్రమే వచ్చాయి. దీంతో రూ.60 వేల నష్టం వాటిల్లింది. ఈ ఏడాది కాపు తక్కువగా ఉన్నప్పటికీ ఆశించిన ధర లేదు. –నీలపాల కోటేశ్వరరావు, మామిడి రైతు, యనమదల, నూజివీడు మండలం -
కోకో గింజల చోరీ కేసులో నలుగురి అరెస్టు
జంగారెడ్డిగూడెం: కోకో గింజల చోరీ కేసుల్లో నలుగురిని అరెస్టు చేసినట్లు జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు.రవిచంద్ర తెలిపారు. ఆదివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జంగారెడ్డిగూడెం, టి.నరసాపురం, లక్కవరం పోలీస్స్టేషన్ల పరిధిలో ఇటీవల కోకో గింజల చోరీ జరిగింది. దొంగిలించిన రూ.8 లక్షలు విలువైన 2 వేల కేజీల కోకో గింజలు అమ్మేందుకు ప్రయత్నించిన క్రమంలో, దాడి చేసి జంగారెడ్డిగూడెం మండలం చక్రదేవరపల్లికి చెందిన కంకిపాటి కీర్తిరాజు, మానికల మంగరాజు, దొప్పసాని వెంకన్నబాబు, పుట్లగట్లగూడెంకు చెందిన కటారి సుబ్రహ్మణ్యంను అరెస్టు చేశామన్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు. వీరిలో కంకిపాటి కీర్తిరాజు పగలు మేకలు కాస్తూ పొలాల్లో ఉన్న కోకో గింజలు ఆరబెట్టిన ప్రదేశాలు గమనించి, బృందంలోని మరో ఐదుగురికి చెబుతాడు. ఆటోలో రహస్య ప్రదేశానికి తరలించేవారు. వీలుచూసుకుని అమ్మేవారు. వీరిపై జంగారెడ్డిగూడెం పోలీస్స్టేషన్ పరిధిలో 2 కేసులు, లక్కవరం పోలీస్స్టేషన్ పరిధిలో 2 కేసులు, టి.నరసాపురం పీఎస్ పరిధిలో ఒక కేసు నమోదైంది. ద్వారకాతిరుమల, తడికలపూడి పోలీస్స్టేషన్ల పరిధిలో సైతం కేసులు ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకోవడం పాటు, చోరీకి వినియోగించిన ఆటోను సీజ్ చేసినట్లు చెప్పారు. కేసును చేధించిన ఎస్సై జబీర్, ఏఎస్సై సంపత్కుమార్, పీసీలు రమేష్, బి.రాజశేఖర్లకు రివార్డు కోసం ఎస్పీకి సిపార్సు చేస్తున్నట్లు తెలిపారు. -
హాకీ పోటీల విజేతగా అనంతపురం
భీమవరం: క్రీడలతో శారీరక దారుఢ్యంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించుకోవచ్చని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు, రాజ్యసభ సభ్యుడు పాక వెంకట సత్యనారాయణ అన్నారు. భీమవరం డీఎన్నార్ కళాశాల ఆవరణలో మూడు రోజులపాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి అంతర్ జిల్లా బాలికల హాకీ పోటీల ముగింపు సందర్భంగా ఆదివారం విజేతలకు బహుమతులు అందజేశారు. పోటీల్లో 16 జట్లు పాల్గొనగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో అనంతపురం, అన్నమయ్య జిల్లాల జట్లు తలపడగా అనంతపురం విజయం సాధించింది. కార్యక్రమంలో భీమవరం మండల పరిషత్ అధ్యక్షుడు పేరిచర్ల విజయ నరసింహరాజు, హాకీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి గంధం హర్షవర్థన్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కలిదిండి ఆనందరాజు, కేవీస్ భరత్ తదితరులు పాల్గొన్నారు. -
మధ్యతరగతి.. అధోగతి
మధ్యతరగతి ప్రజల జీవనం దుర్భరంగా మారింది. ఆర్థిక అవసరాలు రోజురోజుకూ పెరుగుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనం చేకూరకపోవడంతో అప్పులబాట పడుతున్నారు. ఇదే అదనుగా పల్లెల్లో మైక్రో ఫైనాన్స్ వ్యాపారం కోరలు చాచింది. రూ.5 నుంచి రూ.10 వరకు వడ్డీ వ్యాపారం ఇష్టారాజ్యంగా సాగుతోంది.కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి ఏడాది గడిచినా ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయకపోగా.. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండటంతో మధ్యతరగతి వర్గాలు సతమతమవుతున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతి నెలా సంక్షేమ పథకాల రూపంలో బ్యాంకు ఖాతాల్లో నగదు జమకాగా.. ప్రజలు అప్పుల వైపు వెళ్లని పరిస్థితి. కూటమి ప్రభుత్వం కొలువుతీరిన తర్వాత సామాన్యుడి కష్టాల తారాస్థాయికి చేరాయి. ఒకవైపు మండుతున్న నిత్యావసరాల ధరలు, మరోవైపు ప్రభుత్వ చేయూత లేకపోవడంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో సూపర్సిక్స్ అంటూ హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి నాయకులు చేతులెత్తేశారు. తల్లికి వందనం అందించకుండా ఒక విద్యా సంవత్సరం, అన్నదాత సుఖీభవ సాయం ఇవ్వకుండా ఖరీఫ్, రబీ సీజన్లు గడిపేశారు. – సాక్షి ప్రతినిధి, ఏలూరుగత ప్రభుత్వంలో ఏటా రూ.1,850 కోట్లకు పైగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏటా రూ.1,850 కోట్లకు పైగా నగదు ఏలూరు జిల్లాలో లక్షలాది మంది బ్యాంకు ఖాతాల్లో జమకాగా.. నేడు ఒక్క రూపాయి కూడా జమ కాని పరిస్థితి. కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ పథకాలకు పేర్లు, లబ్ధి నగదు మొత్తాన్ని మార్చి ప్రకటించినా అమలు చేయకపోవడం గమనార్హం. ఈ లెక్కన ఏలూరు జిల్లాలో రూ.2 వేల కోట్లకు పైగా సంక్షేమ పథకాల నగదు ప్రజల ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. తగ్గిన కొనుగోలు శక్తి మార్కెట్లో నగదు లావాదేవీలతో పాటు ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గడంతో వ్యాపారాలు మందగించాయి. గత ప్రభుత్వ హయాంలో సంక్రాంతికి అ మ్మఒడి పథకం కింద ఏలూరు జిల్లాలో 1,78,214 మంది తల్లుల ఖాతాల్లో రూ.267.32 కోట్లు నగదు జమైతే కేవలం పండుగ రోజుల్లోనే జిల్లాలోనే రూ.150 కోట్ల నుంచి రూ.170 కోట్ల టర్నోవర్ జరిగినట్టు అంచనా. అయితే ఈ ఏడాది సంక్రాంతి సీజన్లో 50 శాతం కూడా కొనుగోళ్లు లేవని వ్యాపార వర్గాలు అంటున్నాయి. గతంలో డీబీటీ పథకాలు కావడంతో మార్కెట్లో నగదు రోటేషన్లో ఉండటం, ప్రజల్లో కొనుగోలు శక్తి ఉండటంతో విక్రయాలు బాగా జరిగి వ్యాపారాలు కళకళలాడటంతో జీఎస్టీ ద్వారా ప్రభుత్వానికీ ఆదాయం సమకూరేది. ఈ ఏడాది మాత్రం జీఎస్టీ మొదలు అన్ని లావాదేవీలు తగ్గిపోయాయి. కొన్ని రోజుల్లో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుండగా ఇప్పటికీ తల్లికి వందనంపై కూటమి ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. అప్పులతో ఇబ్బందులు గతంలో మా కుటుంబానికి మూడు పథకాల కింద ఏడాదికి రూ.50 వేల వరకూ వచ్చేవి. వాటితో అప్పులు తీర్చడంతో పాటు కొంత పొదుపు చేసుకునే వాళ్లం. ఇంట్లో అవసరమైన సామగ్రిని నెలవారీ వాయిదా పద్ధతిలో తీసుకుని పథకం డబ్బులతో చెల్లించేవాళ్లం. ఇప్పుడు పొదుపు మాట అటుంచి చేసిన అప్పులు తీర్చడానికే ఇబ్బందులు పడుతున్నాం. – గొంతిన ఝాన్సీలక్ష్మి , గృహిణి అవస్థలు పడుతున్నాం కుటుంబ అవసరాల కోసం గతంలో లేదనకుండా అప్పు ఇచ్చేవారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధితో అప్పులు తీర్చేవాళ్లం. ఇప్పుడు పథకాలు అమలు చేయకపోవడంతో మాకు ఆదాయం వచ్చే దారి లేదని గ్రహించి అప్పులు ఇచ్చేవాళ్లు నిరాకరిస్తున్నారు. అవసరానికి అప్పు పుట్టక అవస్థలు పడుతున్నాం. – పోలిశెట్టి ఈశ్వరి, ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయురాలు నమ్మి మోసపోయాం ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు నమ్మి మోసపోయాం. మాలాంటి మహిళలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న పథకాలు ఒక్కటి కూడా అమలు చేయకపోవడం బాధాకరం. రాష్ట్రంలోని మహిళల ఆవేదనను గ్రహించి ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి అమలు చేస్తారని ఆశిస్తున్నాం. – కె.కనకదుర్గ, చిగురుకోట, ముదినేపల్లి మండలంపథకాలన్నీ ఇవ్వాలి గత ప్రభుత్వంలో ఇచ్చిన పథకాలన్నీ మరలా ఇప్పుడు కూడా ఇచ్చేలా చూడాలి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అందించిన పథకాలు పేదలకు ఎంతో వెసులుబాటు కలిగించేవి. అవి నిలిపివేయడంతో చాలా మంది పేదలు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. తిరిగి పథకాలన్నీ ప్రవేశపెట్టాలి. – నల్గొండ నాంచారమ్మ, మండవల్లి -
శ్రీవారిని దర్శించుకున్న నటుడు సుప్రీత్రెడ్డి
ద్వారకాతిరుమల: చినవెంకన్న దివ్య క్షేత్రాన్ని సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుప్రీత్రెడ్డి (కాట్రాజ్) శనివారం మధ్యాహ్నం సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఆయన ముందుగా శ్రీవారు, అమ్మవార్లను దర్శించారు. అనంతరం అర్చకుల నుంచి వేద ఆశీర్వచనాన్ని పొందారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు ఆయనతో ఫొటోలు, సెల్ఫీలు దిగారు. సుప్రీత్రెడ్డి ఛత్రపతి, మిర్చి, మర్యాద రామన్న, ఎక్స్ప్రెస్ రాజా, ఆగడు, బలుపు వంటి చిత్రాల్లో నటించారు. గోదావరిలో పడి యువకుడి మృతి కుక్కునూరు : గోదావరిలో స్నానం చేసేందుకు సరదాగా స్నేహితులతో దిగిన యువకుడు గోదావరిలో మునిగి మృతిచెందిన ఘటన శనివారం మండలంలోని మాధవరం రేవు వద్ద జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. వేలేరుపాడు మండలం చాగరపల్లికి చెందిన మొట్టెం చరణ్ (20) శనివారం మధ్యాహ్నం కుక్కునూరు మండలంలోని బంజరుగూడెం గ్రామంలో మరో ఇద్దరు స్నేహితులతో కలిసి వివాహానికి హాజరయ్యాడు. భోజనం అనంతరం తిరుగు ప్రయాణంలో మాధవరం గ్రామంలో స్నేహితులు ఉండటంతో ఆగాడు. అక్కడ మరో నలుగురు స్నేహితులతో కలిసి గోదావరిలో ఈత కొట్టేందుకు దిగారు. దిగిన వారెవరికీ ఈత రాకపోవడం, చరణ్ లోతును గమనించకుండా ముందుకు వెళ్లడంతో ఒక్కసారిగా గోదావరిలో మునిగి గల్లంతయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని స్థానిక జాలర్లతో గాలింపు చర్యలు చేపట్టగా, రాత్రి 8 గంటల సమయంలో చరణ్ మృతదేహం లభ్యమైంది. సింహవాహనంపై గ్రామోత్సవం అత్తిలి: మండలంలో ఈడూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవరాల వెంకటేశ్వరస్వామి వార్షిక కల్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం స్వామికి నిత్యార్చనలు, ప్రత్యేక పూజలు జరిపారు. వేదపారాయణం నిర్వహించారు. సాయంత్రం సింహవాహనంపై శ్రీస్వామి, అమ్మవార్లను ఉంచి మేళతాళాల నడుమ శ్రీస్వామివారి గ్రామోత్సవం వైభవంగా జరిపారు. దండు శ్రీనివాసరాజు, ఉమాలక్ష్మిదేవి దంపతుల సౌజన్యంతో శ్రీవెంకటేశ్వర సంబరం నిర్వహించారు. ఆలయ అర్చకులు వాడపల్లి శేఖరాచార్యులు ఆధ్వర్యంలో పూజాదికాలు జరిపారు. -
హోరాహోరీగా హాకీ పోటీలు
భీమవరం: భీమవరం డీఎన్నార్ కళాశాల ఆవరణలో 15వ అంతర్జిల్లాల రాష్ట్ర స్థాయి బాలికల హాకీ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 16 టీంలు పాల్గొంటున్నాయి. శనివారం నిర్వహించిన పోటీల్లో 13 జట్లు పాల్గొన్నాయి. వీటిలో కడప– ఎన్టీఆర్ జిల్లాల జట్ల మధ్య పోటీలో కడప 12 గోల్స్ చేసి విజయం సాధించింది. గుంటూరుపై అనంతపురం, కృష్ణాపై ప్రకాశం, పశ్చిమగోదావరిపై అనకాపల్లి జట్టు విజయం సాధించింది. శ్రీసత్యసాయి– నెల్లూరు మధ్య జరిగిన పోటీలో శ్రీసత్యసాయి జట్టు, తిరుపతి–నంద్యాల మధ్య పోటీలో తిరుపతి, విశాఖపట్నం–మన్యం జిల్లా మధ్య పోటీలో విశాఖపట్నం విజయం సాధించాయి. కాకినాడ–అన్నమయ్య జిల్లాల మధ్య పోటీలో ఎవరూ గోల్ చేయకపోవడంతో డ్రాగా ముగిసింది. 288 మంది క్రీడాకారులకు డీఎన్నార్ కళాశాల యాజమాన్యం వసతి కల్పించగా జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో భోజనం ఇతర సౌకర్యాలు కల్పించినట్లు అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కలిదిండి ఆనందరాజు, కేవీఎస్ భరత్ చెప్పారు. -
పంట మార్పిడితో అధిక దిగుబడి
బుట్టాయగూడెం : ఒకే పొలంలో ఒకే పంట సాగు ద్వారా దిగుబడులు తగ్గుతాయి. పంటల్లో ఎదుగుదల ఉండదు. చీడపీడల ఉధృతి అధికంగా ఉంటుంది. పంటల మార్పిడి ద్వారా భూసారం పెరుగుతుందని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఒకే పొలంలో వేర్వేరు పంటలను ఒక క్రమంలో సాగు చేస్తే అధిక ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు. పంట మార్పిడితో ప్రకృతి వనరులు సమర్ధవంతంగా వాడుకోవచ్చు. తక్కువ పెట్టుబడితో భూసారం నష్టపోకుండా అధిక దిగుబడులు పొందవచ్చు. ఈ ఏడాది ఖరీఫ్కు సిద్ధమవుతున్న నేపధ్యంలో పంట మార్పిడితో కలిగే ప్రయోజనాలపై వ్యవసాయశాఖ అధికారులు రైతులకు పలు సూచనలు చేశారు. ఒకే పంట సాగుతో నష్టాలు ● వేరు వ్యవస్థ ఒకే లోతుకు పోవడం వల్ల ఆ లోతు వరకు ఉన్న పోషకాలు మాత్రమే మొక్కలు వినియోగించుకుంటాయి. ● ఏటా ఒకే పంట పండించడం వల్ల చీడపీడలు, కలుపు బెడద ఎక్కువగా ఉంటుంది. పైరు కూడా అభివృద్ది చెందదు. దిగుబడులు తగ్గుతాయి. రైతులకు పెట్టుబడుల భారం పెరుగుతుంది. ● నేల కోతకు గురవుతుంది. పండిన పంట నాణ్యత ఉండదు. ఫలితంగా గిటుబాటు ధర లభించదు. దీంతో రైతులకు నష్టం వచ్చే అవకాశం ఉంది. ● మార్కెట్ సమస్యలు ఎదురవుతాయి. పాటించాల్సిన జాగ్రత్తలు ● ఎక్కువ లోతుకు చొచ్చుకుపోయే వ్యవస్థ ఉన్న పంట, తక్కువ లోతుకు చొచ్చుకు పోయే వేరు వ్యవస్థ ఉన్న పంటలను ఒకదాని తర్వాత ఒకటి సాగు చేయాలి. వరి, అపరాలు, జొన్న, పత్తి వంటి పంటలు వరుసగా వేయడం మంచిది. ● నేలను నిర్వీర్యం చేసే పంటలను సారాన్ని అభివృద్ధి చేసే పంటలను ఒకదాని తర్వాత ఒకటి సాగు చేసుకోవటం మేలు. ఉదాహరణకు మొక్కజొన్న, అపరాలు వంటి పంటలు. పంట మార్పిడితో లాభాలు పంట మార్పిడి విధానం ద్వారా అనేక లాభాలు ఉన్నాయి. వీటిపై రైతులు పూర్తి అవగాహన పెంచుకోవాలి, వరి పంట సాగు చేసే ముందు పచ్చిరొట్ట పైర్లు సాగు చేయడం వల్ల భూసారం పెరుగుతుంది. సేంద్రీయ పదార్థం భూమిలో ఎక్కువగా ఉండడం వల్ల పైరు ఏపుగా పెరుగుతుంది. వరి తర్వాత అపరాలు, వేరుశనగ, సోయా చిక్కుడు తదితర పంటలు సాగు చేయడం వల్ల భూమిలో సేంద్రీయ పదార్థం బాగా వృద్ధి చెందుతుంది. దీంతో పంటలపై వచ్చే శీలీంద్రాల ఉధృతి తగ్గుతుంది. వరి తర్వాత చిక్కుడు జాతికి చెందిన శనగ, పెసర, మినుము, వేరుశనగ సాగు వల్ల వాటి వేర్లలోని రైజోబియన్ బ్యాక్టీరియా గాలిలోని నత్రజనిని తీసుకుంటాయి. వేర్లలో బుడుపుల మాదిరి ఏర్పడి తర్వాత సాగు చేసే పంటలకు మంచి సారాన్ని అందిస్తాయి. పంట మార్పిడితో మంచి దిగుబడులు రైతులు ఏటా ఒకే పంట సాగు చేస్తున్నారు. వరి సాగు తప్ప వేరే పంట సాగు చేసేందుకు ఆశక్తి చూపడం లేదు. దీంతో వరి పంటలో చీడపీడల బెడద ఎక్కువై సాగు ఖర్చులు పెరుగుతున్నాయి. దీన్ని అధిగమించడానికి పంటల మార్పిడి విధానం ఉత్తమం. ఈ విధానంపై రైతులు పూర్తి అవగాహన పెంచుకోవాలి. పంట మార్పిడి వల్ల కలిగే ప్రయోజనాలు ఒకసారి అనుభవంలోకి వస్తే ఈ విధానాన్ని రైతులు కొనసాగిస్తారు. – డి.ముత్యాలరావు, మండల వ్యవసాయాధికారి, బుట్టాయగూడెం పాడి– పంట భూసారం వృద్ధి, చీడ పీడల నివారణ రైతులకు అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ సిబ్బంది -
చెట్టును ఢీకొని యువకుడి మృతి
భీమడోలు: ఆగడాలలంక చానల్ రోడ్డులోని వడ్డిగూడెం సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టిన ఘటనలో యువకుడు మృతిచెందాడు. ఆగడాలలంక వీఆర్వో సైదు గోపాలకృష్ణ రెండో కుమారుడు సైదు సాయికృష్ణ గంగాప్రసాద్ స్నేహితుడి రిసెప్షన్కు బైక్ ఏలూరు వెళ్లాడు. పార్టీ ముగించుకుని స్వగ్రామానికి వస్తుండగా వడ్డిగూడెం సమీపం మలుపు వద్ద ఒక్కసారిగా అదుపు తప్పింది. ఎదురుగా ఉన్న చెట్టును ఢీకొట్టాడు. సాయి కృష్ణ ఎగిరి పక్కనే ఉన్న పంటబోదెలో పడ్డాడు. తల రాయికి తగలడంతో మృతిచెందాడు. శనివారం ఉదయం ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీలు గమనించి పోలీసులకు, తండ్రికి సమాచారం అందించారు. ఎస్సై వై.సుధాకర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. -
గంజాయి రవాణా చేస్తున్న నలుగురి అరెస్టు
గణపవరం : చెడు వ్యసనాలకు బానిసలై, గంజాయి అమ్మకాలు చేస్తున్న నలుగురు యువకులు పోలీసుల వలలో చిక్కారు. గణపవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద పోలీసులు శనివారం ఉదయం మాటువేసి గంజాయి అక్రమంగా రవాణాచేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.50వేల విలువైన 5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. శనివారం సాయంత్రం ఏలూరు డీఎస్పీ శ్రావణ్కుమార్ వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లాకు చెందిన ఖార అర్జున్ ఆటో డ్రైవర్గా పనిచేస్తూ దొంగతనంగా గంజాయి అమ్మేవాడు. ఇతనికి గణపవరం వెలంపేటకు చెందిన రాయపురెడ్డి తరుణ్, ఇందిరమ్మ కాలనీకి చెందినయాళ్ల సాయికిషోర్, ఉండిమండలం కోలమూరుకు చెందిన దగుగ్పల్లి జోగామారిష్ పరిచయం ఆయ్యారు. ఈ ముగ్గురు యువకులు గంజాయి సేవించడమే కాక, చుట్టుపక్కల యువకులకు గంజాయి అమ్మవారు. ఈ ముగ్గురు యువకులు అర్జున్తో కలసి అరకు వెళ్లి గంజాయి కొని తెచ్చి స్థానికంగా అమ్ముతున్నారు. తనకు అందిన సమాచారం ఆధారంగా సీఐ సుభాష్ సిబ్బందితో కలసి మాటువేసి వీరిని పట్టుకున్నారు. కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. గంజాయి మొక్కలు పెంచుతున్న వ్యక్తి అరెస్టు తాడేపల్లిగూడెం అర్బన్: తాడేపల్లిగూడెం పట్టణంలోని దానమ్మగుడి సమీపంలో ఆటో డ్రైవర్ పద్మాకర్ ఇటీవల ఇంటి ముందు గంజాయి మొక్కలు పెంచుతున్నాడు. శనివారం ఇది గమనించిన స్థానికులు కొందరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎకై ్సజ్ ఎస్సై రాంబాబు, పట్టణ ఎస్సై బాదం శ్రీనివాసు పద్మాకర ఇంటికి వెళ్లి అక్కడి గంజాయి మొక్కలను పరిశీలించి నిర్ధారించారు. పద్మాకర్ను విచారించగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అరెస్టు చేసి విచారణ చేపట్టారు. -
చెరువు మట్టి అక్రమార్కుల పాలు
నూజివీడు: పొలంలో మెరక నిమిత్తం మట్టి కావాలని అనుమతులు తీసుకుని చెరువు మట్టిని తవ్వి యథేచ్ఛగా విక్రయిస్తూ టీడీపీ నాయకులు జేబులు నింపుకుంటున్నారు. నూజివీడు పట్టణంలోని పెద్దచెరువులో పొలం మెరక చేసుకోవాలనే ముసుగులో అనుమతులు పొంది మట్టిని వాణిజ్య అవసరాలకు, ఇతర అవసరాలకు అక్రమార్కులు అమ్మేస్తున్నారు. రెండు రోజుల నుంచి అక్రమ మట్టి తవ్వకాలు ఇష్టారాజ్యంగా జరుగుతున్నా ఇటు ఇరిగేషన్ అధికారులు గాని, అటు రెవిన్యూ అధికారులు గాని పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ట్రాక్టరు మట్టిని రూ.1000 నుంచి రూ.1200కు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. పొక్లెయిన్కు టక్కులో మట్టిని పోసినందుకు రూ.150 ఇస్తుండగా మిగిలిన మొత్తం ట్రాక్టర్ కిరాయి కింద వసూలు చేస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. ఇంత రేటు గతంలో ఎన్నడూ లేదని రాజకీయ వర్గాల్లోనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మెరక నిమిత్తం అనుమతులు తీసుకొని.. పట్టణానికి చెందిన వీవీ కృష్ణారావు నూజివీడులోని సర్వే నెంబరు 871–3లోని ఎకరం విస్తీర్ణం గల వ్యవసాయ భూమిని మెరక చేసుకునే నిమిత్తం అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకోగా, తహసీల్దార్, స్థానిక ఇరిగేషన్ డీఈ సిఫార్సుల మేరకు ఇరిగేషన్ ఈఈ 1000 క్యూబిక్ మీటర్ల పూడిక మట్టిని వారి సొంత ఖర్చులతో తవ్వి తోలుకునేందుకు అనుమతి ఇచ్చారు. అది కూడా ఈనెల 1 వరకు మాత్రమే అనుమతినివ్వగా గత రెండు రోజుల నుంచి పెద్ద చెరువులోని మట్టిని అధికార పార్టీకి చెందిన నాయకులు యథేచ్ఛగా, విచ్చలవిడిగా తోలుతూ విక్రయిస్తున్నారు. ఇరిగేషన్ శాఖ, ఇంజినీరింగ్ అధికారులు మట్టి తవ్వడానికి మార్కింగ్ ఇచ్చిన చోట నుంచి తవ్వకుండా నాయకులు వేరొక చోట తవ్వుతూ మట్టిని ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. ఈ నెల ఒకటో తేదీ వరకు మాత్రమే అనుమతి ఉండగా, ఈ నెల 6వ తేదీ నుంచి రెండు జేసీబీలతో మట్టిని తవ్వి తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఇరిగేషన్ ఏఈ, డీఈ ఏమాత్రం పట్టించుకోకుండా టీడీపీ నాయకులకు జీ హుజూర్ అంటున్నారు. అధికార పార్టీ వారు కావడంతో అధికారులు కళ్లు మూసుకొని కూర్చుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చెరువులో నుంచి తరలిస్తున్న మట్టిని అనుమతి తీసుకున్న పొలం మెరకకు ఉపయోగించకుండా పట్టణంలో ఎవరు కావాలంటే వారికి అమ్మేసుకుంటున్నారు. ప్రజల ఇంత పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుంటే పట్టించుకోవాల్సిన ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకుండా వదిలేయగా, రెవిన్యూ అధికారులు సైతం ఇరిగేషన్ అధికారుల బాటలోనే నడుస్తున్నారు. పార్కు మెరక పేరుతో పెద్ద దోపిడీకి స్కెచ్ వేశారు. ఎలాంటి నిధులు మంజూరు కాకుండానే కొప్పుల వెలమపేటలో పార్కు అభివృద్ధి పనులను టీడీపీ నాయకుడొకరు చేస్తుండగా ఆ పార్కులోకి మెరక నిమిత్తం పెద్ద ఎత్తున మట్టిని తోలుతున్నారు. వాస్తవంగా నిధులు మంజూరయ్యాక టెండర్లు పిలిచి కాంట్రాక్టర్ను నిర్ణయించి వర్క్ఆర్డర్ ఇచ్చిన తరువాత పనులు చేయాల్సి ఉండగా, అలాంటివేమీ లేకుండానే పార్కు అభివృద్ధి అంటూ పనులు చేస్తున్నారు. తరువాత మెరక పేరుతో భారీ ఎత్తున బిల్లులు చేసుకోవడానికే ఇదంతా చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పొలం మెరక కోసం అనుమతులు.. వేరే అవసరాలకు తరలింపు ట్రక్కు రూ.1000 నుంచి రూ.1200కు అమ్ముకుంటున్న అక్రమార్కులు -
సూపర్ సిక్స్.. మోసం ఫిక్స్
హోరాహోరీగా హాకీ పోటీలు భీమవరంలో 15వ అంతర్ జిల్లాల రాష్ట్రస్థాయి బాలికల హాకీ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. పలు జిల్లాల నుంచి 16 జట్లు పాల్గొంటున్నాయి. 10లో uకూటమి నాయకులు సూపర్ సిక్స్ పథకాలంటూ ఊదరగొట్టారు.. 143 హామీలతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిపి సంయుక్తంగా కూటమి మేనిఫెస్టో ప్రకటించి ఇంటింటికీ కరపత్రాలు పంచారు.. తీరా చూస్తే గద్దెనెక్కి ఏడాది గడుస్తున్నా ఒక్క పథకాన్నీ మొదలు పెట్టకుండా ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నవరత్నాల పేరులో జిల్లాలో పలు పథకాల కింద ఏటా సగటున రూ.1,850 కోట్ల నగదు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమకాగా.. కూటమి ప్రభుత్వంలో చిల్లిగవ్వ కూడా జమకాని పరిస్థితి. సూపర్సిక్స్ హామీలు అమలు కాకపోవడంతో జిల్లాలో ప్రజలు సుమారు రూ.2,100 కోట్లకుపైగా నష్టపోయారు. ఆదివారం శ్రీ 8 శ్రీ జూన్ శ్రీ 2025సాక్షి ప్రతినిధి, ఏలూరు: వైఎస్సార్సీపీ మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావించింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత 2019లో తొలి సమావేశం నుంచి మేనిఫెస్టో అమలుకు ప్రాధా న్యమిచ్చారు. తొలి ఏడాదిలోనే 90 శాతం హామీలను అమలుచేసి చూపించారు. మేనిఫెస్టోలోని హామీలతో పాటు, మేనిఫెస్టోలో లేని పలు పథకాలను అమలు చేసి విశ్వసనీయత చాటారు. సంక్షేమ క్యాలెండర్ రూపొందించి అమలుకు పక్కాగా చర్య లు తీసుకున్నారు. ఇదంతా వైఎస్ జగన్ హయాంలో నడిచిన సంక్షేమ అజెండా తీరు. హామీలు గుప్పించి.. చివరకు విస్మరించి.. గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి నేతలు సూపర్ సిక్స్తో పాటు రాష్ట్రస్థాయిలో 143 హామీలు, అలాగే ఉమ్మడి పశ్చిమలో మరో 20 హామీలు గుప్పించి విజయం సాధించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చి ఏడాది గడిచినా ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. ఉచిత బస్సు ఎప్పుడనే డిమాండ్ బలంగా వినిపిస్తున్నా.. అదిగో ఇదిగో అంటూ ప్రభుత్వం కాలయాపన చేస్తోది. ఇక అన్నదాత సుఖీభవ పేరుతో రూ.20 వేలు జమ చేయకుండానే ఖరీఫ్, రబీ సీజన్లు ముగించేశారు. అలాగే మొదటి సంవత్సరం తల్లికి వందనం అమలు చేయకుండా గడిపేశారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి పథకాల అమలును విజయవంతం అటకెక్కించారు. సూపర్సిక్స్ హామీలను వెంటనే అమలుచేయాలంటూ ప్రజలు రోడ్లెక్కి నినదిస్తున్నా పట్టించుకోవడం లేదు. భృతి.. భ్రాంతి : జిల్లాలో ప్రతి ఇంటికో ఉద్యోగం.. లేదంటే రూ.3 వేల నిరుద్యోగ భృతి అన్నారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతంలో 4,50,118, పట్టణ ప్రాంతాల్లో 96,672 మొత్తంగా 5,47,790 నివాసాలు ఉన్నాయి. నెలకు రూ.3 వేల చొప్పున సుమారుగా నెలకు రూ.164 కోట్లు చొప్పున ఏడాదికి రూ.1,968 కోట్లు నిరుద్యోగులకు సర్కారు బకాయి పడింది. మహిళలకు టోకరా జిల్లాలో 18 ఏళ్లు పైబడిన మహిళలు 8,29,659 ఉండగా వారందరికీ ఉచిత బస్సు సౌకర్యం అందడం లేదు. అలాగే ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి పేరుతో రూ.1,500 జమ చేస్తామన్నారు. జిల్లా 19–59 ఏళ్ల వయసున్న మహిళలు 6,71,033 మంది ఉండగా వీరందరికీ నెలకు రూ. 100.56 కోట్ల చొప్పున ఏడాదికి రూ.1,207.80 కోట్లు ఇవ్వాల్సి ఉన్నా కూటమి ప్రభుత్వం మోసం చేసింది. అందరికీ ఉచిత గ్యాస్ సిలిండర్లు అని చెప్పి కొద్ది మందికే పరిమితం చేశారు. అది కూడా ఏడాది పాలనలో ఒక్క సిలిండర్తోనే సరిపెట్టారు. జిల్లాలో 5,81,314 కనెక్షన్లకు సిలిండర్లు ఇవ్వాల్సి ఉన్నా కనీసం ఒక్క ఉచిత సిలిండర్ను నూరు శాతం పంపిణీ చేయకపోవడం గమనార్హం. అన్నదాతకు మొండిచేయి జిల్లాలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 1,98,179 మంది రైతులకు ఏటా రూ.20 వేల చొప్పున రూ.336 కోట్లు జమ చేయాలి. మొదటి ఏడాది మోసం చేశారు. గత ప్రభుత్వంలో జగన్ హయాంలో 1,98,179 మంది రైతులకు ఏటా రూ.236.99 కోట్ల చొప్పున క్రమం తప్పకుండా నాలుగేళ్లు జమ చేశారు. న్యూస్రీల్కూటమి మాయా మేనిఫెస్టో ఏడాది గడిచినా ఒక్క పథకమూ అమలు కాలేదు జిల్లాలో కనిపించని అభివృద్ధి, సంక్షేమం ఉచిత బస్సు నుంచి తల్లికి వందనం వరకూ అన్నీ పెండింగే.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోపవిత్ర గ్రంథంలా మేనిఫెస్టో జిల్లాలో ఏటా రూ.1,850 కోట్లకుపైగా సంక్షేమ పథకాల అమలు కూటమి పాలనపై జనాగ్రహం తల్లికి ఎగనామం జిల్లాలో తల్లికి వందనం పేరుతో తల్లులకు రూ. 486.96 కోట్లు ప్రభుత్వం బకాయి పడింది. స్కూల్కు వెళ్లే పిల్లలకు ఎంత మంది ఉంటే అంతమందికి రూ.15 వేలు ఇస్తామని ప్రకటించారు. జిల్లాలో 1,818 ప్రభుత్వ, 495 ప్రైవేటు పాఠశాలల్లో కలిపి 2,91,858 మంది విద్యార్థులు ఉన్నారు. అలాగే 127 ప్రభుత్వ, జూనియర్ కళాశాలల్లో 31,448 మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరికి రూ.486.96 కోట్లు జమ కావాల్సి ఉంది. అదే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జిల్లాలో 1,78,214 మంది విద్యార్థులకు రూ.267.32 కోట్లు చొప్పున ఏటా అమ్మఒడి పేరుతో తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. -
శుభ కార్యాలకు విరామం
శ్రావణం వరకూ ఆగాల్సిందే.. ఈనెల 10 నుంచి గురు మూఢమి. అలాగే 26 నుంచి ఆషాఢ మాసం ప్రారంభం అవుతుంది. దీంతో ఆషాఢ మాసం ముగిసే వరకూ వివాహాలు చేసుకునే వారు ఆగాల్సిందే. శ్రావణ మాసమైన జూలై 26 నుంచి బలమైన ముహూర్తాలు ఉన్నాయి. నవంబరు తర్వాత మళ్లీ ముహూర్తాలు లేవు. – గోవింద వఝుల వెంకటరమణ మూర్తి శర్మ, పురోహితుడు, ద్వారకాతిరుమల ద్వారకాతిరుమల: పెళ్లి పనులు ప్రారంభించడం దగ్గర నుంచి అన్ని పనులకు ముహూర్తాలు చూస్తారు. అటువంటి ముహూర్తాలకు 48 రోజుల పాటు బ్రేక్ పడింది. ఈ ఏడాది జనవరి 30 నుంచి జూన్ 7 వరకు వివాహాలు జోరుగా జరిగాయి. ఆయా ముహూర్తాల్లో జిల్లావ్యాప్తంగా వేలాది వివాహాలు నిర్వహించారు. ఈనెల 10 నుంచి గురు మూఢమి, 26 నుంచి ఆషాఢ మాసం కావడంతో జులై 25 వరకు పెళ్లి సందడికి విరామం వచ్చింది. తిరిగి వివాహ ముహూర్తాలు శ్రావణ మాసం జూలై 26 నుంచి ప్రారంభం కానున్నాయి. అప్పటివరకు వివాహాది శుభకార్యాలకు ఆగాల్సిందే. 48 రోజులు పనులు లేనట్టే.. వివాహాది శుభకార్యాలపై ఆధారపడి జీవనోపాధి పొందే పురోహితులు, పచ్చిపూల మండపాలు, డెకరేషన్, షామియానా పందిళ్లు నిర్మించే వారు, వాయిద్యకారులు, క్యాటరింగ్, లైటింగ్ కార్మికులకు 48 రోజుల పాటు పనులు లేనట్టే. వీరంతా మళ్లీ జులై 26 నుంచి బిజీ కానున్నారు. వివాహ ముహూర్తాలు : వివాహాలకు ఈ ఏడాది జూలై 26, 30, 31, ఆగస్టు 1, 3, 5, 6, 7, 8, 9, 10, 12, 13, 14, 17, సెప్టెంబర్ 23, 24, 26, 27, 28, అక్టోబర్ 1, 2, 3, 4, 7, 8, 10, 11, 12, 16, 17, 22, 23, 24, 26, 28, 29, 30, 31, నవంబర్ 1, 2, 4, 7, 12, 13, 14, 15, 22, 23, 25, 26, 27 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి. నేటి నుంచి 48 రోజులపాటు బ్రేక్ జూలై 26 నుంచి మళ్లీ ముహూర్తాలు -
శ్రీవారి అంతరాలయ దర్శనం రద్దు
ద్వారకాతిరుమల: భక్తుల రద్దీ దృష్ట్యా ద్వారకాతిరుమల చినవెంకన్న దేవస్థానం అధికారులు స్వామి వారి అంతరాలయ దర్శనాన్ని శనివారం ఐదు గంటల పాటు రద్దు చేశారు. దీంతో ప్రజాప్రతినిధుల సిఫార్సులతో వచ్చిన వారికి, వీఐపీలకు షాక్ తగిలింది. కాగా అధికారులు తీసుకున్న నిర్ణయంపై సామాన్య భక్తులు హర్షం వ్యక్తం చేశారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. రద్దీ దృష్ట్యా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీవారి అంతరాలయ దర్శనాన్ని రద్దు చేయాలని ఆలయ ఈఓ ఎన్వీ సత్యనారాయణమూర్తి ఆదేశించారు. అంతే కాకుండా అధిక సమయం అక్కడే ఉండి పర్యవేక్షించారు. ఎవరైనా ఈ నిర్ణయాన్ని అతిక్రమిస్తే చర్యలు చేపడతానని తీవ్రంగా హెచ్చరించారు. అదే సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సులతో వచ్చిన వారికి, వీఐపీలకు చుక్కెదురైంది. అయితే అధికారులు వారికి నచ్చజెప్పి కొండపైన గదుల్లో వసతి కల్పించి, మధ్యాహ్నం నుంచి అంతరాలయ దర్శనం చేయించారు. సౌకర్యాలపై ఆరా : భక్తులకు అందుతున్న సౌకర్యాలను ఈఓ సత్యనారాయణమూర్తి స్వయంగా పరిశీలించారు. ఆలయంలో భక్తుల వద్ద ఉన్న దర్శనం టికెట్లను ఆయన పరిశీలించారు. నిత్యాన్నదాన భవనంలో అన్నప్రసాదం స్వీకరిస్తున్న భక్తులతో మాట్లాడి, రుచి, నాణ్యతపై ఆరా తీశారు. ప్రసాదం కౌంటర్లు, ఇతర విభాగాలను తనిఖీ చేశారు. రూ.43 లక్షలు ఆదాయం: శ్రీవారిని 30 వేల మంది భక్తులు దర్శించినట్టు ఆలయ అధికారులు తెలిపారు. దర్శనం టికెట్లు, ప్రసాదాల విక్రయాలు, స్వామివారి నిత్యార్జిత కల్యాణాలు, విరాళాలు, ఇతర సేవా రుసుముల ద్వారా రూ.43 లక్షల ఆదాయం సమకూరిందన్నారు. క్షేత్రం కిటకిట.. హరినామమే అందరి నోట శ్రీవారి క్షేత్రం భక్తజన సంద్రాన్ని తలపించింది. సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది తరలివచ్చారు. వేకువజాము నుంచే భక్తుల రాక మొదలైంది. దీంతో క్షేత్ర పరిసరాలు సందడిగా మారాయి. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతం, అనివెట్టి మండపం, వైకుంఠం క్యూకాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కేశఖండనశాల, ఉచిత ప్రసాద వితరణ క్యూలైన్లు, నిత్యాన్నదాన విభాగాలు భక్తులతో పోటెత్తాయి. క్యూలైన్లు నిండిపోవడంతో భక్తులు ఆలయ ఆవరణలో బారులు తీరారు. అనివేటి మండపంలో భజన మండలి సభ్యుల కోలాట నృత్యాలు అలరించాయి. స్వామివారి కొండపైన ఘాట్ రోడ్డులో భక్తుల వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. రాత్రి వరకూ క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. చిన వెంకన్న క్షేత్రం.. భక్త జన సంద్రం 5 గంటల పాటు నిలిపివేసిన అంతరాలయ దర్శనం -
గంజాయి రవాణా.. నలుగురి అరెస్ట్
వ్యసనాలకు బానిసలై, గంజాయి విక్రయిస్తున్న నలుగురు యువకులను గణపవరం పోలీసులు అరెస్ట్ చేశారు. 5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 10లో u●ఉచిత ప్రయాణమెప్పుడో? మహిళలకు ఉచిత బస్సు అని ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతోంది. ఉచిత బస్సు గురించి ఊసే ఎత్తడం లేదు. ఎన్నికల సభల్లో మాత్రం మహిళలందరికీ ఉచిత బస్సు ఇస్తాం.. మీరు ఎక్కడి వెళ్లాలన్నా, తీర్థయాత్రలు చేయాలన్నా వెసులుబాటుగా ఉంటుందన్నారు. ఇప్పటివరకు అసలు ఎక్కడా అమలు చేయలేదు. ఈ ఏడాదైనా ప్రకటిస్తారో లేదో చూడాలి. – కూనిశెట్టి నాగమణి, గృహిణి పథకాలన్నీ అమలు చేయాలి పేద కుటుంబాలు గతే డాది నుంచి ఎదురుచూస్తున్న సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలి. పథకాలు అమలు చేస్తే మాలాంటి పేద కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి. పథకాల ద్వారా అందే సొమ్ముతో కాలేజీ ఫీజులు, చదువుకయ్యే ఖర్చులు చెల్లించేందుకు వెసులుబాటు ఉంటుంది. ఈ ఏడాదైనా పథకాలు అమలు చేస్తే బాగుంటుంది. – మిరియాల శ్రీకృష్ణ, ఇంజనీరింగ్ విద్యార్థి -
వెబ్ కౌన్సెలింగ్పై గళమెత్తిన టీచర్లు
ఏలూరు (ఆర్ఆర్పేట): సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు మాన్యువల్ పద్ధతిలో బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక (ఫ్యాప్టో) నాయకులు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక డీఈఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయ బదిలీల చట్టం–2025లో ఎస్జీటీల బదిలీలను మాన్యువల్గా చేపడతామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ హామీ ఇచ్చారని, అయితే ప్రస్తుతం ఇందుకు విరుద్ధంగా వెబ్ ఆప్షన్లను కొన్ని జిల్లాలకు విడుదల చేశారన్నారు. దీని ద్వారా కంప ల్సరీ బదిలీలో ఉన్న సుమారు 2,800 మంది ఐచ్ఛి కాలను ఎన్నుకోవాల్సి ఉందని, ఈ మేరకు వెబ్ కౌన్సెలింగ్ను ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక వ్యతిరేకిస్తోందన్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోని పక్షంలో ఆదివారం డీఈఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మకు వినతిపత్రం సమర్పించా రు. ఫ్యాప్టో నాయకులు ఎం.శామ్యూల్, కేఆర్ పవన్కుమార్, సాంబశివరావు, వి.రామ్మోహన్రావు, ఆర్.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ముసునూరులో.. ముసునూరు: ఎస్జీటీల బదిలీలకు వెబ్ కౌన్సెలింగ్ ఆలోచన మానుకోవాలని మండల ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నేతలు డిమాండ్ చేశారు. మండల ఉపాధ్యాయ ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్థానిక ఎంఈఓ కార్యాలయం ఎదుట శనివారం సాయంత్రం నిరసన ధర్నా చేపట్టారు. మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సంఘ నేతలు గాంగేయుడు, బాబురావు, పద్మ కిషోర్, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. నూజివీడులో.. నూజివీడు: ఎస్జీటీలకు మాన్యువల్గా బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించాలంటూ ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్థానిక ఎంఈఓ కా ర్యాలయం వద్ద ఉపాధ్యాయులు నిరసన తెలిపా రు. ప్రభుత్వం, విద్యాశాఖ ఉన్నతాధికారుల ఒంటె ద్దు పోకడలను వీడాలన్నారు. యూటీఎఫ్, ఎస్టీయూ, డీటీఎఫ్ నాయకులు పాల్గొన్నారు. -
నేత్రపర్వంగా వరాల వెంకన్న కల్యాణం
అత్తిలి: మండలంలోని ఈడూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవరాల వెంకటేశ్వరస్వామివారి కల్యాణం నేత్రపర్వంగా జరిగింది. స్వామి, అమ్మవార్లకు గజవాహన సేవ నిర్వహించారు. సుదర్శన సాయిరామాచార్యులు ఆధ్వర్యంలో వాడపల్లి శేఖరాచార్యులు, విఖన్ బాబు, పలువురు వేదపండితుల సమక్షంలో స్వామి కల్యాణం నిర్వహించారు. దారాబత్తుల సత్యనారాయణ దంపతులచే మంగళసూత్రాలు, సమతం వెంకటేశ్వరరావు దంపతులచే ముత్యాల తలంబ్రాలను స్వామి, అమ్మవార్లకు సమర్పించారు. కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. శుక్రవారం తీర్ధమహోత్సవం జరిగింది. ఆలయప్రాంగణంలో కోలాట బృందంచే హరే శ్రీనివాస్ భజన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో అఖండ అన్నసమారాధన జరిగింది. సాయంత్రం స్వామి,అమ్మవార్లను పుష్పాలతో అలంకరించిన రథంపై ఉంచి మేళతాళాలు, మంగళవాద్యాలు, ఆసాదుల గరగనృత్యాలు నడుమ రథోత్సవం వైభవోపేతంగా జరిపారు. -
లాకర్లో బంగారు ఆభరణం మాయం
ఆకివీడు : ఇంట్లో ఉంటే దొంగల బెడద అని భయపడి బ్యాంక్ లాకర్లో దాచుకున్న బంగారు ఆభరణం మాయమైపోయిన సంఘటనపై బాధితురాలు వల్లభుని శ్రీ పూర్ణ లక్ష్మి శుక్రవారం బ్యాంక్ ఎదుట ఆందోళనకు దిగారు. ఆమెకు మద్దతుగా పలువురు మహిళలు, సీపీఎం నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు. గత ఇరవై రోజులుగా లాకర్లో బంగారు వస్తువు మాయమైందని బ్యాంక్ అధికారులకు మొరపెట్టుకున్నా సరైన సమాధానం చెప్పడంలేదని, తమది బాధ్యత కాదని బ్యాంక్ మేనేజర్ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఆమె వాపోయారు. 27 కాసుల ఆభరణం లాకరులో ఎలా పోతుందని ఆమె బ్యాంక్ అధికారుల్ని నిలదీశారు. సీసీ పుటేజ్ల వివరాలు ఇవ్వమంటే కాలయాపన చేస్తున్నారని ఆమె వాపోయారు. విషయాన్ని మేనేజర్ ఎస్సైకు తెలియజేయడంతో ఆయన వచ్చి మాట్లాడారు. సోమవారం సీపీ పుటేజ్లను సాంకేతిక నిపుణులతో పరిశీలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉన్నతాధికారులు ఎస్సై నాగరాజుకు తెలిపారు. బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ లాకర్లో ఉన్న వస్తువులు ఏం ఉన్నాయో తమకు తెలియదని, బ్యాంక్లో పోయే అవకాశం లేదన్నారు. ఎస్సై నాగరాజు మాట్లాడుతూ బ్యాంక్లోని సీసీ పుటేజ్ సేకరించామని, గతంలో ఓపెన్ కాలేదని.. సాంకేతిక నిపుణుడు సాయంతో సోమవారం పరిశీలిస్తామన్నారు. అక్రమంగా అమ్ముతున్న వరి విత్తనాల సీజ్ కలిదిండి(కై కలూరు): నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న వరి విత్తన బస్తాలను సీజ్ చేసి కేసు నమోదు చేసిన ఘటన కలిదిండి మండలం సానారుద్రవరంలో శుక్రవారం జరిగింది. శ్రీ వేంకటేశ్వర సీడ్స్ విక్రయ దుకాణాన్ని మారుబోయిన సత్యనారాయణ నిర్వహిస్తుండగా.. వ్యవసాయశాఖ జేడీ హబీబ్ బాషా, ఏడీ ఆర్.గంగాధరరావు, ఏఓ కె.విద్యాసాగర్ తనిఖీ చేశారు. దాడుల్లో 710 క్వింటాళ్ల వరి విత్తన బాస్తాలు పట్టుబడ్డాయి. వీటి విలువ మార్కెట్లో రూ.21,63,500 ఉంటుందని అధికారులు చెప్పారు. వరి విత్తనాలు విక్రయించాలంటే 30 కేజీల బస్తాలు కలిగిన లేబుల్ సీల్ ఉండాలి. బ్యాగ్పై తయారీ తేదీ, వివరాలు, ప్యాకింగ్ ప్రాంతం, విత్తన రకం వంటి వివరాలు ఉంటాయి. అవేమీ లేకుండా 40 కేజీల వరి విత్తనాల బస్తాలు రూ.1,200కు విక్రయిస్తున్నాడు. ఎలాంటి బిల్లులు లేకుండా విత్తనాలు విక్రయించడం నేరమన్నారు. స్వాధీనం చేసుకున్న ధాన్యాన్ని పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపుతామన్నారు. ల్యాబ్ నివేదికను బట్టి విక్రయదారుడిపై కేసు నమోదు చేస్తామన్నారు. -
మాయమాటలతో ఏటీఎంలో సొమ్ము స్వాహా
ఆకివీడు: సొమ్ము డ్రా చేద్దామని ఏటీఎంకు వెళ్లిన ఇద్దరికి టోకరా వేసి రూ.39,500 డ్రా చేసిన సంఘటన శుక్రవారం జరిగింది. అయిభీమవరం టర్నింగ్ వద్ద ఏటీఎంలో డబ్బు డ్రా చేసేందుకు ఉపాధ్యాయురాలు సూర్యకుమారి, ఆమె భర్త సత్యనారాయణమూర్తి వెళ్లారు. ఏటీఎంలో కార్డు పెట్టి కోడ్ కొట్టినా సొమ్ము రాకపోవడంతో.. అక్కడే ఉన్న మరో వ్యక్తి వచ్చి ఇప్పుడే డ్రా చేశాను కార్డు ఇవ్వండి ట్రైచేస్తానని చెప్పాడు. కార్డు లోపల పెట్టగా సొమ్ము రాకపోవడంతో.. అతని వద్ద ఉన్న వేరే కార్డు వాళ్లకు ఇచ్చి ఆ వ్యక్తి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఎస్బీఐ మెయిన్బ్రాంచ్ వద్ద ఉన్న ఏటీఎంకు వెళ్లి సూర్యకుమారి కార్డుతో ఆ వ్యక్తి రూ.39,500 డ్రా చేసి పరారయ్యాడు. డబ్బులు డ్రా చేయడం సెల్ఫోన్లో మెసేజ్ రాగా.. వెంటనే మెయిన్ బ్రాంచ్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. వెంటనే కార్డు బ్లాక్ చేశారు. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదుచేయగా.. ఎస్సై హనుమంతు బాధితులతో మాట్లాడారు. సీసీ పుటేజ్లు పరిశీలించి కేసు నమోదు చేస్తామని చెప్పారు. -
త్యాగానికి ప్రతీక బక్రీద్
●ఖుర్బానీ ఇవ్వడం ఆనవాయితీ బక్రీద్ సందర్భంగా ప్రతి ముస్లిం విధిగా పొట్టేలు మాంసాన్ని ఖుర్బానీ ఇచ్చి పేదలకు పంచడం ఆనవాయితీ. ఈ పండుగ సందర్భంగా ముస్లింలు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా అతి పవిత్రమైన మక్కాను సందర్శించి ముక్తి పొందాలి. – మహమ్మద్ అబ్దుల్ వదూద్, జామియా మసీదు ఇమామ్ త్యాగ నిరతికి ప్రతీక బక్రీద్ పండుగ మనిషి దైవ భీతిని, త్యాగ నిరతిని తెలియజేస్తుంది. ఈ పండుగను త్యాగాల పండుగ అంటారు. అంతేకాకుండ చనిపోయిన కుటుంబ సభ్యులను గుర్తు చేసుకుని వారి పేరున ఖుర్బానీ ఇవ్వడం ఈ పండుగ ప్రత్యేకత. – సయ్యద్ బాబు, జామియా మసీదు అధ్యక్షుడు, చింతలపూడిచింతలపూడి: ముస్లింలు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో బక్రీద్ ఒకటి. ధనిక, పేద తారతమ్యం లేకుండ ప్రతి ముస్లిం బక్రీద్ పండుగను జరుపుకుంటారు. పవిత్ర త్యాగానికి ప్రతిరూపమైన దైవ ప్రవక్త హజ్రత్ ఇబ్రహీం అల్లా ప్రసన్నం కోసం చేసిన మహోన్నత త్యాగాన్ని ఈ పండుగ సందర్భంగా ముస్లింలు స్మరించుకుంటారు. ఇస్లాం మతంలో రంజాన్ తరువాత అంత ప్రాముఖ్యత ఉన్న పండుగ ఈదుల్ జుహా (బక్రీద్). శనివారం దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు బక్రీద్ను జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఖుర్బానీ ఇవ్వడం అత్యంత పవిత్రమైందిగా భావిస్తారు. గొర్రె పొట్టేలు మాంసాన్ని మూడు భాగాలుగా చేసి ఒక భాగాన్ని నిరుపేదలకు పంచి పెడతారు. మిగిలిన భాగాలలో రెండో దాన్ని బంధువులకు, మూడో భాగాన్ని తమ కోసం ఉంచుకుంటారు. దీన్నే ఖుర్బానీ అంటారు. ముస్లింలు ఈ మాసంలోనే హజ్ యాత్ర చేస్తారు. పవిత్ర స్థలం మక్కాను సందర్శించడానికి ఇష్టపడతారు. సౌదీ అరేబియాలోని మక్కా వెళ్ళి కాబా చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణ చేస్తారు. బక్రీద్ సందడి జిల్లాలోని ముఖ్యమైన ప్రాంతాల్లో మొదలైంది. పండుగ సందర్భంగా పొట్టేళ్లు, గొర్రెలు, మేకల విక్రయాలు, కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఖుర్బానీ ఇవ్వడం కోసం ఇప్పటికే కొందరు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా పొట్టేళ్లను కొనుగోలు చేసి తెచ్చుకున్నారు. మరికొద్ది మంది తాడేపల్లిగూడెం, గుంటూరు, మచిలీపట్నం, రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి ఖుర్బానీ కోసం సిద్ధం చేసుకున్నారు. స్ధానికంగా కొందరు వ్యాపారులు ఏడాది పొడవునా పొట్టేళ్లను పెంచి విక్రయిస్తుంటారు. ఒక్కో పొట్టేలు రూ.10 వేల నుండి రూ. 20 వేల వరకు ధర ఉంటుందని వ్యాపారులు తెలిపారు. జిల్లాలోని ఏలూరు, నూజివీడు, తాడేపల్లిగూడెం, తణుకు, చింతలపూడి, జంగారెడ్డిగూడెం, ఆకివీడు, పోలవరం తదితర ప్రాంతాల్లో బక్రీద్ను ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 5 కోట్లకు పైగా పొట్టేళ్ళ వ్యాపారం జరుగుతుందని అంచనా. పొట్టేళ్ళకు గిరాకీ బక్రీద్ వస్తుందంటే పొట్టేళ్ళకు గిరాకీ పెరుగుతుంది. వారం రోజుల నుంచి మెట్ట ప్రాంతంలో పండుగ సందర్భంగా కొత్తబట్టలు, పండుగ సామాగ్రి కొనుగోలు చేశారు. ఖుర్బానీ ఇవ్వడానికి గొర్రెలు, మేకలను దూర ప్రాంతాల నుంచి కొనుగోలు చేశారు. పండుగ అయిపోయిన తరువాత నెల మొత్తం ఖుర్బానీ ఇచ్చుకునే అవకాశం ఉండటంతో పొట్టేళ్ల అమ్మకాలు సాగనున్నాయి. నేడు ఖుర్బానీ ఇవ్వనున్న ముస్లింలు ఈ నెలలో పవిత్ర మక్కా సందర్శన -
మూణ్నాళ్ల ముచ్చటగా రోడ్డు మరమ్మతులు
భీమవరం అర్బన్ : భీమవరం మండలంలోని గూట్లపాడు రేవు నుంచి దొంగపిండి వరకు ఆర్ అండ్ బీ రోడ్డుపై చేపట్టిన రోడ్డు మరమ్మతులు మూడు నెలలు గడవక ముందే పాడయ్యాయిజ గూట్లపాడు రేవు, గూట్లపాడు, కొత్తపూసలమర్రు, దొంగపిండి వరకు సుమారు 10 కిలోమీటర్లు గతంలో రోడ్డు ధ్వంసమవడంతో ఆర్అండ్బీ అధికారులు టెండర్ ప్రక్రియ ద్వారా రోడ్డు మరమ్మతులు చేపట్టారు. కాంట్రాక్టర్ నాసిరకం మెటీరియల్ ఉపయోగించి రోడ్డు మరమ్మతులు చేపట్టడంతో గోతులు ఏర్పడుతున్నాయి. ఈ మార్గం గుండా నిత్యం స్కూల్ బస్సులు, చేపల లారీలు, వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే రోడ్డు వేసేటప్పుడు ఆర్అండ్బీ అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో రోడ్డు మరమ్మతులు చేపట్టి మూడు నెలలు గడవకు ముందే ధ్వంసమైంది. దీంతో ఈ రోడ్లపై ప్రయాణమంటేనే ప్రజలు భయపడుతున్నారు. -
వైభవంగా ఏకాదశి ఉత్సవం
ద్వారకాతిరుమల: చినవెంకన్న దివ్య క్షేత్రంలో శుక్రవారం రాత్రి శ్రీవారికి తిరువీధి సేవ అంగరంగ వైభవంగా జరిగింది. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుక భక్తులకు నేత్రపర్వమైంది. ముందుగా ఆలయంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను తొళక్క వాహనంపై ఉంచి, సుగంధ భరిత పుష్పమాలికలతో విశేషంగా అలంకరించారు. అనంతరం అర్చకులు పూజాదికాలను జరిపి, హారతులిచ్చారు. ఆ తరువాత స్వామివారి వాహనం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణల నడుమ ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా క్షేత్ర పురవీధులకు పయనమైంది. ప్రతి ఇంటి ముంగిటా భక్తులు స్వామి, అమ్మవార్లకు నీరాజనాలు సమర్పించారు. -
వర్షాకాలంలో పశువులకు వ్యాధుల ముప్పు
బుట్టాయగూడెం: ముందస్తు వర్షాలు కురవడంతో పాటు వానాకాలం రావడంతో పశువులు, గొర్రెలు ఇతర జీవాలకు వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ అధికారులు సూచిస్తున్నారు. జీవాలకు వచ్చే వ్యాధులను గుర్తించిన వెంటనే సకాలంలో అందుబాటులో ఉన్న పశువైద్యాధికారిని సంప్రదించి సరైన చికిత్స అందించాలని సూచిస్తున్నారు. బ్లూ టంగ్– ఫుట్ రాట్ లక్షణాలు గొర్రెలు, మేకల్లో బ్లూటంగ్ వ్యాధులు సోకితే ఎక్కువగా జ్వరం, మూతివావు, నోటిలోపల పుండ్లు, ముక్కులో చీమిడి, కాళ్లు కుంటడం, ఒంట్లో నీరు చేరడం, పారుకోవడం, మేత మేయకపోవడం, ఈసుకుపోవడం (అబార్షన్లు) వంటి లక్షణాలు ఉంటాయి. వీటి నివారణకు సాయంత్రం సమయంలో గొర్రెల మందలో వేపాకు పొగ పెట్టుకుంటూ అప్పుడప్పుడూ బ్లూటాక్స్/టిక్కిల్ మందులు పిచికారీ చేస్తూ పోడు ప్రాంతాల్లో మేతకు తీసుకెళ్లాలి. కాళ్ల పుండ్ల వ్యాధి జీవాలకు కాళ్ల పుండ్లు వ్యాధి సోకితే కాలి గిట్టల మధ్య చీము చేరి చెడువాసన వస్తుంది. గొర్రెలు కుంటుతూ నడుస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు జీవాలను బురద ప్రాంతంలో మేపకూడదు. పొడి ప్రాంతంలోనే మేసేలా చూడాలి. గొంతు వాపు వ్యాధి పశువులకు సోకే వ్యాధుల్లో గొంతువాపు ప్రమాదకరమైంది. ఈ వ్యాధిని గురక వ్యాధి అని కూడా పిలుస్తారు. వర్షాకాలంలో పశువులకు సూక్ష్మజీవుల వల్ల సంక్రమిస్తుంది. తొలకరి వర్షాలు పడిన సమయంలో కలుషితమైన నీటి ద్వారా, మేత ద్వారా పశువులకు రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల ఈ వ్యాధుల బారిన పడతాయి. గొంతువాపు వ్యాధి బారిన పడిన పశువులను మిగిలిన పశువులతో కలిపి ఉంచితే ఈ వ్యాధి మిగిలిన వాటికి కూడా వ్యాప్తి చెందుతుంది. ఒకేపాకలో మిగతావాటితో ఉంచకుండా వేరుగా ఉంచాలి. వర్షాకాలంలో పశువులు వర్షాలకు తడవకుండా చూడాలి. నివారణ చర్యలు జూన్, జులై, ఆగస్టు నెలలో వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. పౌష్టికాహారం అందించాలి. వ్యాధి సోకిన పశువులను మిగిలినవాటి నుంచి వేరు చేయాలి. వాటి స్థావరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూడాలి. చికిట వ్యాధి ఇది గొర్రెల్లో ఎక్కువగా వస్తుంది. ఎంటరోటాక్సీమియా అనే బ్యాక్టీరియా వల్ల తొలకరి వర్షాలు కురిసే సమయంలో ఈ వ్యాధి గొర్రెలకు సోకుతుంది. ఏడాది వయసున్న గొర్రెల్లో ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి సోకిన గొర్రె తక్కువ సమయానికే మరణిస్తుంది. ఈ వ్యాధి సోకిన గొర్రెలు నీరసిస్తాయి. కొద్దిసేపటికే గొర్రెలు గిలగిలా కొట్టుకుని గాలిలో ఎగిరి కిందపడి మరణిస్తాయి. ఈ వ్యాధి లక్షణాలను ఉదయం, మధ్యాహ్న వేళల్లో గొర్రెల్లో కనిపిస్తాయి. వర్షాలకు ముందే గొర్రెలకు ఈ వ్యాధి రాకుండా టీకాలు వేయించాలి. వ్యాధి సోకిన గొర్రెలను మంద నుంచి వేరు చేయాలి. పాడి– పంట సీజనల్ వ్యాధులు సోకే ప్రమాదం ముందుగానే టీకాలు వేయడం ఉత్తమం: వైద్యులు వ్యాధుల పట్ల జాగ్రత్తలు అవసరం వర్షాకాలంలో పశువులకు వచ్చే వ్యాధులపై జాగ్రత్తలు తీసుకోవాలి. సీజనల్ వ్యాధులు సోకే ప్రమాదం ఉన్నందున ముందుగానే టీకాలు వేయించుకోవడం ఉత్తమం. వ్యాధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే పశువుల ప్రాణాలకు ముప్పు. వ్యాధులను గుర్తిస్తే దగ్గరలో ఉన్న పశువుల ఆస్పత్రిలో వైద్యులను సంప్రదించాలి. సకాలంలో వైద్యం అందేలా చూడాలి. – డాక్టర్ మల్లంపల్లి సాయి బుచ్చారావు, సహాయ సంచాలకులు ప్రాంతీయ పశు సంవర్థక శాఖ, జీలుగుమిల్లి -
చెస్ విజేతలకు బహుమతుల ప్రదానం
భీమవరం : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని అనసూయ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ పోటీల్లో విజేతలకు శుక్రవారం ఆర్యవైశ్య వర్తక సంఘ భవనం అధ్యక్షుడు వబిలి శెట్టి వెంకటేశ్వరరావు బహుమతులు అందించారు. అనంతరం మాట్లాడుతూ పిల్లలు చదరంగంలో పోటీ పడడమేగాక పర్యావరణ పరిరక్షణకు మొక్కలు పెంచి పోషించడంలో ముందుండాలన్నారు. చదరంగం నేర్చుకోవడం ద్వారా మేధాశక్తిని పెంపొందించుకుని విద్యలో రాణించవచ్చన్నారు. ప్రథమ బహుమతి డి.సురేష్ (పాలకొల్లు), ద్వితీయ బహుమతి ఎన్.వరుణ్ తేజ్ (భీమవరం), తృతీయ బహుమతి ఎ.రామకృష్ణ (విజయవాడ) అందుకున్నారు. చెస్ పోటీల నిర్వాహకుడు మాదాసు కిషోర్, సురేష్ జైన్, నోముల రామారావు, సునీల్, గౌరవ్ తదితరులు పాల్గొన్నారు. బాలికల హాకీ పోటీలు ప్రారంభం భీమవరం: రాష్ట్ర స్థాయి 15వ అంతర్ జిల్లాల బాలికల హాకీ పోటీలు శుక్రవారం భీమవరం డీఎన్నార్ కళాశాల ఆవరణలో ప్రారంభమయ్యాయి. పోటీలను ప్రారంభించి డీఎన్నార్ కళాశాల ప్రిన్సిపల్ జి.మోజెస్, పీడీ బీవీ నర్సింహరాజు మాట్లాడుతూ క్రీడలు శారీరక దారుడ్యానికి, మానసిక ప్రశాంతతకే గాకుండా ఉద్యోగ, ఉపాధి కల్పనకు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. హాకీ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కలిదిండి ఆనందరాజు, కేవీఎస్ భరత్ మాట్లాడుతూ మూడు రోజులపాటు నిర్వహించే హాకీ పోటీల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి 16 జట్లు పాల్గొంటున్నట్లు చెప్పారు. అనంతరం పశ్చిమగోదావరి– కృష్ణా జిల్లా జట్ల మధ్య జరిగిన పోటీల్లో పశ్చిమగోదావరి జట్టు కృష్ణా జట్టుపై విజయం సాధించింది. విద్యుత్ వైర్లు తగిలి లారీకి మంటలు తాడేపల్లిగూడెం (టీఓసీ): పట్టణంలో కడకట్ల శివారు ఖాళీ స్థలాల వద్ద శుక్రవారం లారీకి విద్యుత్ వైర్లు తగిలి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫైర్ సిబ్బంది వివరాల ప్రకారం..లారీకి విద్యుత్ వైర్లు తగలడంతో మంటలు చెలరేగాయి. వెంటనే డ్రైవర్ లారీ నుంచి దూకి తప్పించుకున్నాడు. సిమెంట్ పని మీద వచ్చి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. డీజిల్ ట్యాంక్ ఉన్న వైపు మంటలు చెలరేగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఫైర్ ఆఫీసర్ జీవీ రామారావు ఆధ్వర్యంలో సిబ్బంది మంటలు అదుపు చేశారు. -
ప్రాణం ఉన్నంత వరకూ వైఎస్ జగన్ వెంటే..
మీడియాలో దుష్ప్రచారంపై మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆగ్రహం దెందులూరు: తాను ప్రాణం ఉన్నంత వరకూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే, వైఎస్సార్సీపీ కే పనిచేస్తానని దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి అన్నారు. కొన్ని మీడియా సంస్థలు తాను పార్టీ మారుతున్నట్టు చేసిన దుష్ప్రచారాన్ని శుక్రవారం ప్రకటనలో ఖండించారు. ప్రాణం ఉన్నంత వరకూ తనకు, తన కుటుంబానికి ఎంతో ఇష్టమైన వైస్ జగన్ తోనే తన పయనం అన్నారు. తనకు వైఎస్సార్ కుటుంబానికి ఉన్న అనుబంధం విడదీయరానిదన్నారు. తాను పార్టీ మారుతున్నట్టు కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారాన్ని చేయటం బాధ కలిగించిందన్నారు. ఇది సిగ్గుచేటని అబ్బయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. బడులకు విద్యార్థి మిత్ర కిట్లు ఏలూరు (ఆర్ఆర్పేట): వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులకు అందించాల్సిన సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర–1 కిట్లు జిల్లాలోని అన్ని పాఠశాలలకు చేరుకోవాలని డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ బి.శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఆయన ఏలూరులోని ఈదర సుబ్బమ్మ దేవి మున్సిపాల్ కార్పొరేషన్ హైస్కూల్, పెదవేగి హైస్కూల్, వట్లూరు హైస్కూళ్లలో మండల స్థాయి స్టాక్ పాయింట్లను పరిశీలించారు. పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు, బెల్టులు, నోట్ పుస్తకాల నాణ్యతను పరిశీలించారు. జిల్లా స్టూడెంట్ కిట్స్ ఇన్చార్జి కె.ప్రతిష్ట, జిల్లా సమగ్ర శిక్ష ఏపీసీ కె.పంకజ్కుమార్, సమగ్ర శిక్ష ఇన్చార్జి సీఎంఓ జె.రవీంద్ర ఉన్నారు. పదోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహించాలి ఏలూరు (ఆర్ఆర్పేట): వైద్యారోగ్య శాఖలో సచివాలయం హెల్త్ సెక్రటరీలకు ఎంపీహెచ్ఏ (ఎఫ్) పదోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్.లింగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్వీడీ ప్రసాద్ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో వారు మాట్లాడుతూ తొమ్మిది నెలల క్రితమే పదోన్నతులకు ఆదేశాలు వచ్చినా జిల్లా అధికారులు తా త్సారం చేశారన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలు అమలుచేయకుండా ఈనెల 15కు కౌన్సెలింగ్ వాయిదా వేయడం తగదన్నారు. మెడికల్ రీయింబర్స్మెంట్ గడువు పొడిగింపు ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక మెడికల్ రీయింబర్స్మెంట్ సౌకర్యం గడువును ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 30 వరకూ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు పువ్వుల ఆంజనేయులు ప్రకటనలో తెలిపారు. ఈ సౌకర్యం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్కు సమాంతరంగా కొనసాగుతుందని తెలిపారు. 9న కొల్లేరుపై కీలక సమావేశం కై కలూరు: సుప్రీంకోర్టు ఆదేశాలతో కొల్లేరు పరిశీలనకు త్వరలో రానున్న సెంట్రల్ ఎంపవర్ట్ కమిటీ (సీఈసీ)కి నివేదించే అంశాలపై ఈనెల 9న ఉదయం 9 గంటలకు కై కలూరు సీతారామ ఫంక్షన్ హాలులో నిర్వహించనున్న సమావేశానికి కొల్లేరు పెద్దలు తరలిరావాలని రాష్ట్ర చేపల రైతుల సంఘ అధ్యక్షుడు తాడినాడ బాబు శుక్రవారం కోరారు. కొల్లేరు ప్రజల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుందన్నారు. కమి టీ దృష్టికి కొల్లేరు గ్రామాలకు సంబంధించిన సమస్యలు, ఇతర అంశాలను రాతపూర్వకంగా గ్రామాల ప్రజలు తీసుకురావాలని చెప్పారు. గ్రామాల జనాభా, విస్తీర్ణం, కొల్లేరుకు సంబంధించిన అంశాలు అందులో ఉండాలన్నారు. సమావేశానికి ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ హాజరవుతారన్నారు. విద్యా వ్యాపారాన్ని పట్టించుకోని అధికారులు ఏలూరు (ఆర్ఆర్పేట): విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే పలు ప్రైవేట్ విద్యాసంస్థలు పుస్తకాలను విద్యార్థులకు విక్రయిస్తూ డబ్బులు గుంజుతున్నా విద్యాశాఖాధికారులు పట్టించుకోవడం లేదని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కొలిక్కపోగు లెనిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిడమర్రు మండలం బావాయిపాలెంలోని చైతన్య విద్యాసంస్థలో పుస్తకాల అమ్మకాన్ని అడ్డుకున్నట్టు తెలిపారు. -
ప్రశాంతంగా డీఎస్సీ పరీక్షలు ప్రారంభం
ఏలూరు (ఆర్ఆర్పేట): ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో భాగంగా డీఎస్సీ పరీక్షలు శుక్రవారం జిల్లాలో ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఏలూరులోని రెండు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రాన్ని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆకస్మిక తనిఖీ చేశారు. కేంద్రంలో ఏర్పాట్లను, పరీక్షల నిర్వహణ తీరును పరీశీలించారు. జిల్లాలో ఈనెల 30 వరకు జరిగే డీఎస్సీ పరీక్షలకు మూడు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు షిఫ్టుల్లో ఆన్లైన్ పరీక్షలు జరుగుతాయన్నారు. మొత్తంగా 17,584 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని చెప్పారు. అభ్యర్థుల సౌకర్యార్థం 9030723444, 9505644555 నంబర్లతో కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేశామన్నారు. తొలిరోజు 685 మంది హాజరు.. ఏలూరులోని సిద్ధార్థ క్వెస్ట్, సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 685 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. సిద్ధార్థ క్వెస్ట్లో ఉదయం 181 మందికి 165 మంది, మధ్యాహ్నం 180 మందికి 159 మంది, సీఆర్ఆర్ ఇంజనీరింగ్లో ఉదయం 200 మందికి 181 మంది, మధ్యాహ్నం 200 మందికి 180 మంది హాజరైనట్టు డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు. -
మధ్యతరగతి.. అధోగతి
మధ్యతరగతి ప్రజల జీవనం దుర్భరంగా మారింది. ఆర్థిక అవసరాలు రోజురోజుకూ పెరుగుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనం చేకూరకపోవడంతో అప్పులబాట పడుతున్నారు. ఇదే అదనుగా పల్లెల్లో మైక్రో ఫైనాన్స్ వ్యాపారం కోరలు చాచింది. రూ.5 నుంచి రూ.10 వరకు వడ్డీ వ్యాపారం ఇష్టారాజ్యంగా సాగుతోంది. కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి ఏడాది గడిచినా ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయకపోగా.. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండటంతో మధ్యతరగతి వర్గాలు సతమతమవుతున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతి నెలా సంక్షేమ పథకాల రూపంలో బ్యాంకు ఖాతాల్లో నగదు జమకాగా.. ప్రజలు అప్పుల వైపు వెళ్లని పరిస్థితి. శనివారం శ్రీ 7 శ్రీ జూన్ శ్రీ 2025సాక్షి ప్రతినిధి, ఏలూరు : కూటమి ప్రభుత్వం కొలువుతీరిన తర్వాత సామాన్యుడి కష్టాల తారాస్థాయికి చేరాయి. ఒకవైపు మండుతున్న నిత్యావసరాల ధరలు, మరోవైపు ప్రభుత్వ చేయూత లేకపోవడంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో సూపర్సిక్స్ అంటూ హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి నాయకులు చేతులెత్తేశారు. తల్లికి వందనం అందించకుండా ఒక విద్యా సంవత్సరం, అన్నదాత సుఖీభవ సాయం ఇవ్వకుండా ఖరీఫ్, రబీ సీజన్లు గడిపేశారు. తగ్గిన కొనుగోలు శక్తి మార్కెట్లో నగదు లావాదేవీలతో పాటు ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గడంతో వ్యాపారాలు మందగించాయి. గత ప్రభుత్వ హయాంలో సంక్రాంతికి అ మ్మఒడి పథకం కింద ఏలూరు జిల్లాలో 1,78,214 మంది తల్లుల ఖాతాల్లో రూ.267.32 కోట్లు నగదు జమైతే కేవలం పండుగ రోజుల్లోనే జిల్లాలోనే రూ.150 కోట్ల నుంచి రూ.170 కోట్ల టర్నోవర్ జరిగినట్టు అంచనా. అయితే ఈ ఏడాది సంక్రాంతి సీజన్లో 50 శాతం కూడా కొనుగోళ్లు లేవని వ్యాపార వర్గాలు అంటున్నాయి. గతంలో డీబీటీ పథకాలు కావడంతో మార్కెట్లో నగదు రోటేషన్లో ఉండటం, ప్రజల్లో కొనుగోలు శక్తి ఉండటంతో విక్రయాలు బాగా జరిగి వ్యాపారాలు కళకళలాడటంతో జీఎస్టీ ద్వారా ప్రభుత్వానికీ ఆదాయం సమకూరేది. ఈ ఏడాది మాత్రం జీఎస్టీ మొదలు అన్ని లావాదేవీలు తగ్గిపోయాయి. కొన్ని రోజుల్లో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుండగా ఇప్పటికీ తల్లికి వందనంపై కూటమి ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో ఏటా రూ.1,850 కోట్లకు పైగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏటా రూ.1,850 కోట్లకు పైగా నగదు జిల్లాలో లక్షలాది మంది బ్యాంకు ఖాతాల్లో జమకాగా.. నేడు ఒక్క రూపాయి కూడా జమ కాని పరిస్థితి. కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ పథకాలకు పేర్లు, లబ్ధి నగదు మొత్తాన్ని మార్చి ప్రకటించినా అమలు చేయకపోవడం గమనార్హం. ఈ లెక్కన ఏలూరు జిల్లాలో రూ.2 వేల కోట్లకు పైగా సంక్షేమ పథకాల నగదు ప్రజల ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. న్యూస్రీల్గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పథకాల అమలు వైఎస్సార్ రైతు భరోసా 2019–20లో 2,31,061 మంది రైతులకు రూ.311.93 కోట్లు, 2020–21లో రూ.297.73 కోట్లు, 2021–22లో రూ.265.67 కోట్లు, 2022–23లో రూ.262.11 కోట్లు మొత్తంగా రూ.1,137.34 కోట్లు అందజేత జగనన్న విద్యాదీవెన 2019–20లో 36,527 మంది విద్యార్థులకు రూ.95.78 కోట్లు, 2020–21లో రూ.77.97 కోట్లు, 2021–22లో రూ.105.67 కోట్లు, 2022–23లో 56.16 మొత్తంగా రూ.335.58 కోట్ల లబ్ధి చేకూర్చారు. జగనన్న అమ్మఒడి 2019–20లో 1,80,327 మంది మహిళల ఖాతాల్లో రూ. 270.49 కోట్లు, 2020–21లో 266.16 కోట్లు, 2021–22లో 276.36 కోట్లు మొత్తంగా రూ.813.01 కోట్లు అందించారు. వైఎస్సార్ ఆసరా ఏలూరు జిల్లాలో మూడు విడతల్లో రూ.985.82 కోట్లు జమ చేశారు. 3,55,315 మంది మహిళల ఖాతాల్లో 2020–21లో రూ.327.56 కోట్లు, 2021–22లో రూ.329.92 కోట్లు, 2022–23లో రూ.328.34 కోట్లు అందజేశారు. వైఎస్సార్ చేయూత 2020–21లో 94,670 మంది మహిళలకు రూ.177.51 కోట్లు, 2021–22లో రూ.165.60 కోట్లు, 2022–23లో రూ.218.42 కోట్లు మొత్తంగా రూ.561.53 కోట్లు మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. అప్పులతో సతమతం ఏడాదిగా నిలిచిన సంక్షేమ పథకాలు పల్లెల్లో కోరలు చాచిన మైక్రో ఫైనాన్స్ వ్యాపారం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రజలకు ఆర్థిక భరోసా జిల్లాలో ఏటా సగటున రూ.1,850 కోట్లు అందజేత నాడు కళకళలాడిన వ్యాపారాలు నేడు కూటమి పాలనలో వెలవెల -
దుర్వినియోగమైన నిధులు రాబట్టాలి
కై కలూరు: కై కలూరు పంచాయతీలో 2020 నుంచి 2025 వరకు రూ.8,08,58,883 నిధుల అవకతవకలు జరిగాయని వార్డు సభ్యులు కేవీఎన్ఎం నా యుడు, మేడూరు నాంచారయ్య, మంచికంటి శ్రీనివాసరావు, బిరుదుగడ్డ రాజామణి ఆరోపించారు. కై కలూరు పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. అవినీతి ఫిర్యాదులపై నూజివీడు, జంగారెడ్డిగూడెం డీఎల్పీఓలు విచార ణ చేసి నివేదిక కలెక్టర్కు అందించారన్నారు. సర్పంచ్ దానం మేరీ నవరత్నకుమారి, పంచాయతీ ఈఓలకు షోకాజు నోటీసులు ఇచ్చారన్నారు. దుర్వినియోగమైన నిధులను తిరిగి పంచాయతీకి చెల్లించా లని డిమాండ్ చేశారు. అలాగే పంచాయతీ కార్యాలయంలో పౌర సేవ పత్రాన్ని అమలు చేయాలని కో రారు. పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికులకు నా లుగు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, వాటిని చెల్లించకపోతే వార్డు సభ్యులంతా ఆమరణ నిరాహర దీక్ష చేస్తామన్నారు. పలు వార్డుల్లో పారిశుద్ధ్య సమస్య ఏర్పడుతోందని చెప్పారు. సమస్యలను ఎమ్మెల్యే కామినేని దృష్టికి తీసుకువెళతామన్నారు. ముగిసిన టీఓటీ శిక్షణ ఏలూరు(మెట్రో): స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో మూడు రోజుల పాటు జరిగిన టీఓటీ (ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్) శిక్షణ కార్యక్రమం శుక్రవా రం ముగిసినట్లు వ్యవసాయశాఖ అధికారి హబీబ్ బాషా తెలిపారు. ప్రకృతి వ్యవసాయాన్ని ఎలా విస్తరించాలి, రైతులకు ఎలా మద్దతు ఇవ్వాలి అనే అంశాలపై విస్తృతంగా చర్చించామన్నారు. -
అప్పులతో ఇబ్బందులు
గతంలో మా కుటుంబానికి మూడు పథకాల కింద ఏడాదికి రూ.50 వేల వరకూ వచ్చేవి. వాటితో అప్పులు తీర్చడంతో పాటు కొంత పొదుపు చేసుకునే వాళ్లం. ఇంట్లో అవసరమైన సామగ్రిని నెలవారీ వాయిదా పద్ధతిలో తీసుకుని పథకం డబ్బులతో చెల్లించేవాళ్లం. ఇప్పుడు పొదుపు మాట అటుంచి చేసిన అప్పులు తీర్చడానికే ఇబ్బందులు పడుతున్నాం. – గొంతిన ఝాన్సీలక్ష్మి, గృహిణి అవస్థలు పడుతున్నాం కుటుంబ అవసరాల కోసం గతంలో లేదనకుండా అప్పు ఇచ్చేవారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధితో అప్పులు తీర్చేవాళ్లం. ఇప్పుడు పథకాలు అమలు చేయకపోవడంతో మాకు ఆదాయం వచ్చే దారి లేదని గ్రహించి అప్పులు ఇచ్చేవాళ్లు నిరాకరిస్తున్నారు. అవసరానికి అప్పు పుట్టక అవస్థలు పడుతున్నాం. – పోలిశెట్టి ఈశ్వరి, ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయురాలు నమ్మి మోసపోయాం ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు నమ్మి మోసపోయాం. మాలాంటి మహిళలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న పథకాలు ఒక్కటి కూడా అమలు చేయకపోవడం బాధాకరం. రాష్ట్రంలోని మహిళల ఆవేదనను గ్రహించి ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి అమలు చేస్తారని ఆశిస్తున్నాం. – కె.కనకదుర్గ, చిగురుకోట, ముదినేపల్లి మండలం పథకాలన్నీ ఇవ్వాలి గత ప్రభుత్వంలో ఇచ్చిన పథకాలన్నీ మరలా ఇప్పుడు కూడా ఇచ్చేలా చూడాలి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అందించిన పథకాలు పేదలకు ఎంతో వెసులుబాటు కలిగించేవి. అవి నిలిపివేయడంతో చాలా మంది పేదలు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. తిరిగి పథకాలన్నీ ప్రవేశపెట్టాలి. – నల్గొండ నాంచారమ్మ, మండవల్లి ● -
9న ఆయిల్పామ్ రైతుల ధర్నా
పెదవేగి: కేంద్ర ప్రభుత్వం పామాయిల్పై 10 శాతం దిగుమతి సుంకం తగ్గించడాన్ని నిరసిస్తూ ఈనెల 9న ఉదయం 10 గంటలకు ఏలూరు కలెక్టరేట్ వద్ద ఆయిల్పామ్ రైతుల ధర్నా, రైతుల సామూహిక రాయబార కార్యక్రమం చేపట్టినట్టు ఏపీ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం విజయరాయిలో ఆయిల్పామ్ రైతుల సమావేశాన్ని మున్నంగి సుబ్బారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ధర్నా కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ దిగుమతి సుంకం తగ్గడంతో ఆయిల్పామ్ గెలల ధరలు తగ్గి రైతులు నష్టపోతున్నారన్నారు. ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలన్నారు. పెదవేగిలో ఆయిల్ఫెడ్ కర్మాగారం ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలన్నారు. రైతులు పూసం రామరెడ్డి, రాపర్ల తేజ కృష్ణ, నీలం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నేడు రౌండ్ టేబుల్ సమావేశం ఏలూరు (ఆర్ఆర్పేట): ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం (స్ఫూర్తి భవన్) ఆధ్వర్యంలో శనివారం ఉదయం 11 గంటలకు ఆయిల్పామ్ రైతుల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినట్టు ఏపీ రైతు సంఘం ఏలూరు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పుల్లూరి సోమశేఖరా చార్యులు, రాయంకుల లక్ష్మణరావు తెలిపారు. -
జనాభా నిర్వహణపై ప్రజాభిప్రాయం
ఏలూరు(మెట్రో): జనాభా నిర్వహణ విధానంపై ప్రజలను భాగస్వాములను చేసేందుకు ఈనెల 20 వరకు క్యూఆర్ కోడ్ విధానం ద్వారా ప్రజాభిప్రాయం సేకరిస్తున్నట్టు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో ప్రణాళిక శాఖ ప్రచురించిన జనాభా నిర్వహణ విధానం ప్రతి కుటుంబం ముఖ్యం–మీ అభిప్రాయం మార్గదర్శనం వాల్పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ జనాభా సమతుల్యత సాధించే దిశలో జూన్ 20లోపు జనాభా నిర్వహణ విధానంపై ఆలోచనలు పంచుకోవాలని సూచించారు. రాష్ట్రంలో జనాభా సమతుల్యత లక్ష్యంగా జనాభా నిర్వహణ విధానం (పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ)పై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. ఇందుకోసం క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి 9 ప్రశ్నలకు సంబంధించి ప్రజలు అభిప్రాయాలు తెలపాల్సి ఉందన్నారు. జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి సీహెచ్ వాసుదేవరావు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. 9న యోగాంధ్రపై ర్యాలీ : ఈనెల 9న యోగాంధ్ర కార్యక్రమంపై జిల్లావ్యాప్తంగా అవగాహన ర్యాలీలు నిర్వహించాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. నిరాధార ఆరోపణలను ఊరుకోం ప్రభుత్వ అధికారుల విశ్వసనీయతను దెబ్బతీసేలా ధ్రువీకరించని, నిరాధారమైన ఆరోపణలను వ్యాప్తి చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెట్రిసెల్వి హెచ్చరించారు. నిరాధారమైన ఆరోపణలను వ్యాప్తి చేసే వ్యక్తులుగాని, మీడియా ప్రతినిధులు, ఇతర సమూహాలు ఎవరైనా గాని చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. -
ఐటీఐ కౌన్సెలింగ్ ప్రారంభం
ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల్లోని ఐటీఐ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం గురువారం ఏలూరులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో కౌన్సెలింగ్ ప్రారంభమైంది. తొలిరోజు 202 దరఖాస్తులకు గాను 100 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 77 మందికి వివిధ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించినట్టు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ కేంద్రం ప్రధానాధికారి పి.రజిత తెలిపారు. జనరల్ పూల్కు సంబంధించిన ప్రవేశాలకు ఈనెల 9న కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. కౌన్సెలింగ్ ప్రక్రియను కలెక్టరేట్ పరిపాలనాధికారి ఎన్వీ నాంచారయ్య పర్యవేక్షించారు. మూగ జీవాలను హింసిస్తే చర్యలు ఏలూరు (ఆర్ఆర్పేట): మూగజీవాలను హింసించినా, వధించినా, అక్రమంగా రవాణా చేసినా చర్యలు తప్పవని పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకుడు డాక్టర్ టి.గోవిందరాజు తెలిపారు. మూగజీవాలపై హింస, వధించడం, అక్రమ రవాణా నిర్మూలనపై అవగాహనకు గురువారం స్థానిక గన్బజార్ సెంటర్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బక్రీద్ పండుగ సందర్భంగా ఆవులు, దూడలను వధించరాదన్నారు. అలాగే పశువులను విచ్చలవిడిగా రోడ్లపై వదలడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, పశు యజమానులకు నోటీసు జారీ చేసి జరిమానా విధించాలన్నారు. జంతు సంరక్షణ కోసం గ్రామ, డివిజన్, జిల్లాస్థాయిలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. పశు సంవర్ధకశాఖ ఏడీ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ముందస్తు ప్రవేశాలను అడ్డుకోవాలి తాడేపల్లిగూడెం (టీఓసీ): పట్టణంలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పుస్తకాలు అమ్మడం, ముందుస్తు అడ్మిషన్లు నిర్వహించడం చేస్తున్నారని, వారిని అదుపు చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు ఆర్డీఓకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ విద్యాహక్కు చట్టం పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరుతూ స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో గురువారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డిప్యూటీ తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షుడు పతివాడ నాగేంద్రబాబు మాట్లాడుతూ విద్యాసంస్థల్లో పుస్తకాలు అమ్మడం నిషేధమన్నారు. జూన్ 12 వరకు పాఠశాలలు నిర్వహించరాదని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నా పలు స్కూళ్లు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులు కె.రోహిత్, కె.గోవిందు, ఎన్.సాయి పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత భీమవరం (ప్రకాశంచౌక్): మొక్కలు నాటడంతో పాటు, ప్రకృతి సమతుల్యతను కాపాడటానికి కాలుష్య కారకంగా ఉన్న ప్లాస్టిక్ నియంత్రణే లక్ష్యంగా కృషి చేస్తున్నట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా అంతట శ్రీవనం–మనం్ఙ పేరిట మొక్కలు నాటడం, కాలువలు, డ్రెయిన్లలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. కలెక్టర్ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, అధికారులు భీమవరం కలెక్టరేట్లో మొక్కలు నాటారు. అనంతరం విస్సాకోడేరు కాలువ వెంబడి ప్లాస్టిక్ వ్యర్థాలను, జేపీ రోడ్డులోని అడ్డ వంతెన వద్ద కాలువ గట్లపై ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే కార్యక్రమంలో కలెక్టర్ పాలఒగన్నారు. కాలువల్లో వ్యర్థాల తొలగింపు కార్యక్రమాన్ని పరివీలించారు. జిల్లావ్యాప్తంగా 3.85 లక్షల మొక్కలను నాటే కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. అటవీశాఖ పర్యవేక్షణలో జిల్లాలోని వెంకటరామన్నగూడెం, సీతారాంపురం, కొణితివాడ గ్రామాల్లో నర్సరీలను అభివృద్ధి చేశామన్నారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కా ర్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా అదనపు ఎస్పీ వి.భీమారావు, జిల్లా అటవీ శాఖ అధికారి పాల్గొన్నారు. -
సెలవుల్లో తరగతుల నిర్వహణపై ఆగ్రహం
ఏలూరు (ఆర్ఆర్పేట): వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్న నగరంలోని విద్యానగర్లోని శ్రీ చైతన్య పాఠశాల గుర్తింపు రద్దుచేయాలని పీడీఎస్యూ ఆధ్వర్యంలో గురువా రం పాఠశాల వద్ద ఆందోళన నిర్వహించారు. అనంతరం తరగతులు బాయ్ కాట్ చేయించి విద్యార్థులను ఇంటికి పంపించి వేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు కాకి నాని మాట్లాడుతూ వేసవి సెలవుల్ని పక్కన పెట్టి గురువారం నుంచి ఈ పాఠశాలలో తరగతులు నిర్వహించడం అంటే విద్యాశాఖ నిబంధనలను ఉల్లంఘించడమే అన్నారు. అలాగే పదో తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్ష కూడా నిర్వహించడం గుర్తించామన్నారు. విద్యాశాఖ నిబంధనలు ఉల్లంఘించిన ఈ బ్రాంచ్ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నగర అధ్యక్షుడు వై.యశ్వంత్ పాల్గొన్నారు. -
వృద్ధులకూ తప్పని పరేషన్
యథేచ్ఛగా మట్టి అక్రమ రవాణా కొయ్యలగూడెం మండలంలోని పలు ప్రాంతాలు మట్టి అక్రమార్కులకు అడ్డాగా మారాయి. రాత్రి వేళల్లో సాగునీటి చెరువుల నుంచి మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. 10లో uకుక్కునూరు: కూటమి ప్రభుత్వం ఎండీయూ వాహనాలను రద్దు చేయడంతో వృద్ధులు రేష న్ కోసం పాట్లు పడుతున్నారు. 65 ఏళ్లు దాటి న వారికి ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందిస్తామన్న ప్రభుత్వ పెద్దల మాట నీటిమూట లుగా మారాయి. మండలంలో పలువురు రేషన్ డీలర్లు వృద్ధుల ఇళ్లకు వెళ్లి బయోమెట్రిక్ లో వేలిముద్రలు తీసుకోని చౌక డిపోకు వ చ్చి సరుకులు తీసుకువెళ్లాలని చెప్పినట్టు తెలిసింది. దీంతో వృద్ధులు మండుటెండలో రేషన్ కోసం డిపోలకు వెళుతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే తమకు ఈ కష్టాలు ఉండేవి కావని గురువారం కుక్కునూరులో బియ్యం మూటలతో వెళుతున్న వృద్ధులు అన్నారు. -
నిరుద్యోగ భృతి జాడేది?
ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు.. నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వలేని పక్షంలో నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామంటూ.. కూటమి నాయకులు గత సార్వత్రిక ఎన్నికల ముందు ఆర్భాటపు ప్రకటనలు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా ఈ హామీలను అమలు చేయకపోగా ఉన్న ఉద్యోగాలను ఊడ దీశారు. రాజకీయ కక్షతో వలంటీర్, ఎండీయూ వాహనాల వ్యవస్థలను రద్దు చేశారు. దీంతో జిల్లాలో వేలాది మంది ఉపాధిని కోల్పోయారు. అలాగే ఆప్కాస్ రద్దుకు ప్రయత్నాలు చేయడం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మొత్తంగా కూటమి ఏడాది పాలనపై యువత గుర్రుగా ఉన్నారు. శురకవారం శ్రీ 6 శ్రీ జూన్ శ్రీ 2025ఏలూరు (టూటౌన్): ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్.. స్వీట్ సిక్స్ అంటూ ఊదర గొట్టి తీరా అధికారంలోకి వచ్చాక కూటమి నేతలు చేతులెత్తేయడంపై నిరుద్యోగ యు వత ఆందోళన వ్యక్తం అవు తోంది. ఉద్యోగాలు కల్పించని పక్షంలో ప్రతినెలా రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్న హా మీపై పాలకులు మాట్లాడకపోవడంపై నిలదీస్తున్నారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం నమ్మించి మో సం చేసిందంటూ మండిపడుతున్నారు. వలంటీర్లు, ఎండీయూ వాహనాలు రద్దు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించేందుకు తీసుకువచ్చిన వలంటీర్, ఎండీయూ వాహన వ్యవస్థలను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో జిల్లాలో 10,800 వలంటీర్లు వీధిన పడ్డారు. అలాగే ఈ నెల 1 నుంచి ఎండీయూ వాహనాలను నిలిపివేయడంతో జిల్లాలో 800 మంది ఆపరేటర్లు, హెల్పర్లు రోడ్డున పడ్డారు. జిల్లాలో 1.50 లక్షలకు పైగా నిరుద్యోగులు జిల్లాలో 16.50 లక్షల మంది వరకు జనాభా ఉండగా వీరిలో 8 నుంచి 10 శాతం మంది నిరుద్యోగులు ఉంటారని అంచనా. ఈ లెక్కన జిల్లాలో 1.50 లక్షల మందికి పైగా నిరుద్యోగులు ఉన్నారు. వీరంతా ప్రభుత్వం తమకు ఉద్యోగాలు కల్పిస్తుందని, లేనిపక్షంలో నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన చేయకపోవడంపై నిరుద్యోగులు గుర్రుగా ఉన్నారు. సూపర్సిక్స్ హామీల్లో భాగంగా నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆగ్రహం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తీసుకు వచ్చిన ఆప్కాస్ విధానం రద్దు చేసే యోచనలో కూటమి ప్రభుత్వం ఉండటంపై కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్ట్ ఏజెన్సీలు, సంస్థలు, వ్యక్తులు లేకుండా ఆప్కాస్ ద్వారా నేరుగా ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించడం, పీఎఫ్, ఈఎస్ఐ మొత్తాలను ఖాతాల్లో జమచేయడం ద్వారా జిల్లాలో సుమారు 10 వేల మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరింది. కూటమి ప్రభుత్వం ఆప్కాస్ రద్దు చేసి మరలా పాత విధానాన్ని ప్రవేశపెడితే తమకు కష్టాలు తప్పవంటూ వీరంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగ భృతి ఎప్పుడు?ఉద్యోగాల మాటేంటి?న్యూస్రీల్జాబ్ క్యాలెండర్ హామీ ఏమైంది ? ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఖాళీలను భర్తీ చేస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు ఇవ్వాలి. తొలగించిన వలంటీర్లను విధుల్లోకి తీసుకుని వారికి నెలకు రూ.10 వేలు వేతనం అందించాలి. – జి.సూర్యకిరణ్, జిల్లా కార్యదర్శి, డీవైఎఫ్ఐ, ఏలూరు సూపర్ సిక్స్ అమలులో విఫలం కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల అమలులో విఫలమైంది. ఇంట్లో చదువుకునే ప్రతి పిల్లవాడికీ ఏడాదికి రూ.15 వేలు ఇస్తామన్న తల్లికి వందనం హామీ ఏమైంది. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడటం తగదు. వెంటనే నిరుద్యోగ భృతి విడుదల చేయాలి. – కె.లెనిన్, జిల్లా కార్యదర్శి, ఎస్ఎఫ్ఐ, ఏలూరు యువతకు లేదు భవిత నిరుద్యోగ భృతి ఊసే లేదు ఉద్యోగాల కల్పనపై నిర్లక్ష్యం వలంటీర్, ఎండీయూ వాహన వ్యవస్థలు రద్దు కూటమి పాలనపై నిరుద్యోగుల మండిపాటు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉద్యోగాల కల్పనకు పెద్దపీట మెగా కాదు దగా డీఎస్సీ కూటమి అధికారం చేపట్టిన వెంటనే మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామంటూ నాయకులు హామీలు ఇచ్చారు. గద్దెనెక్కిన ఏడాది తర్వాత కంటి తుడుపు చర్యగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే సమయం తక్కువ ఇవ్వడం, ఒకే జిల్లా ఒకే పేపర్ వంటి డిమాండ్లను పట్టించుకోకపోవడంపై నిరుద్యోగ అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు. -
నవధాన్యాల సాగుతో భూసారం పెంపు
భీమవరం: వరి సాగు అనంతరం భూమిలో నవధాన్యాల సాగు చేయడం వల్ల భూసారం పెరుగుతుందని జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ వై.నూకరాజు తెలిపారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్ కార్యక్రమంలో గురువారం ఆయన మాట్లాడారు. నవధాన్యాల సాగు వల్ల భూమిలో సూక్ష్మజీవుల జీవనం పునరుత్థానమవుతుందని, తద్వారా భూమి సారవంతమై ఎరువులు, పురుగు మందుల ఖర్చు తగ్గుతుందన్నా రు. జిల్లా వ్యవసాయశాఖాధికారి జెడ్.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బీజామృతం, ఘన, ద్రవ జీవామృతం, నీమాస్త్రం, అగ్నాస్త్రం, కోడిగుడ్డు నిమ్మ రసం ద్రావణం, బయో కల్చర్ తయారీ విధానాల వల్ల ప్రయోజనాలను రైతులకు వివరించారు. వైద్య శాస్త్ర విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు, వ్యవసాయశాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు. -
మండుతున్న సూరీడు
అవగాహన కల్పిస్తున్నాం జిల్లా వ్యాప్తంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు వడ దెబ్బకు గురికాకుండా వారికి అవగాహన కల్పించాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులకు అదేశాలు జారీ చేశాం. వారు గ్రామాల్లోని ఎంఎల్ హెచ్పీ, ఆశ, ఏఎన్ఎంల ద్వారా ప్రజలకు వడదెబ్బపై అవగాహన కల్పించడం జరుగుతుంది. అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా అందుబాటులో ఉంచాం. వడదెబ్బ తగిలిన వారికి మెరుగైన వైద్యం అందిచేందుకు వైద్యులు, సిబ్బందిని అందుబాటులో ఉంచాం. – జి.గీతాభాయి, జిల్లా వైద్యా ఆరోగ్య శాఖ అధికారిణి భీమవరం●భీమవరం (ప్రకాశం చౌక్): రొహిణి కార్తె ప్రారంభంలో ముందుగానే వచ్చిన రుతుపవనాల కారణంగా వర్షాలు పడడంతో వాతావరణం చల్లబడి అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే గత నాలుగు రోజులుగా భానుడు తన ప్రతాపం చూపడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం నుంచి తీవ్రమైన ఎండలు, వడగాలులు, ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. రోజూ దాదాపుగా అన్నిచోట్లా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంంతో జనం ఇంటి నుంచి బయటకు వెళ్లాంటేనే భయాందోళన చెందే పరిస్థితి నెలకొని ఉంది. ఉద్యోగాలకు, ఇతర పనులకు వెళ్లే వారు ఉదయం 8 గంటలకే ఆయా పనులకు వెళ్లిపోతున్నారు. ఉదయం నుంచే తీవ్రమైన ఎండ ఉండడంతో జన సంచారం లేక రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణం సాగించే ప్రయాణికులు, వాహనదారులు వేడికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ద్విచక్రవాహనదారులు దారి మధ్యలో చెట్ల నీడల్లో సేదతీరుతున్నారు. ఎండ వేడిని తట్టుకోలేక ప్రజలు శీతలపానీయాలను ఆశ్రయిస్తూ సేదతీరుతున్నారు. ఎండ దెబ్బకు పగటి పూట చేయాల్సిన పనులు కొందరు రాత్రులు చేసుకునే పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల టెంట్లు వేసుకుని అత్యవసరమైన పనులు చేసుకుంటున్నారు. వడదెబ్బ తగలకుండా జాగ్రత్తాలు తీసుకోవాలి ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బ బారి నుంచి రక్షణ పొందడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి జి.గీతాభాయి వివరించారు. ● సాధ్యమైనంత వరకు ఎండలో తిరగరాదు. తప్పనిసరి పరిస్థితుల్లో తలకు టోపి, లేదా టవల్ కట్టుకోవడం, గొడుగు వేసుకుని వెళ్లడం మంచిది. మంచినీళ్లు అందుబాటులో ఉంచుకోవాలి. ● నలుపు, ముదురు రంగు దుస్తులు కాకుండా తెలుపు లేదా లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలి. ● రోడ్ల మీద విక్రయించే పానీయాలు (రంగునీళ్లు), కూల్డ్రింక్స్ తాగరాదు. ● మాంసాహారం, మసాలాతో తయారుచేసిన ఆహరం తినరాదు. ఆకు కూరలు, కూరగాయలతో తయారు చేసిన ఆహారం మేలు. ● పరిశుభ్రమైన నీరు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఇంటిలో తయారుచేసే పండ్ల జ్యూసులు తీసుకోవాలి. ● మద్యం సేవించడం, పొగ తాగడం వంటివి చేయరాదు. మద్యం సేవించి ఎండలో ప్రయాణించడం మంచిదికాదు. ● వృద్ధులు, గర్భిణీలు, చినపిల్లలు ఇంటిలోనే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండలోకి వెళ్లనీయరాదు. ● వేసవి సెలవులు కాబట్టి పిల్లలు బయటకు వెళ్లే ఆడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వారికి ఇంటిలోనే ఆటలు ఆడుకునేలా ఏర్పాట్లు చేసుకుంటే మంచిది. భీమవరంలో నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు ఉదయం నుంచే భానుడి భగభగలు వడగాలులు, ఉక్కపోతలతో అల్లాడుతున్న జనం వృద్ధులు, చినపిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు వడదెబ్బ తగిలితే ప్రథమ చికిత్స ఇలా ఎవరైనా వడ దెబ్బకు గురైతే కళ్లు తిరిగి పడిపోవడం, శరీరం చెమటలు పట్టడం, స్పృహలో లేకపోవడం జరుగుతుంది. అలాంటి వ్యక్తిని ముందుగా నీడకు చేర్చి చల్లనీ నీళ్లతో శరీరాన్ని తుడవాలి. శరీరం సాధారణ స్థితికి వచ్చేవరకు తడి గుడ్డతో తుడుస్తూ చల్లగాలి తగిలేలా చూడాలి. ఉప్పు కలిపిన మజ్జిగ గానీ ఓఆర్ఎస్ ద్రావణాన్ని గానీ తాగించాలి. నిర్లక్ష్యం చేయకుండా దగ్గరలోని ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్యులకు చూపించాలి. -
మొక్కలతో పర్యావరణ పరిరక్షణ
కలెక్టర్ వెట్రిసెల్వి పోలవరం రూరల్: పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ కార్మోన్ముఖులు కావాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని పట్టిసీమ గోదావరి ఒడ్డున ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం’ సందర్భంగా వనం–మనం కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్, జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి, ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతిని మనం కాపాడితే అదే మనల్ని కాపాడుతుందని పేర్కొన్నారు. ఈ ఏడాది పర్యావరణ దినోత్సవ ప్రధాన అంశమైన ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణకు కట్టుబడి ఉందామని, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నివారించే ప్రతిజ్ఞ తీసుకుందామని చెప్పారు. జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పాటు, ప్లాస్టిక్ వస్తువులు, క్యారీ బ్యాగులు వాడకానికి ప్రతి ఒక్కరూ స్వస్తి చెప్పాలని అన్నారు. జిల్లాలో 4.50 లక్షల మొక్కలు నాటాలన్నది లక్ష్యమన్నారు. ఆర్డీఓ ఎంవీ రమణ, ఐటీడీఏ పీఓ కె.రాములు నాయక్, జిల్లా అటవీశాఖ అధికారి శ్రీ శుభం, డీఆర్డీఏ పీడీ ఆర్.విజయరాజు, జిల్లా ఆయుష్ అధికారి కె.రాణి, జిల్లా పర్యటక శాఖ మేనేజర్ ఎస్.పట్టాభిరామన్, తహసీల్దార్ సాయిరాజు, ఎంపీడీఓ శ్రీనివాసబాబు పాల్గొన్నారు. యోగా స్ఫూర్తి : పట్టిసీమ గోదావరి తీరంలో కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయం, గోదావరి మధ్యలో సుమారు వెయ్యి మందితో కలిసి యోగాసనాలు వేశారు. క్రాంతికి అవార్డు జంగారెడ్డిగూడెం: పర్యావరణ దినోత్సవం సందర్భంగా 15 ఏళ్లలో 19 వేలకు పైగా పాములను, వన్యప్రాణులను సంరక్షిస్తూ పర్యావరణాన్ని కాపాడుతున్న జంగారెడ్డిగూడేనికి చెందిన చదలవాడ క్రాంతికి అటవీ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ వెట్రిసెల్వి చేతులమీదుగా పర్యావరణ వేత్త అవార్డు అందించారు. -
ఎస్సై సమయస్ఫూర్తి.. నిలిచిన నిండుప్రాణం
ఆకివీడు: రైలు నుంచి ప్రమాదవశాత్తూ జారి పడిపోయిన వ్యక్తిని సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఎస్సై సమయస్ఫూర్తితో గుర్తించి రక్షించారు. వివరాల ప్రకారం ఆకివీడు మండలం కమతవానిగూడెంకు చెందిన నతానియేలుతో పాటు మరో 8 మంది ఉపాధి నిమిత్తం తిరుపతి వలస వెళ్లారు. అక్కడ పనులు ముగించుకుని తిరిగి బుధవారం రాత్రి ఆకివీడుకు తిరుమల – నర్సపూర్ రైలు బండిలో వస్తుండగా నతానియేలు ప్రమాదవశాత్తూ కదులుతున్న రైలు నుంచి జారి పడిపోయాడు. చీకట్లో ఏ ప్రాంతంలో పడిపోయాడో కూడా తెలియదు. వెంటనే బంధువులు గమనించి ఆకివీడు ఎస్సై హనుమంతు నాగరాజుకు ఫోన్ ద్వారా విషయం వివరించారు. ఆయన సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా క్షతగాత్రుడు కావలి ప్రాంతంలో పడిపోయినట్లు గుర్తించి సమీప పోలీస్ స్టేషన్కు తెలియజేసి పోలీసుల్ని అప్రమత్తం చేశారు. ఘటనా స్థలంలో పడిపోయి ఉన్న నతానియేలును గుర్తించి కావలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా నతానియేలుకు సకాలంలో వైద్యం అందడంతో అతడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని, కానీ రెండు కాళ్లూ విరిగిపోయి, తలకి బలమైన గాయమైందని పోలీసులు చెప్పారు. ఎస్సై హనుమంతు నాగరాజు సమయస్ఫూర్తిని ఈ సందర్భంగా పలువురు అభినందించారు. -
తోతాపురి.. ధర దిగజారి
నూజివీడు: గత 20 ఏళ్లలో ఎన్నడూలేని సంక్షోభాన్ని మామిడి రైతులు ఎదుర్కొంటున్నారు. పండ్లలో రారాజుగా పేరొందిన మామిడి రైతులను ఈ ఏడాది కోలుకోలేని నష్టాల ఊబిలో ముంచేసింది. తోతాపురి రకం ధర దారుణంగా పతనమవ్వడంతో రైతులు, వ్యాపారుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ ఏడాది మామిడి దిగుబడి తక్కువగా ఉన్న నేపథ్యంలో ధర ఎక్కువగా ఉంటుందను కున్న మామిడి రైతుల ఆశలు అడియాశలు అయ్యాయి. ఏలూరు జిల్లాలో నూజివీడు, చింతలపూడి ప్రాంతాల్లో దాదాపు 50 వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. వరి, మొక్కజొన్న పంటల తర్వాత ప్రధాన ఉద్యాన పంటగా విరాజిల్లుతున్న మామిడి రైతులకు చేదునే రుచిచూపుతోంది. మార్చి ప్రారంభం నుంచి మామిడి కోతలు ప్రారంభం కాగా తొలుత ఆశాజనంగా ఉన్న తోతాపురి ధర రానురాను తగ్గుతూ వచ్చి ప్రస్తుతం పూర్తిగా పతనమైంది. టన్ను రూ.3 వేలకు పడిపోవడంతో రైతులకు, వ్యాపారులకు కోత కూలి, కిరాయిలు కూడా రాని పరిస్థితి. దీంతో రైతులు, కాయలు కొనుగోలు చేసిన వ్యాపారులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ప్రారంభంలో తోతాపురి రకం టన్నుకు రూ.15 వేల వరకు ధర వచ్చింది. ఆ తర్వాత క్రమేపీ రూ.9 వేలకు, రూ.5 వేలకు పడిపోయి ప్రస్తుతం రూ.3 వేలు పలుకుతోంది. దీంతో ఈ రకం సాగుచేసిన రైతులు లబోదిబోమంటున్నారు. ప్రారంభంలో కావాలనే ధర పెంచుతూ.. మామిడి కాయలను మార్కెట్కు రప్పించేందుకు సీజన్ ప్రారంభంలో సేట్లు ఎక్కువ రేటు వేస్తున్నా రనేది మామిడి రైతుల వాదన. నూజివీడు, ఆగిరిపల్లి, విస్సన్నపేట, నున్న మార్కెట్లకు ఉత్తరాది రాష్ట్రాల నుంచి సేట్లు కాయల కొనుగోలు నిమిత్తం వస్తారు. వీరు సీజన్ కొద్దిరోజులు గడిచిన తర్వాత క్రమేణా ధరను తగ్గిస్తూ చివరకు అతి తక్కువ ధరకు తీసుకువస్తున్నారు. దీనికి తోడు చిత్తూరు జిల్లాలో అధిక శాతం జ్యూస్ ఫ్యాక్టరీలు తెరవకపోవడంతో కొనుగోళ్లు అంతగా లేకపోవడం కూడా ధర పతనమవ్వడానికి కారణమని వ్యాపారులు అంటున్నారు. కనీస మద్ధతు ధర ప్రకటిస్తేనే.. మామిడికాయల ధర నిర్ణయం కొనుగోలు చేసే సేట్కు, కమీషన్ దుకాణదారుడికి మధ్య ఉంటోంది తప్పితే కాయలను మార్కెట్కు తోలుకొచ్చిన రైతు సమక్షంలో నిర్ణయిం చడం లేదు. కమీషన్ వ్యాపారి టన్ను ధర ఎంత అంటే అంతే. అలాకాకుండా ప్రభుత్వం మామిడికాయల రకాలను బట్టి టన్నుకు కనీస మద్దతు ధరను ప్రకటించి అంతకంటే తక్కువకు కొనుగోలు చేయడానికి వీల్లేదంటే రైతులకు కొంత మేర ఉపయోగం ఉంటుంది. ఈ ఏడాది 95 శాతానికి పైగా రైతులు నష్టాల పాలైన నేపథ్యంలో తమను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. పెట్టుబడులు కూడా రావు తోతాపురి రకం ధర టన్ను రూ.3 వేలకు పడిపోయింది. ఇలా అయితే కోత కూలి, కిరాయి డబ్బులు కూడా రాని పరిస్థితి. 14 ఎకరాల మామిడి తోట ఉండగా రూ.6 లక్షల పెట్టుబడి పెట్టాను. పెట్టుబడులు కాదు కదా.. సగం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. – లావు ధనకోటేశ్వరరావు, కొత్త రావిచర్ల, నూజివీడు మండలం దారుణంగా ధరల పతనం టన్ను రూ.15 వేల నుంచి రూ.3 వేలకు తగ్గుదల మామిడి రైతుల గగ్గోలు -
మిగులు భూముల్లో నిరసనగా ఏరువాక
జంగారెడ్డిగూడెం: ముంపు లేని మిగులు భూముల్లో ఏరువాక కార్యక్రమం నిర్వహించి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గురువారం నిరసన తెలిపారు. మండలంలోని ఏ పోలవరం చిన్నవారిగూడెం గ్రామాల ప్రాజెక్టు ఏరియాలో అకాల వర్షాలు కురవడంతో పేదలందరూ ఐక్యంగా దుక్కు దున్ని విత్తనాలు చల్లి సాగు ప్రారంభించారు. రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం జంగారెడ్డిగూడెం మండల కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు ఎం.జీవరత్నం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏ రవి మాట్లాడుతూ.ప్రాజెక్టు ముంపు లేని మిగులు భూముల్లో పేదలందరూ ఐక్యంగా సాగు ప్రారంభించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే ఈ భూమి పేదలు సాగు చేస్తున్నప్పటికీ ఈ ఏడాది వర్షాలు ముందుగా రావడంతో విత్తనాలు నారుమడలు పోసి వరి నాట్లకు సిద్ధం కావాలన్నారు. ఇదే సందర్భంలో ఎరక్రాలువ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూస్వాముల నుంచి వేలాది ఎకరాలు ప్రభుత్వం సేకరించిందని, ఇందుకు లక్షల కోట్ల పరిహారం పొందిన భూస్వాములు అక్రమంగా వరి, మొక్కజొన్న, చెరుకు, అరటి జామాయిల్, పామాయిల్ కొబ్బరి వంటలు సాగు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంపు లేని భూముల్లో పేదలకు సాగు చేసేందుకు ఇవ్వమని కోరుతున్నా పట్టించుకోకుండా అధికారులు భూస్వాములతో కుమ్మకై ్క ఇరిగేషన్ చట్టాలను తుంగలో తొక్కుతున్నారని దుయ్యబట్టారు. దీనిపై వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో హైకోర్టును ఆశ్రయించగా పేదలు ఈ భూములను సాగుచేసుకునేలా కోర్టు తీర్పు ఇచ్చిందని, ఈ తీర్పును అధికారులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కమిటీ సభ్యులు యాగంటి సీతా గుడెల్లి వెంకట్రావు. ఏ ప్రభాకర్ రావు, జి సూర్య కిరణ్. పిల్లి చంటి, కే సుబ్బారావు ఎర్రమాల కుమారి, బత్తుల వెంకన్న, బొక్క వెంకటేష్, రెడ్డి బోయిన సత్యావతి, బెల్లంకొండ శివయ్య, పిల్లి పోతురాజు, పి వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. -
సొంత విత్తనాలే శ్రేయస్కరం
పెనుమంట్ర: రైతులు తమ విత్తనాలను తామే పండించుకోవడం వల్ల ప్రభుత్వ సంస్థలపై ఒత్తిడి తగ్గడమే కాకుండా నాణ్యమైన ఆరోగ్యకరమైన విత్తనాలు లభిస్తాయని మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఇన్చార్జి సహా పరిశోధనా సంచాలకులు డా.బి. సహదేవరెడ్డి అన్నారు. సార్వా విత్తన దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో జరిగిన కార్యక్రమంలో ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. మార్టేరు పరిశోధనా స్థానం నుంచి విడుదల చేయబడిన ఎంటీయూ 1318 రకం రైతుల మన్ననలు పొంది రాష్ట్రంలో అధిక విస్తీర్ణంలో సాగు చేయబడుతుందని తెలిపారు. రైతులు స్వర్ణ రకానికి ప్రత్యామ్నాయంగా ఎంటీయూ – 1318ని సాగుచేస్తున్నట్లుగా తెలియజేశారు. ఈ రకం సాగుచేసే రైతులు ఎకరాకు సిఫారసు చేసిన 36 కిలోల నత్రజనికి బదులుగా 24 కిలోల నత్రజనిని కేవలం రెండు దఫాలుగా నాటే సమయంలోనూ, చిరుపొట్ట దశలోనూ వేసుకోవాలని తెలిపారు. లేని పక్షంలో పంటకాలం పెరిగే అవకాశంతో పాటూ, ఎండు తెగులు, మానుకాయ ఆశించే ప్రమాదముందన్నారు. ఎంటీయూ 1121లో ఎక్కువ నూక శాతం రావడానికి గింజ గట్టిపడే దశలో వర్షాలు కురవడం, ఎక్కువకాలం పంట కోయకుండా చేనుపైనే ఉంచడం కూడా కారణమని తెలిపారు. స్వర్ణకి ప్రత్నామ్నాయంగా ఎంటీయూ 1318 ప్రధాన శాస్త్రవేత్త (వరి) డా.ఎం.గిరిజా రాణి మాట్లాడుతూ ఎంటీయూ 1310 రకం గతేడాది ప్రథమ శ్రేణి ప్రదర్శనా క్షేత్రాల్లో రైతుల మన్ననలు చూరగొందని చెప్పారు. స్వర్ణకి ప్రత్యామ్నాయంగా రూపొందించబడిన ఎంటీయూ 1318 గోదావరి మండలంలోని ఐదు జిల్లాల్లో సుమారు 36 శాతం విస్తీర్ణంలో సాగు చేయబడుతుందని తెలిపారు. అదేవిధంగా సన్న గింజ రకాలైన ఎంటీయూ 1224, ఎంటూ 1262 కృష్ణా జిల్లాలో అధిక విస్తీర్ణంలో బీపీటీ 5204కి ప్రత్యామ్నాయంగా సాగుచేయబడుతుందన్నారు. చౌడు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎంసీఎం 103 రకం మంచి దిగుబడులు ఇస్తుందని తెలిపారు. సన్న గింజ రకాలైన బీపీటీ 2846, 2782 రకాలను మామూలు భూముల్లో సాగుచేయవచ్చని ఆమె వివరించారు. ముంపు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎంటీయూ 1232, 1140, 1172, 1223, పీఎల్ఏ 1100 సాగుచేసుకోవాలని తెలిపారు. దాళ్వాలో ఎంటీయూ 1121, 3626తో పాటుగా పీఆర్ 126కి ప్రత్యామ్నాయంగా రూపొందించబడిన ఎంటీయూ 1010, 1293, 1290, 1156, 1153 రకాలు మన రాష్ట్రంలోనే కాక ఇతర రాష్ట్రాల్లో కూడా మన్ననలు పొందాయని తెలిపారు. ఎంటీయూ 1426 కిట్లు రైతులకు అందజేత ఈసందర్భంగా పలువురు రైతులకు ఆర్ఎన్ఆర్ 15048 రకానికి ప్రత్యామ్నాయంగా రూపొందించబడిన చిరుసంచి రకం ఎంటీయూ 1426 కిట్లను అభ్యుదయ రైతులకు అందజేశారు. శాస్త్రవేత్తలు డా.ఎంవీ కృష్ణాజీ డా.ఎస్.దయాకర్, డా.సీహెచ్ శ్రీనివాస్, డా.వి.భువనేశ్వరి, డా.ఎన్.శ్రీనివాస రావు, డా.ఎ.ఆనంద్ కుమార్, డా.ఎన్.వెరోనికా, డా.వి.రోజా పాల్గొన్నారు. మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఇన్చార్జి సహదేవరెడ్డి -
యథేచ్ఛగా మట్టి అక్రమ రవాణా
కొయ్యలగూడెం: మండలంలోని పలు ప్రాంతాలు మట్టి అక్రమార్కులకు అడ్డాగా మారాయి. రాత్రి వేళల్లో సైతం సాగునీటి చెరువుల నుంచి మట్టిని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కొయ్యలగూడెం సమీపంలోని శ్రీరామ గట్టు చెరువు, కన్నాయిగూడెం సమీపంలోని ఊర చెరువుల నుంచి గురువారం వందల కొద్ది ట్రక్కుల్లో మట్టి అక్రమ రవాణా కొనసాగింది. పంట పొలాలకు వెళ్లే రహదారులు ధ్వంసం అవుతున్నాయని శ్రీరామ గట్టు చెరువు ఆయకట్టు రైతులు ఆందోళన చేపట్టి మట్టి వాహనాలను అడ్డుకున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రైతులు ఆరోపించారు. కన్నాయిగూడెం ఊర చెరువు నుంచి రాత్రి వేళల్లో జేసీబీ యంత్రాలతో మట్టి అక్రమ తోలకాలను నిర్వహించారు. మట్టి అక్రమార్కులకు నియోజకవర్గ పెద్దల అండదండలు ఉండడం వల్ల తామేమి చేయలేకపోతున్నామని ప్రభుత్వ అధికారులు పేర్కొంటున్నారు. రవాణా అవుతున్న మొత్తం మట్టి ఇటుక బట్టీలకు, కమర్షియల్ లేఅవుట్ల నిర్మాణానికి తరలించి జేబులు నింపుకుంటున్నారు. -
నిండు ప్రాణాన్ని బలిగొన్న అతివేగం
నరసాపురం రూరల్ /పెనుమంట్ర: అతివేగంతో వచ్చిన ఓ ఐస్ కంటైనర్ నిండు ప్రాణాన్ని బలిగింది. ఐస్ కంటైనర్ కారును ఢీకొన్న ఘటనలో ఓ ప్రభుత్వ ఉద్యోగి దుర్మరణం పాలవ్వగా వ్యాన్ నుంచి దూకేసి ఇద్దరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఎస్సై జి.వాసు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నం విద్యాశాఖ కార్యాలయంలో సమగ్రశిక్ష విభాగంలో సైట్ ఇంజనీర్గా కర్రి వెంకటరెడ్డి (45) పనిచేస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా గరువారం వేకువజామున ఆయన రాజమండ్రికి కారులో బయలుదేరారు. మొగల్తూరు మండలం ముత్యాలపల్లి వంతెన పైకి చేరుకున్న సమయంలో బంటుమిల్లి వెళుతున్న ఐస్ కంటైనర్ ఎదురుగా వస్తున్న వెంకటరెడ్డి కారును ఢీకొంది. తీవ్రంగా గాయాలపాలైన వెంకట రెడ్డిని 108 వాహనంలో నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో కారు ముందుబాగం నుజ్జుయింది. ఐస్ కంటైనర్ కారు ఢీకొన్న అనంతరం వంతెన రైలింగ్ ఢీకొని కాల్వ వైపునకు వెళ్లి నిలబడింది. ఆ సమయంలో అప్రమత్తమైన లారీ డ్రైవర్ కవురు లీలాకృష్ణ, ఐస్ ప్యాకింగ్ బాయ్గా పనిచేస్తున్న కోమటితిప్పకు చెందిన శీలం ప్రియాంకవర్మ కాలువలోకి దూకేసి ప్రాణాలు రక్షించుకున్నారు. వీరిద్దరూ స్వల్పగాయాలతో బయటపడ్డారు. వెంటకరెడ్డి భార్య మేఘన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. కాగా మృతుడు వెంకటరెడ్డిది స్వగ్రామం పెనుమంట్ర మండలం నెగ్గిపూడి. ఆయనకు భార్య, నాలుగేళ్ల కుమార్తెతో పాటు ఒక సోదరుడు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. ఆయన అంత్యక్రియలు గురువారం రాత్రి నెగ్గిపూడి శ్మశానవాటికలో నిర్వహించారు. కారును ఢీకొన్న ఐస్ కంటైనర్ ప్రభుత్వ ఉద్యోగి దుర్మరణం వ్యాన్ నుంచి దూకేసి ప్రాణాలు కాపాడుకున్న డ్రైవర్, మరో వ్యక్తి -
విక్టర్బాబుపై పీడీ యాక్ట్
భీమవరం : చట్టాన్ని ఉల్లంఘిస్తూ ప్రజాశాంతికి విఘాతం కలిగిస్తున్న భీమవరం పట్టణం చిన అప్పారావుతోటకు చెందిన కొత్తపల్లి విక్టర్బాబుపై పీడీ యాక్ట్ ప్రయోగించినట్లు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి చెప్పారు. గురువారం భీమవరం వన్టౌన్ పోలీసుస్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడించారు. విక్టర్బాబు భీమవరం వన్టౌన్, టూటౌన్, కాళ్ల, ఉండి పోలీసుస్టేషన్లలో వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండడంతో అతడిపై పీడీ యాక్ట్ ప్రయోగించి ముందుస్తు నేర నియంత్రణ చర్యలో భాగంగా రాజమహేంద్రవరం జైలుకు పంపించినట్లు ఎస్పీ తెలిపారు. ఫర్నిచర్ షాపులో అగ్నిప్రమాదం ఎగసిపడిన అగ్నికీలలు.. భారీ ఆస్తి నష్టం ఏలూరు టౌన్ : ఏలూరు రూరల్ ప్రాంతంలోని ఒక ఫర్నిచర్ దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. గురువారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం సంభవించినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు. వివరాల ప్రకారం.. ఏలూరు బీడీ కాలనీ ప్రాంతానికి చెందిన మాదాబత్తుల వెంకటేష్ ఏలూరు రూరల్ పరిధిలో జేఎంజే స్కూల్ సమీపంలో గణేష్ సోఫా అండ్ ఫర్నిచర్ వర్క్స్ పేరుతో దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. గురువారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫర్నిచర్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నికీలలు ఎగసిపడడంతో దుకాణంలో పనిచేస్తున్న కార్మికులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లతో అతికష్టం మీద రెండు గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపు చేశారు. ఆస్తి నష్టం అంచనా వేసేందుకు రాత్రివేళ కావటంతో ఆలస్యం అవుతుందని, భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోందని అగ్నిమాపక శాఖ ఏలూరు అధికారి రామకృష్ణ తెలిపారు. ఆస్తి తగాదాలో కత్తులతో ఇరువర్గాల దాడి ఏలూరు టౌన్: అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాల్లో తీవ్ర వివాదం నెలకొనటంతో ఇరు వర్గాలు కత్తులతో దాడులకు పాల్పడ్డారు. గాయాలపాలైనవారు ఏలూరు సర్వజన ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. ఈ ఘర్షణపై ఏలూరు రూరల్ పోలీస్స్టేషన్లో ఇరువర్గాలు ఫిర్యాదులు చేశారు. శ్రీపర్రు గురకలపేట ప్రాంతానికి చెందిన మండేల గంగరాజు అతని సోదరుడు మండేల రవీంద్రబాబుకు మధ్య ఆస్తి తగాదా ఉంది. ఈ నేపథ్యంలో గురువారం ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ గొడవల్లో గంగరాజు, గంటసాల కుమారస్వామి, గంటసాల పెద్దిరాజు గాయపడగా, రెండవ వర్గం రవీంద్రబాబు, మండల రామరాజుకు గాయాలయ్యాయి. ఏలూరు రూరల్ పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
రాంగ్ రూట్లో వచ్చి..
దెందులూరు: రాంగ్ రూట్లో వస్తున్న కారు ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. జంగారెడ్డిగూడెం వైపు నుంచి ఏలూరు వైపు ఐదుగురు కుటుంబ సభ్యులు కారులో ప్రయాణిస్తున్నారు. సోమవరప్పాడు గ్రామ శివారు వచ్చేసరికి ఏలూరు వైపు నుంచి రాంగ్ రూట్లో వెళుతున్న కారు ఎదురుగా వస్తున్న కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో జంగారెడ్డిగూడెం నుంచి వచ్చే కారులో ఐదుగురికి స్వల్ప గాయాలు కాగా రాంగ్ రూట్లో వస్తున్న కారులో ప్రయాణిస్తున్న ఇద్దరిలో ఒకరికి చేయి విరిగింది. క్షతగాత్రులను దెందులూరు పోలీసులు 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఆర్ శివాజీ తెలిపారు. కారును ఢీ కొట్టిన మరో కారు ఆరుగురికి గాయాలు -
మావోయిస్టు సుధాకర్ ఎన్కౌంటర్
సాక్షి ప్రతినిధి, ఏలూరు/ చర్ల: మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఉన్న ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, విప్లవ రాజకీయ పాఠశాల ఇన్చార్జ్ తెంటు లక్ష్మీ నరసింహాచలం (67) మరణించాడు. ఆయనకు గౌతమ్ అలియాస్ సుధాకర్ అలియాస్ ఆనంద్ అలియాస్ చంటి అలియాస్ రామరాజు అలియాస్ బాలకృష్ణ అలియాస్ అరవింద్ అనే పేర్లు కూడా ఉన్నాయి.సుధాకర్ పేరుతో పార్టీలో ఆయన సుప్రసిద్ధుడు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మరణించి నెల తిరక్కముందే మరో కీలక నేతను కోల్పోవటంతో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలినట్టయ్యింది. కీలక నేతలున్నారన్న సమాచారంతో..: ఇంద్రావతి అటవీ ప్రాంతంలో సుధాకర్తోపాటు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు పాపారావు, మరికొంతమంది కీలక నేతలు ఉన్నారన్న సమాచారంతో ఎస్టీఎఫ్, డీఆర్జీ, కోబ్రా విభాగాల ప్రత్యేక పోలీసు బలగాలు బుధవారం సాయంత్రం నుంచి పెద్ద ఎత్తున కూంబింగ్ చేపట్టాయి. గురువారం ఉదయం మావోయిస్టులు తారసపడటంతో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయని, అనంతరం ఆ ప్రాంతంలో గాలించగా సుధాకర్ మృతదేహం లభించిందని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. ఘటనా ప్రాంతం నుంచి ఏకే 47 తుపాకీ, మందుగుండు సామగ్రి, విప్లవ సాహిత్యం, ఇతర వస్తువులు బలగాలు స్వాదీనం చేసుకున్నాయి. సుధాకర్పై రూ.40 లక్షల రివార్డు ఉంది. శాంతి చర్చల్లో పాల్గొన్న సుధాకర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నక్సలైట్లతో జరిగిన శాంతి చర్చల్లో సుధాకర్ పాల్గొన్నాడు. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా పెదపాడు మండలం సత్యవోలు. సుధాకర్ తండ్రి రామకృష్ణుడు, తల్లి సరస్వతి. వీరికి సుధాకర్ 6వ సంతానం. సత్యవోలులో సుధాకర్ సోదరుడు తెంటు ఆనందరావు నివసిస్తున్నారు. సుధాకర్ మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆయన చింతలపూడి మండలం ప్రగడవరంలో 10వ తరగతి, ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. విజయవాడలోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలలో 1972లో చదువుతున్నప్పుడే మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితుడై అడవి బాట పట్టారు. చివరిసారిగా 1983లో తన తండ్రి అనారోగ్యానికి గురైతే చూడ్డానికి వచ్చి నపుడు సుధాకర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. జైలు నుంచి విడుదలై మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శిగా పని చేస్తున్న సమయంలో 2013లో కేంద్ర కమిటీలో స్థానం దక్కింది. అనంతరం పార్టీ పబ్లికేషన్ విభాగానికి నాయకత్వం వహించాడు. సుధాకర్ 43 ఏళ్లపాటు మావోయిస్టు పార్టీలో పనిచేశారు. 2024–25 సంవత్సరంలో ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లలో మొత్తం 403 మంది మావోయిస్టులు మృతి చెందారని సుందర్రాజ్ వెల్లడించారు. -
విద్యాసంస్థల ఫీజుల దోపిడీ అరికట్టాలి
భీమవరం: కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలని ఎస్ఎఫ్ఐ నాయకులు బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారి ఇ.నారాయణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి.ప్రసాద్ మాట్లాడుతు జిల్లాలో విద్యాహక్కు చట్టాన్ని కార్పొరేట్ విద్యాసంస్థలు తుంగలో తొక్కుతున్నాయని చట్టం ప్రకారం ప్రభుత్వం ముద్రించిన పుస్తకాల ద్వారా మాత్రమే చదువు చెప్పాలనే నిబంధనలున్నా.. ప్రైవేటు పాఠశాలలు సొంతంగా పుస్తకాలు ముద్రించి వేలకు వేలు వసూలు చేస్తున్నాయన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని, పుస్తకాలు, దుస్తులు విక్రయాన్ని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు కొన్ని ప్రాంతాల్లోని కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు ఎస్.లక్ష్మణ్, కె.గోవింద్, ఎన్.సాయి ఫణికుమార్, కె.రోహిత్, పి.సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
వెన్నుపోటుపై తిరుగుబాటు
చంద్రబాబు సర్కారు వెన్నుపోటు రాజకీయాలపై జనం తిరగబడ్డారు. ఏడాది పాలనలో చేసిందేమీ లేదంటూ ప్రజాగ్రహంతో కదంతొక్కారు. అధికారంలోకి రాగానే అద్భుతాలు చేస్తామని నమ్మించి ప్రజలను వంచించి మరీ ఓట్లు వేయించుకున్నారు. గద్దెనెక్కి ఏడాది గడిచినా ఒక్క పథకం అమలు చేయకపోగా కనీస అభివృద్ధి కూడా చేయకపోవడంతో ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. సాక్షి ప్రతినిధి, ఏలూరు: కూటమి ఏడాది పాలనలో పూర్తిగా విఫలమవడంతో బుధవారం ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన వెన్నపోటు దినం జిల్లాలో విజయవంతమైంది. ప్రజలకు హామీలిచ్చి వాటిని గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వ తీరుపై పార్టీ ముఖ్యులు మండిపడ్డారు. సంక్షేమం, అభివృద్ధి విస్మరించి రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో దాడులు, దౌర్జన్యాల చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలకు ముందుగా అనుమతులు తీసుకున్నా చివరి నిమిషంలో పోలీసులు అడ్డుకుని ప్రతి నియోజకవర్గంలో తీవ్ర అడ్డంకులు సృష్టించారు. బైక్ ర్యాలీలను అడ్డుకున్నా.. నిరసన పాదయాత్రలు మాత్రం నిలువరించలేకపోయారు. జిల్లాలోని కై కలూరు నియోజకవర్గంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు నేతృత్వంలో జరిగిన నిరసన ర్యాలీలో పార్టీ పార్లమెంట్ ఇన్చార్జి కారుమూరి సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఏలూరు నగరంలో పార్టీ ఇన్చార్జి మామిళ్ళపల్లి జయప్రకాష్ నేతృత్వంలో జరిగిన భారీ నిరసన ర్యాలీలో పార్టీ పార్లమెంట్ పరిశీలకుడు, ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా నిరసనలు ● ఏలూరు నియోజకవర్గంలో జిల్లా పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు. ఫైర్స్టేషన్ సెంటరులో దివంగత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం కలెక్టరేట్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం డీఆర్ఓ పీ.విశ్వేశ్వరరావుకు వినతిపత్రం అందచేశారు. ఏలూరులో పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించి బైక్ ర్యాలీని నిలువరించారు. దీంతో పార్టీ కార్యాలయం నుంచి పాదయాత్రగా కలెక్టరేట్కు చేరుకున్నారు. ● కై కలూరు నియోజకవర్గంలోని కై కలూరులో పార్టీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నాలుగు మండలాల నుంచి వచ్చిన పార్టీ శ్రేణులు నిరసన ర్యాలీలో పాల్గొన్నాయి. జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ మామకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు ఈ సారి ప్రజలకు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. పార్లమెంట్ ఇన్చార్జి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ సంక్షేమాన్ని విస్మరించి రెడ్బుక్ పేరుతో కై కలూరు, దె ందులూరు, ఏలూరులో కూటమి శ్రేణులు అరాచకాలు సృష్టిస్తున్నాయని ధ్వజమెత్తారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. ● నూజివీడు నియోజకవర్గం నూజివీడులోని ద్వారకా సెంటర్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు 2 కిలోమీటర్ల మేర మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జి మేకా ప్రతాప అప్పారావు, నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. సబ్ కలెక్టర్ కార్యాలయ ఏఓ ఉదయభాస్కర్కు వినతిపత్రం అందించారు. ● పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెంలో మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు నేతృత్వంలో ర్యాలీ నిర్వహించి కూటమి తీరుపై ధ్వజమెత్తారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందచేశారు. ● ఉంగుటూరు నియోజకవర్గం ఉంగుటూరు జాతీయ రహదారి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నియోజకవర్గ ఇన్చార్జి పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పంచాయతీ కార్యాలయం వద్ద దివంగత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందించారు. టీటీడీ బోర్డు మాజీ సభ్యులు గాదిరాజు సుబ్బరాజు పాల్గొన్నారు. ● చింతలపూడి నియోజకవర్గం చింతలపూడిలో నియోజకవర్గ ఇన్చార్జి కంభం విజయరాజు ఆధ్వర్యంలో మారుతీనగర్ నుంచి బోసు బొమ్మ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్ళి ఫైర్స్టేషన్ సెంటరులో దివంగత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ నుంచి ర్యాలీ నిర్వహించి తహసీల్దార్కు వినతిపత్రం అందించారు. ● దెందులూరు నియోజకవర్గ పార్టీ శ్రేణులు ఏలూరులోని దెందులూరు మాజీ ఎమ్మెల్యే పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా పెదపాడు చేరుకుని తహసీల్దార్కు వినతిపత్రం అందచేశారు. వెన్నుపోటుకు కేరాఫ్ చంద్రబాబు: డీఎన్నార్ కై కలూరు: వెన్నుపోటుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేరాఫ్ అడ్రస్గా చరిత్రలో మిగిలిపోతారని వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) విమర్శించారు. బుధవారం నిర్వహించిన వెన్నుపోటు దినంలో నియోజకవర్గం నాలుగు మండలాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా తాలూకా సెంటర్లో డీఎన్నార్ మాట్లాడుతూ తల్లికి వందనం పేరుతో ఒక్కొక్కరికీ రూ.15,000, ఆడబిడ్డలకు 18 సంవత్సరాలు నిండితే నెలకు రూ.1500, ఉచిత బస్సు ప్రయాణం, 50 ఏళ్లు దాటిన ఎస్సీ, బీసీలకు పింఛన్, డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల రుణం, యువతకు రూ.3,000 నిరుద్యోగ భృతి, ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ, పంటలకు గిట్టుబాబు ధర ఇలా ఏదీ చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. రూ.1,53,000 కోట్ల అప్పులు చేశారన్నారు. రేషన్ వాహనాలను తొలగించడం వల్ల రాష్ట్రంలో వేలాది మంది రేషన్ కార్డుదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందని, త్వరంలో ఇది తీవ్రరూపం దాలుస్తోందని చెప్పారు. కూటమి ఏడాది పాలనపై పెల్లుబికిన ప్రజాగ్రహం 7 నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ నిరసనల పర్వం వెన్నుపోటు దినంలో కదంతొక్కిన పార్టీ శ్రేణులు, ప్రజలు బైక్ ర్యాలీకి అనుమతి లేదంటూ అడుగడుగునా పోలీసుల అడ్డంకులు పాదయాత్రగా నిరసన ర్యాలీలు -
పోడు భూముల పట్టాల కోసం ధర్నా
బుట్టాయగూడెం: పోడు వ్యవసాయం చేసే గిరిజనులకు పట్టాలివ్వాలని కోరుతూ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం గిరిజనులు ధర్నా చేశారు. ఐటీడీఏ కార్యాలయం ఎదుట బైఠాయించారు. కార్యక్రమంలో పాల్గొన్న సీపీఎం జిల్లా నాయకులు ఎ.రవి మాట్లాడుతూ గిరిజనులు సాగు భూములకు పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నా మంజూరు చేయకపోవడం బాధాకరమన్నారు. అర్హులందరికీ పట్టాలు మంజూరు చేయాలని కోరారు. అనంతరం ఐటీడీఏ పీఓ కె.రాములు నాయక్కు వినతిపత్రం అందజేశారు. ఆందోళన కారులతోపాటు పీఓ కూడా కింద కూర్చుని వారి సమస్యలను విన్నారు. న్యాయం చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో గిరిజన సంఘ నాయకులు తెల్లం రామకృష్ణ, పోలోజు నాగేశ్వరరావు, సీపీఎం నాయకురాలు మొడియం నాగమణి, తదితరులు పాల్గొన్నారు. -
రేషన్ కోసం పాట్లు
బుట్టాయగూడెం: కూటమి ప్రభుత్వం ఇంటి వద్దకు రేషన్ పంపిణీని రద్దు చేయడంతో మళ్లీ ప్రజలకు బియ్యం మోసే అవస్థలు మొదలయ్యాయి. ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో కిలోమీటర్ల మేర కాలినడకన నడుచుకుంటూ బియ్యం మూటలను మోసుకుని తీసుకెళ్లాల్సి వస్తోంది. మండలంలోని మారుమూల గ్రామమైన రేగులపాటుకు చెందిన కొండరెడ్డి గిరిజనులు బుధవారం లంకపాకలలో ఏర్పాటు చేసిన రేషన్ డిపోకు వచ్చి పడిగాపులు కాచి రేషన్ బియ్యం మూటలను తలపై పెట్టుకుని తీసుకెళ్లారు. పలు గ్రామాలకు చెందిన ప్రజలు గత ప్రభుత్వంలో అందించిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. గతంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒకటో తేదీనే ఎండీయూ వాహనాల్లో ఇళ్ల వద్దకే రేషన్ సరుకులు అందించేవారంటున్నారు. పాత పద్దతి కొనసాగిస్తే గిరిజన ప్రజలకు మేలు జరుగుతుందని పనులు మానుకుని రేషన్ డిపోల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉండదని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు కారం రాఘవ అన్నారు. -
వరాల వెంకన్న కల్యాణోత్సవాలు ప్రారంభం
అత్తిలి: మండలంలో ఈడూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీవరాల వేంకటేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున భక్తులచే గోవింద మాలా దీక్ష స్వీకరణ కార్యక్రమం జరిగింది. సన్నిధి నాగ వెంకట సత్య సూర్య రామలింగేశ్వరరావు, వీర పద్మ, మామిడిపల్లి రాంబాబు, నాగమణి దంపతులచే స్వామివారికి సుప్రభాత సేవ, మేలుకొలుపు, తోమాల సేవ కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం వరాల వేంకటేశ్వర స్వామి వారిని పెండ్లి కుమారునిగాను, శ్రీ దేవి భూదేవి అమ్మవార్లను పెండ్లికుమార్తెలుగా అలంకరించారు. పడాల వెంకటేశ్వరరావు దంపతులు శేషవస్త్రాలు సమర్పించారు. అల్లూరి సత్యనారాయణరాజు సుబ్బలక్ష్మి, అల్లూరి సీతారామరాజు, మీనాక్షి దంపతులచే ఆలయ అర్చకులు వాడపల్లి శేఖరాచార్యులు ఆధ్వర్యంలో విష్వక్సేనపూజ, అంకురార్పణ, అగ్ని ప్రతిష్ఠాపన, గరుడ హోమం, ప్రధాన హోమ పూజలు జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల వెంకట నారాయణ, గ్రామస్తులు పాల్గొన్నారు. -
హామీలను అమలు చేయకుండా మోసం
తాడేపల్లిగూడెం (టీఓసీ): కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు విమర్శించారు. స్థానిక హౌసింగ్బోర్డు కాలనీలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత జగన్ ప్రభుత్వం ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తే నేటి కూటమి ప్రభుత్వం పెన్షన్ మినహా ఏదీ నెరవేర్చలేదన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులపై దాడులు చూస్తుంటే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో ఉన్నట్లుగా ఉందన్నారు. పిఠాపురంలో దళితులను అగ్రవర్ణాలు వారు వెలివేస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించలేదని, ఈ ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు కార్యక్రమం విజయవంతంగా జరిగిందన్నారు. సమావేశంలో మాల సంఘాల జేఏసీ నాయకులు గంట సుందర్ కుమార్, కేసీ రాజు, ఎం.ఎస్తేర్ రాణి పాల్గొన్నారు. -
చోరీ కేసులో రూ.31.83 లక్షలు స్వాధీనం
ఏలూరు టౌన్: పోలవరం మండలం జగన్నాథపేటలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడి నుంచి చోరీ సొత్తు రూ.31.83 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ బుధవారం వివరాలు వెల్లడించారు. పోలవరం మండలం జగన్నాధపేట గ్రామానికి చెందిన పద్మనాభుని శ్రీనివాసగుప్త తన కుటుంబంతో కలిసి మే 13న తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేరని గుర్తించిన దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలు, నగదను అపహరించుకుపోయారు. చోరీ సొత్తు సుమారుగా రూ.33 లక్షల వరకూ ఉంటుందని బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ చోరీ కేసుపై ఎస్పీ ఆదేశాలతో పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. ట్రంక్ పెట్టెలో దాచిన చోరీ సొత్తు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈనెల 3న పోలవరం పోలీసులు నిందితుడు ఉసురుమర్తి గంగాజలంను తాడిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ సమీపంలో అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా చోరీ చేసినట్లు అంగీకరించాడు. నిందితుడు చోరీ సొత్తు దాచిపెట్టిన ప్రదేశాన్ని చూపించగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో కొంత నగదును నిందితుడు గంగాజలం పేకాటలో పోగొట్టగా.. మిగిలిన నగదు, వస్తువులు పాత ఇంట్లో ట్రంక్ పెట్టెలో దాచిపెట్టాడు. రూ.22,12,082 విలువైన 247.16 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.2,71,506 విలువైన 2.4 కిలోల వెండి వస్తువులు, రూ.7 లక్షల నగదు కలిపి మొత్తం రూ.31 లక్షల 83 వేల 588 చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఈ చోరీ కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన పోలవరం సీఐ బాలసురేష్, ఎస్సై పవన్కుమార్, హెచ్సీ కే.శ్రీనివాస్, జీవీవీఎస్ సత్యనారాయణ, కానిస్టేబుల్ జే.బాబి, కే.కోటేశ్వరరావు, మురళీకృష్ణను ఎస్పీ శివకిషోర్ ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇల్లు, షాపుల వద్ద మోషన్ డిటెక్షన్ సీసీ కెమెరాల ఏర్పాటుతో చోరీలను నిరోధించే అవకాశం ఉందని చెప్పారు. విలేకరుల సమావేశంలో ఏఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, పోలవరం డీఎస్పీ, సీఐ పాల్గొన్నారు. జగన్నాధపేటలో భారీ చోరీ కేసు ఛేదించిన పోలీసులు వివరాలు వెల్లడించిన ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ -
కంగారులో రైలు దిగేసిన జార్ఖండ్ మహిళ
ఏలూరు టౌన్: జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఒక మహిళ కంగారులో దెందులూరులో రైలుబండి దిగిపోగా, ఆమెను తిరిగి బంధువులకు అప్పగించినట్లు ఏలూరు రైల్వే ఎస్సై పీ.సైమన్ తెలిపారు. జార్ఖండ్ రాష్ట్రం బిదండి గ్రామానికి చెందిన అనిత ముర్ము అనే మహిళ భర్త రాంలాల్తో కలిసి కేరళ రాష్ట్రానికి పనులు చేసుకునే నిమిత్తం ఈనెల 1వ తేదీన బొకారో ఎక్స్ప్రెస్ రైలులో థన్బాద్ నుంచి ఎర్నాకుళం వెళుతుంది. రైలుబండి దెందులూరు సమీపానికి వచ్చేసరికి భర్త రాంలాల్ కనిపించకపోవడంతో భయంతో అనిత ముర్ము రైలు దిగిపోయింది. ఆమెను గమనించిన రైల్వే సిబ్బంది ఏలూరు రైల్వే పోలీస్స్టేషన్కు తీసుకువచ్చి అప్పగించారు. అనంతరం రైల్వే ఎస్సై సైమన్ మహిళను వన్స్టాప్ సెంటర్లో ఉంచారు. అనంతరం మహిళ వివరాలు సేకరించి బంధువులను ఏలూరు రప్పించారు. మహిళ భర్త రాంలాల్, అన్నలు ఏలూరు రైల్వే పోలీస్స్టేషన్కు రాగా మహిళకు కౌన్సిలింగ్ ఇచ్చి భర్తకు అప్పగించారు. 20 లీటర్ల ఈఎన్ఏ స్పిరిట్ స్వాధీనం చింతలపూడి: చింతలపూడి సర్కిల్ పరిధిలో బుధవారం దాడులు నిర్వహించి 20 లీటర్ల ఈఎన్ఏ స్పిరిట్ (ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ స్పిరిట్)ను స్వాధీనం చేసుకున్నట్లు చింతలపూడి ఎకై ్సజ్ సీఐ పి.అశోక్ తెలిపారు. చింతలపూడి కాంచనగూడెంలో మారుమూడి నాగబాబు నుంచి 5 లీటర్లు, కాలబత్తుల అనిత వద్ద నుంచి లీటరు, ప్రగఢవరంలో కాగిత నాగేశ్వరమ్మ వద్ద నుంచి 5 లీటర్లు, లింగపాలెం మండలం అన్నపనేనివారిగూడెంలో బేతు రమేష్ వద్ద నుంచి 7 లీటర్ల ఈఎన్ఏ స్పిరిట్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరికి చిట్లూరి కిషోర్ అనే వ్యక్తి నల్లజర్ల మండలం ఆవులపాడు డిస్టలరీ నుంచి చోరీ చేసిన ఈఎన్ఏ స్పిరిట్ను అమ్ముతున్నట్లు విచారణలో తెలిసిందన్నారు. కిషోర్ నుంచి కూడా 2 లీటర్ల ఈఎన్ఏ స్పిరిట్ను స్వాధీనం చేసుకుని ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. టీఎస్టీఎఫ్ ఏఈఎస్ జి.పాండురంగారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో ఈఎస్టీఎఫ్ సీఐ ఆర్.సత్యవతి, ఎస్సై ఎండీ ఆరీఫ్, చింతలపూడి ఎకై ్సజ్ ఎస్సైలు ఆర్ నరసింహరావు, జె.జగ్గారావు, అబ్దుల్ ఖలీల్, సిబ్బంది పాల్గొన్నారు. -
పర్యావరణాన్ని కాపాడుకుందాం
●సామాజిక బాధ్యతగా భావించాలి పర్యావరణ పరిరక్షణ అనేది ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలి. ప్లాస్టిక్ రహిత సమాజ స్థాపనే పర్యావరణ పరిరక్షణకు మార్గం. ప్రతి ఒక్కరూ ఆ దిశగా అడుగులు వేయాలి. ప్లాస్టిక్ సంచులు వాడటం వాటి వల్ల వచ్చే అనర్థాలను ప్రజల్లో అవగాహన కలిగించాల్సినటువంటి బాధ్యత అందరి పైన ఉంది. విద్యార్థులకు కళాశాల స్థాయిలో అవగాహన కలిగిస్తున్నాం. – డాక్టర్ ఎం.హరిప్రసాద్, అధ్యాపకుడు, వైవీఎన్నార్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కై కలూరు కాటన్ బ్యాగుల వినియోగం బెటర్ జూట్ పేపర్ కాటన్ బ్యాగులు మాత్రమే ఉపయోగించాలి. ప్లాస్టిక్ అనర్థాలపై ప్రధాన కూడళ్ల వద్ద ప్రచార బోర్డులు, బ్యానర్లను ఏర్పాటు చేయాలి. మున్సిపల్, పంచాయతీ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలి. దుకాణదారుల్లో క్యారీ బ్యాగులు వాడటం వల్ల అనర్థాలపై అవగాహన కలిగించాలి. ప్రజలను పూర్తిగా భాగస్వామ్యం చేయాలి. – పి.పవన్కాంత్, స్వీప్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు, కై కలూరుకై కలూరు: పర్యావరణాన్ని కాపాడుకుంటే అది మానవాళిని కాపాడుతోంది. దీని ప్రాముఖ్యతను ప్రపంచ దేశాలు గుర్తించాయి. స్వీడన్లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో 1972 జూన్ 5న పర్యావరణ పరిరక్షణ అవగాహన సమావేశం జరిగింది. అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 2022 జూన్ 5తో ప్రపంచ పర్యావరణ సంబరాలకు 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ ఏడాది ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఓడిద్దాం అనే నినాదంతో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రొగ్రాం(యూఎన్ఈపీ) జరుగుతుంది. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల వ్యాప్తంగా పలు స్వచ్ఛంద సంస్థలు పర్యావరణంపై అవగాహన సమావేశాలు నిర్వహించనున్నాయి. పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం మొక్కలు నాటే కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ప్లాస్టిక్ బాంబులు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య ప్లాస్టిక్ వాడకం. ప్రతి సంవత్సరం 19–23 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు జల పర్యావరణ వ్యవస్థలో చేరుతున్నాయని అంచనా. 1950లో 2 మిలియన్ టన్నుల నుంచి నేడు 430 మిలియన్ టన్నులకు ప్లాస్టిక్ వాడకం పెరిగింది. ప్రధానంగా మైక్రో ప్లాస్టిక్ సముద్ర జలాల్లో చేరడం వల్ల తాబేళ్లు, తిమింగళాలతో పాటు అరుదైన సముద్ర జీవులు మృత్యువాత పడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మన రాష్ట్రంలో మాత్రం ప్రమాదకర క్యారీ బ్యాగులను నియంత్రించలేకపోతున్నారు. అమలుకు నోచుకోని నిబంధనలు క్యారీ బ్యాగుల నిషేధం చట్టం పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. ఈ చట్టం అమలు కోసం నియమించిన జిల్లా స్థాయి కమిటీల్లో కలెక్టర్లు, మేయర్లు మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కమిషనర్లు, పొల్యూషన్ బోర్డ్ అధికారులు, పరిశ్రమల సంస్థ బాధ్యులు, జిల్లా పంచాయతీ అధికారి సభ్యులుగా ఉంటారు. గ్రామస్థాయిలోనూ కమిటీలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ కమిటీల ఊసే లేదు. దాడులు కూడా స్వల్సంగా జరుగుతున్నాయి. ఎవరైనా కోర్టుల్లో పిల్ వేసినప్పుడు మాత్రం హడావుడి చేసి తర్వాత పట్టించుకోవడం లేదు. క్యారీ బ్యాగుల నిషేధం ఏదీ 120 మైక్రాన్ల మందం కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ సంచులు నిషేధం. తయారీదారులు ప్రతి క్యారీ బ్యాగ్పై చిరునామాతో పాటు రీసైకిల్ చేసిన ప్లాస్టిక్, అసలు ప్లాస్టిక్ వివరాలను ముద్రించాలి. సహజ చాయ తెలుపు రంగులో కవర్లను మాత్రమే వాడాలి, ఈ నిబంధన అతిక్రమించిన తయారీదారులకు రూ.25 వేల నుంచి రూ.50,000, చిల్లర వ్యాపారులకు రూ.2,500 నుంచి రూ.5,000, బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్ సంచులను పారవేస్తే రూ.250 నుంచి రూ.500 వరకు జరిమానా విధించాలి. ఇవి నామమత్రంగా అమలవుతున్నాయి. భూమిలో విచ్ఛిన్నమవడానికి ఎంత సమయం.. న్యూస్ పేపర్ 4 నుంచి 6 వారాలు. సిగిరెట్ చివర ఫిల్టర్ మొన ఒకటి నుంచి 5 సంవత్సరాలు. క్యారీ బ్యాగు 10 నుంచి 20 సంవత్సరాలు. స్టీల్ టీం క్యాన్ 50 సంవత్సరాలు. శీతల పానీయాల అల్యూమినియం బాటిల్ 80 నుంచి 200 సంవత్సరాలు. ప్రిజ్లోని ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు 450 సం.లు గాజు బాటిళ్లు (బీరు సీసాలు) మిలియన్ సంవత్సరం. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఈ ఏడాది నినాదం.. ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఓడిద్దాం కొల్లేరు అభయారణ్యంలో పర్యావరణం మృగ్యం జిల్లాలో పర్యావరణంపై అవగాహన సదస్సులు కొల్లేరులో పర్యావరణానికి విఘాతం రెండు తెలుగు రాష్ట్రాల్లో గుర్తించిన ఏకై క చిత్తడి నేలల ప్రాంతం కొల్లేరు. ఇక్కడ పర్యావరణం నచ్చడంతో వలస పక్షులు లక్షలాదిగా ప్రతి ఏటా తరలివస్తున్నాయి. కొల్లేరు సరస్సు 901 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. కొల్లేరు అభయారణ్యంగా 5వ కాంటూరు వరకు 77,138 ఎకరాలను గుర్తించారు. కొల్లేరు సరస్సుకు పెలికాన్, పెయింటెడ్ స్టోక్, ఐబీస్, స్టిల్ట్ వంటి 185 రకాల జాతుల పక్షులు సంచరిస్తాయి. ఇంతటి ప్రాధాన్యత కలిగిన సరస్సు కాలుష్యపు బారిన పడింది. ఫ్యాక్టరీల నుంచి విడుదలయ్యే వ్యర్థ జలాలతో సరస్సు ఉనికిని కోల్పోతుంది. సహజ సిద్ధ చేపలు మృత్యువాత పడుతున్నాయి. అక్రమ చెరువుల్లో రసాయనాల వాడకం కొల్లేరు పర్యావరణానికి విఘాతం కలుగుతోంది. -
బాల్య వివాహాన్ని అడ్డుకున్న ఐసీడీఎస్ అధికారులు
తాడేపల్లిగూడెం రూరల్ : మండలంలోని ఎల్.అగ్రహారం రాజీవ్ గృహకల్ప సముదాయంలో బుధవారం రాత్రి జరగాల్సిన బాల్య వివాహాన్ని ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొమరపల్లి గ్రామానికి చెందిన బాలికకు, దేవరపల్లి మండలం బంధపురం గ్రామ వాసితో బుధవారం రాత్రి బాలిక అమ్మమ్మ స్వగ్రామం ఎల్.అగ్రహారం రాజీవ్ గృహకల్ప సముదాయంలో వివాహం చేసేందుకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి 1098 నెంబరుకు కాల్ రావడంతో ఐసీడీఎస్ సూపర్వైజర్ కే దుర్గాభవాని, కే విశాలాక్షి, మహిళా పోలీస్, అంగన్వాడీ కార్యకర్తలు బాలిక అమ్మమ్మ ఇంటికి చేరుకుని తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం బాలికను తణుకులోని బాలసదన్కు తాత్కాలిక వసతి నిమిత్తం తరలించినట్లు ఐసీడీఎస్ సూపర్వైజర్ కే దుర్గాభవాని తెలిపారు. 6 నుంచి హాకీ పోటీలు భీమవరం: భీమవరం పట్టణంలోని డీఎన్నార్ కళాశాల ఆవరణలో ఈనెల 6వ తేదీ నుంచి 15వ హాకీ ఆంధ్రప్రదేశ్ జూనియర్ ఉమెన్ ఇంటర్ డిస్ట్రిక్ట్ చాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కలిదిండి ఆనందరాజు, కేవీఎస్ భరత్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 8వ తేదీ వరకు పోటీలు జరుగుతాయన్నారు. రాష్ట్రంలోని 15 టీమ్లు పాల్గొంటాయని, విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతోపాటు ఆగస్టులో కాకినాడలో నిర్వహించే జాతీయస్థాయి పోటీలకు టీమ్ను ఎంపిక చేస్తామన్నారు. డివైడర్పైకి దూసుకెళ్లిన లారీ.. వ్యక్తి మృతి దెందులూరు: ఓ లారీ అదుపు తప్పి డివైడర్పైకి దూసుకెళ్లడంతో డివైడర్పై నిద్రిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల ప్రకారం జాతీయ రహదారిపై ఏలూరు రూరల్ మండలం రత్న డాబా సమీపంలో గురువారం డివైడర్పై ఓ వ్యక్తి నిద్రిస్తున్నాడు. పార్సిల్ లారీ అదపు తప్పి డివైడర్పైకి దూసుకుపోయి ఆ వ్యక్తిపై ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఏలూరు మంచినీళ్ళతోటకు చెందిన రోళ్ల చంద్రరావు(44)గా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏలూరు రూరల్ ఎస్సై దుర్గాప్రసాద్ చెప్పారు. నిందితుడిపై మూడు కేసులుఆకివీడు : బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితుడిపై మూడు కేసులు నమోదు చేసినట్లు ఆకివీడు రూరల్ సీఐ జగదీశ్వరరావు బుధవారం చెప్పారు. కిడ్నాప్, అత్యాచారం, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశామన్నారు. గాయాలైన నిందితుడు షేక్ మీరాకు భీమవరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నామన్నారు. సంతపేట ప్రాంతంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. -
రెచ్చిపోతున్న మట్టి మాఫియా
ఇరగవరం: మండలంలోని పలు గ్రామాల్లో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అధికారులు, అధికార పార్టీ నాయకుల అండ దండలతో విర్రవీగుతూ మట్టిని తరలిస్తున్నారు. ఇరగవరం మండలంలోని కొత్తపాడు, రేలంగి, కత్తవపాడు, అయినపర్రు, పేకేరు, రేలంగి, పొదలాడ గ్రామాల్లో మట్టి తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. వీటిని అదుపు చేయాల్సిన రెవెన్యూ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ పట్టించుకోవడం లేదు. అనుమతుల ఊసే లేదు అనుమతులు లేకుండా యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుతున్నాయి. పూడిక పేరుతో చెరువులను లోతుగా తవ్వి అక్కడ మట్టి ని తొలగిస్తున్నారు. కంతేరు గ్రామంలో సుమారు మూడు ఎకరాల చెరువు గట్టు నుంచి సుమారు పది అడుగుల మేర లోతు మట్టిని తవ్వుతున్నారు. కొత్తపాడు సరిహద్దు ఇరగవరం గ్రామంలో సుమారు ఎకరం చెరువును పూడ్చి వేయడం జరిగింది. దాని గుట్టు మీద ఉన్న సుమారు ఇరవై కొబ్బరి చెట్లు తొలగించారు. ఎక్కడా కూడా ఫిషరిష్, రెవెన్యూ అధికారులు అనుమతులు తీసుకోలేదు. చెరువులు పూడ్చడానికి, తవ్వడానికి ఫిషరిష్ అధికారుల అనుమతులు తప్పనిసరి. కానీ అది ఎక్కడా జరగడం లేదు. ట్రాక్టర్లు, లారీతో మట్టి తరలించడం వల్ల రోడ్లు సైతం పాడైపోతుండడంతో గ్రామాల్లో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇరగవరం మండలం నుంచి మట్టిని తణుకు, పెనుగొండ, పెనుమంట్ర, ఆలయూరు, ఇరగవరం గ్రామాల్లో లేఅవుట్లు పూడ్చడానికి తరలిస్తున్నా అక్కడ లే అవుట్లు పూడ్చడానికి ఎకరాకు రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు అర్జిస్తున్నారు. దీంతో మట్టి వ్యాపారులు కోట్లు సంపాదిస్తున్నారు. దీని కోసం రైతులకు వేలల్లో డబ్బులు ఇస్తున్నారు. అధికారులు వారికి అన్ని విధాలుగా సహకరిస్తున్నందుకు వారికి లక్షల్లో ముడుపులు అప్పజెప్పుతున్నారు అని రెవెన్యూ అధికారులు మీద ఆరోపణలు వినిపిస్తున్నాయి. హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్సు లేకుండా ద్విచక్ర వాహనం నడిపే వారికి రూల్స్ చెప్పి జరిమానా విధించే పోలీసులు, ఆర్టీవో అధికారులు లైసెన్సులు, ధ్రువపత్రాలు లేకుండా ట్రాక్టర్లు, లారీలు విచ్చలవిడిగా తిరుగుతున్నా అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి మట్టి దోపిడికి అడ్డు కట్ట వేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టకుండా కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. అధికార పార్టీ అండదండలతో విర్రవీగుతున్న భూబకాసురులు ముడుపుల మత్తులో జోగుతున్న అధికారులు -
సచివాలయ ఏఎన్ఎం కౌన్సెలింగ్లో రగడ
ఏలూరు టౌన్: జిల్లాలోని సచివాలయాల్లో ఏఎన్ఎంలుగా పనిచేస్తున్న సిబ్బందిని మాతృసంస్థ వైద్య ఆరోగ్యశాఖలోకి నియామకాలు చేపట్టేందుకు నిర్వహించాల్సిన కౌన్సెలింగ్ ఆకస్మికంగా నిలుపుదల చేయడంతో ఏఎన్ఎంలు ఆందోళనకు దిగారు. ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఆర్.మాలిని 4వ తేదీన కౌన్సెలింగ్ చేపడతామని ఉత్తర్వులు జారీ చేయడంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న సచివాలయ ఏఎన్ఎంలు ఏలూరులోని డీఎంఅండ్హెచ్ఓ కార్యాలయానికి బుధవారం ఉదయం 10 గంటలకే చేరుకున్నారు. ఈ నేపథ్యంలో తమకు బదిలీ కౌన్సెలింగ్, పదోన్నతులు ఇచ్చిన అనంతరం మాత్రమే సచివాలయ ఏఎన్ఎంలకు కౌన్సెలింగ్ చేపట్టాలని వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న సీనియర్ ఏఎన్ఎంలు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో కౌన్సెలింగ్ అర్ధాంతరంగా నిలిపివేశారు. దీనిపై సాయంత్రం వరకు అధికారుల నుంచి సమాధానం లేకపోవడంతో సచివాలయ ఏఎన్ఎంలు కార్యాలయం వద్ద బైఠాయించి ధర్నా చేపట్టారు. తమకు గత ప్రభుత్వంలో 2022లో 179 జీఓ మేరకు వైద్య ఆరోగ్యశాఖలో నియమాకాలు చేసేందుకు ఆదేశాలు జారీ చేశారని అనంతరం 2024 కూటమి ప్రభుత్వంలోనూ అక్టోబర్లో మరోసారి కౌన్సెలింగ్ చేపట్టి వైద్య ఆరోగ్య శాఖలో నియామకం చేసేందుకు ఉత్తర్వులు ఇచ్చారని చెబుతున్నారు. దీంతో గందరగోళ వాతావరణం నెలకొనడంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మాలిని, రెవెన్యూ అధికారులు ఈ అంశంపై ఇరువర్గాల నాయకులతో చర్చించి సానుకూలమైన చర్యలు చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బుధవారం రాత్రి 10 గంటల వరకు చర్చలు సాగుతూనే ఉన్నాయి. తొలుత తమకు బదిలీ కౌన్సెలింగ్లంటూ సీనియర్ల పట్టు అర్ధాంతరంగా నిలిచిపోయిన కౌన్సెలింగ్ -
సీ వీడ్ .. సో గుడ్
కైకలూరు: సముద్రపు నాచు (సీ వీడ్) తీరప్రాంత మహిళలకు కుటీర పరిశ్రమగా మారుతోంది. మంచినీరు, ఎరువులు, పురుగు మందులు, ఆహారం అవసరం లేకుండా సముద్రంలో తక్కువ కాలంలోనే అధిక దిగుబడులు సాధించే నాచు పెంపకానికి డిమాండ్ పెరుగుతోంది. ఆక్వా రంగానికి ప్రత్యామ్నాయంగా నాచు సాగు మారనుంది.సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ (సీఎంఎఫ్ఆర్ఐ), కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ (సీఏఏ) ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన(పీఎంఎంఎస్వై) ద్వారా మహిళలకు సబ్సిడీ రుణాలిచ్చేందుకు ప్రభుత్వం ముందుకొస్తోంది. సీ వీడ్పై అవగాహన కల్పించేందుకు ఏటా జూన్ 4న జాతీయ సముద్రపు నాచు దినోత్సవం జరుపుతారు. పోషకాల గని.. సముద్రపు నాచు సముద్రపు నాచు (మెరైన్ ఆల్గే)లో పోషక, ఔషధ విలువలు అధికంగా ఉంటాయి. తెప్పలు, రేస్ వేలు, మోనోలైన్, తాళ్లు వంటి పద్ధతుల్లో సముద్రంలో నాచును సాగు చేస్తున్నారు. తమిళనాడులోని మండపం ప్రాంతం నుంచి కప్పఫైకాస్, గ్రాసిలేరియా అనే జాతుల విత్తనాలను ఏపీకి తెస్తున్నారు. ఒక్కో పంట 45–60 రోజుల సమయం పడుతోంది. సీ వీడ్లో ప్రొటీన్, ఖనిజాలు, విటమిన్లు అధికంగా ఉంటాయి. వీటిని బిస్కెట్లు, పాస్తా, నూడుల్స్, సూప్ పౌడర్లు, పెరుగు వంటి అహార పదార్థాల్లో వినియోగిస్తారు. ఔషధ, సౌందర్య రంగాల్లోనూ సీ వీడ్కు డిమాండ్ ఉంది. దీంతో ఆగార్, కరోజీనాన్ పదార్థాలు తయారవుతాయి. వీటిని టూత్పేస్ట్, స్కిన్ కేర్ ఉత్పత్తుల ఔషధాల్లో వినియోగిస్తారు. వ్యవసాయంలో బయో ఫెర్టిలైజర్లుగా కూడా దీనిని వాడతారు. సీ వీడ్తో తయారు చేసిన తినుబండారాలు, సాల్ట్, ఆయిల్, స్నాక్స్కు డిమాండ్ ఉంది. రాష్టంలో 36 కేంద్రాల గుర్తింపు ఆంధ్రప్రదేశ్లో 1,027 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. సీ వీడ్ సాగుకు అనుకూలమైన 36 ప్రాంతాలను రాష్ట్ర వ్యాప్తంగా సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎస్ఎంసీఆర్ఐ) గుర్తించింది. విశాఖపట్నం, శ్రీకాకుళం, నెల్లూరు, కృష్ణా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలు సీ వీడ్ సాగుకు అనుకూలంగా ఉన్నాయి.నరసాపురం, మొగల్తూరు, సూర్యలంక, విశాఖపట్నం, శ్రీకాకుళంలోని బుడగట్టుపాలెంలో పైలట్ ప్రాజెక్టుగా సీ వీడ్ సాగు చేపట్టనున్నారు. విశాఖపట్నం, బుడగట్టుపాలెంలో ప్రయోగాత్మక సాగు చేపట్టారు. పీఎంఎంఎస్వై ద్వారా వీడ్ సాగుకు కేంద్రం 60 శాతం సబ్సిడీ అందిస్తోంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 60 వేల యూనిట్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. సముద్రపు నాచు విశేషాలివీ! » భూగోళంపై పండించే కూరగాయల కంటే సముద్రంలో పెరిగే నాచు పరిమాణం 30 శాతం ఎక్కువ » సముద్రంలో అదనపు రసాయనాలు, భారీ లోహాలను ఇది గ్రహిస్తుంది » పర్యావరణ వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తుంది » సముద్రపు నాచును జీరో ఇన్పుట్ ఫుడ్గా పిలుస్తారు » సముద్రంలో కార్బన్ డైఆక్సైడ్ను గ్రహిస్తుంది » పశువుల ఆహారం, ఆక్వా కల్చర్లో దీనినిఫీడ్ సప్లిమెంట్లుగా వినియోగిస్తారు » సముద్రపు జీవులకు ఆహారం, ఆశ్రయం అందించి జీవ వైవిధ్యంలో కీలకపాత్ర పోషిస్తుంది » సేంద్రియ ఎరువుగా కార్బోహైడ్రేట్లు, సూక్ష్మ పోషకాలు, ఖనిజాలు అధికం » ఆహార పరిశ్రమ, ఔషధ, సౌందర్య రంగం, వ్యవసాయంలో దీనిని వినియోగిస్తారు » తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం ఇస్తుంది » మత్స్యకారులు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశంతొలి విడతలో 2.2 టన్నుల దిగుబడి విశాఖపట్నం ఆర్కే బీచ్ సమీపంలో తొలిసారిగా సీ వీడ్ సాగును 50 యూనిట్ల ద్వారా ధాన్ ఫౌండేషన్ మహిళలు చేపట్టారు. మొదటి విడతలో 2.20 టన్నుల దిగుబడి వచ్చింది. కిలో రూ.23 ధర పలికింది. ఈ ప్రాజెక్టుకు పెట్టుబడి రూ.4.50 లక్షలు అయింది. మొదటిసారి పెట్టుబడితో అమర్చిన సామగ్రి 8 ఏళ్లపాటు ఉపయోగపడతాయి. రెండో సాగు నుంచి పెట్టుబడి వ్యయం బాగా తగ్గుతుంది. ఇది ప్రధానంగా మహిళలకు కుటీర పరిశ్రమగా మారుతుంది. కేంద్రం సబ్సిడీ ఇచ్చి సీ వీడ్ సాగుకు అవకాశం కల్పిస్తోంది. – పి.లక్ష్మణరావు, మత్స్యశాఖ జేడీ, విశాఖ అవగాహన పెంచాలి సముద్రపు నాచుపై తీరప్రాంత ప్రజలకు అవగాహన పెంచాలి. రాష్ట్రంలో ప్రోసెసింగ్ యూనిట్లు, సీడ్ హేచరీలను ఏర్పాటు చేయాలి. సముద్రపు నాచు పరిశ్రమను వ్యవసాయంగా గుర్తించి బీమా సౌకర్యం కల్పించాలి. సాగు పద్ధతులపై శిక్షణ, సాంకేతిక మార్గదర్శకాలను అందించాలి. – డాక్టర్ పి.రామమోహన్రావు, విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్, కాకినాడ -
● కదిలిన యంత్రాంగం
ట్రాన్స్ఫార్మర్ పరిసరాలు శుభ్రం తాడేపల్లిగూడెం (టీఓసీ): పట్టణంలోని పాతూరు 12వ వార్డు కనకదుర్గమ్మ గుడి వద్ద ట్రాన్స్ఫార్మర్ పరిసరాలను మంగళవారం శుభ్రం చేశారు. ట్రాన్స్ఫార్మర్ చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగిపోవడంతోపాటు చెత్తాచెదారంతో అపరిశుభ్రంగా ఉండడంతో మే 20వ తేదీన సాక్షి కథనాన్ని ప్రచురించింది. దీనిపై ప్రభుత్వ యంత్రాంగం స్పందించింది. మునిసిపల్ సిబ్బంది, విద్యుత్ సిబ్బంది ఆధ్వర్యంలో మంగళవారం జేసీబీ సహాయంతో పిచ్చిమొక్కలను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. కాగా ట్రాన్స్ఫార్మర్ వద్ద రక్షణ కల్పించేలా పెన్సింగ్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. నరసాపురంలో రోడ్డుపై పేరుకుపోయిన చెత్తను పూర్తిగా తొలగించి రోడ్డు శుభ్రం చేశారు. చెత్త రోడ్డుపై పోరుకుపోయి పూర్తి అశుభ్రంగా ఉన్న ఆ ప్రాంతంలో స్థానికులు పడుతున్న ఇబ్బందులను సాక్షి వెలుగులోకి తెచ్చింది. నరసాపురంలో కానరాని స్వచ్ఛత శీర్షికన మగళవారం కథనం ప్రచురించింది. దీంతో స్పందించిన మున్సిపల్ సిబ్బంది చెత్తను తొలగించి, ఆ ప్రాంతంలో ముగ్గు చల్లారు. సమస్య పరిష్కారం కావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. – నరసాపురం -
సీ వీడ్.. సో గుడ్
సముద్రపు నాచు విశేషాలివీ! ● భూగోళంపై పండించే కూరగాయల కంటే సముద్రంలో పెరిగే నాచు పరిమాణం 30 శాతం ఎక్కువ. ● సముద్రంలో అదనపు రసాయనాలు, భారీ లోహాలను ఇది గ్రహిస్తుంది. ● పర్యావరణ వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తుంది. ● సముద్రపు నాచును జీరో ఇన్పుట్ ఫుడ్గా పిలుస్తారు. ● సముద్రంలో కార్బన్ డైఆకై ్సడ్ను గ్రహిస్తుంది. ● పశువుల ఆహారం, ఆక్వా కల్చర్లో దీనిని ఫీడ్ సప్లిమెంట్లుగా వినియోగిస్తారు. ● సముద్రపు జీవులకు ఆహారం, ఆశ్రయం అందించి జీవ వైవిధ్యంలో కీలకపాత్ర పోషిస్తుంది. ● సేంద్రియ ఎరువుగా కార్బోహైడ్రేట్లు, సూక్ష్మ పోషకాలు, ఖనిజాలు అధికం. ● ఆహార పరిశ్రమ, ఔషధ, సౌందర్య రంగం, వ్యవసాయంలో దీనిని వినియోగిస్తారు. ● తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం ఇస్తుంది. ● మత్స్యకారులు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం. కై కలూరు: సముద్రపు నాచు (సీ వీడ్) తీరప్రాంత మహిళలకు కుటీర పరిశ్రమగా మారుతోంది. మంచినీరు, ఎరువులు, పురుగు మందులు, ఆహారం అవసరం లేకుండా సముద్రంలో తక్కువ కాలంలోనే అధిక దిగుబడులు సాధించే నాచు పెంపకానికి డిమాండ్ పెరుగుతోంది. ఆక్వా రంగానికి ప్రత్యామ్నాయంగా నాచు సాగు మారనుంది. సెంట్రల్ మైరెన్ ఫిషరీస్ రీసెర్చ్ (సీఎంఎఫ్ఆర్ఐ), కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ (సీఏఏ) ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన(పీఎంఎంఎస్వై) ద్వారా మహిళలకు సబ్సిడీ రుణాలిచ్చేందుకు ప్రభుత్వం ముందుకొస్తోంది. సీ వీడ్పై అవగాహన కల్పించేందుకు ఏటా జూన్ 4న జాతీయ సముద్రపు నాచు దినోత్సవం జరుపుతారు. పోషకాల గని.. సముద్రపు నాచు సముద్రపు నాచు (మైరెన్ ఆల్గే)లో పోషక, ఔషధ విలువలు అధికంగా ఉంటాయి. తెప్పలు, రేస్ వేలు, మోనోలైన్, తాళ్లు వంటి పద్ధతుల్లో సముద్రంలో నాచును సాగు చేస్తున్నారు. తమిళనాడులోని మండపం ప్రాంతం నుంచి కప్పఫైకాస్, గ్రాసిలేరియా అనే జాతుల విత్తనాలను ఏపీకి తెస్తున్నారు. ఒక్కో పంట 45–60 రోజుల సమయం పడుతోంది. సీ వీడ్లో ప్రొటీన్, ఖనిజాలు, విటమిన్లు అధికంగా ఉంటాయి. వీటిని బిస్కెట్లు, పాస్తా, నూడుల్స్, సూప్ పౌడర్లు, పెరుగు వంటి అహార పదార్థాల్లో వినియోగిస్తారు. ఔషధ, సౌందర్య రంగాల్లోనూ సీ వీడ్కు డిమాండ్ ఉంది. దీంతో ఆగార్, కరోజీనాన్ పదార్థాలు తయారవుతాయి. వీటిని టూత్పేస్ట్, స్కిన్ కేర్ ఉత్పత్తుల ఔషధాల్లో వినియోగిస్తారు. వ్యవసాయంలో బయో ఫెర్టిలైజర్లుగా కూడా దీనిని వాడతారు. సీ వీడ్తో తయారు చేసిన తినుబండారాలు, సాల్ట్, ఆయిల్, స్నాక్స్కు డిమాండ్ ఉంది. రాష్టంలో 36 కేంద్రాల గుర్తింపు ఆంధ్రప్రదేశ్లో 1,027 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. సీ వీడ్ సాగుకు అనుకూలమైన 36 ప్రాంతాలను రాష్ట్ర వ్యాప్తంగా సెంట్రల్ సాల్ట్ అండ్ మైరెన్ కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎస్ఎంసీఆర్ఐ) గుర్తించింది. విశాఖపట్నం, శ్రీకాకుళం, నెల్లూరు, కృష్ణా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలు సీ వీడ్ సాగుకు అనుకూలంగా ఉన్నాయి. నరసాపురం, మొగల్తూరు, సూర్యలంక, విశాఖపట్నం, శ్రీకాకుళంలోని బుడగట్టుపాలెంలో పైలట్ ప్రాజెక్టుగా సీ వీడ్ సాగు చేపట్టనున్నారు. విశాఖపట్నం, బుడగట్టుపాలెంలో ప్రయోగాత్మక సాగు చేపట్టారు. పీఎంఎంఎస్వై ద్వారా వీడ్ సాగుకు కేంద్రం 60 శాతం సబ్సిడీ అందిస్తోంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 60 వేల యూనిట్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో కుటీర పరిశ్రమగా నాచు సాగు ప్రయోగాత్మకంగా విశాఖపట్నంలో మొదటి సాగు రాష్ట్రంలో 60 వేల యూనిట్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం నేడు జాతీయ సముద్రపు నాచు దినోత్సవంఅవగాహన పెంచాలి సముద్రపు నాచుపై తీరప్రాంత ప్రజలకు అవగాహన పెంచాలి. రాష్ట్రంలో ప్రోసెసింగ్ యూనిట్లు, సీడ్ హేచరీలను ఏర్పాటు చేయాలి. సముద్రపు నాచు పరిశ్రమను వ్యవసాయంగా గుర్తించి బీమా సౌకర్యం కల్పించాలి. సాగు పద్ధతులపై శిక్షణ, సాంకేతిక మార్గదర్శకాలను అందించాలి. – డాక్టర్ పి.రామమోహన్రావు, విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్, కాకినాడతొలి విడతలో 2.2 టన్నుల దిగుబడి విశాఖపట్నం ఆర్కే బీచ్ సమీపంలో తొలిసారిగా సీ వీడ్ సాగును 50 యూనిట్ల ద్వారా ధాన్ ఫౌండేషన్ మహిళలు చేపట్టారు. మొదటి విడతలో 2.20 టన్నుల దిగుబడి వచ్చింది. కిలో రూ.23 ధర పలికింది. ఈ ప్రాజెక్టుకు పెట్టుబడి రూ.4.50 లక్షలు అయింది. మొదటిసారి పెట్టుబడితో అమర్చిన సామగ్రి 8 ఏళ్లపాటు ఉపయోగపడతాయి. రెండో సాగు నుంచి పెట్టుబడి వ్యయం బాగా తగ్గుతుంది. ఇది ప్రధానంగా మహిళలకు కుటీర పరిశ్రమగా మారుతుంది. కేంద్రం సబ్సిడీ ఇచ్చి సీ వీడ్ సాగుకు అవకాశం కల్పిస్తోంది. – పి.లక్ష్మణరావు, మత్స్యశాఖ జేడీ, విశాఖ -
గ్యాస్ లీకై పెళ్లింట్లో ప్రమాదం
పెనుగొండ: పెళ్లింట్లో అకస్మాత్తుగా జరిగిన ఓ ప్రమాదంలో ఏడుగురు గాయాలపాలయ్యారు. వివరాల ప్రకారం చెరుకువాడ కొండపల్లి వారి వీధిలో ఇవ్వల నాగేశ్వరరావు కుమారుడు శ్రీనివాసరావు వివాహం బుధవారం జరగనుండడంతో బందువులు, స్నేహితులు అందరూ వచ్చారు. మంగళవారం ఇంటిలో గ్యాస్ వెలిగించి వంట చేస్తుండగా ప్రమాదవ శాత్తు గ్యాస్ లీకై ఆకస్మాతుగా మంటలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమై మంటలు అదుపులోకి తీసుకు రావడానికి ప్రయత్నించడంతో పెండ్లి కుమారుడు శ్రీనివాసరావుతో పాటు, బంధువులు అయినపర్తి లక్ష్మీ, కవిటం నాగమణి, సూర్య హనుమంతరావు, సత్యవతి, నరసింహమూర్తి , మాచవరపు వీరేంద్ర గాయాలపాలయ్యారు. వీరికి కాళ్లు చేతులు, పొట్ట, వీపు మీద గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన పెనుగొండలోని ప్రభుత్వాసుపత్రికి తరలించడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పెళ్లింట్లో పెనుప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకొన్నారు. పెండ్లి కుమారుడు సహా ఏడుగురికి గాయాలు -
జిల్లా స్థాయి కార్యశాల శిక్షణ ప్రారంభం
ఏలూరు (టూటౌన్): స్థానిక సుబ్బమ్మదేవి మున్సిపల్ ఉన్నత పాఠశాలలో మూడు రోజుల జిల్లా స్థాయి కార్యశాల శిక్షణా కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. జిల్లా కో ఆర్డినేటర్గా డీఈఓ వెంకటలక్ష్మమ్మ వ్యవహరించారు. అకడమిక్ కాలెండర్, టీచర్ హ్యాండ్ బుక్, స్టూడెంట్ అసెస్మ్మెంట్ బుక్, కరిక్యులమ్ ఇంటిగ్రేషన్ అనే అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. అసిస్టెంట్ జిల్లా కోఆర్డినేటర్ అంగులూరి సర్వేశ్వరరావు మంగళవారం కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా ఎస్సీఈఆర్టీ రాజబాబు హాజరయ్యారు. శిక్షణకు 162 మంది డీఆర్పీలు, 12 మంది ప్రధానోపాధ్యాయులు హాజరయ్యారు. వీరు క్షేత్ర స్థాయిలో ఉన్న 3,250 స్కూల్ అసిస్టెంట్స్, ప్రధానోపాధ్యాయులకు ఈ నెల 8, 9, 10 తేదీల్లో శిక్షణ ఇవ్వనున్నట్టు సర్వేశ్వరరావు తెలిపారు. 6వ తరగతి విద్యార్ధులకు సంసిద్దతా కార్యక్రమాలు, 9వ తరగతి విద్యార్థులకు జనవరిలో పరీక్షలు పూర్తిచేసి 10వ తరగతికి 40 రోజులు బ్రిడ్జి కోర్సు ముఖ్యాంశాలని రాజబాబు తెలిపారు. 1, 2 తరగతులకు, 9, 10 తరగతులకు ప్రత్యేక పాఠ్యపుస్తకాలుగా కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విజయ రామరాజు, డైరెక్టర్ ఎంవీ కృష్ణారెడ్డి నేతృత్వంలో రూపొందాయని వివరించారు. కార్యక్రమంలో డైట్ లెక్చరర్స్ పాల్గొన్నారు. -
వైఎస్ఆర్ కడప స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాలు
ఏలూరు రూరల్: ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ డాక్టర్ వైఎస్ఆర్ కడప స్పోర్ట్స్ స్కూల్లో 4, 5 తరగతుల్లో ప్రవేశాలు నిర్వహిస్తోందని ఏలూరు జిల్లా డీఎస్డీఓ బి శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 19వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 4వ తరగతి ప్రవేశానికి ఏప్రిల్ 1, 2015 నుంచి మార్చి 31, 2017 మధ్య జన్మించి ఉండాలన్నారు. అలాగే ఏప్రిల్ 1 2014 నుంచి మార్చి 31 2016 మధ్య జన్మించినవారు 5వ తరగతిలో ప్రవేశించవచ్చని వివరించారు. ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకూ దరఖాస్తుల పరిశీలన చేసి శాప్ షార్ట్ లిస్ట్ విడుదల చేస్తుందన్నారు. అనంతరం జూలై 1 నుంచి 3వ తేదీ వరకూ జిల్లాస్థాయి, జూలై 10 నుంచి 11వ తేదీ వరకూ రాష్ట్రస్థాయి ఎంపిక పోటీలు ఉంటాయన్నారు. వివరాలకు 98663–17326, 99487 79015 నంబర్లలో సంప్రదించాలన్నారు. మట్టి ట్రాక్టర్ ఢీకొని వృద్ధురాలి మృతి ముసునూరు: మట్టి అక్రమ తోలకాలు ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. మట్టి ట్రాక్టర్ ఢీకొని ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన మండలంలోని గోపవరంలో చోటుచేసుకుంది. గ్రామంలో పగలూ రాత్రి తేడా లేకుండా మట్టి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. మట్టి ట్రిప్పులు అధికంగా వేయాలనే ఆత్రంతో లైసెన్స్లు లేని, డ్రైవింగ్ కూడా సరిగా రాని వారు కూడా గ్రామంలో మట్టి ట్రాక్టర్లు నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం మట్టి ట్రాక్టరు వెనుక నుంచి ఢీ కొట్టడంతో గ్రామానికి చెందిన వృద్ధురాలు గడ్డం అంజమ్మ (65) అక్కడికక్కడే మృతి చెందింది. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై ఎం.చిరంజీవి తెలిపారు. -
డిపో సీఐ దురుసు ప్రవర్తనపై నిరసన
ఏలూరు (టూటౌన్): ఏపీఎస్ ఆర్టీసీ ఏలూరు డిపో ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి డి.ఆంజనేయులుపై డిపో సీఐ దురుసు ప్రవర్తనకు నిరసనగా మంగళవారం స్థానిక ఆర్టీసీ గ్యారేజీ ఎదుట యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. యూనియన్ ఏలూరు డిపో గౌరవ అధ్యక్షుడు వై.శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంజనేయులు పట్ల సీఐ అలా ప్రవర్తించడం సరైంది కాదన్నారు. యూనియన్ నాయకులు, కమిటీ సభ్యుల పట్ల ఆర్టీసీ అధికారులు సూపర్వైజర్ చిన్న చూపు చూస్తున్నారని ఆరోపించారు. వెహికల్ కండిషన్ మెరుగుపరచాలని పదేపదే మేనేజ్మెంట్కు చెప్పినా ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని తెలిపారు. డిపోలో కనీస మౌలిక వసతులు లేవని అన్నారు. ఆంజనేయులు మాట్లాడుతూ సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాడుతామని, బుధవారం నుంచి నాన్ కోపరేషన్ పాటిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ డిపో నాయకులు వీఎస్ నారాయణ, ఎండి రమేష్, పీకేబీ రాజు, పి.శ్రీహరి పాల్గొన్నారు. కూలీలు పస్తులుంటే.. యోగాలో నిమగ్నమా! భీమవరం అర్బన్: గత రెండు నెలలుగా ఉపాధి హామీ కూలీలు వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. అధికారులందరూ ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాలో నిమగ్నమైపోవడం దారుణమని సీఐటీయూ నాయకులు మండిపడ్డారు. భీమవరం మండలంలోని గూట్లపాడు, గొల్లవానితిప్ప గ్రామాల్లో మంగళవారం సీఐటీయూ సంఘం సభ్యులు పర్యటించి ఉపాధి హామీ కూలీలను కలిసి సమస్యలు అడిగి తెలుసుకుని ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు ఎం.ఆంజనేయులు, ఇంజేటి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీ పనులు చేసిన 15 రోజుల్లోనే వేతనాలు చెల్లించాలని చట్టంలో ఉన్నా రెండు నెలలు గడుస్తున్నా వేతనాలు చెల్లించకపోవడం దారుణమన్నారు. నిత్యావసర ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే యోగాసనాల్లో అధికారులు నిమగ్నమైపోవడం బాధాకరమన్నారు. ఉపాధి హామీ రోజు కూలీ రూ.600 చేసి ఏడాదికి 200 పనిదినాలకు పెంచాలని డిమాండ్ చేశారు. నూతన వంగడాల వైపు రైతులు మొగ్గు చూపాలి భీమవరం అర్బన్: వ్యవసాయంలో సాంకేతికతను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ నూతన వంగడాల వైపు రైతులు మొగ్గు చూపాలని ఉండి కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ పి. వినయలక్ష్మి అన్నారు. భీమవరం మండలంలోని రాయలం గ్రామంలో మంగళవారం వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా శాస్త్రవేత్తలు నూతన వంగడాలు, వాటి దిగుబడులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వినయలక్ష్మి మాట్లాడుతూ వ్యవసాయంలో నూతన వంగడమైన ఎమ్టీయూ 1224 వంగడం గురించి వివరించి దాని బీజం, దిగుబడి గురించి చెప్పారు. జీలుగుమిల్లి సీటీఆర్ఐ టుబాకో, ప్రిన్సిపాల్ శాస్త్రవేత్త డాక్టర్ వై. సుబ్బయ్య, శాస్త్రవేత్త పి. సహదేవరెడ్డి పాల్గొన్నారు. -
చేతివృత్తులను ఆదరించాలి
ఏలూరు (టూటౌన్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతివృత్తులకు రక్షణ కల్పించి చేతివృత్తిదారులను ఆదుకోవాలని చేతి వృత్తిదారుల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామాంజనేయులు డిమాండ్ చేశారు. ఏలూరు స్ఫూర్తి భవనంలో మంగళవారం చేతి వృత్తిదారుల సమాఖ్య ఏలూరు జిల్లా సమావేశం జిల్లా కన్వీనర్ కడుపు కన్నయ్య అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రామాంజనేయులు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన విశ్వకర్మ యోజన పథకం సాధారణ చేతి వృత్తి దారులను ఏ మాత్రం ఆదుకోలేకపోయిందని ఆయన పేర్కొన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ వాగ్దానాల్లో ఇప్పటివరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించలేదన్నారు. ప్రభుత్వాలు ఆదుకోకపోవడంతో చేతి వృత్తిదారులు ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల ఉత్పత్తుల నుంచి పోటీ తట్టుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేతి వృత్తిదారులకు సాంకేతిక యంత్ర పరికరాలు, సబ్సిడీ రుణ పరపతి, భూమి, మౌలిక సౌకర్యాలు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా జిల్లా ప్రధాన కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ గొర్రెల, మేకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పొట్టేలు పెంటయ్య, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ డాంగే చేనేత, తదితర వృత్తి సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
బాలలచే పని చేయించడం నేరం
కలెక్టర్ వెట్రిసెల్వి ఏలూరు(మెట్రో): బాలలచే పనిచేయించడం నేరం అని, వారిని పనిలో పెట్టుకున్న యాజమాన్యంపై కఠిన చర్యలు ఉంటాయని, దీనిపై విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి పేర్కొన్నారు. మంగళవారం స్ధానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశపు మందిరం నందు కార్మిక శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బాల కార్మిక వ్యవస్థ నిషేధ చట్టానికి సంబంధించిన అవగాహన గోడ పత్రికలను కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జిల్లా న్యాయసేవాధికార సంస్ధ కార్యదర్శి కె.రత్నప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 14 నుంచి 18 సంవత్సరాల లోపు బాలలచే పని చేయించడం చట్టప్రకారం నేరమన్నారు. బాల కార్మికుల గురించి ఫిర్యాదులకు చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ 1098ని సంప్రదించవచ్చునన్నారు. బాల కార్మికులను గుర్తించేందుకు ఈనెల 10వ తేదీ నుంచి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశంచారు. బడి బయటి పిల్లలను గుర్తించడంతో పాటు వారిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడమే కాకుండా క్రమం తప్పకుండా పాఠశాలలకు వచ్చేలా విద్యా శాఖ అధికారులు చొరవ చూపాలన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్ధ కార్యదర్శి కె.రత్నప్రసాద్ మాట్లాడుతూ బాల కార్మికులచే పని చేయించిన వారికి ఆరు నెలల నుంచి రెండేళ్ల వరకు జైలు శిక్ష, రూ.20 వేల నుంచి 50 వేల వరకు జరిమానా విధించబడుతుందన్నారు. ఈ సమావేశంలో అధికారులు పాల్గొన్నారు. -
అధికారులు న్యాయం చేయాలి
ఓఎన్జీసీ అధికారులు న్యాయం చేయాలని రైతులు ఆందోళన చేశారు. రైతులకు కేవలం ఒక పంటకు మాత్రమే డబ్బులు వేశారని ఆరోపిస్తున్నారు. 8లో uనాడు సంక్షేమ కాంతులు వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో సంక్షేమ కాంతులతో జిల్లా వెలుగొందింది. ఏలూరులో ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేసి దశాబ్దాల కలను నిజం చేశారు. రూ.525 కోట్లతో వైద్యకళాశాలకు అనుబంధంగా ఆసుపత్రి అభివృద్ధి చేశారు. 150 ఎంబీబీఎస్ సీట్లతో మొదటి విద్యా సంవత్సరం పూర్తయింది. జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో రూ.వందల కోట్లతో అభివృద్ధి పనులు చేశారు. రూ.10 వేల కోట్లకు పైగా నగదును సంక్షేమ పథకాల ద్వారా ప్రజల ఖాతాలకు జమ చేశారు. 1,16,000 ఇళ్ళ స్థలాలు, రూ.713 కోట్లతో ఇళ్ళ నిర్మాణం, రూ.202 కోట్లతో నాడు–నేడులో స్కూళ్ళ అభివృద్ధి, గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో రూ.78.56 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టారు. రూ.193.15 కోట్లతో సచివాలయాలు, 83.79 కోట్లతో రైతు భరోసా కేంద్రాలు, రూ.56.37 కోట్లతో హెల్త్ క్లినిక్ల నిర్మాణం, రూ. 58.49 కోట్లతో వైఎస్సార్ జలకళ పేరుతో బోర్ల తవ్వకం, రూ.606 కోట్లతో జలజీవన్ మిషన్, రూ.627.96 కోట్లతో రహదారుల నిర్మాణాలు, మరమ్మతులు, రూ.26.08 కోట్లతో పీహెచ్సీల అభివృద్ధి ఇలా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టారు. నేడు అన్ని వర్గాలకూ ఇక్కట్లు గత ప్రభుత్వ హయాంలో మధ్య, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు వివిధ సంక్షేమ పథకాల రూపంలో సగటున రూ.2 లక్షల నుంచి రూ.4.50 లక్షల మేరకు ఏటా లబ్ధి చేకూరింది. పల్లెల్లో అప్పుల ఇబ్బందులు గట్టెక్కడంతో పాటు ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగింది. రైతుభరోసా కేంద్రాల వ్యవస్థ వల్ల దళారీ పాత్రకు తెరపడింది. నేడు ఒక్క పథకం కూడా అమలు కాకపోవడంతో పల్లెల్లో మైక్రో ఫైనాన్స్ సంస్థలు పడగవిప్పి రూ.5 మొదలుకొని రూ.15 వడ్డీ వరకు వసూలు చేస్తూ జోరుగా వ్యాపారం చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లలో దళారుల రాకతో అన్నదాతకు కష్టాలు మొదలయ్యాయి. కొద్ది రోజుల క్రితం ప్రైవేటు ఫైనాన్స్ అప్పు తిరిగి చెల్లించడానికి ఇబ్బంది పడి పెదవేగి మండలం కే.కన్నాపురం గ్రామానికి చెందిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వేలాది మందికి భూ పంపిణీ జిల్లాలో వేలాది మంది లబ్ధిదారులకు 20 ఏళ్ళ తరువాత భూ పంపిణీ ప్రక్రియ వైఎస్ జగన్ హయాంలో జరిగింది. 656 మంది రైతులకు 524.116 ఎకరాలు పంపిణీ చేశారు. 9172 మంది రైతులకు ప్రయోజనం చేకూరేలా 11,715.32 ఎకరాల భూమిని అసైన్డ్ 22(ఎ) నుంచి తొలగించి పూర్తి హక్కులు కల్పించారు. 611 మంది ఎస్సీలకు 391.45 ఎకరాల భూమిని అప్పగించారు. అలాగే 26 గ్రామాల్లో ఎస్సీ శ్మశాన వాటికలకు భూమిని కేటాయించారు. -
ఇళ్ల నిర్మాణంలో ప్రగతి సాధించాలి
ఏలూరు(మెట్రో): జిల్లాలో ఇళ్ల ప్రగతికి నిర్ధేశించిన లక్ష్యాలను సాధించే దిశగా గృహనిర్మాణ శాఖ అధికారులు కృషి చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా హౌసింగ్ అధికారులతో సమీక్షించారు. లక్ష్యాలను సాధించకపోతే ఉపేక్షించేది లేదని.. రానున్న 10 రోజుల్లో ఇళ్ల నిర్మాణాల ప్రగతి కనబడాలన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 5న జిల్లా వ్యాప్తంగా 4.50 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మొక్కలు నాటే కార్యక్రమంపై వివిధ శాఖల జిల్లా అధికారులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఈఓపీఆర్డీఓ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలోని 27 మండలాల్లో ఆయా శాఖల వారీగా మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్ధేశించామన్నారు. సమీప నర్సరీల నుంచి మొక్కలు తీసుకుని జూన్ 5న నాటేందుకు సిద్ధం కావాలని ఆదేశించారు. ప్రస్తుతం రెడ్ క్రాస్ వద్ద ఉన్న రెండు డయాలసిస్ మిషన్లకు అదనంగా మరో రెండు డయాలసిస్ మిషన్లతో డయాలసిస్ సెంటర్ను త్వరగా ప్రారంభించే ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రెడ్ క్రాస్ కార్యవర్గానికి సూచించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏలూరు జిల్లా శాఖ చైర్మన్ డాక్టర్ ఎంబీఎస్వీ ప్రసాద్, కమిటీ సభ్యులు మంగళవారం కలెక్టర్ను కలిసి రెడ్ క్రాస్ కార్యక్రమాలపై చర్చించారు. జిల్లాలోని గిరిజన ప్రాంతంలో ఉద్యానవన సంబంధ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుపై అవగాహన కలిగించేందుకు ఏజెన్సీ ప్రాంతంలో వర్క్షాప్ నిర్వహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో జిల్లా పారిశ్రామిక, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పీఎం విశ్వకర్మ పథకం ప్రగతి తీరుపై సమీక్షించారు. జిల్లాలో సింగిల్ విండో కింద దరఖాస్తు చేసుకున్న 51 మందికి పరిశ్రమల ఏర్పాటుకు సమావేశం అనుమతులు మంజూరు చేస్తూ ఆమోదం తెలిపింది. -
దగా పాలనకు ఏడాది
సీ వీడ్.. సో గుడ్ సముద్రపు నాచు (సీ వీడ్) తీరప్రాంత మహిళలకు కుటీర పరిశ్రమగా మారుతోంది. తక్కువ కాలంలోనే అధిక దిగుబడులు సాధించే నాచు పెంపకానికి డిమాండ్ పెరుగుతోంది. 8లో uదగా పాలనకు నేటితో ఏడాది పూర్తయ్యింది. సూపర్ సిక్స్ అంటూ ప్రజలను మభ్యపెట్టి తీరా గెలిచాక ఓట్లేసిన వారిని వెన్నుపోటు పొడిచారు. పోలవరాన్ని ప్రత్యేక జిల్లా చేస్తామని.. కొల్లేరుకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని.. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని.. ఇలా జిల్లా స్థాయిలో పదుల సంఖ్యలో హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చాక పూర్తిగా గాలికి వదిలేశారు. ఒక్క సంక్షేమ పథకం అమలు కాలేదు. అభివృద్ధి పనులు చేపట్టలేదు. రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో మాత్రం దాడులు, దౌర్జన్యాలు కొనసాగిస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది కాలంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేకుండా కూటమి ప్రభుత్వం వ్యక్తిగత ఎజెండాతో ముందుకు వెళ్తోంది. ఇదేం పరేషన్బుధవారం శ్రీ 4 శ్రీ జూన్ శ్రీ 2025నిరసన గళం వినిపించాలి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు నరసాపురం: బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు ప్రజలను నిలువునా మోసం చేసిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు అన్నారు. కూటమి ఏడాది పాలనలో మహిళలు, విద్యార్ధులు, కార్మికులు ఇలా.. అన్ని వర్గాల ప్రజలు దగా పడ్డారని విమర్శించారు. జూన్ 4న వెన్నుదినంగా పరిగణించి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని వైఎస్సార్సీపీ నిర్ణయించిందని చెప్పారు. నిరసన కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వామ్యం చేయాలని చెప్పారు. యువత పెద్ద ఎత్తున పాల్గొనేలా చూడాలన్నారు. 2019–24 మధ్య వైఎస్సార్సీపీ స్వర్ణయుగం పాలన నడిచిందని.. అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని గద్దెనెక్కిన ఏడాదిలోపే అమలు చేశారని గుర్తుచేశారు. నేడు కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేసి పాలన సాగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మఒడి లాంటి పథకాలు అమలుకాక పేద, మధ్య తరగతి పిల్లల చదువులు భారంగా మారాయని అన్నారు. వేతనాల కోసం ఉపాధి కూలీల ధర్నా పెంటపాడు: గత మూడు నెలలుగా ఉపాధి కూలీలకు వేతనాలు అందకపోవడంతో ఉపాధి కూలీలు నిరసన చేపట్టారు. వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి కళింగ లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఆకుతీగపాడు, బోడపాడు, ముదునూరు గ్రామాలలో నిరసన తెలిపారు. పనిచేస్తున్న ప్రదేశాలలో పలువురు కూలీలు మాట్లాడుతూ ఏప్రిల్ నెల నుంచి ఇంత వరకు వేతనాలు అందలేదన్నారు. పెరిగిన ధరలతో ఒక పక్క ఇబ్బందులు పడుతున్నామని, మరోవైపు కూలి పనులు చేసినా పస్తులు ఉండాల్సి వస్తోందని వాపోయారు. కూటమి ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉందన్నారు. రేషన్ డిపోల రద్దుకు కుట్ర భీమవరం: చౌక డిపోల ద్వారా ప్రజలకిచ్చే రేషన్ సరుకుల రద్దుకు ప్రభుత్వం కుట్రచేస్తోందని దీనిలో భాగంగానే నగదు బదిలీ అంటూ ప్రచారం చేస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి జెఎన్వీ గోపాలన్ విమర్శించారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేస్తూ రేషన్ వద్దనుకుంటే నగదు బదిలీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. చౌకడిపోలను పూర్తిగా తీసేయాలనే ఆలోచనే చేస్తున్నారన్నారు. రేషన్ సరఫరాలో అక్రమాలు, అవినీతి ఉంటే వాటిని అరికట్టే చర్యలు తీసుకోవాలి తప్ప డీబీటీ విధానం సరైంది కాదన్నారు. తెలంగాణలో తరహా సన్న బియ్యం పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. రేషన్ సరుకులు చౌక డిపోలతో పాటు ఇంటింటికి వాహనాల ద్వారా ఇవ్వాలని, అన్ని రకాల నిత్యావసర సరుకులను రేషన్ ద్వారా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏలూరులో 12 కరోనా కేసుల నమోదుఏలూరు టౌన్: కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. చాపకింద నీరులా పాజిటివ్ కేసులు మెల్లగా పెరుగుతున్నాయి. ఇంతవరకూ మొత్తం 12 కరోనా కేసులు నమోదుయ్యాయి. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం ప్రజలను అప్రమత్తం చేయటంలో విఫలమయ్యారు. తాజాగా మంగళవారం మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు ఏలూరులో నమోదయ్యాయి. నగరంలోని నరసింహారావుపేటలో ఒకటి, మోతేవారి తోటలో కరోనా కేసు నమోదైంది. సోమవారం మంచినీళ్ళతోట, వెంకటాపురం పంచాయతీల్లో ఇద్దరు మహిళలకు కరోనా సోకింది. ఇప్పటికే ఏలూరు కలెక్టరేట్లో ఐదుగురు ఉద్యోగులకు, అమీనాపేటలో ఒకరికి, శాంతినగర్లో ఇద్దరు రిటైర్డ్ ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా సోకిన బాధితులను హోమ్ ఐసోలేషన్లో ఉంచి చికిత్స పొందేలా వైద్యులు చర్యలు చేపట్టారు. ఏలూరు జీజీహెచ్లోని వీఆర్డీఎల్ ల్యాబ్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ప్రస్తుతం సుమారు 162 కరోనా పరీక్షలు చేసినట్లుగా వైద్యాధికారులు చెబుతున్నారు. 1,684 కేసుల నమోదు ఏలూరు (టూటౌన్): మే నెలలో జిల్లా వ్యాప్తంగా రవాణా, వ్యక్తిగత వాహనాలపై 1,684 కేసులు నమోదు చేసి రూ.1.03 కోట్లను అపరాధ రుసుంగా విధించినట్లు ఉప రవాణా కమిషనరు షేక్ కరీమ్ తెలిపారు. పన్ను చెల్లించని 72 వాహనాలు సీజ్ చేశామన్నారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు : కూటమి ప్రభుత్వం కొలువుదీరి బుధవారంతో ఏడాది పూర్తవుతుంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు జిల్లాలో ఇళ్ల పట్టాలు మొదలుకొని ఇతర అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత ఒక్క పని కూడా మొదలు పెట్టకపోగా ప్రకటించిన హామీలను అటకెక్కించి సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు. హామీలన్నీ గాలికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో ఏలూరు జిల్లాకు లెక్కకు మించి హామీలు గుప్పించారు. ఏలూరులో పరిశ్రమలు నెలకొల్పి ఉపాధి కల్పిస్తామన్నారు. ఇప్పుడు ఉన్న పరిశ్రమలు మూసివేసేలా వ్యవహరిస్తున్నారు. పోలవరం ప్రత్యేక జిల్లా చేస్తామన్నారు. ఆ హామీ గాలికి వదిలేశారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేసే బాధ్యత నాదంటే నాదని చంద్రబాబునాయుడు, పవన్ ఇద్దరూ ప్రకటించి పూర్తిగా విస్మరించారు. రూ.4 వేల కోట్లతో చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తయితే లక్షలాది ఎకరాలు సాగులోకి వస్తాయి. పోలవరం నిర్వాసితులకు ఆరు నెలల్లో పరిహారం పూర్తి చేస్తామన్నారు. దాన్ని ఏడాది దాటినా కనీసం పట్టించుకోలేదు. నూజివీడులో మామిడి పరిశ్రమల ఏర్పాటు, కొల్లేరు ఆక్రమణలు తొలగించి స్థానికులకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. కోర్టు కేసుల పేరుతో విజయవంతంగా పెండింగ్లో పెట్టారు. 7 నియోజకవర్గాల్లో 40కు పైగా ప్రధాన హామీలిచ్చి ఒక్క హామీ కూడా అమలుచేయ లేదు. రెడ్బుక్ పేరుతో ధ్వంస రచన కూటమి ప్రభుత్వం కొలువుదీరాక ఏలూరు, పోలవరం, నూజివీడు, దెందులూరు, చింతలపూడిలో రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేశారు. మొదటి నెలన్నర పాటు పెద్ద ఎత్తున దాడులు చేశారు. ఆ తరువాత వ్యక్తిగత ఆస్తులపై దాడులకు పాల్పడ్డారు. బెదిరింపుల పర్వాన్ని కొనసాగించారు. దెందులూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులతో పాటు చేపలు చెరువుల ధ్వంసం, పట్టుబడులకు అడ్డంకులు సృష్టించారు. అక్రమ గ్రావెల్ దందా కొనసాగిస్తూ అడ్డుకునేందుకు యత్నించిన వారిపై దాడులు చేశారు. పోలవరం నియోజకవర్గంలో మరో అడుగు ముందుకు వేసి ప్రజాప్రతినిధి సొంత టీం పేరుతో అరాచకాలకు తెగబడుతున్నారు. ప్రభుత్వ భూములను పొలిటికల్ లీజ్ పేరుతో ధారాదత్తం చేయడం, అడ్డుకునేవారిపై దాడులు, కేసులు నమోదు చేయించడం పరిపాటిగా కొనసాగిస్తున్నారు. రీ–సర్వేపై విచారణ చేస్తున్న జేసీ రాహుల్ కుమార్ఆకివీడు: మండలంలోని కుప్పనపూడి శివారు తాళ్లకోడులోని జగనన్న కాలనీలోని ఇళ్ల రీ–సర్వేపై తుది విచారణను జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మంగళవారం చేపట్టారు. కాలనీలో గత వారం రోజులుగా ఆరు బృందాలు రీ–సర్వే చేశాయి. అనంతరం భీమవరం ఆర్డీఓ ప్రవీణ్ కుమార్రెడ్డి విచారణ చేపట్టారు. కాలనీలో 3,420 మంది నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాల్ని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కేటాయించారు. వారికి పట్టాలు కూడా ఇచ్చారు. ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.1.80 లక్షలు అందజేశారు. దీంతో 1000 మంది గృహ ప్రవేశాలు చేశారు. మరో 1200 ఇళ్ల నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది. మిగిలిన నిరుపేదలు ఇళ్లు నిర్మించుకునేందుకు పునాదులు వేసి, తగిన సొమ్ములేక ఆగిపోయారు. మరికొంత మంది పునాదులు వేసేందుకు సొమ్ములేక ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇళ్లు నిర్మించుకోలేదనే కారణంగా వారి ఇళ్ల స్థలాలను ప్రభుత్వం వెనక్కి తీసుకునేందుకు రీ సర్వే ఏర్పాటు చేశారు. దీనిపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నిరుపేదలు ఇళ్లు నిర్మించుకునేందుకు రూ. 4 లక్షలు తక్షణం విడుదల చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేసి పేదల ఇళ్ల నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తిచేస్తున్నారు. రేషన్ షాపుల వద్ద నిత్యావసరాల కోసం జనం అవస్థలు కొనసాగుతున్నాయి. ఇంటి వద్దకే రేషన్కు మంగళం పాడిన కూటమి సర్కారు.. జగన్ సర్కారుకు పేరు వస్తుందనే అక్కసుతో షాపుల వద్దే సరుకులు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో మూడో రోజూ మంగళవారం కూడా కార్డుదారులు అవస్థలు పడ్డారు. చాలా చోట్ల సర్వర్ పనిచేయక క్యూలైన్లో పడిగాపులు కాశారు. వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటికే రేషన్ అమలు కాక చాలా చోట్ల వృద్ధులు షాపులకు వెళ్లి రేషన్ తెచ్చుకునేందుకు ఎండలో ఇక్కట్లు పడ్డారు. – సాక్షి నెట్వర్క్ న్యూస్రీల్రాష్ట్రంలో మద్యం, గంజాయి పాలన ఆకివీడు: రాష్ట్రంలో గంజాయి, మద్యం ఏరులైపారడంతో మహిళలు, చిన్నారులకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. స్థానికంగా చిన్నారిపై అఘాయిత్యాన్ని ఖండిస్తూ మంగళవారం నేతలు విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. నగర పంచాయతీ చైర్పర్సన్ జామి హైమావతి, మండల, పట్టణ వైఎస్సార్సీపీ అధ్యక్షులు నంద్యాల సీతారామయ్య, అంబటి రమేష్, మెప్మా మాజీ అధ్యక్షురాలు మోరా జ్యోతిరెడ్డి, కోఆప్షన్ సభ్యురాలు గుండుగొలను సావిత్రి, ధనరాజు మాట్లాడుతూ ఏడేళ్ల చిన్నారిపై అత్యాచార సంఘటన అమానవీయమన్నారు. టీడీపీకి చెందిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళలకు, చిన్నారులకు రక్షణ కల్పించాలంటే పట్టణ, గ్రామాలకు దూరంగా మద్యం షాపులు ఉండాలన్నారు. బెల్టు షాపుల బెల్టు ఎప్పుడు తీస్తారని ప్రశ్నించారు. గంజాయి అమ్మకాలపై పోలీస్ యంత్రాంగం తీవ్ర నిర్లిప్తతతో ఉందన్నారు. పట్టణంలోని విచ్చలవిడిగా గంజాయి, మద్యం దొరుకుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. నగర పంచాయతీ విప్ పడాల శ్రీనివాసరెడ్డి, గేదెల అప్పారావు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో హామీల వరద ఏడాది పూర్తయినా ఒక్క హామీ నెరవేర్చని కూటమి ప్రభుత్వం రెడ్బుక్ పేరుతో దాడులు, దౌర్జన్యాలు సంక్షేమం కొరవడి పల్లెల్లో మైక్రో ఫైనాన్స్ వేధింపులు కూటమి దగాపై జూన్ 4ను ‘వెన్నుపోటు దినం’గా ప్రకటించిన వైఎస్సార్సీపీ నియోజకవర్గ కేంద్రాల్లో నేడు నిరసన కార్యక్రమాలు జిల్లాలో జగన్ హయాంలో ఐదేళ్లలో రూ.10 వేల కోట్లకు పైగా లబ్ధి హామీలు ఏమయ్యాయి కూటమి నేతలు అన్ని ప్రచార సభలో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు. సంవత్సరమైనా హామీలు ఎందుకు అమలు చేయడం లేదు. తల్లికి వందనం, ఉచిత బస్సు, ఆడబిడ్డ నిధి, రైతన్నకు సాయం, నిరుద్యోగ భృతి పథకాలు అమలు చేయకుండా కోట్ల మంది ప్రజలను దగా చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టిన తొలి సంవత్సరంలోనే అన్ని హామీలతో పాటు ఇవ్వని పథకాలు అమలు చేశారు. – మేడూరి రంగబాబు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంకా వేధిస్తూనే ఉన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నా ఇళ్లను ధ్వంసం చేసి, నాపై 9 అక్రమ కేసులు పెట్టారు. నా కుటుంబ సభ్యులను సైతం ఇబ్బంది పెడుతున్నారు. నన్ను నా అనుచరులను వేధిస్తూనే దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సైతం కూటమి పెద్దలకు తలొగ్గి నిబంధనలకు నీళ్లొదిలేశారు. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడు చూడలేదు. కామిరెడ్డి నాని, వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు -
హక్కులను కాలరాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
ఏలూరు (టూటౌన్): రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను అమలు చేయాల్సిన అధికారులు, ప్రజా ప్రతినిధులు వాటిని కాలరాస్తున్నారని, రక్షించాల్సిన వారే వాటిని భక్షించే పరిస్థితి నెలకొందని ఆల్ ఇండియా అంబేడ్కర్ యువజన సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మెండెం సంతోష్ కుమార్, ఏఐఆర్డీఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్.మణిసింగ్ అన్నారు. స్థానిక లేడీస్ క్లబ్లో ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అంశంపై సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాలు మానవ హక్కులను కాలరాస్తున్నాయన్నారు. ముఖ్యంగా దళితులపై అరాచకాలకు పాల్పడుతూ వారి పట్ల వివక్షతను కొనసాగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. రాష్ట్రంలో రెవెన్యూ,పోలీస్ వ్యవస్థలు వైఫల్యం చెందాయని.. పిఠాపురం నియోజకవర్గం, ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో దళితులపై జరిగిన దాడులే నిదర్శనమన్నారు. సమావేశంలో అటవీ శాఖ మాజీ డైరెక్టర్ పల్లెం ప్రసాద్, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి చాగంటి సంజీవ్ కుమార్, డాక్టర్ నిట్టా ప్రసాద్, దాసరి రమేష్, దోమతోటి అబ్రహాం, సింగవరపు జ్యోతి, విజయ కుమారి, మాముడూరు మహాంకాళి, నూకపెయ్యి కార్తీక్, లాయర్ రాజశేఖర్, కనికెళ్ళి రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
జేఈఈ అడ్వాన్స్డ్లో శశి విద్యార్థుల ప్రతిభ
తాడేపల్లిగూడెం (టీఓసీ) : జేఈఈ అడ్వాన్స్డ్ 2025లో శశి తాడేపల్లిగూడెం విద్యార్థులు ఆలిండియా ర్యాంక్లు సాధించినట్లు విద్యా సంస్థల ఛైర్మన్ బూరుగుపల్లి వేణు గోపాలకృష్ణ తెలిపారు. ఎస్కే ఆజాం ఖాన్ ఆలిండియా 16వ ర్యాంక్ సాధించినట్లు వెల్లడించారు. ఎ.ప్రసాద్ 4,111, పి.శ్రీలేఖ 4,915, పి.చరణ్ 6,058, కె.దేవిక 6,637, వి.హరిచరణ్ 12,259 ర్యాంక్లు వచ్చాయని చెప్పారు. విజయం సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను, అధ్యాపకులను చైర్మన్తో పాటు విద్యాసంస్థల వైస్ చైర్మన్ మేకా నరేంద్ర కృష్ణ, అకడమిక్ డైరక్టర్ క్రాంతి సుధలు అభినందించారు. విద్యా శాఖ అధికారుల బాధ్యతల స్వీకరణ ఏలూరు (టూటౌన్): ఏలూరు జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో నలుగురు అధికారులు సోమవారం విధుల్లో చేరారు. జిల్లా విద్యా శాఖ అసిస్టెంట్ డైరెక్టర్–2గా ఎన్. వెంకటప్పయ్య, ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్గా ఏ.జయలక్ష్మి, పరీక్షల విభాగంలో సీనియర్ అసిస్టెంట్గా వి.సుధాకర్, డీఈఓ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్గా కే.పావని బాధ్యతలు స్వీకరించారు. -
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మహిళా సాధికారత
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా డ్వాక్రా మహిళలతో మహిళా మార్టుల పేరుతో సూపర్ మార్కెట్లను ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్వహించారు. చింతలపూడి, జంగారెడ్డిగూడెంలో మూడేళ్ల క్రితం ఏర్పాటు చేసిన మహిళా మార్టులు రోజూ రూ.లక్ష టర్నోవర్ సాధించగా కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రస్తుతం టర్నోవర్ రూ.40 వేలకు పడిపోయింది. రికార్డు స్థాయిలో ఇళ్ల పట్టాలు జిల్లాలో రికార్డు స్థాయిలో 1,16,431 మంది మహిళలకు ఇళ్ల పట్టాలు అందించి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించారు. 98 వేల ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం ద్వారా ప్రతి మహిళకు సగటున రూ.15 లక్షలకుపైగా వ్యక్తిగత ఆస్తిని సమకూర్చారు. -
అతివలకు అన్యాయం
నీకు 15 వేలు.. నీకు 15 వేలు.. నీకు 18 వేలంటూ గడపగడపకు ప్రస్తుత మంత్రి నిమ్మల ప్రచారం.. ఆడవాళ్లందరికీ ఉచిత బస్సు.. ద్వారకాతిరుమల, తిరుపతి, సింహాచలం ఇలా ఏ పుణ్యక్షేత్రమైనా ఉచితంగా వెళ్లి రావొచ్చు అంటూ కూటమి నాయకుల హామీలు.. అధికారంలోకి రాగానే ఇళ్ల నిర్మాణం చేపడతాం.. మహిళలను మహారాణులుగా తీర్చిదిద్దుతాం.. డ్వాక్రా సంఘాలకు అంతర్జాతీయ ఖ్యాతి తీసుకువస్తాం.. అంటూ గత ఎన్నికల సమయంలో లెక్కకు మించి హామీలిచ్చారు.. తీరా అధికారం చేపట్టిన తర్వాత మహిళా సంక్షేమాన్ని పక్కన పెట్టారు కూటమి నాయకులు.. గద్దెనెక్కి ఏడాది గడిచినా ఒక్క పథకాన్నీ అమలుచేయకపోగా.. కనీసం అమలుపై స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. మంగళవారం శ్రీ 3 శ్రీ జూన్ శ్రీ 2025సాక్షి ప్రతినిధి, ఏలూరు: కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా 18–59 ఏళ్ల మహిళలందరికీ నెలకు రూ.1,500, తల్లికి వందనం, డ్వాక్రా రుణాల పరిమితి రెట్టింపు, ఉచిత బస్సు ఇలా అడ్డగోలు హామీలిచ్చింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీలతో పాటు పలు సంక్షేమ పథకాలు మహిళల పేరుతో అమలు చేయగా.. ప్రస్తుత కూటమి సర్కారు ఏడాది గడిచినా ఒక్క హామీ అమలుచేయకపోవడంతో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. ఇప్పటికే ఆడబిడ్డ నిధి, ఉచిత బస్సు ఎప్పుడిస్తారంటూ నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నా ప్రభు త్వం పట్టించుకోని పరిస్థితి. ‘ఆడబిడ్డ’కు అన్యాయం : జిల్లాలో 19–59 ఏళ్ల వయసున్న మహిళలు 6,71,033 మంది ఉన్నారు. వీరందరికీ నెలకు రూ.1,500 చొప్పున కూటమి హామీ మేరకు ఆడబిడ్డ నిధి పేరుతో సాయం అందించాల్సి ఉంది. మొదటి ఏడాది ఈ పథకం మేరకు జిల్లాలో మహిళలకు రూ.1,207.80 కోట్లు అందించాల్సి ఉంది. అయితే పథకాన్ని అమలు చేయకపోవడంతో ఈ మొత్తాన్ని మహిళలు నష్టపోయారు. ఇక ఉచిత బస్సు విషయంలోనూ కూటమి ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. పథకం అమలుపై స్పష్టత లేదు. జిల్లాలో 305 ఆర్టీసీ సర్వీసుల్లో ఉచిత బస్సు పథకం త్వరలో అమలులోకి తెస్తామని పదేపదే ప్రకటిస్తూ ఏడాది గడిపేశారు. తల్లికి పంగనామం : తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంత మంది చదువుకునే పిల్లలుంటే అందరికీ రూ.15 వేలు ఇస్తామని ఎన్నికల ముందు కూటమి నాయకులు ఊదరగొట్టారు. తీరా అధికారం చేపట్టి ఏడాది గడిచినా ఈ ఊసేలేదు. దీంతో మొదటి సంవత్సరంలో జిల్లాలో ఉన్న 2,91,858 మంది విద్యార్థులు, 31,445 మంది ఇంటర్ విద్యార్థులు రూ.486.96 కోట్ల మేర నష్టపోయారు. గత ప్ర భుత్వ హయాంలో జిల్లాలో 1,78,214 మంది తల్లు ల ఖాతాల్లో మొత్తంగా రూ.1,069.30 కోట్లను మా జీ సీఎం జగన్ జమ చేయించారు. న్యూస్రీల్గత ప్రభుత్వంలో మహిళలకు పథకాల లబ్ధి జిల్లాలో 30,917 స్వయం సహాయక సంఘాలకు రూ.7,002 కోట్లు బ్యాంకు లింకేజీ రుణాలు అందించారు. వైఎస్సార్ చేయూత కింద 1,16,491 మందికి రూ.561.53 కోట్ల లబ్ధి చేకూర్చారు. వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 19,868 మందికి రూ.119.21 కోట్లు జమ చేశారు. వైఎస్సార్ ఆసరా ద్వారా 35,745 గ్రూపుల్లోని 3,55,315 మంది మహిళలకు రూ.1,305.05 కోట్ల రుణమాఫీ చేశారు. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద 43,765 స్వయం సహాయ సంఘాలకు రూ.221.99 కోట్ల లబ్ధి చేకూర్చారు. సీ్త్ర నిధి రుణాల కింద 9814 గ్రూపుల్లో 39,255 మంది మహిళలకు రూ.546.53 కోట్లు అందించారు. వైఎస్సార్ ఈబీసీ నేస్తం కింద అగ్రవర్ణాల్లోని పేదలకు మూడు విడతల్లో రూ.45 వేల చొప్పున ఆర్థిక సాయం చేశారు. ఆడబిడ్డలకు ద్రోహం ప్రభుత్వం రాగానే ఆడబిడ్డ నిధి పథకం అమలుకు కూటమి హామీ 19 నుంచి 59 ఏళ్ల లోపు మహిళలకు నెలకు రూ.1,500 జిల్లాలో అర్హులు సుమారు 6.71 లక్షల మంది పథకం అమలు ఊసెత్తని ప్రభుత్వం ఏడాది కాలానికి రూ.1,207 కోట్లు నష్టపోయిన జిల్లాలో మహిళలు ఆసరా, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తంతో మహిళలకు అండగా జగన్ సర్కారు ఏడాదైనా ఒక్క పథకం లేదు సార్వత్రిక ఎన్నికలకు ముందు కూటమి నాయకులు మహిళలను ఆకట్టుకునేలా పలు హామీ లిచ్చారు. తల్లికి వందనం, ఉచిత బస్సు, గ్యాస్, ఆడబిడ్డ నిధి ఇస్తామన్నారు. అధికారం చేపట్టి ఏడాది గడిచినా మహిళలకు ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలను ఏడాదిలోపే మాజీ సీఎం జగన్ అమలు చేసి చూపించారు. – కనమతరెడ్డి చండీప్రియ, నియోజకవర్గ మహిళా విభాగ అధ్యక్షురాలు, చింతలపూడి కాపులను దగా చేశారు కాపు నేస్తం పేరిట గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కాపులందరినీ ఆదుకున్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. మహిళల అభ్యున్నతితోనే సమాజం బాగుంటుందని భావించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేసింది. మహిళా సాధికారతకు కృషి చేసింది. కూటమి ప్రభుత్వం పలు హామీలిచ్చి ఒక్కటీ అమలు చేయకుండా మోసం చేస్తోంది. – అప్పన పద్మావతి, వైస్ ఎంపీపీ, పెదపాడు మండలం -
అర్జీలపై సత్వర చర్యలు
కలెక్టర్ వెట్రిసెల్వి చింతలపూడి: ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)లో అందిన అర్జీల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. సోమవారం చింతలపూడి తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే సొంగా రోషన్కుమార్, జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి, నూజివీడు సబ్ కలెక్టర్ స్మరణ్ రాజ్తో కలిసి ఆమె పీజీఆర్ఎస్లో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలపై అధికారులు ప్రత్యేక చూపాలన్నారు. ఎమ్మెల్యే రోషన్కుమార్ మాట్లాడుతూ 312 అర్జీలు వచ్చాయని, రెవెన్యూ, పెన్షన్లు, రీసర్వే, అసైన్డ్ భూములు, వైద్యారోగ్యం, ఇరిగేషన్ సంబంధిత అంశాలపై ఫిర్యాదులు ఉన్నాయన్నారు. అర్జీల్లో కొన్ని.. ● టి.నర్సాపురానికి చెందిన పసుమర్తి రాము చింతలపూడి–టి.నర్సాపురం ఆర్అండ్బీ రోడ్డు అధ్వానంగా ఉందని, మరమ్మతులు చేయాలని వినతిపత్రం అందించారు. ● చింతలపూడి మండలం ప్రగడవరానికి చెందిన ఎన్.చరణ్ మోహన్ రెడ్డి తనకు 60 శాతం అంగవైకల్యం ఉందని, పెన్షన్ ఇప్పించాలని అర్జీ అందించారు. ● చింతలపూడికి చెందిన బి.రమణ గ్రామంలోని ఇళ్ల కాలనీలోని రోడ్ల సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ● లింగపాలెం మండలం ధర్మాజీగూడేనికి చెందిన కె.ఇస్సాకు తమ గ్రామ సర్వే నం.260.2లో తనకు 0.35 సెంట్ల భూమి ఉందని, దీనిని డిస్టిబ్యూట్ రిజిస్టర్ నుంచి తొలగించాలని కోరుతూ అర్జీ అందజేశారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ ఆర్.విజయరాజు, డీసీఓ శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ భీమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు కలెక్టరేట్లో 204 అర్జీలు ఏలూరు(మెట్రో): ఏలూరు కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్లో డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, అధికా రులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. గడువులోపు పరిష్కారం చూపాలని డీఆర్వో ఆదేశించారు. మొత్తంగా 204 అర్జీలు అందాయి. అర్జీల్లో కొన్ని.. ● నిడమర్రు మండలం బువ్వనపల్లికి చెందిన దామిశెట్టి పద్మ తన ఇంటి డూప్లికేట్ పట్టా కోసం వినతిపత్రం అందించారు. ● పెదపాడు మండలం వసంతవాడకి చెందిన యలమంచిలి వరలక్ష్మి పట్టాదారు పాస్బుక్ కోసం అర్జీ అందించారు. ● ద్వారకాతిరుమల మండలం తిరుమలంపాలెం వాసి మల్లిబోయిన శోభారాణి తన కుమారుడికి వినికిడి యంత్రం ఇప్పించాలని కోరారు. ● ఉంగుటూరు మండలం ఉప్పాకపాడు నివాసి మాకా వెంకట సూర్య సత్యనారాయణ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం అర్జీ అందజేశారు. -
ఇళ్ల స్థలాల కోసం ధర్నా
ఏలూరు (టూటౌన్): ప్రభుత్వం హామీ మేరకు పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు స్థలం ఇచ్చి, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలంటూ బీకేఎంయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఏలూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని, ఇంటి స్థలాలు మంజూరు చేయాలంటూ నినదించారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు, ఏఐటీయూసీ జిల్లా కోశాధికారి పుప్పాల కన్నబాబు, ఏఐటీయూసీ జిల్లా నాయకులు పి.కిషోర్, బీకేఎంయూ కార్యదర్శి పొట్టేలు పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. కౌలు రైతుల వినూత్న నిరసన భీమడోలు: కౌలు రైతులందరికీ అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం అందించాలని, భూ యాజమాని సంతకంతో సంబంధం లేకుండా గుర్తింపు కార్డులను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం భీమడోలు తహసీల్దార్ కార్యాలయం వద్ద కౌలు రైతులు ధర్నా చేశారు. మండుటెండలో మోకాళ్లపై నిలిచి నిరసన తెలిపారు. కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీని వాస్, జిల్లా కన్వీనర్ వెజ్జు శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హామీలను అమలు చేయాలన్నారు. అనంతరం ఎంపీడీఓ సీహెచ్ పద్మావతిదేవి, ఏఓ ఎస్పీవీ ఉషారాణికి వినతిపత్రం అందించారు. ఆయిల్పామ్ రైతుల ఆక్రోశం ద్వారకాతిరుమల: కేంద్ర ప్రభుత్వం పామాయిల్ దిగుమతి సుంకాన్ని తగ్గించడాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో మండలంలోని ఎం.నాగులపల్లిలో ఆయిల్పామ్ గెలల కాటా వద్ద ఆయిల్పామ్ రైతులు సో మవారం ధర్నా నిర్వహించారు. ఆయిల్పామ్ కు గిట్టుబాటు ధర కల్పించాలని, ఫ్యాక్టరీ యాజమాన్యాలు గెలల ఏరివేతను ఆపాలంటూ నినాదాలు చేశారు. సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ దిగుమతి సుంకం తగ్గింపుపై పునరాలోచన చేయకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కరరావు, మండల అధ్యక్షుడు బోయపాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పొగాకు రైతుల ఆందోళన జంగారెడ్డిగూడెం: వర్జీనియా పొగాకుకి కిలోకి రూ.450 గిట్టుబాటు ధర ఇవ్వాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధర్ముల సురేష్ డిమాండ్ చేశారు. పొగాకుకి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ పొగాకు కంపెనీలు కుమ్మకై ్క రైతులకు అన్యాయం చే స్తున్నాయని ఆరోపించారు. పొగాకును రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకుడు కారం రాఘవ, న్యాయవాది, రైతు యు.ఏసుబాబు తదితరులు పాల్గొన్నారు. 5న ఐటీఐ కౌన్సెలింగ్ ఏలూరు (టూటౌన్): 2025–26కి సంబంధించి ఐటీఐ ప్రవేశాలకు ఈనెల 5న ఏలూరులో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు ఏలూరు స త్రంపాడు ఐటీఐ ప్రిన్సిపాల్ పి.రజిత సో మవారం ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 5 ప్రభుత్వ ఐటీఐల్లో 804, 14 ప్రైవేట్ ఐటీఐల్లో 1,672 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. -
మెట్ట రైతులను ఆదుకోవాలి
జంగారెడ్డిగూడెం : గత 6 నెలలుగా సరైన గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు అన్నారు. సోమవారం జంగారెడ్డిగూడెంలో ఆయన మాట్లాడుతూ పామాయిల్, పొగాకు, కోకో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. పామాయిల్ మార్కెట్లో రూ.20,000 ధర పలుకుతుంటే కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం 26 శాతం నుంచి ఒక్కసారిగా 10 శాతం తగ్గించడం వల్ల ధర తగ్గే పరిస్థితులు కనబడుతున్నాయి. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని, పామాయిల్ ధరలు రూ.15 వేలకు పడిపోయే పరిస్థితులు ఉన్నాయని అన్నారు. పొగాకు రైతులకు సరైన గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నారని, వెంటనే పొగాకు రైతులకు గిట్టుబాటు ధర అందించాలని కోరారు. కోకో అంతర్జాతీయ మార్కెట్లో రూ.800 పైగా ఉంటే రాష్ట్రంలో కేవలం కేజీ రూ.400కు మాత్రమే కొంటున్నారని, రైతులను పూర్తిగా నష్టాల పాలు చేస్తున్నారని విమర్శించారు. వెంటనే రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని.. అవసరమైతే ఈ ప్రాంతం తీసుకొచ్చి రైతుల దుస్థితిని వివరిస్తామని చెప్పారు. రైతులు అధైర్య పడవద్దని గిట్టుబాటు ధర కోసం కలిసికట్టుగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొద్దామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు, మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వామిశెట్టి హరిబాబు, మళ్లిడి బాబి, కొయ్యే లీలాధర్ రెడ్డి, ఇర్ల శ్రీనివాస్ రెడ్డి, అట్లూరి రామరాజు, సీతంపేట మాజీ సర్పంచ్ మిరియాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు -
ఉపాధి వేతనాల కోసం గళం
నూజివీడు: ఉపాధి హామీ పథకం కూలీలకు 8 వారాలుగా పెండింగ్లో ఉన్న కూలి డబ్బులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కొక్కిరిపాటి ఆనంద్ డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూలీలు వేతనాలు విడుదల కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే వేతనాలు విడుదల చేయాలని లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నాయకులు కర్రి రామకృష్ణ, సీపీఐ నాయకులు నిమ్మగడ్డ నరసింహా తదితరులు పాల్గొన్నారు. -
వెన్నుపోటుకు కేరాఫ్ చంద్రబాబు
సాక్షి, భీమవరం: వెన్నుపోటు రాజకీయాలకు సీఎం చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. ఎన్నికల మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసి తల్లులు, పిల్లలు, రైతులు, ఉద్యోగులు, కార్మికులతో పాటు అన్ని వర్గాలనూ వంచన చేస్తూ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బాధిత, పీడిత ప్రజల పక్షాన ప్రశ్నిస్తానన్న పవన్ కల్యాణ్ ఏమైపోయారో తెలియని పరిస్థితి ఉందన్నారు. ఆయన కోసం కాపు కాసిన వారికి న్యాయం చేయలేకపోతున్నారన్నారు. కాపు సామాజికవర్గంలో మెజారిటీ వర్గం పేదవారేనని, వారికి కాపు నేస్తం, ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి తదితర ఏ పథకం అందడం లేదన్నారు. ప్రజల కోసం సీఎం చంద్రబాబును పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన ప్రశ్నించారు.అన్ని వర్గాలనూ ఆదుకున్న ఘనత జగన్దే..అన్ని వర్గాలనూ ఆదుకున్న ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి దక్కుతుందని కారుమూరి చెప్పారు. తమ ప్రభుత్వంలో పేదలకు పథకాలు ఇవ్వబట్టే సంక్షేమం, అభివృద్ధి జరిగిందని తెలిపారు. నేడు వ్యాపారాలే లేవని, టోకుగా సొమ్ము మొత్తం దుబాయికో, సింగపూర్కో తరలించేస్తున్నారని విమర్శించారు. మాజీ సీఎం జగన్ హయాంలో రూ.3.31 లక్షల కోట్లు అప్పుచేశారని అసెంబ్లీలో చెప్పిన మంత్రి పయ్యావుల కేశవ్ ఇప్పుడు రూ.10 లక్షల కోట్లు అంటూ బయట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆయనది నోరా? తాటిపట్టా? అని ప్రశ్నించారు. కూటమి పాలనలో మర్డర్లు, ఇళ్లు కూల్చడాలు, ఇష్టానుసారంగా కేసులు పెట్టడాలు, డైవర్షన్ రాజకీయాలు చేయడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. తండేల్ సినిమాలో చూపించినట్లు ఇక్కడ జెట్టీలు లేక మత్స్యకారులు గుజరాత్కు వెళుతుంటే.. 6 జెట్టీలు కట్టించిన మంచి మనసున్న వ్యక్తి మాజీ సీఎం జగన్ అన్నారు. ఆరు పోర్టులు, జిల్లాకు ఒకటి చొప్పున మెడికల్ కళాశాలలు కట్టారని చెప్పారు. మెడికల్ కాలేజీలకు 750 మెడికల్ సీట్లు వస్తే వద్దని లేఖ రాసిన గొప్ప సీఎం చంద్రబాబునాయుడని కారుమూరి ఎద్దేవా చేశారు.మళ్లీ రేషన్ కోసం గంటల తరబడి క్యూ..తణుకు అర్బన్: సంపద సృష్టిస్తామని ప్రగల్బాలు పలికిన చంద్రబాబు విద్యుత్ బిల్లుల మోత మోగిస్తున్నారని, ఉద్యోగాలిస్తామని చెప్పి ఉన్న ఉద్యోగాలు తొలగించారని కారుమూరి మండిపడ్డారు. తణుకు వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఎండీయూ ఆపరేటర్లందరినీ రోడ్డుకు ఈడ్చారని, రేషన్ దుకాణాల వద్ద మళ్లీ క్యూలో నిల్చునే పరిస్థితితోపాటు బియ్యం మూటలను ఇంటికి మోసుకుని వెళ్లే రోజులను తీసుకువచ్చారన్నారు. ఒక ఎమ్మెల్యేని మించి మరొక ఎమ్మెల్యే మద్యం, పేకాట, క్రికెట్ బుకీలే ఆదాయ వనరుగా మార్చుకుని మహిళల మంగళసూత్రాలను కూడా అమ్మించే పరిస్థితికి తీసుకువచ్చారని విమర్శించారు. ఇంకా ధాన్యం డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేయలేదని తప్పుపట్టారు. ఏడాదిలో వ్యవస్థలన్నిటినీ నిర్వీర్యం చేశారన్నారు.4న వెన్నుపోటు దినంవైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు ఈనెల 4వ తేదీన వెన్నుపోటు దినంగా గుర్తించి ఆయా నియోజకవర్గాల పరిధిలో తహసీల్దార్లకు వినతిపత్రాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. -
ఆపరేషన్ సిందూర్లో నేను సైతం
ఏలూరు టౌన్/పెదపాడు: దేశం తనకేమి చేసిందనేది కాకుండా... దేశానికి తాను సేవ చేయాలనే దృఢ సంకల్పంతో సైన్యంలో చేరిన హవల్దార్ మేకా శివాజీ ఆపరేషన్ సిందూర్లో పాల్గొని స్వగ్రామం వట్లూరు వచ్చారు. ఆపరేషన్ సిందూర్లో పాల్గొని తొలిసారి స్వగ్రామానికి వచ్చిన శివాజీకి వట్లూరు కబడ్డీ యూత్, గ్రామస్తులు, ఉపాధ్యాయులు, స్నేహితులు కలపర్రు టోల్ప్లాజా నుంచి ఘనస్వాగతం పలికారు. భారీ ర్యాలీగా గ్రామానికి తీసుకెళ్లారు. వట్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శివాజీకి సన్మానం చేశారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన మేకా పోతురాజు, రాజ్యం దంపతుల కుమారుడు శివాజీ. ఆయనకు భార్య స్వాతి, కుమార్తె నిత్య, కుమారుడు భరత్ ఉన్నారు. ఇటీవల ఆపరేషన్ సింధూర్లో అమృత్సర్ నుంచి యుద్ధంలో పాల్గొన్నానని శివాజీ తెలిపారు. కోట్లాది మంది భారతీయుల తరపున యుద్ధంలో పాల్గొనటం గర్వంగా ఉందన్నారు. -
శివారు గ్రామాల సంగతి ఏంటి?
దెందులూరు: జూన్ 1 నుంచి అమలు చేస్తున్న రేషన్ షాపుల ద్వారా నిత్యావసరాల పంపిణీ అనేక మంది లబ్ధిదారులను ఇక్కట్లకు గురిచేస్తోంది. 90 శాతం శివారు గ్రామాల్లో రేషన్ షాపులు లేవు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గడపగడపకు రేషన్ సరుకుల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టి దిగ్విజయంగా అమలు చేశారు. రేషన్ షాపులు లేని శివారు గ్రామాలు, అటవీ ప్రాంతాల్లో ఇంటి ముంగిట రేషన్ సరుకులు అందాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనా ముద్ర కనపడకూడదన్న శివారు గ్రామాల్లో రేషన్ షాపు లేకపోవడంతో రేషన్ షాపులు ఉన్న గ్రామాలకు వెళ్లి రేషన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాను పోను రెండు కిలోమీటర్లు దూరంతో పాటు ఒక పూట కూలి పని మానుకొని షాపుకు వెళ్లి రేషన్ తెచ్చుకోవాలి. శివారు గ్రామాల్లో, అటవీ ప్రాంతాల్లో రేషన్ షాపులు లేని చోట ఎవరు తెచ్చి ఇస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .రేషన్ షాపులు లేని ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయకుండా కక్షపూరితంగా రద్దు చేసినట్టు ఉందని ప్రశ్నిస్తున్నారు. శివారు ప్రాంతాల్లో బీసీ ఎస్టీ ఎస్సీ సామాజిక వర్గ ప్రజలే అధికంగా జీవిస్తున్నారని వారి హక్కులు పరిరక్షించకుండా పథకాన్ని రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు రేషన్ డీలర్ల సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు.60 ఏళ్లు పైబడిన వారందరికీ ఇంటికి వెళ్లి రేషన్ ఎప్పుడు ఇస్తారు.. ఎలా చెల్లిస్తారు అనే విషయంలో లిఖితపూర్వక హామీ ఆదేశాలు లేవు. తమకు స్పష్టమైన ఆదేశాలు లేకపోతే యూనియన్ పరంగా నిర్ణయం తీసుకుంటామని డీలర్ల యూనియన్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలందరికీ రేషన్ సరుకులు అందకపోయినా, ఏర్పాట్లు చేయకపోయినా దళిత గిరిజన మైనారిటీ బీసీ సంఘాలు ఏకమై భవిష్యత్ ప్రణాళికను ప్రకటించేందుకు సమాయత్తమవుతున్నారు.తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన :ఏలూరు జిల్లాలో శివారు, అటవీ ప్రాంతాల్లో షాపులు లేకుండా సరుకులు ఎలా ప్రజలకు అందిస్తారని, శివారు గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానికంగా రేషన్ షాపులు తక్షణమే ఏర్పాటు చేయాలి అలా జరగని పక్షంలో న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని ఆదివారం దెందులూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద రాష్ట్ర మాలసేన నాయకులు గంటా పండు నిరసన వ్యక్తం చేశారు. -
మొగల్తూరు మామి‘డీలా’
సాక్షి, భీమవరం: చూడచక్కని రంగు.. మధురమైన రుచితో మనసు దోచే పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మామిడి ప్రతికూల వాతావరణం, పండుఈగ దాడితో ధర లేక వెలవెలబోతోంది. స్థానిక అమ్మకాలు, దేశ విదేశాలకు ఎగుమతులతో ఏటా రూ.32 కోట్లకు పైగా వ్యాపారం జరిగితే, ఈ ఏడాది సగం అమ్మకాలు లేని పరిస్థితి. తోటల లీజు, పెట్టుబడి ఖర్చులు రాక తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు. జిల్లాలోని మొగల్తూరు, నరసాపురం మండలాల్లోని 1800 ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ఎకరాకు ఐదు టన్నుల వరకు దిగుబడి వస్తుంది. సారవంతమైన నేలలతో ఈ ప్రాంతంలోని మామిడి కాయలు 500 గ్రాముల నుంచి 700 గ్రాములకు పైగా బరువుతో మంచి రంగు, రుచి కలిగి ఉంటాయి. సహజసిద్ధంగా కాయలు పక్వానికి వచ్చాక మాత్రమే కోసి అమ్మకాలు చేయడం వల్ల ఇక్కడి బంగినపల్లి, రసాలు తదితర మామిడి పండ్లకు గిరాకీ ఎక్కువ. ఎంతోమంది వీటిని కొనుగోలు చేసి దేశ విదేశాల్లోని తమ బంధువులు, స్నేహితులకు పంపిస్తుంటారు. పండు ఈగ దాడికి విలవిల ఏటా ఏప్రిల్ మొదటి వారం నుంచి మొగల్తూరు మామిడి పండ్లు మార్కెట్లోకి రావడం మొదలై జూలై రెండు, మూడు వారాలతో ముగుస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచే అకాల వర్షాలతో ప్రతికూల వాతావరణ పరిస్థితులు పండు ఈగ ఉద్ధృతి పెంచేందుకు దోహదం చేశాయి. మొదట్లో ఈదురుగాలుల ప్రభావంతో కాయలు రాలిపోయి నష్టపోతే తర్వాత పండు ఈగ తమను కోలుకోలేని దెబ్బతీసిందని రైతులు అంటున్నారు. ఈగల వల్ల కాయలపై మచ్చలు ఏర్పడటం, సకాలంలో వినియోగించకపోతే పండు లోపల పురుగు పడుతుండటం అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గతంలో ఢిల్లీ, రాజస్తాన్, ఒడిశా, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి వ్యాపారులు తోటల వద్దకే వచ్చి టన్నుల్లో ఆర్డర్లు ఇస్తే, ఈ ఏడాది మార్కెట్కు తెచ్చినా కోత కూలి, రవాణా ఖర్చులు కూడా రానంతగా అమ్మకాలు దిగజారాయని చెబుతున్నారు. చిరు వ్యాపారులు, కొనుగోలుదారులతో కిటకిటలాడే మొగల్తూరు, నరసాపురం, సీతారామపురం మార్కెట్లు వెలవెలబోతున్నాయి. సాధారణంగా తెల్లవారుజాము మూడు గంటలకు మార్కెట్లు మొదలై తెల్లవారేసరికి ముగిసిపోతుంటాయి. ప్రస్తుతం తెచ్చిన సరుకు ఉదయం 10 గంటల వరకు కూడా అమ్ముడుపోని పరిస్థితి ఉంటోందని వ్యాపారులు అంటున్నారు. నష్టాల్లో రైతులు గతంలో టన్ను మామిడి రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు అమ్మకాలు చేస్తే ఈ ఏడాది రూ.15 వేల నుంచి రూ.25 వేల లోపే ఉంటోందని రైతులు, వ్యాపారులు చెబుతున్నారు. చెట్ల సైజు, సంఖ్యను బట్టి ఎకరాకు లీజు రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు ఉండగా, జూలై, ఆగస్టు నెలల్లో చెట్ల మొదలులో మందులు, ఎరువులు పెట్టడం, డిసెంబరులో పూత మొదలైన నాటి నుంచి జూలైలో కాపు పూర్తయ్యేవరకు రేయింబవళ్లు తోటల వద్ద కాపలా, కోత, మార్కెట్కు తరలింపు తదితర రూపాల్లో రూ.లక్ష వరకు ఖర్చులు అవుతున్నాయంటున్నారు. మార్కెట్లోకి తెచ్చి అమ్మితే పెట్టుబడి ఖర్చులు కూడా రాక తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. గతంలో నాలుగుసార్లు మందులు పిచికారీ చేస్తే సరిపోయేదని, ఈసారి ఏడు సార్లు పిచికారీ చేసినా ఖర్చులు పెరిగాయే తప్ప ఫలితం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ప్రతికూల వాతావరణం పండు ఈగ వ్యాప్తికి కారణమైందని ఉద్యాన వన శాఖ అధికారులు తెలిపారు. కొందరు రైతులు మొదట్లోనే కాయలపై ఈగలు వాలకుండా కవర్లు (కవర్ కల్చరింగ్) కట్టే విధానాన్ని పాటించి సత్ఫలితాలు పొందారన్నారు. దాదాపు రెండు లక్షల కవర్లు కట్టినట్టు అధికారి ఒకరు తెలిపారు. పూర్తిస్థాయిలో రైతులు అందరూ ఈ విధానాన్ని అవలంబించేలా కార్యాచరణ చేస్తున్నట్టు వివరించారు. పండు ఈగ కాటుకు రైతులు విలవిల గతంలో టన్ను మామిడికి రూ.40 వేలకు పైగా రాబడి టన్ను రూ.15 వేల నుంచి రూ. 25 వేల లోపే అమ్మకాలు లీజు, పెట్టుబడి ఖర్చులు రావడం లేదని వాపోతున్న రైతులు మొగల్తూరు, నరసాపురం మండలాల్లో 1800 ఎకరాల్లో సాగు -
5న భీమవరంలో చెస్ టోర్నమెంట్
భీమవరం: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమవరం అనసూయ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో జిల్లా చెస్ అసోసియేషన్ సహకారంతో ఈ నెల 5న రాష్ట్ర స్థాయి ఇన్విటేషన్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు అనసూయ చెస్ అకాడమీ కోచ్ మాదాసు కిషోర్ చెప్పారు. ఆదివారం టోర్నమెంట్ బ్రోచర్ ఆవిష్కరించారు. ఆర్యవైశ్య యువజన సంఘం భవనంలో నిర్వహించే టోర్నమెంట్లో అండర్–5, 7, 9, అండర్ 11, అండర్ 13, అండర్ 15, బాల, బాలికలకు ప్రత్యేక బహుమతులు అందిస్తామన్నారు. మరిన్ని వివరాలకోసం 90632 24466 నెంబరులో సంప్రదించాలన్నారు. పెద్దింట్లమ్మ దేవస్థానంలో భక్తుల రద్దీ కై కలూరు: అమ్మా.. పెద్దింట్లమ్మ చల్లంగా చూడమ్మా.. అంటూ భక్తులు ఆర్తితో వేడుకున్నారు. కొల్లేటికోట పెద్దింట్లమ్మను సమీప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆదివారం దర్శించుకున్నారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో భక్తులు రద్దీ ఎక్కువగా కనిపించింది. పవిత్ర కోనేరులో స్నానాలాచరించిన భక్తులు పెద్దింట్లమ్మకు మొక్కులు సమర్పించుకున్నారు. ఆలయ ఈవో మాట్లాడుతూ ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డు ప్రసాదం, గదుల అద్దెలు, ఇలా అన్నీ కలిపి రూ.85,340 ఆదాయం వచ్చిందని చెప్పారు. -
వంచనకు నిరసనగా వెన్నుపోటు దినం
ఏలూరు (టూటౌన్): రాష్ట్రంలోని కూటమి ప్రభు త్వం ఏడాది పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి రెడ్బుక్ రాజ్యాంగ పాలన సాగిస్తున్న తీరుకు నిరసనగా ప్రజల పక్షాన ఈనెల 4న వైఎస్సార్సీపీ చేపట్టిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చే యాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడాది పాలనలో రాష్ట్రమ ంతా అరాచకాలు, దుర్మార్గాలు, తప్పుడు కేసులు, హత్యలు, భయభ్రాంతులకు గురిచేయడం నిత్యకృత్యమయ్యాయన్నారు. చంద్రబాబు, లోకేష్ రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేయడం సిగ్గుచేటు అన్నారు. ఐఏఎస్, ఐపీఎస్లను జైళ్లలో పెట్ట డం బాధాకరమన్నారు. 199 మంది పోలీస్ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా వీఆర్లో ఉంచారన్నారు. ఏడాది పాలనలో రూ.1,37,540 కోట్ల అప్పులు చేసి చంద్రబాబు రికార్డు సృష్టించారన్నారు. వైఎస్ జగన్ హయాంలో ఇసుక, మద్యం, మైనింగ్లలో పారదర్శక విధానాల వల్ల ప్రభుత్వ ఖజానాకు వందల కోట్లు ఆదాయం సమకూరిందని, అయితే ప్రస్తుత కూటమి పాలనలో ఇసుక, మ ద్యం, మట్టి మాఫియాలకు తెరతీశారన్నారు. అన్నివర్గాలనూ మోసం కూటమి పాలనలో అన్నివర్గాలనూ మోసం చేశారని ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ కారుమూరి సునీల్కుమార్ అన్నారు. కూటమి నాయకులంతా రెండు చే తులా సంపాదించే పనిలోనే ఉన్నారని ఎద్దేవా చే శారు. ఏడాది పాలనలో ఏలూరు పార్లమెంట్ ని యోజకవర్గంలో ఏం పనులు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతిని అటకెక్కించారని, ఫీజు రీయింబర్స్మెంట్ను గాలికి వదిలేశారని మండిపడ్డారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. రోడ్డున పడ్డ ఎండీయూ ఆపరేటర్లు రాష్ట్రవ్యాప్తంగా 9 వేలకు పైగా ఎండీయూ వాహనాలను రద్దుచేసి ప్రజాధనాన్ని కూటమి ప్రభుత్వం వృథా చేసిందని ఏలూరు జిల్లా పరిశీలకులు, ఎ మ్మెల్సీ వంక రవీంద్ర అన్నారు. దీంతో 18 వేల మ ంది ఆపరేటర్లు, హెల్పర్లు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారన్నారు. వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం వెన్నుపోటు దినం వాల్పోస్టర్లను జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్యేలు తెల్లం బాలరాజు, పుప్పాల వాసుబాబు, నియోజకవర్గ ఇన్చార్జులు మామిళ్లపల్లి జ యప్రకాష్(జేపీ) (ఏలూరు), కంభం విజయరాజు (చింతలపూడి), పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నౌడు వెంకటరమణ, అనుబంధ సంఘాల నాయ కులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ పోరుబాట ఈనెల 4న జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు వెల్లడి -
మామిడి పరిస్థితి దారుణం
ఈ ఏడాది మామిడి పరిస్థితి దారుణంగా ఉంది. తో తాపురి రకం మామిడి ధరలు రోజురోజుకూ పడిపోతున్నాయి. టన్ను తోతాపురి రకం రూ.3 వేలు పలకడంతో కోత ఖర్చులు కూడా రావడం లేదు. దీంతో 50 టన్నుల కాయలను కోయకుండా చెట్లకు వదిలేశా. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇలాంటి పరిస్థితి 20 ఏళ్లలో ఎన్నడూ చూడలేదు. మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. – భూక్య కిషోర్, ఓగిరాల తండా, నూజివీడు మండలం పొగాకు ధరలతో నిరాశ వర్జీనియా పొగాకు కొనుగోళ్లు తీవ్రంగా నిరాశ పరుస్తున్నాయి. కంపెనీలు లోగ్రేడ్పై ఆసక్తి చూపడం లేదు. మధ్య రకం పొగాకును సైతం రూ.230కు కొనడం కష్టంగా ఉంది. లోగ్రేడ్ పొగాకు ప్రతి రైతు వద్ద 25 శాతం మేర ఉంది. కంపెనీలు కేవలం గ్రేడ్–1ను మాత్రమే కొంటే రైతులు తీవ్రంగా నష్టపోతారు. బోర్డు అధికారులు స్పందించి కంపెనీలు లోగ్రేడ్ను సైతం కొనుగోలు చేసేలా చూడాలి. – వామిశెట్టి హరిబాబు, వర్జీనియా రైతు సంఘం నాయకులు, పుట్లగట్లగూడెం, జంగారెడ్డిగూడెం మండలం ● -
అన్నదాతా దుఃఖీభవ !
రైతుకు ఏడాదికి రూ.20 వేల సాయం.. ధరల స్ధిరీకరణ నిధి ఏర్పాటుచేసి మద్దతు ధరలకు పంటల కొనుగోలు.. 9 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా.. ఆక్వాకు విద్యుత్ రాయితీలు.. రైతుసేవా కేంద్రాల ద్వారా సేవలు.. ఇవన్నీ గతేడాది ఎన్నికల సమయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇచ్చిన హామీలు.. తీరా చూస్తే గద్దెనెక్కి ఏడాది గడిచినా ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. దీనికితోడు ప్రధాన పంటల ధరలు భారీగా తగ్గుతున్నా పట్టించుకోవడం లేదు. కూటమి పాలనలో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అన్నదాతల సంక్షేమానికి పెద్దపీట వేయగా.. ప్రస్తుత కూటమి సర్కారు కర్షకులపై నిండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దగాపడ్డ రైతన్న ● కూటమి ఏడాది పాలనలో రైతులకు ఇక్కట్లు ● రూ.471.69 కోట్ల అన్నదాత సుఖీభవ ఎగనామం ● కోకో ధరలు నేలచూపులు ● ధాన్యం కొనుగోళ్లలో దళారులరాజ్యం ● మామిడి రైతుల డీలా ● రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం ● గత ప్రభుత్వంలో రూ.1,830 కోట్ల రైతు భరోసా అందజేత ● సకాలంలో పంట నష్టపరిహారాలు, రాయితీలు గత ప్రభుత్వంలో పెద్దపీట గత జగన్ సర్కారులో అన్నదాతల సంక్షేమానికి పెద్దపీట వేశారు. 2.35 లక్షల మంది రైతులకు రూ.1,830 కోట్ల రైతు భరోసా, 97,584 మంది రైతులకు సున్నా వడ్డీ కింద రూ.22.29 కోట్లు అందించారు. జిల్లాలో 70,960 వ్యవసాయ కనెక్షన్లకు 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరాకు రూ.2,467.25 కోట్లు వెచ్చించారు. తుపానులు, విపత్తులకు సంబంధించి పంట నష్టపరిహారాన్ని రోజుల వ్యవధిలో అందించి అండగా నిలిచారు. -
రేషన్ తిప్పలు.. మళ్లీ మొదలు
ఏలూరు (మెట్రో): ఇంటి వద్దకే నిత్యావసర సరుకులు అందించే ఎండీయూ వాహనాలకు మంగళం పలికిన కూటమి సర్కారు ప్రజలను రేషన్ దుకాణాలకు రప్పించి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఆదివారం జిల్లావ్యాప్తంగా రేషన్ దుకాణాలు తెరుచుకోగా పలుచోట్ల సరుకుల కోసం ప్రజలు అవస్థలు పడ్డారు. జిల్లాలో 1,123 రేషన్ డిపోల ద్వారా 6,20,146 కార్డుదారులకు నిత్యావసరాలు పంపిణీ చేయాల్సి ఉండగా తొలిరోజు 57,464 మంది కార్డుదారులకు మాత్రమే సరుకులు అందించారు. 18,019 కార్డులకు పోర్టబులిటీ విధానంలో సరుకులు పంపిణీ చేశారు. జిల్లాలో కేవలం 8.92 శాతం మాత్రమే సరుకుల పంపిణీ పూర్తయ్యింది. పలు డిపోల వద్ద కార్డుదారులు సరుకుల కోసం పడిగాపులు కాశారు. గతంలో ఇంటి వద్దకే సరుకులు అందడంతో తమకు శ్రమ తప్పిందని, ఇప్పుడు మళ్లీ రేషన్ కష్టాలు తప్పడం లేదని పలువురు వాపోయారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వృద్ధులు బియ్యం మూటలను మోసుకు వెళ్లడం పలుచోట్ల కనిపించింది. చాలాచోట్ల ఈ–పోస్ మెషీన్లు పనిచేయలేదు. మూటలు మోయడం మళ్లీ మొదలు దుకాణాల వద్ద పడిగాపులు తొలిరోజు 8.92 శాతమే సరుకుల పంపిణీ ఇంటి వద్దకే రేషన్కు కూటమి మంగళం -
నవధాన్యాలతో భూమికి జవసత్వాలు
భీమవరం: వ్యవసాయమే జీవనాధారమైన జిల్లాలో రైతన్నలు ఆరుగాలం కష్టపడి ఏటా మూడు పంటలు పండించేవారు. సార్వా, దాళ్వా వరిసాగే కాకుండా దాళ్వా పంట అనంతరం ఆరుతడి పంటలుగా మినుము, పెసర, మొక్కజొన్న, బొబ్బర్లు వంటి వాటితోపాటు పశుగ్రాసానికి పిల్లిపెసర, జనుము, జొన్న వంటివాటిని పండించేవారు. అయితే కొన్నేళ్లుగా వరిసాగులో జాప్యం కారణంగా దాళ్వా వరి పంట ఏప్రిల్, మే నెలల్లో చేతికి రావడంతో మూడవ పంట వేయడానికి సమయం సరిపోవడం లేదు. మూడవ పంటగా అపరాలు, పశుగ్రాసం పండించడం వల్ల భూమికి సహజంగా పోషక పదార్థాలు లభించేవి. మూడవ పంట లేకపోవడంతో రైతులు కేవలం ఎరువులు వేయడం ద్వారానే పంట దిగుబడి పెంచుకోడానికి పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సివస్తుంది. అయితే పాత విధానంతో మూడు పంటలు పండించడానికి వ్యవసాయశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. సబ్సిడీపై విత్తనాల పంపిణీ జిల్లాలోని 20 మండలాల పరిధిలో దాదాపు 2.20 లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తుండగా దీనిలో మూడవ పంట పండించేందుకు రైతులను ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుత దాళ్వా సీజన్ ముగింపు దశలో జిల్లాలోని 21,150 ఎకరాల్లో రైతులను అపరాల సాగుతోపాటు పశుగ్రాసం పెంచేందుకు రైతులకు 50 శాతం సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేశారు. దీనికిగాను ప్రత్యేకంగా సేకరించిన మినుము, పెసర, జీలుగు, రాగి, సజ్జలు, నువ్వులు, వేరుశెనగ, ఆవాలు, పిల్లిపెసర, జనుము, మొక్క వంటివాటితోపాటు ఆకుకూరలైన తోటకూర, పాలకూర, మెంతుకూర, చుక్కకూర, గొంగూర, బీర, అనప, దోస వంటి సుమారు 15 రకాలు కలిగిన 12 కిలోల విత్తనాలను కిట్లుగా తయారుచేసి పంపిణీ చేశారు. ప్రయోజనం ఏమిటంటే.. భూమిలో సారాన్ని సహజంగా పెంచడానికి వేరు వ్యవస్థ ఎంతగానో దోహదం చేస్తుంది. అందువల్ల వివిధ రకాల విత్తనాలు కలగలిపి చేలలో వేయడం వల్ల రైతులకు కొంతమేరకు ఆదాయంతోపాటు ఇంటి అవసరాలు తీర్చుకునే అవకాశం ఏర్పడుతుంది. ప్రధానంగా వివిధ రకాల తీగ, ఆకుజాతి మొక్కల వేర్లు వల్ల భూమిలో బ్యాక్టీరియా వృద్ధి చెంది సహజసిద్ధంగా భూసారం పెరుగుతుంది. దీనితో వరి పండించడానికి ఎక్కువ మోతాదులో ఎరువులు వాడనవసరం లేకపోవడమేగాక తెగుళ్లు కూడా తగ్గే అవకాశముంటుంది. భూమిలో బ్యాక్టీరియా వృద్ధి చెందడం వల్ల రైతులు పంటలకు కొద్దిమొత్తంలో ఎరువులు వేసినా వాటి సామర్థ్యం పెరిగి పంటకు ప్రయోజనం కలుగుతుంది. ప్రస్తుతం కొద్దిమొత్తం విస్తీర్ణం ప్రయోగాత్మకంగా వేసి నవధాన్యాల సాగు రానున్ను రోజుల్లో జిల్లా మొత్తం విస్తీర్ణం వేయడానికి రైతులను సన్నద్ధం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో 21 ఎకరాల్లో నవధాన్యాల సాగుకు విత్తన కిట్ల పంపిణీ భూసారం పెరగడంతోపాటు రైతులకు ఆదాయం జిల్లా వ్యాప్తంగా 2.20 లక్షల ఎకరాల్లో నవధాన్యాల సాగుకు ప్రణాళిక నవధాన్యాల సాగు ఎంతో ప్రయోజనం దాళ్వా అనంతరం నవధాన్యాల సాగు ఏడాది ప్రయోగాత్మకంగా చేపట్టాం. దాదాపు 21 వేల ఎకరాల్లో రైతులకు సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేశాం. దీనివల్ల రైతులకు కొంతమొత్తం ఆదాయం రావడమేగాక భూసారాన్ని సహజసిద్ధంగా పెంచుకునే అవకాశం ఏర్పడుతుంది. రానున్న రోజుల్లో జిల్లాలోని దాదాపు 2.20 లక్షల ఎకరాల్లో నవధాన్యాలసాగు చేపట్టే విధంగా రైతులకు అవగాహన కల్పిస్తాం. – జెడ్ వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయశాఖాధికారి, భీమవరం -
కూటమి అండదండలతో కబ్జాలు
కొయ్యలగూడెం: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ భూములే కాకుండా ప్రజల భూ ములు కూడా కబ్జాలకు గురవుతున్నాయని అందు కు ఉదాహరణగా కొయ్యలగూడెంలోని సర్వే నంబర్ 311/2 నిలిచిందని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. ఆయన శనివారం కొయ్యలగూడెం వచ్చిన సమయంలో సమయంలో టీటీడీ కల్యాణ మండప ప్రాంతవాసులు తమ భూముల కబ్జాపై ఆయన వద్ద మొరపెట్టుకున్నారు. కోట్ల రూపాయల విలువైన భూమి గురించి ఇప్పటికే సమగ్రంగా విషయాలను సేకరించానని, చిన్నపాటి లొసుగులను భూతద్దంలో చూపించి భూముల కబ్జాకు పన్నాగం నడుస్తోందని బాలరాజు అన్నా రు. ఈ విషయంలో ప్రజలను కంగారు పడవద్దని ఓ పక్క చెబుతూ మరోపక్క ఆక్రమణదారులకు కూటమి నాయకులు వెన్ను కాస్తున్నారని ఆరోపించారు. 40 ఏళ్లకుపైగా నివాసముంటున్న స్థానికుల జోలికి వస్తే పర్యవసానం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. రెవెన్యూ అధికారులు కూటమి నేతల ఒత్తిళ్లకు లొంగకుండా నిష్పక్షపాతంగా సర్వే చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీపీ గంజిమాల రామారావు, పార్టీ రాష్ట్ర బీసీ సెల్ సహాయ కార్యదర్శి గంటా శీను, పట్టణ కన్వీనర్ సంకుకొండ, ఘంటసాల సాయి, మారిశెట్టి శ్రీను, చిటికెన నాగార్జున, తొంటా వాసు ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
టి.నరసాపురం: వ్యాన్, మోటార్ సైకిల్ ఢీకొన్న ఘటనలో మోటార్సైకిలిస్ట్ మృతిచెందాడు. ఎస్సై ఎం జయబాబు తెలిపిన వివరాల ప్రకారం.. చింతలపూడి మండలం బట్టువారిగూడెంకు చెందిన జక్కుల ప్రకాష్ (21) టి.నరసాపురం మండలం కె.జగ్గవరంలో ఓ ఫంక్షన్కు వెళ్లి మోటార్సైకిల్పై తిరిగి వస్తున్నాడు. రాజుపోతేపల్లి అడ్డరోడ్డు వద్దకు వచ్చే సరికి ఎదురుగా వస్తున్న వ్యాన్ మోటార్సైకిల్ను ఢీకొనడంతో ప్రకాష్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుని తండ్రి జక్కుల నరసింహారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై జయబాబు చెప్పారు. -
పింఛన్ల కోసం పడిగాపులు
ఆకివీడు: పింఛన్లు మే 31వ తేదీ నుంచే పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో పలు చోట్ల ప్రజలు శనివారం ఉదయం నుంచే వీధుల్లో పింఛన్ల కోసం పడిగాపులు పడ్డారు. స్థానిక వడలి వారి వీధి, సంతపేట ప్రాంతాల్లో పింఛన్ల కోసం లబ్ధిదారులు మధ్యాహ్నం వరకూ వేచి చూసినా పంపిణీ చేసే ఉద్యోగులు రాకపోవడంతో తీవ్ర నిరుత్సాహం చెందారు. తిండితిప్పలు లేకుండా, ఉక్కబోత వాతావరణంలో చెమటలు కక్కుతూ పడిగాపులు పడ్డామని వృద్ధులు, దివ్యాంగులు వాపోయారు. ఈ విషయాన్ని సాక్షి ద్వారా కమిషనర్కు తెలియజేయగా సంబంధిత ఉద్యోగి సెలవులో ఉన్నారని, అందువల్ల సంతపేట, ఆనాల చెరువు ప్రాంతాల్లోని పింఛన్దారులకు పింఛన్ పంపిణీ చేయలేదని చెప్పారు. కనీసం ఈ విషయాన్ని బాధితులకు తెలియజేసి అక్కడ నుంచి పంపించివేయండని చెప్పినా వారికి సమాచారం ఇవ్వలేదు. కుప్పనపూడి శివారు తాళ్లకోడులోని 74 ఎకరాల్లో తమకు పట్టాలిచ్చారని, అక్కడే ఇళ్లు కట్టుకున్నామని, ఫించన్, రేషన్కు ఆకివీడు రావాల్సిన దుస్థితి ఏర్పడిందని మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు. ముగిసిన జిల్లా స్థాయి ఓపెన్ రాపిడ్ చెస్ పోటీలు జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా స్థాయి ఓపెన్ రాపిడ్ చెస్ పోటీలు పట్టణంలోని ప్రతిభ స్కూల్ నందు దివ్యాస్ మాస్టర్స్ చెస్ అకాడమీ, శ్రీ హంస చెస్ అకాడమీ, ఏలూరు జిల్లా అడ్హక్ కమిటీ వారి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఓపెన్ కేటగిరీలో చొప్పా వీర వెంకట వివేక్ మొదటి స్థానాన్ని, కన్నా సోనాలి శ్రీమణి కార్తిక రెండవ స్థానాన్ని, తురసం శశి ప్రియాంక మూడవ స్థానాన్ని, సుందరిపల్లి నితిన్ శ్రీసాయి నాల్గవ స్థానాన్ని, పెన్మత్స సాత్విక్ వర్మ 5వ స్థానాన్ని సాధించారని టోర్నమెంట్ చీఫ్ ఆర్బిటర్ పి.కిరణ్ కుమార్ తెలిపారు. ప్రతిభా స్కూల్ ప్రిన్సిపాల్ సరోజ రెడ్డి, అయినపర్తి సరళామాధవి, అయినపర్తి చంద్రశేఖర్ మాస్టారు, కన్నా సూర్య నాగేశ్వరరావు, సురేఖ పాల్గొన్నారు. -
పొగాకు సాగులో విప్లవాత్మక మార్పులు అవసరం
బుట్టాయగూడెం: పొగాకు సాగులో విప్లవాత్మక మార్పులు అవసరమని ఐకార్ ఎన్ఐఆర్సీఏ డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ అన్నారు. జీలుగుమిల్లి ఐకార్ జాతీయ, వాణిజ్య పంటల పరిశోధనా కేంద్రం ఆధ్వర్యంలో శనివారం క్షేత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పొగాకు సాగులో ఉత్తమ నాణ్యత, అధిక దిగుబడికి ఉత్తమ యాజమాన్య పద్ధతుల్లో పొగాకు బేరన్ల నిర్వహణ గురించి రైతులకు వివరించారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరిశోధనా కేంద్రం ప్రతినిధి కొడవటి వాసుదేవరావు మాట్లాడుతూ ఐకార్– ఎన్ఐర్సీఎ, ఐఓసీఎల్, ఎమినెన్ట్ గ్యాస్ టెక్నాలజీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన గ్యాస్ అథారిటీ పొగాకు బేరన్ పనిచేయు విధానాన్ని రైతులకు వివరించారు. గడచిన 30 ఏళ్లుగా పొగాకు రైతులు పొగాకు బేరన్లో కలప వాడటం వల్ల అధికంగా వచ్చే కాలుష్యాన్ని నివారించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఓసీఎల్ జనరల్ మేనేజర్ వర్నేకర్, సంస్థ చీఫ్ మేనేజర్ లలిత, పొగాకు బోర్డు ఎక్స్టెన్షన్ మేనేజర్ సురేఖ, బోర్డు ఆర్ఎమ్ ప్రసాద్, ప్రాజెక్టు హెడ్ డాక్టర్ ఎల్కే ప్రసాద్, ఎన్ఐఆర్సీఏ ఆర్ఎస్ హెడ్ డాక్టర్ వైవీ సుబ్బయ్య, టి.వెంకటేష్, టి.రమేష్, దేవానంద్, పొగాకు బోర్డు అధికారులు, ట్రేడ్ ప్రతినిధులు, ఎన్ఐఆర్సీఏ శాస్త్రవేత్తలు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. ఐకార్ ఎన్ఐఆర్సీఏ డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ -
నేటినుంచి ప‘రేషన్’!
భీమవరం: రేషన్ కార్డుదారులకు చౌక డిపోల వద్దనే నిత్యావసర సరుకులు తీసుకునే కార్యక్రమాన్ని ఆదివారం కూటమి ప్రభుత్వం ప్రారంభించనుంది. కార్డుదారులు రేషన్ షాపుల వద్ద గంటల తరబడి క్యూల్లో నిలబడి మోయలేని బరువుతో ఎక్కువ దూరం తీసుకువెళ్లాల్సిన పరిస్థితులు పునరావృతం కానున్నాయి. ఎండీయూ వాహనాల ద్వారా ఇంటింటికీ నిత్యావసర సరుకులు అందించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జ్ఞాపకాలను చెరిపేసే ఉద్దేశంతో రేషన్ డిపోల వద్దనే సరుకుల పంపిణీకి చేస్తున్న ఏర్పాట్లను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. జిల్లాలో 5,67,671 రేషన్ కార్డులకు 1,060 డిపోల ద్వారా ద్వారా నెలకు సుమారు 8,700 టన్నుల బియ్యం, 567 టన్ను కందిపప్పు, 300 టన్నుల పంచదార పంపిణీ చేయాల్సి ఉంది. ఇందుకోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 356 ఎండీయూ వాహనాలను ఏర్పాటు చేసి వందలాది మందికి ఉపాధి కల్పించడంతో పాటు ఇంటి వద్దకే సరుకులు అందించి వృద్ధులు, మహిళలు, దివ్యాంగులకు ఊరట కల్పించింది. ఇకపై పడిగాపులే.. సరుకులు పొందాలంటే ఇక నుంచి గంటల పాటు చౌకడిపోల వద్ద పడిగాపులు తప్పవని కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు. సర్వర్ పనిచేయడం లేదంటూ, వేలిముద్రలు పడటం లేదంటూ రోజుల తరబడి చౌక డిపోల చుట్టూ తిప్పుతారని వాపోతున్నారు. బియ్యం మూటలతో దూర ప్రాంతాలకు వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడతామని అంటున్నారు. దివ్యాంగులు, 65 ఏళ్లు దాటిన వృద్ధులకు ఇంటి వద్దకే వెళ్లి రేషన్ ఇస్తామని కూటమి ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో ఎంతవరకు సాధ్యమని డీలర్లు పెదవి విరుస్తున్నారు. తాము సరుకులు తీసుకువెళ్లిన సమయంలో కార్డుదారులు వారి ఇంటి వద్ద లేకపోతే సమస్యలు తప్పవని డీలర్లు అంటున్నారు. మొత్తంగా ఎండీయూ వ్యవస్థ రద్దు, చౌక డిపోల ద్వారా రేషన్ పంపిణీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక రేషన్ దుకాణాల్లోనే సరుకుల పంపిణీ క్యూలైన్లలో గంటల తరబడి ఎదురుచూపులు తప్పవు దూరాభారమైనా మోయలేని బరువులతో యాతనలే.. సర్వర్ పనిచేయక వేలిముద్రలు పడకపోతే మరింత ఇబ్బందులు -
‘వెన్నుపోటు దినం’ విజయవంతం చేద్దాం
కై కలూరు: ప్రజలకు హామీలిచ్చి, వాటిని గాలికొదిలేసిన సీఎం చంద్రబాబు చేసిన మోసాలు, అరాచకాలు, అన్యాయాలపై ఈనెల 4న జరిగే వెన్నుపోటు దినంను అందరూ విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) పిలుపునిచ్చారు. శనివారం కై కలూరు పార్టీ కార్యాలయంలో కార్యక్రమ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నామన్నారు. కై కలూరు రైల్వేస్టేషన్ సమీప పార్టీ కార్యాలయానికి ఉదయం 9 గంటలకు నాలుగు మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు. మండల పార్టీ అధ్యక్షుడు సింగంశెట్టి రాము, నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ గాలిబ్బాబు, ఎంపీటీసీ సభ్యు రాలు పట్టపు బాలమ్మ, పార్టీ నాయకులు సమయం వీరాంజనేయులు, పంజా రామారావు, వైబీఎం.సాంబశివరావు, ఉడ్రమట్ట ఏసుకుమార్, బుర్ల కిరణ్ తదితరులు పాల్గొన్నారు. నియామక పత్రాల అందజేత గ్రామస్థాయి పార్టీ కమిటీల ఎంపిక స్థానిక పార్టీ కార్యాలయం వద్ద జరిగింది. ముదినేపల్లి మండలం ప్రొద్దువాక, బొమ్మినంపాడు, ములకలపల్లి, దేవపూడి, కొరగుంటపాలెం గ్రామాలు, కలిదిండి మండలం గోపాలపురం, కాళ్లపాలెం, వెంకటాపురం గ్రామ పార్టీ కమిటీలకు నియామక పత్రాలను డీఎన్నార్ అందించారు ఆయా మండలాల నాయకులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ పిలుపు -
వ్యాధుల కాలం.. పశువులు జాగ్రత్త
ఆగిరిపల్లి: వర్షాకాలంలో పశువులు వ్యాధుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పశు వైద్యాధికారులు పేర్కొంటున్నారు. పశువుల పట్ల పాడి రైతులు ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన వాటి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లవచ్చని, పశువులు, గొర్రెలు, మేకల పెంపకం దారులు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. జీవాలు ప్రమాదకర పరిస్థితిలో ఉంటే వెంటనే 1962 టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేస్తే సంచార పశు ఆరోగ్య సేవ వాహనంతో వైద్యులే ఇంటికి వచ్చి చికిత్స అందిస్తారని తెలిపారు. వర్షాకాలంలో పశువులకు వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఆగిరిపల్లి మండల పశువైద్యాధికారి జి.హనుమంతరావు చేసిన సూచనలు ఇలా ఉన్నాయి. గాలి కుంటు వ్యాధిపై అప్రమత్తం గాలికుంటు వ్యాధి ఎక్కువగా ఆవులు, ఎద్దులు, గేదెలకు సోకుతుంది. వ్యాధి బారిన పడిన పశువు శరీర ఉష్ణోగ్రత 104 నుంచి 105 డిగ్రీలకు పెరుగుతుంది. పశువునోట్లో, గిట్టల మధ్య పుండ్లు ఏర్పడతాయి. ఆహారం సరిగా తీసుకోలేవు. దీంతో నీరసంగా మారి నడిచేందుకు కూడా కష్టపడతాయి. పాడి పశువుల్లో అయితే పాల ఉత్పత్తి గణనీయంగా పడిపోతుంది. వ్యాధి నివారణ కోసం వైద్యులు సూచనల మేరకు యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ మందులను వాడాల్సి ఉంటుంది. కలుషిత నీటితో జలగవ్యాధి మురుగునీరు, కలుషిత నీరు తాగడం వల్ల పశువులకు ఎక్కువగా ఈ వ్యాధి వస్తుంది. ముఖ్యంగా గేదెలు, దూడలు, గొర్రెలు, మేకలు వంటి జీవాలకు ఈ వ్యాధి వస్తుంది. వ్యాధి బారిన పడిన పశువులు మేత తినడంలో ఇబ్బందులు పడతాయి. పాల దిగుబడి క్షీణిస్తుంది. జలగ వ్యాధి బారిన పడిన పశువులను మంద నుంచి వేరు చేయాలి. డిస్టోడిన్ 4 మాత్రలు, 100 మిల్లీ లీటర్ల నియోజడ ప్లస్ను అందించాలి. నట్టల వ్యాధితో ఎదుగుదలకు బ్రేక్ పశువులు పచ్చి మేత తిన్నప్పుడు నులిపురుగుల సమస్య వస్తుంది. దీంతో వాటి ఎదుగుదలకు అవకాశం ఉండదు. జీవాలు తిన్న ఆహారం అంతా నులిపురుగులే స్వాహా చేస్తాయి. దీంతో జీవాలు తరచూ రోగాల బారిన పడే అవకాశం ఉంది. ఎక్కువగా గొర్రెలు ఈ వ్యాధి బారిన పడతాయి. పశుసంవర్థక శాఖ ముందుజాగ్రత్త చర్యగా ఆరు నెలలకు ఒకసారి పశువులకు నట్టల నివారణ మందులు ఉచితంగా అందిస్తుంది. ప్రస్తుతం పశువైద్య సిబ్బంది నట్టల నివారణ మందులు పంపిణీ చేస్తున్నారు. గొంతు వాపు.. ప్రాణాంతకం పశువులకు సంక్రమించే వ్యాధుల్లో గొంతు వాపు వ్యాధి ప్రాణాంతకమైనది. ఈ వ్యాధి బారిన పడిన పశువులు కంటి నుంచి నీరు కారటం, నోటి నుంచి చొంగకారడం, శ్వాస పీల్చడానికి ఇబ్బందులు పడుతుంటాయి. గొంతు కిందకు నీరు దిగి గొంతు వాపు వస్తుంది. తీవ్రత ఎక్కువైతే పశువులు చనిపోయే ప్రమాదం ఉంది. వ్యాధి నివారణకు ముఖ్యంగా జూన్, జులై నెలల్లో (హెచ్ ఎస్) టీకాలు వేయించుకోవాలి. వ్యాధి బారిన పడిన పశువును మిగిలినవాటి నుంచి దూరం చేయాలి. ఈటీ వ్యాక్సిన్తో చిటుకు వ్యాధికి చెక్ వర్షాకాలంలో పశువులకు ఎక్కువగా సోకే మరో వ్యాధి చిటుకు వ్యాధి. ఈ వ్యాధి వచ్చినప్పుడు జ్వరం తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీని నివారణ కోసం జూన్, జూలై మాసంలో ఈటీ వ్యాక్సిన్ వేస్తారు. రైతులు పశువులకు సంబంధించిన వ్యాధులను సకాలంలో గుర్తించి తగిన వైద్యం అందించాలి. జి .హనుమంతరావు. పశు వైద్యాధికారి, ఆగిరిపల్లి -
● నరికినా.. కాసింది
బుట్టాయగూడెం మండలం కామవరంలో గ్రామానికి చెందిన కొమరం వెంకన్న అనే రిటైర్డ్ ఉద్యోగి ఇంటి పెరటిలో నరికేసిన చెట్టు మధ్యలో అరటిగెల వచ్చింది. అయితే అలా రావడం మంచిది కాదని కొందరు చెప్పడంతో వెంకన్న రెండుసార్లు ఆ చెట్టును నరికేసినట్లు తెలిపాడు. అయినప్పటికీ మళ్లీ చెట్టు మధ్యలోనుంచే కాపు వస్తుందంటున్నారు. నరికిన చెట్టు మధ్యలో వచ్చిన అరటిగెలను చూసి పరిసర ప్రాంత ప్రజలు ఆశ్చర్యంగా తిలకిస్తున్నారు. – బుట్టాయగూడెం కామవరంలో నరికేసిన చెట్టు మధ్య నుంచి అరటి గెల వచ్చిన దృశ్యం -
భక్తులతో కిటకిటలాడిన శ్రీవారి క్షేత్రం
ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య క్షేత్రం శనివారం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారికి ప్రీతికరమైన రోజు, వేసవి సెలవులు కావడంతో వేలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. దాంతో ఆలయ పరిసరాలు భక్తులతో పోటెత్తాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, కల్యాణకట్ట, నిత్యాన్నదాన సదనం తదితర విభాగాలు భక్తులతో రద్దీగా మారాయి. కొండపైన టోల్గేట్, ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. దాదాపు 10,500 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. -
ముగిసిన సర్టిఫికెట్ల పరిశీలన
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీలో గత నాలుగు రోజుల నుంచి నిర్వహిస్తున్న ప్రత్యేక కేటగిరి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం శనివారంతో ముగిసింది. ఎన్సీసీ, స్పోర్ట్స్, సైనికోద్యోగుల పిల్లలు, భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ కోటాలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్లను ఈనెల 28 నుంచి నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా నాలుగు రోజుల సర్టిఫికెట్ల పరిశీలనలో ఎన్సీసీ విభాగంలో మొత్తం 1,454 మందికి గాను 1,101 మంది, స్పోర్ట్స్ కోటాకు సంబంధించి 1,032 మందికి గాను 742 మంది, సైనికోద్యోగుల పిల్లల కోటాకు సంబంధించి 270 మందికి గాను 198 మంది, భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ కోటాకు సంబంధించి 247 మందికి గాను 185 మంది హాజరయ్యారు. సర్టిఫికెట్ల పరిశీలనకు వచ్చిన అభ్యర్థులకు, వారితో పాటు వచ్చిన వారి సహాయకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశారు. ప్రొఫెసర్ ఎస్ఎస్ఎస్వీ గోపాలరాజు, ఏఆర్ అర్జునరావు సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. -
ఏలూరులో 6 కరోనా కేసులు
మెల్లగా విస్తరిస్తున్న మహమ్మారి ఏలూరు టౌన్: ఏలూరు నగరంలో మెల్లగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నా యి. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వ అధికారులు మాత్రం ప్రజలను అప్రమత్తం చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కలెక్టరేట్లో శుక్రవారం నాటికి ముగ్గురు కరోనా బారిన పడగా.. తాజాగా శనివారం మరో ఇద్దరికి కరోనా సోకినట్టు చెబుతున్నారు. అలాగే ఏ లూరు అమీనాపేటలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. వీరికి జీజీహెచ్లో పరీక్షలు చేశారు. నగరంలో ఆరుగురికి కరోనా సోకినట్లు వైద్య అధికారులు తెలిపారు.రహదారులపై సర్వే కొయ్యలగూడెం: కొయ్యలగూడెంలోని మెయిన్ రోడ్ల లో రెవెన్యూ అధికారులు శనివారం సర్వే చేపట్టారు. గతనెల 29న ‘సాక్షి’లో ‘పీజీఆర్ఎస్ తీరు అపహాస్యం’ శీర్షికన ప్రచురించిన కథనానికి కలెక్టర్ స్పందించి పరిష్కారానికి చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు. దీంతో రెవెన్యూ, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు సర్వేని ప్రారంభించి మార్కింగ్ చేశారు. దాదాపు మూడు నెలల క్రితం మల్లవరపు శ్రీనివాసు అనే వ్యక్తి కొయ్యలగూడెంలో ప్రధాన జాతీయ రహదారులు ఇరువైపులా ఆక్రమణలకు గురయ్యాయని ఫిర్యాదు చేశారు. అయితే ఆన్లైన్లో సమస్యను పరిష్కరించినట్టు సమాచారం రావడంతో ‘సాక్షి’ ద్వారా కలెక్టర్కి విషయం చేరింది. దీంతో కలెక్టర్ వెట్రిసెల్వి ప్రత్యేక శ్రద్ధతో చర్యలకు ఆదేశాలిచ్చారని అధికారులు తెలిపారు. డిపోల ద్వారా రేషన్ పంపిణీ ఏలూరు(మెట్రో): జిల్లాలోని 1,123 రేషన్ దుకాణాల్లో ఆదివారం నుంచి నిత్యావసర సరు కులు అందించేందుకు ఏర్పాట్లు చేసినట్టు జేసీ పి.ధాత్రిరెడ్డి తెలిపారు. జిల్లాలో 6,20,146 మంది కార్డుదారులకు రేషన్ పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆయా నియోజకవర్గాల్లో అధికారికంగా ప్రారంభిస్తామన్నారు. ఇకపై ప్రతినెలా 1 నుంచి 15వ తేదీ వరకు బియ్యం, పంచదార పంపిణీ చేస్తామన్నారు. 65 ఏళ్లు పైబడిన కార్డుదారులకు, దివ్యాంగులకు ప్రతినెలా 1 నుంచి 5వ తేదీ వరకు రేషన్ డీలర్ల ద్వారా ఇంటి వద్దకే నిత్యావసర సరుకులు అందిస్తామని పేర్కొన్నారు. పటిష్టంగా ‘20 సూత్రాల’ అమలు ఏలూరు(మెట్రో): వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర–2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యసాధన దిశగా 20 సూత్రాల కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలని 20 సూత్రాల కార్యక్రమ కమిటీ చైర్మన్ లంకా దినకర్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో 20 సూత్రాల కార్యక్రమాల అమలుపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఉపాధి హామీ పథకం, ఇంటింటికీ సురక్షిత తాగునీరు, జల్జీవన్ మిషన్ అమలు, గ్రామీణ సడక్ యోజన, లాక్పతి దీదీ, గరీబ్ కల్యాణ్ అన్నయోజన, పీఎం సూర్యఘర్, కు సుమ్, పీఎం ఆవాస్ యోజన, పీఎం విశ్వకర్మ యోజన, పీఎం స్వనిధి వంటి కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు తీరుతో పాటు, ద్వా రకాతిరుమల, కొల్లేరు పర్యాటక రంగం, మత్స్య సంపద అభివృద్ధి తదితర అంశాలపై సమీక్షించారు. జేసీ పి.ధాత్రిరెడ్డి, చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్కుమార్, సీపీఓ వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. ట్రాన్స్జెండర్లకు రైస్ కార్డులు 1ఏలూరు(మెట్రో): జిల్లాలో ట్రాన్స్జెండర్లకు రైస్ కార్డుల జారీకి ఈనెల 4న జిల్లా పౌర సరఫరాల అధికారి కార్యాలయంలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి తెలిపారు. ఈ కేంద్రంలో ట్రాన్స్జెండర్లకు రైస్ కార్డులు, ఆధార్ కార్డుల జారీ, ఆధార్ కార్డులో మార్పులు, రైస్ కార్డులో కుటుంబ సభ్యులు మార్పులు, చేర్పులు, ఆధార్ కార్డులో చిరునామా, తదితర మార్పు లు చేస్తారని చెప్పారు. యోగా రిజిస్ట్రేషన్ వేగిరపర్చాలి జిల్లాలో యోగా అభ్యాసన కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం సాయంత్రం వరకు 6,16,530 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని జేసీ ధాత్రిరెడ్డి తెలిపారు. జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమంలో 8.30 లక్షల మందిని భాగస్వాములను చేయాలనే లక్ష్యానికి అనుగుణంగా రిజిస్ట్రేషన్ను వేగిరపర్చాలని ఆదేశించారు. -
సర్కారు వైద్యం నిర్వీర్యం
●పేదలకు వైద్యం దూరం కూటమి ప్రభుత్వం పేదలకు వైద్యాన్ని దూరం చేసింది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ హాస్పిటల్స్కు బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గత ప్రభుత్వంలో సీఎం జగన్ ఆరోగ్యశ్రీలో 3,225 రోగాలకు వైద్య చికిత్సలు అందిస్తూ పేదల ఆరోగ్యానికి భరోసా క ల్పించారు. ఇక ఇప్పుడు 108 అంబులెన్స్ సేవలు సైతం నామమాత్రంగా అందుతున్నాయి. ఫోన్ చేసినా అత్యవసర సేవలు అందే పరిస్థితి లేదు. – దూలం నాగేశ్వరరావు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రజలకు భంగపాటు కూటమి ప్రభుత్వంలో మరి న్ని సేవలు అందుతాయని ఆశించిన ప్రజలకు భంగపాటు తప్పలేదు. ఆరోగ్య ఆసరా రద్దు చేశారు, ఫ్యామి లీ డాక్టర్, ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు లేవు. పేదలు ప్రభుత్వాస్పత్రికి వెళితే పట్టించుకునే నాథుడే లేడు. కూటమి ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తోంది. తమకు చెందిన కార్పొరేట్ ఆస్పత్రులకు మేలు చేసేలా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. – కారుమూరి సునీల్కుమార్, వైఎస్సార్సీపీ ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జిఏలూరు టౌన్: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాకే తలమానికంగా ప్రభుత్వ వైద్య కళాశాలను ఏలూరులో రూ.525 కోట్లతో ఏర్పాటుచేశారు. యుద్ధప్రాతిపదికన పాతబస్టాండ్ డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద రూ.60 కోట్లతో ఆధునిక సౌకర్యాలతో మెడికల్ కాలేజీ భవనాన్ని నిర్మించారు. ప్రస్తుతం రెండో ఏడాది 300 మంది వైద్య విద్యార్థులు ఇక్కడ వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. ఏలూరు సర్వజన ఆస్పత్రిని రూ.40 కోట్లతో ఆధునికీకరించారు. జీజీహెచ్ ప్రాంగణంలోనే ఆధునిక సౌకర్యాలతో శాశ్వత మెడికల్ కాలేజీ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఆరోగ్యశ్రీతో పేదలకు భరోసా 2014–2019 కాలంలో టీడీపీ హయాంలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేయగా 2019 జూన్లో అధికారంలోకి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్యశ్రీ పథకానికి పునరుజ్జీవం తెచ్చారు. ఏకంగా 3,225 వ్యాధులకు ఆరోగ్యశ్రీలో ఉచిత చికిత్సలు అందించారు. 2020లో కరోనా కష్టకాలంలో కూడా కోవిడ్ సేవలను సైతం ఆరోగ్యశ్రీల చేర్చి పేదలను ఆదుకున్నారు. అందరికీ ఆరోగ్య సురక్ష ● జిల్లాలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో 498 వైద్య శిబిరాలు నిర్వహించారు. కంటి కాటరాక్ట్ పరీక్షలు 39 వేలకు పైగా నిర్వహించి 2,713 మందికి శస్త్ర చికిత్సలు అవసరమని గుర్తించారు. ● రెండో విడతలో 551 వైద్య శిబిరాలు నిర్వహించి 61,140 మందికి ఓపీ సేవలు అందించారు. విలేజ్ క్లినిక్లతో.. గత ప్రభుత్వంలో జిల్లాలో 64 పీహెచ్సీలు ఉండగా అదనంగా 78 విలేజ్ క్లినిక్స్ను ఏర్పాటుచేశారు. 105 రకాల మందులు, 14 రకాల వైద్యపరీక్షలు అందించేలా చర్యలు తీసుకున్నారు. బీఎస్సీ నర్సింగ్తోపాటు కమ్యూనిటీ హెల్త్ కోర్సు పూర్తి చేసిన వైద్య నిపుణులలు, ఏఎన్ఎం, ఎంపీహెచ్ఏ, ఆశావర్కర్లు ఇక్కడ సేవలందించేవారు. అయితే కూటమి సర్కారులో విలేజ్ క్లినిక్స్ నిర్లక్ష్యానికి గురయ్యాయి. చాలా చోట్ల తాళాలు వేసి కనిపిస్తున్నాయి. తల్లీబిడ్డలకు అండగా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తల్లీబిడ్డా ఎక్స్ప్రెస్ వాహనాలతో ఆడబిడ్డలకు సేవలు అందించారు. ప్రసూతి అనంతరం తల్లీబిడ్డను ఈ వాహనాల ద్వారా సురక్షితంగా ఇంటికి చేర్చేవారు. ఇలా 2022 ఏప్రిల్ నుంచి 2023 జూలై వరకూ జిల్లాలో 4,976 మందిని, 2023 ఆగస్టు నుంచి 2024 మార్చి వరకు 5,214 మంది బాలింతలను ఇళ్లకు చేర్చారు. 108కు జవసత్వాలు మాజీ సీఎం జగన్ అధికారం చేపట్టిన తర్వాత 108 అత్యవసర సేవలకు జవసత్వాలు వచ్చాయి. 2020 జూలై 1న 19 కొత్త అంబులెన్సులను జిల్లాకు కేటాయించారు. అనంతరం మరో 4 అంబులెన్సులు మంజూరు చేశారు. మొత్తంగా 27 మండలాలకు ఒక్కో అంబులెన్స్, జిల్లాకు ఒక నియోనెటల్ అంబులెన్స్ సేవలందించాయి. ప్రస్తుత కూ టమి ప్రభుత్వంలో 108 వాహనాలు అందు బాటులో ఉండటం లేదు. ఫోన్ చేసినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఫ్యామిలీ డాక్టర్తో ఇంటికే వైద్యం గ్రామాల్లో ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని చేరువ చేసేందుకు గత ప్రభుత్వంలో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేశారు. ప్రతి పీహెచ్సీ పరిధిలో ఇద్దరు వైద్యులను నియమించటంతోపాటు వారు సిబ్బందితో కలిసి 104 సంచార వైద్యశాలలో గ్రామానికి వెళ్లి ప్రజలకు సేవలందించారు. ఇలా 2022 అక్టోబర్ నుంచి 2023 ఏప్రిల్ వరకు జిల్లాలో 5,56,039 మందికి, 2023 ఏప్రిల్ నుంచి 2024 ఏప్రిల్ వరకూ 7,13,499 మంది వైద్య సేవలు అందించారు. కరోనాలో అండగా.. కరోనా మహమ్మారి విజృంభించిన వేళ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తీసుకున్న చర్యలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి. జిల్లాలో మొదటి డోసుగా 34,79,105, రెండో డోసుగా 33,82,114 వ్యాక్సిన్లు అందించారు. జిల్లాలో 8 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటుచేశారు. నేడుకూటమి సర్కారు అధికారం చేపట్టిన ఏడాది కాలంలో వైద్యరంగాన్ని నిర్వీర్యం చేస్తూ పేదలకు ప్రభుత్వ వైద్యాన్ని దూరం చేశారు. ఆరోగ్య ఆసరాను రద్దు చేశారు. గ్రామాల్లో పేదలకు ఇంటికే వైద్యం అందించిన ఫ్యామిలీ డాక్టర్, 104 సేవలు దూరమయ్యాయి. దీంతో పేదలు జబ్బు చేస్తే అప్పులు చేసి మరీ ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సిన దుస్థితి. విలేజ్ క్లినిక్స్కు తాళాలు వేయగా, అర్బన్ హెల్త్ క్లినిక్స్లో నామమాత్రపు సేవలు అందుతున్నాయి. ఏలూరు జీజీహెచ్లో సైతం పూర్తిస్థాయిలో సేవలందడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. నాడురూపాయి ఖర్చు లేకుండా పేదలకు కార్పొరేట్ సేవలు అందించేలా మాజీ సీఎం జగన్ ఆరోగ్యశ్రీ పథకం, 108, 104కు జవసత్వాలు కల్పించారు. దేశానికే ఆదర్శంగా ఫ్యామిలీ డాక్టర్ విధానంతో ఇంటి వద్దకే వైద్యులను పంపి వైద్యసేవలు అందించారు. తల్లీబిడ్డా ఎక్స్ప్రెస్ సేవలు, ఆరోగ్య ఆసరా, ఆరోగ్య సురక్ష కార్యక్రమాల ద్వారా పేదల ఆరోగ్యానికి భరోసా కల్పించారు. వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్, యూపీహెచ్సీలను ఏర్పాటుచేసి ఆధునిక వైద్యసేవలకు చర్యలు తీసుకున్నారు. ఇలా వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. ప్రజారోగ్యానికి సుస్తీ ఆరోగ్య ఆసరా రద్దు ఫ్యామిలీ డాక్టర్, 108, 104లపై నీలినీడలు కూటమి పాలనలో వైద్యరంగంపై నిర్లక్ష్యం గత వైఎస్సార్సీపీ పాలనలో వైద్యానికి పెద్దపీట ఆరోగ్యశ్రీలో లక్షలాది మందికి సేవలు విలేజ్ క్లినిక్స్తో పల్లెల్లోనే వైద్యం ఏలూరులో మెడికల్ కాలేజీ ఏర్పాటు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవలు ఇలా.. సంవత్సరం వైద్య సేవలు వ్యయం ఆరోగ్య ఆసరా (రూ.కోట్లలో) (రూ.కోట్లలో) 2020–21 73,314 96.00 5.84 2021–22 72,305 98.00 15.00 2022–23 96,000 84.00 15.80 2023–24 98,000 92.00 6.97 -
అప్పుల బాధలు తాళలేక..
జంగారెడ్డిగూడెం: పట్టణానికి చెందిన ఓ కుటుంబం అప్పుల బాధలు తాళలేక ఆత్మహత్యాయత్నం చేయగా.. చికిత్స పొందుతూ కుటుంబ యజమాని శుక్రవారం మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి. స్థానిక లక్ష్మి ఆస్పత్రి సమీపంలోని అపార్ట్మెంట్లో మంగిన సత్యదుర్గాచంద్రరావు (చంద్రం) (40) భార్య, ఇద్దరు పిల్లల తో జీవిస్తున్నారు. గురువారం వీరు కూల్డ్రింక్ లో కలుపు మందు కలిపి సేవించారు. స్థానికు లు వారిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించగా.. చంద్రరావు, భార్య కృష్ణజ్యోతి, కుమారుడు దుర్గాచరణ్, కుమార్తె కోమలికి వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి గుంటూరు తరలించారు. గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతూ చంద్రరావు శుక్రవారం మృతిచెందారు. భార్య, కుమారుడు, కుమార్తె అక్కడే చికిత్స పొందుతున్నారు. వారికి రక్తం శుద్ధి చేసేందుకు డయాలసిస్ చేస్తున్న ట్టు బంధువులు తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. డీఎస్పీ యు.రవి చంద్ర మాట్లాడుతూ అప్పుల బాధ తాళలేక కుటుంబంతో సహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు ప్రాథమికంగా తమకు తెలిసిందన్నారు. విచారణ చేస్తున్నట్టు చెప్పారు. కుటుంబం ఆత్మహత్యాయత్నం కుటుంబ యజమాని మృతి -
వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల్లో నియామకాలు
ఏలూరు టౌన్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఏలూరు జిల్లాకు చెందిన పలువురు నాయకులకు పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాల్లో పదవులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా కోటగిరి సందీప్ (నూజివీడు), రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శులుగా గాదిరాజు వెంకట కిషోర్ మణికంఠ వర్మ (కిట్టు) (కై కలూరు), మద్దుల రాజు (ఉంగుటూరు)ను నియమించారు. రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శులుగా ఆచంట యశ్వంత్ చౌదరి (దెందులూరు), దాలి వెంకటేష్ (ఏలూరు), కామెళ్ల ఉదయభాస్కర్ రాజు (ఉంగుటూరు)ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వలంటీర్స్ వింగ్ కార్యదర్శిగా మట్టా ప్రవీణ్ (దెందులూరు), రాష్ట్ర ఐటీ వింగ్ కార్యదర్శిగా లూటుకుర్తి సుభాష్ (ఏ లూరు), రాష్ట్ర ఐటీ వింగ్ జాయింట్ సె క్రటరీగా నెక్కాటి వెంకటేష్ (ఉంగు టూరు), రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శిగా ఘంటా మోహనరావు (జీఎంఆర్) (ఏలూరు), రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా ముగుడురు సూర్యనారాయణ (దెందులూరు)ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
‘గురుకుల’ ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్
భీమడోలు: పోలసానిపల్లి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల బాలికల కళాశాలలో గురుకుల సొసైటీ ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్ శుక్ర వారం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే కౌన్సెలింగ్కు జోన్–2 పరిధిలోని ఉమ్మడి పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లా, కృష్ణా జిల్లాల్లోని గురుకుల బాలురు, బాలికల క ళాశాలలకు చెందిన 438 మంది ప్రిన్సిపాల్స్, జూనియర్ అధ్యాపకులు, పీజీటీలు హాజరుకానున్నారు. గురుకుల సొసైటీ సంయుక్త కార్యదర్శి ఎ.మురళీ సమక్షంలో కౌన్సెలింగ్ చేప ట్టారు. తొలిరోజు 73 మందికి బదిలీ ఉత్తర్వులు అందించారు. టీజీటీ, స్పెషల్ టీచర్లు, సూపరిండెంటెంట్, సీనియర్ అసిస్టెంట్ల కేడర్లలోని ఉద్యోగులకు మంగళవారం కౌన్సెలింగ్ జరుగనుంది. డీసీఓ బీపీ ఉమాకుమారి, ఆయా జిల్లాల డీసీఓలు పాల్గొన్నారు. ప్రైవేట్ బస్సులపై 152 కేసుల నమోదు ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని కలపర్రు టోల్గేట్ వద్ద గురువారం రాత్రి నుంచి శుక్రవారం వేకువజాము వరకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి కాంట్రాక్టు క్యారేజ్ బస్సులపై 152 కేసులు నమోదు చేసినట్టు జిల్లా ఉప రవాణా కమిషనర్ షేక్ కరీమ్ తెలిపారు. అలాగే రూ.5,01,500 అపరాధ రుసుం, పన్ను విధించినట్లు తెలిపారు. జిల్లాలోని వాహన తనిఖీ అధికారులను బృందాలుగా ఏర్పాటు చేసి కేసు లు నమోదు చేశామన్నారు. విశాఖ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి విశాఖ మధ్య తిరిగే కాంట్రాక్టు క్యారేజ్ బస్సులను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి పర్మిట్ నిబంధనలను ఉ ల్లంఘించిన బస్సులపై కేసులు నమోదు చే శామన్నారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం ఆర్టీఓలు కేఎస్ఎంఎన్ కృష్ణారావు, ఎండీ మదానీ, వాహన తనిఖీ అధికారులు ఎస్.రంగనాయకులు, జి.ప్రసాదరావు, జి.స్వామి, వై.సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ కగార్పై మండిపాటు ఏలూరు (టూటౌన్): ఆపరేషన్ కగార్ ఆపా లని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, కార్మిక సంఘాల అఖిలపక్షం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ నక్సలైట్ల రహిత భారతదేశాన్ని 2026 నాటికి చూపిస్తామని చెబుతూ అడవి మీద ఆధారపడి జీవిస్తున్న గిరిజనులను అడవి నుంచి దూరంగా తరలించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆపరేషన్ కగార్ పేరిట అటవీ ప్రాంతంలోని విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు కేంద్రంలోని మోదీ, అమిత్ షా ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు బండి వెంకటేశ్వరరావు, కాంగ్రెసు జిల్లా అధ్యక్షుడు రాజనాల రామ్మోహన్రావు మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. పట్టణ ప్రజలపై ఆస్తి పన్ను భారం ఏలూరు (టూటౌన్): రాష్ట్రంలో కూటమి ప్రభు త్వం పెంచిన ఆస్తి పన్ను ఉపసంహరించుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నును 20 శాతం పెంచాలని నిర్ణయించి ఆ మేరకు కొలతలు వేసే సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. గత ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఆస్తి పన్ను పెంచబోమని హామీ ఇచ్చిన ఇప్పుడు తుంగలో తొక్కుతున్నారన్నారు. -
ఉద్యోగాల పేరుతో టోకరా
భీమడోలు: నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామ ని నమ్మించి మోసగిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాలోని ఓ వ్యక్తిని భీమడోలు పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న షేక్ రసూల్ కలకాడను భీమడోలు కోర్టులో హాజరుపర్చారు. ఇదిలా ఉండగా ఇదే ముఠాలోని మరో వ్యక్తి అల్తాఫ్ పరారీలో ఉన్నాడు. భీమడోలులో సీఐ యూజే విల్సన్, ఎస్సై వై.సుధాకర్ వివరాలు వెల్లడించారు. హైదరాబాద్లోని తుక్కుగూడ ప్రాంతానికి చెందిన షేక్ రసూల్ కలకాడ, అతడి రెండో కుమారుడు అల్తాఫ్ రంగారెడ్డి జిల్లా గండిపేటలో నివాసముంటున్నారు. కొన్నేళ్లుగా వీరిద్దరూ తమకు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులతో సాన్ని హిత్యం ఉందని చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు ఎర వేస్తున్నారు. వారి నుంచి లక్షలాది రూపాయలు కాజేసి నకిలీ అపాయింట్మెంట్లతో మోసం చేస్తున్నారు. ఇలా పోలసానిపల్లికి చెందిన దివ్యాంగుడు కుక్కల నాగమల్లేశ్వరరావుకు ఏపీ సచివాలయంలోని వ్యవసాయ విభాగంలో అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించారు. నాగమల్లేశ్వరరావు నుంచి రూ.3 లక్షలు తీసుకుని నకిలీ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు. ఇది నకిలీ లెటర్ అని తెలిసి మోసపోయినట్టు గ్రహించిన నాగమల్లేశ్వరరావు గతేడాది మే 26న భీమడోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా రంగారెడ్డి జిల్లా గండికోటలో ఉన్న రసూల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు చేధించిన బృందంలోని హెచ్సీ ఎస్.శ్రీనినవాసరావు, ఎస్కే బాజీ, ఎం.వెంకటేశ్వరరావులు సీఐ విల్సన్ అభినందించారు. అలాగే పూళ్లకి చెందిన దూలం సాయిబాబా అనే వ్యక్తికి పోలీస్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.20 లక్షలు తీసుకుని మోసం చేసిన కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. ద్వారకాతిరుమల మండలం దేవినేనివారిగూడేనికి చెందిన సుంకవల్లి శ్రావణ్కుమార్ అనే వ్యక్తి పొలం కొంటామని నమ్మించి, రెండు చెల్లని చెక్కులు ఇవ్వగా రసూల్, అల్తాఫ్లపై కేసు నమోదైంది. తండ్రి అరెస్ట్.. పరారీలో కుమారుడు -
నాడు–నేడులో 1,117 బడుల అభివృద్ధి
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాడు–నేడు కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాలో మొదటి విడతలో 1,117 పాఠశాలలను రూ.280.44 కోట్లతో అభివృద్ధి చేశారు. అదనపు తరగతి గదులు నిర్మించడం, శ్లాబులు, గోడల మరమ్మతులు, ప్రహరీ గోడల నిర్మాణం, మరుగుదొడ్ల సౌకర్యం, పరిశుభ్రమైన తాగునీటి సరఫరా, తగరతి గదుల్లో గ్రీన్ చాక్బోర్డుల ఏర్పాటు, చక్కటి వెలుగుల కోసం ట్యూబ్లైట్లు, చల్లని గాలి కోసం ఫ్యాన్లు, తరగతి గదుల్లో రంగులతో గోడలకు పెయింటింగ్, క్రీడా ప్రాంగణాల అభివృద్ధి, ప్రహరీ గోడలపై విజ్ఞానాన్ని పెంచేలా, విద్యార్థుల్లో ఆసక్తిని రేకెత్తించేలా చూడచక్కని బొమ్మలు వేయించారు. రెండో విడతలో ఏలూరు జిల్లాలో 889 పాఠశాలలను ఎంపిక చేసి వాటి అభివృద్ధికి రూ.295.54 కోట్లు మంజూరు చేశారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లాలో 739 పాఠశాలలను ఎంపిక చేసి వాటి అభివద్ధికి రూ.259.19 కోట్లు కేటాయించారు. -
చట్టాన్ని ఎమ్మెల్యేలు హైజాక్ చేస్తున్నారు
ఏలూరు (టూటౌన్): పంచాయతీరాజ్ చట్టాన్ని ఎమ్మెల్యేలు హైజాక్ చేస్తూ సర్పంచ్ల విధులు, హక్కులకు భంగం కలిగిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ సర్పంచ్ల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మెండెం సంతోష్ కుమార్ విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1994 పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి వచ్చిన రోజును పురస్కరించుకుని ఏలూరు ఎన్ఆర్పేటలోని కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేలు అధికారులను అడ్డంపెట్టుకుని పంచాయతీల్లో సర్పంచ్లకు ఉన్న హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. పంచాయతీ రాజ్ చట్టాన్ని సక్రమంగా అమలుచేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సర్పంచ్ చిలకా సుబ్బారావు, నాయకులు నూకపెయ్యి కార్తీక్, కనికెళ్ళ రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కొనసాగుతున్న సర్టిఫికెట్ల పరిశీలన నూజివీడు: ట్రిపుల్ ఐటీల్లో 2025–26 విద్యాసంవత్సరానికి ప్రవేశాల్లో భాగంగా ప్రత్యేక కేటగిరి సీట్ల భర్తీకి గాను ఆయా కేటగిరికి చెందిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన మూడోరోజు శుక్రవారం నిర్వహించారు. దీనిలో భాగంగా స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ నందు వెరిఫికేషన్ కార్యక్రమాన్ని నిర్వహించగా క్రీడా కోటాకు సంబంధించి 467మందికి గాను 344 మంది, ఎన్సీసీ కోటాకు సంబంధించి 452 మందికి గాను 354 మంది హాజరయ్యారు. సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమాన్ని డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్, ప్రొఫెసర్ ఎస్ఎస్ఎస్వీ గోపాలరాజు, ఏఆర్ అర్జునరావు పర్యవేక్షిస్తున్నారు. ఈనెల 31న ఎన్సీసీ కేటగిరికి చెందిన 661మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేయనున్నారు. 2న అండర్–19 క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు ఏలూరు రూరల్: జూన్ 2న ఏలూరు సీఆర్ఆర్ కళాశాల గ్రౌండ్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అండర్–19 పురుషుల క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు చేపట్టనున్నట్లు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏసీఓ త్రిసభ్య కమిటీ సభ్యులు ఆర్ఎస్ఆర్ మూర్తి, ఈ ఆశోక్కుమార్, ఎస్కే షాకిర్హుస్సేన్ ఓ ప్రకటనలో తెలిపారు. 2006 సెప్టెంబర్ 1 తర్వాత పుట్టిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులని వివరించారు. జట్టుకు ఎంపికై న వారు 2025–2026 సంవత్సరంలో ఏసీఓ నిర్వహించే సెంట్రల్ జోన్ ఇంటర్ డ్రిస్టిక్ట్ పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు. వివరాలకు 70136 33143 ఫోన్ నంబర్లో సంప్రదించాలన్నారు. కాగా శుక్రవారం ఏలూరులో నిర్వహించిన ఎంపిక పోటీల తర్వాత అండర్–23, సీనియర్ క్రికెట్ జట్లును కమిటీ సభ్యులు వెల్లడించారు. ఈ జట్లు త్వరలో మూలపాడులో నిర్వహించే అంతర జిల్లాల పోటీల్లో ఉమ్మడి పశ్చిమ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తాయన్నారు. -
పొగ.. ఆరోగ్యానికి సెగ
కై కలూరు: పొగాకు వినియోగదారులు వ్యసన చక్రంలో బందీ అవుతున్నారు. పొగాకును ఏ రూపంలో తీసుకున్నా ప్రమాదమే. దీని వల్ల గొంతు కేన్సర్, ఉపిరితిత్తుల వ్యాధులు, గుండెపోటు వంటి సమస్యలు దాపరిస్తున్నాయి. పొగాకు వినియోగం వల్ల ఎదురయ్యే అనర్థాలను వివరించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) ఏటా మే 31వ తేదీన ధూమపాన రహిత దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ ఏడాది శ్రీపొగాకు ఉత్పత్తుల ఆకర్షణలు తగ్గించడంశ్రీ అనే నినాదంతో ప్రపంచ వ్యాప్తంగా అవగాహన కలిగిస్తున్నారు. ఏలూరు జిల్లాలో డీఎంహెచ్వో కార్యాలయంలో పొగాకు వినియోగ అనర్థాలపై శనివారం అవగాహన కలిగించనున్నారు. ఆకర్షితులవుతున్న యువత యుక్తవయస్సులో సిగరెట్కు యువత ఆకర్షితులవుతున్నారు. పొగాకు ఉత్పత్తుల్లో నికోటిన్ ఆనే పదార్థం ఉంటుంది. అందువల్ల వ్యసనం నుంచి త్వరగా బయట పడలేకపోతున్నారు. విద్యార్థి దశ నుంచి కొంతమంది ఫ్యాషన్గా సిగిరెట్కు అలవాటు పడుతున్నారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రధానంగా ధూమపానం వల్ల పురుషులు, సీ్త్రలలో సంతానోత్పత్తి సమస్యలు వస్తున్నాయి. కేన్సర్ల ముప్పు.. సిగిరెట్, బీడి, చుట్టా, జరదా, గుట్కా, తంబాకు వంటి పొగాకు ఉత్పత్తులకు ప్రజలు బానిసలై విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వీటి బారిన పడిన వారికి తల, మెడ, నోరు, ఉపిరితిత్తులు, రక్త, మూత్రపిండాలు, ఫ్లీహము, పేగు, మూత్రసంచి, గర్భాశయ కేన్సర్లు కలుగుతున్నాయి. అదే విధంగా పక్షవాతము, అంధత్వము, చిగురు వాపు, గుండె వ్యాధులు, నిమ్ము, ఆయాసం, రక్తనాళాలు గట్టిపడటం, సంతానోత్పత్తి తగ్గిపోవడం, ఎముకలు బలహీనపడుట వంటి దీర్ఘకాలిక వ్యాధులతో శరీరంలో ప్రతి అవయవం దెబ్బతింటోంది. పొగాకు వల్ల ప్రపంచంలో ప్రతి ఏటా 8 మిలియన్లు పైగా మరణాలు సంభవిస్తున్నాయని అంచనా. జిల్లాలో 2,354 మంది పొగాకు వ్యాధిగ్రస్తులు ఏలూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో ఈ ఏడాది ఇప్పటి వరకు 2,354 మంది పొగాకును వివిధ రూపాల్లో ఉపయోగించిన వ్యాధిగ్రస్తులను గుర్తించారు. వ్యసనపరులకు ఏలూరు సర్వజన ఆస్పత్రిలో రూం నంబరు 15లో టొబోకో ససైషన్ వైద్యశాల(టీసీసీ)లో చికిత్స అందిస్తున్నారు. మొత్తం వ్యాధిగ్రస్తులలో 146 మంది పూర్తిగా కోలుకున్నారు. మరో 955 మంది కోలుకునే దశలో ఉన్నారు. వ్యసనపరులకు వైద్యులు నికోటీవ్ రీప్లేస్మెంట్ థెరఫీతో వ్యసనాన్ని తగ్గిస్తున్నారు. కార్భన్ మోనాకై ్సడ్ అనలైజర్ అనే పరికరం ద్వారా రక్తంలో లెవల్స్ను పరీక్షించి, అనంతరం సైకాలజిస్టుతో కౌన్సిలింగ్ థెరిఫీ అందిస్తున్నారు. నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం జిల్లాలో పొగాకు సంబంధ వ్యాధిగస్తులు 2,354 మంది వ్యసనపరులకు టీసీసీ సెంటర్ ద్వారా వైద్య చికిత్స -
మట్టి కోసం టీడీపీలో వర్గపోరు
నూజివీడు: చెరువుల్లో మట్టిని కొల్లగొట్టి జేబులు నింపుకునేందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లుగా ఉంది. చెరువుల్లో మట్టిని తాము తోలుకోవాంటే తాము తోలుకుంటామంటూ నాయకులు పోటీ పడుతున్నారు. పలు గ్రామాల్లో మట్టి కోసం వర్గపోరు తారాస్థాయికి చేరింది. కొన్నిచోట్ల ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ మట్టితోలకాలను యథేచ్ఛగా నిర్వహిస్తుంటే మరికొన్ని చోట్ల చెరువుల్లో మట్టిని అనుమతులు లేకుండా ఎలా తోలతారని టీడీపీ నాయకులే అడ్డుకుంటున్నారు. మట్టి తవ్వకాలను అడ్డుకున్న రైతులు నూజివీడు పట్టణంలోని పెద్దచెరువులో మాజీ కౌన్సిలర్ టీడీపీ నాయకుడు వేమూరి వెంకట కృష్ణారావు ఇరిగేషన్ అధికారుల నుంచి అనుమతులు తీసుకొని మట్టి తోలకాలను శుక్రవారం చేపట్టగా అదే పెద్దచెరువు సాగునీటి సంఘం సభ్యులు, రైతులు తమ చెరువులో మట్టిని తోలడానికి వీల్లేదని మట్టిని తోలకుండా అడ్డుకున్నారు. వేమూరు వెంకట కృష్ణారావుకు ఆర్ఎస్ నెంబరు 871–3లోని ఎకరం భూమిని మెరక చేసుకొనుటకు గాను వెయ్యి క్యూబిక్ మీటర్ల మట్టిని పెద్ద చెరువు నుంచి తవ్వి తీసుకెళ్లేందుకు గాను ఇరిగేషన్ ఈఈ అనుమతి ఇచ్చారు. దీంతో మట్టి తవ్వకాలను చేపట్టగా సాగునీటి సంఘం సభ్యులు, ఆయకట్టు రైతులు అడ్డుకోవడంతో కొంతసేపు వారి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. చెరువుకు నాలుగు చోట్ల గండ్లు పడి దాదాపు 10నెలలు గడిచినా ఇంత వరకు గండ్లు పూడ్చకుండా చెరువులో మట్టిని వేరే వాళ్లు ఎలా తవ్వుకొని తీసుకెళ్తారని రైతులు ప్రశ్నించారు. అసలు అనుమతుల కోసం దరఖాస్తు పెట్టేటప్పుడు కనీసం నీటి సంఘం అధ్యక్ష, కార్యదర్శులను సంప్రదించకుండా ఎలా మట్టిని తవ్వుతారని నిలదీశారు. సాగునీటి సంఘం సభ్యులు ట్రాక్టర్లను అడ్డుకోవడాన్ని టీడీపీకి చెందిన కొందరు మంత్రి కొలుసు పార్థసారథి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ వ్యవహారంపై మంత్రి ఎలా స్పందిస్తారోనని ఆసక్తి నెలకొంది. కొన్నంగుంటలో మట్టి అక్రమ తవ్వకాలు బోర్వంచ శివారు కొన్నంగుంటలోని గోరింత చెరువులో గురువారం అర్ధరాత్రి నుంచి తెల్లవార్లూ అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగాయి. ట్రాక్టర్లలో మట్టి తరలిపోయింది. గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నాయకులు మట్టి అక్రమ తవ్వకాలకు తెరలేపి ఇష్టారాజ్యంగా కొనసాగించారు. అక్రమ తోలకాలు చేస్తున్నట్లు తెలుసుకున్న బోర్వంచ పంచాయతీకి చెందిన టీడీపీ నాయకుడు హరికోటి సంగీతరావు ట్రాక్టర్లను ఆపి ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని ఎందుకు తోలుతున్నారని నిలదీశారు. అయినప్పటికీ మా ఇష్టం వచ్చినట్లుగా మేము తోలతామని చెప్పి ట్రాక్టర్లలో మట్టిని అడ్డూ అదుపూ లేకుండా తెల్లవార్లు తరలించారు. ఒక వర్గం మట్టి తోలుతుంటే అడ్డుకుంటున్న మరో వర్గం నూజివీడు పెద్దచెరువులో, కొన్నంగుంటలో మట్టి తవ్వకాలు -
యాత్రికుల లగేజీ దోపిడీ
ఏలూరు: టి.నరసాపురం మండలం మక్కినవారిగూడానికి చెందిన యాత్రికులు సోలాపూర్ సమీపంలో దోపిడీకి గురయ్యారు. యాత్రికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మక్కినవారిగూడానికి చెందిన 24మంది ఈ నెల 27న రైలులో షిర్డీ వెళ్లారు. 29వ తేదీ రాత్రి షిర్డీ నుంచి సోలాపూర్కు చెందిన శివ్బాబా ట్రావెల్స్ బస్సును మాట్లాడుకుని బస్సులో సోలాపూర్ బయలుదేరారు. వారి లగేజీ బ్యాగ్లను బస్సు డిక్కీలో ఉంచారు. 30వ తేదీ ఉదయం సోలాపూర్లో బస్సు దిగి డిక్కీ తెరిచి చూడగా, డిక్కీలో పెట్టిన దాదాపు 24 మందికి చెందిన బ్యాగులు మాయమయ్యాయి. వాటిలో దాదాపు విలువైన బట్టలతో పాటు రూ. 70 వేల నగదు ఉంటుందని యాత్రికులు తెలిపారు. బస్సు ప్రయాణిస్తుండగా మార్గమధ్యలో డ్రైవర్ పలు చోట్ల ఆపి కిందకు దిగినట్లు యాత్రికులు చెబుతున్నారు. దీంతో బస్సును సోలాపూర్లో పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి యాత్రికులు ఆందోళన చేశారు. ఈ ఘటనపై మక్కినవారిగూడెంకు చెందిన దొంతు లక్ష్మీనారాయణతో పాటు మరికొందరు కలిసి ఫిర్యాదు చేశారు. సాయంత్రానికి పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీని యాత్రికులకు ఇచ్చారు. యాత్రికులంతా సోలాపూర్ చుట్టుపక్కల పర్యటించి జూన్ 1వ తేదీన 8 గంటలకు సోలాపూర్ నుంచి విజయవాడకు రైలు ఎక్కాల్సి ఉంది. రిజర్వేషన్ టిక్కెట్లు సైతం ఆ బ్యాగ్లోనే ఉన్నాయని, తిరుగు ప్రయాణానికి తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని యాత్రికులు తెలిపారు.శ్రీవారి ఆలయంలో పాము కలకలంద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయంలో శుక్రవారం ఉదయం ఒక పాము కలకలాన్ని రేపింది. దాంతో దేవస్థానం సిబ్బంది దాన్ని పట్టుకుని దూరంగా తీసుకెళ్లి విడిచిపెట్టారు. స్థానికుల కధనం ప్రకారం. ఆలయ ఉత్తరగోపురం వైపు ఉన్న రూ. 200 దర్శనం క్యూలైన్లలోకి ఆ పాము ప్రవేశించడంతో అక్కడున్న భక్తులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్పందించిన దేవస్థానం సిబ్బంది ఆ పామును గోనె సంచెలో పట్టి, దూరంగా తీసుకెళ్లి విడిచిపెట్టారు. దాంతో భక్తులంతా ఊపిరి పీల్చుకున్నారు. -
చిన్నపిల్లలపై పిచ్చి కుక్క దాడి
ద్వారకాతిరుమల: గత నాలుగు రోజుల నుంచి క్షేత్రంలోని చెరువు వీధిలో ఒక పిచ్చికుక్క పిల్లలపై దాడి చేస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 10 మంది పిల్లలపై ఈ కుక్క దాడి చేసి, తీవ్రంగా గాయపరచింది. శుక్రవారం సాయంత్రం చెరువు వీధిగుండా శ్రీవారి ఆలయానికి వెళుతున్న లింగపాలెం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన సాయిల రవి అనే భక్తుడి కుమారుడు యశ్వంత్పై ఈ కుక్క దాడి చేసింది. ఈ దాడిలో బాలుడి కాలికి తీవ్ర గాయమైంది. ఆ సమయంలో అక్కడే ఉన్న స్థానిక వైస్సార్ సీపీ నాయకుడు కొల్లిసుబ్బారావు క్షతగాత్రుడిని హుటాహుటీన పీహెచ్సీకి తరలించారు. అదేవిధంగా గ్రామానికి చెందిన గుడాల మదన్మోహన్ కుమారుడు నవదీప్పై కుక్క దాడి చేసి, కొంత దూరం ఈడ్చుకెళ్లింది. స్థానికులు వెంటపడటంతో బాలుడిని విడిచిపెట్టి పరారైంది. వైద్య సిబ్బంది చిన్నారులకు యాంటి ర్యాబిస్ వ్యాక్సిన్ వేశారు. సమాచారం అందుకున్న డిప్యూటీ ఎంపీడీవో ఏవీ సుబ్బరాయన్ పిచ్చి కుక్కను పంచాయతీ పారిశుధ్య కార్మికులతో పట్టించి, దూర ప్రాంతానికి తరలించారు. పోక్సో కేసులో లాడ్జి యజమాని అరెస్ట్ భీమవరం: మైనర్ బాలికలను వ్యభిచారానికి ప్రోత్సహిస్తున్న నేరంలో భీమవరం టూటౌన్ పరిధిలోని శ్రీనిధి లాడ్జి యజమాని అయితం శ్రీనివాస్ను పోక్సో కేసులో శుక్రవారం అరెస్టు చేసినట్లు టూటౌన్ సీఐ జి కాళీచరణ్ చెప్పారు. ఈనెల 12వ తేదీన వ్యభిచారం నేరంపై బాలికలను అరెస్ట్ చేయగా వారికి రూమ్స్ అద్దెకిచ్చిన శ్రీనివాస్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చామని, 14 రోజుల రిమాండ్ విధించడంతో నరసాపురం సబ్జైలుకు తరలించినట్లు సీఐ కాళీచరణ్ చెప్పారు. -
పొగాకు బారిన పడవద్దు
పొగాకు వాడకం వల్ల ప్రజల జీవితాలు నాశనం చేసుకొంటున్నారు. ప్రధానంగా నోటి, స్వరపేటిక, ఊపిరితిత్తులు, క్లోమగ్రంధి, మూత్రాశయ కేన్సర్లు సంభవిస్తాయి. గుండె పోటుతో అకాల మరణాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంది. జిల్లా సర్వజన ఆస్పత్రిలో పొగాకు విరమణ వైద్యశాల(టీసీసీ) అందుబాటులో ఉంది. పొగాకు ఉత్పత్తులకు అందరూ దూరంగా ఉండండి. – డాక్టర్ ఆర్.మాలిని, జిల్లా వైద్యాధికారి, ఏలూరు పీల్చడమూ ప్రమాదమే సిగిరెట్లులను కాల్చడమే కాదు.. ఆ పొగను పీల్చినా ప్రమాదమే. కొందరు సరదాగా పొగాకునకు అలవాటు పడి వ్యసనపరులుగా మారుతున్నారు. ప్రధానంగా యువత వీటికి ఆకర్షితులవుతున్నారు. గుండె పోటు మరణాల్లో ధూమపానం అలవాటు ఉన్నవారే ఎక్కువగా ఉంటున్నారు. పొగాకు రహిత సమాజానికి అందరూ సహకరించాలి. – డాక్టర్ నరేంద్ర, ప్రొగ్రాం ఆఫీసర్, ఎన్సీడీ, ఏలూరు వ్యసనపరుల్లో మార్పు ఏలూరు సర్వజన ఆస్పత్రిలో టొబోకో ససైషన్ క్లీనిక్(టీసీసీ) అందుబాటులో ఉంది. ఈ సెంటర్లో ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 5 వేల మందికి వైద్య సేవలు అందించాం. వ్యసనపరులకు నికోటివ్ రీప్లేస్మెంట్ థెరపీని అందిస్తున్నాం. పూర్తిగా పొగాకు మానివేసిన వాళ్లను ఆరు నెలల వరకు పరిశీలిస్తున్నాం. ధూమపానానికి అలవాటు పడిన వారిని టీసీసీ ద్వారా మామూలు స్థితికి తీసుకొస్తున్నాం. – కె.చిన వీర్రాజు, సైకాలజిస్టు, గవర్నమెంట్ జనరల్ హాస్పటల్, ఏలూరు -
ఆగడాలు భరించలేకే హతమార్చా
కొడుకును చంపిన కేసులో తండ్రి వెల్లడి జంగారెడ్డిగూడెం: కుమారుడిని హత్యచేసిన కేసులో తండ్రిని అరెస్టు చేశారు. గురువారం జంగారెడ్డిగూడెం సర్కిల్ కార్యాలయంలో డీఎస్పీ యు.రవిచంద్ర వివరాలు వెల్లడించారు. సీతంపేటకు చెందిన కొప్పుల నాగేశ్వరరావు చికెన్షాపు నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి ఇద్దరు కుమారులు కాగా, మృతుడు పవన్కుమార్ (24) పెద్ద కుమారుడు. డిగ్రీ చదువు మధ్యలో మానివేసి చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. ప్రతిరోజు తాగి వచ్చి ఆస్తి ఇవ్వాలంటూ తండ్రి, కుటుంబసభ్యులతో గొడవ పడుతూ, 9 నెలల క్రితం హైదరాబాద్ వెళ్లిపోయాడు. మరలా తిరిగి వచ్చి డబ్బులు కావాలని, లేకపోతే తన ఆస్తి తనకివ్వాలని గొడవ పడేవాడు. ఈ క్రమంలో పవన్కుమార్ తండ్రి నాగేశ్వరరావుపై దాడి చేశాడు. దీంతో విసిగిపోయిన నాగేశ్వరరావు ఈ నెల 26న వీరన్నగుడెం గ్రామంలోని నరసయ్య చెరువు గట్టుపై తన స్నేహితుడుకి చెందిన తాటాకింటికి పవన్కుమార్ను తీసుకువెళ్లి మద్యం పట్టించి మత్తులో గొంతు కోసి హత్య చేసి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితుడిని అరెస్టు చేసిన సీఐ వి.కృష్ణబాబును, ఎస్సై షేక్ జబీర్ను, ఏఎస్సై ఎన్వీ సందప్కుమార్, పీసీలు రమేష్, దిలీప్లను డీఎస్పీ అభినందించారు. రివార్డు కోసం ఎస్పీకి సిఫార్సు చేయనున్నట్లు తెలిపారు. -
రైతుల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి
తాడేపల్లిగూడెం రూరల్ : రైతుల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ కే.గోపాల్ అన్నారు. గురువారం మండలంలోని పట్టెంపాలెం గ్రామంలో వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ గోపాల్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని 11 క్లస్టర్లుగా విభజించి రైతులు ఏ పంట వేస్తే మేలు చేకూరుతుందనే దానిపై కృషి జరగాలన్నారు. రైతులకు మేలైన వరి వంగడాలను అందించాలని, సాగులో పురుగు మందుల వినియోగాన్ని తగ్గించి, లాభసాటిగా మార్చాలన్నారు. ఆరోగ్యకరమైన పంటలను పండించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ ప్రాంతంలో కోకో ప్రొసెసింగ్ ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. స్థానిక రైతాంగానికి ఏ పంటలు అనుకూలమో శాస్త్రవేత్తలు సూచించాలన్నారు. ఐసీఏఆర్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జేవీ.ప్రసాద్ మాట్లాడుతూ సాగులో నూతన పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఐసీఏఆర్ డైరెక్టర్ డాక్టర్ ఎం. శేషు మాధవ్, భారతీయ ఆయిల్పామ్ పరిశోధన సంస్థ (పెదవేగి) డైరెక్టర్ డాక్టర్ కే.సురేష్, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ కేటీవీ.రమణ మాట్లాడారు. జిల్లా వ్యవసాయాధికారి జడ్. వెంకటేశ్వరరావు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి కే.దేవానంద్, ఉద్యాన విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ బి.గోవిందరాజులు, ఏడీఏ మురళీకృష్ణ, పశు, మత్స్యశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఉద్యాన వర్సిటీ ఉప కులపతి డాక్టర్ గోపాల్ -
ట్రిపుల్ ఐటీలో రెండోరోజు సర్టిఫికెట్ల పరిశీలన
నూజివీడు: స్థానిక ట్రిపుల్ ఐటీలో రెండోరోజు గురువారం ప్రత్యేక కేటగిరి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించారు. దీనిలో భాగంగా సైనికోద్యోగుల పిల్లల కోటా, ఎన్సీసీ, క్రీడా, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాకు చెందిన అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. క్రీడా కోటాకు సంబంధించి 245 మందికి 171 మంది, సైనికోద్యోగుల పిల్లల కోటాకు సంబంధించి 117 మందికి 79 మంది, ఎన్సీసీ కేటగిరికి సంబంధించి 341 మందికి 277 మంది, భారత్ స్కౌట్స్ గైడ్స్ కేటగిరికి సంబంధించి 247 మందికి 185 మంది హాజరయ్యారు. ఈనెల 30న ఎన్సీసీ, క్రీడా కోటా అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు. సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమాన్ని డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్, ప్రొఫెసర్ ఆచార్య ఎస్ఎస్ఎస్వీ గోపాలరాజు పర్యవేక్షించారు. భారత సైన్యం సత్తాకు ప్రతీక సిందూర్తాడేపల్లిగూడెం: దేశ రక్షణలో సైనికుల పాత్ర అమూల్యమని ఏపీ నిట్ ఇన్చార్జి డైరెక్టర్ డాక్టర్ ఎన్వీ రమణరావు అన్నారు. ఏపీ నిట్లో గురువారం జరిగిన తిరంగా యాత్రలో ఆయన మాట్లాడారు. భారత సైన్యం ధైర్య సాహసాలకు, త్యాగనిరతికి ఆపరేషన్ సిందూర్ ప్రతీక అని అన్నారు. ఈ విజయం భారత జవాన్ల సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు. మాతృభూమి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ప్రతి సైనికుడి జీవితం స్ఫూర్తిదాయకమని, విద్యార్థులు వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కన్నవాళ్లకు, కుటుంబాలకు దూరంగా దేశ సరిహద్దుల్లో రాత్రి పగలూ విధులు నిర్వర్తిస్తూ శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడుతున్న సైనికుల పోరాటపటిమకు సెల్యూట్ కొట్టాలన్నారు. దేశభక్తిని చాటే నినాదాలతో త్రివర్ణ పతాకాలతో విద్యార్థులతో కలిసి ఆయన ర్యాలీలో పాల్గొన్నారు. రిజిస్ట్రార్ దినేష్ రెడ్డి, నిట్ అధికారులు పాల్గొన్నారు. -
నేత్రపర్వం.. శివ కల్యాణం
ద్వారకాతిరుమల : క్షేత్రపాలకునిగా విరాజిల్లుతున్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో గురువారం శివదేవుని కల్యాణ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని అట్టహాసంగా నిర్వహించిన ఈ వేడుక భక్తులకు కనువిందు చేసింది. మండపంలో ఏర్పాటు చేసిన వేదికపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఉంచి, అర్చకులు విశేష పుష్పాలంకారాలు చేశారు. ఆ తరువాత కల్యాణ తంతును ప్రారంభించి, సుముహూర్త సమయంలో నూతన వధూవరుల శిరస్సులపై జీలకర్ర, బెల్లం ధరింపజేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణలు, భక్తుల శివనామస్మరణల నడుమ మాంగల్యధారణ, తలంబ్రాల వేడుకలను కన్నులపండువగా జరిపి, కల్యాణ మూర్తులకు హారతులిచ్చారు. ఈ వేడుకలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని, స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. జేఈఈ మెయిన్స్కు ఉచిత దీర్ఘకాలిక శిక్షణ ఏలూరు (ఆర్ఆర్పేట) : జేఈఈ మెయిన్స్లో అర్హత మార్కులు సాధించి సీట్లు సాధించలేకపోయిన పేద కుటుంబాల విద్యార్థులకు ఉచితంగా దీర్ఘకాలిక శిక్షణ ఇప్పించాలని నిర్ణయించినట్టు స్పృహ ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్ ట్రస్ట్ తెలిపింది. ఈ మేరకు ట్రస్ట్ ప్రతినిధులు అంగులూరు సర్వేశ్వరరావు, టీటీఎఫ్ రూజ్వెల్ట్ ఏలూరులో గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. కుటుంబ వార్షికాదాయం రూ.1.20 లక్షల లోపు ఉండి అత్యుత్తమ మార్కులు సాధిస్తున్న విద్యార్థులను ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు వారు ఆ ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి జూన్ 21న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తున్నామని, అందులో ప్రతిభ చూపిన సుమారు 10 మంది విద్యార్థులకు ఉచిత శిక్షణ అందించే ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు 79816 96481, 93900 59900, 99595 07507 నంబర్లలో సంప్రదించాలని కోరారు. ద్వారకాతిరుమలలో వర్షంతో ఇక్కట్లు ద్వారకాతిరుమల: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ప్రజలను ఇక్కట్లకు గురి చేస్తున్నాయి. ద్వారకాతిరుమలలో గురువారం సాయంత్రం కురిసిన వర్షానికి తూర్పువీధిలోని డ్రెయినేజీలు పొంగిపొర్లడంతో రోడ్డుపైకి మురుగు నీరు, చెత్తాచెదారం చేరింది. కాలినడకన రాకపోకలు సాగించిన స్థానికులు, భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అలాగే టీటీడీ కాంప్లెక్స్ వద్ద ప్రధాన రహదారిపై వర్షపు నీరు నిలిచిపోయింది. గ్రామంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. గోదావరిలో గల్లంతైన మృతదేహం లభ్యం యలమంచిలి: చించినాడ వశిష్ట గోదావరి వంతెన మీద నుంచి బుధవారం గోదావరిలోకి దూకి గల్లంతైన యువకుడి మృతదేహం గురువారం లభ్యమైనట్లు ఎస్సై కె గుర్రయ్య తెలిపారు. వంతెనపై దొరికిన బైక్, సెల్ ఫోన్ ఆధారంగా అతను భీమవరం మండలం తాడేరు గ్రామానికి చెందిన షేక్ కాసు (24)గా గుర్తించిన స్థానికులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. చించినాడ వచ్చిన తల్లిదండ్రులు బైక్, సెల్ఫోన్ తమ కుమారుడివేనని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు గోదావరిలో గాలించగా గురువారం మృతదేహం లభ్యమైంది. శవ పంచనామా చేసి, పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం చేసిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్సై వివరించారు. -
ఉపాధ్యాయులకు బదిలీ కష్టాలు
నిడమర్రు : ఉపాధ్యాయ బదిలీలు ఈనెల 22వ తేదీ నుంచి విద్యాశాఖ ప్రారంభించింది. నేటి వరకూ ఈ ప్రక్రియ మొత్తం ఆన్లైన్ వేదికగా కొనసాగుతోంది. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయుల బదిలీలు పూర్తయింది. నియామక ఉత్తర్వులు కూడా జారీ చేశారు. మిగిలిన 94 ఖాళీలకు గురువారం ఏలూరు డీఈఓ కార్యాలయంలో అర్హతగల ఎస్ఏలకు పదోన్నతులు కల్పించి గ్రేడ్–2 హెచ్ఎంలుగా మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించి భర్తీ చేశారు. తర్వాత పీఎస్ హెచ్ఎంలకు, స్కూల్ అసిస్టెంట్, పండింట్లకు ఆన్లైన్లోనే బదిలీల ప్రక్రియ నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. కానీ ఎస్జీటీల బదిలీల విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఎస్జీటీలకు ఆఫ్లైన్లో బదిలీలు చేపడతామని పాఠశాల విద్య ఉన్నత అధికారులు ఉపాధ్యాయ సంఘాల నేతల చర్చల సమయంలో అంగీకారం తెలిపారు. దీంతో ఎస్జీటీలకు కొంత సౌలభ్యం లభించిందని అందరూ భావించారు. కానీ ప్రభుత్వం విడుదల చేస్తున్న జీవోల్లో మాత్రం అన్ని వర్గాల ఉపాధ్యాయులతోపాటు ఎస్జీటీలకు ఆన్లైన్లో బదిలీలు పూర్తయ్యేలా మార్గదర్శకాలు జారీ చేశారు. షెడ్యూల్ ప్రకారం జూన్ 7 నుంచి 10 వరకూ ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలని 11వ తేదీన నూతన పాఠశాలల బదిలీ ఆర్డర్స్ విడుదలవుతాయంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో ఎస్జీటీలు గందరగోళంలో పడ్డారు. ఉన్నత అధికారుల హామీ ప్రకారం మాన్యువల్ బదిలీలే చేపట్టాలని ఎస్జీటీలు పట్టుపడుతున్నారు. కానీ అధికారులు మాన్యువల్ బదిలీల వల్ల అనేక సమస్యలు వస్తాయని ఆన్లైన్ బదిలీలే పరిష్కారం అంటూ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఈ విషయంపై ప్రభుత్వం ఏవిధమైన జీవో ఇంత వరకూ ఇవ్వలేదని సంఘాలు చెబుతున్నాయి. పోస్టుల ఖాళీల స్పష్టతకే ఆఫ్లైన్ జిల్లా విద్యాశాఖాథికారి కార్యాలయంలో జరిగే ఆఫ్లైన్ బదిలీల ప్రక్రియ అందరికీ సౌకర్యవంతంగా ఉంటుందని ఎస్జీటీలు అభిప్రాయపడుతున్నారు. అక్కడే ఉపాధ్యాయుడికి వచ్చిన పాయింట్ల ఆధారంగా మండలాల్లోని పాఠశాలలు ప్రదర్శిస్తారు. అక్కడ పాఠశాల వివరాలు తెలుసుకుని ఐచ్ఛికాలు ఎంపిక చేసుకుంటే. ఎక్కడికి బదిలీ అవుతుందనేది స్పష్టంగా తెలిసిపోతుంది. దీంతో అప్పటికే పోస్టులు క్లోజ్ అయిన పాఠశాలల వివరాలు ప్రదర్శిస్తుండటంతో మారాల్సిన పాఠశాలలను ఎంపిక చేసుకునే వీలుంటుంది. దీంతో ఐచ్ఛికాల ఎంపిక సంఖ్య కూడా చాలా వరకూ తగ్గిపోతుంది. తప్పులు చేసే అవకాశం ఉండదని సంఘాలు ముందు నుంచి అధికారులకు చెబుతున్నారు. మాన్యువల్ చేపడితే ఇబ్బందులు ఇలా.. తాజా బదిలీల్లో జిల్లాలో 2,861 మంది ఎస్జీటీలు బదిలీల జాబితాలో ఉన్నారు. వీరంతా ఐచ్ఛికాలు (ఆప్షన్స్) ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆన్లైన్ విధానంలో ఐచ్ఛికాలు ఎంపిక చేసుకోవడం కష్టతరంగా ఉంటుందని వీరు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళా టీచర్లు, సీనియర్ టీచర్లు ఆన్లైన్ విధానం అలవాటు లేకపోవడం, కంప్యూటర్ పరిజ్ఞానం లేకపోవడం వల్ల ఆప్షన్స్ ఎంపిక చేసుకునే క్రమంలో తప్పులు నమోదు చేస్తే దూరంగా పోస్టింగ్ వస్తుందని ఆందోళన వ్యక్త చేస్తున్నారు. దీంతోపాటు ఆన్లైన్ విధానంలో వందల సంఖ్యలో ఆప్షన్లు ఎంపిక చేసుకోవాల్సి వస్తుందని ఈ విధానం వల్ల కనీసం ఆయా మండలాల్లోని పాఠశాల స్థితిగతులు కూడా తెలియవని అంటున్నారు. ఎస్జీటీల బదిలీలపై స్పష్టత కరువు! ఆఫ్లైన్లో చేపడతామని అధికారుల హామీ నేటి వరకూ ఉత్తర్వులివ్వని పాఠశాల విద్యాశాఖ ఆన్లైన్లో తప్పులు దొర్లుతాయని గురువుల ఆందోళన ఉమ్మడి జిల్లాలో బదిలీల జాబితాలో 2861 ఎస్జీటీలు ఆన్లైన్ వల్ల నష్టపోతున్నాం ఉంగుటూరు మండలం తల్లాపురం యూపీ స్కూల్లో ఎస్జీటీగా విధులు నిర్వహిస్తూ 2023 చేపట్టిన ఆన్లైన్ బదిలీల్లో కుక్కునూరు మండలం కమ్మరిగుడెం ప్రాథమిక పాఠశాలకు వెళ్లాల్సి వచ్చింది. వెబ్ ఆప్షన్స్ ఇచ్చే వరుస క్రమంలో దొర్లిన పొరపాటు కారణంగా అంత దూరం వెళ్లాల్సిన పరిస్థితి. ఆన్లైన్ బదిలీల వల్ల అనేక మంది ఎస్జీటీలు నష్టపోతున్నారు. – కె. కమల్కుమార్, ఎస్జీటీ, ఉంగుటూరు ఆఫ్లైన్ బదిలీలపై ఉత్తర్వులు ఇవ్వాలి ఉపాధ్యాయ సంఘాల నేతల చర్చల్లో విద్యాశాఖ ఉన్నత అధికారులు ఎస్జీటీలకు మాన్యువల్ బదిలీలు చేపడతామని హామీ ఇచ్చారు. కానీ ఉపాధ్యాయుల బదిలీల మార్గదర్శకాల ఉత్తర్వుల్లో ఎస్జీటీలంతా ఆన్లైన్లోనే దరఖాస్తులు, వెబ్ ఆప్షన్స్, జాయినింగ్ ఆర్డర్స్ అంటూ ఉత్తర్వులు ఇవ్వడం తగదు. వెంటనే జిల్లా కేంద్రాల్లో మాన్యువల్ బదిలీలకు ఉత్వరులు ఇవ్వాలి. – సీహెచ్ శ్రీధర్, యూటీఎఫ్ అధ్యక్షుడు, ఉంగుటూరుఅధికారుల నుంచి స్పష్టత రావాలి ఉన్నత అధికారులు జారీ చేసిన బదిలీల ఉత్తర్వుల్లో జూన్ 7 నుంచి 10వ తేదీ వరకూ ఎస్జీటీలు ఆన్లైన్లోనే వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాల్సి ఉంది. ఇప్పటి వరకూ అన్ని కేటగిరి బదిలీలు, వెబ్ ఆప్షన్స్, ఆర్డర్స్ అన్నీ ఆన్లైన్లో పారదర్శకంగా జరుగుతున్నాయి. ఎస్జీటీలకు మాన్యువల్ ట్రాన్సఫర్ విషయంపై ఇప్పటి వరకూ ఎటువంటి అధికారిక సమాచారం లేదు. – ఏవీఎస్ఎస్ భాస్కరకుమార్, ఎంఈవో, నిడమర్రు -
రజకుల చెరువులను సర్వేచేసి హద్దులు నిర్ణయించాలి
జంగారెడ్డిగూడెం:జిల్లాలోని అనేక రజకుల చెరువులు ఆక్రమణలకు గురయ్యాయని, దీంతో రజక వృత్తికి ఆటంకం ఏర్పడుతుందని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రజకజన సంఘ అధ్యక్షుడు, రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శి చిలకలపల్లి కట్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రజక చెరువుల ఆక్రమణలకు అడ్డుకట్ట పడాలంటే చెరువులను సర్వేయర్లతో సర్వే చేయించి హద్దులు నిర్ణయించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గురువారం జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం మండలాల్లో ఆక్రమణలకు గురైన చెరువులను రజక సంఘాలతో కలిసి పరిశీలించి అధికారులతో మాట్లాడారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో రజకులకు సుమారు 50 ఏళ్ల క్రితం కేటాయిచిన 3.11 ఎకరాల కోనేరు చెరువు ఆక్రమణలకు గురవ్వడంతో రజక వృత్తి చేసుకునేందుకు రజకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిపై గ్రామ కార్యదర్శి నాగేశ్వరరావుతో మాట్లాడగా చెరువుని రజకులకు ఉపయోగపడే విధంగా చేస్తామని తెలిపారన్నారు. చెరువులో సరిగా నీరు లేనందున లీజు రూ. 11వేలు రద్దు చేయాలని కోరారు. ఉమ్మడి జిల్లా రజక సంఘ మహిళా అధ్యక్షురాలు మెట్ట లక్ష్మీ ప్రసన్న, గ్రామ రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.నీకు భారం కాలేను.. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో.. భర్తకు మెసెజ్ పెట్టి గోదావరిలో దూకి వివాహిత ఆత్మహత్యఏలూరు టౌన్: అన్నింటికీ నీపై ఆధారపడుతున్నాను.. ఇక నీకు భారం కాలేను.. పిల్లల్ని జాగ్రత్తగా చూస్కోండి అంటూ భర్తకు ఫోన్లో మెసెజ్ పెట్టి ఓ వివాహిత గోదావరిలోకి దూకి తనువు చాలించింది. వివరాలు ఇలా ఉన్నాయి. రాజమండ్రి లాలా చెరువు స్పిన్నింగ్ మిల్లు ప్రాంతానికి చెందిన సుంకరం రామకృష్ణ, కళ్యాణి (32) దంపతులు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. ఏలూరు శాంతినగర్ 21 వ డివిజన్ సచివాలయంలో కళ్యాణి ఏఎన్ఎంగా పనిచేస్తుండడంతో ఆమె కుటుంబంతో స్థానికంగానే నివాసముంటున్నారు. రెండేళ్ల క్రితం ఆమెకు ఒక రోడ్డు ప్రమాదంలో కాలికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమె సరిగా నడవలేని పరిస్థితిలో భర్తపై ఆధారపడి జీవనం సాగిస్తోంది. ఆమె చేస్తున్న ఉద్యోగంలో, కుటుంబ జీవనంలోనూ భర్తపై ఆధారపడుతోంది. ఒకవైపు కరోనా వ్యాప్తి చెందుతుందనే భయం, మరోవైపు పని భారం పెరగడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఆమె బుధవారం ఎవరికీ చెప్పకుండా రాజమండ్రి వెళ్లింది. భర్త రామకృష్ణకు ఫోన్లో.. ప్రతి పనికి నీ మీద ఆధార పడి ఉంటున్నా.. నిన్ను ఇబ్బంది పెడుతున్నాను.. నాకు జీవితంపై విరక్తి కలిగింది.. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అని మెసేజ్ పెట్టింది. దీంతో ఏలూరు త్రీ టౌన్ పోలీస్స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా సెల్ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేశారు. లొకేషన్ రాజమండ్రిలో చూపించగా అక్కడకు వెళ్లి వెదికారు. తీరా చూస్తే ఆమె గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై రాజమండ్రి త్రీ టౌన్ సీఐ వీ అప్పారావు ఆధ్వర్యంలో మృతదేహాన్ని రాజమండ్రి సర్వజన ఆసుపత్రి మార్చురీకి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. రాజమండ్రి త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
సినిమా థియేటర్లలో తనిఖీలు
ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరు జిల్లావ్యాప్తంగా సినిమా థియేటర్లలో రెవెన్యూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు థియేటర్లను పరిశీలిస్తున్నారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో థియేటర్లను గురువారం రెవెన్యూ అధికారులు తనిఖీ చేశారు. థియేటర్ల నిర్వహణ, ప్రజలకు సౌకర్యాల ఏర్పాటు, క్యాంటిన్లలో ధరలు తదితర అంశాలు, రికార్డులను పరిశీలించారు. ఏలూరులో అంబికా థియేటర్, సాయి బాలా జీ థియేటర్, సత్యనారాయణ థియేటర్లలో తహ సీల్దార్ జీవీ శేషగిరి తనిఖీ చేశారు. ఓ థియేటర్లోని క్యాంటిన్లో కూల్ డ్రింకులు, వాటర్ బాటిల్స్ అధి క ధరలకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. జంగారెడ్డిగూడెంలో థియేటర్లను అక్కడి తహసీల్దార్ తనిఖీ చేశారు. కై కలూరులో విజయలక్ష్మి, వెంకటరమణ థియేటర్లను తహసీల్దార్ ఎండీ ఇబ్రహీం, భీమ డోలులో శ్రీనివాసా ఽథియేటర్ను తహసీల్దార్ ర మాదేవి తనిఖీ చేశారు. బంద్ పిలుపు కారణంగానే.. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఎగ్జిబిటర్లు నిర్మాతలతో సమావేశమై థియేటర్ల నిర్వహణపై పలు నిర్ణ యాలు తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా థియేటర్లలో ప్రదర్శనలు అద్దె ప్రాతిపదికన కాకుండా సినిమాకు వచ్చే లాభాల ప్రాతిపదికన ఉండాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. అలా లాభాల్లో వాటా ఇవ్వని పరిస్థితి వస్తే థియేటర్లను జూన్ 1 నుంచి మూసివేయడానికి నిర్ణయం తీసుకున్నారు. అలాగే కొత్త సినిమా రిలీజైన వెంటనే ఓటీటీల్లో రిలీజ్ చేయకుండా చూడాలని నిర్మాతల ము ందుకు ప్రతిపాదనలు తీసుకువచ్చినట్టు తెలిసింది. అయితే ఆయా నిర్ణయాల వెనుక కుట్రకోణం ఉందని ఉప ముఖ్యమంత్రి భావించినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో థియేటర్ల తనిఖీలకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్టు పలువురు ఎగ్జిబిటర్లు విమర్శిస్తున్నారు. ఇదంతా కేవలం కక్ష సాధింపు చర్యగానే పరిగణిస్తున్నామని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ప్రముఖ ఎగ్జిబిటర్ స్పష్టం చేశారు. జిల్లాలో 42 థియేటర్లు జిల్లాలో గతంలో 90 థియేటర్లు ఉండగా ప్రస్తుతం 42 థియేటర్లు నడుస్తున్నాయి. నియోజకవర్గాల వారీగా ఏలూరులో 15, చింతలపూడిలో 9, నూజివీడులో 5, ఉంగుటూరులో 6, కై కలూరులో 4, పోలవరంలో 3 థియేటర్లలో సినిమాలు ప్రదర్శిస్తున్నారు. బంద్ పిలుపే తనిఖీలకు కారణమంటున్న ఎగ్జిబిటర్లు ఏలూరు జిల్లాలో 42 థియేటర్లు నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేస్తున్న అధికారులు బంద్ విరమించారు సినీ పరిశ్రమలో ఎగ్జిబిటర్ల పాత్ర ఎంతో కీలకం. ఇటీవల థియేటర్ల నిర్వహణ కష్టసాధ్యంగా మారింది. నిర్వహణ వ్యయం కూడా రాని పరిస్థితి. దీంతో ఎగ్జిబిటర్లు బంద్ నిర్ణయం తీసుకున్నారు. అయితే పరిశ్రమ పెద్దలు మధ్యవర్తిత్వంతో తెలుగు చిత్రసీమ ప్రయోజనాల కోసం వారు బంద్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. – అంబికా కృష్ణ, సినీ నిర్మాత, ఏలూరు నిర్వహణ సంతృప్తికరం ఏలూరులో థియేటర్లను క్షుణ్ణంగా తనిఖీ చేశాం. ఒకటి రెండు అంశాలు తప్ప అంతా సంతృప్తికరంగా ఉంది. కొన్ని థియేటర్లలోని క్యాంటిన్లలో అధిక ధరలకు కూల్డ్రింక్లు విక్రయంచడాన్ని గుర్తించాం. దీనిపై నిర్వాహకులను హెచ్చరించాం. ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తాం. వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం. – జీవీ శేషగిరి, ఏలూరు తహసీల్దార్ -
ఇంటింటికీ సేవలు దూరం
ఉపాధ్యాయులకు బదిలీ కష్టాలు ఉమ్మడి జిల్లాలో చేపట్టిన ఉపాధ్యాయ బదిలీల్లో ఎస్జీటీల బదిలీలపై స్పష్టత రాలేదు. వీరికి ఆఫ్లైన్లో బదిలీలు చేపట్టనున్నట్టు సమాచారం. 8లో uగడపగడపకూ సేవలు దూరమయ్యాయి.. రేషన్ కోసం బారులు తీరే క్యూలైన్లు.. పెన్షన్ కోసం అప్పుడప్పుడూ సచివాలయాలకు వెళ్లడం.. ఎరువులు, పురుగు మందులు, విత్తనాల కోసం మండల, జిల్లా కేంద్రాలకు పరుగులు.. పంట విక్రయాలకు మిల్లుల వద్ద పడిగాపులు.. ఇది ఏడాది కూటమి పాలనలో జిల్లాలో కనిపిస్తున్న పరిస్థితి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇంటికే పెన్షన్, రేషన్, ఫ్యామిలీ డాక్టర్ పేరిట వైద్యసేవలు, రైతుభరోసా కేంద్రాల్లో పూర్తిస్థాయిలో సేవలు అందగా ప్రస్తుతం ఇవన్నీ మృగ్యంగా మారాయి. అలాగే మరిన్ని వ్యవస్థలను విధ్వంసం చేస్తూ మళ్లీ ప్రజలను కూటమి ప్రభుత్వం రోడ్డెక్కిస్తోంది. శురకవారం శ్రీ 30 శ్రీ మే శ్రీ 2025సాక్షి ప్రతినిధి, ఏలూరు: జిల్లాలో ఏడాది ప్రభుత్వ పాలనతో ప్రజల స్థితిగతులు తలకిందులయ్యా యి. ప్రతిదానికీ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగడం, అర్జీలు ఇవ్వడం, పథకం అమలు చేసినప్పుడు అర్హత ఉంటే అమలు చేస్తామని సమాధానం రావడం, ప్రతి పౌర సేవ కోసం నెలలు తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితిని పాలకులు సృష్టించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో పౌరసేవలు మొదలు సంక్షేమ పథకాల వరకు అన్నీ ఇంటి ముంగిటకే తీసుకువచ్చారు. ప్రధానంగా ప్రతి 50 కు టుంబాలకు ఒక వలంటీర్ను ఏర్పాటు చేసి సేవలందించారు. ఇలా కోవిడ్, గోదావరి వరదల వంటి సంక్షోభ సమయంలోనూ సమర్థవంతమైన సేవలు అందించారు. జిల్లాలో 10,800 మంది వలంటీర్లు పనిచేశారు. వలంటీర్లకు జీతాలు పెంచుతాం, ఉద్యోగాలు కొనసాగిస్తాం అంటూ కూటమి నాయకులంతా గత ఎన్నికల సమయంలో ఊదరగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చిన వెంటనే వలంటీర్ వ్యవస్థను రద్దు చేసి జిల్లాలో 10,800 మంది పొట్టకొట్టారు. రూ.3,897 కోట్ల పెన్షన్ పంపిణీ గత ప్రభుత్వం పెన్షన్ పంపిణీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రతినెలా 1వ తేదీన వేకువజామునే లబ్ధిదారుడి ఇంటికే వెళ్లి వలంటీర్ పింఛన్ అందించేవారు. మధ్యాహ్నం 12 గంటలలోపు 95 శాతానికి పైగా పెన్షన్ల పంపిణీ పూర్తయ్యేది. ఎవరైనా తీవ్ర రుగ్మతలతో దూర ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో ఉంటే వారి వద్దకు వెళ్లి మరీ వలంటీర్లు పింఛన్లు అందించి మన్ననలు పొందారు. జిల్లాలో 2,81,470 పెన్షన్దారులకు ప్రతినెలా సగటున రూ.81.75 కోట్ల చొప్పున ఐదేళ్లలో మొత్తంగా రూ.3,897.85 కోట్ల నగదు పంపిణీ చేశారు. అలాగే రెండేళ్ల పాటు గోదావరి వరదల్లోనూ సుమారు 1,000 మంది వరకు వలంటీర్లు పునరావాస సేవలు, తక్షణ నష్టపరిహార పంపిణీలో కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు ఈ వ్యవస్థనే రద్దు చేయడంతో సమస్యలు మొదటికి వచ్చాయి. పారదర్శకంగా ఇంటికే రేషన్ రేషన్ కోసం పడిగాపులు కాయడం, ప్రతినెలా 1 నుంచి 10వ తేదీ వరకూ రేషన్ షాపుల వవద్ద క్యూలైన్లకు స్వస్థి పలికేలా మొబైల్ డిస్పెన్సరీ యూనిట్ (ఎండీయూ) పేరుతో రేషన్ వాహనాలను గత ప్రభుత్వం తీసుకువచ్చింది. జిల్లాలో 395 వాహనాలను మంజూరు చేసి సబ్సిడీపై వాహనాలను సమకూర్చి ప్రతినెలా ఆపరేటర్కు రూ.21 వేలు జీతం ఇచ్చేలా ఏర్పాటు చేసి 395 మందికి ఉపాధి కల్పించారు. 1,123 రేషన్ షాపులకు 395 వాహనాలను అనుసంధానం చేసి జిల్లాలోని 6,31,044 రేషన్ కార్డుదారులకు ప్రతి నెలా 8,791.03 టన్నుల బియ్యాన్ని, 218.75 టన్నుల పంచదార, కందిపప్పు, గోధుమపిండి, ఆయిల్ ప్యాకెట్లను కార్డుదారుల ఇంటి ముంగిటే పంపిణీ చేసేలా వ్యవస్థను రూపొందించారు. కూటమి ప్రభుత్వం తాజాగా ఈ వ్యవస్థను కూడా రద్దు చేయడంతో ఆపరేటర్లు పోరుబాట పట్టారు. న్యూస్రీల్వ్యవస్థల విధ్వంసం.. ప్రజలకు శాపం పేదింటి తలుపు తట్టిన జగన్ ప్రభుత్వం ఇంటి వద్దకే పథకాలు, రేషన్ సరుకులు, వైద్య సేవలు ప్రజలకు ఈ సేవలను దూరం చేస్తున్న కూటమి ప్రభుత్వం వలంటీర్ వ్యవస్థ తొలగింపు పత్తాలేని ‘ఫ్యామిలీ డాక్టర్’ రేషన్ సరుకుల డోర్ డెలివరీ వ్యవస్థ రద్దు -
కొల్లేరులో అక్రమ తవ్వకాలు
సాక్షి టాస్క్ఫోర్స్: కొల్లేరు అభయారణ్యంలో ఫారెస్ట్ అధికారుల కళ్లు కప్పి గుట్టుచప్పుడు కాకుండా అక్రమ చెరువుల తవ్వకానికి అక్రమార్కులు మరోసారి తెర తీశారు. గురువారం ఏలూరు రూరల్ మండలం మానూరు శివారు హరిపురంలో చెరువు గట్లు ఏర్పాటుచేశారు. కొల్లేరులో చెరువులు తవ్వటానికి అనుమతి లేదని తెలిసినా పనులు ప్రారంభించారు. విషయం తెలిసిన ఫారెస్ట్ అధికారులు ఇక్కడకు చేరుకుని గట్లను యంత్రాలతో ధ్వంసం చేశారు. అయితే గట్లు ఎవరూ వేశారన్నది తెలియదన్నారు. కొల్లేరులో జీఓ 120కు వ్యతిరేకంగా చెరువులు తవ్వితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గిట్టుబాటు ధర కల్పించాలి దెందులూరు: నిమ్మకాయలకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం రామారావుగూడెంలో నిమ్మ తోటలను ఆయన పరిశీలించారు. నిమ్మ ధరలు తగ్గిపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీనివాస్ మాట్లాడుతూ నిమ్మకాయల సీజన్లో ధరలు తగ్గడంతో రైతులు నష్టపోతున్నారన్నారు. 31న ‘20 సూత్రాల’పై సమీక్ష ఏలూరు(మెట్రో): ఏలూరు కలెక్టరేట్లో శనివారం 20 సూత్రాల కార్యక్రమం అమలుపై ఈ కార్యక్రమం చైర్మన్ లంకా దినకర్ అధికారులతో సమీక్షిస్తారు. ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని, మ ధ్యాహ్నం 2.30 గంటలకు విలేకరుల సమావేశం నిర్వహిస్తారని గురువారం కలెక్టరేట్ వర్గాలు ప్రకటనలో తెలిపాయి. ఆస్పత్రిలో పనిచేయని ఫ్రీజర్ నూజివీడు: నూజివీడు ఏరియా ఆస్పత్రిలోని పోస్టుమార్టం గదిలో ఏడాదిగా ఫ్రీజర్ పనిచేయడం లేదు. దీంతో అద్దె ఫ్రీజర్ను ఏర్పాటుచేశారు. అయితే అద్దె రోజుకు రూ.5 వేలను మృతదేహానికి సంబంధించిన వారే చెల్లించాల్సి వస్తుంది. అసలే కుటుంబసభ్యులు బాధలో ఉండగా వారితో అద్దె కట్టించడం దారుణమని, పాడైపోయిన ఫ్రీజర్కు మరమ్మతులు చేయించడం లేదా కొత్త ఫ్రీజర్ను ఏర్పాటుచేయడం చేయాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. రిటర్నులు దాఖలు చేయాలి ఏలూరు (ఆర్ఆర్పేట): సహకార సంఘాలు, సేవా సంఘాలు ఆదాయ పన్ను శాఖకు క్రమం తప్పకుండా రిటర్నులు దాఖలు చేయాలని ఆ దాయ పన్నుశాఖ జాయింట్ కమిషనర్ ప్రతాప్ సింగ్ భూక్యా సూచించారు. గురువారం స్థాని క డీసీఎంఎస్ హాల్లో జిల్లా కో–ఆపరేటివ్ సొసైటీలు రిటర్నుల దాఖలుపై జిల్లా కో–ఆపరేటివ్ కార్యదర్శులు, పర్సన్ ఇన్చార్జిలతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదాయపన్ను శాఖ లాగిన్ ద్వారానే రిటర్నులు దాఖలు చేయాలన్నారు. జిల్లా సహకార శాఖ అధికారి ఆరిమిల్లి శ్రీనివాసు మాట్లాడుతూ జిల్లాలో సొసైటీలన్నీ ఆడిటర్ను సంప్రదిచి రిటర్నులు దాఖలు చేయాలని సూచించారు. ఏలూరు ఆదాయ పన్ను శాఖ అధికారి షేక్ అబ్దుల్ ఖయాం, డివిజనల్ కో– ఆపరేటివ్ అధికారి పి.త్రినాథ్, ఆడి టర్ ఆర్.రాధాకృష్ణ పాల్గొన్నారు. వెదురు సాగుకు సన్నాహాలు బుట్టాయగూడెం: డ్వాక్రా సంఘాల మహిళల ద్వారా వెదురు సాగును ప్రోత్సహిస్తున్నట్టు మా నవ వనరుల అభివృద్ధి పథకం జిల్లా అసిస్టెంట్ మేనేజర్ ఈ.వేణుగోపాల్ తెలిపారు. గురువారం స్థానిక వెలుగు కార్యాలయంలో డ్వాక్రా సంఘాల వీఓఏలకు వెదురు సాగుపై శిక్షణ ఇచ్చా రు. బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాలను వెదురు సాగుకు పైలెట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేశామన్నారు. 500 గ్రామ సంఘాల సభ్యులను ఎంపిక చేసి ఒక్కొక్కరూ 35 సెంట్లలో సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. కుటుంబం ఆత్మహత్యాయత్నం జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెంలో ఓ కు టుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాలిలా ఉన్నాయి.. పట్టణానికి చెందిన మంగిన సత్య దుర్గ చంద్రరరావు (చంద్రం), భార్య కృష్ణజ్యోతి, కుమారుడు దుర్గాచరణ్, కు మార్తె కోమలి గురువారం కూల్డ్రింక్లో కలు పు మందు కలిపి తాగారు. చుట్టుపక్కల వారు గమనించి స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసి వీరిని మె రుగైన వైద్యం కోసం విజయవాడ తరలించా రు. ఆర్థిక ఇబ్బందులు, అప్పులు కారణంగా తె లుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం
ద్వారకాతిరుమల: జిల్లాలో ప్రకృతి వ్యవసాయంలో సాగు విస్తీర్ణాన్ని పెంచాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. మండలంలోని ద్వారకాతిరుమల, గుండుగొలనుకుంట, సూర్యచంద్రరావుపేట గ్రామాల్లో గురువారం ఆమె పర్యటించి వ్యవసాయ, అనుబంధ రంగాల సాగు పద్ధతులను పరిశీలించారు. ద్వారకాతిరుమలలో ఫార్మ్ పాండ్స్ను, గుండుగొలనుగుంటలోని సుబ్రహ్మణేశ్వర ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రాన్ని సందర్శించారు. జిల్లాలో ఈ ఏడాది అదనంగా 10 వేల ఎకరాల్లో ప్రకృతి సాగు లక్ష్యాన్ని సాధించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాయన్నారు. సూర్యచంద్రరావుపేట లో బలుసు వీరభద్రయ్య క్షేత్రాన్ని పరిశీలించారు. కోకో రైతులు ఆందోళన చెందవద్దని, కోకో కిలో రూ.500 చొప్పున కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. అనంతరం పశుగ్రాసం విత్తనాలను కలెక్టర్ అధికారులతో కలిసి పొలంలో చల్లారు. అనంతరం భీమడోలు మండలం పొలసానిపల్లిలోని ఎస్ఎంఆర్ జీడిపప్పు ప్రాసెసింగ్ సెంటర్ను కలెక్టర్ సందర్శించారు. యోగాతో ఆరోగ్యం యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ద్వారకాతిరుమలలోని ఏపీ టూరిజం హరిత హోటల్ వద్ద గురువారం జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి, ఆర్డీఓ రమణ, ప్రజలతో కలిసి కలెక్టర్ వెట్రిసెల్వి యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవన విధానానికి యోగా దోహదపడుతుందన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ మాలిని, పర్యాటకాభివృద్ధి అధికారి పట్టాభిరామయ్య, తహసీల్దార్ జేవీ సుబ్బారావు, ఎంపీడీఓ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ వెట్రిసెల్వి -
గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ల పంపిణీ
సంవత్సరం లబ్ధిదారులు లబ్ధి (రూ.కోట్లలో) 2019–20 2,47,215 713.14 2020–21 2,59,198 745.25 2021–22 2,60,561 785.44 2022–23 2,70,547 813.62 2023–24 2,81,470 840.40 బియ్యం కోసం కష్టాలు తప్పవు రేషన్ బియ్యం కోసం గిరిజనులు కాలినడకన వెళ్లి కష్టాలు పడక తప్పదు. ఇంటింటికీ రేషన్ విధానం రద్దు వల్ల ప్రజలు అవస్థలు పడతారు. కూలీ పనులు మానుకుని మరీ క్యూలో నిలుచుని రేషన్ సరుకులు తీసుకోవాల్సి వస్తుంది. రేషన్ డోర్ డెలివరీ వల్ల ఇలాంటి ఇబ్బందులు ఉండేవి కాదు. ఎండీయూ వాహనాల ద్వారానే రేషన్ బియ్యం అందించాలి. లేకుంటే గిరిజన గ్రామాల ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. – కారం రాఘవ, న్యూడెమోక్రసీ నాయకుడు, అలివేరు, బుట్టాయగూడెం మండలం -
దళిత యువకులపై పోలీసుల తీరు దారుణం
చింతలపూడి: తెనాలిలో దళిత, మైనార్టీ యువకులపై పోలీసులు జరిపిన దుశ్చర్యపై దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం చింతలపూడిలో నిరసన తెలిపారు. దళిత సంఘాల ఐక్య జేఏసీ నాయకులు ఎం.ఇమ్మానియేలు, దారా వీరేంద్ర, బుచ్చిబాబు మాట్లాడుతూ పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని దళితులు, మైనార్టీ యువకులపై దాడులకు దిగడం, ప్రజల సమక్షంలో నడిరోడ్డుపై థర్డ్ డిగ్రీ ఉపయోగించి లాఠీలతో చితకబాదటంపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. పోలీసులపై చర్యలు తీసుకునే వరకూ తమ ఉద్యమం ఆగదని హెచ్చరించారు. రాష్ట్రంలో దళితులు మైనార్టీలు అంటే ప్రభుత్వానికి, అధికారులకు ఇంత చిన్నచూపా అంటూ ప్రశ్నించారు. ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సొంత నియోజవర్గంలో దళితులను వెలివేసిన సంఘటన మరువక ముందే తెనాలిలో దళిత యువకులపై దాడులు చేయడంపై ప్రభుత్వం స్పందించాలని అన్నారు. పవన్ కల్యాణ్ సొంత ఇలాకాలో దళితులను వెలివేసినా ఆయన ఇంతవరకు స్పందించకపోవడం దారుణం అన్నారు. జేఏసీ నాయకులు సుందరమ్మ, బూసి నాగేశ్వరరావు, జూపూడి వసంత, భాను తదితరులు పాల్గొన్నారు. -
అడుగంటిన మంచినీటి చెరువులు
భీమవరం అర్బన్: జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో రక్షిత మంచినీటి చెరువులు అడుగంటాయి. దీంతో ప్రజలు తాగునీటికి ఇక్కట్లు పడుతున్నారు. వేసవి ప్రారంభంలో అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా చెరువులను పూర్తిస్థాయిలో నీటితో నింపకపోవడమే సమస్యకు కారణమని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. భీమవరం మండలంలోని గొల్లవానితిప్ప, కొత్తపూసలమర్రు, దొంగపిండి, గూట్లపాడు, చినఅమిరం, కొవ్వాడ అన్నవరం, పెదగరువు, బేతపూడి తదితర గ్రామాల్లో రక్షిత మంచినీటి చెరువులు అడుగంటాయి. దీంతో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఫిల్టర్ బెడ్లు పనిచేయకపోవడంతో బురద నీటినే పంచాయతీ సిబ్బంది కుళాయిల ద్వారా అరకొర సరఫరా చేస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రతి ఏటా ఏప్రిల్ 15 తరువాత ఎప్పుడైనా పంటకాలువలు కట్టేస్తారు. ముందు జాగ్రత్తచర్యగా ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ, ఇరిగేషన్ శాఖల సమన్వయంతో మార్చి నెలాఖరు నుంచే రక్షిత మంచినీటి చెరువులు తాగునీటిని నింపాల్సి ఉంది. అయితే ఈ ఏడాది పెదగరువు, బేతపూడి గ్రామాల్లో రక్షిత మంచినీటి చెరువుల్లోను పూడిక తీత పనులు నిర్వహించడం, మిగిలిన గ్రామాల్లో ఏప్రిల్ చివరి వరకు తాగునీటి చెరువులను నింపకపోవడంతో మే నెల గడవకముందునే రక్షిత మంచినీటి చెరువులు అడుగంటాయి. అంతేకాకుండా కొన్ని గ్రామాల్లో వాడుక చెరువులలో నీటిని సైతం నింపకపోవడంతో అటు తాగునీటికి, ఇటు వాడకానికి నీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుళాయిల ద్వారా అరకొర సరఫరా పంచాయతీ సిబ్బంది రోజుకు గంట మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారని, ఆ నీరు కూడా బురదమయంగా ఉంటోందని గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో 20 లీటర్ల మినరల్ వాటర్ రూ.30 నుంచి రూ.35కు కొనుగోలు చేసి తాగుతున్నామని, స్థోమత లేనివారు కుళాయిల ద్వారా వచ్చే బురదనీటినే తాగి అనారోగ్యాల పాలవుతున్నామని బాహాటంగానే చెబుతున్నారు. గ్రామాల్లో దాహం కేకలు చెరువులను పూర్తిస్థాయిలో నింపకపోవడంతోనే సమస్య బురద నీరు వస్తుంది కుళాయిల ద్వారా రోజుకు ఒక గంట మాత్రమే తాగునీరు ఇస్తున్నారు. అది కూడా బురదగా వస్తుంది. ఇంటి వాడకానికే తప్ప తాగడానికి ఆ నీరు పనికి రావడం లేదు. డబ్బులుంటే మినరల్ వాటర్ కొనుక్కుని తాగుతున్నాం. లేకుంటే ఆ నీటినే తాగాల్సి వస్తుంది. – మేళం సోమన్న, గ్రామస్తుడు, గొల్లవానితిప్ప గంట మాత్రమే ఇస్తున్నారు గ్రామానికి శివారు కావడంతో రోజుకు గంట మాత్రమే తాగునీటిని ఇస్తున్నారు. ఇంటింటికి కుళాయిలు ఇవ్వలేదు. పంచాయతీ కుళాయిల ద్వారా వచ్చే నీటినే తెచ్చుకుంటున్నాం. అవి మురికిగా వస్తున్నాయి. – దేవిరెడ్డి వెంకటలక్ష్మి, గృహి ణి, హౌసింగ్ కాలనీ, గొల్లవానితిప్ప -
వైఎస్సార్ విగ్రహం పాక్షిక ధ్వంసం
పెంటపాడు: పెంటపాడులోని వెలంపేట కోనేరు చెరువు వద్ద దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని బుధవారం వేకువజామున గుర్తుతెలియని వ్యక్తులు పాక్షికంగా ధ్వంసం చేశారు. విగ్రహం ఎడమ చేయి మోచేతి వరకూ విరిగి కింద పడి ఉంది. గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు బర్ల జయ రాంబాబు ఈ విషయాన్ని ముందుగా గుర్తించారు. మంగళవారం రాత్రి వరకూ విగ్రహం బాగానే ఉందని, ఉదయం చూస్తే ఇలా చేయి విరిగి పడి ఉందని వైఎస్సార్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. కడపలో టీడీపీ మహానాడు జరుగుతున్న సమయంలో ఇక్కడ వైఎస్సార్ విగ్రహం ధ్వంసం కావడం చర్చనీయాంశమైంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగనమోహన్రెడ్డి జిల్లాలో ఓదార్పు యాత్ర చేసిన సమయంలో ఈ విగ్రహాన్ని స్వయంగా ఆవిష్కరించారు. విగ్రహం జీవ కళ ఉట్టిపడేలా ఉందని శిల్పిని, నిర్వాహకులను అభినందించారు. అప్పటి నుంచి ఇక్కడ పలు కార్యక్రమాలను వైఎస్సార్ అభిమానులు నిర్వహిస్తున్నారు. మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య పెదవేగి : అప్పుల బాధ తట్టుకోలేక మనస్తాపానికి గురై ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల ప్రకారం.. పెదవేగి మండలం కె కన్నాపురం గ్రామానికి చెందిన కమిలి భాస్కరరావు (35) గృహ నిర్మాణ అవసరాల నిమిత్తం కొంత కాలం క్రితం ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ నుంచి అప్పు తీసుకొని తిరిగి చెల్లించలేదు. దీంతో రికవరీ ఏజెంట్లు అప్పు చెల్లించాలని ఒత్తిడి చేయగా మనస్తాపానికి గురైన భాస్కరరావు బుధవారం ఇంటి సమీపంలోని కోకో తోటలో చెట్టుకు కరెంట్ వైరుతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతదేహాన్ని పోలీసులు శవపంచనామా నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడి దుర్మరణం పెంటపాడు: ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు దుర్మరణం పాలైన ఘటన బుధవారం తాడేపల్లిగూడెం– భీమవరం రోడ్డులో ముదునూరు వద్ద జరిగింది. పెంటపాడు ఎస్సై స్వామి తెలిపిన వివరాలివి. ఆరుగొలను గ్రామానికి చెందిన అడ్డగర్ల సాయి రమేష్ (34) కరెంట్ పని చేస్తుంటాడు. బుధవారం పనినిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లి తిరిగి మోటార్ సైకిల్పై స్వగ్రామం వస్తుండగా ముదునూరు మలుపు వద్ద భీమవరం వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. -
దోపిడీ కేసులో నిందితుల అరెస్టు
జంగారెడ్డిగూడెం: పట్టణంలో ఒక మహిళ కంట్లో కారం కొట్టి ఆమె మెడలోని సూత్రాలతో సహా బంగారు గొలుసుని దోపిడీ చేసిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు.రవిచంద్ర తెలిపారు. బుధవారం స్థానిక పోలీసు సర్కిల్ కార్యాలయంలో ఆయన వివరాలను వెల్లడించారు. జంగారెడ్డిగూడెంకు చెందిన మునగాల జానకీ దేవి, ఆమె భర్త శ్రీరామశాస్త్రి ప్రభుత్వ టీచర్లుగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. ఇల్లు మరమ్మతుల నిమిత్తం తాపీ పనివారిని పెట్టుకున్నారు. ఈ నెల 23న తాపీ పనిచేసేందుకు పేరంపేటకు చెందిన చింతపల్లి రామాంజనేయులు అలియాస్ అంజిబాబు, నక్కా శ్రీను అలియాస్ పండు, యడ్లపల్లి విజయరాజు వచ్చారు. వారు పని ప్రారంభించగా శ్రీరామశాస్త్రి టిఫిన్ తెచ్చేందుకు బయటకు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన ఆ ముగ్గురు జానకీ దేవి కంట్లో కారం కొట్టి నాలుగు కాసుల బంగారు గొలుసు, మంగళసూత్రాలతో సహా దోచుకుపోయారు. ఈ ఘటనకు సంబంధించి నిందితులను సీఐ కృష్ణబాబు అరెస్ట్ చేసి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల అరెస్టుకు సంబంధించి ఎస్సై షేక్ జబీర్ ఏఎస్సై ఎన్వీ సంపత్కుమార్, కానిస్టేబుళ్లు ఎన్.రమేష్, రాజశేఖర్ సహకరించగా, వీరిని డీఎస్పీ రవిచంద్ర అభినందించారు. సమావేశంలో సీఐ కృష్ణబాబు, ఎస్సై షేక్ జబీర్ పాల్గొన్నారు. -
విద్యుత్ షాక్తో యువకుడి మృతి
చాట్రాయి: ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. మండలంలోని పోలవరం గ్రామానికి చెందిన పరసా ఈశ్వరరావు ఇంటి పక్కన ఉన్న 11 కేవీ వైరు ఇంటి సర్వీస్ వైరుపై పడి ఇల్లంతా విద్యుత్ ప్రసారం అయ్యింది. ఆ సమయంలో గదిలో నిద్రపోతున్న పరసా ప్రభు కిరణ్(18) బోర్డులో స్విచ్ ఆపుతుండగా విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చింతలపూడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఐ రామకృష్ణ తెలిపారు. గోదావరిలో దూకిన యువకుడి గల్లంతు యలమంచిలి: మండలంలోని చించినాడ వశిష్ట గోదావరి వంతెన మీద నుంచి దూకి యువకుడు గల్లంతైనట్లు ఎస్సై కె గుర్రయ్య తెలిపారు. వంతెనపై దొరికిన బైక్, సెల్ఫోన్ ఆధారంగా అతడు భీమవరం మండలం తాడేరు గ్రామానికి చెందిన షేక్ కాసు (24)గా అనుమానిస్తున్నారు. ఈ మేరకు షేక్ కాసు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆయన వివరించారు. ఎకై ్సజ్ కేసుల్లో నలుగురి బైండోవర్ భీమవరం: ఎకై ్సజ్ కేసులకు సంబంధించి భీమవరం మండలంలోని నలుగురు వ్యక్తులను బుధవారం భీమవరం తహసీల్దార్ ఆర్ రాంబాబు వద్ద బైండోవర్ చేసినట్లు భీమవరం ఎకై ్సజ్ సీఐ కె బలరామరాజు చెప్పారు. బైండోవర్ చేసిన వారిలో ఇళ్ల శ్రీనివాసరావు, యెలుదూటి నాగన్న, యల్ల శేఖర్, బడుగు రవి ఉన్నారన్నారు. వీరు ఏడాది కాలంలో మరోసారి ఎకై ్సజ్ నేరంలో పట్టుబడితే రూ.లక్ష జరిమానా చెల్లించాల్సి ఉంటుందని సీఐ తెలిపారు. చికిత్స పొందుతూమహిళ మృతి భీమవరం: రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు భీమవరం వన్టౌన్ పోలీసులు బుధవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. ఈనెల 24వ తేదీన వీరవాసరం మండలం పంజావేమవరం గ్రామానికి చెందిన కొడమంచిలి మేరి(35) భర్తతో కలిసి మోటారు సైకిల్పై భీమవరం వస్తుండగా పోలీసుబొమ్మ సెంటర్ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. దీంతో మేరి తీవ్రంగా గాయపడగా గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. వన్టౌన్ ఎస్సై ఎస్వీవీఎస్ కృష్ణాజీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.