breaking news
Eluru
-
బాణసంచా.. తస్మాత్ జాగ్రత్త!
భీమవరం: దీపావళి అంటే పిల్లలు, పెద్దలు అందరికీ పండుగే. పండుగకు 15 రోజుల ముందునుంచే బాణసంచా తయారీ, కొనుగోలుపై దృష్టిపెడతారు. గత కొన్నేళ్లుగా వివిధ రకాల కంపెనీల బాణసంచా మార్కెట్లోనికి రావడంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో బాణసంచా విక్రయ కేంద్రాలు ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా భీమవరం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం, ఆచంట తదితర ప్రాంతాల్లో తాత్కాలికంగా బాణసంచా దుకాణాలు ఏర్పాటుచేసుకోడానికి 200కు పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. భీమవరం పట్టణంలో బాణసంచా దుకాణాలు ఏర్పాటుకు 25 మంది దరఖాస్తు చేసుకోగా లూథరన్ హైస్కూల్ ఆవరణలో ఇప్పటికే కొన్ని దుకాణాలు వెలిశాయి. జనావాసాలకు దూరంగా దుకాణాలు పెద్ద సంఖ్యలో ఒకే చోట ఏర్పాటు చేస్తున్నందున ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దుకాణాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవలశాఖ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ● బాణసంచా దుకాణాల వద్ద మండే స్వభావం కల్గిన వస్తువులను ఉంచరాదు. ● ఒక్కొక్క దుకాణం మధ్య కనీసం మూడు మీటర్ల దూరం తప్పనిసరి. ● నూనె, గ్యాస్ దీపాలు వంటివి దుకాణాల్లో పెట్టకూడదు. ● బాణసంచా దుకాణాల వద్ద బాణసంచాను పరీక్షించేందుకు దుకాణ యజమానులు అంగీకరించకూడదు. ● విక్రయదారులు తక్కువ ప్రేలుడు స్వభావాన్ని కలిగిన బాణసంచా మాత్రమే అమ్మకాలు చేయాలి తప్ప స్థానికంగా తయారుచేసిన తారా జువ్వలు, చిచ్చు బుడ్లు, తాటాకు టపాకాయలు, నార బాంబులు వంటివి అనగా ఎక్కువ ప్రేలుడు స్వభావాన్ని కలిగిన గన్ పౌడర్, నైట్రేట్, క్లోరేట్, అల్యూమినియం మిశ్రమంతో తయారు చేసిన మందుగుండును విక్రయించరాదు. ● ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవిస్తే అగ్ని మాపకవాహనం రావడానికి వీలుగా బాణసంచా దుకాణాలను ఏర్పాటు చేసుకోవాలి. దుకాణాల వద్ద 9 లీటర్ల సామర్థ్యం కల్గిన నాలుగు ఫైర్బకెట్స్ను ఏర్పాటు చేసుకోవాలి. రెండిటినీ పొడి ఇసుకతో, మరో రెండింటినీ నీటితోనూ నింపాలి. ● బాణాసంచా దుకాణాల వద్ద పొగ తాగడాన్ని పూర్తిగా నిషేధించాలి. ● దుకాణాల వద్ద స్థానిక ఫైర్ స్టేషన్ టోల్ ఫ్రీ నెంబర్ 101, పోలీసు డిపార్ట్మెంట్ టోల్ ఫ్రీ నెంబర్ 100 ప్రదర్శన బోర్డులను తప్పనిసరిగా ఏర్పాటుచేయాలి. బాణసంచా విక్రయ దుకాణాల వద్ద తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి. దుకాణదారులకు బాణసంచా తయారీకి అనుమతులు లేవు. ఇతరప్రాంతాల నుంచి తీసుకువచ్చి విక్రయించే బాణసంచాను 18 ఏళ్లలోపు పిల్లలకు విక్రయించకుండా తగిన జాగ్రత్తలతో వ్యాపారం చేసుకోవాలి. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – కె శ్రీనివాసరావు, ఏడీఎఫ్వో, భీమవరం -
విద్యార్థుల భవిష్యత్తో ఆటలు!
● గణితం, ఇంగ్లీషు బోధించడానికి ఈసీఈ ఫ్యాకల్టీ! ● ట్రిపుల్ ఐటీలో పీయూసీ బోధన తీరుపై విమర్శలు నూజివీడు: ఇంటి పెద్ద ఇల్లును పట్టించుకోకపోతే ఇల్లు ఎలా గాడి తప్పి పతనమవుతుందో... ఇలాంటి పరిస్థితే ట్రిపుల్ ఐటీలో నెలకొంటోంది. ట్రిపుల్ ఐటీ అంటే ఎంతో ఉన్నత స్థాయి విద్యాసంస్థ అని ప్రజలు భావిస్తుండగా, యాజమాన్యం మాత్రం నవ్వులపాలయ్యే నిర్ణయాలు తీసుకుంటోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన డీఎస్సీలో ట్రిపుల్ ఐటీల్లో పనిచేస్తున్న 10 మంది ఫ్యాకల్టీకి ఉద్యోగాలు రావడంతో వారు ఇక్కడ ఉద్యోగాలకు రిజైన్ చేసి వెళ్లిపోయారు. దీనిలో భాగంగానే నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో నిర్వహిస్తున్న శ్రీకాకుళం పీయూసీలో గణితం, ఇంగ్లీషు బోధిస్తున్న రాజేష్, రమాదేవి అనే ఫ్యాకల్టీకి ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు రావడంతో వారు రిజైన్ చేసి వెళ్లిపోయారు. దీంతో గణితం, ఇంగ్లీషు బోధించేందుకు ఫ్యాకల్టీ అవసరమైంది. ఈ పరిస్థితుల్లో శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ విద్యార్థులకు బోధించే ఈసీఈ డిపార్ట్మెంట్కు చెందిన ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లను పీయూసీలో గణితం, ఇంగ్లీషు సబ్జెక్టులను బోధించేందుకు నియమిస్తూ శ్రీకాకుళం డైరెక్టర్ కేవీజీడీ బాలాజీ ఉత్తర్వులు జారీచేశారు. దీనిపై ట్రిపుల్ ఐటీలోని ఫ్యాకల్టీ సిబ్బందిలోనే విస్మయం వ్యక్తమవుతోంది. ఇంజినీరింగ్లో ఈసీఈ విద్యార్థులకు బోధించాల్సిన అసిస్టెంట్ ప్రొఫెసర్లను పీయూసీలో గణితం, ఇంగ్లీషు సబ్జెక్టులు బోధించడానికి ఎలా నియమిస్తారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెస్సీ, ఎంఏ చదివిన వారు అర్హులు కదా..! పీయూసీలో గణితం బోధించడానికి ఎమ్మెస్సీ గణితం చదివిన వారు, ఇంగ్లీషు బోధించడానికి ఎంఏ ఇంగ్లీషు చేసిన వారు అర్హులు కాగా, ఈసీఈ చదివిన వారు ఎలా చెబుతారో అంతుబట్టడం లేదు. ఎంతో ఉన్నత ప్రమాణాలతో కూడిన ఇంజినీరింగ్ విద్యను అందించే ట్రిపుల్ ఐటీలాంటి సంస్థలో యాజమాన్యం సరైన నిర్ణయాలు తీసుకోకుండా విద్యార్థుల భవిష్యత్ను పణంగా పెట్టడం దారుణం. అర్హత ఉన్న వారు లేకపోతే నియమించుకోవాలే తప్ప ఇలా అనర్హులతో బోధన చేయిస్తే రేపు పరీక్షల్లో మార్కులు తక్కువ వస్తే ఎవరు బాధ్యత వహిస్తారో యాజమాన్యమే బదులివ్వాల్సిన అవసరం ఉంది. పీయూసీ విద్యార్థులకు గణితం, ఇంగ్లీషు సబ్జెక్టులను బోధించడానికి ఈసీఈ ఫ్యాకల్టీని నియమించినప్పటికీ దానిని తిరస్కరించాం. క్వాలిఫైడ్ ఫ్యాకల్టీతోనే బోధన చేయిస్తాం. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ నుంచి వచ్చిన ఆర్డర్ను కుదరదని తిప్పి పంపించాం. – ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్, ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ -
అప్పు చేసి పప్పుకూడు.. ఎన్నాళ్లు ?
పెరుగుతున్న ఖర్చులతో గత కొన్నేళ్లుగా ఇస్తున్న గౌరవ వేతనం నెలకు రూ.3 వేలు సరిపోవడం లేదు. ప్రభుత్వం స్పందించి గౌరవ వేతనం రూ.10 వేలకు పెంచాలి. మూతపడుతున్న స్కూళ్లలో ఎండీఎం కార్మికులు, ఆయాలు రోడ్డున పడుతున్న పరిస్థితి, వీరందరికి ఉద్యోగ భద్రత కల్పించాలి. – మోడియం నాగమణి, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎండీఎం కార్మిక సంఘం బిల్లులు 3, 4 నెలలు ఆలస్యంగా జమవ్వడంతో ప్రతి నెలా అప్పులు చేసి వంటలు చేయాల్సిన సరిస్థితి. పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచితే ఆర్థిక భారం తగ్గుతుంది. యూపీ బిల్లులు జూలై నెల నుంచి పెండింగ్లో ఉన్నాయి. విడతల వారీగా వేయడంతో బ్యాంక్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది. – కాసాని సత్తెమ్మ, నిర్వాహకురాలు, ఎండీఎం ఏజెన్సీనిడమర్రు: ప్రభుత్వ బడుల్లో ప్రవేశాల పెంపునకు, పోషకాహారలోపం నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన నిధులకు గ్రహణం పట్టింది. ఈ పథకం నిర్వాహకులకు నిధులను సకాలంలో చెల్లిచకపోవడంతో వారికి భారమవుతోంది. సరైన సమయానికి బిల్లులు రాకపోయినా, పిల్లల ఆకలి తీర్చడానికి మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు అప్పులు చేసి వండి వడ్డిస్తున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల లెక్కల ప్రకారం ప్రస్తుతం కళాశాలల్లో నిర్వాహకులకు 5 నెలల నుంచి, యూపీ స్కూళ్లలో నిర్వాహకులకు జూలై నుంచి బిల్లులు కూటమి సర్కారు మంజూరు చేయలేదు. మరోవైపు వంట సహాయకులకు ఇచ్చే రూ.3 వేలు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలంటూ విడతల వారీగా ఇస్తున్నారు. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళాశాలల్లో పరిస్థితి మరింత దారుణం గ్రామీణ ఇంటర్ కళాశాలల్లో గత ఏడాది నుంచి అమలవుతున్న భోజన పథకం నిర్వాహకుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వారికి ఫిబ్రవరి నెల నుంచి నిర్వహణ నిధులు కేటాయించకపోవడంతో వారంతా అప్పులు మీద అప్పులు చేసే పరిస్థితి నెలకొంది. ఉంగుటూరు మండలంలో నారాయణపురం, గణపవరం గ్రామాల్లో మాత్రమే రెండు ప్రభుత్వ ఇంటర్ కళాశాలలు ఉన్నాయి. బిల్లులు నెలలుగా బకాయి పడటంతో అప్పుల భారంతో కొన్ని చోట్ల మెనూ సక్రమంగా అమలు చేయడం లేదనే వాదనలు ఉన్నాయి. బియ్యం, గుడ్లు, రాగిపిండి, పప్పు చిక్కీలను ప్రభుత్వం సరఫరా చేసినా, అవసరమైన వంట గ్యాస్, కూరగాయలు, పప్పు, ఇతర వంట సామగ్రి నిర్వాహకులే కొనుగోలు చేసుకోవాల్సి ఉంది. ఇవన్నీ దుకా ణాల వద్ద అరువు తీసుకొచ్చి వంట చేస్తున్నారు. తమకు రావాల్సిన సొమ్ములు ప్రభుత్వం నుంచి అందకపోవడం, అరువు ఇచ్చిన దుకాణదారుల నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో అందినచోట అప్పులు చేసి ఆర్థిక భారానికి గురవుతున్నామని వంట ఏజెన్సీ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చేది అరకొర.. అదీ నెలల తరబడి భోజన పథకం నిర్వాహకులకు మెనూలోని వంటల తయారుకు ఇచ్చేది అర కొర నిధులు, అవి కూడా నెలల తరబడి పెండింగ్లతో అనేక సమస్యలతో వారు సతమతమవుతున్నట్లు చెబుతున్నారు. మెనూ ప్రకారం సోమవారం కూరగాయలు/ ఆకుకూర పప్పు, మంగళవారం పులిహోర, రోటీ పచ్చడి, బుధవారం మిశ్రమ కూరగాయల కూర, గురువారం పలావు, బంగాళ దుంప కుర్మా, శుక్రవారం ఆకు కూర పప్పు, శనివారం మిశ్రమ కూరగాయాల కూర, చక్కెర పొంగల్ వండాలి. వీటితోపాటు రైస్ వండాలి, వారానికి మూడు రోజులు రాగిజావ, గుడ్డును వడ్డించాల్సి ఉంది. వీటి తయారీకి మాత్రం ప్రాథమిక విద్యార్ధులకు రూ. 5.88, 6వ తరగతి నుంచి ఇంటర్ వరకూ రూ.8.57 ఒక్కో విద్యార్థికి వంట, సరుకుల కొనుగోలు ఖర్చుల కింద చెల్లిస్తున్నారు. ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి ఇచ్చే నగదు మార్కెట్లో ఒక్క ఇడ్లీ కూడా రాదంటూ వాపోతున్నారు. ఇటీవల జిల్లా స్థాయిలో ఎండీఎం కార్మికులు ఆందోళన అనంతరం అర కొరగా బిల్లులు మంజూరు చేసినట్లు చెబుతున్నారు. భోజన పథకంలో బిర్యానీ వడ్డిస్తున్న కార్మికులు సమస్యలపై ఎండీఎం నిర్వాహకులు, కార్మికుల ఆందోళన (ఫైల్) ప్రతీ నెలా 5వ తేదీలోపు గౌరవ వేతనం, వంట ఖర్చుల బిల్లులు చెల్లించాలి. గౌరవ వేతనం రూ.10 వేలు ఇవ్వాలి, మెనూ ఖర్చుల చార్జీలు పెంచాలి. మూతపడుతున్న స్కూళ్లలోని నిర్వాహకులకు ఉపాధి భద్రత కల్పించాలి, యూనీఫాం, గుర్తింపు కార్డులు ప్రభుత్వం అందించాలి. గ్యాస్, వంట పాత్రలు ప్రభుత్వమే సరఫరా చేయాలి. ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. జిల్లా పాఠశాలలు ఎండీఎం కార్మికులు నమోదు ఏలూరు 1,710 92,203 5,732 పశ్చిమగోదావరి 1,384 78,755 4,350 వంట బకాయిలు అందక ఎండీఎం నిర్వాహకుల అవస్థలు అరకొరగా నిధులు కేటాయిస్తున్న కూటమి సర్కారు కళాశాలకు 5 నెలలు, యూపీలకు 3 నెలలుగా నిలిచిన చెల్లింపులు పెరిగిన ధరలతో అప్పులతో కొనసాగిస్తున్న నిర్వాహకులు -
ఏజెన్సీలో ఆగని మట్టి రవాణా
● రాత్రి, పగలు తేడాలేకుండా తోలకాలు ● పట్టించుకోని అధికారులు బుట్టాయగూడెం: ఏజెన్సీ ప్రాంతంలో మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. రాత్రి, పగలు తేడా లేకుండా మట్టి తవ్వకాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని సర్వత్రా విమర్శిస్తున్నారు. బుట్టాయగూడెం మండలం ఎన్ఆర్పాలెం సమీపంలో ఇటీవల ఒక గిరిజనుడికి చెందిన పట్టా భూమిలో ఉన్న కొండను కూటమి నాయకులు నిబంధనలకు విరుద్ధంగా టిప్పర్లు పెట్టి లారీలతో మట్టి రవాణా చేస్తూ సొమ్ములు దండుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ కొండను తవ్వి చదును చేసేందుకు పీసా కమిటీ తీర్మానం చేసుకున్నామని గిరిజనులు చెబుతున్నప్పటికీ అది ఆ గ్రామ పరిధిలో తప్ప లారీల్లో ఇతర ప్రాంతాలకు తరలించే అవకాశం లేదని పలువురు వాపోతున్నారు. ఇక్కడ తవ్విన మట్టిని బుట్టాయగూడెం పరిసర ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తూ కూటమి నాయకులు సొమ్మును కొల్లగొడుతున్నారని ఆరోపిస్తున్నారు. నూతిరామన్నపాలెంలో అక్రమంగా మట్టిని తరలిస్తూ కూటమి నాయకులు సొమ్ము చేసుకుంటున్నారు. అది నిబంధనలకు విరుద్ధమని తెలిసినా సంబంధిత అధికారులు చూసీ చూడనట్లు ఉండడం బాధాకరం. ఇప్పటికై నా అక్రమ మట్టి రవాణాపై అధికారులు తగు చర్యలు తీసుకోవాలి. – తెల్లం బాలరాజు, మాజీ ఎమ్మెల్యే, దుద్దుకూరు, బుట్టాయగూడెం మండలం -
ట్రిపుల్ ఐటీలో మ్యూజిక్ వర్క్షాప్ నిర్వహణ
నూజివీడు: స్థానిక ట్రిపుల్ ఐటీలో గురువారం సంగీత విభాగం ఆధ్వర్యంలో మ్యూజిక్పై వర్క్షాపును నిర్వహించారు. దీనిలో భాగంగా ప్రముఖ గాత్ర విద్వాంసురాలు, సంగీత సుధానిధి వీ లలితా చంద్రశేఖర్ పాల్గొని భారతీయ సంగీతంలోని ప్రాథమిక అంశాలు, విద్యార్థులకు కలిగే ఉపయోగాలు అనే అంశంపై ఉపన్యసించారు. దేశంలో ముఖ్యంగా హిందూస్తానీ, కర్ణాటక సంగీతాలున్నాయన్నారు. సంగీతంలో స్వరాలు, రాగాలు ముఖ్యమైనవని, భావాలను, మానసిక స్థితిని వ్యక్తపరచడానికి రాగాలను ఉపయోగిస్తారన్నారు. సంగీతం వినడం ద్వారా ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత కలగడం, సృజనాత్మకత, భావ వ్యక్తీకరణ పెరగడం, జ్ఞాపకశక్తి మెరుగుపడటం, క్రమశిక్షణ అలవడటంతో పాటు విద్యార్థులకు విద్యాపరమైన పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుందన్నారు. అనంతరం సంగీత కచేరీ చేస్తూ కచేరీ పద్ధతిపై సోదాహరణగా వివరించారు. వీరికి వయోలిన్పై జే చంద్రమౌళి, మృదంగంతో మంగళగిరి శ్రీధర్ తమ సహకారాన్ని అందజేశారు. లలిత విద్యార్థులకు దీక్షితార్ నోటు స్వరం నేర్పించారు. కార్యక్రమంలో ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్, ఏఓ బీ లక్ష్మణరావు, సంగీత విభాగం హెచ్ఓడీ జే చంద్రమౌళీ తదితరులు పాల్గొన్నారు. -
కాట్రేనిపాడు పేదలకు న్యాయం చేయాలి
ముసునూరు: కాట్రేనిపాడు పేదలకు న్యాయం చేయాలని నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు డిమాండ్ చేశారు. పేదలు నివాసం ఉంటున్న స్థలాలు 2007వ సంవత్సరంలో ఇండ్ల స్థలాలు మంజూరుకు కేటాయించారు. అప్పట్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూమి కొనుగోలు చేసేందుకు, లబ్ధిదారుల వాటాతో కలిపి రైతులకు చెల్లించారు. అప్పటి పంచాయతీ పాలకులు తీర్మానం ఇవ్వకపోవడంతో పట్టాల పంపిణీ నిలిచిపోయింది. కాగా ఇటీవల తహసీల్దార్ ఆదేశాలంటూ శుక్రవారం సాయంత్రానికి ఇండ్ల స్థలాలు ఖాళీ చేయాలని, లేకుంటే జేసీబీలతో కూల్చి వేస్తామని, స్థానిక వీఆర్ఓ పేదలను భయభ్రాంతులకు గురి చేశారు. దీంతో పేదలు మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావును ఆశ్రయించగా ఆయన విషయాన్ని నూజివీడు సబ్ కలెక్టర్కు తెలియజేశారు. కనీసం పేదలకు నోటీసులు జారీ చేయకుండా, పురుషులు ఇండ్ల వద్ద లేని సమయంలో వచ్చి మహిళలను స్థలాలు ఖాళీ చేయాలని బెదిరించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు ప్రత్యామ్నాయం చూపించకుండా ఖాళీ చేయించమనడం సబబు కాదని వర్షాకాలంలో ఇటువంటి పనులు తగదని అన్నారు. పేదలకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామన్నారు. ప్రస్తుతం ఆ స్థలాల్లో నివాసం ఉంటున్న పేదలకు, గతంలో రైతులకు లబ్ధిదారు వాటా చెల్లించిన వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అగ్ని ప్రమాద బాధితులకు పరామర్శ కాట్రేనిపాడులో గురువారం కలపాల పోతురాజు అనే వ్యక్తి ఇంటిలో గ్యాస్ సిలిండర్ల పేలుడుతో అగ్ని ప్రమాదం సంభవించి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. కుటుంబ సభ్యులు కట్టుబట్టలతో మిగిలారు. మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఘటనా స్థలానికి చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మూల్పూరి నాగవల్లేశ్వరరావు, జెడ్పీటీసీ డా.వరికూటి.ప్రతాప్, ఏపీ స్టేట్ ఎస్సీ సెల్ సెక్రటరీ కంబాల రాంబాబు, మాజీ సర్పంచ్ సొంగా వెంకటేశ్వరరావు, సొసైటీ మాజీ అధ్యక్షుడు రాజా వర ప్రసాద్, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు -
అవార్డు గ్రహీత రాంప్రసాద్కు సత్కారం
భీమవరం: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అంతర్జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత డీఎన్నార్ ఇంజనీరింగ్ కళాశాల ఏఐఅండ్డీఎస్ విభాగాధిపతి కె సూర్యరాంప్రసాద్ను గురువారం కళాశాలలో ఘనంగా సత్కరించారు. ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును తమ కళాశాలకు చెందిన రాంప్రసాద్ అందుకోవడం తమ కళాశాలకే గర్వకారణమని కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు(బాబు), ఉపాధ్యక్షుడు గోకరాజు పాండురంగరాజు అన్నారు. సొసైటీ ఫర్ లెర్నింగ్ టెక్నాలజీ సంస్థ అవార్డుల ప్రదానోత్సవాన్ని విజయవాడలో నిర్వహించగా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచేగాక పలు దేశాల నుంచి సుమారు 200 మంది ప్రొఫెసర్లు పాల్గొనడం విశేషమన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎం.అంజన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. బుట్టాయగూడెం : మండలంలోని దుద్దుకూరుకు చెందిన గిరిజనుడు తెల్లం కన్నయ్య(60) తాడిచెట్టు ఎక్కి ప్రమాదవశాత్తూ జారి కిందపడి గురువారం మృతిచెందాడు. మృతుడు కన్నయ్య మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకు సోదరుడు. కన్నయ్య మరణ వార్త విన్న బాలరాజు కన్నీరు మున్నీరయ్యారు. కన్నయ్య భౌతికకాయానికి నివాళులు అర్పించారు. కన్నయ్య కుటుంబానికి పెద్ద దిక్కు అని, ప్రభుత్వం కన్నయ్య కుటుంబానికి ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని బాలరాజు కోరారు. పెదపాడు: నకిలీ విలేకరులు పెదపాడు మండలంలో హల్చల్ చేస్తున్నారు. కోళ్ల వ్యర్థాల వాహనాలను ఆపి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇదే క్రమంలో గురువారం ఖాళీగా వెళ్తున్న ఓ వాహనాన్ని ఆప్పి నకిలీ విలేకరి డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో అనుమానించిన ఆ వాహనదారుడు ఆ వ్యక్తిని నకిలీ విలేకరిగా గుర్తించి పెదపాడు పోలీసులకు అప్పగించారు. సదరు వ్యక్తి తాను పేరొందిన మీడియా సంస్థలో పనిచేస్తున్నట్లు పోలీసులను నమ్మబలికాడు. అతని వద్ద ఉన్న ఐడీ కార్డును పరిశీలించి నకిలీ విలేకరుగా పోలీసులు గుర్తించి వారి వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉండగా గుడివాడ ఎమ్మెల్యే కార్యాలయంలో పనిచేసే ప్రదీప్ అనే వ్యక్తి వచ్చి సదరు వ్యక్తిని తీసుకువెళ్లినట్లు చెబుతున్నారు. దీంతో సదరు నకిలీ విలేకరికు 41 నోటీసు అందించినట్లు విస్వసనీయ సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పంచాయతీ పూర్వపు భవనాలకు మోక్షం
ఆకివీడు: స్థానిక నగర పంచాయతీ పరిధిలో గంగానమ్మకోడు ప్రాంతంలో నిర్మించిన పంచాయతీ అసంపూర్తి భవనాలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఇటీవల ‘సాక్షి’లో వచ్చిన కథనానికి అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు స్పందించారు. ఆక్రమణల్లో ఉన్న భవన ప్రాంగణాల్ని ఖాళీ చేయించారు. ఆకివీడు పంచాయతీ పరిధిలోని ఈ ప్రాంతంలో 20 ఏళ్ల కూరగాయలు, మాంసం, చేపల దుకాణాల్ని ఏర్పాటు చేసేందుకు భవనాల నిర్మాణం చేపట్టారు. అయితే ఆ ప్రాంతం తనదేనని, తన వద్ద రికార్డులున్నాయని ప్రైవేటు వ్యక్తి కోర్టుకు వెళ్లారు. దీంతో పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో బిచ్చగాళ్లు, అనాథలు ఆక్రమించుకుని నివాసం ఉంటున్నారు. స్థానికులు కూడా కొంత ఆక్రమించారు. ఇటీవల బిచ్చగాళ్లను, అనాథల్ని అక్కడ నుండి పంపించివేసి, ఆ అసంపూర్తి భవనాల్ని ఆక్రమించారు. దీనిపై ‘సాక్షి’లో కథనం రావడంతో స్పందించి, వెంటనే ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయించారు. అసంపూర్తి భవన నిర్మాణాల్ని పూర్తి చేసి, అవసరమైతే కూరగాయల వ్యాపారాలకు, ఇతరులకు అద్దెకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోనున్నారు. ఆ ప్రాంతాన్ని గురువారం ఉపసభాపతి కె.రఘురామకృష్ణంరాజు, నగర పంచాయతీ కమిషనర్ కృష్ణమోహన్ సందర్శించారు. ఆ భవనాలను సద్వినియోగంచేసుకోవాలని ఆదేశించారు. -
కారు డిక్కీలో క్షతగాత్రురాలి తరలింపు
● ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు ● మహిళకు తీవ్రగాయాలు ● సమయానికి రాని 108 వాహనం మహిళను కారు వెనుక భాగంలో ఎక్కించి తీసుకెళ్తున్న దృశ్యం తేతలిలో గాయపడ్డ మహిళను చెక్కపై పడుకోబెట్టి కారు ఎక్కిస్తున్న స్థానికులు తణుకు అర్బన్: జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టగా మహిళ తీవ్రంగా గాయపడిన ఘటన తేతలిలో గురువారం చోటుచేసుకుంది. తేతలి ఇండస్ట్రీయల్ ఏరియాలోకి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న గుర్తుతెలియని మహిళను తాడేపల్లిగూడెం వైపు నుంచి వస్తున్న కారు వేగంగా ఢీకొట్టింది. దీంతో మహిళకు కాలు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. కారు ఢీకొట్టిన వేగానికి ద్విచక్ర వాహనంతోపాటు మహిళ కూడా గాల్లోకి ఎగిరిపడినట్టు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 108 వాహనానికి ఫోన్ చేసినా అరగంట వరకూ జాడ లేకపోవడంతో చేసేది లేక మహిళ పరిస్థితి చూసిన ప్రయాణికులు ఒక కారు వెనుక భాగంలో డిక్కీ తెరిచి పొడవాటి చెక్కను పెట్టి దానిపై ఆమెను పడుకోబెట్టి ఆస్పత్రికి తరలించారు. ఈ దృశ్యం చూపరులకు కంటతడి పెట్టించింది. అయితే ఆ మహిళ ఎవరు, ఏ ఆస్పత్రికి తీసుకువెళ్లారనే విషయాలు తెలియలేదు. ప్రమాదం జరిగిన తరువాత ఘటనా ప్రాంతానికి పోలీసులు వెళ్లారని అయితే ఎటువంటి వివరాలు తెలియకపోగా, బాధిత వర్గాల నుంచి ఫిర్యాదు కూడా రాలేదని తణుకు రూరల్ ఎస్సై చంద్రశేఖర్ చెప్పారు. -
శ్రీవారి అంతరాలయ దర్శనం పునరుద్ధరణకు చర్యలు
ద్వారకాతిరుమల: ద్వారాకతిరుమల చినవెంకన్న ఆలయంలో పాత పద్ధతిలో స్వామివారి అంతరాలయ దర్శనం, అలాగే అంతరాలయం (అమ్మవార్లు) ముందు భాగం నుంచి భక్తులకు సాధారణ దర్శనం కల్పించేందు అధికారులు గురువారం చర్యలు చేపట్టారు. అందులో భాగంగా మధ్యాహ్నం ట్రయిల్రన్ వేసేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. ఏలూరుకు చెందిన ఆధ్యాత్మికవేత్త, హైకోర్టు న్యాయవాది అయ్యంగార్ రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్కు చేసిన ఫిర్యాదు, ‘సాక్షి’ వరుస కథనాలతో అధికారుల్లో కదలిక వచ్చింది. వివరాల్లోకి వెళితే. ఐదేళ్ల క్రితం కోవిడ్ కారణంగా అధికారులు శ్రీవారి అంతరాలయ దర్శనాన్ని, అలాగే అమ్మవార్ల ముందు నుంచి భక్తులకు సాధారణ దర్శనాన్ని నిలిపివేశారు. కోవిడ్ నిర్మూలన అనంతరం ఇతర ఆలయాల్లో అంతరాలయ దర్శనాలు పునః ప్రారంభం అయిననా, శ్రీవారి ఆలయంలో మాత్రం పునరుద్ధరణ కాలేదు. దీంతో భక్తులు శ్రీవారిని, అమ్మవార్లను బయట (దూరం) నుంచే దర్శించుకోవాల్సి వస్తోంది. ఇదిలా ఉంటే అధికారులు అంతరాలయ దర్శనం టికెట్ రూ.500 లుగా నిర్ణయించి, దేవదాయశాఖ కమిషనర్ నుంచి ఎప్పుడో అనుమతులు పొందినా దానినీ అమలు పరచలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా గతంలో ఉన్న చెక్కల ర్యాంప్ను మళ్లీ ఆలయ అంతరాలయం ముందు భాగంలో ఏర్పాటుచేశారు. భక్తులు తూర్పు గుమ్మం లోంచి ఆలయంలోకి ప్రవేశించి, చెక్కల ర్యాంపు మీదుగా వెళుతూ స్వామి, అమ్మవార్లను దగ్గర నుంచి దర్శించే పాత విధానాన్ని ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తికి అధికారులు వివరించారు. అయితే ఇన్నేళ్లుగా మూలనపడి ఉన్న చెక్కల ర్యాంప్ దెబ్బతినడంతో ట్రయిల్రన్ వేయడం కుదరలేదు. దీంతో ర్యాంపునకు మరమ్మతులు చేయించాలని ఈఓ ఆదేశించారు. ఈనెల 21న అమావాస్య తరువాత అంతరాలయం, సాధారణ దర్శనాన్ని పునరుద్ధరించాలని అధికారులు భావిస్తున్నారు. అయితే శని, ఆదివారాలు, ఇతర పర్వదినాల్లో అంతరాలయ దర్శనాన్ని రద్దు చేసి, మిగిలిన రోజుల్లో పునరుద్ధరించాలని నిర్ణయించారు. అయ్యంగార్ ఫిర్యాదు, ‘సాక్షి’ వరుస కథనాలతో అధికారుల్లో కదలిక -
మందు బిళ్లలకు కోత
జిల్లాలోని ఒక ఆస్పత్రికి రోజుకు దాదాపు 400 వరకు ఓపీ నమోదవుతుంటుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, మే, జూన్ నెలలకు మొదటి క్వార్టర్గా మందుల కోసం వైద్యారోగ్యశాఖ సుమారు రూ.10.5 లక్షలు, సర్జికల్స్కు రూ.3.3 లక్షలు బడ్జెట్ ఇచ్చింది. జూలై, ఆగస్టు, సెప్టెంబరుకు రెండో క్వార్టర్గా మందుల కోసం రూ.11.42 లక్షలు, సర్జికల్స్కు రూ.3.8 లక్షలు ఇచ్చింది. అక్టోబరు, నవంబరు, డిసెంబరుకు సంబంధించి ప్రస్తుత క్వార్టర్కు మందులకు రూ.8.5 లక్షలు, సర్జికల్స్కు రూ.2.42 లక్షలు మాత్రమే బడ్జెట్ ఇచ్చింది. రెండో క్వార్టర్తో పోలిస్తే మూడో క్వార్టర్ బడ్జెట్ కేటాయింపులు తగ్గిపోయాయి. జిల్లాలోని ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో దాదాపు ఇదే పరిస్థితి. సాక్షి, భీమవరం: జిల్లాలో ఒక జిల్లా ఆస్పత్రి, మూడు సీహెచ్సీలు, నాలుగు ఏరియా ఆస్పత్రులు, 34 వరకు పీహెచ్సీలు, 18 యూపీహెచ్సీలు వరకు ఉన్నాయి. రోజుకు 15,500 వరకు ఓపీ నమోదవుతుంది. సాధారణంగా యూనివర్శల్ (యూ), సబ్ డివిజనల్ (ఎస్), టెరిసరీ (టీ) కేటగిరీల్లో విలేజ్ హెల్త్ క్లినిక్లు, పీహెచ్సీలు, సీహెచ్సీలు, జిల్లా ఆస్పత్రులు, వైద్య కళాశాలలకు మందుల కేటాయింపు చేస్తుంటారు. రోజువారీ ఓపీ, పెర్ఫార్మెన్స్ ఆధారంగా ప్రతి మూడు నెలలకు క్వార్టర్ ప్రాతిపదికన మందులు, సర్జికల్ పరికరాల కొనుగోలుకు వైద్యారోగ్య శాఖ బడ్జెట్ మంజూరు చేస్తుంది. ఆస్పత్రి స్థాయిని బట్టి మందుల కోసం అర్బన్ పీహెచ్సీలకు రూ.90 వేల నుంచి రూ.1.5 లక్షలు, రూరల్ పీహెచ్సీలకు రూ.1.75 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు, సీహెచ్సీలకు సుమారు రూ.15 లక్షల వరకు, ఏరియా ఆస్పత్రులకు రూ.20 లక్షల వరకు, అలాగే సర్జికల్ సామగ్రికి నిధులను కేటాయిస్తారు. ఈ నిధులతో మూడు నెలల కాలానికి గాను ఆస్పత్రికి అవసరమైన మందులు, శస్త్రచికిత్సల పరికరాలను సెంట్రల్ డ్రగ్స్ స్టోర్స్ నుంచి వైద్య సిబ్బంది తెచ్చుకోవాలి. బడ్జెట్లో కోత.. రోగులకు వెత గతంతో పోలిస్తే మందులు, సర్జికల్స్కు సంబంధించి ప్రస్తుత క్వార్టర్కు బడ్జెట్ కేటాయింపులు తగ్గినట్టుగా తెలుస్తోంది. యూపీహెచ్సీ, పీహెచ్సీలకు యథావిధిగా కేటాయింపులు చేసినా సీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులకు కోత పడింది. తణుకులోని జిల్లా ఆస్పత్రితో పాటు భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తాడేపల్లిగూడెంలో ఏరియా ఆస్పత్రులు, ఆకివీడు, పెనుగొండ, ఆచంటలోని సీహెచ్సీలకు రోజువారీ ఓపీ అధికంగా ఉంటుంది. ఇన్ పేషెంట్లుగా చికిత్స పొందే వారూ ఎక్కువే. ఆయా ఆస్పత్రులకు మూడో క్వార్టర్ బడ్జెట్లో 20 నుంచి 30 శాతం వరకు కోత పెట్టినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆయా ఆస్పత్రులకు మందులు తగ్గి రోగులు ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొద్దినెలల క్రితం బీపీ అదుపులో ఉంచే ఎటన్లాల్ 50, నొప్పులు తగ్గేందుకు వినియోగించే ప్రియాబ్లిన్ టాబ్లెట్లు, రోగికి సత్తువనిచ్చే మెట్రోజిల్ సైలెన్లు తదితర రకాల మందులు సరిపడా సరఫరా లేక రోగులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. అవసరమైన డ్రగ్స్తో ఇండెంట్ పెడుతున్నా సెంట్రల్ డ్రగ్స్ స్టోర్స్లో కొన్నిరకాల మందులు అందుబాటులో లేక రోగులు ప్రైవేట్ మెడికల్ షాపుల్లో కొనుగోలు చేసుకోవాల్సి వస్తుంది. పూర్తిస్థాయిలో మందులు అందుబాటులో ఉంచేందుకు వైద్యారోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇబ్బంది లేదు మందులకు కొరత లేదని, అవసరమైన మందులు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్నాయని వైద్యారోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. గత బడ్జెట్లో మిగిలి ఉన్న స్టాకు, రోజువారీ ఓపీ, మందుల వినియోగాన్ని బట్టి క్వార్టర్ బడ్జెట్ కేటాయింపులు ఉంటాయని డీసీహెచ్ఎస్ సూర్యనారాయణ తెలిపారు. అవసరమైతే ఆరోగ్యశ్రీ నిధుల నుంచి మందుల కొనుగోలు చేసుకునేందుకు వెసులుబాటు ఇచ్చినట్టు వివరించారు. ఏ మాత్రం శ్రద్ధ లేదు ప్రమాదంలో ప్రజారోగ్యం ప్రభుత్వాస్పత్రులపై కూటమి నిర్లక్ష్యం మందులు, సర్జికల్ సామగ్రి బడ్జెట్ తగ్గింపు 20 నుంచి 30 శాతం మేర కోత రోగులకు తప్పని ఇక్కట్లు -
కోటి సంతకాలతో కూటమిని నిలదీద్దాం
● ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ సిగ్గుచేటు ● పేద పిల్లలకు వైద్య విద్యను దూరం చేయడం దుర్మార్గం ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్, పార్లమెంట్ ఇన్చార్జి సునీల్ ఏలూరులో కోటి సంతకాల ఉద్యమ కార్యక్రమంలో మాట్లాడుతున్న జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్. చిత్రంలో పార్లమెంట్ ఇన్చార్జి సునీల్, ఏలూరు సమన్వయకర్త జయప్రకాష్, కార్యక్రమానికి హాజరైన పార్టీ శ్రేణులు ఏలూరు టౌన్: పేద విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేయాలనే సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ప్రభుత్వంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకువస్తే.. నేడు కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణకు కుట్రలు చేస్తోందని.. కోటి సంతకాల ఉద్యమంతో కూటమి సర్కారు కుతంత్రాలను ఎండగడదామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్), ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జి, యువజన విభాగం రీజనల్ అధ్యక్షుడు కారుమూరి సునీల్కుమార్ అన్నారు. వైఎస్సార్సీపీ ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ ఆధ్వర్యంలో ఏలూరులోని పార్టీ కార్యాలయం వద్ద గురువారం రాత్రి ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల ఉద్యమంలో భాగంగా పార్టీ శ్రేణులతో కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలోని పార్టీ నేతలు, శ్రేణులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ప్రతిఒక్కరూ కోటి సంతకాల దరఖాస్తులను పూర్తి చేసేందుకు ఆసక్తి చూపించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో దేశంలో ఎక్కడా లేనివిధంగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకురావడంతో పాటు 5 మెడికల్ కాలేజీలను పూర్తి చేసి చూపించారన్నారు. అప్పటివరకు రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే, 2019 నుంచి 2024లో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెచ్చిన గొప్ప దార్శనికుడు మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం 16 నెల ల కాలంలో నిర్మాణాలు మొత్తం పూర్తి చేస్తే ఏకంగా 2,500 ఎంబీబీఎస్ సీట్లు రాష్ట్రానికి వచ్చేవనీ, అయితే ప్రభుత్వ నిర్లక్ష్యంతో పేద పిల్లలకు సీట్లు అందకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ ఆంధ్రగా మార్చారు వైఎస్సార్సీపీ యువజన విభాగం రీజనల్ అధ్యక్షుడు కారుమూరి సునీల్కుమార్ మాట్లాడుతూ కూటమి నేతలు రాష్ట్రాన్ని కల్తీ ఆంధ్రప్రదేశ్గా మార్చివేశారని విమర్శించారు. ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారని చెప్పారు. విజయనగరం, రాజ మండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలు పూర్తి చేయగా.. పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీలు ఎన్నికల ఫలితాలు నాటికి పూర్తయ్యాయని తెలిపారు. కూటమి కుట్రలను ఎండగట్టేలా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఏలూరులో మద్యం తాగుతూనే ఒక వ్యక్తి చనిపోతే లిక్కర్ షాపు వాళ్లు కనీసం పట్టించుకోకుండా వ్యాపారం చేయటం వారి దుర్మార్గమైన పరిస్థితిని తెలియజేస్తుందని విమర్శించారు. నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాస్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్బాబు, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్గురునాథ్, నగర మహిళా అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, పార్టీ నాయకులు తులసీ వర్మ తదితరులు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే ప్రజలకు కలిగే నష్టాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కార్యదర్శి దాసరి రమేష్, వైఎస్సార్టీయూసీ జిల్లా అధ్యక్షుడు పల్లి శ్రీనివాస్, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు చిలకపాటి డింపుల్, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు ఇనపనూరి జగదీష్, బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లిపాక సురేష్, నగర, జిల్లాస్థాయి నాయకులు తంగెళ్ల రాము, పిట్టా ధనుంజయ్, ఎచ్చెర్ల ఉమామహేశ్వరరావు, మేతర సురేష్, గేదెల సూర్యప్రకాష్రావు, ఆర్టీఐ జిల్లా అధ్యక్షుడు వేంపాటి స్టాన్లీ బాబు, సోషల్ మీడియా జిల్లా ఉపాధ్యక్షుడు బండ్లమూడి సునీల్కుమార్ తదితరులు ఉన్నారు. -
బాణసంచా.. తస్మాత్ జాగ్రత్త!
బాణసంచా దుకాణాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవలశాఖ విస్తృత ప్రచారం చేస్తోంది. IIలో uనరసాపురం రూరల్: కార్తీకమాసంలో వన సమారాధనలనకు కేపీపాలెం–పేరుపాలెం సాగర తీరాలకు వచ్చే సందర్శకులకు బీచ్ వద్ద పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని నరసాపురం ఆర్డీఓ దాసి రాజు సూచించారు. గురువారం పేరుపాలెం బీచ్ గెస్ట్ హౌస్ వద్ద అధికారులతో సమీక్షించారు. కార్తీక మాసంలో పుణ్యస్నానాలు చేసేందుకు లక్షలాది మంది యాత్రికులు, సందర్శకులు వచ్చే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలిక గదుల నిర్మాణంతో పాటు సముద్రంలో స్నానానికి దిగిన వారికి ప్రాణనష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బీచ్కు వచ్చే మూడు మార్గాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడటంతో పాటు వాహనాలు పార్కింగ్కు అవసరమయ్యే స్థలాన్ని గుర్తించాలన్నారు. ప్రత్యేకంగా శని, ఆదివారం రోజుల్లో పెద్దఎత్తున సందర్శకులు వస్తారని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. నిర్దేశించిన ప్రదేశం దాటి సముద్ర స్నానం చేసేవారిని తక్షణమే ఒడ్డుకు తీసుకువచ్చేందుకు గజ ఈతగాళ్లను నియమించాలని సూచించారు. శాఖల వారీగా చేపట్టాల్సిన పనులను వివరించారు. సర్పంచ్లు తిరుమాని విజయలక్ష్మి, అందే దొరబాబు, డీపీఓ ఎన్.రామనాథరెడ్డి, తహసీల్దార్ రాజ్కిషోర్, డీఎల్పీఓ జ్యోతిర్మయి, డిప్యూటీ ఎంపీడీఓ నవీన్కిరణ్, పోలీస్, ఎకై ్సజ్ శాఖ అధికారులు, వైద్యారోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
‘సాక్షి’పై కూటమి కుట్రలు
● నేడు జర్నలిస్ట్, ప్రజాసంఘాలతో ధర్నాలు ● దాడులను నిరసిస్తూ అధికారులకు వినతులు ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ ప్రభుత్వ అవినీతిని ప్రజల ముందుంచుతున్న పత్రికలు, మీడియాపై అక్రమంగా కేసులు బనాయిస్తూ మీడియాను నిర్వీర్యం చేసే దిశగా చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా జర్నలిస్ట్ సంఘాలు, ప్రజాసంఘాలు, వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం ఏలూరు కలెక్టరేట్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించనున్నారు. ఇటీవల సాక్షి దినపత్రికలో రాష్ట్రంలో నకిలీ మద్యం తాగి పలువురు ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలను ప్రచురిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తుండటాన్ని ప్రభుత్వం జీర్ణించుకోలేక సాక్షి దినపత్రిక ఎడిటర్ పై అక్రమంగా కేసులు బనాయించిన విషయం తెలిసిందే. ఈ కేసులను ఆసరాగా చేసుకుని పోలీసులను సాక్షి కార్యాలయాలపైకి ఉసిగొల్పి సోదాలు, విచారణల పేరిట భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అవినీతిపై వార్తలు ప్రచురించే జర్నలిస్టులు, మీడియా సంస్థలపై కేసులు బనాయించకూడదని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం వాటిని ధిక్కరించి మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని ప్రజాసంఘాల ప్రతినిధులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీడియాను అణగదొక్కే చర్యలను ప్రభుత్వం విరమించుకోవాలని, లేకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాక్షి మీడియాపై ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు నిరసనగా శుక్రవారం ఉదయం 10.30 గంటలకు జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులతో పాటు వైఎస్సార్సీపీ, సీపీఎం, సీపీఐ, ఐఎఫ్టీయూ, సీఐటీయూ, ఎస్పీ సర్పంచులసంఘ, పీడీఎస్యూ, ఎస్ఎఫ్ఐ తదితర సంఘాల ప్రతినిధులు ఆందోళన కార్యక్రమంలో పాల్గొననున్నారు. పత్రిక అద్దం వంటిది. సమాజంలో జరిగే మంచి, చెడులను చూపిస్తుంది. నాలుగో స్తంభంగా భావించే పత్రికా స్వేచ్ఛను హరించడం రాజ్యాంగం ప్రసాదించిన హక్కును కాలరాయడమే. బాధ్యత కలిగిన పౌరులంతా ఇటువంటి చర్యలను ఖండించాలి. – మహమ్మద్ గాలిబ్బాబు, న్యాయవాది, కై కలూరు -
టాయిలెట్ల నిర్మాణాలు వేగిరపర్చాలి
ఏలూరు(మెట్రో): జిల్లాలో స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా చేపట్టాల్సిన టాయిలెట్ల నిర్మాణాలను నెలాఖరులోపు పూర్తిచేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం ప్రభుత్వ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ/వార్డుసచివాలయాలు, ప్రభుత్వ పాఠశాలల్లో మరమ్మతులు, టాయిలెట్లు, తాగునీరు తదితర మౌలిక వసతుల కల్పనలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, గురుకుల వసతి గృహాల్లో తాగునీటిని పరీక్షించి, అవసరమైన చోట ఆర్వో ప్లాంట్లు ఏర్పాటుచేయాలన్నారు. గృహనిర్మాణాలపై సమీక్ష : స్థానిక కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లాలో గృహ నిర్మాణాల ప్రగతిపై అధికారులతో సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా నిర్మాణాలపై కలెక్టర్ సమీక్షించారు. నిర్మాణాలు వేగిరపర్చి నెలాఖరులోపు పూర్తిచేయాలని ఆదేశించారు. ఏలూరు టౌన్: రాష్ట్రంలో సంచలనంగా మారిన కల్తీ మద్యం వ్యవహారంలో సిట్ అధికారులు ఏలూరులోని ఒక మద్యం వ్యాపారిని విచారించారు. కల్తీ మద్యం కుంభకోణంలో కీలక పా త్రధారి జనార్దన్కు ఏలూరులోని వ్యక్తికి మద్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏలూరుకు చెందిన వ్యక్తిని విచారించినట్టు సిట్ అధికారులు చెబుతున్నారు. గ తంలో ఇద్దరి మద్య జరిగిన వ్యాపార లావాదేవీల్లో భాగంగానే డబ్బులు ఇచ్చినట్లు, ప్ర స్తుతం అలాంటి ఆర్థిక లావాదేవీలేమీ జరగలేదని అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై లోతైన దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది. భీమవరం: పంచాయతీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి, కనీస వేతనాలు అమలు చేయాలని పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. సంఘం ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేసి అధికారులకు వినతిపత్రం అందజేశారు. అనంతరం సంఘ అధ్యక్ష, కార్యదర్శులు శివరామ్, రాజారెడ్డి మాట్లాడుతూ పంచాయతీ కార్మికుల సమస్యలు వినే నాథుడే కరువయ్యాడన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేధింపులు పెరిగాయని, వేతన బకాయిలు, పని ఒత్తిడి బాగా పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. టెండర్ తో నిమిత్తం లేకుండా ఉద్యోగాలు కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా టెండర్ల పేరుతో డబ్బులు వసూలు చేయడం మానుకోలేదని ఆరోపించారు. గౌరవ అధ్యక్షుడు ఎం. ఆంజనేయులు మాట్లాడారు. -
రోడ్డు మీద రోడ్డు వేసేయ్!
నూజివీడు మున్సిపాలిటీలో ప్రజాధనం వృథా నూజివీడు: ప్రభుత్వం ఖర్చుచేసే ప్రతి రూపాయి వృథా కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై, అధికారులపై ఉంది. నూజివీడు మున్సిపాలిటీలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ లక్షలాది రూపాయల ప్రజాధనం వృథా చేసేస్తున్నారు. పట్టణంలోని శివారు ప్రాంతాల్లో అభివృద్ధి చేయాల్సిన మట్టిరోడ్లు ఎన్నో ఉన్నప్పటికీ వాటినన్నింటిని వదిలేసి బాగున్న రోడ్డుపైనే మళ్లీ సిమెంట్ రోడ్డు వేసేందుకు మున్సిపాలిటీ ఇంజినీరింగ్ విభాగం సన్నద్ధమైంది. దీంతో బాగున్న రోడ్డుపై రోడ్డు వేయడం నూజివీడు మున్సిపాలిటీలోనే సాధ్యమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిలో భాగంగా ఇంజినీరింగ్ అధికారులు టెండర్లు పిలిచి పని చేసేందుకు కాంట్రాక్టర్ను సైతం నిర్ణయించగా దానికి మున్సిపల్ కౌన్సిల్ తందాన అంటూ ఆమోదం తెలపడం గమనార్హం. దీంతో రూ.7.35 లక్షల ప్రజాధనం వృధా కానుంది. పట్టణంలోని పాత మీసేవా కేంద్రం వద్ద నుంచి సీపీఎం కార్యాలయం వరకు సీసీ రోడ్డు నిర్మించడానికి మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు రూ.7.75 లక్షల అంచనా విలువతో టెండర్లు పిలిచారు. దీనికి 5.24 శాతం లెస్తో టెండర్ వేసిన కాంట్రాక్టర్కు వర్కు దక్కింది. పాత మీసేవా కేంద్రం వద్ద నుంచి సీపీఎం ఆఫీసు మీదుగా రైతుబజారు రోడ్డు వరకు అల్రెడీ సిమెంట్ రోడ్డు ఉంది. ఈ రోడ్డు బాగానే ఉన్నప్పటికీ దీనిపై మళ్లీ రోడ్డు వేయడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. ఈ రోడ్డు భారీ వాహనాలు రాకపోకలు సాగించడానికి కుదరదు. రోడ్డు బాగున్నప్పటికీ సిమెంట్ రోడ్డు వేయడానికి సిద్ధం చేయడం దారుణం. శివారు ప్రాంతాలైన ఉషాబాలానగర్, నందనం తోట, ఎమ్మార్ అప్పారావు కాలనీ, ఎన్టీఆర్ కాలనీ, రోటరీ ఆడిటోరియం ప్రాంతాల్లో పదుల సంఖ్యలో మట్టిరోడ్లు ఉన్నాయి. అధిక మొత్తంలో మున్సిపాలిటీకి ఆస్తిపన్ను వచ్చే రోటరీ ఆడిటోరియం ఏరియాలో రోడ్ల అభివృద్ధి చేయాల్సి ఉంది. వాటిని వదిలేసి ఏరియా కౌన్సిలర్ చెప్పారంటూ రోడ్డుపై రోడ్డు వేయడానికి ప్రజాధనాన్ని వృథా చేస్తుండటం గమనార్హం. -
18 నుంచి చెకుముకి సైన్స్ సంబరాలు
భీమవరం: విద్యార్థుల్లో సైన్స్ పట్ల అవగాహన, ప్రశ్నించే తత్వం, శాసీ్త్రయ దృక్పథాన్ని చెకుముకి సైన్స్ సంబరాలు పెంపొందిస్తాయని జిల్లా విద్యాశాఖాధికారి ఇ నారాయణ అన్నారు. జనవిజ్ఞాన వేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే చెకుముకి సైన్స్ సంబరాలు పోస్టర్ను బుధవారం డీఈవో కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎక్కువమంది విద్యార్థులు సైన్స్ సంబరాల్లో పాల్గొనేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు. చెకుముకి జిల్లా కన్వీనర్ రేపాక వెంకన్నబాబు మాట్లాడుతూ ఈనెల 18వ తేదీన పాఠశాల, నవంబర్ 1న మండల, నవంబర్ 23న జిల్లా స్థాయిలోను డిసెంబర్ 12,13,14 తేదీల్లో రాష్ట్రస్థాయిలోనూ చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్ సత్యనారాయణ, డీసీఈబీ సెక్రటరీ జీవీవీ శ్రీనివాస్, కుమారస్వామి, జనవిజ్ఞానవేదిక గౌరవ సలహాదారు ప్రత్తి వీరాస్వామి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జామాను రామలక్ష్మణరావు, మల్లుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
క్షేత్ర రహదారికి మరమ్మతులంటూ.. మాయ
ద్వారకాతిరుమల: భీమడోలు–ద్వారకాతిరుమల క్షేత్ర ప్రధాన రహదారికి మరమ్మతులంటూ.. కొందరు మాయ చేస్తున్నారు. లక్ష్మీపురంలోని విర్డ్ ఆస్పత్రి సమీపంలో రోడ్డు మార్జిన్ను బుధవారం ఆర్అండ్బీ అధికారులు శుభ్రం చేయగా, కొందరు కూటమి నాయకులు రోడ్డుకు మరమ్మతు పనులు ప్రారంభం అయ్యాయంటూ ప్రచారానికి తెరతీశారు. అయితే రోడ్డుపై ఉన్న గోతులను పూడ్చకుండా ఇలా మార్జిన్లలోని మట్టిని, చెత్తను పక్కకు నెడితే ఉపయోగం ఏమిటని, వీటిని మరమ్మతులని ఎలా అంటారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా పంగిడిగూడెం, సూర్యచంద్రరావుపేట, గొల్లగూడెం, లక్ష్మీపురం విర్డ్ ఆస్పత్రి వద్ద, ద్వారకాతిరుమలలోని నిమ్మకాయల మార్కెట్ యార్డు ఎదురుగా రోడ్డుపై ప్రమాదాలకు నిలయమైన గోతులను పూడ్చి, పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాలని భక్తులు, ప్రయాణికులు కోరుతున్నారు. రోడ్డుపై గోతులు పూడ్చకుండా మార్జిన్ శుభ్రం చేసిన వైనం -
ఆక్వా చెరువుల రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి
ఏలూరు(మెట్రో): కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో బుధవారం రాష్ట్ర ఆక్వాకల్చర్ అభివృద్ధి అథారిటీ యాక్ట్ మేరకు ఆక్వా చెరువుల అప్సడా రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై సంబంధిత అధికారులతో కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఆక్వా సాగులో ఉన్న పది మండలాల్లో గ్రామాల వారీగా సమీక్షించారు. కనీసం 50 శాతం పూర్తి చేయలేక పోయారని కలెక్టరు అసహనం వ్యక్తం చేశారు. టార్గెట్ పూర్తి చేయని అధికారులు, అసిస్టెంట్లను సస్పెండ్ చేస్తానని కలెక్టరు హెచ్చరించారు. కలెక్టరు మాట్లాడుతూ మొత్తం పది మండలాల్లో 1,49,828 ఎకరాలు ఉండగా ఇంతవరకూ 52,613 ఎకరాల రిజిస్ట్రేషన్ల పక్రియ పూర్తయిందని, మిగతా త్వరగా పూర్తి చేయాలన్నారు. కొల్లేరు భూములు వైల్డ్ లైఫ్ పరిధిలో ఉన్నాయని వాటిని లైసెన్స్ ఇవ్వరాదన్నారు. సమావేశంలో విజయవాడ మత్స్యశాఖ కమిషరు కార్యాలయం జాయింటు డైరెక్టరు షేక్ లాల్ మహమ్మద్, జిల్లా మత్స్యశాఖ డీడీ బి.నర్సయ్య, సహాయ సంచాలకులు బి.రాజ్కుమార్, కె.రవికుమార్, తదితరులు పాల్గొన్నారు. హేలాపురి ఉత్సవం సందర్శన ఏలూరు (ఆర్ఆర్పేట): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ ద్వారా తీసుకువచ్చిన సంస్కరణలతో నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలు ప్రతినెల కొంత ఆదాయం పొందుతాయని కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. స్థానిక సీఆర్ రెడ్డి కళాశాల ప్రాంగణంలో బుధవారం సాయంత్రం పండుగ వాతావరణంలో జరిగిన హేలాపురి ఉత్సవం గ్రాండ్ షాపింగ్ ఫెస్టివల్ను కలెక్టర్ సందర్శించారు. -
ప్రశ్నించే గొంతుపై ఉక్కుపాదం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రజల గొంతుగా నిలిచి ప్రశ్నిస్తే ప్రభుత్వానికి నచ్చదు.. ప్రతిపక్ష పాత్రలో ప్రభుత్వ వైఫల్యాలను కూటమి అరాచకాలను వెలుగులోకి తెస్తే వేధింపులకు తెగబడుతున్నారు. కూటమి కొలువుదీరిన తరువాత వేధింపుల్లో జర్నలిస్టులు కూడా బలవుతున్నారు. తరుచూ కేసులు, దాడులు, దౌర్జన్యాలకు గురై హక్కుల కోసం నినదిస్తున్నా స్పందించని పరిస్ధితి. ఈ ఏడాది కాలంలో పశ్చిమగోదావరి జిల్లాలో వరుస మూడు సంఘటనలు జరిగాయి. ఏలూరు సాక్షి కార్యాలయానికి నిప్పు పెట్టడం మొదలుకొని కార్యాలయం వద్ద యూనిట్ కార్యాలయం వద్ద నిరసన పేరుతో కూటమి నేతలు అలజడి సృష్టించారు. తాజాగా నెల్లూరు ఎడిషన్లో ప్రచురితమైన వార్తపై వేధింపులకు శ్రీకారం చుట్టారు. విజయవాడ ఆటోనగర్లోని సాక్షి కార్యాలయం వద్ద, హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు హడావుడి చేసి నోటీసులు ఇవ్వాలంటూ హంగామా చేస్తున్నారు. గతంలో జిల్లాలో కూటమి నేతల మట్టిమాఫియాపై వరుస కథనాలు, మట్టి మాఫియాలో బలైన బాధితుల వివరాలతో స్పాట్ కథనాలు ప్రచురించడంపై కూటమి నేతలు తారాస్థాయిలో మండిపడ్డారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరగణంతో సాక్షి కార్యాలయం వద్దకు వచ్చి హడావుడి సృష్టించి మూడు గంటల పాటు కార్యాలయం వద్దనే వందలాది మందితో బైఠాయించారు. కొంతమంది అనుచరులు కార్యాలయంలోకి ప్రవేశించి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. జూన్ మొదటివారంలో రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి కార్యాలయాలపై టీడీపీ శ్రేణులు ప్రత్యక్ష దాడులకు తెగబడ్డారు. అన్ని యూనిట్ కార్యాలయాల వద్ద టీడీపీ శ్రేణులు వీరంగం సృష్టించడం, కార్యాలయ ప్రధాన ద్వారం వద్ద నేమ్ బోర్డులు తొలగించడం వంటి ఘటనలకు పాల్పడ్డారు. తాడేపల్లిగూడెం యూనిట్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి సాక్షి పత్రిక ప్రతులను దగ్ధం చేశారు. జూన్ 10న ఏలూరులోని సాక్షి కార్యాలయం వద్ద ఆందోళన ముసుగులో కార్యాలయం కింద భాగంలో ఉండే ఫర్నీచర్కు పెట్రోలు పోసి నిప్పంటించారు. ప్రశ్నించినప్పుడల్లా దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. సోషల్ మీడియా పోస్టులపైనా కేసులు సోషల్ మీడియాపైనా వేధింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఉమ్మడి జిల్లాలో ఎవరైనా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ప్రభుత్వ వైఫల్యాలపై పోస్టులు పెడితే కేసుల పేరుతో హోరెత్తించారు. తణుకు మొదలుకొని నూజివీడు వరకు అనేక నియోజకవర్గాల్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే మొదలైన కేసుల పరంపర కొన్ని చోట్ల నేటికీ కొనసాగుతూనే ఉంది. భీమడోలు, తణుకు, భీమవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, ఉంగుటూరు, కై కలూరు ఇలా అనేక ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. కేసుల పేరుతో కొనసాగుతున్న వేధింపుల పర్వం ఈ ఏడాది సాక్షి కార్యాలయం వద్ద కూటమి నేతల వరుస ఆందోళనలు ఆఫీసుకు నిప్పంటించిన వైనం వ్యతిరేక కథనాలు రాస్తే వేధింపుల పరంపర -
రేషన్ సరఫరా అవకతవకలపై విచారణ
తాడేపల్లిగూడెం రూరల్: దండగర్ర రేషన్ డిపోలో రేషన్ సరఫరాలో అవకతవకలపై బుధవారం అధికారులు విచారణ చేపట్టారు. దండగర్ర రేషన్ డిపో నిర్వాహకుడు చిక్కాల అంబేడ్కర్ రేషన్ సక్రమంగా పంపిణీ చేయడం లేదని, అవకతవకలకు పాల్పడుతున్నాడని కార్డుదారుల నుంచి వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తహసీల్దార్ ఎం.సునీల్ కుమార్ ఆదేశాల మేరకు సివిల్ సప్లయిస్ డీటీ అన్నపూర్ణ విచారణ చేశారు. రేషన్ డిపో వద్ద స్టాకు బోర్డు లేకపోవడం, కార్డుదారుల ఫిర్యాదుల మేరకు రేషన్డీలర్పై కేసు నమోదు చేస్తామని డీటీ అన్నపూర్ణ తెలిపారు. రేషన్ డీలర్లు అక్రమాలకు పాల్పడితే అధికారులకు సమాచారం ఇవ్వాలని, వారిపై తగు చర్యలు తీసుకుంటామన్నారు. తణుకు అర్బన్: పశ్చిమగోదావరి జిల్లా ఆర్ఎస్ఎఫ్ఐ, ఏపీఆర్ఎస్ఏ రోలర్ స్కేటింగ్ హాకీక్వాడ్, కేడెడ్ (అండర్ 12), సబ్ జూనియర్స్ (అండర్ 15) ఎంపికలు బుధవారం తణుకు మాంటిస్సోరీ స్కూలు రింక్లో నిర్వహించారు. ఈ ఎంపికల్లో 7గురు కేడెడ్ బాలురు, సబ్ జూనియర్ బాలురు 8 మంది ఎంపికై నట్లు అబ్జర్వర్ షేక్ ఖాసిం తెలిపారు. సానబోయిన స్నేహశ్రీ ఓపెన్ కేటగిరీలో ఎంపికై ంది. వీరంతా వచ్చేనెల 2 నుంచి 5వ తేదీ వరకు నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు హాజరవుతారని వివరించారు. ఈ సందర్భంగా స్కూలు డైరెక్టర్ అనపర్తి ప్రకాశరావు విద్యార్థులకు శిక్షణనిచ్చిన కోచ్ అరెకపూడి భార్గవ్ను అభినందించారు. వీరవాసరం: కిల్కారి సేవల (చిన్నారి చిరునవ్వు)ను గర్భిణులు, బాలింతలు వినియోగించుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ గీత బాయ్ అన్నారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ఆశ నోడల్ ఆఫీసర్స్ మీటింగ్లో కిల్కారి సేవలపై ఆమె సమీక్ష నిర్వహించారు. కిల్కారి కాల్ ద్వారా వచ్చే ప్రతి సమాచారాన్ని గర్భిణులు, బాలింతలు పూర్తిగా వినేటట్లు చేయాలన్నారు. మాతా శిశు మరణాలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కిల్కారి కాల్ సర్వీస్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. గర్భిణీ అయినా 4 వ నెల మొదలు పుట్టిన బిడ్డకు ఏడాది వయసు వచ్చే వరకు కిల్కారి కాల్స్ వస్తాయని, తద్వారా తల్లీ బిడ్డల ఆరోగ్య క్షేమ సమాచారాన్ని అందజేస్తుందన్నారు. ఆశ నోడల్ ఆఫీసర్లు గర్భిణీలు, బాలింతలకు కిల్కారి సేవలపై అవగాహన క ల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజషన్ అధికారిణి డాక్టర్ సుధా లక్ష్మి, డీపీహెచ్ఎన్ఓ వెంకట్రత్నం, డీసీఎం ఎన్.వెంకట స్వామి, కిల్కారి రీజనల్ ప్రోగ్రాం ఆఫీసర్ బి.రాజు పాల్గొన్నారు. -
జిల్లా కోర్టు ఆవరణలో క్యాంటీన్ ప్రారంభం
ఏలూరు (టూటౌన్): ఏలూరు జిల్లా కోర్టు ఆవరణలో నూతనంగా నిర్మించిన క్యాంటీన్ బిల్డింగ్ సముదాయాన్ని హైకోర్టు జడ్జి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ కె.సురేష్రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవితో కలిసి బుధవారం సాయంత్రం ప్రారంభించారు. అనంతరం ఏలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు సీతారాం అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి మాట్లాడుతూ 2018 నుంచి ఏలూరు కోర్టు ఆవరణలో క్యాంటీన్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ సెక్రటరీ నోముల రాముడు, జాయింట్ సెక్రటరీ ఇబ్రహీం షరీఫ్, కోశాధికారి గండికోట సీతారామరాజు, గద్దె విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు(మెట్రో): సమాజంలో విభిన్న ప్రతిభావంతులు ఆత్మస్థైర్యంతో జీవించేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో బుధవారం జాతీయ వైట్ కేన్ దినోత్సవం సందర్భంగా ర్యాలీని కలెక్టర్ వెట్రిసెల్వి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాయన్నారు. వాటిని సద్వినియోగం చేసుకుని వాటి జీవన ప్రమాణాలు మెరుగుపర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రామ్ కుమార్, విజువల్లీ చాలెంజెడ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జి.రాధారాణి, ఏలూరు జిల్లా అధ్యక్షుడు జి.డి.వి.ఎస్.వీర భద్రరావు పాల్గొన్నారు. ఏలూరు (టూటౌన్): జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్ సిబ్బందికి గత 4 నెలలుగా చెల్లించాల్సిన వేతన బకాయిలు, 10 నెలల పీఎఫ్ బకాయిలు చెల్లించాలని కోరుతూ ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం ఏలూరు కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు కె.కృష్ణమాచార్యులు మాట్లాడుతూ ఆస్పత్రుల శానిటేషన్ కాంట్రాక్టర్ ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ సిబ్బందిని ఇబ్బందికి గురి చేస్తుందన్నారు. దీనిపై ప్రభుత్వానికి వినతి పత్రం అందజేసి గత మూడు రోజులుగా సమ్మె చేస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. చాట్రాయి: సీసీ రోడ్ల బిల్లులు దుర్వినియోగం చేశారంటూ స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద కృష్ణారావుపాలెంకి చెందిన టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కృష్ణారావు పాలెంలో 2017లో వేసిన సీసీ రోడ్లకు నిధులు మంజూరైనప్పటికీ పంచాయతీ కార్యదర్శి దుర్వినియోగం చేశారంటూ బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయానికి తలుపులు వేసి టీడీపీ నాయకులు రామారావు, ధనలక్ష్మి, నరసింహారావు నిరసన వ్యక్తం చేశారు. -
శ్రీహరి చెంత.. సౌకర్యాలతో క్యూ కాంప్లెక్స్
ద్వారకాతిరుమల: శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా.. అన్ని హంగులతో, ఆలయ అనివేటి మండపం పక్కన నూతన క్యూ కాంప్లెక్స్ను నిర్మిస్తున్నారు. రూ. 12.50 కోట్లతో జరుగుతున్న ఈ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. మొత్తం ఈ క్యూ కాంప్లెక్స్లో 6 కంపార్ట్మెంట్లను నిర్మించారు. ఒక్కో కంపార్ట్మెంట్లో 250 మంది భక్తులు కూర్చునేందుకు వీలుగా స్టీల్ బల్లలను ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి కంపార్ట్మెంట్లో ఒక డిజిటల్ స్క్రీన్, సెంట్రలైజ్డ్ సౌండ్ సిస్టమ్తో పాటు, 5 సీసీ కెమెరాలను అమర్చారు. ఒక్కో దాంట్లో ప్రత్యేకంగా ఒక హై వాల్యూమ్–లో స్పీడ్ (హెచ్వీఎల్ఎస్) సీలింగ్ ఫ్యాన్ను, అలాగే 12 చిన్న సీలింగ్ ఫ్యాన్లను అమర్చారు. క్యూ కాంప్లెక్స్ పక్కనే మరుగుదొడ్లను నిర్మించారు. వాటిలోకి వెళ్లేందుకు వీలుగా ప్రతి కంపార్ట్మెంట్లో ఒక ఎగ్జిట్ మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే మొత్తం 6 కంపార్ట్మెంట్లలో ఒకటి రూ. 200 టికెట్లు పొందిన భక్తులకు, మరొకటి రూ.100 టికెట్లు పొందిన వారికి, మిగిలిన నాలుగు కంపార్ట్మెంట్లను ఉచిత దర్శనం భక్తులకు కేటాయించనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ క్యూ కాంప్లెక్స్ భక్తులకు అందుబాటులోకి రానుంది. అయితే క్యూ కాంప్లెక్స్ నుంచి ఆలయంలోకి వెళ్లే క్యూ లైన్లను భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తే సరిపోతుంది. హెచ్వీఎల్ఎస్ ఫ్యాన్లు ప్రత్యేకం ప్రతి కంపార్ట్మెంట్లో ఒకటి ఏర్పాటు చేసిన హెచ్వీఎల్ఎస్ సీలింగ్ ఫ్యాన్ ప్రత్యేక ఆకర్షణగా, భక్తులకు సౌకర్యవంతంగా నిలవనుంది. ఒక సాధారణ సీలింగ్ ఫ్యాన్తో పోలిస్తే 10 రెట్లు దూరాన్ని ఈ పెద్ద ఫ్యాన్ కవర్ చేస్తుంది. ఎక్కువగా వీటిని పరిశ్రమలు, ఎయిర్పోర్ట్లు, అతి పెద్ద ఫంక్షన్ హాల్స్లలో వినియోగిస్తున్నారు. వీటి వల్ల విద్యుత్ కూడా ఆదా అవుతుంది. మెయింటినెన్స్ కూడా ఉండదని అధికారులు చెబుతున్నారు. తక్కువ స్పీడ్లో తిరుగుతూ.. ఎక్కువ గాలి ఇవ్వడం వీటి ప్రత్యేకత. అందుకే వీటిని ఏర్పాటు చేశారు. ప్రత్యేక భద్రత కోసం.. శని, ఆదివారాలు, ఇతర పర్వదినాల్లో వేలాది మంది భక్తులు శ్రీవారిని దర్శిస్తుంటారు. వారికి సీసీ కెమెరాల ద్వారా జేబుదొంగల నుంచి ఇప్పటికే రక్షణ క ల్పిస్తున్నారు. భక్తులకు మరింత భద్రత కల్పించేందుకు నూతన క్యూ కాంప్లెక్స్లోని ఒక్కో కంపార్ట్మెంట్లో 5 సీసీ కెమెరాలను, అలాగే స్వామివారి సేవల వివరాలు, దర్శనం వేళలను తెలియజేసేందుకు ఈ డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. నిర్మాణంలో ఉన్న క్యూ కాంప్లెక్స్క్యూ కాంప్లెక్స్ పక్క నుంచి ఏర్పాటు చేసిన స్టీల్ క్యూలైన్లు భక్తుల సౌకర్యార్థం రూ. 12.50 కోట్లతో నిర్మిస్తున్న శాశ్వత క్యూ కాంప్లెక్స్ తుది దశకు చేరుకున్న పనులు కాంప్లెక్స్లో మొత్తం 6 కంపార్ట్మెంట్లు నిర్మాణం ప్రతి దాంట్లో స్టీల్ బల్లలు, స్క్రీన్, సౌండ్ సిస్టమ్, సీసీ కెమెరాలు, ఫ్యాన్ల ఏర్పాటు -
అరుదైన కవల దూడల జననం
కొయ్యలగూడెం: ఓ ఆవు అరుదైన కవల దూడలకు జన్మనిచ్చింది. కొయ్యలగూడెంలోని మట్టా మురళీకృష్ణకి చెందిన శంకర జాతికి (హెచ్ఆర్) చెందిన ఆవు కవల దూడలకు జన్మనివ్వగా ఇందులో ఒకటి దున్న, మరొకటి పెయ్య దూడలు ఉన్నాయి. ఆవును ప్రసవానికి తీసుకువచ్చిన వేళలో కవలదూడలు ఉన్నట్లుగా అనుమానించామని, అయితే సాధారణ ప్రసవానికి లేదా శస్త్ర చికిత్సకు వీలుకాకుండా ఉన్నట్లు పశు వైద్య శాఖ అధికారి బీఆర్ శ్రీనివాస్ తెలిపారు. దీంతో హైడ్రాలిక్ ట్రాక్టర్ను తీసుకువచ్చి ఆవును తలకిందులుగా వేలాడ తీసి కడుపులో ఉండగానే దూడలను సరి చేశామన్నారు. అనంతరం ప్రసవించడానికి చికిత్స అందించగా కవల దూడలు జన్మించాయన్నారు. ఈ విధానాన్ని శాసీ్త్రయంగా ఫ్రీమార్టినిజం అంటారని తెలిపారు. ఈ విధానంలో జన్మించిన దూడల్లో పెయ్య దూడ ప్రాణానికి హాని ఉంటుందని, కానీ రెండు కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటం విశేషం అని చెప్పారు. సిబ్బంది కళింగి నరేష్, కె సతీష్, నరసింహమూర్తి, కార్యాలయ సహాయకుడు కె వెంకట్రావు సహకరించారన్నారు. -
జీఎస్టీ తగ్గినా.. దిగిరాని ధరలు
ఏలూరు (మెట్రో): జీఎస్టీ తగ్గించాం.. ధరలు తగ్గాయి కదా అని మార్కెట్కు వెళ్తే.. పాత ధరలకే విక్రయాలు చేస్తున్నారు. తాము కొనుగోలు చేసిన ధరలకే స్టాకు ఉన్నంత వరకూ పాత ధరకే విక్రయాలు సాగిస్తామని దుకాణదారులు చెబుతున్నారు. అధికారులు మాత్రం గొప్పలు చెప్పుకుంటూ ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు, ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. నూతన టారిఫ్ల ప్రకారం 12 శాతం జీఎస్టీ ఉన్న వస్తువులు 5 శాతంలోకి వెళ్లాయి. ఈ సెక్టార్లో వ్యత్యాసం 7 శాతంగా ఉంది. దీన్ని బట్టి రూ.1000 వస్తువు కొనుగోలు చేస్తే రూ.70 తగ్గాలి. వాస్తవానికి ప్రస్తుత మార్కెట్లో ఇది ఎక్కడా కనిపించడం లేదు. మందుల ధరల విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అరుదైన వ్యాధుల మందులపై ధరలు తగ్గించారు. సుగర్, బీసీ ట్యాబ్లెట్ల ధరలు తగ్గించినా షాపుల్లో మాత్రం పాత ధరలకే అమ్ముతున్నారు. సామాన్యుడు ఉపయోగించే బియ్యం, గ్యాస్, పప్పు, నూనెల ధరలు అలాగే ఉండడమే కాకుండా పెరిగాయి. జీఎస్టీ తగ్గింపుతో పేదవాడికి ఎంతో మేలు చేకూరుతోందంటూ బస్టాండ్లు, ఆసుపత్రులు, పాఠశాలలు, కార్యాలయాలతో పాటు అన్ని చోట్ల ఊదరగొడుతున్నారు. సెప్టెంబరు 25 నుంచి జీఎస్టీ ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. వీటిని ఈనెల 19 వరకూ నిర్వహించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. తగ్గిన ధరలకు విక్రయాలు చేయాలంటూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు తప్ప ఏ ఒక్కరిపైనా పాత ధరలకు విక్రయిస్తున్నారని ఒక్క కేసును సైతం నమోదు చేసిన పాపాన పోలేదు. ఈ నెల 13 నుంచి హేలాపురి ఉత్సవాల పేరుతో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
కోర్టు ఉత్తర్వులు భేఖాతర్
కొయ్యలగూడెం: కోర్టు ఉత్తర్వులను సైతం భేఖాతర్ చేస్తూ కొందరు వ్యక్తులు ఓ రైతుకు చెందిన భూమిని ఆక్రమించుకోవడం వివాదాస్పదమైంది. రాజవరం, తిరుమలాపురం గ్రామాల సరిహద్దులో 595/1 594/2 సర్వే నంబర్లకు సంబంధించిన భూమి బుధవారం వివాదాస్పదంగా మారింది. రాజవరానికి చెందిన రైతు దాసరి విష్ణు పేర్కొన్న వివరాల ప్రకారం గత 20 ఏళ్లుగా వివాదంలో ఉన్న సుమారు 10 ఎకరాల భూమి విషయంపై 2024వ సంవత్సరం కోర్టులో తనకు అనుకూలంగా తీర్పు వెలువడిందని అన్నారు. ఇందుకు సంబంధించి పోలీసు ప్రొటెక్షన్తో డెలివరీ ఆర్డర్ కూడా తీసుకున్నట్లు చెప్పారు. దానికి సంబంధించి ఆక్రమణలకు పాల్పడుతున్న వ్యక్తులకు కోర్టు స్టేఆర్డర్ ఇవ్వనప్పటికీ తన పొలంలోకి వచ్చి తరచూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో దీనిపై పోలీసులను ఆశ్రయిస్తే నిబంధనలకు విరుద్ధంగా మళ్లీ ప్రొటెక్షన్ ఆర్డర్స్ అడుగుతున్నారని అన్నారు. గతంలోనే తాము పోలీసు ప్రొటెక్షన్తో కూడిన డెలివరీ ఆర్డర్స్ అందజేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు. దీన్ని అలుసుగా తీసుకొని ఆక్రమణదారులు పేట్రేగిపోయారని గత మార్చి నెలలో దౌర్జన్యంగా తన పొలంలోకి ప్రవేశించడమే కాకుండా పంటను తరలించుకుపోయారన్నారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించగా తనపై దౌర్జన్యం చేసి తన పొలాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్న వారికి కోర్టు ధిక్కారణ నోటీసులు కూడా జారీ చేసిందన్నారు. నేర చరిత్ర కలిగినటువంటి రాజకీయ నాయకుల అండదండలతో తన పొలాన్ని ఆక్రమించుకోవడానికి ఇరువురు వ్యక్తులు అరాచకాలు సృష్టిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలోనే ఒక సామాజిక వర్గానికి చెందిన కొందరిని అడ్డం పెట్టుకొని, అలాగే కొందరు నేరచరిత్ర కలిగిన కిరాయి వ్యక్తులను వెంటపెట్టుకొని బుధవారం తన పొలంలోకి వచ్చి దౌర్జన్యానికి పాల్పడ్డారని చెప్పారు. వ్యవసాయ అభివృద్ధికి సంబంధించిన పనులు కొనసాగుతుండగా వాటిని అడ్డుకొని కూలీలపై దౌర్జన్యం చేశారని, పనులు నిర్వహించకుండా ఆటంకం కలిగించారని ఆరోపించారు. కోర్టు ఆర్డర్స్ని సైతం ధిక్కరిస్తూ తన భూమిని కాజేయడానికి సదరు వ్యక్తులు అరాచకాలకు పాల్పడుతున్నారని, దీనిపై ప్రభుత్వం స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు. రైతు భూమి ఆక్రమణకు దౌర్జన్యం -
ఫార్మసీ.. ఏదీ అజమాయిషీ?
సాక్షి, భీమవరం: మందుల షాపులపై అధికారుల అజమాయిషీ కొరవడింది. మత్తు మందులతో పాటు కాలం చెల్లిన వాటిని అమ్ముతూ ప్రజారోగ్యంతో ఆటలాడుతున్న వైనం కొద్దినెలల క్రితం విజిలెన్స్ తనిఖీల్లో వెలుగు చూసింది. తాజాగా మందులపై కేంద్రం జీఎస్టీ తగ్గించినా పలుచోట్ల పాత స్టాకు పేరిట పాత ధరలకే అమ్మకాలు చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో 1600 వరకు రిటైల్, 400 హోల్సేల్ మెడికల్ షాపులు ఉన్నాయి. వీటిద్వారా రోజుకు రూ.10 కోట్ల వ్యాపారం జరుగుతున్నట్టు అంచనా. చాలా షాపుల్లో ఫార్మాసిస్టులు లేకుండానే అమ్మకాలు జరిగిపోతున్నాయి. కొందరు బీఫార్మసీ, ఎంఫార్మసీ చేసిన వారితో ఒప్పందం చేసుకుని వారి సర్టిఫికెట్లతో షాపులు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గుండె, సుగర్, క్యాన్సర్, న్యూరాలజీ తదితర కొన్ని రకాల వ్యాధులకు సంబంధించిన మందులు, ఫ్లూయిడ్స్, ఇంజక్షన్లు నిర్ణీత ఉష్ణోగ్రతల్లో మాత్రమే నిల్వ చేయాలి. కాగా ఎన్ని షాపుల్లో అందుకు అవసరమైన ఏర్పాట్లు ఉన్నాయనేది ప్రశ్నార్ధకమే. కాలం చెల్లిన, నిషేధిత మందుల విక్రయాలు: పలుషాపుల్లో మత్తు కలిగించేవి, లైంగిక సామర్ధ్యం పెంచేవి, గర్భస్రావానికి సంబంధించిన నిషేధిత మందులతో పాటు కాలం చెల్లిన మందుల విక్రయాలు అమ్మకాలు చేస్తున్నారు. కొద్దినెలల క్రితం విజిలెన్స్ అధికారులు తాడేపల్లిగూడెం, తణుకు, అత్తిలి తదితర చోట్ల తనిఖీల్లో ఈ తరహా నిషేధిత, కాలం చెల్లిన మందుల అమ్మకాలు చేస్తున్న విషయం వెలుగుచూసింది. వీటిపై పెద్ద మొత్తంలో లావాదేవీలు జరుగుతున్నట్టు తెలుస్తోంది గడువు పూర్తయిన మందులకు స్టిక్కర్లు అతికించి అమ్మకాలు చేస్తున్నారు. పలు షాపులకు నిషేధిత మందులు సరఫరాపై అధికారులు వివరాలు సేకరించినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. జిల్లాలో ఔషధ నియంత్రణశాఖ అధికారులు ఉన్నా విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగితే తప్ప అక్రమాలు బయటపడకపోవడం గమనార్హం. లైంగిక సామర్ాధ్యన్ని పెంచే మందుల వల్ల గుండె, ఊపరితిత్తులపై ప్రభావం పడుతుందని, హార్ట్అటాక్ వచ్చే ప్రమాదముందని వైద్యులు చెబుతున్నారు. గర్భస్రావం మందులు ఒక్కోసారి ప్రాణాల మీదుకు తెస్తాయని, మత్తు కలిగించే మందులతో నిద్రలేమి, నరాలకు సంబంధించిన సమస్యలు వస్తాయంటున్నారు.జీఎస్టీ తగ్గిన మేరకు మందులు విక్రయించాలి. ప్రజలకు అవగాహన కల్పిస్తూ జిల్లా వ్యాప్తంగా 30 స్టాళ్లు ఏర్పాటుచేశాం. నిబంధనలు అమలయ్యేలా జిల్లా అంతటా తనిఖీలు చేస్తున్నాం. ఎక్కడైనా అధిక ధరలకు మందులు అమ్మకాలు చేస్తున్నా, నిషేధిత మందులు విక్రయిస్తున్నా ఫిర్యాదులు వస్తే వెంటనే తనిఖీలు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం. అబిద్ ఆలీషేక్, జిల్లా డ్రగ్ కంట్రోల్ అధికారి, భీమవరం మార్కెట్లో ఉన్న వస్తువుల ధరలు పెరగ్గానే తమ వద్ద ఉన్న పాత స్టాకుపై పెరిగిన ధరల స్టిక్కర్లు అతికించి ఆ మేరకు అమ్మకాలు చేసి లాభాలు ఆర్జి స్తుంటారు. ధరలు తగ్గినప్పుడు తమ వద్ద ఉన్న ఓల్డ్ స్టాక్ అయిపోయేవరకు వాటిపై ఉన్న ఎమ్మార్పీ ధరలకే విక్రయిస్తుంటారు. ప్రస్తుతం పలుచోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వివిధ రకాల మందులు, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, కళ్లజోళ్లు, వ్యాధి నిర్ధారణ కిట్లుపై 12 శాతం ఉన్న జీఎస్టీని ఏడు శాతం మేర, మెడికల్ థర్మోమీటర్లు, మెడికల్ అనాలసిస్ పరికరాలపై 18 శాతం ఉన్న జీఎస్టీని 13 శాతం వరకు తగ్గించగా, 36 రకాల ప్రాణరక్షక, అరుదైన వ్యాధుల మందులపై 12 శాతం నుంచి 5 శాతం వరకు ఉన్న జీఎస్టీలను పూర్తిగా మినహాయింపునిచ్చారు. మందులపై భారీ తగ్గుదల అంటూ ఊరువాడా ప్రభుత్వం ప్రచారం చేస్తుండగా పాత స్టాకులు ఉండిపోయాయంటూ పలుచోట్ల పాత ధరలకే అమ్మకాలు చేస్తున్నారని వినియోగదారులు అంటున్నారు. ఆల్రెడీ ఎమ్మార్పీపై పది నుంచి 15 శాతం వరకు తగ్గించి ఇవ్వడం ద్వారా జీఎస్టీ కంటే ఎక్కువే తగ్గిస్తున్నామని వ్యాపారులు చెబుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యాలు సొంతంగా ఏర్పాటుచేసుకున్న మందుల షాపులతో పాటు కార్పొరేట్ సంస్థలకు చెందిన మెడికల్ షాపుల్లో చాలాచోట్ల ఇంకా ధరలు దిగిరావడం లేదని తెలుస్తోంది. మెడికల్ షాపులపై కొరవడిన నిఘా నిబంధనలకు నీళ్లొదులుతున్న వ్యాపారులు నిషేధిత, గడువు పూర్తయిన మందుల విక్రయాలు జీఎస్టీ తగ్గినా పాత స్టాకు పేరిట పాత ధరలకే అమ్మకాలు -
పోలీస్ గ్రౌండ్లో టెన్నిస్ కోర్టు
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో పోలీసులకు శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసానికి దోహదపడేలా పోలీస్ అధికారులు, సిబ్బంది ఎంతో శ్రమించి ఆహ్లాదకరమైన టెన్నిస్ కోర్టును ఏర్పాటు చేయటం అభినందనీయమని ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ అన్నారు. బుధవారం రాత్రి ఆయన టెన్నిస్ కోర్టును ప్రారంభించారు. కొద్దిసేపు పోలీస్ సిబ్బందితో కలిసి ఆయన టెన్నిస్ ప్రాక్టీస్ చేశారు. ఎంతో కష్టపడి టెన్నిస్ కోర్టును నిర్మించారనీ, పోలీస్ సిబ్బంది సంక్షేమానికి తాము అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. టెన్నిస్ కోర్టు నిర్మాణంలో ... ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు పర్యవేక్షణలో ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, ఎస్బీ సీఐ మల్లేశ్వరరావు, ఆర్ఐ జీఎస్పీబీ కుమార్, ఆర్ఎస్ఐ కే.వెంకటేష్, ఆర్ఎస్ఐ ఎం.భాస్కరరావు, ఆర్ఎస్ఐ అమలేశ్వరరావు, ఏఎన్ఎస్ కానిస్టేబుల్ వీ.వరప్రసాద్ ఆధ్వర్యంలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ బీ.సుగుణరావు, కానిస్టేబుల్ కే.సూర్యచంద్రరావు, పీవీ రమణరావు, టీ.ప్రతాప్, ఎం.మురళీకృష్ణ, హోంగార్డులు జీ.చిన్ని, కే.శ్రీకాంత్, కే.సాయికుమార్, సీహెచ్ చింతయ్య, వీ.చంద్రతేజ కీలకపాత్ర పోషించారు. వీరందరినీ ఎస్పీ శివకిషోర్ అభినందించారు. -
నమ్మకం కలిగించాలి
సౌకర్యాలతో క్యూ కాంప్లెక్స్ శ్రీవారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా అనివేటి మండపం పక్కన రూ. 12.50 కోట్లతో నూతన క్యూ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు. 10లో uకేరళ డీజీపీ ఆజాద్ చంద్రశేఖర్ వీరవాసరం: నిరాడంబర అధికారిగా ఉండటంతో పాటు ప్రజలకు నమ్మకం కలిగించడం పోలీసు బాధ్యత అని కేరళ డీజీపీ రావాడ ఆజాద్ చంద్రశేఖర్ అన్నారు. వీరవాసరానికి చెందిన ఆయనకు బుధవారం స్థానిక జెడ్పీ హైస్కూల్లో పౌర సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా సభలో ఆయన మాట్లాడుతూ తాను ఇదే పాఠశాలలో చదువుకున్నానని, కేరళ డీజీపీగా ఎదగడానికి ప్రధాన కారణం గురువులు, ఊరి ప్రజల ఆశీస్సులే కారణం అన్నారు. ఇదే ఊరిలో తనతో పాటు చదివిన ఎం.సుబ్బారెడ్డి, చికిలే సుధాకర్ ఆలిండియా సర్వీసులకు ఎంపికవడం, వివిధ రాష్ట్రాల్లో అత్యున్నత పదవుల్లో ఉండటంతో వీరవాసరం ఖ్యాతి దేశం మొత్తం తెలిసిందన్నారు. ఏదైనా సాధించాలంటే ఫిజికల్ ఎనర్జీ, మెంటల్ ఎనర్జీ, ఎమోషనల్ ఎనర్జీ, స్పిరిట్యువల్ ఎనర్జీ అనేవి ప్రధానంగా ఉండాలని, ఉన్న సమయాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని అన్నారు. కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ కేరళ డీజీపీగా జిల్లా వాసి ఉండటం గర్వించదగ్గ విషయమన్నారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ భవిష్యత్లో మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని ఆక్షాంక్షించారు. జడ్జి వీరవల్లి గోపాలకృష్ణ, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్పర్సన్ పీతల సుజాత, డీఎస్పీ కూనపరెడ్డి సత్యనారాయణ, రిటైర్డ్ డీఎస్పీ బోను అప్పాజీరావు, డిప్యూటీ కలెక్టర్ మద్దాల సత్యప్రభ, ఎంపీపీ వీరవల్లి దుర్గాభవానీ, సర్పంచ్ చికిలే మంగతాయారు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా ఎస్జీఎఫ్ జిల్లా జట్ల ఎంపిక
అండర్ 19 బాలికల జిల్లా జట్టు అండర్ 19 బాలుర జిల్లా జట్టు పెదవేగి: ఎస్జీఎఫ్ అండర్ 19 ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బాల, బాలికల జట్ల ఎంపికలు పెదవేగి మండలం లక్ష్మీపురం పంచాయతీ ఎంఆర్సీ కాలనీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులంలో ఉత్సాహంగా జరిగాయని ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి కె జయరాజు తెలిపారు. ఇందులో భాగంగా బుధవారం హ్యాండ్బాల్ పోటీలు నిర్వహించి, బాలికల జిల్లా జట్టును, బాలుర జిల్లా జట్టును ఎంపిక చేశారు. ఈ పోటీల్లో ప్రిన్సిపాల్ ఏవీ శివప్రసాద్, జిల్లా కార్యదర్శి కె జయరాజు, పీడీలు ఆండాలు, రాజా, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో పురోహితుడు మృతి
పాలకొల్లు సెంట్రల్: పట్టణంలోని పాలకొల్లు – నరసాపురం రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల ప్రకారం పోడూరు మండలం జిన్నూరు గ్రామానికి చెందిన శివకోటి అప్పారావు (65) బుధవారం తన ద్విచక్ర వాహనంపై నరసాపురం వెళ్లి పాలకొల్లు వస్తుండగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోకి వచ్చే సరికి వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అప్పారావు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద ఆయన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అప్పారావుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు శివకోటి బాల సుబ్రహ్మణ్యం ఫిర్యాదు మేరకు ఎస్సై జీజే ప్రసాద్ కేసు నమోదు చేశారు. తాడేపల్లిగూడెం: డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో పనిచేసే ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ వయసు పరిమితిని యూజీసీ నిబంధనల మాదిరిగానే 62 సంవత్సరాల నుంచి 65 ఏళ్లకు పెంచాలని కోరుతూ ఏపీ హైకోర్టులో వేసిన రిట్లపై విచారణ ఈ నెల 13న జరిగింది. కోర్టు ఎలాంటి తదుపరి ఉత్తర్వులు ఇవ్వకుండానే ఈ నెల మూడో వారానికి వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. ఈ అంశంతో ఉద్యాన వర్సిటీ వీసీ నియామక వ్యవహారం ముడిపడి ఉండటంతో, వర్సిటీలోని వీసీ కుర్చీ 45 రోజులుగా ఖాళీగానే ఉంది. భీమవరం: పట్టణంలోని విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపక చైర్మన్ బీవీ రాజు జయంతి సందర్భంగా బుధవారం భీమవరం పరిసర ప్రాంతాల్లో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో భాగంగా బీవీ రాజు పాఠశాలలోని ప్రతిభ కనబర్చిన 20 మంది విద్యార్థులకు రూ.83 వేలు స్కాలర్షిప్లు అందించారు. భీమవరం, శృంగవృక్షంలోని లెప్రసీ రోగులకు బియ్యం, పండ్లు పంపిణీ చేశారు. అలాగే పట్టణంలోని సెంట్మేరీస్ లెప్రసీ సెంటర్లోని ఎయిడ్స్, టీబీ, లెప్రసీ రోగులకు రూ.60 వేలు విలువైన మందులతోపాటు 250 మందికి బియ్యం, పండ్లు పంపిణీ చేశారు. విష్ణు విద్యాసంస్థల విద్యార్థులు ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ బ్లడ్బ్యాంక్లో ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు. -
రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ ఏఎస్సై మృతి
జంగారెడ్డిగూడెం: దైవదర్శనానికి వచ్చి తిరిగి వెళుతూ రిటైర్డ్ ఏఎస్సై జంగారెడ్డిగూడెం మండలం జల్లేరు వంతెన వద్ద రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఎస్సై షేక్ జబీర్, మృతుడి కుమారుడి వివరాలు ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం అశ్వారావుపేట మండలం పేరాయిగూడెం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఏఎస్సై నార్లపాటి జగ్గారావు (60) మంగళవారం భార్య సరోజినితో ద్విచక్రవాహనంపై మద్ది ఆంజనేయస్వామిని దర్శించుకునేందుకు వచ్చారు. దర్శనం అనంతరం స్వగ్రామానికి వెళుతుండగా, జల్లేరు వంతెన వద్ద వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నారు. జగ్గారావు తీవ్రంగా గాయపడగా, భార్య సరోజినికి స్వల్ప గాయాలయ్యాయి. మరో ద్విచక్ర వాహనదారుడు పాల వెంకన్నబాబుకు గాయమైంది. క్షతగాత్రులను జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో తీవ్రంగా గాయపడిన జగ్గారావు మధ్యలో మృతిచెందారు. మృతుడి కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
మద్దిలో పూజలు
జంగారెడ్డిగూడెం: మండలంలోని గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంజనేయస్వామి వారికి అత్యంత ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలను, అన్నప్రాసనలు, వాహన పూజలను ఆలయ అర్చకులు నిర్వహించారు. భక్తులకు శ్రీ స్వామి వారి నిత్యాన్నదాన సత్రంలో అన్నప్రసాదం అందజేసినట్లు ఈవో ఆర్వీ చందన తెలిపారు. మధ్యాహ్నం వరకు ఆలయానికి వివిధ సేవల రూపేణా రూ.1,82,316 ఆదాయం వచ్చింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ సహాయ కమిషనరు తెలిపారు. తణుకు అర్బన్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఫెన్సింగ్ టీమ్ సెలక్షన్స్ బుధవారం అండర్ –14 విభాగంలో నిర్వహిస్తున్నట్లు ఫెన్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జీఎస్వీ కృష్ణమోహన్ తెలిపారు. తణుకు స్టెప్పింగ్స్టోన్ స్కూలులో నిర్వహించే ఈ ఎంపికలకు 2012 జనవరి 1 తరువాత పుట్టిన వారై ఉండాలని వివరించారు. ఈ నెల 18న కాకినాడ లక్ష్య స్కూలులో నిర్వహించే ఏపీ స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ అండర్–14 సబ్ జూనియర్ చాంపియన్షిప్ 2025–26లో పొల్గొనేందుకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జట్టు ఎంపికలు నిర్వహిస్తున్నామని, ఇతర వివరాలకు 9680234566 నెంబరులో సంప్రదించాలని కోరారు. -
పోగొట్టుకున్న బంగారం అప్పగింత
కొయ్యలగూడెం: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి బంగారం పోగొట్టుకున్న మహిళకు తిరిగి పోలీసులు అందజేశారు. మంగళవారం మువ్వ శ్రీలక్ష్మి జంగారెడ్డిగూడెం బైక్పై వెళుతూ ఏడు సవర్ల బంగారు ఆభరణాలు జారవిడుచుకుంది. పోగొట్టుకున్న బ్యాగులో బ్యాంకు పుస్తకాలు, సెల్ ఫోను కూడా ఉండడంతో దాని ద్వారా బ్యాగును పోయిన ప్రాంతాన్ని బయ్యన్నగూడెం సమీపంలో ఉన్నట్లుగా గుర్తించి ఆమెకు అందజేశారు. ఉండి: ఉండి మండలం అర్తమూరులో ఎస్సీ కాలనీలో సమస్యల తిష్ట అని ఈ నెల 11న సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. మంగళవారం గ్రామంలోని ఎస్సీ కాలనీలో నిలిచిన వర్షపు నీటిని పొక్లెయిన్ సాయంతో మళ్లించారు. అవసరమైన ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించి డ్రెయిన్ల తవ్వకం పనులు చేపట్టారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ముసునూరు: గోగులంపాడులోని ఒక ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఎస్సై ఎం.చిరంజీవి తెలిపిన వివరాలు ప్రకారం.. చింతలవల్లి శివారు గోగులంపాడుకు చెందిన ఎలమంచిలి నళినీ కుమారి, జగదీష్ దంపతులు ఆదివారం ఉదయం ఇంటికి తాళం వేసి నూజివీడు పట్టణంలోని బంధువుల ఇంటికి వెళ్ళారు. సోమవారం సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూడగా బెడ్రూమ్లో ఉన్న బీరువా తెరిచి అందులో దాచి ఉంచిన కాసు బంగారు గొలుసు, 2 వెండి గిన్నెలు, కుంకుమ భరిణె, రూ. 8 వేల నగదు చోరీ చేసినట్లు గమనించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. చాట్రాయి: అక్రమంగా ఆటవీ భూమిని చదును చేస్తున్న జేసీబిని స్వాధీనం చేసుకున్నట్లు ఫారెస్టు రేంజర్ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ మండలంలోని చీపురుగూడెం ఫారెస్టులో సోమవారం తెల్లవారుజామన అటవీ భూమిని గుర్తు తెలియని వ్యక్తి జేసీబీతో చదును చేస్తున్నట్లు సమాచారం రావడంతో దాడి చేసి జేసీబిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు చెప్పారు. -
ఆయిల్ ట్యాంకర్ను ఢీకొని ఒకరి మృతి
పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లు నరసాపురం రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం తణుకుకు చెందిన ముగ్గురు యువకులు పేరుపాలెం బీచ్కు వెళ్లడానికి బుల్లెట్ వాహనంపై బయలుదేరారు. పాలకొల్లు నరసాపురం రోడ్డులో టిడ్కో గృహాల సముదాయం ఎదురుగా వచ్చేసరికి నరసాపురం నుంచి పాలకొల్లు వైపు వస్తున్న ఆయిల్ ట్యాంకర్ ఈ ద్విచక్ర వాహన్నాఇ ఢీకొట్టడంతో కొల్లి మహేష్రాజు (18) అక్కడికక్కడే మృతి చెందాడు. కూచి శరణ్శర్మ, సాయి గణేష్లకు తీవ్ర గాయాలయ్యాయి. సాయి గణేష్ను మెరుగైన వైద్యం కోసం కాకినాడ తరలించినట్లు వైద్యులు తెలిపారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
ద్వారకాతిరుమల: తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో సోమవారం రాత్రి ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో మండలంలోని దొరసానిపాడుకు చెందిన కర్రి రామచంద్రరావు (పండు) అక్కడికక్కడే మృతి చెందాడు. పండు గతంలో దాబాను నిర్వహించేవాడు. అది మూత పడటంతో ప్రస్తుతం ద్వారకాతిరుమలలో ఒక షాపును అద్దెకు తీసుకుని రెస్టారెంట్ నడుపుతున్నాడు. నల్లజర్లలో ఓ వ్యక్తి వద్ద క్యాటరింగ్ నగదు తీసుకుని రాత్రి బైక్పై స్వగ్రామానికి వెళుతున్నాడు. సర్వీసు రోడ్డు నుంచి జాతీయ రహదారిపైకి వెళుతుండగా, కొవ్వూరు వైపు నుంచి ఏలూరు వైపుకు వెళుతున్న తాడేపల్లిగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బైక్ను వెనుక నుంచి ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన పండు అక్కడికక్కడే మృతి చెందాడు. -
రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి
వీరఘట్టం: ఐషర్ వ్యాన్లో ఉన్న గోనె సంచులను అన్లోడ్ చేసేందుకు వ్యాన్కు ఉన్న తాళ్లను విప్పుతూ ప్రమాదవశాత్తు వ్యాన్ బాడీకి–క్యాబిన్కు మధ్యలో పడిపోయిన డ్రైవర్ రాజు(35) శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మెయిన్ రోడ్డులో మంగళవారం మృతి చెందాడు. ఎస్సై జి.కళాధర్, స్థానికులు వివరాల ప్రకారం.. విజయవాడ నుంచి తాడేపల్లిగూడెంకు చెందిన రాజు గోనె సంచులను తీసుకొచ్చాడు. తాళ్లు విప్పుతూ ప్రమాదవశాత్తు వ్యాన్ బాడీకి–క్యాబిన్కు మధ్యలో పడిపోయాడు. అక్కడ ఉన్న వారు అతన్ని బయటకు తీశారు. ఇంతలో రాజుకు పిట్స్ వచ్చి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వీరఘట్టం పీహెచ్సీకి తీసుకెళ్లగా చనిపోయినట్లు నిర్ధారించారు. చాట్రాయి: కారు అదుపు తప్పి ఇద్దరిని ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. చనుబండలో మంగవారం రాత్రి నరసింహరావుపాలెం రోడ్డు నుంచి అతివేగంతో వచ్చిన కారు స్థానిక సత్యనారాయణ స్వామి ఆలయం ఎదుట నిలబడిన నాగుల శ్రీను, భీమవరపు మణికంఠను ఢీ కొట్టింది. శ్రీనుకు కాళ్లు విరిగాయి. ఇద్దరినీ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కారు నడిపే వ్యక్తి మద్యం సేవించి వాహనం నడపడంతో ఈ ప్రమాదం జరిగింది. రెండు ద్వి చక్రవాహనాలపైకి దూసుకెళ్లడంతో అవి దెబ్బతిన్నాయి. కామవరపుకోట: ఉరి వేసుకుని యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలో ఈస్ట్ యడవల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. యడవెల్లి గ్రామానికి చోదిమెళ్ళ సురేష్, రాధ దంపతుల కుమారుడు అభినాష్ ఇంటర్ చదువుతూ మధ్యలో ఆపేశాడు. మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందగా గమనించిన బంధువులు పోలీసులు సమాచారం అందించారు. ఎస్సై చెన్నారావు సంఘటనా స్థలాన్ని చేరుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. -
కై కలూరులో ఇసుక దుమారం
కై కలూరు: నిర్మాణాలకు ఇసుక తోలకం కై కలూరులో పెద్ద దుమారాన్ని లేపుతోంది. నియోజకవర్గంలో చావలిపాడు గ్రామంలో ప్రభుత్వ ఇసుక సరఫరా కేంద్రాన్ని ఇటీవల ప్రారంభించారు. ఇక్కడ ఇసుక టన్ను రూ.731కు విక్రయిస్తున్నారు. రవాణా చార్జీలు అదనం. ఇదే ఇసుకను ఇతర ప్రాంతాల రీచ్ల నుంచి రవాణా ఖర్చులు కలుపుకుని టన్ను రూ.650 నుంచి రూ.700కే రవాణా చేస్తున్నారు. ప్రభుత్వ రవాణా కేంద్రం నుంచి వచ్చే ఇసుకుకు రవాణా ఖర్చులు రూ.3000 నుంచి రూ.4,000 చెల్లించాల్సి వస్తుంది. ప్రభుత్వ ఇసుక సరఫరా నుంచి ఇసుక తీసుకోపోతే గుత్తేదారుల అనుమాయుల సిఫార్సుతో పలు నియోజకవర్గాల్లో అధికారులు ఇబ్బందులు పెడుతోన్నారని లారీ ఓనర్స్ అసోషియేషన్ ఆరోపిస్తోంది. కలిదిండి మండలానికి చెందిన ఓ టిప్పర్ యజమాని రెండు రోజుల క్రితం ఆచంట ర్యాంప్ నుంచి 30 టన్నుల ఇసుకతో సొంత పనులకు ఇసుక తీసుకొస్తున్నాడు. కలిదిండి సెంటర్లో ఎస్సై వాహనాన్ని నిలుపుదల చేసి అధిక లోడుతో రావడంతో ఆ ఇసుకను ఏఎంసీ గోడౌన్లో దింపించి, వాహనాన్ని వదిలారు. దీంతో సదరు టిప్పర్ డ్రైవర్లు అందరూ ప్రభుత్వ స్టాక్ పాయింట్ నుంచి ఇసుక తీసుకోకుండా బయట నుంచి తీసుకురావడంతో టిప్పర్ల యజమానులను ఇబ్బందులు పెడుతున్నారని భావిస్తోన్నారు. నిబంధనల అమలులో తారతమ్యం నియోజకవర్గానికి ఒకటి చొప్పున స్టాక్ పాయింట్ నిర్వాహణ బాద్యతను ఏజన్సీకి అప్పగించారు. పోలీసుల నిబంధనల మేరకు 20 టన్నుల ఇసుక మాత్రమే తరలించాలని చెబుతున్నారు. కై కలూరు నియోజకవర్గంలో దాదాపు 200 టిప్పర్లు ఉన్నాయి. వాస్తవానికి యూనిట్ల లెక్కన టిప్పర్ల ఇసుక రవాణా జరుగుతుంది. 6 యూనిట్లు 25 టన్నులు, 8 యూనిట్లు 33 టన్నులు, 10 యూనిట్లు 40 టన్నులు టిప్పర్లతో తీసుకువచ్చే అవకాశం ఉంది. టిప్పర్లను కొనుగోలు చేసినప్పుడే ప్రత్యేకంగా ఇసుక ఎక్కువుగా తీసుకురాడడానికి ఎత్తు పెంచుతున్నారు. పోలీసుల నిబంధనలు ప్రభుత్వ ఇసుక రీచ్ల వద్ద వాహనాలకు కూడా వర్తింప చేయాలని పలువురు కోరుతున్నారు. కలిదిండిలో నిలిచిన అధిక లోడుతో వస్తున్న టిప్పరు కై కలూరు నియోజకవర్గం చావలిపాడు వద్ద ప్రభుత్వ ఇసుక సరఫరా కేంద్రం వేధింపులకు గురిచేస్తున్నారు : లారీ అసోషయేషన్ నాయకులు కై కలూరు నియోజకవర్గానికి వెళ్ళే ఇసుక లారీలు బయట ప్రాంతాల నుంచి లోడ్ తీసుకురావద్దని, లోకల్గా ఉన్న ఇసుక స్టాక్ యార్డు నుంచి తోలుకోవాలని, డైరెక్ట్గా చెప్పకుండా ఇబ్బందులకు గురి చేస్తోన్నారు. ఈ విషయంపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తున్నాం. – రావూరి రాజా, లారీ ఓనర్స్ అసోషియేషన్ అధ్యక్షుడు -
భర్తలదే పెత్తనం
కై కలూరు: మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని చెబుతున్నప్పటికీ భర్తల పెత్తనమే కనిపిస్తోంది. కై కలూరు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం మంగళవారం జరిగింది. ఆలపాడు సర్పంచ్ కొప్పుల కృష్ణకుమారికి బదులు ఆమె భర్త ఏడుకొండలు సమావేశానికి వచ్చాడు. సీతనపల్లి సర్పంచ్ సుండ్రు పద్మావతికి బదులు భర్త పాండురంగరావు హాజరయ్యారు. ఆలపాడు సర్పంచ్గా కొండలు మైకు పట్టుకుని ప్రతి మీటింగ్లో మాట్లాడుతున్నారు. ముందు వరసలో సైతం వీరే కూర్చుంటున్నారు. చివరకు రిజిస్ట్రార్లో భార్యల పేరిట వీరే సంతకాలు చేస్తున్నారు. తామరకొల్లు వైస్ ఎంపీపీ గంగుల వెంకట నరసమ్మ భర్త పోతురాజు మీటింగ్ హాలులో కూర్చున్నారు. మహిళా సర్పంచుల స్థానంలో భర్తలు హాజరవుతున్నా అధికారులు ప్రశ్నించడం లేదు. దీనిపై ఎంపీడీవో ఆర్.రాజబాబును ప్రశ్నించగా.. ఎన్నికై న ప్రజాప్రతినిధులు మాత్రమే సమావేశ హాలులోకి రావాలని.. వారి బంధువులకు అనుమతి లేదని.. ఇకపై జరిగే మండల పరిషత్ సమావేశాలకు ఇతరులు రాకుండా చర్యలు తీసుకుంటానని చెప్పారు. కై కలూరు మండల పరిషత్ సమావేశంలో మహిళా సర్పంచుల స్థానంలో భర్తలు -
మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి పూర్తయ్యేదెప్పుడు?
బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీప్రాంతంలోని ప్రజలకు కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా వైద్యసేవలు అందించాలనే ఉద్దేశ్యంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుట్టాయగూడెం శివారు పద్మవారిగూడెం సమీపంలో సుమారు రూ. 50 కోట్లతో 146 పడకల మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిని మంజూరు చేశారు. గిరిజన ప్రాంత ప్రజలు మెరుగైన వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇక్కడే వైద్యసేవలు పొందాలనే లక్ష్యంతో 2020 అక్టోబర్ 2 న పనులు ప్రారంభించేందుకు శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో ఫేజ్–1లో ఆస్పత్రి భవనం, ఫేజ్–2లో స్టాఫ్ క్వార్టర్స్, ఫేజ్ పేషెంట్స్ అంటెండెన్స్ భవనాలు నిర్మాణ పనులు చేపట్టారు. ప్రస్తుతం మొదటి ఫేజ్ భవనం శ్లాబ్ వరకూ పూర్తయ్యింది. మిగిలిన రెండు ఫేజ్లలోని భవనాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ పనులకు సుమారు రూ.12 కోట్లు ఖర్చయినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల ముందు వరకూ పనులు జరిగినా తర్వాత అవి నిలిచిపోయాయి. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తిరిగి పనులు ప్రాంభించకపోవడంతో గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. ఆస్పత్రి నిర్మాణం పూర్తయితే.. ఆస్పత్రి నిర్మాణం పూర్తయితే గిరిజన ప్రాంత ప్రజలు ఏలూరు, విజయవాడ, రాజమండ్రికి వైద్యం కోసం పరుగులు తీయాల్సిన పరిస్థితి ఉండదు. ఏజెన్సీ ప్రాంతంలోని ఐదు మండలాలతోపాటు జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం మండలాల్లోని ప్రజలు కూడా ఇక్కడ వైద్యం పొందవచ్చు. ఈ ఆస్పత్రి పూర్తయితే జనరల్ ఐపీ వార్డ్లు 30, పీడియాట్రిక్స్ వార్డులు 20, ఎస్ఐసీయూ 10, ఆర్ధో వార్డులు 30, జనరల్ ఐపీ వార్డులు 9తోపాటు మొత్తం 146 పడకలు అందుబాటులో ఉంటాయి. అన్ని రకాల వ్యాధులకు సంబంధించి అనుభవజ్ఞులైన వైద్యులు అందుబాటులో ఉంటారు. కన్నెత్తి చూడని కూటమి పాలకులు గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే ఉద్దేశంతో నిర్మిస్తున్న మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం పనులు నిలిచినా వాటిని తిరిగి ప్రారంభించడంలో కూటమి పాలకులు కనీసం పట్టించుకోవడంలేదని గిరిజనులు విమర్శిస్తున్నారు. 15 నెలలుగా ఆ ఆస్పత్రి నిర్మించే రహదారి వైపు ప్రయాణిస్తున్నా కనీసం అటు వైపు కన్నెత్తి చూడటంలేదని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి నిర్మాణం పనులు పూర్తయితే గిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుతాయని, ప్రభుత్వం, అధికారులు ఇప్పటికై నా పనులు పూర్తి చేయాలని అధికారులు కోరుతున్నారు. గిరిజన ప్రాంత ప్రజలకు అందని ద్రాక్షగా కార్పొరేట్ వైద్యం ఆస్పత్రి పనులు పూర్తి చేయాలంటున్న ప్రజలు వైఎస్సార్సీపీ పాలనలో రూ.12 కోట్లతో జరిగిన పనులు పనులవైపు కన్నెత్తి చూడని కూటమి పాలకులు గిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే ఉద్దేశంతో రూ.50 కోట్లతో బుట్టాయగూడెంలో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సుమారు రూ.12 కోట్లతో పనులు జరిగాయి. ఆస్పత్రి భవనం శ్లాబ్ వరకూ వచ్చింది. స్టాఫ్ క్వార్టర్స్ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఎన్నికలకు ముందు పనులు నిలిచాయి. కూటమి ప్రభుత్వం ఈ పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుంది. – తెల్లం బాలరాజు, మాజీ ఎమ్మెల్యే, దుద్దుకూరు, బుట్టాయగూడెం మండలం కూటమి ప్రభుత్వానికి గిరిజనుల పట్ల చిత్తశుద్ధి లేదు. మా ప్రాంతంలో ఏటా టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ విష జ్వరాలతో బాధపడుతుంటాం. అత్యవసర వైద్యం కోసం బయట ప్రాంతాలకు పరుగులు తీస్తాం. గిరిజనుల బాధలు తీర్చేందుకు జగన్మోహన్రెడ్డి నిర్మించిన మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి వివిధ దశల్లో ఉంది. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ పనులు పూర్తి చేయడంలో చిత్తశుద్ధి చూపించడంలేదు. – బన్నే బుచ్చిరాజు, సర్పంచ్, నిమ్మలగూడెం, బుట్టాయగూడెం మండలం -
భూసేకరణ వేగవంతం చేయాలి
ఏలూరు(మెట్రో): జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ ద్వారా భూములు అందించిన వారికి నిర్దేశించిన సమయంలోగా పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి మంగళవారం పోలవరం ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ పునరావాస కార్యక్రమాలు, జాతీయ రహదారుల నిర్మాణానికి, సెల్ఫోన్ టవర్ల నిమిత్తం భూసేకరణపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇంకా అవసరమైన భూములకు సంబంధించి భూసేకరణ ప్రకటనలు వెంటనే జారీ చేయాలన్నారు. భూసేకరణపై జాతీయ రహదారుల నిర్మాణానికి సంబందించి కోర్టులలో ఉన్న కేసులు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. నూజివీడు: పెళ్లైన ఏడాదికే భర్త, అత్తమామలు వేధిస్తున్నారంటూ వివాహిత పట్టణ పోలీస్స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేసింది. పట్టణానికి చెందిన పొన్నాల శ్రీదేవి కి ఒంగోలుకు చెందిన పల్లంశెట్టి సత్యవర్ధన్తో 2024లో వివాహమైంది. వివాహ సమయంలో రూ.10 లక్షల కట్నం, రూ.లక్ష ఆడబిడ్డ కట్నంతో పాటు పెళ్లికి రూ.10 లక్షలు ఖర్చుచేశారు. తన భర్తకు కానిస్టేబుల్ ఉద్యోగం వస్తుందంటూ మరో రూ.10 లక్షలు కట్నం తీసుకురావాలంటూ భర్తతో పాటు శ్రీదేవి అత్త దైవేశ్వరి, మామ ఏడుకొండలు కొంతకాలంగా వేధిస్తున్నారు. ఈ విషయమై పెద్ద మనుషుల్లో పెట్టినప్పటికీ ఉపయోగం లేకపోవడంతో బాధితురాలు ఫిర్యాదు చేసింది. -
కూటమికి చెడ్డ పేరొస్తుందని..!
● ప్రమాద సూచిక బోర్డు తొలగించిన గుర్తుతెలియని వ్యక్తులు ● మళ్లీ డ్రమ్ము ఏర్పాటు చేసిన స్థానికులు ద్వారకాతిరుమల: ‘నెమ్మదిగా వెళ్లండి.. నేను కుటుంబాలతో ప్రయాణించే వ్యక్తులను గాయపరుస్తున్నాను. నేను మరొకరికి గాయం కలిగించకముందే దయచేసి నాకు త్వరగా మరమ్మతులు చేయండి’ అంటూ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నట్టుగా భీమడోలు–ద్వారకాతిరుమల క్షేత్ర ప్రధాన రహదారిలో కొందరు వ్యక్తులు ఇటీవల ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను తాజాగా గుర్తుతెలియని వ్యక్తులు తొలగించారు. పంగిడిగూడెం, సూర్యచంద్రరావుపేట, గొల్లగూడెం, ద్వారకాతిరుమలలోని నిమ్మకాయల మార్కెట్ యార్డు ఎదురుగా రోడ్డుపై ఉన్న గోతులు ప్రమాదాలకు నిలయంగా మారాయి. ద్విచక్ర వాహనదారులు తరచూ ఈ ప్రాంతాల్లో ప్రమాదాల బారిన పడి క్షతగాత్రులవుతున్నారు. గతనెల 26న శ్రీఆదమరిస్తే.. ప్రాణాలు గోవిందా!శ్రీ శీర్షికతో దీనిపై శ్రీసాక్షిశ్రీ కథనం ప్రచురించగా, స్పందించిన అధికారులు.. మరుసటిరోజే ఆయా గోతుల్లో మెటల్ డస్ట్ పోశారు. అయితే రెండు రోజులకే రోడ్డు మళ్లీ యథాస్థితికి చేరుకుంది. అధికారులు తూతూ మంత్రంగా గోతుల్లో డస్ట్ పోసి చేతులు దులుపుకున్నారని వాహనదారులు వారి తీరుపై ధ్వజమెత్తుతున్నారు. ద్విచక్ర వాహనదారులు నిత్యం ప్రమాదాల బారిన పడుతుండడాన్ని చూడలేక గుర్తు తెలియని కొందరు వ్యక్తులు పొలసానిపల్లి, పంగిడిగూడెం, లక్ష్మీపురంలోని విర్డ్ ఆస్పత్రి తదితర ప్రాంతాల్లో గోతుల వద్ద పై కొటేషన్తో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ బోర్డుల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్న కారణంగా గుర్తు తెలియని వ్యక్తులు మూడు రోజుల క్రితం వాటిని తొలగించారు. కూటమికి చెందినవారు తప్ప మరెవరూ వాటిని తొలగించే పరిస్థితి ఉండదని, దీనిపై స్థానికులు అభిప్రాయపడుతున్నారు. బోర్డులను తొలగించినవారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన బాగుండేదని అంటున్నారు. ఈ క్రమంలో పంగిడిగూడెం కుమారీ దాబా సమీపంలో రోడ్డుపై ఉన్న గోతుల వద్ద స్థానికులు మళ్లీ హెచ్చరికగా డ్రమ్మును ఏర్పాటు చేశారు. దీనిపై ఆర్అండ్బీ ఏఈ భాస్కరరావు దృష్టికి తీసుకెళ్లగా.. బోర్డులను ఎవరు తొలగించారో తెలియదన్నారు. రహదారి నిర్మాణ ంపై ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపించామని చెప్పారు. -
వివాదాస్పద క్యూలైన్ నిర్మాణంపై విచారణకు ఆదేశం
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయంలో అప్రదక్షిణ మార్గంలో దర్శనం క్యూలైన్ల నిర్మాణాలు చేపట్టడం ఆగమశాస్త్ర విరుద్ధమంటూ ఇటీవల ఏలూరుకు చెందిన ఆధ్యాత్మిక వేత్త, హైకోర్టు న్యాయవాది బీకేఎస్ఆర్ అయ్యంగార్ రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తిని విచారణకు ఆదేశించినట్టు దేవదాయ శాఖ అదనపు కమిషనర్ టి.చంద్రకుమార్ సోమవారం తనకు మెమో ద్వారా తెలియజేసినట్టు అయ్యంగార్ తెలిపారు. విచారణ జరిపి, అవసరమైన చర్యలు తీసుకోవడానికి వివరణాత్మక నివేదికను ఈఓ నుంచి కోరినట్టు అందులో పేర్కొన్నారన్నారు. తాను చేసిన ఫిర్యాదులో అంతరాలయ దర్శనాన్ని పునరుద్ధరించాలని, స్థానాచార్యులను నియమించాలని, స్వామివారికి వినియోగించిన నిర్మాల్య పుష్పాలతో అగరుబత్తీల తయారీ ఆగమ విరుద్ధమని, అంతరాలయ మండపం ఎదురుగా ఆంజనేయస్వామి, గరుడాళ్వార్లు చేస్తున్న నమస్కారం శ్రీవారికి కాకుండా భక్తుల పాదాలకు చేస్తున్నట్టుగా ఉందని, కుచ్చుల మెట్టపై ఉత్సవాన్ని, పొన్నచెట్టు వాహన సేవను పునరుద్ధరించాలన్న అంశాలపై సైతం విచారణకు ఈఓను ఆదేశించినట్టు అయ్యంగార్ తెలిపారు. తనకు వ్యక్తిగతంగా ఎవరిపైనా ద్వేషం లేదని, హిందూ ఆలయాల్లో ఆచార సంప్రదాయాలను కాపాడలన్న ఉద్దేశంతోనే ఈ ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. తూతూ మంత్రంగా విచారణ జరిపి, తప్పులను కప్పిపుచ్చాలని చూస్తే మఠాధిపతులతో ఆలయం వద్ద ఆందోళనకు దిగుతానని, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని న్యాయవాది అయ్యంగార్ తెలిపారు. -
ఉద్యమ పథంలో విద్యుత్ ఉద్యోగులు
ఆస్పత్రి పూర్తయ్యేదెప్పుడు? గత ప్రభుత్వంలో మంజూరైన ఆస్పత్రి పనులు కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక నిలిచిపోయాయి. ఎప్పటికి పూర్తిచేస్తారని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. IIలో uజంగారెడ్డిగూడెం మండలం జల్లేరు వంతెన వద్ద రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ ఏఎస్సై మృతిచెందారు. దైవదర్శనానికి వచ్చి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. IIలో uబుధవారం శ్రీ 15 శ్రీ అక్టోబర్ శ్రీ 2025కొయ్యలగూడెం: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వ వైద్యులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా కొయ్యలగూడెం ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్ర సిబ్బంది మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ఈ నిరసన చేపట్టారు. తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని డిమాండ్ చేశారు. రిసెప్షనిస్టుల వర్క్షాప్లో ఎస్పీ సూచన ఏలూరు టౌన్: ఏలూరు జిల్లాలోని పోలీస్స్టేషన్లలో పనిచేస్తున్న ఫ్రంట్లైన్ రిసెప్షనిస్టులు స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని, పోలీస్ గౌరవాన్ని మరింత పెంచేలా నడుచుకోవాలని జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ సూచించారు. ఏలూరు పోలీస్ జిల్లా ప్రధాన కార్యాలయంలో మంగళవారం జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల రిసెప్షనిస్టులకు ఒకరోజు వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తమ సమస్యలు, ఇబ్బందులతో న్యాయం కోసం పోలీస్స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులకు మెరుగైన సేవలు అందించటం ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని చెప్పారు. పోలీస్ వ్యవస్థ పట్ల ప్రజల్లో మరింత విశ్వాసాన్ని పెంచేందుకు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ బాధితులకు న్యాయం చేసేందుకు కృషి చేయాలన్నారు. ఈ వర్క్షాప్లో అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, కై కలూరు రూరల్ సీఐ వి.రవికుమార్, డీసీఆర్బీ సీఐ హబీబ్ బాషా, మహిళా స్టేషన్ ఎస్ఐ నాగమణి తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (టూటౌన్): రాష్ట్రంలోని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో పనిచేస్తున్న ఉద్యోగ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ మూడో తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సమ్మె చేయనున్నట్టు ఏఐటీయూసీ అనుబంధ ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం కార్పొరేషన్ కమిషనర్ ఎ.భానుప్రతాప్కు సమ్మె నోటీసు అందించింది. యూనియన్ గౌరవ అధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ డాంగే, యూనియన్ ప్రధాన కార్యదర్శి ఏ అప్పలరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం: రిటైర్డ్ పంచాయతీ కార్యదర్శి పి.నాగేశ్వరరావును అరెస్టు చేసినట్టు ఎస్సై షేక్ జబీర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం జంగారెడ్డిగూడెం పంచాయతీగా ఉన్న సమయంలో పి.నాగేశ్వరరావు పంచాయతీ కార్యదర్శిగా పనిచేశారు. 2011లో జంగారెడ్డిగూడెం నగర పంచాయతీగా అప్గ్రేడ్ అయ్యింది. పంచాయతీగా ఉన్న సమయంలో అప్పట్లో పనిచేసిన కొంతమంది అధికారులు సుమారు కోటి రూపాయల మేరకు పంచాయతీ నిధులు దుర్వినియోగం చేసినట్టు గుర్తించారు. దీనిపై 2013లో డివిజనల్ పంచాయతీ అధికారి జంగారెడ్డిగూడెం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వ్యక్తులు కోర్టు నుంచి స్టే తెచ్చుకోవడంతో ఇంతకాలం స్టేపై బయట ఉన్నారు. స్టే వేకెంట్ కావడంతో ఇటీవల రిటైరైన పంచాయతీ కార్యదర్శి పి.నాగేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు. ఆయన్ని కోర్టులో హాజరు పరచగా, రిమాండ్ విధించినట్టు ఎస్సై చెప్పారు. ఏలూరు (ఆర్ఆర్పేట): విద్యుత్ ఉద్యోగులు ఉద్యమ పథం పట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఇటీవల దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటు ప్రభుత్వం నుంచి గాని అటు విద్యుత్ సంస్థల యాజమాన్యాల నుంచి గాని వారికి సానుకూల స్పందన లభించలేదు. జేఏసీ రాష్ట్ర నాయకులతో చర్చలు జరిపినా ప్రధాన డిమాండ్లు నెరవేర్చడానికి ప్రభుత్వం ఒప్పుకోలేదు. సుమారు 50కి పైగా డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి, విద్యుత్ యాజమాన్యాల దృష్టికి తీసుకువెళ్ళినా వారు మొండిపట్టు వీడలేదు. సమస్యల పరిష్కారానికి చొరవ చూపకపోవడంపై విద్యుత్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేటి నుంచి సమ్మెకు పిలుపు.. చర్చలు విఫలం కావడంతో తమ సమస్యల పరిష్కారానికి ఉద్యోగులు సమ్మెబాట పట్టక తప్పలేదు. ఈ నేపథ్యంలో సమ్మె తప్పనిసరి అని విద్యుత్ జేఏసీ నాయకులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఈ నెల 15 నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సమ్మెలో విద్యుత్ సంస్థలో పని చేసే అసిస్టెంట్ లైన్మెన్, లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టర్, ఏఈలు, ఏఈఈలతో పాటు వివిధ విభాగాల ఉద్యోగులు, కొంతమంది ఈఈలు సైతం పాల్గొననున్నారు. సమ్మెలో దాదాపు సంస్థలో పనిచేసే 80 శాతం మంది పాల్గొననున్నట్టు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నాయకులు తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే విద్యుత్ సంస్థలకు చెందిన పలు ఉద్యోగ సంఘాలు జేఏసీగా ఏర్పడి దశలవారీ ఆందోళన నిర్వహించగా, ప్రస్తుతం తలపెట్టిన నిరవధిక సమ్మెలో జేఏసీలోని భాగస్వామ్య సంఘాలన్నీ పాల్గొనడానికి సిద్ధపడ్డాయి. ఈ మేరకు విద్యుత్ ఉద్యోగుల సంఘాల్లోని ప్రధాన సంఘాలైన 1104, 327 సంఘాలతో పాటు ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం, బీసీ ఉద్యోగుల సంఘం, ఓసీ ఉద్యోగుల సంఘం, ముస్లిం మైనార్టీ ఉద్యోగుల సంఘాలు సైతం సమ్మెకు వెళుతున్నాయి. సమ్మె జరిగితే.. వినియోగదారులకు కష్టాలే విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు వెళితే వినియోగదారులకు కష్టాలు తప్పేలా లేవు. ఏ వీధిలో, ఏ ఇంటిలో కరెంటు పోయినా వెంటనే గుర్తుకు వచ్చే ఫ్యూజ్ ఆఫ్ కాల్కు ఫోన్ చేస్తే నేటి నుంచి స్పందన వచ్చే అవకాశం కనిపించడం లేదు. అధిక లోడ్ కారణంగా ఎక్కడ ట్రిప్ అయినా వెంటనే వెళ్ళి మరమ్మతు చేసేవారు దొరకరు. మరమ్మతులు చేసేవారు లేక గ్రామాలకు గ్రామాలు చీకటిలో ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశముంది. ఏలూరు టౌన్ : ఏలూరు నగరంలో సెయింట్ ఆన్స్ మహిళా డిగ్రీ కాలేజీ సమీపంలోని యూనియన్ బ్యాంకులో మంగళవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం 8.30 గంటల సమయంలో ఇంకా బ్యాంకు తెరవకముందే మంటలు చెలరేగాయి. బ్యాంకులోని ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా దట్టమైన పొగలు అలముకున్నాయి. ప్రమాదాన్ని గమనించిన సెయింట్ ఆన్స్ కాలేజీ సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఈ అగ్నిప్రమాదంలో సుమారుగా రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించి ఉండవచ్చని అగ్నిమాపక శాఖ అధికారి రామకృష్ణ తెలిపారు. బ్యాంకులో అగ్ని ప్రమాద నిరోధక వ్యవస్థ పనిచేస్తూ ఉండడంతో బ్యాంకులో చెలరేగిన మంటలను వ్యాప్తి చెందకుండా నిరోధించినట్టు తెలుస్తోంది. ఏలూరు కార్పొరేషన్ ఎదుట ఆందోళన చేస్తున్న మున్సిపల్ కార్మికులు ఏలూరు (టూటౌన్): పారిశుద్ధ్య పనుల నిర్వహణను ప్రైవేటీకరించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మున్సిపల్ కార్మికులు మంగళవారం ఆందోళన నిర్వహించారు. ఏలూరు నగరంలో పారిశుద్ధ్య పనుల నిర్వహణ ప్రైవేటీకరణను నిలిపివేయాలని, ఆప్కాస్ విధానం కొనసాగించాలని, కొత్త కార్మికులను ఆప్కాస్ ద్వారా నియమించాలని, చనిపోయిన, రిటైర్ అయిన కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్టీయూ)ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు కమిషనర్ చాంబర్ వద్దకు వెళ్లి బైఠాయించారు. దీంతో కమిషనర్ కార్మికుల వద్దకు వచ్చి ప్రస్తుతం ఆప్కాస్లో ఉద్యోగాల భర్తీపై నిషేధం ఉన్నందున కార్మికులను తీసుకునేందుకు అవకాశం లేదని, అందువల్ల టీఎల్ఎఫ్ ద్వారా నియామకాలు చేపడుతున్నామని చెప్పారు. టీఎల్ఎఫ్ ద్వారా నియామకాలు చేసే వారికి కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ తదితర సౌకర్యాలు అమలు చేస్తామని, భవిష్యత్తులో ఆప్కాస్లో నిషేధం ఎత్తివేసిన తర్వాత వీరిని అందులో విలీనం చేస్తామని హామీ ఇచ్చారు. కమిషనర్ హామీ మేరకు తమ ఆందోళనను తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నామని ఈ సందర్భంగా కార్మికులు తెలిపారు. ధర్నానుద్దేశించి ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.సోమయ్య ఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి యు.వెంకటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బద్ధా వెంకట్రావు మాట్లాడారు. పారిశుద్ధ్య పనుల ప్రైవేటీకరణ వల్ల కార్మికులు తమ హక్కులు కోల్పోతారని, జీతాలకు, పని భద్రతకు గ్యారెంటీ ఉండదని, ఈ కార్యక్రమానికి యూనియన్ అధ్యక్షుడు లావేటి కృష్ణారావు అధ్యక్షత వహించారు. విద్యుత్ బోర్డ్ విభజనకు ముందు ఉద్యోగ సంఘాలతో కుదుర్చుకున్న త్రైపాక్షిక ఒప్పందానికి విరుద్ధంగా గత ఆరు దశాబ్దాల నుంచి అమలులో ఉన్న సర్వీస్ నిబంధనలను ఏకపక్షంగా మార్పులు చేయడాన్ని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం బోర్డు విభజనకు ముందు అమలులో ఉన్న సర్వీస్ నిబంధనలు, పని ప్రమాణాలు, కారుణ్య నియామకాలు తదితర ప్రయోజనాలు యథావిధిగా కొనసాగుతాయని, ఏవైనా మార్పులు చేయాలంటే ఉద్యోగ సంఘాలతో చర్చించి ప్రస్తుత ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా పరస్పర అవగాహనతో ఒప్పందాలు చేస్తామని చెప్పి ప్రస్తుతం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడాన్ని విద్యుత్ ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. జీతభత్యాల విషయంలో ప్రస్తుతం అమలులో ఉన్న పరస్పర చర్చల ద్వారా వేతనాలు నిర్ణయించే పద్ధతి ఇకముందు ఏర్పడబోయే సంస్థల్లో కూడా కొనసాగిస్తామని త్రైపాక్షిక ఒప్పందంలో స్పష్టంగా పేర్కొన్నా, ఇందుకు భిన్నంగా 2022 వేతన సవరణపై నిర్ణయాల కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక మాజీ ఐఏఎస్ అధికారిని నియమించడం ఉద్యోగుల ఆగ్రహానికి గురైంది. పూర్వం నుంచి అమలులో ఉన్న వెయిటేజ్శ్రీ ఫార్ములాను రద్దు చేసి, అతి తక్కువ శాతం (8 శాతం) ఫిట్మెంట్ బెనిఫిట్ను, పాత పద్ధతికి విరుద్ధంగా ఇంక్రిమెంట్లు, మాస్టర్ స్కేలును రూపొందించారని, దీనివల్ల ఉద్యోగులు చాలా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్రైపాక్షిక ఒప్పందంలోని అన్ని అంశాలూ అమలు చేయాలని డిమాండ్ నేటి నుంచి సమ్మెకు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ పిలుపు భాగస్వాములవుతున్న పలు విద్యుత్ ఉద్యోగ సంఘాలు సమ్మెకు వెళితే వినియోగదారులకు విద్యుత్ కష్టాలే విద్యుత్ సంస్థల్లో 1999 నుంచి 2004 మధ్య చేరిన ఉద్యోగులకు ప్రస్తుతం అమలు చేస్తున్న ఈపీఎఫ్ విధానాన్ని జీపీఎఫ్ విధానానికి మార్చాలనేది మా ప్రధాన డిమాండ్లలో ఒకటి. విద్యుత్ ఉద్యోగులకు, పెన్షనర్లకు, వారి కుటుంబ సభ్యులకు వైద్య ఖర్చులు యాజమాన్యాలే చెల్లించాలి. పది సంవత్సరాల సర్వీసు దాటిన వారందరికీ 2018 రివిజన్లో మంజూరు చేసిన శ్రీసర్వీస్ ఇన్సెంటివ్శ్రీ పునరుద్ధరించాలి. – తురగా రామకృష్ణ, విద్యుత్ జేఏసీ డిస్కం వైస్ చైర్మన్ విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి. ప్రభుత్వం దిగివచ్చేవరకూ సమ్మె కొనసాగుతుంది. పెండింగ్లో ఉన్న నాలుగు డీఏ/సీఆర్లను మంజూరు చేయాలి. 2019లో నియమించిన ఎనర్జీ అసిస్టెంట్ల (జేఎల్ఎం (గ్రేడ్–2)ను రెగ్యులర్ జేఎల్ఎంలుగా పరిగణించి వేతనాలు తదితర ప్రయోజనాలన్నీ కల్పించాలి. 1993 జూలై ఒకటో తేదీకి ముందు నియమితులైన ఉద్యోగులకు, అంతకు ముందు నియమితులైన ఉద్యోగులకు వేతనాల్లో ఉన్న వ్యత్యాసాలను తొలగించాలి. – పి.శ్రీనివాస్, జేఏసీ ఏలూరు డివిజన్ కన్వీనర్ భవిష్యత్తుపై ఎంతో ఆశతో ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కాంట్రాక్ట్ లేబర్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. 2023లో విద్యుత్ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమక్షంలో కుదిరిన ఒప్పందం ప్రకారం వారికి యాజమాన్యమే నేరుగా వేతనాలు చెల్లించాలి. 2014, 2018 నూతన వేతనాల్లో అమలు జరిపిన పద్ధతిలో 2022 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 2023 ఆగస్టు 13 వరకు బకాయిలు చెల్లించాలి. – భూక్యా నాగేశ్వరరావు నాయక్, విద్యుత్ జేఏసీ డిస్కం కన్వీనర్ అత్యున్నత స్థాయిలో తీసుకున్న నిర్ణయాలను కూడా యాజమాన్యాలు అమలు చేయకపోవడం పలు సందేహాలకు తావిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, అడిషనల్ లేబర్ కమిషనర్ రిపోర్టు ప్రకారం, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. దీర్ఘకాలిక సర్వీసు ఉన్న వారందరినీ విద్యుత్ సంస్థల్లో విలీనం చేయాలి. కారుణ్య నియామకాలు కల్పించటంలో కొత్త కొత్త పేర్లు పెట్టి కన్సాలిడేటెడ్ పే ఇస్తున్న పద్ధతిని వెంటనే రద్దు చేసి గత నాలుగు దశాబ్దాల నుంచి అమలులో ఉన్న పద్ధతినే కొనసాగించాలి. – కె.కుమార్, జేఏసీ ఏలూరు డివిజన్ చైర్మన్ -
శివశివా.. ఇదేం దారుణం?
ద్వారకాతిరుమల: క్షేత్రపాలకునిగా విరాజిల్లుతోన్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం జరిగిన రుద్ర హోమాన్ని వీక్షించిన భక్తులు శివశివా.. ఇదేం దారుణమంటూ ముక్కున వేలేసుకున్నారు. శాస్త్రోక్తంగా హోమకుండంలో జరగాల్సిన ఈ హోమాన్ని తాపీ పనులకు వినియోగించే గమేళాలో నిర్వహించడం పట్ల పలువురు భక్తులు మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే శివదేవుని ఆలయంలో ధ్వజస్తంభం ఎదురుగా, ప్రహరీ గోడకు ఆనుకుని ఉన్న యాగశాల షెడ్డులో ప్రతి సోమవారం రుద్ర హోమాన్ని జరుపుతారు. అందులో రూ.516 లు రుసుము చెల్లించి దంపతులు పాల్గొంటారు. ఇదిలా ఉంటే వేరే ప్రాంతంలో యాగశాలను నిర్మించే ఉద్దేశంతో, దేవస్థానం అధికారులు మూడు రోజుల క్రితం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ప్రస్తుత యాగశాల షెడ్డును అకస్మాత్తుగా తొలగించారు. అయితే అందులో హోమకుండం భాగానే ఉండడంతో అర్చకులు సోమవారం ఉదయం ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి, హోమ నిర్వహణకు అంతా సిద్ధం చేశారు. ఇంతలో వర్షం కురవడంతో అర్చకులకు ఏం చేయాలో? పాలుపోలేదు. అప్పటికే నలుగురు భక్తులు హోమంలో పాల్గొనేందుకు ఆన్లైన్ టికెట్లను కొనుగోలు చేశారు. అలాగే భక్తులు ఉన్నా.. లేకపోయినా ఈ హోమాన్ని జరపడం పరిపాటి. దాంతో అర్చకులు తప్పనిసరి పరిస్థితుల్లో, వేరే గత్యంతరం లేక ఆలయ మండపంలో, తాపీ పనులకు వినియోగించే గమేళాలో ఈ రుద్ర హోమాన్ని నిర్వహించారు. ఇది చూసిన భక్తులు విస్తుపోయారు. శ్రీవారి ఆలయానికి ఉపాలయమై, పురాణ పాశస్త్యం ఉన్న ఈ ఆలయంలో ఇలాంటి పరిస్థితులను చూసిన భక్తులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అధికారుల అనాలోచిత నిర్ణయాల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. అయితే ఈ ఘటనపై సెక్షన్ సూపరింటిండెంట్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ షెడ్డు తొలగించిన వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నది వాస్తమేనని అంగీకరించారు. అయితే ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్లు పనిలోపడి మర్చిపోయారని, వర్షం కారణంగా ఉదయం టెంటు నిర్మించడం కుదరలేదన్నారు. అర్చకులు ప్రత్యామ్నాయంగా ఆలయంలో రుద్ర హోమాన్ని జరిపారన్నారు. -
పోలవరం భూసేకరణ అక్రమాలను అడ్డుకుంటాం
ధవళేశ్వరం: పోలవరం ప్రాజెక్టు భూసేకరణకు తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్లో అక్రమాలను అడ్డుకుంటామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం, పోలవరం, జీలుగుమిల్లి మండలాల్లోని 20 గ్రామాల గిరిజనులు తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేశారు. కాటన్ బ్యారేజీ సెంటర్ నుంచి వందలాది మంది ర్యాలీగా వెళ్లి, కార్యాలయం గేటు ఎదుట ధర్నా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీనివాసరావు మాట్లాడుతూ, బుట్టాయిగూడెం, పోలవరం, జీలుగుమిల్లి మండలాల్లో ఇప్పటి వరకూ 5 నోటిఫికేషన్లు ఇచ్చారని, ప్రతి దానిలోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. గ్రామసభలు నిర్వహించలేదని, పెసా కమిటీల అనుమతులు సైతం లేకుండానే నోటిఫికేషన్ జారీ చేశారని తెలిపారు. గిరిజనుల సాగులో ఉన్న భూములను భూస్వాముల పేరిట రికార్డుల్లో నమోదు చేశారని చెప్పారు. ఇలాంటి అక్రమాలను అడ్డుకుని, గిరిజనులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనుల రక్షణకు ఏర్పాటైన చట్టాల అమలులో పాలనా యంత్రాంగం విఫలమవుతోందన్నారు. పోలవరం భూసేకరణ పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొట్టే ప్రయత్నాన్ని అడ్డుకుంటామని శ్రీనివాసరావు చెప్పారు. ప్రతి ఎకరాకు బహిరంగ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో 1.05 లక్షల మంది నిర్వాసితులవుతున్నారని, ఇప్పటి వరకూ 12 శాతం మందికే పునరావాసం కల్పించారని, ఆలస్యంగా చేసినా అన్నీ అవకతవకలే వెలుగు చూస్తున్నాయని అన్నారు. ఆందోళన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటివ్ అధికారి వి.అభిషేక్ వచ్చి గిరిజనులు, నాయకులతో మాట్లాడి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గిరిజనుల అభ్యర్థనలను స్వీకరించారు. వాటిని పరిశీలిస్తామని, ఏలూరు జిల్లా కలెక్టర్, ఆర్డీఓలతో చర్చిస్తానని చెప్పారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బి.బలరాం, సీపీఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ.రవి, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మొడియం నాగమణి తదితరులు పాల్గొన్నారు. -
చోరీకి యత్నించి.. దాడిలో గాయపడి..!
ఏలూరు టౌన్: ఏలూరు ఎన్ఆర్ పేట, కట్టా సుబ్బారావు వీధి ప్రాంతంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి వారిపై దాడి చేసేందుకు ప్రయత్నించగా ఇంటి యజమాని అతడిని క్రికెట్ బ్యాట్తో కొట్టటంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆ గుర్తు తెలియని వ్యక్తిని ఏలూరు జీజీహెచ్కు తరలించగా మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ తరలించారు. అతను చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. ఏలూరు టూటౌన్ ఏఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం కట్టా సుబ్బారావు తోట ప్రాంతంలో వీరమాచినేని మృత్యుంజయబాబు తన కుటుంబంతో నివాసం ఉంటున్నారు. ఈ నెల 8న రాత్రి సుమారు 8 గంటల సమయంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి మృత్యుంజయబాబు ఇంట్లోకి ప్రవేశించాడు. అతను చోరీ చేసేందుకు వచ్చాడా? మరే కారణామో తెలియదు గానీ... ఇంట్లోని వారిపై క్రికెట్ బ్యాట్తో దాడి చేసేందుకు ప్రయత్నించగా, అతడి చేతిలోని బ్యాట్ను లాక్కున్న మృత్యుంజయబాబు అతడిపై దాంతో దాడి చేశాడు. ఈ దాడిలో గుర్తు తెలియని వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో అతడిని చికిత్స నిమిత్తం ఏలూరు జీజీహెచ్కు తరలించారు. మెరుగైన చికిత్సకు వైద్యులు విజయవాడ రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 12న మృతిచెందాడు. ఈ సంఘటనపై వీఆర్ఓ ఫిర్యాదు మేరకు ఏలూరు టూటౌన్ సీఐ కే.అశోక్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జోరు వాన.. నరకయాతన
పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో సోమవారం వర్షం దంచికొట్టింది. తెల్లవారు జాము నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో కూలీలు, విద్యార్థులు, ఉద్యోగస్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఎనిమిది గంటలైనా వాన తగ్గకపోవడంతో ఇక చేసేది రెయిన్కోట్లు, గొడుగుల సాయంతో తమ తమ విధులకు వెళ్లారు. అయితే భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ముఖ్యంగా రోడ్లు అధ్వానంగా ఉండడంతో గుంతలు తెలియక వాహనచోదకులు అవస్థలు పడ్డారు. పట్టణ ప్రాంతాల్లో ప్రధాన రోడ్లపై మోకాలు లోతు నీరు చేరడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. – సాక్షి, నెట్వర్క్ -
పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించాలి
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తోన్న పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించకపోవటంతో వారంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ విభాగం అధికారులకు ఎన్నిసార్లు వినతి చేసినా పట్టించుకోవటం లేదని ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కె.కృష్ణమాచార్యులు ఆవేధన వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లాలోని ఏరియా హాస్పిటల్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ఏలూరు జీజీహెచ్లో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నాలుగు నెలలుగా జీతాలు రాకపోవడంతో వారంతా కుటుంబ పోషణ కష్టమై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీంతో యూనియన్ పిలుపు మేరకు ఏలూరు జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు సోమవారం నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేశారని తెలిపారు. జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం, భీమడోలు, నూజివీడు, కై కలూరు ఇలా అన్ని హాస్పిటల్స్ వద్ద కార్మికులు తమ సమస్యల పరిష్కారానికి ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. జిల్లాలోని వైద్యాధికారులు వెంటనే జీతాల చెల్లింపులకు ప్రభుత్వానికి నివేధించాలనీ, లేనిపక్షంలో ఆందోళన బాట పట్టక తప్పదని హెచ్చరించారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రి వద్ద ధర్నా చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు బుట్టాయగూడెం ప్రభుత్వాసుపత్రి వద్ద నిరసన ప్రదర్శన చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు -
చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి
ద్వారకాతిరుమల: శ్రీవారి కొండపైన దేవస్థానం సత్రం గదిలోని బాత్రూమ్లో గడప తగిలి పడిపోయిన ఓ వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. స్థానిక ఎస్సై టి.సుధీర్ తెలిపిన వివరాల ప్రకారం విజయవాడ లోని యనమలకుదురు గ్రామానికి చెందిన యార్లగడ్డ నరేంద్రబాబు తన మేనకోడలి వివాహం నిమిత్తం కుటుంబ సభ్యులతో కలసి ఈనెల 11న ద్వారకాతిరుమల క్షేత్రానికి విచ్చేశాడు. ఇదిలా ఉంటే అర్ధరాత్రి తెల్లవారుజామున నరేంద్రబాబు తండ్రి యార్లగడ్డ సాంబశివరావు(80) కొండపైన ధర్మఅప్పారాయ నిలయం గదిలోని బాత్రూమ్ నుంచి బయటకు వస్తూ, గడప తగిలి ముందుకు పడిపోయాడు. దాంతో తీవ్ర గాయాలు పాలైన ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఈ మేరకు నరేంద్రబాబు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. కల్వర్టులోకి దూసుకెళ్లిన కారు కుక్కునూరు: కుక్కునూరు మీదుగా భద్రాచలం వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న కల్వర్టులోకి దూసుకెళ్లి బోల్తాకొట్టిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, తెలంగాణా రాష్ట్రం చర్ల గ్రామానికి చెందిన పాస్టర్ దంపతులు రాజమండ్రిలో సువార్త స్వస్థత సభలకు హాజరై తిరుగు ప్రయాణంలో భాగంగా కుక్కునూరు మీదుగా వారి స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో మండలంలోని కొర్లకుంట రామాలయం సమీపంలోని కల్వర్టు వద్ద రహదారిపై గుంటలను తప్పించే క్రమంలో కారు అదుపు తప్పి కల్వర్టుకు ఉన్న రైలింగ్కు ఢీకొని పక్కనే ఉన్న కాలువలో బోల్తాపడింది. అయితే ఈ ఘటనలో కారులో ఉన్న పాస్టర్ దంపతులకు ఎలాంటి గాయాలు కాలేదు. -
పారిజాతగిరి హుండీ ఆదాయం లెక్కింపు
జంగారెడ్డిగూడెం: స్థానిక గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. ఏలూరు దేవదాయ ధర్మదాయ శాఖ ఇన్స్పెక్టర్ బాబు నాయుడు పర్యవేక్షణలో నిర్వహించిన లెక్కింపులో 90 రోజులకు గానూ రూ. 12,88,615 ఆదాయం వచ్చినట్లు ఈఓ కలగర శ్రీనివాస్ తెలిపారు. హుండీ లెక్కింపులో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు అబ్బిన దత్తాత్రేయ, గొట్టుముక్కల భాస్కరరాజు, వాసవీ సాయి నగేష్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (టూటౌన్): హర్యానా రాష్ట్ర దళిత ఐపీఎస్, ఏడీజీపీ పురానాకుమార్ ఆత్మహత్య పై సుప్రీంకోర్టు జడ్జి తో విచారణ జరిపించాలి దళిత సేన నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక ఆర్ఆర్పేటలోని రాష్ట్ర కార్యాలయంలో సోమవారం సాయంత్రం జరిగిన సమావేశంలో సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జిజ్జువరపు రవిప్రకాష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దళిత జాతి కి చెందిన హర్యానా రాష్ట్రం ఐపీఎస్ ఏడీజీపీ పురానా కుమార్ కుల వివక్ష కారణంగా ఆత్మహత్య చేసుకోవడానికి అందుకు కారుకులైన హర్యానా రాష్ట్ర డీజీపీ, ఎస్పీలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కోరారు. ఈ ఆత్మహత్యపై సుప్రీంకోర్టు జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాన్ని దళిత సేన తరుపున డిమాండ్ చేిశారు. సమావేశంలో పశ్చిమగోదావరి జిల్లా దళిత సేన అధ్యక్షులు చీలి మోహనరావు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు దిరుసు పాము కృష్ణమూర్తి, ఏలూరు జిల్లా ఉపాధ్యక్షులు పెదపాటి ఏసురత్నం తదితరులు పాల్గొన్నారు. -
చోరీ కేసుల్లో నిందితుల అరెస్టు
చింతలపూడి/లింగపాలెం: ఇటీవల లింగపాలెం మండలంలో చైన్ స్నాచింగ్ , దొంగతనాలకు పాల్పడిన ఐదుగురు నిందితులను పట్టుకుని, సొమ్మును రికవరీ చేసినట్లు డీఎస్పీ రవిచంద్ర తెలిపారు. స్థానిక సీఐ కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ కేసు వివరాలను వెల్లడించారు. ఏలూరు పట్టణానికి చెందిన చవల భార్గవ కృష్ణ, భరగడ హర్ష వర్ధన్, కాకర్లపర్తి గణేష్, బద్ది హేమ అచ్యుత్, కోలా అప్పల రాజు గత నెల 23న ధర్మాజీగూడెంలో ఒడ్డు కట్టు చెరువు రోడ్డు బాపిరాజు గూడెంలో బొల్లా నాగలక్ష్మి నుంచి బంగారు ఆభరణాలను బలవంతంగా లాక్కుని ద్విచక్ర వాహనాలపై పారిపోయారు. ఈ మేరకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీఐ టి.క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో ధర్మాజిగూడెం ఎస్సై వెంకన్నబాబు సిబ్బందితో కలిసి సోమవారం ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వీరి నుంచి పలు నేరాల్లో సుమారు 80 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చెడు అలవాట్లకు, సులభంగా డబ్బు సంపాదించాలి అనే ఆశతో చదువుకునే యువత దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలిపారు. నిందితులను పట్టుకున్న పోలీసు సిబ్బందిని డీఎస్పి అభినందించారు. బాణసంచా నిల్వ చేస్తే కఠిన చర్యలు అనధికారికంగా బాణసంచా నిల్వ చేసిన, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రవిచంద్ర హెచ్చరించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో మండలంలోని పలు ప్రాంతాల్లో అనధికారకంగా బాణసంచా నిల్వ ఉంచిన ప్రాంతాల్లో దాడులు నిర్వహించామని తెలిపారు. దాడుల్లో ప్రగడవరం గ్రామంలో మూడు చోట్ల ఐదు లక్షల విలువైన అక్రమ మందు బాణసంచా గుర్తించి సీజ్ చేసినట్లు తెలిపారు. -
రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరించాలి
జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ ఏలూరు(మెట్రో): జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణ లక్ష్యాలను సాధించేందుకు పటిష్టమైన ప్రణాళికతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ ఎం.జె.అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ చాంబర్లో సోమవారం ఖరీఫ్లో ధాన్యం సేకరణ లక్ష్యాలు, ప్రణాళికలపై అధికారులతో జేసీ సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ అభిషేక్ గౌడ్ మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతుల నుంచి 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్ణయించామని, ఒక్క రైతుకీ ఎలాంటి సమస్య రాకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గోనె సంచులు, రవాణా, హమాలీ చార్జీలు, తేమ శాతం తదితర సమస్యలు, ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వాటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ముందుగానే చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం సేకరణ కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు జాప్యం లేకుండా రైస్ మిల్లులకు తరలించాలని, ధాన్యం సేకరణలో రైతులు, మిల్లర్లు, రవాణా పరమైన ఇబ్బంది లేకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దేవకీదేవి, డీఎస్ఓ విలియమ్స్, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజరు శివరామమూర్తి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎస్కె హబీబ్ బాషా, డీసీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి అర్జీకీ పరిష్కారం చూపాలి
ఏలూరు(మెట్రో): పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి సోమవారం కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. అధికారులు అర్జీలను క్షుణ్నంగా అధ్యయనం చేసి తమ సిబ్బందితో నిర్ణీత గడువు లోగా పరిష్కారం చూపాలన్నారు. ఫిర్యాదు పరిష్కారానికి సమయం అవసరం ఉన్నప్పుడు సంబంధిత విషయాన్ని ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడాలని అన్నారు. ఫిర్యాదులు తమ పరిధిలోనివి కానప్పుడు వెంటనే సంబంధిత శాఖకు ఎండార్స్ చేసి పంపాలని, అర్జీలు రీఓపెన్ కాకుండా సమస్యలు పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులను కలెక్టరు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింటు కలెక్టరు అభిషేక్ గౌడ, జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు, ఆర్డీవో యం.అచ్యుత అంబరీష్, కెఆర్ఆర్సి స్పెషల్ డిప్యూటీ కలెక్టరు కె.భాస్కర రావు తదితరులు పాల్గొన్నారు. -
స్తంభించిన జనజీవనం
● ఏలూరు జిల్లాలో కుండపోత వాన ● ఏలూరు పట్టణంలో నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు ● ఏజెన్సీలో పొంగిన వాగులు, వంకలు ఏలూరు(మెట్రో): జిల్లా వ్యాప్తంగా సోమవారం కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. ఉదయమే ప్రారంభమైన వర్షం ఉరుములు, పిడుగులతో జిల్లాను తడిసి ముద్దచేసింది. జిల్లా వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా వర్షపాతం నమోదవుతున్నప్పటికీ సోమవారం వేకువ జాము నుంచే ఏజెన్సీ, మెట్ట ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఏలూరు ప్రాంతంలో వర్షం ముంచెత్తింది. మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏజెన్సీలో కొండవాగులు పొంగి పొర్లడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సోమవారం కావడంతో కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. జిల్లా కేంద్రానికి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు ప్రజలు రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉదయం 8.30 గంటల వరకు 388.6 మి.మీ వర్షపాతం నమోదైంది. అధికంగా కైకలూరులో 87.4 మి.మీ, బుట్టాయగూడెంలో 40.8, కొయ్యలగూడెంలో 38.2, ద్వారకాతిరుమలలో 35, జంగారెడ్డిగూడెంలో 34.6, కలిదిండిలో 26.6, ముదినేపల్లిలో 25.4, ఏలూరు నగరంలో 21.6, మండవల్లిలో 20.6, కుక్కునూరులో 11.2, ఏలూరు రూరల్ మండలంలోని 9.6, ఉంగుటూరు 9.4, పోలవరంలో 8, పెడపాడులో 6.8, వేలేరుపాడులో 6.4, జీలుగుమిల్లిలో 2.4, భీమడోలులో 1.8, నూజివీడులో 1.2, నిడమర్రులో 1.2, లింగపాలెంలో 0.4 మి.మీ వర్షపాతం నమోదైంది. మంగళవారం సైతం వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరించింది. బుట్టాయగూడెం మండలంలోని ఐటీడీఏకు వెళ్ళే మార్గంలో వాగు ప్రవాహంచెరువును తలపిస్తున్న ఏలూరు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం -
జేసీగా అభిషేక్ గౌడ బాధ్యతల స్వీకరణ
ఏలూరు(మెట్రో): ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టరుగా ఎం.జె.అభిషేక్ గౌడ సోమవారం పదవీ బాధ్య తలు చేపట్టారు. అనంతరం కలెక్టరు కె.వెట్రిసెల్విని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో పౌరసరఫరాల శాఖ మరింత పటిష్టంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభంకానున్న దృష్ట్యా ప్రతి రైతుకు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అంతకుముందు జాయింట్ కలెక్టరును జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, ఆర్డీవో యం.అచ్యుత అంబరీష్ కలిసి స్వాగతం పలికారు. ఏలూరు(మెట్రో): ఏలూరు జిల్లాలో రెండ్రోజుల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాల సమయంలో ప్రజలు బహిరంగ ప్రదేశాలకు రావద్దని, చెట్ల కింద, శిథిల భవనాల వద్ద నిలబడవద్దని, ఉరుముల సమయంలో రైతులు పొలాలకు దూరంగా ఉండాలని కోరారు. భారీ వర్షాల కారణంగా పొంగుతున్న కాజ్వేలు, కల్వర్ట్లు, వాగులు దాటవద్దని, అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉండి: జిల్లాలోని ఉండి మండలం ఎన్నార్పీ అగ్రహారం, ఆచంటలోని ప్రభుత్వ ఐటీఐలో మిగిలిన సీట్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీఐ జిల్లా కన్వీనర్ డీఏ వేణుగోపాల్ పత్రికా ప్రకటనలో సోమవారం తెలిపారు. ఈ నెల 16 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆన్లైన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేయించుకుని సమీపంలోని ప్రభుత్వ ఐటీఐలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకుని రసీదు పొందాలని సూచిం చారు. వివరాలకు 08816 297093, 96664 07468 నెంబర్లలో సంప్రదించాలని కోరారు. భీమవరం: మునిసిపల్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా నవంబరు 3 నుంచి సమ్మె చేపట్టనున్నట్లు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కిలారి మల్లేశ్వరరావు, ఏఐటీయుసీ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెల్లబోయిన రంగారావు చెప్పారు. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం సమ్మె నోటీసును మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డికి అందచేసిన సందర్భంగా మాట్లాడారు. మృతి చెందిన, రిటైర్డు, అవుట్ సోర్సింగ్ కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగావకాశం కల్పించాలని, 12వ పీఆర్సీ ప్రకటించి 30 శాతం ఐఆర్ ఇవ్వాలని, పెరిగిన జనాభా కనుగుణంగా కార్మికుల నిష్పత్తిని పెంచాలని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. 62 ఏళ్లకు పదవీవిరమణ వయస్సును పొడిగించాలని, సులభ్ నిర్వహణ మునిసిపల్ కార్మికులకు ఇవ్వాలని, మున్సిపల్ కార్మికులకు ఇల్లు, ఇళ్ళ స్థలాలు కేటాయించి మున్సిపల్ కాలనీలు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): పోస్టల్ వారోత్సవాల్లో భాగంగా భీమవరం సర్ సీవీ రామన్ స్కూల్లో శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకు పోస్టల్ సంక్షేమ పథకాలపై అవగాహన, కరపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోస్టల్ యూనియన్ లీడర్ లెనిన్ బాబు మాట్లాడుతూ తపాలా శాఖ ప్రస్తుతం నూతన సాంకేతికత వినియోగించుకుంటూ కొత్త సేవల ద్వారా ప్రజలకు సేవలందిస్తుందని, పోస్టల్ శాఖలో అందించే సేవలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలన్నారు. స్కూల్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ కె.పార్వతి, ఉపాధ్యాయులు ఎం.శైలజ, ఎన్.రాధా తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ మద్యంపై కన్నెర్ర
శివశివా.. ఇదేం దారుణం? ద్వారకా తిరుమల భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో హోమాన్ని తాపీ గమేళాలో నిర్వహించడం పట్ల పలువురు భక్తులు మండిపడుతున్నారు. 8లో uలింగపాలెం మండలంలో చైన్ స్నాచింగ్, దొంగతనాలకు పాల్పడిన ఐదుగురు నిందితులను పట్టుకుని, సొమ్మును పోలీసులు రికవరీ చేశారు. 8లో uమంగళవారం శ్రీ 14 శ్రీ అక్టోబర్ శ్రీ 2025సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘ఎన్’ బ్రాండ్ మద్యం, నకిలీ మద్యంపై ప్రతిపక్ష వైఎస్సార్సీపీ పోరుబాట పట్టింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఎకై ్సజ్ కార్యాలయాల వద్ద ఆందోళనలు నిర్వహించి వినతిపత్రాలు అందజేసింది. నకిలీ మద్యంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. మద్యాన్ని కుటీర పరిశ్రమగా మార్చేసి సొమ్ములు చేసుకుంటున్నారని, టీడీపీ నేతలు ప్రజల రక్తమాంసాలు దోచేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం జోరువానలో కూడా పలు నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. తణుకు నియోజకవర్గంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నేతృత్వంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం కొనసాగింది. పార్టీ కార్యాలయం నుంచి ఎకై ్సజ్ సీఐ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించి కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా చీప్ లిక్కర్ బాటిళ్లను ఎకై ్సజ్ సీఐ కార్యాలయం ముందు పారబోసి ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. కారుమూరి మాట్లాడుతూ ప్రజల రక్తమాంసాలతో ప్రభుత్వం వ్యాపారం చేస్తోందని, ఇంటికో ఉద్యోగం కాకుండా ఊరూరా మద్యం కుటీర పరిశ్రమ పెట్టి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతోందని ధ్వజమెత్తారు. నకిలీ మద్యాన్ని కూటమి ప్రభుత్వం పెంచి పోషిస్తోందని మండిపడ్డారు. అనంతరం ఎకై ్సజ్ సీఐ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కై కలూరులో.. కై కలూరు నియోజకవర్గంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు నేతృత్వంలో ఎకై ్సజ్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించి అనంతరం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ నకిలీ మద్యం ముఠా గుట్టు రట్టు చేయాలని, సర్కారు అండదండలతోనే మద్యం కుటీర పరిశ్రమగా మారిందని ధ్వజమెత్తారు. ఏలూరులో.. ఏలూరులో పార్టీ సమస్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. సెయింట్ థెరిస్సా కాలేజీ సెంటరులో ఉన్న దివంగత వైఎస్సార్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించి అనంతరం న్యూ అశోక్నగర్లోని ఎకై ్సజ్ డీసీ కార్యాలయం వద్ద నిరసన ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా జయప్రకాష్ మాట్లాడుతూ నకిలీ మద్యం విక్రయాల్లో కూటమి నేతలే పాత్రధారులు, సూత్రధారులని సీబీఐ విచారణ నిర్వహించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని ధ్వజమెత్తారు. ఏలూరులో వైన్షాపులో ఒక వ్యక్తి మద్యం సేవించి మృతి చెందింతే ఆ బ్యాచ్ మద్యం సీసాల మొత్తాన్ని మాయం చేశారని దీనిపై విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు. నూజివీడులో.. నూజివీడులో సమస్వయకర్త మేకా ప్రతాప అప్పారావు ఆధ్వర్యంలో నిరసన తెలిపి ఎకై ్సజ్ స్టేషన్ వద్ద నిరసన నిర్వహించి అధికారులకు వినతిపత్రం అందించారు. నకిలీ మద్యంతో ప్రభుత్వ ఆదాయానికి కూటమి నేతలు గండికొడుతూ వ్యక్తిగత ఆదాయాన్ని పెంచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పోలవరం నియోజకవర్గంలో.. పోలవరంలో పార్టీ సమస్వయకర్త తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో నకిలీ మద్యంపై నిరసన తెలియచేస్తూ పోలవరంలోని ఎకై ్సజ్ సర్కిల్ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ నకిలీ మద్యం అంతమయ్యేవరకు పోరాటం కొనసాగుతుందని పిలుపునిచ్చారు. కూటమి నేతలే నకిలీ మద్యం సిండికేట్ నడుపుతున్నారని తెలిసినా ప్రభుత్వం మాత్రం చోద్యం చూడడం నీతిమాలిన చర్య అని ధ్వజమెత్తారు. ఉంగుటూరులో.. ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలులో ఏలూరు పార్లమెంట్ వైఎస్సార్సీపీ ఇన్చార్జి కారుమూరి సునీల్ నేతృత్వంలో ఎకై ్సజ్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి వినతిపత్రం అందచేశారు. నకిలీ మద్యాన్ని కుటీర పరిశ్రమగా మార్చి ఇప్పుడు బహిర్గతం కాగానే దాన్ని వైఎస్సార్సీపీపై మోపడానికి కూటమి నేతలు చేస్తున్న కుట్రలను ప్రజలందరూ గమనిస్తున్నారని ధ్వజమెత్తారు. కేసులో పట్టుబడిన వ్యక్తులందరూ చంద్రబాబు, లోకేష్కు సన్నిహితులని సీబీఐ విచారణ జరిగితేనే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. చింతలపూడిలో.. చింతలపూడి నియోజకవర్గంలో మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు జెట్టి గురునాథరావు ఆధ్వర్యంలో చింతలపూడి ఎకై ్సజ్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గురునాథరావు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో నకిలీ మద్యం రాకెట్కు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టి ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి కోట్లు దండుకుంటుందని ధ్వజమెత్తారు. పాలకొల్లు నియోజకవర్గంలో.. పాలకొల్లు నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్చార్జి గుడాల గోపి నేతృత్వంలో ఎకై ్సజ్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి అనంతరం ఎకై ్సజ్ అధికారులకు వినతిపత్రం అందించారు. నకిలీ మద్యంలో టీడీపీ పెద్దల పేర్లు బయటకు రాకుండా కూటమి ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలకు తెరతీసి వైఎస్సార్సీపీపై బురదజల్లుతుందంటూ మండిపడ్డారు. ఎకై ్సజ్ కార్యాలయాల వద్ద వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనలు జోరు వానలోనూ కొనసాగిన ఆందోళనలు -
ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు అన్యాయం
కై కలూరు: పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు వైద్య కళాశాలలను ప్రైవేటుపరం (పీపీపీ) చేస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) ఆరోపించారు. కై కలూరు పార్టీ కార్యాలయంలో కోటి సంతకాల పోస్టర్లను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 17 కళాశాలలకు అనుమతులు పొందగా 5 నిర్మాణాలు పూర్తిచేసుకుని ప్రారంభించారని, మరో 2 కళాశాలల ప్రారంభానికి ఎన్నికల కోడ్ అడ్డువచ్చిందన్నారు. మిగిలిన 10 కాలేజీల నిర్మాణాలు పలు దశల్లో ఉన్నాయన్నారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణకు పూనుకుందన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైఎస్సార్సీపీ కోటి సంతకాల ఉద్యమం చేపట్టిందన్నారు. ప్రతి నియోజకవర్గంలో 60 వేల సంతకాల సేకరణ లక్ష్యమన్నారు. నవంబరు 22 వరకు రచ్చబండ, సంతకాల సేకరణ, అక్టోబరు 28న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు, నవంబరు 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, నవంబరు 23న నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు సంతకాల పత్రాల తరలింపు, నవంబరు 24న జిల్లా కేంద్రాల నుంచి పార్టీ కేంద్ర కార్యాలయాలకు తరలింపు, చివరకు కోటి సంతకాల పత్రాలను గవర్నర్కు నివేదిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర ముదిరాజ్ సంఘ అధ్యక్షుడు కోమటి విష్ణువర్ధన్, రాష్ట్ర ఎస్సీ సెల్ విభాగ అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు, రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి, ముదినేపల్లి ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ, రాష్ట్ర బీసీ విభాగ కార్యదర్శి బలే నాగరాజు, జిల్లా అధికార ప్రతినిధి మొట్రు ఏసుబాబు, కై కలూరు, కలిదిండి, మండవల్లి మండలాల పార్టీ అధ్యక్షులు సింగంశెట్టి రాము, తిరుమాని రమేష్, బేతపూడి ఏసేబురాజు, వివిధ విభాగాల నాయకులు పాల్గొన్నారు. నేడు కల్తీ మద్యంపై నిరసన కల్తీ మద్యంతో పేదల ప్రాణాలతో చెలగాటమడుతున్న ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రతిఒక్కరూ ముందుకు రావాలని డీఎన్నార్ కోరారు. సోమవారం ఎకై ్సజ్, ప్రొహిబిషన్ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందించే కార్యక్రమం చేపట్టినట్టు చెప్పారు. కై కలూరు పార్టీ కార్యాలయానికి ఉదయం 8 గంటలకు పార్టీ నాయకులు, శ్రేణులు హాజరుకావాలని కోరారు. -
అవిగవిగో పాపికొండలు
బుట్టాయగూడెం: పాపికొండల విహారం తిరిగి ప్రారంభమైయింది. గోదావరి వరదల కారణంగా సుమారు మూడు నెలల పాటు పాపికొండల యాత్రను ప్రభుత్వం నిలిపివేసింది. అయితే ప్రస్తుతం గోదావరిలో వరద తగ్గుముఖం పట్టడంతో విహారయాత్ర తిరిగి ప్రారంభించేందుకు పర్యాటక శాఖ అనుమతి ఇచ్చింది. దీంతో శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం గండిపోచమ్మ తల్లి గుడి బోటు పాయింట్ నుంచి 23 మంది ప్రయాణికులతో బోటు ప్రయాణం ప్రారంభమైంది. అలాగే ఆదివారం ఉదయం 9 గంటలకు సుమారు 65 మంది ప్రయాణికులతో బోటు ప్రయాణం చేసినట్టు అధికారులు తెలిపారు. పాపికొండల పర్యాటక బోట్లు యథాతథంగా నడపడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. 15 బోట్లు సిద్ధం గోదావరి నది ఒడ్డున ఉన్న పాపికొండలు ప్రకృతి సౌందర్యానికి ప్రతీకగా పేర్గాంచాయి. గోదావరి ప్రవాహంలో ప్రకృతి రమణీయమైన ఎత్తయిన కొండల మధ్య సాగే బోటు ప్రయాణం పర్యాటకులు అపూర్వ అనుభూతిని అందిస్తుంది. అయితే గోదావరి వరదలు పెరగడంతో జూలై నెలలో విహార యాత్రను టూరిజం శాఖ అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. వరదల ప్రభావం తగ్గి నీటిమట్టం సాధారణ స్థాయికి చేరడంతో మరలా ప్రారంభించారు. పర్యాటకుల భద్రత కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. బోట్లలో పూర్తిగా సాంకేతిక తనిఖీలు చేసిన తర్వాతే ప్రయాణానికి అనుమతి ఇస్తున్నట్టు చెప్పారు. రెండు రోజుల నుంచి రెండు బోట్లు మాత్రమే సర్వీసులు అందిస్తున్నాయి. ఇదిలా ఉండగా పూర్తిస్థాయిలో సర్వీసులు నడిపేందుకు 15 బోట్లు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. విహారయాత్ర పునః ప్రారంభం కావడంతో పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాపికొండల మధ్య బోటు ప్రయాణం 3 నెలల అనంతరం విహారయాత్ర ప్రారంభం వరదల కారణంగా నిలిచిన బోటు ప్రయాణాలు వరద తగ్గుముఖంతో యాత్రకు అనుమతి బోటుపై పాపికొండల విహారయాత్ర మరువలేని అనుభూతి. చెప్పలేని ఆనందాన్ని పొందుతాం. మూడు నెలల పాటు నిలిచిన యాత్ర పునః ప్రారంభం కావడం ఆనందదాయకం. ప్రతిఒక్కరూ తప్పనిసరిగా బోటు ప్రయాణంతో మర్చిపోలేని తీపి జ్ఞాపకాలు పొందుతారు. –చెరుకూరి రాజియోగి, పర్యాటకుడు, కేఆర్ పురం -
ప్రాణం తీసిన మద్యం మత్తు
బైక్ను ఢీకొట్టిన లారీ.. వ్యక్తి దుర్మరణం భీమడోలు: మద్యం మత్తులో ఉన్న లారీ డ్రైవర్ అతివేగంగా వాహనాన్ని నడుపుతూ బైక్ను ఢీకొట్టిన ఘటనలో ఆగడాలలంకకు చెందిన సిరింగి మోహనరావు (35) దుర్మరణం పాలయ్యారు. ఆదివారం సాయంత్రం గుండుగొలను పంచాయతీ పరిధిలోని వడ్డిగూడెం వద్ద దుర్ఘటన చోటుచేసుకుంది. లారీ ఢీకొన్న తర్వాత అర కిలోమీటరు మేర బైక్ను, మోహనరావును ఈడ్చుకెళ్లింది. వివరాలిలా ఉన్నాయి.. మోహనరావు గుండుగొలనులో చదువుకుంటున్న తన కుమారుడిని తీసుకుని వచ్చేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. మార్గమధ్యంలో ఘటనా స్థలి వద్ద వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలతో మోహనరావు అక్కడి కక్కడే కన్నుమూశారు. గ్రామస్తులు భారీ సంఖ్యలో చేరుకుని లారీ డ్రైవర్ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం మృతుని కుటుంబానికి న్యా యం చేయాలంటూ ఆందోళనకు దిగడంతో ట్రాఫి క్ నిలిచిపోయింది. నిడమర్రు సీఐ రజనీకుమార్, ద్వారకాతిరుమల ఎస్సై సుధీర్ ఇక్కడకు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. లారీ డ్రైవర్ను కఠినంగా శిక్షించాలని, బాఽధిత కుటుంబానికి న్యాయం చేయాలని, గుండుగొలను సమీపంలోని ఓ ఫ్యాక్టరీకి చెందిన లారీ యాజమాని వచ్చి హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుమారు 3 గంటలపాటు ఆందోళన కొనసాగింది. మృతుని కుటుంబానికి న్యాయం చేస్తామని పోలీసులతో పాటు ఎంపీపీ కనమాల రామయ్య, మాజీ ఎంపీపీ శిరిబత్తిన కొండబాబు, గ్రామపెద్దలు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. మృతుడు మోహనరావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నా రు. వీరితో పాటి తల్లి, నానమ్మలను రోజువారీ పనులు చేస్తూ పోషిస్తున్నాడు. ఇంటికి ఆధారమైన మోహనరావు మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. -
పారిశుద్ధ్య కార్మికుల పోరుబాట
ఏలూరు (టూటౌన్): రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో వర్క్ అవుట్ సోర్సింగ్ పేరిట ప్రైవేటీకరణ విధానాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించడాన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే పారిశుద్ధ్య పనులను ప్రైవేటీకరించ వద్దు, ప్రయోగాత్మకంగా రెండు డివిజన్లలో అమలు చేయాలనే ఆలోచనను విరమించుకోవాలని కోరుతూ కమిషనర్ ఎ.భానుప్రతాప్కు వినతిపత్రం సైతం అందించారు. సాక్షాత్తూ మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ సొంత నియోజకవర్గం నెల్లూరులో ఈ విధా నాన్ని అమలు చేయబోతే కార్మిక సంఘాల వ్యతిరేకతతో వెనక్కి తగ్గారని నాయకులు గుర్తుచేస్తున్నా రు. కార్మికులను బానిసలుగా మార్చే వర్క్ అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దుచేసి, ఆప్కాస్ ద్వారా మున్సిపల్ కార్మికుల నియామకాలను జరపాలని డిమాండ్ చేస్తున్నారు. మాట తప్పిన మంత్రి నెల్లూరులో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన సందర్భంగా వర్క్ అవుట్ సోర్సింగ్ విధానాన్ని రాష్ట్రంలో మరెక్కడా అమలు చేయబోమని మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారని కార్మిక సంఘ నా యకులు చెబుతున్నారు. అయితే ఇందుకు భిన్నంగా ఏలూరు కార్పొరేషన్ వన్టౌన్లో 11వ డివిజన్, టూటౌన్లో 30 డివిజన్లో ఈ విధానాన్ని అమలు చేయడానికి పావులు కదుపుతున్నారని మండిపడుతున్నారు. ఏలూరు నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మున్సిపల్ కార్మికుల నియామకాలను ఆప్కాస్ ద్వారా చేపట్టాలని, నగర ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించేందుకు కృషి చేయాలని కోరుతున్నారు. ప్రైవేటీకరణతో అస్తవ్యస్తం పారిశుద్ధ్య పనులను ప్రైవేటీకరించడం అంటే ప్రజల ప్రాణాలను బలిపెట్టడమేనని, పారిశుద్ధ్య వ్యవస్థ అస్తవ్యస్తమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని, లేకుంటే నెల్లూరు తరహాలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ప్రైవేటీకరణ వల్ల దళారీ వ్యవస్థ ఏర్పడుతుందని, కనీస వేతనాలు, కార్మిక చట్టాల అమలుకావని ఆందోళన వ్యక్తం చేశారు. రేపు ఏలూరులో ధర్నా వర్క్ అవుట్ సోర్సింగ్ విధానం అమలును నిరసిస్తూ మంగళవారం ఉదయం 10 గంటలకు ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించాలని ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నగర కమిటీ సమావేశం తీర్మానించింది. ఈ ధర్నాలో అన్ని సర్కిళ్లకు చెందిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చింది. అలాగే నగరంలోని కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతు తెలపాలని యూనియన్ నాయకులు కోరారు. సాక్షాత్తు మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ నెల్లూ రు మున్సిపాల్టీలో పారిశుద్ధ్య పనులను ప్రైవేటీకరించేందుకు ప్రయత్నించే సమయంలో సీఐటీయూ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ సమయంలో రాష్ట్రంలో మరెక్కడా దీనిని అమలు చేయబోమని మంత్రి హామీ ఇచ్చారు. అయితే ఈ హామీని తుంగలోకి తొక్కి ఏలూరు కార్పొరేషన్లోని రెండు డివిజన్లలో పారిశుద్ధ్య పనులను వర్క్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ప్రైవేటీకరించాలనుకోవడం తగదు. – డీఎన్వీడీ ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి, సీఐటీయూ, ఏలూరువర్క్ అవుట్ సోర్సింగ్ విధానంలో నగరంలోని 11,30 డివిజన్లలోని పారిశుద్ధ్య పనులను ప్రై వేటీకరించాలనుకునే విధానాన్ని తక్షణం ని లుపుదల చేయాలి. కార్పొరేషన్లోని ఖాళీ లను ఆప్కాస్ విధానంలో భర్తీ చేయాలి. అవు ట్ సోర్సింగ్ విధానం రద్దు చేయాలి. కొన్నేళ్లు గా ఖాళీగా ఉన్న మున్సిపల్ కార్మికుల పోస్టుల ను తక్షణం భర్తీ చేయాలి. ఈనెల 14న జరిగే ధర్నాను కార్మికులు విజయవంతం చేయాలి. –బి.సోమయ్య,ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఏలూరు వర్క్ అవుట్ సోర్సింగ్పై తీవ్ర వ్యతిరేకత ఏలూరు కార్పొరేషన్లో అమలుకు ప్రభుత్వం ప్రయత్నం భగ్గుమంటున్న కార్మిక సంఘాలు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మాట తప్పారంటూ నిరసన రేపు భారీ ధర్నాకు సన్నాహాలు -
అప్రదక్షిణ మార్గంలో క్యూలైన్ నిర్మాణమా?
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయంలో అప్రదక్షిణ మార్గంలో దర్శనం క్యూలైన్ల నిర్మాణాలు చేపట్టడం ఆగమశాస్త్ర విరుద్ధమంటూ ఓ ఆధ్యాత్మిక వేత్త ఇటీవల రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్కు ఫిర్యాదు చేశాడు. దీనిపై దేవస్థానం అధికారులను కమిషనర్ రిమార్క్స్ అడగడంతో ఆ నిర్మాణ పనులకు తాజాగా బ్రేక్ పడింది. ద్వారకాతిరుమల దివ్య క్షేత్రాన్ని సందర్శించే భక్తుల సౌకర్యార్ధం రూ.12.50 కోట్లతో చేపట్టిన నూతన క్యూ కాంప్లెక్స్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇదిలా ఉంటే క్యూ కాంప్లెక్స్లోని భక్తులు ముందుగా దక్షిణ రాజగోపురం లోంచి ఆలయంలోకి చేరుకుని, అక్కడి నుంచి తూర్పువైపుకు తిరిగి క్యూలైన్ల గుండా శ్రీవారి దర్శనానికి వెళ్లేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. అందులో భాగంగానే తూర్పు వైపున ఉన్న పాత క్యూలైన్లలో కొన్నింటిని తొలగించి, అక్కడ ఎత్తయిన కాంక్రీటు చప్టాను నిర్మించారు. దానిపై కొత్త క్యూలైన్లు నిర్మించాల్సి ఉంది. ఏలూరుకు చెందిన ఆధ్యాత్మిక వేత్త, హైకోర్టు న్యాయవాది బీకేఎస్ఆర్ అయ్యంగార్ ఈ క్యూలైన్ నిర్మాణ పనులు అప్రదక్షిణంగా జరుగుతున్నాయంటూ దేవదాయ శాఖ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. అప్రదక్షిణం ఎలా అంటే.. భక్తులు దక్షిణ రాజగోపురం లోంచి ఆలయంలోకి ప్రవేశించగానే, పడమర వైపు (ఎడమ వైపు)కు తిరిగి శ్రీవారి దర్శనానికి వెళ్లాలని, అలా కాకుండా తూర్పు వైపు (కుడి వైపు)కు తిరిగి వెళ్లడం అప్రదక్షిణమని, ఇది పూర్తిగా ఆగమశాస్త్ర విరుద్దమని అయ్యంగార్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కమిషనర్ దేవస్థానం అధికారులను రిమార్క్స్ అడగడంతో కాంక్రీటు చప్టాపై క్యూలైన్ నిర్మాణ పనులకు బ్రేక్ పడింది. అర్చకులకు తప్పని ఇక్కట్లు గతంలో ఆలయ పడమర వైపు అర్చకులకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు ఉండేవి. అభివృద్ధి పనుల్లో భాగంగా ఏడాదిన్నర క్రితం వాటిని తొలగించారు. ఇప్పటి వరకు తిరిగి నిర్మించలేదు. దాంతో ఆలయంలో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో అర్చకులు కాలకృత్యాలు తీర్చుకోవాల్సి వస్తే.. తమ ఇళ్లకు పరుగులు తీయాల్సి వస్తోంది. నిత్యం దేవుడి సేవలో ఉండే అర్చకుల పరిస్థితే ఇలా ఉంటే ఎలా అని పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. దగ్గరగా నిర్మిస్తేనే సౌకర్యం.. ఆలయానికి దగ్గరగా, అందుబాటులో నిర్మించిన కట్టాడాలనే భక్తుల ఎక్కువగా వినియోగిస్తున్నారు. దూరంగా ఉన్న వాటికి పాధాన్యత అంతంత మాత్రమనే చెప్పాలి. ప్రస్తుతం ఆలయ తూర్పు ప్రాంతంలో రూ. 12 కోట్లతో విస్తరిస్తున్న అనివేటి మండపం, రూ.12.50 కోట్లతో నిర్మిస్తున్న క్యూ కాంప్లెక్స్ దేవాలయానికి దగ్గరగా ఉన్నాయి. ఇవి సౌకర్యవంతంగా ఉంటాయి. ఆరేళ్ల క్రితం ఆలయానికి దూరంగా రూ.2.50 కోట్లతో ఆధునీకరించిన మాధవుని కుంట నిరుపయోగంగా మారింది. అలాగే రూ.8.50 కోట్లతో నిర్మించిన కల్యాణకట్ట భక్తులకు అసౌకర్యంగా ఉండటంతో, కొండపైన సెంట్రల్ పార్కింగ్ ప్రాంతంలో షెడ్లు నిర్మించి కల్యాణ కట్టను అందులోకి మార్చే యోచనలో అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. రూ. 4.10 కోట్లతో నిర్మించిన క్యాంటీన్ ఆలయానికి దూరంగా, మూలన ఉండటంతో భక్తులు అందులోకి వెళ్లేవారు కాదు. ఫలితంగా క్యాంటీన్ నిర్వహించలేమని ప్రైవేట్ వ్యాపారులు, ఒకానొక దశలో దేవస్థానం అధికారులు చేతులెత్తేశారు. దాంతో కొన్నాళ్లుగా కొండపైన క్యాంటిన్ లేక భక్తులు అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు తూర్పువైపు సప్తగోకుల ప్రాంతంలో తాత్కాలికంగా క్యాంటీన్ ఏర్పాటు చేసుకుని, మూడేళ్లపాటు నిర్వహించుకునే హక్కుకు దేవస్థానం ఈనెల 17న టెండర్, బహిరంగ వేలాన్ని నిర్వహించనుంది. దేవదాయ శాఖ కమిషనర్కు ఆధ్యాత్మిక వేత్త ఫిర్యాదు శ్రీవారి ఆలయంలో ఆగమ విరుద్ధంగా అప్రదక్షిణ మార్గంలో క్యూలైన్లు నిర్మిస్తుండటంపై ఇటీవల రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్కు ఫిర్యాదు చేశాను. మాధవుని కుంటకు పెట్టిన రూ.2.50 కోట్ల ఖర్చు, నృసింహ సాగర అభివృద్ధికి పెట్టి ఉంటే బాగుండేది. ఇప్పటికై నా పుష్కరిణిని అభివృద్ధి చేసి, పూర్వ ఆచార సాంప్రదాయాలను కొనసాగించాలి. లేకుంటే న్యాయపోరాటం చేస్తాను. – బీకేఎస్ఆర్ అయ్యంగార్, ఆధ్యాత్మిక వేత్త, హైకోర్టు న్యాయమూర్తి -
కాల్వలో పడి బాలుడి గల్లంతు
తణుకు అర్బన్: బాలుడు కాలువలో పడి గల్లంతైన ఘటన పైడిపర్రులో ఆదివారం చోటుచేసుకుంది. తణుకు బ్యాంక్ కాలనీలో నివసిస్తున్న బొమ్మనబోయిన జోగీంద్ర నందు(13) ఆదివారం తన స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు తణుకులోని పైడిపర్రు ప్రాంతానికి వచ్చాడు. మధ్యాహ్నం సమయంలో కాలువ రేవులోకి దిగి స్నానం చేసేందుకు ప్రయత్నించగా ప్రమాదవశాత్తూ గల్లంతయ్యాడు. స్థానికులు గమనించి కాల్వలో గాలించినప్పటికీ ఆచూకీ లభ్యం కాకపోవడంతో తణుకు రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ ఎస్సై కె.చంద్రశేఖర్ ఘటనా స్థలానికి చేరుకుని పోలీసు, ఫైర్ సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న బాలుడి తల్లితండ్రులు ప్రమాదప్రాంతానికి వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై చంద్రశేఖర్ కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నారు. ఏలూరు టౌన్: ఏలూరు శివారు వట్లూరు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రైలు ప్రమాదంలో మృతిచెందాడు. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. ఏలూరు శివారు వట్లూరు రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి ఆదివారం మధ్యాహ్నం రైలు ప్రమాదంలో మృతిచెందాడు. రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించగా...అతని వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతుడి ఎత్తు 5.5 అడుగులు, చామన చాయ రంగుతో, తెలుపు నలుపు చారల చొక్కా, బిస్కెట్ రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడు. అతని వయసు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉంటుందని అంచనా. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీలో భద్రపరిచామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. దెందులూరు: సానిగూడెం గ్రామంలో భర్త, అత్తతో కలిసి అద్దె ఇంట్లో నివసిస్తున్న వివాహిత నేతల లీలామణి (19) అనుమానాస్పద స్థితిలో శనివారం రాత్రి మృతి చెందింది. స్థానికులు, కుటుంబ సభ్యుల సమాచారం మేరకు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు. విచారణ నిర్వహించి కేసు నమోదు చేశామన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
మందుబాబులకు అడ్డాగా.. శ్రీవారి పుష్కరణి
● మెట్లపైనే మద్యం, బీరు సీసాలు, సిగరెట్లు ● అధ్వానంగా ఉన్న పుష్కరణిలోని నీరు ద్వారకాతిరుమల: ప్రతి ఏటా కార్తీకమాసంలో వచ్చే క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీవారి తెప్పోత్సవాన్ని నిర్వహించే నృసింహ సాగరం (పుష్కరణి) అధ్వానంగా మారింది. రాత్రి అయితే చాలు మందు బాబులు సాగరం మెట్లపైకి చేరి మద్యం, బీరులు, ఖాళీ సీసాలను అక్కడే పడేస్తున్నారు. కాల్చి పడేసిన సిగరెట్టు పీకలు, ఖాళీ పెట్టెలు మెట్లపక్కన దర్శనమిస్తున్నాయి. ఏకంగా బీరు సీసాలను సాగరం వద్ద ఉన్న గణేషుడి విగ్రహం పక్కనే పెడుతున్నారు. పుష్కరిణి సైతం చెత్తా, చెదారం, మురుగుతో దారుణంగా ఉంది. పురాణ పాశస్త్యం గల ఈ సాగరాన్ని సందర్శించేందుకు నిత్యం సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు వీటిని చూసి విస్తుపోతున్నారు. పవిత్రమైన ప్రదేశం ఇంత దారుణంగా ఉంటే ఆలయ అధికారులు ఏం చేస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. పూర్వం ఈ సాగరం వద్దే భక్తులు మొక్కులు తీర్చుకుని, స్నానాలు ఆచరించి, ఆలయానికి వెళ్లేవారు. స్వామివారికి నిత్యం తీర్ధపు బిందె ఇక్కడి నుంచే వెళ్లేది. ఇప్పుడు ఆ ఆచారం కొనసాగడం లేదు. తెప్పోత్సవాన్ని మాత్రం ఏటా దేవస్థానం వైభవంగా నిర్వహిస్తోంది. ఆ ఉత్సవ సమయంలో మాత్రమే సాగరాన్ని, పరిసరాలను అధికారులు ముస్తాబు చేస్తున్నారు. ఆ తరువాత మళ్లీ పట్టించుకోవడం లేదు. దాంతో పుష్కరిణి ప్రాంతం మందుబాబులకు అడ్డాగా మారింది. ఇప్పటికై నా ఆలయ అధికారులు స్పందించి పుష్కరిణి అభివృద్ధికి కృషి చేయాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు. అలాగే సెక్యురిటీని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, పుష్కరణి పవిత్రతను, భక్తుల మనోభావాలను కాపాడాలని అంటున్నారు. -
వైకల్యం ఓడింది
ఏలూరు రూరల్: దివ్యాంగుల చేతుల్లో వైకల్యం ఓడింది. వైకల్యం శరీరానికే కాని.. తమ సామర్థ్యానికి కాదని మరోసారి నిరూపించారు. ఆదివారం ఏలూరు భిశ్వనాథ్ భర్తియా స్విమ్మింగ్పూల్ ఆవరణలో రాష్ట్రస్థాయి 7వ పారా స్విమ్మింగ్ చాంపియన్షిప్ పోటీలు జరిగాయి. కాళ్లు, చేతులు లేక పోయినా ఈత కొలనులో ఈదుతూ అబ్బురపరిచ్చారు. సుమారు 100 మందికి పైగా క్రీడాకారులు 20, 40, 60 మీటర్ల స్విమ్మింగ్ పోటీల్లో తలపడ్డారు. ఆంధ్రప్రదేశ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గోనుగుంట్ల కోటేశ్వరరావు మా ట్లాడుతూ రాష్ట్రంలో దివ్యాంగులు అంతర్జాతీయ స్థాయిలో 40కు పైగా పతకాలు సాధించారని కొనియాడారు. దివ్యాంగులకు ఆటలపై ఆసక్తిని పెంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుకునేలా కృషి చేస్తున్నామన్నారు. అనంతరం విజేతలకు పత కాలు అందించారు. ఎమ్మెల్యే బడేటి చంటి, డీఎస్డీఓ బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. స్విమ్మింగ్లో సత్తాచాటిన దివ్యాంగులు -
మడుగుల్లా రోడ్లు.. ప్రయాణానికి పాట్లు
భీమవరం (ప్రకాశం చౌక్): భీమవరంలోని పలు వీధుల్లో రోడ్లు భారీ గోతులు, వర్షం నీటితో మడుగులను తలపిస్తున్నాయి. దీంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం గోతులు పూడ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టడం లేదు. వర్షాలు కురుస్తుండటంతో రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు అవకాశం లేదని అధికారులు తప్పించుకుంటున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు రోడ్ల బాగోగులపై పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పట్టణంలోని పలుచోట్ల పైప్లైన్ లీకేజీలతో తాగునీరు వృథా అవుతోంది. ఇలా పట్టణంలో 10 నుంచి 15 చోట్ల భారీ లీకేజీలు ఉన్నా మున్సిపల్ వాటర్ విభాగ అధికారులు పట్టించుకోవడం లేదు. దీని వల్ల తాగునీరు వృథాతో పాటు రోడ్లపై నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బందిగా ఉందని పట్టణవాసులు అంటున్నారు. జాతీయ రహదారిపై అధ్వానంగా.. భీమవరం: భీమవరం నుంచి ఉండి వైపునకు వెళ్లే జాతీయ రహదారిపై పలుచోట్ల గుంతలు పడటం ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తోంది. అయి తే అధికారులు పట్టించుకోకపోవడంతో స్థానికులే పలుచోట్ల స్వచ్ఛందంగా కర్రలకు సంచులు కట్టి హెచ్చరికలు ఏర్పాటుచేశారు. గుంతలు పూ డ్చేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
పాత జీఎస్టీ వసూలు చేస్తే చర్యలు
చిచ్చర పిడుగులు ఏలూరు ఇండోర్ స్టేడియంలో జిల్లాస్థాయి స్కేటింగ్ పోటీలు ఆకట్టుకున్నాయి. చిన్నారులు చిచ్చర పిడుగుల్లా దూసుకుపోయారు. 8లో uకలెక్టర్ వెట్రిసెల్విఏలూరు(మెట్రో): జీఎస్టీ 2.0 ప్రయోజనాలు ప్రజలందరికీ అందాల్సిందేనని, పాత జీఎస్టీ వసూ లు చేస్తే వర్తకులపై చర్యలు తప్పవని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. జిల్లాలో కొందరు వర్తకులు కొత్త జీఎస్టీ విధానాన్ని అమలు చేయడం లేదనే ఫిర్యాదులు అందుతున్నాయని అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జీఎస్టీ ప్రయోజనాలకు సంబంధించి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి, సందేహాల నివృత్తికి 8712631283 నంబర్తో ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్, హెల్ప్డెస్క్లను అధికారులు ఏర్పాటు చేశారు. అలాగే రాష్ట్రస్థాయిలో 8712631279 నంబర్తో ప్రభుత్వం ఏర్పాటుచేసిందన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్లకు వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించి, చర్యలు తీసుకోవాలని వాణిజ్య శాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. అర్థవంతంగా హేలాపురి ఉత్సవం సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్ కార్యక్రమాల్లో భాగంగా ఈనెల 13 నుంచి 19వ తేదీ వరకు ఏలూరు సీఆర్ రెడ్డి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో హేలాపురి ఉత్సవాన్ని అర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. శనివారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించారు. షాపింగ్ ఉత్సవంలో పెద్ద ఎత్తున స్టాల్స్ ఏర్పాటు చేసేలా వర్తకులతో మాట్లాడాలన్నారు. అలాగే హేలాపురి ఉత్సవంలో అధిక మొత్తంలో షాపింగ్ చేసిన వారి పేర్లను డ్రా తీసి ముగ్గురికి బహుమతులు అందజేయాలన్నారు. డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, వాణిజ్య పనులు శాఖ జాయింట్ కమిషనర్ నాగార్జునరావు, ఆర్డిఓ అచ్యుత్ అంబరీష్, ఏలూరు కమిషనర్ ఎ.భానుప్రతాప్, పలుశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
మెనూ ప్రత్యేకమే..
పుంజులో శక్తి, సామర్థ్యం పెంచేందుకు, శరీరంలో కొవ్వు చేరకుండా తేలిగ్గా ఎగురుతూ ప్రత్యర్థిపై విరుచుకుపడేందుకు మూడు నెలలు ప్రత్యేక మేత అందిస్తారు. పుంజు బరువును బట్టి ఉదయం పూట 20 నుంచి 40 గ్రాముల వరకు ఉడకబెట్టిన మటన్, మూడు నుంచి ఐదు వరకు బాదం, రెండు వెల్లుల్లి, ఒక ఎండు ఖర్జూరం, కోడిగుడ్డు ముక్క లు చేసి పెడతారు. తిరిగి సాయంత్రం ఎప్పటిమాదిరి చోళ్లు, గంటులు, మెరికలు మొదలైన వాటిని అందిస్తారు. పుంజు అనారోగ్యం, వైరస్ల బారిన పడకుండా తరచూ పశువైద్యుడిని తీసుకువచ్చి పరీక్షలు చేయించి మందులు వేయించడం, మ రెన్నో సంప్రదాయ ఆయుర్వేద పద్ధతులు అవలంబించడం చేస్తుంటారు. -
చింతలపూడి ఇసుక పంచాయితీ
పేరేమో చింతలపూడిది.. ఇసుక తరలివెళ్లేది మాత్రం తెలంగాణకు.. ఇసుక సిండికేట్కు, తెలంగాణ నుంచి వచ్చే అక్రమ లారీ సిండికేట్ మధ్య జరిగిన చీకటి ఒప్పందానికి చింతలపూడి లారీ యజమానులు బలయ్యారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు: తెలంగాణకు కొవ్వూరు నుంచి వెళ్లే ప్రతి ఇసుక లారీ చింతలపూడి అన్లోడింగ్ పేరిట బిల్లు తీసుకుని అక్రమ దందా తారాస్థాయిలో కొనసాగిస్తున్న క్రమంలో చింతలపూడి పరిధిలోని లారీలకు రీచ్ల నుంచి ఇసుక ఇవ్వబోమని తేల్చిచెప్పడంతో వివాదం రేగింది. లారీ యజమానులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. యథేచ్ఛగా ఇసుక దందా కొవ్వూరు నియోజకవర్గంలోని కొవ్వూరు, తాళ్లపూడి, పంగిడి, కుమారదేవంలో ఇసుక రీచ్ల నుంచి చింతలపూడి లారీలకు ఇసుక ఇవ్వడానికి ర్యాంప్ సిండికేట్లు నిరాకరిస్తున్నారు. చింతలపూడి నియోజకవర్గానికి గత రెండు నెలల్లో 1.42 లక్షల టన్నుల ఇసుకను తరలించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అనధికారిక లెక్కలు మాత్రం చింతలపూడి మీదుగా ఖమ్మం జిల్లాకు తెలంగాణ రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు భారీగా ఇసుక అక్రమంగా తరలిపోతోంది. ప్రధానంగా 25 లారీల్లో నిత్యం తెలంగాణకు కొవ్వూరు నియోజకవర్గం నుంచి అక్రమంగా ఇసుక తరలివెళ్తోంది. కొవ్వూరు స్థానిక ప్రజాప్రతినిధిని శాసించే త్రిసభ్య కమిటీయే ఇసుక దందా సిండికేట్. అన్ని రీచ్లు త్రిసభ్య కమిటీలో ఉన్న ముగ్గురే శాసించడం, ప్రజాప్రతినిధికి కూడా ట్రాక్టర్ మొదలుకొని లారీ వరకు ఒక్కొక్క ధర నిర్ణయించి చెల్లించి పూర్తిగా హవా సాగిస్తున్నారు. సదరు త్రిసభ్య కమిటీ తెలంగాణాకు భారీగా తరలిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఇలా చింతలపూడి మండలం అల్లిపల్లి సరిహద్దు గ్రామం మీదుగా తెలంగాణకు తరలిస్తున్నారు. దూరాన్ని బట్టి రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో గత రెండు నెలల వ్యవధిలో మైనింగ్ శాఖ పూ ర్తిగా మౌనం వహించడంతో పోలీసులు అతికష్టం మీద 25 వాహనాలను సీజ్ చేయడం, రెండు, మూడు రోజుల వ్యవధిలో వాహనాలను తీసుకువెళ్లడం జరిగింది. దీనిపై కలెక్టర్కు వరుస ఫిర్యాదులు రావడంతో కలెక్టర్ అల్లిపల్లి వద్ద సీసీ కెమెరాల పర్యవేక్షణతో రెవెన్యూ చెక్పోస్టు ఏర్పాటుచేశారు. అయినా ఇసుక దందాకు అడ్డుకట్ట పడలేదు. చెక్పోస్టులో ఉన్న వీఆర్ఓను బెదిరించి మరీ ఇసుకను తరలించడంతో వీఆర్ఓ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. అయినా రోజూ 10 నుంచి 15 లారీలు అక్రమంగా తరలివెళ్తున్నాయి. ఒక్కో లారీ నుంచి రెవెన్యూ సిబ్బంది రూ.వెయ్యి నుంచి రూ.2,500 వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక గత వారం నుంచి జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చింతలపూడి మండలానికి ఇసుక ఇవ్వడం లేదు. ఈ క్రమంలో తెలంగాణ లారీల ముఠా ఏలూరు, కామవరపుకోట, చాట్రాయి మండలాల పేరిట బిల్లులు కొట్టించి యథావిధిగా ఇసుకను సరిహద్దులు దాటిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈనెల 8న చింతలపూడికి చెందిన శ్రీ ఆంజనేయ లారీ ఓనర్స్ అసోసియేషన్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అసోసియేషన్ పరిధిలో 120 లారీలున్నాయని, కొవ్వూరు నియోజకవర్గం ఇసుక ర్యాంపుల్లో లోడింగ్ చేయమని తమకు ఆదేశాలున్నాయని చెప్పి చింతలపూడి వాహనాలకు ఇసుక ఇవ్వడం లేదని ఫిర్యాదులో వివరించారు. అలాగే ఆంధ్రా నుంచి తెలంగాణకు అల్లిపల్లి రెవెన్యూ చెక్పోస్టు మీదుగా రోజూ 15 లారీలకుపైగా అక్రమంగా ఇసుక వెళ్తుందని, అక్కడ సిబ్బందికి సొమ్ములు ఇచ్చినట్లు లారీ ఓనర్లే చెబుతున్నారని, ప్రతి వాహనానికి ఏర్పాటు చేసిన మైనింగ్ జీపీఎస్, సీసీ కెమెరాల ద్వారా విచారణ చేసి చర్యలు తీసుకోవాలని, అలాగే తమకు ఉపాధి కల్పించాలని, లేదంటే ఈఎంఐలు చెల్లించలేక లారీ యజమానులు అప్పులపాలవుతున్నారని తెలిపారు. అలాగే అక్రమ రవాణా చేస్తున్న 25 లారీ నంబర్లను కూడా కలెక్టర్కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనడం విశేషం. ఇసుక.. మస్కా చింతలపూడి లారీలకు కొవ్వూరులో నో ఇసుక తెలంగాణ లారీలకు అదనంగా రూ.100 వసూలు రోజూ 15 లారీలు తెలంగాణాకు.. చింతలపూడి అన్లోడింగ్ పేరుతో తెలంగాణకు అక్రమ దందా నష్టపోతున్నామంటూ లారీ యజమానుల ఆవేదన కలెక్టర్కు ఫిర్యాదు చేసిన వైనం -
పుంజులకు పందెంపాఠాలు
పుంజులకు పందెం పాఠాలేంటీ అనుకుంటున్నారా? సంక్రాంతి కోడిపందేలకు పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం ఎంత ఫేమస్సో తెలిసిందే. రూ.కోట్లలో చేతులు మారడం ఒకెత్తయితే.. తమ కోడి.. పందెం కొట్టడం ప్రతిష్టాత్మకంగా భావించడం మరో ఎత్తు. పుంజులను పందేలకు సిద్ధం చేసేందుకు మూడు నెలల ముందు నుంచి పెద్ద కసరత్తే జరుగుతోంది. రానున్న సంక్రాంతి కోసం దసరా నుంచే పందేలరాయుళ్లు తమ పుంజులకు శిక్షణ ప్రారంభించారు. సాక్షి, భీమవరం: సంక్రాంతి పండగ రోజుల్లో భీమవరం, కోనసీమ ప్రాంతాల్లో రూ.కోట్లు వెచ్చించి ప్రత్యేకంగా బరులు ఏర్పాటుచేసి కోడిపందేలు నిర్వహిస్తుంటారు. వీటిని చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు ఎందరో తరలివస్తుంటారు. అందుకు తగ్గట్టే పుంజుల పెంపకంలో పందేలరాయుళ్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అధిక శాతం మంది తమ ఇళ్లు, మకాంల వద్ద పుంజులను పెంచితే, పండుగలకు దేశ విదేశాల నుంచి వచ్చేవారు తెలిసిన ట్రైనర్లతో శిక్షణ ఇప్పిస్తుంటారు. అంతా గోప్యమే : కాకి, నెమలి, అబ్రాస్, డేగ, పచ్చకాకి, కేతువ తదితర జాతుల నుంచి రెండేళ్ల వయసు కలిగిన పుంజులను పందేలకు వినియోగిస్తుంటారు. పుంజుకు పోరాట పటిమ, శరీర పటుత్వం, శక్తిని పెంచేందుకు మూడు నెలల ముందు నుంచి ఎవరికి వారు ఎన్నో సంప్రదాయ, ఆధునిక పద్ధతులు పాటిస్తుంటారు. వాటికిచ్చే ఆహారం, మందుల నుంచి శిక్షణ వరకు ప్రతి విషయంలోనూ గోప్యత పాటిస్తారు. రూ.కోట్లలో వ్యాపారం.. మకాంల వద్ద పనిచేసే వారికి నెలకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు జీతాలుంటాయి. వీరు ఒక్కొక్కరూ 12 నుంచి 15 పుంజులను మాత్రమే పర్యవేక్షిస్తారు. నీళ్ల పోతలు, శాఖల కోసం వచ్చే ట్రైనర్లకు సిట్టింగ్కు కొంత మొత్తం మాట్లాడుకుంటారు. ఇవికాకుండా కోడికి అందించే ప్రత్యేక మేత, మందులతో ఒక్కో పందెం పుంజుకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చవుతుందంటున్నారు. వీటి జాతి, రంగు, ఎత్తును బట్టి రూ.50 వేల నుంచి రూ.లక్షల్లో అమ్ముతుంటారు. మామూలుగా ఇళ్ల వద్ద పెంచిన పుంజులు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు అమ్మకాలు చేస్తుంటారు. పండగల కోసం నాలుగు వేలకు పైగా పందెం కోళ్ల అమ్మకాలు జరుగుతుంటాయి. వీటి ద్వారా రూ.10 కోట్లకు పైగా వ్యా పారం జరుగుతుందని అంచనా. పుంజులకు ఉన్న డిమాండ్తో జిల్లాలోని భీమవరం, ఉండి, ఆకివీడు, పాలకోడేరు, పాలకొల్లు, కాళ్ల తదితర మండలాల్లో 200కు పైగా నాటుకోళ్ల పెంపకం కేంద్రాలు ఉన్నా యి. కొందరు స్థలాలను లీజుకు తీసుకుని వీటి పెంపకం సాగిస్తుంటారు. సామర్థ్యాన్ని బట్టి ఒక్కోచోట వంద నుంచి 250 వరకు వివిధ రకాల జాతుల పుంజులు, కోళ్లను పెంచుతుంటారు. పందెంకోళ్లను ఆరుబయట కట్టిన దృశ్యం ఉదయాన్నే పుంజును బయటకు తెచ్చి కొద్దిగా వేడి నీటిని పట్టిస్తారు. కాళ్లలో పటుత్వం, ఆయాసం రాకుండా, అనారోగ్య సమస్యలుంటే గుర్తించేందుకు నెలరోజుల పాటు రోజు విడిచి రోజు చెరువులు, నీటి తొట్టెల్లో ఈత కొట్టిస్తారు. ‘వి’ (ఇంగ్లిష్ లెటర్) ఆకారంలో నెట్లు కట్టి పుంజు అందులోనే తిరిగే విధంగా బేటా (నిర్ణీత పద్ధతిలో వాకింగ్) చేయిస్తారు. మరికొందరు ఖాళీ జాగాలో వాటి వెనుకే ఉండి తరుముతూ పరుగులు పెట్టిస్తారు. కోడి నోటి నుంచి వచ్చే కఫాన్ని తొలగించి శుభ్రం చేస్తారు. మేత పెట్టి 11 గంటల సమయం వరకు ఎండలో కట్టేసిన తర్వాత మకాంలోకి మార్చేస్తుంటారు. పండగలు దగ్గరపడే కొద్దీ పుంజు శరీరం గట్టిపడేందుకు, నొప్పులు తగ్గడానికి ప్రత్యేక ట్రైనర్లతో వేప, జామాయిల్, కుంకుడు తదితర ఆకులు, తుమ్మ బెరడు, తోక మిరియాలు, పసుపు కొమ్ములు తదితర 20 రకాలతో గంటల కొద్దీ మరిగించిన ద్రావణాన్ని కోడి తట్టుకునే వేడి వరకు చల్లార్చి పుంజును అందులో ఉంచి పైనుంచి ద్రావణం పోస్తూ వారంలో ఒకటి రెండుసార్లు నీళ్లపోతలు పోస్తారు. చివరిగా పొయ్యిపై మూకిడిని వేడిచేస్తూ అందులో చీప్ లిక్కర్ చిమ్మినప్పుడు వచ్చిన ఆవిరిని మెత్తటి గుడ్డకు పట్టించి దానిని కోడి శరీరం అంతా అద్దుతూ శాఖల చేయిస్తారు. పందేలకు ముందు అలసిపోకుండా నాలుగైదు రోజుల ముందు నుంచి పుంజుకు పూర్తి విశ్రాంతిని ఇచ్చేసి మకాంలో కట్టేసి ఉంచుతారు. ఈ ప్రక్రియలన్నిటినీ నిర్ణీత పద్ధతుల్లో చేయిస్తుంటారు. కోఢీ.. రెడీ సంక్రాంతి పందేలకు శిక్షణ ఉదయాన్నే హాట్ వాటర్, వాకింగ్, స్విమ్మింగ్, వామప్ మేతగా మటన్, గుడ్డు, బాదం, ఎండు ఖర్జూరం, వెల్లుల్లితో మెనూ ఒక్కో పుంజుకు రూ.30 వేల వరకు శిక్షణ వ్యయం ‘పశ్చిమ’లో 200కు పైగా పెంపకం కేంద్రాలు సంక్రాంతి సీజన్కు రూ.10 కోట్లకు పైనే వ్యాపారం -
ప్రైవేటీకరణపై కోటి సంతకాల పోరు
ఉంగుటూరు: పేదలకు వైద్య విద్యను చేరువ చేసేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలను తీసుకువస్తే కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని చూస్తే సహించబోమని, ప్రైవేటీకరణకు పేదలకు ఉచిత విద్య, వైద్యం అందవని ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు పుప్పాల వాసుబాబు అన్నారు. స్థానిక దళితవాడ వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద వాసుబాబు తొలి సంతకం చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కార్పొరేట్ వ్యక్తులకు దారాదత్తం చేసేలా చంద్రబాబు పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలో 60 వేలు సంతకాలకు తగ్గకుండా సేకరించాలని పిలుపునిచ్చారు. ప్రైవేటీకరణను అడ్డుకుంటాం బుట్టాయగూడెం: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుని తీరతామని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకుడు, రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావుతో కలిసి కోటి సంతకాల ప్రజా ఉద్యమ పోస్టర్లను ఆవిష్కరించారు. కోటి సంతకాల ఉద్యమంతో కూటమిని కూకటివేళ్లతో సహా పెకిలిస్తామని హెచ్చరించారు. అలాగే జంగారెడ్డిగూడెంలో కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని పార్టీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు ప్రారంభించారు. దెందులూరులోని మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి క్యాంపు కార్యాలయం వద్ద పార్టీ అన్ని విభాగాల నాయకులు కోటి సంతకాల సేకరణ పోస్టర్లను విడుదల చేశారు. బుట్టాయగూడెంలో పోస్టర్లు ఆవిష్కరిస్తున్న మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఉంగుటూరులో కోటి సంతకాల సేకరణను ప్రారంభిస్తున్న మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు -
ప్రభుత్వమే వైద్య కళాశాలలు నిర్వహించాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): వైద్య కళాశాలలు ప్రభుత్వ రంగంలో ఉంటేనే సేవా దృక్పథంతో పనిచేయగలవని, ప్రైవేటు వారికి అప్పగిస్తే వ్యాపార దృక్పథంతోనే పనిచేస్తారని జన విజ్ఞాన వేదిక పూర్వపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎన్ రమేష్ అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వద్దు, ప్రభుత్వ రంగంలోనే నిర్వహించాలి అనే అంశంపై స్థానిక ఎన్ఆర్పేటలో జనవిజ్ఞాన వేదిక కార్యాలయంలో శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. పీపీపీ విధానం ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడదన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి రిటైర్డ్ సూపరింటెండెంట్ రవి గోపాలకృష్ణయ్య మాట్లాడుతూ ప్రభుత్వ రంగానికి, ప్రైవేటు రంగానికి ఉన్న అంతరాన్ని వివరిస్తూ ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులు ఇతోధికంగా సేవ చేశాయన్నారు. రిటైర్డ్ జడ్జి అడబాల లక్ష్మి మా ట్లాడుతూ కాలేజీల్ని ప్రైవేట్పరం చేయడం అంటే రాజ్యాంగ విలువలకి పాతర వేయడమే అన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాజనాల రామ్మోహన్, సీపీఐ నాయకుడు బండి వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడారు. ఏలూరు (టూటౌన్): రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో వర్క్ అవుట్ సోర్సింగ్ పేరిట ప్రైవేటీకరణ విధానాన్ని అమలు చేయడానికి ప్రయత్నించడాన్ని సీఐటీయూ వ్యతిరేకిస్తోందని జిల్లా కార్యదర్శి డీఎన్వీడీ ప్రసాద్ అన్నారు. వర్క్ అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలంటూ శనివారం ఏలూరు ఆర్ఆర్పేట మస్తర్ పాయింట్ వద్ద కార్మికులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. నెల్లూరులో ఈ విధానాన్ని సీఐటీయూ తిప్పికొట్టిందని, ఆ సందర్భంలో రాష్ట్రంలో మరెక్కడా అమలు చేయమని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్పారన్నారు. అయితే ఏలూరు కార్పొరేట్లో పనులను ప్రైవేట్ వ్యక్తలకు అప్పగించాలని చూస్తే ఊరుకోబోమని అన్నారు. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా కార్యదర్శి ఎ.జానుబాబు, నగర కార్యదర్శి ఎం.ఇస్సాకు, జిల్లా కార్యదర్శి జె.గోపి పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): నారాయణ, చైతన్య విద్యాసంస్థలు సెలవు రోజుల్లోనూ నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్నాయంటూ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కె.లెనిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో శనివారం తరగతులు నిర్వహిస్తున్న విద్యాసంస్థలను మూయించివేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ విద్యాసంస్థల్లో రోజులో కనీసం గంట కూడా క్రీడలు నిర్వహించకపోవడంతో విద్యార్థులకు మానసిక వికాశం, స్వేచ్ఛ ఉండటం లేదన్నారు. అలాగే ఎన్ శాట్ స్కాలర్షిప్ పేరుతో ఆదివారం నారాయణ విద్యాసంస్థలు నిర్వహించే పరీక్షకు ప్రభుత్వ అనుమతి లేదన్నారు. ఆయా సమస్యలపై విద్యాశాఖ అధికారులు దృష్టి పెట్టాలన్నారు. ఎస్ఎఫ్ఐ నాయకులు వై.అభి, టి.వంశీ, ఎస్.రాజా పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం అర్బన్: తాడేపల్లిగూడెంలో ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపింది. శనివారం ఉదయం ఓ వ్యక్తి పోలీస్స్టేషన్ సెంటర్కు వచ్చి దుకాణం వద్ద టీ తాగుతున్నాడు. ఇంతలో ఓ కారులో నుంచి ముఖానికి ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు దిగి టీ తాగుతున్న వ్యక్తిని బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లారు. దీంతో అక్కడున్న వారు నిర్ఘాంతపోయారు. విషయం తెలిసిన పట్టణ సీఐ బోణం ఆదిప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. తాడేపల్లిగూడెం (టీఓసీ): డీఎస్సీ–98 మినిమం టైం స్కేల్ టీచర్స్ (ఎంటీఎస్) విజ్ఞాపన దీక్ష రా ష్ట్రవ్యాప్తంగా ఉన్న టీచర్స్తో శనివారం విజయవాడలోని ధర్నాచౌక్ వద్ద జరిగినట్లు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నాయకుడు కె.మోహన్రావు శనివారం తెలిపారు. -
గోడను ఢీకొనడంతో వ్యక్తి మృతి
నూజివీడు: ద్విచక్ర వాహనం అదుపు తప్పి గోడను ఢీకొన్న సంఘటనలో మండలంలోని తుక్కులూరుకు చెందిన బత్తుల రామ్మోహన్రావు(50) అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన శనివారం నూజివీడు మండలం మీర్జాపురం శివారు కండ్రికలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బత్తుల రామ్మోహన్రావు తక్కులూరులోని తన ఇంటి వద్ద నుంచి హనుమాన్జంక్షన్లోని బంధువుల ఇంటికి వెళ్తూ మధ్యాహ్నం 12 గంటల సమయంలో మీర్జాపురం శివారు కండ్రిక వద్దకు వచ్చే సరికి వాహనం అదుపు తప్పి గోడను ఢీకొట్టాడు. దీంతో అతను బండిపై నుంచి ఎగిరి కింద పడటంతో తలకు బలమైన గాయమై రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
అక్రమ మద్యాన్ని అడ్డుకోవాలి
రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ మద్యం, కల్తీ మద్యం వ్యాపారం జోరుగా సాగుతుంది. అనేక చోట్ల కల్త మద్యం తయారు చేస్తున్న మద్యం మాఫియా గుట్టు బట్టబయలు అవుతుంది. కూటమి ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోవడంలేదు. ఏలూరు జిల్లాలో అక్రమ మద్యం వ్యాపారం భారీగా సాగుతుంది. టైమింగ్స్ లేకుండా అర్థరాత్రి వరకూ మద్యం విక్రయిస్తూ.. మళ్ళీ తెల్లవారుజామునే దుకాణాలు తెరుస్తున్నారు. కూటమి నేతలే మద్యం షాపులను నిర్వహిస్తూ ఉండడంతో అధికారులు సైతం అటువైపు కన్నెత్తి చూడడం లేదు. – జిజ్జువరపు విజయనిర్మల, ఏలూరు నగర మహిళ అధ్యక్షురాలు, వైఎస్సార్సీపీ -
ప్రజల ప్రాణాలతో చెలగాటం
కూటమి ప్రభుత్వం, నేతలు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఒకవైపు అక్రమ మద్యం, మరోవైపు కల్తీ మద్యంతో ప్రజలు మద్యానికి బానిసలుగా మారిపోయి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కుటుంబంలో భర్త పనికి వెళ్ళకుండా మద్యం తాగుతూ వేధింపులకు గురిచేస్తూ ఉంటే... కుటుంబాలు నాశనం అవుతున్నాయి. మహిళలు అంతా ఈ కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఓట్లు వేశామా ? అని బాధపడుతున్నారు. ప్రతీ గ్రామంలోనూ మద్యం బెల్టు షాపులు విచ్చలవిడిగా ఏర్పాటు చేశారు. – నిట్టా లీలా నవకాంతం, దెందులూరు జెట్పీటీసీ -
కుటుంబాలు ఛిన్నాభిన్నం
కూటమి ప్రభుత్వంలో మద్యాన్ని ఏరులై పారిస్తూ ప్రజలను మద్యానికి బానిసలుగా మార్చేస్తున్నారు. రాత్రీ పగలూ తేడా లేకుండా ఇష్టారాజ్యంగా ప్రైవేటు మద్యం దుకాణాల్లో మద్యాన్ని అందుబాటులో ఉంచుతున్నారు. పేద, మద్యతరగతి వర్గాల ప్రజలు, కూలిపనులకు వెళ్ళే వారు సంపాదించిన సొమ్మంతా మద్యానికే ఖర్చు చేస్తున్నారు. నిత్యం మందు అందుబాటులో ఉండేసరికి కుటుంబ యజమాని మద్యం తాగడంతో కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. – కేసరి సరితారెడ్డి, ఏలూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు, వైఎస్సార్సీపీ -
●దేశ రక్షణలో నేను సైతం..
దేశ సరిహద్దు భద్రతా దళం సభ్యురాలిగా శిక్షణ పూర్తి చేసుకుని స్వగ్రామానికి వచ్చిన కంటుబోతు రమ్యకు దెందులూరు మండలం ఉండ్రాజవరం గ్రామస్తులు శనివారం ఘనస్వాగతం పలికారు. కంటుబోతు నాగు, పద్మల కుమార్తె రమ్య బీకాం కంప్యూటర్స్ పూర్తి చేసింది. దేశభక్తితో ఎప్పటికై నా సెక్యూరిటీ ఫోర్స్లో చేరాలని నిర్ణయించుకుంది. తన కలను సాకారం చేసుకుంటూ 2022లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లో దరఖాస్తు చేసుకుంది. 2023లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్కు ఎంపికై సంవత్సరం పాటు శిక్షణ తీసుకుంది. శిక్షణ పూర్తి చేసుకున్న రమ్య శనివారం ఉండ్రాజవరం గ్రామానికి రావడంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఆమెకు స్వాగతం పలికారు. రమ్య తల్లిదండ్రులను సైతం గ్రామస్తులు అభినందించారు. – దెందులూరు -
ఎఫెక్ట్
ఇరగవరం: ఇరగవరం మండలంలోని రేలంగి పంచాయతీలో చెత్త వాహనాలు మరమ్మతులకు గురై మూలకు చేరాయి. దీంతో శ్రీమూలకు చేరిన చెత్త వాహనాల్ఙు అనే శీర్షికన శనివారం సాక్షి దినపత్రికలో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. కథనానికి స్పందించిన ఇన్చార్జ్ పంచాయతీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ మూలకు చేరిన చెత్త వాహనాలకు మరమ్మతులు చేపట్టారు. పేరుకుపోయిన చెత్తను, జేసీబీ సాయంతో శుభ్రం చేయించారు. భీమవరం: భీమవరం పట్టణంలో ఉభయ తెలుగు రాష్ట్రాల స్ధాయిలో చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మాదాసు కిషోర్ శనివారం చెప్పారు. స్ధానిక తాలూకా ఆఫీసు సెంటర్లోని జీవీఆర్ కల్యాణ మండపంలో ఈ నెల 12వ తేదిన నిర్వహించే చెస్ పోటీల్లో విజేతలకు రూ.లక్ష నగదు బహుమతులు అందచేస్తామన్నారు. ఉదయం 9 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని ఆయన చెప్పారు. మండవల్లి: మండలంలోని పెరికెగూడెంలో సెప్టెంబర్ 2న దేవితల్లి అమ్మవారి నవరాత్రుల సందర్భంగా దాడి చేసిన ఇద్దరికి మేజిస్ట్రేట్ 14 రోజుల చొప్పున రిమాండు విధించినట్లు ఎస్ఐ రామచంద్రరావు చెప్పారు. పెరుమాల నరేంద్రబాబు, పిండి కర్ణబాబులు దేశిగణేష్పై దాడి చేసి గాయపర్చారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను న్యాయస్ధానంలో హాజరుపర్చగా, రిమాండు విధించినట్లు తెలిపారు. -
శ్రీవారి క్షేత్రం.. భక్తజన సంద్రం
ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య క్షేత్రం శనివారం భక్తులతో పోటెత్తింది. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. దాంతో క్షేత్ర పరిసరాలు భక్తజన సంద్రమయ్యాయి. దర్శనం క్యూలైన్లు, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కల్యాణకట్ట, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ తదితర విభాగాలు భక్తులతో కిక్కిరిశాయి. సాయంత్రం వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. సాయంత్రం 5 గంటల వరకు దర్శనం టికెట్లు, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.32 లక్షల ఆదాయం లభించినట్టు ఆలయ అధికారులు తెలిపారు. శ్రీవారి క్షేత్రంతో పాటు, పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం అధిక సంఖ్యలో వివాహాలు జరిగాయి. దాంతో కొత్త జంటలు స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. -
చిచ్చర పిడుగులు
జిల్లా యువజన సేవ, క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఏలూరు ఇండోర్ స్టేడియంలో స్కేటింగ్ ట్రాక్పై జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి చిన్నారులు పాల్గొన్నారు. నాలుగు సంవత్సరాల నుంచి 10 ఏళ్ల వయసు ఉన్న వారికి జరిగిన ఈ పోటీల్లో అండర్–4 నుంచి అండర్–6 విజేతలుగా వై.తీరాజ్, ఎం.శ్రీయ, అండర్–6 నుంచి అండర్–8 పోటీల్లో దేవాంశ్, డి.శరన్ శ్రీవాస్తవ్, లక్ష్మి, అండర్–12 నుంచి అండర్–15 పోటీల్లో ఎన్.భువనరత్న శ్లోక గెలుపొందారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, ఏలూరు స్కేటింగ్లో పోటీ పడుతున్న క్రీడాకారులు -
నిట్లో ముగిసిన టెక్రియా
తాడేపల్లిగూడెం: విద్యార్థుల సృజనాత్మక ఆలోచనలకు పెద్దపీట వేసే టెక్రియా 2కె25 కార్యక్రమం శనివారం నిట్లో ముగిసింది. విద్యార్థుల ప్రదర్శనలు ఆలోచింపచేశాయి. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గ్రాఫిక్ కేఫ్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మర్డర్ మిస్టరీ గేమ్ ఆలోచింపచేసింది. ఈసీఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో కారుకి గైర్ స్కోప్ను అనుసంధానం చేసుకుంటూ అవరోధాలు అధిగమిస్తూ, గమ్యాన్ని ఎలా చేరుకోవచ్చనే విషయాలను విద్యార్థులు వివరించారు. నేచర్ క్లబ్ ఆధ్వర్యంలో ఎకో పెయింటింగ్ పోటీలో ఆకట్టుకున్నాయి. ముగింపు సందర్భంగా విద్యార్ధులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు జోష్ను నింపాయి. కొయ్యలగూడెం: విద్యుత్ షాక్కు గురై వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో రామనుజపురంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం టీ.నర్సాపురం మండలం శ్రీరామవరం గ్రామానికి చెందిన పరిటాల నాగచందద్రరావు (42) కొయ్యలగూడెం మండలం రామనుజపురంలో అన్న కుమార్తె వివాహానికి వచ్చాడు. ఇంటి ఆవరణలో చెత్తను శుభ్రం చేస్తూ ఉండగా, సమీపంలోని ఇనప ఊస అడ్డుగా ఉందని తొలగిస్తుండగా 11 కేవీ విద్యుత్ వైర్లకు తగిలింది. దీంతో షాకుకు గురైన నాగచంద్రరావు మృతి చెందాడని ఎస్సై వి.చంద్రశేఖర్ తెలిపారు. ఉండి మండలంలో మరొకరు..ఉండి: చత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన బహుదూర్(19) ఉండి మండలం ఆరేడులో శనివారం సాయంత్రం చేపల చెరువులో మేత వేసేందుకు వెళ్లగా చెరువు గట్టుపై ఉన్న విద్యుత్తు మోటర్ షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్సై ఎండీ నసీరుల తెలిపారు. -
మద్యం కిక్కులో జేబుకు చిల్లు
ఏలూరు టౌన్ : ఏలూరు జిల్లాలో ప్రైవేటు మద్యం దుకాణాలు 155 ఉండగా.. కూటమి నేతలు, మద్యం సిండికేట్ చేతుల్లో ఏకంగా 1290కి పైగా బెల్టు షాపులు ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో రెండు, మూడు బెల్టు షాపులు పెట్టుకుని మద్యం విక్రయాలు భారీ ఎత్తున చేస్తున్నారు. అన్ని చోట్లా విచ్చలవిడిగా మద్యం విక్రయిస్తూ కూటమి నేతలు కోట్లు గడిస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. చింతలపూడి, కై కలూరు, నూజివీడు, దెందులూరు, పోలవరం ఏజెన్సీ ప్రాంతంలోనూ బెల్టు షాపుల హవా భారీ ఉంది. జేబులకు చిల్లు మద్యం కిక్కులో మందుబాబుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. చీప్ లిక్కర్ను సైతం రూ.20 అధిక ధరలకు విక్రయిస్తున్నారు. జిల్లాలో నెలకు సగటున అధిక రేటు కారణంగా మందుబాబుల నుంచి కోట్లలో సొమ్ములు కాజేస్తున్నారు. జిల్లాలో ఒక నెలకు సుమారుగా 16.80 లక్షల క్వార్టర్ బాటిల్స్ విక్రయిస్తే ఒక్కో బాటిల్కు రూ.20ల చొప్పున అధిక ధరకు అమ్ముతున్నారు. నెలకు రూ.3.36 కోట్ల మేర మందుబాబుల మీద అదనంగా లాగేస్తున్నారు. ఏడాదికి చూస్తే కేవలం అధిక రేటు ద్వారానే సుమారుగా రూ.40 కోట్లు వరకూ కూటమి మద్యం సిండికేట్ వ్యాపారులు అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నట్లు అంచనా. చంద్రబాబు చిత్రపటంపై మద్యం పోస్తూ నిరసన తెలుపుతున్న మహిళలు ఎకై ్సజ్ కార్యాలయం వద్ద నినాదాలు చేస్తున్న వైఎస్సార్సీపీ మహిళా నాయకులువైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో బెల్టు షాపులను పూర్తిగా తొలగించి.. కేవలం ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేశారు. మద్యం షాపులు ఉదయం 10 నుంచి రాత్రి 8.30 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉండేలా టైమింగ్స్ పెట్టారు. మద్యం కొనాలంటే షాక్ కొట్టేలా.. చేస్తాననే మాటను నిజం చేస్తూ ధరలు పెంచటంతో పేదవర్గాల ప్రజలు మద్యానికి దూరం అయ్యారు. సిట్టింగ్ రూమ్లు లేకపోవటంతో మద్యం తాగేందుకు ఆసక్తి తగ్గింది. కూటమి సర్కారు హాయాంలో చంద్రబాబు మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. అనారోగ్యం వస్తే మందుల షాపులైనా తెరిచిఉంటాయో లేదో కానీ మద్యం కావాలంటే మాత్రం నో టైమింగ్స్. ఎనీ టైమ్ మద్యం (ఏటీఎం) తరహాలో మద్యాన్ని ఇష్టారాజ్యంగా విక్రయిస్తూ కూటమి నేతలు జేబులు నింపుకుంటున్నారు.. మందుబాబులకు రాత్రీ పగలూ తేడాలేకుండా మద్యాన్ని అందుబాటులో ఉంచారు. ఒకవైపు మద్యం షాపులు, మరో వైపు గ్రామగ్రామాన బెల్టు షాపుల లైట్లు నిత్యం వెలిగే ఉంటున్నాయి. చీఫ్ లిక్కర్ క్వార్టర్ బాటిల్పై సైతం రూ.20 అదనంగా బాదేస్తున్నారు. లిక్కర్ షాపుల్లో అదనపు దోపిడీ ఒక్కో క్వార్టర్పై సుమారు రూ.20కి పైగా అదనంగా వసూలు ఏడాదికి సిండికేట్ అ‘ధనం’ సుమారు రూ.40 కోట్లు -
●ఇదేనా ‘చెత్త’శుద్ధి?
నూజివీడు పట్టణంలోని బస్టాండు వద్ద డ్రైనేజీలో చెత్త పేరుకోవడంతో అపారిశుద్ధ్యానికి నిలయంగా మారింది. గతంలో డ్రైనేజీ కల్వర్టులో నుంచి మురుగునీరు వెళ్లకపోవడంతో కల్వర్టు శ్లాబు కొంత తొలగించి అడ్డుపడ్డ చెత్తను తొలగించి మురుగునీరు వెళ్లేలా చేశారు. ఆ తరువాత పైభాగంలో శ్లాబు పోయకుండా వదిలేశారు. దీంతో డ్రెయిన్ నిండా చెత్త పేరుకుపోయింది. మరోవైపు ఈ డ్రెయిన్ ప్రమాదాలకు నెలవుగా మారింది. ఇప్పటికై నా మున్సిపల్ అధికారులు స్పందించి డ్రైనేజీపై శ్లాబును నిర్మిస్తే పారిశుద్ధ్య సమస్యకు పరిష్కారం లభించడంతో పాటు ప్రమాదాలు నివారించవచ్చు. – నూజివీడు -
మద్యం దుకాణాల్లో తనిఖీలు
ఎఫెక్ట్ తణుకు అర్బన్ : శ్రీపశ్చిమలో మద్యం దందాశ్రీ శీర్షికన సాక్షి దినపత్రికలో శనివారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. తణుకు ఎకై ్సజ్ సీఐ సత్తి మణికంఠరెడ్డి తమ సిబ్బందితో కలిసి స్టేషన్ పరిధిలోని మద్యం దుకాణాల్లో శనివారం తనిఖీలు చేసి మద్యం బాటిల్స్ శాంపిల్స్ సేకరించారు. ఎక్కడా బెల్టు షాపుల నిర్వహణ జరగడంలేదని, ఇంతవరకూ తణుకు స్టేషన్ పరిధిలో 95 బెల్టు షాపులకు సంబంధించి కేసులు నమోదుచేసి వారి నుంచి 135.21 లీటర్ల మద్యం, 3.25 లీటర్ల బీరును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులందరినీ తహసీల్దారు కోర్టులో బైండోవర్ చేసినట్లు వివరించారు. తణుకులో ఒక మద్యం దుకాణంలో అదనపు ధరలకు విక్రయిస్తున్నట్లుగా ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసినట్లు చెప్పారు. అదనపు ధరలకు విక్రయిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. తాడేపల్లిగూడెంలో.. తాడేపల్లిగూడెం: పశ్చిమలో మద్యం దందా కఽథనానికి ఎకై ్సజ్ అధికారులు కదిలారు. గూడెం సర్కిల్ పరిధిలోని మద్యం దుకాణాలలో తనిఖీలు చేయడంతో పాటు, మద్యం నమూనాలు సేకరించి పరిశోధనశాలకు పంపించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే మద్యం విక్రయిస్తున్నారా.. లేదంటే అధిక ధరకు విక్రయిస్తున్నారా అనే విషయాలను పరిశీలించారు. బెల్టు దుకాణాలు నిర్వహిస్తున్నారా అనే విషయాలను పరిశీలించారు. 40 మద్యం దుకాణాల్లో ధరలు పరిశీలించారు. ఇప్పటి వరకు స్టేషన్ పరిధిలో 134 బెల్టు దుకాణాలపై కేసులు నమోదు చేశామని ఎకై ్సజ్ సీఐ స్వరాజ్యలక్ష్మి అన్నారు. 226 లీటర్ల మద్యం, 7.8 లీటర్ల బీరును స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. -
ఆదాయమున్నా.. కనిపించని వైభవం!
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతోంది. నిత్యం వేలాది మంది, శని, ఆదివారాలు, పర్వదినాల్లో అంతకుమించి భక్తులు పోటెత్తుతున్నారు. స్వామివారి వార్షిక ఆదాయం రూ.180 కోట్ల పైమాటే. ఒక్క హుండీ ఆదాయమే నెలకు సుమారు రూ.3 కోట్ల వరకు ఉంటోంది. వీటికి దాతల విరాళాలు అదనం. అయితే ఆదాయం ఎంత పెరుగుతున్నా.. స్వామివారి వైభ వం మాత్రం పెరగడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో నామమాత్రంగా జరుగుతున్న పలు కార్యక్రమాలే ఇందుకు నిదర్శనమని అంటున్నారు. ఇదిలా ఉండగా అధిక శాతం ఆదాయాన్ని భక్తులకు సౌకర్యాల కల్పన పేరుతో అధికారులు వృథా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్యాప్ కింద శ్రీచక్రస్నానమా.. బ్రహ్మోత్సవాల్లో శ్రీచక్రస్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. చిన్నపాటి ఆలయాల్లో సైతం ఈ వేడుక వైభవంగా నిర్వహిస్తున్నారు. అయితే శ్రీవారి క్షేత్రంలో మాత్రం మొక్కుబడిగా జరుగుతుందన్న విమర్శలు ఉన్నాయి. సాధారణంగా శ్రీచక్రస్నానాన్ని కోనేరులో నిర్వహిస్తారు. ఆ సమయంలో భక్తులు ఆ కోనేరులో స్నానం చేసి పునీతులవుతారు. అయితే ద్వారకాతిరుమల క్షేత్రంలో కోనేరు లేకపోవడంతో ఆలయ యాగశాలలో ఉన్న ట్యాప్ కింద స్వామివారికి శ్రీచక్రస్నానాన్ని నిర్వహిస్తున్నారు. దీనిపై భక్తులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రథంలో కనిపించని అమ్మవార్లు : దేవస్థానం ఏడేళ్ల క్రితం తయారు చేయించిన రథాన్ని రథోత్సవాలకు వినియోగిస్తు న్నారు. అయితే రథ నిర్మాణంలో తలెత్తిన లోపాల కారణంగా రథంలో స్వామివారు మినహా, అమ్మవార్లు కనిపించడం లేదు. దీంతో రథయాత్రలో పాల్గొనే భక్తులు అమ్మవార్ల దర్శనం కాక అసంతృప్తి చెందుతున్నారు. రథానికి ముందు భాగంలో అశ్వాలు లేక జీవకళ లేదనే విమర్శలు ఉన్నాయి. అటకెక్కిన అంచనాలు గతంలో ఆలయ ప్రాకారం లోపల స్వామివారి ప్రధాన ఆలయాన్ని యథాతఽథంగా ఉంచి, నలువైపులా గ్రానెట్ స్టోన్తో అనివేటి మండపాన్ని నిర్మించేందుకు అంచనాలు రూపొందించారు. గతంలో బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారి క ల్యాణాన్ని కొండ కింద పాదుకా మండపం వద్ద ఉన్న కల్యాణ మండపంలో నిర్వహించేవారు. అది చాలడం లేదని ఏడేళ్ల క్రితం కల్యాణాన్ని ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలోకి మార్చారు. అక్కడే తాత్కాలిక మండపాన్ని నిర్మించి అందులో కల్యాణాన్ని నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆలయం తూర్పు వైపునే స్టోన్తో వాస్తు ప్రకారం మండపాన్ని నిర్మించాలని అంచనాలు రూపొందించారు. అయితే ముందుకు సాగలేదు. దీంతో ఇప్పటికీ తాత్కాలిక మండపంలోనే శ్రీవారి కల్యాణం జరుగుతోంది. ఆలయ ఈశాన్య భాగంలో కోనేరు నిర్మించాలని అంచనాలు రూపొందించారు. అయినా కార్య రూపం దాల్చలేదు. ట్యాప్ కింద శ్రీచక్రస్నానం నిర్వహిస్తున్న అర్చకులు (ఫైల్) అశ్వాలు లేకుండా ఉన్న ప్రస్తుత రథం చినవెంకన్న ఉత్సవాల నిర్వహణపై భక్తుల్లో అసంతృప్తి శ్రీవారి రథంలో కనిపించని అమ్మవార్లు ట్యాప్ కిందే శ్రీచక్రస్నానం కోనేరు, స్వామి కల్యాణ మండపాల నిర్మాణం ఊసే లేని వైనం కొండపైన టోల్గేట్ సమీపంలో రూ.8.50 కోట్లతో నిర్మించిన కల్యాణకట్ట ఆలయానికి దూరం కావడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. రూ.4.10 కోట్లతో నిర్మించిన క్యాంటీన్ భక్తులకు అందుబాటులో లేకపోవడంతో కల్యాణ మండపం, డార్మెటరీ, ఆధ్యాత్మిక గ్రంథాలయంగా మారిపోయింది. అలాగే రూ.2.79 కోట్లతో నిర్మించిన ప్రసాద విక్రయశాల, బుకింగ్ కౌంటర్లు ఆలయానికి దూరం కావడంతో భక్తులు పూర్తిస్థాయిలో వెళ్లడం లేదు. దీంతో కొండపైన అన్నదాన భవనం వద్ద, కొండ కింద సమాచార కేంద్రంలో ప్రసాదాలను విక్రయిస్తున్నారు. ఇటీవల వైకుంఠం క్యూకాంప్లెక్స్ వద్ద నుంచి కొండపైకి కాలినడకన వెళ్లే భక్తుల కోసం రూ.లక్షలు వెచ్చించి మెట్ల మార్గాన్ని నిర్మించారు. ఇప్పుడు వ్యాపారులకు ఇబ్బంది కలుగుతుందని ఆ మెట్ల మార్గాన్ని ప్రారంభించకుండానే మూసేశారు. భవిష్యత్తు అవసరాల మాట ఎలా ఉన్నా.. అధికారుల చర్యలు కారణంగా భక్తులకు ప్రస్తుతం సౌకర్యాలు దూరంగా ఉన్నాయి. ఆలయ అర్చకుల సలహాలు, సూచనలు లేకుండానే అధికారులు ఈ నిర్మాణాలు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
ప్రైవేటీకరణపై కోటి సంతకాల ఉద్యమం
ఏలూరు టౌన్: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నామని, దీనిలో భాగంగా కోటి సంతకాల సేకరణ చేపడుతున్నట్టు ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ తెలిపారు. ఏలూరులోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం కోటి సంతకాల సేకరణ పోస్టర్లను ఆవిష్కరించారు. ప్రైవేట్పరం దారుణంనూజివీడు: ప్రభుత్వ రంగంలోని మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అమ్మేయడం అత్యంత దారుణమని, దీని ద్వారా పేదలకు వైద్యం మరింత దూరమవుతుందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ధ్వజమెత్తారు. నూజివీడులోని నియోజకవర్గ కార్యాలయంలో శుక్రవారం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమం వాల్పోస్టర్ను ప్రతాప్ అప్పారావు ఆవిష్కరించారు. -
ఆపదలో ఆరోగ్యశ్రీ
పశ్చిమలో మద్యం దందా ఉమ్మడి పశ్చిమలో మద్యం దందా యథేచ్ఛగా సాగుతోంది. వీధివీధికీ బెల్టుషాపులు, ఎమ్మార్పీకి మించి అధిక ధరలతో దోపిడీ కొనసాగుతోంది. 8లో uశనివారం శ్రీ 11 శ్రీ అక్టోబర్ శ్రీ 2025సాక్షి, భీమవరం: పేద, మధ్యతరగతి వర్గాలకు అపర సంజీవనిలా ఉన్న ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) పథకాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. రూ.కోట్లల్లో బకాయిలు పేరుకుపోయి ముందుకు సాగలేని పరిస్థితుల్లో నెట్వర్క్ ఆస్పత్రులు సమ్మెబాట పట్టాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 30 ఆస్పత్రులకు 26 చోట్ల సేవలు నిలిచిపోయి రోగుల ప్రాణాలు గాల్లో దీపాలవుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం. పశ్చిమలో 30 ఆస్పత్రులు జిల్లాలోని 30 వరకు ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నాయి. వీటిలో రెండు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు ఉండగా, ఆర్థో, కన్ను, చెవి ముక్క తదితర కేటగిరీ ఆస్పత్రులు 28 ఉన్నాయి. రోజుకు సుమారు 1,500 వరకు ఓపీ నమోదవుతుండగా ఇన్ పేషెంట్లుగా చేరేవారు 500 వరకు ఉంటున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలుచేసింది. క్యాన్సర్ లాంటి ఖరీదైన జబ్బుల చికిత్సకు పరిమితి లేకుండా సాయం అందించింది. 1,059 చికిత్సల సంఖ్య (ప్రొసీజర్ల)ను 3,257కి పెంచడంతో పాటు కుటుంబానికి రూ.5 లక్షలు ఉన్న వ్యయ పరిమితిని రూ.25 లక్షలకు పెంచడం ద్వారా పేదల ఆరోగ్యానికి మరింత భరోసా కల్పించారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. వైద్యసేవలకు ఆటంకం రాకుండా నిరంతరం అందిస్తూ వచ్చారు. రోగి కోలుకునే వరకూ కుటుంబ పోషణకు ఆరోగ్య ఆసరాగా అవసరమైన ఆర్థ్ధిక సాయాన్నీ అందించేవారు. కాగా కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీకి ఎసరుపెడుతోంది. ఆరోగ్య ఆసరాను నిలిపివేయడంతో పాటు ఆస్పత్రులకు బకాయిల విడుదలకు తీవ్ర జాప్యం చేస్తోంది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఏప్రిల్లోనూ నెట్వర్క్ ఆస్పత్రులు సమ్మెలోకి వెళ్లాయి. జిల్లాలోని 34 రూరల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో దాదాపు 74 మంది వైద్యులు సేవలందిస్తున్నారు. సర్వీస్లోని పీహెచ్సీ వైద్యులకు పీజీ కోటాలో సీట్లను పునరుద్ధరించాలని, టైం బాండ్ ప్రమోషన్స్ కల్పించాలని, గిరిజన ప్రాంతాల్లో పనిచేసేవారికి బేసిక్పై 50 శాతం అలవెన్స్ ఇవ్వాలని, చంద్రన్న సంచార చికిత్స కార్యక్రమానికి రూ.5 వేల అలవెన్స్ ఇవ్వాలని, కౌన్సెలింగ్ విషయంలో అర్బన్ అండ్ నేటివిటీపై ఆరేళ్ల గడువుని ఐదేళ్లకు కుదించుట, నేటివిటీపై స్పష్ట త కావాలని కోరుతూ రెండు వారాలుగా ఆందో ళనను కొనసాగిస్తున్నారు. ఏరియా, సీహెచ్సీల నుంచి రూరల్ పీహెచ్సీలకు వైద్యులను సర్దుబాటు చేస్తున్నా అటు ప్రధాన ఆస్పత్రులు, ఇటు రూరల్ పీహెచ్సీల్లోనూ పూర్తిస్థాయిలో వైద్యసేవలందక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో పేదవర్గాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అపర సంజీవనికి గ్రహణం ప్రభుత్వం బిల్లులివ్వక సమ్మెలోకి నెట్వర్క్ ఆస్పత్రులు ఉమ్మడి జిల్లాలోని ఆస్పత్రుల్లో సేవలు బంద్ గాల్లో దీపాల్లా రోగుల ప్రాణాలు ఇప్పటికే సమ్మెలో పీహెచ్సీ వైద్యులు అగమ్యగోచరంగా పేదల పరిస్థితి -
పోలవరం నియోజకవర్గ సమన్వయకర్తగా బాలరాజు
బుట్టాయగూడెం: వైఎస్సార్సీపీ పోలవరం నియోజకవర్గ సమన్వయకర్తగా మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర కార్యాలయం నుంచి శుక్రవారం ఉత్తర్వులు అందాయి. ఈ సందర్భంగా బాలరాజు విలేకరులతో మాట్లాడుతూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తనపై ఎంతో నమ్మకంతో సమన్వయకర్తగా నియమించడంపై కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషిచేస్తానని, సమన్వయంతో ముందుకు సాగుతానని అన్నారు. బాలరాజును పార్టీ మచిలీపట్న ం పరిశీలకుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు శాలువా కప్పి అభినందించారు. భీమవరం: ఉద్యోగుల చెంతకే రాష్ట్ర అకౌంటెంట్ జనరల్ కార్యాలయం రావడం, దీర్ఘకాలికంగా అపరిష్కతంగా ఉన్న కేసులను పరిష్కరించడం సంతోషమని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. శుక్రవారం స్థానిక ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లా యంత్రాంగం రాష్ట్ర ఏజీ కార్యాలయం అధికారులతో ఏర్పాటుచేసిన జీఎఫ్, పెన్షన్ అదాలత్ కార్యక్రమాన్ని ఏపీ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎస్.శాంతి ప్రియ, కలెక్టర్ నాగరాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా శాంతిప్రియ మాట్లాడుతూ మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఉద్యోగుల చెంతకే వచ్చే కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రతి నెలా ఏజీ బృందం ఆయా జిల్లాల్లో పర్యటిస్తుందని, వారి వద్ద సమస్యలు పరిష్కరించుకోవచ్చన్నారు. కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ పెన్షన్ అదాలత్లో 35 మంది ఉద్యోగులకు పింఛన్ మంజూరు పత్రాలను అందించామన్నారు. పింఛన్ సమస్యల పరిష్కారానికి 20 మంది దరఖాస్తు చేసుకోగా 15 సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారన్నారు. జీపీఎఫ్ సమస్యలపై 55 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ ఎన్.ఆశ్రిత పట్నాయక్ మాట్లాడుతూ ఉద్యోగుల హక్కులకు రక్షణ కల్పించడమే ప్రధాన లక్ష్యమన్నారు. రాష్ట్ర ఖజానా, లెక్కల అధికారి ఎన్.మోహనరావు మాట్లాడుతూ త్వరలో పె న్షన్ ప్రతిపాదనల సమర్పణలో పలు మా ర్పు లు రానున్నాయన్నారు. ఎప్పుడైనా జీపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకునే విధానం రానుందన్నారు. ఏలూరు (టూటౌన్): భవ్య గుజరాత్ పేరిట ఈ నెల 26 నుంచి వచ్చే నెల 4 వరకు ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో యాత్రను నిర్వహిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్ ఎం. రాజా శుక్రవారం తెలిపారు. యాత్ర రైలు రేణిగుంటలో ప్రారంభమై గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ స్టేషన్ లలో ఆగుతుందన్నారు. మొత్తం 9 రాత్రులు, 10 పగళ్లు సాగుతుందన్నారు. ద్వారకా, సో మనాథ్, అహ్మాదాబాద్లోని సబర్మతి ఆశ్రమం, మోధేరా సూర్య దేవాలయం, స్టాట్యూ ఆఫ్ యూనిటీ వంటి ప్రాంతాలు సందర్శించవచ్చన్నారు. వివరాల కోసం 92814 95848, 92810 30714 నంబర్లలో సంప్రదించాలన్నారు. ఏలూరు టౌన్: జార్ఖండ్ నుంచి తమిళనాడు ప్రాంతానికి బాలకార్మికులను తరలిస్తున్నారనే సమాచారంతో అప్రమత్తమైన ఏలూరు రైల్వే ఎస్సై శివన్నారాయణ తన సిబ్బందితో దా డులు చేసి బాలలను రక్షించి ఏలూరులోని హోమ్కు తరలించారు. వివరాలిలా ఉన్నా యి.. జార్ఖండ్ నుంచి తమిళనాడు ప్రాంతానికి కొంతమంది బాలలను అక్రమంగా తరలిస్తూ ఆయా ప్రాంతాల్లో బాలకార్మికులుగా వినియోగిస్తున్నారని ఏలూరు రైల్వే పోలీసులకు శుక్రవారం రాత్రి సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన ఏలూరు రైల్వే పోలీసులు రైలు ఏలూరు చేరుకోగానే... తమ సిబ్బందితో తనిఖీలు చేసి 14 మంది బాలురను రక్షించారు. మైనర్ బాలలను వివిధ కర్మాగారాల్లో పనిచేసేందుకు తరలిస్తున్నట్లు చెబుతున్నారు. జార్ఖండ్కు చెందిన రూప్లాల్ మిర్థ, కెప్టెన్ గగరాజ్, ముఖేష్ కోరా, మహావీర్ ముర్ము, మో నోటోస్ హాజ్ర, డిస్కో దాస్ అనే ఆరుగురు వ్యక్తులను ఏలూరు రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. బాలలను ప్రభుత్వ వసతి గృహానికి తరలించామని రైల్వే ఎస్సై శివన్నారాయణ తెలిపారు. -
ఏలూరు జిల్లాలో రూ. 60 కోట్ల బకాయిలు
సాంకేతికతపై పట్టు సాధించాలి విద్యార్థులు ఆధునిక సాంకేతికతపై పట్టు సాధించాలని ఏపీ నిట్ ఇన్చార్జి డైరెక్టర్ అన్నారు. నిట్లో టెక్రియా 2కే25 ప్రారంభమైంది. 8లో uఏలూరు టౌన్: ఏలూరు జిల్లాలో ఆరోగ్యశ్రీ పథకంలో వైద్య చికిత్సలు, శస్త్రచికిత్స లు అందిస్తున్న నెట్వర్క్ ఆస్పత్రులకు కూటమి ప్రభుత్వం సుమారు రూ.60 కోట్ల మేర బకాయిలు పెట్టడంతో ఆస్పత్రి యాజమాన్యాలు ఉచిత సేవలకు నిరాకరిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్లో సేవలను నిలిపివేయాలని నిర్ణయించటంతో దాని ప్రభావం పేద, మద్యతరగతి వర్గాల ప్రజలపై పడుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఏలూరు జిల్లాలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ 32 వరకు ఉన్నాయి. అయితే వీటికి బకాయిల చెల్లింపుల్లో కూటమి ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది. ఈ నేపథ్యంలో వైద్య సేవలు నిలిపివేయాలని ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు నిర్ణయించాయి. దీనిలో భాగంగా శుక్రవారం ఏలూరు నగరంలో మూడు ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశారు. మిగిలిన హాస్పిటల్స్ సైతం మెల్లగా సేవలను నిలిపివేసేందుకు చూస్తున్నాయి. జిల్లాలో ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్కు సుమారుగా రూ.60 కోట్ల మేర భారీగా బకాయిలు పేరుకుపోయినట్టు చెబుతున్నారు. ఒక్కో హాస్పిటల్కు సుమారుగా రూ.50 లక్షల నుంచి రూ.కోటి నుంచి రూ.2 కోట్లకు పైగా బకాయిలు ఉన్నట్టు తెలిసింది. చిన్న హాస్పిటల్స్కు బిల్లు బకాయిలు భారంగా మారటంతో వారంతా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు శివారులోని ఒక హాస్పిటల్కి అయితే ఏకంగా రూ.20 కోట్ల వరకూ బకాయి ఉన్నట్టు సమాచారం. ఒక మిషనరీ సంస్థ హాస్పిటల్కు సైతం రూ.5 కోట్లకు పైగా బకాయి ఉందని చెబుతున్నారు. -
మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిపై కూటమి నిర్లక్ష్యం
బుట్టాయగూడెం: అసంపూర్తిగా ఉన్న మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులు చేపట్టి పూర్తిచేయడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ మచిలీపట్న ం పరిశీలకుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు, మాజీ ఎమ్మెల్యే తె ల్లం బాలరాజు విమర్శించారు. బుట్టాయగూడెం మండలం పద్మవారిగూడెం సమీపంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చేపట్టిన మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి భవన నిర్మాణాన్ని శుక్రవారం వారు సందర్శించారు. నిధులలేమితో అసంపూర్తిగా పనులు మిగిలిపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని ఐదు ఐటీడీఏల పరిధిలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. బుట్టాయగూడెం సమీపంలో ఆస్పత్రి కోసం సు మారు రూ.50 కోట్ల నిధులు మంజూరు చేయగా దాదాపు రూ.12 కోట్లతో పనులు జరిగాయన్నారు. అయితే కూటమి ప్రభుత్వం భవన నిర్మాణంపై శ్రద్ధ చూపడం లేదన్నారు. ఆస్పత్రి నిర్మాణం పూర్తయితే 100 పడకలతోపాటు 60 మంది వైద్యులు అందుబాటులో వస్తారని, దీంతో గిరిజనులకు మెరుగైన సేవలు అందుతాయన్నారు. పనులు పూర్తి చేసేందుకు కూటమి పాలకులు కృషిచేయా లని లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పార్టీ మండల కన్వీ నర్ అల్లూరి రత్నాజీరావు, సీనియర్ నాయకులు ఆరేటి సత్యనారాయణ, జెడ్పీటీసీ మొడియం రామతులసి, వైస్ ఎంపీపీ గగ్గులోతు మోహన్రావు, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు తాళ్లూరి ప్రసాద్, పార్టీ యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు బగ్గి దినేష్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. -
రూ.100 కోట్ల మేర బకాయిలు
జిల్లాలోని ఆయా ఆస్పత్రులకు రూ.100 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉన్నట్టు అంచనా. వీటిలో ఒక్కో ఆస్పత్రికి రూ.40 లక్షల నుంచి రూ.7 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్టు యాజమాన్యాలు చెబుతున్నాయి. వీటిని విడుదల చేయాలని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశా) ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చింది. ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆశా పిలుపు మేరకు నెట్వర్క్ ఆస్పత్రులు సమ్మెబాట పట్టాయి. పలు ఆరోపణలతో నెలరోజుల క్రితమే భీమవరంలోని ఒక మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో సేవలు నిలిచిపోగా తణుకులోని మరో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రితో పాటు జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురంలోని 25 నెట్వర్క్ ఆస్పత్రుల్లోను శుక్రవారం నుంచి సేవలను నిలిపివేశారు. ఆయా ఆస్పత్రుల్లో రోగులకు అవసరమైన సహకారం అందించే ఆరోగ్యశ్రీ హెల్ప్డెస్క్లు ఆరోగ్యమిత్రలు లేకుండా కనిపించాయి. ఆరోగ్యశ్రీపై ఉచిత వైద్యసేవలు పొందేందుకు వచ్చిన రోగులను ఆస్పత్రి సిబ్బంది సొమ్ములు చెల్లించిన వారికే వైద్యం అందుతుందని చెప్పడంతో పేదవర్గాల వారు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు నగదు చెల్లించి వైద్యసాయం పొందగా, చెల్లించే స్థోమత లేక మరికొందరు ఉసురూమంటూ వెనుదిరిగారు. అధికారంలోకి వచ్చాక వైద్యసేవల్ని నిర్వీర్యం చేస్తూ వస్తున్న కూటమి ప్రభుత్వం తమకు ఆరోగ్య భరోసానిస్తున్న ఆరోగ్యశ్రీని మొత్తం ఆపేయాలని చూస్తోందని పేదవర్గాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బకాయిలు విడుదల చేయడం ద్వారా త్వరితగతిన సేవలు పునరిద్ధరించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
నేడే ఎంటీఎస్ ఉపాధ్యాయుల విజ్ఞాపన సభ
ఏలూరు (ఆర్ఆర్పేట): మినిమమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్) ప్రాతిపదికన ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు పోరుబాట పట్టారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారికి ఉద్యోగాలు కల్పించి వారికి జీవితంలో ఆశలు చిగురింపచేశారు. వారిలో ఎక్కువ మంది పదవీ విరమణ వయసుకు దగ్గర పడుతుండడంతో ఉద్యోగం వచ్చిందనే ఆనందం ఎంతోకాలం మిగిలే పరిస్థితి కనిపించడంలేదు. రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న తమకు ప్రభుత్వం మెరుగైన ఉద్యోగ భద్రత కల్పించాలని, మరిన్ని సౌకర్యాలు కల్పించాలని ఎంటీఎస్ ఉపాధ్యాయులు ప్రజా ప్రతినిధులు, మంత్రులు, ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. ఈ నెల 11న విజయవాడ ధర్నా చౌక్లో ఉద్యమించడానికి కార్యాచరణ రూపొందించుకున్నారు. 60 సంవత్సరాలకే పదవీ విరమణను వ్యతిరేకిస్తున్నారు. 62 సంవత్సరాలకు పదవీ విరమణ వయసు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. తమ సర్వీసులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పెన్షన్ సౌకర్యం కల్పించాలని, దీని వలన కొంత మేరకు ఉద్యోగ భద్రత లభిస్తుందని భావిస్తున్నారు. -
నూజివీడు ఎంఈఓ–2 అదృశ్యం
నూజివీడు: నూజివీడు ఎంఈఓ–2 సంగెపు జమలయ్య ఈనెల 4 నుంచి కనిపించకపోవ డం సంచలనంగా మారింది. ఫోన్ చేస్తే అవు టాఫ్ కవరేజీ అని రావడంతో కుటుంబ సభ్యు ల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం జమలయ్య కుమారుడు పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై మిస్సింగ్ కేసు కట్టినట్టు సీఐ పి.సత్యశ్రీనివాస్ తెలిపారు. ఎలాంటి సమాచారం లేకుండా వి ధులకు గైర్హాజరవుతుండటంతో ఇన్చార్జి డీవైఈఓ పీఎస్ సుధాకర్ విచారణ నిర్వహించి ని వేదికను డీఈఓకు అందజేసినట్టు తెలిసింది. జమలయ్య రెండేళ్ల క్రితం గంపలగూడెంలో పనిచేస్తూ పదోన్నతిపై ఇక్కడకు వచ్చారు. దసరా సెలవులకు బుల్లెట్ వేసుకుని గంపలగూడెం వెళ్తున్నానని చెప్పిన ఆయన ఈనెల 3 వర కు ఫోన్లో అందుబాటులో ఉన్నట్టు తెలిసింది. -
ఆధునిక సాంకేతికతపై పట్టు సాధించాలి
తాడేపల్లిగూడెం: విద్యార్ధులు ఆధునిక సాంకేతికతపై పట్టు సాధించాలని ఏపీ నిట్ ఇన్చార్జి డైరెక్టర్ ఎన్వీ రమణరావు అన్నారు. నిట్లో శుక్రవారం టెక్రియా 2కె25 అట్టహాసంగా ప్రారంభమైంది. పరిశోధనల్లో విద్యార్థులు కొత్త శిఖరాలను అధిరోహించాలన్నారు. అన్ని విషయాలపై అవగాహన పెంచుకొని నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలన్నారు. డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ కె.హిమబిందు మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉండాలన్నారు. కో–ఆర్డినేటర్గా డీన్ డాక్టర్ రాజేశ్వర్రెడ్డి వ్యవహరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. టెక్రియా కార్యక్రమ కార్యదర్శి వేదాంత రెడ్డి, డీన్లు డాక్టర్ వి.సందీప్, డాక్టర్ వీరేష్కుమార్, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు. టెక్రియాలో విద్యార్దులు రూపొందించి ప్రదర్శించిన ప్రదర్శనలు అబ్బుర పర్చాయి. -
తూర్పు, గాజుల కాపు కులస్తుల ఆత్మీయ సమావేశం
ఏలూరు(మెట్రో): తూర్పు కాపు, గాజుల కాపు కుల సంఘ నాయకుల ఆత్మీయ సమావేశం శుక్రవారం ఏలూరులో నిర్వహించారు. తూర్పు కాపు, గాజుల కాపు కార్పొరేషన్ ఛైర్మన్ యశస్వి అధ్యక్షతన స్థానిక జెడ్పీ మీటింగ్ హాల్లో కార్యక్రమాన్ని నిర్వహించారు. బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పుష్పలత మాట్లాడుతూ తూర్పు కాపు, గాజుల కాపు కులస్తులు కుల ధ్రువీకరణ పత్రాలు పొందడంతో ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించామన్నారు. తూర్పు కాపు, గాజులు కాపు కార్పొరేషన్ ద్వారా విదేశీ విద్యా పథకం అమలు చేయాలని నాయకులు కోరారు. సమావేశంలో ఆర్టీసీ విజయవాడ రీజియన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ లావేటి శ్రీనివాసరావు, డైరెక్టర్ కరణం పెద్ది రాజు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు టౌన్: ఏలూరు నగరంలోని శనగపప్పు పేట, ఇందిరాకాలనీ సమీపంలో ఉంటున్న వ్యక్తి బాత్రూంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. త్రీటౌన్ పోలీసులు వివరాల ప్రకారం.. ఎర్ర వెంకటేశ్వరరావు (48) ఆటోడ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తె భీమవరంలో ఇంజనీరింగ్ చదువుతూ ఉండడంతో గత 9 నెలలుగా అక్కడే భార్య, కుమార్తెతో ఉంటున్నాడు. ఇటీవల ప్రభుత్వం ఆటోడ్రైవర్లకు రూ.15 వేల భృతి డబ్బులు వేస్తుందని, వాటిని తీసుకునేందుకు ఏలూరు వచ్చాడు. అప్పటి నుంచీ ఏలూరులోనే ఉంటున్నాడు. అతను శుక్రవారం మధ్యాహ్నం ఇంటిలోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యలమంచిలి: బాలికను వేధిస్తున్న కేసులో యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు యలమంచిలి ఎస్సై గుర్రయ్య తెలిపారు. పెదలంక గ్రామానికి చెందిన కొల్లి నాని అదే గ్రామానికి చెందిన బాలికను ప్రేమిస్తున్నానంటూ రోజు వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
పశ్చిమలో మద్యం దందా
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉమ్మడి పశ్చిమలో మద్యం దందా ఏరులై పారుతుంది. అధికార పార్టీ కనుసన్నల్లో వీధి వీధికి బెల్టుషాపులు ఏర్పాటు చేసి అడ్డగోలు దోపిడీ ఓ వైపు కొనసాగిస్తూ మరోవైపు వైన్ షాపుల్లో ఎమ్మార్పీకి మించి అధిక ధరకు విక్రయిస్తూ భారీగా సొమ్ము చేసుకునే పనిలో మద్యం సిండికేట్ పడింది. పర్యవేక్షించాల్సిన ఎకై ్సజ్ శాఖ, శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీస్ శాఖను మాముళ్లతో కట్టడి చేసి దందా జోరుగా సాగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 352 మద్యం దుకాణాల్లో నెలకు సగటున రూ.260 కోట్ల మద్యం విక్రయాలు సాగుతున్నాయి. ఉమ్మడి పశ్చిమలో ఎమ్మార్పీ ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతుంది. ప్రతి నియోజకవర్గంలోనూ ఎమ్మార్పీతో సంబంధం లేకుండా క్వార్టర్ సీసాపై రూ.10 నుంచి రూ.20 అధిక ధరలు వసూలు చేస్తున్నారు. ఎకై ్సజ్ మొదలుకొని ప్రజాప్రతినిధుల వరకు అందరికీ మాముళ్ళ చెల్లించడం అనివార్యం కాబట్టి అధిక ధర తప్పదని వైన్షాపు నిర్వాహకులు బహిరంగంగానే చెబుతున్నారు. మరోవైపు కూటమి నేతలే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మద్యం సిండికేట్లు కావడంతో ధరలు మొదలుకొని సమయపాలన వరకు అన్ని ఇష్టారాజ్యంగా మారిపోయాయి. కొన్ని నియోజకవర్గాల్లో మద్యం వ్యాపారులు ఇంకో అడుగు ముందుకేసి మద్యం షాపుల వద్ద మద్యం ధరలు పెరిగాయి. మందుబాబులు సహకరించాలని ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం గమనార్హం. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించింది. సమయపాలనతో పాటు ఎమ్మార్పీ ఉల్లంఘన లేకుండా పక్కాగా విక్రయాలు కొనసాగించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రైవేటుపరం చేస్తున్నామనే పేరుతో అన్ని కూటమి నేతలకు కట్టబెట్టారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కీలక మద్యం సిండికేట్లలో టీడీపీ, జనసేన నేతలు ఉండటం గమనార్హం. షాపు ఏర్పాటు సమయంలో ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కో రేటు పెట్టి మరీ సిండికేట్ నుంచి వసూలు చేశారు. జిల్లాలో సగటున ఒక్కొ షాపు నుంచి రూ.3 లక్షలు మొదలుకొని అత్యధికంగా 6 లక్షల వరకు వసూలు చేశారు. అలాగే షాపు ఏర్పాటు క్రమంలో 10 శాతం ఉన్న కమిషన్ 14 శాతానికి పెంచడం, ఎమ్మార్పీ ఉల్లంఘనకు అధికార పార్టీ నుంచి పోలీసు వరకు అందరూ సహకరించడంతో ఇష్టారాజ్యంగా రేట్లు మారిపోయాయి. క్వార్టర్కు రూ.10 నుంచి రూ.20 వరకు, పుల్ బాటిల్కు రూ.50 నుంచి రూ.100కు పెంచి విక్రయిస్తున్నారు. ఏలూరు జిల్లాలో 155 మద్యం దుకాణాల ద్వారా నెలకు రూ.110 కోట్లు, పశ్చిమగోదావరి జిల్లాలో 197 వైన్షాపుల్లో నెలకు రూ.160 కోట్లకు పైగా విక్రయాలు జరిగాయి. ఈ ఏడాది ప్రధానంగా దసరా పండుగ రోజు గాంధీ జయంతి కావడంతో మద్యం దుకాణాలు మూతపడ్డాయి. 1న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.18 కోట్ల మేర విక్రయాలు జరిగినట్లు అంచనా. ఎమ్మార్పీ ఉల్లంఘన, సమయ పాలన, మద్యం నాణ్యత ఇలా అన్ని అంశాలను క్షుణ్నంగా పరిశీలించాల్సిన ఎకై ్సజ్ శాఖను పూర్తిగా మాముళ్ళతో కట్టడి చేశారు. ఒక్కొ షాపునకు రూ.50 నుంచి రూ.80 వేల వరకు సగటున వసూలు చేస్తున్నారు. పోలీసులు ఒక్కొ షాపు నుంచి రూ.15 వేలు వసూలు చేస్తున్నారు. కేవలం ఎకై ్సజ్, పోలీస్ నెలవారీలే రూ.2 కోట్లపై ఉంటాయని అంచనా. దీంతో ఎమ్మార్పీ ఉల్లంఘనపై కన్నెత్తి చూసిన దాఖలాలు జిల్లాలో లేవు. మరోవైపు కల్తీ మద్యం రాష్ట్ర వ్యాప్తంగా కుదిపేస్తున్నా జిల్లా సరిహద్దులో తెలంగాణ ప్రాంతం ఉండటంతో తెలంగాణ మద్యం విచ్చలవిడిగా విక్రయాలు జరుగుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం గమనార్హం. ఏలూరు జిల్లాలో కీలక నియోజకవర్గంలో మాత్రమే ఎకై ్సజ్, పోలీసులకు ముడుపులు ఇవ్వటానికి వీల్లేదని ఎమ్మెల్యే హుకుం జారీ చేశారు. ఎందుకంటే ప్రతి సిండికేట్లో సదరు ప్రజాప్రతినిధే సిండికేట్లో కీలక భాగస్వామ్యం కావడం విశేషం. అడ్డగోలు ధరకు మద్యం విక్రయాలు మందుబాబులు సహకరించాలంటూ వైన్షాపుల వద్ద ఫ్లెక్సీలు క్వార్టర్కు రూ.10 నుంచి 20 పెంచి విక్రయాలు నెలవారీ మాముళ్ల మత్తులో ఎకై ్సజ్, పోలీస్ శాఖలు కూటమి నేతలే సిండికేట్ సభ్యులు -
ఒంటరి వృద్ధులే టార్గెట్
● తణుకులో భారీ చోరీ కేసు ఛేదించిన పోలీసులు ● 10 మంది అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్ ● 30 కాసుల ఆభరణాలు స్వాధీనం తణుకు అర్బన్: తణుకులో వృద్ధురాలిని భయపెట్టి 70 కాసుల బంగారు ఆభరణాల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. 10 మంది అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకుని సుమారు 30 కాసుల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. గత నెల 26 రాత్రి స్థానిక వారణాసి వారి వీధిలో నివసిస్తున్న వాకలపూడి కనకదుర్గ నివాసంలో చోరీకి సంబంధించి ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసుల దర్యాప్తులో పట్టుబడిన దొంగల నుంచి రూ.16 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. తణుకు పోలీస్స్టేషన్లో శుక్రవారం నిర్వహించిన తాడేపల్లిగూడెం డీఎస్పీ డి.విశ్వనాథ్ వివరాలు వెల్లడించారు. ఈ భారీ చోరీ కేసులో ఎస్పీ ఆదేశాల మేరకు కేసు దర్యాప్తు చేపట్టామని, పోలీసు అధికారులు 6 బృందాలుగా ఏర్పడి మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో జల్లెడ పట్టి చైన్ లింక్ మాదిరిగా దొంగలను పట్టుకున్నారన్నారు. చోరీ సొత్తును పంచుకున్నారని, వృద్ధులు, సంపన్నుల ఇళ్లను టార్గెట్ చేసుకుని ఈ దొంగల ముఠా చోరీలకు పాల్పడుతుందని స్పష్టం చేశారు. ఈ కేసులో మరికొందరిని పట్టుకోవాల్సి ఉందని, మిగిలిన ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకోవాల్సి ఉందని, తణుకు పట్టణ, రూరల్ సర్కిల్ పోలీసులు అదే పనిలో ఉన్నారన్నారు. చోరీకి సంబంధించి 10 బంగారు గాజులు, జత చెవి దుద్దెలు, జత మాటీలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అనుమానితులు ఎవరైనా కనపడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ముద్దాయిలను పట్టుకోవడంలో సహకరించిన పట్టణ సీఐ ఎన్.కొండయ్య, రూరల్ సీఐ బి.కృష్ణకుమార్, తాడేపల్లిగూడెం రూరల్ సీఐ బీబీ రవికుమార్, పట్టణ ఎస్సైలు కె.శ్రీనివాస్, కె.ప్రసాద్, ట్రాఫిక్ ఎస్సై డి.ఆదినారాయణ, రూరల్ ఎస్సై కె.చంద్రశేఖర్, అత్తిలి ఎస్సై పి.ప్రేమ్రాజ్ ఏఎస్సైలు ఎస్.శ్రీధర్, పి.సంగీతరావు, పి.సత్యనారాయణ, 10 మంది కానిస్టేబుళ్లను డీఎస్పీ అభినందించారు. -
పాలిటెక్నిక్ విద్యార్థి దుర్మరణం
ఆగిరిపల్లి: ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో పాలిటెక్నిక్ విద్యార్థి మృతిచెందిన ఘటన ఆగిరిపల్లి దళితవాడ వద్ద చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని సింహాద్రి అప్పారావుపేటకు చెందిన పటాపంచులు సాయి (19) విస్సన్నపేటలోని వికాస్ కాలేజీలో పాలిటెక్నిక్ చదువుతున్నాడు. గురువారం రాత్రి ఆగిరిపల్లిలో తన పని ముగించుకుని ద్విచక్ర వాహనంపై సింహాద్రి అప్పారావుపేటకు వెళ్తుండగా విజయవాడ రోడ్డులోని దళితవాడ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో రోడ్డుపై పడ్డాడు. తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనా స్థలికి చేరుకున్న ఎస్సై శుభశేఖర్ బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఏలూరు(మెట్రో): జిల్లాలో ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన పథకంలో ఎంపిక చేసిన గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిర్దేశించిన సమయంలోపు పూర్తిచేస్తామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్కు తెలిపారు. ఏపీ సచివాలయం నుంచి గురువారం విజయానంద్ పలు అంశాలపై కలెక్టర్లతో సమీక్షించారు. జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలను కలెక్టర్ ఆయనకు వివరించారు. -
ట్రిపుల్ఐటీలో ‘ప్రజ్ఞ’ మాసపత్రిక ఆవిష్కరణ
నూజివీడు: ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ఐటీ ‘ప్రజ్ఞ’ పేరిట మాసపత్రికను ప్రారంభించింది. తొలి సంచికను ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్, నూజివీడు డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్ గురువారం ఆవిష్కరించారు. విద్యా ర్థుల చైతన్యం, ప్రతిభ, నూతన ఆవిష్కరణలను ఇందులో ప్రతి నెలా ప్రచురించనున్నట్టు తెలిపారు. ఐఐటీలలో ఇలాంటి మాసపత్రికలు ప్రచురితమవుతాయని, అలాంటి సంప్రదాయాన్ని ట్రిపుల్ఐటీలో కూడా పరిచయం చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. ఇంజినీరింగ్ విద్యార్థులే తమ పరిజ్ఞానంతో ఈ మాసపత్రికకు అంకురార్పణ చేసుకోవడం అభినందనీయమన్నారు. అనంతరం ఒక ప్రత్యేక వెబ్సైట్ను ప్రారంభించారు. సెంట్రల్ డీన్ శ్రావణి, ఈఐటీపీ డీన్ శ్యాం, పాలనాధికారి లక్ష్మణరావు, అకడమిక్ డీన్ సాదు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
ప్రచార ధ్యాస.. రోగుల ఘోష
ఆగిరిపల్లి: కూటమి ప్రభుత్వం అత్యవసర సేవలందించే వైద్యులను కూడా ప్రచార ఆర్భాటానికి వాడుకుంటోంది. సూపర్ జీఎస్టీ అవగాహన కార్యక్రమాలకు వైద్యులను వినియోగించుకోవడంతో పేదలకు వైద్యసేవలు దూరమవుతున్నాయి. ఆగిరిపల్లి పీహెచ్సీలో ఇద్దరు వైద్యులు ఉండగా ఒకరు సేవ లందిస్తున్నారు. రోజూ ఆస్పత్రిలో 100 మంది వర కు ఓపీ చూపించుకుంటారు. గురువారం ఆగిరిపల్లిలో జరిగిన సూపర్ జీఎస్టీ కార్యక్రమానికి ము ఖ్య అతిథిగా మంత్రి కొలుసు పార్థసారథి హాజర య్యారు. దీంతో ఉదయం కొందరు రోగులకు పీ హెచ్సీలో వైద్యం అందించిన తర్వాత వైద్యాధికారి జగన్మోహన్రావు జీఎస్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. దీంతో పీహెచ్సీలో డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో రోగులు సుమారు 3 గంటల పాటు అవస్థలు పడ్డారు. డాక్టర్లను ఇలా ప్రచారానికి వాడుకోవడం ఏంటని రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై డాక్టర్ జగన్మోహన్రావుని వివరణ కోరగా ప్రభుత్వ ఆదేశాల మేరకే అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నట్టు చెప్పారు. -
కానరాని స్వచ్ఛత
అంగన్వాడీల్లో పరేషన్ సకాలంలో సరకులు అందక అంగన్వాడీ చిన్నారులు, పాఠశాలల విద్యార్థులు చాలీచాలని ఆహారంతో, ఖాళీ కడుపులతో కాలం వెళ్లదీస్తున్నారు. IIలో uచెత్త ఉండని రోడ్డు ఉండదు.. చిన్నపాటి వర్షం పడితే డ్రెయినేజీ మురుగు రోడ్లపై తాండవిస్తోంది.. ఇది జిల్లా కేంద్రం ఏలూరు నగర దుస్థితి. చింతలపూడి గ్రేడ్–3 మున్సిపాల్టీలో కనీసం పక్కా డ్రైనేజీ వ్యవస్థ, మున్సిపాల్టీకో డంపింగ్ యార్డు లేని పరిస్థితి. ఇక కై కలూరు, నూజివీడులో చెత్త సమస్యతో పాటు డ్రైనేజీ ఇబ్బందులు.. ఇది జిల్లాలో పారిశుద్ధ్య నిర్వహణ తీరు.శురకవారం శ్రీ 10 శ్రీ అక్టోబర్ శ్రీ 2025సాక్షి ప్రతినిధి, ఏలూరు: చిన్నపాటి పంచాయతీ మొదలు ఏలూరు నగరపాలక సంస్థ వరకూ ఇదే తీరు. అసలే వర్షాకాలం ఆపై చిన్నపాటి వర్షం పడినా మురుగు నీరంతా రోడ్లపైనే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర పేరుతో స్వచ్ఛత నిర్వహణకు హడావుడి చేయడం ఏటా అవార్డులు ఇచ్చుకుంటూ అంతా బాగుందని స్వయం ప్రకటనలు మినహా క్షేత్రస్థాయిలో పరిస్థితి అత్యంత అధ్వాన్నం. క్షేత్రస్థాయిలో అధ్వానంగా.. పంచాయతీ మొదలు నగరపాలక సంస్థ వరకూ జనాభా ప్రతిపాదిక తీసుకుని 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా స్వచ్ఛాంధ్ర పేరుతో ఆయా స్థానిక సంస్థల్లో కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రధానంగా మురుగు కాల్వలు బాగు చేయటం, చెత్త తొలగించడం, దోమల నివారణకు చర్యలు తీసుకోవడం, కాలుష్యరహితం కోసం మొక్కలు పెంచడం, ప్రధాన డ్రైయిన్లు బాగుచేయడం నిర్వహించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభు త్వం ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించి వీధి వీధికి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మరీ హడావుడి అయితే చేసింది కానీ పారిశుద్ధ్య పనులు, అభివృద్ధి పనులు ఎక్కడా నిర్వహించకపోవడంతో వర్షాకాలంలో సమస్యలు తీవ్రమయ్యాయి. ఉదాహరణకు ఏలూరు నగరపాలక సంస్థ ఆర్ధిక సంఘం నిధులతో డివైడర్లకు రంగులు వేయడం, ఇతరాత్ర ఆదాయం ఉండే అభివృద్ధి పనులు చేసుకోవడం మినహా మరేమీ పనులు నిర్వహించడం లేదు. దీంతో చిన్నపాటి వర్షం వస్తే ఆర్ఆర్పేట రహదారి, శనివారపుపేట కాజ్వే, పవరుపేట రైల్వేస్టేషన్ రోడ్డు, కొత్తపేట, జీజీహెచ్ రోడ్డు, అశోక్నగర్ ఇలా అనేక ప్రాంతాల్లో రోడ్లపై రోజులు తరబడి నీరు నిలిచే పరిస్థితి. ఇక పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. వాస్తవానికి నగరపాలక సంస్థ నిధుల్లో 30 శాతం వరకు శానిటేషన్ మెరుగుదలకు వినియోగించాల్సి ఉన్నా వినియోగిస్తున్నట్లు లెక్కలు చూపించినా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. పడకేసిన పారిశుద్ధ్యం జంగారెడ్డిగూడెం, నూజివీడు మున్సిపాల్టీలతో పాటు చింతలపూడి నగర పంచాయతీ అలాగే మేజర్ గ్రామ పంచాయతీల్లోనూ పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసింది. గత మూడు నెలల వ్యవధిలో విషజ్వరాలు విజృంభించిన పరిస్థితి. జిల్లాలో 457 గ్రామ పంచాయతీల్లో 15వ ఆర్థిక సంఘం నిధులతో స్వచ్ఛ నిర్వహణ కార్యక్రమాలను అధికారులు మమ అనిపించే రీతిలో చేశారు. నిధులు కేటాయించకుండా రాష్ట్ర ప్రభుత్వం హడావుడి చేయడం, ఐవీఆర్ఎస్ కాల్స్తో ప్రజల నుంచి స్పందన తెలుసుకుని అవార్డులు ఇవ్వడం మినహా మరేమి జిల్లాలో జరగడం లేదు. ఇదిలా ఉండగా జిల్లాలో అద్భుతంగా పరిస్థితులున్నాయంటూ రాష్ట్రస్థాయి లో 2 అవార్డులు, జిల్లా స్థాయిలో 51 అవార్డులను ఈనెల 6న ఇవ్వడం గమనార్హం. అనుమానం పెనుభూతమై భార్యపై భర్త కత్తెరతో దాడి చేయగా ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన ఏలూరులో చోటుచేసుకుంది. IIలో uజిల్లాలో బెస్ట్ స్వచ్ఛత గ్రీన్ అంబాసిడర్గా జీలుగుమిల్లి మండలం పి.అంకంపాలెంకు చెందిన ఎం.సూరమ్మకు, స్వచ్ఛత రెసిడెన్షియల్ స్కూల్ అవార్డు విప్పలపాడులోని ఏకలవ్య మోడ్రన్ స్కూల్కు కేటాయించారు. జిల్లాస్థాయిలో అయితే నిత్యం నీరు నిలిచే ఏలూరు బస్టాండ్కు స్వచ్ఛత బస్టాండ్గా అవార్డు దక్కడం విశేషం. బస్టాండ్ మొత్తం గుంతలు, గోతులు, అత్యంత అధ్వానంగా పారిశుద్ధ్య నిర్వహణ ఉన్నా స్వచ్ఛ బస్టాండ్ అవార్డు దక్కింది. అలాగే ఏలూరు కార్పొరేషన్, మైనార్టీ వెల్ఫేర్, జిల్లా పరిషత్ కార్యాలయాలకు కూడా స్వచ్ఛ ప్రభుత్వ కార్యాలయాల అవార్డులు దక్కాయి. ఈ మూడు కా ర్యాలయాల్లోనూ పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయి. జిల్లా అధికార యంత్రాంగం ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛాంధ్ర పేరుతో ఉద యం ఒక గంట సేపు ఫొటో ఫోజులకు పరిమితమై కాల్వ పూడిక పనులు గంట సేపు నిర్వహించడం, అలాగే అక్కడక్కడా మొక్కలు నాటడం, వాటి దగ్గర సెల్ఫీలు దిగడం మినహా శాశ్వత పరిష్కారం చేకూర్చేలా పనులు నిర్వహించకపోవడం, అవసరమైన నిధులు కేటాయించకపోవడంతో జిల్లాలో పారిశుద్ధ్య పరిస్థితి మొదలు డ్రెయిన్ల పూడికతీత పనుల వరకూ అన్నీ ఇబ్బందికరంగానే మారాయి. చెత్తశుద్ధి కరువాయె ఏలూరులో ఎక్కడి చెత్త అక్కడే.. మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి జిల్లావ్యాప్తంగా క్షీణించిన పారిశుద్ధ్యం అయినా రాష్ట్రస్థాయిలో జిల్లాకు అవార్డులు స్వచ్ఛాంధ్ర పేరుతో అధికారుల హడావుడి -
గురువుల బోధనేతర బహిష్కరణ
● ఉదయం 9.20లోపు విద్యార్థుల హాజరు ఆన్లైన్లో నమోదు చేయాలి. ఆయా అటెండెన్స్, ఐఎంఎంఎస్ యాప్లో ఇన్స్పెక్షన్ రిపోర్టు పూర్తి చేయడం, మధ్యాహ్నం 12 గంటలలోపు భోజన పథకానికి సంబంధించిన మెనూ లైవ్, ఫొటోలు, వీడియోలు పంపాలి. ● 2 గంటలలోపు మొక్కల రిజిస్ట్రేషన్ నమోదు. ● సాయంత్రం విట్నెస్ యాప్ అప్డేట్ చేయాలి. ● ఆపై టీఎంఎఫ్, లీప్ యాప్, ఎఫ్ఎల్ఎన్, టీపీడీఎస్, మైస్కూల్, డిజిటల్ అటెండెన్స్, లాంగ్వేజ్ మాపింగ్లు వంటి పనులు చేయాలి. ● ఇలా క్లాస్రూమ్లో సమయం బోధనకు కాకుండా స్కీన్లపై స్వైపింగ్ చేయడానికే ఖర్చవుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఈనెల 7న నిర్వహించిన ధర్నాలో బోధనేతర పనులు, ఆన్లైన్ యాప్లు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బోధనేతర పనులు రద్దుపై దశల వారీగా ఆందోళనలు పెరిగేలా ఫ్యాప్టో ఆధ్వర్యంలో పోరాటానికి ఉపాధ్యాయులు సిద్ధం కావాలి. – పుప్పాల సూర్యప్రకాశరావు, జిల్లా ఫ్యాప్టో నాయకులు బడుల్లోకి సెల్ఫోన్ ప ట్టుకుని వెళ్లకుండా కేవలం పాఠాలు మాత్రమే పిల్లలకు చెబుతాం. ఫేషియల్ హాజరు కోసం ప్రభుత్వం పరికరాలు అందించాలి. బోధనా సమయం హరించేలా ఉపాధ్యాయులకు అప్పగిస్తున్న ఆన్లైన్ పనులతో సింగిల్ టీచర్ స్కూళ్లలో పరిస్థితి దారుణంగా ఉంది. – షేక్ రంగావలి, జిల్లా ఫ్యాప్టో నాయకులు నిడమరు: ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులతో బోధనేత పనులు చేయిస్తూ ఉపాధ్యాయ వృత్తినే కూటమి ప్రభుత్వం అవమానిస్తున్నట్లు ఉపాధ్యా య వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఫలితంగా విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారంటూ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 7న విజయవాడలో ఫ్యాప్టో ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో ఈనెల 10 నుంచి ప్రభుత్వ బడుల్లో బోధనేతర కార్యక్రమాలు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు గురువారం జిల్లాస్థాయి అధికారులకు ఫ్యాప్టో నాయకులు వినతిపత్రాలు సమర్పించారు. దీంతో శుక్ర వారం నుంచి అన్ని ప్రభుత్వ బడులు బోధనేతర పనులు బహిష్కరించి నిరసనలు తెలిపేలా ఉపాధ్యాయ సంఘాల నాయకులు సన్నద్ధమవుతున్నారు. కూటమి ప్రభుత్వం విద్యారంగ మూలాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తుందని ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. వాట్సాప్లో అర్జెంట్, మోస్ట్ అర్జెంట్ అంటూ మెసేజ్లు, ఆన్లైన్లో పనులు, వెబెక్స్ మీటింగ్లతో రోజంతా బోధనకు దూరమవుతున్నట్టు వాపోతున్నారు. బోధనేతన పనులతో నష్టాలు కూటమి ప్రభుత్వంలో సర్కారీ బడులు అభ్యాస మందిరాలుగా కాకుండా డేటా సెంటర్లుగా మారు తున్నాయంటూ ఫ్యాప్టో నేతలు చెబుతున్నారు. బోధనేతర పనుల వల్ల రోజువారీ తరగతులు ఆల స్యం అవుతున్నాయి. విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించేందుకు సమయం తగ్గిపోతుంది. టీచర్స్లో బోధనాసక్తి కూడా క్రమంగా తగ్గిపోతుంది. టెక్నికల్ సమస్యలతో మానసిక ఒత్తిడిలో పడటం, నా ణ్యతగల బోధన కంటే యాప్ల స్క్రీన్షాట్ల ప్రా ముఖ్యతకే అధికారులు ప్రాధాన్యమిస్తున్నారు. పాఠశాలలు తెరిచిన నాటి నుంచీ.. ఈ ఏడాది జూన్ 12న పాఠశాల తెరిచిన నాటి నుంచి స్కూల్ ఆర్గనైజేషన్ టీములు, ఎంటీఎస్ బదిలీలు, కౌన్సెలింగ్లతో జూన్ నెల ముగిసింది. తర్వాత గిన్నిస్ రికార్డు పేరుతో యోగాంధ్ర ముందస్తు కార్యక్రమాలు, స్కూడెంట్ కిట్స్, పాఠ్యపుస్తకాలు తెచ్చుకుని అందించడం, బియ్యం లెక్కలు, మెగా పేరెంట్ మీటింగ్ 2.0కు పది రోజులు ముందుగా జూలై ముగిసింది. తర్వాత లీడర్షిప్, ప్రా థమిక అక్షరాస్యత, ఎఫ్ఎల్ఎన్ వంటి శిక్షణా కార్యక్రమాలు జరిగాయి. నిత్యం సర్వర్ డౌన్తో టీచర్ ముఖ హాజరు నమోదుకు ఉదయం, సాయంత్రం ఆలస్యమవుతోంది. దీంతోపాటు విద్యాశక్తి కార్యక్రమం కొనసాగుతోంది. విద్యార్థులకు అందించే సన్నబియ్యం బస్తాలు ఓపెన్ చేసి క్యూఆర్కోడ్లు స్కానింగ్ నమోదు, ప్రతి బియ్యం బస్తా, చిక్కీలు, రాగి, బియ్యం, క్లీనింగ్ టూల్స్, ఐఎఫ్పీ ట్యాబ్లెట్స్ పంపిణీ వంటివి ఆన్లైన్ చేయడం, ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలైన సూపర్ జీఎస్టీ ప్రచారాన్ని ఉపాధ్యాయులపై రుద్దడం దారుణమని ఆయా సంఘాల నాయకులు అంటున్నారు. ఈనెల 13 నుంచి ఎఫ్ఏ–2 పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేసే సమయంలో ప్రభుత్వ ప్రచారాలకు ఉపాధ్యాయులను ఉపయోగించడం ఎంత వరకూ సబబు అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న యాప్ల భారం నేటినుంచి బోధనేతర కార్యక్రమాల బహిష్కరణ ఫ్యాప్టో పిలుపుతో నిలిచిపోనున్న ఆన్లైన్ వర్కులు -
పార్సిల్ వాహనాల్లో బాణసంచా తరలింపు నేరం
ఏలూరు (ఆర్ఆర్పేట): పార్సిల్ సర్వీస్ వాహనాల్లో బాణసంచా, పేలుడు, విస్ఫోటన పదార్థాలు, నిషేధిత హానికారక స్వభావం కలిగిన వస్తువులను తరలిస్తే చర్యలు తప్పవని ఉప రవాణా కమిషనర్ షేక్ కరీమ్ హెచ్చరించారు. దీపావళి పండగ దృష్ట్యా గురువారం డీటీసీ కార్యాలయంలో ఏలూరులోని పార్సిల్ సర్వీస్ సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. మందుగుండు సామగ్రి, విస్ఫోటన ప దార్థాలు తదితర నిషేధిత వస్తువులను నిల్వ చేయడం, లారీల్లో తరలించడం నేరమని, ఉ ల్లంఘనలకు పాల్పడే పార్సిల్ సర్వీస్ సంస్థలపై క్యారేజ్ బై రోడ్ యాక్ట్ 2007, ఎంవీ యాక్ట్, సీఎంవీ రూల్స్ ప్రకారం కేసులు నమో దు చేస్తామని హెచ్చరించారు. అనంతరం వాహన తనిఖీ అధికారులు వారికి నోటీసులు అందజేశారు. ఇన్చార్జి ఆర్టీఓ ఎస్బీ శేఖర్, వాహన తనిఖీ అధికారులు ఎండీ జమీర్, జి.స్వామి తదితరులు పాల్గొన్నారు. -
ఉధృతంగా ప్రవహిస్తున్న జల్లేరు వాగు
బుట్టాయగూడెం: మండలంలో బుధవారం రాత్రి కురిసిన వర్షంతోపాటు ఎగువన కొండప్రాంతంలో కురిసిన వర్షాలకు తోడు జల్లేరు జలాశయం డ్యామ్ నుంచి అధికారులు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన నేపథ్యంలో జల్లేరు వాగు ఉధృతంగా ప్రవహించింది. గురువారం కూడా జైనవారిగూడెం– రెడ్డిగణపవరం మధ్య ఉన్న జల్లేరువారు వాగు ఉధృతంగా ప్రవహించింది. అయితే ఈ సమయంలో మండలంలోని జైనవారిగూడెంకు చెందిన ఇరపా అన్నామణి అనే గిరిజన మహిళ వాగుదాటే ప్రయత్నం చేస్తూ కొట్టుకుపోయింది. అయితే ఈ సమాచారం అందుకున్న గ్రామస్థులు తాటి రాముడు, తాటి రాంబాబు, సవలం యాకోబు, తదితరులు వాగు సమీపానికి చేరుకుని వాగు వెంబడి అన్నామణి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతూ కొంగవారిగూడెం ప్రాజెక్టు వరకూ వెళ్లారు. ఎక్కడా ఆమె ఆచూకీ లభించకపోవడంతో వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎస్సై దుర్గా మహేశ్వరరావు, రైటర్ రాంప్రసాద్తోపాటు మరికొంతమంది పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకోవడంతోపాటు వారు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. వాగు వెంబడి గాలింపు చర్యలు చేస్తున్న సమయంలో వాగుకు పైభాగంలో పనిచేస్తున్న కొవ్వాసు బాబూరావు అనే రైతు అన్నామణి వాగు వెంబడి కొమ్మలు పట్టుకుని ఉన్నట్లు చెప్పారు. దీంతో హుటాహుటిన గ్రామస్తులు, పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను బయటకు తీశారు. ఎస్సై అన్నామణిని ప్రశ్నించగా తన పిల్లలు మండలంలోని వెలుతురువారిగూడెంలో ఉండగా వారిని చూసేందుకు వెళ్తుండగా ఈ సంఘటన జరిగినట్లు చెప్పింది. -
అంగన్వాడీలు, పాఠశాలల్లో పరేషన్
కై కలూరు: కూటమి పాలనలో నిత్యవసరాల పంపిణీ వ్యవస్థ గాడి తప్పుతోంది. సకాలంలో సరుకులు అందక అంగన్వాడీ చిన్నారులు, పాఠశాలల విద్యార్థులు చాలీచాలని ఆహారంతో, ఖాళీ కడుపులతో కాలం వెళ్లదీస్తున్నారు. అక్టోబర్ నెల వచ్చి 10 రోజులు కావస్తున్నా ఇంకా అంగన్వాడీలు, ప్రభుత్వ పాఠశాలలకు రేషన్ సరఫరా లేదు. ఆన్లైన్ సర్వర్లో మార్పులు ఆలస్యానికి కారణమని సివిల్ సప్లయిస్ అధికారులు చెబుతోన్నారు. అంగన్వాడీ సెంటర్లలో నిల్వలు నిండుకోవడంతో రేషన్ దుకాణాలు చుట్టూ అంగన్వాడీ టీచర్లు తిరుగుతున్నారు. ఇదీ పరిస్థితి ఏలూరు జిల్లాలో 2,226 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల పరిధిలో 6 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలు 48,563 మంది, 3వ సంవత్సరం నుంచి 6వ సంవత్సరం వరకు పిల్లలు 23,499 మంది, గర్భిణులు 8,861 మంది, బాలింతలు 6,592 మంది, యుక్తవయస్సు బాలికలు 21,498 మంది ఉన్నారు. అదే విధంగా జిల్లాలో 1,818 ప్రభుత్వ పాఠశాలల్లో 1,22,790 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరి కోసం అంగన్వాడీలకు బియ్యం, కందిపప్పు, నూనె, పిండి, గుడ్లు, పాలు వంటివి సరఫరా చేయాల్సి ఉంది. సరుకుల ఆలస్యం వల్ల పదేపదే గర్భిణులు, బాలింతలు కేంద్రాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. మధ్యాహ్న భోజనం పథకంలో పాత నిల్వలతోనే నిర్వాహకులు వంట చేస్తున్నారు. కాంట్రాక్టర్ల గగ్గోలు.. ఏలూరు జిల్లాలో ఏలూరు, కై కలూరు, నూజివీడు, జంగారెడ్డిగూడెం, కోట రామచంద్రాపురం, పాతూరు, ధర్మాజీగూడెం, కుక్కనూరులో మండల లెవెల్ స్టాక్ పాయింట్(ఎంఎల్ఎస్పీ) ఉన్నాయి. సెంట్రల్ వేర్ హౌస్ కార్పొరేషన్(సీడబ్ల్యూసీ) నుంచి సరకును స్టేజ్–1 కాంట్రాక్టర్లు ఎంఎల్ఎస్పీకి సరఫరా చేస్తారు. ఎంఎల్ఎస్పీ నుంచి రేషన్ దుకాణాలకు స్టేజ్–2 కాంట్రాక్టర్లు చేరవేస్తారు. వీరికి రెండు నెలలుపైబడి బిల్లులు రాలేదు. సివిల్ సప్లయిస్ కార్పొరేషన్లో ఉద్యోగులకు సైతం సకాలంలో జీతాలు రావడం లేదు. అంగన్వాడీ కేంద్రాల వద్దకు నేరుగా సరుకుల సరఫరా చేస్తామని చెబుతున్నా అమలులో అది సాధ్యం కావడం లేదు. ఇదిలా ఉంటే 50 కేజీల బస్తాలలో ఇప్పటికే బియ్యం కొంత తగ్గుతున్నాయని రేషన్ డీలర్లు వాపోతున్నారు. అంగన్వాడీ సెంటర్లలో కార్యకర్తలు సొంత డబ్బులతో సరుకులు కొంటున్నారు. ఇప్పటి వరకు చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సరుకుల సరఫరా చేయలేదు. నిత్యవసర సరుకుల కోసం పదేపదే కార్యకర్తలు డీలర్ల చుట్టూ తిరుగుతున్నారు. ప్రతి నెలా సమయానికి నిత్యవసరాలను సరఫరా చేయాలి. – డీఎన్వీడీ.ప్రసాద్, ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్(సీఐటీయూ) జిల్లా గౌరవాధ్యక్షుడు అంగన్వాడీ కేంద్రాలకు నిత్యవసర సరుకుల పంపిణీ కొంత ఆలస్యమైన మాట వాస్తవమే. ఈ విషయాన్ని జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంగన్వాడీ కార్యకర్తలు చర్యలు తీసుకుంటున్నారు. సమస్య త్వరలోనే పరిష్కారమవుతుంది. – పి.శారద, ఐసీడీఎస్, జిల్లా పీడీ, ఏలూరుఏలూరు జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఆహార, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యవహరిస్తున్నా జిల్లాలో సకాలంలో అంగన్వాడీలకు, పాఠశాలలకు సరుకుల మాత్రం చేరడం లేదు. ఎంఎల్ఎస్ పాయింట్లో బియ్యం తూకంపై నిఘాను ముమ్మరం చేయాలని పలువురు కోరుతున్నారు. ఈ సమస్యపై కై కలూరు సివిల్ సప్లై డీటీ శ్రీనివాసరావు మాట్లాడుతూ గతంలో స్టేట్, సెంట్రల్ రెండు సైట్లు ఉండేవని, రెండు సర్వర్లను కలిపి సింగిల్ విండోగా తీసుకొస్తున్నారని చెప్పారు. దీని వల్ల రిలీజ్ ఆర్టర్(ఆర్వో)ల సమస్య వచ్చిందన్నారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కారం కావచ్చని తెలిపారు. ఇంకా చేరని నిత్యావసరాలు ఆన్లైన్ మార్పులతో ఆర్వోలు ఆలస్యం అప్పులు చేసి అంగన్వాడీల నిర్వహణ జిల్లాలో 2,226 అంగన్వాడీలు, 1,818 పాఠశాలల్లో అవస్థలు -
అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త
ఏలూరు టౌన్: భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త కత్తెరతో ఆమెను కడతేర్చిన ఘటన ఏలూరు పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చింతలపూడి మండలం సీతానగరం ప్రాంతానికి చెందిన కంతేటి నరేష్కు, నాగలక్ష్మి (34)కు 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులున్నారు. భర్త నరేష్ తాపీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో నరేష్ తన కుటుంబంతో పాటు ఏలూరు శనివారపుపేట జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంతానికి మకాం మార్చివేశాడు. భర్త నరేష్ ఏలూరులో కూడా తాపీ పనులు కొనసాగిస్తూ ఉండగా, భార్య నాగలక్ష్మి కొంతకాలం కర్రీ పాయింట్ పెట్టి, అనంతరం మెషీన్ కుడుతూ కుటుంబ పోషణలో భర్తకు తోడుగా ఉంటుంది. కానీ గత కొంత కాలంగా భర్త నరేష్ తన భార్య వేరొకరితో మాట్లాడుతుందని అనుమానం పెంచుకున్నాడు. ఇక అనుమానం కాస్త కక్షగా మారి ఇంటి వద్దనే మిషన్ కుడుతున్న భార్యపై ఆకస్మికంగా కత్తెరతో దాడి చేశాడు. అతి కిరాతకంగా మెడ, తలభాగాలపై పోడిచాడు. స్థానికులు గమనించి అతడిని నిలువరించి పట్టుకునే ప్రయత్నం చేయగా, తప్పించుకుని పారిపోయాడు. తీవ్ర గాయాలతో రక్తంలో పడి ఉన్న నాగలక్ష్మిని స్థానికులు ఏలూరు జీజీహెచ్కు తరలించారు. కొంతసేపటికే ఆమో చికిత్స పొందుతూ మృతి చెందింది. సంఘటనా స్థలాన్ని ఏలూరు త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు పరిశీలించారు. నిందితుడు నరేష్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్టు తెలిపారు. పెనుమంట్ర: పెనుమంట్ర గ్రామాభివృద్ధికి ప్రభుత్వం, అధికారులు సహకరించడం లేదని పెనుమంట్ర గ్రామ సర్పంచ్ తాడిపర్తి ప్రియాంక, ఉప సర్పంచ్ భూపతిరాజు శ్రీనివాసరాజు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం పెనుమంట్ర సచివాలయ ఆవరణలో ‘పల్లె పల్లెకు మన పితాని’గ్రామ సభ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ సర్పంచ్ ప్రియాంకును కించపరిచే విధంగా మాట్లాడడంతో వేదికపై ఉన్న సర్పంచ్ ప్రియాంక, ఉప సర్పంచ్ శ్రీనివాసరాజు ఒక్కసారిగా లేచి పితాని ప్రసంగానికి అడ్డు తగిలారు. గ్రామంలోని అధికారులు విద్యా కమిటీ సభ్యుల ఫోర్జరీ సంతకాలు చేసి, తప్పుడు తీర్మానాలతో ఇక్కడ పాఠశాలను విద్యార్థులకు దూరం చేశారని, వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎలగల బుల్లి రామిరెడ్డి, తహసీల్దార్ వైవీ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. మెషీన్ కుడుతున్న భార్యపై కత్తెరతో దాడి -
హస్తకళలపై విద్యార్థులకు అవగాహన
బుట్టాయగూడెం: ఔత్సాహిక ఆదివాసీ, గిరిజన యువతను గుర్తించి వారికి ఉత్సాహం ఉన్న కళారంగాల్లో నిష్ణాతులైన వారితో ప్రత్యేక శిక్షణలు ఇచ్చి వెదురు వస్తువులతో వివిధ రకాల కళాకృతులను రూపొందిస్తామని డెవలప్మెంట్ కమిషనర్, కేంద్ర జౌళి మంత్రిత్వశాఖ సహాయ డైరెక్టర్ ఎన్.అపర్ణలక్ష్మి అన్నారు. మండలంలోని బూసరాజుపల్లిలో గిరిజన సంక్షేమ శాఖ గురుకుల రెసిడెన్షియల్ కళాశాలలో గురువారం డెవలప్మెంట్ కమిషనర్, కేంద్ర జౌళి మంత్రిత్వశాఖ ఆర్థిక సహకారంతో కోకో ట్రైబల్ ప్రోడ్యూసర్ కంపెనీ నిర్వహణలో వెదురు వస్తువుల కళాకృతులు తయారీ, ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అపర్ణలక్ష్మి మాట్లాడుతూ భారతీయ హస్తకళలపై విద్యార్థులకు అవగాహన కలిగించడానికి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో క్రాఫ్ట్ అవేర్నెస్, డిమాన్స్ట్రేషన్ ప్రోగామ్ను నిర్వహిస్తున్నామని చెప్పారు. కేఆర్పురం ఐటీడిఏ పరిధిలో, సీతంపేట, ఒరిస్సా సరిహద్దులో ఉన్న గిరిజన యువతకు వెదురు, తాటాకులతో వస్తువుల తయారీ, సవర పెయింటింగ్లో నైపుణ్యం సాధించే దిశగా కృషి చేస్తామని చెప్పారు. అనంతరం పలువురు కళాకారులకు టూల్ కిట్స్ను పంపిణీ చేశారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ పాస్ట్ డిస్ట్రిక్ గవర్నర్ గట్టిం మాణిక్యాలరావు, ఏపీడీ రాజబాబు, ప్రాజెక్టు డైరెక్టర్ షేడ్ ఆర్గనైజేషన్, కోకో ట్రైబుల్ ప్రొడ్యూసింగ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పీడీ సుధీర్కుమార్ పాల్గొన్నారు. -
ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
నేటి నుంచి ఆర్జిత సేవల పునరుద్ధరణ ద్వారకాతిరుమల: శ్రీవారి ఆశ్వయుజమాస దివ్య బ్రహ్మోత్సవాలు గురువారం జరిగిన పలు కార్యక్రమాలతో ముగిశాయి. ఉదయం స్వామివారి కల్యాణ మండపంలో అర్చకులు శ్రీవారు, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు అర్చనాది కార్యక్రమాలను జరిపి, హారతులిచ్చారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు వసంతాలను సమర్పించి, చూర్ణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అందులో భాగంగా స్వామివారిని కీర్తిస్తూ అర్చకులు, మహిళా భక్తులు వడ్లు దంచారు. ఆ తరువాత రాజాదిరాజ వాహనంపై శ్రీవారికి తిరువీది సేవను నిర్వహించి, భక్తులపై వసంతాలు చల్లారు. రాత్రి ఆలయంలో ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీపుష్ప యాగోత్సవాన్ని జరిపారు. ద్వాదశ కోవెల ప్రదక్షిణలు ఇలా.. స్వామి, అమ్మవార్లకు రాత్రి ఆలయంలో 12 ప్రదక్షిణలు, 12 సేవా కాలాలు, 12 రకాల పిండి వంటలతో నివేదనలు జరిపారు. ఒక్కో ప్రదక్షిణకు ఒక్కో సేవాకాలాన్ని నిర్వహించి, ఒక్కో రకం పిండి వంటను ఆరగింపుచేసి స్వామి, అమ్మవార్లకు హారతులిచ్చారు. వీణా, వేణువు, మృదంగం, గానం, నృత్యం, శృతి, శ్మ్రుతి, ద్రవిడ వేదం, బేరి, కాహలము, గంటారావం, నిశ్శబ్ధం వెరసి 12 సేవలు, 12 ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం జరిపిన శ్రీపుష్ప యాగోత్సవంలో అర్చకులు, పండితులు, భక్తులు, అధికారులు పాల్గొన్నారు. అలాగే ఆలయ ముఖ మండపంలో స్వామివారు శయన మహావిష్ణువు అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీహరి కళాతోరణ వేదికపై నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ఈ వేడుకలతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. నేటి నుంచి ఆర్జిత సేవలు యథాతథం శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో రద్దు చేసిన నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను శుక్రవారం నుంచి పునరుద్ధరిస్తున్నట్టు ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. భక్తులు గమనించాలని ఆయన కోరారు. -
టిడ్కో ఇళ్ల బకాయిలు చెల్లించాలి
తాడేపల్లిగూడెం: బ్యాంకు రుణాలు ద్వారా టిడ్కో ఇళ్లు పొందిన లబ్ధిదారులు బకాయిలు వెంటనే చెల్లించాలని యూనియన్ బ్యాంకు అధికారులు ఎల్.అగ్రహారంలోని టిడ్కో లబ్ధిదారులను కోరారు. గురువారం ఉమ్మడి పశ్చిమకు చెందిన బ్యాంకు అధికారులు కాలనీని సందర్శించారు. ప్రత్యేక డ్రైవ్లో భాగంగా లబ్ధిదారులకు ఎంత బకాయిలు ఉన్నారు? పెండింగ్లు ఎంత ఉన్నాయనే విషయాలను వివరించారు. బకాయిలను ఎట్టి పరిస్ధితుల్లో వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. బకాయిలు చెల్లించే స్థితిలో మేం లేమని లబ్దిదారులు చెప్పారు. ఇళ్లకు ఎలాంటి సొమ్ము చెల్లించనక్కరలేదని గతంలో ఇళ్లు మాకు కేటాయించిన సందర్భంలో చెప్పారని, ఇప్పుడు బకాయిలు చెల్లించమంటే ఎలా అని ప్రశ్నించారు. బ్యాంకు చీఫ్ మేనేజర్ ప్రదీప్ మాలిక్, సీనియర్ మేనేజర్ భాస్కరరావు, మేనేజర్లు లోకేష్, చినబాబు, విజయ్, రామకృష్ణ పాల్గొన్నారు. -
విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి
ముదినేపల్లి రూరల్: చేపల చెరువుపై విద్యుత్ మోటారు మరమ్మతులు చేస్తూ షాక్నకు గురై వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని బొమ్మినంపాడులో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం గోరింతోట గ్రామానికి చెందిన వలిగేటి ఏసురాజు(35) బొమ్మినంపాడులో 20 రోజుల కింద చేపల చెరువుపై కాపాలదారుగా చేరాడు. ఈ నేపధ్యంలో గురువారం ఉదయం విద్యుత్ మోటారుతో నీరు తోడుతుండగా మధ్యంలో ఆగింది. దీనిని మరమ్మతులు చేస్తూ హఠాత్తుగా విద్యుత్ షాక్నకు గురై మరణించాడు. ఏసురాజు బంధువు దాసరి ప్రసాద్ స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదుచేయగా ఎస్సై వీరభద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వార్డెన్ చర్యలపై విచారణ
ఆకివీడు: విద్యార్థులపై అసభ్యకరంగానూ, అశ్లీల మాటలతో వేధిస్తున్నారనే విద్యార్థుల ఆరోపణల మేరకు స్థానిక ఎస్సీ హాస్టల్ వార్డెన్ పి.శ్రీధర్ పై గురువారం ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. సాక్షిలో వచ్చిన వార్తకు స్పందించిన ఏఎస్డబ్ల్యూజే రాజశేఖరరెడ్డి హాస్టల్లోని విద్యార్థులతో మాట్లాడారు. దూషణలు, తదితర విషయాల్ని అడిగి తెలుసుకున్నారు. దీనిపై జిల్లా సాంఘిక సంక్షేమ అధికారికి నివేదిక సమర్పించి, జిల్లా కలెక్టర్కు అందజేస్తామన్నారు. ప్రస్తుతం హాస్టల్కు ఇన్ఛార్జి వార్డెన్గా ఉండి వసతి గృహఅధికారిణిని నియమిస్తున్నట్లు విలేకరులకు తెలిపారు. కై కలూరు: ఇంట్లో ఒంటరిగా ఉన్న వివాహితపై లైంగికదాడికి ప్రయత్నించిన వ్యక్తిపై గురువారం కేసు నమోదు చేశామని కై కలూరు రూరల్ పోలీసులు తెలిపారు. వివరాల ప్రకారం జంగంపాడు పల్లెపాలెంలో వడుగు దుర్గపై బుధవారం ఉదయం అదే గ్రామానికి చెందిన కర్రి దుర్గారావు అనే వివాహితుడు లైంగికదాడికి యత్నించాడు. ఆమె బిగ్గరగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చేసరికి అతను పరారయ్యాడు. దీంతో బాధితురాలు గురువారం పోలీసులను ఆశ్రయించింది. -
ఎట్టకేలకు కల్వర్టుపై గుంతల పూడ్చివేత
ఆగిరిపల్లి: మండలంలోని నూగొండపల్లి వద్ద ఉన్న కుంపిని వాగు పై ఉన్న కల్వర్టు ధ్వంసమై గుంతలు ఏర్పడ్డాయి. ఈ దుస్థితిపై సోమవారం సాక్షి దినపత్రికలో ‘ప్రమాదకరంగా కల్వర్టు’ కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన సంబంధిత అధికారులు కల్వర్టుపై ఏర్పడిన గుంతులను బుధవారం కంకరరాళ్లతో పూడ్పించారు. రేపటి నుంచి నిట్లో టెక్రియా 2కే25 తాడేపల్లిగూడెం: ఏపీ నిట్లో టెక్రియా 2కే25 సన్నాహక కార్యక్రమానికి బుధవారం శ్రీకారం చుట్టారు. శుక్రవారం, శనివారాల్లో రెండు రోజులపాటు టెక్రియా జరుగనుంది. బుధవారం కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని ప్రారంభించిన నిట్ రిజిిస్ట్రార్ దినేష్ శంకరరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో వైజ్ఞానిక స్పృహను పెంచడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. అసోసియేట్ డీన్ రాజేశ్వర్రెడ్డి, కో ఆర్డినేటర్ సారధ్యంలో విద్యార్థులు నృత్యాలు చేశారు. టెక్రియాలో రోబోటిక్స్, ఆటోమేషన్, అల్టిమేట్ డ్రోన్, డ్రోన్ చాలెంజ్, సెరెనిటీ రూమ్, ఇంజనీర్స్ డ్రైవ్ వే , రిథమ్ రియాల్టీ, షేర్ లాక్డ్, షార్ట్ఫిలిం తదితర కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో నిట్ అధికారులు కె.హిమబిందు, శ్రీనివాసన్, టి.రమేష్ పాల్గొన్నారు. ఏలూరు జీజీహెచ్లో డాగ్స్క్వాడ్ తనిఖీలు ఏలూరు టౌన్: ఏలూరు సర్వజన ఆసుపత్రిలోని పలు విభాగాలను డాగ్స్క్వాడ్ బృందం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టింది. జీజీహెచ్లోని అత్యవసర సేవల విభాగం వైపు నుంచీ లోపల ఎమర్జెన్సీ వార్డులు, ఇతర విభాగాల్లోనూ తనిఖీలు చేశారు. జీజీహెచ్ ప్రాంగణంలోనూ, అన్ని విభాగాల్లోనూ క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. దీనిపై ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్కుమార్ మాట్లాడుతూ సాధారణ తనిఖీల్లో భాగంగానే ఏలూరు జీజీహెచ్లోనూ డాగ్స్క్వాడ్ తనిఖీలు చేపట్టామని తెలిపారు. -
పారా త్రోబాల్ జట్టు మేనేజర్గా సూర్యనారాయణ
అత్తిలి: ఈఏడాది డిసెంబర్ 15 నుండి 22 వరకు శ్రీలంక లో రత్నాపుర ఇండోర్ స్టేడియంలో మొదటి సౌత్ ఏషియన్ పారాత్రో బాల్ ఛాంపియన్ షిప్–2025 లో పాల్గొనే భారత పారా త్రో బాల్ జట్టు మేనేజర్గా అత్తిలికి చెందిన యడ్లపల్లి సూర్యనారాయణ ఎంపికయ్యారని ఆంధ్రప్రదేశ్ పారాత్రో బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గండా కై లాష్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. గత ఆగస్టు 30, 31 తేదీల్లో కోయంబత్తూర్లో నిర్వహించిన జాతీయస్థాయి పోటీలలో పాల్గొన్న ఆంధ్ర పారా త్రో బాల్ జట్టుకి మేనేజర్గా సూర్యనారాయణ వ్యవహరించారని తెలిపారు. ఈ పోటీల్లో ఆంధ్ర పారాత్రో బాల్ జట్టు విజేతగా నిలిచిందని కై లాష్ పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం: మండలంలోని గుర్వాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో బుధవారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. జిల్లా దేవదాయ శాఖ అధికారి కూచిపూడి శ్రీనివాస్ పర్యవేక్షణలో కేవీబీ బ్యాంక్ సిబ్బంది, ఆలయ సిబ్బంది హుండీలను తెరిచి లెక్కింపు నిర్వహించారు. 111 రోజులకు గానూ దేవస్థానంలోని హుండీల ద్వారా రూ.60,84,458, అన్నదానం హుండీ ద్వారా రూ.76,609లు మొత్తం రూ. 61,61,067 ఆదాయం సమకూరినట్లు మద్ది ఆలయ ఈఓ, సహాయ కమిషనర్ ఆర్వీ చందన తెలిపారు. -
పూర్వ పోలీసు అధికారుల సేవలు అభినందనీయం
ఏలూరు టౌన్: రాష్ట్రంలో పూర్వ పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది సేవలు అభినందనీయమనీ సుదీర్ఘకాలం పాటు ప్రజాసేవకే అంకితమై పారదర్శకంగా పనిచేస్తూ అందరి మన్ననలు పొందారని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్కుమార్ అన్నారు. ఏలూరులో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రిటైర్డ్ పోలీస్ అధికారుల సంఘం ఏడో వార్షికోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. గౌరవ అతిథులుగా మాజీ డీజీపీలు మాలకొండయ్య, పి.గౌతంకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మాజీ అదనపు ఎస్పీ కె.మాణిక్యాలరావు (80), డిప్యూటీ ఇంజనీర్ చందన విష్ణువర్థన్ (85), మాజీ పోలీస్ కానిస్టేబుల్(86), సయ్యద్ బాజీ (85)ను ఘనంగా సత్కరించారు. అనంతరం అమీనాపేట సురేష్చంద్ర బహుగుణ పోలీస్ స్కూల్లోని 12 మంది విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రిటైర్డ్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు పీవీఎస్కే భగవాన్ రాజు, సంఘం కార్యదర్శి మాజీ సీఐ ఎస్.దాశరధి, ట్రెజరర్ ఎల్.సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ కె.రాజగోపాల్రావు తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీ నిధుల దుర్వినియోగంపై విచారణ
కై కలూరు: కై కలూరు మేజర్ పంచాయతీలో రూ.54 లక్షలు నిధులు దుర్వినియోగమయ్యాయనే ఫిర్యాదుపై డీఎల్పీఓ అమ్మాజీ పంచాయతీ కార్యాలయంలో బుధవారం విచారణ చేపట్టారు. రాచపట్నానికి చెందిన సీహెచ్ మురళీ ఇటీవల ఏలూరు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదు చేశాడు. అప్పటి ఎంపీడీఓ ఆర్.ఫణింద్ర, పంచాయతీ ఈఓ పీఎన్పీ ఆనందభూషణం బాధ్యత వహించాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో డీఎల్పీఓ అమ్మాజీ పంచాయతీ కార్యాలయంలో రికార్డులను, ఫిర్యాదుదారుడు సీహెచ్ మురళీ సమక్షంలో జిల్లా కేంద్రానికి తీసుకెళ్లారు. పూర్తిగా పరిశీలించి నివేదిక ఉన్నతాధికారులకు అందిస్తామన్నారు. కార్యక్రమంలో సెక్రటరీలు కిరణ్, ప్రసాద్ పాల్గొన్నారు. సీఎంఎఫ్ఎస్ ఐడీ నంబర్ హ్యాక్ చేశారు.. పంచాయతీలో జరిగే లెక్కలు ఫిర్యాదుదారులకు చేరాయంటే కచ్చితంగా సీఎంఎఫ్ఎస్ ఐడీ నంబరు హ్యాక్కు గురైందని ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్వపు ఈఓ ఆనందభూషణం బుధవారం విలేకరులకు తెలిపారు. పంచాయతీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ తాను ఈఓ ఉండగా రెండు విడతలుగా రూ.55 లక్షలు డ్రా చేశానన్నారు. అన్ని సక్రమంగా ఖర్చు చేశానని పేర్కొన్నారు. డ్రెయిన్ల బాగుచేయించడం, కుళాయిల రిపేర్లు చేశానన్నారు. తాను ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ఏలూరు (టూటౌన్): పీపీపీ పద్ధతిలో చైతన్య–నారాయణ విద్యాసంస్థలు రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాల నిరుపేద విద్యార్థులను దత్తత తీసుకోవాలని దళిత సేన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జిజ్జువరపు రవిప్రకాష్ డిమాండ్ చేశారు. స్థానిక ఆర్ఆర్పేటలోని సంఘ కార్యాలయంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టిన పీపీపీ పద్ధతిలో చైతన్య–నారాయణ విద్యాసంస్థల అధినేతలు రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఒక 100 మంది చొప్పున 26 జిల్లాల్లో 2600 మంది ఫీజు చెల్లించలేని పేద బడుగు బలహీన వర్గాల నిరుపేద విద్యార్థులను దత్తత తీసుకుని ఉచిత విద్య అందించాలని కోరారు. వారి జీవితాలను ఉన్నత శిఖరాలకు చేర్చి పేదరికాన్ని నిర్మూలించడానికి తోడ్పడాలని కోరారు. సమావేశంలో చీలి మోహనరావు, దిరుసుపాం కృష్ణమూర్తి, భూసే అనిల్ కుమార్, పింగుల ఈథియా తదితరులు పాల్గొన్నారు. -
ఇదేనా.. స్వచ్ఛ మున్సిపాలిటీ?
● భీమవరంలో ఎక్కడి చెత్త అక్కడే ● అయినా స్వచ్ఛ మున్సిపాలిటీ అవార్డు ● ఆశ్చర్యపోతున్న పట్టణవాసులుభీమవరం(ప్రకాశం చౌక్): స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర అవార్డుల్లో జిల్లా స్థాయిలో స్వచ్ఛ మున్సిపాలిటీగా భీమవరం మున్సిపాలిటీ అవార్డు అందుకోవడంపై భీమవరం ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. మా కాలనీల్లో ఎక్కడ చెత్త అక్కడే ఉంటుంది..చెత్త తీయండి మహాప్రభో అని నేరుగా మున్సిపాలిటీకి మహిళలు సైతం వెళ్లి గగ్గోలు పెట్టే పరిస్థితి ఉన్నా మున్సిపాలిటీకి మాత్రం స్వచ్ఛ మున్సిపాలిటీగా అవార్డు ఇవ్వడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 6న కలెక్టరేట్ వద్ద కలెక్టర్, ప్రజాప్రతినిధుల చేతుల మీదగా స్వచ్ఛ మున్సిపాలిటీగా భీమవరం మున్సిపాలిటీకి అవార్డు అందుకున్నారు. పట్టణంలో మధ్యాహ్నం 1 గంట వరకు చెత్త తీయరని, కొన్ని ప్రాంతాల్లో రెండు రోజులకు ఒకసారి చెత్త తీస్తారని ప్రజలు బహిరంగంగానే చెబుతున్నారు. ముఖ్యంగా పట్టణంలోని డ్రెయిన్లన్నీ చెత్తచెదారంతో అధ్వానంగా ఉన్నా అవార్డు రావడం ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. 39 వార్డుల్లోనూ పారిశుద్ధ్యం అధ్వానం భీమవరం మున్సిపాలిటీలో 39 వార్డులు ఉన్నాయి. దాదాపు ప్రతి వార్డులో చెత్తాచెదారం ఎక్కడబడితే అక్కడ ఉంటుంది. డ్రెయిన్లలో కూడా చెత్తాచెదారం పేరుకుపోయి డ్రెయినేజి నీళ్లు రోడ్డుపై ప్రవహించే పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భీమవరంలో ఒక డ్రెయినేజీను కూడా బాగు చేయడం గానీ, ఎత్తు పెంచి నిర్మించడం గానీ చేయలేదు. ముఖ్యంగా పట్టణంలో చెత్తతో, దోమలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నూటికి నూరు శాతం తొలగింపు ఎక్కడ? భీమవరం పట్టణంలో మొత్తం 38,744 కుటుంబాలు ఉండగా 1.50 లక్షల మంది జనాభా ఉన్నారు. రోజుకు 70 టన్నుల చెత్త వస్తుందని అంచనా. అయితే మున్సిపాలిటీ మాత్రం 60 నుంచి 70 శాతం మేర చెత్తను డంప్ చేస్తుంది. నూటికి నూరుశాతం చెత్తను తొలగించడం లేదు. దాంతో మారుమూల ప్రాంతాల్లో ఎక్కడ చెత్త అక్కడే ఉంటుంది. అలాంటి మున్సిపాలిటీకి ఏ విధంగా కూటమి ప్రభుత్వంలో అధికారులు స్వచ్ఛ మున్సిపాలిటీ అవార్డు ఇప్పించారో? వారికే తెలియాలని పట్టణవాసులు ఎద్దేవా చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు తెలియదా? భీమవరం మున్సిపాలిటీకి స్వచ్ఛ మున్సిపాలిటీ అవార్డు అందించిన జిల్లా కలెక్టర్, కేంద్ర సహయ మంత్రి భూపతిరాజుశ్రీనివాసవర్మ, ఎమ్మెల్యే అంజిబాబుకు భీమవరం మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం ఏ స్థాయిలో ఉంటుందో? వారికి తెలియదా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సాక్షాత్తూ కలెక్టర్ కలెక్టరేట్కు వచ్చే దారిలో అంటే పీపీ రోడ్డులో డ్రెయిన్లు ఏ స్థాయిలో ఉన్నాయో? ఆమెకు తెలియదా? అని మండిపడుతున్నారు. ఎమ్మెల్యే అంజిబాబు నివాసం ఉండే బ్యాంకు కాలనీలో డ్రెయిన్లు అధ్వానంగా ఉన్నాయని, పలు వీధుల్లో ఎక్కడ చెత్త అక్కడే ఉంటుందని చెబుతున్నారు. ఇక కేంద్రమంత్రి ఉండే నాలుగో వార్డు, ఆర్టీసీ డిపో, దగ్గరలో ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాలో డ్రెయిన్లు అధ్వానంగా ఉండడంతో పారిశుద్ధ్యం దారుణంగా ఉంటుందని స్థానికులు వాపోతున్నారు. -
చోరీ కేసులో ముగ్గురి అరెస్టు
పెనుమంట్ర: మండలంలోని సోమరాజు ఇల్లిందలపర్రు గ్రామంలో మాజీ సర్పంచ్ కర్రి కమల ఇంట్లో సెప్టెంబర్ 16న జరిగిన దోపిడీకి సంబంధించి ముగ్గురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి సుమారు రూ.35 లక్షలు విలువచేసే 324.540 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు పెనుగొండ సీఐ రాయుడు విజయకుమార్ తెలిపారు. పెనుమంట్ర పోలీస్ స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. సెప్టెంబర్ 16న రాత్రి 7:45 ప్రాంతంలో ఇద్దరు గుర్తుతెలియ వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి తన అత్తగారిని, తనను తాళ్లతో బంధించి తన మెడపై కత్తి పెట్టి చంపుతామని బెదిరించి ఇంట్లో ఉన్న రూ.35 లక్షలు విలువైన బంగారు ఆభరణాలతో పాటు కొంత నగదు, రెండు రెండుసెల్ ఫోన్లను చోరీ చేశారని కర్రి జ్ఞాన చంద్రిక ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేశామని వివరించారు. దర్యాప్తులో ఈ దోపిడికి సూత్రదారి అత్తిలి మండలం ఆరవల్లి గ్రామానికి చెందిన వెలగల నరేందర్ రెడ్డిని గుర్తించామన్నారు. దోపిడీకి పాల్పడిన వారిని అల్లూరి సీతారామరాజు జిల్లా తులం గ్రామానికి చెందిన తెరవాడ హనుమంతరావు, నంద్యాల జిల్లా తువ్వ పల్లి గ్రామానికి చెందిన చింతల సుధాకర్గా గుర్తించామన్నారు. ఈ ముగ్గురిని నత్త రామేశ్వరం సెంటర్లో ఆభరణాలతో సహా పట్టుకుని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు. సమావేశంలో పెనుమంట్ర ఎస్సై కె.స్వామి, ఆచంట ఎస్సై కె.వెంకటరమణ, భీమవరం సైబర్ క్రైమ్ ఎస్సై రవికుమార్ పాల్గొన్నారు. -
రోడ్ల నిర్వహణ బాధ్యత ప్రజలకేనా..?
● ఉండి–గణపవరం రోడ్డు అధ్వానం ● గుంతలు సరి చేసి.. సూచికలు ఏర్పాటు చేస్తున్న ప్రజలుఉండి: నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి దారుణంగా తయారైంది. జాతీయ రహదారి 165తో పాటు రాష్ట్ర రహదారులు, ఆర్అండ్బీ, ఇంటర్నల్రోడ్లు నిర్వహణను అధికారులు పట్టించుకోవడం లేదంటూ వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. ముఖ్యంగా ఉండి–గణపవరం రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారిందని చెబుతున్నారు. ఉండి నుంచి పాములపర్రు, వెలివర్రు, కోలమూరు, ఉప్పులూరు, పాందువ్వ, ఆరేడు, కలిగొట్ల గ్రామాలకు చెందిన ప్రజలు ఇదే రోడ్డుపై ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ రోడ్డు పేరుకే రాష్ట్ర రహదారి అని, కానీ ఈ రోడ్డు నిర్వహణను ఆర్అండ్బీ అధికారులు అస్సలు పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఈ రోడ్డకు ఓ వైపు బొండాడ మేజర్ డ్రెయిన్ ఉంది. అయితే ఈ రోడ్డు నిర్మాణంలో నిర్లక్ష్యం, నాణ్యత లేకపోవడం వల్ల రోడ్డు వేసినా లేక మరమ్మతులు చేసిన కొద్దిరోజులకే మళ్లీ పరిస్థితి మొదటికి వస్తుంది. ఆ బాధ్యత తీసుకున్న ప్రజలు ఈ రోడ్డు అధ్వానంగా మారడంతో స్థానికులు కోలమూరులో రోడ్డుపైనే ఇసుకబస్తాలు పెట్టి వాటిల్లో కర్రలు పెట్టి వాటికి ఎర్రని బట్టలు చుట్టి ప్రయాణికుల ప్రాణాలు కాపాడుతూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. అలాగే కోలమూరు గ్రామ పరిధిలో రోడ్డుకు ఆనుకుని వుండే పంబోదె ఆక్రమణకు గురైందంటూ గతంలో తవ్వేశారు. అయితే రోడ్డుకు ఆనుకుని బోదె తవ్వడంతో ఇప్పుడు రోడ్డు బోదెలోకి కుంగిపోతుంది. కొద్దిరోజుల క్రితం ఓ ద్విచక్రవాహనదారుడు కుంగిన రోడ్డు గుంతలో పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో స్థానికంగా ఉండే రైతులు తమ పని ముగిసిన తరువాత పొక్లెయినర్ సాయంతో ఈ రహదారికి మరమ్మతులు చేయించారు. ఉండి నుంచి తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, అలాగే తాడేపల్లిగూడెంలో జాతీయ రహదారి నుంచి విజయవాడ, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రజలు ఎక్కువగా ఈ రహదారినే వినియోగిస్తూ ఉంటారు. ఇంతటి ప్రముఖమైన ఈ రోడ్డును అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి మరమ్మతులు చేయించాలని వాహనదారులు కోరుతున్నారు. ఉండి గణపవరం రోడ్డు అంటేనే వాహనదారులు భయపడే పరిస్థితి వచ్చింది.రోడ్డు పరిస్థితిని గమనించి మరమ్మతులు కూడా చేయకపోవడంతో రోడ్డు దారుణంగా మారింది. దీనివల్ల వారానికి ఒకటి లేదా రెండు పెద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి. – వర్రే పైడియ్య, మాజీ ఎంపీటీసీ, పాములపర్రు రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు, ప్రయాణికుల భాధ్యత ఎవరిది? వారిని ఎవరు పట్టించుకోవాలి? ఈ రోడ్డు దారుణంగా ఉండడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి వారు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మరణాలకు బాధ్యత ఎవరిది? – నిమ్మల కేశవకుమార్, ఎంపీటీసీ ఉప్పులూరు -
ఉత్సాహంగా ఎస్జీఎఫ్ జిల్లా జట్ల ఎంపిక
పెదవేగి: ఎస్జీఎఫ్ అండర్–19 ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బాలుర జట్ల ఎంపికలు బుధవారం లక్ష్మీపురం పంచాయతీ ఎంఆర్సీ కాలనీలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో ఉత్సాహంగా సాగాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు వాలీబాల్, కబడ్డీ, కోకో, త్రోబాల్, బాల్బాట్మింటన్, చెస్, యోగాసన, మొదలైన ఆటల పోటీలు నిర్వహించి, జిల్లా జట్లను ఎంపిక చేశారు. సుమారు 480 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో ప్రిన్సిపాల్ ఏవీ శివప్రసాద్, జిల్లా కార్యదర్శి కె.జయరాజు, హేళాపురి ఇంజనీరింగ్ కళాశాల ఏఓ కరుణానిధి, పీడీలు రాజా, శ్రీనివాస్, శ్రీలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. -
అధినేతకు ఘన స్వాగతం
భీమవరం (ప్రకాశం చౌక్): వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి నేతలు ఘన స్వాగతం పలికారు. హెలీప్యాడ్ వద్ద పలువురు నేతలు ఆయన్ను కలిశారు. శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు, రాజ్యసభ్య సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ మంత్రులు పేర్ని నాని, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, ఆర్కే రోజా, తానేటి వనిత, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పినిపే విశ్వరూప్, కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక, పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, పశ్చిమగోదావరి జిల్లా పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జి కారుమూరి సునీల్కుమార్, ఎమ్మెల్సీలు కవురు శ్రీనివాస్, వరుదు కళ్యాణి, మాజీ ఎమ్మెల్యేలు తెల్లం బాలరాజు, తలారి వెంకట్రావు, పుప్పాల వాసుబాబు, గొల్లపల్లి సూర్యారావు, రాపాక వరప్రసాదరావు, నియోజకవర్గ ఇన్చార్జులు పీవీఎల్ నరసింహరాజు, చినమిల్లి వెంకట్రాయుడు, గుడాల గోపి, మామిళ్లపల్లి జయప్రకాష్, కంభపాటి విజయరాజు, టి.శ్రీనివాస్నాయుడు, పిల్లి సూర్యప్రకాష్, పినిపే శ్రీకాంత్, ఎస్ఈసీ సభ్యులు మేడిది జాన్సన్, పెండ్ర వీరన్న, జిల్లా యూత్ ప్రెసిడెంట్ చిగురుపాటి సందీప్, సోషల్ మీడియా కన్వీనర్ బంధన పూర్ణచంద్రరావు, పార్టీ నాయకులు యడ్ల తాతాజీ, బీవీఆర్ చౌదరి, పేరిచర్ల నరసింహరాజు, ఏఎస్ రాజు, గాదిరాజు రామరాజు, కామన నాగేశ్వరరావు, దాట్ల రంగావతి, ఉమా శంకర్, చవ్వాకుల సత్యనారాయణ, వీరవల్లి శ్రీనివాస్, మానుకొండ ప్రదీప్, నడపన గోవిందరాజు, ఆనందప్రకాష్, పాలవెల్లి మంగ, హరివర్మ, రమేష్వర్మ, జయరామకృష్ణంరాజు, గణేశ్న రాంబాబు, ఆంజనేయరాజు తదితరులు ఉన్నారు. -
అభిమాన నేతకు నీరాజనం
స్కూల్ బస్సులపై కేసులు ఏలూరు జిల్లా వ్యాప్తంగా మోటారు వాహనాల తనిఖీ అధికారులు బుధవారం విద్యా సంస్థల బస్సులను తనిఖీ చేసి 18 కేసులు నమోదు చేశారు. 8లో uభీమవరం మున్సిపాలిటీలో ఎక్కడ చెత్త అక్కడే ఉండగా.. మున్సిపాలిటీకి మాత్రం స్వచ్ఛ మున్సిపాలిటీగా అవార్డు ఇవ్వడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 8లో uగురువారం శ్రీ 9 శ్రీ అక్టోబర్ శ్రీ 2025సాక్షి, భీమవరం: వివాహ వేడుక కోసం జిల్లాకు విచ్చేసిన మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి జనం నీరాజనం పట్టారు. కుండపోతగా వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా కాన్వాయ్ వెంట పరుగులు పెట్టారు. అభిమాన నేతను చూసి యువత కేరింతలు కొడుతూ సంబరపడిపోయారు. బుధవారం పశ్చిమగోదావరి జిల్లా పెదఅమిరంలోని రాధాకృష్ణ కన్వెన్షన్ హాలులో జరిగిన పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు తనయుడు కృష్ణంరాజు వివాహానికి జగన్ విచ్చేశారు. ఆయన వస్తున్నారన్న విషయం తెలియడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు భీమవరం చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం కల్యాణ వేదికకు సమీపంలోని హెలీప్యాడ్కు 3.25 గంటలకు చేరుకుంటారనగా మధ్యాహ్నం నుంచే జువ్వలపాలెం, కన్వెన్షన్ హాలు రోడ్లలో హడావుడి మొదలైంది. మండుటెండను లెక్కచేయకుండా పార్టీ శ్రేణులు, యువత పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు పట్టుకుని సందడి చేశారు. జగన్ హెలీప్యాడ్కు కొద్దిసేపట్లో చేరుకుంటారనే సరికి కారుమబ్బులతో కుండపోత వర్షం మొదలైనా ఎటూ కదలకుండా వేచిచూశారు. అక్కడి నుంచి కల్యాణ వేదిక వరకు కేరింతలు కొడుతూ, జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ కాన్వాయ్ వెంట పరుగులు తీశారు. సాయంత్రం 4 గంటల సమయానికి జగన్ కల్యాణ వేదిక వద్దకు చేరుకుని నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం 5 గంటల సమయానికి హెలీప్యాడ్ నుంచి తిరుగుపయనమయ్యే వరకూ హోరువానలోనూ అధినేత వెంటే ఉండి అభిమానాన్ని చాటుకున్నారు. కిక్కిరిసిన కన్వెన్షన్ తొలుత హెలీప్యాడ్ వద్ద ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల నుంచి తరలివచ్చిన మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు జగన్కు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అక్కడి నుంచి జగన్ కన్వెన్షన్ హాలుకు బయలుదేరారు. కల్యాణ వేదిక వద్ద ప్రసాదరాజు, శారదవాణి దంపతులు జగన్కు స్వాగతం పలికారు. వధూవరులు కృష్ణంరాజు, దివ్యలను జగన్ ఆశ్వీరించారు. వేదిక వద్ద జగన్ను చూసేందుకు జనం పోటీపడ్డారు. ఆయన వధూవరులను ఆశీర్వదిస్తున్న దృశ్యాలను చిన్నాపెద్దా తేడాలేకుండా సోఫాలు, కుర్చీలు ఎక్కీ మరీ తమ సెల్ఫోన్లలో బంధిస్తూ మురిసిపోయారు. భీమవరంలో మాజీ సీఎం వైఎస్ జగన్కు ఘనస్వాగతం హెలీప్యాడ్ నుంచి కల్యాణ మండపం వరకూ భారీ జనసందోహం భారీ వర్షాన్ని సైతం లెక్కచేయని యువత ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నుంచి తరలివచ్చిన నేతలు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు కుమారుడి వివాహానికి హాజరు -
పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలి
ఏలూరు (మెట్రో): జిల్లాలో అంటువ్యాధులు వ్యాపించకుండా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని, పాఠశాలలు, వసతి గృహాలలో గురువారం నాటికి పారిశుద్ధ్య కార్యక్రమాలు, తాగునీటి నీటి ట్యాంకులు శుభ్రపరిచే పనులను పూర్తి చేయించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి బుధవారం పారిశుద్ధ్యం, తాగునీటి వనరుల పరిశుభ్రత, విద్యార్థులకు ఫీవర్ సర్వే, వైద్య పరీక్షలు, జీఎస్టీ అవగాహన, సదరం క్యాంపుల నిర్వహణ, తదితర అంశాలపై కలెక్టర్ ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కోకో నాణ్యతపై దృష్టి పెట్టాలి కోకో సాగు, పంటకోత తర్వాత నిర్వహణలో ఆధునిక పద్ధతులపై వర్క్షాపులో కలెక్టరు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ నాణ్యమైన కోకో మంచి ధర పలుకుతుందని, దేశంలోనే ఏలూరు జిల్లా కోకో సాగులో మొదటి స్థానంలో ఉందని, అదే స్ఫూర్తితో నాణ్యమైన కోకో సాగు చేసేలా రైతులు దృష్టి పెట్టాలన్నారు. పటిష్ట చర్యలు తీసుకోవాలి జిల్లాలో ఎలాంటి బాణసంచా ప్రమాదాలు సంభవించకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి జిల్లాలో బాణసంచా ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, అనధికార తయారీ, నిల్వలు, అమ్మకాల నియంత్రణపై బుధవారం సాయంత్రం జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్తో కలిసి సమీక్షించారు. అలాగే ఔషధాలు, జీవిత, ఆరోగ్య బీమాపై జీఎస్టీ తగ్గింపు గురించి ప్రజలకు పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. -
వేడుకగా శ్రీచక్రస్నానం
● నేటితో ముగియనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు ● రేపటి నుంచి ఆర్జిత సేవలు పునఃప్రారంభం ద్వారకాతిరుమల: శ్రీవారి ఆశ్వయుజమాస దివ్య బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు బుధవారం స్వామివారికి శ్రీచక్ర స్నానాన్ని ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. ముందుగా శ్రీవారి గ్రామోత్సవాన్ని తొళక్క వాహనంపై క్షేత్ర పురవీధుల్లో అట్టహాసంగా జరిపారు. ఆ తరువాత ఆలయ యాగశాలలో స్వామి, అమ్మవార్లు, శ్రీచక్ర పెరుమాళ్ల ఉత్సవమూర్తులను ఒక వేదికపై వేంచేపు చేశారు. పూజాధికాల అనంతరం సుగంధ ద్రవ్యాలు, పంచ పల్లవులు, శ్రీచందనం, పసుపు, మంత్రపూత అభిషేక తీర్థంతో శ్రీచక్ర స్వామిని అభిషేకించారు. ఆ తరువాత శ్రీచక్ర పెరుమాళ్లతో పాటు ఉభయ నాంచారులకు, శ్రీవారికి తిరుమంజనాలు జరిపి, హారతులిచ్చారు. అభిషేక జలాన్ని భక్తుల శిరస్సులపై చల్లారు. సాయంత్రం ఆలయంలో నిత్యహోమ బలిహరణలు, పూర్ణాహుతి, అనంతరం ధ్వజ అవరోహణను అర్చకులు వేద మంత్రోచ్ఛరణలతో వైభవోపేతంగా నిర్వహించారు. అనంతరం అశ్వవాహనంపై స్వామి వారి తిరువీధి సేవ అట్టహాసంగా జరిగింది. అలాగే ఆలయ ముఖ మండపంలో శ్రీవారు వైకుంఠ నారాయణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. గురువారం రాత్రి జరగనున్న శ్రీపుష్ప యాగోత్సవంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయని, శుక్రవారం నుంచి ఆలయంలో నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను పునరుద్ధరిస్తామని ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో నేడు.. ● ఉదయం 8 గంటల నుంచి – భజనలు ● ఉదయం 9 గంటల నుంచి – చూర్ణోత్సవం, వసంతోత్సవం ● ఉదయం 9 గంటల నుంచి – భక్తి రంజని ● ఉదయం 10 గంటల నుంచి – కూచిపూడి నృత్య ప్రదర్శనలు ● సాయంత్రం 4 గంటల నుంచి – నాదస్వరకచేరి ● సాయంత్రం 5 గంటల నుంచి – హరికధ ● సాయంత్రం 6 గంటల నుంచి – కూచిపూడి నృత్య ప్రదర్శనలు ● రాత్రి 7 గంటల నుంచి – ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీ పుష్పయాగము ● ప్రత్యేక అలంకారం : శయన మహావిష్ణువు అశ్వ వాహనంపై క్షేత్ర పురవీధులకు పయనమైన శ్రీవారు ధ్వజ అవరోహణం అనంతరం ధ్వజ పటానికి హారతులిస్తున్న అర్చకులు శ్రీచక్ర స్నానం -
12న దక్షిణ భారత ఓబీసీ సెమినార్
మధురానగర్ (విజయవాడసెంట్రల్): సౌత్ ఇండియా ఓబీసీ సెమినార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ, కురుమ, కురవ సంఘం పదో వార్షికోత్సవం ఈ నెల 12న నిర్వహించనున్నట్లు సంఘం గౌరవాధ్యక్షుడు తట్టి అర్జునరావు, అధ్యక్షుడు జబ్బల శ్రీనివాసులు తెలిపారు. విజయవాడ దుర్గాపురం విజయ్ నర్సింగ్ కళాశాలలో బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ, కురుమ, కురవ సంఘం ఆధ్వర్యంలో సంఘ పదో వార్షికోత్సవం, సౌత్ఇండియా ఓబీసీ సెమినార్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెమినార్కు రాజకీయాలకు అతీతంగా దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన పలువురు ప్రముఖ నేతలు హాజరుకానున్నట్లు చెప్పారు. షెఫర్డ్ ఇండియా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ నార్త్ నుంచి 6 రాష్ట్రాలు, సౌత్ నుంచి 6 రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. అనంతరం తట్టి అర్జునరావు ఎన్నికల అధికారిగా ఆయన పర్యవేక్షణలో నూతన కార్యవర్గం ఎంపిక నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. -
తెలంగాణకు ఇసుక తరలిస్తున్న లారీల సీజ్
బుట్టాయగూడెం: ఏపీలోని కొవ్వూరు నుంచి తెలంగాణకు ఇసుక తరలిస్తున్న 5 లారీలను జీలుగుమిల్లి పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. ఎస్సై ఐ. క్రాంతికుమార్ ఆధ్వర్యంలో జీలుగుమిల్లి రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా కొవ్వూరు నుంచి తెలంగాణకు ఇసుక తరలిస్తున్న ఐదు లారీలు పట్టుబడ్డాయి. వీటిని జీలుగుమిల్లి స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై క్రాంతికుమార్ తెలిపారు. ఇసుక లారీల పట్టివేత కుక్కునూరు: ఇసుకను తెలంగాణాకు అక్రమంగా తరలిస్తుండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల పోలీసులు మంగళవారం వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు. అంతరాష్ట్ర సరిహద్దులోని బురుగువాయి గ్రామం వద్ద గల పాములేరు వాగు నుంచి సోమవారం రాత్రి లారీలలో ఇసుకను సరిహద్దులు దాటించే యత్నం చేసినట్టు సమాచారం. ఒక లారీలో ఇసుకను తరలించే క్రమంలో వాహనం డీజిల్ పైపు పగిలి వాహనం బురుగువాయి గ్రామంలో నిలిచిపోయింది. మంగళవారం ఉదయం వాహన డ్రైవర్, యజమాని మెకానిక్ను తీసుకొచ్చి రిపేర్ చేయించి తీసుకెళ్తుండగా తెలంగాణాలోని ములకలపల్లి పోలీసులు పట్టుకుని లారీని సీజ్ చేసి కేసు నమోదు చేశారు. -
చెత్త డంప్ను అడ్డుకున్న స్థానికులు
● నరసాపురం 28వ వార్డులో ఉద్రిక్తత ● ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం నరసాపురం: నరసాపురం మున్సిపాలిటీలో చెత్త డంప్ చేసే విషయంలో మంగళవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. స్థానికుల అభ్యంతరాలను పట్టించుకోకుండా, మున్సిపల్ అధికారులు దౌర్జన్యంగా చెత్తను డంప్ చేయడంతో పట్టణంలోని 28 వ వార్డులో ఉద్రిక్తత ఏర్పడింది. స్థానికులు చెత్త డంప్ను అడ్డుకోవడమే కాకుండా, కొందరు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడంతో పరిస్థితి అదుపు తప్పింది. పోలీసు బందోబస్తు మధ్య మున్సిపల్ అధికారులు ఇళ్ల మధ్య ఉన్న మున్సిపల్ స్థలంలో చెత్తను డంప్ చేశారు. మున్సిపాలిటీకి డంపింగ్ యార్డ్ లేకపోవడంతో ఏళ్ల తరబడి చెత్తను గోదావరి గట్టున పోస్తున్నారు. ఇటీవల చెత్త వేయొద్దని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇవ్వడంతో చెత్తను వేయడానికి మున్సిపాలిటీకి జాగా లేకపోయింది. దీంతో చెత్తను 28వ వార్డులో ఉన్న తుంగపాటి చెరువు వద్ద మున్సిపల్ స్థలంలో వేయాలని అధికారులు నిర్ణయించారు. తీవ్ర ఉద్రిక్తత : చెత్త వాహనాలు రాగానే స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు. దళితులు ఉండే ఇళ్ల మధ్య చెత్తను ఎలా వేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్త వాహనాలకు అడ్డంగా కూర్చుని నిరసన తెలిపారు. ఈ క్రమంలో ఇద్దరు యువకులు ఒంటిపై పెట్రోల్ పోసుకుని చెత్తను ఇక్కడ డంప్ చేస్తే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపుచేసే ప్రయత్నం చేశారు. చివరకు పోలీసుల సాయంతో చెత్తను మున్సిపల్ స్థలంలోనే డంప్ చేశారు. -
చిరుద్యోగుల పోరుబాట
బుధవారం శ్రీ 8 శ్రీ అక్టోబర్ శ్రీ 2025ఏలూరు (టూటౌన్): మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 8న రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించనున్నారు. గతంలో రాష్ట్ర వ్యాప్త సమ్మె విరమణ సందర్భంగా అప్పట్లో సంబంధిత అధికారులు కార్మిక సంఘాలతో చేసుకున్న ఏ ఒక్క ఒప్పందాన్ని, హామీని అమలు చేయక చేయకపోవడంతో ఉద్యోగులు, కార్మికులు ఆందోళన బాట పట్టేందుకు సన్నద్దమవుతున్నారు. మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణం 12వ పీఆర్సీ ప్రకటించి ఐఆర్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంజనీరింగ్ కార్మికులకు జీవో నెం.36 ప్రకారం నెలకు రూ.21 వేలు వేతనం ఇవ్వాలని, 2023 డిసెంబర్ సమ్మెకాలపు ఒప్పందాల అమలుకు తక్షణం జీవోలు విడుదల చేయాలని కార్మికులు, ఉద్యోగులు కోరుతున్నారు. రాష్ట్రంలోని మున్సిపల్ ఉద్యోగులు, కార్మికుల సమస్యలపై గతంలో సమ్మె చేసిన సమయంలో ప్రభుత్వం తరఫున ఒప్పందాలు కుదుర్చుకున్న అధికారులు ప్రతిపాదనలు తయారు చేసి ఫైనాన్స్ విభాగానికి పంపించారు. ఈ లోగా ఎన్నికల కోడ్ రావడంతో ఆ ఫైలు ముందుకు కదలలేదు. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మున్సిపల్ కార్మికులు, ఉద్యోగుల ఫైలును ఆమోదించకుండా ఫైనాన్స్ డిపార్టుమెంట్ వద్ద ఉన్న ఫైలును వెనక్కు రప్పించడం పట్ల మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ 2024 డిసెంబర్ 26 నుంచి దశలవారీగా ఆందోళనలు నిర్వహించారు. దీనిలో భాగంగా ఈనెల 8న ధర్నాలు నిర్వహించాలని యూనియన్ నిర్ణయించింది. చాలీచాలని వేతనం ఎన్నాళ్లు? మున్సిపల్ కార్మికులకు ఇచ్చేది కొద్దిపాటి వేతనమే. అయినా వారితో చేయించేది గొడ్డు చాకిరీ.. ఎప్పటికై నా తమ బతుకుల్లో వెలుగులు రాకపోతాయా? తమ సమస్యలు తీరకపోతాయా? అనే ఆఽశతో మున్సిపల్ కార్మికులు, ఉద్యోగులు మౌనంగా తమ విధులు నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఏడాది క్రితం సమ్మె చేశారు. సమస్యలు పరిష్కరిస్తామంటూ హామీలు ఇచ్చారు. వీటిలో ఏ ఒక్కటీ నెరవేరలేదు. దీంతో మళ్ళీ ఆందోళన బాట పట్టారు మున్సిపల్ కార్మికులు, ఉద్యోగులు. దీనిలో భాగంగా ఇప్పటికే మస్తర్ పాయింట్ల వద్ద తెల్లవారుజామున ఆందోళన చేశారు. 90 శాతం మంది ఆప్కాస్ ఉద్యోగులే ఏలూరు నగర పాలక సంస్థలో పనిచేసే ఉద్యోగులు, కార్మికుల్లో 90 శాతం మంది ఆప్కాస్ ఉద్యోగులే ఉన్నారు. ఏలూరు నగర పాలక సంస్థలో దాదాపు 1,170 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా వీరిలో పర్మినెంట్ ఉద్యోగులు కేవలం 250 మంది మాత్రమే ఉన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులు 800 మంది, స్కూల్ స్వీపర్లు 120 మంది పనిచేస్తున్నారు. ఈ లెక్క ప్రకారం దాదాపు వెయ్యి మంది ఉద్యోగులు, కార్మికులు అంతా ఆప్కాస్ ఉద్యోగులే. సమస్యల పరిష్కారం కోరుతూ రోడ్డెక్కుతున్న మున్సిపల్ కార్మికులు సమ్మె కాలపు ఒప్పందాలకు జీవోలు ఇవ్వాలని డిమాండ్ ఇంజనీరింగ్ కార్మికులకు రూ.21 వేలు చేయాలి నేడు మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో ధర్నాలు -
న్యాయవాదుల నిరసన
జంగారెడ్డిగూడెం: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయిపై దాడిని జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ ఖండించింది. జిల్లా ఫెడరేషన్ పిలుపుమేరకు మంగళవారం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జీఎస్ఆర్ మూర్తి ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి, స్థానిక కోర్టు ప్రాంగణం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు నల్లబాడ్జీలు ధరించి నిరసన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో న్యాయవాదులు పి.లక్ష్మణరావు, పీవీ కృష్ణరెడ్డి, విత్తనాల రత్నరాజు, మానికల సూరిబాబు, సీహెచ్డీవీ కోటేశ్వరరావు, కాపుదాసు వెంకటేశ్వరరావు, మాండ్రు మోహన్రావు, జువ్వాల బాబ్జి, పిల్లి పెద్దిరాజు, మనెల్లి గంగరాజు, వింజమూరి కిరణ్, కురిమెళ్ల హరి, బండారు లతాకుమారి తదితరులు పాల్గొన్నారు. సీజేఐపై దాడిని ఖండించిన ‘ఐలు’ ఏలూరు (టూటౌన్): భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్పై దాడిని ఆలిండియా లాయర్స్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తుందని ఐలు రాష్ట్ర కమిటీ సభ్యులు కట్టా సత్యనారాయణ, గెద్దా విజయభాస్కర్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మతోన్మాదుల బరితెగింపునకు, సనాతన వాదుల దుశ్చర్యకు, సంఘ పరివార్ విద్వేషానికి ప్రతిబింబమే ఈ సంఘటన అని అన్నారు. న్యాయ వ్యవస్థపై, రాజ్యాంగంపై జరిగిన దాడి అని, ఈ సందర్భంగా సీజేఐకు అంతా సంఘీభావంగా నిలవాలన్నారు. బుట్టాయగూడెం: గిరిజన సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించేవారిపై చర్యలు తప్పవని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ అన్నారు. సభ్యులు రెండోరోజు మంగళవారం బుట్టాయగూడెం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా పులిరామన్నగూడెం, రెడ్డిగూడెం గ్రామాలను సందర్శించారు. ఆయా గ్రామాల్లో గిరిజనుల పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఐటీడీఏ సమావేశ మందిరంలో వినతులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గిరిజన సంక్షేమం కోసమే జాతీయ ఎస్టీ కమిషన్ పనిచేస్తుందన్నారు. గిరిజన సమస్యల పట్ల అలసత్వం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అండ్ ఆర్ ప్యాకేజీకి సంబంధించి అర్హులను గుర్తించి వారికి అందేలా కృషి చేయాలని కోరారు. వంకవారిగూడెం నేవీ డిపో ఏర్పాటుపై అభ్యంతరాలు తెలుపుతూ గిరిజన సంఘాల నాయకులు, గిరిజనులు హుస్సేన్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ రాములు నాయక్, ఇన్చార్జ్ ఆర్డీఓ ముక్కంటి తదితరులు పాల్గొన్నారు. ఏలూరు(మెట్రో): మహర్షి వాల్మీకి జయంతి మహోత్సవాలు కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. కలెక్టరు కె.వెట్రిసెల్వి ముఖ్యఅతిథిగా పాల్గొని, మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ వాల్మీకి మహర్షికి మనమందరం రుణపడాల్సిన అవసరం ఉందన్నారు. -
12వ పీఆర్సీ ప్రకటించాలి
రాష్ట్ర ప్రభుత్వం తక్షణం 12వ పీఆర్సీ ప్రకటించాలి. ఐఆర్ ఇవ్వాలి. 2023 జూలై నుంచి ఎరియర్స్ చెల్లించాలి. జీపీఎఫ్ ఖాతాలు తెరవాలి. మూడు సంవత్సరాల సరెండర్ లీవుల వేతనాలు చెల్లించాలి. మున్సిపల్ కార్మికులు, ఉద్యోగుల పట్ల పాలకులు చిన్నచూపు చూడటం తగదు. గత సమ్మె కాలపు ఒప్పందాల అమలుకు జీవోలు విడుదల చేయాలి. బి.సోమయ్య, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పారిశుద్ధ్య కార్మికులకు చాలీ చాలని వేతనాలు అందిస్తుండటంతో మా కుటుంబ పోషణ కోసం అనేక ఇబ్బందులు పడుతున్నాం. పెరిగిన నిత్యావసరాల ధరలు, పెంచిన విద్యుత్ ఛార్జీలు, ఇంటి అద్దెలు భారంగా మారాయి. పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలి. – అంగులూరి జాన్ బాబు, మున్సిపల్ కార్మికుడు, ఏలూరు కార్పొరేషన్ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు జీవో నెం.36 ప్రకారం కనీస వేతనం రూ.21 వేలు ఇవ్వాలి. స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాల అమలుకు ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫార్సులు అమలు చేయాలి. టూల్ కిట్స్, యూనిఫారం అందించాలి. వారాంతపు సెలవులు, జాతీయ, పండుగ సెలవులు, సీఎల్లు అమలు చేయాలి. – కలం సాంబశివరావు, ఇంజనీరింగ్ విభాగం వర్కర్, ఏలూరు కార్పొరేషన్ రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.75 వేలు ఇచ్చేలా జీవో ఇవ్వాలి. రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలు పెంచేందుకు. దహాన సంస్కారాల ఖర్చులు రూ.20 వేలకు పెంచే హామీకి తక్షణం జీవోలు ఇవ్వాలి. పారిశుద్ధ్య కార్మికులకు యూనిఫాం, చెప్పులు, సబ్బులు, కొబ్బరినూనెలు అందించాలి. కనీస వేతనం రూ.21 వేలు చెల్లించాలి. పి.దుర్గ, పారిశుద్ధ్య విభాగం వర్కర్, ఏలూరు కార్పొరేషన్ -
దివ్య రథంపై.. దేవదేవుడి విహారం
● ద్వారకాతిరుమలలో వైభవంగా శ్రీవారి రథోత్సవం ● నేడు చక్రస్నానం, ధ్వజావరోహణం ● ఉదయం 8 గంటల నుంచి – భజనలు ● ఉదయం 9 నుంచి – భక్తిరంజని ● ఉదయం 10.30 నుంచి–చక్రవారి, అపభృదోత్సవం ● ఉదయం 11 నుంచి–కూచిపూడి నృత్య ప్రదర్శనలు ● సాయంత్రం 4 నుంచి – నాదస్వర కచేరి ● సాయంత్రం 5 నుంచి – బుర్రకథ ● సాయంత్రం 6 నుంచి–కూచిపూడి నృత్య ప్రదర్శనలు ● రాత్రి 8 గంటల నుంచి – భక్తిరంజని ● రాత్రి 9 గంటల నుంచి – నాటకం ● రాత్రి 9 గంటల నుంచి – ధ్వజావరోహణ, అనంతరం అశ్వ వాహనంపై గ్రామోత్సవం ● ప్రత్యేక అలంకారం : వైకుంఠ నారాయణుడు ద్వారకాతిరుమల: బ్రహ్మోత్సవ వేళ.. బ్రహ్మాండనాయకుడిని దర్శించిన వారిది కదా భాగ్యము.. భువి వైకుంఠంలో అడుగిడిన వారిది కదా పుణ్యము.. ఆనందంతో దేవదేవుని కనులారా కాంచిన వారిది కదా జన్మ ధన్యము.. మహిమాన్విత రథంపై క్షేత్ర పురవీధుల్లో ఊరేగుతున్న శ్రీవారిని సేవించిన వారు కదా పునీతం.. గోవింద నామస్మరణలతో పులకించిన వారిది కదా ముక్తి మార్గం.. రథ వాహనంలో విహరిస్తున్న అలంకార ప్రియుడి కటాక్షం పొందిన వారి జీవితం కదా చరితార్ధం. ద్వారకాతిరుమల శ్రీవారి ఆశ్వయుజమాస దివ్య బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. మంగళవారం రాత్రి ఉభయ దేవేరులతో కలసి దేవదేవుడు దివ్య రథంపై క్షేత్ర పురవీధుల్లో అట్టహాసంగా ఊరేగారు. తొలుత ఆలయంలో అర్చకులు స్వామి, అమ్మవార్లను తొళక్క వాహనంపై ఉంచి, పూజాధికాలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాట భజనలు, అర్చకులు, పండితులు, ఆగమ విద్యార్థుల వేద మంత్రోచ్ఛరణల నడుమ వాహనాన్ని రథం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ రథంలో ఏర్పాటు చేసిన సింహాసనంపై కల్యాణ మూర్తులను ఉంచి, విశేష పుష్పాలంకారాలు చేసి హారతులిచ్చారు. అనంతరం ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్వీఎన్ఎన్ నివృతరావు, డీఈఓ భద్రాజీ, ఈఈ డీవీ భాస్కర్, డీఈ, ఏఈఓలు, సూపరింటిండెంట్లు పూజలు నిర్వహించి, బలిహరణను సమర్పించగా, రథోత్సవం ప్రారంభమైంది. డప్పు వాయిద్యాలు, వేషధారణలు, భక్తుల గోవింద నామస్మరణల నడుమ శ్రీవారి దివ్య రథం క్షేత్ర పురవీధుల్లో తిరుగాడింది. స్వామివారి దివ్య దర్శనంతో భక్తులు పులకించారు. రథోత్సవంలో దేవదేవుడిని సేవించిన వారికి పునర్జన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే అశేష భక్తజనులు గోవింద నామస్మరణలతో మహా రథం లాగుతూ తన్మయత్వం చెందారు. -
కొల్లేరు కథ.. కంచికి చేరేనా!
● నేడు సుప్రీంకోర్టులో వాదనలు ● అటవీశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ కాంతిలాల్ సమీక్ష కై కలూరు: సుప్రీం కోర్టులో కొల్లేరు సమస్యలపై బుధవారం వాదనలు జరగనున్నాయి. దీంతో ఏలూరు కలెక్టరేట్ గౌతమి సమావేశ హాలులో ప్రజాప్రతినిధులు, అధికారులతో కీలక సమావేశం బుధవారం జరిగింది. కై కలూరు, దెందులూరు, ఉంగుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, చింతమనేని ప్రభాకర్, పత్సమట్ల ధర్మరాజు హాజరయ్యారు. అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే, అటవీ, పర్యావరణ శాఖల ప్రత్యేక కార్యదర్శి శరవనన్, కలెక్టర్ కె.వెట్రిసెల్వితో కొల్లేరు అంశాలపై చర్చించారు. అనంతరం తాడేపల్లి సీఎంవోలో కొల్లేరుపై సమావేశమయ్యారు. కొల్లేరు అభయారణ్య ఆక్రమణలపై విశ్రాంత బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి మృత్యుంజయరావు ఫిర్యాదుపై సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర సాధికారిత కమిటీ(సీఈసీ) ఈ ఏడాది జూన్లో జిల్లాలో రెండు రోజుల క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. నివేదిక తమకంటే తమకు అనుకూలంగా వస్తుందని పర్యావరణవేత్తలు, కొల్లేరు ప్రజాప్రతినిధులు ఎదురు చూస్తున్నారు. సీఈసీ అడిగిన వాస్తవ వివరాలను అటవీ, రెవెన్యూ, డ్రైనేజీ శాఖలు అందించలేదు. దీంతో పూర్తి స్థాయి సమాచారం పంపించాలని సీఈసీ కోరింది. కొల్లేరులో అక్రమ చేపల సాగు యథేచ్చగా సాగుతున్నా కూటమి నేతలను ఎదిరించి ఒక్క గట్టు ధ్వంసం చేయలేని స్థితిలో అటవీశాఖ అధికారులు ఉన్నారు. మరోపక్క కొల్లేరు అక్రమ చేపల చెరువుల ధ్వంసం సమాచారం ఇవ్వాలని సుప్రీంకోర్టు పదేపదే అడుగుతోంది. క్షేత్ర స్థాయి లెక్కలను చూపించడంలో అటవీ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. కొల్లేరు అంశాల అధ్యాయానికి వచ్చిన ప్రత్యేక సెక్రటరీ కాంతిలాల్ దండేకు కొల్లేరు నాయకుడు బలే ఏసురాజు ఆధ్వర్యంలో కొల్లేరు ప్రజలు వినతిపత్రాన్ని అందించారు. గోకర్ణపురం – చింతపాడు రహదారిలో 5 కిలోమీటర్ల రోడ్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని కోరారు. కొల్లేరు అభయారణ్యంలో 14,932 ఎకరాల జిరాయితీ, 5,510 ఎకరాల డీ–ఫాం భూములను మినహాయించి పేదలకు పంపిణి చేయాలని వినతిపత్రాల్లో కోరారు. -
12 గంటల పని విధానం రద్దు చేయాలి
ఏలూరు (టూటౌన్): పని గంటలు 12 గంటలకు పెంచడాన్ని నిరసిస్తూ కార్మిక కర్షక సంఘాల ఆధ్వర్యంలో ఏలూరు పాత బస్టాండ్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగిం చాలని 12 గంటల పని విధానాన్ని రద్దు చేయాలని నినదించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఆర్.లింగరాజు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్స్లో భాగంగానే రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం కార్మికులను బానిసలుగా మార్చే 12 గంటల విధానాన్ని తెచ్చిందని యజమానులకు కార్మికుల కష్టాన్ని మరింత దోచి పెట్టే ఈ చర్యను రాష్ట్రంలోని శ్రామిక వర్గం అంతా ఐక్యంగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. రైతు సంఘం (ఏఐకేఎస్) జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పిల్లి రామకృష్ణ, సీఐటీయూ నగర అధ్యక్ష, కార్యదర్శులు వై.కనకారావు, మంచెల్ల ఇస్సాకు పాల్గొన్నారు. -
బీచ్కు వచ్చే సందర్శకుల రక్షణకు చర్యలు తీసుకోవాలి
భీమవరం (ప్రకాశంచౌక్): పేరుపాలెం, కేపీ పాలెం బీచ్ సందర్శకుల రక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన బీచ్ సందర్శకుల రక్షణ ఏర్పాట్లపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ మైరెన్ పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ, బీచ్ సందర్శకులను అప్రమత్తం చేయడంతో పాటు, వారి భద్రతకు పటిష్టమైన చర్యలను చేపట్టాలన్నారు. పేరుపాలెం బీచ్లోని స్థానిక లా – ఆర్డర్ పోలీసులతో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను కూడా నిర్వహించాలని సూచించారు. పేరుపాలెం బీచ్లో కొత్త కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్ కోసం భూమిని సేకరించాలని ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, విశాఖపట్నం కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ డీఎస్పీ జి.బాలిరెడ్డి, అంతర్వేది మైరెన్ ఇన్స్పెక్టర్ నవీన్ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. మహర్షి వాల్మీకికి నివాళులు భీమవరం (ప్రకాశం చౌక్): రామాయణ మహా కావ్యాన్ని రచించి జాతికి సన్మార్గాన్ని నిర్దేశించిన మహోన్నత వ్యక్తి మహర్షి వాల్మీకి అని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డీఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వాల్మీకి జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. -
పశుగ్రాస వెతలకు చెక్
చింతలపూడి: రైతులకు వ్యవసాయంతో పాటు పశు పోషణ ఆర్థికంగా తోడ్పాటునిస్తుంది. ఈ నేపథ్యంలో పశు పోషణలో పశుగ్రాసం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. మెట్ట ప్రాంతంలో పాడి పశువులను పెంచుకునే రైతులు పశుగ్రాసం పండించడంలో మెలకువలు తెలుసుకుంటే మేలు జరుగుతుందని వ్యవసాయ సహాయ సంచాలకులు వై.సుబ్బారావు చెబుతున్నారు. వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఏర్పడిన సందర్భాల్లో పశువులకు పశుగ్రాసం కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ దశలో గ్రామీణ ప్రాంతాల్లో పాడిని నమ్ముకున్న రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. పశు పోషణలో 70 శాతం ఖర్చు మేతకే అవుతుందని తెలిసిందే. ఈ దశలో ప్రభుత్వం సబ్సిడీపై పశుగ్రాసం విత్తనాలను రైతులకు సరఫరా చేస్తున్నట్లు ఆయన చెప్పారు. వర్షాకాలంలో పశుగ్రాసం పండించుకుంటే వేసవిలో పశువుల పోషణకు ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. ఖాళీ ప్రదేశాల్లో.. ముఖ్యంగా మెట్ట ప్రాంతంలోని పండ్ల తోటల్లోని మొక్కల మధ్య ఖాళీ ప్రదేశాల్లో పప్పు జాతి పశుగ్రాసాలు అలసంద, ఉలవ, పిల్లిపెసర, జనుము, మొక్కజొన్న వంటి పంటలను సాగు చేయడం వల్ల పశుగ్రాసం కొరతను అధిగమించడంతో పాటు భూమిలో నత్రజని స్ధిరీకరించబడి భూసారం పెరిగే అవకాశాలు ఉంటాయని పేర్కొంటున్నారు. జనుము ఇది కాయజాతి పశుగ్రాసం. అన్ని నేలల్లోనూ అన్ని కాలాల్లో కొద్దిపాటి నీటితో కూడ పండించుకోవచ్చు. ఎకరానికి 12 కిలోల విత్తనాలను 50 కిలోల సూపర్ ఫాస్ఫేట్తో కలిపి చల్లాలి. విత్తిన తరువాత 40, 50 రోజులకు కోతకు వస్తుంది. ఈ మేతను పూత దశలో కోసి ఎండు మేతగా వినియోగించుకుంటే ఉపయోగం ఉంటుంది. పిల్లి పెసర వరి సాగు చేసే అన్ని భూముల్లో అంతర పంటగా దీన్ని సాగు చేసుకోవచ్చు. సాధారణ భూములకు పచ్చి రొట్టగా వాడితే భూమికి బలం చేకూరుతుంది. శీతాకాలంలో రబీ పంటగా ఈ పశుగ్రాసాన్ని సాగు చేసుకోవచ్చు. ఈ పశుగ్రాసం వేర్లలో నత్రజని బుడిపెలు ఉండటం వల్ల భూమి సారవంతమవుతుంది. వరి పంట కోయడానికి 3,4 రోజుల ముందు అంటే భూమిలో తేమ ఉన్నప్పుడే ఎకరానికి 10–15 కిలోల విత్తనాలను 50 కిలోల సూపర్ ఫాస్ఫేట్తో కలిపి చల్లుకోవాలి. 50 రోజుల్లో కోతకు వచ్చే ఈ పశుగ్రాసం వల్ల ఎకరానికి 10 నుండి 12 టన్నుల పచ్చి మేత లభిస్తుంది. ఇతర రకాలు ఇక పశుగ్రాస మొక్కజొన్నలో ఆఫ్రికన్ టాల్ రకం జె 1006–రకం, విజయ కాంపోజిట్ రకాలు 85 రోజులకు ఒకే సారి కోతకు వస్తాయి. పండ్ల తోటలు, పామాయిల్ తోటల్లో కూడ సాగు చేసుకోవచ్చు. రైతులకు అధిక పశుగ్రాసా దిగుబడులను అందిస్తాయి. పప్పు జాతి రకాలైన అలసంద(బొబ్బర్లు) రష్యన్ జైంట్, బుందేల్ లోబియ 1,2, ఇసి 4216–5287, కెబీసీ 2 మొదలైన రకాలు 55 నుండి 60 రోజుల్లో ఒకే కోతలో నాణ్యమైన పశుగ్రాసాన్ని అందిస్తాయి. వై సుబ్బారావు –వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ తోటల్లో ఖాళీ ప్రదేశాలను ఉపయోగించుకోవాలంటున్న నిపుణులు -
పెదవేగి ఎంఈఓ–1పై విచారణకు ఆదేశం
ఏలూరు (టూటౌన్): పెదవేగి ఎంఈఓ–1 పై జాతీయ ఎస్టీ కమిషన్ విచారణకు ఆదేశించింది. పెదవేగి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రామచంద్రపురంలో పనిచేస్తున్న పీఎస్ హెచ్ఎం జి.కృష్ణకు జూలై నెల జీతం చేయకుండా వేధించినందుకుగాను జాతీయ ఎస్టీ కమిషన్కు ఆగస్టు నెలలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన జాతీయ ఎస్టీ కమిషన్ గత నెల 19న జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారికి నోటీసులు జారీ చేసింది. దీంతో ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారి ఇటీవల పెదవేగి మండల విద్యాశాఖ అధికారి–1పై విచారణ చేసేందుకు ఏలూరు ఉప విద్యాశాఖ అధికారి ఎన్.రవీంద్ర భారతి, దెందులూరు ఎంఈఓ ఏవీఎన్వీ ప్రసాద్ లను విచారణ అధికారులుగా నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు. విచారణ నివేదికను ఈ నెల 12 లోగా తమకు అందించాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఏలూరు (టూటౌన్): ఏలూరు జిల్లా నుంచి చలో విజయవాడ పోరుబాట కార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో మహిళా ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు తరలి వెళ్లారు. ఈ ధర్నాకు 10 వేలు పై చిలుకు హాజరవ్వగా ఒక్క ఏలూరు జిల్లా నుంచే ఈ కార్యక్రమంలో సుమారు 1000 మందికి పైగా హాజరైనట్లు నాయకులు చెబుతున్నారు. బోధనేతర పనులను బహిష్కరించడంతో పాటు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఫ్యాప్టో చైర్మన్ జి.మోహన్, సెక్రటరీ జనరల్ యం.ఆదినారాయణ, కో–చైర్మన్లు జి. వెంకటేశ్వరరావు, జి.ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. దెందులూరు: హైదరాబాద్ నుంచి కురెళ్లగూడెం చేపల చెరువుకు వెళ్తున్న కోళ్ల వ్యర్థాల లారీని మంగళవారం గుండుగొలను వద్ద పట్టుకుని సీజ్ చేశామని దెందులూరు హెచ్సీ హమీద్ అన్నారు. ముందస్తు సమాచారంతో గుండుగొలను వద్ద లారీ పట్టుకున్నామన్నారు. ఈ నేరంతో సంబంధం ఉన్న ఐదుగురు నిందితుల పై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. -
విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి
చింతలపూడి: ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్కు గురై వ్యక్తి మృతి చెందిన సంఘటన చింతలపూడి మండలం కంచనగూడం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మానేపల్లి రవి (40) దేశవరం గ్రామంలో ఒక రైతు పొలంలో నడిచి వెళుతుండగా విద్యుత్ స్తంభం వద్ద ఉన్న ఏబీ స్విచ్ వైర్ తగిలి విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమా ర్టానికి తరలించారు. ఎస్సై కె.సతీష్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏలూరు (టూటౌన్): చెల్లని చెక్కు ఇచ్చిన కేసులో ఓ మహిళకు 6 నెలలు జైలు శిక్ష విధిస్తూ ఏలూరు స్పెషల్ మొబైల్కోర్టు మంగళవారం తీర్పు నిచ్చింది. ఏలూరు వన్టౌన్ పడమర వీధి గాంధీ మైదానంకు చెందిన ఉప్పాల అనూరాధ అనే వివాహిత కుటుంబ అవసరాల నిమిత్తం 2022, మే నెలలో ఏలూరుకు చెందిన మేడపాటి సుధాకరరెడ్డి వద్ద రూ.9 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఆ అప్పు తీర్చే క్రమంలో 2023, మే నెలలో రూ.6.50లక్షల కు చెక్కును సుధాకరరెడ్డికి ఇవ్వగా ఆయన ఆ చెక్కును బ్యాంకులో వేశారు. బ్యాంకు ఖాతాలో డబ్బులేనందున ఆ చెక్కు బౌన్స్ అయ్యింది. దీంతో సుధాకరరెడ్డి కోర్టును ఆశ్రయించారు. -
తప్పిన పెను ప్రమాదం
పెనుగొండ: పెనుగొండ సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయం వద్ద మంగళవారం ఉదయం జరిగిన ప్రమాదంలో పెనుప్రమాదం తప్పింది. మంగళవారం కావడంతో సుబ్రహ్మణేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు మోటార్ సైకిళ్లను వరుసగా పార్కింగ్ చేశారు. ఈ తరుణంలో నరసాపురం వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఓ మోటారు సైకిల్ను వేగంగా ఢీకొనడంతో మోటారు సైకిళ్లు అన్నీ గుట్టలుగా ఒకదానిపై ఒకటి పడిపోయాయి. అయితే, ప్రతి మంగళవారం యాచకులు ఈ మోటారు సైకిళ్లు పక్కనే కూర్చుని భక్తులను యాచిస్తుంటారు. కానీ, ఈ రోజు కొంచెం దూరంలో ఉండి యాచిస్తుండడంతో ప్రమాదంతో ఒక్కసారిగా అప్రమత్తమై పక్కకు తప్పుకున్నారు. అయితే మోటార్ సైక్లిస్టులు నష్టపరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. -
గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి
బుట్టాయగూడెం: గిరిజన ప్రాంతాల్లో పీఎం జన్మాన్ పథకం కింద విద్య, వైద్యం, విద్యుత్, తాగునీరు, రహదారి వంటి సదుపాయాలు మరింత మెరుగుపరిచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ అధికారులను ఆదేశించారు. మండలంలోని కేఆర్పురం ఐటీడిఏలో జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వితో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో గిరిజనులకు మంజూరు చేసి నిబంధనలపేరుతో నిలుపుదల చేసిన 26 ఇళ్లను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అలాగే తమకు సమస్యలు తెలియజేసేందుకు వచ్చిన గిరిజనులపై మర్యాదపూర్వకంగా ఉండాలని చెప్పారు. కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ పెద్దవాగు ప్రాజెక్టు మరమ్మతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి, ఇరిగేషన్ అధికారులకు ప్రతిపాదనలు పంపించామన్నారు. అనుమతులు రాగానే చర్యలు చేపడతామన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో జాతీయ ఎస్టీ కమిషన్ డైరెక్టర్ కళ్యాణ్ రెడ్డి, జిల్లా అటవీశాఖ అధికారి ఇ.సతీష్, ఐటీడిఏ పీఓ రాములు నాయక్, ఇన్చార్జి ఆర్డీఓ ముక్కంటి, పోలవరం ప్రాజెక్టు భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ సరళా వందనం తదితరులు పాల్గొన్నారు. -
వరిపైరులో పురుగుల పని పట్టండిలా
కై కలూరు: వరి పైరు చిరు పొట్ట దశలో ఉంది. ఈ దశలో వరిపైరుపై పురుగులు, తెగుళ్లు దాడి చేస్తున్నాయి. ఏలూరు జిల్లాలో 2,45,855 సాదారణ వరి విస్తీర్ణానికి గానూ 2,00,490 ఎకరాల్లో నాట్లు వేశారు. మొత్తం రైతులు 1,36,468 రైతులు ఉండగా, వీరిలో 32,074 మంది కౌలు రైతులు ఉన్నారు. ప్రస్తుత తరుణంలో పురుగుల వ్యాప్తిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను కై కలూరు మండల వ్యవసాయాధికారిణి ఆర్.దివ్య సూచనలు చేశారు. కాండం తొలుచు పురుగు నారుమడి దశ నుంచి ఈనిక దశ వరకు వరి పైరును కాండం తొలుచు పురుగు నష్టపరుస్తుంది. దీనినే మొవ్వు పురుగు, పీక పురుగు, తెల్లకంకి అంటారు. ఖరీఫ్లో తక్కువ నుంచి మధ్యస్తంగా, రబీలో మధ్యస్తం నుంచి ఎక్కువగా ఆశిస్తుంది. నారుమడిలో అశిస్తే మొక్కలు, పిలక దశలో ఆశిస్తే మొవ్వు చనిపోతుంది. ఈనిక దశలో ఆశిస్తే కంకి పాలు పోసుకోక తెల్ల కంకి ఏర్పడుతుంది గుడ్డు నుంచి వచ్చిన లార్వా కాండము కింద వైపు నుంచి లోపలికి ప్రవేశించి మొవ్వను తినేస్తోంది. నివారణ చర్యలు.. నారు పీకటానికి వారం రోజులు ముందు 5 సెంట్ల నారుమడికి 800 గ్రాముల కార్బోప్యూరాన్ 3జీ గుళికలను పలుచగా చల్లి మడిలోనే ఇంకేటట్లు చేయాలి. పిలక, దుబ్బు చేసే దశలో కార్బోప్యూరాన్ 3జీ గుళికలను ఎకరానికి 10 కిలోలు వేయాలి. ఎసిఫేట్ 75 ఎస్.పి.1.5 10 కిలోలు వేయాలి లేదా ఎసిఫేట్ 75 ఎస్పీ1.5 గ్రా, లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 ఎస్పీ 2 గ్రా, లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. అంకురం నుంచి చిరుపొట్ట దశలో కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4జీ గుళికలు 8 కిలోలు, లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.4 శాతం గుళికలు 4 కిలోలు వేయాలి. ఆకుముడత పంట నాటిన దగ్గర నుంచి పోటాకు దశ వరకు ఆకుముడత ఆశిస్తుంది. దీనినే నాము, తెల్ల తెగులు అంటారు. ఇది సీతాకోక చిలుకలగా ముదురు గోధుమ రంగులో ఉండి రెక్కల అంచుల మధ్య సన్నని నల్ల గీతలుంటాయి. పొలంలో నడస్తూ ఉంటే గుంపులు గుంపులుగా ఎగిరే రెక్కల పురుగులను బట్టి అకుముడతను గుర్తించవచ్చు. ఆలస్యంగా నాటిన పొలాల్లో, వర్షభావ పరిస్థితులలోను, చుట్టూ నీడ ప్రదేశాలు ఉండటం, నత్రజని ఎరువు అధిక మోతాదులో వాడటం వల్ల దీని ఉదృతి పెరుగుతుంది. పొటాకు దశలో దుబ్బుకి 1 నుంచి 2 కొత్తగా తెల్లగా గీకబడిన ఆకులు, వాటిలో చిన్న లార్వాలు గమనించిన వెంటనే సస్యరక్షణ చేపట్టాలి. నివారణ చర్యలు పరాన్నజీవులైన ట్రైకోగ్రామా ఖిలోనిస్ను ఎకరాకు 20,000 చొప్పున మూడు సార్లు వదలాలి. పిలక దశలో చేనుకు అడ్డంగా తాడును 2–3 సార్లు లాగితే పురుగులు పడిపోతాయి. నివారణకు క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ, లేదా ఎసిఫేట్ 1.5 గ్రా, లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పొట్ట ఆకు దశలో కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 ఎస్పీ 2 గ్రా, లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 20 ఎస్పీ 0.4 మిల్లీ గ్రాములు, లేదా ఫ్లూబెండామైడ్ 20 డబ్యూడీజీ 0.25 గ్రా, లేదా ప్లూబెండమైడ్ 48 ఎస్పీ 0.1 మి.లీ, లీటరు నీటికి కలిపి కై కలూరు మండల వ్యవసాయాధికారిణి ఆర్.దివ్యచిరు పొట ్టదశలో వరిపైరుకు పురుగుల బెడద పిచికారీ చేయాలి. లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4జీ 8 కిలోల లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.4 శాతం 4 కిలోలు గుళికలు ఎకరాకు చొప్పున వేయాలి. సుడిదోమ నారుమడి, పిలక, పొట్ట, ఈనిక దశల్లో దోమలు నీటి మట్టంపై ఉంటూ దుబ్బుల నుంచి రసం పీల్చడం ద్వారా నష్టాన్ని కలుగిస్తాయి. వీటిలో దోమపోటు, గోధుమ వర్ణపు దోమ, తెల్ల మచ్చ దోమలు కీలకమైనవి. వీటి ఉదృతి ఎక్కువైతే పొలం ఎండి పడిపోవటం, తాలు గింజలు, నూర్చినప్పుడు నూక అవుతుంది. తొలి దశలో రసాన్ని పీల్చడం వల్ల పైరు లేత పసువు వర్ణానికి మారుతుంది. ఉదృతి పెరిగే కొద్ది పైరు సుడులు సుడులుగా వలయకారంలో ఎండిపోతూ ఉంటాయి. నత్రజనిని అధిక మోతాదు, కాలి బాటలు తీయని పొలాల్లో, పైరు తొలిదశలో ఆకులను ఆశించే పురుగుల నివారణకు క్లోరిపైరిఫాస్, ప్రొఫెనోఫాస్, సింథటిక్ పైరథ్రాయిడ్ మందులను వాడినపుడు ఈ పురుగు ఉధృతి ఎక్కువవుతోంది. నివారణ చర్యలు పిలకల దశలో దుబ్బుకు 10 దోమలు, ఈనిక దశలో దుబ్బుకు 20–25 దోమలు గమనించిన వెంటనే సస్యరక్షణ చేపట్టాలి. వరి నాటేటప్పుడు ప్రతి 2 మీటర్లకు 20 సెంటీ మీటర్ల బాటలు తీయాలి. దీని నివారణకు లీటరు నీటికి ఎసిఫేట్ 1.5 గ్రా,లేదా మోనోక్రోటోఫాస్ 2.2 మి.లీ లేదా ఇథోఫెనోప్రాక్స్ 2 మి.లీ, లేదా ఫెనోబుకార్బ్ 2 మి.లీ, లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25 మి.లీ, లేదా థయోమిథాక్సామ్ 0.2 గ్రా, లేదా బుప్రోఫెజిన్ 1.6 మి.లీ, లేదా పైమెట్రోజైన్ 0.6 గ్రా, లేదా ట్రైవ్లూమిజోఫైరిమ్ 0.486 మి.లీ, పిచికారీ చేయాలి. -
మద్ది అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ
జంగారెడ్డిగూడెం: మండలంలోని గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో మంగళవారం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు అంజన్నను దర్శించుకున్నారు. ఆలయంలో స్వామి వారికి నిత్య కై ంకర్యాలతో పాటు, నాగవల్లీ దళాల(తమలపాకులు)తో అష్టోత్తర పూజలు నిర్వహించారు. ఆలయ ఈఓ ఆర్వీ చందన మాట్లాడుతూ ఆలయానికి మధ్యాహ్నం వరకు వివిధ సేవల రూపేణా రూ. 2,07,725 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. అలాగే స్వామి వారి అన్నప్రసాదాన్ని 1868 మంది భక్తులు స్వీకరించారని పేర్కొన్నారు. అలాగే బుధవారం ఉదయం 8 గంటల నుంచి స్వామి వారి హుండీల ఆదాయాన్ని లెక్కిస్తున్నట్లు స్పష్టం చేశారు.వార్డెన్కు ఐదేళ్ల జైలు శిక్ష భీమవరం అర్బన్: భీమవరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వార్డెన్ చేసిన నేరాలు రుజువు కావడంతో మంగళవారం ఐదేళ్లు జైలు, రూ. 5 వేలు జరిమానా విధించినట్లు రూరల్ ఎస్సై ఐ.వీర్రాజు తెలిపారు. భీమవరంలోని విష్ణు కళాశాలలో హాస్టల్ వార్డెన్గా బన్నరావూరి వెంకట సుదాకర్ విధులు నిర్వహిస్తూ విద్యార్థుల నుంచి హాస్టల్ ఫీజు వసూలు చేసి కళాశాల యాజమాన్యానికి కట్టకపోవడంతో 2020లో అప్పటి ఎస్సై కె.సుధాకర్రెడ్డి కేసు నమోదు చేశారు. మంగళవారం కేసు విచారణకు రావడంతో వార్డెన్ బన్నరావూరి వెంకట సుధాకర్ చేసిన నేరాలు రుజువు కావడంతో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి, మెజిస్ట్రేట్ భీమవరం జి.సురేష్ బాబు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారని పేర్కొన్నారు. -
జిల్లా బాలికల క్రీడా జట్లకు 70 మంది ఎంపిక
తణుకు అర్బన్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–19 విభాగంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా బాలికల క్రీడా జట్ల ఎంపికలు తణుకు ఎస్కేఎస్డీ మహిళా జూనియర్ కళాశాలలో మంగళవారం నిర్వహించారు. చదరంగం, ఖోఖో, వాలీబాల్, యోగా, బాల్ బ్యాడ్మింటన్, టెన్నీకాయిట్, త్రోబాల్ విభాగాల్లో ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి 200 మంది క్రీడాకారులు హాజరుకాగా 70 మంది ఎంపికయ్యారని వారిలో 25 మంది ఎస్కేఎస్డీ మహిళా కళాశాల విద్యార్థులు ఉన్నట్లుగా ప్రిన్సిపాల్ భూపతిరాజు హిమబిందు తెలిపారు. కళాశాల జాయింట్ సెక్రటరీ చిట్టూరి వెంకట కృష్ణారావు జట్ల ఎంపికలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ జిల్లా సెక్రటరీ కె.జయరాజు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ యు.లక్ష్మీసుందరీబాయ్, ఎస్డీ కళాశాల ప్రిన్సిపల్ వీవీ సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.మద్యం తాగి వాహనాన్ని నడిపిన వ్యక్తికి జైలుభీమడోలు: డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వ్యక్తికి ఏలూరులోని మేజిస్ట్రేట్ 14 రోజుల జైలు శిక్షక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారని భీమడోలు సీఐ యూజే విల్సన్ మంగళవారం రాత్రి విలేకరులకు తెలిపారు. భీమడోలులోని రహదారి ప్రమాదాల నివారణ కోసం ట్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమంలో వాహనాలను తనిఖీలు చేశామన్నారు. ఈ డ్రైవ్లో ఆర్జావారిగూడెంలోని పూనూరి ప్రవీణ్కుమార్ మద్యం సేవించి వాహనాన్ని నడుపుతున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశామని వివరించారు. ముద్దాయికి ఏలూరులోని మేజిస్ట్రేట్ కేవీఆర్ మహేశ్వరి సెక్షన్ 185 ఎంవీఐ అండ్ సెక్షన్ 284 యాక్ట్ కింద జైలు శిక్ష విధించారని స్పష్టం చేశారు.ముగ్గురికి జరిమానాచింతలపూడి: మండలంలోని యండపల్లి గ్రామంలో ఎస్సై కె.సతీష్కుమార్ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ముగ్గురు వ్యక్తులు మద్యం తాగారని గుర్తించి, కేసు నమోదు చేసిన చింతలపూడి కోర్టులో మంగళవారం హాజరుపరిచారు. సివిల్ కోర్టు జడ్జి సీహెచ్ మధుబాబు ఒక్కొక్కరికి రూ. 10 వేలు చొప్పన జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. -
టీఈటీపై రివ్యూ పిటిషన్ వేయాలి
భీమవరం: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఈటీ) విషయంలో సుప్రీంకోర్టు తీర్పుపై కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని పీఆర్టీయూ జిల్లా నాయకులు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మను కోరారు. సోమవారం కేంద్రమంత్రిని మంత్రి క్యాంపు కార్యాలయంలో కలసి వినతిపత్రం అందచేశారు. ఈ సందర్బంగా పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ఎల్వీ చలం, ఎం.శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి బి.త్రినాథ్ మాట్లాడుతూ.. విద్యాహక్కు చట్టం 2009 అమలులోకి రాకముందు నియామకం పొందిన ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించేలా ఎన్సీటీఈ మార్గదర్శకాలలో సవరణ చేయాలని, పదోన్నతి కోసం ఈవో, జీవో పరీక్షలు పాస్ అవుతున్నామని మరల టెట్ కూడా పాస్ కావాలనే నిబంధనను పునఃసమీక్ష చేయాలని కోరుతున్నట్లు చెప్పారు. -
మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ కమిటీ ఎన్నిక
ఏలూరు (టూటౌన్): రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న నర్సింగ్ స్టాప్, ల్యాబ్ టెక్నీషియన్లు, ఆఫీస్ స్టాప్ తదితర విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ నిరంతరం పోరాడుతుందని ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.లక్ష్మణ మూర్తి తెలిపారు. సోమవారం జిల్లా సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ బ్రాంచ్ ఎన్నికలు జరిగాయి. అధ్యక్షుడిగా ఎం.రవికుమార్, కార్యదర్శిగా డి.లక్ష్మణమూర్తి, కోశాధికారిగా వి.శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా టీఎస్ ఆచారి, ఎం.కిషోర్, బి.సందీప్, జి.రాజకుమార్, కే.మణి, కే శేషు, సహాయ కార్యదర్శులుగా పి.అరుణ్ గోపాల్, శేఖర్, ఎం.హరిబాబు, పి.లోకేష్, ఎన్.బేబీ అనురాధ, సీహెచ్ అశోక్ కుమార్ ఎన్నికయ్యారు. -
ఘాట్ రోడ్డులో దూసుకెళ్లిన కారు
ద్వారకాతిరుమల: శ్రీవారి కొండపైన ఘాట్ రోడ్డులో ఫుట్పాత్ పైకి ఆదివారం రాత్రి ఓ కారు దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ భక్తులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికుల కథనం ప్రకారం.. కారు టోల్ గేట్ మీదుగా కొండపై నుంచి కిందకి వేగంగా వస్తోంది. కేశఖండన శాఖ సమీపానికి వచ్చేసరికి కారు అదుపుతప్పి ఒక్కసారిగా ఫుట్పాత్ పైకి దూసుకెళ్లింది. అయితే ఫుట్పాత్పై భక్తుల సౌకర్యార్ధం దేవస్థానం నిర్మించిన ఫెడస్టల్ షెడ్డు పోల్స్ను ఢీకొట్టి కారు నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం కాగా, షెడ్డు పోల్స్ నేలకొరిగాయి. కారులో ఉన్న వారికి ఏమీ కాలేదు. -
ప్రాధాన్యం దక్కేనా..?
సాక్షి ప్రతినిధి,ఏలూరు: ఆరుగాలం శ్రమించి పంట చేతికందే సమయానికి ఒక వైపు ప్రభుత్వ నిర్లక్ష్యం, మరోవైపు ప్రకృతి ప్రకోపంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏటా వ్యవసాయం కష్టతరంగా మారుతున్న నేపథ్యంలో వీటిని అధిగమిస్తూ సాగు చేస్తున్నాడు. అయినా ఎరువులు రూ పంలో, వరదల రూపంలో రైతులు అవస్థలు పడు తూనే ఉన్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా కోతలకు రైతులు సిద్ధమవుతున్నారు. మరో వారం, పది రోజుల్లో కోతలు కోసి వరిని ఒబ్బిడి చేసేందుకు సిద్ధపడుతున్నారు. రెండు సీజన్లుగా దళారుల రాజ్యం జిల్లావ్యాప్తంగా 1,97,985 ఎకరాల్లో వరిని సాగు చేయగా 2,72,939 ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో ప్రధాన పంట అయిన వరి దిగుబడులు ఏటా తగ్గుతున్నాయి. అయితే ప్రస్తుతం దిగుబడులు తగ్గినా ప్రభుత్వం ఆదుకోకపోయినా రైతులు మాత్రం వరిని సమృద్ధిగా సాగుచేస్తున్నారు. మెట్ట ప్రాంతమైన ఏలూరు జిల్లాలో 1,97,985 ఎకరాలకుగాను 5.73 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా వేశారు. దీనిలో 4 లక్షల టన్నుల వరిని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే గతంలో ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేసి రైతులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకునేది. రైతు భరోసా కేంద్రం ద్వారా గ్రామగ్రామానా రైతులకు అండగా నిలుస్తూ ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకునేది. అయితే గత రెండు సీజన్లుగా ధాన్యం దళారుల బారిన పడుతోంది. దళారులే రంగ ప్రవేశం చేసి ధాన్యాన్ని తక్కువ రేటుకు కొనుగోలు చేస్తూ రైతులను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుత సీజన్ మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులకు పూర్తి న్యాయం జరిగే విధంగా కొనుగోలు జరుగుతుందా లేదా అనేది ప్రశ్నార్థకమే. జిల్లా పౌరసరఫరాల శాఖ ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నా గోనె సంచుల దగ్గర నుంచి ధాన్యం సరఫరా వరకూ రైతులు ప్రతి సీజన్లో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. వీటిని ఈసారైనా అధిగమించి ధాన్యం కొనుగోలులో ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. రబీలో రైతులకు చుక్కలు ఈ ఏడాది రబీ సీజన్లో అన్నదాతకు ప్రభుత్వం చుక్కలు చూపించింది. కొనుగోళ్లకు టార్గెట్లు నిర్దేశించడం, సకాలంలో రైతుసేవా కేంద్రాలు ప్రారంభించకపోవడం, అలాగే నగదు చెల్లింపులు ఆ లస్యం కావడంతో సమస్యలు తీవ్రమయ్యాయి. ప్రధానంగా రబీ సీజన్లో 77 వేల ఎకరాల సాగు విస్తీర్ణంలో 3.53 లక్షల టన్నులు దిగుబడి కాగా 50 శాతం మేరకే కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు అనివార్యంగా తక్కువ ధరకు దళారులకు అమ్మిన పరిస్థితి. అలాగే 24 గంటల్లో నగదు చెల్లింపులు చేస్తామని చెప్పి నెలలు తరబడి ఎదురుచూసేలా చేశారు. మే నెల మొదటి వారానికి రబీ కొనుగోళ్లు పూర్తయినా జూలై నెలాఖరు వరకు చెల్లింపులు జరిపారు. నెలాఖరు నుంచి ఖరీఫ్ కోతలు 5.73 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి 2.50 లక్షల టన్నుల కొనుగోలుకు ప్రభుత్వం సన్నాహాలు కొనసాగుతున్న ఈ–క్రాప్ ప్రతి సీజన్లోనూ రైతులకు ఇబ్బందులు జిల్లావ్యాప్తంగా రైతులను వారు సాగు చేసిన పంటల ఆధారిత కార్యక్రమం ఈ–క్రాప్ బుకింగ్ను ప్రస్తుతం నమోదు చేసే పనిలో జిల్లా వ్యవసాయ శాఖ నిమగ్నమైంది. ఈ ప్రక్రియ తుదిదశకు చేరుకున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం 4,40,040 ఎకరాల విస్తీర్ణంలో ఈ–క్రాప్ బుకింగ్ను వ్యవసాయ అధికారులు పూర్తి చేశారు. 92 శాతం పైబడి ఈ–క్రాప్ బుకింగ్ ప్రక్రియ పూర్తయింది. మరో రెండు, మూడు రోజుల్లో వంద శాతం ప్రక్రియను పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. దీని అనంతరం ధాన్యం కొనుగోలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ప్రకృతి రైతులపై పగబట్టినట్లు వ్యవహరిస్తోంది. కోతలు ప్రారంభం కానున్న సమయంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆకస్మాత్తుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోతలు కోసే సమయంలో వరుణుడు ప్రకోపిస్తే మాత్రం రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఒకవైపు వ్యవసాయశాఖ, మరోవైపు పౌరసరఫరాల శాఖతో పాటుగా ప్రభుత్వం, ప్రకృతి సహకరించి రైతులకు నష్టం వాటిల్లకుండా చూడాల్సి ఉంది. -
ఉత్తమ సేవలే లక్ష్యం
ఏలూరు టౌన్: ప్రజలకు పోలీస్ శాఖ ద్వారా ఉత్తమ సేవలు అందించటమే లక్ష్యంగా పనిచేయాలనీ, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాలను నిరోధించటంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ అన్నారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తంగా 45 ఫిర్యాదులు రాగా వీటిలో అత్యధికంగా భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, కుటుంబ సమస్యలు, మోసపూరిత ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు మోసాలు, ఆర్థిక, సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.జిల్లాలో ప్రజా సమస్యలపై సత్వరమే స్పందిస్తున్నామన్నారు. కై కలూరు: కొల్లేరు సమస్యల చిక్కుముడులు వీడటం లేదు. కేంద్ర సాధికారత కమిటీ (సీఈ సీ) ఈ ఏడాది జూన్లో కొల్లేరులో క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. సుప్రీంకోర్టుకు నివేదిక అందించాల్సి ఉంది. స్థానిక అటవీ, రెవెన్యూ, డ్రెయినేజీ, పొల్యూషన్ బోర్డు నుంచి పూర్తి సమాచారం చేరకపోవడంతో నివేదిక ఆ లస్యం అవుతోంది. ఈ నేపథ్యంలో కొల్లేరు పరిరక్షణకు పర్యావరణ వేత్త మృత్యుంజయరావు వేసిన ప్రజాప్రయోజనాల వాజ్యంపై బుధవారం సుప్రీంకోర్టులో వాదనలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ కేసు పలుమార్లు వాయిదాలు పడుతూ వస్తోంది. కొల్లేరు అభయారణ్యంపై పూర్తి సమాచారంతో మంగళవారం ఢిల్లీకి రావాలని ఇప్పటికే ఏలూరు జిల్లా అటవీశాఖ అధికారులకు సీఈసీ నుంచి వర్తమానం వచ్చింది. దీంతో అటవీ అధికారులు దస్త్రాలను సిద్ధం చేసుకున్నారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి క్రాంతిలాల్ దండే ఇటీవల నియామితులయ్యారు. రాష్ట్రం తరఫున వాస్తవ పరిస్థితులను కేంద్రం, సీఈసీకి తెలియజేయాల్సిన బాధ్యత ఉండటంతో ఆయన కొల్లేరు అధ్యయనానికి మంగళవారం ఉద యం 10 గంటలకు ఏలూరు కలెక్టరేట్కు రానున్నా రు. కై కలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, కలెక్టర్ వెట్రిసెల్వి, అటవీ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కొల్లేరు సమస్యలపై రాష్ట్ర అధికారులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఏలూరు (టూటౌన్): ఆంధ్రప్రదేశ్ భారతీయ విజ్ఞాన మండలి, ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆంధ్రప్రదేశ్ సిటీ సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వ సంస్థల్లో విద్యార్థులకు కౌశల్ ప్రతిభా పోటీలు నిర్వహిస్తున్నట్టు జిల్లా కౌశల్ కో–ఆర్డినేటర్ జె.విజయరత్న బాబు, జాయింట్ కో–ఆర్డినేటర్ ఐఎస్ఎల్ రా మలక్ష్మి తెలిపారు. సోమవారం కౌశల్ ప్రతిభా పోటీల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. కౌశ ల్ రాష్ట్రస్థాయి సైన్స్ ప్రతిభా అన్వేషణ పోటీలు–2025లో భాగంగా 8వ తరగతి విద్యార్థులకు నవంబర్ 1న, 9వ తరగతి విద్యార్థులకు నవంబర్ 3న, టెన్త్ విద్యార్థులకు నవంబర్ 4న పోటీలు నిర్వహిస్తామన్నారు. జిల్లాస్థాయి పరీ క్షలు 27, 28వ తేదీల్లో, రా ష్ట్రస్థాయి పోటీలు డిసెంబర్ 27న నిర్వహిస్తారన్నారు. ఏలూరు(ఆర్ఆర్పేట): జిల్లాను స్వర్ణ ఏలూరు–స్వచ్ఛ ఏలూరుగా తీర్చిదిద్దడంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. సోమవారం స్థానిక సీఆర్రెడ్డి కళాశాల ఆడిటోరియంలో జరిగిన జిల్లా స్థాయి స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానోత్సవంలో జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, మేయర్ షేక్ నూర్జహాన్, అధికారులతో కలిసి ఆమె పురస్కారాలు అందించారు. జిల్లా రాష్ట్రస్థాయిలో 2, జిల్లాస్థాయిలో 51 స్వచ్ఛ అవార్డులు సాధించిందన్నారు. సూపర్ జీఎస్టీపై అవగాహన జిల్లాలో సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్స్ కా ర్యక్రమం ద్వారా ప్రజలకు అవగాహన కలిగించేందుకు సచివాలయ, సంబంధిత శాఖల జీ ఎస్టీ చాంపియన్స్ చొరవ తీసుకోవాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. సోమవారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. -
నేత్ర వైద్యంపై నిర్లక్ష్యం
● ఏ స్కాన్ మెషీన్ సేవలు నిల్ ● రోజూ 90 నుంచి 120 మంది ఓపీకి.. ● ఏలూరు జీజీహెచ్లో అధికారుల నిర్వాకం ఏలూరు టౌన్: ఏలూరు సర్వజన ఆస్పత్రి (జీజీహెచ్)లో నేత్ర వైద్య సేవలపై నీలినీడలు కమ్ముకున్నా యి. వైద్యాధికారుల నిర్లక్ష్యంతో పేదలకు కంటి వైద్య సేవలు అందడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. కంటి వైద్య పరీక్షల్లో ప్రధానమైన ఏ స్కాన్ మెషీ న్ మరమ్మతులకు గురవడంతో ఇబ్బందులు తలెత్తాయి. కంటి సమస్యను గుర్తించడంతో ఈ మెషీన్ కీలకం. కంటిలో పొరలు, శుక్లాలు, ఇతరత్రా సమస్యలను గుర్తించి మందులు ఇవ్వాలా, లేదా శస్త్రచికిత్స చేయాలా అనేది నిర్ధారిస్తారు. అయితే మూడు నెలలుగా ఈ మెషీన్ పనిచేయడం లేదు. రోజూ కంటి వైద్య విభాగానికి ఓపీ సేవలకు 90 నుంచి 120 మంది వరకు వస్తుంటారు. సగటున నెలకు 2 వేల మందికి పైగా వస్తుంటారు. అయితే ఈ సేవలు అందకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిమ్మకు నీరెత్తినట్టు.. ఏ స్కాన్ మెషీన్ బాగు చేయడం కుదరదనీ, కొత్త మెషీన్ కొనుగోలు చేయాలని వైద్య పరికరాలను సరఫరా చేసే సంస్థ సైరస్ సిబ్బంది తేల్చి చెప్పే శారు. ఈ యంత్రం కొనుగోలుకు రూ.3 లక్షలు మాత్రమే వెచ్చించాల్సి ఉంది. అయినా అధికారు లు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. మెషీన్ కొనుగోలుపై డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ)కు నివేదించగా రూ.5 లక్షలలోపు సొ మ్ములు ఖర్చు చేసేందుకు స్థానికంగా బోధనాసుపత్రి నిధులు వినియోగించుకోవచ్చనీ, కలెక్టర్ అనుమతులు తీసుకోవాలని సూచించారు. అయితే ఏ లూరు జీజీహెచ్ వైద్య అధికారులు మాత్రం వి షయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లకుండా తా త్సారం చేస్తున్నారని సమాచారం. కలెక్టర్ వెంటనే స్పందించి ఏ స్కాన్ మెషీన్ కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
అర్జీల పరిష్కారానికి శ్రద్ధ పెట్టాలి
ఏలూరు(మెట్రో): పీజీఆర్ఎస్లో ప్రజలు సమర్పించిన అర్జీల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లో సోమవారం జిల్లాస్థాయి ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తంగా 248 అర్జీలు అందాయి. నిర్లక్ష్యానికి తావు లేకుండా అర్జీలు పరిష్కరించాలని కలెక్టర్ అన్నారు. డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, ఆర్డీఓ అచ్యుత అంబరీష్, డీఆర్డీఏ పీడీ ఆర్.విజయరాజు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దేవకీదేవి, సర్వే ఏడీ అన్సారీ అర్జీ పాల్గొన్నారు. అర్జీల్లో కొన్ని.. ● పెదపాడు మండలం చిన్న సత్యవోలుకి చెందిన సింగవరపు వెంకట అప్పారావు తన అపరాల పంట పక్కనున్న భూమిలో కొందరు చేపల చెరువు తవ్వుతున్నారని, దీంతో పంట నష్టం వాటిల్లుతుందని పరిహారం ఇప్పించాలని అర్జీ అందించారు. ● ఏలూరుకి చెందిన దొండపాటి విశాల్ తాను ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫస్టియర్ చదివి మానేశానని, ఫస్టియర్ పూర్తిచేసిన సర్టిఫికెట్ అడిగితే రూ.75 వేలు అడుగుతున్నారని ఫిర్యాదు చేశారు. ● ముదినేపల్లి మండలం చిగురుకోటకి చెందిన గాజాల గోవర్ధన తనకు ఆధారమైన 0.05 సెంట్ల భూమిలో ఇల్లు కట్టుకుని జీవిస్తుంటే ఓ మహిళ తనను ఇంటి నుంచి వెళ్లగొట్టిందని న్యాయం చేయాలని కోరారు. ● పోలవరం మండలం పాతపేటకు చెందిన కత్తవ వెంకటలక్ష్మి వితంతు పెన్షన్ కోసం అర్జీ అందించారు. ● చాట్రాయి మండలం చీపురుగూడేనికి చెందిన ఘంటసాల వెంకటేశ్వరరావు తనకు పింఛన్ మంజూరు చేయాలని అభ్యర్థించారు. ● టి.నర్సాపురం మండలం మక్కినవారిగూడేనికి చెందిన చక్రపు సాయమ్మ తన కుమారుడికి ఇల్లు, స్థలం రాసిచ్చానని, అప్పటి నుంచి తనను పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. ఆటపాక భూముల ఆక్రమణలపై ఫిర్యాదు కై కలూరు: ప్రభుత్వ భూముల ఆక్రమణలపై భుజబలపట్నంకు చెందిన ఓగిరాల శ్రీకాంత్ ఏలూరులో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్కి ఫిర్యా దు చేశారు. ఆటపాక నుంచి అగ్రహారం వెళ్లే రహదారిలో సర్వే నం.213లో జిల్లాపరిషత్కు చెందిన 10 సెంట్లు భూమి, ఇదే పంచాయతీ జాన్పేటలో సర్వే నంబరు 422లో 10 సెంట్లు ఇరిగేషన్ భూమిని గ్రామానికి చెందిన తలారి జాన్, పాలపర్తి సద్గుణరావు, బావిశెట్టి నాగేశ్వరరావులు ఆక్రమించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఆర్డీఓ అచ్యుత అంబరీష్ను కలెక్టర్ విచారణకు ఆదేశించారు. కలెక్టర్ వెట్రిసెల్వి -
‘చెత్త’శుద్ధి కరువాయె
● నూజివీడు మున్సిపాలిటీలో అధ్వానంగా పారిశుద్ధ్యం ● మంత్రి పీఏలు హడావుడి చేసినా మారని తీరు నూజివీడు: నూజివీడు మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా మారింది. నూజివీడుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పార్థసారథి పీఏలు గత నెలలో పారిశుద్ధ్యం విషయమై హడావుడి చేసిన రెండు రోజులు తప్ప మిగిలిన రోజుల్లో పారిశుద్ధ్య సిబ్బంది తీరు ఏమాత్రం మారలేదు. పలు ప్రాంతాల్లో, వార్డుల్లో చెత్త పేరుకుపోయి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పాలకులు, అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మున్సిపల్ పారిశుద్ధ్య విభాగం పనితీరు దారుణంగా ఉండటంతో వీధులు చెత్తాచెదారంతో దర్శనమిస్తున్నాయి. ప్రధాన రహదారుల వెంబడి చెత్తను కూడా తొలగించకపోవడంతో తీవ్ర అపరిశుభ్రత నెలకొంది. ప్రభుత్వం ప్రతినెలా మూడో శనివారం స్వచ్ఛాంధ్ర –స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ప్రచారార్భాటంతో నిర్వహించడం తప్పితే వాస్తవంగా ఆచరణలో పారిశుద్ధ్య నిర్వహణ ఏమాత్రం మెరుగుపడటం లేదు. మున్సిపాలిటీలో రోజుకు 28 నుంచి 30 టన్నుల వరకు చెత్త వస్తుండగా అందులో సగం చెత్త కూడా ఎత్తడం లేదు. దాదాపు 150 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నా ఎక్కడి చెత్త అక్కడే ఉండి దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో దోమలు, ఈగలు వృద్ధి చెంది రోగాల బారిన పడుతున్నామని పట్టణవాసులు వాపోతున్నారు. సబ్ కలెక్టర్గా ఒకవైపు ఐఏఎస్ అధికారి పనిచేస్తున్న కేంద్రమే కాకుండా, మరోవైపు మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రంలోనూ పారిశుద్ధ్యాన్ని గాలికి వదిలేయడం వి మర్శలకు తావిస్తోంది. -
గిరిజనుల అభ్యున్నతికి కృషి చేయాలి
జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ వేలేరుపాడు: గిరిజను ల అభ్యున్నతికి అధికారులు పాటుపడాలని, సంక్షేమ ఫలాలను గిరిజన కుటుంబాలకు అందేలా చూడాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ అన్నారు. సోమవారం మండలంలోని మోదెల గ్రామంలో మాజీ మంత్రి జల గం ప్రసాదరావుతో కలిసి ఆయన పర్యటించా రు. సంక్షేమ, అభివృద్ధి పనులపై గిరిజనులను ఆరా తీశారు. గిరిజన ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు లేని గ్రామాలపై 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని, మూడు నెలల్లో పనులకు శ్రీకారం చుట్టేలా చర్యలలు తీసుకుంటామన్నారు. గిరిజనుల నుంచి అర్జీలు స్వీకరించారు. మాజీ మంత్రి జలగం, జేవీఆర్ స్వ చ్ఛంద సేవా సంస్థ ద్వారా గిరిజనులకు స్టీల్ కంచం, గ్లాస్, స్వీట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే అధికారుల వైఫల్యం కనిపిస్తోందన్నారు. ప్రతి గ్రామంలో సెల్ టవర్లు ఏ ర్పాటుచేయాలని అధికారులను ఆదేశించారు. గిరిజన తండాల అభివృద్ధికి త్వరితగతిన అనుమతులు ఇవ్వాలన్నారు. సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గిరిజన ప్రాంతాలు అభివృద్ధి విషయంలో ఎవరూ కోర్టులకు వెళ్లవద్దని, ఎస్టీ కమిషన్ను సంప్రదించాలని కోరారు. ఐటీడీఏ పీఓ కె.రాములు నాయక్, ఇన్చార్చి ఆర్డీఓ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం.ముక్కంటి, డీఎఫ్ జి.సతీష్ రెడ్డి, జిల్లా ఆర్డబ్ల్యూఎస్ అధికారి జి.త్రినాథబాబు, విద్యుత్ శాఖ ఈఈ ఫీర్ అహ్మద్ ఖాన్, హౌసింగ్ ఈఈ కేవీవీఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.