breaking news
Eluru
-
ఇదిగో.. ప్రభుత్వ వైద్య కళాశాల..‘మీ కళ్ళకు కనిపిస్తోందా’?
ఏలూరు టౌన్ : ‘ఇదిగో.. చంద్రబాబు గారూ... ఏలూరులో వైఎస్ జగన్ హయాంలో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాల భవనం.. కూటమి నేతలూ... చూశారా’ అంటూ వైఎస్సార్సీపీ నేతలు ఆ భవనాల వద్ద సెలీ్ఫలు దిగారు. ఏలూరు జిల్లాకే ప్రతిష్టాత్మకంగా.. జిల్లా ప్రజల చిరకాల కోరికను నెరవేర్చుతూ వైఎస్సార్సీపీ హయాంలో ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ కట్టలేదంటూ చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తోన్న తరుణంలో వైఎస్సార్సీపీ ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకా‹Ù, మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి ఆధ్వర్యంలో పార్టీ నేతలు ఏలూరులోని మెడికల్ కాలేజీని సోమవారం సందర్శించారు. అత్యాధునిక సౌకర్యాలతో, కార్పొరేట్ తరహా లుక్తో మెరిసిపోతున్న వైద్య కళాశాల భవనాలను రాష్ట్ర ప్రజలకు చూపించే ప్రయత్నం చేశారు. ‘మీ కళ్ళకు కనిపిస్తోందా?’ అంటూ.. వీడియోలు, సెలీ్ఫలు దిగారు. జోహార్ వైఎస్సార్.. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. కూటమి నేతలు చేస్తున్నట్లు ఇది గ్రాఫిక్స్ కాదంటూ మెడికల్ కాలేజీ భవనం వద్ద ఫొటోలు తీశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సు«దీర్బాబు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, ప్రధాన కార్యదర్శి లంకలపల్లి గణే‹Ù, అధికార ప్రతినిధి మున్నుల జాన్గురునాథ్, ఎస్సీ సెల్ కార్యదర్శి ఇమ్మానుయేల్, నగర మహిళా అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు ఇనపనూరి జగదీ‹Ù, బీసీ సెల్ కార్యదర్శి కొల్లిపాక సురేష్, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు చిలకపాటి డింపుల్జాబ్ తదితరులు పాల్గొన్నారు. 300 మంది విద్యార్థులు చదువుతున్నారు: ప్రిన్సిపాల్ ఏలూరులో వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాల భవనం ప్రారంభించి రెండేళ్లు పూర్తయ్యింది. 2023 సెప్టెంబర్ 2న ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం క్లాస్లు ప్రారంభించగా.. రెండేళ్లు పూర్తవడంతో వైఎస్సార్సీపీ నేతలు మెడికల్ కాలేజీ వద్ద కేక్ కట్ చేసి వేడుకలు చేసుకున్నారు. వైద్య విద్యార్థులకు, కాలేజీ ప్రొఫెసర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. తొలుత కాలేజీలోని మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. కళాశాలలో అత్యాధునిక డిజిటల్ క్లాస్రూంలు, ల్యాబ్స్, టీచింగ్ రూమ్స్ పరిశీలించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సావిత్రిని మర్యాదపూర్వకంగా కలిసి కళాశాల నిర్వహణపై పలు అంశాలు అడిగి తెలుసుకున్నారు. 2023 సెప్టెంబర్ 2న 150 మంది ఎంబీబీఎస్ వైద్య విద్యార్థులతో క్లాస్లు ప్రారంభించారని, 2024లో మరో 150 మంది చేరారని, ప్రస్తుతం 300 మంది విద్యార్థులు చదువుతున్నారని చెప్పారు. జగన్ చెప్పింది చేసి చూపిస్తారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేబితే చేసి చూపిస్తారు. గ్రాఫిక్స్ చేయడం మాకు చేతకాదు. 2022 నవంబర్లో మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు ప్రారంభించి 2023 సెపె్టంబర్ 2 నాటికే క్లాస్లు ప్రారంభించేలా పూర్తి చేసి చూపించారు. రూ.60 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలు కల్పించి మెడికల్ కాలేజీని నిర్మించారు. రెండేళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు చేసుకున్నాం. వైద్య విద్యార్థులు, మెడికల్ కాలేజీ స్టాఫ్కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపాం. రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు రూ.8500 కోట్లతో ప్రణాళిక రూపొందించి, తొలి దశలో ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించారు. – మామిళ్ళపల్లి జయప్రకాష్ , ఏలూరు సమన్వయకర్తప్రైవేటు పరం చేయటం న్యాయమా? వైఎస్సార్సీపీ హయాంలో ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుమతులు తెచ్చిన గొప్ప నాయకుడు జగన్మోహన్రెడ్డి. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను అధికారంలో ఉండగానే ప్రారంభించగా.. ఎన్నికల నాటికి పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు. కూటమి ప్రభుత్వం హయాంలో ఒక్క కొత్త భవనం నిర్మించారా?. జగన్ హయాంలో రైతు భరోసా కేంద్రాలు, సచివాలయ భవనాలు, విలేజ్ క్లీనిక్స్ నిర్మించారని, కూటమి నేతలు ఒక్క కొత్త భవనం నిర్మించారా? ప్రజలకు మంచి చేయటానికి ప్రయత్నం చేయాలి. – కొఠారు అబ్బయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్యే -
జాయింట్ కలెక్టర్ బదిలీ
ఏలూరు(మెట్రో): ఐఏఎస్ బదిలీల్లో భాగంగా జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ధాత్రిరెడ్డిని రతన్ టాటా ఇన్నోవేషన్ సీఈవోగా బదిలీ చేసింది. ప్రస్తుతం జిల్లాకు ఎవరినీ కేటాయించలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన అనంతరం బదిలీల్లో భాగంగా ధాత్రిరెడ్డిని జిల్లా జాయింట్ కలెక్టర్గా నియమించారు. ద్వారకాతిరుమల: క్షేత్రంలో సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కురిసిన భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. ఈ క్రమంలో భీమడోలు–ద్వారకాతిరుమల ప్రధాన రహదారి పలుచోట్ల కాలువలా మారింది. దాంతో ఆ మార్గంలో వివిధ వాహనాలపై యాత్రికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ప్రధానంగా ద్వారకాతిరుమలలోని కుంకుళ్లమ్మ ఆలయ సమీపంలో, అలాగే గొల్లగూడెం, సూర్యచంద్రరావుపేట, పంగిడిగూడెం వద్ద రోడ్డుపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. గంటల తరబడి నీరు అలాగే ఉండిపోవడంతో రోడ్డుపై ఉన్న గుంతలు కనిపించక ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డ్రైనేజీల్లోని మురుగు, చెత్తాచెదారం రోడ్లపైకి చేరింది. ఏలూరు (టూటౌన్): స్కూల్ స్వీపర్లు, శానిటేషన్ వర్కర్లకు, నైట్ వాచ్మెన్లకు జీవో నెంబర్ 7 ప్రకారం కనీస వేతనం రూ.15 వేలు ఇవ్వాలని, రెండు నెలల బకాయిలు ఇవ్వాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు బి.సోమయ్య మాట్లాడుతూ స్వీపర్లు, శానిటేషన్ వర్కర్లకు కనీస వేతనాలు లేవని, ఇచ్చే అరకొర జీతాలు సైతం నెలల తరబడి పెండింగ్లో ఉంటున్నాయని తెలిపారు. నెలంతా పని చేసినా స్వీపర్లకు రూ.4000, శానిటేషన్ వర్కర్కు రూ.6 వేల జీతం ఇస్తున్నారని విమర్శించారు. తక్షణం వేతనాలు పెంచి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏలూరు (టూటౌన్): ఆయిల్పామ్ కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఆయిల్పామ్ కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు పి.రామకృష్ణ డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం, ఆయిల్పామ్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పి.రామకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో 13 మండలాల్లో పామాయిల్ విస్తారంగా పండుతుందన్నారు. ఆ తోటలపై ఆధారపడి పని చేస్తున్న కూలీల కుటుంబాలు దినదినగండంగా బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రమాదాలకు గురై వికలాంగులుగా మారిన కార్మికుడికి పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డికి సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు జె.హరీష్, జిల్లా నాయకులు ఎం.సత్యనారాయణ, కే రాంబాబు, కే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (టూటౌన్): ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో అవసరమైన యూరియా తదితర ఎరువులను ప్రభుత్వం తక్షణమే అందించేలా చర్యలు తీసుకోవాలని, బ్లాక్ మార్కెట్ విక్రయాలను అరికట్టాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రాజనాల రామ్మోహనరావు, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు మద్దుకూరి బుచ్చిబాబు మాట్లాడుతూ.. ఖరీఫ్లో అవసరమైన యూరియా లభించక రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. రూ.300 ఖరీదు చేసే యూరియాను రూ.వెయ్యికి విక్రయిస్తున్నారన్నారు. బ్లాక్ మార్కెట్లో యూరియా విక్రయిస్తున్న షాపులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్చేశారు. -
వరద ముంపులో అంకాలగూడెం
కొయ్యలగూడెం: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రధాన కాలువలు ఉధృత స్థాయిలో ప్రవహిస్తున్నాయి. నూతి కుంట కాలువ ఉధృతికి రెండు రోజుల నుంచి అంకాలగూడెం గ్రామం జలదిగ్బంధంలో ఉంది. నూతికుంట కాలువ పూడిక తీత చేయకపోవడంతో దళితవాడ ముంపునకు గురైందని మాజీ ఉప సర్పంచ్ గర్రె వీరభద్రం తెలిపారు. రెండు రోజుల నుంచి ముంపులోనే ఉంటున్నామని అధికారులు గానీ, ప్రజా ప్రతినిధులు గానీ కన్నెత్తి చూడలేదని దళిత మహిళలు వాపోతున్నారు. తమ పిల్లల్ని పాఠశాలలకు కూడా పంపలేని స్థితిలో ఉన్నామని, బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామన్నారు. మిషనరీ హాస్పిటల్ నుంచి గణపతి ఆలయం వరకు కాలువ ఆక్రమణలకు గురి కావడమే ముంపుకు కారణమని బాధితులు ఆరోపిస్తున్నారు. ఏజెన్సీలో పొంగిన కొండవాగులు బుట్టాయగూడెం: అల్పపీడన ద్రోణి కారణంగా సోమవారం ఏజెన్సీలో సుమారు గంట సేపు భారీ వర్షం కురిసింది. కొండప్రాంతాల్లో కురిసిన వర్షానికి వాగులు పొంగిపొర్లాయి. మండలంలోని ఇప్పలపాడు సమీపంలో ఉన్న జల్లేరు వాగు, రెడ్డిగణపవరం సమీపంలోని వాగులు రెండు గంటలపాటు పొంగిపొర్లాయి. వాగులు పొంగి పొర్లడంతో పోలీసులు ఇరువైపులా భద్రతా చర్యలు చేపట్టారు. వాగులు పొంగుతున్న సమయంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. -
ఇదే.. ప్రభుత్వ వైద్య కళాశాల
ఏలూరు టౌన్ : ‘ఇదిగో.. చంద్రబాబు గారూ... ఏలూరులో వైఎస్ జగన్ హయాంలో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాల భవనం.. కూటమి నేతలూ... చూశారా’ అంటూ వైఎస్సార్సీపీ నేతలు ఆ భవనాల వద్ద సెల్ఫీలు దిగారు. ఏలూరు జిల్లాకే ప్రతిష్టాత్మకంగా.. జిల్లా ప్రజల చిరకాల కోరికను నెరవేర్చుతూ వైఎస్సార్సీపీ హయాంలో ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ కట్టలేదంటూ చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తోన్న తరుణంలో వైఎస్సార్సీపీ ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్, మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి ఆధ్వర్యంలో పార్టీ నేతలు ఏలూరులోని మెడికల్ కాలేజీని సోమవారం సందర్శించారు. అత్యాధునిక సౌకర్యాలతో, కార్పొరేట్ తరహా లుక్తో మెరిసిపోతున్న వైద్య కళాశాల భవనాలను రాష్ట్ర ప్రజలకు చూపించే ప్రయత్నం చేశారు. ‘మీ కళ్ళకు కనిపిస్తోందా?’ అంటూ.. వీడియోలు, సెల్ఫీలు దిగారు. జోహార్ వైఎస్సార్.. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. కూటమి నేతలు చేస్తున్నట్లు ఇది గ్రాఫిక్స్ కాదంటూ మెడికల్ కాలేజీ భవనం వద్ద ఫొటోలు తీశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్బాబు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, ప్రధాన కార్యదర్శి లంకలపల్లి గణేష్, అధికార ప్రతినిధి మున్నుల జాన్గురునాథ్, ఎస్సీ సెల్ కార్యదర్శి ఇమ్మానుయేల్, నగర మహిళా అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు ఇనపనూరి జగదీష్, బీసీ సెల్ కార్యదర్శి కొల్లిపాక సురేష్, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు చిలకపాటి డింపుల్జాబ్ తదితరులు పాల్గొన్నారు. రెండేళ్లు పూర్తిచేసుకున్న ఏలూరు మెడికల్ కాలేజీ వైఎస్ జగన్ హయాంలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మాణం వైఎస్సార్సీపీ హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ కట్టలేదంటూ బాబు అసత్య ప్రచారం వైద్య కళాశాలను సందర్శించి ఫొటోలు దిగిన అబ్బయ్యచౌదరి, జయప్రకాష్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేబితే చేసి చూపిస్తారు. గ్రాఫిక్స్ చేయడం మాకు చేతకాదు. 2022 నవంబర్లో మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు ప్రారంభించి 2023 సెప్టెంబర్ 2 నాటికే క్లాస్లు ప్రారంభించేలా పూర్తి చేసి చూపించారు. రూ.60 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలు కల్పించి మెడికల్ కాలేజీని నిర్మించారు. రెండేళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు చేసుకున్నాం. వైద్య విద్యార్థులు, మెడికల్ కాలేజీ స్టాఫ్కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపాం. రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు రూ.8500 కోట్లతో ప్రణాళిక రూపొందించి, తొలి దశలో ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించారు. – మామిళ్ళపల్లి జయప్రకాష్ , ఏలూరు సమన్వయకర్త వైఎస్సార్సీపీ హయాంలో ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుమతులు తెచ్చిన గొప్ప నాయకుడు జగన్మోహన్రెడ్డి. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను అధికారంలో ఉండగానే ప్రారంభించగా.. ఎన్నికల నాటికి పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు. కూటమి ప్రభుత్వం హయాంలో ఒక్క కొత్త భవనం నిర్మించారా?. జగన్ హయాంలో రైతు భరోసా కేంద్రాలు, సచివాలయ భవనాలు, విలేజ్ క్లీనిక్స్ నిర్మించారని, కూటమి నేతలు ఒక్క కొత్త భవనం నిర్మించారా? ప్రజలకు మంచి చేయటానికి ప్రయత్నం చేయాలి. – కొఠారు అబ్బయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్యే ఏలూరులో వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాల భవనం ప్రారంభించి రెండేళ్లు పూర్తయ్యింది. 2023 సెప్టెంబర్ 2న ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం క్లాస్లు ప్రారంభించగా.. రెండేళ్లు పూర్తవడంతో వైఎస్సార్సీపీ నేతలు మెడికల్ కాలేజీ వద్ద కేక్ కట్ చేసి వేడుకలు చేసుకున్నారు. వైద్య విద్యార్థులకు, కాలేజీ ప్రొఫెసర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. తొలుత కాలేజీలోని మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. కళాశాలలో అత్యాధునిక డిజిటల్ క్లాస్రూంలు, ల్యాబ్స్, టీచింగ్ రూమ్స్ పరిశీలించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సావిత్రిని మర్యాదపూర్వకంగా కలిసి కళాశాల నిర్వహణపై పలు అంశాలు అడిగి తెలుసుకున్నారు. 2023 సెప్టెంబర్ 2న 150 మంది ఎంబీబీఎస్ వైద్య విద్యార్థులతో క్లాస్లు ప్రారంభించారని, 2024లో మరో 150 మంది చేరారని, ప్రస్తుతం 300 మంది విద్యార్థులు చదువుతున్నారని చెప్పారు. -
కేసులు పెట్టడం సరికాదు
ప్రజా సమస్యల పరిష్కారం కోసం వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చే పత్రికా రంగంపై కేసులు పెట్టే ధోరణి మంచిది కాదు. ప్రచురితమైన వార్తా కథనాల్లో ఏమైనా అవాస్తవాలు దొర్లితే న్యాయపరంగానో, ఇతర మార్గాల్లోనో సంప్రదించాలే తప్ప విలేకరులపై కేసులు నమోదుచేసే పరిస్థితులు తీసుకురాకూడదు. సమాజంలో పత్రికా స్వేచ్ఛకు గండి కొట్టేలా ఏ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోరాదు. నాలుగో స్తంభంగా ఉన్న పాత్రికేయ వ్యవస్థకు సమాజంలో జరుగుతున్న విషయాలను తెలిపే హక్కు ఉంటుంది. – వంక రవీంద్రనాథ్, ఎమ్మెల్సీ -
డ్వాక్రా సొమ్ము రూ.58 లక్షలు స్వాహా
ఆగిరిపల్లి: డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులు అక్రమార్కుల చేతిలో మోసపోవడం పరిపాటిగా మారింది. ఆగిరిపల్లి మండలం సీతారామపురంలో ఏవోఏగా పనిచేస్తున్న దిడ్డి భార్గవి డ్వాక్రా మహిళల సొమ్ము ఏకంగా రూ.58 లక్షలు స్వాహా చేసింది. ఏపీఎం రికార్డుల పరిశీలనతో ఈ వ్యవహారం బయటపడింది. వివరాల ప్రకారం దిడ్డి భార్గవి 12 ఏళ్లుగా వీవోఏగా విధులు నిర్వహిస్తోంది. ఆమె పరిధిలో 38 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి.వీరి ఖాతాలు ఈదర గ్రామంలోని ఇండియన్ బ్యాంకులో ఉన్నాయి. గ్రామానికి బ్యాంకు దూరంగా ఉండటం, నిరక్షరాస్యులైన మహిళల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని మహిళలు బ్యాంకుకు చెల్లించాల్సిన డ్వాక్రా రుణాలను తానే చెల్లిస్తానని నమ్మించి కొన్ని నెలలు సజావుగానే చెల్లించింది. గత కొన్ని నెలలుగా సుమారు 28 స్వయం సహాయక సంఘాల్లో ఒక నెల సభ్యులు బ్యాంకుకు వెళ్లి చెల్లిస్తుండగా, మరో నెల భార్గవికి ఇస్తున్నారు. ఆమె బ్యాంకులో చెల్లిస్తున్నానని నమ్మించి సొమ్ములు కట్టడం లేదు. ఇటీవల బదిలీపై వచ్చిన ఏపీఎం రాజశేఖర్ స్వయం సహాయక సంఘాల రికార్డులను పరిశీలించడంతో ఈమె వ్యవహారం బయటపడింది. డీఆర్డీఏ డీపీఎంలు విజయ్ కుమారి, ఎంఎస్డీ భూషణం నిధుల స్వాహాపై సోమవారం గ్రామంలో బహిరంగ విచారణ చేపట్టారు. విచారణలో రూ.58 లక్షలు అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. వీవోఏ భార్గవి డబ్బులు వెంటనే చెల్లించాలని మహిళలు నిరసన వ్యక్తం చేశారు. తనకు రెండు నెలల సమయం ఇస్తే ఆ డబ్బులు చెల్లిస్తానని భార్గవి అధికారులను కోరింది. ఈ సందర్భంగా డీఆర్డీఏ అధికారులు మాట్లాడుతూ వీవోఏ అవినీతికి పాల్పడినట్లు గుర్తించామని, ఉన్నతాధికారులకు నివేదిక పంపిన తర్వాత తదుపరి విషయాలు తెలియజేస్తామన్నారు. సీ్త్ర నిధి ఏజీఎం చెన్నకేశవులు, సర్పంచ్ అత్తి మురళి, ఏపీఎం డి.రాజశేఖర్, సీసీ దివ్య పాల్గొన్నారు. -
కాలువలో బాలుడి గల్లంతు
పాలకోడేరు: వేండ్ర అగ్రహారం శివారు కట్టావారిపాలెంలోని గోస్తని డ్రెయిన్లో ఆదివారం సాయంత్రం ప్రమాదవశాత్తూ ఓ బాలుడు పడి గల్లంతయ్యాడు. గ్రామానికి చెందిన బొక్కా శ్రీనివాస్రావు రెండవ కుమారుడు జైదేవ్ (7) నౌడూరులోని ప్రైవేట్ స్కూల్లో ఒకటవ తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో మరో బాలుడు చరణ్తో కలిసి సైకిల్ తొక్కుకుంటూ గ్రామంలోని గోస్తని డ్రెయిన్పై ఉన్న బ్రిడ్జి పైకి వెళ్లారు. ప్రమాదవశాత్తు బ్రిడ్జిపై నుంచి బాలుడు జైదేవ్ కాలువలోకి పడిపోయాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఫైర్ అధికారులు గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదు. సోమవారం కాకినాడ నుంచి ఏపీఎస్డీఆర్ఎఫ్ బలగాలు వచ్చి గాలిస్తున్నారు. జై దేవ్ తండ్రి శ్రీనివాస్ రావు లారీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. బాలుడి ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
శివయ్య ఆలయాన్ని ముంచెత్తిన గంగమ్మ
ద్వారకాతిరుమల: మండలంలోని తిరుమలంపాలెంలో శ్రీ భ్రమరాంబ ఆది మల్లేశ్వర స్వామివారి ఆలయాన్ని సోమవారం గంగమ్మ ముంచెత్తింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా ఆలయ ఆవరణలోకి, అలాగే శివయ్య, అమ్మవారి గర్భాలయాల్లోకి భారీగా నీరు చేరింది. పురోహితుడు ఆ నీటిలోంచే స్వామి, అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంతం లోతట్టుగా ఉండటం వల్ల వర్షపు నీరు ఆలయంలోకి చేరుతోందని, దేవస్థానం అధికారులు స్పందించి, ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
13 మందికి పదోన్నతులు
ఏలూరు (మెట్రో) : ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో, జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఏవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు 13 మందికి పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులను చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ సోమవారం అందజేశారు. జెడ్పీ సీఈవో శ్రీహరి, ఏవో రాఘవులు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు టౌన్: ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, నేరాలకు పాల్పడే వ్యక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ అన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల వేదికలో బాధితుల నుంచి 48 ఫిర్యాదులు స్వీకరించారు. వీటిలో ప్రధానంగా భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, మోసాలు, ఆర్థిక లావాదేవీలపై ఫిర్యాదులు ఉన్నాయి. ఎస్పీ మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో మోసాలకు పాల్పడే నేరగాళ్లు ఎక్కువ అయ్యారని, సెబర్ నేరాలపై వెంటనే సమీపంలోని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలని, 1930 టోల్ఫ్రీ నెంబర్కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ నక్కా సూర్యచంద్రరావు పాల్గొన్నారు. -
తప్పుల తడకగా స్మార్ట్ రేషన్కార్డులు
నూజివీడు: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా పంపిణీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులు తప్పుల తడకగా తయారయ్యాయి. ప్రభుత్వం ప్రచారానికి ఇస్తున్న ప్రాధాన్యత స్మార్ట్కార్డుల ముద్రణ విషయంలో లేకపోవడంతో స్మార్ట్ రేషన్ కార్డుల్లో తప్పులు నమోదయ్యాయి. దీంతో కార్డుదారులు లబోదిబోమంటున్నారు. ఇంటి పేర్లు, ఇంటి నెంబర్లు, ఊరి పేర్లు తప్పుగా నమోదు కావడం, పాతకార్డులో ఉన్న వారి పేర్లన్నీ కొత్తగా జారీ చేసిన స్మార్ట్ రేషన్ కార్డులో లేకపోవడం వంటి తప్పులు ఎక్కువగా చోటు చేసుకున్నాయి. దీంతో వీటిని సరిచేయించుకోవడానికి కార్డుదారులు గ్రామ, వార్డు సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తప్పుల తడకలుగా ఉన్న స్మార్ట్ రేషన్ కార్డులను చూసి ప్రభుత్వం కార్డుల ముద్రణ విషయంలో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో అర్థమవుతోందని కార్డుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరి పేర్లు స్మార్ట్ రేషన్కార్డుపై లేకపోవడంతో రాబోయే రోజుల్లో పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత లేకుండా పోతుందని ఆందోళన చెందుతున్నారు. నూజివీడు నియోజకవర్గంలో 170 రేషన్ దుకాణాల పరిధిలో 94,185 రేషన్కార్డులున్నాయి. వీటిల్లో నూజివీడు పట్టణంలో 13,648 కార్డులు, నూజివీడు మండలంలో 23,922 కార్డులు, ఆగిరిపల్లిలో 20,769 కార్డులు, ముసునూరు మండలంలో 18,515 కార్డులు, చాట్రాయి మండలంలో 17331 చొప్పున కార్డులున్నాయి. వీటిలో దాదాపు 25 నుంచి 30 శాతం కార్డుల్లో తప్పులు నమోదయ్యాయి. ఏకంగా కాలనీ పేరే తప్పుగా నమోదు జిల్లాలోనే అతి పెద్ద కాలనీగా ఉన్న పట్టణంలోని ఎమ్మార్ అప్పారావు కాలనీ పేరునే తప్పుగా నమోదు చేశారు. ఎమ్మార్ అప్పారావు పేరులో ఎమ్మార్ లేకుండా శ్రీ అప్పారావు కాలనీగా స్మార్ట్ రేషన్ కార్డుల్లో నమోదైంది. ఇలా కాలనీ పేరునే మార్చేయడమేమిటో అర్థం కావడం లేదని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కాలనీలో దాదాపు వెయ్యి కుటుంబాలకు చెందిన 5వేల మంది వరకు నివసిస్తున్నారు. తప్పుగా నమోదు కావడం వల్ల వీరందరి కార్డులపైన కాలనీ పేరును సరిచేయాల్సిన అవసరం నెలకొంది. పాత రావిచర్లలో మెతుకుపల్లి శ్రీనివాసరావు, అతని భార్య పద్మావతిలకు కలిపి స్మార్ట్ రేషన్కార్డు రావాల్సి ఉండగా కేవలం మెతుకుమిల్లి పద్మావతి ఒక్కరి పేరునే కార్డు రావడంతో ఆమె భర్త శ్రీనివాసరావు వారం రోజులుగా గ్రామ సచివాలయం, తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తమ అర్జీని ఆన్లైన్లో నమోదు చేయడానికి రూ.80కు వరకు ఫీజు చెల్లించాల్సి వస్తోంది. తప్పుల సవరణను ఉచితంగా చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఆందోళనలో రేషన్ కార్డుదారులుఇటీవల ఇచ్చిన స్మార్ట్ రేషన్కార్డులో నా భార్య పేరు ఉంచి నా పేరును తొలగించారు. స్మార్ట్ రేషన్కార్డును తీసుకొని సరుకులు తెచ్చుకుందామని రేషన్ దుకాణానికి వెళ్లగా నీపేరు లేదు కదా, ఒక్కరికే సరుకులు వస్తాయని రేషన్ డీలరు చెప్పాడు. నా పేరును కార్డులో నుంచి ఎందుకు తీసేశారో తెలియడం లేదు. – మెతుకుమిల్లి శ్రీనివాసరావు, పాతరావిచర్ల, నూజివీడు మండలం నూతనంగా ఇచ్చిన స్మార్ట్ రేషన్ కార్డుల్లో పట్టణంలోని ఎమ్మార్ అప్పారావు కాలనీ పేరునే మార్చేశారు. ఎమ్మార్ అప్పారావు బదులుగా శ్రీ అప్పారావు అని ముద్రించారు. ఇలా తప్పుగా నమోదు చేయడంతో కార్డుదారులందరూ తప్పులను సరిచేయించుకోవాలి. షేక్ మస్తాన్, ఎమ్మార్ అప్పారావు కాలనీ, నూజివీడు -
వికలాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి
ఏలూరు (టూటౌన్): వికలాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని, తొలగించిన వికలాంగుల పింఛన్లు పునరుద్ధరించాలని, ఇండ్లు లేని వికలాంగులకు ఇంటి స్థలం ఇచ్చి ఇళ్లు నిర్మించాలని వికలాంగుల సేవా సంఘం జిల్లా సమావేశం ప్రభుత్వాన్ని కోరింది. స్థానిక ఆర్ఆర్ పేటలోని శ్రీ కాశీ విశ్వేశ్వర కళ్యాణ మండపం నందు నిర్వహించిన జిల్లా సమావేశానికి కుందేటి జయరాజు అధ్యక్షత వహించి మాట్లాడారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా బి.సోమయ్య, అధ్యక్షుడిగా కుందేటి జయరాజు, ఉపాధ్యక్షుడిగా డి.గంగాధర్ రావు, సీహెచ్.కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శిగా ఎల్.రాంబాబు, సహాయ కార్యదర్శులుగా పల్లెం వెంకటేశ్వరరావు, కాటూరి సత్యనారాయణ, మహిళా విభాగం అధ్యక్షురాలిగా పి.చంద్రవాణి, పలువురు కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పోలవరం రూరల్: గోదావరి వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నదిలో నీటి ప్రవాహం పెరుగుతుండటంతో వరద ఉద్ధృతి పెరిగింది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద 31.200 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. స్పిల్వే 48 గేట్ల నుంచి సుమారు 7 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు చేరుతోంది. ఎగువన భద్రాచలం వద్ద 39.70 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు నదిలోకి నీరు చేరడంతో వరద మరో రెండు రోజులు పెరిగే పరిస్థితి ఉందని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. -
విద్యుత్ మోటార్లు, కేబుల్ వైర్ల దొంగల అరెస్టు
నూజివీడు: రైతుల పొలాల్లో విద్యుత్ మోటార్లు, కరెంటు తీగలను దొంగతనం చేసే ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. నూజివీడు సీఐ కొప్పిశెట్టి రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చాట్రాయి మండలంలోని పలు గ్రామాల పరిధిలోని పంట పొలాల్లోని వ్యవసాయ మోటార్లు, కరెంటు తీగలు ఇటీవల చోరీకి గురవుతున్నాయి. దీంతో రైతులు చాట్రాయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్సై డీ రామకృష్ణ దర్యాప్తు చేపట్టారు. దీనిలో భాగంగా ఫోన్ సిగ్నళ్లు ఆధారంగా చాట్రాయి మండలం తుమ్మగూడెంకు చెందిన యర్రా నాగవాసు, మాదాల భవానీశంకర్లను నిందితులుగా గుర్తించారు. వారిని సోమవారం తుమ్మగూడెం శివారు ఎన్నెస్పీ కాలువ వద్ద అరెస్టు చేసి, వారి నుంచి మూడు విద్యుత్ మోటార్లు, ఒక పంపుసెట్, 900 అడుగుల విద్యుత్ తీగను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.1.50 లక్షలు ఉంటుందని సీఐ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన ఎస్సై డీ రామకృష్ణతో పాటు హెడ్కానిస్టేబుల్ జీ శ్రీనివాసరావు, కానిస్టేబుళ్లు కే మునీంద్రరావు, పీ వెంకటేశ్వరరావులను సీఐ అభినందించారు. -
యథేచ్ఛగా గ్రావెల్ అక్రమ తవ్వకాలు
కొయ్యలగూడెం: రాజవరం పంచాయతీ గంగవరం గ్రామంలో గ్రావెల్ అక్రమ తవ్వకాలు గత కొద్ది రోజులుగా యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. గంగవరం సమీపంలోని కొండ ప్రాంతమైన సర్వే నెంబర్ 205, 206, 207లలో సుమారు 20 ఏళ్ల క్రితం అప్పటి వైఎస్సార్ ప్రభుత్వం దళితులకు అరవై ఎకరాలకు పైగా సాగు భూమిగా కేటాయించి పట్టాలు అందజేశారు. వాటిలో రైతులు కొందరు జీడి మామిడి తోటలు వేయగా మరికొన్ని భూములు ఖాళీగా ఉన్నాయి. అటువంటి వాటిని గుర్తించి అక్రమార్కులు గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. రోజుకు 40 నుంచి 60 ట్రిప్పుల గ్రావెల్ మట్టి ట్రక్కుల ద్వారా సుదూర ప్రాంతాలకు రవాణా అవుతోందని ఇందులో అన్ని రాజకీయ పార్టీల నాయకుల భాగస్వామ్యం ఉందని ప్రజలు పేర్కొంటున్నారు. కొద్ది నెలల క్రితం డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ఇదే ప్రాంతంలో కొనసాగుతున్న అక్రమ గ్రావెల్ తవ్వకాలను స్వయంగా చూడడం జరిగిందన్నారు. గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి సేకరిస్తున్న గ్రావెల్ మట్టిపై విచారణ చేసి అక్రమ తవ్వకాలపై తనకు నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. తిరిగి అదే కొండ ప్రాంతంలో ఇప్పుడు భారీ ఎత్తున గ్రావెల్ అక్రమ తవ్వకాలు కొనసాగుతుండడంపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. కాగా అక్రమ గ్రావెల్ తవ్వకాల విషయాన్ని తహసీల్దార్ ఎన్.నాగరాజు దృష్టికి తీసుకువెళ్లగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సూదిగట్టు తవ్వేస్తున్నారు ఆగిరిపల్లి: కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి మండలంలోని సహజ వనరులను దర్జాగా దోచుకుంటున్నారు. రాత్రి అయితే చాలు మండలంలో కొండలను, గుట్టలను, అడిగే వారు లేకపోవడంతో అడ్డగోలుగా తవ్విస్తున్నారు. వడ్లమానులో సూది గట్టు వద్ద ఆదివారం అర్ధరాత్రి అక్రమంగా తవ్వకాలు జరిపి గ్రావెల్ను తరలించిపోతుండగా గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు వచ్చి కనీసం ఎటువంటి కేసులు నమోదు చేయకుండా వెళ్లిపోయారు. ఆ తర్వాత యథావిధిగా గ్రావెల్ తవ్వకాలు జరిగాయి. అమ్మవారి గూడెం గ్రామంలోని మాల గట్టు, ఈదులగూడెం, నరసింగపాలెంలో కూడా గ్రావెల్ మాఫియా అడ్డగోలుగా తవ్వేస్తున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు మాత్రం తమకేమీ సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి సహజ వనరులైన మట్టి, గ్రావెల్ను అక్రమార్కులు తరలించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. -
కుమారుడి మరణం జీర్ణించుకోలేక తల్లి మృతి
చింతలపూడి: కుమారుడి మరణాన్ని జీర్ణించుకోలేని ఓ తల్లి మృతి చెందిన ఘటన గురుభట్ల గూడెం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చక్రపు వాసు (65) గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆదివారం వాసు తీవ్ర అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో కుమారుడు మరణించడం తెలుసుకున్న వాసు తల్లి శాంతమ్మ(90) తీవ్ర మనోవేదనకు గురైంది. తన కళ్లముందే కుమారుడు మృతి చెందిన విషాదాన్ని జీర్ణించుకోలేక సోమవారం శాంతమ్మ కూడా తనువు చాలించింది. రెండు రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలోని తల్లి, కుమారుడు మృతి చెందడంతో గురుభట్లగూడెంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. -
రామిలేరులో గల్లంతైన యువతి మృతదేహం లభ్యం
నూజివీడు: రామిలేరులో గల్లంతైన తుక్కులూరు దళితవాడకు చెందిన బడిపాటి నీరజ(20) మృతదేహం సోమవారం లభ్యమైంది. ఆదివారం చర్చికి వెళ్లి తిరిగి వస్తూ తుక్కులూరు, మర్రికుంటల మధ్యలో రామిలేరుపై ఉన్న లోలెవెల్ కాజ్వేను దాటుతూ వరద ఉద్ధృతిలో ఆమె కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందం రామిలేరు వాగులో సోమవారం ఉదయం గాలించగా ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలో మృతదేహం లభ్యమైంది. నూజివీడు ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం నీరజ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. గాలింపు చర్యలను తహసీల్దార్ గుగులోతు బద్రూనాయక్ పర్యవేక్షించారు. నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీలో సోమవారం ఇంజినీర్స్ డే ను నిర్వహించారు. దీనిలో భాగంగా సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఏఓ బీ లక్ష్మణరావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏఓ మాట్లాడుతూ దేశ నిర్మాణంలో భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరాయ పాత్ర వెలకట్టలేనిదన్నారు. దేశంలోని అనేక నదులపై ఆనకట్టలు, వంతెనలు నిర్మించి నీటి పారుదల రంగంలో విశేష అభివృద్ధికి కారణమయ్యారన్నారు. దేశం గర్వించదగ్గ సుప్రసిద్ధ ఇంజినీర్ మోక్షంగుండం విశ్వేశ్వరయ్యను స్ఫూర్తిగా తీసుకొని సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థులు దేశ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించాలన్నారు. అనంతరం సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన పోటీలను నిర్వహించారు. కార్యక్రమంలో డీన్ అకడమిక్స్ సాదు చిరంజీవి, డీఎస్డబ్ల్యూఓ రాజేష్, సివిల్ హెచ్ఓడీ సునీల్భగత్, ఫ్యాకల్టీ పాల్గొన్నారు. ద్వారకాతిరుమల: శ్రీవారి దేవస్థానంలోని లీజెస్ విభాగంలో అవకతవకలకు పాల్పడిన రికార్డ్ అసిస్టెంట్ అనుమంచిపల్లి సాయి రామానుజన్ను సస్పెండ్ చేస్తూ ఆలయ ఈఓ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ద్వారకాతిరుమల మండలంలోని దేవినేనివారిగూడెంకు చెందిన జూనుపూడి సిద్ధయ్య స్థానిక టీటీడీ కాంప్లెక్స్ లోని 11 వ నెంబర్ షాపును దేవస్థానం నుంచి బహిరంగ వేలం ద్వారా లీజుకు తీసుకుని, అందులో ఫొటో స్టూడియో నడుపుతున్నాడు. అద్దె సొమ్ము రూ.58 వేలు చెల్లించాల్సి ఉండగా, గతనెల 6న రూ.51 వేలను లీజెస్ విభాగం రికార్డ్ అసిస్టెంట్ రామానుజన్కు ఇచ్చాడు. అతడు దేవస్థానానికి మరుసటి రోజు రూ. 42 వేలను జమ చేసి, రూ.9 వేలను పక్కదారి పట్టించాడు. సిద్ధయ్యకు రసీదును కూడా ఇవ్వలేదు. లీజెస్ విభాగం ఏఈఓ ఐనంపూడి రమణరాజు షాపు నిర్వాహకుడు సిద్ధయ్యకు మూడు రోజుల క్రితం ఫోన్చేసి బ్యాలెన్స్ అద్దె డబ్బులు రూ. 16 వేలను వెంటనే చెల్లించాలని సూచించారు. తాను సాయి రామానుజన్కు రూ.51 వేలు చెల్లించానని, మరో రూ. 7 వేలు చెల్లిస్తే సరిపోతుందని చెప్పాడు. వెంటనే ఎమ్మార్లను పరిశీలించిన ఏఈఓ రమణరాజు పక్కదారి పట్టిన రూ.9 వేలను వెంటనే దేవస్థానానికి జమ చేయాలని ఉద్యోగిని హెచ్చరించారు. దాంతో సదరు ఉద్యోగి ఈనెల 14 న రూ.9 వేలను జమ చేశాడు. ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో పాటు, సిద్ధయ్య సోమవారం ఫిర్యాదు చేయడంతో అధికారులు ప్రాథమిక విచారణ జరిపారు. ఉద్యోగి సాయి రామానుజన్పై సస్పెన్షన్ వేటు వేశారు. -
అథ్లెటిక్స్ జిల్లా జట్ల ఎంపిక
తణుకు అర్బన్: పశ్చిమ గోదావరి జిల్లా అండర్ 14, 16, 18, 20 బాలుర, బాలికల జిల్లా జట్ల ఎంపికలు తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో సోమవారం నిర్వహించినట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంకు సూర్యనారాయణ తెలిపారు. ఎంపికై న జట్లలోని క్రీడాకారులు ఈ నెల 27 నుంచి 29వ తేదీల్లో ఏలూరులో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని వివరించారు. ఈ ఎంపికలకు జిల్లా నలుమూలల నుంచి 200 మంది క్రీడాకారులు హాజరుకాగా వీరిలో ప్రతిభ కనబరచిన 42 మందిని ఎంపిక చేసినట్లు చెప్పారు. అసోసియేషన్ చైర్మన్ మానేపల్లి శ్రీనివాస్ క్రీడాకారులకు భోజన వసతి కల్పించి సర్టిఫికెట్లు, మెడల్స్ అందచేశారు. ఉత్సాహంగా అథ్లెటిక్స్ జట్ల ఎంపిక ఏలూరు రూరల్: ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో సోమవారం జిల్లా అథ్లెటిక్స్ జట్ల ఎంపిక పోటీలు ఉత్సాహంగా జరిగాయి. అండర్–14, 16, 18, 20 విభాగంలో బాలబాలికలకు వేరు వేరుగా ఎంపిక పోటీలు చేపట్టారు. రన్నింగ్, షాట్పుట్, జావలిన్, డిస్కస్, హేమర్త్రో పాటు హైజంప్, లాంగ్జంప్ అంశాల్లో అథ్లెట్లు నువ్వా నేనా అన్నట్టు పోటీ పడ్డారు. సుమారు 250 మంది బాలబాలికలు పోటీలకు హాజరయ్యారని కార్యదర్శి దేవరపల్లి ప్రసాద్ చెప్పారు. ఎంపికై న అథ్లెట్లు ఈ నెల 26వ తేదీ నుంచి 29 వరకూ ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో జరిగే అంతర జిల్లాల పోటీల్లో పాల్గొంటారని వివరించారు. అసోసియేషన్ చైర్మన్ ఆదిరెడ్డి సత్యనారాయణ, అధ్యక్షుడు గుళ్ల ప్రసాద్, ట్రెజరరీ ఏ శ్రీనివాసరావు, రిటైర్డ్ హెచ్ఎం జల్లా వీరభద్రరావు హాజరయ్యారు. -
టీడీపీ నేత దౌర్జన్యంపై ఫిర్యాదు
ఏలూరు (టూటౌన్): నా భూమిలోకి దౌర్జన్యంగా ప్రవేశించి షెడ్ను కూల్చి వేసి దౌర్జన్యం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బుట్టాయగూడెం మండలం సూరపావారిగూడెంకు చెందిన బల్లా భూలక్ష్మి జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదుచేశారు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు తెల్లం వెంకటేశ్వరరావు దౌర్జన్యంగా తన భూమిలోకి ప్రవేశించి రూ.4 లక్షల విలువైన షెడ్ ధ్వంసం చేసారని ఆరోపించారు. గత నెల 26న అక్రమంగా చొరబడి షెడ్డు కూల్చివేసి పంటను నాశనం చేశారన్నారు. నిందితులు తనపై దాడి చేశారన్నారు. తనకు ఆ భూమే జీవనాధారమని వారి అరాచకాల వల్ల మొత్తం రూ.13.90 లక్షలు నష్టపోయినట్లు చెప్పారు. -
పత్రికా స్వేచ్ఛ అణ చివేత
తమ వైఫల్యాలను ప్రశ్నించి, నిజాలు వెలికితీస్తున్న ‘సాక్షి’పై కూటమి ప్రభుత్వం అక్కసు వెళ్లగక్కుతోంది. పత్రికా స్వేచ్ఛను హరిస్తూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ పాత్రికేయులపై కేసులు నమోదు చేయడం హేయమైన చర్య. పత్రికలపై కేసులు బనాయించడం దేశంలో ఎక్కడా చూడలేదు. ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్య్రాన్ని పత్రికా స్వేచ్ఛను కూటమి ప్రభుత్వం దారుణంగా అణచివేస్తోంది. తక్షణమే సాక్షి యాజమాన్యం, పాత్రికేయులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి. – కవురు శ్రీనివాస్, ఎమ్మెల్సీ -
మహిళా కండక్టర్ ఆవేదన
జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న వై.కుసుమకుమారి మహిళలకు ఉచిత బస్సు పథకంపై స్పందిస్తూ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాము పడుతున్న ఇబ్బందులు, బాధలను వివరిస్తూ ఆర్టీసీ ఉన్నతాధికారులకు వీడియో పంపినట్టు ఆమె పేర్కొన్నారు. ఆ వీడియోలో ఏముందంటే.. ‘ఆర్టీసీ ఉన్నతాధికారులకు మా మనవి.. మీకో వీడియో పెడుతున్నాను చూడండి. పరిమితికి మించి 150 నుంచి 170 మంది బస్సు ఎక్కుతున్నారు. చాలా రెక్లెస్గా ఉన్నారు. డోర్లో ప్రమాదకరంగా నిలబడుతున్నారు.. డోర్ వద్ద నిలబడొద్దు.. పైకి ఎక్కమంటే కండక్టర్పై ఎదురు తిరుగుతున్నారు.. ఉద్యోగాలు చేయలేకపోతున్నాం.. ఎందుకు సర్, మా ఉద్యోగాలతో, మా ఊపిరితో, మా కుటుంబాలతో ఇలా ఆడుకుంటున్నారు.. అధికారులకు మా సేవల పట్ల కనీస జాలి, దయ లేదు.. పారిశుధ్య కార్మికుల కన్నా హీనంగా తయారైంది మా ఉద్యోగం.. కిక్కిరిసిన జనాలతో మా ఊపిరి ఆర్టీసీ బస్సులోనే పోయేలా ఉంది.. బస్సులో కొట్టుకోవడం, కండక్టర్పై తిరగబడటం, గొర్రెలా అరుస్తున్నా పైకి ఎక్కకపోవడం, ఏంటండి ఇది మాకు.. మీరిచ్చే జీతాల కన్నా ఎక్కువ కష్టపడుతున్నాం.. అయినా సరే సరైన రక్షణ, మా సేవల పట్ల గుర్తింపు లేకుండా పోయింది..’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరి కండక్టర్ ఆవేదనపై ప్రభుత్వం, అధికారులు స్పందన ఎలా ఉంటుందనేది వేచిచూడాలి. -
చింతలపూడిలో నల్ల బంగారం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు జిల్లా చింతలపూడికి మహర్దశ పట్టనుంది. సుమారు రెండు దశాబ్దాలుగా విస్తృతంగా చర్చల్లో ఉన్న బొగ్గు నిల్వల వ్యవహారం కొలిక్కి వచ్చింది. ఏయే ప్రాంతాల్లో ఏ మేర నిల్వలు ఉన్నాయనే గుర్తింపులు పూర్తి చేసి వేలం దశకు కేంద్రం తీసుకువచ్చింది. దీనిలో భాగంగా జిల్లాలో మొదటిగా చింతలపూడి మండలం రేచర్ల బొగ్గు బ్లాక్కు టెండర్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. సోమవారం ప్రీబిడ్ సమావేశం నిర్వహించి వచ్చే నెల 27 వరకు టెండర్లు తీసుకునేలా కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.గ్రేడ్–1 నిల్వలుజిల్లాలోని మెట్ట ప్రాంతమైన చింతలపూడి నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో అపార బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. అది కూడా గ్రేడ్–1 నిల్వలు ఉన్నట్టు అధికారికంగా నిర్ధారించారు. 1964 నుంచి 2004 వరకు కేంద్ర ప్రభుత్వం నాలుగు దఫాలుగా రకరకాల సర్వేలు నిర్వహించింది. మళ్లీ 2006 నుంచి 2016 వరకు సర్వే ప్రక్రియ అత్యంత వేగంగా కొనసాగింది. ప్రధానంగా ఏలూరు, ఖమ్మం జిల్లాల సరిహద్దులో 2,500 చదరపు కిలోమీటర్ల పరిధిలో అపార నల్ల బంగారం నిక్షేపాలున్నట్టు గుర్తించింది. గతంలో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ దీనిపై కేంద్రానికి కూడా నివేదిక పంపింది. ఈ పరిణామాల క్రమంలో చింతలపూడి, టి.నర్సాపురం, జంగారెడ్డిగూడెం మండలాల్లో కొన్ని గ్రామాల్లో గ్రేడ్–1 బొగ్గు భూగర్భంలో ఉన్నట్టు గుర్తించారు. గతంలో చింతలపూడి మండలంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) నిపుణుల బృందం సర్వే నిర్వహించింది. లక్నోకు చెందిన బీర్బల్ సహాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలియోబొటానీ అనే సంస్థ 2013లో ఉభయగోదావరి, కృష్ణా, ఖమ్మం జిల్లాల్లో సర్వే చేసింది. ప్రధానంగా గోదావరి పరీవాహక ప్రాంతంలోని చింతలపూడి, ముసునూరు మండలాల్లో సర్వే నిర్వహించింది. గతేడాది కేంద్రానికి నివేదిక సమర్పించి బొగ్గు ఉన్న ప్రాంతాలను బ్లాక్లుగా విభజించి వేలం ప్రక్రియకు శ్రీకారం చుట్టేలా చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో ఈ ఏడాది మార్చిలో దేశవ్యాప్తంగా 80 గనుల వేలానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. చింతలపూడి బ్లాక్ను వేలం జాబితాలో ఉంచినా సింగరేణి సహా ప్రధాన కంపెనీలు పోటీకి రాకపోవడంతో వేలం వాయిదా పడింది. ఈ నేపథ్యంలో గత వారంలో లాంఛనాలు పూర్తి చేసి టెండర్కు సన్నద్ధమయ్యారు. దీనిలో జిల్లాలోని చింతలపూడి మండలం రేచర్ల బొగ్గు బ్లాక్తో పాటు దేశవ్యాప్తంగా మరో 13 బ్లాక్లకు కలిపి టెండర్లకు ఆహ్వానించారు. 22.24 చదరపు కిలోమీటర్ల పరిధిలో రేచర్ల కేంద్రీకృతంగా యర్రగుంటపల్లి, సీతానగరం, మేడిశెట్టివారిపాలెం, లింగగూడెం, రాఘవాపురం తదితర గ్రామాల్లో బొగ్గు నిల్వలను నిర్ధారించారు.2.225 మిలియన్ టన్నులేఆంధ్రా–తెలంగాణ సరిహద్దు సమీపంలో ఉన్న రేచర్ల బొగ్గు బ్లాక్ పరిధి 22.24 చదరపు కిలోమీటర్లు. ఇక్కడ జీ–13 గ్రేడ్ బొగ్గు లభిస్తుందని, 623 మీటర్ల లోతు నుంచి గరిష్టంగా 1,123 మీటర్ల లోతులో నిల్వలు ఉన్నాయని, 2,225.63 మిలియన్ టన్నుల నిల్వలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని అంచనా వేసి టెండర్లను ఆహ్వానించారు. సోమవారం ప్రీబిడ్ సమావేశం నిర్వహించి వచ్చే నెల 27 వరకు టెండర్ దాఖలుకు తుది గడువుగా ప్రకటించారు. 28న టెక్నికల్ బిడ్లు తెరిచి నవంబర్ చివరి వారంలో ఈ–వేలం ద్వారా బొగ్గు గనిని కేటాయించనున్నారు. -
అలరించిన నాట్య విన్యాసాలు
ఏలూరు (ఆర్ఆర్పేట): నగరానికి చెందిన నటరాజ నాట్య కళాకేంద్రం, కళాదీపిక నృత్య అకాడమీ, శ్రీశ్రీ కల్చరల్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో 12వ జాతీయ స్థాయి నృత్య అవార్డుల ప్రదాన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. వైఎంహెచ్ఏ హాలులో ఈ కార్యక్రమం రాత్రి 10 గంటల వరకూ కొనసాగింది. 150 మంది చిన్నారులు చేసిన నృత్య విన్యాసాలు మంత్రముగ్ధులను చేశాయి. 20 మంది నృత్య గురువులకు నాట్య విదాత అవార్డులు ప్రదానం చేసి సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు ఎన్.రాజ్కుమార్ మాట్లాడుతూ ఎంతోమంది చిన్నారులను ప్రోత్సహించడానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో నాట్య గురువు వేదాంతం రాధేశ్యామ్, కళారత్న ఏ.పార్వతి రామచంద్రన్, నాట్యాచార్య డీ.హేమసుందర్ అతిథులుగా పాల్గొనగా, నటరాజ నాట్య కళాకేంద్రం నిర్వాహకురాలు ఎన్.కృష్ణవేణి కార్యక్రమాలు పర్యవేక్షించారు. -
గుంతలు పూడ్చండి మహాప్రభో!
ఏలూరు నగరంలో ఎక్కడ చూసినా గుంతలే. ఈ భారీ గోతుల మధ్య ప్రయాణమంటే జనం భయపడుతున్నారు. వర్షం పడితే గుంతల్లో నీరుచేరి ఎంత లోతు ఉందో తెలియక వాహనదారులు ప్రమాదానికి గురవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వర్షం నీటితో గుంతలన్నీ చెరువును తలపిస్తున్నాయి. ముఖ్యంగా ఏలూరు వన్టౌన్ ప్రాంతంలోని సత్యనారాయణ థియేటర్ రోడ్డు మరీ అధ్వానంగా తయారైంది. కనీసం గుంతలైనా పూడ్చమని ప్రజలు మొరపెట్టుకుంటున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్/ఏలూరు వైఎంహెచ్ఎ హాల్ సెంటరులో.. సత్యనారాయణ థియేటర్ మెయిన్ రోడ్డులో..ఏలూరు పెద్ద వంతెన సెంటర్ వద్ద.. -
పత్రికా స్వేచ్ఛను హరించడమే
భీమవరం: సాక్షి దినపత్రికపై ఉద్దేశ్య పూర్వకంగా కేసులు పెట్టడం పత్రికా స్వేచ్ఛను హరించడమేనని దళిత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందరకుమార్ అన్నారు. భీమవరం పట్టణం ప్రకాశంచౌక్ సెంటర్లో శనివారం నిర్వహించిన ఐక్య వేదిక ముఖ్యనాయకులు సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల పక్షాన ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను సాక్షి పత్రికలో ప్రచురించడాన్ని జీర్ణించుకోలేని కూటమి ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తోందని దీనిలో భాగంగానే సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై కేసులు పెట్టారని దీనికి దళిత ఐక్యవేదిక తీవ్రంగా ఖండిస్తునట్లు చెప్పారు. ఈ సమావేశంలో గొల్ల రాజ్కుమార్, ఆలమూరి బాబ్జి, తుళ్లూరి చంటి, పట్టెం శుభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఈ నెల 16, 17 తేదీల్లో ఏలూరు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని యాజమాన్యాల ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అండర్–14, అండర్–17 బాలబాలికల క్రీడా జట్ల ఎంపికలు నిర్వహించనున్నట్టు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి కే అలివేలు మంగ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఈ నెల 16న అండర్–17 బాలబాలికల వెయిట్ లిఫ్టింగ్ జట్ల ఎంపిక అల్లూరి సీతారామరాజు స్టేడియంలో జరుగుతుందన్నారు. అండర్–14, 17 బాలబాలికల స్విమ్మింగ్ జట్ల ఎంపికలు అల్లూరి సీతారామ రాజు స్విమ్మింగ్ పూల్లో, అండర్–14, 17 కరాటే జట్ల ఎంపికలు స్థానిక కాస్మోపాలిటన్ క్లబ్ ప్రాంగణంలో జరుగుతాయన్నారు. అండర్–14 జట్లకు వచ్చే విద్యార్థులు 2012 జనవరి 1న కానీ ఆ తరువాత కానీ పుట్టి ఉండాలన్నారు. అండర్–17 జట్ల ఎంపికకు 2009 జనవరి 1న కానీ ఆ తరువాత పుట్టి ఉండాల న్నారు. ఇతర వివరాలకు 9030894311 నెంబర్లో సంప్రదించవచ్చన్నారు. -
ఉచితం.. అవస్థల ప్రయాణం!
ప్రముఖ క్షేత్రంలో బస్సుల కోసం ఇన్ని ఇబ్బందులు పడాలా? మరీ ఇంత దారుణంగా ఉంటుందని అనుకోలేదు. రెండు గంటల నుంచి రాజమండ్రి బస్సు కోసం బస్టాండ్లో వేచి ఉన్నాం. కనీసం భీమడోలు వరకు అయినా వెళదామంటే బస్సు ఎక్కడానికి వీలు లేకుండా ఉంది. – కుడిపూడి సత్యనారాయణ, భక్తుడు, రాజమహేంద్రవరం శనివారం భక్తులు ఎక్కువగా ఉంటారని ఆర్టీసీ అధికారులకు తెలియదా? రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు బస్సు సర్వీసులను పెంచాలి కదా. గంటకో బస్సు వస్తోంది. అది ఎక్కేందుకు వందల మంది పోటీ పడుతున్నారు. క్షేత్రంలో ఇలాంటి ఇబ్బందులు ఎప్పుడూ ఎదుర్కోలేదు. – వేగి వీరమ్మ, భక్తురాలు, పాలకొల్లు బస్సులు నడపలేనప్పుడు ఉచిత బస్సు పథకం ఎందుకు పెట్టారు? మహిళలను ఇబ్బంది పెట్టడానికా? శ్రీవారి దర్శనార్థం యానాం నుంచి వచ్చాం. తిరిగి వెళ్లేందుకు బస్సులు లేవు. పిల్లలు, దివ్యాంగులు, వృద్ధులతో ఎన్నో కష్టాలు పడుతున్నాం. ఉచిత బస్సులను తీసేసి, పూర్తి స్థాయిలో బస్సులను నడపండి. – జిత్తుగ శ్రీదేవి, భక్తురాలు, యానాం నేను దివ్యాంగుడిని. నా తల్లి సాయంతో వచ్చి శ్రీవారిని దర్శించుకున్నాను. బస్టాండుకు వస్తే జనంతో నిండిపోయింది. నాలాంటి వారు బస్సు ఎలా ఎక్కాలి? – ప్రవీణ్కుమార్, దివ్యాంగ భక్తుడు, ఉయ్యూరు ద్వారకాతిరుమల: ఓ వైపు చాలీచాలని బస్సులు.. మరో వైపు ఇళ్లకు చేరుకోవాల్సిన భక్తులు.. ఏం చేయాలో పాలుపోక వృద్ధులు, చంటి పిల్లలు, దివ్యాంగులతో బస్టాండ్లో గంటల తరబడి పడిగాపులు.. ఇదీ ద్వారకాతిరుమలలోని శ్రీవారి భక్తుల దీన స్థితి. ఈ దుస్థితికి ఉచిత బస్సు ప్రయాణాలే కారణమని కొందరు మహిళా భక్తులు ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. చిన్న తిరుపతి క్షేత్రాన్ని శనివారం వేలాది మంది భక్తులు దర్శించారు. అనంతరం తిరిగి బస్సుల్లో స్వగ్రామాలకు చేరుకునేందుకు వారంతా బస్టాండ్కు చేరుకున్నారు. భక్తుల రద్దీకి సరిపడా బస్సులు లేకపోవడంతో బస్టాండ్ మొత్తం యాత్రికులతో నిండిపోయింది. దానికి తోడు మధ్యాహ్నం వర్షం కురవడంతో నిలవడానికి చోటు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. బస్సులే లేవు.. ఉచిత బస్సు ఏమిటి? ఉచిత బస్సు ప్రయాణం వల్లే ఇబ్బందులు ఏర్పడ్డాయని మహిళా భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము గతంలో శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు తిరుగు ప్రయాణంలో ఇన్ని ఇబ్బందులు ఎప్పుడూ పడలేదని, ప్రస్తుత పరిస్థితికి ఉచిత ప్రయాణాలే కారణమని అన్నారు. బస్సులు తక్కువగా వస్తుండటంతో, వచ్చిన వాటిలో సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కుతున్నారని, దీంతో అవి పక్కకు ఒరిగిపోతున్నాయని విమర్శించారు. గుడి సెంటర్లో బస్సులు ఆపకపోవడం వల్ల బస్టాండుకు వచ్చామని, కానీ ఇక్కడ అసలు నిలబడడానికి కూడా దారిలేదని వాపోయారు. పునరుద్ధరించని బస్సు సర్వీసులు భీమవరం, నరసాపురం ఆర్టీసీ డిపోలు ద్వారకాతిరుమలకు పలు బస్సు సర్వీసులను రద్దు చేశాయి. దానికి తోడు చాలీచాలని బస్సుల కారణంగా యాత్రికులు పడుతున్న ఇబ్బందులపై సాక్షి దినపత్రికలో గతనెల 31న ‘ఉచిత బస్సు.. ప్రయాణం తుస్సు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ఏలూరు ప్రజారవాణా శాఖ అధికారి ఎస్కే షబ్నం భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సు సర్వీసులను పెంచుతామని, రద్దయిన సర్వీసులను త్వరలో పునరుద్ధరిస్తామని తెలిపారు. కానీ ఇప్పటివరకు అవి అమలు కాలేదు. ద్వారకాతిరుమల క్షేత్రంలో యాత్రికులకు ప్రయాణ కష్టాలు చాలీచాలని బస్సులు.. భక్తుల కొట్లాటలు ఉచిత బస్సుల్లో రద్దీ ఇబ్బందులు బస్సుల ద్వారాల వద్ద నిలబడి ప్రమాదకర ప్రయాణాలు బస్సు ఎక్కే సమయంలో యాత్రికులు తోపులాటకు దిగి ఒకానొక దశలో కొట్లాటలకు దిగారు. దీంతో బస్టాండ్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు బస్టాండ్లో ఇదే పరిస్థితి కొనసాగింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి యాత్రికులను నియంత్రించే ప్రయత్నం చేశారు. పోలీసులను సైతం లెక్కచేయలేదు. దాదాపు అన్ని బస్సుల్లోనూ ద్వారాల వద్ద నిలబడే యాత్రికులు ప్రయాణాలు సాగించారు. ఈ ప్రమాదకర ప్రయాణాలు తోటి యాత్రికులను ఆందోళనకు గురిచేశాయి. -
ఆక్రమణలను అడ్డుకున్న అటవీ అధికారులు
చాట్రాయి: మండలంలోని పోతనపల్లికి చెందిన గిరిజనులు శనివారం అటవీ భూములను ఆక్రమించుకునే యత్నాన్ని ఫారెస్టు అధికారులు అడ్డుకున్నారు. సుమారు 60 మంది ఉదయం అడవిలో తుప్పలు కొడుతుండగా సమాచారం అందుకున్న అధికారులు అడ్డుకోవడంతో గిరిజనులు, అధికారుల మధ్య కొద్ది సేపు వాగ్వాదం చోటు చేసుకుంది. తమ్మిలేరు వల్ల తమ భూములు కోల్పోయామని వాటికి ప్రత్యామ్నాయంగా ముంపు భూములను సాగు చేసుకుంటామని చెప్పగా తమ్మిలేరు రిజర్వాయర్ ప్రాజెక్టు అధికారులు ఫారెస్టు అధికారులు జాయింట్ సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని అంతవరకు ఆక్రమణలు చేపట్టవద్దని సూచించారు. ప్రభుత్వ అనుమతి ఇస్తే వనసంరక్షణ సమితి ఏర్పాటు చేసి ఆదాయం కలిగేలా చేస్తామని ఫారెస్టు అధికారులు గిరిజనులకు చెప్పారు. అనంతరం కొంత మందిపై ఆక్రమణలు చేసినందుకు స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసినట్లు ఫారెస్టు అధికారి సత్యనారాయణ తెలిపారు. కొయ్యలగూడెం: అచ్చుతాపురం వద్ద శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై వి.చంద్రశేఖర్ వివరాల ప్రకారం.. రాజమండ్రికి చెందిన నల్లమాటి రాంబాబు (58) కొయ్యలగూడెం వ్యాపారం నిమిత్తం వచ్చి తిరిగి రాజమండ్రి వైపు వెళుతుండగా గోపాలపురం మండలం బుచ్చంపేట నుంచి కొయ్యలగూడెం వైపు బైక్పై తల్లితో వస్తున్న తామా శ్రీరామ్ ఢీకొట్టాడు. రాంబాబు తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 108 సిబ్బంది చేరుకొని గాయపడిన శ్రీరామ్, అతని తల్లిని కొయ్యలగూడెం పీహెచ్సీకి, అక్కడ నుండి జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్ కి తరలించారు. ఏలూరు రూరల్: ఈ నెల 16న ఏలూరు జిల్లా బాల బాలికల జూనియర్ కబడ్డీ జట్ల ఎంపిక పోటీలు చేపట్టనున్నామని ఏలూరు జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి రంగారావు, అధ్యక్షుడు ఎం.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. వట్లూరు సర్ సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో మధ్యాహ్నం 2 గంటలకు ఎంపిక జరుగుతుందన్నారు. 2006 జనవరి 1 తర్వాత పుట్టిన వారే పాల్గొనేందుకు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు 99519 31133 నెంబర్లో సంప్రదించాలన్నారు. చింతలపూడి: విజిలెన్సు, రెవిన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు శనివారం చింతలపూడి మండలంలోని ఎరువులు షాపులను తనిఖీ చేశారు. మండలంలోని సీతానగరంలో గణేష్ ట్రేడర్స్, శ్రీ లక్ష్మి ట్రేడర్స్ షాపుల్లో తనిఖీ చేయగా రూ.15,67,650 విలువ కలిగిన 64.5 టన్నుల ఎరువులు తేడా ఉన్నట్లు గుర్తించి వాటిని సీజ్ చేశారు. షాపు యజమానులపై కేసులు నమోదు చేసినట్లు ఏఓ మురళీ కృష్ణ తెలిపారు. జంగారెడ్డిగూడెం: కొంగువారిగూడెం కేకేఎం ఎర్రకాలువ జలాశయంలోకి వరద నీరు చేరడంతో జలాశయం నీటిమట్టం 82.70 మీటర్లకు చేరుకుంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 83.5 మీటర్లు కాగా.. ప్రస్తుతం 12,619 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో జలాశయంలోకి భారీగా వరద నీరు వస్తోంది. దీంతో రెండు గేట్లు ఎత్తి దిగువకు 5,078 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఎడమవ కాలువ నుంచి సాగునీటికి 50 క్యూసెక్కులు, కుడి కాలువ నుంచి 80 క్యూసెక్కుల విడుదల చేస్తున్నట్లు ఇరిగేషన్ ఏఈ రాహుల్ భాస్కర్ తెలిపారు. బుట్టాయగూడెం: భారీ వర్షాల నేపథ్యంలో కొండవాగులు పొంగుతున్నందున గుబ్బల మంగమ్మతల్లి దర్శనాలు నిలిపి వేస్తునట్లు బుట్టాయగూడెం ఎస్సై దుర్గా మహేశ్వరరావు శనివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా ఉండేందుకే వర్షాలు తగ్గే వరకు ఆలయ ప్రవేశాలను నిలిపి వేస్తున్నట్లు తెలిపారు. -
22 నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు
ద్వారకాతిరుమల: ఏటా తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరిగే శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ ఏడు 11 రోజుల పాటు జరగనున్నాయి. అందులో భాగంగా ఈనెల 22 నుంచి వచ్చేనెల 2 వరకు జరగనున్న ఉత్సవాలను పురస్కరించుకుని ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయానికి ఉపాలయమైన, క్షేత్ర దేవత శ్రీ కుంకుళ్లమ్మ అమ్మవారి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ప్రస్తుతం విద్యుద్దీప అలంకారాల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రహదారికి ఇరువైపులా విద్యుత్ తోరణాలు అమర్చుతున్నారు. ఆలయం వద్ద అమ్మవారి భారీ విద్యుత్ కటౌట్ నిర్మిస్తున్నారు. ఉత్సవాలు జరిగే రోజుల్లో అమ్మవారు రోజుకో ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారని ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. అలంకారాలు ఇవీ.. దసరా ఉత్సవాల సందర్భంగా కుంకుళ్లమ్మ అమ్మవారు ఈనెల 22న శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా, 23 న శ్రీ గాయత్రీ దేవిగా, 24 న శ్రీ అన్నపూర్ణా దేవిగా, 25 న శ్రీ కాత్యాయని దేవిగా, 26న శ్రీ మహాలక్ష్మి దేవిగా, 27న లలితా త్రిపుర సుందరీ దేవిగా, 28న మహాచండీగా, 29 న శ్రీ సరస్వతీ దేవిగా(మూలానక్షత్రం), 30 న శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు. అలాగే వచ్చేనెల 1న మహిషాసురమర్దినిగా, ఉత్సవాల ముగింపు రోజైన(దసరా పండుగ) 2న శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు భక్తులను కటాక్షిస్తారని తెలిపారు. అదేరోజు సాయంత్రం క్షేత్రంలో కుంకుళ్లమ్మ అమ్మవారి రథోత్సవం, 3న దీక్షాధారుల ఇరుముడి సమర్పణ, చండీహోమాన్ని నేత్రపర్వంగా నిర్వ హిస్తామని పేర్కొన్నారు. 4న ఆలయం వద్ద భారీ అన్నసమారాధన నిర్వహిస్తామని తెలిపారు. ద్వారకాతిరుమలలో శ్రీవారిని దర్శించిన అనంతరం భక్తులు తిరుగు ప్రయాణంలో తప్పనిసరిగా కుంకుళ్లమ్మ అమ్మవారిని దర్శించుకుంటారు. ద్వారకాతిరుమలలో క్షేత్ర దేవత కుంకుళ్లమ్మ అమ్మ ఆలయం ఆలయం వద్ద అమ్మవారి భారీ విద్యుత్ కటౌట్ నిర్మాణ పనులు శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ ఏడాది 11 రోజులు రావడం విశేషం. తిధుల్లో హెచ్చుతగ్గులు రావడమే ఇందుకు కారణం. ఉత్సవాలు జరిగే రోజుల్లో విజయవాడ దుర్గమ్మ ఏ రోజు ఏ అలంకారంలో దర్శనమిస్తారో, ఇక్కడ కుంకుళ్లమ్మ అమ్మవారు కూడా అదే అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. – భైరవ స్వామి, కుంకుళ్లమ్మ ఆలయ ప్రధాన్చాకుడు, ద్వారకాతిరుమల ఈసారి 11 రోజుల పాటు వేడుకలు ముస్తాబవుతున్న క్షేత్ర దేవత కుంకుళ్లమ్మ ఆలయం రోజుకో అలంకారంలో దర్శనమివ్వనున్న అమ్మవారు -
రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక
కొయ్యలగూడెం: జిల్లా స్థాయిలో నిర్వహించిన ఫుట్బాల్, సెపక్తక్రా పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు విద్యాసంస్థల ప్రతినిధులు శుక్రవారం పేర్కొన్నారు. ఈనెల 11న పెదవేగిలో నిర్వహించిన ఫుట్బాల్ అండర్–19 విభాగంలో పదో తరగతి చదువుతున్న కోమటి గుంట మనోజ్ కుమార్, రామని బాలాజీ, గుర్రం వెంకటలక్ష్మి ప్రతిభ చూపి ఆకట్టుకున్నారన్నారని ప్రధానోపాధ్యాయుడు కె.రవికుమార్ తెలిపారు. దీంతో వీరిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారని తెలిపారు. అదేవిధంగా కొయ్యలగూడెం వీఎస్ఎన్ కళాశాలలో ఇంటర్ అభ్యసిస్తున్న పాక దుర్గా మధుర శ్రీ జిల్లా స్థాయి పోటీలలో పాల్గొని సెపక్తక్రా విభాగంలో ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై ంది ఈ సందర్భంగా విద్యార్థులను ఎస్ఎంసి చైర్మన్ కోడి నాగలక్ష్మి, పీఈటి సురేష్ అభినందించారు. తాడేపల్లిగూడెం (టీఓసీ): స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల సెకండియర్ విద్యార్థి హేమంత్ కుమార్ ఏలూరులో జరిగిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అండర్–19 బ్యాడ్మింటన్ సింగిల్స్లో ప్రథమ స్థానంలో నిలిచాడు. దీంతో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. హేమంత్ కుమార్, వ్యాయామ అధ్యాపకుడు మాణిక్యం రాజాను ప్రిన్సిపాల్ నాగవేణి, అధ్యాపక బృందం అభినందించారు. భీమవరం: తెలుగు రాష్ట్రాల ర్యాపిడ్ చెస్ చాంపియన్షిప్ పోటీలు అక్టోబర్ 12న భీమవరంలో నిర్వహించనున్నట్టు జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు మాదాసు కిషోర్ తెలిపారు. దీనికి సంబంధించిన బ్రోచర్ల ఆవిష్కరణ శుక్రవారం నిర్వహించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు విజేతలకు రూ.లక్ష నగదు బహుమతులు, క్రీడాకారులకు ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్నట్టు ఆయన తెలిపారు. తాడేపల్లిగూడెం: ఎన్సీసీ బెటాలియన్ ఆధ్వర్యంలో ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలకు సంబంధించి ఐజీసీఆర్డీసీ సెలక్షన్ క్యాంపు కమాండెంటు కల్నల్ అమిత్ పాండే ఆధ్వర్యంలో శుక్రవారం వరకు నిర్వహించారు. ఈ శిబిరంలో డ్రిల్ ఫైరింగ్, కల్చరల్ ప్లాగ్ విభాగాల్లో పరీక్షలు నిర్వహించారు. ఇక్కడ ఎంపికై న వారు గుంటూరులో జరగనున్న క్యాంపులో పాల్గొంటారు. కై కలూరు: చేపల చెరువు గట్టుపై గడ్డి కోస్తున్న కూలీని పాము కాటు వేయడంతో మరణించిన ఘటన పల్లెవాడలో గురువారం జరిగింది. రూరల్ పోలీసుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పెద్ది నాగరాజు(44)లో చేపల చెరువుపై పనిచేస్తున్నాడు. పురుగు కుట్టుందని భావించి సరైన సమయంలో చికిత్స తీసుకోలేదు. పరిస్థితి విషమించడంతో కై కలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం ఏలూరు తరలిస్తుండగా మరణించాడు. -
మూలనపడ్డ ఎన్హెచ్–165 పనులు
ఆకివీడు: జాతీయ రహదారి–165 నిర్మాణంలో భాగంగా స్థానిక ఉప్పుటేరుపై నిర్మించనున్న వంతెన పనులు పూర్తిగా స్తంభించిపోయాయి. పామర్రు–ఆకివీడు, ఆకివీడు–దిగమర్రు జాతీయరహదారి నిర్మాణానికి అడుగడుగునా అవాంతరాలతో కాలం గడిచిపోతుంది. పీపీ రోడ్డుగా ఉన్న ఈ రహదారిని 1999లో జాతీయ రహదారిగా గుర్తించి ఆ శాఖ విలీనం చేసుకుంది. అప్పటి నుంచి పాత రహదారి పునర్నిర్మాణ పనులు చేపట్టకపోయినా, తూట్లు పడ్డ ప్రాంతంలో మాట్లు వేసి ఎన్హెచ్ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. ప్రజలు, ప్రయాణికులు జాతీయరహదారిగా గుర్తింపు పొందిన తరువాత కొత్త రోడ్డు వేస్తారు.. రోడ్డు విస్తరణ జరుగుతుందని ఎంతో ఆశపడ్డారు. చివరకు నిరాశే మిగిలింది. ప్రస్తుతం ఏలూరు జిల్లా పరిధిలో ఉన్న పామర్రు–ఆకివీడు ప్రాంతంలో రహదారి విస్తరణ, అభివృద్ధి పనులు వేగంగా జరుగుతూ చాలా వరకూ పనులు పూర్తి చేశారు. ఏలూరు జిల్లా తాడినాడ ప్రాంతంలోని ఉప్పుటేరు గట్టు నుంచి, ఆకివీడు మండలంలోని అయిభీమవరం గుండా బైపాస్ వెళ్లేందుకు ఉప్పుటేరుపై వంతెన నిర్మాణ పనులు రెండేళ్ల క్రితమే ప్రారంభించారు. ఉప్పుటేరులో పిల్లర్ల నిర్మాణం వేగంగా చేపట్టారు. రెండు వేసవిలు పూర్తయిన తరువాత నిర్మాణ పనుల్ని అర్థంతరంగా మూసివేశారు. ఎక్కడ పిల్లర్లు అక్కడే ఉప్పుటేరులో తుప్పుపట్టిపోతున్నాయి. పామర్రు–ఆకివీడు మధ్య ప్రాజెక్టు పనులలో భాగంగా ఈ వంతెన నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉందని చెబుతున్నారు. పిల్లర్లకు ఉన్న ఇనుప రాడ్లు తుప్పు పడుతుండటంతో వంతెన నిర్మాణానికి మళ్ళీ పిల్లర్లు వేయాలా అన్న సందేహం వ్యక్తమవుతోంది. పాత రోడ్డుకు తెర ఆకివీడు–దిగమర్రు మధ్య బైపాస్ రోడ్ల నిర్మాణంతో పాత రోడ్లు కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. బైపాస్ రోడ్లతో కలిపి 46 కిలోమీటర్ల మేర ఫోర్లైన్ రోడ్డు నిర్మాణానికి మొదట్లో రూ.1,200 కోట్లు, ఆ తరువాత రూ.2,400 కోట్లు, ప్రస్తుతం రూ.3,100 కోట్ల నిధులు కేటాయించారు. పాత అలైన్మెంట్ ప్రకారం ఫోర్లైన్ రోడ్డు నిర్మాణానికి అంచనా రూ.2,400 కోట్లతో ప్రతిపాదనలు ఆమోదించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొత్త అలైన్మెంట్ ప్రకారం మరో రూ.700 కోట్లు అదనంగా కేటాయించారు. పాత రోడ్డుకు మోక్షం కల్పించండి జాతీయ రహదారి 165 పాత రోడ్డుకు మోక్షం కల్పించేలా ఆ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణం చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు. బైపాస్తో కొత్త రోడ్డు నిర్మాణానికి మరో 10 ఏళ్లు పట్టినా ఆశ్చర్యపడాల్సిన అవసరంలేదని పలువురు పేర్కొంటున్నారు. పాతరోడ్డును నాలుగు లైన్లకు గానీ, కనీసం మూడు లైన్లకు గానీ విస్తరింపజేసి, ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించాలని పలువురు కోరుతున్నారు. జాతీయ రహదారి విస్తరణ, నిర్మాణ పనులు రెండు దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ప్రతిపాదనల రూపంలోనే ఉండిపోయింది. ప్రభుత్వాలు మారినా, ప్రజా ప్రతినిధులు మారినా ఎన్హెచ్–165 రూపురేఖలు మారడంలేదు. ప్రస్తుతం ఉన్న రోడ్డును అభివృద్ది చేయాలి. – అంబటి రమేష్, ఆకివీడు జాతీయ రహదారి–165 అభివృద్ధి జరగకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నాము. వాహనాల సంఖ్య పెరగడంతో ట్రాఫిక్ పెరిగిపోతుంది. జాతీయ రహదారిని నాలుగు లైన్లుగా త్వరితగతిని అభివృద్ధి చేయాలి. బైపాస్ రోడ్లకు పనుల్ని వేగవంతం చేయాలి. నిత్యం ట్రాఫిక్తో సతమతమవుతున్నాం. – కె.లాజరు, కుముదవల్లి, పాలకోడేరు మండలం -
యాజమాన్య పద్ధతులు పాటించాలి
పోలవరం రూరల్: యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా వరిలో ఆశించే ఎండాకు తెగులు, ఉల్లికోడు, ఆకునల్లి తెగుళ్లను నివారించవచ్చని ఏలూరు జిల్లా ఏరువాక కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ కె.ఫణి కుమార్ అన్నారు. గూటాల, కొత్త పట్టిసీమ రైతులకు వరి పొలంలో ఆశించే ఎండాకు తెగులు, ఉల్లికోడు, ఆకు నల్లిపై రైతులకు అవగాహన కార్యక్రమం గూటాలలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరిలో ఆశించే ఎండాకు తెగులు నత్రజని ఎరువులు అధికంగా వాడడం వల్ల, వాతావరణ పరిస్థితులు వల్ల ఆశిస్తుందన్నారు. నత్రజని ఎరువులు వాడకాన్ని తక్కువ మోతాదులో వాడటం– పోటాష్ ఎరువును అధిక మోతాదులో వాడుకుంటే ఈ ఎండాకు తెగులు కొంతవరకు అరికట్టవచ్చన్నారు. మురికి నీటిని ఎప్పటికప్పుడు తీస్తూ కాలువలో ఉన్న నీరుని ఎప్పటికప్పుడు చేల్లో పెట్టుకుంటూ ఉండాలన్నారు. ఎండాకు తెగులు ఆశించిన పొలాల్లో కాప్రాక్సీ క్లోరైడ్ రెండు గ్రాములు లీటరు నీటికి, లేదా ప్లాంటు మైసనోగ్రామ్ లీటరు నీటికి కలిపి చేనంతా తడిచేలా పిచికారీ చేయాలన్నారు. వరి దుబ్బుకు రెండు కన్నా ఎక్కువగా ఉల్లికోడు ఉన్నట్లయితే నివారణ చర్యలు చేపట్టుకోవాలన్నారు. పెప్రోనిల్ 2 ఎంఎల్ లీటరు నీటికి లేదా క్లోరీఫైరిపాస్ 2.5 ఎంఎల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. ముదురునారు నాటడం వల్ల ఉల్లికోడు ఎక్కువగా ఆశించే అవకాశం ఉందన్నారు. దీని నివారణకు నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లీటరు నీటికి లేదా డైకో ఫాలో 5 ఎంఎల్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలన్నారు. ముదినేపల్లి రూరల్: ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యంపై ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం ముదినేపల్లికి చెందిన బొర్రా కుసుమ భర్త పున్నారావు రెండేళ్ల క్రితం మరణించాడు. కుసుమ అప్పటి నుంచి ముదినేపల్లిలో తండ్రి ఇంటి వద్దే ఉంటోంది. కుసుమకు ఇద్దరు పిల్లలు. ఈ నెల 11న డ్వాక్రా గ్రూపు వాయిదా చెల్లించేందుకు మచిలీపట్నంలోని అత్తగారింటికి వెళ్లింది. అదే రోజు తిరిగి సాయంత్రం ముదినేపల్లి వచ్చింది. ఇద్దరు కుమారులు పాఠశాల నుంచి రాగానే తమ బంధువులకు యాక్సిడెంట్ జరిగిందని పొరుగూరు వెళ్తున్నానని, తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పాలని పొరుగింట్లో చెప్పి పిల్లలతో సహా వెళ్లిపోయింది. తండ్రి బంధువులను ఆరా తీయగా ఎవరూ ఆచూకీ తెలపకపోవడంతో స్టేషన్ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): ప్రస్తుత ఖరీఫ్లో రైతుల నుంచి ధాన్యం సేకరణకు లక్ష్యాలను నిర్దేశించినట్టు జాయింట్ కలెక్టర్ రాహుల్కుమార్రెడ్డి తెలిపారు. కాకినాడలో శుక్రవారం ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల అధికారుల సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ విషయం వెల్లడించారని తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాలో 5 లక్షలు, ఏలూరు జిల్లాలో 4 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యమన్నారు. కేంద్రం వరి సాధారణ రకాలకు రూ.2369, ఏ గ్రేడ్ రకాలకు రూ.2389 మద్దతు ధరల ప్రకటించిందని చెప్పారు. పాలకొల్లు సెంట్రల్: క్షీరారామలింగేశ్వరస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు నియామకపు ఉత్తర్వులు శుక్రవారం వెలువడ్డాయి. సభ్యులుగా మీసాల రామచంద్రరావు, ఉప్పలపు పెద్దిరాజు, నాళం వెంకట సురేఖ, పినిశెట్టి శ్రీనివాస్, కొండ్రెడ్డి సూర్యనారాయణ, పెన్మత్స శ్రీదేవి, బాసిన సత్యనారాయణ, వాండ్రపు కుమారి, నీలాపు సింహాచలం, నీలాపు మణి సభ్యులుగా ఎన్నికయ్యారు. -
రోడ్డు ప్రమాదంలో వీఆర్వో మృతి
గణపవరం (నిడమర్రు): పిప్పర గ్రామంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్.కొండేపాడు వీఆర్వో అడబాల రామకృష్ణ ప్రసాద్ మృతిచెందారు. గణపవరం ఎస్సై మణికుమార్ తెలిపిన వివరాల ప్రకారం రామకృష్ణ ప్రసాద్ స్వగ్రామం వీరేశ్వరపురం నుంచి విధుల నిమిత్తం ఎస్.కొండేపాడు వెళ్తుండగా.. మధ్యలో పిప్పరలోని రాజ్ కళ్యాణ మండపం వద్ద వ్యాన్ వెనక నుంచి ఢీకొనడంతో ప్రసాద్ అక్కడికక్కడే మృతిచెందాడు. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసి తాడేపల్లిగుడెం ప్రభుత్వ అసుపత్రిలో పోస్ట్మార్ట్ అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు. తహసీల్దారు అప్పారావు, కార్యాలయం సిబ్బంది వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. దెందులూరు: గోదావరి కాలువలో దెందులూరు మండలం సత్యనారాయణపురం వద్ద మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని గమనించిన గ్రామస్తులు దెందులూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి చేతి మీద సత్య అని రాసి ఉందని 40 సంవత్సరాలు వయసు ఉంటుందని ఎస్సై ఆర్.శివాజీ తెలిపారు. మృతుడి వివరాలు తెలిస్తే సంప్రదించాలన్నారు. -
లోక్ అదాలత్ను విజయవంతం చేయాలి
ఏలూరు (టూటౌన్): ఈ నెల 13న జరిగే జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చూడాలని సంబంధిత అధికారులకు ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి ఆదేశించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా 13న లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని తెలిపారు. శుక్రవారం జిల్లా న్యాయమూర్తి చాంబరులో మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా 34 లోక్ అదాలత్ బెంచ్లు ఏర్పాటు చేశామని, మండల న్యాయ సేవాధికార సంస్థలను సంప్రదించి ఎక్కువ కేసుల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఈ లోక్ అదాలత్లో 4,802 పెండింగ్ కేసులను రాజీయోగ్యంగా గుర్తించామని, 2,225 ప్రీ లిటిగేషన్ కేసులను గుర్తించామని చెప్పారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంటు కోనె సీతారాం, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
యూరియా కోసం రైతుల తిప్పలు
చింతలపూడి: యూరియా కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారని సీపీఐ మండల కార్యదర్శి తొర్లపాటి బాబు అన్నారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. రైతులకు ఒక బస్తా యూరియాతోనే షాప్ యజమానులు సరిపెడుతుండడం దారుణమని అన్నారు. ఒక పట్టాదార్ పాస్ పుస్తకానికి ఒక బస్తా యూరియా మాత్రమే ఇస్తున్నారని, ఎక్కువ భూమి ఉన్న రైతుల పరిస్థితి ఏమిటని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చింతలపూడి మండలంలో యూరియా కొరతలేదని ప్రజాప్రతినిధులు అధికారులు చెప్పడం సబబు కాదన్నారు. యూరియా కోసం చింతలపూడి గ్రోమోర్ వద్ద రైతులు పడిగాపులు పడుతున్నారన్నారు. రైతులకు అవసరమైన మేరకు యూరియాను సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చాట్రాయి: అల్పపీడనం కారణంగా చాట్రాయి మండలంలో బుధవారం రాత్రి 10 నుంచి 2 గంటల వరకు భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో ఏకథాటిగా కురిసిన వర్షానికి ప్రజలు భయాందోళన చెందారు. చెరువులు, ఉప్పు వాగు, రేడగి వాగుల్లో వరద ఉద్ధృతంగా ప్రవహించింది. ఉప్పువాగుకు వచ్చిన వరదతో చాట్రాయి గొల్లగూడెం, జనార్థనవరం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచాయి. పలు గ్రామాల్లో కాలనీలు జలమయం అయ్యాయి. టి.నరసాపురం: మండలంలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో వాగులు ప్రవహించే మార్గాల్లో గురువారం వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రధానంగా మండలంలోని మక్కినవారిగూడెం – టి.నరసాపురం మార్గంలో కనకదుర్గ గుడి వద్ద జలవాగు, బండివారిగూడెం – మక్కినవారిగూడెం గ్రామాల మద్య గల ముగ్గురాళ్ళ వాగు, అప్పలరాజుగూడెం – మధ్యాహ్నపువారిగూడెం గ్రామాల మధ్య ఎర్రకాలువ వాగులు భారీ వర్షం కారణంగా పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఆయా గ్రామాల మధ్య వాహన రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ఏలూరు (టూటౌన్): ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అమలు జరిగి 35 సంవత్సరాలు పూర్తయినా నేటికీ ఎస్సీ, ఎస్టీల పట్ల వివక్షత కొనసాగుతూనే ఉందని ఆల్ ఇండియా అంబేడ్కర్ యువజన సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మెండెం సంతోష్ కుమార్ అన్నారు. స్థానిక నరసింహారావుపేటలోని ఎస్ఆర్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసే వ్యక్తులపై వీఎన్ఎస్ చట్టం కింద అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి ఎస్సీ సామాజిక వర్గం మీద దాడులు పెరిగాయన్నారు. ఎస్సీల జోలికి వెళితే శిక్షించబడతాం అనే భావన వాళ్లలో కలగట్లేదన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన రాజ్యాంగ ధర్మ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ ఎన్ఏడీ పాల్ మాట్లాడుతూ చాలామంది ఈ చట్టం పట్ల అవగాహన లేక దుర్వినియోగం చేస్తున్న వ్యక్తుల్ని ప్రశ్నించలేని పరిస్థితి నేడు కనిపిస్తుందన్నారు. చట్టాన్ని దుర్వినియోగం చేయడానికి ఎవరూ ప్రయత్నం చేయొద్దని తెలియజేశారు. కార్యక్రమంలో నాయకులు వెంకట్, రాజేష్ పాల్గొన్నారు. ఉప్పు వాగులో ప్రవహిస్తున్న వరద -
15 నుంచి ఉపాధ్యాయుల రణభేరి
నూజివీడు: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం నిమిత్తం ఈనెల 15 నుంచి 19 వరకు యూటీఎఫ్ ఆధ్వర్యంలో రణభేరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షుడు జీ వెంకటేశ్వరరావు తెలిపారు. రణభేరి కార్యక్రమం పోస్టర్ను గురువారం నూజివీడులో యూటీఎఫ్ నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధ్యాయ, ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు డీఏలను విడుదల చేయాల్సి ఉందని, ఇంత వరకు ఒక్క డీఏ కూడా విడుదల చేయలేదన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలన్నారు. ప్రభుత్వం లీప్ యాప్ ఒక్కటే ఉందంటూ గొప్పలు చెప్పుకుంటోందని, వాస్తవంగా అందులో గతంలో కంటే ఎక్కువ యాప్లు ఉన్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే యాప్ల భారాన్ని తగ్గించాలన్నారు. విద్యార్థుల పరీక్షలకు సంబంధించి మూల్యాంకనం పుస్తకాల విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్నే కొనసాగించాలన్నారు. యూటీఎఫ్ మహిళా కౌన్సిలర్ బత్తుల అనురాధ, నూజివీడు మండల అధ్యక్షురాలు బొద్దుకోళ్ల బాబూరావు, కార్యదర్శి మల్లెల చెన్నకేశవరావు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నిరసన వారం విజయవంతం చేయాలి ఏలూరు (ఆర్ఆర్పేట): ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన నిరసన వారాన్ని విజయవంతం చేయాలని ఆ సంఘ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి బీ.రెడ్డి దొర పిలుపునిచ్చారు. నిరసన వారంలో భాగంగా తొలి రోజు గురువారం స్థానిక గవరవరం జిల్లా పరిషత్ పాఠశాలలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రెడ్డి దొర మాట్లాడుతూ నిరసన వారంలో భాగంగా 12న మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శన, 13, 14 తేదీల్లో ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు సమర్పించడం, 15న తాలూకా కేంద్రాల్లో, 16న జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శన, 17న సీఎం, సీఎస్లకు మెయిల్స్, వాట్సాప్ ద్వారా సందేశాలు పంపుతామన్నారు. ప్రభుత్వం దిగిరాకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. -
ఆటోవాలా.. బతుకు డీలా
ఏలూరు (టూటౌన్): రాష్ట్రంలో ఉచిత బస్సు పథకం అమలుతో ఆటో డ్రైవర్ల జీవనోపాధికి ఆటంకం ఏర్పడింది. రోజుకు 60 శాతం ఆదాయం కోల్పోయి వాహనాల కిస్తీలు కూడా కట్టులేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పని లేక, ఆదాయం లేక ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితితో సతమతమవుతున్నారు. కూటమి ప్రభుత్వం సీ్త్రశక్తి పథకంతో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో కిరాయిలు లేక ఆటో డ్రైవర్లు విలవిల్లాడుతున్నారు. ప్రభుత్వ అనాలోచిత చర్యల వల్ల తామంతా వీధిన పడ్డామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్మిక సంఘాల నాయకులతో చర్చించి, ఆటో, క్యాబ్ డ్రైవర్ల ఉపాధికి నష్టం కలగని విధంగా ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ చర్య కారణంగా ఏలూరు జిల్లావ్యాప్తంగా 19 వేల మంది ఆటో, క్యాబ్ డ్రైవర్లు వీధిన పడ్డారు. వీటిలో ఆటోలే 15 వేలు ఉండగా, మ్యాక్సీలు, క్యాబ్లు, ట్రాలీ వాహనాలు మరో 4 వేల వరకు ఉన్నాయి. ఈ మేరకు ఈ వాహనాల డ్రైవర్లు ఉచిత బస్సు పథకం ప్రవేశ పెట్టిన నాటి నుంచి తీవ్రంగా నష్టపోతున్నారు. రూ.25 వేల చొప్పున ఇవ్వాలి సూపర్ సిక్స్–సూపర్ హిట్ అంటూ అనంతపురంలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు వాహన మిత్ర పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని, దసరా రోజున దీనిని అమలు చేస్తామని ప్రకటించారు. ఇది ఎంత మాత్రం సమంజసం కాదని, కేవలం రూ.15 వేలు ప్రకటించి చంద్రబాబు చేతులు దులుపుకోవాలని చూస్తున్నారని యూనియన్ నాయకులు విమర్శిస్తున్నారు. ఎన్నికల హామీల్లో ఇచ్చిన హామీ మేరకు లైసెన్స్ ఉన్న ప్రతి డ్రైవర్కు (ఆటో, క్యాబ్, లారీ, బస్సు) ఏడాదికి రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 60 శాతం ఆదాయం కోల్పోయి.. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు పథకాన్ని ఆటో మోటార్ కార్మికుల సంఘాలతో చర్చించకుండా ఏకపక్షంగా అమలు చేసింది. దీనివలన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆటో క్యాబ్ డ్రైవర్లు తమ ఆదాయంలో 60 శాతానికి పైగా నష్టపోతున్నారు. రవాణా రంగంలో ఉన్న కార్మికుల కుటుంబాలకు భరోసానిచ్చే విధంగా సమగ్ర సంక్షేమ చట్టాన్ని అమలు చేస్తామని, జీఓ నం.21 రద్దు చేస్తామని హామీలు ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. బ్రిటిష్ చట్టాల కంటే కఠినంగా తయారు చేసిన బీఎంఎస్ 106 (1)(2) చట్టాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. రవాణా రంగం ద్వారా ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు పన్నుల రూపంలో ఆదాయం సమకూరుస్తుందని, అయినా రవాణా రంగ కార్మికులకు, ఆటో డ్రైవర్లకు ఒక సంక్షేమ చట్టాన్ని అమలు చేయకపోవడం ప్రభుత్వాల అసమర్థతను తెలియజేస్తుందని యూనియన్ నాయకులు విమర్శిస్తున్నారు. వీటన్నింటిపై ఎటువంటి ప్రకటన చేయకుండా వాహన మిత్ర ద్వారా కేవలం 3 లక్షల మందికి మాత్రమే వాహన మిత్ర (ఆటో క్యాబ్ ఓనర్లకు) పథకాన్ని ఇస్తామని ప్రకటన చేయడాన్ని ఏలూరు జిల్లా ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ (సీఐటీయూ) ఖండిస్తోంది. 18న విజయవాడలో ధర్నా రాష్ట్రవ్యాప్తంగా రవాణా రంగ కార్మికులందరికీ వర్తించేలా సంక్షేమ పథకాలు ప్రకటించాలని, వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని, అధిక పెనాల్టీలను వసూలు చేసే విధంగా రూపొందించిన జీఓ 21ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఈనెల 18న విజయవాడలో ధర్నాకు సమాయత్తమవుతున్నారు. ఉచితబస్సు పథకం అమలు చేస్తున్నందున నష్టపోయిన ఆటో డ్రైవర్లను ఆదుకునేందుకు రూ.25 వేలు ఆర్థిక సాయాన్ని అందించాలని ఆటో, క్యాబ్ యూనియన్ నాయకులు ముక్త కంఠంతో కోరుతున్నారు. ఉచిత బస్సుతో ఉపాధికి గండి సీ్త్రశక్తి పథకంతో రోడ్డున పడ్డ ఆటో డ్రైవర్లు సమస్యలపై 18న విజయవాడలో ధర్నా రూ.25 వేలు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ ఆటో, క్యాబ్, ట్రాలీ డ్రైవర్ల సంక్షేమం కోసం సమగ్ర సంక్షేమ చట్టాన్ని అమలు చేయాలి. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు జీఓ 21ని రద్దు చేయాలి. ఆటో, క్యాబ్ డ్రైవర్ల జీవనోపాధికి మెరుగైన చర్యలు తీసుకోవాలి. – జె.గోపి, జిల్లా కార్యదర్శి, ఆటో, క్యాబ్ అండ్ ట్రాలీ డ్రైవర్స్ యూనియన్, ఏలూరు జిల్లా సీ్త్ర శక్తి పథకంతో ఆటో డ్రైవర్ల జీవనం దినదినగండంగా మారింది. ప్రభుత్వం లైసెన్స్ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కు ఏడాదికి రూ.25 వేలు ఆర్థిక సహాయం అందించాలి. అలాగే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించి వారి కుటుంబాలకు భరోసా కల్పించాలి. – చక్రాల అమర్ కుమార్, జిల్లా అధ్యక్షుడు, ఆటో, క్యాబ్ అండ్ ట్రాలీ డ్రైవర్స్ యూనియన్, ఏలూరు జిల్లా -
సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్త నిరసనలు
యలమంచిలి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను 15 రోజుల్లో పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక స్పష్టం చేసింది. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీలో, మండలంలో మున్సిపల్ కమిషనర్లకు, ఎంపీడీఓలకు సచివాలయ ఉద్యోగులు అధికారిక నోటీసులు అందజేశారు. ఈ మేరకు యలమంచిలి మండల ఉద్యోగులు ఈఓపీఆర్డీ జేడీవీ ప్రసాద్కు వినతిపత్రం ఇచ్చారు. ఇంటింటికీ తిరుగుతూ చేసే సర్వేల నుంచి సచివాలయ ఉద్యోగులకు విముక్తి కల్పించాలని, గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులను వారి సంబంధిత మాతృశాఖలకే అనుసంధానం చేయాలని, సమయపాలన లేకుండా ఆదివారాలు, పండుగలు, సెలవులు, అర్ధరాత్రుల్లో బలవంతపు విధులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రొబేషన్ పీరియడ్ పూర్తయిన వారికి నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, ఆరేళ్లుగా ఒకే క్యాడర్లో కొనసాగుతున్న వారికి స్పెషల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని, ప్రస్తుత రికార్డ్ అసిస్టెంట్ క్యాడర్ను జూనియర్ అసిస్టెంట్ క్యాడర్గా మార్పు చేయాలని, సీనియారిటీ జాబితాలు విడుదల చేయాలని, పారదర్శక బదిలీలకు ప్రత్యేక విధి విధానాలు రూపొందించాలని వారు అధికారిక నోటీసులో పేర్కొన్నారు. సచివాలయ ఉద్యోగుల హెచ్చరిక -
బాల్యవివాహాల నిరోధానికి సమష్టిగా కృషి చేయాలి
ఏలూరు (టూటౌన్): బాల్య వివాహాలు నిరోధించడానికి సమష్టిగా కృషి చేయాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ కోరారు. బాల్యవివాహాల వల్ల కలిగే నష్టాలు, పనిచేసే ప్రదేశాల్లో మహిళలపై జరిగే లైంగిక వేధింపుల నివారణ చట్టాలపై గురువారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్థ భవనంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రత్నప్రసాదు మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు ప్రతి గ్రామంలో బాల్యవివాహాలను నిరోధించడానికి తమ వంతు కృషి చేయాలని అన్నారు. పని ప్రదేశాల్లో, సంస్థల్లో మహిళలకు ఎదురయ్యే లైంగిక వేధింపులను ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. దీనికి చట్టం ద్వారా ఆయా సంస్థల్లో ఒక కమిటీని ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. ఫిర్యాదు చేసుకోవడానికి వీలుగా ఆ కమిటీ వివరాలను సంబంధిత కార్యాలయాల ముందు ప్రదర్శించాలని తెలియజేశారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా మహిళలపై జరిగే లైంగిక వేధింపులను ఎదుర్కోవటానికి న్యాయ సహాయం ఉచితంగా పొందవచ్చునని సూచించారు. కార్యక్రమంలో ట్రైనీ మాస్టర్ పి.రత్నరాజు, ఉమెన్ డెవలప్మెంట్ – చైల్డ్ వెల్ఫేర్ పీడీ ఏ.శారద, డీసీపీఓ డా.సీహెచ్.సూర్య చక్రవేణి, సీడీపీవోలు తులసి, పద్మావతి, తదితరులు పాల్గొన్నారు. -
ట్రిపుల్ ఐటీ అభివృద్ధికి కృషి
డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఏ నిర్ణయం కూడా వ్యక్తిగతంగా తీసుకోవడం లేదని, అకడమిక్ క్యాలెండర్ ప్రకారం తరగతులు, పరీక్షలు నిర్వహిస్తున్నామని డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ పేర్కొన్నారు. ఈనెల 10న సాక్షిలో ‘పాలనలో విఫలం–సమస్యలతో సావాసం’ పేరుతో వచ్చిన కథనంపై గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. మూడేళ్లకోసారి బీఓఎస్ సమావేశాలు నిర్వహించి సిలబస్లో మార్పు చేస్తారని, వ్యక్తిగత ఇష్టాలకు ఇందులో తావులేదన్నారు. వైస్ చాన్సలర్, డైరెక్టర్ల నియామకానికి నోటిఫికేషన్ను జారీచేశారని, ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ట్రిపుల్ ఐటీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నామని పేర్కొన్నారు. హౌస్ కీపింగ్, సెక్యూరిటీ ఏజెన్సీల ఎంపికకు సంబంధించి ఇటీవల జరిగిన గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని, త్వరలోనే టెండర్లు పిలుస్తామన్నారు. విద్యావసరాలను బట్టి అధ్యాపకులను సర్దుబాటు చేసుకొని బోధనకు నియమించుకోవడం సర్వసాధారణమన్నారు. ట్రిపుల్ ఐటీలో సెక్యూరిటీ సిబ్బంది నిరంతరం కాపలా కాస్తున్నా ఒక విద్యార్థి గోడ దూకి వెళ్లి మందు బాటిళ్లు తీసుకురావడం విచారకరమని, ఈ విషయం తెలియగానే హాస్టల్కు వెళ్లి ఆ మందు బాటిళ్లను స్వాధీనం చేసుకొని విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామన్నారు. పీయూసీ అకడమిక్ సంస్కరణల కమిటీ సిఫార్సు మేరకు ఇంటర్ పుస్తకాలను ప్రవేశపెట్టడం జరిగిందని వివరించారు. -
సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
భీమవరం (ప్రకాశంచౌక్): గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగుల సమస్యలను 15 రోజుల్లో పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక స్పష్టం చేసింది. ఈ మేరకు జిల్లా ఐక్యవేదిక సభ్యులు జీఎస్డబ్ల్యూఎస్ అధికారి వై.దోసిరెడ్డికి నోటీసు అందజేశారు. ఇంటింటికీ తిరుగుతూ చేసే సర్వేల నుంచి విముక్తి కల్పించాలన్నారు. గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులను వారి సంబంధిత మాతృశాఖలకే అనుసంధానం చేయాలని, సమయ పాలన లేకుండా ఆదివారాలు, పండుగలు, సెలవుల్లో కూడా విధులు చేయించడం నిలిపివేయాలని కోరారు. నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, ఒకే క్యాడర్లో కొనసాగుతున్న ఉద్యోగులకు స్పెషల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని కోరారు. పారదర్శక బదిలీలు జరిగేలా ప్రత్యేక విధి విధానాలు రూపొందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు షేక్ ఉమర్ అలీషా, ఎం.వెంకటేష్, డి.స్వర్ణలత, కే ఆదిత్య, కే కళ్యాణి, టి.చాందిని తదితరులు పాల్గొన్నారు.అధినేతతో భేటీ ఏలూరు టౌన్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో చేపట్టిన అన్నదాత పోరు కార్యక్రమం, నియోజకవర్గంలో పార్టీ కమిటీల నియామకాలు, రాజకీయ పరిస్థితులను అధినేతకు వివరించారు.వైఎస్సార్సీపీ వలంటీర్ల విభాగం అధ్యక్షురాలిగా పార్వతిఏలూరు టౌన్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఏలూరు నియోజకవర్గానికి చెందిన మహిళా నేతకు జిల్లా పదవిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్సీపీ వలంటీర్ల విభాగం జిల్లా అధ్యక్షురాలిగా భోగిశెట్టి పార్వతిని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా పదవి కేటాయించటం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.వైఎస్సార్సీపీ మహిళా విభాగం కార్యదర్శిగా నీరజ చింతలపూడి: వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శిగా చింతలపూడి మండలానికి చెందిన మొలుగుమాటి నీరజా సుధాకర్ను నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నీరజ ప్రస్తుతం చింతలపూడి జెడ్పీటీసీగా ఉన్నారు. తన సేవలను గుర్తించి రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.అంతర్జాతీయ పారా అథ్లెటిక్స్కు ఎంపిక ద్వారకాతిరుమల: పంగిడిగూడెంకు చెందిన కస్సే పవన్కుమార్ అంతర్జాతీయ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్నకు ఎంపికయ్యాడు. నెల వ్యవధిలోనే రాష్ట్ర, జాతీయ స్థాయిలో 6 పతకాలను సాధించి అందరి చూపు తన వైపు తిప్పుకున్నాడు. గత నెల 9న విశాఖలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో 3 స్వర్ణ పతకాలను సాధించాడు. ఆగస్టు 29 నుంచి 31 వరకు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జరిగిన జాతీయ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీల్లో స్వర్ణ, రెండు రజత పతకాలు సాధించి అంతర్జాతీయ చాంపియన్షిప్నకు ఎంపికయ్యాడు. డిసెంబర్ 7 నుంచి దుబాయ్లో జరిగే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటాడు. -
వైఎస్సార్సీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలు
కాలువ మట్టి తవ్వకుండా తవ్వారంటూ అధికారుల వేధింపులు ద్వారకాతిరుమల: కూటమి నేతల అధికార దుర్వినియోగం, దౌర్జన్యాలు రోజురోజుకు పెచ్చు మీరుతున్నాయి. ద్వారకాతిరుమల మండలం గుణ్ణంపల్లి పంచాయతీ, తక్కెళ్లపాడులో ఇద్దరు వైఎస్సార్ సీపీ నాయకులపై బుధవారం కూటమి నేతలు కక్ష సాధింపు చర్యలకు దిగారు. పొలం పనులు చేసుకుంటున్న వారిని కాలువ మట్టి తవ్వారంటూ వారి జేసీబీ, ట్రాక్టర్ను అధికారుల చేత సీజ్ చేయించారు. స్థానికుల క నం ప్రకారం. తక్కెళ్లపాడులో దామోదరరెడ్డికి చెందిన ఆయిల్పామ్ తోటలోకి ఉదయం 10 గంటల నుంచి, సత్తాలకు చెందిన వైఎస్సార్ సీపీ గ్రామకమిటీ అధ్యక్షుడు కుంచే రాజేష్ ట్రాక్టర్ ఎరువు (పేడ)ను తోలుతోంది. ఎరువు లోడింగ్, ఇతర పొలం పనులకు తక్కెళ్లపాడు వైఎస్సార్ సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు ముల్లంగి నీలకంఠరెడ్డి జేసీబీ పనిచేస్తోంది. మధ్యాహ్నం సమయంలో వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, పోలవరం కాలువ అధికారులు, పోలీస్ సిబ్బంది దామోదరరెడ్డి తోటకు 300 మీటర్ల దూరంలో ఉన్న పోలవరం కుడి కాలువ గట్టు వద్దకు వచ్చారు. అక్కడ మట్టి తవ్విన పాత ఆనవాలును చూసి, అది నీలకంఠరెడ్డి, రాజేష్లే తవ్వారని ఆరోపించారు. అయితే వారి జేసీబీ, ట్రాక్టర్ ఘటనా స్థలంలో లేవు. అయినా వారే తవ్వారంటూ అధికారులు నిర్ణయించారు. విషయం తెలుసుకున్న నీలకంఠరెడ్డి, రాజేష్లు అధికారులను కలసి తమకు సంబంధం లేదని, తమ వాహనాలను పొలం పనులకు పెట్టామని చెప్పినా అధికారులు వినిపించుకోలేదు. మాకు ఒత్తిళ్లు వస్తున్నాయి. వాహనాలు పోలీస్టేషన్కు వెళ్లాల్సిందేనని తెగేసి చెప్పారని బాదితులు వాపోయారు. కూటమి నేతల అక్రమ తవ్వకాలను తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వారి వాహనాలను రాత్రి పోలీస్టేషన్కు తరలించారు. వీఆర్వో మీడియాతో మాట్లాడుతూ పోలవరం కాలువ పక్కన మట్టి తవ్వేసి ఉందని పై నుంచి ఫోన్లు వస్తే ఇక్కడికి వచ్చామని చెప్పారు. -
కామినేని రౌడీలను పెంచి పోషిస్తున్నారు
● ‘సేవ్ కై కలూరు’ పేరుతో త్వరలో విశ్రాంత ఉద్యోగులతో కమిటీ ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ కై కలూరు: పెంపుడు కొడుకుగా పేరొందిన రౌడీని కై కలూరు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పెంచి పోషించడంతో అరాచకశక్తిగా మారి, అల్లరి మూకలను తయారు చేశాడని వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) మండిపడ్డారు. కై కలూరులోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ ఈనెల 5న దానిగూడెం దళితవాడకు చెందిన ఇద్దరి యువకులపై కత్తులతో దాడి జరిగితే ఎమ్మెల్యే అనుచరులు తనపైనా, తన కుమారులపైనా దాడి కుట్రను ఆపాదించడం సిగ్గుచేటన్నారు. ప్రధాన నిందితుడిని అరెస్టు చేయకుండా ఎవరు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు. గొడవ జరిగిన వినాయక ఊరేగింపులో గంగానమ్మగుడి, సంతమార్కెట్, మసీదు సెంటర్, కొల్లేటికోటకు చెందిన అల్లరు మూకలు ఎందుకు ఊరేగింపునకు వచ్చారో ఆలోచించాలన్నారు. వారం రోజుల క్రితం వినాయక పందిరి వద్ద గొడవలో పోలీసులు చర్యలు తీసుకుంటే ఈ రోజు ఇంతటి దారుణం జరిగేది కాదన్నారు. ఎన్నికల్లో కలెక్షన్ల కోసం వచ్చి ఉంటున్నావారెవరనేది అందరికీ తెలుసన్నారు. రౌడీ మూకల అరచకాలకు అరికట్టడానికి నియోజకవర్గ స్థాయిలో అందరితో సంప్రదించి విశ్రాంత ఉద్యోగులతో శ్రీసేవ్ కై కలూరుశ్రీ పేరుతో కమిటీని ఏర్పాటు చేస్తానన్నారు. పదవులు శాశ్వతం కాదు పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చేబోయిన వీర్రాజు, పార్టీ ముదిరాజుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కోమటి విష్ణువర్ధనరావు మాట్లాడుతూ ఎవరికీ పదవులు శాశ్వతం కాదన్నారు. ఎంపీపీలు పెద్దిరెడ్డి శ్రీరామదుర్గాప్రసాద్, చందన ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కూటమి కార్యకర్తలు వైఎస్సార్సీపీని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం దుర్మర్గమన్నారు. ఎస్సీ సెల్ నాయకుడు గుమ్మడి వెంకటేశ్వరరావు, నాయకులు గోట్రూ ఏసుబాబు, మండల పార్టీ అధ్యక్షులు రాము, రామరాజు, నత్తగుళ్లపాడు సర్పంచ్ ముంగర కృష్ణంరాజు, నాయకులు సమయం అంజి, మడక శ్రీను పాల్గొన్నారు. ఈ సందర్భంగా దళితుల దాడిలో ప్రధాన నిందితుడు, అతడి అనుచరుల అరాచకాలను డీఎన్నార్ వెల్లడించారు. కై కలూరు గాంధీబొమ్మ సెంటర్లో టీడీపీ ఆర్యవైశ్య డైరెక్టర్ మల్యాద్రి దుకాణంపై మూకుమ్మడి దాడి, సంత మార్కెట్ వద్ద బ్యాటరీ నాయుడు దుకాణంపై దాడి, ఏలూరు రోడ్డు వద్ద చికెన్ దుకాణంపై, చింతపాడు వద్ద వడ్డి సామాజికవర్గ బృందంపై, పోలీసుస్టేషన్ ఎదుటే ఆర్యవైశ్య కిషోర్ దంపతులపై కాల్మనీ కేసులో దాడి చేశారన్నారు. అన్న క్యాంటీన్లో పేదలపై దాడి, వెలంపేటలో కాపు సామాజికవర్గానికి చెందిన గుర్రం అరవింద్పై దాడి, భుజబలపట్నంలో దళితవర్గానికి చెందిన విలేకరి కురేళ్ల కిషోర్పై దాడి, బైపాస్ రోడ్డులో విశ్రాంత రైల్వే ఉద్యోగిపై, డబ్బులు అడిగినందుకు సంత మార్కెట్ వద్ద ఫ్లెక్సీ ప్రింటర్పై దాడి వంటి ఘటనలు ఉదహరించారు. -
వృద్ధులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు
ఏలూరు(మెట్రో): వయో వృద్ధులను ఇబ్బందులకు గురిచేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్లో వయో వృద్ధుల చట్టం నిబంధనలపై జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ వయో వృద్ధుల సంరక్షణకు చట్టాలపై క్షేత్రస్ధాయిలో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. వృద్ధుల సమస్యలను పరిష్కరించే దిశగా వృద్ధులకు రక్షణ కల్పించేందుకు పోలీస్ శాఖలో నోడల్ అధికారిని నియమించాలని, ప్రతి పోలీస్ స్టేషన్లో వాలంటరీ కమిటీలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సీనియర్ సిటిజన్స్ కేసులకు సంబంధించి డివిజన్ స్ధాయిలో 642 కై ్లయిమ్స్ అందగా వాటిలో ఇంతవరకు 515 పరిష్కరించామన్నారు. అక్టోబరు 1న వృద్ధుల దినోత్సవం పురస్కరించుకొని ఈ నెల 21 నుంచి 30 వరకు వివిధ పోటీలు, వైద్య శిబిరాలు, కుటుంబ సంబంధిత కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ, అందరికీ ఇళ్ల పరిశీలన కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అలాగే 175 మైనర్ ఇరిగేషన్ చెరువులకు సంబంధించి రూ.160.25 కోట్లతో మరమ్మతులు, పునరుద్ధరణ, పునర్నిర్మాణాలపై ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించేందుకు కలెక్టర్ అధ్యక్షతన జరిగిన జిల్లా స్థాయి పరిశీలన కమిటీ ఆమోదించింది. ఆక్వా వివరాలు పొందుపర్చాలి : జిల్లాలో ఆక్వా సాగు చేసే చెరువుల వివరాలను విలేజ్ ఆక్వా కల్చర్ యాప్లో పొందుపరచాలని కలెక్టర్ వెట్రిసెల్వి మత్స్య శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి విలేజ్ ఆక్వాకల్చర్ యాప్లో చెరువుల వివరాల నమోదుపై మత్స్య శాఖాధికారులతో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. 78,145 టన్నుల ఎరువుల పంపిణీజిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఇంతవరకు 78,145 టన్నుల ఎరువులు అందించామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి చెప్పారు. సెప్టెంబర్ 11 నుంచి 13 మధ్య మరో 1,614 టన్నుల యూరియా జిల్లాకు రానుందన్నారు. ప్రస్తుతం జిల్లాలో 1873 టన్నుల యూరియా, 2,952 టన్నుల డీఏపి, 4,437 టన్నుల ఎంఓపీ, 12,903 టన్నుల ఎన్పీకే, 665 టన్నుల ఎస్ఎస్టి ఎరువులు ఉన్నాయన్నారు. -
మన్యంలో ప్రకృతి సేద్యం
మన్యంలో ప్రకృతి వ్యవసాయంపై గిరిజన రైతులకు అవగాహన కలిగిస్తున్నారు. ఖరీఫ్లో 10వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. 8లో uబుట్టాయగూడెం: కొద్ది రోజులుగా తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు బుధవారం మధ్యాహ్నం కాస్త ఉపశమనం లభించింది. ఉదయం నుంచి తీవ్రమైన ఎండ ఉన్నప్పటికీ మధ్యాహ్నం ఒక్కసారిగా కారుమబ్బులు కమ్మి సుమారు రెండు గంటలు ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. వర్షానికి రోడ్లన్నీ జలమయంగా మారాయి. వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో ప్రజలు వేడి నుంచి ఉపశమనం పొందారు. రూ.70 లక్షల నిధుల దుర్వినియోగం ఏలూరు (టూటౌన్): ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సంతకాన్ని ఫోర్జరీ చేసి 2019 నుంచి ఇంతవరకు దాదాపు రూ.70 లక్షల మేర నిధులు దుర్వినియోగంపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. దీనికి కారకుడైన ఎస్సీ కార్పొరేషన్ జూనియర్ అసిస్టెంట్ పవన్ కుమార్ను సస్పెండ్ చేశారు. తాజాగా రూ.6 లక్షలు విత్డ్రా చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఎస్సీ కార్పొరేషన్ నిధులను దుర్వినియోగం చేసినందుకు పవన్ కుమార్ను బుధవారం విధుల నుంచి కలెక్టర్ వెట్రిసెల్వీ సస్పెండ్ చేశారు. సొమ్ము దుర్వినియోగంపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టేందుకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. -
స్వచ్ఛంద సంస్థల సేవలు ప్రశంసనీయం
ఏలూరు (టూటౌన్): స్వచ్ఛంద సంస్థలు సమాజానికి అందిస్తున్న సేవలు విశేషమైనవని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవాధికార సంస్థ భవనంలో స్వచ్ఛంద సేవా సంస్థల కార్యకర్తలు, బాలలకు న్యాయ సేవాధికార సంస్థ నిర్వహించే కార్యకలాపాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కె.రత్న ప్రసాద్ మాట్లాడుతూ స్వచ్ఛంద సేవా సంస్థలు సమాజానికి అందిస్తున్న సేవలు విశేషమైనవని న్యాయ సేవాధికార సంస్థ అందించే ఉచిత న్యాయసేవలపై అవగాహన కల్పించడంతో ఎంతో కృషి చేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సూర్య చక్రవేణి, సీడీపీఓ తులసి, చైల్డ్ రైట్స్ అడ్వకసీ ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. డీఎల్ఎస్ఏ జిల్లా కార్యదర్శి కె.రత్నప్రసాద్ -
బిల్లుల పెండింగ్పై కాంట్రాక్టర్ల బెంగ
భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం మున్సిపాలిటీకి సంబంధించి గత ప్రభుత్వం ఎన్నికల ముందు దాదాపు 90 శాతం బిల్లులు క్లియర్ చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన పనులకు సంబంధించిన బిల్లులు సీఎఫ్ఎంఎస్కు పంపగా ఈ ఏడాది మార్చి 31న క్యాన్సిల్ చేశారు. అప్పటి నుంచి కాంట్రాక్టర్లకు పైసా బిల్లు అందలేదు. పలుమార్లు ఉన్నతాధికారులు, మున్సిపల్ మంత్రి నారాయణ దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. బుధవారం భీమవరంలో మున్సిపల్ కాంట్రాక్టర్లు మాట్లాడుతూ బిల్లులు అందక పడుతున్న ఇబ్బంది పడుతున్నామన్నారు. మార్చి 31న సీఎఫ్ఎంఎస్లో ఉన్న బిల్లుల్ని క్యాన్సిల్ చేశారని, నిధి పోర్టల్ తీసుకొచ్చి బిల్లులు అప్లోడ్ చేసుకోమన్నారు. ఏప్రిల్ 19 వరకూ బిల్లులు అప్లోడ్ చేశామని, ఆగస్టు 21 వరకూ భీమవరం మున్సిపాలిటీకి సంబంధించి సుమారు రూ.9 కోట్ల మేర 60 బిల్లులు అప్లోడ్ చేశామన్నారు. ఆ తర్వాత గ్రీన్ చానల్లో బిల్లులు అప్లోడ్ చేసుకోవాలని సూచించారు. కొత్తగా ప్రతి నెలా 11 నుంచి 20 మధ్య బిల్లులు పెట్టుకోవాలని కమిషనర్లకు చెప్పారన్నారు. ఈనెల 4 నుంచి కొత్తగా అప్లోడ్ చేసిన బిల్లులకు పేమెంట్లు చేశారు. గత 15 నెలలుగా పెండింగ్ ఉన్న బిల్లులకు సంబంధించి ఎలాంటి పేమెంట్లు చేయకపోగా 4న అప్లోడ్ చేసిన బిల్లులు ఇవ్వడంతో వారు వాపోతున్నారు. ఒక్కొక్కరికి రూ.40 లక్షల నుంచి రూ.3 కోట్ల వరకూ బిల్లులు బకాయిలు ఉన్నాయన్నారు. అటు జనరల్ ఫండ్ నుంచి గాని, ఇటు కేంద్రం ఇచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు ఫండ్స్ నుంచి గాని కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం బాధాకరమన్నారు. -
సరిహద్దుల్లో ఇసుక దందా
గురువారం శ్రీ 11 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025సాక్షి ప్రతినిధి, ఏలూరు: తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక కొని.. ఏలూరు జిల్లా సరిహద్దు గ్రామాల్లో డంప్ చేస్తారు. రాత్రిపూట గుట్టుచప్పుడు కాకుండా సరిహద్దులు దాటించి తెలంగాణాకు తీసుకెళ్తారు.. ఇలా రోజుకు ఏకంగా 90 లారీలకు పైగా ఇసుకను పొరుగు రాష్ట్రానికి అక్రమంగా రవాణా చేసి భారీగా దండుకుంటున్నారు. టీడీపీ నేతలే నిర్వాహకులు కావడంతో అన్ని వ్యవస్థల సహకారం అందుతోంది. దీంతో గత మూడు నెలలుగా సరిహద్దులో ఇసుక దందా జోరుగా సాగుతోంది. గత వారంరోజుల వ్యవధిలో చింతలపూడి పరిసర ప్రాంతాల్లో తెలంగాణకు అక్రమంగా రవాణా అవుతున్న 21 లారీలను గుర్తించి కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేశారు. దీంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మూడు నెలలుగా వందల లారీలు ఒకే మార్గంలో ప్రయాణిస్తున్నా అధికారులు మౌనం వహించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొవ్వూరు నియోజకవర్గంలోని కొవ్వూరు, తాళ్ళపూడి, అన్నదేవరపేటలోని ఇసుక రీచ్ల్లో వందల లారీల ఇసుకను లారీ యజమానులు కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా జంగారెడ్డిగూడెం నుంచి కొవ్వూరు మార్గంలో వందలాది లారీలు ఉన్నాయి. స్థానిక లారీ యజమానులు కొందరు అధికార పార్టీ నేతలుగా చలామణి అవుతున్నారు. ఈ క్రమంలో ఎవరికి అనుమానం రాకుండా సరికొత్త ఇసుక వ్యాపారానికి తెరతీశారు. కొవ్వూరు నియోజకవర్గంలోని రీచ్ల్లో ఇసుకను బుక్ చేసి చింతలపూడి, తెలంగాణ సరిహద్దు గ్రామాలకు వే బిల్లులు తీసుకుంటారు. లారీ లేదా ట్రాక్టర్ ద్వారా చింతలపూడి సరిహద్దు ప్రాంతాల్లోని మేడిశెట్టివారిగూడెం, సీతానగరం, లింగగూడెం మరికొన్ని గ్రామాల్లో అక్కడక్కడ ఐదారు లారీల ఇసుకను డంప్ చేసి అక్కడ నుంచి కొద్ది కిలోమీటర్లు దాటించి తెలంగాణకు అక్రమంగా రవాణా చేస్తున్నారు. మూడు నెలలుగా ఈ తతంగం సాగుతుంటే ఈ నెల 4న పోలీస్, రెవెన్యూ, మైనింగ్ విభాగాలు కలిసి 15 లారీలు సీజ్ చేశారు. మళ్ళీ బుధవారం 6 లారీలు సీజ్ చేశారు. గత మూడు నెలల కాలంలో తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో వందకుపైగా ఇసుక అక్రమ రవాణా వాహనాలపై కేసులు నమోదు కావడం గమనార్హం. కొవ్వూరు నుంచి టన్ను ఇసుక చింతలపూడికి అయితే రూ.700, ఖమ్మం జిల్లా కల్లూరుకి రూ. 1400, హైదరాబాద్కు రూ.3 వేలు రవాణా చార్జీతో కలిపి తీసుకుంటారు. ఒక్కొక్క లారీకి 20 టన్నులు, కొన్ని పెద్ద లారీలకు 30 టన్నులకు వేబిల్లు తీసుకుని ఆ మేరకు నగదు చెల్లిస్తారు. 20 టన్నుల లారీలో 40 టన్నులు, 30 టన్నుల లారీలో 60 నుంచి 70 టన్నులు లోడ్ చేసి భారీగా విక్రయిస్తున్నారు. సగటున చింతలపూడిలో 20 టన్నుల లారీ రూ.28 వేలు. అదే హైదరాబాద్కు అయితే లక్షకుపైగా వసూలు చేస్తున్నారు. కేవలం కొవ్వూరులోని రీచ్ల నుంచే అధికార పార్టీ అండదండలతో ఈ దందా సాగడం గమనార్హం. అది కూడా రెండు జిల్లాలు దాటించి సరిహద్దులో డంప్లు పెట్టి పొరుగు రాష్ట్రంలో విక్రయించడం చర్చనీయాంశంగా మారింది. కొవ్వూరు నుంచి భారీగా తెలంగాణకు అక్రమ రవాణా 3 రీచ్ల నుంచి తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో డంపింగ్ అక్కడ నుంచి లారీల్లో తెచ్చి చింతలపూడిలో విక్రయాలు 3 నెలలుగా యథేచ్ఛగా సాగుతున్న అక్రమ దందా రోజూ 90కు పైగా లారీల్లో సరిహద్దుకు రవాణా టీడీపీ నేతలే నిర్వాహకులు -
పశువుల్లో ‘లంపీ’తో అప్రమత్తం
● శ్రీవారి క్షేత్రంలో తాత్కాలికంగా గోదానం, గోదత్తత నిలుపుదల ● గోసంరక్షణ శాలలో పశువులకు టీకాలు ద్వారకాతిరుమల : పశువులకు ముద్దచర్మ (లంపీ స్కిన్) వ్యాధి వ్యాపిస్తుండటంతో శ్రీవారి దేవస్థానం అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే గోదానం, గోదత్తత పథకాలను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ప్రస్తుతం గోసంరక్షణశాలలో మొత్తం 326 పశువులు ఉన్నాయి. పశువైద్యాధికారులు ఇప్పటికే వాటన్నిటికి లంపీ స్కిన్ వ్యాధి నివారణా టీకాలు వేశారు. అయితే ఇటీవల ఓ భక్తుడు ఆవు, దూడను దానంగా ఇవ్వగా అందులో దూడకు లంపీ స్కిన్ వ్యాధి ఉన్నట్టు గుర్తించిన వైద్యులు, దానికి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆ దూడ కోలుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో గోదానాన్ని స్వీకరిస్తే గోసంరక్షణశాలలోని అన్ని గోవులకు ఆ వ్యాధి సోకే ప్రమాదం ఉందని పశువైద్యులు దేవస్థానం అధికారులకు సూచించారు. దాంతో గోదానం, గోదత్తతను ఈనెల 6 నుంచి తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రతిష్టాత్మకంగా గోసంరక్షణ గోదానం ఎంతో విశిష్టమైనదిగా ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే భక్తులు శ్రీవారికి గోవులను దానంగా ఇస్తుంటారు. వాటిలో కొన్నింటిని దేవస్థానం రైతులకు వ్యవసాయ పనుల నిమిత్తం దత్తత ఇస్తోంది. ముందుగా దరఖాస్తు చేసుకున్న రైతులకు ప్రతినెలా రెండవ, నాల్గవ శనివారాల్లో ఆవులను దత్తత ఇస్తున్నారు. ఏడాదిలో ఒకసారి దేవస్థానం అధికారులు రైతుల వద్దకు వెళ్లి వారిచ్చిన గోవులను పరిశీలిస్తున్నారు. అలాగే గోసంరక్షణశాలలో ఉన్న గోవుల పోషణపట్ల అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. తెల్ల పశువుల్లోనే వ్యాధి తీవ్రత తెల్ల పశువులు అయిన ఆవులు, ఎద్దుల్లోనే ఎక్కువగా ఈ వ్యాధి తీవ్రత కనిపిస్తుంది. లంపీ స్కిన్ అనే వైరస్ వల్ల కలిగే ఈ వ్యాధి పశువుల రక్తం పీల్చే దోమలు, ఈగలు, పిడుదుల ద్వారా ఒక పశువు నుంచి మరో పశువుకు సులభంగా వ్యాపిస్తుంది. అది కూడా అక్టోబర్ నుంచి జనవరి మధ్యలోనే ఈ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి. అందుకే పశువైద్యాధికారులు, సిబ్బంది గోసంరక్షణశాలలోని గోవులకు సెప్టెంబర్లోనే టీకాలు వేశారు. జాగ్రత్తలు తప్పనిసరి పశువులకు లంపీ స్కిన్ వ్యాధి సోకకుండా ముందుగానే టీకాలు వేయించాలి. 104 నుంచి 106 డిగ్రీల జ్వరం వచ్చి, చర్మంపై బొబ్బలు, బుడిపెలు, పొక్కులు ఏర్పడి, నెమ్మదిగా అవి పగిలి పుండ్లుగా మారి, మేత సరిగ్గా తినకపోవడం, నోరు, ముక్కు నుంచి చొంగ కారడం, పాల దిగుబడి తగ్గడం, అలసటగా ఉండటం వంటి లక్షణాలు ఉంటే దాన్ని లంపీ స్కిన్ వ్యాధిగా గుర్తించాలి. వాటిని మంద నుంచి వేరు చేసి, చికిత్స అందించాలి. దోమ తెరలు, లేదా వేపాకు పొగ వేయాలి. గంజి వంటి ఆహార పదార్థాల్లో కాస్త ఉప్పు కలిపి తాగించాలి. జ్వరం తగ్గే వరకు ఓఆర్ఎస్ ద్రావణాన్ని ఇవ్వాలి. జ్వరం తగ్గడానికి మెలోక్సికామ్, ఆనాల్జిన్ మందులను వైద్యుల సూచనల మేరకు వాడాలి. సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీ బయాటిక్, న్యూమోనియా లక్షణాలు ఉంటే అవిల్, సీపీఎం వంటి మందులు వాడాలని పశువైద్యులు తెలిపారు. వ్యాధి పూర్తిగా తగ్గిన ఆవులనే దానంగా ఇవ్వాలి. గోసంరక్షణశాలలోని షెడ్డులో ఉన్న ఆవులు , గోసంరక్షణశాలలో లంపీ స్కిన్ వ్యాధి నుంచి కోలుకున్న ఆవుదూడ లంపీ స్కిన్ వ్యాధి విస్తరిస్తున్న నేపధ్యంలో పశువైద్యాధికారుల సూచనల మేరకు భక్తుల నుంచి గోవులను దానంగా తీసుకోవడం, అలాగే రైతులకు గోవులను దత్తత ఇవ్వడాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేశాం. వ్యాధి తీవ్రత తగ్గిన తరువాత మళ్లీ వాటిని పునఃప్రారంభిస్తాం. ఆ సమాచారాన్ని ముందుగా మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తాం. – ఎన్వీఎస్ఎన్ మూర్తి, శ్రీవారి దేవస్థానం ఈఓశ్రీవారి గోసంరక్షణశాల లోని ఆవులకు, గిత్తలకు, దూడలకు నెల క్రితమే లంపీ స్కిన్ వ్యాధి నివారణా టీకాలు వేశాం. బయట నుంచి కొత్తగా పశువులు లోపలికి వస్తే ప్రస్తుతం ఉన్న ఆవులకు వ్యాధి సోకే ప్రమాదం ఉంది. అందుకే కొత్త వాటిని రాకుండా చూడాలని ఆలయ అధికారులకు సూచించాం. వారు వెంటనే అప్రమత్తమై గోదానం, గోదత్తతను నిలిపివేశారు. – అంగర సురేష్, పశువైద్యాధికారి, ద్వారకాతిరుమల -
ఆధిపత్యం కోసమే హత్య
ఏలూరు టౌన్: ఏలూరు రూరల్ కొమడవోలు ఇందిరమ్మ కాలనీలో ఇటీవల జరిగిన దారుణ హత్య కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు డీఎప్పీ డి.శ్రావణ్కుమార్ బుధవారం ఏలూరు పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. కొమడవోలు ఇందిరమ్మ కాలనీకి చెందిన పూనూరు రాజేష్ కొందరు రాజకీయ నేతల అండతో గొడవలకు సెటిల్మెంట్లు చేస్తూ ఉంటాడు. ఇదే ప్రాంతానికి చెందిన బూరగ నాని అలియాస్ చిన్న నాని మృతుడితో సన్నిహితంగా మెలిగేవాడు. కానీ కొన్ని సందర్భాల్లో రాజేష్ కఠినంగా ప్రవర్తిస్తూ చిన్న నానిని మందలించటం... కొట్టటం చేసేవాడు. రాజేష్కు తెలిసిన ఒక మహిళతో నాని చనువుగా ఉండటాన్ని గమనించిన ఆమె బంధువులు గతంలో నానితో గొడవపడి కొట్టారు. దీనిలోనూ రాజేష్ కీలకపాత్ర పోషించాడని నాని మనసులో కక్ష పెంచుకున్నాడు. పైగా ఇందిరమ్మ కాలనీలో సెటిల్మెంట్లు చేస్తున్న రాజేష్ లేకుంటే... తానే పెద్దమనిషిగా చలామణి అవ్వచ్చు అనే ఆలోచనతో రాజేష్ను చంపేందుకు తన స్నేహితులతో కలిసి పక్కా స్కెచ్ వేశాడు. కత్తులతో దాడి చేసి.. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ఆగస్టు 31 తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇందిరమ్మ కాలనీలో రాజేష్ తన ఇంట్లో ఉండగా బూరగ నాని అతని ఇంటికి వెళ్లి బయటకు రావాలని పిలిచాడు. చర్చి సమీపంలోకి తీసుకువెళ్లి నాని, మరో ఐదుగురు కత్తులతో దాడి చేసి కారులో పరారయ్యారు. ఈలోగా అరుపులు, కేకలకు రాజేష్ కుమార్తె, కుమారుడు, చెల్లి బయటకు వచ్చి చూడగా తీవ్ర గాయాలతో ఉన్నాడు. కుటుంబ సభ్యులు అతడ్ని ఏలూరు జీజీహెచ్కు తరలించగా వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లు నిర్థారించారు. మృతుడి భార్య ఫిర్యాదుపై ఏలూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసును ఛేదించిన పోలీసులు ఈ కేసు విచారణకు సంబంధించి ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలతో ఏలూరు డీఎస్పీ శ్రావణ్కుమార్ పర్యవేక్షణలో ఏలూరు వన్టౌన్ సీఐ జీ.సత్యనారాయణ, ఏలూరు టూటౌన్ సీఐ కే.అశోక్కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈనెల 10న ఏలూరు జాతీయ రహదారిపై రత్నాస్ రెస్టారెంట్ వెనుక నిందితులు ఉన్నారనే సమాచారంతో ఏలూరు వన్టౌన్ సీఐ సత్యనారాయణ, రూరల్ ఇన్చార్జి ఎస్సై నాగబాబు, సిబ్బంది కలిసి ఆరుగురు నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి స్కూటీ, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వీరే.. ఏలూరు రూరల్ ఇందిరమ్మ కాలనీకి చెందిన ప్రధాన నిందితుడు బూరగనాని అలియాస్ చిన్ననానితోపాటు, ఏలూరులోని వివిధ ప్రాంతాలకు చెందిన సామంతుల అజయ్సూర్య అలియాస్ బెస్సీ, లంకపల్లి బాలకృష్ణ అలియాస్ బాలు, సిగిరెడ్డి సుధాకర్ అలియాస్ సుధా, ఉగ్గిన షణ్ముక వేణుగోపాల్ అలియాస్ వేణు, కటారి పూర్ణచంద్ర శేఖర్ అనే ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరిలో ముగ్గురిపై ఏలూరు నగరంలో పాత కేసులు ఉన్నాయి. ఈ కేసును ఛేదించిన సీఐలు సత్యనారాయణ, అశోక్కుమార్, ఎస్సై నాగబాబు, ఏఎస్సై సురేష్, హెచ్సీ సత్యారావు, కానిస్టేబుళ్లు బీ.నాగార్జున, ఆర్.మోహన్, పీ.నాగరాజు, ఎండీ రుహుల్లా, ఎన్.శేషుకుమార్ను ఏలూరు డీఎస్పీ శ్రావణ్కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. -
15న కృష్ణాష్టమి వేడుకలు
ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య క్షేత్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఈనెల 15 న అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్టు ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. అందులో భాగంగా ఆరోజు ఆలయంలో స్వామివారికి నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టు చెప్పారు. అలాగే 16న సాయంత్రం క్షేత్రంలో ఉట్ల పండుగ, శ్రీవారి గ్రామోత్సవాన్ని నిర్వహిస్తామన్నారు. భక్తులు గమనించాలని ఆయన కోరారు. ఏలూరు(మెట్రో): జిల్లాలో ఎన్ఎంఆర్ కార్మికులకు 2025 –26 సంవత్సరానికి వేతనాల పెంపును ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఉప కార్మిక కమిషనర్ పి.శ్రీనివాస్ బుధవారం తెలిపారు. ఒక రోజుకి స్కిల్డ్ కార్మికునికి రూ.710 నుంచి రూ.730, సెమీ స్కిల్డ్ కార్మికునికి రూ.640 నుంచి రూ.665, అన్స్కిల్డ్ కార్మికునికి రూ.595 నుంచి రూ.615గా నిర్ణయించారని, ఈ వేతనాలు ఏప్రిల్ 01, 2025 నుంచి అమలులోకి వస్తాయన్నారు. -
కేవీకే హెడ్ సైంటిస్ట్కు అవార్డు
ఉండి: ఏరువాక ఉత్తమ శాస్త్రవేత్త అవార్డుకు ఎన్నార్పీ అగ్రహారం కృషీ విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్.మల్లిఖార్జునరావు ఎంపికయ్యారు. ఏరువాక ఫౌండేషన్ ఏటా వ్యవసాయ అనుబంధ రంగాల్లోని వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచే శాస్త్రవేత్తలను ఎంపిక చేసి అవార్డులు అందజేస్తుంది. దీనిలో భాగంగా 2023–24కి గాను ఉత్తమ విస్తరణ నిపుణుడు ఎంటొమోలోజీ విభాగంలో డాక్టర్ మల్లిఖార్జునను ఉత్తమ శాస్త్రవేత్తగా ఎంపిక చేశారు. ఈమేరకు ఫౌండేషన్ నుంచి తనకు సమాచారం అందినట్లు మల్లిఖార్జునరావు తెలిపారు. ఈ నెల 26, 27 తేదీల్లో గుంటూరు కేఎల్ యూనివర్సీటీలోని కాలేజ్ ఆఫ్ ఆగ్రికల్చర్ ఆర్అండ్డీ థియేటర్లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డు అందజేస్తారని ఆయన చెప్పారు. టి.నరసాపురం: బొర్రంపాలెం అన్నపూర్ణ ఫెర్టిలైజర్స్ అండ్ జనరల్ స్టోర్స్లో బుధవారం విజిలెన్స్ అధికారుల బృందం తనిఖీలు నిర్వహించారు. షాపులో ఆయా ఎరువులు ఉండాల్సిన దానికన్నా 3.245 టన్నులు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. రూ.6,98,663 విలువ కలిగిన యూరియా, పొటాష్, 10–26, సూపర్ 39.585 టన్నులను సీజ్ చేశారు. షాప్ యజమాని అశోక్ కుమార్పై 6 ఏ కేసు నమోదు చేశారు. దాడుల్లో విజిలెన్స్ ఎస్సై రంజిత్ కుమార్, విజిలెన్స్ ఏవో మీరయ్య, మండల వ్యవసాయ అధికారిణి బి.ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. ఉండి: ఈ నెల 17వ తేదీ నుంచి ఎన్నార్పీ అగ్రహారంలోని కృషీ విజ్ఞాన కేంద్రంలో మిద్దెతోటల పెంపకంపై శిక్షణ, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ మల్లిఖార్జునరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మిద్దెతోటల పెంపకంతో పాటు తేనెటీగలు, కోళ్లు, చేపల పెంపకం, బయోడీకంపోజర్స్ వినియోగం తయారీపై సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించడంపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మిద్దెతోటల పెంపకం నిపుణుడు వేణుగోపాలరావు తదితర జిల్లా మండల అధికారులు హాజరువుతారని తెలిపారు. మిద్దెతోటలు తదితర వాటిపై అవగాహన, శిక్షణకు ఆసక్తి గల మహిళలు హాజరు కావాలని కోరారు. పెదవేగి : ఎస్జీఎఫ్ అండర్ 19 జిల్లా జట్ల ఎంపిక పోటీలు బుధవారం పెదవేగి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులంలో ఉత్సాహంగా జరిగాయి. ఫెన్సింగ్ జూడో, బాక్సింగ్, బీచ్ వాలీబాల్, రగ్బీ, తైక్వాండో, గక్కా క్రీడాంశాలలో పోటీలు నిర్వహించి జిల్లా జట్లను ఎంపిక చేసినట్లు డీవైఈఓ టి శేఖర్బాబు, ఆర్గనైజింగ్ కార్యదర్శి కె జయరాజు తెలిపారు. ఈ పోటీల్లో కళాశాల ప్రిన్సిపాల్ ఏవీ శివప్రసాద్, ఇతర పీడీలు పాల్గొన్నారు. -
మన్యంలో ప్రకృతి సేద్యం
● 10 వేల ఎకరాల్లో రసాయన రహిత సాగు ● స్వయంగా కషాయాలు తయారు చేస్తున్న గిరిజన రైతులు గిరిజన ప్రాంతంలో ప్రకృతి సాగు పెంపునకు కృషి చేస్తున్నాం. వరి, మొక్కజొన్న, జీడిమామిడి, ప్రత్తితోపాటు కూరగాయల సాగును, ఎక్కువగా చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంపై గిరిజన రైతులు ఆసక్తి చూపుతున్నారు. – నక్కా శ్రీను, సీఆర్పీ, కేఆర్పురం, బుట్టాయగూడెం మండలం ప్రకృతి వ్యవసాయం చాలా బాగుంది. ముఖ్యంగా కూరగాయల సాగుతో అధిక లాభాలు సాధిస్తున్నాం. పండించిన కూరగాయలు, ఆకుకూరలను ఎప్పటికప్పుడు విక్రయిస్తున్నాం. ప్రజలు కూడా అధికంగా కొనుగోలు చేస్తున్నారు. – కుమార్బాబు, సీఆర్పీ, సీతప్పగూడెం, బుట్టాయగూడెం మండలంబుట్టాయగూడెం: రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగంతో వ్యవసాయం భారంగా మారుతోంది. మిత్ర పురుగుల నాశనంతో చీడపీడల బెడద పెరుగుతుంది. దీనితో అధికారుల ప్రోత్సాహంతో తక్కువ పెట్టుబడి కలిగిన ప్రకృతి వ్యవసాయంపై గిరిజన రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. మన్యంలో ప్రకృతి వ్యవసాయంపై గిరిజన రైతులకు ఐటీడీఏ, ప్రకృతి వ్యవసాయ రైతులు అవగాహన కలిగిస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో సుమారు 1,596 మందికి పైగా ప్రకృతి వ్యవసాయం చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రకృతి సాగులో పంటలు కేఆర్పురం ఐటీడీఏ పరిధిలోని బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాలతోపాటు జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం మండలాల్లో గిరిజనులు సుమారు 10 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. వరి, మొక్కజొన్న, వేరుశనగ, మినుము పంటలతోపాటు జీడిమామిడి, అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయల పంటలను ప్రకృతి వ్యవసాయంగా సాగు చేసి పండిస్తున్నారు. వీటిలో బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాల పరిధిలో 4 వేల ఎకరాల్లో జీడిమామిడి, 2 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 270 ఎకరాల్లో వరి, 200 ఎకరాల్లో మిర్చి, 250 ఎకరాల్లో మినుము, 280 ఎకరాల్లో కూరగాయలు, 3 వేల ఎకరాల్లో చిరుధాన్యాల పంటలు సాగు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. స్వయంగా కషాయాల తయారీ ప్రకృతి వ్యవసాయ పంటలకు కషాయాలను స్వయంగా గిరిజన రైతులు తయారు చేసుకుంటున్నారు. రసాయన ఎరువులు, పురుగు మందులకు బదులుగా పంటలకు జీవామృతం, ఘనామృతం, బీజామృతం, ద్రవ జీవామృతం, పంచగవ్య, అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం వంటి రసాయనాలను గిరిజన రైతులు స్వయంగా తయారు చేసుకుని పంటలకు వినియోగించుకుంటున్నారు. -
జీవితంలో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలి
నూజివీడు: జీవితంలో సవాళ్లను, సమస్యలను ఎదుర్కొనడానికి విద్యార్థి దశ నుంచే ధైర్యంతో సిద్ధంగా ఉండాలని ఎన్సీడీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జే నర్సింగరావు అన్నారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవంను పురస్కరించుకొని విద్యాసంస్థల్లో ఆత్మహత్యల్ని నివారించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ సూచనల మేరకు పట్టణంలోని ట్రిపుల్ ఐటీలో బుధవారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జేడీ మాట్లాడుతూ మారుతున్న పరిస్థితుల వల్ల ఒత్తిడి పెరిగిపోయి వాటి నుంచి తట్టుకోలేక ఆత్మహత్యలు పెరుగుతున్నాయన్నారు. విద్యార్థిపై ఎవరూ ఒత్తిడి చేయకూడదని, వారికిష్టమైన సబ్జెక్టును చదువుకునే స్వేచ్ఛ విద్యార్థికి ఇవ్వాలన్నారు. విద్యార్థుల మానసిక పరిస్థితిని బట్టి వారిలో ధైర్యాన్ని నిరంతరం నింపుతూ ఉండాలన్నారు. ఎవరి జీవితం వడ్డించిన విస్తరి కాదని, చిన్న చిన్న కారణాలకే జీవితాన్ని చాలించాలనుకోవడం అవివేకమన్నారు. ఒక తలుపు మూసుకుపోతే, మరో తలుపు తెరిచే ఉంటుందన్న విషయాన్ని గుర్తెరగాలన్నారు. నిరంతరం పాజిటివ్ దృక్పథంతో ముందుకు సాగాలని, నిరాశ నిస్పృహలను దరిచేరనీయవద్దన్నారు. నేనున్నాను అనే భరోసా ఇవ్వాలి సైకియాట్రిస్టు డాక్టర్ కోమలి మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకోవడం నేరమని, అలాంటి ఆలోచన వచ్చిన వాళ్లను నిరంతరం గమనిస్తూ ఉండాలన్నారు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఉన్నవాళ్ల ప్రవర్తన వేరుగా ఉంటుందని, ఒక్కరే కూర్చోవడం, ఏడవడం, ఒంటరితనం, ఎవరూ లేరని బాధపడడం, మన బాధ వినేవారు ఎవరూ లేరని బాధపడడం అనే లక్షణాలతో బాధపడుతుంటారన్నారు. అలాంటి వాళ్లని గుర్తించి ప్రేమగా పలకరించాలని, నీకు నేనున్నాను అనే భరోసా ఇవ్వాలన్నారు. అనంతరం హాజరైన విద్యార్థులతో ఆత్మహత్యా నివారణా ప్రతిజ్ఞను చేయించారు. కార్యక్రమంలో నూజివీడు డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ డా.జాస్తి జగన్మోహనరావు, ఏరియా ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ శ్రీనివాసరావు, సైకాలజిస్ట్ కె.శ్రీనివాసరావు, ట్రిపుల్ ఐటీ సైకాలజీ అధ్యాపకుడు వేణుగోపాల్, డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ రాజేష్, చీఫ్ వార్డెన్లు సురేష్ బాబు, గౌతమి, పీయూసీ కోఆర్డినేటర్ రఘు తదితరులు పాల్గొన్నారు. ఎన్సీడీ జేడీ డాక్టర్ నర్సింగరావు -
పాలనలో విఫలం.. సమస్యలతో సావాసం
● నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఏడాదిగా ఇన్చార్జులే దిక్కు ● విద్యార్థులపై కొరవడిన పర్యవేక్షణ నూజివీడు: ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఏడాది కాలంగా ఇన్చార్జి అధికారుల పాలన కొనసాగుతుండటంతో రోజురోజుకూ పరిస్థితులు దిగజారుతున్నాయి. పాలనలో విఫలం కావడంతో నిరంతరం సమస్యలు చుట్టుముడుతున్నాయి. అకడమిక్ క్యాలెండర్ గాని, బీఓఎస్ సమావేశాలు గాని, ఇతర అకడమిక్ అంశాలపై సుదీర్ఘ అనుభవం కలిగిన నిష్ణాతులతో సంప్రదించకుండానే ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ట్రిపుల్ ఐటీని పురోగమనంలోకి కాకుండా తిరోగమనంలోకి నెడుతున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 15 నెలలు గడిచినా నేటికి రెగ్యులర్ చాన్సలర్ను గాని, వైస్ చాన్సలర్ను గాని, నాలుగు ట్రిపుల్ ఐటీలకు డైరెక్టర్లను గాని నియమించలేదు. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో పనిచేస్తున్న ప్రొఫెసర్ సండ్ర అమరేంద్రకుమార్కు నూజివీడు ట్రిపుల్ ఐటీకి ఇన్చార్జి డైరెక్టర్గాను, అలాగే ఆర్జీయూకేటీకి ఇన్చార్జి రిజిస్ట్రార్గాను నియమించింది. ఒకే వ్యక్తికి రెండు కీలకమైన బాధ్యతలు అప్పగించడంతో తలకు మించిన భారంగా మారింది. నూజివీడు ట్రిపుల్ ఐటీలో నిరంతరం ఎదురయ్యే సమస్యలను పరిష్కరంచడానికే ఉన్న సమయం చాలక సతమతమవుతుంటే రిజిస్ట్రార్గా కూడా బాధ్యతలు ఉండటంతో మిగిలిన మూడు ట్రిపుల్ ఐటీలలో ఏ సమస్య ఉత్పన్నమైనా అక్కడికి ఉరుకులు, పరుగులు పెట్టాల్సి వస్తోంది. దీంతో దేనిపైనా శ్రద్ధ పెట్టలేక పాలన క్రమంగా బలహీనంగా మారి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. అలాగే ఇక్కడ పనిచేస్తున్న ఏఓ సైతం ఇన్చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తుండగా ఇటీవలే ఏడాది కాలపరిమితి పూర్తవ్వగా మరలా ఒక నెల ఇన్చార్జి బాధ్యతలను పొడిగించారు. ప్రొఫెసర్పై ఎంటెక్ విద్యార్థి కత్తులతో దాడికి దిగడం చూస్తుంటేనే ఇక్కడ పాలన ఎలా ఉందో అర్థమవుతోంది. టెండర్లు పిలవడంలో జాప్యం సెక్యూరిటీ, హౌస్ కీపింగ్ ఏజన్సీల కాలపరిమితి ముగిసిన నేపథ్యంలో మరలా ఏజెన్సీల ఎంపికకు టెండర్లు పిలవాల్సి ఉన్నా నెలలు గడుస్తున్నా ఇప్పటికీ టెండర్లు పిలవలేదు. ఇది ఎప్పటికీ పిలుస్తారో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. అలాగే శ్రీకాకుళం, ఒంగోలు పీయూసీ ప్రథమ సంవత్సర విద్యార్థులకు నూజివీడు క్యాంపస్లోనే తరగతులు నిర్వహిస్తున్న నేపథ్యంలో పరిపాలన లోపం కారణంగానే తెలుగు సబ్జెక్టు బోధనకు సంబంధించి మెంటార్లకు, సర్ప్లస్లో ఉన్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు మధ్య వివాదం తలెత్తి కొద్దిరోజులు పాటు నడిచింది. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి యాజమాన్యానికి తల బొప్పి కట్టింది. చివరకు మెంటార్లు వెనక్కు తగ్గడంతో ఎలాగోలా సమస్య సద్దుమణిగింది. క్యాంపస్లోకి మందు సీసాలు విద్యార్థులకు స్వేచ్ఛ ఎక్కువైపోవడంతో క్యాంపస్లోకి ఏకంగా మందుసీసాలే వచ్చేస్తున్నాయి. ఇటీవల పార్టీ చేసుకునేందుకు 10 మంది విద్యార్థులు మందు సీసాలను ఒక విద్యార్థితో తెప్పించుకోవడం తీవ్ర సంచలనంగా మారింది. ఆ విద్యార్థి గోడ దూకి వెళ్లి మద్యం సీసాలు తీసుకురావడం గమనార్హం. అలాగే క్యాంపస్లో బాలురకు, బాలికలకు వేరు వేరుగా ఫుడ్ కోర్టులున్నా బాలికలు కూడా బాలుర ఫుడ్కోర్టు వద్దకు వచ్చి బాలురతో దగ్గరగా కలిసి కూర్చొని తింటూ కాలక్షేపం చేస్తున్నారు. దీంతో ఫ్యాకల్టీ, సిబ్బంది ఫుడ్కోర్టు వైపు వెళ్లడమే మానివేశారు. సెమిస్టర్ పరీక్షలు ఎత్తేశారు దేశ వ్యాప్తంగా హైస్కూల్ స్థాయిలో విద్యార్థులకు ఉన్న వార్షిక పరీక్షలను ఎత్తేసి సెమిస్టర్ పరీక్షల విధానాన్ని తీసుకొస్తుండగా ట్రిపుల్ ఐటీలో మాత్రం పీయూసీ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఈ ఏడాది నుంచి సెమిస్టర్ పరీక్షలను ఎత్తేసి వార్షిక పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించారు. అధికార బాధ్యతలను చూస్తున్న వారికి అవగాహన లేకో, ఒకరిద్దరూ ఐఏఎస్ అధికారుల మెప్పు పొందడానికో గాని సెమిస్టర్ పరీక్షలను ఎత్తేసి వార్షిక పరీక్షలను ఏర్పాటుచేశారు. దీనికి గవర్నింగ్ కౌన్సిల్ అనుమతి గాని, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనుమతులు గాని ఏమీ లేవని ట్రిపుల్ ఐటీలోని అధ్యాపక వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో పురోగమిస్తుందో, తిరోగమిస్తుందో అర్థం కావడం లేదని అధ్యాపకులు వాపోతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పటిష్టమైన చర్యలు చేపట్టాలని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్లో భారీ చోరీ
రూ.3 కోట్ల బంగారు ఆభరణాలతో ఆడిటర్ పరార్ చింతలపూడి: చింతలపూడి పట్టణంలోని కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్లో భారీ చోరీ జరిగింది. సుమారు రూ.3 కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో అదే సంస్థలో పనిచేస్తున్న ఆడిటర్ వడ్లమూడి ఉమా మహేష్ పరారయ్యాడు. సంస్థ ఉద్యోగులు, ఖాతాదారులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడ ప్రధాన కార్యాలయం నుంచి ఆడిటర్ మహేష్ మంగళవారం ఉదయం 11 గంటలకు స్థానిక కనకదుర్గ ఫైనాన్స్ సంస్థకు చేరుకున్నాడు. మేనేజర్ యాదల ప్రవీణ్ కుమార్, క్యాషియర్ అమృతాల ఆషాలను బయటకు పంపించి 380 పాకెట్లలో ఉన్న గోల్డ్తో మహేష్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న సీఐ క్రాంతికుమార్, ఎస్సై సతీష్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. సాయంత్రం 5 గంటల సమయంలో తనకు హెల్త్ బాలేదని, కొబ్బరి నీళ్లు తీసుకురమ్మని తమను బయటికి పంపించి మహేష్ గోల్డ్ బ్యాగ్తో పరార్ అయినట్లు సంస్థ ఉద్యోగులు తెలిపారు. అతడు బంగారం ఉన్న బ్యాగ్తో ఏలూరు వైపు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉద్యోగాలకు ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఎంపిక
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీలో నాలుగో సంవత్సరం ఈసీఈ చదువుతున్న విద్యార్థులు ఇద్దరు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. విద్యార్థి యుగంధర్ ఓమ్నీ డిజైన్స్ అనే కంపెనీకి ఇంటర్న్షిప్తో పాటు ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఇంటర్న్షిప్లో నెలకు రూ.50 వేలు ఏడాది పాటు ఇవ్వనున్నారు. అనంతరం ఏడాదికి రూ.18 లక్షల వార్షిక వేతనాన్ని కంపెనీ ఆఫర్ చేసింది. అలాగే మరో విద్యార్థిని కమలప్రియ ఎన్ఎక్స్పీ సెమీ కండక్టర్ కంపెనీకి ఎంపికై ంది. ఆరు నెలల పాటు ఇంటర్న్షిప్కు వెళ్లనుంది. ఇంటర్న్షిప్లో నెలకు రూ.40 వేల స్టైఫండ్ను కంపెనీ అందించనుంది. అనంతరం ఏడాదికి రూ.25 లక్షల వార్షిక వేతనంను అందించనుంది. విద్యార్థులను నూజివీడు ట్రిపుల్ఐటీ డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్, ఏఓ బీ లక్ష్మణరావు అభినందించారు. -
అన్నదాతకు అండగా
సీసలిలో 144 సెక్షన్ సీసలిలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా మంగళవారం నుంచి 15 రోజులపాటు గ్రామంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 8లో uఆంక్షలు అధిగమించి.. సాగును నిర్వీర్యం చేస్తూ కూటమి దగాకోరు పాలనపై కర్షకులు కదం తొక్కారు. అన్నదాత పోరు విఫలయత్నానికి ఆంక్షల రూపంలో ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు కల్పించినా లెక్కచేయకుండా విజయవంతం చేశారు. రైతుల సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ నేతల ఆధ్వర్యంలో ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు ఆర్డీఓ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేశారు. బుధవారం శ్రీ 10 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025తణుకు అర్బన్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని మంగళవారం మాజీ మంత్రి, రీజనల్ కో–ఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు, రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కారుమూరి సునీల్కుమార్లు మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిసి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమ పరిపాలనపై చర్చించినట్లు కారుమూరి తెలిపారు. దెందులూరు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని ఆయన నివాసంలో మంగళవారం దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి కలిశారు. రాష్ట్రంలో యూరియా బ్లాక్ మార్కెట్ను నిరసిస్తూ అన్నదాత పోరు కార్యక్రమం జరిగిన తీరు వివరించారు. దెందులూరు నియోజకవర్గంలో ఇటీవల జరిగిన జరుగుతున్న రాజకీయ పరిణామాలు, అక్రమ కేసులు, దాడులు, దౌర్జన్యాలపై వివరించారు. కాలం చెల్లిన మందుల వాడకం వేలేరుపాడు: ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన వైద్య ఆరోగ్య శాఖ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. రోగులకు గడువు తీరిన మందులను వినియోగిస్తోంది. వేలేరుపాడు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీకి గడువు తీరిన మందులు ఇచ్చిన సంఘటన వెలుగు చూసింది. వేలేరుపాడు మండలంలోని పూచిరాల కాలనీకి చెందిన గర్భిణీ గత నెలలో వైద్య పరీక్షల నిమిత్తం వేలేరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళింది. పరీక్షల అనంతరం వైద్యుడు మందులు రాయగా రాయగా, ఆరోగ్య కేంద్రంలోని ఫార్మసిస్ట్ మందులు ఇచ్చారు. మందులను ఇంటికి తీసుకెళ్ళిన మహిళ మాత్రలను వేసుకునేందుకు సిద్ధమై తన భర్తకు చూపించింది. అనుమానం వచ్చిన భర్త మాత్రల షీట్పై ఉన్న తయారీ, గడువు ముగిసిన తేదీలు గమనించాడు. ఆ మందుల గడువు జులైలోనే తీరిపోయింది. దీంతో గర్భిణీ మహిళ మాత్రలు వేసుకోలేదు. ఈ విషయాన్ని మంగళవారం వేలేరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ సురేష్కు చూపించింది. గడువు తీరిన మందులు వేసుకొని, మా ప్రాణాల మీదకు తెచ్చుకోవాలా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విచారించిన డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ ఫార్మాసిస్ట్కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఇలాంటి తప్పులు జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. ఏలూరు(మెట్రో): మోతాదుకు మించి ఎరువుల వినియోగం వలన కలిగే అనర్థాలపై రైతులకు విస్తృతంగా అవగాహన కలిగించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి వ్యవసాయాధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎరువుల సరఫరా, పంపిణీలపై మంగళవారం కలెక్టరేట్ నుంచి సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎరువులకు ఎలాంటి కొరతా లేదని, రైతుల అవసరాలకు సరిపడా ఉన్నాయని, అయినప్పటికీ సాగులో నిర్దేశించిన మోతాదుకు కంటే ఎక్కువ పరిమాణంలో వినియోగం కారణంగా భూసారం దెబ్బతినడంతో పాటు, మనుషుల ఆరోగ్యాలపై ప్రభావం చూపుతాయని రైతులకు అవగాహన కలిగించాలన్నారు. నానో ఎరువుల వినియోగంపై కూడా అవగాహన కలిగించాలన్నారు. ఈ సందర్భంగా సొసైటీలలో ప్రస్తుతం ఉన్న ఎరువుల నిల్వలు, రాబోయే వారానికి అవసరమైన ఎరువుల వివరాలపై కలెక్టర్ ఆరా తీశారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరును అష్టదిగ్బంధం చేశారు. చిన్న పట్టణమైన జంగారెడ్డిగూడెంలో అడుగడుగునా పోలీసులను మోహరించారు. చెక్పోస్టులు, బారికేడ్లతో రైతులు, వైఎస్సార్సీపీ శ్రేణులను నిలువరించే యత్నాలు తెల్లవారుజామున నుంచే మొదలుపెట్టారు. సెక్షన్ 30 అమలులో ఉందని నిరసన చేయవద్దంటూ పార్టీ ఇన్చార్జులకు నోటీసులు, 41 నోటీసుల పేరుతో హౌస్ అరెస్టులు చేశారు. అన్నింటిని దాటుకుని వైఎస్సార్సీపీ తలపెట్టిన అన్నదాత పోరు జిల్లాలో విజయవంతమైంది. పోలీసుల అణచివేతలపై తిరగబడిన పార్టీ శ్రేణులు, రైతులు వేలాదిగా తరలివచ్చి నిరసన తెలిపారు. వైఎస్సార్సీపీ మంగళవారం నిర్వహించిన అన్నదాత పోరు ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడులో విజయవంతంగా సాగింది. ఎన్నడూ లేని విధంగా ఆంక్షలు, పోలీసుల హడావుడితో రైతు ఉద్యమాన్ని అణిచివేయాలని సర్కారు అనేక అడ్డదారులు తొక్కింది. వాటిన్నింటిని చేధించి పార్టీ శ్రేణులు తరలివచ్చాయి. ప్రధానంగా ఏలూరు నగరంలో అశోక్నగర్, అమీనాపేట, పాత బస్టాండ్, జూట్ మిల్లు సెంటర్, పంపుల చెరువు రోడ్డు, మాదేపల్లి రోడ్డు, ఆశ్రం కాలేజీ సెంటర్, సత్రంపాడు సెంటర్ వద్ద పోలీసుల చెక్పోస్టులు ఏర్పాటు చేసి కై కలూరు, దెందులూరు, ఉంగుటూరు నుంచి ద్విచక్ర వాహనాలు, కార్లలో వచ్చేవారిని పెద్ద ఎత్తున అడ్డుకున్నారు. మరోవైపు అంతటితో ఆగకుండా అనేక చెక్పోస్టుల వద్ద రవాణాశాఖాధికారులు కూడా పోలీసులతో జత కలిసి వాహనాలను తనిఖీ చేయించి కేసుల పేరుతో అలజడి సృష్టించారు. ముఖ్యనేతలందరికీ నోటీసులు పంపారు. వీటన్నింటిని దాటుకుని అశేష జనవాహిని ఏలూరు ఫైర్స్టేషన్కు చేరుకుంది. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొంతసేపు అక్కడ ఆందోళన నిర్వహించి పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, సమన్వయ కర్తలు పుప్పాల వాసుబాబు, కొఠారు అబ్బయ్యచౌదరి, మామిళ్ళపల్లి జయప్రకాష్, పార్టీ బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నౌడు వెంకటరమణ, నగర నేతలు కలిసి ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. అన్నదాత సమస్యలను శాంతియుత వాతావరణంలో ప్రభుత్వానికి తెలియజేయడానికే నిరసన కార్యక్రమం నిర్వహించామని దీన్ని పోలీసుల ఆంక్షలతో అడ్డుకోవడం సర్కారు నీతిమాలిన చర్య అని జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. నూజివీడులో పార్టీ సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప అప్పారావు నేతృత్వంలో కార్యాలయంలో సమావేశం నిర్వహించి నిరసన ప్రదర్శనగా పార్టీ శ్రేణులు సబ్కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందించారు. జంగారెడ్డిగూడెం అష్టదిగ్బంధం గతంలో ఎన్నడూ లేని విధంగా జంగారెడ్డిగూడెంను పోలీసు అష్టదిగ్బంధం చేశారు. ఏలూరు రోడ్డు, శ్రీనివాసపురం, జీలుగుమిల్లి రోడ్డు, బుట్టాయగూడెం, కొయ్యలగూడెం రహదారుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల నుంచి రైతులు, పార్టీ శ్రేణులు రాకుండా అడ్డుకున్నారు. పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులను జంగారెడ్డిగూడెం బయటే అడ్డుకున్నారు. ఈ క్రమంలో పార్టీ జిల్లా పరిశీలకులు, ఎమ్మెల్సీ వంకా రవీంధ్రనాఽథ్, పార్లమెంట్ ఇన్చార్జి కారుమూరి సునీల్, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, చింతలపూడి, పోలవరం సమన్వయకర్తలు కంభం విజయరాజు, తెల్లం రాజ్యలక్ష్మి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు, రైతు విభాగం జిల్లా అధ్యక్షులు వాసిరెడ్డి మధుతో పాటు మరికొందరు ముఖ్య నేతలు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయానికి భారీ సంఖ్యలో వచ్చి వినతిపత్రం అందచేశారు. జంగారెడ్డిగూడెం పాత బస్టాండ్ నుంచి ఆర్డీఓ సెంటర్ వరకు ఆరు చోట్ల పోలీస్ పికెటింగ్లు ఏర్పాటు చేసి హడావుడి చేసినప్పటికీ భారీగా శ్రేణులు తరలివచ్చి నిరసనలో పాల్గొన్నాయి. కారుమూరి సునీల్కుమార్, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి రైతులకు యూరియా అందకుండా ఇబ్బంది పెట్టేలా ప్రభుత్వం ప్రవర్తిస్తోంది. చంద్రబాబు వరి పండించక్కర్లేదు అని చెప్పడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటున్నారు.. ఆయన మాటలు, చేష్టలు అర్థం కాకుండా ఉన్నాయి. రైతుల కోసం మరిన్ని పోరాటాలు చేస్తాం. సినిమా టిక్కెట్లకు రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇస్తుంది గాని, పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైంది. దోచుకో... దాచుకో అనేది కూటమి లక్ష్యంగా ఉంది. తెల్లం బాలరాజు, పోలవరం మాజీ ఎమ్మెల్యే అన్నదాత పోరు చూసి చంద్రబాబు సిగ్గుపడాలి. రైతులు రోడ్డెక్కారంటే సిగ్గు చేటు. యూరియా అందించలేక కూటమి చేతులెత్తేసింది. ఇన్పుట్ సబ్సిడీ, బీమా ఎగ్గొట్టారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం మొద్దు నిద్ర విడనాడాలి. బ్లాక్ మార్కెట్లో యూరియాను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలి. యూరియా కోసం క్యూలో నిల్చుంటే వారిని కించపరిచేలా మాట్లాడుతున్నారు. రైతులను అవమానిస్తే రైతుల తడాఖా చూపిస్తారు. కంభం విజయరాజు, చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో ప్రజలకు చేసింది శూన్యం. రైతు కంట కన్నీళ్లు పెట్టిస్తోంది కూటమి ప్రభుత్వం. రైతు కళ్లలో నీరు తెప్పించిన ఏ ప్రభుత్వమైనా కూలిపోక తప్పదు. అన్నదాతకు అండగా ఉండాలని కోరుతున్నాం. అన్నదాత సుఖీభవ గత ఏడాది, ఈ ఏడాది కలిపి మొత్తం రూ.40 వేలు రైతులకు ఇవ్వాలి. యూరియాను బ్లాక్మార్కెట్ నుంచి బయటకు తెచ్చి రైతులకు అందించాలి. గిట్టుబాటు ధర కల్పించాలి. జెట్టి గురునాథరావు, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి చంద్రబాబు రాష్ట్రానికి అన్యాయం చేయకుండా, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి అడ్డుకుంటున్నారు. ప్రజలను మోసం చేయకుండా ఇచ్చిన హామీలన్నీ కూటమి ప్రభుత్వం అమలు చేసేలా తన పోరాటాల ద్వారా జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారు. జగన్ పోరాటాల ఫలితంగానే తల్లికి వందనం, ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాలు, రైతులకు యూరియా సరఫరాకు ప్రభుత్వం పూనుకుంది. ఏలూరు ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం ఇస్తున్న జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్, మాజీ ఎమ్మెల్యేలు వాసుబాబు, అబ్బయ్య చౌదరి, ఇన్చార్జి జేపీ తదితరులుజంగారెడ్డిగూడెంలో వినతిపత్రం ఇస్తున్న ఎమ్మెల్సీ రవీంద్రనాథ్, పార్లమెంట్ ఇన్చార్జి సునీల్కుమార్, మాజీ ఎమ్మెల్యే బాలరాజు, ఇన్చార్జ్లు విజయరాజు, రాజ్యలక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి గురునాథరావు ఏలూరు కలెక్టరేట్ వద్ద పార్టీ శ్రేణులను అడ్డుకుంటున్న పోలీసులు ఏలూరు(మెట్రో): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు ఈనెల 12 ఉదయం 10 గంటల నుంచి ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ అధ్యక్షతన జరుగుతుందని జెడ్పీ సీఈఓ శ్రీహరి ఒక ప్రకటనలో తెలిపారు. ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా యూనిట్ ఫాస్ట్ట్రాక్ కోర్టులలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పోస్టుల భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తూ గత నెల 30న నోటిఫికేషన్ జారీ చేశారు. పరిపాలన కారణాలవల్ల ఆ నోటిఫికేషన్ రద్దు చేశామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏలూరు (టూటౌన్): విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించవద్దని.. పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఏలూరులో కొత్త బస్టాండ్ సమీపంలోని వంతెన వద్ద మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. అదానీ మీటర్లు వద్దు.. పెంచిన విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు.ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె.శ్రీనివాస్, ఆర్.లింగరాజు, డీఎన్వీడీ ప్రసాద్ మాట్లాడారు. గత ఎన్నికల ముందు విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టండని లోకేష్ పిలుపునిచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రజలపై భారంపడేలా స్మార్ట్ మీటర్లు ఏ విధంగా బిగిస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికే వ్యాపార సంస్థలకు, షాపులకు స్మార్ట్ మీటర్లు బిగించారని ఈ స్మార్ట్ మీటర్లతో బిల్లుల భారం పెరిగిందన్నారు. ఇప్పుడు గృహ వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని, దొంగ చాటుగా ప్రజలు ఆమోదం లేకుండా మీటర్లు బిగించడం దుర్మార్గమన్నారు. బిగించిన స్మార్ట్ మీటర్లకు బిల్లు ఇవ్వడం లేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ట్రూ ఆఫ్ చార్జీలు పేరుతో ప్రజలపై రూ.12 వేల కోట్లు భారం వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు పి.మంగరాజు, ఎస్.మహంకాళి రావు, తామా ముత్యాలమ్మ, నగర కార్యదర్శి పంపన రవికుమార్, నగర కమిటీ సభ్యులు వైఎస్ కనకారావు తదితరులు పాల్గొన్నారు. -
సీసలిలో 144 సెక్షన్ అమలు
కాళ్ల: సీసలి గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా మంగళవారం నుంచి 15 రోజులపాటు గ్రామంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఆకివీడు సీఐ జగదీశ్వరరావు, తహసీల్దార్ జి.సుందర్ సింగ్ తెలిపారు. సీసలిలో గ్రామదేవత పోలేరమ్మ గుడి పక్కన ఉన్న పోరంబోకు స్థలం విషయమై సోమవారం రాత్రి జరిగిన వివాదంలో పలువురికి గాయాలైన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం కాళ్ల తహసీల్దార్ కార్యాలయంలో ఇరువర్గాల పెద్దలతో పోలీసు, రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్ అధికారులు శాంతి సమావేశం నిర్వహించారు. సదరు వివాదాస్పద భూమిని ఇరిగేషన్ అధికారులు స్వాధీన పరుచుకోవాలని, ఇరిగేషన్ ఏఈ ఫణిశంకర్కు తహసీల్దార్ సూచించారు. గ్రామంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నామని, ఎక్కడా గుంపులు గుంపులుగా గాని, ఐదుగురు కంటే ఎక్కువ వ్యక్తులు గాని ఉండరాదని స్పష్టం చేశారు. బయట నుంచి వచ్చి గ్రామంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
మొగల్తూరు ముత్యాలమ్మ పూరిపాక దగ్ధం
నరసాపురం రూరల్: మొగల్తూరు గ్రామదేవత నడివీధి ముత్యాలమ్మ అమ్మవారి పూరిపాక సోమవారం అర్ధరాత్రి దగ్థమైంది. ఈ ఘటనతో భక్తులు, పరిసర గ్రామాల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఆలయ ధర్మకర్త, కమిటీ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మత సామరస్యానికి ఇబ్బంది కలుగకుండా అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంది. అడిషనల్ ఎస్పీ వాసుపల్లి భీమారావు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ సమాచారం అందిన వెంటనే డీఎస్పీ శ్రీవేద, సీఐలు, ఎస్సైలు సంఘటనా స్థలంలోనే ఉన్నారన్నారు. ఇప్పటికే డాగ్స్స్క్వాడ్, వేలిముద్ర నిపుణులు వచ్చి సమాచార సేకరణలో నిమగ్నమయ్యారన్నారు. ఆలయ ధర్మకర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భీమారావు తెలిపారు. -
మట్టి అక్రమ తవ్వకాలను అడ్డుకున్న పోలీసులు
ద్వారకాతిరుమల: మండలంలోని గుణ్ణంపల్లి పంచాయతీ తక్కెళ్లపాడులో తాడిపూడి కాలువ గట్టుపై గ్రావెల్ మట్టి అక్రమ తవ్వకాలను ఆదివారం రాత్రి పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఒక జేసీబీని, టిప్పర్ను సీజ్ చేసి పోలీస్టేషన్కు తరలించారు. స్థానికుల కథనం ప్రకారం.. తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన ఒక టీడీపీ నాయకుడు కాలువ మట్టిని ఆదాయ వనరుగా ఎంచుకున్నాడు. రాత్రి వేళల్లో జేసీబీ సహాయంతో కాలువ గట్టుపై గ్రావెల్ మట్టిని తవ్వి, టిప్పర్ల ద్వారా వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నాడు. ఆ మట్టిని రిలయ్ ఎస్టేట్ వెంచర్లు చదును చేసేందుకు వినియోగిస్తున్నారు. -
దళిత కుటుంబాలకు పరామర్శ
కై కలూరులో 144 సెక్షన్, భారీగా పోలీసుల మోహరింపు కై కలూరు: దానిగూడెం దళితులపై దాడి నేపధ్యంలో కై కలూరు పట్టణంలో నాలుగు రోజులుగా పోలీసులను మెహరించారు. నిందితులను రిమాండ్కు తరలించినప్పటకీ ప్రధాన సూత్రదారుడిని అదుపులోకి తీసుకోవాలంటూ దళిత నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సోమవారం నియోజకవర్గం, ఇతర ప్రాంతాల నుంచి దాదాపు 150 మంది దళిత యువకులు పోలీసుల వలయాన్ని చేధించుకుని దానిగూడెం చేరుకున్నారు. దానిగూడెం ప్రజలు వంటా, వార్పుతో మద్దతు తెలపడానికి వచ్చిన వారికి భోజనాలు అందించారు. డీఎస్పీ, పలువురు సీఐలు, ఎస్ఐలు కలిపి దాదాపు 200 మంది పోలీసులు విధులు నిర్వహించారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదు.. సంక్షేమం లేదు.. రోజు రోజుకు దళితులు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీ కులాలపై అత్యాచారాలు, హత్యలు, అరాచకాలు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చింతపల్లి గురుప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. దానిగూడెంకు పోలీసులు వెళ్ళనీయకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో కీలక వ్యక్తులను అరెస్టు చేసి అందరిపై రౌడీషీట్లు ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు చర్యలు తీసుకోని పక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. దళితులపై దాడులు అరికట్టడంలో ప్రభుత్వం విఫలమవుతోందని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కన్వీనర్ ఉప్పులేటి దేవీ వరప్రసాద్ విమర్శించారు. ఇటీవల తెనాలి, తణుకు, ఇప్పుడు కై కలూరులో దళితులపై దాడులు జరిగాయన్నారు. రోడ్డుపై ఆందోళనలు చేశారంటూ దళితులపై పోలీసులు నమోదు చేసిన కేసులను ఉపసంహరించాలన్నారు. ప్రధాన నిందితుడు కొల్లి బాబీని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మాలమహాడు రాష్ట్ర అధ్యక్షుడు నాగ జగన్ బాబూరావు, కృష్ణాజిల్లా మాలమహానాడు అధ్యక్షుడు దోవా గోవర్థన్, దళిత నాయకులు పాల్గొన్నారు. సున్నితమైన అంశంపై కావాలని ఘర్షణలకు పాల్పడితే సహించమని డీఎస్పీ డి.శ్రావణ్కుమార్ హెచ్చరించారు. 144 సెక్షన్ అమలులో ఉందన్నారు. దళితులపై దాడి కేసులో ఇప్పటికే అరెస్టులు చేసి రిమాండ్కు పంపామన్నారు. మరొకరిపై ఆరోపణలను నిర్ధారణ చేసుకుని చర్యలు తీసుకుంటామన్నారు. -
10న క్వాంటం వ్యాలీ హ్యాకథాన్ సెమీస్
పూర్ణానందంపేట(విజయవాడపశ్చిమ): వైఎస్సార్ సీపీ ఏలూరు జిల్లా బీసీ సెల్ ఇన్చార్జ్గా గొలగాని శ్రీనివాసరావును నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనకు ఏలూరు బీసీ సెల్ ఇన్చార్జ్గా బాధ్యతలు అప్పగించడంతో ఆ పార్టీ బీసీ సెల్ నేతలు ఆయన్ను అభినందించారు. ఈ సందర్భంగా గొలగాని శ్రీనివాసరావు మాట్లాడుతూ తనపై నమ్మకంతో బీసీ సెల్ ఏలూరు ఇన్చార్జ్గా బాధ్యతలు అప్పగించడంపై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
ఖరీఫ్లో ఎరువుల గండం
రైతులకు సకాలంలో యూరియా సరఫరా చేసే విషయంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందింది. పంటలకు పెట్టుబడి సాయం చేయకపోగా, కనీసం యూరియా కూడా సకాలంలో సరిపడా ఇవ్వకపోతే కూటమి ప్రభుత్వ వైఫల్యం కాకపోతే ఏమనాలి. వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ఎంత యూరియా అవసరమో అంతా దిగుబడి చేసుకోవాలి. ప్రణాళిక లేకుండా విధి నిర్వహణ ఎలా చేస్తున్నారు? సరిపడా యూరియా దిగుబడి చేసుకోకపోతే సాగు చేసే రైతుల పరిస్థితి ఏమిటి? విజిలెన్స్ శాఖ అధికారులు నిరంతర తనిఖీ చేయాలే తప్ప అమావాస్యకు పౌర్ణానికి తనిఖీలు చేస్తే ఫలితాలు ఉండవు. – పర్వతనేని నరేంద్రబాబు, రైతు, మలకచర్ల కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని గాలికొదిలేసింది. రాష్ట్రవ్యాప్తంగా యూరియా కోసం రైతులు ధర్నాలు, ఆందోళనలు చేయడమే ఇందుకు నిలువెత్తు నిదర్శనం. ప్రభుత్వం ఏర్పడిన ఒక సంవత్సరంలోనే రైతుల సంక్షేమం, అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కూటమి ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి, ప్రణాళిక ఉంటే యూరియా కొరత వస్తుందా? ఎన్నికల ముందు ప్రచార సభల్లో కూటమి నాయకులు చెప్పిన, ఇచ్చిన హామీలకు, ప్రభుత్వ ఏర్పాటు అనంతరం చేస్తున్న చర్యలకు తేడాను గమనిస్తున్న రైతులు తాము మోసపోయామని తెలుసుకున్నారు. – మేడూరి రంగబాబు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నదాతకు ఎరువుల రూపంలో గండం మొదలైంది. గత ప్రభుత్వ హయాంలో సజావుగా, సక్రమంగా దొరికే ఎరువుల కోసం.. కూటమి ప్రభుత్వ హయాంలో మళ్లీ సొసైటీల చుట్టూ అన్నదాతలు ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. సొసైటీకి ఎరువులు ఎప్పుడు వస్తాయో తెలుసుకుని ఒకపూట క్యూలో పడిగాపులు కాస్తే రెండు, మూడు బస్తాలు దొరికితే గొప్ప అనే పరిస్థితి నెలకొంది. దాదాపు నెల రోజులుగా జిల్లాలో అన్నదాతను ఎరువుల సమస్య పట్టిపీడిస్తోంది. ఖరీఫ్ సీజన్లో 33,762 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉండగా, ఈ నెల ఐదో తేదీకి 8 వేల మెట్రిక్ టన్నులను మాత్రమే పంపిణీ చేశారు. సోమవారం ఏలూరులో హడావిడిగా సమీక్ష సమావేశం ఏర్పాటుచేసిన ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్.. రెండు రోజుల్లో 24 వేల మెట్రిక్ టన్నులు పంపిణీ చేశామని, జిల్లాలో ఎక్కడా కొరతే లేదంటూ ప్రకటించారు. ఇదంతా ప్రతిపక్షాల కుట్రేనని, రైతులు చాలా సంతోషంగా ఉన్నారని ముక్తాయించారు. కట్ చేస్తే... సొసైటీల వద్ద, డీసీఎంఎస్ కేంద్రాల వద్ద భారీగా అన్నదాతలు బారులు తీరిన దృశ్యాలు సోమవారం కూడా కొనసాగడం గమనార్హం. సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఖరీఫ్ సీజన్లో రైతుకు సకాలంలో ఎరువులు అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. ఈ క్రమంలో రైతులకు అండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం జిల్లా వ్యాప్తంగా అన్నదాత పోరు పేరిట ఆర్డీఓ కార్యాలయాల వద్ద భారీ నిరసన ర్యాలీలు, ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో రెండు రోజుల నుంచి ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా అధికార యంత్రాంగం నానా హైరానా పడుతూ అంతా బాగుంది.. అన్నీ అందుబాటులో ఉన్నాయంటూ కొత్త ప్రచారానికి తెర తీసింది. ఎరువుల బ్లాక్ మార్కెట్పై అన్నదాత పోరు పేరిట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన నేపథ్యంలో జిల్లా ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం ఏలూరులో హడావిడిగా అధికారులతో సమీక్ష ఏర్పాటు చేసి అన్నీ బాగున్నాయని ప్రకటించారు. ఖరీఫ్లో 33,762 మెట్రిక్ టన్నులు ఎరువులు అవసరం ఉండగా 30,555 మెట్రిక్ టన్నులు పంపిణీ చేసేశామని, 2,200 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచుతామని, పామాయిల్, కోకో, మిర్చి, ఇతర ఉద్యానవన పంటల రైతులు కూడా ఎరువులు వాడుతున్నారని, జిల్లా వ్యాప్తంగా 530 పంపిణీ కేంద్రాలున్నాయని, ఎవరూ ఆందోళన పడవద్దని, జిల్లాలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారంటూ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అని, కావాలనే అలజడి సృష్టిస్తున్నారంటూ సమస్య వదిలి రాజకీయ విమర్శలకు దిగారు. జిల్లాలో ఎప్పుడు ఏర్పాటు చేశారో తెలియదు కానీ.. 29 చెక్పోస్టులను ఏర్పాటు చేసి బ్లాక్ మార్కెట్లో విక్రయించేవారిపై 12 కేసులు నమోదు చేసినట్టు కూడా ప్రకటించారు. రెండు రోజుల్లో 24 వేల మెట్రిక్ టన్నుల పంపిణీ ఎలా? జిల్లాలో గత శనివారానికి 8 వేల మెట్రిక్ టన్నుల పంపిణీ జరిగినట్టు అధికారిక సమాచారం. ఆగస్టులో 10,183 మెట్రిక్ టన్నులు అవసరం ఉండగా 5496 మెట్రిక్ టన్నులు పంపిణీ చేశారు. సెప్టెంబర్లో 7449 మెట్రిక్ టన్నుల అవసరానికి గాను ఐదో తేదీకి 2,512 మెట్రిక్ టన్నుల పంపిణీ పూర్తి చేశారు. మొత్తంగా రెండు నెలలు కలిపి 8008 మెట్రిక్ టన్నులు పంపిణీ చేశారు. శని, ఆదివారాలతో పాటు సోమవారం మధ్యాహ్నం నాటికి 30 వేల మెట్రిక్ టన్నులు రైతులందరికీ పంపిణీ చేశామని, అంతా బాగుందని అధికారుల నివేదికల సారాంశం. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ప్రతి సెంటర్ వద్ద భారీగా క్యూ లైన్లు, పడిగాపులు కొనసాగుతూనే ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కేంద్రాలు ఉండటంతో ఐదేళ్లలో ఎరువులు, పురుగు మందులు, విత్తనాల సమస్యే తలెత్తలేదు. అది కూడా సీజన్ ప్రారంభంలోనే అవసరమైన ఎరువులను నూరు శాతం పంపిణీ చేశారు. 2022–23లో 26,591 మెట్రిక్ టన్నులు, 2023–24లో 26,090 మెట్రిక్ టన్నులు, 2024–25లో 25,055 మెట్రిక్ టన్నుల యూరియాను జిల్లాలో రైతులకు అందించారు. మంగళవారం ఉదయం ఏలూరు, నూజివీడు, జంగారెడ్డిగూడెంలలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్తల నేతృత్వంలో ఎరువుల బ్లాక్మార్కెట్ను నిరసిస్తూ నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు. డీసీఎంఎస్ల వద్ద భారీగా క్యూలైన్లు రెండు రోజుల క్రితం వరకు జిల్లాలో 8 వేల మెట్రిక్ టన్నుల పంపిణీ సోమవారం నాటికి 30 వేల మెట్రిక్ టన్నులు పూర్తి అధికారుల గణాంకాలతో అవాక్కవుతున్న అన్నదాతలు యూరియా కోసం సొసైటీల వద్ద తప్పని పడిగాపులు గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ కొరత హడావిడిగా ఇన్చార్జి మంత్రి సమీక్ష సమావేశం ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అంటూ వ్యాఖ్యలు అన్నదాతలకు మద్దతుగా నేడు వైఎస్సార్సీపీ ఆందోళన ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిరసన ర్యాలీలు, ధర్నాలు -
ఎరువుల సరఫరాలో కూటమి విఫలం : సీపీఐ
ఏలూరు (టూటౌన్): రైతులకు ఎరువుల సరఫరాలో కూటమి ప్రభుత్వం విఫలమైందంటూ సీపీఐ, ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తహసీల్దారు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేపట్టారు. ఏలూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నానుద్దేశించి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి డేగా ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఎరువుల కొరతతో అల్లాడిపోతున్నారని, సొసైటీల వద్ద ఎండనక, వాననక క్యూలైన్లలో ఎరువుల కోసం ఎదురుచూపులు చూస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా రైతుల కష్టాలను తీరుస్తామని, రైతులకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అందిస్తామని హామీ ఇచ్చి అధికారం చేపట్టిన తర్వాత రైతులు పడుతున్న కష్టాలను, ఇబ్బందులను తొలగించడానికి ఏమాత్రం ప్రయత్నం చేయడంలేదని విమర్శించారు. నానో ఎరువుల కంపెనీలతో కుమ్మకై ్క రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం, అధికారులు ఎరువులు సరిపడా ఉన్నాయని చెబుతున్నా రాష్ట్రంలోని రైతులు క్యూ లైన్లలో నిలబడి పడిగాపులు కాస్తున్న విషయం అధికారులు దృష్టికి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. రైతులకు ఎరువులను సక్రమంగా అందించాలని, బ్లాక్ మార్కెట్లో ఎరువుల అమ్మకాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో 70 శాతం మాత్రమే వ్యవసాయం సాగు చేస్తున్నారని, అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అందించే యూరియా, డీఏపీ అధికంగా ఉండాలి గానీ కొరత ఎలా వచ్చిందని ప్రశ్నించారు. 30 శాతం సాగు తగ్గినప్పటికీ ప్రభుత్వం ఎరువులను అందించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉందా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్, కురెళ్ల వరప్రసాద్, మావూరి విజయ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మండల తహసీల్దార్ గాయత్రికి వినతిపత్రం అందజేశారు. -
రైతు కన్నీరు సమాజానికి మంచిది కాదు
● అన్నదాత పోరును విజయవంతం చేద్దాం ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ కై కలూరు: రైతు కన్నీరు కారిస్తే సమాజానికి మంచిది కాదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) అన్నారు. ఎరువుల బ్లాక్ మార్కెట్పై రైతన్నకు బాసటగా వైఎస్సార్ సీపీ మంగళవారం ఏలూరులో చేపట్టే అన్నదాత పోరును రైతన్నలు, కార్యకర్తలు విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. కై కలూరులోని పార్టీ కార్యాలయంలో పోరుబాట పోస్టర్ను సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిపక్షం రైతు సమస్యలపై ప్రశ్నిస్తే కూటమి ప్రభుత్వం విమర్శలు చేస్తోందన్నారు. యూరియా సహా రైతులకు అవసరమైన ఎరువులను వెంటనే పంపిణీ చేసి, బ్లాక్ మార్కెట్ను నియంత్రించాలని డిమాండ్ చేశారు. ఎరువులను పక్కదారి పట్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు ఉచిత పంటల బీమాను పునరుద్ధరించి అందరికీ వర్తింపజేయాలన్నారు. వర్షాల కారణంగా పంట దెబ్బతిన్న రైతులకు వెంటనే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏలూరులో మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు వైఎస్ విగ్రహం వద్ద నివాళులర్పించి శాంతియుత ర్యాలీ నిర్వహించి, ఆర్డీవోకు వినతిపత్రం అందిస్తామని చెప్పారు. కై కలూరు నియోజకవర్గ ప్రజలు స్థానిక పార్టీ కార్యాలయానికి ఉదయం 8.30కి చేరుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర మేధావుల విభాగ కార్యదర్శి బీవీ రావు, రాష్ట్ర మైనారిటీ విభాగ కార్యదర్శి ఎండీ గాలిబ్ బాబు, పార్టీ నేతలు సింగంశెట్టి రాము, గుడివాడ వీర రాఘవయ్య, వడుపు రామారావు, జాస్తి బాబు రాజేంద్రప్రసాద్, పడమట శేషావతారం తదితరులు పాల్గొన్నారు. -
శ్రీవారి ఆలయంలో దొడ్డిదారిన గదులు అద్దెకు
ద్వారకాతిరుమల: శ్రీవారి కొండపైన ధర్మ అప్పారాయ నిలయం (120 గదుల సత్రం)లో సోమవారం దొడ్డిదారిన గదులు అద్దెకిచ్చి, సొమ్ము స్వాహా చేసిన ఇద్దరు ఉద్యోగుల్లో ఒకరిని అధికారులు సస్పెండ్ చేశారు. మరో ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. వివరాల్లోకి వెళితే.. గుంటూరుకు చెందిన కొందరు భక్తులు సోమవారం ఉదయం శ్రీవారి దర్శనార్థం టూరిస్టు బస్సులో కొండపైకి వచ్చారు. ముందుగా వారు స్నానాదుల కోసం రూములు తీసుకునేందుకు సీఆర్వో కార్యాలయానికి వెళ్లి అక్కడ విధులు నిర్వర్తిస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగి వంశీని వివరాలు అడిగారు. ధర్మ అప్పారాయ నిలయానికి వెళ్లి రూములు చూసుకోవాలని అతను సలహా ఇచ్చాడు. దీంతో వారు అక్కడికి చేరుకొని గుమాస్తాగా విధులు నిర్వర్తిస్తున్న శాశ్వత ఉద్యోగి సీహెచ్ పవన్కుమార్ను గదులు అద్దెకు కావాలని అడిగారు. అతను రూ.4500 నగదు తీసుకొని టికెట్లు లేకుండా 7 నాన్ ఏసీ గదులను అద్దెకు ఇచ్చాడు. దీనిపై సమాచారం అందుకున్న ఆలయ ఈఓ ఎన్వీ సత్యనారాయణమూర్తి.. వెంటనే ఆలయ ఏఈఓలు మెట్టపల్లి దుర్గారావు, రమణరాజు, ఎలక్ట్రికల్ డీఈ టి.సూర్యనారాయణలతో కలసి ధర్మ అప్పారాయ నిలయానికి వెళ్లి తనిఖీలు జరిపారు. ప్రాథమిక విచారణలో జరిగింది వాస్తవమని, ఉద్యోగులిద్దరూ కుమ్మకై ్క ఇదంతా చేశారని అధికారులు తేల్చడంతో పవన్ కుమార్ను సస్పెండ్ చేస్తూ ఈఓ సత్యన్నారాయణమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. సీఆర్వో కార్యాలయ ఉద్యోగి వంశీని విధుల నుంచి తొలగించారు. స్వాహా అయిన సొమ్మును వారినుంచి వసూలు చేసి గదులకు అద్దె చెల్లించారు. డబ్బులు తీసుకుని టికెట్లు లేకుండా 7 గదులు అద్దెకిచ్చిన సిబ్బంది సమాచారంతో తనిఖీలు చేసిన ఆలయ అధికారులు శాశ్వత ఉద్యోగి సస్పెన్షన్, అవుట్సోర్సింగ్ ఉద్యోగి తొలగింపు -
యూరియా వినియోగం తగ్గించేలా చర్యలు
రైతులకు అవగాహన కల్పించాలని మంత్రి నాదెండ్ల ఆదేశం ఏలూరు (మెట్రో): జిల్లాలో యూరియా వినియోగం తగ్గించే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులకు ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో ఎరువుల సరఫరా, పంపిణీపై సంబంధిత శాఖల అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఆయిల్పామ్ సాగులో యూరియా వినియోగాన్ని తగ్గించేలా రైతులకు పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో ఎరువులు సొసైటీలకు గతం కంటే ఎక్కువగా అందించే ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుత ఏడాది 33,762 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కాగా, ఇప్పటికే 30,557 మెట్రిక్ టన్నులు అందించామన్నారు. మరో రెండు రోజుల్లో 2200 మెట్రిక్ టన్నులు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. గతంలో వచ్చిన ఈ–పోస్ యంత్రాల సాంకేతిక సమస్యలు ప్రస్తుతం రాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. యూరియా స్టాక్లు సొసైటీలకు అవసరమైన మేరకు ఒకేసారి అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎరువుల బ్లాక్ మార్కెటింగ్, అధిక ధరలకు అమ్మడం వంటి వాటిపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ గత ఏడాది కన్నా ఈ ఏడాది రైతులకు అధికంగా ఎరువులను అందించామన్నారు. చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ మాట్లాడుతూ వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకుని రైతుల అవసరాలకు అనుగుణంగా ఎరువులను అందించాలన్నారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు యూరియా సరఫరా చేయాలని కోరారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ రైతులకు ఎరువులను సక్రమంగా పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బందీ కలగకుండా ఎరువుల పంపిణీ చేస్తున్నామన్నారు. సమావేశంలో కలెక్టర్ వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ బాషా, ఉద్యాన శాఖ అధికారి రామ్మోహన్, జిల్లా సహకార అధికారి శ్రీనివాస్, మార్క్ఫెడ్ డీఎం ప్రసాద్గుప్త, రైతులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న యూరియా కష్టాలు
పోలవరం రూరల్: యూరియా కొరత లేదంటూ ప్రభుత్వం చెప్పే లెక్కలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన లేని పరిస్థితి కనిపిస్తోంది. పోలవరం మండలంలోని కృష్ణారావుపేట, పట్టిసీమ, గూటాల, ప్రగడపల్లి సొసైటీల్లో 50.460 మెట్రిక్ టన్నుల యూరియా ఉన్నట్టు వ్యవసాయశాఖ అదికారులు చెబుతున్నారు. సోమవారం ఉదయం పట్టిసీమ, పోలవరం సొసైటీల వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఆధార్ కార్డులు పట్టుకుని క్యూ కట్టారు. రైతుకు రెండు బస్తాలు యూరియా వంతున పంపిణీ చేపట్టారు. కొన్ని గంటల్లోనే ఉన్న సరకు అయిపోయింది. దీనిపై రైతులు సిబ్బందిని నిలదీయగా, వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో పోలవరం ఎస్సై ఎస్ఎస్ పవన్కుమార్ అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. క్యూలో ఉన్నవారికి మాత్రమే బస్తాలు ఇవ్వడంతో ఆ తర్వాత వచ్చినవారు మిగిలిపోయారు. మిగిలిన రైతులు సుమారు 150 మంది వరకు ఉండటంతో వారికి వచ్చే కోటాలో యూరియా ఇస్తామని నచ్చజెప్పారు. వారికి స్లిప్పులు ఇచ్చి యూరియా వచ్చిన వెంటనే ముందుగా ఇచ్చేందుకు ఏర్పాటు చేయడంతో రైతులు శాంతించి వెనుదిరిగారు. యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనడానికి ఇదో తాజా ఉదాహరణ. -
బాఽధితులకు సత్వర న్యాయం : ఎస్పీ
ఏలూరు టౌన్: ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని, బాధితులకు సత్వర న్యాయం అందించాలని జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ పోలీసు అధికారులకు ఆదేశించారు. ఏలూరులోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఫిర్యాదుల స్వీకరణలో పారదర్శకత కోసం పూర్తిగా పేపర్లెస్ విధానాన్ని అవలంబిస్తున్నామని చెప్పారు. అనంతరం సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ చేసి ఆయా ఫిర్యాదుల పరిష్కారంపై ఆదేశాలిచ్చారు. మొత్తం 38 మంది తమ ఫిర్యాదులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఏలూరు టౌన్: ఏలూరు సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ భవనాలను రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి సోమవారం పరిశీలించారు. ఏలూరు సర్వజన ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఏమి అవసరమో ఆయన వైద్య అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే మెడికల్ కాలేజీ, జీజీహెచ్లో సిబ్బంది పోస్టులు భర్తీ చేస్తామని, మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. జీజీహెచ్కు చెందిన కొన్ని భవనాలను మెడికల్ కాలేజీ కోసం వినియోగిస్తున్నారని తెలిపారు. రెండు మూడు నెలల్లో మెడికల్ కాలేజీ భవనాలు పూర్తవుతాయని, అప్పుడు పూర్తిస్థాయిలో జీజీహెచ్కు సదుపాయాల కల్పనకు అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. మంత్రి వెంట మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సావిత్రి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎంఎస్ రాజు తదితరులు ఉన్నారు. ఇష్టానుసారంగా కాంట్రాక్టర్ తీరు పాలకొల్లు సెంట్రల్ : ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందించే ఆహారాన్ని కాంట్రాక్టర్ నేరుగా తన ద్విచక్ర వాహనంతో వార్డుల్లోకి తీసుకువెళ్లి అందించడంపై రోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అక్కడున్న ఒక వ్యక్తి ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ విషయం బహిర్గతమైంది. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్న, రాత్రి వేళల్లో భోజనం కాంట్రాక్టర్ ద్వారా ఏర్పాటు చేస్తుంటారు. ఈ కాంట్రాక్టర్ గత కొంతకాలంగా ఆహారాన్ని నేరుగా వార్డుల్లోకి తన ద్విచక్ర వాహనంతో వెళ్లి సరఫరా చేస్తుండటం గమనార్హం. ఆస్పత్రి వైద్యాధికారులు ద్విచక్ర వాహనంతో లోపలికి రావద్దని వారించినా, తాను గత కొంతకాలంగా ఇలానే ఇస్తున్నానంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్టు సమాచారం. సోషల్మీడియాలో ఈ విషయం వైరల్ కావడంతో ద్విచక్ర వాహనాన్ని వార్డు వద్ద పెట్టి.. లోపలికి పేషెంట్లను తీసుకెళ్లే వీల్ చైర్లో పెట్టుకుని తీసుకెళ్లడం గమనార్హం. మరి అత్యవసర సమయంలో వీల్ చైర్ అవసరమైతే ఏం చేస్తారని ఆసుపత్రికి వచ్చిన రోగుల బంధువులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై వైధ్యాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటుపరం బాధాకరం
దెందులూరు: పేదలకు ఖరీదైన వైద్య విద్యను చేరువ చేయాలని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తపన పడ్డారని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలపై దుర్మార్గంగా వ్యవహరిస్తోందని దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పేదలకు వైద్య విద్యను దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందన్నారు. సదుద్దేశంతో మాజీ సీఎం జగన్ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటుచేస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రైవేటుపరం చేయడం వెనకున్న ఆంతర్యాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారన్నా రు. వైద్య విద్య కోసం దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా వైఎస్ జగన్ సంస్కరణలు తీసుకువస్తే వాటిని చెరిపేసే ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు. దెందులూరు నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితి బిహార్ను అధిగమించిందని, అక్రమ కేసు లు, దాడులు, దౌర్జన్యాలు, కొట్లాటలు, శిలాఫలకా లు, బోర్డులు ధ్వంసం అజెండాగా కూటమి పాల కులు పనిచేస్తున్నారన్నారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం ఆలోచనను కూటమి ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ నాయకులు ముంగర సంజీవ్కుమార్, పెనుమాల విజయ్బాబు, మేక లక్ష్మణరావు, ముదుగురు సూర్యనారాయణ, డీబీఆర్కే చౌదరి, నిట్టా గంగరాజు, జెడ్పీటీసీ నిట్టా లీలానవకాంతం, పెదపాడు ఎంపీపీ భక్తుల రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. -
కుల ఘర్షణలు రెచ్చగొడితే కఠిన చర్యలు
ఏలూరు టౌన్: కై కలూరులో గణేష్ నిమజ్జనం ఊరేగింపులో చోటుచేసుకున్న ఘర్షణలో బాధితులకు న్యాయం చేయటంతోపాటు నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు చేపడతామనీ, కై కలూరు దా నిగూడెంలో బాధితులకు పరామర్శ పేరుతో కుల ఘర్షణలు రెచ్చగొట్టేలా ప్రయత్నిస్తే చర్యలు తప్ప వని ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్కుమార్ హెచ్చరించారు. ఏలూరు సబ్ డివిజన్ కార్యాలయంలో ఆది వారం కై కలూరు టౌన్ సీఐ కృష్ణ, కై కలూరు రూ రల్ సీఐ రవికుమార్తో కలిసి విలేకరులతో మా ట్లాడారు. ఈనెల 5న సాయంత్రం కై కలూరు కాపులబజార్లో గణేష్ నిమజ్జనం ఊరేగింపు జరుగుతుండగా.. దానిగూడెంకు చెందిన పయ్యేద్దు అజయ్కుమార్ మరో ఇద్దరితో కలిసి రేషన్ బియ్యం తీసుకునేందుకు మోటారు సైకిల్పై వెళుతున్నాడు. బైక్ హారన్ కొట్టడంతో కాపులబజార్కు చెందిన కొందరు యువకులతో రెండు వర్గాల మధ్య కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. తులసీ శివ, తో ట కార్తికేయ, తులసీ పూర్ణ, పోతుల నాగమణికంఠ అలియాస్ బాలు, పిచ్చుకల రాజేష్, తోట సంజయ్ భార్గవ్ అలియాస్ బబ్లు, కటికల జయప్రకాష్ అనే వ్యక్తులు అజయ్పై దాడి చేశారు. విషయం తెలిసి అక్కడికి వచ్చిన అజయ్ తల్లి, అక్కపై, దినేష్ అనే మరో యువకుడిపై వీరంతా కలిసి దాడి చేసి నట్టు విచారణలో గుర్తించాం. దాడి పక్కా పథకం మేరకు జరిగినట్టు విచారణలో వెల్లడైంది. దాడికి పాల్పడిన ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామనీ, కేసు నమోదు చేసి అరెస్ట్ చే శామని డీఎస్పీ చెప్పారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టామన్నారు. ఈ ఘటనకు పాత కక్షలే కారణంగా కనిపిస్తున్నాయని, మరింత లోతుగా విచారణ చేపడతామన్నారు. జిల్లాలో 30 యాక్ట్ ఏలూరు జిల్లాలో యాక్ట్ 30తోపాటు 144 సెక్షన్ అమల్లో ఉందనీ, కై కలూరు పట్టణం, దానిగూడెంకు బయటి వ్యక్తులు పరామర్శల పేరుతో వెళ్లేందుకు పోలీసుల అనుమతి తీసుకోవాలని డీఎస్పీ తెలిపా రు. కులఘర్షణలు రెచ్చగొట్టేలా ప్రయత్నిస్తే చర్య లు తప్పవని హెచ్చరించారు. కై కలూరు కాపులబ జార్, దానగూడెంలో భారీ పోలీస్ బందోబస్తు ఏ ర్పాటు చేశామనీ, రెండు వర్గాలకు పూర్తిగా రక్షణ క ల్పించేలా జిల్లా ఎస్పీ శివకిషోర్ ఆదేశాల మేరకు చ ర్యలు తీసుకున్నామని చెప్పారు. సుమారు 150 మందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. -
రైతులపై కూటమి రాక్షసత్వం
బుట్టాయగూడెం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆ ది నుంచి రాక్షసత్వం ప్రదర్శిస్తోందని, ఎరువులు అ డిగితే ముఖ్యమంత్రితోపాటు మంత్రులు చులకగా మాట్లాడటమే నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మండిపడ్డారు. రైతు సమస్యలపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ఈనెల 9న ఆర్డీఓ కార్యాలయాల వద్ద జరిగే అన్నదాత పోరు కార్యక్రమానికి సంబంధించిన పోస్టరును బాలరాజు, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి తెల్లం రాజ్యలక్ష్మి దుద్దుకూ రులో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాలరాజు మాల్లాడుతూ రాష్ట్రంలో ఎరువుల కొరత ప్రధాన సమస్యగా ఉందన్నారు. యూరియాను బ్లాక్ మార్కెట్లో తరలించి కృత్రిమ సంక్షోభం సృష్టించారని విమర్శించారు. వైఎస్సార్సీపీ పాలనలో అన్నదాతలకు కొండంత అండగా నిలిచామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రైతుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయన్నారు. వైఎస్సార్ సీపీ చేపట్టిన అన్నదాత పోరు నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు, ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. పార్టీ మండల కన్వీనర్ అల్లూరి రత్నాజీరావు, పార్టీ సీనియర్ నాయకులు ఆరేటి సత్యనారాయణ, వైఎస్సార్సీపీ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు వాసిరెడ్డి మధు, జెడ్పీటీసీ మొడియం రామతులసి, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు తాళ్లూరి ప్రసాద్, నాయకులు కలగర నాని, సర్పంచ్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కూటమి పాలనలో రౌడీ సంస్కృతి
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ ధ్వజం ● దానిగూడెం దళితవాడలో బాధిత కుటుంబాలకు పరామర్శ కై కలూరు: కై కలూరు నియోజకవర్గంలో ఎన్నడూచూడని కత్తులు, కర్రలతో దాడులు చేసే సంస్కృతి కూటమి పాలనలోనే కనిపిస్తోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) విమర్శించారు. వినాయక ఊ రేగింపు సందర్భంగా జనసేన కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడిన దానిగూడెం దళితవాడ బాధిత కుటుంబాలను ఆదివారం ఆయన పరామర్శించి చర్చిలో మాట్లాడారు. ఈ సందర్భంగా దళితులు మాట్లాడుతూ వినాయక ఊరేగింపులో డీజే సౌండ్ల వద్ద హారన్ కొట్టినందుకు జనసేన కార్యకర్తలు విచక్షణారహితంగా పయ్యేద్దు అజయ్, గొంతుపులి దినేష్బాబుపై బ్లేడు, కత్తులు, రాడ్లతో దా డి చేశారన్నారు. దీనిపై దళితులు ఆందోళన చేస్తే పోలీసులు తమపైనే లాఠీ చార్జీ చేశారని, తగిలిన దెబ్బలను డీఎన్నార్కు చూపించారు. గొడవలకు ప్రధాన సూత్రధారి, జనసేన నేత కొల్లి బాబీని కే సు నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తున్నారని ఆ రోపించారు. తీవ్ర గాయాలైన అజయ్, దినేష్బా బు తండ్రులు శ్రీను, నానీలు కన్నీళ్లు పెట్టుకుని త మకు న్యాయం చేయాలని కోరారు. డీఎన్నార్ మాట్లాడుతూ కూటమి పాలనలో రౌడీలమంటూ అరాచక శక్తులు చెలరేగిపోతున్నాయన్నారు. పోలీసులు వారం ముందు అన్నసమారాధనలో జరిగిన ఘర్షణపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటే ఇటువంటి హత్యయత్నాలు జరిగేవి కావన్నారు. కేసు విషయమై ఏలూరు ఎస్పీతో మాట్లాడానన్నా రు. నిందితులకు శిక్ష పడేవరకూ పార్టీ పరంగా దళితులకు అండగా ఉంటామన్నారు. రోడ్డుపై చేసిన ఆందోళనపై దానిగూడెం దళితులపై కేసు నమోదు చేసినట్టు తెలిసిందని, తక్షణమే ఈ కేసును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు అండగా ఉంటాందోషులను కఠినంగా శిక్షంచకపోతే పార్టీపరంగా ఆందోళన చేస్తామని డీఎన్నార్ హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పక్కన కూర్చుని రౌడీయిజం చేస్తున్న సంఘ విద్రోహులను పక్కన పెట్టి ప్రశాంత వాతావరణం కల్పించాలని డీఎన్నార్ కోరారు. డీఎన్నార్ వెంట వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకులు గుమ్మడి వెంకటేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి మొట్రూ ఏసుబాబు, మండవల్లి మండల పార్టీ అధ్యక్షుడు బేతపూడి ఏసేబురాజు, జిల్లా యాక్టివ్ సెక్రటరీ నాగదాసి థామస్, నియోజకవర్గ క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఉచ్చుల చిన్నరాజు, జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు సాదు కొండయ్య, జిల్లా క్రిస్టియన్ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు దాసి ఏసుబాబు, జిల్లా మేధావుల విభాగ కార్యదర్శి సోమల శ్యాంసుందర్, నాయకులు చేబ్రోలు మాషిలిన్ మణి, మెండా సురే ష్బాబు, దానిగూడెం దళిత నాయకులు ఉన్నారు. -
సచివాలయ ఉద్యోగుల పోరు బాట
● ఒకే మాతృ శాఖ కింద ఆత్మగౌరవంతో పనిచేయడానికి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి. ● అన్ని సర్వేలను సంబంధిత శాఖల ద్వారానే నిర్వహించి సచివాలయ సిబ్బందిపై భారం తొలగించాలి. ● పదోన్నతుల్లో జాప్యాన్ని నివారించి, జిల్లాల వారీగా, యూఎల్బీ వారీగా సీనియార్టీ లిస్టులు ప్రకటించి, ప్రక్రియను 2 నుంచి 3 నెలల్లో పూర్తి చేయాలి. ● ప్రతి యూఎల్బీ ఖాళీల్లో కనీసం 50 శాతం ఖాళీలను సచివాలయ సిబ్బందితో భర్తీ చేయాలి. ● 5 నుంచి 6 ఏళ్లు సర్వీస్ పూర్తిచేసిన ఉద్యోగులకు ఆటోమేటిక్ అడ్వాన్స్డ్ స్కీమ్ వర్తింపజేసి, రెండు అదనపు ఇంక్రిమెంట్లు ఇవ్వాలి. ● ప్రొబేషన్ పీరియడ్లో రావాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్లకు స్పష్టమైన టైమ్ ఫ్రేమ్ నిర్ణయించాలి. కూటమి ప్రభుత్వం వలంటీర్ వ్యవస్థను రద్దు చేసి సచివాలయ ఉద్యోగులపై భారం వేసింది. గతంలో ఒక వలంటీర్ క్లస్టర్ (50 ఇళ్లు) చూసుకుంటే సచివాలయ ఉద్యోగికి ప్రస్తుతం మూడు నుంచి ఐదు క్లస్టర్ల బాధ్యతలు అప్పగించారు. దీంతో తీవ్ర పని ఒత్తిళ్లతో విధులు నిర్వహించాల్సి వస్తోంది. శాఖాపరమైన పనులతో పాటు బీఎల్ఓ, అదనపు పనులు, సర్వేల భారాన్ని మోపారు. సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదు. ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆత్మ గౌరవ ఉద్యమం చేపట్టాం. – ఎ.శ్రీనివాస్, ఏపీ ఎంఎంఈఏ రాష్ట్ర ప్రచార కార్యదర్శి, వార్డు సెక్రటరీ, భీమవరంక్లస్టర్ మ్యాపింగ్ సిస్టమ్ సచి వాలయ సిబ్బందికి గుదిబండ వంటిది. గతంలో వలంటీర్లు ఉండటంతో సర్వేలు, పెన్షన్ల పంపిణీ సులభంగా జరిగేది. వలంటీర్లు లేకపో వడంతో సచివాలయ ఉద్యోగులపై భారం పెరిగింది. ఉదయం 8 గంటలలోపు, సాయంత్రం 5 గంటల తర్వాత కూడా సేవలందించాల్సి వస్తుంది. ఒక్కో ఉద్యోగి మూడు నుంచి ఐదు క్లస్టర్ల బాధ్యతలు చూసుకోవడం చాలా భారంగా ఉంది. ఒక్కో ఉద్యోగి 150 నుంచి 250 కుటుంబాల బాధ్యతలు నిర్వహించడం కష్టంగా ఉంది. ప్రభుత్వం కొన్ని సర్వేలను థర్డ్ పార్టీ వారితో చేయించాలి. సచి వాలయ ఉద్యోగుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి. –కె.శ్రీనివాస్, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్, ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ ఏలూరు (మెట్రో)/ భీమవరం(ప్రకాశం చౌక్): కూటమి ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా గ్రా మ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఆత్మగౌరవ ఉ ద్యమ బాట పట్టారు. పనిఒత్తిళ్లు, సర్వేల భారం, తమ ఆత్మగౌరవాన్ని దిగజార్చడంపై ఇప్పటికే పలు మార్లు వినతిపత్రాలు సమ ర్పించినా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఏడు రోజులపాటు నిరసనలకు పిలుపునిచ్చారు. గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థల ను తీసుకువచ్చింది. గత ప్రభుత్వంలో ఐదేళ్లపాటు పూర్తిస్థాయిలో ఈ వ్యవస్థల ద్వారా ముంగిళ్లలోకే ప్రజలకు పాలనను చేరువ చేశారు. అయితే కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత ని ర్దాక్షిణ్యంగా వలంటీర్ వ్యవస్థను రద్దు చేసింది. దీంతో రాష్ట్రంలో లక్షలాది మంది వలంటీర్లు ఉపాధి కో ల్పోయారు. ఈ క్రమంలో సచివాలయ ఉద్యోగులపై పనిభారం మరింత పెరిగింది. ఇంటింటా సర్వేలు, పింఛన్ల పంపిణీ, మల్టీ టాస్కింగ్ విధులతో సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. రోజురోజుకూ ఉద్యో గుల ఆత్మగౌరవాన్ని దిగజార్చేలా ప్రభుత్వం వ్యవహరించడంపై రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఆత్మ గౌరవ ఉద్యమం పేరట నిరసనలు తెలుపుతున్నారు. దీనిలో భాగంగా ఏలూరు జిల్లాలో 517 సచివాలయాల్లో మొత్తం 4,412 మంది ఉద్యోగులు నిరసనలు తెలుపుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని గళమెత్తుతున్నారు. ఉద్యమ కార్యాచరణ సచివాలయ ఉద్యోగులు ఏడు రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. దీనిలో భా గంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో తొలిరోజు (శనివారం) ఉన్నతాధికారు లకు వినతిపత్రాలు సమర్పించారు. 2, 3 రోజుల్లో (సోమ, మంగళవారాలు) నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు, 4, 5 రోజుల్లో (బుధ, గురువారాలు) అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి వైదొలగడం, 6,7 రోజుల్లో (శుక్ర, శనివారాలు) పెన్డౌన్ కార్యక్రమాల ద్వారా నిరసన తెలుపనున్నారు. ఆత్మగౌరవ ఉద్యమం సర్వేల భారంతో సతమతం ఒత్తిళ్లతో విధుల నిర్వహణ మహిళా, దివ్యాంగ సిబ్బందికి తప్పని ఇబ్బందులు ప్రభుత్వ వైఖరిపై మండిపాటు జిల్లాలో 4,412 మంది ఉద్యోగుల నిరసన గళం వలంటీర్ల వ్యవస్థను రద్దు చేయడంతో ఒక్కో ఉద్యోగి మూడు నుంచి ఐదు క్లస్టర్ల పరిధిలో సేవలందించాల్సి వస్తోంది. ఈ లెక్కన ఒక్కో ఉద్యోగి 150 నుంచి 250 కుటుంబాల బాధ్యతలను నిర్వహించడం కష్టంగా మారింది. సామాజిక, ఆర్థిక, విద్య, వైద్య, ఉపాధి తదితర సర్వేల భారాన్ని ప్రభుత్వం మోపడాన్ని వీరంతా వ్యతిరేకిస్తున్నారు. మల్టీటాస్కింగ్ పేరుతో మాతృశాఖ పనులతో పాటు ఇతర శాఖల పనులు కూడా చేయమని బలవంతం చేస్తున్నారు. డాష్ బోర్డులు, టార్గెట్ల పేరిటపై అధికారులు వేధిస్తున్నారు. సర్వేలకు వెళ్లినప్పుడు మహిళా సిబ్బంది సామాజిక వేధింపులకు గురవుతున్నారు. రక్షణపై ఆందోళన చెందుతున్నారు. సర్వే కోసం ఇంటింటా తిరగడం దివ్యాంగ సిబ్బందికి ఇబ్బందిగా ఉంది. సర్వే సమయంలో ఆధార్, బయోమెట్రిక్, ఓటీపీలు చెప్పేందుకు కొందరు సహకరించడం లేదు. సంక్షేమం, ఉద్యోగ ప్రయోజనాలు వంటి విషయాల్లో అధికారులు శ్రద్ధ చూపడం లేదు. సర్వేల విషయంలో ఒత్తిడి పెంచడం, సర్వే కాలేదనే కారణంతో సస్పెండ్ చేయడం ఉద్యోగులను ఆందోళన కలిగిస్తోంది. పని ఒత్తిళ్లతో కుటుంబ జీవనానికి దూరమవుతున్నామని ఉద్యోగులు వాపోతున్నారు. కొందరు ఆత్మహత్యలకు సైతం పాల్పడ్డారు. జిల్లాలో ఇలా.. గ్రామ, వార్డు సచివాలయాలు 517 గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు 4,412 -
రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాటం
నూజివీడు: కూటమి ప్రభుత్వంలో అడుగడుగునా రైతులకు అన్యాయం జరుగుతోందని, రైతులకు న్యా యం జరిగే వరకు పోరాటం చేస్తూనే ఉంటామని నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. రైతులు ఎదుర్కొంటున్న యూ రియా కష్టాలను ప్రభుత్వానికి తెలియజేసి కనువిప్పు కలుగచేసేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ఈనెల 9న సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నామన్నారు. ఈ మేరకు ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో అన్నదాత పోరు వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో మామిడి, పొగాకు, ఉల్లి, మిర్చి, మినుము, మొక్కజొన్న...ఇలా ఏ పంటకూ గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు. ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు విత్తనాల నుంచి యూరియా వరకు ఏదీ కూడా సరఫరా చే యలేని దుస్థితిలో పాలన చేస్తోందని ధ్వజమెత్తారు. పంటల బీమా ప్రీమియాన్ని గాలికొదిలేసిందన్నారు. యూరియా కోసం రైతులు గంటల తరబడి ఎదురుచూస్తున్నా ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. గత ప్రభుత్వంలో రైతుభరోసా కేంద్రాల ద్వారా గ్రామస్థాయిలోనే రైతులకు పూర్తిస్థాయిలో సేవలందించామని గుర్తు చేశారు. అన్నదాత సుఖీభవ పథకం కింద కేంద్రంతో సంబంధం లేకుండా ఏడాదికి రూ.20వేలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు దానికి కూటమి ప్రభుత్వం కోత పెట్టిందన్నారు. నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలిరావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు శీలం రాము, జడ్పీ వైస్ చైర్మన్ గుడిమళ్ల కృష్ణంరాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ కొమ్ము వెంకటేశ్వరరావు, క్రిస్టియన్ మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు పిళ్లా చరణ్, అధికార ప్రతినిధి కంచర్ల లవకుమార్, నాయకులు పాల్గొన్నారు. -
నాటుసారా కేంద్రాలపై దాడి
కుక్కునూరు: నాటుసారా తయారీ కేంద్రాలపై ఆదివారం కుక్కునూరు పోలీసులు దాడి చేసి 600 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. కుక్కునూరు ఎస్సై రాజారెడ్డి వివరాల ప్రకారం, మండలంలోని సీతారామనగరం గ్రామ శివారులోని కిన్నెరసాని వాగు ఒడ్డున నాటుసారా తయారు చేస్తున్నారన్న సమాచారం మేరకు ఆదివారం దాడులు నిర్వహించినట్టు చెప్పారు. దాడులలో సారా తయారు చేసేందుకు సిద్ధంగా ఉంచిన 600 లీటర్ల బెల్లం ఊటను స్వాధీనం చేసుకోని ధ్వంసం చేసినట్టు తెలిపారు. 10 లీటర్ల నాటుసారాను ఓ వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. సారా నియంత్రణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని భవిష్యత్తులో ఇలాంటి దాడులు కొనసాగుతాయని తెలిపారు. -
జీడిమామిడి కనుమరుగు
● సరైన ప్రోత్సాహం లేక తోటలు నరికివేత ● ఏజెన్సీ మండలాల్లో 6 వేల ఎకరాలకు పడిపోయిన విస్తీర్ణం బుట్టాయగూడెం: ఏజెన్సీ ప్రాంతంలోని గ్రామాల్లో పోడు వ్యవసాయం తర్వాత అత్యధికంగా గిరిజనులు జీడిమామిడి సాగు చేస్తున్నారు. ఐటీడీఏ ద్వారా ఈ ప్రాంతంలో సుమారు 20 వేల ఎకరాల వరకూ రైతులు జీడిమామిడి పంట వేశారు. ప్రస్తుతం జీడిమామిడి పంటల స్థానంలో రైతులు ప్రత్యామ్నాయ పంట వైపు దృష్టి సారించారు. దీంతో జీడిమామిడి తోటలను తొలగిస్తున్నారు. తోటల స్థానంలో పామాయిల్, మొక్కజొన్న, పొగాకు, అరటి వంటి వాణిజ్యపంటలను పండిస్తున్నారు. ప్రస్తుతం 5 వేల ఎకరాల వరకూ రైతులు జీడిమామిడి తోటలను తొలగించినట్లు సమాచారం. భవిష్యత్లో ఇంకా తగ్గే అవకాశం ఉంది. ప్రోత్సాహం కరువు ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజన మండలాల్లో గిరిజన రైతులు జీడిమామిడి పంటల సాగుతో అధిక లాభాలను సాధిస్తున్నారు. అయితే గిట్టుబాటు ధరతోపాటు సరైన ప్రోత్సహం ఐటీడీఏ ద్వారా అందించకపోవడం వల్ల వాణిజ్యపంటలపై రైతులు దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా కొండరెడ్డి గ్రామాల్లో పోడు వ్యవసాయం తర్వాత జీడిమామిడి పంటలే ప్రధానం. దీనిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందంటున్నారు.జీడిమామిడి రైతులను ఐటీడిఏ అధికారులు ప్రోత్సహించాలి. జీసీసీ ద్వారా జీడిగింజలను కొనుగోలు చేసి గిరిజన రైతులు ఆదాయం పొందేలా చూడాలి. రానురానూ జీడిమామిడి పంటల విస్తీర్ణం తగ్గిపోతోంది. కారం రాఘవ, న్యూడెమోక్రసీ నేత, అలివేరు, బుట్టాయగూడెం మండలం గిరిజన ప్రాంతంలో ఎంతో మంది రైతులకు లాభాలు అందించిన జీడిమామిడి తోటలు నేడు నరికేస్తున్నారు. బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో అత్యధికంగా జీడిమామిడి పంటలను రైతులు తొలగిస్తున్నారు. చెట్లను నరికి కట్టెలుగా మార్చి బేరన్ పుల్లగా తరలిస్తున్నారు. కలపను తరలించి ఆ భూముల్లో ప్రత్యామ్నాయ పంటల కోసం భూములను సిద్ధం చేస్తున్నారు. -
పరిహారం లేదు.. పథకమూ అందదు
● కూటమి ప్రభుత్వ నిర్వాకం ● ఘొల్లుమంటున్న విలీన మండలాల రైతులు కుక్కునూరు: రాష్ట్రంకోసం.. పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన విలీన మండలాల రైతులపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పోలవరం ముంపు పేరుతో అటు అభివృద్ధి పనులు చేయకుండా, ఇటు పరిహారం ఇవ్వకపోవడమే కాకుండా ప్రభుత్వ పథకాలు కూడా వారికి అందకపోవడంతో నిర్వాసితులు తామేం పాపం చేశామని వాపోతున్నారు. రైతుకు పెట్టుబడి సాయం కింద ఇస్తామన్న అన్నదాత సుఖీభవ రూ.7 వేలు ఆర్థిక సాయం గత ప్రభుత్వం పట్టాదారు లేకపోతే వారి వారసులకు అందించగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక నామినీలను అనర్హులుగా పేర్కొంది. ఆ తరువాత రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో మరలా వారంరోజులు సమయం ఇచ్చి ఆన్లైన్ చేయించుకునే అవకాశం కల్పించింది. దీంతో చాలా మంది రైతులు అన్నదాత సుఖీభవ పథకానికి దూరమయ్యారు. ఎల్టీ అగ్రికల్చర్ కలెక్షన్లు లేవు ప్రభుత్వం వ్యవసాయం కోసం అందించే ఎల్టీ అగ్రికల్చర్ కనెక్షన్ను తాజాగా రైతులకు దూరం చేసింది. గత జనవరి వరకు ప్రభుత్వం కొత్త అగ్రికల్చర్ కనెక్షన్లు మంజూరు చేయగా ప్రస్తుతం ఎల్టీ అగ్రికల్చర్ కనెక్షన్ కొరకు స్థానిక సబ్స్టేషన్కు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వెళ్లిన రైతులకు వెబ్ల్యాండ్ ఫ్రీజ్లో ఉండడంతో ఆధార్ కార్డ్ నెంబర్లు టైప్ చేస్తే ఆన్లైన్లో ఎటువంటి డేటా చూపించడంలేదని విద్యుత్ సిబ్బంది చెబుతున్నారు. దీంతో రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మండలంలో ముంపునకు గురవుతున్న భూములకు సంబంధించి పోలవరం భూసేకరణ పూర్తికాగా ఇంకా ముంపునకు గురికాని భూములు దాదాపు 50 శాతంకు పైగా ఉన్నాయి. ఇప్పుడు ఆ భూ యజమానులు మా భూములకు పరిహారం అయినా అందించండి లేకపోతే సాగు చేసుకునేందుకు విద్యుత్ కనెక్షన్ అయినా అందించాలని కోరుతున్నారు. అంతేకాక రాష్ట్రమంతా ఓ న్యాయం మాకో న్యాయమా అని బహిరంగంగానే కూటమి ప్రభుత్వ తీరును విమర్శిస్తున్నారు. బిందు సేద్యం దూరం ప్రభుత్వం ఉద్యాన రైతులకు అందించే బిందు సేద్యాన్ని కూడా విలీన రైతులు దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిందు సేద్యం చేస్తున్న గిరిజనేతర రైతులకు కేంద్ర ప్రభుత్వం 90 శాతం సబ్సిడీ ఇస్తుండగా, గిరిజన రైతులకు వందశాతం సబ్సిడీ ఇస్తుంది. ప్రస్తుతం బిందు సేద్యం కోసం దరఖాస్తు చేసుకునేందుకు వెబ్ల్యాండ్ ఫ్రీజింగ్ కారణంగా జియోట్యాగింగ్ చేసుకునేందుకు పలు గ్రామాల పేర్లు చూపించకపోవడంతో రైతులకు బిందు సేద్యానికి దరఖాస్తు చేసుకునే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. నాకు కివ్వాక గ్రామంలో 2.5 ఎకరాల సాగు భూమి ఉంది. సదరు భూమి ముంపులో లేదు. ఆ భూమిలో సాగు చేసుకునేందుకు అగ్రికల్చర్ కనెక్షన్ కొరకు దరఖాస్తు చేసుకుందామంటే విద్యుత్ సిబ్బంది ఆన్లైన్ చేసేందుకు మీ గ్రామం సైట్లో చూపించడంలేదంటున్నారు. మా భూములకు పరిహారం అయినా ఇవ్వండి లేదంటే విద్యుత్ కనెక్షన్కు అవకాశం కల్పించండి. – పగిళ్ల ప్రసాద్, కివ్వాక, కుక్కునూరు మండలంవ్యవసాయ విద్యుత్ మోటార్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకునే రైతుల ఆధార్ వివరాలు కుక్కునూరు మండల వెబ్ ల్యాండ్ ఫ్రీజింగ్లో ఉండడంతో రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఆన్లైన్లో రైతుల వివరాలు చూపించడం లేదు. దీంతో రైతులకు కొత్త కనెక్షన్ పొందే అవకాశం లేకుండా పోయింది. ఈ సమస్యకు పరిష్కారం చూపాలి. – ఎంఎం పాపారావు, అసిస్టెంట్ ఇంజనీర్, కుక్కునూరుమా భూములకు సంబంధించి వెబ్ ల్యాండ్ ఫ్రీజింగ్లో ఉండడంతో మిర్చి తదితర పంటలకు డ్రిప్ వేసుకునేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ముంపులో లేని భూములకు పథకాలు వర్తింపజేసేలా అధికారులు చర్యలు చేపట్టాలి. – మచ్చా రాజులు, ఇసుకపాడు, కుక్కునూరు మండలం -
బ్రిటన్ మంత్రి కావడమే లక్ష్యం
సాక్షి, భీమవరం: బ్రిటన్ మంత్రి కావడమే తన లక్ష్యమని లండన్లోని రాయల్ బరో ఆఫ్ కెన్సింగ్టన్ అండ్ చెల్సియా డిప్యూటీ మేయర్ ఆర్యన్ ఉదయ్ ఆరేటి చెప్పారు. యూకే కాలేజీలో తెలుగు విద్యార్థుల పట్ల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి స్టూడెంట్ ఎన్నికల్లో గెలవడమే తన రాజకీయ ప్రవేశానికి కారణమని తెలిపారు. అనంతరం కన్జర్వేటివ్ పార్టీలో చేరి రెండుసార్లు కౌన్సిలర్గా గెలిచినట్లు చెప్పారు. భీమవరం సమీపంలోని తుందుర్రు గ్రామానికి చెందిన ఆర్యన్ ఉదయ్ ఇటీవల భీమవరం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన శ్రీసాక్షిశ్రీతో మాట్లాడారు. తన బాల్యం, చదువు, బ్రిటన్ రాజకీయాల్లో ఎదుగుదల, తన లక్ష్యాల గురించి వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. టెన్నిస్ కోసం లండన్కు మాది భీమవరం పక్కనే ఉన్న తుందుర్రు. తాత నాయనమ్మల పేర్లు ఆరేటి వీరాస్వామి, గొబ్బిలమ్మ. తండ్రి వెంకటసత్యనారాయణ కేజీఆర్ ప్రిన్సిపల్గా పనిచేశారు. తల్లి విజయలక్ష్మి, సోదరి ఇంద్రాణి. 7వ తరగతి వరకు భీమవరంలోని సెయింట్ మేరీస్ స్కూల్లో చదువుకున్నా. అప్పటికే ఏపీ తరఫున టెన్నిస్ ఆడుతున్న నేను ఆటపై ఆసక్తితో 8వ తరగతి హైదరాబాద్లో చేరాను. స్కూల్ నేషనల్స్, ఇంటర్ స్టేట్ కాంపిటీషన్స్కు ఏపీ కెప్టెన్గా వ్యవహరించాను. నా స్నేహితులు చాలామంది యూఎస్, యూకే వెళ్లేవారు. గ్రాడ్యుయేషన్ తరువాత టెన్నిస్ కోసం యూకే వెళ్లాను. 2006లో ఏయూ స్కాలర్షిప్ రావడంతో లండన్లో ఎంఎస్ చేశాను. రాజకీయాల్లోకి.. యూకే కాలేజీలో తెలుగు విద్యార్థుల పట్ల వివక్ష పూరిత సంఘటనలకు వ్యతిరేకంగా పోరాడేవాడిని. అప్పుడే స్టూడెంట్స్ ఎన్నికల్లో గెలవడం నాలో ఆత్మస్థైర్యం, నమ్మకం పెంచాయి. చదువు అనంతరం అక్కడే ఉండి బిజినెస్ చేసుకుంటూ కన్జర్వేటివ్ పార్టీ ఫాలోవర్గా ఉన్నాను. అక్కడి సిటిజన్షిప్ కూడా వచ్చింది. బ్రెగ్జిట్ టైంలో ప్రధాని డేవిడ్ కేమరూన్ టీంలో చేరాను. నా అనాలసిస్, స్ట్రాటజీని చూసి కన్జర్వేటివ్ పార్టీ తరఫున పనిచేయాలని ప్రోత్సహించేవారు. 2014లో పార్టీలో సభ్యుడిగా చేరాను. రెండు, మూడు సంవత్సరాలు పార్టీ విధివిధానాలు, రాజకీయ పరిస్థితులను సైలెంట్గా అబ్జర్వ్ చేస్తూ వచ్చాను. ఇక్కడి మాదిరి అక్కడ కూడా రాజకీయ పార్టీల్లో అంతర్గత విభేదాలు, వివక్ష కామన్. సెంట్రల్ కౌన్సిలర్గా ఎన్నిక నిజాం కాలేజీలో ఇంటర్ చదువుతున్న రోజుల్లో ఆర్ఎస్ఎస్కు ఆకర్షితుడినయ్యాను. లండన్లోను దేవాలయాలకు వెళ్లి దీపారాధన చేసేవాడిని. భారతీయులను, మన సంప్రదాయాలను ఎంతో గౌరవించే పార్టీ చైర్మన్, మాజీ మేయర్ జూలీమీల్స్ నన్ను ఎంతో ప్రోత్సహించేవారు. అందరితో కలుపుగోలుతనం నాకు కలిసొచ్చింది. ఇంటర్నల్ ఓటింగ్లో తెల్లవాళ్లకంటే అత్యధిక మెజార్టీ సాధించడంతో 2017లో నాకు సీట్ డిక్లేర్ అయ్యింది. 2018లో జరిగిన ఎన్నికల్లో మొదటిసారి సెంట్రల్ కౌన్సిలర్గా గెలిచాను. కౌన్సిలర్ అంటే ఇక్కడ ఎమ్మెల్యేతో సమానం. 2022 ఎన్నికల్లోను వరుస విజయాన్ని అందుకున్నాను. లండన్లోని ముఖ్యమైన ప్రాంతానికి డిప్యూటీ మేయర్గా సుమారు రెండున్నర లక్షలమందికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ప్లానింగ్, లైసెన్సింగ్, ఎన్విరాన్మెంట్ తదితర కీలక కమిటీల్లో సభ్యుడిగా ఉన్నాను. మేయర్ అందుబాటులో లేని సమయంలో ఆ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. భారత్, బ్రిటన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో ఆక్వా, ఎన్విరాన్మెంట్కు సంబంధించి కొన్ని పాలసీలు చేయాలని అనుకున్నాం. కానీ సెంట్రల్ స్థాయిలో మా పార్టీ ఓడిపోవడంతో అది సాధ్యం కాలేదు. భవిష్యత్తులో ఆ దిశగా కృషిచేస్తాను. దేవుడి దయతో ఈ స్థాయికి వచ్చాను. వచ్చే ఎన్నికల్లో మేయర్ కావాలన్నదే నా లక్ష్యం. ఎంపీ కావడం, అనంతరం మినిస్టర్ అవడం తదుపరి లక్ష్యాలు. ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు యువత కులమతాలు, ప్రాంతీయ విభేదాలు విడిచిపెట్టి అందరితో కలిసుండాలి. అనవసరమైన ఆర్భాటాలు, పబ్లిసిటీలకు దూరంగా ఉండాలి. ఎవరినీ తక్కువ అంచనా వేయకుండా లక్ష్యాన్ని చేరేందుకు ముందుకు సాగాలి యూకే స్టూడెంట్స్ ఎన్నికల్లో గెలుపే రాజకీయాల వైపు నడిపించింది రెండుసార్లు కౌన్సిలర్గా గెలుపొందా అందరితో కలుపుగోలుతనమే నా విజయ రహస్యం ‘సాక్షి’తో లండన్లోని కెన్సింగ్టన్ అండ్ చెల్సియా డిప్యూటీ మేయర్ ఆర్యన్ ఉదయ్ స్వస్థలం భీమవరంలో సహ విద్యార్థులతో మమేకం -
పెద్దింట్లమ్మ దేవస్థానంలో భక్తుల రద్దీ
కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం భక్తులతో ఆదివారం కిటకిటలాడింది. సమీప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు విచ్చేశారు. దేవస్థాన సమీప పవిత్ర కోనేరులో స్నానాలు ఆచరించి అమ్మవారికి వేడి నైవేద్యాలను సమర్పించారు. ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పేటేటి పరమేశ్వరశర్మ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ రూ.19,185 ఆదాయం వచ్చిందని తెలిపారు. దెందులూరు: రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. సీతంపేట సమీపంలోని రైల్వేస్టేషన్ వద్ద వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. అతని ముఖం గుర్తించడానికి వీలు లేకుండా ఉంది. మృతుడు ఎరుపు రంగు చొక్కా ధరించాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉందని.. ఇతర వివరాలకు ఏలూరు రైల్వే పోలీసులను సంప్రదించాలన్నారు. -
పీ–సెట్ నోటిఫికేషన్ విడుదల
దెందులూరు: ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పీ సెట్) నోటిఫికేషన్ నాగార్జున యూనివర్సిటీ విడుదల చేసిందని గోపన్నపాలెం ప్రభుత్వ వ్యాయామ విద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.నతానియేలు అన్నారు. ఆదివారం వ్యాయామ కళాశాలలో ఆయన మాట్లాడుతూ బీపీఈడీ, డీపీఈడీ కోర్సులలో అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 13 వరకు దరఖాస్తు చేసుకోవటానికి గడువు ఉందన్నారు. ముసునూరు: మద్యం మత్తులో కింద పడడంతో తలకు తీవ్రగాయమై వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని రమణక్కపేటకు చెందిన తోట మురళీకృష్ణ(31) శనివారం సాయంత్రం మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. అర్థరాత్రి మూత్ర విసర్జనకు బయటకు వస్తూ, తూలి గచ్చుపై పడ్డాడు. గచ్చు కోణం తలకు తగలడంతో తీవ్రంగా గాయపడి, అధిక రక్తస్రావమైంది. క్షతగాత్రుడిని బంధువులు నూజివీడు ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ద్వారకాతిరుమల: మండల కేంద్రమైన ద్వారకాతిరుమలలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా మొదలైన వర్షం అరగంట పాటు ఏకధాటిగా పడింది. దాంతో డ్రైనేజీలు పొంగి పొర్లడంతో మురుగు, చెత్తాచెదారం రోడ్లపైకి చేరింది. వర్షపు నీరు రోడ్లపై ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొండపై నుంచి లింగయ్య చెరువులోకి భారీగా నీరు ప్రవహించింది. పెనుగొండ: పౌర్ణమి సందర్భంగా ఆదివారం గోదావరి మాతకు హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో హరతులనిచ్చారు. కలగభద్రుడు అర్చకత్వంలో ఏకముఖ, ద్విముఖ, చతుర్థ, పంచమ, కుంభ, నక్షత్ర, పూర్ణ, కుంభ, సర్ప హారతులనిచ్చారు. కార్యక్రమంలో హిందూ ధర్మ సమితి సభ్యులు పాల్గొన్నారు. -
కండక్టర్పై మహిళ దాడి
ఏలూరు జిల్లా: ఫోన్లో కాకుండా ఆధార్ కార్డు ఒరిజనల్ గాని, జిరాక్స్ గాని చూపించాలని అడిగినందుకు కండక్టర్పై ఓ మహిళ దాడి చేసింది. ఈ ఘటన ఏలూరు జిల్లా నూజివీడు పరిధిలో శనివారం జరిగింది. విజయవాడ విద్యాధరపురం డిపో బస్సు విజయవాడ–విస్సన్నపేట మధ్య నడుస్తుంది. నూజివీడులో సాయంత్రం విజయవాడ వెళ్లేందుకు బస్సు ఎక్కిన మహిళను కండక్టర్ ఎంవీ ప్రసాద్ ఆధార్ కార్డు చూపించమని అడగ్గా ఆమె ఫోన్లో చూపించింది. కండక్టర్ ఒరిజనల్ గాని, జిరాక్స్ గాని చూపించాలని, లేకపోతే టికెట్ తీసుకోవాలని మహిళకు స్పష్టం చేశాడు. దీంతో కోపోద్రిక్తురాలైన మహిళ..వాటర్ బాటిల్తో కండక్టర్ను కొట్టింది. అంతటితో ఆగక...చేతులతో కూడా దాడి చేసింది. బస్సులోని మహిళలు దాడి చేస్తోన్న మహిళను నిలువరించారు. ఈ గొడవ జరుగుతున్నంత సేపు కొన్నంగుంట వద్ద బస్సును నిలిపివేశారు. బస్సులోని ప్రయాణికులు మహిళకు నచ్చజెప్పడంతో ఆమె టికెట్ తీసుకుంది. ఘర్షణ సద్దుమణిగిన తరువాత బస్సు విజయవాడకు బయలుదేరింది. -
దళితులపై దాడులు దారుణం
ఏలూరు (టూటౌన్): కై కలూరు మండలంలో దానగూడెంలో దళితులపై జరిగిన దాడులను వివిధ సంఘాలు, పలు పార్టీల నాయకులు ఖండించారు. బాధితులను పరామర్శించి దోషులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక దళితులపై దాడులు పెరిగిపోయాయని ఆల్ ఇండియా అంబేడ్కర్ యువజన సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మెండెం సంతోష్ కుమార్ విమర్శించారు. స్థానిక ఎన్ఆర్పేటలోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితులపై దాడులకు తెగబడటం సరికాదన్నారు. న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు సిద్ధమని హెచ్చరించారు. సమావేశంలో గొల్ల కిరణ్, కనికెళ్ల రవిప్రసాద్, పెరియార్ పాల్గొన్నారు. తక్షణమే అరెస్టు చేయాలి దళితులపై హత్యాయత్నం చేసిన దోషులను తక్షణమే అరెస్టు చేసి శిక్షించాలని దళిత బహుజన్ సీనియర్ నాయకుడు నేతల రమేష్ బాబు డిమాండ్చేశారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత యువకులను ఆయన పరామర్శించారు. దళితులపై హత్యాయత్నానికి పాల్పడిన జనసేన నాయకులను ఎస్సీ, ఎస్సీ అట్రాసిటీ యాక్టు కింద తక్షణమే అరెస్ట్ చేయాలన్నారు. కై కలూరులో జరిగిన దాడిని పోలీసులు ఇరువర్గాల ఘర్షణగా చిత్రీకరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వమే బాధ్యత వహించాలి దళితులపై దాడి చేసి హత్యాయత్నానికి ఒడిగట్టిన బాధితులను శిక్షించాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఏ.ఫ్రాన్సిస్ డిమాండ్చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత యువకులను ఆయన శనివారం పరామర్శించారు. గతంలో జనసేన సైనికులు పిఠాపురంలో దళితుల ఊరు మీద పడి దారుణంగా కొట్టారని, ఇప్పుడు కై కలూరులో అలాగే దాడులకు పాల్పడినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏమీ మాట్లాడకపోవడం సిగ్గు చేటన్నారు. దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు. విచారణ జరిపించాలి కై కలూరు మండలం దానగూడెం దళితులపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి పోలీసు ఉన్నతాధికారులతో విచారణ జరిపించాలని సీపీఎం ఏలూరు జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. దోషులపై అట్రాసిటీ చట్టం పెట్టి అరెస్టు చేయాలని సీపీఎం జిల్లాకార్యదర్శి ఏ.రవి డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వస్తే హత్యలు, అత్యాచారాలు, దాడులను అరికడతామని చెప్పిన కూటమి నాయకులు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ప్రశ్నించారు. బాధితులను పరామర్శించిన సంఘాలు, పార్టీల నాయకులు -
గంజాయి కేసులో ముగ్గురి అరెస్ట్
నరసాపురం రూరల్: గంజాయి కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.40 వేలు ఖరీదు చేసే 1.938 కిలోల (సుమారు రెండు కిలోలు) గంజాయి, మూడు సెల్ఫోన్లు, రూ.4 వేలు నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయి అక్రమ రవాణాపై నరసాపురం ఎస్సై సీహెచ్ జయలక్ష్మికి వచ్చిన సమాచారం మేరకు నరసాపురం– పాలకొల్లు రోడ్డులోని వీరభవాని ఆలయం వెనుక గల ఖాళీ స్థలంలో పోలీసులు నిఘా వేశారు. ఉండి ఎన్ఆర్పీ అగ్రహారంనకు చెందిన కాలుకురస ఏసురాజు నరసాపురం వీవర్స్ కాలనీకి చెందిన పృధ్వీసాయి శివకుమార్, పిచ్చుక ఉదయ్కిరణ్లకు విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితులను అరెస్టు చేసి కోర్టుకు పంపగా రిమాండ్ విధించినట్లు చెప్పారు. ఏసురాజు ఏలూరుకు చెందిన మణికంఠ వద్ద గజాయిని కొని నరసాపురానికి చెందిన వ్యక్తులకు విక్రయిస్తున్నాడని, మణికంఠను అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. నరసాపురం డీఎస్పీ శ్రీవేద ఆదేశాల మేరకు టౌన్ సీఐ బి యాదగిరి ఆధ్వర్యంలో జరిపిన ఈ దాడుల్లో ఎస్సై ముత్యాలరావు, హెడ్ కానిస్టేబుళ్లు వేణుగోపాలరావు, ప్రకాష్ బాబు, కానిస్టేబుల్ చక్రవర్తి పాల్గొన్నారు. -
రూ.16.63 లక్షలకు లడ్డూ వేలం
నూజివీడు: మండలంలోని మిట్టగూడెం వినాయక చవితి నవరాత్రుల్లో విఘ్నేశ్వరుడికి ప్రసాదంగా ఏర్పాటుచేసిన 11 కేజీల లడ్డూకు శనివారం వేలం నిర్వహించగా రూ.16.63 లక్షలకు మాజీ ఎంపీటీసీ కొనకళ్ల మాధవరావు దక్కించుకున్నారు. గతేడాది సైతం లడ్డూను వేలంలో రూ.9.09 లక్షలకు మాధవరావు సొంతం చేసుకున్నారు. సర్పంచ్ కొనకాల నరసింహారావు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బుట్టాయగూడెం: కలకత్తా నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఒక కంటైనర్ను జీలుగుమిల్లి పోలీసులు శనివారం తనిఖీ చేసి అందులో సుమారు 12,100 కేజీల గోమాంసాన్ని పట్టుకున్నారు. గ్రామశివారులోని హెచ్పీ గ్యాస్ గోడౌన్ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా కంటైనర్లో ఏదో తరలిస్తున్నట్లు అనుమానంతో తనిఖీ చేయగా గోమాంసాన్ని గుర్తించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ మాంసాన్ని నిర్జీవ ప్రదేశంలో ఖననం చేశారు. -
బీవీ రాజు కళాశాలకు జాతీయస్థాయి గుర్తింపు
భీమవరం : భీమవరంలోని బీవీరాజు కళాశాల ఆర్ట్స్ అండ్ సైన్స్ విభాగంలో జాతీయస్థాయి గుర్తింపు దక్కించుకుందని ప్రిన్సిపాల్ ఐఆర్ కృష్ణంరాజు తెలిపారు. కేంద్ర విద్యా శాఖ ఈ నెల 4న విడుదల చేసిన ర్యాంకింగ్స్లో ఈ ఘనత సాధించిందని చెప్పారు. శనివారం రాజమహేంద్రవరంలో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఎస్.ప్రసన్నశ్రీ, రిజిస్ట్రార్ కేవీ స్వామి అభినందనలు తెలియజేస్తూ సర్టిఫికెట్ అందించారని వివరించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు, సిబ్బందిని విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ కేవీ విష్ణురాజు, వైస్ చైర్మన్ ఆర్.రవిచంద్రన్, సెక్రటరీ కె.ఆదిత్య విస్సం, జాయింట్ సెక్రటరీ కె.సాయి సుమంత్, డైరెక్టర్లు తదితరులు అభినందించారు. గర్భం దాల్చిన మైనర్ బాలిక ఏలూరు టౌన్: మైనర్ బాలికకు ఓ వ్యక్తి మాయమాటలు చెప్పి ఆమె గర్భవతిని చేశాడు. బాలికకు అనారోగ్య సమస్య రావటంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు రూరల్ లంకగ్రామానికి చెందిన భార్యభర్త కొంతకాలం క్రితం గ్రామం నుంచి వలస వెళ్లి మహారాష్ట్రలోని పూణేలో చేపల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మైనర్ బాలిక మాత్రం లంకగ్రామంలోనే తన అమ్మమ్మ వద్ద ఉంటూ 8వ తరగతి వరకూ చదివి ఇంటివద్దనే ఉంటుంది. 2024లో బాలికను తల్లిదండ్రులు తమతోపాటు పూణే తీసుకువెళ్లారు. అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి బాలికకు పరిచయం అయ్యాడు. ఒకే గ్రామానికి చెందిన వ్యక్తులమని పరిచయం చేసుకుని, బాలికతో సన్నిహితంగా మెలుగుతూ వచ్చాడు. అనంతరం పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు. ఇటీవల బాలిక తన అమ్మమ్మ వద్దకు వచ్చింది. బాలిక అనారోగ్యంతో బాధపడుతూ ఉండడంతో హాస్పిటల్కు తీసుకువెళ్లగా ఆమెను పరీక్షించిన వైద్యులు 9నెలల గర్భవతిగా నిర్థారించారు. ఏలూరు రూరల్ ఎస్సై నాగబాబు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఏలూరు జీజీహెచ్లో చేర్పించారు. ముసునూరు: ఇంటి సమీపంలో ఉన్న నేల బావిలో పడి వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై ఎం.చిరంజీవి తెలిపిన వివరాలివి. వేల్పుచర్ల శివారు అన్నపనేనివారిగూడెంకు చెందిన ఉమ్మడి వెంకట నాగకిషోర్ (32) శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటి వెనుక గల నేల బావిలో ప్రమాదవశాత్తు కాలుజారి పడిపోయాడు. ముసునూరు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై ఎం.చిరంజీవి ఆధ్వర్యంలో శనివారం అగ్నిమాపక సిబ్బందిని రప్పించి, మృతదేహాన్ని బావిలోనుంచి బయటకు తీయించారు. నాగకిషోర్కు భార్య, 10 నెలల కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నూజివీడు ఏరియా ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై చెప్పారు. ద్వారకాతిరుమల: రాష్ట్రంలో లంపి స్కిన్ వ్యాధి వేగంగా వ్యాపిస్తున్నందు వల్ల భక్తుల నుంచి గోదానాన్ని, అలాగే భక్తులకు ఇచ్చే గోదత్తతను శ్రీవారి దేవస్థానం తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్టు ఆలయ ఈఓ ఎన్వీ సత్యన్నారాయణ మూర్తి శనివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. అంటు వ్యాధులు తగ్గిన తరువాత మళ్లీ వీటిని పునః ప్రారంభిస్తామని, భక్తులకు ఆ విషయాన్ని తెలియజేస్తామని చెప్పారు. -
బానిసలం కాదు.. ప్రభుత్వ ఉద్యోగులం
సాక్షి, భీమవరం: మేము బానిసలం కాదు.. ప్రభుత్వ ఉద్యోగులమంటూ సచివాలయ ఉద్యోగులు పోరుబాట పట్టారు. ఇంటింటి సర్వేలు నిషేధించాలంటూ శుక్రవారం నిర్వహించాల్సిన వాట్సప్ గవర్నెన్స్ ఇంటింట అవగాహన సర్వేను బహిష్కరించి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 15,004 సచివాలయాలకు గాను కేవలం 12 సచివాలయాల్లో మాత్రమే సర్వే చేసినట్టుగా డాష్బోర్డులో అప్లోడ్ చేయగా.. జేఏసీ పిలుపు మేరకు మిగిలిన ఉద్యోగులు సర్వేను బహిష్కరించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం వ్యయప్రయాసలకోర్చి ప్రజలు మండల, జిల్లా కేంద్రాలకు తిరగాల్సిన పనిలేకుండా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. రాజకీయ జోక్యం, అవినీతి, అక్రమాలకు తావులేకుండా పూర్తి పారదర్శకంగా సచివాలయ ఉద్యోగుల నియామకాలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రెండు వేలు, పట్టణ ప్రాంతాల్లో నాలుగు వేల జనాభా ప్రాతిపదికన జిల్లాలో 535 సచివాలయాల పరిధిలో ప్రస్తుతం 4,434 మంది ఉద్యోగులు సేవలందిస్తున్నారు. వీరిలో సచివాలయ సెక్రటరీ, ఇంజినీరింగ్, వెల్ఫేర్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, హార్టీకల్చర్, వెటర్నరీ, డిజిటల్ అసిస్టెంట్లు, ఏఎన్ఎం, విలేజ్ సర్వేయర్ తదితర ఉద్యోగులు ఉన్నారు. సచివాలయానికి వెళితే చాలు అన్ని పనులు జరిగేలా 500కు పైగా సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఆయా సేవలను బట్టి తక్షణ, కొన్ని 72 గంటలు, మరికొన్ని వారం నుంచి రెండు వారాల వ్యవధిలో పరిష్కరించేలా గడువు పెట్టారు. గత ప్రభుత్వంలో కేవలం దరఖాస్తు చేసుకున్న గంటలోనే రేషన్ కార్డులు, పింఛన్లు మంజూరుచేసిన సచివాలయాలు ఎన్నో ఉన్నాయి. కూటమి కుట్రలు గతంలో నవరత్న పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరి గడప చెంతకు చేరేలా వలంటీర్లను సమన్వయం చేసుకుంటూ సచివాలయ ఉద్యోగులు పనిచేసేవారు. కాగా సంక్షేమాన్ని అటకెక్కించిన కూటమి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులతో జాబ్చార్ట్లో లేని పనులు చేయిస్తూ వారిని తీవ్ర ఒత్తిడికి గురిచేస్తోంది. వలంటీర్ల పనులను వారితో చేయిస్తూ మొత్తం పనిభారం ఉద్యోగులపై మోపింది. హౌస్హోల్డ్, ఎంఎస్ఎం తదితర సర్వేల పేరిట ఇంటింటికి తిప్పుతూ వెట్టిచాకిరీ చేయిస్తోంది. కూటమి వచ్చాక కొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు తమ సొంత సర్వేలకు సచివాలయ ఉద్యోగులను వినియోగించుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. హేతుబద్దీకరణ పేరిట 3,500 జనాభా పైబడిన సచివాలయాల్లో ఎనిమిది మంది, 2,500 నుంచి 3,500 జనాభా ఉన్న చోట ఏడుగురు, 2,500 లోపు జనాభా ఉన్నచోట ఆరుగురు ఉద్యోగులను కొనసాగించే అంశాన్ని కూటమి తెరపైకి తెచ్చింది. మరోపక్క ఉద్యోగుల బదిలీల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల సిఫార్సు లెటర్లకు ప్రాధాన్యమిస్తూ రాజకీయ జోక్యానికి తెరలేపింది. తాజాగా ప్రతి శుక్రవారం వాట్సప్ గవర్నెస్ అవగాహన సర్వేలు నిర్వహించాలంటూ గురువారం సచివాలయ ఉద్యోగులకు మౌఖిక ఆదేశాలందాయి. ఈ విషయమై సచివాలయ ఉద్యోగుల జేఏసీ స్పందించింది. ఉద్యోగుల ఆత్మగౌరవానికి భంగం కలిగించే వలంటీర్ విధులను బహిష్కరించి నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరుకావాలని జేఏసీ పిలుపునిచ్చింది. ఈ మేరకు శుక్రవారం భీమవరం, ఆకివీడు, జిల్లా వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు వాట్సప్ సర్వీస్ రిజిస్ట్రేషన్లను ఉద్యోగులు బహిష్కరించి నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. దీంతో జిల్లాలో 535 సచివాలయాల పరిధిలో ఒక్కచోట కూడా వాట్సప్ రిజిస్ట్రేషన్లు జరుగలేదు. సచివాలయ ఉద్యోగుల పోరుబాట సర్వే డాష్బోర్డు నింపకుండా నిరసన ఇంటింటి సర్వేలు నిషేధించాలని డిమాండ్ నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు -
ప్లాస్టిక్ కవర్లకు నో ఎంట్రీ
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయంలో ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై ఈనెల 4న ‘సాక్షి’లో ప్రచురించిన ‘ప్లాస్టిక్పై సమరం.. ప్రచారానికే పరిమితం’ కథనంపై ఆలయ అధికారులు స్పందించారు. ప్లాస్టిక్ కవర్లు ఆలయంలోకి వెళ్లకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద భక్తులను క్షుణ్ణంగా పరిశీలించి లోనికి పంపిస్తున్నారు. అయితే ప్లాస్టిక్ను పూర్తిస్థాయిలో నిర్మూలించాలంటే క్షేత్రంలోకి కవర్లు రాకుండా చూడాలని పలు వురు అంటున్నారు. దేవస్థానానికి చెందిన కొ బ్బరికాయలు, ఫ్యాన్సీ దుకాణాల్లో కవర్ల వి క్రయాలను అరికట్టాలని కోరుతున్నారు. -
9న వైఎస్సార్సీపీ అన్నదాత పోరు
● యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలం ● రైతుల పక్షాన వైఎస్సార్సీపీ ఉద్యమం ● పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు ఏలూరు టౌన్: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచీ రైతన్నలకు కష్టాలు మొదలయ్యాయని, కనీసం ఎరువులు కూడా అందించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు అన్నారు. ఏలూరులోని పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. ఈనెల 9న ఏలూరులో చేపట్టే అన్నదాత పోరు నిరసన కార్యక్రమం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అండగా వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందని, అన్నదాతల పక్షాన ఉద్యమిస్తామన్నా రు. 9న ఉదయం 10 గంటలకు ఏలూరు జిల్లాలో మూడు చోట్ల అన్నదాత పోరు నిరసన కార్యక్రమా లు చేపట్టేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు ఆర్డీఓ కార్యాలయాల వద్దకు రైతులతో కలిసి ర్యాలీగా వెళ్లి, కొద్దిసేపు నిరసన అనంతరం ఆర్డీఓలకు వినతిపత్రాలు సమర్పిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం వెంటనే రైతులకు యూరియా సహా అవసరమైన ఎరువులను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. బ్లాక్ మార్కెట్ను నియంత్రిస్తూ, ఎరువులను పక్కదోవ పట్టిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలన్నారు. కనీసం పంటలకు గిట్టుబాబు ధరను కల్పించలేని దుస్థితిలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఎరువులను బ్లాక్ చేస్తూ వందల కోట్లు కాజేస్తున్నారని ఆరోపించారు. రైతులు ఎరువుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు ప్రభుత్వం మొద్దునిద్రలో ఉందని ఎద్దేవా చేశారు. రైతు కష్టాలు పట్టవా? ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ మాట్లాడుతూ ఏలూరులో రైతులు, పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీ అనంతరం నిరసన చేపడతామన్నారు. అనంతరం ఆర్డీఓకు వినతిపత్రం సమర్పిస్తామన్నారు. కూటమి ప్రభుత్వానికి రైతుల కష్టాలు పట్టించుకునే తీరిక లేదన్నారు. చింతలపూడి సమన్వయకర్త కంభం విజయరాజు మాట్లాడుతూ మార్క్ఫెడ్కు ఇవ్వాల్సిన 50 శాతం యూరియాను తగ్గించి ప్రైవేట్కు కేటాయించడం దుర్మార్గమన్నారు. దీంతో యూరియా బ్లాక్ మార్కెట్కు వెళ్లి బస్తా రూ.450 నుంచి రూ.600కు విక్రయిస్తున్నారన్నారు. ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి దాసరి రమేష్, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్బాబు, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, వాణిజ్య విబాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంటా రామ్మోహనరావు, మైనార్టీ విభా గం కార్యదర్శి ఎస్కే గాజుల బాజీ, వాణిజ్య విభా గం కార్యదర్శి భాస్కర్ల వెంకట బాచి, విద్యార్థి విభా గం జిల్లా అధ్యక్షుడు పాతినవలస రాజేష్, వైఎస్సా ర్టీయూసీ జిల్లా అధ్యక్షుడు పల్లి శ్రీనివాసరావు, జిల్లా గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు సముద్రాల దుర్గారావు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, జిల్లా కార్యదర్శి కంచుమర్తి తులసీ, మహిళా జిల్లా ఉపాధ్యక్షురాలు చిలకపాటి డింపుల్ జాబ్, నగర మహిళా అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, నగర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఇనపనూరి జగదీష్, కామవరపుకోట మండల అధ్యక్షులు రాయకుల సత్యనారాయణ పాల్గొన్నారు. -
ఆక్వాకల్చర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా వడ్డి
తాడేపల్లిగూడెం: వైఎస్సార్సీపీ రాష్ట్ర రైతు విభాగం ఆక్వాకల్చర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా అప్సడా మాజీ వైస్చైర్మన్, రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డి రఘురాంను శనివారం నియమించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నియామకం చేపట్టినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటనలో తెలిపింది. గత ప్రభుత్వంలో అప్సడా వైస్చైర్మన్గా నిరంతరం రైతుల వెంట ఉన్న వడ్డి రఘురాం ఈ రంగానికి చేసిన సేవలను పరిగణనలోకి తీసుకుని వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు. ఆక్వా రంగంలో విశేష సేవలందించడానికి వీలుగా తనకు ఈ పదవిని ఇచ్చిన జగన్మోహన్రెడ్డికి రఘురాం ధన్యవాదాలు తెలిపారు. ఆయన నమ్మకానికి తగ్గట్టుగా రైతులకు సేవలు అందిస్తానన్నారు. -
ఎనీవేర్కు కేరాఫ్ ఉండి
మేం బానిసలం కాదు.. మేం బానిసలం కాదు.. ప్రభుత్వ ఉద్యోగులమంటూ సచివాలయ ఉద్యోగులు పోరుబాట పట్టారు. నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. 8లో uకై కలూరు మండలం దానగూడెంలో దళితులపై జరిగిన దాడులను వివిధ సంఘాలు, పలు పార్టీల నాయకులు ఖండించారు. 8లో uఆదివారం శ్రీ 7 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025సాక్షి, భీమవరం/ ఉండి: పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని ఉండి, ఆకివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు లోపభూయిష్టంగా జ రుగుతున్నాయా? అమరావతి, చుట్టుపక్కల జి ల్లాల వారు రిజిస్ట్రేషన్ల కోసం ఇక్కడికి క్యూ కడుతున్నారా?.. అంటే అవుననే ఆరోపణలు వినిపిస్తు న్నాయి. ఇటీవల చోటుచేసుకున్న సంఘటనలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. క్రయ, విక్రయదారులు ఇబ్బంది పడకుండా భూములు, స్థలాలను ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా ప్రభుత్వం ‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్’ వీలు కల్పించింది. సాధారణంగా నిషేధిత జాబితాలోని భూములు, స్థలాలపై స్థానిక సబ్ రిజిస్ట్రార్లకు అవగాహన ఉంటుంది. ధ్రువీకరణ పత్రాలు, వ్యక్తులను క్షుణ్ణంగా పరిశీలించి అన్నీ సవ్యంగా ఉన్నాయనుకుంటేనే రిజిస్ట్రేషన్ చేస్తుంటారు. బయటి ప్రాంతాల్లోని వారికి ఈ భూములపై అవగాహన ఉండదు. బయటి ప్రాంతాల డా క్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత ఏ రియాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి అ న్నీ ధ్రువీకరించుకున్న తర్వాతనే రిజిస్ట్రేషన్లు చేయా లి. అయితే ఎనీవేర్ సాఫ్ట్వేర్ను దుర్వినియోగం చేస్తూ కొందరు అక్రమాలకు తెరలేపుతున్నారు. గతంలో మొగల్తూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బయ టి ప్రాంతాలకు చెందిన నిషేధిత జాబితాలోని భూముల రిజిస్ట్రేషన్ చేశారన్న విషయంలో సబ్ రిజిస్ట్రార్పై చర్యలు తీసుకున్నారు. అయినా కొందరి తీరులో మార్పు రావడం లేదు. వందలాది ఎనీవేర్ రిజిస్ట్రేషన్లు ప్రస్తుతం ఉండి, ఆకివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ ఈ తరహా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత మూడు నెలల్లో ఉండి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 1,013 డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్లు చేయగా వీటిలో 300 లకు పైగా ఇతర జిల్లాలకు చెందిన వారివే ఉన్నాయి. ఆకివీడులో వెయ్యికి పైనే రిజిస్ట్రేషన్లు జరగ్గా అక్కడ కూడా ఇదే పరిస్థితి ఉన్నట్టు సమాచారం. కృష్ణా జిల్లా బంటుమిల్లి, పెడన, మచిలీపట్నం, మండవల్లి, ఉయ్యూరు, ఏలూరు జిల్లా కై కలూరు, ప్రకాశం జిల్లా కనిగిరి, పల్నాడు జిల్లా గురజాల, గుంటూరు జిల్లా పెదకాకాని, జంగారెడ్డిగూడెం, భీమవరం తదితర ప్రాంతాలకు చెందిన వారి రిజిస్ట్రేషన్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఎనివేర్ రిజిస్ట్రేషన్లకు సంబంధించి పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఉన్నతాధికారుల అనుమతులు కావాలంటూ అధికారులు దాటవేత ధోరణి అవలంబిస్తున్నారు. మంగళ, శుక్రవారాలు, అమావాస్య రోజుల్లోనూ బయట జిల్లాల వారితో ఆయా కార్యాలయాలు కళకళలాడుతుంటాయని తెలిసింది. ఆయా కార్యాలయాల వద్ద లేఖర్లదే ఇష్టారాజ్యమంటున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ పాతుకుపోయిన కొందరు అన్నీ తామై వ్యవహరిస్తుంటారన్న ఆరోపణలు ఉన్నాయి. నా భూమిని నాకు స్వాధీనం చేయకపోవడంతో పాటు వేరే వారి పేరిట తప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన అధికారులు, లేఖర్లపైనా చర్యలు తీసుకోవాలి. ఉన్నతాధికారులను అడుగుతుంటే సబ్ రిజిస్ట్రార్ సెలవులో ఉన్నారని చెబుతున్నారు. ఈ విషయమై పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసినా నాకు న్యాయం జరగలేదు. సమస్యను పరిష్కరించినట్టుగా ఫేక్ ఫొటో అప్లోడ్ చేసి నా అర్జీని క్లోజ్ చేశారు. – కురెళ్ల రాజ్కుమార్, గణపవరం కాళ్ల మండలం కలవపూడిలో దాదాపు రూ.2.50 కోట్ల విలువైన 1.68 ఎకరాల గ్రామ కంఠం భూమిని జూన్ 30న ఒక సబ్ రిజిస్ట్రార్ తన భర్త పేరిట రిజిస్ట్రేషన్ చేసేశారు. ఈ విషయమై ఫిర్యాదు అందడంతో జూలై 15న రిజిస్ట్రేషన్ రద్దు చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం ఈ విషయమై విచారణ కొనసాగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. కృష్ణా జిల్లా చినగొల్లపాలెంకు చెందిన ఏలూరి రంగబాబు కుటుంబానికి చినగొల్లపాలెంలో 32 ఎకరాల సాగు భూమి ఉంది. కొందరు ఉండి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఫేక్ రిజిస్ట్రేషన్ చేయించి ఈ భూమిని కాజేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు రంగబాబు ఆందోళనకు దిగారు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు అందుకు కొమ్ముకాస్తున్నారంటూ టెంట్ వేసి నిరసన తెలిపారు. గణపవరానికి చెందిన కురెళ్ల రాజ్కుమార్కు ఏలూరు జిల్లా కలిదిండి మండలం పటమటిపాలెంలోని 9 సెంట్ల భూమి ఉంది. ఏప్రిల్ 24న ఉండి సబ్ రిజిస్ట్రార్ ఈ భూమిని అదే గ్రామానికి చెందిన మరొకరి పేరిట రిజిస్ట్రేషన్ చేసేశారు. విషయం తెలుసుకున్న రాజ్కుమార్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో సవరణ పేరుతో తప్పుడు రిజిస్ట్రేషన్ చేసినట్టుగా విచారణలో నిర్ధారణ అయ్యింది. సబ్ రిజిస్ట్రార్ దాదాపు రెండు నెలలుగా సెలవులో ఉన్నారు. అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని కోరుతూ బాధితుడు పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఇప్పటికీ అధికారులు చర్యలు తీసుకోలేదు. కాగా సమస్యను పరిష్కరించి ఉండి ఎస్సై చేతులమీదుగా రాజ్కుమార్కు ఎండార్స్మెంట్ ఇచ్చినట్టు నాలుగు రోజుల క్రితం పీజీఆర్ఎస్ సైట్లో అధికారులు ఫేక్ ఫొటోను అప్లోడ్ చేశారని బాధితుడు ఆరోపిస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అక్రమాలు దండి ఒకరి భూమి మరొకరి పేరుపై ఉండిలో రిజిస్ట్రేషన్ రెండు నెలలుగా సెలవులోనే సబ్ రిజిస్ట్రార్ గ్రామ కంఠం భూమిని రిజిస్టర్ చేసేసిన మరో సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ల కోసం పొరుగు జిల్లాల నుంచి జనం క్యూ చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు -
కదం తొక్కిన ఆటో కార్మికులు
భీమడోలు జంక్షన్లో ఆందోళన చేస్తున్న ఆటో కార్మికులు భీమడోలులో భారీగా ఆటోల ర్యాలీభీమడోలు: సీ్త్ర శక్తి పథకం (ఉచిత బస్సు) మా పా లిట శాపంగా మారిందంటూ ఆటోడ్రైవర్లు ఆందోళనకు దిగారు. ఒక్కో ఆటో కార్మికునికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయం చేయాలంటూ శుక్రవారం భీమడోలు శ్రీవేంకటేశ్వర ఆటో యూనియన్ ఆధ్వర్యంలో భీమడోలు, పూళ్ల, గుండుగొలను ప్రాంతాలకు చెందిన 120 ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. భీమడోలు జంక్షన్ వద్ద మానవహారం చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని వారంతా భీమడోలు జంక్షన్లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో అందించారు. ఈ సందర్భంగా జిల్లా సీఐటీయూ అధ్యక్షుడు ఆర్.లింగరాజు మా ట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు ఏడాదికి రూ.15 వేల ఆర్థిక సాయం చే స్తామని హామీ ఇచ్చిందని, ఇప్పటికీ ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. ఉచిత బస్సుతో ఆటో కార్మికుల ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని, వెంటనే కార్మికులకు ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మోదీ ప్రభుత్వం తెచ్చిన మోటార్ వెహికల్ చట్ట సవరణలను ఉపసంహరించుకోవాలన్నారు. క్రూడాయిల్ తగ్గుతున్నా పె ట్రోలు, డీజిల్ ధరలు తగ్గించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం మేల్కొని ఆటో కార్మికులను ఆదుకోవాలని, లేకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆటో యూనియన్ల అధ్యక్షులు సీరా సాంబశివరావు, డి.పైడియ్య, నల్లమిల్లి నాగరాజు, ఉపాధ్యక్షుడు ముప్పిడి సతీష్, కార్యదర్శి రాచేటి యోహాన్, సిద్దాబత్తుల పండు, సంయుక్త కార్యదర్శి కూరపాటి సర్వేశ్వరరావు, కోశాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ తీరుపై ఆందోళన -
ఉపాధి పనుల్లో అక్రమాలు
బుట్టాయగూడెం: ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా గత ఏడాదిపాటు జరిగిన గ్రామీణ అభివృద్ధి పనులు, పంచాయతీరాజ్, ఐటీడీఏ సోషల్ ఫారెస్ట్, టెరిటోరియల్ ఫారెస్ట్, కూలీలకు కలిపి సుమారు రూ. 16.27 కోట్ల నిధులకు సంబంధించి పనులు చేశారు. ఈ పనులపై సామాజిక తనిఖీ బృందం అధికారులు ఆగస్టు 21 నుంచి ఒక్కొక్కటిగా పరిశీలించారు. పనుల వివరాలను మండల స్థాయిలో వెల్లడించేందుకు స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేదికలో బుట్టాయగూడెం మండలంలోని 21 పంచాయతీల పరిధిలో జరిగిన పనుల్లో సుమారు రూ.1.73 కోట్ల అక్రమాలు జరిగినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. కొలతలు, మస్తర్లు, అంగన్వాడీ కేంద్రాల్లో చేపట్టిన పనులు, ఐటీడీఏ ద్వారా చేపట్టిన పనులు, తదితర పనుల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించామని చెప్పారు. వీటిలో రూ. 27.86 లక్షలను అధికారులు రికవరీకి ఆదేశించారు. మరో రూ.27 లక్షలకు సంబంధించి ఎంకై ్వరీకి ఆదేశించినట్లు తెలిపారు. రూ.86.86 లక్షలతో వివిధ పనులతోపాటు మొక్కలు వేయించేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ ప్రజావేదికలో రూ.66 లక్షలు తొలగించినట్లు చెప్పారు. అదేవిధంగా ఏపీఓ, ఈసీ, జేఏ, ఫీల్డ్ అసిస్టెంట్లకు సుమారు రూ. 2.81 లక్షల జరిమానా విధించినట్లు తెలిపారు. అదేవిధంగా ఎన్ఆర్పాలెంలో కాంపౌండ్ వాల్, రాజానగరం, లక్ష్ముడుగూడెంలో పాల కేంద్రం నిర్మాణాలు చేపట్టకుండానే సుమారు రూ.8 లక్షల వరకూ డబ్బులు చెల్లించినట్లు గుర్తించామన్నారు. ఆ సొమ్ము మొత్తం రికవరీ చేసినట్లు తెలిపారు. డ్వామా పీడీ వెంకటసుబ్బారావు ఆధ్వర్యంలో ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కె.జ్యోతి, ఏపీఓ ఎం.స్వర్ణకుమారి, తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా గురువారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9:30 వరకూ ఈ కార్యక్రమం జరిగింది. -
బైబిల్ విరుద్ధమైన బోధనలు అడ్డుకుంటాం
పాలకొల్లు సెంట్రల్: బైబిల్కు విరుద్ధమైన బోధనలు చేసే వారిని అడ్డుకుంటామని తెలుగు క్రైస్తవ సంఘాల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఎస్.ఎబినేజర్ అన్నారు. శుక్రవారం పట్టణ శివారు అడబాల గార్డెన్స్లో జరుగుతున్న క్రైస్తవ తెలాభిషేకం ఆరాధన కార్యక్రమాన్ని పాలకొల్లు తెలుగు క్రైస్తవ సంఘాల పరిరక్షణ సమితి సభ్యులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా గార్డెన్స్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. కొంత కాలంగా ప్రార్థనా శక్తి నిర్వాహకుడు ఇస్సాక్ అడబాల గార్డెన్స్లో ప్రతి నెలా మొదటి శుక్రవారం తైలాభిషేకం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని నిలిపివేయాలంటూ స్థానిక తెలుగు క్రైస్తవ సంఘాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గురువారం రాత్రి నుంచి నిరసన చేపట్టారు. సంఘ అధ్యక్షుడు ఎబినేజర్ మాట్లాడుతూ అమాయక ప్రజలను, విశ్వాసులను మభ్యపెట్టి ప్రలోభాలకు గురిచేస్తున్నారన్నారు. ఆరాధన ఆదివారం మాత్రమే జరగాలని.. అలా కాకుండా ఏ రోజైనా చేస్తే వాక్యానికి విరుద్ధమన్నారు. తైలాభిషేకం బైబిల్లో ఎక్కడా లేదని, అందువల్ల ఈ బోధనను ఖండించేందుకు నిరసన చేపట్టామన్నారు. బోధకుడు ఇస్సాక్ అనుచరులు వచ్చి కోర్టు ఆర్డర్ ఉందని చెప్పారని.. అయితే కోర్టు నుంచి ఎలాంటి ఆర్డర్ రాలేదన్నారు. -
వైఎస్సార్టీఏ ఆధ్వర్యంలో గురువులకు సన్మానం
ఏలూరు (ఆర్ఆర్పేట): వైఎస్సార్సీపీ ఉపాధ్యాయ విభాగం, వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో గురుపూజా దినోత్సవం సందర్భంగా శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువులను సన్మానించారు. రాష్ట్రవ్యాప్తంగా 16 మంది ఉపాధ్యాయులను సన్మానించగా పశ్చిమగోదావరి జి ల్లాకు చెందిన బొడ్డు రాంబాబు, సున్నం శ్రీనివాసరావు ఉన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.అశోక్కుమార్ రెడ్డి, గడ్డం సుధీర్, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కె.జాల్ రెడ్డి పాల్గొన్నారు. ద్వారకాతిరుమల: చంద్ర గ్రహణాన్ని పురస్కరించుకుని ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని ఆదివారం మహానివేదన అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు మూసివేస్తామ ని ఆలయ ఈఓ ఎన్వీ సత్యనారాయణమూర్తి తెలిపారు. సోమవారం (8వ తేదీన) పుణ్యహవాచనం అనంతరం ఉదయం 9.30 గంటల నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే 7న సాయంత్రం జరగాల్సిన ఆర్జిత సేవలను, 8న వేకువజామున జరగాల్సిన సుప్రభాత సేవను రద్దు చేస్తున్నట్టు చెప్పారు. మిగిలిన అన్ని సేవలు యథావిధిగా జరుగుతాయన్నారు. భక్తులు గమనించాలని కోరారు. కొయ్యలగూడెం: ప్రభుత్వ హాస్టళ్ల తరలింపు నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, వాటి బదిలీ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక మెయిన్ సెంటర్లో ఏఐఎస్ఎఫ్ నాయకులు చేపట్టిన ఆందోళన శిబిరానికి బాలరాజు వెళ్లి సంఘీభావం తెలిపారు. కొయ్యలగూడెంలోని ప్రభుత్వ బీసీ హాస్టళ్లు రెండింటినీ వేరే మండలాలకు తరలించడాన్ని తప్పుపట్టారు. విద్యార్థులు అత్యధిక శాతం హాజరయ్యే కొయ్యలగూడెంలోని హా స్టళ్లను తరలించడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. కూటమిలోని నా యకులు రాజకీయాలు మాని ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకోవాలన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కొయ్యలగూడెం వల్లే పోలవరం అసెంబ్లీ స్థానాన్ని కూటమి గెలవగలిగింది అనేది జగమెరిగిన సత్యం అని, అయితే కొ య్యలగూడెంలో విద్యారంగాన్ని అణగదొక్కేలా కుట్రలు జరుగుతున్నాయన్నారు. కార్పొ రేట్ సంస్థలతో కలి ప్రభుత్వ విద్యారంగాన్ని అడ్డుకోవడం దారుణమన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి దాసరి విష్ణు, ఏఐఎస్ఎఫ్ నాయకులు డి.శివకుమార్, ఎం.క్రాంతి కుమార్, తాడిగడప ఆంజనేయరాజు తది తరులు పాల్గొన్నారు. ఏలూరు(మెట్రో): ఎరువుల నిల్వలు తక్కువగా ఉన్న సొసైటీలకు యుద్ధప్రాతిపదికన సరఫరా చేయాలనీ కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. జిల్లాలో ఎరువుల లభ్యత, సరఫరాలపై శుక్రవారం కలెక్టరేట్ నుంచి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎరువుల పంపిణీపై వ్యవసాయాధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నా రు. ఎరువుల నిల్వలు తక్కువగా ఉన్న పెద పాడు, పెదవేగి, ఏలూరు, దెందులూరు, కలిదిండి, ముదినేపల్లి, బుట్టాయగూడెం, చింతలపూడి, ఆగిరిపల్లి, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు 500 టన్నుల యూరియాను పంపామన్నారు. యూరియా పంపిణీ, రైతుల సందేహాల నివృత్తి కోసం ఏలూరు వ్యవసాయ శాఖ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూ మ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. 85004 21967, 89850 21117 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు. ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు శుక్రవారం కలెక్టర్ వెట్రిసెల్వి శుభాకాంక్షలు తెలిపారు. సన్మానం అందుకుంటున్న బొడ్డు రాంబాబు, సున్నం శ్రీనివాసరావు -
ప్రత్తిపాడు– బాదంపూడి రోడ్డెక్కితే టెర్రరే
సంక్రాంతికి రోడ్లు వేస్తామన్నారు. చివరకు అరకొర మరమ్మతులతో సరిపెట్టారు. తాడేపల్లిగూడెంలో ఒక్క ప్రధాన రహదారి నిర్మాణం పూర్తి చేయకుండానే మమా అనిపించారు. బాదంపూడి నుంచి ప్రత్తిపాడు వరకూ ఉన్న ప్రధాన రహదారి తాడేపల్లిగూడెం పట్టణానికే కాకుండా, తణుకు, రావులపాలెం వంటి ప్రాంతాలకు ఎంతో కీలకం. తాము అధికారంలోకి రాగానే ఈ రోడ్డు వేస్తామని జనసేన ఎమ్మెల్యే ఊదరగొట్టారు. ఇప్పుడు ఏడాదిన్నర దాటినా కనీసం దీనివైపు కన్నెత్తి చూడడం లేదు. చిన్నాచితకా రోడ్లకు చేసినా మరమ్మతులు కూడా చేయకపోవడంతో ఈ రోడ్డు నరకాన్ని తలపిస్తోంది. ఇటీవల పలువురు ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురై కాళు,్ల చేతులు విరగ్గొట్టుకున్నారు. గతంలో చిన్నపాటి గోతులపై రాజకీయం చేసిన కూటమి నేతలు ఇప్పుడు భారీ గుంతలతో రోడ్లు అధ్వానంగా తయారైనా పట్టించుకోవడం లేదు. –పెంటపాడు -
వరద ముంపులోనే కనకాయలంక ప్రజలు
యలమంచిలి: గోదావరిలో వరద స్థిరంగా ఉండిపోవడంతో కనకాయలంక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కనకాయలంక చుట్టూ వరద చుట్టుముట్టడంతో ప్రజలు తమ దైనందిన అవసరాల కోసం పడవల మీద ప్రయాణిస్తున్నారు. గత నెల 29న వరదముంపునకు గురయిన కాజ్వే మీద ఎనిమిది రోజులుగా వరద నీరు ప్రవహిస్తుంది. ముఖ్యంగా తాగునీటి కోసం లంక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో తాగునీరు దొరకడం లేదు. దీంతో ప్రతి ఒక్కరూ చాకలిపాలెం వెళ్లి ఫౌండేషన్ నీరు తెచ్చుకుంటారు. మామూలు సమయంలో బైక్, సైకిల్ మీద తెచ్చుకుంటారు. వరద రావడంతో పడవపై తెచ్చుకోవాల్సి వస్తుంది. దీంతో ఒంటరి మహిళలు తాగునీరు తెచ్చుకోవడం కష్టమవుతుందని వాపోతున్నారు. ప్రభుత్వం కనీసం వాటర్టిన్స్ పంపిణీ చేయాలని కోరుతున్నారు. -
ఇంత అసమర్థ సర్కార్ని ఎన్నడూ చూడలేదు
గణపవరం: రైతు వ్యతిరేక ప్రభుత్వంగా పేరొందిన కూటమి ప్రభుత్వం చివరికి రైతులకు యూరియా కూడా అందించలేని దుస్థితిలో ఉందని, ఇంతటి అసమర్థ ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు పుప్పాల వాసుబాబు అన్నారు. శుక్రవారం నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ నాయకుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా రైతు లు యూరియా కోసం రేయింబవళ్లు ఎదురుచూసి నా బస్తా యూరియా కూడా దొరకడం లేదన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో యూరియా కొరత అనేదే లేకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించిన విషయాన్ని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం ఆర్బీకేల పేరు మార్చి, రైతులకు అందుబాటులో లే కుండా చేయడంతో పాటు యూరియా కూడా ఇ వ్వడం లేదన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇలా ఉంటే ముఖ్యమంత్రితోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు యూరియా కొరత లేదని చెప్పడం సిగ్గుచేటన్నారు. యూరియా కోసం లైన్లలో నిలిచిన రైతులను వైఎస్సార్సీపీ కార్యకర్తలుగా, సంఘ వ్యతిరేక శక్తులుగా చిత్రీకరించడం దారుణమన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పూర్తిస్థాయిలో యూరియాను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈనెల 9న ఏలూరులో నిర్వహించే ఆందోళనా కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. యూరియా కొరతపై మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు బెదిరింపు ధోరణికి దిగడం సరికాదన్నారు. వ్యవసాయ మంత్రి గ్రామాలకు వెళితే వాస్తవం ఏమిటో రైతులే తెలియజేస్తారన్నారు. వైఎస్సార్సీపీ మండల కన్వీనర్లు దండు రాము, సంకు సత్యకుమార్, మరడ మంగారావు, రావిపాటి సత్యశ్రీనివాస్, ఎంపిపిలు ధనుకొండ ఆదిలక్ష్మి, గంటా శ్రీలక్ష్మి, జెడ్పీటిసి సభ్యులు కొరిపల్లి జయలక్ష్మి, కోడే కాశీ, తుమ్మగుంట రంగాభవాని, వైఎస్సార్సిపి రాష్ట్ర కార్యదర్శి నడింపల్లి సోమరాజు, వెజ్జు వెంకటేశ్వరరావు, నాలుగు మండలాల బూత్ కన్వీనర్లు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే వాసుబాబు -
యూరియాను అందించలేని దుస్థితిలో కూటమి
నూజివీడు: కూటమి ప్రభుత్వ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారని, యూ రియాను సరఫరా చేయలేని దుస్థితిలో సర్కారు ఉందని మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ధ్వజమెత్తారు. నూజివీడులో వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులతో ఈనెల 9న నిర్వహిస్తున్న రైతు నిరసనపై శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతాప్ అప్పారావు మా ట్లాడుతూ కూటమి పాలనలో మద్యం ఏరులై పారుతుంది గాని, రైతులకు యూరియా దొరకడం లేదన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వ్యవసా యం పండుగలా సాగిందన్నారు. కూటమి ప్రభుత్వంలో మామిడి, మిర్చి, మొక్కజొన్న, మినుము, పొగాకు, పుచ్చ ఇలా పలు పంటలకు గిట్టుబాటు ధరలు లేవన్నారు. యూరియా కోసం రైతులు సొసైటీల వద్ద పడిగాపులు పడుతున్నారని, సొసైటీలకు వారానికోసారి కేవలం 12 టన్నులు మాత్రమే ఇస్తున్నారని, ఇది ఎలా సరిపోతుందని ప్రశ్నించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి సరిపడా యూరియాను ఎందుకు తీసుకురావడం లేదని నిలదీశారు. వైఎస్సార్సీపీ పాలన యూరియా కొరత తలెత్తలేదన్నారు. మద్యం షాపులు, బార్ల ఏర్పాటుపై ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ రైతు సంక్షేమంపై లేదన్నారు. మామిడి రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోతే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. చిత్తూరు ప్రాంతంలో మామిడి రైతులకు కంటితుడుపుగా ఇచ్చిన బోనస్ను నూజివీడు ప్రాంతంలో ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 9న యూరియా సమస్యపై రైతులతో కలిసి స్థానిక సబ్కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా రైతులు తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జెడ్పీ వైస్ చైర్మన్ గుడిమళ్ల కృష్ణంరాజు, ముసునూరు, ఆగిరిపల్లి జెడ్పీటీసీలు వరికూటి ప్రతాప్, పిన్నిబోయిన వీరబాబు, ఆగిరిపల్లి ఎంపీపీ గోళ్ల అనూష, ముసునూరు, చాట్రాయి మండలాల పార్టీ అధ్యక్షులు మూల్పురి నాగవల్లేశ్వరరావు, పుచ్ఛకాయల సుబ్బారెడ్డి, సీనియర్ నాయకలు పలగాని నరసింహారావు, ఈలప్రోలు సుబ్బయ్య, మచ్చా హరిబాబు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు -
నీళ్లునములుతున్న కమిషనర్
భీమవరం(ప్రకాశం చౌక్): పాలకోడేరు మండలం విస్సాకోడేరులోని పవన్ సుధ నాన్ లేఅవుట్కు భీమవరం మున్సిపాలిటీ నీటి సరఫరాను ము న్సిపల్ అధికారులు సమర్థించుకున్నారు. ‘సాక్షి’లో వచ్చిన ‘గొంతెండుతుంటే నాన్ లేఅవుట్కు నీళ్లా?’ శీర్షికన కథనానికి వివరణ ఇస్తూ తప్పు చేయలేదని పేర్కొన్నారు. అయితే ఆ వివరణలో నాన్ లేఅవుట్ లేక అప్రూవల్ లేఅవుట్ అనేది పంచాయతీకి సంబంధించిన విషయమని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. అయితే నాన్ లేఅవుట్ లేక అప్రూవుల్ లేఅవుట్ అనే విషయం తెలియకుండా కౌన్సిల్ తీర్మానంలో ఎలా పెడతారు? లేఅవుట్ వివరాలు లేకుండా ప్రత్యేక అధికారిగా ఉన్న జాయింట్ కలెక్టర్ కౌ న్సిల్ తీర్మానంపై ఎలా సంతకం చేస్తారనే దానికి మాత్రం సమాధానం చెప్పలేదు. నిబంధనల ప్ర కారం నాన్ లేఅవుట్కు మున్సిపల్ నీళ్లు ఇవ్వచ్చని ఉంటే ఎందుకు కౌన్సిల్ తీర్మానంలో నిబంధనల కాపీ జత చేయలేదు? ఇలా నాన్ లేఅవుట్లకు మున్సిపల్ నీళ్లు ఇచ్చుకుంటూ భీమవరం ప్రజలకు నీళ్లు లేకుండా చేస్తారా? అని భీమవరం పట్టణ వాసులు ప్రశ్నిస్తున్నారు. నాన్ లేఅవుట్కు నీళ్లివ్వ డం కష్టమని విస్సాకోడేరు పంచాయతీ చేతులు ఎ త్తేస్తే భీమవరం మున్సిపాలిటీ ఫీజులు కట్టించుకుని నీళ్లివ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర నాన్ లేఅవుట్లలోని వారు కూడా ఫీజులు చెల్లిస్తే నీళ్లిస్తారా.. అని ప్రశ్నిస్తున్నారు. విమర్శల వెల్లువ నాన్ లేఅవుట్కు మున్సిపాలిటీ నీటి సరఫరా చే స్తుంటే కలెక్టర్ పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం నుంచి వచ్చిన ఉత్తర్వుల్లో నీటి సరఫరా చేయాలని ఉన్నా.. నాన్ లే అవుట్ అయినా ఫర్వాలేదు డబుల్ ఫీజులు కట్టించుకుని నీళ్లు సరఫరా చేయండి అని ఎక్కడా పేర్కొనలేదు. ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులు గు ర్తించడం లేదు. మున్సిపల్ బైలా ప్రకారం నీళ్లు ఇ స్తున్నాం అని మాత్రమే వివరణలో ఉంది. అయితే నాన్ లేఅవుట్కు కూడా ఫీజులు కట్టించుకుని నీళ్లు ఇవ్వచ్చని మాత్రం చెప్పలేదు. మిగతా నాన్ లేఅవుట్లకు ఇస్తారా? పవన్ సుధా లేఅవుట్కు తీర్మానాలు చేసి ప్రభుత్వం నుంచి ఆర్డర్ పాస్ చేయించి మున్సిపాలిటీ నీళ్లు సరఫరా చేస్తున్నట్టుగా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలకు సమీపంలో ఉన్న నాన్ లేఅవుట్లకూ మంచినీటి సరఫరా చేస్తారా అన్నదానిపై జిల్లా ఉన్నతాధికారులు సమాధానం చెప్పాల్సి ఉంది. ‘సాక్షి’లో వచ్చిన కథనంపై ఇచ్చిన వివరణ అక్రమ లేఅవుట్కు నీటి సరఫరా కరెక్టే అని సమర్థింపు వాస్తవాలు రాసిన ‘సాక్షి’కి వివరణ ఇచ్చిన వైనం కౌన్సిల్ తీర్మానంలో లేఅవుట్ వివరాలు ఎందుకు పెట్టలేదు ? నాన్ లేఅవుట్కు నీళ్లు ఎలా ఇస్తారని పట్టణవాసుల ప్రశ్న మిగిలిన నాన్ లేఅవుట్లకూనీళ్లు ఇస్తారా అని అంటున్న వైనం భీమవరంలో అనేక ప్రాంతాలకు పైప్లైన్ ఉన్నా మంచినీళ్లు అందడం లేదు. శివారు ప్రాంతాలకు పైపులైన్ వేసి నీళ్లు అందించాల్సిన మున్సిపాలిటీ పక్క నియోజకవర్గంలో నాన్ లేఅవుట్కు పైపులైన్ వేసి మరీ నీళ్లివ్వడం అనేది రాజకీయ ఒత్తిడా లేక అవినీతి చోటుచేసుకుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టణంలో 39 వార్డుల్లోని అన్ని ప్రాంతాలకు పుష్కలంగా నీళ్లు అందించడంలో లేని ఆసక్తి నాన్ లేఅవుట్పై ఎందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు. నాన్ లేఅవుట్కు దగ్గరలో ఉన్న మున్సిపల్ పైపు నుంచి పైప్లైన్ వేయాలని ఉండి ఎమ్మెల్యే సూచించారని తీర్మానంలో పేర్కొనడం గమనార్హం. -
సంచార జాతులకు ఏం చేశారో చెప్పాలి?
కాళ్ల: సంచార జాతులకు బీజేపీ ప్రభుత్వం తరపున న్యాయం చేస్తామని విజయవాడలో నిర్వహించిన సంచార జాతుల దినోత్సవం సభలో బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారని, గత 11 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం సంచార జాతులకు ఏం చేసిందో చెప్పాలని ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెండ్ర వీరన్న కౌంటర్ ఇచ్చారు. పెద అమీరంలోని జిల్లా పార్టీ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ డీఎన్టీ, ఎన్టీ సర్టిఫికెట్లు ఇవ్వాలని, ఆ నెపం రాష్ట్ర ప్రభుత్వంపై నెట్టివేయడం సరికాదన్నారు. మతం పేరుతో ఓట్ల కోసం ఈ జాతులను వాడుకోవటం సరికాదని, సర్టిఫికెట్లు ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ చేసి భారత రాజ్యాంగంలోని 341, 342 ఆర్టికల్ పరిధిలోకి తీసుకొచ్చి న్యాయం చేయాలన్నారు. గతంలో అనేక కమిషన్లు కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చాయని ఇంతవరకు చర్చకు కూడా తీసుకురాకుండా ఈ వర్గాలకు న్యాయం చేస్తామని అబద్ధాలు చెప్పడం మాధవ్ మానుకోవాలని పెండ్ర వీరన్న అన్నారు. ఆగస్టు 31న ప్రధానమంత్రి మోదీ ఏం అద్భుతమైన సంక్షేమ పథకాలు ప్రకటించారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. గత ప్రభుత్వం సంచార జాతులకు వివిధ సంక్షేమ పథకాల కింద రూ.1288.44 కోట్ల లబ్ధి చేకూర్చిందన్నారు. గుర్తింపు లేని సంచార జాతులను గుర్తించి కుల ధ్రువీకరణ పత్రాలు ఇప్పించే కార్యక్రమానికి గత ప్రభుత్వం స్వీకారం చుట్టిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో సంచార జాతుల సంఘ జిల్లా అధ్యక్షుడు చుండూరి ముసలయ్య, ప్రధాన కార్యదర్శి చింత వీర్రాజు, కార్యదర్శి చుండూరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
భవనం పైనుంచి దూకి వృద్ధుడి ఆత్మహత్య
తణుకు అర్బన్: గుర్తుతెలియని వృద్ధుడు భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం రాత్రి తణుకులో జరిగింది. తణుకు సూర్యాలయం వీధిలోని ప్రైవేటు ఆస్పత్రి భవనం పైనుంచి దూకగా.. మృతుడికి 65 ఏళ్లు ఉంటాయని భావిస్తున్నారు. ఆస్పత్రి వర్గాలు ఇచ్చిన సమాచారంతో ఘటనా ప్రాంతానికి వెళ్లిన ఎస్సై ప్రసాద్ సీసీ పుటేజీ పరిశీలించారు. వృద్ధుడు ఆస్పత్రిలోకి వచ్చి మెట్ల మార్గంలో మూడో అంతస్తులోకి వెళ్లి రెయిలింగ్పై నుంచి దూకినట్లుగా నిర్ధారించారు. పైనుంచి కిందపడిన వెంటనే తలకు తీవ్రగాయమై రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి చొక్కా జేబులో బిస్కట్ ప్యాకెట్ తప్ప మరే వివరాలు లేకపోవడంతో ఆ వృద్ధుడు ఎవరనేది తెలియరాలేదు. దీంతో మృతదేహాన్ని తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. మృతుడి ఫొటోతోపాటు వివరాలను పోలీసులు పలు వాట్సాప్ గ్రూపుల్లో పెట్టడంతో వివరాలు బయటపడ్డాయి. అత్తిలి మండలం బల్లిపాడులోని ఇందిరమ్మ కాలనీకి చెందిన కాకర్ల ఆదినారాయణ (65)గా పోలీసులు గుర్తించారు. ఉదయం 10 గంటలకు ఇంటినుంచి బయటకు వచ్చిన ఆదినారాయణ మళ్లీ రాలేదని కుటుంబసభ్యులు చెప్పారు. మృతుడికి భార్యతోపాటు కుమారుడు, కుమార్తె ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. ఎస్సై ప్రసాద్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కృత్రిమ కొరతతోనే యూరియా సంక్షోభం
కొయ్యలగూడెం: యూరియా సంక్షోభానికి కృత్రిమ కొరతే కారణమని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. శుక్రవారం కొయ్యలగూడెంలో వైఎస్సార్సీపీ యూత్ నేత నూకల రాము ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 9న చేపట్టనున్న ఆర్డీఓ కార్యాలయాల ముట్టడి, ఆందోళనలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కూటమి నాయకులు యూరియాను బ్లాక్ మార్కె ట్కి తరలించి కోట్లాది రూపాయల స్కామ్కి తెరదీశారని ఆరోపించారు. కొందరు ప్రజాప్రతినిధులు, నాయకుల చేతిలో కీలుబొమ్మగా మారిన కూటమి ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతోందన్నారు. చంద్రబాబు అంటేనే కరువు, కాటకాలకు దత్తపుత్రుడని ఎద్దేవా చేశారు. యూరియా కోసం రైతులు సొసైటీల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొందన్నారు. కూటమి ప్రభుత్వం తమ పార్టీలకు చెందిన వారికి మాత్రమే సుపరిపాలన అందిస్తూ ప్రజలను నట్టేట ముంచేస్తోందన్నారు. పార్టీ మండల కన్వీనర్ తుమ్మలపల్లి గంగరాజు, ఎంపీపీ గంజిమాల రామారావు, మండల కో–కన్వీనర్ బిరుదుగట్ల ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు. బొజ్జగణపయ్యా.. యూరియా అందించవయ్యా గణేష్ సెంటర్లో పునర్నిర్మించిన వినాయక ఆలయంలో బాలరాజు పూజలు చేశారు. యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలు తీర్చాలని కోరారు. -
చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నాం
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయంలో ఏళ్ల తరబడి చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నామని, తమను రెగ్యులర్ చేయాలని కోరుతూ దేవస్థానం ఎన్ఎంఆర్ ఉద్యోగులు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్లకు శుక్రవారం వినతి పత్రాలను అందజేశారు. ముందుగా ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ను వారి క్యాంపు కార్యాలయాల్లో మర్యాద పూర్వకంగా కలసి, తమ సమస్యలను వివరించారు. ఆ తరువాత దుశ్శాలువాలు కప్పి, శ్రీవారి చిత్రపటాలను అందించి సత్కరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు తాము శ్రీవారి దేవస్థానంలో సుమారు 25 ఏళ్లుగా పనిచేస్తున్నామని తెలిపారు. చాలీచాలని జీతంతో పనిచేస్తూ, ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని చెప్పారు. దేవస్థానం ఎస్టాబ్లీష్మెంట్ చార్జెస్ 30 శాతం లోపు ఉంటే ప్రభుత్వంపై ఎలాంటి భారం పడదని, తమ దేవస్థానం ఎస్టాబ్లీష్మెంట్ చార్జెస్ కేవలం 16 శాతం లోపే ఉందని పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే ప్రస్తుతం ఆలయంలో పనిచేస్తున్న ఎన్ఎంఆర్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరినీ రెగ్యులర్ చేయొచ్చన్నారు. అప్పుడు కూడా హుండీల ద్వారా వచ్చే ఆదాయంతోనే తమకు జీతభత్యాలు అందుతాయని, ప్రభుత్వంపై ఎటువంటి భారం పడదన్నారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రెగ్యులర్ అయ్యేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎంఆర్ ఉద్యోగులు చవలం శ్రీనివాసరావు, సర్నాల రంగారావు, విజ్జురోతి కుంకుళ్లు, గోపా బాలు, నాగేశ్వరరావు, మంగరాజు తదితరులున్నారు. శ్రీవారి దేవస్థానం ఎన్ఎంఆర్ ఉద్యోగుల ఆవేదన -
గురువులపై కర్ర పెత్తనం
నిడమర్రు: కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ గురువులపై రోజు రోజుకూ నిఘా పెరుగుతూనే ఉంది. అందులో భాగంగా బడుల్లో నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమానికి పరిశీలకులు, సాక్షులు, నోడల్ పర్సన్స్ల పేరుతో ఇతర శాఖ అధికారులు, సిబ్బందితో ఉపాధ్యాయులపై పెత్తనం చేస్తున్నారంటూ వారు ఆరోపిస్తున్నారు. మరో పక్క రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకూ విద్యాశాఖ అధికారుల తనిఖీలు మామూలే. తాజాగా ఒక పక్క డైట్ కళాశాల అధ్యాపకులతో తనఖీలు చేస్తుండంగా మరో పక్క మండల అకడమిక్ ఫోరంలు ఏర్పాటు చేసి ఉపాధ్యాయులపై పర్యవేక్షణ పెంచేలా విద్యాశాఖ సిద్ధమైంది. ఇప్పటికే మూల్యాంకన పుస్తకాలు దిద్దడం, హోలిస్టిక్ ప్రోగ్రస్ కార్డులు అందించడం, మార్కులు ఆన్లైన్ చేయడం, టీచర్ డైరీ నింపడం వంటి కార్యక్రమాలతో వారం రోజులుగా ఉపాధ్యాయులకు బోధనకు దూరంగా ఉన్న సమయంలో ఉన్నత అధికారులతో తనిఖీలు చేయడంపై ఉపాధ్యాయ వర్గం మండిపడుతోంది. నాలుగు మండలాలకు ఒక డైట్ లెక్చరర్ దూబచర్ల డైట్ కళాశాలల్లో ఉన్న 11 మంది అధ్యాపకులకు నాలుగు మండలాల చొప్పున ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పనితీరుపై నివేదికలు అందించేలా ఉన్నత అధికారులు వారిని నియమించారు. వీరంతా వారికి కేటారయించిన మండలాల్లో ఎంపిక చేసుకున్న పాఠశాలల్లో ఉపాధ్యాయుల పనితీరు, విద్యార్థుల విద్యా సామర్థ్యాలు, భోజన పథకం వంటి అనేక అంశాలను పరిశీలించి జిల్లా అధికారులకు రోజువారీ నివేదిక అందించాల్సి ఉంది. మండల ఎకడమిక్ ఫోరంలు ప్రతి మండలాల్లో ఇప్పటికే మండల అకడమిక్ ఫోరంలు ఏర్పాటు చేశారు. ఈ ఫోరంలో ఎంఈవో 1, 2లు, నాలుగు క్లస్టర్ చైర్మన్లు, హైస్కూల్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ టీచర్లు ఏడుగురు, ప్రైమరీ ఎక్సపర్ట్ టీచర్స్ 5గురుని నియమించారు. వీరంతా వారానికి రెండు సార్లు మండల ప్రాతిపదికగా పాఠశాలలు పరిశీలన చేయాల్సి ఉంది. ఈ ఫోరంలో ఎంఈవో1, ఎంఈవో2 రెండు వేర్వేరు బృందాలుగా ఆయా గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలలను ఏకకాలంలో విజిట్ చేస్తారు. అలాగే విజిట్ జరుగుతున్న రోజు సంబంధిత స్కూళ్లలో ఏ టీచర్కు సెలవు మంజూరు చేయరు. అందరూ తప్పనిసరిగా హాజరయ్యేలా చర్యలు తీసుకుంటారు. అర్ధవరం జెడ్పీస్కూల్లో మూల్యాంకన పుస్తకాలు తనిఖీ చేస్తున్న డీఈవో నారాయణ (ఫైల్) బువ్వనపల్లి జెడ్పీస్కూల్లో ఉపాధ్యాయుల పనితీరును పరిశీలిస్తున్న డైట్ లెక్చరర్ లక్ష్మీనారాయణ (ఫైల్) రోజురోజుకీ పెరుగుతున్న నిఘా ఒక పక్క డైట్ లెక్చరర్లతో తనిఖీలు మరో వైపు మండల అకడమిక్ ఫోరంల ఏర్పాటు రోజువారీ హాజరుపైనా పర్యవేక్షణ ఉక్కిరిబిక్కిరవుతున్న ఉపాధ్యాయులు విద్యార్థి, ఉపాధ్యాయుల హాజరు సమయం, సిలబస్, టెక్ట్స్ బుక్, వర్క్ బుక్స్, నోట్ బుక్స్ పరిశీలన. ప్రతి శనివారం నిర్వహించే నోబ్యాగ్ డే కృత్యాల పుస్తకాలు, అభ్యసనా ఫలితాలు అంచనా వేయడం, మూల్యాంకన పుస్తకాలు, టీచర్ డైరీలు, స్కూల్ నమోదుపై జరుగుతున్న కృషి, మధ్యాహ్నా భోజన పథకం రికార్డులు, విద్యాప్రవేశ్ కార్యక్రమం నిర్వహణ వంటి అనేక అంశాలు పరిశీలిస్తారు. వీరందరూ అందించిన నివేదికలను సరి పోల్చుకుని ఆ పాఠశాల పనితీరుపై రాష్ట్రస్థాయిలో ఒక సమగ్ర నివేదిక అందించేలా జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటారు. -
రాయితీని తగ్గించుకునే ప్రయత్నం
ఏలూరు(ఆర్ఆర్పేట): కేంద్ర ప్రభుత్వం యూరియాపై సబ్సిడీ తగ్గించుకునేందుకు చేస్తున్న కుట్రలో భాగంగానే యూరియా దిగుమతి చేసుకోకుండా కొరత సృష్టిస్తోందని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాస్ విమర్శించారు. ఏలూరులోని అన్నే భవనంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం యూరియాపై సబ్సిడీని కుదించి వేసిందన్నారు. రాష్ట్రానికి సరిపడా యూరియా అందించని కేంద్రంపై ఒత్తిడి చేయకుండా సీఎం చంద్రబాబు ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం తగదన్నారు. యూరియా కోసం రైతులు సొసైటీలు, ఎరువుల షాపులు ముందు క్యూలు కట్టాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. అలాగే ఆధార్తో లింకు పెట్టి యూరియా ఇస్తామని చెప్పడం సరికాదన్నారు. రైతులకు నానో యూరియా అంటగట్టడం తగదన్నారు. వర్షాల సీజన్లో ఎరువుల కొరత దారుణమన్నారు. అనంతపురం జిల్లాలో సోలార్ ఎనర్జీ కంపెనీలకు సేకరిస్తున్న భూములు పరిశీలనకు వెళ్లిన రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్ రెడ్డికి గుంతకల్లు ఎమ్మెల్యే జి.జయరాం ఫోన్ చేసి దూషించడాన్ని ఖండిస్తున్నామన్నారు. గుంతకల్లు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
ఆదర్శం.. బోధన వినూత్నం
శురకవారం శ్రీ 5 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025నా పాఠశాల, నా విద్యార్థులు, నా పాఠ్యాంశాల బోధన, నా తరగతి అనే అంశాలతో నిరంతరం గడిపేస్తూ విశ్రాంతి ఎరుగని ఉపాధ్యాయుడిగా సేవలందిస్తున్నారు ఆర్.నాగేంద్రసింగ్. శ్రీరామ్నగర్ ప్రత్యేక పాఠశాలలో పనిచేస్తున్న ఆయన 1998లో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించారు. బాహ్య అంశాలను చొప్పించి పాఠాలు బోధించడం, బొమ్మలు వేసి వినూత్నంగా బోధించడం ఆయన శైలి. నాడు–నేడులో భాగంగా పాఠశాల ప్రహరీలపై ఆయన ఆకర్షణీయంగా బొమ్మలు వేసి ఔరా అనిపించారు. తన స్నేహితుడిని ప్రోత్సహించి విద్యార్థులకు యూనిఫాం కుట్టు పనికి అవసరమైన రూ.20 వేలు ఇచ్చేలా కృషి చేశారు. అలాగే క్రీడాకారులకు స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, షటిల్ బ్యాడ్మింటన్లో శిక్షణ ఇస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన 200కు పైగా టీ–20 క్రికెట్ పోటీలకు అంపైర్గా వ్యవహరించారు. ఆయన దివ్యాంగుడైనా ఏమాత్రం లెక్కచేయకుండా పలు రకాల శిక్షణలతో ఆకట్టుకుంటున్నారు. అజ్ఞానాన్ని పారదోలి జీవితంలో విజ్ఞాన కాంతులు నింపేవారే గురువులు. పేరుకు మూడక్షరాలే అయినా తరాల తలరాతను మార్చే సత్తా వారి సొంతం. అందుకే మాతృదేవోభవ.. పితృదేవోభవ.. అన్న తర్వాత ఆచార్యదేవోభవ అంటూ తల్లిదండ్రుల తర్వాత గురువుకే ఆ స్థానం కల్పించారు. వినూత్నంగా విద్యాబోధన, సామాజిక సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలుస్తున్న ఉపాధ్యాయులు ఎంతోమంది ఉన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యనందిస్తూ వారి ఉన్నతికి బంగారు బాటలు వేస్తూ శభాష్ ‘గురూ’ అనిపించుకుంటున్నారు. – ఏలూరు (ఆర్ఆర్పేట)/గణపవరం/నిడమర్రు ఏఐతో పాఠాలు బోధిస్తున్న గాదిరాజు నరసింహరాజు చెత్తకుప్పల వద్ద ఉన్న చిన్నారులతల్లిదండ్రులతో మాట్లాడుతున్న స్టీవెన్ తరగతి గదుల్లో హైటెక్ బోధనా పద్ధతులతో ఆకట్టుకుంటున్నారు గణపవరం మండలం జల్లికొమ్మర జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయుడు గాదిరాజు వెంకట నరసింహరాజు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలకు స్మార్ట్ టీవీలు, ఐఎఫ్పీ ప్యానెల్స్తో డిజిటల్ బోధనను చేరువ చేయగా పలువురు ఉపాధ్యాయులు వాటిని ఉపయోగిస్తూ పాఠాలు బోధిస్తున్నారు. వీరిలో నరసింహరాజు మాస్టారు ఒకరు. 56 ఏళ్ల వయసులోనూ ఏఐ టెక్నాలజీ ద్వారా పాఠ్యాంశాలను బోధిస్తున్నారు. ఏఐ సాయంతో వీడియోలు తయారు చేసి బోధిస్తున్నారు. పలు అంశాలను విజువలైజ్ చేసి విద్యార్థులకు చూపిస్తూ వాటిపై అవగాహన, ఆసక్తి కల్పిస్తున్నారు. ఈ మాస్టారు తయారు చేస్తున్న వీడియోలను టీచర్ వాట్సాప్ గ్రూప్స్లో పోస్ట్ చేయడం వల్ల మిగిలిన ఉపాధ్యాయులకు ఉపయుక్తంగా ఉంటోంది. బడిఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించడం ఉద్యమంగా పెట్టుకున్నారు వైఎస్సార్ నగర్ పాఠశాల ఉపాధ్యాయుడు బీజేఏ స్టీవెన్. పేదలు, మురికివాడల్లోని పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించేందుకు కృషిచేస్తున్నారు. తరచుగా ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ ఎక్కడైనా బడికి వెళ్లని పిల్లలు కనిపిస్తే వారిని చదువుకునేలా ప్రోత్సహిస్తున్నారు. 1998లో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించిన ఆయన పేద పిల్లలకు విద్యా సౌకర్యాలు కల్పించేందుకు సొంతంగా ఖర్చు పెట్టడంతో పాటు దాతల సహకారం కూడా తీసుకుంటున్నారు. విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, యూనిఫారం వంటి విద్యా సామగ్రితో పాటు పోషకాహారం కూడా అందిస్తున్నారు. ఏలూరు మండలం పోణంగి పాఠశాలలో తొమ్మిదేళ్లకు పైగా పనిచేసి విద్యార్థుల సంఖ్యను 120 నుంచి 270కు పెంచారు. బడి మానివేసిన పిల్లలను తిరిగి బడికి పంపేలా తల్లిదండ్రులకు అవగాహన కలిగించడం, విద్యార్థులను ప్రోత్సహించడానికి వారికి వచ్చిన మార్కులు, ప్రవర్తన ఆధారంగా అవార్డులు ఇస్తున్నారు. పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు నిడమర్రు మండలంలో పనిచేస్తున్న భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు కె.సుబ్బరాజు. జీతంలో కొంత మొత్తాన్ని వెచ్చించడంతో పాటు తన ఇంటి వద్దనే ప్రత్యేక బోధనతో విద్యార్థులను పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు. 16 ఏళ్ల సర్వీసు లో పదుల సంఖ్యలో విద్యార్థులను ఉన్నత చదువులకు ప్రో త్సహించారు. ఈయన ప్రోత్సాహంతో సుమారు 24 మంది విద్యార్థులు నూజివీడు, ఇడుపులపాయ త్రిపుల్ఐటీల్లో సీట్లు సాధించారు. మరో 30 మంది ఎనిమిదో తరగతి విద్యార్థులు ఎన్ఎంఎంఎస్ ఉపకార వేతనాలకు ఎంపికయ్యారు. ఇద్దరు విద్యార్థులు ఐఐటీలో ఎంటెక్ సీట్లు సాధించారు. సైన్సు ప్రదర్శనలో జాతీయ, రాష్ట్ర, జిల్లాస్థాయిల్లో విజేతలుగా నిలిచారు. ఏటా సైన్సు దినోత్సవాన్ని తన సొంత ఖర్చులతో సుబ్బరాజు నిర్వహిస్తున్నారు. ఆ యన విద్యార్థులు చెకుముకి సైన్సు క్విజ్ పోటీల్లో మూడు సార్లు జిల్లాస్థాయిలో ప్రథమ స్థానం సాఽధిస్తున్నారు. దశాబ్ద కాలంగా ఏపీఆర్జేసీ, పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు. సైన్స్ఫేర్లో ఒకసారి జాతీయ స్థాయిలో, ఏడు సార్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో మూడో స్థానం సాధించారు. గురుతర బాధ్యత విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి విభిన్న శైలిలో బోధనలు ఏఐతో పాఠాలు.. సైన్స్ ప్రదర్శనలు ఆదర్శంగా నిలుస్తున్న ఉపాధ్యాయులు నేడు ఉపాధ్యాయ దినోత్సవం -
రైతు పక్షాన వైఎస్సార్సీపీ పోరాటం
● 9న ర్యాలీ, వినతిపత్రం అందజేత ● పార్టీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ కైకలూరు: పంటలకు అదునులో వేయాల్సిన యూ రియా సరఫరాలో విఫలమైన తెలుగుదేశం ప్రభు త్వ వైఫల్యాన్ని ఎండగడుతూ ఈనెల 9న ఏలూరు ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందించే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) పిలుపినిచ్చారు. కై కలూరు పార్టీ కార్యాలయంలో గురువారం నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. డీఎన్నార్ మాట్లాడుతూ పార్టీ ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం అక్కడక్కడా యూరియాను సరఫరా చేస్తోందన్నారు. పూర్తిస్థాయిలో రైతుల సమస్యలను పరిష్కరించడానికి మంగళవారం ఉదయం 10 గంటలకు ఏలూరుకు అందరూ హాజరుకావాలన్నారు. ముందుగా వైఎస్ విగ్రహానికి నివాళి అర్పించి, శాంతియుత ర్యాలీతో ఆర్డీఓ కార్యాలయానికి చేరాలన్నారు. ఇప్పటివరకు కై కలూరు నియోజకవర్గంలో 6,600 పైబడి కార్యకర్తలు, నాయకుల వివిధ హోదాల్లో పదవులు పొందారన్నారు. వీరికి పార్టీ తరఫున గుర్తింపు కార్డులు అందిస్తామన్నారు. ఒకేసారి అందరికీ సెల్ఫోన్లలో సందేశాలు అందించే పక్రియను ప్రారంభిస్తామన్నారు. నియోజకవర్గంలో వివిధ విభాగాల పనితీరును బోర్డుపై డీఎన్నార్ వివరించారు. కూటమి ప్రభుత్వానికి అరిష్టం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చేబోయిన వీరరాజు, ముదిరాజుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కోమటి వి ష్ణువర్ధనరావు మాట్లాడుతూ రైతు కన్నీళ్లు కూటమి ప్రభుత్వానికి అరిష్టదాయకమన్నారు. 50 ఏళ్ల క్రితం యూరియా కొరత చూశామని, చంద్రబాబు పాలనలో మరోసారి కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీపీలు రామిశెట్టి సత్యనారాయణ, పెద్దిరెడ్డి శ్రీరామదుర్గాప్రసాద్ మాట్లాడుతూ విజనరీ సీఎం అని చెప్పుకునే వారు యూరియా సమస్యను పరిష్కరించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. పార్టీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి బీవీ రావు మాట్లాడుతూ కూటమి పేరు మార్చిన అన్నదాత సుఖీభవతో ఉపయోగం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి గాదిరాజు మణికంఠ వర్మ, రాష్ట్ర మైనార్టీ సెల్ సెక్రటరీ గాలిబ్బాబు, జిల్లా మేధావుల ఫోరం అధ్యక్షుడు దుగ్గిరాల నాగు, ఎస్సీ విభాగ రాష్ట్ర నాయకుడు గుమ్మడి వెంకటేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు తిరుమాని రమేష్, బోయిన రామరాజు, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు జయమంగళ కాసులు, బొమ్మనబోయిన గోకర్ణయాదవ్, దున్నా బేబీ, చాన్భాషా, చినరాజు, ఈడే వెంకటేశ్వరరావు, మండ నవీన్, ఏసుబాబు, నరసయ్య, బొబ్బిలి రత్తయ్యనాయుడు, సమయం అంజి, రేగిశెట్టి రాము పాల్గొన్నారు. -
కోకో రైతులు సంఘటితం కావాలి
పెదవేగి: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోకో రైతులు సంఘటితం కావాలని రైతు నాయకులు పిలుపునిచ్చారు. గురువారం విజయరాయిలోని సీతారామ కల్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (ఎఫ్పీఓ) ఆధ్వర్యంలో కోకో రైతుల రాష్ట్ర సదస్సు నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ అధ్యక్షత వహించారు. సంఘ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఏబీ వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.కేశవరావు మాట్లాడుతూ కార్పొరేట్ కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వకుండా రైతులను మోసగిస్తున్నాయని విమర్శించారు. అయినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో కోకో బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సరైన మార్కెటింగ్ విధానంలో కోకో గింజలను అమ్ముకోగలిగితే రైతులకు లాభాలు వస్తాయని సీపీసీఆర్ఐ కాసర గోడ్ మాజీ డైరెక్టర్ డాక్టర్ పి.చౌడప్ప అన్నారు. నాబార్డ్ ఏజీఎం ఎం.రాజశేఖర్ రెడ్డి మా ట్లాడుతూ కోకో రైతుల ఎఫ్పీఓకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఉద్యాన శాఖ జేడీ మునిరెడ్డి, ఉద్యాన శాఖ జిల్లా అధికారి ఎస్.రామ్మోహన్, కొబ్బరి రైతుల ప్రాంతీయ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు మున్నంగి సుబ్బారెడ్డి, పెదవేగి ఆయిల్పామ్ రైతుల సంఘం అధ్యక్షుడు ఉండవల్లి వెంకటరావు, సంఘ ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కరరావు, కోకో రైతుల సంఘం రాష్ట్ర నాయకులు గుదిబండి వీరారెడ్డి, కోనేరు సతీష్బాబు పాల్గొన్నారు. -
యూరియా సరఫరాలో కూటమి విఫలం
బుట్టాయగూడెం: ఖరీఫ్ సీజన్ ముగుస్తున్నా కూ టమి ప్రభుత్వం రైతులకు యూరియా అందించడంలో పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. బుట్టాయగూడెంలో పా ర్టీ సీనియర్ నేత ఆరేటి సత్యనారాయణ ఇంటి వద్ద గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యూరియాను రైతులకు అందకుండా బ్లాక్లో విక్రయిస్తూ రైతులను కష్టాలు పాలు చేస్తున్నారన్నారు. పంటల బీమా లేక రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. సీఎం చంద్రబాబు అమరావతిలో కూర్చుని ఉచిత సలహాలు ఇస్తున్నారని విమర్శించారు. వరికి రైతులు యూరియా వేయొద్దని సలహా ఇవ్వడం శోచనీయమన్నారు. ఆయన తనయుడు లోకేష్ గళ్లాపెట్టె సర్దుకుంటున్నారని, పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్లో బిజీ అయిపోయారని మండిపడ్డారు. ఈ పరిస్థితుల్లో రైతును పట్టించుకునే నా థుడే కరువయ్యాడన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే రైతుల దయనీయ స్థితి అర్థమవుతుందన్నారు. పొ గాకు, మిర్చి, పామాయిల్ ఇలా ఏ పంట చూసినా గిట్టుబాటు ధర లేదన్నారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు సరఫరా చేయడంతో పాటు విత్తు నుంచి పంటల విక్రయాల వరకూ అండగా నిలిచారన్నారు. కరోనా కష్టకాలంలోనూ అన్నివిధాలా అండగా నిలిచారన్నారు. మార్క్ఫెడ్ ద్వారా పొ గాకు కొనుగోలు చేయించి గిట్టుబాటు ధర కల్పించారన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం యూరియా సరఫరా చేయకపోతే రైతులే ప్రభుత్వానికి ఉరి వేస్తారన్నారు. రైతు సమస్యలపై ఈనెల 9న జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద జరిగే ధర్నా కార్యక్రమంలో నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. జెడ్పీటీసీ మొడియం రామతులసి, పార్టీ జిల్లా కార్యదర్శి సయ్యద్ బాజీ, పార్టీ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు తాళ్లూరి ప్రసాద్, జిల్లా విభజన విభాగం ఉపాధ్యక్షుడు బగ్గి దినేష్, సర్పంచ్లు బన్నే బుచ్చిరాజు, తెల్లం వెంకటలక్ష్మి, మాల్చి వెంకన్నబాబు, నాయకులు తెల్లం దేవరాజు, రవి తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే బాలరాజు -
మద్యం మత్తులో హత్యాయత్నం
తణుకు అర్బన్: మద్యం మత్తులో ఉన్న యువకుడు కత్తితో భార్యభర్తలపై దాడికి పాల్పడిన ఘటన తణుకులో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తణుకు కొమ్మాయిచెర్వుగట్టు ప్రాంతంలో వినాయచవితి మహోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న ఊరేగింపులో జరిగిన వాగ్వాదంలో చుక్కా సంజయ్ అనే యువకుడు స్థానికంగా నివసిస్తున్న కొలుసు శంకర్, నాగమణి దంపతులపై కత్తితో విచక్షణారహితంగా దాడిచేశాడు. గత పదేళ్లుగా తణుకులో కొబ్బరికాయల వ్యాపారం చేసుకుంటున్న శంకర్కు, సంజయ్ పాత గొడవలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఫూటుగా మద్యం సేవించి ఉన్న సంజయ్ బాఽధితుడి ఇంట్లోకి చొరబడి కత్తితో దాడిచేసినట్లుగా తెలుస్తోంది. తీవ్రంగా గాయపడ్డ భార్యాభర్తలిద్దరినీ స్థానికులు తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించగా వైద్యసేవలందిస్తున్నారు. దాడికి పాల్పడిన యువకుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. పట్టణ ఎస్సై శ్రీనివాస్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. నూజివీడు: విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మోసం చేశారంటూ నూజివీడుకు చెందిన అరిగెల అమృతవల్లి చేసిన ఆరోపణలు అవాస్తవమని కే సంధ్య, ఆమె సోదరుడు కే శ్రీకాంత్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మా తల్లి ఇంట్లో గతంలో కొన్ని నెలలు అమృతవల్లి పనిమనిషిగా పనిచేసిందని, ఆ సమయంలో తన ఆర్థిక ఇబ్బందులు చెప్పి విదేశాల్లో ఏమైనా అవకాశాలుంటే తనకు సాయం చేయాలని కోరిందన్నారు. దీంతో తమ స్నేహితుడు డాక్టర్ సమీర్ ఖతార్లో ఉంటే ఆయన ద్వారా సాయం చేయడమే కాకుండా శ్రీకాంత్ సైతం కొంత డబ్బును ఆమెకు చేబదులుగా ఇచ్చాడన్నారు. దీంతో ఖతార్ వెళ్లిన ఆమె రెండు నెలల పాటు అక్కడ పనిచేసి జీతం కూడా తీసుకుందన్నారు. అయితే వీసా మార్పిడి, వర్క్ పర్మిట్ వంటి అవసరమైన వాటిని అమృతవల్లి చేసుకోలేక తిరిగి ఇక్కడకు రావాల్సి వచ్చిందన్నారు. తిరుగు ప్రయాణం టిక్కెట్ కూడా సమీర్ కొని పంపించాడని, కానీ అమృతవల్లి మాత్రం నష్టపోయినట్లు నటిస్తూ, తప్పుడు ఆరోపణలతో బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బు దండుకోవడానికి చూస్తోందన్నారు. ఆమె ఆరోపణలకు మా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శంకర్, నాగమణి -
సందిగ్ధంలో వీసీ పీఠం
● వ్యాజ్యపరమైన అంశంతో ముడి ● 11న స్పష్టత వచ్చే అవకాశం తాడేపల్లిగూడెం: డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ ఉద్యోగ కాల పొడిగింపు, లేదంటే కొత్త వారి నియామకం వ్యవహారం సందిగ్ధతకు ఇంకా తెరపడలేదు. వ్యవహారం వ్యాజ్యపరమైన వివాదంతో ముడిపడి ఉండటంతో ఇంకా కామాలతో వ్యవహారం సాగుతోంది. ప్రస్తుత వీసీ ఉద్యోగ కాలం ఆగస్టు 31తో ముగిసింది. యూజీసీ నిబంధనల ప్రకారం జీఓ నంబరు 39ను అనుసరించి తనకు 65 ఏళ్ల వయస్సు వచ్చే వరకు వీసీ పదవిలో కొనసాగించాలని వీసీ గోపాల్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు గత నెలలో ఈ నిబంధన వ్యవసాయశాఖ పరిధిలో ఉద్యోగులుగా ఉన్న వారికి వర్తించదని, దీనిపై మరోసారి అఫిడవిట్ సెప్టెంబరు 29న దాఖలు చేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా వీసీ కొనసాగింపు, లేదా ఇన్చార్జిని నియమించడం వంటి ప్రక్రియను పూర్తి చేయలేదు. ఈలోగా అఫిడవిట్ దాఖలుకు ముందు నాయస్థానంలో జరిగిన వాదనల నేపథ్యంలో మరోమారు ఈ నెల 11న ఉద్యానవర్సిటీ వీసీ వ్యవహారంపై వాదనలు జరుగనున్నాయని తెలిసింది. దీంతో వీసీ కొనసాగింపు, లేదంటే కొత్త వారిని నియమించడం అనేది 11న తేలవచ్చని తెలుస్తోంది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు.. ఉద్యోగ నియామక పత్రాలను ఉద్యోగులకు ప్రభుత్వాలు ఇచ్చే సమయంలో అంటిల్ ఫర్దర్ ఆర్డర్ అనే పదాన్ని నియామకపు లేఖలో ఉటంకిస్తాయి. అంటే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇచ్చిన ఉద్యోగంలో కొనసాగవచ్చు అని అర్థం. అంటే ఉద్యోగకాలం ఉన్న వారికి మాత్రమే అంటిల్ ఫర్దర్ ఆర్డర్ అనే నిబంధన వర్తిస్తుంది. అంతే కాని ఉద్యోగ విరమణ చేసిన వారి విషయంలో వర్తించదు. ఉద్యానవర్సిటీ వీసీగా ఉన్న కె.గోపాల్ ఉద్యోగకాలం ఆగస్టు 31తో ముగిసింది. అంటిల్ ఫర్దర్ ఆర్డర్ మార్గదర్శకాలు ఆయనకు వర్తించదని అధికార వర్గాల సమాచారం. అయితే వీసీ తర్వాత పర్యవేక్షక బాధ్యతలు వహించాల్సిన వ్యక్తులు కూడా అంటిల్ ఫర్దర్ ఆర్డర్ను అడ్డుపెట్టుకొని తన పైఅధికారి విషయంలో మౌనంగా ఉన్నారని తెలుస్తోంది. గురువారం జరుగనున్న రాష్ట్ర క్యాబినెట్లో టేబుల్ అజెండాగా పెట్టే విషయంలో ఉద్యానవర్సిటీ వీసీ అంశంగా ఉండవచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. -
గంజాయి కేసులో ఆరుగురి అరెస్ట్
ఏలూరు టౌన్: గంజాయి విక్రయిస్తున్న నలుగురిని అరెస్ట్ చేయగా, ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నట్లు ఏలూరు త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు తెలిపారు. ఏలూరు త్రీటౌన్ పోలీస్స్టేషన్లో ఆయన ఎస్సై పీ రాంబాబుతో కలిసి వివరాలు వెల్లడించారు. ఈనెల 3వ తేదీన ఏలూరు మినీబైపాస్ రోడ్డులో గ్రాండ్ కృష్ణ ఫంక్షన్ హాల్ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్నారని సమాచారం మేరకు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలతో ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్ పర్యవేక్షణలో సిబ్బందితో దాడులు చేశామన్నారు. ఈ దాడుల్లో నిందితులు ఏలూరుకు చెందిన విష్ణుశెట్టి సత్యరూప్కుమార్ అలియాస్ సతీష్, కొమ్మిన మణికంఠ అలియాస్ సర్థార్పాండా, తమ్మిశెట్టి రామ్చరణ్, అల్లంపల్లి రాజేష్ తోపాటు మరో ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారివద్ద నుంచి సుమారు మూడున్నర కిలోల గంజాయి, రెండు మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితులపై ఏలూరు మండలంలోని ఆయా పోలీస్స్టేషన్లలో ఇప్పటికే వివిధ కేసులు నమోదయ్యాయని చెప్పారు. -
ఇసుక లారీల స్వాధీనం
చింతలపూడి: ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమంగా గోదావరి ఇసుకను హైదరాబాద్ తరలిస్తున్న లారీలను చింతలపూడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చింతలపూడి మండలం ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతాలగుండా ఇసుకను తెలంగాణలో అధిక ధరలకు విక్రయిస్తూ అక్రమార్కులు అక్రమంగా ఆర్జిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున పోలవరం, కొవ్వూరు ఇసుక రీచ్ల నుంచి తరలిస్తున్న 16 ఇసుక లారీలను స్థానికుల సమాచారం మేరకు అల్లిపల్లి సమీపంలో చింతలపూడి సీఐ క్రాంతికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు పట్టుకున్నారు. పట్టుకున్న లారీలను రెవెన్యూ అధికారులకు బైండోవర్ చేశారు. కాగా ఇసుక లారీలు పట్టుబడిన వెంటనే అప్రమత్తమైన అక్రమార్కులు వాటిని విడిపించుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. అయితే పోలీసులు ఎలాంటి వత్తిళ్ళకు తలొగ్గకుండా కేసులు నమోదు చేశారు. నిత్యం వందలాది లారీల్లో ఇసుక ఏపీ నుంచి తెలంగాణ రాష్ట్రం తరలి పోతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా పెట్టి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
వదలని వరద గోదావరి
● జలదిగ్బంధంలో 25 గ్రామాలు ● నేటికీ బయట పడని రహదారులు ● పడవ ప్రయాణమే ఆ గ్రామాలకు దిక్కు వేలేరుపాడు: ఒక వైపు గ్రామాలను చుట్టుముట్టిన గోదావరి వరద.. మరో వైపు అడపా దడపా జోరున కురుస్తున్న వాన.. ముంపు మండలాల వాసులను మూడు నెలలలుగా కలవరపెడుతున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి వరద నీటి మట్టం తగ్గుతూ.. పెరుగుతూ దోబూచులాడుతోంది. ఎగువన ఉన్న తుపాకులగూడెం సమ్మక్క, సారక్క పూర్తిగా గేట్లు ఎత్తివేశారు. దీంతో 8 లక్షల క్యూసెక్కుల నీరు కిందకు వదిలారు. దీనికి తోడు తాలిపేరు వరద తోడవ్వడంతో బుధవారం 43 అడుగులకు నీటిమట్టం పెరగడంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. గురువారం రాత్రి 8.30కు గోదావరి నీటి మట్టం 42.60 అడుగులకు చేరడంతో ఉపసంహరించారు. వరద వల్ల జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో 18 రోజులుగా వేలేరుపాడు మండలంలో 25 గ్రామాలు జలదిగ్భంధనంలోనే ఉన్నాయి. వేలేరుపాడు నుంచి కొయిదా వెళ్లే రహదారిలో మేళ్ళవాగు, ఎద్దెలవాగు, టేకూరు, తదితర వాగుల వంతెనలు ముంపులోనే ఉన్నాయి. దిగువనున్న కొయిదా, కాచారం, పేరంటపల్లి, టేకుపల్లి, తాళ్ళగొంది, పూసుగొంది, టేకూరు, కట్కూరు, సిద్దారం, ఎడవల్లి, చిట్టంరెడ్డిపాలెం, ఎర్రతోగు, చిగురుమామిడి, బోళ్ళపల్లి, పాతనార్లవరం, తూర్పుమెట్ట, కొత్తూరు, తదితర గ్రామాలతోపాటు మరో ఎనిమిది గ్రామాలు జలదిగ్బంధనంలోనే ఉన్నాయి. వేలేరుపాడు నుంచి రేపాకగొమ్ము, వెళ్లే రహదారి నేటికీ మోకాల్లోతు నీరు పారుతోంది. దీంతో ఆయా గ్రామ ప్రజలు మోకాల్లోతు నీటిలో ప్రయాణిస్తున్నారు. రుద్రమకోట వెళ్లే రహదారులు ఇంకా నీటిలోనే మునిగి ఉండటంతో ఆయా గ్రామాల ప్రజలు లచ్చిగూడెం గ్రామం గుండా రాకపోకలు సాగిస్తున్నారు. పడవ ప్రయాణమే దిక్కు దిగువ ప్రాంతంలో ఉన్న 18 గిరిజన గ్రామాలకు గత మూడు నెలలుగా పడవ ప్రయాణమే దిక్కయింది. ఎద్దెలవాగు, టేకూరు, వాగుల వంతెనలు నీట మునగడంతో పడవల పైనే ప్రయాణం సాగిస్తున్నారు. ఏ అవసరమున్నా మండల కేంద్రమైన వేలేరుపాడుకు రావాలంటే పడవ దాటి రావాల్సిందే. పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు కూడా పడవల పైనే పాఠశాలలకు వస్తున్నారు. గురువారం టేకూరు వాగు వద్ద స్థానిక పోలీసులు పడవ దాటించి పాఠశాలలకు పంపుతున్నారు. ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలతో లైఫ్ జాకెట్లతో బోట్లపై ప్రయాణిస్తున్నారు. పాతనార్లవరం గ్రామాన్ని పట్టించుకోని అధికారులు జలదిగ్బంధనంలో ఉన్న పాతనార్లవరం గ్రామాన్ని అధికారులు పట్టించుకోకుండా వదిలేశారు. ఇక్కడ 50 కుటుంబాలున్నాయి. ఈ గ్రామానికి వెళ్లే రహదారి నీటమునిగి జలదిగ్బంధనంలో ఉన్నప్పటికీ ఆ గ్రామానికి కనీసం పడవ కూడా ఏర్పాటు చేయకపోవడంతో గ్రామస్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు. -
రైతుల కళ్లలో వెలుగులు నింపాలి
జంగారెడ్డిగూడెం: రైతుల కళ్లల్లో కన్నీళ్లు తుడిచి, వెలుగులు నింపాలని వైఎస్సార్సీపీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంభం విజయరాజు డిమాండ్ చేశారు. ఈనెల 9న జంగారెడ్డిగూడెంలో ప్రదర్శన నిర్వహించి రైతు సమస్యలపై ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించే నేపథ్యంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకుడు జెట్టి గురునాథరావుతో కలిసి ఆయన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయరాజు మాట్లాడుతూ ఈనెల 9న రైతుల సమస్యలు పరిష్కరించి, యూరియా, ఎరువులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచి, గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు చేపట్టాలని కోరుతూ భారీ ప్రదర్శన నిర్వహించనున్నామన్నారు. కూటమి ప్రభు త్వం అధికారంలోకి రావడానికి మోసపూరిత వా గ్దానాలు చేసిందన్నారు. గతేడాది అన్నదాత సుభీభవకు ఎగనామం పెట్టిందన్నారు. మెట్ట ప్రాంతంలో పొగాకు, మిచ్చి, కోకో, పామాయిల్ తదితర పంటలకు గిట్టుబాటు ధరలు లేవన్నారు. ప్రస్తుతం యూరియా కొరతతో రైతులు అల్లాడుతున్నారని, గంటల తరబడి డీసీఎంఎస్ల వద్ద పడిగాపులు పడాల్సి వస్తోందన్నారు. యూరియా కోసం రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సీఎం చంద్రబాబు ఈ విషయంలో సిగ్గుపడాలన్నారు. చంద్రబాబు దృష్టి అమరావతిపై ఉందని, రైతులపై లేదన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కీసర సరితా రెడ్డి, పార్టీఉపాధ్యక్షుడు జగ్గవరపు జానకిరెడ్డి, జిల్లా మున్సిపల్ విభాగం అధ్యక్షుడు బొడ్డు వెంకటేశ్వరరావు, ప్రచార విభా గం అధ్యక్షుడు త్సల్లాబత్తుల శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షుడు కర్పూరం గవరయ్య గుప్త, నాలుగు మండలాల అధ్యక్షులు ఓరుగంటి నాగేంద్ర, రమేష్రెడ్డి, ఎ.శాంతారావు, ఆర్.సత్యనారాయణ, రైతు విభాగం అధ్యక్షులు ఖాదర్బాబు రెడ్డి, చండీ ప్రియ, ముప్పిడి శ్రీనివాసరావు, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శులు గురుజాల పార్థసారథి, కుక్కల ధర్మరాజు, మల్నీడి బాబి, జెట్టి ఆదిత్య, బత్తిన చిన్న, చింతలపూడి జెడ్పీటీసీ ఎం.నీరజ పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
పక్షులు వేటాడుతున్న ఏడుగురి అరెస్ట్
నరసాపురం: లక్ష్మణేశ్వరం చేపల మార్కెట్ వద్ద పక్షులను వేటాడి విక్రయిస్తున్న ఓ బృందంపై గురువారం భీమవరం ఫారెస్ట్ రేంజ్ అధికారులు దాడి చేశారు. ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి మూడు నాటు తుపాకులు, కొంత గన్ పౌడర్, 13 మృత పక్షులను స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణులను వేటాడటం, అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న నేరంపై కేసు నమోదు చేసినట్టు భీమవరం ఫారెస్ట్ రేంజ్ మురాల కరుణాకర్ అధికారి చెప్పారు. వన్యప్రాణులను వేటాడటం, విక్రయించడం చట్టప్రకారం నేరమని హెచ్చరించారు. -
పాము కాటుకు రైతు బలి
ద్వారకాతిరుమల: మండలంలోని సూర్యచంద్రరావుపేటలో ఒక రైతు పాము కాటుకు గురై మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చవల అశోక్ (23) వ్యవసాయం చేస్తుంటాడు. రోజులానే బుధవారం సాయంత్రం పొలానికి వెళ్లిన అశోక్ గడ్డి కోస్తుండగా కాలుపై తాచుపాము కరిచింది. వెంటనే అక్కడున్న రైతులు తొలుత భీమడోలు ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందాడు. అశోక్కి ఇంకా వివాహం కాలేదు. ఈ ఘటనపై మృతుడి తండ్రి వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్టు ఎస్సై టి.సుధీర్ తెలిపారు. ఏలూరు(మెట్రో) : ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం కింద చేతివృత్తి శ్రామికులకు, హస్తకళ నిపుణులకు బ్యాంకుల ద్వారా అందిస్తున్న ఎంఎంఎస్ఎంఈ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడీ కేఎస్ ప్రభాకరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మైనార్టీ అభ్యర్థులు, చేతివృత్తులు చేసుకుంటున్నవారు పీఎం విశ్వకర్మ డాట్ జీవోవీ డాట్ ఇన్ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలన్నారు. వివరాల కొరకు కామన్ సర్వీస్ సెంటర్స్ లేదా వెబ్సైట్లో సంప్రదించాలన్నారు. ఇతర సమాచారం కొరకు జీఎం, జిల్లా పారిశ్రామిక కేంద్రం, ఏలూరు వారిని పనివేళలో సంప్రదించాలన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్) : ఈ నెల 7వ తేదీ చంద్ర గ్రహణం కారణంగా పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో మధ్యాహ్నం 12.30 గంటలకు మహానివేదన అనంతరం అమ్మవారి దర్శనం నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. 8వ తేదీ ఉదయం ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో సంప్రోక్షణ జరిపిన అనంతరం ఉదయం 8.30 గంటల నుంచి యథావిధిగా దర్శనాలు అనుమతించనున్నట్లు ఆలయ సహా య కమిషనర్ బుద్ధ మహాక్ష్మి నగేష్ తెలిపారు. -
మురళీకృష్ణంరాజును ఫోన్లో పరామర్శించిన వైఎస్ జగన్
సాక్షి, పశ్చిమగోదావరి: నర్సాపురం పార్లమెంట్ వైఎస్సార్సీపీ పరిశీలకులు మురళీకృష్ణంరాజును ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. 86 ఏళ్ల వయసున్న మురళీకృష్ణంరాజు తండ్రి రామరాజుపై తప్పుడు కేసు పెట్టడం దారుణమని వైఎస్ జగన్ అన్నారు. అక్రమ కేసులపై భయపడొద్దని.. పార్టీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.పింఛన్లు పంపిణీ సందర్భంగా ఈనెల 1వ తేదీన ధర్మవరంలో మురళీకృష్ణంరాజు నివాసానికి వెళ్ళిన సచివాలయం మహిళ సంరక్షణ కార్యదర్శి రాధిక.. జగన్నాధరాజు అనే పింఛన్ దారుని చిరునామా కోసం రామరాజును ఆమె వివరాలు అడిగారు. ఈ సమయంలో తనను 86 ఏళ్ల రామరాజు లైగింకంగా వేధించారని ఆరోపిస్తూ ప్రత్తిపాడు పీఎస్లో ఆమె ఫిర్యాదు చేశారు. రాధిక ఫిర్యాదు మేరకు ఆగమేఘాలపై పోలీసులు లైగింక వేధింపులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. -
మళ్లీ పెరుగుతున్న గోదావరి
కుక్కునూరు: గత రెండు రోజులుగా గోదావరి వరద ప్రవాహం తగ్గినట్టే తగ్గి మరలా పెరుగుతోంది. బుధవారం సాయంత్రం భద్రాచలం వద్ద 8 లక్షల క్యూసెక్కుల వరదతో 42.10 అడుగులకు చేరుకుంది. 43 అడుగులకు వరద ప్రవాహం చేరితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీచేయనున్నారు. అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తుండడం వలన అటు గోదావరి, ఇటు శబరీ నదులతో విలీన మండలాల్లో వరద తీవ్రత పెరిగే అవకాశం ఉంటుందని విలీన మండలాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈసారి వరద తీవ్రత ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. పోలవరంలో స్వల్పంగా తగ్గుతూ... పోలవరం రూరల్: గోదావరి వరద స్వల్పంగా తగ్గుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి కొండవాగుల నీరు నదిలోకి చేరుతుండటంతో వరద ప్రవాహం కొనసాగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద 32 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. స్పిల్వే 48 గేట్ల నుంచి దిగువకు 8.62 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. దిగువన వరద ఉధృతంగానే ప్రవహిస్తోంది. పట్టిసం శివక్షేత్రం చుట్టూ వరద నీరు తాకుతూ ప్రవహిస్తోంది. భద్రాచం వద్ద 48.80 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి నదిలోకి నీరు చేరడంతో ప్రవాహం ఒకే విధంగా కొనసాగుతోంది. -
సినీ ఫక్కీలో సెల్ఫోన్ చోరీ
ద్వారకాతిరుమల: మీ బైక్ చక్రం బోల్టు ఊడిపోతోంది.. ఆపండి చూద్దాం.. అంటూ ఇద్దరు యువకులు బైక్పై వెళుతున్న ఒక వ్యాపారిని నమ్మించారు. బైక్ ఆపి చూస్తుండగా సినీ ఫక్కీలో ఆ వ్యాపారి జేబులోని సెల్ఫోన్ను తస్కరించారు. ఏలూరు ఆశ్రం ఆస్పత్రి వద్ద మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనపై బాధితుడు ద్వారకాతిరుమల పోలీస్టేషన్లో బుధవారం ఉదయం ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే. ద్వారకాతిరుమలకు చెందిన ఫ్యాన్సీ షాపు వ్యాపారి కోరుప్రోలు సత్యన్నారాయణ వస్తువుల కొనుగోలు నిమిత్తం మంగళవారం మధ్యాహ్నం తన బైక్పై ఏలూరు వెళుతున్నాడు. ఘటనా స్థలం వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి బైక్పై వచ్చిన ఇద్దరు యువకులు, సార్.. మీ బైక్ చక్రం బోల్టు లూజయ్యి ఊడిపోయేటట్టు ఉంది, చూద్దాం ఆపండని అన్నారు. అది నమ్మిన సత్యన్నారాయణ బైక్ ఆపాడు. దాంతో ఆ యువకులు సైతం తమ బైక్ ఆపగా, అందులో ఒక యువకుడు బైక్ దిగి వ్యాపారి వద్దకు వచ్చాడు. చక్రం తిప్పండి చూద్దాం అనడంతో వ్యాపారి కాస్త ఒంగాడు. అంతే సినీ ఫక్కీల్లో ఘరానా మోసగాడైన ఆ యువకుడు వ్యాపారి జేబులోని సెల్ఫోన్ను లాక్కుని బైక్పై పరారయ్యాడు. సదరు వ్యాపారి వారిని పట్టుకునేందుకు వెంబడించినా ఫలితం దక్కలేదు. దీనిపై వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ముదినేపల్లి రూరల్: యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లోబరుచుకుని మోసం చేసిన యువకుడిపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. మండలంలోని చేవూరుకు చెందిన యువతి 2020లో పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశానికి గుడివాడలోని కళాశాలకు వెళ్లింది. అదే సమయంలో ప్రవేశం కోసం అక్కడికి వచ్చిన జంగారెడ్డిగూడెం మండలం కొయ్యలగూడెంకు చెందిన అంజూరి దివాకర్తో పరిచయం పెరిగింది. అది కాస్తా ప్రేమగా మారడంతో వివాహం చేసుకుంటానని నమ్మించి దివాకర్ ఆ యువతిని శారీరకంగా లోబరుచుకున్నాడు. అనంతరం వివాహం చేసుకోమని పలుమార్లు కోరినప్పటికీ అతడు తిరస్కరించాడు. దీనిపై పెద్దల సమక్షంలో పెట్టినా దివాకర్ తిరస్కరించాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు ఎస్సై వీరభద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం న్యాయం చేయాలంటున్న మహిళ నూజివీడు: విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి తనను ముగ్గురు వ్యక్తులు మోసం చేశారంటూ నూజివీడుకు చెందిన అమృతవల్లి బుధవారం విలేకరుల వద్ద వాపోయింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. అమృతవల్లి నివాసానికి సమీపంలో ఉంటున్న కాటుమాల శ్రీకాంత్, సంధ్య ఆమె భర్త మేడికొండ సాంబయ్య అనేవారు రూ.6 లక్షలు తీసుకుని ఖతార్ పంపారని, అయితే అక్కడ ఉద్యోగం ఏమీ లేదని, వెట్టిచాకిరీ చేస్తూ నరకం అనుభవించలేక రెండు నెలలకు తిరిగి వచ్చేసినట్టు ఆవేదన వ్యక్తం చేసింది. టూరిస్ట్ వీసాతో వీరు మోసం చేస్తున్నారన్నారు. విషయం బయటకు చెబితే ప్రాణాలు దక్కవంటూ బెదిరిస్తున్నారని వాపోయింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది. దీనిపై తాను మంత్రి కొలుసు పార్థసారధి క్యాంపు కార్యాలయంలోని సిబ్బందికి ఫిర్యాదు చేశానని, గురువారం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు అమృతవల్లి తెలిపారు. -
హీల్ విద్యార్థులకు జాతీయస్థాయిలో పతకాలు
ఆగిరిపల్లి: జాతీయస్థాయిలో నిర్వహించిన పారా అథ్లెటిక్స్ పోటీల్లో మండలంలోని తోటపల్లికి చెందిన హీల్ పాఠశాల అంధ విద్యార్థులు పతకాలు సాధించారు. ఆగస్టు 29 నుంచి 31 వరకు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో 14వ జాతీయ స్థాయి జూనియర్, సబ్ జూనియర్ పారా అథ్లెటిక్స్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో హీల్ పాఠశాలకు చెందిన అంధ విద్యార్థులు జూనియర్స్ విభాగంలో జాలా వరలక్ష్మి డిస్కస్ త్రోలో బంగారు పతాకం, లాంగ్ జంప్లో రజిత పతకం, చింతల ప్రవీణ్ పరుగు పందెం పోటీల్లో రజిత పతకం, సబ్ జూనియర్ విభాగంలో హరి లాంగ్ జంప్ , పరుగు పందెం పోటీల్లో రజిత పతకం, రోహిత్ జావాలిన్ త్రోలో రజిత పతకం సాధించారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు యార్లగడ్డ లతా చౌదరి తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను హీల్ సంస్థ సీఈఓ కూరపాటి అజయ్కుమార్ అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ మిక్కిలినేని హరీష్, అంధ పాఠశాల ఇన్చార్జి కే అబ్రహం, విద్యార్థులు పాల్గొన్నారు. -
పోషకాహారం.. ఆరోగ్యానికి అనుసంధానం
కై కలూరు: పోషకాహారలోప నివారణ, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రొత్సహించడానికి మహిళా అభివృద్ధి శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఈనెల 12 నుంచి అక్టోబరు 11 వరకు 8వ రాష్ట్రీయ పోషణ్ మాహ్ – 2025ను ప్రారంభించనున్నారు. పోషణ్ అభియాన్–మిషన్ పోషణ్ 2.0 పేరుతో నెల రోజుల పాటు అవగాహన కార్యక్రమాలను జిల్లాలో అమలు చేయనున్నారు. ఊబకాయం, చక్కెర, నూనె వినియోగం తగ్గించడం, బాల్య సంరక్షణ, తల్లి పేరు మీద ఒక చెట్టు, శిశువులు, చిన్న పిల్లలకు ఆహారం పెట్టడం, పోషకాహార సంరక్షణలో పురుషులు పాల్గొనడం వంటి 5 కార్యక్రమాలను అధికారులు అమలు చేయనున్నారు. ఏలూరు జిల్లాలో 10 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 2,225 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. గర్భిణులు 8,314 మంది ఉండగా వీరిలో 695 మందికి రక్తహీనత(ఎనిమియా) ఉన్నట్లు గుర్తించారు. అదే విధంగా జిల్లాలో 3–6 ఏళ్ల చిన్నారులు 49,048 ఉండగా, బాలామృతం తీసుకునే పిల్లలు 48,563 మంది ఉన్నారు. వీరిలో వయసుకు తగ్గ ఎత్తు లేని చిన్నారులు 14,281 మంది, ఎత్తుకు తగిన బరువు లేని పిల్లలు 4,141 మంది, వయసుకు తగిన బరువు లేని చిన్నారులు 6,705 మంది ఉన్నట్లు గుర్తించారు. ఇక బాలింతలు 5,758 ఉన్నారు. మహిళలు, పిల్లల్లో ఐరన్, అయోడిన్, విటమిన్ ‘ఏ’ లోపాలను సరిచేయడానికి మిషన్ పోషణ్ 2.0లో అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ప్రతి ఒక్కరికీ పోషకమైన ఆహారం ఆదాయం, సామాజిక స్థితికి సంబంధం లేకుండా అందరికీ ఆరోగ్యకర ఆహారం అందుబాటులో ఉంచాలని ప్రతి ఏటా సెప్టెంబరులో జాతీయ పోషకాహార వారోత్సవాలను 1982 నుంచి జరుపుతున్నారు. ప్రభుత్వం వీటిని నెల రోజుల పాటు నిర్వహిస్తుంది. ఏలూరు జిల్లాలో 16,37,418 మంది జనాభాలో 2,16,284 మందికి రక్తపోటు, 1,71,505 మందికి మధుమేహం ఉన్నట్లు గుర్తించారు. కోవిడ్–19 తదనంతర పరిస్థితుల్లో పోషకాహారం మరింతగా తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ పోషకాహార వినియోగంపై సూచనలు అందిస్తోంది. విటమిన్ ‘ఏ’ లేకపోవడం వల్ల మన దేశంలో ఏటా 30 వేల మంది కంటి చూపును కోల్పోతున్నారని అధ్యాయనాలు చెబుతున్నాయి. ఊబకాయం వల్ల టైప్ –2 డయాబెటీస్, ఫ్యాటీ లివర్ వ్యాధి, పిత్తాశయంలో రాళ్లు, కీళ్ల రుగ్మతలు, రక్తపోటు, కేన్సర్ వంటి వ్యాధులు వస్తున్నాయి. వీటి నివారణకు సరైన పోషకాహార వినియోగంపై అధికారులు అవగాహన కలిగించనున్నారు. షెడ్యూల్ ఇలా.. జిల్లా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నెల రోజులు జరిగే పోషకాహార కార్యక్రమాల్లో ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీశాఖ పాలుపంచుకోనున్నాయి. షెడ్యూల్ విషయానికి వస్తే ఈనెల 12 నుంచి 25 వరకు ఊబకాయం, నూనె, చక్కరలు తగ్గించుకోవడం, ఈనెల 18 నుంచి 30 వరకు పోషణ్ బీ పధైబీ(పీబీపీబీ)పై అవగాహన, ఈనెల 12 నుంచి అక్టోబరు 11 వరకు ఒక చెట్టు పేరు, పర్యావరణం, ఈనెల 26 నుంచి అక్టోబరు 2 వరకు శిశువులు, చిన్న పిల్లలకు ఆహారం అందించడం, అక్టోబరు 3 నుంచి 11 వరకు పురుషులను భాగస్వాములను చేయడం వంటి కార్యక్రమాలు జరగనున్నాయి. అంగన్వాడీ కేంద్రాలు, పంచాయతీ భవనాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, పాఠశాలలు, కమ్యూనిటీ భవనాలలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఈనెల 12 నుంచి అక్టోబరు 11 వరకు పోషణ్ అభియాన్ – మిషన్ పోషణ్ 2.0 పై అవగాహన కలిగిస్తాం. ఇప్పటికే పోషకాహార లోపం కలిగిన వారిని గుర్తించాం. మహిళలు, చిన్నారులకు పోషకాహారంపై అంగన్వాడీ సిబ్బంది అవగాహన కలిగించాలి. వివిధ శాఖలతో సమన్వయంతో పనిచేయాలి. – పి.శారద, ఐసీడీఎస్, జిల్లా, పీడీ, ఏలూరు పోషకాహారం లోపాన్ని ప్రారంభంలోనే గుర్తించాలి. పిల్లలు ఎత్తుకు తగిన బరువు, బరువు తగిన ఎత్తు లేకపోతే వ్యాధి నిరోధక శక్తి వారిలో తుగ్గతుంది. ఏకాగ్రత లోపిస్తోంది. ఇటువంటి వారిని గుర్తించి అంగన్వాడీ సెంటర్లలో ప్రత్యేక ఆహారం అందిస్తున్నారు. పోషకాహార విలువల ఆహారాన్ని బిడ్డలకు అందించాలి. – డాక్టర్ కె.అన్నపూర్ణ, పీహెచ్సీ, శీతనపల్లి పోషణ్ అభియాన్ – మిషన్ పోషణ్ 2.0 ఈనెల 12 నుంచి అక్టోబరు 11 వరకు కార్యక్రమాలు 5 అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సమావేశాలు -
ఉన్నత విద్యకు, ఉద్యోగాలకు గేట్ స్కోర్ కీలకం
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ తృతీయ, ఆఖరి సంవత్సరం విద్యార్థులకు గేట్–2026 పరీక్షపై బుధవారం స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్లో సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించగా, ప్రసిద్ధ కోచింగ్ సంస్థ ఏస్ ఇంజనీరింగ్ అకాడమీకి చెందిన సీనియర్ ఫ్యాకల్టీ ఎస్ మణిమోహన్ త్రినాథ్ వక్తగా పాల్గొని పలు విషయాలను విద్యార్థులకు వివరించారు. గేట్ పరీక్ష నిర్మాణం, సిలబస్, దానివల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేశారు. ఐఐటీ, ఎన్ఐటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో ఉన్నత విద్యకు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలకు గేట్ స్కోర్ ఎంతో కీలకమని అవగాహన కల్పించారు. గేట్ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం ఆరో తేదీన బ్రాంచి వారీగా మాక్ పరీక్షను నిర్వహిస్తామన్నారు. దీని ద్వారా విద్యార్థులు తమ సన్నద్ధత స్థాయిని అంచనా వేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో సెంట్రల్ డీన్ అకడమిక్స్ దువ్వూరి శ్రావణి, ఈఐటీపీ డీన్ పీ శ్యామ్, డీన్ అకడమిక్స్ సాదు చిరంజీవి, సెంట్రల్ కోఆర్డినేటర్లు ఎం.రామకృష్ణ, వై ప్రియాంక పాల్గొన్నారు. -
ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ దాడులు
తణుకు అర్బన్ : తణుకు మండలంలోని దువ్వ గ్రామంలోని ప్రైవేటు ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, వ్యవసాయ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. తనిఖీల్లో దుకాణాల్లో ఎరువులకు సంబంధించి రిజిస్టరులో ఉన్న గణాంకాలకు గ్రౌండ్ బ్యాలెన్స్లో 17 బస్తాల యూరియా వ్యత్యాసం ఉండటంతో 1.395 మెట్రిక్ టన్నుల యూరియాను సీజ్చేసి దుకాణదారుడిపై 6ఏ కేసు నమోదు చేయాల్సిందిగా సూచించారు. కార్యక్రమంలో విజిలెన్స్ ఏవో జి. మీరయ్య, విజిలెన్స్ ఎస్సై సీహెచ్ రంజిత్ కుమార్, వ్యవసాయాధికారి కె.రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. ఏలూరు(మెట్రో): జిల్లాలో యూరియా సరఫరా విషయంలో ఎలాంటి సమస్య లేదని, యూరియా సమృద్ధిగా ఉందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ ఓ ప్రకటనలో తెలిపారు. 2025–26లో ఇప్పటివరకు 28 వేల టన్నులు సరఫరా చేశామని, రాబోయే 3 నెలల్లో మిగిలిన 3 వేల మెట్రిక్ టన్నులు కూడా త్వరితగతిన అందుబాటులోకి వస్తాయన్నారు. ద్వారకాతిరుమల: కాణిపాకంలో జరుగుతున్న స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని చినవెంకన్న దేవస్థానం తరపున ఆలయ ఈఓ ఎన్వీ సత్యన్నారాయణ మూర్తి దంపతులు బుధవారం గణేషుడికి పట్టువస్త్రాలను సమర్పించారు. ముందుగా శ్రీవారి దేవస్థానం అర్చకులు, పండితులు, ఈఓ దంపతులు కాణిపాకం ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అక్కడి దేవస్థానం ఈఓ కిషోర్ దంపతులతో కలసి, సత్యన్నారాయణ మూర్తి దంపతులు అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణ నడుమ పూలు, పండ్లు, పట్టువస్త్రాలను శిరస్సుపై పెట్టుకుని తీసుకెళ్లి వరసిద్ధి వినాయకుడికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రమణరాజు, సూపరింటెండెంట్ హయగ్రీవాచార్యులు తదితరులున్నారు. -
మరోసారి న్యాయం గెలిచింది
● యాసిడ్ దాడి కేసులో ముగ్గురుముద్దాయిలకు కఠిన శిక్షలు ● రెండు జీవిత ఖైదులు, పదేళ్ల కఠిన కారాగారం, జరిమానా ఏలూరు టౌన్: రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన యాసిడ్ దాడి కేసులో మరోసారి ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది. ముగ్గురు ముద్దాయిలకు రెండు జీవిత ఖైదులతోపాటు మరో పదేళ్ల కఠిన కారాగార శిక్ష, యాసిడ్ విక్రయించిన వ్యక్తికి జరిమానా విధించగా, మరో ఇద్దరిని నిర్ధోషులుగా ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేశారు. 2023లో ప్రత్యేక న్యాయస్థానంలో నిందితులకు శిక్షలు విధించగా, హైకోర్టును ఆశ్రయించి, తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆ తీర్పును రద్దు చేస్తూ మరోసారి ట్రయల్ నిర్వహించాలని ఆదేశించింది. రెండవ సారి క్షుణ్ణంగా సాక్షాధారాలను, సాక్షులను విచారించిన ప్రత్యేక న్యాయమూర్తి బుధవారం తీర్పు వెలువరించారు. ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ కేసు వివరాలను వెల్లడించారు. అసలేం జరిగిందంటే... ఏలూరు విద్యానగర్లో యడ్ల ఫ్రాన్సినా అనే మహిళ జూన్ 13 తేదీ 2023న రాత్రి 9గంటల సమయంలో డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తుండగా ముగ్గురు వ్యక్తులు ఆమైపె యాసిడ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించగా పోలీస్ అధికారులు కృషితో నిందితులను 48 గంటల్లోపే పట్టుకున్నారు. ఏలూరు కొత్తగూడెంకు చెందిన బోడ నాగసతీష్, అతని స్నేహితులు ఏలూరు వైఎస్సార్ కాలనీకి చెందిన బెహర మోహన్, బూడిద ఉషాకిరణ్ను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. యాసిడ్ కొనుగోలు చేసేందుకు సహకరించిన షేక్ కాజ్బాబు, యాసిడ్ విక్రయించిన కొల్లా త్రివిక్రమరావు, అతని వద్ద పనిచేస్తున్న వీడెలా సత్యనారాయణపైనా కేసు నమోదు చేశారు. ఐజీ జీవీజీ అఽశోక్కుమార్, అప్పటి జిల్లా ఎస్పీ దాసరి మేరీ ప్రశాంతి కేసును పరుగులు పెట్టించి నిందితులకు కేవలం మూడు నెలల వ్యవధిలోనే కఠిన శిక్ష విధించేలా చర్యలు చేపట్టారు. ప్రత్యేక న్యాయస్థానం కీలక తీర్పును వెలువరించింది. యాసిడ్ దాడికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులకు రెండు జీవిత ఖైదులు విధించగా, ఏ5 నిందితుడికి జరిమానా విధించారు. తీర్పును సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించగా మరోసారి ట్రయల్ నిర్వహించారు. మరోసారి సంచలన తీర్పు రాష్ట్ర హైకోర్టు ఆదేశాలతో ట్రయల్ నిర్వహించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి మరోసారి బుధవారం సంచలన తీర్పును వెలువరించారు. ఏ1 నుంచి ఏ3 వరకూ నిందితులైన బోడ నాగసతీష్, బెహర మోహన్, బూడిద ఉషాకిరణ్కు రెండు జీవిత ఖైదులతోపాటు, 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, జరిమానా విధించారు. ఏ5 నిందితుడు కొల్లా త్రివిక్రమరావుకు రూ.1500 జరిమానా, రూ.50 వేలు బాధితురాలి కుటుంబానికి పరిహారం చెల్లించాలని ఆదేశించారు. ఏ4, ఏ6 నిందితులు షేక్ కాజాబాబు, వీడెలా సత్యనారాయణపై నేరం రుజువు కాలేదని, నిర్ధోషులుగా ప్రకటించారు. మృతురాలికి న్యాయం చేసే లక్ష్యంతో... రాష్ట్ర హైకోర్టు ఆదేశాలతో స్పెషల్ జడ్జి ఫర్ ట్రయల్ ఆఫ్ కేసెస్ అండర్ ఎస్సీ, ఎస్టీ యాక్ట్, అదనపు జిల్లా సెషన్స్ జడ్జి పశ్చిమగోదావరి జిల్లా న్యాయమూర్తి మరోసారి ట్రయల్ నిర్వహించారు. సాక్షులను విచారించగా, పూర్తిస్థాయిలో సాక్షాధారాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎస్పీ శివకిషోర్ కోర్టు మానిటరింగ్ సెల్కు సూచనలు చేయగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్.శారదమణి తనదైన శైలిలో వాదనలు వినిపించారు. మృతురాలికి న్యాయం చేసే లక్ష్యంతో పనిచేసిన పోలీసులందరినీ ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. -
శ్రీవారి దర్శనం క్యూలైన్లలో పాము కలకలం
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయంలో బుధవారం తాచు పాము కలకలం రేపింది. మధ్యాహ్నం 1 గంట సమయంలో స్వామివారి మహా నివేదన నిమిత్తం దర్శనాన్ని నిలుపుదల చేశారు. ఆ సమయంలో ఉత్తరం వైపు ఉన్న దర్శనం క్యూలైన్లలోకి ఒక పెద్ద తాచు పాము ప్రవేశించింది. దర్శనం నిలుపుదల కావడంతో క్యూలైన్లలో భక్తులెవరూ లేరు. దాంతో పెనుప్రమాదం తప్పింది. సెక్యూరిటీ సిబ్బంది ద్వారా సమాచారం అందుకున్న దేవస్థానం అధికారులు అక్కడికి చేరుకుని, గార్డెన్ సిబ్బందితో ఆ పామును చంపించారు. అనంతరం దాన్ని దూరంగా తీసుకెళ్లి పడేశారు. -
ఇవి తప్పక పాటించండి
● పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు, ఫైబర్ కలిగినవి తీసుకోవాలి. ● రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల రక్తపోటు, గుండె జబ్బుల నుంచి రక్షణ పొందవచ్చు. ● పుట్టిన నాటి నుంచి 6 నెలల వయస్సు వరకు పిల్లలకు తల్లిపాలు మాత్రమే అందించాలి. 2 సంవత్సరాల పైనే తల్లి పాలు బిడ్డకు కొనసాగించవచ్చు. ● స్నాక్స్, చక్కెర, కొవ్వులు, ఉప్పు ఎక్కువగా ఉండే అహారం తీసుకోవద్దు. ● చేపలు, గుడ్లు, పాలు, మాంసం, కూరగాయలు, పండ్లు సమపాళ్లలో తీసుకోవాలి. కూరగాయలు, పండ్లను ఎక్కువగా ఉడికిస్తే విటమిన్లు కోల్పోతాయి. ● ప్రతి రోజూ వ్యాయామం, నడక, యోగసానాలు అలవర్చుకోవాలి. ● బలహీనంగా ఉన్న పిల్లలకు ప్రత్యేక పోషకాహారం అందించాలి. -
సర్వీస్ రోడ్ల కోసం రాస్తారోకో
టి.నరసాపురం: టి.నరసాపురం మండల పరిధిలో గ్రీన్ ఫీల్డ్ హైవే ఎక్కేందుకు దిగేందుకు సర్వీసు రోడ్లు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం గ్రీన్ ఫీల్డ్ హైవేకు సర్వీస్ రోడ్లు ఇవ్వాల్సిందేనని భూ నిర్వాసిత రైతుల పోరాట కమిటీ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో టి.నరసాపురం వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించారు. నిర్వాసిత రైతుల సమస్యల పరిశీలనకు జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్, హైవే అధికారులు, రోడ్డు నిర్మాణ సంస్థ ప్రతినిధులు పరిశీలనకు వచ్చారు. ఈ సందర్భంగా టి.నరసాపురం, గురువాయిగూడెం, ఏపుగుంట, మధ్యాహ్నపువారి గూడెం, వెంకటాపురం, బొర్రంపాలెం తదితర గ్రామాల వద్ద భూ నిర్వాసిత రైతులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. సమస్యలు రైతులు చెప్పడంతో నివేదికను కలెక్టర్కు పంపిస్తామని చెప్పారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్, రైతు పోరాట కమిటీ నాయకులు దేవరపల్లి సత్యనారాయణ, వెదుళ్ళ నాగేశ్వరరావు, లింగారెడ్డి శ్రీనివాస్, నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, బొంతు మురళి తదితరులు మాట్లాడుతూ సర్వీస్ రోడ్లు గ్రావెల్ రోడ్లుగా నిర్మించి ఇస్తామన్న హామీలు అమలు చేయకపోవడం వల్ల తమ పొలాలకు వెళ్లే మార్గాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సర్వీస్ రోడ్డు మట్టి రోడ్డు కావడంతో దిగుబడిపోయి నానా తంటాలు పడాల్సి వస్తోందన్నారు. సర్వీస్ రోడ్ లో మొక్కలు వేయవద్దని డిమాండ్ చేశారు. టి.నరసాపురం 112వ అండర్ పాస్ వద్ద సర్వీస్ రోడ్ గుండా వెళ్లే అవకాశం లేకుండా పోయిందన్నారు. కొన్నిచోట్ల కల్వర్టులు నిర్మించలేదన్నారు. -
తల్లికి వందనం.. అంతా గోల్మాల్
ఏలూరు (ఆర్ఆర్పేట): తల్లికి వందనం పథకం ద్వారా చదువుకునే ప్రతి బిడ్డకు రూ.15 వేలు ఇస్తామని చెప్పి కేవలం 13 వేలు మాత్రమే వేశార. ఆ పథకంలో కూడా అనేక విధాలుగా కొర్రీలు పెట్టి ఈ పథకాన్ని గోల్మాల్ గోవిందం అనే రీతికి తీసుకొచ్చారు. ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం 12(1) (సీ) కింద ప్రతి పాఠశాలలో 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు ఇవ్వడంలో భాగంగా జిల్లాలో అనేక పాఠశాలల్లో విద్యార్థులను చేర్చుకున్నారు. ఈ పథకం కింద ఒకటో తరగతిలో మాత్రమే ప్రవేశాలు కల్పిస్తారు. ఈ మేరకు ఈ ఏడాది ఒకటో తరగతిలో చేరిన పిల్లల తల్లులకు ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. ఒక బిడ్డకు ఉచిత విద్య సీటు లభించి రెండో బిడ్డ చదువుకు ప్రభుత్వం చెల్లించే తల్లికి వందనం పథకం డబ్బు రూ.15 వేలతో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ లేకుండా చదివించవచ్చనుకున్న తల్లులకు ఉచిత విద్య పథకంలో సీటు వచ్చిందనే కారణం చూపి తల్లికి వందనం డబ్బులకు ఎగనామం పెట్టారు. ఈ విషయంలో మరో మెలిక ఏమిటంటే ఉచిత విద్యకు దరఖాస్తు చేసుకుని ఒక ప్రైవేట్ పాఠశాలలో సీటు పొందిన తల్లులు వివిధ కారణాలతో తమ బిడ్డలను సదరు పాఠశాలలో చేర్చకపోయినా వారు అక్కడే చదువుతున్నట్లు రికార్డుల్లో ఉంటోంది. ఉచిత విద్య చట్టం కింద తమ పాఠశాలలో నమోదైన విద్యార్థి పేరును సదరు పాఠశాల యాజమాన్యం తొలగించకుండా అలానే ఉంచడంతో అలాంటి తల్లులు తల్లికి వందనం పథకాన్ని కోల్పోయారు. జిల్లాలో 3,23,306 మంది విద్యార్థులు జిల్లాలో 1818 ప్రభుత్వ, 495 ప్రైవేటు పాఠశాలల్లో కలిపి 2,91,858 మంది విద్యార్ధులున్నారు. 127 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 31,448 మంది విద్యార్థులున్నారు. వీరందరికి మొత్తం రూ.486.96 కోట్లు జమ కావాల్సి ఉంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జిల్లాలో 1,78,214 మంది విద్యార్ధులకు రూ.267.32 కోట్ల చొప్పున ఏటా తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమచేసింది. ఎంతమందికి ఇచ్చారో లెక్కలేదు జిల్లాలో తల్లికి వందనం పథకం కింద ఎంతమంది ఖాతాలకు డబ్బు జమ చేశారో లెక్కలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం జిల్లాలో ఏ సంవత్సరం ఎంతమందికి అమ్మ ఒడి నగదు జమ చేసిందో అధికారికంగా లెక్కలు చూపింది. ఈ ప్రభుత్వం ఇంతవరకూ ఎంతమందికి నగదు జమ చేసిందో చెప్పే ధైర్యం చేయలేకపోతోంది. కనీసం మండలంలో ఎంతమందికి ఈ పథకాన్ని అమలు చేశారో అనే లెక్క మండల విద్యాశాఖాధికారి వద్ద కూడా దొరకడం లేదు. నాకు ఇద్దరు పిల్లలు. ఈ ఏడాది తల్లికి వందనం పడలేదు. సచివాలయానికి వెళ్ళి విచారించగా ఆన్లైన్లో ఎలిజిబుల్ అని చూపిస్తోంది. ఎటువంటి వివరాలూ చూపించడం లేదు. వాట్సాప్ గవర్నెన్స్లో చూసుకుంటే తల్లికి వందనం రికార్డుల్లో మీరు లేరని వస్తోంది. నాకు ఎటువంటి ఆస్తులూ లేవు. నా భర్త కూలి పనులు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నారు. నాకు తల్లికి వందనం నగదు జమయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. – మొరా దుర్గాభవానీ, గృహిణి, ఏలూరు నాకు ఇద్దరు పిల్లలు, గతంలో అమ్మ ఒడి ఒకరికి పడేది. ఇప్పుడు తల్లికి వందనం ఒక్కరికి కూడా పడలేదు. ఇద్దరికీ పడుతుందని ఎంతో ఆశగా ఎదురు చూస్తే ఒక్కరికీ పడకపోవడం విచారకరం. నాకు తల్లికి వందనం పడకపోవడానికి కారణమేమిటో కూడా ఎవరూ చెప్పడం లేదు. ఎందువల్ల ఆగిందో తెలుసుకుంటే ఆ కారణం చెప్పాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. – పి.లలిత, గృహిణి, నూజివీడు ఉచిత విద్య పథకం పొందితే రెండో బిడ్డకు డుమ్మా ఇప్పటి వరకూ ఎంతమందికి ఇచ్చారో లెక్కలేదు పీజీఆర్ఎస్కు తల్లుల వినతుల వెల్లువ జూన్ 12న తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించారు. తమకు ఈ పథకం కింద నగదు జమకాలేదని తల్లులు ఎక్కే గడప, దిగే గడప అన్నట్లు తిరుగుతున్నా ఇంతవరకూ ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఈ పథకం కింద డబ్బులు జమకాని తల్లులు తొలుత పాఠశాలలకు, అనంతరం మండల విద్యాశాఖాధికారి కార్యాలయాలకు, అక్కడా ఫలితం లేకపోవడంతో జిల్లా విద్యాశాఖాధికారికి అర్జీలు సమర్పిస్తూనే ఉన్నారు. వారికి డబ్బు జమకావడం లేదు. ఇక చేసేదేమీ లేక చివరి ప్రయత్నంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతీ సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చి అర్జీలు సమర్పిస్తున్నారు. వారికి వచ్చే రూ. 15 వేల కోసం జిల్లాలోని సుదూర ప్రాంతాలైన కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం, నూజివీడు ఇలా అన్ని ప్రాంతాల నుంచీ పీజీఆర్ఎస్కు తల్లులు పోటెత్తుతున్నారు. -
చిచ్చుపెడతారా ?
ప్రశాంత వాతావరణంలో టీడీపీ శ్రేణులు చిచ్చు పెడతారా? కామిరెడ్డి నానిపై దాడి దుర్మార్గం. దాడులు, అక్రమ కేసులు పెట్టి ఏం చేయాలని సంకేతాలు ఇస్తున్నారు. ఎందుకు ఈ విధానాన్ని అవలంభిస్తున్నారు. గత ఐదేళ్లలో శిలాఫలకాలు, హోర్డింగులు మేం ధ్వంసం చేశామా? పోలీసులు చర్యలు తీసుకోవాలి. – కారుమూరి సునీల్ కుమార్ ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జ్ ప్రజలు అధికారం ఇచ్చింది అభివృద్ధి, సంక్షేమం చేసి సమస్యలు పరిష్కరించాలని కానీ దాడులు, కొట్లాటలు చేయడానికి కాదు. ఇలాంటి చర్యలు సరికాదు. గతంలో ఎప్పుడు ఈ పరిస్థితులు లేవు. ఈ ఘటనపై పోలీసులు స్పందించాలి. బాధితులపై చర్యలు తీసుకోవాలి. – కొఠారు అబ్బయ్యచౌదరి, మాజీ ఎమ్మెల్యే -
రైతు కష్టాలపై పోరుబాట
● ఈనెల 9న ఆర్డీవో కార్యాలయాల వద్ద నిరసన ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు ఏలూరు టౌన్: రాష్ట్రంలో రైతుల కష్టాలు వర్ణణాతీతంగా మారాయి.. ఆఖరికి యూరియా సరఫరా చేయలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది. గత ఐదేళ్లూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో రైతులకు వ్యవసాయం పండుగలా సాగిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. పీఏసీ సభ్యులు, ఉంగుటూరు, నూజివీడు, చింతలపూడి సమన్వయకర్తలు పుప్పాల వాసుబాబు, మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, కంభం విజయరాజు, ఉమ్మడి జిల్లా జోనల్ మహిళా విభాగం అధ్యక్షురాలు మాకినీడి శేషుకుమారి, జిల్లా మహిళా అధ్యక్షురాలు కేసరి సరితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. డీఎన్నార్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 9న అన్ని ఆర్డీవో కార్యాలయాల వద్ద రైతులతో కలిసి నిరసన తెలిపి వినతిపత్రం సమర్పిస్తామని చెప్పారు. ఏలూరు, కై కలూరు, ఉంగుటూరు, దెందులూరు నియోజకవర్గాలకు సంబంధించి ఏలూరులో నిరసన కార్యక్రమం చేపడతామన్నారు. పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల్లోని రైతులతో జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయం వద్ద, నూజివీడు నియోజకవర్గంలోని రైతులతో నూజివీడు ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన చేస్తారన్నారు. రైతులకు బీమా అందించలేని దుస్థితి ఏ సీజన్లో పంట నష్టం జరిగితే ఆ సీజన్లో పరిహారం అందించేలా వైఎస్సార్సీపీ ప్రభుత్వం శ్రద్ద వహించిందని, నేడు కూటమి ప్రభుత్వంలో రైతులకు బీమా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బ్లాక్మార్కెట్లో యూరియా దొరుకుతుంది తప్ప... రైతులకు మాత్రం యూరియా అందుబాటులో లేదన్నారు. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర లేదన్నారు. నూజివీడు సమన్వయకర్త మేకా ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంలో ఎప్పుడూ రైతులకు కష్టాలు, నష్టాలు తప్ప మంచి జరిగిన దాఖలాలు లేవన్నారు. కోఆపరేటివ్ సొసైటీలో యూరియా రూ.270కు విక్రయించాల్సి ఉండగా.. రూ.400కు విక్రయించటం చంద్రబాబు ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్దికి నిదర్శనం అన్నారు. నూజివీడు మామిడిరైతులను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ బీసీ సెల్ జిల్లాఽ అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, జిల్లా ఉపాధ్యక్షురాలు జగ్గవరపు జానకిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు పొత్తూరు శ్రీనివాసరాజు, చేబోయిన వీర్రాజు, జిల్లా అధికార ప్రతినిధిలు మున్నుల జాన్ గురునాథ్, మొట్రు అర్జున్రావు(యేసుబాబు), ఇంజేటి నీలిమ, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఆళ్ళ సతీష్ చౌదరి, షేక్ సయ్యద్ బాజీ, మోరంపూడి జగన్, జిల్లా కార్యదర్శులు మట్టిపల్లి సూర్యచంద్రరావు, బసవ వినయ్, కాసర్లపూడి జనార్ధన్, డీవీఆర్కే చౌదరి, బత్తిన మస్తాన్రావు, కంచుమర్తి తులసీ, పెదగర్ల స్వరూపరాణి, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, మహిళా విబాగం కార్యదర్శి మంద జయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ పెరుగుతున్న గోదావరి
గత రెండు రోజులుగా గోదావరి వరద ప్రవాహం తగ్గినట్టే తగ్గి మరలా పెరుగుతోంది. బుధవారం సాయంత్రం భద్రాచలం వద్ద 42.10 అడుగులకు చేరుకుంది. 8లో uనాకు ఒక ఎకరం పొలం ఉంది. మరో 2 ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాను. ఎకరానికి కనీసం ఒక కట్ట యూరియా వేయాలి. ఇక్కడ మూడు కట్టలు 20–20 తీసుకుంటేనే ఒక కట్ట యూరియా ఇస్తామంటున్నారు. ఈ లెక్కన నాకు మూడు ఎకరాలకి రూ.15 వేలకి పైగా పెట్టుబడి పెట్టాలి. ఈ సమయంలో అంత డబ్బు తీసుకురావడం ఏ రైతుకై నా కష్టమే. – బీ వెంకటేశ్వర రావు, రైతు, పోణంగి నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాను. పంట వేసిన నెల రోజులలోపు రెండు విడతలు యూరియా వేయాలి. తొలి విడత యూరియా వేసి నెలా 20 రోజులైంది. గత 20 రోజులుగా యూరియా ఎక్కడ ఇస్తున్నారని తెలిస్తే అక్కడికి వెళ్ళాను. స్థానికేతరులకు యూరియా ఇచ్చేది లేదని అక్కడి సొసైటీల వాళ్ళు తిప్పి పంపారు. – సనకా ఆంజనేయులు, కౌలురైతు సత్రంపాడు -
యూరియా అందక గగ్గోలు
పోషకాహారంతో ఆరోగ్యం పోషకాహార లోప నివారణ, ఆరోగ్యకర జీవనశైలిని ప్రొత్సహించడానికి ఈ నెల 12 నుంచి అక్టోబరు 11 వరకు రాష్ట్రీయ పోషణ్ మాహ్ను ప్రారంభిస్తున్నారు. 8లో u● నాయకుల సిఫార్సు ఉన్నవారికే యూరియా ● దిగుబడి తగ్గిపోతుందని ఆందోళన గురువారం శ్రీ 4 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025ఏలూరు (ఆర్ఆర్పేట): రైతును ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమవుతోంది. ఖరీఫ్ ప్రారంభమై నెల రోజులు దాటుతోంది. పంట దిగుబడి రావాలంటే పంటకు అవసరమైన కాంప్లెక్స్ ఎరువులతో పాటు యూరియా కూడా అవసరం. అయితే రైతులకు యూరియా అందడం గగనమైపోయింది. రెండో విడతలో యూరియా వేయాల్సి ఉండగా నెలా 20 రోజులు అవుతున్నా ఇప్పటికీ రైతులకు యూరియా అందడం లేదు. ఏలూరు పరిసర ప్రాంతాల్లో వ్యవసాయం చేసే రైతులు యూరియా కోసం తిరగని చోటు ఉండడం లేదు. ఇటీవల పెదపాడు, వట్లూరు, వెంకటాపురం, దెందులూరు తదితర ప్రాంతాల్లో యూరియా దొరుకుతోందని తెలిసి అక్కడికి వెళ్ళిన ఏలూరు పరిసర ప్రాంతాల రైతులకు మొండి చేయి చూపారు. ఏలూరు చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాలకూ తిరిగినా ఎవరూ సమయానికి యూరియా అందించక పోవడంతో రైతులు దిగాలు పడ్డారు. బుధవారం ఏలూరు డీసీఎంఎస్ డిపోకు యూరియా వచ్చిందని తెలిసి రైతులు అధిక సంఖ్యలో ఆ డిపో వద్దకు చేరుకున్నారు. రైతులంతా ఒక్కసారిగా చేరుకోవడంతో తొక్కిసలాట కూడా జరిగింది. బుధవారం డీసీఎంఎస్ డిపోకు 18 టన్నుల యూరియా వచ్చింది. అయినప్పటికీ రైతుల పంటలకు అవసరమైనంత యూరియా ఇవ్వకుండా అధికారులు మోకాలడ్డారు. యూరియా కోసం డిపో వద్ద బారులు తీరిని రైతులకు కాంప్లెక్స్ ఎరువులు తీసుకుంటేనే యూరియా ఇస్తామని మెలిక పెట్టడంతో రైతులు ఆందోళనలో పడ్డారు. యూరియా రూ.267 ఉంటే కాంప్లెక్స్ ఎరువుకు రూ.1850 చెల్లించాల్సి వచ్చింది. మూడు కట్టలు కాంప్లెక్స్ కొంటేనే ఒక కట్ట యూరియా ఇస్తామనడంతో రైతులు కుదేలయ్యారు. సిఫార్సు ఉన్నవారికే యూరియా యూరియా కోసం స్వయంగా వచ్చిన రైతులకు యూరియా ఇవ్వని డీసీఎంఎస్ అధికారులు సిఫార్సులు ఉన్నవారికి మాత్రం ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చి పంపుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు చుట్టుపక్కల ఎన్నిసార్లు తిరిగినా తమకు యూరియా ఇవ్వడానికి నిరాకరించిన సొసైటీల పరిధుల్లోని రైతులకు మాత్రం ఇక్కడ ఎన్ని కావాలంటే అన్ని ఎలా ఇస్తారంటూ నిలదీశారు. ఏలూరు డీసీఎంఎస్ డిపోకు వచ్చిన ఎరువును ముందుగా ఏలూరు పరిసర ప్రాంతాలకు అవసరమైనంత ఇచ్చిన తరువాత మిగిలిన యూరియా మాత్రమే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దిగుబడి తగ్గిపోతుందని ఆందోళన సమయానికి యూరియా వేయకపోతే దిగుబడి తగ్గిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట వేసిన నెల రోజుల్లోపు రెండు విడతలు యూరియా వేయాల్సి ఉండగా దాదాపు రెండు నెలలు కావస్తుండగా ఇప్పడు యూరియా సరఫరా చేస్తున్నారని, దీనివల్ల పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది సుమారు 35– 38 బస్తాల దిగుబడి వచ్చిందని, ఈ ఏడాది సమయానికి యూరియా వేని కారణంగా దాదాపు 10 బస్తాల దిగుబడి తగ్గిపోతుందంటున్నారు. -
కామిరెడ్డి నానిని ఫోన్లో పరామర్శించిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏలూరు జిల్లా వైఎస్సార్సీపీ యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు, శ్రీరామవరం సర్పంచ్ కామిరెడ్డి నానిపై టీడీపీ గూండాల దాడి ఘటనను వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నానితో ఆయన ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. నాని ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు.తనపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు, టీడీపీ గూండాలు ఎలా దాడిచేశారనేది కామిరెడ్డి నాని.. వైఎస్ జగన్కు వివరించారు. తనపై దాడి తర్వాత చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళితే అక్కడకు కూడా వచ్చి దాడి చేశారని నాని చెప్పారు. ప్రశాంతమైన దెందులూరు నియోజకవర్గంలో ఈ తరహా దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులతో వైఎస్సార్సీపీ నేతలను దారుణంగా ఇబ్బందులు పెట్టడంపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలను బలంగా తిప్పికొడదామని వైఎస్ జగన్ సూచించారు. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడడం దారుణమన్నారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత అర్థమై ఇలా కూటమి నేతలు భయోత్సాతం సృష్టిస్తున్నారని వైఎస్ జగన్ తీవ్రంగా మండిపడ్డారు.ఈ అనైతిక కార్యక్రమాలన్నీ ప్రజలు గమనిస్తున్నారని, టీడీపీకి తగిన బుద్ది చెబుతారన్నారు. వైఎస్సార్సీపీ నాయకులంతా ధైర్యంగా ఉండాలని, పార్టీ అందరికీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. నానికి అవసరమైన న్యాయ సహాయం అందించేందుకు వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అందుబాటులో ఉంటుందని భరోసానిచ్చారు. -
మద్ది క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం
జంగారెడ్డిగూడెం: స్వయంభూః శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభాతసేవ, నిత్యార్చన పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు బారులుతీరి స్వామివారిని దర్శించుకున్నట్లు దేవస్థాన కార్యనిర్వాహణాధికారి ఆర్వీ చందన తెలిపారు. భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రంలో అన్నప్రసాద వితరణ చేసినట్లు చెప్పారు. తాడేపల్లిగూడెం: డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ ఉపకులపతి నియామకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఉత్తర్వులు మంగళవారం సాయంత్రానికి కూడా రాలేదు. దీంతో ఈ కుర్చీ విషయంలో సందిగ్ధ స్థితి కొనసాగుతోంది. కొత్త ఉపకులపతి వస్తేనే కాని, లేదంటే ఎవ్వరినైనా ఇన్చార్జిగా నియమించి వారు ఇక్కడకు వచ్చి బాధ్యతలు స్వీకరించేవరకు ప్రస్తుతమున్న వీసీ కొనసాగుతారు. అయితే విధాన పరమైన కీలక నిర్ణయాలు తీసుకొనే వెసులుబాటు ఉండదు. మార్గదర్శకాలు, నిబంధనల ప్రకారం వర్సిటీ రిజిస్ట్రార్ పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. -
కారులో చెలరేగిన మంటలు
ఏలూరు టౌన్: ఏలూరు అమీనాపేటలో మంగళవారం రాత్రి ఒక కారులో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే కారు అగ్నికి ఆహుతి అయ్యింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు మంచినీళ్ళతోట ప్రాంతానికి చెందిన కురెళ్ళ సుబ్బారావుకి చెందిన కారులో మంగళవారం రాత్రి 8.15 గంటలకు యజమాని కుమారుడు వివేక్ ప్రయాణిస్తున్నాడు. అశోక్నగర్ వైపు నుంచి కారులో వెళుతూ ఉండగా అమీనాపేట సోనోవిజన్ షోరూమ్ సమీపానికి వచ్చే సరికి కారు ఇంజన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన వెంటనే కారులో నుంచి కిందికి దిగి పక్కకు వెళ్లిపోయారు. స్థానికులు మంటలను అదుపుచేసే ప్రయత్నం చేశారు. ఏలూరు అగ్నిమాపక అధికారి రామకృష్ణ పర్యవేక్షణలో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. కారు ఇంజన్ భాగం దగ్ధమైంది. అగ్నిమాపకశాఖ ప్రమాదనష్టాన్ని అంచనా వేస్తున్నారు. -
ప్రమాద స్థాయిలో తమ్మిలేరు
● శనివారపు పేట కాజ్వే పైకి నీరు ● లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం ఏలూరు (టూటౌన్): తమ్మిలేరు ప్రాజెక్టు నుంచి 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో తమ్మిలేరు నిండుకుండలా ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరింది. ఏలూరు నగర ప్రజల్లో ఆందోళన నెలకొంది. ప్రవాహం మరింత ఎక్కువైతే నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరే ప్రమాదం పొంచి ఉంది. నగరాన్ని ఆనుకుని ఇరువైపులా తూర్పు, పడమరగా ఉన్న తమ్మిలేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. శనివారపు పేట కాజ్వేపై రెండు అడుగుల మేర నీరు చేరింది. సోమవారం సాయంత్రం నుంచి కాజ్వేపై రాకపోకలు నిలిపేశారు. దీంతో ఏలూరు నుంచి పెదవేగి మండలంలోని పలు గ్రామాలతో పాటు నగరంలోని శనివారపు పేట, శ్రీరామ్ నగర్ ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏలూరు నుంచి నూజివీడు వెళ్లే ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. రాకపోకలు నిలిపివేయడంతో సెయింట్ ఆన్స్, గవరవరం, గ్జేవియర్ నగర్, టీటీడీ కళ్యాణమండపం మీదుగా ఏలూరు టౌన్లోకి వస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలన్న కలెక్టర్, ఎస్పీ తమ్మిలేరు వరద దృష్ట్యా ఏలూరు రూరల్, అర్బన్ ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలను కలెక్టర్ కె.వెట్రిసెల్వి, ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ మంగళవారం ఉదయం పరిశీలించారు. తమ్మిలేరు పరివాహక ప్రాంతమైన శనివారపుపేట కాజ్ వే, బాలయోగి వంతెన, తంగెళ్ళమూడి వంతెన తదితర ప్రాంతాల్లో పర్యటించారు. వరద వల్ల ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు, తమ్మిలేరు వెంట ఉన్న గట్ల పటిష్టత గురించి ఆదేశాలు జారీ చేశారు. తమ్మిలేరు వరద కారణంగా చింతలపూడి, లింగపాలెం, పెదవేగి, చాట్రాయి, ముసునూరు మండలాల్లోని గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందన్నారు. గట్ల పటిష్టతను పరిశీలించి బలహీనమైన చోట్ల అవసరమైన ఇసుక బస్తాలు, తదితర సామగ్రితో పటిష్టం చేయాలన్నారు. తమ్మిలేరు రిజర్వాయర్ లో నీటి సామర్ాధ్యన్ని ఎప్పటికప్పుడు ఇరిగేషన్ అధికారులు తెలుసుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎస్పీ మాట్లాడుతూ తమ్మిలేరు వరద నీటి విడుదల ఎప్పటికప్పుడు రెవెన్యూ, పోలీసు అధికారులు గమనిస్తూ ప్రజలకు సమాచారం ఇవ్వాలన్నారు. తమ్మిలేరు వరద నీటిని ఏలూరు తూర్పు, పడమర లాకుల నుంచి దిగువ కొల్లేరులోకి విడుదల చేస్తున్నారు. లాకుల వద్ద ఉన్న అన్ని గేట్లను ఎత్తేశారు. దీంతో పెద్ద ఎత్తున వరద నీరు దిగువకు ప్రవహిస్తోంది. లాకుల వద్ద చెత్తను ఎప్పటికప్పుడు తీయించేందుకు అధికారులు పొక్లెయిన్లను అందుబాటులో ఉంచారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కార్పొరేషన్లో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. -
మహానేతకు ఘన నివాళి
సాక్షి ప్రతినిధి, ఏలూరు: రైతుకు తోడుగా, నిరుపేదకు నీడగా, ఆడపడుచులకు అండగా, యువతకు దార్శనికుడిగా, ఆనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆపద్బాంధవుడిగా, పేద విద్యార్థుల ఉన్నత చదవులకు పెద్దదిక్కుగా జనరంజక పాలన సాగించిన రాజన్నకు జిల్లా ప్రజలు జోహార్లు పలికారు. మహానేత దివికేగి 16 ఏళ్లు గడిచినా గుండె గూటిలో ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలంగానే ఉంటాయని చాటిచెప్పారు. జోహార్ వైఎస్సార్ అంటూ నినదించారు. జిల్లా వ్యాప్తంగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని నిర్వహించారు. వైఎస్సార్సీపీ నేతలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్ఆర్తో అనుబంధాన్ని, ఆయన చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నేతలు గుర్తుచేసుకున్నారు. పలు చోట్ల అన్నదానాలు, దుస్తుల పంపిణీ, ఇతర కార్యక్రమాలు నిర్వహించారు.వాడవాడలా ఘనంగా నివాళులు● పార్టీ జిల్లా అధ్యక్షుడు, కై కలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కై కలూరులో వైఎస్సార్ సంస్మరణ కార్యక్రమాలు జరిగాయి. కై కలూరు సంత మార్కెట్ వద్ద వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదరిక నిర్మూలనకు వైఎస్సార్ వినూత్న పథకాలు ప్రవేశపెట్టి అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ఆరోగ్యశ్రీ, 108, 104 సేవలు, ఫీజు రీయింబర్స్మెంటు, ఉచిత కరెంటు, రుణ మాఫీ ఇలా అనేక పథకాలతో పేదల కష్టాలను తీర్చిన మహానుభావుడని కీర్తించారు.● నూజివీడు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావు నేతృత్వంలో చినగాంధీ బొమ్మ సెంటరులో నివాళి కార్యక్రమం నిర్వహించారు. నూజివీడు మండలం రేగుంటలో ఉచిత వైద్యశిబిరాన్ని నిర్వహించి పేదలకు మందులు పంపిణీ చేశారు.● పోలవరం నియోజకవర్గంలో బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీ.నర్సాపురం, కొయ్యలగూడెం, పోలవరం మండలాల్లో వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. జీలుగుమిల్లి మండలం ములగలంపల్లిలో పేదలకు సొసైటీ మాజీ అధ్యక్షుడు, పార్టీ నేత ఘంటశాల గాంధీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు.● ఉంగుటూరులో మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు దివంగతనేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గణపవరం, భీమడోలు, నిడమర్రు ఆయా మండలాల్లో నాయకులు వైఎస్సార్కు నివాళులర్పించారు.● చింతలపూడి నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త కంభం విజయరాజు నేతృత్వంలో నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కార్యక్రమాలు నిర్వహించారు. చింతలపూడిలో అన్నదాన కార్యక్రమం, జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం, శ్రీనివాసపురంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అలాగే కామవరపుకోట, లింగపాలెం మండలాల్లో నివాళి కార్యక్రమాలు నిర్వహించారు.● ద్వారకాతిరుమల, పంగిడిగూడెం గ్రామాల్లో జరిగిన వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాల్లో మాజీ హోం మంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయించుకున్న ప్రతి పేదవాడి గుండె చప్పుడులో వైఎస్సార్ చిరస్మరణీయంగా ఉన్నారన్నారు. చివరి శ్వాస వరకు పేదల సంక్షేమానికి ఆయన కృషి చేశారని కొనియాడారు. తండ్రి బాటలో సంక్షేమ పాలన సాగించి ప్రజలకు మేలు చేసిన ఘనత జగనన్నకే దక్కిందన్నారు.● దెందులూరు మండలం శ్రీరామవరంలో పార్టీ యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు కామిరెడ్డి నాని దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పెదపాడు, పెదవేగి, ఏలూరు రూరల్ మండలాల్లో ఆయా మండల నాయకుల ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు.● ఏలూరు నగరంలో పార్టీ నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాస్, పార్టీ నాయకులు జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. అలాగే ఫైర్స్టేషన్ సెంటరులో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
పేట్రేగిన టీడీపీ మూకలు
● వైఎస్సార్సీపీ యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు నానిపై దాడి ● ఆస్పత్రికి వెళ్తే అక్కడికీ వెళ్లి దాడిచేసిన టీడీపీ మూకలు టాస్క్ఫోర్స్: కూటమి ప్రభుత్వంలో దాడులు, దౌర్జ న్యాలు, అక్రమ కేసుల పరంపర కొనసాగుతూనే ఉన్నాయి. వైఎస్సార్సీపీ యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు, శ్రీరామవరం సర్పంచ్ కామిరెడ్డి నానిపై దాడులు పరంపర కొనసాగుతోంది. గతేడాది జూలై7న నాని ఇల్లు, తండ్రి కార్యాలయంపై దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేయడంతో పాటు, ద్విచక్రవాహనాలను దగ్ధం చేశారు. గత నెలలో అక్రమ కేసు బనాయించి అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఏలూరు న్యాయస్ధానం నాని అరెస్టును తప్పుపట్టి అరెస్టు చేసిన పెదవేగి ఎస్సై మెమో జారీ చేసింది. ఆస్పత్రిలో మరోసారి దాడి నానిపై మంగళవారం టీడీపీ రౌడీ మూకలు హత్యాయత్నానికి పాల్పడ్డాయి. ఈ మేరకు నాని పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. నాని ప్రయాణిస్తున్న కారుపై కత్తి, క్రికెట్ కర్రతో దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. మంగళవారం వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకుని శ్రీరామవరంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం కారులో తిరిగివస్తుండగా శ్రీరామవరం మలుపు దాటిన తర్వాత టీడీపీ నాయకులు మోత్కూరు నాని, అక్కినేని రాజేంద్రప్రసాద్ తన కారుకు వాళ్ళ కారు అడ్డుపెట్టి క్రికెట్ కర్రలు, కత్తితో దాడి చేసి అద్దాలు పగలగొట్టారని చెప్పారు. తనను కారులో నుంచి కిందకు లాగి క్రికెట్ కర్రతో చంక కింద భుజం పైన కొట్టారన్నారు. తనపై టీడీపీ నాయకులు దాడి చేస్తుండగానే వారు ఫోన్ చేస్తే మరో 30 మంది రౌడీమూకలు వచ్చాయన్నారు. తనపై జరిగిన హత్యాయత్నాన్ని జిల్లా ఎస్పీకి చెప్పి చూపించడానికి ఎస్పీ కార్యాలయానికి వచ్చామన్నారు. ఎస్పీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళితే అక్కడ కూడా టీడీపీ శ్రేణులు వచ్చి దాడి జరపడంతో పాటు అక్కడ ఉన్న పార్టీ నాయకులు కే. పట్టాభిరామయ్య, కే. బాలు, సాయిలపై దాడి చేశారు. ఈ దాడిలో పట్టాభిరామయ్య తలకు గాయమైంది. కామిరెడ్డి నాని, పార్టీ నాయకులపై టీడీపీ నాయకుల దాడిని మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి ఖండించారు. ప్రశాంతమైన దెందులూరు నియోజకవర్గంలో ఈ తరహా దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరగలేదన్నారు. ఏదైనా సమస్య ఉంటే పరిష్కారం చేసుకోవాలే తప్పా దాడులు, దౌర్జన్యాలు తగదన్నారు. -
వైద్యం వికటించి ..యువతి మృతి
ఏలూరు టౌన్: ఆర్ఎంపీ వైద్యుడి నిర్వాకంతో వైద్యం వికటించి ఒక యువతి మృతిచెందింది. దీంతో మృతురాలి బంధువులు ఆర్ఎంపీ వైద్యుడి క్లినిక్ వద్ద మంగళవారం ఆందోళనకు దిగారు. ఏలూరు వన్టౌన్ తూర్పువీధి మేకల కబేళా ప్రాంతానికి చెందిన కటారి భారతి (20) భర్తతో కలిసి జీవిస్తోంది. గత మూడు రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతుండడంతో ఆమెను మంగళవారం వంగాయగూడెం సెంటర్లోని ఆర్ఎంపీ వైద్యుడు నాని వద్దకు తీసుకువెళ్లారు. అతని క్లినిక్ పక్కనే ఉన్న మెడికల్ షాపులో రెండు ఇంజక్షన్లు తీసుకుని జ్వరంతో బాధపడుతున్న భారతికి నరంలోకి ఇంజెక్షన్ ఇచ్చారు. కొంతసేపు విశ్రాంతి తీసుకోవాలని బంధువులకు సూచించాడు. ఇంజక్షన్ చేసిన 15 నిమిషాల వ్యవధిలోనే ఆమె స్పృహ కోల్పోయింది. బంధువులంతా భయపడగా... ఏమీ కాదనీ కంగారుపడవద్దని ఆర్ఎంపీ వైద్యుడు నాని చెప్పాడు. కొంతసేపు గడచిన అనంతరం మెరుగైన వైద్యం కోసం వేరొక హాస్పిటల్కు తరలించాలని సూచించాడు. బంధువులు వేరొక హాస్పిటల్కు తరలించేందుకు ప్రయత్నిస్తూ ఉండగానే ఆమె మృతిచెందింది. కోపంతో బంధువులంతా ఆమె మృతదేహాంతో నాని క్లినిక్ వద్ద ఆందోళన చేపట్టారు. ఏలూరు వన్టౌన్ పోలీసులకు సమాచారం రావటంతో ఘటనా స్థలానికి వెళ్లి బాధితులతో మాట్లాడి సర్థిచెప్పారు. మృతదేహాన్ని ఏలూరు జీజీహెచ్ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నారు. ఇదే తరహాలో ఆర్ఎంపీ వైద్యుడి నిర్వాకంతో గతంలోనూ ఇలాంటి ఘటనలే చోటుచేసుకున్నాయని ఆరోపిస్తున్నారు. అతనికి వైద్యం చేసే అర్హత కూడా లేదని పలువురు చెబుతున్నారు. -
రోడ్డెక్కిన గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులు
చింతలపూడి: గ్రీన్ ఫీల్డ్ హైవేకు సర్వీస్ రోడ్లు ప్రొవిజన్ కల్పించాలని, గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల సమస్యలు పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేశారు. భూ నిర్వాసిత రైతుల పోరాట కమిటీ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రేచర్ల గ్రామం వద్ద ఆందోళన చేపట్టారు. భూ నిర్వాసిత రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రీన్ ఫీల్డ్ హైవేకు సర్వీస్ రోడ్లు ప్రొవిజన్ కల్పించకపోవడం దారుణమని విమర్శించారు. రైతులు తమ పొలాలకు వెళ్లే మార్గాలు లేక, తమ పంటలు తెచ్చుకునే అవకాశం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక చోట్ల అండర్ పాస్లు తగినంత ఎత్తు, వెడల్పుతో నిర్మాణం చేయకపోవడంతో గ్రామాల మధ్య రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయని చెప్పారు. గ్రీన్ఫీల్డ్ హైవే వలన ప్రతి గ్రామం పరిధిలో సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అధికారులు క్షేత్ర స్థాయిలో గ్రామాల వారీగా రైతులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలన్నారు. రేచర్ల ఎగ్జిట్ వద్ద రైతులు తమ పొలాలకు వెళ్లే మార్గం లేదన్నారు. సర్వీస్ రోడ్ ఏర్పాటు చేస్తామని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని అధికారులు ఇచ్చిన హామీలు అమలు కాలేదన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు హైవే అథారిటీ, రెవెన్యూ అధికారులు, కేఎంవీఎల్ రోడ్డు నిర్మాణ సంస్థ మేనేజర్ తదితరులు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం వలన రైతులకు, ప్రజలకు వస్తున్న సమస్యలను పరిశీలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ రైతులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సర్వీస్ రోడ్లు నిర్మించాలని డిమాండ్ -
వైఎస్ చలవతో తమ్మిలేరు కష్టాలకు చెక్
● రక్షణ గోడ నిర్మాణానికి నాంది పలికిన వైఎస్సార్ ● రూ. 60 కోట్ల గోడతో ప్రజలకు ఊరట ఏలూరు టౌన్: ‘ఏలూరు దుఃఖదాయినిగా తమ్మిలేరును పిలుచుకునే పరిస్థితి.. తుపానులు, భారీ వర్షాలు కురిస్తే చాలు.. ఏలూరు నగరంలో తూర్పు, పడమరగా ప్రవహించే తమ్మిలేరు వరద ఉద్ధృతికి జనం బెంబేలెత్తేవారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యేవి. ప్రజలంతా నిరాశ్రయులై పిల్లాపాపలతో బతికితే చాలు అన్నట్లు.. ప్రభుత్వం ఏర్పాటు చేసే పునరావాస కేంద్రాల్లో తలదాచుకునే దుస్థితి ఉండేది. 2005లో ముఖ్యమంత్రిగా దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏలూరు నగరంలో వరద పరిస్థితులను పరిశీలించేందుకు హుటాహుటిన బయలుదేరి వచ్చారు. నగరంలోని పలు ప్రాంతాల్లో వరద నీటిలోనే వరద బాధితులను పరామర్శించారు. ప్రజలను తీవ్రస్థాయిలో కష్టాల్లోకి నెడుతున్న తమ్మిలేరు వరద ముంపునకు శాశ్వత పరిష్కారానికి ఆయన నాంది పలికారు. తమ్మిలేరు గట్లకు రక్షణ గోడ నిర్మాణం చేపట్టాలని సంకల్పించారు. నిధులు సైతం విడుదల చేశారు. నేడు ప్రజలు భయం లేకుండా సురక్షితంగా ఉన్నారంటే... ‘మహానేత డాక్టర్ వైఎస్సార్ చలవే అంటారు’ తమ్మిలేరు వరదముప్పుకు శాశ్వత పరిష్కారం తమ్మిలేరు ఏలూరు నగరంలోకి ప్రవేశిస్తూనే తూర్పు, పడమరగా రెండు పాయలుగా ప్రవహిస్తుంది. తూర్పు వైపు అశోక్నగర్, కుమ్మరిరేవు, ఇజ్రాయేల్పేట, బీడీ కాలనీ, తంగెళ్ళమూడి సెంటర్ మీదుగా వెళుతుంది. పడమరవైపు అశోక్నగర్ బ్రిడ్జికి ముందుగా ప్రవహిస్తూ శనివారపుపేట కాజ్వే మీదుగా అమీనాటపేట ఏటిగట్టు, జన్మభూమి పార్క్, సీఆర్ఆర్ కాలేజీ ప్రాంతంలో నుంచి పడమర లాకుల వైపు వెళుతుంది. అనంతరం ఎన్టీఆర్ కాలనీ, కొత్తూరు కాజ్వే, పోణంగి, వైఎస్సార్ కాలనీల మీదుగా ప్రవహిస్తుంది. ఈ ప్రాంతాలన్నీ గతంలో తమ్మిలేరు వరదముంపు ప్రభావిత ప్రాంతాలే కావటం విశేషం. భారీ ఎత్తున వరదనీరు ఏలూరు నగరంలోకి ప్రవేశిస్తే చాలు ప్రజలు వరద భయంతో వణికిపోయేవారు. రూ.60 కోట్లతో రక్షణ గోడ ఏలూరు నగర ప్రజలకు తమ్మిలేరు ఏటిగట్టు వరద ముంపు నుంచి రక్షణ కల్పించేందుకు 2005లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.60 కోట్లతో రక్షణ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఏలూరు అశోక్నగర్ ప్రాంతంలో తూర్పు, పడమర వైపు ఏటిగట్టుకు రివిట్మెంట్ నిర్మాణం చేశారు. మరోవైపు అమీనాపేట ప్రాంతంలో తమ్మిలేరుకు రెండు వైపులా రక్షణ గోడ నిర్మాణం చేశారు. ఈ రివిట్మెంట్తో వరద ముంపు బారి నుంచి కొంతమేర ఊరట లభించింది. అనంతరం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం హయాంలో రూ.80 కోట్లతో మరికొన్ని ప్రాంతాల్లో తమ్మిలేరుకు రివిట్మెంట్ నిర్మాణం చేశారు. వైఎస్సార్ కాలనీ, పోణంగి ప్రాంతాలకు పూర్తిస్థాయిలో వరద భయం పోయింది.ఆనాడు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏలూరు నియోజకవర్గ ప్రజలు తమ్మిలేరు వరదముంపుతో కష్టాలు పడకూడదనే సంకల్పంతో రివిట్మెంట్ నిర్మాణానికి చర్యలు చేపట్టారు. యుద్ధప్రాతిపదికన నిధులు మంజూరు చేసి నిర్మాణం చేసేలా శ్రద్ధ చూపారు. దీంతో అమీనాపేట ఏటిగట్టు, ఇజ్రాయేల్ పేట, అశోక్నగర్ ప్రాంతాల్లోని ప్రజలు ప్రశాంతంగా నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. మిగిలిన ప్రాంతాల్లోనూ తమ్మిలేరుకు రివిట్మెంట్ నిర్మాణం చేయాలని ప్రజలు కోరుతున్నారు. – పల్లి శ్రీనివాసరావు, వైఎస్సార్టీయూసీ జిల్లా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మహానేత డాక్టర్ వైఎస్సార్ ఏలూరు నియోజకవర్గం ప్రజల పట్ల అభిమానంతో పనిచేశారు. తండ్రి, కొడుకులు ఇద్దరూ... ఏలూరుకు తమ్మిలేరు వరద నుంచి శాశ్వత పరిష్కారం లభించేలా కృషి చేశారు. పోణంగి, వైఎస్సార్ కాలనీల్లో ప్రజలు తమ్మిలేరుకు వరద వస్తే చాలు.. కట్టుబట్టలతో పరుగులు పెట్టే పరిస్థితి ఉండేది. కానీ మహానేత వైఎస్సార్ అనంతరం మాజీ సీఎం జగన్ అన్నతోనే ... మిగిలిన చోట్ల రివిట్మెంట్ నిర్మాణం సాధ్యం అవుతుంది. – గంటా రాజేంద్ర, ఏలూరు వన్టౌన్ -
మహిళపై దాడి.. కేసు నమోదు
ముదినేపల్లి రూరల్: మహిళపై దాడి ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులపై స్థానిక పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం పెనుమల్లి శివారు శింగారంలో వినాయకచవితి సందర్భంగా గత నెల 27న ఉత్సవాల వద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలో వాసుపల్లి నాగరాజు ఫొటో ముద్రించారు. అదే గ్రామానికి చెందిన జి రామకృష్ణ ఆగ్రహించి నాగరాజు ఇంటికి వెళ్లి ఫ్లెక్సీపై ఫొటో వేసుకునే స్థాయి నీకెక్కడిది అంటూ, ఎందుకు వేయించుకున్నావంటూ వినాయకచవితి రోజున దూషించాడు. అనంతరం సోమవారం రాత్రి గ్రామంలో జరిగిన అన్నసమారాధనకు నాగరాజు వెళ్లగా అక్కడ దాడి చేసేందుకు రామకృష్ణ యత్నించాడు. రామకృష్ణతోపాటు నాగరాజు, వీరబాబు వాసుపల్లి నాగరాజు ఇంటికి వెళ్లి రాడ్లతో దాడి చేయబోగా తప్పించుకోవడంతో అడ్డు వచ్చిన నాగరాజు భార్య మాధవికి తగిలి గాయాలయ్యాయి. దీనిపై బాధితురాలు మాధవి మంగళవారం ిఫిర్యాదు చేయగా ఎస్సై వీరభద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఏలూరు (మెట్రో): ప్రకృతి వ్యవసాయాన్ని కేవలం వేతన ప్రాతిపదికన చేసే పనికాదని, సేవగా చూడాలని ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ (డీపీఎం) వెంకటేష్ అన్నారు. మంగళవారం వ్యవసాయశాఖాధికారి కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఫార్మర్ సైంటిస్టులు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల నుంచి మొత్తం 75 మంది సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీపీఎం వెంకటేష్ మాట్లాడుతూ డెల్టా ప్రాంతాల్లోని సభ్యులు వరి, మొక్కజొన్న పంటలకు వినూత్నమైన మోడళ్లను రూపొందించి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రారంభ ప్రయత్నాలు విఫలమైనా సరే, ట్రయల్ అండ్ ఎరర్ పద్ధతిలో నిరంతరం ప్రయోగాలు చేస్తూ ముందుకు సాగితే ఒక దశలో విజయం సాధించగలమన్నారు. రైతు సాధికారిక సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజయ్కుమార్ గూగుల్ మీట్ ద్వారా సమావేశానికి హాజరై ప్రసంగించారు. పూర్తిగా రసాయనికంగా సాగు చేసిన భూమిని ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా మార్పు చేసి, దిగుబడుల్లో ఎలాంటి నష్టం లేకుండా సాగు సాధ్యమవుతుందని ఒక ప్రామాణిక నమూనాను ప్రదర్శించారు. 20 కాసుల బంగారం చోరీ పాలకొల్లు సెంట్రల్: పెళ్లి ఇంట్లో బంగారు ఆభరణాల చోరీపై కేసు నమోదైంది. మండలంలోని ఉల్లంపర్రు గ్రామంలో పెన్మెత్స సుబ్బరాజు ఇంట్లో ఇటీవల వివాహం జరిగింది. వివాహ వేడుక అనంతరం చూసుకోగా హారం, నల్లపూసలు, గొలుసు, తెలుపు గులాబి రంగు రాళ్ల ముత్యాల నక్లీసు, బంగారు గాజులు, దుద్దులు మొత్తం దాదాపుగా 20 కాసుల వరకూ బంగారు ఆభరణాలు పోయినట్లు గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.11 లక్షల వరకూ ఉంటుందని అంచనా. ఇంటిలో ఓ వ్యక్తిపై అనుమానం ఉన్నట్లు సుబ్బరాజు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రూరల్ ఎస్సై బి. సురేంద్రకుమార్ తెలిపారు. -
వాటా.. కోటాగా కూటమి ప్రభుత్వం
పెంటపాడు: ప్రజాపాలన విస్మరించి కూటమి ప్రభుత్వం తమ కార్యకర్తలకు కోటా.. వాటాగా పనిచేస్తోందని రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ విమవర్శించారు. మంగళవారం జట్లపాలెంలోని ఎస్సీపేటలో వైఎస్సార్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. కొట్టు మాట్లాడుతూ నియోజకవర్గం నుంచి రాష్ట్రం దాకా కూటమి నేతలు కోటా, వాటాగా పంచేసుకుంటున్నారన్నారు. ప్రధానంగా జిల్లాలోని పలు ప్రాంతాలకు సంబందించి సీజన్ ఎరువులు గూడెం వస్తాయని, అయితే ఎరువుల ర్యాక్లను కూటమి నేతలు పంచుకుంటూ రైతుల సమస్యలను గాలికొదిలేశారన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని చెప్పిన ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ కూటమికి తలొగ్గారన్నారు. వైఎస్సార్ సీపీ పటిష్టతకు కృషి చేయాలి వైఎస్సార్ సీపీ పటిష్టతకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని కొట్టు సత్యనారాయణ పిలుపునిచ్చారు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా జగనన్న అందించిన పాలనను ప్రజలకు మళ్లీ అందించేలా ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా పేదలకు పండ్లు పంపిణీ చేశారు. మాజీ ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శ -
ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి
ఉంగుటూరు: ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పంట బోదెలోకి బోల్తా పడడంతో డ్రైవర్ మృతి చెందిన ఘటన నారాయణపురంలో చోటుచేసుకుంది. చేబ్రోలు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిడమర్రు మండలం బావాయిపాలెం గ్రామానికి చెందిన సింగులూరి రాంబాబు (59) భీమవరంలో ట్రాక్టరుపై డ్రైవర్గా పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో ట్రాక్టర్పై చేపల మేతలోడు భీమవరం నుంచి భీమడోలు మండలం గుండుగొలను తీసుకువెళ్లి అక్కడ దించేసి ఖాళీ ట్రాక్టరుతో తిరిగి భీమవరం వస్తున్నాడు. చేబ్రోలు వంతెన మీదనుంచి నారాయణపురం పుంత రహదారిమీదుగా వెళుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ అదుపు తప్పి పక్కనే ఉన్న పంట బోదెలోకి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ రాంబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. అతడికి భార్య వరలక్ష్మి ఇద్దరు కుమారులు ఉన్నారు. మంగళవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పజెప్పగా అంత్యక్రియలు నిర్వహించారు. చేబ్రోలు ఎస్సై సూర్య భగవాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తప్పని పడవ ప్రయాణం
వేలేరుపాడు: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమేపీ తగ్గుముఖం పడుతున్నా వేలేరుసాడు మండలాన్ని ముంపు వీడటం లేదు. మంగళవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద 41.40 అడుగులకు చేరింది. అయినప్పటికీ వేలేరుపాడు మండలంలో 25 గ్రామాలు ఐదో రోజూ కూడా జలదిగ్బంధనంలోనే ఉన్నాయి. వేలేరుపాడు నుంచి కొయిదా వెళ్లే రహదారిలో మేళ్ళవాగు, ఎద్దెలవాగు, టేకూరు, తదితర వాగుల వంతెనలు ముంపులోనే ఉన్నాయి. దిగువనున్న కొయిదా, కాచారం, పేరంటపల్లి, టేకుపల్లి, తాళ్ళగొంది, పూసుగొంది, టేకూరు, కట్కూరు, సిద్దారం, ఎడవల్లి, చిట్టంరెడ్డిపాలెం, ఎర్రతోగు, చిగురుమామిడి, బోళ్ళపల్లి, పాతనార్లవరం, తూర్పుమెట్ట, కొత్తూరు, తదితర గ్రామాలతోపాటు మరో ఎనిమిది గ్రామాలు జలదిగ్బంధనంలోనే ఉన్నాయి. వేలేరుపాడు నుంచి రేపాకగొమ్ము, వెళ్లే రహదారి మంగళవారం బయటపడింది. దీంతో ఆయా గ్రామ ప్రజలు మోకాల్లోతు నీటిలో ప్రయాణిస్తున్నారు. రుద్రమకోట వెళ్లే రహదారులు ఇంకా నీటిలోనే మునిగి ఉండటంతో ఆయా గ్రామాల ప్రజలు లచ్చిగూడెం గ్రామం గుండా రాకపోకలు సాగిస్తున్నారు. దిగువ గ్రామాల ప్రజలు పడవలపై ప్రయాణిస్తున్నారు. ఐదో రోజూ జలదిగ్బంధంలోనే 25 గ్రామాలు -
దెందులూరులో టీడీపీ నేతల గూండా గిరి
సాక్షి, ఏలూరు: దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు గూండా గిరికి తెగబడ్డారు. వైఎస్సార్ వర్ధంతి వేడుకల్లో పాల్గొనేందుకు మంగళవారం శ్రీరామవరం వెళ్లిన వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు కామిరెడ్డి నానిపై హత్యాయత్నానికి ప్రయత్నించారు.క్రికెట్ కిట్లు, బీరు సీసాలు, కత్తులతో తెలుగు యువత అధ్యక్షుడు మోత్కూరీ నాని, కొందరు టీడీపీ కార్యకర్తలు.. కామిరెడ్డి నానిపై దాడికి ప్రయత్నించారు. పోలీసుల సమక్షంలోనే పచ్చ మూకలు రెచ్చిపోయి.. కారును ధ్వంసం చేశారు. ఈ దాడిలో 50 మందికిపైగా పాల్గొన్నారు. ఈ ఘటనకు సంబంధించి అదనపు సమాచారం అందాల్సి ఉంది. -
మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులకు అస్వస్థత
కుక్కునూరు: స్థానిక జెడ్పీ హైస్కూల్లో మధ్యాహ్న భోజనం తిని 8 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 6వ తరగతికి చెందిన 8 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తిన్న తరువాత వాంతులు అవ్వడంతో వెంటనే ఉపాధ్యాయులు స్థానిక పీహెచ్సీకి తరలించి చికిత్స అందించారు. దీనిపై పీహెచ్సీ వైద్యురాలు డాక్టర్ సుప్రియను వివరణ కోరగా విద్యార్థుల ఆరోగ్యం బాగానే ఉందని, చికిత్స అందించిన వెంటనే పంపించివేశామని చెప్పారు. కాగా దీనిపై విద్యార్థుల తల్లితండ్రులు పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయులను నిలదీశారు. భోజనం తిన్న వెంటనే వాంతులు అయ్యాయని విద్యార్థులు చెబుతుంటే, బయట నుంచి తెచ్చుకున్న బిస్కెట్లు తినడం వలనే విద్యార్థులకు వాంతులు అయ్యాయని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఎంపీపీ చేబ్రోలు గీతావాణి, సర్పంచ్ రావు మీనాతో కలిసి పాఠశాలకు వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎంపీపీ ఉపాధ్యాయులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భోజనంలో నాణ్యత పాటించాలని సూచించారు. -
నారాయణ స్కూల్లో దారుణం
పాలకొల్లు సెంట్రల్: తరగతి గదిలో ఓ చిన్నారి హార్పిక్ యాసిడ్ పౌడర్ తినేయడంతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన పాలకొల్లు శంభన్న అగ్రహారం ప్రాంతంలో చోటుచేసుకుంది. పట్టణంలోని స్థానిక బుధవారపు వీధి ప్రాంతానికి చెందిన మామిడిపల్లి సంయుక్త, అనుదీప్ వివరాలను విలేకరులకు వెల్లడించారు. తమ కుమార్తె నాలుగేళ్ల చిన్నారి హార్వి సహస్ర పట్టణంలోని నారాయణ స్కూల్లో ఎల్కేజీ చదువుతోందని తెలిపారు. గత గురువారం స్కూల్కు వెళుతుండగా పాప బ్యాగ్లో బిస్కెట్ ప్యాకెట్ వేసి పంపించామని చెప్పారు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో చిన్నారికి అస్వస్థతగా ఉందని ఆసుపత్రికి తీసుకు వెళుతున్నామని స్కూల్ నుంచి ఫోన్ రావడంతో వెళ్లినట్టు చెప్పారు. అక్కడ చిక్సిత చేసిన వైద్యులు ఇక్కడ కష్టమని, మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించాలని సూచించారన్నారు. వెంటనే విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్లు చెప్పారు. అసలు విషయంపై ఆరా తీయగా స్కూల్లో ఇచ్చిన స్నాక్స్ బ్రేక్లో చిన్నారి బిస్కెట్ ప్యాకెట్ అనుకొని హార్పిక్ యాసిడ్ పౌడర్ తినేసిందని, దీంతో నోటి నుంచి రక్తం వచ్చినట్లు తెలిసిందన్నారు. చిన్నారి నాలుక, పేగులు, గొంతు లోపల భాగంలో కాలిపోయాయని వైద్యులు చెప్పినట్టు బాలిక తల్లి సంయుక్త కన్నీరుమున్నీరవుతూ వివరించారు. ప్రస్తుతం శరీరంలోకి పైపు ద్వారా ఓఆర్ఎస్ ద్రావణం, కొబ్బరి నీళ్లు, మంచినీళ్లు ఐదేసి చుక్కలు చుక్కలుగా వేస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు సుమారు రూ.1.50 లక్షలు ఖర్చు అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో కేసు నమోదు చేయించినట్టు కుటుంబసభ్యులు తెలిపారు.తప్పించుకునే ప్రయత్నంలో బుకాయింపుఈ ఘటనపై స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా మీ పాప ఆ ప్యాకెట్ తెచ్చుకుందని బుకాయిసున్నారని చిన్నారి తల్లిదండ్రులు వాపోయారు. సీసీ ఫుటేజీ తీయాలని అడుగుతుంటే కెమెరాలు పనిచేయడం లేదని చెబుతూ ఎదురు వాదనకు దిగారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్కూల్ ప్రిన్సిపాల్ వెంకటేష్ మాట్లాడుతూ స్నాక్స్ సమయంలో పాపకు ఇబ్బంది ఏర్పడినట్టు తెలియగానే నోరు కడిగి ఆస్పత్రికి తరలించామని, ఈ ప్యాకెట్ ఎక్కడిది అని పాపని అడిగితే ఇంటి నుంచి తెచ్చుకున్నానని చెప్పిందని సమాధానమిచ్చారు. సుమా రు నెల రోజుల క్రితం ఇదే పాఠశాలలో ఓ చిన్నారిపై టీచర్ అగ్గిపుల్ల అంటించి వాత పెట్టిన ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. -
అయినవాళ్లే ఆదరించకపోతే..!
తణుకు అర్బన్: నడవలేని స్థితిలో ఉండడంతో భారమవుతాడనుకున్నారో ఏమో కానీ తండ్రి, తోడబుట్టిన సోదరులు ఇంట్లోకి రానివ్వడం లేదు. దీంతో తనను ఇంట్లోకి రానివ్వండి అంటూ ఆ యువకుడు వేడుకుంటూ రోదిస్తున్న తీరు ఆ ప్రాంతవాసులను కలచివేస్తోంది. మానవత్వాన్ని మంటకలిపే ఈ ఘటన తణుకు మండలం వేల్పూరు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... గ్రామంలోని సాలిపేటకు చెందిన తాడిశెట్టి నాగ త్రినాఽథ్ గత ఏడేళ్లుగా సింగపూర్లోని షిప్యార్డులో రెస్క్యూ టీంలో ఉద్యోగిగా ఉపాధి పొంది కుటుంబంలో ఏర్పడ్డ సమస్యలతో గతేడాది జూలైలో ఇండియాకు వచ్చారు. అయితే ఇటీవల రోడ్డు ప్రమాదంలో నడుము భాగంలో తగిలిన గాయానికి కాలు కదపలేని స్థితిలో విశాఖపట్నం, విజయవాడ ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. చేతిలో ఉన్న డబ్బు అయిపోగా సోమవారం ఆస్పత్రి నుంచి ఇంటికి రాగా ఇంట్లోకి రానీయకుండా తండ్రి, అన్నదమ్ములు ఇంటి తలుపులు మూసేశారు. దీంతో దిక్కుతోచక ఇంటి ముందు రోదిస్తూ ఉండిపోయారు. గతంలోనే తల్లి చనిపోగా తండ్రి తాడిశెట్టి నాగేశ్వరరావు, అన్న, తమ్ముడు ఇంట్లోకి రానీయడంలేదని చెబుతున్నారు. సింగపూర్లో ఉన్నంత కాలం సంపాదించిన సొమ్ము అంతా ఇంటికే పంపించానని, కానీ నేడు ఆరోగ్యం బాగోలేని సమయంలో సొంతవాళ్లే పట్టించుకోవడంలేదని త్రినాథ్ వాపోతున్నారు. నడవలేని స్థితిలో యూరిన్ బ్యాగ్తో వీల్చైర్లో ఉన్న త్రినాథ్ పడుతున్న ఆందోళన, ఆవేదన వర్ణనాతీతంగా మారింది. తన సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్లతోపాటు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణలను సోషల్ మీడియా వేదికగా వేడుకుంటున్నారు. -
కుమ్మరిగట్టులో 9 డయేరియా కేసులు
బుట్టాయగూడెం: బుట్టాయగూడెం సమీపంలో ఉన్న కుమ్మరిగట్టు గ్రామంలో సుమారు 9 మంది వాంతులు, విరోచనాలతో బాధపడుతుండగా మరొక ఐదుగురు జ్వరాల బారిన పడ్డారు. దీంతో నందాపురం పీహెచ్సీకి సంబంధించిన వైద్యులు డాక్టర్ సల్మాన్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి బాధితులకు వైద్యసేవలు అందించారు. రోగుల్లో యండమూరి వెంకటలక్ష్మితో పాటు మీనాక్షి అనే చిన్నారిని చికిత్స నిమిత్తం జంగారెడ్డిగూడెం తరలించారు. ఈ వైద్యశిబిరాన్ని డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ అమృతం సందర్శించి గ్రామంలో డయేరియా కేసుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ వైద్య శిబిరాన్ని మరో ఐదు రోజులపాటు కొనసాగించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎస్ఓ హరేంద్రకృష్ణ, డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓ జె. సురేష్, సర్పంచ్ ఎం.రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు అస్వస్థతకు గురి కావడానికి కలుషిత నీరు కారణమా? లేక మరేదైనా ఉందా? అని గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. పాలకొల్లు సెంట్రల్: తండ్రికి కుమార్తె తలకొరివిపెట్టిన ఘటన పాలకొల్లులో చోటుచేసుకుంది. పట్టణంలోని బ్రాడీపేట మూడవ వీధికి చెందిన సారిక సత్యనారాయణ (80) గత రెండేళ్లుగా అనారోగ్యంతో మంచానికే పరిమితం కాగా సోమవారం మృతి చెందాడు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. ఉండి నియోజకవర్గం కాళ్ల గ్రామంలో ఉంటున్న కుమార్తె తండ్రి సత్యనారాయణ అంతిమ సంస్కారాలు నిర్వహించింది. పెన్షన్తోనే జీవనం సాగించే సత్యనారాయణకు సచివాలయ సిబ్బంది ఉదయం సుమారు 8 గంటల సమయంలో పింఛన్ ఇవ్వడానికి వెళ్లగా అప్పటికే మృతి చెందాడు.