breaking news
Personal Finance
-
మధ్యతరగతి మదుపు.. ప్రశ్నలు.. సమాధానాలు
ప్రతి మధ్యతరగతి కుటుంబానికి డబ్బుతో కూడిన చాలా కలలు ఉంటాయి. సొంతిల్లు, పిల్లల చదువులు, బంగారం, సురక్షితమైన పదవీ విరమణ.. ఇవన్నీ నెరవేరాలంటే కేవలం సంపాదన ఉంటే సరిపోదు, సరైన ఆర్థిక ప్రణాళిక ఉండాలి. ప్రస్తుత కాలంలో సామాన్యులు తమ పొదుపు ప్రయాణంలో ఎదుర్కొంటున్న ప్రధాన సందేహాలకు నిపుణుల సమాధానాలు ఇవే..రియల్టీ..సొంతిల్లు కొనుక్కోవటానికి కరెక్టు వయసంటూ ఏమైనా ఉందా? సొంతిల్లు ఫలానా వయసులోనే కొనుక్కోవాలనే నియమం కానీ, నిబంధన కానీ ఏమీ లేదు. ఇక్కడ వయసుకన్నా దీర్ఘకాలం సెటిల్మెంట్ ముఖ్యం. మీరు గనక తరచూ ప్రాంతాలు మారాల్సి వచి్చందనుకోండి. అప్పుడు సొంతిల్లు కొనుక్కునీ ప్రయోజనం ఉండదు. స్థిరమైన ఆదాయం లేనప్పుడు సొంతింటి లాంటి ఆలోచనలు చేయకూడదు. అందుకని వయసు కన్నా ఆర్థిక స్థిరత్వం, దీర్ఘకాలం అదే ప్రాంతంలో ఉండే అవకాశం, స్థిరమైన ఆదాయం అనేవి ప్రధానం.బ్యాంకింగ్..ప్రతినెలా నా ఆదాయంలో కొంత మిగులుతోంది. దీన్ని సిప్ చేయటం మంచిదా... లేక రికరింగ్ డిపాజిట్ చేయొచ్చా?రికరింగ్ డిపాజిట్... సిప్, రెండూ మంచివే. కాకపోతే రికరింగ్ డిపాజిట్లో భద్రత ఎక్కువ. కానీ రాబడి పరిమితంగా ఉంటుంది. సిప్ అనేది స్టాక్ మార్కెట్లకు, మ్యూచువల్ ఫండ్లకు మంచిదే. దీన్లోనూ భద్రత ఉంటుంది కానీ... గ్యారంటీ ఉండదు. అయితే ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులు సిప్తోనే సాధ్యమవుతాయి. కాబట్టి మీరు దీర్ఘకాలం వేచి చూసేటట్లయితే సిప్ను, స్వల్ప కాలానికైతే ఆర్డీని ఎంచుకోండి.బంగారం బంగారంలో నెలవారీ ఇన్వెస్ట్ చేయొచ్చా? దీనికున్న సాధనాలేంటి?నెలవారీనే కాదు. వారం, రోజువారీ ఇన్వెస్ట్ చేసుకునే అవకాశాలు కూడా వచ్చాయి. కాకపోతే ఇలా ఇన్వెస్ట్ చేయాలనుకున్నపుడు భౌతికంగా గోల్డ్ను కొనే ప్రయత్నాలు వద్దు. డిజిటల్ గోల్డ్ లేదా గోల్ ఈటీఎఫ్లలో ఇన్వెస్ట్ చేయండి. రకరకాల ఫిన్టెక్ యాప్లు కూడా అత్యంత సులువుగా గోల్డ్లో ఎప్పుడు, ఎంత కావాలంటే అంత ఇన్వెస్ట్ చేసుకునే అవకాశాన్ని కలి్పస్తున్నాయి. మార్కెట్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ... ధర పతనమైనప్పుడు ఎక్కువ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయటమూ మంచిదే.స్టాక్ మార్కెట్...2026లో ఐపీఓల్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? చాలా ఐపీఓలు అధిక ధరలతో వస్తున్నాయి. కాబట్టి లిస్టింగ్లో రకరకాల కారణాల వల్ల లాభాలొచి్చనా అవి ఎక్కువకాలం నిలవటం లేదు. ఇప్పటి ఐపీఓలు కొని దీర్ఘకాలం ఉంచుకునేట్లుగా లేవు. కాబట్టి కంపెనీ ఫండమెంటల్స్ బాగుండి, వాళ్లు తక్కువ ధరకు ఆఫర్ చేస్తున్నారనిపిస్తేనో, కంపెనీ ట్రాక్ రికార్డు అద్భుతంగా ఉంటేనో మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. లిస్టింగ్ లాభాల కోసం మాత్రం ఐపీఓల వెంట పడొద్దు. ఎందుకంటే ఫండమెంటల్స్ బాగులేని పక్షంలో లిస్టింగ్నాడే పనతమయ్యే అవకాశాలూ ఉంటాయి.మ్యూచువల్ ఫండ్స్...నేను కొన్ని సంవత్సరాలుగా ‘సిప్’ చేస్తున్నాను. ఇప్పుడు ఆపేయవచ్చా? సిప్లో ఎన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్ చేశామన్నది ముఖ్యం కాదు. ఏ లక్ష్యం కోసం ఇన్వెస్ట్ చేశాం... మనకు ఎంత రాబడులు వచ్చాయి అనేవే ముఖ్యం. మీరు ఏ లక్ష్యం కోసమైతే ఇన్వెస్ట్ చేశారో ఆ లక్ష్యం నెరవేరిందని అనుకోండి. అప్పుడు సిప్ ఆపేయొచ్చు. లేకపోతే మీకు సిప్ వల్ల బాగా నష్టాలు వస్తున్నాయని అనుకుందాం... అపుడు తాత్కాలికంగా సిప్ను నిలిపేసి అంతకన్నా ఎక్కువ రాబడులొచ్చే మార్గాలేమైనా ఉంటే అందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇన్సూరెన్స్నాకు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. అది సరిపోతుందా? సరిపోదు. ఎందుకంటే కవరే జీ మొత్తం చాలా పరిమితంగా ఉంటుంది. పైపెచ్చు ఉద్యోగానితో ముడిపడి ఉంటుంది. ఉద్యోగం పోతే బీమా ఉండదు. నిబంధనలపై మీకు ఎలాంటి నియంత్రణా ఉండదు. ఇక చాలా గ్రూప్ ఇన్సూరెన్స్లలో కుటుంబ సభ్యులకు పరిమితి ఉంటుంది. తల్లిదండ్రులకు కవరేజీ ఉండదు. వీటన్నిటితో పాటు ఉద్యోగానంతరం మీకు సొంత ఆరోగ్య బీమా కావాలంటే ప్రీమియం రూపంలో చాలా ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. మొదట్నుంచీ ఉంటే తక్కువ ప్రీమియంతో సరిపోతుంది.ఇదీ చదవండి: గ్రామీణ క్రెడిట్ స్కోర్తో అప్పు!? -
మిడిల్ క్లాస్ సప్తపది
జీతం చాలా ఎక్కువ. ఖర్చులు అంతకన్నా ఎక్కువ. ఏం లాభం? అందుకే... ఎంత సంపాదించామన్నది కాదు..! ఎంత ఖర్చు పెట్టాం, ఎంత పొదుపు చేశాం? అన్నదే ముఖ్యం. అదే మన జీవిత గమనాన్ని నిర్ణయిస్తుంది. మధ్యతరగతి కుటుంబాల్లో ఆర్థిక సమస్యలకు ప్రధాన కారణం ఆదాయం తక్కువగా ఉండడం కాదు. కాలం చెల్లిన ‘మనీ’ సూత్రాలను పట్టుకుని వేలాడటమే. ఖర్చులు ఆదాయాన్ని మించకుండా చూసుకుంటే మధ్యతరగతి వారయినా మహారాజుల్లా బతికేయొచ్చు. అందుకోసం ఈ 7 సూత్రాలు పాటించడం మాత్రం తప్పనిసరి. కొత్త సంవత్సరంలోనైనా పాటించాల్సిన ఈ ‘సప్త పది’ గురించి వివరించేదే ఈ ‘వెల్త్’ స్టోరీ...అత్యవసర నిధి.. అవసరం వచ్చినప్పుడు సాయం కోసం ఒకరి దగ్గర చేయి చాచటమనేది చాలా ఇబ్బందికరం. ఒకప్పుడు మనుషుల మధ్య బంధాలను డబ్బుతో కొలవటమనేది తక్కువ. ఇపుడు ఎవరినైనా అడిగినా... వారు ఎంత దగ్గరివారైనా ఇస్తారన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే వాళ్లకూ ఏవో అవసరాలు ఉండి ఉండొచ్చు. పైపెచ్చు మన అవసరాన్ని వాళ్లు గుర్తించకపోవచ్చు. అందుకని ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా ఎదుర్కొనేందుకు వీలుగా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం తెలివైన నిర్ణయం. అత్యవసర నిధి అన్నది ఆప్షనల్ కాదు. తప్పనిసరి. రాజీపడకూడనిది. → కరోనా సమయంలో ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోండి. ఆస్పత్రిలో వైద్యం కోసం చాలామంది లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది. అదే సమయంలో ఉద్యోగం, ఉపాధి కోల్పోయిన వారెందరో. కొన్ని సంస్థలు అయితే వేతనాలకు కోత పెట్టాయి. చేస్తున్న ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియని అనిశ్చితి. → వైద్యం కూడా అంతే. ఎప్పుడు ఏ ప్రమాదం, ఏ అనారోగ్యం ముంచుకొస్తుందో ఊహించలేం. → అందుకే కనీసం ఆరు నెలల అవసరాలకు సరిపడా అత్యవసర నిధి ప్రతి కుటుంబానికి ఉండాలి. కుదిరితే 9 నెలలు, 12 నెలల అవసరాలకు సరిపడా నిధిని పక్కన పెట్టుకోవాలి. → ఇలా చేయడం వల్ల దీర్ఘకాల లక్ష్యాల కోసం చేస్తున్న పెట్టుబడులను కదపకుండా ఉండొచ్చు. అధిక రేటుపై రుణాలు తీసుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా చూసుకోవచ్చు. ఈఎంఐలు గీత దాటొద్దు.. → అవసరం వస్తే క్రెడిట్ కార్డు చేతిలో ఉందిలే... వెంటనే రుణం దొరుకుతుందిలే. అనే రీతిలో అన్నింటికీ ‘రుణ’ మంత్రం పనికిరాదు. బ్యాంక్లు, ఫిన్టెక్లు పిలిచి రుణం ఇస్తున్నాయి కదా అని చెప్పి.. ఇల్లు, కారు, ఇంట్లో వస్తువులు ఇలా ప్రతిదానికీ అప్పు చేసుకుంటూ వెళితే, ఆర్థిక పరిస్థితులు క్రమంగా అదుపు తప్పుతాయి. నెల సంపాదనలో 50–60 శాతం వరకు రుణ చెల్లింపులకే వెచ్చించే కుటుంబాలు మన మధ్య ఎన్నో ఉన్నాయి. → ఆదాయంలో నెలవారీ రుణ వాయిదాలను (ఈఎంఐలు) 35–40 శాతం మించకుండా చూసుకోవాలన్నది ముఖ్యమైన ఆర్థిక సూత్రం. దీనివల్ల ఇతర ముఖ్యమైన జీవన అవసరాలకు (గ్రోసరీ, యుటిలిటీ, విద్యా వ్యయాలు) ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు. → ఆదాయమనేది నేటి అవసరాల కోసమే కాదు. భవిష్యత్ లక్ష్యాలు, విశ్రాంత జీవన అవసరాల కోసం కూడా. దీనికోసం ప్రతినెలా కొంత పక్కన పెట్టుకోవాలి. → పిల్లల విద్య, వివాహాలు, సొంతిల్లు, రిటైర్మెంట్ జీవితం కోసం పెట్టుబడులకు కొంత కేటాయించుకోవాలంటే, ఆదాయంలో ఈఎంఐలు లక్ష్మణ రేఖ దాటకుండా చూసుకోవడం ముఖ్యం. → ఈఎంఐలు హద్దు మీరి చెల్లింపుల్లో విఫలమైతే, అది క్రెడిట్ హిస్టరీని దెబ్బతీస్తుంది. ఆదాయం అప్పులకే పోతుంటే సంపద సృష్టి ఎప్పటికీ సాధ్యం కాదు. ఆదాయాన్ని మించి పెట్టుబడి.. → సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ఇపుడు బాగా ప్రాచుర్యం పొందిన పెట్టుబడి సాధనం. ఈ విధానంలో చేస్తున్న పెట్టుబడి, మన వార్షిక ఆదాయ వృద్ధికి మించి పెరిగేలా చూసుకోవాలి. వార్షిక వేతన పెరుగుదల సాధారణంగా 8–10 శాతంగా ఉంటుంది. కానీ, సిప్ పెట్టుబడులపై 12–15 శాతం వరకు రాబడి వచ్చేలా పెట్టుబడి సాధనాలను ఎంపిక చేసుకోవాలి. → ద్రవ్యోల్బణం కారణంగా కొంత కాలానికి మన పెట్టుబడి దాని విలువను కోల్పోతుంటుంది. మన దగ్గర వార్షిక సగటు ద్రవ్యోల్బణం 5–6 శాతం స్థాయిలో ఉంటోంది. కనుక ఈ మేరకు మన పెట్టుబడి విలువ ఏటా క్షీణిస్తుంటుంది. → ఇపుడు మన జీవన వ్యయాలు నెలవారీ రూ.10,000గా ఉన్నాయనుకుంటే.. 6 శాతం ద్రవ్యోల్బణం రేటు ప్రకారం పదేళ్ల తర్వాత అవే అవసరాల కోసం రూ.17,908 ఖర్చు చేయాల్సి వస్తుంది. అదే 20 ఏళ్ల తర్వాత అయితే రూ.32,071 అవసరం అవుతుంది. → ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే పదేళ్లకు మించిన కాలంలో 12–15 శాతం రాబడులు సాధ్యమేనని చరిత్ర చెబుతోంది. → ఇక నెలవారీ చేస్తున్న సిప్ పెట్టుబడిని సైతం ఏటా ఆదాయ పెరుగుదలను మించిన స్థాయిలో పెంచుకోవడం ప్రధానం. లేదంటే కనీసం ద్రవ్యోల్బణం రేటు స్థాయిలో అయినా సిప్ పెట్టుబడిని ఏటా పెంచుకుంటూ వెళ్లాలి. → ఇలా సిప్ పెట్టుబడిని పెంచుకుంటూ, ఆ పెట్టుబడి ద్రవ్యోల్బణం మించి వృద్ధి చెందేలా చూసుకుంటే, కాంపౌండింగ్ ప్రయోజనంతో పెద్ద మొత్తంలో నిధి సమకూరుతుంది. ఆరోగ్య బీమా రూ.5 లక్షలు చాలదు.. → మనలో చాలా మందికి ఆరోగ్య బీమా రక్షణ లేదు. ఉన్న వారిలోనూ చాలా మందికి రూ.5 లక్షలకు మించి కవరేజీ లేదు. కానీ, మారుతున్న పరిస్థితుల కోణంలో చూస్తే ఈ రక్షణ ఎంత మాత్రం చాలదని స్పష్టమవుతోంది. → వైద్య రంగంలో ద్రవ్యోల్బణం 12– 14 శాతం స్థాయిలో ఉంటోంది. అంటే చికిత్సలు, ఔషధాలు, ఇతరత్రా చార్జీలు ఈ స్థాయిలో ఏటా పెరుగుతున్నట్టు లెక్క. → అత్యాధునిక వైద్య విధానాలు, రోబోటిక్ తరహా టెక్నాలజీలు రావడంతో క్లిష్టమైన సర్జరీలను సైతం సునాయాసయంగా, విజయవంతంగా చేస్తున్నారు. వీటి కోసం పెద్ద మొత్తంలో ఖర్చవుతోంది. అవయవ మార్పిడి కోసం రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు ఖర్చవుతోంది. → కనుక రూ.5 లక్షల కవరేజీ ఎంతమాత్రం సరిపోదు. ఒక కుటుంబానికి కనీసం రూ.10– 20 లక్షల వరకు అయినా బేసిక్ హెల్త్ ప్లాన్ ఉండాలి. రూ.10–20 లక్షల డిడక్టబుల్తో సూపర్ టాపప్ ప్లాన్ తీసుకోవాలి. వైద్య బిల్లు రూ.10– 20 లక్షల్లోపు ఉంటే బేసిక్ప్లాన్ నుంచి, అంతకు మించిన సందర్భాల్లో సూపర్ టాపప్ ప్లాన్ నుంచి చెల్లింపులు జరుగుతాయి. రెండు చేతులా సంపాదించాల్సిందే.. → ఒకవైపు కరెన్సీ విలువ క్షీణిస్తుండగా... మరోవైపు జీవన వ్యయాలు భారీగా పెరుగుతున్నాయి. కాబట్టి వీటికి తగ్గట్టు ఆదాయం కూడా వృద్ధి చెందాలి. కానీ మన ఆర్థిక డేటాను పరిశీలిస్తే.. ఆదాయ వృద్ధి కంటే జీవన వ్యయ పెరుగుదలే ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే రెండో ఆదాయ మార్గంపై దృష్టి పెట్టాలి. → అద్దె రూపంలో ఆదాయం లేదంటే తమ నైపుణ్యాల ఆధారంగా ఖాళీ సమయంలో ఫ్రీలాన్స్ వర్క్ లేదంటే వడ్డీ ఆదాయం లేదా డివిడెండ్ ఆదాయం ఇలా ఏదో ఒక మార్గం గుర్తించాలి. ఖర్చులపై కన్ను.. టీవీ ఛానళ్ల కోసం ఒకటి, నెట్ఫ్లిక్స్–అమెజాన్ ప్రైమ్, ఆహా ఇలా వేర్వేరు ఓటీటీ చందాలు, క్లౌడ్ స్టోరేజీ, లెరి్నంగ్ యాప్లు ఇలా చెప్పుకుంటూ పోతే డిజిటల్ లైఫ్ కోసం ప్రతి కుటుంబంలో నెలతిరిగేసరికి చందా చెల్లింపుల జాబితా పెరిగిపోతోంది. ఒక సర్వే ప్రకారం ఒక కుటుంబం ఈ తరహా రీచార్జ్ల కోసం కనీసం రూ.25,000– 40,000 వరకు ఖర్చు చేస్తోంది. కనుక ఏదో ఒక వినోద ఓటీటీ, ఒక లెర్నింగ్ యాప్నకు పరిమితమై, అనవసర దుబారాను అదుపు చేసుకోవడం ద్వారా ఆర్థిక స్వేచ్ఛకు మార్గం వేసుకోవచ్చు. బంగారం కూడా బీమా లాంటిదే..→ బంగారాన్ని ఒక పెట్టుబడి సాధనంగా కంటే రక్షణ కవచంగానే (హెడ్జింగ్ సాధనం) ఎక్కువ పరిగణిస్తారు. ఆర్థిక అస్థిరతలప్పుడు, కరెన్సీ విలువ క్షీణించినపుడు, ద్రవ్యోల్బణం నుంచి పెట్టుబడి విలువను కాపాడుకోవడంలో బంగారం కీలకంగా పనిచేస్తుంది. → ఈ ఏడాది బంగారం ధర దేశీ మార్కెట్లో 78 శాతం పెరిగింది. 2020లో రూ.48,000 స్థాయిలో ఉంది. ఐదేళ్లలో రెండు రెట్లు (200 శాతం వృద్ధి) పెరిగింది. గత రెండు దశాబ్దాల్లో చూస్తే బంగారంపై వార్షిక రాబడి 11–12 శాతంగా ఉంది. → భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కంపెనీల లాభదాయకత ఆశాజనకంగా లేకపోవడం, వాణిజ్య అనిశి్చతులతో గడిచిన ఏడాది కాలంలో ఈక్విటీలు ఎలాంటి రాబడులు ఇవ్వలేదు. ఈ కాలంలో బంగారం విలువను సృష్టించి పెట్టింది. → కనుక పెట్టుబడుల్లో వైవిధ్యానికి, అనిశి్చతులు, కరెన్సీ విలువల నుంచి పెట్టుబడి విలువకు రక్షణ కోసం, అత్యవసరాల్లో రుణం పొందేందుకు సైతం బంగారం అక్కరకు వస్తుంది. → అందుకే ప్రతి ఒక్కరూ తమ పెట్టుబడుల్లో బంగారానికి 10–15 శాతం కేటాయించుకోవాలి.2026 చెక్ లిస్ట్అత్యవసర నిధి: 6–9 నెలలు ఆదాయంలో ఈఎంఐలు: 35 శాతం మించొద్దు సిప్ పెట్టుబడి: ఏటా పెంచుకుంటూ వెళ్లాలి, ఆదాయాన్ని మించి వృద్ధి చెందాలి హెల్త్ కవరేజీ: కనీసం రూ.10–20 లక్షలకు బీమా ఉండాలి పెట్టుబడుల్లో బంగారానికి కేటాయింపులు: 10–15 శాతం రెండో ఆదాయం తప్పనిసరి డిజిటల్ లైఫ్ ఖర్చును నియంత్రించుకోవాలి -
లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే.. కుటుంబం లోన్ చెల్లించాలా?
ఈ రోజుల్లో ఎంత పెద్ద ఉద్యోగం చేసేవారికైనా.. కొన్ని సందర్భాల్లో లోన్ తీసుకోవాల్సి వస్తుంది. అయితే లోన్ తీసుకున్న వ్యక్తి అనుకోని సందర్భాల్లో మరణిస్తే.. ఆ లోన్ ఎవరు చెల్లించాలి?, ఇది చాలామంది మనసులో మెదిలే ప్రశ్న. ఈ ప్రశ్నకు.. ఇక్కడ సమాధానం తెలుసుకుందాం.నిజానికి పర్సనల్ లోన్ పొందటానికి దాదాపు ఎలాంటి ఆస్తులకు పూచీకత్తు అవసరం లేదు. కాబట్టి దీనిని అన్సెక్యూర్డ్ లోన్ కింద పరిగణిస్తారు. కాబట్టి పర్సనల్ లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే చెల్లింపు విషయం కొన్ని పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.చాలా బ్యాంకులు లేదా ఫైనాన్స్ కంపెనీలు లోన్తో పాటు లోన్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తాయి. ఆలాంటి ఇన్సూరెన్స్ ఉంటే.. లోన్ మొత్తాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది. కాబట్టి లోన్ భారం.. మరణించిన లోన్ తీసుకున్న వ్యక్తి కుటుంబ సభ్యులపై పడదు. ఇన్సూరెన్స్ లేని సందర్భంలో.. కుటుంబ సభ్యులు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు.లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. అతనికి చెందిన ఆస్తులు ఏవైనా ఉంటే, బ్యాంక్ ఆ ఆస్తులపై క్లెయిమ్ చేయవచ్చు. ఆ ఆస్తుల విలువలో నుంచి లోన్ మొత్తాన్ని తీసుకుంటారు. మిగిలింది వారసులకు అప్పగిస్తుంది. ఒకవేళా కో-అప్లికెంట్ ఉన్నట్లయితే.. ఆ వ్యక్తే లోన్ చెల్లించాలి. గ్యారెంటర్ ఉంటే.. బ్యాంక్ గ్యారంటర్ దగ్గర నుంచి లోన్ రికవర్ చేస్తుందిఇదీ చదవండి: బ్యాంక్ అకౌంట్ వాడకుండా ఉంటే.. ఖాతాలో డబ్బు ఏమవుతుంది?ఏ ఆస్తులు లేవు, కో-అప్లికెంట్ లేరు, గ్యారంటర్ లేరు అన్నప్పుడు.. కుటుంబ సభ్యులు వ్యక్తిగతంగా చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ బ్యాంక్ లీగల్ నోటీసులు పంపిస్తుంది. దానికి కుటుంబ సభ్యులు భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో బ్యాంకులు లోన్ మాఫీ చేసే అవకాశం కూడా ఉంది. -
2026లో సంపద సృష్టించే ‘టాప్-4’ థీమ్స్ ఇవే!
2025లో భారత స్టాక్ మార్కెట్ కొంత ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ, 2026వ సంవత్సరం ఇన్వెస్టర్ల పాలిట వరంగా మారబోతోందని మార్కెట్ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్ల తగ్గింపు, భారత ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధి, కార్పొరేట్ లాభాలు పుంజుకోనుండటం మార్కెట్కు కొత్త ఊపిరి పోయనున్నాయని అంచనా వేస్తున్నారు.ముఖ్యంగా నిఫ్టీ-50 ఇండెక్స్ 2026 చివరి నాటికి 28,000 పాయింట్ల మైలురాయిని చేరుకోవచ్చని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, కేవలం సంప్రదాయ పద్ధతుల్లో కాకుండా.. కృత్రిమ మేధ(AI), గ్రీన్ ఎనర్జీ వంటి భవిష్యత్తు అవసరాలను గుర్తించి పెట్టుబడి పెట్టే వారికి దీర్ఘకాలికంగా భారీ లాభాలు అందనున్నాయని చెబుతున్నాయి. మరి 2026లో మదుపరుల అదృష్టాన్ని మార్చబోతున్న ఆ కీలక రంగాలు ఏమిటో చూద్దాం.కృత్రిమ మేధభారతదేశం ప్రస్తుతం ఏఐ విప్లవంలో ఒక కీలక దశలో ఉంది. ఇది కేవలం సాఫ్ట్వేర్ సేవలకే పరిమితం కాకుండా, ఉత్పాదకతను పెంచే ప్రధాన సాధనంగా మారుతోంది. అమెజాన్, మెటా, గూగుల్ వంటి గ్లోబల్ దిగ్గజాలు సుమారు 90 బిలియన్ డాలర్ల పెట్టుబడులను భారత్లో ఏఐ మౌలిక సదుపాయాల కోసం కేటాయించాయి. 2026 ఫిబ్రవరి 19-20 తేదీల్లో జరగనున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’ ఈ రంగానికి దిశానిర్దేశం చేయనుంది. భారత ప్రభుత్వ లక్ష్యం ప్రకారం, స్వదేశీ అవసరాలకు తగ్గట్టుగా ఉత్పాదకతను పెంచే ‘చిన్న మోడల్స్’(Small Language Models) అభివృద్ధిపై దృష్టి సారించింది.ఈవీ చార్జింగ్ సదుపాయాలుఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగం పెరుగుతున్నా, వాటికి అవసరమైన చార్జింగ్ సౌకర్యాలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. 45 శాతం మంది ఈవీ వినియోగదారులు పబ్లిక్ చార్జింగ్ పాయింట్లపై ఆధారపడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ భారీ అంతరాన్ని పూడ్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ సబ్సిడీలను అందిస్తున్నాయి. ప్రైవేట్ రంగంలో ఈ మేరకు సర్వీసులు అందిస్తున్న కంపెనీలు భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉంది.ఆఫీస్ వర్క్స్పేస్భారతదేశం ఇప్పుడు కేవలం బ్యాక్ ఆఫీస్ హబ్గా కాదు.. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు (GCC) కంపెనీల వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే ప్రధాన కేంద్రాలుగా మారుతున్నాయి. అంతర్జాతీయ కంపెనీలు తమ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్ సెంటర్లను భారత్లో ఏర్పాటు చేస్తున్నాయి. దీనివల్ల అత్యాధునిక సౌకర్యాలు గల 50-100 సీటర్ ఆఫీసులకు, మీటింగ్ రూమ్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది.లగ్జరీ, ప్రీమియం వస్తువులుపెరుగుతున్న ఆదాయాలు, పట్టణీకరణ వల్ల లగ్జరీ ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతోంది. గృహాలంకరణ, ఖరీదైన వాచీలు, ప్రీమియం కార్లు, ఎలక్ట్రానిక్స్ రంగంలో బలమైన వృద్ధి కనిపిస్తోంది.ఇదీ చదవండి: క్విక్ కామర్స్.. గిగ్ వర్కర్ల సమస్యలివే.. -
అర్ధరాత్రితో మారిపోయే ఆధార్ రూల్స్..
దేశంలో ఆధార్ కార్డు ఎంత ముఖ్యమైన డాక్యుమెంటో అందరికీ తెలిసిందే. రోజువారీ ఆర్థిక కార్య కలాపాల దగ్గర నుంచి ప్రభుత్వ సంక్షేమ పథకాల వరకు అన్నింటికీ ఇదే ‘ఆధారం’. ఇంత కీలకమైన ఆధార్కు సంబంధించిన పలు ముఖ్యమైన నిబంధనల్లో మార్పులు చేస్తోంది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ). డిసెంబర్ 31 అర్ధరాత్రి తర్వాత అంటే కొత్త ఏడాది 2026లో నూతన నిబంధనలు అమలు కాబోతున్నాయి.ఆధార్ కార్డు కొత్త డిజైన్ప్రస్తుతం పెరిగిన డిజిటల్ మోసాలు, డేటా దుర్వినియోగం సంఘటనలను దృష్టిలో ఉంచుకుని యూఐడీఏఐ ఇప్పటికే 2025 డిసెంబర్ 1 నుంచే ఆధార్ కొత్త డిజైన్ను ప్రకటించింది. ఈ కొత్త కార్డులో మీ ఫోటో, సురక్షిత క్యూర్ కోడ్ మాత్రమే ఉంటుంది. మీ పేరు, ఆధార్ నంబర్ ఉండవు. మొత్తం కార్డుల డిజైన్ను 2026 జూన్ 14 లోపు అప్డేట్ చేయనుంది యూఐడీఏఐ.ఫోటోకాపీల వాడకంపై ఆంక్షలుకొత్త యూఐడీఏఐ నిబంధనల ప్రకారం.. గుర్తింపు కోసం ఇక ఆధార్ కార్డు భౌతిక కాపీలను (జిరాక్స్) ఇవ్వాల్సిన పని లేదు. గుర్తింపు ధ్రువీకరణ కోసం క్యూఆర్ కోడ్ స్కానింగ్, ఆఫ్లైన్ ఆధార్ ఎక్స్ఎంఎల్, మాస్క్డ్ ఆధార్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. డిజిటల్ ధ్రువీకరణను ప్రాథమిక ఎంపికగా చేస్తున్నారు. ఫేస్ అథెంటికేషన్ను చట్టపరమైన గుర్తింపుగా చేయనున్నారు.ఆధార్-పాన్ లింక్ గడువుఆధార్-పాన్ లింక్ చేయడానికి 2025 డిసెంబర్ 31 చివరి తేదీ. ఈ తేదీ నాటికి పాన్ ను ఆధార్ తో లింక్ చేయకపోతే, అది 2026 జనవరి 1 నుండి ఇనాక్టివ్గా మారుతుంది. దీంతో ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు, రిఫండ్, ఇతర ఆర్థిక లావాదేవీలు కష్టమవుతాయి.10 ఏళ్లు దాటిన ఆధార్ కార్డుల అప్డేట్ తప్పనిసరిమీడియా నివేదికల ప్రకారం.. 10 ఏళ్లు దాటిన ఆధార్ కార్డులు అంటే పదేళ్ల క్రితం ఆధార్ తీసుకుని వాటిని ఇప్పటివరకూ ఎలాంటి అప్డేట్ చేయించకపోతే ఇప్పుడు చేయించడం తప్పనిసరి. పేరు, పుట్టిన తేదీ, చిరునామా వంటి సమాచారాన్ని అప్ డేట్ చేయడం వల్ల మీ ఆధార్ యాక్టివ్ గా ఉండటమే కాకుండా ధ్రువీకరణ సమయంలో ఎటువంటి ఇబ్బందులూ ఉండవు. -
పర్సనల్ లోన్ తీసుకుని ఏంచేశారు వీళ్లు..?
ఈ సంవత్సరం మొదటి అర్ధభాగంలో పర్సనల్ లోన్స్కు సంబంధించి ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఈ ఏడాది ఫస్ట్ హాఫ్లో పర్సనల్ లోన్స్ తీసుకున్న యువతరంలో 27 శాతం రుణాలు ‘ట్రావెల్’ కోసం తీసుకోబడ్డాయి. ఈ పరిణామం దేశ ఆర్థిక చరిత్రలో ఇదే మొదటిసారి.‘భారతదేశ చరిత్రలో మొదటిసారిగా కనిపించిన భారీ మార్పు ఇది. యువతరం పర్సనల్ లోన్స్ తీసుకోవడానికి ప్రధాన కారణం...వైద్య అత్యవసర పరిస్థితి, ఇంటి పునరుద్ధరణ, ఇల్లు కొనడం...మొదలైనవి కాదు. ఒకే ఒక కారణం... ప్రయాణం’ అని చెప్పారు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, రచయిత సార్థక్ అహుజ.ఈ మార్పుకు కారణం ఏమిటి?‘ఇండ్ల ధరలు ఆకాశాన్ని అంటడంతో సొంత ఇల్లు అనే కల యువతరంలో చాలామందికి కలగానే మిగిలిపోతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా తక్షణం సంతృప్తిని ఇచ్చే విషయాలకు యువతరం ప్రాధాన్యత ఇస్తోంది. ట్రావెల్, లగ్జరీ వస్తువులు కొనుగోలు... మొదలైనవి అందులో ఉన్నాయి’ ఫిన్టెక్ ఇన్నోవేషన్తో అప్పుల కోసం పడే ఇబ్బందులు యువతరానికి తగ్గాయి. జీరో–కాస్ట్ ఇఎంఐలు, బై నౌ పే ల్యాటర్ (బిఎన్పీఎల్) స్కీమ్లు యువతరానికి స్పీడ్గా చేరువవుతున్నాయి.వాళ్ళు అలా... మనం ఇలా...చైనా యువతరం విషయానికి వస్తే...కోవిడ్ తరువాత ‘రివెంజ్ స్పెండింగ్’ నుంచి ‘రివెంజ్ సేవింగ్’కు మళ్లింది. ఎంతో కొంత అయినా సరే బంగారం మదుపు చేయడంపై మోజు పెరిగింది. బంగారాన్ని మదుపు చేయడం అనేది సరికొత్త స్టేటస్ సింబల్గా మారింది. ‘రేపు నేను సంపాదిస్తాను కాబట్టి ఈరోజు అప్పు చేయాలని మన యువతరం ఆలోచిస్తుంది. రేపు నా ఉద్యోగం ఉండకపోవచ్చు కాబట్టి ఈరోజే ΄పొదుపు చేస్తాను అని చైనీస్ యువతరం అనుకుంటుంది’ అంటున్నారు అహుజ.ఇదీ చదవండి: బంగారం, వెండి విశ్వరూపం!! రోజు మారేలోపు ఇంత రేటా? -
బ్రాంచ్ లేని బ్యాంక్ అకౌంట్లు..
దేశంలో బ్యాంకింగ్ రంగం వేగంగా డిజిటల్ వైపు అడుగులు వేస్తోంది. బ్యాంక్ బ్రాంచ్కు వెళ్లకుండానే, పూర్తిగా ఆన్లైన్ ద్వారా ఖాతా తెరవగలిగే డిజిటల్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు ఇప్పుడు విస్తృతంగా అందుబాటులోకి వస్తున్నాయి. ఆధార్, పాన్ కార్డులు ఉంటే చాలు వీడియో-కేవైసీ సహాయంతో ఇంటి నుంచే ఖాతా ప్రారంభించే సౌకర్యాన్ని పలు బ్యాంకులు కల్పిస్తున్నాయి.ఏయే బ్యాంకులు అందిస్తున్నాయంటే..ప్రైవేట్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఈ డిజిటల్ సేవలను ప్రధానంగా అందిస్తున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ తన కొటక్ 811 డిజిటల్ సేవింగ్స్ ఖాతా ద్వారా జీరో బ్యాలెన్స్ సౌకర్యాన్ని అందిస్తోంది. అలాగే యాక్సిస్ బ్యాంక్, యెస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ వంటి బ్యాంకులు కూడా పేపర్లెస్, బ్రాంచ్లెస్ ఖాతాలను అందుబాటులోకి తెచ్చాయి.ఇదే విధంగా ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వంటి బ్యాంకులు మొబైల్ యాప్ ఆధారంగా డిజిటల్ ఖాతా ప్రారంభించే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ ఖాతాల ద్వారా యూపీఐ, ఐఎంపీఎస్, నెఫ్ట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వర్చువల్ డెబిట్ కార్డ్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటున్నాయి.అంతేకాకుండా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ వంటి పేమెంట్స్ బ్యాంకులు కూడా డిజిటల్ సేవింగ్స్ ఖాతాలను అందిస్తున్నాయి. అయితే వీటిపై డిపాజిట్ పరిమితులు ఉండటంతో, వీటిని సంప్రదాయ బ్యాంక్ ఖాతాలకు పూర్తి ప్రత్యామ్నాయంగా పరిగణించలేము.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్స్ (BSBDA)కు డిజిటల్ సదుపాయాలను ప్రోత్సహిస్తూ, ఆర్థిక చేరికను మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటోంది.డిజిటల్ బ్యాంకింగ్ వల్ల గ్రామీణ ప్రాంతాలు, యువత, ఉద్యోగుల్లో బ్యాంకింగ్ వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో ఆన్లైన్ మోసాల పట్ల కూడా కస్టమర్లు జాగ్రత్తలు వహించాచాలని బ్యాంకులు సూచిస్తున్నాయి. -
టర్మ్ ఇన్సూరెన్స్.. డబ్బులు దండగా..!?
ఈరోజుల్లో మనిషి ప్రాణానికి గ్యారెంటీ లేదు.. కానీ కుటుంబ భవిష్యత్తుకు మాత్రం గ్యారెంటీ ఉండాల్సిందే. చాలామంది ఇన్సూరెన్స్ అనగానే ‘తిరిగి ఎంత వస్తుంది?’ అని లెక్కలు వేస్తారు. అయితే, మీరు లేని లోటును ఏ డబ్బు భర్తీ చేయలేకపోయినా, మీ కుటుంబం ఆర్థికంగా కుప్పకూలిపోకుండా నిలబెట్టే ఏకైక ఆయుధం టర్మ్ ఇన్సూరెన్స్. నెలకు ఓ కుటుంబానికి అయ్యే సినిమా టికెట్ ఖర్చుతో కోటి రూపాయల రక్షణ కవచాన్ని అందించే ఈ పాలసీపై అపోహలు వీడాలి.నేటి ఆధునిక కాలంలో ఆర్థిక ప్రణాళిక అనగానే చాలామంది కేవలం పొదుపు, పెట్టుబడుల గురించే ఆలోచిస్తారు. ఈ క్రమంలో టర్మ్ ఇన్సూరెన్స్ను ఒక అనవసరపు ఖర్చుగా భావిస్తూ ‘ప్రీమియం కడితే తిరిగి రాదు కదా, ఇది డబ్బులు దండగ’ అనే ధోరణిలో ఉంటున్నారు. అయితే, ఇది ఆర్థికంగా అత్యంత ప్రమాదకరమైన ఆలోచన.ఏది పెట్టుబడి? ఏది రక్షణ?చాలామంది ఇన్సూరెన్స్ను కూడా మ్యూచువల్ ఫండ్స్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్లలాగా చూస్తారు. అందులో..ఎండోమెంట్ పాలసీలు.. వీటిలో ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. మెచ్యూరిటీ తర్వాత కొంత డబ్బు తిరిగి వస్తుంది. కానీ, ఇందులో ఉండే లైఫ్ కవర్(బీమా మొత్తం) చాలా తక్కువగా ఉంటుంది.టర్మ్ ఇన్సూరెన్స్.. ఇది స్వచ్ఛమైన బీమా. ఇక్కడ మీరు చెల్లించే ప్రీమియం కేవలం మీ ప్రాణానికి రక్షణ కల్పించడానికి మాత్రమే. పాలసీ కాలపరిమితిలో పాలసీదారునికి ఏదైనా జరిగితే, నామినీకి పెద్ద మొత్తంలో (ఉదాహరణకు కోటి రూపాయలు) బీమా సొమ్ము అందుతుంది.‘డబ్బులు తిరిగి రావు’ అనేది అపోహ మాత్రమే‘నేను ఆరోగ్యంగా ఉంటే కట్టిన డబ్బులు పోతాయి కదా’ అని బాధపడటం అంటే.. మనం ఇంటికి ఇన్సూరెన్స్ చేయించుకుని ఇల్లు కాలిపోలేదు కాబట్టి ఇన్సూరెన్స్ వేస్ట్ అని అనుకోవడమే. వయసును అనుసరించి నెలకు వెయ్యి రూపాయలలోపు ప్రీమియంతోనే కోటి రూపాయల కవరేజ్ పొందే అవకాశం కేవలం టర్మ్ ఇన్సూరెన్స్లో మాత్రమే ఉంటుంది.ప్రీమియం రిటర్న్ రావాలంటే..డబ్బులు వెనక్కి రావాలనుకునే వారి కోసం ఇప్పుడు కంపెనీలు ‘రిటర్న్ ఆఫ్ ప్రీమియం’ ప్లాన్లను కూడా అందిస్తున్నాయి. ఇందులో పాలసీ ముగిశాక మీరు కట్టిన డబ్బులు తిరిగి ఇస్తారు (అయితే దీని ప్రీమియం సాధారణ టర్మ్ ప్లాన్ కంటే కాస్త ఎక్కువగా ఉంటుంది).టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు తప్పనిసరి?కుటుంబంలో సంపాదించే వ్యక్తి అకాల మరణం చెందితే ఆ కుటుంబం వీధిన పడకుండా ఉండాలంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఒక్కటే మార్గం.పిల్లల చదువు, పెళ్లిళ్లు, రోజువారీ ఖర్చులకు ఇది భరోసా ఇస్తుంది.నేటి కాలంలో చాలా మందికి హోమ్ లోన్, కారు లోన్ లేదా పర్సనల్ లోన్స్ ఉంటున్నాయి. పాలసీదారునికి ఏమైనా జరిగితే ఆ అప్పుల భారం కుటుంబం మీద పడకుండా, ఇన్సూరెన్స్ డబ్బుతో వాటిని తీర్చుకోవచ్చు.25-30 ఏళ్ల వయసులో పాలసీ తీసుకుంటే ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. పైగా ఒకసారి నిర్ణయించిన ప్రీమియం పాలసీ కాలపరిమితి ముగిసే వరకు మారదు.ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద మీరు చెల్లించే ప్రీమియంపై పన్ను మినహాయింపు పొందవచ్చు.టర్మ్ ఇన్సూరెన్స్ను ఒక ఖర్చులా కాకుండా, మీ కుటుంబం కోసం మీరు కట్టే రక్షణ కవచంలా భావించాలి. విలాసాల కోసం వేల రూపాయలు ఖర్చు చేసే మనం, మన తదనంతరం కుటుంబం గౌరవంగా బతకడానికి రోజుకు రూ.30-40 కేటాయించడం పెద్ద విషయం కాదు. కాబట్టి, ప్రతి వ్యక్తి తక్షణమే సరైన టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా ముఖ్యం.ఇదీ చదవండి: రోజుకు 10 గంటల పనికి ప్రభుత్వం ఆమోదం -
చిట్టి బ్యాంకులు.. గట్టి బ్యాంకులు!
బ్యాంకులు నిత్య అవసరాలు. ప్రజల దైనందిన ఆర్థిక కార్యకలాపాలు బ్యాంకుల మీద ఆధారపడే సాగుతున్నాయంటే అతిశయోక్తి కాదు! దేశంలో ఇటు ప్రభుత్వ రంగ బ్యాంకులతోపాటు అటు ప్రైవేటు రంగంలోనూ పెద్ద కమర్షియల్ బ్యాంకులతోపాటు పేమెంట్ బ్యాంకులని, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులని వివిధ రకాల బ్యాంకులు సేవలు అందిస్తున్నాయి.బ్యాంకుల వర్గీకరణ ఇలా.. దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో పేమెంట్ బ్యాంకులు (Payments Banks), చిన్న ఫైనాన్స్ బ్యాంకులు (Small Finance Banks – SFBs), పెద్ద బ్యాంకులు / యూనివర్సల్ బ్యాంకులు (Universal Banks) అని రకాలు ఉంటాయి.వీటిలో చిన్న లావాదేవీలు, డిజిటల్ చెల్లింపులు వంటి ప్రాథమిక సేవలు అందించేవి పేమెంట్ బ్యాంకులు. వీటికి రుణాలు ఇచ్చే అవకాశం ఉండదు. ఉదాహరణకు ఫినో పేమెంట్స్ బ్యాంక్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్.. వంటివి.చిన్న ఫైనాన్స్ బ్యాంకులు చిరు వ్యాపారులు, రైతులు, తక్కువ ఆదాయ వర్గాలకు బ్యాంకింగ్ సేవలు అందిస్తుంటాయి. అయితే పరిమిత కార్యకలాపాలకే అనుమతి ఉంటుంది. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స బ్యాంక్ వంటివి ఉదాహరణలు.ఇక పెద్ద బ్యాంకులు.. వీటినే యూనివర్సల్ బ్యాంకులు అని వ్యవహరిస్తుంటారు. ఇవి వ్యక్తులకు, కార్పొరేట్లకు, పరిశ్రమలకు పూర్తి స్థాయి బ్యాంకింగ్ సేవలు అందిస్తాయి. ఉదాహరణకు ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి సంస్థలు.ఆయా బ్యాంకులు తమ సేవలను విస్తృతపరుచుకుంటూ కాలక్రమంలో అప్గ్రేడ్ అయ్యేందుకు కేంద్ర బ్యాంకు ఆర్బీఐకి దరఖాస్తు చేస్తుంటాయి. వాటి అర్హతను పరిశీలించి ఆర్బీఐ ఆ మేరకు అనుమతులు జారీ చేస్తుంటుంది. అలా కేంద్ర బ్యాంకు 2025లో కొన్ని పేమెంట్ బ్యాంకులకు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులుగా, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు యూనివర్సల్ బ్యాంకులుగా(పెద్ద బ్యాంకులు) అనుమతులు ఇచ్చింది.ఏయూ స్మాల్ బ్యాంకుకు ‘యూనివర్సల్’ అనుమతిరిజర్వ్ బ్యాంక్ 2025లో ఏయూ ఫైనాన్స్ స్మాల్ బ్యాంకుకు (AU Small Finance Bank) యూనివర్సల్ బ్యాంక్ స్థితికి మారటానికి అనుమతి పొందింది. త్వరలో పెద్ద బ్యాంకుగా సేవలు అందించేందుకు లైసెన్స్ లభించనుంది. దశాబ్ద కాలంలో యూనివర్సల్ బ్యాంక్గా అనుమతి పొందిన ఏకైక బ్యాంక్ ఇదే కావడం గమనార్హం. మరి కొన్ని బ్యాంకులు దరఖాస్తు చేసినప్పటికీ అవి కొన్ని పెండింగ్లో ఉండగా మరికొన్నింటిని ఆర్బీఐ తిరస్కరించింది.పెద్ద బ్యాంకులతో పోటీగా వడ్డీ రేట్లుఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విస్తృతమైన సేవలు అందిస్తోంది. పెద్ద బ్యాంకులతో పోటీగా వడ్డీ రేట్లు అందిస్తూ డిపాజిటర్లను ఆకట్టుకుంటోంది. ఇందులో సేవింగ్స్ అకౌంట్స్పై అత్యధికంగా 6.5 శాతం వరకూ వడ్డీ ఇస్తోంది. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లపైనా 8.5 శాతం దాకా వడ్డీ చెల్లిస్తోంది.పేమెంట్ బ్యాంకుకు ప్రమోషన్2025లో ఆర్బీఐ మరో పేమెంట్ బ్యాంకుకు కూడా ప్రమోషన్ ఇచ్చింది. ఫినో పేమెంట్స్ బ్యాంకు (Fino Payments Bank) స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్గా మారటానికి ఆర్బీఐ నుంచి సూత్రప్రాయ అనుమతి పొందింది. దీంతో ఫినో బ్యాంక్ రానున్న రోజులలో పెద్ద డిపాజిట్లు, రుణాలు, బీమా సేవలను అందించగల స్థితికి చేరుతుంది.ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయాలను చిన్న ఫైనాన్స్ రంగంలో నాణ్యత , సేవా విస్తరణను ప్రోత్సహించేందుకు తీసుకున్న ముందడుగు అని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వినియోగదారులు త్వరలో మరింత అనుకూలమైన బ్యాంకింగ్ సదుపాయాలను పొందగలుగుతారని భావిస్తున్నారు. -
హోమ్ లోన్ మహాన్.. ఎస్బీఐ
ఎస్బీఐ తన గృహ రుణాల పోర్ట్ఫోలియో రూ.10 లక్షల కోట్లను దాటనున్నట్టు ప్రకటించింది. ‘‘ఇప్పుడు ఎస్బీఐ గృహ రుణ పోర్ట్ఫోలియో రూ.9 లక్షల కోట్లకు పైనే ఉంది. బ్యాంక్లో ఇది అతిపెద్ద రుణ విభాగం. మా మొత్తం రుణ ఆస్తుల్లో 20 శాతానికి పైనే ఉంటాయి. 14 శాతం వృద్ధి రేటు ప్రకారం వచ్చే ఆర్థిక సంత్సరంలో ఎస్బీఐ గృహ రుణాల పోర్ట్పోలియో రూ.10 లక్షల కోట్లు దాటుతుంది’’అని ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి వివరించారు.బలమైన డిమాండ్, సానుకూల వడ్డీ రేట్లు (కనిష్ట స్థాయిలో) వృద్ధికి మద్దతుగా ఉన్నట్టు చెప్పారు. ఎస్బీఐ గృహ రుణాల పోర్ట్ఫోలియో గత నెలలోనే రూ.9 లక్షల కోట్లు దాటడంతో దేశంలోనే అతిపెద్ద మార్ట్గేజ్ రుణదాతగా నిలవడం గమనార్హం. 2024–25లో ఎస్బీఐ గృహ రుణాల పోర్ట్పోలియో 14.4 శాతం పెరిగి రూ.8.31 లక్షల కోట్లకు చేరింది.2011 మార్చి నాటికి రూ.లక్ష కోట్లు మార్క్నకు చేరగా, అక్కడి నుంచి నాలుగున్నరేళ్లకే (2025 నవంబర్) రూ. 9 లక్షల కోట్లను దాటేయడం వేగవంతమైన వృద్ధిని సూచిస్తోంది. గృహ రుణ విభాగంలో వసూలు కాని మొండి బకాయిలను (ఎన్పీఏలు) ఒక శాతంలోపునకే కట్టడి చేస్తోంది. 2025 మార్చి నాటికి మొత్తం గృహ రుణాల్లో స్థూల ఎన్పీఏలు 0.72 శాతంగా ఉండడం గమనించొచ్చు. -
Income Tax: పన్ను చెల్లించే విధానం ఇలా..
ఈ నెలాఖరుతో 2025–26లో 9 నెలలు పూర్తవుతాయి. వచ్చే మార్చికి ఏడాది పూర్తి. ఎలాగైతే ఏడాది పొడవునా ఆదాయం వస్తుందో, అదే రకంగా ఆదాయపు పన్ను చెల్లించాలి.మొదటిది. టీడీఎస్..ఉద్యోగస్తులైతే మొదటి నెల నుంచి టీడీఎస్ పరిధిలోకి వస్తారు. యజమాని ఉద్యోగి పన్ను భారాన్ని లెక్కించి, పన్నెండు భాగాలుగా విభజించి, ఏప్రిల్ నుంచి రికవరీ చేసి, గవర్నమెంటు ఖాతాలో జమ చేయాలి. ఇలా జరిగిన టీడీఎస్ మీ ఖాతాలోనే పడుతుంది. అంతే కాకుండా బ్యాంకు వాళ్లు మీకు వడ్డీ ఇచ్చినప్పుడు లేదా క్రెడిట్ చేసినప్పుడు టీడీఎస్ చేస్తారు. ఇతరత్రా ఎన్నో ఆదాయాలు చేతికొచ్చే సందర్భంలో టీడీఎస్ జరుగుతుంది. ఇందులో ముఖ్యమైనది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఒకటి. అలాగే మీరు విదేశాలకు డబ్బులు పంపించినప్పుడు, బ్యాంకర్లు చేసే టీడీఎస్ని టీసీఎస్ అంటారు.రెండోది. టీసీఎస్..ఇది కూడా ముఖ్యమైన రికవరీ. కొన్ని నిర్దేశిత వస్తువులను మీరు కొంటున్నప్పుడు, అంటే, ఉదాహరణకి మోటర్ వాహనాన్ని తీసుకుంటే మీరు కొనుగోలుదారు అవుతారు. అప్పుడు అమ్మే వ్యక్తి మీ దగ్గర్నుంచి 1 శాతాన్ని పన్నుగా రికవరీ చేస్తారు. దీన్నే టీసీఎస్ అంటారు.మూడోది.. ఎస్టీటీ..ఇది షేర్ల క్రయవిక్రయాల్లో వసూలు చేసే పన్ను.అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు..పన్నుభారం కొన్ని పరిమితులు దాటితే, అడ్వాన్స్ ట్యాక్స్ పరిధిలోకి వస్తారు. అలాంటి భారం ఏర్పడ్డ వారు ముందుగానే తమ అడ్వాన్స్ ట్యాక్స్ భారాన్ని లెక్కించి, నాలుగు భాగాలుగా సమర్పించాలి. 60 ఏళ్లు దాటిన వారికి వ్యాపారం/వృత్తి మీద ఆదాయం లేకపోతే వర్తించదు. ఎలా కట్టాలంటే.. జూన్ 15నాటికి 15 శాతం, సెప్టెంబర్ 15 నాటికి 30 శాతం, డిసెంబర్ 15 నాటికి 30 శాతం, మార్చి 15 నాటికి 25 శాతం చెల్లించాల్సి ఉంటుంది. మొదటి విడత జూన్ 15 నాటికి, ఆ తర్వాత ప్రతి క్వార్టర్లో చివరి నెల 15లోపు పైన చెప్పిన విధంగా చెల్లించాలి. కొంత మంది ఊహాజనితంగా ట్యాక్స్ చెల్లిస్తారు. వారు 100 శాతాన్ని మార్చి 15లోపల చెల్లించాలి. సకాలంలో చెల్లించకపోతే వడ్డీ పడుతుంది.క్యాపిటల్ గెయిన్స్ ఏర్పడటం ముందుగా ఊహించడం కుదరదు కనుక, అడ్వాన్స్ ట్యాక్స్ లెక్కింపులో దాన్ని పరిగణనలోకి తీసుకోరు. కానీ వ్యవహారం అయిన తర్వాత వచ్చే క్వార్టర్లోగా చెల్లించాలి. అలా చెల్లించిన తర్వాత, టీడీఎస్ తీసుకున్నాక, ఇంకా పన్ను భారం ఏర్పడితే, మార్చి 31లోగా పూర్తిగా చెల్లించాలి. వీలైతే ఈ వారంలో మీరు వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఈ కింది వాటిని చూడండి.1. ఫారం 26 ఏఎస్ 2. ఏఐఎస్ 3. టీఐఎస్సర్వసాధారణంగా ఈ మూడు ఫారాలలోని అంశాల్లో, ఆ రోజు వరకు మీకొచ్చిన ఆదాయం, మీరు చెల్లించిన అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు, టీడీఎస్, టీసీఎస్ రికవరీ మొదలైనవి కనిపిస్తాయి. ఒక్కొక్కపుడు కొన్ని ఎంట్రీలు పడకపోవచ్చు, కనిపించకపోవచ్చు. గాభరాపడకండి. అవి అప్డేట్ అవుతాయి. ఈ సమాచారమంతా గ్రహించిన తర్వాత మీకు తెలుస్తుంది.. మీ పన్నుభారమెంతో. తక్కువగా ఉంటే ఆ మొత్తాన్ని మార్చి 15 వరకు వాయిదాలతో సర్ది, సరిచేసి అంతా చెల్లించి హాయిగా ఉండండి. దీనితో మీ పన్ను భారం చెల్లింపులు పూర్తవుతాయి.ఆరోది..ఆఖరుది. సెల్ఫ్ అసెస్మెంటు. సాధారణంగా మార్చి లోపల చేసే చెల్లింపులన్నీ టీడీఎస్, అడ్వాన్స్ ట్యాక్స్ అవుతాయి. మార్చి తర్వాత చేసే పేమెంట్లని, సెల్ఫ్ అసెస్మెంట్ చెల్లింపులని అంటారు. రిటర్నులు వేసేటప్పుడు అన్నీ దగ్గర పెట్టుకుని, పన్ను భారం లెక్కించి కట్టేది సెల్ఫ్ అసెస్మెంట్. అప్పటికే ఎక్కువ చెల్లించినట్లయితే రిఫండ్ కోరవచ్చు. అసెస్మెంట్ చేసినప్పుడు ఆదాయంలో హెచ్చులు, తప్పొప్పులు జరిగితే పన్నుభారం పడొచ్చు. ఆ చెల్లింపుని డిమాండ్ చెల్లింపని అంటారు. దీనితో కథ ముగిసినట్లే. -
ఒకే ఒక్క రూల్.. ఎంతో మందిని ‘రిచ్’ చేసింది!
ఒకే ఒక్క రూల్.. ప్రపంచ మార్కెట్లను ఎన్నో ఏళ్లుగా ఏలుతోంది. సగటు ఇన్వెస్టర్లు ధనవంతులు అయ్యేందుకు రామ బాణంలా పనిచేస్తూ వస్తోంది. అదే వారెన్ బఫెట్ ప్రతిపాదించిన 90/10 పెట్టుబడి వ్యూహం. వ్యక్తిగత మదుపరులకు అందుబాటులో ఉన్న అత్యంత సరళమైన, ప్రభావవంతమైన విధానాలలో ఒకటిగా ఇది నిలిచింది. అధిక రుసుములు, అనవసరమైన సంక్లిష్టతను నివారిస్తూ, దీర్ఘకాలంలో అమెరికన్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి నుంచి లాభపడేందుకు సగటు మదుపరులకు సహాయపడాలనే ఉద్దేశంతో బఫెట్ ఈ నియమాన్ని సూచించారు.మార్కెట్ను అంచనా వేయడంలో చాలా మంది యాక్టివ్ ఫండ్ మేనేజర్లు విఫలమవుతున్నారని చాలా కాలంగా విమర్శిస్తూ వచ్చిన బఫెట్.. చారిత్రక మార్కెట్ డేటా, సహనం, కాంపౌండింగ్ శక్తిపై ఆధారపడేలా పెట్టుబడి ప్యూహాన్ని ప్రతిపాదించారు. 90/10 వ్యూహం పెట్టుబడిదారులకు వృద్ధిని గరిష్టంగా పొందే అవకాశం ఇస్తూనే, చిన్న భద్రతా వలయాన్ని కూడా కల్పిస్తుంది. తక్కువ నిర్వహణ, దీర్ఘకాలికంగా నిలకడైన, అమలు సాధ్యమైన వ్యూహంగా దీన్ని రూపొందించారు.ఏమిటీ 90/10 రూల్?మదుపరులు పెట్టే పెట్టుబడుల్లో 90 శాతం తక్కువ ఖర్చుతో కూడిన ఎస్& పి 500 ఇండెక్స్ ఫండ్లో మిగిలిన 10 శాతం స్వల్పకాలిక అమెరికా ప్రభుత్వ ట్రెజరీ బిల్లుల్లో ఇన్వెస్ట్ చేయాలనేది ఈ నియమం సారాంశం.బఫెట్ 2013లో తన బెర్క్ షైర్ హాత్వే వాటాదారులకు రాసిన లేఖలో ఈ నియమాన్ని మొదటిసారిగా బహిరంగంగా వివరించారు. బెంజమిన్ గ్రాహం బోధనలను ఆధారంగా తీసుకుని, చాలా మంది వ్యక్తిగత మదుపరులకు స్టాక్స్ను లోతుగా విశ్లేషించే సమయం లేదా నైపుణ్యం ఉండదని ఆయన స్పష్టం చేశారు. గెలుపు గుర్రాల్లాంటి స్టాక్స్ను ఎంచుకోవడానికి ప్రయత్నించడంకన్నా, విస్తృత మార్కెట్లో పెట్టుబడి పెట్టడం మెరుగైన మార్గం అనేది బఫెట్ అభిప్రాయం.తన భార్య కోసం ఏర్పాటు చేసిన ట్రస్ట్కు సంబంధించిన పెట్టుబడులకు కూడా ఇదే సూత్రాన్ని పాటించారు బఫెట్. దీంతో ఈ వ్యూహంపై ఇన్వెస్టర్లకు నమ్మకం మరింత బలపడింది.బఫెట్ లాజిక్ ఇదే..కాలక్రమేణా అమెరికన్ వ్యాపార రంగం పెరుగుతుందనేది బఫెట్ నమ్మకం. ఆ వృద్ధిని సంపూర్ణంగా పొందాలంటే విస్తృత మార్కెట్ బహిర్గతం అవసరం. అధిక ఫీజులు, భావోద్వేగ నిర్ణయాలు, తప్పుడు టైమింగ్ వంటి అంశాలు మదుపరుల రాబడులను తగ్గిస్తాయి. ఇండెక్స్ ఫండ్లు ఈ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తాయి.బఫెట్ తరచూ చెప్పే మాట ఒక్కటే ‘చిన్నపాటి ఫీజులు కూడా దీర్ఘకాలంలో భారీ నష్టాలకు దారి తీస్తాయి.’ప్రయోజనాలు.. పరిమితులు90/10 వ్యూహం అనేక స్పష్టమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఎస్&పీ 500 దాదాపు ఒక శతాబ్దంలో స్థిరమైన వృద్ధిని అందించిందని దీర్ఘకాలిక డేటా చూపిస్తోంది. దాని విస్తృత వైవిధ్యం.. అధిక ఈక్విటీ కేటాయింపుతో వచ్చే రిస్క్ను కూడా పరిమితం చేస్తుంది. తక్కువ నిర్వహణ రుసుములు కాంపౌండింగ్ను మరింత పెంచుతాయి. కాలక్రమేణా పోర్ట్ ఫోలియోకు వేలాది డాలర్లను జోడిస్తాయి.అయితే ఈక్విటీలకు 90 శాతం కేటాయింపు అందరికీ తగినది కాదని విమర్శకులు గమనించారు. ఇది పదవీ విరమణ చేసిన వారికి లేదా రిస్క్ సహనం తక్కువ ఉన్నవారికి దూకుడుగా ఉండవచ్చు. -
కెనరా బ్యాంక్ కొత్త యాప్.. ఏఐ ఫీచర్లతో..
డిజిటల్ చెల్లింపులను సురక్షితంగా చేసేందుకు ఉపయోగపడేలా ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ కొత్తగా ’కెనరా ఏఐ1పే’ పేమెంట్స్ యాప్ని ప్రవేశపెట్టింది. యూపీఐ ప్లాట్ఫాం ద్వారా వేగవంతంగా, సురక్షితంగా పేమెంట్స్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని బ్యాంకు తెలిపింది.నెలవారీగా ఖర్చులను విశ్లేషించుకునేందుకు స్పెండ్ అనలిటిక్స్, సులువుగా క్యూఆర్ స్కాన్ చేసేందుకు విడ్జెట్ సదుపాయం, తక్షణ నగదు బదిలీలు.. బిల్లుల చెల్లింపులు మొదలైన వాటికి యూపీఐ ఆటోపేలాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయని పేర్కొంది. అలాగే, పిన్ నంబరు ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా చిన్న మొత్తాలను చెల్లించేందుకు వీలుగా యూపీఐ లైట్ ఫీచరు సైతం ఇందులో ఉన్నట్లు వివరించింది.ఇదే యాప్లో మల్టీ లెవల్ భద్రతా వ్యవస్థను కూడా పొందుపరిచినట్లు కెనరా బ్యాంక్ వెల్లడించింది. ఏఐ ఆధారిత మోసాల గుర్తింపు (Fraud Detection) ద్వారా అనుమానాస్పద లావాదేవీలను తక్షణమే గుర్తించి వినియోగదారులను అప్రమత్తం చేసే విధంగా ఈ యాప్ను రూపొందించారు. బయోమెట్రిక్ లాగిన్, డివైస్ బైండింగ్, రియల్టైమ్ అలర్ట్స్ వంటి సదుపాయాలతో వినియోగదారుల ఖాతా భద్రత మరింత బలోపేతం అవుతుందని బ్యాంక్ అధికారులు తెలిపారు.అలాగే, ఈ యాప్ ద్వారా వ్యక్తిగత వినియోగదారులతో పాటు వ్యాపారులు కూడా సులభంగా చెల్లింపులు స్వీకరించవచ్చని పేర్కొన్నారు. చిన్న దుకాణాలు, స్వయం ఉపాధి వ్యాపారులు డిజిటల్ చెల్లింపుల వైపు అడుగులు వేయడానికి ఇది ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కెనరా బ్యాంక్ స్పష్టం చేసింది. -
బీమా ప్రీమియం పెరిగింది.. మరి కవరేజీ సరిపోతుందా?
విద్యలేని వాడు వింత పశువు అని ఒకప్పుడు అనేవారు.. ఈ ఆధునిక కాలంలో మాత్రం ఈ సామెతను బీమా లేని వారికి వాడుకోవాలి. అయితే కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని కబళించిన 2020 నుంచి భారత్లో బీమా ప్రీమియం గణనీయంగా పెరిగింది. కచ్చితంగా చెప్పాలంటే ప్రీమియం 73 శాతం వరకూ పెరగ్గా బీమా చేసిన మొత్తం కూడా 240 శాతం వరకూ ఎక్కువైంది. కానీ... ఏదైనా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరితే... ఉన్న బీమా కవరేజీ అస్సలు సరిపోవడం లేదు. ఇతర అవసరాల కోసం దాచుకున్న సొమ్ము ఖర్చుపెట్టాలి లేదంటే అప్పు చేయాలి. అందుకే... మీ బీమా పాలసీ ఏటికేడాదీ పెరిగిపోతున్న వైద్యం ఖర్చులను తట్టుకునేలా ఉందా? లేదా? సరిచూసుకోండి.దేశంలో చాలామంది బీమా పాలసీ తీసుకున్న వారు తమకు రూ.10 - 15 లక్షల కవరేజీ ఉంటే సరిపోతుందని అనుకుంటున్నారు. కొంచెం ఆదాయం తక్కువగా ఉన్న వారు రూ.పది లక్షల మొత్తానికి సర్దుకుంటూంటే.. మధ్యతరగతి వారు ఇంకో ఐదు లక్షల వరకూ ఎక్కువ మొత్తంతో పాలసీలు తీసుకుంటున్నారు. అయితే ఈ పెంపు సరిపోతుందా? అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం చూస్తే వైద్యం ఖర్చులు ఏటా పన్నెండు నుంచి 14 శాతం వరకూ పెరుగుతున్నాయి. శస్త్రచికిత్సలకు మాత్రమే కాకుండా.. ఆసుపత్రుల్లో గదుల అద్దెలు, మందులు, ఇతర కన్స్యూమబల్స్ రేట్లు పెరిగిపోవడం ఇందుకు కారణం. గత ఐదేళ్లలో పెరిగిన ప్రీమియం మొత్తం కూడా ఈ వ్యత్యాసాన్ని తట్టుకోలేకపోతోంది. ఎక్కువ మొత్తానికి పాలసీ తీసుకున్నాం కాబట్టి ఇబ్బంది లేదని చాలామంది పాలసీదారులు అనుకుంటున్నారని, అంతకంటే వేగంగా ఆసుపత్రి బిల్లులు పెరుగుతున్నాయని గుర్తించడం లేదని నిపుణులు చెబుతున్నారు.టాప్ అప్లతో ఉపశమనం...పెరిగిపోతున్న వైద్యం ఖర్చులకు అనుగుణంగా మీ పాలసీను మలచుకోవడం ఒక మార్గం. బేస్ ప్లాన్కు అనువైన టాప్అప్ పాలసీలు జోడించుకోండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ కవరేజీ వస్తుంది. కొన్ని కంపెనీలు ద్రవ్యోల్బణానికి తగ్గట్టు ఏటా బీమా మొత్తాన్ని పెంచే పాలసీలు అందిస్తున్నాయి. హెచ్డీఎఫ్సీ ఎర్గో, ఐసీఐసీఐ లంబార్డ్లలో పాలసీ మొత్తం ఏటా పదిశాతం పెరిగేలా ఇన్ఫ్లేషన్ షీల్డ్ కవరేజీ అందిస్తున్నాయి. కుటుంబంలో ఒకొక్కరి ఒక్కో పాలసీ కాకుండా.. ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్లు ఎంచుకోండి. దీనివల్ల అందుబాటులో ఉండే మొత్తం ఎక్కువగా ఉంటుంది. పాలసీని ఎంచుకునేటప్పుడు ఏ ఏ అంశాలపై కవరేజీ లేదన్నది స్పష్టంగా అర్థం చేసుకోండి. కొన్ని పాలసీల్లో ఆసుపత్రిలో గది అద్దెలపై పరిమితి ఉంటుంది. లేదా పూర్తి మినహాయింపు ఉండవచ్చు. అలాగే ఏ ఏ ప్రొసీజర్లకు కవరేజీ వర్తిస్తుందో కూడా గమనించండి. వీటితోపాటు వీలైనంత వరకూ అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు కొంత అదనపు మొత్తాన్ని ఒక పద్ధతి ప్రకారం పొదుపు చేసుకోవడమూ అవసరమే.- గిళియారు గోపాలకృష్ణ మయ్యా. -
దీర్ఘకాల సంపద రహస్యం ఏమిటంటే..
ఆర్థిక మార్కెట్లకు 2025 సంవత్సరం ఆశ్చర్యాలకు గురిచేసింది. సంవత్సరంలో ఎక్కువ భాగం ఈక్విటీ మార్కెట్లు స్థిరంగా ఉన్నప్పటికీ, ఇటీవల రికవరీ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది రెండో అర్ధభాగంలో రెండు రకాల ఆస్తులు ప్రత్యేకంగా మెరిశాయి.బంగారం, వెండిబంగారం, క్యాలెండర్ ఇయర్ 2024లో 30% రాబడిని అందించింది. ఇది ఈక్విటీలను మించిన లాభం. మరోవైపు పరిశ్రమల వినియోగంతో డిమాండ్ పెంచుకున్న వెండి 25.3% లాభపడింది. దీంతో వీటిలో ఎక్కువ పెట్టుబడి పెట్టుంటే బాగుండేది అనుకునే ఇన్వెస్టర్ల సంఖ్య పెరిగింది. కానీ ఇలాంటి సమయంలోనే ‘రాబడులు ఇప్పటికే పెరిగాక వాటిని వెంబడించడం’ అనే ఉచ్చులో పెట్టుబడిదారులు చిక్కుకుంటారు.సమూహాన్ని వెంబడించే మానసిక లక్షణంబంగారంలో రాబడులు పెరిగే సమయంలో పెట్టుబడిదారుల ఆసక్తి కూడా ఒక్కసారిగా పెరుగుతుంది. అయితే ధరలు పడిపోతే అదే ఆసక్తి తగ్గిపోతుంది. ఈ ప్రతిస్పందనాత్మక ప్రవర్తనే, పెట్టుబడుల్లో క్రమశిక్షణ, స్థిరత్వం ఎంత కీలకమో గుర్తు చేస్తుంది. మార్కెట్ టైమింగ్ కన్నా, దీర్ఘకాలిక దృష్టితో, విభిన్న ఆస్తుల్లో పెట్టుబడి పెట్టడం మెరుగైన ఫలితాలు ఇస్తుంది. మార్కెట్ గతంలో ఇచి్చనట్లుగా భవిష్యత్లో కూడా లాభాలను అందిస్తుందనే హామీ ఏమీ ఉండదు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఒక సమర్థవంతమైన మార్గంఔట్సోర్సడ్ అసెట్ అలొకేషన్. అంటే, మన డబ్బును ఏ ఆస్తిలో ఎంత పెట్టాలి (షేర్లు, బాండ్లు, గోల్డ్, క్యాష్ వంటివి) అనే నిర్ణయాన్ని ఒక ఫండ్ మేనేజర్కే అప్పగించడం.క్లిష్ట పరిణామాల నేపథ్యంలో పెట్టుబడులుఎప్పటికప్పుడు మారుతూ అస్థిరంగా ఉన్న ప్రపంచ మార్కెట్లలో, ఇటీవల బాగా రాబడులు ఇచ్చిందనే కారణంతో ఒకేరకమైన ఆస్తి తరగతిపైనే పెట్టుబడి పెట్టడం ప్రమాదకరం కావచ్చు. విభిన్న ఆస్తి తరగతులు ఇప్పుడెలా ప్రవర్తిస్తున్నాయో చూద్దాం:బంగారం–వెండి: సంప్రదాయంగా సురక్షిత పెట్టుబడి ఆస్తులుగా భావించే ఈ లోహాలు, ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు లేదా కరెన్సీ బలహీనపడినప్పుడు మెరుగ్గా లాభాలను అందిస్తాయి. పరిశ్రమలతో అనుసంధానమై ఉండడం వల్ల ఎక్కువ ఊగిసలాట ఉన్నా వెండిలో అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.ఈక్విటీలు: వృద్ధి అవకాశాలు ఎక్కువగా ఉండే ఆస్తి తరగతి. కానీ వడ్డీ రేట్లు, కంపెనీల లాభాల అంచనాలు, స్థూల ఆర్థిక మార్పులపై ఎక్కువగా ఆధారపడతాయి. ప్రాంతాలు, రంగాల మధ్య పనితీరులో పెద్దగా తేడాలు ఉంటాయి.ఫిక్స్డ్ ఇన్కమ్: స్థిరత్వం ఎక్కువ, అంచనా వేయగల ఆదాయాన్ని అందిస్తాయి. వడ్డీ రేట్లు పెరిగితే బాండ్ ధరలపై ఒత్తిడి వచ్చినా, రిస్క్ నియంత్రణకు, మూలధన పరిరక్షణకు ఇవి కీలకం. ముఖ్యంగా సంరక్షణాత్మక పెట్టుబడిదారులకు, పదవీ విరమణకు దగ్గరలో ఉన్నవారికి ఇవి ఉపయోగం.రియల్ అసెట్స్ ఇతర ప్రత్యామ్నాయాలు: రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కమోడిటీలు ద్రవ్యోల్బణానికి రక్షణనిచ్చే అవకాశముంది. ప్రైవేట్ ఈక్విటీ, హెడ్జ్ ఫండ్స్ వంటి ప్రత్యామ్నాయ పెట్టుబడులు అధిక రాబడులు ఇవ్వగలిగినా, ఎక్కువ రిస్క్, తక్కువ లిక్విడిటీ కలిగి ఉంటాయి.వైవిధ్యీకరణ ఎందుకు కీలకం?: బుల్ మార్కెట్లో ఈక్విటీలు కావొచ్చు, మాంద్య సమయంలో బంగారం కావొచ్చు. అత్యుత్తమ పనితీరు కనబరిచే ఆస్తి వెంట పరుగులుతీయడం, ఇదిపెట్టుబడుల విషయంలో తప్పు టైమింగ్కు, అధిక ఊగిసలాటకు దారితీస్తుంది. వైవిధ్యీకరణ అంటే, వివిధ పరిస్థితుల్లో భిన్నంగా ప్రవర్తించే ఆస్తుల మధ్య పెట్టుబడులను పంచడం. ఇది రిస్క్ను తగ్గిస్తుంది.వైవిధ్యీకరణకి ఉదాహరణ: ఎన్ఎస్ఈ 500 కంపెనీలలో, 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మే 31 వరకు, తక్కువ పనితీరు, నిదానమైన వృద్ధి ఉన్న కంపెనీలు, మంచి పనితీరు, అధిక వృద్ధి కంపెనీల కంటే ఎక్కువ రాబడులు ఇచ్చాయి. కానీ ఈ ధోరణి మళ్లీ మారుతోంది. 2024 జూన్ నుంచి, మార్కెట్ మళ్లీ అధిక పనితీరు, అధిక వృద్ధి కంపెనీలను ప్రోత్సహించడం మొదలుపెట్టింది. అవి గతంలో ఎదుర్కొన్న అండర్పర్ఫార్మెన్స్లో పావు వంతుకు పైగా రికవరీ సాధించాయి. అందువల ఈక్విటీల పనితీరును బట్టి వైవిధ్యీకరణను పాటించాలి.ఇదీ చదవండి: క్రూడాయిల్ ధరలు తగ్గినా.. తగ్గని పెట్రోల్, డీజిల్ రేట్లుముగింపు: తరచూ ఒడిదుడుకులకు లోనయ్యే పెట్టుబడుల ప్రపంచంలో, ఆలోచనాత్మకమైన వైవిధ్యీకరణతో బలమైన పోర్ట్ఫోలియో నిర్మించడం తెలివైన పని మాత్రమే కాదు, అవసరం కూడా. అందుకే పెట్టుబడిదారులు తాత్కాలిక రాబడులకన్నా, సమతుల్యత, క్రమశిక్షణ, దీర్ఘకాలిక వ్యూహంపై దృష్టి పెట్టాలి. ప్రఖ్యాతపారిశ్రామికవేత్త, పెట్టుబడిదారు నావల్ రవికాంత్ చెప్పినట్లుగా.. ‘‘జీవితంలో వచ్చే అన్ని రాబడులూ సంపద, సంబంధాలు, జ్ఞానం కలయిక వల్లే వస్తాయి.’’ -
అప్పుడే తీర్చేయొద్దు!
ఇపుడు ఫోన్ తెరిచి మెసేజ్లు, వాట్సాప్లు చూసినా... మెయిల్ తెరిచినా రుణాలిస్తామంటూ రోజూ ఆఫర్ల కొద్దీ ఆఫర్లు. దీంతో పాటు ఫోన్లు. ఫోన్ చేసి మరీ... లోన్ కావాలా? అని అడిగే ఏజెన్సీలు కోకొల్లలు. ఇలాంటివేమీ లే కున్నా.. జస్ట్ యాప్ తెరిచి క్లిక్ కొడితే మన ఖాతాలోకి డబ్బులిచ్చేసే రుణ యాప్లు కూ డా ఉన్నాయి. అదీ ఫిన్టెక్ మహిమ. నిజానికి ఈ యాప్లన్నీ అప్పులిచ్చేది వాటి సొంత డబ్బేమీ కాదు. అవన్నీ ఏదో ఒక ఫైనాన్స్ కంపెనీతోనో, బ్యాంకుతోనో జతకట్టి ఉంటాయి. వాటికన్నా కాస్త ఎక్కువ వడ్డీ వేసుకుని... అత్యంత ఈజీగా మీ ఖాతాలోకి వేసేస్తూ ఉంటాయి. తీర్చటం కాస్త ఆలస్యమయినా, తీర్చకపోయినా వీటి వ్యవహారశైలి కూడా చాలా దుర్మార్గంగా ఉంటుంది. అందుకే రుణం తీసుకునేటపుడు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ తీసుకున్నాం? ఎంత వడ్డీకి తీసుకున్నాం? ప్రాసెసింగ్ ఛార్జీలెంత? ప్రీపేమెంట్ పెనాల్టీ ఎంత? ఇవన్నీ తప్పనిసరిగా చూడాలి. సరే! ఇవన్నీ చూశాకే రుణం తీసుకున్నారనుకుందాం. ఇల్లు, కారు, స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, గృహోపకరణాల కొనుగోళ్లు, టూర్లు... ఇలా దేనికైనా రుణం తీసుకుని ఉండొచ్చు. కాకపోతే చాలామంది ఈజీగా వస్తున్నాయి కదా అని ప్రతిదానికీ రుణం తీసేసుకోవటం... ఆ తరువాత దాన్ని భారంగా భావించి త్వరగా వదిలించుకునే మార్గాల కోసం వెతకడం చేస్తుంటారు. దేశంలో ముందస్తు రుణ చెల్లింపులు పెరుగుతుండడం దీన్నే సూచి స్తోంది. 1వ తారీఖు వస్తుందంటే మనసులో ఆందోళన పెరగడం... ‘ఈఎంఐ’ కట్టడంలో ఉన్న నొప్పి... వారితో అలా చేయిస్తుంటా యి. కానీ, అన్ని రుణాలనూ ఇలా ముందు గా తీర్చేయడం ఆర్థికంగా తెలివైన పనేమీ కా దు. రుణాల్లో మనల్ని పిండేసే వాటితో పాటు కొన్ని మనకు లాభాన్నిచ్చేవి కూడా కొన్ని ఉంటాయి. ఆర్థికంగా గుల్ల చేసే రుణాలను వదిలించుకోవడం, చౌక రుణాలతో నాలుగు రాళ్లు వెనుకేసుకోవడం ఎలాగో చూద్దాం...రుణాన్ని ముందుగా తీర్చేయడం ఎందుకు? → రుణ భారం నుంచి బయటపడాలన్న ప్రయత్నం వెనుక ఎన్నో కారణాలుంటాయి. → అత్యవసరమో లేక నచి్చన వస్తువును సొంతం చేసుకోవాలన్న బలహీనత వల్లో రుణం తీసుకుని ఉండొచ్చు. నెలవారీ రుణ చెల్లింపులు మొదలయ్యాక భారంగా అనిపించొచ్చు. ఆదాయం నుంచి ఈఎంఐలకు సర్దుబాటు చేయలేక, రుణాన్ని ముగించాలని భావించొచ్చు. → పెట్టుబడులు గడువు తీరి చేతికి రావొచ్చు. లేదా పనిచేస్తున్న కంపెనీ నుంచి బోనస్ బ్యాంక్లో జమ కావొచ్చు. వీటితో రుణం భారం తగ్గించుకుందామని అనిపించొచ్చు. → నెలవారీ ఆదాయంలో చాలా వరకు రుణ చెల్లింపులకే ఖర్చు చేసేస్తుంటే.. ఇక ఇతర ఖర్చులకు చాలని పరిస్థితులతో ఇంట్లో ఒత్తిళ్లు తట్టుకోలేక.. రుణాన్ని క్లోజ్ చేసే ప్రయత్నాలు మొదలు పెడుతుంటారు. రుణంతో కలసి సాగడమే.. కొన్ని రుణాలను ముందుగా చెల్లించడం కంటే, వాటిని కొనసాగించుకోవడం ద్వారా రుణ గ్రహీత అదనపు ప్రయోజనం పొందొచ్చు. అది ఎప్పుడంటే.. → రుణంపై వడ్డీ రేటు 9–10 శాతం మించకుండా ఉండాలి. సాధారణంగా గృహ రుణం, వాహన రుణం, విద్యా రుణాలు ఇంత తక్కువ రేటుకు వస్తుంటాయి. ప్రాపర్టీ తనఖాపైనా ఇంతే తక్కువ రేటుకు రుణాలు లభిస్తున్నాయి. → రుణాన్ని తీర్చే బదులు, ఆ మొత్తాన్ని పెట్టుబడి పెడితే.. రుణ రేటు కంటే అధిక రాబడి వచ్చేట్టు ఉండాలి. సాధారణంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్పై రాబడులు 10–15 ఏళ్లు అంతకుమించిన దీర్ఘకాలంలో 12–20 శాతం మధ్య ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. → అత్యవసరాల కోసం ఉద్దేశించిన నిధిని తీసుకెళ్లి రుణానికి కట్టేయడం వివేకం అనిపించుకోదు. ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోతేనో లేదా వైద్య అత్యవసరం ఏర్పడితేనో నిధుల కోసం మళ్లీ అప్పు చేయాల్సి వస్తుంది. కనుక అత్యవసర నిధిని రుణాల కోసం ఉపయోగించొద్దు. → నెలవారీ రుణ చెల్లింపులు ఆదాయంలో 30% లోపే ఉన్నప్పుడు దాన్ని ముందుగా తీర్చడం కంటే.. మిగులు ఆదాయాన్ని పెట్టుబడులకు మళ్లించుకునే మార్గాలను చూడొచ్చు. → పన్ను ఆదా ప్రయోజనాలున్న రుణాలను వదిలించుకోవడం కంటే కొనసాగించడం ద్వారా ప్రయోజనం పొందొచ్చు. ఉదాహరణకు గృహ రుణం. పాత పన్ను విధానంలో సెక్షన్ 80సీ కింద ఇంటి రుణం కోసం చేసే చెల్లింపుల్లో అసలు రూ.1.50 లక్షల వరకు, సెక్షన్ 24 కింద వడ్డీ రూ.2 లక్షలపైనా పన్ను మినహాయింపు పొందొచ్చు. పన్ను ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని చూస్తే ఇంటి రుణంపై 8.3% వడ్డీ రేటు చెల్లిస్తున్నప్పటికీ.. నికరంగా పడే భారం 6.5–7% మించదు. పైగా ముందస్తు చెల్లింపుల ను ఈక్విటీ, బంగారంలోకి పెట్టుబడిగా మళ్లించి మెరుగైన రాబడులూ సొంతం చేసుకోవచ్చు.ఇలాంటపుడు తీర్చేయటమే బెటర్...→ నెలవారీ సంపాదనలో ఈఎంఐలు 45 శాతం మించినట్టయితే, ఆయా రుణాలను త్వరగా చెల్లించే మార్గాలను చూడొచ్చు. → పదవీ విరమణకు చేరువవుతుంటే (మరికొన్నేళ్లే ఉంటే)... అప్పుడు వీలైనంత త్వరగా ఆ రుణాల నుంచి బయటకు రావాలి. → రుణాల్లో అధిక వడ్డీ రేటుతో ఉన్న వాటిని త్వరగా వదిలించుకోవాలి. ఉదాహరణకు క్రెడిట్ కార్డులపై 36– 44 శాతం వరకు వడ్డీ పడుతుంది. ఆ తర్వాత వ్యక్తిగత రుణాలపైనా 15 శాతం వరకు వడ్డీ ఉంటుంది. ఇలాంటి వాటిని ముందుగా చెల్లించడం వల్ల లాభమే కానీ, నష్టం ఉండదు. → కొన్ని వాహన రుణాలపై వడ్డీ రేటు 12 శాతం వరకు ఉంటుంది. ఇలాంటివీ ముందుగా తీర్చేయొచ్చు. → గృహ, విద్యా రుణం తప్ప మిగిలిన రుణాలపై ఎలాంటి పన్ను ప్రయోజనాల్లేవు. కనుక అధిక రేటుతో ఉంటే త్వరగా బయటకు వచ్చేయడం లాభమే. → కొందరు ఈక్విటీ పెట్టుబడులపై మెరుగైన రాబడి వచి్చనప్పటికీ.. పెట్టుబడి కంటే రుణాన్ని ముగించేందుకే మొగ్గు చూపుతుంటారు. అధిక రాబడి కోసం పెట్టుబడులపై రిస్క్ తీసుకోవడం వారికి నచ్చదు. పైగా రుణాన్ని ఎక్కువ కాలం పాటు కొనసాగించేందుకు ఇష్టంలేని వారికి సైతం రుణభారం దింపుకోవడమే మెరుగైన మార్గం అవుతుంది. → ఏది ఏమైనా మెరుగైన రాబడులు ఇస్తున్ను పెట్టుబడులను ముందస్తు రుణ ముగింపునకు వినియోగించడం వివేకం అనిపించుకోదు.ఆదా మామూలుగా లేదుగా..! → రూ.20 లక్షల గృహ రుణాన్ని 15 ఏళ్ల టర్మ్తో తీసుకున్నారు. వడ్డీ రేటు 8.3%. → ఇందులో రూ.5 లక్షలను ముందుగా చెల్లించినట్టయితే 15 ఏళ్ల కాలంలో మొత్తం మీద రూ.3.2 లక్షలు వడ్డీ రూపంలో ఆదా అవుతుంది. → రూ.5 లక్షలను ముందస్తు రుణం చెల్లింపులకు వినియోగించకుండా, 12 శాతం రాబడినిచ్చే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుంది? → 15 ఏళ్ల కాలంలో రూ.27.36 లక్షలు సమకూరుతుంది. → ముందస్తు రుణ చెల్లింపులకు బదులు.. ఇన్వెస్ట్ చేయడం వల్ల రూ.24 లక్షలు సమకూర్చుకోవచ్చని ఈ ఉదాహరణ తెలియజేస్తోంది. → పెట్టుబడులపై రాబడి, రుణం రేటు కంటే అధికంగా ఉంటే అలాంటప్పుడు ముందస్తు చెల్లింపులతో వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. వీటిని గమనించాలి.. అధిక రేటుతో తీసుకున్న రుణాలను ముందుగా తీర్చేయడం లాభమే. కానీ, గడువు కంటే ముందుగానే వాటిని ముగించేందుకు బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలు ఉచితంగా అనుమతించకపోవచ్చు. ఫోర్క్లోజర్ చార్జీలంటూ చాలా సంస్థలు రుణ గ్రహీతల నుంచి వసూలు చేస్తున్నాయి. రుణాన్ని గడువులోపు తీర్చేస్తుంటే.. అప్పటికి మిగిలిన బకాయిపై 2–5 శాతం వరకు ఈ రూపంలో చార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ తదితర కొన్ని బ్యాంక్లు అయితే వ్యక్తిగత రుణాలను ముందుగా తీర్చేస్తుంటే ఎలాంటి చార్జీలు విధించడం లేదు. కనుక ఇలాంటి చార్జీల్లేని చోటే రుణాలు తీసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. దీనివల్ల తర్వాతి కాలంలో వీలైనంత ముందుగానే గుడ్బై చెప్పేయొచ్చు. -
పీఎఫ్ కొత్త రూల్: ఎన్పీఎస్ నుంచి ఇక 80 శాతం విత్డ్రా
జాతీయ పింఛను వ్యవస్థ (ఎన్పీఎస్) సభ్యులకు హార్షానిచ్చే మార్పులకు పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి మండలి (పీఎఫ్ఆర్డీఏ) శ్రీకారం చుట్టింది. పదవీ విరమణ నాటికి సమకూరిన మొత్తం నిధిలో 60 శాతం ఉపసంహరణకు ప్రస్తుతం అనుమతి ఉండగా, ఇకపై 80 శాతం వెనక్కి తీసుకోవచ్చు. మిగిలిన 20 శాతంతో యాన్యూటీ ప్లాన్ (క్రమానుగతంగా పింఛను చెల్లించే) కొనుగోలు చేస్తే సరిపోతుంది. ప్రస్తుతం గరిష్టంగా 70 ఏళ్ల వయసు వరకే ఎన్పీఎస్లో కొనసాగేందుకు అనుమతి ఉంది. దీన్ని ఇప్పుడు 85 ఏళ్లకు పెంచారు. ఇందుకు సంబంధించి కొత్త నిబంధనలను పీఎఫ్ఆర్డీఏ ప్రకటించింది. గెజిట్ ప్రకటించిన తేదీ నుంచి ఇవి అమల్లోకి వస్తాయని తెలిపింది. పథకం నుంచి వైదొలిగే నాటికి పింఛను నిధి రూ.8లక్షల్లోపు ఉంటే ఆ మొత్తాన్ని సభ్యులు ఒకే విడత, లేక సిస్టమ్యాటిక్ యూనిట్ రిడెంప్షన్ రూపంలో (క్రమానుగతంగా/ఫండ్స్లో ఎస్డబ్ల్యూపీ మాదిరి) వెనక్కి తీసుకోవచ్చు. నాలుగేళ్ల విరామంతో సభ్యులు ఇకపై నాలుగు పర్యాయాలు పాక్షిక ఉపసంహరణ చేసు కోవచ్చు. ప్రస్తుతం 3 సార్లకు అనుమతి ఉంది. 60 ఏళ్ల రిటైర్మెంట్ వయసు తర్వాత కొనసాగే వారు మూడేళ్ల విరామంతో మూడు పాక్షిక ఉపసంహరణలే చేసుకోగలరు. ఎన్పీఎస్లో ప్రభుత్వ చందాదారులు సైతం 85 ఏళ్ల వరకు కొనసాగొచ్చు. అంటే 85 ఏళ్లు వచ్చే వరకు పెట్టుబడులను సైతం కొనసాగించుకోవచ్చు. వీరు పథకం నుంచి వైదొలిగే సమయంలో కనీసం 40 శాతంతో యాన్యూటీ ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది. మిగిలిన 60 శాతాన్ని ఒకే విడత లేదా క్రమానుగతంగా వెనక్కి తీసుకోవచ్చు. రాజీనామా లేక తొలగింపు కారణంగా పథకం నుంచి మందుగా వైదొలిగే ప్రభుత్వ చందాదారులు.. పింఛను నిధి నుంచి 20 శాతాన్నే వెనక్కి తీసుకోగలరు. మిగిలిన 80 శాతంతో యాన్యూటీ ప్లాన్ తీసుకోవడం తప్పనిసరి. పింఛను నిధి రూ.5 లక్షల్లోపే ఉంటే.. సాధారణ వైదొలగడం, ముందస్తుగా వైదొలగడం లేదా సభ్యుడు మరణించిన సందర్భాల్లో పూర్తి మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. -
Rupee fall: జీతం తగ్గుతుందా.. EMI పెరుగుతుందా?
భారత కరెన్సీ రూపాయి విలువ రోజురోజుకీ బలహీనపడుతోంది.. డాలర్ మారకంలో భారత రూపాయి చరిత్రలోనే కనిష్ఠ స్థాయికి చేరడంతో సామాన్య కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపే అంశాలపై ఆందోళన పెరుగుతోంది. ముఖ్యంగా జీతాలు, ఈఎంఐలు (EMIs), రోజువారీ ఖర్చులు అన్నీ ఒకేసారి ఒత్తిడిలో పడుతున్నాయి.ఈఎంఐలపై ప్రభావం ఇలా..రూపాయి విలువ పడిపోతే లోన్లపై ప్రభావం రెండు విధాలుగా కనిపిస్తుంది.విదేశీ కరెన్సీ లోన్లుడాలర్లు లేదా ఇతర విదేశీ కరెన్సీలో లోన్ తీసుకున్నవారికి నేరుగా దెబ్బ పడుతుంది. ఉదాహరణకు డాలర్ ధర రూ.80 నుంచి రూ.90కి పెరిగితే, రీపేమెంట్ భారం సుమారు 12.5 శాతం పెరుగుతుంది.దేశీయ లోన్లుఇక్కడ ప్రభావం పరోక్షంగా ఉంటుంది. రూపాయి బలహీనపడటంతో దిగుమతుల ఖర్చు పెరుగుతుంది. ఫలితంగా ఇంధనం, మందులు, ఎలక్ట్రానిక్స్ ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దీనిని నియంత్రించేందుకు ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచితే, ఫ్లోటింగ్ రేట్ లోన్ల ఈఎంఐలు పెరుగుతాయి.ఉదాహరణకు మీరు రూ.50 లక్షల హోం లోన్ తీసుకున్నారనుకోండి.. 20 ఏళ్లు టెన్యూర్, 8% వడ్డీతో ప్రస్తుతం ఈఎంఐ సుమారు రూ.41,045 గా ఉంటే వడ్డీ రేటు 0.5% పెరిగితే ఈఎంఐ రూ.42,366కి చేరుతుంది. అంటే నెలకు రూ.1,321 అదనపు భారం. మొత్తం కాలంలో రూ.3.17 లక్షలు అదనంగా చెల్లించాల్సి వస్తుందన్న మాట.జీతాలపై రూపాయి ప్రభావంరూపాయి పతనం వల్ల జీతాలు వెంటనే తగ్గవు కానీ సమస్య అక్కడే మొదలవుతుంది.ప్రైవేట్ ఉద్యోగులకుకంపెనీల ఖర్చులు పెరగడంతో ఇంక్రిమెంట్లు ఆలస్యం కావచ్చు.కొత్త నియామకాలు తగ్గే అవకాశంకొన్నిచోట్ల బోనసులు, వేరియబుల్ పే తగ్గవచ్చుఐటీ, ఎగుమతి రంగాలలోని డాలర్లలో ఆదాయం వచ్చే కంపెనీలకు కొంత లాభం ఉన్నా, ఆ ప్రయోజనం ఉద్యోగుల జీతాల పెంపులోకి వెంటనే రావడం కష్టంప్రభుత్వ ఉద్యోగులకుజీతాలు స్థిరంగానే ఉన్నా, ద్రవ్యోల్బణం పెరగడం వల్ల జీతం విలువ తగ్గినట్లే అవుతుంది. డీఏ పెంపు ఆలస్యమైతే భారమవుతుంది.రూపాయి పతనం అంటే కేవలం ఎగుమతులు–దిగుమతుల సమస్య కాదు. ఇది జీతం విలువను తగ్గించి, ఈఎంఐ భారం పెంచి, కుటుంబ బడ్జెట్ను కుదించే నిశ్చబ్ద దెబ్బ. నేరుగా అయినా, పరోక్షంగా అయినా సామాన్యుడిపై ప్రభావం తప్పదు. -
ఎస్బీఐ యోనో కొత్త వెర్షన్.. 20 కోట్లు టార్గెట్!
ఎస్బీఐ డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ అయిన ‘యోనో’ వచ్చే రెండేళ్లలో కస్టమర్ల సంఖ్యను 20 కోట్లకు పెంచుకోవాలన్న ప్రణాళికతో ఉంది. యోనో 2.0 (కొత్త వెర్షన్)ను విడుదల చేసిన సందర్భంగా ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి ఈ విషయాన్ని ప్రకటించారు. ఎస్బీఐ 2.0 మెరుగైన వెర్షన్ అని, కస్టమర్లకు మెరుగైన సేవల అనుభవాన్ని అందిస్తుందన్నారు. ఎస్బీఐకి వెన్నెముకగా నిలుస్తుందన్నారు. ఈ ప్లాట్ఫామ్పై పూర్తి స్థాయి సదుపాయాలను వచ్చే 6–8 నెలల్లో అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.‘‘డిజిటలైజేషన్కు యోనో 2.0 మూలస్తంభంగా ఉంటుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్కు ఉమ్మడి కోడ్ ఉంటుంది. దీంతో వివిధ ఛానళ్ల మధ్య అనుసంధానత సాఫీగా సాగుతుంది. దీని కారణంగా కొత్త ఉత్పత్తులను, సేవలను ఎస్బీఐ వేగంగా కస్టమర్లకు అందించగలదు. యోనోకి ప్రస్తుతం 10 కోట్ల కస్టమర్లు ఉన్నారు. యోనో మొబైల్ బ్యాంకింగ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్పై కస్టమర్ల సంఖ్య 20 కోట్లకు చేర్చాలన్నది మా ఉద్దేశ్యం. వచ్చే రెండేళ్లలో దీన్ని చేరుకుంటాం’’అని శెట్టి చెప్పారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నికర వడ్డీ మార్జిన్ (నిమ్)ను 3 శాతం సాధిస్తామని మరోసారి ప్రకటించారు. ర్యామ్ విభాగంలో (రిటైల్, వ్యవసాయం, ఎంఎస్ఎంఈ) రుణాల పరంగా 14 శాతం వృద్ధి సాధిస్తామని, అలాగే రూ.25 లక్షల కోట్ల పోర్ట్ఫోలియో మైలురాయిని అధిగమిస్తామని చెప్పారు. బంగారం రుణాలు, ఎక్స్ప్రెస్ క్రెడిట్ (అన్సెక్యూర్డ్ వ్యక్తిగత రుణాలు)లో మంచి వృద్ధి సాధిస్తామన్నారు. -
ఫండ్ పరిశ్రమకు సిప్ దన్ను
అర్థవంతమైన, దీర్ఘకాలిక సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్లు (సిప్), మార్కెట్ వృద్ధితో అసెట్ విలువలు పెరుగుతుండటంలాంటి అంశాలు మ్యుచువల్ ఫండ్ పరిశ్రమ వృద్ధికి దోహదపడుతున్నాయని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ సీఈవో నిమేష్ షా తెలిపారు. రిటైర్మెంట్ లేదా పిల్లల చదువులాంటి నిర్దిష్ట లక్ష్యాల కోసం సిప్ విధానంలో పెట్టుబడులు పెడుతున్నప్పుడు మదుపరులు, చివరివరకు పెట్టుబడులను కొనసాగిస్తున్నారని ఆయన చెప్పారు.యాక్టివ్ వ్యూహాలు అత్యధిక రాబడులను అందించినంత వరకు వాటిపై ఇన్వెస్టర్ల ఆసక్తి కొనసాగుతుందని షవివరించారు. దేశీయంగా యాక్టివ్ ఫండ్లు సహేతుకమైన పనితీరును కనపరుస్తున్నందున వాటిల్లోకి గణనీయంగా పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. ఏదైనా ఫండ్ సంస్థకు ఇతర సంస్థల నుంచి పోటీ, లేదా నియంత్రణ నిబంధనలపరమైన రిసు్కల కన్నా పనితీరు ఆశించినంత స్థాయిలో లేకపోవడమే పెద్ద రిసు్కగా ఉంటుందని షా వివరించారు.‘‘డిజిటైజేషన్, డెమోగ్రాఫిక్స్, ఆర్థిక అసెట్ద్లోకి కుటుంబాల పొదుపు మొత్తాలు భారీగా వస్తుండటంలాంటి అంశాల దన్నుతో భారత జీడీపీ గణనీయంగా వృద్ధి నమోదు చేస్తోంది. ప్రభుత్వం చేపట్టిన పలు సంస్కరణల ఊతంతో దేశ స్థూల ఆర్థిక పరిస్థితులు పటిష్టంగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా మరింత పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. కంపెనీల ఆదాయ వృద్ధి రూపంలో ఈక్విటీ మార్కెట్లలో కూడా ఇది ప్రతిఫలిస్తోంది. దీర్ఘకాలికంగా పెట్టుబడులను కొనసాగించే వారికి సముచితమైన ప్రతిఫలం దక్కుతుందని ఇవి నమ్మకం కలిగిస్తున్నాయి’’ అని షా తెలిపారు.లిస్టయినా జవాబుదారీతనం యథాతథం.. ‘‘స్టాక్ మార్కెట్లలో కంపెనీ లిస్టయినప్పటికీ మా జవాబుదారీతనం, బాధ్యతలేమీ మారవు. ఇన్వెస్టర్లు పెట్టుబడులను కొనసాగించి, వారి సంపద వృద్ధి చెందితేనే మా ఆదాయాలు పెరుగుతాయి కాబట్టి యూనిట్హోల్డర్లకు ఒనగూరే ప్రయోజనాలతో షేర్హోల్డర్ల ప్రయోజనాలు ముడిపడి ఉంటాయి. అన్నింటికన్నా ప్రధానంగా డబ్బును నిర్వహించే రిస్క్ మేనేజ్మెంట్ కంపెనీగానే మమ్మల్ని మేము భావిస్తాం. లిస్టింగ్ తర్వాత కూడా అదే కొనసాగుతుంది. ఫండ్ పరిశ్రమ చాలా విస్తృత స్థాయి వ్యాపారం. ఇన్వెస్టర్లకు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నియంత్రణ సంస్థ వ్యయాలను క్రమబదీ్ధకరించింది. దీనితో ఇన్వెస్టర్లకు ఫండ్స్ మరింత అందుబాటులోకి వస్తాయి. అలాగే మార్జిన్లు తగ్గినా పరిమాణం పెరగడం వల్ల సంస్థకు ఆ మేరకు భర్తీ అవుతుంది. కాలక్రమేణా అధిక లాభాలకు దోహదపడుతుంది’’ అని షా చెప్పారు.ఇక ఐపీవో వల్ల కంపెనీ నిర్వహణ స్వరూపం ఏమీ మారదన్నారు. గత మూడు దశాబ్దాలుగా పెట్టుబడులు కొనసాగిస్తున్న ప్రుడెన్షియల్ కార్పొరేషన్ హోల్డింగ్స్ పాక్షికంగానే వాటాలను విక్రయిస్తోందని, ఐసీఐసీఐ బ్యాంకు మెజారిటీ వాటాదారుగా కొనసాగుతుందని తెలిపారు. కాబట్టి అదే మేనేజ్మెంట్, అవే పెట్టుబడి సూత్రాలు, గవర్నెన్స్తో వ్యాపారం కొనసాగుతుందన్నారు. పబ్లిక్ ఇష్యూతో లిక్విడిటీ, యాజమాన్యం పెరుగుతుందే తప్ప కంపెనీ వ్యూహంలో మార్పు ఉండదని షా తెలిపారు. అంతర్జాతీయంగా, దేశీయంగా ఎంతో పేరున్న పలు దిగ్గజ సంస్థలు యాంకర్ ఇన్వెస్టర్లుగా ఈ ఇష్యూలో పాలుపంచుకుంటున్నాయని వివరించారు. తమ బిజినెస్ మోడల్, నిర్వహణ క్రమశిక్షణ, దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలు, భారత అసెట్ మేనేజ్మెంట్ పరిశ్రమపై వాటికున్న నమ్మకానికి ఇది నిదర్శనంగా ఉంటుందని వివరించారు. -
ఏటీఎం నుంచి పీఎఫ్ విత్డ్రా.. కొత్త డెడ్లైన్
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO).. చందాదారులు తమ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF)ను ఏటీఎం ద్వారా, యూపీఐ ద్వారా విత్డ్రా చేసుకోవడానికి ఉపయోగపడే ఫీచర్ తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ అంశంపై కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయా స్పందించారు.2026 మార్చిలోపు ఏటీఎం ద్వారా, యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రా చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి వస్తుందని మన్సుఖ్ మాండవీయా పేర్కొన్నారు. మీరు ఇప్పటికే 75 శాతం పీఎఫ్ను విత్డ్రా చేసుకోవచ్చు. దీనిని మరింత సరళతరం చేయడంలో భాగంగానే ఏటీఎం విత్డ్రా ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు.ప్రస్తుత ఈపీఎఫ్ ఉపసంహరణ విధానాన్ని కూడా మాండవియా హైలైట్ చేశారు. ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ను ఉపసంహరించుకోవడానికి అనేక ఫామ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇది చాలా మంది సభ్యులకు ఇబ్బందిగా మారుతుందని, ఇటువంటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని మంత్రిత్వ శాఖ ఈపీఎఫ్ ఉపసంహరణలను సులభతరం చేస్తోందని మంత్రి అన్నారు.ఇదీ చదవండి: బఫెట్ సూత్రాలు: స్టాక్ మార్కెట్లో విజయం!అక్టోబర్ 2025లో, ప్రావిడెంట్ ఫండ్ కార్యకలాపాలను సులభతరం చేయడానికి, వేగవంతం చేయడానికి ఈపీఎఫ్ఓ ప్రధాన సంస్కరణలను ఆమోదించింది. ఈపీఎఫ్ ఉపసంహరణ నియమాలు గందరగోళంగా ఉన్నాయని, దీని వల్లనే కొన్నిసార్లు పీఎఫ్ ఉపసంహరణ ఆలస్యం, తిరస్కరణ జరుగుతోందని కార్మిక మంత్రి వెల్లడించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఉపసంహరణ చట్రాన్ని సరళీకృతం చేయడానికి మంత్రిత్వ శాఖ 13 వర్గాలను విలీనం చేసి 3 విభాగాలుగా వర్గీకరించారు. ఇది పీఎఫ్ ఉపసంహరణను మరింత సులభతరం చేసింది. -
ఉద్యోగం చేస్తూ కోటీశ్వరులు కావాలంటే..
ఉద్యోగం చేసేవారికి కోటీశ్వరులు కావాలనే కల నెరవేర్చుకోవడానికి క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి ప్రణాళిక చాలా ముఖ్యం. కేవలం పొదుపు చేయడం ద్వారా లక్ష్యాన్ని చేరుకోవడం కష్టం. అందుకే పెట్టుబడి పెట్టడం ద్వారా మీ డబ్బు మీ కోసం పనిచేసేలా చేయాలి. దీనికి తోడు చక్రవడ్డీ (Compounding) శక్తిని అర్థం చేసుకోవడం, వీలైనంత త్వరగా పెట్టుబడి పెట్టడం, రిస్క్ను తట్టుకునే సామర్థ్యాన్ని బట్టి వివిధ మార్గాల్లో పెట్టుబడులను విభజించడం చాలా అవసరం. పెట్టుబడి పెట్టడానికి ఉద్యోగులకు అందుబాటులో ఉన్న ప్రధాన మార్గాలు ఏమిటో చూద్దాం.మ్యూచువల్ ఫండ్స్ఉద్యోగులకు కోటీశ్వరులయ్యే లక్ష్యాన్ని చేరేందుకు మ్యూచువల్ ఫండ్స్ అత్యంత ప్రజాదరణ పొందిన మార్గాలలో ఒకటి. ప్రతి నెలా క్రమం తప్పకుండా ఒక నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టడానికి సిప్ విధానం అనుకూలంగా ఉంటుంది. ఇది మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావాన్ని తగ్గిస్తుంది. చిన్న మొత్తంతో మొదలుపెట్టి జీతం పెరిగే కొద్దీ సిప్ మొత్తాన్ని పెంచుకుంటూ పోవడం మంచి పద్ధతి.ఈక్విటీ ఫండ్స్దీర్ఘకాలంలో (10-15 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ) అధిక రాబడిని ఆశించేవారికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ (లార్జ్-క్యాప్, మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్, ఫ్లెక్సీ-క్యాప్ ఫండ్స్) అనుకూలం. ఇవి అధిక రిస్క్తో కూడినప్పటికీ ద్రవ్యోల్బణాన్ని అధిగమించే శక్తిని కలిగి ఉంటాయి.డెట్ ఫండ్స్ఇవి బాండ్లు, గవర్నమెంట్ సెక్యూరిటీస్ వంటి స్థిర ఆదాయ సాధనాల్లో పెట్టుబడి పెడతాయి. తక్కువ రిస్క్, స్థిరమైన రాబడి కోరుకునే వారికి ఇవి ఉపయోగపడతాయి.ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ఇవి ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్. పెట్టుబడిపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనం లభిస్తుంది. అయితే వీటికి కనీసం మూడు సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది.ఈక్విటీ, స్టాక్ మార్కెట్పెట్టుబడిపై అధిక నియంత్రణ, అధిక రాబడిని కోరుకునే వారికి స్టాక్ మార్కెట్లో నేరుగా పెట్టుబడి పెట్టడం ఒక మార్గం. స్టాక్ మార్కెట్లో నేరుగా పెట్టుబడి పెట్టాలంటే మార్కెట్పై, కంపెనీల ఫండమెంటల్స్పై మంచి అవగాహన ఉండాలి. ఇది మ్యూచువల్ ఫండ్స్ కంటే అధిక రిస్క్తో కూడుకున్నది. దీర్ఘకాలికంగా బలంగా ఉన్న మంచి వృద్ధి సామర్థ్యం కలిగిన నాణ్యమైన కంపెనీల షేర్లను ఎంచుకోవడం వల్ల అద్భుతమైన రాబడిని పొందే అవకాశం ఉంది. మీ పోర్ట్ఫోలియోలో కొంత భాగాన్ని మాత్రమే డైరెక్ట్ ఈక్విటీకి కేటాయించడం, ఒకే రంగంలో లేదా ఒకే షేరులో ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా వైవిధ్యపరచడం చాలా ముఖ్యం.రియల్ ఎస్టేట్భౌతిక ఆస్తులుఇళ్లు, అపార్ట్మెంట్లు లేదా వాణిజ్య ఆస్తులను కొనుగోలు చేయడానికి పెద్ద మొత్తంలో మూలధనం అవసరం. అద్దెల ద్వారా క్రమం తప్పకుండా ఆదాయం, ఆస్తి విలువ పెరగడం ద్వారా దీర్ఘకాలికంగా మూలధన వృద్ధి లభిస్తుంది. అయితే నిర్వహణ ఖర్చులు, లిక్విడిటీ లేకపోవడం (అంటే అవసరమైనప్పుడు త్వరగా నగదుగా మార్చలేకపోవడం) వంటి సవాళ్లు ఉంటాయి.రీట్స్(Real Estate Investment Trusts)రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడానికి ఇదొక సులభమైన మార్గం. రీట్స్ అనేవి స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతున్న మ్యూచువల్ ఫండ్స్ లాంటివి. వీటి ద్వారా చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టి, భారీ వాణిజ్య ఆస్తుల యజమాన్యంలో భాగస్వామి కావచ్చు. అద్దెల ఆదాయంలో వాటాను పొందవచ్చు. ఇది తక్కువ రిస్క్తో రియల్ ఎస్టేట్ ప్రయోజనాలను అందిస్తుంది.చిన్న వ్యాపారాలుపెట్టుబడి పెట్టడం ద్వారా కాకుండా మీ ఆదాయాన్ని పెంచుకోవడం ద్వారా కూడా లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఉద్యోగానికి భంగం కలగకుండా మీ నైపుణ్యాలు లేదా అభిరుచులకు అనుగుణంగా ఫ్రీలాన్సింగ్, ఆన్లైన్ సేవలు, కన్సల్టింగ్, లేదా చిన్న ఆన్లైన్ వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా అదనపు ఆదాయాన్ని సృష్టించవచ్చు.ఈ సైడ్ బిజినెస్ ద్వారా వచ్చిన అదనపు ఆదాయాన్ని పైన పేర్కొన్న పెట్టుబడి మార్గాల్లోకి మళ్లించడం ద్వారా అనుకున్న ఆర్థిక లక్ష్యాన్ని మరింత వేగంగా చేరుకోవచ్చు. కొంతమంది విజయవంతమైన చిరు వ్యాపారాల్లో చిన్న మొత్తంలో మూలధనాన్ని పెట్టుబడి పెట్టడం ద్వారా కూడా లాభాలు పొందవచ్చు. కానీ దీనికి ఆ వ్యాపారంపై పూర్తి అవగాహన ఉండాలి. ఇది కొంత రిస్క్తో కూడుకుంది.ఇతర ముఖ్యమైన పెట్టుబడి మార్గాలుపీపీఎఫ్: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ప్రభుత్వం మద్దతుతో నడిచే సురక్షితమైన, దీర్ఘకాలిక పెట్టుబడి పథకం. దీనికి 15 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. రాబడి స్థిరంగా, పన్ను రహితంగా ఉంటుంది. ఇది తక్కువ రిస్క్ కోరుకునే వారికి అనుకూలం.ఎన్పీఎస్: జాతీయ పింఛను పథకం అనేది ఉద్యోగులకు దీర్ఘకాలిక పదవీ విరమణ పొదుపు కోసం ఉద్దేశించింది. ఇది ఈక్విటీ, డెట్ సాధనాల్లో పెట్టుబడి పెడుతుంది. సెక్షన్ 80సీ, 80సీసీడీ(1బీ) కింద అదనపు పన్ను ప్రయోజనం లభిస్తుంది.బంగారం: భౌతిక బంగారం లేదా సావరీన్ గోల్డ్ బాండ్లు (SGBs), గోల్డ్ ఈటీఎఫ్ల ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు. బంగారం తరచుగా ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా హెడ్జింగ్గా(ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని మార్కెట్ పడుతున్నప్పడు బంగారం పెరుగుతుంది. ఈక్రమంలో మార్కెట్ పడినప్పుడు బంగారంలోని పెట్టుబడి తీసి ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తుంటారు) పనిచేస్తుంది. పోర్ట్ఫోలియో వైవిధ్యీకరణకు సహాయపడుతుంది.ఇదీ చదవండి: బంగారం ధరలపై భారీ ఊరట.. తులం ఎంతంటే.. -
కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025: అమల్లోకి ఎప్పుడంటే?
ఒకప్పుడు స్వాతంత్రం రాక ముందు ఆదాయపు పన్ను చట్టం 1922, స్వాతంత్రం వచ్చిన తరువాత చట్టం 1961 అమలులోకి వచ్చింది. మధ్యలో ఎన్నో మార్పులు, చేర్పులు, కూర్పులు, నాలుగైదు సార్లు పెనుమార్పులు. తీసివేతలు, కలిపివేతలు, 65 సార్లు 4,000 మార్పులు చేశారు. ఈ సంవత్సరం కొత్త చట్టాన్ని అమల్లోకి తెస్తున్నారు.ఆదాయపు పన్ను చట్టం 2025.. 47 చాప్టర్లను 23కు కుదించారు. 819 సెక్షన్లను 536కి తగ్గించారు. ఇప్పుడు షెడ్యూళ్లు లేవు. ఇప్పుడు వాటి సంఖ్య 16. ప్రస్తుతం అంకెలకు ఇంగ్లీషు అక్షరాలు తగిలించి.. మూడు అక్షరాల రైలుబండిలా పెట్టి వ్యవహారం నడుపుతున్నారు. ఇకపై అలా ఉండదు. కేవలం నంబర్లే... సెక్షన్ 10లో ఉండే అన్ని మినహాయింపులను షెడ్యూల్స్లో అమర్చారు. క్లారిటీ కోసం కొన్ని టేబుల్స్, ఫార్మూలాలు ప్రవేశపెట్టారు. అదేదో సినిమా డైలాగు గుర్తొస్తోంది. ‘అయితే నాకేంటి’? ఈ మార్పుల వలన మనకు ఒరిగేది ఏమిటి? 1.4.2026 నుంచి అమల్లోకి వచ్చే ఈ చట్టం ప్రత్యేకతలు ఏమిటంటే...?సరళీకృతంగా ఉంటుంది. వాడుకలో లేనివాటిని తీసివేశారుకొన్ని అంశాలను నెంబరింగ్ ఇచ్చి క్రమబద్ధీకరించారు. కొన్ని అంశాలను పునర్నిర్మాణం చేశారు. రాబోయే పదం ‘‘పన్ను సంవత్సరం’’. ప్రస్తుత అకౌటింగ్ సంవత్సరం, ఫైనాన్సియల్ సంవత్సరం, ఆదాయపు సంవత్సరం, గత సంవత్సరం, ఇవన్నీ మనకు అర్ధం అయ్యేలా చెప్పాలంటే మనం ఆదాయం సంపాదించిన సంవత్సరం. ఈ ఆదాయాన్ని సంవత్సరం తరువాత అస్సెస్సుమెంట్ సంవత్సరం అంటే ఆ తరువాత సంవత్సరంలో అస్సెస్సు చేస్తారు. కాబట్టి ఈ సంవత్సరం అస్సెస్సుమెంట్ సంవత్సరం అని అంటారు.రామాయణం అంతా విని రాముడికి సీత ఏమి అవుతుందని అడిగినట్లు... 64 ఏళ్లు దాటినా టాక్స్ ప్లేయర్కి ఈ రెండు సంవత్సరాల మధ్య తేడా తెలియదు. కన్ఫ్యూజన్ పోలేదు. ఎన్నో పొరపాట్లు జరిగేవి. ఇన్కం టాక్స్ చెల్లించేటప్పుడు చలాన్లో సంవత్సరానికి సంబంధించిన కాలమ్ నింపేటప్పుడు తికమక అయ్యేవారు. ఇకపై తికమక అవసరం ఉండదు. 1.4.2026 నుంచి నుంచి ఒకే పదం వాడుకలోకి వస్తుంది. అదే ‘‘పన్ను సంవత్సరం’’. టీడీఎస్కి సంబంధించిన అంశాలను చాలా పద్ధతి ప్రకారం ఎటువంటి తికమక రాకుండా చేశారు. ఒక సెక్షన్ ద్వారా జీతాలకు సంబంధించిన అంశాలు పొందుబరిచారు. ఒకే ఒక సెక్షన్ ద్వారా మిగతా అన్ని టీడీయస్ అంశాలు పొందుబరిచారు. ఈ పట్టిక సమగ్రం.., సంపూర్ణం. క్రమసంఖ్య ఏ ఆదాయం మీద చేయాలి? ఎవరికి వర్తిస్తుంది? పరిమితులు... ఇలా ఉంటాయి వివరాలు... రెసిడెంట్లకు, నాన్ రెసిడెంట్లకు, టీసీఎస్.. ఎవరికి అక్కర్లేదు.? ఇలా అన్నీ టేబుల్స్ ద్వారా చక్కగా వివరించారు. పాతకాలపు పదజాలానికి స్వస్తి పలికారు. పాతవాటికి మంగళం పలికి, ప్రపంచంలో ఆచరించే మంచి పద్ధతులకు చట్టంలో చోటిచ్చారు.వర్చువల్, డిజిటల్ ఆస్తులను నిర్వచించారు. క్రిప్టో కరెన్సీ, టోకనైజ్డ్ ఆస్తులు, టెక్నాలజీ ద్వారా ఏర్పడే హక్కులు మొదలైనవి వివరించారు. వివాదాలకు ఆస్కారం లేకుండా పరిష్కారం చేస్తారు. టెక్నాలజీని ఆసరా తీసుకొని అధికార్లకువిస్తృత అధికారాలు కల్పించారు. ఇన్నాళ్లు సెర్చ్లు అంటే ఇంటినో, ఆఫీసునో, ఫిజికల్ ఏరియా మాత్రమే ఉండేవి. ఇక నుంచి మీ ఈ–మెయిల్స్, క్లౌడ్ సర్వర్లు, సోషల్ మీడియా అకౌంట్లు, వెబ్సైట్లు అన్నింట్లోనూ చొరబడతారు ఎగబడతారు. ఇకపై బుకాయించలేము. ఈ నగదు నాది కాదు మా మామగారిది అనలేము. అధికారులకు విస్తృత సమాచారం ఇవ్వడం వల్ల మీకు సంబంధించిన సమాచారం వారి చెంతనే ఉంటుంది. కాబట్టి కొత్త చట్టంలోని అంశాలకు అనుగుణంగా నడుచుకుందాం. చట్ట ప్రకారం మీ విధులను సక్రమంగా నిర్వర్తించండి. ఫిబ్రవరిలో బడ్జెటుకు కసరత్తు జరుగుతోంది. అందులో శ్లాబులు, రేట్లు మారవచ్చు. మారకపోవచ్చు. ఈ రాబోయే మార్పులు తప్ప, మిగతా అంతా కొత్త చట్టం మనకు అందుబాటులో ఉంటుంది.కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి & కె.వి.ఎన్ లావణ్య -
డిజిటల్ పేమెంట్లు.. చీఫ్ రిస్క్ ఆఫీసర్ చిట్కాలు
డిజిటల్ పేమెంట్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి, ఇవి భారతదేశాన్ని డిజిటల్–ఫస్ట్ ఆర్థిక వ్యవస్థ వైపు తీసుకెళ్తున్నాయి. ఇవి భద్రతతో పాటు, వినియోగదారులకు చెల్లింపుల్లో సౌకర్యాన్ని అందిస్తాయి. అయితే, డిజిటల్ పేమెంట్లను సురక్షితంగా ఉపయోగించడం, ఆన్లైన్ మోసాలకు గురి కాకుండా ఉండటం ఈరోజుల్లో అత్యంత కీలకం.సంభవించే మోసాలను ముందుగానే గుర్తించగలిగితే అది మీతోపాటు మీ కుటుంబ సభ్యులను కూడా ఆన్ లైన్ మోసాల నుంచి కాపాడడమే కాకుండా అందరికీ సురక్షితమైన, తక్కువ నగదు వినియోగంతో కూడిన ఆర్థిక వ్యవస్థను నిర్మించడంలో సహాయపడుతుంది. ఆధునిక టెక్నాలజీ చెల్లింపులను వేగంగా జరిపేలా, సులభతరంగా మార్చినప్పటికీ, ఆన్లైన్ మోసాల నుండి పూర్తి స్థాయి రక్షణ అవగాహనతోనే సాధ్య పడుతుంది. ఆన్లైన్ మోసాలు, ముఖ్యంగా సామాజిక ఇంజినీరింగ్ ద్వారా జరిగేవి ఇటీవలి కాలంలో చాలా ఆందోళనగా కలిగిస్తున్నాయి. దురాశ, భయం, అత్యవసరం వంటి భావోద్వేగాలను సాధనాలుగా ఉపయోగించి ఆన్లైన్ మోసగాళ్లు వినియోగదారులను వంచిస్తారు.ఇటీవలి కాలంలో వేగంగా పెరుగుతున్న ధోరణుల్లో ఒకటి ‘‘డిజిటల్ అరెస్టు‘ తమను పోలీసులమని చెప్పుకుంటూ ఎవరో కాల్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. మీ బ్యాంక్ ఖాతా దర్యాప్తులో ఉందని, డబ్బును ‘సురక్షిత’ ఖాతాకు మార్చాలని వారు చెబుతారు. వెంటనే మానసిక ఒత్తిడికి గురైన వినియోగదారులు వారి ట్రాప్లో పడి అంతా పోగొట్టుకుని చాలా ఆలస్యంగా అది మోసమని గ్రహిస్తారు. నిజమైన ప్రభుత్వ సంస్థలు, నియంత్రణ సంస్థలు ఎప్పుడూ ఫోన్లు, వీడియో కాల్ ద్వారా డబ్బు అడగవు, కేసులను దర్యాప్తు చేయవు. డబ్బు విషయంలో నిర్ణయం తీసుకునే ముందు కాల్ చేసిన వ్యక్తి నిజస్వరూపాన్ని నిర్ధారించుకోవడం, నమ్మకమైన ప్రభుత్వ సంస్థలను సంప్రదించడం చాలా ముఖ్యం.వేగంగా పెరుగుతున్న పెట్టుబడి మోసాలు ఆరి్ధక నిపుణులుగా పరిచయం చేసుకుని మోసంచేసే వారు ఇటీవలి బాగా పెరిగారు. పేరున్న సంస్థలను, నకిలీ రిఫరెన్సులను అమాయక, ఔత్సాహిక ఇన్వెస్టర్లను మోసగించేందుకు వీరు ఉపయోగిస్తారు.అసాధారణ లాభాలు , ప్రత్యేక పెట్టుబడి అవకాశాలను అందిస్తామని వాగ్దానం చేస్తారు. బదులుగా డబ్బు అందుకున్న వెంటనే అదృశ్యమైపోతారు. అందుకే ఎల్లప్పుడూ సెబీ, ఆర్బీఐ ఇతర అధికారిక నియంత్రణ సంస్థల వెబ్సైట్లలో నమోదైన సంస్థల జాబితాలను తనిఖీ చేస్తుండాలి.వినియోగదారులు సురక్షితంగా ఎలా ? డిజిటల్ పేమెంట్లను ఆమోదించే ముందు వినియోగదారులు ఎల్లవేళలా యాప్ నోటిఫికేషన్లను జాగ్రత్తగా పరిశీలించాలి, మోసం జరిగితే వెంటనే తమ బ్యాంకుకు తెలియజేయాలి లేదా 1930 (సైబర్ సెక్యూరిటీ హెల్ప్లైన్)కు కాల్ చేయాలి, అలాగే నిర్ధారించని యాప్లను డౌన్లోడ్ చేయకూడదు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) కూడా తక్షణ చెల్లింపు వ్యవస్థ –యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్(UPI) వ్యవస్థలో అనేక భద్రతా చర్యలను అమలు చేస్తోంది. తెలియని యూపీఐ ఐడీలకు డబ్బు పంపేటప్పుడు హెచ్చరిక సందేశాలతో ప్రారంభ అలర్ట్లు, అలాగే డివైస్ బైండింగ్ లాంటి రెండంచెల ధృవీకరణతో కూడిన భద్రతా వ్యవస్థను అమల్లోకి తెచ్చింది.‘మే మూర్ఖ్ నహీ హూన్’’ వంటి ప్రచార వీడియోల ద్వారా ప్రజల్లో అవగాహనను పెంచడానికి కూడా ఎన్పీసీఐ కృషి చేస్తోంది. డిజిటల్ భద్రతగా ఉండడం, ఆన్లైన్ మోసాల విషయంలో అప్రమత్తతతో ఉండే సంస్కృతిని వినియోగదారుల్లో పెంపొందించేందుకు ప్రయత్నిస్తోంది. డిజిటల్ పేమెంట్లు ప్రతి వినియోగదారుడికి సులభంగా సురక్షితంగా ఉండేలా చేస్తోంది. -
పసిడి, వెండిపై పెట్టుబడి.. రూ.100 ఉంటే చాలు!
బంగారం, వెండిపై పెట్టుబడుల పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా.. యాక్సిస్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్యాసివ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్వోఎఫ్)ను తీసుకొచ్చింది. ఇది ఓపెన్ ఎండెడ్ ఫండ్ ఆఫ్ ఫండ్ న్యూ ఆఫర్.ఈ నెల 10న మొదలు కాగా, 22వ తేదీన ముగియనుంది. ఈ ఒక్క పథకం ద్వారా ఇన్వెస్టర్లు బంగారం, వెండి ధరల ర్యాలీలో భాగం కావొచ్చని సంస్థ ప్రకటించింది. ఈ పథకం గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్లల్లో 50:50 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేస్తుంది. కనీసం రూ.100 నుంచి ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.‘‘చారిత్రకంగా చూస్తే బంగారం, వెండి ద్రవ్యోల్బణం, కరెన్సీ అస్థిరతలకు చక్కని హెడ్జింగ్ సాధనంగా పనిచేశాయి. అదే సమయంలో పెట్టుబడుల్లో వైవిధ్యం ప్రయోజనాలను సైతం పోర్ట్ఫోలియోకి అందిస్తాయి’’అని యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈవో బి.గోపకుమార్ తెలిపారు.ఇన్వెస్టర్లు ఈ పథకంలో లంప్సమ్తో పాటు ఎస్ఐపీ మార్గంలోనూ పెట్టుబడి పెట్టుకునే అవకాశం ఉంది. ప్యాసివ్ ఫండ్ ఆఫ్ ఫండ్ కావడంతో ఇందులో దూకుడుగా స్టాక్లను ఎంపిక ఉండదు. అంటే గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్ల పనితీరును అనుసరిస్తుంది. అందువల్ల ఫండ్ మేనేజర్ రిస్క్ తక్కువగా ఉండగా, ఖర్చులు కూడా సాధారణంగా నియంత్రిత స్థాయిలోనే ఉంటాయని సంస్థ తెలిపింది.అయితే బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్లు, వడ్డీ రేట్లు, డాలర్ మారకం విలువ వంటి అంశాలపై ఆధారపడి మారుతుంటాయి కాబట్టి తక్కువకాలంలో ఊగిసలాటలు ఉండొచ్చు. దీర్ఘకాల పెట్టుబడిదారులు, తమ పోర్ట్ఫోలియోలో స్థిరత్వం, వైవిధ్యం కోరుకునేవారికి ఈ పథకం అనుకూలంగా ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు స్కీమ్ సమాచార పత్రం (ఎస్ఐడీ)ను జాగ్రత్తగా చదువుకోవడం చాలా అవసరం. -
స్టేట్ బ్యాంకు శుభవార్త.. అప్పు తీసుకున్నోళ్లకు..
తమ బ్యాంకులో అప్పు తీసుకున్నోళ్లకు ప్రభుత్వ అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శుభవార్త చెప్పింది. కేంద్ర బ్యాంకు ఆర్బీఐ ఇటీవల రెపో రేటును తగ్గించిన తరువాత, ప్రధాన బ్యాంకులు ఈ ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేసే పనిలో ఉన్నాయి. తాజాగా ఎస్బీఐ కూడా తన కీలక రుణ రేట్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది.ఇందులో మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్), ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లెండింగ్ రేట్ (ఈబీఎల్ఆర్), రెపో లింక్డ్ లెండింగ్ రేట్ (ఆర్ఎల్ఎల్ఆర్), బెంచ్మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్ (బీపీఎల్ఆర్), బేస్ రేట్లో కోతలు ఉన్నాయి. డిసెంబర్ 15 నుండి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. మారిన వడ్డీ రేట్లతో ఈ బ్యాంకులో రుణ గ్రహీతలకు వడ్డీ భారం తగ్గనుంది. నెలవారీ వాయిదాలు (EMI) తగ్గుతాయి.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల రెపోరేటు అంటే వాణిజ్య బ్యాంకులకు తాత్కాలికంగా ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్ల తగ్గించింది. దీంతో ఇది 5.25 శాతానికి తగ్గింది. వృద్ధికి తోడ్పడటానికి ఈ ఏడాది నాల్గవసారి కీలక వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించాలని గత వారం ఆర్బీఐ విధాన కమిటీ నిర్ణయం తీసుకుంది.సవరించిన ఎంసీఎల్ఆర్ రేట్లుచాలా రిటైల్ రుణాలకు కీలకమైన ఎంసీఎల్ఆర్ రేటును అన్ని కాలపరిమితిలలోనూ ఎస్బీఐ తగ్గించింది. ఓవర్నైట్, ఒక నెల రేట్లు 7.90% నుండి 7.85%కి తగ్గాయి. మూడు నెలల ఎంసీఎల్ఆర్ 8.30 శాతం నుంచి 8.25 శాతానికి రాగా, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 8.65 శాతం నుంచి 8.60 శాతానికి తగ్గింది. అనేక గృహ, వాహన రుణాలకు ఉపయోగించే క్లిష్టమైన ఒక సంవత్సరం కాలపరిమితి రుణ రేటు 8.75% నుండి 8.70%కి దిగొచ్చింది. ఇక రెండేళ్ల టెన్యూర్ రుణాలపై 8.80% నుండి 8.75%, మూడేళ్ల కాలపరిమితి లోన్లపై 8.85 % నుండి 8.80 శాతానికి వడ్డీని ఎస్బీఐ సవరించింది.ఈబీఎల్ఆర్, ఆర్ఎల్ఎల్ఆర్ కోతలుక్రెడిట్ రిస్క్ ప్రీమియం (CRP), బ్యాంక్ స్ప్రెడ్ (BSP)తో కూడిన ఈబీఎల్ఆర్ను ఎస్బీఐ 8.15% నుండి 7.90%కి తగ్గించింది. ఆర్బీఐ రెపో రేటుతో నేరుగా ముడిపడి ఉన్న ఆర్ఎల్ఎల్ఆర్ 7.75% + CRP నుండి 7.50% + CRP కి దిగొచ్చింది. ఫలితంగా రుణగ్రహీతలు తమ రిస్క్ ప్రొఫైల్ ఆధారంగా ఈఎంఐలలో తగ్గింపులను చూస్తారు.బీపీఎల్ఆర్, బేస్ రేటు మార్పులుతమ అత్యంత విశ్వసనీయ కస్టమర్లకు (prime customers) వసూలు చేసే కనీస వడ్డీ రేటు బీపీఎల్ఆర్ను ఎస్బీఐ 14.65 శాతానికి తగ్గించింది. దీంతోపాటు బేస్ రేటును కూడా 9.90 శాతానికి తగ్గించింది. ఈ తగ్గింపులు వినియోగదారుల స్థోమతను పెంచుతాయి. గృహ కొనుగోలు, వ్యాపార పెట్టుబడులను ప్రోత్సహిస్తాయి. -
అప్పు తీసుకునే వారు చూస్తున్నదేమిటి?
వడ్డీ ఎంత అన్నది. కరెక్టేనా? ఊహూ కాదంటోంది పైసాబజార్. పండుగ రుణాలు తీసుకునేటప్పుడు మనోళ్లు.. అంటే దక్షిణాది రాష్ట్రాల వాళ్లు వడ్డీ రేట్ల కంటే.. ఎంత వేగంగా రుణం వస్తుంది? డిజిటల్ సౌకర్యం ఉందా? లేదా? అన్నదానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారట. ఇదేమీ ఒట్టి మాటేమీ కాదండోయ్. సర్వే చేసి మరీ నిర్ణయించామని చెబుతోంది ఆ సంస్థ. వివరాలు ఇలా ఉన్నాయి..ఈ రోజుల్లో అప్పు చేయకుండా ఉండటం అన్నది చాలామందికి అసాధ్యం. పండగ షాపింగ్ కావచ్చు. ఇంట్లో చిన్న చిన్న మరమ్మతులు కావచ్చు.. అన్ని సందర్భాల్లోనూ మన సేవింగ్స్ మాత్రమే అక్కరకు రావు. చేబదులు లేదా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల్లో రుణాలు తీసుకోక తప్పని పరిస్థితి. తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కర్ణాటక, కేరళల్లో అప్పుకు ఈ మూడే ప్రధాన కారణాలని పైసాబజార్ సర్వే చెబుతోంది. సర్వే చేసిన వారిలో సుమారు 33 శాతం మంది రూ.మూడు లక్షల నుంచి రూ.ఐదు లక్షల వరకూ అప్పు చేశారని, వీరు వడ్డీ రేట్ల కంటే డిజిటల్ ఎక్స్పీరియన్స్, ప్రాసెస్ వేగాలను ఆధారంగా చేసుకుని ఏ సంస్థ నుంచి రుణం తీసుకోవాలో నిర్ణయించుకుంటున్నారని ఈ సర్వే ద్వారా తెలిసింది.దక్షిణాది రాష్ట్రాల్లోని సుమారు 18 పట్టణాల్లో 1700 మందిని ప్రశ్నించి సిద్ధం చేశారీ సర్వేను. అడక్కుండానే మన ఆర్థిక స్థితిగతులు, పరపతులకు తగ్గట్టుగా లభించే ప్రీఅప్రూవ్డ్, ఇన్స్టంట్ లోన్లు మేలని సర్వే చేసిన వారిలో 41 శాతం మంది అభిప్రాయపడ్డారు. లోన్ ప్రాసెస్ మొత్తం చిట్టీలు, అకౌంట్ పుస్తకాల్లో కాకుండా డిజిటల్ పద్ధతిలో ఉంటే ఇష్టమని 24 శాతం చెబితే.. కేవలం 20 శాతం మంది మాత్రమే వడ్డీ రేట్లు ఎక్కువ తక్కువ ఉంటే అక్కడ రుణాలు తీసుకునేందుకు ఇష్టపడతామని చెప్పడం గమనార్హం. ఇంకో విషయం సర్వే చేసిన వాళ్లలో ఏకంగా 80 శాతం మంది మొత్తం ప్రాసెస్ను పద్ధతిగా వివరించే డిజిటల్ ప్లాట్ఫామ్లపై రుణం తీసుకునేందుకు మక్కువ చూపారు.అవసరం ఏమిటి? మొత్తం ఎంత?ముందుగా చెప్పుకున్నట్లు అత్యధిక శాతం మంది.. స్పష్టంగా చెప్పాలంటే 39 శాతం మంది హోమ్ రెనవేషన్ కోసమే అప్పు చేస్తున్నట్లు ఈ సర్వే ద్వారా స్పష్టమైంది. రుణాల సర్దుబాటు కోసం కొత్త రుణం చేస్తున్న వారు 27 శాతం మంది ఉంటే.. పండుగ షాపింగ్, పెట్టుపోతల వంటి వాటి కోసం అప్పు చేస్తున్న వారు 14 శాతం మంది. ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, బంగారం కొనుగోళ్లకు అప్పులు చేస్తున్న వాళ్లు వరుసగా 12 శాతం, 10 శాతం ఉన్నట్లు స్పష్టమైంది.సుమారు 35 శాతం మంది మూడు నుంచి ఐదు లక్షల రూపాయల వరకూ అప్పు చేస్తుంటే.. 22 శాతం మంది తాలూకూ మొత్తాలు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకూ మాత్రమే ఉన్నట్లు ఈ సర్వేలో తెలిసింది. కేవలం 14 శాతం మంది మాత్రమే పది లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తం అప్పు చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం సమాజంలో చాలామంది కేవలం అత్యవసరాల కోసం మాత్రమే కాకుండా.. లైఫ్స్టైల్ కోసం, ఆశలు నెరవేర్చుకునేందుకు కూడా అప్పులు చేస్తున్నారని ఈ సర్వే నిర్వహించిన పైసా బజార్ సీఈవో సంతోశ్ అగర్వాల్ తెలిపారు. రుణ వ్యవస్థ మెరుగైన పనితీరుకు ఇది నిదర్శనమని వ్యాఖ్యానించారు. -
మరింత పెరగనున్న వైద్య ఖర్చులు
కొత్త సంవత్సరం వస్తోంది. ఉద్యోగులు వచ్చే ఏడాది ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నూతన సంవత్సరం మరింత ఖరీదైన వైద్య ఖర్చుల భారాన్ని కూడా మోసుకొస్తోంది. దేశంలో ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ఖర్చులు 2026లో 11.5% పెరుగుతాయని అయోన్ గ్లోబల్ మెడికల్ ట్రెండ్ రేట్స్ రిపోర్ట్ తెలిపింది.వైద్య ఖర్చుల పెరుగుదల 2025లో ఉన్న 13% కంటే కొత్త ఏడాదిలో తక్కువే అయినప్పటికీ దేశ వైద్య సంబంధ ద్రవ్యోల్బణం ప్రపంచ సగటు 9.8% కంటే ఎక్కువగా ఉంది. హృదయ సంబంధ వ్యాధులు, జీర్ణశయ రుగ్మతలు, క్యాన్సర్ వంటివి వైద్య ఖర్చులను మరింత పెంచుతాయని నివేదిక హైలైట్ చేస్తోంది. రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, పోషకాహారలేమి వంటి కారకాలు ఖర్చుల భారం పెరుగుదలకు దోహదం చేస్తున్నాయని అభిప్రాయపడింది.వైద్య ఖర్చులు ఎందుకు పెరుగుతున్నాయంటే..ఇటీవల కాలంలో వైద్య సాంకేతికతల్లో అత్యంత పురోగతి వచ్చింది. కొత్త కొత్త వైద్య చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. అధునాతన రొబోటిక్స్, ఏఐ టెక్నాలజీని వైద్య చికిత్సల్లో వినియోగిస్తున్నారు.ప్రాణాంతకమైన అనేక జబ్బులకు ఇటీవల నూతన ఔషధాలు కనుగొంటున్నారు. సాధారణంగా ఇవి అత్యంత ఖరీదైనవిగా ఉంటున్నాయి.దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సకు డిమాండ్ పెరుగుతోంది. అయితే ఆస్థాయిలో నాణ్యమైన ఆసుపత్రులు, నైపుణ్యం కలిగిన వైద్య నిపుణులు ఉండటం లేదు. దీంతో మరింత ఖర్చు చేయాల్సి వస్తోంది.పెరుగుతున్న వైద్య ఖర్చుల నుంచి రక్షించుకోవడానికి చాలా మంది ఉద్యోగులు వైద్య బీమాను ఆశ్రయిస్తుంటారు. అయితే వాటిలో ఇటీవల క్లెయిమ్లు పెరగడంతో ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రీమియంలను పెంచేస్తున్నాయి. -
జీవిత బీమాపై అపోహలు తగ్గాలి
భవిష్యత్ ఆర్థిక భద్రత, దీర్ఘకాలిక పొదుపు, రిటైర్మెంట్ అనంతరం ఆదాయ రక్షణ వంటి కీలక అంశాలపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో జీవిత బీమా రంగం స్థిరంగా వృద్ధి చెందుతోంది. డిజిటల్ టెక్నాలజీ, మొబైల్ ప్లాట్ఫారమ్లు, త్వరిత పాలసీ జారీ వ్యవస్థలతో బీమా కొనుగోలు ప్రక్రియ మరింత సులభతరం అవుతోంది. అయినప్పటికీ జీవిత బీమాపై ప్రజల్లో ఇంకా కొన్ని అపోహలు కొనసాగుతూనే ఉన్నాయి. వాటిని తొలగించాల్సిన అవసరం ఉందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు.ఆర్జన మొదలుపెట్టిన యువతలో బీమా అవసరం లేదన్న భావన ఎక్కువగా కనిపిస్తోంది. కానీ చిన్న వయసులో పాలసీ తీసుకుంటే ప్రీమియం తక్కువగా ఉండడమే కాక, దీర్ఘకాల కవరేజీ లభిస్తుంది. ఆర్థిక స్వాతంత్య్రం, ముందస్తు రిటైర్మెంట్ లక్ష్యంగా పెట్టుకున్న యువత కోసం ప్రస్తుతం నెలకు రూ.1,000 నుంచి ప్రారంభమయ్యే సేవింగ్స్ ఆధారిత ప్రణాళికలు అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పుడు సంక్లిష్టంగా అనిపించిన బీమా ప్రక్రియ ఇప్పుడు పూర్తిగా డిజిటల్ అయింది. మొబైల్ యాప్ల నుంచి పాలసీ కొనుగోలు, డాక్యుమెంటేషన్, అదే రోజున పాలసీ జారీ వరకు అన్నీ సరళతరం కావడంతో బీమా ఇప్పుడు అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా మారింది.దేశీయ బీమా రంగంలోని కంపెనీలు ప్రస్తుతం 98–99% క్లెయిమ్ సెటిల్మెంట్ రేటు సాధిస్తున్నాయి. అవసరమైన పత్రాలు సమర్పించగానే మరుసటి రోజే సెటిల్మెంట్ చేసే సంస్థలు కూడా ఉన్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.పొగ తాగే అలవాటు లేని 30 ఏళ్ల వ్యక్తి రూ.1 కోటి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే రోజుకు రూ.30 కన్నా తక్కువే ప్రీమియం అవుతుంది. కాఫీ ధర కంటే కూడా తక్కువ. దీంతో పాటు పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. కుటుంబ ఆదాయ రక్షణకు, గృహ రుణాలు వంటి ఆర్థిక భారం తీర్చేందుకు టర్మ్ ప్లాన్ కీలకంగా ఉపయోగపడుతుంది.కొత్త తరహా లైఫ్ ఇన్సూరెన్స్ పథకాలు పాలసీదారుల జీవితకాలంలోనే అనేక ప్రయోజనాలు అందిస్తున్నాయి. ఉదాహరణకు క్రిటికల్ ఇల్నెస్ కవర్లు చికిత్స ఖర్చులను భర్తీ చేసి కుటుంబ పొదుపులను రక్షిస్తాయి. స్మార్ట్ ఆర్థిక ప్రణాళికలో లైఫ్ ఇన్సూరెన్స్ కీలకం . ప్రస్తుత పరిస్థితుల్లో జీవిత బీమా కేవలం భద్రతకే పరిమితం కాకుండా, భవిష్యత్ అవసరాలను తీర్చే ఆర్థిక సాధనంగా మారిందని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: నైట్క్లబ్లు.. ఆర్థిక చిక్కులు.. నిర్వహణ సవాళ్లు -
అతిపెద్ద ఆర్థిక పతనం వస్తోంది.. ఇది ఎనిమిదో పాఠం
ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత, ఇన్వెస్ట్మెంట్ గురూ రాబర్ట్ కియోసాకి.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ “చరిత్రలోనే అత్యంత తీవ్రమైన పతనం” దిశగా సాగుతోందని సోషల్ మీడియాలో వరుస పోస్ట్లు చేస్తూ వస్తున్నారు. ఆర్థికంగా ప్రపంచం పతనమైనా అందులో చిక్కుకోకుండా ధనవంతులు ఎలా కావాలో పాఠాలు చెబుతున్నారు. అందులోభాగంగా ఎనిమిదో పాఠాన్ని తాజాగా ‘ఎక్స్’లో పంచుకున్నారు.చరిత్ర చూడండి..ఆర్థిక పతనాలు ఒక్కరోజులో జరగవని, దశాబ్దాల పాటు నిర్మాణం చెందుతాయని కియోసాకి పేర్కొన్నారు. 1965లో అమెరికా నాణేల్లో వెండిని తొలగించడం, 1971లో నిక్సన్ ప్రభుత్వం డాలర్ను బంగారం ప్రమాణం నుంచి వైదొలగించడం వంటి చరిత్రాత్మక సంఘటనలు ప్రపంచ ఆర్థిక నిర్మాణాన్ని మార్చేశాయని చెప్పారు.ఈ పరిణామాలు ప్రపంచాన్ని “రుణ ఆర్థిక వ్యవస్థగా” మార్చాయని, దీని ఫలితంగా అమెరికా జపాన్ వంటి దేశాలు భారీ రుణభారంతో సతమతమవుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఇంటి అద్దెలు పెరగడంతో ఉద్యోగాలు ఉన్నవారు కూడా రోడ్డునపడుతున్నారన్నారు.కియోసాకి తన వ్యక్తిగత పెట్టుబడి అనుభవాలను కూడా పంచుకున్నారు. 1970లలో బంగారం కొనడం ఎలా ప్రారంభించారో, ఇప్పటికీ బంగారం వెండి విదేశాల్లో నిల్వ చేస్తానని చెప్పారు. దశాబ్దాల క్రితం కొన్న బంగారు నాణెం విలువ ఇప్పుడు భారీగా పెరిగిందని, ఇది ఆర్థిక అస్థిరత సమయంలో విలువ నిలుపుకొనే ఆస్తులు ఎంత ముఖ్యమో నిరూపిస్తుందని అన్నారు.ఫెడ్ ఏర్పాటే ప్రస్తుత సంక్షోభానికి మూలంప్రస్తుత సంక్షోభానికి మూలం 1913లో ఏర్పడిన ఫెడరల్ రిజర్వ్నేనని ఆయన ఆరోపించారు. ఆధునిక ఫియట్ కరెన్సీలు విలువ కోల్పోవడానికి ఈ సంస్థ విధానాలు ప్రధాన కారణమని కియోసాకి అభిప్రాయపడ్డారు. బంగారం, వెండి లను “దేవుని సొమ్ము”గా.. బిట్కాయిన్, ఈథీరియంను “ప్రజల డబ్బు”గా కియోసాకి అభివర్ణించారు.ద్రవ్యోల్బణం, రుణ సంక్షోభం, నివాస సమస్యలు పెరుగుతున్న సమయంలో కూడా, సిద్ధపడి పెట్టుబడులు మారుస్తున్న వారు లాభపడతారని కియోసాకి పునరుద్ఘాటించారు. “వాళ్లే విజేతలు” అని, “ఫెడరల్ రిజర్వ్ లేదా ప్రభుత్వం రక్షిస్తుంది” అనే నమ్మకంతో ఉన్నవారు నష్టపోతారని హెచ్చరించారు.స్కూళ్లలో ఆర్థిక విద్యను ఎందుకు బోధించడంలేదనే ప్రశ్నను ఆయన మళ్లీ లేవనెత్తారు. ఎవరికివారే స్వయంగా ఆర్థిక జ్ఞానం పెంచుకోవాలని, రాబోయే అనిశ్చిత కాలానికి సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు.కియోసాకి గత కొన్నేళ్లుగా ఇదే తరహా హెచ్చరికలు చేస్తూ, బంగారం, వెండి, క్రిప్టోకరెన్సీలు వంటి ప్రత్యామ్నాయ ఆస్తుల్లో పెట్టుబడి పెట్టాలని ఆహ్వానిస్తున్నారు. ఆర్థిక నిపుణులు ఆయన అంచనాలను కొట్టిపడేస్తున్నప్పటికీ, రుణభారం, ద్రవ్యోల్బణంపై ఆందోళన ఉన్న పలువురికి ఆయన సందేశం ఇంకా ఆందోళన కలిగిస్తోంది. LESSON # 8: How you can get richer as the world economy collapses.CRASHES do not happen over night.CRASHES take decades to occur.For Example:Silver crashed in 1965: when the US government turned silver coins into fake coins…. Violating Greshams Law which stated when…— Robert Kiyosaki (@theRealKiyosaki) December 10, 2025 -
22..? 24..? ఏది మంచిది?
ఫైనాన్షియల్ వ్యవహారాలపై చాలామందికి సరైన అవగాహన ఉండకపోవచ్చు. దాంతో పెద్దగా రాబడులు రాని విధానాల్లో పెట్టుబడి పెట్టి దీర్ఘకాలంలో భారీగా నష్టపోతుంటారు. ఈక్రమంలో ఏది మేలో.. ఏది కాదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. బంగారం, బ్యాంకులు, రియల్టీ, స్టాక్ మార్కెటు, మ్యూచువల్ ఫండ్స్.. వంటి ఎన్నో సాధనాల్లో పెట్టే ఇన్వెస్ట్మెంట్కు సంబంధించి చాలానే ప్రశ్నలుంటాయి. వీటిలో కొన్నింటిపై నిపుణులు ఇస్తున్న సమాధానాలు చూద్దాం.బంగారంతరచూ బంగారంలో 22 కేరెట్లు, 24 కేరెట్లు అంటుంటారు కదా! ఏది మంచిది?ఆభరణాల కోసమైతే 22 కేరెట్ల బంగారాన్ని కొంటే సరిపోతుంది. అలాకాకుండా ఇన్వెస్ట్ చేయడానికైతే 24 కేరెట్ల బంగారమే బెటర్. దీన్లో తరుగు ఉండదు కాబట్టి స్వచ్ఛమైన 24 కేరెట్ల బంగారమైతే ఎప్పుడు విక్రయించినా అప్పుడు మార్కెట్లో ఉన్న రేటు మనకు లభిస్తుంది. సాధారణంగా కాయిన్లు, బిస్కెట్ల వంటివి 24 కేరెట్లలోనే లభిస్తుంటాయి. ధర కూడా 22 కన్నా 24 కేరెట్లు కాస్త ఎక్కువ ఉంటుంది. కొందరైతే ఆభరణాల కోసం 18 కేరెట్ల బంగారాన్ని కూడా వాడతారు. ఇది మరికొంత చౌక.స్టాక్ మార్కెట్లు..ఈ ఏడాది చాలా ఐపీఓలు వచ్చాయి. వచ్చే ఏడాది కూడా ఇలాగే రావచ్చేమో. మరి 2026లో ఐపీఓల్లో పెట్టుబడి పెట్టవచ్చా?ఈ మధ్య కాలంలో చాలా ఐపీఓలు అత్యధిక ధర వద్ద ఇష్యూకు వస్తున్నాయి. లిస్టింగ్ నాడు లాభాలొస్తున్నా... అది దైవాదీనమనుకోవాలి. ఎందుకంటే చాలా ఐపీఓలు లిస్ట్ అయిన నెల–రెండు నెలలకే నేల చూపులు చూస్తున్నాయి. కాబట్టి ఏ ఐపీఓలో పెట్టుబడి పెట్టినా కంపెనీ ఫండమెంటల్స్ చూడండి. ఫండమెంటల్స్ బాగుండి, ఆ వ్యాపారానికి భవిష్యత్ ఉందనిపిస్తే పెట్టండి. దీర్ఘకాలానికైనా పనికొచ్చేలా ఉండాలి.రియల్టీ..నేనో స్థలం కొందామనుకుంటున్నాను. గేటెడ్ కమ్యూనిటీలో అయితే మంచిదా... లేకపోతే మామూలు సింగిల్గా ఉండే ప్లాటయితే మంచిదా?ప్లాట్ల విషయానికొచ్చినపుడు గేటెడ్ కమ్యూనిటీలో ఉండే స్థలానికున్న రక్షణ బయట సింగిల్గా ఉండే స్థలాలకు ఉండదు. కబ్జాలకు అవకాశం తక్కువ. కాకపోతే స్థలమన్నది ఎక్కడ కొన్నా ముందుగా చెక్ చేసుకుని కొనటం తప్పనిసరి. గేటెడ్ అయితే రీసేల్ కాస్త సులువుగా అవుతుంది. దీనికోసం 10–20 శాతం ధర ఎక్కువ పెట్టాల్సి వచ్చినా పర్వాలేదు. బ్యాంకింగ్..నేను భవిష్యత్ లక్ష్యాల కోసం క్రమానుగత ఇన్వెస్ట్మెంట్ చేద్దామనుకుంటున్నాను. బ్యాంకులో రికరింగ్ డిపాజిట్ చేయటం మంచిదా... మ్యూచువల్ ఫండ్స్ మంచివా? దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేసేటపుడు మ్యూచ్వల్ ఫండ్స్ను ఎంచుకోవటమే సరైన నిర్ణయం అనిపిస్తుంది. ఎందుకంటే ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే శక్తి షేర్ మార్కెట్కు ఉంటుంది. పైపెచ్చు ఆర్డీతో పోలిస్తే దీర్ఘకాలానికి ఫండ్లే మంచి రాబడినిస్తాయి. ఆర్డీ సురక్షితమే అయినా రాబడి తక్కువ. స్వల్పకాలానికైతే అది మంచిది.ఫండ్స్...నేను మ్యూచువల్ పండ్స్లో పెట్టుబడి పెడుతున్నాను. ప్రస్తుతం నా పోర్ట్ఫోలియోలో 22 మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఇది మంచిదేనా? అసలు ఎన్ని ఫండ్స్ ఐతే బెటర్?వాస్తవానికి అన్ని మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అన్ని ఫండ్ల పనితీరూ ఒక్కలా ఉండదు. ఇలా పెట్టడమంటే షేర్లలో పెట్టినట్లే. షేర్లలో పెట్టుబడి పెడితే రిస్కు ఎక్కువనే కదా మీరు మ్యూచువల్ ఫండ్లు ఎంచుకున్నది. మరి ఇన్ని ఫండ్లలో ఇన్వెస్ట్ చేస్తే అన్నింటి పనితీరునూ ఎప్పటికపుపడు గమనిస్తూ వెళ్లగలరా? అందుకే నా సూచనేమిటంటే కనిష్టంగా 3, గరిష్ఠంగా 5 మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం ఉత్తమం.ఇన్సూరెన్స్...క్రిటికల్ ఇల్నెస్ రైడర్ అంటే ఏంటి? ఎంతవరకూ ఉపకరిస్తుంది? అది తీసుకోవటం మంచిదేనా? మంచిదే. మీ ఆరోగ్య బీమా ప్రీమియానికి కొంత మొత్తాన్ని జోడించటం ద్వారా ఈ రైడర్ను తీసుకోవచ్చు. ఇలా తీసుకోవటం వల్ల కేన్సర్, గుండెపోటు, కిడ్నీ ఫెయిల్యూర్, మేజర్ అవయవ మారి్పడి వంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు వాస్తవంగా ఆసుపత్రి బిల్లు ఎంతయిందనే అంశంతో సంబంధం లేకుండా ఇన్సూర్ చేసిన మొత్తాన్ని కంపెనీ మీకు చెల్లించేస్తుంది. ఆ మొత్తాన్ని మీరు చికిత్సకు, రికవరీకి, ఈ మధ్యలో చెల్లించాల్సిన ఈఎంఐల వంటి ఖర్చులు వాడుకోవచ్చు. ఊహించని వ్యాధులొచ్చినపుడు ఈ రైడర్ వల్ల ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడటమనేది తప్పుతుంది. కాబట్టి క్రిటికల్ ఇల్నెస్ రైడర్ను తీసుకోవటం సరైనదే.ఇదీ చదవండి: ఇండిగో కొంప ముంచింది ఇదే.. -
అంత క్యాష్ కనిపించిందా.. కొరడానే!
దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చే ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నగదు లావాదేవీలపై కఠినమైన కొత్త నిబంధనలు అమలు చేయనుంది. ఈ మార్పులు వ్యక్తులు కానీ, వ్యాపార సంస్థలు కానీ నిర్వహించే రోజువారీ నగదు ప్రవాహంపై గణనీయమైన ప్రభావం చూపనున్నాయి.కొత్త నిబంధనల ప్రకారం, లెక్కల్లో చూపని నగదుపై జరిమానాలు, సర్ఛార్జీలు, సెస్సులు కలిసి మొత్తం 84% వరకు పన్ను భారం పడే అవకాశం ఉందని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ సార్థక్ అహుజా లింక్డ్ఇన్ పోస్ట్లో వెల్లడించారు.అహుజా పేర్కొన్నట్లుగా, ఆదాయపు పన్ను శాఖ సోదాలు లేదా స్వాధీనం సందర్భాల్లో వ్యక్తి వద్ద లెక్కలు లేని నగదు పట్టుబడితే ఈ అధిక పన్ను రేటు వర్తిస్తుంది. ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త మార్పుల నేపథ్యంలో ఇటు వ్యక్తులతోపాటు వ్యాపార సంస్థలు నగదు వినియోగంపై మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.కొత్త నిబంధనలు ఇవే..కొత్త నియమాల ప్రకారం, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు పెద్ద మొత్తాల నగదు లావాదేవీలను నిశితంగా పర్యవేక్షించనున్నాయి.ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షలకు పైగా నగదు ఉపసంహరణ జరిగితే, బ్యాంకులు ఆ వివరాలను ఆదాయపు పన్ను శాఖకు నివేదిస్తాయి.రూ. 20 లక్షలకు పైగా ఉపసంహరణ జరిగితే, బ్యాంకులు తక్షణమే టీడీఎస్ (TDS) కట్ చేస్తాయి.తరచుగా పెద్ద మొత్తాల నగదు ఉపసంహరణలు జరిగితే, వాటి మూలం అనుమానాస్పదంగా కనిపిస్తే, ఆదాయపు పన్ను శాఖ సోదాలు లేదా జప్తు చర్యలు కూడా ప్రారంభించవచ్చు.వీటికి 100% జరిమానా తప్పదుకొన్ని ప్రత్యేక నగదు లావాదేవీలపై ఇకపై 100 శాతం జరిమానా వర్తించనుంది. అటువంటి లావాదేవీలు ఇవే..స్థిరాస్తి విక్రయం సమయంలో రూ. 20,000 కంటే ఎక్కువ నగదు స్వీకరిస్తే, ఆ మొత్తంపైనే 100% జరిమానా ఉంటుంది.ఒకే రోజులో ఒక కస్టమర్ నుండి రూ. 2 లక్షలకు పైగా నగదు అందుకుంటే ఆ మొత్తంపైనే జరిమానా విధిస్తారు.వ్యక్తులు నగదు రూపంలో రుణాలు పొందడం ఇకపై పూర్తిగా నిషేధం. దీనిని ఉల్లంఘిస్తే రుణ మొత్తం అంతటిపై 100% జరిమానా పడుతుంది.ఈ జాగ్రత్తలు అవసరంప్రభుత్వం కట్టుదిట్టమైన నగదు నియంత్రణ వ్యవస్థను నెలకొల్పుతున్న నేపథ్యంలో ఈ జాగ్రత్తలు అవసరంపెద్ద మొత్తాల నగదు లావాదేవీలు తప్పకుండా బ్యాంకింగ్ ఛానళ్ల ద్వారా జరపాలి.నగదు రసీదులు స్పష్టమైన ఆధారాలతో ఉండాలి.అక్రమ, లెక్కల్లో లేని నగదు ఖచ్చితంగా గణనీయమైన పన్ను భారం, జరిమానాలు తెచ్చిపెడుతుంది. -
Income Tax: అక్విజిషన్ డేటు V/S రిజిస్ట్రేషన్ డేటు
ఎన్నో స్థిరాస్తుల క్రయవిక్రయాల్లో ఇదొక సమస్య. ఈ విషయంలో ఎన్నో వివాదాస్పదమైన చర్చలు, సంభాషణలు జరిగాయి. స్థిరాస్తి క్రయవిక్రయాల్లో సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ కంపల్సరీ. చట్టరీత్యా చెయ్యాలి. అలా చేసిన తర్వాతే కొనుక్కునే వారికి హక్కు ఏర్పడుతుంది. అందుకని రిజిస్ట్రేషన్ డేటునే ప్రాతిపదికగా తీసుకుంటారు. రిజిస్ట్రేషన్ తేదీ నాడే హక్కు సంక్రమిస్తుంది. హోల్డింగ్ పీరియడ్.. అంటే ఆ సదరు ఆస్తి ఎన్నాళ్ల నుంచి ఆ వ్యక్తి వద్ద ఉంది అనేది. కొన్న తేదీ అలాగే అమ్మిన తేదీ .. ఈ రెండూ కూడా ఒప్పందం/అగ్రిమెంట్/డీడ్ ప్రకారం రిజిస్ట్రేషన్ తేదీలే. ఈ మధ్య వ్యవధిని హోల్డింగ్ పీరియడ్ అంటారు. ఇక కొనుగోలు తేదీ నుంచి అమ్మకపు తేదీల మధ్య వ్యవధి .. దీన్ని నిర్ణయించడానికి రిజిస్ట్రేషన్ తేదీనే ప్రాతిపదికగా తీసుకుంటారు. ఈ హోల్డింగ్ పీరియడ్.. స్థిరాస్తి క్రయ, విక్రయాల్లో 2 సంవత్సరాలు దాటితే దీర్ఘకాలికం. రెండు సంవత్సరాల కన్నా తక్కువ ఉంటే స్వల్పకాలికం అంటారు. దీర్ఘకాలికం అయితే ఒక రకమైన పన్ను రేటు ఉంటుంది. (రెసిడెంటుకి 20 శాతం, నాన్ రెసిడెంటుకి 12.5 శాతం) స్వల్పకాలికం అయితే, ఇతర ఆదాయాలతో కలిసి శ్లాబుల ప్రకారం రేట్లు విధిస్తారు. హోల్డింగ్ పీరియడ్ కాకుండా కాస్ట్ ఆఫ్ ఇండెక్సింగ్ లెక్కించడానికి అక్విజిషన్ డేటును ప్రాతిపదికగా తీసుకుంటారు.ఈ మేరకు ఎన్నో ట్రిబ్యునల్స్, కోర్టులు కూడా రూలింగ్ ఇచ్చాయి. వీటి సారాంశం ఏమిటంటే .. కొన్న వ్యక్తి మొత్తం ప్రతిఫలం చెల్లించి, ఆ ఆస్తిని తీసుకుని అనుభవిస్తున్నారు. అనుభవించడం అంటే తాను ఆ ఇంట్లో ఉండటం గానీ లేదా అద్దెకి ఇచ్చి.. ఆ అద్దెని ఇన్కం ట్యాక్స్ లెక్కల్లో చూపించినట్లయితే గానీ అని అర్థం. అయితే, ఏదో ఒక కారణం వల్ల రిజిస్ట్రేషన్ జరగలేదు. రిజిస్ట్రేషన్ పెండింగ్లో పడింది. అలాంటప్పుడు అలాట్మెంట్నే పరిగనలోకి తీసుకుంటారు. సుప్రీం కోర్టు: సీఐటీ వర్సెస్ ఘన్శ్యామ్ 2009 రాజస్తాన్ హైకోర్టు: సీఐటీ వర్సెస్ రుక్మిణీ దేవి 2010.పైన చెప్పిన కేసుల్లో ఈ విషయాన్ని నిర్ధారించారు. వీటి సారాంశం ఏమిటంటే ఏ తేదీన అయితే స్వాధీనపర్చుకున్నారో, అంటే డేట్ ఆఫ్ అక్విజిషన్, ఆ తేదీనే రిజి్రస్టేషన్ తేదీగా పరిగణిస్తారు. కాబట్టి డేట్ ఆఫ్ అక్విజిషన్ ముఖ్యం. ఇక అలాట్మెంట్ డేట్ వేరు. ముఖ్యంగా సొసైటీల్లో, డెవలప్మెంట్ అథారిటీపరంగా ఎన్నెన్నో సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. ఫలితంగా అలాట్మెంట్ జరుగుతుంది.. అక్విజిషన్ కూడా జరుగుతుంది.. కానీ న్యాయపరమైన చిక్కులు, కోర్టు లిటిగేషన్స్ వల్ల చట్టపరంగా జరగాల్సిన రిజిస్ట్రేషన్ సంవత్సరాల తరబడి వాయిదా అవుతుంది. బేరసారాలు జరిగి, అగ్రిమెంటు ప్రకారం ప్రతిఫలం ఇచ్చి అక్వైర్ (acquire) చేసుకున్నా, రిజి్రస్టేషన్ ప్రక్రియ ఆగిపోతుంది. పెండింగ్ పడిపోతుంది. ఇదొక సాంకేతిక సమస్య తప్ప న్యాయపరమైనది లేదా హక్కులపరమైన సమస్య కాదు.అందుకని హోల్డింగ్ పీరియడ్కి, కాస్ట్ ఆఫ్ ఇండెక్సింగ్కి డేట్ ఆఫ్ అక్విజిషన్నే ప్రాతిపదికగా తీసుకుంటారు. క్రయవిక్రయాలు చేసే ముందు, లింక్ డాక్యుమెంట్లు, దస్తావేజులను క్షుణ్నంగా చదవాలి. అప్పుడే ముందడుగు వేయాలి. మరొక జాగ్రత్త. సేల్ డీడ్లో మార్కెట్ విలువను ప్రస్తావిస్తారు. ప్రతిఫలం కన్నా మార్కెట్ విలువ ఎక్కువ ఉంటే, మార్కెట్ విలువనే అమ్మకపు విలువగా తీసుకుంటారు. తగిన జాగ్రత్త వహించండి. -
పసిడి ధర మరింత పెరుగుతుందా?
బంగారం ధర ఇప్పటికే బాగా పెరిగింది. ఇంకా పెరుగుతుందా? – శ్రావణి అద్దంకిబంగారం ధరలు అదే పనిగా ర్యాలీ చేస్తుండం తప్పకుండా ఆకర్షిస్తుంది. అవును బంగారం ధరలు ఇటీవలి కాలంలో గణనీయమైన రాబడిని ఇచ్చాయి. కానీ, ఇంకెంత పెరుగుతుందన్నది సమాధానం లేని ప్రశ్నే అవుతుంది. ఏ అసెట్ క్లాస్కు అయినా ఇదే వర్తిస్తుంది. కనుక దీనికి బదులు మీ పెట్టుబడుల్లో బంగారాన్ని చేర్చుకోవడం వల్ల ఒనగూరే ప్రయోజనాలనే పరిగణనలోకి తీసుకోవాలి. అనిశ్చితుల్లో బంగారం మంచి పనితీరు చూపిస్తుంటుంది.ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల సమయంలో లేదా ఈక్విటీ మార్కెట్లు ఆటుపోట్లను ఎదుర్కొంటున్న తరుణంలో బంగారం ధరలు పెరుగుతుంటాయి. అలాంటి అనిశి్చతులన్నీ సర్దుకుని, ఆర్థిక వ్యవస్థలు మంచి పనితీరు చూపిస్తుంటే అప్పుడు బంగారం పనితీరు పరిమితం అవుతుంది. గత 15 ఏళ్లలో బంగారం ఏటా 10 శాతం రాబడిని అందించింది. వివిధ రంగాలు, పరిమాణంతో కూడిన కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసే ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ ఇదే కాలంలో ఏటా ఇచ్చిన రాబడి 12 శాతంగా ఉంది.రాబడిలో వ్యత్యాసం స్వల్పమే అయినప్పటికీ దీర్ఘకాలంలో కాంపౌండింగ్ కారణంగా చెప్పుకోతగ్గంత అదనపు నిధి సమకూరుతుంది. ఈక్విటీలు అన్నవి వ్యాపారాల్లో వాటాలను అందిస్తాయి. అవి సంపదకు వీలు కల్పిస్తాయి. బంగారం కేవలం నిల్వ ఉంచుకునే సాధనమే. కనుక ఇన్వెస్టర్లు తమ ప్రాధాన్యతలకు అనుగుణంగా మొత్తం పెట్టుబడుల్లో 10 శాతం వరకు బంగారానికి కేటాయించుకోవచ్చు. నేను ప్రతి నెలా రూ.45,000 చొప్పున ఆరేళ్లపాటు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నాను. ఈ మొత్తాన్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లేదా డెట్ మ్యూచువల్ ఫండ్స్లో వేటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి? – దీపక్పెట్టుబడిలో తక్కువ రిస్క్ కోరుకునే వారు 50 శాతాన్ని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల పెట్టుబడికి రిస్క్ ఉండదు. మిగిలిన 50 శాతాన్ని వృద్ధి కోసం ఈక్విటీలకు కేటాయించుకోవాలి. డెట్ విషయంలో షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ లేదా టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్స్ను ఎంపిక చేసుకోవచ్చు. ఈక్విటీల్లో లార్జ్క్యాప్ ఫండ్స్ లేదా లో కాస్ట్ ఇండెక్స్ ఫండ్స్ నుంచి ఎంపిక చేసుకోవాలి. ఒకవేళ అధిక రిస్క్ తీసుకునేట్టు అయితే.. ఈక్విటీలకు 65 శాతం నుంచి 80 శాతం, మిగిలిన మొత్తాన్ని డెట్ సాధనాలకు కేటాయించుకోవాలి.సమాధానాలు:: ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
సంక్షోభం అంచున ప్రపంచం.. ముందే చెబుతున్నా మీ ఇష్టం
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆర్థిక నిపుణుడు, ప్రముఖ రచయిత రాబర్ట్ కియోసాకి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసే హెచ్చరిక చేశారు. 2026 నుంచి అతిపెద్ద మాంద్యం ప్రారంభమవుతుందని, ఇప్పటి నుంచే ప్రజలు సిద్ధంగా ఉండాలని ఆయన ఎక్స్ వేదికగా సుదీర్ఘ పోస్ట్లో పేర్కొన్నారు.ఉద్యోగ నష్టాలు.. ముందస్తు సంకేతాలుప్రస్తుతం అమెరికాలో చోటుచేసుకుంటున్న ఉద్యోగ నష్టాలను రాబోయే మహా మాంద్యానికి ముందస్తు సంకేతాలుగా కియోసాకి పేర్కొన్నారు. ఏడీపీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ నివేదికను ఉటంకిస్తూ, నవంబర్లో అమెరికాలో దాదాపు 32,000 ఉద్యోగాలు కోల్పోయారని తెలిపారు. ముఖ్యంగా పెద్ద కంపెనీలతో పాటు, చిన్న వ్యాపారాలు 1,20,000 మంది ఉద్యోగులను తొలగించడం మరింత కలవరానికి గురిచేసిందని అన్నారు.‘2026లో భారీగా ఉద్యోగ తొలగింపులు మొదలవుతాయి. మీ ఉద్యోగం ప్రమాదంలో ఉంటే ఇప్పుడే నా పాఠం #4ని గుర్తుచేసుకోండి. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు ధనవంతులు ఎలా జీవిస్తారో అలాగే మీరూ జీవించండి’ అని కియోసాకి ఉద్యోగులకు హితవు పలికారు.డబ్బు సంపాదించే మార్గాలుమాంద్యం ప్రభావం నుంచి బయటపడటానికి తక్షణమే ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను ఆయన సూచించారు. సొంత కారు ఉన్నవారు వెంటనే ఉబర్ (Uber) వంటి సేవల్లో చేరి అదనపు ఆదాయాన్ని సంపాదించాలని సూచించారు. మాంద్యం సమయంలో అమ్మకం నైపుణ్యం అనేది జీవనాధారమవుతుందని, దురదృష్టవశాత్తూ చాలా మంది ఉద్యోగులకు ఈ నైపుణ్యం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.రియల్ ఎస్టేట్ క్రాష్2026లో ముఖ్యంగా రెసిడెన్షియల్ (నివాస), కమర్షియల్ (వాణిజ్య) రియల్ ఎస్టేట్ మార్కెట్ పూర్తిగా క్రాష్ అవుతుందని కియోసాకి హెచ్చరించారు. ‘బేరసారాలు ఉండవు. లైఫ్టైమ్ ఒప్పందాలు మీ కోసం ఎదురుచూస్తాయి. పెట్టుబడిదారులు సిద్ధంగా ఉండండి’ అని మాంద్యం సమయంలోనే అద్భుతమైన పెట్టుబడి అవకాశాలు ఉంటాయని ఆయన సూచించారు.కళాశాల డిగ్రీ కంటే నైపుణ్యాలు ఉత్తమంఉపయోగంలేని డిగ్రీల కోసం మళ్లీ కళాశాలకు వెళ్లి రుణాలు తీసుకోవద్దని, దానికి బదులుగా నర్సింగ్, ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్, వృద్ధుల సంరక్షణ వంటి ఆచరణాత్మక నైపుణ్యాలు నేర్చుకోవాలని అన్నారు. ‘ప్రపంచానికి ఎప్పుడూ ఈ నైపుణ్యాలు కావాలి’ అని అన్నారు.Lesson #4: How to get richer when the economy crashes:ADP just announced 32,000 jobs were lost in November. Those job losses are from big businesses.The frightening news is small businesses laid off 120,000 workers.The bigger lay offs will begin in 2026 when the world…— Robert Kiyosaki (@theRealKiyosaki) December 4, 2025బంగారం, వెండి, క్రిప్టో.. ఇవే భవిష్యత్తుప్రస్తుతం చెలామణిలో ఉన్న డాలర్ను కియోసాకి మళ్లీ నకిలీ డబ్బుగా అభివర్ణించారు. సంక్షోభ సమయంలో డబ్బును కాపాడుకోవడానికి నిజమైన ఆస్తుల్లో పొదుపు చేయాలని ఆయన సూచించారు. బంగారం, వెండి, బిట్కాయిన్, ఎథేరియం వంటి ప్రధాన క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడి పెట్టాలన్నారు. ప్రస్తుతం ఔన్సుకు 57 డాలర్లుగా ఉన్న వెండి ధర, జనవరి 2026 నాటికి 96 డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేశారు.ఇదీ చదవండి: విద్య ముసుగులో రూ.546 కోట్ల మోసం -
ఉచితంగా క్రెడిట్ స్కోరు.. యస్ బ్యాంక్ మైక్రోసైట్
ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ తాజాగా ’స్కోర్క్యాహువా.బ్యాంక్.ఇన్’ పేరిట మైక్రోసైట్ని ప్రవేశపెట్టింది. క్రెడిట్ స్కోర్ను ఉచితంగా చెక్ చేసుకునేందుకు, రుణాల సంబంధ అంశాలు, క్రెడిట్ ప్రొఫైల్ ప్రాధాన్యత గురించి తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది.క్రెడిట్ స్కోర్పై అవగాహన పెంచేందుకు, రుణాల విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించడం వల్ల వచ్చే ప్రయోజనాలను తెలియజేసేందుకు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద దీన్ని రూపొందించినట్లు యస్ బ్యాంక్ ఎండీ ప్రశాంత్ కుమార్ తెలిపారు.ఇందులో ఆర్థిక అంశాల సంబంధిత బ్లాగ్లు, వీడియోలు క్రెడిట్ స్కోరుపై అపోహలు తొలగించే సమాచారం మొదలైనవి ఉంటాయి. ఈ సందర్భంగా నాలుగు టీవీ ప్రకటనలను కూడా బ్యాంకు ఆవిష్కరించింది. -
ఇది నేర్చుకుంటేనే బయటపడతారు: కియోసాకి
ప్రపంచ ఆర్థిక మాంద్యం గురించి హెచ్చరిస్తూ వరుస ట్వీట్లు చేస్తున్న రాబర్ట్ కియోసాకి.. దాన్నుంచి బయటపడి ధనవంతులు కావాలంటే ఏం చేయాలో 10 సూచనలు ఇస్తానన్నారు. వాటిలో మూడోది ఇప్పుడు వెల్లడించారు. ఈ మేరకు ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత తాజాగా ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.ఆర్థిక సంక్షోభానికి చిక్కకుండా ఉండాలంటే ‘నెట్ వర్క్ మార్కెటింగ్’లో చేరాలని సూచించారు. ఆర్థిక రచయిత రాబర్ట్ కియోసాకి నెట్ వర్క్ మార్కెటింగ్ వ్యాపారాల ద్వారా వ్యవస్థాపక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా ప్రపంచ ఆర్థిక పతనానికి సిద్ధం కావాలని సలహా ఇస్తున్నారు.కృత్రిమ మేధస్సు త్వరలో మిలియన్ల ఉద్యోగాలను తొలగిస్తుందని ఇటీవలి ట్వీట్లలో వాదించారు. ఇందులో సాంప్రదాయకంగా స్థిరంగా పరిగణించబడే లేదా చట్టం, వైద్యం, వినోదం వంటి విస్తృతమైన విద్య అవసరమయ్యే వృత్తులకు కూడా మినహాయింపు ఉండదన్నారు. కియోసాకి ప్రకారం.. ఈ మార్పు చాలా మందిని స్వయం ఉపాధి, ప్రత్యామ్నాయ ఆదాయ నమూనాల వైపు నెట్టివేస్తుంది.అల్లకల్లోలమైన ఆర్థిక వాతావరణంలో వృద్ధి చెందడానికి అవసరమైన ప్రధాన నైపుణ్యాలను పొందడానికి మల్టీ-లెవల్ మార్కెటింగ్ (MLM) అని కూడా పిలువబడే నెట్ వర్క్ మార్కెటింగ్ ఒక మార్గంగా నిలుస్తుందని కియోసాకి వర్ణిస్తున్నారు. అటువంటి వ్యాపారాలు అందించే అనేక ప్రయోజనాలను వివరించారు.LESSON # 3: How to get richer as global economy crashes.Join a network marketing business.Reasons why a network marketing business will make you richer.AI (Artificial Intelligence) will wipe out millions of jobs even jobs that required lots of schooling like lawyers,…— Robert Kiyosaki (@theRealKiyosaki) December 3, 2025 -
రాయికి రంగేసి రూ.5 వేలకు అమ్మాడు.. కానీ..
నేటి యువతరం కేవలం ఉద్యోగాల కోసం మాత్రమే కాకుండా, సంపాదన కోసం తమదైన మార్గాన్ని సృష్టించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఒక చిన్న ఆలోచన, కొంచెం సృజనాత్మకత ఉంటే.. సాధారణ వస్తువులను కూడా అద్భుతమైన బిజినెస్ అవకాశాలుగా ఎలా మార్చుకోవచ్చో కొందరు నిరూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీకి చెందిన ఓ యువకుడు చేసిన పనికి సోషల్ మీడియాలో ప్రశంసలు వస్తున్నాయి. ఈమేరకు సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేసిన ఓ వీడియా వైరల్గా మారింది.రోడ్డు పక్కన రాయి.. రూ.5,000 గడియారంగా!సాధారణంగా రోడ్డు పక్కన పడి ఉండే రాళ్లను ఎవరు పట్టించుకుంటారు? కానీ, ఢిల్లీకి చెందిన ఒక యువకుడు అదే రాయిని అత్యంత ఆకర్షణీయమైన ఫంక్షనల్ గడియారంగా మార్చి రూ.5,000కు అమ్మి అందరి దృష్టిని ఆకర్షించాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ప్రకారం.. ఈ యువకుడు రోడ్డు పక్కనుంచి తీసుకున్న ఒక సాధారణ రాయిని ప్రత్యేకమైన షోపీస్గా మార్చాలని నిర్ణయించుకున్నాడు. మొదట రాయిని కావలసిన ఆకారంలో కత్తిరించి, ఆపై పాలిషింగ్, పెయింటింగ్ చేశాడు. దీంతో రాయికి నిగనిగలాడే ఫినిషింగ్ వచ్చింది. తర్వాత లోపల ఒక చిన్న గడియారాన్ని జాగ్రత్తగా అమర్చి దాన్ని అలంకార వస్తువుగా మార్చేశాడు. View this post on Instagram A post shared by Sabke Bhaiya JI (@deluxebhaiyaji)మొదట ఆకర్షణీయంగా లేకపోవడంతో..వీడియోలోని వివరాల ప్రకారం.. మొదటి ప్రయత్నంలో గడియారం వెనుక భాగం అంతగా ఆకర్షణీయంగా లేకపోవడంతో కొనుగోలుదారులు పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ, ఈ యువకుడు నిరాశ చెందకుండా వెంటనే దాన్ని సరిదిద్ది వెనుక భాగాన్ని చక్కటి కవర్తో కప్పి ఆకర్షణీయంగా చేశాడు. దాంతో ఒక కస్టమర్ వెంటనే రూ.5,000 చెల్లించి దాన్ని కొనుగోలు చేశాడు.ఇదీ చదవండి: భవిష్యత్ యుద్ధాలు ‘చిట్టి’లతోనే! -
దీర్ఘకాలిక ఆర్థిక భద్రతకు ప్రభుత్వ పథకాలు
ఆర్థిక అనిశ్చితులు, మార్కెట్ హెచ్చుతగ్గులు, జీవితంలో ఎదురయ్యే దీర్ఘకాలిక లక్ష్యాల (రిటైర్మెంట్, పిల్లల విద్య, వివాహం వంటివి) మధ్య సాధారణ ప్రజలు తమ డబ్బును సురక్షితంగా పెంపుచేసుకోవాలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్థిరమైన రాబడినేచ్చే పథకాలపై దృష్టి సారించాల్సి ఉంటుంది. ఈ పథకాలు పూర్తిగా ప్రభుత్వ హామీతో ఎలాంటి రిస్క్ లేకుండా 7-8% వరకు వడ్డీ రేట్లు అందిస్తాయి. అందులో కొన్ని పథకాల గురించి తెలుసుకుందాం.ఈ పథకాల వడ్డీ రేట్లు 2025లో క్వార్టర్లవారీగా సమీక్షిస్తున్నప్పటికీ, ఆర్బీఐ విధానాల మార్పులకు అనుగుణంగా రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. పీపీఎఫ్, ఎస్ఎస్వై వంటివి దీర్ఘకాలిక భద్రతకు ఉపయోగపడగా, ఎన్పీఎస్ మార్కెట్ లింక్డ్ రిటర్న్స్తో ఎక్కువ లాభాలు ఇస్తుంది. గత దశాబ్దంలో ఈ పథకాలు ముఖ్యంగా మహిళలు, గ్రామీణ ప్రజలకు కోట్ల రూపాయల ఆదాయాన్ని సృష్టించాయి.పథకంలక్ష్యంవడ్డీ రేటు (ఏటా)వ్యవధిప్రయోజనాలుపబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)దీర్ఘకాలిక ఆర్థిక భద్రత, రిటైర్మెంట్7.1%15 సంవత్సరాలుపూర్తి పన్నుమినహాయింపు, రిస్క్ ఫ్రీ, మార్కెట్ అస్థిరతకు వ్యతిరేకం.నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)రిటైర్మెంట్ పెన్షన్10-12% (మార్కెట్-లింక్డ్)60 సంవత్సరాల వయసు వరకుఈక్విటీ/ డెట్ మిక్స్, 80C + అదనపు రూ.50,000 మినహాయింపు. యువతకు ఉపయోగకరం.సుకన్యా సమృద్ధి యోజన (SSY)ఆడపిల్లల విద్య/వివాహం8.2%21 సంవత్సరాలుపూర్తి పన్నుమినహాయింపు, మహిళా సాధికారతకు ప్రోత్సాహం.సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)వృద్ధులకు ఆదాయం8.2% (క్వార్టర్లీ)5 సంవత్సరాలు60+ వయసు, 80C మినహాయింపుకిసాన్ వికాస్ పత్రా (KVP)మధ్యస్థ/దీర్ఘకాలిక పెట్టుబడి7.5%9 సంవత్సరాలు 5 నెలలు (డబుల్ అవుతుంది)గ్రామీణ ప్రజలకు ఉపయోగంనేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC)మధ్యస్థ పెట్టుబడి7.7%5 సంవత్సరాలు80C మినహాయింపుఅటల్ పెన్షన్ యోజన (APY)అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ రిటైర్మెంట్రూ1,000-5,000/నెల పెన్షన్60 సంవత్సరాల వయసు18-40 సంవత్సరాల వారు దరఖాస్తు చేయాలి. గ్యారంటీడ్ పెన్షన్. ప్రస్తుతం వాటిలో పెట్టుబడి పెట్టే మార్గాలుఆధార్, పాన్కార్డ్, బ్యాంక్ అకౌంట్తో కేవైసీ పూర్తి చేస్తే చాలు పోస్ట్ ఆఫీస్, బ్యాంకుల డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా వీటిలో పెట్టుబడి పెట్టడం చాలా సులభం అవుతుంది.పోస్ట్ ఆఫీస్ మార్గం (ఆఫ్లైన్/ఆన్లైన్)ఆఫ్లైన్: సమీప పోస్ట్ ఆఫీస్కు వెళ్లి సంబంధిత ఫామ్ (ఉదా., పీపీఎఫ్కు Form-1, ఎస్ఎస్వైకు Form-4) సమర్పించాలి.ఆన్లైన్: పోస్ట్ ఆఫీస్ ఐపీపీబీ యాప్ లేదా వెబ్సైట్ (indiapost.gov.in) ద్వారా కూడా ఆన్లైన్లో వీటిని ప్రారంభించవచ్చు.బ్యాంకింగ్ మార్గంఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ వంటి ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో యాకౌంట్ తెరిచి నెట్ బ్యాంకింగ్ ద్వారా పీపీఎఫ్/ ఎన్ఎస్సీ వంటి వాటిలో పెట్టుబడి చేయవచ్చు.ఇదీ చదవండి: వైబ్ కోడింగ్.. ‘ఏఐకి అంత సీన్ లేదు’ -
పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలా?: నాలుగు మార్గాలున్నాయ్గా..
ఉద్యోగం చేస్తున్న దాదాపు అందరికి ఈపీఎఫ్ఓ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) గురించి అవగాహన ఉంటుంది. అయితే కొందరికి పీఎఫ్ ఖాతాలో ఎంత అమౌంట్ ఉందనే విషయం తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ కథనంలో పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలి?, దానికున్న మార్గాలు ఏమిటనేది వివరంగా తెలుసుకుందాం.మిస్డ్ కాల్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్యూఏఎన్ పోర్టల్లో ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ చేసుకున్న సభ్యులు.. తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 9966044425 కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా EPFOలో బ్యాలెన్స్ ఎంత ఉందనే విషయం తెలుసుకోవచ్చు.మిస్డ్ కాల్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోలనుకునే సభ్యులు ముందుగా.. మొబైల్ నెంబర్ను యూనిఫైడ్ పోర్టల్లో UANతో యాక్టివేట్ చేయాలి. దీనికోసం కావలసిన డాక్యుమెంట్లతో కేవైసీ పూర్తి చేసుకుని ఉండాలి.9966044425 కు కాల్ చేసినప్పుడు రెండు రింగ్ల తర్వాత స్వయంచాలకంగా డిస్కనెక్ట్ అవుతుంది. తరువాత ఒక ఎస్ఎమ్ఎస్ వస్తుంది. అందులోనే మీ పీఎఫ్ బ్యాలెన్స్ చూడవచ్చు.ఎస్ఎమ్ఎస్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్యూఏఎన్ యాక్టివేట్ చేసుకున్న సభ్యులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 7738299899కు ఎస్ఎమ్ఎస్ పంపడం ద్వారా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.EPFOHO UAN టెక్స్ట్లో మీ UAN నంబర్ను యాడ్ చేసి.. మీ ప్రాంతీయ భాషలో ప్రతిస్పందనను స్వీకరించాలనుకుంటే, టెక్స్ట్లో మీ UAN తర్వాత మీకు నచ్చిన భాష కోసం కోడ్ను వెల్లడించాలి. ఇది ఇంగ్లీష్, హిందీ (HIN), పంజాబీ (PUN), గుజరాతీ (GUJ), మరాఠీ (MAR), కన్నడ (KAN), తెలుగు (TEL), తమిళం (TAM), మలయాళం (MAL), బెంగాలీ (BEN) వంటి పది భాషల్లో అందుబాటులో ఉంటుంది.UMANG యాప్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్UMANG యాప్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోలంటే.. ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి ఉమాంగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి.డౌన్లోడ్ చేసుకున్న తరువాత.. లాగిన్ అయి EPFO సేవలను యాక్సెస్ చేయడానికి మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)ని లింక్ చేయాలి.లింక్ చేసిన తర్వాత, మీరు UMANG యాప్ ద్వారా మీ PF బ్యాలెన్స్ను సులభంగా చూడవచ్చు.EPFO వెబ్సైట్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి.. సర్వీసెస్ ఫర్ ఎంప్లాయీస్పై క్లిక్ చేసి, దీని కింద ఉన్న మెంబర్ పాస్బుక్పై క్లిక్ చేయాలి.EPFO పోర్టల్లో మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) & పాస్వర్డ్ని ఉపయోగించి లాగిన్ అవ్వాలి.ఇలా లాగిన్ అయిన తరువాత మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎంత అనేది తెలుసుకోవచ్చు.ఇదీ చదవండి: చెప్పినవే చేస్తాను.. విజేతగా మారాలంటే? -
పెట్టుబడి.. వృద్ధికి మార్గం!
ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో మెరుగైన రాబడిని సమకూర్చుకోవాలని భావించే వారు.. తమ పోర్ట్ఫోలియో కోసం స్మాల్క్యాప్ ఫండ్స్ను తప్పకుండా పరిశీలించాలి. ఈక్విటీల్లో అత్యధిక రిస్క్ ఉండేది ఈ విభాగంలోనే. అదే సమయంలో అధిక రాబడులు కూడా ఇక్కడే సాధ్యం. కనుక దీర్ఘకాల లక్ష్యాల కోసం తమ మొత్తం పెట్టుబడుల్లో 20 శాతం వరకు స్మాల్క్యాప్ ఫండ్స్కు కేటాయించుకోవచ్చు. ఈ విభాగంలో మంచి రాబడులను అందిస్తున్న పథకాల్లో ఎస్బీఐ స్మాల్క్యాప్ ఫండ్ కూడా ఒకటి.రాబడులు: గత ఐదేళ్ల కాలంలో ఎస్బీఐ స్మాల్క్యాప్ ఫండ్ పెట్టుబడిపై 285 శాతం రాబడిని అందించింది. ఈ కాలంలో నిఫ్టీ 50 రాబడి 164%. అంటే వార్షిక కాంపౌండెడ్ రాబడి 28.44 శాతం. గత ఏడాది కాలంలో రాబడి ఒక శాతంగా ఉంది. గత ఏడాది కాలంగా మార్కెట్లు దిద్దుబాటు దశలో ఉండడం తెలిసిందే. ఇక మూడేళ్ల కాలంలో వార్షిక రాబడి 15 శాతం వరకు ఉండడాన్ని గమనించొచ్చు.ఈ పథకం ఆరంభం నుంచి ఇప్పటి వరకు పనితీరును గమనిస్తే వార్షిక రాబడి 19.35 శాతం చొప్పున ఉంది. రాబడుల్లో స్థిరత్వాన్ని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. ఇక ఈ పథకంలో సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసినట్టయితే ఏడాది కాలంలో సిప్ పెట్టుబడులపై 6.88 శాతం నష్టాలు కనిపిస్తున్నాయి. మూడేళ్ల కాలాన్ని పరిశీలిస్తే వార్షిక రాబడి 18.49 శాతం చొప్పున ఉంది. ఐదేళ్ల కాలంలో అయితే వార్షిక రాబడి ఏకంగా 55.78 శాతంగా ఉండడం గమనించొచ్చు. ఇక 10 ఏళ్లలో సిప్ రాబడి 164% ఉంది. కనుక సిప్ ప్లాన్ రూపంలో పెట్టుబడులతో రిస్్కను అధిగమించడంతోపాటు.. మెరుగైన రాబడుల ను సమకూర్చుకోవచ్చని డేటా తెలియజేస్తోంది.పెట్టుబడుల విధానం: దీర్ఘకాలంలో ఇన్వెస్టర్లకు సంపద సమకూర్చడం ఈ పథకం పెట్టుబడుల విధానంలో భాగం. చిన్న కంపెనీలు ఆర్థిక సంక్షోభ సమయాల్లో పెద్ద కంపెనీలతో పోల్చి చూస్తే కుదేలవుతుంటాయి. కనుక ఆ సమయంలో స్మాల్క్యాప్ పెట్టుబడుల విలువ పడిపోతుంటుంది. ఆందోళన చెందకుండా, స్థిరంగా ఆ పెట్టుబడిని తిరిగి గణనీయంగా వృద్ధి చెందే వరకు వేచి చూడగలిగే వారికే స్మాల్క్యాప్ పెట్టుబడులు అనుకూలం.పోర్ట్ఫోలియో: ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతం 36,945 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 93.27 శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయగా, 2.57 శాతం పెట్టుబడులు డెట్ సాధనాల్లో ఉన్నాయి. 4.16 శాతం మేర నగదు నిల్వలు కలిగి ఉంది. ఈక్విటీ పెట్టుబడులను పరిశీలించగా, 36.34 శాతం మేర స్మాల్క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయగా, మిగిలిన మొత్తం మిడ్క్యాప్ కంపెనీల్లో ఉన్నట్టు తెలుస్తోంది.పేరుకు స్మాల్క్యాప్ ఫండ్ అయినప్పటికీ.. మిడ్క్యాప్లో ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంది. దీనికి కారణం స్వల్పకాలంలో రాబడుల అవకాశాలతోపాటు.. ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేసిన తర్వాతి కాలంలో కొన్ని కంపెనీలు వృద్ధితో మధ్యస్థ కంపెనీలుగా అవతరించినట్టు తెలుస్తోంది. ఈక్విటీల్లో అత్యధికంగా 26.55 శాతం ఇండ్రస్టియల్స్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది. కన్జ్యూమర్ కంపెనీలకు 20.56 శాతం, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు 15.9 శాతం చొప్పున కేటాయింపులు చేసింది. -
జెన్ జెడ్ ఇన్వెస్టర్లకు బీమా.. డైలమా
పూర్తిగా డిజిటల్ శకంలో పెరుగుతున్న జెన్ జెడ్ తొలి తరం ఇన్వెస్టర్లు.. డబ్బు, లైఫ్స్టయిల్, విశ్వసనీయతకు సంబంధించిన అభిప్రాయాలను తిరగరాస్తున్నారు. వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉంటున్నారు. ఎంచుకునే ప్రతి దాన్నుంచి గరిష్ట విలువను పొందడంపై దృష్టి పెడుతున్నారు. తాము ఉపయోగించే ప్రతి ప్రొడక్టు, సర్వీసు సరళంగా, వేగవంతంగా ఉండాలని కోరుకుంటున్నారు. దీనితో వారికి అనుగుణమైన ప్రోడక్టులను అందించే విషయంలో ఈ పరిణామం, బీమా సంస్థలకు ఒక పెద్ద డైలమాగా మారింది. వారి వాస్తవ అవసరాలు, అందుబాటులో ఉన్న సాధనాల మధ్య అంతరాలను భర్తీ చేసేలా కొత్త సొల్యూషన్స్ని కనుగొనాల్సిన పరిస్థితి నెలకొంది.జెన్ జెడ్ తరం వారు ఆర్థిక ప్రణాళికలపై ఆసక్తిగానే ఉన్నప్పటికీ బీమాను ఇంకా పూర్తి స్థాయిలో పరిశీలించడం లేదు. ఇటీవలి హెచ్డీఎఫ్సీ ఎర్గో నివేదిక ప్రకారం 61 శాతం యువత హెల్త్ ఇన్సూరెన్స్పై ఆసక్తి చూపగా, 37 శాతం మంది క్యాష్లెస్ హాస్పిటల్ నెట్వర్క్ లభ్యతకు ప్రాధాన్యమిచ్చారు. బీమాకు ప్రాధాన్యమిస్తున్నప్పటికీ కేవలం సంప్రదాయ ఫీచర్లకే పరిమితం కాకుండా సౌకర్యం, తమకు ఎంత వరకు ఉపయోగకరంగా ఉంటుందనే కోణాల్లో కూడా ఇన్సూరెన్స్ని చూస్తున్నారని దీని ద్వారా తెలుస్తోంది.జెన్ జెడ్ తరం టెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ లాంటి అంశాలపై గణనీయంగా ఖర్చు చేస్తోంది. తమ లైఫ్స్టయిల్కి అనుగుణంగా, పారదర్శకమైన, సరళమైన ట్రావెల్, హెల్త్ పాలసీలను, గ్యాడ్జెట్స్ను కొనుగోలు చేసేందుకు వారు సిద్ధంగా ఉంటున్నారు. దానికి తగ్గట్లుగా వారికి అర్థమయ్యే రీతిలో బీమాను వివరించి, తగు పాలసీలను అందచేయగలిగితే ఇన్సూరెన్స్ ప్రయోజనాలను జెన్ జడ్ తరంవారికి మరింతగా చేరువ చేసేందుకు వీలవుతుంది.ఏం కోరుకుంటున్నారు..సరళత్వం: అర్థం కాని సంక్లిష్టమైన పదాలు, సుదీర్ఘంగా ఉండే పాలసీ డాక్యుమెంట్లను వారు ఇష్టపడటం లేదు. సాదా సీదాగా అర్థమయ్యే భాషను, డిజిటల్ సాధనాలను, స్పష్టతను కోరుకుంటున్నారు.పర్సనలైజేషన్: వారు సంప్రదాయ పద్ధతుల్లో గిరిగీసుకుని ఉండటం లేదు. ఫ్రీల్యాన్స్ కెరియర్లు మొదలుకుని ఇతరత్రా పార్ట్టైమ్ పనులు కూడా చేస్తున్నారు. కాబట్టి పే–యాజ్–యు–డ్రైవ్ కార్ ఇన్సూ రెన్స్, అవసరాలకు తగ్గట్లు యాడ్–ఆన్లను చేర్చేందుకు వీలుండే హెల్త్ పాలసీలు, స్వల్పకాలిక కవరేజీల్లాంటి ప్రోడక్టులను వారు ఇష్టపడుతున్నారు.డిజిటల్ ఫస్ట్: ఫోన్తో చెల్లింపులు జరిపినట్లు లేదా ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా ఆర్డరు పెట్టినట్లు పాలసీ కొనుగోలు అనుభూతి కూడా సులభతరమైన విధంగా, వేగవంతంగా, మొబైల్ – ఫస్ట్ తరహాలో ఉండాలనుకుంటున్నారు.పారదర్శకత: నైతిక విలువలు, పారదర్శక విధానాలను పాటించే బ్రాండ్స్ వైపు జెన్ జెడ్ తరం మొగ్గు చూపుతున్నారు. సమాజం, పర్యావరణంపట్ల బాధ్యతాయుతంగా ఉండే సొల్యూషన్స్.. వారి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.ఈ నేపథ్యంలో జెన్ జడ్ తరం అవసరాలకి తగ్గ పాలసీలను అందించే దిశగా పరిశ్రమలో ఇప్పటికే మార్పులు చోటు చేసుకుంటున్నాయి. టెలీమ్యాటిక్స్ ఆధారిత వాహన బీమా యువ డ్రైవర్లకు దన్నుగా ఉంటోంది. వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఆరోగ్య బీమా సంస్థలు తమ పాలసీల్లో వెల్నెస్ ప్రోగ్రాంలు, నగదురహిత డిజిటల్ సర్వీసులు మొదలైనవి అందిస్తున్నాయి. ప్రయాణాలు కావచ్చు ఇతరత్రా కొనుగోళ్లు కావచ్చు అన్నింటి అంతర్గతంగా బీమా ప్రయోజనాన్ని అందించే విధానం క్రమంగా ఊపందుకుంటోంది.జెన్ జడ్ తరం వారు బీమాను భారంగా కాకుండా సాధికారతగా చూస్తున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా కలలను సాకారం చేసుకునేందుకు తోడ్పడే భద్రత సాధనాలను వారు కోరుకుంటున్నారు. వృద్ధిలోకి వచ్చేందుకు ఇన్వెస్ట్ చేయదల్చుకుంటున్నారు. కాబట్టి బీమా అనేది డిజిటల్–ఫస్ట్గా, సరళంగా, పారదర్శకంగా ఉంటే కేవలం బ్యాకప్ వ్యూహంగా మాత్రమే కాకుండా వారు కోరుకునే జీవితాన్ని గడిపేందుకు సహాయపడే సాధనంగా ఉంటుంది.వారి ఆకాంక్షలకు తగ్గట్లు పరిశ్రమ కూడా తనను తాను మల్చుకోగలిగితే జెన్ జడ్ తరానికి చేరువ కావడంతో పాటు బీమా రంగ భవిష్యత్తును సరికొత్తగా తీర్చిదిద్దుకోవడానికి ఆస్కారం ఉంటుంది. జెన్ జడ్ తరం అంటే ఏదో అల్లాటప్పా కస్టమర్ సెగ్మెంట్ కాదు, బీమా రంగం భవిష్యత్తుకు దిక్సూచిలాంటిది. కొత ఆవిష్కరణలను కనుగొనడం, పాలసీలను మరింత సరళం చేయడం, చక్కగా అర్థమయ్యేలా వివరించడంలాంటి అంశాల్లో పరిశ్రమ పురోగమనాన్ని ఇది మరింత వేగవంతం చేయనుంది. -
Income Tax: నోటీసులా... నోటీసులే..!
రోజూ ఇన్కంట్యాక్స్ వారి వెబ్సైట్లోకి వెళ్లి మీ పర్సనల్ అకౌంటులో లాగిన్ అయ్యి మీ వివరాలు చూసుకోవడం అలవాటు చేసుకోండి. మీ ఆడిటర్ నుంచి మీ లాగిన్ వివరాలు తీసుకోండి. ప్రతిసారి ఆడిటర్స్ దగ్గరకు పరిగెత్తకుండా మీరే లాగిన్ అవ్వొచ్చు.నోటీసు/సమాచారంఇన్కమ్ ట్యాక్స్ సైట్లో లాగిన్ అయ్యి ... డాష్ బోర్డులోని పెండింగ్ యాక్షన్స్లో ఈ–ప్రొసీడింగ్స్ని క్లిక్ చేయండి. అందులో నోటీసులు ఉంటాయి. ఆ నోటీసుని చూడండి. దీనిని VIEW అంటారు. దానిలో నోటీసులు ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. అప్పుడు నోటీసులో ఏముందో అర్థమవుతుంది.నోటీసులెన్నో రకాలు, మరెన్నో అంశాలుడిఫెక్టివ్ నోటీసు అంటారు. బదులుగా సకాలంలో దీన్ని సర్దుబాటు చేసుకోవచ్చు.అలా సర్దుబాటు చేస్తే సరిపోతుంది.143 (1) ప్రకారం ఒక స్టేట్మెంట్ పంపిస్తారు. ఆదాయంలో కానీ పన్ను భారం లెక్కింపులో కానీ వ్యత్యాసాలుంటే తెలియజేస్తారు. ఆదా యం ‘కాలమ్’ మీరు వేసింది. అధికారి అస్సె స్ చేసింది పక్కపక్కనే ఉంటాయి. ఒకదానితో మరొకదాన్ని పోల్చి చూసుకొండి. హెచ్చుతగ్గులుంటాయి. మినహాయింపులుంటాయి.కూడికల్లో లేదా తీసివేతల్లో పొరపాట్లు రావచ్చు.పన్ను చెల్లింపుల విషయంలో రికార్డులు అప్డేట్ కాకపోవడం వల్ల తేడాలుంటాయి.అలాంటి సందర్భాల్లో ట్యాక్స్ చెల్లించమంటారు.ఆ సర్దుబాటు ఆర్డర్లు ఉంటాయి.మీరు వాటితో ఏకీభవిస్తేనే పన్ను కట్టండి. ఒప్పుకోకపోతే అంటే అంగీకరించకపోతే డాక్యుమెంట్లు పొందుపరుస్తూ జవాబు ఇవ్వండి.స్క్రూటినీకి ఎంపిక అయితే ఏయే సమాచారం ఇవ్వాలో అడుగుతారు. ఇవ్వండి.ముందుగా AGREE/ NOT AGREE చెప్పండిఅనవసరంగా వాయిదాలు అడగొద్దు. అవసరం అని తెలిస్తేనే టైం అడగండిఅంతా ఫేస్లెస్ ... మీ మీద ఎటువంటి ఒత్తిళ్లు ఉండవు.అధికారులు ఎంతో ఓపికగా మీ రిప్లై చదువుతారు.సాధారణంగా తప్పులేం జరగవుఅవసరం అయితే నిబంధనల మేరకు మీరు అప్పీల్కు వెళ్లవచ్చు. -
మీ కార్డు సంపాదిస్తోందా?
చాలామందికి క్రెడిట్ కార్డంటే భయం. ప్రమాదాన్ని జేబులో పెట్టుకున్నట్లే భావిస్తారు. కానీ కొంచెం తెలివిగా... క్రమశిక్షణతో వాడితే క్రెడిట్ కార్డుతో లాభమే ఎక్కువ. పైసా వడ్డీ చెల్లించక్కర్లేదు. పైపెచ్చు కాస్త సంపాదించుకోవచ్చు కూడా. వీటన్నిటికీ తోడు హోటళ్లు, సినిమా టికెట్లు, ప్రయాణ టికెట్లపై ఎప్పటికప్పుడు ఆఫర్లూ వస్తాయి. ఎయిర్పోర్ట్ లాంజ్లలో ఉచిత సదుపాయాలు... ఆన్లైన్ షాపింగ్ చేసినప్పుడు నో–కాస్ట్ ఈఎంఐ తీసుకుంటే... రూపాయి వడ్డీలేకుండా వాయిదాల్లో చెల్లించుకునే అవకాశం... ఇలా చాలా లాభాలుంటాయి. కాకపోతే ఒక్కటే షరతు. ఏ క్రెడిట్ కార్డుపై ఎంత కొన్నా... బిల్లు గడువు తేదీ ముగిసేలోగా పూర్తిగా చెల్లించెయ్యాలి. అలాకాకుండా ఈ సారి మినిమం బిల్లు చెల్లిస్తే సరిపోతుందిలే అనుకున్నారో...! మీ పని అయిపోయినట్లే!!.సరైన ఆదాయం లేకపోవటమో... అప్పులంటే భయమో... లేదా సమాచారం లేకపోవటమో... ఏదైనా కావచ్చు. మన దేశంలో క్రెడిట్ కార్డుల వినియోగం చాలా తక్కువ. మన జనాభాలో వీటిని వాడుతున్నవారు ఐదారు శాతానికి మించి లేరు. అమెరికా లాంటి దేశాల్లో ఏకంగా 80 శాతం మందికిపైగా కనీసం ఒక్క క్రెడిట్ కార్డయినా వాడతారు. అందుకే ఈ క్రెడిట్ కార్డుల వ్యాపార విస్తరణకు దేశంలో విపరీతమైన అవకాశాలున్నాయి కాబట్టే... కంపెనీలు రకరకాల ఆఫర్లిస్తూ మరింతమందికి చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నాయి.ఇదీ.. అసలైన లాభం ప్రతి క్రెడిట్ కార్డుకూ ఓ లిమిట్ ఉంటుంది. ఉదాహరణకు రాఘవకు యాక్సిస్ బ్యాంకు కార్డుంది. దాని లిమిట్ రూ.6 లక్షలు. అంటే రూ.6 లక్షల వరకూ తను వాడుకోవచ్చన్న మాట. మరి ఆ కార్డు జేబులో పెట్టుకుంటే... తన జేబులో రూ.6 లక్షలున్నట్లే కదా? ఆసుపత్రి వంటి ఎంత ఎమర్జెన్సీ వచి్చనా... డబ్బుల కోసం ఇబ్బంది పడకుండా దీన్ని వాడొచ్చు. ఇలాంటి ఎమర్జెన్సీల కోసం డబ్బును సేవింగ్స్ ఖాతాల్లో ఉంచుకోవాల్సిన పనిలేదు కూడా. ఇక ప్రతి కార్డుకూ బిల్లింగ్ తేదీ... చెల్లించడానికి గడువు తేదీ ఉంటాయి. ప్రతి బిల్లింగ్ తేదీకి 30 రోజుల సైకిల్... చెల్లించడానికి మరో 15 రోజుల గడువు ఉంటాయి. అంటే మొత్తంగా 45 రోజుల వ్యవధన్న మాట. బిల్లింగ్ తేదీ అయిన వెంటనే భారీ మొత్తాన్ని వాడినా అది తదుపరి బిల్లులోనే వస్తుంది. గడువు తేదీ కూడా ఉంటుంది కనక దాదాపు 40 రోజులు వడ్డీ లేకుండా అప్పు దొరికినట్లన్న మాట. దాన్ని గడువులోపు చెల్లించేస్తే వాడిన మొత్తంపై పైసా వడ్డీ కూడా ఉండదు.ఇదీ.. ప్రమాదానికి సంకేతం మీరు కార్డుపై ఆ నెల అవసరం కొద్దీ రూ.2 లక్షలు వాడారనుకుందాం. తదుపరి నెల బిల్లులో వాడుకున్న మొత్తాన్ని చూపించటంతో పాటు... ఒకవేళ మీరు దాన్ని చెల్లించలేకపోతే వాడినదాంట్లో 5 శాతాన్ని చెల్లించవచ్చని (మినిమం బిల్) పేర్కొంటారు. అంటే రూ.10వేలు చెల్లిస్తే చాలు. అది ఈజీ కూడా. కానీ మిగిలిన మొత్తంపై 36 శాతానికిపైగా వార్షిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అంటే మరో నెల గడిస్తే మరో 3 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. పైపెచ్చు కనీస బిల్లు కూడా చెల్లించకపోతే ఆపరాధ రుసుములు భారీగా ఉంటాయి. మీ లిమిట్ను దాటి వాడినా భారీ చార్జీలు చెల్లించాలి. వీటివల్ల ఆర్థిక పరిస్థితులు తల్లకిందులయిపోతాయి. ప్రతినెలా కనీస బిల్లు కట్టుకుంటూ పోతే ఆ రుణం ఎప్పటికీ తీరదని గుర్తుంచుకోవాలి. క్రెడిట్ కార్డుతో అతిపెద్ద ప్రమాదం ఇదే.కో–బ్రాండెడ్ కార్డులు కూడా... చాలా బ్యాంకులు రకరకాల సంస్థలతో జతకట్టి కో–బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు ఆఫర్ చేస్తున్నాయి. ఉదాహరణకు గతంలో సిటీబ్యాంకు ఐఓసీతో జతకట్టి సిటీ–ఐఓసీ కార్డును ఆఫర్ చేసింది. సిటీ క్రెడిట్ కార్డుల వ్యాపారాన్ని కొనుగోలు చేసిన యాక్సిస్ బ్యాంకు కూడా దాన్ని కొనసాగిస్తోంది. ఐఓసీ బంకులో పెట్రోలు లేదా డీజిల్ పోయించుకుంటే 2 శాతం వరకూ క్యాష్బ్యాక్ వస్తుందన్న మాట. ఆ పాయింట్లను నేరుగా బిల్లు రూపంలో చెల్లించేయొచ్చు కూడా.రోజువారీ వినియోగానికి ఇవి బెస్ట్.. → ఎస్బీఐ క్యాష్ బ్యాక్ కార్డ్: ఆన్లైన్ కొనుగోళ్లపై ఫ్లాట్ 5 శాతం క్యాష్ బ్యాక్ వస్తుంది. → యాక్సిస్ బ్యాంక్ ఏస్: కొనుగోళ్లపై 2–5 మధ్య క్యాష్ బ్యాక్. గూగుల్ పేతో లింక్ చేసుకోవచ్చు. → హెచ్డీఎఫ్సీ రిగాలియా: ప్రయాణాలు, రెస్టారెంట్లలో చెల్లింపులపై రివార్డులు.ఇలా చేయొద్దు... → కార్డుపై చేసే చెల్లింపుల్లో కొన్నింటిని ఈఎంఐ కిందకు మార్చుకోవచ్చు. కానీ, ప్రతి నెలా ఇదే ధోరణి అనుసరిస్తే ఈఎంఐలు చెల్లించడం కష్టం. → ఆఫర్లు ఉన్నాయని చెప్పి, అవసరం లేకపోయినా క్రెడిట్ కార్డుతో కొనుగోళ్లు చేయడం స్మార్ట్ కానే కాదు. → వార్షిక ఫీజుపైనా దృష్టి సారించాలి. కొన్ని ఫ్రీగా ఇచ్చినా... కొన్ని సంస్థలు అధిక చార్జీలు వసూలు చేస్తుంటాయి. ఇదీ క్యాష్బ్యాక్ పవర్.. → ఒక నెలలో కార్డుతో ఆన్లైన్లో రూ.30,000 ఖర్చు చేశారు. → 5 శాతం క్యాష్బ్యాక్ ఆఫర్ కింద రూ.1,500 వెనక్కి వస్తుంది. → ఇలా ఒక ఏడాదిలో రూ.18,000 ఆదా చేసుకోవచ్చు. → ఈ మొత్తంతో కుటుంబానికి కావాల్సిన ఆరోగ్య బీమాను సొంతం చేసుకోవచ్చు. ఈక్విటీ ఫండ్లో ఏటా రూ.18,000 చొప్పున పదేళ్లు ఇన్వెస్ట్ చేసుకుంటే, 12 శాతం రాబడి ఆధారంగా రూ.3.53 లక్షలు సమకూరుతుంది. స్మార్ట్ అంటే ఇలా.. → క్రెడిట్కార్డు బిల్లును ప్రతి నెలా గడువులోపు పూర్తిగా చెల్లించేయాలి. → కార్డుతో ఏటీఎం నుంచి నగదు విత్డ్రా చేయనే చేయొద్దు → గడువు తేదీకి చెల్లింపులు జరిగేలా ఆటో డెబిట్ సదుపాయం యాక్టివేట్ చేసుకోవాలి. → లిమిట్ ఉంది కదా అని చెప్పి నియంత్రణ లేకుండా వాడకూడదు. → క్రెడిట్ కార్డులు రెండుకు మించకుండా చూసుకోండి. -
డిసెంబర్ డెడ్లైన్లు.. కొత్త మార్పులు
డిసెంబర్ నెలలో పలు బ్యాంకింగ్, పెన్షన్, ఆదాయపు పన్ను సంబంధించిన కీలక మార్పులు అమలులోకి రానున్నాయి. ఎస్బీఐ ఎంక్యాష్ సేవ నిలిపివేత నుంచి, లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ, పాన్–ఆధార్ లింకింగ్, ఐటీఆర్ గడువులు, ఎన్పీఎస్ నుంచి యూపీఎస్కు మారడానికి ఆప్షన్ గడువు.. ఇలా అనేక అంశాలు గమనించాల్సివి ఉన్నాయి.నవంబర్తో ముగిసే కీలక గడువులుఎస్బీఐ ఎంక్యాష్ సేవ నిలిపివేతస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నవంబర్ 30 తర్వాత ఆన్లైన్ ఎస్బీఐ, యోనో లైట్లో ఎంక్యాష్ (mCASH) సేవలను నిలిపివేస్తోంది. దీని తర్వాత లబ్ధిదారును నమోదు చేయకుండా డబ్బు పంపడం లేదా లింక్ ద్వారా నిధులు స్వీకరించడం సాధ్యం కాదు. బదులుగా వినియోగదారులు యూపీఐ, ఐఎంపీఎస్, నెఫ్ట్, ఆర్టీజీఎస్ వంటి సురక్షిత చెల్లింపు మార్గాలను ఉపయోగించాలని ఎస్బీఐ సూచించింది.లైఫ్ సర్టిఫికేట్ సమర్పణకు చివరి తేదీప్రభుత్వ పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్ను నవంబర్ 30లోపు తప్పనిసరిగా సమర్పించాలి. జీవన్ ప్రమాణ్ పత్రాన్ని ఇంటి వద్ద సేవల ద్వారా, బ్యాంకులు/పోస్టాఫీసుల ద్వారా, డిజిటల్ యాప్ ద్వారా కూడా సమర్పించవచ్చు. గడువు దాటితే పెన్షన్ తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది.ఎన్పీఎస్ నుండి యూపీఎస్కు మార్పు..ఎన్పీఎస్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS)కి మారడానికి నవంబర్ 30 చివరి అవకాశం ఉంది. దరఖాస్తులు సీఆర్ఏ వ్యవస్థ ద్వారా లేదా నోడల్ కార్యాలయాలకు భౌతికంగా అందించాలి.డిసెంబర్లో కీలక ఆదాయపు పన్ను గడువులుపన్ను ఆడిట్ కేసుల ఐటీఆర్పన్ను ఆడిట్కి అర్హులైన మదింపుదారుల కోసం ఐటీఆర్ దాఖలు గడువును సీబీడీటీ డిసెంబర్ 10 వరకు పొడిగించింది. అసలు గడువు అక్టోబర్ 31తోనే ముగిసింది.ఆలస్యంగా ఐటీఆర్ దాఖలుఅసలు గడువులో ఐటీఆర్ దాఖలు చేయని పన్ను చెల్లింపుదారులు సెక్షన్ 139(4) కింద డిసెంబర్ 31 వరకు ఆలస్యంగా రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు. ఈ తేదీ తర్వాత దాఖలు చెయ్యడం అసాధ్యం. జరిమానా, వడ్డీ, రిఫండ్ నష్టం వంటి పరిణామాలు ఎదురవచ్చు.పాన్–ఆధార్ లింకింగ్2024 అక్టోబర్ 1 లోపు ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడీ ఆధారంగా పాన్ పొందిన వ్యక్తులు తమ పాన్ ఇనాక్టివ్ కాకుండా ఉండాలంటే డిసెంబర్ 31 లోపు ఆధార్–పాన్ లింకింగ్ పూర్తి చేయాలి. -
ధనికులయ్యే ‘తొలి కిటుకు’ చెప్పేసిన కియోసాకి..
ప్రపంచ ఆర్థిక అంశాలు, పెట్టుబడులపై ఎప్పటికప్పుడు వ్యాఖ్యానించే ప్రముఖ ఆర్థిక రచయిత రాబర్ట్ కియోసాకి ఒక కఠినమైన హెచ్చరికను జారీ చేశారు. మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రపంచ ఆస్తి బుడగ పేలడం ప్రారంభించిందని, అత్యంత ప్రభావవంతమైన "క్యారీ ట్రేడ్"కు జపాన్ ముగింపు పలుకుతోందని హెచ్చరించారు.ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor) రచయిత.. జపాన్ "క్యారీ ట్రేడ్" అంటే అతి-తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు ఇచ్చే దీర్ఘకాల పద్ధతి గురించి సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ (ట్విటర్)లో వరుస పోస్టులలో వ్యాఖ్యానించారు. ఈ విధానం ద్వారా ప్రపంచ రియల్ ఎస్టేట్, ఈక్విటీలు, బాండ్లు, కమాడిటీలు, ప్రైవేట్ వ్యాపారాలలోకి ప్రవహించిన మూలధనం ప్రపంచవ్యాప్తంగా వాటి ధరలను పెంచడానికి సహాయపడిందని పేర్కొన్నారు.కియోసాకి (Robert Kiyosaki ) ప్రకారం.. ఈ అనూహ్య తిరోగమనం ఇప్పుడు యు.ఎస్. థాంక్స్ గివింగ్ సమయంలో "చరిత్రలో అతిపెద్ద క్రాష్"ను ప్రేరేపిస్తోంది. మార్కెట్లు కుదుపునకు లోనవుతున్నప్పుడు ఆ సంక్షోభానికి చిక్కకుండా ధనవంతులు కావడానికి ఏం చేయాలో తాను 10 వ్యూహాలను చెబుతానన్న కియోసాకి తన తొలి కిటుకును బయట పెట్టేశారు.తొలి వ్యూహం ఇదే.. కియోసాకి మొదటి సూచన చమురు, సహజ వాయువు వంటి ఇంధనాలపై పెట్టుబడులు పెట్టడం. కృత్రిమ మేధస్సులో వేగవంతమైన పురోగతి ప్రపంచ ఇంధన డిమాండ్ను గణనీయంగా పెంచుతుందని, సాంప్రదాయ ఇంధన ఉత్పత్తిదారులు ప్రయోజనం పొందుతారన్న ఆయన తాను ఇంధన రంగంలోనే పెట్టుబడుతున్నట్లు వెల్లడించారు.కోట్లాది మంది ఉద్యోగాలు పోయి, ఆస్తులు పోగొట్టుకుని బికారులయ్యే ఈ తరుణంలో ‘నేను ధనవంతున్ని కావాలని ప్లాన్ చేస్తున్నాను’ అంటూ రాసుకొచ్చిన ఆయన ఉద్యోగ మార్కెట్పైనే రియల్ ఎస్టేట్ మార్కెట్ ఆధారపడి ఉంటుందన్న తన ‘రిచ్ డాడ్’ పాఠాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు.ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిపోయినా మీరు మాత్రం ధనికులు కావచ్చని తనను అనుసరించేవారికి కియోసాకి సూచించారు. తన నుంచి మరిన్ని సూచనలు రాబోతున్నాయన్న ఆయన ఇవి కేవలం తన సూచనలు మాత్రమేనని, సిఫార్సులు కాదని స్పష్టం చేశారు.30 YEAR BUBBLE BURSTINGJapan ends “CARRY TRADE” ending.For 30 years Japan has loaned billions to investors in global markets, and money flowed into real estate, stocks, bonds, commodities & businesses. The Japanese “carry trade” blew the assets of the world….into the…— Robert Kiyosaki (@theRealKiyosaki) November 29, 2025 -
ఖాతాల్లోనే మిగిలిపోయిన డబ్బు.. ఇక ఒకే పోర్టల్!
క్లెయిమ్ చేయకుండా ఖాతాల్లోనే మిగిలిపోయిన డిపాజిట్లు, పెన్షన్ ఫండ్, షేర్లు, డివిడెండ్లను క్లెయిమ్ చేసుకోవడంలో ప్రజలకు సహాయకరంగా ఉండేలా రిజర్వ్ బ్యాంక్తో కలిసి సమగ్ర పోర్టల్ను రూపొందించడంపై కసరత్తు చేస్తున్నట్లు ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం నాగరాజు తెలిపారు. త్వరలోనే దీన్ని ప్రారంభించే అవకాశం ఉందని పేర్కొన్నారు.అన్క్లెయిమ్డ్ అసెట్స్ కోసం ఉద్గాం పేరుతో ఆర్బీఐ, మిత్ర పేరిట మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ, బీమా భరోసా పేరుతో బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ ఐఆర్డీఏఐ వేర్వేరు పోర్టల్స్ నిర్వహిస్తున్నాయి. ’మీ డబ్బు, మీ హక్కు’ పేరిట అన్క్లెయిమ్డ్ అసెట్స్పై అక్టోబర్ 4న కేంద్ర ఆర్థిక మంత్రి దేశవ్యాప్తంగా మూడు నెలల పాటు నిర్వహించే అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఆర్బీఐ, ఐఆర్డీఏఐ, సెబీ, ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ (ఐఈపీఎఫ్ఏ)తో కలిసి ఆర్థిక సేవల విభాగం దీన్ని ప్రారంభించింది. ఇప్పటికే రూ. 1,887 కోట్ల మొత్తాన్ని సిసలైన యజమానులు లేదా వారి నామినీలకు అందజేసినట్లు నాగరాజు వివరించారు. అవగాహన లేకపోవడం లేదా అకౌంట్ వివరాలను అప్డేట్ చేయకపోవడం వల్ల చాలా ఖాతాల్లో బీమా పాలసీ క్లెయిమ్లు, బ్యాంక్ డిపాజిట్లు, డివిడెండ్లు, షేర్లు, మ్యుచువల్ ఫండ్స్ ద్వారా వచ్చే నిధులు పెద్ద మొత్తంలో ఉండిపోతున్నాయి. వీటిని అన్–క్లెయిమ్డ్ అసెట్స్గా పరిగణిస్తున్నారు. -
‘శ్రేయోభిలాషుల’తో బతుకు బస్స్టాండ్!
కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయిని, మీ భవిష్యత్తు కోసం జాగ్రత్తగా వేసే ప్రతి అడుగును.. మీ చుట్టూ ఉండే కొంతమంది తెలియకుండానే లేదా కావాలనే వెనక్కి లాగుతుంటారు. తరచుగా మన ఆర్థిక కష్టాలకు మార్కెట్ హెచ్చుతగ్గులు, తక్కువ జీతం ఉందని నిందిస్తాం. కానీ నిజమైన శత్రువులు మన పక్కనే ఉంటారని గుర్తుంచుకోండి. వీరి ఆలోచనా విధానాలు, ఆర్థిక అలవాట్లు మనపై తీవ్ర ప్రభావాన్ని చూపి పేదవారిగా మార్చేస్తుంటారు. మనల్ని పేదవారిగా మార్చే ఈ వ్యక్తులు ఎవరు? వారి మనస్తత్వం మన భవిష్యత్తును ఎలా దెబ్బతీస్తుందో తెలుసుకుందాం.ఖర్చులను ప్రోత్సహించడంపేద మనస్తత్వం ఉన్నవారు సాధారణంగా తక్షణ లభించే సంతృప్తిని కోరుకుంటారు. పొదుపు చేయడాన్ని లేదా పెట్టుబడి పెట్టడాన్ని వాయిదా వేస్తూ ‘రేపటి గురించి ఎవరి తెలుసు?’ అనే ధోరణితో ఉంటారు. అలాంటివారు మిమ్మల్ని తరచుగా అనవసరమైన విందులకు, పార్టీలకు లేదా ఫ్యాషన్ వస్తువులకు ఖర్చు పెట్టమని ప్రోత్సహిస్తారు. దీనివల్ల మీ బడ్జెట్ను దాటి ఖర్చు చేస్తారు. ‘అందరూ కొంటున్నారు, నువ్వు కొనకపోతే ఎలా?’ అనే ఒత్తిడికి లోనై అప్పులు చేయక తప్పదు.నిరాశావాదంకొందరు ఆర్థిక విజయానికి కృషి చేయడం కంటే తమ పేదరికానికి వ్యవస్థను, ప్రభుత్వాన్ని, లేదా ఇతరులను నిందించడానికి మొగ్గు చూపుతారు. వారి నిరాశావాదం మీ లక్ష్యాలను చేరుకునే ప్రయత్నంలో ఆటంకం కలిగిస్తుంది. ‘డబ్బు సంపాదించడం కేవలం అదృష్టవంతులకే సాధ్యం’, ‘ఈ వయసులో పొదుపు చేయడం ఎందుకు?’ వంటి మాటలు మీలోనూ నిరుత్సాహాన్ని పెంచి కొత్తగా పెట్టుబడులు పెట్టాలనే ఆలోచనను చంపేస్తాయి.తప్పుడు సలహాలుకొందరి సొంత ఆర్థిక జీవితాలు గందరగోళంగా ఉన్నప్పటికీ మీకు అనవసరమైన, అధిక రిస్క్ కూడిన పథకాల్లో డబ్బు పెట్టమని సలహా ఇవ్వవచ్చు. వారి సలహాలు విని మీరు పదేపదే తప్పుడు పెట్టుబడులు పెట్టి నష్టపోతారు. ముఖ్యంగా త్వరగా డబ్బు సంపాదించాలనే పథకాలపై దృష్టి పెట్టడం వల్ల మీ సంపద కరిగిపోతుంది.ఈ విషవలయం నుంచి బయటపడే మార్గంతమ ఆర్థిక స్థితితో మీ స్థితిని పోల్చుకునే వారితో దూరం పాటించండి.‘నో’ అనడం నేర్చుకోండి. అది మీ డబ్బుకి రక్షణ కవచం.మీ ఆర్థిక లక్ష్యాలను ఎవరితోనూ షేర్ చేయకండి. ఎగతాళి చేసే వారు ఎక్కువ.ఆదా, పెట్టుబడి, ఆర్థిక స్వాతంత్ర్యం గురించి మాట్లాడే వారితోనే స్నేహం చేయండి.ఇదీ చదవండి: భారత్-రష్యా ఒప్పందాలపై అంచనాలు -
భారీగా బ్యాంకు సెలవులు.. చివరి నెలలో తెరిచేది కొన్ని రోజులే..
నవంబర్ నెల ముగుస్తోంది. సంవత్సరంలో చివరి నెల డిసెంబర్ ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో రానున్న నెలలో చేయాల్సిన పనుల గురించి చాలా మంది ముందుగా షెడ్యూల్ వేసుకుంటూ ఉంటారు. వాటిలో ముఖ్యమైనవి బ్యాంకు పనులు. అయితే ఇందు కోసం బ్యాంకు బ్రాంచిలు ఏ రోజుల్లో తెరిచి ఉంటాయి.. ఎప్పుడు సెలవులు ఉంటాయన్నది తెలుసుకోవడం ముఖ్యం. ఈ నేపథ్యంలో రానున్న నెలలో బ్యాంకు సెలవులు ఏయే రోజుల్లో ఉన్నాయో ఇక్కడ అందిస్తున్నాం..రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) క్యాలెండర్ ప్రకారం.. ప్రభుత్వ సెలవు దినాలు, వారాంతపు మూసివేత కారణంగా డిసెంబరులో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో బ్యాంకులు దాదాపు 18 రోజులు మూసి ఉంటాయి. సెలవుల జాబితాలో ఆదివారాలు, రెండవ, నాల్గవ శనివారాలతోపాటు జాతీయ, ప్రాంతీయ పండుగలు, ప్రత్యేక సందర్భాలు ఉన్నాయి.సెలవు దినాలలో అన్ని బ్యాంకు బ్రాంచీల వద్ద సేవలు అందుబాటులో ఉండవు. కాబట్టి ఖాతాదారులు తమ బ్యాంకుల ప్రాంతీయ సెలవు క్యాలెండర్ ప్రకారం బ్రాంచీ సందర్శనలను ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, సెలవు దినాలలోనూ ఆల్లైన్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) పేమెంట్స్, నెట్ బ్యాంకింగ్, ఏటీఎం లావాదేవీలు వంటి ఆన్లైన్ సేవలను వినియోగించుకోవచ్చు.డిసెంబర్లో సెలవులు ఇవే..డిసెంబర్ 1 - అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ లలో రాష్ట్ర అవతరణ దినోత్సవండిసెంబరు 3 - గోవాలో సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ పండుగడిసెంబరు 7- ఆదివారండిసెంబరు 12 - మేఘాలయలో పా టోగన్ నెంగ్మింజా సంగ్మా వర్ధంతిడిసెంబర్ 13 - రెండో శనివారండిసెంబరు 14- ఆదివారండిసెంబర్ 18 - మేఘాలయలో యు సోసో థామ్ వర్ధంతి సందర్భంగాడిసెంబర్ 19- గోవాలో విమోచన దినోత్సవండిసెంబర్ 20 - సిక్కిం, గోవాలో లోసూంగ్ / నామ్సూంగ్డిసెంబరు 21- ఆదివారండిసెంబర్ 22 - సిక్కింలో లోసూంగ్ / నామ్సూంగ్డిసెంబర్ 24 - మిజోరం, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో క్రిస్మస్డిసెంబర్ 25 - క్రిస్మస్ సందర్భంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో బ్యాంకుల మూసివేతడిసెంబర్ 26 - మిజోరం, నాగాలాండ్, మేఘాలయలలో క్రిస్మస్ వేడుకలుడిసెంబర్ 27 - నాలుగో శనివారండిసెంబరు 28- ఆదివారండిసెంబర్ 30 - మేఘాలయలో యు కియాంగ్ నంగ్బా వర్ధంతిడిసెంబర్ 31 - మిజోరాం, మణిపూర్ లలో నూతన సంవత్సర వేడుకలు / ఇమోయిను ఇరాట్పా -
రిజైన్ చేసిన రెండు రోజుల్లోనే ఫైనల్ సెటిల్మెంట్
కొత్త లేబర్ కోడ్ అమలులోకి వస్తున్న క్రమంలో ఇప్పటి వరకూ ఒక్కో కంపెనీ ఒక్కో రకంగా లేదా అనధికారికంగా అనుసరిస్తున్న పలు ప్రక్రియలు ఇప్పుడు అధికారికంగా ఒకే రకంగా ప్రామాణీకరణ చెందుతున్నాయి. అలాంటి ప్రక్రియల్లో ఒకటే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ (FnF).ఉద్యోగులు రాజీనామా చేసినప్పుడు లేదా వారిని యాజమాన్యాలు తొలగించిన సందర్భంలో గ్రాట్యుటీ, లీవ్ ఎన్క్యాష్మెంట్, శాలరీ బకాయిలు, బోనస్, ఇన్సెంటివ్లు, పీఎఫ్/ఈఎస్ఐ సంబంధిత ఏర్పాట్లు వంటి అనేక చట్టబద్ధ సెటిల్మెంట్లు ఉంటాయి. వీటిని ఇప్పటి వరకూ కొన్ని కంపెనీలు ఉద్యోగుల సర్వీస్ కాలం ముగింపు రోజే అంటే చివరి పనిదినమే చెల్లిస్తుండగా మరికొకొన్ని కంపెనీలు 30 రోజుల చట్టబద్ధమైన కాలపరిమితిలో చెల్లించేవి.ఇప్పుడు కొత్త లేబర్ కోడ్ ప్రకారం.. కంపెనీలు ఉద్యోగుల ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ డబ్బును రెండు పనిదినాల్లో చెల్లించాలి. ఈ విషయంలో గందరగోళం లేకుండా యాజమాన్యాలన్నీ ఒకే విధమైన ప్రక్రియను అనుసరించేలా కేంద్ర కార్మిక శాఖ ప్రామాణీకరిస్తోంది. అయితే గ్రాట్యుటీ చెల్లింపునకు మాత్రం విడిగా కాల వ్యవధి ఉంటుంది.కాగా 2026 ఏప్రిల్ 1 లోపు నాలుగు లేబర్ కోడ్ల కింద నిబంధనలను నోటిఫై చేయడానికి కేంద్రం సన్నద్ధమవుతోందని, కొత్త కార్మిక నిబంధనలను వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే అమలు చేయడానికి ఇదే కాలక్రమాన్ని అనుసరించాలని రాష్ట్రాలకు సూచించిందని కార్మిక కార్యదర్శి వందన గుర్నానీ తెలిపారు.కొత్త నిబంధన వల్ల ఉద్యోగులకు ప్రయోజనాలుఉద్యోగి రాజీనామా చేసిన వెంటనే రెండు రోజుల్లో సెటిల్మెంట్ రావడంతో కొత్త ఉద్యోగానికి మారుతున్నవారికి లేదా మధ్యలో గ్యాప్ తీసుకున్నవారికి ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది.కంపెనీలు ఏదైనా కారణం చెప్పి సెటిల్మెంట్ ఆలస్యం చేయడం ఇక సాధ్యం కాదు. మోసాలు, అన్యాయాలపై నియంత్రణ పెరుగుతుంది.సెటిల్మెంట్ ఆలస్యం కారణంగా వచ్చే వివాదాలు, కేసులు తగ్గుతాయి.ఇది చదివారా? ఉద్యోగుల చేతికొచ్చే జీతం తగ్గుతుందా?కంపెనీలపై ప్రభావంహెచ్ఆర్ & ఫైనాన్స్ ప్రక్రియలలో కఠినమైన క్రమశిక్షణ అవసరమౌతుంది. రెండు రోజుల్లో సెటిల్మెంట్ చేయాలంటే హెచ్ఆర్ ఎగ్జిట్ ఫార్మాలిటీలను వేగంగా పూర్తి చేయాలి. ఫైనాన్స్ టీమ్ వెంటనే క్లియరెన్స్ ఇవ్వాలి. ఈ మేరకు సిస్టమ్లు ఆటోమేటెడ్ కావాలి.రెండు రోజుల్లో సెటిల్మెంట్ పెద్ద కంపెనీలకు సమస్య కాకపోయినా చిన్న, మధ్య తరహా సంస్థలు వెంటనే చెల్లింపుల కోసం క్యాష్ రిజర్వులు ఉంచుకోవాల్సి ఉంటుంది. లేబర్ కోడ్ ఉల్లంఘనకు జరిమానాలు, లీగల్ ఇష్యూలు వస్తాయి. కాబట్టి కంపెనీలు తమ ఎస్వోపీలను అప్డేట్ చేయాలి.రెండు రోజుల్లో సెటిల్మెంట్ చేయడానికి మాన్యువల్ ప్రాసెస్ కష్టసాధ్యమౌతుంది. ఫలితంగా ఆటోమేషన్, హెచ్ఆర్ఎంఎస్, పేరోల్ టూల్స్ డిమాండ్ పెరుగుతుంది. -
ఐటీఆర్ ఫైలింగ్లో తప్పులు.. నోటీసులు వస్తే ఏం చేయాలి?
ఆదాయపన్ను రిటర్నుల (ఐటీఆర్)ను దాఖలు చేయడం పన్ను చెల్లింపుదారుల బాధ్యత. అయితే, తెలియక చేసిన తప్పులు, ముఖ్యంగా విదేశీ ఆస్తుల వంటి కీలక వివరాలను వెల్లడించకపోవడం వంటి అంశాల్లో ఐటీ డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు (లేదా ఎస్ఎంఎస్/ఈ-మెయిల్స్) అందుకునే అవకాశం ఉంది. 2025–26 అసెస్మెంట్ ఇయర్ (ఏవై)కి సంబంధించిన ఐటీఆర్ల్లో విదేశీ ఆస్తుల వివరాలను వెల్లడించని పన్నుదారులకు ఇలాంటి నోటీసులు పంపబోతున్నట్లు ఐటీ శాఖ తెలిపింది.ఐటీ డిపార్ట్మెంట్ అత్యాధునిక సాంకేతికత, అంతర్జాతీయ సమాచార మార్పిడి ఒప్పందాల (ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ - ఏఈఓఐ) ద్వారా పన్నుదారుల ఆర్థిక లావాదేవీల గురించి సులభంగా తెలుసుకోగలుగుతోంది. విదేశీ జ్యూరిస్డిక్షన్ల నుంచి అందిన సమాచారం ఆధారంగా, విదేశాల్లో ఆస్తులు కలిగి ఉండి కూడా ఐటీఆర్లో ఆ వివరాలను పేర్కొనని వారికి ఐటీ శాఖ ఎస్ఎంఎస్లు/ఈ-మెయిల్స్ పంపడానికి సిద్ధమైంది.‘హై–రిస్క్’ కేసులుతొలి దశలో భాగంగా దాదాపు 25,000 ‘హై–రిస్క్’ కేసులుగా పరిగణిస్తున్న వారికి త్వరలో ఎస్ఎంఎస్లు/ఈ–మెయిల్స్ పంపనున్నారు. చట్టపరమైన చర్యలను నివారించడానికి వీరు 2025 డిసెంబర్ 31లోగా సవరించిన ఐటీఆర్ (Revised ITR)ను దాఖలు చేయాలని సూచించారు. గత ఏడాది కూడా ఇలాగే నోటీసులు పంపినప్పుడు మొత్తం 24,678 మంది పన్నుదారులు రూ.29,208 కోట్ల విలువైన విదేశీ అసెట్స్ వివరాలను పొందుపరుస్తూ సవరించిన ఐటీఆర్లను దాఖలు చేశారు. ఇది పన్ను ఎగవేతదారులను గుర్తించే విషయంలో డిపార్ట్మెంట్ సామర్థ్యాన్ని స్పష్టం చేస్తోంది.ఐటీ శాఖ ఇప్పటికే జూన్ వరకు 1,080 కేసులను మదింపు చేసి రూ.40,000 కోట్లకు సంబంధించి డిమాండ్ నోటీసులు పంపింది. ఢిల్లీ, ముంబై, పుణె వంటి నగరాల్లో సోదాలు కూడా నిర్వహించారు.నోటీసులకు ఎలా స్పందించాలి?ఐటీ డిపార్ట్మెంట్ నుంచి ఎస్ఎంఎస్, ఈ-మెయిల్ లేదా అధికారిక నోటీసు అందుకున్నప్పుడు పన్ను చెల్లింపుదారుడు భయాందోళనకు గురికాకుండా చట్టబద్ధంగా స్పందించాలి. నోటీసులు ఏ సెక్షన్ కింద వచ్చింది? (ఉదాహరణకు, సవరించిన ఐటీఆర్ను దాఖలు చేయమని తెలిపే సమాచార మెయిల్ కావచ్చు, లేదా సెక్షన్ 143(2) కింద మదింపు నోటీసు కావచ్చు.) అనే వివరాలు తెలుసుకోవాలి. నోటీసు దేని గురించి.. ఆదాయం తక్కువగా చూపడం, ఖర్చులను ఎక్కువగా చూపడం లేదా విదేశీ ఆస్తుల వివరాలు వెల్లడించకపోవడం వంటివాటిలో ఏది? అనే దాన్ని పరిశీలించాలి. నోటీసుకు స్పందించడానికి నిర్దిష్టంగా ఇచ్చిన గడువును గుర్తించాలి.సవరించిన ఐటీఆర్ దాఖలువిదేశీ ఆస్తుల వెల్లడి విషయంలో డిపార్ట్మెంట్ స్నేహపూర్వకంగా సవరించిన ఐటీఆర్ను దాఖలు చేయమంటూ ఎస్ఎంఎస్/ఈ-మెయిల్ పంపినట్లయితే అది చట్టపరమైన చర్యల నుంచి తప్పించుకోవడానికి ఇచ్చిన ఒక అవకాశంగా భావించాలి. పన్ను చెల్లింపుదారు తక్షణమే తన ఐటీఆర్ను సమీక్షించి విదేశీ బ్యాంకు ఖాతాలు, ఆస్తులు, మూలధన లాభాలు లేదా ఇతర విదేశీ ఆదాయాల వివరాలను తప్పనిసరిగా చేర్చి సవరించిన ఐటీఆర్ను దాఖలు చేయాలి. సవరించిన రిటర్న్ ద్వారా అదనపు పన్ను చెల్లించాల్సి వస్తే ఆలస్య రుసుముతో సహా ఆ మొత్తాన్ని వెంటనే చెల్లించాలి. ఈ చర్య చట్టపరమైన చర్యలను (పెనాల్టీలు, ప్రాసిక్యూషన్ వంటివి) నివారించడానికి ఉపకరిస్తుంది.చట్టపరమైన చిక్కుల నివారణసమయానికి స్పందించడం అనేది జరిమానాలు, ప్రాసిక్యూషన్ వంటి తీవ్ర పరిణామాలను నివారించడానికి దోహదం చేస్తుంది. నోటీసులో పేర్కొన్న గడువులోగా స్పందించడం అత్యంత ముఖ్యం. గడువు దాటితే డిపార్ట్మెంట్ ఏకపక్షంగా మదింపును పూర్తి చేసే అవకాశం ఉంది. నోటీసులు క్లిష్టంగా లేదా పెద్ద మొత్తాలకు సంబంధించినవైతే పన్ను నిపుణులు, చార్టర్డ్ అకౌంటెంట్ల (సీఏ) సహాయం తీసుకోవడం ఉత్తమం. వారు నోటీసును విశ్లేషించి చట్ట ప్రకారం సరైన స్పందనను సిద్ధం చేయడంలో సహాయపడతారు. ఐటీ డిపార్ట్మెంట్ విచారణలో పూర్తి సహకారం అందించాలి. అడిగిన అన్ని పత్రాలను, వివరాలను ఆలస్యం చేయకుండా సమర్పించాలి.ఇదీ చదవండి: ‘కేంద్రం లేబర్ కోడ్స్ మాకొద్దు’.. అందులో ఏముంది? -
రిచ్గా కనిపిస్తున్నారా? రిచ్గా మారుతున్నారా?
స్పోర్ట్స్ కారు, ఖరీదైన వాచ్, చేతి నిండా షాపింగ్ బ్యాగ్లు.. బయటికి చూస్తే అతడు కోటీశ్వరుడు! కానీ తన క్రెడిట్ కార్డు బిల్లులు, బ్యాంకు రుణాల చిట్టా చూస్తే మాత్రం కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. రిచ్గా కనిపించడానికి భారీగా అప్పు చేశాడు. మరోవ్యక్తి అనవసర ఆండంబరాలకు పోకుండా మంచి పెట్టుబడి సాధనాల్లో పొదుపు చేస్తూ దీర్ఘకాలంలో భారీ సొమ్ము పోగు చేశాడు. తర్వాత తన అవసరాలకు ఖర్చు చేస్తున్నాడు. నేటి సమాజంలో నిజంగా ధనవంతులుగా మారడానికి ప్రయత్నించే వారి కంటే, అప్పుల ఊబిలో కూరుకుపోయి ధనవంతులుగా నటించే వారే ఎక్కువైపోతున్నారు. పొరుగువారిని మెప్పించాలనే ఉద్దేశంతో లేనిపోని ఖర్చులు చేస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.రిచ్గా కనిపించడానికి చేసే ఖర్చులు కొన్ని..చాలామంది వ్యక్తులు ఇతరుల దృష్టిలో ధనవంతులుగా, విజయవంతమైనవారిగా కనిపించడానికి తమ సంపాదనలో సింహభాగాన్ని ఖర్చు చేస్తారు. ఈ ఖర్చులు సాధారణంగా అప్పులు లేదా అధిక వడ్డీకి దారితీయవచ్చు.అవసరం లేకపోయినా కేవలం స్టేటస్ సింబల్ కోసం ఖరీదైన హ్యాండ్బ్యాగ్లు, బట్టలు, యాక్సెసరీలు కొంటారు. ఇవి ఆస్తులు కావు, విలువ కోల్పోయే వస్తువులని గుర్తుంచుకోవాలి.స్తోమతకు మించిన లగ్జరీ కార్లు కొనడం, వాటి ఈఎంఐలు, నిర్వహణ ఖర్చుల కోసం ఇబ్బందులు పడుతుంటారు. కారు విలువ తగ్గుతూ ఉంటుంది, కానీ అప్పు భారం మాత్రం పెరుగుతూనే ఉంటుంది.నిత్యం ఖరీదైన రెస్టారెంట్లు, పబ్లు, విదేశీ పర్యటనలకు వెళ్లడం, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా ఇతరుల నుంచి ప్రశంసలు పొందాలని ఆశిస్తారు.అవసరం కంటే పెద్ద ఇల్లు కొనడం లేదా అద్దెకు తీసుకుంటారు. కేవలం రిచ్ ఏరియాలో నివసించాలనే ఉద్దేశంతో అధిక అద్దె చెల్లిస్తారు.నిజంగా రిచ్గా మారాలంటే అనుసరించాల్సిన మార్గాలునిజమైన సంపద అంటే బ్యాంకు ఖాతాలో భారీ మొత్తంలో డబ్బు, నిరంతరాయంగా వచ్చే ఆదాయ వనరులు కలిగి ఉండటం. నిజమైన ధనవంతులు ఖర్చు చేయడంలో కాకుండా సంపద సమకూర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు.ఇతరులను మెప్పించడం అనే ఆలోచనను వదిలి తమ వ్యక్తిగత ఆర్థిక భద్రతపై దృష్టి పెట్టాలి.ఎంత సంపాదించినా దానికి తగినట్టుగా ఖర్చును పెంచకుండా, ఒక కచ్చితమైన బడ్జెట్ను అనుసరించాలి.వెంటనే వచ్చే సంతృప్తి (Instant Gratification) కంటే దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల సాధనకు ప్రాధాన్యత ఇవ్వాలి.ఆదాయం, ఖర్చులను ట్రాక్ చేసి ప్రతి నెలా కచ్చితమైన బడ్జెట్ను అనుసరించాలి.అధిక వడ్డీ ఉండే క్రెడిట్ కార్డు అప్పులు, వ్యక్తిగత రుణాలను ముందుగా తీర్చేయాలి.జీతం రాగానే ఖర్చు చేయడానికి ముందే, కొంత మొత్తాన్ని నేరుగా పొదుపు ఖాతాలోకి లేదా పెట్టుబడిలోకి మళ్లించాలి.ఇదీ చదవండి: రికార్డు స్థాయిలో చమురు దిగుమతులు -
జీవిత బీమాతో మహిళలకు పన్నుల ఆదా
జీవిత బీమాను ఒకప్పు డు పురుషులు తమ కుటుంబాన్ని రక్షించుకోవడానికిమరియు పన్ను భారం తగ్గించుకోవడానికిఉపయోగించేసాధనంగా భావించేవారు. ఇప్పు డు మహిళలు కూడా అదే ప్రయోజనాలు పొందుతూ తమ ఆర్థిక భవిష్యత్తును బలపరుస్తున్నారు.మహిళల కోసం జీవిత బీమా పన్ను ప్రయోజనాలు వారికిపన్ను కు వచ్చే ఆదాయాన్ని తగ్గించడంలో, పన్ను లేకుండా వచ్చే మొత్తాలను పొందడంలో, మరియు ఆర్థిక భదత్రను నిర్మించడంలో సహాయపడుతాయి. ఈ ప్రయోజనాలను అర్థం చేసుకోవడం మహిళలకు సంపదను పెంచుకోవడంలో మరియు రక్షించుకోవడంలో జీవితబీమాను తెలివైన సాధనంగా మారుస్తుంది.జీవిత బీమాతో ఆదాయ పన్ను ప్రయోజనాలుజీవిత బీమా మీ కుటుంబాన్ని ఆర్థికంగా రక్షించడమేకాదు, ఆదాయ పన్ను చట్టం పక్రారం మంచి పన్ను ప్రయోజనాలను కూడా ఇస్తుంది. ఇప్పు డు ఇవి ఏవో చూద్దాం.1. ప్రీమియంపైపన్ను తగ్గింపు (సెక్షన్ 80C)జీవిత బీమా పాలసీలకు చెల్లించిన ప్రీమియంపైసెక్షన్ 80C పక్రారం పన్ను తగ్గింపు లభిస్తుంది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో ₹1.5 లక్షల వరకు తగ్గింపును క్లెయిమ్ చేయవచ్చు . ఇదిమీకు, మీ జీవిత భాగస్వా మికిలేదా మీ పిల్లల కోసం తీసుకున్న పాలసీలకు వర్తిస్తుంది.2. పాలసీమెచ్యూ రిటీమొత్తం పన్ను నుండిమినహాయింపు (సెక్షన్ 10(10D))పాలసీమెచ్యూ రిటీసమయంలో లేదా బీమాదారుడిమరణ సమయంలో కుటుంబం పొందేమొత్తం సెక్షన్ 10(10D) ప్రకారం పూర్తిగా పన్ను రహితం. దీంతో మొత్తం మీ కుటుంబానికిఎలాంటిపన్ను భారంలేకుండా లభిస్తుంది. మహిళలు ఈ ప్రయోజనాన్ని ఉపయోగించి పన్ను రహిత మెచ్యూరిటీ మొత్తాన్ని పొందవచ్చు .3. యూఎల్ఐపీలు (ULIPs) పైపన్ను ప్రయోజనాలు ULIPలకు చెల్లించిన ప్రీమియం కూడా సెక్షన్ 80C కింద తగ్గింపుకు అర్హం. కొన్ని షరతులు నెరవేరితేమెచ్యూరిటీ మొత్తం కూడా సెక్షన్ 10(10D) కింద పన్ను రహితం. ULIPs బీమాతో పాటు పెట్టుబడిఅవకాశం అందిస్తాయి. అందువల్లపన్ను ఆదా చేస్తూ సంపదను పెంచుకోవచ్చు .4. పెన్షన్ లేదా అన్న్యుటీ పాలసీలపై పన్ను లాభంపెన్షన్ లేదా అన్న్యు టీఅందించే జీవిత బీమా పాలసీతీసుకుంటే, చెల్లించిన ప్రీమియం సెక్షన్ 80CCC కింద తగ్గింపునకు అర్హం. పదవీ విరమణ తర్వా త వచ్చే అన్న్యుటీపై పన్ను ఉంటుందేకానీ, పెట్టుబడికాలంలో మీరు ముందుగానే పన్ను ఆదా చేసుకోవచ్చు .పన్ను ప్రయోజనాల కోసం జీవిత బీమాను ఉపయోగించేముందు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయంజీవిత బీమా ద్వా రా పన్ను ప్రయోజనాలు పొందేటప్పుడు ఈ సూచనలు మీకు ఉపయోగపడతాయి.● సరైన పాలసీని ఎంచుకోండి: టర్మ్ ప్లాన్, ఎండోవ్మెంట్ ప్లాన్, ULIP వంటికొన్ని పాలసీలకేపన్ను ప్రయోజనాలు ఉంటాయి. రక్షణ, పెరుగుదల మరియు పన్ను ఆదా మధ్య సరైన సమతుల్యం కలిగిన పాలసీని తీసుకోండి. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ సెక్షన్ 80C కింద పూర్తిపన్ను తగ్గింపును ఇస్తుంది, ఇదిమహిళలకు మంచి ఎంపిక.● ప్రీమియం పరిమితులు మరియు సామర్థ్యాన్ని తెలుసుకోండి: సెక్షన్ 80C కింద సంవత్సరానికి₹1.5 లక్షల వరకు మాత్రమే తగ్గింపులు లభిస్తాయి. మీరు ప్రీమియంను ప్లాన్ చేసేటప్పు డు మీ బడ్జెట్ను దృష్టిలో ఉంచుకోండి. అలా చేస్తేమీరు గరిష్టపన్ను ప్రయోజనం పొందగలరు.● పన్ను రహిత చెల్లింపుల నియమాలను అర్థం చేసుకోండి: మెచ్యూ రిటీలేదా మరణ లాభాలు సెక్షన్ 10(10D) కింద పన్ను రహితంగా ఉండాలంటేపాలసీకొన్ని నిబంధనలను పాటించాలి. ఇందులో కనీస ప్రీమియం చెల్లింపులు మరియు అవసరమైన పాలసీవ్యవధిఉంటాయి.● లాక్-ఇన్ పీరియడ్ గురించి తెలుసుకోండి: కొన్ని పాలసీలకు, ముఖ్యంగా ULIPsకు, 5 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. ఈ కాలానికి ముందే ఉపసంహరణ చేస్తే పన్ను ప్రయోజనాలు తగ్గవచ్చు.● రికార్డులను సరిగ్గా ఉంచండి: పన్ను తగ్గింపులు క్లెయిమ్ చేసేసమయంలో ప్రీమియం రసీదులు మరియు పాలసీపత్రాలు అవసరం అవుతాయి. అందువల్లవీటిని జాగత్ర్తగా భదప్రరచండి.మహిళలకు జీవిత బీమా రక్షణకన్నా ఎక్కు వని ఇస్తుంది. ఇదిఆర్థిక స్థిరత్వా న్ని మరియు నిజమైన పన్ను ప్రయోజనాలను అందిస్తుంది. సెక్షన్ 80C తగ్గింపులు మరియు సెక్షన్ 10(10D) మినహాయింపులు ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవడం ద్వా రా మహిళలు తమ ఆర్థిక పణ్రాళికపైస్పష్టమైన నిర్ణయాలు తీసుకోగలరు. సరైన నిర్ణయాలు మరియు జాగ్రత్తైన పణ్రాళికతో మహిళలు జీవిత బీమాతో ఉన్న అపోహలను తొలగించి మరింత భద్రమైన మరియు ఆర్థికంగా బలమైన భవిష్యత్తును నిర్మించుకోగలరు. -
రూ.100 నుంచే ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్
యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ తక్కువ మొత్తంతో ఫండ్స్ పథకాల్లో పెట్టుబడులకు వీలు కల్పిస్తూ నిర్ణయించింది. ఇందుకు వీలుగా మైక్రోసిప్ను ప్రవేశపెట్టినట్టు ప్రకటించింది. దీంతో ఇన్వెస్టర్లు రూ.100 నుంచి యాక్సిస్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రూ.1,000 పెట్టుబడిని పది పథకాల్లో రూ.100 చొప్పున ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా.. వాటి పనితీరును పరిశీలిస్తూ నష్టాల భయం లేకుండా మార్కెట్లు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవచ్చని పేర్కొంది.మహీంద్రా మాన్యులైఫ్ ఇన్కమ్ ప్లస్ ఆర్బిట్రేజ్ ఫండ్ మహీంద్రా మాన్యులైఫ్ మ్యుచువల్ ఫండ్ కొత్తగా మహీంద్రా మాన్యులైఫ్ ఇన్కం ప్లస్ ఆర్బిట్రేజ్ యాక్టివ్ ఎఫ్వోఎఫ్ పేరిట ఓపెన్ ఎండెడ్ ఫండ్ ఆఫ్ ఫండ్ స్కీమును ఆవిష్కరించింది. పన్ను పరమైన ప్రయోజనాలను అందుకునేందుకు.. 24 నెలలు, అంతకుమించిన దీర్ఘకాలం పెట్టుబడులపై పన్నుల అనంతరం స్థిరమైన, మెరుగైన రాబడులను కోరుకునే ఇన్వెస్టర్లకు ఈ ఫండ్ అనుకూలమని సంస్థ ప్రకటించింది.ఈ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో) నవంబర్ 21న ప్రారంభమై డిసెంబర్ 1న ముగుస్తుంది. ‘‘డెట్, ఆర్బిట్రేజ్ వ్యూహాల సామర్థ్యాలను మేళవించి అన్ని పరిస్థితులకు అనువుగా ఉండే విధంగా ఇన్కం ప్లస్ ఆర్బిట్రేజ్ యాక్టివ్ ఎఫ్వోఎఫ్ రూపొందించాం. వడ్డీ రేట్లలో అస్థిరతలతో కూడిన అనిశి్చత మార్కెట్లలో, పన్నుల అనంతరం మెరుగైన రాబడులకు ఉపయోగకరంగా ఉంటుంది’’ అని మహీంద్రా మాన్యులైఫ్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ, సీఈవో ఆంథోనీ హెరెడియా తెలిపారు.ఇదీ చదవండి: ఇక ఇన్వెస్ట్మెంట్ సలహా ఇవ్వాలంటే.. రూల్స్ మార్చిన సెబీ -
బంగారు నగలపై ఓవర్డ్రాఫ్ట్.. వివరాలివే..
కొంతకాలంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో అనేక మందికి బంగారం కేవలం ఆభరణంగా కాకుండా అత్యంత విశ్వసనీయమైన పెట్టుబడి సాధనంగా మారింది. అత్యవసర ఆర్థిక అవసరాల కోసం తమ బంగారాన్ని అమ్మివేయడం లేదా తాకట్టు పెట్టడం సర్వసాధారణం. అయితే అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు బంగారాన్ని సాధారణ పద్ధతిలో తాకట్టు పెట్టకుండా, అమ్ముకోకుండానే దాన్ని ఉపయోగించుకునే అద్భుతమైన మార్గం ఉంటే? అవును, అదే బంగారు నగలపై ఓవర్డ్రాఫ్ట్ (Overdraft on Gold Jewellery) సదుపాయం. పెరుగుతున్న బంగారం ధరల నేపథ్యంలో అనేక ప్రముఖ బ్యాంకులు తమ వినియోగదారులకు ఈ ప్రత్యేక సౌకర్యాన్ని అందిస్తూ వారి ఆర్థిక అవసరాలకు భరోసా కల్పిస్తున్నాయి.గోల్డ్ ఓవర్డ్రాఫ్ట్ ఫెసిలిటీ అంటే?బంగారు నగలపై ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యం అనేది ఒక రకమైన సురక్షితమైన రుణం (Secured Loan). ఇది వ్యక్తిగత రుణం లాంటిది కాకుండా, ఒక క్రెడిట్ లైన్లాగా పనిచేస్తుంది. సాధారణంగా గోల్డ్ లోన్లో ఒకేసారి మొత్తం డబ్బు తీసుకుని దానిపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఓవర్డ్రాఫ్ట్ సదుపాయంలో మీ బంగారు ఆభరణాల విలువను బట్టి బ్యాంక్ నిర్దిష్ట పరిమితి(Limit)తో రుణాన్ని మంజూరు చేస్తుంది. వినియోగదారుడు ఈ పరిమితి నుంచి అతనికి అవసరమైన మేరకు ఎప్పుడైనా, ఎంతైనా డబ్బును డ్రా చేసుకునే సౌలభ్యం ఉంటుంది.మీరు డ్రా చేసుకున్న అసలు మొత్తంపై (Utilised Amount) మాత్రమే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. మంజూరైన మొత్తం పరిమితిపై కాదు. ఈ సౌకర్యం సాధారణంగా ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు చెల్లుబాటు అవుతుంది. మీ సౌలభ్యాన్ని బట్టి క్రమానుగతంగా రుణం తిరిగి చెల్లించవచ్చు.వినియోగదారులకు ఉపయోగాలుబంగారు నగలపై ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యం ద్వారా వినియోగదారులకు కీలక ప్రయోజనాలు ఉన్నాయి. యూజర్లు డ్రా చేసుకున్న మొత్తానికే వడ్డీ లెక్కిస్తారు. ఉదాహరణకు, మీకు రూ.5 లక్షల పరిమితి మంజూరైతే అందులో రూ.2 లక్షలు మాత్రమే వాడుకుంటే ఆ రూ.2 లక్షలపై మాత్రమే వడ్డీ చెల్లించాలి.ఓవర్డ్రాఫ్ట్ ఖాతాలో నిధులు జమ చేయడం ద్వారా తీసుకున్న రుణాన్ని ఎప్పుడైనా, ఎన్నిసార్లైనా పాక్షికంగా లేదా పూర్తిగా తిరిగి చెల్లించవచ్చు. నెలవారీ ఈఎంఐ (EMI) లాంటి కఠిన నిబంధనలు ఉండవు.వ్యాపార అవసరాలు, వైద్య ఖర్చులు లేదా ఇతర అత్యవసరాల కోసం తక్షణమే నిధులు పొందవచ్చు.గోల్డ్ లోన్ లేదా గోల్డ్ ఓవర్డ్రాఫ్ట్లకు వ్యక్తిగత రుణాల కంటే వడ్డీ రేట్లు సాధారణంగా తక్కువగా ఉంటాయి.బంగారు ఆభరణాలు సురక్షితంగా బ్యాంకు వాల్ట్లో ఉంటాయి. వాటిని అమ్ముకోవాల్సిన అవసరం లేదు.బంగారం విలువను ఎలా లెక్కిస్తారు..బంగారు నగలపై ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యాన్ని పొందడానికి వినియోగదారులు సాధారణంగా కొన్ని అర్హతలు కలిగి ఉండి ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. సాధారణంగా 18 క్యారెట్ల (Carat) నుంచి 24 క్యారెట్ల మధ్య స్వచ్ఛత కలిగిన బంగారు ఆభరణాలపై బ్యాంకులు ఓడీ ఇస్తాయి. వినియోగదారుడికి కావలసిన పరిమితిని బట్టి తగినంత బరువున్న బంగారాన్ని సమర్పించాల్సి ఉంటుంది.బ్యాంక్ నియమించిన వాల్యుయేటర్ బంగారు ఆభరణాల స్వచ్ఛతను, బరువును నిర్ధారించి వాటి ప్రస్తుత మార్కెట్ విలువను లెక్కిస్తారు. ఈ విలువలో 70% నుంచి 75% వరకు ఓవర్డ్రాఫ్ట్ పరిమితిని మంజూరు చేస్తారు.ఛార్జీలుబంగారు నగలపై ఓవర్డ్రాఫ్ట్ (OD) సౌకర్యాన్ని వినియోగించుకునేటప్పుడు వినియోగదారులు చెల్లించాల్సిన ప్రధాన ఛార్జీల్లో వడ్డీ రేటు ముఖ్యమైనది. ఓడీ పరిమితి నుంచి తీసుకున్న అసలు మొత్తానికి మాత్రమే లెక్కిస్తారు. ఈ వడ్డీ సాధారణంగా రోజువారీగా లెక్కిస్తారు. బ్యాంకును అనుసరించి సంవత్సరానికి 8% నుంచి 15% మధ్య మారుతూ ఉంటుంది.కొన్ని బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తున్నాయి. ఇది బ్యాంక్ ఓవర్డ్రాఫ్ట్ దరఖాస్తును ప్రాసెస్ చేయడానికి, అకౌంట్ను సెటప్ చేయడానికి వసూలు చేసే ఏకమొత్తం ఛార్జీ. ఈ ఫీజు సాధారణంగా మంజూరైన మొత్తం ఓవర్డ్రాఫ్ట్ పరిమితిలో 0.5% నుంచి 1.5% వరకు ఉంటుంది.వాల్యుయేషన్ ఛార్జీలు.. బ్యాంక్ నియమించిన వాల్యుయేటర్ బంగారు ఆభరణాల స్వచ్ఛతను, బరువును తనిఖీ చేసి దాని ప్రస్తుత మార్కెట్ విలువను నిర్ణయిస్తారు. ఈ సర్వీసు కోసం వసూలు చేసే ఫీజునే వాల్యుయేషన్ ఛార్జీలు అంటారు. అలాగే రుణ ఒప్పందాలను చట్టబద్ధం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు స్టాంప్ డ్యూటీ ఛార్జీని వినియోగదారులే భరించాల్సి ఉంటుంది.ఓవర్డ్రాఫ్ట్ సదుపాయాన్ని అందిస్తున్న బ్యాంకులు1. ఫెడరల్ బ్యాంక్: డిజి గోల్డ్ ఓవర్ డ్రాఫ్ట్ పథకం2. సీఎస్బీ బ్యాంక్: ఓవర్ డ్రాఫ్ట్ గోల్డ్ లోన్ స్కీమ్3. తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ (TMB): టీఎంబీ గోల్డ్ ఓవర్ డ్రాఫ్ట్ స్కీమ్4. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Union Bank of India): బంగారు ఆభరణాలపై ఎస్ఓడీ (Secured Overdraft on Gold Ornaments - SOD).ఇదీ చదవండి: ఇండియాలో ‘గూగుల్ మీట్’ డౌన్ -
UPI: ఇదిగో యాప్.. యాడ్ చేశా.. ఖర్చు పెట్టుకోండి!
మనం ఖర్చు పెట్టుకోవడానికి ఇంట్లో పెద్దవారు కానీ, యజమానులు కానీ నగదు కాకుండా బ్లాంక్ చెక్లు ఇచ్చేవాళ్లు. ఆ తర్వాత క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు ఇస్తున్నారు. ఇప్పుడు ‘ఇదిగో యాప్.. ఖర్చు పెట్టుకోండి’ అని ఇచ్చే పరిస్థితి వచ్చింది.ఎన్పీసీఐ అనుబంధ సంస్థ అయిన ఎన్పీసీఐ భీమ్ సర్వీసెస్ లిమిటెడ్ (NBSL).. తన భీమ్ పేమెంట్స్ యాప్ లో ‘యూపీఐ సర్కిల్ ఫుల్ డెలిగేషన్’ ఫీచర్ను ప్రారంభించింది. దీంతో కుటుంబ సభ్యులు, మిత్రులు లేదా కావాల్సినవారిని సర్కిల్లోకి తీసుకుని మన అకౌంట్ నుంచి వాళ్లు డబ్బులు వాడుకునేలా చేయొచ్చు. నెలకు ఇంత అని రూ .15,000 వరకు ప్రీసెట్ చేస్తే ఇక వారు తమకు కావాల్సినప్పుడల్లా సలువుగా యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చు. ఇందుకు వారికి సొంత యూపీఐ-లింక్డ్ బ్యాంక్ ఖాతా కూడా అవసరం లేదు. ఇలా ఎన్నికాలం వాడుకోవచ్చు (1 నెల నుండి 5 సంవత్సరాల వరకు) అన్నది కూడా సెట్ చేయొచ్చు.ఎన్బీఎస్ఎల్ ఎండీ, సీఈవో లలిత నటరాజ్ మాట్లాడుతూ, ఈ ఫీచర్ సామాన్య కుటుంబాలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు తమ ఆర్థిక కార్యకలాపాలను సులభంగా నిర్వహించుకోవడానికి అనువుగా ఉంటుందని, డిజిటల్ చెల్లింపులను మరింత చేరువ చేస్తుందని పేర్కొన్నారు.యూపీఐ సర్కిల్ను ఎలా ఉపయోగించాలంటే..భీమ్ యాప్లోకి వెళ్లి యూపీఐ సర్కిల్ ఓపెన్ చేయండి.'ఇన్వైట్ టు సర్కిల్'ను ఎంచుకుని కాంటాక్ట్ ని యాడ్ చేయండి.వారి యూపీఐ ఐడీని ఎంటర్ చేయండి లేదా క్యూఆర్ స్కాన్ చేయండి.'అప్రూవ్ ఎ మంత్లీ లిమిట్'ను ఎంచుకోండిరిలేషన్ షిప్ సెట్ చేసి గుర్తింపును (ఆధార్/ఇతర డాక్యుమెంట్ లు) వెరిఫై చేయండిఖర్చు పరిమితి (రూ.15,000 వరకు), వ్యాలిడిటీ (1 నెల నుంచి 5 సంవత్సరాలు) సెట్ చేయండి.ఖాతాను ఎంచుకుని యూపీఐ పిన్తో ప్రమాణీకరించండి.ఇప్పుడు అవతలివారు అంగీకరించిన తర్వాత కొద్దిసేవటికి చెల్లింపులను ప్రారంభించవచ్చు. -
హోమ్ లోన్ అంటే ప్రభుత్వ బ్యాంకే.. ఎందుకు?
గృహ రుణ మార్కెట్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీలు) తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకున్నాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో జారీ అయిన మొత్తం గృహ రుణాల విలువలో 50 శాతం ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచే ఉన్నట్టు క్రిఫ్ హైమార్క్ సంస్థ వెల్లడించింది. ప్రైవేటు రంగ బ్యాంక్లను ఈ విభాగంలో ప్రభుత్వరంగ బ్యాంకులు అధిగమించినట్టు తెలిపింది.ఇక మొత్తం రుణాల్లో 40 శాతం రూ.75 లక్షలకు మించిన గృహ రుణాలే ఉన్నాయి. మొత్తం యాక్టివ్ రుణాలు (చెల్లింపులు కొనసాగుతున్నవి) 3.3 శాతం పెరిగి 2.29 కోట్లకు చేరాయి. రిటైల్ రుణాల్లో అతిపెద్ద విభాగమైన గృహ రుణాల మార్కెట్ సెప్టెంబర్ త్రైమాసికంలో 11.1 శాతం పెరిగి రూ.42.1 లక్షల కోట్లకు చేరింది.కన్జ్యూమర్ డ్యూరబుల్ రుణాల విభాగంలో డిమాండ్ స్తబ్దుగా ఉందంటూ.. 10.2 శాతం వృద్ధి కనిపించినట్టు క్రిఫ్ హైమార్క్ నివేదిక తెలిపింది. 31 నుంచి 180 రోజుల వరకు చెల్లింపుల్లేని వినియోగ రుణాలు జూన్ చివరికి 3.1 శాతంగా ఉంటే, సెప్టెంబర్ చివరికి 3 శాతానికి తగ్గాయి.ప్రభుత్వ బ్యాంకుల వాటా ఎక్కువ ఉండటానికి కారణాలువడ్డీరేట్లు సాధారణంగా తక్కువగా ఉండటంప్రభుత్వరంగ బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లతో హోమ్ లోన్లు ఇస్తాయి. ప్రైవేట్ బ్యాంకులతో పోల్చితే వారి ప్రాసెసింగ్ ఫీజులు కూడా తక్కువగా ఉంటాయి.ప్రభుత్వంపై నమ్మకంఇంటి కోసం తీసుకునే రుణం ఎక్కువ సంవత్సరాల పాటు ఉంటుంది. ప్రజలకు ప్రభుత్వరంగ బ్యాంకులపై ఉన్న భద్రతా భావం కారణంగా అక్కడి నుంచే రుణం తీసుకోవాలనే భావన బలంగా ఉంటుంది.ప్రభుత్వ హౌసింగ్ స్కీములుప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) వంటి పథకాలు సాధారణంగా ప్రభుత్వ బ్యాంకుల ద్వారా సబ్సిడీలతో ఇస్తారు. దీంతో ప్రభుత్వ బ్యాంకుల హౌసింగ్ లోన్ డిమాండ్ పెరుగుతుంది.పెద్ద మొత్తాల రుణాలువినియోగదారులకు పెద్ద మొత్తాల రుణాలు ఇవ్వడానికి ప్రభుత్వ బ్యాంకులు ముందుంటాయి. గణాంకాల ప్రకారం.. మొత్తం రుణాల్లో 40% రూ.75 లక్షలకుపైబడినవే ఉంటున్నాయి. ఇంత పెద్ద మొత్తాల రుణాలను ఇచ్చే ధైర్యం, ఫండింగ్ సామర్థ్యం ప్రభుత్వ బ్యాంకుల్లో ఎక్కువ.రిస్క్ తీసుకునే సామర్థ్యంప్రైవేట్ బ్యాంకులు ఎక్కువ క్రెడిట్ స్కోర్, స్థిరమైన ఆదాయం వంటి షరతులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు మాత్రం మధ్య తరగతి వర్గాలు, ప్రభుత్వ ఉద్యోగులు, సాధారణ ఆదాయం గలవారికి కూడా రుణాలు ఇవ్వడానికి ముందుంటాయి.బ్రాంచ్ నెట్వర్క్ భారీగా ఉండటంగ్రామీణ, పట్టణాల్లో ప్రభుత్వ బ్యాంకుల శాఖలు ప్రైవేట్ బ్యాంకులతో పోలిస్తే చాలా ఎక్కువ. ఫలితంగా లోన్ యాక్సెస్ సులభంగా ఉంటుంది. -
స్థిరమైన ఆదాయానికి ఏ ఫండ్ మంచిది..?
నేను రిటైర్మెంట్ తీసుకున్నాను. స్థిరమైన ఆదాయం కోసం లిక్విడ్ ఫండ్ లేదా షార్ట్ డ్యురేషన్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి సిస్టమ్యాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ (ఎస్డబ్ల్యూపీ)ను ఎంపిక చేసుకోవచ్చా? – నివేష్ పటేల్లిక్విడ్ ఫండ్స్ స్థిరత్వంతో, తక్కువ రిస్్కతో ఉంటాయి. కనుక షార్ట్ డ్యురేషన్ ఫండ్స్తో పోలి్చతే సిస్టమ్యాటిక్ విత్ డ్రాయల్ ప్లాన్ (ఎస్డబ్ల్యూపీ) కోసం లిక్విడ్ ఫండ్స్ను ఎంపిక చేసుకోవచ్చు. అతి తక్కువ అస్థిరతలతో, స్థిరమైన రాబడులు ఇవ్వడం వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ప్రశాంతత లభిస్తుంది. లిక్విడ్ ఫండ్స్పై మార్కెట్ అస్థిరతలు పెద్దగా ఉండవు. లిక్విడ్ఫండ్స్ పెట్టుబడుల విలువ దాదాపుగా తగ్గిపోవడం ఉండదు. వారం, నెల వ్యవధిలోనూ ఇలా జరగదు.లిక్విడ్ ఫండ్స్లో పెట్టుబడులను ఇన్స్టంట్గా అదే రోజు వెనక్కి తీసుకునేందుకు (నిరీ్ణత మొత్తం) కొన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు అనుమతిస్తున్నాయి. లేదంటే మరుసటి రోజు అయినా పెట్టుబడులు చేతికి అందుతాయి. వీటిల్లో రాబడి ఎంతన్నది ముందుగానే అంచనాకు రావొచ్చు. షార్ట్ డ్యురేషన్ ఫండ్స్లోనూ లిక్విడిటీ ఎక్కువే. కాకపోతే వాటి యూనిట్ నెట్ అసెట్ వ్యాల్యూ (ఎన్ఏవీ)లో స్వల్ప ఊగిసలాటలు ఉంటాయి. కనుక ఇది నెలవారీ ఉపసంహరించుకునే పెట్టుబడులపై ప్రభావం చూపిస్తుంది. షార్ట్ డ్యురేషన్ ఫండ్స్లో రాబడులు కొంచెం ఎక్కువగా ఉంటాయి. కానీ, ఈ మేరకు రిస్క్ కూడా అధికంగా ఉంటుంది.నేను ప్రభుత్వ ఉద్యోగిని. నాకు హెల్త్ రీయింబర్స్మెంట్ సదుపాయం ఉంది. అయినా, వ్యక్తిగతంగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవడం మంచి ఆలోచనేనా? – రేణుకేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, రాష్ట్రాల్లోనూ ప్రభుత్వం తరఫున ఉద్యోగులకు హెల్త్ కవరేజీ ఉంటుంది. ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు, ఎంపానెల్డ్ ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్య చికిత్సలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఔషధాల కొనుగోలుకు పరిహారం పొందొచ్చు. అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేద, యునానీ, సిద్ధ, యోగా చికిత్సలకు సైతం రీయింబర్స్మెంట్ పొందొచ్చు. వినికిడి పరికరాలు, కృత్రిమ అవయవాలకు కుడా పరిహారం వస్తుంది. కాకపోతే ఎంపిక చేసిన ఆస్పత్రుల వరకే ఈ కవరేజీ పరిమితం. అయితే, ప్రభుత్వ ఆమోదం పొందిన ఆస్పత్రులు అన్ని ప్రాంతాల్లోనూ ఉండాలని లేదు. కనుక మీకు సమీపంలోని ఏఏ ఆస్పత్రుల్లో కవరేజీ ఉందో, అక్కడ వసతులు ఏ మేరకు ఉన్నాయో తెలుసుకోండి.ప్రభుత్వ ఆమోదం ఉన్న ఆస్పత్రి మీకు సమీపంలో లేకపోయినా, లేదంటే మెరుగైన, రోబోటిక్ వంటి అత్యాధునిక చికిత్సలను తమకు ఇష్టమైన ఆస్పత్రిలో పొందాలని కోరుకుంటే.. అప్పుడు వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ను కనీసం రూ.5 లక్షల కవరేజీతో తీసుకోవాలి. అది కూడా వృద్ధాప్యం వచ్చే వరకు ఆగకుండా, యుక్త వయసులోనే వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవడం వల్ల ప్రీమియం తక్కువగా ఉంటుంది. మంచి హెల్త్ ట్రాక్ రికార్డు కూడా లభిస్తుంది. 60 ఏళ్లు దాటిన తర్వాత తీసుకోవాల్సి వస్తే కో–పే షరతుకు అంగీకరించాల్సి వస్తుంది. కోపే వద్దనుకుంటే ప్రీమియం భారీగా ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఉచిత వైద్య సదుపాయం అధిక శాతం చికిత్సలకు రీయింబర్స్మెంట్ రూపంలోనే ఉంటుంది. కనుక ముందుగా తాము చెల్లించిన తర్వాతే ప్రభుత్వం వద్ద క్లెయిమ్ దాఖలు చేసి పొందగలరు. అదే వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉంటే అవసరమైన సందర్భంలో నగదు రహిత చికత్సను దాని కింద పొందొచ్చు.ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
వ్యవసాయ ఆదాయం.. పన్ను భారం లెక్కింపు
గత రెండు వారాలుగా వ్యవసాయ భూముల గురించి, వ్యవసాయ ఆదాయం గురించి తెలుసుకున్నాం. మూడో వారం ముచ్చటగా వ్యవసాయ ఆదాయం వల్ల పన్ను భారం ఎలా లెక్కించాలో ఉదాహరణలతో తెలుసుకుందాం. ఈ కాలమ్లో చెప్పిన ఉదాహరణలలో ప్రస్తావించిన వ్యవసాయ ఆదాయం, చట్టప్రకారం నిర్దేశించిన రూల్స్ను బట్టి లెక్కించినదిగా అనుకోండి. కేవలం వ్యవసాయ ఆదాయమే ఉంటే.. ఒక వ్యక్తి సంవత్సర ఆదాయం పూర్తిగా వ్యవసాయం నుంచే వచ్చి, ఇతరత్రా ఆదాయమేమీ లేదనుకుందాం. అలాంటప్పుడు ఆ వ్యక్తికి ఎలాంటి పన్నుభారం ఏర్పడదు. నూటికి నూరుపాళ్లు మినహాయింపే. దీని ప్రకారం చాలా మంది చిన్నకారు/సన్నకారు రైతులకు ఇన్కంట్యాక్స్ పడదు. కేవలం వ్యవసాయేతర ఆదాయం ఉండి, వ్యవసాయం మీద ఆదాయం లేకపోతే.. సవ్యసాచి అనే వ్యక్తి వయస్సు 60 సంవత్సరాల లోపు ఉందనుకుందాం. అతను రెసిడెంటు అయి ఉండి, వ్యాపారం కలిగి ఉన్న వ్యక్తి అనుకుందాం. సాధారణంగా ట్యాక్సబుల్ ఇన్కం రూ. 14,00,000. 2025–26 ఆరి్థక సంవత్సరానికి ఈ వ్యక్తి కొత్త పద్ధతిని ఫాలో అయితే, శ్లాబులు/రేట్ల ప్రకారం పన్ను భారం రూ. 90,000 ఉంటుంది. విద్యా సుంకం అదనం. ఇదే సవ్యసాచికి రూ. 9,00,000 వ్యవసాయం మీద ఆదాయంగా వస్తోంది. ఇది కాకుండా పైన చెప్పిన రూ. 14,00,000 ఆదాయం కూడా ఉంది. ఇప్పుడు పన్ను ఎలా లెక్కించాలంటే..A. వ్యవసాయ ఆదాయం, వ్యవసాయేతర ఆదాయం కలిపితే మొత్తం ఆదాయం రూ. 23,00,000. దీనిపై పన్ను= రూ. 2,90,000B. వ్యవసాయ ఆదాయం, బేసిక్ లిమిట్ మాత్రమే కలిపితే మొత్తం ఆదాయం రూ.13,00,000. దీనికి సంబంధించి రిబేటు = రూ. 75,000 ఇప్పుడు (A) నుంచి (B)ని తీసివేస్తే, అంటే రూ. 2,90,000 నుంచి రిబేటు రూ. 75,000 తీసివేస్తే కట్టాల్సిన పన్ను భారం రూ. 2,15,000గా ఉంటుంది. దీనికి విద్యా సుంకం అదనం.ఇప్పుడు విశ్లేషణలోకి వెళ్దాం..మొత్తం వ్యవసాయేతరం మీద ఆదాయం వచి్చందనుకోండి, రూ. 2,90,000 పన్ను కట్టాలి. రూ. 2,90,000 ఎక్కువగా భావించి, ఇందులో కొంత ఆదాయం, అంటే రూ. 9,00,000 వ్యవసాయం అని అన్నాం అనుకోండి. రూల్సు ప్రకారం ఆధారాలన్నీ ఉన్నాయనుకుంటే, రూ. 75,000 రిబేటు వస్తుంది. ఈ మేరకు పన్ను భారం తగ్గుతుంది. అందరూ కేవలం రూ. 14,00,000 మీద పన్ను చెల్లిస్తే సరిపోతుంది, వ్యవసాయ ఆదాయం మీద మినహాయింపు వస్తుందని అనుకుంటారు. ఈ ఊహ అబద్ధం. నిజం కాదు. ఇక్కడో వల, మెలిక ఉన్నాయి. ఈ రెండింటి మీద ఆదాయాన్ని కలిపి స్థూల పన్ను భారాన్ని లెక్కిస్తారు. (రూ. 14,00,000 + 9,00,000)బేసిక్ లిమిట్కి వ్యవసాయ ఆదాయం కలిపి పన్ను లెక్కిస్తారు (రూ. 4,00,000 + రూ. 9,00,000)చెల్లించాల్సిన పన్ను (5) – (6)దీనికి విద్యా సుంకం అదనంరూ. 9,00,000 వ్యవసాయ ఆదాయం కలపడంతో శ్లాబు మారుతుంది. పెద్ద శ్లాబులోకి వెళ్తారు.బేసిక్ లిమిట్కి వ్యవసాయ ఆదాయం కలిపితే అది తక్కువ / లేదా చిన్న శ్లాబులో ఉంటుంది. పై శ్లాబుకి వెళ్లడం వల్ల పన్ను భారం పెరుగుతుంది.రూ. 9,00,000 మీద అదనంగా రూ. 1,25,000 కట్టాల్సి వస్తోంది. వాస్తవానికి పన్ను భారమే ఉండదనుకుంటే, అది ఏకంగా రూ. 1,25,000కు పెరిగింది. మరో కేసు. 45 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి. జీతం రూ. 8,00,000, వ్యవసాయం మీద ఆదాయం రూ. 4,00,000. పాత పద్ధతిని ఎంచుకుని, పన్ను లెక్కిస్తే రూ. 1,72,500 అవుతుంది. అందులో నుంచి రూ. 42,500 రిబేటు తీసివేయగా రూ. 1,30,000 చెల్లించాలి. విద్యా సుంకం అదనం.కొత్త పద్ధతైనా, పాత పద్ధతైనా, ఇలా కలపడాన్ని పార్షియల్ ఇంటిగ్రేషన్ ( partial integration) అంటారు. దీని వల్ల పన్ను భారం పెరుగుతుంది.అయితే, వ్యవసాయ ఆదాయం కలపడం వల్ల, వ్యవసాయేతర ఆదాయం పెద్ద శ్లాబులోకి వెళ్లింది. ఆ మేరకు పన్ను భారం పెరిగింది. కానీ, రిబేటు ఇవ్వడం వల్ల పన్ను భారం తగ్గుతుంది.పన్ను భారాల పంపిణీ న్యాయబద్ధంగా ఉండేలా, పన్ను విధింపులో సమానత్వాన్ని పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా దీన్ని భావించాలి. ఏదైతేనేం, వ్యవసాయ ఆదాయాన్ని ఒక ట్యాక్స్ ప్లానింగ్ మార్గంగా భావించి, పన్ను ఎగవేత వైపు వెళ్లేవారికి ఇదొక హెచ్చరిక. -
అప్పు ఎంత చేయొచ్చు..? తెలిసినవారు అధిక సంపన్నులు!
"అప్పులేని వాడే అధిక సంపన్నుడు" అన్నాడు కవి వేమన. కానీ ఆధునిక అవసరాలు అనివార్యమైన నేటి రోజుల్లో "అప్పు ఎంత చేయొచ్చో తెలిసినవారు అధిక సంపన్నులు" అంటున్నారు ఆర్థిక నిపుణులు. పేదవారి నుంచి సంపన్నుల వరకూ అప్పు చేయనిదే పూట గడవదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఎవరి స్థాయిలో వారు ఏదో ఒక రూపంలో అప్పులు చేసుకుంటూ పోతున్నారు. ఇక సగటు మధ్యతరగతి జీవితంలో అప్పు నిత్యకృత్యమే.నిత్యవసర వస్తువుల ధరలు, ఇంటి అద్దెలు, పిల్లల చదువుల వ్యయాలు పెరిగిపోయాయి. దీంతో అప్పుల తిప్పలు తప్పడం లేదు. అయితే జీవన శైలిలో మార్పుల కారణంగా కొన్ని అప్పులు అనవరంగా వచ్చి మీద పడుతున్నాయి. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి రుణ బాధ్యతలను మరింత దగ్గరగా పర్యవేక్షించుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అస్సలు అప్పు లేకుండా ఉండటం మంచిదే. అయితే, కొన్నిసార్లు ముఖ్యంగా ఇల్లు, వాహనాల కొనుగోలు లేదా ఉన్నత విద్య వంటి వాటి కోసం అప్పు ఆచరణాత్మక అవసరం.తు.చ.తప్పకూడని అప్పు సూత్రంఆర్థికంగా ఆరోగ్యంగా ఉండటానికి, నిపుణులు ఒక క్లిష్టమైన నియమాన్ని నొక్కి చెబుతారు. అదే ఒక నెలలో ఈఎంఐలు (EMI), చేబదుళ్లు వంటివాటి కోసం వెళ్లే మొత్తం ఒక వ్యక్తి స్థూల నెలవారీ ఆదాయంలో 36 శాతానికి మించకూడదు. రుణం-ఆదాయ నిష్పత్తి అని పిలిచే ఈ పరిమితిని తిరిగి చెల్లింపు సామర్థ్యాన్ని కొలవడానికి బ్యాంకులు విస్తృతంగా ఉపయోగిస్తాయి. అప్పు దీన్ని మించితే రుణగ్రహీత బడ్జెట్ ను ఒత్తిడి చేస్తుంది. దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తుంది.ముఖ్యంగా యువతకు..ఈ అప్పు సూత్రం యువతకు ముఖ్యమైంది. సులభమైన క్రెడిట్ ఆప్షన్లు, ఒక్క స్క్రీన్ ట్యాప్తో అందుబాటులో ఉన్న తక్షణ రుణాలతో నిండిన ఆర్థిక దృశ్యంలోకి దేశ యువత ప్రవేశిస్తున్నారు. సామాజిక ఒత్తిళ్లు, ఆన్ లైన్ షాపింగ్, దూకుడు మార్కెటింగ్ తరచుగా ఆదాయానికి మించి ఖర్చు చేయిస్తుంటాయి. ఫలితంగా, చాలా మంది యువ సంపాదనాపరులు జీవితం ప్రారంభంలోనే అధిక వడ్డీ రుణాల ఉచ్చులో పడతారు. వయసు 20, 30ల ప్రారంభంలోనే ఆరోగ్యకరమైన రుణ అలవాట్లను అలవరచుకోవడం దీర్ఘకాలికంగా సంపద సృష్టిని గణనీయంగా ప్రభావితం చేస్తుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.ఇదీ చదవండి: ఉద్యోగుల చేతికొచ్చే జీతం తగ్గుతుందా?అప్పునకు దూరంగా ఉండటానికి మార్గాలుమీ మొదటి ఉద్యోగం ప్రారంభం నుంచే ఈఎంఐ-టు-ఇన్కమ్ నిష్పత్తిని ట్రాక్ చేయండి. ఆదాయం పెరిగినప్పటికీ, ఈఎంఐలు మీ స్థూల జీతంలో 36% మించకుండా చూసుకోండి.లైఫ్ స్టైల్ అప్ గ్రేడ్ చేయడానికి ముందు అత్యవసర నిధిని నిర్మించుకోండి.యువత తరచుగా ఖర్చు చేయడానికి అనుకూలంగా పొదుపును దాటవేస్తారు. సంక్షోభ సమయంలో ఎక్కువ రుణాలు తీసుకోకుండా ఉండటానికి ఈ ఎమెర్జెన్సీ ఫండ్ అవసరం.క్రెడిట్ కార్డులు లేదా ఇప్పుడు కొని తర్వాత చెల్లించే యాప్ల ద్వారా హఠాత్తు కొనుగోళ్లను నివారించండి. బై-నౌ-పే-లేటర్ సర్వీసులు యువ వినియోగదారులలో ప్రాచుర్యం పొందాయి. కానీ ఊహించని రుణ ఉచ్చులను సృష్టించగలవు.విద్యా రుణాలను తెలివిగా ఎంచుకోండి. సైన్ అప్ చేయడానికి ముందు వడ్డీ రేట్లు, తిరిగి చెల్లించే ఎంపికలు, మారటోరియం కాలాలను పోల్చి చూసుకోండి.బడ్జెట్ను రూపొందించుకోవడం అలవాటు చేసుకోండి. కొన్ని యాప్లు ఖర్చులను ట్రాక్ చేయడంలో సహాయపడతాయి. ఒక సాధారణ నెలవారీ బడ్జెట్ అధిక ఖర్చును నిరోధిస్తుంది. పొదుపును ప్రోత్సహిస్తుంది.అధిక వడ్డీ రుణంపై దృష్టి పెట్టండి. వడ్డీని నివారించడానికి మొదట క్రెడిట్ కార్డు బకాయిలను క్లియర్ చేయండిఅదనపు ఆదాయ వనరులను ఏర్పాటు చేసుకోండి. ఫ్రీలాన్సింగ్, పార్ట్ టైమ్ వర్క్ లేదా డిజిటల్ గిగ్ లు ఆరోగ్యకరమైన రుణ-ఆదాయ నిష్పత్తిని నిర్వహించడంలో సహాయపడతాయి.ప్రతిదానికీ ఫైనాన్స్ చేయడానికి బదులుగా పెద్ద కొనుగోళ్లను ప్లాన్ చేయండి. అది బైక్, ఫోన్ లేదా విహారం అయినా. మొదట పొదుపు చేయడం ఈఎంఐలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. -
ఉద్యోగుల చేతికొచ్చే జీతం తగ్గుతుందా?
కేంద్ర ప్రభుత్వం కొత్త లేబర్ కోడ్లను (New Labour Code) అమల్లోకి తెచ్చింది. దేశంలో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ ప్రధానంగా 29 కార్మిక చట్టాలు ఉండగా వాటిని నాలుగు కొత్త లేబర్ కోడ్లుగా ఏకీకృతం చేసింది. వీటితో వేతనాల (Wages) నిర్వచనం పూర్తిగా మారిపోనుంది. ఈ నేపథ్యంలో వేతన నిర్మాణం ఎలా మారుతుంది? చేతికందే జీతం (టేక్-హోమ్) తగ్గుతుందా? అనే ప్రశ్నలు మళ్లీ ముందుకు వచ్చాయి.ఎక్కువ బేసిక్ పే.. తక్కువ టేక్ హోమ్వేతనాలలో కనీసం 50 శాతం భాగం ప్రాథమిక వేతనం + కరువు భత్యం (డీఏ) + నిలుపుదల భత్యం (రిటైనింగ్ అలవెన్స్) రూపంలో ఉండాలనే కొత్త నిబంధన ప్రధాన ఆందోళనగా నిలుస్తోంది. ఇప్పటి వరకు చాలా కంపెనీలు ప్రాథమిక జీతాన్ని మొత్తం సీటీసీ (CTC)లో తక్కువగా ఉంచి, మిగతాది వివిధ భత్యాలతో పూరించేవి. ఎందుకంటే పీఎఫ్ (ఉద్యోగి 12%, యజమాన్యం 12%), గ్రాట్యుటీ లెక్కింపు ప్రాథమిక వేతనంపై ఆధారపడి ఉండటం వల్ల, తక్కువ బేసిక్ పే ఉంటే తక్కువ చట్టబద్ధ తగ్గింపులు (కటింగ్స్) పోయి ఎక్కువ జీతం చేతికందేది.రిటైనింగ్ అలవెన్స్ అంటే..రిటైనింగ్ అలవెన్స్ అనేది పని లభ్యం కాని కాలాల్లో ఉద్యోగులు సంస్థను వీడి వెళ్లకుండా నిలుపుకోవడం కోసం చేసే చెల్లింపు. దీని ద్వారా కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యేంత వరకు వారు కంపెనీతో ఉండేలా యాజమాన్యాలు చూసుకుంటాయి. అయితే కొత్త లేబర్ కోడ్లు వేతనాలకు ఒక నూతన ఏకీకృత నిర్వచనాన్ని తీసుకొస్తున్నాయి. మొత్తం వేతనంలో 50 శాతాన్ని మినహాయింపుల కసం కనీస వేతనంగా పరిగణిస్తుండటంతో ఈపీఎఫ్, గ్రాట్యుటీ లెక్కింపునకు ఉపయోగించే బేస్ పెరుగుతుంది. అహ్లావాట్& అసోసియేట్స్కు చెందిన అలయ్ రజ్వీ ప్రకారం.. ఇది ఉద్యోగి పొందే రిటైర్మెంట్, ఇతర చట్టబద్ధమైన ప్రయోజనాల లెక్కింపులో మార్పుని తీసుకువస్తుంది.ఇదీ చదవండి: ఉద్యోగుల గ్రాట్యుటీకి ఇక ఏడాది చాలు..అయితే యాజమాన్యాలు తప్పనిసరిగా ప్రాథమిక వేతనాన్ని పెంచాల్సిన అవసరం లేదని, మారేది పీఎఫ్/గ్రాట్యుటీ లెక్కింపు కోసం ఉపయోగించే మొత్తం మాత్రమేనని రజ్వీ స్పష్టం చేస్తున్నారు. దీనివల్ల మినహాయింపుల బేస్ పెరుగుతుందనీ, కానీ టేక్-హోమ్ పై ప్రభావం యాజమాన్యాలు జీత నిర్మాణాన్ని ఎలా పునర్నిర్మిస్తాయన్న దానిపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు. -
న్యూ ఫండ్ ఆఫర్: కొత్త మ్యూచువల్ ఫండ్స్
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ (ఏబీఎస్ఎల్ఐ) తమ యులిప్ ప్లాన్స్ కింద డివిడెండ్ ఈల్డ్ ఫండ్ని ప్రవేశపెట్టింది. అత్యధికంగా డివిడెండ్ చెల్లించే కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మెరుగైన రాబడులను అందించడం ఈ ఫండ్ లక్ష్యం. ఈ ఫండ్ ప్రధానంగా డివిడెండ్ ఇచ్చే కంపెనీల ఈక్విటీలు, ఈక్విటీల ఆధారిత సాధ నాల్లో 80–100% వరకు, డెట్.. మనీ మార్కెట్ సాధనాల్లో 20% వరకు ఇన్వెస్ట్ చేస్తుంది. మహీంద్రా మాన్యులైఫ్ ఇన్కం ప్లస్ ఆర్బిట్రేజ్ యాక్టివ్ ఎఫ్వోఎఫ్ మహీంద్రా మాన్యులైఫ్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ఇన్కం ప్లస్ ఆర్బిట్రేజ్ యాక్టివ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్వోఎఫ్)ను ప్రవేశపెట్టింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ డిసెంబర్ 1తో ముగుస్తుంది. డెట్, ఆర్బిట్రేజ్ స్కీముల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలికంగా మెరుగైన రాబడులు అందించడం ఈ ఫండ్ లక్ష్యం. 24 నెలలకు పైబడి పెట్టుబడి కొనసాగించి, పన్నుల అనంతరం స్థిరమైన, మెరుగైన రాబడి అందుకోవాలనుకునే వారికి ఇది అనువైనదిగా ఉంటుంది. దీర్ఘకాలం పెట్టుబడులను కొనసాగించడం ద్వారా 12.5 శాతం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ మాత్రమే వర్తించేలా ఎఫ్వోఎఫ్ స్వరూపం ఉంటుంది.యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ మల్టీ అసెట్ ఎఫ్వోఎఫ్ యాక్సిస్ మ్యుచువల్ ఫండ్ కొత్తగా యాక్సిస్ మల్టీ–అసెట్ యాక్టివ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్వోఎఫ్)ను ఆవిష్కరించింది. ఈ ఓపెన్ ఎండెడ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ పథకం ప్రధానంగా.. ఈక్విటీ ఆధారిత, డెట్ ఆధారిత మ్యుచువల్ ఫండ్స్ పథకాలు, కమోడిటీ ఆధారిత ఈటీఎఫ్ల యూనిట్లలో ఇన్వెస్ట్ చేస్తుంది. అంటే ఇది నేరుగా ఆయా సెక్యూరిటీల్లో కాకుండా వాటికి సంబంధించిన ఫండ్ పథకాల్లో పెట్టుబడులు పెడుతుందని గమనించాలి. ఈ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో) 2025 నవంబర్ 21న ప్రారంభమై డిసెంబర్ 5న ముగుస్తుంది. -
కొనకుండానే.. షి‘ కారు’!
ఇపుడు కారు లగ్జరీ కాదు. అవసరం. సిటీ ట్రాఫిక్లో కష్టమైనా సరే... కారుంటే కాస్త బెటర్. మరి కారు కొనాలంటే...? బీమా, ట్యాక్సులు, రిజిస్ట్రేషన్ చార్జీలు అన్నీ కలిస్తే రోడ్డుమీదికొచ్చేసరికి తడిసి మోపెడు. ఈఎంఐతో పాటు డౌన్పేమెంటూ కావాలి. అందుకేనేమో..! యువతరం కారు కొనడానికన్నా లీజుకు తీసుకోవటానికే మొగ్గు చూపుతోంది. రోజూ కాస్త ఎక్కువ దూరమే ప్రయాణిస్తాం కనక తమకు ఇదే బెటర్ అంటోంది. నిజమేనా? కారు కొనటం మంచిదా లేక లీజుకు తీసుకోవటం మేలా? ఏది బెటర్? లీజులో ఉండే రిస్కులేంటి? అసలు మన తెలుగు రాష్ట్రాల్లో వాహనాలు లీజుకు ఇస్తున్న కంపెనీలేంటి? లీజుకు తీసుకునేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఒకసారి తెలుసుకుందాం... – సాక్షి, వెల్త్ డెస్క్ లీజుపై ఆసక్తి ఎందుకంటే...→ కార్ల ధరలు ప్రియమయ్యాయి. దాదాపు రూ.13 లక్షల విలువైన ఎస్యూవీ... రోడ్డుమీదికి వచ్చేసరికి రూ.18–19 లక్షలవుతోంది. కొనాలంటే రూ.3–4 లక్షల డౌన్ పేమెంటూ కావాలి. → లీజుకు తీసుకుంటే డౌన్పేమెంట్ అక్కర్లేదు. → అవసరమైనపుడు బీమా కంపెనీలతో పేచీలు అక్కర్లేదు. → పదేపదే సర్వీసు సెంటర్లకు వెళ్లాల్సిన పనిలేదు. → కారు మార్చాలనుకున్నపుడు విక్రయించే బాధ కూడా లేదు. లీజింగ్ అనుకూలమేనా? అనుకూలమనే చెప్పాలి. ప్రతి రెండు మూడేళ్లకు కార్లను మార్చేవారికి... బీమా చెల్లింపులు, సర్వీసింగ్, టైర్లు– బ్యాటరీలు మార్చటం వంటి బాదరబందీలు వద్దనుకునే వారికి... తరచూ ఉద్యోగరీత్యా ప్రాంతాలు మారేవారికి ఇది అనుకూలమే.వీరికి కొనుక్కుంటేనే బెటర్...కారును కనీసం 8 నుంచి పదేళ్లు మార్చకుండా ఉంచుకునే వారికి... ఏడాదికి 20వేల కి.మీ. కన్నా ఎక్కువ తిరిగే వారికి.. కారును నచి్చనట్లు మార్చుకోవాలనుకునే వారికి కొనుక్కోవటమే నయమని చెప్పాలి. అసలు ఏంటీ లీజింగ్?→ లీజింగ్ కంపెనీయే కారు కొని రిజి్రస్టేషన్ చేయిస్తుంది. బీమా చేయించటంతో పాటు నిర్వహణ కూడా చూసుకుంటుంది. నెలనెలా అద్దె చెల్లించి దాన్ని లీజుకు తీసుకోవచ్చు. లీజు పీరియడ్ అయిపోయాక కారు ఇచ్చేయొచ్చు. ఇపుడిపుడే ఇండియాలో విస్తరిస్తున్న ఈ విధానం యూరప్, అమెరికాల్లో చాలా కాలంగాఉన్నదే.లీజు కంపెనీల్లో తేడాలేంటి?→ తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఒరిక్స్, మైల్స్, రెవ్ వంటి సంస్థలు ఈ లీజు సేవలు అందిస్తున్నాయి. → ఒరిక్స్కు తయారీదార్లతో ఒప్పందాలున్నాయి. పూర్తి స్థాయి కార్పొరేట్ లీజింగ్ సేవలందిస్తోంది. లాకిన్ పీరియడ్ ఏడాది నుంచి ఐదేళ్ల వరకూ ఉంటుంది. ముందే గనక ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలనుకుంటే కొంత ఫీజుంటుంది. → మైల్స్ లాకిన్ పీరియడ్ మూడు నెలలతో మొదలవుతుంది. కొత్త కార్లతో పాటు వాడేసిన సర్టిపైడ్ కార్లనూ అందించటం దీని ప్రత్యేకత. దీర్ఘకాలం లాకిన్ వద్దనుకునే వారికిది అనుకూలం. → రెవ్ సంస్థ నెలరోజుల సబ్స్క్రిప్షన్ను అందిస్తోంది. ఇక 1–4 ఏళ్ల లాకిన్తో ఈఎంఐ లీజింగ్నూ అందిస్తోంది. హ్యుందాయ్ కార్లలో చాలా వాటిని లీజుపై ఇస్తున్నది ఈ కంపెనీయే.→ కారు లీజింగ్ → కారు కొనడంఏకమొత్తం చెల్లింపు→ తొలినెల అద్దె+ సెక్యూరిటీ డిపాజిట్ → 15–20 శాతం డౌన్పేమెంట్తో పాటు బీమా, ఆన్రోడ్ చార్జీలు.నెలవారీ ఎంత?→ స్థిరమైన అద్దె (బీమా, నిర్వహణ ఛార్జీలు కలిసే ఉంటాయి) → ఈఎంఐతో పాటు బీమా, నిర్వహణ చార్జీలూ ఉంటాయి.ఓనర్షిప్→ గడువు ముగిశాక వాహనం తిరిగి ఇచ్చేయాలి. → రుణం తీరాక వాహనం సొంతమవుతుంది. రీసేల్ చేయొచ్చు.పన్ను ప్రయోజనాలు→ ఉద్యోగస్తులకు వారి కంపెనీ పాలసీ ప్రకారం ప్రయోజనాలు ఉంటాయి. అద్దె మినహాయింపు ఉంటుంది కనుక వ్యాపారాలకూ అనుకూలమే. → నేరుగా ఎలాంటి పన్ను ప్రయోజనాలూ ఉండవు.హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి లీజు విధానాలు అందుబాటులో ఉన్నాయంటే.. → కార్పొరేట్ లీజింగ్→ కనీస లీజు కాలం 2 నుంచి ఐదేళ్లుంటుంది. బీమా, నిర్వహణ, రోడ్ ట్యాక్స్, బ్రేక్డౌన్ సపోర్ట్ అన్నీ లీజింగ్ కంపెనీయే చూసుకుంటుంది. → ఎవరికి అనుకూలం?: కంపెనీలకు, ఎక్కువ ట్రావెల్ చేసే ప్రొఫెషనల్స్కు → సానుకూలాంశాలు: డౌన్పేమెంట్ అవసరం లేదు. నిర్వహణ తలనొప్పులేవీ ఉండవు. → ప్రతికూలాంశాలు: దీర్ఘకాలం లాకిన్ పీరియడ్. ఈఎంఐతో పోలిస్తే నెలవారీ అద్దె కాస్త ఎక్కువ చెల్లించాల్సి రావటం.→ లీజ్ టు ఓన్ → లీజు కాలం ముగిసిన తరువాత వాహనాన్ని సొంతం చేసుకోవచ్చు. నిర్వహణ వ్యయాలను లీజింగ్ కంపెనీ, లీజుదారుడు తలాకొంత భరించాల్సి ఉంటుంది. → ఎవరికి అనుకూలం?: చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి, స్వయం ఉపాధి వారికి ఇది అనుకూలమనే చెప్పాలి. ఎందుకంటే నెలవారీ చెల్లింపులు ఈఎంఐకి అటూఇటుగా ఉంటాయి. → కార్ సబ్స్క్రిప్షన్ → దీన్లోనూ డౌన్పేమెంట్ ఉండదు. బీమా, సర్వీసు చార్జీలను కంపెనీయే చూసుకుంటుంది. దాదాపుగా నెల నుంచి రెండేళ్లవరకు పీరియడ్తో మైల్స్, రెవ్, క్విక్లిజ్ వంటి కంపెనీలు దీన్ని ఆఫర్ చేస్తున్నాయి. → ఈ విధానంలో క్రెటా వంటి మిడ్సైజ్ ఎస్యూవీలకు నెలకు రూ.30 వేల నుంచి 50 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. → నెలవారీ రెంటల్స్... → తాత్కాలికంగా కారు కావాలనుకునేవారికి, ప్రాజెక్టు పనులపై వచి్చనవారికి, ట్రావెలర్స్కి కనుక తామే డ్రైవ్ చేసుకునేలా కార్లు కావాలంటే జూమ్కార్, రెవ్, మైల్స్ వంటి కంపెనీలు దీన్ని ఆఫర్ చేస్తున్నాయి. → ఎన్నాళ్లు కావాలంటే అన్నాళ్లే తీసుకోవచ్చు. లాకిన్ పీరియడ్ ఉండదు. కాకుంటే నెలవారీ చెల్లింపు కాస్త ఎక్కువ ఉంటుంది.→ కార్ల కంపెనీల సబ్స్క్రిప్షన్... → మారుతి, హ్యుందాయ్ వంటి సంస్థలు ఒరిక్స్, రెవ్, మైల్స్ వంటి కంపెనీల ద్వారా ఈ విధానంలో వాహనాలను అందిస్తున్నాయి. ఈ విధానంలో కొత్త కారును నేరుగా తయారీ కంపెనీ నుంచే తీసుకోవచ్చు. → స్విఫ్ట్ వంటి కార్లు నెలకు రూ.18,350 నుంచి లభిస్తున్నాయి. బ్రాండ్ సపోర్ట్తో పాటు నెలవారీ ఎంత చెల్లించాలో ముందే తెలుస్తుంది.డబ్బులిచ్చే స్వతంత్రమే వెల్త్దశాబ్దాలుగా మన ఆర్థిక ఆలోచనలు యాజమాన్యం చుట్టూనే తిరుగుతున్నాయి. ఇల్లు, భూమి, కారు, బంగారం ఏదైనా కొనటమే. కానీ ఇప్పటి మధ్య తరగతి ఈ నియమాల్ని తిరగరాస్తున్నారు. నేటి యువతరం ‘దీన్నెలా కొనాలి?’ అని కాకుండా ‘దీన్నెలా సొంతం చేసుకోవాలి?’ అని ఆలోచిస్తున్నారు. కార్లను లీజుకు తీసుకుంటున్నారు. ల్యాప్టాప్లకు అద్దె చెల్లిస్తున్నారు. సబ్ర్స్కిప్షన్ ఫోన్లు, కో–లివింగ్ ఇళ్లు ఇవన్నీ దీన్లో భాగమే. సొంతం చేసుకోవటం కన్నా దాన్ని ఉపయోగించుకోవటం మీదే ఫోకస్ పెడుతున్నారు. లగ్జరీకి బదులు తమకొచ్చే ఆదాయాన్నే దృష్టిలో ఉంచుకుంటున్నారు.డౌన్పేమెంట్లు, రుణాల్లో మునిగిపోయే బదులు చేతిలో నగదు, ట్రావెలింగ్, ఇన్వెస్ట్మెంట్లు, కొత్త అనుభవాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ ధోరణి ఆర్థికంగా మంచిదే. గాడ్జెట్లు అద్దెకు తీసుకోవటం వల్ల టెక్నాలజీ మార్పుల్ని ఎదుర్కోవచ్చు. కో–లివింగ్తో దీర్ఘకాల కమిట్మెంట్లు ఉండవు. సబ్స్క్రిప్షన్లతో మిగిలే మొత్తాన్ని సిప్లు, బాండ్ల వంటి పెట్టుబడుల్లోకి మళ్లించవచ్చు. అలాగని ‘సొంతం’ సంస్కృతి పోయేదేమీ కాదు. ఇది కాస్త స్మార్ట్గా సొంతం చేసుకోవటమంతే!. సంపదకు నేటి మధ్య తరగతి కొలమానం తమ దగ్గరుండే వస్తువులు కాదు. చేతిలోని డబ్బులిచ్చే స్వతంత్రమే. ఈ విధానాలపై సరైన సమాచారాన్నిస్తూ పాఠకుల కరదీపిక కావటానికే ఈ సాక్షి వెల్త్. – ఎడిటర్ -
ఫిక్స్డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ ఇచ్చే బ్యాంకులు
పెట్టుబడి సురక్షితంగా ఉండాలనుకునే పెట్టుబడిదారులు.. ఫిక్స్డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేస్తారు. ఇక్కడ మీ డబ్బు సురక్షితంగా ఉండటమే కాకుండా, స్థిర రాబడి కూడా పొందవచ్చు. అయితే ఇందులో పెద్ద మొత్తంలో లాభం రాకపోయినా.. నష్టం మాత్రం ఉండదు. అయితే మీకు వచ్చే రాబడి వివిధ బ్యాంకులు అందించే వడ్డీ రేట్ల మీద ఆధారపడి ఉంటుంది. ఈ కథనంలో ఏ బ్యాంక్ ఎంత వడ్డీ ఇస్తుందో తెలుసుకుందాం.సాధారణంగా వడ్డీ రేట్లలో పెద్దగా తేడా ఉండదు, కానీ 50 బేసిస్ పాయింట్ల చిన్న వ్యత్యాసం కూడా మీ పెట్టుబడిని గణనీయంగా పెంచుతుంది. లాభం అనేది ముఖ్యంగా పెట్టుబడి పెట్టిన మొత్తం గణనీయంగా ఉన్నప్పుడు & కాలపరిమితి ఎక్కువగా ఉన్నప్పుడు ఆశించవచ్చు.ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లుHDFC బ్యాంక్: ఈ బ్యాంక్ సాధారణ పౌరులకు మూడేళ్ల కాలపరిమితి డిపాజిట్పై 6.45%, సీనియర్ సిటిజన్లకు 6.95% అందిస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్ అనేది 18 నెలల నుంచి 21 నెలల మధ్య కాలపరిమితి ఉన్నప్పుడు ఈ బ్యాంక్ కొంత ఎక్కువ వడ్డీ అందిస్తుంది.ICICI బ్యాంక్: ఈ ప్రైవేట్ రంగ బ్యాంకు.. సాధారణ పౌరులకు మూడేళ్ల కాలపరిమితి గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 6.6% వడ్డీని, సీనియర్ సిటిజన్లకు 7.2% వడ్డీని అందిస్తుంది.కోటక్ మహీంద్రా బ్యాంక్: ఇది మూడు సంవత్సరాల కాలపరిమితి కలిగిన సాధారణ పౌరులకు 6.4%, సీనియర్ సిటిజన్లకు 6.9% వడ్డీని అందిస్తుంది. అయితే, 391 రోజుల నుంచి రెండు సంవత్సరాల కంటే తక్కువ కాలపరిమితి కలిగినప్పుడు.. బ్యాంక్ అత్యధికంగా 6.7%, 7.2% వడ్డీని అందిస్తుంది.ఫెడరల్ బ్యాంక్: ఈ ప్రైవేట్ రంగ బ్యాంకు తన మూడు సంవత్సరాల డిపాజిట్లపై సాధారణ పౌరులకు 6.7% & సీనియర్ సిటిజన్లకు 7.2% వడ్డీని అందిస్తుంది. అత్యధిక వడ్డీ ఇచ్చే బ్యాంకుల జాబితాలో ఇది ఒకరి కావడం గమనార్హం.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI): భారతదేశంలోని అతిపెద్ద బ్యాంకు అయిన.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన మూడేళ్ల డిపాజిట్లపై సాధారణ పౌరులకు 6.3% వడ్డీని & సీనియర్ సిటిజన్లకు 6.8% వడ్డీని అందిస్తుంది. రెండు, మూడు సంవత్సరాల మధ్య కాలపరిమితి ఉన్నప్పుడు కొంత ఎక్కువ వడ్డీ (6.45% & 6.95%) అందిస్తుంది.కెనరా బ్యాంక్: ఈ బ్యాంక్ మూడు సంవత్సరాల డిపాజిట్లపై సాధారణ పౌరులకు 6.25% & సీనియర్ సిటిజన్లకు 6.75 వడ్డీని ఇస్తుంది. అయితే, 444 రోజుల కాలపరిమితి ఉన్నప్పుడు అత్యధిక రేట్లు (6.5% & 7%) పొందవచ్చు.యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: ఇది మూడు సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్లపై సాధారణ పౌరులకు 6.6% & సీనియర్ సిటిజన్లకు 7.1% వడ్డీని అందిస్తుంది.ఇదీ చదవండి: 50/30/20 రూల్: పొదుపు చేయడానికి ఉత్తమ మార్గం! -
50/30/20 రూల్: పొదుపు చేయడానికి ఉత్తమ మార్గం!
డబ్బు ఎవరైనా ఖర్చు పెట్టేస్తారు.. కానీ పొదుపు చేయడం బహుశా అందరికీ సాధ్యం కాకపోవచ్చు. పెరిగిపోతున్న ధరల వల్ల ఎక్కడ, ఎంత ఖర్చు పెట్టాలనే విషయంలో ఒక క్లారిటీ లేకుండా పోతోంది. అయితే 50/30/20 ఫార్ములాను అనుసరిస్తే ఎవరైనా.. డబ్బు పొదుపు చేయవచ్చు. ఈ ఫార్ములా గురించి ఈ కథనంలో వివరంగా చూసేద్దాం.ఒక వ్యక్తి బ్యాచిలర్ లైఫ్ గడుపుతున్నప్పుడు పెద్దగా ఖర్చులు ఉండకపోవచ్చు. ఆ వ్యక్తి పెళ్లి చేసుకుని, పిల్లలను కంటే?, ఖర్చులు ఆటోమాటిక్గా పెరిగిపోతాయి. ఈ ఖర్చుల కోసం.. సంపాదించిన మొత్తం వెచ్చిస్తే?, భవిష్యత్ కోసం ఏమీ మిగలదు. కాబట్టి పొదుపు అవసరం.ఏమిటీ 50/30/20 ఫార్ములా?50/30/20 ఫార్ములా.. మీ ఆదాయాన్ని మూడు ఖర్చు భాగాలుగా విభజిస్తుంది. 50 శాతం అవసరాలకు, 30 శాతం కోరికలు (సరదా ఖర్చులు), 20 శాతం పొదుపు. ఈ ఫార్ములాను యూఎస్ సెనెటర్ ఎలిజబెత్ వారెన్ తన పుస్తకం "ఆల్ యువర్ వర్త్: ది అల్టిమేట్ లైఫ్టైమ్ మనీ ప్లాన్''లో వెల్లడించారు.వివరంగా చెప్పాలంటే.. మీరు నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్నారనుకుందాం. అందులో 50 శాతం లేదా రూ. 50వేలు అవసరాలకు, అంటే రూమ్ రెంట్, కిరాణా సామాగ్రి, బీమా & ఆరోగ్య సంరక్షణ వంటి వాటికి ఉపయోగించుకోవచ్చు. 30 శాతం లేదా రూ. 30వేలు సరదా ఖర్చులకు, అంటే.. హ్యాండ్బ్యాగులు, గడియారాలు, నగలు వంటివన్న మాట. 20 శాతం లేదా రూ. 20వేలు పొదుపు (స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ మొదలైనవి, మీ నైపుణ్యాన్ని బట్టి) చేయాలి. ఇలా విభజించుకుంటే.. మీరు తప్పకుండా పొదుపు చేయొచ్చు.ఇదీ చదవండి: నెలకు ₹11వేలు ఆదాతో రూ. కోటి!: ఇదిగో ఫార్ములామీరు సంపాదించే డబ్బులో ఇంకా కొంత ఎక్కువ పొదుపు చేయాలంటే.. అనవసరమైనవి కొనుగోలు చేయడం లేదా ఖర్చు పెట్టడం మానేయాలి. ఆలా మిగిలిన డబ్బును కూడా మీరు సేవింగ్స్ చేసుకుంటూ పోతే.. పొదుపు తప్పకుండా పెరుగుతుంది. అయితే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే.. దాని గురించి తప్పకుండా కొంత సమాచారం తెలుసుకుండాలి, అనుభవం కూడా ఉండాలి. లేకుంటే నష్టాలను చవిచూసే అవకాశం ఉంటుందన్న విషయం మర్చిపోవద్దు. -
ఉద్యోగుల గ్రాట్యుటీకి ఇక ఏడాది చాలు..
కార్మిక చట్టాలలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులను ప్రవేశపెట్టింది. కొత్త లేబర్ కోడ్ల ప్రకారం.. అన్ని రంగాల్లోని ఉద్యోగులు ఇప్పుడు కేవలం ఒక సంవత్సరం సర్వీస్ ఉంటే చాలు గ్రాట్యుటీకి అర్హులు అవుతారు. దేశంలో ఇప్పటివరకూ ఉన్న 29 కార్మిక చట్టాలను ప్రభుత్వం నాలుగు సరళీకృత లేబర్ కోడ్లుగా ఏకీకృతం చేసింది.కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపిన ప్రకారం.. ఉద్యోగులకు మెరుగైన వేతనాలు, విస్తృత సామాజిక భద్రతా కవరేజ్, మెరుగైన ఆరోగ్య రక్షణ అందించడమే ఈ మార్పుల లక్ష్యం. ఈ సంస్కరణలు అనధికారిక కార్మికులు, గిగ్ , ప్లాట్ఫామ్ వర్కర్లు, వలస కార్మికులు, మహిళా ఉద్యోగులు వంటి విభిన్న వర్గాలకు వర్తిస్తాయి.గ్రాట్యుటీ అర్హతలో భారీ మార్పుపేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ ప్రకారం.. ఇప్పటిదాకా ఒక ఉద్యోగి ఐదు సంవత్సరాల నిరంతర సర్వీస్ పూర్తి చేసుకున్న తర్వాతే గ్రాట్యుటీకి అర్హుడు. అయితే, కొత్త లేబర్ కోడ్ల అమలుతో నిర్ణీత కాలానికి అంటే రెండేళ్లకో.. మూడేళ్లకో ఒప్పందంపై చేరే ఉద్యోగులు (ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ (FTEs) కూడా ఇప్పుడు ఏడాది సర్వీస్ అనంతరం గ్రాట్యుటీకి అర్హత పొందుతారు.మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం.. ఈ మార్పు ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులతో సమాన హోదాలోకి తీసుకురావడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త నిబంధనల ప్రకారం.. ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులు కూడా శాశ్వత ఉద్యోగుల మాదిరిగానే జీతాలు, సెలవు సదుపాయాలు, వైద్య ప్రయోజనాలు, సామాజిక భద్రతా పరిరక్షణలు పొందుతారు.గ్రాట్యుటీ అంటే..గ్రాట్యుటీ అనేది ఉద్యోగి దీర్ఘకాలిక సేవకు గుర్తింపుగా కంపెనీల యాజమాన్యాలు చెల్లించే ఆర్థిక ప్రయోజనం. సాధారణంగా, ఒక ఉద్యోగి రాజీనామా చేసినప్పుడు, పదవీ విరమణ చేసినప్పుడు లేదా అర్హతగల సర్వీస్ కాలాన్ని పూర్తి చేసినప్పుడు ఈ మొత్తం చెల్లిస్తారు.లెక్కిస్తారిలా..ఉద్యోగికి చెల్లించే గ్రాట్యుటీ మొత్తం ఈ ఫార్ములాతో లెక్కిస్తారు. గ్రాట్యుటీ = (చివరిగా అందుకున్న వేతనం) × (15/26) × (సర్వీస్ కాలం సంవత్సరాల్లో)ఇక్కడ చివరిసారిగా అందుకున్న వేతనం అంటే బేసిక్ పే, డియర్నెస్ అలవెన్స్ (DA) కలిపి తీసుకోవాలి.ఉదాహరణకు ఒక ఉద్యోగి 5 సంవత్సరాలు పనిచేసి చివరిగా బేసిక్, డీఏ కలిపి రూ.50 వేలు అందుకున్నారనుకుంటే.. గ్రాట్యుటీ రూపంలో సదరు ఉద్యోగి అందే మొత్తం రూ.1,44,230 అవుతుంది. -
ట్రేడింగ్లో జాగ్రత్త.. ఇన్వెస్టర్లకు ఆర్బీఐ హెచ్చరిక
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్పట్ల జాగ్రత్త వహించవలసిందిగా ఇన్వెస్టర్లను రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) తాజాగా హెచ్చరించింది. ఇప్పటికే ఇలాంటి సంస్థల జాబితాను విడుదల చేసిన ఆర్బీఐ కొత్తగా అలర్ట్ లిస్ట్లో 7 ప్లాట్ఫామ్స్ను జత చేసింది. దీంతో వీటి సంఖ్య 95కు చేరింది. వీటిలో స్టార్నెట్ ఎఫ్ఎక్స్, క్యాప్ప్లేస్, మిర్రరాక్స్, ఫ్యూజన్ మార్కెట్స్, ట్రైవ్, ఎన్ఎక్స్జీ మార్కెట్స్, నార్డ్ ఎఫ్ఎక్స్ చేరాయి.విదేశీ మారక నిర్వహణ చట్టం, 1999(ఫెమా) ప్రకారం జాబితాలోని సంస్థలకు అధికారికంగా ఫారెక్స్ లావాదేవీలు చేపట్టేందుకు అనుమతిలేకపోవడంతోపాటు.. ఎల్రక్టానిక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్(ఈటీపీలు)ను సైతం నిర్వహించేందుకు వీలులేదని కేంద్ర బ్యాంకు పేర్కొంది. అంతేకాకుండా జాబితాలోని సంస్థలు, ప్లాట్ఫామ్స్, వెబ్సైట్లు ప్రకటనల ద్వారా అనధికారిక ఈటీపీలను ప్రమోట్ చేస్తున్నట్లు వెల్లడించింది. శిక్షణ, అడ్వయిజరీ సర్వీసులందిస్తున్నట్లు క్లెయిమ్ చేసుకుంటున్నాయని తెలియజేసింది. -
నెలకు ₹11వేలు ఆదాతో రూ. కోటి!: ఇదిగో ఫార్ములా
సరైన ఆదాయం పొందాలంటే.. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP) ఒక ఉత్తమమైన మార్గం. 11-12-20 ఫార్ములా ప్రకారం.. ఇందులో పెట్టుబడి పెడితే.. కోటీశ్వరులు అవుతారని నిపుణులు చెబుతున్నారు. ఇదెలా సాధ్యమో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.11-12-20 ఫార్ములాఈ ఫార్ములా ప్రకారం.. నెలకు 11,000 రూపాయలు 20 ఏళ్లు పెట్టుబడిగా పెడితే, 12 శాతం రిటర్న్తో రూ. కోటి పొందవచ్చు.20 సంవత్సరాలు.. నెలకు రూ. 11000 చొప్పును పెట్టుబడిగా పెడితే మొత్తం రూ. 26.40 లక్షలు అవుతుంది. 12 శాతం రిటర్న్స్ ఆశిస్తే.. మీరు చక్రవడ్డీ రూపంలో మరో రూ.83.50 లక్షల ఆదాయం పొందవచ్చు. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసిన అసలు + వచ్చిన చక్రవడ్డీ రెండూ కలిపితే.. కోటి రూపాయల కంటే ఎక్కువ ఆదాయం వస్తుందన్నమాట. ఇక్కడ తప్పకుండా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే.. మీకు వచ్చే రిటర్న్స్ బాగున్నప్పుడే.. ఎక్కువ ఆదాయం వస్తుంది.మీ పెట్టుబడికి ఎక్కువ లాభం రావడానికి కారణం.. చక్రవడ్డీ. ఎందుకంటే మీ పెట్టుబడి కంటే.. ఎక్కువ వడ్డీ రూపంలోనే యాడ్ అవుతుంది. మీరు పెట్టిన పెట్టుబడి.. ఆ పెట్టుబడికి వచ్చిన వడ్డీపై కూడా మీరు రిటర్న్స్ ఆశించవచ్చు. ఈ కారణంగానే మీరు 20 ఏళ్లలో భారీ ఆదాయం ఆశించవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. పెట్టుబడికి లాంగ్ టర్న్ ఉత్తమమైన ఎంపిక.NOTE: పెట్టుబడి పెట్టడం అనేది.. మీ సొంత నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. అంతే కాకుండా పెట్టుబడి పెట్టడానికి ముందు.. పెట్టుబడులను గురించి తెలుసుకోవడానికి, ఆర్ధిక నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్కరికీ భారీ లాభాలు వస్తాయని చెప్పలేము. కొన్ని సార్లు కొంత నష్టాన్ని కూడా చవిచూడాల్సి ఉంటుంది. కాబట్టి పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్స్ జాగ్రత్తగా ఉండాలి. -
1980 తర్వాత పుట్టిన వారికి అలర్ట్!
‘‘ముప్పై ఏళ్ల యువకుడు.. ఇటీవలే కెరియర్లో స్థిరపడ్డాడు. మంచి జీతం. ఈఎంఐలతో ఇల్లు, కారు కొనుగోలు చేశాడు. అయితే, అనుకోని ప్రమాదంలో మరణించాడు. అతని ఆదాయంపై ఆధారపడిన తన భార్య, చిన్నపిల్లలు, వృద్ధ తల్లిదండ్రులు ఒక్కసారిగా ఆర్థిక కష్టాల్లో పడ్డారు. పెద్ద మొత్తంలో ఉన్న లోన్ భారం, పిల్లల చదువుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. ఆర్థిక భద్రతకు అత్యంత సరళమైన, శక్తివంతమైన మార్గమైన టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుని ఉంటే ఈ దుర్భర పరిస్థితిని నివారించేవారు’’ఈ రోజుల్లో ఆర్థిక నిపుణులు ముఖ్యంగా 1980 తర్వాత పుట్టినవారు (నేటి మధ్య వయస్కులు, సీనియర్ ప్రొఫెషనల్స్), 1997-2007 మధ్య పుట్టిన యువతరం (మిలీనియల్స్/జనరేషన్ జెడ్) తప్పనిసరిగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది పెట్టుబడి ప్లాన్ కాదు. ఇది కేవలం ప్యూర్ ప్రొటెక్షన్ (Pure Protection) ప్లాన్. బీమా తీసుకున్న వ్యక్తి పాలసీ కాలంలో మరణిస్తే అతని కుటుంబానికి లేదా నామినీకి పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం లభిస్తుంది.టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?టర్మ్ ఇన్సూరెన్స్ ఒక నిర్దిష్ట కాలానికి (ఉదాహరణకు, 10, 20, 30 సంవత్సరాలు లేదా 60/ 80 ఏళ్ల వయసు వరకు) కవరేజీని అందిస్తుంది. ఈలోపు పాలసీదారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే నిబంధనల ప్రకారం ఇన్సూరెన్స్ డబ్బు నామినీకి చెందుతుంది. ఇతర జీవిత బీమా పథకాలతో పోలిస్తే ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్కు ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో మీ కుటుంబానికి రూ.1 కోటి లేదా అంతకంటే ఎక్కువ కవరేజీని అందించవచ్చు.పాలసీదారుడు మరణిస్తే నామినీకి బీమా మొత్తాన్ని (Sum Assured) ఏకమొత్తంగా లేదా నిర్ణీత కాల వ్యవధిలో నెలవారీ ఆదాయంగా పొందే అవకాశం ఉంటుంది. పాలసీదారుడు పాలసీ కాలం ముగిసే వరకు జీవించి ఉంటే సాధారణంగా చెల్లించిన ప్రీమియం తిరిగి రాదు (టర్మ్ ప్లాన్ విత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం - వంటి ప్రత్యేక ప్లాన్లలో ప్రీమియం కూడా వస్తుంది. అయితే అందుకు ప్రీమియం ఎక్కువగా ఉంటుంది). అందుకే ఇది ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్.1980 తర్వాత పుట్టిన వారికి..1980 తర్వాత పుట్టిన వారిలో చాలా మంది ఇప్పుడు 40 లేదా 45 ఏళ్ల వయసులో ఉన్నారు. ఈ దశలో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం లేదా ఉన్న కవరేజీని పెంచుకోవడం చాలా అవసరం. పిల్లలు కాలేజీ లేదా ఉన్నత విద్య దశలో ఉంటారు. వారి చదువులు, పెళ్లిళ్ల కోసం పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అవుతుంది. ఇంటి పెద్ద లేని సమయంలో ఈ లక్ష్యాలు నెరవేరడం కష్టమవుతుంది.చాలా మందికి ఈ వయసులో హోమ్ లోన్, కార్ లోన్ వంటి భారీ ఈఎంఐ బాధ్యతలు ఉంటాయి. పాలసీదారు మరణిస్తే ఈ లోన్ భారం మొత్తం కుటుంబంపై పడుతుంది. టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా వచ్చే మొత్తం ఈ రుణాలను సులభంగా తీర్చడానికి ఉపయోగపడుతుంది.ఆరోగ్య సమస్యలువయస్సు పెరిగే కొద్దీ ఆరోగ్య ప్రమాదాలు (క్రిటికల్ ఇల్నెస్) పెరిగే అవకాశం ఉంటుంది. టర్మ్ ప్లాన్తో పాటు రైడర్స్ తీసుకోవడం ద్వారా ముఖ్యమైన అనారోగ్యాలు సంభవించినా ఆర్థిక భద్రత లభిస్తుంది.1997-2007 మధ్య పుట్టిన యువతఈ జనరేషన్ జీ/మిలీనియల్స్కు టర్మ్ ఇన్సూరెన్స్ అత్యంత ముఖ్యమైంది. ఎందుకంటే వారికి అతి తక్కువ ప్రీమియంతో జీవితకాలం రక్షణ పొందే అద్భుత అవకాశం ఉంది. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి వయసు ముఖ్యమైన అంశం. చిన్న వయసులో (20-30 ఏళ్ల మధ్య) తీసుకుంటే ఆరోగ్య ప్రమాదాలు తక్కువగా ఉంటాయి కాబట్టి, ప్రీమియం తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు, 25 ఏళ్ల వయసులో తీసుకున్న ప్రీమియం, 35 ఏళ్లలో తీసుకున్న ప్రీమియం కంటే గణనీయంగా తక్కువగా ఉంటుంది.ఆర్థిక బాధ్యతలుఈ యువతరం ఇప్పుడిప్పుడే వివాహం చేసుకుని, పిల్లల పెంపకం, సొంత ఇల్లు, ఇతర జీవిత లక్ష్యాల దిశగా అడుగులు వేస్తారు. కుటుంబం వారిపై ఆధారపడటం మొదలవుతుంది. ఈ దశలోనే రక్షణ కవచం ఏర్పరచుకోవడం తెలివైన నిర్ణయం.దీర్ఘకాలిక రక్షణతక్కువ ప్రీమియంతో 60 లేదా 70 ఏళ్ల వరకు కూడా కవరేజీ తీసుకోవచ్చు. టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపును పొందుతాయి.ఇదీ చదవండి: జీవిత బీమా వెనుక భారీ సంపద రహస్యం -
బీమా ఏజెంట్లు చెప్పని విషయాలు..
ఆరోగ్యం అత్యంత విలువైన ఆస్తి. అందుకే, అనుకోని ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఆర్థిక భారం నుంచి ఉపశమనం పొందడానికి ఆరోగ్య బీమా (Health Insurance) పాలసీలు తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే, పాలసీ తీసుకునే క్రమంలో బీమా ఏజెంట్లు లేదా మధ్యవర్తులు పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలను, ముఖ్యంగా పాలసీదారునికి ప్రతికూలంగా ఉండే అంశాలను చెప్పడం లేదనే ఆరోపణలున్నాయి. పాలసీ తాలూకు నిజమైన నిబంధనలు, పరిమితులు కప్పిపుచ్చడం వల్ల క్లెయిమ్ సమయంలో పాలసీదారులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఏజెంట్లు కావాలనే దాచే లేదా ఎక్కువగా చెప్పని అంశాలేమిటో చూద్దాం.కో-పేమెంట్ నిబంధనచాలా పాలసీల్లో కో-పేమెంట్ నిబంధన ఉంటుంది. దీని ప్రకారం ఆసుపత్రి బిల్లులో నిర్ణీత శాతాన్ని (ఉదాహరణకు, 10% లేదా 20%) పాలసీదారుడే భరించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని మాత్రమే బీమా కంపెనీ చెల్లిస్తుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్ల ప్లాన్లలో ఇది సర్వసాధారణం. ఏజెంట్లు ఈ ముఖ్యమైన ఆర్థిక భారాన్ని విస్మరిస్తారు.వెయిటింగ్ పీరియడ్స్బీమా పాలసీని కొన్ని రకాల వెయిటింగ్ పీరియడ్స్ ప్రభావితం చేస్తాయి. పాలసీ తీసుకున్న మొదటి 30 రోజులు (కొన్ని ప్రత్యేక ప్రమాదాలు మినహా) వరకు ఎలాంటి అనారోగ్యానికి క్లెయిమ్ చేయలేరు. కీళ్ల నొప్పులు, క్యాటరాక్ట్, హెర్నియా వంటి కొన్ని నిర్దిష్ట వ్యాధులకు 1 లేదా 2 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. పాలసీ తీసుకునే ముందు నుంచే ఉన్న మధుమేహం, అధిక రక్తపోటు వంటి వ్యాధులకు సాధారణంగా 2 నుంచి 4 సంవత్సరాల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. పాలసీ తీసుకున్న వెంటనే ఈ వ్యాధులకు క్లెయిమ్ రాదని ఏజెంట్లు స్పష్టంగా చెప్పరు.రూమ్ రెంట్ క్యాపింగ్చాలా ప్లాన్లలో బీమా మొత్తం ఆధారంగా రోజువారీ గది అద్దెపై పరిమితి ఉంటుంది. ఉదాహరణకు, ఒక పాలసీలో బీమా మొత్తంలో 1% మాత్రమే రూమ్ అద్దెగా నిర్ణయించవచ్చు. దీని అర్థం రూ.5 లక్షల పాలసీకి రోజుకు గరిష్టంగా రూ.5,000 మాత్రమే గది అద్దె కింద చెల్లిస్తారు. మీరు అంతకంటే ఖరీదైన గదిని ఎంచుకుంటే అధిక అద్దెతో పాటు గది అద్దెతో సంబంధం ఉన్న ఇతర ఖర్చులలో కొంత భాగాన్ని (ఉదాహరణకు, డాక్టర్ ఫీజు, నర్సింగ్ ఛార్జీలు) పాలసీదారుడే భరించాల్సి వస్తుంది.క్లెయిమ్ తిరస్కరణదరఖాస్తు ఫామ్లో పాలసీదారుని మునుపటి ఆరోగ్య చరిత్ర, శస్త్రచికిత్సలు, తీసుకుంటున్న మందుల గురించి తప్పుడు లేదా అసంపూర్తి సమాచారం ఇవ్వడం వల్ల క్లెయిమ్ సమయంలో బీమా కంపెనీ పాలసీని రద్దు చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఏజెంట్లు పాలసీ త్వరగా ఆమోదం పొందాలనే ఉద్దేశంతో దాచమని సలహా ఇస్తారు. ఇది క్లెయిమ్ తిరస్కరణకు ప్రధాన కారణం అవుతుంది.సబ్ లిమిట్స్కొన్ని చికిత్సలు లేదా సర్వీసులపై బీమా కంపెనీ నిర్దిష్ట పరిమితులు విధిస్తుంది. ఉదాహరణకు, క్యాటరాక్ట్ శస్త్రచికిత్సకు రూ.40,000 మించి చెల్లించరు. అంబులెన్స్ ఛార్జీలకు రూ.2,000 మించి చెల్లించరు. మీరు ఆ చికిత్సకు అంతకంటే ఎక్కువ ఖర్చు చేసినా పరిమితి మేరకు మాత్రమే క్లెయిమ్ లభిస్తుంది.కవర్ కాని అంశాలుసౌందర్య చికిత్సలు (Cosmetic Treatment), అడ్వెంచర్ స్పోర్ట్స్ వల్ల కలిగే గాయాలు, అప్పుడే పుట్టిన శిశువుల చికిత్స ఖర్చులు (కొన్ని వారాల వరకు), నాన్-మెడికల్ వస్తువులు (గ్లోవ్స్, మాస్కులు, టూత్ బ్రష్, పౌడర్ మొదలైనవి) వంటి అనేక అంశాలను పాలసీ కవర్ చేయదు. ఈ మినహాయింపుల జాబితాను ఏజెంట్లు చాలా అరుదుగా వివరిస్తారు.పాలసీదారులు ఏం చేయాలి?బీమా పాలసీ గురించి ఏజెంట్ మాటలు విన్న తర్వాత తప్పనిసరిగా డాక్యుమెంట్ను పూర్తిగా చదవాలి.నిబంధనలు, షరతులు, మినహాయింపులు, కో-పేమెంట్ సెక్షన్లను పరిశీలించాలి.పాలసీ పత్రాలు అందిన తర్వాత 15 రోజుల ఫ్రీ-లుక్ పీరియడ్ ఉంటుంది. ఈ సమయంలో మీకు పాలసీ నచ్చకపోతే పూర్తి డబ్బు వెనక్కి తీసుకొని రద్దు చేసుకోవచ్చు.వెయిటింగ్ పీరియడ్స్, కో-పేమెంట్, రూమ్ రెంట్ క్యాపింగ్ గురించి ఏజెంట్ను స్పష్టంగా అడిగి ఈమెయిల్ రూపంలో సమాచారం పొందాలి.ఇదీ చదవండి: ఈ-కామర్స్ అనైతిక పద్ధతులకు కేంద్రం కళ్లెం -
బంగారం ధరలు.. అది ‘నకిలీ అంచనా’: కియోసాకి
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో దాని దుర్వినియోగం కూడా అంతే స్థాయిలో పెరుగుతోంది. ఏఐ టెక్నాలజీతో పెరుగుతున్న డీప్ ఫేక్ వీడియోల ప్రభావం ప్రసిద్ధ పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకిని కూడా తాకింది.డిసెంబరులో బంగారం ధరలు 50 శాతం తగ్గుతాయని తానుచెప్పినట్లుగా ఏఐతో డీప్ ఫేక్ చేసి రూపొందించిన వీడియో ఒకటి యూట్యూబ్ వీడియో ఆన్ లైన్ లో ప్రత్యక్షమవుతోందని రాబర్ట్ కియోసాకి తన ఫాలోవర్లను అప్రమత్తం చేశారు. అది ఏఐతో సృష్టించిన డీప్ ఫేక్ వీడియో అని, తాను అలా చెప్పలేదని స్పష్టం చేశారు.ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్)లో రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) ఓ పోస్ట్ చేశారు. ‘ఫెడ్ (ఫెడరల్ రిజర్వ్) నకిలీ డబ్బును తయారు చేస్తున్నట్లుగానే ఏఐ నకిలీ మనుషులను సృష్టిస్తోంది’ అన్నారు.‘నకిలీ రాబర్ట్ కియోసాకిని సృష్టించి నకిలీ ఆర్థిక అంచనాలను చెప్పిస్తున్నారు. ఇందుకోసం కొంతమంది ఎందుకు తమ సమయాన్ని, శక్తిని వెచ్చిస్తున్నారు?.. ఇదంతా నాకు, మీకు, అందరికీ చికాకు పుట్టిస్తోంది’ అని రాసుకొచ్చారు.తనపై ఇలా డీక్ ఫేక్ చేసి అబద్దాలు సృష్టంచడానికి బదులు 'రాబర్ట్ కియోసాకి భారీ యూనిట్ తో పోర్న్ స్టార్ గా ఉండేవాడు' అని ఎందుకు చెప్పకూడదు? నేను దానిని ఇష్టపడతాను" అని చమత్కరించారు. తప్పుడు సమాచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని యూజర్లను కియోసాకి మరోసారి హెచ్చరించారు.PLEASE BE AWAREAI creates FAKE PEOPLE…just as the FED creates FAKE MONEY.Just saw a YOU TUBE video with me saying gold will drop by 50% in December.I did not say that.Why would some PERVERT waste so much time and effort creating a FAKE ROBERT KYOSAKI making a FAKE…— Robert Kiyosaki (@theRealKiyosaki) November 19, 2025 -
మ్యూచువల్ ఫండ్స్ కొత్త రూల్స్పై మరింత గడువు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్కు సంబంధించి ప్రతిపాదించిన కొత్త నిబంధనలపై అభిప్రాయాలు తెలియజేసేందుకు గడువును ఈ నెల 24 వరకు పొడిగిస్తున్నట్టు సెబీ ప్రకటించింది. టోటల్ ఎక్స్పెన్స్ రేషియో (టీఈఆర్)కు మరింత మెరుగైన నిర్వచనం ఇస్తూ, బ్రోకరేజీ సంస్థలు ఫండ్స్ నుంచి వసూలు చేసే చార్జీలను గణనీయంగా తగ్గిస్తూ సెబీ కొత్త ప్రతిపాదనలను సిద్దం చేయడం తెలిసిందే.అక్టోబర్ 28న వీటిని విడుదల చేస్తూ, ప్రజాభిప్రాయాలను ఆహ్వానించింది. తమకు అందించిన వినతుల మేరకు అభిప్రాయాలు తెలియజేసే గడువును 24వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు సెబీ ప్రకటన విడుదల చేసింది. -
ఆధార్ కార్డుల్లో కొత్త మార్పులు..!!
ఆధార్ కార్డుల దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు అక్రమ ఆఫ్లైన్ ధృవీకరణను తగ్గించడానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) కొత్త మార్పులు చేయబోతోంది. పేరు, ఇతర వివరాలేవీ లేకుండా కేవలం కార్డుదారు ఫోటో, క్యూఆర్ కోడ్ మాత్రమే కలిగిన సరళీకృత ఆధార్ కార్డును జారీ చేసే విషయాన్ని యూఐడీఏఐ పరిశీలిస్తున్నదని ఆ సంస్థ సీఈఓ భువనేష్ కుమార్ వెల్లడించారు.ఆఫ్లైన్ స్టోరేజ్ లేదా ఆధార్ నంబర్ల వాడకాన్ని నిషేధించే చట్టం ఉన్నప్పటికీ అనేక సంస్థలు ఇప్పటికీ ఆధార్ ఫోటోకాపీలను సేకరిస్తున్నాయని ఆయన అన్నారు. హోటళ్లు, ఈవెంట్ ఆర్గనైజర్లు, బ్యాంకులు వంటి సంస్థల ద్వారా జరుగుతున్న ఆఫ్లైన్ ధృవీకరణను తగ్గించచడానికి, అలాగే వ్యక్తిగత గోప్యతను రక్షిస్తూ ఆధార్ ఆధారిత వయస్సు ధృవీకరణ ప్రక్రియను మరింత మెరుగుపరచడానికి డిసెంబర్లో కొత్త నిబంధనలను ప్రవేశపెట్టాలని యూఐడీఏఐ యోచిస్తోంది.“కార్డుపై ఏవైనా వివరాలు ఎందుకు ఉండాలి? కేవలం ఫోటో, క్యూఆర్ కోడ్ ఉంటే సరిపోతుంది కదా అన్న ఆలోచన ఉంది. మనం ఎలా ప్రింట్ చేసిన కార్డులను ప్రజలు అలా అంగీకరిస్తూనే ఉంటారు. దుర్వినియోగం చేయాలనుకునే వారు వాటిని అలా చేస్తూనే ఉంటారు” అని సీఈఓ భువనేష్ కుమార్ అన్నారు.ఆధార్ కార్డు కాపీల ద్వారా జరిగే ఆఫ్లైన్ ధృవీకరణను పూర్తిగా అరికట్టే నిబంధన కూడా సిద్ధమవుతుందని, దీనిపై ప్రతిపాదనను డిసెంబర్ 1న యుఐడీఏఐ పరిశీలనకు తీసుకురాబోతున్నట్లు ఆయన తెలిపారు. “ఆధార్ను డాక్యుమెంట్గా ఉపయోగించరాదు. ఆధార్ నంబర్ ద్వారా ప్రామాణీకరించాలి లేదా క్యూఆర్ కోడ్ ద్వారా ధృవీకరించాలి. లేనిపక్షంలో నకిలీ పత్రం అయి ఉండే ప్రమాదం ఉంది,” అంటూ కుమార్ స్పష్టం చేశారు.ఆధార్ కొత్త యాప్ తీసుకొస్తున్న నేపథ్యంలో యూఐడీఏఐ బ్యాంకులు, హోటళ్లు, ఫిన్టెక్ సంస్థలు తదితర వాటాదారులతో సంయుక్త సమావేశం నిర్వహించింది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్కు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్న కొత్త యాప్ ఆధార్ ప్రామాణీకరణ సేవలను మరింత మెరుగుపరచనుందని, ఇది సుమారు 18 నెలల్లో పూర్తిగా అందుబాటులోకి వస్తుందని యూఐడీఏఐ భావిస్తోంది. -
మెరుగైన రాబడి కోసం.. మిడ్క్యాప్ మ్యూచువల్ ఫండ్స్
మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి పెట్టుబడులపై మెరుగైన రాబడి కోరుకునే ఇన్వెస్టర్ల ముందున్న ఎంపికల్లో మిడ్క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఒకటి. వీటిల్లో రిస్క్ అధికం. రాబడి కూడా అధికంగానే ఉంటుంది. లార్జ్క్యాప్ కంటే దీర్ఘకాలంలో అదనపు రాబడి మిడ్క్యాప్ ఫండ్స్తో సాధ్యపడుతుందని గత గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ విభాగంలో క్వాంట్ మిడ్క్యాప్ ఫండ్ మంచి పనితీరు చూపిస్తోంది. పదేళ్లు అంతకుమించిన దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇన్వెస్టర్లు ఈ పథకంలో పెట్టుబడులను పరిశీలించొచ్చు.రాబడులుస్వల్పకాలం నుంచి దీర్ఘకాలంలోనూ ఈ పథకంలో పనితీరు మెరుగ్గా ఉండడం కనిపిస్తుంది. ముఖ్యంగా గత ఏడాది కాలంలో ఈ పథకం ఎలాంటి రాబడిని ఇవ్వలేదు. అదే సమయంలో నష్టాలను మిగల్చలేదు. గడిచిన ఏడాది కాలంలో ఈక్విటీలు దిద్దుబాటు దశలో ఉండడం తెలిసిందే ఇది మినహా మిగిలిన అన్ని కాలాల్లోనూ రాబడులు పటిష్టంగా ఉన్నాయి. మూడేళ్లలో చూస్తే ఏటా 18 శాతం చొప్పున డైరెక్ట్ ప్లాన్లో రాబడి నమోదైంది. ఐదేళ్లలోనూ ఏటా 28 శాతం చొప్పున ప్రతిఫలాన్ని అందించింది. ఇక ఏడేళ్ల కాలంలో 23 శాతం, పదేళ్లలోనూ 18.34 శాతం చొప్పున రాబడి తెచి్చపెట్టింది. బీఎస్ఈ 150 మిడ్క్యాప్ టీఆర్ఐ సూచీతో పోల్చి చూస్తే ఐదేళ్లు, ఏడేళ్లలో అదనపు రాబడి ఇచి్చంది. పదేళ్ల కాలంలోనూ సూచీతో సమాన రాబడిని అందించింది. ముఖ్యంగా గడిచిన ఐదేళ్ల కాలంలో ఏ ఏడాది కూడా ఈ పథకం నికరంగా నష్టాలను ఇవ్వలేదు.పెట్టుబడుల విధానంఇది యాక్టివ్ ఫండ్. అంటే ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చేస్తుంటుంది. మార్కెట్, రంగాల వారీ పరిస్థితులు, పెట్టుబడుల అవకాశాలకు అనుగుణంగా పోర్ట్ఫోలియోలో కొత్త స్టాక్స్ను చేర్చుకోవడం, ప్రస్తుత స్టాక్స్లో ఎక్స్పోజర్ తగ్గించుకోవడం, పూర్తిగా వైదొలగడం వంటి బాధ్యలను ఫండ్ పరిశోధక బృందం ఎప్పటికప్పుడు చేస్తుంటుంది. ముఖ్యంగా ఏదో ఒక విధానానికి పరిమితం కాబోదు. మూమెంటమ్, వ్యాల్యూ, గ్రోత్ ఇలా అన్ని రకాల విధానాల్లోనూ పెట్టుబడుల అవకాశాలను ఈ పథకం పరిశీలిస్తుంటుంది. అవకాశాలకు అనుగుణంగా పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది.పోర్ట్ఫోలియోఈ పథకం నిర్వహణలో ప్రస్తుతం రూ.8,525 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 90.52 శాతం పెట్టుబడులను ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసింది. డెట్ సెక్యూరిటీల్లో 2.8 శాతం పెట్టుబడులు పెట్టింది. 6.68 శాతం నగదు నిల్వలు ఉన్నాయి. ముఖ్యంగా ఈక్విటీ పోర్ట్ఫొలియోని గమనించినట్టయితే మొత్తం 29 స్టాక్స్ ఉన్నాయి. టాప్–10 స్టాక్స్లోనే 58 శాతం పెట్టుబడులు ఉన్నాయి. ఈక్విటీ పెట్టుబడులను గమనిస్తే.. మిడ్క్యాప్ కంపెనీల్లో 59 శాతం ఇన్వెస్ట్ చేసింది. అదే సమయంలో 29 శాతం మేర లార్జ్క్యాప్ కంపెన్లీలో ఇన్వెస్ట్ చేసింది. లార్జ్క్యాప్ పెట్టుబడులు రిస్క్ను తగ్గిస్తాయి. మిడ్క్యాప్ పెట్టుబడులు మెరుగైన రాబడులకు అవకాశం కలి్పస్తాయని అర్థం చేసుకోవచ్చు. ఇంధన రంగ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ 18 శాతం పెట్టుబడులను ఈ రంగాల కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత ఇండ్రస్టియల్స్ కంపెనీలకు 16.71 శాతం, హెల్త్ కేర్ కంపెనీలకు 15.30 శాతం, టెక్నాలజీ కంపెనీలకు 11.22 శాతం చొప్పున కేటాయింపులు చేసింది. -
తక్కువ పెట్టుబడి.. మెరుగైన రాబడులు: ఎంపిక విషయంలో..
నేను ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. మంచి ఇండెక్స్ ఫండ్ ఎంపిక విషయంలో ఏ అంశాలను చూడాలి? - కృష్ణ శర్మఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకోవడం మంచి ఆలోచన అవుతుంది. ఇవి తక్కువ వ్యయాలకే మెరుగైన రాబడుల అవకాశాలను కల్పిస్తాయి. వీటి ఎంపిక విషయంలో ముఖ్యంగా చూడాల్సింది ఎక్స్పెన్స్ రేషియో. ఇండెక్స్ ఫండ్ ఏ సూచీలో అయితే పెట్టుబడులు పెడుతుందో గమనించి, ఆ ఇండెక్స్తో పోలిస్తే రాబడుల తీరు ఎలా ఉందన్నది చూడాలి. ఇండెక్స్తో పోలిస్తే పథకం పనితీరు ఎలా ఉందన్న సమాచారాన్ని ఆన్లైన్లో తెలుసుకోవచ్చు. ఇండెక్స్కు, ఆ ఇండెక్స్ అనుసరించే ఫండ్స్కు రాబడుల్లో అతి స్వల్ప వ్యత్యాసం ఉండే అవకాశం లేకపోలేదు. అంటే ఇండెక్స్ 2 శాతం పెరిగితే.. ఫండ్ పెట్టుబడుల విలువ వృద్ధి అదే కాలంలో 2.01 శాతం, 1.99 శాతంగా ఉండొచ్చు.ముఖ్యంగా ఎక్స్పెన్స్ రేషియో ఎంతో కీలకమైన అంశం అవుతుంది. రెండు ఇండెక్స్ పథకాల్లో ఒకటి 10 బేసిస్ పాయింట్లు చార్జ్ చేస్తుంటే, మరో పథకం 25 బేసిస్ పాయింట్లు చార్జ్ తీసుకుంటుంటే.. అప్పుడు 10 బేసిస్ పాయింట్ల పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవడం సరైన నిర్ణయం అవుతుంది. ఇండెక్స్ ఫండ్స్ సూచీలను అనుసరించే పెట్టుబడులు పెడుతుంటాయి. కనుక ఎక్స్పెన్స్ రేషియో ఒక్కటే ఇక్కడ ప్రామాణికం అవుతుంది.నెలవారీ సంపాదన నుంచి రిటైర్మెంట్, ఇతర జీవిత లక్ష్యాల కోసం ఏ మేరకు కేటాయించుకోవాలి. - విశేష్మీకు నెలవారీగా వస్తున్న ఆదాయం, జీవిత లక్ష్యాలు, వాటికి ఎంత కాలవ్యవధి ఉంది? తదితర అంశాల ఆధారంగా పొదుపు, పెట్టుబడులను నిర్ణయించుకోవాలి. ఒకరు తమ ఆదాయంలో కనీసం 20 శాతాన్ని అయినా పొదుపు చేసి, ఇన్వెస్ట్ చేయాలన్నది సాధారణ సూత్రం. ఈ పొదుపు మొత్తాన్ని వివిధ లక్ష్యాలకు ఎంత చొప్పున విభజించాలనే దానికి ఇదమిత్థమైన సూత్రం లేదు. ఎంత ఇన్వెస్ట్ చేయగలరు, ఎంత కాలంపాటు, ఎంత రాబడి కోరుకుంటున్నారనే దాని ఆధారంగా ఈ కేటాయింపులు ఆధారపడి ఉంటాయి. ముందు కాలవ్యవధికి అనుగుణంగా లక్ష్యాలను స్వల్పకాలం, మధ్యకాలం, దీర్ఘకాలం అంటూ వేరు చేయండి.దీర్ఘకాలం అంటే కనీసం ఏడేళ్లు అంతకుమించిన లక్ష్యాల కోసం ఈక్విటీ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి మెరుగైన రాబడులతోపాటు, కాంపౌండింగ్ ప్రయోజనాన్నిస్తాయి. 5–7 ఏళ్ల మధ్యకాల లక్ష్యాల కోసం ఈక్విటీ, డెట్ ఫండ్స్లో లేదా బ్యాలన్స్డ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వీటిల్లో వృద్ధి, స్థిరత్వం ఉంటుంది. 3 నుంచి 5 ఏళ్ల స్వల్ప కాల లక్ష్యాల కోసం బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, లిక్విడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్ చేసిన అనంతరం ఆరు నెలలు లేదా ఏడాదికోసారి అయినా పెట్టుబడులు మీ లక్ష్యాలకు అనుగుణంగానే పనిచేస్తున్నాయా? అన్నది సమీక్షించుకోవాలి. లక్ష్యాలకు చేరువ అవుతున్న సమయంలో ఈక్విటీ పెట్టుబడులను కొద్ది కొద్దిగా వెనక్కి తీసుకుని, డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల ఈక్విటీ మార్కెట్లలో పతనాల రిస్క్ను అధిగమించొచ్చు.ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
Income Tax: వ్యవసాయ ఆదాయం అంటే..?
గతవారం వ్యవసాయ భూముల అమ్మకం, క్యాపిటల్ గెయిన్ గూర్చి తెలుసుకున్నాము. కొందరు పాఠకులు అసలు ‘వ్యవసాయ ఆదాయం’ ఏమిటని అడుగుతున్నారు. ఆదాయపన్ను చట్టంలో వ్యవసాయ ఆదాయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈ ఆదాయం మీద పన్ను భారం లేదు. పూర్తిగా మినహాయింపే! అయితే ఇది కేవలం రైతులకు మాత్రమే కాదు రైతులుగా వ్యవసాయం చేసే వారికి కూడా ఈ మినహాయింపులు ఇస్తారు. అంటే భూమికి ఓనరే కావల్సిన అవసరం లేదు. కొన్ని షరతులు ఉన్నాయి. తెలుసుకోండి. వ్యవసాయ భూమి దేశంలోనే ఉండాలి. ఇందుకు సంబంధించి కాగితాలు ఉండాలి. అవి న్యాయబద్ధంగా ఉండాలి. సర్వే నెంబర్లు... పోరంబోకు భూములు, అడవులు, మెట్టభూములు, ఇసుక మెట్టలు, బంక మట్టివి మొదలగునవి చెప్పి మోసం చేయకండి. వ్యవసాయానికి అనువైన భూమిగా ఉండాలి. పట్టా పుస్తకాలు, పాస్ బుక్లు, అమ్మకం పత్రాలు, మ్యూటేషన్ వివరాలు ఉండాలి. వీటి ద్వారా హక్కులు, పరిమాణం, సరిహద్దులు, కొలతలు, యాజమాన్య స్థితి, ల్యాండ్ రికార్డు తదితర రికార్డులుండాలి. ఆ నిర్దేశిత వ్యవసాయ భూమి ద్వారా ఆదాయం ఏర్పడాలి. అది అద్దె కావచ్చు. పాడి పంటలు అమ్మగా నికరంగా మిగిలింది కావచ్చు. ఫామ్ హౌస్ మీద ఆదాయం కావచ్చు. అయితే ఆదాయం చేతికొచ్చినట్లు ఆధారాలుండాలి. రశీదులు, అగ్రిమెంట్లు, వ్యవసాయ కమిటీలు, పంపినట్లు రశీదు క్రయవిక్రయాలకు కాగితాలు మొదలైనవి. ఎంత పంట పండింది? పరిమాణం ఎంత? ఎక్కడ దాచారు? ఎంత దాచారు? సొంత వాడకం ఎంత? మార్కెట్ యార్డులకు ఎలా తరలించారు? ఎంత ధరకు అమ్మారు? ఎవరికి అమ్మారు? నగదు ఎలా వచ్చింది? బ్యాంకులో జమ ఎంత? తదితర వివరణలు ఉండాలి. అలాగే ఖర్చులు వివరాలు... అంటే సాగుబడికెంత? లేబర్కి ఎంత? విత్తనానికి ఎంత? పురుగు మందులకు ఎంత? ఎరువులకు ఎంత? యంత్రాల పనిపట్లపై ఎంత ఖర్చు చేశారు? కరెంటు ఎంత? బట్వడా ఎంతిచ్చారు ? ట్రాక్టరు బాడుగ, నీటి పారుదల, గోదాములు ఖర్చు తదితరాలపై సరైన కాగితాలుండాలి. పంటల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయమై ఉండాలి.కౌలు ద్వారా వచ్చినది వ్యవసాయ ఆదాయమే.. అయితే అగ్రిమెంట్లు ఉండాలి. ఒకటి గుర్తుంచుకోండి. నిజానికి రైతుకి నెలసరి ఆదాయం 2021–22లో సగటున రూ.12,698గా ఉంది. ఖర్చు కూడా అదే స్థాయిలో ఉంది. ఇక మిగిలింది ఎంత ? గొర్రె తోకంత. కానీ ఆదాయపు పన్ను శాఖ వారి రికార్డుల ప్రకారం ఏడాదికి కోటి రూపాయల వ్యవసాయ ఆదాయం ప్రకటించిన వారి సంఖ్య సుమారు 3,000 మంది. అందుకని వారి డేగ కన్ను కచ్చితంగా ఉంటుంది గుర్తుపెట్టుకొండి. కింద వివరాలు, ఉదాహరణలు గమనించండి విత్తనాల అమ్మకాలు, మొక్కలు, పూలు, పాదులు, ల్యాండ్ మీద అద్దె, వ్యవసాయం చేసే భాగస్వామ్య సంస్థలో భాగస్వామికిచ్చే వడ్డీ, పంట అమ్మకం పంట నష్టం అయితే ఇన్సూరెన్సు వారిచ్చే పరిహారం, అడువులలో చెట్లు ఇవన్నీ వ్యవసాయం మీద ఆదాయం కిందకు వస్తాయి. ఈ కిందివి వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయాలు కావుభూమి బదిలీ చేసిన తరువాత వచ్చిన ఎన్యూటీ బకాయి అద్దెల మీద వడ్డీ కౌలు తీసుకున్న వారు డబ్బులు చెల్లించకపోతే బదులుగా ప్రామిసరీ నోటు ఇచ్చి.., వాటి మీద వచ్చే వడ్డీ అటవీ సంపద అమ్మకం అంటే చెట్లు, పండ్లు, పూలు, అడవి గట్టి వంటివి అడవి నుంచి దొంగిలించినవి అమ్మివేయగా వచ్చేవి. పొలాల్లో సముద్రపు నీరు రావడం వలన ఏర్పడ్డ ఉప్పు అమ్మకం ద్వారా ఆదాయం వడ్డీ కమీషన్ చేపల అమ్మకం ఫైనాన్సింగ్లోని రాయితీ వెన్న, చీజ్ అమ్మకం పౌల్ట్రీ ఆదాయం డెయిరీ మీద ఆదాయం తేనెటీగల పెంపకం చెట్లు నరకడం ద్వారా వచ్చిన ఆదాయం ఫామ్ హౌజ్ని టీవీ, సీరియల్స్ షూటింగ్లకు అద్దెకిస్తే వచి్చన ఆదాయం విదేశాల నుంచి వచి్చన వ్యవసాయ ఆదాయం వ్యవసాయ కంపెనీ ఇచ్చే డివిడెండ్లు టీ పంటలో ఆదాయం 40%, మిగతా 60% వ్యవసాయం మీద ఆదాయం కాఫీలో 25%, (పండించి అమ్మితే) రబ్బర్ 95% కాఫీ... చికోరితో/లేదా చికోరి లేకుండా 40%చివరిగా, వ్యవసాయ ఆదాయం రూ.5,000 కు మినహాయింపు అందరికీ ఉంటుంది. దీనితో పాటు వ్యవసాయేతర ఆదాయం ఉన్నవారికి రెండింటిని కలిపి పన్ను భారం లెక్కిస్తారు. దీని వల్ల కొంత పన్ను భారం పెరుగుతుంది. కేవలం వ్యవసాయం మీద ఆదాయం ఇతరత్రా టాక్సబుల్ ఇన్కమ్ లేకపోతే పన్నుభారం లేదు. -
ఈ వారం బ్యాంకు సెలవులు ఎన్ని?
బ్యాంకులు ప్రతిఒక్కరి దైనందిన జీవితంలో భాగమైపోయాయి. పలు సేవల కోసం వినియోగదారులు బ్యాంకు శాఖలను సందర్శిస్తుంటారు. ఈ నేపథ్యంలో వారం ప్రారంభం కాగానే బ్యాంకు శాఖలు ఏ రోజుల్లో తెరిచి ఉంటాయి.. సెలవులేమైనా ఉన్నాయా అని చూస్తుంటారు.సాధారణ వారపు సెలవుల్లో భాగంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు ఈ వారం నవంబర్ 22న శనివారం, నవంబర్ 23న ఆదివారం రెండు రోజులు మాత్రమే మూసి ఉంటాయి. ఈ షెడ్యూల్ సెలవులు కాకుండా, వారంలోని అన్ని ఇతర రోజులలో బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి.సాధారణంగా అన్ని ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు నెలలో రెండో, నాలుగో శనివారాలను సెలవు దినాలుగా పాటిస్తాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) అధికారిక సెలవు క్యాలెండర్ ప్రకారం.. నవంబర్ 22న నెలలో నాల్గవ శనివారం వస్తుంది. కాబట్టి ఆ రోజన సెలవు ఉంటుంది.బ్యాంకులు ఎప్పుడు మూసిఉంటాయి?ఆర్బీఐ సెలవుదినాలు మినహా ఆదివారాలు, ప్రతి నెలా రెండవ, నాల్గవ శనివారాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి.నవంబర్ నెలలో ఇప్పటివరకు, ప్రాంతీయ పండుగలు, స్థానిక ఆచారాల కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో బ్యాంకులు మొత్తం ఆరు రోజుల పాటు మూసి ఉన్నాయి.ఈ నెలలో సెలవులు ఏమైనా మిగిలి ఉన్నాయా?ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం.. అన్ని బ్యాంకు శాఖలు మూసిఉంచే ఆదివారాలు మినహా నవంబర్ నెలలో మిగిలిన రోజుల్లో అదనపు బ్యాంకు సెలవులు లేవు. జాబితా చేసిన బ్యాంక్ తదుపరి సెలవుదినం డిసెంబరులో మాత్రమే ఉంటుంది.దేశంలో బ్యాంకు సెలవులు రాష్ట్రం నుండి రాష్ట్రానికి మారవచ్చు. జాతీయ, ప్రాంతీయ, మతపరమైన ఆచారాలు, పండుగల సందర్భంగా సెలవులను నిర్ణయిస్తారు. -
వెల్త్ కంపెనీ నుంచి కొత్త ఫండ్
వైవిధ్యమైన పోర్ట్ఫోలియోతో మెరుగైన రాబడులు అందించేలా హైబ్రిడ్ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ను ది వెల్త్ కంపెనీ ఏఎంసీ ఆవిష్కరించింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ నవంబర్ 19న ప్రారంభమై డిసెంబర్ 3న ముగుస్తుంది. ఇది ప్రధానంగా ఈక్విటీ, డెట్, కమోడిటీల్లో (వెండి, పసిడి) ఇన్వెస్ట్ చేస్తుంది.అనిశ్చితి నెలకొన్నప్పుడు, ద్రవ్యోల్బణం నుంచి హెడ్జింగ్ కోసం 50 శాతం వరకు కమోడిటీల్లో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంటుంది. ఆదాయ పన్ను చట్టంపరంగా హైబ్రిడ్ ట్యాక్సేషన్ ప్రయోజనాలు ఉంటాయి. -
టర్మ్ ఇన్సూరెన్స్ ఇప్పుడు చేస్తేనే ఎక్కువ ప్రయోజనం
ఇప్పుడిప్పుడే కెరియర్లో పురోగమిస్తూ, కుటుంబాలను ఏర్పర్చుకునే దశలో ఉన్న యువతకు సాధికారత కల్పించేందుకు టర్మ్ ఇన్సూరెన్స్ తోడ్పడుతుందని ఆదిత్య బిర్లా సన్లైఫ్ ఇన్సూరెన్స్ (ఏబీఎస్ఎల్ఐ) ఎండీ కమలేష్ రావు తెలిపారు. వాస్తవానికి 26–35 ఏళ్ల వయస్సు గ్రూప్లోని వారు దీర్ఘకాలికంగా ఆర్థిక భరోసాను కల్పించే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడంలో కొంత వెనుకబడుతున్నారని తమ సర్వేలో వెల్లడైందని చెప్పారు.ఈ సర్వే ప్రకారం 2025 మార్చి ఆఖరు నాటికి ప్రతి నలుగురు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీహోల్డర్లలో ఈ వయస్సు గ్రూప్లోని వారు ఒకరే ఉంటున్నారని (మొత్తం పాలసీదారుల్లో 25.24 శాతం) వెల్లడైనట్లు పేర్కొన్నారు. ఇది చెప్పుకోతగిన స్థాయే అయినప్పటికీ 36–45 ఏళ్ల గ్రూప్ వారి వాటా అత్యధికంగా 41.68 శాతంగా, 46–55 ఏళ్ల గ్రూప్ వారి వాటా 23.96 శాతంగా ఉందని తెలిపారు.ఈఎంఐలు, ఇతరత్రా ఖర్చులు, పొదుపు లక్ష్యాలు మొదలైన వాటి కారణంగా అప్పుడప్పుడే కాస్త అధికంగా ఆర్జించడం మొదలుపెట్టిన వారు కీలకమైన కవరేజీని పెద్దగా పట్టించుకోవడం లేదని దీని ద్వారా తెలుస్తోందని పేర్కొన్నారు. సాధారణంగా బీమాకు సంబంధించి చిన్న వయస్సులో ప్రీమియంలు, ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. అదే వయస్సు పెరిగి అదే నలభైలు, యాభైల్లోకి వచ్చినప్పుడు ప్రీమియంలు పెరిగిపోతాయి.ఈ విషయాలను యువతకు సమర్ధవంతంగా తెలియజేయడంతో పాటు బీమా కేవలం రక్షణ కవచంగానే కాకుండా ఆకాంక్షలను నెరవేర్చుకునే సాధనంగా కూడా ఉపయోగపడుతుందనే విషయాన్ని బీమా సంస్థలు సైతం వివరించాల్సి ఉంటుందని కమలేష్ రావు చెప్పారు. ఇందుకోసం వెల్నెస్ బెనిఫిట్స్, పొదుపునకు ఉపయోగపడే రైడర్లు, జీవితంలోని దశలను బట్టి కాలవ్యవధులను మార్చుకునే ఆప్షన్లు మొదలైనవి ఆఫర్ చేయాల్సి ఉంటుందన్నారు. -
ప్రమాదంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ: కియోసాకి హెచ్చరిక
ఎప్పుడూ స్టాక్ మార్కెట్లను, బాండ్లను విమర్శించే ప్రముఖ పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి.. తాజాగా మరో ఆసిక్తికర ట్వీట్ చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భారీ ప్రమాద దశలో ఉందని హెచ్చరించారు.ఆయన మాటల్లో.. ప్రపంచ మార్కెట్లలో ఏర్పడిన “ప్రతీ బుడగ” ఇప్పుడు పేలుతున్నదనీ, దీనితో పెద్ద ఎత్తున ధరలు పడిపోతున్నాయనీ తెలిపారు. అయితే, ఈ పరిణామాల మధ్య ఆయన తన ఆస్తులను (బంగారం, వెండి, బిట్కాయిన్, ఎథీరియం) అమ్మడం లేదని స్పష్టం చేశారు.‘ఎక్స్’(ట్విట్టర్)లో చేసిన వరుస పోస్ట్లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రమాదం అంచున ఉందని వ్యాఖ్యానించిన కియోసాకి (Robert Kiyosaki).. ప్రభుత్వాలు భారీ అప్పుల భారంతో కుప్పకూలే పరిస్థితిలో ఉన్నాయని, ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడానికి చివరకు అధిక స్థాయిలో డబ్బు ముద్రించడం తప్ప మరో మార్గం ఉండదని అన్నారు.అదే సమయంలో, అధిక ముద్రణ వల్ల డాలర్ విలువ పడిపోవడంతో “నకిలీ డబ్బు” (fiat currency) క్రాష్ అవుతుందని, దాంతో సహజంగా విలువ కలిగిన కఠిన ఆస్తులు (Hard Assets) ధరలు పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.క్రిప్టో మార్కెట్లో భారీగా పడిపోయే ధోరణి గురించి ఆయన మాట్లాడుతూ.. “బిట్కాయిన్ క్రాష్ అవుతోంది, ప్రతీ బుడగలు పగులుతున్నాయి. నేను అమ్ముతున్నానా? లేదు. ఎందుకంటే ప్రపంచానికి డబ్బు అవసరం, నాకు కాదు” అని అన్నారు.కియోసాకి ప్రకారం.. భారీ అప్పు సంక్షోభం కారణంగా ప్రభుత్వాలు త్వరలో “ది బిగ్ ప్రింట్” (నోట్ల ముద్రణ) ప్రారంభించాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో బంగారం, వెండి, బిట్కాయిన్, ఎథీరియం వంటి ఆస్తులు మరింత విలువను సంపాదిస్తాయని ఆయన నమ్మకం.BITCOiN CRASHING:The everything bubbles are bursting….Q: Am I selling?A: NO: I am waiting.Q: Why aren’t you selling?A: The cause of all markets crashing is the world is in need of cash.A: I do not need cash.A: The real reason I am not selling is because the…— Robert Kiyosaki (@theRealKiyosaki) November 15, 2025 -
రూ.కోట్లు కరిగిస్తున్న ‘షుగర్’!
ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న జబ్బు మధుమేహం. వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాలను ఇబ్బంది పెడుతోంది. డయాబెటిస్ ఒక కుటుంబానికి కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే కాదు.. ఆర్థిక సమస్య కూడా. మధ్యతరగతి కుటుంబంలో ఒకరికి షుగర్ జబ్బు వస్తే వైద్య ఖర్చులకే ఆ కుటుంబ ఆదాయంలో 10 నుంచి 20 శాతం వరకు ఖర్చవుతోంది. ఇంట్లో ఒక్కరికి డయాబెటిస్ వస్తే ఆ కుటుంబం ఆర్థికంగా ఎలా ఇబ్బంది పడుతుంది.. వైద్యపరంగా సగటున ఎంత ఖర్చు వస్తుంది.. తాజా డేటాతో సమగ్ర కథనం..భారతదేశంలో డయాబెటిస్ ఒక కుటుంబానికి పెద్ద ఆర్థిక భారంగా మారుతోంది. సగటున ఒక రోగి చికిత్స, మందులు, పరీక్షలు, ఇన్సులిన్ మొదలైన వాటికి సంవత్సరానికి రూ.15,000 నుంచి రూ.60,000 వరకు ఖర్చు అవుతోంది. దేశవ్యాప్తంగా డయాబెటిస్ కేర్ మార్కెట్ విలువ 2024లో రూ.1.25 లక్షల కోట్లు ఉండగా, అది 2030 నాటికి రూ.1.87 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా.మధుమేహంతో ఆర్థిక ఇబ్బందులు ఇలా..డయాబెటిస్ ఒకసారి వచ్చిన తర్వాత జీవితాంతం మందులు, పరీక్షలు, డాక్టర్ కన్సల్టేషన్లు అవసరం. ఇది నెలవారీ స్థిర ఖర్చుగా మారుతుంది. ప్రత్యేక డైట్ ఫుడ్, షుగర్-ఫ్రీ ఉత్పత్తులు, గ్లూకోమీటర్లు వంటి వస్తువులు అదనపు ఖర్చు పెంచుతాయి. జబ్బు కారణంగా రోగి పని సామర్థ్యం తగ్గితే కుటుంబ ఆదాయం కూడా తగ్గుతుంది. ఇంకా డయాబెటిస్ వల్ల హృదయ సంబంధిత సమస్యలు, కిడ్నీ వ్యాధులు, కంటి సమస్యలు వస్తే అదనపు వైద్య ఖర్చులు పెరుగుతాయి.సగటు వైద్య ఖర్చులుమధుమేహం బారిన పడిన వ్యక్తి మందులు, ఇన్సులిన్ కోసం నెలకు రూ.1,000 నుంచి రూ.4 వేలు.. అంటే సంవత్సరానికి రూ.12 వేల నుంచి రూ.48 వేలు ఖర్చవుతోంది. ఇక HbA1c, బ్లడ్ షుగర్, లిపిడ్ ప్రొఫైల్ వంటి పరీక్షల కోసం సంవత్సరానికి రూ.3వేల నుంచి రూ.10 వేలు వెచ్చించాల్సి వస్తోంది. అలాగే డాక్టర్ కన్సల్టేషన్లకు సంవత్సరానికి రూ.2 వేల నుంచి రూ.5 వేలు, అదే జబ్బు కాస్త ముదిరితే కిడ్నీ డయాలిసిస్, హృదయ శస్త్రచికిత్స వంటి చికిత్సల కోసం రూ.లక్షల్లో ఖర్చు భరించాల్సి ఉంటోంది. -
కొత్త రూల్.. పీఎఫ్ విత్డ్రాపై ట్యాక్స్!
సాధారణంగా ఉద్యోగాలు మారినప్పుడు లేదా అత్యవసర పరిస్థితుల్లో పీఎఫ్ డబ్బును విత్డ్రా చేసుకుంటారు. పీఎఫ్ విత్డ్రా విధానాన్ని వీలైనంత వరకు సులభంతరం చేయడానికి కేంద్రం కూడా తగిన చర్యలు తీసుకుంటూ ఉంది. అయితే ఇప్పుడు ఉద్యోగంలో చేరిన ఐదేళ్ల లోపు ఎవరైనా పీఎఫ్ విత్డ్రా చేసుకోవాలంటే ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.ఆదాయ పన్ను చట్టం, పాత పన్ను విధానం ప్రకారం.. పీఎఫ్ డబ్బును ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు. దీనిపై ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అయితే పదవీవిరమణకు ముందే పీఎఫ్ విత్డ్రాను నియంత్రించడానికి ఈపీఎఫ్ఓ కొత్త విధానం తీసుకొచ్చింది. దీని ప్రకారం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఇది కొత్త పన్ను నియమాలకు అనుగుణంగా ఉంటుంది.ఒకవేళా మీ ఈపీఎఫ్ఓ ఖాతాలో రూ. 50వేలు కంటే తక్కువ డబ్బు ఉన్నప్పుడు.. లేదా సంస్థ క్లోజ్ అయినప్పుడు, ఇతర అనారోగ్య కారణాల వల్ల ఉద్యోగం నుంచి వైదొలిగినప్పుడు పీఎఫ్ విత్డ్రా చేసుకోవచ్చు. దీనిపై ఎటువంటి ట్యాక్స్ ఉండదు.ఈపీఎఫ్ఓ ఖాతాలో రూ. 50వేలు కంటే ఎక్కువ డబ్బు ఉన్నప్పుడు.. మీరు ఉద్యోగంలో చేరి ఐదేళ్ల కంటే తక్కువ సమయం అయినప్పుడు.. పీఎఫ్ విత్డ్రా చేసుకోవాలంటే ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. మీరు పాన్ వివరాలు అందజేస్తే 10 శాతం టీడీఎస్ కట్ అవుతుంది, ఇవ్వకపోతే 34 శాతం వరకు టీడీఎస్ కట్ అవుతుంది. అదే ఐదేళ్లు ఉద్యోగం చేసిన తరువాత.. మీరు ఎలాంటి పన్ను చెల్లించకుండానే మీ పీఎఫ్ విత్డ్రా చేసుకోవచ్చు.ఒకే సంస్థలో ఐదేళ్లు పనిచేయాలా?, లేక ఇతర కంపెనీలలో పనిచేసిన సమయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారా? అనే అనుమానం చాలామందికి రావచ్చు. ఉదాహరణకు.. మీరు A అనే కంపెనీలో రెండేళ్లు ఉద్యోగం చేసి.. B అనే కంపెనీలో మరో మూడేళ్లు పనిచేశారనుకోండి. ఈ రెండు కంపెనీలలో పనిచేసిన సంవత్సరాలను కలిపి ఐదేళ్లుగా కౌంట్ చేసుకుంటారు. కాబట్టి మీరు ఎక్కడ పనిచేసినా.. ఆ మొత్తాన్ని పరిగణలోకి తీసుకుంటారు.ఇదీ చదవండి: ఇప్పుడు కొనండి, అప్పుడు అమ్మండి: కియోసాకి -
‘పేదల బంగారం’పైనా లోన్లు.. ఎప్పటి నుంచంటే..
ఆర్థికంగా అత్యవసరం తలెత్తినప్పుడు బంగారం ఉంటే అక్కరకువస్తుంది. బ్యాంకులు, ఇతర సంస్థల్లో తాకట్టు పెట్టి లోన్ పొందవచ్చు. ఈ కారణంతోనే చాలామంది మధ్య తరగతి వాళ్లు కూడా తమ స్తోమతకు మించి బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే మరి పేద, సామాన్య ప్రజల దగ్గర బంగారు ఆభరణాలు, వస్తువులు ఉండవు. ఏదో కొద్దో గొప్పో వెండి ఆభరణాలు, వస్తువులు ఉంటే ఉంటాయి. ఏదైనా అవసరం వచ్చినప్పుడు వాటిపై లోన్లు ఎవరూ ఇవ్వరు కదా.. అని ఇన్నాళ్లు బాధపడిఉంటారు. ఇకపై ఆ బాధ అక్కర్లేదు. పేదల బంగారంగా భావించే వెండిపైనా బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు రుణాలు ఇవ్వనున్నాయి.వెండిపై రుణాలకు సంబంధించి వాణిజ్య బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, సహకార బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలకు రుణ మార్గదర్శకాలను ఆర్బీఐ సవరించింది. ఇందులో భాగంగా 2026 ఏప్రిల్ 1 నుండి వెండి ఆభరణాలు, వస్తువులు లేదా నాణేలను తాకట్టు పెట్టి రుణాలను పొందవచ్చు. పేదలు, సామాన్యులకు రుణ లభ్యతను మెరుగుపరచడానికి ఆర్బీఐ ఈ మార్పులు చేస్తోంది. అయితే ప్రాథమిక వెండి అంటే ఆభరణాలు, వినియోగ వస్తువులు కాకుండా వాణిజ్యానికి ఉపయోగించే వెండి బార్లపై మాత్రం ఈ రుణ సదుపాయం ఉండదని ఆర్బీఐ స్పష్టం చేసింది.అయితే బంగారంపై ఇచ్చినట్లుగా దాటి రేటు ఆధారంగా అధిక మొత్తంలో రుణాలు వెండిపై ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చని ఆర్బీఐ చెబుతోంది. వెండికి ఉన్న అధిక అస్థిరత, తక్కువ లిక్విడిటీ కారణంగా లోన్-టు-వాల్యూ నిష్పత్తులు, వడ్డీ రేట్లకు సంబంధించి వెండిపై రుణాలు బంగారు రుణాలతో పోల్చితే భిన్నంగా ఉండవచ్చు. అందువల్ల బ్యాంకులు, రుణ సంస్థలు వెండి-ఆధారిత రుణాలపై తక్కువ క్రెడిట్ పరిమితులను, కొంచెం ఎక్కువ వడ్డీ రేట్లను నిర్ణయించవచ్చు. తాకట్టు పెట్టిన వెండి స్వచ్ఛత, నిల్వ, బీమా ఖర్చులు, తిరిగి చెల్లింపు షెడ్యూల్, జప్తు నిబంధనలతో సహా కారకాలను జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకోవాలని రుణగ్రహీతలకు ఆర్బీఐ సూచించింది. -
మరో గోల్డ్ బాండ్.. రిడంప్షన్ రేటు ప్రకటించిన ఆర్బీఐ
బంగారం ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో బంగారాన్ని రిస్క్ లేని పెట్టుబడిగా భావిస్తుండటంతో పసిడికొనుగోళ్లు నానాటికి పెరుగుతున్నాయి. ధరలు పెరుగుతున్నప్పుడు కొనేవారికంటే రేటు తక్కువ ఉన్నప్పుడు భవిష్యత్తు అంచనాతో కొన్నవారే ఎక్కువ ప్రతిఫలం దక్కించుకుంటారు. ఇదే ఆలోచనలో గతంలో చాలా మంది ప్రభుత్వం జారీ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్లను కొనుగోలు చేశారు. వారు ఇప్పుడు దాదాపు మూడింతల లాభాన్ని పొందుతున్నారు.2017-18 సిరీస్-7 కింద జారీ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్లు (ఎస్జీబీ) నేటికి (2025 నవంబర్ 13) మెచ్యూరిటీ తీరాయి. దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వాటికి రూ.12,350 రిడంప్షన్ ధర ప్రకటించింది. ఆర్బీఐ నోటిఫికేషన్ ప్రకారం.. 2017 వవంబర్ 13న వీటిని గ్రాముకు రూ.2934 లకు జారీ చేసింది. డిస్కౌంట్ పోగా వీటి ఆన్లైన్ ధర రూ.2,884. ఇప్పుడీ బాండ్లు 329 శాతం రాబడిని అందుకుంటున్నాయి. అంటే గ్రాముకు రూ.9466 లాభం అన్నమాట.మరో సిరీస్కు ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ఆర్బీఐ 2018-19 సిరీస్-3 కింద జారీ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్లకు కూడా ముందస్తు రిడంప్షన్ ప్రకటించింది. 2018 నవంబర్ 13న జారీ చేసిన ఈ బాండ్లను ముందస్తుగా 2018 నవంబర్ 13న గ్రాముకు రూ.12,350 ధర వద్ద రిడీమ్ చేసుకునే వెసులుబాటు ఉంది. గ్రాముకు రూ.3,146 ధర వద్ద జారీ చేసిన వీటి తుది గడువు 2026 నవంబర్ 13న తీరనుంది. ఇప్పుడు రిడీమ్ చేసుకుంటే గ్రాముకు 288 శాతం అంటే రూ.9204 లాభంతో సొమ్ము చేసుకోవచ్చు.సావరిన్ గోల్డ్ బాండ్ పథకం గురించి..భౌతిక బంగారానికి ప్రత్యామ్నాయంగా భారత ప్రభుత్వం 2015 నవంబర్లో సావరిన్ గోల్డ్ బాండ్స్ పథకాన్ని ప్రవేశపెట్టింది. కేంద్రం తరపున ఆర్బీఐ ఈ బాండ్లను జారీ చేసింది. గ్రాములవారీగా ఈ గోల్డ్ బాండ్లపై పెట్టిబడి పెట్టినవారికి ద్వంద్వ ప్రయోజనాన్ని అందించాయి. ఇష్యూ ధరపై 2.5% స్థిర వార్షిక వడ్డీతో పాటు రిడంప్షన్ నాటికి అప్పటి ధరను పొందే అవకాశం కల్పించాయి.వాస్తవంగా ఈ బాండ్లకు ఎనిమిదేళ్ల నిర్ణీత కాలపరిమితి ఉంటుంది. కానీ మదుపరులు కోరుకుంటే ఐదేళ్ల తర్వాత వడ్డీ చెల్లింపు తేదీలలో నిష్క్రమించవచ్చు. ఈ గోల్డ్ బాండ్లను స్టాక్ ఎక్స్ఛేంజీలలో ట్రేడ్ చేయవచ్చు, ఇతరులకు బదిలీ చేయవచ్చు లేదా రుణాలకు పూచీకత్తుగా ఉపయోగించవచ్చు. కాగా రుణ భారం అధికమవడంతో ప్రభుత్వం 2024 ఫిబ్రవరిలో వీటి జారీని నిలిపివేసింది.ఆదాయపు పన్ను చట్టం, 1961 (1961 సెక్షన్ 43) నిబంధనల ప్రకారం సావరిన్ గోల్డ్ బాండ్లపై వచ్చే వడ్డీపై పన్ను ఉంటుంది. అయితే ఈ బాండ్లను రీడీమ్ చేసినప్పుడు, మూలధన లాభాల పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఎక్స్ఛేంజీలో బాండ్ల బదిలీ ఫలితంగా వచ్చే ఏదైనా మూలధన లాభాలపై ఇండెక్సేషన్ ప్రయోజనాలు ఉంటాయి. -
2047 నాటికి ప్రతి ఒక్కరికీ బీమా: ఐఆర్డీఏఐ ఛైర్మన్
2047 నాటికి ప్రతి ఒక్కరికీ బీమా అనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని ఐఆర్డీఏఐ ఛైర్మన్ అజయ్ సేథ్ తెలిపారు. హైదరాబాద్లోని ఇన్సూరెన్స్ అంబుడ్స్మన్ కార్యాలయంలో ఈరోజు బీమా లోక్పాల్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా ఉన్న బీమా లోకపాల్ కేంద్రాలతో వెబ్కాస్ట్ ద్వారా మాట్లాడారు. పాలసీదారుల ఫిర్యాదులను ఉచితంగా, నిష్పక్షపాతంగా పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం బీమా లోకపాల్ వ్యవస్థను ప్రారంభించిందన్నారు. పాలసీదారుల సమస్యలను పారదర్శకంగా పరిష్కరించే వ్యవస్థ మరింత బలోపేతం కావాలన్నారు. ఈ సందర్భంగా ఐఆర్డీఏఐ సభ్యుడు దీపక్ సూద్ మాట్లాడుతూ ఖైరతాబాద్లోని ది సెంట్రల్ కోర్ట్ హోటల్లో మాట్లాడుతూ బీమా రంగ అభివృద్ధిలో పాలసీదారుల నమ్మకం అత్యంత ముఖ్యమన్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టడంలో బీమా లోకపాల్ నిరంతరం న్యాయపూర్వక సేవలందిస్తూ కీలక బాధ్యతను నిర్వర్తిస్తున్నదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ బీమా లోకపాల్ జీ శోభారెడ్డి మాట్లాడుతూ 2024-25 ఆర్ధిక సంవత్సరంలో కేంద్రం సాధించిన పని తీరును, 2025 అక్టోబర్ నెల వరకు ప్రస్తుత సంవత్సరంలో నమోదు చేసిన ఫిర్యాదుల పరిశీలన, పరిష్కార విజయాలను వివరించారు. కరపత్రాలు, బ్రోచర్లు బీమా పాలసీ కొనుగోలు సమయంలో గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్య అంశాలు, లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్లో ‘కరెక్ట్ పద్ధతులు’, ‘ఎలా చేయకూడదు’ వంటి అంశాలను ప్రజలకు సులభంగా అర్థమయ్యే విధంగా తెలియజేశారు.బీమా లోకపాల్ కార్యాలయ ప్రాంగణంలో 'బీమా లోకపాల్ - బీమా ఫిర్యాదుల పరిష్కారానికి ఉచిత ప్రత్యామ్నాయ న్యాయ వేదిక' అనే సందేశంతో బ్యానర్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ మెట్రో మార్గాలు, ఆంధ్రప్రదేశ్లోని వివిధ రైల్వే స్టేషన్లలో చీరాల, తుని, తాడేపల్లిగూడెం, అనకాపల్లి, కాకినాడ, భీమవరం, సామర్లకోట, రేణిగుంటలో సమాచార డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఇవి బీమా లోకపాల్ కార్యాలయాన్ని సంప్రదించే విధానం, ఫిర్యాదు ప్రక్రియ వంటి వివరాలను ప్రజలకు చూపించాయి.'న్యాయమైన పరిష్కారం ద్వారా పాలసీదారులకు సాధికారత కల్పించడం' అనే అంశంతో వాట్సాప్ డిస్ప్లే పిక్చర్స్, స్టేటస్ సందేశాలతో ప్రచారం చేపట్టారు. డిజిటల్ వేదికల ద్వారా విస్తృతంగా ప్రజలను చేరుకున్నారు. ఈ సమగ్ర చర్యలు పాలసీదారులకు బీమా లోకపాల్ సేవల గురించి స్పష్టమైన అవగాహన కల్పించడం, ఉచితంగా, నిష్పక్షపాతంగా ఫిర్యాదులను పరిష్కరించుకునే అవకాశాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. పబ్లిక్ సెక్టార్ బీమా సంస్థల సీనియర్ అధికారులు, ప్రైవేట్ బీమా కంపెనీల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తమ సంస్థల్లో వినియోగదారుల ఫిర్యాదు పరిష్కార వ్యవస్థలను మరింత బలోపేతం చేసే విధానాలపై తమ అనుభవాలు పంచుకున్నారు. -
బంగారం మాయలో పడొద్దు!
పెళ్లిళ్ల సీజన్ కావడంతో ప్రస్తుతం చాలా కుటుంబాల్లో బంగారంపై చర్చ జరుగుతుంది. పెళ్లి కుటుంబాల్లో బంగారం కొనుగోలు అనివార్యం. అయితే పసిడిపై పెట్టుబడి పెట్టాలనుకునేవారు కూడా ఇదే అదనుగా పుత్తడిని కొనుగోలు చేస్తుంటారు. అంతర్జాతీయ అనిశ్చితులు, ద్రవ్యోల్బణం భయాల మధ్య బంగారం ధరలు ఇటీవల ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ సంపదను కాపాడుకోవడానికి, ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి చాలా మంది పెట్టుబడిదారులు బంగారంపై దృష్టి సారిస్తున్నారు. అయితే బంగారంలో పెట్టుబడి అంటే నేరుగా ఆభరణాలు లేదా కాయిన్స్ కొనుగోలు చేయాలని కొందరు భావిస్తున్నారు. కానీ, కేవలం ‘బంగారం’ అనే భావనతో భౌతిక రూపంలో పెట్టుబడి పెట్టడం వల్ల ఊహించని నష్టాలు, ఇబ్బందులు ఎదురవుతాయని గుర్తుంచుకోవాలి. మరి.. ఈ మెరిసే లోహంలో సురక్షితంగా, లాభదాయకంగా పెట్టుబడి పెట్టాలంటే సరైన మార్గం ఏమిటో తెలుసుకుందాం.భౌతిక బంగారం కొనుగోలుతో..బంగారం కొనుగోలు అనేది తరతరాలుగా వస్తున్న ఒక అలవాటు. అయితే, దీన్ని ఒక పెట్టుబడి సాధనంగా చూసినప్పుడు నేరుగా బంగారం కొనుగోలు చేయడం (ఫిజికల్ గోల్డ్) అనేక ప్రతికూలతలను కలిగి ఉంటుంది. ఆభరణాలు కొన్నప్పుడు బంగారం అసలు ధరతో పాటు అధికంగా 8% నుంచి 30% వరకు తయారీ ఛార్జీలు, తరుగు రూపంలో కొంత చెల్లించాల్సి వస్తుంది. ఈ ఖర్చు పెట్టబడుల నుంచి లాభాన్ని తగ్గిస్తుంది.బంగారాన్ని కొనుగోలు చేసేటప్పుడు దాని స్వచ్ఛత (క్యారెట్) విషయంలో అనుమానాలు, మోసాలు జరిగే అవకాశం ఉంది. హాల్మార్క్ ఉన్నప్పటికీ చిన్న దుకాణాల్లో నాణ్యతను తనిఖీ చేయడం కష్టం. భౌతిక బంగారాన్ని ఇంట్లో ఉంచుకుంటే దొంగతనం జరిగే ప్రమాదం ఉంది. బ్యాంక్ లాకర్లలో ఉంచినా అద్దె, ఇతర ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఇది పెట్టుబడిపై రాబడిని తగ్గిస్తుంది.అత్యవసర పరిస్థితుల్లో బంగారాన్ని త్వరగా సరైన ధరకు అమ్మడం కష్టం కావచ్చు. కొన్నిసార్లు కొనుగోలు చేసిన ధర కంటే తక్కువకు అమ్ముకోవాల్సి వస్తుంది. కొనుగోలు చేసేటప్పుడు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇది పెట్టుబడిదారునికి అదనపు భారం. బంగారు ఆభరణాలు ఖర్చు లేదా అలంకారం కిందకు వస్తాయి తప్ప పూర్తిస్థాయి పెట్టుబడి కిందకు రావని గమనించాలి.గోల్డ్ ఈటీఎఫ్లుబంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునే వారికి భౌతిక బంగారానికి ప్రత్యామ్నాయంగా సులభంగా, పారదర్శకంగా ఉండే మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (Gold ETFs). గోల్డ్ ఈటీఎఫ్లు అంటే ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్న గోల్డ్ యూనిట్లు అని అర్థం. ఇవి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) లేదా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లో షేర్ల వలె ట్రేడ్ అవుతాయి. ఒక గోల్డ్ ఈటీఎఫ్ యూనిట్ సాధారణంగా ఒక గ్రాము బంగారానికి సమానం.గోల్డ్ ఈటీఎఫ్ల్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి?ముందుగా ఏదైనా బ్రోకరేజ్ సంస్థ వద్ద డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాను తెరవాలి. ఇది షేర్లు కొనుగోలు చేయడానికి అవసరం.వివిధ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు (AMC) అందించే గోల్డ్ ఈటీఎఫ్ల్లో (ఉదా: నిప్పన్ ఇండియా గోల్డ్ ఈటీఎఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ గోల్డ్ ఈటీఎఫ్..) ఒకదాన్ని ఎంచుకోవాలి.ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో మీకు కావలసిన గోల్డ్ ఈటీఎఫ్ పేరును ఎంటర్ చేసి షేర్లను కొనుగోలు చేసినట్లే యూనిట్లను కొనుగోలు చేయవచ్చు.ఒకేసారి పెద్ద మొత్తంలో లేదా క్రమంగా చిన్న మొత్తాల్లో (సిప్ మాదిరిగా) కొనుగోలు చేయవచ్చు.గోల్డ్ ఈటీఎఫ్ల వల్ల ప్రయోజనాలుగోల్డ్ ఈటీఎఫ్లు అనేక రకాల ప్రయోజనాలను అందించి, భౌతిక బంగారంపై మెరుగైన పెట్టుబడి సాధనంగా నిలుస్తాయి. ప్రతి ఈటీఎఫ్ యూనిట్ 99.5% స్వచ్ఛత కలిగిన భౌతిక బంగారం కలిగి ఉంటుంది. నాణ్యత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇందులో తయారీ ఛార్జీలు, తరుగు వంటివి ఉండవు. కేవలం కొద్దిపాటి బ్రోకరేజ్, ఫండ్ నిర్వహణ ఛార్జీలు (సాధారణంగా 0.5% లోపు) మాత్రమే ఉంటాయి. ఇది లాభాలను పెంచుతుంది.స్టాక్ ఎక్స్ఛేంజ్లో రోజులో ఎప్పుడైనా అమ్ముకోవచ్చు, కొనుగోలు చేయవచ్చు. తక్షణమే నగదుగా మార్చుకోవచ్చు. ఈటీఎఫ్లు ఎలక్ట్రానిక్ రూపంలో డీమ్యాట్ ఖాతాలో నిల్వ చేయబడతాయి కాబట్టి, దొంగతనం అయ్యే ప్రమాదం లేదు. లాకర్ ఖర్చులు ఉండవు. కేవలం ఒక యూనిట్ (సుమారు ఒక గ్రాము బంగారానికి సమానం) నుంచే పెట్టుబడి ప్రారంభించవచ్చు. దీనివల్ల సాధారణ మధ్యతరగతి పెట్టుబడిదారులు కూడా సులభంగా ఇన్వెస్ట్ చేయవచ్చు.ఇదీ చదవండి: ఉద్యోగంతో ఊడిగం చేయాల్సిందేనా..! -
పెట్టుబడి వెనక్కి తీసుకుంటే పెనాల్టీ కట్టాలా?
నా వద్ద రూ.30 లక్షలు ఉన్నాయి. మెరుగైన రాబడుల కోసం ఈక్విటీల్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి? – జయ్దేవ్ముందుగా సరైన పెట్టుబడి సాధనాన్ని ఎంపిక చేసుకోవాలి. రాబడితోపాటు పెట్టుబడి రక్షణకూ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. కనుక ప్రతీ పెట్టుబడి ఆప్షన్లో ఉండే సానుకూల, ప్రతికూలతలను చూడాలి. ఈక్విటీ పథకాలు స్వల్పకాలంలో రాబడులు ఇస్తాయని కచి్చతంగా చెప్పలేం. రాబడులు ఇవ్వొచ్చు. నష్టాలూ ఇవ్వొచ్చు. అస్థిరతలు ఎక్కువ. మార్కెట్ ఏ సమయంలో అయినా దిద్దుబాటుకు గురికావచ్చు. పెట్టుబడి అవసరమైన సమయంలో మార్కెట్లు దిద్దుబాటును చూస్తే రాబడిని నష్టపోవాల్సి రావచ్చు. కనుక స్వల్పకాలం కోసం అయితే అస్థితరల రిస్క్ను అధిగమించేందుకు డెట్ సాధనాలను ఎంపిక చేసుకోవాలి. ఐదేళ్లు, అంతకుమించిన కాలం కోసం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక మీ పెట్టుబడులను వివిధ రకాల మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవడం ద్వారా వైవిధ్యం ఉండేలా చూసుకోవాలి.ఒకవేళ ఏదైనా ఫండ్ బలహీన పనితీరు చూపిస్తే, మరో ఫండ్ మంచి పనితీరుతో రాబడుల్లో స్థిరత్వం ఉంటుంది. క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసుకోవడం మరో మార్గం. ఇందుకు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్)ను ఎంపిక చేసుకోవచ్చు. దీనివల్ల అస్థిరతల ప్రభావాన్ని అధిగమించొచ్చు. మీ లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యం, రాబడుల అంచనాల ఆధారంగా డెట్, ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవడం సరైన నిర్ణయం అవుతుంది.నేను సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్)లో రూ.4 లక్షలు ఇన్వెస్ట్ చేశాను. మూడేళ్లు అయింది. ఇప్పుడు నా పెట్టుబడిని వెనక్కి తీసుకుంటే పెనాల్టీ చెల్లించాలా? – శ్యామ్ ముఖర్జీసీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కాల వ్యవధి ఐదేళ్లు. 8.2 శాతం వార్షిక రాబడిని మూడు నెలలకు ఒకసారి చొప్పున చెల్లిస్తారు. ఈ పథకం వడ్డీ రేటును ప్రతి మూడు నెలలకు ఒకసారి కేంద్ర ఆర్థిక శాఖ సమీక్షిస్తుంటుంది. అయినప్పటికీ డిపాజిట్ చేసే రోజు ఉన్న రేటు ఐదేళ్ల కాలానికి అమలవుతుంది. అంటే కొత్తగా ప్రారంభించే ఖాతాలకే సవరించిన రేటు అమల్లో ఉంటుంది. ఈ పథకం కాలవ్యవధి ఐదేళ్లకు ముందుగానే వైదొలగాలంటే అందుకు ఫారమ్-2 సమర్పించాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసిన కాలవ్యవధి ఆధారంగా కొంద పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.డిపాజిట్ చేసిన ఏడాది లోపు వెనక్కి తీసుకుంటే ఎలాంటి వడ్డీ చెల్లించరు. అప్పటి వరకు మూడు నెలలకు ఒకసారి చెల్లించిన వడ్డీ మొత్తాన్ని అసలు నుంచి మినహాయించుకుంటారు. ఏడాది నుంచి రెండేళ్ల మధ్య డిపాజిట్ను రద్దు చేసుకుంటే పెట్టుబడిలో 1.5 శాతాన్ని జరిమానా కింద మినహాయించి, మిగిలినది చెల్లిస్తారు. ఇక రెండు నుంచి ఐదేళ్ల మధ్యలో డిపాజిట్ రద్దు చేసుకుంటే అప్పుడు పెట్టుబడిపై 1 శాతం జరిమానా పడుతుంది. మీరు మూడేళ్ల తర్వాత డిపాజిట్ను వెనక్కి తీసుకోవాలని అనుకుంటున్నారు. కనుక మీరు మీ పెట్టుబడి మొత్తం రూ.4 లక్షలపై ఒక శాతం చొప్పున రూ.4,000 పెనాల్టీ మినహాయించుకుని, మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తారు. మొదటి ఐదేళ్ల కాలానికే ఈ నిబంధనలు అమలవుతాయి. ఎస్సీఎస్ఎస్ పథకాన్ని ఐదేళ్ల తర్వాత మరో మూడేళ్లు పొడిగించుకోవచ్చు. ఇలా పొడిగించిన కాలంలో ఏడాది నిండిన తర్వాత, అంటే మొత్తంగా ఆరేళ్ల తర్వాత ఎప్పుడు ముందస్తుగా రద్దు చేసుకున్నా, ఎలాంటి పెనాల్టీ పడదు.ధీరేంద్ర కుమార్ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఈ పోస్టాఫీసు స్కీములో పెట్టిన డబ్బులు డబుల్
పోస్టాఫీసు పొదుపు పథకాలకు ప్రజల్లో ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. పోస్టాఫీసుల ద్వారా ఆకర్షణీయమైన వడ్డీతోపాటు రిస్క్ లేకుండా రాబడిని ఇచ్చే స్కీములు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటే ‘కిసాన్ వికాస్ పత్ర’ (KVP). భారత ప్రభుత్వం మద్దతుతో ఇండియా పోస్ట్ అందించే అత్యంత నమ్మదగిన, సురక్షితమైన పెట్టుబడి పథకాలలో ఒకటిగా 2025లో కూడా కొనసాగుతోంది. కచ్చితమైన రాబడితో తక్కువ-రిస్క్ పెట్టుబడులను కోరుకునేవారి కోసం రూపొందించిన ఈ పథకం.. దీర్ఘకాలికంగా స్థిరంగా రాబడిని పెంచుకునే మార్గాన్ని అందిస్తోంది.కచ్చితమైన రాబడి.. అసలుకు భద్రతకిసాన్ వికాస్ పత్ర పథకం పెట్టుబడి పెట్టిన మొత్తానికి ప్రభుత్వ హామీతో కూడిన భద్రతను అందిస్తుంది. మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా, నిర్దిష్ట కాలవ్యవధిలో పెట్టుబడి రెట్టింపు అవుతుంది.తక్కువ మొత్తంతోనే పెట్టుబడికిసాన్ వికాస్ పత్ర పథకంలో తక్కువ మొత్తం పెట్టుబడితోనే ప్రవేశించవచ్చు. కేవలం రూ.1,000తో పొదుపు ప్రారంభించవచ్చు. గరిష్టంగా ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. ఎలాంటి పరిమితి లేదు. ఇది చిన్న, మధ్యతరహా, పెద్ద మొత్తంలో పొదుపు చేసేవారికి కూడా అందుబాటులో ఉంటుంది.ఆకర్షణీయమైన వడ్డీ రేటుకిసాన్ వికాస్ పత్ర పథకంపై ప్రస్తుతం 7.5% చక్రవడ్డీ రేటు అందుబాటులో ఉంది. దీని ద్వారా పెట్టుబడి పెట్టిన మొత్తం సుమారు 115 నెలల్లో (9 సంవత్సరాలు 7 నెలలు) రెట్టింపు అవుతుంది. వడ్డీ రేటును ప్రభుత్వం కాలానుగుణంగా సవరిస్తుంది.కేవీపీలో ఎవరు పెట్టుబడి పెట్టవచ్చు?కిసాన్ వికాస్ పత్రలో సాధారణ వ్యక్తులెవరైనా తమ పేరుతో పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే ఇద్దరు, ముగ్గురు కలిసి కూడా జాయింట్ ఖాతాదారులుగా పొదుపు చేయవచ్చు. ఇక మైనర్లు అయితే తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ద్వారా ఈ స్కీములో చేరవచ్చు. ఖాతా తెరవడానికి పోస్టాఫీసు లేదా ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంకు శాఖను సందర్శిస్తే సరిపోతుంది. గుర్తింపు, చిరునామా రుజువు వంటి ప్రాథమిక డాక్యుమెంట్లు అవసరమవుతాయి.కేవీపీ పథకం ప్రధాన ఫీచర్లు, ప్రయోజనాలుపెట్టుబడి రెట్టింపు: మార్కెట్ రిస్క్ లేకుండా నిర్దిష్ట కాలంలో మీ డబ్బు రెట్టింపు అవుతుందిముందస్తు ఉపసంహరణ సౌకర్యం: 2.5 సంవత్సరాల తరువాత అత్యవసర పరిస్థితులలో మీ పెట్టుబడి సొమ్మును ఉపసంహరించుకోవచ్చు.రుణం, బదిలీ సదుపాయం: కేవీపీ సర్టిఫికెట్లను బ్యాంకుల వద్ద పూచీకత్తుగా ఉంచి రుణం పొందవచ్చు. పెట్టుబడిని వ్యక్తుల మధ్య లేదా పోస్టాఫీసుల మధ్య బదిలీ చేయవచ్చు.మార్కెట్ రిస్క్ లేకుండా స్థిరమైన వృద్ధి: స్టాక్ మార్కెట్ లేదా ఇతర అస్థిర పెట్టుబడి సాధనాలతో సంబంధం లేకుండా, పూర్తిగా రిస్క్ రహితమైన పెట్టుబడి మార్గం.2025లో కిసాన్ వికాస్ పత్ర ఎందుకంటే..మార్కెట్ అస్థిరత, ఫిక్స్డ్ డిపాజిట్లపై తక్కువ వడ్డీ రేట్లు ఉన్న పరిస్థితుల్లో కిసాన్ వికాస్ పత్ర స్థిరమైన వృద్ధిని కోరుకునే మదుపరులకు సురక్షితమైన ఆశ్రయం అందిస్తుంది. ఇది కొంత మందికి ప్రత్యేకంగా సరిపోతుంది. ముఖ్యంగా స్థిరమైన ఆదాయాన్ని కోరుకునే సీనియర్ సిటిజన్లు, పదవీ విరమణ చేసినవారు, ప్రభుత్వ హామీతో కూడిన పొదుపును ఇష్టపడే గ్రామీణ మదుపరులు, చదువు, వివాహం లేదా పదవీ విరమణ కోసం దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలు చేసుకునే కుటుంబాలకు కిసాన్ వికాస్ పత్ర సరైన ఎంపికగా నిలుస్తుంది. -
వ్యవసాయ భూములు.. క్యాపిటల్ గెయిన్స్..
భూమి, ప్లాటు, జాగా.. ఇలాంటివి అమ్మితే ఏర్పడే క్యాపిటల్ గెయిన్స్ స్వభావరీత్యా పన్నుకి గురి అవుతాయి. అయితే, గ్రామాల్లో ఉన్న వ్యవసాయ భూములు అమ్మితే ఏర్పడే క్యాపిటల్ గెయిన్స్ మీద ఎలాంటి పన్నుభారం ఏర్పడదు.గ్రామాల్లో వ్యవసాయ భూమి అంటే ఏమిటి..ఇన్కం చట్టంలో గ్రామీణ వ్యవసాయ భూమి అంటే ఏమిటో వివరించారు. ఇలాంటి పొలాన్ని చట్టం ప్రకారం క్యాపిటల్ అసెట్గా పరిగణించరు. అసలు అది క్యాపిటల్ అసెట్ కాదు కాబట్టి, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పడదు. ఒక మున్సిపాలిటీ, అందులో ఉన్న జనాభా 10,000 కన్నా తక్కువ ఉండి, ఈ రెండు కండీషన్లకు అనుగుణంగా ఉన్న ప్రాంతంలోని పొలాన్ని వ్యవసాయ భూమి అంటారు. అలాగే మున్సిపాలిటీ బైట, జనాభా 10,000 దాటినప్పుడు దూరాన్ని బట్టి పరిగణనలోకి తీసుకుంటారు.జనాభా సంఖ్య10,000 దాటి 2 కి.మీ. లోపల1,00,000 దాటి 2కి.మీ.దాటి 6 కి.మీ. లోపల10,00,000 దాటి 6కి.మీ.దాటి 8 కి.మీ. లోపలమున్సిపాలిటీ పొలిమేర హద్దుల నుంచి కొలుస్తారు. జనాభా సంఖ్యను బట్టి, దూరాల లోపల ఉంటేనే గ్రామీణ వ్యవసాయ భూమి కింద లెక్కిస్తారు. ఈ రోజు గ్రామంలో ఉన్న జనాభా సంఖ్య తీసుకోరు. తాజా జనాభా లెక్కల గణన ప్రకారం పరిగణిస్తున్నారు. అంటే ప్రస్తుతానికి చివరగా 2011లో జనాభా లెక్కింపు జరిగినది. 2021లో జరగలేదు. 2027లో జరుగుతుంది. దూరం అంటే నడక దూరం కాదు, వైమానిక దూరం.వ్యవసాయ భూమి అమ్మితే..పైన చెప్పిన షరతులకు లోబడి భూమి ఉండి, ఆ భూమి అమ్మితే పన్ను భారం ఉండదు. ఆదాయానికి కూడా పన్ను భారం ఉండదు. అయితే, చాలా మంది వ్యవసాయ భూమి మీద బంగారం పండుతుందని చెప్తారు. ఆస్తిపరులు, రాజకీయ నాయకులు, సినిమా ఇండస్ట్రీ వాళ్లు, పారిశ్రామికవేత్తలు, బడా బడా ఆఫీసర్లు ఉన్నారు. మహానగరాల్లో మసలుతూ, వ్యవసాయం మీద ఆదాయం ఉందని, పొంతన లేని లెక్కలు చూపిస్తుంటారు. వరి వంగడంలో నుంచి ‘‘సిరి’’ పండిందని, యాపిల్ చెట్టుకి బంగారం పళ్లు కాశాయని చెప్పిన ఎందరో రాజకీయ నాయకులు, తనిఖీలు చేసినప్పుడు, అడ్డంగా బుక్ అయిపోయారు.పెద్ద పెద్ద సినిమా స్టార్లు, తాము చిత్ర రంగాన్ని ఏలుతున్నా, వ్యవసాయదార్లమని చెప్పుకుంటున్నారు. అలాగే కంపెనీలు కూడా. ఒక ఆర్టీఐ జవాబు ప్రకారం 2011లో 6,50,000 మంది వ్యక్తులు డిక్లేర్ చేసిన వ్యవసాయ ఆదాయం సుమారు రూ. 2,000 లక్షల కోట్లు!! అయితే, ఆదాయ పన్ను శాఖ వారు స్రూ్కటినీ చేస్తున్నారు. శాటిలైట్ ద్వారా పరీక్ష చేస్తున్నారు. అసలు పొలం ఉందా లేదా.. ఉంటే ఏం పండుతుంది.. అది ఎలా అమ్ముతారు.. ఎక్కడ అమ్ముతారులాంటి విషయాలు తెలుసుకుంటున్నారు.సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే, వ్యవసాయం మీద పన్నుభారం లేదు. వ్యవసాయ భూములు అమ్మితే పన్నుభారం లేదు. వచ్చిన మొత్తం మీద ఏమాత్రం పన్ను కట్టకుండా వైట్ రంగు వేసుకోవచ్చు. అయితే, ఆ ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చే ఆదాయం, వడ్డీ, డివిడెండ్ల రాబడి మీద పన్నుభారం ఉంటుంది. ఇక రూ. 50,00,000 దాటినా టీడీఎస్ ఉండదు. అయితే, అర్బన్ ల్యాండ్ని క్యాపిటల్ అసెట్గా పరిగణిస్తారు. అమ్మగా ఏర్పడ్డ క్యాపిటల్ గెయిన్స్ మీద పన్ను వేస్తారు. రూ. 50,00,000 దాటితే టీడీఎస్ 1 శాతం వర్తిస్తుంది.అర్బన్ ల్యాండ్ స్వల్పకాలికం అయితే, శ్లాబు ప్రకారం పన్ను విధిస్తారు. దీర్ఘకాలికం అయితే, 20 శాతం విధిస్తారు. అర్బన్ ల్యాండ్ అమ్మి వ్యవసాయ భూమి కొంటే పన్నుండదు. అలాగే కంపల్సరీ అక్విజిషన్, పన్ను విధింపు, మినహాయింపు ఉన్నాయి. అర్బన్ ల్యాండ్ అమ్మగా ఏర్పడ్డ క్యాపిటల్ గెయిన్స్ నుంచి మినహాయింపు పొందాలంటే 54ఎఫ్ ప్రకారం ఇల్లు కొనొచ్చు. 54ఈసీ ప్రకారం గుర్తింపు పొందిన బాండ్లలో రీఇన్వెస్ట్ చేయొచ్చు.లేని ఆదాయాన్ని చూపించకండి. లేని ఆస్తిని చూపించకండి. దొంగ లెక్కలు చూపించకండి. అన్నదాత ముసుగులో అసలు నిజాన్ని దాచి, దోచి అధికారుల దృష్టిలో పడకండి. -
కొత్త క్రెడిట్ కార్డుకు అప్లై చేస్తే సిబిల్ తగ్గుతుందా?
కొత్త క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేయాలని ఆలోచిస్తున్నారా? చాలా మందికి సాధారణంగా ‘కొత్త కార్డు కోసం అప్లై చేస్తే సిబిల్ స్కోర్ తగ్గిపోతుందేమో?’ అనే అనుమానం ఉంటుంది. ఈ భయం సహజమే, ఎందుకంటే మంచి సిబిల్ స్కోర్ ఆర్థిక భవిష్యత్తుకు చాలా కీలకం. క్రెడిట్ కార్డు దరఖాస్తు సిబిల్ స్కోర్ను ఎలా ప్రభావితం చేస్తుందో, తక్కువ సమయంలో ఎక్కువ కార్డుల కోసం దరఖాస్తు చేయడం వల్ల కలిగే పర్యవసానాలు, సిబిల్ స్కోర్ పెంచుకోవడానికి తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలను తెలుసుకుందాం.కొత్త క్రెడిట్ కార్డుకొత్త క్రెడిట్ కార్డు (లేదా లోన్) కోసం దరఖాస్తు చేసిన ప్రతిసారీ అది మీ సిబిల్ స్కోర్పై తాత్కాలికంగా కొద్దిపాటి ప్రభావాన్ని చూసే అవకాశం ఉంది. దీనికి కారణం ‘హార్డ్ ఎంక్వైరీ’. అంటే ఒక లోన్ లేదా క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసినప్పుడు రుణదాత (బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ) మీ క్రెడిట్ అర్హతను అంచనా వేయడానికి సిబిల్ (CIBIL) వంటి క్రెడిట్ బ్యూరోల నుంచి క్రెడిట్ రిపోర్టును అడుగుతారు. హార్డ్ ఎంక్వైరీ మీ క్రెడిట్ ప్రొఫైల్పై ఒక నోట్ను ఉంచుతుంది. రుణదాతల దృష్టిలో ఇది మీరు కొత్త రుణం కోసం చేస్తున్నారని సూచిస్తుంది. ఇది సాధారణంగా స్కోర్ను కొద్దిగా (5 నుంచి 10 పాయింట్లు) తగ్గించే అవకాశం ఉంటుంది. అయితే క్రమం తప్పకుండా బిల్లులు చెల్లించడం కొనసాగిస్తే ఈ ప్రభావం కొన్ని నెలల్లో తగ్గిపోతుంది.మీ సిబిల్ స్కోర్ను మీరే చెక్ చేసుకుంటే అది సాఫ్ట్ ఎంక్వైరీ అవుతుంది. సాఫ్ట్ ఎంక్వైరీ మీ స్కోర్పై ఎటువంటి ప్రతికూల ప్రభావాన్ని చూపదు.తక్కువ సమయంలో ఎక్కువ కార్డుల కోసం..కొంతమంది తక్కువ సమయంలో ఒకటికంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు లేదా లోన్ల కోసం దరఖాస్తు చేస్తుంటారు. ఈ అలవాటు సిబిల్ స్కోర్కు చాలా ప్రమాదకరం. మీరు కొద్ది కాలంలో (ఉదాహరణకు, 6 నెలల్లో) 3-4 కార్డుల కోసం దరఖాస్తు చేస్తే మీ రిపోర్ట్పై అదే సంఖ్యలో హార్డ్ ఎంక్వైరీలు రికార్డ్ అవుతాయి. ఎక్కువ ఎంక్వైరీలు ఉన్నప్పుడు రుణదాతలు మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, అత్యవసరంగా క్రెడిట్ అవసరమని భావిస్తారు. మీరు పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తున్నారనుకుంటారు. రుణాన్ని సమర్థవంతంగా నిర్వహించలేకపోవచ్చని అంచనా వేస్తారు. ఇది మీ క్రెడిట్ రిస్క్ను పెంచుతుంది. తద్వారా సిబిల్ స్కోర్ తగ్గుతుంది. భవిష్యత్తులో దరఖాస్తు చేసే లోన్ దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే అవకాశం పెరుగుతుంది.కొత్త క్రెడిట్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు నిజంగా అవసరమైన వాటికి మాత్రమే దరఖాస్తు చేయాలి. ఒక దరఖాస్తు రెజెక్ట్ అయితే వెంటనే వేరే కార్డుకు అప్లై చేయకుండా కనీసం 6 నెలలు వేచి ఉండటం ఉత్తమం.సిబిల్ స్కోర్ పెంచుకోవడానికి జాగ్రత్తలుమంచి సిబిల్ స్కోర్ (సాధారణంగా 750 లేదా అంతకంటే ఎక్కువ) తక్కువ వడ్డీ రేట్లు, మెరుగైన లోన్ ఆఫర్లు అందిస్తుంది.క్రెడిట్ కార్డు బిల్లులు, లోన్ ఈఎంఐలను ఎల్లప్పుడూ గడువు తేదీ కంటే ముందే చెల్లించాలి.ఆలస్య చెల్లింపులు స్కోర్ను తీవ్రంగా దెబ్బతీస్తాయి.క్రెడిట్ కార్డు బిల్లులను మినిమమ్ డ్యూ కాకుండా, పూర్తి మొత్తాన్ని చెల్లించడం అలవాటు చేసుకోవాలి.మొత్తం క్రెడిట్ పరిమితిలో మీరు ఎంత ఉపయోగిస్తున్నారు అనేదాన్ని క్రెడిట్ వినియోగ నిష్పత్తి(సీయూఆర్) అంటారు. ఉదాహరణకు మొత్తం క్రెడిట్ లిమిట్ రూ.1 లక్ష అయితే, మీరు రూ.30,000 కంటే ఎక్కువ ఉపయోగించకుండా చూసుకోవాలి.సెక్యూర్డ్ లోన్లు (హోమ్ లోన్, కారు లోన్..), అన్సెక్యూర్డ్ లోన్లు (పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డు) మధ్య తేడా తెలుసుకోవాలి. అన్సెక్యూర్డ్ లోన్లపై ఆధారపడటం సిబిల్ స్కోర్కు మంచిది కాదు.ఇదీ చదవండి: రూ.9,169 కోట్ల లాండరింగ్ రాకెట్ను గుర్తించిన సీబీడీటీ -
బంగారం ‘కొండంత’ లక్ష్యంతో కొంటున్నా: కియోసాకి
ప్రముఖ ఇన్వెస్టర్, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి.. రాబోయే మార్కెట్ క్రాష్ గురించి మరోసారి అలారం మోగించారు. బంగారం, వెండి, బిట్ కాయిన్, ఎథేరియం వంటి హార్డ్ ఆస్తులపై తన బుల్లిష్ దృక్పథాన్ని మరింత రెట్టింపు చేశారు.తాజాగా ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) లో ఒక పోస్ట్ పెట్టారు. యూఎస్ రుణం, ద్రవ్య విధానం, ఫెడరల్ రిజర్వ్పై తన అభిప్రాయాలను పంచుకుంటూ ట్రెజరీ ముద్రించినది "నకిలీ డబ్బు" అని అభివర్ణించారు. తాను బంగారం, వెండి, బిట్ కాయిన్, ఎథీరియం ఆస్తులను ఎందుకు అమ్మడం లేదు.. ఇంకా కొంటున్నాడో వివరించారు.కియోసాకి అంచనాలో భవిష్యత్తులో బంగారం ఔన్సుకు 27,000 డాలర్లకు చేరుకుంటుంది. బిట్ కాయిన్ 2026 నాటికి 250,000 డాలర్లకు పెరుగుతుంది. వెండి 100 డాలర్లకు చేరుతుంది. ఇక ఎథేరియం 60,000 డాలర్లను తాకుతుంది. యు.ఎస్. ప్రభుత్వం రుణ భారాన్ని విస్తరించడం కొనసాగిస్తున్నందున ఈ ఆస్తులు సాంప్రదాయ పొదుపును అధిగమిస్తాయని రాసుకొచ్చారు.తాను గ్రేషమ్, మెట్కాఫ్ల డబ్బు నియమాలను అనుసరిస్తానని చెప్పొకొచ్చారు. "దురదృష్టవశాత్తు, యు.ఎస్. ట్రెజరీ, ఫెడ్ చట్టాలను ఉల్లంఘిస్తున్నాయి. తమ బిల్లులు చెల్లించడానికి నకిలీ డబ్బును ముద్రిస్తున్నాయి. ఫెడ్, ట్రెజరీ చేస్తున్నది మనం చేస్తే జైలులో ఉంటాం " అన్నారు.‘చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నేడు అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద అప్పులున్న దేశంగా నిలుస్తోంది. అందుకే "పొదుపు చేసేవారు నష్టపోతారు" అని నేను చాలాకాలంగా హెచ్చరిస్తున్నా’ అన్నారు. అందుకే బంగారం, వెండి, బిట్కాయిన్, ఎథీరియంలను అవి క్రాష్ అయినప్పుడు కూడా కొంటున్నానని వివరించారు.CRASH COMING: Why I am buying not selling.My target price for Gold is $27k. I got this price from friend Jim Rickards….and I own two goldmines.I began buying gold in 1971….the year Nixon took gold from the US Dollar.Nixon violated Greshams Law, which states “When fake…— Robert Kiyosaki (@theRealKiyosaki) November 9, 2025 -
వాళ్లు నిజమైన ధనవంతులు కారు!!
ఒక వ్యక్తి ఆర్థికంగా ఎంత విజయం సాధించాడన్నది ఈ రోజుల్లో ఆన్లైన్లో చూస్తున్నారు. వారి విలాసవంతమైన జీవనశైలి, వాడే లగ్జరీ వస్తువులు, సోషల్ మీడియా హోదాతో కొలుస్తారు. కానీ చార్టర్డ్ అకౌంటెంట్ నితిన్ కౌశిక్ మాత్రం సంపదకు కొత్త నిర్వచనాన్ని చెబుతున్నారు. సంపదను ప్రదర్శించేవారు నిజమైన ధనవంతులు కారు అంటున్నారాయన.‘నిజమైన సంపద అంటే మనశ్శాంతి. బ్యాంక్ బ్యాలెన్స్ కాదు’ అంటూ తన అభిప్రాయాలను ‘ఎక్స్’ పోస్ట్లో వెల్లడించారు. కౌశిక్ అభిప్రాయం ప్రకారం.. ఆర్థిక ఆరోగ్యాన్ని మన దగ్గర ఉన్న డబ్బు ద్వారా కాకుండా, ఆ డబ్బు మనకు ఇచ్చే శాంతి, స్వేచ్ఛ ద్వారా కొలవాలి.‘మీరు ప్రశాంతంగా నిద్రపోలేకపోతే, బ్యాంకులో రూ.50 లక్షలు ఉన్నా వ్యర్థం’ అని రాసుకొచ్చారు. బడ్జెట్, పొదుపు, పెట్టుబడి వంటి ఆర్థిక అలవాట్లు దురాశతో కాకుండా స్వేచ్ఛ కోసం అలవరుచుకోవాలని గుర్తుచేశారు. కౌశిక్ దృష్టిలో "ఆర్థిక స్వేచ్ఛ = మానసిక స్వేచ్ఛ". అంటే సంపద నిర్వహణ అంతిమ లక్ష్యం శాంతియుతమైన, సురక్షితమైన మనస్సు. అంతే కానీ బయటకు ప్రదర్శించేది కాదు.ఆర్థిక పరిణతి అంటే..“ఆర్థికంగా పరిణతి చెందిన అలవాట్లు” గురించి మరొక పోస్ట్లో కౌశిక్ వివరించారు. నిజమైన సంపద ఆదాయం లేదా ఆస్తులను మించి ఉందని, “ధనవంతులను నిర్వచించేది డబ్బు కాదు.. దానిని వాళ్లు ఎలా తీసుకువెళ్తారన్నదే” అని చెప్పారు. ప్రశాంతత, క్రమశిక్షణ, దీర్ఘదృష్టి.. ఇవే ఆర్థిక పరిణతి అసలైన లక్షణాలు అని వివరించారు.ఆర్థికంగా పరిణతి చెందిన వ్యక్తుల అలవాట్లుతమ ఆర్థిక విజయాలను ప్రదర్శించరు. నిజమైన ఇన్వెస్టర్లు (ధనవంతులు) తమ గురించి చెప్పుకోరు. అంటే, వృద్ధికి ప్రజా గుర్తింపు అవసరం లేదు.తమ ఆర్థిక ప్రమాణాలను సమర్థించుకోరు. “పేలవమైన డబ్బు అలవాట్లకు నో చెప్పినందుకు మీరు ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు.”విలాసాన్ని చూపించరు. “నిజమైన సంపద శాంతిని తెస్తుంది. అందరి దృష్టిని కాదు” నిజమైన ఆర్థిక భద్రత తక్కువ ప్రదర్శనలోనే ఉంటుంది.మార్కెట్ గోలను పట్టించుకోరు. “ఆ డ్రామా (మార్కెట్ హడావుడి) నుండి దూరంగా ఉండటం దృష్టిని, పోర్ట్ఫోలియో రాబడిని రక్షిస్తుంది” తద్వారా భావోద్వేగ స్థిరత్వాన్ని పొందుతారు.ధ్రువీకరణ కోసం వెతుక్కోరు. “ఉనికి, స్థిరత్వం, సహనం.. ఇవి బ్యాలెన్స్ షీట్ కంటే గొప్పవి” నిశ్శబ్ద పట్టుదల వారికి బలాన్ని ఇస్తుంది.Real wealth = Peace of mind ☕️Having ₹50 lakh in the bank means nothing if you can’t sleep peacefully.Budgeting, saving, and investing are not about greed .. they’re about freedom.Financial freedom = mental freedom.#StockMarket #IndianFinance— CA Nitin Kaushik (FCA) | LLB (@Finance_Bareek) November 7, 2025 -
డిజిటల్ గోల్డ్తో జాగ్రత్త.. సెబీ హెచ్చరిక
డిజిటల్ గోల్డ్ను విక్రయించే సంస్థలు, ఆయా ఉత్పత్తులు నియంత్రణ పరిధిలో లేవని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తెలిపింది. కాబట్టి, డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేయడం రిస్క్తో కూడుకున్న వ్యవహారమని, జాగ్రత్త వహించాలని హెచ్చరించింది. సెబీ నియంత్రించే పసిడి ఉత్పత్తులతో పోలిస్తే ఇవి భిన్నమైనవని పేర్కొంది.డిజిటల్ గోల్డ్ లేదా ఈ–గోల్డ్ ప్రోడక్టుల్లో పెట్టుబడులకు ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ యంత్రాంగంపరమైన హామీ ఉండబోదని వివరించింది. ప్రస్తుతం పసిడికి డిమాండ్ భారీగా పెరగడం, ఆన్లైన్లో అత్యంత తక్కువగా రూ. 10 నుంచి కూడా ఇన్వెస్ట్ చేయొచ్చంటూ పలు సంస్థలు ఊరిస్తుండటం తదితర పరిణామాల నేపథ్యంలో సెబీ హెచ్చరిక ప్రాధాన్యం సంతరించుకుంది.ఎక్స్ఛేంజీల్లో ట్రేడయ్యే కమోడిటీ డెరివేటివ్ కాంట్రాక్ట్లు, గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్), ఎల్రక్టానిక్ గోల్డ్ రిసీట్స్ మొదలైన సాధనాల ద్వారా నియంత్రణ సంస్థ పరిధిలో పసిడిలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయని సెబీ తెలిపింది.ఏమిటీ గోల్డ్ ఈటీఎఫ్లు?గోల్డ్ ఈటీఎఫ్లు బంగారంపై పెట్టుబడి పెట్టే డిజిటల్ మార్గం. ఇవి భౌతిక బంగారాన్ని కొనకుండా, స్టాక్ మార్కెట్ ద్వారా బంగారం ధరలపై పెట్టుబడి పెట్టే అవకాశం కల్పిస్తాయి. గోల్డ్ ఈటీఎఫ్ (Gold ETF) అంటే గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్. ఇది మ్యూచువల్ ఫండ్ల తరహాలో పనిచేస్తుంది. ఇది స్టాక్ ఎక్స్ఛేంజ్లో ట్రేడయ్యే ఒక ఫండ్. బంగారం ధరల ఆధారంగా దీని విలువ మారుతూ ఉంటుంది. దీంతో భౌతిక బంగారం కొనకుండా డిజిటల్ రూపంలో బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చు.ముఖ్యమైన ప్రయోజనాలుభౌతిక బంగారానికి ఉన్న భద్రతా సమస్యలు గోల్డ్ ఈటీఎఫ్లకు ఉండవు.స్టాక్ మార్కెట్లో ఎప్పుడైనా కొనుగోలు లేదా అమ్మకం చేయవచ్చు.గోల్డ్ ఈటీఎఫ్లపై తక్కువ మొత్తాలతో కూడా పెట్టుబడి ప్రారంభించవచ్చు.లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వర్తిస్తుంది. ఇది మ్యూచువల్ ఫండ్లకు సమానం.భౌతికంగా నిల్వ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి స్టోరేజ్ ఖర్చులు ఉండవు.పెట్టుబడి ఎలా పెట్టాలంటే..గోల్డ్ ఈటీఎఫ్లపై పెట్టుబడి పెట్టాలంటే డీమాట్ ఖాతా (Demat Account) అవసరం. స్టాక్ బ్రోకర్ ద్వారా గోల్డ్ ఈటీఎఫ్లు కొనుగోలు చేయవచ్చు. నిర్దిష్ట ఏఎంసీ అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు ఈ ఫండ్లను నిర్వహిస్తాయి. -
సేవింగ్స్ అకౌంట్ ఉంటే రూ.7,500 క్యాష్బ్యాక్!!
రోజువారీ ఖర్చుల కోసం మీరు యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తుంటే, ఈ ఆఫర్ మీకోసమే! ప్రైవేట్ రంగానికి చెందిన డీసీబీ బ్యాంక్ (DCB Bank) తన హ్యాపీ సేవింగ్స్ ఖాతాదారులకు ప్రత్యేక క్యాష్బ్యాక్ ఆఫర్ను ప్రకటించింది. హ్యాపీ సేవింగ్స్ అకౌంట్స్ ద్వారా చేసే యూపీఐ లావాదేవీలపై కస్టమర్లు నెలకు రూ .625 వరకు, సంవత్సరానికి రూ .7,500 వరకు సంపాదించవచ్చు.క్యాష్ బ్యాక్ ఎలా పొందాలంటే..ఈ ఆఫర్ను సద్వినియోగం చేసుకోవడానికి, మీరు డీసీబీ బ్యాంక్లో హ్యాపీ సేవింగ్స్ ఖాతాను తెరవాలి. తరువాత ఈ ఖాతాలోని మొత్తాన్ని ఉపయోగించి యూపీఐ ద్వారా (డెబిట్ లావాదేవీలు) చేసే చెల్లింపులపై బ్యాంకు ప్రతి త్రైమాసికం లేదా మూడు నెలలకోసారి క్యాష్ బ్యాక్ను మీ ఖాతాలో జమచేస్తుంది.నిబంధనలు, ప్రయోజనాలుఖాతాలో కనీసం రూ.10,000 సగటు నెలవారీ బ్యాలెన్స్ (AMB) నిర్వహించడం తప్పనిసరి.క్యాష్ బ్యాక్ కు అర్హత సాధించడానికి, సగటు త్రైమాసిక బ్యాలెన్స్ (AQB) రూ. 25,000 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి.కనీస లావాదేవీ మొత్తం రూ. 500.ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ లావాదేవీలు ఉచితం.డీసీబీ బ్యాంక్ ఏటీఎం నుంచి అపరిమిత ఉచిత లావాదేవీలుయూపీఐ అంటే..యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI)అనేది ఒక డిజిటల్ చెల్లింపు వ్యవస్థ. దీంతె మీ మొబైల్ ఫోన్ ద్వారా రోజులో 24 గంటలు, వారానికి 7 రోజులు తక్షణం డబ్బును పంపడం లేదా స్వీకరించడం సాధ్యమవుతుంది. ఈ వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అభివృద్ధి చేసింది. యూపీఐ ద్వారా మీ బ్యాంకు ఖాతాను గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం, భీమ్ వంటి యాప్లతో అనుసంధానం చేయవచ్చు. -
బీమా క్లెయిమ్ తిరస్కరించకూడదంటే...
అనారోగ్యం లేదా ప్రమాదం బారిన పడినప్పుడు ఆపదలో ఆదుకుంటుందని నమ్మే ఏకైక భరోసా హెల్త్ ఇన్సూరెన్స్. కానీ, మీరు అత్యవసరంగా క్లెయిమ్ చేసుకున్నప్పుడు బీమా కంపెనీ దాన్ని తిరస్కరిస్తే (Reject) ఆ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించండి. ఇది ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుంది. అయితే మీ క్లెయిమ్ తిరస్కరణకు గురైనంత మాత్రాన అంతా అయిపోయినట్లు కాదు. ఈ సంక్లిష్టమైన పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి, అసలు క్లెయిమ్లు ఎందుకు తిరస్కరణకు గురవుతాయి, భవిష్యత్తులో అవి తిరస్కరణ కాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.క్లెయిమ్ తిరస్కరణకు కారణాలుపాలసీ తీసుకునేటప్పుడు మీ మునుపటి ఆరోగ్య సమస్యలను (Pre-existing diseases) లేదా ముఖ్యమైన సమాచారాన్ని దాచడం లేదా తప్పుగా చెప్పడం. బీమా కంపెనీ దీన్ని అత్యంత తీవ్రమైన ఉల్లంఘనగా పరిగణిస్తుంది.పాలసీ తీసుకున్న వెంటనే క్లెయిమ్ చేయడం. కొన్ని వ్యాధులు లేదా శస్త్రచికిత్సలకు 30 రోజుల నుంచి 4 సంవత్సరాల వరకు వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. ఈ సమయం పూర్తవకముందే క్లెయిమ్ చేస్తే తిరస్కరిస్తారు.క్లెయిమ్ ఫారమ్లో లేదా హాస్పటల్ బిల్లులు, డిశ్చార్జ్ సమ్మరీ వంటి కీలక పత్రాల్లో తప్పులు ఉండటం లేదా వాటిని సమర్పించకపోవడం.పాలసీలో కవర్ కాని చికిత్సల కోసం క్లెయిమ్ చేయడం.సరైన సమయంలో ప్రీమియం చెల్లించకపోవడం వల్ల పాలసీ నిలిపేయడం.కొన్ని వ్యాధులకు హాస్పటల్స్ వారు అనవసరమైన చికిత్స లేదా రోగులే చికిత్స కోసం ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేకపోయినా చేరడం.క్లెయిమ్ తిరస్కరిస్తే ఏం చేయాలి?కంపెనీ తిరస్కరణకు కచ్చితమైన కారణాన్ని రెజెక్షన్ ఫామ్లో స్పష్టంగా పరిశీలించండి. తిరస్కరణకు ఏ క్లాజ్ లేదా నిబంధనను ఉదహరించారో తెలుసుకోవాలి. వెంటనే బీమా కంపెనీ క్లెయిమ్స్ విభాగం లేదా మీ థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ను సంప్రదించాలి. మీరు సమర్పించిన పత్రాలు సరిగా ఉన్నాయని నిర్ధారించుకోవాలి. ఏవైనా అదనపు పత్రాలు లేదా వివరణ అవసరమైతే వాటిని అందించాలి.అప్పీల్ ప్రక్రియమీరు కంపెనీ నిర్ణయంతో ఏకీభవించకపోతే అప్పీల్ చేసుకోవచ్చు. ముందుగా బీమా కంపెనీ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్కు ఫిర్యాదు చేయాలి. ఈ అధికారి 15 రోజుల్లో మీ ఫిర్యాదును పరిష్కరించాలి. గ్రీవెన్స్ ఆఫీసర్ నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోతే లేదా వారు మీ ఫిర్యాదును తిరస్కరిస్తే ఇన్సూరెన్స్ అంబుడ్స్మన్ను ఆశ్రయించవచ్చు. ఇది ఉచిత, వేగవంతమైన ప్రక్రియ. క్లెయిమ్ మొత్తం రూ.20 లక్షలలోపు ఉంటే అంబుడ్స్మన్ వారికి అధికారం ఉంటుంది.అంబుడ్స్మన్ సేవతో సంతృప్తి చెందకపోతే బీమా నియంత్రణ సంస్థ అయిన ఐఆర్డీఏఐ(IRDAI)కి చెందిన ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ (IGMS) పోర్టల్లో ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. పైన చెప్పిన మార్గాలు ఏవీ పనిచేయకపోతే చివరి ప్రయత్నంగా వినియోగదారుల కోర్టును ఆశ్రయించవచ్చు.క్లెయిమ్ తిరస్కరణ కాకుండా ఉండాలంటే జాగ్రత్తలుపాలసీ తీసుకునేటప్పుడు మీ వైద్య చరిత్ర, జీవనశైలి, అలవాట్లకు సంబంధించిన ప్రతి వివరాలు, ముఖ్యంగా మునుపటి ఆరోగ్య సమస్యలను కచ్చితంగా నిజాయితీగా తెలపాలి.పాలసీలో ఉన్న కవరేజీలు, మినహాయింపులు, వెయిటింగ్ పీరియడ్స్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి.క్లెయిమ్ చేసేటప్పుడు హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ సమ్మరీ, ఒరిజినల్ బిల్లులు, ల్యాబ్ రిపోర్టులు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్లు వంటి అన్ని పత్రాలను ఉంచుకోవాలి.పాలసీ గడువు ముగియకుండా ఉండేందుకు సమయానికి ప్రీమియం చెల్లించాలి.హాస్పిటల్లో చేరినప్పుడు వీలైనంత త్వరగా (సాధారణంగా 24-48 గంటల్లో) బీమా కంపెనీకి తెలియజేయాలి.ఇదీ చదవండి: భారత్-యూఎస్ వాణిజ్య చర్చలపై ట్రంప్ ఆశాభావం -
అందరూ తెలుసుకోవాల్సిన EPFO కొత్త రూల్స్
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) అంటే తెలియని ప్రైవేటు ఉద్యోగులు ఉండరు. దీని పరిధిలో సుమారు 8 కోట్ల మంది క్రియాశీల సభ్యులు ఉన్నారు. ఇది కేవలం పదవీ విరమణ పొదుపు సాధనంగానే కాకుండా ఉద్యోగులకు తొలి దీర్ఘకాలిక పెట్టుబడి కూడా. సభ్యులకు సేవలను సులభతరం చేయడానికి ఈపీఎఫ్ఓ నిబంధనలలో అనేక మార్పులు చేసింది.ఉద్యోగ మార్పుల సమయంలో పీఎఫ్ నిధుల బదిలీ ప్రక్రియలో సమస్యలు ఎక్కువగా ఉండటంతో, ఈపీఎఫ్వో ఇటీవల భారీ మార్పులు చేసింది. ఇప్పుడు బదిలీలు వేగంగా, సులభంగా, ఆటోమేటిక్ జరుగుతున్నాయి. ఇంతకీ పీఎఫ్ ట్రాన్స్ఫర్కు సంబంధించి చేసిన తాజా మార్పులు ఏంటో ఈ కింద చూద్దాం..ఇవి ప్రధాన మార్పులుఆటోమేటిక్ బదిలీఇంతకు ముందు ఉద్యోగులు ఫారం 13 ద్వారా మాన్యువల్గా బదిలీకి దరఖాస్తు చేయాల్సి ఉండేది. ఇప్పుడు ఉద్యోగి కొత్త సంస్థలో చేరిన వెంటనే, కొత్త యజమాన్యం చేరిన తేదీని అప్డేట్ చేసిన తర్వాత, ఈపీఎఫ్ బదిలీ ఆటోమేటిక్గా ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియలో కంపెనీ యాజమాన్యం ప్రమేయం అవసరం లేదు.ఒకే యూఏఎన్ఇప్పటి నుంచి ఒక ఉద్యోగికి ఒక్క యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) మాత్రమే ఉంటుంది. ఆధార్ ఆధారిత ధృవీకరణతో కొత్త యూఏఎన్ను సృష్టించేందుకు వీలుండదు. దీంతో పాత, కొత్త పీఎఫ్ ఖాతాలు ఆటోమేటిక్ ఒకే యూఏఎన్కు లింక్ అవుతాయి. తద్వారా ఎక్కువ ఖాతాల విలీనం అవసరం తగ్గుతుంది.వేగవంతమైన ధృవీకరణఈపీఎఫ్ఓ ఆధార్ ఆధారిత ఈ-సైన్, ఏపీఐ ఇంటిగ్రేషన్ ద్వారా కంపెనీ యాజమాన్యాల ధృవీకరణను వేగవంతం చేసింది. ఇంతకుముందు 30–45 రోజులు పట్టిన బదిలీలు ఇప్పుడు 7–10 రోజుల్లో పూర్తవుతున్నాయి.పాస్బుక్లో కంబైన్డ్ బ్యాలెన్స్బదిలీ పూర్తయిన తర్వాత పాత ఖాతా “జీరో బ్యాలెన్స్” చూపుతుంది. కొత్త పాస్బుక్లో పాతది కొత్తది మొత్తం బ్యాలెన్స్ కనిపిస్తుంది. దీంతో ఉద్యోగులు తమ ఖాతాల్లో ఎంత మొత్తం ఉన్నది సులభంగా ట్రాక్ చేయగలరు.నిష్క్రమణ తేదీ తప్పనిసరిమునుపటి కంపెనీ యాజమాన్యం ఉద్యోగి నిష్క్రమణ తేదీని అప్డేట్ చేయకపోవడం వల్ల బదిలీలు ఆలస్యం కావడం సాధారణం. ఇప్పుడు ఇది తప్పనిసరి. యాజమాన్యం అప్డేట్ చేయకపోతే, ఉద్యోగి ఆధార్ ఓటీపీ ద్వారా తన నిష్క్రమణ తేదీని స్వయంగా ప్రకటించవచ్చు.బదిలీ సమయంలోనూ వడ్డీఇంతకు ముందు బదిలీ సమయంలో పాత ఖాతాలో ఉన్న మొత్తంపై వడ్డీ ఆగిపోయేది. ఇప్పుడు బదిలీ పూర్తయ్యే వరకు కూడా వడ్డీ కొనసాగుతుందని ఈపీఎఫ్వో స్పష్టం చేసింది.ఈ మార్పులతో ఈపీఎఫ్ బదిలీ ప్రక్రియ మరింత పారదర్శకంగా, వేగంగా, సులభంగా మారింది. తమ సంస్థల యాజమాన్యాలపై ఆధారపడకుండా ఉద్యోగులు స్వతంత్రంగా తమ పీఎఫ్ నిధులను నిర్వహించగలుగుతున్నారు. ఇది ఉద్యోగ మార్పుల సమయంలో సమయం, ఆందోళన రెండింటినీ తగ్గించి, ఈపీఎఫ్ వ్యవస్థపై విశ్వాసాన్ని మరింత బలపరుస్తుంది. -
‘బాండ్’ బంగారం.. మూడు రెట్లు లాభం!
బంగారంపై పెట్టుబడులంటే అందరికీ ఆసక్తి ఉంటుంది. కానీ లోహం రూపంలో పసిడిని కొనడం కొందరికి ఇష్టం ఉండదు. అలాంటివారి కోసం పెట్టుబడి అవకాశంగా ప్రభుత్వం తీసుకొచ్చినదే సావరిన్ గోల్డ్ బాండ్స్ పథకం (SGB). అలా సావరిన్ గోల్డ్ బాండ్స్ 2017–18 సిరీస్ VIలో పెట్టుబడిపెట్టినవారికి ఇప్పుడు మూడు రెట్లకు పైగా లాభం వస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గ్రాముకు రూ.12,066 తుది రిడంప్షన్ ధరను ప్రకటించింది. అంటే 8 సంవత్సరాల కాలంలో 317 శాతం లాభం అన్నమాట.2017 నవంబర్లో గ్రాముకు రూ.2,945 వద్ద జారీ చేసిన బాండ్లు ఇప్పుడు రూ. 9,171 లాభాన్ని ఇచ్చాయి. దీనికి ఆర్నెళ్లకోసారి చెల్లించే 2.5% వార్షిక వడ్డీ అదనం. 2025 అక్టోబర్ 31, నవంబర్ 3, 4 తేదీల్లో ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రచురించిన బంగారం సగటు ముగింపు ధర (999 స్వచ్ఛత) ఆధారంగా రిడంప్షన్ ధరను నిర్ణయించారు.ఏమిటీ సావరిన్ గోల్డ్ బాండ్స్?బంగారం దిగుమతులను తగ్గించడంతోపాటు.. పసిడిపై పెట్టుబడులను డిజిటల్వైపు మళ్లించే లక్ష్యాలతో తీసుకొచ్చిందే సావరీన్ గోల్డ్ బాండ్ పథకం. పసిడిపై పెట్టుబడులను డిజిటల్ రూపంలోకి మళ్లించడంలో కేంద్రం ఒక విధంగా సక్సెస్ అయింది. కానీ, బంగారం దిగుమతులు మాత్రం తగ్గలేదు.ఎస్జీబీలకు (Sovereign Gold Bonds) ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రభుత్వ హామీతో కూడిన సాధనం కావడంతో పెట్టుబడులకు ఎక్కువ మంది ఆసక్తి చూపించారు. దీంతో ఎస్జీబీల రూపంలో ప్రభుత్వంపై చెల్లింపుల భారం పెరిగిపోయింది. దీంతో సావరిన్ గోల్డ్ బాండ్ల జారీని ప్రభుత్వం నిలిపేసింది.కాగా సావరిన్ గోల్డ్ బాండ్స్ (SGB) 2017–18 సిరీస్ IVలో పెట్టుబడిపెట్టినవారు గత అక్టోబర్లో తుది రిడంప్షన్ను అందుకున్నారు. ఆ సిరీస్ బాండ్లకు ఆర్బీఐ గ్రాముకు రూ.12,704 తుది రిడంప్షన్ ధరను ప్రకటించింది. 2017–18 సిరీస్ IV మదుపరులు 8 ఏళ్ల కాలంలో 325 శాతం రాబడిని పొందారు. -
బంగారం, వెండి, బిట్కాయిన్.. కియోసాకి మరో హెచ్చరిక!
ప్రసిద్ధ పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) రచయిత, అమెరికన్ వ్యాపారవేత్త రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki).. సందర్భమేదైనా బంగారం, వెండి వంటి విలువైన లోహాలు, బిటికాయిన్, ఎథీరియం వంటి క్రిప్టో కరెన్సీపై తన విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ ఉంటారు. న్యూయార్క్ నగరానికి కొత్త మేయర్గా జోహ్రాన్ మామ్దానీ (Zohran Mamdani) ఎన్నికైన సందర్భంగా తన అసంతృప్తి వ్యక్తం చేస్తూ తాజగా ‘ఎక్స్’లో ఓ పోస్ట్ పెట్టారు.‘మార్క్సిస్ట్ మామ్దానీ న్యూయార్క్ మేయర్ అయ్యారా? అతను రెంట్ స్టెబిలిటీని పెంచుతారని న్యూయార్క్ వాసులకు తెలుసా?’ అంటూ ట్వీట్ చేశారు. అద్దెపై నియంత్రణ అన్నది మార్క్సిస్ట్ సిద్ధాంతమని, దానర్థం అపార్ట్మెంట్ తరాలుగా అద్దెకుండేవారి చేతుల్లోనే ఉండిపోతుందని, ఓనర్లు మాత్రం హక్కులు కోల్పోతారని హెచ్చరించారు.అన్నింటికీ మార్క్సిస్ట్ ప్రభుత్వమే యాజమాని అయ్యేటప్పుడు ఇక ప్రజలు దేనికైనా ఓనర్లుగా ఉండటం ఎందుకు? అంటున్నారు. అమెరికా స్వేచ్ఛ, పెట్టుబడి వ్యవస్థ కోల్పోంతోందని, మార్క్సిస్ట్ దేశంగా మారిపోతోందని అసంతృప్తిని వెలిబుచ్చారు. వామపక్ష ప్రభుత్వం నడిపే స్కూళ్లలో ఆర్థిక బోధన ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు.కాబట్టి అప్రమత్తంగా ఉండాలని, అసలైన ఆర్థిక జ్ఞానంతో మిమ్మిల్ని మీరు రక్షించుకోవాలని తన ఫాలోవర్లకు సూచించారు. రియల్ మనీ గురించి తెలుసుకోవాలన్నారు. బంగారం, వెండిని (gold and silver) దేవుని సొమ్ముగా, బిట్కాయిన్, ఎథీరియంను ప్రజా సొమ్ముగా అభివర్ణించారు.OMG: Marxist Momdami Mayor of NYC? Don’t New Yorkers know that he will increase “Rent Stability” which is Marxist and means;1: Infinite Rent Control…. Which means a renter has control of their apartment for generations. A person can pass on their apartment to their kids,…— Robert Kiyosaki (@theRealKiyosaki) November 5, 2025 -
జనవరి 1 నుంచి ఆ పాన్ కార్డులు చెల్లవు..!
ఆధార్తో లింక్ చేసుకోని పాన్ కార్డులు వచ్చే జనవరి 1 నుంచి చెల్లుబాటు కావు. అంటే తమ ఆధార్తో పాన్ కార్డులు లింక్ చేసుకోనివారు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ను ఫైల్ చేయలేరు. ట్యాక్స్ రిఫండ్ను అందుకోలేరు. అలాగే ఇతర బ్యాంకింగ్, షేర్ మార్కెట్ ట్రేడింగ్, ఇతర ఆర్థిక కార్యకలాపాల్లోనూ ఇబ్బందులు తప్పవు.ఆధార్, పాన్ కార్డులు.. రెండూ దేశంలో అత్యంత ముఖ్యమైన ధ్రువ పత్రాలు. ఒకటి దేశ పౌరుడిగా విశిష్ట గుర్తింపును తెలియజేసేదైతే మరొకటి ఆర్థిక కార్యకలాపాలకు అత్యంత కీలకమైన డాక్యుమెంట్. పన్ను ఎగవేతలను అక్రమాలను అరికట్టడానికి ఆధార్, పాన్ కార్డులను లింక్ చేసుకోవాలని ప్రభుత్వం ఎప్పుడో నిబంధన తెచ్చింది. దీనికి గడువును మాత్రం ఎప్పటికప్పుడు పెంచుతూ వస్తోంది.సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) 2024 అక్టోబర్ 1వ తేదీకి ముందు జారీ చేసిన పాన్ కార్డులను 2025 డిసెంబర్ 31వ తేదీ లోపు తప్పనిసరిగా ఆధార్తో లింక్ చేసుకోవాలని గడువు విధించింది. ఆ లోపు లింకింగ్ పూర్తి కాకపోతే అలాంటి పాన్కార్డులు చెల్లుబాటు కావని సీబీడీటీ గతంలో వెల్లడించింది. ఇప్పుడా గడువు సమీపిస్తోంది. ఇంకా ఈ ప్రక్రియను పూర్తి చేయనివారు వెంటనే అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది.ఆన్లైన్లో పాన్-ఆధార్ లింక్ చేసుకోండిలా..ఆదాయపు పన్ను శాఖ ఆన్లైన్ పోర్టల్లో మీ పాన్, ఆధార్ ను సులభంగా లింక్ చేసుకోవచ్చు. ఈ దశలను అనుసరించండి..అధికారిక ఇన్కమ్ ట్యాక్స్ ఈ-ఫైలింగ్ వెబ్ సైట్ కు వెళ్లండి."లింక్ ఆధార్" పై క్లిక్ చేసి మీ పాన్, ఆధార్ నంబర్, మొబైల్ నంబరును నమోదు చేయండి.ఇప్పుడు మీ ఫోన్కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వివరాలను వెరిఫై చేయండి.ఒకవేళ మీ పాన్ ఇప్పటికే ఇనాక్టివ్గా ఉంటే, మొదట రూ .1,000 లింకింగ్ ఫీజు చెల్లించాలి.లింకింగ్ పూర్తయిందో లేదో తెలుసుకోవడానికి, వెబ్సైట్లో ‘క్విక్ లింక్స్’కు వెళ్లి ఆధార్ స్టేటస్ లింక్పై క్లిక్ చేయండి. -
జేబుకు తెలియకుండానే కన్నం వేస్తున్నారా?
డబ్బు సంపాదించడం ఒక కళ. ధనవంతులు అయ్యేందుకు చాలా మార్గాలు అనుసరించి లక్ష్యం చేరినా, దాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఎంతో కష్టపడి సంపాదించిన ధనం దేనికి ఖర్చు చేస్తున్నారో సరైన అవగాహన లేకుండానే చాలా మంది నష్టపోతున్నారు. ఇది కేవలం తక్కువ ఆదాయం ఉన్నవారికి మాత్రమే కాదు, అపార సంపద ఉన్నవారికి కూడా వర్తిస్తుంది. ఆర్థిక స్వేచ్ఛకు పునాదులు వేసుకోవడానికి బదులు, దారిద్ర్యం వైపు నడిపించే ప్రమాదకరమైన అలవాట్లు, ఆర్థిక నిర్ణయాలు ఏమిటో తెలుసుకోవడం అత్యవసరం.అదుపులేని వినియోగం‘నాకు ఇప్పుడే ఆ వస్తువు అవసరం లేదు, కానీ కొనాలి’ అనే భావన పేదరికానికి మొదటి మెట్టు. క్రెడిట్ కార్డులు లేదా వ్యక్తిగత రుణాలపై వస్తువులను కొనుగోలు చేయడం, వాటిపై భారీ వడ్డీ చెల్లించడం వల్ల ఆర్థిక భారం పెరుగుతుంది. తరచుగా కొత్త మోడల్ ఫోన్లు, కార్లు లేదా ఫ్యాషన్ వస్తువుల కోసం అధికంగా ఖర్చు చేయడం వంటి విధానాల ద్వారా డబ్బు కరిగిపోతుంది. కొనుగోలు చేసిన వస్తువుల విలువ కాలక్రమేణా తగ్గిపోతుంది. ఇతరులను అనుకరించడానికి లేదా సమాజంలో గొప్పగా కనిపించడానికి స్థోమతకు మించిన ఖర్చులు చేయకూడదు.ఆర్థిక అవగాహన లేకపోవడండబ్బు సంపాదించడం గురించి తెలుసుకోవడమే కాదు, అది ఎలా పనిచేస్తుందో తెలియకపోవడం అతిపెద్ద లోపం. డబ్బును బ్యాంకులో ఉంచడం సురక్షితమని భావించి చాలా మంది దాని విలువ ద్రవ్యోల్బణం కారణంగా క్రమంగా తగ్గిపోతోందని గ్రహించడం లేదు. భవిష్యత్తు కోసం పొదుపు చేయడం ముఖ్యం. కానీ ఆ పొదుపును తెలివిగా పెట్టుబడి పెట్టకపోతే ఆర్థిక లక్ష్యాలు నెరవేరవు. పన్నుల విధానంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల అనవసరంగా ఎక్కువ పన్నులు చెల్లించడం లేదా చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు.అత్యవసర నిధి..ఊహించని సంఘటనలకు (ఉద్యోగం కోల్పోవడం, అనారోగ్యం, ప్రమాదాలు) సిద్ధంగా లేకపోవడం వల్ల పేదరికం అంచుల్లోకి వెళుతారు. అత్యవసర సమయాల్లో డబ్బు లేకపోతే అధిక వడ్డీకి అప్పులు చేయక తప్పదు. ఇది దీర్ఘకాలికంగా ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తుంది. కనీసం ఆరు నెలల జీవన వ్యయాలకు సరిపడా డబ్బును పక్కన పెట్టుకోవాలి. ఏ చిన్న విపత్తు వచ్చినా తీవ్ర సంక్షోభం నుంచి కపాడుకోవడానికి ఇది తోడ్పడుతుంది.ఒకే ఆదాయ మార్గంపై ఆధారపడటంఒకే ఉద్యోగం లేదా ఒకే వ్యాపారంపై పూర్తిగా ఆధారపడటం ఆర్థిక ప్రమాదానికి సంకేతం. ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పుడు ఉద్యోగం పోతుందో చెప్పలేం. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు లేకపోతే కుటుంబ పోషణ కష్టమవుతుంది. అదనపు ఆదాయ వనరుల ద్వారా సంపదను వేగంగా పెంచుకునే అవకాశం ఉంది. అన్ని గుడ్లను ఒకే బుట్టలో ఉంచడం మంచిది కాదనే సూత్రాన్ని గుర్తుంచుకోవాలి.దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళిక..రేపటి గురించే కాకుండా 20-30 సంవత్సరాల భవిష్యత్తు గురించి ఆలోచించకపోవడం వల్ల కూడా చాలామంది పేదరికంలోకి వెళ్తున్నారు. యువతలో రిటైర్మెంట్ గురించి ఆలోచించడం లేదు. దానికోసం పొదుపు/పెట్టుబడి పెట్టడం లేదు. దాంతో వృద్ధాప్యంలో ఇతరులపై ఆధారపడేలా చేస్తుంది. ఇల్లు కొనడం, పిల్లల విద్య వంటి స్పష్టమైన ఆర్థిక లక్ష్యాలు లేకుండా ఇష్టానుసారంగా ఖర్చు చేస్తే పరిస్థితులు తారుమారవుతాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల ద్వారా లభించే చక్రవడ్డీ శక్తిని గుర్తించాలి.ఇదీ చదవండి: దొంగలించి ‘ట్రేడ్-ఇన్’ ద్వారా కొత్త ఫోన్! -
సేవింగ్స్ బ్యాంక్ ఖాతా: ఏఐతో వాత!
నాకు సేవింగ్స్ బ్యాంక్ ఖాతా ఒకటే ఉంది. అందులో జీతమే పడుతుందని కొందరు.. పెన్షన్ తప్ప ఇంకేమీ వేయనని ఇంకొందరు.. మార్చి నెలాఖరుకల్లా చాలా తక్కువ.. అంటే మినిమం బ్యాలెన్స్ మాత్రమే ఉంటుందని మరికొందరు చెప్తుంటారు. అక్షరాలా ఇదే నిజమైతే ఏ ఇబ్బందీ ఉండదు. కానీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంటు వ్యవహారాల మీద ఎలాంటి నిఘా ఉండదు. కేవలం ఫిక్సిడ్ డిపాజిట్ల మీదే దృష్టి ఉంటుందని కొందరి పిడివాదన.డిపార్టుమెంటు వారికి అవేమీ పట్టవు. కృత్రిమ మేధస్సు (AI) ద్వారా అన్ని బ్యాంకులు, అన్ని బ్రాంచీలు ప్రతి సంవత్సరం విధిగా, మీకు సంబంధించిన అన్ని సేవింగ్స్ ఖాతాల వ్యవహారాలను కొన్ని నిబంధనలకు లోబడి డిపార్టుమెంటుకు చేరవేస్తాయి. ఆ చేరవేత, ఆ తర్వాత ఏరివేత.. మెదడుకి మేత.. కృత్రిమ మేథస్సుతో వాత.. వెరసి మీకు నోటీసుల మోత! అసాధారణమైన నగదు డిపాజిట్లు, విత్డ్రాయల్స్ వారి దృష్టిలో పడతాయి. వివిధ సంస్థలు, ఏజెన్సీలు ప్రతి సంవత్సరం ‘‘నిర్దేశిత ఆర్థిక వ్యవహారాల’’ను ఒక రిటర్ను ద్వారా తెలియజేస్తాయి.పది లక్షలు దాటిన నగదు డిపాజిట్లుఒక ఆర్థిక సంవత్సరంలో ఒకసారి కాని, దఫదఫాలుగా కానీ వెరసి నగదు డిపాజిట్లు రూ. 10,00,000 దాటితే మీ ఖాతా వ్యవహారాలు.. సేవింగ్స్ ఖాతాలో పడినట్లు కాదు.. డిపార్టుమెంటు వారి చేతిలో పడ్డట్లే.విత్డ్రాయల్స్కొందరు తమ ఖాతాల నుంచి పెద్ద మొత్తాలు విత్డ్రా చేస్తారు. వ్యాపారం నిమిత్తం, పెళ్లి ఖర్చుల నిమిత్తం.. ఇలా చేయడం చట్టపరంగా తప్పు కాకపోవచ్చు. అసమంజసంగా అనిపిస్తే ఆరా తీస్తారు. ‘సోర్స్’ గురించి కూపీ లాగుతారు.క్రెడిట్ కార్డులపై భారీ చెల్లింపులుఅకౌంటు ద్వారా పెద్ద పెద్ద మొత్తాలు క్రెడిట్ కార్డుల చెల్లింపులకు వెళ్తుంటాయి. వీటి మీద నిఘా, విచారణ ఉంటాయి.రూ. 30,00,000 దాటిన క్రయ విక్రయాలు..ఇలాంటి క్రయవిక్రయాలను సబ్రిజిస్టార్ వాళ్లు ప్రతి సంవత్సరం రిపోర్ట్ చేస్తారు. వెంటనే బ్యాంకు అకౌంట్లను చెక్ చేస్తారు. సాధారణ పద్దులు/రొటీన్ పద్దులు ఉండే అకౌంట్లలో పెద్ద పెద్ద పద్దులుంటే, వారి అయస్కాంతంలాగా వారి దృష్టికి అతుక్కుపోతాయి.విదేశీయానం.. విదేశీ మారకం..విదేశీయనం నిమిత్తం, విదేశీ చదువు కోసం, విదేశాల్లో కార్డుల చెల్లింపులు... ఇలా వ్యవహారం ఏదైనా కానీ రూ. 10,00,000 దాటితో పట్టుకుంటారు. దీనికి ఉపయోగించిన విదేశీ మారకం, చట్టబద్ధమైనదేనా లేక హవాలానా అనేది ఆరా తీస్తారు.నిద్రాణ ఖాతాల్లో నిద్ర లేకుండా చేసే వ్యవహారాలుకొన్ని సంవత్సరాలపాటు ఎటువంటి లావాదేవీలు ఉండని ఖాతాలను నిద్రాణ లేదా ని్రష్కియ ఖాతాలని అంటారు. వాటిలో అకస్మాత్తుగా పెద్ద పెద్ద వ్యవహారాలేమైనా జరిగాయంటే.. అధికారుల కళ్లల్లో పడతాయి. ఇలాంటి వ్యవహారాలు అధికారుల దృష్టిని ఆకట్టుకుంటే.. వారు వెంటనే పట్టుకుంటారు.డిక్లేర్ చేయని వ్యవహారాలు చనిపోయిన మావగారు, పెళ్లప్పుడు ఇచ్చిన స్థలాన్నో, ఇళ్లనో ఇప్పుడు అమ్మేసి, వచి్చన ఆ పెద్ద మొత్తాన్ని అకౌంటులో వేసి, ఆయన ఆత్మశాంతి కోసం మౌనం పాటిస్తే అది మౌనరాగం కాదు. గానాబజానా అయిపోతుంది. ఖజానాకి చిల్లులు పడతాయి. పొంతన లేని డివిడెండ్లు.. వడ్డీ.. కొన్న షేర్లు భారీగా ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్లు కొండంత ఉన్నా డివిడెండ్లు, వడ్డీల రూపంలో ఆదాయం ఆవగింజంత కనిపిస్తోందంటే ..తస్మాత్ జాగ్రత్త.ఎన్నో అకౌంట్లు .. కానీ ఒక్కదాన్నే..కొందరికి ఎన్నో అకౌంట్లు ఉంటాయి. తప్పు లేదు. కానీ వారు ఇన్కంట్యాక్స్ రిటర్నుల్లో ‘ఏకో నారాయణ’ అన్నట్లు ఒక దాన్ని మాత్రమే డిక్లేర్ చేస్తారు. డిపార్టుమెటు వారి దగ్గర మీ పది అకౌంట్ల వివరాలు పదిలంగా ఉంటాయని గుర్తుంచుకోవాలి.వేరే వ్యక్తుల సహాయార్థం.. ఏదో, సహాయమని, బంధువులు, స్నేహితుల పెద్ద పెద్ద వ్యవహారాలను మీ అకౌంట్లలో నడిపించకండి. వివరణ మీరు ఇవ్వాల్సి వస్తుంది.. ఇవ్వగలరా? అప్పులను తిరిగి చెల్లించేటప్పుడే ఆశగా ఎక్కువ వడ్డీ చూపించి, పెద్ద మొత్తాన్ని మీ అకౌంట్లో వేసి, ‘నా పేరు చెప్పకు గురూ’ అని అంటారు.. కానీ, వీరి వీరి గుమ్మడిపండు వీరి పేరేంటి అనే అటలాగా, వీళ్ల వ్యవహారాలేంటి.. వాళ్ల వ్యవహారాలేంటి అని ఆరా తీస్తూ, దొంగ లావాదేవీలు లేదా డిక్లేర్ చేయని లావాదేవీలను డిపార్టుమెంటు వారు కళ్లు మూసుకుని సైతం పట్టేస్తారనే విషయాన్ని అర్థం చేసుకుని మనం కళ్లు తెరుచుకుని ఉండాలి. -
‘నెల జీతాల ఉద్యోగాలు ఉండవ్..’
దేశంలో నెల జీతాల ఉద్యోగాలు ఉండబోవంటూ ఓ ఆర్థిక నిపుణుడు చేసిన హెచ్చరిక కలవరపెడుతోంది. భారతదేశ వైట్ కాలర్ జాబ్ యంత్రం ఆగిపోయే దశకు వచ్చిందని మార్సెల్లస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ సౌరభ్ ముఖర్జియా హెచ్చరిస్తున్నారు. ఆయన మాటల్లో చెప్పాలంటే “భారతదేశంలో స్థిరమైన జీతం పొందే ఉపాధి యుగం ముగుస్తోంది”ఇటీవలి పాడ్కాస్ట్లో మాట్లాడిన ముఖర్జియా.. “ఉపాధి వృద్ధి ప్రధానంగా ఆగిపోయింది. ఈ పరిస్థితి కనిపించడమే కాదు.. కోలుకోలేనిదిగా ఉంది” అన్నారు. గత ఐదేళ్లలో వైట్ కాలర్ ఉద్యోగాల పెరుగుదల తక్కువగా ఉండటమే కాక, భవిష్యత్తులో కూడా వాటి పునరుజ్జీవనం “దాదాపు అసంభవం” అని ఆయన అభిప్రాయపడ్డారు.కారణం ఆటోమేషన్..ఈ పరిణామానికి ప్రధాన కారణాలు ఆటోమేషన్, కార్పొరేట్ సామర్థ్యం. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టైటాన్, ఏషియన్ పెయింట్స్ వంటి పెద్ద కంపెనీలు, ఇప్పుడు ఉద్యోగులను పెంచుకోకుండానే తమ వ్యాపారాన్ని విస్తరించగలుగుతున్నాయి. “ఈ కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగావకాశాలు సృష్టించే అవకాశం చాలా తక్కువ. ఆటోమేషన్ వల్ల ఉద్యోగుల సంఖ్యను పెంచకుండానే ఎదగడం సాధ్యమవుతోంది” అని సౌరభ్ ముఖర్జియా అన్నారుగ్రాడ్యుయేట్ల వెల్లువ.. అవకాశాల కొరతప్రతి సంవత్సరం సుమారు 80 లక్షల మంది కొత్త గ్రాడ్యుయేట్లు భారత శ్రామికశక్తిలోకి ప్రవేశిస్తున్నారు. కానీ వీరికి తగిన అవకాశాలు ఉండటం లేదు. “అధికారిక కార్పొరేట్ నిర్మాణం లేకుండా ఈ కొత్త తరం యువతకు జీవనోపాధి కల్పించడం ఎలా అన్నదే దేశం ఎదుర్కొనే సవాలు” అని ఆయన చెప్పారు. రానున్న సంవత్సరాల్లో దేశంలో పని విధానం పూర్తిగా మారిపోతుందని సౌరభ్ ముఖర్జియా హెచ్చరించారు.గిగ్ ఎకానమీ వైపు ప్రయాణంసాంప్రదాయ వేతన ఉద్యోగాలు వేగంగా తగ్గిపోతాయనేది సౌరభ్ ముఖర్జియా అంచనా. “డ్రైవర్లు, కోడర్లు, పాడ్కాస్టర్లు, ఫైనాన్షియల్ అడ్వైజర్లు అందరూ స్వయం ఉపాధి వైపు వెళ్తున్నారు,” అని ఆయన చెప్పారు. “మనం గిగ్ ఉద్యోగాల ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాం. జీతం ఆధారిత ఉపాధి యుగం చరిత్రలో కలిసిపోతోంది” అన్నారు.గిగ్ ఎకానమీ భారత్కు కలిసివస్తుందని ముఖర్జియా ఆశాజనకంగా కూడా ఉన్నారు. 29 సంవత్సరాల సగటు వయస్సు ఉన్న యువ జనాభా, ప్రపంచంలోనే చౌకైన మొబైల్ బ్రాడ్బ్యాండ్, అలాగే ఆధార్, యూపీఐ వంటి డిజిటల్ వ్యవస్థలు.. ఇవన్నీ భారత్ను “గిగ్ ఎకానమీ” యుగంలో బలంగా నిలబెడతాయని ఆయన నమ్మకం.“సాంప్రదాయ వైట్ కాలర్ ఉద్యోగాలు సవాలుగా మారతాయి. మన జీవితంలో ఎక్కువ భాగం గిగ్ కార్మికులుగా గడపాల్సిన భవిష్యత్తు కోసం మనమూ, మన పిల్లలూ సిద్ధం కావాలి” అని ఆయన స్పష్టం చేశారు. -
పెట్టుబడి వెనక్కి తీసుకుంటే పెనాల్టీ కట్టాలా?
నా వద్ద రూ.30 లక్షలు ఉన్నాయి. మెరుగైన రాబడుల కోసం ఈక్విటీల్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి? – జయ్దేవ్ముందుగా సరైన పెట్టుబడి సాధనాన్ని ఎంపిక చేసుకోవాలి. రాబడితోపాటు పెట్టుబడి రక్షణకూ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. కనుక ప్రతీ పెట్టుబడి ఆప్షన్లో ఉండే సానుకూల, ప్రతికూలతలను చూడాలి. ఈక్విటీ పథకాలు స్వల్పకాలంలో రాబడులు ఇస్తాయని కచ్చితంగా చెప్పలేం. రాబడులు ఇవ్వొచ్చు. నష్టాలూ ఇవ్వొచ్చు. అస్థిరతలు ఎక్కువ. మార్కెట్ ఏ సమయంలో అయినా దిద్దుబాటుకు గురికావచ్చు. పెట్టుబడి అవసరమైన సమయంలో మార్కెట్లు దిద్దుబాటును చూస్తే రాబడిని నష్టపోవాల్సి రావచ్చు.స్వల్పకాలం కోసం అయితే అస్థితరల రిస్క్ను అధిగమించేందుకు డెట్ సాధనాలను ఎంపిక చేసుకోవాలి. ఐదేళ్లు, అంతకుమించిన కాలం కోసం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక మీ పెట్టుబడులను వివిధ రకాల మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవడం ద్వారా వైవిధ్యం ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా ఫండ్ బలహీన పనితీరు చూపిస్తే, మరో ఫండ్ మంచి పనితీరుతో రాబడుల్లో స్థిరత్వం ఉంటుంది. క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసుకోవడం మరో మార్గం. ఇందుకు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్)ను ఎంపిక చేసుకోవచ్చు. దీనివల్ల అస్థిరతల ప్రభావాన్ని అధిగమించొచ్చు. మీ లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యం, రాబడుల అంచనాల ఆధారంగా డెట్, ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవడం సరైన నిర్ణయం అవుతుంది. నేను సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్)లో రూ.4 లక్షలు ఇన్వెస్ట్ చేశాను. మూడేళ్లు అయింది. ఇప్పుడు నా పెట్టుబడిని వెనక్కి తీసుకుంటే పెనాల్టీ చెల్లించాలా? – శ్యామ్ ముఖర్జీసీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కాల వ్యవధి ఐదేళ్లు. 8.2 శాతం వార్షిక రాబడిని మూడు నెలలకు ఒకసారి చొప్పున చెల్లిస్తారు. ఈ పథకం వడ్డీ రేటును ప్రతి మూడు నెలలకు ఒకసారి కేంద్ర ఆర్థిక శాఖ సమీక్షిస్తుంటుంది. అయినప్పటికీ డిపాజిట్ చేసే రోజు ఉన్న రేటు ఐదేళ్ల కాలానికి అమలవుతుంది. అంటే కొత్తగా ప్రారంభించే ఖాతాలకే సవరించిన రేటు అమల్లో ఉంటుంది. ఈ పథకం కాలవ్యవధి ఐదేళ్లకు ముందుగానే వైదొలగాలంటే అందుకు ఫారమ్–2 సమర్పించాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసిన కాలవ్యవధి ఆధారంగా కొంత పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. డిపాజిట్ చేసిన ఏడాది లోపు వెనక్కి తీసుకుంటే ఎలాంటి వడ్డీ చెల్లించరు. అప్పటి వరకు మూడు నెలలకు ఒకసారి చెల్లించిన వడ్డీ మొత్తాన్ని అసలు నుంచి మినహాయించుకుంటారు.ఏడాది నుంచి రెండేళ్ల మధ్య డిపాజిట్ను రద్దు చేసుకుంటే పెట్టుబడిలో 1.5 శాతాన్ని జరిమానా కింద మినహాయించి, మిగిలినది చెల్లిస్తారు. ఇక రెండు నుంచి ఐదేళ్ల మధ్యలో డిపాజిట్ రద్దు చేసుకుంటే అప్పుడు పెట్టుబడిపై 1 శాతం జరిమానా పడుతుంది. మీరు మూడేళ్ల తర్వాత డిపాజిట్ను వెనక్కి తీసుకోవాలని అనుకుంటున్నారు. కనుక మీరు మీ పెట్టుబడి మొత్తం రూ.4 లక్షలపై ఒక శాతం చొప్పున రూ.4,000 పెనాల్టీ మినహాయించుకుని, మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తారు. మొదటి ఐదేళ్ల కాలానికే ఈ నిబంధనలు అమలవుతాయి. ఎస్సీఎస్ఎస్ పథకాన్ని ఐదేళ్ల తర్వాత మరో మూడేళ్లు పొడిగించుకోవచ్చు. ఇలా పొడిగించిన కాలంలో ఏడాది నిండిన తర్వాత, అంటే మొత్తంగా ఆరేళ్ల తర్వాత ఎప్పుడు ముందస్తుగా రద్దు చేసుకున్నా ఎలాంటి పెనాల్టీ పడదు.ఇదీ చదవండి: ఈపీఎఫ్ క్లెయిమ్ చేసుకోవాలా? -
రిటర్నులకు ఇంకా చాన్సుంది..!
ఆదాయ పన్ను రిటర్నుల దాఖలు (ఐటీఆర్) గడువు సెప్టెంబర్ 16తో ముగిసింది. ఏదైనా కారణాలతో గడువు లోపు రిటర్నులు సమర్పించలేకపోతే.. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. కొంత పెనాల్టీ చెల్లించడం ద్వారా ఆదాయపన్ను చట్టం నిబంధనల కింద రిటర్నులు దాఖలు చేయొచ్చు. ఇందుకు డిసెంబర్ 31 వరకూ గడువు ఉంది. ఇక గడువు ముగియడానికి చివరి గడియల్లో హడావుడిగా రిటర్నులు దాఖలు చేసిన వారు సైతం, అందులో ఏవైనా తప్పులు దొర్లి ఉంటే వాటిని సరిచేసుకునేందుకు వెసులుబాటు ఉంది. ఈ విషయంలో పన్ను చెల్లింపుదారులు ఏం చేయాలన్నది చూద్దాం. – సాక్షి, బిజినెస్ డెస్క్ఈ ఏడాది రిటర్నుల దాఖలుకు ఆదాయపన్ను శాఖ అదనపు సమయం ఇచ్చింది. జూలై 31గా ఉన్న గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించింది. చివరి రోజుల్లో ఈ–ఫైలింగ్ పోర్టల్పై సాంకేతిక సమస్యలు రావడంతో సెప్టెంబర్ 16 వరకు రిటర్నులు సమర్పించేందుకు అవకాశం ఇచ్చింది. అయినా సరే సకాలంలో రిటర్నులు సమర్పించని వారు ఇప్పుడు బిలేటెడ్ (ఆలస్యంగా) ఐటీఆర్ను సెక్షన్ 139(1) కింద సమర్పించొచ్చు. ఇందుకు డిసెంబర్ 31 వరకు అవకాశం ఉంటుంది. కాకపోతే పెనాల్టీ కట్టాలి. అంతేకాదు, ఒకవేళ పన్ను చెల్లించాల్సి ఉంటే, వడ్డీతోపాటు కట్టేయాలి. సెక్షన్ 234ఎఫ్ కింద.. ఆదాయం రూ.5 లక్షలకు మించని వారు రూ.1,000 బిలేటెడ్ రిటర్నుల ఫీజు కింద చెల్లించాలి. ఆదాయం రూ.5 లక్షలు మించితే రూ.5,000 చెల్లించాల్సి వస్తుంది. అంతేకాదు.. సెక్షన్ 234ఏ కింద నికరంగా చెల్లించాల్సిన పన్నుపై, గడువు ముగిసిన నాటి నుంచి నెలవారీ ఒక శాతం చొప్పున వడ్డీని చెల్లించాలి. అప్పటికే సంబంధిత పన్ను చెల్లింపుదారు పాన్పై నమోదైన టీడీఎస్, ముందస్తు పన్ను చెల్లింపులను పరిగణనలోకి తీసుకున్న తర్వాత నికరంగా చెల్లించాల్సిన మొత్తంపైనే వడ్డీ పడుతుందని బీడీవో ఇండియా ఎల్ఎల్పీ ట్యాక్స్ పార్ట్నర్ ప్రీతి శర్మ తెలిపారు. అసలు చెల్లించాల్సిన తేదీ నుంచి, రిటర్నులు సమర్పించే తేదీ వరకు ఈ వడ్డీని పరిగణనలోకి తీసుకుంటారు. ఒక ఆర్థిక సంవత్సరం మొత్తం మీద పన్ను బాధ్యత రూ.10,000కు మించి ఉంటే అందులో 90 శాతాన్ని సంబంధిత ఆర్థిక సంవత్సరం ముగియక ముందే చెల్లించాలని (ముందస్తు పన్ను) నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ప్రకారం.. 2025 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి నికర పన్ను మొత్తంలో 90 శాతాన్ని ముందుగా చెల్లించడంలో విఫలమైతే అప్పుడు సెక్షన్ 234బీ కింద నిబంధనలు అమలవుతాయి. వీటి కింద ఆర్థిక సంవత్సరం ముగిసిన మర్నాటి నుంచి (ఏప్రిల్ 1) పన్ను మొత్తంపై వడ్డీ రేటు అమల్లోకి వస్తుంది. ఇక సెక్షన్ 234సీ కింద సంబంధిత త్రైమాసికం చివరి తేదీ నాటికి ముందస్తు పన్ను చెల్లించడంలో విఫలమైనా, లేదా తక్కువ చెల్లించినా.. అప్పుడు క్వార్టర్ వారీ పరిశీలన తర్వాత వడ్డీ రేటు అమలు చేస్తారు. ఒకవేళ త్రైమాసికం వారీ ముందస్తు పన్ను చెల్లింపుల్లో విఫలమై, ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత కూడా గడువులోపు రిటర్నులు సమర్పించి, పన్ను బకాయిని వడ్డీ సహా చెల్లించలేకపోతే.. అలాంటి సందర్భాల్లో ఈ మూడు సెక్షన్ల (234ఏ, బీ, సీ) కింద మూడు రెట్లు వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని ప్రీతి శర్మ వివరించారు. దీంతో చెల్లించాల్సిన మొత్తం గణనీయంగా పెరిగిపోతుంది. ఈ భారం వద్దనుకుంటే నిబంధనల ప్రకారం సకాలంలో చెల్లించడమే చక్కని మార్గం. జాప్యం చేస్తే నష్టమే.. గడువులోపు రిటర్నులు దాఖలు చేసినట్టయితే పాత, కొత్త పన్ను విధానాల్లో తమకు అనుకూలమైన దాన్ని (తక్కువ పన్ను భారం పడే) ఎంపిక చేసుకోవచ్చు. కానీ, గడువు దాటితే విధిగా కొత్త పన్ను విధానం కిందే సమర్పించగలరు. అంతేకాదు సెక్షన్ 10ఏ, 10బీ, 80–1ఏ, 80–ఐబీ, 80–ఐసీ, 80–ఐడీ, 80–ఐఈ కింద వ్యాపార, మూలధన నష్టాలను తదుపరి ఆర్థిక సంవత్సరాలకు బదిలీ చేసుకోవడం కుదరదు. గడువులోపు రిటర్నులు సమర్పించిన వారికే ఈ నష్టాలను తదుపరి ఆర్థిక సంవత్సరాలకు బదిలీ చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. ‘‘గడువు తర్వాత కొత్త పన్ను విధానం కింద రిటర్నులు వేసేట్టు అయితే స్వీయ నివాసానికి సంబంధించి నష్టాలను లాభాలతో సర్దుబాటు చేసుకునేందుకు లేదా తదుపరి ఆర్థిక సంవత్సరాలకు బదిలీ చేసుకునేందుకు అనుమతి ఉండదు. అద్దెకు ఇచ్చిన నివాసం రూపంలో నష్టం ఏర్పడితే, కేవలం క్యారీ ఫార్వార్డ్ (తదుపరి ఆర్థిక సంవత్సరాలకు ) చేసుకునేందుకే అవకాశం ఉంటుంది’’ అని ప్రీతి శర్మ తెలిపారు. అలస్యంగా డిసెంబర్ 31లోపు దాఖలు చేసినప్పటికీ, సాధారణ ఐటీఆర్ మాదిరే మదింపు చేస్తారు. నికరంగా పన్ను చెల్లించాల్సిన వారే రిటర్నులు వేయాలని లేదు. పన్ను చెల్లించేంత ఆదాయం లేని వారు సైతం బిలేటెడ్ రిటర్నుల పత్రాన్ని సమర్పించడం ద్వారా నిబంధనలను పాటించొచ్చు. దీనివల్ల టీడీఎస్ లేదా టీసీఎస్లు ఉంటే నిబంధనల కింద పెనాల్టీ చెల్లించి, వాటి రిఫండ్ కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు.ఇలా సమర్పించొచ్చు.. ఈ–ఫైలింగ్ పోర్టల్లోకి లాగిన్ అవ్వాలి. ‘ఈ–ఫైల్’ విభాగంలో ‘ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్’ అన్న దగ్గర క్లిక్ చేయాలి. అక్కడ అసెస్మెంట్ సంవత్సరాన్ని ఎంపిక చేసుకుని, ‘రివైజ్డ్ రిటర్న్ అండ్ సెక్షన్ 139(5)’పై క్లిక్ చేయాలి. తొలుత సమర్పించిన ఐటీఆర్ అక్నాలెడ్జ్మెంట్ నంబర్ను పేర్కొనడం మర్చిపోవద్దు. ఆఫ్లైన్లో పేపర్ రూపంలో (80 ఏళ్లకు పైబడిన వారు) రిటర్నులు దాఖలు చేసిన వారు ఆన్లైన్లో సవరణ రిటర్నులకు అవకాశం ఉండదు. తిరిగి భౌతిక రూపంలోనే సమర్పించాల్సి ఉంటుంది. సవరణ రిటర్నులను డిసెంబర్ 31 (2024–25 సంవత్సరానికి సంబంధించి) వరకు ఎన్ని పర్యాయాలు అయినా సమర్పించొచ్చు. ఇందుకు ఎలాంటి పెనాల్టీ చెల్లించక్కర్లేదు. రిఫండ్ ప్రాసెస్ అయిన తర్వాత కూడా సవరణ రిటర్నులు దాఖలు చేసుకోవచ్చు. సాధారణ రిటర్నుల మాదిరే సవరణ రిటర్నులు వేసిన తర్వాత 30 రోజుల్లోపు ధ్రువీకరించడం తప్పనిసరి. అప్పుడే అది మదింపునకు వెళుతుంది.వివిధ వర్గాల వారికి రిటర్నుల గడువు → వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు (హెచ్యూఎఫ్), ఆడిటింగ్ అవసరం లేని అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ (ఏవోపీ), బాడీ ఆఫ్ ఇండివిడ్యువల్స్ (బీవోఐ) రిటర్నులు దాఖలు చేయాల్సిన గడువు సెప్టెంబర్ 16తో ముగిసింది. → ఆడిట్ అవసరమైన వ్యాపార సంస్థలు రిటర్నుల సమర్పణ గడువు అక్టోబర్ 31. → సవరణ, బిలేటెడ్ రిటర్నుల సమర్పణ గడువు డిసెంబర్ 31. → 2024–25 అసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించి అప్డేటెడ్ రిటర్నుల దాఖలు గడువు 2030 మార్చి 31. డిసెంబర్ 31నాటికి దాఖలు చేయకపోతే..? డిసెంబర్ 31లోపు ఆలస్యపు రిటర్నులు సమర్పించడంలోనూ విఫలమైతే ఏమవుతుంది? అన్న సందేహం ఏర్పడొచ్చు. అలాంటి కేసుల్లో ఆదాయపన్ను శాఖ నుంచి నోటీసు జారీ కావొచ్చు. సకాలంలో రిటర్నులు వేయడం ద్వారానే చట్టపరిధిలో ఎన్నో మినహాయింపులు, ప్రయోజనాలకు అర్హత ఉంటుంది. లేదంటే వీటిని కోల్పోయినట్టే. రుణాలకు, ఆదాయ ధ్రువీకరణకు, వీసా ప్రాసెసింగ్కు ఐటీ రిటర్నులు రుజువుగా పనికొస్తాయన్నది గుర్తు పెట్టుకోవాలి. రిటర్నుల్లో సవరణలు.. ఆదాయపన్ను రిటర్నుల దాఖలు ఇటీవలి కాలంలో కొంత సులభంగా మారినప్పటికీ, ఇంకా కొంత సంక్లిష్టమనే చెప్పుకోవాలి. అన్ని ఆర్థిక లావాదేవీలు, ఆదాయం, పెట్టుబడులు, మూలధన లాభాలు/నష్టాలు, డిపాజిట్లపై వడ్డీ ఆదాయం, అద్దె ఆదాయం, విదేశీ పెట్టుబడులు ఇలా ఎన్నో వివరాలను పేర్కొనాల్సి ఉంటుంది. టీడీఎస్, టీసీఎస్ ఏవైనా ఉంటే సరిచూసుకోవాలి. వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్)ను చూసుకున్న తర్వాత అందులో ఏవైనా తప్పులుంటే ఆదాయపన్ను శాఖకు రెక్టిఫికేషన్ (దిద్దుబాటు) అభ్యర్థన నమోదు చేయాలి. ఇంత సుదీర్ఘ ప్రక్రియలో కొన్ని తప్పులు దొర్లే అవకాశం లేకపోలేదు. లేదా ఫలానా ఆదాయం లేదా ఆర్థిక లావాదేవీల వివరాలను వెల్లడించడం మర్చిపోవచ్చు. అలాంటి సందర్భాల్లో సవరణ రిటర్నులు దాఖలు చేసుకోవచ్చు. కనుక రిటర్నులు సమర్పించిన అనంతరం ప్రతి ఒక్కరూ ఒక్కసారి సమగ్రంగా పరిశీలించుకోవడం మంచిది. ఏవైనా తప్పులుంటే, వాటిని సవరించుకునేందుకు అవకాశం ఉంటుంది. డిసెంబర్ 31లోపు ఈ పనిచేయొచ్చు. ఐటీఆర్ పత్రం సరైనది ఎంపిక చేసుకోకపోవడం, వ్యక్తిగత వివరాల్లో తప్పులు, బ్యాంక్ ఖాతా వివరాల్లో తప్పులు, కొన్ని ఆదాయాలను వెల్లడించకపోవడం, మినహాయింపులు ఉన్నప్పటికీ వాటిని వినియోగించుకోకుండా పన్ను రిటర్నులు వేసి, అధిక పన్ను చెల్లించడం.. విదేశీ పెట్టుబడులు, ఆదాయాలు, ఇ–సాప్లు.. ఎలాంటి ఆధారాల్లేకుండా మినహాయింపులను క్లెయిమ్ చేసుకున్న సందర్భాల్లో సవరణ రిటర్నులు సమర్పించొచ్చు. ముఖ్యంగా విదేశీ ఆస్తులు, ఆదాయాలను వెల్లడించకపోతే ‘బ్లాక్మనీ అండ్ ఇంపోజిషన్ ఆఫ్ ట్యాక్స్ యాక్ట్, 2015’ కింద పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే, అప్పటికే సమర్పించిన రిటర్నులను ఆదాయపన్ను శాఖ మదింపు చేయడం ముగిసిపోతే సవరణ రిటర్నులకు అవకాశం ఉండదు. → సెక్షన్ 143 (1) కింద ఐటీఆర్ ప్రాసెస్ (ఇనీíÙయల్/ప్రాథమిక) అయినప్పుడే సవరణ రిటర్నులను డిసెంబర్ 31లోపు లేదా తుది ప్రాసెసింగ్కు ముందు సమర్పించుకునేందుకు అనుమతి ఉంటుంది. → ఒకవేళ డిసెంబర్ 31 కంటే ముందుగానే సెక్షన్ 143 (3) కింద ఐటీఆర్ తుది మదింపు ముగిసినట్టయితే సవరణ రిటర్నులకు అవకాశం ఉండదు. ఇటువంటి సందర్భంలో సెక్షన్ 139(8ఏ) కింద ఐటీఆర్–అప్డేటెడ్ సమర్పించుకోవచ్చు.డిసెంబర్ 31 తర్వాత కూడా.. గడిచిన ఆర్థిక సంవత్సరానికి తర్వాతి ఆర్థిక సంవత్సరం అసెస్మెంట్ ఇయర్ అవుతుంది. 2024–25కు 2025–26 అసెస్మెంట్ సంవత్సరం అవుతుంది. అసెస్మెంట్ సంవత్సరం డిసెంబర్ 31 వరకు బిలేటెడ్ రిటర్నులు లేదా సవరణ రిటర్నులు సమర్పించుకోవచ్చు. అప్పటికీ అది చేయలేకపోతే, ఆ తర్వాత ఉన్న ఏకైక మార్గం అప్డేటెడ్ రిటర్నులు (ఐటీఆర్–యూ) సమర్పించడం. అసెస్మెంట్ సంవత్సరం ముగిసిన నాటి నుంచి 48 నెలల వరకు (నాలుగేళ్లు) ఇందుకు అవకాశం ఉంటుంది. అసలు టర్నులు దాఖలు చేయకపోయినా లేక సమర్పించిన రిటర్నుల్లో తప్పులను గుర్తించినా లేదా ఏవైనా ఆదాయ, ఆస్తుల వివరాలు వెల్లడించడం మర్చిపోయినా లేదా సవరణ రిటర్నుల్లోనూ తప్పులను గుర్తించిన సందర్భాల్లో.. ఐటీఆర్–యూ దాఖలు చేసుకోవచ్చు. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 139(8ఏ) ఇందుకు అవకాశం కల్పిస్తోంది. ముఖ్యంగా ఆదాయపన్ను చెల్లించాల్సిన బాధ్యత కలిగి, రిటర్నులు సమర్పించని వారు లేదా సమర్పించినా సమగ్ర వివరాలు వెల్లడించని వారు తప్పకుండా ఐటీఆర్–యూ దాఖలు చేసి, పెనాల్టీ, వడ్డీ సహా పన్నును చెల్లించడం మంచి నిర్ణయం అవుతుంది. రిటర్నులను ఎంత ఆలస్యంగా దాఖలు చేశారు, చెల్లించాల్సిన పన్ను ఎంతన్నదాని ఆధారంగా.. అసలుకి 25 శాతం, 50 శాతం, 60 శాతం లేదా 70 శాతం వరకు అదనపు పన్నును చెల్లించాల్సి ఉంటుంది. దీనికి అదనంగా అంతకాలానికి వడ్డీ, పెనాల్టీలను కూడా సమర్పించుకోవాలి. -
బ్యాంకులో డబ్బు సేఫేనా? ‘రిచ్ డాడ్’ అబద్ధాలు!
ప్రఖ్యాత రచయిత, ఆర్థిక విద్యావేత్త రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki).. తన బెస్ట్ సెల్లింగ్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad)కు ప్రసిద్ధి చెందారు. డబ్బు, భద్రత, విజయంపై సమాజం దీర్ఘకాల నమ్మకాల గురించి మరోసారి సోషల్ మీడియాలో చర్చను రేకెత్తించారు.రాబర్ట్ కియోసాకి తాజాగా ‘ఎక్స్’(గతంలో ట్విట్టర్) లో ఒక పోస్ట్ చేశారు. "ఇప్పటివరకు చెప్పిన అతిపెద్ద అబద్ధాలు" ఇవే అంటూ కొన్ని అంశాలను ప్రస్తావించారు. అవి. "వాళ్లు ఎప్పటికీ సంతోషంగా ఉంటున్నారుబాండ్లు సురక్షితం.బ్యాంకులో డబ్బు సురక్షితం.నాకు ఉద్యోగ భద్రత ఉంది.కళాశాల డిగ్రీ ఆర్థిక విజయానికి కీలకం"ఈ ట్వీట్ వెంటనే వైరల్ అయింది. ఆయన ప్రస్తావించిన ప్రతి పాయింట్ ను చర్చించడంతో వేలాది లైక్లు, షేర్లు వచ్చాయి. కియోసాకి సందేశం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ ప్రధాన తత్వాన్ని ప్రతిధ్వనిస్తుంది. సాంప్రదాయ ఉపాధి విద్య వ్యవస్థల కంటే ఆర్థిక స్వాతంత్ర్యం పెట్టుబడి అక్షరాస్యత సంపదకు మరింత నమ్మదగిన మార్గాలు అన్నది కియోసాకి అభిప్రాయం.👉 ఇది చదవలేదా ఇంకా: అదిగో భారీ క్రాష్.. ‘రిచ్ డాడ్’ వార్నింగ్!BIGGEST LIES EVER TOLD:1: “They lived happily ever after.”2: “Bonds are safe.”3: “Safe as money in the bank.”4: “I have job security.”5: “ A college degree is the key to financial success.”— Robert Kiyosaki (@theRealKiyosaki) November 2, 2025 -
సామాన్యులకు తెలియని నగదు సూత్రాలు
ధనవంతులుగా మారడం కేవలం అదృష్టం లేదా అధిక జీతం వల్ల మాత్రమే సాధ్యం కాదు. నిరంతర కృషి, తెలివైన ఆర్థిక నిర్ణయాలు, కొంతమందికి తెలియని ఆర్థిక రహస్యాలు తెలుసుకొని వాటిని అనుసరించడం వంటివి ఉంటాయి. భారీగా డబ్బు సంపాదించే వారు పాటించే కొన్ని ఆర్థిక రహస్యాలను తెలుసుకుందాం.ముందు పెట్టుబడి తర్వాతే ఖర్చుసామాన్య ప్రజలు జీతం వచ్చిన తర్వాత ఖర్చులన్నీ పోగా మిగిలిన డబ్బును పొదుపు చేస్తారు. కానీ ధనవంతులు దీనికి పూర్తి విరుద్ధమైన సూత్రాన్ని పాటిస్తారు. ముందే పొదుపు తర్వాతే ఖర్చు నియమాన్ని అనుసరిస్తారు. జీతం/ఆదాయం రాగానే తమ ఆర్థిక లక్ష్యాల కోసం నిర్దిష్ట శాతాన్ని (ఉదాహరణకు 20% లేదా అంతకంటే ఎక్కువ) వెంటనే పెట్టుబడికి మళ్లిస్తారు. ఆ తర్వాతే మిగిలిన మొత్తంతో తమ ఖర్చులను ప్లాన్ చేసుకుంటారు. అత్యంత ధనవంతుడైన వారెన్ బఫెట్ కూడా ఈ సూత్రాన్నే సిఫార్సు చేస్తారు. ఇది ఖర్చులను నియంత్రించడమే కాక, ప్రతి నెలా సంపద సృష్టికి తప్పనిసరిగా నిధులు కేటాయించే క్రమశిక్షణను అలవాటు చేస్తుంది.అప్పులో మంచి-చెడుఅప్పు అంటేనే ఆర్థిక సమస్యలకు మూలం అని సామాన్యులు భావిస్తారు. కానీ ధనవంతులు అప్పును ఒక ఆర్థిక సాధనంగా ఉపయోగిస్తారు. మంచి అప్పు.. ఇది ఆదాయాన్ని సృష్టించే ఆస్తులను కొనుగోలు చేయడానికి ఉపయోగించే అప్పు. ఉదాహరణకు, అద్దెకు ఇవ్వడానికి రియల్ ఎస్టేట్ ఆస్తులు కొనడానికి తీసుకునే రుణం లేదా వ్యాపారం విస్తరణకు తీసుకునే రుణం. ఈ అప్పు ద్వారా వచ్చే ఆదాయం, రుణం వడ్డీ కంటే ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేస్తారు.చెడు అప్పు వినియోగ వస్తువుల కోసం లేదా త్వరగా విలువ తగ్గే వస్తువుల కోసం తీసుకునే అప్పు. ఉదాహరణకు, క్రెడిట్ కార్డు రుణాలు, ఖరీదైన కార్ల ఈఎంఐలు, విలాసవంతమైన విహారయాత్రలకు తీసుకునే రుణాలు. ధనవంతులు ఇలాంటి చెడు అప్పులకు దూరంగా ఉంటారు.సంపద సృష్టికి ఆదాయ మార్గాలుసామాన్య ఉద్యోగులు కేవలం ఒకే ఒక్క ఆదాయ వనరుపై (ఉద్యోగం) ఆధారపడతారు. అందుకే వారి ఆర్థిక ఎదుగుదల పరిమితంగా ఉంటుంది. ధనవంతులు తమ ప్రధాన ఆదాయంతో పాటు అదనంగా కనీసం రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయ వనరులను సృష్టిస్తారు. ఉదాహరణకు, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్, అద్దె ఆదాయం ఇచ్చే ఆస్తులు, రాయల్టీలు, లేదా ఒక సైడ్ బిజినెస్ వంటివి నిర్వహిస్తారు.దీర్ఘకాలిక పెట్టుబడులుత్వరగా ధనవంతులు అవ్వాలనే ఆశతో సామాన్యులు షార్ట్ కట్లు లేదా ఊహాజనిత పెట్టుబడుల్లో డబ్బును కోల్పోతారు. ధనవంతులు తక్కువ సమయంలో అధిక లాభాల కోసం వెంపర్లాడకుండా దీర్ఘకాలిక వృద్ధిని లక్ష్యంగా చేసుకుని పెట్టుబడి పెడతారు. వారు పెట్టుబడి పెట్టే కంపెనీలు, ఆస్తుల గురించి లోతుగా పరిశోధన చేస్తారు.వడ్డీపై వడ్డీదీర్ఘకాలంలో పెట్టుబడులను అలాగే ఉంచడం ద్వారా వారు కేవలం అసలుపై మాత్రమే కాక, అప్పటి వరకు వచ్చిన లాభాలపై కూడా రాబడిని పొందుతారు. ఇది సంపదను భారీగా పెంచే అసలైన రహస్యం.ఆర్థిక అక్షరాస్యత, నిరంతర అభ్యాసండబ్బు సంపాదించడం కంటే డబ్బును ఎలా నిర్వహించాలో తెలుసుకోవడం ధనవంతుల ముఖ్య రహస్యం. ధనవంతులు ఎప్పుడూ ఆర్థిక అంశాల గురించి తెలుసుకుంటూనే ఉంటారు. వారు పన్ను నియమాలు, పెట్టుబడి పోకడలు, ఆర్థిక వ్యవస్థ స్థితిగతులపై నిరంతరం అప్డేట్ అవుతారు. సరైన ఆర్థిక ప్రణాళికలు, పన్ను ఆదా వ్యూహాల కోసం వారు మంచి ఆర్థిక సలహాదారులను, అకౌంటెంట్లను నియమించుకుంటారు. ఇది వారి డబ్బును మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడుతుంది.ఇదీ చదవండి: ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ బాటిళ్లు వాడకూడదు -
అదిగో భారీ క్రాష్.. ‘రిచ్ డాడ్’ వార్నింగ్!
‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత, ప్రముఖ ఇన్వెస్టింగ్ గురూ రాబర్ట్ కియోసాకి పెట్టుబడుల గురించి మరోసారి హెచ్చరించారు. అంతర్జాతీ మార్కెట్ల ఒడిదొడుకుల నేపథ్యంలో ‘భారీ క్రాష్ మొదలంది’ అంటూ ‘ఎక్స్’లో (గతంలో ట్విట్టర్) పోస్ట్ పెట్టారు.లక్షల మంది ఇన్వెస్టర్లు ఆర్థికంగా వినాశనానికి గురవుతారని అంచనా వేశారు. సాంప్రదాయ ఆర్థిక వ్యవస్థలు హాని కలిగిస్తున్నాయని ఆయన నొక్కిచెప్పారు. వెండి (silver), బంగారం (gold) వంటి విలువైన లోహాలు, బిట్ కాయిన్, ఎథేరియం లాంటి క్రిప్టోకరెన్సీలు తిరోగమనం సమయంలో రక్షణ కవచాలుగా ఉపయోగపడతాయని సూచించారు.‘భారీ క్రాష్ మొదలంది. కోట్ల కొద్దీ పెట్టుబడులు తుడిచిపెట్టుకుపోతాయి. మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి. బంగారం, వెండి, బిట్ కాయిన్, ఎథేరియం పెట్టుబడులే మిమ్మల్ని కాపాడేదది’ అంటూ తన ట్వీట్లో రాబర్ట్ కియోసాకి రాసుకొచ్చారు.కియోసాకి (Robert Kiyosaki) ఇలా హెచ్చరించడం ఇదే మొదటిసారి కాదు. 2025 ప్రారంభం ఫిబ్రవరిలో కూడా ఇలాగే "చరిత్రలో అతిపెద్ద స్టాక్ మార్కెట్ క్రాష్" రాబోతోందంటూ అంచనా వేస్తూ ఇన్వెస్టర్లను అప్రమత్తం చేసే ప్రయత్నం చేశారు.MASSIVE CRASH BEGININING: Millions will be wiped out. Protect yourself. Silver, gold, Bitcoin, Ethereum investors will protect you. Take care— Robert Kiyosaki (@theRealKiyosaki) November 1, 2025 -
ఈపీఎఫ్ క్లెయిమ్ చేసుకోవాలా?
ఉద్యోగులు తమ అత్యవసర ఆర్థిక అవసరాల కోసం పీఎఫ్ (PF) నిధులను పొందే ప్రక్రియను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) విప్లవాత్మకంగా మార్చింది. క్లెయిమ్ ఆటో సెటిల్మెంట్ పరిమితిని ఈ ఏడాది జూన్లో రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. దాంతో క్లెయిమ్ ప్రక్రియ వేగవంతం అయింది. దీనివల్ల లక్షలాది మంది సభ్యులు ఇకపై తమ అడ్వాన్స్ క్లెయిమ్లను కేవలం 72 గంటల్లో పరిష్కరించుకునే వీలుంది. ఈ నేపథ్యంలో ఆన్లైన్లో ఈపీఎఫ్ సెటిల్మెంట్ విధానాన్ని పరిశీలిద్దాం.పీఎఫ్ క్లెయిమ్ చేసుకునే విధానంEPF సభ్యులు (ఉద్యోగులు) ఆన్లైన్లో అడ్వాన్స్ లేదా తుది సెటిల్మెంట్ క్లెయిమ్ను సమర్పించడానికి ఈ కింది దశలను అనుసరించాలి.మీ UAN యాక్టివ్గా ఉండాలి.UANతో ఆధార్, PAN, బ్యాంక్ ఖాతా (IFSCతో సహా) లింక్ అయి ఉండాలి.KYC వివరాలు EPFO రికార్డుల్లో ధ్రువీకరించుకోవాలి.ముందుగా EPFO అధికారిక యూనిఫైడ్ మెంబర్ పోర్టల్ను సందర్శించాలి.UAN, పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి.హోం పేజీలో ఆన్లైన్ సేవలను ఎంచుకోవాలి.Online Services టాబ్పై క్లిక్ చేసి, డ్రాప్డౌన్ మెనూలో ‘Claim (Form-31, 19, 10C)’ ఎంచుకోవాలి.ఏ ఫారమ్ ఎందుకోసమంటే.. Form-31: అనారోగ్యం, విద్య, ఇల్లు మొదలైన వాటి కోసం పాక్షిక ఉపసంహరణ.Form-19: తుది సెటిల్మెంట్ - ఉద్యోగం మానేసిన తర్వాత.Form-10C: పెన్షన్ ఉపసంహరణ - ఉద్యోగం మానేసిన తర్వాత.తరువాత పేజీలో మీ బ్యాంక్ ఖాతా నంబర్ను నమోదు చేసి ‘Verify’పై క్లిక్ చేయాలి.నిబంధనలను అంగీకరించి ‘Proceed for Online Claim’పై క్లిక్ చేయండి.క్లెయిమ్ ఫారం వివరాలు నింపాలి.‘I Want To Apply For’ విభాగంలో మీకు అవసరమైన క్లెయిమ్ రకాన్ని ఎంచుకోవాలి.ఆన్లైన్ ఫామ్లో Amount (కావలసిన మొత్తం), ‘Employee Address (ఉద్యోగి చిరునామా)’ వంటి వివరాలను నింపాలి.డాక్యుమెంట్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.షరతులకు అంగీకరించడానికి టిక్ బాక్స్ను ఎంచుకుని, ‘Get Aadhaar OTP’పై క్లిక్ చేయాలి.మీ ఆధార్తో లింక్ అయిన మొబైల్ నంబర్కు వచ్చిన OTPని ఎంటర్ చేసి Submit చేయాలి.భవిష్యత్తు క్లెయిమ్ ట్రాకింగ్ కోసం ప్రాసెస్ను ధ్రువీకరిస్తూ పీడీఎఫ్ వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోవాలి.ఇదీ చదవండి: ఆటోమేషన్తో క్లెయిమ్ సెటిల్మెంట్ వేగవంతం -
రూ.240 కోట్ల లాటరీ.. మరి ట్యాక్స్ ఎంత కట్టాలి?
యూఏఈలో ఇటీవల ఒక భారతీయ వ్యక్తి 100 మిలియన్ దిర్హమ్ల (రూ.240 కోట్లు) భారీ లాటరీని గెలుచుకున్నారు. ఇది విన్నవారందరూ ఆశ్చర్యచకితులై ఉంటారు. ‘వామ్మో అన్ని కోట్లు గెలిచాడా.. మరి దీనిపై ట్యాక్స్ కట్టాలా.. కడితే ఎంత కట్టాలి.. గెలిచిన లాటరీ సొమ్మును ఇండియాకు తెచ్చుకోవచ్చా?’ అందిరికీ వెంటనే ఇవే సందేహాలు వచ్చి ఉంటాయి. వీటి గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం..యూఏఈలో నో ట్యాక్స్లాటరీ గెలిచింది అబుదాబిలో నివసిస్తున్న 29 ఏళ్ల ప్రవాస భారతీయ యువకుడు అనిల్ కుమార్ బొల్లాగా గుర్తించారు. లాటరీ సొమ్ముపై ట్యాక్స్ అన్నది ఆయన ఎక్కడ పన్నులు చెల్లిస్తాడనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఆ దేశంలో ఇప్పటివరకు గెలిచిన అతిపెద్ద జాక్ పాట్ ఇదే అయినప్పటికీ, అక్కడ అటువంటి లాటరీలపై స్థానిక యూఏఈ పన్నులేవీ ఉండవు. అంటే ఆయన మొత్తం డబ్బును యూఏఈలోని తన బ్యాంకు ఖాతాలో జమవుతుంది.మరి భారత్లో..భారతదేశంలో లాటరీ బహుమతులపై ఫ్లాట్ 30% పన్ను వర్తిస్తుంది. అదనంగా ఈ పన్ను మొత్తంపై 15% సర్ఛార్జ్ (రూ .1 కోటి కంటే ఎక్కువ గెలుపొందినవారికి), అలాగే మొత్తంపై 4% ఆరోగ్య, విద్యా సెస్ చెల్లించాల్సి ఉంటుంది. సదరు వ్యక్తి భారతదేశంలో నివాసి హోదాను కలిగి ఉంటే ఈ పన్నుకు లోబడి ఉంటాడు.ఒక వ్యక్తి భారతదేశంలో నివాసిగా పరిగణించబడాలంటే.. గడిచిన సంవత్సరంలో కనీసం 182 రోజులు భారతదేశంలో ఉండాలి. లేదా గడిచిన సంవత్సరంలో 60 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం, అలాగే అంతకుముందు నాలుగు సంవత్సరాలలో మొత్తం 365 రోజులు భారత్లో నివసించి ఉండాలి.ఈ రెండు సందర్భాల పరిధిలోకి లాటరీ విజేత రాకపోతే నాన్-రెసిడెంట్ ఇండియన్ (ఎన్ఆర్ఐ) హోదాను కలిగి ఉంటారు. కాబట్టి భారతదేశంలో పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ నివాస హోదా ఉంటే, డైరెక్టరేట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం.. ప్రపంచంలో ఎక్కడ సంపాదించినా.. అది భారతదేశంలోకి తీసుకురాకపోయినా భారతదేశంలో ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తుంది.అనిల్ కుమార్ బొల్లా దీర్ఘకాలంగా అబుదాబి నివాసి. ఒకటిన్నర సంవత్సరాలకు పైగా ఆయన యూఏఈలో నివసిస్తున్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక తెలిపింది. అంటే ఆయన భారతీయ పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు.ఇక ఆయన గెలుచుకున్న లాటరీ సొమ్మును భారతదేశానికి తీసుకురాగలడా అంటే.. తీసుకొచ్చేందుకు నిబంధనలు అనుమతించవు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ), ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) ప్రకారం, బయటి దేశాల్లో లాటరీ ద్వారా గెలుచుకున్న సొమ్మును భారత్లోకి తేవడం నిషేధం. -
ఈపీఎఫ్వో భారీ మార్పునకు సన్నద్ధం! 11 ఏళ్ల తర్వాత..
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) భారీ మార్పునకు సన్నద్ధమవుతోంది. ఈపీఎఫ్, ఈపీఎస్ అర్హత కోసం జీతం పరిమితిని పెంచే ప్రతిపాదనపై చర్చించడానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వచ్చే డిసెంబర్ లేదా జనవరిలో సమావేశం కానుంది.ప్రస్తుతం, నెలకు బేసిక్ వేతనం రూ .15,000 వరకు (డీఏతో కలిపి) ఉన్న ఉద్యోగులు మాత్రమే తప్పనిసరిగా ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్), ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) పరిధిలోకి వస్తారు. ఈపీఎఫ్వో ఇప్పుడు ఈ పరిమితిని రూ .25,000 లకు పెంచాలని యోచిస్తోంది. ఇది 2014 అనంతరం అంటే దాదాపు 11 ఏళ్ల తర్వాత భారీ మార్పు కాబోతోంది.ఇది అమల్లోకి వస్తే భారతదేశ శ్రామిక శక్తిలో చాలా మంది ఈపీఎఫ్ ఈపీఎస్ ప్రయోజనాలను పొందుతారు. అంటే ఇప్పుడు పదవీ విరమణ, పెన్షన్ భద్రత కోల్పోతున్న లక్షలాది మంది మళ్లీ వాటి పరిధిలోకి వస్తారు.ప్రస్తుత వ్యవస్థ ఎలా పనిచేస్తుందంటే.. ఉద్యోగి, యాజమాన్యం ఇద్దరూ ఉద్యోగి నెలవారీ బేసిక్ జీతంలో 12 శాతం ప్రావిడెంట్ ఫండ్కు జమ చేస్తారు. ఇక్కడ యాజమాన్యం వాటా మళ్లీ విభజిస్తారు. 3.67 శాతం ఈపీఎఫ్కు వెళుతుంది. 8.33 శాతం ఈపీఎస్కు కేటాయిస్తారు.ఇక నెలవారీ జీతంలో బేసిక్ పే రూ .15,000 దాటినవారికి ఈపీఎఫ్ కవరేజీ తప్పనిసరి కాదు. అంటే ఈపీఎఫ్ కవరేజీ కావాలంటే తీసుకోవచ్చు. వద్దనుకుంటే విరమించుకోవచ్చు.ఈపీఎఫ్ఓ ఇప్పటికే దేశవ్యాప్తంగా 7.6 కోట్ల క్రియాశీల సభ్యులతో రూ .26 లక్షల కోట్ల భారీ నిధిని నిర్వహిస్తోంది. ఈ మార్పు ఇప్పటికే ఆలస్యమయ్యాయని, కార్మిక మంత్రిత్వ శాఖ అధికారులు అంటున్నారు. జీతాలతోపాటు ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉన్న నేపథ్యంలో పాత నిబంధనలు నేటి వాస్తవికతకు సరిపోవు. కొత్త పరిమితి అమల్లోకి వస్తే మరింత మంది కార్మికులకు పదవీ విరమణ అనంతర రక్షణను పొందడానికి సహాయపడుతుంది. -
రూ.కోటితో ఉల్లాసంగా విశ్రాంత జీవనం
న్యూఢిల్లీ: పదవీ విరమణ (రిటైర్మెంట్) తర్వాత సౌకర్యవంతమైన జీవనానికి రూ.కోటి సరిపోతుందని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. ప్రతి పది మందికి గాను ఏడుగురు ఇదే అభిప్రాయంతో ఉన్నారు. అయితే విశ్రాంత జీవన అవసరాలకు ఎంత నిధి కావాలన్న విషయమై ఇప్పటికీ అవగాహనన తక్కువగానే ఉందని యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ నిర్వహించిన ఇండియా రిటైర్మెంట్ ఇండెక్స్ అధ్యయనం ‘ఐరిస్ 5.0’లో తెలిసింది. → ఐరిస్ ఇండెక్స్ స్కోరు 2022లో 44గా ఉంటే 2025లో 48కి చేరింది. ఈ సూచీ రిటైర్మెంట్ సన్నద్ధతను సూచిస్తుంది. నిజానికి గతేడాది 49 పాయింట్ల స్థాయిలో ఉండగా, అక్కడి నుంచి ఒక పాయింట్ తగ్గినట్టు తెలుస్తోంది. → ఆరోగ్యపరమైన సన్నద్ధత మెరుగుపడింది. పదవీ విరమణానంతరం సురక్షిత జీవనానికి ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని గుర్తిస్తున్నారు. → 25–65 ఏళ్ల వసులోని 2,242 మంది అభిప్రాయాలను సర్వేలో భాగంగా తెలుసుకున్నారు. వీరిలో 50 శాతం మంది వేతన జీవులు కాగా, మిగిలిన వారు స్వయం ఉపాధిపై ఆధారపడి ఉన్నారు. → ఆర్జన ఆరంభమైన వెంటనే లేదా 35 ఏళ్లలోపే రిటైర్మెంట్ ప్రణాళిక మొదలు కావాలని 50 శాతం మంది చెప్పారు. → తమ విశ్రాంత జీవన ప్రణాళికను ఎలా ఆరంభించాలన్న దానిపై కొందరు అయోమయాన్ని ఎదుర్కొంటున్నారు. వీరికి విశ్వసనీయమైన సలహాలు అవసరమని ఈ సర్వే పేర్కొంది. ‘‘వివేకమైన, సమగ్రమైన పదవీ విరమణ ప్రణాళిక వైపు స్పష్టమైన మార్పును ఐరిస్ 5.0 సూచిస్తోంది. ఆరోగ్యం పట్ల నేడు మంచి అవగాహన పెరుగుతోంది. ఉత్పత్తులపై అవగాహన, స్థిరమైన ఆర్థిక విశ్వాసం కనిపిస్తోంది’’అని యాక్సిస్ మ్యాక్స్లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో సుమిత్ మదన్ తెలిపారు. -
‘ఆ భయంతోనే ఇంకా పేదలవుతున్నారు’
‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి బిట్కాయిన్పై తన విశ్వాసాన్ని ‘రెట్టింపు’ చేశారు. క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ విలువ ఈ ఏడాది రెట్టింపు అవుతుందని, బహుశా 2 లక్షల డాలర్లకు చేరవచ్చని అంచనా వేశారు. అలాగే ఎందుకు చాలామంది నష్టాల్లోనే మిగిలిపోతున్నారన్నది కూడా వివరించారు.రాబర్ట్ కియోసాకి బిట్ (Robert Kiyosaki) తాజాగా ‘ఎక్స్’(గతంలో ట్విట్టర్)లో మరో ఆసక్తికర పోస్ట్ చేశారు. ‘బిట్ కాయిన్ ధర ఈ సంవత్సరం రెట్టింపు కావచ్చు.. బహుశా 2 లక్షల డాలర్లకు చేరవచ్చు’, ‘నష్టపోతున్నవారు నష్టపోతూనే ఉంటారు ఎందుకంటే వారిలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేదా "ఈక్యూ" లోపించింది’ అని పేర్కొన్నారు.ఈ సందర్భంగా తన మిత్రునితో జరిగిన వ్యక్తిగత అనుభవాన్ని కియోసాకి పంచుకున్నారు. కొన్నేళ్ల క్రితంఓసారి తన స్నేహితుడికి తన కాయిన్ బేస్ యాప్ను చూపించానని, అదప్పడు అంత మెరుగ్గా లేదని రాసుకొచ్చారు. కానీ ఇప్పుడు ఆ అకౌంట్లో లక్షల బిట్ కాయిన్లు (Bitcoin) ఉన్నాయని వివరించారు. అయితే అతనప్పుడు చూడగలిగింది వేలల్లో నష్టాలనే.. కానీ మిలియన్లలో లాభాలను అతను చూడలేకపోయాడని తాను గుర్తించినట్లు రాసుకొచ్చారు.ధనిక, పేద, మధ్యతరగతి మధ్య తేడా అదే..‘ఆ మానసిక భావోద్వేగ వ్యత్యాసమే ధనిక, పేద, మధ్యతరగతి మధ్య కీలకమైన వ్యత్యాసం’ అని కియోసాకి పేర్కొన్నారు. "దీనినే ఈక్యూ లేదా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు" అని వివరాంచారు. కియోసాకి అభిప్రాయం ప్రకారం.. "పేదలకు తక్కువ ఈక్యూ ఉంటుంది. వారు భయం అనే భావోద్వేగంలో ఉంటున్నారు". అదే "ధనవంతులకు 'భయం', ఆశ' రెండింటి గురించీ తెలుసు. ఈ రెండు ఈక్యూలు మనందరికీ ఉండేవే. సంపన్నులు, విజేతలు ఈ రెండు ఈక్యూలను గౌరవిస్తారు"."ఈక్యూ.. ఐక్యూ కంటే శక్తివంతమైనది. అందుకే నా ‘పూర్ డాడ్’ వంటి చాలా మంది ఉన్నత విద్యావంతులు కూడా పేదలుగానే గతిస్తున్నారు" అని కియోసాకి ఉదహరించారు. "ఆర్థిక ప్రపంచంలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఐక్యూ కంటే ముఖ్యమైనది" అన్నారు.ఇదీ చదవండి: ‘బంగారం, వెండి క్రాష్ అంటూ భయపెడుతున్నారు’యు.ఎస్. ఫెడరల్ రిజర్వ్ విధాన నిర్ణయం, యూఎస్-చైనా వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితికి ముందు లిక్విడేషన్ల ద్వారా స్వల్పకాలిక అస్థిరతతో బిట్ కాయిన్ విలువ బుధవారం (అక్టోబర్ 29) 1,13,125 డాలర్ల వద్ద కదులుతున్న నేపథ్యంలో కియోసాకి నుంయి ఈ బుల్లిష్ వ్యాఖ్యలు వచ్చాయి.WHY LOSERS lose:I was showing a friend my coin base app, explaining that a few years ago it was pathetic. Today my app showed my friend I have millions in Bitcoin…. and I think Bitcoin will double in price this year…. Possibly a high of $200k.Although my coin base showed I…— Robert Kiyosaki (@theRealKiyosaki) October 29, 2025 -
రోజుకు రూ.60 వేలు, నెలకు రూ.10 లక్షలు.. నమ్మేదేనా?
ఆధునిక సాంకేతికత, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో నకిలీ వార్తలు, తప్పుడు సమాచారం అదే స్థాయిలో పెరుగుతున్నాయి. కొన్ని నమ్మశక్యం కానీ సమాచారాలను కూడా ఏఐ సాయంతో అవలీలగా వ్యాప్తి చేస్తున్నారు. అలాంటిదే ఇది.. 24 గంటల్లో రూ.60 వేలు.. ‘నెలకు రూ.10 లక్షలు సంపాదించే పెట్టుబడి పథకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది’ అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.నకిలీ వార్తను ఛేదించిన పీఐబీకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా ఈ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ గురించి చెబుతున్నట్లుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో కనిపిస్తోంది. దీని గురించి పూర్తి అవగాహన లేనివారు ఎటువంటి ధ్రువీకరణ లేకుండానే వ్యాప్తి చేస్తున్నారు. అయితే ఇది ఏఐ మానిప్యులేటెడ్ వీడియో అని, ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉందని ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ తేల్చింది.'ఈజీగా రోజువారీ ఆదాయం వచ్చే 'పెట్టుబడి పథకం' కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించారు అంటూ ఫేస్బుక్లో ఒక వీడియో చలామణిలో ఉంది. ఆర్థిక మంత్రి లేదా భారత ప్రభుత్వం అటువంటి పథకాన్ని ప్రారంభించలేదు లేదా ఆమోదించలేదు" అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ‘ఎక్స్’ (ట్విటర్)లో అధికారిక పోస్ట్లో తెలిపింది."అలాంటి త్వరగా ధనవంతులవుతారని చెప్పే ఉచ్చులలో పడకండి! అప్రమత్తంగా ఉండండి. సమాచారం ఇవ్వండి. మీరు షేర్ చేసే ముందు ధృవీకరించుకోండి" అని పీఐబీ తెలిపింది. యూజర్లు అప్రమత్తంగా ఉండటానికి, స్కామ్లను గుర్తించడానికి కొన్ని సూచనలను చేసింది.ఇదీ చదవండి: ‘బంగారం, వెండి క్రాష్ అంటూ భయపెడుతున్నారు’ఇలాంటి వీడియోల్లో మాట్లాడుతున్నవారి పెదవుల కదలిక, అసహజమైన వాయిస్ సింక్ గమనించాలి. వీడియోల్లో చూపిస్తున్న తేదీ, బ్యాక్గ్రౌండ్, లోగో వంటివి సరిపోలాయా లేదా అన్నది పరిశీలించాలి. అధికారిక ప్రభుత్వ డొమైన్లు ఎల్లప్పుడూ .gov.in అనే ఎక్స్టెన్షన్తో ముగుస్తాయి. షేర్ చేసేముందు ఆ లింక్లను ధ్రువీకరించుకోవడం అవసరం. 💥 Earn ₹60,000 in 24 hours & ₹10 Lakhs a month! 🚨Sounds tempting❓ 💸 Think Again‼️A video on Facebook falsely shows Union Finance Minister @nsitharaman promoting an 'investment program' that promises easy daily income.#PIBFactCheck ✅❌ FAKE ALERT!👉The video is… pic.twitter.com/QsUkFkrYYW— PIB Fact Check (@PIBFactCheck) October 27, 2025 -
ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదించే బిజినెస్ ఐడియాలు
నేటి డిజిటల్ యుగంలో పెట్టుబడి లేకుండా, ఇంట్లో కూర్చుని లక్షల్లో సంపాదించే అవకాశాలు గణనీయంగా పెరిగాయి. అయితే వీటికి మీ నైపుణ్యాలు, సమయాన్ని పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ఇంటర్నెట్ ఆధారిత ప్లాట్ఫామ్లను ఉపయోగించుకునే చాలా వ్యాపారాలు సాగుతున్నాయి. అయితే ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. ఎలాంటి శ్రమ లేకుండా నిజానికి లక్షల రూపాయలు సంపాదించడం అనేది సాధ్యంకాదు. నిరంతర కృషి, సరైన వ్యూహం, మార్కెటింగ్ సామర్థ్యం, కొత్త ట్రెండ్లను ఉపయోగించుకుంటే డబ్బు సంపాదన తేలికవుతుంది. నగదు రూపేణా పెద్దగా పెట్టుబడి లేకుండా లక్షలు సంపాదించడానికి అవకాశం ఉన్న కొన్ని వ్యాపార ఆలోచనలు చూద్దాం.ఫ్రీలాన్సింగ్ సేవలుమీకు ఏదైనా ప్రత్యేక నైపుణ్యం ఉంటే దాన్ని సర్వీసుగా మార్చి డబ్బు సంపాదించవచ్చు. ఉదాహరణకు కంటెంట్ రైటింగ్ (తెలుగు/ఇంగ్లీష్), గ్రాఫిక్ డిజైనింగ్, వెబ్ డెవలప్మెంట్, వీడియో ఎడిటింగ్, సోషల్ మీడియా మేనేజ్మెంట్, డేటా ఎంట్రీ, ట్రాన్స్లేషన్ (అనువాదం) వంటి నైపుణ్యాలు ఉన్నాయంటే ఆన్లైన్లోని Fiverr, Upwork, Freelancer వంటి ప్లాట్ఫామ్ల్లో మీ సర్వీసులు అందించడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. స్థానిక చిన్న వ్యాపారాలు లేదా స్టార్టప్ల కోసం డిజిటల్ మార్కెటింగ్ లేదా కంటెంట్ సేవలు అందిస్తూ డబ్బు సమకూర్చుకోవచ్చు.ఆన్లైన్ ట్యూటరింగ్/ కోచింగ్ఏదైనా అకడమిక్ సబ్జెక్ట్లో పరిజ్ఞానం (గణితం, సైన్స్), సంగీతం, యోగా, వంట, ప్రోగ్రామింగ్, భాషా నైపుణ్యాలు ఉంటే డిజిటల్ వేదికగా ఆన్లైన్ ట్యూటరింగ్ కోసం చాలా ప్లాట్ఫామ్లున్నాయి. లేదా సొంతంగా వీడియో కాల్స్ ద్వారా ట్యూషన్ చెప్పవచ్చు.Udemy, Skillshare వంటి వేదికల్లో ఆన్లైన్ కోర్సులను రికార్డ్ చేసి అమ్ముకోవచ్చు. కోర్సు అమ్మకాలు ఎక్కువైతే లక్షల్లో సంపాదన సాధ్యమవుతుంది.డ్రాప్షిప్పింగ్డ్రాప్షిప్పింగ్ అంటే ఉత్పత్తిని ముందే కొనుగోలు చేయకుండా ఆర్డర్ వచ్చిన తర్వాత నేరుగా సరఫరాదారు నుంచి కస్టమర్కు పంపే విధానం. ఇందుకోసం ఆన్లైన్ మార్కెటింగ్, కస్టమర్ సర్వీస్, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లపై అవగాహన పెంచుకోవాలి. మీరు ఒక ఆన్లైన్ స్టోర్ను సృష్టించి ఇతర కంపెనీల ఉత్పత్తులను అందులో ఉంచాల్సి ఉంటుంది. కస్టమర్ ఆర్డర్ చేసినప్పుడు ఆ ఆర్డర్ను సరఫరాదారుకు పంపితే వారు నేరుగా కస్టమర్కు డెలివరీ చేస్తారు. కొనుగోలు ధర, అమ్మకపు ధర మధ్య వ్యత్యాసాన్ని లాభంగా మీకు వస్తుంది.అనుబంధ మార్కెటింగ్ (Affiliate Marketing)సోషల్ మీడియా (YouTube, Instagram..) లేదా వెబ్సైట్ ద్వారా భారీ ఫాలోయింగ్/ట్రాఫిక్ ఉంటే ఈ అనుబంధ మార్కెటింగ్లో మంచిగానే సంపాదించవచ్చు. ఒక ఉత్పత్తికి సంబంధించిన ప్రత్యేక లింక్ను (Affiliate Link) మీ వెబ్సైట్లో లేదా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. ఆ లింక్ ద్వారా ఎవరైనా వస్తువులు కొనుగోలు చేస్తే మీకు నిర్దిష్ట శాతం కమీషన్ వస్తుంది.విజయానికి ముఖ్య అంశాలుపెట్టుబడి లేకుండా లక్షల్లో సంపాదించడానికి కేవలం ఆలోచన సరిపోదు. ఆన్లైన్ వ్యాపారాలలో విజయం సాధించడానికి రోజూ క్రమం తప్పకుండా ఫాలోఅప్ అవసరం. మీ సర్వీసులు లేదా కంటెంట్ ఎక్కువ మందికి చేరడానికి సోషల్ మీడియా మార్కెటింగ్ తప్పనిసరి. మీరు అందించే సర్వీసు నాణ్యతగా ఉంటేనే కస్టమర్లు లేదా వీక్షకులు మిమ్మల్ని నమ్ముతారు. ఇంట్లో కూర్చొని పని చేసేటప్పుడు ఏకాగ్రతతో సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ముఖ్యం.ఇదీ చదవండి: మధ్యతరగతి వారికి వారెన్ బఫెట్ ఆర్థిక సూత్రాలు -
మధ్యతరగతి వారికి వారెన్ బఫెట్ ఆర్థిక సూత్రాలు
ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన పెట్టుబడిదారుల్లో వారెన్ బఫెట్కు ప్రత్యేక స్థానం ఉంది. మధ్యతరగతి ప్రజలు, ముఖ్యంగా భారతదేశంలోని సాధారణ వేతన జీవులు ఆర్థికంగా ఎదగడానికి, సంపదను సృష్టించడానికి ఉపయోగపడే అత్యంత విలువైన, ఆచరణాత్మక ఆర్థిక సూత్రాలను సూచించారు.ముందుగా పొదుపు, తర్వాతే ఖర్చుప్రతినెల జీతం వచ్చిన వెంటనే ఖర్చులు పోగా మిగిలిన మొత్తాన్ని పొదుపు చేయడం కంటే ముందుగా పొదుపు చేయదలిచిన మొత్తాన్ని పక్కన పెట్టి ఆ తర్వాత మిగిలిన దానితో ఖర్చులను సరిపెట్టుకోవాలి. ఈ సూత్రం ద్వారా పొదుపుకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టవుతుంది. ఇది ఆర్థిక క్రమశిక్షణను పెంచుతుంది. మధ్యతరగతి వారికి ఇది ఒక బలమైన ఆర్థిక పునాదిని ఏర్పరుస్తుంది.అనవసరమైన రుణాలను నివారించడంఅధిక వడ్డీ రేట్లు ఉండే రుణాలకు (ముఖ్యంగా క్రెడిట్ కార్డు రుణాలు) దూరంగా ఉండాలి. ఎందుకంటే అవి సంపదను హరించివేస్తాయి. రుణాలను నివారించడం లేదా వీలైనంత త్వరగా వాటిని తీర్చేయడం ద్వారా వడ్డీ రూపంలో పోయే డబ్బు ఆదా అవుతుంది. దాన్ని పెట్టుబడికి ఉపయోగించవచ్చు. ఇది సంపద సృష్టి వేగాన్ని పెంచుతుంది.దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడిస్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గులకు భయపడకుండా బలమైన వ్యాపార నమూనా, మంచి నిర్వహణ ఉన్న కంపెనీలను ఎంచుకుని దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడి పెట్టాలి. స్వల్పకాలిక లాభాల కోసం వెంపర్లాడకుండా సహనంతో ఉంటే కాలక్రమేణా చక్రవడ్డీతో చిన్న పెట్టుబడులు కూడా భారీ మొత్తంగా మారతాయి. మధ్యతరగతి వారికి సంపద సృష్టిలో ఇది అత్యంత కీలకమైన సూత్రం.తెలిసిన వాటిలో మాత్రమే పెట్టుబడి పెట్టడంమీకు పూర్తిగా అర్థం కాని లేదా అవగాహన లేని వ్యాపారాలు/పరిశ్రమలలో పెట్టుబడి పెట్టవద్దు. మధ్యతరగతి వారు నష్టాలను భరించే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. అందుకే తాము అర్థం చేసుకోగలిగే, భవిష్యత్తులో వృద్ధి చెందే సామర్థ్యం ఉన్న వాటిలో మాత్రమే పెట్టుబడి పెట్టాలి.సాధారణ వేతన జీవులకు సలహాలుప్రతి నెల బడ్జెట్ను పాటించాలి. అవసరాలు, కోరికల మధ్య తేడాను గుర్తించి అనవసరమైన ఖర్చులను తగ్గించాలి. ధనవంతులుగా కనిపించడానికి లగ్జరీ వస్తువులు (పెద్ద ఇల్లు, ఖరీదైన కారు) కొనడానికి అప్పులు చేయవద్దు. విలువ తగ్గే ఆస్తులపై (ఉదా: కొత్త కారు) అధికంగా ఖర్చు పెట్టకుండా ఉండాలి. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, పుస్తకాలు చదవడం, జ్ఞానాన్ని నిరంతరం పెంచుకోవడం ద్వారా సంపాదన సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవాలి. మంచి విద్య, నైపుణ్య శిక్షణ, నిరంతర అభ్యాసం ద్వారా ఉద్యోగంలో మెరుగైన స్థానం, అధిక జీతం పొందవచ్చు.ఇదీ చదవండి: 60 ఏళ్లలో 260 రెట్లు పెరిగిన వేతనాలు! -
వచ్చే నెలలో వరుస సెలవులు?
బ్యాంకులు ప్రతిఒక్కరి దైనందిన జీవితంలో భాగమైపోయాయి. చాలా మంది నిత్యం ఏదో ఒక పనిమీద బ్యాంకు శాఖలను సందర్శిస్తూనే ఉంటారు. ఈ నేపథ్యంలో ఏ రోజుల్లో బ్యాంకులు పనిచేస్తాయి.. ఏ రోజుల్లో సెలవులు ఉంటాయన్నది తెలుసుకోవడం ముఖ్యం. వీటిని ముందే తెలుసుకుంటే అందుకు అనుగుణంగా ప్రణాళికలు చేసుకునే అవకాశం ఉంటుంది.అక్టోబర్ నెల అప్పుడే ముగింపునకు వచ్చేసింది. ఈ నెలలో పండుగలు, సెలవులు ముగిశాయి. నవంబర్ ప్రారంభం కాబోతోంది. ఇక వచ్చే నెలలో బ్యాంకు సెలవులు (Bank Holidays in November 2025) ఎప్పుడు ఉంటాయన్నదానిపై వినియోగదారులు దృష్టి సారించారు. నవంబర్ నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులు 9 నుండి 10 రోజుల పాటు మూసిఉండనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జారీ చేసిన బ్యాంక్ సెలవుల జాబితాను ఇక్కడ పరిశీలిద్దాం..ఈరోజుల్లోనే బ్యాంకు సెలవులునవంబర్ 1 - కన్నడ రాజ్యోత్సవం సందర్భంగా కర్ణాటకలో, ఐగస్ బఘ్వాల్ సందర్భంగా డెహ్రాడూన్లో బ్యాంకులకు సెలవు.నవంబర్ 2 - ఆదివారం దేశవ్యాప్తంగా సెలవునవంబర్ 5 - గురునానక్ జయంతి / కార్తీక పూర్ణిమ / రహస్ పూర్ణిమ సందర్భంగా ఐజ్వాల్, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, డెహ్రాడూన్, హైదరాబాద్, ఇటానగర్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోహిమా, కోల్కతా, లక్నో, ముంబై, నాగ్పూర్, న్యూఢిల్లీ, రాయపూర్, రాంచీ, సిమ్లా, శ్రీనగర్ లలో బ్యాంకులు మూసిఉంటాయి.నవంబర్ 7 - వంగాలా ఫెస్టివల్ సందర్భంగా షిల్లాంగ్లో సెలవునవంబర్ 8 - రెండో శనివారం దేశవ్యాప్తంగా సెలవునవంబర్ 9 - ఆదివారం దేశవ్యాప్తంగా సెలవునవంబర్ 16 - ఆదివారం దేశవ్యాప్తంగా సెలవునవంబర్ 22 - నాలుగో శనివారం దేశవ్యాప్తంగా సెలవునవంబర్ 23 - ఆదివారం దేశవ్యాప్తంగా సెలవునవంబర్ 30 - ఆదివారం దేశవ్యాప్తంగా సెలవుసెలవు రోజుల్లో భౌతికంగా బ్యాంకులు శాఖలు మూసిఉంచినప్పటికీ, వినియోగదారులు ఏటీఎంలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్లు, యూపీఐ సేవలను అంతరాయం లేకుండా ఉపయోగించవచ్చు. -
ధర్మ మార్గాన ధనార్జన
నేటి ఆధునిక యుగంలో ఆర్థిక స్వేచ్ఛ సాధించడం ప్రతి ఒక్కరి కల. అయితే కొందరు వ్యక్తుల్లో ‘ఎదుటివారిని మోసం చేస్తేనే ధనవంతులు కాగలం’ అనే తప్పుడు అభిప్రాయం బలంగా పాతుకుపోయింది. ఈ విధమైన అక్రమ సంపాదన ధోరణి తాత్కాలికంగా ఫలించినా అది ఎప్పుడూ స్థిరమైన, గౌరవప్రదమైన జీవితాన్ని ఇవ్వలేదు. నిజమైన, నిలకడైన సంపదను, గౌరవాన్ని సాధించాలంటే కచ్చితంగా ధర్మబద్ధమైన మార్గాలనే అనుసరించాలి. సగటు ఉద్యోగి, వ్యాపారి లేదా ఇతర రంగాల్లో ఉన్నవారు నైతిక విలువలను పాటిస్తూ సరైన ఆర్థిక ప్రణాళికతో ధనవంతులు ఎలా కావాలో చూద్దాం.ఆదాయాన్ని పెంచే నైపుణ్యాలపై దృష్టిఉద్యోగులు తమ వృత్తిలో అత్యంత విలువైన వ్యక్తిగా మారడానికి ప్రయత్నించాలి. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకోవడం ద్వారా జీతం పెరిగే అవకాశాలు మెరుగుపడతాయి. ముఖ్యంగా సంస్థకు లాభాలను తెచ్చిపెట్టే లేదా సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలపై పెట్టుబడి పెట్టాలి.వ్యాపారులు, ఇతర నిపుణులు తమ ఉత్పత్తులు లేదా సర్వీసుల్లో నిరంతరం కొత్త ఆవిష్కరణలు తీసుకురావడం, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తమను తాము మార్చుకోవడం ద్వారా వ్యాపార విస్తరణ, లాభాల పెంపు సాధ్యమవుతుంది. నాణ్యత, నమ్మకమే విజయానికి పునాది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.ఖర్చులపై నియంత్రణ, పొదుపుధనవంతులు కావడానికి కేవలం ఎక్కువ సంపాదించడం మాత్రమే మార్గం కాదు. సంపాదించిన దానికంటే తక్కువ ఖర్చు చేయడం చాలా ముఖ్యం. నెలవారీ ఖర్చులను ట్రాక్ చేస్తూ దేనికి ఎంత ఖర్చు చేస్తున్నారో స్పష్టంగా తెలుసుకోవాలి. అనవసరమైన, ఆడంబరమైన ఖర్చులను తగ్గించుకోవాలి. జీతం రాగానే మొదట కొంత మొత్తాన్ని పొదుపు/ పెట్టుబడి ఖాతాలోకి మళ్లించాలి. మిగిలిన దానితోనే ఖర్చులను ప్లాన్ చేసుకోవాలి. ఈ అలవాటు ఆర్థిక క్రమశిక్షణను పెంచుతుంది.తెలివైన పెట్టుబడులుకాలంతో పాటు డబ్బు విలువ తగ్గకుండా వృద్ధి చెందేలా పెట్టుబడి పెట్టడం అవసరం. పదవీ విరమణ, పిల్లల చదువులు వంటి దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ప్లాన్ చేసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ మార్కెట్లు, రియల్ ఎస్టేట్, బంగారంలో క్రమబద్ధంగా పెట్టుబడులు పెట్టడం ద్వారా వడ్డీ, రాబడి రూపంలో సంపద పెరుగుతుంది. వీటిలో ఇన్వెస్ట్ చేసేముందు నిపుణుల సలహా తీసుకోవాలి. అధిక వడ్డీ ఉన్న అప్పులను (ముఖ్యంగా క్రెడిట్ కార్డు అప్పులు) వీలైనంత త్వరగా తీర్చేయాలి. మంచి అప్పులు (వ్యాపార విస్తరణకు లేదా విలువ పెంచే ఆస్తుల కొనుగోలుకు) మాత్రమే చేయడం తెలివైన నిర్ణయం అవుతుంది.ఇదీ చదవండి: కాలంతో మారిన కంపెనీలు.. అందుకు కారణాలు -
‘బంగారం, వెండి క్రాష్ అంటూ భయపెడుతున్నారు’
ప్రముఖ ఇన్వెస్టర్, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) బిట్కాయిన్, బంగారం(Gold), వెండి పెట్టుబడులకు సంబంధించి తాజాగా మరో ట్వీట్ చేశారు. ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి చాలా మంది యూట్యూబ్ జాకీలు భయాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు.రాబర్ట్ కియోసాకి తన తాజా ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) పోస్ట్లో "ఫియర్ క్లిక్ బైటింగ్" గురించి విమర్శించారు. వ్యూస్, సబ్స్కైబర్లను పెంచుకోవడానికి ఆన్ లైన్ కంటెంట్ క్రియేటర్లు ఆర్థిక మార్కెట్ల గురించి ముఖ్యంగా బిట్ కాయిన్, బంగారం, వెండి గురించి భయంకరమైన అంచనాలను పోస్ట్ చేస్తున్నారన్నారు."చాలా మంది యూట్యూబ్ జాకీలు... 'ఫియర్ క్లిక్ బైట్స్' తో మిమ్మల్ని ఆకర్షిస్తున్నారు.. 'బిట్ కాయిన్ క్రాష్ కాబోతోంది.. లేదా బంగారం, వెండి పతనం కానున్నాయి' వంటి అంచనాలను చెబుతున్నారు. తర్వాత 'నా వెబ్ సైట్ కు సబ్ స్క్రైబ్ చేయండి' అంటూ అడుక్కుంటున్నారు. ఎంత మోసం?" అంటూ కియోసాకి రాసుకొచ్చారు.నిజమైన ఆస్తులను కలిగి ఉండటంపై తన నమ్మకాన్ని మరోసారి పునరుద్ఘాటించిన కియోసాకి, ఆ మార్కెట్లలో భవిష్యత్తులో ఏదైనా తిరోగమనం వస్తే మరింత కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. "వాళ్లు చెబుతున్నట్లు ఒకవేళ బిట్కాయిన్, ఎథేరియం, బంగారం, వెండి వంటివి క్రాష్ అయితే ఆ తగ్గిన ధరలకు మరింత ఎక్కువ కొనుగోలు చేస్తాను" అన్నారు.ఇదీ చదవండి: షేర్ల విక్రయాలు – పన్ను మినహాయింపు"అసలు సమస్య నకిలీ డబ్బు, అసమర్థ నాయకులు.. లక్షల కోట్లలో ఉన్న జాతీయ రుణం." అని పేర్కొన్న రాబర్ట్ కియోసాకి యూఎస్ డాలర్ "ఫేక్ మనీ" అని చాలాకాలంగా హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి రియల్ మనీ అని చెప్పే బంగారం, వెండి, బిట్ కాయిన్, ఎథేరియం వంటివాటిని పోగుచేసుకోవాలని తన ఫాలోవర్లకు సూచించారు.FEAR CLICK BAITING:Many You Tube jockeys, vs old time Radio Disc Jockies….lure you in with “Fear Click Baits.” They state such predictions as “Bitcoin to crash.” Or “Gold and silver to crash.”Then they say “ Subscribe to my website.” How phoney. How fake?”If the…— Robert Kiyosaki (@theRealKiyosaki) October 27, 2025 -
షేర్ల విక్రయాలు – పన్ను మినహాయింపు
ప్ర. మా దగ్గర ఈక్విటీ షేర్లు ఉన్నాయి. అవన్నీ లిస్టెడ్..లాంగ్ టర్మ్. వాటిని అమ్మితే ఏర్పడ్డ లాభాలను గుర్తింపు పొందిన బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తే పన్ను మినహాయింపు లభిస్తుందా? – ఎ.వి. రమణ మూర్తి, విశాఖపట్నంజ. మూలధన లాభాల నుంచి మినహాయింపు పొందాలంటే సెక్షన్లలో నిర్దేశించిన విధంగా ఇన్వెస్ట్ చేస్తేనే మినహాయింపు ఇస్తారు. ఉదాహరణకు, ఇల్లు, భూమి.. రెండూ.. ఇటువంటివి అమ్మి, షరతులకు లోబడి మళ్లీ ఇళ్లు కొంటే మినహాయింపు ఇస్తారు. ఇలాంటి మినహాయింపు షేర్ల విషయంలో ఒక ఇంటికి తప్ప దేనికి లేదనే చెప్పాలి. బాండ్లకి మినహాయింపు లేదు. ఇల్లు అమ్మి, ఇల్లు కొంటే మినహాయింపు.. అలాగే ల్యాండ్, ఇండస్ట్రియల్ హబ్. కానీ బంగారం అమ్మి బంగారం కొంటే మినహాయింపు లేదు. అలాగే, వెండి, ఆభరణాలు కూడా.అయితే, మినహాయింపు విషయంలో ఒక్క గుర్తింపు పొందిన బాండ్లకు మాత్రం అవకాశం ఉంటుంది. అవేమిటంటే, నేషనల్ హైవే, రూరల్ ఎలక్ట్రిఫికేషన్లు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ బాండ్లు, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ బాండ్లు. ఇళ్లు మళ్లీ కొనుక్కోకపోయినా ఈ బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తే మినహాయింపు దొరుకుతుంది. ఇదొక మంచి అవకాశం. ఇక షేర్స్ విషయానికొస్తే..అవి లిస్టెడ్ షేర్లు అయి ఉండాలి.లాంగ్ టర్మ్ అయి.. అంటే ఏడాది దాటి ఉండాలి ఇటువంటివి అమ్మితే ఏర్పడ్డ లాభాలకు సంబంధించి విషయాలను తెలుసుకుందాం.అలా ఏర్పడ్డ లాభాల మీద మొదటి రూ. 1,25,000లకు మినహాయింపు, బేసిక్గా దొరుకుతుంది. జీతంలో స్టాండర్డ్ డిడక్షన్లాగా.మిగతా లాభం మీద 12.5 శాతం పన్ను విధిస్తారు.మీ ఆలోచన లిస్టెడ్ షేర్ల మీదే ఉండాలి. హోల్డింగ్ పీరియడ్ ఏడాది దాటాలి.ఇక మీ చేతిలో ఉన్న మొత్తం మీ ఇష్టం. బంగారమే కొంటారో. వెండి కొంటారో .. పిల్ల పెళ్లో.. అబ్బాయి చదువో.. ల్యాండో.ఎలాగూ అమ్మే ముందు లాభం తెలుస్తుంది, కాబట్టి ఆ లాభం సుమారుగా రూ. 1,12,500 లోపల ఉంటుంది. కాబట్టి ఎటువంటి పన్ను భారం ఉండదు.ట్రెండింగ్లో కొన్న షేర్లు నష్టాలబాటలో ఉంటాయి. వాటిని వదిలించుకోండి. నష్టం ఏర్పడుతుంది. ఆ నష్టాన్ని మిగతా, మూలధన లాభంతో (షేర్ల మీద) సర్దుబాటు చేసుకోవచ్చు. మొత్తం మీద బేసిక్ లిమిట్ దాటకుండా ఉంటే, ఇప్పుడు మంచి షేర్లలో ఇన్వెస్ట్ చేయండి. పన్ను భారం ఉండదు.అమ్మగా వచ్చిన మొత్తం, పన్ను చెల్లించి మంచి షేర్లలో ఇన్వెస్ట్ చేయండి. కొత్త షేర్లు బాగా పెరిగితే, మీకు లాంగ్ రేంజిలో ప్రయోజనం ఉంటుంది. డివిడెండ్లతో పాటు ఆస్తి విలువ పెరిగిపోతుంది.కొంత మంది త్వరలో పెళ్లి చెద్దామనుకుంటున్నవారు బంగారం, వెండి కొంటున్నారు.80సీలో ఉన్న ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు.. ఉత్తరోత్తరా మినహాయింపు దొరుకుతుంది.ఒక అవకాశం, ఇల్లు తప్ప ఏ ఆస్తి అమ్మినా, బంగారం, ల్యాండ్, షేర్లు వల్ల ఏర్పడ్డ క్యాపిటవ్ గెయిన్స్తో సెక్షన్ 54 ఎఫ్ కింద ఒక ఇల్లు కొనవచ్చు/కట్టుకోవచ్చు. అమ్మకాల విలువలోనుంచి కాస్ట్ తీసివేసి, మిగతా పరిహారం ఇన్వెస్ట్ చేయాలి. చేసినంత మేరకే మినహాయింపు ఇస్తారు. నిర్దేశిత వ్యవధిలోపల కొనాలి/కట్టించాలి. ఆఇంటి మీద ఖర్చు రూ. 10 కోట్లు దాటకూడదు. దాటినా మినహాయంపు రూ. 10 దాటి ఇవ్వరు. షేర్లు అమ్మిన వ్యక్తి పేరు మీదే ఇల్లు కొనాలి.ముఖ్యంగా ఇల్లు కొనే వేళకు ఆ వ్యక్తి పేరుమీద ఇల్లు ఉండదు. అంటే ఈ రిలీఫ్ ఇల్లు లేని వాళ్లు కొనుక్కోంటేనే వస్తుంది.చివరిగా చెప్పాలంటే..లిస్టెడ్ షేర్లు లాంగ్ టెర్మ్లో అమ్మితే, బేసిక్ లిమిట్ రూ. 1,25,000 తప్ప ఎలాంటి మినహాయింపు లేదు. మీరు చెప్పిన బాండ్లు కొనడం వల్ల ఎలాంటి మినహాయింపు లేదు. కొంత మంది ట్యాక్స్ హార్వెస్టింగ్ అని అంటున్నారు. అది ప్లానింగ్లో భాగం మాత్రమే. వృత్తి నిపుణులను సంప్రదించండి.మామూలుగా బేసిక్ లిమిట్ రూ. 3,00,000 లేదా రూ. 4,00,000 .. ప్లానింగ్ పేరున మీ ఆదాయాన్ని బేసిక్ లిమిట్కి తీసుకురాగలమా.. అది కుదరని పని. దాని కన్నా కేవలం ఆర్థికంగా లాభనష్టాలు అంచనా వేసి, చట్టప్రకారం మసులుకోవడమే మంచి పని. -
వడ్డీ ఆదాయంపై పన్ను ఏ మేరకు..?
2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ఆదాయపన్ను నిబంధనల కింద.. ఆదాయపన్ను శ్లాబులు, మూలం వద్దే పన్ను మినహాయింపు (టీడీఎస్) పరిమితుల్లో మార్పులు వచ్చాయి. నేను సీనియర్ సిటిజన్. వడ్డీ ఆదాయంపై ఆధారపడి ఉన్నాను. ఈ మార్పుల ప్రభావం నాపై ఎలా ఉంటుంది? – లక్ష్మీ నర్సింహ. వి ఆదాయపన్ను కొత్త విధానంలో పన్ను శ్లాబులు, టీడీఎస్ పరిమితుల్లో మార్పులు 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది నిజమే. ఇందులో టీడీఎస్ పరిమితి ఒకటి. సీనియర్ సిటిజన్ (60 ఏళ్లు నిండిన వారు), నాన్ సీనియర్ సిటిజన్కు సంబంధించి టీడీఎస్ పరిమితుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. నిర్దేశిత పరిమితికి మించినప్పుడు మూలం వద్దే 10 శాతం మినహాయిస్తారు. మీరు వడ్డీ ఆదాయంపై ఆధారపడి ఉన్నట్టు చెప్పారు. బ్యాంక్ ఎఫ్డీలు, రికరింగ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయం రూ.50,000 మించితే గతంలో 10 శాతం టీడీఎస్ (తగ్గించేవారు) మినహాయించేవారు. ఇకపై వీటిపై వడ్డీ ఆదాయం రూ.1,00,000 మించినప్పుడే టీడీఎస్ అమలవుతుంది.డివిడెండ్ ఆదాయంపై టీడీఎస్ను రూ.10,000 మించినప్పుడే అమలు చేయనున్నారు. టీడీఎస్ మినహాయించారు కదా అని చెప్పి, వడ్డీ ఆదాయంపై పన్ను తప్పించుకోవడం కుదరదు. మీ మొత్తం ఆదాయం పన్ను పరిధిలోకి వచ్చినట్టయితే అప్పుడు రిటర్నులు దాఖలు చేసి నిబంధనల మేరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కొత్త పన్ను విధానంలో వయసుల వారీ వేర్వేరు శ్లాబుల్లేవు. ఆదాయం రూ.4–8 లక్షల మధ్య ఉంటే 5 శాతం, రూ.8–12 లక్షల మధ్య ఉంటే 10 శాతం, రూ.12–16 లక్షల మధ్య ఉంటే 15 శాతం, రూ.16–20 లక్షల మధ్య ఉంటే 20 శాతం, రూ.20–24 లక్షల మధ్య ఆదాయంపై 25 శాతం, రూ.24 లక్షలకు మించిన ఆదాయంపై 30 శాతం పన్ను చెల్లించాలి. ఉద్యోగులకు రూ.75వేల స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనం ఉంటుంది. మినహాయింపు అనంతరం నికర ఆదాయం రూ.12 లక్షలకు మించనప్పుడు సెక్షన్ 87ఏ కింద ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. వార్షిక ఆదాయం పన్ను పరిధిలో లేకపోయినప్పటికీ.. స్టాక్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులపై వచ్చే స్వల్ప, దీర్ఘకాల మూలధన లాభాలపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. నా మొత్తం పెట్టుబడుల్లో 70 శాతం ఈక్విటీల్లో ఉన్నాయి. మిగిలిన 30 శాతం ఫిక్స్డ్ ఇన్కమ్ (డెట్) పథకాల్లో ఉన్నాయి. ఈక్విటీ కేటాయింపులు అధికంగా ఉన్నందున, ఇందులో నుంచి 10 శాతాన్ని వెనక్కి తీసుకుని, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్)లలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. పదేళ్ల కాలంలో వీటి నుంచి ఎంత రాబడి ఆశించొచ్చు? – వినీ ఆనంద్రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఆర్ఈఐటీ/రీట్)లు అన్నవి వాణిజ్య అద్దె ఆదాయం వచ్చే ఆస్తులపై ఇన్వెస్ట్ చేస్తుంటాయి. వీటి అద్దె రాబడులు వచ్చే పదేళ్ల కాలంలో మెరుగుపడతాయని అంచనా వేస్తున్నాను. ఇక ఈక్విటీల్లో అస్థిరతలు ఉన్నప్పటికీ మన దేశ ఆర్థిక వ్యవస్థ, స్టాక్స్ పట్ల ఎంతో ఆశావహంతో ఉన్నాను. దీర్ఘకాలంలో గొప్ప పనితీరుతో సంపద సృష్టించిన కంపెనీలు ఎన్నో ఉన్నాయి. ఆ విధంగా చూస్తే రీట్ల కంటే సెన్సెక్స్ విషయంలోనే నేను ఎక్కువ సానుకూలంగా ఉన్నాను.ఇదీ చదవండి: రిటైర్మెంట్ ప్లానింగ్లో చేయకూడని తప్పులు -
మిక్స్ అండ్ మ్యాచ్.. పెట్టుబడుల కొత్త ఫ్యాషన్
గడిచిన ఏడాది కాలంలో ఈక్విటీల్లో ఎలాంటి రాబడుల్లేవు. ఎన్నో ఆటుపోట్లను చూస్తున్నాం. ఇదే కాలంలో పసిడి, వెండి ధరలు రెట్టింపయ్యాయి. డెట్ సాధనాలు సైతం స్థిరమైన రాబడులను అందించాయి. అంతెందుకు అంతర్జాతీయంగా ఎన్నో ఈక్విటీ మార్కెట్లు (యూఎస్, జపాన్, చైనా తదితర) గడిచిన ఏడాది కాలంలో ఇన్వెస్టర్లకు సానుకూల రాబడులను పంచాయి. పెట్టుబడులు అన్నింటినీ తీసుకెళ్లి ఒకే చోట ఇన్వెస్ట్ చేసుకోవడం తెలివైన నిర్ణయం కాదని ఈ గణాంకాలు గుర్తు చేస్తున్నాయి. పెట్టుబడులు ఎప్పుడూ కూడా ఒకే గూటి పక్షులు కాకూడదు. ఎందుకంటే ప్రతికూలతలు ఎదురైతే రాబడులు లేకపోగా, నికర నష్టాలను చూడాల్సి వస్తుంది. భిన్న సాధనాల మధ్య పెట్టుబడులను వర్గీకరించుకోవడం ద్వారా రిస్క్ తగ్గించుకుని, నికర రాబడుల దిశగా సాఫీగా ప్రయాణం చేయొచ్చు. ఇందుకు హైబ్రిడ్ ఫండ్స్ వీలు కల్పిస్తాయి. హైబ్రిడ్ ఫండ్స్లో మొత్తం ఆరు విభాగాలు. వివిధ సాధనాల్లో పెట్టుబడులు పెడుతూ వైవిధ్యాన్ని ఆఫర్ చేస్తుంటాయి. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్లో వీటికి సైతం చోటివ్వాలి. తద్వారా లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చు. అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ గతంలో బ్యాలెన్స్డ్ ఫండ్స్గా వీటికి పేరు. చాలా కాలం నుంచి పనిచేస్తున్నాయి. ఈక్విటీలకు, డెట్ పెట్టుబడులను జోడించి స్థిరత్వాన్ని అందిస్తాయి. సెబీ నిబంధనల ప్రకారం ఇవి కనీసం 65–80 శాతం మేర ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. మిగిలిన మొత్తాన్ని స్థిరాదాయ సాధనాల్లో (డెట్ ఇన్స్ట్రుమెంట్లు) పెట్టుబడిగా పెడతాయి. కొంత పెట్టుబడిని డెట్లోకి మళ్లించడం వల్ల ఆటుపోట్లను తట్టుకోగల సామర్థ్యం ఏర్పడుతుంది. హైబ్రిడ్ ఫండ్స్లోనూ కొన్ని ఈక్విటీలకు 75–80 శాతం వరకు కేటాయిస్తుంటాయి. హైబ్రిడ్ ఫండ్స్ దీర్ఘకాలంలో లార్జ్క్యాప్ మాదిరిగా, బెంచ్మార్క్ స్థాయిలో రాబడులను అందిస్తుంటాయి. క్వాంట్ అగ్రెస్సివ్ హైబ్రిడ్, బీవోఐ మిడ్ అండ్ స్మాల్క్యాప్ ఈక్విటీ అండ్ డెట్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఈక్విటీ అండ్ డెట్ ఫండ్స్ అయితే గత ఐదేళ్లలో ఏటా 23–24 శాతం స్థాయిలో కాంపౌండెడ్ వార్షిక రాబడులను (సీఏజీఆర్) అందించాయి. 65 శాతం తగ్గకుండా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నందున.. రూ.1.25 లక్షలకు మించిన దీర్ఘకాల మూలధన లాభంపై 12.5 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. మధ్యస్థం నుంచి అధిక రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లు, దీర్ఘకాల లక్ష్యాల కోసం వీటిని ఎంపిక చేసుకోవచ్చు.బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్వీటిని డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ అని కూడా అంటారు. ఇవి మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పెట్టుబడులను (నిర్వహణ ఆస్తులు/ఏయూఎం) ఈక్విటీలు–డెట్ సాధనాల మధ్య మార్పులు, చేర్పులు చేస్తుంటాయి. రూ.3.05 లక్షల కోట్ల ఏయూఎంతో హైబ్రిడ్ ఫండ్స్లో ఇది అతిపెద్ద విభాగంగా ఉంది. అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ అన్నవి స్థిరమైన పెట్టుబడుల విధానంతో పనిచేస్తుంటాయి. డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ దీనికి భిన్నంగా పనిచేస్తాయి. ఈక్విటీ మార్కెట్ల విలువలు అసాధారణ స్థాయికి చేరాయని భావించినప్పుడు అక్కడ పెట్టబడులను గణనీయంగా తగ్గించుకుని (30–40 శాతానికి పరిమితం), డెట్లోకి మళ్లిస్తాయి. ఈక్విటీల వ్యాల్యూషన్లు చౌకగా, ఆకర్షణీయంగా మారినప్పుడు తిరిగి డెట్ నుంచి అధిక మొత్తాన్ని (70 శాతం) వెనక్కి మళ్లిస్తాయి. దీనివల్ల పెట్టుబడుల విలువ పెద్దగా పతనం కాకుండా రక్షణ ఉంటుంది. ఇవి సాధారణంగా పీఈ, పుస్తకం విలువ, అస్థిరతలు ఇలా ఎన్నో అంశాల ఆధారంగా వ్యాల్యూషన్లపై అంచనాకు వస్తాయి. లాభాలపై ఈక్విటీ పన్ను ప్రయోజనం కోసం ఈ విభాగంలో చాలా ఫండ్స్ 65 శాతం తగ్గకుండా ఈక్విటీలు, ఆర్బిట్రేజ్ అవకాశాల్లో (రెండు స్టాక్ ఎక్సే్ఛంజ్ల్లో ధరల వ్యత్యాసం) పెట్టుబడుల విధానాన్ని అనుసరిస్తున్నాయి. గత ఏడాది కాలంలో నిఫ్టీ 100 టీఆర్ఐ 4 శాతం నష్టపోగా, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ నష్టం 0.8 శాతానికి పరిమితమైంది. గత ఐదేళ్ల కాలంలో సగటున 12 శాతం వార్షిక రాబడి (5.2–29 శాతం మధ్య) ఈ పథకాల్లో నమోదైంది. ఈక్విటీ కేటాయింపులు 65 శాతం కంటే తక్కువగా ఉండే పథకాల్లో రాబడిపై పన్ను బాధ్యత భిన్నంగా ఉంటుంది. ఇవి నాన్ ఈక్విటీ, నాన్ డెట్ కిందకు వస్తాయి. ఈ తరహా ఫండ్స్లో రెండేళ్లు నిండిన పెట్టుబడులపై వచ్చే రాబడిలో 12.5 శాతం పన్ను కింద చెల్లించాలి. రెండేళ్లు నిండకుండా విక్రయించే పెట్టుబడులపై వచ్చే రాబడిని వార్షిక ఆదాయానికి కలిపి చూపించాలి. కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్పెట్టుబడులకు అస్థిరతలు చాలా తక్కువగా ఉండాలని భావించే వారికి కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ అనుకూలం. ఇవి పెట్టుబడుల్లో కనీసం 75 శాతాన్ని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాలి. కేవలం 10–25 శాతం మధ్యే ఈక్విటీలకు కేటాయిస్తుంటాయి. కనుక ఇవి డెట్ ప్రధానమైన పెట్టుబడులతో పనిచేస్తాయి. స్వల్ప మొత్తాన్ని ఈక్విటీలకు కేటాయించడం వల్ల దీర్ఘకాలంలో (పదేళ్లకు మించిన) వార్షిక రాబడి.. అచ్చమైన డెట్ సాధనాలతో పోల్చి చూస్తే 1–3 శాతం మధ్య అదనంగా వస్తాయని ఆశించొచ్చు. ఇవి అధిక శాతం డెట్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి కనుక పెట్టుబడులు పెట్టే ముందు వాటి పోర్ట్ఫోలియోని ఒకసారి గమనించాలి. ఈ విభాగంలో ఎక్కువ శాతం ఫండ్స్ డెట్ పెట్టుబడుల్లో క్రెడిట్ రిస్క్ తక్కువగా ఉండేలా చర్యలు తీసుకుంటాయి. ఇందుకోసం అధిక శాతం పెట్టుబడులను ఏఏఏ రేటెడ్ సాధనాల్లోనే ఇన్వెస్ట్ చేస్తుంటాయి. గత ఐదేళ్లలో రాబడులను గమనిస్తే 3.5 శాతం నుంచి 13.7 శాతం మధ్య ఉన్నాయి. సగటున 9 శాతం వార్షిక రాబడులను గమనించొచ్చు. డెట్ ఫండ్స్ కిందకు వస్తుండడంతో.. 2023 బడ్జెట్ తర్వాత నుంచి వచ్చిన కొత్త పన్ను నిబంధనల ప్రకారం.. ఎంతకాలం పాటు ఇన్వెస్ట్ చేశారన్నది సంబంధం లేకుండా మూలధన లాభాలను వార్షిక ఆదాయానికి కలిపి చూపించి పన్ను చెల్లించాలి. ఆర్బిట్రేజ్ ఫండ్స్ హైబ్రిడ్ ఫండ్స్ విభాగంలో అతి తక్కువ రిస్్కను ఆర్బిట్రేజ్ ఫండ్స్లో చూడొచ్చు. సెబీ నిబంధనల ప్రకారం ఇవి కనీసం 65 శాతం పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించాలి. కనుక వీటిని ఈక్విటీ ఫండ్స్గానే పరిగణిస్తారు. ఇవి ప్రధానంగా ఏం చేస్తాయంటే.. ఉదాహరణకు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ధర క్యాష్ మార్కెట్లో రూ.1,400 వద్ద ఉందని అనుకుందాం. అదే ఫ్యూచర్స్లో 1,410 వద్ద ఉందనుకుంటే.. క్యాష్లో కొని, ఫ్యూచర్స్లో విక్రయిస్తాయి. దీనివల్ల రూ.10 ప్రయోజనం దక్కుతుంది. ఈ విధంగా స్పాట్, ఫ్యూచర్స్ విభాగాల్లో ధరల వ్యత్యాసం ఉన్న స్టాక్స్ను గుర్తించి ఎక్స్పోజర్ తీసుకుంటాయి. ఒక్కోసారి ఒకే స్టాక్ ధర రెండు ఎక్ఛేంజ్ల్లో (బీఎస్ఈ, ఎన్ఎస్ఈ) కొంత వ్యత్యాసంతో ట్రేడవుతుంటాయి. అలాంటి అవకాశాలపైనా ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఇక మిగిలిన నిధులను స్వల్పకాల డెట్ సాధనాలకు కేటాయిస్తుంటాయి. కనుక వీటిల్లో రిస్క్ అతి తక్కువగా ఉంటుంది. గత ఐదేళ్లలో ఈ ఫండ్స్లో వార్షిక సగటు రాబడి 5.8 శాతంగా ఉంది. ఈక్విటీ ఫండ్స్ కిందకు వస్తాయి కనుక, పన్ను ప్రయోజనం (ఏటా రూ.1.25 లక్షలపై లాభం లేదు) సొంతం చేసుకోవచ్చు. స్వల్పకాలం కోసం (6–18 నెలలు) ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మల్టీ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ పేరులో ఉన్నట్టుగా ఒకటికి మించిన ఆస్తుల్లో (అసెట్స్) ఇవి ఇన్వెస్ట్ చేస్తుంటాయి. సెబీ నిబంధనల ప్రకారం ఈ ఫండ్స్ కనీసం మూడు రకాల అసెట్ క్లాసెస్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. గరిష్ట పరిమితి ఏమీ లేదు. ఇక ప్రతీ అసెట్ క్లాస్కు కనీసం 10 శాతం పెట్టుబడులు కేటాయించాలన్నది నిబంధన. ఈ పథకాలతో ఉన్న గొప్ప ప్రయోజనం వైవిధ్యం. ఈ విభాగంలో 31 ఫండ్స్ పనిచేస్తున్నాయి. ఇవి ఈక్విటీలు, డెట్, ఆర్బిట్రేజ్ అవకాశాలు, బంగారం, వెండి ఈటీఎఫ్లు, కమోడిటీ డెరివేటివ్లు, విదేశీ ఈక్విటీలు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లు (రీట్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లు (ఇన్విట్) తదితర సాధనాల్లో పెట్టుబడులు పెడుతుంటాయి. కోటక్, సుందరం, హెచ్డీఎఫ్సీ మల్టీ అసెట్ ఫండ్స్ అయితే ఈక్విటీ పన్ను ప్రయోజనం దృష్టితో కనీసం 65 శాతాన్ని ఈక్విటీలకు కేటాయిస్తున్నాయి. ఎడెల్వీజ్ మల్టీ అస్సెట్ ఫండ్ అయితే డెట్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తోంది. వివిధ సాధనాలకు పెట్టుబడుల కేటాయింపుల్లో ఈ పథకాల మధ్య ఏకరూపత ఉండదు. కనుక రాబడులను పథకాల వారీగా చూడాల్సి ఉంటుంది. దీర్ఘకాలంలో వీటి రాబడి వార్షికంగా 10–15 శాతం మధ్య ఉంటుందని ఆశించొచ్చు. గత ఏడాది కాలంగా ఈక్విటీలు ఎలాంటి రాబడులు ఇవ్వనప్పటికీ, ఇదే సమయంలో బంగారం, వెండి ధరలు రెట్టింపు కావడాన్ని గమనించాలి. ఈ దృష్టితో మల్టీ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్కు కొంత పెట్టుబడులు కేటాయించుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్ సెబీ నిబంధనల ప్రకారం ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్ తమ నిర్వహణలోని పెట్టుబడుల్లో కనీసం 65 శాతాన్ని ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కనుక ఇవి 15–30 శాతం మధ్య నేరుగా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. మరో 35–45 శాతం మేర పెట్టుబడులను ఈక్విటీ ఆర్బిట్రేజ్ అవకాశాలకు కేటాయిస్తుంటాయి. 25–35 శాతం మధ్య డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. 65 శాతం కేటాయింపుల కారణంగా ఈక్విటీ పెట్టబుడులకు మాదిరే లాభాలపై పన్ను ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ పథకాల్లో గత ఐదేళ్ల కాల పనితీరును గమనిస్తే.. సగటు వార్షిక రాబడి 10 శాతంగా ఉంది. డెట్ ఫండ్స్ కంటే స్వల్ప అదనపు రాబడి ఈ పథకాల నుంచి ఆశించొచ్చు. ఈక్విటీల్లోనూ రిస్క్ తక్కువగా ఉండే లార్జ్క్యాప్ కంపెనీలకు ఇవి ఎక్కువగా కేటాయిస్తుంటాయి. కనుక ఈక్విటీ పెట్టుబడుల కారణంగా ఏదురయ్యే రిస్క్ చాలా పరిమితమే. రిస్క్ పెద్దగా తీసుకోకుండా, కొంత మెరుగైన రాబడి ఆశించే వారికి ఈ పథకాలు అనుకూలం. అంతేకాదు రిటైర్మెంట్ తీసుకున్న వారు సైతం లంప్సమ్గా ఇన్వెస్ట్ చేసుకుని, ప్రతి నెలా కొంత చొప్పున ఉపసంహరించుకునే ఎస్డబ్ల్యూపీ ప్లాన్కు అనుకూలం. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
రిటైర్మెంట్ ప్లానింగ్లో చేయకూడని తప్పులు
ఉద్యోగుల జీవితంలో రిటైర్మెంట్ అనేది ఒక మధురమైన, ముఖ్యమైన ఘట్టం. ఉద్యోగ బాధ్యతల నుంచి తప్పుకొని నచ్చిన పనులను, అలవాట్లను ఆస్వాదించడానికి లభించే విలువైన సమయం. అయితే ఈ కాలాన్ని ఆనందంగా, ఆర్థికపరమైన చింతలు లేకుండా గడపాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. చాలా మంది తమ రిటైర్మెంట్ ప్లానింగ్లో కొన్ని సాధారణ ఆర్థిక తప్పులు చేస్తారు. ఈ తప్పులు భవిష్యత్తులో వారి జీవితాన్ని కష్టతరం చేయవచ్చు. రిటైర్మెంట్ జీవితం గోల్డెన్డేస్గా మారాలంటే సాధారణంగా చేసే తప్పులను సరి చేసుకోవ్సాలిందే.త్వరగా ప్రారంభించకపోవడంరిటైర్మెంట్ ప్లానింగ్లో చేసే అతిపెద్ద తప్పు.. పదవి విరమణ ప్రణాళికను త్వరగా ప్రారంభించపోవడం. ‘ఇంకా చాలా సమయం ఉంది కదా.. అప్పుడే తొందరేముంది’ అని అనుకుంటూ పొదుపును వాయిదా వేస్తారు. కానీ పెట్టుబడి, రాబడికి సంబంధించి సమయం అనేది అత్యంత శక్తివంతమైన ఆస్తి. చిన్న మొత్తంలో అయినా త్వరగా పెట్టుబడి పెట్టడం వల్ల చక్రవడ్డీ ప్రభావం ద్వారా మెరుగైన రాబడి వస్తుంది. ఆలస్యంగా మొదలుపెడితే అదే లక్ష్యాన్ని చేరుకోవడానికి చాలా పెద్ద మొత్తాలను పోగుచేయాల్సి ఉంటుంది.స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోకపోవడంరిటైర్మెంట్ తర్వాత ఎలాంటి జీవనశైలిని కొనసాగించాలనుకుంటున్నారు? ఆ జీవనానికి ఎంత డబ్బు అవసరమవుతుంది? అనేదానిపై స్పష్టమైన లక్ష్యం లేకపోవడం మరో పెద్ద తప్పు. ద్రవ్యోల్బణం పెరుగుదలను పరిగణనలోకి తీసుకోకుండా లక్ష్యాన్ని అంచనా వేయడం వల్ల అవసరమైన మొత్తం కంటే తక్కువ పొదుపు చేసే ప్రమాదం ఉంది.ద్రవ్యోల్బణం ప్రభావాన్ని విస్మరించడంనేడు రూ.50,000 అయ్యే ఖర్చులు 20 ఏళ్ల తర్వాత కూడా అంతే ఉంటుంది అనుకోవడం పొరపాటు. ద్రవ్యోల్బణం కాలక్రమేణా డబ్బు విలువను హరిస్తుంది. ద్రవ్యోల్బణాన్ని అధిగమించలేని పెట్టుబడి సాధనాలను (ఉదాహరణకు, తక్కువ రాబడిని ఇచ్చే సంప్రదాయ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు) మాత్రమే ఎంచుకుంటే రిటైర్మెంట్ కార్పస్ కొన్నాళ్లకు సరిపోకపోవచ్చు. అందుకే ద్రవ్యోల్బణాన్ని మించి రాబడిని ఇచ్చే పెట్టుబడులు (ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్ వంటివి) అవసరం.ఆరోగ్య ఖర్చులను పట్టించుకోకపోవడంవయసు పెరిగే కొద్దీ ఆరోగ్య సంరక్షణ ఖర్చులు పెరుగుతాయి. చాలా మంది రిటైర్మెంట్ కార్పస్ను లెక్కించేటప్పుడు ఆరోగ్య ఖర్చులను విస్మరిస్తారు. ఊహించని వైద్య అత్యవసర పరిస్థితులు మీ పొదుపు మొత్తాన్ని క్షణాల్లో ఖర్చు చేస్తాయి. అందుకే రిటైర్మెంట్ ప్రణాళికలో భాగంగా సరైన ఆరోగ్య బీమా తీసుకోవడం, వైద్య ఖర్చుల కోసం ప్రత్యేకంగా కొంత మొత్తాన్ని కేటాయించడం చాలా అవసరం.అధిక అప్పులతో రిటైర్మెంట్లోకి అడుగుపెట్టడంరిటైర్మెంట్ దశలోకి అడుగుపెట్టే సమయానికి గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు లేదా క్రెడిట్ కార్డ్ అప్పులు వంటివి ఉండటం చాలా ప్రమాదకరం. స్థిరమైన జీతం లేని సమయంలో ఈ రుణాలకు ఈఎంఐలు చెల్లించడం రిటైర్మెంట్ నిధిపై ఒత్తిడిని పెంచుతుంది. రిటైర్మెంట్కు ముందే అన్ని అప్పులనూ తీర్చేయడం ముఖ్యం.ఇదీ చదవండి: అగ్ని ప్రమాదంలో ఆస్తి నష్టం.. క్లెయిమ్ ప్రాసెస్ ఎలా? -
ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారా? ఉచితంగా రూ.7 లక్షలు బీమా
అకాల మరణం.. ప్రతి ఉద్యోగి జీవితంలో అకస్మాత్తుగా ఎదురయ్యే ప్రమాదం. ఉద్యోగులు చనిపోతే ప్రభుత్వ రంగంలో పని చేస్తున్న వారికి ప్రత్యేక వెసులుబాట్లు ఉంటాయి కాబట్టి వారి కుటుంబం ఆర్థికంగా పెద్దగా ఇబ్బంది పడకపోవచ్చు. అదే చిన్న సంస్థలో తక్కువ జీతానికి పనిచేస్తూ ఇంటి ఖర్చులను నెట్టుకొస్తున్న వారి కుటుంబాలకు తీవ్ర ఇబ్బందులు తప్పవు. ఆ సమయంలో ఉద్యోగి పోగుచేసుకున్న ఈపీఎఫ్తోపాటు మరొక కీలకమైన భద్రత తోడుగా ఉందని గుర్తుంచుకోవాలి. అదే ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ (EDLI). ఈపీఎఫ్ఓ ఆధ్వర్యంలో 1976లో ప్రారంభమైన ఈ పథకం ఉద్యోగుల కుటుంబాలకు ఒక నిర్దిష్ట మొత్తంలో బీమా ప్రయోజనాన్ని అందిస్తుంది. ఉద్యోగులకు ఆర్థిక భద్రతను అందించే ఈపీఎఫ్ఓ ఫ్రేమ్వర్క్లో ఇది కీలకంగా ఉంది.ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ (EDLI)ఈడీఎల్ఐ అనేది ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) సభ్యుల కోసం ఉద్దేశించిన బీమా పథకం. ఈపీఎఫ్ఓ పరిధిలోకి వచ్చే ఏ ఉద్యోగి అయినా సర్వీసులో ఉండగా మరణిస్తే వారి నామినీ లేదా చట్టపరమైన వారసులకు ఈ పథకం కింద ఏకమొత్తంలో బీమా మొత్తాన్ని చెల్లిస్తారు.ఈపీఎఫ్ ఉన్నా ఈడీఎల్ఐ అవసరం ఏమిటి?చాలా మందికి వచ్చే సందేహం ఇదే. ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబానికి ఈపీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తం, పెన్షన్ (EPS) అందుబాటులో ఉంటాయి. అయితే ఈడీఎల్ఐ వీటి కంటే భిన్నంగా పనిచేస్తుంది. ఈపీఎఫ్ అనేది ఉద్యోగి దాచుకున్న పొదుపు. కాగా, ఈడీఎల్ఐ అనేది బీమా. ఇది తక్షణమే బాధిత కుటుంబానికి ఏకమొత్తంలో ద్రవ్య సహాయాన్ని అందించి, ఆర్థిక భరోసాను కల్పిస్తుంది.ఈడీఎల్ఐ ప్రీమియాన్ని పూర్తిగా కంపెనీయే భరిస్తుంది. ఉద్యోగి వేతనంలో ఎలాంటి కోత లేకుండా ఉచితంగా ఈ బీమా కవరేజీని పొందవచ్చు. కొత్తగా ఉద్యోగంలో చేరిన వ్యక్తి ఈపీఎఫ్ బ్యాలెన్స్ తక్కువగా ఉన్నప్పటికీ ఈడీఎల్ఐ కింద రూ.7 లక్షల వరకు బీమా కవరేజీకి అర్హత పొందుతాడు. అంటే ఈపీఎఫ్ పొదుపుతో సంబంధం లేకుండా బీమా భద్రత లభిస్తుంది.అర్హత ప్రమాణాలు20 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న అన్ని సంస్థలు ఈపీఎఫ్ చట్టం కింద నమోదు చేసుకోవాలి. ఈపీఎఫ్కు అర్హత ఉన్న ప్రతి ఉద్యోగికి ఈడీఎల్ఐ కవరేజీ ఆటోమేటిక్గా వర్తిస్తుంది. ఈ పథకం ఉద్యోగంలో ఉన్నప్పుడు సంభవించే సహజ మరణం, ప్రమాదం లేదా అనారోగ్యంతో మరణించినా కవరేజీ లభిస్తుంది. ఈపీఎఫ్కు ఉన్న నామినీలే దీనికి వర్తిస్తారు.చెల్లింపులు, బోనస్, లెక్కింపు విధానంఈడీఎల్ఐ కింద చెల్లించే మొత్తం గరిష్టంగా రూ.7 లక్షలకు పరిమితం చేశారు. ఈ మొత్తాన్ని లెక్కించే విధానంలో బోనస్ ఒక కీలక పాత్ర పోషిస్తుంది. మరణించిన ఉద్యోగి కుటుంబానికి స్థిర బోనస్ కింద రూ.2.5 లక్షలు చెల్లిస్తారు. ఈడీఎల్ఐ ప్రయోజనాన్ని కింది విధంగా లెక్కిస్తారు.చెల్లింపు మొత్తం = (30 × ఉద్యోగి సగటు నెలవారీ వేతనం) + బోనస్సగటు నెలవారీ వేతనం కింద మరణానికి ముందు 12 నెలల్లో ఉద్యోగి తీసుకున్న వేతనాన్ని లెక్కిస్తారు. ఈడీఎల్ఐ లెక్కల ప్రకారం ఈ వేతనాన్ని రూ.15,000కు పరిమితం చేశారు.బోనస్.. రూ.2,50,000 స్థిరం.(30*రూ.15,000) + రూ.2,50,000(బోనస్) = రూ.4,50,000 + రూ.2,50,000 = గరిష్టంగా రూ.7 లక్షలు.ఉద్యోగి జీతం రూ.15,000 కంటే తక్కువగా ఉన్నప్పటికీ కనీసం రూ.2.5 లక్షల హామీ చెల్లింపు లభిస్తుంది.ఎలా విత్డ్రా చేసుకోవాలి?ఉద్యోగి మరణించిన సందర్భంలో నామినీ లేదా చట్టపరమైన వారసులు ఈ ప్రయోజనాలను క్లెయిమ్ చేయవచ్చు. ఫారం 5 IFను పూర్తి చేసి అవసరమైన డాక్యుమెంట్లతో పాటు ప్రాంతీయ ఈపీఎఫ్ కార్యాలయంలో సమర్పించాలి. ఖాతాదారుడి మరణ ధ్రువీకరణ పత్రం, గార్డియన్షిప్ పత్రం (వర్తిస్తే), క్యాన్సల్ చెక్ జతచేయాలి. దరఖాస్తు సమర్పించిన తర్వాత క్లెయిమ్ను 30 రోజులలోపు పరిష్కరించాల్సి ఉంటుంది. ఆలస్యం అయితే 12% వార్షిక వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: వారసులకు ఎంతెంతో ఇప్పుడే చెప్పేయవచ్చు -
వారసులకు ఎంతెంతో ఇప్పుడే చెప్పేయవచ్చు
దేశవ్యాప్తంగా అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల (బ్యాంకు ఖాతాల్లో ఎవరూ క్లెయిమ్ చేయని నగదు) సమస్య బ్యాంకులకు, ఖాతాదారుల కుటుంబాలకు దీర్ఘకాలంగా సవాలుగా మారింది. ఖాతాదారు చనిపోయిన తర్వాత సరైన నామినేషన్ లేకపోవడం వల్ల వేల కోట్ల రూపాయలు బ్యాంకు ఖాతాల్లో పోగవుతున్నాయి. దాంతోపాటు నామినీగా ఉన్న వారికిసైతం సరైన అవగాహన లేకపోవడంతో భారీగా డబ్బు ఖాతాల్లో మూలుగుతుంది. ఈ నేపథ్యంలో అన్క్లెయిమ్డ్ నగదును తగ్గించి, చట్టపరంగా నామినీలకు డబ్బు చేరే ప్రక్రియను సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఒక ఖాతాకు నలుగురు నామినీలను నియమించుకునేలా నిబంధనలు సడలించింది. ఇది నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది.ఇప్పటివరకు ఇలా..ఇప్పటివరకు బ్యాంకు పొదుపు ఖాతాకు ఒకే నామినీని మాత్రమే నియమించే అవకాశం ఉండేది. ఈ నిబంధన అనేక సమస్యలకు దారితీసింది. కొందరు ఖాతాదారులైతే అసలు నామినీని యాడ్ చేయాలని కూడా గుర్తించడం లేదు. ఇంకొందరు నామినీని చేర్చినా ఆ విషయం తమ నామినీకి చెప్పడంలేదు. ఖాతాలో పేరున్న ఒక్క నామినీ ప్రమాదవశాత్తు ఖాతాదారుడి కంటే ముందు మరణిస్తే అకౌంట్లోని నగదు మళ్లీ అన్క్లెయిమ్డ్గానే మిగిలిపోతుంది. ఆ నగదును చట్టబద్ధమైన వారసులు పొందడానికి సుదీర్ఘమైన, ఖర్చుతో కూడిన వ్యవహారం.నలుగురు నామినీలుఈ ఇబ్బందులను అధిగమించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై ఒక బ్యాంకు పొదుపు ఖాతాకు గరిష్ఠంగా నలుగురు నామినీలను నియమించుకోవచ్చు. ఈ కొత్త నిబంధన ఖాతాదారులకు రెండు ముఖ్యమైన సౌకర్యాలను కల్పిస్తుంది. ఖాతాదారుడు తన డిపాజిట్లలోని నగదును ప్రతి నామినీకి ఎంత శాతం చొప్పున చెందాలి (ఉదాహరణకు, భార్యకు 50 శాతం, ఇద్దరు పిల్లలకు చెరో 25 శాతం) అని స్పష్టంగా పేర్కొనే వీలుంది.ప్రాధాన్యత క్రమంలో..నామినీలను ప్రాధాన్యత క్రమంలో కూడా నిర్ణయించుకోవచ్చు. అంటే మొదటి నామినీ అందుబాటులో లేకపోతే లేదా మరణిస్తే, డబ్బు రెండో నామినీకి చెందుతుంది. ఈ విధంగా నలుగురిలో ఒకరి తర్వాత మరొకరికి డబ్బు చెందేలా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ నిర్ణయం ద్వారా నామినీని యాడ్ చేయడం మరింత సులభతరం అవుతుంది. కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ వ్యక్తులను నామినీలుగా చేర్చడం వల్ల ఏదైనా అనుకోని సంఘటన సంభవించినా డబ్బు ఖచ్చితంగా వారసులకు చేరుతుంది అనే భరోసా లభిస్తుంది.నామినీ నగదును క్లెయిమ్ చేసుకునే విధానంఖాతాదారు మరణించిన తర్వాత నామినీకి నగదు క్లెయిమ్ చేసుకునే ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది.ఖాతాదారుడి మరణం గురించి నామినీ వెంటనే బ్యాంకు బ్రాంచ్ను సంప్రదించి వారికి తెలియజేయాలి.బ్యాంకులో అందుబాటులో ఉండే డెత్ క్లెయిమ్ ఫారంను నింపి సమర్పించాలి.ఖాతాదారుడి మరణ ధ్రువపత్రం, మరణాన్ని ధ్రువీకరించిన కాపీ (Attested Copy)ని అందించాలి.నామినీ ఆధార్, పాన్ లేదా ఇతర గుర్తింపు పత్రాలు ఇవ్వాలి.సంబంధిత బ్యాంకు పాస్ బుక్/ డిపాజిట్ రసీదు బ్యాంకులో సమర్పించాలి.నామినీ సమర్పించిన పత్రాలను బ్యాంకు తనిఖీ చేస్తుంది. నామినేషన్ చట్టబద్ధంగా ఉంటే, ఎలాంటి వివాదాలు లేకపోతే, అకౌంట్లో ఉన్న మొత్తాన్ని నామినీకి చెల్లిస్తుంది. ఈ డబ్బును నామినీ ఖాతాకు బదిలీ చేయడం లేదా డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చెల్లిస్తుంది.ఇదీ చదవండి: అగ్ని ప్రమాదంలో ఆస్తి నష్టం.. క్లెయిమ్ ప్రాసెస్ ఎలా? -
మీ బ్యాంక్ అకౌంట్లో ఈ లావాదేవీలు జరిగితే.. పెద్ద తలనొప్పే!
బ్యాంకు అకౌంట్ అన్నది ప్రతిఒక్కరికీ అత్యవసరమైనది. రోజువారీ జీవితంలో భాగమైనది. జీతం జమ అవడం, బిల్లు చెల్లింపులు, ఈఎంఐలు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో డబ్బు లావాదేవీలు అన్నీ బ్యాంకు ఖాతాల్లో జరుగుతుంటాయి. ఇవన్నీ సాధారణంగానే అనిపిస్తాయి. కానీ, ఈ సాధారణ లావాదేవీలే కొన్ని సందర్భాల్లో ఆదాయపు పన్ను శాఖ దృష్టిని ఆకర్షించవచ్చు అని మీకు తెలుసా?ఇప్పుడున్న డేటా మానిటరింగ్ సిస్టమ్ (Statement of Financial Transactions - SFT) ద్వారా ఆదాయపు పన్ను శాఖ అధిక విలువ గల ఆర్థిక లావాదేవీలను ట్రాక్ చేస్తోంది. దీని ఉద్దేశం పన్ను ఎగవేతను గుర్తించడం. ఇది కేవలం ధనవంతులకు మాత్రమే కాదు. సాధారణ ఖాతాదారులు కూడా తమ బ్యాంకు కార్యకలాపాలు అసాధారణంగా కనిపిస్తే పరిశీలనకు లోనవుతారు. కింద పేర్కొన్న సాధారణ బ్యాంకు లావాదేవీలు పన్ను అధికారుల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది.అధిక విలువ నగదు లావాదేవీలువివాహాలు లేదా వ్యాపార అవసరాల వల్ల పెద్ద మొత్తాలు పదేపదే జమ చేయడం లేదా ఉపసంహరించుకోవడం చట్టబద్ధమైనదే అయినా, బ్యాంకులు ఇటువంటి లావాదేవీలను పర్యవేక్షిస్తాయి. అవసరమైతే, “ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్ళింది?” అని ఐటీ అధికారులు అడగవచ్చు.రూ.10 లక్షలకు పైగా నగదు జమఒక ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్–మార్చి) మీ పొదుపు ఖాతాలో రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు జమ చేస్తే, బ్యాంకు ఆ సమాచారాన్ని పన్ను శాఖకు నివేదిస్తుంది. మొత్తం ఒకేసారి జమ చేసినా, విడతలుగా జమ చేసినా మొత్తంగా ఎంత జరిగిందన్నది ముఖ్యం. ఉదాహరణకు, రూ.12 లక్షలు జమ చేసినా దాన్ని ఐటీఆర్లో చూపించకపోతే, పన్ను శాఖ వివరణ కోరుతూ నోటీసు జారీ చేయవచ్చు.క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపులునగదు రూపంలో లేదా పెద్ద మొత్తాల బదిలీల ద్వారా అధిక విలువ గల క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించడం కూడా పన్ను శాఖ దృష్టిని ఆకర్షించవచ్చు. మీ ఆదాయం రూ.6 లక్షలు అయినా, ప్రతి నెలా రూ.1 లక్ష విలువైన బిల్లులు చెల్లిస్తే మీరు ప్రకటించిన దానికంటే ఎక్కువ ఆదాయం ఉందని సూచిస్తుంది.విదేశీ ప్రయాణం లేదా ఫారెక్స్ ఖర్చులువిదేశీ విద్య, ప్రయాణం లేదా ఫారెక్స్ కార్డులపై రూ.10 లక్షలకు పైగా ఖర్చు చేస్తే, ఆ సమాచారం కూడా పన్ను శాఖకు అందుతుంది. దీని ఉద్దేశం విదేశీ ఖర్చులు చట్టబద్ధమైన, ప్రకటించిన ఆదాయ వనరుల నుంచే రావాలని నిర్ధారించడం.ఆస్తి కొనుగోలు లేదా అమ్మకంరూ.30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువ గల ఆస్తి లావాదేవీలు స్వయంచాలకంగా పన్ను శాఖ దృష్టికి వెళ్తాయి. మీ ఖాతాలో పెద్ద మొత్తంలో ఇన్ఫ్లో లేదా అవుట్ఫ్లో కనిపిస్తే, అది ఆస్తి లావాదేవీతో సంబంధముందా, దాన్ని మీ ఐటీఆర్లో సరిగా ప్రకటించారా లేదా అని అధికారులు పరిశీలిస్తారు.దాచిన ఆదాయ వనరులు‘బహుమతి’, ‘రుణం’ లేదా ‘పొదుపు’ అని చెప్పినా, సరైన ఆధారాలు లేకుండా పెద్ద మొత్తాన్ని జమ చేయడం పన్ను అధికారుల ప్రశ్నలకు దారితీయవచ్చు. డబ్బు మూలాన్ని స్పష్టంగా చూపించకపోతే అది “అస్పష్ట ఆదాయం”గా పరిగణించబడే అవకాశం ఉంది.ఇనాక్టివ్ ఖాతాలో అకస్మాత్తుగా లావాదేవీలుకొంతకాలంగా ఉపయోగించని ఖాతాలో అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో డిపాజిట్లు లేదా బదిలీలు జరగడం అనుమానాస్పదంగా భావిస్తారు. గతంలో జరిగిన లావాదేవీల మాదిరిగా కాకుండా అకస్మాత్తుగా అధిక విలువ గల కదలికలు ఉంటే, బ్యాంకులు ఆ సమాచారాన్ని పన్ను శాఖకు నివేదించవచ్చు.కాబట్టి బ్యాంకు ఖాతా ఉన్న ప్రతిఒక్కరూ ఈ నియమాలను తెలుసుకోవాలి. తద్వారా పన్ను శాఖ నుండి అనవసరమైన పరిశీలనను నివారించవచ్చు. మీ బ్యాంకు ఖాతాలో జరిగిన అన్ని లావాదేవీల రికార్డులు దగ్గర ఉంచుకోవడం, మీ ఆర్థిక కార్యకలాపాలు మీరు ప్రకటించిన ఆదాయానికి అనుగుణంగా ఉండేలా చూసుకోవడం ఉత్తమం. -
అగ్ని ప్రమాదంలో ఆస్తి నష్టం.. క్లెయిమ్ ప్రాసెస్ ఎలా?
అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరుగుతుంటుంది. తాజాగా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదబారిన పడడంతో మంటలు చెలరేగి కొందరు ప్యాసింజర్లు మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టంతోపాటు ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదం ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణం ఏమిటనేది స్పష్టంగా వెల్లడికావాల్సి ఉంది. కాగా, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు సంబంధీకుల ప్రాణనష్టాన్ని ఎవరూ పూడ్చలేరు. ప్రమాదంలో ఫోన్లు, ల్యాప్టాప్లు, బీమా చేయించిన ఇతర విలువైన వస్తువుల నష్టాన్ని ఇన్సూరెన్స్ ద్వారా కొంత భర్తీ చేయవచ్చు. ఇలాంటి సందర్భంలో బీమా ఎలా క్లెయిమ్ చేయాలో నిపుణులు సూచిస్తున్నారు.ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం ఎలాబీమా కంపెనీకి సమాచారం అందించాలి: అగ్నిప్రమాదం జరిగిన వెంటనే బీమా ప్రొవైడర్కు సమాచారం ఇవ్వండి. అవసరమైతే, అత్యవసర ఖర్చుల కోసం ముందస్తు ఆర్థిక సహాయాన్ని అభ్యర్థించండి. సంఘటన జరిగిన తేదీ, సమయం, స్థలం వంటి ముఖ్యమైన వివరాలను అందించడంతో పాటు.. ఎంత నష్టం జరిగిందో అంచనా వేయండి.నష్టాన్ని డాక్యుమెంట్ చేయండి: అగ్నిప్రమాదం జరిగిన తరువాత.. స్థలాన్ని శుభ్రపరచడానికి ముందు.. అక్కడ పరిసరాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తీయండి. కాలిన వస్తువులను పారవేయకూడదు. బీమా కంపెనీ స్పందించడానికి ముందే రిపేర్ చేయడం వంటి చేయకూడదు.క్లెయిమ్ ఫైల్ చేయండి: ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫారాన్ని ఆన్లైన్లో లేదా బీమా కంపెనీ కార్యాలయంలో సబ్మిట్ చేయండి. మీ ఫైర్ ఇన్సూరెన్స్ పాలసీ కాపీ, నష్టాన్ని తెలియజేసే ఫోటోలు, వీడియోలు, పాడైపోయిన వస్తువుల జాబితా వాటి విలువను తెలిపే రసీదులు లేదా ఇన్వాయిస్లు, అధికారిక నివేదిక వంటి అవసరమైన డాక్యుమెంట్స్ అందించాల్సి ఉంటుంది.కంపెనీకి సహకరించండి: ఇన్సూరెన్స్ కంపెనీ నష్టాన్ని అంచనా వేయడానికి ఒక వ్యక్తిని నియమించే అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తికి సహకరించండి. తనకు అవసరమైన సమాచారం, పత్రాలను అందించాలి. నష్టపోయిన ఆస్తిని పరిశీలించడానికి అనుమతి ఇవ్వాలి.క్లెయిమ్ సెటిల్మెంట్: మీ క్లెయిమ్ ఆమోదం పొందిన తరువాత.. పాలసీ నిబంధనల ప్రకారం నష్టపరిహారం కంపెనీ చెల్లిస్తుంది. చెల్లింపు విధానం గురించి సంస్థ మీకు తెలియజేస్తుంది.Note: ఈ దశలు సాధారణ మార్గదర్శకాలు మాత్రమే. మీ నిర్దిష్ట పాలసీ, ఇన్సూరెన్స్ కంపెనీని అనుసరించి విధానాలు మారవచ్చు. కాబట్టి మీ పాలసీ డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి. మీకు ఏవైనా సందేహాలు ఉంటే మీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ను సంప్రదించండి.ఇదీ చదవండి: ఇండిపెండెంట్ ఇల్లు Vs అపార్ట్మెంట్లో ఫ్లాట్ -
నక్క తోక తొక్కిన ‘గోల్డ్ బాండ్లు’.. రూ.100కు రూ.325
ముంబై: సావరిన్ గోల్డ్ బాండ్స్ (SGB) 2017–18 సిరీస్ IVలో పెట్టుబడిపెట్టినవారు ఇప్పుడు పండుగ చేసుకుంటున్నారు. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గ్రాముకు రూ.12,704 తుది రిడంప్షన్ ధరను ప్రకటించింది. అంటే 8 సంవత్సరాల కాలంలో 325 శాతం రాబడిని వస్తోందన్నమాట.వాస్తవానికి అక్టోబర్ 2017లో గ్రాముకు రూ.2,987 వద్ద జారీ చేసిన బాండ్లు ఇప్పుడు రూ. 9,717 లాభాన్ని ఇచ్చాయి. దీనికి ఆర్నెళ్లకోసారి చెల్లించే 2.5% వార్షిక వడ్డీ అదనం. 2025 అక్టోబర్ 17, 20, 22 తేదీల్లో ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రచురించిన బంగారం సగటు ముగింపు ధర (999 స్వచ్ఛత) ఆధారంగా రిడంప్షన్ ధరను నిర్ణయించారు.దిగుమతులను తగ్గించడంతోపాటు.. బంగారంపై పెట్టుబడులను డిజిటల్వైపు మళ్లించే లక్ష్యాలతో తీసుకొచ్చిందే సావరీన్ గోల్డ్ బాండ్ పథకం. పసిడిపై పెట్టుబడులను డిజిటల్ రూపంలోకి మళ్లించడంలో కేంద్రం ఒక విధంగా సక్సెస్ అయింది. కానీ, బంగారం దిగుమతులు మాత్రం తగ్గలేదు.ఎస్జీబీలకు (Sovereign Gold Bonds ) ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రభుత్వ హామీతో కూడిన సాధనం కావడంతో పెట్టుబడులకు ఎక్కువ మంది ఆసక్తి చూపించారు. దీంతో ఎస్జీబీల రూపంలో ప్రభుత్వంపై చెల్లింపుల భారం పెరిగిపోయింది. దీంతో సావరిన్ గోల్డ్ బాండ్ల జారీని ప్రభుత్వం నిలిపేసింది.సావరిన్ గోల్డ్ బాండ్లు అందుబాటులో లేనప్పటికీ డిజిటల్ గోల్డ్లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికీ ఇప్పటికీ ఇతర మార్గాలు ఉన్నాయి. అవే గోల్డ్ ఈటీఎఫ్లు (Gold Exchange Traded Funds - Gold ETFs). వీటిని మ్యూచువల్ ఫండ్ సంస్థలు జారీ చేస్తాయి. వీటిలో పెట్టిన పెట్టుబడులు స్టాక్ ఎక్స్చేంజ్లలో షేర్లలా ట్రేడ్ అవుతాయి. గోల్డ్ ఈటీఎఫ్ ధర బంగారం మార్కెట్ ధరకు నేరుగా అనుసంధానమై ఉంటుంది. బంగారం ధర పెరిగితే, ఈటీఎఫ్ యూనిట్ విలువ కూడా పెరుగుతుంది. -
ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఫీజులలో మార్పులు..
ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు కీలక అప్డేట్ వచ్చింది. వచ్చే నవంబర్ 1 నుండి ఎస్బీఐ కార్డ్ అనేక సర్వీస్ ఛార్జీలు, ఫీజులను సవరించనుంది. ఈ మార్పులు విద్యా చెల్లింపులు, డిజిటల్ వాలెట్ లోడ్లు, కార్డు మార్పిడి వంటి లావాదేవీలను నేరుగా ప్రభావితం చేస్తాయి.థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా ఎడ్యుకేషన్ పేమెంట్లపై 1% ఫీజుఇకముందు పేటీఎం (Paytm), ఫోన్పే (PhonePe), గూగుల్ పే (Google Pay) వంటి థర్డ్ పార్టీ పేమెంట్ యాప్స్ ద్వారా చేసే విద్యా సంబంధిత లావాదేవీలపై 1% ఫీజు వర్తిస్తుంది. అయితే నేరుగా పాఠశాల, కళాశాల లేదా విశ్వవిద్యాలయం వెబ్సైట్ ద్వారా లేదా పీవోఎస్ యంత్రాల ద్వారా చేసే చెల్లింపులపై మాత్రం ఎటువంటి ఫీజు ఉండదు.వాలెట్ లోడ్ ఛార్జీలుమీరు తరచుగా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా పేటీఎం, ఫోన్పే, అమెజాన్ పే వంటి డిజిటల్ వాలెట్లలో డబ్బు లోడ్ చేస్తే, ఇప్పుడు కొత్త ఫీజు వర్తిస్తుంది. రూ.1,000 కంటే ఎక్కువ మొత్తంలో వాలెట్ టాప్-అప్ చేసినప్పుడు 1% ఛార్జీ విధిస్తారు.కొనసాగుతున్న ప్రస్తుత సర్వీస్ ఛార్జీలుకొన్ని ఛార్జీలు కొత్తగా ప్రవేశపెట్టినా, ఇప్పటికే ఉన్న అనేక ఫీజులు యథాతథంగా కొనసాగుతాయి. ప్రధానంగా గమనించాల్సినవి..క్యాష్ పేమెంట్ ఫీజు: రూ.250పేమెంట్ డిస్ హానర్ ఫీజు: పేమెంట్ మొత్తంలో 2% (కనీసం రూ.500)చెక్కు చెల్లింపు రుసుము: రూ.200క్యాష్ అడ్వాన్స్ ఫీజు: లావాదేవీలో 2.5% (కనీసం రూ.500)కార్డు రీప్లేస్ మెంట్ ఫీజు: రూ.100–రూ.250 (ఆరం కార్డులకు రూ.1,500)విదేశాలలో అత్యవసర కార్డు మార్పిడి: వీసా కార్డుల కోసం 175 డాలర్లు, మాస్టర్ కార్డ్ కోసం 148 డాలర్లుసవరించిన ఆలస్య చెల్లింపు ఛార్జీలుసకాలంలో చెల్లింపులు చేయడాన్ని ప్రోత్సహించేందుకు, ఎస్బీఐ కార్డ్ ఆలస్య చెల్లింపు ఫీజులను సవరించింది. మీరు కనీస బకాయి మొత్తాన్ని (MAD) సకాలంలో చెల్లించకపోతే, కింది రుసుములు వర్తిస్తాయి..బకాయి మొత్తంఆలస్య చెల్లింపు రుసుమురూ.0 – రూ.500ఫీజు లేదురూ.500 – రూ.1,000రూ.400రూ.1,000 – రూ.10,000రూ.750రూ.10,000 – రూ.25,000రూ.950రూ.25,000 – రూ.50,000రూ.1,100రూ.50,000 పైగారూ.1,300అదనంగా, వరుసగా రెండు బిల్లింగ్ సైకిల్స్కు కనీస బకాయి మొత్తాన్ని చెల్లించకపోతే, అదనంగా మరో రూ.100 పెనాల్టీ విధిస్తారు.ఎస్బీఐ కార్డ్ తీసుకువస్తున్న ఈ ఫీజు మార్పులు చిన్నగా కనిపించినా, తరచుగా వాలెట్ టాప్-అప్లు లేదా విద్యా చెల్లింపులు చేసే వినియోగదారులపై కొంత ప్రభావం చూపవచ్చు. వినియోగదారులు తమ లావాదేవీ అలవాట్లను సమీక్షించి, సరికొత్త ఫీజు నిర్మాణాన్ని అనుసరించడం ద్వారా అనవసర వ్యయాలను నివారించవచ్చు. -
తెలంగాణలో అన్క్లెయిమ్డ్ డబ్బు రూ.2,095.10 కోట్లు
సాక్షి, సిద్దిపేట: రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకుల్లో పదేళ్లుగా ఎలాంటి లావాదేవీలు జరగని వినియోగదారుల ఖాతాల్లో రూ.2,095.10 కోట్లు పేరుకుపోయాయి. ఇలాంటి 78,53,607 ఖాతాలను ఆర్బీఐ గుర్తించింది. చాలా మంది తమ ఆర్థిక విషయాలను ఎవరితో పంచుకోవడానికి ఇష్టపడరు. వారికి అనుకోకుండా ఏమైనా జరిగినా బ్యాంకు ఖాతాల్లో డబ్బులున్నాయన్న విషయం కుటుంబ సభ్యులకు తెలియదు. మరోవైపు కొందరు బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేసి మరిచిపోతుంటారు. ఇలా ఆగస్టు 31, 2025 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 78,53,607 ఖాతాల్లో రూ 2,095.10 కోట్లు పేరుకుపోయాయి.ఆర్బీఐ నిబంధనల ప్రకారం బ్యాంకు ఖాతాను పదేళ్లకు మించి ఆపరేట్ చేయకపోతే అందులో ఉన్న డబ్బు డిపాజిటర్స్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ (డీఈఏఎఫ్) ఖాతాకు చేరుతుంది. ఆర్బీఐ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఖాతాలపై బ్యాంకులు ఈ నెల 13వ తేదీ నుంచి డిసెంబర్ 31 వరకు ప్రత్యేక క్యాంపెయిన్ను నిర్వహిస్తున్నాయి.ఎస్బీఐలోనే అధికం..రాష్ట్రవ్యాప్తంగా 30 బ్యాంకులలో అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు ఉండగా.. అందులో ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లోనే 21,61,529 ఖాతాలలో రూ 586.98 కోట్లు మూలుగుతున్నాయి. తర్వాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 20,70,208 ఖాతాల్లో రూ.467.76 కోట్లు ఉన్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఈ అన్క్లెయిమ్డ్ డబ్బు అధికంగా ఉండిపోయింది.ఉద్గం పోర్టల్ ద్వారా వివరాలు..చనిపోయిన వారి బ్యాంక్ ఖాతాల్లో ఏమైన డబ్బులు ఉన్నాయని భావిస్తే వారి కుటుంబ సభ్యులు ఉద్గం పోర్టల్లో చెక్ చేసుకోవచ్చు. మొదట ఉద్గం పోర్టల్లో లాగిన్ కావాలి. తర్వాత కుటుంబ సభ్యుని వివరాలు నమోదు చేయాలి. అప్పుడు ఖాతాలోని నగదు నిల్వ వివరాలు తెలుస్తాయి. ఒకవేళ డబ్బు ఉంటే సంబంధిత బ్యాంక్ను సంప్రదించి, ఖాతాదారుడి మరణ ధ్రువీకరణ పత్రం, ఇతర పత్రాలను సమర్పించి క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే ఖాతాదారుడు బ్యాంక్లో డబ్బులు జమచేసి మర్చిపోతే సదరు ఖాతాదారుని ధ్రువీకరణ పత్రాలు, కేవైసీ పత్రాలతో సంప్రదించాలి. అన్నీ పరిశీలించిన తర్వాత బ్యాంకు ఖాతాలోని డబ్బులను అప్పగిస్తుంది. డిసెంబర్ 31వ తేదీవరకు క్లెయిమ్ చేసుకోకపోతే డీఈఏఎఫ్లో ఆ డబ్బు జమ అవుతుంది.ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తాంబ్యాంక్లో డబ్బులు జమచేసి పదేళ్లుగా లావాదేవీలు జరగని ఖాతాలను అన్క్లెయిమ్డ్ డిపాజిట్లుగా పరిగణిస్తాం. వీటిపై డిసెంబర్ 31 వరకు ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తాం. చనిపోయినవారి ఖాతాల్లో ఉన్న డబ్బులను సంబంధిత కుటుంబ సభ్యులు తగిన పత్రాలను అందించి డ్రా చేసుకోవచ్చు. ఉద్గం పోర్టల్లో చెక్ చేసుకోవచ్చు.– హరిబాబు, లీడ్ బ్యాంక్ మేనేజర్, సిద్దిపేట -
రోజుకు రెండు లక్షలు దాటితే..?
డిజిటల్ చెల్లింపులు, ఆన్లైన్ బ్యాంకింగ్కు ప్రాధాన్యత ఇస్తున్న ఈ కాలంలో ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) పెద్ద మొత్తంలో జరిగే నగదు లావాదేవీల (Cash Transactions) విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. నిబంధనల ప్రకారం ఒక రోజులో ఎంతమేరకు నగదు లావాదేవీలు జరపాలో చట్టపరమైన పరిమితి గురించి అవగాహన ఉండకపోవచ్చు. వ్యక్తిగత అవసరాల కోసం లేదా వ్యాపార ప్రయోజనాల కోసం నగదును స్వీకరిస్తే ఎలాంటి నియమాలున్నాయో తెలుసుకుందాం. నిర్దిష్ట పరిమితికి మించి నగదు లావాదేవీలు నిర్వహిస్తే భారీ జరిమానాలు, చివరికి ఆదాయపు పన్ను నోటీసు కూడా రావచ్చని గుర్తుంచుకోవాలి.సెక్షన్ 269ఎస్టీఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 269ఎస్టీ ప్రకారం ఏ వ్యక్తి కూడా ఒకే రోజులో రూ.2 లక్షల కంటే ఎక్కువ నగదును స్వీకరించడానికి అనుమతుల్లేవు. ఈ పరిమితులు సదరు నగదు లావాదేవీ వ్యక్తిగతమా లేక వ్యాపారమా అనే దానిపై ఆధారపడవు. అంటే అందరికీ వర్తిస్తుంది.ఉదాహరణకు: ఒక వ్యక్తి తన కారును అమ్మి కొనుగోలుదారు నుంచి రూ.2.5 లక్షల నగదు అందుకుంటే అది ఆదాయపు పన్ను చట్టానికి విరుద్ధం అవుతుంది. రూ.2 లక్షలకు మించి నగదును స్వీకరిస్తే ఆదాయపు పన్ను శాఖ మీరు తీసుకున్న మొత్తం నగదుకు సమానమైన జరిమానా విధించవచ్చు. ఉదా.. మీరు ఆస్తి లేదా వ్యాపార లావాదేవీల కోసం రూ.5 లక్షల నగదును స్వీకరిస్తే జరిమానా మొత్తం రూ.5 లక్షల వరకు ఉండవచ్చు. ఈ జరిమానాను సెక్షన్ 271డీఏ కింద విధిస్తారు. నగదును స్వీకరించిన వ్యక్తి మాత్రమే దీనికి జవాబుదారీగా ఉంటారు.ఆర్థిక వ్యవస్థలో నల్లధనం (Black Money), పన్ను ఎగవేతలను అరికట్టడానికి ఉద్దేశించిన ప్రధాన చర్యల్లో భాగంగానే ఈ రూ.2 లక్షల నగదు లావాదేవీల పరిమితిని విధించారు. బ్యాంకు బదిలీలు, చెక్కులు లేదా ఇతర డిజిటల్ మార్గాల ద్వారా నిర్వహించే అన్ని పెద్ద లావాదేవీలు పారదర్శకంగా ఉండేలా చూడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. రూ.2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని స్వీకరించాలంటే బ్యాంకు (NEFT, RTGS, IMPS), చెక్కు లేదా డిమాండ్ డ్రాఫ్ట్, యూపీఐ లేదా ఇతర డిజిటల్ వాలెట్ల ద్వారా లావాదేవీలు జరుపుకోవచ్చు.ఆదాయపు పన్ను శాఖ పర్యవేక్షణ వ్యవస్థఆదాయపు పన్ను శాఖ అసాధారణమైన లేదా అధిక విలువ గల నగదు డిపాజిట్లు, ఉపసంహరణలను పర్యవేక్షించడానికి ఏఐ ఆధారిత డేటా విశ్లేషణను ఉపయోగిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో పొదుపు ఖాతాలో రూ.10 లక్షలు లేదా కరెంట్ ఖాతాలో రూ.50 లక్షలకు మించిన నగదు డిపాజిట్లు లేదా ఉపసంహరణలు చేస్తే ఆదాయపు పన్ను శాఖ హెచ్చరికలు జారీ చేయవచ్చు.ఇదీ చదవండి: గోల్డ్ ఢమాల్.. భారీగా తగ్గిన బంగారం ధరలు -
చేతిలో ఐఫోన్.. కారు.. అన్నీ అప్పుతో కొంటున్నవే..!
భారతీయ కుటుంబాలు మునుపెన్నడూ లేని విధంగా అప్పుల్లో కూరుకుపోతున్నాయి. పండుగ వేళ విపరీతమైన షాపింగ్, అప్పులు సులభంగా లభ్యమవుతున్న నేపథ్యంలో పర్సనల్ ఫైనాన్స్ ఇన్ఫ్లుయెన్సర్ నేహా నగర్ అప్పులపై ఆధారపడే ధోరణి పెరుగుతోందని హెచ్చరిస్తున్నారు. భారతదేశంలో 70 శాతం ఐఫోన్లు (iPhones) రుణాల ద్వారా, 80 శాతం కార్లు ఈఎంఐల ద్వారా కొంటున్ననవేనని పేర్కొన్నారు.వినియోగదారు రుణంలో ఈ పెరుగుదల భారతదేశ ఆర్థిక ప్రవర్తనలో లోతైన మార్పును ప్రతిబింబిస్తుంది. ఆదాయాల కంటే ఆకాంక్షలు వేగంగా పెరుగుతుండటంతో చాలా మంది ఆస్తులను నిర్మించడానికి బదులుగా జీవనశైలికి నిధులు సమకూర్చుకోవడానికి రుణాల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఇలాంటి అప్పులు చేటు చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు."ధనవంతులు ఆస్తులను నిర్మించుకోడానికి పరపతిగా రుణాలను ఉపయోగిస్తుంటే పేద, మధ్యతరగతివారు మాత్రం విలాసాలను కొనుక్కోవడానికి వాటిని ఉపయోగిస్తారు" అని ఫైనాన్స్ రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) తన ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తకంలో ప్రముఖంగా చెప్పారు. ఆ వ్యత్యాసమే చాలా మంది మధ్య ఆదాయ వర్గాలు రాబడిని ఇచ్చే పెట్టుబడులకు బదులుగా గాడ్జెట్లు, వాహనాల వంటి క్షీణించే ఆస్తుల కోసం ఈఎంఐ (EMI) చక్రాలలో ఎలా చిక్కుకుపోతున్నారో వివరిస్తుంది. -
ఆస్తులు పంచితే బజారున పడాల్సిందే..
ఆస్తులను పోగేసి వారసులకు పంచిపెట్టాలా లేదా అనేది పూర్తిగా వ్యక్తిగత ఎంపిక. అయితే మారుతున్న జీవన విలువలు కారణంగా చాలామంది కేవలం డబ్బు కోసమే తమ తల్లిదండ్రులను చూసుకుంటున్నవారు ఉన్నారు. అదే డబ్బు చేతికి రాగానే ఆ పండుటాకులను నిర్దాక్షిణ్యంగా బయటకు తరిమేస్తున్నారు. ఈ క్రమంలో ఆస్తులు పంపకాలకు ముందు వారసుల కంటే తమ అవసరాలకే ప్రాధాన్యం ఇవ్వాలన్నది నిపుణుల సూచన.జీవితకాలం కష్టార్జితం వృద్ధాప్యంలో మెరుగైన జీవనానికి భరోసా ఇవ్వాలి. తమ అవసరాలకు పోను మిగిలినది తమ తదనంతరం వారసులకు పంపిణీ చేయడం మెరుగైన ఆలోచన అవుతుంది. అయితే పిల్లల చదువులకు ఉన్నదంతా ఖర్చు చేసి.. వారికి మెరుగైన భవిష్యత్తును అందించిన తల్లిదండ్రులు మిగిలిన కొద్ది ఆర్థిక వనరులు/ ఆస్తులను తమ కోసమే వినియోగించుకునేందుకైనా ప్రాధాన్యం ఇవ్వాలి.అవసరాలకు మించి అదనంగా కలిగి ఉంటే అప్పుడు జీవించి ఉండగానే బదిలీ చేయడాన్ని పరిశీలించొచ్చు.కొందరు పిల్లలకు ఆస్తులను పంపిణీ చేసే సందర్భంలో జీవిత భాగస్వామిని విస్మరిస్తుంటారు. ముందుగానే ఆస్తులన్నింటినీ పిల్లలకు పంచేసిన తర్వాత.. దంపతుల్లో ఒకరు ముందుగా కాలం చేస్తే అప్పుడు రెండో వ్యక్తి యోగ క్షేమాలను పిల్లలు పట్టించుకుంటారన్న గ్యారంటీ లేదు. కనుక జీవిత భాగస్వామికి ఈ విషయంలో భరోసా కల్పించాలి.పిల్లల్లో ఒకరిద్దరు గొప్పగా స్థిరపడి.. ఎవరో ఒకరు వైవాహిక జీవితం విచ్ఛిన్నం కారణంగా తల్లిదండ్రులపైనే ఆధారపడి ఉండొచ్చు. అలాంటి ప్రత్యేక కేసుల్లో వారు జీవితాంతం అదే ఇంట్లో నివసించే హక్కు (రైట్ టు రిసైడ్)ను వీలునామా ద్వారా కల్పించొచ్చు.ఆస్తుల పంపకంలో పిల్లల ఆసక్తులను పట్టించుకోవాలి. వారికి ఇష్టం లేని ఆస్తులు, వ్యాపారాలను విడిచిపెట్టడం మంచి నిర్ణయం కాబోదు. అలా ఇచ్చిన వ్యాపారాలు, ఇంటి నిర్వహణను వారు పట్టించుకోకపోతే కొంత కాలానికి వాటి విలువ క్షీణిస్తుంది.ముఖ్యంగా మైనర్ పిల్లలు, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఉంటే వారి కోసం సంరక్షకులను వీలునామా ద్వారా నియమించుకోవచ్చు. లేదా ట్రస్ట్ ఏర్పాటు చేయడాన్ని పరిశీలించొచ్చు. ఇలాంటి వారికి ఆస్తుల బదిలీలో ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. నిపుణుల సాయంతో వారికి జీవిత కాలం పాటు స్థిరమైన ఆదాయ మార్గం కల్పించడంపై దృష్టి పెట్టాలి.ఆస్తుల బదిలీకి అనుకూలమైన చట్టబద్ధమైన ప్రక్రియలు, పన్ను బాధ్యతలను పరిగణనలోకి తీసుకోవాలి. విదేశాల్లో స్థిరపడిన పిల్లలకు ఆస్తులను బదిలీ చేస్తుంటే.. వారు తమ దేశాల్లో పన్నులు చెల్లించాల్సి రావచ్చు. కనుక వీటి గురించి ముందే పిల్లలతో చర్చించాలి.ఇదీ చదవండి: నా సోదరుడి ఆత్మహత్యకు ఓలా సీఈఓ కారణం -
బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్త యులిప్ ప్లాన్
బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్తగా ‘బజాజ్ లైఫ్ సుప్రీమ్’ పేరుతో యూనిట్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ వ్యక్తిగత జీవిత బీమా పొదుపు పథకాన్ని ప్రారంభించింది. సంపద సృష్టికి, స్థిరమైన ఆదాయానికి ఈ ప్లాన్ ఉపకరిస్తుందని తెలిపింది. పరిశ్రమలోనే తొలిసారి గ్యారంటీడ్ వెల్త్ బూస్టర్ ఫీచర్ ఇందులో ఉన్నట్టు తెలిపింది.ప్రీమియం అలోకేషన్పై ఏటా 7 శాతం కాంపౌండెడ్ వృద్ధికి హామీ ఇస్తున్నట్టు, ఈ మొత్తం 15వ ఏట చివర్లో పాలసీ ఫండ్కు జోడించడం జరుగుతుందని పేర్కొంది. పన్నులేని సంపద బదిలీకి మార్గమని తెలిపింది. మోర్టాలిటీ చార్జీలను వెనక్కివ్వడం, పాలసీ కాల వ్యవధి తర్వాత క్రమానుగతంగా ఉపసంహరించుకునే ఫీచర్లు సైతం ఇందులో ఉన్నాయి.మిగతా కీలక ఫీచర్లుపన్ను ప్రయోజనాలు: ఈ ప్లాన్ ద్వారా సంపద బదిలీపై పన్నుల నుంచి మినహాయింపు లభిస్తుంది, ఇది కుటుంబ భద్రతకు తోడ్పడే ప్రధాన ప్రయోజనం.మోర్టాలిటీ చార్జీల రీఫండ్: పాలసీ కాలం పూర్తయ్యే నాటికి, పాలసీదారులు చెల్లించిన మోర్టాలిటీ చార్జీలు వారికి తిరిగి అందజేయడం ఈ ప్లాన్ ప్రత్యేకత.స్టెప్-అప్ విత్డ్రావల్స్ (క్రమానుగత ఉపసంహరణలు): పాలసీ మియాదు తర్వాత, పాలసీదారులు తమ నిధులను తక్కువ మోతాదులో కానీ సుస్థిరంగా ఉపసంహరించుకునే అవకాశం ఉంది. దీని వల్ల రిటైర్మెంట్ అనంతర కాలానికి సులభమైన నగదు ప్రవాహం ఏర్పడుతుంది.బహుళ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఎంపికలు: బజాజ్ లైఫ్ సుప్రీమ్ ద్వారా వినియోగదారులు తమ పెట్టుబడుల లక్ష్యాలకు అనుగుణంగా వివిధ నిధుల ఎంపిక చేసుకోవచ్చు. స్థిర ఆదాయం నుంచి మ్యూచువల్ ఫండ్ తరహా పెట్టుబడుల దాకా.లాంగ్టర్మ్ వాల్యూ సృష్టి: ఈ యులిప్ పథకం, దీర్ఘకాలిక పెట్టుబడి లక్ష్యాల కోసం రూపొందించబడింది. ప్రత్యేకంగా, పిల్లల విద్య, రిటైర్మెంట్, ఇంటి కొనుగోలు వంటి జీవన లక్ష్యాలను చేరుకునేందుకు ఇది సహాయకారి. -
85% పేమెంట్స్ యూపీఐ నుంచే..
దేశంలో 85 శాతం డిజిటల్ చెల్లింపులు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) రూపంలోనే జరుగుతున్నట్టు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ప్రతి నెలా 20 బిలియన్ యూపీఐ లావాదేవీలు నమోదవుతున్నాయని, వీటి విలువ 280 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు చెప్పారు.సమ్మిళిత, సురక్షిత, విస్తరణకు అనుకూలమైన డిజిటల్ పబ్లిక్ ఫ్లాట్ఫామ్ల (డీపీపీలు) విషయంలో భారత్ ప్రపంచానికి ఒక కేసు స్టడీ (అధ్యయనం చేయతగిన) అవుతుందన్నారు. వాషింగ్టన్లో ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ వార్షిక సమావేశాల సందర్భంగా ఆర్బీఐ నిర్వహించిన ఒక కార్యక్రమంలో భాగంగా మల్హోత్రా మాట్లాడారు.సమ్మిళిత వృద్ధి, ఆవిష్కరణలకు డిజిటల్ పబ్లిక్ ప్లాట్ఫామ్లు ప్రేరణినిస్తున్నట్టు చెప్పారు. డిజిటల్ గుర్తింపునకు ఉద్దేశించిన ఆధార్, రియల్టైమ్ చెల్లింపులకు వీలు కల్పిస్తున్న యూపీఐ ద్వారా.. తక్కువ వ్యయాలతో, ప్రజలకు సమర్థవంతమైన సేవలను అందించే వ్యవస్థలకు ఎలా నిర్మించొచ్చో విజయవంతంగా చూపించినట్టు పేర్కొన్నారు.డిజిటల్ పరివర్తనను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు, ‘వసుదైక కుటుంబం’ స్ఫూర్తితో అంతర్జాతీయ సహకారానికి భారత్ కట్టుబడి ఉన్నట్టు ప్రకటించారు. యూపీఐని ఒక ముఖ్యమైన డిజిటల్ పబ్లిక్ ప్లాట్ఫామ్గా పేర్కొంటూ, చెల్లింపుల ముఖచిత్రాన్ని ఇది పూర్తిగా మార్చేసినట్టు చెప్పారు. -
Income tax: కొత్త చట్టం వస్తోంది కానీ...
ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు.. ఆదాయపన్ను చట్టం 1922, ఆ తరువాత చట్టం 1961 ... ఇప్పుడు కొత్తం చట్టం 2025 పేరుతో వస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో రాష్ట్రపతి ఆమోదముద్ర పొందిన ఈ చట్టం 1.4.2026 నుంచి అమల్లోకి రానుంది. కొత్త చట్టం అత్యంత సరళీకృతంగా ఉంది. నిడివి, సెక్షన్లు తగ్గించారు. ‘పన్ను సంవత్సరం’ అనే కొత్త నిర్వచనంతో వర్చువల్ డిజిటల్ ఆస్తులను కూడా కలుపుతూ, సెర్చ్, సీజర్ అధికారాలను విస్తృత పరుస్తూ, ఎన్నో సంస్కరణలతో రూపుదిద్దుకొని ఇది ముస్తాబయింది.ఈ సంవత్సరంలో అన్నీ పూర్తయినా, అమలు మాత్రం 1.4.2026 నుండే ఉంటుంది. అయితే 2025 బడ్జెట్లో తెచ్చిన మార్పులు 2025–26 ఆర్థిక సంవత్సరంలో వర్తిస్తాయి. 2026లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కొన్ని మార్పులు రావడం సహజం. ముఖ్యంగా బేసిక్ లిమిట్, మినహాయింపులు, శ్లాబులు, రేట్లు, ఇవి రావచ్చు. లేదా రాకపోవచ్చు. వచ్చేవి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వస్తాయి. వాటి గురించి ఇప్పుడు ఆలోచించడం అనవసరం. కొత్త విధానాన్ని ప్రతిపాదించినప్పటి నుంచే ప్రభుత్వం దాన్ని సమర్థిస్తూ, వెనకేసుకొస్తోంది. మధ్య తరగతి వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని శ్లాబులు, రేట్లు తెచ్చారు. దీని ప్రకారం రూ.12,00,000కు పన్ను ఉండదు. శ్లాబులు మార్చారు. రేట్లు మారాయి.రూ.12,00,000 ఆదాయాల విషయంలో శ్లాబులను మార్చకుండా రిబేటును 87 అ ప్రకారం రూ.60వేల వరకు పెంచి ఎంతో ఉపశమనం ఇచ్చారు. నికర ఆదాయం పెరిగితే వైకుంఠపాళి ఆటలో పాము నోట్లో పడినట్లే. శ్లాబుల వారీగా పన్ను కట్టాల్సి వస్తోంది. సాండర్డ్ డిడక్షన్ని కొత్త విధానంలో రూ.75వేలకు పెంచారు.ఈ ఆర్థిక సంవత్సరం నుంచి వ్యక్తులు రెండు సొంత ఇళ్ల మీద పన్ను కట్టాల్సిన అవసరం లేదు. గతంలో ఒక ఇంటికే ఉన్నా.., ఇప్పుడు మినహాయింపుని రెండో ఇంటికీ కల్పించారు.కొత్త విధానంలో ఫ్యామిలీ పెన్షను మినహాయింపుని రూ.25వేలకు పెంచారు. గతంలో ఇది రూ.13,000గా ఉండేది. ఈ విధంగా కొత్త విధానాన్ని సమర్ధిస్తూ.., ఉపశమనం ఇచ్చారు. కొత్త విధానం కొంగు బంగారం అయ్యింది. ఆర్థికపరంగా ఎందరో చిన్న చిన్న అస్సెస్సీలకు పెద్ద రిలీఫ్ ఇచ్చారు. టాక్స్ ప్లానింగ్ పేరుతో ఎటువంటి అక్రమ మార్గాలకు పాల్పడకుండా రాచమార్గంలో రాజహంసలాగా రాజీ పడకుండా, రాంగ్ రూటు వెళ్లకుండా రైట్వే ఇది. యూలిప్ ద్వారా వచ్చే మొత్తాలను క్యాపిటల్ గెయిన్ పరిధిలోకి తీసుకొచ్చారు. మొదటి రూ.25వేలకు మినహాయింపు ఉంది. టీడీఎస్ (టాక్స్ డిడక్షన్ సోర్స్) వర్తించే విషయాల్లో పరిమితిని పెంచారు. దానివల్ల కొంతమంది టీడీఎస్కి గురికారు. విదేశాల చెల్లింపుల్లో వర్తించే టీసీఎస్(టాక్స్ కలెక్టెడ్ సోర్స్) విషయంలో పరిమితి పెంచారు.కొన్ని వస్తువుల అమ్మకపు విషయంలో పరిమితి రూ.50,00,000 ఇక నుంచి లేదు.అప్డేటెడ్ రిటర్నులను ఫైల్ చేసుకోవడానికి 24 నెలల నుంచి 48 నెలలకు వెనక్కి వెళ్లవచ్చు. ఇది మంచి అవకాశం. అయితే షరతులకు లోబడి మాత్రమే.రిటర్నులు వేయనివారిని నాన్ఫైలర్స్ అంటారు. గతంలో ఎక్కువ టీడీఎస్/టీసీఎస్ రేట్లు వేసేవారు. ఇప్పుడు ఆ వివక్ష లేదు.భాగస్వాములకు చెల్లించే చెల్లింపుల మీద టీడీఎస్ ప్రవేశపెట్టారు. నాన్ రెసిడెంట్లకి సంబంధించి కొన్ని డిజిటల్ వ్యవహారాల మీద వేసే పన్ను 6% ఎత్తివేశారు. ఈ మార్పులను పెట్టుకొని టాక్స్ ప్లానింగ్ వైపు అడుగులు వేయండి. -
పోస్టల్ ఉద్యోగులకు బిగ్ న్యూస్.. దీపావళి కానుక ప్రకటన
దీపావళికి ముందు కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు ఆనందకరమైన బహుమతిని ప్రకటించింది. కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోని తపాలా శాఖ 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఉత్పాదకత-లింక్డ్ బోనస్ను ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం పోస్టల్ ఉద్యోగులకు 60 రోజుల వేతనానికి సమానమైన బోనస్ లభిస్తుంది.ఈ బోనస్ను పొందే ఉద్యోగుల వర్గాలుపోస్టల్ శాఖ ఉత్తర్వుల ప్రకారం.. ఈ బోనస్ పొందడానికి ఈ కింది వర్గాల ఉద్యోగులు అర్హులురెగ్యులర్ ఉద్యోగులు - గ్రూప్ సి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్), నాన్ గెజిటెడ్ గ్రూప్ బి ఉద్యోగులు.గ్రామీణ డాక్ సేవకులు - రెగ్యులర్ సర్వీస్లో ఉన్నవారుతాత్కాలిక, ఫుల్టైమ్ క్యాజువల్ ఉద్యోగులుఅదనంగా, 2025 మార్చి 31 తర్వాత పదవీ విరమణ చేసిన, రాజీనామా చేసిన లేదా డిప్యుటేషన్కు వెళ్లిన ఉద్యోగులు కూడా ఈ బోనస్ కు అర్హులు.బోనస్ లెక్కింపు విధానంబోనస్ లెక్కించడానికి పోస్టల్ శాఖ స్పష్టమైన ఫార్ములాను కూడా అందించింది. రెగ్యులర్ ఉద్యోగులకు బోనస్ = (సగటు వేతనం × 60 రోజులు ÷ 30.4). అయితే, బోనస్ లెక్కించడానికి గరిష్ట జీతం పరిమితిని నెలకు రూ .7,000 గా నిర్ణయించారు.గ్రామీణ డాక్ సేవకులకు (జీడీఎస్)కు వారి టైమ్ రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్ (టీఆర్సీఏ), డియర్ నెస్ అలవెన్స్ ఆధారంగా బోనస్ నిర్ణయిస్తారు.తాత్కాలిక లేదా ఫుల్ టైమ్ క్యాజువల్ వర్కర్లకు వారి అంచనా వేతనం రూ.1,200 ఆధారంగా వారికి అడ్హాక్ బోనస్ ఇస్తారు.సర్వీసు విడిచిపెట్టిన అంటే 2025 మార్చి 31 తర్వాత పదవీ విరమణ చేసిన, రాజీనామా చేసిన లేదా బదిలీ అయిన ఉద్యోగులకు కూడా ప్రో-రేటా ప్రాతిపదికన బోనస్ లభిస్తుందని ఉత్తర్వులో పోస్టల్ శాఖ పేర్కొంది. -
వారెన్ బఫెట్ చెప్పిన సక్సెస్ సీక్రెట్..
ఒరాకిల్ ఆఫ్ ఒమాహాగా పేరుగాంచిన వారెన్ బఫెట్.. తన సంపత్తి కంటే ఎక్కువగా తన పెట్టుబడి మేథసంపత్తికి, పట్టుదలకి, దాతృత్వానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యాపారవేత్త. ప్రపంచంలోని అత్యంత వయోవృద్ధ బిలియనీర్లలో ఒకరైన ఆయన, టీనేజ్లోనే తన మొదటి పెట్టుబడి పెట్టారు. ‘1% క్లబ్’లో భాగంగా, తన సంపాదనలో 99 శాతాన్ని స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇవ్వాలని ప్రతిజ్ఞ చేసిన బఫెట్.. తన దాతృత్వ ప్రయత్నాలు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు.బఫెట్ విజయం వెనుక అలవాట్ల పాత్ర ఎక్కువవారెన్ బఫెట్ (Warren Buffett) జీవిత సూత్రం "తక్కువగా పనిచేయడం కాదు, కానీ తెలివిగా జీవించడం". ప్రతిరోజూ చదవడం, త్వరగా పడుకోవడం, ఏ పనినైనా ప్రారంభించే ముందు చక్కగా ఆలోచించడం ఆయన దైనందిన జీవితంలోని అలవాట్లు. ఇవి సింపుల్ కనిపిస్తాయి. కానీ ప్రభావవంతమైనవి. వాస్తవానికి, బఫెట్ రోజులో 80 శాతానికి పైగా చదవడం, ఆలోచించడానికే కేటాయిస్తారు. కొన్ని రోజుల్లో ఇది 6 గంటల దాకా ఉంటుంది.అలవాట్ల శక్తి గురించి బఫెట్ ఆసక్తికర ఉదహరణఒకసారి, యువ విద్యార్థులతో మాట్లాడుతుండగా, బఫెట్ అలవాట్ల రూపకల్పనలో ఉన్న "అదృశ్య శక్తి" గురించి ఆసక్తికరంగా వివరించారు. "మీరు గౌరవించే ఇద్దరు వ్యక్తులు, అలాగే మీకు అసహ్యంగా అనిపించే మరో వ్యక్తిని తీసుకోండి. తరువాత, ఈ ముగ్గురు వ్యక్తుల లక్షణాలను పేపర్పై రాయండి" అంటూ సూచించారు.ఈ ప్రక్రియ ద్వారా బఫెట్ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే.. "మీరు ఆదర్శంగా భావించే వ్యక్తుల లక్షణాలు మీకూ సాధ్యమైనవే. కొంత అభ్యాసం చేస్తే మీరు కూడా అలాంటి వ్యక్తిగా మారగలరు. ఇవి అలవాట్లుగా మారినపుడు, అవే మీ వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి".అలవాట్లు ఎలా ఏర్పడతాయో, వాటిని చిన్నవయస్సులో ఎలా మార్చగలమో స్పష్టంగా వివరించేందుకు బఫెట్ బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఉదాహరణను ప్రస్తావించారు. ఫ్రాంక్లిన్ "ఒక వ్యక్తి కావాలనుకునే లక్షణాన్ని తాను అభ్యసించి అలవాటుగా మార్చుకున్నాడు" అని బఫెట్ చెబుతూ.. "అలవాట్ల గొలుసులు మొదట తేలికగా ఉంటాయి. మనం గుర్తించలేము కూడా. కానీ, అవి గట్టిపడితే, విరగ్గొట్టడం కష్టమవుతుంది. కాబట్టి చిన్న వయస్సులోనే మంచి అలవాట్లను అభ్యసించండి" అన్నారు.ఇదీ చదవండి: రిచ్ అవ్వాలంటే కూడబెట్టాల్సింది ఆ ‘ఫేక్ డబ్బు’ కాదు.. -
దీపావళి బోనస్లు, గిఫ్ట్లు భారీగా వచ్చాయా..?
దేశమంతా దీపావళి పండుగ సందడి నెలకొంది. దేశవ్యాప్తంగా జరిగే పెద్ద పండుగ కావడంతో దీపావళికి చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు బోనస్లు, గిఫ్ట్లు ఇస్తుంటాయి. కొన్ని సంస్థలు వీటిని భారీ స్థాయిలో అందిస్తుంటాయి. ఇప్పటికే దాదాపు చాలా సంస్థలు దీపావళి బోనస్లు, బహుమతులు ఇచ్చేశాయి.మరికొన్ని ఇంకా ఇవ్వాల్సి ఉండటంతో బోనస్లు, బహుమతుల గురించి ఆశతో ఎదురుచూస్తున్నారు. కొంతమంది నగదు బోనస్ను ఆశిస్తే, మరికొందరు బహుమతులు, వోచర్లు, స్వీట్లు లేదా గాడ్జెట్లు పొందుతారు. అయితే, మీకు తెలిసా? ఈ బోనస్లు, బహుమతులు పన్ను చెల్లింపులకు కూడా కారణమవవచ్చు.చాలా మంది ఈ పండుగ సమయంలో వచ్చే బహుమతులు పూర్తిగా పన్ను మినహాయింపు పొందుతాయని అనుకుంటారు. కానీ వాస్తవానికి, ఇవి కూడా ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఒక నిర్దిష్ట పరిమితికి మించి ఉంటే పన్ను వర్తించవచ్చు. దీని గురించి సమగ్రంగా తెలుసుకుందాం..ఇలా ఉంటే పన్ను మినహాయింపుఆదాయపు పన్ను చట్టం ప్రకారం, ఒక ఉద్యోగి ఏడాదిలో పొందే బహుమతులు రూ.5,000, అంత లోపు విలువ ఉంటే పన్ను మినహాయింపు పొందుతాయి. ఉదాహరణకు స్వీట్లు, దుస్తులు, చిన్న ఎలక్ట్రానిక్ వస్తువులు, గిఫ్ట్ వోచర్లు (రూ.5,000 లోపు విలువతో) వంటివి. ఇవి పరిధిలోపు ఉన్నట్లయితే, ఉద్యోగి ఆదాయంలోకి జోడించాల్సిన అవసరం లేదు.రూ.5,000 దాటితే..బహుమతుల మొత్తం విలువ రూ.5,000 మించి పోతే, ఆ మొత్తం ఉద్యోగి వార్షిక ఆదాయంలో భాగంగా పరిగణిస్తారు. వీటిని ‘పెర్క్’ (perquisite) గా లెక్కిస్తారు. ఉదాహరణకు.. రూ.10,000 విలువైన ల్యాప్టాప్ బహుమతిగా లభిస్తే మొత్తం రూ.10,000 ఆదాయంలోకి జోడించాలి. రూ.7,000 విలువ గల వోచర్ వచ్చినా మొత్తం వాల్యూ పన్ను పరిధిలోకి వస్తుంది.దీపావళి క్యాష్ బోనస్దీపావళి సందర్భంగా క్యాష్ బోనస్లపై (Diwali bonus) కూడా ఎలాంటి పన్ను మినహాయింపు ఉండదు. దీన్ని కూడా ఉద్యోగి జీతంలో భాగంగానే పరిగణిస్తారు. ఉదాహరణకు మీరు దీపావళి రోజున రూ.30,000 బోనస్ అందుకుంటే, దీన్ని మీ వార్షిక జీతానికి జోడిస్తారు. తద్వారా, మీరు ఉన్న ఆదాయపు పన్ను శ్లాబ్ ప్రకారం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.ఐటీఆర్ ఫైలింగ్లో జాగ్రత్తలురూ.5,000 కంటే ఎక్కువ విలువ ఉన్న బహుమతులను ఐటీఆర్లో తప్పనిసరిగా చేర్చాలి. లేని పక్షంలో, ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉంటుంది. సంస్థలు ఇచ్చే ఫార్మ్ 16లో ఈ వివరాలు ఉండవచ్చు. కానీ మీరు కూడా చెక్ చేయడం మంచిది.ఇదీ చదవండి: దీపావళి ఇన్సూరెన్స్ రూ.5 లకే.. -
రిచ్ అవ్వాలంటే కూడబెట్టాల్సింది ఆ ‘ఫేక్ డబ్బు’ కాదు..
ప్రముఖ ఇన్వెస్టర్, ప్రసిద్ధ పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich dad Poor dad) రచయిత రాబర్ట్ కియోసాకి అమెరికా ద్రవ్య విధానాన్ని తీవ్రంగా విమర్శించారు. బంగారం, వెండి, బిట్ కాయిన్ వంటి పెట్టుబడుల పెరుగుదల అనేది వ్యవస్థల వైఫల్యానికి సంకేతమని అని ఆయన హెచ్చరించారు. అమెరికా బేబీ బూమర్ (1946-1964 మధ్య పుట్టినవారు)తరగతికి ఈ ద్రవ్యోల్బణం తీవ్ర ప్రభావం చూపించబోతుందని ఆయన భావిస్తున్నారు."ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతారు" అంటూ కియోసాకి (Robert Kiyosaki) తాజాగా ‘ఎక్స్’ (ట్విటర్)లో ఓ పోస్ట్ చేశారు. "కానీ ద్రవ్యోల్బణం పేద మధ్యతరగతి ప్రజల జీవితాన్ని మరింత కష్టతరం చేస్తుంది." ధరలు పెరుగుతున్నప్పుడు, ఫియట్ మనీ లేదా "నకిలీ డబ్బు" సామాన్య అమెరికన్ల ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం, వెండి, బిట్ కాయిన్, ఎథీరియం వంటి "నిజమైన డబ్బు" లో ఆదా చేయాలని ప్రజలకు సూచించారు.అక్టోబర్ లో బంగారం ధరలో జరిగిన నాటకీయ ర్యాలీని అనుసరించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం, బంగారం ప్రపంచవ్యాప్తంగా ఔన్సుకు 4,250 డాలర్లు, భారతదేశంలో 10 గ్రాములకు రూ.1.31 లక్షల వద్ద (అక్టోబర్ 18 నాటికి) ట్రేడ్ అవుతోంది. వెండి కూడా దూసుకెళ్తోంది. అయితే బిట్ కాయిన్ మార్కెట్ గందరగోళం మధ్య 1,21,000 డాలర్ల నుండి 108,000 డాలర్లకు పడిపోయింది.1947 లో జన్మించిన రాబర్ట్ కియోసాకి, తన లాంటి బేబీ బూమర్ తరగతికి ఈ ద్రవ్యోల్బణం బలమైన హానిని కలిగించే అవకాశం ఉందని చెప్పారు. "ద్రవ్యోల్బణం ద్వారా మనం పూర్తిగా తుడిచిపెట్టకుపోతామని" ఆయన హెచ్చరించారు. "మీ అమ్మ, నాన్నలు వీధుల్లోకి రావచ్చు ఎందుకంటే ద్రవ్యోల్బణం వారి సామాజిక భద్రతను తుడిచిపెట్టబోతోంది." అన్నారు.THE RICH get RICHER: while I am personally happy gold, silver, Bitcoin, Ethereum are going up…. My concern is the price of life…. AKA…inflation….makes life harder on the poor and middle class.Please do your best to not be a victim of a broken and corrupt monetary system.…— Robert Kiyosaki (@theRealKiyosaki) October 17, 2025 -
దీపావళి ఇన్సూరెన్స్ రూ.5 లకే..
దీపావళి (Diwali 2025) అంటే ఆనందాల వేడుక. కానీ విషాదానికీ అవకాశం ఉన్న పండుగ. ఏటా దీపావళికి దేశవ్యాప్తంగా ఆసుపత్రులు బాణసంచా కారణమైన ప్రమాదాలతో అధిక భారం ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా కాలిన గాయాలు, కంటి గాయాలు, మంటలు మొదలైనవి.2024లో ఒక్క ఢిల్లీలోనే అగ్నిమాపక కాల్స్ 53 శాతం పెరిగాయి. బెంగళూరు, లక్నో, చండీగఢ్ లాంటి ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. చాలా కేసుల్లో పిల్లలు, బాణాసంచా కాల్చడం చూస్తున్నవారికి కూడా ప్రమాదాలు సంభవించాయి.దీన్ని దృష్టిలో ఉంచుకొని, ‘కవర్ ష్యూర్’ (CoverSure) అనే ఇన్సూర్టెక్ సంస్థ కేవలం రూ.5కే ఫైర్క్రాకర్ ఇన్సూరెన్ (Firecracker Insurance ) ప్లాన్ను ప్రారంభించింది. బాణసంచా సంబంధిత ప్రమాదాల నుంచి రక్షణను అందించడమే లక్ష్యంగా దీన్ని రూపొందించారు.ప్లాన్ ముఖ్యాంశాలు* అకాల మరణానికి కవరేజీ: రూ.50,000 వరకు* కాలిన గాయాలకు కవరేజీ: రూ.10,000 వరకు* 10 రోజుల పరిమిత కాల కవరేజీ (కొనుగోలు చేసిన తర్వాతి రోజు నుంచి)* డిజిటల్ యాక్టివేషన్– ఎటువంటి డాక్యుమెంటేషన్ లేకుండా, వెంటనే యాక్టివ్* కవర్ ష్యూర్ యాప్/వెబ్సైట్ ద్వారా తక్షణ కొనుగోలుఎందుకు అవసరమంటే..భారతదేశంలో ప్రతి సంవత్సరం 1,000కి పైగా దీపావళి ప్రమాదాలు నమోదవుతున్నాయి. ఈ సందర్భాల్లో చికిత్స ఖర్చు రూ.25,000 నుంచి రూ.1 లక్ష వరకు ఉంటోంది. చాలా మందికి సాంప్రదాయ ఆరోగ్య బీమా లేదు. దీంతో చిన్న ప్రమాదాలూ ఆర్థికంగా పెద్ద భారం కావచ్చుఈ ప్లాన్ ప్రామాణిక ఆరోగ్య/టర్మ్ పాలసీలను భర్తీ చేయదగినది కాదు కానీ వాటితో పాటు ముఖ్యంగా పండుగల కాలంలో అదనపు రక్షణగా పనిచేస్తుంది. బీమా తీసుకోండి.. దీపావళిని శుభంగా, సురక్షితంగా జరుపుకోండి.ఇదీ చదవండి: ఎల్ఐసీ కొత్త పాలసీలు.. జీఎస్టీ తగ్గాక వచ్చిన ప్లాన్లు ఇవే.. -
ఎల్ఐసీ కొత్త పాలసీలు.. జీఎస్టీ తగ్గాక వచ్చిన ప్లాన్లు ఇవే..
దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) రెండు కొత్త బీమా ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. విభిన్న వ్యక్తిగత అవసరాలను తీర్చడానికి, ఆర్థిక రక్షణ, పొదుపు ప్రయోజనాలను అందించడానికి ‘ఎల్ఐసీ జన్ సురక్ష’, ‘ఎల్ఐసీ బీమా లక్ష్మి’ అనే పేర్లతో వీటిని రూపొందించింది.ఎల్ఐసీ జన్ సురక్ష (LIC Jan Suraksha), ఎల్ఐసీ బీమా లక్ష్మి (LIC Bima Lakshmi) అక్టోబర్ 15 నుంచి ఈ రెండు కొత్త పాలసీలు అందుబాటులో ఉంటాయని, కొత్త నెక్స్ట్ జెన్ జీఎస్టీ విధానంలో ఎల్ఐసీ విడుదల చేసిన మొదటి ఉత్పత్తులు ఇవేనని బీమా సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.ఎల్ఐసీ జన్ సురక్షఎల్ఐసీ జన్ సురక్ష ప్లాన్ ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం రూపొందించిన తక్కువ ఖర్చుతో కూడిన బీమా పథకం. ఇది నాన్-పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్, అంటే ఇది మార్కెట్ లేదా బోనస్ లతో లింక్ చేయబడదు.🔹 ముఖ్య లక్షణాలురకం: నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్ప్రత్యేకత: తక్కువ ఆదాయ వర్గాలు, ఆర్థికంగా వెనుకబడిన వారికి అనుకూలంబీమా మొత్తం: కనీసం రూ.1,00,000, గరిష్టంగా రూ.2,00,000పాలసీ కాలం: 12 నుంచి 20 సంవత్సరాలుప్రీమియం చెల్లింపు కాలం: మొత్తం పాలసీ కాలంలో 5 సంవత్సరాలు తీసివేయగా వచ్చే కాలంఅర్హత:వయస్సు: 18 నుండి 55 ఏళ్లుఆరోగ్యం: పాలసీదారుకు మంచి ఆరోగ్యస్థితి ఉండాలి. వైద్య చికిత్సలు తీసుకుంటూ ఉండరాదు.అదనపు ప్రయోజనాలు:3 సంవత్సరాల ప్రీమియం చెల్లింపుల తర్వాత ఆటో కవర్1 సంవత్సరం తర్వాత పాలసీ రుణంగ్యారెంటీడ్ ఎడిషన్లుఎల్ఐసీ బీమా లక్ష్మిఎల్ఐసీ బీమా లక్ష్మి అనేది మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన జీవిత బీమా, పొదుపు పథకం. ఇది నాన్-పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్ స్కీం, ఇది జీవిత బీమా, కాలానుగుణ మనీబ్యాక్ ఎంపికలు రెండింటినీ అందిస్తుంది.🔹 ముఖ్య లక్షణాలురకం: నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ మనీబ్యాక్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ప్రత్యేకత: మహిళల కోసం ప్రత్యేకంబీమా మొత్తం: కనీసం రూ. 2,00,000, గరిష్ట పరిమితి లేదు (అండర్రైటింగ్ ఆధారంగా)పాలసీ కాలం: 25 సంవత్సరాలుప్రీమియం చెల్లింపు కాలం: 7 నుంచి 15 సంవత్సరాల మధ్య ఉంటుంది.అర్హత:వయస్సు: 18–50 సంవత్సరాల మధ్యఅదనపు ప్రయోజనాలుగ్యారెంటీడ్ వార్షిక జోడింపులుసర్వైవల్ బెనిఫిట్లు నచ్చినట్లు ఎంచుకునే అవకాశంసర్వైవల్ బెనిఫిట్లు కావాల్సినప్పుడు తీసుకోవచ్చు.మెచ్యూరిటీ / డెత్ బెనిఫిట్ వాయిదాలలో తీసుకునే అవకాశంఆటో కవర్ సౌలభ్యం (3 సంవత్సరాల తర్వాత)అధిక బీమా మొత్తానికి ప్రోత్సాహకాలుఇదీ చదవండి: దీపావళి ఇన్సూరెన్స్ రూ.5 లకే.. -
ధన త్రయోదశి రోజున బంగారంపై పెట్టుబడా?
ప్రతి సంవత్సరం దీపావళి పండుగ సందర్భంగా వచ్చే ధన త్రయోదశి (ధన్తేరాస్) రోజున బంగారం కొనడం భారతదేశంలో ఒక శుభప్రదమైన సంప్రదాయం. ఈ రోజున పసిడిని కొనుగోలు చేయడం ద్వారా సంవత్సరం పొడవునా సంపద సమకూరుతుందని ప్రజలు బలంగా నమ్ముతారు. అయితే ఈ ఏడాది కాలంలో బంగారం, వెండి ధరలు సామాన్యులు కొనలేనంత భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి, రూపాయి విలువ పతనం, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేరుగా బంగారు ఆభరణాలు కొనడం కంటే మెరుగైన, ఆర్థికపరంగా లాభదాయకమైన పెట్టుబడి మార్గాలను ఎంచుకోవడం ఉత్తమం.నేరుగా ఆభరణాలు కొంటే..ధరలు భారీగా పెరగడంతో ఆభరణాల రూపంలో బంగారం కొనుగోలు చేయాలనుకోవడం చాలా మందికి ఆర్థిక భారంగా ఉంటుంది. రికార్డు స్థాయిలో ఉన్న ధరల కారణంగా చిన్న వస్తువు కొనుగోలుకు కూడా ఎక్కువ మొత్తంలో చెల్లించాలి. బంగారు ఆభరణాల తయారీలో తరుగు రూపంలో కొంత మొత్తాన్ని అదనంగా చెల్లించాలి. వీటికి తయారీ ఛార్జీలు (Making Charges) అదనం. బంగారం ధర, తయారీ ఛార్జీలపై జీఎస్టీ వర్తిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో ఆభరణాలు అమ్మినప్పుడు తయారీ ఛార్జీలు, తరుగు కారణంగా కొనుగోలు ధర కంటే తక్కువ ధరకే విక్రయించాల్సి వస్తుంది.ఈ ఛార్జీలు, నష్టాల నేపథ్యంలో బంగారంలో పెట్టుబడి పెట్టడానికి నిపుణులు మెరుగైన ప్రత్యామ్నాయ మార్గాలు సూచిస్తున్నారు. బంగారంపై ఇన్వెస్ట్ చేయడానికి భౌతిక బంగారాన్ని నిల్వ చేయాల్సిన అవసరం లేకుండా సురక్షితమైన, పారదర్శకమైన, తక్కువ ఖర్చుతో కూడుకున్న కొన్ని మార్గాలు అందుబాటులో ఉన్నాయి.గోల్డ్ ఈటీఎఫ్లుగోల్డ్ ఈటీఎఫ్లు అనేవి స్టాక్ ఎక్స్ఛేంజ్ల్లో షేర్ల మాదిరిగా ట్రేడ్ చేయబడే ఫండ్లు. ఇవి దేశీయ భౌతిక బంగారం ధరను ట్రాక్ చేస్తాయి. వీటిని లైవ్ మార్కెట్ నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. దీనివల్ల తయారీ ఛార్జీలు, జీఎస్టీ వంటి అదనపు ఛార్జీలు ఉండవు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ వేళల్లో ఎప్పుడైనా సులభంగా కొనుగోలు చేయవచ్చు, అమ్మవచ్చు. భౌతిక బంగారంలాగా దొంగిలించబడుతుందనే భయం ఉండదు. రియల్ టైమ్ మార్కెట్ ధరలకు అనుగుణంగా వీటి ధరలు ఉంటాయి. వీటిని కొనుగోలు చేయడానికి డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతా అవసరం.డిజిటల్ గోల్డ్PhonePe, Paytm వంటి యాప్ల ద్వారా 99.9% స్వచ్ఛమైన బంగారాన్ని కొద్ది మొత్తంలో డిజిటల్ రూపంలో కొనుగోలు చేయవచ్చు. ఈ బంగారం మీ తరపున భౌతిక రూపంలో లాకర్లో నిల్వ చేస్తారు. అయితే అమ్మాలనుకుంటే మాత్రం జీఎస్టీ వర్తిస్తుందని గుర్తుంచుకోవాలి. ఈ విధానంలో చాలా తక్కువ డబ్బుతో కూడా కొంత మొత్తంలో కొనుగోలు చేయవచ్చు. భౌతికంగా నిల్వ చేయాలనే ఆందోళన అవసరం లేదు. అయితే దీనికి కొనుగోలు పరిమితులు ఉంటాయి. ఈ పెట్టుబడి RBI లేదా SEBI నియంత్రణలో ఉండదని గమనించాలి.ఇదీ చదవండి: లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం కుప్పకూలింది.. ఏం జరిగిందంటే.. -
ఆన్లైన్ షాపింగ్.. డబ్బు మిగలాలంటే ఇలా చేయాల్సిందే..
పండుగ సీజన్ వచ్చిందంటే ఈ-కామర్స్ కంపెనీలకు, వినియోగదారులకు ఇద్దరికీ పెద్ద పండుగే. ఒకవైపు కంపెనీలు భారీ ఆఫర్లు, డిస్కౌంట్లతో అమ్మకాలను పెంచుకోవాలని చూస్తే.. మరోవైపు వినియోగదారులు ఆకర్షణీయమైన ధరల్లో తమకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేయాలని ఆశిస్తుంటారు. ఈ ఉత్సాహంలో కొందరు వినియోగదారులు తొందరపడి అనవసరమైన లేదా నకిలీ వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. మరికొందరు మోసాలకు గురవుతుంటారు.కంపెనీలు ఇచ్చే ఆఫర్లకు లొంగకుండా సురక్షితంగా, తెలివిగా ఆన్లైన్లో షాపింగ్ చేయడానికి వినియోగదారులు తప్పనిసరిగా పాటించవలసిన జాగ్రత్తలు, ఈ-కామర్స్ కంపెనీలు గోప్యంగా ఉంచే ఆఫర్ల వెనుక ఉన్న ఆంతర్యం, డబ్బును ఆదా చేసుకోవడానికి అనుసరించవలసిన విధానాలను పరిశీలిద్దాం.పండుగ సీజన్లో అపరిమితమైన ఆఫర్లు వస్తుంటాయి. ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా వినియోగదారులు అప్రమత్తంగా వ్యవహరించాలి.భద్రతా పరమైన జాగ్రత్తలుఅధికారిక వెబ్సైట్లు/యాప్లనే వాడాలి..ఎల్లప్పుడూ విశ్వసనీయమైన ఈ-కామర్స్ వేదికలు (ఉదాహరణకు, అధికారిక వెబ్సైట్ లేదా యాప్) నుంచే షాపింగ్ చేయాలి. ఈమెయిల్, మెసేజ్లు లేదా సోషల్ మీడియాలో వచ్చే అనుమానాస్పద లింకులను (Phishing Links) క్లిక్ చేయవద్దు.వెబ్సైట్ ప్రామాణికతను నిర్ధారించుకోవాలి..పేమెంట్ చేసే ముందు వెబ్సైట్ అడ్రస్ (URL) సరిచూసుకోవాలి. నకిలీ వెబ్సైట్లు అక్షర దోషాలతో కూడిన URLలను కలిగి ఉంటాయి. జాగ్రత్తగా గమనించాలి.వ్యక్తిగత డేటా విషయంలో అప్రమత్తత..UPI PINలు, OTPలు (వన్-టైమ్ పాస్వర్డ్లు), క్రెడిట్ కార్డ్ వివరాలు లేదా బ్యాంక్ అకౌంట్ వివరాలను ఎవరితోనూ ఫోన్లో, మెసేజ్లలో లేదా సోషల్ మీడియాలో పంచుకోవద్దు.పబ్లిక్ వై-ఫైని వాడొద్దుఆన్లైన్ చెల్లింపులు చేసేటప్పుడు పబ్లిక్ వై-ఫై నెట్వర్క్లను ఉపయోగించకూడదు. సురక్షితమైన ఇంటర్నెట్ కనెక్షన్ను మాత్రమే వాడాలి.అత్యంత భారీ డిస్కౌంట్ల పట్ల జాగ్రత్తఒక ఆఫర్ నమ్మశక్యం కానంత గొప్పగా (ఉదాహరణకు, 70% కంటే ఎక్కువ డిస్కౌంట్) ఉంటే అది మోసపూరితమయ్యే అవకాశం ఉంది. అటువంటి వాటిని అధికారిక యాప్లో లేదా వెబ్సైట్లో ధ్రువీకరించండి.కొనుగోలు చిట్కాలుఅవసరాల జాబితాఅమ్మకాలు చేసేందుకు ముందే మీకు నిజంగా అవసరమైన వస్తువుల జాబితాను తయారుచేసుకోవాలి. అందుకు బడ్జెట్ను నిర్దేశించుకోవాలి. ఇది అనవసర కొనుగోళ్లను నివారిస్తుంది.ధరల పోలికఒకే వస్తువును వేర్వేరు ఈ-కామర్స్ సైట్లలో ధరలను పోల్చి చూడాలి. ఇందుకోసం ప్రత్యేకమైన ప్రైస్ కంపారిజన్ టూల్స్ లేదా వెబ్సైట్లను ఉపయోగించవచ్చు.రివ్యూలు, రేటింగ్లువస్తువును కొనే ముందు దానిపై ఉన్న కస్టమర్ రివ్యూలు, రేటింగ్లు, విక్రేత (Seller) విశ్వసనీయతను తప్పకుండా పరిశీలించండి.తిరిగి ఇచ్చే విధానం (Return Policy)పండుగ సీజన్ అమ్మకాల్లో కొన్ని వస్తువులకు రిటర్న్ లేదా ఎక్స్ఛేంజ్ పాలసీలు మారిపోవచ్చు. కాబట్టి, కొనుగోలు చేసే ముందు రిటర్న్ పాలసీని స్పష్టంగా చదవాలి.ఆఫర్లలోని ఆంతర్యం ఏమిటి?బ్రౌజింగ్ హిస్టరీకొన్ని ఈ-కామర్స్ కంపెనీలు ప్రకటిస్తున్న డిస్కౌంట్లలో మార్కెటింగ్ వ్యూహాలు ఉంటాయి. ఈ-కామర్స్ కంపెనీలు మీ ఆన్లైన్ బ్రౌజింగ్ హిస్టరీ, వెబ్సైట్లో మీరు చూసిన వస్తువులు, కార్ట్లో ఉంచిన వస్తువులు, గతంలో చేసిన కొనుగోళ్లు వంటి డేటాను విశ్లేషిస్తాయి. ఈ సమాచారం ఆధారంగా మీకు ప్రత్యేకంగా ఒక డిస్కౌంట్ కోడ్ లేదా ఆఫర్ను అందిస్తాయి.ఉదాహరణకు, మీరు ఒక వస్తువును కార్ట్లో చేర్చి కొనుగోలు చేయకుండా వదిలేస్తే ఆ వస్తువుపై తగ్గింపుతో కూడిన ఈమెయిల్ లేదా నోటిఫికేషన్ను మీకు పంపుతాయి.ధరలుకొన్ని కంపెనీలు వాడుతున్న టూల్స్ ఏ వినియోగదారుడు ఎంత ధర చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాడో అంచనా వేసి వారికి మాత్రమే ఆ ధరను లేదా ఆఫర్ను చూపిస్తాయి. అంటే ఒకే వస్తువు వేర్వేరు కస్టమర్లకు వేర్వేరు ధరలకు లేదా ఆఫర్లకు కనిపించవచ్చు. ఇది గరిష్ట లాభాన్ని ఆర్జించడానికి కంపెనీలకు సహాయపడుతుంది.ఫ్లాష్ సేల్‘ఈ ఆఫర్ కొద్దిసేపు మాత్రమే’ (Flash Sale), ‘ఇంకా 5 వస్తువులు మాత్రమే మిగిలాయి’ వంటి సందేశాలను వినియోగదారులకు చూపించడం ద్వారా వారిలో ఆతృతను సృష్టించి త్వరగా కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తారు. దీనివల్ల వినియోగదారులు పూర్తి విశ్లేషణ చేయకుండానే కొనుగోలు చేస్తారు.కస్టమర్ లాయల్టీ ప్రోగ్రామ్లుతరచుగా కొనుగోళ్లు చేసే వినియోగదారులకు లేదా ప్రత్యేక సభ్యత్వాలు (ఉదా. ప్రైమ్ మెంబర్షిప్) ఉన్న వారికి మాత్రమే కొన్ని అదనపు ఆఫర్లు లేదా త్వరగా సేల్ యాక్సెస్ ఇస్తారు. ఇది వారిని కంపెనీకి కట్టుబడి ఉండేలా చేస్తుంది.డబ్బు మిగిల్చుకోవడానికి విధానాలుమీరు కొనాలనుకున్న వస్తువును కార్ట్లో ఉంచి కొద్ది రోజులు వేచి చూడండి. కంపెనీలు తరచుగా కొనుగోలు చేయకుండా వదిలేసిన వస్తువులపై ప్రత్యేక తగ్గింపును లేదా నోటిఫికేషన్ను పంపే అవకాశం ఉంది. కొనుగోలు చేసే ముందు సదరు వెబ్సైట్కు సంబంధించిన కూపన్ కోడ్స్ ఉన్నాయేమో చూడాలి. కొన్ని క్యాష్బ్యాక్ యాప్లు లేదా వెబ్సైట్ల ద్వారా షాపింగ్ చేయడం వల్ల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. పండుగ సేల్లో ఈ-కామర్స్ కంపెనీలు కొన్ని బ్యాంకుల క్రెడిట్/డెబిట్ కార్డులపై ఇన్స్టాంట్ తగ్గింపులు లేదా ఈఎంఐ ఆఫర్లు ఇస్తాయి. చాలా వెబ్సైట్లు తమ కొత్త కస్టమర్లకు ప్రత్యేక తగ్గింపు కూపన్లను పంపుతాయి. ఇది మొదటి కొనుగోలుపై కొంత డబ్బు ఆదా చేస్తుంది. ఒకటి కంటే ఎక్కువ వస్తువులు లేదా అనుబంధ ఉత్పత్తులు ఒకే ప్యాకేజీగా తక్కువ ధరకు లభించే అవకాశం ఉంటుంది.చివరగా..కంపెనీలు ఇస్తున్న ఆఫర్ల ఆంతర్యం అంతిమంగా వాటి అమ్మకాలను, లాభాలను పెంచడమే. కాబట్టి వినియోగదారులు ఆఫర్ల వెనుక దాగి ఉన్న మార్కెటింగ్ వ్యూహాన్ని అర్థం చేసుకుని వాటిని విచక్షణతో ఉపయోగించుకోవాలి. -
ఆర్బీఎల్ బ్యాంక్ నుంచి ప్రీపెయిడ్ కార్డులు
దేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఒకటైన ఆర్బీఎల్ బ్యాంక్ (RBL Bank), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)తో భాగస్వామ్యంలో ‘హమ్ సఫర్’ పేరుతో రూపే ప్రీపెయిడ్ కార్డులు ప్రారంభించింది. ముంబైలో నిర్వహించిన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్టివల్ (GFF)లో ఈ ప్రీపెయిడ్ కార్డును ఆవిష్కరించింది.ఈ కార్డ్, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (NCMC) అనుభవాన్ని అందించడంతో, దేశవ్యాప్తంగా ఉన్న పలు నగరాల్లో ప్రజా రవాణా వ్యవస్థను సమన్వయపరచడంలో దోహదపడుతుంది. వినియోగదారులు తమ ‘హమ్ సఫర్’ కార్డును తక్షణమే, సురక్షితంగా రీచార్జ్ చేసుకోవచ్చు.ఈ కార్డు ద్వారా వినియోగదారులు ప్రయాణం, ఆహారం, ఇంధనం, షాపింగ్, వినోదం వంటి అనేక అవసరాల కోసం సులభంగా చెల్లింపులు చేయవచ్చు. ఇది వాడటానికి సులభమైన ప్రీపెయిడ్ పరిష్కారంగా నిలుస్తుంది.హమ్ సఫర్ రూపే కార్డు ముఖ్య ప్రయోజనాలు🔹సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవం: మెట్రో, బస్సుల్లో పొడవైన క్యూలను తప్పించుకుని వేగంగా ప్రయాణించవచ్చు.🔹నిరవధిక లావాదేవీలు: రూపే ప్లాట్ఫామ్ ఆధారంగా సురక్షితమైన, వేగవంతమైన లావాదేవీల అనుభవం.🔹స్మార్ట్ ఖర్చు నిర్వహణ: అవసరమైనంత మొత్తాన్ని ముందుగానే లోడ్ చేసుకొని, ఎక్కువ కార్డులు లేదా నగదు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా ఉపయోగించవచ్చు.🔹మెరుగైన నియంత్రణ: ఖర్చులపై స్పష్టత, బడ్జెట్పై నియంత్రణ సాధ్యమవుతుంది. -
ఈపీఎఫ్ మొత్తం తీసేయాలంటే.. ఇక మూడేళ్లు ఆగాలి!
మీకు ఉద్యోగం లేదా.. రాజీనామా చేసి చాలాకాలమైందా? మూడేళ్లు కూడా దాటిపోయిందా.. అయితే ఇక మీరు మీ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లో ఉన్న డబ్బు మొత్తం డ్రా చేసేసుకోవచ్చు. ఉద్యోగం లేకుండా ఉంటే రెండు నెలలు దాటగానే పీఎఫ్ అకౌంట్ను ఖాళీ చేసేందుకు ఇప్పటివరకూ అవకాశం ఉండగా... ఈపీఎఫ్ఓ బోర్డు తాజా నిర్ణయంతో అది మూడేళ్లకు పెరిగింది.కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈపీఎఫ్ఓ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఈ మార్పును ఆమోదించింది. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) దీర్ఘకాలం పాటు ఉపాధి లేకుండా కొనసాగిన సందర్భాల్లోనే సభ్యులు తుది పరిష్కారాన్ని ఎంపిక చేసుకునేందుకు, భవిష్యనిధి ఖాతాలోని మొత్తాన్ని వెనక్కి తీసుకునేందుకు అనుమతించింది. 12 నెలలుగా ఉద్యోగం లేని వారు (పదవీ విరమణ కాలం తీరకముందే ) ఈపీఎఫ్ తుది పరిష్కారానికి దరఖాస్తు చేసుకోవచ్చు.36 నెలల పాటు ఉద్యోగం లేకుండా కొనసాగితే అప్పుడు భవిష్యనిధితోపాటు పెన్షన్ ఖాతాలో ఉన్న మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చని (EPF withdrawal) ఈపీఎఫ్వో ప్రకటించింది. ప్రస్తుతం రెండు నెలలుగా ఉద్యోగం లేకుండా ఉన్న వారు నిధులను ఉపసంహరించుకునేందుకు అనుమతి ఉంది. దీంతో చాలా మంది 2 నెలల తర్వాత ఖాతాను ఖాళీ చేస్తున్న నేపథ్యంలో.. వారి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈపీఎఫ్వో తెలిపింది.ఈపీఎఫ్ ఉపసంహరణలో కీలక మార్పులుఇక మూడు రకాల ఉపసంహరణలే..ఇంతకుముందు, ఈపీఎఫ్ నుండి పాక్షిక ఉపసంహరణకు అనుమతించే 13 నిబంధనలు ఉండేవి. వీటన్నింటినీ విలీనం చేస్తూ కేవలం మూడు నిబంధనలను ఉంచాలని సీబీటీ నిర్ణయించింది. అవి అత్యవస పరిస్థితులు, గృహ అవసరాలు, ప్రత్యేక పరిస్థితులు100% వరకు విత్ డ్రాయల్స్ఈపీఎఫ్ఓ సభ్యులు ఇప్పుడు ఉద్యోగి, యాజమాన్యం వాటాతో సహా ప్రావిడెంట్ ఫండ్లోని అర్హత కలిగిన బ్యాలెన్స్లో 100% వరకు ఉపసంహరించుకోవచ్చు.మరిన్ని విత్ డ్రాలుసీబీటీ ఉపసంహరణ పరిమితులను సరళీకృతం చేసింది. విద్య సంబంధ అవసరాలకు ఇప్పుడు 10 సార్ల వరకు, వివాహం కోసం 5 సార్ల వరకు పీఎఫ్ ఉపసంహరించుకోవచ్చు. ఇవి గతంలో 3 సార్ల వరకే ఉండేవి.12 నెలల తరువాత పాక్షిక ఉపసంహరణఅన్ని పాక్షిక ఉపసంహరణలకు కనీసం ఉండాల్సిన సర్వీస్ కాలాన్ని ఏకరీతిగా 12 నెలలకు తగ్గించారు.ప్రత్యేక పరిస్థితులకు ఎలాంటి కారణం అవసరం లేదు'ప్రత్యేక పరిస్థితులలో' పీఎఫ్ విత్డ్రా చేయాలంటే ఇంతకు ముందు కారణాలు అంటే ప్రకృతి వైపరీత్యాలు, లాకౌట్లు / సంస్థల మూసివేత, నిరంతర నిరుద్యోగం, అంటువ్యాధి వ్యాప్తి మొదలైనవి సభ్యుడు స్పష్టం చేయాల్సి వచ్చేది. ఇప్పుడు, సభ్యుడు ఈ కేటగిరీ కింద ఎటువంటి కారణాలు పేర్కొనకుండానే దరఖాస్తు చేసుకోవచ్చు.25 శాతం కనీస బ్యాలెన్స్ తప్పనిసరి సభ్యుల ఖాతాలో 25% కాంట్రిబ్యూషన్ను కనీస బ్యాలెన్స్గా తప్పనిసరిగా ఉంచాలని నిబంధన తీసుకొచ్చారు.100% ఆటో సెటిల్మెంట్సభ్యులకు ఎక్కువ సౌలభ్యం కల్పించేందుకు సెటిల్మెంట్ నిబంధనలను ఈపీఎఫ్వో సరళీకృతం చేసింది. ఎటువంటి డాక్యుమెంటేషన్ అవసరం లేకుండా, పాక్షిక ఉపసంహరణ కోసం క్లెయిమ్ల 100% ఆటో సెటిల్మెంట్ను ఈపీఎఫ్వో అనుసరించనుంది.ముందస్తు ఫైనల్ సెటిల్మెంట్, పెన్షన్ ఉపసంహరణపదవీ విరమణ కాలం తీరకముందే ముందస్తు ఈపీఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ను పొందే వ్యవధిని ప్రస్తుతం ఉన్న 2 నెలల నుండి 12 నెలలకు, పైనల్ పెన్షన్ ఉపసంహరణను 2 నెలల నుండి 36 నెలలకు పెంచాలని సీబీటీ నిర్ణయించింది.ఇదీ చదవండి: ఇన్ఫోసిస్ ఉద్యోగులకు తీపి కబురు.. చిగురించిన ఆశలు -
EPFO: ఇక 100% ఈపీఎఫ్ విత్డ్రా!
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) సభ్యులు ఇకపై తమ ముఖ్యమైన అవసరాల కోసం భవిష్యనిధి నుంచి నూరు శాతం (తన వాటా, యాజమాన్యం వాటాలు) ఉపసంహరించుకోవచ్చు. కేంద్ర కారి్మక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన భేటీ అయిన ఈపీఎఫ్వో సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సభ్యుల జీవనాన్ని సులభతరం చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంది. పాక్షిక ఉపసంహరణల పరిమితులను సైతం పెంచింది. 13 క్లిష్టమైన నిబంధనలన్నింటినీ కలిపేసి ఒక్కటిగా మార్చింది. నిత్యావసరాలు (అనారోగ్యం, విద్య, వివాహ అవసరాలను), గృహావసరాలు, ప్రత్యేక అవసరాలు పేరుతో ఉపసంహరణలను మూడు కేటగిరీలుగా వర్గీకరించింది. విద్యావసరాల కోసం 10 పర్యాయాలు భవిష్యనిధిని వెనక్కి తీసుకోవచ్చు. వివాహం కోసం 5 పాక్షిక ఉపసంహరణలకు ఇకపై అనుమతి ఉంటుంది. ఇప్పటి వరకు ఈ రెండింటి కోసం మూడు పర్యాయాలు మాత్రమే అనుమతించేవారు. ఇకపై పాక్షిక ఉపసంహరణలకు 12 నెలల కనీస సర్వీస్ (పదవీకాలం) ఉంటే సరిపోతుంది. ప్రత్యేక సందర్భాల్లో భవిష్యనిధి ఉపసంహరణకు గాను.. ప్రకృతి విపత్తు, సంస్థల మూసివేత/ఉద్యోగుల తొలగింపు, ఉపాధి లేకుండా ఉండడం, అంటువ్యాధి తదితర వాటిల్లో ఒక కారణాన్ని పేర్కొనాల్సి వచ్చేది. దీంతో ఉపసంహరణ దరఖాస్తులు కొన్ని సందర్భాల్లో తిరస్కరణకు గురయ్యేవి. ఇకపై ప్రత్యేక అవసరాల కోసం చేసే పాక్షిక ఉపసంహరణకు కారణాన్ని వెల్లడించనక్కర్లేదు. సభ్యులు తమ చందా మొత్తంలో 25% కనీస బ్యాలన్స్గా అన్ని సమయాల్లోనూ కొనసాగించాల్సి ఉంటుంది. తద్వారా అధిక వడ్డీ రేటు ప్రయోజనం, కాంపౌండింగ్ ప్రయోజనాలను పొందే వీలుంటుంది. ఒకవైపు తాత్కాలిక అవసరాలకు నిధుల సాయం పొందుతూ.. మరోవైపు రిటైర్మెంట్ సమయానికి కొంత నిధిని సమకూర్చుకునేందుకు వీలుగా దీన్ని ప్రవేశపెట్టారు. మిగిలిన వాటా నుంచి 100% తీసేసుకోవచ్చు. ఈపీఎఫ్వో తుది సెటిల్మెంట్ను ప్రస్తుతం రెండు నెలల ముందుగా పొందడానికి అవకాశం ఉండగా, దీన్ని 12 నెలలకు పెంచారు. తుది పింఛను ఉపసంహరణ గడువును సైతం 2 నెలల నుంచి 36 నెలలకు పొడిగించారు. ఈపీఎస్ 95 పింఛనుదారులు తమ ఇంటి నుంచే డిజిటల్ లైఫ్ సరి్టఫికెట్ను సమర్పించేందుకు వీలుగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుతో అవగాహన ఒప్పందానికి ఈపీఎఫ్వో సెంట్రల్ బోర్డు ఆమోదం తెలిపింది. ఇందుకు పెన్షనర్లు ఒక్కొక్కరు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. జరిమానాలను క్రమబద్దీకరించడం ద్వారా వివాదాలను తగ్గించేందుకు ‘విశ్వాస్ స్కీమ్’ను ఈపీఎఫ్వో తీసుకొచి్చంది. పీఎఫ్ చందాలను సంస్థలు ఆలస్యంగా జమ చేయడం జరిమానాలకు ప్రధాన కారణమని కేంద్ర కార్మిక శాఖ పేర్కొంది. 2025 మే నాటికి ఇలాంటి జరిమానాలు, నష్ట పరిహారం మొత్తం రూ.2,406 కోట్లుగా ఉంది. విశ్వాస్ స్కీమ్ కింద జరిమానా మొత్తాన్ని ఫ్లాట్ 1%కి తగ్గించారు. కాగా, ఈపీఎఫ్వో డెట్ పెట్టుబడుల నిర్వహణకు నాలుగు ఫండ్ మేనేజర్ల (హెచ్డీఎఫ్సీ ఏఎంసీ, ఆదిత్య బిర్లా ఏఎంసీ, యూటీఐ ఏఎంసీ, ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్) ఎంపికకు సైతం సెంట్రల్ బోర్డు ఆమోదముద్ర వేసింది.ఇదీ చదవండి: బంగారం, వెండి కొనాల్సింది అప్పుడే: కమొడిటీ గురు జిమ్ రోజర్స్ -
అన్ని ఎస్ఎంఎస్లు ఇక రావా? ఆర్బీఐని ఆశ్రయించిన బ్యాంకులు
కొన్ని ఆన్లైన్ లావాదేవీలకు (Digital transactions) సంబంధించిన ఎస్ఎంఎస్ సందేశాలను (SMS Alerts) వినియోగదారులకు పంపడాన్ని బ్యాంకులు భవిష్యత్తులో నిలిపేయవచ్చు. రూ.100 లోపు లావాదేవీలకు ఎస్ఎంఎస్ అలర్టులు పంపడాన్ని నిలిపివేసేందుకు అనుమతినివ్వాలని కోరుతూ బ్యాంకులు ఆర్బీఐ (RBI) ని ఆశ్రయించాయి.ఆన్ లైన్లో ముఖ్యంగా యూపీఐ ద్వారా పదీ.. ఇరవై.. ఇలా చిల్లర పేమెంట్లు పెరిగిపోయాయి. వీటికి సంబంధించిన ఎస్ఎంఎస్ నోటిఫికేషన్లు వినియోగదారులను ముంచెత్తుతున్నాయి. దీంతో అలర్ట్ వ్యవస్థ మందగమనానికి దారితీసిందని, దీంతో కొన్నిసార్లు, కస్టమర్లు పెద్ద లావాదేవీలకు సంబంధించిన సందేశాలను కూడా కోల్పోతున్నారని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ ఎకనమిక్స్ టైమ్స్ కథనం పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులతో అంతర్గత సంప్రదింపులు జరిపిన తరువాత గత నెలలో ఆర్బీఐకి ఈ విజ్ఞప్తి చేశామని ఓ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ చెప్పారు. ఎస్ఎంఎస్లు నిలిపేసిన పక్షంలో ప్రతిపాదిత ప్రత్యామ్నాయ రక్షణలు ఇంకా వినియోగదారులకు తెలియజేయాల్సి ఉందని మరొక బ్యాంకింగ్ అధికారి తెలిపారు. ఒక వేళ రూ.100 పరిమితి ఉన్న తక్కువ విలువ లావాదేవీల అలర్టులు కావాలంటే ఎస్ఎంఎస్లు కాకుండా బ్యాంకింగ్ యాప్లు లేదా ఈమెయిల్స్ లో నోటిఫికేషన్ల ద్వారా వాటిని పొందవచ్చని వివరించారు.ప్రస్తుతం ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. బ్యాంకులు అన్ని ఎలక్ట్రానిక్ లావాదేవీలపై ఎస్ఎంఎస్ అలర్డుల కోసం కస్టమర్లతో నుంచి నమోదు చేయించుకోవాలి. అయితే ఈమెయిల్ అలర్టులు ఐచ్ఛికం. అంటే ఎస్ఎంఎస్లు ఆటోమేటిక్గా వెళ్తాయి. కానీ ఈమెయిల్ అలర్ట్ లు ఎంచుకున్న వారికి మాత్రమే వెళతాయి.ఒక్క ఎస్ఎంఎస్ పంపడానికి సుమారు 20 పైసలు ఖర్చవుతుంది. ఇది సాధారణంగా వినియోగదారుల మీదే పడుతుంది. కానీ కొన్ని బ్యాంకులు మాత్రం ఈ ఖర్చును తామే భరిస్తున్నాయి. అదే ఈమెయిల్ అలర్టులకు అయితే పెద్దగా ఖర్చు ఉండదు. -
బంగారం, వెండి కొనాల్సింది అప్పుడే..
బంగారం, వెండి కొనే విషయంలో భారతీయ మహిళలను చూసి నేర్చుకోవాలంటున్నారు ప్రముఖ కమోడిటీ ఇన్వెస్టర్ జిమ్ రోజర్స్. పెట్టుబడి పాఠాలకు సంబంధించి ఆయన రాసిన పుస్తకం ‘స్ట్రీట్ స్మార్ట్స్: అడ్వెంచర్స్ ఆన్ ది రోడ్ అండ్ ఇన్ ది మార్కెట్స్’ (Street Smarts: Adventures on the Road and in the Markets) చాలా ప్రసిద్ధి చెందింది.ఇటీవల జిమ్ రోజర్స్ (Jim Rogers) బిజినెస్ టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను బంగారం, వెండిని కలిగి ఉన్నానని, కానీ వాటిని అమ్మే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుత ధరల వద్ద కొత్తగా కొనుగోలు చేసే ఆలోచన తనకు లేకపోయినా, ధరలు తగ్గితే మరింత కొనడానికి ఆసక్తిగా ఉన్నానని తెలిపారు.రోజర్స్ పెట్టుబడి తత్వం ఇదే..తాను మార్కెట్ భవిష్యత్తు గురించి లెక్కలు వేస్తూ కూర్చోనని, ఎప్పుడైతే వస్తువుల ధరలు పడిపోతాయో అప్పుడే ఎక్కువగా కొనుగోలు చేస్తానని జిమ్ రోజర్స్ చెప్పుకొచ్చారు. బంగారం (gold), వెండి (silver) వంటి విలువైన లోహాలు తన వద్ద ఉన్నాయని, అవి తన పిల్లలకు మిగలాలని ఆశిస్తున్నానని చెప్పారు. ఇటీవల వెండి ధరలు దూసుకుపోతున్న తరుణంలో తానూ కొంత వెండి కొనుగోలు చేసినట్టు పేర్కొన్నారు.ప్రపంచంలోని చాలా దేశాలు భారీగా డబ్బును ముద్రిస్తున్నాయి. అప్పుల్లో కూరుకుపోయాయి. ఈ నేపథ్యంలో బంగారం వంటి లోహాలు కరెన్సీ డీ-వాల్యుయేషన్ నుండి తమను తాము రక్షించుకునేందుకు మంచి మార్గమని రోజర్స్ చెప్పారు. ‘భారతీయ మహిళలు శతాబ్దాలుగా బంగారం, వెండి కొనుగోలు చేస్తున్నారు. వారికి ఉన్న తెలివితేటలు నేనూ నేర్చుకుంటున్నాను’ అని ఉదహరించారు.మార్కెట్లపై దృష్టిచైనా మార్కెట్లో కొంత ఈక్విటీ ఎక్స్పోజర్ ఉన్నప్పటికీ, తన ఇతర పోర్ట్ఫోలియోలో చాలా భాగం విక్రయించానన్నారు. ఇటీవల స్టాక్ మార్కెట్లు బలంగా ఉండటాన్ని చూస్తే, తన అభిప్రాయం ప్రకారం ఇది అమ్మే సమయం అని చెప్పారు. జిమ్ రోజర్స్ తరచూ మార్కెట్లో వేచి చూసే పెట్టుబడిదారుల సరసన నిలబడతారు. వారు చెబుతున్నది స్పష్టం.. ధరలు పడితేనే కొనండి, ఎప్పుడూ ట్రెండ్ను అనుసరించవద్దు. బంగారం, వెండిలో దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టాలన్నది ఆయన సలహా.ఇదీ చదవండి: ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ నుంచి 10 శక్తివంతమైన డబ్బు పాఠాలు -
టీడీఎస్ రూల్స్.. కొత్త సెక్షన్: రూ. 20వేలు దాటితే..
2025 బడ్జెట్లో ప్రవేశ పెట్టుబడి, చట్టంలో చోటు చేసుకున్న టీడీఎస్కి సంబంధించిన అంశాల రూల్స్ గురించి ఈ వారం తెలుసుకుందాం. ఇవన్నీ 2025–26 ఆర్థిక సంవత్సరానికి అంటే నడుస్తున్న సంవత్సరానికి అమల్లోకి వచ్చాయి. 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లో పెట్టారు. భాగస్వామ్య సంస్థల్లో భాగస్వాములకు జీతం లేదా పారితోషికం మొదలైనవి ఇవ్వడం పరిపాటి. సెక్షన్ 194 క్యూ కొత్తగా వచ్చింది. సంస్థ చేసే చెల్లింపులు సంవత్సరానికి రూ. 20,000 దాటితే టీడీఎస్ వర్తిస్తుంది.ముఖ్యమైన అంశాలు..2025 ఏప్రిల్ 1 నుంచి అమలుచెల్లింపులు అంటే జీతం, పారితోషికం, వడ్డీ, కమీషన్, బోనస్. సంస్థ నుంచి పార్ట్నర్స్ ఇలా డ్రా చేస్తుంటారు. ఒకప్పుడు వీటిని టీడీఎస్ పరిధిలోకి తీసుకురాలేదు. 2025 ఏప్రిల్ 1 నుంచి వీటన్నింటినీ టీడీఎస్ పరిధిలోకి తెచ్చారు.భాగస్వామ్య సంస్థలు, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్లకు వర్తిస్తుంది.దీనివల్ల కాంప్లయెన్స్, పారదర్శకత పెరుగుతుందని అంటున్నారు. నిజానికి పిలక ముందే దొరుకుతుంది. ముందర కాళ్లకు బంధం.పైన చెప్పిన ఐదు చెల్లింపులు వెరసి .. ఒక్కొక్కటి కాదు.. అన్నీ జాయింటుగా కలిపి సంవత్సరకాలంలో రూ. 20,000 దాటితే టీడీఎస్ వర్తిస్తుంది. ఎన్నో విషయాల్లో ఒక్కొక్క చెల్లింపునకు ఒక్కొక్క పరిమితి ఉంది. కానీ ఇక్కడ అన్నీ కలిపి రూ. 20,000 దాటితే, టీడీఎస్ అని అంటున్నారు. ఇది ఇటువంటి చెల్లింపుల మీద ఒక కన్నేసి చూడటమా లేదా కన్నెర్ర చేయడమా తెలియడం లేదు.పార్ట్నర్స్ సాధారణంగా విత్డ్రా చేస్తుంటారు. దీన్నే సొంత వాడకాలని అంటారు. ఇటువంటి విత్డ్రాయల్స్ మీద ఎటువంటి టీడీఎస్ లేదు. ఇక నుంచి ట్యాక్స్ ప్లానింగ్పరంగా ఆలోచించి, విత్డ్రాయల్స్ చేయండి.చెల్లింపులు చేతికి రావడం, లేదా అకౌంటుకి క్రెడిట్ చేయడం.. ఈ రెండు పద్ధతుల్లో ఏది ముందు జరిగితే అప్పుడు టీడీఎస్ వర్తిస్తుంది.టీడీఎస్ రేటు ఎంత అంటే 10 శాతం. వెరసి చెల్లింపులు రూ. 20,000 దాటితే 10 శాతం చొప్పున టీడీఎస్ చేసి, గవర్నమెంట్ ఖాతాలో జమ చేయాల్సిందే.వెరసి చెల్లింపులు సంవత్సరానికి రూ. 20,000 దాటకపోతే టీడీఎస్ రూల్స్ వర్తించవు.సెక్షన్ 194 క్యూ ప్రకారం.. జీతాలు, పారితోషికం, కమీషన్, బోనస్, వడ్డీ మొదలైన చెల్లింపులు టీడీఎస్ పరిధిలోకి వస్తాయి.పార్ట్నర్స్కి వారి మూలధనం మీద లేదా అప్పు మీద వడ్డీ ఇచ్చే సంప్రదాయం ఉంది. అందరు పార్ట్నర్స్ ఒక సమాన మొత్తం క్యాపిటల్గా పెట్టలేరు. అలాగే, అందరూ అప్పు ఇవ్వొచ్చు.. ఇవ్వకపోవచ్చు. అదనంగా పెట్టుబడి చేసినందుకు.. ఆదనపు రాబడే ఈ వడ్డీ.పని చేసినందుకు జీతం ఉంటుంది. స్లీపింగ్ పార్ట్నర్స్కి జీతం ఉండదు.అలాగే పారితోషికం లాభాల ఆర్జనను బట్టి ఉంటుంది. అలాగే బోనస్సు.. అలాగే కమీషనూ. అంటే బుక్స్ క్లోజ్ చేసి లాభాల్ని తేల్చాలి. మార్చి 31వి వెంటనే తేల్చాలి. గడువుతేదీ ఏప్రిల్ 30. అందుకే బుక్స్ వెంటనే రాయాలి. ఈ కొత్త అంశాల వల్ల బుక్ రాసే ప్రక్రియ సజావుగా, కరెక్టుగా, సకాలంలో పూర్తవ్వాలి. ఎప్పుడో రిటర్ను వేసే ముందు తీరిగ్గా అకౌంట్లు రాయడం, ఫైనలైజ్ చేయడం కుదరదు.టీడీఎస్ రికవరీ, చెల్లింపులు.. బుక్స్లో కనిపిస్తాయి.రిటర్నులు దాఖలు చేయాలి. చివరిగా, పార్ట్నర్స్కి చెల్లింపులు టీడీఎస్ మేరకు తగ్గుతాయి. క్యాష్ఫ్లోలు తగ్గుతాయి. సంస్థలో టీడీఎస్ బాధ్యతలు పెరుగుతాయి. ఈ మేరకు సంస్థలు సిద్ధం కావాలి. -
లాభాన్ని నష్టంతో సర్దుబాటు చేసుకోవచ్చా?
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో నాకు రూ.1.25 లక్షలకు పైగా దీర్ఘకాల మూలధన లాభం (ఎల్టీసీజీ) వచ్చింది. అదే సమయంలో స్వల్పకాల మూలధన నష్టం కూడా ఎదురైంది. ఈ నష్టాన్ని సర్దుబాటు చేసుకుని తక్కువ పన్ను చెల్లించడం సాధ్యపడుతుందా? – సత్యనారాయణ గొట్టిపాటిఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో దీర్ఘకాల మూలధన లాభం వచ్చినట్లయితే.. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.25 లక్షలకు మించిన మొత్తంపై 12.5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈక్విటీ పెట్టుబడులపై స్వల్పకాల మూలధన నష్టం (ఏడాదిలోపు విక్రయించినప్పుడు వచ్చే మొత్తం/ఎస్టీసీఎల్)) ఎదురైతే.. అప్పుడు ఎల్టీసీజీ నుంచి ఎస్టీసీఎల్ను మినహాయించుకోవచ్చు. దీనివల్ల నికరంగా చెల్లించాల్సిన పన్ను భారం తగ్గిపోతుంది. ఈక్విటీ పెట్టుబడిని కొనుగోలు చేసిన తేదీ నుంచి ఏడాది నిండిన తర్వాత విక్రయించనప్పుడు వచ్చే లాభం/నష్టాన్ని దీర్ఘకాలంగా, ఏడాది నిండకుండా విక్రయించినప్పుడు వచ్చే మొత్తాన్ని స్వల్పకాల మూలధన లాభం/నష్టం కింద పరిగణిస్తారు.ఉదాహరణకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో రూ.2 లక్షల దీర్ఘకాల లాభం వచ్చిందని అనుకుందాం. రూ.1.25 లక్షల వరకు పన్ను లేదు. అప్పుడు మిగిలిన రూ.75,000పై 12.5 శాతం చొప్పున రూ.9,375 పన్ను చెల్లించాలి. ఒకవేళ అదే ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 స్వల్పకాల నష్టం వచ్చిందనుకోండి. నికర దీర్ఘకాల లాభం రూ.75వేలలో ఈ మొత్తాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు. అప్పుడు నికర దీర్ఘకాల మూలధన లాభం రూ.25,000కు తగ్గుతుంది. దీనిపై 12.5 శాతం రేటు ప్రకారం రూ.3,125 పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఒకవేళ ఈక్విటీ ఫండ్స్లో పెట్టుబడులపై వచ్చిన నష్టం దీర్ఘకాలానికి సంబంధించి అయితే.. అప్పుడు దీర్ఘకాల మూలధన లాభంతోనే సర్దుబాటు చేసుకోగలరు. అదే స్వల్పకాల మూలధన నష్టాన్ని స్వల్పకాల మూలధన లాభం, దీర్ఘకాల మూలధన లాభంతోనూ సర్దుబాటు చేసుకోవచ్చు. ఒకవేళ స్వల్పకాల నష్టం అన్నది స్వల్పకాల లాభం/దీర్ఘకాల మూలధన లాభం మించి ఉంటే.. అప్పుడు సర్దుబాటు చేసుకోగా మిగిలిన నికర నష్టాన్ని ఎనిమిది ఆర్థిక సంవత్సరాల పాటు క్యారీ ఫార్వార్డ్ (భవిష్యత్తు లాభాల్లో సర్దుబాటు) చేసుకోవచ్చు. ఇదీ చదవండి: మధ్యతరగతి వారికి వారెన్ బఫెట్ ఆర్థిక సలహా మ్యూచువల్ ఫండ్స్లో సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తున్నాను. నాకు ఇంటి లోన్ ఉంది. మరో 5 ఏళ్లకు పూర్తవుతుంది. గ్రాట్యుటీ రూపంలో వచ్చే మొత్తంతో గృహ రుణాన్ని ముందుగానే తీర్చివేయాలా లేక మెరుగైన రాబడి వచ్చే చోట ఇన్వెస్ట్ చేసుకోవాలా? – జ్యోతిర్మయిగృహ రుణాన్ని కొనసాగించుకోవచ్చు. గృహ రుణం కాకుండా ఇతర రుణాలు ఉంటే, పెట్టుబడుల కంటే ముందు వాటిని తీర్చేయడం మంచి నిర్ణయం అవుతుంది. గృహ రుణం కొనసాగించడం వల్ల నష్టం లేదనడానికి పలు కారణాలు ఉన్నాయి. అద్దె రూపంలో కొంత ఆదా చేస్తుంటారు. రుణంపై వడ్డీ చెల్లింపులకు పన్ను ప్రయోజనం ఉంది. పైగా చాలా తక్కువ రేటుకు వచ్చే రుణం ఇది. ఈ రుణం రేటుతో పోలిస్తే దీర్ఘకాలంలో పెట్టుబడులపై అధిక రాబడులు వస్తాయి. కనుక గృహ రుణం లాభదాయకమే. ఒకవేళ గృహ రుణాన్ని పూర్తిగా తీర్చివేయడం ద్వారా నిశ్చింతగా ఉండొచ్చని భావిస్తే లేదా భవిష్యత్తు ఆదాయం విషయంలో అనిశ్చితిగా ఉంటే అలాగే ముందుకెళ్లొచ్చు. గ్రాట్యుటీ ద్వారా వచ్చే మొత్తంతో ఆ పనిచేయవచ్చు.


