Personal Finance
-
ఆటోమెటిక్గా కట్ అయ్యే డబ్బులు.. ఆర్బీఐ కొత్త అప్డేట్
డిజిటల్ చెల్లింపుల భద్రతను మరింత కఠినతరం చేస్తూ ఈ-మాండేట్ (e-Mandate) నిబంధనలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా రూ. 15,000 దాటే ఆటో-డెబిట్ లావాదేవీలపై పర్యవేక్షణను పెంచుతూ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. రికరింగ్ (పునరావృత) చెల్లింపులకు సంబంధించి పాత నిబంధనలను సవరిస్తూ, కస్టమర్ల రక్షణ కోసం కొత్త ఫ్రేమ్వర్క్ను ప్రవేశపెట్టింది.మార్పులు ఏమిటంటే..కొత్త నిబంధనల ప్రకారం, ఆటో-డెబిట్ లావాదేవీలకు సంబంధించి రూ. 15,000 పరిమితిని ప్రామాణికంగా తీసుకున్నారు.రూ. 15,000 లోపు: చిన్న మొత్తాల చెల్లింపులు (OTT సబ్స్క్రిప్షన్లు, ఫోన్ బిల్లులు వంటివి) ఎటువంటి ఓటీపీ (OTP) అవసరం లేకుండానే ఆటోమేటిక్గా జరిగిపోతాయి.రూ. 15,000 పైన: లావాదేవీ విలువ రూ. 15,000 దాటితే మాత్రం ఖచ్చితంగా అదనపు ప్రామాణీకరణ అవసరమవుతుంది. అంటే కస్టమర్ ఓటీపీని ఎంటర్ చేస్తేనే పేమెంట్ పూర్తవుతుంది.అయితే బీమా ప్రీమియంలు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, క్రెడిట్ కార్డు బిల్లుల వంటి వాటికి రూ. 15,000 నుండి రూ. 1 లక్ష వరకు కొన్ని ప్రత్యేక మినహాయింపులు ఉంటాయి.ఈ నిబంధనలు యూపీఐ (UPI) ఆటో-పే, డెబిట్/క్రెడిట్ కార్డులు, ప్రీపెయిడ్ వాలెట్లకు వర్తిస్తాయి.ఈ-మాండేట్ సేవలను సెటప్ చేయడానికి లేదా వినియోగించుకోవడానికి బ్యాంకులు కస్టమర్ల నుండి ఎటువంటి అదనపు రుసుము వసూలు చేయకూడదు.అనధికారిక లావాదేవీలు జరిగితే, నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలో రిపోర్ట్ చేస్తే కస్టమర్ బాధ్యత పరిమితంగా ఉంటుంది. అంటే మోసపూరిత లావాదేవీల నుండి రక్షణ లభిస్తుంది.ముందస్తు హెచ్చరికలు తప్పనిసరికస్టమర్ల ప్రమేయం లేకుండా ఖాతా నుండి డబ్బు కట్ అవ్వకుండా ఉండేందుకు ఆర్బీఐ 'అలర్ట్ సిస్టమ్'ను తప్పనిసరి చేసింది. నగదు డెబిట్ అయ్యే సమయానికి కనీసం 24 గంటల ముందే కస్టమర్కు మెసేజ్ లేదా మెయిల్ పంపాలి. ఇందులో మర్చంట్ పేరు, మొత్తం, డెబిట్ తేదీ స్పష్టంగా ఉండాలి. నోటిఫికేషన్ అందిన తర్వాత కస్టమర్ ఆ చెల్లింపును వద్దనుకుంటే రద్దు చేసే లేదా నిలిపివేసే అవకాశం ఉంటుంది. అలాగే నగదు డెబిట్ అయిన వెంటనే ఫిర్యాదుల పరిష్కార వివరాలతో కూడిన మెసేజ్ పంపాల్సి ఉంటుంది. -
వారెన్ బఫెట్ చెప్పే ‘కోటీశ్వరులయ్యే’ రహస్యాలివే!
పెట్టుబడి ప్రపంచంలో 'లెజెండ్'గా పేరొందిన వారెన్ బఫెట్.. కేవలం 11 ఏళ్ల వయస్సులో మూడు షేర్లతో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. నేడు రూ. 11 లక్షల కోట్లకు పైగా సంపదతో ప్రపంచ కుబేరులలో ఒకరిగా నిలిచారు. మరి అతి తక్కువ డబ్బుతో పెట్టుబడి మొదలుపెట్టేవారికి ఆయన ఇచ్చే సలహాలేంటి? సామాన్యులు కూడా బఫెట్ రూట్ లో సంపదను ఎలా సృష్టించవచ్చో తెలుసుకుందాం.చిన్న మొత్తంతోనే శ్రీకారం చుట్టండిచాలామంది తమ దగ్గర లక్షలాది రూపాయలు ఉంటేనే షేర్ మార్కెట్లోకి రావాలని అనుకుంటారు. కానీ బఫెట్ దృష్టిలో ఇది తప్పు. మీ దగ్గర రూ. 500 లేదా రూ. 1000 ఉన్నా సరే, పెట్టుబడిని తక్షణమే ప్రారంభించాలి. "సమయం మీ వైపు ఉంటే, చిన్న మొత్తమే భవిష్యత్తులో కొండంత సంపదగా మారుతుంది" అని ఆయన పదే పదే చెబుతుంటారు.ఇండెక్స్ ఫండ్స్: సామాన్యుల ఆయుధంఏ షేర్ కొనాలి? ఏ కంపెనీ బాగుంటుంది? అన్న అవగాహన లేని వారికి బఫెట్ సూచించే ఉత్తమ మార్గం 'లో-కాస్ట్ ఇండెక్స్ ఫండ్స్'. కంపెనీలను విశ్లేషించే సమయం, నైపుణ్యం లేని వారికి ఇవి అత్యంత సురక్షితమైనవని ఆయన నమ్ముతారు. అమెరికాలో S&P 500 లాగా, భారత్లో నిఫ్టీ 50 (Nifty 50) వంటి ఇండెక్స్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా మార్కెట్ వృద్ధిలో భాగస్వాములు కావచ్చు.తెలివితేటలే అసలైన పెట్టుబడితెలివితేటలే అసలైన పెట్టుబడి అని వారెన్ బఫెట్ నమ్ముతారు. అందుకే జ్ఞానం కోసం అనే పుస్తకాలు ఆయన తిరగేస్తుంటారు. ఇప్పటికీ రోజుకు కనీసం 500 పేజీలు చదువుతారు. "అన్నింటికంటే ఉత్తమమైన పెట్టుబడి మీ జ్ఞానం మీద పెట్టేదే" అని ఆయన అంటారు. పెట్టుబడులు పెట్టేవారు కంపెనీల వార్షిక నివేదికలు చదవడం అలవాటు చేసుకోవాలి. వ్యాపార నమూనాలను అర్థం చేసుకోవాలి. బెంజమిన్ గ్రాహం రాసిన 'ద ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్' వంటి పుస్తకాలు చదవాలని ఆయన సూచిస్తుంటారు.కాంపౌండింగ్ మాయాజాలంబఫెట్ సంపదలో 90 శాతం ఆయనకు 60 ఏళ్లు దాటిన తర్వాతే వచ్చింది. దీనికి కారణం 'చక్రవడ్డీ' (Compounding). మీరు ఎంత త్వరగా పెట్టుబడి మొదలుపెట్టి, దాన్ని ఎంత కాలం కొనసాగిస్తారో, మీ డబ్బు అంత వేగంగా రెట్టింపు అవుతుంది. అందుకే "పెట్టుబడి పెట్టడానికి నిన్నటి కంటే ఈరోజే సరైన సమయం" అని ఆయన చెబుతారు.కేవలం ఎఫ్డీ(FD)లు, సేవింగ్స్ అకౌంట్లలో డబ్బు దాచుకుంటే ద్రవ్యోల్బణాన్ని అధిగమించడం కష్టం. ధనవంతులు కావాలంటే ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం అనివార్యమని బఫెట్ సిద్ధాంతం చెబుతోంది. తప్పులు చేయడం సహజం, కానీ వాటి నుండి నేర్చుకుని క్రమశిక్షణతో పెట్టుబడి పెడితే ఎవరైనా ‘కోటీశ్వరులు’ కావచ్చని బఫెట్ సూత్రం నిరూపిస్తోంది. -
ఈ ఆర్థిక సంవత్సరంలో ‘సీనియర్ సిటిజన్లు’
కొత్త చట్టం, కొత్త రూల్సు అమలులోకి వచ్చాయి. ఎన్నెన్నో మార్పులు, చేర్పులు, కూర్పులు. ప్రాథమికమైన అంశాలు మారకపోయినా కొన్నింటిలో మార్పులు వచ్చాయి. కొత్త ఆర్థిక సంవత్సరంలో కొత్త చట్టం, కొత్త రూల్స్ ప్రకారం కేవలం సీనియర్ సిటిజన్లకు వచ్చే మార్పులతో కలిపి అన్ని సంగతులు ఈ వారం తెలుసుకుందాం! ఎన్నిసార్లు చెప్పినా ముఖ్యమైనది కావున మళ్లీ మళ్లీ చెప్పే విషయం ఏమిటంటే ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ‘ఆర్థిక సంవత్సరం’ అమల్లోకి వస్తుంది. గతంలోలాగా, అసెస్మెంట్ సంవత్సరం, గత సంవత్సరం అనే పదాలుండవు. ఇటు అసెస్సీ గానీ అటు గవర్నమెంట్, మరెవరైనా గానీ ఒకే పదం వాడాలి. ఇక నుంచి ఎవరికీ ఎటువంటి తికమక ఉండదు. స్టాండర్డ్ డిడక్షన్ని రూ.50,000 నుంచి రూ.75,000 వరకు పెంచారు. ఈ డిడక్షన్ అటు పాత పద్దతిని అనుసరించే వారికైనా, ఇటు కొత్త పద్దతికి వెళ్లే వారికైనా వర్తిస్తుంది. 80డి కింద ప్రయోజనం కేవలం పాత పద్ధతిని ఎంచుకున్న వారికే వర్తిస్తుంది. ఆరోగ్య బీమా, ముందు జాగ్రత్త హెల్త్ చెకప్కి సంబంధించిన తగ్గింపు రూ.50,000 వరకు కొనసాగుతుంది. గత వారం ఎంతో వివరంగా చెప్పాము. కొత్త 15హెచ్ గురించి ... ఇప్పుడది 121గా మారింది. ఈ ఫారమ్ సబి్మట్ చేస్తే టీడీఎస్ చేయరు. చేయకపోతే టీడీఎస్ రివకరీ చేసి గవర్నమెంట్ ఖజానాకి చెల్లిస్తారు. సీనియర్ సిటిజన్ల ఆదాయం టాక్సబుల్ ఇన్కం. ఇప్పుడు దీని లిమిట్ రూ.12.75 లక్షలు అని చెప్పొచ్చు. ఇందులో స్టాండర్డ్ డిడక్షన్ రూ.75 వేలు. మీ ఆదాయం బ్యాంకు వడ్డీ కానీ, అద్దె మీద ఆదాయం కానీ, పెన్షన్ మీద ఆదాయం.. అన్నీ కలిపితే రూ.12.75 లక్షల దాటకపోతే వెంటనే ఫారమ్ 121 సంబంధిత అధికారులకు ఇవ్వండి. పన్ను రికవరీ ఉండదు. 75 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్లకు పాత చట్టం 194పి ప్రకారం మూడు షరతుల మీద రిటర్ను వేయనవసరం లేదు. ఈ అంశాలని చాలామంది అందరికీ అన్వయించుకుంటున్నారు. అది అపోహ. ఆ మూడు షరతులు ఏంటంటే... (ఎ) కేవలం పెన్షన్ ఉండాలి (బి) ఒక బ్యాంకు నుంచి మాత్రమే వడ్డీ ఉండవచ్చు (సి) అదే బ్యాంకు మొత్తం టీడీఎస్ రికవరీ అయ్యి గవర్నమెంట్ ఖజానాలో జమ అయ్యి ఉండాలి ఈ సదుపాయం కొనసాగుతుంది. ఇక ఫారాలు, గడువు తేదీ, అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపు బాధ్యతలు, సెల్ఫ్ అస్సెస్మెంట్ విధివిధానాలు ఇలాంటివన్నీ షరామామూలే. ఫైలింగ్ విధానంలో ఎటువంటి మార్పులు లేవు. ఇదివరకటి ఆలోచనే... ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు ఉండి ఎక్కువ సేవింగ్స్ ఉన్నవారికి పాత పద్ధతి. ఏ తగ్గింపులు ఉండవు. కొత్త పద్ధతిలో ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఎంపిక మీదే. కానీ ముందుగానే లెక్కలు వేసి ఆదాయం ఎంతో తేల్చి, నిర్ణయం తీసుకోండి. మిగతా ఎక్కడ ఎటువంటి మార్పులు లేవు. యథావిధిగా కొనసాగుతున్నాయి. ప్రీ ఫిక్స్డ్ ఫారమ్లలో చాలా సమాచారం ఉంటుంది. అయినా జాగత్ర వహించండి. సీనియర్ సిటిజన్ల సేవింగ్స్ స్కీంలో రూ.80 లక్షల ఇన్వెస్ట్ చేయొచ్చు. రూ.5,00,000 లోపు నికర ఆదాయం ఉన్నవారు మాన్యువల్గా రిటర్ను వేయవచ్చు. తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీ రిటైర్మెంట్ జీవితం, జీతం జాగ్రత్తగా గడపండి. -
విద్యార్థుల కోసం ప్రత్యేకమైన టర్మ్ ప్లాన్
నేడు ఎంతో మంది విద్యార్థులు రుణాలతో విదేశీ విద్య కోసం వెళుతున్న నేపథ్యంలో.. వారికంటూ ప్రత్యేకమైన టర్మ్ ప్లాన్ను టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చింది. విద్యా రుణం తీసుకున్న వారు విద్య పూర్తి చేసుకుని, ఉపాధి పొందిన వెంటనే తిరిగి చెల్లింపులు మొదలు పెట్టాల్సి వస్తుంది. ఒకవేళ ఆ లోపు విద్యార్థికి అనుకోనిది ఏదైనా జరిగితే ఆ రుణాన్ని చెల్లించాల్సిన భారం కుటుంబంపై పడుతుంది.ఈ ఇబ్బంది లేకుండా ఉండేందుకు టాటా ఏఐఏ ‘స్టూడెంట్ ఫోకస్డ్ టర్మ్ ప్లాన్’ను ప్రవేశపెట్టింది. 18–25 ఏళ్ల వయసులోని విద్యార్థులు దీన్ని తీసుకోవచ్చు. భారత్లో లేదా విదేశాల్లో గుర్తింపు పొందిన విద్యా కోర్సులో ప్రవేశం పొంది ఉండాలి. రూ.2 కోట్ల వరకు సమ్ ఇన్సూర్డ్తో ప్లాన్ తీసుకోవచ్చు. లేదా ఎంత మేర విద్యా రుణం తీసుకుంటే, అంత వరకే కవరేజీని ఎంపిక చేసుకోవచ్చు. పాలసీ కాల వ్యవధి పదేళ్ల పాటు ఉంటుంది. -
పింఛను రంగంలో ఎఫ్డీఐ పెంపు!
న్యూఢిల్లీ: పింఛను (పెన్షన్) రంగంలోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) పరిమితిని నూరు శాతానికి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) చట్టం, 2013కు సవరణలతో కూడిన బిల్లును వచ్చే వర్షాకాలం లేదంటే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.ప్రస్తుతం పింఛను రంగంలో 49 శాతం ఎఫ్డీఐకే పరిమితి ఉంది. ప్రభుత్వం ఇటీవలే బీమా రంగంలోనూ ఎఫ్డీఐని నూరు శాతానికి అనుమతించడం తెలిసిందే. అంతకుముందు వరకు 74 శాతం వరకు అనుమతించేవారు. తొలుత 2015లో బీమా రంగంలో ఎఫ్డీఐ పరిమితిని 49 శాతం నుంచి 74 శాతం పెంచుతూ.. బీమా చట్టం, 1938లో కేంద్ర సర్కారు సవరణలు తీసుకురావడం గమనార్హం.ప్రతిపాదిత పెన్షన్ చట్టం బిల్లులో ఎన్పీఎస్ ట్రస్ట్ను వేరు చేసే సవరణ కూడా ఉంటుందని ఆ వర్గాలు తెలిపాయి. ఎన్పీఎస్ను పీఎఫ్ఆర్డీఏ నుంచి వేరు చేసి, 15 మంది సభ్యుల బోర్డు నిర్వహణలో ఉంచనున్నట్టు చెప్పాయి. ఈ బోర్డులో మెజారిటీ సభ్యులు ప్రభుత్వం నుంచి ఉంటారని పేర్కొన్నాయి. -
ఇవి తెలియకుండా బంగారం కొంటే మీకే నష్టం!
భారతీయులకు బంగారం కేవలం ఆభరణం మాత్రమే కాదు, అది ఒక సెంటిమెంట్.. ఆపదలో ఆదుకునే ఆర్థిక భరోసా. అయితే, మీరు కష్టపడి సంపాదించిన డబ్బుతో కొనే బంగారం ఎంతవరకు స్వచ్ఛమైనది? ఆకర్షణీయమైన ఆఫర్ల వెనుక దాగున్న నాణ్యత లోపాలను ఎలా గుర్తించాలి? అనే సందేహం కలుగుతుందా? బంగారం కొనుగోలు చేసేటప్పుడు బీఐఓఎస్ హాల్మార్కింగ్, ఆరు అంకెల హెచ్యూఐడీ నంబర్ ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మెరిసేదంతా బంగారం కాదని గుర్తుంచుకోండి. మీ పెట్టుబడికి పూర్తి రక్షణ కల్పించే పక్కా బిల్లు రహస్యాలు, ఆధునిక పరీక్షల గురించి మరిన్ని వివరాలు చూద్దాం.హాల్మార్కింగ్: ఈ మూడు గుర్తులు ఉన్నాయా?ప్రస్తుతం విక్రయించే ప్రతి బంగారు ఆభరణంపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) నిబంధనల ప్రకారం హాల్మార్కింగ్ తప్పనిసరి. మీరు కొనే నగపై ఈ మూడు గుర్తులు ఉన్నాయో లేదో పరీక్షించండి.బీఐఎస్ లోగో: త్రిభుజాకారంలో ఉండే ఈ గుర్తు ఆ ఆభరణం ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉందని ధ్రువీకరిస్తుంది.బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో సూచిస్తారు.22K916: అంటే అది 22 క్యారెట్ల బంగారం, అందులో 91.6% స్వచ్ఛత ఉంటుంది.18K750: వజ్రాలు లేదా ఇతర విలువైన రాళ్లు పొదిగిన నగలకు సాధారణంగా 75% స్వచ్ఛత కలిగిన ఈ బంగారాన్ని వాడతారు.హెచ్యూఐడీ నంబర్ (హాల్మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్): ఇది అత్యంత ముఖ్యమైనది. ప్రతి ఆభరణానికి ఆరు అంకెలతో కూడిన ప్రత్యేక ఆల్ఫాన్యూమరిక్ కోడ్ (ఉదా: AZ1234) ఉంటుంది.బీఐఎస్ కేర్ యాప్తో డిజిటల్ వెరిఫికేషన్మీరు కొన్న నగ అసలైనదో కాదో తెలుసుకోవడం ఇప్పుడు చాలా సులభం. మీ స్మార్ట్ఫోన్లో ప్రభుత్వ అధికారిక బీఐఎస్ కేర్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. యాప్లోని ‘Verify HUID’ సెక్షన్లోకి వెళ్లి నగపై ఉన్న ఆరు అంకెల కోడ్ను ఎంటర్ చేయండి. వెంటనే ఆ నగను ఏ జ్యువెలర్ రిజిస్టర్ చేశారు? ఏ హాల్మార్కింగ్ సెంటర్ పరీక్షించింది? నగ స్వచ్ఛత ఎంత? వంటి వివరాలన్నీ స్క్రీన్పై కనిపిస్తాయి. షాపు వారు ఇచ్చే ట్యాగ్తో ఈ వివరాలను సరిపోల్చుకోండి.క్యారెట్ మీటర్, మ్యాగ్నెట్ టెస్ట్నగలను కట్ చేయకుండానే వాటిలోని లోహాల శాతాన్ని (బంగారం, వెండి, రాగి) తెలుసుకోవడానికి ఎక్స్ఆర్ఎఫ్ (X-Ray Fluorescence) మెషీన్లు వాడతారు. చాలా మంది పెద్ద వ్యాపారుల వద్ద ఇవి ఉంటాయి. కేవలం 30 సెకన్లలోనే ఇది రిజల్ట్ ఇస్తుంది. నగలను మీ ముందే స్కాన్ చేయమని అడగడం మీ హక్కు.మ్యాగ్నెట్ పరీక్ష: బంగారం అయస్కాంత పదార్థం కాదు. ఒకవేళ నగ అయస్కాంతానికి ఆకర్షితమైతే అందులో ఇనుము, నికెల్ లేదా కోబాల్ట్ వంటి ఇతర లోహాల కల్తీ ఉందని అర్థం.ట్యాక్స్ ఇన్వాయిస్ తప్పనిసరికొనుగోలు చేసిన తర్వాత వివరణాత్మకమైన టాక్స్ ఇన్వాయిస్ తీసుకోవడం మర్చిపోవద్దు. ఆ బిల్లులో వివరాలు స్పష్టంగా ఉండాలి.ప్రతి వస్తువు హెచ్యూఐడీ నంబర్.బంగారం బరువు, దాని స్వచ్ఛత.ఆ రోజు ఉన్న మార్కెట్ రేటు.తయారీ ఖర్చులు, జీఎస్టీ.ఇదీ చదవండి: డిమాండ్ భళా.. నిర్మాణాలు డీలా! -
సరిగా కొంటేనే.. బంగారం!
ధర ఎంతన్నా ఉండనివ్వండి. బంగారమనేది మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగం. తరతరాలుగా పుత్తడికి ప్రాధాన్యం పెరుగుతోందే తప్ప తగ్గటం లేదు. ఇంటింటా ఆభరణాల రూపంలో మురిపిస్తూనే, ఆర్థికంగా కూడా భరోసాను కల్పించే సాధనంగా పనికొస్తోంది. అయితే, అంతర్జాతీయ పరిణామాల దెబ్బతో ఒకసారి అయిదు వేలు పెరిగితే, ఇంకోసారి పదివేలు పడిపోయి.. బంగారం రేట్లు సృష్టిస్తున్న గందరగోళం అంతా ఇంతా కాదు.ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల ఎమోషనల్ కారణంతోనో, పెట్టుబడి కోసమో ఆభరణాలు, నాణేల రూపంలో కొనుక్కుని పెట్టుకున్న వారిలోను, కొనుక్కోవాలనుకుంటున్న వారిలోనూ ఆందోళన నెలకొంటోంది. ఈ నేపథ్యంలో క్రమంగా పుత్తడిని చూసే తీరు మారుతోంది. కేవలం ఆభరణంగానో లేదా భావోద్వేగాలతో ముడిపడిన ఆస్తిగానో చూడటం కాకుండా పెట్టుబడి కోణంలో చూసే ధోరణి పెరుగుతోంది. యువ ఇన్వెస్టర్లు తమ సౌకర్యార్థం, లిక్విడిటీ కోసం క్రమంగా ఈటీఎఫ్లు, డిజిటల్ గోల్డ్ వైపు మళ్లుతున్నారు. పుత్తడిని ఎమోషనల్గా కొనుక్కోవడం కాకుండా వ్యూహాత్మకంగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇదే సరైన విధానమన్నది విశ్లేషకుల మాట.తయారీ.. తరుగుతో కోత..మార్కెట్లో మెరుగైన ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నప్పటికీ, చాలా మంది ఇన్వెస్టర్లు జ్యుయలరీ రూపంలో కొన్న బంగారాన్ని కూడా పెట్టుబడిగానే పరిగణిస్తుంటారు. అనుబంధం, సంప్రదాయాలపరంగా ఆభరణాలు, నాణేల రూపంలో బంగారానికి ఎంతో విలువ ఉన్నప్పటికీ, ఆర్థిక కోణంలో చూస్తే మాత్రం భౌతికరూపంలోని పసిడి కొనుగోలు విధానంలో లోటుపాట్లు ఎక్కువ. తయారీ చార్జీల కారణంగా వీటి విలువ కొనుక్కోగానే 10–15 శాతం తగ్గిపోతుంది. రూ. 1 లక్ష విలువ చేసే బంగారు ఆభరణాన్ని కొన్నప్పుడు, సాధారణంగా రూ. 10,000 నుంచి రూ. 15,000 వరకు మేకింగ్ చార్జీల కింద పోతుంది. అంటే మనం వాస్తవానికి రూ. 85,000–90,000 విలువ చేసిన బంగారమే కొన్నట్లవుతుంది. ఇక మళ్లీ రీసేల్ చేయాలంటే తరుగు అంటూ తీసేస్తారు. దీంతో సదరు బంగారు ఆభరణంపై వచ్చే రాబడి మరింత తగ్గిపోయినట్లవుతుంది. ఇదిగాకుండా వీటిని సురక్షితంగా భద్రపర్చుకోవడం మరో ఎత్తు. ఇక తిరిగి విక్రయించినప్పుడు, రేట్లు భారీగా పెరిగితే తప్ప, రీసేల్ విలువ తక్కువే వస్తుంది. ఆ రకంగా పెట్టుబడుల కోణంలో చూస్తే ఇది అంత లాభసాటి వ్యవహారంగా ఉండదు.పసిడిపై మళ్లీ ఫోకస్దేశ, విదేశ పరిణామాలతో ఇటీవలి కాలంలో పసిడికి మళ్లీ ప్రాధాన్యం పెరిగింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ఆర్థిక అనిశి్చతి, ఈక్విటీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతుండటం, కరెన్సీ బలహీనపడుతుండటంలాంటి అంశాలు మళ్లీ బంగారంపై ఇన్వెస్టర్లలో ఆసక్తిని పెంచుతున్నాయి. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో పసిడి సురక్షితమైన పెట్టుబడి సాధనం పాత్రను పోషిస్తుంది. మిగతా ఆర్థిక సాధనాలు ఒడిదుడుకులకు లోనవుతున్నప్పుడు ఇది స్థిరత్వాన్ని అందిస్తుంది. ఇదీ... నయా రూట్ఇలాంటివన్నీ చూశాకేనేమో... ఇపుడు పుత్తడిలో పెట్టుబడులు పెట్టే విధానంలో గణనీయంగా మార్పులొచ్చాయి. గోల్డ్ ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) ప్రత్యామ్నాయంగా తెరపైకి వచ్చాయి. పసిడి ధరలకు అనుగుణంగా ఉండే ఈ ఈటీఎఫ్లను షేర్లలాగానే స్టాక్ ఎక్స్ఛేజీల్లో కొనుక్కోవచ్చు. అమ్ముకోవచ్చు. వీటిని కావాల్సినప్పుడు కొనుక్కుని, అమ్ముకునేందుకు (లిక్విడిటీ) వీలు, పారదర్శకత ఉంటుంది. భౌతికంగా భద్రపర్చుకోవాల్సిన అవసరం తగ్గుతుంది. ఇంత వెసులుబాటు ఉన్నందుకే ఇన్వెస్టర్లు వీటివైపు చూడటం పెరుగుతోంది. ఇక కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సావరీన్ గోల్డ్ బాండ్స్ (ఎస్జీబీ) కూడా గతంలో వచ్చాయి. పసిడి ధరను ట్రాక్ చేసే ఈ బాండ్లపై వార్షికంగా అదనంగా 2.5 శాతం వడ్డీ కూడా ఇవ్వడంతో పాటు క్యాపిటల్ గెయిన్స్ నుంచి కూడా మినహాయింపు లభించేలా వీటిని తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఈ విధానంలో కొన్ని మార్పులు వచి్చ, కొత్త బాండ్ల జారీ ఆగినప్పటికీ, గతంలో జారీ చేసినవి అలాగే కొనసాగుతున్నాయి. పోర్ట్ఫోలియోకి భద్రతపోర్ట్ఫోలియోను సమతూకంతో ఉంచడంలో పసిడి చాలా కీలక పాత్ర పోషిస్తుంది. పసిడి పెట్టుబడుల విషయంలో క్రమశిక్షణతో వ్యవహరిస్తే చాలా ఉపయోగకరం. ఈక్విటీల తరహాలో భారీ రిటర్నుల కోసం కాకుండా, స్థిరత్వానికి, డైవర్సిఫికేషన్ కోసం ఇది ఉపయోగపడుతుంది. సాధారణంగా 10–15 శాతం పసిడికి, సుమారు 60 శాతం ఈక్విటీలకి, 25 శాతం డెట్ సాధనాలకు కేటాయిస్తే పోర్ట్ఫోలియో సమగ్రంగా ఉంటుంది. దీనివల్ల ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పుడు రిసు్కలు తగ్గుతాయి. గోల్డ్ ఈటీఎఫ్లు లిక్విడిటీతో పాటు స్వల్పకాలిక అవసరాల కోసం, పోర్ట్ఫోలియోలో పరిస్థితులకు తగ్గట్లుగా మార్పులు, చేర్పులు చేసుకునేందుకు ఉపయోగపడతాయి.నాణేలు, ఆభరణాలతో ప్రతికూలం..మేకింగ్ చార్జీల రూపంలో కొనగానే 10–15%తరుగుతో రీసేల్ విలువలోనూ కోతఆభరణం కొనుగోలు ధర: రూ. 1,00,000మేకింగ్ చార్జీలు : రూ. 10,000 15,000వాస్తవంగా బంగారం ధర: రూ.85,000-90,000పోర్ట్ఫోలియో కేటాయింపు ఇలా..ఈక్విటీ 60 శాతండెట్ 25 శాతంపసిడి 10-15 శాతంఇదీ చదవండి: ‘న్యూడిఫై’ యాప్లతో కాసుల వేట! -
సిప్ ఓకే... తప్పు చేయొద్దు!
స్టాక్ మార్కెట్లలో ఇది అత్యంత ఆకర్షణీయంగా కనిపించే పదం. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ను (సిప్ను) ప్రోత్సహించే కంపెనీలు కావొచ్చు... ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు... ఇన్వెస్ట్మెంట్ గురువులు కావొచ్చు. అందరూ దీన్నో తారకమంత్రం మాదిరి జపిస్తుంటారు. నిజానికి ఇన్వెస్టర్లకు కూడా ఇదో హుక్ లాంటిది. కోటి రూపాయలనే టార్గెట్గా పెట్టుకుని, 10వేలతో సిప్ ప్రారంభించినవారు చాలామంది ఉన్నారు. కాకపోతే వారంతా నిజంగా కోటి రూపాయలు సంపాదించారా? లేక నష్టాలొచ్చాయని మధ్యలోనే వదిలేసారా? ఒకవేళ కోటి రూపాయలు సంపాదిస్తే ఎంతకాలానికి సంపాదించి ఉంటారు? ఎంత క్రమశిక్షణ పాటించి ఉంటారు? ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయాలే. ఎందుకంటే సిప్కు కావాల్సినవి ఇవే. సిప్ అంటే అదేదో మంత్రదండం కాదు. అక్షయపాత్ర కూడా కాదు. క్రమశిక్షణతో దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేయటం ద్వారా సంపద సృష్టించే ఒక సాధనం మాత్రమే. ఆ రిసు్కల్ని తెలియజేసేదే ఈ ‘వెల్త్ స్టోరీ’...రాబడికి గ్యారంటీ ఉండదు...చాలా మంది నిర్ణిత కాలంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించలేరు. దీనివెనుక అంచనాల్లో పొరపాట్లే ప్రధానంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా రాబడి విషయంలోనే ఇన్వెస్టర్లు తప్పులో కాలేస్తుంటారు. → ఈక్విటీల్లో పెట్టుబడిపై ఏటా 15 శాతం కాంపౌండెడ్ రాబడి వస్తుందని అనుకుంటుంటారు. → ఈక్విటీ మార్కెట్లు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయని భావిస్తుంటారు. → ఇన్ఫ్లుయెన్సర్ల మాటలు నమ్మి.. సిప్తో రిస్క్ ఉండదని అనుకుంటుంటారు. → కానీ ఇవేవీ నిజం కావు. వాస్తవాలను తెలుసుకోవాలి... → ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా రికరింగ్ డిపాజిట్ల మాదిరి ఈక్విటీల్లో రాబడులు స్థిరంగా ఉండవు. → ఈక్విటీ రాబడులు అన్నవి మార్కెట్ రిస్క్ కు లోబడి ఉంటాయన్న డిస్క్లోజర్ను తప్పనిసరిగా మనసులో ఉంచుకోవాలి. → మార్కెట్ ర్యాలీల్లో 15 శాతమే కాదు. 18– 25– 35 శాతం వార్షిక రాబడులు వచి్చన సందర్భాలు కూడా ఉన్నాయి. → కానీ ఆటుపోట్ల తరుణంలో రాబడులు 10–12 శాతం మించకపోవచ్చు. → మరీ ముఖ్యంగా ప్రతికూల సమయాల్లో సగటు వార్షిక రాబడి 7–9 శాతం మించకపోవచ్చు. ఒకోసారి అంతకన్నా తక్కువకూడా రావచ్చు. → ఇక సిప్ తొలినాళ్లలో అయితే (మూడేళ్లలోపు) మార్కెట్ దిద్దుబాట్లు ఎదురైతే.. రాబడి కాదు, నష్టాలకూ స్వాగతం పలకాల్సి వస్తుంది. → పైన కొటేషన్లో చెప్పుకున్నట్టు ప్రతి నెలా రూ.10,000తో 20 ఏళ్లలో కోటికి అధిపతి కావాలంటే వార్షిక రాబడి 12.7 శాతం తక్కువ కాకుండా ఉండాలి. ఉదాహరణలు.. → 2020 మార్చిలో కరోనా వైరస్ దెబ్బకు మార్కెట్లు 40% నష్టపోవడం తెలిసిందే. → 2024 నుంచి ఇప్పటి వరకు మార్కెట్లు పరిమిత శ్రేణిలోనే పెరుగుతూ, తగ్గుతూ, స్థిరీకరణకు గురవుతున్నాయి. → కానీ వైరస్పై కొంత స్పష్టత రావడంతో మార్కెట్లు వెంటనే రివర్స్గేర్ తీసుకున్నాయి. 2023 వరకు ర్యాలీ చేశాయి. ఈ కాలంలో సిప్ రాబడులు అద్భుతంగా ఉన్నాయి.రిస్క్ లూ ఉంటాయ్.. → అనుకున్న కాలానికి అనుకున్నంత సమకూరాలంటే అన్ని సందర్భాల్లోనూ సాధ్యపడకపోవచ్చు. → మార్కెట్లు సైడ్వేస్ (ఓ పరిధిలోనే)లో ఎక్కువ కాలం పాటు కొనసాగొచ్చు. దీనివల్ల దీర్ఘకాల రాబడులు తగ్గిపోతాయి. → పక్కా ప్లాన్తో సిప్ చేసినా.. ఫండ్ ఎంపిక సరిగ్గా లేకపోతే చివర్లో అనుకున్నంత రాబడి సాధ్యం కాదు.ప్రవర్తనా లోపాలే ఎక్కువ... → కొంత మంది ఆదాయం సర్దుబాటు చేయలేక సిప్లను మధ్యలోనే ఆపేస్తుంటారు. → కొంత మంది మార్కెట్లు పడిపోతున్నాయని చెప్పి నష్టాలను చూసి భయంతో సిప్కు టాటా చెబుతుంటారు. → మార్కెట్లు పెరుగుతున్నప్పుడు ఉత్సాహం కొద్దీ అధిక వ్యాల్యూషన్ల వద్ద అదనంగా సిప్ చేస్తుంటారు. → అదే మార్కెట్ల పతనాల్లో మాత్రం నమ్మకం సడలి ఉన్న సిప్లను ఆపేస్తుంటారు. కానీ, నిజానికి పతనాల్లోనే సిప్లకు అదనంగా జోడించుకోవడం తెలివైన పని. → కొందరు ఒక లక్ష్యం, స్పష్టత లేకుండా ఇన్వెస్ట్ చేస్తుంటారు. లక్ష్యం, కాల వ్యవధి ఆధారంగా సరితూగే పథకాలనే ఎంపిక చేసుకోవాలి. → నిపుణుల సూచనలు కాకుండా స్నేహితులో, సహచర ఉద్యోగో లేక బంధువు చెప్పిన దాంట్లో ఇన్వెస్ట్ చేయడం వంటివి వద్దు. → స్వల్పకాల కోసం సిప్ చేయడం సరికాదు. సిప్ అనేది దీర్ఘకాల ఇన్వెస్ట్మెంట్ సాధనం. → గడిచిన ఏడాది కాలంలో మంచి పనితీరు చూపించిన (అప్పటికే బాగా పెరిగిన) ఫండ్స్లో సిప్ చేయడం సరికాదు. → పెట్టుబడి తక్కువ మొత్తమే అయినా ఎక్కువ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడాన్ని అతి వైవిధ్యంగా చెబుతారు. ఇది కూడా తప్పే.ఇదీ వాస్తవం.. → సిప్పై దీర్ఘకాలంలో రాబడి 10–12 శాతంగానే ఉంటుందన్న అంచనా వాస్తవికం. 15–20 శాతం అంచనా వేసుకోకూడదు. → కనీసం 10–15 ఏళ్ల పాటు అయినా స్థిరంగా సిప్ చేసుకుంటూ వెళ్లాలి. → మార్కెట్ టైమింగ్ (ఎప్పుడు ఎటు కదులుతుందో అంచనా) కాకుండా క్రమశిక్షణకే ప్రాధాన్యం ఇవ్వాలి. → సిప్ అన్నది పవర్ఫుల్ టూల్. అద్భుతమైన మంత్రదండం కాదు. కానీ, క్రమశిక్షణతో దీర్ఘకాలంలో సిప్ చేస్తే సంపద సాధ్యం. → అవాస్తవిక అంచనాలతో ముందుకెళితే చివర్లో ఫలితం నిరాశకు గురి చేయొచ్చు. ముందు మొదలెడితే... మ్యాజిక్ → నెలకు రూ.10,000 చొప్పున 20 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే ఏటా 12 శాతం రాబడి అంచనా ఆధారంగా రూ.91.98 లక్షలు సమకూరుతుంది. → 20 ఏళ్లకు బదులు మరో 5 ఏళ్లు పెంచి 25 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే రూ.1.70 కోట్లు సమకూరుతుంది. అంటే ఐదేళ్లలో రూ.78 లక్షలు అదనంగా వస్తుంది. → 30 ఏళ్ల పాటు ఇంతే మేర ఇన్వెస్ట్ చేస్తే సమకూరే సంపద రూ.3.08 కోట్లు. → ప్రతి నెలా 10వేలు చొప్పున, ఏటా 10 శాతం అదనంగా సిప్ పెంచుకుంటూ ఇన్వెస్ట్ చేస్తే.. (12 శాతం రాబడి అంచనా ఆధారంగా) → 20 ఏళ్లలో రూ.1.86 కోట్ల సొమ్ము సమకూరుతుంది. → 25 ఏళ్లలో రూ.3.93 కోట్లు ఏర్పడుతుంది. → 30 ఏళ్లలో రూ.7.98 కోట్ల నిధి సొంతం అవుతుంది. -
డిజిటల్ గోల్డ్కు అక్షయ తృతీయ మెరుపులు
న్యూఢిల్లీ: అక్షయ తృతీయ సందర్భంగా ఈసారి ఆభరణాలు, నాణేలతో పాటు డిజిటల్ రూపంలో కూడా బంగారం కొనుగోళ్లపై కూడా గణనీయంగా ఆసక్తి నెలకొనే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. డిజిటల్ గోల్డ్ని మరింత సులభతరంగా, పారదర్శకంగా కొనుగోలు చేసే అవకాశాలు ఉండటం ఇందుకు దోహదపడుతుందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమోడిటీస్ విభాగం రీసెర్చ్ హెడ్ నవనీత్ దమానీ, అనలిస్ట్ మానవ్ మోదీ ఒక నివేదికలో తెలిపారు.పసిడి ప్రస్తుతం అంతర్జాతీయంగా సంక్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, గ్లోబల్ వృద్ధి మందగించడం, మానిటరీ పాలసీ అంచనాల్లో మార్పులు తదితర అంశాల కారణంగా 2026లో బులియన్ మార్కెట్ ఒడిదుడుకులకు లోనవుతోందని తెలిపారు. మధ్య మధ్యలో కరెక్షన్కి లోనైనప్పటికీ సురక్షిత పెట్టుబడి సాధనాలకు డిమాండ్ నెలకొనడంతో పసిడి, వెండి వరుసగా 10, 5 శాతం మేర పెరిగాయని వివరించారు. -
డీఏ పెంపు.. కేంద్ర ఉద్యోగులకు ఇక మరింత జీతం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల నిరీక్షణకు తెరపడింది. ప్రభుత్వ ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్ (DA)ను 2 శాతం పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తాజా పెంపుతో డీఏ ప్రస్తుతం ఉన్న 58 శాతం నుండి 60 శాతానికి చేరుకుంది.గత అక్టోబర్లో ప్రభుత్వం డీఏను 55% నుండి 58 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. ఆ నిర్ణయం జూలై 1, 2025 నుండి అమలులోకి వచ్చింది. ఇప్పుడు ప్రకటించిన అదనపు 2 శాతం పెంపుతో కోటి మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.జీతం ఎంత పెరుగుతుందంటే?ఈ పెంపు వల్ల నెలవారీ వేతనంలో మార్పులను ఒక ఉదాహరణ ద్వారా పరిశీలిస్తే.. ఒక ఉద్యోగి ప్రాథమిక వేతనం (Basic Pay) రూ.50,000 అనుకుందాం. పాత రేటు (58%) ప్రకారం డీఏ రూ.29,000. కొత్త రేటు (60%) ప్రకారం డీఏ రూ.30,000. అంటే, ప్రతి నెలా నేరుగా రూ.1,000 అదనంగా లభిస్తుంది. దీనితో పాటు జనవరి నుండి రావాల్సిన బకాయిలు (Arrears) కూడా ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతాయి.8వ వేతన సంఘానికి డిమాండ్లుఒకవైపు డీఏ పెరుగుతున్నప్పటికీ, ఉద్యోగ సంఘాలు 8వ వేతన సంఘం (8th Pay Commission) ఏర్పాటుపై ఒత్తిడి పెంచుతున్నాయి. నేషనల్ కౌన్సిల్-జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ 3.83 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను డిమాండ్ చేస్తోంది. ఇదే గనుక అమలైతే కనీస వేతనం రూ.18,000 నుండి ఏకంగా రూ.69,000కు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత డీఏ పెంపు వల్ల సుమారు 1.19 కోట్ల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. -
కొత్త క్రెడిట్ కార్డు.. ఎల్ఈడీ లైట్లతో..
ముంబై: ప్రముఖ రుణ సేవల ప్లాట్ఫాం ‘చెక్’, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ దేశంలోనే తొలి కో–బ్రాండెడ్ ఎల్ఈడీ క్రెడిట్ కార్డును ఆవిష్కరించాయి. సులభతర చెల్లింపులు, గరిష్ట రివార్డు పాయింట్లే లక్ష్యంగా క్రెడిట్ కార్డు వినియోగదారులకు వినూత్న అనుభవాన్ని అందించేందు కు చెక్ ఏయూ క్రెడిట్ కార్డు పేరుతో దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చినట్లు ప్రకటించాయి.ఎల్ఈ డీ ఆధారిత చెల్లింపుల ట్యాపింగ్ విధానం ఈ క్రెడిట్ కార్డు ప్రత్యేకత అని చెక్ వ్యవస్థాపకుడు, సీఈవో ఆదిత్య సోని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పీఓఎస్ యంత్రాల ద్వారా జరిపే ప్రతి చెల్లింపు సందర్భంగా క్రెడిట్ కార్డులోని ఎల్ఈడీ లైటు వెలుగుతుందని.. తద్వారా చెల్లింపు ధ్రువీకరణ తక్షణమే కనిపిస్తుందని వివరించారు.ఇందుకు బ్యాటరీ అవసరం లేదని.. పీఓసీలోని ఎన్ఎఫ్సీ ఫీల్డ్ సాయంతో ఎల్ఈడీ కాంతి ప్రసరిస్తుందన్నారు. ఈ సరికొత్త క్రెడిట్ కార్డు కావాలనుకొనే వారు చెక్ యాప్ లో ఈ నెల 28 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. -
‘హెచ్చరిక: 'రిచ్ డాడ్' అంచనాలు నిజమవుతున్నాయ్’
ప్రముఖ ఆర్థిక వ్యాఖ్యాత, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2002లో తాను రాసిన 'రిచ్ డాడ్స్ ప్రొఫెసీ' (Rich Dad’s Prophecy) పుస్తకంలోని అంచనాలు 2026 నాటికి నిజమవుతున్నాయని ఆయన ‘ఎక్స్’ పోస్ట్లో హెచ్చరించారు.బుడగ పేలిపోనుంది!ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక పరిస్థితులు ఒక భారీ బుడగ లాంటివని, అది త్వరలోనే పగిలిపోనుందని కియోసాకి పేర్కొన్నారు. ఈ పరిణామం ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక మాంద్యానికి దారితీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు."దుబాయ్ నుండి వేగాస్ వరకు, టోక్యో నుండి న్యూయార్క్ వరకు ఆర్థిక పతనాలను గమనించండి. దురదృష్టవశాత్తూ, ప్రపంచవ్యాప్తంగా నిరాశ్రయుల సంఖ్య పెరగబోతోంది" అని ఆయన తన పోస్ట్లో రాసుకొచ్చారు.బాధితులుగా మిగిలిపోకండి..ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పటికీ, అప్రమత్తంగా ఉండేవారు విజేతలుగా నిలవవచ్చని కియోసాకి సూచించారు. ఈ సంక్షోభం నుండి తప్పించుకోవడానికి ఆయన కొన్ని కీలక సూచనలు చేశారు. ప్రస్తుత ఆర్థిక మార్పులను నిశితంగా గమనిస్తూ ఉండాలి. మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకోవడానికి ఆర్థిక అంశాలపై లోతైన అవగాహన పెంచుకోవాలి. ఆర్థిక స్వేచ్ఛ కోసం పట్టుదలతో కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు."ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతున్నా.. మీరు మాత్రం ఆర్థికంగా విజేతలుగా నిలవవచ్చు. అందుకు కావాల్సిన పోరాటం మీరు చేయాలి" అని కియోసాకి తన ఫాలోవర్లకు హితవు పలికారు.ఇదీ చదవండి: పండుగ పసిడి.. తిరుగులేని రాబడి!I WARNED EVERYONEIn 2002 I released Rich Dad’s Prophecy. In 2026 the predictions in Prophecy are coming true. You don’t have to be a victim to the “Everything Bubble” as the bubbles burst and leads to the greatest depression in world history. You can still be a winner…— Robert Kiyosaki (@theRealKiyosaki) April 17, 2026 -
బ్యాంక్ ఖాతాపై కన్నేసే సైబర్ కిరాతకులు
మీ ఈమెయిల్ బాక్స్లో ఒక నోటిఫికేషన్... ‘మీ పేరుతో కొత్త బ్యాంక్ ఖాతా ప్రారంభమైంది’ అని ఉందా? లేదా మీ బ్యాంక్ స్టేట్మెంట్ను పరిశీలిస్తే మీకు తెలియని లావాదేవీలు కనిపిస్తున్నాయా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు సామాన్యుల కష్టార్జితాన్ని దోచుకోవడానికి సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్టీసీ) నివేదిక ప్రకారం, వినియోగదారులు సైబర్ మోసాల వల్ల 2024లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 12.5 బిలియన్ డాలర్లు (రూ.1 లక్ష కోట్లకు పైగా) డబ్బు కోల్పోయారు. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 25 శాతం ఎక్కువ. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ప్రధాన బ్యాంకింగ్ మోసాలు, వాటి నుంచి తప్పించుకునే మార్గాలపై ప్రత్యేక కథనం.నేరగాళ్లు అనుసరిస్తున్న ఏడు వినూత్న పద్ధతులు1. నకిలీ బ్యాంక్ వెబ్సైట్లుఅచ్చం మీ బ్యాంక్ వెబ్సైట్లాగే కనిపించే నకిలీ సైట్లను స్కామర్లు సృష్టిస్తారు. అధిక వడ్డీ ఆశ చూపి లేదా మీ ఖాతా బ్లాక్ అయ్యిందని భయపెట్టి మిమ్మల్ని లాగిన్ అయ్యేలా చేస్తారు. మీరు అక్కడ ఇచ్చే యూజర్ ఐడీ, పాస్వర్డ్ నేరుగా నేరగాళ్ల చేతికి వెళ్తాయి.జాగ్రత్త: వెబ్సైట్ అడ్రస్లో ‘https://’ ఉందో లేదో చూడండి. బ్యాంక్ అధికారిక వెబ్సైట్ను మాత్రమే వాడండి.2. ప్రమాదకరమైన యాప్లు, ఎక్స్టెన్షన్లుఉపయోగకరంగా కనిపించే కొన్ని థర్డ్ పార్టీ యాప్లు మీ ఫోన్లోని డేటాను దొంగిలిస్తాయి. ఇవి మీ కీబోర్డ్ ఎంట్రీలను (కీస్ట్రోక్స్) ట్రాక్ చేసి మీ బ్యాంక్ వివరాలను స్కామర్లకు తెలియజేస్తాయి.జాగ్రత్త: ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ నుంచి అధికారిక బ్యాంకింగ్ యాప్లను మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. యాంటీ-వైరస్ సాఫ్ట్వేర్ను వాడండి.3. ఫోన్ కాల్స్, మెసేజ్లు‘మీ కేవైసీ అప్ డేట్ చేయకపోతే అకౌంట్ ఆగిపోతుంది’ అంటూ వచ్చే ఫోన్ కాల్స్ లేదా ఎస్ఎంఎస్లతో జాగ్రత్త. బ్యాంక్ ప్రతినిధులమని నమ్మిస్తూ మీ ఓటీపీ లేదా పిన్ నంబర్ అడుగుతారు.జాగ్రత్త: బ్యాంకులు ఎప్పుడూ ఫోన్లో వ్యక్తిగత సమాచారం అడగవు. అనుమానం వస్తే వెంటనే కాల్ కట్ చేసి నేరుగా మీ బ్రాంచ్ను సంప్రదించండి.4. ఓవర్ పేమెంట్ స్కామ్మీరు ఏదైనా వస్తువు అమ్మకానికి పెట్టినప్పుడు కొనుగోలుదారు పొరపాటున ఎక్కువ మొత్తానికి చెక్ ఇచ్చానని చెప్పి మిగిలిన మొత్తాన్ని తిరిగి పంపమని కోరతాడు. మీరు డబ్బు పంపిన తర్వాత ఆ చెక్ బౌన్స్ అవుతుంది.జాగ్రత్త: గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే చెక్కులు క్లియర్ అయ్యే వరకు వేచి ఉండండి. అనుమానాస్పద లావాదేవీలను ప్రోత్సహించకండి.5. ఎంప్లాయిమెంట్ మోసాలువర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల పేరుతో నేరగాళ్లు మిమ్మల్ని సంప్రదిస్తారు. జీతం పంపడానికి లేదా క్లయింట్లకు డబ్బు బదిలీ చేయడానికి మీ వ్యక్తిగత బ్యాంక్ ఖాతాను వాడమంటారు. ఇలా చేయడం ద్వారా మిమ్మల్ని మనీ లాండరింగ్ కేసుల్లో ఇరికించే ప్రమాదం ఉంది.జాగ్రత్త: పేరున్న సంస్థలు ఎప్పుడూ ఉద్యోగి వ్యక్తిగత ఖాతాలను వ్యాపార లావాదేవీలకు వాడవు. అధికారిక వెబైసైట్ల్లో కంపెనీ క్రెడెన్షియల్స్ చెక్ చేయండి.6. అనధికార ఖాతాలుమీ ఆధార్ లేదా పాన్ వివరాలను దొంగిలించి మీ పేరుతో ఇతర బ్యాంకుల్లో ఖాతాలు తెరుస్తారు. వీటి ద్వారా అక్రమ లావాదేవీలు జరిపి మీ క్రెడిట్ స్కోర్ను దెబ్బతీస్తారు.జాగ్రత్త: మీ క్రెడిట్ రిపోర్ట్ను తరచుగా తనిఖీ చేయండి. మల్టీ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (ఎంఎఫ్ఏ) తప్పనిసరిగా ఆన్ చేసుకోండి.మోసపోయారా? వెంటనే ఇలా చేయండి!వెంటనే మీ బ్యాంక్ కస్టమర్ కేర్కు ఫోన్ చేసి ఖాతాను లేదా కార్డును బ్లాక్ చేయించండి.సైబర్ క్రైమ్ రిపోర్ట్ చేసేందుకు భారతదేశంలో 1930కు కాల్ చేయండి లేదా ‘cybercrime.gov.in’లో ఫిర్యాదు చేయండి.భవిష్యత్తులో చట్టపరమైన ఇబ్బందులు రాకుండా ఉండేందుకు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి.ఇదీ చదవండి: ‘న్యూడిఫై’ యాప్లతో కాసుల వేట! -
పండుగ పసిడి.. తిరుగులేని రాబడి!
భారతీయ సంస్కృతిలో అక్షయ తృతీయకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ పవిత్ర దినాన పసిడిని కొనుగోలు చేయడం అదృష్టాన్ని, శాశ్వత సంపదను తెస్తుందని కోట్లాది మంది నమ్ముతారు. అయితే, ఈ సంప్రదాయం వెనుక బలమైన ఆర్థిక ప్రయోజనం కూడా దాగి ఉందని గత తొమ్మిదేళ్ల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కేవలం సెంటిమెంట్తోనే కాకుండా, లాభదాయకమైన పెట్టుబడి వ్యూహంగా కూడా బంగారం తన సత్తాను చాటుతోంది. ముఖ్యంగా గత తొమ్మిదేళ్ల కాలంలో పసిడి సుమారు రూ. 29,000 నుండి రూ. 1,54,000 స్థాయికి చేరుకుని, పెట్టుబడిదారులకు ఏకంగా 435 శాతం భారీ రాబడిని అందించింది.12 ఏళ్లలో అక్షయ తృతీయ రాబడులు ఇలా..గత 12 ఏళ్ల అక్షయ తృతీయ బంగారం రాబడులను పరిశీలిస్తే, 2015లో 11 శాతం, 2017లో 3 శాతం తగ్గుదలతో కొంత నిరాశపరిచినప్పటికీ, ఆ తర్వాత నుండి పసిడి ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతోంది. ముఖ్యంగా 2020లో 47 శాతం భారీ రాబడిని అందించిన బంగారం, ఈ ఏడాది (2026) ఏకంగా 60 శాతం వృద్ధిని నమోదు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. 2023లో 18 శాతం, 2024లో 22 శాతం, 2025లో 31 శాతంగా ఉన్న రాబడులు, ప్రతి ఏడాది రెట్టింపు ఉత్సాహంతో పెరుగుతూ పసిడిపై పెట్టుబడి అత్యంత లాభదాయకమని మరోసారి నిరూపించాయి.ఏడాదిలో 60 శాతం పెరుగుదలగత ఏడాది కాలంలో బంగారం చూపిన జోరు ఇన్వెస్టర్లను ఆశ్చర్యానికి గురిచేసింది. 2025 అక్షయ తృతీయ (ఏప్రిల్ 30) నాటి ధరలతో పోలిస్తే, ప్రస్తుతం పసిడి ధరలు 60 శాతం పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు గోల్డ్ మార్కెట్కు గతేడాది అండగా నిలిచాయి. పెట్టుబడిదారులకు వరుసగా తొమ్మిదో ఏడాది కూడా ఘనమైన లాభాలను అందిస్తూ, సురక్షితమైన పెట్టుబడి సాధనంగా బంగారం తన పట్టును నిలుపుకుంది. ధంతేరాస్తో పాటు అక్షయ తృతీయ భారతీయులకు అతిపెద్ద కొనుగోలు పండుగగా కొనసాగుతోంది.2026 సంవత్సరం బంగారం కొనుగోలుదారులకు కొంత గందరగోళంగా ప్రారంభమైనప్పటికీ, బులియన్ మార్కెట్ భవిష్యత్తు మాత్రం ఆశాజనకంగానే కనిపిస్తోంది. ఇటీవల యూఎస్-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో మార్చి గరిష్టాల నుండి ధరలు 10 శాతం మేర తగ్గుముఖం పట్టాయి. ద్రవ్యోల్బణ భయాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై జాప్యం వంటి కారణాలు మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేశాయి. అయినప్పటికీ, ఈ ఏడాది ఇప్పటివరకు బంగారం 15 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. ధరల్లో వచ్చిన ఈ తాత్కాలిక తగ్గుదల (పుల్ బ్యాక్) కొనుగోలుదారులకు ఒక మంచి అవకాశమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మళ్లీ వచ్చే పండుగకి రూ.1.80 లక్షలు!మున్ముందు బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా ఎదురయ్యే ఆటంకాలు పసిడి ధరలో పదునైన పెరుగుదలకు దారితీస్తాయని, ఏడాది కాలంలోనే తులం (10 గ్రాములు) బంగారం ధర రూ.1,80,000 మార్కును తాకవచ్చని నిర్మల్ బాంగ్ కమోడిటీస్ రీసెర్చ్ హెడ్ కునాల్ షా విశ్లేషించారు. అదేవిధంగా, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు ధర 5,500 డాలర్ల స్థాయికి చేరవచ్చని, తద్వారా దేశీయంగా ధరలు రూ.1,70,000 నుండి రూ. 1,85,000 మధ్య ఉండొచ్చని యాక్సిస్ సెక్యూరిటీస్ నిపుణులు భావిస్తున్నారు. -
అలర్ట్: రేపటి నుంచి ఈ బ్యాంక్ అకౌంట్లు క్లోజ్!
దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కీలక నిర్ణయం తీసుకుంది. నిరుపయోగంగా ఉన్న లక్షలాది ఖాతాలను రేపటి (ఏప్రిల్ 16) నుండి శాశ్వతంగా మూసివేయాలని బ్యాంక్ యాజమాన్యం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇతర ప్రభుత్వ బ్యాంకుల బాటలోనే పీఎన్బీ కూడా ఈ కఠిన చర్యలకు ఉపక్రమించడం బ్యాంకింగ్ రంగంలో చర్చనీయాంశంగా మారింది.ఎవరి ఖాతాలు మూతపడతాయి?మీడియా నివేదికల ప్రకారం.. ఈ కింది కేటగిరీల కిందకు వచ్చే ఖాతాలను బ్యాంక్ మూసివేయనుంది.మూడేళ్లుగా లావాదేవీలు లేనివి: గత మూడేళ్లుగా కనీసం ఒక్కసారి కూడా వాడని ఖాతాలు.జీరో బ్యాలెన్స్: ఖాతాలో జీరో బ్యాలెన్సు ఉండి, చాలా కాలంగా ఇన్యాక్టివ్గా ఉన్న ఖాతాలు.కేవైసీ అప్డేట్ లేనివి: గడువులోపు e-KYC (ఈ-కేవైసీ) పూర్తి చేయని ఖాతాలపై బ్యాంక్ వేటు వేసే అవకాశం ఉంది.ఎందుకీ కఠిన నిర్ణయం?బ్యాంకులో వేల సంఖ్యలో నిరుపయోగంగా పడి ఉన్న ఖాతాల వల్ల మోసాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని బ్యాంక్ భావిస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా, అలాగే బ్యాంక్ డేటాను ప్రక్షాళన చేసే ఉద్దేశంతో క్రమానుగతంగా ఇటువంటి చర్యలు చేపడుతుంటారు.ఖాతాను కాపాడుకోవాలంటే..మీ ఖాతా క్లోజ్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ కింది పనులు పూర్తి చేయండి:మీ సమీపంలోని పీఎన్బీ బ్రాంచ్కు వెళ్లి వెంటనే ఇ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయండి.మీ అకౌంట్లో కొంత మొత్తాన్ని జమ చేయండి.కనీసం ఒక చిన్న లావాదేవీ (డ్రా చేయడం లేదా జమ చేయడం) చేయడం ద్వారా అకౌంట్ యాక్టివ్గా ఉందని నిర్ధారించుకోండి.తీసుకెళ్లాల్సిన పత్రాలుఈ పనుల నిమిత్తం బ్యాంకుకు వెళ్లేటప్పుడు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, విద్యుత్ లేదా నీటి బిల్లు (అడ్రస్ ప్రూఫ్ కోసం), బ్యాంక్ పాస్బుక్ ఒరిజినల్ పత్రాలతో పాటు వాటి ఫోటోకాపీలను (జిరాక్స్) వెంట తీసుకెళ్లడం మర్చిపోకండి.ఇదీ చదవండి: పోస్టాఫీసు స్కీములు.. అత్యధిక వడ్డీలు -
ఆరోగ్య బీమా.. ఆదుకునే కవచమా? చక్రవ్యూహమా?
ఆరోగ్య బీమా అనేది ఆపద సమయంలో ఆదుకునే ఒక రక్షా కవచం. కానీ, అవసరానికి ఆ కవచం పనిచేయకపోతే పరిస్థితి ఏమిటి? ప్రస్తుతం దేశంలో ఇలాంటి సంఘటనలే ఎక్కువగా జరుగుతున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగి ఆసుపత్రి ఖర్చుల కోసం క్లెయిమ్ చేస్తే.. ఇన్సూరెన్స్ కంపెనీలు ఏదో ఒక కారణంతో తిరస్కరించడం లేదా సగం డబ్బులే ఇవ్వడం వంటివి సాధారణమయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారిక గణాంకాలు, నిపుణుల విశ్లేషణతో రూపొందించిన ప్రత్యేక కథనం మీ కోసం..క్లెయిమ్ ఎందుకు రిజెక్ట్ అవుతుంది?వైద్య ఖర్చులు ఆకాశాన్నంటుతున్న తరుణంలో సామాన్యుడికి ఆరోగ్య బీమా కొండంత అండ. అయితే, క్లెయిమ్ సెటిల్మెంట్ విషయంలో పాలసీదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం, 2026 ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో ‘బీమా భరోసా’ పోర్టల్లో నమోదైన ఫిర్యాదులు, 2025 ఆర్థిక సంవత్సరం మొత్తం ఫిర్యాదుల సంఖ్యను మించిపోయాయి. ఫిబ్రవరి 2026 నాటికి ఈ పోర్టల్లో సుమారు 73,729 ఫిర్యాదులు నమోదవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇందులో దాదాపు 69% ఫిర్యాదులు కేవలం క్లెయిమ్ తిరస్కరణ లేదా జాప్యానికి సంబంధించినవే కావడం గమనార్హం.క్లెయిమ్ తిరస్కరణకు ప్రధాన కారణాలుబీమా సంస్థలు క్లెయిమ్లను తిరస్కరించడానికి నిబంధనలతోపాటు పాలసీదారుల అవగాహన లోపం కూడా ఒక కారణం. క్లెయిమ్ రిజెక్ట్ కావడానికి ప్రధానంగా ఐదు కారణాలు కనిపిస్తున్నాయి.ముందస్తు వ్యాధులను చెప్పకపోవడం..పాలసీ తీసుకునేటప్పుడు బీపీ, షుగర్ వంటి పాత జబ్బుల గురించి దాచడం అతిపెద్ద తప్పు. 36 నెలల నిరీక్షణ కాలం (మారటోరియం పీరియడ్) ముగియకముందే ఇలాంటివి బయటపడితే కంపెనీలు క్లెయిమ్ను నేరుగా తిరస్కరిస్తాయి.వెయిటింగ్ పీరియడ్కొత్తగా పాలసీ తీసుకున్న వెంటనే అన్ని వ్యాధులకు కవరేజీ ఉండదు. సాధారణంగా మొదటి 30 రోజులు (ప్రమాదాలు మినహా) నిర్దిష్ట వ్యాధులకు (హెర్నియా, క్యాటరాక్ట్.. వంటివి) 2-4 ఏళ్ల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఈలోపు క్లెయిమ్ చేస్తే అది రిజెక్ట్ అవుతుంది.వైద్య అవసరం లేకుండానే ఆసుపత్రిలో చేరికకేవలం డయాగ్నోస్టిక్ పరీక్షల కోసం లేదా ఇంట్లోనే చికిత్స పొందే అవకాశం ఉన్న జబ్బులకు ఆసుపత్రిలో చేరితే క్లెయిమ్ రాదు. కనీసం 24 గంటల ఆసుపత్రి చేరిక తప్పనిసరి (డే కేర్ చికిత్సలు మినహా).కాస్మెటిక్ సర్జరీలు, దంత చికిత్సలు, విటమిన్ సప్లిమెంట్స్ వంటివి చాలా పాలసీల్లో కవర్ కావు. మీరు పాలసీ తీసుకునే ముందే వీటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి.ఆసుపత్రిలో చేరిన 24-48 గంటల్లోపు బీమా సంస్థకు సమాచారం ఇవ్వాలి. రీయింబర్స్మెంట్ విషయంలో డిశ్చార్జ్ అయిన 15-30 రోజుల్లోపు పత్రాలు సమర్పించకపోతే సమస్యలు ఎదురవుతాయి.పాలసీ కొనే ముందు చెక్ చేయాల్సినవి..పాలసీ డాక్యుమెంట్ అనేది కేవలం కాగితాల కట్ట కాదు, అది ఒక చట్టపరమైన ఒప్పందం. కొనే ముందు కీలక అంశాలపై స్పష్టత తెచ్చుకోవాలి.గది అద్దెపై పరిమితి ఉందో లేదో చూడండి. గది అద్దె పరిమితి మించితే, మొత్తం బిల్లులో కంపెనీ కోత విధిస్తుంది.బిల్లులో కొంత శాతం మీరే చెల్లించాలనే నిబంధన(కో-పేమెంట్) ఉంటే ప్రీమియం తగ్గుతుంది కానీ, క్లెయిమ్ సమయంలో మీ జేబుకు చిల్లు పడుతుంది.మీ ఇంటికి దగ్గరలో ఉన్న ప్రముఖ ఆసుపత్రులు ఆ బీమా నెట్వర్క్లో ఉన్నాయో లేదో సరిచూసుకోండి.ఒకే ఏడాదిలో ఒకటికంటే ఎక్కువసార్లు అనారోగ్యం పాలైతే బీమా మొత్తం (సమ్ అస్యూర్డ్) తిరిగి రీఛార్జ్ అయ్యే సౌకర్యం ఉందో లేదో చూడండి.ఇన్సూరెన్స్ ఏజెంట్ చెప్పే మాటల కంటే పాలసీలోని ‘కీ ఫీచర్స్ డాక్యుమెంట్’ చదవడం ఉత్తమం. ఏదైనా ఫిర్యాదు ఉంటే మొదట బీమా సంస్థకు, అక్కడ పరిష్కారం లభించకపోతే ఐఆర్డీఏఐ ‘బీమా భరోసా’ పోర్టల్ లేదా ఇన్సూరెన్స్ అంబడ్స్మన్ను ఆశ్రయించవచ్చు.ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు -
దీర్ఘకాలిక ప్రణాళికలకు దక్షిణాది ఓటు
దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికల విషయంలో దక్షిణాది వారు ముందుంటున్నారు. రిటైర్మెంట్ ప్లాన్ల విషయంలో స్పష్టతతో ఉంటున్నారు. ఇప్పటికే మూడింట రెండొంతుల మంది ఇందుకు సంబంధించిన ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. ఇఫ్సాస్ ఇండియా భాగస్వామ్యంతో హెచ్డీఎఫ్సీ లైఫ్ నిర్వహించిన రెడీ టు లైఫ్ ఇండెక్స్ సూచీలో దక్షిణాది రెడీనెస్ స్కోరు జాతీయ సగటైన 59కి మించి 60 స్థాయిలో నమోదైంది.ఈ నివేదిక ప్రకారం బీమా భద్రతపై అవగాహన ఉన్నప్పటికీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే వారి సంఖ్య తక్కువగానే ఉంటోంది. తక్షణ రాబడి ఉండదని, చర్చించడానికి కొంత ఇబ్బందికరమైనదని, ఎటువంటి క్లెయిమ్ తలెత్తకపోతే నిష్ప్రయోజనమనే భావన ఇందుకు కారణమని నివేదికలో వెల్లడైంది. దక్షిణాది వారి పొదుపు ప్రాధాన్యతల్లో పిల్లల చదువు, సొంత ఇల్లు, ఆకస్మిక ప్రణాళికలు మొదలైనవి అగ్రస్థానంలో ఉన్నాయి. అత్యవసర నిధి విషయంలో దక్షిణాది అగ్రస్థానంలోనే ఉన్నప్పటికీ మూడింట ఒక వంతు మంది సదరు నిధి ఒక నెలకు మాత్రమే సరిపోతుందని పేర్కొన్నారు. ఆర్థిక ప్రణాళిక, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే సన్నద్ధత, ఆరోగ్యం, పదవీ విరమణ వ్యూహాలపై అవగాహన–సన్నద్ధత మధ్య అంతరాలను పూరించడం లక్ష్యంగా నిర్వహించిన ఈ సూచీ సంబంధిత అధ్యయనంలో 25–55 ఏళ్ల వయస్సు గల 1,836 మంది పాల్గొన్నారు.ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు -
ఇన్వెస్టర్ల మనసంతా ఆ ఇన్వెస్టింగ్పైనే..
ముంబై: పారదర్శకమైన, తక్కువ వ్యయాలతో కూడుకున్న ఇండెక్స్ ఇన్వెస్టింగ్పై మదుపర్లలో ఆసక్తి పెరుగుతోందని యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ వెల్లడించింది. ఇందుకు అనుగుణంగా తమ సంస్థ వివిధ సూచీల ఆధారిత ఫండ్స్ని అందిస్తున్నట్లు వివరించింది.2026 ఫిబ్రవరి 28 నాటికి వీటిలో నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ ఏయూఎం రూ. 849 కోట్లకు, 100 ఇండెక్స్ ఫండ్ ఏయూఎం రూ. 1,983 కోట్లకు చేరినట్లు తెలిపింది. 2022 జనవరిలో ప్రవేశపెట్టిన నిఫ్టీ నెక్ట్స్ 50 ఫండ్ గణనీయంగా వృద్ధి చెందుతోందని పేర్కొంది. ఇవి లార్జ్ క్యాప్ మొదలుకుని వివిధ స్థాయుల్లో మార్కెట్కి ప్రాతినిధ్యం వహించే, భవిష్యత్తులో లీడర్లుగా ఎదిగే సామర్థ్యాలున్న కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉపయోగపడతాయని సంస్థ తెలిపింది.యాక్టివ్గా మేనేజ్ చేసే ఫండ్స్తో పోలిస్తే, ఇండెక్స్ ఫండ్స్లో హ్యూమన్ ఎర్రర్ (నిర్ణయాల్లో పొరపాట్లు) తక్కువగా ఉండటం వల్ల దీర్ఘకాలంలో స్థిరమైన రాబడులను ఆశించే ఇన్వెస్టర్లు వీటివైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా కొత్త తరం ఇన్వెస్టర్లు తక్కువ ఎక్స్పెన్స్ రేషియో (నిర్వహణ వ్యయం) కలిగిన ప్యాసివ్ ఇన్వెస్టింగ్ పద్ధతులపై అవగాహన పెంచుకుంటున్నారు. -
ఫారమ్ 15 G/H బదులుగా ఫారమ్ 121
కొత్త చట్టం, కొత్త రూల్స్తో ఫారాల నంబర్లు మారడం సహజం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 15 G/Hలు రెండింటికి బదులుగా ఒకే ఫారమ్ తెచ్చారు. దాని నెంబరు 121గా ఉంది. కొత్త ఫారమ్ ఎందుకు దాఖలు చేయాలి? విషయం పాతదే. మీకు బాగా తెలిసిందే. మీరు సంపాదించిన బ్యాంకు డిపాజిట్లు మీద వడ్డీని ఇతర ఆదాయం కింద పరిగణిస్తారు. ఇది పన్నుకు గురి అవుతుంది. ఒక ఏడాది ఇటువంటి ఆదాయం రూ.50 వేలు, ఏడాది దాటితే ఈ పరిమితి సీనియర్ సిటిజన్లకు అయితే రూ.1,00,000. బ్యాంకు వాళ్లు దాని మీద టీ.డీ.యస్ రివకరీ చేస్తారు. అందుకని ముందుగా లెక్కలు వేసుకోండి. మీ నికర టాక్స్ బుక్ ఆదాయం 2026–27లో రూ.12,00,000 దాటకపోతే మీకు పన్ను భారం ఏర్పడదు. మీకు ఏర్పడ్డ ఆదాయంలో బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ల మీద వడ్డీ కూడా ఉండి, మొత్తం ఆదాయం రూ.12,00,000 దాటకపోతే పన్ను భారమే ఉండదు కాబట్టి టీడీఎస్కి గురి కావడం అనవసరం. అందుకని ఈ నెలలోనే 121 ఫారమ్ సబ్మిట్ చేయండి. మీరు బ్యాంకుకి సబ్మిట్ చేయకపోతే బ్యాంకు వారు టీడీఎస్ కట్ చేస్తారు. అందుకని 121 వేయండి.పాత ఫారమ్లు ఇక ఉండవా..? 1.4.2026 నుంచి పాత ఫారమ్లు 15 G/H ఉండవు. రద్దు అయ్యాయి అని అనవచ్చు. గతేడాది వరకు 60 ఏళ్లు దాటిన వారికి ఒక ఫారమ్, దాటని వారికి వేరొక ఫారమ్ అమల్లో ఉండేవి. ఇక నుంచి ఒకే ఫారమ్. దాని నెంబరే 121. వయస్సుతో నిమిత్తం లేకుండా ఎవ్వరైనా 121 దాఖలు చేయాలి. టీడీఎస్ ఏ పరిస్థితుల్లో చేస్తారు.. ఫారమ్ 121 దాఖలు చేసినా, చేయకపోయినా డిపాజిట్ హోల్డర్లకి పాన్ లేకపోతే టీడీఎస్ 20% చొప్పున చేస్తారు. పాన్ ఉండి పనిచేయకపోయినా.. ఆధార్తో అనుసంధానం కాకపోయినా 20 % రివకరీ చేస్తారు. బ్యాంకు వడ్డీ రూ.50,000 దాటి, గత రెండు అస్సెస్మెంట్ సంవత్సరాలకు ఆదాయపు పన్ను రిటర్ను వేయకపోతే టీడీఎస్ 20 శాతం కట్ చేస్తారు. క్యాపిటల్ గెయిన్స్ ఆదాయం ఉంటే .. ఫారమ్ 121 కేవలం పన్ను భారం లేని వారికి మాత్రమే. 87 అ కింద రిబేటు సౌకర్యం/సదుపాయం పొందడానికి క్యాపిటల్ గెయిన్స్ మీద కాకుండా ఏర్పడ్డ ఇతర అన్ని ఆదాయాలకు మాత్రమే. మీకు క్యాపిటల్ గెయిన్స్ మీద ఆదాయం ఉంటే ఫారమ్ 121 వేయకూడదు. కింది ఉదాహరణ అర్థం చేసుకోండి .. 2026–27లో మీ ఆదాయం రూ.12,00,000 లోపల ఉంది. ఈ సందర్భంలో పన్ను భారం ఉండదు. రూ.2,00,000 బ్యాంకు వడ్డీ ఇందులో కలిసి ఉండదనుకొండి. 121 ఇచ్చారు. బ్యాంకు వాళ్లు టీడీఎస్ చేయరు. కానీ సంవత్సరాంతంలో మీకొక క్యాపిటల్ గెయిన్స్ వచ్చింది అనుకోండి. పన్ను భారం ఏర్పడుతుంది. మినహాయింపులు పొందవచ్చు. మినహాయింపులు వద్దనుకుంటే... 87 అ బెనిఫిట్ రద్దు అవుతుంది. అంటే రేట్ల ప్రకారం రూ.12,00,000 మీద క్యాపిటల్ గెయిన్స్ మీద చెల్లించాలి. ఇలాంటి పరిస్థితి ఏర్పడితే మీరు ఫారమ్ 121 ఇవ్వడం తప్పు అవుతుంది. ఆ తప్పు నుంచి బయట పడాలంటే క్యాపిటల్ గెయిన్స్ నుంచి మినహాయింపు పొందాల్సిందే. అప్పుడు ఫారమ్ 121 ఇవ్వడం సముచితము. రెండు విభిన్న ఆలోచనలు .. ఏ ఆదాయం ఎంత ఉన్నా.. ఫారమ్ 121 ఇవ్వకపోతే అప్పుడు బ్యాంకు వాళ్లు టీడీఎస్ రికవరీ చేస్తారు. సంవత్సరం చివరన ఆదాయం లెక్కించడం, పన్ను చెల్లించడం.. ఒక వర్గం వాదన ఇది. కాగా మరో వర్గం ఆలోచన ఏమిటంటే ఏ ఆదాయం ఎంత ఉన్నా ఫారమ్ 121 ఇవ్వడం... పన్ను కోత టీడీఎస్ లేకుండా బయటపడటం.. కానీ సంవత్సరాంతంలో ఆదాయం లెక్కించి పన్ను కట్టడం, లేదా రిఫండ్ తెచ్చుకోవడం .. ఇలా కూడా చేయొచ్చు. మీరు ముందుగానే లెక్కలన్నీ వేసి నిర్ణయం తీసుకోండి. ఫారమ్ 121 గురించి సాంకేతిక సమాచారం .. ఇందులో రెండు భాగాలుంటాయి. పార్ట్ అ లో అంకెలు మనం నింపాలి. ఫారమ్ ఆ బ్యాంకు వాళ్లు నింపుతారు. అంశాలన్నీ మీకు తెలిసినవే. మొత్తం సంవత్సర ఆదాయం ఎంతో చెప్పాలి. అంతేకాకుండా గత రెండేళ్ల ఆదాయపు రిటర్నులు వివరాల ఇవ్వాలి. 121 దాఖలు చేయగానే బ్యాంకు అధికార్లు 26 క్యారెక్టర్లతో అంకెలు/అక్షరాలు కలిపిన నెంబరు ఇస్తారు. ఇందులో బ్యాంకు పేరు, టాన్ నంబరు, ఆర్థిక సంవత్సరం మొదలైనవి ఉంటాయి. ఈ నంబరుతో డిపార్ట్మెంట్ వారు మీ వివరాలన్నింటినీ ట్రాక్ చేస్తారు. దీని వలన దురి్వనియోగం/అనుచితయోగం తగ్గుతుంది. ఈ ఫారమ్లో వివరాలు ఇతర ఫారాలతో లింక్ చేయడం వలన అన్నీ ఫారాల్లోని అంశాలు అప్డేట్ అవుతాయి. తగిన జాగ్రత్త వహించండి. -
సక్సెస్కు ‘సప్త’పది! ‘కొత్త’గా ఇన్వెస్ట్ చేద్దాం..
నిన్న మొన్నటిదాకా పెట్టుబడులు పోటెత్తాయి. దీంతో మార్కెట్లు దూసుకెళ్లాయి. కొత్త గరిష్ఠ స్థాయిలను నమోదు చేశాయి. ఆ పరిస్థితుల నుంచి ఇపుడు మార్కెట్లు ఆటుపోట్ల దశవైపు మళ్లాయి. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో మార్కెట్లు విపరీతమైన ఊగిసలాటకు గురవుతున్న తరుణంలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. గత కొన్నాళ్లుగా ఈక్విటీలు పటిష్టంగా ర్యాలీలు చేస్తుండటంతో ఇన్వెస్టర్లు అటువైపు మొగ్గు చూపటం వారికి మంచి లాభాలనే ఇచ్చింది. కానీ 2027 ఆర్థిక సంవత్సరం కాస్త విభిన్నంగా ఉండబోతోంది. అంతర్జాతీయంగా వృద్ధిపై అనిశ్చితి నెలకొంది. ద్రవ్యోల్బణం దిగి వస్తున్నా, అంత తేలిగ్గా లొంగడం లేదు. వడ్డీ రేట్లు కూడా మరీ దూకుడుగా ఏమీ తగ్గడం లేదు. భారతీయ ఇన్వెస్టర్లకు దేశీయంగా పటిష్టమైన వృద్ధి వల్ల అవకాశాలు మెరుగ్గానే ఉన్నప్పటికీ, విధానాలను కాస్త మార్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఏడాది, రాబడులపై ఆశలతో గుడ్డిగా పరుగెత్తడం కాకుండా, పెట్టుబడులను స్మార్ట్గా తీర్చిదిద్దుకోవాల్సి ఉంది. దానికోసం ఉపయోగపడే ఏడు వ్యూహాల సమాహారమే ఈ వెల్త్ స్టోరీ... ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లు ఆర్థిక లక్ష్యాల మదింపు చాలా మంది ఇన్వెస్టర్లు ఒక్కసారి లక్ష్యాలను నిర్దేశించుకున్నారంటే చాలు మళ్లీ వాటిలో మార్పులు, చేర్పులు చేసుకోరు. అయితే, కాలక్రమేణా మార్కెట్ పరిస్థితులు, ఆదాయ స్థాయిలు, వ్యక్తిగత బాధ్యతలు మారుతుంటాయి. కాబట్టి మీరు పెడుతున్న పెట్టుబడులు మీ లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనేది పునఃసమీక్షించుకునేందుకు ఈ కొత్త ఆర్థిక సంవత్సరాన్ని ఒక చక్కని అవకాశంగా మార్చుకోవాలి. ఉదాహరణకు మీరు నిర్దేశించుకున్న ఆర్థిక లక్ష్యానికి 2–3 ఏళ్లే ఉన్నప్పుడు భారీ స్థాయిలో ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టి ఉంటే ఒడిదుడుకులపరంగా అనవసర రిసు్కలు ఎదురుకావచ్చు. అదే రిటైర్మెంట్ లేదా సంపదను పెంచుకోవడంలాంటి దీర్ఘకాలిక లక్ష్యాల కోసం పెట్టి ఉంటే ఈక్విటీల్లో అధిక పెట్టుబడులను కొనసాగించవచ్చు. ఇక్కడ విషయం ఏమిటంటే, ఆటో పైలట్ మోడ్లో పెట్టుబడులు పెట్టుకుంటూ పోవడం కాకుండా లక్ష్యానికి ఉన్న వ్యవధికి తగ్గట్లుగా కేటాయింపులు మార్చాల్సి ఉంటుంది.అసెట్ అలోకేషన్ని సరి చేసుకోవడం ఇపుడు అన్నింటికన్నా పెద్ద రిస్కు మార్కెట్ ఒడిదుడుకులు కాదు.. కేవలం ఒకే పెట్టుబడి సాధనంలో, అందులోనూ, ఈక్విటీల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయడమే రిస్కీ వ్యవహారం. చాలా మటుకు పోర్ట్ఫోలియోలు అనుకోకుండానే ఈక్విటీల్లో భారీగా ఇన్వెస్ట్ చేసి ఉంటాయి. రాబోయే రోజుల్లో మార్కెట్లలో ఒకే రకమైన రిటర్నులు రాకపోవచ్చు. కాబట్టి, అసెట్ అలొకేషన్పై మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈక్విటీ, డెట్, పసిడితో సమతూకమైన పోర్ట్ఫోలియో ఉంటే షాక్లేవైనా ఎదురైనా తట్టుకుంటూ సంపదను పెంచుకునేందుకు వీలవుతుంది. ఉదాహరణకు... ఈక్విటీలు పతనమైనప్పుడు, డెట్ సాధనాలు స్థిరత్వాన్ని అందిస్తాయి. ఇక గ్లోబల్ అనిశి్చతికి పసిడి హెడ్జింగ్ సాధనంగా పని చేస్తుంది. వార్షికంగా రీబ్యాలెన్సింగ్ చేసుకోవడం వల్ల పోర్ట్ఫోలియోకి మీరు నిర్దేశించుకున్న స్థాయికి మించి రిస్కులు ఎదురవకుండా చూసుకోవచ్చు.డైవర్సిఫికేషన్ ప్రధానం పెట్టుబడుల్లో వైవిధ్యం పాటించడమంటే బోలెడన్ని మ్యూచువల్ ఫండ్స్ కలిగి ఉండాలనే అపోహ ఒకటి ఇన్వెస్టర్లలో ఉంది. వాస్తవానికి సదరు ఫండ్స్ అన్నీ కూడా ఒకే రకమైన రంగాలు లేదా మార్కెట్ క్యాప్లకు చెందినవైతే, అప్పుడు కూడా మొత్తం పోర్ట్ఫోలియోలో ఒకే తరహా పెట్టుబడులున్నట్లే అవుతుంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో సిసలైన డైవర్సిఫికేషన్ అంటే వివిధ అసెట్ క్లాస్లు, భౌగోళిక ప్రాంతాలు, పెట్టుబడి వ్యూహాలపై దృష్టి కేంద్రీకరించడం. ఈక్విటీల విషయానికొస్తే, స్థిరత్వం కోసం లార్జ్ క్యాప్స్లో, అడాప్టబిలిటీ కోసం ఫ్లెక్సి క్యాప్స్లో, సమతూకం కోసం డెట్, పసిడిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా కొంత ఇన్వెస్ట్ చేస్తే డైవర్సిఫికేషన్ మరింతగా ఉంటుంది.ఒడిదుడుకులు.. వ్యూహాలు ఈ ఆర్థిక సంవత్సరంలో ఆటుపోట్లు ప్రత్యేకంగా కనిపించనున్నాయి. ఇన్వెస్టర్లు వీటిని రిస్కులుగా అనుకోకుండా, అవకాశాలుగా మార్చుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు (సిప్) చక్కగా పని చేస్తాయి. దీనివల్ల కాలక్రమేణా కొనుగోలు రేటు సగటు స్థాయికి వస్తుంది. అయితే, మార్కెట్లు కరెక్షన్లకు లోనైనప్పుడు సిప్లతో పాటు వ్యూహాత్మక పెట్టుబడులను కూడా జోడిస్తే స్మార్ట్ విధానంగా ఉంటుంది. ఉదాహరణకు మార్కెట్లు అర్థవంతంగా తగ్గితే, అదనంగా పెట్టుబడులను కొద్ది కొద్దిగా పెట్టడం వల్ల దీర్ఘకాలిక రాబడులు మెరుగుపడతాయి. మార్కెట్లు ఆటుపోట్లకు గురవుతున్నప్పుడు భావోద్వేగాలతో కాకుండా క్రమశిక్షణతో వ్యవహరించడం ముఖ్యం.లిక్విడిటీ పటిష్టం చేసుకోవాలి అనిశ్చితిలో రాబడులకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో లిక్విడిటీకి కూడా అంతే ప్రాధాన్యం ఉంటుంది. చాలా మంది ఇన్వెస్టర్లు ఈ విషయాన్ని పట్టించుకోరు. ఫలితంగా చాలా మటుకు డబ్బును మార్కెట్ ఆధారిత సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. నిర్మాణాత్మకమైన ఆర్థిక ప్రణాళికలో కనీసం ఆరు నెలలకు సరిపడే ఎమర్జెన్సీ నిధి కూడా ఉంటుంది. అనూహ్య పరిస్థితులు ఏవైనా తలెత్తితే దీర్ఘకాలిక పెట్టుబడులను ఉపసంహరించుకోకుండా ఇది తోడ్పడుతుంది. లిక్విడిటీ ఉంటే ప్రధాన పోర్ట్ఫోలియోని డిస్టర్బ్ చేయకుండా మార్కెట్లో వచ్చే కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వీలవుతుంది.పోర్ట్ఫోలియోలో డెట్ సాధనాలకూ చోటివ్వండి ఈక్విటీ మార్కెట్లు బాగున్నప్పుడు డెట్ పెట్టుబడులను పెద్దగా పట్టించుకోరు. కానీ రాబడులు ఒక మోస్తరు స్థాయికి పరిమితమై, వడ్డీ రేట్లు స్థిరంగా ఉన్న దశలో వీటి ప్రాధాన్యత పెరుగుతుంది. డెట్ సాధనాల వల్ల అంచనాలకు అనుగుణమైన రాబడులు వస్తాయి. పోర్ట్ఫోలియోలో ఆటుపోట్లు తగ్గుతాయి. మార్కెట్లో అనిశ్చితి నెలకొన్న దశలో పోర్ట్ఫోలియోకి కాస్త స్థిరత్వం లభిస్తుంది. ముఖ్యంగా పెట్టుబడిని సంరక్షించుకోవడం చాలా కీలకంగా ఉండే స్వల్పకాలిక, మధ్యకాలిక ఆర్థిక లక్ష్యాల సాధనకు ఇవి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి 2026–27లో అత్యంత నాణ్యమైన డెట్ సాధనాలకు సమతూకంగా కేటాయిస్తే, భారీ రాబడులు లేకపోయినా, రిసు్కకు తగ్గట్లుగా మెరుగైన రాబడులను అందుకునేందుకు వీలవుతుంది. క్రమశిక్షణ ముఖ్యం సాధారణంగా సరైన ఫండ్ని ఎంపిక చేసుకుంటే చాలు మంచి రాబడులు వస్తాయనే దృష్టితో చాలా మంది ‘అత్యుత్తమ మ్యూచువల్ ఫండ్ని వెతికి పట్టుకునేందుకు సమయాన్ని వెచ్చిస్తుంటారు. నిజానికి, నిలకడ, క్రమశిక్షణ, అసెట్స్కి సరైన అలొకేషన్ చేయడమే దీర్ఘకాలికంగా ప్రయోజనాలను అందిస్తాయి. ఇటీవలి కాలంలో పనితీరు బాగుండటం లేదంటూ మాటిమాటికీ ఫండ్స్ని అటూ ఇటూ మార్చడం వల్ల అసలుకే మోసం వస్తుంది. దీనివల్ల భారీ వేల్యుయేషన్స్కి కొనుక్కుని, తాత్కాలికంగా పడగానే, ని్రష్కమించినట్లవుతుంది. అలా గాకుండా మెరుగ్గా నిర్వహిస్తున్న కొద్ది ఫండ్స్ని ఎంచుకుని, పెట్టుబడులను కొనసాగిస్తూ, మధ్యమధ్యలో వాటిని సమీక్షించుకుంటూ ఉంటే ఉపయోగకరంగా ఉంటుంది. కాలం గడిచే కొద్దీ తాత్కాలిక భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకోవడం వల్ల గాకుండా క్రమశిక్షణతో ఇన్వెస్ట్ చేయడం వల్లే మంచి ఫలితాలు పొందవచ్చు. కొత్త ఆర్థిక సంవత్సరంలో దూకుడుగా, అస్తవ్యస్తంగా పెట్టుబడులను పెడితే ఫలితాలు దక్కేలా లేవు. ఎవరైతే సమతూకం, నిలకడ, రిస్క్ మేనేజ్మెంట్పై ప్రధానంగా ఫోకస్ చేస్తారో వారికే ప్రయోజనాలు లభిస్తాయి. మార్కెట్ కదలికలను ఒడిసి పట్టుకునేందుకు ప్రయత్నం చేయడం కాకుండా, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనగలిగే విధంగా పోర్ట్ఫోలియోని తీర్చిదిద్దుకోవడం స్మార్ట్ వ్యూహంగా ఉంటుంది. లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులను సరిచేసుకుంటూ, సరైన అసెట్ అలొకేషన్ని పాటిస్తూ, సమర్ధవంతంగా డైవర్సిఫై చేస్తూ, క్రమశిక్షణతో వ్యవహరిస్తూ ఇన్వెస్టర్లు ఒకవైపు దీర్ఘకాలికంగా సంపదను పెంచుకుంటూనే మరోవైపు అనిశ్చితి నుంచి బైటపడొచ్చు. చివరగా చెప్పేదేమిటంటే, గొప్ప ఫలితాలు సాధించాలంటే ఏదైనా అసాధారణమైనది చేయడం కాదు.. నిలకడగా కొన్ని సరైన నిర్ణయాలు తీసుకుంటే చాలు. -
పసిడి పండుగ.. అప్పుడు పది గ్రాములు..
ఆశలు అక్షయం కావాలని కోరుకుంటూ భారతీయులు జరుపుకునే పవిత్ర పండుగ అక్షయ తృతీయ. ఈ ప్రత్యేక సందర్భంలో పసిడి కొనుగోలు చేయడం అనవాయితీ. ఈ ఏడాది కూడా పసిడి కొనుగోళ్లకు జనం సిద్ధమవుతున్నప్పటికీ, ఆకాశాన్నంటుతున్న ధరలు సామాన్యుడి అంచనాలను తలకిందులు చేస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే బంగారం ధరల్లో వచ్చిన భారీ మార్పు ఇప్పుడు కొనుగోలుదారుల నిర్ణయాలను ప్రభావితం చేస్తోంది.ధరల వ్యత్యాసం2025 అక్షయ తృతీయ నాటి ధరలతో పోలిస్తే, ఈ ఏడాది (2026) బులియన్ మార్కెట్లో పెను మార్పులు సంభవించాయి. గతేడాది 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.96,000 నుండి రూ.97,000 మధ్య ఉండగా, ఇప్పుడు అదే ధరకు కేవలం 6 నుండి 6.5 గ్రాములు మాత్రమే వస్తోంది. అంటే కేవలం ఏడాది కాలంలోనే కొనుగోలుదారుల శక్తి 30-40% వరకు క్షీణించిందని విశ్లేషకులు చెబుతున్నారు.దేశంలో ప్రస్తుతం తులం (10 గ్రాములు) బంగారం (24 క్యారెట్స్) ధర రూ.1,52,840 లుగా (ఏప్రిల్ 11 నాటికి) ఉంది. ఆభరణాలకు వినియోగించే 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.1,40,100 లుగా ఉంది.ఎందుకీ పరుగు?బంగారం ధరలు ఇలా అదుపు లేకుండా పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయ కారణాలు కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం, అనిశ్చితి వల్ల పెట్టుబడిదారులు 'సురక్షిత ఆస్తి'గా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. రూపాయి విలువ తగ్గడం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాల్లో ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. భౌతిక బంగారంతో పాటు డిజిటల్ గోల్డ్, ఇటిఎఫ్ (ETF)లపై ఆసక్తి పెరగడం వల్ల డిమాండ్ పెరిగి ధరలు పైపైకి వెళ్తున్నాయి.మారిన వినియోగదారుల తీరుధరలు భారమైనా సెంటిమెంట్ను వదులుకోని భారతీయులు, తమ కొనుగోలు పద్ధతులను మార్చుకుంటున్నారు. భారీ ఆభరణాల కంటే తక్కువ బరువుతో ఆకర్షణీయంగా కనిపించే డిజైన్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఫ్యాషన్ కంటే పెట్టుబడి దృక్పథంతో బంగారు నాణేలను కొనుగోలు చేస్తున్నారు. కొత్తగా నగదు ఖర్చు చేసే కంటే, ఇంట్లో ఉన్న పాత ఆభరణాలను ఇచ్చి కొత్తవి తీసుకునే 'ఎక్స్ఛేంజ్ స్కీంల' వైపు జనం మొగ్గు చూపుతున్నారు.వ్యాపారుల వ్యూహాలుకస్టమర్లను ఆకర్షించడానికి జ్యువెలరీ షాపులు కూడా రాయితీలను ప్రకటిస్తున్నాయి. మేకింగ్ ఛార్జీలపై తగ్గింపులు, ముందస్తు బుకింగ్ సదుపాయాలు కల్పిస్తున్నారు. స్టోర్లకు వచ్చే వారి సంఖ్య తగ్గకపోయినప్పటికీ, ఒక్కొక్కరు కొనే బంగారం పరిమాణం తగ్గే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
ఊడిన ఉద్యోగికి ఎంత కష్టం!!
ప్రైవేటు రంగంలో పెరుగుతున్న లేఆఫ్స్ కేవలం ఉద్యోగ భద్రతనే కాకుండా, మధ్యతరగతి ఆర్థిక మూలాలను, ముఖ్యంగా ఈఎంఐ (EMI) చెల్లింపుల వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈఎంఐలు అంటే సాధారణ వ్యావహారికంలో సులభ వాయిదాలుగా వ్యవహిరిస్తారు. కానీ ఉద్యోగం కోల్పోయిన వారికి ఇప్పుడవే భూతంగా భయపెడుతున్నాయి. ఈ పరిస్థితిపై తాజా నివేదికలు, విశ్లేషణలతో ప్రత్యేక కథనం..ఐటీ లేఆఫ్స్.. ఈఎంఐ సంక్షోభంగత దశాబ్ద కాలంగా భారత ఐటీ రంగం స్థిరమైన ఆదాయానికి, విలాసవంతమైన జీవనశైలికి చిరునామాగా నిలిచింది. అయితే, 2025-26 కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం, ప్రపంచ ఆర్థిక మందగమనం కారణంగా ఐటీ కొలువులు ఊడుతున్నాయి. ఇది నేరుగా బ్యాంకింగ్, రుణ చెల్లింపుల రంగంపై ప్రభావం చూపుతోంది.పెరుగుతున్న గృహ రుణాల ఆందోళనఐటీ నిపుణులు ఎక్కువగా బెంగళూరు, హైదరాబాద్, పుణే వంటి నగరాల్లో భారీ ధరలకు ఇళ్లను కొనుగోలు చేశారు. మెట్రో నగరాల్లో సగటు ఐటీ ఉద్యోగి హోమ్ లోన్ ఈఎంఐ రూ.80,000 నుండి రూ.1.2 లక్షల మధ్య ఉంటోంది. ఇటీవల ఒక సర్వే ప్రకారం, ఉద్యోగం కోల్పోయిన వారిలో 60% మందికి కేవలం 6 నుండి 8 నెలల వరకు మాత్రమే ఈఎంఐలు చెల్లించగల అత్యవసర నిధి (Emergency Fund) ఉంది. ఆ తర్వాత డిఫాల్ట్ అయ్యే ప్రమాదం కనిపిస్తోంది.భారమైన బకాయిలుఆర్బీఐ (RBI) తాజా ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ (2026) ప్రకారం, భారతదేశ గృహ రుణాలు జీడీపీలో 41% దాటాయి. ఇందులో అధిక భాగం వినియోగ అవసరాల కోసం తీసుకున్న పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ బకాయిలే. ఐటీ నిపుణులు తమ జీవనశైలిని కొనసాగించేందుకు తీసుకున్న అన్సెక్యూర్డ్ లోన్స్ ఇప్పుడు భారంగా మారాయి. ఆదాయం ఆగిపోవడంతో, ఈ రుణాల రికవరీ బ్యాంకులకి సవాలుగా మారుతోంది.మారిన సిబిల్ నిబంధనలతో తక్షణ ప్రభావంఏప్రిల్ 2026 నుండి ఆర్బీఐ కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం.. బ్యాంకులు ఇప్పుడు ప్రతి వారం రుణ గ్రహీతల సమాచారాన్ని సిబిల్కు పంపాలి (గతంలో ఇది 15-30 రోజులకు ఒకసారి ఉండేది). దీంతో ఒక్క ఈఎంఐ మిస్ అయినా, కేవలం 7 రోజుల్లోనే మీ క్రెడిట్ స్కోర్ పడిపోతుంది. దీనివల్ల ఉద్యోగం కోల్పోయిన వారు ఇతర రుణాల కోసం ప్రయత్నించడం లేదా రీఫైనాన్సింగ్ చేసుకోవడం కష్టతరమవుతోంది.తాజా నివేదికల ముఖ్యాంశాలు బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు (NPA) చారిత్రాత్మక కనిష్టంలో (2.15%) ఉన్నప్పటికీ, పర్సనల్ లోన్ విభాగంలో ఒత్తిడి పెరుగుతోంది. గృహ రుణాలు జీడీపీలో 41% కి చేరాయి. ఇది ఆందోళనకర స్థాయి. ఐటీ హబ్లలో నివసించే వారిలో పొదుపు శాతం 15% తగ్గింది. ఐటీ ఉద్యోగుల నుండి రుణ కాలపరిమితి పెంచాలని కోరుతూ వచ్చే దరఖాస్తులు 25% పెరిగాయి.ఉద్యోగం కోల్పోతే ఏం చేయాలి?లేఆఫ్స్ జరిగినప్పుడు భయపడి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం లేదా బ్యాంకులకు ముఖం చాటేయడం అతిపెద్ద తప్పు. రుణదాతలతో సంప్రదింపులు జరిపి మోరటోరియం లేదా లోన్ రీస్ట్రక్చరింగ్ కోరడం ఉత్తమ మార్గమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.అన్నిటా లేఆఫ్లు పెరుగుతున్న తరుణంలో ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితి. కాబట్టి ఉద్యోగులు ఇప్పటి నుంచే జాగ్రత్త పడాలి. కనీసం 12 నెలల ఈఎంఐలకు సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ నిధిని ముందే సిద్ధం చేసుకోవాలి. మొదట హోమ్ లోన్ వంటి సెక్యూర్డ్ లోన్స్కు ప్రాధాన్యత ఇవ్వాలి, ఎందుకంటే ఆస్తి జప్తు అయ్యే అవకాశం ఉంటుంది. ఆదాయం తగ్గినప్పుడు వెంటనే విలాసవంతమైన ఖర్చులను నిలిపివేయాలి.ఐటీ రంగంలో లేఆఫ్స్ అనేవి కేవలం ఒక రంగ సమస్య కాదు, ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థలో వినియోగాన్ని, రుణ చెల్లింపుల చక్రాన్ని ప్రభావితం చేస్తోంది. క్రెడిట్ స్కోర్ పట్ల బ్యాంకులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్న తరుణంలో, ఐటీ ఉద్యోగులు తమ ఆర్థిక ప్రణాళికలను మరింత జాగ్రత్తగా రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. -
గ్రాట్యుటీ.. రిటైర్మెంట్ గిఫ్ట్!
ఒక సంస్థలో ఏళ్ల తరబడి పనిచేసిన ఉద్యోగికి, ఆ సంస్థ పట్ల వారు చూపిన అంకితభావానికి, విధేయతకు ఇచ్చే గౌరవపూర్వకమైన బహుమతే గ్రాట్యుటీ. ఇది కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాదు, ఉద్యోగి శ్రమకు యాజమాన్యం ఇచ్చే గుర్తింపు. మరి ఈ గ్రాట్యుటీ అందరికీ వస్తుందా? దీని లెక్కలేంటి? తాజా నిబంధనలు ఏం చెబుతున్నాయి? ఓసారి పరిశీలిద్దాం.గ్రాట్యుటీ అంటే ఏమిటి?‘పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్, 1972’ ప్రకారం, ఒక ఉద్యోగి ఒకే సంస్థలో దీర్ఘకాలం పనిచేసినందుకు ప్రతిఫలంగా యజమాని ఇచ్చే మొత్తాన్ని గ్రాట్యుటీ అంటారు. సాధారణంగా ఉద్యోగి పదవీ విరమణ చేసినప్పుడు, రాజీనామా చేసినప్పుడు లేదా దురదృష్టవశాత్తు మరణించినప్పుడు ఈ మొత్తాన్ని చెల్లిస్తారు.గ్రాట్యుటీ పొందడానికి అర్హతలుగ్రాట్యుటీ అందరికీ వర్తించదు. దీనికి కొన్ని ప్రాథమిక నియమాలు ఉన్నాయి. ఒకే సంస్థలో కనీసం 5 ఏళ్ల నిరంతర సేవలు పూర్తి చేసి ఉండాలి. 10 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న ఏ సంస్థ అయినా గ్రాట్యుటీ చట్టం పరిధిలోకి వస్తుంది. ఒకవేళ ఉద్యోగి మరణించినా లేదా ప్రమాదం వల్ల అంగవైకల్యం సంభవించినా ఈ ఐదేళ్ల నిబంధన వర్తించదు. అటువంటప్పుడు వారు పనిచేసిన కాలానికే గ్రాట్యుటీ చెల్లిస్తారు.ఎలా లెక్కిస్తారు?గ్రాట్యుటీ లెక్కించడానికి ఒక నిర్దిష్టమైన సూత్రం ఉంది. ఇందులో ప్రధానంగా రెండు అంశాలు కీలకం. చివరిగా తీసుకున్న వేతనం (బేసిక్+డీఏ), పూర్తి చేసిన సర్వీసు కాలం.గ్రాట్యుటీ=(చివరగా తీసుకున్న వేతనం*సర్వీసు చేసిన మొత్తం సంవత్సరాలు*15)/26ఇక్కడ 26 రోజులను ఒక నెలగా పరిగణిస్తారు. నెలలో 4 ఆదివారాలు తీసివేసి 15 రోజులను సగటు వేతనంగా లెక్కిస్తారు.ఉదాహరణ:రాము అనే వ్యక్తి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో 10 ఏళ్ల 7 నెలలు పనిచేశాడు. అతను ఉద్యోగం వదిలేటప్పుడు అతని బేసిక్ పే, డీఏ కలిపి రూ.50,000 అనుకుందాం.గమనిక: సర్వీసు కాలం 6 నెలల కంటే ఎక్కువ ఉంటే దాన్ని తదుపరి ఏడాదిగా పరిగణిస్తారు. అంటే ఇక్కడ రాము సర్వీసును 11 ఏళ్లుగా తీసుకోవాలి.గ్రాట్యుటీ: (50000*11*15)/26=రూ.3,17,307.ముఖ్యమైన అంశాలుప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం, ఒక ఉద్యోగి గరిష్టంగా రూ.20 లక్షల వరకు గ్రాట్యుటీని పన్ను మినహాయింపుతో పొందవచ్చు. కొత్త లేబర్ కోడ్ అమల్లోకి వస్తే ఈ పరిమితి పెరిగే అవకాశం ఉంది.ప్రభుత్వ ఉద్యోగులకు గ్రాట్యుటీపై పూర్తి పన్ను మినహాయింపు ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగులకు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 10(10) ప్రకారం నిర్దేశిత పరిమితి వరకు మినహాయింపు లభిస్తుంది.ప్రతి ఉద్యోగి తన గ్రాట్యుటీ కోసం నామినీని నియమించుకోవడం తప్పనిసరి.ఇదీ చదవండి: రఫేల్ డీల్.. ‘స్వదేశీ’ అస్త్రాలకు పెద్దపీట! -
ఆన్లైన్ పేమెంట్ అలర్ట్.. గంట తర్వాతే చెల్లింపులు!
డిజిటల్ లావాదేవీల్లో పెరుగుతున్న మోసాలను తగ్గించేందుకు ఆర్బీఐ కీలక చర్యలు ప్రతిపాదించింది. ఇందుకు సంబంధించి ఒక చర్చాపత్రం విడుదల చేసింది. డిజిటల్ లావాదేవీ రూ.10,000 కంటే ఎక్కువ ఉంటే ఒక గంట తర్వాతే దాన్ని అమలు చేసే విధానం (ల్యాగ్) ఉండాలని ప్రతిపాదన తెచ్చింది.వద్దనుకుంటే గంటలోపు విజయవంతం కాకముందే దాన్ని రద్దు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. దీనివల్ల సైబర్ నేరస్థులు డెబిట్ చేసుకునేట్టు అయితే ఆ లావాదేవీల సమాచారం కస్టమర్లకు ముందే తెలుస్తుంది. అలాగే, మ్యూల్ ఖాతాలకు చెక్ పెట్టేందుకు ఒక ఖాతాలోకి వచ్చే మొత్తం జమలపై పరిమితులను ప్రతిపాదించింది. మెరుగైన శ్రద్ధ లేని ఖాతాలకు వార్షిక క్రెడిట్లను సుమారు రూ .25 లక్షలకు పరిమితం చేయాలని సూచించింది.ఒకే క్లిక్తో అన్ని డిజిటల్ చెల్లింపులను నిలిపివేసే (కిల్ స్విచ్) విధానాన్ని పేర్కొంది. ఇక 70 ఏళ్లు నిండిన వృద్ధులు, దివ్యాంగులను మోసపుచ్చి పెద్ద మొత్తాల్లో డబ్బులు ఖాతా నుంచి మళ్లించకుండా, ఆయా లావాదేవీలకు విశ్వసనీయమైన వ్యక్తి ద్వారా అదనపు ధ్రువీకరణను తీసుకువచ్చే ప్రతిపాదనను చేసింది. రూ .50,000 లకు మించిన లావాదేవీల విషయంలో వినియోగదారులకు నిధులను బదిలీ చేయడానికి ముందు నామినేటెడ్ వ్యక్తి నుండి అనుమతి అవసరం. -
విదేశీ చెల్లింపులపై కస్టమర్లకు వెంటనే సమాచారం
ముంబై: విదేశాల నుంచి భారత్లోని ఖాతాలకు వచ్చే సీమాంతర చెల్లింపులపై (జమలు) ఖాతాదారులకు వెంటనే సమాచారం (నోటిఫికేషన్) ఇవ్వాలని బ్యాంక్లకు ఆర్బీఐ ఆదేశించింది. ఇందుకు వీలుగా తమ ప్రక్రియలను క్రమబద్దీకరించుకోవాలని సూచించింది. ఖాతాలో జమ అయిన వెంటనే కస్టమర్లకు తెలియజేయాలని స్పష్టం చేసింది.ఫారెక్స్ మార్కెట్ పనిచేయని వేళ్లలో వచ్చే చెల్లింపుల విషయాన్ని మరుసటి రోజు తెలియజేయాలని కోరింది. బ్యాంకులు తమ విదేశీ ఖాతాల లావాదేవీలను గరిష్టంగా ఒక గంటలోపే పరిశీలించి సరిచూడాలని ఆదేశించింది. ఫారీన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్ పనివేళ్లలో వచ్చే చెల్లింపులను మాత్రం అదే రోజు జమ చేయాలని పేర్కొంది. ఇందుకు వీలుగా వ్యవస్థలను సరిచేసుకోవాలని సూచించింది.2025 అక్టోబర్ 29న జారీ చేసిన ముసాయిదా నిబంధనలపై భాగస్వాముల నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా ఈ నిబంధనలను ఆర్బీఐ జారీ చేసింది. ఇవి ఆరు నెలల తర్వాత నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. కొత్త నిబంధనల ప్రకారం సీమాంతర చెల్లింపులకు సంబంధించి సమాచారం అందించిన వెంటనే, ఆ మొత్తాన్ని తక్షణమే సంబంధిత లబ్దిదారు ఖాతాలో జమ చేయనప్పటికీ, కస్టమర్లకు వెంటనే ఆ విషయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. -
పోస్టాఫీసు స్కీములు.. అత్యధిక వడ్డీలు
సంపాదించే ప్రతి వ్యక్తి తన భవిష్యత్తు కోసమో, తన కుటుంబం భవిష్యత్తు కోసమో ఎంతో కొంత పొదుపు చేయాలనుకుంటారు. అయితే రిస్క్తో కూడిన స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లు అందరూ చేయలేరు. అలాంటి వారి కోసం రిస్క్ లేకుండా మెరుగైన రాబడినిచ్చే అనేక పొదుపు పథకాలు పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉన్నాయి. ఆయా స్కీములు ఏంటి.. వాటికి వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి.. తెలుసుకుందాం..2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్) సంబంధించి చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా ప్రకటించింది. వరుసగా ఎనిమిదో త్రైమాసికంలోనూ రేట్లలో ఎలాంటి మార్పు చేయకపోవడం గమనార్హం. సురక్షితమైన పెట్టుబడితో పాటు ఆకర్షణీయమైన రాబడులు ఇచ్చే ప్రధాన పథకాల వివరాలు ఇలా ఉన్నాయి..సుకన్య సమృద్ధి యోజన: ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఉద్దేశించిన ఈ పథకం ప్రస్తుతం అత్యధిక వడ్డీని అందిస్తోంది. దీర్ఘకాలిక అవసరాలకు ఇది ఉత్తమ ఎంపిక. దీనికి వడ్డీ రేటు 8.2 శాతంగా ఉంది.సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్: వృద్ధులకు సామాజిక భద్రత కల్పిస్తూ, సుకన్య సమద్ధితో సమానంగా అత్యధిక 8.2% వడ్డీని అందిస్తోంది.పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF): పన్ను ప్రయోజనాలతో పాటు దీర్ఘకాలిక సంపద సృష్టికి ఇది అత్యంత ప్రజాదరణ పొందిన పథకం. దీనిపై ప్రస్తుతం 7.1% వడ్డీ లభిస్తోంది.నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC): ఐదేళ్ల కాలపరిమితి కలిగిన ఈ పథకం స్థిరమైన, సురక్షితమైన రాబడులకు గ్యారెంటీ ఇస్తుంది. దీనిపై అందిస్తున్న వడ్డీ 7.7 శాతం.కిసాన్ వికాస్ పత్ర (KVP): తమ పెట్టుబడిని నిర్ణీత కాలంలో రెట్టింపు చేసుకోవాలనుకునే వారికి ఇది సరైన ఎంపిక. ప్రస్తుత రేటు ప్రకారం 115 నెలల్లో నగదు రెట్టింపు అవుతుంది. దీని వడ్డీ రేటు 7.5%.మంత్లీ ఇన్కమ్మ్ స్కీమ్ (MIS): ఒకేసారి పెట్టుబడి పెట్టి, ప్రతి నెలా స్థిరమైన ఆదాయం పొందాలనుకునే వారికి ఈ పథకం అనువైనది. దీనికి 7.4% వడ్డీ లభిస్తుంది.టైమ్ డిపాజిట్లు & రికరింగ్ డిపాజిట్లుబ్యాంకు ఎఫ్డీలతో పోలిస్తే పోస్టాఫీసు టైమ్ డిపాజిట్లు గట్టి పోటీనిస్తున్నాయి. కాలపరిమితిని బట్టి వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి..కాలపరిమితివడ్డీ రేటు (%)ఏడాది టైమ్ డిపాజిట్6.9రెండేళ్ల టైమ్ డిపాజిట్7.0మూడేళ్ల టైమ్ డిపాజిట్7.1ఐదేళ్ల టైమ్ డిపాజిట్7.55 ఏళ్ల రికరింగ్ డిపాజిట్ (RD)6.7సాధారణ సేవింగ్స్ డిపాజిట్లపై యథావిధిగా 4 శాతం వడ్డీ కొనసాగుతోంది. మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా, ప్రభుత్వ హామీతో కూడిన ఈ పథకాలు సామాన్యులకు పెట్టుబడి సాధనాలుగా నిలుస్తున్నాయి. -
స్మాల్ సేవింగ్స్ వడ్డీ రేట్లు ఇలా..
చిన్న మొత్తాల పొదుపు పథకాల రేట్లు వరుసగా ఎనిమిదో త్రైమాసికంలోనూ యథాతథంగా కొనసాగనున్నాయి. 2026–27 సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించి చిన్న మొత్తాల పొదుపు పథకాల రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా ప్రకటించింది. వివిధ స్కీమ్లపై ఎంత వడ్డీ వస్తుందో చూద్దాం..➤ సుకన్య సమృద్ధి యోజన: 8.2 శాతం➤ పీపీఎఫ్: 7.1 శాతం➤ సేవింగ్స్ డిపాజిట్ రేటు: 4 శాతం➤ కిసాన్ వికాస్ పత్ర: 7.5 శాతం➤ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్: 7.7 శాతం➤ మంత్లీ ఇన్కమ్ స్కీమ్: 7.4 శాతం➤ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్: 8.2 శాతం➤ ఏడాది టైమ్ డిపాజిట్: 6.9 శాతం➤ రెండేళ్ల టైమ్ డిపాజిట్: 7 శాతం➤ మూడేళ్ల టైమ్ డిపాజిట్: 7.1 శాతం➤ ఐదేళ్ల టైమ్ డిపాజిట్: 7.5 శాతం➤ ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ): 6.70 శాతం -
పెళ్లి ఆగిపోయినా.. ఖర్చు మిగిలిపోదు!
భారతదేశంలో వివాహం అంటే కేవలం రెండు మనసుల కలయిక మాత్రమే కాదు, అదొక భారీ వేడుక. లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసే ఈ వేడుకలు, ఏదైనా అనుకోని కారణంతో ఆగిపోతే ఆ కుటుంబాలు ఆర్థికంగా కోలుకోవడం కష్టమవుతుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అండగా నిలిచేందుకు ఇప్పుడు 'వెడ్డింగ్ ఇన్సూరెన్స్' (Wedding Insurance)అందుబాటులోకి వచ్చింది.ఏమేమి కవర్ అవుతాయి?సాధారణంగా వెడ్డింగ్ ఇన్సూరెన్స్ పాలసీలు ప్రధానంగా నాలుగు అంశాల్లో రక్షణ కల్పిస్తాయి..క్యాన్సిలేషన్ లేదా వాయిదా: ప్రకృతి వైపరీత్యాలు (భారీ వర్షాలు, వరదలు), ఆకస్మిక అగ్నిప్రమాదాలు లేదా వధూవరుల కుటుంబాల్లో ఎవరైనా మరణించడం వంటి కారణాలతో పెళ్లి ఆగిపోతే, ఇప్పటికే చెల్లించిన అడ్వాన్స్లను బీమా కంపెనీ చెల్లిస్తుంది.ఆస్తి నష్టం: ఫంక్షన్ హాల్లో అగ్నిప్రమాదం జరిగి ఆస్తికి నష్టం వాటిల్లినా లేదా దొంగతనం జరిగినా బీమా వర్తిస్తుంది.వ్యక్తిగత ప్రమాదాలు: వేడుక సమయంలో వధూవరులకు లేదా పాలసీలో పేర్కొన్న కుటుంబ సభ్యులకు ఏదైనా ప్రమాదం జరిగితే వైద్య ఖర్చులు భరిస్తుంది.పబ్లిక్ లయబిలిటీ: పెళ్లికి వచ్చిన అతిథులకు ఏదైనా ప్రమాదం జరిగినా లేదా మూడవ పక్షానికి నష్టం జరిగితే ఈ పాలసీ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు.వధూవరుల్లో ఒకరు తప్పుకుంటే బీమా వస్తుందా?ఇది చాలా మందికి ఉండే సందేహం. ఒకవేళ వధూవరుల్లో ఎవరో ఒకరు పెళ్లి వద్దని వెళ్ళిపోతే ఇన్సూరెన్స్ వర్తిస్తుందా? దీనికి సమాధానం 'లేదు'. వధూవరుల మధ్య గొడవలు రావడం, ఒకరు మరొకరిని ఇష్టం లేక వదిలేయడం (Cold Feet) వంటి కారణాలకు బీమా కంపెనీలు పరిహారం ఇవ్వవు. అలాగే యుద్ధం, ఉగ్రవాద దాడులు లేదా వధూవరుల నిర్లక్ష్యం వల్ల జరిగే నష్టాలకు కూడా బీమా వర్తించదు.ప్రీమియం ఎంత ఉంటుంది?వివాహ బడ్జెట్ను బట్టి ఈ పాలసీ ప్రీమియం నిర్ణయిస్తారు. సాధారణంగా పెళ్లి మొత్తం ఖర్చులో 0.7 శాతం నుంచి 2 శాతం వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అంటే, రూ. 20 లక్షల బడ్జెట్తో పెళ్లి చేసుకుంటున్న వారు దాదాపు రూ. 15 వేల నుంచి రూ. 25 వేల మధ్య ప్రీమియం చెల్లించి సురక్షితం కావచ్చు.బీమా అందించే సంస్థలుభారతదేశంలో ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ ఎర్గో (HDFC ERGO), ఐసీఐసీఐ లాంబార్డ్ (ICICI Lombard), బజాజ్ అలియంజ్ (Bajaj Allianz), ఫ్యూచర్ జనరాలి (Future Generali) వంటి సంస్థలు ఈ వెడ్డింగ్ ఇన్సూరెన్స్ ప్యాకేజీలను అందిస్తున్నాయి. పెళ్లి కార్డు ప్రింటింగ్ నుంచి క్యాటరింగ్, వెన్యూ బుకింగ్ వరకు అన్నిటికీ రసీదులు (Invoices) ఉంటే క్లెయిమ్ ప్రాసెస్ సులభతరం అవుతుంది.లక్షల రూపాయల ఖర్చుతో కూడిన శుభకార్యాన్ని నిర్వహిస్తున్నప్పుడు, స్వల్ప ప్రీమియంతో ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఆర్థిక భద్రతతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: బంగారంపై తీపి కబురు.. రెండు రోజులే గ్యాప్.. -
నూతన సంవత్సరంలో కొత్త మార్పులతో ముందుకు..
కొత్త ఆర్థిక సంవత్సరం మొదలు.. ఇంచుమించుగా కొత్త తెలుగు సంవత్సరమైన పరాభవ కూడా మొదలు.. కొత్త ఆదాయపు చట్టం అమల్లోకి వచ్చింది. కొత్త నియమాలు.. కొత్త దేవుడొచ్చాడు. దేవుడు మారాడు కానీ మన బాధ్యతలు మారలేదు. కర్తవ్యం యథాతథం. పూజా యథాతథమే. సకాలంలో కర్తవ్యం పూర్తి చేస్తే అనుగ్రహం, శాంతి కలుగుతాయి. లేదంటే ఆగ్రహం, అశాంతి.ఆదాయ పన్ను చట్టం 2025లో సాంకేతికంగా చూస్తే సెక్షన్లు, చాప్టర్లు తగ్గాయి. అక్షరమాల పోయి, అంకెల మాల అయ్యింది. చాలా విషయాల్లో హేతుబద్ధీకరణ జరిగింది. మాటిమాటికీ బ్రాకెట్లు వాడేవారు. ఇప్పుడవి లేవు. క్లాజులు, సబ్క్లాజులు తగ్గాయి. వివరణలు తగ్గాయి. సులభంగా, అర్థమయ్యేలా ఉంది. కొత్త చట్టం, నియమాలు అమలయ్యే వేళ, మార్పుల గురించి తెలుసుకుందాం. ఇక నుంచి ఆర్థిక సంవత్సరాన్ని ఆదాయపు సంవత్సరం, పన్ను సంవత్సరం అంటారు. మొన్నటి వరకు రెండు పదాలు.. అంటే ఒకటి ఆదాయపు సంవత్సరం, రెండోది మదింపు సంవత్సరంగా ఉండేవి. ఇప్పుడు ఒకే పదం.. ఒకే సంవత్సరం. ప్రస్తుతం మనం 2026–27 పన్ను సంవత్సరంలో ఉన్నాం.జీతం రూపంలోని ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఒక్కొక్క అంశం దగ్గర ఒక్కొక్క నిర్వచనం. ‘జీతం’ అంటే ఏమిటనేది ఉండేది. ఇప్పుడు ఏ అంశమైనా ఒకే నిర్వచనం. దీని వల్ల ఎటువంటి తికమక ఉండదు. తప్పుడు లెక్కలకు ఆస్కారం లేదు.మనం ఫైల్ చేసిన ఐటీఆర్ తప్ప మిగతా అన్నింటి నంబర్లు మారిపోయాయి. దశాబ్దాల చరిత్ర గల ఫారం 16 మారిపోతోంది. కొత్త నంబరు 130. ఈ మార్పుకంటే అందులోని అంశాల్లో మార్పులు మరింత ముఖ్యమైనవి. ఇన్నాళ్లు, కేవలం ఆదాయం, పన్ను భారం, టీడీఎస్ వివరాలకే పరిమితం అయింది. ఇప్పుడు ఫోకస్ మారింది. కొత్త చట్టంలోని నియమాల ప్రకారం ‘పన్ను సంవత్సరం’ అని ప్రస్తావిస్తారు. ఉద్యోగి వివరాలను అటు యజమాని తెలియజేస్తారు. పన్ను భారమే కాకుండా ఏ రేటు ప్రకారం ఎంతెంత అనేది చెప్పాలి. అంతే కాకుండా ఈ సమాచారం టీడీఎస్ రిపోర్టింగ్లోని అంశాలకు సరిపోలి ఉండాలి. అప్డేటెడ్ సిస్టంతో ఇంటిగ్రేట్ చేస్తున్నారు. ఫారం 130లోని అంశాలు యజమాని బాధ్యత అయినప్పటికీ, మీరు 130లోని ప్రతి అంశాన్ని చెక్ చేసుకోండి.అలాగే 26ఏఎస్/ఏఐఎస్కి స్వస్తి పలికారు. కొత్త నంబరు 168. పేరులో చిన్న మార్పు..నంబరులో మార్పు. 26ఏఎస్ కేవలం టీడీఎస్, టీసీఎస్, ట్యాక్స్ చెల్లింపుల వరకే పరిమితం. కానీ 168లో ఫోకస్ అంతా విశ్వమయం. అన్ని ఆర్థిక వ్యవహారాల సమాచారం, ట్రాకింగ్ ఉంటుంది. ట్యాక్స్ పద్దులకే 26ఏఎస్ పరిమితం కాగా, ఫారం 168లో పన్ను పద్దులతో పాటు షేర్లు, డిపాజిట్లు, ఇన్వెస్ట్మెంట్స్, ఖర్చులు మొదలైనవి కూడా ఉంటాయి. ఇక్కడ గమనించాల్సినదేమిటంటే ఫారం 130 అనేది యజమాని బాధ్యత. ఫారం 168 డిపార్టుమెంటు వారి బాధ్యత. కానీ ఈ రెండింటి వల్ల ప్రభావితం అయ్యేది మీరు. మీ ప్రమేయం లేకపోయినా ఇవి మిమ్మల్ని శాసిస్తాయి. జాగ్రత్తగా పరిశీలించండి.మరో ఫారం 16ఏ కాస్తా ఫారం 131గా అవతారం ఎత్తుతోంది. జీతం కాని ఆదాయాలన్నింటి మీద టీడీఎస్లు ఇందులో ఉంటాయి. ఫారం 131 కూడా కొత్త చట్టానికి, కొత్త రూల్స్కి అనుసంధానంగా ఉంటుంది. మీరు చెక్ చేసుకోండి.ఉద్యోగస్తులకు శుభవార్త. విద్య అలవెన్స్, హాస్టల్ అలవెన్స్, గిఫ్ట్ ఓచర్ లిమిట్, భోజన కూపన్ అలవెన్స్ మొదలైన వాటి మీద పరిమితిని గణనీయంగా పెంచారు. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని ఎంతో సమంజసంగా, సమయోచితంగా ఆచరణాత్మకమైన విధంగా ఈ పరిమితులు పెంచారు.ఇక హెచ్ఆర్ఏ విషయంలో గతంలో 50 శాతం పరిమితిని కేవలం నాలుగు ప్రధాన నగరాలకే పరిమితం చేసేవారు. ఇప్పుడు మరికొన్ని నగరాలకు విస్తరింపచేశారు. అందులో హైదరాబాద్ ఉంది.పాన్ నంబరుని కంపల్సరీగా తెలియజేసే పరిమితులను పెంచారు. ఇన్కం ట్యాక్స్తో సంబంధం లేకపోయినా, రిజర్వ్ బ్యాంకు కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆన్లైన్ చెల్లింపుల విషయంలో కూడా మార్పులు వచ్చాయి. వివరాలు రాబోయే రోజుల్లో మరింతగా తెలుసుకుందాం. -
ఈ వారం బ్యాంకులకు వెళ్లొచ్చా?
సామాన్యుడి దైనందిన జీవితంలో బ్యాంకింగ్ సేవలు అంతర్భాగమయ్యాయి. నగదు విత్డ్రాయల్స్ నుంచి లోన్ అప్లికేషన్ల వరకు ఏదో ఒక పనిపై మనం బ్యాంకులను సందర్శిస్తుంటాం. అయితే, బ్యాంకుకు వెళ్లే ముందు ఆ రోజు సెలవు ఉందో లేదో తెలుసుకోవడం అవసరం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన హాలిడే క్యాలెండర్ ప్రకారం.. ఏప్రిల్ 6 నుండి ఏప్రిల్ 12 మధ్య బ్యాంకుల పనిదినాల వివరాలు ఇలా ఉన్నాయి..ఈ వారం ప్రత్యేక సెలవులు లేవుఆర్బీఐ నిబంధనల ప్రకారం, ఈ వారంలో (ఏప్రిల్ 6 - ఏప్రిల్ 12) దేశవ్యాప్తంగా ఎలాంటి జాతీయ లేదా ప్రాంతీయ పండుగ సెలవులు లేవు. బ్యాంకులు తమ సాధారణ పనివేళల్లోనే సేవలందిస్తాయి. అయితే, వారాంతపు సెలవుల కారణంగా కొన్ని రోజులు బ్యాంకులు మూసి ఉంటాయని గమనించాలి. ఏప్రిల్ 11న రెండో శనివారం, 12వ తేదీన ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకు శాఖలు మూసి ఉంటాయి. సాధారణంగా బ్యాంకులు ప్రతి నెల మొదటి, మూడవ, ఐదవ శనివారాల్లో పనిచేస్తాయి. రెండో, నాలుగో శనివారాల్లో మాత్రమే సెలవు ఉంటుంది.ఆన్లైన్ సేవలు అందుబాటులో..బ్యాంకులకు భౌతికంగా సెలవు ఉన్నప్పటికీ, ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా డిజిటల్ బ్యాంకింగ్ సేవలు నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయి.ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ (UPI) సేవలతోపాటు నెట్ బ్యాంకింగ్/మొబైల్ యాప్స్ ద్వారా నగదు బదిలీ (NEFT, RTGS, IMPS) చేసుకోవచ్చు. ఇక ఏటీఎం (ATM) కేంద్రాలు 24 గంటలూ తెరిచి ఉంటాయి. -
గ్రూప్ బీమా.. ఇస్తుందా ధీమా?
వేతన జీవుల్లో చాలా మందికి యాజమాన్యం ఆఫర్ చేసే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎంతో కీలకం. అంతేకాదు, దాన్నొక భరోసాగానూ చూస్తుంటారు. ఒక విధంగా ప్రీమియం తక్కువగా ఉండడం, కొన్ని చోట్ల యాజమాన్యాలు ప్రీమియంలో కొంత సబ్సిడీ ఇవ్వడం, మరికొన్ని సొంతంగా ప్రీమియం చెల్లిస్తూ హెల్త్ ఇన్సూరెన్స్ను ఆఫర్ చేస్తుంటాయి. దీంతో ఉద్యోగులు ఈ విషయంలో మరో ఆలోచన లేదన్నట్టు కనిపిస్తుంటారు.కానీ, అసలు రిస్క్ ఎప్పుడంటే..? ఆ ఉద్యోగంతో బంధం తెగిపోయినప్పుడే. సంస్థే తొలగించొచ్చు. లేదంటే ఉద్యోగే రాజీనామా చేయొచ్చు. లేదా రిటైర్మెంట్ తీసుకోవచ్చు. ఆ మరుసటి రోజు నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ రక్షణ లేకుండా కొనసాగాల్సి వస్తుంది. చూడ్డానికి ఇదేమంత పెద్ద అంశంగా అనిపించకపోవచ్చు. మరో సంస్థలో చేరిన తర్వాత బీమా తీసుకోవచ్చులేనని అనుకోవచ్చు. కానీ, ఈ విరామ సమయంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఎదురైతే రూ.లక్షలాది పొదుపు నిధి ఖర్చయిపోతుంది. లేదంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది.ఇక రిటైర్మెంట్ వరకు సంస్థ బీమాపైనే ఆధారపడిన వారి పరిస్థితి మరింత సంక్లిష్టం. వృద్ధాప్యంలో ఏవైనా ఆరోగ్య సమస్యలతో తాజాగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే అదేమంత ఈజీ కాదు. ప్రీమియం భారీగానే ఉంటుంది. కనుక వేతన జీవులు వ్యక్తిగత ఆరోగ్య రక్షణ విషయం ఎలా వ్యవహరించాలో తెలిపే వెల్త్ స్టోరీ ఇది... – సాక్షి, వెల్త్సంస్థల్లో ఉద్యోగులు అందరికీ ఆఫర్ చేసేది గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్. కనుక స్టాండెలోన్ హెల్త్ప్లాన్తో పోల్చితే ఇందులో కొన్ని పరిమితులు ఉంటాయి. కంపెనీకి రాజీనామా చేసిన మరుక్షణం నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ నిలిచిపోతుంది. కొనసాగింపు ప్రయోజనాలేవీ ఉండవు. పాలసీ నియమ, నిబంధనలు అన్నవి ప్రతి ఉద్యోగికి అనుకూలమైనవిగా ఉండాలని లేదు. సమ్ ఇన్సూర్డ్ (బీమా కవరేజీ) ఎంత ఉండాలి?అందులో ప్రయోజనాలు, మినహాయింపులు, నెట్వర్క్ ఆస్పత్రులు ఇవన్నీ ప్రైవేటు సంస్థ, బీమా సంస్థ కలసి తమ అంగీకారం మేరకు నిర్ణయిస్తుంటాయి. వారు ఆఫర్ చేసే ప్రయోజనాలు, పరిమితులకు ఉద్యోగులు తప్పనిసరిగా అంగీకారం తెలపాల్సిందే. ఉద్యోగులకు సంబంధించి గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల్లో చాలా వరకు కవరేజీ సమగ్రంగా ఉండదు. రూ.3–5 లక్షలకు మించదు. ఈ రక్షణ అందరికీ చాలకపోవచ్చు.రిటైర్మెంట్ వరకు మేల్కొనకపోతే..🔸 55–60 ఏళ్ల తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ కోసం వెళితే బీమా సంస్థలు అన్ని రకాల పరీక్షలు చేయించొచ్చు. 🔸 అప్పటికే ఏవైనా వ్యాధులు ఉంటే రిస్క్ దృష్ట్యా అధిక ప్రీమియంపైనే ఇచ్చేందుకు ముందుకు వస్తాయి. 🔸 పైగా ఆయా వ్యాధులకు 3–4 ఏళ్ల పాటు వేచి ఉన్న తర్వాతే కవరేజీ ఇస్తామంటాయి. 🔸 కొన్ని సంస్థలు ముందస్తు వ్యాధులకు కవరేజీని తరస్కరించొచ్చు. 🔸 పెద్ద వయసులో క్లెయిమ్ల రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కనుక బీమా సంస్థలు నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుంటాయి. 🔸 55–60 ఏళ్ల తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ కోసం వెళితే బీమా సంస్థలు అన్ని రకాల పరీక్షలు చేయించొచ్చు. 🔸 అప్పటికే ఏవైనా వ్యాధులు ఉంటే రిస్క్ దృష్ట్యా అధిక ప్రీమియంపైనే ఇచ్చేందుకు ముందుకు వస్తాయి. 🔸 పైగా ఆయా వ్యాధులకు 3–4 ఏళ్ల పాటు వేచి ఉన్న తర్వాతే కవరేజీ ఇస్తామంటాయి. 🔸 కొన్ని సంస్థలు ముందస్తు వ్యాధులకు కవరేజీని తరస్కరించొచ్చు. 🔸 పెద్ద వయసులో క్లెయిమ్ల రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కనుక బీమా సంస్థలు నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుంటాయి.ముందే ఎందుకు..? హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడైనా, ఏ వయసులో అయినా తీసుకోవచ్చు. కానీ 20–30ల్లో తీసుకుంటే చౌక ప్రీమియంతో వస్తుంది. అన్ని రకాల కవరేజీలను పొందొచ్చు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు కనుక ముఖ్యమైన కవరేజీలకు సంబంధించి వెయిటింగ్ పీరియడ్ నిబంధనల గండాలను సులభంగా దాటేయొచ్చు. అందుకే ఆర్థిక నిపుణులు చిన్న వయసులోనే హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ రక్షణలను జోడించుకోవాలని బలంగా సూచిస్తుంటారు. పనిచేసే సంస్థ ఇచ్చే గ్రూప్ హెల్త్ ప్లాన్తో సంబంధం లేకుండా విడిగా కుటుంబం అంతటికీ వర్తించే విధంగా మెరుగైన రక్షణతో ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ను తప్పకుండా తీసుకోవాలి. దీనివల్ల ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోయినా.. మరో ఉద్యోగం వచ్చే వరకు, పదవీ విరమణ తర్వాత కూడా వ్యక్తిగత ఆరోగ్య బీమా రక్షణ నిశి్చంతగా కొనసాగుతుంది. కంపెనీ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్లో పరిమితులు ఉంటాయి. అదే ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలో తమ కుటుంబ సభ్యుల ఆరోగ్య అవసరాలు, రిస్్కలకు అనుగుణంగా మెరుగైన రక్షణ సదుపాయాలతో ప్లాన్ను ఎంపిక చేసుకోవచ్చు.ఉదాహరణ.. 🔸 35 ఏళ్ల వయసులో రూ.10 లక్షల హెల్త్ ప్లాన్కు ప్రీమియం రూ.8,000–12,000 🔸 60 ఏళ్ల వయసులో ఇంతే కవరేజీ తీసుకోవాలంటే ప్రీమియం రూ.40,000–80,000 చెల్లించాల్సిందే. 🔸 60ల్లో ఆరోగ్య సమస్యలతో పాలసీ కొనుగోలు కష్టం కావొచ్చు. యథార్థమిదీ.. 🔸 హైదరాబాద్కు చెందిన రమేష్ వయసు 60 ఏళ్లు. 🔸 ఒక ప్రైవేటు సంస్థలో 30 ఏళ్లు పనిచేసి రెండేళ్ల క్రితం రిటైర్మెంట్ తీసుకున్నాడు. 🔸 ఇప్పటి వరకు సంస్థ ఇచి్చన గ్రూప్ హెల్త్ ప్లాన్ తప్ప విడిగా ఎలాంటి రక్షణ లేదు.🔸 రమే‹Ùకు కొంత కాలం క్రితమే మధుమేహం, బీపీ బారినపడ్డాడు. 🔸 గత రెండేళ్లలోనే ఆరోగ్య సమస్యల కారణంగా అతడు రూ.6 లక్షలు తన రిటైర్మెంట్ ఫండ్ నుంచి ఖర్చు చేయాల్సి వచ్చింది. ఈ తప్పులకు దూరం దూరం..🔸 కేవలం కంపెనీ బీమాపైనే ఆధారపడడం. 🔸 ఇండివిడ్యువల్ లేదా ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకోకపోవడం. 🔸 బీమా కొనుగోలు చేసినా, ప్రీమియం తక్కువగా ఉండడం. కోసం సమ్ ఇన్సూర్డ్ రూ.3–5 లక్షలకే పరిమితం చేయడం. 🔸 తల్లిదండ్రుల బీమా అవసరాలను విస్మరించడం. 🔸 పెరుగుతున్న ఆదాయం, ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా బీమా రక్షణను సమీక్షించుకోకపోవడం. 🔸 హెల్త్ ఇన్సూరెన్స్ను కేవలం పన్ను ఆదా సాధనంగా చూడడం. 🔸 ఉద్యోగుల గ్రూప్ హెల్త్ ప్లాన్ను ప్రయోజనంగా కాకుండా పరిష్కారంగా చూడడం. రక్షణ అవసరమైన మేర..🔸 ప్రతి వేతన జీవి కనీసం రూ.10–20 లక్షలతో బేస్ ఇండెమ్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలి. 🔸 అది కూడా 25–35 ఏళ్ల వయసు మించకుండా తీసుకుంటనే బెటర్. 🔸 జీవిత భాగస్వామి, పిల్లలను తప్పకుండా అందులో భాగం చేయాలి. పెద్ద వయసులోని తల్లిదండ్రులు ఉంటే వారికంటూ విడిగా ప్లాన్ తీసుకోవాలి. 🔸 టాపప్ లేదా సూపర్ టాపప్ ప్లాన్తో అదనపు రక్షణను కల్పించుకోవాలి. 🔸 బేస్ పాలసీ కవరేజీ అంత డిడక్టబుల్ పెట్టుకుని రూ.50 లక్షలకు టాపప్ లేదా సూపర్ టాపప్ తీసుకోవాలి. ఈ రెండింటిలో సూపర్ టాపప్ ఎక్కువ ప్రయోజనకరం. 🔸 ఒకవేళ బేస్ పాలసీ రూ.5 లక్షలు ఉంటే.. రూ.5 లక్షల డిడక్టబుల్తో రూ.50 లక్షలకు సూపర్ టాపప్ ప్లాన్ తీసుకోవాలి. 🔸 దీనివల్ల ఎప్పుడైనా ఆస్పత్రిలో బిల్లు బేసిక్ కవరేజీని మించిపోతే అప్పుడు టాపప్ లేదా సూపర్ టాపప్ నుంచి చెల్లింపులు లభిస్తాయి. 🔸 రూ.5 లక్షల కవరేజీ చాలులే అనిపించొచ్చు. కానీ, వైద్య చికిత్సల చార్జీలు ఏటా 10–15 శాతం వరకు పెరుగుతున్నాయి. నేడు గుండె సర్జరీకి రూ.5 లక్షలు ఖర్చు అయితే.. పదేళ్ల తర్వాత రూ.12 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుంది. 🔸 అందుకే తగినంత సమ్ ఇన్సూర్డ్తోపాటు ప్రతి మూడేళ్లకు ఒకసారి హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని సమీక్షించుకోవాలి. తమ అవసరాలకు భరోసానిస్తుందా? అన్నది చూసుకోవాలి. -
ఆ ముప్పు ముంచుకొచ్చింది: కియోసాకి హెచ్చరిక
ప్రముఖ ఆర్థిక వ్యాఖ్యాత, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026 నాటికి ప్రపంచం ఆర్థికంగా పెను ముప్పును ఎదుర్కోబోతోందని హెచ్చరిస్తూ ఆయన ఒక పోస్ట్ను షేర్ చేశారు. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి 1974లో జరిగిన కొన్ని కీలక పరిణామాలే కారణమని ఆయన విశ్లేషించారు."బ్యాడ్ న్యూస్.. చరిత్ర ముంచుకొచ్చింది" అంటూ రాబర్ట్ కియోసాకి 2026 ఆర్థిక స్థితిగతులపై ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా 1974లో జరిగిన రెండు ప్రధాన మార్పులు నేటి వినాశకర పరిస్థితులకు కారణమయ్యాయని ఆయన పేర్కొన్నారు.పెట్రో డాలర్ వ్యవస్థ - చమురు యుద్ధాలు1974 వరకు అమెరికా డాలర్కు బంగారాన్ని హామీగా ఉంచేవారని, కానీ ఆ ఏడాది నుంచి డాలర్ 'పెట్రో డాలర్'గా మారిందని కియోసాకి గుర్తుచేశారు. అంటే, బంగారం స్థానంలో చమురు (Oil) డాలర్కు వెన్నుముకగా మారింది. ఆ కారణంగానే 2026లో చమురు కోసం ప్రపంచ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. చమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుతున్నాయి.పెన్షన్ వ్యవస్థలో మార్పు - రిటైర్మెంట్ భయం1974లో అమెరికాలో 'ERISA' చట్టం వచ్చిందని, దీనివల్ల ఉద్యోగులకు జీవితాంతం వచ్చే గ్యారెంటీ పెన్షన్లు పోయి.. 401k, IRA వంటి రిస్క్తో కూడిన పథకాలు వచ్చాయని ఆయన విమర్శించారు. కోట్లాది మంది బేబీ బూమర్స్ (వృద్ధులు) తమ పదవీ విరమణ తర్వాత రూపాయి ఆదాయం లేక ఇబ్బంది పడబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ వంటి వ్యవస్థలు దివాళా తీసే స్థితిలో ఉన్నాయని, దీనివల్ల లక్షలాది మంది వృద్ధులు నిరాశ్రయులయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.అప్పుల ఊబిలో అమెరికాప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అప్పులు పెరిగిపోయాయని, ముఖ్యంగా అమెరికా చరిత్రలోనే అతిపెద్ద రుణగ్రస్త దేశంగా మారిందని కియోసాకి ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల్లో ఆర్థిక విద్య (Financial Education) నేర్పకపోవడమే ఈ దుస్థితికి కారణమని ఆయన దుయ్యబట్టారు.మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలంటే..ఈ సంక్షోభం నుండి బయటపడటానికి రాబర్ట్ కియోసాకి మూడు ప్రధాన సూత్రాలను ప్రతిపాదించారు. నిజమైన సంపదను పొదుపు చేయండి. కేవలం కాగితపు కరెన్సీని నమ్ముకోకుండా బంగారం (Gold), వెండి (Silver), బిట్కాయిన్ (Bitcoin)లలో పెట్టుబడి పెట్టాలని ఆయన సూచించారు.యూట్యూబ్ వంటి వేదికల్లో మంచి గురువులను ఎంచుకుని, డబ్బును ఎలా నిర్వహించాలో నేర్చుకోవాలని కోరారు. అయితే, మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మీ ఆర్థిక భవిష్యత్తును ఇతరుల చేతుల్లో పెట్టకండి. మీరే బాధ్యత తీసుకుని సంపన్నమైన భవిష్యత్తును నిర్మించుకోండి.ఇదీ చదవండి: బంగారం ధరలు: వారమంతా పరుగులు.. ఇప్పుడేమో ఇలా.."1974లో మొదలైన భవిష్యత్తు ఇప్పుడు మన ముందు నిలిచింది. ఓడిపోయిన వారు మీ భవిష్యత్తును నిర్ణయించేలా అవకాశం ఇవ్వకండి." అని కియోసాకి తన పోస్ట్ను ముగించారు.BAD NEWS: History has ARRIVED.1974 was a future changing year. 1974 marked two massive changes in our world’s future.Our problem is….in 2026, our future is here.The two 1974 future changing events were:1974 the US dollar became the Petro dollar. Rather than backed by…— Robert Kiyosaki (@theRealKiyosaki) April 4, 2026 -
బంగారం 'గిఫ్ట్' వచ్చిందా.. ఈ రూల్స్ తెలుసా?
ప్రస్తుతం పసిడి ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, ప్రతి ఇంటా బంగారంపైనే చర్చ జరుగుతోంది. 2026 మార్చిలో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1.69 లక్షల ఆల్-టైమ్ గరిష్టాన్ని తాకి, ప్రస్తుతం స్వల్ప హెచ్చుతగ్గులతో రూ.1.50 లక్షల సమీపంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, అక్షయ తృతీయ, పెళ్లిళ్ల సీజన్ సందర్భంగా బంగారం బహుమతులు ఇచ్చే వారు, తీసుకునే వారు తాజా పన్ను నిబంధనలు తెలుసుకోవడం చాలా అవసరం.బంగారం ధరలు భారీగా పెరగడంతో, బహుమతిగా ఇచ్చే నగలు లేదా కాయిన్ల విలువ కూడా పెరిగింది. దీనివల్ల పన్ను పరిమితులు త్వరగా దాటే అవకాశం ఉంది.ఇలా వస్తే పన్ను లేదు..బంధువుల నుంచి: భార్యాభర్తలు, తల్లిదండ్రులు, తోబుట్టువుల నుంచి ఎంత విలువైన బంగారం అందుకున్నా నయా పైసా పన్ను చెల్లించక్కర్లేదు.వివాహ కానుకలు: వివాహ సమయంలో స్నేహితులు లేదా ఇతరుల నుంచి వచ్చే గోల్డ్ గిఫ్ట్లకు పూర్తి మినహాయింపు ఉంటుంది. ధర ఎంత ఉన్నా పన్ను ఉండదు.వారసత్వ సంపద: తల్లిదండ్రుల నుంచి లేదా వీలునామా ద్వారా వచ్చే బంగారానికి పన్ను మినహాయింపు లభిస్తుంది.ఇలా అయితే పన్ను కట్టాల్సిందే..స్నేహితులు / ఇతరుల నుంచి: బంధువులు కాని వారు ఇచ్చే బంగారం విలువ ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 మించితే, ఆ మొత్తం విలువపై మీ ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం పన్ను కట్టాలి. ప్రస్తుతం బంగారం ధర రూ.1.5 లక్షలు దాటిన నేపథ్యంలో, చిన్న ఉంగరం బహుమతిగా ఇచ్చినా ఈ పరిమితి దాటే అవకాశం ఉందని గుర్తుంచుకోవాలి.బంగారం అమ్మితే పన్ను ఎంత? బడ్జెట్ 2026 నిబంధనల ప్రకారం బంగారం అమ్మకంపై పన్ను (Capital Gains Tax) గణనలో స్పష్టత వచ్చింది. దీర్ఘకాలిక మూలధన లాభం (LTCG): మీరు బంగారాన్ని 24 నెలల (2 ఏళ్లు)కంటే ఎక్కువ కాలం ఉంచుకుని అమ్మితే, వచ్చే లాభంపై 12.5% పన్ను పడుతుంది. ఇందులో 'ఇండెక్సేషన్' (ద్రవ్యోల్బణ సర్దుబాటు) ప్రయోజనం ఉండదు.స్వల్పకాలిక మూలధన లాభం (STCG): కొన్న 24 నెలల లోపే అమ్మితే, ఆ లాభాన్ని మీ వార్షిక ఆదాయానికి కలిపి, మీ ట్యాక్స్ స్లాబ్ (Slab Rate) ప్రకారం పన్ను విధిస్తారు.సావరిన్ గోల్డ్ బాండ్లు (SGB): మీరు నేరుగా ఆర్బీఐ నుంచి కొన్న బాండ్లను (Sovereign Gold Bonds) మెచ్యూరిటీ (8 ఏళ్లు) వరకు ఉంచుకుంటే లాభంపై పన్ను ఉండదు. కానీ, సెకండరీ మార్కెట్లో కొన్న వారికి ఈ మినహాయింపు వర్తించదు.కొనుగోలుపై జీఎస్టీ అదనంబంగారం ధరలతో పాటు పన్నుల (GST) భారం కూడా ఉంటుంది. గోల్డ్ వాల్యూపై 3 శాతం, మేకింగ్ చార్జీలపై 5% జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. డిజిటల్ గోల్డ్పై కూడా 3 శాతం జీఎస్టీ వర్తిస్తుంది.నిపుణుల సూచన: బంగారం ధరలు భారీగా ఉన్నందున, పెద్ద మొత్తంలో బంగారం బహుమతిగా వచ్చినప్పుడు భవిష్యత్తులో ఐటీ నోటీసుల ఇబ్బంది లేకుండా 'గిఫ్ట్ డీడ్' (Gift Deed) రాసి ఉంచుకోవడం ఉత్తమం.ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ ప్రకారం, బంగారం ధరలు 2026 చివరి నాటికి మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాబట్టి పెట్టుబడి లేదా బహుమతుల విషయంలో పన్ను అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోండి.ఇదీ చదవండి: బంగారం, వెండి పెట్టుబడులకు కొత్త నిబంధనలు -
యాక్సిస్ బ్యాంక్: మొబైల్ నంబర్ అప్డేట్ కొత్తగా..
ముంబై: బ్యాంకు ఖాతాకి అనుసంధానమైన మొబైల్ నంబరును మార్చుకోవడానికి సంబంధించి ఆధార్ ఆధారిత ఫేస్ ఆథెంటికేషన్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. ఇందుకోసం ముందుగా కొత్త నంబరును ఎంటర్ చేసి, ఆధార్ఫేస్ఆర్డీ యాప్ ద్వారా ఫోన్ ఫ్రంట్ కెమెరాతో లైవ్ ఫోటోని తీసుకోవాల్సి ఉంటుంది.ఆ తర్వాత కొత్త మొబైల్ నంబరుకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. యాక్సిస్ మొబైల్ యాప్ ‘యాప్’లో రీ–రిజిస్టర్ చేసుకున్నాక, భద్రతా కారణాల రీత్యా తొలి 24 గంటల పాటు మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల పరిమితులు, డిఫాల్ట్ స్థాయికి సెట్ అవుతాయి. ఈ నూతన సదుపాయం వల్ల ఖాతాదారులు మొబైల్ నంబర్ మార్పు కోసం బ్యాంకు శాఖలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా విదేశాల్లో ఉన్నవారు లేదా బ్యాంకుకు వెళ్లలేని వృద్ధులకు ఇది ఎంతో ఊరటనిచ్చే అంశం. అయితే, ఈ ప్రక్రియ సజావుగా సాగాలంటే ఖాతాదారుడి ఆధార్ డేటాబేస్లో ఫోటో, ఇతర వివరాలు లేటెస్ట్ ఉండటం తప్పనిసరి.సాంకేతిక భద్రతతో కూడిన ఈ ఫేస్ ఆథెంటికేషన్ ద్వారా మోసాలకు అడ్డుకట్ట వేయవచ్చని, కేవలం ముఖ గుర్తింపు ద్వారానే కాకుండా ఓటీపీ ధ్రువీకరణ కూడా ఉండటం వల్ల ఖాతాదారుల డేటాకు పూర్తి రక్షణ లభిస్తుందని బ్యాంక్ ప్రతినిధులు పేర్కొన్నారు. -
EPF వడ్డీ రేటు పెంపు? ప్రభుత్వ ప్రకటన ఇదీ..
ఉద్యోగుల భవిష్య నిధి (EPF) వడ్డీ రేటును 10 శాతానికి పెంచుతారనే ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. లోక్సభలో అడిగిన ఓ ప్రశ్నకు కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే లిఖితపూర్వక సమాధానం ఇస్తూ, ప్రస్తుత పరిస్థితులు, ప్రభుత్వ వైఖరిని వివరించారు.కార్మిక సంఘాల నుంచి డిమాండ్ లేదుఈపీఎఫ్ వడ్డీ రేటును 10 శాతానికి పెంచాలని కార్మిక సంఘాలు ఏవైనా డిమాండ్ చేశాయా? అన్న ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. అటువంటి విజ్ఞప్తులేవీ ప్రభుత్వం వద్దకు రాలేదని స్పష్టం చేశారు. వడ్డీ రేటు పెంపుపై యూనియన్ల నుంచి ఎటువంటి అధికారిక ప్రతిపాదనలు లేవని ఆమె పేర్కొన్నారు.10 శాతం రేటు సాధ్యమేనా?వడ్డీ రేటును 10 శాతానికి పెంచే అంశంపై ఈపీఎఫ్ఓ (EPFO) ఏదైనా ఆర్థిక లేదా యాక్చురియల్ విశ్లేషణ నిర్వహించిందా అన్న అంశాన్ని కూడా మంత్రి ప్రస్తావించారు. ఈపీఎఫ్ వడ్డీ రేటును నిర్ణయించే అధికారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT)కు ఉంటుందని, వారి సిఫార్సుల మేరకే నిర్ణయాలు జరుగుతాయని తెలిపారు.వడ్డీ రేటును ఎలా నిర్ణయిస్తారంటే..ఈపీఎఫ్ వడ్డీ రేట్ల లెక్కింపు వెనుక ఉన్న ప్రాతిపదికను ప్రభుత్వం ఈ సందర్భంగా వివరించింది. ఈపీఎఫ్ నిధిని వివిధ మార్గాల్లో పెట్టుబడి పెట్టగా వచ్చే వాస్తవ ఆదాయం ఆధారంగానే వడ్డీ రేటును నిర్ణయిస్తారు.ఇది కేవలం పెట్టుబడి రాబడిపై ఆధారపడి ఉంటుంది కాబట్టి, ఇతర ఆర్థిక వేరియబుల్స్తో దీనిని పోల్చడం సాధ్యం కాదు. ఈపీఎఫ్ పథకం-1952లోని పారాగ్రాఫ్ 60(4) ప్రకారం.. వడ్డీ ఖాతాలో నిధుల కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుంది. -
రికార్డ్: ఒక్క నెలలో రూ. 29.53 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: పండుగలు, ఆర్థిక సంవత్సరం ముగింపు తదితర అంశాల నేపథ్యంలో ఏకీకృత చెల్లింపు విధానం (యూపీఐ) ద్వారా లావాదేవీలు మార్చిలో రికార్డు స్థాయికి ఎగిశాయి. ఏకంగా రూ. 29.53 లక్షల కోట్ల విలువ చేసే 2,264 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.గతేడాది మార్చిలో నమోదైన రూ. 24.77 లక్షల కోట్లతో పోలిస్తే విలువపరంగా 19 శాతం పెరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ. 26.84 లక్షల కోట్ల విలువ చేసే 2,039 కోట్ల లావాదేవీలు రికార్డయ్యాయి. డిజిటల్ చెల్లింపులు ప్రజల రోజువారీ జీవితంలో భాగంగా మారాయనడానికి ఇది నిదర్శనమని పేనియర్బై ఎండీ ఆనంద్ కుమార్ బజాజ్ తెలిపారు. ప్రస్తుతం దేశీయంగా డిజిటల్ లావాదేవీల్లో యూపీఐ వాటా 85 శాతంగా ఉంది. అంతర్జాతీయంగా యూఏఈ, సింగపూర్ తదితర ఏడు దేశాల్లో ఇది అందుబాటులో ఉంది. -
హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జీ.. చెల్లించాలా? వద్దా?
వీకెండ్ వచ్చిందంటే చాలు కుటుంబంతోనో, స్నేహితులతోనో కలిసి రెస్టారెంట్కు వెళ్లడం ఇప్పుడు సర్వసాధారణం. భోజనం ముగించి బిల్లు చేతికి రాగానే అన్నీ సరి చూసుకుంటాం. కానీ అందులో ‘సర్వీస్ ఛార్జీ’ పేరుతో అదనంగా 5 నుంచి 10 శాతం వరకు బిల్లులో వసూలు చేస్తుండడం గమనించే ఉంటారు. ఇది తప్పనిసరి అని హోటల్ సిబ్బంది వాదించవచ్చు, లేదా మీ అనుమతి అడగకుండానే బిల్లులో వేసేయవచ్చు. అసలు ఈ సర్వీస్ ఛార్జీని కస్టమర్లు కచ్చితంగా చెల్లించాలా? చట్టం ఏం చెబుతోంది? వంటి అంశాలను చూద్దాం.సర్వీస్ ఛార్జీ ‘ట్యాక్స్’ కాదు!చాలామంది వినియోగదారులు సర్వీస్ టాక్స్ (సేవా పన్ను)కు, ‘సర్వీస్ ఛార్జీ’కి మధ్య ఉన్న తేడా తెలియక అయోమయానికి గురవుతుంటారు. జీఎస్టీ అనేది ప్రభుత్వం విధించే చట్టబద్ధమైన పన్ను. ఇది ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా చెల్లించాలి. సర్వీస్ ఛార్జీ అనేది రెస్టారెంట్ యాజమాన్యం తమ సిబ్బంది సేవలకు గుర్తింపుగా (టిప్కు బదులుగా) విధించే రుసుము. ఇది ప్రభుత్వానికి వెళ్లే పన్ను కాదు. కేంద్ర వినియోగదారుల పరిరక్షణ ప్రాధికార సంస్థ (సీసీపీఏ) మార్గదర్శకాల ప్రకారం, సర్వీస్ ఛార్జీ అనేది పూర్తిగా ఆప్షనల్. కస్టమర్ అనుమతి లేకుండా దీన్ని బిల్లులో చేర్చడం వినియోగదారుల హక్కుల ఉల్లంఘనే అవుతుంది.రెస్టారెంట్లు ఏం చేయవచ్చు.. ఏం చేయకూడదు?కొన్ని రెస్టారెంట్లు తమ మెనూ కార్డులో ‘మేము సర్వీస్ ఛార్జీ విధిస్తాం’ అని రాసి ఉండవచ్చు. అయితే, కేవలం మెనూ కార్డులో రాసి ఉన్నంత మాత్రాన దాన్ని తప్పనిసరిగా చెల్లించాల్సిన అవసరం లేదు. సర్వీస్ ఛార్జీ చెల్లించలేదని కస్టమర్ను వేధించడం, సర్వీస్ నిరాకరించడం లేదా రెస్టారెంట్లోకి రాకుండా అడ్డుకోవడం చట్టవిరుద్ధం. వారి సర్వీసు నచ్చకపోతే లేదా మీకు ఇష్టం లేకపోతే సదరు ఛార్జీని తొలగించమని అడిగే పూర్తి హక్కు కస్టమర్లకు ఉంది.సాధారణంగా వినియోగదారులు ఏం చేస్తారు?రద్దీగా ఉన్న సమయంలో గొడవ ఎందుకని చాలామంది మౌనంగా చెల్లిస్తుంటారు. కొందరు ఇది ప్రభుత్వ పన్నుగా భావిస్తారు. ఛార్జీని తొలగించమని అడిగితే తక్కువగా చూస్తారేమోనన్న ఇంకొందరు సంకోచిస్తారు. బిల్లులో చివరలో దీన్ని కలపడం వల్ల అది మొత్తంలో భాగమని చెల్లిస్తుంటారు.అసలు ఏం చేయాలి?బిల్లు జనరేట్ కాకముందే సర్వీస్ ఛార్జీని మినహాయించి బిల్లు ఇవ్వమని కోరండి. సిబ్బందితో వాదించకుండా ఇది చెల్లించడం ఆప్షనల్ అని ప్రశాంతంగా హోటల్ యాజమాన్యానికి వివరించండి. ఒకవేళ హోటల్ యాజమాన్యం మొండిగా వ్యవహరించి బలవంతంగా వసూలు చేస్తే ఆ బిల్లును సాక్ష్యంగా ఉంచుకుని నేషనల్ కన్స్యూమర్ హెల్ప్లైన్(1915)కు ఫిర్యాదు చేయవచ్చు.ఎలాంటి సమయాల్లో చెల్లించవచ్చు?మీకు అందించిన సర్వీసులు అద్భుతంగా ఉందని మీరు భావిస్తే ఆ సిబ్బందిని ప్రోత్సహించడానికి సర్వీస్ ఛార్జీ రూపంలో లేదా నేరుగా టిప్ రూపంలో నగదును స్వచ్ఛందంగా ఇవ్వవచ్చు. ఇది పూర్తిగా మీ విచక్షణపై ఆధారపడి ఉంటుంది.ఇదీ చదవండి: పాకిస్థాన్కు వీసా నిలిపివేసిన ఖతార్ -
బంగారం, వెండి పెట్టుబడులకు కొత్త నిబంధనలు
దేశంలో బంగారం, వెండిపై పెట్టుబడులకు సంబంధించి ఏప్రిల్ 1 నుండి కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. సెబీ (SEBI) తీసుకున్న కొత్త నిర్ణయాలు, పన్ను విధానాల్లో మార్పులు మీ లాభాలపై నేరుగా ప్రభావం చూపనున్నాయి. ఆ మార్పులేంటో ఓసారి పరిశీలిద్దాం.అంతర్జాతీయ ధరలకు స్వస్తి! ఇప్పటి వరకు గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్ల (ETF) ధరలను అంతర్జాతీయ ప్రమాణాల (LBMA) ఆధారంగా నిర్ణయించేవారు. కానీ ఏప్రిల్ 1 నుండి సెబీ (SEBI) కొత్త నిబంధనలను అమలు చేస్తోంది. ఇకపై వీటి ధరలు భారతీయ ఎక్స్ఛేంజీల 'దేశీయ స్పాట్ ధర' (Domestic Spot Price) ఆధారంగానే నిర్ణయిస్తారు. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గులు, కరెన్సీ మార్పిడి రేట్ల ప్రభావం మన పెట్టుబడులపై తక్కువగా ఉంటుంది. పెట్టుబడిదారులు భారత మార్కెట్ వాస్తవ ధరకే లావాదేవీలు జరపవచ్చు.గోల్డ్ బాండ్స్పై పన్ను పోటుఫిజికల్ గోల్డ్ కంటే సురక్షితమైనదిగా భావించే సావరిన్ గోల్డ్ బాండ్ల (SGB)విషయంలో ప్రభుత్వం పన్ను నిబంధనలను కఠినతరం చేసింది. ఇప్పటి వరకు సావరిన్ గోల్డ్ బాండ్లపై పన్ను మినహాయింపులు ఉండటంతో వీటిని ఉత్తమ పెట్టుబడిగా భావించేవారు. అయితే, కొత్త నిబంధనల ప్రకారం వీటిపై కూడా 'మూలధన లాభాల పన్ను' వర్తిస్తుంది.అయితే బాండ్లను జారీ చేసిన సమయంలో నేరుగా కొనుగోలు చేసి, మెచ్యూరిటీ వరకు ఉంచుకునే వారికి పన్ను మినహాయింపు కొనసాగుతుంది. అదే సెకండరీ మార్కెట్ (స్టాక్ మార్కెట్) ద్వారా బాండ్లను కొనుగోలు చేసిన వారు మాత్రం ఇకపై స్వల్పకాలిక లేదా దీర్ఘకాలిక మూలధన లాభాల ఆధారంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.డిజిటల్ గోల్డ్పై ప్రభుత్వ నిఘాడిజిటల్ గోల్డ్ లేదా సావరిన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టే ప్రయోజనాలను పూర్తిగా పన్ను వలయం కిందకు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫిజికల్ గోల్డ్ మాదిరిగానే డిజిటల్ పెట్టుబడులపై కూడా పారదర్శకమైన పన్ను విధానాన్ని తీసుకురావడమే దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. -
ఏటీఎం రూల్స్.. ఇక మారిపోయాయ్..
దేశంలోని ప్రముఖ బ్యాంకుల ఏటీఎం వినియోగదారులకు అలర్ట్.. ఈ ఏప్రిల్ 1 నుంచి దేశంలోని ప్రముఖ బ్యాంకులు ఏటీఎం/సీఆర్ఎం నగదు ఉపసంహరణ నిబంధనల్లో కీలక మార్పులు చేశాయి. ముఖ్యంగా హెచ్డీఎఫ్సీ (HDFC), బంధన్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తమ కస్టమర్లకు కొత్త మార్గదర్శకాలను జారీ చేశాయి.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ, ఏప్రిల్ 1 నుంచి యూపీఐ (UPI) ద్వారా చేసే ఏటీఎం విత్ డ్రాయల్స్ను కూడా నెలవారీ ఉచిత లావాదేవీల కోటాలో చేర్చింది.నెలవారీ ఉచిత పరిమితి దాటిన తర్వాత, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నగదు తీసుకుంటే ప్రతి లావాదేవీకి రూ. 23 + పన్నులు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.కార్డు లేకుండా నగదు పొందే సౌలభ్యం ఉన్నప్పటికీ, ఇకపై లావాదేవీల సంఖ్యపై కస్టమర్లు నిఘా ఉంచక తప్పదు.పంజాబ్ నేషనల్ బ్యాంక్పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన డెబిట్ కార్డ్ వేరియంట్లను బట్టి రోజువారీ నగదు ఉపసంహరణ పరిమితిని తగ్గించింది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం, భద్రతను పెంచడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది.రూపే ఎన్సీఎంసీ ప్లాటినం (డొమెస్టిక్ & ఇంటర్నేషనల్), ఉమెన్ పవర్ ప్లాటినం, పీఎన్బీ పలాష్, రూపే బిజినెస్ ప్లాటినం, మాస్టర్ కార్డ్ ప్లాటినం, వీసా గోల్డ్ కార్డులకు నగదు విత్డ్రా పరిమితిని రూ. లక్ష నుంచి రూ. 50,000కు తగ్గించింది.ఇక రూపే సెలెక్ట్, పీఎన్బీ రూపే నియో/ఎక్సెల్, వీసా సిగ్నేచర్, మాస్టర్ కార్డ్ బిజినెస్ డెబిట్ కార్డులకు క్యాష్ విత్డ్రా లిమిట్ రూ. 1.5 లక్షల నుంచి రూ. 75,000కు తగ్గిందిఅయితే పీఓఎస్ (POS), ఈ-కామర్స్ లావాదేవీల పరిమితుల్లో ఎలాంటి మార్పు లేదు. కస్టమర్లు తమ లిమిట్ను పీఎన్బీవన్ యాప్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా సెట్ చేసుకోవచ్చు.బంధన్ బ్యాంక్బంధన్ బ్యాంక్ కూడా తన కస్టమర్లకు ఏటీఎం వినియోగ నియమాలను మార్చింది. సొంత బ్యాంకు అంటే బంధన్ బ్యాంక్ ఏటీఎంలలో నెలకు 5 ఉచిత ఫైనాన్షియల్ లావాదేవీలే ఉంటాయి. ఆర్థికేతర లావాదేవీలు (బ్యాలెన్స్ చెక్ వంటివి) మాత్రం అపరిమితం.ఇతర బ్యాంకు ఏటీఎంలలో అయితే మెట్రో నగరాల్లో నెలకు కేవలం 3 ఉచిత లావాదేవీలు (ఫైనాన్షియల్ + నాన్ ఫైనాన్షియల్ కలిపి), నాన్-మెట్రో నగరాల్లో నెలకు 5 ఉచిత లావాదేవీలకు అవకాశం ఉంటుంది.ఉచిత పరిమితి మించితే ఒక్కో ఆర్థిక లావాదేవీకి రూ.23, ఒక్కో నాన్ ఫైనాన్షియల్ లావాదేవీకి రూ.10 అదనంగా చార్జీలు ఉంటాయి. ఇక తగినంత బ్యాలెన్స్ లేకపోవడం వల్ల లావాదేవీలు విఫలమైతే రూ.25 పెనాల్టీ విధిస్తారు.ఇది చదవలేదా? 👉 బ్యాంకులు దేశవ్యాప్తంగా తెరిచేది ఒక్క రోజే! -
లోన్ కావాలా? ఇవి తెలియకపోతే ఇబ్బందే!
ప్రస్తుత పరిస్థితుల్లో సొంత ఇల్లు, కారు కొనుగోలు లేదా పిల్లల ఉన్నత చదువుల కోసం రుణం తీసుకోవడం సర్వసాధారణం. అయితే, అవసరం కదా అని ఏ ఆర్థిక సంస్థ కనిపిస్తే అందులో అప్పు చేయడం భవిష్యత్తులో ఇబ్బందులకు దారితీయవచ్చు. అందుకే, ఏదైనా లోన్ కోసం దరఖాస్తు చేసే ముందు తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాల్సిన కొన్ని కీలక అంశాలను పాఠకుల కోసం అందిస్తున్నాం.క్రెడిట్ స్కోరురుణం మంజూరు చేయడంలో క్రెడిట్ స్కోరు కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణంగా 750 కంటే ఎక్కువ స్కోరు ఉంటే బ్యాంకులు తక్కువ వడ్డీ రేటుకే రుణాలు ఇస్తాయి. దరఖాస్తుకు ముందే మీ స్కోరును సరిచూసుకోండి. ఒకవేళ స్కోరు తక్కువగా ఉంటే దాన్ని మెరుగుపరుచుకున్నాకే లోన్కు వెళ్లడం ఉత్తమం.ఎలాంటి వడ్డీ రేటో ముందే తెలుసుకోండి..వడ్డీ రేట్లలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి స్థిర వడ్డీ. ఇందులో రుణ కాలపరిమితి మొత్తం వడ్డీ మారదు. రెండోది ఫ్లోటింగ్ రేటు. రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు మార్పులకు అనుగుణంగా వడ్డీ మారుతుంటుంది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మీకు ఏది లాభదాయకమో నిర్ణయించుకోండి.తిరిగి చెల్లించే సామర్థ్యంనెలవారీ ఆదాయంలో 40% నుంచి 50% మించి అన్ని లోన్ల ఈఎంఐలు ఉండకుండా చూసుకోవాలి. లోన్ తీసుకునే ముందే ఆన్లైన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ద్వారా మీరు ఎంత చెల్లించగలరో లెక్కవేసుకోండి.ప్రాసెసింగ్ ఫీజు, ఇతర ఛార్జీలుకేవలం వడ్డీ రేటు మాత్రమే కాదు.. లోన్ ఇచ్చేటప్పుడు బ్యాంకులు వసూలు చేసే ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ ఛార్జీలు, జీఎస్టీ వంటి వాటిపై కూడా కన్నేయాలి. ఒక్కోసారి తక్కువ వడ్డీ అని చెప్పి ఇతర ఫీజుల రూపంలో భారీగా వసూలు చేసే అవకాశం ఉంది.లోన్ కాలపరిమితికాలపరిమితి పెరిగే కొద్దీ నెలవారీ ఈఎంఐ తగ్గుతుంది కానీ, మీరు చెల్లించే మొత్తం వడ్డీ భారం పెరుగుతుంది. కాబట్టి, మీ ఆర్థిక స్థితిని బట్టి సాధ్యమైనంత తక్కువ కాలపరిమితిని ఎంచుకోవడం తెలివైన పని.ముందస్తు చెల్లింపు నిబంధనలుమీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు లోన్ మొత్తాన్ని ముందే కట్టేయాలని అనుకుంటే బ్యాంకులు ఏమైనా పెనాల్టీలు విధిస్తున్నాయో అడగండి. ముఖ్యంగా పర్సనల్ లోన్ల విషయంలో ఈ ఛార్జీలు ఎక్కువగా ఉంటాయి.ఇతర నిబంధనలులోన్ అగ్రిమెంట్పై సంతకం చేసే ముందు ‘ఫైన్ ప్రింట్’ (లోసుగులతో కూడిన ఇతర నిబంధనలు) చదవండి. బీమా తీసుకోవాలనే నిబంధన లేదా సర్వీస్ ఛార్జీల పెంపు వంటి అంశాలు అందులో ఉండవచ్చు.ఇతర బ్యాంకుల ధరలతో పోలికఒక్క బ్యాంక్తోనే ఆగిపోకుండా కనీసం 3-4 ఆర్థిక సంస్థల ఆఫర్లను పోల్చి చూడండి. ప్రస్తుతం అనేక వెబ్సైట్లు వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లను ఒకే చోట పోల్చి చూసే వెసులుబాటును కల్పిస్తున్నాయి.లోన్ ఇన్సూరెన్స్దురదృష్టవశాత్తూ రుణగ్రహీతకు ఏదైనా జరిగితే, ఆ అప్పు కుటుంబ సభ్యులపై భారం కాకుండా ఉండేందుకు లోన్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిది. ఇది తప్పనిసరి కాకపోయినా భద్రత దృష్ట్యా ఆలోచించదగ్గ విషయం.బ్యాంక్ విశ్వసనీయత, సేవలుకేవలం తక్కువ వడ్డీ ఇస్తున్నారని తెలియని యాప్ల ద్వారా లేదా గుర్తింపు లేని సంస్థల ద్వారా రుణాలు తీసుకోవద్దు. ఆర్బీఐ గుర్తింపు పొందిన బ్యాంకులు లేదా ఎన్బీఎఫ్సీలను మాత్రమే ఎంచుకోండి. అలాగే వారి కస్టమర్ సర్వీస్ ఎలా ఉందో కూడా తెలుసుకోండి.రుణం అనేది అవసరానికి ఆసరా కావాలి కానీ, అది మీ ప్రశాంతతను దూరం చేసే భారం కాకూడదు. పైన పేర్కొన్న అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటే మీ ఆర్థిక భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది.ఇదీ చదవండి: చమురు, గ్యాస్ కాదు.. ఈసారి కండోమ్ల వంతు! -
పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు ఇలా..
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, పీపీఎఫ్ సహా చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను కేంద్రం వరుసగా ఎనిమిదో త్రైమాసికంలోనూ యథాతథంగా కొనసాగించనుంది. 2026–27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి సంబంధించి ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు వివిధ స్మాల్ సేవింగ్స్ స్కీములపై వడ్డీ రేట్లలో మార్పులేమీ ఉండవని ఆర్థిక శాఖ సోమవారం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది.దీని ప్రకారం సుకన్య సమృద్ధి స్కీముపై 8.2 శాతంగా, మూడేళ్ల టర్మ్ డిపాజిట్లపై 7.1 శాతంగా, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), పోస్టాఫీస్ సేవింగ్స్ డిపాజిట్ స్కీములపై వరుసగా 7.1 శాతం, 4 శాతంగా వడ్డీ రేట్లు ఉంటాయి. కిసాన్ వికాస పత్రాలపై 7.5 శాతం, ఎన్ఎస్సీలపై 7.7 శాతం, మంత్లీ ఇన్కం స్కీముపై 7.4 శాతంగా వడ్డీ రేటు కొనసాగుతుంది. కేంద్రం చివరిసారిగా 2023–24 నాలుగో త్రైమాసికంలో కొన్ని పథకాల రేట్లను మార్చింది. -
యుద్ధం ఆగదు.. వాళ్లంతా నష్టపోక తప్పదు: కియోసాకి
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆర్థిక నిపుణుడు, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) రచయిత రోబర్ట్ కియోసాకి మరోసారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సంచలన హెచ్చరికలు చేశారు. తాజా ‘ఎక్స్’ పోస్ట్లో ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాలు అడ్డగోలుగా ముద్రిస్తున్న డబ్బును 'ఫేక్ మనీ'గా అభివర్ణించిన ఆయన (Robert Kiyosaki), రాబోయే రోజుల్లో సంప్రదాయ పెట్టుబడులు నష్టపోక తప్పదని హెచ్చరించారు.డాలర్ విలువ పతనం - పెరుగుతున్న అప్పులుప్రభుత్వాలు తమ ఇష్టానుసారం కరెన్సీని ముద్రిస్తుండటం వల్ల దేశాల జాతీయ అప్పులు (National Debt) విపరీతంగా పెరుగుతున్నాయని కియోసాకి పేర్కొన్నారు. దీనివల్ల ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతుందని, డాలర్లను పొదుపు చేసేవారు కాలక్రమేణా తమ సంపదను కోల్పోతారని ఆయన విశ్లేషించారు. ముఖ్యంగా అమెరికా బాండ్లు సురక్షితమైనవనేది ఒక "పెద్ద అబద్ధం" అని ఆయన కుండబద్దలు కొట్టారు.చమురు సెగ.. అంతం లేని యుద్ధంప్రస్తుతం ఇరాన్ కేంద్రంగా సాగుతున్న ఉద్రిక్తతలను ఆయన ఒక 'పవిత్ర యుద్ధం'గా అభివర్ణించారు. ఈ వివాదాలు త్వరలో ముగిసేవి కావని, దీని ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు నిరంతరం పెరుగుతూనే ఉంటాయని, అది మరింత ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.పాత పద్ధతులకు కాలం చెల్లింది!సాధారణంగా ప్రజలు నమ్మే "చక్కగా చదువుకో, మంచి ఉద్యోగం సంపాదించు, పన్నులు కట్టు, 401k లేదా మ్యూచువల్ ఫండ్లలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయి" అనే సూత్రం ఇప్పుడు పనికిరాదని కియోసాకి కొట్టిపారేశారు. ఈ పద్ధతిని అనుసరించేవారే భవిష్యత్తులో ఎక్కువగా నష్టపోతారని ఆయన అభిప్రాయపడ్డారు. చివరికి ఎంబీఏ (MBA) వంటి ఉన్నత డిగ్రీలు కూడా ప్రస్తుత ఆర్థిక సంక్షోభం ముందు పనికిరావని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.2026కు సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్లు ఇవే..ఏవైతే ముద్రించడానికి వీలుపడవో అవే నిజమైన ఆస్తులని కియోసాకి నమ్ముతారు. ఆయన ప్రకారం 2026లో పెట్టుబడిదారులను కాపాడేవి బంగారం, వెండి (Real Gold & Silver), చమురు (Oil), ఆహార ధాన్యాలు (Food), క్రిప్టో కరెన్సీ (Bitcoin & Ethereum) మాత్రమే."మీ మెదడులో మీరు నింపుకునే ఆర్థిక విద్య (Financial Education) మాత్రమే మిమ్మల్ని కాపాడుతుంది. దేనిని నమ్మాలో మీరే ఆలోచించుకోండి" అంటూ ఆయన ఇన్వెస్టర్లకు సూచించారు. INVESTOR SECRET: “lf you want to be a rich investor you have to see the future.”Seeing the future today is EASY for two reasons.1: The National Debt will only go up because governments will only keep printing fake money. That means inflation will keep going up which…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 30, 2026 -
మ్యూచువల్ ఫండ్స్: ‘సిప్’ ఇన్వెస్టర్లకు షాక్!
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ రూపంలో పెట్టుబడులు పెడుతున్న వారికి మార్కెట్ పనితీరు షాక్ ఇచ్చి ఉంటుంది. ఎందుకంటే గడిచిన ఏడాది, రెండేళ్ల కాలంలో వీటిల్లో రాబడి లేకపోగా, నష్టాలు మిగిలాయి. ముఖ్యంగా 2025–26 ఆర్థిక సంవత్సరంలో సిప్ పెట్టుబడులపై 48 శాతం వరకు నష్టపోయినవి ఉన్నాయి. 556 పథకాలను పరిశీలించగా, వీటిల్లో 486 నికర నష్టాలను ఇవ్వగా, 70 పథకాలు ఎంతో కొంత లాభాలను పంచాయి. విదేశీ ఫండ్స్లో లాభాలు.. ముఖ్యంగా గత కొంత కాలంలో దేశీ పథకాలు నష్టాలను మిగల్చగా, అంతర్జాతీయ ఫండ్స్ రాబడులు కురిపించాయి. ఇందులో క్వాంట్ టెక్ ఫండ్, మోతీలాల్ ఓస్వాల్ డిజిటల్ ఇండియా ఫండ్ సైతం ఉన్నాయి. కారణాలు ఎన్నో.. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులపై రాబడులకు గ్యారంటీ లేదు. దేశీయంగా, అంతర్జాతీయంగా ఆర్థిక, భౌగోళిక పరిణామాలకు అనుగుణంగా ఈక్విటీలు ర్యాలీ చేస్తుంటాయి. దిద్దుబాటుకు గురవుతుంటాయి. కొన్ని సందర్భాలలో దీర్ఘకాలం పాటు దిద్దుబాటు దశలోకి వెళ్లొచ్చు. కొన్ని సందర్భాల్లో వెంటనే కోలుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో స్మాల్, మిడ్క్యాప్లో ఎక్కువ దిద్దుబాటు కనిపిస్తుంటుంది. కనుక స్వల్పకాలానికి ఈక్విటీలు అనుకూలం కాదు. మధ్య, దీర్ఘకాలానికే వీటిల్లో పెట్టుబడులు పెట్టుకోవాలన్నది నిపుణుల సూచన.కనీసం ఐదేళ్లు అంతకంటే ఎక్కువ కాలం పాటు పెట్టుబడులు కొనసాగించాల్సి ఉంటుంది. అయినా సరే ఐదేళ్లలోనే రాబడులు వస్తాయని చెప్పలేం. అనుకోకుండా మార్కెట్లు ఐదేళ్లపాటు దిద్దుబాటు, స్థిరీకరణ దశలోకి వెళితే రాబడులు లేకపోగా, నష్టాలూ ఎదురుకావొచ్చు. లంప్సమ్ అయినా, సిప్ అయినా రాబడులు/నష్టాలు మార్కెట్ గమనంపైనే ఆధారపడి ఉంటాయి. కనీసం 7–10 ఏళ్ల కాలంలో ఈ ప్రతికూలతలను అధిగమించి మెరుగైన రాబడులు అందుకోవచ్చని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఎలాంటి వ్యూహం అనుసరించాలి..? రాబడుల వెంట పరుగెత్తకుండా, గడిచిన ఏడాది కాల రాబడులను అనుసరించకుండా ఎంపిక చేసుకున్న పథకాల్లో సిప్ రూపంలో పెట్టుబడులు పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పెట్టుబడులను వైవిధ్యం చేసుకునేందుకు ఇంటర్నేషనల్ ఫండ్స్కు సైతం కొంత కేటాయించుకోవాలన్నది సూచన. అంతర్జాతీయంగా ఏఐ, టెక్ ఫండ్స్కు లేదా చైనా, యూఎస్ ఫండ్స్ల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చని జెడ్ఫండ్స్ సీఈవో మనీష్ కొతారి పేర్కొన్నారు.ప్రస్తుతం అంతర్జాతీయంగా ఫండ్స్ మంచి పనితీరు వెనుక ఏఐ, టెక్ అంశాలున్నాయని చెప్పారు. సిప్ను కేవలం 2–3 ఏళ్ల కాలానికి చూడొద్దన్నారు. దీర్ఘకాలంలో మార్కెట్ అస్థిరతలను అధిగమించి, సంపద సృష్టించుకునేందుకు రూపొందించిన సాధనం సిప్ అని చెప్పారు. కనీసం 10–15 ఏళ్ల కాల దృష్టితో చూడాలన్నారు. అంతర్జాతీయ ఫండ్స్కు 10–20 శాతం మేర పెట్టుబడులు కేటాయించుకోవచ్చని, ముఖ్యంగా యూఎస్ మార్కెట్లకు ప్రాధాన్యం ఇవ్వొచ్చని సూచించారు. -
బ్యాంకులు దేశవ్యాప్తంగా తెరిచేది ఒక్క రోజే!
మీకు ఈ వారం బ్యాంకు పనులున్నాయా? అయితే ఒక్క నిమిషం ఆగండి! మార్చి 30 నుండి ఏప్రిల్ 5 మధ్య దేశవ్యాప్తంగా బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నాయి. పండుగలు, వార్షిక ఖాతాల ముగింపు, ఆదివారం సెలవుల కారణంగా ఈ వారంలో దాదాపు ఆరు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగనుంది.వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పండుగలు, మహావీర్ జయంతి, గుడ్ ఫ్రైడే వంటి సందర్భాలను పురస్కరించుకుని ఆయా రాష్ట్రాల్లో బ్యాంకులు ఈ వారంలో ఆరు రోజులు మూతపడనున్నాయి. అంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు తెరిచేది వారంలో ఒక్క రోజే అన్నమాట.సెలవుల పూర్తి వివరాలు ఇవే..మార్చి 30 (సోమవారం): మహావీర్ జయంతి సందర్భంగా కర్ణాటకలో బ్యాంకులు పనిచేయవు.మార్చి 31 (మంగళవారం): మహావీర్ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ వంటి పలు రాష్ట్రాల్లో సెలవు.ఏప్రిల్ 1 (బుధవారం): బ్యాంకుల వార్షిక ఖాతాల ముగింపు (Annual Closing) సందర్భంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో సాధారణ వినియోగదారులకు సేవలు నిలిచిపోతాయి.ఏప్రిల్ 2 (గురువారం): మౌండీ థర్స్ డే (Maundy Thursday) సందర్భంగా కేరళలో బ్యాంకులు మూసివేస్తారు.ఏప్రిల్ 3 (శుక్రవారం): గుడ్ ఫ్రైడే సందర్భంగా దేశవ్యాప్తంగా మెజారిటీ రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు.ఏప్రిల్ 5 (ఆదివారం): సాధారణ వారాంతపు సెలవు.సాధారణంగా నెలలో మొదటి, మూడవ, ఐదవ శనివారాల్లో బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి. కాబట్టి ఏప్రిల్ 4 (శనివారం) నాడు బ్యాంకులు తెరిచి ఉండే అవకాశం ఉంది.డిజిటల్ సేవలు యథాతథంబ్యాంకు శాఖలు భౌతికంగా మూసివేసినప్పటికీ, కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉంటాయి. యూపీఐ (UPI) చెల్లింపులు (GPay, PhonePe మొదలైనవి) ఎప్పటిలాగే పనిచేస్తాయి. నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్స్ ద్వారా నిధుల బదిలీ చేసుకోవచ్చు. ఏటీఎం (ATM) కేంద్రాల్లో నగదు ఉపసంహరణ సేవలు కొనసాగుతాయి.ముందస్తు ప్రణాళిక అవసరంవరుస సెలవుల దృష్ట్యా నగదు అవసరాలు లేదా చెక్కుల క్లియరెన్స్ వంటి ముఖ్యమైన పనులు ఉన్నవారు ముందే ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా బ్యాంకింగ్ పనులను త్వరగా పూర్తి చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. -
2022–23 రిటర్నులు వేయకపోతే..
పైన చెప్పినది 2022–23 అసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించినది. చెప్పాలంటే 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విషయం. పరాభవ నామ సంవత్సరం ప్రారంభంలోనే ఇన్కం ట్యాక్స్ డిఫాల్టర్లకు డిపార్ట్మెంట్ వారు షాకిచ్చారు. షాక్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందయ్యా అంటే.. 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ సైకిల్ 6ని ఫాలో అవుతున్నారు. సాధారణంగా రిస్క్ మేనేజ్మెంట్లో ఆరు అంశాలు ఉంటాయి. అవేంటంటే..🔸 రిస్క్ని గుర్తించడం 🔸 వాటి విశ్లేషణ 🔸 నిర్ధారణ 🔸 తగిన చర్యలు తీసుకోవడం 🔸 పర్యవేక్షణ 🔸 నివేదికఇంచుమించు ఇదే పంథాలో డిపార్ట్మెంట్ తమ పంజా విసురుతోంది. డిపార్ట్మెంట్ వారి నిర్వహణ నిమిత్తం అంటు 2026 మార్చి 23న ఒక అంతర్గత సూచన అంటూ జారీ చేశారు. విషయం ఏమిటంటే, 2021–22 ఆర్థిక సంవత్సరం.. అంటే 2022–23 అసెస్మెంట్ సంవత్సరంలో జరిగిన పెద్ద వ్యవహారాలను బైటికి తీసి (అలాగని .. వార్తాపత్రికల్లో ప్రచురించరు), వాటిని విశ్లేషించి, అసలు రిటర్నులు వేయనివారిని, అంటే, నాన్–ఫైలర్స్ని గుర్తించి, వారి మీద చట్టరీత్యా చర్యలు చేపడతారు.ఎలా గుర్తిస్తారు?ఆర్థిక వ్యవహారాల పట్టికలు. ప్రతి సంవత్సరం స్థిరాస్తి క్రయవిక్రయాలు, క్రెడిట్ కార్డ్ చెల్లింపులు, మ్యూచువల్ ఫండ్స్, బాండ్లు, షేర్లలో పెట్టుబడులు మొదలైన వాటికి సంబంధించి వాటి నిర్వాహక సంస్థల నుంచి డిపార్ట్మెంట్ వారికి సమాచారం చేరిపోతుంది. వార్షిక సమాచార రిటర్న్ ద్వారా ఇది జరుగుతుంది.టీడీఎస్ సర్టిఫికెట్లు. ప్రతి డిడక్టర్ టీడీఎస్ మొత్తాన్ని రికవర్ చేసి, సకాలంలో గవర్నమెంట్ ఖజానాకి చెల్లించాలి. ఆ మేరకు సరి్టఫికెట్లు 16 లేదా 16ఏ జారీ చేయాలి. అంతే కాకుండా వాటికి సంబంధించిన రిటర్నులను దాఖలు చేయాలి. వీటిలో మీకు చేసిన చెల్లింపుల వివరాలన్నీ సమగ్రంగా ఉంటాయి.టీడీఎస్లాగానే, టీసీఎస్పరంగా మీ సంబంధిత సమాచారం ఉంటుంది.జీఎస్టీ రికార్డులుఎగుమతులు–దిగుమతులు. కస్టమ్స్ అధికారి వద్ద రికార్డులు, షిప్మెంట్ రికార్డులు, హెచ్ఎస్ఈ కోడ్లు, వాళ్ల పేర్లు, టర్నోవర్ వివరాలు, విలువ.. ఈ సమాచారం అంతా ఉంటుంది.ట్యాక్స్ పేయర్స్ ప్రొఫైల్స్మీ ఆర్థిక వ్యవహారాల చిట్టాఆస్తులు.. అప్పులుఎవరితో ఏయే వ్యవహారాలు జరిపారు.థర్డ్ పార్టీతో వ్యవహారాలుఇలాంటి వివరాలన్నీ సేకరించి మీ రిటర్న్ ప్రొఫైల్, ఆర్థిక సమాచారపు ప్రొఫైల్, వ్యక్తిగత సమాచారపు ప్రొఫైల్, అకౌంట్స్, ఆస్తుల ప్రొఫైల్, ఎవరితో సంబంధం ఉందో ఆ ప్రొఫైల్, ఇతర ఏజెన్సీల ప్రొఫైల్ తయారు చేస్తారు. ఆ తర్వాత వారి దగ్గర నుండి సమాచారం అందుకోని వారి జాబితా, అందుకుని కూడా రెస్పాన్స్ ఇవ్వని వారి జాబితాలు తయారు చేసి, అందులోని నాన్–ఫైలర్స్ని బైటికి తీస్తారు. ఆ తర్వాత నోటీసులు.. ప్రక్రియ మొదలు.ఈ మేరకు దిశ, సూచనలు, సలహాలు, ఉత్తర్వులు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఒక్కొక్కప్పుడు రిటర్నులు అనవసరమైతే, వారిని వదిలేస్తారు. రిటర్నులు వేయాల్సి ఉన్నా, వేయని డిఫాల్టర్స్ని మాత్రం వదలరు. ‘ఇన్కం – ఎస్కేప్డ్‘ కింద భావించి, కథ నడుపుతారు. ఈ రోజు 2021–22 మొదలు, త్వరలోనే ఆ తర్వాత సంవత్సరాల వ్యవహారాల మీదా నిఘా ఇలాగే ఉంటుంది. తగిన జాగ్రత్త వహించండి. అందాకా కథ పోనివ్వకండి. అప్డేటెడ్ రిటర్న్స్ వేసుకునే అవకాశం ఉన్న కాగితాలతో వృత్తి నిపుణులను సంప్రదించండి.ఈ సందర్భంలో మహాభారతంలో తిక్కన రాసిన పద్యం గుర్తుంచుకోండి ‘వచ్చిన వాడు ఫల్గుణుడు. అవశ్యము గెల్తుమనంగ రాదు‘ అని. దాని అర్థం ఏమిటంటే, ఆ వచ్చిన వాడు అర్జునుడు.. యుద్ధం చేస్తే గెలుస్తామనే నమ్మకం లేదు.. మనం సిద్ధంగా ఉండాలి. దేనికైనా ఓర్చుకోవాలి. సంధి చేసుకోవడం మంచిదని భావం.మనకు అన్వయించుకుంటే.. ఆ వచ్చేవాళ్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు. విస్తృత అధికారాలతో పాటు సమాచారంతో వస్తారు. సరైన తోవలో నడుచుకోవడం శ్రేయస్కరం. -
మల్టీ అసెట్ ఫండ్స్తో పెట్టుబడుల్లో వైవిధ్యం..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెట్టుబడుల్లో వైవిధ్యాన్ని పాటించేందుకు మల్టీ అసెట్ ఫండ్స్కి గణనీయంగా ఆదరణ పెరుగుతున్నట్లు యాక్సిస్ ఎంఎఫ్ ఫండ్ మేనేజర్ ఆశీష్ నాయక్ తెలిపారు. ఫండ్ సంస్థల సమాఖ్య యాంఫీ గణాంకాల ప్రకారం 2026 ఫిబ్రవరిలో ఈ ఫండ్స్లోకి రూ. 8,500 కోట్ల పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. దీనితో ఈ కేటగిరీ నిర్వహణలోని ఆస్తుల పరిమాణం (ఏయూఎం) రూ. 1.83 లక్షల కోట్లకు చేరిందని ఆయన చెప్పారు. ఫోలియోల సంఖ్య 49.1 లక్షలకు చేరినట్లు వివరించారు. వరుసగా నాలుగో నెలా హైబ్రిడ్ కేటగిరీకి మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ సారథ్యం వహించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ తరహా ఫండ్స్ ప్రధానంగా ఈక్విటీ, డెట్, కమోడిటీస్ (పసిడి లేదా వెండి)లో ఇన్వెస్ట్ చేస్తాయని నాయక్ వివరించారు. సాధారణంగా వివిధ సందర్భాల్లో వీటిలో ఒక్కొక్కటి ఒక్కో రకంగా స్పందిస్తాయని చెప్పారు. కార్పొరేట్ ఆదాయాలు బాగున్నప్పుడు ఈక్విటీలు పెరుగుతాయని, అలాగే వడ్డీ రేట్లు పెరిగినప్పుడు లేదా మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్నప్పుడు డెట్ సాధనాలు ఆకర్షణీయంగా ఉంటాయని వివరించారు. ఇక ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉన్నా, అంతర్జాతీయంగా అనిశి్చతులు నెలకొన్నా పసిడి పెరుగుతుందని పేర్కొన్నారు. గత రెండేళ్లుగా దేశీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయని వివరించారు. ‘‘ఈక్విటీ వేల్యుయేషన్స్ భారీ స్థాయిలో పెరిగిపోగా, వడ్డీ రేట్లపై ఎలాంటి నిర్ణయాలు ఉంటాయోనని డెట్ ఇన్వెస్టర్లు ఆచి తూచి వ్యవహరిస్తూ వస్తున్నారు. గ్లోబల్గా అనిశి్చతితో కమోడిటీల రేట్లపై అనిశ్చితి నెలకొనడం పరిస్థితిని మరింత జటిలంగా మార్చింది’’ అని ఆయన తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం ఒకే సాధనంలో ఇన్వెస్ట్ చేసిన వారికన్నా మల్టీ అసెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన మదుపరుల పోర్ట్ఫోలియోల్లో ఒడిదుడుకులు కొంత తక్కువగా ఉన్నట్లు వివరించారు. ఇలా ఒకే ఫండ్ ద్వారా వివిధ అసెట్స్కి కేటాయింపులు జరిపే వ్యూహం దీర్ఘకాలికంగా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఇన్వెస్టర్లు, అడ్వైజర్లు గుర్తిస్తున్నారని నాయక్ చెప్పారు. అయితే, ఈ కోవకి చెందిన ఫండ్స్ అన్నీ ఒకే రకంగా పని చేయవని గుర్తుంచుకోవాలని సూచించారు. కొన్ని ఈక్విటీలవైపు ఎక్కువగా మొగ్గు చూపితే మరికొన్ని బ్యాలెన్స్డ్గా లేదా వ్యవహరిస్తాయని చెప్పారు. అలాగే కేవలం బుల్ మార్కెట్కే పరిమితం కాకుండా గతంలో వివిధ పరిస్థితుల్లో ఫండ్ ఎలా పని చేసిందనేది కూడా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. -
ఆచితూచి... ఐపీఓలకు!
గత ఏడాది ఐపీవోల జోరు మామూలుగా లేదు. రిటైల్ ఇన్వెస్టర్లకు పండుగలా అనిపించింది. చాలా మటుకు ఇష్యూలు లిస్టింగ్ రోజున భారీగానే లాభాలు ఇచ్చాయి. దీనితో ఏ కంపెనీ ఇష్యూ వచ్చినా 50రెట్లు.. 100 రెట్లు సబ్స్క్రయిబ్ అయిపోయేవి. లిస్టింగ్ లాభాల కోసం అప్లై చేసుకోవడమనేది ఒక వ్యూహంగా మారిపోయింది. కానీ ఇప్పుడు అదే రిటైల్ ఇన్వెస్టర్లు.. ఐపీవో అంటే వెనక్కి తగ్గుతున్నారు. ఇష్యూలు పూర్తిగా సబ్ర్స్కయిబ్ కావడం లేదు. లిస్టింగ్లు నిరాశపరుస్తున్నాయి. ధీమా దెబ్బతింది. అందుకేనేమో! తాజాగా ఐపీఓకి వచ్చిన ప్రభుత్వ సంస్థ కోల్ ఇండియా అనుబంధ కంపెనీని సైతం రిటైలర్లు పట్టించుకోలేదు.ఈ పరిస్థితికి ప్రధాన కారణం సెంటిమెంటే. 2025లో ఐపీఓలు విజయవంతం కావడానికి ఇదే సెంటిమెంటు కారణమయితే... ఇప్పుడు రిటైలర్లు చాలా ఐపీఓలకు దూరంగా ఉండటానికి కూడా సెంటిమెంటే కారణంగా కనిపిస్తోంది. ఈ ఏడాది కొన్ని ఐపీఓల్లో రిటైర్లు తక్కువమంది ఇన్వెస్ట్ చేసినా... వారు కంపెనీల ఫండమెంటల్స్ చూసే ముందుకొస్తున్నారనే భావన ఉంది. ఏడాది వ్యవధిలోనే పరిస్థితి ఎందుకిలా మారిపోయింది? దీనికి కారణాలేమిటి? చిన్న ఇన్వెస్టర్ల ఆలోచనేంటి? ఏం చేస్తే బెటర్? అనే అంశాలసమాహారమే ఈ ‘సాక్షి’ వెల్త్ స్టోరీ... – సాక్షి, వెల్త్గతంలో ఐపీవో లిస్టయ్యిందంటే చాలు తక్కువలో తక్కువగా 20 శాతం నుంచి 50 శాతం వరకు లాభాలు పక్కా అనే విధంగా ఉండేది. అందుకే రిటైలర్ల విభాగంలో ఒక్కో ఇష్యూ 50 రెట్లు, 100 రెట్లు ఓబర్ సబ్ర్స్కయిబ్ అయ్యేది. నిజానికిలా ఓవర్ సబ్్రస్కయిబ్ అయినపుడు నూటికి 90 శాతం మందికి షేర్లు అలాట్ కావు. కానీ... అలాట్ అయితే లాభాలొస్తాయి కదా అనే ఆశతో ఒక్కొక్కరూ తమ కుటుంబీకులకు ఎన్ని ఖాతాలుంటే అన్ని ఖాతాల్లోనూ దరఖాస్తు చేసేవారు. కొద్దిరోజులు తమ క్యాపిటల్ లాకిన్లో ఉండటానికి కూడా ఇష్టపడేవారు. చివరికి అలాట్ అయి లిస్టింగ్ లాభాలొస్తే హ్యాపీ. కాదంటే నిట్టూర్పు. కానీ ఇటీవల చాలా ఐపీఓలు లిస్టింగ్లో పెద్దగా లాభాలివ్వలేదు. ఇష్యూ ధరకు సమానంగా ఫ్లాట్గానో లేకపోతే ఒక్కోసారి అంతకన్నా తక్కువకే లిస్టవుతున్నాయి. దీనితో ఐపీవోలో అలాట్ అయితే చాలు లాభాలు గ్యారంటీ అనే అభిప్రాయం తొలగిపోయింది.ఓవర్ప్రైసింగ్..చాలా మటుకు కంపెనీలు తమ అసలు వేల్యుయేషన్లకు మించిన స్థాయిలో ఐపీవోలకు ధర నిర్ణయిస్తున్నాయి. బులిష్ సెంటిమెంటుని క్యాష్ చేసుకుని, బయటపడిపోయేందుకు ప్రమోటర్లు ప్రయతి్నస్తున్నారనే అపవాదు ఉంది. చాలా ఐపీఓల పరిస్థితి ఇదే అయినా... ఇటీవల లెన్స్కార్ట్ వంటి ఐపీఓలపై తీవ్రమైన ఆరోపణలొచ్చాయి కూడా. అందుకే రిటైల్ ఇన్వెస్టర్లకి ఇలాంటి వాటిల్లో ఎంట్రీ చాలా ఖరీదుతో కూడుకున్న వ్యవహారమని, రాబడులపై స్పష్టత ఉండదని అర్థమవుతోంది. లిస్టింగ్కి ముందు.. తర్వాత..కొన్ని కంపెనీల లెక్కల మాయాజాలమో, యాదృచ్ఛికమో అర్థం కావటం లేదు కానీ.. ఐపీఓకి రావటానికి ముందు ఒకటి రెండేళ్లు అద్భుతమైన పనితీరును చూపిస్తున్నాయి. అంతకుముందు చాలా ఏళ్లు ఆ పరిస్థితి లేకపోవటం గమనార్హం. దీంతో ఆ రెండేళ్ల లెక్కలను చూపిస్తూ.. భవిష్యత్తు సూపర్ అంటూ ఊదరగొడుతున్నాయి. అది నమ్ముకుని కొనుక్కుంటే, ఆ తర్వాత వాస్తవం బోధపడుతోంది. లిస్టింగ్ అయిన తర్వాత ఎరి్నంగ్స్ తీరు చూస్తే భయపెట్టేదిగా ఉంటోంది. ఇటీవల కొన్ని డ్రోన్ కంపెనీలు ఇదే బాగోతాన్ని కళ్లకుకట్టాయి.మారిన మార్కెట్ పరిస్థితులుఇరాన్ యుద్ధ ప్రభావం కావచ్చు,. అంతకుముందు అమెరికా టారిఫ్ల వ్యవహారం కావచ్చు. ఇవన్నీ మార్కెట్లను తీవ్రంగా భయపెడుతున్నాయి. ఒకటి తరువాత ఒకటిగా చుట్టుముడుతున్న అంతర్జాతీయ పరిణామాలతో ఎఫ్ఐఐలు భారత మార్కెట్లలో తమ షేర్లను అమ్ముతూనే వస్తున్నారు. గడిచిన కొన్ని నెలలుగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారత మార్కెట్లలో జరిపిన అమ్మకాలకు దీటుగా దేశీ ఫండ్లు కొనుగోళ్లు చేసినప్పటికీ... ఇపుడు తాజా ఇరాన్ యుద్ధ ప్రభావం తీవ్రంగా పడింది. మార్కెట్లు భారీ కరెక్షన్కు గురయ్యాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు గణనీయంగా నష్టపోయాయి. ఇక లిక్విడిటీ కూడా కష్టంగా మారుతుండటంతో రిటైల్ ఇన్వెస్టర్లు స్పెక్యులేషన్ కన్నా క్షేమంగా ఉండటమే మిన్న అనే ధోరణికి ప్రాధాన్యం ఇస్తున్నారు. మరేం చెయ్యాలి?పరిస్థితులు ఇలా మారినంత మాత్రాన ఐపీవో మార్కెట్ మొత్తానికే కుప్పకూలిందనుకోవడానికి లేదు. తాజాగా వస్తున్న ఐపీఓల్లో రిటైలర్ల పాత్ర తగ్గినా పూర్తిగా పోలేదు. కొన్ని ఇష్యూల్లో ఫండ్లతో పాటు పెద్ద ఇన్వెస్టర్లు భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది మార్కట్పై, సదరు కంపెనీలపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని చెప్పాలి. ఈ వ్యవహారంపై దేశీ మ్యూచువల్ ఫండ్ దిగ్గజం ఒకరు స్పందిస్తూ... ‘‘గతంలో అందరికీ డబ్బులొచ్చేవి. కానీ ఇప్పుడు అన్ని విషయాలు క్షుణ్నంగా తెలుసుకుని, ముందడుగు వేసే ఇన్వెస్టర్లకే వస్తున్నాయి. అది రిటైల్ ఇన్వెస్టర్లయినా... హెచ్ఎన్ఐలయినా’’ అని వ్యాఖ్యానించటం గమనార్హం. -
యుద్ధం లాభదాయకమే: కియోసాకి కామెంట్స్
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆర్థిక విశ్లేషకుడు, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి యుద్ధం వల్ల కలిగే ఆర్థిక పరిణామాలపై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ఎవరికీ మంచిది కాదని చెబుతూనే, అది ఏ విధంగా దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదిపేస్తుందో ఆయన వివరించారు.నాటి యుద్ధ జ్ఞాపకాలు..వియత్నాం యుద్ధ కాలం నాటి ఒక నిరసన గీతాన్ని ప్రస్తావిస్తూ.. "యుద్ధం వల్ల ఎవరికీ లాభం లేదు" అని ఆయన పేర్కొన్నారు. స్వయంగా వియత్నాం యుద్ధంలో (1966, 1971-72) పాల్గొన్న కియోసాకి, తన స్నేహితులను కోల్పోయిన బాధను గుర్తు చేసుకున్నారు. మూడు వారాల క్రితమే తాను వియత్నాం వెళ్లి తన పాత స్నేహితులకు వీడ్కోలు పలికి, మనశ్శాంతిని పొందినట్లు ఆయన తెలిపారు.యుద్ధం వల్ల భారంగా మారుతున్న సామాన్యుడి జీవితంప్రస్తుతం 'పవిత్ర భూముల్లో' (మిడిల్ ఈస్ట్) జరుగుతున్న యుద్ధంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధం వల్ల కేవలం ప్రాణనష్టం మాత్రమే కాకుండా, యుద్ధానికి దూరంగా ఉన్న దేశాల్లోని ప్రజలు కూడా ద్రవ్యోల్బణం (Inflation) వల్ల ఆర్థికంగా దెబ్బతింటారని హెచ్చరించారు. యుద్ధాల వల్ల దేశాల అప్పులు విపరీతంగా పెరుగుతాయన్నారు. పెరిగే ధరల వల్ల సామాన్యుడు పేదరికంలోకి నెట్టబడతాడని, ఆర్థిక సంక్షోభం కారణంగా ఎంతోమంది ఇళ్లు కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన విశ్లేషించారు.సంక్షోభంలోనే సంపద సృష్టియుద్ధం అనేది మానవత్వానికి నష్టమే అయినా, ఆర్థికంగా అది కొంతమందికి లాభాలను తెచ్చిపెడుతుందని కియోసాకి అభిప్రాయపడ్డారు. "యుద్ధం వల్ల దేశాలు అప్పుల ఊబిలో ఉన్నంత మాత్రాన మీరు ఆర్థికంగా నష్టపోవాల్సిన అవసరం లేదు. సరైన ఆర్థిక విద్య (Financial Education) ఉంటే ఇలాంటి కష్టకాలంలో కూడా మీరు ధనవంతులు కావచ్చు" అని ఆయన సూచించారు. మీ మెదడు, మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలే మీ గొప్ప ఆస్తులని, మంచి గురువులను ఎంచుకుని ఆర్థిక అంశాలపై పట్టు సాధించాలని ఆయన తన అనుచరులకు పిలుపునిచ్చారు.“WAR: What is it good for?Absolutely nothing.”The above are words from a Vietnam era protest song.Tragically war is profitable. If war was not proftsble….would we have wars?FYI: I served in Vietnam twice…once in 1966 and 1971-72.I lost many friends in Vietnam. I…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 29, 2026 -
విడాకులు ఇస్తే ఉమ్మడి ఆస్తి ఎవరిది?
భారతీయ సమాజంలో వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాల ఆర్థిక ప్రయాణం కూడా. నేటి ఆధునిక కాలంలో చాలా వరకు భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తున్నారు. ఉమ్మడి లక్ష్యాల కోసం కలిసి ఆస్తులు కొంటున్నారు. అయితే, దురదృష్టవశాత్తూ ఆ బంధం విడాకుల వరకు వెళ్తే.. మరి వారు ఇద్దరూ కలిసి కొనుగోలు చేసిన ఆస్తి ఎవరిది? అనే ప్రశ్న వివాదంగా మారుతోంది.ఇటీవల ‘1 ఫైనాన్స్’ నిర్వహించిన అధ్యయనం ప్రకారం, విడాకులు తీసుకున్న వారిలో 67 శాతం మంది తాము విడిపోకముందే తీవ్రమైన ఆర్థిక విభేదాలు ఎదుర్కొన్నట్లు తేలింది. అంతేకాకుండా, 43 శాతం కేసుల్లో విడాకులకు ప్రధాన కారణం ఆర్థిక సమస్యలే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో వైవాహిక ఆస్తుల యాజమాన్యంపై చట్టం ఏం చెబుతోంది? ఇటీవల తెలంగాణ హైకోర్టు ఇచ్చిన కీలక తీర్పు ప్రాధాన్యత ఏమిటి? అనే అంశాలను చూద్దాం.టైటిల్ డీడ్ వర్సెస్ కంట్రిబ్యూషన్: చట్టం ఏం చెబుతోంది?1955 హిందూ వివాహ చట్టం ప్రకారం, ఆస్తి ఎవరి పేరు మీద ఉంటే వారే యజమాని అనేది ప్రాథమిక సూత్రం. కేవలం పెళ్లి చేసుకున్నంత మాత్రాన భర్త ఆస్తిలో భార్యకు లేదా భార్య ఆస్తిలో భర్తకు సగం వాటా దానంతట అదే రాదు. ఇటీవల అమిష్ అగర్వాలా కేసులో తెలంగాణ హైకోర్టు ఒక స్పష్టమైన తీర్పునిచ్చింది. భర్త పేరు మీద ఉన్న నివాస ఆస్తిలో తనకూ వాటా కావాలని భార్య కోరగా కోర్టు దాన్ని తోసిపుచ్చింది. ‘వివాహం జరిగినంత మాత్రాన స్థిరాస్తిపై ఉమ్మడి యాజమాన్యం ఏర్పడదు’ అని కోర్టు స్పష్టం చేసింది. ఆస్తి కొనుగోలులో తమ ఆర్థిక భాగస్వామ్యం ఉందనడానికి బ్యాంకు స్టేట్మెంట్లు వంటి పక్కా ఆధారాలు చూపాలని న్యాయస్థానం పేర్కొంది.వినీతా సక్సేనా కేసు మినహాయింపుసుప్రీంకోర్టు కొన్ని సందర్భాల్లో దీనిపై విభిన్నంగా స్పందించింది. వినీతా సక్సేనా వర్సెస్ పంకజ్ పండిట్ (2006) కేసులో ఆస్తి భర్త పేరు మీద ఉన్నప్పటికీ భార్యకు అనుకూలంగా తీర్పు వచ్చింది. గృహిణిగా ఆమె అందించిన సేవలు, ఇంటి నిర్వహణలో ఆమె పడిన శ్రమను ‘పరోక్ష సహకారం’గా గుర్తించి హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 27 కింద ఆమెకు హక్కు కల్పించింది.నేటికీ చాలామందిలో ఆస్తి విషయంలో కొన్ని తప్పుడు అవగాహనలు ఉన్నాయి. 1 ఫైనాన్స్లో విల్, ఎస్టేట్ ప్లానింగ్ హెడ్ శ్రద్ధా నీలేశ్వర్ కొన్ని కీలక విషయాలను వివరించారు. తాను తెలిపిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.పెళ్లయ్యాక కొన్న ఆస్తిలో భాగస్వామికి ఆటోమేటిక్గా 50% వాటా రాదు.‘షమీమా ఫరూకీ వర్సెస్ షాహిద్ ఖాన్ (2015)’ కేసు ప్రకారం, ఆస్తిలో నివసించే హక్కు మాత్రమే ఉంటుంది తప్ప, పూర్తి యాజమాన్య హక్కులు ఉండవు.చాలామంది పన్ను ఆదా కోసం ఒకరి పేరు మీదనే ఆస్తులు కొంటారు, కానీ విడాకుల సమయంలో ఇది రెండో వ్యక్తికి చట్టపరమైన ఇబ్బందులు కలిగిస్తోంది.ప్రస్తుతం 42 శాతం మంది పురుషులు తమ సంపాదనలో సగటున 38 శాతాన్ని భరణం లేదా వివాహ సంబంధిత రుణాలకే వెచ్చిస్తున్నారు. ఇది ఆర్థిక ప్రణాళికలో రికార్డుల ప్రాధాన్యతను చెబుతోంది.నిపుణుల సూచనలుభవిష్యత్తులో ఆస్తి తగాదాలు తప్పించుకోవడానికి కొనుగోలు సమయంలోనే భార్యాభర్తలిద్దరి పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించాలి. దీనివల్ల సెక్షన్ 80సీ, సెక్షన్ 24(b) కింద ఇద్దరూ పన్ను మినహాయింపు పొందవచ్చు.డౌన్ పేమెంట్స్ లేదా ఈఎంఐలు చెల్లించినప్పుడు ఆ లావాదేవీల రికార్డులను, బ్యాంక్ స్టేట్మెంట్లను భద్రపరుచుకోవాలి.ఆస్తిలో ఎవరి వాటా ఎంతో దస్తావేజుల్లోనే పేర్కొనడం ఉత్తమం.వివాహం అనేది నమ్మకంతో కూడిన బంధం అయినప్పటికీ, ఆర్థిక విషయాల్లో పారదర్శకత ఉండటం నేటి కాలంలో అత్యవసరం. చట్టపరమైన చిక్కులు రాకముందే మేల్కొని ఆస్తులకు సంబంధించిన సరైన పత్రాలను సిద్ధం చేసుకోవడం ఇరు పక్షాలకు శ్రేయస్కరం.ఇదీ చదవండి: ఉద్యోగం మారినా.. వయసు పెరిగినా ఇదే దిక్కు! -
‘ఆడపిల్లల ఆర్థిక భవిష్యత్తు’ మారుతుందా?
ఆడపిల్లల ఆర్థిక భవిష్యత్తుకు భరోసానిచ్చే 'సుకన్య సమృద్ధి యోజన' (SSY) గత దశాబ్ద కాలంలో భారతీయ కుటుంబాల నమ్మకమైన పెట్టుబడి సాధనంగా అవతరించింది. 2014లో ప్రారంభమైన ఈ పథకం, నేడు కోట్లాది మంది తల్లుల కలలకు అండగా నిలుస్తోంది. ఇటీవల ఈ పథకం వడ్డీ రేట్లపై వస్తున్న ఊహాగానాలకు కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది.వడ్డీ రేటులో మార్పు లేదు.. స్పష్టం చేసిన కేంద్రంప్రస్తుతం అమలులో ఉన్న 8.2 శాతం వడ్డీ రేటును తగ్గించే ఆలోచన లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మార్చి 23న లోక్సభలో అడిగిన ప్రశ్నలకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిస్తూ.. వడ్డీ రేటును 8.1 శాతానికి తగ్గించే ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని పేర్కొన్నారు. ఇతర చిన్న మొత్తాల పొదుపు పథకాలతో పోలిస్తే సుకన్య సమృద్ధి యోజన అత్యంత ఆకర్షణీయమైన రిటర్న్స్ను అందిస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.దశాబ్ద కాలంలో 100 రెట్లు వృద్ధిగత పదేళ్లలో ఈ పథకం సాధించిన ప్రగతి అసాధారణం. గణాంకాలను పరిశీలిస్తే సామాన్యులకు ఈ పథకంపై ఉన్న నమ్మకం స్పష్టమవుతోంది. 2014-15లో కేవలం 4.2 లక్షలుగా ఉన్న ఖాతాలు, 2024-25 నాటికి 424.57 లక్షలకు చేరాయి. అంటే పదేళ్లలో 100 రెట్లు వృద్ధి నమోదైంది. ప్రారంభంలో రూ. 0.001 లక్షల కోట్లుగా ఉన్న డిపాజిట్లు, ప్రస్తుతం రూ. 2.99 లక్షల కోట్లకు చేరడం విశేషం.వడ్డీ రేట్లు ఎలా నిర్ణయిస్తారు?సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లను ప్రభుత్వం ప్రతి త్రైమాసికానికి (Quarterly) సమీక్షిస్తుంది. ప్రధానంగా శ్యామల గోపీనాథ్ కమిటీ సిఫార్సుల మేరకు, ప్రభుత్వ సెక్యూరిటీల (G-Secs)పై వచ్చే దిగుబడిని బట్టి ఈ రేట్లను ఖరారు చేస్తారు. 2014–16 ఆర్థిక సంవత్సరంలో 9% పైచిలుకు ఉన్న వడ్డీ రేటు ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ 2020–23 సంవత్సరాల్లో 7.6 శాతానికి (అత్యల్పం) చేరింది. 2024 నుండి ఈ వడ్డ రేటు 8.2 శాతంగా కొనసాగుతోంది. -
ఉద్యోగం మారినా.. వయసు పెరిగినా ఇదే దిక్కు!
‘నాకు కంపెనీ అందించే ఇన్సూరెన్స్ ఉంది కదా, ఇంకేం పర్లేదు’.. సగటు ఉద్యోగి ధీమా ఇది. కానీ, ఆ ధీమా వెనుక ఒక ముప్పు పొంచి ఉందన్నది చేదు నిజం. ఆసుపత్రి బిల్లు చేతికి వచ్చాక ‘రూమ్ రెంట్ క్యాపింగ్’ పేరుతో సగం డబ్బులు కట్ అయినప్పుడో, లేదా అనుకోకుండా ఉద్యోగం పోయి హెల్త్ కవర్ రద్దయినప్పుడో కానీ ఆ కార్పొరేట్ పాలసీ ఎంత బలహీనమైనదో అర్థం కాదు.వైద్య ఖర్చులు రాకెట్ వేగంతో దూసుకుపోతున్న తరుణంలో కేవలం ఆఫీస్ ఇచ్చే పాలసీపైనే ఆధారపడటం అంటే.. వర్షం కురుస్తున్నప్పుడు చిల్లుల గొడుగు పట్టుకుని బయటకు వెళ్లడమే. జెరోధా వ్యవస్థాపకుడు నితిన్ కామత్ వంటి ప్రముఖులు సైతం ఈ విషయంలో ఉద్యోగులను అప్రమత్తం చేస్తున్నారు. అసలు ఆఫీస్ ఇన్సూరెన్స్లో మనకు తెలియని లోపాలేంటి? సొంతంగా ఒక పాలసీ ఉండటం ఎందుకు అత్యవసరం? తెలుసుకుందాం.కార్పొరేట్ పాలసీల్లోని ‘ఫైన్ ప్రింట్’ చదివారా?చాలా మంది ఉద్యోగులు తమ హెచ్ఆర్ ఇచ్చే పాలసీ డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించరు. గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపెనీకి తక్కువ ఖర్చులో ఎక్కువ మందిని కవర్ చేసేలా రూపొందించబడుతుంది. ఇందులో ఉండే కొన్ని పరిమితులు అత్యవసర సమయంలో అవాంతరంగా మారవచ్చు.గది అద్దెపై పరిమితి: మీ పాలసీలో రోజుకు గది అద్దె రూ.5,000 అని ఉందనుకుందాం. మీరు రూ.10,000 గదిని ఎంచుకుంటే కేవలం అద్దెలో వ్యత్యాసమే కాకుండా డాక్టర్ ఫీజులు, సర్జరీ ఖర్చుల్లో కూడా బీమా సంస్థ దామాషా పద్ధతిలో కోత విధిస్తుంది.తక్కువ కవరేజీ: నగరాల్లో వైద్య ఖర్చులు ఏటా 15% వరకు పెరుగుతున్నాయి. ఒక మోస్తరు శస్త్రచికిత్సకే రూ.5-10 లక్షలు ఖర్చవుతున్న రోజుల్లో కంపెనీ ఇచ్చే రూ.3 లేదా 5 లక్షల కవరేజీ ఎంతవరకు సరిపోతుందనేది ప్రశ్నార్థకంగా మారుతుంది.నియంత్రణ లేకపోవడం: పాలసీలో ఏయే జబ్బులు కవర్ కావాలి, ఏ యాడ్ఆన్లు ఉండాలి అనే నిర్ణయం కంపెనీదే తప్ప మీది కాదు.ఉద్యోగం పోతే.. బీమా ఖేల్ ఖతం!కార్పొరేట్ బీమాలో అతిపెద్ద లోపం ఇదే. ఈ పాలసీ ఉద్యోగంతో ముడిపడి ఉంటుంది. మీరు రాజీనామా చేసినా, లేఆఫ్స్ వల్ల ఉద్యోగం కోల్పోయినా లేదా వ్యక్తిగత కారణాలతో విరామం తీసుకున్నా.. మరుక్షణమే మీ బీమా రక్షణ రద్దవుతుంది. ఒకవేళ ఆ విరామ సమయంలోనే అనారోగ్యం పాలైతే పరిస్థితి ఏమిటి? కొత్త ఉద్యోగంలో చేరే వరకు మీకు ఎటువంటి రక్షణ అందదు.సొంత పాలసీ ఎందుకు తప్పనిసరి?వ్యక్తిగత ఆరోగ్య బీమాతో కలిగే ప్రయోజనాలు ఇవే..చిన్న వయసులోనే మేలు: తక్కువ వయసులో పాలసీ తీసుకుంటే ప్రీమియం తక్కువగా ఉండటమే కాకుండా ఎటువంటి వైద్య పరీక్షలు లేకుండానే పాలసీ లభిస్తుంది.వెయిటింగ్ పీరియడ్: బీమా తీసుకున్న వెంటనే కొన్ని జబ్బులు కవర్ కావు. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే పాలసీ తీసుకుంటే భవిష్యత్తులో ఏదైనా సమస్య వచ్చినా అప్పటికే వెయిటింగ్ పీరియడ్ పూర్తయి రక్షణ లభిస్తుంది.నో క్లెయిమ్ బోనస్: క్లెయిమ్ చేయని ప్రతి ఏటా మీ బీమా మొత్తం పెరుగుతూ పోతుంది. ఇది రిటైర్మెంట్ సమయానికి పెద్ద రక్షణ కవచంగా మారుతుంది.పన్ను ప్రయోజనం: ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80D కింద వ్యక్తిగత పాలసీకి చెల్లించే ప్రీమియంపై మినహాయింపు పొందవచ్చు. కంపెనీ పాలసీలో ఈ ప్రయోజనం ఉండదు.ఇప్పుడేం చేయాలి?కార్పొరేట్ బీమాను వదులుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని ప్రాథమిక రక్షణగా వాడుకుంటూనే ఒక వ్యక్తిగత పాలసీని కలిగి ఉండటం మంచి నిర్ణయం. చిన్న క్లెయిమ్లకు ఆఫీస్ బీమాను, పెద్ద ఆపదలు వస్తే మీ సొంత పాలసీని వాడుకోవచ్చు. చివరగా.. ఉద్యోగాలు మారతాయి, కంపెనీ పాలసీలు మారతాయి, కానీ మీ ఆరోగ్యం, మీ ఆర్థిక భద్రత మీ చేతుల్లోనే ఉండాలి.ఇదీ చదవండి: సరిపడా నిల్వలున్నా ఎందుకీ యాతన? -
ఫండ్స్లో పెట్టుబడులకు గిఫ్ట్ కార్డులు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడుల దిశగా మరింత మంది ఇన్వెస్టర్లను ప్రోత్సహించేందుకు సెబీ.. గిఫ్ట్ కార్డులు లేదా గిఫ్ట్ ప్రీ పెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్లను (పీపీఐలు) ప్రతిపాదించింది. దీని ప్రకారం ఎవరైనా సరే గిఫ్టీపీపీఐలను కొనుగోలు చేసి వేరొకరికి కానుకగా ఇవ్వొచ్చు. ఈ గిఫ్ట్ పీపీఐలను స్వీకరించిన వారు వాటితో తమకు నచ్చిన మ్యూచువల్ ఫండ్ పథకంలో యూనిట్లను కొనుగోలు చేసుకోవచ్చు.ఈ ప్రతిపాదనపై సలహాలు, సూచనలను ఏప్రిల్ 14లోపు తెలియజేయాలని సెబీ కోరింది. గిఫ్ట్ పీపీఐలను ఎల్రక్టానిక్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ లేదా యూపీఐ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. వీటి కాల వ్యవధి ఏడాదిగా ఉంటుంది. గిఫ్ట్ పీపీఐ ద్వారా ఒక్కో ఇన్వెస్టర్ ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చని సెబీ పరిమితి పెట్టింది.గిఫ్ట్ పీపీఐలను అనుమతించాలంటూ మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ చేసిన వినతి మేరకు సెబీ ఈ చర్యకు ఉపక్రమించింది. రిటైల్ కొనుగోళ్లకు సంబంధించి గిఫ్ట్ కార్డులు ఎంతో ప్రాచుర్యం పొందడం తెలిసిందే. ఇప్పుడు వీటిని పెట్టుబడుల వైపు మళ్లించేందుకు సెబీ నిర్ణయం తోడ్పడనుంది. -
ఇక ఫింగర్ప్రింట్తోనే పేమెంట్స్!
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)కి చెందిన అనుబంధ సంస్థ ‘ఎన్పీసీఐ భీమ్ సర్వీసెస్ లిమిటెడ్’ (NBSL) డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేస్తూ కీలక ప్రకటన చేసింది. ఇకపై భీమ్ యాప్ ద్వారా చేసే యూపీఐ (UPI) లావాదేవీలకు పిన్ అవసరం లేకుండా, కేవలం వేలిముద్ర లేదా ఫేస్ రికగ్నిషన్తో నగదు చెల్లించే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.ఫీచర్ ముఖ్యాంశాలురూ. 5,000 వరకు పరిమితి: వినియోగదారులు తమ స్మార్ట్ఫోన్లోని బయోమెట్రిక్ ఫీచర్ను ఉపయోగించి గరిష్టంగా రూ. 5,000 వరకు లావాదేవీలను క్షణాల్లో పూర్తి చేయవచ్చు.పిన్ ఎంట్రీతో పనిలేదు: తరచూ పిన్ మర్చిపోవడం లేదా తప్పుగా నమోదు చేయడం వల్ల పేమెంట్స్ ఫెయిల్ అయ్యే ఇబ్బందులకు ఇది పరిష్కారం చూపుతుంది.అధిక భద్రత: పిన్ షేరింగ్ వంటి రిస్క్లను తగ్గించి, వ్యక్తిగత గుర్తింపు ఆధారంగా లావాదేవీలు జరుగుతాయి కాబట్టి ఇది మరింత సురక్షితం.రూ. 5,000 దాటితే: అంతకంటే ఎక్కువ మొత్తంలో జరిపే లావాదేవీలకు భద్రతా కారణాల దృష్ట్యా యధావిధిగా యూపీఐ పిన్ తప్పనిసరి.యాక్టివేట్ చేసుకునే విధానంభీమ్ యాప్లో ఈ కొత్త ఫీచర్ను యాక్టివేట్ కోవడానికి ఈ కింది దశలను అనుసరించండి..భీమ్ (BHIM) యాప్ ఓపెన్ చేయండి.ప్రొఫైల్ (Profile) విభాగానికి వెళ్లండి.మీ బ్యాంక్ ఖాతాను ఎంచుకోండి.యాక్టివేట్ బయోమెట్రిక్ ట్రాన్సాక్షన్స్ (Activate Biometric Transactions)పై క్లిక్ చేయండి.ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ (iOS) ప్లాట్ఫారమ్లలో బయోమెట్రిక్ సదుపాయం ఉన్న అన్ని స్మార్ట్ఫోన్లకు అందుబాటులో ఉంది. -
జియో.. జెరోధా.. కొత్త మ్యూచువల్ ఫండ్లు
జెరోధా మ్యూచువల్ ఫండ్ నుంచి నిఫ్టీ మిడ్స్మాల్క్యాప్ 50:50 ఇండెక్స్ ఫండ్ న్యూ ఫండ్ ఆఫర్ 23న ప్రారంభం కానుంది. ఏప్రిల్ 6 వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. ఇన్వెస్టర్లు రూ.100 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ ఫండ్ను కేదార్నాథ్ మిరాజ్కార్ నిర్వహించనున్నారు. ఈ ఫండ్ అధిక రిస్క్ కిందకు వస్తుంది.నిఫ్టీ మిడ్స్మాల్క్యాప్ 400 50:50 ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. కనుక సూచీ రాబడులే ఈ పథకం పనితీరుకు ప్రామాణికంగా ఉంటాయి. మిడ్క్యాప్, స్మాల్క్యాప్ విభాగంలో బలమైన వృద్ధి అవకాశాలున్న కంపెనీల్లో దీర్ఘకాలం పెట్టుబడుల ద్వారా మెరుగైన సంపద సృష్టించుకోవాలని భావించే ఇన్వస్టర్లకు ఈ పథకం అనుకూలంగా ఉంటుంది.జియో బ్లాక్రాక్ లార్జ్క్యాప్ ఫండ్ జియో బ్లాక్రాక్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా జియో బ్లాక్రాక్ లార్జ్క్యాప్ ఫండ్ను తీసుకొచ్చింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ ఈ నెల 24న ప్రారంభమై, ఏప్రిల్ 7న ముగుస్తుంది. లార్జ్క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో పెట్టుబడిని వృద్ధి చేయడం ఈ పథకం ఉద్దేశ్యం. బీఎస్ఈ 100 ఇండెక్స్ (టీఆర్ఐ) ఈ పథకం పనితీరుకు ప్రామాణికం.తన్వి కచేరియా, సాహిల్ చౌదరి ఈ పథకానికి మేనేజర్లుగా వ్యవహరించనున్నారు. డైరెక్ట్ప్లాన్ (మధ్యవర్తుల ప్రమేయం లేని), గ్రోత్ ఆప్షన్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. కనీసం రూ.500 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లార్జ్క్యాప్ కంపెనీల్లో 80–100 శాతం వరకు, 0–20 శాతం మేర ఇతర కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. -
తీవ్ర సంక్షోభం తప్పదు.. కియోసాకి హెచ్చరిక
ప్రముఖ ఆర్థిక నిపుణుడు, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి ఆర్థిక ప్రణాళికపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఆర్థిక పరిస్థితి, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్నవారు ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే ఎదురయ్యే పరిణామాలను ఆయన తన తాజా సోషల్ మీడియా పోస్ట్లో వివరించారు.నిర్లక్ష్యం.. నిశ్శబ్ద శత్రువు!తన కుటుంబ సభ్యురాలితో జరిగిన ఒక చర్చను ఉదహరిస్తూ.. "చాలా మంది ప్రస్తుత ఆర్థిక సంక్షోభాన్ని గుర్తించడం లేదు" అని కియోసాకి (Robert Kiyosaki) ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 80 ఏళ్ల వయస్సు ఉండి, ఎటువంటి పొదుపు లేకుండా, ఇప్పటికీ పని చేయాల్సిన పరిస్థితిలో ఉన్నప్పటికీ.. చాలామంది "ఏం పర్వాలేదు.. సంతోషంగా ఉంటే చాలు (Don't worry, be happy)" అనే ధోరణిలో ఉండటం ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు.యువతకు విలువైన హెచ్చరికఆర్థిక సంక్షోభం ఎప్పుడైనా రావచ్చని, దాన్ని ఎదుర్కోవడానికి యువతకు ఉన్న అతిపెద్ద ఆస్తి "సమయం" అని ఆయన గుర్తు చేశారు. సమయం, ఆరోగ్యం.. ఇవే మనిషికి ఉన్న గొప్ప ఆస్తులు. వీటిని వృథా చేయకుండా పెట్టుబడిగా మార్చుకోవాలి.తాను 28 ఏళ్ల వయస్సులో ఇల్లు లేకుండా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని.. కానీ ఆ వయస్సులో తాను నేర్చుకున్న పాఠాలే నేటి ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడానికి సహాయపడుతున్నాయని ఆయన వివరించారు.ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరం!ప్రపంచ దేశాల్లో ముద్రిస్తున్న 'నకిలీ కరెన్సీ' (ఫేక్ మనీ), పెరుగుతున్న జాతీయ అప్పులు, స్టాక్ మార్కెట్ కుప్పకూలే అవకాశాలను విస్మరించడం తెలివైన పని కాదని కియోసాకి హెచ్చరించారు. వయస్సు పెరిగే కొద్దీ కొత్తగా సంపాదించే సామర్థ్యం తగ్గుతుందని, అందుకే యువత తమ సమయాన్ని తెలివిగా ఖర్చు చేయాలని ఆయన సూచించారు.(ఇది చదివారా 👉పసిడి పతనం.. 1983 నాటి సీన్ రిపీట్)"వయస్సును, మీకు ఉన్న సమయాన్ని గౌరవించండి. ఆరోగ్యం, యవ్వనం ఉన్నప్పుడే సరైన ఆర్థిక పునాదులు వేసుకోకపోతే, రిటైర్మెంట్ సమయంలో తీవ్ర ఇబ్బందులు తప్పవు" అన్నది కియోసాకి మాటల సారాంశం.DON’T WORRY….BE HAPPY. I was talking to a family member about the national debt, the war, printing fake money, inflation, and possible crash of the stock market. She got angry and said to not talk about money, the world economy, and possible global depression. She was…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 23, 2026 -
బ్యాంకు సెలవులు.. వారంలో 4 రోజులు క్లోజ్!
మీరు ఈ వారంలో బ్యాంకు పనులు ఏవైనా ప్లాన్ చేసుకున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. ఈ వారంలో బ్యాంకులకు వరుస సెలవులు రానున్నాయి. వివిధ పండుగలు మరియు వారాంతపు సెలవుల కారణంగా మార్చి 26 నుండి మార్చి 29 వరకు వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారిక క్యాలెండర్ ప్రకారం, వివిధ రాష్ట్రాల్లో శ్రీరామనవమి పండుగ, వారాంతపు సెలవుల కారణంగా వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకింగ్ కార్యకలాపాలకు అంతరాయం కలగనుంది.సెలవుల వివరాలు ఇవే...మార్చి 26 (గురువారం): శ్రీరామనవమి సందర్భంగా గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో బ్యాంకులు మూసిఉంటాయి.మార్చి 27 (శుక్రవారం): తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తోపాటు మధ్యప్రదేశ్, ఒడిశా, బీహార్ రాష్ట్రాల్లో శ్రీరామనవమి సెలవు పాటించనున్నారు.మార్చి 28 (శనివారం): ఇది నెలలో నాలుగో శనివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు.మార్చి 29 (ఆదివారం): సాధారణ సెలవు దినం.నెల ఆఖరిలో మరో సెలవు: మార్చి 31న మహావీర్ జయంతి సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మినహా మెజారిటీ రాష్ట్రాల్లో (మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ వంటివి) బ్యాంకులు మూతపడతాయి.డిజిటల్ సేవలు యథాతథంబ్యాంకు శాఖలు భౌతికంగా మూసివేసినప్పటికీ, ఖాతాదారులకు ఇబ్బంది కలగకుండా ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉంటాయి.ఏటీఎం (ATM) సేవలు: నగదు ఉపసంహరణ కోసం ఏటీఎంలు యథావిధిగా పనిచేస్తాయి.డిజిటల్ బ్యాంకింగ్: నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్స్ ద్వారా UPI, NEFT, RTGS లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.ఇతర సేవలు: ఫిక్స్డ్ డిపాజిట్లు తెరవడం, బ్యాలెన్స్ చెక్ చేయడం వంటి పనులను ఆన్లైన్లో పూర్తి చేసుకోవచ్చు.మార్చి నెలాఖరు కావడంతో అకౌంట్ క్లోజింగ్ పనులు కూడా ఉంటాయి. కాబట్టి, అత్యవసర బ్యాంకింగ్ పనులు ఏవైనా ఉంటే ముందే పూర్తి చేసుకోవడం ఉత్తమం. -
పాత సంవత్సరాలకు నోటీసులొస్తున్నాయి..
ముందుగా పాఠకలోకానికి పరాభవ నామ ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు. త్వరలో రాబోయే కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్నుపరంగా ఎటువంటి సమస్యలు లేకుండా, సాఫీగా గడవాలని కోరుకుంటున్నాం. ఆన్లైన్లో నోటీసుని చూడగానే ముందుగా ఎంతో ఆందోళన చెందారు చెంగలరావుగారు. తాను ప్రతి సంవత్సరం ఠంచనుగా సకాలంలో పన్నులు చెల్లించి, సకాలంలో రిటర్నులు వేసే కచ్చితమైన మనిషి. ఆరేడేళ్ల క్రితం గవర్నమెంటు వారిచ్చిన మెడల్, నగదు బహుమతి పొందారు. ఒకప్పుడు ఆయకర్ రత్న అవార్డులు, రాష్ట్రీయ సన్మానాలు పొందిన వారు చెంగలరావుగారికి ఆదర్శం. ప్రభుత్వం ఇటువంటి వారిని దేశ ఆర్థికాభివృద్ధిలో పాల్గొనే వ్యక్తులుగా గుర్తిస్తుంది. అంత మంచి ట్రాక్ రికార్డు ఉన్న చెంగలరావు గారికి నోటీసులు వచ్చాయి. ఆర్థిక సంవత్సరంలో మీరు పన్ను పూర్తిగా చెల్లించలేదు.. బకాయి, వడ్డీ చెల్లించండి అనేది వాటి సారాంశం. ఆ నోటీసులను పది సార్లు చదివి, ఉగ్రుడైపోయాడాయన. కోపం, విసుగు, అసహనం.. వెంటనే ఆడిటర్కి ఫోన్ చేశారు.‘‘ఏమోనండి. రికార్డులు తెచ్చి చూపిస్తే కానీ ఏమీ చెప్పలేం. అన్ని కాగితాలూ పట్టుకురండి’’ అని తేల్చిచెప్పారు ఆడిటరు. సంఘాన్ని, ప్రభుత్వాన్ని, డిపార్టుమెంటుని ఎడాపెడా తనలో తానే తిట్టుకుంటూ, కాసేపు ఆ కోపాన్ని పన్ను ఎగవేతదార్లపై ప్రదర్శించాక, భార్య కాంతం తమ్ముడు ఏకాంబరం వైపు ఫోకస్ మళ్లింది. ‘‘నీ తమ్ముడు కాంట్రాక్టరు. వాడెప్పుడైనా నేను కట్టినంత కట్టాడా. ఎప్పుడూ ఏడుపే. నష్టాలే బావగారూ అని. అటువంటి వాళ్లను ఏమీ అనరు’’ అంటూ విరుచుకుపడ్డారు. కానీ ఆమె జవాబు ఇవ్వలేదు.మనవడి సహాయంతో బీరువాపైన ఉన్న కాగితాలు కిందికి దించి, ఫైళ్లు వెతకడం మొదలెట్టారు. ఒక నోటీసు 2007–08ది కాగా మరో నోటీసు 2013–14ది. ముందుగానే రెండు నోటీసులను కాపీలు తీసుకుని, ఆయా సంవత్సరాల కాగితాల కోసం వెతుక్కోవడం మొదలెట్టారు. ఒకటి ఇంచుమించు 18 ఏళ్ల క్రితం నాటిది. మరొకటి 12 ఏళ్ల నాటిది. అదృష్టవశాత్తు ఆయా కాగితాలు దొరికాయి. ‘ధన్యుడనైతిని రామా’ అని ఊపిరి పీల్చుకుని, ముందుగా 2007–08కి సంబంధించిన ఫైళ్లు తీసి ఒక్కొక్క కాగితాన్ని పరిశీలించడం మొదలెట్టారు.2014లో ఒక నోటీసు వచ్చింది. టీడీఎస్ తక్కువగా జమ అయింది, మిగతా మొత్తం చెల్లించమని. అన్ని కాగితాలు తీసి, ఒక్కొక్క రికవరీ, చెల్లింపు జమకి వివరణ ఇస్తూ, సమన్వయ పట్టిక చేసి, ఎంతో వివరంగా ఇచ్చారు. దాని అక్నాలెడ్జ్మెంట్ కూడా ఉంది. అది ఇంకా క్లోజ్ అయినట్లు లేదు. అదే సంవత్సరానికి గాను మళ్లీ నోటీసు. ఆ రిటర్నులు.. అన్ని రికార్డులు, ఆ నోటీసు, తన జవాబు, తాను జతపరచిన కాగితాలు.. అన్నింటినీ పది సార్లు చెక్ చేసుకున్నారు. తనవన్నీ సరిగ్గా ఉన్నాయి. అయినా నోటీసు. వెంటనే ఆడిటర్గారికి ఫోన్ చేశారు. మొదటి పది నిమిషాలు ప్రసంగం..ఉక్రోషం.. ఊగిపోవడమైంది. అయినా సరే, నోటీసు వచ్చింది కాబట్టి, మళ్లీ జవాబు ఇవ్వాల్సిందేనని ఆడిటర్ ఆర్గ్యూ చేశారు. రాత్రి కొడుకు వచ్చాక, అప్పటివరకు అయిన గొడవంతా ఏకరువు పెట్టి, తానే స్వయంగా రిప్లైని చేతితో రాసి, కొడుకు చేత ప్రింటర్లో అన్ని కాపీలు తీశారు. అదొక అరవై పేజీల పుస్తకం అంత అయింది. ఈలోగా రాత్రయ్యింది. ఇక మర్నాడు మరొక నోటీసు.. అంటే 2013–14ది బైటికి తీశారు. 26ఏఎస్లో వివరాలు మిస్ మ్యాచ్ అయ్యాయనేది అందులోని సారాశం. టీడీఎస్ క్రెడిట్లు అవలేదు. షరామామూలే! అదే విపత్తు. అదే కసరత్తు.. మళ్లీ పని యావత్తూ. మొత్తానికి అన్ని కాగితాలూ దొరికాయి. కొడుకు సహాయంతో జవాబు పూర్తి చేశాక, ఓ 30 పేజీల ఫైలు తయారైంది. తన జ్యూరిస్డిక్షన్ అధికారి ఆఫీసుకి ఆటోలో బయలుదేరాడాయన. అధికారులు రెండు జవాబులు తీసుకుని అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు. ఎంతో ఆశగా అడిగారాయన ‘‘అన్నీ పర్ఫెక్టుగా ఉన్నాయి.. రెండు మూడు రోజుల్లో అయిపోతుందా’’ అని. ఆ అధికారి ఆ కాగితాలను పక్కన పెట్టుకుంటూ ‘‘రెండు మూడు నెలల తర్వాత’’ అని ముక్తసరిగా చెప్పారు. ఇలాంటి చెంగలరావుగార్లు ఎందరో లెక్కలేదు. ఎంతో నిజాయితీగా చెల్లించే రిటైర్డు ఉద్యోగస్తులపై అస్త్రాల మీద అస్త్రాలు వస్తున్నాయి. రికార్డులు అప్డేట్ చేసుకోవడం లేదు.. ఇచ్చిన రిప్లై సరిగ్గా చెక్ చేసుకోవడం లేదు. ఇచ్చిన వారికే నోటీసులు ఇవ్వడం.. ఎంతో విచిత్రమైన పరిస్థితి. అంత పాత రికార్డులు ఉండకపోతే/దొరక్కపోతే ఏంటి పరిస్థితి! కాబట్టి డిమాండ్ల విషయంలో ఎంతో మెలకువగా వ్యవహరించాలి అధికారులు. -
మీ డబ్బు మీ కోసం పనిచేస్తుందా?
చాలామందికి ఆదాయం అంటే నెల జీతం మాత్రమే. పెట్టుబడులను కూడా ఖర్చుల్లానే చూస్తుంటారు. భవిష్యత్తు ఆదాయానికి పెట్టుబడులే ప్రధానమన్న సూత్రాన్ని పెద్దగా పట్టించుకోరు. వారెన్ బఫెట్ మాటల్లో చెప్పాలంటే రెండో ఆదాయమనేది పెట్టుబడులతోనే వస్తుంది. మరి పెట్టుబడుల్లో సక్సెస్ కావాలంటే.? దీనికి పెద్ద పరిజ్ఞానం అవసరం లేదు. కావాల్సిందల్లా సరైన ఆలోచన... క్రమశిక్షణ, ఓర్పు. ఈ మూడింటితో పెట్టుబడులను సరైన దారిలో కొనసాగించడం, సమయానికి మార్పులు చేయడం, దీర్ఘకాలం కొనసాగించటం చేయొచ్చు. అదే సంపద సృష్టికి మార్గం. నిజానికి చాలా మంది ఇన్వెస్టర్లు తొలుత ఉత్సాహంగా పెట్టుబడులు మొదలెడతారు. కొన్నాళ్లకు నిర్లక్ష్యం చేస్తారు. ఇదే వారి వైఫల్యానికి ప్రధాన కారణం. పెట్టుబడుల్లో విజయానికి ఫైనాన్షియల్ ప్లానర్లు ప్రత్యేకంగా చెబుతున్న సూత్రాలను వివరించేదే ఈ ‘వెల్త్ స్టోరీ’...ముందుగా తెలుసుకోవటం... తరవాతే ఇన్వెస్ట్మెంట్చాలామంది ఇతరులు చెప్పారని, సోషల్ మీడియాలో చూశామని, ఇది బాగా లాభాలిస్తుందని ఎవరో చెబితే విన్నామని పెట్టుబడులు పెడతారు. ఇదే మొదటి పెద్ద తప్పు. మీరు దేనిలో పెట్టుబడి పెడుతున్నారో దాని గురించి బాగా తెలుసుకోవాలి. అది ఎలా పనిచేస్తుంది? అందులో రిస్క్ ఎంత? రిటర్న్స్’ ఎన్నాళ్లకు వస్తాయి? మీ లక్ష్యాలకు ఇది సరిపోతుందా? ఇవన్నీ సరిచూసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్, డెట్ ఫండ్స్, ఈక్విటీ వంటి వాటి లక్షణాలు, లాభాలు, రిసు్కలు తెలుసుకోకుండా పెట్టుబడి పెట్టకూడదు. తెలియని దాంట్లో పెట్టుబడి పెట్టకూడదన్నది తొలి నియమం.మీ రిస్క్ సామర్థ్యాన్ని మీరే తెలుసుకోండిఅందరూ ఒకే రకమైన ఇన్వెస్టర్లు కాదు. కొంతమంది అధిక రిస్క్ తీసుకోగలుగుతారు. మరికొందరు అస్సలు రిస్క్ తీసుకోలేరు. ఇది ప్రధానంగా వారి ఆర్థిక స్థాయిలను బట్టి మారుతుంటుంది. మీరు తట్టుకోలేని స్థాయిలో రిస్క్ తీసుకుంటే... మార్కెట్లో సంభవించే చిన్న చిన్న మార్పులకే భయపడతారు. అప్పుడు ఆందోళనతో తప్పుడు నిర్ణయాలు తీసుకుని, నష్టాల్లో కూరుకుపోతారు. మంచి ఇన్వెస్టర్ అంటే భయంలేని వాడు కాదు. తన సామర్థ్యాన్ని అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా ఇన్వెస్ట్ చేసేవాడు.ఉచిత సలహాలకు విలువ ఉండదుఉచితంగా లభించే విషయాలను ఎవరూ సీరియస్గా తీసుకోరు. ఫైనాన్స్ విషయంలోనూ అదే జరుగుతుంది. కానీ తప్పుడు నిర్ణయాల వల్ల కలిగే నష్టం మాత్రం చాలా ఖరీదైనదిగా మారుతుంది, ఒక్కోసారి జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ఒక మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్ మీ అవసరాలు, లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యాన్ని అర్థం చేసుకుని సరైన మార్గాన్ని నిర్దేశిస్తాడు., అవసరమైన సందర్భాల్లో పోర్ట్ఫోలియోలో మార్పులు కూడా సూచిస్తాడు. పెయిడ్ అడ్వైజర్ని సంప్రదించడం ఖర్చు కాదు. భవిష్యత్తు పెట్టుబడుల్లో భాగం.లాభాలను తిరిగి పెట్టుబడి పెట్టండిలాభాలు వచ్చినప్పుడు వాటిని మొత్తం ఖర్చు చేయకండి. కొంత భాగాన్ని మళ్లీ పెట్టుబడుల్లో పెట్టండి. దీనివల్ల లాభాలపై మళ్లీ లాభాలు వస్తాయి. ఇదే నిజమైన సంపద రహస్యం. సరైన అసెట్ అలొకేషన్మీ పెట్టుబడులపై ఎంత రాబడి వస్తుందనేది మీరు ఎక్కడ పెట్టుబడులు పెట్టారనేదానిపై ఆధారపడి ఉంటుంది. దీన్నే అసెట్ అలొకేషన్గా చెబుతుంటారు. ఈక్విటీ, డెట్, ఫిక్స్డ్ డిపాజిట్లు, గోల్డ్ వంటి విభాగాల్లో మీ డబ్బును సరైన శాతాల్లో పెట్టుబడి చేయడమే ఈ అసెట్ అలొకేషన్. మీ వయస్సు, రిస్క్ తీసుకునే సామర్థ్యం , మీ లక్ష్యాలు వాటి కాల వ్యవధి మీద ఇది ఆధారపడి ఉంటుంది. యువ ఇన్వెస్టర్లు రిస్క్ ఎక్కువ తీసుకోగలరు. అందుకే ఈక్విటీల్లో ఎక్కువగా పెట్టుబడి పెట్టవచ్చు. వయస్సు పెరిగే కొద్దీ భద్రత ముఖ్యం అవుతుంది. అప్పుడు డెట్లో పెట్టుబడికి ప్రాధాన్యమివ్వాలి. ఎవరైనా మొత్తం డబ్బు ఒకే చోట పెట్టడం ప్రమాదకరం.మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ మాట వినండిమీ ఫైనాన్షియల్ అడ్వైజర్ మీ పెట్టుబడులను పర్యవేక్షిస్తుంటారు. మార్కెట్ ట్రెండ్స్ను గమనిస్తుంటారు. వారు ఇచ్చే సూచనలను నిర్లక్ష్యం చేయకుండా, ఆలోచించి అమలు చేయడం మంచిది. ఫైనల్ నిర్ణయం మీరే తీసుకున్నా.. వారి అనుభవం పెట్టుబడుల విషయంలో ఎంతో ఉపయోగపడుతుంది.మార్కెట్ ఊగిసలాటలు సహజమేమార్కెట్ ఎప్పుడూ పైకి మాత్రమే వెళ్లదు. అప్పుడప్పుడూ పడిపోతుంది. కానీ మళ్లీ పెరుగుతుంది. ఇది సహజ ప్రక్రియ. చిన్న మార్పులకు భయపడి పెట్టుబడులు ఉపసంహరించుకుంటే, మీరు నష్టాలకే బాట వేస్తారు. దీర్ఘకాలంలో ఈక్విటీ పెట్టుబడులు మంచి ఫలితాలు ఇస్తాయనే విషయం చరిత్ర చెబుతోంది. పెట్టుబడుల విషయంలో ఓర్పు ఇన్వెస్టర్కు అత్యంత ముఖ్యమైన ఆయుధం.పెట్టుబడులూ ప్రధానమే..మనందరికీ కుటుంబం ముఖ్యం. పని ముఖ్యం. కానీ పెట్టుబడులూ అంతే ముఖ్యమని తెలు సుకోవాలి. ఎందుకంటే ఇవే మీ భవిష్యత్తును కాపాడతాయి. చాలామంది చేసే తప్పేంటంటే ముందుగా ఖర్చులు చేస్తారు, మిగిలితే ఇన్వెస్ట్ చేస్తారు. స్మార్ట్ ఇన్వెస్టర్లు చేసే పని ముందుగా ఇన్వెస్ట్ చేయడం. తర్వాత ఖర్చులు ప్లాన్ చేసుకోవటం. ఇది చిన్న మార్పులా అనిపించినా, దీర్ఘకాలంలో సంపద సృష్టికి పెద్ద ఆధారమవుతుంది.దీర్ఘకాలిక లక్ష్యాలను ఎప్పుడూ మరవద్దుపిల్లల చదువు, రిటైర్మెంట్, ఇల్లు కొనడం లాంటి లక్ష్యాలు 10–15 సంవత్సరాల తర్వాత వచ్చే దీర్ఘకాలిక లక్ష్యాలు. ఇవి సమయం మీద ఆధారపడే లక్ష్యాలు. సమయం అంటే కాంపౌండింగ్ శక్తి. ఈ డబ్బును చిన్న అవసరాలకు వాడితే మీరు కోల్పోయేది కేవలం డబ్బు కాదు. అంతకంటే విలువైన సమయం. డబ్బు మళ్లీ సంపాదించవచ్చు, కానీ కోల్పోయిన సమయాన్ని తిరిగి తెచ్చుకోలేరు.పెట్టుబడులు చేయడం అలవాటు చేసుకోండివిజయవంతమైన ఇన్వెస్టర్లు ఒక్కసారి మాత్రమే పెట్టుబడి పెట్టరు. క్రమ పద్ధతిలో పెట్టుబడులు చేస్తుంటారు. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ (సిప్) వంటి పద్ధతులు మీలో క్రమశిక్షణను పెంచుతాయి. చిన్న మొత్తాలతో మొదలుపెట్టినా, కాలక్రమంలో అవి పెద్ద మొత్తాలుగా మారతాయి.పోర్ట్ఫోలియోను రీబ్యాలెన్స్ చేయాలిమార్కెట్ మారుతుంది. మీ జీవితం కూడా మారుతుంది. కొత్త లక్ష్యాలు వస్తాయి, పాత లక్ష్యాలు పూర్తవుతాయి. ఈ మార్పులకు అనుగుణంగా మీ పెట్టుబడుల్లో కూడా మార్పులు చేయాలి. దీన్నే పెట్టుబడుల పరిభాషలో రీ–బ్యాలెన్సింగ్ అంటారు.ఉదాహరణకు పిల్లల చదువుకు చేసిన పెట్టుబడులు పూర్తయ్యాక, ఆ డబ్బును రిటైర్మెంట్ లక్ష్యానికి మళ్లించాలి.ఇదీ చదవండి: ‘జీడి’ రైతుకు కొత్త ఆదాయం -
రక్షణ ప్లస్ రాబడి
మన దేశంలో ఇన్వెస్ట్మెంట్లంటే మొదటి నుంచీ ఒకటే ధోరణి. అయితే డిపాజిట్లు. లేకుంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు. ఇవి రెండూ కాకుంటే బంగారం లేదా రియలీ్ట. స్టాక్ మార్కెట్లో నేరుగా పెట్టుబడులు పెట్టడం ఇబ్బందికరం అనుకునేవారు మ్యూచువల్ ఫండ్లను ఆశ్రయించటం. ఇప్పటికీ చాలామందిది ఇదే తీరు. వారికి మ్యూచువల్ ఫండ్లంటే స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేవే. కానీ ఇప్పుడు మార్కెట్లు ఇలా వేటిలోనూ ఒకదాంట్లో పెట్టుబడులు పెట్టి ఊరుకునేలా లేవు. అలాగని అన్నింట్లోనూ పెట్టుబడులు పెట్టాలంటే... వాటిని గమనిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి మార్చుకోవటం అంత తేలికకాదు. అందుకే ఇలాంటివన్నీ చేసే ఫండ్స్ను చూసుకోవాలి. అటు డెట్లోను, ఇటు స్టాక్ మార్కెట్లో, మరోవైపు బంగారంలోనూ... ఇలా మూడింటా పెట్టుబడులు పెడుతూ... అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ముందుకెళ్లేవే మల్టీ అసెట్ ఫండ్స్. పేరుకు తగ్గట్టే ఇవి భిన్న రకాల ఆస్తుల్లో పెట్టుబడులు పెడుతూ ఉంటాయి. డెట్లో పెడతాయి కనక కొంత రక్షణ తప్పనిసరిగా ఉంటుంది. పైపెచ్చు అవసరాన్ని బట్టి మారుస్తాయి కనక చక్కని రాబడి కూడా ఇస్తున్నాయి. రిస్క్ లు, రాబడుల మధ్య సమతూకాన్ని పాటిస్తూ వివిధ అసెట్స్లో ఇన్వెస్ట్ చేస్తున్న ఈ మల్టీ అసెట్ ఫండ్స్... ప్రస్తుతం అందరికీ అవసరమైనవనటంలో సందేహం లేదు. వాటిపై సమగ్ర అవగాహనే ఈ వెల్త్ స్టోరీ...కనీసం మూడు అసెట్స్లో ఇన్వెస్ట్ చేసే హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్నే మల్టీ అసెట్ ఫండ్స్గా వ్యవహరిస్తుంటారు. ఇవి పెట్టుబడి వృద్ధి కోసం ఈక్విటీల్లో, స్థిరత్వం కోసం డెట్ సాధనాలు– బాండ్స్లో, రిస్క్ లను హెడ్జ్ చేసేందుకు పసిడి/ కమోడిటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ప్రతి అసెట్ క్లాస్కి కనీసం ఇంత కేటాయించాలనే నిబంధనలుంటాయి. కాబట్టి దానికి తగ్గట్లే ఈ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇలాంటి ఫండ్ ఒకటి ఉంటే సంపూర్ణమైన పోర్ట్ఫోలియో ఉన్నట్లే లెక్క. ఇవన్నీ ఎందుకు ప్రాచుర్యం పొందుతున్నాయి.. ప్రస్తుతం మార్కెట్లను చూస్తే విడివిడిగా స్టాక్స్ని ఎంచుకోవడం కన్నా అసెట్స్ అలొకేషన్ వైపే పరిస్థితులు మొగ్గు చూపుతున్నాయి. ఎందుకంటే ఈక్విటీ మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. డెట్ మార్కెట్లు స్థిరపడుతున్నాయి. పుత్తడి పటిష్టమైన హెడ్జింగ్కి ఉపయోగపడుతోంది. ఈ నేపథ్యంలో ఏదో ఒక్క అసెట్ని నమ్ముకుంటే వర్కౌట్ కాదని ఇన్వెస్టర్లు గ్రహిస్తున్నారు. మల్టీ అసెట్ ఫండ్స్తో ఈ సమస్యకు పరిష్కారాన్ని కూడా అందుకుంటున్నారు. ఇవి పరిస్థితులను బట్టి వివిధ అసెట్స్ మధ్య కేటాయింపులను ఆటోమేటిక్గా మార్చేస్తాయి. మార్కెట్లలో మార్పులను బట్టి అవకాశాలను అందిపుచ్చుకుంటాయి. పోర్ట్ఫోలియో పతనమయ్యే రిస్కులను తగ్గిస్తాయి. మల్టీ అసెట్ ఎందుకు ఉపయోగకరం అంటే..వివిధ అసెట్స్ వ్యాప్తంగా పెట్టుబడులను డైవర్సిఫై చేసేందుకు వీలుంటుంది. పరిస్థితులను బట్టి పోర్ట్ఫోలియో ఆటోమేటిక్గా రీబ్యాలెన్స్ అవుతుంది. ఈక్విటీల్లో మాత్రమే పెట్టే పెట్టుబడులతో పోలిస్తే హెచ్చుతగ్గులు తక్కువగా ఉంటాయి. వీటిలోనైతే మార్కెట్ కరెక్షన్లకు లోనయ్యేటప్పుడు రక్షణ ఉంటుంది. దీర్ఘకాలికంగా సిప్ ఇన్వెస్టింగ్ కోసం ఇవి అనువైనవి కూడా.డెట్ (బాండ్లు) పాత్ర.. డెట్ విభాగమనేది మల్టీ అసెట్ ఫండ్స్కి ఉండే బలాల్లో ఒకటి. ఇది స్థిరమైన రాబడిని అందిస్తుంది. పోర్ట్ఫోలియోలో ఒడిదుడుకులను తగ్గిస్తుంది. ఈక్విటీలు కరెక్షన్కి లోనయ్యే సమయంలో పోర్ట్ఫోలియో మరీ ఎక్కువగా పడిపోకుండా కాస్త కుషన్గా పని చేస్తుంది. మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్నప్పుడు బాండ్లు అనేవి భద్రత కోసమే కాక పోర్ట్ఫోలియోను సంరక్షించుకునే వ్యూహంగా కూడా పనికొస్తాయి. సరైన ఫండ్ని ఎంచుకోవడం ఇలా.. అసెట్ అలొకేషన్ని పరిశీలించాలి → ఈక్విటీలవైపు ఎక్కువగా మొగ్గు చూపించే ఫండ్లలో అధిక రాబడులతో పాటు అధిక రిస్క్ లూ ఉంటాయి. → బ్యాలెన్స్డ్గా పెట్టుబడులు పెట్టే ఫండ్లలో మాత్రమే స్థిరమైన రాబడులుంటాయి. నిలకడపై ఫోకస్ → స్వల్పకాలిక రాబడులను కాకుండా 3–5 ఏళ్ల పనితీరును పరిశీలించాలి. ఫండ్ వ్యూహాన్ని అర్థం చేసుకోవాలి → ఐసీఐసీఐ = కాంట్రేరియన్ → ఎస్బీఐ = బ్యాలెన్స్డ్ → క్వాంట్ = అగ్రెసివ్ మీ రిస్కు సామర్థ్యాలను బట్టి అనువైనవి ఎంచుకోవాలి→ కన్జర్వేటివ్ = ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ → మోడరేట్ = ఐసీఐసీఐ, కోటక్ → అగ్రెసివ్ = నిప్పన్, క్వాంట్ ఈ రిస్క్ లుంటాయ్.. మార్కెట్లు బులిష్గా దూకుడు మీదున్నప్పుడు ఇవి పెద్దగా రాణించకపోవచ్చు. అలాగే రాబడులనేవి ఫండ్ మేనేజర్ నిర్ణయాలను బట్టి ఆధారపడి ఉంటాయి. ఇక మరీ డైవర్సిఫికేషన్ ఎక్కువగా చేసినా కూడా వృద్ధి అవకాశాలు పరిమితమవుతాయి.– సాక్షి, వెల్త్ -
సిబిల్ స్కోరుపై పెరుగుతున్న అవగాహన
ముంబై: రుణాల విషయంలో కీలక పాత్ర పోషిస్తున్న క్రెడిట్ స్కోరు గురించి తెలుసుకోవడంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోందని ట్రాన్స్యూనియన్ సిబిల్ ఒక నివేదికలో తెలిపింది. దీని ప్రకారం 18.3 కోట్ల మంది భారతీయులు తమ సిబిల్ స్కోరును స్వయంగా పరిశీలించుకుంటున్నారు.తొలిసారిగా పరిశీలించుకునే వారి సంఖ్య గతేడాది డిసెంబర్ గణాంకాల ప్రకారం వార్షికంగా 27 శాతం పెరిగింది. క్రెడిట్ మానిటరింగ్ చేసుకుంటున్న వారి సగటు స్కోరు 728గా ఉంది. ఇలా పర్యవేక్షించుకుంటున్న వారిలో సుమారు 45 శాతం మంది ఆరు నెలల వ్యవధిలో తమ స్కోరును మరింత మెరుగుపర్చుకుంటున్నారు.సాధారణంగా వ్యక్తిగత రుణాల్లాంటివి అవసరమైనప్పుడు మాత్రమే వినియోగదారులు స్కోరును తెలుసుకునే వారని, కానీ ప్రస్తుతం తరచుగా తెలుసుకోవడం, దాన్ని మెరుగుపర్చుకోవడంపై మరింతగా దృష్టి పెడుతున్నారని సంస్థ ఎండీ భవేష్ జైన్ తెలిపారు. మిలీనియల్స్, జెన్ జెడ్ తరం, మహిళలు ఈ విషయంలో ముందుంటున్నారని పేర్కొన్నారు. మెట్రోయేతర ప్రాంతాల్లో స్కోరు ను పరిశీలించుకునే ధోరణి పెరుగుతోందన్నారు. -
మారనున్న పాన్ కార్డు రూల్స్.. కేంద్రం కఠిన నిబంధనలు!
భారతదేశంలో పర్మనెంట్ అకౌంట్ నెంబర్ (PAN) కోసం దరఖాస్తు చేసే విధానంలో.. 2026 ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఇప్పటి వరకు కేవలం ఆధార్ కార్డును ఉపయోగించి.. పాన్ కార్డుకు అప్లై చేసుకునే అవకాశం ఉండేది. అయితే మార్చి 31 తరువాత అదనంగా గుర్తింపుకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది.ఈ కొత్త నియమాల ప్రకారం.. PAN కోసం దరఖాస్తు చేసే ప్రతి వ్యక్తి ఆధార్తో పాటు మరో గుర్తింపు కార్డును తప్పనిసరిగా సమర్పించాలి. ఇందులో బర్త్ సర్టిఫికేట్, ఓటర్ ఐడీ కార్డు, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పదో తరగతి సర్టిఫికేట్ లేదా మేజిస్ట్రేట్ ఇచ్చే అఫిడవిట్ వంటి పత్రాలు ఉన్నాయి. ఇది ఇప్పటి వరకు ఉన్న సరళమైన విధానం కంటే కాస్త కఠినమైన ధృవీకరణ ప్రక్రియగా మారనుంది.కొత్త ఆర్ధిక సంవత్సరం నుంచి.. PAN కార్డులో ఉన్న పేరు, ఆధార్ కార్డులో ఉన్న పేరుతో పూర్తిగా సరిపోవాలి. ఇంతకు ముందు చిన్న మార్పులు లేదా వేరియేషన్లు ఉన్నా పెద్దగా సమస్య ఉండేది కాదు. కానీ ఏప్రిల్ నుంచి అలాంటి అసమానతలకు అవకాశం ఉండదు. ఇది వ్యక్తుల గుర్తింపు వివరాలను మరింత ఖచ్చితంగా నమోదు చేయడానికి తీసుకున్న చర్యలలో భాగం అని తెలుస్తోంది.సైబర్ నేరాలుఇటీవల కాలంలో ఈ పాన్ డౌన్లోడ్ పేరుతో చాలా మోసాలు జరుగుతున్నాయి. సెకన్ల వ్యవధిలో పాన్ డౌన్లోడ్ చేసుకోండంటూ.. కొందరు సైబర్ నేరగాళ్లు కొన్ని లింక్స్ పంపిస్తున్నారు. ఆ లింక్స్ నమ్మి ఓపెన్ చేయాలని చూస్తే యూజర్లు మోసపోతారు. అలాంటి మోసాలకు చెక్ పెట్టడంలో భాగంగానే.. కేంద్రం కొత్త డాక్యుమెంట్స్ కూడా అందించాలని ద్రువీకరించింది.ఇదీ చదవండి: తగ్గుతున్న బంగారం ధరలు: మళ్లీ పెరుగుతాయా? -
బ్యాంకు కస్టమర్లకు అలర్ట్.. మారుతున్న ఏటీఎం రూల్స్
మీకు బ్యాంకు ఖాతా ఉండి ఏటీఎంల ద్వారా తరచుగా నగదు విత్ డ్రా చేస్తుంటే ఈ వార్త మీకోసమే. వచ్చే ఏప్రిల్ 1 నుంచి దేశంలోని ప్రముఖ బ్యాంకులు ఏటీఎం/సీఆర్ఎం నగదు ఉపసంహరణ నిబంధనల్లో కీలక మార్పులు చేయనున్నాయి. ముఖ్యంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), హెచ్డీఎఫ్సీ (HDFC), బంధన్ బ్యాంకులు తమ కస్టమర్లకు కొత్త మార్గదర్శకాలను జారీ చేశాయి.యూపీఐ (UPI) ఆధారిత నగదు ఉపసంహరణలు, రోజువారీ విత్ డ్రాయల్ లిమిట్స్, ఉచిత లావాదేవీల సంఖ్యపై ఈ ప్రభావం ఉండనుంది. ఆ మార్పులేంటో ఒకసారి చూద్దాం..పంజాబ్ నేషనల్ బ్యాంక్ మార్పులుపంజాబ్ నేషనల్ బ్యాంక్ తన డెబిట్ కార్డ్ వేరియంట్లను బట్టి రోజువారీ నగదు ఉపసంహరణ పరిమితిని తగ్గించింది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం, భద్రతను పెంచడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది.రూపే ఎన్సీఎంసీ ప్లాటినం (డొమెస్టిక్ & ఇంటర్నేషనల్), ఉమెన్ పవర్ ప్లాటినం, పీఎన్బీ పలాష్, రూపే బిజినెస్ ప్లాటినం, మాస్టర్ కార్డ్ ప్లాటినం, వీసా గోల్డ్ కార్డులకు నగదు విత్డ్రా పరిమితిని రూ. లక్ష నుంచి రూ. 50,000కు తగ్గించింది.ఇక రూపే సెలెక్ట్, పీఎన్బీ రూపే నియో/ఎక్సెల్, వీసా సిగ్నేచర్, మాస్టర్ కార్డ్ బిజినెస్ డెబిట్ కార్డులకు క్యాష్ విత్డ్రా లిమిట్ రూ. 1.5 లక్షల నుంచి రూ. 75,000కు తగ్గనుంది.అయితే పీఓఎస్ (POS), ఈ-కామర్స్ లావాదేవీల పరిమితుల్లో ఎలాంటి మార్పు లేదు. కస్టమర్లు తమ లిమిట్ను పీఎన్బీవన్ యాప్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా సెట్ చేసుకోవచ్చు.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొత ఛార్జీలుప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ, ఏప్రిల్ 1 నుంచి యూపీఐ (UPI) ద్వారా చేసే ఏటీఎం విత్ డ్రాయల్స్ను కూడా నెలవారీ ఉచిత లావాదేవీల కోటాలో చేర్చింది.నెలవారీ ఉచిత పరిమితి దాటిన తర్వాత, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నగదు తీసుకుంటే ప్రతి లావాదేవీకి రూ. 23 + పన్నులు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.కార్డు లేకుండా నగదు పొందే సౌలభ్యం ఉన్నప్పటికీ, ఇకపై లావాదేవీల సంఖ్యపై కస్టమర్లు నిఘా ఉంచక తప్పదు.బంధన్ బ్యాంక్ మారిన నిబంధనలుబంధన్ బ్యాంక్ కూడా తన కస్టమర్లకు ఏటీఎం వినియోగ నియమాలను మార్చింది.సొంత బ్యాంకు అంటే బంధన్ బ్యాంక్ ఏటీఎంలలో నెలకు 5 ఉచిత ఫైనాన్షియల్ లావాదేవీలే ఉంటాయి. ఆర్థికేతర లావాదేవీలు (బ్యాలెన్స్ చెక్ వంటివి) మాత్రం అపరిమితం.ఇతర బ్యాంకు ఏటీఎంలలో అయితే మెట్రో నగరాల్లో నెలకు కేవలం 3 ఉచిత లావాదేవీలు (ఫైనాన్షియల్ + నాన్ ఫైనాన్షియల్ కలిపి), నాన్-మెట్రో నగరాల్లో నెలకు 5 ఉచిత లావాదేవీలకు అవకాశం ఉంటుంది. -
EPF కనీస పెన్షన్ పెంపు.. పార్లమెంటు కమిటీ కీలక సిఫార్సులు
ఈపీఎఫ్ చందాదారులు రిటైర్మెంట్ తర్వాత పొందే పెన్షన్కు సంబంధించి పార్లమెంటరీ ప్యానెల్ కేంద్రానికి కీలక ప్రతిపాదనలు చేసింది. ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్, 1995 (EPS, 1995) కింద.. ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.1000 కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలని కమిటీ సూచించింది. ఆ మొత్తం వాస్తవికంగా, గౌరవప్రదంగా ఉండాలని అభిప్రాయపడింది. ఈ మేరకు లేబర్, టెక్స్టైల్స్, స్కిల్ డెవలప్మెంట్పై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తన 15వ నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది.ఈపీఎస్ కనీస పెన్షన్ పెంచాలని పెన్షనర్లు ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు అందుతున్న మొత్తం ఏమాత్రం సరిపోవడం లేదని, దాన్ని రూ.7,500కు పెంచాలని వారు కోరుతున్నారు. ఇదే డిమాండ్ ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మూడు రోజుల పాటు ధర్నా నిర్వహించారు. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ స్థాయీ సంఘం స్పందించింది.కనీస పెన్షన్పై ఇప్పటికే పెన్షనర్ల నుంచి పలు విజ్ఞాపనలు వచ్చినట్లు పేర్కొంది. ద్రవ్యోల్బణం, ఆరోగ్య సంరక్షణ ఖర్చులు, జీవన వ్యయాలు పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న కనీస మొత్తం ఏమాత్రం సరిపోదని కమిటీ అభిప్రాయపడింది. కాబట్టి ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్, 1995ని పునః సమీక్షించి పెన్షన్ మొత్తాన్ని పెంచాలని ప్రతిపాదించింది. ఇందుకోసం కేటాయింపులు చేయాలని సూచించింది.ఇదీ చదవండి: కియోసాకి హెచ్చరిక.. చరిత్రలో అతిపెద్ద బబుల్ బస్ట్! -
కస్టమర్లకు అలర్ట్.. మారిపోతున్న క్రెడిట్ కార్డు రూల్స్..
దేశంలోని పలు ప్రముఖ బ్యాంకులు ఏప్రిల్ 2026 నుంచి తమ క్రెడిట్ కార్డు నియమాలలో మార్పులు అమలు చేయనున్నాయి. ముఖ్యంగా క్యాష్బ్యాక్ ప్రయోజనాలు, రివార్డ్ పాయింట్ల రిడంప్షన్ విధానం, అలాగే కొన్ని చెల్లింపులపై లావాదేవీ ఛార్జీల్లో మార్పులు ఉండనున్నాయి.ఈ మార్పులను ఇప్పటికే యాక్సిస్ బ్యాంక్ (Axis Bank), యెస్ బ్యాంక్ (YES Bank), ఎస్బీఐ (SBI Card) తమ వినియోగదారులకు తెలియజేశాయి. కాబట్టి క్రెడిట్ కార్డు వినియోగదారులు కొత్త నిబంధనలను ముందుగానే తెలుసుకుని తమ ఖర్చు విధానాన్ని సర్దుబాటు చేసుకోవడం మంచిది.యాక్సిస్ క్రెడిట్ కార్డు బెనిఫిట్స్లో మార్పులుఏప్రిల్ 12 నుంచి ఎయిర్టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు రివార్డ్ స్ట్రక్చర్లో కొన్ని మార్పులు అమల్లోకి రానున్నాయి. వాటిలో ముఖ్యమైనవి..ఎయిర్టెల్ మొబైల్, బ్రాడ్బ్యాండ్, డీటీహెచ్ చెల్లింపులపై 25% క్యాష్బ్యాక్ కొనసాగుతుంది.ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా యుటిలిటీ బిల్లులు చెల్లిస్తే 10% క్యాష్బ్యాక్ అందుతుంది.అయితే ప్రతి బిల్లింగ్ సైకిల్కు గరిష్ట క్యాష్బ్యాక్ పరిమితి ఇప్పుడు బేస్ క్యాష్బ్యాక్ క్యాప్తో అనుసంధానం అవుతుంది.స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్ వంటి ప్లాట్ఫారమ్లపై ఇప్పటివరకు ఉన్న 10% క్యాష్బ్యాక్ నిలిపివేయనున్నారు.బదులుగా జొమాటో, బ్లింకిట్, డిస్ట్రిక్ట్ వంటి ప్లాట్ఫారమ్లపై 10% వాల్యూ-బ్యాక్ అందించనున్నారు.యెస్ బ్యాంక్ కొత్త ఛార్జీలుఏప్రిల్ 1 నుంచి యెస్ బ్యాంక్ యుటిలిటీ బిల్లులు, ట్రాన్స్పోర్ట్ చెల్లింపులపై కొత్త పరిమితులు, ఛార్జీలు అమలు చేయనుంది. కొత్త నిబంధనలు ఇలా.. విద్యుత్, నీరు, గ్యాస్ వంటి యుటిలిటీ బిల్లులపై నెలవారీ ఖర్చు నిర్దిష్ట పరిమితిని దాటితే 1% ఛార్జీ వసూలు చేస్తారు.కార్డు రకాన్ని బట్టి పరిమితులు ఉంటాయి. యెస్ ప్రైవేట్ క్రెడిట్ కార్డు అయితే నెలకు రూ.1,00,000 వరకు, ప్రీమియం కార్డులైతే రూ.50,000 వరకు, ఇతర కార్డులకు రూ.25,000 వరకు పరిమితులను నిర్ణయించారు.ఈ పరిమితులను దాటిన తర్వాత చేసిన యుటిలిటీ చెల్లింపులపై 1% ఫీజు వర్తిస్తుంది.అదే విధంగా టోల్, బ్రిడ్జ్ చెల్లింపులు కూడా నిర్దిష్ట పరిమితిని మించితే 1% ఛార్జీ వసూలు చేస్తారు. అయితే ఒక్క లావాదేవీకి గరిష్ట ఛార్జీ రూ.5,000 వరకు మాత్రమే ఉంటుంది.ఎస్బీఐ.. రివార్డ్ పాయింట్ రిడంప్షన్ మార్పులుఎస్బీఐ కార్డ్ కూడా ఏప్రిల్ 1 నుంచి రివార్డ్ పాయింట్ రిడంప్షన్ విధానంలో కొత్త నియమాలను అమలు చేయనుంది. కొత్త పాలసీ ప్రకారం..స్టేట్మెంట్ క్రెడిట్గా నెలకు గరిష్టంగా 60,000 రివార్డ్ పాయింట్లు మాత్రమే రిడీమ్ చేసుకోవచ్చు.రివార్డ్ పాయింట్ల రిడంప్షన్ 4,000 పాయింట్ల గుణిజాల్లో మాత్రమే ఉంటుంది.అయితే ఎయిర్ ఇండియా ఎస్బీఐ సిగ్నేచర్ కార్డ్ వంటి కొన్ని కార్డులకు ఈ నియమాల నుంచి మినహాయింపు ఉంటుంది. -
స్పెషల్ అలవెన్సులు.. పన్ను భారాలు
జీతంలో కొంత భాగాన్ని స్పెషల్ అలవెన్స్ రూపంలో ఇస్తారు. ఉద్యోగస్తులు వాళ్ల సీటీసీ అంటే ’కాస్ట్ టు ది కంపెనీ’లో ’టేక్ హోమ్ పే’ ఎక్కువగా ఉండాలని ఆశిస్తారు. బేసిక్ పే కాకుండా అదనంగా ఇచ్చే జీతాన్ని స్పెషల్ అలవెన్స్ అంటారు. ఇవి కాకుండా ఇంటద్దె అలవెన్స్, లీవ్ ట్రావెల్ అలవెన్స్ మొదలైన వాటిని కేవలం ఆయా పేర్లలో పేర్కొన్న వాటికి మాత్రమే ఖర్చు పెట్టాలి.ఇవి కాకుండా ఎన్నో స్పెషల్ అలవెన్సులు ఉన్నాయి. స్వభావరీత్యా నిర్దేశించినవి తప్ప అన్ని అలవెన్సులు పన్నుకి గురవుతాయి. ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీల నిమిత్తం వీటిని తీసుకోవచ్చు.. తీసుకోకపోవచ్చు. కొన్ని పనితీరును బట్టి ఉంటాయి. కొన్ని పని పరిస్థితులను బట్టి ఉంటాయి. 1961వ చట్టంలో ఉన్న అన్ని అలవెన్సులను 2025 చట్టంలో పొందుపరిచారు. చాలా సులభంగా అర్థం అయ్యేలాగా, ఒక పట్టిక రూపంలో పొందుపరిచారు. ఇవి మూడు రకాలు..మినహాయింపు లేని అలవెన్సులు డీఏ, సీసీఏ, పెర్ఫార్మెన్స్ అలవెన్స్, అటెండెంట్ అలవెన్స్, ప్రాజెక్ట్ అలవెన్స్ మొదలైన వాటిమీద ఎటువంటి మినహాయింపు లేదు. ఇవన్నీ జీతంలో భాగమే. పన్నుకి గురవుతాయి. కొన్ని అలవెన్సులకి షరతులకు లోబడి మినహాయింపులు ఉంటాయి. అవేంటంటే హెచ్ఆర్ఏ, ఎల్టీఏ, స్టాండర్డ్ డిడక్షన్అలవెన్స్ ఖర్చు పెట్టినంత వరకే మినహాయింపు. ఈ తరహా అలవెన్సులను మీరు ఖర్చు పెట్టినంత వరకే మినహాయింపునిస్తారు. ఖర్చు పెట్టని మొత్తాన్ని ఆదాయంగా భావిస్తారు. ఉదాహరణకు కన్వేయన్స్ అలవెన్స్, డైలీ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్, హెల్పర్ అలవెన్స్, రీసెర్చ్ అలవెన్స్, యూనిఫాం అలవెన్స్.. వీటి అన్నింటికి ఖర్చులు పెట్టాలి. ఓచర్లు ఇవ్వాలి.పాత పద్ధతి – కొత్త పద్ధతి.. కొత్త పన్ను విధానంలో బేసిక్ లిమిట్ అధికం. ఎక్కువ శ్లాబ్లు, తక్కువ పన్ను రేట్లు, అందువల్ల అలవెన్స్లకు మినహాయింపు ఇవ్వడం లేదు. ఈ కింది అలవెన్సులను మినహాయించరు.ఇంటద్దె అలవెన్సు, లీవ్ ట్రావెల్ అలవెన్సు, పిల్లల విద్య అలవెన్సు, పిల్లల హాస్టల్ అలవెన్సు, ట్రాన్స్పోర్ట్ అలవెన్సు (దివ్యాంగులకు కాదు), హెల్పర్, యూనిఫాం అలవెన్సు, ఇంటర్నెట్ అలవెన్సు, ఎంటర్టైన్మెంట్ అలవెన్సు. ఇవన్నీ కాకుండా ఇప్పటి 80సి కింద ఇస్తున్న.. పీఎఫ్, ఎన్నెస్సీలు, జీవిత బీమా, పిల్లల చదువు ఫీజులు.. మొదలైన వాటికి కూడా ఇవ్వరు. ఎన్పీఎస్ చెల్లింపులు, అగ్నివీర్ కార్పస్ ఫండ్ చెల్లింపులు.. ఈ రెండు మినహాయింపులు ఇస్తారు. కొత్త విధానంలో మినహాయింపులు వచ్చేవి కొన్ని..స్టాండర్డ్ డిడక్షన్ రూ. 75,000. కన్వేయన్స్ అలవెన్స్ / డైలీ / ట్రాన్స్పోర్ట్ అలవెన్సు. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ అలవెన్సు. వృత్తి పన్ను. ఫ్యామిలీ పెన్షను .. రూ. 25,000 వరకు. స్థలాభావం వల్ల అన్ని షరతులు ఇక్కడ పొందుపరచలేదు. చట్టంలోనూ, రూల్స్లోను వివరంగా దొరుకుతాయి.. లేదా ఉంది కదా.. గూగుల్ తల్లి.. సంప్రదించండి. 1961 చట్టంతో పోల్చి కొత్త చట్టాన్ని విశదీకరిస్తే వచ్చిన మార్పులు.ఎంటర్టైన్మెంట్ అలవెన్సుకి మినహాయింపు లేదుప్రత్యేక సామర్థ్యం ఉన్న ఉద్యోగస్తులకు ఇచ్చే అలవెన్సులకు మినహాయింపులు కొనసాగుతాయి. ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఇచ్చే అలవెన్సులకు మినహాయింపు ఉంది.ఫెనాన్షియల్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ అని ఉండవు. ఇకనుంచి ఒకే పదం ’ట్యాక్స్ సంవత్సరం’.రాబోయే ప్రక్రియలన్నీ డిజిటల్ ప్రపంచంలోనే ఉంటాయి. అరకొర సిబ్బందికి ఏఐ బ్రహ్మాస్త్రంలాగా దొరికింది. అంతా డిజిటల్ రికార్డులు, డిజిటల్ పరిష్కారాలు, టెక్నాలజీమయం. కాబట్టి, మనకు డిజిటల్ అక్షరాస్యత కావాలి. డిజిటల్ సామర్థ్యాలు.. నైపుణ్యాలు సంపాదించాలి. సర్వసన్నద్ధంగా ముందుకెళ్లాలి. -
మహిళలకు ప్యాసివ్ పెట్టుబడుల దన్ను
దేశీయంగా పర్సనల్ ఫైనాన్స్ వ్యవహారాల్లో నెమ్మదిగానే అయినా, గమనించతగ్గ మార్పులే జరుగుతున్నాయి. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. డేటా ప్రకారం గత ఐదేళ్లలో కుటుంబాల ఆర్థిక ప్రణాళికల్లో మహిళల పాత్ర గణనీయంగా పెరిగింది. ప్రతి నలుగురు ఫండ్ మదుపరులలో ఒకరు మహిళే ఉంటున్నారు. ఇది పెట్టుబడుల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుండటాన్నే కాకుండా, వివిధ అసెట్స్, స్కీముల విషయంలో మారుతున్న వారి దృక్పథాన్ని కూడా తెలియజేస్తోంది.పెట్టుబడుల విషయంలో మహిళలు సాధారణంగా చాలా జాగ్రత్తగా, క్రమశిక్షణతో వ్యవహరిస్తారు. లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుంటారు. మార్కెట్ పరిస్థితులను అర్థం చేసుకుని, తమ లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యాలకు తగ్గ అవకాశాలు పరిశీలిస్తారు. అవసరమైతే నమ్మకమైన ఆర్థిక సలహాదారులను కూడా సంప్రదిస్తారు. ఈ నేపథ్యంలో మహిళలకు ప్యాసివ్ ఇన్వెస్టింగ్, అంటే ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్లలో పెట్టుబడులు పెట్టడం ఒక సులభతరమైన, సరైన ప్రారంభంగా నిలుస్తోంది. తక్కువ ఖర్చుతో, స్పష్టమైన నియమాల ఆధారంగా ఉండే ప్యాసివ్ ఇన్వెస్టింగ్ అనేది కోర్ పోర్ట్ఫోలియోను తీర్చిదిద్దుకోవడంతో పాటునిర్దిష్ట రంగాలు లేదా థీమ్లలో విస్తృతంగాఇన్వెస్ట్ చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అందుకే వీటిపై ఆసక్తి పెరుగుతోంది. తాజా యాంఫీగణాంకాల ప్రకారం, ప్రస్తుతం ప్యాసివ్ ఫండ్ల నిర్వహణలో దాదాపు రూ. 15 లక్షల కోట్ల ఆస్తులు ఉండటం ఇందుకు నిదర్శనం. ఇందులోరంగాలవారీ ఇండెక్స్లు, గోల్డ్, సిల్వర్లాంటి కమోడిటీ ఇండెక్స్లు, వేల్యూ .. క్వాలిటీ థీమ్ ఆధారిత ఫండ్స్లో కూడా పెట్టుబడులు పెరుగుతున్నాయి. ప్రణాళికాబద్ధంగా..డిజిటల్ మౌలిక సదుపాయాల పురోగతితో మహిళలకు పెట్టుబడి సాధనాలు మరింత అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా వివిధ సాధనాలవ్యాప్తంగా ఇన్వెస్ట్ చేయగలిగే సామర్థ్యాలు వచ్చినప్పుడే సిసలైన సాధికారత లభించినట్లవుతుంది. విదేశీ పర్యటన కోసం లేదా ఉన్నత విద్య కోసం నిధులను సమకూర్చుకోవడం, కొత్త వాహనం కొనుగోలు చేయడం, పిల్లల చదువులు, ఆరోగ్యం, రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత.. ఇలా అనేక లక్ష్యాలు ఉండొచ్చు. ఇలాంటివాటిని సాకారం చేసుకునేందుకు వివిధ ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్ల్లాంటి ప్యాసివ్ ఫండ్స్ ఆకర్షణీయంగా ఉంటున్నాయి. బ్లూచిప్, లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే నిఫ్టీ 100 లేదా నిఫ్టీ 50 ఇండెక్స్ను అనుసరించే ఈక్విటీ ఇండెక్స్ ఫండ్ లేదా ఈటీఎఫ్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పెట్టుబడుల ప్రస్థానాన్ని ప్రారంభించవచ్చు. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు ఇది బలమైన పునాదిగా కూడా నిలుస్తుంది. అలాగే, మరింత మెరుగైన ఫలితాల కోసం ఫ్యాక్టర్ ఆధారిత ప్యాసివ్ ఫండ్స్ను పరిశీలించవచ్చు. వేల్యూ, క్వాలిటీ, లో వోలటాలిటీ లేదా మొమెంటంలాంటి లక్షణాల ఆధారంగా ఇవి ఉంటాయి. తరతరాలుగా భారత మహిళలకు పసిడి, వెండితో ఎనలేని అనుబంధం ఉంటోంది.ఈ నేపథ్యంలో గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్లు లేదా ఫండ్ ఆఫ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పెట్టుబడుల పోర్ట్ఫోలియోలో వీటికి కూడా చోటు కల్పించవచ్చు. సరైన స్థాయిలో కేటాయిస్తే, అనిశ్చితుల్లో ఈక్విటీలు నెమ్మదించినా, పోర్ట్ఫోలియోపై తీవ్ర ప్రభావం పడకుండా హెడ్జింగ్ సాధనంగా కూడా ఇవి రక్షణ కలి్పస్తాయి. ఇండెక్స్ ఫండ్లలో బాండ్స్లాంటి స్థిరాదాయాన్ని ఇచ్చే సాధనాలకు సంబంధించిన ఫండ్స్ కూడా ఉన్నాయి. వీటిలో కొన్ని, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ మెచ్యూరిటీలాగా, ముందుగా నిర్ణయించిన మెచ్యూరిటీ తేదీతో ఉంటాయి. ఇలాంటివి సమీప భవిష్యత్తులో నిర్దిష్ట ఆరి్థక లక్ష్యాలను చేరుకోవడానికి ఉపయోగపడతాయి.సిప్ శ్రేయస్కరం..ఇక సిప్ విధానం ద్వారా ప్యాసివ్ ఫండ్స్లో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయడం శ్రేయస్కరం. దీనితో పెట్టుబడుల విషయంలో క్రమశిక్షణ పెరుగుతుంది. అలాగే, రూపీ కాస్ట్ యావరేజింగ్ ప్రయోజనం కూడా లభిస్తుంది. ఇండెక్స్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్లలో సిప్ మార్గంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా క్రమంగా పెట్టుబడిని పెంచుకోవచ్చు. మార్కెట్ టైమింగ్ గురించి ఆందోళన చెందనక్కర్లేదు. రోజువారీ వార్తల ప్రభావంతో పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితీ ఉండదు.చివరిగా చెప్పేదేమిటంటే దేశీయంగా మహిళలు గతంలో ఎన్నడూ లేనంత స్థాయి లో సంపదను నిర్వహిస్తున్నారు. వారిలో ఖర్చులపై అవగాహన పెరిగింది. దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వంపై ఫోకస్ పెరిగింది. వారి పెట్టుబడులు ఇప్పుడు మరింత ప్రణాళికాబద్ధంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండెక్స్ ఫండ్స్ అనేవి మహిళా ఇన్వెస్టర్లు తమ సామర్థ్యాలను, తెలివైన పెట్టుబడి నిర్ణయాలుగా మార్చుకునేందుకు ఒక చక్కని, సరళమైన అవకాశాన్ని కల్పిస్తాయి. మారే లక్ష్యాలు, పెరిగే బాధ్యతలకు అనుగుణంగా పెట్టుబడులను మల్చుకునేందుకు పునాదిగా నిలుస్తాయి. -
ఎఫ్డీ కన్నా బెటర్ గురూ..
ఈ ఏడాది ఆరంభం నుంచి ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లన్నింటిదీ ఒడిదుడుకుల దారే. మన మార్కెట్లదీ అదే తీరు. నిన్న మొన్నటి వరకూ ట్రంప్ టారిఫ్లు రోజుకో టర్న్ తీసుకుంటూ ఇన్వెస్టర్లను స్థిమితంగా ఉండనివ్వలేదు. ఇపుడేమో పశ్చిమాసియా సంక్షోభం దావానలంలా చుట్టేస్తోంది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా ఆరంభించిన యుద్ధం ఎప్పటికి ముగుస్తుందో ఇంకా స్పష్టత లేదు. దీంతో రోజురోజుకూ చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఈ ప్రభావం స్టాక్ మార్కెట్లపై కూడా తీవ్రంగానే ఉంటోంది. గరిష్ఠ స్థాయిల నుంచి చూస్తే మన మార్కెట్లు ఇప్పటికే దాదాపు 10 శాతం పతనమయ్యాయి. ఇది ఎక్కడ ఆగుతుందో తెలియదు. మరి ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్న మదుపరులు ఇపుడేం చేయాలి? సాధారణంగా అయితే ఇలాంటి సందర్భాల్లో మార్కెట్లు కాస్త కిందికి వచ్చాక కొద్దికొద్దిగా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లటమే మంచిదని నిపుణులు చెబుతారు. మరి అలా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న మొత్తాన్ని ఎక్కడుంచాలి? సేవింగ్స్ ఖాతాల్లో అయితే వడ్డీ ఏమీ రాదు. ఎఫ్డీల్లో అయితే బ్రేక్ చేస్తే వచ్చేది తక్కువ. ఇక మ్యూచ్వల్ ఫండ్స్లో అయితే స్వల్ప కాలానికి పెద్దగా రాబడులేమీ రావు. దీనికి నిపుణులు చెబుతున్న సమాధానమే ఓవర్నైట్, లిక్విడ్ మ్యూచ్వల్ ఫండ్లు. వార్షికంగా 6–7 శాతం రాబడినిస్తూ... తక్కువ ఛార్జీలతో ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బు వెనక్కి తీసుకోగలిగే అవకాశం ఉండటమే వీటి ప్రత్యేకత. స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయటానికి వేచి చూసే వారే కాదు... స్వల్ప కాలానికి తమ డబ్బుల్ని ఎక్కడైనా ఉంచాలనుకునే వారందరికీ ఇవి అత్యుత్తమ పెట్టుబడి సాధనాలని చెప్పొచ్చు. ఎందుకంటే ఇవి డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి కనక వీటిలో రిస్కూ తక్కువే.ఓవర్నైట్.. లిక్విడ్ ఫండ్స్.. ఈ రెండూ భిన్నమైన ఫండ్స్. ఓవర్నైట్ ఫండ్స్ కేవలం ఒక్క రోజు మెచ్యూరిటీ ఉండే డెట్ సాధనాల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాయి. ఆ విధంగా మ్యూచువల్ ఫండ్స్లో అత్యంత సురక్షితమైన కేటగిరీల్లో ఇది కూడా ఒకటిగా నిలుస్తుంది. ప్రధాన ప్రత్యేకతలేమిటంటే... వడ్డీ రేట్ల మార్పులపరంగా చాలా తక్కువ రిసు్క. అత్యధిక లిక్విడిటీ ఉంటుంది. కొద్ది రోజుల నుంచి కొన్ని వారాల వ్యవధి వరకు ఇన్వెస్ట్ చేసేందుకు ఇవి అనువుగా ఉంటాయి. ఇవి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పరిధిలో ఉంటాయి. ఇక లిక్విడ్ ఫండ్స్ని తీసుకుంటే ఇవి 91 రోజుల వరకు మెచ్యూరిటీలు ఉండే డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఓవర్నైట్ ఫండ్స్తో పోలిస్తే కాస్తంత ఎక్కువ రాబడులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే లిక్విడిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. కొద్దివారాల నుంచి కొద్ది నెలల వ్యవధి వరకు షార్ట్ టర్మ్ పెట్టుబడులకు ఇవి అనువైనవి.రాబడి ఇలా.. సాధారణంగా వడ్డీ రేట్ల సైకిల్ను బట్టి రాబడులు మారుతుంటాయి. ఓవర్నైట్ ఫండ్స్ విషయం తీసుకుంటే వార్షికంగా సుమారు 5– 6 శాతం రాబడినిస్తాయి. అదే లిక్విడ్ ఫండ్స్ అయితే సుమారు 6–7 శాతం స్థాయిలో ఉంటుంది. అయితే కచి్చతంగా ఇంత రాబడులే వస్తాయని లేదు కానీ, స్వల్పకాలిక వడ్డీ రేట్లను బట్టి ఇవి ఉంటాయి. ఎవరికి అనువైనవి స్టాక్ మార్కెట్లలో మదుపు చేసేందుకు సన్నద్ధమవుతున్నవారు, ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందు తమ దగ్గర ఉన్న నగదును ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే, స్వల్పకాలికంగా, కొద్ది నెలల వ్యవధిలో అవసరం పడే మిగులు డబ్బును కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎమర్జెన్సీ ఫండ్గా ఉపయోగించుకోదల్చుకునే నిధులను కూడా కొందరు ఇన్వెస్టర్లు, లిక్విడ్ ఫండ్స్లో ఉంచుతారు.ఇందులోనూ రిసు్కలు ఉంటాయి.. ఈ తరహా పెట్టుబడుల్లో రిస్కులు తక్కువగా ఉంటాయే తప్ప పూర్తి రిస్క్– ఫ్రీగా మాత్రం ఉండవు. వీటిల్లో ప్రధానంగా పొంచి ఉండే రిసు్కలను చూస్తే.. వడ్డీ రేట్లలో మార్పులు: స్వల్పకాలిక వడ్డీ రేట్లు బట్టి రాబడులు హెచ్చుతగ్గులకు లోను కావచ్చు. క్రెడిట్ రిస్కు (లిక్విండ్ ఫండ్స్లో): కొన్ని లిక్విడ్ ఫండ్స్, కార్పొరేట్ డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఇలాంటి వాటిలో పరిమిత స్థాయిలో క్రెడిట్ రిస్కు ఉంటుంది. ట్యాక్సేషన్: పన్నులపరంగా చూస్తే ఇన్వెస్టర్ ఆదాయ శ్లాబ్ని బట్టి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వర్తిస్తుంది.ఏం చేయొచ్చంటే.. ఇలాంటి ఫండ్స్లో పెట్టుబడులు పెట్టేందుకు నిపుణులు మూడు సింపుల్ రూల్స్ సూచిస్తున్నారు. అవేంటంటే.. ⇒ రెగ్యులర్ ప్లాన్లు కాకుండా డైరెక్ట్ ప్లాన్లు తీసుకుంటే చార్జీల మోత తగ్గుతుంది. ⇒ ఇన్వెస్ట్ చేయడానికి ముందే వ్యయ నిష్పత్తిని చూసుకోవాలి. ⇒ మాటిమాటికీ ఎంట్రీ, ఎగ్జిట్ చేయకుండా ఉంటే ఎగ్జిట్ లోడ్ భారాలు తగ్గుతాయి. ⇒ అత్యంత నాణ్యమైన పోర్ట్ఫోలియో ఉండే ఫండ్స్ని ఎంచుకోవాలి. ⇒ ఇంకా ఎక్కువ ఈల్డ్పై అత్యాశతో నాసిరకం ఫండ్స్ని ఎంచుకోకూడదు. ⇒ స్వల్పకాలిక అవసరాల కోసమే ఈ సాధనాన్ని ఉపయోగించుకోవాలి. ⇒ దీర్ఘకాలిక పెట్టుబడి సాధనాలుగా పరిగణించకూడదు.ఖర్చులూ చూసుకోవాలి .. సాధారణంగా ఓవర్నైట్, లిక్విడ్ ఫండ్స్ అనేవి చౌకైన పెట్టుబడి సాధనాలే అయినప్పటికీ, కొన్ని చార్జీలు ఉంటాయని ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాలి. అవేంటంటే.. వ్యయ నిష్పత్తి: స్కీమును నిర్వహించేందుకు ఫండ్ హౌస్ వార్షికంగా విధించే ఫీజును ఎక్స్పెన్స్ రేషియోగా వ్యవహరిస్తారు. ఓవర్నైట్ ఫండ్స్లో ఇది ఏడాదికి 0.6 నుంచి 0.25 శాతం శ్రేణిలో, లిక్విడ్ ఫండ్స్లో 0.8 నుంచి 0.40 శాతంగా శ్రేణిలోను ఉంటుంది. ఈ ఫీజును ఆటోమేటిక్గా ఫండ్ రిటర్నుల్లో నుంచి డిడక్ట్ చేస్తారు కనక ఇన్వెస్టర్లు విడిగా చెల్లించనక్కర్లేదు.ఈ చార్జీలు సెబీ పరిధిలో ఉంటాయి. ఉదాహరణకు రూ. 10 లక్షలను 0.30 శాతం ఎక్స్పెన్స్ రేషియో ఉన్న లిక్విడ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే వార్షికంగా సుమారు రూ. 3,000 చార్జీ వర్తిస్తుంది. అయితే మనం ఎన్ని రోజులు ఆ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ను ఉంచితే అన్ని రోజులకే చార్జీలు వర్తిస్తాయి. ఎగ్జిట్ లోడ్: పెట్టుబడులను సత్వరం రిడీమ్ చేసుకుని, వైదొలిగితే కొన్ని ఫండ్లు కొంత ఎగ్జిట్ లోడ్ని వసూలు చేస్తాయి. లిక్విడ్ ఫండ్స్ విషయాన్ని చూస్తే, మొదటి రోజు రిడీమ్ చేసుకుంటే సుమారు 0.007 శాతం, రెండో రోజైతే 0.0065 శాతం.. అలా 7 రోజుల తర్వాత జీరో స్థాయికి లోడ్ తగ్గుతుంది. చాలా మటుకు ఓవర్నైట్ ఫండ్స్లో సాధారణంగా ఎగ్జిట్ లోడ్ ఉండదు. బ్రోకరేజ్ లేదా లావాదేవీ ఫీజులు: కొన్ని ప్లాట్ఫాంలు లేదా డి్రస్టిబ్యూటర్ల ద్వారా ఫండ్స్ తీసుకుంటే కొంత ట్రాన్సాక్షన్ చార్జీలు వర్తించవచ్చు. అయితే, ప్రస్తుతం చాలా మటుకు ఆన్లైన్ ప్లాట్ఫాంలు ఇలాంటి ఫీజుల బాదరబందీ లేకుండా డైరెక్ట్ ప్లాన్లను ఆఫర్ చేస్తున్నాయి. ట్యాక్సేషన్: ఈ ఫండ్స్ నుంచి రాబడులపై పన్నులు వర్తిస్తాయి. ఇటీవల పన్ను విధానాల్లో మార్పుల అనంతరం, ఇన్వెస్టర్ ఆదాయ పన్ను శ్లాబ్ బట్టి స్వల్పకాలిక క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వర్తిస్తోంది. స్టాక్ మార్కెట్లు ఇటీవలి కాలంలో తీవ్ర హెచ్చుతగ్గులకు, కరెక్షన్లకు లోనవుతున్నాయి. ఇప్పటికే కొంత వరకూ మార్కెట్ల నుంచి ఎగ్జిట్ అయిన వారు, ఇంకా కొంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న వారు ఇప్పటికిప్పుడు ఇన్వెస్ట్ చేసి, బీపీ తెచ్చుకోవడం కంటే డబ్బును సురక్షితంగా ఉంచుకోవటానికి ప్రాధాన్యమిస్తున్నారు. అలా చేస్తే పరిస్థితులు చక్కబడ్డాక మళ్లీ మార్కెట్లో పెట్టుబడులు పెట్టొచ్చని భావిస్తున్నారు. మరి బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలపై 2.5 – 4 శాతం వడ్డీ రేటే ఉంటోంది. అందుకే వీరు ఎంట్రీ, ఎగ్జిట్ రెండూ సులభంగా ఉండే ఓవర్నైట్, లిక్విడ్ ఫండ్స్ను ఆశ్రయించవచ్చు. -
గోల్డ్ లోన్లో.. రిస్కులూ ఉంటాయి!
బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నా... ఊగిసలాట ఇంకా పెరుగుతోంది. నెలన్నర కిందట గరిష్ఠ స్థాయిలకు చేరిన ధర... అప్పటితో పోలిస్తే ప్రస్తుతం 7–8 శాతం వరకూ పతనమైంది. క్రయవిక్రయాలైతే ఈ కదలికలకు అనుగుణంగా చేయొచ్చు. ధర పడుతుంటే కొంత వేచిచూడటం.. తక్కువ స్థాయిల్లో కొనటం వంటివి చేయొచ్చు. మరి రుణాలు తీసుకునేవారి సంగతేంటి? ఎందుకంటే ఆర్థిక అనిశ్చితుల్లో ఎంతో మందికి బంగారమనేది విశ్వసనీయ సాధనం. పెట్టుబడులకే కాకుండా అత్యవసర సాధనంగా, అత్యవసర నిధిగా ఇది ఎన్నో కుటుంబాలను ఆదుకుంటోంది.వాస్తవానికి బంగారంపై రుణం చాలా ఈజీ. గంటలోపే డబ్బుతో ఇంటికెళ్లిపోవచ్చు. బహుశా... అందుకేనేమో!. 2026 మార్చి నాటికి సంఘటిత రంగంలో బంగారం రుణాలు ఏకంగా 15 లక్షల కోట్లకు చేరుకున్నట్లు అంచనా. ధరలు బాగా పెరగటంతో రుణ మొత్తం కూడా ఎక్కువే దొరుకుతోంది. దీంతో చాలామంది రుణాలను ఆశ్రయిస్తున్నారు. అయితే బంగారం ధరలు ఇక్కడి నుంచి మరింతగా పెరుగుతాయని.... దిద్దుబాటుకు గురవుతాయని భిన్న విశ్లేషణలున్నాయి. ఈ పరిస్థితుల్లో పసిడిపై రుణాలు తీసుకునే వారు అందులోని రిస్్కలనూ తెలుసుకోవాలి. ధరల ఊగిసలాట వల్ల రుణ గ్రహీతలు కొన్ని సవాళ్లనూ ఎదుర్కోవాల్సి రావచ్చు. అవేంటో వివరించేదే ఈ ‘వెల్త్’ స్టోరీ... రుణ పరిమితులు.. ⇒ బంగారం విలువలో రుణం ఎంత ఇవ్వాలన్న దానికి ఒక పరిమితి ఉంది. దీన్నే లోన్ టు వ్యాల్యూ నిష్పత్తి (ఎల్టీవీ)గా చెబుతుంటారు. ⇒ ఎల్టీవీకి సంబంధించి ఆర్బీఐ మూడు రకాల శ్లాబులను తీసుకొచ్చింది. ⇒ బంగారం విలువ 2.5 లక్షల వరకు ఉంటే... అందులో 85 శాతం వరకూ రుణంగా ఇవ్వొచ్చు. ⇒ అదే బంగారం విలువ రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య ఉంటే 80 శాతం ఎల్టీవీ అమలవుతుంది. ⇒ కుదువ పెట్టే బంగారం విలువ రూ.5 లక్షలు కంటే మించితే అప్పుడు ఎల్టీవీ 75 శాతం మించకూడదు. అంటే... తక్కువ రుణం తీసుకునేటపుడు మీ బంగారం ధరలో ఎక్కువ మొత్తం మీకు రుణంగా దొరుకుతుంది. రుణం పెరుగుతున్న కొద్దీ ఈ మొత్తం తగ్గుతుంది. ఉదాహరణకు రూ.3 లక్షల విలువైన బంగారాన్ని కుదువ పెడితే ప్రతి లక్షకు గరిష్టంగా రూ.75,000 నుంచి రూ.85,000 వరకు రుణంగా పొందవచ్చు. ఉన్నట్టుండి ధరలు పతనమైతే..? ⇒ ఇతర రుణాలకు, బంగారంపై రుణానికీ మధ్య స్పష్టమైన లక్ష్మణ రేఖ ఉంటుంది. అదే బంగారం ధరలు. ⇒ వ్యక్తిగత రుణం తీసుకుంటే కాల వ్యవధి ముగిసే వరకు ప్రతి నెలా నిరీ్ణత మొత్తం చెల్లిస్తూ వెళితే సరిపోతుంది. ⇒ బంగారంపై రుణం అలా కాదు. రుణం తీసుకున్న తర్వాత బంగారం ధరలు పతనమైతే.. అప్పుడు తనఖాలోని మొత్తం బంగారం విలువ పడిపోతుంది. ఆర్బీఐ విధించిన ఎల్టీవీ పరిమితిని రుణం మించిపోతుంది. అంత మేర రుణ గ్రహీత అదనపు బంగారాన్ని తనఖా పెట్టాల్సిందే. ⇒ లేదంటే ఎల్టీవీలో ఎంత తగ్గిందో ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించినా సరిపోతుంది. ⇒ ఈ రెండూ చేయలేకపోతే రుణం ఇచి్చన సంస్థ తనఖాలోని బంగారాన్ని వేలం వేస్తుంది. ⇒ రుణ ఈఎంఐలు లేదా వడ్డీ చెల్లించని సందర్భాల్లోనూ నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేసి, బంగారాన్ని వేలం వేస్తారు. బంగారం వేలానికి గురైతే.. ఇక ఆ ఆభరణాలను తిరిగి పొందలేరు. దాంతో ఉన్న అనుబంధం ముగిసిపోతుంది. ⇒ ధరలు తగ్గిపోవడం వల్ల విలువ పతనమై.. చెల్లించలేని పరిస్థితుల్లో కుదువ పెట్టిన బంగారాన్ని వేలంలో తక్కువకు విక్రయించే రిస్్కనూ గమనించాలి. దీనివల్ల మరింత నష్టం ఏర్పడుతుంది. ⇒ వేలం వేయగా వచ్చిన మొత్తం నుంచి బకాయిలను మినహాయించి మిగిలినది రుణ గ్రహీతకు వెనక్కిచ్చేస్తారు. బకాయిల చెల్లింపులు కూడా చాలకపోతే అప్పుడు మిగిలిన మొత్తాన్ని వసూలు చేసుకునేందుకు చట్టప్రకారం చర్యలు చేపడతారు. ⇒ వేలానికి ముందు రుణ గ్రహీతకు తప్పకుండా నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. వేలం చివరి నిమిషం వరకు బకాయిలు చెల్లించేందుకు అనుమతి ఉంటుంది. ⇒ కొన్ని సందర్భాల్లో బంగారం విలువ మదింపులో తప్పులకు అవకాశం లేకపోలేదు. గోల్డ్ అప్రైజర్ బంగారం విలువను పొరపాటున అధికంగా నిర్ణయించి, ఆ మేరకు అధిక రుణం మంజూరు చేసినట్లు తర్వాత ఆడిట్లో గుర్తించినట్టయితే.. అదనపు మొత్తాన్ని జమ చేయాలని బ్యాంక్/ఎన్బీఎఫ్సీ కోరుతుంది. వడ్డీ రేట్లు – చార్జీలు⇒ బంగారంపై రుణ రేట్లు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో తక్కువ. వీటికంటే ప్రైవేటు బ్యాంకుల్లో కొంత అధికంగా ఉంటాయి. ఇక బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు మరింత అధిక రేట్లపై రుణాలు ఇస్తుంటాయి. ⇒ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో అయితే 8– 10.5 శాతం మధ్య... ప్రైవేటు బ్యాంకుల్లో 9–18 శాతం మధ్య, ఎన్బీఎఫ్సీల్లో 10.75–27 శాతం మధ్య రుణ రేట్లు ఉన్నాయి. ⇒ ఎన్బీఎఫ్సీలు కొంత అధికంగా వడ్డీ వసూలు చేసినప్పటికీ.. పలు రకాల ఆకర్షణీయ పథకాలతో రుణ గ్రహీతలను ఆకట్టుకుంటాయి. తక్కువ ఎల్టీవీపై తక్కువ రేటు, అధిక రేటుపై గరిష్ట పరిమితి మేరకు రుణాన్ని మంజూరు చేస్తాయి. బ్యాంక్లు– ఎన్బీఎఫ్సీల మధ్య పోటీ పెరిగిపోవడంతో.. రుణ గ్రహీతలకు ఎన్నో రకాల పథకాలు అందుబాటులోకి వస్తున్నాయి. ⇒ బంగారం రుణాలపై ప్రాసెసింగ్ చార్జీ, గోల్డ్ అప్రైజర్ చార్జీలు, డాక్యుమెంటేషన్ చార్జీలను బ్యాంక్లు వసూలు చేస్తుంటాయి. ⇒ సకాలంలో రుణాన్ని చెల్లించలేని సందర్భాల్లో అదనపు చార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఇవి 2 శాతం వరకు ఉంటాయి. ముఖ్యంగా పెనాల్టీ చార్జీ పేరుతో అసలు, వడ్డీ మొత్తంపై ప్రతి నెలా 0.5 శాతం చొప్పున కలుపుతూ వెళతారు. ⇒ అరుదుగా తనఖా పెట్టే బంగారం విషయంలో మోసాలకు అవకాశం లేకపోలేదు. తనఖాలోని ఆభరణాలు దుర్వినియోగానికి గురయ్యే రిస్క్ ఉంటుంది. ⇒ బంగారం వేలం వేసే పరిస్థితి ఏర్పడితే అందుకయ్యే ఖర్చలనూ బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలు తీసుకుంటాయి. బంగారం విలువ మదింపు ఎలా..?‘లోయర్ ఆఫ్ టూ’ నిబంధన తెలియాలి: రుణం ఇచ్చే సంస్థ ఆ రోజు మార్కెట్ ధరను ఆధారం చేసుకోదు. క్రితం రోజు ముగింపు ధర? గత 30 రోజుల్లో సగటు ధర ఈ రెండింటిలో తక్కువ ధరను పరిగణనలోకి తీసుకుంటారు. ధరలు ఉన్నట్టుండి పెరిగిపోతే వాటి ఆధారంగా రుణం మంజూరు చేయకుండా ఈ సూత్రాన్ని అనుసరిస్తారు. బంగారానికే విలువ: బంగారం ఆభరణాల్లో నికర బంగారం ఎంతన్న దానిపైనే ఎల్టీవీని నిర్ణయిస్తారు.ఆభరణాల్లో రాళ్లు, ఇతరత్రా ఉంటే వాటి బరువును ఉజ్జాయింపుగా మినహాయిస్తారు. ఉదాహరణకు 50 గ్రాముల ఆభరణాలు తీసుకెళ్లినప్పుడు అందులో రాళ్లు, పూసలు వంటివి ఉంటే 5–10 గ్రాముల వరకు బరువు తగ్గిపోతుంది. పైగా బంగారం ఆభరణాల స్వచ్ఛతను కూడా అంచనా వేస్తారు. 24, 22, 18 క్యారట్ లేదా అసలు ప్యూరిటీ ఎంతుందని చూస్తారు. ఆ తర్వాతే బంగారం నికర విలువను ఖరారు చేస్తారు.ఇలా చేస్తే బెటర్..⇒ బంగారంపై గరిష్ట పరిమితి మేరకు రుణాన్ని తీసుకోకపోవడమే మంచిది. తనఖా పెట్టే రోజున ఉన్న విలువలో రుణం 60 శాతం మించకుండా చూసుకోవాలి. దీనివల్ల ధరలు కొంత పడిపోయినప్పటికీ నిశ్చింతంగా ఉండొచ్చు. అదనపు బంగారం లేదా డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఏర్పడదు. బంగారం ధరలు పెరగడం వల్ల తనఖా బంగారంపై అధిక రుణ మొత్తాన్ని పొందొచ్చు. కానీ, ధరలు పతనం అవుతున్నప్పుడు అదనంగా సర్దుబాటు చేయాల్సి రిస్క్ కూడా ఉంటుందని గుర్తుంచుకోవాలి. ⇒ దీర్ఘకాలం కోసం కాకుండా స్వల్పకాల అవసరాల కోసమే బంగారంపై రుణాలను పరిశీలించాలి. రుణం తీసుకున్న తర్వాత నుంచి బంగారం ధరలను గమనిస్తూ ఉండాలి. ⇒ బంగారం విలువ మదింపు, వాటి భద్రత విషయంలో రిస్్కలు వద్దనుకుంటే పేరున్న సంస్థల నుంచి రుణం తీసుకోవడం మంచి నిర్ణయం. ఈ విషయంలో ప్రముఖ బ్యాంక్లు, ప్రముఖ ఎన్బీఎఫ్సీలను పరిశీలించొచ్చు. రుణ కాల వ్యవధులు..⇒ సాధారణంగా 6– 12 నెలల కాలానికి బంగారంపై రుణాలు లభిస్తుంటాయి. కొన్ని బ్యాంక్లు, ముత్తూట్ ఫైనాన్స్ వంటి కొన్ని సంస్థలు అయితే ఏడాదికి మించిన కాలానికీ రుణాలు ఇస్తున్నాయి. ⇒ తక్కువ కాల వ్యవధికి తీసుకున్నప్పటికీ, గడువులోపు ఆ మొత్తాన్ని చెల్లించి, వెంటనే అప్పటి విలువ ప్రకారం మళ్లీ రుణం పొందొచ్చు. -
ATMలలో రూ.10 నోట్లు రానున్నాయా?
డిజిటల్ పేమెంట్ వ్యవస్థ ప్రజల జీవితాన్ని చాలా సులభతరం చేసింది. అయితే అదే సమయంలో చిన్న నోట్ల కొరత ఉన్నట్లుగా అనిపించే పరిస్థితి కూడా ఏర్పడుతోంది. కొన్నిసార్లు రూ.100 లేదా రూ.500 నోటుతో చిన్నపాటి కొనుగోళ్లు చేయాలనుకుంటే, దుకాణదారులు చిల్లర లేదని చెప్పే సందర్భాలు ఎదురవుతున్నాయి. ఎక్కువ మంది ఆన్లైన్ చెల్లింపులు చేయడం వల్ల చిన్న నోట్ల వినియోగం తగ్గింది.ఈ నేపథ్యంలో దేశంలో చిన్న నోట్ల కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మంగళవారం పార్లమెంటులో మాట్లాడుతూ ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి దేశంలో ఇప్పటికే రూ.10, రూ.20, రూ.50 నోట్లు సమృద్ధిగా చలామణిలో ఉన్నాయని తెలిపారు.సాధారణంగా ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరించుకునే సమయంలో ఎక్కువగా రూ.500 నోట్లు, కొన్నిసార్లు రూ.100 లేదా రూ.200 నోట్లు మాత్రమే వస్తున్నాయి. దీంతో చిన్న ఖర్చుల సమయంలో చిల్లర సమస్య ఎదురవుతోంది.ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని కొత్త చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ఉన్న సాంప్రదాయ ఏటీఎంలు చిన్న నోట్లను పంపిణీ చేయడానికి ప్రత్యేకంగా రూపకల్పన చేయలేదని మంత్రి వివరించారు. అయితే ఈ సమస్యకు పరిష్కారంగా పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించినట్లు చెప్పారు.ఈ ప్రాజెక్ట్ కింద ప్రత్యేకంగా “స్మాల్ డినామినేషన్ డిస్పెన్సర్లు” అనే యంత్రాలను పరీక్షిస్తున్నారు. ఈ యంత్రాల ద్వారా ప్రజలు రూ.10, రూ.20, రూ.50 నోట్లను నేరుగా ఏటీఎంల నుంచి ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. దీంతో నగదు తీసుకునేటప్పుడు చిల్లర సమస్య కొంతవరకు తగ్గే అవకాశం ఉంది.చిన్న నోట్ల చలామణి ఎంత?ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి 26 వరకు దేశంలో పెద్ద మొత్తంలో చిన్న నోట్లు చలామణిలో ఉన్నాయి. రూ.10 నోట్లు సుమారు రూ.439.4 కోట్లు, రూ.20 నోట్లు సుమారు రూ. 193.7 కోట్లు, రూ.50 నోట్లు సుమారు రూ.130.3 కోట్లు విలువైనవి ఉన్నాయి. ఇక గత ఆర్థిక సంవత్సరంలో రూ.10 నోట్లు రూ.180 కోట్లు, రూ.20 నోట్లు రూ.150 కోట్లు, రూ.50 నోట్లు రూ.300 కోట్లు విలువైనవి చలామణిలో ఉన్నట్లు వెల్లడించారు. -
ఈఎంఐతో ఐఫోన్.. కనిపించని ఆర్థిక నిజాలు!
ఒకప్పుడు భారతదేశంలో యాపిల్ ఐఫోన్ కొనడం అంటే.. డబ్బున్నవారికి మాత్రమే సాధ్యమయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితి చాలా మారింది. బ్యాంకులు & ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫార్మ్లు ఇచ్చే సులభమైన ఈఎంఐ ఆప్షన్స్ వల్ల చాలా మంది ఖరీదైన స్మార్ట్ఫోన్లను సులభంగా కొనుగోలు చేస్తున్నారు. రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ ధర ఉన్న ఫోన్ను కూడా నెలకు చిన్న చిన్న చెల్లింపులుగా చెల్లిస్తూ కొనడం ఇప్పుడు సాధారణంగా మారింది.ఎలక్ట్రానిక్స్ షాపుల్లోకి వెళ్లినా లేదా ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లు చూసినా ఖరీదైన ఫోన్లు, ముఖ్యంగా ఐఫోన్లకు చాలా డిమాండ్లో ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఈఎంఐ ఆప్షన్ వల్ల ఒకేసారి పెద్ద మొత్తం చెల్లించాల్సిన అవసరం లేకపోవడం వల్ల చాలా మంది దీనిని కొనడానికి సిద్దపడుతున్నారు. ఈఎంఐ సౌకర్యం అనేది మీకు తెలియని ఆర్ధిక భారం మోపుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.నెలవారీ ఖర్చులుఇప్పటికే చాలామంది యువ ఉద్యోగులు కార్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ లేదా క్రెడిట్ కార్డ్ బకాయిల కోసం ఈఎంఐలు చెల్లిస్తున్నారు. అలాంటి పరిస్థితిలో ఫోన్ కోసం మరో ఈఎంఐ తీసుకుంటే వారి నెలవారీ ఖర్చులు పెరిగి ఆర్థిక ఒత్తిడి ఎక్కువవుతుంది. కాబట్టి ఈఎంఐ తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలని ఆర్థిక సలహాదారులు సూచిస్తున్నారు.ఒక వ్యక్తి మొత్తం అప్పులు తన ఆదాయంతో పోలిస్తే ఎంత ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోవాలి. సాధారణంగా మన నెలవారీ ఆదాయంలో 30% కంటే ఎక్కువ భాగం ఈఎంఐలకు వెళ్ళకూడదు. 40% దాటితే అది ప్రమాదకరంగా మారుతుంది. 50% కంటే ఎక్కువైతే అది అప్పుల బారిన పడే పరిస్థితికి దారితీయవచ్చు. అంతే కాకుండా.. ప్రతి వ్యక్తి వద్ద కనీసం ఆరు నెలల ఖర్చులకు సరిపడే ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. ఉద్యోగం కోల్పోయినా లేదా ఇతర సమస్యలు వచ్చినా ఈఎంఐలు చెల్లించడానికి ఇది ఉపయోగపడుతుంది.ఎక్కువ సంపాదిస్తేరూ.1,34,900 ధర ఉన్న ఒక ఐఫోన్ను 12 నెలల నో కాస్ట్ ఈఎంఐతో కొనుగోలు చేస్తే.. ప్రతి నెల సుమారు రూ.11,242 చెల్లించాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి నెలకు రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ సంపాదిస్తే ఈ ఈఎంఐ అతని ఆదాయంలో సుమారు 11% మాత్రమే అవుతుంది. అప్పుడు ఇది కొంతవరకు ఆర్థికంగా సౌకర్యంగా ఉంటుంది. కానీ తక్కువ ఆదాయం ఉన్నవారికి ఇది భారంగా మారే అవకాశం ఉంది.చాలా మంది చేసే పెద్ద తప్పు ఏమిటంటే.. ఈఎంఐ మొత్తం చిన్నదిగా కనిపిస్తే చాలు కొనుగోలు చేస్తున్నారు. కానీ వారు ఒక ముఖ్యమైన విషయం మర్చిపోతున్నారు. ఈఎంఐ చెల్లిచడానికి పెట్టే డబ్బును.. పెట్టుబడిగా పెట్టితే భవిష్యత్తులో ఎక్కువ సంపాదించవచ్చు. కానీ ఫోన్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కాలక్రమేణా విలువ కోల్పోతాయి. ఇంకో విషయం ఏమిటంటే.. ఈఎంఐ కొనుగోళ్లలో ప్రాసెసింగ్ ఫీజులు వంటి అదనపు ఖర్చులు కూడా ఉండే అవకాశం ఉంటుంది.వన్ మంత్ రూల్ఆర్థిక నిపుణులు ఒక సాధారణ నియమాన్ని సూచిస్తున్నారు. దాన్ని వన్ మంత్ రూల్ అంటారు. అంటే మనం కొనబోయే ఫోన్ ధర మన నెల జీతాన్ని మించకూడదు. మరొకటి ట్వైస్ ఓవర్ రూల్. అంటే మన వద్ద ఆ ఫోన్ను రెండు సార్లు కొనగలిగేంత లిక్విడ్ క్యాష్ ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఖరీదైన ఫోన్ కొనవచ్చు.మొత్తం మీద ఈఎంఐతో ఐఫోన్ కొనడం తప్పు కాదు. కానీ అది మన పొదుపులు, పెట్టుబడులు & భవిష్యత్తు ఆర్థిక భద్రతపై ప్రభావం చూపకూడదు. అందుకే ఖరీదైన ఫోన్ కొనుగోలు చేయడానికి ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం అని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: 2026లో అతిపెద్ద ఆర్ధిక సంక్షోభం!.. కియోసాకి హెచ్చరిక -
ఎన్పీఎస్ నుంచి విత్డ్రా ఇలా..
ఆర్థికంగా ఏదైనా అవసరం వస్తే గట్టెక్కేందుకు ఎన్నో మార్గాలు వెతుకుతాం. చివరికి ఏదో ఒక రుణమైనా తీసుకుని బయటపడదామని అనుకుంటాం. కానీ, అధిక వడ్డీ రేట్లపై అప్పులు తెచి్చ, భవిష్యత్తు ఆదాయాన్ని తాకట్టు పెట్టే బదులు.. ఏవైనా పెట్టుబడులుంటే, వాటిని వినియోగించుకోవడం మంచిది. అలాంటి సందర్భాల్లో జాతీయ పింఛను వ్యవస్థ (ఎన్పీఎస్) నుంచి కూడా పెట్టుబడులను వెనక్కి తీసుకోవచ్చు!. కాకపోతే దీన్ని విచక్షణ మేరకు వినియోగించుకోవాలి. ఎంత అవసరం అయినా... భవిష్యత్తు కోసం ఉద్దేశించినది కనుక వివేకంతో వ్యవహరించాలి.ఎలా వెనక్కి తీసుకోవచ్చు?ఆన్లైన్లో అయితే ప్రొటీన్ ఈగోవ్ పోర్టల్కు వెళ్లాలి. పర్మినెంట్ అకౌంట్ నంబర్ (ప్రాన్), పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి. పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గెట్ ఆప్షన్తో రీసెట్ చేసుకోవచ్చు.లాగిన్ అనంతరం ‘విత్డ్రాయల్’ సెక్షన్కు వెళ్లాలి. అందులో ట్రాన్సాక్ట్ ఆన్లైన్ సెక్షన్లో విత్డ్రాయల్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి.విత్డ్రాయల్ రకాన్ని ఎంపిక చేసుకోవాలి. రిటైర్మెంట్ లేదా పాక్షిక ఉపసంహరణ లేదా ముందస్తుగా వైదొలగడంలో ఒకదాన్ని ఎంచుకోవాలి.ఫారమ్లోని వివరాలను పూర్తిచేయాలి. ప్రాన్ను ధ్రువీకరించి, అవసరమైన పత్రాలను అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.ఈ అభ్యర్థన ఆమోదం పొందితే రెండు పనిదినాల్లో సభ్యుడి ఖాతాలో నిబంధనల మేరకు రావాల్సిన మొత్తం జమ అవుతుంది. ఆఫ్లైన్లో దరఖాస్తు సమర్పణకు వీలుగా సీఆర్ఏ వెబ్సైట్ నుంచి పత్రాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. లేదంటే పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ (పీవోపీ) నుంచి కూడా తీసుకోవచ్చు.పత్రంలో పాన్ వివరాలు, వ్యక్తిగత వివరాలు న మోదు చేసి, కేవైసీ డాక్యుమెంట్లు జత చేయాలి.ఈ పత్రాన్ని తీసుకెళ్లి ఏదేనీ పీవోపీలో సమరి్పంచొచ్చు. ఎన్పీఎస్ పీవోపీ మీకు సమీపంలో ఎక్క డ ఉన్నదీ గూగుల్ సెర్చ్ద్వారా తెలుసుకోవచ్చు. స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్, ఎస్బీఐ క్యాప్ సెక్యూరిటీస్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఐడీఎఫ్సీ ఫస్ట్బ్యాంక్ ఇలా పీవోపీలు చాలానే ఉన్నాయి.పాక్షిక ఉపసంహరణఎన్పీఎస్లో టైర్–1 ఖాతా ప్రారంభించిన మూడేళ్ల అనంతరం, మూసివేయాల్సిన అవసరం లేకుండా పాక్షికంగా ఉపసంహరించుకునేందుకు అర్హత లభిస్తుంది.సొంత చందాల మొత్తం... అంటే తాను చెల్లించిన దాని నుంచి 25 శాతాన్ని వెనక్కి తీసుకోవచ్చు. యాజమాన్యం జమ చేసిన మొత్తాన్ని గానీ, పెట్టుబడులపై వృద్ధి రూపంలో పెరిగిన మొత్తాన్ని గానీ పరిగణనలోకి తీసుకోరు.జీవిత కాలంలో నాలుగు పర్యాయాలు ఇలా పాక్షికంగా ఉపసంహరించుకోవచ్చు. కాకపోతే ఒక సారి ఉపసంహరించుకున్నాక మరో నాలుగేళ్ల తరవాత గానీ మళ్లీ ఉపసంహరించుకోలేరు.పిల్లల ఉన్నత విద్య లేదా వివాహ అవసరాల కోసం పాక్షికంగా వెనక్కి తీసుకోవచ్చు.ఇంటి నిర్మాణం లేదా కొనుగోలుకు సైతం తీసుకోవచ్చు. అప్పటికే సొంతంగా ఇల్లు కలిగి ఉండకూడదు.సభ్యులు లేదా సభ్యుడిపై ఆధారపడిన కుటుంబీకులు తీవ్ర అనారోగ్యానికి గురై... వారి చికిత్స కోసం డబ్బు అవసరమైతే పాక్షికంగా విత్డ్రా చేసుకోవచ్చు.ఎన్పీఎస్ ఖాతాపై రుణం తీసుకుని, దాన్ని తీర్చేయాలనుకున్నా కూడా పాక్షిక ఉపసంహరణకు అనుమతిస్తారు.ఈ విషయాలను గమనించాలి..60 ఏళ్ల నాటికి లేదా 15 ఏళ్ల పాటు చందాలు జమ చేసిన తర్వాత మొత్తం నిధి రూ.8లక్షలు మించకుండా ఉంటే అందులో 80 శాతాన్ని ఉపసంహరించుకోవచ్చు. మిగిలిన 20 శాతంతో యాన్యుటీ ప్లాన్ తీసుకోవాలి.ఎన్పీఎస్ సభ్యుడు/సభ్యురాలు మరణించినట్టయితే వారి పేరిట ఉన్న ఫండ్ను నామినీకి బదిలీ చేస్తారు.ఎన్పీఎస్ కింద గరిష్ట వయో పరిమితిని 75 ఏళ్ల నుంచి 85 ఏళ్లకు ఇటీవలే పెంచారు. దీని ప్రకారం సభ్యులు రిటైర్మెంట్ అనంతరం తప్పుకోకుండా.. అప్పటి వరకు సమకూరిన నిధిని ఒకే విడత కాకుండా సిస్టమ్యాటిక్ యూనిట్ రిడెంప్షన్ రూపంలో కావాల్సినంత నెలవారీ తీసుకోవచ్చు.60 ఏళ్లు నిండిన తర్వాత కూడా ఎన్పీఎస్లో కొనసాగే వారు సైతం పాక్షిక ఉపసంహరణ ఎంపిక చేసుకోవచ్చు. అయితే రెండు ఉపసంహరణల మధ్య కనీసం మూడేళ్ల విరామం ఉండాలి.తప్పుకోవడంసభ్యులకు 60 ఏళ్లు నిండగానే నిబంధనల ప్రకారం వారు పూర్తిగా ఈ పథకం నుంచి బయటకు వెళ్లిపోవచ్చు.ఎన్పీఎస్ నిధి అప్పటికి రూ.12 లక్షలకు మించి ఉంటే ఎలాంటి పన్ను చెల్లించకుండా మొత్తం నిధిలో 80 శాతాన్ని ఉపసంహరించుకోవచ్చు. మిగిలిన 20 శాతంతో యాన్యుటీ ప్లాన్ (పింఛను ఇచ్చేది) కొనుగోలు చేయాల్సి ఉంటుంది.ఎన్పీఎస్ నిధి ఒకవేళ రూ.8–12లక్షల్లోపు ఉంటే రూ.6 లక్షలను ఒకే విడత వెనక్కి తీసుకోవచ్చు. మిగిలిన మొత్తంతో యాన్యుటీ ప్లాన్ కొనుగోలు చేయటం... లేదంటే కనీసం ఆరేళ్ల కాలానికి సిస్టమ్యాటిక్ యూనిట్ రిడెంప్షన్ (ప్రతి నెలా నిరీ్ణత మొత్తం) పద్ధతిని, లేదంటే రెండింటి మిశ్రమాన్ని ఎంపిక చేసుకోవచ్చు.ఎన్పీఎస్ ఫండ్ విలువ రూ.8 లక్షల్లోపు ఉంటే 100 శాతాన్ని ఒకే విడత ఉపసంహరించుకోవచ్చు. దీనిపై ఎలాంటి పన్ను ఉండదు.సిస్టమ్యాటిక్ లంప్సమ్ విత్డ్రాయల్ (ఎస్ఎల్డబ్ల్యూ)ను సైతం ఎంపిక చేసుకోవచ్చు. 80 శాతాన్ని ఒకే విడత కాకుండా క్రమానుగతంగా 75 ఏళ్లు వచ్చే వరకు తీసుకునేలా ప్లాన్ చేసుకోవచ్చు.ముందస్తుగా వైదొలగడంఎన్పీఎస్లో 60 ఏళ్లకు ముందుగా కూడా కొన్ని సందర్భాల్లో పూర్తిగా వైదొలిగే అవకాశం ఉంది.ఎన్పీఎస్ ప్రారంభించి కనీసం ఐదేళ్లు పూర్తయి ఉండాలి.ఆ సమయానికి ఉన్న నిధి నుంచి 20 శాతాన్నే ఉపసంహరించుకోగలరు. మిగిలిన 80 శాతంతో యాన్యుటీ ప్లాన్ తీసుకోవాల్సిందే.మొత్తం నిధి రూ.5 లక్షలు లేదా అంత కంటే తక్కువే ఉన్న సందర్భాల్లో నూరు శాతం వెనక్కి తీసుకుని గుడ్బై కొట్టేయొచ్చు.టైర్–2 అకౌంట్ నుంచి ఉపసంహరణఈ ఖాతాలో ఉన్న నిధి మొత్తాన్ని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు స్వేచ్ఛగా వెనక్కి తీసుకోవచ్చు.టైర్– 1 మాదిరి ఈ ఖాతా నుంచి నిధి ఉపసంహరణకు ఎలాంటి షరతులూ లేవు.టైర్ –2 ఖాతా నుంచి ఉపసంహరించుకునే మొత్తం పన్ను పరిధిలోకి వస్తుంది. -
ఇన్వెస్ట్ చేస్తేనే ఇంకా ముందుకు..
దేశీయంగా మహిళలకు ఆర్థిక సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ ఆర్థిక భద్రత, సంపద సృష్టి అవకాశాలు పరిమితంగానే ఉంటున్నాయని ఫిన్టెక్ ప్లాట్ఫాం ఎల్ఎక్స్ఎంఈ ఫౌండర్ ప్రీతి రాఠీ గుప్తా తెలిపారు. చాలా మంది మహిళల్లో పొదుపు చేసే అలవాటు ఉన్నప్పటికీ మ్యుచువల్ ఫండ్స్, ఈక్విటీలు, పెన్షన్లు, లేదా బీమాలాంటి సాధనాల్లో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య చాలా తక్కువగానే ఉంటోందని వివరించారు.చాలా మంది బంగారం, నగదు, చిట్ఫండ్స్పైనే ఆధారపడుతుంటారని, వీటిపై దీర్ఘకాలంలో రాబడులు అంతంత మాత్రమే ఉంటాయని పేర్కొన్నారు. మహిళల ఆర్థిక పురోగతికి సంబంధించి ఎల్ఎక్స్ఎంఈ–ఈవై ఉమెన్స్ ఫైనాన్షియల్ ప్రాస్పరిటీ ఇండెక్స్ (2026) అధ్యయనం ప్రకారం భారత్కి 100కి 28.1 స్కోరు మాత్రమే లభించిందని గుప్తా చెప్పారు. బీమా లేకపోవడం, అసంఘటిత రంగంలో ఉద్యోగం, వేతనజీవులకు మాత్రమే రూపొందించబడిన సిస్టంలు మొదలైనవి మహిళల పురోగతికి ఆటంకాలుగా ఉంటున్నాయని వివరించారు.అయితే, మహిళలు క్రమంగా ఆర్థిక భద్రతపై మరింతగా దృష్టి పెట్టే ధోరణి పెరుగుతోందని తెలిపారు. ఎమర్జెన్సీ నిధి, బీమా కవరేజీ, ఆర్థిక పరిజ్ఞానం, కమ్యూనిటీ మద్దతు మొదలైనవి మహిళలు పెట్టుబడులు పెట్టడాన్ని ప్రారంభించేందుకు, క్రమంగా సంపద నిర్మించుకునేందుకు తోడ్పడతాయని ఆమె చెప్పారు. పెట్టుబడుల్లో మహిళల భాగస్వామ్యం పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థకు రూ. 40 లక్షల కోట్ల మేర జత కాగలదని గుప్తా పేర్కొన్నారు. -
PF ఖాతాలో రూ.లక్ష ఉంటే.. ఎంత వడ్డీ వస్తుందంటే?
2025-26 సంవత్సరానికి ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) డిపాజిట్లపై వడ్డీ రేటును మునుపటి మాదిరిగానే 8.25 శాతం వద్దనే ఉంచారు. ఈపీఎఫ్ఓ తన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం పొందిన తరువాత.. వడ్డీ రేటు చందాదారుల ఖాతాల్లోకి జమ అవుతుంది.వడ్డీ రేటు 8.25 శాతం వద్ద ఉన్నప్పుడు.. పీఎఫ్ ఖాతాలో ఒక ఒక లక్ష రూపాయలు ఉంటే ఎంత మొత్తం ఎంత వడ్డీ వస్తుందనే విషయాన్ని గమనిస్తే.. 2026 మార్చి 31 నాటికి ఖాతాలో రూ. 1 లక్ష ఉంటే రూ. 8250 (8.25 శాతం) వడ్డీ వస్తుంది. అంటే మొత్తం రూ. 1,08,250 అవుతుంది. ఆ తరువాత ఏడాది కూడా ఇదే వడ్డీ ఉంటే.. ఆ మొత్తంపై కూడా వడ్డీ పెరుగుతుంది.ఒకవేళా రూ. 5 లక్షలు పీఎఫ్ ఖాతాలో ఉంటే.. వడ్డీ రూ.41250 జమ అవుతుంది. ఖాతాలో రూ. 10 లక్షలు ఉంటే రూ. 82500 వడ్డీ వస్తుందన్నమాట. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఖాతాలో ఉన్న డబ్బుకు మాత్రమే వడ్డీ వస్తుంది. అంటే ఏడాది మధ్యలో అకౌంట్ నుంచి మీరు విత్డ్రా చేసుకుంటే.. మిగిలిన మొత్తానికి వడ్డీ జమ అవుతుంది.పీఎఫ్ వడ్డీ రేటు గతంలో..నిజానికి 2024లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO), చందాదారులకు 2015-16లో వడ్డీ రేటు 8.8 శాతం వడ్డీని అందించింది. ఆ తరువాత వడ్డీ రేటును తగ్గించి 2016-17లో 8.65 శాతం & 2017-18లో 8.55 శాతం అందించింది. 2020-21లో 8.5 శాతం వద్ద ఉన్న వడ్డీ రేటును 2021-22 సంవత్సరానికి 8.10 శాతంగా నిర్ణయించారు. 2022-23లో 8.15 శాతంగా ఉన్న వడ్డీ రేటును 2023-24కి స్వల్పంగా 8.25 శాతానికి పెంచింది. ఇప్పుడు కూడా అదే వడ్డీ రేటు కొనసాగుతోంది.ఇదీ చదవండి: మరో ఫ్లాట్ అమ్మేసిన ప్రీతిజింటా.. ఈసారి ఎన్ని కోట్లు వచ్చాయంటే? -
భారీ సబ్సిడీ స్కీమ్.. గాడిదలు పెంచితే రూ.50 లక్షలు!
గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఆదాయ వనరులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ (NLM) కింద గాడిదలు, గుర్రాలు, ఒంటెల పెంపకానికి పారిశ్రామికవేత్తలు, రైతులకు భారీ ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ పథకం ద్వారా గాడిదల పెంపక కేంద్రాలను ఏర్పాటు చేసుకునేందుకు రూ.50 లక్షల వరకు మూలధన సబ్సిడీ పొందే అవకాశం ఉంది.సగం సబ్సిడీకేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖకు చెందిన పశుసంవర్ధక, పాడిపరిశ్రమ విభాగం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం.. మొత్తం ప్రాజెక్టు వ్యయంపై 50 శాతం వరకు మూలధన సబ్సిడీ ప్రభుత్వం అందిస్తుంది. అయితే ఈ సబ్సిడీ గరిష్ట పరిమితి రూ.50 లక్షలుగా నిర్ణయించారు.అర్హులెవరు?ఈ పథకానికి వ్యక్తిగత రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (FPO), స్వయం సహాయక సంఘాలు (SHG), జాయింట్ లయబిలిటీ గ్రూపులు (JLG), సహకార సంఘాలు, సెక్షన్-8 కంపెనీలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.ఎన్ని గాడిదలు ఉండాలంటే..గాడిదల పెంపక యూనిట్కు అర్హత పొందాలంటే కనీసం 50 ఆడ గాడిదలు, 5 మగ గాడిదలతో ప్రాజెక్టు ఉండాలి. స్థానిక జాతులను సంరక్షించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని దేశీయ గాడిద జాతులకు మాత్రమే ప్రభుత్వం వర్తింపజేస్తోంది.సబ్సిడీ విడుదల ఇలా..ఈ సబ్సిడీని రెండు విడతలుగా విడుదల చేస్తారు. ప్రాజెక్టుకు బ్యాంకు రుణం ఆమోదం పొందిన తర్వాత మొదటి విడతను విడుదల చేస్తారు. అనంతరం గాడిదల పెంపక కేంద్రం పూర్తయి, అధికారులు పరిశీలించి ధ్రువీకరించిన తర్వాత రెండో విడత సబ్సిడీని అందిస్తారు.దేశంలో గాడిదల సంఖ్య వేగంగా తగ్గిపోతున్న నేపథ్యంలో ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. 2019లో జరిగిన 20వ పశు జనాభా లెక్కల ప్రకారం దేశంలో సుమారు 1.23 లక్షల గాడిదలు మాత్రమే ఉన్నట్లు వెల్లడైంది. 2012తో పోలిస్తే ఇది దాదాపు 60 శాతం తగ్గుదలగా అధికారులు చెబుతున్నారు.ఒకప్పుడు గ్రామీణ రవాణా, నిర్మాణ పనుల్లో విస్తృతంగా ఉపయోగించిన గాడిదలకు యాంత్రీకరణ పెరగడంతో డిమాండ్ తగ్గింది. ఈ పరిస్థితిని మార్చేందుకు, స్థానిక జాతులను సంరక్షించేందుకు గాడిదల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. -
శుభ్ ఫ్లెక్సి పెన్షన్.. టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్
జీవించినంత కాలం నిరంతర ఆదాయం అందుతుందనే భరోసాతో రిటైర్ కావడాన్ని ఒకసారి ఊహించుకోండి. మీ పొదుపులు స్థిరమైన ఆదాయాన్ని అందించడమే కాకుండా, పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా పెరుగుతూ మీ జీవనశైలిని కొనసాగించేందుకు సహాయపడితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అచ్చంగా ఈ ఆలోచనకే వాస్తవ రూపం ఇచ్చేలా టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ‘శుభ్ ఫ్లెక్సి పెన్షన్ ప్లాన్’ను ఆవిష్కరించింది. మీరు ధీమాగా, సౌకర్యవంతంగా, ఆర్థిక భద్రత దన్నుతో పదవీ విరమణను ప్లాన్ చేసుకునేందుకు తోడ్పడేలా ఇది తీర్చిదిద్దబడింది.నేటి రిటైర్మెంట్ - సరికొత్త పరిస్థితులుప్రస్తుతం రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే కేవలం భవిష్యత్తు కోసం పొదుపు చేయడం మాత్రమే కాదు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆర్థిక ప్రణాళిక అవసరం. ఆయుర్దాయం పెరగడం, ఆరోగ్య వ్యయాలు పెరుగుతుండటం వల్ల రిటైర్ అయిన వారిపై ఆర్థిక ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది రిటైర్మెంట్ అనంతరం కూడా తమ జీవనశైలిని కొనసాగిస్తూ ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నారు. అందుకే స్థిరత్వంతో పాటు వృద్ధి అవకాశాలు కలిగిన స్మార్ట్ ఫైనాన్షియల్ పరిష్కారాల కోసం చూస్తున్నారు.ఇప్పటి రిటైరీలు కారు కొనడం లేదా విదేశీ పర్యటనలు చేయడం వంటి లక్ష్యాల గురించి కూడా కలలు గంటున్నారు. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రిటైర్ ఎర్లీ (FIRE) తరానికి చెందిన వారు కావచ్చు, ఔత్సాహిక వ్యాపారవేత్తలు కావచ్చు లేదా ఉద్యోగ మార్పుల మధ్యలో ఉన్నవారు కావచ్చు, ఇలా చాలా మందికి సంప్రదాయ పెన్షన్ పథకాలు సరిపోవడం లేదు. అంతేకాదు, జీవితకాలం ముగిసేలోగానే, దాచుకున్న డబ్బు పూర్తిగా ఖర్చయిపోతుందనే భయం కూడా చాలా మందిలో ఉంది.అయితే రిటైర్మెంట్ జీవితం గురించి ఆందోళన చెందే పరిస్థితి లేకపోతే ఎలా ఉంటుంది? నిర్దిష్ట హామీతో కచ్చితమైన ఆదాయం పొందుతూ మార్కెట్ వృద్ధి అవకాశాలను కూడా పొందగలిగితే ఎలా ఉంటుంది?‘శుభ్ ఫ్లెక్సి పెన్షన్ ప్లాన్’ అచ్చంగా అలాగే ఉంటుంది. ఈ పథకం ద్వారా భద్రతతో పాటు వృద్ధి అవకాశాలు కూడా లభిస్తాయి. దీంతో మీరు కోరుకున్న జీవనశైలి విషయంలో రాజీపడాల్సిన అవసరం లేకుండా, ధీమాగా రిటైర్ కావచ్చు.రిటైర్మెంట్ ప్లానింగ్కు స్మార్ట్ మార్గంఆయుర్దాయం పెరుగుతుండటం, ఆరోగ్య వ్యయాలు పెరుగుతుండటం వల్ల ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతోంది. సంప్రదాయ రుణాధారిత పెన్షన్ పథకాలు భరోసా ఇస్తాయి కానీ ఆదాయం పెరిగే అవకాశం ఉండదు. మరోవైపు సూచీ ఆధారిత పెట్టుబడులు వృద్ధి అవకాశాలను ఇస్తాయి కానీ స్థిరత్వం ఉండదు. అలాంటప్పుడు ఈ రెండు ప్రయోజనాలు ఒకే పథకంలో లభిస్తే ఎలా ఉంటుంది?శుభ్ ఫ్లెక్సి పెన్షన్ ప్లాన్ జీవితాంతం హామీ ఆదాయాన్ని అందిస్తుంది. ఈక్విటీల్లో 40 శాతం వరకు పెట్టుబడుల దన్నుతో ఇది అదనంగా మార్కెట్ ఆధారిత వృద్ధి అవకాశాలను కూడా అందిస్తుంది. ‘ఈక్విటీ ఓరియెంటెడ్, రెగ్యులర్ పే’ సొల్యూషన్గా ఈ పథకం ఇలా పనిచేస్తుంది.జీవితాంతం హామీతో కూడుకున్న ఆదాయంమీరు జీవించినంతకాలం యాన్యుటీ రూపంలో ఆదాయం అందుతుంది. రిటైర్మెంట్ సమయంలో డబ్బు సరిపోదేమోనని ఆందోళన చెందనక్కర్లేదు.మార్కెట్ ఆధారిత వృద్ధికి అవకాశంవేరియబుల్ యాన్యుటీ ఆప్షన్ ద్వారా మీ ఆదాయంలో కొంత భాగాన్ని NIFTY 50 పనితీరుకు అనుసంధానం చేసుకోవచ్చు. ఇందులో ఈ ఆప్షన్లు ఉన్నాయి:➤60% గ్యారంటీడ్ ఆదాయం (డెట్) + 40% మార్కెట్ ఆధారితం (ఈక్విటీ)➤70% గ్యారంటీడ్ ఆదాయం (డెట్) + 30% మార్కెట్ ఆధారితం (ఈక్విటీ)➤80% గ్యారంటీడ్ ఆదాయం (డెట్) + 20% మార్కెట్ ఆధారితం (ఈక్విటీ)➤90% గ్యారంటీడ్ ఆదాయం (డెట్) + 10% మార్కెట్ ఆధారితం (ఈక్విటీ)ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనగలిగేలా, మీకు ఒక స్థిరమైన ఆదాయం ఉండడమే కాకుండా మార్కెట్ పెరుగుదలతో మీ పెన్షన్ కూడా పెరిగే అవకాశం ఉండేలా చూసేందుకు ఇది సహాయకరంగా ఉంటుంది.“భారతదేశంలో రిటైర్మెంట్ ప్లానింగ్ విధానం మారుతోంది. ఆయుర్దాయాలు పెరగడం, ఆరోగ్య వ్యయాలు పెరుగుతుండటం, వడ్డీ రేట్లు మారడం వంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు స్థిరత్వంతో పాటు వృద్ధి అవకాశాలను కూడా అందించే సాధనాలను కోరుకుంటున్నారు. శుభ్ ఫ్లెక్సి పెన్షన్ ప్లాన్ ద్వారా కస్టమర్లకు హామీతో కూడుకున్న ఆదాయం మరియు పొదుపు మొత్తాన్ని పెంచుకునే అవకాశం, ఇలా రెండింటినీ అందిస్తున్నాం,” అని టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ అపాయింటెడ్ యాక్చువరీ క్షితిజ్ శర్మ తెలిపారు.మీ రిటైర్మెంట్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దబడినదిప్రతి ఒక్కరి రిటైర్మెంట్ లక్ష్యాలు భిన్నంగా ఉంటాయి. ప్రతి ఒక్కరికి తమవైన లక్ష్యాలు, కాలవ్యవధులు ఉంటాయి. అందుకే శుభ్ ఫ్లెక్సి పెన్షన్ ప్లాన్, వివిధ రకాల రిటైర్మెంట్ అవసరాలకు తగ్గట్లుగా అనేక అనువైన ఆప్షన్లు అందిస్తుంది.ముందుగానే ప్రారంభించండి: 35 ఏళ్ల వయసు నుంచే రిటైర్మెంట్ నిధిని ఏర్పర్చుకోవడాన్ని ప్రారంభించవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడి కావడం వల్ల కాంపౌండింగ్ ప్రయోజనం లభిస్తుంది.ఎప్పటి నుంచి ఆదాయం కావాలో మీరే ఎంచుకోవచ్చుఇమిడియేట్ యాన్యుటీ: రిటైర్ అయిన వెంటనే ఆదాయం ప్రారంభం.డిఫర్డ్ యాన్యుటీ: చెల్లింపులు ప్రారంభమయ్యే ముందు 20 సంవత్సరాల వరకు నిధికి పెరిగే అవకాశాన్ని కల్పించడం ద్వారా మూలనిధిని పెంచుకోవచ్చు. PPTకి అదనంగా గరిష్ట స్థాయిలో 20 ఏళ్ల వరకు వాయిదా వేసే వీలు. ఉదాహరణకు పాలసీ ప్రీమియం చెల్లింపు వ్యవధి 12 ఏళ్లు అనుకుంటే, గరిష్టంగా 12 + 20 = 32 ఏళ్లు డిఫర్ చేసుకోవచ్చు.సరళతర ప్రీమియం ఆప్షన్లుఏకమొత్తంగా చెల్లించవచ్చు2–12 ఏళ్ల వరకు విడతలవారీగా చెల్లింపులు జరపవచ్చుకుటుంబానికి రక్షణఈ పథకం కేవలం మీ భవిష్యత్తు కోసం మాత్రమే కాదు, మీ కుటుంబ భద్రతను కూడా దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. “రిటర్న్ ఆఫ్ పర్చేజ్ ప్రైస్” ఆప్షన్ని ఎంచుకోవడం వల్ల పాలసీదారు మరణించిన తర్వాత కొనుగోలు కోసం మీరు మొదట చెల్లించిన మొత్తం తిరిగి నామినీకి లభిస్తుంది.ఎవరికి అనుకూలం?శుభ్ ఫ్లెక్సి పెన్షన్ ప్లాన్ వివిధ వర్గాలవారందరికీ అనుకూలమైనదిగా ఉంటుందిముందుగానే రిటైర్మెంట్ ప్లానింగ్ ప్రారంభించాలనుకునే వారు (FIRE తరం)ఆర్థిక స్వాతంత్య్రంతో జీవనశైలిని కొనసాగించాలనుకునే వారుస్థిరమైన ఆదాయం, వృద్ధి అవకాశాలను కోరుకుంటూ, రిటైర్మెంట్కు సమీపిస్తున్న వారుస్థిరత్వంతో పాటు వృద్ధి అవకాశాలు కోరుకునే రిటైరీలుయాన్యుటైజేషన్ ఆప్షన్లను కోరుకునే NPS సభ్యులునిర్మాణాత్మకమైన, దీర్ఘకాలిక రిటైర్మెంట్ వ్యూహం కోరుకునే వ్యక్తులు -
EPFO సేవల్లో మార్పులు.. ఇక అన్నీ ఆటోమేషన్లోనే!
సాక్షి, హైదరాబాద్: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) ద్వారా అందే సేవలను పూర్తిగా ఆటోమేషన్ పద్ధతిలో నిర్వహించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) నిర్ణయించింది. ఇందుకు ప్రతి చందాదారుడు తప్పనిసరిగా కేవైసీ సమర్పించాలని సూచించింది. అలా కేవైసీ సమర్పించిన వారికి ఈ సేవలన్నీ ఆటోమేషన్ పద్ధతిలో అందుతాయి.ఇకపై మాన్యువల్ విధానానికి తావు ఇవ్వొద్దని సీబీటీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కసరత్తు చేయాలని ఈపీఎఫ్ఓ యంత్రాంగాన్ని ఆదేశించింది. ఇటీవల ఢిల్లీలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరిగిన సీబీటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చందాదారుల సంఖ్య వేగంగా పెరుగుతున్న తరుణంలో సేవలను వేగంగా అందించే లక్ష్యంతో డిజిటల్ రీఫార్మ్స్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.మానవ జోక్యం లేకుండా... క్లెయిమ్ ప్రాసెస్ను మానవ జోక్యం లేకుండా పూర్తి చేసే వ్యవస్థను ఈపీఎఫ్ఓ అభివృద్ధి చేస్తోంది. పూర్తిగా ఆటో సెటిల్మెంట్ విధానాన్ని విస్తరిస్తోంది. ఒక క్లెయిమ్ పరిష్కారానికి ఇదివరకు మాన్యువల్గా కాగితాల సమర్పణ, అధికారుల ఆమోదం లాంటివి ఉండేవి. ఇకపై అలాంటి జాప్యం లేకుండా ఆటోమేషన్ పద్ధతిలో క్లెయిమ్స్ ప్రాసెస్ చేస్తారు. ఇందుకోసం చందాదారుడు ఆధార్, బ్యాంకు కేవైసీ ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి చేసి ఉండాలి.దీంతో మానవ ప్రమేయం లేకుండా సిస్టమ్ ఆధారంగానే క్లెయిమ్స్ సెటిల్ చేస్తారు. ఈ సందర్భంలోనే ఆన్లైన్ ట్రాకింగ్, ఎస్ఎంఎస్/ ఈ –మెయిల్ అప్డేట్ను మరింత పారదర్శకం చేయనున్నారు. ఇనాపరేటివ్ ఖాతాల నిర్వహణకు చెక్ పెట్టాలని సీబీటీ నిర్ణయం తీసుకుంది. రూ.1,000 కంటే తక్కువ బ్యాలెన్స్ ఉన్న ఈపీఎఫ్ ఖాతాలు, చాలాకాలంగా నిర్వహణ లేని వాటిని ఆటో–ఇనిషియేషన్ క్లెయిమ్ సెటిల్మెంట్ చేసేందుకు సీబీటీ నిర్ణయం తీసుకుంది.ఇలాంటి ఖాతాలు దాదాపు 3 లక్షలకు పైబడి ఉన్నాయి. ఆటో–ఇనిషియేషన్ క్లెయిమ్ సెటిల్మెంట్ విధానాన్ని పైలట్ పద్ధతిలో ప్రారంభించనుంది. చిన్న మొత్తాలున్న ఖాతాలు, ఏళ్ల తరబడి నిర్వహణ లేని ఖాతాలను స్వయంచాలకంగా గుర్తించి, సభ్యుల బ్యాంక్ వివరాలు సరైనవని నిర్ధారించుకొని ఆ నిధులను వెనక్కి ఇచ్చేస్తారు. దీంతో ఏటా వడ్డీ చెల్లింపులు, నిర్వహణ భారం తగ్గుతుంది. ఈడీఎల్ఐ పథకం అమలు కూడా మరింత వేగవంతం కానుంది.క్లెయిమ్స్ను వేగంగా పరిష్కరించేలా ప్రత్యేక సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు. ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, ఇన్సూరెన్స్ విభాగాల మధ్య డేటా సమన్వయానికి చర్యలు చేపట్టనున్నారు. చందాదారులకు ఒకేచోట సేవలు అందేలా యూనిఫైడ్ పోర్టల్ అభివృద్ధికి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ఇదివరకే తీసుకోగా... పనుల ప్రగతి నివేదికపైనా సీబీటీ సమావేశంలో చర్చించారు.యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) ఆధారంగా రికార్డుల నవీకరణ, పేరు, పుట్టిన తేదీ సవరణను సులభతరం చేయనున్నారు. దీంతోపాటు ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేస్తారు. ఫిర్యాదుకు సంబంధించిన సమస్య పరిష్కారానికి నిర్దేశించిన గరిష్ట సమయం కంటే ముందే పరిష్కరించేలా సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు. -
పెట్టుబడులకు చక్కని వైవిధ్యం
పెట్టుబడులకు వైవిధ్యం ఎంతో అవసరం. దీని వల్ల నష్టాల రిస్క్ను గణనీయంగా తగ్గించుకోవచ్చు. అన్ని పెట్టుబడులను ఒకే చోట పెట్టడం కంటే.. వివిధ విభాగాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల నష్టాల రిస్క తగ్గుతుంది. ఒకే ఫండ్తో చక్కని వైవిధ్యం కోరుకునే వారికి పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ చక్కగా సరిపోతుంది. దీర్ఘకాలంలో స్థిరమైన రాబడులతో, తక్కువ నష్టాల రిస్్కతో ఈ పథకం మెరుగ్గా రాణిస్తోంది.రాబడులుఈ పథకానికి మంచి రాబడుల చరిత్రే ఉంది. ఈ పథకం 2013లో ఆరంభం కాగా, నాటి నుంచి నేటి వరకు ఏటా సగటున 19 శాతం చొప్పున రాబడులను అందించింది. గత ఐదేళ్లలోనూ రాబడి ఇదే స్థాయిలో ఉంది. మూడేళ్లలో మాత్రం ఏటా 20.94 శాతం చొప్పున, ఏడాది కాలంలో 10 శాతం మేర పెట్టుబడులపై ప్రతిఫలాన్ని అందించింది. ఫ్లెక్సీక్యాప్ విభాగం సగటు రాబడి కంటే 6 శాతం వరకు అధిక ప్రతిఫలం ఈ పథకంలోనే ఉండడం గమనించొచ్చు.పెట్టుబడుల విధానంమంచి రాబడుల అవకాశాలు ఎక్కడ ఉంటే అక్కడ ఇన్వెస్ట్ చేసే స్వేచ్ఛ ఈ ఫండ్కు ఉంది. స్థానిక కంపెనీలతో పాటు విదేశీ కంపెనీల్లోనూ ఇన్వెస్ట్ చేయడం ఈ పథకం పెట్టుబడుల విధానంలో భాగం. ముఖ్యంగా అమెరికాకు చెందిన దిగ్గజ టెక్నాలజీ కంపెనీల్లో ఈ పథకం చెప్పుకోతగ్గ స్థాయిలో ఇన్వెస్ట్ చేసింది. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్, ఫేస్బుక్లో ఈ పథకానికి గణనీయమైన పెట్టుబడులు ఉన్నాయి. వ్యాల్యూ స్టాక్స్కు ఈ పథకం ప్రాధాన్యం ఇస్తుంటుంది. అంటే కంపెనీ వ్యాపారం, మూలాల పరంగా మంచి విలువ కలిగి, ఆకర్షణీయమైన ధరల్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయడం ద్వారా అధిక రాబడులు తెచ్చిపెట్టే వ్యూహాన్ని పాటిస్తోంది.వాస్తవ విలువలకు మించి గరిష్ట స్థాయిల్లో ట్రేడవుతున్న స్టాక్స్కు దూరంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రిస్్కను సాధ్యమైనంత తగ్గించే విధంగా పనిచేస్తుంది. స్టాక్స్ను తరచూ మార్చదు. ఒక కౌంటర్లో దీర్ఘకాలం పాటు కొనసాగడాన్ని పాటిస్తుంది. స్థూల ఆర్థిక అంశాలు కాకుండా.. ఎంతో విలువ దాగున్న స్టాక్స్ను గుర్తించి పెట్టుబడులు పెడుతుంటుంది. పరిస్థితులకు అనుగుణంగా డెట్ సెక్యూరిటీలు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లలో (రీట్)నూ ఇన్వెస్ట్ చేస్తుంటుంది. మధ్యకాల లక్ష్యాలకు (5–7 ఏళ్లు) దీర్ఘకాల లక్ష్యాలకు (10 ఏళ్లకు అంతకుమించి) ఈ పథకాన్ని ఎంపిక చేసుకోవచ్చు.పోర్ట్ఫోలియోప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.1,33,970 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 77.32 శాతం ఈక్విటీల్లో, డెట్ సాధనాల్లో 13.71 శాతం, ఈక్విటీ హెడ్జింగ్ ఇన్స్ట్రుమెంట్లలో 2.53 శాతం, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్)లలో 1.33 శాతం చొప్పున పెట్టుబడులు పెట్టింది. 5.11 శాతం నగదు నిల్వలు ఉన్నాయి. రంగాల వారీ పెట్టుబడులను పరిశీలిస్తే.. అత్యధికంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు 33.80 శాతం, టెక్నాలజీ రంగ కంపెనీలకు 25.29 శాతం, కన్జ్యూమర్ డిస్క్రిషినరీ కంపెనీలకు 7.48 శాతం చొప్పున కేటాయించింది. ప్రతినెలా రూ.1000 నుంచి సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. -
పెరిగిన గ్యాస్ ధరలు.. 19 కిలోల సిలిండర్ కొత్త రేటు..
మార్చి నెలకు ఎల్పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సవరించాయి. దేశవ్యాప్తంగా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలు రూ.28 నుంచి రూ.31 వరకు పెరిగాయి. అయితే 14 కిలోల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేకపోవడం సాధారణ వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగించే అంశం.ప్రధాన నగరాల్లో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరలురాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1740.50 నుంచి రూ.1768.50కు పెరిగింది. కోల్కతాలో ధర రూ.1844.50 నుంచి రూ.1875.50కు చేరింది. ముంబైలో రూ.1692 నుంచి రూ.1720కు పెరిగింది. అలాగే చెన్నైలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1899.50 నుంచి రూ.1929కు, హైదరాబాద్లో రూ. 1,962.50 నుంచి రూ. 1,990.50కు విశాఖపట్నంలో రూ. 1,791.50 నుంచి రూ. 1,822.50కు పెరిగినట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వెల్లడించాయి.గృహ ఎల్పీజీ రేట్లు యథాతథంఆయిల్ కంపెనీల తాజా వివరాల ప్రకారం 14.2 కిలోల గృహ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.ఢిల్లీలో ఇది రూ.853కు అందుబాటులో ఉంది. కోల్కతాలో రూ.951గా కొనసాగుతోంది. ముంబైలో రూ.852.50గా ఉంది. లక్నోలో గృహ సిలిండర్ ధర రూ.890.50గా కొనసాగుతోంది. హైదరాబాద్లో రూ. 905, విశాఖపట్నంలో రూ. 861లుగా ఉంది.కమర్షియల్ సిలిండర్ ధరలు పెరగడం హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే గృహ వినియోగ సిలిండర్ ధరల్లో మార్పు లేకపోవడం సామాన్యులకు కొంత ఊరట కలిగిస్తోంది. -
ఇన్సూరెన్స్తోపాటు ఈక్విటీ.. కొత్త మ్యూచువల్ ఫండ్స్ ఇవే..
అంతర్జాతీయంగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే అవకాశాన్ని కల్పించే దిశగా టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ‘టాటా ఏఐఏ గ్లోబల్ ఈక్విటీ ఫండ్’ను ఆవిష్కరించింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ మార్చి 5 వరకు అందుబాటులో ఉంటుంది. జీవిత బీమా రక్షణ కల్పించడంతో పాటు గ్లోబల్ ఈక్విటీల్లో పెట్టుబడుల ద్వారా దీర్ఘకాలికంగా మూలధన వృద్ధికి కూడా దోహదపడేలా ఇది ఉంటుంది. టాటా ఏఐఏ శుభ్ గ్లోబల్ ఇన్వెస్ట్ లాంటి యూనిట్ లింక్డ్ పథకాల ద్వారా ఈ ఫండ్ అందుబాటులో ఉంటుంది. ప్రధానంగా ఈ ఫండ్ నిధుల్లో 70%–100% వరకు భాగాన్ని గ్లోబల్ ఈక్విటీల్లో, మిగతా భాగాన్ని డెట్, మనీ మార్కెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తారు.ట్రస్ట్ ఎంఎఫ్ మిడ్క్యాప్ ఫండ్ ప్రధానంగా మిడ్–క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ట్రస్ట్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా మిడ్ క్యాప్ ఫండ్ని ఆవిష్కరించింది. ఇది మార్చి 13 వరకు అందుబాటులో ఉంటుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్పరంగా 101 నుంచి 250 ర్యాంకుల వరకు ఉండే సంస్థల షేర్లు, ఈక్విటీ సంబంధ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. దీనికి నిఫ్టీ మిడ్క్యాప్ 150 టీఆర్ఐ ప్రామాణికంగా ఉంటుంది. దేశీయంగా తయారీ, ఆర్థిక సేవలు తదితర రంగాలకు చెందిన పలు మిడ్ క్యాప్ కంపెనీలు గణనీయంగా రాణిస్తున్నాయని సంస్థ తెలిపింది. గత అయిదేళ్లలో ఈ విభాగంలోని 37 కంపెనీలు మూడు రెట్లు రాబడులు అందించాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో మిడ్–క్యాప్ కంపెనీల వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈ ఫండ్ ఉపయోగపడుతుందని సంస్థ సీఈవో సందీప్ బాగ్లా తెలిపారు. ఐసీఐసీఐ ప్రు లైఫ్ డివిడెండ్ లీడర్స్ 50 ఇండెక్స్ ఫండ్ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ (యులిప్) కింద ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్తగా డివిడెండ్ లీడర్స్ 50 ఇండెక్స్ ఫండ్ని ప్రవేశపెట్టింది. నిలకడగా డివిడెండ్లను చెల్లించే ట్రాక్ రికార్డుతో ఫండమెంటల్గా పటిష్టంగా ఉన్న స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలికంగా మెరుగైన రాబడులు అందించడం దీని లక్ష్యం. బీఎస్ఈ 500 నుంచి ఎంపిక చేసిన 50 కంపెనీల ఇండెక్స్ని ఇది ట్రాక్ చేస్తుంది. ఐసీఐసీఐ ప్రు సిగ్నేచర్ అష్యూర్, స్మార్ట్కిడ్ అష్యూర్, స్మార్ట్ ఇన్సూరెన్స్ ప్లాన్ ప్లస్ (సిప్ ప్లస్) తదితర పథకాలతో ఇది లభిస్తుంది. -
ఇంటి అద్దె అలవెన్సు క్లెయిమ్... జాగ్రత్తలు
ఇంటి అద్దె అలవెన్సు క్లెయిమ్ విషయంలో వహించాల్సిన జాగ్రత్తలు గతంలో ఎన్నోసార్లు ఉదాహరణలతో తెలుసుకున్నాము. మన్మథరావు గారి కొడుకు, కోడలిది ప్రేమ వివాహం. తల్లిదండ్రుల ఇంట్లోనే కాపురం ఉంటున్నారు. ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. అతి తెలివితేటలున్న స్నేహితుల సలహా ప్రకారం... ఇద్దరూ వారికొచ్చిన ఇంటి అద్దె అలవెన్సుని మొత్తం మినహాయింపు పొందడానికి అవసరమైనంత మొత్తానికి రశీదులు ఇచ్చి మినహాయింపు పొందుతున్నారు. మన్మథరావు పలుసార్లు వారించినా ఫలితం లేకపోయింది. ఒకే నగరం, ఒకే చోటు ఉంటూ చెరొక రశీదు సబ్మిట్ చేసి నాటకం ఆడుతున్నారు. ఈ దంపతుల్ని మించిపోయాడు వైకుంఠం గారు. పెళ్లి అయిన నాటి నుంచి మామగారి ఇంట్లోనే మకాం. మామగారికి అద్దె చెల్లిస్తున్నట్లు క్లెయిమ్ చేశాడు. నాలుగేళ్ల తర్వాత మామ చనిపోయారు. వైకుంఠం జీతం పెరిగింది. ఇంటి అద్దె అలవెన్సు పెరిగింది. ఎంత పెరిగిందో.. అంతా, పాతది వెరసి మొత్తానికి ఎంత అద్దె ఉండాలో అంత అద్దె ఇస్తున్నట్లు దొంగ రశీదులు సబ్మిట్ చేస్తూనే ఉన్నారు. రెండు మూడేళ్ల తర్వాత ఇంత అద్దె పుచ్చుకుంటున్న ఆ సదరు పెద్ద మనిషి ‘ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నులు’ వేస్తున్నారా లేదా అని ఆరా తీసారు అధికారులు. అడ్రసు పట్టుకొని మామ గారి ఇంటికెళ్లారు. గుమ్మం మీద మామ నేమ్ బోర్డు ఉంది. ఇంటి నెంబరు సరిపోయింది. కానీ అడుగు ముందుకేసి అడిగే సరికి అత్తగారు ప్రత్యక్షం. ‘సుబ్బారావు గారు ఉన్నారా’ అధికారుల ప్రశ్న..! అత్తగారి నోటి నుంచి మాటలు రావడం లేదు పైగా కన్నీళ్లు... ‘ఎవరు బాబు మీరు.. ఆయన చనిపోయిన మూడేళ్లకి తీరుబాటు అయ్యిందా పరామర్శకి’ అన్నారు. ‘అదికాదండీ.. మీ అల్లుడు వైకుంఠం గారు ...’ అన్నారు అధికారులు. ‘ఆయన ఇక్కడెందుకు ఉంటారు. వీధి చివరి ఇల్లు. అధికారులకు అర్థం అయ్యింది పరిస్థితి. మెల్లగా కూపీ లాగారు. అధికారులు నోటీసులిచ్చి పిలిపించారు. అన్నీ ఒప్పుకున్నాడు వైకుంఠం. దొంగ రశీదులు, దొంగ సంతకాలు, దొంగ క్లెయిమ్లు.. అన్నింటిని మించి అద్దె పక్కా ఆదాయంగా డిక్లేర్ చేయకపోవడం... అసెస్సుమెంటు చూశారు. తప్పులన్నీ సవరించారు. పన్ను, వడ్డీ, పెనాల్టీలు 200%... ఆ షాకుతో ఇంటి అవసరం లేకుండా వైకుంఠం డిపార్టుమెంటు వరండాలోనే తిరుగుతున్నారు. బహుశా ఇటువంటి బాపతులు చాలా మంది కనిపించి ఉంటారు డిపార్ట్మెంట్ వారికి... కొత్త రూలు వచ్చింది. ముసాయిదా రూల్స్ ప్రకారం ఇక నుంచి .. అంటే ఏప్రిల్1వతేదీ, 2026 నుంచి ఏడాది అద్దె రూ.1,00,000 దాటితే.. ఫారం 124 ఇవ్వాలి. ఓనర్ పేరు, అడ్రస్, పాన్.. మీకు ఓనర్కి చుట్టరికం ఏమిటి? చుట్టమంటే ... అమ్మ, నాన్న, అత్తగారు, మామగారు, అన్న, అక్క, చెల్లి, తమ్ముడా... ఇలాంటి వివరాలు సంపూర్ణంగా సేకరించి ఓనర్ ఆదాయాన్ని ట్రాక్ చేస్తారు. బ్యాంకు అకౌంటుని చెక్ చేస్తారు. ఆ వ్యక్తి ఈ ఆదాయం తన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నులలో చూపిస్తే సరి.. లేదా కొంప కొల్లేరు అవుతుంది. మన గతంలో ఎన్నోసార్లు చెప్పుకున్నాము. షరా మామూలే అయితే గోవిందా..! ముందు ఓనర్ గారికి నోటీసులు ఇస్తారు అన్నీ ఆరా తీస్తారు. సక్రమంగా అన్ని డిక్లేర్ చేస్తే సరేసరి.. లేదంటే పన్ను, వడ్డీ 200% పెనాల్టీలు.అలా అని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అటువంటి బంధువుకి ఎటువంటి ఆదాయం లేకుండా ఇంటి అద్దె ఆదాయమే అనుకొండి.. రూ.12,00,000 దాకా పన్ను భారం ఉండదు. కావున నిశ్చింతగా ఆ ఇంట్లోనే ఉండండి. బ్యాంకు ద్వారా అద్దె ఇవ్వండి. కాస్త శ్రమ తీసుకొని ఓనర్ చేత రిటర్ను వేయించండి. -
టాటా ఏఐజీ కొత్త ఇన్సూరెన్స్ ప్లాన్
ముంబై: టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ‘యాక్సిడెంట్ సూపర్ గార్డ్ ప్లస్’ ప్లాన్ను ప్రవేశపెట్టింది. ప్రమాదాల్లో సమగ్ర ఆర్థిక రక్షణను అందించే వ్యక్తిగత ప్రమాద బీమా ప్లాన్ ఇదని, దేశంలో ఏటా ప్రమాదాల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో దీన్ని తీసుకొచ్చినట్టు ప్రకటించింది. వ్యక్తుల ఆదాయం, అప్పులు, జీవనశైలి రిస్క్లకు అనుగుణంగా కవరేజీని ఎంపిక చేసుకోవచ్చు.ప్రమాద మరణం, శాశ్వత పాక్షిక, పూర్తి వైకల్యంలో ఏక మొత్తంలో బీమా పరిహారం లభిస్తుంది. ప్రమాదాల కారణంగా అత్యవసర వైద్యం కోసం ఆస్పత్రిలో చేరాల్సి వస్తే అయ్యే ఖర్చులకు రీయింబర్స్మెంట్ పొందొచ్చు. లోన్ షీల్డ్ (రుణాల కోసం), ఈఎంఐ ప్రొటెక్షన్, పెట్కేర్ పేరుతో ఐచ్ఛిక కవరేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఐదేళ్ల కాల వ్యవధిపై వ్యక్తులు, కుటుంబ సభ్యులు ఈ ప్లాన్ను తీసుకోవచ్చు. వేతన జీవులకు ప్రీమియంలో అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. -
హెల్త్కు సూపర్ టాపప్!
పదేళ్ల కిందట హెల్త్ ఇన్సూరెన్స్ అంటే... లక్ష రూపాయలు చాలు. ఆ మాత్రం కవరేజీ ఉంటే హ్యాపీ. ఇక రెండు లక్షలంటే లగ్జరీకిందే లెక్క. మరిప్పుడు? చాలామంది తమకు రూ.5 లక్షలు, రూ.10 లక్షలు కవరేజీ ఉన్నా సరే ధీమాగా ఉండలేని పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారి ఆసుపత్రి మెట్లెక్కితే ఎన్ని పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియదు. ఏ పరీక్షల్లో ఏం బయటపడుతుందో తెలియదు. దానికి ఎన్ని లక్షలవుతుందో తెలియదు. ఎందుకంటే జీవనశైలి మారిపోయింది. ఆహారపు అలవాట్లు మారిపోయాయి. అనారోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయి. దానికి తగ్గట్లే అత్యాధునిక హంగులతో కార్పొరేట్ ఆసుపత్రులు పుట్టుకొస్తున్నాయి. ఖర్చు ఏటా 14% చొప్పున పెరుగుతోందన్నది ఒక అంచనా. మరిప్పుడు ఏం చేయాలి? ఈ ప్రశ్నకు సమాధానమే టాపప్. ఆ వివరాలే ఈ ‘వెల్త్ స్టోరీ’అవసరానికి పనికిరాకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా లేనట్టే. ఎందుకంటే మన ఆరోగ్యానికి ఎంత బీమా కవరేజీ ఉన్నదనేది ఇప్పుడు ప్రధానం కాదు. అది ఎంతవరకూ అవసరానికి పనికొస్తుందన్నదే ప్రధానం. చాలామందికి రూ.5 లక్షలు లేదా రూ.10 లక్షల కవరేజీ ఉంటోంది. చాలా సందర్భాల్లో అది సరిపోతుంది. కానీ పెద్ద ప్రమాదం జరిగితేనో, కేన్సర్ వంటి మహమ్మారి చికిత్సలు అవసరమైతేనో అది ఎంతమాత్రం చాలదు. ఎందుకంటే కేన్సర్ చికిత్సకు దాని స్టేజ్ను బట్టి ఆరంభంలో రూ.15 లక్షల వరకు కూడా ఖర్చు అవుతుంటుంది. ఇక వైద్యం ఎప్పటికప్పుడు ఆధునికతను సంతరించుకుంటూ ఉండటంతో చికిత్సల వ్యయాలూ అదే స్థాయిలో పెరుగుతున్నాయి. 14 శాతంగా ఉంటున్న వైద్య ద్రవ్యోల్బణం మనకు తెలియకుండానే.. మన బీమా రక్షణ కవరేజీ సామర్థ్యాన్ని తినేస్తోంది. గతంలో రూ.3000 ఉన్న ఆసుపత్రి రూమ్ చార్జీ ఇపుడు రూ.6వేలు దాటిపోయింది. ఇపుడు తీసుకున్న రూ.5 లక్షల బీమా ఐదేళ్ల తర్వాత రూ.2.5 లక్షలకు సమానం. కనుక మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆరోగ్య బీమానూ సమీక్షించుకోవాలి. ప్రీమియం భారం..? వైద్య చికిత్సల వ్యయాలు, క్లెయిమ్లకు అనుగుణంగా బీమా సంస్థలు ప్రీమియంను సవరిస్తుంటాయి. దీంతో కరోనా తర్వాతి కాలంలో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు 50 శాతానికి పైనే పెరిగాయి. అధిక ఆయుర్దాయం, పెరిగిపోతున్న వ్యాధులు, కరోనా విపత్తు అనంతరం ఆరోగ్య సమస్యలతో కంపెనీలపై క్లెయిమ్ల భారం పడడం ఈ పరిస్థితికి కారణం. ఇక వయసును బట్టి ప్రీమియంల పెంపు సహజంగానే చూస్తుంటాం. 35– 40, 45–50, 60 తర్వాత ప్రీమియం ఎంతలేదన్నా 20 శాతం మేర పెరుగుతుంటుంది. కనుక చాలా మంది మధ్య తరగతి కుటుంబాలకు భారీ ప్రీమియంతో ప్రాథమిక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ (బేసిక్ ఇండెమ్నిటీ ప్లాన్) తీసుకోవడం కష్టమే. ఈ పరిస్థితుల్లో తక్కువ ప్రీమియానికి అదనపు రక్షణనిచ్చే టాపప్, సూపర్ టాపప్ ప్లాన్ల గురించి, ఇవి ఏ రకంగా ఉపయోగపడతాయన్నది తప్పకుండా తెలుసుకోవాలి. టాపప్ ప్లాన్లు.. పరిమిత ప్రీమియానికి అదనపు ఆరోగ్య బీమా రక్షణను టాపప్, సూపర్ టాపప్లు అందిస్తుంటాయి. బేస్ పాలసీ కవరేజీని రూ.5 నుంచి రూ.15 లక్షలకు పెంచుకోవాలంటే ప్రీమియం చాలా ఎక్కువుంటుంది. కానీ రూ.15 లక్షల సూపర్ టాపప్ ప్రీమియం చాలా తక్కువ. ఇవి బేస్ పాలసీతో అనుసంధానమై పనిచేస్తాయి. ‘డిడక్టబుల్’ (తగ్గించడం) ఇక్కడ కీలకం. టాపప్ అయినా, సూపర్ టాపప్ అయినా కనీస డిడక్టబుల్తో వస్తాయి. ఉదాహరణకు రూ.5 లక్షల డిడక్టబుల్తో రూ.50 లక్షలకు టాపప్ లేదా సూపర్ టాపప్ తీసుకున్నారనుకుంటే.. హాస్పిటల్ బిల్లు రూ.5 లక్షల్లోపే ఉంటే టాపప్, సూపర్ టాపప్తో పని ఉండదు. బేస్ పాలసీలోనే క్లెయిమ్ పరిష్కారం అవుతుంది. బిల్లు రూ.5 లక్షలు దాటినప్పుడు ఈ ప్రత్యేక ప్లాన్లు యాక్టివ్గా మారతాయి. అదనపు మొత్తాన్ని అందిస్తాయి. బిల్లు రూ.8 లక్షలు వచి్చందనుకుందాం. అప్పుడు బేస్ పాలసీ రూ.5 లక్షలు, టాపప్ లేదా సూపర్ టాపప్ రూ.3 లక్షలు చెల్లిస్తాయి. రెండూ వేర్వేరు.. ఇక్కడ టాపప్, సూపర్ టాపప్ రెండూ డిడక్టబుల్తో వచ్చినప్పటికీ.. కొంత స్పష్టమైన వైరుధ్యం ఉంది. టాపప్, సూపర్ టాపప్ రెండూ ‘డిడక్టబుల్’ దాటిన సందర్భాల్లో అమల్లోకి వస్తాయి. ఇందులో టాపప్ ప్లాన్ అనేది ఒకసారి ఆసుపత్రిలో చేరినపుడు ఆ క్లెయిమ్ మొత్తం డిడక్టబుల్ మొత్తాన్ని మించినప్పుడే అమలవుతుంది. సూపర్ టాపప్ అలా కాదు. ఒక బిల్లు డిడక్టబుల్ను మించిన సందర్భాల్లోనూ చెల్లింపులు చేస్తుంది. అలాగే, ఒక పాలసీ సంవత్సరంలో విడిగా ఒక్కో బిల్లు డిడక్టబుల్ దాటకుండా.. అన్నీ కలసి డిడక్టబుల్ను మించిన సందర్భంలోనూ చెల్లింపులు చేస్తుంది. పాలసీ కవరేజీబేస్ ప్లాన్ రూ.10 లక్షలు టాపప్ రూ.20 లక్షలు సూపర్ టాపప్ రూ.20 లక్షలు డిడక్టబుల్ రూ.10 లక్షలుఒక ఏడాదిలో క్లెయిమ్లు మొదటి క్లెయిమ్ 4 లక్షలు రెండో క్లెయిమ్ 3.50 లక్షలు మూడో క్లెయిమ్ 4.50 లక్షలు మొత్తం రూ.12 లక్షలు → ఇందులో టాపప్ ప్లాన్ కింద ఎలాంటి చెల్లింపులు రావు. ఎందుకంటే విడిగా ప్రతీ క్లెయిమ్ డిడక్టబుల్ రూ.10 లక్షలుమించలేదు. → సూపర్ టాపప్ ప్లాన్ మాత్రం విడిగా ఒక క్లెయిమ్ అనే కాకుండా, ఒక ఏడాదిలో మొత్తం క్లెయిమ్లు రూ.10 లక్షలు మించినా యాక్టివేట్ అవుతుంది. కనుక రూ.10 లక్షలు డిడక్టబుల్ పోను మిగిలిన రూ.2 లక్షలు చెల్లిస్తుంది. ఒక ఏడాదిలో ఎన్ని సందర్భాలు ఆస్పత్రిలో చేరారన్న దానితో సంబంధం లేకుండా డిడక్టబుల్ దాటిన తర్వాత నుంచి ఆ పాలసీ సంవత్సరంలో అయ్యే వ్యయాలు అన్నింటికీ పాలసీ గరిష్ట పరిమితి మేరకు చెల్లింపులు లభిస్తాయి. రూ.10 లక్షల డిడక్టబుల్తో రూ.20 లక్షలకు సూపర్ టాపప్ తీసుకుంటే.. ఒక ఏడాదిలో రూ.10 లక్షలు మించి, రూ.20 లక్షల వరకు పాలసీ నిబంధనల మేరకు చెల్లింపులు అందుకోవచ్చు. → టాపప్లో ఈ ఫీచర్ లేదు. ఏ బిల్లు అయినా డిడక్టబుల్ దాటినప్పుడే యాక్టివేట్ అవుతుంది. → ఒక ఏడాదిలో ఎన్ని సందర్భాల్లో వైద్యం అవసరమవుతుందో తెలియదు. ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ అన్నది కుటుంబం అంతటికీ ఉద్దేశించినది. ఒక ఏడాదిలో ఒకరు ఆస్పత్రి పాలై బేసిక్ కవరేజీ ఖర్చయిపోయితే, అదే ఏడాది అదే కుటుంబంలో మరొకరికి వైద్యం అవసరం పడొచ్చు. అటువంటప్పుడు సూపర్ టాపప్ ప్లాన్ ఆదుకుంటుంది. ముఖ్యంగా కరోనా వంటి విపత్తులు, వైరల్ ఇన్ఫెక్షన్లు, ప్రమాదాల కారణంగా ఒకే ఏడాది కుటుంబంలో ఒకరికి మించి వైద్యం అవసరం ఏర్పడొచ్చు. ఏది తీసుకోవాలి..? → వివాహం కాని వారు, ఇండివిడ్యువల్ హెల్త్ ఇన్సూరెన్స్తోపాటు టాపప్ ప్లాన్ తీసుకోవచ్చు. → కుటుంబం అంతటికీ ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ తీసుకునే వారికి సూపర్ టాపప్ అనుకూలం. → బేసిక్ ఇండెమ్నిటీ హెల్త్ ప్లాన్ కంపెనీ నుంచే టాపప్ లేదా సూపర్ టాపప్ తీసుకోవాలని లేదు. ఐఆర్డీఏఐ నిబంధనల ప్రకారం ఇది తప్పనిసరి కాదు. పాలసీదారులు తమకు నచి్చన సంస్థ నుంచి ఈ రక్షణలను ఎంపిక చేసుకోవచ్చు. → ఒకే కంపెనీ నుంచి బేసిక్ ప్లాన్, టాపప్/సూపర్ టాపప్ ఉంటే క్లెయిమ్లు సాఫీగా పరిష్కారం అవుతాయి. టాపప్–సూపర్ టాపప్ క్లెయిమ్ కోసం పెద్దగా శ్రమ పడక్కర్లేదు. → టాపప్– సూపర్ టాపప్ ప్లాన్ ప్రీమియం తక్కువ కోరుకుంటే, వేర్వేరు కంపెనీల నుంచి ఎంపిక చేసుకోవాల్సి రావచ్చు. → బేసిక్ ప్లాన్, టాపప్/సూపర్ టాపప్ కవరేజీల్లో ఏకరూపత ఉంటే మంచిది.వీటిపై ఫోకస్ చేయండి.. → బీమా కంపెనీ ఆస్పత్రుల నెట్వర్క్ ఎంత బలంగా ఉందో చూడాలి. తాము నివసించే ప్రాంతంలో దాదాపు అన్ని ముఖ్యమైన ఆస్పత్రులు బీమా కంపెనీ నగదు రహిత ఆస్పత్రుల నెట్వర్క్లో ఉంటే నయం. → ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేకుండా.. అదే రోజు చికిత్స తీసుకుని వెళ్లిపోయే (డే కేర్ ప్రొసీజర్స్) చికిత్సలకు (అన్నింటికీ) కవరేజీ ఉన్నాయేమో ధ్రువీకరించుకోవాలి. → ఆస్పత్రిలో చేరడానికి ముందు.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఎక్కువ రోజులకు కవరేజీ ఉండాలి. → అత్యాధునిక రోబోటిక్, లేజర్ సర్జరీలకు పాలసీలో చెల్లింపుల ప్రయోజనాలు ఉంటే మెరుగు. → ముందస్తు వ్యాధులకు కవరేజీ ఎంత వెయిటింగ్ తర్వాత అమల్లోకి వస్తాయో తెలుసుకోవాలి. → ముఖ్యంగా రీసోర్టేషన్ ప్రయోజనం ఉంటే మంచిది. అంటే ఒక ఏడాదిలో కుటుంబంలో ఒకరు ఆస్పత్రిలో చేరడం వల్ల సమ్ అష్యూర్డ్ మొత్తం ఖర్చయిపోతే.. తిరిగి అంతే మొత్తాన్ని తదుపరి వైద్యానికి బీమా సంస్థ పునరుద్ధరిస్తుంది. → ఎంపిక చేసుకునే పాలసీల ప్రీమియం భరించగలిగే స్థాయిలోనే ఉండేలా చూసుకోవాలి. తగినంత కవరేజీ.. → చాలా కుటుంబాలు తమ అవసరాలకు సరిపడా రక్షణను (సమ్ అష్యూర్డ్) ఎంపిక చేసుకోవడం లేదని ఎన్నో సర్వేల్లో తేలింది. మెజారిటీ పాలసీదారుల రక్షణ అవసరానికంటే తక్కువే ఉంటోంది. → కుటుంబంలో ఎంత మంది సభ్యులు ఉన్నారు, వారికి అప్పటికే ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? తాము నివసించే ప్రాంతం, ఆ ప్రాంతంలో వైద్యానికి అయ్యే వ్యయాల ఆధారంగా కవరేజీని నిర్ణయించుకోవాలన్నది నిపుణుల సూచన. → కనీసం రూ.10 లక్షల సమ్ అష్యూర్డ్తో బేసిక్ ప్లాన్, రూ.10 లక్షల డిడక్టబుల్తో రూ.50 లక్షలు లేదా రూ.కోటికి సూపర్ టాపప్ ప్లాన్ తీసుకోవడం సముచితంగా ఉంటుంది. దీనివల్ల నేటి వ్యయాలకే కాకుండా, భవిష్యత్తు వ్యయాలకు సైతం రక్షణను ఏర్పాటు చేసుకున్నట్టు అవుతుంది. -
జియో ఫైనాన్షియల్ యాప్లో వినూత్న ఫీచర్లు
ముంబై: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (జేఎఫ్ఎస్) ఇతర సంస్థల ఉత్పత్తులను కూడా విక్రయించే విధంగా తమ యాప్ను మార్కెట్ప్లేస్ తరహాలో విస్తరిస్తోంది. కృత్రిమ మేథ, మెషిన్ లెర్నింగ్లాంటి టెక్నాలజీలను పొందుపర్చడంతో వివిధ ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో తగు సలహాలు, ఫైనాన్షియల్ స్కోర్ మొదలైనవి కూడా ఇవ్వనుంది.ఆర్థిక సేవల పంపిణీని సరికొత్తగా నిర్వచించేలా ఇలాంటి వినూత్న ఫీచర్లను యాప్లో జోడిస్తున్నట్లు జేఎఫ్ఎస్ ఎండీ హితేష్ సేథియా తెలిపారు. యూజర్లు తమ సందేహాలు, అవసరాలను టైప్ చేస్తే వారికి అనువైన ఆర్థిక సాధనాలు, క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు మొదలైన వాటికి గురించి యాప్ సిఫార్సు చేస్తుంది.దాదాపు ఏడాదిగా నిర్వహిస్తున్న యాప్కి ప్రస్తుతం 2 కోట్ల మంది యూజర్లు ఉన్నట్లు వివరిచారు. 50 క్రెడిట్ కార్డులు, 90 బీమా పథకాలను అందించేందుకు ఆయా సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు చెప్పారు. -
బ్యాంకులకు వరుస సెలవులు.. ఇదే చివరి నెల!
మార్చి నెలలో అడుగు పెడుతున్నాం. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఇదే చివరి నెల. పూర్తి చేయాల్సిన బ్యాంకు పనులు చాలానే ఉంటాయి. కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు కస్టమర్లు ఈ మార్చి నెలలో తమ బ్యాంకు బ్రాంచ్ల సందర్శనలను ముందుగానే ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పండుగలు, రాష్ట్రాల వారీగా ఉన్న ప్రత్యేక సెలవులు, అలాగే సాధారణ ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాల కారణంగా అనేక రోజులు బ్యాంకులు మూసి ఉండనున్నాయి. ముందస్తుగా షెడ్యూల్ను చూసుకోవడం ద్వారా నగదు ఉపసంహరణలు, చెక్ క్లియరెన్సులు వంటి ఇతర బ్రాంచ్ సేవలలో ఆలస్యాలను నివారించవచ్చు.మార్చిలో బ్యాంకు సెలవులు» మార్చి 1 (ఆదివారం): దేశవ్యాప్తంగా సాధారణ సెలవు.» మార్చి 2: హోలికా దహన్ సందర్భంగా ఉత్తరప్రదేశ్లో బ్యాంకులు మూసివేత.» మార్చి 3: హోలి, డోల్జాతర తదితర పండుగల సందర్భంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అస్సాం, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, గోవా, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో సెలవు. మార్చి 4: యోసాంగ్ (రెండవ రోజు)తో పాటు హోలీ వేడుకల నేపథ్యంలో త్రిపుర, గుజరాత్, మిజోరం, ఒడిశా, చండీగఢ్, ఉత్తరాఖండ్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, బీహార్, ఛత్తీస్గఢ్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేత.» మార్చి 8 (ఆదివారం): దేశవ్యాప్త సెలవు.» మార్చి 13: చాప్కార్ కత్ సందర్భంగా మిజోరంలో బ్యాంకులు మూసివేత.» మార్చి 14 (రెండో శనివారం): దేశవ్యాప్త సెలవు.» మార్చి 15 (ఆదివారం): దేశవ్యాప్త సెలవు.» మార్చి 17: షాబ్ ఈ ఖదర్ సందర్భంగా జమ్మూ & కాశ్మీర్లో బ్యాంకులు మూసివేత.» మార్చి 19: ఉగాది, గుడి పడ్వా, సాజిబు నోంగ్మా పంబా వేడుకల నేపథ్యంలో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, మణిపూర్, జమ్మూ & కాశ్మీర్, గోవా, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేత.మార్చి 20: ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్), జమాత్ ఉల్ విదా సందర్భంగా జమ్మూ కాశ్మీర్, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేత.» మార్చి 21: రంజాన్-ఈద్, సర్హుల్ తదితర పండుగల కారణంగా అనేక రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేత.» మార్చి 22 (ఆదివారం): దేశవ్యాప్త సెలవు.» మార్చి 26: శ్రీ రామ నవమి సందర్భంగా మిజోరం, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, చండీగఢ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేత.» మార్చి 28 (నాలుగో శనివారం): దేశవ్యాప్త సెలవు.» మార్చి 29 (ఆదివారం): దేశవ్యాప్త సెలవు.» మార్చి 31: మహవీర్ జయంతి సందర్భంగా ఆర్బీఐ సెలవుగా గుర్తించినప్పటికీ, 2025-26 ఆర్థిక సంవత్సరాంత లావాదేవీల దృష్ట్యా ప్రభుత్వ వ్యాపారం నిర్వహించే ఏజెన్సీ బ్యాంకులు ఆ రోజున తెరిచి ఉంటాయి.యథావిధిగా డిజిటల్ సేవలుబ్యాంకు బ్రాంచీలకు సెలవులు ఉన్నప్పటికీ ఏటీఎంలు, యూపీఐ, ఆన్లైన్ బ్యాంకింగ్, మొబైల్ యాప్ సేవలు కొనసాగుతాయి. నిధుల బదిలీలు, బిల్లు చెల్లింపులు వంటి డిజిటల్ లావాదేవీలు అంతరాయం లేకుండా అందుబాటులో ఉంటాయి. -
ఐటీ కొత్త రూల్: ఇంటి ఓనర్తో సంబంధం చెప్పాలి
ఆదాయపన్ను ముసాయిదా పత్రాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇంటి అద్దెపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకునే వారు ఇకపై ఇంటి యజమానితో చేసుకున్న ఒప్పంద రుజువును చూపించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపన్ను చట్టం అమల్లోకి రానుండడం గమనార్హం. దీంతో ముసాయిదా పత్రాలు, నిబంధనలపై భాగస్వాములకు ఆదాయపన్ను శాఖ పంపిణీ చేసింది. వేతన జీవులు హెచ్ఆర్ఏ క్లెయిమ్ను చేసుకునే విషయంలో యాజమాన్యానికి ధ్రువీకరణ ఇవ్వాల్సి ఉంటుంది.ఇకపై ఫారమ్ 124లో ప్రాపర్టీ యజమానితో ఉన్న సంబంధాన్ని (అసెసీ/పన్ను చెల్లింపుదారు/దాఖలుదారు) వెల్లడించాల్సి ఉంటుంది. కల్పిత, పెంచి చూపించే అద్దె మొత్తాలకు ఈ నిబంధన చెక్ పెడుతుందని పన్ను నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విదేశీ ఆదాయంపై పన్ను జమ క్లెయిమ్లకు సంబంధించి ఆడిటర్లు, కంపెనీలపై బాధ్యతను పెంచడం కూడా కొత్త పత్రాల్లో భాగంగా ఉంది. భారత్కు వెలుపల ఏదైనా ప్రాంతానికి సంబంధించిన ఆదాయంపై ఫారీన్ ట్యాక్స్ విత్హోల్డింగ్ సర్టిఫికెట్లను అకౌంటెంట్లు స్వతంత్రంగా నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. చెల్లింపుల రుజువులు, కరెన్సీ మారకం లావాదేవీలు, పన్ను అర్హత నిబంధనలను, పన్ను చెల్లింపుదారు నివాస హోదాలను సైతం ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. -
కొంచెం రిస్క్ ఉన్నా.. లాభం రావాలంటే?
ఈక్విటీలలో థీమ్యాటిక్/సెక్టోరల్ ఫండ్స్ అన్నవి కొంచెం రిస్క్ ఉన్నా సరే, రాబడులు కూడా బలంగా ఉండాలని కోరుకునే వారికి అనుకూలంగా ఉంటాయి. ఇవి తాము ఎంపిక చేసుకున్న రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఈ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బిజినెస్ సైకిల్ ఫండ్ మాత్రం భిన్నమైన, మెరుగైన పనితీరుతో ఆకర్షిస్తోంది. ఇన్వెస్టర్లు దీర్ఘకాల లక్ష్యాల పెట్టుబడుల్లో కొంత మొత్తాన్ని వైవిధ్యం కోసం కేటాయించుకోవాలని భావించేట్టు అయితే.. ఈ ఫండ్ను పరిశీలించొచ్చు.రాబడులుఈ పథకం 2021 జనవరిలో ప్రారంభమై.. ఐదేళ్ల ట్రాక్ రికార్డును పూర్తి చేసింది. ఈ పథకం ఆరంభంలో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే అది రూ.2.51లక్షలుగా మారి ఉండేది. ఐదేళ్లలోనూ ఏటా 20.56 శాతం చొప్పున ప్రతిఫలాన్ని అందించింది. ఇదే కాలంలో నిఫ్టీ 500 టీఆర్ఐ రాబడి 15.47 శాతమే ఉండడం గమనార్హం. ఏడాది కాలంలో పెట్టుబడులపై 18 శాతం రాబడిని అందించింది. ఇక మూడేళ్ల కాలంలో చూస్తే వార్షిక రాబడి 22.82 శాతంగా ఉంది. ఇక ఇదే విభాగంలో ఇతర పథకాలతో పోలి్చతే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బిజినెస్ సైకిల్ ఫండ్ ట్రాక్ రికార్డు పటిష్టంగా ఉంది. ఇన్వెస్టర్లు కనీసం రూ.100 నుంచి సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆరంభం నుంచి ఈ పథకంలో ప్రతి నెలా రూ.10,000 చొప్పున సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసి ఉంటే రూ.6.10 లక్షలు ఐదేళ్లలో రూ.9.74 లక్షలుగా మారి ఉండేది. అంటే ఏటా 18.47 కాంపౌండెడ్ రాబడి (సీఏజీఆర్)కి సమానం.పెట్టుబడుల విధానం..బిజినెస్ సైకిల్స్ అంటే.. కొన్ని వ్యాపారాలకు ఒక్కో సమయంలో డిమాండ్ బలంగా ఉంటుంది. ప్రస్తుతం మెటల్స్లో బంగారం, వెండి, అల్యూమినియం, రాగి ధరలు గణనీయంగా పెరగడం, ఈ రంగాల్లోని కంపెనీలు బలంగా లాభాలు ఆర్జించడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సైకిల్స్ను ఈ ఫండ్ ముందే గుర్తించి ఇన్వెస్ట్ చేస్తుంటుంది. స్థూల ఆర్థిక పరిస్థితులకు (ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, వృద్ధి గమనం, ద్రవ్య పరిస్థితులు, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు) అనుగుణంగా ప్రయోజనం పొందే రంగాలను, థీమ్యాటిక్ అవకాశాలను ముందే గుర్తించి, ఆయా రంగాల్లోని బలమైన కంపెనీల్లో పెట్టుబడులు పెడుతుంది. తద్వారా దీర్ఘకాలంలో ఇన్వెస్టర్ల పెట్టుబడులను వృద్ధి చేయడం ఈ పథకం ఉద్దేశం. పరిస్థితులకు అనుగుణంగా విదేశీ స్టాక్స్లోనూ ఇన్వెస్ట్ చేస్తుంది.పోర్ట్ఫోలియోప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.15,808 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 97.88 శాతం మేర ఈక్విటీలకు కేటాయించగా, డెట్ సాధనాల్లో 0.75 శాతం, నగదు రూపంలో 1.37 శాతం కలిగి ఉంది. ఈక్విటీ పెట్టుబడులను గమనించగా.. లార్జ్క్యాప్స్ కంపెనీల్లో 73.54 శాతం, మిడ్క్యాప్ కంపెనీల్లో 9.6 శాతం, స్మాల్క్యాప్ కంపెనీల్లో 5.51 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసింది. పోర్ట్ఫోలియోలో మొత్తం 84 స్టాక్స్ ఉన్నాయి. రంగాల వారీ కేటాయింపులను పరిశీలిస్తే.. అత్యధికంగా 32.28 శాతం మేర బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు కేటాయించింది. ఆ తర్వాత ఇండస్ట్రియల్స్ కంపెనీల్లో 17.52 శాతం, కన్జ్యూమర్ డిస్క్రిషినరీ కంపెనీల్లో 12.90 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసింది. -
రూ.7 కోట్ల ఫ్రాడ్లో ఇరుక్కున్న ఇంజినీరింగ్ విద్యార్థి
స్నేహితుడికి సాయం చేద్దామని బ్యాంక్ ఖాతా వివరాలు పంచుకున్న ఓ ఇంజినీరింగ్ విద్యార్థి.. ఏకంగా రూ.7 కోట్ల సైబర్ మోసం కేసులో చిక్కుకున్నాడు. ఈ ఘటన బ్యాంకు ఖాతాల విషయంలో యువతకు పెద్ద హెచ్చరికగా మారింది. బ్యాంక్ ఖాతా వివరాలను నిర్లక్ష్యంగా పంచుకోవడం ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన స్పష్టం చేస్తోందిబెంగళూరులోని ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థికి ఆయుష్ అనే వ్యక్తితో దాదాపు ఏడాది కాలంగా స్నేహం ఉంది. 2025 నవంబర్లో ఆయుష్ బ్యాలెన్స్ లేకపోవడంతో తన బ్యాంక్ ఖాతా బ్లాక్ అయిందని, తాత్కాలికంగా విద్యార్థి ఖాతాను ఉపయోగించుకుంటానని అభ్యర్థించాడు.స్నేహితుడిని పూర్తిగా నమ్మిన విద్యార్థి.. తన కర్ణాటక గ్రామీణ బ్యాంక్ (Karnataka Gramin Bank) ఖాతాకు లింక్ అయిన ఏటీఎం కార్డ్తో పాటు ఎయిర్టెల్ సిమ్ కార్డు, నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడీ, పాస్వర్డ్లతో సహా అన్ని యాక్సెస్ వివరాలను పంచుకున్నాడు. ఈ వివరాలను పోస్ట్ ద్వారా పంపగా.. అందుకున్నట్లు ఆయుష్ వాట్సాప్లో ధ్రువీకరించాడు కూడా.అయితే, కొన్ని నెలల తర్వాత షాకింగ్ నిజం బయటపడింది! బ్యాంకు అధికారులు సదరు విద్యార్థిని సంప్రదించి.. అతడి ఖాతా ద్వారా భారీ అనుమానాస్పద లావాదేవీలు జరిగాయని తెలిపింది. దాదాపు రూ.7 కోట్లు ఈ ఖాతా ద్వారా బదిలీ అయినట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి. రెండు రోజుల్లోనే ఈ మొత్తం లాండరింగ్ జరిగినట్లు సమాచారం.తన ఖాతా సైబర్ నేరస్థుల 'మ్యూల్ అకౌంట్'గా దుర్వినియోగం అయినట్లు తెలిసిన విద్యార్థి వెంటనే ఖాతాను బ్లాక్ చేయించాడు. అనంతరం నార్త్ డివిజన్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆయుష్తో పాటు ఇతరులపై కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇది ఓ హెచ్చరికే!స్నేహితులు అయినా.. బ్యాంక్ డీటెయిల్స్, పాస్వర్డ్లు, ఓటీపీలు ఎవరితోనూ షేర్ చేయవద్దు. అత్యంత నమ్మకమైన వ్యక్తుల నుంచే ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. బ్యాంక్ లేదా పోలీసులు అడిగినా.. ఫోన్లో ఇలాంటి వివరాలు ఇవ్వవద్దు. జాగ్రత్తలు తీసుకోండి.. సైబర్ మోసాల నుంచి దూరంగా ఉండండి!బ్యాంక్ అకౌంట్ దుర్వినియోగం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలుఏటీఎం పిన్, సీవీవీ, ఓటీపీలు, నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్, ఖాతా వివరాలు స్నేహితులు/బంధువులు అయినా ఎవరికీ ఇవ్వవద్దు. బ్యాంకులు కూడా ఎప్పుడూ ఇలాంటివి ఫోన్ ద్వారా అడగవు."తాత్కాలికంగా ఖాతా ఉపయోగించుకోవాలి", "ఈజీ మనీ", "కమిషన్ ఇస్తాం", "జాబ్ ఫ్రమ్ హోమ్" అని ఎవరైనా అడిగితే నిరాకరించండి. ఇవి మనీ మ్యూల్ స్కామ్లే!స్ట్రాంగ్ పాస్వర్డ్ (అప్పర్+లోయర్+నంబర్+స్పెషల్) పెట్టుకోండి. దీన్ని రెగ్యులర్గా మారుస్తూ ఉండండి. ట్రాన్సాక్షన్ అలర్ట్స్ (SMS/ఈమెయిల్) ఆన్ చేసుకోండి. దీని వల్ల అనుమానాస్పద లావాదేవీలు వెంటనే తెలుస్తాయి.అన్నోన్ SMS/వాట్సాప్ లింకులు క్లిక్ చేయవద్దు. బ్యాంకు యాప్/వెబ్సైట్ నేరుగా టైప్ చేసి వెళ్లండి. పబ్లిక్ వైఫైలో బ్యాంకింగ్ చేయవద్దు.ఖాతా స్టేట్మెంట్ తరచూ చెక్ చేయండి. అనుమానాస్పద ట్రాన్సాక్షన్ కనిపిస్తే వెంటనే బ్యాంకుకు, 1930 (సైబర్ క్రైమ్ హెల్ప్లైన్) లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయండి. -
మ్యూచువల్ ఫండ్స్.. ‘న్యూ ఆఫర్స్’..
ఎల్ఐసీ ఎంఎఫ్ టెక్నాలజీ ఫండ్: సంప్రదాయ ఐటీ సర్వీసుల పరిధికి మించి విస్తరిస్తున్న టెక్నాలజీ రంగంలో పెట్టుబడుల అవకాశాలను అందించే దిశగా ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ కొత్తగా టెక్నాలజీ ఫండ్ని ఆవిష్కరించింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ మార్చి 6తో ముగుస్తుంది. సెమీకండక్టర్ ఆధారిత కంపెనీలు, డేటా సెంటర్ ఆపరేటర్లు, డిజిటల్ కామర్స్ ప్లాట్ఫాంలు, ఇంటర్నెట్ బిజినెస్లు, వర్ధమాన టెక్నాలజీ సంస్థలు సహా సాంకేతికతతో ముడిపడి ఉన్న వివిధ రంగాల సంస్థల్లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. దీనికి బీఎస్ఈ టెక్ టోటల్ రిటర్న్ ఇండెక్స్ ప్రామాణికంగా ఉంటుంది. కనీసం రూ. 1,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. సిప్ రూపంలోనైతే వ్యవధిని బట్టి రూ.100 నుంచి కట్టొచ్చు. కరణ్ దోషి, జైప్రకాశ్ తోషి్నవాల్ దీనికి ఫండ్ మేనేజర్లుగా వ్యవహరిస్తారు. ‘బరోడా బీఎన్పీ’ ఈఎస్జీ స్ట్రాటజీ ఫండ్ పర్యావరణహితంగా వ్యాపార కార్యకలాపాల నిర్వహణకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో బరోడా బీఎన్పీ పారిబా మ్యుచువల్ ఫండ్ తాజాగా ఈఎస్జీ బెస్ట్–ఇన్–క్లాస్ స్ట్రాటెజీ ఫండ్ని ఆవిష్కరించింది. దీనికి నిఫ్టీ100 ఈఎస్జీ టోటల్ రిటర్న్ ఇండెక్స్ ప్రామాణికంగా ఉంటుంది. సెబీలో నమోదు చేసుకున్న రేటింగ్ కంపెనీలు ఇచ్చే ఈఎస్జీ రేటింగ్స్, అలాగే, కంపెనీ అంతర్గతంగా నిర్వహించే ఫండమెంటల్ రీసెర్చ్, అనాలిసిస్ ఆధారంగా ఎంపిక చేసిన సంస్థల్లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. కనీసం రూ. 1,000 నుంచి పెట్టుబడి పెట్టే విధంగా ఈ ఫండ్ ఉంటుంది. గడిచిన పదేళ్లలో ఏడేళ్ల పాటు నిఫ్టీ 100 టీఆర్ఐకి మించి నిఫ్టీ 100 ఈఎస్జీ టీఆర్ఐ మెరుగైన పనితీరు కనపర్చిందని సంస్థ సీఈవో సంజయ్ గ్రోవర్ తెలిపారు. బజాజ్ లైఫ్ బీఎస్ఈ 500 క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్ జీవిత బీమా సంస్థ బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్తగా బీఎస్ఈ 500 క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్ని ప్రవేశపెట్టింది. ఫిబ్రవరి 15 వరకు ఈ న్యూ ఫండ్ ఆఫర్లో (ఎన్ఎఫ్వో) ఇన్వెస్ట్ చేయొచ్చు. స్థిరంగా ఆదాయాలు ఆర్జిస్తూ, ఆర్థికంగా పటిష్టంగా ఉన్న దేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది. కంపెనీకి చెందిన యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకాలైన (యులిప్స్) బజాజ్ లైఫ్ స్మార్ట్ వెల్త్ గోల్, బజాజ్ లైఫ్ సుప్రీం, బజాజ్ లైఫ్ గెయిన్లతో దీన్ని తీసుకోవచ్చు. ఇటు జీవిత బీమా కవరేజీని పొందుతూనే అటు దీర్ఘకాలంలో సంపదను కూడా పంచుకునేలా ఇది రెండిందాల ప్రయోజనాలు అందిస్తుందని కంపెనీ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు రావూరి తెలిపారు.వెల్త్ కంపెనీ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ ఈక్విటీ, డెట్ సాధనాల్లో క్రమశిక్షణతో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో పెట్టుబడిని పెంచుకునే అవకాశం కల్పించేలా ది వెల్త్ కంపెనీ మ్యుచువల్ ఫండ్ ..తాజాగా బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ని ప్రవేశపెట్టింది. ఇది ఫిబ్రవరి 10న ముగుస్తుంది. మార్కెట్ పరిస్థితులు, వేల్యుయేషన్లు, రిస్క్ ఇండికేటర్లను బట్టి ఈక్విటీ, డెట్ సాధనాల మధ్య పెట్టుబడులను సర్దుబాటు చేస్తూ మెరుగైన రాబడులు అందించడంపై ఇది దృష్టి పెడుతుంది. కనీసం 65 శాతం నిధులను ఈక్విటీలు, ఈక్విటీ ఆధారిత సాధనాల్లోనూ, 35 శాతం భాగాన్ని డెట్, మనీ మార్కెట్ సాధనాల్లోను ఇన్వెస్ట్ చేస్తుంది. దీనికి క్రిసిల్ హైబ్రిడ్ 50+50 మోడరేట్ ఇండెక్స్ టోటల్ రిటర్న్ ఇండెక్స్ ప్రామాణికంగా ఉంటుంది. -
ప్రభుత్వ సొమ్ములు ప్రైవేటు బ్యాంకుల్లో ఎందుకు?
భారత బ్యాంకింగ్ రంగంలో మరోసారి భారీ మోసం కలకలం రేపింది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ చండీగఢ్ బ్రాంచ్లో హర్యానా రాష్ట్ర ప్రభుత్వ ఖాతాల్లో రూ.590 కోట్ల మోసం జరిగినట్లు బ్యాంక్ వెల్లడించింది. ఇది కేవలం ఈ ఒక్క బ్యాంకుకే పరిమితమా.. లేక అన్ని ప్రైవేటు బ్యాంకుల్లో ఉన్న ప్రభుత్వ డిపాజిట్లపై భద్రతా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయా!! ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉండగా ప్రైవేటు బ్యాంకుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వాటి విభాగాలు డిపాజిట్లు ఎందుకు చేస్తున్నాయి? ఎంత మొత్తం ఉంది? ఈ ప్రత్యేక కథనంలో వివరంగా చూద్దాం.మోసం బయట పడిందిలా..ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్లోని తమ ఖాతాలు మూసివేయాలని హర్యానా ప్రభుత్వ విభాగం ఒకటి కోరగా, బ్యాంకు రికార్డుల్లోని బ్యాలెన్స్లు వాస్తవ ఖాతాలతో సరిపోలలేదు. దీంతో బ్యాంకు అంతర్గత ఆడిట్లో రూ.590 కోట్ల మోసం బయటపడింది. బ్యాంకు ఉద్యోగులు, బయటి వ్యక్తులు కలిసి ఈ అవకతవకలకు పాల్పడ్డారని ప్రాథమిక విచారణలో తేలింది. ఫలితంగా బ్యాంకు షేర్లు 20% పడిపోయి, మార్కెట్ విలువలో రూ.14,438 కోట్ల నష్టం జరిగింది.బ్యాంకు సీఈవో వి వైద్యనాథన్ మాట్లాడుతూ, "ఇది ఒక్క బ్రాంచ్కు పరిమితమైన విషయం. బ్యాంకు మొత్తం కార్యకలాపాలు సాధారణంగా సాగుతున్నాయి" అని చెప్పారు. నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసి, ఫోరెన్సిక్ ఆడిట్ ప్రారంభించారు. "ఇది సిస్టమిక్ సమస్య కాదు. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం" అని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. అయితే, ఈ ఘటన ప్రైవేటు బ్యాంకుల్లో ప్రభుత్వ డిపాజిట్ల భద్రతపై చర్చను రేకెత్తించింది.ప్రైవేటు బ్యాంకుల్లో ప్రభుత్వ డిపాజిట్లు ఎంత?దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వాటి విభాగాలు ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన మొత్తం గురించి ఖచ్చితమైన లెక్కలు బహిరంగంగా అందుబాటులో లేవు. అయితే, ఆర్బీఐ, ఎస్బీఐ రీసెర్చ్ నివేదికల ప్రకారం.. మొత్తం బ్యాంకింగ్ సిస్టమ్లో డిపాజిట్లు 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.241.5 లక్షల కోట్లు ఉన్నాయి. ఇందులో ప్రైవేటు బ్యాంకుల వాటా సుమారు 37% (రూ.89 లక్షల కోట్లు) కాగా, ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా 55 శాతం.ప్రభుత్వ డిపాజిట్లు ప్రైవేటు బ్యాంకుల్లో ఎంతో చెప్పాలంటే, ఐడీఎఫ్సీ మోసం కేసులోనే హర్యానా ప్రభుత్వ ఖాతాల్లో రూ.590 కోట్లు ఉన్నాయంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర విభాగాలు కలిపి ఈ మొత్తం వేల కోట్లలో ఉండవచ్చు. ఇండియాస్టాట్ డేటా ప్రకారం.. ప్రైవేటు బ్యాంకుల మొత్తం డిపాజిట్లు 2024-25లో వివిధ రకాలుగా (కరెంట్, సేవింగ్స్, ఫిక్స్డ్) విభజించబడ్డాయి, కానీ ప్రభుత్వ స్పెసిఫిక్ డేటా లేదు. ఆర్బీఐ అంచనాల ప్రకారం.. 2025-26లో డిపాజిట్ గ్రోత్ 11-12%. ఇందులో ప్రభుత్వ డిపాజిట్లు కూడా పెరుగుతున్నాయి.ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉండగా ప్రైవేటులో ఎందుకు?ప్రభుత్వ రంగ బ్యాంకులు సార్వభౌమ గ్యారెంటీతో భద్రత కల్పిస్తున్నప్పుడు, ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి పలు కారణాలు ఉన్నాయి. ముందుగా, ప్రైవేటు బ్యాంకులు మెరుగైన వడ్డీ రేట్లు, టెక్నాలజీ ఆధారిత సేవలు అందిస్తాయి. గత 10 ఏళ్లలో ప్రైవేటు బ్యాంకులు డిపాజిట్ మార్కెట్లో పీఎస్యూబీల వాటాను తగ్గించాయి. డిపాజిట్లు డిజిటల్ పేమెంట్లు, మ్యూచువల్ ఫండ్ల వైపు మళ్లుతున్నా, ప్రైవేటు బ్యాంకులు మెరుగైన కస్టమర్ రిలేషన్షిప్లతో డిపాజిట్లు సమీకరిస్తున్నాయి.రెండవది డైవర్సిఫికేషన్: ప్రభుత్వాలు రిస్క్ తగ్గించడానికి డిపాజిట్లను వివిధ బ్యాంకుల్లో విభజిస్తాయి. పీఎస్యూబీలు ఫిస్కల్ డెఫిసిట్, ఎన్పీఏలతో సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. ప్రైవేటు బ్యాంకులు మెరుగైన ఎఫిషియన్సీ, డిజిటల్ సర్వీసెస్తో ఆకర్షిస్తాయి.మూడవది, రెగ్యులేటరీ సపోర్ట్: ఆర్బీఐ లిక్విడిటీ మేనేజ్మెంట్, సీఆర్ఆర్ తగ్గింపులతో డిపాజిట్ గ్రోత్ను ప్రోత్సహిస్తోంది. అయితే, పీఎస్యూబీలు ప్రైవేటు బ్యాంకులతో పోటీ పడుతూ, డిపాజిట్ గ్రోత్లో ముందున్నాయి. గత 6 నెలల్లో పీఎస్యూబీల మార్కెట్ క్యాప్ రూ.5.75 లక్షల కోట్లు పెరిగింది.ఐడీఎఫ్సీ మోసం ప్రభుత్వ డిపాజిట్ల భద్రతపై హెచ్చరికలా మారింది. ప్రభుత్వాలు డిపాజిట్లు చేసేటప్పుడు బ్యాంకు ఆంతరిక నియంత్రణలు, ఆడిట్ సిస్టమ్లను పరిశీలించాలి. ఆర్బీఐ మరిన్ని రెగ్యులేషన్లు తీసుకురావాలి. ప్రభుత్వ సొమ్ములంటే ప్రజల సొమ్ములే. వీటి భద్రత అత్యవసరం. -
నగదు వ్యవహారాలు వద్దే వద్దు ..!
నగదు వ్యవహారాలు ఇప్పటికీ చాలామంది చేస్తూనే ఉన్నారు. వ్యవస్థలో నగదు చెలామణి ఈ జనవరిలో రూ. 40 లక్షల కోట్లకు చేరిందని ప్రాథమిక అంచనా. ఇది వార్షికంగా 11.1% చొప్పున పెరుగుతోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వినియోగం గణనీయంగా పెరిగింది. ఈ పెరుగుదల ఒక చరిత్రను సృష్టిస్తోంది. మరోవైపు డిజిటల్ వ్యవస్థ వృద్ధి చెందుతోంది. దేశవ్యాప్తంగా యూపీఐ వాడే వారి సంఖ్య 400 మిలియన్లు. దానిని మరో 600 మిలియన్లకు పెంచి ‘ఒక బిలియన్’కి పెంచాలనేది ప్రభుత్వ లక్ష్యం.ఫోన్పే, గూగుల్ పే, పేటీఎంలు ‘స్కాన్అండ్పే’ ప్రభంజనాన్ని సృష్టిస్తున్నాయి. భవిష్యత్తు ‘డిజిటల్ ప్రపంచమే’. అయినా మనిషి మారడం లేదు. నగదు వదలట్లేదు. రాజకీయ ఎన్నికల్లో నగదు పంపిణీ గురించి వింటాం. సినిమా ఇండస్ట్రీలో అది పరిపాటి. రియల్ ఎస్టేట్లో అలవాటు. లంచావతరాలకు దురలవాటు. ఎందుకో ఈ పొరపాటు చేసిన తర్వాత, దొరికిపోయిన తర్వాత గ్రహపాటు అని సరిపెట్టుకోవడం సాధారణమైంది. భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేసుకుంటూ సక్రమమైన మార్గంలోనే సంపాదిస్తూ చౌక రోజుల్లో ఇళ్లు, ఫ్లాటు కొన్నారు. కాలం కలిసొచ్చింది. వాటిని అమ్మినప్పుడు భారీ లాభాలు వచ్చాయి.అయితే మార్కెట్ ధరని మించిన ప్రతిఫలాన్ని నగదులో తీసుకున్నారు. సక్రమమైన(వైట్) వ్యవహారాన్ని ఆదాయపన్ను వారికి డిక్లేర్ చేసి చేతులు దులుపుకున్నారు. కానీ ఇంట్లో కొండచిలువగా నగదు నిలువ ఉంది. ఏం చేయాలి? ఇదొక పెద్ద ప్రశ్న..! ఇంతటితో ఆగిపోయిందా? లేదు. జాలి గుండె కలిగిన ఆ ఇల్లాలు స్నేహితుడికి వైద్యం నిమిత్తం రూ.6 లక్షలు నగుదు రూపంలో ఇచ్చింది. ఆ స్నేహితుడు తన భార్య ఆనారోగ్యం కోసం ఖర్చు పెట్టినా భార్య చనిపోయింది. తరువాత ఇన్సూరెన్సు డబ్బు బ్యాంకు ద్వారా వచ్చాయి. ‘చేతిలో నగదు లేదు. తను తిరిగి చెల్లించాల్సిన రూ.6 లక్షల మొత్తం చెక్కు ద్వారా ఇస్తాను’ అంటున్నాడు. ఇప్పుడు ఆ జాలి గుండె కలిగిన ఆ ఇల్లాలు ఆ మొత్తాన్ని ఎలా చూపించాలన్నది ప్రశ్న.మంచికి పోతే చెడు ఎదురురొచ్చింది..? తండ్రి బతికున్నప్పుడు జాగాలో సగం రాయించుకున్నాడు పెద్ద కొడుకు. పెద్దలు ఇద్దరూ కాలం చేశారు. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు మిగిలిన సగం జాగా పెద్దవాడికే అమ్మేశారు. కానీ పెద్దవాడు వ్యాపారంలో బాగా సంపాదించడం వలన తన దగ్గర ఉన్న నగదు కుటుంబ సభ్యులకిచ్చి వ్యవహారం నడిపించాడు. డబ్బు మీద వ్యామోహం వలన అందరూ నగదు వైపే మొగ్గు చూపించారు. ఒక్కొక్కరి చేతిలో పదేసి లక్షల మూట చేరింది. అటు పెద్దకొడుకు తన ‘బ్లాక్మనీ’ని వదిలించుకొని మిగతా అందరికి నగదు పంచి ఇచ్చాడు.నగదు నాగుపాములా తయారైంది.! అన్నదమ్ములు ఐక్యంగా ఉన్న కుటుంబంలో అన్న పురోహితుడు, తమ్ముడు క్యాటరింగ్ చేసేవారు. ఇద్దరికి దశ తిరిగింది. బాగా డబ్బులు నగదు రూపంలో వచ్చాయి. భార్యామణుల సలహామేరకు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు చేశారు. కాలక్రమేణా పెద్ద మొత్తాలుగా మారాయి. టీడీయస్.. ఇన్కమ్టాక్స్.. పన్ను ఎగవేత ఉద్దేశంతో ఇన్కమ్ రిటర్నులు వేయడం లేదు. ఇప్పుడేం చేయాలనేది ఎడతెగని ప్రశ్న..?తను ఒక చిన్న ఇంట్లో ఉంటూ తన పది ప్లాట్లు కేవలం నగదుకే అద్దెకిచ్చి, అద్దె వసూలు చేస్తూ జీవితం కులాసాగా గడుపుతున్నాడు గోవిందం. పొరపాటున ఒక కిరాయిదారునికి ఇచ్చిన రశీదు కొంప ముంచింది. ఒకటి నగదు రశీదు. రెండవది పన్ను ఎగవేత. వీటి విషయం ఏమిటంటే.. నగదు వ్యవహారాలను చేయకండి. అసలు ప్రోత్సహించకండి. నల్లధనం (బ్లాక్ మనీ) వైపు వెళ్లొద్దు. నగదులో అప్పు ఇవ్వడం తప్పు. పుచ్చుకోవడం మరీ తప్పు. ఆ మొత్తాన్ని తిరిగి బ్యాంకు ద్వారా చెల్లిస్తే అది ఆదాయంగా మారి పన్నుకి గురి అవుతుంది. నగదు తీసుకోవడం తప్పని చెప్పాం కదా..! పోనీ దానిని అకౌంటు చేస్తే కనీసం మీ నిజాయితీ తెలుస్తుంది. గణనీయంగా పెరిగిన నగదు వ్యవహారాలను కృత్రిమ మేధస్సు (ఏఐ) ద్వారా కనుక్కొవచ్చు. డిపార్ట్మెంట్ వారి వద్ద ఇంటెలిజెన్స్, ఫోరెన్సిక్ విభాగాలున్నాయి. మీరు సంపాదించిన ‘ధనం’ మీ దగ్గర ఉన్నా, వారి దగ్గర ‘ఇంధనం’ లాంటి సమాచారం ఉంది. ఈ రెండింటిని అనుసంధానం చేసే అవకాశం ఇవ్వకండి. సౌకర్యం కోసం నగదుని ఆశ్రయించకండి. అన్ని విధాల బ్యాంకు దారి సక్రమమైన రహదారి. -
రిటైర్మెంట్కు రెడీనా?
రిటైర్మెంట్ అంటే... 60 ఏళ్లకు కదా! అనుకుంటారంతా. ఇంకా చాలా సమయం ఉందని, ఇప్పటి నుంచే దాని గురించి ఆలోచించటమెందుకని రోజులు గడిపేస్తూ ఉంటారు. దాదాపు 70 శాతం మంది వేతన జీవులది ఇదే పరిస్థితి. కాకపోతే ఆ మిగిలిన 30 శాతం మందీ మరోరకంగా ఆలోచిస్తుంటారు. వారి దృష్టిలో రిటైర్మెంట్ అంటే ఉద్యోగానికి గుడ్బై చెప్పటం కాదు. తప్పనిసరి పనికి స్వస్తి చెప్పి... నచ్చిన పని చేయగలిగే స్వేచ్ఛను సంపాదించుకోవటం. ఆ స్వేచ్ఛను ఎంత త్వరగా సంపాదించుకోగలిగితే... అంత త్వరగా తప్పనిసరి పనికి గుడ్బై కొట్టేయటం. చాలామందికి 60 ఏళ్లు దాటినా కూడా ఈ తరహా స్వేచ్ఛ సాధ్యం కాదు. కొందరు మాత్రం 40లు, 50లలోనే సాధ్యం చేసుకోగలుగుతున్నారు. ఎలా? దీనికి ఏం చేయాలి? ఇదే ఈ వెల్త్ స్టోరీ...క్యాంపస్లోనో, కాలేజీ నుంచి బయటకు వచ్చాకో మంచి జాబ్ కొడితే సెటిలైపోయినట్లేనని భావిస్తారు చాలామంది. ఆదాయాన్ని బట్టి ఖరీదైన ఫోన్లు, కారు, ప్రీమియం హౌస్... ఇలా ఖర్చు చేసుకుంటూ వెళుతుంటారు. భవిష్యత్ ఆదాయాన్ని కూడా ఈఎంఐల రూపంలో ఇప్పుడే ఖర్చు చేసేస్తుంటారు. వారికప్పుడు రిటైర్మెంట్ గుర్తుకే రాదు. కొందరికి గుర్తుకు వచ్చినా ప్రాధాన్యంగా తీసుకోరు. 40 ఏళ్లు దాటాక మెల్లగా ఆలోచించటం మొదలుపెడతారు. అక్కడి నుంచి మరో 15–20 ఏళ్లే ఉండడంతో, ఇక తప్పదులే అనుకుని ఆదాయంలో కొంత పక్కన పెట్టడం ఆరంభిస్తారు. దీర్ఘకాల లక్ష్యాల విషయంలో ఈ వాయిదానే పెద్ద ప్రతికూలమన్నది చాలా మంది తెలుసుకోరు. 20–30ల నుంచి పెట్టుబడి ఆరంభిస్తేనే అది పెద్ద నిధిగా మారుతుంది. వాస్తవానికి రిటైర్మెంట్ ప్రణాళిక ఫెయిలవటానికి ప్రధాన కారణం పెట్టుబడిని ఆలస్యంగా మొదలు పెట్టడమే. త్వరగా మొదలు పెడితే చక్ర వడ్డీ ఫలితంగా (కాంపౌండింగ్) అది పెద్ద మొత్తమవుతుందన్నది గుర్తించకపోవటమే.అవగాహన లేమి..ప్రైవేటు రంగంతోపాటు, అసంఘటిత రంగంలోని వారికి సామాజిక భద్రత తక్కువే. ఉద్యోగుల భవిష్యనిధి లేదా ఫిక్స్డ్ డిపాజిట్లపై రాబడి 7–8 శాతమే. ఇందులో 6 శాతం ద్రవ్యోల్బణం తీసివేస్తే మిగిలేది ఎంత? కొంత మంది బీమా పాలసీల్లో (ఎండోమెంట్, యులిప్) ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఎండోమెంట్ ప్లాన్లలో దీర్ఘకాల రాబడి 4–5 శాతం మించదు. యూనిట్ లింక్డ్ ప్లాన్లలోనూ (యులిప్) రాబడి 8–9 శాతమే. తమకున్న ప్రాపర్టీ ఆదుకుంటుందిలే? అన్నది కూడా అవగాహన లేమే. ఒక్క చిన్న వివాదంతో ప్రాపర్టీ ఏళ్ల కొద్దీ అపరిష్కృతంగా ఉండిపోగలదు.వృద్థాప్యంలో తమ అవసరాలను చూసుకోవడానికి పిల్లలు ఉన్నారుగా? ఇలాంటి ఆలోచనలు.. 60 తర్వాత 20–30 ఏళ్ల ప్రశాంత జీవనానికి సోపానాలు కానే కావు.అత్యాధునిక వైద్య విధానాలతో ఆయుర్దాయం (జీవనకాలం) పెరుగుతోంది. వైద్య వ్యయాలు కూడా ఏటేటా రెండంకెల స్థాయిలో పెరుగుతుండడం చూస్తున్నాం. వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలకు పెద్ద మొత్తమే ఖర్చు చేయాల్సి రావొచ్చు. ఒక్కసారి ఆసుపత్రిలో చేరితే రూ.లక్షల పొదుపు కరిగిపోవచ్చు. ఇక మనలో కొంత మంది అయితే విశ్రాంత జీవన నిధిని పిల్లల విద్యావసరాలకు ఖర్చు పెట్టేస్తుంటారు. ఇది చేయరాని తప్పు. ఆలస్యం అమృతం విషం..25 ఏళ్లకు, 30 ఏళ్లకు, 40 ఏళ్లకు మధ్య పెద్ద వ్యత్యాసం లేకపోవచ్చు. కానీ సంపద సమకూర్చుకోవడంలో ఎంతో తేడా వస్తుంది. నెలకు రూ.15,000 చొప్పున 25 ఏళ్ల నుంచి మొదలు పెట్టి 60వ ఏట వరకు 10 శాతం వార్షిక రాబడి (సగటు) వచ్చే ఈక్విటీ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారనుకుందాం. 35 ఏళ్లలో రూ.5.14 కోట్లు (రూ.514 లక్షలు) సమకూరుతుంది. ఇందులో అసలు పెట్టుబడి రూ.60 లక్షలే.ఐదేళ్లు ఆలస్యంగా 30వ ఏట నుంచి మొదలు పెట్టి 60 వరకు 30 ఏళ్ల పాటు ఇంతే మేర పొదుపు చేస్తే సమకూరేది రూ.3.12 కోట్లు. ఐదేళ్లు ఆలస్యం చేయడం వల్ల రూ.2 కోట్ల నిధిని కోల్పోయినట్టు అవుతుంది. ఇంకో పదేళ్లు ఆలస్యంగా 40 ఏళ్లలో మొదలు పెడితే.. 20 ఏళ్లలో ఇదే రూ.15,000తో సమకూరేది కోటీ ఎనిమిది లక్షల రూపాయలు. ఎంత కావాలి..?ఒక వ్యక్తికి నేడు నెలవారీ రూ.50,000 ఖర్చు అవుతుంటే.. 25 ఏళ్ల తర్వాత అదే మాదిరి జీవన అవసరాలకు నెలకు రూ.2 లక్షలు అవసరమవుతుంది. ఏటా 6 శాతం ద్రవ్యోల్బణం ఆధారంగా వేసిన అంచనా ఇది. నెలకు రూ.2 లక్షల ఆదాయం రూ.4–5 కోట్ల నిధిపైనే సాధ్యం. మరి రూ.5 కోట్ల నిధిని సమకూర్చుకోవడం మధ్య తరగతి వారికి ఐదు, పదేళ్లలో సాధ్యమేనా..? కనీసం ఇంత అవసరం..ఆర్జన ఆరంభించిన మొదటి నెల నుంచే 20–25 శాతాన్ని రిటైర్మెంట్ ఫండ్ కోసం ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాలి. ఈక్విటీ ఫండ్స్లో ప్రతినెలా సిస్టమ్యాటిక్ ప్లాన్ (సిప్) ద్వారా ఈ మొత్తాన్ని పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఏటా ఆదాయ వృద్ధికి సమానంగా రిటైర్మెంట్ ఫండ్ పెట్టుబడిని పెంచుకుంటూ వెళ్లాలి. ప్రతి నెలా ఇంటి అద్దె, గ్రోసరీ, యుటిలిటీ (బ్రాడ్బ్యాండ్, మొబైల్, విద్యుత్) కేటాయింపులు ఎలా తప్పనిసరో.. పిల్లల ఉన్నత విద్య, రిటైర్మెంట్ నిధి కోసం నిర్ణీత మొత్తాన్ని పక్కన పెట్టుకోవడం కూడా అంత అవసరం. లేదంటే ఒక లక్ష్యం కోసం మరో లక్ష్యం విషయంలో రాజీపడాల్సి వస్తుంది.రిటైర్మెంట్ నాటికి సమకూర్చుకున్న నిధిని మూడు భాగాలు చేసుకోవాలిస్వల్పకాల అవసరాలు, ఆరోగ్య అత్యవసరాల్లో వెంటనే తీసుకునేందుకు వీలుగా (రెండేళ్ల అవసరాలకు సరిపడా) ఒక భాగం ఏర్పాటు చేసుకోవాలి. దీనికోసం లిక్విడిటీ (వెంటనే నగదుగా మార్చుకునే) ఎక్కువగా ఉండే లిక్విడ్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్, మనీ మార్కెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి.3–10 ఏళ్ల అవసరాల కోసం ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇక పదేళ్లకు మించిన అవసరాల కోసం మరో భాగం ఏర్పాటు చేసుకోవాలి. ఈ పెట్టుబడుల విషయంలో కొంత రిస్క్ తీసుకోవచ్చు. ఈక్విటీ ఫండ్స్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్)లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల దీర్ఘకాల నిధి ద్రవ్యోల్బణాన్ని మించి ఎక్కువగా కాంపౌండ్ అవుతుంది.వాస్తవాలు ఇవీ..రిటైర్మెంట్ కోసం తాము మరింత ముందు నుంచే ఎందుకు ఇన్వెస్ట్ చేయలేదు? అని 50 ఏళ్లు దాటిన వారిలో 90 శాతం మంది ఇప్పుడు పశ్చాత్తాపం చెందుతున్నట్టు ఒక సర్వేలో వెల్లడైంది.రిటైర్మెంట్ ప్రణాళిక కలిగిన వారు 2025 నాటికి 37 శాతమే. అంటే ప్రతి ముగ్గురిలో ఇద్దరు ఈ విషయంలో ప్రణాళికలేమితో ఉన్నట్టు తెలుస్తోంది.తమ పొదుపు నిధి రిటైర్మెంట్ తర్వాత పట్టుమని పదేళ్లు అయినా చాలుతుందో, లేదోనని 63 శాతం మంది ఆందోళన చెందుతున్నారు.పట్టణాల్లో సగం మంది రిటైర్మెంట్ కోసం ముందు నుంచే పెట్టుబడి పెట్టేందుకు ప్రాధాన్యం చూపిస్తున్నారు. కానీ, 40 శాతం మంది విశ్రాంత జీవనం కోసం అసలు పెట్టుబడే మొదలు పెట్టలేదు.ప్రణాళిక మొదలు పెట్టిన వారిలోనూ కేవలం 37 శాతమే సమకూర్చుకోవాల్సిన నిధిలో పావు శాతం లక్ష్యానికి చేరారు. రిటైర్మెంట్ కోసం పొదుపు చేస్తున్న వారిలో జీవిత బీమానూ పరిగణనలోకి తీసుకుంటున్నవారు 95 శాతంగా ఉన్నారు.అత్యంత ముఖ్యమైన నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) పథకం గురించి 64 శాతం మందికి తెలిసినా.. అందులో ఇన్వెస్ట్ చేస్తున్న వారు 16–25 శాతం మించిలేరు.ఇక రిటైర్మెంట్ కోసం పక్కన పెడుతున్న వారిలో కూడా జీవించినంత కాలం ఆ నిధి సరిపోతుందన్న నమ్మకంతో ఉన్నవారు 19 శాతం మందే.ఈ ఫలితాలు విశ్రాంత జీవన అవసరాలకు చాలా ముందుగా సన్నద్ధం కావాల్సిన అవసరాన్ని తెలియజేస్తున్నాయి.ఇదీ చదవండి: అమెరికా డ్రీమ్ Vs రియాలిటీ -
ఖర్చులకు కళ్లెం వేద్దాం!
ఒకప్పుడు విలాసం అనుకున్నవన్నీ ఇప్పుడు అవసరాలైపోయాయి. స్మార్ట్ఫోన్లు, కార్లు, లాప్టాప్లు, ఏటా ఒకటిరెండు సార్లు వైద్య పరీక్షలు, విహార యాత్రలు... ఇవన్నీ ఇపుడు జీవితంలో భాగమైపోయాయి. ఇక కొంచెం ఆదాయం పెరిగిందంటే వీటన్నిట్లోనూ ‘బెటర్మెంట్’ తప్పదనిపిస్తుంది. మెరుగైన ఫోన్లు, ఆధునిక ల్యాప్టాప్లు, సురక్షితమైన కార్లు, నాణ్యమైన చదువు, నమ్మకమైన ఆరోగ్య సంరక్షణ, డిజిటల్ సబ్స్క్రిప్షన్లు, విదేశీ విహారాలు ఇవన్నీ అప్గ్రేడెడ్ వెర్షన్లతో అవసరాలుగా మారి మనముందు కూర్చుంటున్నాయి. ఆదాయం పెరిగినప్పుడు సరే!!. కానీ ఆదాయం తక్కువ ఉన్నా కూడా వీటికోసం పరుగులుపెట్టి ఖర్చులు చేస్తేనే సమస్య. ఈ సమస్య ఇపుడు పెరుగుతోంది. పెద్దదవుతోంది. కుటుంబాలను ఒత్తిడిలోకి నెడుతోంది. మరేం చేయాలి? ఇదిగో ఈ వెల్త్ స్టోరీ చూడండి...మనకు, మన ఆదాయానికి తగ్గట్లుగా జీవన శైలిని పెంచుకోవటం తప్పు కాదు. కానీ పరిమితు లు లేకుండా పెంచుకుంటూ పోతేనే సమస్య. అందుకే లైఫ్స్టయిల్ను తెలివిగా నియంత్రించుకోవటం తప్పనిసరి. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవటం... అవసరాలను స్పష్టంగా వర్గీకరించుకోవటం... స్వీయ పరిమితులు విధించుకోవటం ఎలాగో చూద్దాం. ద్రవ్యోల్బణం.. సైలెంట్ కిల్లర్ ఆదాయం పెరుగుతున్నప్పుడు లైఫ్స్టయిల్పరమైన ద్రవ్యోల్బణం పెరుగుతుంటుంది. ఖర్చు చేయడమనేది నిశ్శబ్దంగా, చాలా వేగంగా పెరిగిపోతుంది. జీతం పెరగ్గానే ఆటోమేటిక్గా పెంచుకునేవి కొన్ని ఉంటాయి. అవేంటంటే.. → మరింత పెద్ద ఇల్లు, మరింత ఎక్కువ అద్దె → కారును అప్గ్రేడ్ చేసుకోవడం లేదా ఈఎంఐలపై గ్యాడ్జెట్లు కొనుగోలు చేయటం. → మరింత తరచుగా బయట తినటం, ఫుడ్ డెలివరీ సరీ్వసులను ఆశ్రయించటం. → జిమ్తో పాటు అనేక ఓటీటీలు, యాప్లు సబ్స్క్రయిబ్ చెయ్యటం. వాస్తవానికి వీటిని విడివిడిగా చూస్తే ఒక్కో దానిపై చేసే ఖర్చు సముచితమైనదిగానే అనిపిస్తుంది. కానీ వాటన్నింటినీ కలిపి చూస్తే మాత్రం మనకు తెలియకుండానే పొదుపు సామర్థ్యం తగ్గిపోతున్న విషయం అర్థమవుతుంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఎక్కువగానే సంపాదిస్తున్నప్పటికీ చాలా కుటుంబాలు, తక్కువగా పొదుపు చేస్తుండటానికి ప్రధాన కారణం ఇదే. ‘అవసర ఖర్చుల’ భ్రమ .. అవసరమనే పేరుతో ఇప్పుడు చేసే చాలా మటుకు ఖర్చులు, నిజంగా అవసరమైనవేనా అంటే సరైన సమాధానం దొరకదు. ఉదాహరణకు స్మార్ట్ఫోన్ అనేది అవసరం. కానీ ప్రతి సంవత్సరం వేలకు వేలు పోసి దాన్ని అప్గ్రేడ్ చేసుకోవడం అవసరమేనా? అలాగే అప్పుడప్పుడు బయట హోటళ్లలో తినడం సాధారణమే. కానీ అది ఎంత తరచుగా జరుగుతోందనేది ముఖ్యం. విహారయాత్రలు ము ఖ్యమే. కానీ ఎంత తరచుగా వెళ్తున్నాం? ఎంత ఖర్చు పెడుతున్నాం? అనేది అత్యంత ప్రధానం. ఖర్చులనేవి సమస్య కాదు. హద్దులు లేకపోవడమే అసలు సవాలు. ఏం చేయాలంటే.. జీవన విధానానికి పెద్దగా ఇబ్బంది లేకుండానే ఖర్చులను అదుపు చేసుకునేందుకు కొన్ని మార్గాలు ఉంటాయి. అవేంటంటే.. → పరిమితి విధించుకోవడం జీవన వ్యయాలనేవి ఆదాయానికి మించిన వేగంతో పెరగకూడదు. పాటించాల్సిన సింపుల్ రూల్ ఏమిటంటే, ఆదాయం 10 శాతం పెరిగితే, లైఫ్స్టయిల్ ఖర్చులు 5–6 శాతానికి మించి పెరగకుండా చూసుకోవాలి. → పొదుపును ఆటోమేట్ చేయాలి ఖర్చు చేయడానికి ముందు పొదుపు చేయాలి. దీనితో లైఫ్స్టయిల్ ఖర్చులు ఆటోమేటిక్గా దానికి తగ్గట్లు సర్దుకుంటాయి. → ఒక్కొక్కటిగా అప్గ్రేడ్ ఇల్లు, కారు, గ్యాడ్జెట్లు ఇలాంటి వాటన్నింటినీ ఒకేసారి అప్గ్రేడ్ చేయడం పెట్టుకోవద్దు. ఒక్కొక్కటిగా చేసుకుంటే కాస్త వెసులుబాటు లభిస్తుంది. → సబ్్రస్కిప్షన్లను సరిచూసుకోవాలి.. ఉపయోగించని వాటిని క్యాన్సిల్ చేసేయాలి. దీనివల్ల గణనీయంగా ఆదా అవుతుంది. మూడు కేటగిరీలు.. వృధా ఎక్కడవుతోందో గ్రహించాలంటే మనం చేసే ఖర్చులను తప్పనిసరైనవి, లైఫ్స్టయిల్ని బట్టి ఉండేవి, లీకేజీలనే మూడు కేటగిరీల కింద విడగొట్టుకోవాలి. వాటిని ఒకసారి విశ్లేషించి చూసుకుంటే, ఎక్కడ ఖర్చు చేయాలి, ఎక్కడ కట్టడి చేసుకోవాలనే దానిపై అవగాహన వస్తుంది. లైఫ్స్టయిల్ని బట్టి సరిదిద్దుకునేవి కాస్త స్మార్ట్గా వ్యవహరిస్తే ఈ కింది వాటిని కొంత కంట్రోల్ చేసుకోవడానికి వీలుంటుంది. → బయట హోటళ్లలో తినడం → విహార యాత్రలు → సబ్స్క్రిప్షన్లు→ అప్గ్రేడెడ్ గ్యాడ్జెట్లు → తరచుగా వాహనాలను అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండటంతప్పనిసరైన ఖర్చులు ఇలాంటివి జీవిత నాణ్యతను మెరుగుపరుస్తాయి. వీటి విషయంలో రాజీపడే పరిస్థితి ఉండదు. → విద్య → ఆరోగ్య సంరక్షణ → ప్రాథమిక హౌసింగ్ → బీమా → నిత్యావసరాలులీకేజీలు అదనంగా ఎలాంటి ప్రయోజనం లభించకుండా చేసే ఖర్చులు ఈ బకెట్ కిందికి వస్తాయి. → ఉపయోగించని సబ్స్క్రిప్షన్లు, అడ్డదిడ్డంగా ఆన్లైన్లో షాపింగ్ → క్రెడిట్ కార్డ్ బాకీలను రోలోవర్ చేస్తుండటం. → ఖర్చు చేస్తున్నామని గ్రహించకుండానే కన్వీనియెంట్గా చేసే వ్యయాలురియాలిటీ చెక్ లైఫ్స్టయిల్కి సంబంధించి అప్గ్రేడ్స్ చేసుకోవడంలో తప్పేమీ లేదు. కోరుకున్నట్లుగా, బాగా జీవించాలనుకోవడమేమీ తప్పిదం కూడా కాదు. కాకపోతే, అడ్డూ అదుపూ లేకుండా లైఫ్స్టయిల్ ఖర్చులను పెంచుకోవడమే తప్పు. రేపటి రోజున వచ్చే ఆదాయాన్ని నేడే ఖర్చు చేసేయకుండా జాగ్రత్తపడితేనే ఆర్థికంగా నిశ్చింతగా ఉంటుంది. ఇందుకోసం ఆదాయంలో ఖర్చులకు చేసే కేటాయింపుల విషయంలో పాటించతగిన సింపుల్ సూత్రం ఒకటి ఉంది. → 50%– తప్పనిసరి అవసరాలు → 30% – లైఫ్స్టయిల్, కోరికలు → 20% – పొదుపు, పెట్టుబడులు. లైఫ్స్టయిల్ ఖర్చులు 40 శాతాన్ని దాటాయంటే, పొదుపు కేటాయింపులు ఆటోమేటిక్గా పడిపోతాయి. -
అది బంగారాన్ని మించిపోతుంది..: కియోసాకి
బిట్ కాయిన్ ధర కీలక మద్దతు స్థాయికి చేరువ కావడంతో మార్కెట్లో ఆందోళన పెరిగింది. బిట్ కాయిన్ ధర ఇటీవల 60,000 డాలర్ల వద్ద ఉన్న దిగువ అంచును తాకింది. ఈ పరిణామంతో పలువురు పెట్టుబడిదారులు మరింత పతనం సంభవిస్తుందని అంచనా వేస్తున్న వేళ, ప్రముఖ ఇన్వెస్టర్, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) మాత్రం విభిన్న నిర్ణయం తీసుకున్నారు.ధరలు పడిపోతున్న సమయంలోనే సుమారు 67,000 డాలర్ల వద్ద మరో పూర్తి బిట్ కాయిన్ను కొనుగోలు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ నిర్ణయానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని తెలిపారు. అమెరికా ప్రభుత్వ రుణభారం పెరుగుతున్న నేపథ్యంలో డాలర్పై ఒత్తిడి అధికమవుతుందని, దాని ఫలితంగా భారీ స్థాయిలో డబ్బు ముద్రణ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దీనినే ఆయన “బిగ్ ప్రింట్”గా పేర్కొన్నారు.ఇక బిట్ కాయిన్ ప్రత్యేకత దాని పరిమిత సరఫరా అని కియోసాకి గుర్తుచేశారు. గరిష్టంగా 21 మిలియన్ నాణేలు మాత్రమే ఉండేలా రూపొందించిన ఈ డిజిటల్ ఆస్తి సరఫరాను ఏ కేంద్ర అధికారం పెంచలేనని తెలిపారు. ప్రతి కొత్త బిట్ కాయిన్ ముందే నిర్ణయించిన వేగంతోనే మార్కెట్లోకి ప్రవేశిస్తుందని, తుది నాణేల మైనింగ్కు దగ్గరపడే కొద్దీ దాని కొరత మరింత స్పష్టమవుతుందని పేర్కొన్నారు.దీర్ఘకాలంగా కరెన్సీ బలహీనతకు వ్యతిరేకంగా బంగారాన్ని సురక్షిత ఆశ్రయంగా భావిస్తున్నన్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో బిట్ కాయిన్ బంగారాన్ని మించిపోవచ్చని కియోసాకి వాదిస్తున్నారు. పెరుగుతున్న ప్రభుత్వ రుణాలు, కేంద్ర బ్యాంకుల విధానాల నేపథ్యంలో కొరత గల ఆస్తుల ప్రాధాన్యం మరింత పెరుగుతుందని ఆయన విశ్లేషించారు.Although Bitcoin is crashing I bought one more whole Bitcoinfor $67k.Why? Two reasons: # 1: Because the Big Print will begin when the US debt crashes the dollar and “The Marxist Fed” begins printing trillions in fake dollars.#2: The magical 21 millionth Bitcoin is…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 20, 2026 -
ఎక్కువ జీతాలొచ్చేవారికి ఐటీ నోటీసులు!!
భారీ జీతాలు పొందుతున్న కొంతమంది ఉద్యోగులకు ఆదాయపు పన్ను శాఖ నుంచి ‘నడ్జ్’ నోటీసులు అందుతున్నాయి. వెల్లడించని ఆస్తి ఆదాయం, క్రిప్టో లాభాలు, ఈఎస్ఓపీ లాభాలు, విదేశీ ఆదాయం వంటి అంశాల్లో లోపాలను సరిదిద్దుకునేందుకు వీటిని జారీ చేస్తున్నారు. కఠిన చర్యలకు ముందుగా స్వచ్ఛందంగా తప్పులు సరిచేసుకునేందుకు ఇది చివరి అవకాశమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.ఒకే రాజకీయ పార్టీకి లేదా వివిధ స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు ఇవ్వడానికి పలువురు పన్ను చెల్లింపుదారులు ఒకే చార్టర్డ్ అకౌంటెంట్ సేవలు వినియోగిస్తున్న నమూనాను శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో సంబంధిత సీఏలపై కూడా ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.బహుళజాతి సంస్థల సీఈవోలు, మేనేజింగ్ డైరెక్టర్లు సహా ఉన్నతాధికారులకు ఈ సూచనలు పంపినట్లు తెలిసింది. జరిమానాలు విధించే ముందు లోపాలను సవరించుకోవాలని శాఖ కోరుతోంది.ఈ అంశాల్లో వ్యత్యాసాలువిదేశీ ఆస్తులు, విదేశీ ఆదాయాన్ని ప్రకటించకపోవడం, స్టాక్-లింక్డ్ ప్రోత్సాహకాలను తక్కువగా చూపించడం, గృహ, ప్రయాణ భత్యాలను పెంచి పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గించడం, విదేశీ క్లయింట్ల నుంచి క్రిప్టో రూపంలో ద్వితీయ వేతనాలు పొందడం, గుర్తింపు లేని లేదా ఎన్నికల్లో పోటీ చేయని రాజకీయ పార్టీలకు భారీ విరాళాలు ఇవ్వడం వంటి వ్యత్యాసాలను అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.డేటా విశ్లేషణతో గుర్తింపుప్రస్తుత అసెస్మెంట్ సైకిల్లో అధిక ఆదాయ వర్గాల ఐటీఆర్లను తీవ్రంగా సమీక్షించినప్పుడు ఈ వ్యత్యాసాలు బయటపడ్డాయి. ‘గైడ్ అండ్ ఎనేబుల్’ (నడ్జ్) ప్రచారంలో భాగంగా సవరించిన ఐటీఆర్లు దాఖలు చేయాలని శాఖ సూచిస్తోంది.ఆటోమేటెడ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్లు, పాన్ ఆధారిత ట్రాకింగ్ ద్వారా విదేశీ లావాదేవీల సమాచారం ప్రభుత్వానికి అందుతున్నందున తక్కువగా నివేదించడం కష్టమవుతోందని అధికారులు చెబుతున్నారు.నడ్జ్ నోటీసు అంటే ఏమిటి?ఇది డీఐఎన్ నంబర్తో కూడిన అధికారిక నోటీసు కాదు. కేవలం లోపాలు ఉన్నాయేమో పరిశీలించమనే సూచన మాత్రమే. ఐటీఆర్లో ప్రకటించిన ఆదాయం, ఆస్తులు సరైనవేనని నమ్మకం ఉంటే, డీఐఎన్ నంబర్తో అధికారిక నోటీసు అందే వరకు ఆందోళన అవసరం లేదు.డేటా అనలిటిక్స్ ఆధారంగా ఐటీఆర్లో చూపిన ఆదాయం, టీడీఎస్ వివరాలు, ఇతర లావాదేవీ డేటా మధ్య వ్యత్యాసాలు గుర్తించబడుతున్నట్లు చార్టర్డ్ అకౌంటెంట్ సురేష్ సురానా చెబుతున్నారు.ట్యాక్స్ పేయర్స్ ఏం చేయాలంటే..సంబంధిత ఆర్థిక సంవత్సరాల రిటర్నులను సమీక్షించాలిపూర్తి లావాదేవీ వివరాలు సేకరించాలిఅవసరమైతే సెక్షన్ 139(8A) కింద నవీకరించిన రిటర్న్ (ఐటీఆర్-యు) దాఖలు చేయాలివడ్డీతో పాటు అదనపు పన్ను చెల్లించాలిఇలా చేయడం ద్వారా తదుపరి విచారణ, జరిమానాలు లేదా ప్రాసిక్యూషన్ వంటి కఠిన చర్యల నుండి తప్పించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. -
ఈపీఎఫ్ వడ్డీ.. ఈసారైనా పెరుగుతుందా?
ఎంప్లాయూస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) వడ్డీ ఈసారైనా పెరుగుతుందా? అని వేతన జీవులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈపీఎఫ్ఓ 2026 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.25 శాతంగా యథాతథంగా కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి 2న జరిగే కీలక సమావేశంలో తుది నిర్ణయం వెలువడనుంది. ప్రతిపాదన ఆమోదం పొందితే, వరుసగా మూడో ఏడాది కూడా చందాదారులు 8.25 శాతం వడ్డీ పొందే పరిస్థితి ఉంటుంది.సుమారు రూ.28 లక్షల కోట్ల కార్పస్ను నిర్వహిస్తున్న ఈపీఎఫ్ఓ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ద్వారా సరిపడా ఆదాయం సమకూర్చుకున్నట్లు సమాచారం. దీంతో వడ్డీ రేటును కొనసాగించడానికి ఆర్థికంగా వీలుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే భవిష్యత్తులో మార్కెట్ పరిస్థితులు, ఆదాయాలపై ఒత్తిడి పెరిగితే కొత్త పెట్టుబడి మార్గాలను అన్వేషించాల్సి రావచ్చని విశ్లేషణలు సూచిస్తున్నాయి.పెట్టుబడుల పంపిణీ పరంగా చూస్తే, 45–65 శాతం నిధులు ప్రభుత్వ సెక్యూరిటీల్లో, 20–45 శాతం ఇతర రుణ సాధనాల్లో, 5–15 శాతం ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ద్వారా ఈక్విటీల్లో, మిగిలినవి స్వల్పకాలిక రుణ సాధనాల్లో పెట్టుబడి పెడుతున్నారు. భద్రత, స్థిరత్వం, రాబడి.. ఈ మూడింటి మధ్య సమతుల్యత సాధించడమే లక్ష్యంగా ఈ మిశ్రమాన్ని అనుసరిస్తున్నారు.వడ్డీ రేటు ప్రతిపాదనను ఈపీఎఫ్ఓ అపెక్స్ బాడీ అయిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) చర్చించి ఆమోదించనుంది. ఈ బోర్డుకు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మండవీయ అధ్యక్షత వహిస్తున్నారు. గత అక్టోబర్లో జరిగిన సమావేశంలో ఉపసంహరణలు సులభతరం చేసే పలు సంస్కరణలు ప్రకటించిన సీబీటీ, ఈసారి కూడా సభ్యుల సేవలను మరింత సులభతరం చేసే అంశాలపై చర్చించే అవకాశముందని సమాచారం.దేశవ్యాప్తంగా ఆరు కోట్లకు పైగా చందాదారులకు 8.25 శాతం వడ్డీ రేటు స్థిరత్వం కల్పించనుంది. ఉదాహరణకు, ఖాతాలో రూ.5 లక్షలు ఉన్న సభ్యుడికి సంవత్సరానికి సుమారు రూ.41,250 వడ్డీ లభిస్తుంది (నెలవారీ నిల్వల ఆధారంగా మారవచ్చు). మార్చి 2 సమావేశం అనంతరం తుది నిర్ణయం అధికారికంగా ప్రకటించనున్నారు. ఆమోదం లభించిన వెంటనే, నిర్ణయించిన వడ్డీ రేటు ప్రకారం చందాదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. -
మెరుగైన రాబడులకు మార్గం
ఈక్విటీల్లో దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేసుకునే వారు.. వివిధ రకాల పథకాలను ఎంపిక చేసుకుంటూ ఉంటారు. ఎక్కువ మంది పోర్ట్ఫోలియోలో లార్జ్క్యాప్, మిడ్క్యాప్, స్మాల్క్యాప్ ఫండ్స్ కనిపిస్తుంటాయి. ఇలా భిన్న పథకాలకు కేటాయింపులు చేసుకునే బదులు.. ఒకే పథకం ద్వారా అన్ని విభాగాల్లోనూ పెట్టుబడులు పెట్టుకోవాలని భావించే వారికి ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. అంటే మార్కెట్ విలువ పరంగా ఇవి ఏదో ఒక విభాగానికే పరిమితం కాకుండా.. అన్ని రకాల అవకాశాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఈ విభాగంలో టాప్ ఫండ్స్లో హెచ్డీఎఫ్సీ ఫ్లెక్సీక్యాప్ ఫండ్ ఒకటి.రాబడులుఈ పథకంలో ఇన్వెస్ట్ చేసిన వారికి గడిచిన ఏడాది కాలంలో రాబడి 16.19 శాతం వచ్చింది. ఇక గడిచిన మూడేళ్లలో వార్షిక రాబడి 23.07 శాతం చొప్పున నమోదైంది. ఐదేళ్లలోనూ ఏటా 21.33 శాతం చొప్పున రాబడిని ఈ పథకం ఇన్వెస్టర్లకు అందించింది. ఇక ఈ ఫండ్ ఆరంభం నుంచి (1995) చూసుకున్నా.. వార్షిక రాబడి 16.78 శాతం చొప్పున ఉండడం గమనించొచ్చు. ఈ పథకంలో కనీసం రూ.100 నుంచి సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.పెట్టుబడుల విధానంఈ పథకం ఈక్విటీల్లో కనీసం 65 శాతం తగ్గకుండా, గరిష్టంగా 100 శాతం వరకు పెట్టుబడులు పెడుతుంది. లార్జ్క్యాప్స్, మిడ్క్యాప్, స్మాల్క్యాప్ మధ్య ఎలాంటి పరిమితులు లేకుండా.. మెరుగైన వృద్ధి అవకాశాలు ఏ విభాగంలో ఉంటే అక్కడ కేటాయింపులు పెంచే స్వేచ్ఛతో పనిచేస్తుంది.ఈక్విటీ పెట్టుబడుల విలువను ఊహించని షాక్ల నుంచి రక్షించుకునేందుకు పరిస్థితులకు అనుగుణంగా డెరివేటివ్స్ (ఫ్యూచర్, ఆప్షన్ కాంట్రాక్టులు) పొజిషన్లలోనూ కొంత ఇన్వెస్ట్ చేస్తుంటుంది. పరిస్థితులను బట్టి డెట్ సాధనాల్లో అరుదుగా (ఈక్విటీలు మరీ ఖరీదుగా మారినప్పుడు) 35 శాతం వరకూ ఇన్వెస్ట్ చేస్తుంది. రియల్ ఎస్టెట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్వెస్ట్)ల్లోనూ పెట్టుబడులు పెడుతుంటుంది. సగటు కంటే అధిక రాబడులు అందించాలన్నది ఈ పథకం ఉద్దేశం.పోర్ట్ఫోలియోప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.97,451 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో ఈక్విట్లీలో 82.12 శాతం ఇన్వెస్ట్ చేయగా, రియల్ ఎస్టేట్ సాధనాల్లోనూ 2.32 శాతం మేర పెట్టుబడి పెట్టింది. డెట్ సెక్యూరిటీల్లో కేవలం 0.53 శాతం పెట్టుబడులు ఉండగా, 15 శాతం మేర నగదు నిల్వలు ఉన్నాయి. మార్కెట్ వ్యాల్యూషన్లు ఆకర్షణీయంగా లేనప్పుడు ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ ఇలా చెప్పుకోతగ్గ స్థాయిలో నగదు నిల్వలు నిర్వహిస్తుంటాయి.ఈక్విటీ పెట్టుబడులను పరిశీలించగా.. ఇందులో 70 శాతం మేర లార్జ్క్యాప్ కంపెనీల్లోనే ఉన్నాయి. మిడ్క్యాప్ కంపెనీల్లో 4.25 శాతం, స్మాల్క్యాప్ కంపెనీల్లో 9.35 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసింది. రంగాల వారీ కేటాయింపులను పరిశీలించగా, అత్యధికంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీల్లో 47 శాతం, కన్జ్యూమర్ డిస్క్రీషినరీ కంపెనీల్లో 16.87 శాతం, టెక్నాలజీ కంపెనీల్లో 11.20 శాతం, హెల్త్కేర్ కంపెనీల్లో 8.18 శాతం, మెటీరియల్స్ కంపెనీల్లో 6.61 శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి. -
మ్యూచువల్ ఫండ్స్.. ‘కొత్త’ ఆఫర్స్!
ఓవైపు జీవిత బీమా భద్రత పొందుతూనే మరోవైపు సంపదను పెంచుకునేందుకు అవకాశం కలి్పస్తూ టాటా ఏఐఏ లైఫ్ కొత్తగా ఎన్హాన్స్డ్ వేల్యూ ఇండెక్స్ ఫండ్స్ని ఆవిష్కరించింది. ఎన్హాన్స్డ్ వేల్యూ ఇండెక్స్ ఫండ్, ఎన్హాన్స్డ్ వేల్యూ ఇండెక్స్ పెన్షన్ ఫండ్ వీటిలో ఉన్నాయి. ఇవి ప్రధానంగా వేల్యూ ఇన్వెస్టింగ్ పద్ధతిలో లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ కంపెనీల స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తాయి. టాటా ఏఐఏ యూనిట్ లింక్డ్ ప్లాన్ల ద్వారా వీటిని తీసుకోవచ్చు. పిల్లల చదువులు, అసెట్స్ సమకూర్చుకోవడం, దీర్ఘకాలిక ఆర్థిక భద్రత మొదలైన ప్రణాళికలకు మొదటి ఫండ్ ఉపయోగకరంగా ఉంటుంది. రిటైర్మెంట్ నిధిని ఏర్పర్చుకోవడానికి రెండోది పని చేస్తుంది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ ఫిబ్రవరి 16 వరకు అందుబాటులో ఉంటుంది. ఓల్డ్ బ్రిడ్జ్ ఫ్లెక్సి క్యాప్ ఫండ్ లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే ఈ ఫండ్ని ఓల్డ్ బ్రిడ్జ్ మ్యూచువల్ ఫండ్ ప్రవేశపెట్టింది. ఫిబ్రవరి 23 వరకు ఇది అందుబాటులో ఉంటుంది. బాటమ్–అప్ వ్యూహంతో దీర్ఘకాలిక పెట్టుబడి వృద్ధికి దోహదపడే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. అయిదేళ్లకు పైగా పెట్టుబడులు కొనసాగించే వారికి అనువైన ఫండ్. కనీసం రూ. 5,000 నుంచి, సిప్ అయితే రూ. 1,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. కేవలం మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా పెట్టుబడులను కేటాయించకుండా కంపెనీ వ్యాపార నాణ్యత, వృద్ధి అవకాశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. బీఎస్ఈ 500 టీఆర్ఐ దీనికి ప్రామాణికంగా ఉంటుంది. -
పన్నుల ముసాయిదాలోని ‘‘ప్రమోదం’’
కొత్త ఇన్కం టాక్స్ చట్టం వచ్చింది. ముసాయిదా నిబంధనలు–2026 విడుదల అయ్యాయి. ఈ ఫిబ్రవరి 22 తేదీ వరకు సలహాలు స్వీకరిస్తారు. ఆ తరువాత వాటిని అమలులోకి తెస్తారు. ఈ ముసాయిదా ప్రతిపాదనలు చిన్న చిన్న అస్సెస్సీలకు, ఉద్యోగస్తులకు ఎంతో ఊరట, ఉపశమనం కల్పిస్తాయి అనడంలో సందేహం లేదు. ముసాయిదాలోని ప్రతిపాదనలు ప్రమోదాన్ని తెస్తున్నాయి. వివరాల్లోకి వెళ్దాం... కేవలం వ్యక్తులకు సంబంధించిన వాటిని ప్రస్తావిస్తున్నాం....ఉద్యోగస్తులకు ఉపశమనంఉద్యోగికి జీతంతో పాటు అదనంగా లభించే వేతనేతర ప్రయోజనాలు/సౌకర్యాల పరిమితిని పెంచారు. కొత్తగా వచ్చే ఈ అదనపు ప్రయోజనాలతో లబ్ధి పొందేది అంతిమంగా ఉద్యోగస్తుడు. రెండు, మూడు దశాబ్దాలుగా వీటి జోలికెళ్లని డిపార్ట్మెంట్ ఇప్పుడు ఆచరణాత్మకంగా అడుగులేస్తోంది. యజమాని సమకూర్చే వాహనాల సామర్థ్యం ఆధారంగా మినహాయింపు ఇస్తారు. ఈ సదుపాయంతో డ్రైవర్ ఇవ్వడం లేదా ఇవ్వకపోవడం జరగొచ్చు. ఇంజిన్ సామర్థ్యం 1.6 లీటర్ దాటని సందర్భంలో ఇచ్చే మినహాయింపుని రూ.2,700 నుంచి రూ.8,000 లకు పెంచారు. కెపాసిటీ 1.6 లీటర్ దాటితే రూ.3,200 నుంచి రూ.10,000లకు పెంచారు.యజమాని ఇచ్చే భోజనం విలువ పరిమితిని ఒక్కొక్క భోజనానికి రూ.50 నుంచి రూ.200లకు పెంచారు. దాని విలువ ఏడాదికి లెక్కిస్తే మినహాయింపు విలువ రూ.1,05,000 దాకా వస్తుందని అంచనా.గిఫ్ట్ వోచర్ల విలువని రూ.15,000 లకు పెంచారు. ప్రస్తుతం వాటి విలువ రూ.5,000గా ఉంది. వడ్డీ లేని రుణాలు... వడ్డీ విలువ రూ.20,000 దాకా ఉంది. దాన్ని పదింతలు అంటే రూ.2,00,000 లకు పెంచారు.ఎడ్యుకేషన్ అలవెన్స్.. ఒక సంతనానికి నెలకి రూ.100 ఉంది. దానిని రూ.3,000లకు పెంచారు. విద్యార్థులకు హాస్టల్ అలవెన్సు పరిమితిని రూ.300 నుంచి రూ.3,000లకు పెంచారు.ప్రస్తుతం అమల్లో ఉన్న పరిమితులు దశాబ్దాల చరిత్ర కలిగినవి. కొంతమంది మరిచిపోయారు. కొంతమంది క్లెయిమ్ చేయడం మానేశారు. డిపార్ట్మెంట్ వారి ఆలోచనా విధానం సమకాలీన పరిస్థితులకు అద్దం పడుతోంది. ఈ పెంపుదల గణనీయం.. ఈ మేరకు ఉద్యోగస్తులకు ఎంతో పన్ను ఊరట కలుగుతుంది. పాన్తో తిప్పలు తప్పుతాయ్..! చేతిలో సెల్ఫోన్, బ్యాగులో ఆధార్కార్డు, పాన్ కార్డు లేకుండా బయటకు రాలేని పరిస్థితి. కొంతమంది జిరాక్సులు చేయించి సిద్ధంగా ఉంటారు. ప్రస్తుతం బ్యాంకులో నగదు డ్రా చేయాలంటే ఒక రోజులో రూ.50,000 దాటితే పాన్ తెలియచేయాలి. ఇక నుంచి డైయిలీ లిమిట్స్ ఉండవు. ఒక ఆర్థిక సంవత్సరం మొత్తంలో రూ.10,00,000 నగదు విత్డ్రా చేసినా, డిపాజిట్ చేసినా, ఈ పరిమితి రూ.10 లక్షలు దాటితేనే పాన్ వివరాలు ఇవ్వాలి. దీని వలన ఇల్లు కట్టిస్తున్నప్పుడు, ఏవైనా పెళ్లిళ్లు, కార్యాలున్నప్పుడు వ్యాపారంలో కొనుగోళ్లు, మెడికల్ ఎమర్జెనీ సందర్భాల్లో ఎంతో వెసులుబాటు ఉంటుంది. స్థిరాస్తి క్రయవిక్రయ సందర్భాల్లో రూ.10,00,000 ఉన్న పరిమితిని రూ.20,00,000లకు పెంచారు. అలాగే జాయింట్ డెవలప్మెంట్ సందర్భాల్లో రూ.20,00,000 లోపల ఎటువంటి ఇబ్బంది లేకుండా సాఫీగా వ్యవహారాలు జరుపుకోవచ్చు. అలాగే చిన్న, చిన్న మోటారు బైకులు కొనుగోలు సందర్భంలో విలువతో నిమిత్తం లేకుండా పాన్ అడిగేవారు. ఇక నుంచి రూ.5,00,000 దాటిన బండి కొంటేనే పాన్ అడుగుతారు. హోటల్, ఈవెంట్ల నిర్వహణ కోసం చెల్లించే మొత్తం రూ.1,00,000 దాటితేనే పాన్ సమర్పించాలి. ప్రస్తుతం ఈ పరిమితి రూ.50,000గా ఉంది. అయితే ఇవన్నీ ఒక దిశగా వెళ్లితే.., ఊరంతా ఒక దారి, ఉలిపికట్టెదొక దారి అన్నట్లు బీమా రంగంలో మాత్రం ఎటువంటి సడలింపు లేదు. పాన్ వాడకం సడలింపు విషయంలో డిపార్ట్మెంట్ని అభినందించాలి. సడలింపుల వలన ఎంతో సౌలభ్యం ఏర్పడుతుంది. కాలం వృథా కాదు. టాక్సుపేయర్ ఎప్పుడూ చట్టాన్ని, రూల్స్తో కలిసి చదివి నిర్ణయానికి రావాలి. ఈ రూల్స్ ప్రకారం మన తెలుగు ప్రజలలో హైదరాబాద్ ఉద్యోగస్తులకు ఒక తీపి కబురు. హైదారాబాద్ ఉద్యోగస్తులుఇంటి అద్దె అలవెన్సు మినహాయింపు ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా మినహా అన్ని ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగస్తులకు జీతం మీద 40% మాత్రమే ఉండేది. నిజానికి హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందింది. దానితో పాటు సదుపాయాలు, ఇళ్లు, అపార్ట్మెంట్లు ఇప్పు డు విల్లాలు.. కొంతమంది ఇండిపెండెంట్ ఇంటిలో ఉంటారు. అమలులో ఉన్న రూల్స్ ప్రకారం వారికి మినహాయింపు 40% మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు ఈ లిమిట్ అన్నీ 40% నుంచి 50 శాతానికి పెంచారు. దాని వలన హైదరాబాదులో ఎక్కువ అద్దె ఇచ్చే వారికి మంచి ఉపమశనం. అంతేకాకుండా ఈ వెసులుబాటు పూణే, అహ్మదాబాద్, బెంగళూర్కి వర్తిస్తుంది. వెనకోముందో ఉద్యోగస్తులకు ప్రమోదం కలిగించేలా ప్రతిపాదనలు ఉన్నాయి. అభినందనీయం..! -
ఉఫ్.. బిగ్ రిలీఫ్!
రాజ్యలక్ష్మి(68) రిటైర్డ్ గవర్నమెంట్ టీచరు. ఉండేది హైదరాబాద్లో. ఎఫ్డీని రెన్యువల్ చెయ్యడానికి బ్యాంకుకు వెళ్లారు. బ్యాంకు సిబ్బంది రెన్యువల్ చెయ్యకుండా... ఎఫ్డీని మించిన రాబడి కచ్చితంగా వస్తుందంటూ మార్కెట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్లో రూ.10 లక్షలు ఇన్వెస్ట్ చేయించారు. రెండేళ్లు గడిచాయి. మార్కెట్ పడిపోవడంతో ఆమె పెట్టుబడిలో 18 శాతం వరకూ పోయింది. ఎఫ్డీని మించిన రాబడి కచ్చితంగా వస్తుందన్నారు కదా? అంటూ బ్యాంకును నిలదీశారు. ‘‘మార్కెట్ లింక్డ్ సాధనాల్లో ఇవి సహజం. మీరూ ఒప్పుకుని సంతకం చేశారు కదా?’’ అని బ్యాంకు వాళ్లు చూపించటంతో లక్ష్మి హతాశురాలయ్యారు.ఇక వెంకటాచలం అయ్యర్ అనే 90 ఏళ్ల వ్యక్తికి ఏటా రూ.2 లక్షల ప్రీమియంతో 2124లో అంటే, వందేళ్ల తర్వాత మెచ్యూరయ్యే జీవిత బీమా పాలసీని అంటగట్టింది మరో బ్యాంకు. దీనిపై సోషల్ మీడియాలో నానా రచ్చ జరిగేసరికి సైలెంటుగా రిఫండ్ చేసేసింది. ఈ నేపథ్యంలో కస్టమర్లకుండే హక్కులను వివరించేదే ఈ వెల్త్ స్టోరీ..బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మనకు పనికిరాని, అనవసరమైన ఉత్పత్తుల్ని బలవంతంగా కొనిపించేదంతా మిస్–సెల్లింగే. దీన్నుంచి వినియోగదారులను కాపాడేందుకు రిజర్వ్ బ్యాంక్ తొలిసారి స్పష్టమైన చర్యలకు దిగింది. ‘రెస్పాన్సిబుల్ బిజినెస్ కండక్ట్ అమెండ్మెంట్ డైరెక్షన్స్ – 2026’ ముసాయిదా ప్రకారం మిస్ సెల్లింగ్ రుజువైతే, కస్టమర్ల దగ్గరనుంచి వసూలు చేసిన డబ్బు మొత్తాన్ని బ్యాంకులు వాపసు చేయాలి. సదరు ప్రోడక్టు విక్రయాన్ని రద్దు చేయాలి. ఈ ఏడాది జులై 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశమున్న ఈ నిబంధనలతో మిస్–సెల్ చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత బ్యాంకులపై పడుతుంది.మిస్–సెల్లింగ్ ఇదీ...రిజర్వ్ బ్యాంక్ తొలిసారిగా మిస్–సెల్లింగ్కంటూ స్పష్టమైన నిర్వచనాలిచ్చింది. అవేంటంటే...కస్టమర్ ప్రొఫైల్కి అనువుగా లేని ఉత్పత్తులను విక్రయించటంపూర్తిగా, లేక సరైన వివరాలు ఇవ్వకుండా అమ్మడంబండిల్గా ప్రోడక్టులను అంటగట్టడంకస్టమరు నుంచి స్పష్టమైన సమ్మతి తీసుకోకుండానే విక్రయించడంఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కస్టమరు ఒకవేళ అన్ని డాక్యుమెంట్స్పై సంతకాలు చేసినా, ప్రోడక్టు గానీ అనువైనది కాకపోతే అది మిస్–సెల్లింగ్ కిందికే వస్తుంది. ఇప్పటివరకు కస్టమర్ల సంతకాలు, డిజిటల్ క్లిక్లు అనే లూప్హోల్ని అడ్డం పెట్టుకుని, బయటపడిపోయిన బ్యాంకులు ఇకపై అలాంటివి చేయటానికి కుదరదు. ఆర్బీఐ కొత్త ఫ్రేమ్ వర్క్ ప్రకారం రాజ్యలక్ష్మి ఎదుర్కొన్నది మిస్ సెల్లింగే. ఎందుకంటే ఆమె వయస్సు, రిస్కు సామర్థ్యాల రీత్యా మార్కెట్లో భారీ పెట్టుబడులు పెట్టడం రిస్కీ వ్యవహారమే. పెట్టుబడికి కూడా హాని ఉంటుందనే విషయం సరిగ్గా చెప్పకుండా ఆమెకు అరకొర సమాచారమే ఇచ్చి ఉండొచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ఆమెకు పూర్తి రిఫండ్ చేయాల్సి ఉంటుంది.బలవంతంగా బండిల్ చేయొద్దు..రుణం ఇవ్వాలంటే ఆ రుణానికి బీమా తీసుకోవాలంటూ బ్యాంకులు లింకు పెట్టడం సహజం. ఇదే బండ్లింగ్. ఒకటి కావాలంటే మరొకటి కూడా జత కలపటం. ఆర్బీఐ ముసాయిదా నిబంధనల ప్రకారం...రుణం కోసం తప్పనిసరిగా తాము చెప్పే బీమా పాలసీని తీసుకోవాల్సిందే అంటూ బ్యాంకులు ఒత్తిడి చేయడానికి ఉండదు.నచ్చిన ఏ కంపెనీ నుంచైనా థర్డ్ పార్టీ ప్రోడక్టులను కొనుక్కునేందుకు కస్టమర్లకు స్వేచ్ఛ ఉంటుంది.కస్టమర్లు స్పష్టంగా సమ్మతించకుండా, రుణ మొత్తం నుంచి బీమా లేదా ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్టులకు సంబంధించిన డబ్బును కట్ చేసుకోవడానికి ఉండదు. కస్టమర్ల సమ్మతి అనేది నిర్దిష్టంగా ఉండాలి. పూర్తి వివరాలు తెలుసుకుని ఇచ్చినట్లుగా ఉండాలి. అస్పష్టత ఉండకూడదు.వివిధ ప్రోడక్టులన్నింటికీ కలిపి ఒకే ఫారంలో లేదా డిజిటల్ చెక్బాక్స్ ద్వారా సమ్మతి తీసుకోవడానికి కుదరదు. ప్రతి ప్రోడక్టుకు విడిగా అప్రూవల్ తీసుకోవాల్సిందే. డిజిటల్ ‘డార్క్ ప్యాటర్న్స్’ కట్టడిబ్యాంకులు ఇకపై కస్టమర్లను మభ్యపెట్టే ‘డార్క్ ప్యాటర్న్స్’లాంటి డిజిటల్ మాయవేషాలు వేయడానికి ఉండదు. ఈ డార్క్ ప్యాటర్న్స్ ఏమిటంటే..ఇదిగో మరికాసేపట్లోనే ఆఫర్ ముగిసిపోతుంది, త్వరపడకపోతే నష్టపోతారనే విధంగా కంగారు పెట్టేయడం ముందే యాడ్–ఆన్స్ని సెలెక్ట్ చేసేసి ఉంచడంప్రీ–అప్రూవ్డ్ క్రెడిట్ కార్డులంటూ ఇచ్చేసి, కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్లలాంటివి అంటగట్టడంపేమెంట్ దశవరకు ఇతర చార్జీల గురించి చెప్పకుండా దాచి పెట్టి ఉంచడంఅన్సబ్స్క్రయిబ్ చేసేందుకు సంబంధించిన ఆప్షన్లు గందరగోళంగా ఉండటంఇలాంటివి చేయకుండా కేంద్రీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థ మార్గనిర్దేశకాలను బ్యాంకులు తప్పనిసరిగా పాటించాలి. తమ యూజర్ ఇంటర్ఫేస్లను తరచుగా ఆడిట్ చేసుకుంటూ ఉండాలి. దీనితో యాప్–ఆధారిత బ్యాంకింగ్లో పారదర్శకత గణనీయంగా మెరుగుపడుతుంది. టార్గెట్లే మిస్–సెల్లింగ్కి మూలం..అసలు మిస్–సెల్లింగ్కి మూలకారణం ఉద్యోగులకు ఉండే భారీ సేల్స్ టార్గెట్లు, ప్రోత్సాహకాలే. కాబట్టి ఇకపై బ్యాంకులు ఏవి చేయకూడదో ఆర్బీఐ స్పష్టంగా పేర్కొంది. అవి...సేల్స్ కోసం అంతర్గతంగా పోటీ పెట్టడంస్పెషల్ ‘టార్గెట్ డేస్’ని నిర్దేశించడంఎలాగైనా ప్రోడక్టును అంటగట్టేలా ప్రోత్సహించే ప్రోత్సాహకాల విధానాలుథర్డ్ పార్టీ ప్రోడక్టులను విక్రయించే ఉద్యోగులు నేరుగా గానీ పరోక్షంగా గానీ సదరు సంస్థల నుంచి ప్రోత్సాహకాలేవీ పొందకూడదు. రిలేషన్షిప్ మేనేజర్లు టార్గెట్లను పూర్తిచేసేందుకు, తమకు భారీగా కమీషన్ వచ్చే ప్రోడక్టులను అంటగట్టకుండా ఇలాంటివి కట్టడి చేస్తాయి. టెలీమార్కెటింగ్ కష్టాలకు చెక్కొత్త రూల్స్ ప్రకారం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకే కాల్స్కి అనుమతి ఉంటుందిడీఎన్డీ కింద రిజిస్టర్ చేసుకుంటే అసలు కాల్ చేయడానికే ఉండదుఏజెంట్లు తాము కూడా బ్యాంకు ఉద్యోగులమే అన్నట్లుగా వ్యవహరించకూడదుప్రమోషనల్ మెసేజీలను కస్టమర్లు స్పష్టంగా సమ్మతిస్తేనే పంపాలి. అన్సబ్స్క్రైబింగ్ ప్రక్రియ కూడా సరళంగా ఉండాలి.ఇదీ చదవండి: విదేశాలకు వెళుతున్నారా.. ఈ జాగ్రత్తలు మీకోసమే -
మీ లాకర్ ఎంత భద్రం?
బ్యాంకు లాకర్లో పెట్టేదే భద్రంగా ఉంటాయని. మరి అక్కడే చోరీ జరిగితే? తమకు సంబంధం లేదని బ్యాంకులు తప్పించుకోజూస్తే? పశ్చిమ బెంగాల్లోని బాగ్డోగ్రా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇదే జరిగింది. 2016లో ఈ బ్యాంకు లాకర్లో ఓ కస్టమర్ ఉంచిన విలువైన వస్తువులు చోరీ అయ్యాయి. రాష్ట్ర వినియోగ వివాదాల పరిష్కార కమిషన్ రూ.59 లక్షల పరిహారానికి ఆదేశించింది. బ్యాంకు జాతీయ కమిషన్కు అప్పీల్ చేసింది. తాజాగా జాతీయ కమిషన్ తీర్పునిస్తూ... లాకర్ భద్రతలో వైఫల్యం ఉన్నప్పుడు బ్యాంక్ తప్పించుకోలేదని స్పష్టంచేసింది. నష్ట పరిహారాన్ని రూ.5 లక్షలకు తగ్గించింది. మరి ఈ సంఘటన నుంచి నేర్చుకోవాల్సిందేంటి? అదే ఈ ‘వెల్త్’ స్టోరీ...రెండేళ్లలో బంగారం ధర 150 శాతానికి పైనే పెరిగింది. వెండి ధర ఐదు రెట్లు ఎగిసింది. మరి ఇంతటి విలువైన వస్తువుల్ని ఇంట్లో ఉంచటం సేఫేనా? పోనీ బ్యాంకు లాకర్లో పెడితే భద్రతకు గ్యారంటీ ఉంటుందా? వాస్తవానికి ఇల్లయినా, బ్యాంకయినా పటిష్ట రక్షణ చర్యలతోనే అక్కడ పెట్టిన వస్తువులకు భద్రత. ఒకవేళ లాకర్లో విలువైన వస్తువులను కోల్పోతే పరిస్థితేంటి? అందుకు బ్యాంక్లు పూర్తి బాధ్యత తీసుకోవా? సేఫ్ట్ లాకర్ విషయంలో కస్టమర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవైనా ఉన్నాయా? అసలు లాకర్ ఎవరికి అవసరం? ఒకసారి చూద్దాం...లాకర్ చార్జీలు ఎంతంటే..→ ప్రాంతం, బ్యాంక్, లాకర్ పరిమాణం ఆధారంగా చార్జీలుంటాయి → సాధారణంగా చిన్న లాకర్కు వార్షిక చార్జీ రూ.1,000–3,000 → మధ్యస్థ లాకర్కు రూ.3– 6వేలు... పెద్ద లాకర్కు రూ.6 –12 వేలు → ఈ చార్జీపై జీఎస్టీని ... ఒప్పందానికి సంబంధించి స్టాంప్ డ్యూటీని చెల్లించాలి. → లాకర్ కోసం బ్యాంక్లు డిపాజిట్లు అడుగుతాయి. లాకర్ను క్లోజ్ చేసినప్పుడు వీటిని తిరిగి పొందొచ్చు. → వార్షిక చార్జీలు బకాయి పడి, కస్టమర్ స్పందించని సందర్భాల్లో లాకర్ బ్రేకింగ్కు అయ్యే చార్జీలను బ్యాంక్లు వసూలు చేస్తాయి.బ్యాంకులపై బాధ్యత లేదా..?→ లాకర్ల నిర్వహణకు సంబంధించి బ్యాంకులపై బాధ్యత ఎంత వరకు అన్నది కస్టమర్తో కుదుర్చుకునే ఒప్పంద పత్రాల్లో వివరంగా ఉంటుంది. → నిర్లక్ష్యం లేదా భద్రత వైఫల్యం కారణంగా లాకర్లలో ఉంచిన వాటికి నష్టం వాటిల్లితే అందుకు బ్యాంకులదే బాధ్యత. → చోరీ, దోపిడీ, అగ్ని ప్రమాదం, భవనం కూలిపోవడం లేదా బ్యాంక్ ఉద్యోగుల మోసం కారణంగా నష్టం ఏర్పడితే పరిహారం చెల్లించాల్సిందే. → ప్రకృతి విపత్తులు, భూకంపాలు, వరదల కారణంగా లాకర్లలో వాటికి నష్టం కలిగితే బ్యాంకులపై బాధ్యత ఉండదు. కానీ, బ్యాంక్ తగిన రక్షణ చర్యలు తీసుకోకపోవటం వల్ల ఈ సమయాల్లో నష్టం ఏర్పడితే అప్పుడు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. → లాకర్లోని వాటికి నష్టం జరిగినప్పటికీ.. బ్యాంకుల బాధ్యత పరిమితంగానే ఉంటుంది. లాకర్ వార్షిక అద్దె చార్జీలకు గరిష్టంగా 100 రెట్ల వరకే అవి చెల్లిస్తాయి. ఉదాహరణకు లాకర్లోని రూ.20 లక్షల విలువైన ఆభరణాలు కనిపించకుండాపోయాయనుకోండి. లాకర్ చార్జీ రూ.6,000 ఉంటే, అప్పుడు గరిష్టంగా రూ.6 లక్షల మొత్తాన్ని బ్యాంక్ చెల్లిస్తుంది. → వరుసగా మూడేళ్ల పాటు వార్షిక చార్జీలు చెల్లించకపోతే లేదా ఏడేళ్లపాటు లాకర్ను తెరవకపోతే నోటీసు జారీ చేసి.. మూడు నెలల తర్వాత లాకర్లను బ్యాంక్లు బ్రేక్ చేయాల్సి ఉంటుంది. నోటీసులకు స్పందన రానప్పుడు.. పేపర్ ప్రకటన ఇచ్చి, ఇద్దరు సాక్షుల సమక్షంలోనే ఈ పని చేయాలి. ఇన్సూరెన్స్తో రక్షణ → లాకర్లను సురక్షితంగా ఉంచేందుకు దాదాపు అన్ని బ్యాంక్లు గట్టి చర్యలు చేపడతాయి. అయినా, కొన్ని ఘటనల్లో కస్టమర్లకు నష్టం జరుగుతుంటుంది → కాబట్టి లాకర్లలో విలువైన ఆభరణాలు, డాక్యుమెంట్లు ఉంచే వారు వ్యక్తిగతంగా వాటికి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి. → బ్యాంకుల మాదిరి లాకర్ చార్జీకి గరిష్టంగా 100 రెట్ల వరకే పరిహారం అన్న పరిమితి బీమాలో ఉండదు. → బంగారం, వెండి ఆభరణాలు, విలువైన రాళ్లు, ఇతర విలువైన వస్తువులు, పత్రాలకు సైతం బీమా రక్షణ పొందొచ్చు. → దోపిడీ, దొంగతనాలు, బ్యాంకు ఉద్యోగుల నిర్లక్ష్యం లేదా మోసం, అగ్ని ప్రమాదాలు, పేలుడు, భూకంపాలు లేదా వరదలు కారణంగా లాకర్లోని వాటికి ఏర్పడే నష్టానికి బీమా పరిహారం పొందొచ్చు. → లాకర్లలో ఉంచిన కరెన్సీ నోట్లకు నష్టం వాటిల్లితే బీమా పరిహారం రాదు. → తుప్పు పట్టడం, చెద పురుగులు, వాతావరణంలో తేమ కారణంగా ఏర్పడే నష్టానికి కూడా బీమా పాలసీలో రక్షణ ఉండదు. ఇలాంటి లాకర్లుంటేనే భరోసా... → బ్యాంక్లు లాకర్లకు సంబంధించి సీసీటీవీ కెమెరా, అలారమ్ (హెచ్చరించే) సిస్టమ్లను ఏర్పాటు చేసుకోవాలి. → లాకర్లు సురక్షితంగా ఉండేలా భవన నిర్మాణం ఉండాలి. రాత్రిళ్లు తగినంత భద్రత ఉండేలా చర్యలు తీసుకోవాలి. → లాకర్ తెరిచిన ప్రతి సందర్భంలో ఖాతాదారుడి రిజిస్టర్ మొబైల్ నంబర్కు ఎస్ఎంఎస్ అలర్ట్ను పంపించాల్సి ఉంటుంది. → లాకర్కు సంబంధించి బ్యాంక్లకు ఉండే బాధ్యత ఎంత మేర? అనేది ఒప్పందంలో వివరంగా ఉండాలి. → నామినేషన్ సదుపాయం కలి్పంచాలి. ఒప్పందంపై సంతకాలు చేయించుకుని, కాపీని కస్టమర్కు సైతం అందించాలి.వీరికి పెద్దగా ఉపయోగం ఉండదు.. → కేవలం కొన్ని ఆభరణాలే ఉన్నా... వాటి విలువ తక్కువగా ఉన్నా.. → బ్యాంక్కు వెళ్లి లాకర్ నుంచి తీసుకొచ్చి, మళ్లీ లాకర్లో పెట్టడం వీలు పడని వారు.అసలు లాకర్లు ఎవరికి..? → అధిక విలువ కలిగిన ఆభరణాలున్నప్పుడు. ముఖ్యంగా వారసత్వంగా వచి్చన ఆభరణాలున్నవారికి అనుకూలం. → వ్యాపార లావాదేవీలకు సంబంధించి సున్నితమైన డాక్యుమెంట్లు ఉన్నప్పుడు. → ప్రాపర్టీ ఒరిజినల్ డాక్యుమెంట్లు, పార్టనర్íÙప్ డీడ్లు ఉన్నవారు. → పటిష్టమైన రక్షణ చర్యలు లేని అద్దె ఇళ్లలో నివసించే వారు. → ఇళ్లల్లో కేవలం వృద్ధులే ఉండే వారికి బ్యాంకు లాకర్లు ఎంతో ఉపయోగకరం. లాకర్లో వేటికి చోటు..? → బంగారం, వజ్రాభరణాలు → ప్రాపర్టీ క్రయ, విక్రయ దస్తావేజులు → వీలునామాలు, చట్టబద్ధమైన పత్రాలు → బాండ్ సరి్టఫికెట్లు, అరుదైన కలెక్షన్లునమోదు చేస్తే నయం...→ లాకర్లో ఏవేవి ఉంచుతున్నారనే విషయాన్ని ఒక రికార్డులో రాసి ఉంచుకోవటం మంచిది. → ఆభరణాలు, వాటి బరువు, వస్తువుల వివరాలు రాయండి. వీటి కొనుగోలు బిల్లులు, ఫొటోలు కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి. → లాకర్లో తీసి, పెడుతున్న ప్రతి సారీ వాటి వివరాలు తప్పకుండా నమోదు చేయాలి. → ఆభరణాలకు సంబంధించి విలువ నిర్ధారణ సరి్టఫికెట్లు దగ్గర ఉంచుకోవాలి. → లాకర్కు తప్పకుండా నామినేషన్ తీసుకోవాలి. అవసరమైనప్పుడు నామినీని అప్డేట్ చేసుకోవాలి. → ఏడాదిలో ఒకసారి అయినా లాకర్ను తెరిచి, మూయడం చేయాలి. → డాక్యుమెంట్లు తేమ కారణంగా దెబ్బతినే రిస్క్ ఉంటుంది. కనుక దెబ్బతినని విధంగా ప్యాక్ చేసి పెట్టాలి.వీటిని ఉంచకండి.. → దేశ, విదేశీ కరెన్సీ నోట్లు → హానికారక మెటీరియల్స్ → పాడైపోయే వస్తువులు → ప్రమాదకరమైన వస్తువులు → ఆయుధాలు, డ్రగ్స్, మందుగుండు సామగ్రి → చట్టవిరుద్ధమైనవి కూడా..నష్టం జరిగితే... → లాకర్లో ఉంచినవి దెబ్బతిన్నట్టు గుర్తించినా లేదా కనిపించక పోయినా బ్యాంక్ మేనేజర్కు లిఖిత పూర్వక ఫిర్యాదు ఇవ్వాలి. → బ్యాంక్ ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో అక్కడి వెళ్లి ఫిర్యాదు చేయాలి. → కస్టమర్ నిర్లక్ష్యం లేని సందర్భాల్లో జరిగిన నష్టానికి బ్యాంక్లు పరిహారం చెల్లించాల్సిందే. → బ్యాంక్లు పరిహారానికి నిరాకరిస్తే బ్యాంకింగ్ అంబుడ్స్మన్ను సంప్రదించొచ్చు. → అక్కడ న్యాయం జరగకపోతే జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ను సంప్రదించాలి. -
డబ్బుతోనే చెడగొడుతున్నారు.. ‘రిచ్ డాడ్’ వార్నింగ్!
ప్రఖ్యాత ఇన్వెస్టర్, బెస్ట్ సెల్లర్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) తరచూ తన ఆర్థిక అభిప్రాయాలతో వార్తల్లో నిలుస్తుంటారు. ఈసారి ఆయన.. తల్లిదండ్రులు డబ్బుతో తమ పిల్లల జీవితాలను ఎలా చెడగొడుతున్నారో వివరించారు.5 ‘సీ’లతో పిల్లల జీవితాలు నాశనంతల్లిదండ్రులు తమ పిల్లల జీవితాలను ఎలా నాశనం చేస్తున్నారో కియోసాకి తన సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ (ట్విటర్)లో చేసిన పోస్టులో వివరించారు. పిల్లలు ఆర్థికంగా చెడిపోవడానికి కారణమైన ఐదు ‘సీ’(C)ల గురించి ప్రస్తావించారు.1. క్యాష్ (మనీ): తల్లిదండ్రులు పిల్లలకు డబ్బు ఇస్తారు. కానీ వారు స్వయంగా సంపాదించాలని ఆశించరు. దీంతో పిల్లల్లో ఆర్థిక బాధ్యత తగ్గుతుంది.2. కాలేజ్ : పిల్లల ఉన్నత విద్యకు తల్లిదండ్రులే పూర్తిగా ఖర్చు భరిస్తారు. దీంతో ఉన్నత విద్య కోసం కష్టపడే అలవాటు పిల్లలకు తగ్గిపోతుంది.3. కారు: కళాశాల ఫీజులతో పాటు, కారు కొనివ్వడం, బీమా, నిర్వహణ ఖర్చులు కూడా తల్లిదండ్రులే భరిస్తున్నారు.4. కాండో (ఇల్లు): కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు తొలి ఇంటిని కూడా తామే స్వయంగా కొనిస్తున్నారు.5. క్యాష్(ట్రస్ట్ ఫండ్): పిల్లల భవిష్యత్తు కోసం ట్రస్ట్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నారు. ఫలితంగా పిల్లలు బడ్జెట్ చేయడం, పెట్టుబడి పెట్టడం వంటి ఆర్థిక నైపుణ్యాలు నేర్చుకోరు.ఆస్తి కరిగిపోతుంది..కియోసాకి అభిప్రాయం ప్రకారం.. మొదటి తరం కష్టపడి సంపాదిస్తుంది. రెండో తరం సౌకర్యవంతమైన జీవితం గడుపుతుంది. కానీ అదే అలవాట్లు మూడో తరానికి వెళ్తే కుటుంబ ఆస్తి క్రమంగా క్షీణిస్తుంది. కష్టపడి పనిచేయడం, సంపాదించడం, పెట్టుబడి పెట్టడం, బడ్జెట్ నిర్వహించడం వంటి అలవాట్లు చిన్నప్పటి నుంచే నేర్పాలని ఆయన సూచిస్తున్నారు.ఇదీ చదవండి: ఫేక్లొద్దు.. రాబర్ట్ కియోసాకి హెచ్చరిక!భారతీయ కుటుంబాల్లో ఇదే పరిస్థితిరాబర్ట్ కియోసాకి చెప్పిన పరిస్థితి భారతీయ కుటుంబాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. భారతదేశంలో పిల్లలు ఉద్యోగం పొందిన తర్వాత కూడా ఇల్లు లేదా కారు కొనుగోలు సమయంలో తల్లిదండ్రులు తమ పొదుపులను, కొన్నిసార్లు ప్రావిడెంట్ ఫండ్ లేదా పదవీ విరమణ నిధుల నుంచే ఉపసంహరించుకుని సహాయం చేస్తుంటారు. ఇది తల్లిదండ్రుల ప్రేమగా కనిపించినా, దీర్ఘకాలంలో పిల్లల్లో ఆర్థిక స్వావలంబనను దెబ్బతీసే ప్రమాదం ఉందని కియోసాకి హెచ్చరిస్తున్నారు.THE 5-Cs: How to destroy a child’s life with money.I have met many parents who destroy their children’s lives with money….The parents give their child or children the 5-Cs1: CASH: they give their children money never expecting them to earn their money.2: COLLEGE:…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 12, 2026 -
పాన్ కార్డు రూల్స్ మారుతున్నాయ్..
పాన్ కార్డుకు సంబంధించి పలు నిబంధనలు మారబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘డ్రాఫ్ట్ ఆదాయపు పన్ను నిబంధనలు–2026’లో పాన్ కార్డు (PAN) బహిర్గతం తప్పనిసరి అయ్యే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పరిమితుల్లో మార్పులను ప్రతిపాదించింది. లక్ష్యం ఏమిటంటే.. సాధారణ, తక్కువ విలువైన లావాదేవీలకు పాన్ కార్డు అవసరాన్ని తగ్గిస్తూ, పెద్ద మొత్తాల లావాదేవీలలో పారదర్శకత పెంచడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశమని అధికారులు పేర్కొంటున్నారు. ఈ ముసాయిదాపై ఫిబ్రవరి 22 వరకు ప్రజల నుంచి అభిప్రాయాలను కోరుతోంది. తుది ఆమోదం అనంతరం కొత్త నిబంధనలు 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.నగదు డిపాజిట్లు, ఉపసంహరణలు, మోటారు వాహనాల కొనుగోలు, హోటల్, రెస్టారెంట్ బిల్లులు, స్థిరాస్తి లావాదేవీలు, ఇన్సూరెన్స్ పాలసీలు ప్రీమియం చెల్లింపులకు సంబంధించి పాన్ కార్డు అవసరం ఎలా మారబోతోందో ఈ కింద తెలుసుకుందాం.నగదు డిపాజిట్లు, ఉపసంహరణలు ప్రస్తుతం ఒకే రోజులో రూ.50,000 కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేస్తే పాన్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త ప్రతిపాదన ప్రకారం, ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఖాతాల్లో కలిపి రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు డిపాజిట్ లేదా ఉపసంహరణ చేసినప్పుడు మాత్రమే పాన్ తప్పనిసరి అవుతుంది.మోటారు వాహనాల కొనుగోలుప్రస్తుత నిబంధనల ప్రకారం మోటార్ సైకిళ్లు మినహా అన్ని వాహనాల కొనుగోలుకు పాన్ అవసరం. ప్రతిపాదిత మార్పుల ప్రకారం రూ.5 లక్షల కంటే ఎక్కువ విలువైన వాహనాలు (బైక్లు సహా) కొనుగోలు చేసినప్పుడు మాత్రమే పాన్ అవసరం ఉంటుంది.హోటల్, రెస్టారెంట్ బిల్లులుఇప్పటి వరకు ఒక చెల్లింపులో రూ.50,000 దాటితే పాన్ ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త ముసాయిదాలో ఈ పరిమితిని రూ.1 లక్షకు పెంచాలని సూచించారు.స్థిరాస్తి లావాదేవీలుప్రస్తుతం రూ.10 లక్షలకు పైబడిన ఆస్తి లావాదేవీలకు పాన్ తప్పనిసరి. ప్రతిపాదన ప్రకారం ఈ పరిమితిని రూ.20 లక్షలకు పెంచనున్నారు.ఇన్సూరెన్స్ పాలసీలుఇప్పటివరకు రూ.50,000 పైగా ప్రీమియం చెల్లింపులకు మాత్రమే పాన్ అవసరం ఉండేది. ఇకపై బీమా సంస్థలతో ఏదైనా ఖాతా ఆధారిత సంబంధం ఏర్పరిస్తేనే పాన్ తప్పనిసరి చేయాలని సూచించారు. -
బ్యాంకుల ‘తోకలు’ కత్తిరిస్తున్న ఆర్బీఐ.. ఇక కొత్త రూల్స్!
బ్యాంకు బ్యాలెన్స్ కొన్నిసార్లు అనవసరంగా కట్ అవుతూ ఉంటుంది. ఎందుకు కట్ అయిందో తెలుసుకుందామని బ్యాంకుకు వెళ్తే అప్పుడు తెలుస్తుంది.. ఏ ఇన్సూరెన్సో, మరేదో సర్వీస్ యాక్టివేట్ అయింది... దానికి సంబంధించిన ప్రీమియమే కట్ అయింది అని. ఇది చాలా మంది ఖాతాదారులకు ఎదురయ్యే అనుభవమే. ఇకపై అలా కుదరదు..బ్యాంకుల్లో తప్పుడు అమ్మకాల (మిస్-సేలింగ్) నిర్వచనాన్ని మరింత కఠినతరం చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త మార్గదర్శకాలను ప్రతిపాదించింది. బ్యాంకులు, బీమా సంస్థలు ఇప్పటివరకు వినియోగిస్తున్న కొన్ని రక్షణలను తొలగిస్తూ, కస్టమర్కు అనుచితంగా ఉత్పత్తులు విక్రయించినట్లు నిరూపితమైతే పూర్తి రీఫండ్ చెల్లించాల్సిన బాధ్యతను విధించింది.2026లో అమల్లోకి రానున్న డ్రాఫ్ట్ ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (కమర్షియల్ బ్యాంక్స్ – రెస్పాన్సిబుల్ బిజినెస్ కండక్ట్) సవరణ ఆదేశాలు’ ప్రకారం.. కస్టమర్ వయస్సు, ఆదాయ స్థాయి, రిస్క్ స్వభావం వంటి ప్రొఫైల్కు సరిపోని ఉత్పత్తి లేదా సర్వీస్ను విక్రయించడం ‘తప్పుడు అమ్మకం’గా పరిగణిస్తారు.అంతేకాదు.. “డార్క్ ప్యాటర్న్స్” (చీకటి నమూనాలు) అనే భావనను కూడా మొదటిసారిగా ఆర్బీఐ నిర్వచించింది. ఇవి డిజిటల్ ప్లాట్ఫామ్లలో వినియోగదారులను తప్పుదారి పట్టించే విధంగా రూపకల్పన చేసిన మోసపూరిత యూజర్ ఎక్స్పీరియన్స్ నమూనాలు. ఇవి వినియోగదారుల స్వతంత్ర నిర్ణయాన్ని ప్రభావితం చేసి, వారు ఉద్దేశించని చర్యలకు ప్రేరేపిస్తాయి. ఇటువంటి చర్యలు తప్పుదారి పట్టించే ప్రకటనలు, అన్యాయ వాణిజ్య పద్ధతులు, వినియోగదారుల హక్కుల ఉల్లంఘనలకు సమానమని ఆర్బీఐ పేర్కొంది.ఇప్పటివరకు బ్యాంకులు, బీమా సంస్థలు ‘కొనుగోలుదారు జాగ్రత్త’ (Buyer Beware) విధానాన్ని అనుసరిస్తూ, సంతకం చేసిన పత్రాలు, నిర్ధారణ కాల్స్ ఆధారంగా తమను తాము రక్షించుకునేవి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు విక్రయించిన సంక్లిష్ట బీమా, పెట్టుబడి ఉత్పత్తుల విషయంలో వివాదాలు ఎక్కువగా వచ్చేవి.కస్టమర్ సమ్మతి ఉన్నా కూడా, అది అనుచిత అమ్మకాన్ని చట్టబద్ధం చేయదని ఆర్బీఐ తాజాగా స్పష్టం చేసింది. దీని ద్వారా బ్యాంకులను ‘అత్యున్నత సద్భావన’ (Utmost Good Faith) సూత్రానికి లోబరచి, కేవలం కమీషన్ ఆధారిత మధ్యవర్తులుగా కాకుండా వారు విక్రయించే ఉత్పత్తులు సరైనవిగా ఉండేలా బాధ్యత వహించే సంస్థలుగా నిలిపింది. వినియోగదారుల పరిహారం కోసం ప్రతి నియంత్రిత సంస్థ తప్పనిసరిగా ప్రత్యేక విధానం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.ముసాయిదా నిబంధనలు రుణ ఆమోదాన్ని బీమా లేదా ఇతర ఆర్థిక ఉత్పత్తుల కొనుగోలుతో అనుసంధానించే తప్పనిసరి బండిలింగ్ను నిషేధించాయి. అలాగే, థర్డ్ పార్టీ ఏజెంట్ల పర్యవేక్షణను కఠినతరం చేస్తూ, అన్ని డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్ల తాజా జాబితాను బ్యాంకుల వెబ్సైట్లలో ప్రదర్శించాలని ఆదేశించింది. బ్రాంచీల్లో పనిచేసే ఏజెంట్లు, బ్యాంకు ఉద్యోగులు వేరువేరని స్పష్టమైన నిర్ధారణ ఉండాలి.ఈ నిబంధనలు 2026 జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. బ్యాంకు శాఖల ద్వారా బీమా, పెట్టుబడి ఉత్పత్తుల విక్రయ విధానంలో ఇవి గణనీయమైన మార్పులకు దారి తీసే అవకాశముందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
రాధికాగుప్తాను ఎక్కువగా అడుగుతున్న ప్రశ్నలు ఇవే..
ప్రస్తుతం స్టాక్ మార్కెట్లలో నెలకొన్న అస్థిరత, అనిశ్చితి నేపథ్యంలో ఏ ఫండ్ను ఎంచుకోవాలి? ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? అనే గందరగోళం పెట్టుబడిదారుల్లో పెరిగిపోతోంది. ఈ క్రమంలో ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ రాధికా గుప్తా పెట్టుబడిదారులకు దిశానిర్దేశం చేస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కొన్ని సూచనలు చేశారు.ఇటీవలి కాలంలో ‘నా దగ్గర రూ.30,000 ఉన్నాయి. వెండి కొనాలా? ఏ ఫండ్ తీసుకోవాలి?’ వంటి ప్రశ్నలు తనను ఎక్కువగా అడుగుతున్నారని ఆమె పేర్కొన్నారు. తక్షణ పరిష్కారాల కోసం వెతకడం కంటే సరైన పోర్ట్ఫోలియోను నిర్మించుకోవడానికి కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆమె సూచించారు.ప్రాథమిక అవగాహన ముఖ్యంచాలామంది ఫైనాన్స్ గురించి కనీస అవగాహన లేకుండానే నేరుగా ఫండ్స్ కొనుగోలు చేయాలని ఆరాటపడుతుంటారు. దీన్ని ఆమె ‘శ్వాస తీసుకోవడం నేర్చుకోకముందే డైవింగ్ చేయడం’తో పోల్చారు. పెట్టుబడి పెట్టడానికి ముందు ఆర్థిక అంశాలపై ప్రాథమిక అవగాహన పెంచుకోవాలని, దీనికోసం తన పుస్తకం ‘మ్యాంగో మిలియనీర్’ ఎంతో దోహదపడుతుందని సూచించారు.ఆర్థిక స్థితిగతులపై స్పష్టతపెట్టుబడి పెట్టే ముందు ప్రతి ఒక్కరూ తమ ఆర్థిక వాస్తవాలను డాక్యుమెంట్ చేసుకోవాలి.మీ నెలవారీ ఆదాయం, ఖర్చులు ఎంత?ప్రస్తుత పెట్టుబడులు, అప్పులు ఏమిటి?మీ ఆర్థిక లక్ష్యాలు, వాటి కాలపరిమితి ఎంత?స్వల్పకాలికంగా నష్టాలు వస్తే భరించే శక్తి ఉందా?ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటేనే బలమైన పునాది ఏర్పడుతుందని గుప్తా అభిప్రాయపడ్డారు.నిపుణుల సలహా తీసుకోవడంమ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు లేదా క్వాలిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ల సహాయం తీసుకోవాలని ఆమె కోరారు. పైన పేర్కొన్న ఆర్థిక స్పష్టతతో నిపుణులను కలిసినప్పుడు వారు మీ అవసరాలకు తగ్గట్టుగా సరైన ప్రణాళికను రూపొందించగలరు. మీకు నమ్మకం కలిగే వరకు ఒకటి కంటే ఎక్కువ మంది నిపుణులతో మాట్లాడటంలో తప్పు లేదని ఆమె అన్నారు."I have 30,000 to invest, should I buy silver? What fund do I buy?"I am seeing a lot more friends, family, and folks in general reach out for advice on their portfolio in the last few months. It is probably because volatility is so high across asset classes, returns over the…— Radhika Gupta (@iRadhikaGupta) February 9, 2026తొందరపాటు నిర్ణయాలు వద్దుపెట్టుబడి ప్రయాణం ప్రారంభంలోనే డైరెక్ట్ స్టాక్స్, వెండి, లేదా సంక్లిష్టమైన పీఎంఎస్(ధనవంతులైన పెట్టుబడిదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఒక పర్సనలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ సర్వీస్) ఉత్పత్తుల జోలికి వెళ్లాల్సిన అవసరం లేదని హెచ్చరించారు. మార్కెట్పై అవగాహన పెరిగే వరకు వీటి కోసం వేచి చూడటం ఉత్తమమని అభిప్రాయపడ్డారు.తప్పుల నుంచి నేర్చుకోండి‘ఇప్పుడే మొదలుపెట్టే వారు వెంటనే పని ప్రారంభించండి. తప్పులు చేసిన వారు కాసేపు విశ్రాంతి తీసుకోండి’ అని ఆమె సరళంగా వివరించారు. 2008 ఆర్థిక సంక్షోభం సమయంలో కూడా ఎంతోమంది మేధావులు తప్పులు చేశారని గుర్తు చేస్తూ పెట్టుబడి ప్రయాణంలో తప్పులు సహజమని పేర్కొన్నారు. మార్కెట్ దిద్దుబాట్లు అనేవి బోర్డు పరీక్షల వంటివని, అవి మనకు క్రమశిక్షణ, సహనం నేర్పుతాయని ఆమె విశ్లేషించారు.ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప ఊరట -
మ్యూచువల్ ఫండ్ కొత్త స్కీములు
ముంబై: కోటక్ మహింద్రా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ.. కోటక్ సర్వీసెస్ ఫండ్ పేరుతో కొత్త పథకాన్ని (ఎన్ఎఫ్వో) ప్రారంభించింది. ఈ నెల 18 వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. దేశ జీడీపీలో 55 శాతం వాటా ఆక్రమిస్తూ, వృద్ధికి కీలక చోదకంగా ఉన్న సేవల రంగంలో పెట్టుబడులకు ఈ పథకం వీలు కల్పిస్తుందని కోటక్ మ్యూచువల్ ఫండ్ ప్రకటించింది.వినియోగ సేవలు, టెలికం, హెల్త్కేర్, లాజిస్టిక్స్, ఆర్థిక సేవలు, ఐటీ, విద్యుత్, ఆయిల్ అండ్ గ్యాస్ తదితర రంగాలతో కూడిన సేవలు దీర్ఘకాల పెట్టుబడులకు మంచి వృద్ధి అవకాశాలను కల్పిస్తాయని పేర్కొంది. మంచి వృద్ధి అవకాశాలు, సహేతుక ధరల వద్దనున్న కంపెనీల్లో పెట్టుబడులు పెడుతుంది. వ్యాపారం, యాజమాన్యం, కంపెనీ విలువకు ప్రాధాన్యం ఇస్తుంది. అన్ని రకాల మార్కెట్ విలువల్లోనూ పెట్టుబడులు పెడుతుంది.నాణ్యమైన వ్యాపారం, బలమైన నగదు ప్రవాహాలను చూస్తుంది. కనీసం రూ.1,000, అంతకుమించి ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎన్ఎఫ్వో ముగిసిన కొన్ని రోజుల అనంతరం తిరిగి పెట్టుబడులకు అందుబాటులోకి వస్తుంది. వైవిధ్యమైన పోర్ట్ఫోలియోతో, దీర్ఘకాలంలో పెట్టుబడి వృద్ధిని కోరుకునే వారికి ఈ పథకం అనుకూలమని కోటక్ మ్యూచువల్ ఫండ్ పేర్కొంది.360 వన్ ఎంఎఫ్ నుంచి సిఫ్ పథకం సంపన్న ఇన్వెస్టర్ల కోసం 360 వన్ మ్యుచువల్ ఫండ్ తాజాగా డైనాసిఫ్ ఈక్విటీ లాంగ్–షార్ట్ ఫండ్ పేరిట స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (సిఫ్)ని ప్రవేశపెట్టింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ ఫిబ్రవరి 20న ముగుస్తుంది. ఇది కనీసం 80 శాతం నిధులను ఈక్విటీలు, ఈక్విటీ డెరివేటివ్స్కి కేటాయిస్తుంది. ఈక్విటీ డెరివేటివ్స్ ద్వారా 25 శాతం వరకు షార్ట్ ఎక్స్పోజర్ తీసుకునేందుకు, డెట్ అలాగే ఇని్వట్స్లో 20 శాతం వరకు ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు ఉంటుంది.దీనికి బీఎస్ఈ 500 టీఆర్ఐ ప్రామాణికంగా ఉంటుంది. కనీసం రూ. 10 లక్షలు (అక్రెడిటెడ్ ఇన్వెస్టర్లయితే రూ. 1,00,000) ఇన్వెస్ట్ చేయొచ్చు. మ్యుచువల్ ఫండ్స్ పరమైన ట్యాక్సేషన్ ప్రయోజనాలతో పాటు మరింత మెరుగైన రాబడులను అందించే విధంగా ఈ ఫండ్ ఉంటుందని 360 వన్ అసెట్ మేనేజ్మెంట్ సీఈవో రాఘవ్ అయ్యంగార్ తెలిపారు. డీఎస్పీ మల్టీ అసెట్ ఆమ్ని ఎఫ్వోఎఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రక్రియను సరళతరం చేసే దిశగా డీఎస్పీ మ్యుచువల్ ఫండ్ సంస్థ మల్టీ అసెట్ ఆమ్ని ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్వోఎఫ్)ని ప్రవేశపెట్టింది. ఇది ఫిబ్రవరి 19 వరకు అందుబాటులో ఉంటుంది. సంస్థకు చెందిన స్వంత మార్కెట్ ఇంటెలిజెన్స్ ఫ్రేమ్వర్క్ డీఎస్పీ నేత్ర దన్నుతో ఇది పని చేస్తుంది. ఈక్విటీ, డెట్ ఆధారిత స్కీములు, గోల్డ్..సిల్వర్ ఈటీఎఫ్ల్లాంటి కమోడిటీ ఆధారిత స్కీములు మొదలైన వాటిలో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది.మార్కెట్ పరిస్థితులను బట్టి ఈక్విటీ ఆధారిత స్కీముల్లో 25–75 శాతం, డెట్ స్కీముల్లో 15–50 శాతం, గోల్డ్–సిల్వర్ ఈటీఎఫ్లలో 10–50 శాతం మేర ఇది పెట్టుబడులు పెట్టొచ్చు. మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులు ఏర్పడినప్పుడు ఈక్విటీల్లో పెట్టుబడులను కనిష్టంగా 25 శాతానికి కూడా తగ్గించే వెసులుబాటు ఉంటుంది. పెట్టుబడులను వివిధ సాధనాల్లో డైవర్సిఫై చేయడం వల్ల రాబడుల కోసం కేవలం ఒకే సాధనంపై ఆధారపడాల్సిన రిసు్కలు తగ్గుతాయని సంస్థ ప్రోడక్ట్ హెడ్ సాహిల్ కపూర్ తెలిపారు. -
పిల్లలకు ప్రత్యేక బీమా పథకాలు
పిల్లల భవిష్యత్ ప్రణాళికల కోసం ఉపయోగపడేలా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ స్మార్ట్కిడ్ 360 ప్లాన్ని ప్రవేశపెట్టింది. ఇది బీమా ప్రయోజనాలను కల్పించడంతో పాటు దీర్ఘకాలిక పొదుపు పథకంగా కూడా ఉపయోగపడుతుంది. పాలసీదారుకేదైనా జరిగితే ప్రీమియంల నుంచి మినహాయింపు, ప్రయోజనాల కొనసాగింపు, కుటుంబానికి క్రమం తప్పకుండా ఆదాయాన్నిచ్చే ఫ్యామిలీ ఇన్కం బెనిఫిట్ మొదలైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. పిల్లల చదువులు తదితరాలకు మనీబ్యాక్ పొందే వీలుంది. బజాజ్ జనరల్ ఫీటల్ ఫ్లరిష్ ఆరోగ్య బీమా గర్భస్త శిశువు ఆరోగ్యానికి సంబంధించి ‘ఫీటల్ ఫ్లరిష్’ పేరిట బజాజ్ జనరల్ ఇన్సూరెన్స్ ప్రత్యేక ఇన్సూరెన్స్ రైడర్ని ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు మెటర్నిటీ ఇన్సూరెన్స్ పరిధిలోకి రాని అధునాతన ఇన్–యుటెరో ప్రొసీజర్లు, రిస్కులు ఎక్కువగా ఉండే ప్రెగ్నెన్సీలకు కవరేజీ లభిస్తుంది. ‘మై హెల్త్ కేర్ ప్లాన్’, ‘హెల్త్ గార్డ్’ పథకాలతో కలిపి ఈ రైడర్ని తీసుకోవచ్చు. 18–45 ఏళ్ల వయస్సు గల మహిళలకు, ఒక్కో ప్రసవానికి రూ. 2 లక్షల సమ్ ఇన్సూర్డ్తో రెండు ప్రసవాల వరకు వర్తిస్తుంది. ప్రీమియం రూ. 1,025గా ఉంటుంది. -
బంగారానికి బదులుందా? బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఏది?
ప్రముఖ ఇన్వెస్టర్, ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి పెట్టుబడుల విషయమై తన అభిప్రాయాలను మరోసారి స్పష్టం చేశారు. బంగారం, వెండి, బిట్కాయిన్.. మూడింటినీ కలిపి పెట్టుబడులు పెట్టడం మంచిదేనని చెప్పిన ఆయన, ఒక్క ఆస్తినే ఎంచుకోవాల్సి వస్తే మాత్రం తాను బిట్కాయిన్కే ప్రాధాన్యం ఇస్తానన్నారు.ఇటీవల చేసిన వ్యాఖ్యల్లో, బిట్కాయిన్కు ఉన్న పరిమిత సరఫరానే దాని అతిపెద్ద బలమని కియోసాకి వివరించారు. బంగారం ధర పెరిగినప్పుడు మరిన్ని గనులు తవ్వడం ద్వారా సరఫరా పెరిగే అవకాశం ఉందని, తాను స్వయంగా గోల్డ్ మైనర్ కావడంతో ఇది తనకు తెలుసని అన్నారు.“బంగారం ధర పెరిగితే మరిన్ని గనులు తవ్వుతారు. అంటే సరఫరా పెరుగుతుంది. కానీ బిట్కాయిన్ విషయంలో అలా కాదు. దాని డిజైన్ ప్రకారం గరిష్టంగా 21 మిలియన్ బిట్కాయిన్లే ఉంటాయి” అని కియోసాకి (Robert Kiyosaki) తెలిపారు. బిట్కాయిన్ ప్రోటోకాల్ ప్రకారం 21 మిలియన్లకు మించి ఒక్క బిట్కాయిన్ కూడా సృష్టించలేమని, ఆ స్థాయికి మెల్లగా చేరుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ విధమైన నిర్మాణాత్మక కొరత బిట్కాయిన్ను ప్రత్యేకంగా నిలబెడుతుందని అన్నారు.ఇది చదివారా? కియోసాకీకి కోపమొచ్చింది!“21 మిలియన్ల తర్వాత కొత్త బిట్కాయిన్లు రావు. ఇది అద్భుతమైన డిజైన్. అందుకే దీర్ఘకాలంలో బిట్కాయిన్ ధర పెరుగుతుందని నేను నమ్ముతున్నాను” అని కియోసాకి వ్యాఖ్యానించారు. తాను బిట్కాయిన్ను ప్రారంభ దశలోనే కొనుగోలు చేశానని, అదే సమయంలో గోల్డ్ మైనింగ్, చమురు తవ్వకాలు వంటి సంప్రదాయ పెట్టుబడులను కూడా కొనసాగిస్తున్నానని తెలిపారు.ఫియాట్ కరెన్సీలపై తనకు నమ్మకం లేదని, ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితుల నుంచి రక్షణనిచ్చే “హార్డ్ అసెట్స్”కే తాను మద్దతు ఇస్తానని కియోసాకి మరోసారి స్పష్టం చేశారు. అయితే నిపుణులు మాత్రం, కేవలం కొరత మాత్రమే ధరలు పెరగడానికి హామీ ఇవ్వదని, డిమాండ్, నియంత్రణలు, మార్కెట్ ఊగిసలాటలు కూడా కీలక పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడుతున్నారు.అయినప్పటికీ, బిట్కాయిన్ను బంగారానికి ప్రత్యామ్నాయంగా చూసే ఇన్వెస్టర్ల సంఖ్య పెరుగుతోందని కియోసాకి వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.I am often asked:Which is a better investment?Gold or Bitcoin.Obviously I would say both for diversification of assets and add silver.Yet if I had to choose only one asset I would choose Butcoin.Why?Because gold is in theory infinite. When the price of gold rises…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 9, 2026 -
Income Tax: ఆదాయం కరెక్టుగా రిపోర్ట్ చేయండి
రూల్ 114బీ ప్రకారం ఫారం ‘60’ ఇవ్వాలి. వ్యక్తులు.. అంటే మనం అందరం మనకు పర్మనెంట్ అకౌంట్ నంబరు లేకపోతే, నిర్దేశించిన హై–వేల్యూ ఆర్థిక వ్యవహారాలు జరపాలంటే, ఈ ఫారం 60ని సబ్మిట్ చేసి ఆ వ్యవహారాన్ని అయ్యిందనిపిస్తాం.నిర్దేశిత ఆర్థిక వ్యవహారాలేమిటంటే ▪️ బ్యాంకులో ఖాతా తెరవడం ▪️ డీమ్యాట్ ఖాతా తెరవడం ▪️ బ్యాంకులో రూ. 50,000 దాటి నగదు డిపాజిట్ చేసినప్పుడు ▪️ రూ. 10 లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ స్థిరాస్తి క్రయ, విక్రయాలు ▪️ రెండు చక్రాల బండి తప్ప ఇతర ఏ మోటర్ వాహనం కొన్నా ▪️ రూ. 50,000 దాటి ఫిక్స్డ్ డిపాజిట్లు, బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్ కొన్నా ▪️ విదేశీ మారకం/యాత్ర రూ. 50,000 దాటితే ▪️ జీవిత బీమా ప్రీమియం రూ. 50,000 దాటితేతీసుకోవాల్సిన జాగ్రత్తలు ▪️ పాన్ లేని వారు ఫారం 60 సబ్మిట్ చేసి వ్యవహారం పూర్తి చేయొచ్చు. పాన్ ఉన్నవారు కాదు. ▪️ ఫారం 60లో చాలా అంశాలుంటాయి. మీ వివరాలు సరిగ్గా ఇవ్వాలి. వివరాలకు ఆధారాలుండాలి. వాటితో సరిపోవాలి. అలా ఇవ్వకపోతే వ్యవహారం ఆగిపోవచ్చు. ▪️ అసలు అర్హత ఉందా. అవసరం లేకుండా అబద్ధాలు చెప్పి దాఖలు చేయొద్దు. ▪️ మీ వ్యక్తిగత వివరాలు ఇవ్వాలి. ▪️ మీకు పాన్ ఎందుకు లేదో కారణాలు తెలియజేయాలి ▪️ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలి ▪️ జాయింటు వ్యవహారాలు అయితే, అందరి వివరాలు ఇవ్వాలి ▪️ మైనర్ తరఫున అయితే, తల్లిదండ్రులు, గార్డియన్ ఇవ్వాలితప్పుడు ధ్రువీకరణలు ఇస్తే.. తప్పుడు సమాచారం, తప్పు ధృవీకరణలు ఇచ్చిన పక్షంలో కఠిన కారాగార శిక్షలుంటాయి. తప్పించుకోలేరు. పన్ను ఎగవేత మొత్తం నుంచి రూ. 25,00,000ల వరకు పెనాల్టీ వేస్తారు. కారాగారంతో పాటు ఫైన్ కూడా వేస్తారు. మరో ఫారం 61. ఈ ఫారం అనేది వ్యక్తులకు, కేవలం వ్యవసాయ ఆదాయం ఉండి, ఏ ఇతర ఆదాయం లేని వారు దాఖలు చేయాలి. ఫారం 60 వ్యవసాయేతర ఆదాయం ఉన్నవారికి వర్తిస్తుంది. ఫారం 60, వ్యవహారం జరిపే ముందు ఇవ్వాలి. ఫారం 61 అనేది ప్రతి సంవత్సరంలో రెండుసార్లు, ఆర్నెల్లకోసారి ఇవ్వాలి. రెండు ఫారం విషయాల్లోను తప్పులు దొర్లితే శిక్షకు అర్హులే. కఠిన కారాగార శిక్ష, పెనాల్టీ, ఫైన్ మామూలే. మిస్రిపోర్టింగ్ జరిగితే 50 శాతం నుంచి 200 శాతం వరకు పెనాల్టీ వేస్తారు. ‘‘మన తక్షణ కర్తవ్యం ఏమిటి’’ అనే ప్రశ్నకు జవాబుగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ రవి అగర్వాల్ చాలా స్పష్టంగా ఇచ్చిన జవాబు సారాంశం ఏమిటంటే, ఈ సంవత్సరం పెండింగ్, లిటిగేషన్ తగ్గిస్తారు. అసెస్మెంట్ ప్రొసీడింగ్స్, పెనాల్టీ ప్రొసీడింగ్స్ కలిపి ఒకేసారి పూర్తి చేస్తారు. విడిగా అసెస్మెంట్ని 4–5 సంవత్సరాల సమయం, పెనాల్టీకి 7–8 సంవత్సరాలు పడుతోంది. ఒకేసారి ఆర్డర్ పాస్ చేస్తే సమయం కలిసి వస్తుంది. అసెస్మెంట్ తర్వాత, మీకో అవకాశం ఇస్తారు... రివైజ్ చేసుకునేందుకు. దీన్నే అప్డేట్ చేసుకోవాలి. శాంతిని పొందాలి. అప్పీలుకు వెళ్లడం వల్ల ఖర్చు, కాలయాపన, వడ్డీ, పెనాల్టీలు అవుతాయి. న్యూ రూల్స్ ఇంకా నోటిఫై చేయలేదు. ఫారం 60బీకి సంబంధించి ఉదాహరణగా ఒకప్పుడు బ్యాంకులు కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్/సిస్టమ్స్ లేనప్పుడు పాన్ లేనివారికి ఫారం 60 తీసుకున్నవారు. ఇప్పుడు అన్ని బ్యాంకుల్లో సీబీఎస్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ సందర్భానికి ఫారం 60 విషయంలో తగిన మార్పులు చేయొచ్చు. అలాగే ఆడిట్ రిపోర్టులోని అంశాల్లో రిటర్నులు ముందే నింపేలా చేయొచ్చు.అంటే స్మార్ట్ ఫారంల ద్వారా వారికి కావల్సిన సమాచారాన్ని రాబట్టుకుంటారు. ఫారాలు, రిపోర్టులు ఉన్న సమాచారం, రిటర్నుల్లో ముందే వచ్చేలా ఆలోచిస్తున్నారు. దీన్నే ఆటోమేటిక్ ప్రీ–పాపులేట్ అంటారు. ఈ డేటా వల్ల అర్థవంతమైన (అర్థపరమైన) విశ్లేషణకు దారి సుగమం. ఇదే కొత్త మంత్రం. ఇన్కం కరెక్టుగా రిపోర్ట్ చేయండి. అప్పుడు వారికి చెకింగ్ టైమ్ తగ్గుతుంది. మంచివారిని వదిలేసి ‘దేశముదురు’లను.. అంటే పన్ను ఎగవేసే వారి మీద దృష్టి పెట్టొచ్చు. -
రిస్క్ లేకుంటే రాబడి లేదు!
క్యాలెండర్ మారి నెల దాటిపోయింది. ఫిబ్రవరి కూడా గడిచిపోతోంది. ఈక్విటీలు స్థిరంగా లేవు. ఇండెక్స్లు ఆల్టైమ్ గరిష్ఠాలకు దగ్గర్లో కనిపిస్తున్నా.. 80–90 శాతం షేర్లు కనిష్ఠ స్థాయిల్లో ట్రేడవుతున్నాయి. ఇక ఎఫ్డీలను చూస్తే వడ్డీలు తగ్గి రాబడుల్లేవు. సురక్షితమని బంగారం, వెండి వంటి లోహాలవైపు వెళితే... వాటి ఎగుడుదిగుళ్లకి ఊపిరాడని పరిస్థితి. మొత్తంగా ఇప్పటివరకూ 2026 చెబుతున్నదొక్కటే. రిస్క్ తీసుకోకుంటే రాబడుల్లేవు. అలాగని రిస్క్ తీసుకున్నా నిద్ర లేదు. మరేం చేద్దాం? ఇలాంటి పరిస్థితుల్లో సురక్షితమైన దారేది? కనీసం ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులనిచ్చే సాధనాలేంటి? వీటి విశ్లేషణే ఈ వారం ‘వెల్త్ ప్లస్’ స్టోరీ...కొందరిది రిస్క్కు దూరంగా ఉండే ధోరణి. కొందరిదైతే దూకుడుగా రిస్క్ గురించి ఆలోచించకుండా ముందుకెళ్లే ధోరణి. వాస్తవానికి ఇలాంటి ఏకపక్ష విధానాలు ఎప్పుడో తప్ప కలిసిరావు. ఈ సంవత్సరం ఇలాంటి విధానాలు అస్సలు కలిసొచ్చేలా లేవు. కాబట్టి ప్రతి ఒక్క ఇన్వెస్టర్ తమ పెట్టుబడుల సామర్థ్యం, కాల వ్యవధి, రాబడుల ఆకాంక్షలకు అనుగుణంగా వివిధ సాధనాల మధ్య కేటాయింపులు సమతుల్యం చేసుకోవాలి. ‘బ్యాలన్స్’గా నడుచుకోవడం తప్పనిసరి. ఎందుకంటే గతేడాది కూడా (2025–26లో) సంప్రదాయ ఎఫ్డీలు ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడులను ఇవ్వలేకపోయాయి. ఈక్విటీ మార్కెట్లలో ఆటుపోట్లూ పెరిగాయి. జీడీపీలో ఆర్థిక పొదుపులు 47 ఏళ్ల కనిష్టానికి చేరాయి. జీవన వ్యయాలేమో పెరిగిపోతున్నాయి. మధ్యతరగతి ప్రజలకిది పెద్ద సవాలే. కాబట్టి ఏం చేయాలంటే...వేటి ప్రాధాన్యం వాటిదే..మనం ఆహారంలో భాగంగా బియ్యం/గోధుమలకే పరిమితం కాలేం. కూరగాయలు, పండ్లు, పప్పులు, గుడ్లు, మాంసం ఇలా అన్నింటినీ తీసుకుంటాం. ఎందుకంటే ఒక్కోదానిలో ఉండే పోషకాలు వేరు. సమతుల్య ఆహారం మానసిక, శారీరక ఆరోగ్యాన్నిస్తుంది. పెట్టుబడులకూ ఇదే సూత్రం వర్తిస్తుంది. తమ నికర ఆర్జన ఎంత? అందులో ఖర్చులు ఎంత? మిగిలేది ఎంత? భవిష్యత్ లక్ష్యాలు ఏవి? వాటికి ఎంత మొత్తం సమకూరాలి? ఇందుకోసం ఎంత రాబడి అవసరం? ఈ అంశాల ఆధారంగా ఎఫ్డీలు/డెట్ ఫండ్స్–ఈక్విటీలు–పసిడి/వెండి ఇలా వివిధ సాధనాలకు కేటాయింపులు చేసుకోవాలి. దీన్నే అసెట్ అలోకేషన్ అని కూడా అంటుంటారు. ఏదో ఒక సాధనం కాకుండా, స్వల్పకాల అవసరాల కోసం డెట్, మధ్య కాల అవసరాలకు డెట్–ఈక్విటీ, దీర్ఘకాల అవసరాలకు ఈక్విటీ, బంగారం సాధనాలకు కేటాయింపులు ప్లాన్ చేసుకోవాలి. దీని వల్ల వైవిధ్యం ఉంటుంది. ఒక విభాగంలో ప్రతికూలతలు ఉన్న సమయంలో మరో విభాగంలోని పెట్టుబడులు మంచి పనితీరుతో ప్రయోజనం పొందొచ్చు. వేటికి ఎంత..? సంపాదనలో 35 శాతం అయినా (మూడింట ఒక వంతు) ఆదా చేయాలి. ఆదా చేసిన మొత్తంలో 30–35 శాతాన్ని ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా చిన్న మొత్తాల పొదుపు పథకాలు, లేదా లిక్విడ్, మనీ మార్కెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి.కనీసం 50–60 శాతాన్ని ఈక్విటీల్లో దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేసుకోవాలి. బంగారం, వెండిలో 10–15 శాతం మించకుండా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈక్విటీ, బంగారం, వెండిపై పెట్టుబడులకు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) మంచి సాధనం. రక్షణ–రాబడులుఎఫ్డీలు, డెట్ ఫండ్స్తో సంపద సృష్టి సాధ్యం కాదు. కానీ, పెట్టుబడికి రక్షణ ఉంటుంది. స్వల్పకాలంలో పెట్టుబడి కాపాడుకోవడమే ముఖ్యం.ఈక్విటీలతో సంపద సృష్టి సాధ్యం. అది దీర్ఘకాలంలో, క్రమశిక్షణతో నడుచుకున్నప్పుడే.కమోడిటీలు మిగిలిన పెట్టుబడులకు హెడ్జింగ్గా పనిచేస్తాయి. అదే సమయంలో మెరుగైన రాబడికీ మార్గం చూపుతాయి. ప్రీమియం లోహాలు..బంగారం, వెండి ర్యాలీ ఏ స్థాయిలో ఉంటుందో గత కొన్నేళ్ల అనుభవాలు చూస్తే అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా గడిచిన ఏడాది కాలంలో అయితే పసిడి, వెండి ధరలు రెట్టింపయ్యాయి. దీన్ని చూసి ఇన్వెస్టర్లు పసిడి, వెండిలోనూ పెద్ద ఎత్తున పెట్టుబడులు కుమ్మరిస్తున్నారు. కాకపోతే ఈ ఏడాది ఊగిసలాట మామూలుగా లేదు. తాజాగా వెండి గరిష్ఠానికి చేరటం... భారీగా పతనమవటం అంతా నెలలో జరిగిపోయింది. మిగిలిన పెట్టుబడి సాధనాల నుంచి వైదొలిగి మొత్తం వీటిలోనే కుమ్మరించిన వారి పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది. ‘అతి సర్వత్ర వర్జయేత్’ అన్నది వీటికీ వర్తిస్తుంది. బంగారం, పసిడి ఏటా స్థిరంగా రాబడినిస్తాయన్న భరోసా లేదు. ఇవి ఒక సైకిల్ ప్రకారం చలిస్తుంటాయి. కొన్నేళ్ల పాటు అతి తక్కువ రాబడి, స్థిరీకరణ తర్వాత కొద్ది కాలంలోనే ఎక్కువ ర్యాలీ చేయడం వీటి స్వభావం. కనుక ఏటా స్థిరంగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లడమే మెరుగైన విధానం.స్టాక్స్లో మాదిరి వీటిపై డివిడెండ్, బోనస్లు వంటివేవీ ఉండవు.బంగారం కంటే వెండిలో ఆటుపోట్లు ఎంతో ఎక్కువ. ఆర్థిక వ్యవస్థలు గొప్పగా పనిచేస్తున్న కాలంలో ఇవి దీర్ఘకాలం పాటు ర్యాలీకి దూరంగా ఉంటాయి. ఇన్వెస్టర్ల హెడ్జింగ్ కోసం, సెంట్రల్ బ్యాంకుల మారకం నిల్వల స్థిరత్వానికి పసిడికి డిమాండ్ ఎక్కువ. పారిశ్రామిక వినియోగం, ఇన్వెస్టర్ల పెట్టుబడిగానూ వెండికి డిమాండ్ పెరుగుతోంది.కానీ, ఇప్పటి వరకు చరిత్ర చూస్తే 1950 నుంచి ఇప్పటి వరకు పసిడి, వెండిపై రాబడి 10–11 శాతం (వార్షికంగా) చొప్పున ఉంది.పసిడి, వెండిపై పెట్టుబడులకు చార్జీలు, లిక్విడిటీ పరంగా ఈటీఎఫ్లు లేదా మ్యూచువల్ ఫండ్స్ పథకాలే మెరుగైనవి. ఫిక్స్డ్ డిపాజిట్లు భద్రమే కానీ..ఎఫ్డీలపై 6.5–7 శాతం రాబడి పేపర్పై కనిపించేంత వరకే. మన దగ్గర ద్రవ్యోల్బణం సగటున 5–6 శాతం మధ్య ఉంటోంది. అంటే ఎఫ్డీ ఇచ్చిన రాబడిని ద్రవ్యోల్బణమే తినేస్తున్నట్లు లెక్క. ఇక ఇన్వెస్టర్కు మిగిలేది ఏముంటుంది? కొన్ని సందర్భాల్లో ద్రవ్యోల్బణం 6 శాతాన్ని దాటిపోతోందన్నది కూడా గుర్తు పెట్టుకోవాలి. ఒకవేళ 30 శాతం ఆదాయపన్ను పరిధిలో ఉంటే ఎఫ్డీఐపై వచ్చే 6–7 శాతం రాబడిపై కూడా 30 శాతం పన్ను చెల్లించాల్సి వస్తుంది. అప్పుడు అసలు రాబడి రాకపోగా... పన్ను అనంతరం స్వల్పంగా నష్టపోవాల్సి వస్తుంది. దీనివల్ల కాలానుగుణంగా ఆ డిపాజిట్కు ఉన్న విలువ తగ్గిపోతుందని గమనించాలి. ఫిక్స్డ్ డిపాజిట్ అన్నది ఎంతో సులభమైన పెట్టుబడి సాధనం. కాల వ్యవధి తీరే నాటికి ఎంత వస్తుందన్నది ముందుగానే తెలిసిపోతుంది. పైగా ఇంటి సమీపంలోని బ్యాంక్లో డిపాజిట్ చేసుకుని, కావాల్సినప్పుడు అదే రోజు వెనక్కి తీసుకోగల సౌలభ్యం ఉంటుంది. ఎఫ్డీలో పెట్టుబడికి భద్రత ఎక్కువ. ఒక డిపాజిటర్కు ఒక బ్యాంక్ పరిధిలో రూ.5 లక్షల వరకు బీమా ఉంటుంది కనుక నిశ్చింత ఎక్కువ. కానీ, భద్రత కోసమని, సౌకర్యం ఉందని చెప్పి నికరంగా రూపాయి కూడా రాబడి లేని (ఎఫ్డీ రేటు నుంచి ద్రవ్యోల్బణం తీసేయగా) సాధనంలో ఉన్నదంతా పెట్టేస్తే ముఖ్యమైన లక్ష్యాలను సాధించడమెలా అన్నది ఆలోచించాలి. పైగా ఆర్బీఐ ఇటీవలి కాలంలో 1.25 శాతం మేర రెపో రేటును తగ్గించేసింది. భవిష్యత్తులోనూ తగ్గించొచ్చు. అలాంటప్పుడు ఎఫ్డీఐలపై రాబడి మరింత తగ్గిపోతుందని అర్థం చేసుకోవాలి. కాలానుగుణంగా మన పెట్టుబడి విలువ కూడా పెరగాలి. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఏటా విద్య, వైద్యం, గృహ అద్దె, నిత్యాసవరాల ధరలు కూడా పెరుగుతుంటాయి. ఈ స్థాయిలో లేదంటే ఇంతకుమించి పెట్టుబడిని వృద్ధి చేసుకోవాల్సిందే. ఇక్కడే ఈక్విటీల పాత్ర కీలకం అవుతుంది. ఈక్విటీలు మెరుగే కానీ..ఈక్విటీలు ఇతర సంప్రదాయ సాధనాలకు మించి రాబడులను ఇస్తాయన్నది చారిత్రక వాస్తవం. కానీ, అది దీర్ఘకాలంలోనే సాధ్యం. పదేళ్లకు మించిన కాలంలో ఈక్విటీ ఫండ్స్లో రాబడి 12– 15 శాతం మధ్య ఉంది. స్మాల్, మిడ్క్యాప్ ఫండ్స్లో అయితే ఈ రాబడి 30 శాతం వరకు ఉంది. స్వల్పకాలానికి ఈక్విటీల పనితీరు ఎలా ఉంటుందో అంచనా వేయలేం. ఆర్థిక వృద్ధి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య అనిశ్చితులు, కరెన్సీ విలువలు, దేశాల రుణ భారాలు, వడ్డీ రేట్లు, వాతావరణ మార్పులు ఇలా ఎన్నో అంశాల ఆధారంగా ఈక్విటీలు కదులుతూ ఉంటాయి. ఇలాంటి ప్రతికూలతలను జీర్ణం చేసుకుంటూ మధ్య కాలం నుంచి దీర్ఘకాలంలో ఈక్విటీలు మెరుగైన పనితీరు చూపిస్తుంటాయి.క్రమశిక్షణ, అనుభవం కలిగిన ఇన్వెస్టర్లు సైతం ఈక్విటీల పతనాలను చూసి ఆందోళన చెందుతుంటారు. ప్రతి ర్యాలీ తర్వాత దిద్దుబాటు కచ్చితంగా ఉంటుందన్నది వాస్తవం.దీంతో ఈక్విటీ పెట్టుబడులపై నిశ్చింత, ప్రశాంతత అన్నది అన్ని సందర్భాల్లో ఉండదు. ముఖ్యంగా మధ్యతరగతి ఇన్వెస్టర్లలో ఎక్కువ మంది తక్షణ రాబడుల కోసం ఫ్యూచర్స్, ఆప్షన్స్ (ఎఫ్అండ్వో), ఇంట్రాడే ట్రేడింగ్ వైపు అడుగులు వేస్తుంటారు. సరైన పరిశోధన, ఆయా సాధనాల పనితీరు, రిస్క్లు ఇవన్నీ తెలుసుకోకపోవడం ఫలితంగా నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తుంది. ఎఫ్డీల మాదిరి (రూ.5లక్షలు) ఈక్విటీ పెట్టుబడులకు ఎలాంటి గ్యారంటీ ఉండదు. స్వల్పకాలంలో పెట్టుబడి విలువ కూడా తగ్గిపోవచ్చన్నది గుర్తు పెట్టుకోవాలి. ఒక్కోసారి మెరుగైన రాబడుల కోసం మార్కెట్ సైకిల్ మారే వరకూ వేచి చూడాల్సి రావచ్చు. ఈక్విటీ ఫండ్స్లో పెట్టుబడులతో కంపెనీలు జారీ చేసే డివిడెండ్ సైతం తిరిగి పెట్టుబడిగా మారుతుంది. దీర్ఘకాలంలో కాంపౌండింగ్తో రాబడి మరింత ఇతోధికం అవుతుంది. లిక్విడిటీ ఎక్కువ. సులభంగా క్రయ, విక్రయాలు చేసుకోవచ్చు. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని అధిగమించేందుకు ఈక్విటీ పెట్టుబడులు బలంగా పనిచేస్తాయి. దీంతో కొనుగోలు శక్తి తగ్గదు.ఇదీ చదవండి: భారత్-యూఎస్ ట్రేడ్ డీల్పై రైతు సంఘాల ఆగ్రహం -
ఆరోగ్య ఖర్చుల కోసం ఎన్పీఎస్ ‘స్వస్థ్య’
రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత కల్పించే నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) ఇప్పుడు ఆరోగ్య అవసరాలు తీర్చేందుకు సిద్ధమైంది. పెరుగుతున్న వైద్య ఖర్చులను దృష్టిలో ఉంచుకుని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) ‘ఎన్పీఎస్ స్వస్థ్య’ అనే కొత్త పెన్షన్ స్కీమ్ను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ఇది పూర్తిస్థాయి ఆరోగ్య బీమాకు ప్రత్యామ్నాయం కానప్పటికీ వైద్య ఖర్చుల కోసం ఒక ప్రత్యేక వాలెట్లా పనిచేస్తుంది.ప్రస్తుతం ఈ పథకాన్ని ‘రెగ్యులేటరీ సాండ్బాక్స్’ విధానంలో పరిశీలిస్తున్నారు. అంటే, ఈ పథకం క్షేత్రస్థాయిలో ఎంతవరకు విజయవంతమవుతుందో టెక్నాలజీ, కస్టమర్ రక్షణ పరంగా ఎదురయ్యే సవాళ్లేమిటో ఈ ట్రయల్ ద్వారా పర్యవేక్షిస్తారు.ఎలా పనిచేస్తుంది?ఎన్పీఎస్ స్వస్థ్య అనేది సాధారణ ఎన్పీఎస్ ఖాతాకు అనుబంధంగా ఉండే ఒక ప్రత్యేక ఖాతా. ఈ ఖాతా తెరవాలంటే సభ్యుడికి కనీసం ఒక సాధారణ ఎన్పీఎస్ ఖాతా ఉండాలి. సభ్యులు తమ ఇష్టానుసారం ఇందులో నగదు జమ చేయవచ్చు. ఈ నిధులను పెన్షన్ ఫండ్ మేనేజర్లు వివిధ పథకాల్లో పెట్టుబడిగా పెడతారు. ఓపీడీ ఖర్చులు, ఆసుపత్రిలో చేరి చికిత్సల కోసం ఈ నిధులను వాడుకోవచ్చు.40 ఏళ్లు దాటిన వారికి..ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన ప్రభుత్వేతర ఉద్యోగులకు ఈ పథకం కీలకమని చెప్పవచ్చు. వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని తమ సాధారణ ఎన్పీఎస్ ఖాతాలోని కార్పస్ నుంచి 30 శాతం వరకు నిధులను ‘స్వస్థ్య’ ఖాతాకు బదిలీ చేసుకునే అవకాశం కల్పించారు. దీనివల్ల అదనపు పొదుపు చేయకపోయినా పాత పొదుపునే ఆరోగ్య అవసరాలకు మళ్లించుకోవచ్చు.ఉపసంహరణ నిబంధనలుమొదటిసారి ఉపసంహరణ చేయాలంటే ఖాతాలో కనీసం రూ.50,000 ఉండాలి. ఉపసంహరణల సంఖ్యపై ఎటువంటి పరిమితి లేదు. ఒకవేళ ఆసుపత్రి బిల్లులు మొత్తం నిధిలో 70 శాతం దాటితే సభ్యుడు పూర్తి మొత్తాన్ని ఒకేసారి విత్డ్రా చేసుకోవచ్చు. ఈ పథకంలో బిల్లుల చెల్లింపు నేరుగా సభ్యుడికి కాకుండా హెల్త్ బెనిఫిట్ అడ్మినిస్ట్రేటర్ (హెచ్బీఏ) లేదా థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ (టీపీఏ) ద్వారా జరుగుతుంది. దీనివల్ల నిధుల దుర్వినియోగం తగ్గుతుంది.సవాళ్లు.. నిపుణుల అభిప్రాయంఈ పథకం క్రమశిక్షణతో కూడిన పొదుపును ప్రోత్సహిస్తున్నప్పటికీ కొన్ని పరిమితులు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎన్పీఎస్లో రూ.50,000 కనీస నిధి ఉండాలనే నిబంధన సామాన్యులకు ఇబ్బందిగా మారవచ్చు. క్లెయిమ్ ప్రాసెసింగ్ ఫీజులు, ఉపసంహరణలపై పన్ను విధింపు విషయంలో ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. ఇది మార్కెట్ ఆధారిత పథకం కావడంతో వైద్య ద్రవ్యోల్బణంకు తగ్గట్టుగా రాబడులు వస్తాయా లేదా అన్నది సందేహమే.ఇదీ చదవండి: భారత్-యూఎస్ ట్రేడ్ డీల్పై రైతు సంఘాల ఆగ్రహం -
వాయిదాల వార్నింగ్!
ఆదాయాలు పెరుగుతున్నాయి. మధ్య తరగతి ఎదిగి... ఎగువ మధ్య తరగతిగా మారుతోంది. కాకపోతే ఈ ఆదాయాలతో పాటు ఆకాంక్షలూ పెరుగుతున్నాయి. ఇది సహజమే. ఇందులో తప్పేమీ లేదు. కాకపోతే చిక్కల్లా... మధ్య తరగతి పొదుపు తగ్గుతుండటమే. ఎందుకంటే దేశంలో పొదుపు మొత్తాల శాతం దశాబ్దాల కనిష్ఠానికి చేరిపోతోంది. ఇది నిశ్శబ్దంగా విస్తరిస్తున్న ప్రమాదకరమైన ధోరణికి సంకేతంగా కనిపిస్తోంది. అదేంటంటే... ఈఎంఐల ఉచ్చు. ఇళ్లు, కార్లు, గ్యాడ్జెట్లు, విహారయాత్రలు, విద్య... ఇలా ప్రతిదీ ఇపుడు ‘సులభతరమైన’ నెలవారీ వాయిదాల్లో దొరికేస్తోంది. దీనికి కంపెనీలు పెడుతున్న ముద్దుపేరు బీఎన్పీఎల్. ఇప్పుడు కొనండి... తరువాత చెల్లించండి. ఈ ఈజీ కొనుగోళ్ల మాయలో పడి ఆర్థిక ప్రణాళికలను, క్రమశిక్షణను అటకెక్కించే పరిస్థితి ఏర్పడుతోంది. దీన్నుంచి బయటపడకపోతే ఉచ్చులో చిక్కుకుని ఊబిలో కూరుకుపోయే ప్రమాదం పొంచి ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడాలంటూ హెచ్చరిస్తున్నదే ఈ ‘వెల్త్ స్టోరీ’.ఈఎంఐల సమస్య ఎకాయెకిన కాకుండా నెమ్మదిగా, ఒక్కొక్కటిగా మొదలవుతోంది. క్రమంగా పెనుభారంగా మారి కుటుంబాలను అస్తవ్యస్తం చేస్తోంది. తామరతంపరగా పెరిగిపోయే ఈఎంఐలు, నెలవారీ ఆదాయంలో సింహభాగాన్ని తినేస్తున్నాయి. అప్పులకు, ఇంటి అవసరాలకు చెల్లించేయగా.. చివరికి పొదుపు చేసేందుకు పైసా మిగ లని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ఎప్పటికప్పుడు పొదుపు వాయిదా పడిపోతుంది. ఇది ఒక స్థాయిని చేరాక పొదుపు సంగతి పక్కనబెడితే ఖర్చులకూ సరిపోని పరిస్థితి. వీటికి తోడు ఊహించని విధంగా ఏ చిన్న కుదుపు వచ్చినా (ఉద్యోగం పోవడం, వైద్యం ఖర్చుల్లాంటివి) అప్పుల కోసం హైరానా పడిపోయే పరిస్థితి. ప్రస్తుతం చాలా కుటుంబాల పరిస్థితి ఇలాగే ఉంటోంది. గృహ రుణం ఈఎంఐ, కారు రుణం ఈఎంఐ, వ్యక్తి గత రుణం లేదా క్రెడిట్ కార్డ్ ఈఎంఐ, విద్యారుణం ఈఎంఐ ఇలా ప్రతి దానికి ఈఎంఐలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి.లెక్కేసుకుంటే.. .సాధారణంగా ఈఎంఐల గురించి ఫైనాన్షియల్ ప్లానర్లు చెప్పే సూత్రం ఒకటి ఉంది. నెలవారీ ఆదాయంలో ఈఎంఐల భారం 30–35 శాతానికి మించకూడదు. కానీ వాస్తవంగా పట్టణ ప్రాంతాల్లోని చాలా కుటుంబాల్లో వాయిదాల భారం 50–60 శాతం పైగా ఉంటోంది. ఇక క్రెడిట్ కార్డ్ రోలోవర్స్ గురించి చెప్పనక్కర్లేదు. ప్రతి నెలా అలా పెరుగుతూనే ఉంటోంది. డిఫాల్ట్ ముప్పును అటుంచితే కనీసం ఊపిరి కూడా తీసుకోలేని ఆందోళనకర పరిస్థితి నెలకొంటోంది.ఈ సమస్య ఎందుకింత వేగంగా పెరుగుతోంది.. అప్పులు, ఈఎంఐల సమస్య వేగంగా పెరుగుతుండటానికి చాలా కారణాలు ఉంటున్నాయి. వీటిలో కొన్ని... రుణాలు సులువుగా దొరకడం ఇప్పుడు రుణం తీసుకోవడమనేది గతంలోలాగా సుదీర్ఘ ప్రక్రియగా ఉండటం లేదు. క్షణాల్లో లోన్స్ కి అప్రూవల్ లభిస్తోంది. నిమిషాల్లో క్రెడిట్ అయి పోతోంది. జీవన విధానంపరమైన ద్రవ్యోల్బణం జీతం పెరిగిందంటే చాలు లైఫ్ స్టయిల్ని కూడా మార్చేసే ధోరణి ఉంటోంది. దానికి తగ్గట్లుగా లోన్ తీసుకోవడం, ఇంకో కొత్త ఈఎంఐని జోడించుకోవడం చక చకా జరిగిపోతోంది. ‘‘నో–కాస్ట్ ఈఎంఐ’’ భ్రమ అసలు వడ్డీ ప్రసక్తే ఉండదు.. తీసుకున్నంతే కట్టొచ్చు అని ఆర్థిక సంస్థలు ఊరిస్తుంటాయి. కానీ మన లెక్కకు అందని, మనకు తెలియని వడ్డీ ఎంతో కొంత ఉంటుందనేది అర్థం చేసుకోవాలి. సామాజిక ఒత్తిళ్లు వచ్చినదానితో ఇంట్లో ఎంతగా సర్దుకుని ఉందామనుకున్నా హంగులు, ఆర్భాటాలు లేకపోతే ఉపయోగం లేదు అనే రకంగా సామాజిక ఒత్తిడి ఉంటోంది. ఖరీదైన ఇళ్లు, కార్లు, గ్యాడ్జెట్స్ లాంటివి విజయానికి గుర్తుల్లాగా ఉంటున్నాయి. చెల్లించుకోక తప్పదు మూల్యం.. ఈఎంఐలు అడ్డదిడ్డంగా పెరిగిపోవడం వల్ల చాలా దుష్పరిణామాలు కూడా ఎదురవుతాయి. ఎమర్జెన్సీ నిధి అనేది ఎప్పటికీ ఏర్పాటు చేసుకోలేం. పిల్లల చదువులకు సంబంధించిన ప్రణాళికలు దెబ్బతింటాయి. రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక అవసరాల కోసం పొదుపు చేద్దామనుకున్నా నిరవధికంగా వాయిదా పడుతూనే ఉంటుంది. వీటన్నింటి వల్ల శాశ్వత ప్రాతిపదికన ఒకే ఒక్కటి లభిస్తుంది. అదేంటంటే మానసిక ఒత్తిడి. చాలా కుటుంబాలు ఆర్థికంగా స్థిరంగానే ఉన్నట్లు కనిపిస్తుంటాయి. కానీ ట్రబుల్ అనేది ఆసుపత్రి వ్యయాల రూపంలో కూతవేటు దూరంలోనే ఉంటుంది.మూడు ప్రశ్నలు.. ఏ రుణం తీసుకోవాలన్నా ముందుగా మీకు మీరు ఓ మూడు ప్రశ్నలు వేసుకోండి. అవేంటంటే.. → ఈ ఈఎంఐ తీసుకున్న తర్వాత కూడా పొదుపును యథాప్రకారం కొనసాగించగలనా? → ఒక 3 నెలల పాటు ఆదాయం రాకపోయినా కూడా ఈఎంఐలను కట్టగలనా? → ఈఎంఐపై కొనుక్కుంటున్నదేదైనా సరే నా భవిష్యత్తును మెరుగుపర్చుకోవడానికి ఉపయోగపడుతుందా, లేక కేవలం లైఫ్స్టయిల్కే పనికొచ్చేదా? వీటిల్లో దేనికైనా సరే జవాబు ‘‘నో’’ అని వస్తే.. కాస్త ఆలోచించండి. చివరిగా చెప్పేదేమిటంటే.. రుణాలు, ఈఎంఐలనేవి చెడ్డవి కావు. కాకపోతే ఈఎంఐలు మరీ ఎక్కువైపోతే ఆర్థిక స్వాతంత్య్రాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా అనిశ్చితి నెలకొన్న తరుణంలో షో కోసం అప్పు మీద కొని పెట్టుకునేవాటికంటే పొదుపు చేయడం, చేతిలో డబ్బు ఆడటమే చాలా ముఖ్యమని గుర్తెరగాలి.బయటపడేదిలా.. పీకల్లోతు ఈఎంఐల ఊబిలో కూరుకుపోతున్న పరిస్థితి నెలకొన్నప్పటికీ కాస్తంత సరిగ్గా ప్లాన్ చేసుకుంటే దాన్నుంచి తప్పించుకోవడం కష్టమేమీ కాదు. అదెలాగో చూద్దాం.. 1. ఈఎంఐలకు ఒక పరిమితి విధించుకోవాలి → మొత్తం ఈఎంఐల భారం నెలకు నికరంగా వచ్చే ఆదాయంలో మూడో వంతు స్థాయికి మించకుండా చూసుకోవాలి. → ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడకూడదని డిసైడ్ కావాలి. 2. ముందుగా ఎమర్జెన్సీ ఫండ్ని ఏర్పాటు చేసుకోండి. → ఎటు పోయి ఎటొచ్చినా కనీసం 6 నెలల ఖర్చులకు సరిపడేంత నిధిని పక్కన పెట్టుకోవాలి. → ఆ తరువాతే కొత్త లోన్స్ గురించి ఆలోచించాలి. 3. అధిక వడ్డీ రుణాల నుంచి బైటపడాలి → ముందుగా వడ్డీ భారం ఎక్కువగా ఉండే క్రెడిట్ కార్డులపై రుణాలు, వ్యక్తిగత రుణాలను తీర్చేసుకోవడంపై దృష్టి పెట్టాలి. → కాస్త కాస్త చొప్పున ప్రీపేమెంట్ చేసినా, భారీగా వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు. 4. ‘‘అవసరం’’, ‘‘అప్గ్రేడ్’’కి మధ్య వ్యత్యాసం.. → సాధారణంగా మనకి అవసరమైనవి కొన్ని ఉంటాయి. స్థాయిని చూపించుకునేందుకు తీసుకునేవి కొన్ని ఉంటాయి. ఈ రెండింటి మధ్య తేడాను అర్థం చేసుకుంటే చాలు. ఉదాహరణకు సొంత ఇల్లు అనేది ఒక అవసరం. కానీ ఖరీదైన కార్లు, కొత్త గ్యాడ్జెట్స్కు మారుతుండటమనేది అప్గ్రేడ్ కావాలనే తాపత్రయానికి నిదర్శనం. -
నెలకు రూ. 5వేలుతో.. రూ. 8లక్షలు చేతికి!
ఎంత డబ్బు సంపాదించే వారికైనా పొదుపు చేయడం తప్పనిసరి. ఆర్ధిక క్రమశిక్షణ లేకుండా.. దుబారా ఖర్చు చేస్తే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం పెట్టుబడికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇందులో కొంత రిస్క్ కూడా ఉంటుంది. అయితే రిస్క్ లేకుండా.. ప్రభుత్వ హామీతో సురక్షితమైన లాభం ఆశించేవారికి పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ ఓ మంచి ఎంపిక అవుతుంది.నెలకు రూ.5000 చొప్పున పోస్టాఫీస్ రికరింగ్ ఖాతాలో జమ చేస్తూ.. ఐదేళ్లు ఇన్వెస్ట్ చేయలి. ఇలా చేసుకుంటూ పోతే.. మీ పెట్టుబడి రూ.3 లక్షలు అవుతుంది. ప్రభుత్వం దీనికి 6.7 శాతం వార్షిక వడ్డీ ఇస్తుంది. ఐదేళ్ల కాలం మీరు చేసిన డబ్బుకు మొత్తం రూ. 3,56,830 లభిస్తుంది.దీనిని మీరు పదేళ్లు పొడిగించుకుంటే.. మొత్తం పెట్టుబడి రూ. 6,00,000 (5000 x 120 నెలలు). దీనికి 6.7 శాతం వడ్డీ అనుకుంటే రూ. 2,54,272 వస్తుంది. వడ్డీ, అసలు కలిపితే మొత్తం రూ. 8,54,272 అవుతుంది.నిజానికి ఒక సాధారణ వ్యక్తికి లేదా ఒకేసారి పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టలేని వారికి ఈ పోస్టాఫీస్ రికరింగ్ స్కీమ్ బెస్ట్ అనే చెప్పాలి. పిల్లల చదువుకు, పెళ్లి వంటి అవసరాలకు ఇది కొంత ఉపయోగకరంగా ఉంటుంది.ఇదీ చదవండి: 2026లో బంగారం, వెండి భవిష్యత్తు ఇదే!: బాబా వంగా -
కియోసాకీకి కోపమొచ్చింది!
‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకీ, తాను బిట్కాయిన్ను 6,000 డాలర్లకి కొనుగోలు చేశానన్న వ్యాఖ్యలపై వచ్చిన విమర్శలకు స్పందించారు. బిట్కాయిన్ కొనుగోలు చేసిన తేదీపై అనవసరంగా దృష్టి పెట్టడం ఇన్వెస్టర్ల అసలు లక్ష్యాన్ని తప్పుదారి పట్టిస్తుందని ఆయన అన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’లో వరుస ట్వీట్లు చేశారు.తనను “అబద్ధం చెబుతున్నాడు” అంటూ ఆరోపించిన వ్యక్తి, బిట్కాయిన్ను ఏ తేదీన కొనుగోలు చేశానన్న అంశాన్ని ప్రశ్నిస్తున్నాడని కియోసాకీ పేర్కొన్నారు. అయితే తాను గుర్తుంచుకునేది కొనుగోలు చేసిన ధర (strike price) మాత్రమేనని, తేదీ తనకు ప్రాధాన్యం కాదని చెప్పారు.“నేను ఏ తేదీన బిట్కాయిన్ కొన్నానో అతడికి ఎందుకు అంత ఆసక్తి?” అని ప్రశ్నించిన కియోసాకీ, ఆ విమర్శల వెనుక వ్యక్తిగత అజెండా ఉండవచ్చని ఆరోపించారు.బిట్కాయిన్ ధర మళ్లీ 6,000 డాలర్లకి పడితే మరోసారి కొనుగోలు చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఆ సమయంలో తేదీ ఏమిటన్నది తనకు ఎలాంటి ప్రాధాన్యం లేదన్నారు. ప్రస్తుతం తాను మరింత బంగారం కొనుగోలు చేయడానికి సిద్ధమవుతున్నానని కూడా వెల్లడించారు.తన విమర్శకులను ఉద్దేశించి, వారు ఎన్ని బిట్కాయిన్లు, బంగారం, వెండి లేదా ఈథీరియం కలిగి ఉన్నారో చెప్పాలని సవాలు విసిరారు. అలాగే అద్దె ఇళ్లు, చమురు బావులు వంటి వాస్తవ ఆస్తులపై కూడా ప్రశ్నించారు. “నేను ఈ ఆస్తులు ఎప్పుడు కొనుగోలు చేశానో నాకు గుర్తులేదు. కానీ వాటిని కొనుగోలు చేశానన్నది మాత్రం ఆనందంగా ఉంది” అని కియోసాకీ అన్నారు.అలాగే 2026 సంవత్సరానికి చెందిన 60 అమెరికన్ సిల్వర్ ఈగిల్స్ నాణేలు, 20 మిశ్రమ తేదీల గోల్డ్ ఈగిల్స్ కొనుగోలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. వెండి మార్కెట్లో ఉన్న కల్లోలం కారణంగా 2026 సిల్వర్ ఈగిల్స్ భవిష్యత్తులో కలెక్టర్ కాయిన్లుగా మారవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.చివరగా, తనను అనుసరించే ఇన్వెస్టర్లకు కియోసాకీ ఒక సూచన చేశారు. “ఆస్తి విలువ, సంఖ్య కంటే కొనుగోలు చేసిన తేదీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తుల నుంచి దూరంగా ఉండండి. దీర్ఘకాలిక సంపద ఆస్తుల సేకరణతోనే వస్తుంది, తేదీలతో కాదు.” అని ముగించారు.To the person who said I was lying that I bought Bitcoin at $6000…. I know my strike price not the date he falsely accuses me of the date I bought Bitcoin on.Why would he care what date I bought it on?Does he have a personal agenda for calling me a liar?If Bitcoin hits…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 7, 2026 -
‘ఏంటి మేడమ్ ఇది.. పసిడి పన్ను న్యాయమేనా?’
దేశ ప్రజలను భౌతిక బంగారం నుంచి పేపర్ గోల్డ్ వైపు మళ్లించేందుకు ఒకప్పుడు ఫ్లాగ్షిప్ పథకంగా నిలిచిన సావరిన్ గోల్డ్ బాండ్ (SGB) ఇప్పుడు ఆర్థిక బిల్లులో ప్రతిపాదించిన కొత్త పన్ను మార్పుల నేపథ్యంలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. సంవత్సరాల తరబడి పన్ను-సమర్థ పెట్టుబడిగా ప్రచారం చేసిన ఈ బాండ్లపై ఇప్పుడు ప్రభుత్వ విధాన స్థిరత్వమే ప్రశ్నార్థకంగా మారిందని విమర్శకులు అంటున్నారు.ఈ నేపథ్యంలో పెట్టుబడిదారుల అసంతృప్తికి స్వరం ఇచ్చారు చార్టర్డ్ అకౌంటెంట్ కరణ్ భాల్. ఆయన సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు విస్తృత చర్చకు దారి తీశాయి. “వావ్! ఇప్పుడు PPF, EPF ఉపసంహరణల్లో కూడా ప్రభుత్వానికి వాటా కావాలా? NPS లాభాలపై కూడా పన్నా? ‘నువ్వు డబ్బు సంపాదిస్తే, నాకూ వాటా ఎందుకు వద్దు?’ అనడం ఇది ఏం లాజిక్ మేడమ్? (ఆర్థిక మంత్రి నిర్మిలా సీతారామన్), ఎలాంటి పన్ను సమస్యలు లేకుండా గోల్డ్ బాండ్లు కొనాలని మీ ప్రభుత్వమే చెప్పింది. పెట్టుబడిదారులు లాభపడితే విధానాలనే మార్చేస్తారా?” అంటూ భాల్ మండిపడ్డారు.గోల్డ్ బాండ్ కొత్త ట్యాక్స్ ఫ్రేమ్వర్క్ఆర్థిక బిల్లులో ప్రతిపాదించిన మార్పుల ప్రకారం.. ఇకపై సావరిన్ గోల్డ్ బాండ్లపై పన్ను విధానం ఇన్వెస్టర్ దాన్ని ఎప్పుడు, ఎలా కొనుగోలు చేశారు, ఎప్పుడు నిష్క్రమించారు అన్నదానిపై ఆధారపడి ఉంటుంది. లాంచ్ సమయంలో చందా పొంది, పూర్తి 8 సంవత్సరాల మెచ్యూరిటీ వరకు ఉన్నవారికి మాత్రమే ఇప్పటికీ మూలధన లాభాలపై పన్ను మినహాయింపు ఉంటుంది.అదే సెకండరీ మార్కెట్లో సావరిన్ గోల్డ్ బాండ్లను కొనుగోలు చేసినవారికి మూలధన లాభాలపై పన్ను వర్తిస్తుంది. అలాగే, అసలు చందాదారులు ఐదేళ్ల తర్వాత కానీ ఎనిమిదేళ్లకు ముందే కానీ రీడీమ్ చేస్తే వారికి కూడా పన్ను వర్తిస్తుంది.2015లో ప్రారంభమైన సావరిన్ గోల్డ్ బాండ్ పథకం ఇప్పటివరకు 67 విడతల్లో సుమారు 147 టన్నుల బంగారానికి బాండ్లు జారీ చేసింది. అయితే బంగారం ధరలు పెరగడంతో, 2024 తర్వాత కొత్తగా వీటి జారీని నిలిపేసింది. దీంతో సెకండరీ మార్కెట్లో లావాదేవీలు పెరిగాయి. అవే ఇప్పుడు పన్నుల వలలో చిక్కాయి.మరోవైపు రిస్క్ తీసుకున్నప్పటికీ తమ మొత్తం పోర్ట్ఫోలియో XIRRలు (ఎక్స్టెండెడ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్) ఇప్పటికీ ప్రారంభ రెండంకెల్లోనే ఉన్నాయని, ఈటీఎఫ్లతో పోలిస్తే సావరిన్ గోల్డ్ బాండ్లకు సెకండరీ మార్కెట్లో లిక్విడిటీ సమస్యలు ఎక్కువ అని సీఏ కరణ్ భాల్ వాదిస్తున్నారు.WOW!The government will deserve its share of your PPF, EPF withdrawals too.It'll deserve its share of your NPS gains too.And what logic is this? "If you are making a killing, why shouldn't I get something?"Madam, your government only told us to go ahead and buy SGBs… pic.twitter.com/8KYhZ2Kxx9— Kanan Bahl (@BahlKanan) February 4, 2026 -
ఇంటి పొదుపును ఇన్వెస్ట్మెంట్గా మారుస్తాం: అంబానీ
భారతదేశంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న దీర్ఘకాలిక పొదుపు సంస్కృతి ఉన్నప్పటికీ, అది ఇప్పటివరకు ఉత్పాదక సంపద సృష్టిగా పూర్తిగా మారలేదన్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ. గృహ పొదుపులను పెట్టుబడుల వైపు మళ్లించడంలో జియో–బ్లాక్రాక్ కీలక పాత్ర పోషించే అవకాశముందని ఆయన పేర్కొన్నారు.ముంబైలో నిర్వహించిన జియో–బ్లాక్రాక్ ఫైర్సైడ్ చాట్లో బ్లాక్రాక్ సీఈవో లారీ ఫింక్తో సంభాషిస్తూ అంబానీ ఈ వ్యాఖ్యలు చేశారు. భారతీయులు గత ఐదు నుంచి ఆరు దశాబ్దాలుగా క్రమంగా పొదుపు చేస్తున్నప్పటికీ, ఆ మూలధనం ఎక్కువగా దీర్ఘకాలిక రాబడులు అందించే విధంగా ఉపయోగించబడలేదని ఆయన తెలిపారు. రాబోయే 20-30 ఏళ్లలో భారతదేశం 25 నుండి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారే అవకాశం ఉందని, ఈ కాలం దేశంలోని యువ తరానికి అద్భుతమైన పెట్టుబడి అవకాశాన్ని అందిస్తుందని అన్నారు. పొదుపుదారులను పెట్టుబడిదారులుగా మారుస్తూ, పనికిరాని పొదుపును ఆదాయం తీసుకొచ్చే ఆస్తులుగా మార్చే మార్గాలను అందించడంలో జియో–బ్లాక్రాక్కు పెద్ద అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. “భారతీయులను కేవలం పొదుపు చేయడానికే కాదు, ఆ పొదుపులను సంపాదనగా మార్చుకునే ఎంపికలు అందించడమే మా లక్ష్యం” అని అంబానీ చెప్పారు.రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్లాక్రాక్ మధ్య ఉన్న భాగస్వామ్య తత్వాన్ని కూడా అంబానీ ప్రస్తావించారు. మూలధన కేటాయింపునకు సంబంధించిన విస్తృత దృష్టికోణంపై లారీ ఫింక్తో జరిగిన చర్చను గుర్తు చేస్తూ, “బ్లాక్రాక్ లక్ష్యం కేవలం స్వల్పకాలిక లాభాలు లేదా పెట్టుబడిదారులకు రాబడులు ఇవ్వడం మాత్రమే కాదు. ఆ మూలధనం సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడితేనే ఆ లక్ష్యం పూర్తైనట్టుగా భావిస్తారు. అదే తత్వం రిలయన్స్లో కూడా ఉంది” అని అంబానీ అన్నారు. -
ఐటీ రిటర్న్స్ గడువు పెంపు అందరికీనా?
ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఐటీఆర్ దాఖలు గడువును ఆగస్టు 31 వరకు పెంచుతున్నట్లు ఇటీవల 2026-27 బడ్జెట్లో ప్రకటించడంతో, ఈ పొడిగింపు పన్ను చెల్లింపుదారులందరికీ వర్తిస్తుందని చాలామంది భావిస్తున్నారు. కానీ అది పూర్తిగా నిజం కాదు.పీక్ ఫైలింగ్ సీజన్లో ఒత్తిడిని తగ్గించేందుకు ప్రభుత్వం దశలవారీ ఫైలింగ్ టైమ్లైన్ను ప్రవేశపెట్టింది. అయితే ఈ సడలింపు ఎంపిక చేసిన కొన్ని కేటగిరీల ట్యాక్స్ పేయర్స్కు మాత్రమే పరిమితం. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలోనే, అదనపు సమయం నిర్దిష్ట పన్ను చెల్లింపుదారులకు మాత్రమే ఉంటుందని, మిగతావారు ప్రస్తుత గడువునే పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.జూలై 31 గడువు ఎవరికీ వర్తిస్తుంది?వేతన పన్ను చెల్లింపుదారులు, పెన్షనర్లు, ఐటీఆర్-1 లేదా ఐటీఆర్-2 దాఖలు చేసే వ్యక్తులు, జీతం, వడ్డీ లేదా మూలధన లాభాల ద్వారా ఆదాయం పొందేవారికి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్కు జూలై 31 గడువే కొనసాగుతుంది. వీరికి ఎలాంటి గడువు పొడిగింపు లేదు. అందువల్ల, వారు మునుపటిలాగే తమ ఫైలింగ్ ప్రణాళికలను కొనసాగించాలి.ఆగస్టు 31 ఎవరికి?ఆడిట్ అవసరం లేని వ్యాపార సంస్థలు, ఫ్రీలాన్సర్లు, డాక్టర్లు, కన్సల్టెంట్లు వంటి వృత్తి నిపుణులు (నాన్-ఆడిట్ బిజినెస్ కేసులు), అర్హత కలిగిన కొన్ని ట్రస్టులు మాత్రమే జూలై 31కి బదులుగా ఆగస్టు 31 వరకు ఐటీఆర్ దాఖలు చేయవచ్చు. ఆదాయపు పన్ను చట్టం, 2025 లోని సెక్షన్ 263(1)(c) కింద ఈ పొడిగింపు వర్తిస్తుంది.ఎప్పటి నుంచి అమల్లోకి..?ఈ కొత్త గడువు పన్ను సంవత్సరం 2026–27 నుంచి వర్తిస్తుంది. ఆదాయపు పన్ను చట్టం, 2025 కింద సవరణలు 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. 2026–27 అసెస్మెంట్ సంవత్సరానికి, ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టం, 1961లో కూడా ఇదే మార్పులు అమలు చేస్తారు. -
భారమైన బహుమతులు.. దూరమవుతున్న బంధాలు
ఒకప్పుడు శుభకార్యం అంటే పలకరింపులు, పట్టుచీరలు, బంగారు కానుకల సందడి. కానీ నేడు భారీగా పెరిగిన బంగారం, వెండి ధరల సెగ మధ్యతరగతి గడప దాటి వారి బంధాలపై ప్రభావం చూపుతోంది. ‘అప్పుడు వారు మాకు తులం బంగారం పెట్టారు, ఇప్పుడు మేము వారికి అంత ఇవ్వలేకపోతున్నామే’ అనే ఆవేదన.. బంధువుల్లో ఆత్మీయతపై ఆందోళన పెంచుతోంది.అసలు కానుకల వెనుక అర్థంసంప్రదాయంగా బంగారం, వెండి బహుమతులు కేవలం ఆడంబరం కోసం పుట్టినవి కావు. దీని వెనుక లోతైన సామాజిక, ఆర్థిక భద్రత దాగి ఉంది. పూర్వకాలంలో ఆడపిల్లకు ఇచ్చే నగలు ఆమె ఆర్థిక భద్రతకు భరోసాగా ఉండేవి. బంధువుల మధ్య బంగారు కానుకల మార్పిడి అనేది ఒక ‘సామాజిక పొదుపు’ లాంటిది. ఒకరి ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు అందరూ కలిసి ఇచ్చే కానుకలు, ఆ కుటుంబానికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తాయని ధోరణి ఉంది.పెరుగుతున్న ధరలు.. అంతరాలుప్రస్తుతం బంగారం ధరలు గతంతో పోలిస్తే భారీగా పెరిగాయి. గతంలో తులం బంగారం రూ.50,000 ఉన్నప్పుడు జరిగిన శుభకార్యంతో, ఇప్పుడు తులం రూ.1,40,000 ధరతో బేరీజు వేయడం వల్ల సమస్యలు మొదలవుతున్నాయి. ‘వారు మాకు అప్పుడు ఇచ్చారు, ఇప్పుడు మేము ఇవ్వకపోతే తక్కువ చేసి చూస్తారు’ అనే అభద్రతా భావం బంధువుల మధ్య గోడలు కడుతోంది. కానుకలు ఇచ్చుకోలేక చాలామంది సన్నిహితుల వేడుకలకు వెళ్లడమే మానేస్తున్నారు. ఇది పరోక్షంగా సామాజిక దూరాన్ని పెంచుతోంది.మానవ సంబంధాలను కాపాడుకోవడం ఎలా?డబ్బు కన్నా మనుషులు ముఖ్యం అని భావించినప్పుడే బంధాలు నిలుస్తాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో అనుసరించాల్సిన కొన్ని మార్గాలివే..1. కాలానుగుణ మార్పును అంగీకరించాలి.. పదేళ్ల క్రితం నాటి ధరలు ఇప్పుడు లేవని గ్రహించాలి. ఇచ్చే కానుక బరువును (గ్రాములను) కాకుండా అవతలి వారి ఆర్థిక పరిస్థితిని, ఆత్మీయతను గౌరవించాలి.2. ప్రత్యామ్నాయాల వైపు చూపు.. కేవలం బంగారం, వెండి మాత్రమే కానుకలు కావు. స్థిరాస్తి బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్ లేదా నగదు రూపంలో చిన్న మొత్తాన్ని అందించడం కూడా గౌరవప్రదమే.3. ముందస్తు ప్రణాళిక.. రాబోయే శుభకార్యాల కోసం ‘గోల్డ్ స్కీమ్స్’ వంటి వాటి ద్వారా చిన్న మొత్తాల్లో పొదుపు చేయడం వల్ల భారంగా అనిపించదు.4. సన్నిహిత బంధువుల మధ్య ఆర్థిక ఇబ్బందుల గురించి మొహమాటం లేకుండా చర్చించుకోవడం వల్ల అపోహలు తొలగిపోతాయి.5. వేడుకకు వెళ్లడం, తోడుగా నిలబడటం అనేది వస్తురూపంలో ఇచ్చే కానుక కంటే గొప్పదని గుర్తించాలి.బంగారం మెరుస్తుంది కానీ మాట్లాడలేదు. బంధం మౌనంగా ఉన్నా మనసును తడుముతుంది. ధరలు పెరిగినప్పుడు మన ఆలోచనా ధోరణిని మార్చుకోవాలే తప్ప, ఆత్మీయులను దూరం చేసుకోకూడదు.ఇదీ చదవండి: ఒరాకిల్ నిధుల వేట.. రూ.14 లక్షల కోట్లు కావాలట! -
లెక్కలు తప్పయితే.. చిక్కులు తప్పవు!
ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంటులో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. దేశ ఆర్థిక గమనాన్ని నిర్దేశించే ఈ కీలక ప్రకటన కోసం దేశవ్యాప్తంగా సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఆదాయపు పన్ను రాయితీలు పెరుగుతాయా? నిత్యావసరాల ధరలు తగ్గుతాయా? గృహ రుణ గ్రహీతలకు ఊరట లభిస్తుందా? అన్నవి ఇప్పుడు ప్రజల ముందున్న ప్రశ్నలు.అయితే, కేంద్ర బడ్జెట్ కేవలం టీవీల్లో చూసే అంకెలు మాత్రమే కాదు; అది నేరుగా మీ ఇంట్లో, మీ పిల్లల చదువులపై, మీ పొదుపుపై ప్రభావం చూపే అంశం. అందుకే, ప్రభుత్వ బడ్జెట్తో పాటు మీ ‘ఇంటి బడ్జెట్’ను ఎలా ప్లాన్ చేసుకోవాలి? పన్ను మార్పులను ఎలా అందిపుచ్చుకోవాలి? అసలు ఆర్థిక క్రమశిక్షణ ఎందుకు ముఖ్యం? వంటి అంశాలతో కూడిన ప్రత్యేక కథనం ఇదిగో..పన్ను మార్పులు..ఈసారి కొత్త పన్ను విధానంలో (New Tax Regime) మరిన్ని మార్పులు లేదా సెక్షన్ 80C కింద మినహాయింపు పరిమితిని రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచే అవకాశం ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బడ్జెట్ ప్రసంగం తర్వాత మీ వార్షిక ఆదాయం ఏ పన్ను స్లాబ్లోకి వస్తుందో లెక్కించుకుని, దానికి అనుగుణంగా పెట్టుబడులను ప్లాన్ చేసుకోండి.ఖర్చుల అంచనాబడ్జెట్లో కొన్ని వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం లేదా పెంచడం జరుగుతుంది. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, బంగారం లేదా గృహోపకరణాల ధరల్లో మార్పులు ఉండవచ్చు. మీ ఇంట్లో కొనుగోలు చేయాల్సిన వస్తువుల జాబితా ఉంటే బడ్జెట్ తర్వాత ధరల హెచ్చుతగ్గులను బట్టి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.పొదుపు మంత్రంబడ్జెట్లో మౌలిక సదుపాయాలు, తయారీ రంగాలకు పెద్దపీట వేయడం వల్ల దీర్ఘకాలంలో స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్పై ప్రభావం ఉంటుంది. మీ భవిష్యత్తు అవసరాల కోసం (పిల్లల చదువు, పెళ్లిళ్లు) ఎంత మేర కేటాయించాలో బడ్జెట్ ఫలితాలను బట్టి నిర్ణయించుకోవాలి.‘ఇంటి బడ్జెట్’ ఎందుకు?ప్రభుత్వం దేశం కోసం ఎలాగైతే ప్రణాళికలు సిద్ధం చేస్తుందో ప్రతి ఇంట్లో కూడా అలాగే ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. ఎందుకంటే..అనుకోని ఆరోగ్య సమస్యలు లేదా ఉద్యోగ మార్పులు ఎదురైనప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ అవసరం ఉంటుంది. బడ్జెట్ వేసుకుంటేనే మన దగ్గర ఎంత మిగులు ఉందో తెలుస్తుంది. దాన్ని ఎమర్జెన్సీ ఫండ్లోని మళ్లించవచ్చు.ఆదాయానికి మించిన ఖర్చులు చేస్తే క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్ల ఊబిలో చిక్కుకుపోయే ప్రమాదం ఉంది. బడ్జెట్ వల్ల అనవసరపు ఖర్చులకు అడ్డుకట్ట వేయవచ్చు.సొంత ఇల్లు కొనాలన్నా, కొత్త కారు తీసుకోవాలన్నా, పిల్లల చదువులు సాగాలన్నా.. కచ్చితమైన ప్లానింగ్ అవసరం. నెలకు ఎంత పొదుపు చేస్తున్నామో తెలిస్తేనే లక్ష్యం చేరువవుతుంది.బడ్జెట్ కోసం సింపుల్ టిప్: 50-30-20 రూల్మీ ఆదాయాన్ని మూడు భాగాలుగా విభజించండి. మొత్తం నెలవారీ రాబడిలో..50%: అవసరాలు (అద్దె, కిరాణా, ఫీజులు)30%: కోరికలు (సినిమాలు, విహారయాత్రలు, షాపింగ్)20%: పొదుపు, పెట్టుబడులుకేంద్ర బడ్జెట్ 2026 దేశానికి ఒక రోడ్ మ్యాప్ అయితే, మీరు వేసుకునే ఇంటి బడ్జెట్ మీ కుటుంబ ఆర్థిక భరోసాకు పునాది. ఫిబ్రవరి 1న వెలువడే అధికారిక ప్రకటనలను బట్టి మీ ఆర్థిక వ్యూహాన్ని సిద్ధం చేసుకోండి.ఇదీ చదవండి: కొత్త వాహనం.. అయినా టైరు పేలొచ్చు! -
ఆ పన్నులు తగ్గిస్తే మంచిది: ఎస్బీఐ
రాబోయే కేంద్ర బడ్జెట్ 2026లో పన్నులు, బీమా, పెన్షన్ రంగాల్లో కీలక సంస్కరణలు తీసుకురావాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన తాజా నివేదికలో కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. గృహ ఆర్థిక పొదుపును పెంచడం, నియంత్రణ సవాళ్లను తగ్గించడం, దేశంలో సామాజిక భద్రత కవరేజీని మెరుగుపరచడం ఈ సూచనల ప్రధాన లక్ష్యమని పేర్కొంది.గృహ ఆర్థిక పొదుపులో బ్యాంకు డిపాజిట్ల వాటా 2024 ఆర్థిక సంవత్సరంలో 38.7 శాతం నుంచి 2025లో 35.2 శాతానికి తగ్గిందని నివేదిక వెల్లడించింది. బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా పొదుపును ప్రోత్సహించేందుకు డిపాజిటర్లకు పన్ను ఉపశమన చర్యలు అవసరమని ఎస్బీఐ అభిప్రాయపడింది.బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ ఆదాయానికి వర్తించే పన్ను విధానాన్ని దీర్ఘకాలిక, స్వల్పకాలిక మూలధన లాభాల (LTCG, STCG)తో సమానంగా తీసుకురావాలని సూచించింది. అలాగే పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్ల లాక్-ఇన్ వ్యవధిని మూడేళ్లకు తగ్గించి, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ (ELSS)తో సమానంగా చేయాలని సిఫార్సు చేసింది. చిన్న పొదుపుదారులకు ఉపశమనం కలిగించేలా పొదుపు ఖాతాలపై వడ్డీకి వర్తించే టీడీఎస్ను పూర్తిగా తొలగించాలని లేదా కనీస పరిమితిని పెంచాలని కూడా ఎస్బీఐ సూచించింది.పరోక్ష పన్నుల విషయంలో, ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ (ISD)కు సంబంధించిన జీఎస్టీ నిబంధనల్లో స్పష్టత తీసుకురావాలని నివేదిక పేర్కొంది. జీఎస్టీ చట్టం, 2017లోని కొన్ని పదాలను సవరించడం ద్వారా వివాదాలు తగ్గించవచ్చని సూచించింది. అలాగే బ్యాంకులు పంపిణీ చేసే ఐఎస్డీపై వాల్యుయేషన్ వివాదాలు లేకుండా ఉండేందుకు సెక్షన్ 20(3)కు వివరణ జోడించాలని ప్రతిపాదించింది.ఎన్పీసీఐ, వీసా, మాస్టర్కార్డ్ వంటి సెటిల్మెంట్ ఏజెన్సీల ద్వారా చెల్లింపులపై జీఎస్టీ టీడీఎస్ అమల్లో బ్యాంకులు ఎదుర్కొంటున్న ఆచరణాత్మక సమస్యలను కూడా నివేదిక ప్రస్తావించింది. బ్యాంకింగ్ సేవలకు జీఎస్టీ టీడీఎస్ వర్తించకుండా మినహాయింపు ఇవ్వాలని ఎస్బీఐ సూచించింది.బీమా రంగంలో, భారతదేశంలో బీమా వ్యాప్తి 2025 ఆర్థిక సంవత్సరంలో 3.7 శాతానికి తగ్గిందని ఐఆర్డీఏఐ డేటాను ఉటంకిస్తూ నివేదిక తెలిపింది. జీవిత బీమా వ్యాప్తి 2.7 శాతానికి, నాన్-లైఫ్ బీమా 1 శాతానికి పరిమితమైందని పేర్కొంది. “2047 నాటికి అందరికీ బీమా” అనే ఐఆర్డీఏఐ లక్ష్యానికి ఇది సవాలుగా మారిందని హెచ్చరించింది. అలాగే 2025లో వచ్చిన ఫిర్యాదుల్లో 69 శాతం క్లెయిమ్స్కు సంబంధించినవేనని, ముఖ్యంగా ఆరోగ్య బీమా రంగంలో తక్షణ సంస్కరణలు అవసరమని నివేదిక స్పష్టం చేసింది.పెన్షన్ రంగంలో కనీస పెన్షన్ హామీతో కూడిన బలమైన, సమగ్ర పెన్షన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఎస్బీఐ నొక్కి చెప్పింది. కేంద్ర బడ్జెట్ 2026లో ఈ సూచనలను అమలు చేస్తే దేశ ఆర్థిక భద్రత బలోపేతమవుతుందని, దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వానికి దోహదపడుతుందని ఎస్బీఐ పేర్కొంది. -
Income Tax: బినామీ వ్యవహారాల జోలికెళ్లొద్దు..
బినామీ ఆస్తి అంటే ఏమిటి.? బినామీ వ్యవహారం ఏమిటి.? బినామీదారు ఎవరు? ప్రయోజనం పొందేవారెవరు? మొదలైన విషయాలు ఇప్పటికే తెలుసుకున్నాము. ఈ వ్యవహారాలు చేయడం వల్ల కలిగే కష్టనష్టాలు ఈ వారం తెలుసుకుందాం.!ఆస్తి జప్తు: బినామీ ఆస్తి అని నిర్ధారణ జరిగితే ఆ ఆస్తిని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం లేదా జప్తు చేసుకుంటుంది.శిక్షార్హులు: బినామీదారు, ప్రయోజనం పొందే వ్యక్తి (ముసుగు మనిషి), ఈ వ్యవహారాన్ని ప్రేరేపించిన లేదా ప్రోత్సహించిన వ్యక్తి, ఈ ముగ్గురూ చట్టం ప్రకారం శిక్షార్హులే. ఆరోపణలు నిరూపణ అయితే ఒక ఏడాది నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష (కఠినకారాగార శిక్ష) ఉంటుంది. ఇది కాకుండా, బినామీ ఆస్తి ఫెయిర్ మార్కెట్ విలువ మీద 25% జరిమానాగా విధిస్తారు. ముందుగానే తప్పు ఒప్పుకుంటే కొన్ని షరతులకు లోబడి జరిమానాను సడలిస్తారు. బినామీదారు బినామీ ఆస్తిని తిరిగి ‘ప్రయోజకుడు’ లేదా ఏ ఇతర వ్యక్తికి కూడా బదిలీ చేయకూడదు. ఇలాంటి బదిలీలు చెల్లవు. అలాంటి అమ్మకం జరిగినప్పుడు కొన్న వ్యక్తికి ఎటువంటి విషయం తెలియకపోతే.. నిజమని నమ్మించి అమ్మితే, కొన్న వ్యక్తి నుంచి ఆస్తి తీసుకోరు. అధికారుల అధికారాలు ఈ చట్టప్రకారం నాలుగు రకాల అధికారులు ఉన్నారు. వారి అధికారాలు ఏమిటంటే... (1) సమన్లు జారీ చేయడం (2) సమాచారం కోరడం (3) డాక్యుమెంట్లు స్వాధీనపరచుకోవడం (4) విచారణ చేయడం (5). విచారణలో సహకారం కోసం ఇతర అధికారులను కోరడం. ఇంకా ఏం చేస్తారు నోటీసులు ఇస్తారు. విచారిస్తారు. తీర్పు ఇస్తారు. తీర్పు అనుగుణంగా ఆస్తిని స్వాధీనం చేసుకుంటారు. వాటిని ఆధీనంలోకి తీసుకుంటారు.ఆద్యులెవరు .. ఆస్తిని స్వాధీనపరుచుకోవడానికి ముందు.. ఆద్యులు ఎవరంటే ఇన్కంటాక్స్ డిపార్టుమెంటు వారు. వారిచ్చిన సమాచారం, డాక్యుమెంట్ల ఆధారంగా చేసుకొని, బినామీ చట్టంలోని అధికారులు రంగంలోకి ప్రవేశిస్తారు. ఈ తరువాత పద్దతి ప్రకారం పని ముగిస్తారు.నోటీసు ప్రక్రియ.. నోటీసు ఇవ్వడానికి ప్రక్రియ మారితే.. వ్యక్తిగత పోస్టు ద్వారా లేదా సివిల్ కోడ్ ప్రకారం నోటీసు ద్వారా విచారణ, ప్రశ్నలు, ఇన్వెస్టిగేషన్, సోదాలు, కాగితాల సేకరణ, పత్రాలు అడగడం, ఆ తరువాత తీర్పు ఇవ్వడం, ఎటాచ్మెంట్ చేయడం, స్వాధీనపరచుకోవడంలాంటివి జరుగుతాయి. ఆ తరువాత బినామీ ఆస్తి కేంద్ర ప్రభుత్వానికి చెందుతుంది. ఎంక్వైరీ మధ్యలో బినామీదారు/ముసుగు మనిషి మరణిస్తే వారి వారసులకు కేసు బదిలీ చేస్తారు. కోర్టు పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఈ ప్రక్రియలో ఏ స్థాయిలోనైనా తప్పుడు సమాచారం ఇచ్చినా., తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించినా కఠిన కారాగార శిక్ష, జరిమానాలు పడతాయి.ఈ రెండు చట్టాలు–చుట్టాలు .. అటు అదాయపన్ను చట్టం, ఇటు బినామీ వ్యవహారంలో నిషేధిత చట్టం రెండూ కలిసి పనిచేస్తాయి. బినామీ వ్యవహారాల ద్వారా పన్ను ఎగవేత అంశం వెలుగులోకి వస్తుంది. ఇన్కంటాక్స్ అధికారులనే సూత్రధారులుగా .. ప్రారంభించే అధికారిని INITIATING OFFICERS గా వ్యవహరించమంటారు. వారే అన్ని తయారు చేస్తారు. డిపార్టుమెంటు వారు ఈ చట్టం ద్వారా సమాచారం, డాక్యుమెంట్లు రాబట్టుకుంటారు. వారి చట్టం ప్రకారం పెనాల్టీలు.. ఆదాయం మీద పన్ను వేసి... మిగతా కార్యక్రమం పూర్తి చేసి బినామీ నిషేధ చట్టం అధికారులకు అప్పగిస్తారు. ఈ అధికార్లు ఆస్తిని జప్తు చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇస్తారు. డిక్లేర్ చేయని ఆస్తులు.. డిక్లేర్ చేయని ఆదాయ వివరాలు తెలుసుకొని వాటిని అసెస్సీ పన్ను పరిధిలోకి తెచ్చి.. అసెస్మెంట్ చేసి... పన్ను, వడ్డీ, పెనాల్టీలు వసూలు చేసి బినామీ చట్టం అధికార్లకు అప్పగిస్తారు.ఇప్పుడు అర్థమైందా... బినామీ వ్యవహారాల వెనుకు ఎంత రిస్క్ ఉందో... దగ్గర బంధువులు, వ్యాపారం చేస్తున్న మిత్రులు, బంధువులు, మీరు చిన్న ఉద్యోగి అయితే మీ బాస్లు, యజమానులు, అల్లుడు, బావ, వియ్యంకుడు ఇలా అభిమానం అడ్డుపెట్టి, డబ్బులు ఎరచూపి, వారి కష్టాలని మీ దగ్గర వెలిబుచ్చి ట్రాప్ చేస్తారు. వారి వలలో పడకండి! -
నిర్మాణంలో ఉన్న ఇల్లు బెటరా?
సొంత ఇల్లు కొనాలన్నా, బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలన్నా సామాన్యుడికి ఎన్నో లెక్కలు.. మరెన్నో సందేహాలు. కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయిని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే భద్రంగా ఉంటుంది? ఎక్కడ పెడితే లాభసాటిగా ఉంటుంది? అన్నదే ప్రతి ఒక్కరి ఆలోచన. రియల్ ఎస్టేట్ నుంచి స్టాక్ మార్కెట్ వరకు, బంగారం నుంచి ఇన్సూరెన్స్ వరకు పెట్టుబడిదారుల మదిలో మెదిలే కీలక ప్రశ్నలకు ఆర్థిక నిపుణుల విశ్లేషణాత్మక సమాధానాలు మీకోసం..రియల్టీ..నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేయటం మేలా... లేక నిర్మాణం పూర్తయిన ఇంటిని కొనుగోలు చేయాలా?రెండింట్లోనూ దేనికుండే లాభాలు, దేనికి ఉండే ఇబ్బందులు దానికున్నాయి. ఎందుకంటే నిర్మాణం పూర్తయి తక్షణం వెళ్లగల ఇంటిని కొనుక్కోవటం సురక్షితం. వెంటనే వెళ్లిపోవచ్చు. వేచి చూడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇలాంటి ఇళ్ల ధర సహ జంగానే ఎక్కువ ఉంటుంది. ఇక నిర్మాణంలో ఉన్న ఇల్లయితే ధర కాస్త తక్కువగా ఉంటుంది. కాకపోతే ఎప్పటికి పూర్తవుతుంది... ఎప్పుడు డెలివరీ ఇస్తారు అనే విషయాలకు గ్యారంటీ ఉండదు. ఇవన్నీ బిల్డరు పూర్వ చరిత్రను చూసి ముందుకు వెళ్లాల్సిన విషయాలే. కాకపోతే ఎంత పేరున్న బిల్డరయినా ఒకోసారి ఇబ్బందులో పడొచ్చు. దానివల్ల మనకు ఇవ్వాల్సిన ఇల్లు ఆలస్యం కావచ్చు. అందుకని మీ అవసరం, వేచిచూసే సామర్థ్యాన్ని బట్టి దేన్ని తీసుకోవాలో నిర్ణయించుకోవాలి. బ్యాంకింగ్..ఎఫ్డీ చేయాలనుకుంటున్నాను. వడ్డీ రేటును బట్టి బ్యాంకును ఎంచుకోవాలా? లేక సర్వీసును చూశా?మీరు ఎంత మొత్తాన్ని ఎఫ్డీ చేయాలనుకుంటున్నారనేది ఇక్కడ ముఖ్యం. ఎందుకంటే అది తక్కువ మొత్తమే అనుకోండి. వడ్డీ రేటు చూసి ఎఫ్డీ చెయ్యండి. అలాకాకుండా ఎక్కువ మొత్తాన్ని డిపాజిట్ చేయాలనుకున్నానుకోండి. అపుడు బ్యాంకు అందిస్తున్న సేవలు, డిజిటల్ సౌకర్యాలు, ఆ బ్యాంకు ఎంత సురక్షితమైనది... అనే అంశాలన్నీ చూడాలి. 0.1 లేదా 0.25 వడ్డీ శాతం కన్నా మన సొమ్ము భద్రంగా ఉండటం ముఖ్యం కదా!. అందుకే మీరు ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారనే అంశాన్ని బట్టి బ్యాంకును ఎంచుకోండి. మీరు చేసే ఎఫ్డీ గనక రూ.5 లక్షలు లేదా అంతకన్నా తక్కువ ఉంటే.. అది ఏ బ్యాంకులో డిపాజిట్ చేసినా ఆ మొత్తానికి డిపాజిట్ క్రెడిట్ గ్యారంటీ పథకం కింద బీమా ఉంటుంది. కాబట్టి సురక్షితం. బంగారం సావరిన్ గోల్డ్ బాండ్స్ సురక్షితమేనా? అందులో ఇన్వెస్ట్ చేయొచ్చా?సావరిన్ గోల్డ్ బాండ్లు పూర్తిగా సురక్షితం. వాటికి ఆర్బీఐ ద్వారా కేంద్ర ప్రభుత్వ గ్యారంటీ ఇస్తోంది. కాకపోతే ప్రస్తుతం ఈ సావరిన్ గోల్డ్ బాండ్లను జారీ చెయ్యటాన్ని కేంద్రం నిలిపేసింది. గతంలో జారీ చేసినపుడు కొన్నవాటికి మాత్రం మెచ్యూరిటీ అయిన వెంటనే చెల్లింపులు జరుగుతున్నాయి. ఇవి మరికొన్ని సంవత్సరాలు జరుగుతాయి కూడా. ఈ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసినవారికి బంగారం ధర ఎంత పెరిగితే అంత చెల్లించటంతో పాటు ఏటా 2.5 శాతం మొత్తాన్ని అదనంగా కూడా చెల్లిస్తారు. భౌతికంగా బంగారం కొనటం కన్నా ఇదే ఎక్కువ లాభం కదా!. కాకపోతే ఇందులో ఉండే రిస్కల్లా ఒకటే. బంగారం ధర తగ్గితే చెల్లించేటపుడు తగ్గిన ధరే చెల్లిస్తారు. ఏడేళ్ల పాటు కాలపరిమితి ఉండటంతో పాటు ఐదేళ్ల లాకిన్ కూడా ఉంది.స్టాక్ మార్కెట్...1న బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు కనక ఆదివారమైనా స్టాక్ మార్కెట్ పనిచేస్తుందని ప్రకటించారు. బడ్జెట్కు, స్టాక్ మార్కెట్కు సంబంధమేంటి?బడ్జెట్ ప్రవేశపెట్టిననాడు సెలవు దినమైతే ఆ రోజున స్టాక్ మార్కెట్ ప్రత్యేకంగా పనిచేయటమన్నది ప్రస్తుత ప్రభుత్వ హయాంలో మొదలైన సంప్రదాయం. గత సంవత్సరం కూడా ఫిబ్రవరి 1 శనివారం వచి్చంది. ఆ రోజునా స్టాక్ మార్కెట్లు పనిచేశాయి. ఇపుడు ఆదివారం కూడా పనిచేస్తాయని ప్రకటించారు. వాస్తవానికి బడ్జెట్ అనేది పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం కాదని గతంలో కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. కానీ ఇపుడు బడ్జెట్ సమయంలో మార్కెట్ ఎలా ప్రతిస్పందిస్తుందనేది లైవ్లో దేశ ప్రజలకు తెలుస్తుందని, తమ నిర్ణయాలకు మార్కెట్ ఆమోదం ఉందో లేదో కూడా తెలిసిపోతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.మ్యూచువల్ ఫండ్స్...సాధారణ డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయటం సురక్షితమేనా?షేర్లలో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్తో పోలిస్తే బాండ్లలో ఇన్వెస్ట్ చేసే డెట్ ఫండ్స్ చాలా సురక్షితం. అలాగని వాటిలో రిస్కు ఉండదని కాదు. అవి ఏ బాండ్లు కొంటున్నాయనేదాన్ని బట్టి అవెంత సురక్షితమో చెప్పొచ్చు. సాధారణంగా డెట్ఫండ్స్ ప్రభుత్వ సెక్యూరిటీల్లోను, ట్రెజరీ బిల్స్లోను, కార్పొరేట్ బాండ్లలోను, మనీమార్కెట్ సాధనాల్లోను ఇన్వెస్ట్ చేస్తుంటాయి. వీటిలో హెచ్చుతగ్గులు తక్కువ. తక్కువైనా... స్థిరమైన రాబడులుంటాయి. అయితే ఈ ఫండ్లు కార్పొరేట్ బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. సదరు కంపెనీ క్రెడిట్ రేటింగ్ తగ్గితే అది కొంతమేర రిస్కే. ఇక వడ్డీరేట్లు పెరిగినపుడు బాండ్ల ధరలు తగ్గుతాయి. మార్కెట్ పరిస్థితులు బాగులేకుంటే ఫండ్లు తమ బాండ్లను అమ్మటానికి ప్రయత్నించినా ఎవరూ కొనకపోవచ్చు. ఈ రిస్క్లు దృష్టిలో పెట్టుకోవాలి.ఇన్సూరెన్స్ఆయుష్ ట్రీట్మెంట్కు అయ్యే ఖర్చులు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ పరిధిలోకి వస్తాయా?మన దేశంలో ఇపుడు చాలా పాలసీలు ఆయుష్ ట్రీట్మెంట్కు కవరేజీ ఇస్తున్నాయి. కొన్ని షరతులుంటున్నాయి. ఆయుర్వేద, యోగ, నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియో పతి వంటి చికిత్సలన్నీ ఆయుష్ పరిధిలోకి వస్తా యి. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలోనో, లేక ప్రభు త్వ గుర్తింపు పొందిన ఆసుపత్రిలోనో, ఎన్ఏబీహెచ్ అక్రిడిటేషన్ ఉన్న ఆయుష్ ఆసుపత్రిలోనో తీసుకున్న చికిత్సకే కవరేజీ ఇస్తున్నారు. ఔట్పేషెంట్ చికిత్సలకు కాకుండా... ఆసుపత్రిలో చేరిన చికిత్స లకే ఇది వర్తిస్తుంది. గుర్తింపు లేని ప్రయివేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్నా, నేరుగా మందులు కొనుక్కున్నా, వెల్నెస్ థెరపీ, స్పా, రిజువనేషన్ చికిత్సలకు ఇది వర్తించదు. పైపెచ్చు చాలా పాలసీలు కవరేజీ మొత్తాన్ని ఏడాదికి రూ.25వేల నుంచి రూ.50 వేలకు పరిమితం చేస్తున్నాయి.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2026: బయో ఇం‘ధనం’ కావాలి.. -
విశ్రాంత జీవనంలోనూ ‘ఫండించొచ్చు!
స్టాక్ మార్కెట్ పెట్టుబడులంటేనే కాస్త టెన్షన్. ఎందుకంటే ఇక్కడ రాబడుల వెనకాల రిస్కూ ఉంటుంది. వయసులో ఉన్నవారికైతే ఓకే. మార్కెట్లు పడినా కొన్నాళ్లు వేచిచూస్తే మళ్లీ సర్దుకుంటాయి. మరి రిటైరీల మాటేంటి? నెలవారీ ఆదాయంతోనే నెట్టుకురావాల్సిన సీనియర్ సిటిజన్లు ఈ టెన్షన్లతో సుఖవంతమైన జీవితాన్ని ఆస్వాదించటం సాధ్యమా? అలాగని ఎఫ్డీలపైనే ఆధారపడితే అంతకంతకూ వడ్డీ రేట్లు తగ్గుతూ పోతున్నాయి. పైపెచ్చు జీవన వ్యయాలు, వైద్యం ఖర్చుల్లాంటివి పెరిగిపోతున్నాయి. మరి విశ్రాంత జీవనం గౌరవప్రదంగా, ఆర్థికంగా స్వేచ్ఛతో సాగించాలంటే దారేంటి? ద్రవ్యోల్బణాన్ని మించి కాకపోయినా బ్యాంకు ఎఫ్డీలకన్నా మెరుగైన రాబడి అందించే సాధనాలు ఏమున్నాయి? మ్యుచువల్ ఫండ్స్ వైపు మళ్లొచ్చా? అసలు సీనియర్ సిటిజన్లకు అవి మంచివేనా అనే ప్రశ్నలకు అంత తేలిగ్గా సమాధానాలు దొర కవు. కాకపోతే ఆచి తూచి, సరైన వ్యూహంతో ఎంచుకుంటే సీనియర్ సిటిజన్లకూ ఫండ్స్ ప్రయోజనకరంగానే ఉంటాయనేది నిపుణుల మాట. దాన్ని వివరించే ప్రయత్నమే ఈ వెల్త్ స్టోరీ....ప్రాధాన్యాలు మారుతాయి.. వయస్సు పెరిగే కొద్దీ ప్రాధాన్యాలు మారుతాయి. యువ ఇన్వెస్టర్లతో పోలిస్తే సీనియర్ సిటిజన్ల ఆర్థిక అవసరాలు, ప్రణాళికలు వేరుగా ఉంటాయి. వారికి రాబడికన్నా తమ పెట్టుబడిని కాపాడుకోవటం ముఖ్యం. క్రమం తప్పకుండా, కచ్చితంగా కొంత మొత్తం ఆదాయంగా చేతికి అందటం అంతకన్నా ముఖ్యం. అది కూడా పెరిగే ధరలను తట్టుకునే భరోసానివ్వాలి. ఆరోగ్యం పరంగానో లేక మరొకటో అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే చేతిలో నగదు ఉండాలి. ఇలా ఒకటా, రెండా.. పెట్టుబడి పెట్టేటప్పుడు ఎన్నో విషయాలు చూసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ని సరిగ్గా ఉపయోగించుకోగలిగితే, సంప్రదాయ పెట్టుబడి సాధనాలకు తోడుగా ఉంటూ, ఈ లక్ష్యాలను సాధించుకోవడంలో సహాయకరంగానూ ఉంటాయి. సౌకర్యవంతంగా జీవించాలంటే... ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో, అద్దెను మినహాయించి తక్కువలో తక్కువగా, ఓ మధ్యతరగతి సీనియర్ సిటిజన్ కుటుంబ ఖర్చులు ఇలా ఉంటున్నాయి... → కరెంటు, ఇంటి మెయింటెనెన్సు మొదలైనవి: రూ. 8,000–10,000 → నిత్యావసరాలు : రూ. 10,000–12,000 → వైద్యం, ఔషధాల ఖర్చులు: రూ. 5,000–7,000 → ప్రయాణాలు, వ్యక్తిగత అవసరాల ఖర్చులు: రూ. 5,000–6,000 → ఇలా, ఒక మోస్తరు సౌకర్యవంతంగా జీవించాలంటే నెలకు సింపుల్గా రూ. 30,000 నుంచి రూ. 40,000 వరకు అవసరమవుతోంది. → మరికాస్త సౌకర్యవంతంగా ఉండాలంటే (ట్రావెల్, హాబీలు, పని మనుషులు) ఖర్చులు నెలకు రూ. 45,000–60,000 వరకు పెరుగుతాయి.ఇంత ఆదాయం రావాలంటే ఎంత దాచిపెట్టాలి? రిటైర్మెంట్ తర్వాత కూడా ఖర్చుల కోసం నెలకు రూ. 30,000 నుంచి రూ. 60,000 వరకు అందుకోవాలంటే, అందుకు ఏ స్థాయిలో పెట్టుబడులు ఉండాలి? వార్షికంగా ఎంత మొత్తం రాబడిని ఆశించవచ్చు అనేది మరో ప్రశ్న. సీనియర్ సిటిజన్లకు, పెట్టుబడి భారీగా వృద్ధి చెందడం కన్నా, రాబడిపరమైన భద్రత అవసరం కాబట్టి తక్కువలో తక్కువగా ఏటా 6–7 శాతం రాబడిని ఆశించవచ్చు. దాన్ని బట్టి, పెద్దగా రిస్కులు ఉండని, పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ ప్రాతిపదికన చూస్తే..సీనియర్ సిటిజన్లకు పెట్టుబడి ఆప్షన్లు.. → బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీములు – స్థిరత్వం కోసం ఇవి పెట్టుబడులకు భద్రతనిచ్చేలా, రాబడులు అంచనాలకు తగ్గట్లుగా ఉంటాయి. క్రమం తప్పకుండా వడ్డీ ఆదాయం వస్తుంది. కాకపోతే పెరిగే ధరలకు తగ్గ స్థాయిలో రాబడి ఉండకపోవచ్చు. కాబట్టి పోర్ట్ఫోలియోలో వీటికి 30–40 శాతం పెట్టుబడిని కేటాయించవచ్చు. → డెట్ మ్యూచువల్ ఫండ్స్ వీటిలో వివిధ కేటగిరీలున్నా.. సీనియర్ సిటిజన్లకు ఈ కిందివి అనువైనవిగా ఉంటాయి. → సంప్రదాయ హైబ్రిడ్ ఫండ్స్ → స్వల్పకాలిక ఫండ్స్ → కార్పొరేట్ బాండ్ ఫండ్స్ వీటిని ఎందుకు పరిశీలించవచ్చంటే, ఇవి ఎఫ్డీలతో పోలిస్తే పన్నుల అనంతరం మరింత మెరుగైన రాబడిని అందిస్తాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు నగదు కింద మార్చుకునే (లిక్విడిటీ) వీలుంటుంది. విత్డ్రాయల్ సులభతరంగా ఉంటుంది. వీటికి 30–35 శాతం కేటాయించవచ్చు. → ఎస్డబ్ల్యూపీ (సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్) – పొదుపు మొత్తం నుంచి నెలవారీ జీతం ఎస్డబ్ల్యూపీ అనేది మ్యుచువల్ ఫండ్స్ నుంచి ప్రతి నెలా ఇంత మొత్తాన్ని విత్డ్రా చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. దీన్ని పెన్షనో లేదా శాలరీగానో అనుకోవచ్చు. వడ్డీ ఆదాయంతో పోలిస్తే దీనిపై పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. ఎంత విత్డ్రా చేసుకోవాలనేది ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు. డెట్ లేదా కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్తో కలిపి ఉపయోగించుకోవచ్చు. → ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ – పరిమిత స్థాయిలోనే, కాకపోతే కీలకం సీనియర్ సిటిజన్స్ అయినంత మాత్రాన షేర్లకు పూర్తిగా దూరంగా ఉండాల్సిన పనిలేదు. లార్జ్ క్యాప్ లేదా ఇండెక్స్ ఫండ్స్ లాంటివి ఎంచుకోవచ్చు. పెట్టుబడుల్లో 10–20 శాతానికి మించకుండా ఈక్విటీలకు కేటాయించవచ్చు. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణం నుంచి పొదుపు మొత్తాలను కాపాడుకోవడానికి ఈ ఫండ్స్ ఉపయోగపడతాయి. శాంపిల్ రిటైర్మెంట్ పోర్ట్ఫోలియో (రూ. 1 కోటి నిధి) → బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు + ఎస్సీఎస్ఎస్: రూ. 35 లక్షలు → డెట్/కన్జర్వేటివ్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్: రూ. 35 లక్షలు → ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ / ఇండెక్స్ ఫండ్స్: రూ. 15 లక్షలు → ఎమర్జెన్సీ నగదు – సేవింగ్స్: రూ. 15 లక్షలు పోర్ట్ఫోలియోను ఇలా తీర్చిదిద్దుకుంటే ఒక మోస్తరు స్థిరత్వంతో ప్రతి నెలా సుమారు రూ.45,000 నుంచి రూ. 55,000 వరకు అందుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ గుర్తుంచుకోతగిన కీలకమైన అయిదు సూత్రాలు .. → భారీ రాబడుల హామీలతో ఊరించే స్కీములకు దూరంగా ఉండాలి → వడ్డీపై మాత్రమే ఆధారపడకుండా ఎస్డబ్ల్యూపీని ఉపయోగించుకోవాలి→ చేతిలో ఉన్న మొత్తం నిధిని ఒకే సాధనంలో ఇన్వెస్ట్ చేయొద్దు.→ నామినేషన్లు, వీలునామా అప్డేటెడ్గా ఉండేలా చూసుకోవాలి → తగినంత స్థాయిలో హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. -
రూ.లక్షల బంగారం.. లాకర్లో సేఫేనా?
ఇటీవల బంగారం ధర భారీగా పెరిగిపోయింది. ఒక్క తులం (10 గ్రాములు) బంగారమే రూ.1.5 లక్షలు దాటిపోయింది. ఈ క్రమంలో బంగారు ఆభరణాల భద్రత గురించి ఆందోళనలు సైతం ఎక్కువయ్యాయి. బంగారు ఆభరణాలను బ్యాంకు లాకర్లో ఉంచితే పూర్తిగా సురక్షితం అని చాలామంది భావిస్తారు.నిజానికి, బ్యాంకు లాకర్లు బలమైన భౌతిక భద్రత అందించినప్పటికీ, ఆభరణాలు పోయినా లేదా దెబ్బతిన్నా పూర్తి ఆర్థిక రక్షణ ఇవ్వవు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాల ప్రకారం.. లాకర్ విషయంలో బ్యాంకుల బాధ్యత పరిమితమైనదే. చాలా సందర్భాల్లో నష్టాన్ని కస్టమరే భరించాల్సి వస్తుంది.లాకర్లోని వస్తువులకు బీమా ఉంటుందా?లాకర్లో ఉంచిన ఆభరణాలకు బ్యాంకు బీమా చేస్తుందనేది ఒక పెద్ద అపోహ. వాస్తవానికి, లాకర్ కంటెంట్కు బ్యాంకులు ఎలాంటి బీమా ఇవ్వవు. దొంగతనం, అగ్నిప్రమాదం లేదా ఇతర కారణాల వల్ల ఆభరణాలు నష్టపోయినా, బ్యాంకు ఆటోమేటిక్గా పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు.భద్రతా వైఫల్యం, సిబ్బంది నిర్లక్ష్యం లేదా మోసం, లాకర్ నిర్వహణ లోపాలు వంటి సందర్భాల్లో మాత్రమే బ్యాంకు బాధ్యత వహిస్తుంది. బ్యాంకు తప్పిదం నిరూపితమైనా, పరిహారం మొత్తానికి పరిమితి ఉంటుంది. ఆర్బీఐ నియమాల ప్రకారం, బ్యాంకు చెల్లించే గరిష్ట పరిహారం వార్షిక లాకర్ అద్దెకు 100 రెట్లు మాత్రమే. ఉదాహరణకు మీ లాకర్ అద్దె సంవత్సరానికి రూ.4,000 అయితే, మీ ఆభరణాల విలువ ఎంత ఎక్కువైనా గరిష్ట పరిహారం రూ.4 లక్షలు మాత్రమే.వరదలు, భూకంపాలు, అగ్నిప్రమాదాలు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల లాకర్కు నష్టం జరిగితే, బ్యాంకు నిర్లక్ష్యం నిరూపించబడనంత వరకు బ్యాంకు బాధ్యత వహించదు. అటువంటి పరిస్థితుల్లో మొత్తం ఆర్థిక నష్టం కస్టమరుదే.ప్రత్యేక ఆభరణాల బీమా అవసరంవిలువైన బంగారు ఆభరణాలకు ప్రత్యేక జ్యువెలరీ ఇన్సూరెన్స్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి పాలసీలు సాధారణంగా దొంగతనం, అగ్నిప్రమాదం, డ్యామేజ్, బ్యాంకు లాకర్లో ఉన్నప్పుడూ జరిగే నష్టం వంటి వాటికి కవరేజ్ ఇస్తాయి.క్లెయిమ్ సులభంగా రావాలంటే..ఆభరణాల ఫోటోలు భద్రపరుచుకోండి. తాజా వాల్యుయేషన్ సర్టిఫికెట్లు దగ్గర ఉంచుకోండి. ఆభరణాలు లాకర్లో ఉన్నాయని బీమా కంపెనీకి తెలియజేయండి. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం, ఇప్పుడు అన్ని బ్యాంకులు ప్రామాణిక లాకర్ ఒప్పందం అనుసరించాలి. మీరు సంతకం చేసిన అగ్రిమెంట్లో మీ హక్కులు, బ్యాంకు బాధ్యతలు, పరిహార నిబంధనలు స్పష్టంగా ఉన్నాయో లేదో తప్పకుండా పరిశీలించండి.బ్యాంకు లాకర్ భౌతిక భద్రతకు మంచి ఎంపికే కానీ, పూర్తి ఆర్థిక రక్షణ ఉండదు. పరిమిత బ్యాంకు బాధ్యతలు, ఆటోమేటిక్ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల, లాకర్ + ఆభరణాల బీమా కలిపి ఉపయోగించడమే అత్యంత సురక్షితమైన మార్గం. -
లైఫ్ ఇన్సూరెన్స్.. ఎందుకు తీసుకోవాలంటే?
అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో.. అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో ప్రజల జీవన విధానం కూడా ఒకటి. ఉమ్మడి కుటుంబాలు తగ్గుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ కూడా వ్యవసాయం నుంచి పారిశ్రామిక రంగాలవైపు పరుగులు పెడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం చేస్తున్నవారికి పదవీ విరమణ తర్వాత జీవితం.. సురక్షితంగా, ఆర్థికంగా స్థిరంగా ఉండాలంటే ముందుగానే సరైన ప్రణాళిక అవసరం. వయసు పెరిగేకొద్దీ.. వైద్య ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి. మనం ఈ కథనంలో పదవీ విరమణ ప్రణాళికలో జీవిత బీమా ఎందుకు ముఖ్యమో చూసేద్దాం.పదవీ విరమణ తర్వాత ఆదాయంఉద్యోగం చేస్తున్న వ్యక్తి పదవీ విరమణ చేస్తే జీతం ఆగిపోతుంది. అలాంటి సమయంలో.. ఖర్చుల కోసం స్థిరమైన ఆదాయం అవసరం. కొన్ని జీవిత బీమా పథకాలు పదవీ విరమణ తర్వాత నెలవారీ లేదా వార్షిక ఆదాయం అందిస్తాయి. ఎండోమెంట్ పాలసీలు, ULIP (యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్)లు వంటి అనేక ప్రణాళికలు ఒకేసారి మొత్తం ఇవ్వడం కాకుండా.. నిరంతర ఆదాయం అందించే అవకాశాన్ని కల్పిస్తాయి. ఇవి పదవీ విరమణ జీవితం ప్రశాంతంగా సాగేందుకు సహాయపడుతుంది.వైద్య ఖర్చులువయస్సు పెరిగే కొద్దీ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల చికిత్సకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. జీవిత బీమాతో పాటు క్రిటికల్ ఇల్నెస్ రైడర్ ఉంటే.. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక భారం తగ్గుతుంది. ఖర్చుల గురించి ఆందోళన లేకుండా మంచి వైద్యం పొందే అవకాశం ఉంటుంది.అప్పులు తీర్చేందుకుకొన్ని సందర్భాల్లో హోమ్ లోన్స్ లేదా ఇతర లోన్లు పదవీ విరమణ తర్వాత కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. అలాంటి అప్పులు వృద్ధాప్యంలో తప్పకుండా భారం అవుతాయి. జీవిత బీమా పాలసీ నుంచి వచ్చే మెచ్యూరిటీ మొత్తాన్ని ఉపయోగించి మిగిలిన అప్పులను తీర్చేయవచ్చు. దీంతో అప్పుల ఒత్తిడి లేకుండా జీవించవచ్చు.ఖర్చుల నుంచి రక్షణకాలక్రమంలో ఖర్చులు పెరగవచ్చు. దీనికోసం డబ్బు దాచుకుంటే సరిపోదు. డబ్బును పెంచుకునే మార్గాలు ఉండేలా చూడాలి. దీనికోసం ULIPల వంటి మార్కెట్ ఆధారిత జీవిత బీమా పథకాలు. పెట్టుబడికి అవకాశం కల్పిస్తాయి. మార్కెట్ అనుకూలంగా ఉన్నప్పుడు మంచి వృద్ధి పొందుతాయి.తక్షణ నగదు లభ్యతభూములు, ఇళ్లు వంటి స్థిర ఆస్తులను అవసరమైనప్పుడు వెంటనే అమ్మడం కష్టం. కానీ జీవిత బీమా నుంచి వచ్చే మొత్తాన్ని సులభంగా పొందవచ్చు. అంతే కాకుండా.. ఈ మొత్తంపై ట్యాక్స్ ప్రయోజనాలు కూడా లభిస్తాయి. కుటుంబానికి అవసరమైన సమయంలో ఇది చాలా ఉపయోగపడుతుంది.ఇదీ చదవండి: సాయంత్రానికి సగం తగ్గిన ధర!.. లేటెస్ట్ గోల్డ్ రేటు ఇలా.. -
రోజుకో రూ.200.. అవుతాయి రూ.10 లక్షలు!
సంపద నిర్మించుకోవడానికి ఎప్పుడూ అధిక రిస్క్ పెట్టుబడులు లేదా స్టాక్ మార్కెట్పై లోతైన అవగాహనే అవసరం లేదు. సరైన ప్రణాళిక, క్రమశిక్షణ ఉంటే చిన్నపాటి రోజువారీ పొదుపు కూడా కాలక్రమేణా బలమైన ఆర్థిక భద్రతగా మారుతుంది. అలాంటి నమ్మదగిన పథకమే ‘పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్’ (RD). రోజుకు కేవలం రూ.200 పెట్టుబడి పెడితే, దీర్ఘకాలంలో రూ.10 లక్షలకు పైగా నిధిని నిర్మించుకోవచ్చు.చిన్న పొదుపు.. పెద్ద ఫలితంఈ పథకంలోని అసలైన బలం స్థిరత్వం. రోజుకు రూ.200 అంటే నెలకు రూ.6,000 మాత్రమే. ఇది చాలా కుటుంబాలకు సులభంగా నిర్వహించగలిగే మొత్తమే. ఈ చిన్న మొత్తాలు మీ నెలవారీ బడ్జెట్పై ఒత్తిడి లేకుండా, క్రమంగా పెద్ద మొత్తంగా మారతాయి.పోస్ట్ ఆఫీస్ ఆర్డీ పథకం ప్రస్తుతం 6.7 శాతం వడ్డీ రేటు అందిస్తోంది. పోస్టాఫీస్ భారత ప్రభుత్వ ఆధీనంలో ఉండటంతో, ఈ పెట్టుబడికి పూర్తి భద్రత ఉంటుంది. మార్కెట్ ఒడిదుడుకులకు దూరంగా, రిస్క్ లేకుండా పొదుపు చేయాలనుకునే వారికి ఇది అత్యంత అనుకూలమైన ఎంపిక.ఖాతా ప్రారంభం సులభంకేవలం రూ.100తోనే పోస్ట్ ఆఫీస్ ఆర్డీ ఖాతా ప్రారంభించవచ్చు. 18 ఏళ్లు నిండిన ప్రతి భారతీయ పౌరుడు తమ సమీప పోస్టాఫీసులో ఈ ఖాతాను సులభంగా తెరవవచ్చు. నెలవారీ డిపాజిట్లు వెంటనే ప్రారంభించవచ్చు.రికరింగ్ డిపాజిట్కు ప్రాథమిక కాలపరిమితి 5 సంవత్సరాలు. మెచ్యూరిటీ అనంతరం, ఖాతాను మరో 5 సంవత్సరాలు పొడిగించుకునే అవకాశం ఉంది. ఈ పొడిగింపు వల్ల చక్రవడ్డీ ప్రయోజనం పెరిగి, సంపద మరింత వేగంగా పెరుగుతుంది.అత్యవసర అవసరాలకు రుణ సదుపాయంఖాతా తెరిచి ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత, మీరు జమ చేసిన మొత్తంలో 50% వరకు రుణం పొందవచ్చు. ఈ రుణంపై వడ్డీ, ఆర్డీ వడ్డీ రేటు కంటే కేవలం 2 శాతం మాత్రమే ఎక్కువ. కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో ఇది తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారంగా ఉపయోగపడుతుంది.కొన్ని షరతుల మేరకు ప్రీ-మెచ్యూరిటీ విత్డ్రాయల్కు కూడా అవకాశం ఉంటుంది. అనివార్య కారణాలతో ఖాతాదారు మరణించినప్పుడు, డిపాజిట్ మొత్తాన్ని నామినీ సులభంగా పొందవచ్చు.రోజుకు రూ.200.. రూ.10 లక్షలు ఎలా అవుతాయంటే?➕రోజుకు రూ.200 ➕నెలకు రూ.6,000➕5 సంవత్సరాలు డిపాజిట్ చేస్తే➕మొత్తం డిపాజిట్: రూ.3.60 లక్షలు➕వడ్డీ: సుమారు రూ.68,197➕మెచ్యూరిటీ మొత్తం: రూ.4.28 లక్షలు➕అదే ఖాతాను మరో 5 ఏళ్లు పొడిగిస్తే➕మొత్తం డిపాజిట్: రూ.7.20 లక్షలు➕మొత్తం వడ్డీ: సుమారు రూ.2.05 లక్షలు➕తుది మెచ్యూరిటీ మొత్తం: సుమారు రూ.10.25 లక్షలుసున్నా మార్కెట్ రిస్క్, ప్రభుత్వ హామీ, క్రమశిక్షణతో కూడిన పొదుపు ద్వారా చిన్నపాటి రోజువారీ పొదుపులు కూడా గొప్ప ఆర్థిక మైలురాయిగా మారతాయని పోస్ట్ ఆఫీస్ ఆర్డీ పథకం నిరూపిస్తోంది. -
ఎస్బీఐ జనరల్ నుంచి హెల్త్ ఆల్ఫా
న్యూఢిల్లీ: ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ‘ఎస్బీఐజీ హెల్త్ ఆల్ఫా’ పేరుతో హెల్త్ ఇన్సూరెన్స్ పరిష్కార్నాన్ని ఆవిష్కరించింది. కస్టమర్ల ఆరోగ్య సంరక్షణ అవసరాలకు అనుగుణంగా హెల్త్ప్లాన్ను ఎంపిక చేసుకోవచ్చని ప్రకటించింది. ఎన్నో రకాల ఆప్షనల్ (ఐచ్ఛిక) ప్రయోజనాలతో తీసుకోవచ్చని తెలిపింది.మెరుగైన క్యుములేటివ్ బోనస్, సమ్ ఇన్సూర్డ్ (బీమా రక్షణ) ఆప్షన్లలో సౌలభ్యం, ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలతో అనుసంధానం, నేటి జీవనశైలి అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకమైన కవరేజీని హెల్త్ ఆల్ఫా అందిస్తుందని వెల్లడించింది. ఇందులో 50కు పైగా కవరేజీ ఆప్షన్లు ఉన్నట్టు, జిమ్, క్రీడా గాయాలు, ఫిట్నెస్ సంబంధిత గాయాలకు ఓపీడీ కవరేజీ ప్రయోజనం ఉన్నట్టు తెలిపింది.జీవితాంతం ఒకే తరహా ప్రయోజనాలతో కాకుండా, వివిధ స్థాయిల్లోని అవసరాలకు అనుగుణంగా (వివాహానంతరం ప్రసవ సంబంధిత, పిల్లల ఆరోగ్య సంబంధిత, వృద్ధాప్యంలో అదనపు కవరేజీ తదితర) ఎంపిక చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ పేర్కొంది. అదనపు యాడాన్లను తీసుకుని, అవసరం లేని వాటిని ఆప్ట్ అవుట్ చేసుకునేందుకు సైతం అవకాశం ఉంటుందని తెలిపింది. -
మీరు యాక్టివా.. పాసివా?
స్టాక్ మార్కెట్లపై పెద్దగా అవగాహన లేనివారు... షేర్ల గురించి ఎక్కువగా తెలియని వారు కూడా మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఎందుకంటే ఏ షేర్లో ఎప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేయాలో, ఎప్పుడు వెనక్కు తీసుకోవాలో అవన్నీ చూసుకోవటానికి మ్యూచువల్ ఫండ్లలో ఓ పెద్ద వ్యవస్థ ఉంటుంది. అవన్నీ చేస్తూ... ఏడాది తిరిగేసరికల్లా చక్కని రాబడినిస్తాయి కనక మ్యూచువల్ ఫండ్లు చాలామందిని ఆకర్షిస్తుంటాయి. బ్యాంకు వడ్డీని మించి రాబడి సాధించాలన్నా... ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవాలన్నా ఇదో మంచి మార్గం. సరే! మరి ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి? అంటే షేర్లలోను, బాండ్లలోను ఇన్వెస్ట్ చేసేయాక్టివ్ ఫండ్స్లోనా? లేక ఇండెక్స్లో మాత్రమే పెట్టుబడి పెట్టే పాసివ్ ఫండ్స్లోనా? ఏది బెటర్? దీన్ని వివరించేదే ఈ ‘వెల్త్ స్టోరీ’...భారతదేశ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ ఏకంగా రూ.81 లక్షల కోట్లకు చేరిందిపుడు, ఒకరకంగా ఇది రికార్డు స్థాయి. ఇందులో పాసివ్ ఫండ్స్ విలువ దాదాపు రూ.14 లక్షల కోట్లు. మిగిలిన విలువ యాక్టివ్ ఫండ్స్ది. అసలు మనదేశంలో ఇండెక్స్లో మాత్రమే ఇన్వెస్ట్ చేసే పాసివ్ ఫండ్ల విలువ రూ.14 లక్షల కోట్లకు చేరుతుందని ఎవరైనా ఊహించారా? మున్ముందు ఇది ఇంకా పెరుగుతుందనేది నిపుణుల మాట. దీంతో పాసివ్ ఫండ్లు మంచివా... లేక యాక్టివ్ ఫండ్సా అనే చర్చ మళ్లీ జోరందుకుంది. నైపుణ్యం, అనుభవం ఉన్న ఫండ్ మేనేజర్లు మాత్రమే, నిరంతరం మార్కెట్ని మించి రాబడులు అందించగలరనే భావన కొన్నాళ్ల కిందటిదాకా ఉండేది. కానీ, ఇపుడు చాలా మంది ఇన్వెస్టర్లు క్రమంగా ఖర్చులను ఆదా చేసే, సరళంగా ఉండే, దీర్ఘకాలికంగా విశ్వసనీయంగా ఉండే పాసివ్ విధానంవైపు మళ్లుతున్నారు. ఈ రెండింట్లో ఉండే సానుకూల, ప్రతికూలాంశాలు చూస్తే...ఇండెక్స్ వర్సెస్ యాక్టివ్ ఫండ్స్..ఇండెక్స్ ఫండ్స్ అంటే, సెన్సెక్స్, నిఫ్టీ50, నిఫ్టీ– 500 లాంటి నిర్దిష్ట మార్కెట్ సూచీని ప్రతిబింబించేవి పాసివ్ ఫండ్స్. ఇవి ఆ సూచీలోని స్టాక్స్లో, అదే పరిమాణంలో ఇన్వెస్ట్ చేస్తాయి. ప్రత్యేకంగా షేర్లను ఎంచుకోవడం, మంచి సమయం కోసం వేచి ఉండటంలాంటిది ఉండదు. ఈ తరహా ఫండ్స్లో ఖర్చులు చాలా తక్కువ. దాదాపు సదరు ఇండెక్స్ స్థాయిలో పనితీరు కనపరుస్తాయి (కొంత వ్యయాలు పోగా).అదే యాక్టివ్ ఫండ్స్ని తీసుకుంటే బెంచ్మార్క్కి మించిన రాబడులను అందించేలా వీటిని ప్రొఫెషనల్స్ నిర్వహిస్తుంటారు. ఇందుకోసం అధ్యయనం, షేర్ల ఎంపిక, వ్యూహాత్మకంగా సర్దుబాట్లు చేయడంలాంటి హడావిడి ఉంటుంది. ఈ తరహా ఫండ్లు ప్రామాణిక సూచీలకు మించిన పనితీరు సాధించే అవకాశం ఉంటుంది. వీటిల్లో పరిశోధనలు, ట్రేడింగ్ యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే, ఖర్చుల నిష్పత్తి కూడా ఎక్కువే.ఏవి ఎలా ఉంటాయ్..ఇండెక్స్ ఫండ్స్ పూర్తి పారదర్శకంగా ఉంటాయి. ఏదో ఒక్క మేనేజరు మీదే ఆధారపడాల్సిన పరిస్థితి ఉండదు. మార్కెట్ హెచ్చుతగ్గులపరమైన ప్రభావమే తప్ప నిర్దిష్ట స్టాక్పరమైన ప్రతికూల ప్రభావం ఉండదు. మరోవైపు, యాక్టివ్ ఫండ్స్ విషయానికొస్తే ఇవి నిర్దిష్ట సాధనాల్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం వల్ల, తీవ్ర ఒడిదుడుకులు ఏర్పడితే పెట్టుబడిపైనా తీవ్ర ప్రభావం పడుతుంది. తప్పుడు నిర్ణయాలు తీసుకున్న పక్షంలో ఫండ్ పనితీరు దెబ్బతినే అవకాశాలూ ఉంటాయి.వాస్తవ పరిస్థితిఆర్థిక సమాచార సేవల సంస్థ ఎస్ అండ్ పీకి చెందిన ఎస్పీఐవీఏ ఇండియా నివేదిక ప్రకారం (2025 మధ్య, అంతకు ముందు ట్రెండ్స్) దాదాపు 65–66 శాతం లార్జ్ క్యాప్ యాక్టివ్ ఫండ్స్, 2025లో తమ తమ బెంచ్మార్క్ సూచీలకన్నా తక్కువ రాబడులను అందించాయి. దీర్ఘకాలికంగా అంటే పదేళ్ల పైగా వ్యవధిలో చూస్తే సుమారు 80 శాతం మిడ్, స్మాల్ క్యాప్ యాక్టివ్ ఫండ్స్ వెనుకబడ్డాయి. అయితే, కొన్ని యాక్టివ్ ఫండ్లు తీవ్ర హెచ్చుతగ్గుల మార్కెట్లలో కూడా రాణించగలిగే విధంగా ఉంటాయి. మరోవైపు, పాసివ్ ఫండ్స్ అనేవి కొంత రిస్కు తక్కువ వ్యవహారంగా విశ్వసనీయమైన స్థాయిలో రాబడులు అందించేందుకు అవకాశం ఉంది. ఎవరికి .. ఏవి అనువు..ఇండెక్స్ ఫండ్స్: తొలిసారి ఇన్వెస్ట్ చేస్తున్నవారు, దీర్ఘకాలిక సిప్ ఇన్వెస్టర్లు, రిటైర్మెంట్ ప్రణాళికల్లో ఉన్నవారు. పెట్టుబడుల ప్రక్రియ సరళంగా ఉండాలనుకునేవారు. ప్రతి రోజూ మార్కెట్లను, పెట్టుబడులను చూస్తూ కూర్చోవడానికి ఇష్టపడని వారు. యాక్టివ్ ఫండ్స్: పనితీరును సమీక్షించుకోవడానికి ఇష్టపడే అనుభవజ్ఞులైన ఇన్వెస్టర్లు, నిర్దిష్ట రంగాలు/థీమ్ల్లో పెట్టుబడుల ద్వారా భారీ లాభాలను కోరుకునేవారు.ఖర్చులు కీలకం..ఇండెక్స్ ఫండ్స్కి సంబంధించిన పెద్ద సానుకూల అంశం ఖర్చులు తక్కువగా ఉండటం. డైరెక్ట్ ప్లాన్లయితే సాధారణంగా 0.1 శాతం నుంచి 0.3 శాతం వరకు ఉంటాయి. మరోవైపు, యాక్టివ్ ఫండ్లు సాధారణంగా 1.5 – 2.5 శాతం శ్రేణిలో చార్జీలు విధిస్తాయి. కాలక్రమేణా ఈ చార్జీలన్ని కలిపితే తడిసి మోపెడవుతుంది. దీర్ఘకాలంలో ఇదొక సైలెంట్ వెల్త్ కిల్లర్లాంటిది. 20–25 ఏళ్ల వ్యవధిలో చూస్తే ఆఖర్లో ఈ వ్యయాల భారం పెట్టుబడి, నిధిని బట్టి లక్షలు, కోట్లల్లోనూ ఉంటుంది. ఆ మేరకు రాబడీ తగ్గుతుంది.హైబ్రిడ్ వ్యూహంతో మేలు..చాలా మంది నిపుణులు ప్రస్తుతం పెట్టుబడులకు సంబంధించి హైబ్రిడ్ వ్యూహమైన ‘కోర్–శాటిలైట్’ విధానాన్ని సూచిస్తున్నారు. అంటే 60–70 శాతం మొత్తాన్ని (కోర్) తక్కువ వ్యయాలతో కూడుకుని ఉండే ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. వీటి నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉంటాయి, పోర్ట్ఫోలియోకి స్థిరత్వం లభిస్తుంది. ఇక 30–40 శాతం మొత్తాన్ని అనుబంధంగా (శాటిలైట్), అధిక లాభాలను ఆర్జించి పెట్టే అవకాశమున్న నిర్దిష్ట యాక్టివ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే, ఇక్కడో విషయం గుర్తుంచుకోవాలి. అందరికీ ఒకే రకం పెట్టుబడి వ్యూహం ఉపయోగపడకపోవచ్చు. ఇండెక్స్ ఫండ్లతో ఖర్చులు ఆదా అవుతాయి. రాబడులు కాస్త అంచనాలకు అందే విధంగా ఉంటాయి. దీర్ఘకాలికంగా కాంపౌండింగ్ ప్రయోజనాలు దక్కుతాయి. ముఖ్యంగా నిలకడగా మార్కెట్ని మించి రాబడులను సాధించడం కష్టంగా ఉండే లార్జ్–క్యాప్ సెగ్మెంట్కి సంబంధించి ఇవి అనువైనవిగా ఉంటాయి. యాక్టివ్ ఫండ్స్ అనేవి అధిక రాబడుల ఆశలు కలి్పస్తాయి, కానీ ఫీజులు, రిసు్కలు అధికంగా ఉంటాయి. ఏదైతేనేం.. వీలైనంత ముందుగా పెట్టుబడులను ప్రారంభించాలి. యాంఫీ, ఫండ్ ఫ్యాక్ట్ షీట్లు, విశ్వసనీయమైన ప్లాట్ఫాంల ద్వారా ఫండ్ని క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. మీ రిస్క్ ప్రొఫైల్, లక్ష్యాలకు అనువుగా ఉండే దాన్ని ఎంచుకోవాలి. క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయాలి.ఇదీ చదవండి: డేటా పంచుకోలేం.. కోర్టును ఆశ్రయించిన గూగుల్! -
గోల్డ్ కార్డు: బంగారంతోనే షాపింగ్!
నగదుకు ప్రత్యామ్నాయంగా బంగారాన్ని వినియోగించే వినూత్న విధానంతో ‘ఓ గోల్డ్ మాస్టర్ కార్డు’ను దుబాయ్లో అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్డు ద్వారా వినియోగదారులు తమ వద్ద ఉన్న బంగారాన్ని విక్రయించకుండా, నేరుగా కొనుగోళ్లకు ఉపయోగించుకోవచ్చు.ఓ గోల్డ్ మేనేజ్మెంట్ సంస్థ తమ డిజిటల్ గోల్డ్ ప్లాట్ఫామ్ను లైఫ్స్టైల్ సూపర్ యాప్గా తిరిగి ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ యాప్ ద్వారా తక్కువ పరిమాణంలోనూ బంగారం యాజమాన్యాన్ని పొందే అవకాశం కల్పిస్తున్నారు.కొత్తగా ప్రవేశపెట్టిన ఓ గోల్డ్ మాస్టర్ కార్డుతో, వినియోగదారులు బంగారాన్ని నగదు మాదిరిగా ఉపయోగించి వివిధ వస్తువులు, సేవలను కొనుగోలు చేయవచ్చు. ఈ లావాదేవీలు సులభమైనవి, సురక్షితమైనని, అన్ని చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా ఉంటాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ వినూత్న వ్యవస్థను మావరిడ్ ఫైనాన్స్, మాస్టర్ కార్డ్ సహకారంతో అమలు చేశారు.ఈ కార్డు వినియోగదారులకు అనేక ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. విమానాశ్రయ లాంజ్లకు కాంప్లిమెంటరీ ప్రవేశం, హోటళ్లపై ప్రత్యేక డిస్కౌంట్లు, ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులపై ఆఫర్లు, అలాగే రెస్టారెంట్లు, ఈ-కామర్స్, ఎంటర్టైన్మెంట్ సేవలపై రాయితీలు లభిస్తాయి.ఓ గోల్డ్ మాస్టర్ కార్డు ద్వారా 8,000కు పైగా బ్రాండ్ల ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. యాప్ ద్వారా వోచర్లు, గిఫ్ట్ కార్డులను సులభంగా రీడీమ్ చేసుకునే సదుపాయం ఉంది. అలాగే ఈ-సిమ్ కార్డులు, రివార్డులు, లాయల్టీ ప్రోగ్రామ్లను సులభంగా యాక్సెస్ చేయవచ్చని ఓ గోల్డ్ వ్యవస్థాపకుడు బందర్ అల్ ఓట్మాన్ తెలిపారు. -
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రా!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO).. చందాదారులు తమ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF)ను ఏటీఎం ద్వారా విత్డ్రా చేసుకోవడానికి ఉపయోగపడే ఫీచర్ తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు.. ఇప్పటికే కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయా వెల్లడించారు. ఈ సదుపాయం 2026 ఏప్రిల్ నుంచి అందుబాటులోకి రానుంది.ప్రస్తుతం ఉద్యోగులు పీఎఫ్ విత్డ్రా చేసుకోవడానికి క్లెయిమ్ ఫారమ్స్ సమర్పించి రోజులు తరబడి వేచి చూడాలి. అయితే ఈ విధానానికి మంగళం పాడటానికి కేంద్రం సన్నద్ధమైంది. కొత్త విధానంలో.. యూపీఐ ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాలోకి పీఎఫ్ మొత్తాన్ని బదిలీ చేసుకోవచ్చు. ఈ విధానం ద్వారా నిమిషాల్లో పీఎఫ్ డబ్బును ఉపయోగించుకోవచ్చు.కొత్త విధానం అమలులోకి వచ్చిన తరువాత.. పీఎఫ్ ఖాతాలోని మొత్తంలో కొంత భాగం మినహాయించి, మిగిలిన మొత్తాన్ని తీసుకోవచ్చు. ఇది ఈపీఎఫ్ ఖాతాకు సీడ్ అయిన బ్యాంక్ అకౌంట్ ద్వారా ఎంత మొత్తంలో విత్డ్రా చేసుకోవచ్చో చూడవచ్చు. అంతే కాకుండా యూపీఐ పిన్ నెంబర్ ఉపయోగించడం ద్వారా.. మీ ఖాతాలు బదిలీ చేసుకోవచ్చు. ఇలా బదిలీ చేసుకున్న తరువాత ఏటీఎం ద్వారా తీసుకోవచ్చు.ఇదీ చదవండి: 'వెండి దొరకడం కష్టం': కియోసాకి -
ఎస్బీఐ ఏటీఎం ఛార్జీల పెంపు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఏటీఎం, ఆటోమేటెడ్ డిపాజిట్-కమ్-విత్డ్రాయల్ మెషిన్ (ఏడీడబ్ల్యూఎం) లావాదేవీలపై వసూలు చేసే ఛార్జీలను సవరించింది. ఇతర బ్యాంకుల ఏటీఎంలను ఉచిత పరిమితిని మించి ఉపయోగించే కస్టమర్లపై ఫీజులు పెరిగాయి. ఈ సవరించిన ఛార్జీలు 2025 డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి.ఉచిత లావాదేవీల పరిమితి పూర్తయిన తర్వాత, ఎస్బీఐ కస్టమర్లు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నగదు ఉపసంహరణ చేస్తే ఒక్కో లావాదేవీకి రూ.23 + జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్ వంటి ఆర్థికేతర లావాదేవీలపై ఫీజును రూ.11 + జీఎస్టీగా నిర్ణయించారు. ఇంటర్చేంజ్ ఫీజు పెరుగుదల నేపథ్యంలో ఏటీఎం సేవల ధరలను సమీక్షించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్బీఐ తెలిపింది.ప్రభావం వీరిపైనే..ఉచిత లావాదేవీ పరిమితిని మించి ఎస్బీఐయేతర ఏటీఎంలను ఉపయోగించే సేవింగ్స్, శాలరీ ఖాతాదారులపై ఈ మార్పులు ప్రధానంగా ప్రభావం చూపుతాయి. అయితే, పలు ఇతర కేటగిరీల అకౌంట్లకు ఈ సవరణల నుంచి మినహాయింపును ఎస్బీఐ ఇచ్చింది.ఉచిత లావాదేవీల పరిమితులురెగ్యులర్ సేవింగ్స్ ఖాతాదారులకు నెలకు ఐదు ఉచిత లావాదేవీలు (ఆర్థిక, ఆర్థికేతర కలిపి) యథాతథంగా కొనసాగుతాయి. ఈ పరిమితిని దాటిన తర్వాత సవరించిన ఛార్జీలు వర్తిస్తాయి. ఎస్బీఐ శాలరీ ప్యాకేజీ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారులకు ఇకపై అన్ని ప్రదేశాల్లోని ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నెలకు 10 ఉచిత లావాదేవీలు మాత్రమే అనుమతిస్తారు. గతంలో వీరికి అపరిమిత ఉచిత లావాదేవీలు ఉండేవి.ప్రభావం లేని ఖాతాలివే.. ఈ సవరణల వల్ల కింది ఖాతాదారులకు ఎలాంటి మార్పు ఉండదని ఎస్బీఐ స్పష్టం చేసింది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (బీఎస్బీడీ) ఖాతాలు – ప్రస్తుత ఛార్జ్ నిర్మాణమే కొనసాగుతుంది. ఎస్బీఐ డెబిట్ కార్డు ద్వారా ఎస్బీఐ ఏటీఎంలలో చేసే లావాదేవీలు పూర్తిగా ఉచితం. ఎస్బీఐ ఏటీఎంలలో కార్డు రహిత నగదు ఉపసంహరణలు అపరిమితంగా, ఉచితంగా కొనసాగుతాయి. కిసాన్ క్రెడిట్ కార్డు (కేకేసీ) ఖాతాలకు కూడా ఈ ఛార్జీల నుంచి మినహాయింపు ఉంటుంది. -
ప్రతి ఇంట్లో లక్షాధికారి! ఈ ఎస్బీఐ స్కీమ్ గురించి తెలుసా?
ప్రతి కుటుంబం తమ ఆర్థిక స్థితిని మెరుగుపర్చుకోవాలని కోరుకుంటుంది. కానీ పెరుగుతున్న ఖర్చుల వల్ల భవిష్యత్ కోసం పొదుపు, పెట్టుబడులను చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. పెద్ద మొత్తంలో సంపద కూడబెట్టాలంటే అధిక జీతం లేదా ఒకేసారి భారీ పెట్టుబడి అవసరమనే అపోహ కూడా చాలామందిలో ఉంది. ఈ భావనకు భిన్నంగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తీసుకువచ్చిన ‘హర్ ఘర్ లఖ్పతి’ పథకం నిలుస్తోంది. నెలకు కేవలం రూ.610 పెట్టుబడితోనే రూ.1 లక్ష కార్పస్ ఎలా నిర్మించవచ్చో ఇప్పుడు చూద్దాం.ఏమిటీ ‘హర్ ఘర్ లఖ్పతి’ పథకం?ఇది ఎస్బీఐ అందిస్తున్న ప్రత్యేక రికరింగ్ డిపాజిట్ (RD) పథకం. ఇందులో ఖాతాదారులు ఎంచుకున్న కాలపరిమితి పాటు ప్రతి నెలా ఒక స్థిర మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. గడువు పూర్తయ్యాక ఒకేసారి మొత్తం (అసలు + వడ్డీ) లభిస్తుంది. క్రమమైన పొదుపు అలవాటును పెంపొందించడం, ఆర్థిక ఒత్తిడి లేకుండా దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకోవడం ఈ పథకం ప్రధాన లక్ష్యం.ఈ ఆర్డీ పథకంలో మెచ్యూరిటీ వ్యవధి 3 నుంచి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. పొదుపుదారులు తమ ఆదాయం, భవిష్యత్ ప్రణాళికలకు అనుగుణంగా కాలపరిమితిని ఎంచుకోవచ్చు.రూ.610తో రూ.1 లక్ష ఎలా?ఈ పథకంలోని 10 ఏళ్ల ప్లాన్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. నెలకు రూ.610 చొప్పున పొదుపు చేస్తే, 10 సంవత్సరాల అనంతరం వడ్డీతో కలిపి సుమారు రూ.1 లక్ష కార్పస్ లభిస్తుంది. అంటే రోజుకు దాదాపు రూ.20 పొదుపు చేస్తే చాలు.. ఆరు అంకెల మొత్తాన్ని సాధించవచ్చు. ఈ కారణంగానే వేతనజీవులు, ఉద్యోగులు, కొత్తగా పొదుపు చేసేవాళ్లు, తక్కువ ఆదాయం కలిగినవారికి ఈ పథకం ఎంతో అనుకూలంగా మారింది.వడ్డీ రేట్లు ఎలా ఉంటాయంటే.. ‘హర్ ఘర్ లఖ్పతి’ ఆర్డీ పథకంపై వడ్డీ రేట్లు పెట్టుబడి కాలపరిమితి, పొదుపుదారు కేటగిరీపై ఆధారపడి ఉంటాయి. సాధారణ పౌరులకైతే 3–4 సంవత్సరాల కాలానికి గరిష్ఠంగా 6.55 శాతం, 5–10 సంవత్సరాల కాలానికైతే 6.30% వడ్డీ లభిస్తుంది.అదే సీనియర్ సిటిజన్లు అయితే 3–4 సంవత్సరాల కాలానికి గరిష్ఠంగా 7.05 శాతం, 5–10 సంవత్సరాల కాలానికి 6.80% వడ్డీ అందుకుంటారు. ఈ వడ్డీ రేట్లు ఎస్బీఐ నిర్ణయాల ప్రకారం కాలానుగుణంగా మారవచ్చు అన్నది గమనించాలి.తక్కువ కాలంలో లక్ష్యం చేరాలంటే?త్వరగా రూ.1 లక్ష కార్పస్ కావాలనుకునే వారు ఎక్కువ నెలవారీ చందాతో తక్కువ కాలాన్ని ఎంచుకోవచ్చు. 3 సంవత్సరాల్లో రూ.1 లక్ష కావాలంటే నెలకు సుమారు రూ.2,510, 5 సంవత్సరాల్లో రూ.1 లక్ష కావాలంటే నెలకు సుమారు రూ.1,420 పొదుపు చేయాల్సి ఉంటుంది.రూ.1 లక్ష కన్నా ఎక్కువ కావాలంటే..ఈ పథకం కేవలం రూ.1 లక్ష వరకే కాదు. పొదుపుదారులు రూ.2 లక్షలు, రూ.3 లక్షలు, రూ.4 లక్షలు వంటి అధిక లక్ష్యాలను కూడా ఎంచుకోవచ్చు. లక్ష్యం మొత్తాన్ని బట్టి నెలవారీ చందా ఆధారపడి ఉంటుంది. పిల్లల చదువు, వివాహ ఖర్చులు, అత్యవసర నిధి వంటి మధ్యకాలిక అవసరాలకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.ఎవరు అర్హులు?భారతీయ పౌరుడెవరైనా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఖాతాను వ్యక్తిగతంగా లేదా ఉమ్మడిగా తెరవవచ్చు. తల్లిదండ్రులు పిల్లల పేరుపై కూడా ఆర్డీ ఖాతాను ప్రారంభించవచ్చు. 10 ఏళ్లు పైబడిన పిల్లలు తల్లిదండ్రుల మార్గదర్శకత్వంలో ఖాతా కలిగి ఉండవచ్చు. 10 ఏళ్లలోపు పిల్లల తరఫున తల్లిదండ్రులు లేదా చట్టబద్ధ సంరక్షకులు ఇందులో పొదుపు చేయొచ్చు. -
పండుగ షాపింగ్.. భారీ డిస్కౌంట్లు కావాలా?
పండుగ సీజన్ వచ్చిందంటే చాలు.. ఇటు వీధులన్నీ రంగురంగుల వెలుగులతో, అటు ఆన్లైన్ షాపింగ్ సైట్లు భారీ డిస్కౌంట్లతో కళకళలాడుతుంటాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్.. వంటి ఈ-కామర్స్ సైట్లు ప్రత్యేక ఈవెంట్లతో ఆఫర్లు ప్రకటిస్తాయి. దాంతో వినియోగదారులను అమితంగా ఆకర్షిస్తాయి. అయితే, ఈ ఆఫర్ల వెల్లువలో పడి అనవసరంగా డబ్బు ఖర్చు చేయకుండా, తెలివిగా ఎలా షాపింగ్ చేయాలో వివరించే చిట్కాలు చూద్దాం.ముందస్తు ప్రణాళికసేల్ ప్రారంభం కావడానికి ముందే మీకు కావాల్సిన వస్తువులను ‘విష్లిస్ట్’లో చేర్చుకోవడం ఉత్తమం. దీనివల్ల ధర తగ్గినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే, ఎంత వరకు ఖర్చు చేయాలనే దానిపై ఒక బడ్జెట్ వేసుకోవడం వల్ల అనవసరమైన కొనుగోళ్లను నివారించవచ్చు.ధరల పరిశీలనఒక సైట్లో తక్కువ ధర కనిపిస్తోందని వెంటనే కొనేయకండి. వేర్వేరు ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్ల్లో ధరలను పోల్చి చూడండి. ఇందుకోసం ఆన్లైన్లో కొన్ని టూల్స్ లేదా వెబ్సైట్లను ఉపయోగించి, గత కొన్ని నెలల్లో ఆ వస్తువు అత్యల్ప ధర ఎంత ఉందో తెలుసుకోవచ్చు. కొన్నిసార్లు ‘భారీ డిస్కౌంట్’ అని చూపించేవి నిజానికి సాధారణ ధరలకంటే తక్కువ ఏమీ ఉండకపోవచ్చు.బ్యాంక్ ఆఫర్లు, క్యాష్బ్యాక్పండుగ సేల్స్ సమయంలో ఈ-కామర్స్ సంస్థలు నిర్దిష్ట బ్యాంకుల క్రెడిట్/డెబిట్ కార్డులపై 10% నుంచి 15% వరకు తగ్గింపును ఇస్తుంటాయి. మీ దగ్గర ఆ బ్యాంక్ కార్డు లేకపోతే, స్నేహితులు లేదా బంధువుల కార్డులను ఉపయోగించి డబ్బు ఆదా చేయవచ్చు. కొన్ని వెబ్సైట్లు లేదా యాప్స్ ద్వారా షాపింగ్ చేయడం వల్ల అదనంగా కొంత మొత్తం క్యాష్బ్యాక్ ద్వారా వాలెట్లోకి వస్తుంది.నో-కాస్ట్ ఈఎంఐఖరీదైన వస్తువులు (ల్యాప్టాప్స్, ఫ్రిజ్లు, ఫోన్లు) కొనేటప్పుడు ‘నో-కాస్ట్ ఈఎంఐ’ సౌకర్యం ఉపయోగకరంగా ఉంటుంది. దీనివల్ల వడ్డీ భారం లేకుండా వాయిదాల పద్ధతిలో చెల్లించవచ్చు. అయితే, దీనిపై ఉండే ప్రాసెసింగ్ ఫీజును గమనించడం మర్చిపోవద్దు.ఎక్స్ఛేంజ్ ఆఫర్లుమీ పాత వస్తువులను మార్పిడి చేయడం ద్వారా కొత్త వస్తువు ధరను గణనీయంగా తగ్గించుకోవచ్చు. పండుగ సమయాల్లో ఎక్స్ఛేంజ్ వాల్యూపై అదనపు బోనస్ కూడా లభిస్తుంది. వస్తువును ఇచ్చే ముందు అది పని చేసే స్థితిలో ఉందో లేదో సరిచూసుకోండి.సైబర్ భద్రత అత్యంత ముఖ్యంషాపింగ్ హడావిడిలో సైబర్ మోసాల బారిన పడే అవకాశం ఉంది. కేవలం అధికారిక వెబ్సైట్లు లేదా యాప్స్ ద్వారానే షాపింగ్ చేయండి. వాట్సాప్ లేదా ఎస్ఎమ్ఎస్ల్లో వచ్చే ‘భారీ బహుమతులు’, ‘లింక్లపై క్లిక్ చేయండి’ వంటి సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండండి. చెల్లింపులు చేసేటప్పుడు సురక్షితమైన గేట్వేలను మాత్రమే వాడండి.ఇదీ చదవండి: బ్యాంకింగ్ పారదర్శకతపై సందిగ్ధత -
మీ డబ్బు - మీ నిర్ణయం..
సొంత ఇల్లు కొనాలన్నా, మిగిలిన డబ్బును పొదుపు చేయాలన్నా సగటు మనిషికి ఎన్నో సందేహాలు. మార్కెట్లో పెట్టుబడి మార్గాలకు కొదువ లేకపోయినా, ఎక్కడ రిస్క్ తక్కువ ఉంటుంది? ఎక్కడ రాబడి ఎక్కువగా వస్తుంది? అనేదే అసలు ప్రశ్న. మీ ఆర్థిక భవిష్యత్తును పటిష్టం చేసేలా రియల్టీ, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ వంటి కీలక రంగాలపై కొన్ని కీలక ప్రశ్నలకు నిపుణులు ఇచ్చిన స్పష్టమైన వివరణలు ఇక్కడ చూద్దాం.రియల్టీ..ఇల్లు కొనటానికి డౌన్పేమెంట్ ఎంతవరకూ ఉండాలి? సాధారణంగా ఇంటి విలువలో 10–20 శాతాన్ని డౌన్పేమెంట్గా చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన 80–90 శాతం మొత్తాన్ని బ్యాంకులు లేదా ఎన్బీఎఫ్సీలు రుణంగా అందిస్తుంటాయి. ప్రాపర్టీ విలువ రూ.30 లక్షల లోపు ఉంటే 90 శాతం వరకూ మొత్తాన్ని రుణంగా ఇస్తారు. 10 శాతం డౌన్పేమెంట్ చెల్లించాలి. ప్రాపర్టీ విలువ రూ.30 నుంచి 75 లక్షల వరకూ ఉంటే 80 శాతం వరకూ రుణాన్ని ఇస్తారు. మిగిలిన 20 శాతం డౌన్పేమెంట్గా చెల్లించాలి. రూ.75 లక్షలు దాటిన ఇళ్లకయితే 25 శాతం వరకూ డౌన్పేమెంట్ అవసరం. మిగిలిన 75 శాతాన్నే రుణంగా ఇస్తారు. ఇక 5–8 శా>తం ఉండే స్టాంప్ డ్యూటీ, జీఎస్టీ, ఇంటీరియర్ ఖర్చులు, లీగల్ ఖర్చులు అన్నీ కొనుగోలుదారే భరించాలి. బ్యాంకింగ్..స్వల్ప కాలంపాటు సొమ్ము దాచుకోవటానికి సేవింగ్స్ ఖాతా లేక లిక్విడ్ ఫండ్సా? లిక్విడ్ ఫండ్స్లో సేవింగ్స్ ఖాతా కన్నా ఎక్కువ వడ్డీ వస్తుంది. సేవింగ్స్ ఖాతాపై 2–3 శాతం వడ్డీ వస్తే... లిక్విడ్ ఫండ్స్లో 5–6 శాతం వరకూ ఉంటుంది. కాకపోతే ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకోవటమన్నది సేవింగ్స్ ఖాతాలోనే సాధ్యపడుతుంది. లిక్విడ్ ఫండ్స్లో కనీసం ఒక్కరోజైనా పూర్తిగా ఉంచాలి. ఎక్కువ శాతం ట్యాక్స్ రేటు చెల్లించేవారికి సేవింగ్స్ ఖాతాకన్నా లిక్విడ్ ఫండ్సే బెటర్. పూర్తిస్థాయి భద్రతను కోరుకునేవారికి సేవింగ్స్ ఖాతా నయం. ఇలా దేని ప్రత్యేకతలు దానికున్నాయి. కనీసం నెలరోజుల ఖర్చులకు సరిపడా మొత్తాన్ని సేవింగ్స్ ఖాతాలో ఉంచుకుని, అంతకు మించిన మొత్తాన్ని లిక్విడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయటం మంచిది. బంగారం బంగారానికి హాల్ మార్కింగ్ తప్పనిసరా? దేశంలో అన్ని నోటిఫైడ్ జిల్లాల్లోనూ హాల్మార్కింగ్ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీనిప్రకారం బంగారాన్ని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్’ (బీఐఎస్) హాల్మార్కింగ్ చేయాలి. అంటే ప్రత బంగారు ఆభరణంపై బీఐఎస్ లోగో, దాని స్వచ్ఛత (24– 22– 18 క్యారెట్లు..), హాల్మార్కింగ్ ఐడెంటిఫికేషన్ నంబర్, సదరు జ్యుయలర్ ఐడెంటిఫికేషన్ నంబర్ వంటివన్నీ ఉండాలి. స్వల్ప నాన్–నోటిఫైడ్ జిల్లాలకు మాత్రం ఈ హాల్మార్కింగ్ నిబంధనలు వర్తించవు. ఇక బ్యాంకులు, ఎంఎంటీసీ విక్రయించే బంగారం కాయిన్లు, బార్లకు అవే హాల్మార్కింగ్ చేస్తాయి. హాల్మార్కింగ్ వల్ల బంగారం స్వచ్ఛత ఎంతో స్పష్టంగా తెలుస్తుంది. ఆ స్వచ్ఛతకు గ్యారంటీ కూడా ఉంటుంది. స్టాక్ మార్కెట్...రిటైరైన వారికి స్టాక్ మార్కెట్లు సురక్షితమేనా? సురక్షితమే. కాకపోతే మిగతా వారితో పోలి్చనపుడు రిటైరీలు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారికి అదనపు ఆదాయం ఉండదు. కాబట్టి ఎక్కువ రాబడులకన్నా తమ అసలు భద్రంగా ఉండటం ముఖ్యం. మార్కెట్లలో ఒడదుడుకులు సహజం కనక అవి వారి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీయకుండా ఉండాలి. అందుకని తమ రిటైర్మెంట్ నిధిలో 15–20 శాతం మాత్రమే స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయటం మంచిది. నెలవారీ ఖర్చుల కోసం కాకుండా దీర్ఘకాలాన్ని దృష్టిలో పెట్టుకుని డివిడెండ్లు ఇచ్చే షేర్లు, లేదా లార్జ్క్యాప్ షేర్లు లేదా వీటిల్లో ఇన్వెస్ట్ చేసే ఈక్విటీ మ్యూచ్వల్ ఫండ్లను ఎంచుకోవాలి. ఎక్కువ డబ్బును ఎఫ్డీలు, ఆర్బీఐ బాండ్లలో పెట్టుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్...సిప్లో రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేయటం మంచిదా..∙ఒకేసారి పెద్ద మొత్తం పెడితే మంచిదా? సిప్ అనేది అందరికీ వర్తిస్తుంది. ఇక ఏకమొత్తంలో ఒకేసారి పెట్టుబడి పెట్టడమనేది కొందరికే. మార్కెట్ టైమింగ్ను చూసుకుని, బాగా రిస్్కను తట్టుకోగలిగే వారికే! సిప్ వల్ల మార్కెట్ టైమింగ్ రిస్కు ఉండదు. క్రమశిక్షణ అలవాటు కావటంతో పాటు రుపీ కాస్ట్ కూడా యావరేజ్ అవుతుంది. కాకపోతే మీ దగ్గర పెద్ద మొత్తం ఉన్నపుడు సిప్ చేయటం మొదలుపెడతే ఆ డబ్బును ఇన్వెస్ట్ చేయ డానికి చాలా సమయం పడుతుంది. అలాకాకుండా ఏకమొత్తంగా ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్లు కలిసివస్తే రాబడులు కూడా బాగానే ఉంటాయి. కాకపోతే మార్కెట్లు బాగా చౌకగా ఉన్నాయని భావించినపుడు, రిసు్కను తట్టుకోగలమని భావించినపుడు మాత్రమే దీనికి సిద్ధపడాలి. ఇన్సూరెన్స్ప్రెగ్నెన్సీ, డెలివరీ ఖర్చులు ఇన్సూరెన్స్లో కవరవుతాయా?మెటరి్నటీ ఖర్చులకు చాలా బీమా కంపెనీలు ఇపుడు కవరేజీ ఇస్తున్నాయి. పాలసీ తీసుకున్నాక కొంత వెయిటింగ్ పీరియడ్ తరవాతే ఇవి వర్తిస్తాయి. నార్మల్ లేదా సి–సక్షన్ డెలివరీ ఖర్చులతో పాటు ప్రీ–పోస్ట్ నాటల్ వ్యయాలు, కొంతకాలం వరకూ పుట్టిన బిడ్డకు అయ్యే ఖర్చు ఇవన్నీ కవర్ అవుతున్నాయి. మెటరి్నటీ కవర్ పాలసీ తీసుకున్న 2–4 ఏళ్ల తరువాతే మొదలవుతుంది. ఈ వెయిటింగ్ పీరియడ్లోపల అయ్యే ఖర్చులకు కవరేజీ ఉండదు. ప్రత్యేకంగా పేర్కొంటే తప్ప ఐవీఎఫ్, ఐయూఐ వంటి గర్భధారణ ఖర్చులకు బీమా కవరేజీ ఉండదు. అయితే కొన్ని యాజమాన్యాలిచ్చే పాలసీ లు, గ్రూప్ పాలసీల్లో మాత్రం వెయిటింగ్ పీరియడ్ లేకుండానే డెలివరీ కవరేజీ అందిస్తున్నారు.ఇదీ చదవండి: రిటైర్మెంటుతో.. లీవ్ ఎన్క్యాష్మెంట్..? -
రిటైర్మెంటుతో.. లీవ్ ఎన్క్యాష్మెంట్..?
ఇప్పుడు దేశవ్యాప్తంగా రిటైర్మెంటు తీసుకున్న ఉద్యోగస్తులు ఆలోచిస్తున్న అంశం.. తమ చేతికొచ్చిన లీవ్ ఎన్ క్యాష్మెంట్ మొత్తంలో మినహాయింపు రూ.3,00,000 పోగా పన్నుకి గురైన మిగతా భాగం గురించే. దీనిపై సమాచారాన్ని ఈ వారం తెలుసుకుందాం.లీవ్ ఎన్క్యాష్మెంట్పై కొన్ని రూల్స్కి లోబడి రూ.3,00,000 వరకు మినహాయింపు ఉండేది. 24–03–2023 నాడు విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఈ మొత్తాన్ని రూ.25,00,000కు పెంచారు. ఈ డేటు తర్వాత వచ్చిన వాటికి ఇది వర్తిస్తుంది. ఈలోగా ఏడో వేతన సంఘం సిఫార్సుల ప్రకారం 01–01–2016 నుంచి రిటైర్ అయిన ఉద్యోగస్తులకు జీతాలు, లీవ్ ఎన్క్యాష్మెంట్ భారీగా పెరిగాయి. 01–01–2016 తర్వాత రిటైర్ అయిన ఉద్యోగస్తులు తమ ఆదాయ పన్ను రిటర్నులలో రూ.3,00,000 వరకు మినహాయింపు పొంది, మిగతా మొత్తాల మీద 30 శాతం పన్ను, విద్యా సుంకం 4 శాతం.. వెరసి 31.2 శాతం పన్ను చెల్లించి సరిపెట్టుకున్నారు. ఇది సంతోషాన్ని కలిగించినప్పటికీ కొంత అలజడి మొదలైంది.కొంత మంది ఉద్యోగస్తులు నోటిఫికేషన్ అంశాన్ని లేవదీసి, ఆ మేరకు అదనంగా కట్టిన ట్యాక్స్ రిఫండు కోసం దరఖాస్తు చేశారు. అధికారులు యధావిధిగా అన్నింటినీ తోసిపుచ్చారు. విషయం ట్రిబ్యునల్ వరకు వెళ్లింది. అక్కడ ఉపశమనం లభించింది. వడ్డీతో సహా రిఫండ్ వచ్చింది. ఈ విషయం ఉద్యోగ సంఘాల ద్వారా ఊరు, వాడా చేరింది. ఒకే ప్రశ్న మరి ఇప్పుడు ఏం చేయాలి? ఏముంది.. మీరూ రిఫండు కోసం క్లెయిమ్ చేయొచ్చు. క్లెయిమ్ చేయడం తప్పు కాదు. ఎటువంటి రిస్కు కాదు. ఖర్చేమీ కాదు. ఫైల్ చేయండి.ఇదీ చదవండి: అంతులేని ధరల పెంపు ఆగేదెప్పుడో..ఎలా చేయాలి..కాగితాలన్నీ సమకూర్చుకోండి. మీ గత చరిత్ర ఒక పద్ధతిలో పెట్టండి. ఏ సంవత్సరంలో దాఖలు చేశారు, అక్నాలెడ్జ్మెంటు, రిటర్ను కాపీ, అసెస్మెంట్ ఆర్డరు, ట్యాక్స్ చెల్లించిన చలాన్లు, వాటికి సంబంధించిన అన్ని కాగితాలు.కాలదోషం పట్టిన కేసుల్లో రిటర్ను వేయకూడదు. అలా వేయాలంటే డిపార్టుమెంటు నోటీసులు ఇవ్వాలి. ఈ విషయంలో అలాంటివి జరగవు. ఆటోమేటిక్గా వాళ్లు రిఫండు ఇవ్వరు. మీరు రివైజ్ రిటర్ను వేయాలి.రివైజ్ రిటర్ను వేయాలంటే మీకు అనుమతి కావాలి. ఆ అనుమతి కేంద్ర పన్నుల బోర్డు ఇవ్వాలి. బోర్డు అంటే.. మీరు ఢిల్లీ పరుగెత్తనక్కర్లేదు. మీకు సంబంధించిన ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కం ట్యాక్స్ వారికి దరఖాస్తు చేసుకోవాలి.ఇలా దరఖాస్తు చేయడాన్ని కండోనేషన్ అప్లికేషన్ వేయడం అంటారు. తెలుగు రాష్ట్రాల వారికి హైదరాబాద్లో వీరి కార్యాలయం ఉంది. ప్రత్యక్షంగా ఫైల్ చేయొచ్చు లేదా ఐటీ పోర్టల్లోనైనా చేయొచ్చు. లాగిన్ తర్వాత సర్వీసెస్ బోర్డుకి వెళ్లాక, కండోనేషన్ రిక్వెస్ట్ కనిపిస్తుంది. కంటిన్యూ చేయండి. క్రియేట్ రిక్వెస్ట్ అని ఉంటుంది. అందులో అన్ని వివరాలు ఉంటాయి. నింపండి.ఏ వివరాలు ఇవ్వాలంటే.. మీ వివరాలు, కేసు వివరాలు, గతంలో రిటర్న్ వేసిన వివరాలు, నిజాలన్నీ పొందుపరుస్తూ, నా తప్పేమీ లేదు, ఉద్దేశపూర్వకంగా ఏమీ చేయలేదు అని రివైజ్ రిటర్ను వేయడానికి అనుమతి వేడుకోండి.సాధారణంగా అనుమతి ఇస్తారు. రోజూ వెబ్సైట్ వాచ్ చేయండి. అనుమతి రాగానే రివైజ్ రిటర్ను వేయండి.అన్ని కాగితాలు/వివరాలు ఇచ్చి రిటర్ను వేస్తే రిఫండు వచ్చే అవకాశం ఉంది. -
మీ ఇల్లు బంగారంగానూ!
తాకట్టు... రుణం!. ఈ రెండూ భవిష్యత్తుని నిర్ణయించేవే. అది ఎదగటమైనా... పాతాళానికి పడిపోవటమైనా!. దానికి దిక్సూచులు ఏ అవసరానికి తీసుకుంటున్నాం? ఎంత క్రమశిక్షణతో తిరిగి తీరుస్తున్నామనేవే. ఇక రుణ ప్రపంచానికి హృదయం లాంటివి హోమ్లోన్... గోల్డ్ లోన్. ఒకటి ఆశలు నెరవేర్చేదైతే మరొకటి అవసరాన్ని తీర్చేది. మరి బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల్లో రెండూ ఈ రుణాలిస్తున్నాయి కదా... ఏది మంచిది? ఏ రుణం ఎక్కడ తీసుకుంటే మంచిది? వీటికి సమాధానమే ఈ వెల్త్ స్టోరీ...సరైన రుణాన్ని, సరైన సంస్థను ఎంచుకోకకపోవటం వల్ల లక్షల రూపాయలు నష్టపోవాల్సి వస్తుందంటే ఆశ్చర్యంగా ఉండదూ? గృహరుణంలో ఒక్క 0.5 శాతం తేడా వల్ల మనం చెల్లించే సొమ్ము కొన్ని లక్షల రూపాయలు పెరిగిపోతుందంటే ఇబ్బందికరంగా లేదూ? అందుకే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల్లో ఎక్కడ రుణం తీసుకున్నా... మన అవసరమేంటన్నది ముఖ్యం. ఆ అవసరానికి మనకు ఎంత త్వరగా రుణం వస్తోంది? ఎంత వడ్డీకి వస్తోంది? మన దగ్గర అన్ని డాక్యుమెంట్లూ ఉన్నాయా? మనకు కొన్ని వెసులుబాట్లు అవసరమా? ఇలాంటివన్నీ చూసుకుని, దానికి తగ్గ సంస్థను ఎంపిక చేసుకుని ముందుకు వెళ్లాలి. అదెలాగో చూద్దాం... గృహ రుణానికి బ్యాంకే మంచిదా? గృహ రుణం తీసుకునే వారు ఒక్క వడ్డీ రేటే కాకుండా చాలా అంశాలు చూడాలి. అదేమిటంటే గృహ రుణాలపై వడ్డీ రేట్లు సాధారణంగా బ్యాంకుల్లోనే తక్కువ. ఎందుకంటే ఇవి ఆర్బీఐ రెపో రేటు మాదిరి ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ రేట్తో అనుసంధానమై ఉంటాయి. కాబట్టి ఆర్బీఐ రేట్లకు అనుగుణంగా తక్షణం మార్పుచేర్పులుంటాయి. ఉదాహరణకు 0.5 శాతం గనక వడ్డీ రేటు తగ్గితే... 20 ఏళ్ల కాల వ్యవధికి రూ.50 లక్షల రుణంపై ఏకంగా రూ.3 లక్షలు మిగుల్చుకోవచ్చు. పైపెచ్చు బ్యాంకుల్లో గృహ రుణాలను గరిష్టంగా 30 ఏళ్ల కాలానికీ తీసుకునే వెసులుబాటు ఉంటుంది. తక్కువ వడ్డీ రేట్లు, దీర్ఘకాలం కారణంగా ఈఎంఐ భారం తగ్గించుకోవచ్చు. కాకపోతే బ్యాంకుల్లో గృహ రుణ దరఖాస్తుల పరిశీలన చాలా కఠినంగా ఉంటుంది. ప్రాపరీ్టకి క్లియర్ టైటిల్తోపాటు, రుణ గ్రహీత క్రెడిట్ స్కోర్ (రుణ పరపతి/ రుణ చరిత్ర) 700కు పైన ఉండాలి. చెల్లింపుల సామర్థ్యాలనూ బ్యాంక్లు చూస్తాయి. దీనికితోడు న్యాయపరమైన క్లియరెన్స్ కూడా తీసుకుంటాయి. కనుక ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుంది. ఎన్బీఎఫ్సీలు ఎవరికంటే... నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు) గృహ రుణాల విషయంలో బ్యాంకుల మాదిరి అంత కఠినంగా వ్యవహరించవు. 700కు దిగువన క్రెడిట్స్కోరు ఉన్న వారికి సైతం, ఇతర అర్హతల ఆధారంగా ఇవి రుణాలను అందిస్తుంటాయి. ఆదాయ ధ్రువీకరణల్లేని స్వయం ఉపాధిపై ఉన్న వారికి, తక్కువ ఆదాయ వర్గాలకు సైతం ఎన్బీఎఫ్సీల్లో రుణాలు లభిస్తాయి. పైపెచ్చు ఎన్బీఎఫ్సీల్లో గృహ రుణం కేవలం రోజుల వ్యవధిలో మంజూరవుతుంది. సాధారణంగా రెండు నుంచి మూడు రోజుల్లోనే రుణం పొందొచ్చు. అంటే బ్యాంకులతో పోలి్చనపుడు ఎన్బీఎఫ్సీల్లో వేగవంతమైన, ప్రత్యేకమైన సేవలను ఆశించొచ్చు. కాకపోతే ఎన్బీఎఫ్సీల్లో వడ్డీ రేట్లు ఎక్కువ. కనుక వడ్డీ రూపంలో కాస్త ఎక్కువ చెల్లించాలి. బ్యాంకుల్లో మాదిరి అధిక రుణం మొత్తం అన్ని ఎన్బీఎఫ్సీల్లో సాధ్యపడదు. వీరికి బ్యాంక్ బెటర్.. → మంచి క్రెడిట్ స్కోరు ఉండి, ఆదాయ ధ్రువీకరణలున్న వారికి. → ఆర్బీఐ నియత్రణల కింద మరింత పారదర్శకత కోరుకునే వారికి. → సమయం పట్టినా తక్కువ వడ్డీకి రుణం కావాలనుకునేవారికి. వీరికి ఎన్బీఎఫ్సీలు.. → తక్కువ ఆదాయం లేదా ఫ్రీలాన్స్, స్వయం ఉపాధి, చిన్న వ్యాపారాల ద్వారా ఆదాయం వచ్చేవారికి → వేగంగా రుణం మంజూరు కోరుకునే వారికి. ళీ వడ్డీ రేటు కాస్త ఎక్కువైనా.. తమ అవసరాలకు వీలుగా సౌకర్యవంతమైన షరతులపై రుణం కోరుకునే వారికి బంగారంపై రుణం ఎక్కడ నయం? గృహ రుణం మాదిరే బంగారాన్ని తనఖా పెట్టి తీసుకునే రుణమూ సెక్యూర్డ్ కిందికే వస్తుంది. కనుక వీటిపైనా రేట్లు తక్కువగానే ఉంటాయి. అయినప్పటికీ రుణం మొత్తం, వడ్డీ రేటు, కాల వ్యవధి, చెల్లింపుల్లో సౌలభ్యం పరంగా బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీల మధ్య ఎన్నో వ్యత్యాసాలు కనిపిస్తాయి. బ్యాంక్లు ఎక్కడ బెటరంటే... → బంగారంపై వడ్డీ రేటు బ్యాంకుల్లో తక్కువ. ఇవి 8 శాతం రేటుకే రుణాలిస్తుంటాయి. కొన్ని బ్యాంకుల్లో ఈ రేటు గరిష్టంగా 12 శాతం వరకు ఉంటుంది. → బంగారంపై బ్యాంకుల్లో దీర్ఘకాలిక రుణాలు తీసుకునే సౌలభ్యం ఉంది. రుణం తీసుకుని, ప్రతి నెలా చెల్లింపులు చేయకుండా.. ఒకేసారి తిరిగి చెల్లించేట్టయితే ఏడాది కాలానికి మంజూరు చేస్తారు. → రుణం తీసుకుని నెలవారీ వాయిదాల్లో (ఈఎంఐ) చెల్లించేట్టు అయితే రెండు నుంచి మూడేళ్ల కాలానికి రుణాలిస్తారు. → ఇక బ్యాంకుల్లో కూడా ప్రభుత్వ రంగ బ్యాంకులైతే బంగారంపై తక్కువ రేటుకు రుణాలిస్తుంటాయి. → ఆర్బీఐ మార్గదర్శకాలను బ్యాంకులు కచి్చతంగా అనుసరిస్తుంటాయి. కనుక భద్రత, పారదర్శకత ఎక్కువ. → బ్యాంకుల్లో బంగారంపై రుణం అదే రోజు, గంటల్లోనే మంజూరవుతుంది. → కాకపోతే బ్యాంకుల్లో బంగారం విలువపై తక్కువ రుణం లభిస్తుంది. అంటే ఎక్కువ బ్యాంకులు బంగారం విలువలో 65–70 శాతానికి మించి రుణాన్ని ఇవ్వవు. ఎన్బీఎఫ్సీలు ఎక్కడ బెటరంటే... → ఎన్బీఎఫ్సీల్లో బంగారం రుణాలపై అధిక వడ్డీ రేటు అమలవుతుంది. వీటిల్లో 12 శాతం నుంచి 30 శాతం మధ్య రేటు ఉంటుంది. → కేవైసీ పరంగా ఆధార్, పాన్ ఇస్తే చాలు... బ్యాంకుల్లో మాదిరే బంగారంపై రుణం అదే రోజు వేగంగానే మంజూరవుతుంది. → ముఖ్యంగా బంగారంపై అధిక రుణాన్ని ఎన్బీఎఫ్సీలు ఆఫర్ చేస్తుంటాయి. కానీ, ఇందుకోసం అధిక వడ్డీ రేటు చెల్లించుకోవాల్సిందే. → వడ్డీని ఏ నెలకానెల కట్టేసి.. అసలును చివర్లో కట్టేస్తే సరిపోతుంది. → కాకపోతే వీటిల్లో రుణ కాలవ్యవధి బ్యాంకుల్లో మాదిరి సుదీర్ఘంగా ఉండదు. ఆరు నెలలు, ఏడాదికే ఆఫర్ చేస్తాయి. ఆ తర్వాత రెన్యువల్ చేసుకోవాలి. → రుణాన్ని సకాలంలో చెల్లించడంలో విఫలమైతే కఠినంగా వ్యవహరిస్తాయి. అంగీకారానికి ముందు.. → రుణం తీసుకునే ముందు ఒప్పంద నియమ నిబంధనలు, షరతులు, చార్జీల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి. → తిరిగి చెల్లింపుల పరంగా ఉన్న ఆప్షన్లను తెలుసుకోవాలి. → రుణాన్ని నిరీ్ణత కాల వ్యవధికి ముందే తీర్చివేస్తే పెనాల్టీ మాదిరి ఏవైనా చార్జీలు చెల్లించాల్సి ఉంటుందా? అడగాలి. → వివిధ బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీల మధ్య రుణ రేట్లు, చార్జీలను పోల్చి చూసుకోవాలి. → సాధారణంగా దీర్ఘకాల రుణాలకు బ్యాంక్లు అనుకూలం, సౌకర్యం. → అత్యవసరంగా, అధిక రుణం కోరుకునే వారికి ఎన్బీఎఫ్సీలు అనుకూలం.రుణ వ్యయాలు తగ్గించుకోవడమెలా? → రుణం తీసుకోవడానికి ముందు తమ క్రెడిట్ స్కోరు ఎంతో తెలుసుకోవాలి. ఏడాదిలో ఒక్కసారి క్రెడిట్ స్కోరును ఆయా సంస్థలు ఉచితంగా ఇస్తాయి. → 760కు పైన క్రెడిట్ స్కోరు ఉన్న వారు తక్కువ వడ్డీ రేటుతోపాటు, ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు కోసం డిమాండ్ చేయొచ్చు. → గృహ రుణం అయితే ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ (ఆర్బీఐ రెపో/ఈబీఎల్ఆర్) రేటు ఆధారితంగా ఎంపిక చేసుకోవాలి. → రుణం తీసుకునే సమయంలో అధిక రేటు ఉండి, ఆ తర్వాత రేట్లు దిగొస్తే.. మిగిలిన బకాయిని తక్కువ రేటు ఉన్న సంస్థకు బదిలీ చేసుకోవడాన్ని పరిశీలించాలి. -
ప్రీ అప్రూవ్డ్ లోన్ గురించి తెలుసా.. బ్యాంక్ ఎవరికి ఇస్తుందంటే?
ఉద్యోగం చేసేవాళ్లకైనా.. వ్యాపారం చేసేవాళ్లకైనా.. లోన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లోన్ అంటే.. అందులో చాలా రకాలు ఉన్నాయి. ఇందులో ఒకటి ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్. బహుశా దీని గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. అయినప్పటికీ.. బ్యాంకులు ఈ రకమైన లోన్స్ ఎందుకు ఇస్తాయి?, ఎవరికి ఇస్తాయి? అనే విషయాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ అంటే?ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ అనేది.. బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ ముందుగానే అర్హత నిర్ధారించి, ప్రత్యేకంగా ఎంపిక చేసిన కస్టమర్లకు ఆఫర్ చేసే పర్సనల్ లోన్. అంటే కస్టమర్ ప్రత్యేకంగా లోన్ కోసం అప్లై చేయకపోయినా.. లోన్ తీసుకోవడానికి అర్హులు అని చెప్పడం. ఆదాయం, క్రెడిట్ స్కోర్, లావాదేవీలు మొదలైనవాటిని పరిశీలించి.. ఎంత మొత్తంలో లోన్ ఇవ్వవచ్చు అని బ్యాంక్ ముందుగానే ఫిక్స్ చేస్తుంది.ఈ లోన్ ఎవరికి ఇస్తారు?బ్యాంకులో ఇప్పటికే అకౌంట్ ఉండే కస్టమర్లకు, జీతం పొందుతున్న లేదా ఉద్యోగం చేస్తున్న వారికి, సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉన్నవాళ్లకు బ్యాంకులు ప్రీ అప్రూవ్డ్ లోన్ ఇస్తుంది. ఒక వ్యక్తి ప్రీ అప్రూవ్డ్ లోన్ పొందటానికి అర్హుడు అని బ్యాంక్ గుర్తించినప్పుడు.. వారికి ఎస్ఎంఎస్, ఈమెయిల్, నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తారు.ఈ లోన్ ఆఫర్ కస్టమర్ అంగీకరిస్తే.. సింపుల్ పద్దతిలో లోన్ పొందవచ్చు. దీనికోసం ఎక్కువ డాక్యుమెంట్స్ అవసరం లేదు. చాలా తొందరగా లోన్ మంజూరు అవుతుంది. కొన్ని సందర్భాల్లో బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు.బ్యాంక్ శాఖకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.గుర్తుంచుకోవాల్సిన విషయాలుబ్యాంక్ ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ ఆఫర్ చేసింది కదా అని.. ముందు వెనుక ఆలోచించకుండా లోన్ తీసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే మీరు తీసుకునే లోన్ మీద ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి లోన్ తీసుకోవడానికి ముందు.. అన్నీ తెలుసుకుని, తప్పకుండా అవసరం అయితేనే ముందుకు వెళ్లడం మంచిది. లేకుంటే.. భవిష్యత్తులో ఆర్ధిక భారం మోయాల్సి వస్తుంది. -
బ్యాంకులకు వారమంతా సెలవులే!!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జనవరి నెలకు సంబంధించిన బ్యాంకు సెలవుల షెడ్యూల్ను ప్రకటించింది. స్వామి వివేకానంద జయంతి, మకర సంక్రాంతి, తిరువళ్లువర్ దినోత్సవం, ఉళవర్ తిరునాళ్ వంటి పండుగల నేపథ్యంలో వచ్చే వారం దేశంలోని పలు రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉండనున్నాయి.ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)తో సహా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ప్రతి నెల రెండవ, నాల్గవ శనివారాలు, అన్ని ఆదివారాలు వారపు సెలవులుగా పాటిస్తాయి. ఇదే క్రమంలో ఈ జనవరి నెలలో మొత్తం 16 బ్యాంకు సెలవులు (వారాంతాలు కలుపుకొని) ఉంటాయి.ప్రాంతీయ పండుగలు, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాల ఆధారంగా సెలవులు మారవచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది. అందువల్ల ఖాతాదారులు తమ స్థానిక బ్యాంకు శాఖ సెలవు షెడ్యూల్ను ముందుగానే తెలుసుకుని అందుకు అనుగుణంగా తమ బ్యాంకు పనులను ప్లాన్ చేసుకోవడం అవసరం.వచ్చే వారం బ్యాంకు సెలవులు ఇవే..జనవరి 12: స్వామి వివేకానంద జయంతి – పశ్చిమ బెంగాల్జనవరి 14: మకర సంక్రాంతి / మాఘ్ బిహు – గుజరాత్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, అసోంజనవరి 15: ఉత్తరాయణ పుణ్యకాళం / పొంగల్ / మాఘే సంక్రాంతి / మకర సంక్రాంతి – తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సిక్కింజనవరి 16: తిరువళ్లువర్ దినోత్సవం – తమిళనాడుజనవరి 17: ఉళవర్ తిరునాళ్ – తమిళనాడుజనవరి 18: ఆదివారం – దేశవ్యాప్తంగా బ్యాంకు సెలవుబ్యాంకులు మూసివున్నా ఇవి పనిచేస్తాయిబ్యాంకు సెలవు దినాల్లో కూడా వినియోగదారులు నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ (UPI), ఏటీఎం నగదు ఉపసంహరణ వంటి సేవలను సాధారణంగానే వినియోగించుకోవచ్చు. అయితే, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం చెక్కులు, ప్రామిసరీ నోట్లకు సంబంధించిన లావాదేవీలు సెలవు రోజుల్లో జరగవు. -
పీఎఫ్ భాగ్యం మరింత మందికి దక్కుకుందా?
దేశంలో ఉద్యోగుల సామాజిక భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసేందుకు సిద్ధమవుతోంది. తప్పనిసరి ఉద్యోగ భవిష్య నిధి (EPF)కు వర్తించే వేతన పరిమితిని పెంచే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇది కార్యరూపం దాలిస్తే, ఇప్పటివరకు ఈపీఎఫ్ పరిధికి బయట ఉన్న లేదా పరిమిత ప్రయోజనాలకే పరిమితమైన లక్షలాది ఉద్యోగులకు అదనపు భద్రత లభించే అవకాశముంది.ఏమిటీ వేతన పరిమితి?ప్రస్తుతం, ఒక ఉద్యోగి ప్రాథమిక జీతం డీఏతో కలిపి రూ .15,000 లేదా అంతకంటే తక్కువ ఉంటే మాత్రమే ఈపీఎఫ్ తప్పనిసరిగా వర్తిస్తోంది. ఆ పరిమితిని పెంచితే, మధ్యస్థ వేతనాలు (వేతన రూ.30 వేల వరకూ పెంచే అవకాశం) పొందే ఉద్యోగులు కూడా ఈపీఎఫ్ కవరేజీలోకి వస్తారు. ముఖ్యంగా ప్రైవేట్ రంగం, ఎంఎస్ఎంఈలు, సేవారంగాల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రస్తుతం ఉన్న రూ .15 వేల గరిష్ట వేతన పరిమితి చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. 2014 సెప్టెంబర్లో దీన్ని నిర్ణయించారు. గత దశాబ్ద కాలంలో జీతాలు, జీవన ఖర్చులు గణనీయంగా పెరిగాయి. కానీ పీఎఫ్ పరిమితి మాత్రం మారకుండా అలాగే కొనసాగుతూ వస్తోంది.వేతన పరిమితి పెంచితే ప్రయోజనాలువేతనంతో పాటు సంస్థ వాటా కూడా ఈపీఎఫ్లో జమ కావడంతో దీర్ఘకాలిక పొదుపు పెరుగుతుంది.పదవీ విరమణ అనంతరం ఆర్థిక భద్రత మెరుగవుతుంది.ఈపీఎస్ పరిధి విస్తరించడంతో పెన్షన్ ప్రయోజనాలు లభిస్తాయి.ఈపీఎఫ్కు చెల్లించే మొత్తాలపై పన్ను రాయితీలు ఉంటాయి.గృహ నిర్మాణం, వైద్యం, విద్య వంటి అవసరాలకు నిబంధనల ప్రకారం ఉపసంహరణ సౌకర్యం ఉంటుంది.యాజమాన్యాలపై ప్రభావంవేతన పరిమితి పెంపుతో యాజమాన్యాలపై చెల్లింపుల భారం కొంత పెరగవచ్చు. అయితే, ఉద్యోగుల నిలుపుదల (రిటెన్షన్) మెరుగవడం, సామాజిక భద్రతతో కూడిన స్థిరమైన వర్క్ఫోర్స్ ఏర్పడటం వంటి దీర్ఘకాలిక లాభాలు సంస్థలకు దక్కుతాయని నిపుణులు చెబుతున్నారు.ప్రతిపాదనపై కార్మిక సంఘాలు, పరిశ్రమల ప్రతినిధులతో ప్రభుత్వం సంప్రదింపులు జరపనుంది. అన్ని వర్గాల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇది అమలులోకి వస్తే, దేశంలో సామాజిక భద్రతా వ్యవస్థకు ఇది మరో కీలక మైలురాయిగా నిలవనుంది. -
Income Tax: కోటీశ్వరులు పెరిగారు..
మన దేశంలో ఆదాయ వివరాలను సమర్పిస్తున్న వ్యక్తుల సంఖ్య అతి స్వల్పంగా పెరిగింది. ఇదే సమయంలో రూ. కోటికి మించి వార్షిక ఆదాయం ప్రకటించిన వారు మాత్రం గతం కంటే భారీగా ఉన్నారు. పన్ను ఎగవేతల కట్టడికితోడు భారీ నగదు, విదేశీ రెమిటెన్సులు, లగ్జరీ వస్తువుల కొనుగోళ్ల వంటి అధిక విలువ కలిగిన లావాదేవీలను కేంద్ర ప్రభుత్వం ట్రాక్ చేయడంతో అధిక ఆదాయ వర్గాలు అన్ని వివరాలు వెల్లడించక తప్పడం లేదు. - సాక్షి, స్పెషల్ డెస్క్అధిక ఆదాయ వర్గాలు పెరగడం, లావాదేవీల వెల్లడి మరింత మెరుగవడం తాజా గణాంకాలను ప్రతిబింబిస్తోందని ట్యాక్స్ నిపుణులు అంటున్నారు. ఆర్థిక కార్యకలాపాల్లో విస్తృత వృద్ధికి ఈ ధోరణి కారణమని చెబుతున్నారు. వేతన వృద్ధి, బలమైన బోనస్, ఆరోగ్యకరమైన వ్యాపార లాభదాయకత కారణంగా గృహ ఆదాయాల్లో స్పష్టమైన మెరుగుదల నమోదవుతుందని పేర్కొంటున్నారు.ఆదాయ వివరాల వెల్లడిలో కఠిన నిబంధనలు, డేటా అనలిటిక్స్ విస్తృత వినియోగం, వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్), మూలం వద్ద పన్ను మినహాయింపు (టీడీఎస్)/మూలం వద్ద పన్ను వసూళ్లు (టీసీఎస్) ట్రాకింగ్ కారణంగా పారదర్శకత పెరిగి పన్ను ఎగవేతలు గణనీయంగా తగ్గాయి. కొత్త సంపద ఆకస్మిక సృష్టి కంటే నిబంధనల అమలు మెరుగైన తీరుకు గణాంకాలు నిదర్శనమని ఇతర ట్యాక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.అతి తక్కువగా.. ఆదాయపు పన్ను ఈ–ఫైలింగ్ పోర్టల్ సమాచారం ప్రకారం.. 2025–26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–డిసెంబర్లో 9 కోట్లకు పైగా రిటర్నులు దాఖలు అయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో వీటి సంఖ్య 8.92 కోట్లు. దాఖలైన మొత్తం రిటర్నులు ఏడాదిలో 1.22 శాతం మాత్రమే పెరగడం గమనార్హం. అసెస్మెంట్ సంవత్సరం 2025–26కుగాను ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి 2025 డిసెంబర్ 31 చివరి తేదీ. రెండంకెల వృద్ధి.. 2024–25 ఏప్రిల్–డిసెంబర్తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్స రం ఇదే కాలంలో రూ.కోటికిపైగా ఆదాయాన్ని ప్రకటించిన వ్య క్తుల (అసెసీలు) సంఖ్య 3,17,098 నుంచి 3,85,752కు చేరింది. అంటే 21.65% అధికం కావడం విశేషం. రూ.5 లక్షలలోపు వార్షికాదాయం ఉన్న అసెసీలు 24.1% తగ్గడం గమనార్హం.ఇతర అన్ని ఆదాయ శ్రేణిలో.. అంటే రూ.5 లక్షలకుపైగా ఆదాయం కలిగిన అసెసీల సంఖ్యలో రెండంకెల వృద్ధి నమోదైంది. రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి, రూ.1–5 కోట్ల ఆదాయం చూపిన అసెసీలు 21% పెరిగారు. ఇక రూ.5–10 కోట్ల శ్రేణిలో ఏకంగా 29.7 %, రూ.10 కోట్లకుపైగా ఆదాయంతో రిటర్నులు సమర్పించినవారి సంఖ్య 28.3% దూసుకెళ్లడం ఆశ్చర్యం కలిగించే అంశం. ఆదాయం వెల్లడించాల్సిందే.. కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని అత్యధికులు ఎంచుకుంటున్నారు. అంటే వార్షికాదాయం రూ.12 లక్షల వరకు పన్ను లేదు. అధిక విలువ కలిగిన లావాదేవీల సమాచారం వివిధ ప్రభుత్వ విభాగాలు, బ్యాంకుల నుంచి ఆదాయపు పన్ను (ఐటీ) శాఖకు ఎప్పటికప్పుడు చేరుతోంది. పన్ను ఎగవేతలకు చెక్ పెట్టేందుకు ఐటీ శాఖ కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. అందుకే అధిక ఆదాయ శ్రేణిలో దాఖలైన రిటర్నుల సంఖ్య భారీగా పెరిగింది. - అరుణ్ రాజ్పుత్, ఫౌండర్, ఆంబర్ గ్రూప్ -
పర్సనల్ లోన్ vs టాప్-అప్ లోన్: ఏది బెస్ట్?
ఈ రోజుల్లో ఎంత పెద్ద ఉద్యోగం చేసే వారైనా.. కొన్ని సందర్భాల్లో లోన్ తీసుకోవాల్సి వస్తోంది. దీంతో లోన్స్ అనేవి సర్వసాధారణం అయిపోయాయి. అయితే ఇక్కడ చాలామందికి వచ్చే అనుమానం ఏమిటంటే.. పర్సనల్ లోన్ & టాప్-అప్ లోన్లలో ఏది బెస్ట్. మీ సందేహానికి.. ఈ కథనమే సమాధానం.పర్సనల్ లోన్పర్సనల్ లోన్ గురించి దాదాపు అందరికీ తెలుసు. విద్య, పెళ్లి, వైద్య ఖర్చులు, ట్రావెల్ వంటి వ్యక్తిగత అవసరాల కోసం ఎక్కువమంది ఈ లోన్స్ తీసుకుంటూ ఉంటారు. ఈ లోన్కు అప్రూవల్ ప్రక్రియ కొంత వేగంగా ఉంటుంది. అంతే కాకుండా డాక్యుమెంట్ ప్రాసెస్ కూడా కొంత తక్కువే.పర్సనల్ లోన్ మీద వడ్డీ రేటు 11 శాతం నుంచి 24 శాతం వరకు ఉంటుంది. ఇది మీ సిబిల్ స్కోర్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. నెలవారీ చెల్లించాల్సిన ఈఎంఐ కూడా కొంత ఎక్కువే. మొత్తం మీద మీరు తీసుకున్న లోన్ మీద కొంత ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.టాప్ అప్ లోన్టాప్ అప్ లోన్ విషయానికి వస్తే.. ఇది మీరు ఇప్పటికే తీసుకున్న లోన్పైనే అదనంగా ఇచ్చే లోన్ అన్నమాట. ఒక వ్యక్తి లోన్ తీసుకుని సక్రమంగా చెల్లిస్తున్న సమయంలో.. బ్యాంక్స్ లేదా ఫైనాన్స్ కంపెనీలు ఈ సౌకర్యాన్ని అందిస్తాయి.టాప్ అప్ లోన్ తీసుకోవడం వల్ల.. వడ్డీ రేటు కొంత తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా హోమ్ లోన్ మీద తీసుకునే టాప్-అప్ లోన్కు వడ్డీ తక్కువగా ఉంటుంది. ఈఎంఐ కూడా పర్సనల్ లోన్తో పోలిస్తే చాలా తక్కువే. ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే.. టాప్ అప్ లోన్ కావాలంటే.. మీరు ఇప్పటికే లోన్ తీసుకుని ఉండాలి. సక్రమంగా చెల్లిస్తూ ఉండాలి.పర్సనల్ లోన్ అనేది అత్యవసరంలో ఉపయోగపడుతుంది. ఇది దాదాపు అందరికీ అందుబాటులో ఉంటుంది. టాప్ అప్ లోన్ మాత్రం అందరికీ అందుబాటులో ఉండదు. లోన్ తీసుకుని, సమయానికి చెల్లించేవారికి మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. కాబట్టి.. మీ సౌలభ్యం, అవసరాన్ని బట్టి.. ఏ లోన్ తీసుకోవాలనేది మీరే నిర్ణయించుకోవాలి. -
అవీవా లైఫ్ నుంచి కొత్త టర్మ్ ప్లాన్
అవీవా ఇండియా ‘అవీవా స్మార్ట్ వైటల్ ప్లాన్’ను ప్రవేశపెట్టింది. ఇది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్. అంటే జీవిత బీమాకు రణ కల్పించే అచ్చమైన స్థిర ప్రయోజన పాలసీ. కనీసం రూ.10 లక్షల నుంచి బీమా రక్షణ మొదలవుతుంది. 49 తీవ్ర అనారోగ్యాల్లో (క్రిటికల్ ఇల్నెస్) ఏదేనీ బారిన పడి, 15 రోజుల పాటు జీవించి ఉంటే ఈ ప్లాన్లో రూ.10/15/20 లక్షలు ఒకే విడత ప్రయోజనం అందిస్తారు.పాలసీ తీసుకున్న 90 రోజుల తర్వాతే ఇది అమల్లోకి వస్తుంది. రోజువారీ నడక ద్వారా ఇందులో రివార్డులు జమ చేసుకోవచ్చు. వీటి ద్వారా బీమా రక్షణను రెండు రెట్లకు పెంచుకోవచ్చు. రూ.20–50 ఏళ్ల మధ్య వయసు వారు పాలసీని 10–15–20 ఏళ్ల కాలానికి తీసుకోవచ్చు.ఇందులో ప్రీమియం చెల్లింపునకు వార్షిక, అర్ధవార్షిక, త్రైమాసిక, నెలవారీ వంటి సౌకర్యవంతమైన ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. పాలసీ కాలంలో బీమాదారు మరణిస్తే నామినీకి ముందుగా నిర్ణయించిన సమ్ అష్యూర్డ్ను చెల్లిస్తారు. అవసరమైతే అదనపు రైడర్లను కూడా జత చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రీమియం మొత్తాన్ని వయసు, బీమా కాలం, ఎంచుకున్న కవరేజ్ ఆధారంగా నిర్ణయిస్తారు.పన్ను ప్రయోజనాల పరంగా కూడా ఈ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది. వర్తించే ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం ప్రీమియంపై మినహాయింపులు, క్లెయిమ్ మొత్తంపై పన్ను మినహాయింపులు పొందే అవకాశం ఉంది. దీర్ఘకాలిక ఆర్థిక భద్రతతో పాటు ఆరోగ్య సంబంధిత ప్రమాదాలకు రక్షణ కోరుకునే వారికి ఈ ప్లాన్ సరైన ఎంపికగా అవీవా ఇండియా పేర్కొంది. -
యాక్సిస్ బ్యాంక్ యాప్లో ‘సేఫ్టీ సెంటర్’
డిజిటల్ మోసాల బారిన పడకుండా కస్టమర్లు తమ ఖాతాలను స్వయంగా నియంత్రించుకునే వీలు కల్పిస్తూ యాక్సిస్ బ్యాంక్ తమ మొబైల్ యాప్ ‘ఓపెన్’లో ‘సేఫ్టీ సెంటర్’ ఫీచరును ప్రవేశపెట్టింది. సందేహాస్పద సందర్భాల్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్కి యాక్సెస్ని డిసేబుల్ చేసేందుకు, ఫండ్ ట్రాన్స్ఫర్లను బ్లాక్ చేసేందుకు, యూపీఐ చెల్లింపులను నియంత్రించేందుకు, పరిమితులను సెట్ చేసేందుకు, కొత్త పేయీలను జోడించకుండా నివారించేందుకు ఇది సహాయకరంగా ఉంటుంది.దీనితో కస్టమర్ కేర్ సెంటర్ లేదా బ్రాంచీలపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా ఖాతాను స్వయంగా నియంత్రించుకోవచ్చని బ్యాంకు తెలిపింది. అలాగే, బ్యాంకు మెసేజీల ప్రామాణికతను ధృవీకరించేలా ఎస్ఎంఎస్ షీల్డ్ సేవలను కూడా అందిస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు, కళలు, సాహిత్యానికి సంబంధించిన ష్ల్పాష్ 2025 పోటీలను నిర్వహించినట్లు వివరించింది.ఇందులో దేశవ్యాప్తంగా 995 పాఠశాలల నుంచి 2.66 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నట్లు బ్యాంకు పేర్కొంది. దక్షిణాదిలో హైదరాబాద్, వైజాగ్ సహా 308 స్కూళ్ల నుంచి 1.01 లక్షల మంది పాల్గొన్నట్లు వివరించింది. ఇందులో ఆరుగురు విజేతలకు రూ. 1 లక్ష చొప్పున, ఆరుగురు రన్నర్స్ అప్లకు తలో రూ. 50,000 చొప్పున బహుమతి ఉంటుంది. -
బీమా అనైతిక విక్రయాలకు చెక్!.. ఐఆర్డీఏఐ
బీమా రంగంలో ఉత్పత్తులను తప్పుదోవ పట్టించి విక్రయించడం (అనైతిక మార్గాల్లో) ఆందోళన కలిగిస్తున్నట్టు బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్ఈఏఐ) వార్షిక నివేదిక పేర్కొంది. అసలు దీనికి గల కారణాలను గుర్తించేందుకు బీమా సంస్థలు లోతైన విశ్లేషణ చేయాలని సూచించింది.2023–24లో జీవిత బీమా కంపెనీలకు వ్యతిరేకంగా 1,20,726 ఫిర్యాదులు రాగా, 2024–25లోనూ ఇదే స్థాయిలో 1,20,429 ఫిర్యాదులు దాఖలైనట్టు తెలిపింది. అనైతిక వ్యాపార విధానాలపై మాత్రం ఫిర్యాదులు 23,335 నుంచి 26,667కు పెరిగినట్టు వెల్లడించింది. మొత్తం ఫిర్యాదుల్లో అనైతిక వ్యాపార పద్ధతులకు సంబంధించినవి 19.33 శాతం నుంచి 22.14 శాతానికి పెరిగినట్టు పేర్కొంది.వ్యక్తుల అవసరాలకు సరిపడని, నియమ, నిబంధనలు, షరతులు గురించి పూర్తిగా తెలియజేయకుండా, కేవలం ప్రయోజనాల గురించే చెబుతూ పాలసీలను విక్రయించడాన్ని మిస్ సెల్లింగ్గా చెబుతుంటారు. బ్యాంక్లు, బీమా ఏజెంట్ల రూపంలో ఈ తరహా విక్రయాలు సాగుతుంటాయి. ‘‘మిస్ సెల్లింగ్ను నిరోధించేందుకు గాను తగిన విధానాలను అమలు చేయాలని బీమా సంస్థలకు సూచించాం. ఉత్పత్తి అనుకూలతను అంచనా వేయడం (పాలసీదారునకు అనుకూలమైనా), పంపిణీ ఛానల్ వ్యాప్తంగా కొన్ని నియంత్రణలు అమలు చేయడం, మిస్ సెల్లింగ్పై ఫిర్యాదుల పరిష్కారానికి ప్రణాళిక రూపొందించడం, మూల కారణాలను గుర్తించేందుకు అధ్యయనం చేయాలని సూచించడమైంది’’అని ఐఆర్డీఏఐ తన 2024–25 నివేదికలో వివరించింది.తప్పుడు మార్గాల్లో బీమా ఉత్పత్తుల విక్రయంపై కేంద్ర ఆర్థిక శాఖ బ్యాంక్లు, బీమా సంస్థలను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉండడం గమనార్హం. అనుకూలం కాని పాలసీలను విక్రయించడం పాలసీదారులు తర్వాత రెన్యువల్ చేసుకోరని, దాంతో పాలసీల రద్దునకు దారితీస్తున్నట్టు పేర్కొంది.బీమా విస్తరణ 3.7 శాతందేశంలో బీమా విస్తరణ 2024–25 సంవత్సరానికి జీడీపీలో 3.7 శాతంగా ఉన్నట్టు ఐఆర్డీఏఐ నివేదిక తెలిపింది. ఇది ప్రపంచ సగటు 7.3 శాతం కంటే సగమే. జీవిత బీమా రంగంలో విస్తరణ రేటు 2023–24లో ఉన్న 2.8 శాతం నుంచి 2024–25లో 2.7 శాతానికి తగ్గినట్టు తెలిపింది. నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ విస్తరణ రేటు మాత్రం యథాతథంగా ఒక శాతం వద్దే ఉంది.ఇదీ చదవండి: బంగారం బాటలో మరో మెటల్.. ఫుల్ డిమాండ్! -
పెరిగిన ఆధార్ కార్డు ఛార్జీలు
ఆధార్ కార్డు దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడానికి.. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉంది. ఇందులో భాగంగానే.. పేపర్లెస్ ఆధార్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్తగా ఆధార్ యాప్ కూడా ప్రవేశపెట్టింది. ఇపుడు తాజాగా.. ఆధార్ PVC కార్డు కోసం సర్వీస్ ఛార్జీని రూ.50 నుంచి రూ.75కి పెంచింది.పెరిగిన PVC కార్డు సర్వీస్ ఛార్జీలలో.. ట్యాక్స్, డెలివరీ ఛార్జీలు ఉన్నాయి. 2020లో ఈ సేవ ప్రవేశపెట్టిన ధర పెంచడం ఇదే మొదటిసారి. 2026 జనవరి నుంచి ఆధార్ PVC పొందాలనుకుంటే వినియోగదారులు కొత్త ఛార్జీలు చెల్లించాల్సిందే. myAadhaar వెబ్సైట్ లేదా mAadhaar మొబైల్ యాప్ అప్లై చేసుకొనే వినియోగదారులకు కూడా ఇవే ఛార్జీలు వర్తిస్తాయి. సంవత్సరం జనవరి 1 నుండి కొత్త ధర అమలులోకి వచ్చిందని UIDAI తెలిపింది.ధర పెరుగుదలకు కారణంపీవీసీ ఆధార్ కార్డు ధరల పెరుగుదలకు కారణం.. నిర్వహణ ఖర్చులు పెరగడం అని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. కొన్నేళ్లుగా.. ఆధార్ PVC కార్డ్ ఉత్పత్తి, పంపిణీకి సంబంధించిన మెటీరియల్స్, ప్రింటింగ్, సురక్షిత డెలివరీ, లాజిస్టిక్స్ ఖర్చు పెరిగింది. దీనివల్ల ఛార్జీలు పెంచినట్లు సంస్థ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: అటెన్షన్.. ప్రతీ ఒక్కరి ఖాతాలో రూ.46 వేలు జమ!ఆధార్ PVC కార్డును ఎలా ఆర్డర్ చేయాలి?➤ఆధార్ PVC కార్డు కోసం myAadhaar వెబ్సైట్ లేదా mAadhaar యాప్ ఉపయోగించాలి.➤యాప్ లేదా వెబ్సైట్ ఓపెన్ చేసి.. ఆధార్ నెంబర్ , క్యాప్చ ఎంటర్ చేసిన తరువాత.. రిజిస్టర్ మొబైల్ నెంబరుకు వచ్చే ఓటీపీ ద్వారా లాగిన్ లాగిన్ అవ్వాలి.➤లాగిన్ అయినా తరువాత.. ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డు అనే ఆప్షన్ ఎంచుకోవాలి.➤ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డు ఆప్షన్ ఎంచుకున్న తరువాత 75 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.➤ప్రాసెస్ పూర్తయిన తరువాత.. ఐదు పని దినాలలోపు డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది.Once you have placed an order for your #AadhaarPVCCard, within a few days your card is printed and sent through India Post’s Speed Post service, which is fast, secure, and trackable.You can easily check the delivery status online.To track the delivery status of your #Aadhaar… pic.twitter.com/ZFQOet6TU2— Aadhaar (@UIDAI) January 6, 2026 -
ల్యాప్స్ అయిన పాలసీల పునరుద్ధరణ
రద్దయిన జీవిత బీమా పాలసీలను (ల్యాప్స్డ్ పాలసీలు) పునరుద్ధరించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు ప్రభుత్వరంగ ఎల్ఐసీ ప్రకటించింది. మార్చి 2 వరకు రెండు నెలల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపింది. అన్ని నాన్ లింక్డ్ పాలసీలకు, ఆలస్యపు రుసుము (నిలిచిపోయిన కాలానికి సంబంధించిన ప్రీమియంపై)లో ఆకర్షణీయమైన తగ్గింపును ఇస్తున్నట్టు పేర్కొంది.ఆలస్యపు రుసుములో 30 శాతం, గరిష్టంగా రూ.5,000 తగ్గింపు పొందొచ్చని వెల్లడించింది. సూక్ష్మ జీవిత బీమా పాలసీలపై ఆలస్యపు రుసుమును పూర్తిగా మాఫీ చేస్తున్నట్టు తెలిపింది. పాలసీ కాల వ్యవధి (టర్మ్) ముగిసిపోకుండా, కేవలం ప్రీమియం చెల్లింపుల్లేక రద్దయిన పాలసీలకే పునరుద్ధరణ అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది.వైద్య/ఆరోగ్య అవసరాల్లో ఎలాంటి రాయితీలు ఉండవని పేర్కొంది. సకాలంలో ప్రీమియంలు చెల్లించలేకపోయిన వారికి ఈ పునరుద్ధరణ కార్యక్రమం ప్రయోజనం కల్పిస్తుందని వివరించింది. పాలసీలను పునరుద్దరించుకుని, బీమా కవరేజీని తిరిగి పొందాలంటూ పాలసీదారులకు సూచించింది.ఇదీ చదవండి: ఆన్లైన్లో కొన్న బంగారంపై లోన్ ఇస్తారా? -
ఆన్లైన్లో కొన్న బంగారంపై లోన్ ఇస్తారా?
దైనందిన ఆర్థిక జీవనంలో మనకు అనేక అనుమానాలు, సందేహాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో రియల్టీ, బ్యాంకింగ్, బంగారం, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్.. ఇలా భిన్న అంశాలపై పాఠకులు అడిగిన ప్రశ్నలకు నిపుణుల ద్వారా సమాధానాలు అందిస్తోంది ‘సాక్షి బిజినెస్’..రియల్టీ..ఆదాయంతో పోల్చితే గృహ రుణంపై చెల్లించే ఈఎంఐ ఎంతవరకూ ఉండాలి?సాధారణంగా అయితే గృహరుణంపై చెల్లించే ఈఎంఐగా మీ ఆదాయంలో 30 శాతాన్ని మించకపోతే మంచిది. 35–40 శాతమైతే కాస్త రిస్కే. ఎందుకంటే నెలవారీ క్యాష్ ఫ్లో తక్కువగా ఉంటుంది. ఇక 40 శాతం దాటితే వద్దనే చెప్పాలి. ఇంటి ఖర్చులకు డబ్బులు మిగలటం చాలా కష్టమవుతుంది. మెడికల్, ఉద్యోగ ఎమర్జెన్సీలు తలెత్తితే మేనేజ్ చేయటం కష్టం. అధిక వడ్డీలకు అప్పులు చేసి ఇరుక్కుపోయే ప్రమాదముంటుంది. ఒకవేళ ఎక్కువ మంది సంపాదిస్తుంటే, 6–12 నెలల ఎమర్జెన్సీ నిధి చేతిలో ఉన్నపుడు, ఇతరత్రా రుణాలేవీ లేనప్పుడు మాత్రం 40 శాతానికి అటూ ఇటుగా ఉన్నా మేనేజ్ చేయొచ్చు.బ్యాంకింగ్..నా భార్యతో జాయింట్గా ఎఫ్డీలను ఓపెన్ చేయొ చ్చా? పన్ను ప్రయోజనాలు?ఇద్దరూ కలిసి ఫిక్స్డ్ డిపాజిట్లు ఓపెన్ చేయటానికి ఇబ్బందులుండవు. పన్ను ప్రయోజనాలు ఫస్ట్ హోల్డర్కే వర్తిస్తాయి. ఎఫ్డీ తెరిచేటపుడు దాన్ని విత్డ్రా చేయటం, రెన్యూవల్ చేయటం వంటి హక్కులు ఇద్దరిలో ఏ ఒక్కరికైనా ఉండేలా స్పష్టంగా పేర్కొనాలి. అలాకాని పక్షంలో ఫస్ట్ హోల్డర్కే ఆ హక్కులుంటాయి. తన మరణం తరువాతే మిగిలిన వ్యక్తికి వస్తాయి. ఇద్దరు కలిసి ఎఫ్డీ తెరిటేపుడు ఒకరు సీనియర్ సిటిజన్ అయితే వారినే ఫస్ట్ హోల్డర్గా పేర్కొంటే వడ్డీ కాస్త ఎక్కువ వస్తుంది. లేని పక్షంలో ఇద్దరిలో ఎవరు తక్కువ ట్యాక్స్ బ్రాకెట్లో ఉంటారో వారి పేరిట తెరిస్తే... వడ్డీపై పన్ను తక్కువ చెల్లించాల్సి వస్తుంది.బంగారంబంగారం ఆన్లైన్లో కొన్నాను. దీన్ని తనఖా పెట్టవచ్చా?ఆన్లైన్లో కాయిన్లు, ఆభరణాల రూపంలో కొంటే దాన్ని తనఖా పెట్టవచ్చు. స్వచ్ఛతకు సంబంధించిన కొన్ని నిబంధనలున్నాయి. వాటికి లోబడి బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు తనఖా పెట్టుకుంటాయి. ఒరిజినల్ బిల్లు తప్పనిసరిగా ఉండాలి. బంగారం 22 లేదా 24 క్యారెట్ల స్వచ్ఛతను కలిగి ఉండాలి. హాల్మార్క్ ఉంటే ఈజీగా అంగీకరిస్తారు. కొన్ని బ్యాంకులైతే ప్రయివేటు మింట్ల నుంచి వచి్చన కాయిన్లను 50 గ్రాములకన్నా ఎక్కువ తీసుకోవటం లేదు. అలాంటి పక్షంలో ముత్తూట్, మణప్పురం వంటి ఎన్బీఎఫ్సీలు బెటర్. మీకు బంగారంపై రుణం సత్వరం కావాలంటే ఎన్బీఎఫ్సీలే నయం. బ్యాంకులు నిబంధనల విషయంలో కఠినంగా ఉంటాయి.స్టాక్ మార్కెట్...ట్రేడింగ్ ఖాతా ఓపెన్ చేయడానికి నిబంధనలేంటి? సిబిల్ స్కోరు అవసరమా?ట్రేడింగ్ ఖాతా తెరవటానికి సిబిల్ స్కోరు అవసరం లేదు. కాకపోతే 18 ఏళ్లు నిండి ఉండాలి. పాన్ కార్డు, ఆధార్ నంబరు, బ్యాంకు ఖాతా, మొబైల్ నంబరు, ఈమెయిల్ ఉండాలి. షేర్లలో ఇన్వెస్ట్ చేయటం వరకూ పర్వాలేదు గానీ... ఎఫ్అండ్ఓ, కమోడిటీ–కరెన్సీ డెరివేటివ్స్లో ట్రేడింగ్ చేయాలంటే మాత్రం ఆదాయపు ధ్రువీకరణ పత్రం అవసరం. దీనికోసం ఐటీఆర్, 3 నెలల శాలరీ స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్, నెట్వర్త్ సర్టిఫికెట్ వంటివాటిలో ఏదైనా సరిపోతుంది. షేర్లను హోల్డ్ చేయడానికి డీమ్యాట్ ఖాతా తప్పనిసరి. మనకైతే మామూలు కేవైసీ సరిపోతుంది. ఎన్ఆర్ఐలకు ప్రత్యేక ఎన్ఆర్ఈ ఖాతా అవసరం.మ్యూచువల్ ఫండ్స్...సిప్లలో ఎంతశాతం రాబడిని ఆశించవచ్చు?సిప్లలో రాబడులనేవి అది ఏ తరహా ఫండ్.. ఎంతకాలం ఇన్వెస్ట్ చేశారన్నదానిపై ఆధారపడి ఉంటుంది. పదేళ్లకు మించి చూస్తే... లార్జ్క్యాప్ ఫండ్లు 10–012 శాతం, మిడ్ క్యాప్ ఈక్విటీ 12–15 శాతం, స్మాల్ క్యాప్ ఈక్విటీ 14–18 శాతం, హైబ్రిడ్ ఫండ్లు 8–10 శాతం, డెట్ ఫండ్లు 5–7 శాతం రాబడులను అందించిన పరిస్థితి ఉంది. సిప్లు కనీసం ఏడేళ్లకు పైబడి చేస్తేనే మంచి ఫలితాలొస్తాయి. స్వల్పకాలా నికైతే ఒకోసారి నెగెటివ్ రాబడులూ ఉండొచ్చు. మార్కెట్లలో ఎగుడుదిగుళ్లు సహజం. వాస్తవ రాబడులనేవి మార్కెట్ సైకిల్స్, మీరు ఎంచుకున్న ఫండ్ నాణ్యత, మీ క్రమశిక్షణపై ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా.. దీర్ఘకాలమైతేనే ‘సిప్’ చెయ్యండి.ఇన్సూరెన్స్హెల్త్ ఇన్సూరెన్స్కు టాప్–అప్ చేయించడం మంచిదేనా?హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ తక్కువగా ఉందని భావిస్తే టాప్–అప్ మంచిదే. మీ అవసరాలు, బడ్జెట్ కూడా చూసుకోవాలి. టాప్–అప్ మీ ఇన్సూరెన్స్ మొత్తం సరిపోని పక్షంలో మాత్రమే అక్కరకొస్తుంది. అంటే మీకు రూ.5 లక్షల బీమా ఉందనుకుందాం. రూ.10 లక్షలకు టాప్–అప్ తీసుకుంటే... మీకు అవసరం వచి్చనపుడు రూ.5 లక్షలు పూర్తయిపోయాక ఈ టాప్ అప్ మొత్తం అక్కరకొస్తుంది. అందుకని మీకు ప్రస్తుత ఇన్సూరెన్స్ సరిపోదని భావిస్తున్నపుడే టాప్–అప్ వైపు చూడాలి. మీరు యువకులై ఉండి, మీకు కవరేజీ గనక రూ.10 లక్షల వరకూ ఉందనుకుందాం. అపుడు టాప్–అప్ అవసరం చాలా తక్కువపడుతుంది.మీ సందేహాలకూ నిపుణుల ద్వారా సమాధానాలు కావాలంటే business@sakshi.com కు మెయిల్ చేయండి. -
Income Tax: కొత్త చట్టంలో జీతాల మీద ఆదాయం
ముందుగా టాక్స్ కాలమ్ పాఠకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు... అరవై ఏళ్లు దాటిన ఆదాయపన్ను చట్టంకు బదులుగా దాని స్థానంలో కొత్త ఆదాయపు పన్ను 2025 వస్తోంది. పేరులో 2025 అని ఉన్నా అమలు మాత్రం 1.4.2026 నుంచి వస్తోంది. ఈ వారం జీతాలకు సంబంధించిన అంశాలు తెలుసుకుందాం. ప్రస్తుతం నడుస్తున్న ఆర్థిక సంవత్సరం 31–3–2026తో ముగుస్తుంది. దీనికి, అంటే 2025–26 ఆర్థిక సంవత్సరానికి 2026–27ని అస్సెట్మెంట్ ఇయర్ అంటారు. ఆర్థిక సంవత్సరం 2024–25 సంవత్సరం వరకు 1961 చట్టం వరిస్తుంది. 2024–25, అంతకుముందు ఆర్థిక సంవత్సరం వర్తించే 1961 చట్టంలో జీతం నిర్వచనం, దీని పరిధి, పలు అంశాలు ఉన్నాయి. ఏ పేరుతో పిలిచినా, యజమాని తన ఉద్యోగికి ఇచ్చిన డబ్బుకి ఇవి వర్తిస్తాయి.ఇక టాక్సబిలిటీ విషయాకొస్తే, చేతికొచ్చినా, రాకపోయినా హక్కుగా ఏర్పడ్డా, జీతం పన్ను పరిధిలోకి వస్తుంది. డిడక్షన్ల జోలికొస్తే సాండర్డ్ డిడక్షన్ను, వృత్తి పన్ను డిడక్షన్ చేస్తారు. పాత పద్ధతిలో అయితే ఛాప్టర్ VI ప్రకారం మినహాయింపులు ఇస్తారు. ఇవి చాలా ఉన్నాయి. కొత్త పద్ధతి ప్రకారం డిడక్షన్లు చాలా తక్కువ. పాత పద్దతి చూస్తే తక్కువ శ్లాబులు .. ఎక్కువ రేట్లు. కొత్త పద్ధతిలో బేసిక్ శ్లాబ్ ఎక్కువ. శ్లాబులు ఎక్కువ. రేట్లు చాలా తక్కువ.ఇప్పుడు రాబోయే మార్పులు: 🔸 చట్టం సులభరీతిలో ఉంది. 🔸 నిర్వచనాలు, పన్ను పరిధి అంశాల్లో ఎటువంటి మార్పులేదు. 🔸 ఇక నుంచి అకౌంటింగ్ ఇయర్, అస్సెస్మెంట్ సంవత్సరం అని ఉండదు. 🔸 ఒకే ఒక పదం... దానిపేరే ఆదాయపు సంవత్సరం. కావున ఎటువంటి పొరబాటుకి తావులేదు. 🔸 2025–26 ఆర్థిక సంవత్సరం నుంచి మొత్తం నికర ఆదాయం .. అంటే టాక్సబుల్ ఇన్కం .. సంవత్సరానికి రూ.12,00,000 వరకు పన్ను పడదు. ఉద్యోగస్తులకు స్టాండర్డ్ డిడక్షన్ రూ.75వేల వరకు ఉంటుంది. కాబట్టి ఉద్యోగస్తులకు రూ.12,75,000ల వరకూ ఎటువంటి పన్ను పడదు. 🔸 మీ ఆదాయం... నికర ఆదాయం రూ.12,00,00 లోపల ఉన్నట్లు అయితే ట్యాక్స్ పడదు. 🔸 దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రణాళిక చేసుకోవచ్చు. ఉదాహరణకు, ఇంటి మీద హక్కులు జాయింట్గా ఉంటే, ఆ అద్దెని ఇద్దరికి అకౌంటులో సర్దుబాటు చేయడం. రెండవ ఉదాహరణగా ఫిక్స్డ్ డిపాజిట్ల మీద వచ్చే వడ్డీ... ఒకరి పేరు మీదనే అన్ని డిపాజిట్లు ఉంచుకోకుండా ఇతర భాగస్వామి మీద బదిలీ చేయడం. అయితే ఈ రెండింట్లో ఏది చేసినా కాగితాలు ముఖ్యం. మరే, అగ్రిమెంట్లు రాసుకోకపోయినా ఓనర్షిప్.. టైటిల్ డీడ్స్లో ఇద్దరి పేరుండటం, అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లు ఆయా వ్యక్తి పేరు మీద ఉండటం. 🔸 రిబేటు రూపంలో బేసిక్ లిమిట్ రూ.12,00,000 పెంచినట్లే తప్ప, ఆదాయం రూపంలో కాదు. గతంలో ఎన్నో ఉదాహరణలు ఇచ్చాం. 🔸 2025–26 ఆర్థిక సంవత్సరం కొత్త పద్ధతి ప్రకారం బేసిక్ లిమిట్... శ్లాబులు... రేట్లు మీకు సుపరిచితమే. 🔸 అలాగే పాత పద్ధతిలో కూడా...చివరిగా, ప్రాథమిక, మౌలిక విషయాల్లో మార్పు లేనప్పటికీ, విషయ విశదీకరణలో, సరళత్వం కన్పిస్తుంది. కొత్త పద్ధతిలో వెళ్లడానికి ప్రోత్సాహకరంగా ఉంది. అవే సర్కిళ్లు, అవే డివిజన్లు, అవే పద్ధతులు, అదే మదింపు పద్దతి విధానం, నోటీసులు, సమన్లు, జవాబులు, వడ్డీలు, పెనాల్టీలు, అధికార్ల అభిమతం, హక్కులు, అధికారాలు, బాధ్యతలు, విధివిధానాలు మారవు. అలాగే కొనసాగుతాయి. పాతసీసాలో కొత్త నీరు. పేరు మారితే పెత్తనం పోతుందా. భాషను మార్చినా, వేషము మార్చినా అధికార్లు అలాగే ఉండాలి. -
70/10/10/10 ఫార్ములా: ఇలా పొదుపు చేస్తే.. నెల మొత్తం హ్యాపీ!
డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, ఆ డబ్బును సరైన విధంగా పొదుపు చేయకపోతే భవిష్యత్తులో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి 70/10/10/10 ఫార్ములా ప్రకారం.. మీరు డబ్బును ఖర్చు చేస్తే.. తప్పకుండా ఆర్ధిక ఇబ్బందుల నుంచి భయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ ఫార్ములా గురించి మరిన్ని వివరాలు వివరంగా..ఏమిటీ 70/10/10/10 ఫార్ములామీరు సంపాదించే డబ్బు లేదా నెలవారీ సంపాదనను నాలుగు భాగాలుగా విభజించుకోవాలి. ఎంత డబ్బు దేనికి ఖర్చు చేయాలనే విషయాన్ని ముంచుగానే ఊహించాలి. అప్పుడే.. నెల చివరలో కూడా డబ్బు కోసం ఇబ్బందిపడాల్సిన అవసరం ఉండదు.70 శాతం: మీ నెల జీతంలో 70 శాతం డబ్బును.. ఇంటి అద్దె, నిత్యావసర వస్తువుల కోసం, ప్రయాణ ఖర్చులకు, పిల్లల ఖర్చులు, బీమా వంటి వాటికోసం కేటాయించాలి. అంటే.. ప్రస్తుత జీవన విధానం కోసం ఆ డబ్బును వెచ్చించాలన్నమాట.10 శాతం: మీ నెల జీతంలో 10 శాతాన్ని పొదుపు (సేవింగ్స్) చేయడానికి కేటాయించాలి. అంటే మ్యూచువల్ ఫండ్స్, రిటైర్మెంట్ ఫండ్స్ లేదా స్టాక్ మార్కెట్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టడానికి ఉపయోగించాలన్నమాట. ఎందుకంటే.. భవిష్యత్తు కోసం కూడా తప్పకుండా కొంత డబ్బు పొదుపు చేయాల్సిందే.10 శాతం: మీ నెల సంపాదనలో మరో 10 శాతం.. అత్యవసర నిధి మాదిరిగా.. అంటే ఎమర్జెన్సీ సమయంలో ఈ డబ్బును ఉపయోగించుకోవచ్చు. ప్రయాణాలు చేయడానికి, ఆకస్మిక వైద్యం కోసం.. కొన్ని గృహోపకరణాల కోసం కూడా దీనిని కేటాయించుకోవచ్చన్నమాట.10 శాతం: మిగిలిన 10 శాతం.. ఈఎంఐ, లేదా అప్పులు వంటివి చెల్లించడానికి ఉపయోగించుకోవచ్చు. ఒకవేలా అప్పు లేదా ఈఎంఐ లేకపోతే.. కొత్త విషయాలను నేర్చుకోవడానికి, విదేశీ విద్య కోసం కూడా ఉపయోగించుకోవచ్చన్నమాట.మీ జీతం నెలకు లక్ష రూపాయలు అనుకుంటే.. అందులో రూ. 70వేలు (70 శాతం) ఇంటి అద్దె మొదలైనవాటికి, మిగిలిన 30 శాతాన్ని ఫార్ములా ప్రకారం కేటాయించుకోవాలి. ఈ ఫార్ములా మీరు పాటిస్తే.. ఉన్న డబ్బును ఎలా ఉపయోగించుకోవాలో స్పష్టంగా అర్థమవుతుంది. -
పోస్టాఫీసు పథకాలు.. కొత్త వడ్డీ రేట్లు
దేశంలో పోస్టాఫీసులు అనేక రకాల పొదుపు పథకాలను అందిస్తున్నాయి. తమ భవిష్యత్తును భద్రపరచుకోవడానికి చాలా మంది ఈ పథకాలలో పెట్టుబడులు పెడుతుంటారు. పోస్టాఫీసు స్కీముల్లో పొదుపు చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే, స్థిరమైన, కచ్చితమైన రాబడిని పొందుతారు. ఈ పథకాలకు ప్రభుత్వం ప్రతి త్రైమాసికంలో వడ్డీ రేట్లను ప్రకటిస్తుంది. అలాగే జనవరి-మార్చి త్రైమాసికానికి చిన్న పొదుపు పథకాలకు వడ్డీ రేట్లను ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.ఇండియా పోస్ట్ దేశంలోనే అత్యధిక స్థాయిలో చిన్న పొదుపు పథకాలను నిర్వహిస్తుంది. పోస్టాఫీసులో ప్రతి వర్గానికి పథకాలు ఉన్నాయి. మహిళలు, పిల్లలు, సీనియర్ సిటిజన్ల కోసం వివిధ పోస్టాఫీసు స్కీములు ఉన్నాయి. 2026 సంవత్సరానికి గానూ అందుబాటులో ఉన్న ఉత్తమ పోస్టాఫీస్ పొదుపు పథకాలు.. వాటికి లభించే వడ్డీ రాబడి గురించి తెలుసుకుందాం..సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) అనేది సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న చిన్న పొదుపు పథకం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి అన్ని అగ్రశ్రేణి బ్యాంకులు అందించే ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్ల కంటే ఈ పథకంపై అధిక వడ్డీ లభిస్తుంది. ప్రస్తుతం 8.2 శాతం వడ్డీ రేటును ఈ పథకం అందిస్తోంది.సుకన్య సమృద్ధి యోజనసుకన్య సమృద్ధి యోజన (SSY) ఖాతా అనేది బాలికల కోసం ప్రత్యేక పొదుపు పథకం. బాలికల చదువు, భవిష్యత్తుకు భద్రత కల్పించడం కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. అప్పుడే పుట్టిన బాలిక దగ్గర నుంచి 10 ఏళ్ల వయస్సు వరకు అమ్మాయి పేరు మీద ఎస్ఎస్ వై ఖాతాను తెరవవచ్చు. ఈ పథకానికి ప్రస్తుత వడ్డీ రేటు 8.2 శాతంగా ఉంది.మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకంమహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ (MSSC) అనేది మహిళలు, బాలికలు సురక్షితంగా పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహించడానికి ఉద్దేశించిన పొదుపు కార్యక్రమం. పోస్టాఫీసులు, కొన్ని బ్యాంకుల్లో లభ్యమయ్యే ఈ పథకం స్థిర వడ్డీ ఆదాయంతోపాటు మూలధన సంరక్షణను అందిస్తుంది. రెండేళ్ల గరిష్ట కాల పరిమితితో ఉండే ఈ పథకాన్ని ప్రభుత్వం 2025 మార్చి 31తో నిలిపేసింది. అంతకుముందు ఖాతా తెరిచినవారికి ప్రస్తుతం 7.5 శాతం వడ్డీ లభిస్తోంది.నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) అనేది దేశంలో మంచి ఆదరణ పొందిన, స్థిర-ఆదాయ పొదుపు పథకం. ఇది ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సి కింద కచ్చితమైన రాబడి, పన్ను ప్రయోజనాలను అందిస్తుంది. ప్రభుత్వం నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లపై వడ్డీ రేటును 7.7 శాతంగా ఉంచింది.పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్ కమ్ స్కీమ్పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్ కమ్ స్కీమ్ (POMIS) అనేది ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా గుర్తింపు పొందిన, ఆమోదించబడిన పెట్టుబడి పథకం. 7.4% వడ్డీ రేటుతో, ఇది అత్యధిక రాబడినిచ్చే పథకాలలో ఒకటి. ఈ పథకంలో వడ్డీ ఆదాయం నెలవారీగా చేతికొస్తుంది. -
ఆధార్ యాప్ ద్వారా అడ్రస్ చేంజ్: చాలా సింపుల్
ఆధార్ కార్డులో చిరునామా మార్చుకోవాలంటే.. ఒకప్పుడు మీసేవ లేదు ఆధార్ సెంటర్లకు వెళ్లాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు టెక్నాలజీ పెరగడంతో.. ఇంట్లో కూర్చునే అడ్రస్ మార్చేసుకోవచ్చు. ఇప్పుడు ఆధార్ యాప్ ద్వారా కూడా దీనిని అప్డేట్ చేసుకోవచ్చు.అవసరమయ్యే డాక్యుమెంట్స్ఆధార్ కార్డులో చిరునామా మార్చుకోవడానికి గుర్తింపు కార్డుగా.. రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, బ్యాంక్ పాస్బుక్, పాస్పోర్ట్, ఎలక్ట్రిసిటీ బిల్లు మొదలైనవాటిలో ఎదో ఒకటి కావాలి.అడ్రస్ అప్డేట్ చేయడం ఎలా?➤యాప్ స్టోర్ నుంచి ఆధార్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి.➤యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తరువాత.. ఆధార్ నెంబర్ & ఓటీపీ నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.➤తరువాత కెమెరా స్క్రీన్లో.. మీ ముఖాన్ని చూపిస్తూ, గ్రీన్ లైట్ వచ్చేవరకు చూడాలి. అప్పుడప్పుడు కళ్ళుమూసి తెరవాలి.➤ఫేస్ డిటెక్షన్ పూర్తయిన తరువాత.. హోమ్ పేజీకి వెళ్తారు. అక్కడ సర్వీసెస్ విభాగంలో.. మై ఆధార్ అప్డేట్ సెలక్ట్ చేసుకోవాలి.➤అక్కడ మీ దగ్గర ఏ డాక్యుమెంట్ అందుబాటులో ఉందో ఎంచుకుని.. కంటిన్యూ చేయాలి.➤డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన తరువాత వివరాలను ఫిల్ చేయాల్సి ఉంటుంది.➤అయితే ప్రస్తుతం ఆధార్ కార్డులో ఉన్న చిరునామా కనిపిస్తుంది, కాబట్టి మీరు మార్చాలన్న కొత్త చిరునామా ఎంటర్ చేసి కంటిన్యూ చేయాలి.➤మీరు 'ప్రొసీడ్ టు ఫేస్ అథెంటికేషన్' క్లిక్ చేస్తే, మీ ముఖం మళ్లీ ధృవీకరించబడుతుంది.➤ఇవన్నీ పూర్తయిన తరువాత .. ఆన్లైన్లో 75 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.


