Personal Finance
-
అగ్ని ప్రమాదంలో నష్టపోయారా?: ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ ఇదే..
అసలే వేసవి కాలం.. భానుడి భగభగలు భారీగా ఉన్నాయి. ఇలాంటి సమయంలోనే సాధారణంగా అగ్ని ప్రమాదాలు, షార్ట్ సర్క్యూట్లు జరుగుతుంటాయి. ఇటీవల హైదరాబాద్ పాతబస్తీలోని 'గుల్జార్హౌస్'లో జరిగిన అగ్ని ప్రమాదంలో.. ప్రాణ నష్టంతోపాటు ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదం ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణం ఏమిటనేది స్పష్టంగా వెల్లడికావాల్సి ఉంది. కాగా, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు సంబంధీకుల ప్రాణనష్టాన్ని ఎలాగో పూడ్చలేరు. కానీ ఆస్తి నష్టాన్ని ముందుగానే తీసుకున్న ఇన్సూరెన్స్ ద్వారా కొంత భర్తీ చేయవచ్చు. ఇలాంటి సందర్భంలో బీమా ఎలా క్లెయిమ్ చేయాలో నిపుణులు సూచిస్తున్నారు.ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం ఎలాబీమా కంపెనీకి సమాచారం అందించాలి: అగ్నిప్రమాదం జరిగిన వెంటనే మీ బీమా ప్రొవైడర్కు సమాచారం ఇవ్వండి. అవసరమైతే, అత్యవసర ఖర్చుల కోసం ముందస్తు ఆర్థిక సహాయాన్ని అభ్యర్థించండి. సంఘటన జరిగిన తేదీ, సమయం, స్థలం వంటి ముఖ్యమైన వివరాలను అందించడంతో పాటు.. ఎంత నష్టం జరిగిందో అంచనా వేయండి.నష్టాన్ని డాక్యుమెంట్ చేయండి: అగ్నిప్రమాదం జరిగిన తరువాత.. స్థలాన్ని శుభ్రపరచడానికి ముందు.. అక్కడ పరిసరాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తీయండి. కాలిన వస్తువులను పారవేయకూడదు. భీమా కంపెనీ స్పందించడానికి ముందే.. రిపేర్ చేయడం వంటి చేయకూడదు.క్లెయిమ్ ఫైల్ చేయండి: ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫారాన్ని ఆన్లైన్లో లేదా బీమా కంపెనీ కార్యాలయంలో సబ్మిట్ చేయండి. మీ ఫైర్ ఇన్సూరెన్స్ పాలసీ కాపీ, నష్టాన్ని తెలియజేసే ఫోటోలు & వీడియోలు, పాడైపోయిన వస్తువుల జాబితా.. వాటి విలువను తెలిపే రసీదులు లేదా ఇన్వాయిస్లు, ఫైర్ బ్రిగేడ్ నివేదిక వంటి అవసరమైన డాక్యుమెంట్స్ అందించాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: రోజుకు 121 రూపాయలతో రూ.27 లక్షలు చేతికి: ఈ పాలసీ గురించి తెలుసా?సర్వేయర్తో సహకరించండి: ఇన్సూరెన్స్ కంపెనీ నష్టాన్ని అంచనా వేయడానికి ఒక సర్వేయర్ను నియమిస్తుంది. సర్వేయర్కు పూర్తిగా సహకరించండి. వారికి అవసరమైన సమాచారం & పత్రాలను అందించండి. నష్టపోయిన ఆస్తిని పరిశీలించడానికి వారికి అనుమతి ఇవ్వండి.క్లెయిమ్ సెటిల్మెంట్: మీ క్లెయిమ్ ఆమోదం పొందిన తరువాత.. పాలసీ నిబంధనల ప్రకారం నష్టపరిహారం కంపెనీ చెల్లిస్తుంది. అయితే చెల్లింపు విధానం గురించి సంస్థ మీకు తెలియజేస్తుంది.Note: ఈ దశలు సాధారణ మార్గదర్శకాలు మాత్రమే. మీ నిర్దిష్ట పాలసీ, ఇన్సూరెన్స్ కంపెనీ విధానాలు కొద్దిగా మారవచ్చు. కాబట్టి, మీ పాలసీ డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి. మీకు ఏవైనా సందేహాలు ఉంటే మీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ను సంప్రదించండి. -
అలా ఇన్వెస్ట్ చేసుకోవడం మంచి నిర్ణయమే..
ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో లార్జ్క్యాప్, లార్జ్ అండ్ మిడ్క్యాప్ విభాగం మధ్య ఏ ఫండ్స్ మెరుగైనవి? – వీణారాణి దీర్ఘకాలంలో ఏ విభాగం మంచి పనితీరు చూపిస్తుందన్నది ఊహించడమే అవుతుంది. ఈక్విటీల్లో పెట్టుబడులు పెడుతున్నప్పుడు కాల వ్యవధి కనీసం ఐదేళ్లకు తగ్గకుండా ఉండాలి. ఇన్వెస్ట్ చేసిన ఆ ఐదేళ్ల కాలంలోనూ మార్కెట్ సైకిల్ ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో లార్జ్క్యాప్ కంపెనీలు మంచి పనితీరు చూపిస్తాయి. కొన్ని సందర్భాల్లో మిడ్క్యాప్ మంచి ప్రదర్శన చేస్తాయి. కొన్ని సందర్భాల్లో స్మాల్క్యాప్ ఇంకా మంచి రాబడులను ఇస్తుంటాయి. కనుక ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం సానుకూలం. ఫ్లెక్సీక్యాప్ ఫండ్ ఏ విబాగంలో అయినా ఇన్వెస్ట్ చేసే స్వేచ్ఛతో ఉంటుంది. మార్కెట్లో ఒక విభాగం మంచి పనితీరు, మరో విభాగం బలహీన పనితీరు చూపిస్తున్న సందర్భాల్లో ఫ్లెక్సీక్యాప్ పథకంలో పెట్టుబడుల ద్వారా దీన్ని చక్కగా అధిగమించగలరు. నేను అధిక పన్ను శ్లాబులోకి వస్తాను. ఎఫ్డీలపై ఆదాయం సైతం పన్ను పరిధిలోకి వస్తుంది. అత్యవసర నిధిని డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా..? – జగన్నాథ స్వామిమీ అత్యవసర నిధిలో కొంత భాగాన్ని డెట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచి నిర్ణయమే అవుతుంది. అత్యవసర నిధిని మూడు భాగాలుగా వర్గీకరించుకుని ఇన్వెస్ట్ చేసుకోవాలి. మొదటి భాగం అత్యవసర నిధిని నగదు రూపంలోనే ఉంచుకోవాలి. రెండో భాగాన్ని బ్యాంకు ఖాతా లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో పెట్టుకోవచ్చు. లేదా వెంటనే నగదుగా మార్చుకోగలిగిన మరొక సాధనంలో అయినా ఇన్వెస్ట్ చేసుకోవాలి. మూడో భాగాన్ని లిక్విడ్ ఫండ్ లేదా అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల రాబడులు సానుకూలంగా ఉంటాయి. పన్ను పరంగా ప్రత్యేక అనుకూలతలు ఏవీ లేవు. ఫిక్స్డ్ డిపాజిట్ల మాదిరిగా కాకుండా.. డెట్ ఫండ్స్లో పెట్టుబడులను వెనక్కి తీసుకున్నప్పుడే రాబడులపై పన్ను వర్తిస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్ అయితే ప్రతీ ఆర్థిక సంవత్సరంలోనూ వడ్డీ ఆదాయాన్ని పన్ను చెల్లింపుదా రు తన వార్షిక ఆదాయానికి కలిపి చూపించాల్సి ఉంటుంది. వారి శ్లాబు రేటు ప్రకారం పన్ను చెల్లించాలి. అధిక పన్ను శ్లాబు పరిధిలోకి వచ్చే వారికి ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో వచ్చే ఆదాయంపై 30 శాతం పన్ను పడుతుంది. డెట్ మ్యూచువల్ ఫండ్స్లోనూ 2023 ఏప్రిల్ 1 తర్వాత చేసిన పెట్టుబడులను విక్రయిస్తే.. ఎంతకాలం అన్నదానితో సంబంధం లేకుండా లాభం మొత్తం వార్షిక ఆదాయానికి కలుస్తుంది. కనుక ఈ ఆదాయంపైనా మీరు గరిష్ట పన్ను చెల్లించాల్సి వస్తుంది. అయితే, ఎఫ్డీలతో పోలిస్తే డెట్ ఫండ్స్ కాస్త మెరుగైన రాబడులిస్తాయి. కానీ, డెట్ ఫండ్స్లో రాబడులకు హామీ ఉండదు. ఫిక్స్డ్ డిపాజిట్స్ మాదిరి ఒక్కో ఇన్వెస్టర్కు గరిష్టంగా రూ.5 లక్షల పెట్టుబడికి బీమా రక్షణ హామీ కూడా ఉండదు. లిక్విడ్ ఫండ్స్, అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ తక్కువ రిస్క్ విభాగంలోకి వస్తాయి.సమాధానాలు: ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
పదేళ్ల చరిత్ర.. సెక్షన్ 80Cలో ఎన్నో ఆప్షన్లు
ఈ సెక్షన్ 80Cలో సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్లు, ఖర్చులు ఇలా ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. ఈ సెక్షన్కు పదేళ్ల చరిత్ర ఉంది. ఒకప్పుడు గరిష్ట పరిమితి రూ.1,00,000 ఉండేది. తరువాత రూ.1.50 లక్షలకి పెంచారు. అనంతరం ఎటువంటి మార్పులేదు. ఎప్పుటికప్పుడు ఈ పరిమితిని పెంచుతారని వదంతులు, పుకార్లు, ఎదురుచూపులు.. కానీ ప్రతిసారి నిరాశే ఎదురైంది. ఈ లక్షన్నర లిమిట్ ప్రస్తుతానికి అక్కడే ఆగిపోయింది. కారణం ఏమిటంటే ఈ సెక్షన్ పాత పద్ధతిలో పన్ను భారాన్ని ఎంచుకున్నవారికి మాత్రమే. కొత్త విధానం ఎంచుకున్న వారికి ఇది వర్తించదు.పాతవిధానాన్ని ఎంచుకున్న వారికి మాత్రమే 80C లో ఉన్న ఆప్షన్లు వర్తిస్తాయి. అవేమిటంటే ... 🔸 తన పేరు మీద, జీవిత భాగస్వామి .. పిల్లల పేర్ల మీద చెల్లించే జీవిత బీమా 🔸 డిఫర్డ్ యాన్యుటీ కోసం చేసిన చెల్లింపులు 🔸 ఈపీఎఫ్/జీపీఎఫ్/ సూపర్ యాన్యుయేషన్ ఫండ్కి చెల్లింపులు 🔸 సుకన్య సమృద్ధి అకౌంటులో డిపాజిట్లు 🔸 నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లలో VIII, IX ఇష్యూలు 🔸 అయిదేళ్ల పైబడి కాలవ్యవధి కలిగిన డిపాజిట్లలో ఇన్వెస్ట్మెంట్లు 🔸 పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో జమలు 🔸 సీనియర్ సిటిజన్స్ స్కీము 2024లో పెట్టుబడులు 🔸 యూటీఐ యూలిప్ పాలసీ 1971కి జమలు, ఎల్ఐసీ జమలు 🔸 ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్కి జమలు 🔸 ఎల్ఐసీ యాన్యుటీ ప్లాన్/ ఇతర సంస్థల యాన్యుటీ ప్లాన్, కొత్త జీవన్ధార, కొత్త జీవన్ అక్షయ ఐఐ, ఐఐఐ ప్లాన్లు, జీవన్ధార అక్షయ 🔸 యూటీఐ స్కీం 1992/1999/2005కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్ 🔸 నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్హెచ్బీ) వారికి చేసిన చెల్లింపులు 🔸 బ్యాంకు/ఎల్ఐసీ/ఎన్హెచ్బీ/ ఇతర కంపెనీల నుంచి తీసుకున్న రుణాల తిరిగి చెల్లింపులు 🔸 పిల్లల స్కూల్ ఫీజు చెల్లింపులు (ఇద్దరికి మాత్రమే) 🔸 ఈక్విటీ షేర్లు/డిబెంచర్ల కోసం చెల్లింపులు 🔸 షెడ్యూల్డ్ బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులో అయిదేళ్ల కాలవ్యవధితో చేసిన డిపాజిట్లు 🔸 నాబార్డు వారు జారీ చేసిన బాండ్ల కొనుగోళ్లు 🔸 ఇన్యూరెన్స్ పాలసీ (డిఫర్డ్ యాన్యుటీ పాలసీ మినహా) 🔸 ఇంటి రిజిస్టేషన్ కోసం చెల్లించే రిజిస్టేషన్ ఫీజులు, స్టాంప్ డ్యూటీ చెల్లింపులు. ఇలా సెక్షన్ 80Cలో 20 అంశాలు ప్రతిపాదించారు. వీటిలో కొన్నింటికి షరతులు విధించారు. షరతులకు లోబడితేనే ఆయా అంశాల ప్రకారం మినహాయింపు ఇస్తారు. ఇతరత్రా విషయాలు.. 🔸 ప్రావిడెండ్ ఫండ్కి చేసే చెల్లింపులు, లోన్ రీపేమెంట్లకు ఎటువంటి మినహాయింపు రాదు. 🔸 ఇంటి రిజిస్ట్రేషన్ విషయంలో వాటా కోసం చెల్లింపు, డిపాజిట్, ఇంటికి మార్పులు, రెనోవేషన్, రిపేరు ఖర్చులకు మినహాయింపు ఇవ్వరు. 🔸 ట్యూషన్ ఫీజుకే మినహాయింపులు. డెవలప్మెంట్, డొనేషన్స్ నిమిత్తం చెల్లించినందుకు మినహాయింపులు ఇవ్వరు. 🔸 లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపుల మీద ఆంక్షలున్నాయి. ఏడాది చెల్లింపులు సమ్ అష్యూర్డ్లో 10 శాతం దాటకూడదు. 🔸 సుకన్య సమృద్ధి అకౌంటు డిపాజిట్ల మీద వడ్డీ మినహాయింపు ఉంది.పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు. -
EPFOలో ఐదు కీలక మార్పులు
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఈ ఏడాది.. తన చందాదారుల కోసం కొన్ని కీలక మార్పులు చేసింది. ఇవన్నీ ఉద్యోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. రాబోయే రోజుల్లో మరిన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. ఈ కథనంలో ఈపీఎఫ్ఓలో 2025లో జరిగిన ఐదు కీలక మార్పుల గురించి వివరంగా తెలుసుకుందాం.ప్రొఫైల్ అప్డేట్ఈ ఏడాది ఈపీఎఫ్ఓలో జరిగిన ప్రధానమైన మార్పులలో ప్రొఫైల్ అప్డేట్ ఒకటి. ఈ అప్డేట్ ద్వారా.. ప్రొఫైల్ అప్డేట్ చాలా సులభతరమైపోయింది. మీ యూఏఎన్ నెంబర్.. ఆధార్తో లింక్ అయి ఉంటే.. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, లింగం, నేషనాలిటీ, వైవాహిక స్థితి, జీవిత భాగస్వామి పేరు, ఉద్యోగం ప్రారంభించిన తేదీ వంటి వివరాలను ఎటువంటి పత్రాలతో అవసరం లేకుండానే అప్డేట్ చేసుకోవచ్చు.పీఎఫ్ బదిలీగతంలో, ఉద్యోగాలు మారినప్పుడు పీఎఫ్ బదిలీ చేయడం.. చాలా సుదీర్ఘమైన ప్రక్రియగా ఉండేది. ఇప్పుడిది.. చాలా సులభమైపోయింది. పీఎఫ్ బదిలీకి పాత లేదా కొత్త యజమాని ఆమోదం అవసరం లేదు. దీంతో పీఎఫ్ డబ్బు కొత్త ఖాతాకు వేగంగా.. సులభంగా బదిలీ అవుతుంది.జాయింట్ డిక్లరేషన్జనవరి 16, 2025 నుంచి వర్తించే కొత్త నిబంధనల ప్రకారం.. ఈపీఎఫ్ఓ జాయింట్ డిక్లరేషన్ ప్రక్రియ డిజిటల్గా మారింది. మీ యూఏఎన్ ఆధార్తో లింక్ అయి ఉంటే.. జాయింట్ డిక్లరేషన్ను ఆన్లైన్లో సబ్మిట్ చేయవచ్చు.పెన్షన్ పేమెంట్స్ఈపీఎఫ్ఓ జనవరి 1, 2025 నుంచి కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థ (CPPS)ను ప్రారంభించింది. దీని కింద ఇప్పుడు పెన్షన్ 'నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' ప్లాట్ఫామ్ ద్వారా నేరుగా ఏదైనా బ్యాంకు ఖాతాకు పంపడం జరుగుతుంది. గతంలో పెన్షన్ చెల్లింపు ఆర్డర్లను ఒక ప్రాంతీయ కార్యాలయం నుంచి మరొక ప్రాంతీయ కార్యాలయానికి బదిలీ చేయాల్సి వచ్చింది. దీని వల్ల పెన్షన్ చెల్లింపు ఆలస్యం అయ్యేది. ఇప్పుడు ఈ విధానం పూర్తిగా రద్దు అయింది.ఇదీ చదవండి: 'అమెరికాలో ఉంటున్న భారతీయులకు హెచ్చరిక'జీతంపై పెన్షన్ ప్రక్రియఅధిక జీతంతో పెన్షన్ పొందాలనుకునే ఉద్యోగుల కోసం.. ఈపీఎఫ్ఓ ఇప్పుడు మొత్తం ప్రక్రియను సులభతరం చేసింది. ఇప్పుడు అందరికీ ఒకే విధమైన పద్ధతిని అవలంబించనున్నారు. ఒక ఉద్యోగి జీతం నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువగా ఉండి, దానిపై పెన్షన్ కోరుకుంటే ఈ విధానం ఉపయోగపడుతుంది. దీనితో పాటు, ఈపీఎఫ్ఓ పరిధిలోకి రాని లేదా వారి స్వంత ప్రైవేట్ ట్రస్ట్ పథకాన్ని నిర్వహించని సంస్థలు కూడా ట్రస్ట్ నియమాల ప్రకారం ఈ ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది. -
అమెరికాలో కొత్త ట్యాక్స్.. అమలైతే ఎన్ఆర్ఐల జేబులు ఖాళీ!
అమెరికాలో మరో కొత్త రకం పన్నుకు ట్రంప్ సర్కారు కసరత్తు చేస్తోంది. ఇది గనుక అమలులోకి వస్తే అక్కడ నివస్తున్న ప్రవాస భారతీయులపై (NRI) తీవ్ర ప్రభావం చూపుతుంది. దీనికి సంబంధించి అమెరికా హౌస్ ఆఫ్ రిపబ్లికన్స్లో మే 12న ఓ బిల్లు ప్రవేశపెట్టారు. దీని ప్రకారం అంతర్జాతీయ మనీ ట్రాన్స్ఫర్పై 5 శాతం పన్ను విధించనున్నారు.స్టాండర్డ్ డిడక్షన్ పెంపు, చైల్డ్ ట్యాక్స్ క్రెడిట్ను 2028 వరకు 2,500 డాలర్లకు పెంచడం ద్వారా 2017 పన్ను కోతలు, ఉద్యోగాల చట్టాన్ని శాశ్వతం చేయాలని ఈ బిల్లు లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం రెండోసారి అధికారంలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగానే ఈ చట్టాన్ని 'గ్రేట్' అని అభివర్ణిస్తూ, రిపబ్లికన్లు దీనిని ఆమోదించేలా చూడాలని కోరారు. మే 26 మెమోరియల్ డే నాటికి బిల్లును ఆమోదించాలని సభ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ తర్వాత అది సెనేట్కు వెళుతుంది. జూలై 4వ తేదీలోగా చట్టంగా మార్చాలని ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు.కొత్తగా వసూలు చేసే 5 శాతం రెమిటెన్స్ పన్నును పన్ను విరామాలకు నిధులు సమకూర్చడానికి, సరిహద్దు భద్రతా కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు చెబుతున్నారు. ఇది యూఎస్ ట్రెజరీకి బిలియన్లకొద్దీ ఆదాయాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. కానీ కష్టపడి డబ్బులు సంపాదించుకుని వాటిని తమ దేశాల్లోని కుటుంబాలకు పంపించే విదేశీయులకు ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది.ఎన్ఆర్ఐలపై తీవ్ర ప్రభావంభారత్లోని తమ కుటుంబాలకు డబ్బు పంపే ఎన్ఆర్ఐలకు ఈ పన్ను తీవ్ర ఆర్థిక ప్రభావాలను కలిగిస్తుంది. ప్రస్తుతం వివిధ దేశాల నుంచి భారత్కు ఏటా 8,300 కోట్ల డాలర్ల రెమిటెన్స్ లు పంపుతుండగా, అందులో ఎక్కువ భాగం అమెరికా నుంచే అందుతున్నాయి. ఈ కొత్త నిబంధన ప్రకారం ఎన్ఆర్ఐలు భారత్లోని తమ కుటుంబాలకు పంపే ప్రతి లక్ష రూపాయలకు రూ.5,000 పన్ను రూపంలో యూఎస్ ప్రభుత్వానికి వెళ్తుంది. -
ఇన్వెస్టర్లలో ఆసక్తి పెంచుతున్న ఫండ్స్ ఇవి..
అగ్రెస్సివ్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతోంది. ఇందుకు నిదర్శనంగా గడిచిన ఏడాది కాలంలో ఈ విభాగంలో కొత్తగా 3.5 లక్షల మంది ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టారు. దీంతో 2025 ఏప్రిల్ నాటికి హైబ్రిడ్ ఫండ్స్ పరిధిలోని మొత్తం ఇన్వెస్టర్ ఫోలియోలు (పెట్టుబడి ఖాతాలు) 58 లక్షలకు చేరాయి. అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ సైతం 12 శాతం పెరిగి రూ.2.26 లక్షల కోట్లకు చేరుకుంది. 2024 ఏప్రిల్ నాటికి ఈ మొత్తం రూ.2.02 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం.అగ్రెస్సివ్ హైబిడ్ ఫండ్స్ అన్నవి ఈక్విటీలతోపాటు డెట్ సాధనాల్లోనూ ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఈక్విటీలకు 65–80 శాతం మధ్య.. మిగిలిన మేర డెట్కు కేటాయింపులు చేస్తుంటాయి. తద్వారా పెట్టుబడుల వృద్ధితోపాటు, స్థిరత్వానికి ఇవి ప్రాధాన్యం ఇస్తుంటాయి. ఈక్విటీ పెట్టుబడుల అస్థిరతలను కొంత తగ్గించుకోవాలని చూసే వారికి ఇవి అనుకూలం. గతేడాది కాలంలో ఈక్విటీల్లో ఆటుపోట్లు పెరిగిపోయిన తరుణంలో అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్కు ఇన్వెస్టర్ల ప్రాధాన్యం పెరిగినట్టు తెలుస్తోంది. గత ఏడాది కాలంలో అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ 9 శాతం రాబడులను ఇవ్వగా.. రెండేళ్ల కాలంలో వార్షిక రాబడి 20 శాతం, మూడేళ్లలో 15 శాతం, ఐదేళ్లలో సగటున 21 శాతం చొప్పున ఉన్నట్టు డేటా తెలియజేస్తోంది. మోస్తరు రిస్క్ తీసుకునే వారికి ఇవి అనుకూలమని ట్రేడ్జినీ సీవోవో త్రివేష్ సూచించారు.ఇదీ చదవండి: పేటీఎమ్లో రూ.2,104 కోట్ల బ్లాక్డీల్భవిష్యత్కు అనుకూలం..రానున్న కాలానికి పెట్టుబడుల కోసంయాక్టివ్ నిర్వహణలోని అగ్రెస్సివ్ మ్యూచువల్ ఫండ్స్ అనుకూలమని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్ మొత్తంగా కాకుండా.. రంగాల వారీ, స్టాక్స్ వారీ కదలికలకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో.. చురుకైన విధానంతో నడిచే అగ్రెస్సివ్ ఫండ్స్ మెరుగైన అవకాశాలను సొంతం చేసుకోగలవన్న అభిప్రాయాన్ని జెరి్మనేట్ ఇన్వెస్టర్ సర్వీసెస్ సీఈవో సంతోష్ జోసెఫ్ వ్యక్తం చేశారు. సెబీ ఎఫ్అండ్వో నిబంధనలను కఠినతరం చేయడంతో కొందరు ఇన్వెస్టర్లు పన్ను ఆదా, బ్యాలన్స్డ్ ఫండ్స్ వైపు మొగ్గు చూపిస్తున్నట్టు చెప్పారు. ఈ విభాగంలో పదుల సంఖ్యలో పథకాలున్నాయి. ఐదేళ్ల కాలంలో వార్షిక రాబడి 18.5–24 శాతం మధ్య ఉంది. ఈ తరహా ఫండ్స్లో పెట్టుబడులకు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ను నిపుణులు సూచిస్తున్నారు. -
అన్ని ఐటీఆర్ పత్రాలు నోటిఫై
ఆదాయపన్ను శాఖ మొత్తం ఏడు ఆదాయపన్ను రిటర్నుల (ఐటీఆర్) పత్రాలను నోటిఫై చేసింది. తద్వారా రిటర్నుల దాఖలుకు ఇవి అందుబాటులోకి వచ్చినట్టయింది. గత ఆర్థిక సంవత్సరానికి (2024–25) సంబంధించి ఆదాయపన్ను రిటర్నులను జులై 31లోగా దాఖలు చేయాల్సి ఉంది. వ్యక్తులు, ఖాతాల ఆడిటింగ్ లేని వారికి ఈ గడువు వర్తించనుంది.ఐటీఆర్ 2, 3, 5, 6, 7లో మూలధన లాభాల స్థిరీకరణకు సంబంధించి మార్పు చోటుచేసుకుంది. దీనికింద పన్ను చెల్లింపుదారులు తమ మూలధన లాభాలను 2024 జులై 23కు ముందు, ఆ తర్వాత అని రెండు భాగాలుగా చూపించాల్సి ఉంటుంది. అలాగే, ఐటీఆర్ 1, 4కు సంబంధించి కూడా మరో మార్పు జరిగింది. వేతన జీవులు రూ.1.25 లక్షలు మించని దీర్ఘకాల మూలధన లాభం కలిగినప్పుడు ఐటీఆర్ 1 లేదా 4 ఎంపిక చేసుకోవచ్చు. గతంలో వీరు ఐటీఆర్ 2 దాఖలు చేయాల్సి వచ్చేది. వేతనంతోపాటు దీర్ఘకాల మూలధన లాభాలు రూ.1.25 లక్షలకు మించితే అప్పుడు ఐటీఆర్ 2ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: భారత సైన్యం వేతన వివరాలు ఇలా..2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్ చివరి తేదీలువ్యక్తులు, ఉద్యోగులు: జులై 31, 2025ఆడిట్ అవసరమయ్యే వ్యక్తులు, వ్యాపారాలు: అక్టోబర్ 31, 2025కంపెనీలు: అక్టోబర్ 31, 2025 -
అమ్మ నేర్పించే పెట్టుబడి పాఠాలు
మాతృమూర్తుల ప్రపంచం చాలా అసాధారణంగా, అద్భుతంగా ఉంటుంది. ఇల్లు, కుటుంబం, ఆర్థిక వ్యవహారాలను మాతృమూర్తులు చక్కబెట్టే తీరును ఒకసారి పరిశీలిస్తే వారు ఎంత ఆలోచనాత్మకంగా వ్యవహరిస్తారనేది అర్థమవుతుంది. పరిమిత వనరులతోనే అన్ని అవసరాలను చక్కబెట్టడం నుంచి దీర్ఘకాలిక కోణంలో పిల్లల భవిష్యత్ కోసం ఎన్నో సంవత్సరాల ముందు నుంచే ప్రణాళికలు వేసి, అమలు చేయడం వరకు అమ్మ ఎంతో ఓర్పుగా, క్రమశిక్షణగా అనుసరించే విధానం ఒక మాస్టర్క్లాస్గా ఉంటుంది. ఇన్వెస్టర్లకు కూడా ఇదే ఓరిమి, క్రమశిక్షణ, దీర్ఘకాలిక దృక్పథాలు ఉంటే సంపద సృష్టికి దోహదం చేస్తాయి. డబ్బు గురించి ఎలా ఆలోచించాలి, ఎలాంటి ప్రణాళికలు వేసుకోవాలి, మనకు ఎంతో ఇష్టమైన వారి జీవితాలను తీర్చిదిద్దే నిర్ణయాలకు ఎలా కట్టుబడి ఉండాలనే విషయాలకు సంబంధించి అమ్మ నుంచి ఎన్నో విలువైన పాఠాలను నేర్చుకోవచ్చు. ఓర్పు: ప్రక్రియను విశ్వసించడం ఒకసారి చిన్నప్పటి రోజులను గుర్తు చేసుకోండి. పిల్లలు మొదటి మాట పలకడం కావచ్చు, మొదటి అడుగు వేయడం కావచ్చు ప్రతీ దాని కోసం అమ్మ ఎంతో ఓపికగా ఎదురుచూస్తుంది. తొందరపడదు. పిల్లలు తప్పకుండా సాధిస్తారు, వారిలో ఆ సామర్థ్యం ఉంది అని గట్టిగా నమ్ముతుంది. పెట్టుబడులు కూడా ఇందుకు భిన్నమైనవి కావు. మార్కెట్లు పెరుగుతాయి, పడతాయి. కానీ పెట్టుబడులను అలా కొనసాగించడం వల్ల కాంపౌండెడ్ ప్రభావంతో సంపద స్థిరంగా వృద్ధి చెందుతుంది. స్వల్పకాలిక ఒడిదుడుకుల ప్రభావాలకు మనం సులభంగా భయపడిపోవచ్చేమో. కానీ చిన్ననాటి మైలురాళ్లలాగే, ఆర్థిక మైలురాళ్లను సాధించడానికి కూడా సమయం పడుతుంది. నిలకడగా, చిన్న మొత్తాలను పెట్టుబడులు పెడుతూ సంవత్సరాలు గడిచే కొద్దీ పెద్ద నిధిని సమకూర్చుకునేందుకు సిప్లు (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు) చక్కని సాధనాలుగా నిలుస్తాయి. రూపీ కాస్ట్ యావరేజింగ్, కాంపౌండింగ్ ప్రయోజనాలను పొందుతూ కాలక్రమేణా సంపదను పెంచుకునేందుకు ఇవి తోడ్పడతాయి. క్రమశిక్షణ: చిన్న చిన్న పనులు, భారీ ఫలితాలు అమ్మ రోజువారీ దినచర్యే మనకు క్రమశిక్షణ పాఠంగా నిలుస్తుంది. పేరెంటింగ్ కావచ్చు, ఇన్వెస్టింగ్ కావచ్చు క్రమం తప్పకుండా, తరచుగా చేసే పనులు చిన్నవిగానే కనిపించినా భవిష్యత్తును తీర్చిదిద్దే పెద్ద ఫలితాలనిస్తాయి. ఎలాంటి సవాళ్లనైనా అధిగమించగలిగే సామర్థ్యాలనిస్తాయి. మార్కెట్లు పతనమైనప్పుడైనా లేక వ్యక్తిగతంగా ఆటంకాలు ఏర్పడిన కష్ట పరిస్థితుల్లోనైనా సిప్ల ద్వారా క్రమం తప్పకుండా పెట్టుబడులు పెట్టడాన్ని కొనసాగించడం వల్ల ఆర్థిక సామర్థ్యం బలపడుతుంది. సిప్ను మధ్య మధ్యలో మానేసినా ఫర్వాలేదని అప్పుడప్పుడు అనిపించినప్పటికీ, అలా చేయడం వల్ల, దీర్ఘకాలిక లక్ష్యాలకు హాని కలుగుతుంది. పేరెంటింగ్లాగే ప్రతి విషయంలోనూ నిలకడగా ఉండటం ముఖ్యం.సిప్లు: అమ్మ స్టయిల్లో పెట్టుబడులు పెట్టడం మాతృమూర్తులు కేవలం నేటి గురించే కాదు, భవిష్యత్తు కోసం కూడా ఆలోచిస్తారు. పిల్లల చదువుల కోసం పొదుపు చేయడం కావచ్చు లేదా డబ్బు విలువ గురించి నేర్పించడం కావచ్చు, వారు నిలకడగా చేసే చిన్న చిన్న పనులే భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తాయి. సిప్లు కూడా ఇలాగే ఉంటాయి. ఆలోచనాత్మకంగా, నిలకడగా పని చేస్తాయి. క్రమశిక్షణతో క్రమం తప్పకుండా చేసే పెట్టుబడులే, అమ్మ కృషిలాగే, పెరిగి పెద్దయి, మంచి ఫలితాలనిస్తాయి. సత్వర లాభాల వెంటబడకుండా, అనిశ్చితుల్లోనూ పెట్టుబడులకు కట్టుబడాలి. ఫలితాలు వచ్చేందుకు తగిన సమయం ఇవ్వాలి. అమ్మలాగా పెట్టుబడి పెట్టడమంటే, సహన శక్తిపై నమ్మకం ఉంచడం. ప్రణాళికలు పట్టాలు తప్పకుండా చూసుకోవడం. సురక్షితమైన, స్వతంత్రమైన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడం. ఇది స్మార్ట్ ఇన్వెస్టింగ్ మాత్రమే కాదు, దీర్ఘకాలిక దృక్పథంతో నెమ్మదిగా, అర్థవంతమైన విధంగా సంపదను పెంపొందించుకోవడం కూడా. ఒక్క ముక్కలో చెప్పాలంటే, మనం ఎంచుకున్న మ్యుచువల్ ఫండ్ స్కీములో క్రమం తప్పకుండా (సాధారణంగా నెలవారీగా), ఇంత మొత్తం చొప్పున ఇన్వెస్ట్ చేసేందుకు సిప్ ఉపయోగపడుతుంది. ఈ విధానంతో మూడు శక్తివంతమైన ప్రయోజనాలు ఉన్నాయి: రూపీ–కాస్ట్ యావరేజింగ్: మార్కెట్ హెచ్చుతగ్గులను అధిగమించేందుకు సిప్లు ఆటోమేటిక్గా సహాయపడతాయి. మార్కెట్లు పడినప్పుడు ఎక్కువ యూనిట్లు వస్తాయి. మార్కెట్లు పెరిగినప్పుడు కాస్త తక్కువ యూనిట్లు వస్తాయి. క్రమేణా కొనుగోలు ధర, నిర్దిష్ట సగటు స్థాయిలో ఉండటం వల్ల కాస్త అదనపు ప్రయోజనాలు చేకూరతాయి.అలవాటు ఏర్పడటం: మాతృమూర్తుల దినచర్య ఎలాగైతే ఉంటుందో, సిప్లు కూడా ఆర్థిక క్రమశిక్షణను అలవాటు చేస్తాయి. ప్రతి నెలా సిప్ కట్టడమనేది ఒక అలవాటుగా మారుతుంది. దీర్ఘకాలిక పొదుపునకు దోహదపడుతుంది. సరళత్వం: తక్కువ మొత్తాలతోనే పెట్టుబడులను పెట్టడాన్ని ప్రారంభించేందుకు సిప్లు ఉపయోగపడతాయి. యువ ఇన్వెస్టర్లకు లేదా వివిధ బాధ్యతలున్న కుటుంబాలకు ఇలాంటి విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కుటుంబ బాధ్యతల్లో మార్పులు, ఆదాయం పెరిగే కొద్దీ, పెట్టుబడి మొత్తాన్ని పెంచుకోవచ్చు. దీర్ఘకాలిక విజన్: భారీ లక్ష్యాలపై దృష్టిమాతృమూర్తులు కేవలం ఇవాళ్టి గురించే ఆలోచించరు. రాబోయే రోజుల గురించి కూడా ముందు నుంచే ప్రణాళికలు వేస్తూ ఉంటారు. స్కూలు ఫీజుల కోసం పొదుపు చేయడం దగ్గర్నుంచి పిల్లల పెళ్ళిళ్ల ఖర్చుల వరకు ప్రతి విషయం గురించి ఎన్నో సంవత్సరాల ముందు నుంచే ఆలోచిస్తారు. పెట్టుబడులు పెట్టే విషయంలోనూ ఈ దీర్ఘకాలిక విజన్ ఉండటం చాలా ముఖ్యం. సంపద సృష్టి అనేది కేవలం ట్రెండ్ల వెంట పరుగెత్తడం ద్వారా కాదు, ప్రణాళికలు పట్టాలు తప్పకుండా చూసుకోవడం ద్వారానే సాధ్యపడుతుంది. పిల్లల చదువులు, ఇంటి కొనుగోలు లేదా రిటైర్మెంట్ నిధిని సమకూర్చుకోవడం ఇలా లక్ష్యాల ఆధారితమైనదిగా ఇన్వెస్ట్మెంట్ ఉండాలి.-రోహిత్ మట్టూ, నేషనల్ హెడ్ (రిటైల్ సేల్స్), యాక్సిస్ మ్యుచువల్ ఫండ్ -
జీతాలు.. పన్ను భారం.. జాగ్రత్తగా లెక్కించాలి
మొత్తం ఆదాయలన్నింటిని 5 శీర్షికలుగా విభజించారు. అందులో మొదటిది జీతాలు. ఈ వారం జీతాలకు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. జీతం అనే ఆదాయాన్ని పొందే వ్యక్తులను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. 🔸 ప్రభుత్వ ఉద్యోగులు 🔸 ప్రైవేటు సెక్టార్ ఉద్యోగులు 🔸 క్యాజువల్ లేబర్ ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ప్రభుత్వ అనుబంధ సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థలు ఇలా.. పెద్ద జాబితా తయారవుతుంది. ప్రైవేటు సెక్టార్ పరిధిలో కంపెనీలు, సంస్థలు .... ఇదొక జాబితా. ఈ రెండూ కాకుండా క్యాజువల్గా పనిచేసే కార్మికులు, పనివారు. ఉద్యోగులు .. అంటే ప్రస్తుతం పని చేసేవారే కాకుండా రిటైర్ అయిన వారు పదవీ విరమణ తర్వాత డ్రా చేసే ఫైనాన్స్ని కూడా ‘జీతం’గానే పరిగణిస్తారు.ఫ్యామిలీ ఫైనాన్స్ని మాత్రం ఇతర ఆదాయంగా పరిగణిస్తారు. డబ్బులు ఇచ్చే వ్యక్తికి, ఆ డబ్బులు పుచ్చుకునే వ్యక్తికి మధ్య యజమాని–సేవకుడు అనే సంబంధం ఉంటేనే ఈ వ్యవహారాలను జీతంగా పరిగణిస్తారు. ఎటువంటి ఉద్యోగం..? ప్రైవేటా... ప్రభుత్వమా.., ఫుల్టైమా.., పార్ట్టైమా.., రెగ్యులరా..? పర్మినెంటా..? తాత్కాలికమా..? క్యాజువలా..? ఇటువంటి విషయాలతో నిమిత్తం లేదు. సెక్షన్ 15, సెక్షన్ 17లోని అంశాలు పరిశీలిస్తే జీతాల పరిధిని, నిర్వచనాన్ని చాలా జాగ్రత్తగా తయారు చేశారనిపిస్తుంది. నిర్ధిష్టంగా, సంక్షిప్తంగా, క్లుప్తంగా నిర్వచించే సందర్భాల్లో... ఒక జాబితా తయారు చేసి ఇందులో అంశాలన్నీ ‘జీతం’ అని అంటారు. చెల్లించవల్సిన జీతం టాక్సబుల్, చెల్లించకపోయినా టాక్సబుల్. ప్రస్తుత యజమాని, పూర్వపు యజమాని .. ఎవరు ఇవ్వాల్సినా, దాని మీద పన్ను పడుతుంది. చెల్లించిన జీతాల గురించి చెప్పక్కర్లేదు. ఎరియర్స్ జీతాల మీద పన్ను పడుతుంది. ‘డ్యూ’ జీతం, చెల్లించిన జీతం... ఏది ముందు జరిగితే దానికి టాక్స్ వర్తింపచేస్తారు. అడ్వాన్స్ జీతం చెల్లించిన సంవత్సరంలో టాక్స్ వర్తింపచేస్తారు. జీతం... అంటే వేతనాలు, పెన్షన్లు, అలవెన్సులు, లీవ్ ఎన్క్యాష్మెంట్, గ్రాట్యుటీ, అడ్వాన్స్ జీతం, కమీషన్, ప్రావిడెంట్ ఫండ్ క్రెడిట్ ద్వారా ప్రతి సంవత్సరం వచ్చి చేరే మొత్తం, న్యూ పెన్షన్ స్కీంలో చేసే చెల్లింపులు లాంటివన్నీ దీని పరిధిలోకి వస్తాయి. విదేశాల నుంచి జీతం వస్తే దాన్ని మన కరెన్సీలోకి మార్చి ఆ విలువను పరిగణనలోకి తీసుకుంటారు. బోనస్ ఏ సంవత్సరం చేతికొచ్చిందో ఆ సంవత్సరం టాక్స్ వేస్తారు. గత సంవత్సరాల జీతాలు ‘ఎరియర్స్’ ప్రస్తుత సంవత్సరం వస్తే మీకు రెండు ఆప్షన్లు ఉంటాయి.మొదటిది ఏంటంటే మొత్తాన్ని కరెంట్ సంవత్సరంలో వచ్చినట్లు లెక్కించడం లేదా రెండో ఆప్షన్ ప్రకారం గత ఆర్థిక సంవత్సరానికి సర్దుబాటు చేయడం వలన రిలీఫ్ వస్తే దాన్ని పొందడం. వదులుకున్న జీతం మీద టాక్సు పడుతుంది. కేంద్ర ప్రభుత్వానికి వదిలేసిన జీతం మీద పన్ను భారం లేదు. జీతాలు విదేశాల్లో చెల్లించినా ఇండియాలోనే టాక్స్ వేస్తారు. డిప్యుటేషన్ మీద విదేశాలకు వెళ్లిన వారు ఇండియాలోనే పన్ను చెల్లించాలి. ఇక పెర్క్స్, పెర్క్విజిట్స్.. ఇదొక జాబితా.. రెంట్, ఫ్రీ వసతి, రాయితీ మీద ఇల్లు ఇవ్వడం, ఇతర సదుపాయాలు.. ఇలా ఎన్నో అంశాలు ఉంటాయి. ఎంత మొత్తం మీద పన్ను పడుతుందనేది వాల్యుయేషన్ చేయాలి. రూలు 3 ప్రకారం... టాక్సు వర్తించే అంశాన్ని, దాన్ని ఎలా వాల్యూ చెయ్యాలో విశదీకరించారు. పెర్క్స్ తర్వాత చెప్పుకోదగినది జీతానికి బదులుగా ఇచ్చే మొత్తం. ఈ మొత్తం మీద కూడా పన్ను భారం పడుతుంది. ఉదాహరణకు పరిహారం.ఇక కొన్ని అలవెన్సులు మీద మినహాయింపు ఉంది. లీవ్ ఎన్క్యాష్మెంట్, గ్రాట్యూటీ, ఇంటి అద్దె అలవెన్సు మొదలైనవి ఇంకా ఎన్నో ఉంటాయి. పన్ను భారం తగ్గించుకోవడానికి అనేక ఇన్వెస్ట్మెంట్ పద్దతులున్నాయి. ఇవే 80 ఇ నుంచి మొదలయ్యే అంశాలు ఉన్నాయి. ఇదోక పెద్ద జాబితా. జీతం ఒక చిన్న పదం. దాని పరిధిలో ఎన్నో అంశాలు ఉంటాయి. ఎంతో జాగ్రత్తగా పన్ను భారాన్ని లెక్కించాలి.పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు. -
కొత్త ఫండ్లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా?
నా వద్దనున్న పెట్టుబడుల్లో 60% బ్యాంకు ఎఫ్డీలలో ఇన్వెస్ట్ చేశాను. మిగిలిన 40% ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాను. ఇప్పుడు ఈక్విటీ పెట్టుబడుల విలువ బాగా పెరిగింది. ఇలాంటి సందర్భాల్లో నేను ఏం చేయాలి? – మనోజ్ సిన్హామీరు ఈక్విటీకి 60 శాతం, డెట్కు 40 శాతం కేటాయింపులతో అస్సెట్ అలోకేషన్ విధానాన్ని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు మీ మొత్తం పెట్టుబడుల్లో ఈక్విటీ వాటా 80%కి చేరి డెట్ పెట్టుబడులు 20%గా ఉన్నాయని అనుకుంటే.. పోర్ట్ఫోలియో పరంగా రిస్క్ పెరిగినట్టు అవుతుంది. ఎందుకంటే ఎక్కువ పెట్టుబడులు ఈక్విటీల్లో ఉండడంతో మార్కెట్ల ఆటుపోట్ల ప్రభావం పెట్టుబడుల విలువపై అధికంగా పడుతుంది. దీంతో మానసిక ప్రశాంతత కోల్పోవచ్చు.రిస్క్ ఎక్కువగా తీసుకోకూడదన్నది మీ అభిప్రాయం అయితే.. ఈక్విటీ పెట్టుబడులను తిరిగి 60%కి తగ్గించుకుని, డెట్ పెట్టుబడులను 40%కి పెంచుకోవాలి. దీన్నే అస్సెట్ రీఅలోకేషన్తో లేదా అస్సెట్ రీబ్యాలన్స్గా చెప్పుకోవచ్చు. అస్సెట్ రీబ్యాలన్సింగ్తో ఉన్న మరో ప్రయోజనం.. అధిక స్థాయిల్లో విక్రయించి, తక్కువలో కొనుగోలు చేయడం సాధ్యపడుతుంది. అంటే విలువ గణనీయంగా పెరిగిన చోట విక్రయించి.. అదే సమయంలో పెద్దగా పెరగని చోట కొనుగోలు చేస్తాం.ఉదాహరణకు పెట్టుబడుల్లో ఈక్విటీల వాటా పెరిగితే.. ఈక్విటీలు బాగా ర్యాలీ చేశాయని అర్థం. దాంతో అస్సెట్ రీబ్యాలన్స్లో భాగంగా అధిక వ్యాల్యూషన్ల వద్ద పెట్టుబడులు కొంత వెనక్కి తీసుకుని డెట్కు మళ్లిస్తాం. తరచూ కాకుండా.. ఏడాదికి ఒకసారి పెట్టుబడులను సమీక్షించుకుని అస్సెట్ రీబ్యాలన్స్ చేసుకోవచ్చు. లేదా ఏదైనా ఒక సాధనంలో (ఈక్విటీ లేదా డెట్) పెట్టుబడుల విలువ మీరు నిర్ణయించుకున్న పరిమితికి మించి 5 శాతానికి పైగా పెరిగిపోయిన సందర్భాల్లోనూ రీబ్యాలన్స్ చేసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో) ప్రకటనలు తరచూ కనిపిస్తున్నాయి. వీటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచి నిర్ణయమేనా? లేక ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఫండ్స్లో మంచి ట్రాక్ రికార్డు ఉన్నవి ఎంపిక చేసుకోవాలా? – జైరూప్కొత్త పథకాల పట్ల, మరీ ముఖ్యంగా పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టినప్పుడు ఆసక్తి ఏర్పడడం సహజమే. పెట్టుబడుల ప్రపంచంలో కొత్త అంటే అది మెరుగైనదని కాదు. చాలా వరకు ఎన్ఎఫ్వోలు ఇన్వెస్టర్ల కోసం కొత్తగా తీసుకొచ్చేదేమీ ఉండదు. ఇప్పటికే గొప్పగా నిర్వహిస్తున్న మ్యూచువల్ ఫండ్స్ వ్యూహాలను పోలినవే ఎక్కువ సందర్భాల్లో ఎన్ఎఫ్వోలుగా వస్తుంటాయి. ఇప్పటికే ఉన్న పథకాల మాదిరి కాకుండా.. ఎన్ఎఫ్వోలకు గత పనితీరు చరిత్ర ఉండదు.సదరు ఎన్ఎఫ్వో ఫండ్ మేనేజర్ మార్కెట్ సైకిల్స్, రిస్క్ను సమర్థవంతంగా ఎలా ఎదుర్కొంటారన్నది తెలియదు. కొత్త ఫండ్ అని ఎంపిక చేసుకోవడం అంటే.. మంచి ట్రాక్ రికార్డు ఉన్న క్రికెటర్లను కాదని, అప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని క్రికెటర్ను జట్టులోకి తీసుకోవడం వంటిదే. కొత్త ఆస్సెట్ క్లాస్ లేదా పెట్టుబడుల విధానాన్ని ఆఫర్ చేయకుండా, అప్పటికే ఉన్న పథకాల పెట్టుబడుల వ్యూహాలకు నకలుగా వచ్చే ఫండ్ను ఎంపిక చేసుకోవడానికి ఎలాంటి కారణం కనిపించడం లేదు.సమాధానాలు: ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
వేల్యూ ఇన్వెస్టింగ్కి పెరుగుతున్న ప్రాధాన్యత
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో వేల్యూ ఇన్వెస్టింగ్కి ప్రాధాన్యత పెరుగుతున్నట్లు టాటా అసెట్ మేనేజ్మెంట్ ఫండ్ మేనేజర్ సోనమ్ ఉదాసీ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో టాటా ఈక్విటీ పీఈ ఫండ్లోకి రూ. 884 కోట్లు రాగా, ఏయూఎం రూ. 8,004 కోట్లకు పెరగడం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.సాధారణంగా నెగెటివ్ మార్కెట్ సెంటిమెంట్ వంటి అంశాల వల్ల ఉండాల్సిన దానికన్నా తక్కువ విలువకి ట్రేడవుతున్న స్టాక్స్లో ఈ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తుంటాయని వివరించారు. టారిఫ్లపరంగా కఠినతర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఫైనాన్షియల్స్, యుటిలిటీస్, ఇంధన, సిమెంట్, పెట్రోకెమికల్స్, సర్వీసెస్ వంటి దేశీ పరిస్థితుల ఆధారిత రంగాలు ఆకర్షణీయంగా ఉండొచ్చన్నారు. -
ఏంజెల్ వన్ నుంచి రెండు కొత్త ఫండ్స్..
ఏంజెల్ వన్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ కొత్తగా నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్, నిఫ్టీ 50 ఈటీఎఫ్ పేరిట రెండు ప్యాసివ్ ఫండ్స్ను ఆవిష్కరించింది. మే 16 వరకు ఈ న్యూ ఫండ్ ఆఫర్స్లో (ఎన్ఎఫ్వో) ఇన్వెస్ట్ చేయొచ్చు. కనీసం రూ. 1,000 నుంచి పెట్టుబడి పెట్టొచ్చు. సిప్ రూపంలోనైతే రోజువారీ, వారంవారీ, పక్షానికోసారి, నెలవారీ, త్రైమాసికాలవారీగా రూ. 250 నుంచి రూ. 3,000 వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇవి రెండూ నిఫ్టీ 50 సూచీని ట్రాక్ చేస్తాయి. నాణ్యమైన లార్జ్ క్యాప్ స్టాక్స్లో పెట్టుబడుల ప్రయోజనాలను పొందాలనుకునే ఇన్వెస్టర్లు వీటిని ఎంచుకోవచ్చని సంస్థ ఈడీ హేమేన్ భాటియా తెలిపారు. బరోడా బీఎన్పీ పారిబా నుంచి..ఇన్కం ప్లస్ ఆర్బిట్రేజ్ యాక్టివ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్వోఎఫ్) పేరిట న్యూ ఫండ్ ఆఫర్ను బరోడా బీఎన్పీ పారిబా మ్యుచువల్ ఫండ్ (బీబీపీఎంసీ Baroda BNP Paribas) ఆవిష్కరించింది. ఇది మే 21న ముగుస్తుంది. రిస్కులను అంతగా ఇష్టపడకుండా.. మూలధన వృద్ధి, మెరుగైన రాబడులు కోరుకునే ఇన్వెస్టర్లకు ఈ ఫండ్ అనువైనదిగా ఉంటుంది. బీబీపీఎంసీకి చెందిన డెట్ ఆధారిత ఫండ్స్లో 50–65 శాతం నిధులను, ఆర్బిట్రేజ్ పథకంలో 30–50 శాతం, మిగతా మొత్తాన్ని మనీ మార్కెట్ సాధనాల్లో ఇది ఇన్వెస్ట్ చేస్తుంది. -
మిస్ సెల్లింగ్.. బుట్టలో పడకూడదంటే..?
ఇటీవలే పదవీ విరమణ చేసిన ప్రకాష్ (60)కు వివిధ ప్రయోజనాల రూపంలో రూ.40 లక్షలు సమకూరాయి. వీటిని బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి (ఎఫ్డీ) దానిపై ప్రతి నెలా ఆదాయం తీసుకోవాలని భావించాడు. సీనియర్ సిటిజన్స్కు అర శాతం అదనపు రేటు కూడా అతన్ని ఆకర్షించింది. తీరా బ్యాంక్కు వెళ్లిన తర్వాత అక్కడి రిలేషన్ షిప్ మేనేజర్ (ఆర్ఎం) సూచనలతో మరింత రాబడి కోసం ‘స్పెషల్ ఎఫ్డీ’లో ఇన్వెస్ట్ చేశాడు.అది కాస్తా యులిప్ ప్లాన్ అని తర్వాత తెలియడంతో ఎవరికి చెప్పుకోలేక లోలోపలే ఆవేదన చెందాడు. గత రాబడుల గురించి గొప్పగా చెప్పడంతో ఆర్ఎం మాటలతో బోల్తా పడ్డాడు. 55 ఏళ్ల నారాయణ మూర్తి చిన్న కిరాణా దుకాణం నడుపుతున్నాడు. ఒక్కతే కుమార్తె. ఉన్నత విద్య కోసం అమెరికాకు పంపాడు. ఇటీవలే ఊళ్లో భూమిని విక్రయించగా రూ.20 లక్షలు చేతికి వచ్చింది. ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దామని బ్యాంక్కు వెళ్లాడు. అక్కడి మేనేజర్ ఎఫ్డీ కంటే మంచి రాబడి వస్తుందంటూ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఆ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయించాడు. మనలో చాలా మందికి ఇలాంటి అనుభవాలు ఎదురుకావొచ్చు. అవగాహనతోనే ఇలాంటి వాటికి చెక్ పెట్టడం సాధ్యపడుతుంది. తిరుచ్చిరాపల్లికి చెందిన నారాయణస్వామి దంపతులకూ ఇలాంటి అనుభవమే ఎదురైంది. గడువు తీరిన ఎఫ్డీని రెన్యువల్ చేద్దామని బ్యాంక్కు వెళ్లగా.. దానికి బదులు యులిప్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేసుకోవాలన్న సూచన బ్యాంక్ నుంచి వచ్చింది. దీంతో వారు ఫైనాన్షియల్ అడ్వైజర్ (ఆర్థిక సేవల సలహాదారు)ను సంప్రదించారు. యులిప్ ప్లాన్లో పెట్టుబడులకు దూరంగా ఉండాలన్న సూచనతో ఎఫ్డీ రెన్యువల్కే మొగ్గు చూపించారు. బీమా పాలసీలు, మ్యూచువల్ ఫండ్స్, ఇతర పెట్టుబడి సాధనాలను తప్పుడు మార్గాల్లో విక్రయించడం ఇటీవలి కాలంలో ఎక్కువగా కనిపిస్తోంది. దీన్నే మిస్ సెల్లింగ్గా చెబుతున్నారు. బ్యాంక్లు, మ్యూచువల్ ఫండ్స్ పంపిణీదారులు, బీమా ఏజెంట్ల బుట్టలో పడకుండా ఉండాలంటే కావాల్సింది అవగాహన, స్వీయ జాగ్రత్తలే. ఇలాంటి సందర్భాల్లో కార్యాచరణ ఎలా ఉండాలన్నది చూద్దాం. 2023 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం ఐఆర్డీఏఐ గణాంకాల ప్రకారం బీమా కంపెనీలకు వ్యతిరేకంగా 1,27,378 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో 50 శాతం జీవిత బీమా కంపెనీలు మిస్ సెల్లింగ్ విధానాలకు వ్యతిరేకంగా దాఖలైనవే ఉన్నాయి. బ్యాంకింగ్ ఉత్పత్తుల కంటే మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ ఉత్పత్తులకు సంబంధించి తప్పుదోవ పట్టించి విక్రయించడం అతిపెద్ద సమస్యగా ఉన్నట్టు గ్రాంట్ థార్న్టన్ పార్ట్నర్ వివేక్ అయ్యర్ తెలిపారు. ‘‘బ్యాంకుల ఉత్పత్తులు సులభంగా, సరళంగా ఉంటాయి. అదే మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ అన్నవి మార్కెట్ రిస్క్లు, షరతులతో ముడిపడి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో నిపుణులకు సైతం వీటి గురించి చెప్పడం కష్టంగానే ఉంటుంది’’ అని వివరించారు. బ్యాంకుల ద్వారా ఎక్కువ మిస్ సెల్లింగ్ అవుతున్నది బీమా ఉత్పత్తులేనని ఆర్థిక సర్వే 2024 సైతం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా యస్ బ్యాంక్ ఉదాహరణ గురించి కూడా చెప్పుకోవాలి. లోగడ యస్ బ్యాంక్ సిబ్బంది ఎఫ్డీల పేరుతో ఏటీ–1 బాండ్లను కస్టమర్లకు విక్రయించారు. నిజానికి అవి పర్పెచ్యువల్ బాండ్లు. ఈ విషయం తమకు చెప్పనేలేదని కస్టమర్లు ఆరోపించడం గమనార్హం. ఏటీ–1 బాండ్లకు మెచ్యూరిటీ ఉండదు. నిర్ణీత కాలానికోసారి వడ్డీ చెల్లింపులు చేస్తారు. ఎఫ్డీల కంటే వీటిపై అధిక రేటు ఉంటుంది. బ్యాంక్ నష్టపోతే వీటికి ఎలాంటి చెల్లింపులు చేయరు. వాటిని రద్దు చేయొచ్చు కూడా. 2020లో యస్ బ్యాంక్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు రూ.8,400 కోట్ల ఏటీ–1 బాండ్లను రద్దు చేసింది.మార్కెటింగ్ లక్ష్యాలు.. → బీమా ఉత్పత్తులను ఎఫ్డీల కంటే అధిక రాబడులను ఇచ్చే సాధనాలుగా బ్యాంక్ ఆర్ఎంలు విక్రయిస్తుండడం తరచుగా కనిపిస్తోంది. కొన్ని సందర్భాల్లో మూడు నుంచి ఐదేళ్ల కాలం కోసం ఉద్దేశించిన పెట్టుబడి సాధనాలుగా వాటిని బ్యాంక్ సిబ్బంది విక్రయిస్తున్నట్టు డెలాయిట్ ఇండియా ఇన్సూరెన్స్ సెక్టార్ లీడర్ దేవాశిష్ బెనర్జీ తెలిపారు. → బ్యాంక్ రుణం మంజూరునకు, లాకర్ల సదుపాయం తెరవాలంటే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం తప్పనిసరి అని కొన్ని బ్యాంకులు షరతు పెడుతున్నాయి. → యూనిట్ లింక్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు (యులిప్లు), డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్లు (ఇన్వెస్ట్ చేసిన కొంత కాలం తర్వాత నుంచి దానిపై ఆదాయం చెల్లించేవి), గ్యారంటీడ్ ఇన్కమ్ ప్లాన్లు సైతం తçప్పుడు మార్గాల్లో విక్రయిస్తున్నారు. → రిస్క్ అంతగా తీసుకునే సామర్థ్యం లేని సంప్రదాయ ఇన్వెస్టర్లకు అధిక రిస్క్ మ్యూచువల్ ఫండ్స్ పథకాలను విక్రయిస్తున్నారు. → పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సరీ్వసెస్ (పీఎంఎస్), ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్లు)ను తరచుగా మ్యూచువల్ ఫండ్స్ కంటే మెరుగైనవంటూ మార్కెటింగ్ చేస్తున్నారు. → కొన్ని సందర్భాల్లో అవసరం లేకపోయినా కస్టమర్లతో రుణాలు తీసుకునేలా ప్రోత్సహిస్తున్నారు. ఎఫ్డీ ప్రారంభిస్తే తక్కువ రేటుపై పర్సనల్ లోన్ ఇస్తామంటూ కొన్ని సందర్భాల్లో బ్యాంక్ సిబ్బంది కస్టమర్లను కోరుతున్నారు. తమకు విధించిన లక్ష్యాలను చేరుకునేందుకు వీలుగా బ్యాంక్ సిబ్బంది ఇలాంటి ఉత్పత్తులను ఏదో ఒక రకంగా కస్టమర్లతో కొనిపించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. → 1 ఫైనాన్స్ మ్యాగజైన్’ 2024 అక్టోబర్ సర్వే నివేదిక ప్రకారం.. లక్ష్యాలను చేరుకోకపోతే ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందన్న భయంతో బ్యాంక్ ఆర్ఎంలలో 57 శాతం మంది ఆర్థిక ఉత్పత్తులను తప్పుడు మార్గాల్లో విక్రయిస్తున్నట్టు చెప్పారు.అవగాహనతోనే నివారణ ఏ ఉత్పత్తిని అయినా కొనుగోలు చేసే ముందు పూర్తి పరిశీలన అవసరం. దాని గురించి సమగ్రంగా తెలుసుకుని, అవగాహన ఏర్పడిన తర్వాతే కొనుగోలుపై నిర్ణయం తీసుకోవాలి. బ్యాంక్లు విక్రయిస్తున్నవన్నీ తప్పుదోవపట్టించి అంటగట్టేవిగా చూడడం సరికాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ జీవిత, ఆరోగ్య బీమా అవసరం. ఇప్పుడు చాలా బ్యాంక్లు గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజీని, గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని నాన్ గ్రూప్తో పోలి్చతే తక్కువ ప్రీమియానికే ఆఫర్ చేస్తున్నాయి. కనుక బ్యాంక్ల్లో అందుబాటులో ఉండే ఉత్పత్తుల్లో కొన్ని ప్రయోజనకరమైనవీ ఉంటాయన్నది మర్చిపోవద్దు. ముఖ్యంగా అధిక రాబడుల కాంక్షతో పెట్టుబడి సాధనాలను కొనుగోలు చేయడం సరికాదు. ఇంటర్నెట్లో సంబంధిత ఉత్పత్తి గురించి శోధిస్తే సమగ్ర సమాచారం చిటికెలో లభిస్తుంది. ‘‘ఏజెంట్ను గుడ్డిగా నమ్మకుండా కస్టమర్లు తమ పరిశోధన తర్వాత సహేతుక నిర్ణయాలు తీసుకోవాలి. ప్రతి రోజూ ఎన్నో కొత్త ఉత్పత్తులు వస్తుండడంతో బ్యాంక్ ఆర్ఎంలపై లక్ష్యాల భారం పడుతోంది. ఈ ఒత్తిడితో ఆయా సాధనాల గురించి కస్టమర్లకు వివరంగా చెప్పకుండానే తప్పుడు మార్గాల్లో విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంది’’ అని గ్రాంట్ థార్న్టన్ పార్ట్నర్ వివేక్ అయ్యర్ తెలిపారు.మోసపోతే ఏం చేయాలి? → ఇప్పటికే బ్యాంక్ నుంచి ఏదైనా ఉత్పత్తిని కొనుగోలు చేసి, అది తమ అవసరాలను సరిపడదని గుర్తిస్తే దీనిపై చర్యలు చేపట్టొచ్చు. బ్యాంక్ కస్టమర్ సేవల విభాగం లేదా ఆర్ఎం వద్ద ఫిర్యాదు దాఖలు చేయాలి. ఫలితం రాకపోతే అదే బ్యాంక్లో ఫిర్యాదుల పరిష్కార విభాగం దృష్టికి తీసుకెళ్లాలి. → బ్యాంక్ స్థాయిలో సమస్య పరిష్కారం కాకపోతే లేదా సంతృప్తికరమైన ఫలితం రాకపోతే అప్పుడు బ్యాంకింగ్ అంబుడ్స్మన్ను సంప్రదించాల్సి ఉంటుంది. ‘‘సంబంధిత లావాదేవీని రద్దు చేయాలని అంబుడ్స్మన్ ఆదేశించగలదు. లేదా పరిహారం ఇప్పిస్తుంది. లేదా దిద్దుబాటు చర్యలకు ఆదేశిస్తుంది. ఇదొక సమర్థవంతమైన పరిష్కార యంత్రాంగం. దీనికి న్యాయపరమైన ప్రతినిధి అవసరం లేదు’’అని ఢిల్లీకి చెందిన న్యాయవాది నిషాంత్ దత్తా సూచించారు. → బ్యాంక్, అంబుడ్స్మన్ స్థాయిల్లో పరిష్కారం రాకపోతే అప్పుడు వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార కమిషన్ (వినినయోగదారుల ఫోరమ్) వద్ద కేసు దాఖలు చేయాలి. → చివరిగా కోర్టును ఆశ్రయించడం ద్వారా న్యాయం కోసం ప్రయత్నించొచ్చు. గతంలో పలు హైకోర్టులు, సుప్రీంకోర్టుల వరకు ఇలాంటి మిస్ సెల్లింగ్ కేసులు వెళ్లాయి. ఆ సమయంలో కోర్టులు సైతం కఠినంగా స్పందించాయి. → వీరేంద్ర పాల్ కపూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2014) కేసులో.. రాబడులపై తప్పుడు సమాచారంతో పాలసీని విక్రయించిన బీమా సంస్థ అందుకు పూర్తి బాధ్యత వహించాలని ఆదేశించింది. బ్యాంక్ సిబ్బంది చర్యలకు బ్యాంకులే బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు సైతం 2013లో ఓ కేసు సందర్భంగా స్పష్టం చేసింది. → మ్యూచువల్ ఫండ్స్ పంపిణీదారులు లేదా ఏజెంట్లు ఉత్పత్తులను తప్పుగా అంటగడితే సెబీ వద్ద ఫిర్యాదు దాఖలు చేయాలి. → బీమా ఏజెంట్ల కారణంగా తమకు అనుకూలం కాని ఉత్పత్తులను కొనుగోలు చేసినట్టయితే బీమా అంబుడ్స్మన్ను ఆశ్రయించాలి. ప్రయోజనాలు.. రిస్క్ లు చూడాలి... బ్యాంక్ ఆఫర్ చేస్తున్నఉత్పత్తిలోని ప్రయోజనాలు, రిస్క్లు, అవి తమకు ఏ మేరకు అనుకూలమన్నది ప్రశి్నంచాలి. అర్థవంతమైన వివరణ అనంతరం సరైన నిర్ణయం తీసుకోవాలి. రుణం మంజూరు కావాలంటే దానికి అనుబంధంగా టర్మ్ ప్లాన్ తీసుకోవాలని కోరొచ్చు. అవసరం లేకపోతే అదే విషయం తేలి్చచెప్పండి. తమకు అప్పటికే లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజీ లేకపోతే కొనుగోలును పరిశీలించొచ్చు. సంతకాలు చేసే ముందు ఆయా పత్రాలను వివరంగా చదివి అర్థం చేసుకోవాలి. గ్యారంటీడ్ (హామీతో కూడిన) రాబడుల పేరుతో ఏదైనా ఉత్పత్తిని విక్రయించే ప్రయత్నం చేస్తుంటే.. అది డెట్ సాధనమే అయి ఉండాలి. అధిక రాబడులు వస్తాయంటుంటే అది ఈక్విటీ సాధనమైనా అయి ఉండొచ్చు. గత రాబడులు భవిష్యత్ పనితీరుకు హామీ కాదు. ఉత్పత్తి ఏదైనా సరే తమ అవసరాలకు సరితూగే విధంగా ఉండాలి. ఉదాహరణకు 60 ఏళ్లు నిండిన వారికి జీవిత బీమా కవరేజీ అవసరం ఉండదు. కనుక వారు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. యులిప్లు అయినా, ఈక్విటీలు అయినా అధిక రిస్క్తో కూడినవి. వృద్ధాప్యంలో మెజారిటీ మొత్తం సురక్షిత సాధనాల్లోనే ఉండాలన్న విషయాన్ని మర్చిపోకూడదు. సెబీ, యాంఫి, ఆర్బీఐ, ఐఆర్డీఏఐ ఇప్పటికే తమ నియంత్రణల పరిధిలో సంస్థలకు ఈ విషయమై ఆదేశాలు జారీ చేశాయి. → మీ అవసరాలను, ఆర్థిక లక్ష్యాలను ముందుగా తేల్చుకోవాలి. ఆ తర్వాత అందుకు అనుకూలమైన సాధనాన్ని ఎంపిక చేసుకోవాలి. → పెట్టుబడుల పత్రాలను సమగ్రంగా చదివి, సందేహాలను తీర్చుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలి. → రిస్క్ తీసుకోలేని వారు అధిక రాబడులను ఆశించడం సరికాదు. అధిక రాబడులను ఇచ్చే సాధనాల్లో ఎలాంటి హామీ ఉండదు. → పెట్టుబడులు, రక్షణ కలసిన ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. ఈ రెండింటినీ వేర్వేరుగా తీసుకోవాలి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఐటీఆర్ దాఖలుకు 5 ప్రధాన అంశాలు
ఆదాయపు పన్ను దాఖలుకు సమయం రానే వచ్చింది. ఐటీఆర్ దాఖలుకు చివరితేదీని ప్రభుత్వం జులై 31గా నిర్ణయించింది. చివరి నిమిషంలో గందరగోళంగా పన్ను రిటర్న్లు ఫైల్ చేస్తే పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే అందుకు సంబంధించిన వివరాలు పూర్తిగా తెలుసుకుని వీలైనంత త్వరగా ఐటీఆర్ ఫైల్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటి దాఖలుకు ఎలాంటి ధ్రువపత్రాలు సమకూర్చుకోవాలి.. ఎలాంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలో తెలుసుకుందాం.అవసరమైన డాక్యుమెంట్లు: పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఫారం 16 (వేతన జీవుల కోసం), బ్యాంక్ స్టేట్మెంట్లు, ఇన్వెస్ట్మెంట్కు సంబంధించిన ధ్రువపత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి.సరైన ఐటీఆర్ ఫారాన్ని ఎంచుకోవడం: మీ ఆదాయ వనరు ఆధారంగా తగిన ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) ఫారాన్ని ఎంచుకోవాలి. ఉదా. వేతన జీవులు ఐటీఆర్ -1, వ్యాపార యజమానులు ఐటీఆర్ -3 తీసుకోవాలి.పన్ను లెక్కలు: మీ మొత్తం పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం, మినహాయింపులు, చెల్లించాల్సిన మొత్తం పన్నును లెక్కించాలి. ఈ వివరాలు ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో ఎంతో ఉపయోగపడుతాయి.ఆన్లైన్లో ఐటీఆర్ దాఖలు: ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్లోకి లాగిన్ అయి మీ వివరాలను నమోదు చేయాలి. మీ వద్ద ఉన్న ధ్రువపత్రాలు, ఇతర ఆధారాలతో రిటర్న్లు దాఖలు చేయవచ్చు.ట్యాక్స్ రిటర్న్ వెరిఫై: ఆధార్ ఓటీపీ, నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి లేదా మీరు సంతకం చేసిన ఫిజికల్ కాపీలో వివరాలు నమోదు చేసి ఇన్కమ్ ట్యాక్ విభాగానికి పంపడం ద్వారా ఈ-వెరిఫికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. చాలామంది దీన్ని విస్మరిస్తారు. కేవలం ఐటీఆర్ ఫైల్ చేయడంతోనే ప్రక్రియ పూర్తి అయిపోతుందని అనుకుంటారు. కానీ కచ్చితంగా ట్యాక్స్ రిటర్న్లను వెరిఫై చేయాలి. అప్పుడే మీ ఖాతాలో డబ్బు జమ అవుతుంది.ఇదీ చదవండి: ఐపీఎల్ నిలిపివేత.. కంపెనీలకు నష్టం ఎంతంటే..2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్ చివరి తేదీలువ్యక్తులు, ఉద్యోగులు: జులై 31, 2025ఆడిట్ అవసరమయ్యే వ్యాపారాలు: అక్టోబర్ 31, 2025కంపెనీలు: అక్టోబర్ 31, 2025 -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఈఎంఐలు తగ్గుతాయ్...
దేశంలో అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో లోన్ కస్టమర్లు చెల్లించే నెలవారీ వాయిదాలు (ఈఎంఐలు) తగ్గనున్నాయి. ఈ మేరకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను (ఎంసీఎల్ఆర్) తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఎంపిక చేసిన రుణ కాలపరిమితిపై ఎంసీఎల్ఆర్ను 15 బేసిస్ పాయింట్లు (బీపీఎస్) అంటే 0.15% తగ్గించింది.ఈ సవరణ తరువాత,హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ ఇప్పుడు రుణ కాలపరిమితిని బట్టి 9 శాతం నుంచి 9.20 శాతం వరకు ఉంటుంది. ఇది ఇంతకు ముందు 9.10 శాతం నుంచి 9.35 శాతం ఉండేది. సవరించిన రేట్లు మే 7 నుంచి అమల్లోకి వచ్చాయి.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఏప్రిల్లో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన నేపథ్యంలో తరువాత హెచ్డీఎఫ్సీ బ్యాంకు కూడా ఎంసీఎల్ఆర్లో మార్పులు చేసింది. 2025 ఫిబ్రవరి నుండి రెపోరేటు మొత్తం తగ్గింపు 50 బేసిస్ పాయింట్లకు చేరుకుంది. రెపో రేటు అనేది వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణంపై వసూలు చేసే వడ్డీ రేటు. ఇది తగ్గితే సాధారణంగా బ్యాంకింగ్ రంగంలో రుణ వ్యయాలు తగ్గుతాయి. ఫలితంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి బ్యాంకులు తక్కువ రుణ రేట్ల ద్వారా తక్కువ ఫండింగ్ ఖర్చుల ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేస్తున్నాయి.రుణగ్రహీతలకు ఏంటి ప్రయోజనం?ఎంసీఎల్ఆర్ అనేది ఒక నిర్దిష్ట రుణం కోసం ఒక ఆర్థిక సంస్థ వసూలు చేయాల్సిన కనీస వడ్డీ రేటు. ఇది రుణానికి వడ్డీ రేటు తక్కువ పరిమితిని నిర్ణయిస్తుంది. ప్రత్యేకంగా ఆర్బీఐ సవరిస్తే తప్ప ఇదే రేటును బ్యాంకులు అమలు చేస్తాయి. 2016లో ఆర్బీఐ ప్రవేశపెట్టిన ఎంసీఎల్ఆర్ను గృహ, వ్యక్తిగత, వాహన రుణాలతో సహా వివిధ ఫ్లోటింగ్ రేట్ రుణాలకు ఉపయోగిస్తారు. ఎంసీఎల్ఆర్ తగ్గడం వల్ల రుణం ఫిక్స్డ్ లేదా ఫ్లోటింగ్ వడ్డీ రేటుపై ఆధారపడిన రుణ ఈఎంఐలు తగ్గుతాయి లేదా రుణ కాలపరిమితి తగ్గుతుంది.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తాజా ఎంసీఎల్ఆర్ రేట్లుఓవర్నైట్: 9.00%1 నెల: 9.00%3 నెలలు: 9.05%6 నెలలు: 9.15%1 సంవత్సరం: 9.15%2 సంవత్సరాలు: 9.20%3 సంవత్సరాలు: 9.20% -
ఫారం 16లో జరిగిన మార్పులు ఇవే.. గమనించారా?
2024–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫారంలో 16 మార్పులు వచ్చాయి. మీ యజమాని ఈ మార్పులు చేసిన తర్వాత మీకు ఫారం 16 జారీ చేస్తారు.ఫారం 16 అంటే ఏమిటి?యజమాని తన దగ్గర చేసే ఉద్యోగులకు ప్రతి సంవత్సరం జారీ చేసేది ఫారం 16. ఇందులో మొదటి భాగంలో ఉద్యోగులు, యజమాని ప్రాథమిక వివరాలు ఉంటాయి. రెండో భాగంలో జీతభత్యాలకి సంబంధించిన పూర్తి వివరాలు .. అంటే జీతాలు, అలవెన్సులు, టాక్సబుల్ ఇన్కం వివరాలు, మినహాయింపులు, తగ్గింపులు, డిడక్షన్లు, నికరజీతం లేదా ఆదాయం, టీడీఎస్ వివరాలు ఉంటాయి. ‘సులభతరం, పారదర్శకత, స్పష్టత’ అనే లక్ష్యాలతో ఫారం 16 రాబోతోంది.ఫారం 16 చాలా ముఖ్యమైంది..రిటర్నులు వేయడానికి మొదటగా చూసే డాక్యుమెంటు ఇదే. లోన్ ఇచ్చేందుకు బ్యాంకులు, రుణ సంస్థలు ఈ ఫారంనే ప్రాతిపదికగా తీసుకుంటాయి. ఈ ఫారంతో ఉద్యోగి ‘రుణ స్తోమత’ నిర్ధారిస్తారు. దీంతోనే పన్ను భారం, చెల్లింపులు నిర్ధారించవచ్చు. రీఫండు కోసం కూడా ఇదే ఫారంని ‘బేస్’గా తీసుకుంటారు. ఎందుకంటే, పన్ను వసూలు చేయడం, దాన్ని ప్రభుత్వానికి చెల్లించడాన్ని దీని ద్వారానే నిర్ధారించుకుంటారు. ఇవే అంశాలు 26ఏఎస్లో ఉంటాయి.ప్రతి మూడు నెలలకు సమ్మరీ, జీతం, టీడీఎస్ చెల్లించినది, గవర్నమెంటుకు ఎలా చెల్లించారు, ఏ బ్యాంకు ద్వారా చెల్లించారు, ఏ తేదీన కట్టారు, చలాన్ నంబరు ఎంత వగైరా వివరాలన్నీ ఉంటాయి. జీతం, అలవెన్సులు, బోనస్లు, ఏరియర్స్, సెక్షన్ 10 ప్రకారం మినహాయింపులు, ఇంటి అద్దె అలవెన్సు, గ్రాట్యుటీ మొదలైన అన్ని డిడక్షన్లు 80 C నుంచి 80 TTA వరకు ఉంటాయి. ఆ తరువాత పన్ను భారం లెక్కింపులు, స్టాండర్డ్ డిడక్షన్లు ఉంటాయి. 89(1) రిలీఫ్ కూడా ఉంటుంది. వచ్చిన మార్పులు ఏమిటంటే..80 ఇఇఏ ప్రకారం అగ్నివీర్ కార్పస్ ఫండ్కి ఇచ్చిన విరాళాలకు సంబంధించిన మినహాయింపు ఉంటుంది. జీతాలకు సంబంధించిన అంశాలు వర్గీకరిస్తారు. హెచ్ఆర్ఏకి సంబంధిత వివరాలుంటాయి. అలాగే రెంట్ఫ్రీ వివరాలు, ఇతర ప్రిరిక్వజిట్లు, ప్రతి డిడక్షన్కి సంబంధించి మరిన్ని వివరాలు పొందుపరుస్తారు. కొత్త కాలమ్ ద్వారా టీడీఎస్, టీసీఎస్కి సంబంధించిన వివరాలు తెలిసేలా, సరి చేసుకునే వీలు కల్పించడానికి ఫారం 24 Q టీడీఎస్/టీసీఎస్ రిటర్నులు కనిపించేలా చేస్తారు. దీనివల్ల 26 Aను అప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. ఇదీ చదవండి: ఇండియన్ రైల్వే డిజిటల్ క్లాక్ డిజైన్ పోటీ: రూ.5 లక్షల ప్రైజ్మీరు చేయాల్సిందేమింటంటే..ఫారం 16 యజమాని ఇచ్చే సర్టిఫికేట్. ఇది విలువైంది. ఎందుకంటే ఇది మీ టీడీఎస్, టీసీఎస్ రికవరీ అయినట్లు... చెల్లించినట్లు. గవర్నమెంటు చేతికందినట్లూ. మీ ఖాతాలో జమ అయినట్లు ధృవీకరించే ఏకైక పత్రం. అయితే ఇందులో ప్రతి అంశాన్ని మీరే సరి చూసుకోవాలి. నెలసరి శాలరీ స్లిప్పులతో మినహాయింపు, తగ్గింపులు... మొదలైనవి చెక్ చేసుకోవాలి. మీరు ఇచ్చే ఆదాయపు వివరాలు ఉన్నాయా లేదా ఎక్కువ పడ్డాయా చెక్ చేసుకోవాలి. వాటికి సంబంధించిన కాగితాలు భద్రపరుచుకోవాలి. మీరు కొత్త రెజీమ్లో ఉన్నారా లేక పాత పద్ధతిలో ఉన్నారో చెక్ చేసుకొండి. మీరు సంవత్సరంలో ఉద్యోగం మారితే రెండు ఫారం 16లు ఉంటాయి. అప్పుడు రిపోరి్టంగ్లో హెచ్చు తగ్గులు... డబుల్ క్లయిమ్/తప్పుడు క్లయిమ్ ఉండొచ్చు. చెక్ చేసుకోండి. యజమానికి అంటే ‘డిస్బర్సింగ్’ అధికారి ఇవన్నీ అదనపు భాద్యతలు... తగిన జాగత్ర వహించాలి. గతంలో ఏర్పడిన ఇబ్బందులు, సమస్యలు కొత్త ఫారమ్ 16 వల్ల రావని ఆశిద్దాం! ట్యాక్సేషన్ నిపుణులు: కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి & కె.వి.ఎన్ లావణ్య -
‘మనీ మహిమ’తోనే చాలామంది విడాకులు!
మానవ సంబంధాల్లో డబ్బు కీలక పాత్ర పోషిస్తుంది. ప్రేమగా మాట్లాడాలన్నా, అభిమానాన్ని ఎదుటివ్యక్తికి తెలియజేయాలన్నా డబ్బు అవసరం లేకపోవచ్చు.. కానీ ఆ ప్రేమను, అభిమానాన్ని కలకాలం నిలబెట్టుకోవాలంటే మాత్రం కచ్చితంగా డబ్బు కావాల్సిందే. ప్రస్తుత రోజుల్లో విడాకులు తీసుకుంటున్న జంటల సంఖ్య పెరుగుతోంది. అందుకు చాలానే కారణాలుండొచ్చు.. అయితే దాంపత్య జీవితంలో భాగస్వామికి డబ్బు లేకపోవడం, అప్పులుండడం, ఖర్చు చేయలేకపోవడం.. వంటివి కూడా పచ్చని కాపురంలో చిచ్చు పెడుతోంది. కలకాలం సంతోషంగా జీవించాల్సిన జంటను ఈ డబ్బు విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిస్తోంది. విడిపోయే జంటల జీవితాలను మనీ ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం.రుణాలు..కొత్తగా పెళ్లయిన జంటను స్థిరమైన ఆర్థిక ఒత్తిళ్లు వేరు చేస్తున్నాయి. ఈ రోజుల్లో పెళ్లికి చాలా కుటుంబాలు భారీగానే ఖర్చు చేస్తున్నాయి. సంపన్నులకు డబ్బు ఖర్చయినా తిరిగి సంపాదిస్తారు. పేదవారు కూడా ఉన్నంతలో తూతూ మంత్రంగా పెళ్లి తంతు కానిస్తారు. కానీ సమస్య అంతా మధ్య తరగతి ప్రజలతోనే. బంధువుల్లో గొప్ప కోసమో.. మళ్లీ చేయని కార్యక్రమం అనో.. పెళ్లికి బాగానే డబ్బు ఖర్చు చేస్తారు. మధ్య తరగతివారికి సరైన సంపాదన ఉండకపోవడంతో దీనికోసం అప్పు చేయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. వాటిని తీర్చేందుకు అదనపు కట్నం కోసం భాగస్వామిపై వేదింపులు సాగిస్తారు. అది చివరకు విడాకుల వరకు వెళ్లే ప్రమాదం ఉంది.ఆర్థిక అస్థిరతపెళ్లైనప్పటి నుంచి వధువరులకు బాధ్యతలు పెరుగుతాయి. పెళ్లి తర్వాత పిల్లలు, వారి చదువులు, వాహనాల కొనుగోలు, ఆస్తులు కూడబెట్టడం.. వంటి కార్యకలాపాల కోసం చాలామంది అప్పులు చేస్తున్నారు. ఈఎంఐలు చెల్లించలేక మానసిక ఒత్తిడితో భాగస్వామితో సఖ్యతగా నడుచుకోకుండా చివరకు కాపురాన్ని కూల్చుకుంటున్నారు.దుబారా ఖర్చులు..పెళ్లికి ముందు చాలా మందికి దుబారాగా డబ్బు ఖర్చు చేసే అలవాటు ఉంటుంది. వివాహం తర్వాత కూడా అది కొనసాగితే అప్పులు తప్పవు. సంపాదన భారీ మొత్తంలో ఉన్న కుటుంబాలపై ఇది పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. కానీ మధ్య తరగతి కుటుంబాలపై ఈ వ్యవహార శైలి తప్పకుండా ప్రభావం చూపుతుంది. ఇది దంపతుల మధ్య గొడవలు జరిగేందుకు కారణమవుతుంది. ఇది కూడా విడాకులకు దారితీస్తుంది.ఇదీ చదవండి: వచ్చే మూడేళ్లలో ఒకే రంగంలో కోటిన్నర ఉద్యోగాలుమరేం చేయాలి..జల్సాలకు, దుబారా ఖర్చులకు అలవాటుపడే వారు, పెళ్లి కోసం అనాలోచితంగా చేసే భారీగా ఖర్చు చేసేవారు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇది ఆ దంపతులు తమ వైవాహిక బంధాన్ని తెంచుకునేందుకు చాలాసార్లు కారణమవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక సవాళ్లు అనివార్యమైనప్పటికీ సరైన ప్రణాళిక, పారదర్శకత, బాధ్యతాయుతమైన ఆర్థిక నిర్వహణ వల్ల సమస్యలను గట్టెక్కవచ్చు. ఆ దిశగా దంపతులు ఆలోచించాలి. ఖర్చులు తగ్గించుకుని, అప్పులు చేయకుండా పెట్టుబడి, పొదుపుపై దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. కరెన్సీ నోటు కాపురాలను కలకాలం నిలబెడుతుంది.. అదే కాపురాలను చిదిమేస్తుందని గుర్తుంచుకోవాలి. -
అనిశ్చితిని ఎలా ఎదుర్కోవాలి?
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపన్ను నిబంధనలు అమల్లోకి వచ్చాయని విన్నాను. ఆదాయపన్ను శ్లాబుల్లో, టీడీఎస్ పరిమితుల్లోనూ మార్పులు చేసినట్టు తెలిసింది. సీనియర్ సిటిజన్గా (60 ఏళ్లకు పైన) నాకు డెట్ సాధనాలపై వస్తున్న వడ్డీ ఆదాయమే ప్రధానంగా ఉంది. కాబట్టి ఆదాయపన్ను మార్పుల ప్రభావం నాపై ఏ మేరకు ఉంటుంది? – వినోద్ బాబుకొత్త విధానం కింద ఆదాయపన్ను శ్లాబుల్లో, టీడీఎస్లో మార్పులు చోటుచేసుకున్నాయన్నది నిజమే. టీడీఎస్ పరిమితిని సీనియర్, నాన్ సీనియర్ సిటిజన్లకూ (60 ఏళ్లలోపు) తగ్గించారు. సీనియర్ సిటిజన్స్కు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 వరకు వడ్డీ ఆదాయంపై టీడీఎస్ మినహాయింపు ఉంది. ఇప్పుడు ఈ పరిమితి రూ.లక్షకు పెరిగింది. ఆదాయం ఈ లోపు ఉంటే టీడీఎస్ వర్తించదు. నాన్ సీనియర్ సిటిజన్స్కు రూ.40,000గా ఉన్న పరిమితి రూ.50,000కు పెరిగింది. అంటే వడ్డీ ఆదాయం రూ.50వేలు మించినప్పుడే టీడీఎస్ వర్తిస్తుంది. అద్దె ఆదాయంపై టీడీఎస్ అమలును రూ.2.4 లక్షల పరిమితి నుంచి రూ.6లక్షలకు పెంచారు. ఇది పన్ను చెల్లింపుదారులందరికీ వర్తిస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ నుంచి వచ్చే డివిడెండ్ ఆదాయం రూ.5,000 నుంచి రూ.10,000కు పెంచారు. అంటే ఫండ్స్ నుంచి డివిడెండ్ ఆదాయం రూ.10,000 మించినప్పుడే టీడీఎస్ అమలవుతుంది. కొత్త పన్ను విధానంలో ఆదాయపన్ను శ్లాబుల్లోనూ మార్పులు జరిగాయి. మొత్తం ఆదాయం రూ.12లక్షల వరకు ఉంటే సెక్షన్ 87ఏ కింద రాయితీ ప్రయోజనంతో ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. స్టాక్స్, ఈక్విటీ ఫండ్స్ నుంచి వచ్చే మూలధన లాభాలు కూడా రూ.12 లక్షల ఆదాయంలోపే ఉన్నప్పటికీ.. మూలధన లాభాలపై విడిగా పన్ను చెల్లించడం తప్పనిసరి. ఇదీ చదవండి: రేట్ల తగ్గింపు ప్రతికూలం!మార్కెట్లు అస్థిరతంగా ఉన్నాయి. ఈ పరిస్థితులను ఇన్వెస్టర్లు ఎలా ఎదుర్కోవాలి? – ఉషమార్కెట్లలో అస్థిరతలు సహజమే. ఇప్పుడనే కాదు.. గతంలోనూ ఎన్నో సందర్భాల్లో ఇలాంటి ఆటుపోట్లను చూశాం. భవిష్యత్తులో మరింత ఎక్కువగా ఉండొచ్చు. గడిచిన ఐదు, పదేళ్ల కాలంలో ఇదే ధోరణి కనిపిస్తోంది. వీటిని ఎదుర్కొనే విధంగా ఇన్వెస్టర్ల పెట్టబడుల ప్రణాళిక ఉండాలి. ఇందుకోసం కొన్ని చర్యలను అమల్లో పెట్టాల్సి ఉంటుంది. ముందుగా లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్తో కుటుంబానికి ఆర్థిక, ఆరోగ్య రక్షణ కలి్పంచుకోవాలి. ఊహించని అవసరాలు ఏర్పడితే ఈక్విటీ పెట్టబడులపై ఆధారపడకుండా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న పెట్టుబడులు కనీసం ఐదు నుంచి పదేళ్లు అంతకంటే ఎక్కువ కాలానికి అయి ఉండాలి. దీంతోపాటు క్రమం తప్పకుండా మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అస్థిరతల నుంచి గరిష్ట ప్రయోజనాన్ని పొందొచ్చు. రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేసే వారికి మార్కెట్ కరెక్షన్లలో మంచి పెట్టుబడుల అవకాశాలు వస్తుంటాయి. వీటిని అనుకూలంగా మలుచుకోవచ్చు. మార్కెట్లు దిద్దుబాటుకు గురైతే చౌక ధరల వద్ద కొనుగోలు చేసుకోవచ్చు. తద్వారా దీర్ఘకాలంలో రాబడులను పెంచుకోవచ్చు.ధీరేంద్ర కుమార్సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
పోస్టాఫీస్ స్కీములకు కొత్త విధానం
పోస్టాఫీస్ పొదుపు పథకాలకు ప్రజల నుంచి మంచి ఆదరణ ఉంటుంది. ఈ స్కీములు మారుమూల గ్రామీణులకు సైతం అందుబాటులో ఉన్నప్పటికీ వీటిని తెరిచేందుకు అనుసరించే పేపర్ వర్క్ సామాన్యులకు కాస్త ఇబ్బందిగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఎంపిక చేసిన పొదుపు పథకాలను తెరవడానికి తపాలా శాఖ ఇప్పుడు పూర్తి డిజిటల్ ప్రక్రియను ప్రవేశపెట్టింది.మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (ఎంఐఎస్), టైమ్ డిపాజిట్ (టీడీ), కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్సీ) వంటి పొదుపు పథకాలను తెరవడానికి పేపర్లతో పనిలేకుండా ఆధార్ బయోమెట్రిక్ ధృవీకరణను తపాలా శాఖ అమలుచేస్తోంది. ఈ ప్రక్రియ పూర్తిగా కాగిత రహితంగా, వేగంగా ఉంటుంది. ఫిజికల్ డిపాజిట్ స్లిప్ అవసరం ఉండదు.మంత్లీ ఇన్కమ్ స్కీమ్, టైమ్ డిపాజిట్, కిసాన్ వికాస్ పత్ర, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ వంటి ప్రసిద్ధ చిన్న పొదుపు పథకాలను తెరవడానికి ఆధార్ ఆధారిత వీ-కేవైసీ ప్రక్రియను ఏప్రిల్ 23 నుండి తపాలా శాఖ అమలు చేస్తోంది. పోస్టాఫీస్ పొదుపు ఖాతాలు తెరవడం, నిర్వహించడం కోసం ఆధార్ ఆధారిత ఈ-కేవైసీని ఇదివరకే జనవరి 6 నుండి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు డిపాజిట్ వోచర్లు, భౌతిక ఫారాలు నింపే సాంప్రదాయ పద్ధతి కూడా అందుబాటులో ఉంది. కస్టమర్లు తమకు అనువైన విధానాన్ని ఎంచుకోవచ్చు.ఆధార్ బయోమెట్రిక్ ఆథెంటికేషన్ ద్వారా ఖాతా మూసివేత, ఖాతా బదిలీలు, నామినేషన్ అప్డేట్స్ వంటి ఫీచర్లు ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్నాయని, త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. అప్పటి వరకు ఈ సేవలు సంప్రదాయ ప్రక్రియలోనే కొనసాగుతాయి. పేపర్లెస్ కేవైసీ ప్రక్రియను కొత్త కస్టమర్లతోపాటు ఇప్పటికే ఉన్న ఖాతాదారులందరూ వినియోగించుకునేలా చూడాలని అన్ని సర్కిళ్ల సిబ్బందికి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. -
అ(త)ప్పు చేయకూడదంటే....
కష్టాలు చెప్పి చెప్పి రావు... కష్టాలు చుట్టాల్లా వచ్చి పలకరిస్తాయి...పగవాడికి కూడా ఈ కష్టం రాకూడదురా నాయనా...ఈ కష్టాలు ఎప్పుడు తీరతాయో...మనం తరచుగా వినే మాటలే ఇవి.ఒక్కొక్కరి కష్టాలు ఒక్కో రకంగా ఉండొచ్చు.. ఇతరత్రా కష్టాలని కాసేపు పక్కన పెట్టేసి... ఆర్ధిక కష్టాల గురించి ఈ ఆర్టికల్ లో మాట్లాడుకుందాం... మనిషి జీవితం డబ్బుతో ముడిపడి ఉందనేది వాస్తవం. మరి ఈ డబ్బుని ఎంత పద్ధతిగా సద్వినియోగం చేసుకుంటే జీవితంలో అంత సురక్షితంగా ఉండగలుగుతాం. ఇలా ఉండాలంటే ప్రతి వ్యక్తికీ సరైన ఆర్ధిక ప్రణాళిక ఉండాలి. ప్రణాళిక లేకపోతే జీవితం అధోగతి పాలవుతుందనేది నిర్వివాదాంశం. కాబట్టి మీరు సంపాదన మొదలు పెట్టిన తొలినాళ్లలోనే పక్కా పకడ్బందీ ప్రణాళికతో సాగాలి. ఇందుకు ప్లాన్-1, ప్లాన్-2, ప్లాన్-3, ప్లాన్-4 అనే అస్త్రాలను సిద్ధం చేసుకోవాలి.ప్లాన్-1 చేతిలో ఎప్పుడూ తగినంత నగదు ఉంచుకోవాలి. ఉదాహరణకు: మీకు నెలకు అన్ని ఖర్చులూ పోగా సగటున రూ. 2000 అవసరమవుతోంది అనుకోండి. మీ చేతిలో దానికి అయిదు రెట్లు... అంటే రూ.10,000 ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలి. అది నగదు రూపంలోనైనా సరే.. బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ లోనైనా సరే. ఆరోగ్యపరంగా కావచ్చు... ఏదైనా ఫంక్షన్స్ రావొచ్చు.. అప్పటికప్పుడు అత్యాసర పని మీద ఏదైనా ఊరు వెళ్లాల్సి రావొచ్చు.. కారణం ఏదైతేనేం... చేతిలో కొంత నగదు అట్టేపెట్టుకోవడం ప్లాన్-1 లో ప్రథమ లక్షణం. ఇలా చేయడం వల్ల అప్పుకు ఎవరి దగ్గరికీ పరిగెత్తాల్సిన పరిస్థితి తలెత్తదు.ప్లాన్-2 బ్యాంకులో డిపాజిట్లు తప్పనిసరి. మీరు ప్రతి నెలా క్రమం తప్పకుండా పొదుపు చేసే రికరింగ్ డిపాజిట్ అయినా.. కొంచెం పెద్ద మొత్తంలో దాచుకున్న ఫిక్సడ్ డిపాజిట్ అయినా... మీకు సమయానికి ఉపయోగపడుతుంది. అత్యవసర సందర్భాల్లో ఎవరి దగ్గరా చెయ్యి చాచనక్కర్లేకుండా .. ఈ డిపాజిట్లను విత్ డ్రా చేసుకుని అవసరాన్ని నెరవేర్చుకోవచ్చు. మరో విషయం: ఈ ఆర్డీ, ఎఫ్డీ లను మధ్యలోనే విత్ డ్రా చేయడం వల్ల మీరు ఆశించిన వడ్డీ రాదు, కొన్ని సందర్భాల్లో మీరు పెనాల్టీ కూడా కట్టాల్సి రావచ్చు. అయినప్పటికీ... మీరు అప్పు చేయాల్సిన అవసరం ఏర్పడదు. అదే సమయంలో ఒకర్ని సాయం చేయమని అడిగే పరిస్థితి తలెత్తదు. అన్నిటికంటే ముఖ్యంగా మీ ఆత్మాభిమానం దెబ్బ తినదు. ఒకవేళ మీరు చెప్పిన టైం కి బాకీ తీర్చలేకపోతే అవతలి వ్యక్తులు అనే మాటలు పడాల్సిన అవసరం ఉండదు. అప్పిచ్చినవాడు ఎప్పుడు మీద పడతాడో అని నిత్యం నలిగిపోతూ బతకక్కర్లేదు. కాబట్టి... ప్రతి వ్యక్తి జీవితంలోనూ ప్లాన్-2 అనేది తప్పనిసరి.ప్లాన్-3 లిక్విడ్ పెట్టుబడులుప్రతి వ్యక్తి ఆర్ధిక జీవితంలోనూ ఇదొక అత్యంత కీలకాంశం. ఈ మూడో మార్గంలో మిమ్మల్ని ఆదుకునేది మీరు చేసే చర పెట్టుబడులే. అవును.. ఇది నిజమే.. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, బంగారాల్లో చేసిన పెట్టుబడుల్ని మూడో అంచె మిత్రులుగా చెప్పుకోవచ్చు. ఈ మూడింటిలోనూ పెట్టుబడి పెట్టడాన్ని అలవాటుగా మార్చుకోవాలి. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ జోలికి పోకండి. కేవలం పెట్టుబడులపైనే దృష్టి పెట్టండి.షేర్ల విషయానికొస్తే... తప్పనిసరిగా ఫండమెంటల్స్ బాగుండే ప్రధాన కంపెనీలనే ఎంచుకోవాలి. ఇలా చేయడం వల్ల... పెద్ద కంపెనీల షేర్లు మార్కెట్ ఒడుదొడుకుల్లో క్షీణించినప్పటికీ... మళ్ళీ సత్వరమే కోలుకునే సత్తా వీటికి ఉంటుంది. కాబట్టి భయపడిపోయి మార్కెట్ కు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. పైగా మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు బాగా దూసుకెళ్ళేవి కూడా ఈ షేర్లే. మీరు ఎంచుకునే షేర్లను బట్టే మీకొచ్చే రాబడి ఆధారపడి ఉంటుంది. అదే సమయంలో కనీసం మూడేళ్లకు తగ్గకుండా.. దీర్ఘకాలిక దృక్పథంతో చేసే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులకు కూడా అవసరానికి ఆదుకునే లక్షణం ఉంది. (వివరాలు మరో ఆర్టికల్ లో చర్చిద్దాం).ఇక బంగారంలో పెట్టుబడి మూడోది. ఈవేళ బంగారం ధర లక్షకు చేరుకుంది. మీకు తెలియకుండానే అప్పుడో కొంత.. ఇప్పుడో కొంత చొప్పున బంగారం కొంటూ వచ్చినా.. లేదంటే.. గోల్డ్ బాండ్స్ లో పెట్టుబడి పెడుతూ వచ్చినా.. మీకు మంచి ప్రయోజనమే ఉంటుంది. తాకట్టు పెట్టుకుంటే దాని విలువలో దాదాపు 80% అప్పు దొరుకుతుంది. అది కూడా తక్కువ వడ్డీకే. మళ్ళీ మీరు శక్తియుక్తులు కూడదీసుకున్నాక దాన్ని విడిపించుకోవచ్చు.పై మూడు పెట్టుబడుల్లోనూ ఉన్న ఒక గొప్ప లక్షణం ఏమిటంటే... మన అవసరాలకు తక్షణమే పెద్ద మొత్తంలో నగదు కావాల్సి వచ్చినపుడు ఈ మూడూ ఆదుకుంటాయి. అంటే స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్, బంగారాల్లో పెట్టుబడులు సమయానికి అక్కరకొస్తాయన్న మాట. ఇవన్నీ తక్షణ లిక్విడిటీ ఉన్న పెట్టుబడులు.ప్లాన్-4 స్థిరాస్తులపై పెట్టుబడిభూములు, ఆస్తులు, భవనాలపై పెట్టుబడులను ఈ కేటగిరీలోకి తీసుకోవచ్చు. ఇవి ఖరీదైనవే కావచ్చు..వీటిని సమకూర్చుకోవడం అందరివల్లా కాకపోవచ్చు. కానీ ప్రతి మనిషీ తన జీవితంలో ఒక సొంత ఇల్లు సమకూర్చుకోవాలి అనుకోవడం సహజమే కదా..మరికొందరు రూపాయి రూపాయి కూడబెట్టి ఎంతో కొంత భూమి కొనుక్కుంటారు. అలా సమకూర్చుకున్న సొమ్మే ఆపదలో ఆదుకుంటుంది (ఇల్లు అమ్ముకోమని కాదు. ఇదొక మార్గం కూడా ఉంటుంది అని చెప్పడమే నా ఉద్దేశం).ముగింపు అనుకోకుండా తలెత్తే ఖర్చులను తట్టుకోవడానికి ప్రతి మనిషి జీవితానికీ నాలుగు దశల ఆర్ధిక ప్రణాళికలు ఉండాలి. మొదటిది చిన్న చిన్న ఇబ్బందుల్ని ఎదుర్కోవడానికి ఉపయోగపడితే..రెండోది ఇంకొంచెం పెద్ద సమస్యలను దీటుగా గట్టెక్కడానికి దోహదపడుతుంది. మూడోది ఎలాంటి పరిస్థితులనుంచి అయినా బయటపడే అవకాశాన్ని కల్పిస్తుంది.పీకల మీదకి వచ్చి... విధిలేని పరిస్థితుల్లో తోడ్పడేది నాలుగోది. ఈ నాలుగు పాటించిన వాళ్ళ జీవితం నలుగురికి ఆదర్శంగా ఉంటుంది. నిర్లక్ష్యం చేసిన వారి జీవితం నిత్యం యాతనతో సతమతమవుతూనే ఉంటుంది. నిర్ణయం మీచేతుల్లోనే ఉంది.-బెహరా శ్రీనివాస రావు, ఆర్ధిక నిపుణులు -
ఏటీఎం కొత్త ఛార్జీలు.. రేపటి నుంచే..
ఏటీఎం లావాదేవీలు మరింత భారం కానున్నాయి. ఏటీఎం విత్డ్రావల్ కొత్త ఛార్జీలు మే 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఉచిత పరిమితిని మించి చేసే ఏటీఎం లావాదేవాలపై ఛార్జీల పెంపునకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుమతి ఇచ్చింది. ఈ రుసుములో ఏటీఎం కొనుగోలు, నిర్వహణ, ఇతర బ్యాంకుల కస్టమర్లకు సేవలను అందించడానికి అయ్యే ఖర్చు కూడా ఉంటుంది.సవరించిన ఏటీఎం ఛార్జీలు ఇవే..మే 1 నుండి అమల్లోకి వస్తున్న కొత్త నిబంధనల ప్రకారం, వినియోగదారులు తమ ఉచిత ఉపసంహరణ పరిమితిని దాటిన తర్వాత ప్రతి లావాదేవీకి రూ.2 అదనంగా రూ .23 చెల్లించాల్సి ఉంటుంది. ఇది గతంలో రూ .21 ఉండేది. దీన్ని 2022 నుంచి అమలు చేస్తున్నారు.ఉచిత లావాదేవీలుఏటీఎం ఛార్జీల పెంపు ఉన్నప్పటికీ ఉచిత లావాదేవీ పరిమితుల్లో ఎలాంటి మార్పులు లేవు. సొంత బ్యాంకు ఏటీఎంలలో నెలకు 5 ఏటీఎం ట్రాన్సాక్షన్స్ ఉచితంగా చేసుకోవచ్చు. ఇక ఇతర బ్యాంకుల ఏటీఎంల విషయానికి వస్తే.. మెట్రో గరాల్లో అయితే 3 లావాదేవీలు, నాన్ మెట్రో నగరాల్లో 5 లావాదేవీలు ఉచితంగా చేసుకోవచ్చు.నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) సిఫారసుల మేరకు ఆర్బీఐ సవరణలో భాగంగా ఏటీఎం ఫీజులను పెంచింది. నిర్వహణ ఖర్చులు పెరుగుతుండటంతో వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు, బ్యాంకులు ఈ పెంపునకు మొగ్గుచూపుతున్నాయి.చిన్న బ్యాంకులపై ప్రభావంలావాదేవీ రుసుముల పెరుగుదల చిన్న బ్యాంకుల కస్టమర్లపై ఎక్కువ ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే వాటికి తక్కువ సంఖ్యలో ఏటీఎంలు ఉన్నాయి. దీంతో ఆయా బ్యాంకుల ఖాతాదారులు నగదు ఉపసంహరణ కోసం పెద్ద బ్యాంకుల ఏటీఎంలపై ఆధారపడుతున్నారు. ఇప్పుడు ఇలాంటి కస్టమర్లు అధిక ఛార్జీలను భరించాల్సి ఉంటుంది. -
అక్షయ తృతీయ రోజు బంగారు నగలే కొనాలా?
భారత్లో బంగరానికి ఉన్న విలువ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. తరాలుగా పసిడి సంపదకు గుర్తుగా ఉంటోంది. సంపద ఉంటే ఆర్థిక ఇబ్బందులు దరిచేరకుండా హ్యాపీగా ఉండవచ్చు. కాబట్టి ఏటా అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనుగోలు చేయాలని చాలామంది భావిస్తారు. ఆరోజు పసిడి కొంటే ఆ ఏడాదంతా సంపద సొంతం అవుతుందని అనుకుంటారు. రేపు అక్షయ తృతీయ సందర్భంగా సాధారణంగా బంగారం షాపులు కిక్కిరిసిపోతాయి. అయితే బంగారాన్ని కేవలం నగల రూపంలోనే కొనుగోలు చేయాలని చాలామంది అనుకుంటారు. కానీ మార్కెట్లో వివిధ మార్గాల ద్వారా కూడా బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.గోల్డ్ ఈటీఎఫ్ (Gold ETF)ఫిజికల్ గోల్డ్ సొంతం చేసుకోవాలనే ఇబ్బంది లేకుండా బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) మంచి ఎంపిక. గోల్డ్ ఈటీఎఫ్లు ఫిజికల్ గోల్డ్ ధరను ట్రాక్ చేసే ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్. షేర్ల మాదిరిగానే వీటిని స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ట్రేడ్ చేస్తారు. గోల్డ్ ఈటీఎఫ్ ప్రతి యూనిట్ సాధారణంగా ఒక గ్రాము బంగారం లేదా దానిలో కొంత భాగాన్ని సూచిస్తుంది. వీటివల్ల కలిగే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. స్టాక్ ఎక్స్ఛేంజీల్లో సులభంగా కొనడం, విక్రయించడం చేయవచ్చు. ఫిజికల్ గోల్డ్ మాదిరిగా కాకుండా మేకింగ్ ఛార్జీలు లేదా నిల్వ ఖర్చులు ఉండవు. ధరలు నేరుగా బంగారం రేట్లతో ముడిపడి ఉంటాయి. ద్రవ్యోల్బణం, మార్కెట్ అస్థిరతకు వ్యతిరేకంగా పెట్టుబడికి రక్షణ కవచంగా పనిచేస్తుంది. గోల్డ్ ఈటీఎఫ్లను ట్రేడ్ చేయడానికి డీమ్యాట్ ఖాతా అవసరం ఉంటుంది. మార్కెట్లో చాలా స్టాక్ బ్రోకింగ్ కంపెనీల నుంచి ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు.డిజిటల్ గోల్డ్ (Digital Gold)డిజిటల్ గోల్డ్ అనేది భౌతికంగా బంగారాన్ని సొంతం చేసుకోకుండా అందులో పెట్టుబడి పెట్టడానికి ఒక ఆధునిక మార్గం. ఇది ఆన్లైన్లో బంగారాన్ని కొనడానికి, విక్రయించడానికి, నిల్వ చేయడానికి ఉపయోగపడుతుంది. మీరు కొనుగోలు చేసే బంగారానికి సురక్షితమైన వాల్ట్ల్లో నిల్వ చేసిన భౌతిక బంగారం మద్దతుగా నిలుస్తుంది. కనీసం రూ.10 నుంచి ఎప్పుడైనా, ఎక్కడైనా బంగారంపై ఇన్వెస్ట్ చేయవచ్చు. 24 క్యారెట్ల బంగారం నాణ్యతకు సర్టిఫికేట్ ఇస్తారు. ఈ డిజిటల్ గోల్ట్కు బీమా చేసిన వాల్ట్ల ద్వారా భద్రత కల్పిస్తారు. దాంతో దొంగతనం జరుగుతుందేమోనని ఆందోళన చెందనవసరం లేదు. అవసరమైనప్పుడల్లా డిజిటల్ బంగారాన్ని ఫిజికల్ గోల్డ్ లేదా క్యాష్గా మార్చుకోవచ్చు. పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే వంటి ప్లాట్ఫామ్లతోపాటు ప్రముఖ బ్యాంకులు ఈ డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లను అందిస్తున్నాయి. ఎంఎంటీసీ-పీఏఎంపీ, సేఫ్గోల్డ్ ఆగ్మాంట్ గోల్డ్ లిమిటెడ్ వంటి సంస్థలు ఈ పెట్టుబడులకు మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాయి. ఫిజికల్ గోల్డ్ మాదిరిగానే డిజిటల్ గోల్డ్ కూడా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్కు లోబడి ఉంటుంది.ఇదీ చదవండి: భగ్గుమంటున్న పసిడి ధరలు! తులం ఎంతంటే..చివరగా.. అప్పు చేసి వద్దు!అక్షయ తృతీయ మంచి రోజు.. ఏది కొన్నా కలిసి వస్తుందని భావించి అప్పులు చేసి మరీ బంగారం కొనేవారూ ఉన్నారు. కానీ అప్పు చేసి కొంటే రుణాలు పెరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే బంగారం కొనకపోయినా పర్లేదు.. ఉన్నంతలో ఆ రోజున నలుగురికి సాయపడితే.. అంతకు మించిన పుణ్యం మరొకటి ఉండదు! అప్పు మాత్రం చేయకండి. -
బ్యాంకులో క్యాష్ వేస్తున్నారా..? జాగ్రత్త!!
నగదు .. అంటే కరెన్సీ నోట్లను బ్యాంకు అకౌంటులో జమచేయడం మీద ఎన్నో ఆంక్షలు ఉన్నాయి. » పాన్ నెంబర్ వేయకుండా, అంటే అవసరం లేకుండా ఒక వ్యవహారంలో రూ.50,000 దాటకుండా డిపాజిట్ చేయవచ్చు. » అలా అని ఒకరోజు మొత్తంలో రూ. 2 లక్షలు దాటి తీసుకోరు. » ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు డిపాజిట్లు చేసారంటే మీరు జాగ్రత్త పడాలి.ఈ పరిమితిని ఒక ఆంక్షలాగే భావించాలి. మొదటగా పాన్ నెంబర్ ఇవ్వాలి. అంతేకాకుండా సదరు బ్యాంకు బ్రాంచి ఏ పొదుపు ఖాతాలో నగదుగా రూ.10 లక్షలు, అంతకన్నా ఎక్కువగా డిపాజిట్ అయ్యిందో, వారి అకౌంటు వివరాలు... సంవత్సర కాలంలో నగదు మొత్తం ఎంత జమ అయ్యిందో, సమాచారం తెలియజేస్తారు. ప్రతి బ్యాంకుకి వారి వారి పాలసీలు కూడా అమలులో ఉన్నాయి. ఈ క్రింది కేసులు/వ్యవహారాలు గమనించండి.ఈశ్వరరావు పాలబూత్లో కార్డులు, అరువులు కాకుండా రోజూ నగదు రూపేణా రూ.20 వేల అమ్మకాలు ఉండేవి. రోజూ ఉదయం బ్యాంకు తెరవగానే ఆ మొత్తాన్ని డిపాజిట్ చేసేవాడు. ఏడాదికి గాను రూ.72 లక్షలు డిపాజిట్ అయ్యాయి. నోటీసులు వచ్చాయి. నగదుగా చేసిన డిపాజిట్ నుంచి సరఫరా చేసే డైయిరీఫాం వారికి పెద్ద పెద్ద మొత్తాలు చెక్కు/డీడీ రూపంలో చెల్లించేవాడు. డిపాజిట్ చేసిన మొత్తం పాల విక్రయం ద్వారా ఏర్పడింది. కానీ అది నూటికి నూరు పాళ్ళు ఆదాయం కాదు. లాభమూ కాదు. నోటీసులకు జవాబులిచ్చి బయటపడేసరికి తలప్రాణం తోకకి వచ్చింది. ఇలా కొన్ని వ్యాపారాలు/వృత్తుల్లో ప్రైవేటు హాస్పిటల్స్, సినిమా పరిశ్రమ, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం, హోటల్స్, సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్లో నగదు వస్తుంటుంది. తగిన జాగ్రత్త వహించాలి. అలాగే గుడి, గోపురాల్లో కూడా.దామోదర్ రెడ్డికి నగరశివార్లలో ఒక పెద్ద కాంప్లెక్స్, 12 ఫ్లాట్లు ఉన్నాయి. అద్దెలు వస్తున్నాయి. వయస్సు పెద్దది. సమయం, ఓపిక లేదు. అందరూ నగదే చెల్లిస్తున్నారు. అందరిని తన పొదుపు ఖాతాలోకి నగదు రూపంలో డిపాజిట్ చేయమనేవాడు. వారందరూ మాట ప్రకారం అకౌంట్లోనే జమచేసేవారు. లక్షల్లో తేలేది అద్దె ఆదాయం. నోటీసులు తథ్యం. అకౌంటు చేయక తప్పలేదు. వీరభద్రానికి పెద్ద ఇల్లు. నలుగురు పిల్లలు. భారీ సంపాదన. అంతా చెక్కు రూపంలోనే స్వీకరించేవారు. నగదు విత్డ్రా చేయడం ఖర్చులన్నీ పోగా మిగిలిన మొత్తాన్ని నగదు ద్వారా బ్యాంకులో డిపాజిట్ చేసేవారు. ఇలా చేసిన డిపాజిట్లు రూ.10 లక్షల దాటాయి. నోటీసులు... కథా కమామీషు.👉ఇది చదివారా? బంగారం భారీగా పడిపోతుంది: గోల్డ్ మైనర్ అంచనాహస్తవాసి ఉన్న డాక్టర్ ఆనంద్రావు ఖాతాలు, ఎన్నో గుళ్లు గోపురాలు ప్రతిష్ట చేసిన బ్రహ్మ గారి ఖాతాలు, లంచాలు లాగి.. లాగి అమాయకంగా బ్యాంకులో నగదు డిపాజిట్ చేసిన లంచావతారం ఖాతాలు, అదర్శ రైతు అవార్డు పొందిన రైతుగా తన వ్యవసాయ ఆదాయాన్ని బ్యాంకు అకౌంటులో డిపాజిట్ చేసిన నాగయ్య, ఎన్నో ఇళ్లు కట్టిన మేస్త్రిగా మంచి పేరు పొందిన కొండయ్య, బొటిక్ పెట్టి మంచి పేరుతో డబ్బులు సంపాదించి బ్యాంకులో డిపాజిట్ చేసిన రాణి, కేటరింగ్తో లక్షలు సంపాదించి నగదు డిపాజిట్ చేసిన శ్రీను.. ఇలా ఎందరో నగదు డిపాజిట్దారులు.. ఎన్నెన్నో కథలు. ప్రయివేటు చిట్టీల్లో వచ్చిన మొత్తాలు... భూములు, పొలాలు, ఇండ్లు అమ్మగా వచ్చిన మొత్తాలు... స్నేహితులు, చుట్టాలు ఇచ్చిన రుణాలు... అప్పులు... ఇలా ఎంతమందినైనా చెప్పవచ్చు. ఎన్నో వ్యవహారాలు ప్రస్తావించవచ్చు. అన్నీ డిపాజిట్ల ఆదాయం కాకపోవచ్చు. సరైన, సమగ్రమైన, సంతృప్తికరమైన వివరణ ఇస్తే బయపడవచ్చు. లేదంటే ఈ డిపాజిట్లలో నగదును ఆదాయంగా భావించే ప్రమాదం ఉంది. 1.4.2024 నుంచి 31.3.2025 మధ్య ఇటువంటి డిపాజిట్లు ఉంటే విశ్లేషించుకోండి. విషయాన్ని బయటపెట్టండి. ::కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య, ట్యాక్సేషన్ నిపుణులుపన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు. -
నా బడ్జెట్కు 50-30-20 రూల్ సరిపోతుందా?
మూడు నుంచి ఐదేళ్ల కాలానికి.. కార్పొరేట్ ఫండ్స్, షార్ట్ డ్యురేషన్ ఫండ్స్, పీఎస్యూ ఫండ్స్లో ఏది అనుకూలం? – మంజునాథ్ కార్పొరేట్ బాండ్ ఫండ్స్ 80 శాతం అధిక క్రెడిట్ రేటింగ్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. బ్యాంకింగ్ అండ్ పీఎస్యూ ఫండ్స్ 80 శాతం బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. వీటితోపాటు షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ అన్ని రకాల పరిస్థితుల్లోనూ అనుకూలమైనవి. దీర్ఘకాలంలో వీటిలోని రిస్క్–రాబడులు ఇంచుమించు ఒకే మాదిరి ఉంటాయి.ఇన్వెస్టర్లు రెండు కారణాల దృష్ట్యా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ను ఎంపిక చేసుకోవచ్చు. ఇవి వివిధ రకాల డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. వైవిధ్యం ఎక్కువ. మెచ్యూరిటీ కాలంపై స్పష్టత ఉంటుంది. ఏడాది కాలానికి మించిన లక్ష్యాల కోసం, డెట్ విభాగంలో షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి.ఇంటి బడ్జెట్ విషయంలో 50–30–20 ఆర్థిక సూత్రం గురించి విన్నాను. నా ఆర్థిక అంశాలకు ఇది మంచి సూత్రమేనా? – కరణ్ రాథోడ్మీ నెలవారీ ఆదాయాలను ఏ రకంగా వర్గీకరించాలన్నది ఈ సూత్రం తెలియజేస్తుంది. ఆదాయంలో 20 శాతాన్ని అవసరాల కోసం కేటాయించాలి. అంటే ఇంటి అద్దె, గ్రోసరీ, విద్యుత్, ఈఎంఐలు, స్కూల్ ఫీజులు అన్నీ కలిపి 50 శాతానికే పరిమితం కావాలి. ఆదాయంలో 30 శాతాన్ని కోరికల కోసం కేటాయించుకోవచ్చు. అంటే రెస్టారెంట్లలో విందులు, ఓటీటీ చందాలు, విహార యాత్రలు, షాపింగ్, ఇతర హాబీల కోసం కేటాయింపులు 30 శాతం మించకూడదు. ఇక మిగిలిన 20 శాతాన్ని పొదుపు కోసం కేటాయించాలి.మీ ఆర్థిక అంశాలను సులభంగా నిర్వహించుకునేందుకు ఇది అనుకూలిస్తుంది. ముఖ్యంగా వేతన జీవులు, అప్పుడే కెరీర్ ఆరంభించిన వారికి ఇది ఎంతో సులభం. కాకపోతే ఇదొక సాధారణ సూత్రమే కానీ, అందరికీ అనుకూలమని చెప్పలేం. వ్యక్తిగత ఆదాయం, జీవన వ్యయాలు, బాధ్యతలు ఇవే ఒకరి బడ్జెట్ను నిర్ణయించేవి.ఉదాహరణకు ఒక నగరానికి చెందిన యువ ఉద్యోగి నెలకు రూ.40,000 సంపాదిస్తున్నాడని అనుకుందాం. పెద్ద నగరం కావడంతో అద్దెకు, రవాణా కోసమే నెల జీతంలో సగం ఖర్చు చేయాల్సి వస్తుంది. అప్పుడు కోరికలు, పొదుపు కోసం మిగిలేదేమీ ఉండదు. అదే రూ.2 లక్షలు సంపాదిస్తున్న వ్యక్తి అయితే ఆదాయంలో 30–35 శాతంతోనే అవసరాలను తీర్చుకోవడం సులభం. అప్పుడు పొదుపు చేయడానికి 30–40 శాతం మిగులు ఉంటుంది. కనీసం 20 శాతం పొదుపు ఎవరైనా సరే బడ్జెట్ ఆరంభించేందుకు 50–30–20 సూత్రం మంచి ఫలితమిస్తుంది. మీ జీవన అవసరాలు ఆదాయాన్ని మించకుండా చూసుకోవాలి. అలాగే, ఆదాయంలో కనీసం 20 శాతాన్ని పొదుపు చేయాలి. కోరికల విషయంలో కొంత రాజీ పడినా సరే పొదుపును కొనసాగించాలి.ఎలా ఆరంభించాలో తెలియకపోతే అప్పుడు ఆదాయంలో 20 శాతాన్ని పెట్టుబడులకు మళ్లించే విధంగా ఆటోమేట్ చేసుకోవాలి. అగ్రెస్సివ్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్లేలా సిప్ పెట్టుకోవాలి. మొదట పొదుపు, పెట్టుబడి తర్వాతే ఖర్చులకు వెళ్లాలి. స్థిరమైన పొదుపు, వివేకంతో చేసే ఖర్చుతో మీ ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. సమాధానాలు:: ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఈపీఎఫ్ క్లెయిమ్కు వెళ్తున్నారా..?
వేతన జీవుల్లో అధిక శాతం మందికి నెలవారీ ఖర్చులు ఆదాయాన్ని మించుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రుణాలను ఆశ్రయిస్తున్నారు. దీని ఫలితమే పర్సనల్, క్రెడిట్ కార్డ్, బంగారం రుణాలు గడిచిన కొన్నేళ్లలో గణనీయంగా పెరిగిపోవడం చూస్తున్నాం. కానీ, ఒక్కసారి ఈ రుణ చక్రంలోకి దిగితే.. అది అంత తొందరగా విడిచిపెట్టదు. అందుకే దీనికి ప్రత్యామ్నాయాలను పరిశీలించాలి. ఇటీవలి కాలంలో వేతన జీవుల నుంచి భవిష్యనిధి క్లెయిమ్లు పెరగడం చూస్తున్నాం. అత్యవసరాల్లో ఈపీఎఫ్ నుంచి పాక్షిక ఉపసంహరణ అవకాశాన్ని ఉద్యోగులు వినియోగించుకుంటున్నారు. నిర్దేశిత అర్హతలు, నిబంధనల మేరకే ఈపీఎఫ్ క్లెయిమ్ చేసుకోగలరు. ఈ విషయంలో ఎలా వ్యవహరించాలన్న దానిపై నిపుణులు అందిస్తున్న సమాచారం ఇది... ‘ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్’ (ఈపీఎఫ్) వేతన జీవుల భవిష్యత్ లక్ష్యాల కోసం ఉద్దేశించిన సాధనం అని అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ముఖ్యంగా రిటైర్మెంట్ అవసరాల కోసం దీన్ని ఏర్పాటు చేశారు. అదే సమయంలో సొంతిల్లు, వైద్య అవసరాల్లోనూ దీన్ని వినియోగించుకోవచ్చు. భవిష్యత్ లక్ష్యాల కోసం ఉద్దేశించిన ఈ నిధిని తాత్కాలిక అవసరాల కోసం ఖాళీ చేయడం మంచి నిర్ణయం అనిపించుకోదు. కానీ, ఆర్థిక, అత్యవసర పరిస్థితుల్లో కొందరు ఉద్యోగులకు మరో ప్రత్యామ్నాయం లేకపోవచ్చు. ఖర్చులు ఆదాయాన్ని మించినప్పుడు.. రుణాలు తీసుకోవడం వల్ల చెల్లింపులు భారంగా మారతాయి. కనుక విశ్రాంత జీవనం కోసం ప్రత్యామ్నాయ ప్రణాళిక కలిగిన వారు.. విద్య, వైద్యం, వివాహం వంటి అత్యంత ముఖ్యమైన, క్లిష్టమైన అవసరాల్లో ఈపీఎఫ్ క్లెయిమ్ను పరిశీలించొచ్చు. అలాంటి సందర్భాల్లో ఎంత మేర వెనక్కి తీసుకోవచ్చు? అర్హతల గురించి ఉద్యోగులకు తప్పక అవగాహన ఉండాలి. ఏ అవసరానికి ఎంత? వివాహం లేదా ఉన్నత విద్య కోసం ఈపీఎఫ్ నిధిని వినియోగించుకోవాలంటే కఠిన నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఉద్యోగి కనీసం ఏడేళ్ల పాటు ఈపీఎఫ్ సభ్యుడు/సభ్యురాలిగా ఉంటేనే ఈ అవసరాల కోసం క్లెయిమ్ చేసుకునేందుకు అర్హత లభిస్తుందని ప్రావిడెంట్ ఫండ్ మాజీ ప్రాంతీయ కమిషనర్ సంజయ్ కేసరి తెలిపారు. ఉద్యోగంలో చేరిన తేదీ క్లెయిమ్ తేదీకి ఏడేళ్ల ముందు అయి ఉండాలన్నారు. ఈ నిబంధనలో ఎలాంటి వెసులుబాటు ఉండదు. తన సర్విస్ మొత్తంలో ఉన్నత విద్య (పదో తరగతి తర్వాత చదువులు), వివాహ అవసరాల కోసం కలిపి మూడు పర్యాయాలు ఉపసంహరణకు వెళ్లొచ్చు. ఒకవేళ వైద్యం కోసం అయితే సర్విస్తో సంబంధం లేకుండా క్లెయిమ్కు వెళ్లొచ్చు. గరిష్టంగా క్లెయిమ్ ఇన్ని సార్లు అన్న పరిమితి అయితే లేదు. వివాహం ఉద్యోగి తన సొంత వివాహం కోసం, తన తోడ బుట్టిన వారి వివాహం కోసం, తన పిల్లల వివాహాల కోసం పీఎఫ్ నిధిని పొందొచ్చు. కనీసం ఏడేళ్ల సర్వీస్ ఉండాలి. ఉద్యోగి వాటాల రూపంలో జమలు, వడ్డీ నుంచి 50 శాతం ఉపసంహరించుకోవచ్చు. వైద్యం సభ్యుడు, అతను/ఆమె జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, తన పిల్లల వైద్యం కోసం తీసుకోవచ్చు. వైద్య అవసరాలకు కనీస సర్వీస్ నిబంధన వర్తించదు. ఎన్ని పర్యాయాలు ఉపసంహరించుకోవచ్చన్న పరిమితి లేదు. ఉద్యోగి స్వీయ జమల రూపంలో పోగైన మొత్తం, వడ్డీ లేదా.. నెలవారీ మూలవేతనం, డీఏకి ఆరు రెట్లు.. ఈ రెండింటిలో ఏది తక్కువ అయితే అంత మేరకు వెనక్కి తీసుకోవచ్చు. ఇల్లుప్లాట్ కొనుగోలు లేదా ఇల్లు/ఫ్లాట్ నిర్మాణం, కొనుగోలు కోసం ఉద్యోగి తన జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే పీఎఫ్ క్లెయిమ్కు వెళ్లొచ్చు. కనీసం ఐదేళ్ల సర్వీస్ను పూర్తి చేసి ఉండాలి. ఉద్యోగి సొంతంగా లేదా జీవిత భాగస్వామితో కలసి జాయింట్గా ప్రాపర్టీ కొనుగోలు చేయడం లేదా కలిగి ఉండడం తప్పనిసరి. ప్లాట్ కొనుగోలుకు అయితే నెల జీతానికి 24 రెట్లు.. ఇల్లు కొనుగోలు లేదా ఇంటి నిర్మాణం కోసం అయితే నెలవారీ జీతానికి 36 రెట్లు.. లేదా ఉద్యోగి, యాజమాన్యం జమలు, వీటిపై వడ్డీ మొత్తం.. లేదా కొనుగోలు/నిర్మాణ వ్యయం.. ఇందులో ఏది తక్కువ అయితే ఆ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. గృహ నవీకరణ ఇల్లు నిర్మించుకున్న ఐదేళ్ల తర్వాత అనుమతిస్తారు. ఉద్యోగి నెలవారీ మూలవేతనం, డీఏకి 12 రెట్ల వరకు తీసుకోవచ్చు. లేదా ఉద్యోగి స్వీయ జమలు, వాటిపై వడ్డీ.. లేదా నవీకరణకు అయ్యే వ్యయం.. ఈ మూడింటిలో తక్కువ మొత్తాన్నే అనుమతిస్తారు. గృహ రుణం తీర్చివేసేందుకు కనీసం మూడేళ్ల సర్విస్ పూర్తి చేసి ఉండాలి. బ్యాలన్స్ నుంచి 90% వెనక్కి తీసుకోవచ్చు. విద్య తన కుమారుడు లేదా కుమార్తెల ఉన్నత విద్య కోసమే భవిష్య నిధి నుంచి పాక్షిక ఉపసంహర ణకు అనుమతిస్తారు. కనీసం ఏడేళ్ల సర్విస్ ఉండాలి. ఉద్యోగి జమలు, వడ్డీ మొత్తం నుంచి 50 శాతాన్ని తీసుకోవచ్చు. ఇలా 3 పర్యాయాలు ఉపసంహరించుకోవచ్చు. ఈ 3 సార్లు అన్న పరిమితి వివాహం, విద్యకు కలిపి వర్తిస్తుంది. ఉద్యోగం కోల్పోయిన పరిస్థితుల్లో.. ఒకచోట ఉద్యోగం కోల్పోవడం లేదంటే మానివేసి.. నెల రోజులకు పైగా మరో ఉపాధి లేని పరిస్థితుల్లో పీఎఫ్ బ్యాలన్స్ నుంచి 75 శాతాన్ని ఉపసంహరించుకోవచ్చు. ఉపాధి లేకుండా రెండు నెలలు దాటిపోతే అప్పుడు మిగిలిన 25 శాతాన్ని కూడా వెనక్కి తీసేసుకోవడానికి నిబంధనలు అనుమతిస్తున్నాయి. ఒక సంస్థలో ఉద్యోగం మానేశామన్న కారణంతో పీఎఫ్ ఖాతాను ఖాళీ చేయాలనేమీ లేదు. మరో సంస్థలో చేరిన తర్వాత పీఎఫ్ ఖాతాను బదిలీ చేసుకోవచ్చు. తద్వారా అందులో ప్రయోజనాలను అలాగే కొనసాగించుకోవచ్చు.ఉపసంహరణ ఎలా..? ఆన్లైన్ క్లెయిమ్ ప్రక్రియను ఈపీఎఫ్వో ఎంతో సులభతరం చేసింది. ఈపీఎఫ్ ఇండియా పోర్టల్కు వెళ్లి కుడి భాగంలో పైన కనిపించే ‘ఆన్లైన్ క్లెయిమ్స్’ దగ్గర క్లిక్ చేయాలి. ఆ తర్వాత ప్రత్యేక విండో తెరుచుకుంటుంది. అక్కడ ‘యూఏఎన్’ నంబర్, పాస్వర్డ్ నమోదు చేసి, మొబైల్కు వచ్చే ఓటీపీతో లాగిన్ అవ్వాలి. లాగిన్ పూర్తయిన తర్వాత పైన కనిపించే ఆప్షన్లలో ‘ఆన్లైన్ సర్విసెస్’ సెక్షన్లో ‘క్లెయిమ్ ఫారమ్’ను ఎంపిక చేసుకోవాలి. అక్కడ యూఏఎన్కు లింక్ చేసిన బ్యాంక్ ఖాతా నంబర్ను నమోదు చేసి ధ్రువీకరించాలి. అక్కడ పీఎఫ్ అడ్వాన్స్ను సెలక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత సెలక్ట్ సర్వీస్ దగ్గర పనిచేస్తున్న సంస్థను ఎంపిక చేసుకోవాలి. దాని కింద క్లెయిమ్ దేనికోసమన్న కారణాన్ని ఎంపిక చేసుకోవాలి. అనంతరం అక్కడ కోరిన వివరాలు ఇచ్చి దరఖాస్తును సమర్పించాలి. చివరిగా మొబైల్కు వచ్చే ఓటీపీని నమోదు చేసిన అనంతరం అది విజయవంతంగా దాఖలవుతుంది. క్లెయిమ్ దరఖాస్తు పురోగతిని సైతం ఇదే మాదిరి లాగిన్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. పరిశీలన కోసం చెక్ కాపీని స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి రావచ్చు. కనుక ముందే సిద్ధం చేసుకోవాలి. సంబంధిత చెక్ లీఫ్పై సభ్యుడి పేరు, బ్యాంక్ ఖాతా తదితర వివరాలు ఉండాలి. ఉమంగ్ యాప్ నుంచి కూడా క్లెయిమ్ దాఖలు చేసుకోవచ్చు. అదే ఆఫ్లైన్లో క్లెయిమ్ దరఖాస్తు సమర్పించేందుకు, కావాల్సిన అన్ని డాక్యుమెంట్లతో సమీపంలోని ఈపీఎఫ్వో కార్యాలయానికి వెళితే సరిపోతుంది. అక్కడ విత్డ్రాయల్ ఫారమ్ పూరించి, వారు కోరినట్టు డాక్యుమెంట్లను జత చేసి సమర్పించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో క్లెయిమ్ దరఖాస్తు 3–4 రోజుల్లో పరిష్కారం అవుతుంది. క్లెయిమ్ రూ. లక్ష లోపు ఉంటే ఆటోమేటిక్గా అనుమతి లభిస్తుంది. ఆఫ్లైన్లో ఇందుకు 10–20 రోజులు పట్టొచ్చు. ఈపీఎఫ్ ఖాతా నుంచి ఉపసంహరించుకున్న నిధులను, రుణం కాదు కనుక తిరిగి జమ చేయాల్సిన అవసరం లేదు. అలాగే, ఈపీఎఫ్ బ్యాలన్స్పై ఎలాంటి రుణ సదుపాయం లేదు. → క్లెయిమ్ భారీగా ఉంటే అప్పుడు విద్యార్హత సర్టిఫికెట్లు లేదా వైద్య డాక్యుమెంట్ల కాపీలు అప్లోడ్ చేయాల్సి రావచ్చు. → అర్హతలు, పరిమితులను ఒక్కసారి సమగ్రంగా తెలుసుకోవాలి. ముఖ్యమైన అవసరాల్లోనే ఈపీఎఫ్ను వివేకంగా ఉపయోగించుకోవాలన్నది నిపుణుల సూచన. → ఈపీఎఫ్ క్లెయిమ్కు వెళ్లే ముందు తమ కేవైసీ వివరాలు సరిగ్గా ఉన్నాయేమో ఒక్కసారి సరిచూసుకోవాలి. అంటే బ్యాంక్ ఖాతా వివరాలు, ఆధార్, పాన్ వివరాలు నమోదు చేసి, ధ్రువీకరించి ఉండాలి. దీనివల్ల క్లెయిమ్ దరఖాస్తు తిరస్కరణకు గురికాకుండా ఉంటుంది. 54 ఏళ్లు నిండితే..54 ఏళ్లు నిండిన తర్వాత, ముందస్తు పదవీ విరమణ/వయోభారం రీత్యా విరమణ చేసిన వారు 58 ఏళ్లు రాకముందే మొత్తం పీఎఫ్ బ్యాలన్స్లో 90 శాతాన్ని ఉపసంహరించుకోవచ్చు.పన్ను భారం? ఈపీఎఫ్ ఖాతా ప్రారంభించిన ఐదేళ్ల తర్వాత ఉపసంహరణకు వెళితే ఆ మొత్తంపై ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. ఒకవేళ సర్విస్ ఐదేళ్లలోపు ఉండి, ఉపసంహరించుకునే మొత్తం రూ.50,000 మించితే అప్పుడు దీనిపై 10 శాతం టీడీఎస్ మినహాయిస్తారు. పాన్ నంబర్ ఇవ్వకపోతే 20 శాతం టీడీఎస్ పడుతుంది. ఐదేళ్లలోపు రూ.50 వేలకు మించి ఉపసంహరించుకుంటే ఆ మొత్తాన్ని వార్షిక ఆదాయానికి కలిపి చూపించి నిబంధనల మేరకు పన్ను చెల్లించాల్సి వస్తుంది. పన్ను పరిధిలోకి రాకపోతే, పీఎఫ్పై మినహాయించిన టీడీఎస్ను రిఫండ్ కోరొచ్చు. ఒకవేళ ఉద్యోగం నుంచి తొలగింపునకు గురై లేదా కంపెనీ మూసివేసిన కేసుల్లో ఉద్యోగులు పీఎఫ్ నిధిని ఉపసంహరించుకుంటే, అప్పుడు సర్విస్ ఐదేళ్లలోపు ఉన్నా సరే ఆ మొత్తం పన్ను పరిధిలోకి రాదు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
అలాంటి బ్యాంక్ అకౌంట్స్ వెంటనే క్లోజ్ చేసుకోండి
సాధారణంగా చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. అయితే.. అందులో ఒకటి లేదా రెండు మాత్రమే ఉపయోగిస్తుంటారు. మిగిలినవన్నీ వృధా అన్న మాట. ఇలా వదిలేయడం వల్ల.. కొన్ని నష్టాలు భరించాల్సి ఉంటుంది. ఈ కథనంలో అలాంటి నష్టాలేమిటో తెలుసుకుందాం..బ్యాంక్ చార్జీలుఒక బ్యాంకులో అకౌంట్ ఉందంటే.. అందులో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయాల్సిందే. ఒకవేళా మినిమమ్ బ్యాలెన్స్ లేకుండా ఉంటే.. వాటిపై బ్యాంక్ చార్జీలు వసూలు చేస్తుంది. కొన్ని సార్లు మైనస్ బ్యాలెన్స్లోకి కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. ఆ తరువాత లావాదేవీలు చేయాలంటే.. ముందు మైనస్ బ్యాలెన్స్ క్లియర్ చేయాల్సిందే.డబ్బు వృధాబ్యాంక్ అకౌంట్ ఉపయోగించకుండా.. అలాగే వదిలేస్తే అందులో ఉన్న మినిమమ్ బ్యాలెన్స్ వంటివి వృధా అవుతాయి. మీకు ఓ ఐదు అకౌంట్స్ ఉన్నాయనుకుంటే.. అందులో మీరు కేవలం ఒకదాన్ని మాత్రం వాడుతూ.. మిగిలినవి ఉపయోగించకుండా వదిలేస్తే అందులో ఉన్న డబ్బు వృధా అయినట్టే. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఎక్కువ అకౌంట్స్ మెయింటెన్సన్ చేయకుండా ఉండటమే ఉత్తమం.ఇదీ చదవండి: ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం.. ఒకేరోజు 52 కార్ల డెలివరీమోసాలకు అవకాశంటెక్నాలజీ పెరుగుతున్న సమయంలో మోసాలు ఎక్కువవుతున్నాయి. మీరు ఉపయోగించకుండా ఉంటే.. అలాంటి అకౌంట్లను కొందరు సైబర్ నేరగాళ్లు ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఇవి మిమ్మల్ని చిక్కుల్లో పడేసే అవకాశం ఉంది. కాబట్టి బ్యాంక్ అకౌంట్ వృధాగా ఉన్నా.. అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. లేదా క్లోజ్ చేసుకోవడం మంచిది.సిబిల్ స్కోరుపై ప్రభావంబ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా లేకుంటే.. మైనస్ బ్యాలెన్స్లోకి వెళ్ళిపోతుంది. అంటే దీనర్థం మీరు బ్యాంకుకు అప్పు ఉన్నారన్నమాట. ఇది మీ క్రెడిట్ స్కోర్ మీద ప్రభావం చూపిస్తుంది. దీంతో సిబల్ స్కోర్ తగ్గిపోతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే.. యాక్టివ్గా ఉన్న అకౌంట్స్ కాకుండా.. మిగిలినవన్నీ వెంటనే క్లోజ్ చేసుకోవాలి. -
రిటైర్ అవుతున్నారా? రూ.5 కోట్లు సరిపోవు!
ఆరుపదుల వయసులో రిటైర్ అవ్వాలంటే భారత్లాంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో ఎంత కార్పస్ కావాలో తెలుసా? పెరుగుతున్న ద్రవ్యోల్బణం, రూపాయి విలువ తగ్గడం, ఖర్చులు పెరగడం.. వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ సార్థక్ అహుజా ఇటీవల లింక్డ్ఇన్ పోస్ట్లో అందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. రిటైర్మెంట్ ప్లాన్కు సరిపడా డబ్బుకు సంబంధించి ఆన్లైన్లో అందుబాటులో ఉండే అంచనాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలిపారు.‘ఈ రోజు ఇండియాలో రిటైర్ కావడానికి ఎంత డబ్బు అవసరమో తెలిస్తే షాక్ అవుతారు. దేశంలో చాలా రిటైర్మెంట్ పోర్ట్ఫోలియోలు ఈక్విటీలు, ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలోనే ఉంటున్నాయి. కొందరు దీన్ని తొందరగా క్యాష్ చేసుకునేందుకు వీలుగా ఈక్విటీ, డెట్ ఫండ్స్ల్లోకి మళ్లిస్తున్నారు. ఈక్విటీ నుంచి 12–14 శాతం, డెట్ నుంచి 5–7 శాతం కలిపి ఏడాదికి 10% మిశ్రమ రాబడిని అంచనా వేస్తున్నారు. క్రమంగా పన్నులు, ద్రవ్యోల్బణం పెరుగుతున్నాయి. రిటైర్మెంట్ సమయంలో పెట్టుబడి ఆదాయంపై 20 శాతం పన్ను విధించడం, ద్రవ్యోల్బణం ఏటా మరో 6 శాతం ఉంటుండడంతో వాస్తవ రాబడులు గణనీయంగా తగ్గిపోతున్నాయి. రిటైర్మెంట్ ఫండ్పై కేవలం 2% నికర రియల్ రిటర్న్ మాత్రమే వస్తుంది’ అని చెప్పారు.ఇదీ చదవండి: ధోనీ కంపెనీలో 200 మందికి లేఆఫ్స్‘భారత్లో పదవీ విరమణ పొందిన తర్వాత సౌకర్యవంతమైన జీవనశైలి కోసం ప్రస్తుతానికి నెలకు కనీసం రూ.1.5 లక్షలు అవసరమవుతాయి. ఏటా మీకు రూ.20 లక్షలు అవసరం. 2% రియల్ రిటర్న్స్ అంటే.. మీ రిటైర్మెంట్ కార్పస్ కనీసం రూ.10 కోట్లు ఉండాలి. మీరు లగ్జరీగా జీవించాలంటే ఇది ఏమాత్రం సరిపోదు. హాయిగా బతకాలనుకుంటే ఇంకా ఎక్కువ లక్ష్యం పెట్టుకోవాలి. మీ రిటైర్మెంట్ ఫండ్ వార్షిక ఖర్చుకు 50 రెట్లు ఉండాలి. అంటే మీ కుటుంబం ఏటా రూ.10 లక్షలు ఖర్చు చేయాలంటే రూ.5 కోట్లు కావాలి. ఏడాదికి రూ.20 లక్షలు అంటే రూ.10 కోట్లు అవసరం’ అని తెలిపారు. -
బాలికల ప్రత్యేక స్కీమ్.. వడ్డీ రేటు మారిందా?
సుకన్య సమృద్ధి యోజన (SSY) దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన చిన్న పొదుపు పథకాలలో ఒకటి. ఆడపిల్లల చదువు, వివాహం కోసం పొదుపు చేసే తల్లిదండ్రులకు ఈ పథకం అధిక వడ్డీ ఇస్తుంది. వచ్చే రాబడులపై కూడా పన్ను ఉండదు. బేటీ బచావో, బేటీ పడావో కార్యక్రమం కింద భారత ప్రభుత్వం ఈ పథకానికి సార్వభౌమ గ్యారంటీని అందిస్తోంది.సుకన్య సమృద్ధి యోజన వడ్డీ తగ్గిస్తున్నారా?సుకన్య సమృద్ధి యోజన సహా చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను ప్రభుత్వం ప్రతి త్రైమాసికానికి సమీక్షిస్తుంది. ఈ నేపథ్యంలో 2025 ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు మారిందా అన్న సందేహం చాలా మందిలో ఉంది. కానీ సుకన్య సమృద్ధి యోజనపై వడ్డీ రేటును ప్రభుత్వం మార్చలేదు. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఈ పథకం కింద డిపాజిట్లపై సంవత్సరానికి 8.2 శాతం లభిస్తుంది. పోస్టాఫీసు పొదుపు పథకాలలో ఇదే అత్యధికం. ఈ పథకానికే కాదు ప్రస్తుత త్రైమాసికంలో ఏ చిన్న పొదుపు పథకానికి ప్రభుత్వం వడ్డీ రేటును మార్చకపోవడం గమనార్హం.గరిష్ట, కనిష్ట డిపాజిట్లు..సుకన్య సమృద్ధి యోజన కింద, డిపాజిట్లు నిర్దిష్ట నిబంధనలకు లోబడి ఉంటాయి. కనీసం రూ.250 ప్రారంభ డిపాజిట్తో ఈ ఖాతాను తెరవవచ్చు. కాబట్టి ఇది ఎక్కువ కుటుంబాలకు అందుబాటులో ఉంటుంది. ఖాతా యాక్టివ్గా ఉండాలంటే ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ .250 అయినా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ స్కీమ్లో ఒక ఆర్థిక సంవత్సానికి గరిష్టంగా రూ .1.5 లక్షలు డిపాజిట్ చేయొచ్చు. డిపాజిటర్లు తమ సౌలభ్యాన్ని బట్టి ఏకమొత్తంలో లేదా నెలవారీ వాయిదాల ద్వారా పొదుపు జమ చేసుకోవచ్చు.విత్డ్రా ఎప్పుడు?సుకన్య సమృద్ధి ఖాతా తెరిచిన 21 సంవత్సరాల తరువాత మెచ్యూరిటీ అవుతుంది. ఈ సమయంలో ఖాతాను క్లోజ్ చేసి, వడ్డీతో సహా పూర్తి బ్యాలెన్స్ పొందవచ్చు. ప్రత్యామ్నాయంగా, అమ్మాయి వివాహం తర్వాత లేదా ఆమెకు 18 ఏళ్లు వచ్చాక ఖాతాను మూసివేయవచ్చు. మెచ్యూరిటీ తర్వాతే నిధులు తీసుకునేందుకు వీలున్నప్పటికీ బాలిక చదువు కోసం అంతకుముందే పాక్షిక ఉపసంహరణకు అవకాశం ఉంది.బాలికకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత లేదా పదో తరగతి పూర్తయిన తర్వాత ఏది ముందయితే అది కొంత మేర నిధులు విత్డ్రా చేసుకోవచ్చు. ఉపసంహరణ మొత్తం గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి అందుబాటులో ఉన్న బ్యాలెన్స్లో 50% వరకు ఉంటుంది. దీన్ని వన్ టైమ్ ఏకమొత్తంగా లేదా ఐదేళ్లకు మించకుండా సంవత్సరానికి ఒకటి చొప్పున వాయిదాల్లో పొందవచ్చు. -
పీఎఫ్ ఖాతా బదిలీ.. ఈపీఎఫ్వో గుడ్న్యూస్!
న్యూఢిల్లీ: ఒక సంస్థలో ఉద్యోగం వీడి, మరో సంస్థలో చేరిన సందర్భాల్లో భవిష్యనిధి (పీఎఫ్) ఖాతాను ఆన్లైన్లో సులభంగా బదిలీ చేసుకునే దిశగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు కొన్ని రకాల అనుమతులను తొలగించింది.‘‘ఇప్పటి వరకు పీఎఫ్ ఖాతా బదిలీ రెండు ఈపీఎఫ్ కార్యాలయాలతో ముడిపడి ఉండేది. ఇందులో ఒకటి పీఎఫ్ జమలు జరిగిన (సోర్స్) ఆఫీస్. ఈ మొత్తం మరో ఈపీఎఫ్ కార్యాలయం పరిధిలో (డెస్టినేషన్ ఆఫీస్)కి బదిలీ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసే లక్ష్యంతో క్లెయిమ్ల బదిలీకి డెస్టినేషన్ ఆఫీస్ అనుమతుల అవసరాలను తొలగించాం. ఇందుకు సంబంధించి పునరుద్ధరించిన ఫామ్ 13 సాఫ్ట్వేర్ను అమల్లోకి తెచ్చాం. ఇక నుంచి క్లెయిమ్లకు సోర్స్ ఆఫీస్ నుంచి అనుమతి లభించగానే, సభ్యుడి/సభ్యురాలి పీఎఫ్ ఖాతా ప్రస్తుత కార్యాలయం పరిధిలోకి మారిపోతుంది’’అని కేంద్ర కార్మిక శాఖ తెలిపింది. -
ఐటీఆర్ ఫైలింగ్కు వేళాయే..
గడిచిన 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి సమయం ఆసన్నమైంది. దీనికి సంబంధించి ఆదాయపు పన్ను శాఖ త్వరలో ఆన్లైన్ ఫైలింగ్ పోర్టల్ను ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో రిటర్న్స్ ఎప్పుడు దాఖలు చేయాలి, గడువు ఎప్పుడు, రిఫండ్ను ఎప్పుడు పొందే అవకాశం ఉందనే అంశాల గురించి తెలుసుకుంది.ఐటీఆర్ను ఎప్పుడు ఫైల్ చేయవచ్చు?ఆన్లైన్ పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత 2025-26 మదింపు సంవత్సరానికి మీ ఐటీఆర్ను సమర్పించవచ్చు. ఇంకా దీనికి సంబంధించిన ధ్రువీకరణ తేదీని అధికార వర్గాలు వెల్లడించలేదు. అయినప్పటికీ ఆదాయ పన్ను శాఖ సాధారణంగా ఏటా ఏప్రిల్ నాటికి ఐటీఆర్ ఫారాలను అందుబాటులో ఉంచుతుంది. ఫారాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్సైట్ ద్వారా తమ రిటర్నులను ఈ-ఫైలింగ్ చేయడం ప్రారంభించవచ్చు.ఐటీఆర్ నమోదు చేయడానికి చివరి తేదీ ఏమిటి?గత ఏడాది షెడ్యూల్ ప్రకారం జరిమానా లేకుండా రిటర్న్స్ దాఖలు చేయడానికి చివరి తేదీ జులై 31, 2024గా నిర్ణయించారు. జరిమానాలతో ఆలస్యంగా రిటర్న్స్ దాఖలు చేయడానికి డిసెంబర్ 31 వరకు అనుమతించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటికైతే ఎలాంటి ప్రకటన రాలేదు.రిఫండ్లు ఎప్పుడు పొందవచ్చు?రిఫండ్ ప్రక్రియను ఆదాయపు పన్ను శాఖ మరింత సులభతరం చేసింది. చాలా మంది పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్స్ దాఖలు చేసిన వారం నుంచి 20 రోజుల్లో వారి రిఫండ్లను పొందేందుకు వీలు కల్పిస్తున్నారు. అయితే పన్ను చెల్లింపుదారులు దాఖలు చేసిన రిటర్నుల్లో ఎలాంటి దోషాలు ఉండకూడదు. ఫైలింగ్ సమయంలో ఆధార్ ఓటీపీతో ధ్రువీకరించాలి. బ్యాంక్ ఖాతాను ముందుగా నమోదు చేసి పాన్తో లింక్ చేసుకోవాలి.ఇదీ చదవండి: అవి ‘అల్లం’.. ఇవి ‘బెల్లం’!కీలక డాక్యుమెంట్లు ఏమిటి?మీ రిటర్న్ను సజావుగా, వేగంగా దాఖలు చేయడానికి అవసరమైన అన్ని పత్రాలను ముందుగానే సేకరించుకోవడం చాలా ముఖ్యం. ఇందులో పాన్ కార్డు, ఆధార్ కార్డు, మీరు పని చేస్తున్న యజమాని నుంచి ఫారం 16, వేతన స్లిప్పులు, మీ బ్యాంకు నుంచి ధ్రువీకరణ పత్రాలు, ఏదైనా మూలధన లాభాల వివరాలు ఉంటే వాటిని సమర్పించాల్సి ఉంటుంది. అలాగే మీరు అద్దె ఆదాయం పొందినట్లయితే దానికి రుజువులను కూడా జత చేయాల్సి ఉంటుంది. -
రోజుకు 121 రూపాయలతో రూ.27 లక్షలు చేతికి: ఈ పాలసీ గురించి తెలుసా?
సంపాదించిన మొత్తంలో ఎంతో కొంత పొదుపు చేయాలని అందరూ అనుకుంటారు. అయితే ఎప్పుడు, ఎక్కడ, ఎంత ఇన్వెస్ట్ చేయాలనే విషయాల మీద బహుశా కొందరికి అవగాహన ఉండకపోవచ్చు. మనదేశంలో ముఖ్యంగా.. ఆడపిల్లల గురించి ఆలోచించేవారి సంఖ్య కొంత ఎక్కువే. ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా ఆలోచించేవారు ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ ఎంచుకోవచ్చు. ఇందులో రోజుకు రూ. 121 పొదుపు చేస్తే.. పెళ్లి చేసే నాటికి రూ. 27 లక్షలు చేతికి వస్తాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ప్రవేశపెట్టిన 'ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ'.. తల్లిదండ్రులు తమ కుమార్తె భవిష్యత్తును సురక్షితంగా ఉంచడంలో సహాయపడటానికి ప్రత్యేకంగా రూపొందించింది. ఇందులో మీరు రోజుకు 121 రూపాయలు డిపాజిట్ చేస్తే.. నిర్దిష్ట సమయం తరువాత రూ. 27 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ చేతికి అందుతాయి. ఇది మీరు ఎన్ని సంవత్సరాలు డిపాజిట్ చేస్తున్నారు, వచ్చే బోనస్ ఎంత అనేదానిపై ఆధారపడి ఉంటుంది.➤కనీస రోజువారీ పెట్టుబడి: రూ. 121➤మెచ్యూరిటీ మొత్తం: రూ. 27 లక్షల వరకు (ఎన్ని సంవత్సరాలు డిపాజిట్ చేస్తున్నారు & బోనస్ ఆధారంగా)➤పాలసీ కాలపరిమితి: 13 నుంచి 25 సంవత్సరాలుఇదీ చదవండి: ఐదేళ్లలో రూ.20 లక్షలు: ఈ పోస్టాఫీస్ స్కీమ్ గురించి తెలుసా?ఉదాహరణకు.. మీ కుమార్తెకు 5 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు మీరు రోజుకు రూ. 121 పెట్టుబడి పెట్టడం ప్రారంభించారని అనుకుందాం. అలా మీరు 25 సంవత్సరాలు డిపాజిట్ చేస్తే.. వచ్చే ఎల్ఐసీ ద్వారా బోనస్లు, లాయల్టీ వంటి వాటితో కలిపి మీ మొత్తం మెచ్యూరిటీ మొత్తం రూ. 27 లక్షలు దాటవచ్చు. ఈ పథకంలో లబ్ధిదారు తండ్రి వయస్సు కనీసం 30 సంవత్సరాలు, కుమార్తె వయస్సు కనీసం ఒక సంవత్సరం ఉండాలి.ఇదీ చదవండి: విడాకులు తీసుకుంటే క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది!.. ఎలా అంటే?ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ అనేది ఆదాయ పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80సీ కిందికి వస్తుంది. కాబట్టి వినియోగదారులు రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. పాలసీదారు స్కీమ్ మెచ్యూరిటీ కాలానికి ముందే కొన్ని అవాంఛనీయ కారణాల వల్ల మరణిస్తే.. కుటుంబ సభ్యులకు రూ. 10 లక్షల వరకు అందుతాయి. అంతే కాకుండా కుటుంబ సభ్యులు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. ప్రీమియం గడువు ముగిసిన తరువాత మొత్తం రూ. 27 లక్షలు నామినికీ అందిస్తారు.ఎల్ఐసీ కన్యాదాన్ పథకానికి అప్లై చేసుకోవడానికి.. ఐడెంటిటీ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, నివాస ఋజువు, కుమార్తె బర్త్ సర్టిఫికెట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో వంటివి అవసమవుతాయి. ఈ పథకం గురించి తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ లేదా సమీపంలోని ఎల్ఐసీ కార్యాలయాన్ని సందర్శించవచ్చు. -
‘కొత్త పన్ను’.. పంచ తంత్రం!
దేశంలో కొత్త పన్ను విధానం అమలులోకి వచ్చింది. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 115BAC కింద దీన్ని ప్రవేశపెట్టారు. ఇది తక్కువ పన్ను రేట్లతో సరళమైన పన్ను నిర్మాణాన్ని అందిస్తుంది. కానీ పాత విధానంతో పోలిస్తే డిడక్షన్లు, మినహాయింపులు తక్కువ ఉంటాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం (అసెస్మెంట్ ఇయర్ 2026-27) కోసం కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవడం వల్ల కలిగే ఐదు ముఖ్యమైన ప్రయోజనాలేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.1.పన్ను రహిత ఆదాయ పరిమితి ఎక్కువ రూ .12 లక్షల మినహాయింపు పరిమితి, రూ .75,000 స్టాండర్డ్ డిడక్షన్ కారణంగా వేతన జీవులకు రూ .12.75 లక్షల వరకు ఆదాయం పన్ను రహితంగా ఉంటుంది. ఇది మునుపటి రూ .7.5 లక్షల పన్ను రహిత పరిమితి (రూ .7 లక్షలు + రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్) కంటే గణనీయమైన పెరుగుదల. ఇది మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు పెద్ద ఉపశమనం కలిగిస్తుంది.2.అన్ని స్లాబ్లలో తక్కువ పన్ను రేట్లుకొత్త విధానంలో రాయితీ పన్ను రేట్లతో ఏడు స్లాబ్లు ఉన్నాయి. ఇవి రూ.4 లక్షల వరకు ఆదాయానికి 0% నుండి ప్రారంభమై, రూ.24 లక్షలకు పైబడిన ఆదాయానికి 30% వరకు ఉన్నాయి. ఈ విధానం ముఖ్యంగా రూ.15 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి, పెద్దగా డిడక్షన్లు క్లెయిమ్ చేయని వారికి, పన్ను బాధ్యతను తగ్గిస్తుంది. తద్వారా చేతికందే జీతం ఎక్కువౌతుంది.3.సరళమైన పన్ను ఫైలింగ్.. తక్కువ కంప్లయన్స్తక్కువ డిడక్షన్లు, మినహాయింపులతో (ఉదా., HRA, LTA, లేదా సెక్షన్ 80C ప్రయోజనాలు లేకపోవడం), కొత్త విధానం డాక్యుమెంటేషన్, కంప్లయన్స్ ఇబ్బందులను తగ్గిస్తుంది. దీంతో ఈ విధానం యువ ప్రొఫెషనల్స్ లేదా పాత విధానం డాక్యుమెంటేషన్ భారంగా భావించే వారికి అనువుగా ఉంటుంది.4.లిక్విడిటీ.. ఆర్థిక సౌలభ్యంతప్పనిసరి పన్ను ఆదా పెట్టుబడుల అవసరాన్ని (ఉదా., PPF, ELSS, లేదా ఇన్సూరెన్స్ ప్రీమియంలు) తొలగించడం ద్వారా కొత్త విధానం ఖర్చు, ఆదా, లేదా వ్యక్తిగత ఆర్థిక లక్ష్యాల ఆధారంగా పెట్టుబడి పెట్టడానికి డబ్బు అందుబాటులోకి వచ్చేలా చేస్తుంది. ఇది కెరీర్ ప్రారంభ దశలో ఉన్న వ్యక్తులకు లేదా లిక్విడిటీకి ప్రాధాన్యత ఇచ్చే వారికి ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది.5.మెరుగైన స్టాండర్డ్ డిడక్షన్.. ఇతర ప్రయోజనాలుజీతం పొందే వ్యక్తులు రూ. 75,000 స్టాండర్డ్ డిడక్షన్ (గతంలో రూ.50,000 ఉండేది) క్లెయిమ్ చేయవచ్చు. ఫ్యామిలీ పెన్షనర్లు అయితే రూ.25,000 డిడక్షన్ (గతంలో రూ.15,000) పొందవచ్చు. అదనపు డిడక్షన్లలో యాజమాన్యం (పని చేస్తున్న కంపెనీ) ఎన్పీఎస్ కాంట్రిబ్యూషన్ (సెక్షన్ 80CCD(2)), అద్దెకు ఇచ్చిన ఆస్తులపై హోమ్ లోన్ వడ్డీ, అగ్నివీర్ కార్పస్ ఫండ్కు విరాళం వంటివి ఉన్నాయి. ఇవి సంక్లిష్ట పెట్టుబడులు లేకుండా కొంత పన్ను ఉపశమనం అందిస్తాయి.ఎవరికి ఎక్కువ ప్రయోజనం?- పెద్దగా డిడక్షన్లు లేకుండా రూ.12.75 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు.- పన్ను ఆదా సాధనాలలో ఎక్కువగా పెట్టుబడి పెట్టని యువ ప్రొఫెషనల్స్ లేదా కొత్తగా సంపాదించేవారు.- దీర్ఘకాలిక, లాక్-ఇన్ పెట్టుబడులు కాకుండా సరళత, సౌలభ్యాన్ని కోరుకునే పన్ను చెల్లింపుదారులు.గమనించవలసినవి..కొత్త విధానం ఈ ప్రయోజనాలను అందించినప్పటికీ, ఇది అందరికీ సరిపోకపోవచ్చు. మీకు గణనీయమైన డిడక్షన్లు (ఉదా., రూ.30 లక్షలకు పైబడిన ఆదాయాలకు రూ.3.75 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ, HRA, సెక్షన్ 80C, లేదా హోమ్ లోన్ వడ్డీతో సహా) ఉంటే, పాత విధానం తక్కువ పన్ను బాధ్యతకు దారితీయవచ్చు. మీ ఆదాయం, డిడక్షన్లు, ఆర్థిక లక్ష్యాల ఆధారంగా రెండు విధానాలను ఆదాయ పన్ను కాలిక్యులేటర్ను ఉపయోగించి పోల్చుకుని ఆ తర్వాత నిర్ణయం తీసుకోవడం మంచిది. -
ఇక మైనర్లే బ్యాంక్ ఖాతాలు నిర్వహించుకోవచ్చు: ఆర్బీఐ
ముంబై: పిల్లలు బ్యాంక్ సేవింగ్స్/డిపాజిట్ ఖాతాల ప్రారంభం, నిర్వహణ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పదేళ్లు నిండిన వారు (మైనర్లు) బ్యాంక్ ఖాతాలు తెరిచేందుకు, సొంతంగా నిర్వహించేందుకు వీలుగా బ్యాంక్లకు ఆర్బీఐ అనుమతి మంజూరు చేసింది. ఈ దిశగా సవరించిన నిబంధనలను ఆర్బీఐ విడుదల చేసింది.ఏ వయసు మైనర్లు అయినా తమ తల్లిదండ్రులు లేదా చట్టబద్ధమైన సంరక్షకుల ద్వారా సేవింగ్స్, టర్మ్ డిపాజిట్లు తెరిచేందుకు అనుమతిస్తున్నట్టు వాణిజ్య బ్యాంక్లు, కోపరేటివ్ బ్యాంక్లకు జారీ చేసిన సర్క్యులర్లో ఆర్బీఐ పేర్కొంది.బ్యాంక్లు తమ రిస్క్ నిర్వహణ విధానాన్ని దృష్టిలో పెట్టుకుని పదేళ్లు నిండిన మైనర్లు సేవింగ్స్, టర్మ్ డిపాజిట్ ఖాతాలను తెరిచి, స్వతంత్రంగా నిర్వహించుకునేందుకు అనుమతించొచ్చని స్పష్టం చేసింది. అయితే ఇందుకు సంబంధించిన నిబంధనలను ఖాతాదారులకు ముందుగానే తెలియజేయాలని పేర్కొంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం/డెబిట్ కార్డులు, చెక్బుక్ సదుపాయాలను సైతం మైనర్ ఖాతాదారులకు ఆఫర్ చేయొచ్చని తెలిపింది. -
విడాకులు తీసుకుంటే క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది!.. ఎలా అంటే?
ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకునేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. కారణం ఏదైనా విడాకులు వరకు వెళ్లిపోతున్నారు. డివోర్స్ తీసుకుంటే ఆ తరువాత జరిగే పరిణామాలు ఎలా ఉన్నా.. క్రెడిట్ స్కోర్ తగ్గిపోయే అవకాశం ఉంది. ఇది వినడానికి వింతగా అనిపించినప్పటికీ, ఈ కథనం చదివితే.. తప్పకుండా మీకే అర్థమవుతుంది.భార్యాభర్తలు కలిసి ఉన్నప్పుడు (ఉద్యోగం చేసే వారైతే).. జాయింట్ అకౌంట్స్ మీద హోమ్ లోన్, వెహికల్ లోన్ వంటివి తీసుకుని ఉంటే.. విడాకులు తరువాత ఈ ఖాతాలను క్లోజ్ చేస్తే సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. ఎలా అంటే.. జాయింట్ అకౌంట్స్ కింద తీసుకున్న లోన్కు ఇద్దరూ బాధ్యత వహించాలి. ఆలా కాకుండా అకౌంట్ క్లోజ్ చేస్తే లేదా లోన్ చెల్లింపులు ఆలస్యం చేస్తే సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది.కలిసి ఉన్నప్పుడు ఇద్దరి సంపాదన తోడవుతుంటుంది. విడాకుల తరువాత ఎవరి దారి వారిదే. అలాంటి సమయంలో ఆర్ధిక ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ఇది మీ ఈఎంఐల మీద ప్రభావం చూపిస్తుంది. ఇది కూడా సిబిల్ స్కోర్ తగ్గిపోవడానికి కారణమవుతుంది.ఇదీ చదవండి: ఫుడ్ ఆర్డర్తో పాటు ఓ స్లిప్ పంచుతున్న డెలివరీ బాయ్.. అందులో ఏముందంటే?విడాకులు మంజూరు చేసే సమయంలో లోన్స్ క్లియర్ చేయాల్సిన బాద్యతను మీ భాగస్వామికి కోర్టు అప్పగించినప్పటికీ.. లోన్ అగ్రిమెంట్స్ మీద ఇద్దరి సంతకాలు ఉంటాయి. అలాంటి సమయంలో మీ భాగస్వామి చెల్లింపులను ఆలస్యం చేస్తే.. ఆ ప్రభావం ఇద్దరిపైన పడుతుంది. ఇది సిబిల్ స్కోర్ తగ్గడానికి కారణమవుతుంది.జాయింట్ అకౌంట్స్ లేదా క్రెడిట్ కార్డులను విడాకులు తీసుకున్న వెంటనే క్లోజ్ చేసుకున్నట్లయితే.. అది మీ క్రెడిట్ స్కోర్ మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి విడాకులు తీసుకున్న తరువాత కూడా ఇలాంటి ఆర్ధిక సంబంధ లావాదేవీల గురించి మాట్లాడుకుంటే.. సిబిల్ స్కోర్ తగ్గకుండా చూసుకోవచ్చు. -
ఐదేళ్లలో రూ.20 లక్షలు: ఈ పోస్టాఫీస్ స్కీమ్ గురించి తెలుసా?
ప్రతి మనిషి తన సంపాదనలో కొంత మొత్తాన్ని భవిష్యత్ కోసం తప్పకుండా దాచుకోవాలి. లేకుంటే ఆర్ధిక సమస్యలతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కొందరు చిన్న మొత్తాలలో సేవింగ్ చేసుకుంటుంటే.. మరికొందరు పిల్లల చదువులకు, వివాహం లేదా ఇల్లు కొనుగోలు చేయడానికి.. ఇలా కొంత పెద్ద మొత్తంలో కూడబెట్టాలనుకుంటున్నారు. అలాంటి వారికి 'పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్' మంచి ఎంపిక అవుతుంది.5 సంవత్సరాల్లో 20 లక్షలు ఇలా..ఐదేళ్లలో పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా రూ. 20లక్షలు పొందాలంటే.. నెలకు రూ. 28,100 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఐదేళ్లు ఈ పథకంలో డిపాజిట్ చేస్తే.. రూ. 20 లక్షలు చేతికి అందుతాయి. ఈ స్కీమ్ కింద పెట్టుబడిదారు 6.7 శాతం వార్షిక వడ్డీని పొందవచ్చు. ఇది త్రైమాసిక కాంపౌండింగ్ ఆధారంగా ఉంటుంది. అంటే.. వడ్డీ ప్రతి మూడు నెలలకు ఒకసారి మీ మొత్తం పెట్టుబడిన కొంత పెంచుతుంది.➤మొత్తం పెట్టుబడి (రూ. 28100 x 60 నెలలు): రూ. 16,86,000➤మీ పెట్టుబడికి వడ్డీ: రూ. 3,19,382➤మెచ్యూరిటీ మొత్తం: రూ. 20,05,382ఇదీ చదవండి: నెలకు ₹5000 ఆదాతో రూ.8 లక్షలు చేతికి: ప్లాన్ వివరాలివిగో..రిస్క్ లేకుండా పొదుపు చేయడానికి పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఉత్తమమైన మార్గం. ఈ ప్లాన్ను మీరు నెలకు 100 రూపాయల పెట్టుబడితో కూడా ప్రారభించవచ్చు. గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు. ఈ పథకం పూర్తిగా ప్రభుత్వ హామీతో ఉంటుంది, కాబట్టి మీ డబ్బు పూర్తిగా సురక్షితం. వడ్డీ రేట్లలో మార్పులు ప్రతి మూడు నెలలకు సమీక్షించబడతాయి. కాబట్టి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారాలు చేసేవారు, గృహిణులు అందరూ ఈ పథకం నుండి ప్రయోజనం పొందవచ్చు. -
యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ?: క్లారిటీ ఇచ్చిన కేంద్రం
యూపీఐ లావాదేవాల మీద ప్రభుత్వం జీఎస్టీ విధించనుందని వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని కేద్రం క్లారిటీ ఇచ్చింది. రూ. 2వేలు కంటే ఎక్కువ లావాదేవీలు జరిగితే 18 శాతం జీఎస్టీ విధిస్తారని ప్రచారమవుతున్న వార్తా అబద్దమని ఆర్థికమంత్రిత్వ శాఖ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.రూ. 2000 కంటే ఎక్కువ యూపీఐ లావాదేవీలు చేస్తే జీఎస్టీ విధిస్తారని కొంతమంది తప్పుదారి పట్టిస్తున్నారు. ప్రభుత్వం డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్రం స్పష్టం చేసింది.ఇదీ చదవండి: వచ్చేస్తోంది EPFO 3.0: ప్రయోజనాలెన్నో..యూపీఐ అందుబాటులోకి వచ్చిన తరువాత.. చాలామంది జేబులో డబ్బులు పెట్టుచుకోవడమే మరచిపోయారు. ప్రతి చిన్న వస్తువు కొనుగోలు చేయాలన్నా.. ఆన్లైన్లో పే చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో లావాదేవీలమీద జీఎస్టీ విధిస్తారని వస్తున్న వార్తలకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. -
వచ్చేస్తోంది EPFO 3.0: ప్రయోజనాలెన్నో..
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO).. తొమ్మిది కోట్లకు పైగా లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చడానికి 'ఈపీఎఫ్ఓ 3.0' ప్రారంభించనుంది. ఈ కొత్త వెర్షన్ 2025 మే లేదా జూన్ నాటికి ప్రారంభమవుతుందని కేంద్ర కార్మిక & ఉపాధి మంత్రి 'మన్సుఖ్ మాండవియా' ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.ఈపీఎఫ్ఓ 3.0 ద్వారా చందాదారులు వేగంగా నిధులను ఉపసంహరించుకోవచ్చు. ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్స్, డిజిటల్ కరెక్షన్స్, ఏటీఎం ద్వారా విత్డ్రా వంటివి కూడా అందుబాటులోకి రానున్నాయని మన్సుఖ్ మాండవియా వెల్లడించారు. ఈపీఎఫ్ఓ 3.0 తీసుకురావడానికి ప్రధాన కారణం.. చందాదారులకు మరింత మెరుగైన సేవలు అందించడమే అని ఆయన అన్నారు.ఈపీఎఫ్ఓ 3.0 వెర్షన్ అమలులోకి వచ్చిన తరువాత.. ఫామ్ ఫిల్లింగ్ ప్రక్రియలు, క్లెయిమ్ల కోసం లేదా కరెక్షన్స్ కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఓటీపీ ద్వారానే ఏపీఎఫ్ఓ ఖాతాలను అప్డేట్ చేసుకోవచ్చు. క్లెయిమ్లను వేగంగా పరిష్కరించడం వల్ల, నిధులు చందాదారుల బ్యాంకు ఖాతాలో త్వరగా జమ అవుతాయని మన్సుఖ్ అన్నారు.ఏఈఎఫ్ఓ మొత్తం 27 లక్షల కోట్ల విలువైన నగదు నిల్వలను కలిగి ఉంది. దీనికి ప్రభుత్వ హామీతో పాటు 8.25 శాతం వడ్డీ ఇస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటికే అమలులో ఉన్న సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఏ బ్యాంకు ఖాతాలోనైనా పెన్షన్లు పొందేందుకు వీలు కల్పిస్తూ 78 లక్షలకు పైగా పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుస్తున్నామని ఆయన అన్నారు.పెన్షన్ కవరేజీని క్రమబద్ధీకరించడానికి, బలోపేతం చేయడానికి అటల్ పెన్షన్ యోజన, ప్రధాన్ మంత్రి జీవన్ బీమా యోజన, శ్రామిక్ జన్ ధన్ యోజనతో సహా వివిధ సామాజిక భద్రతా పథకాలను ఏకీకృతం చేయడాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి మన్సుఖ్ మాండవియా చెప్పారు.ఇదీ చదవండి: కోపైలట్ సలహాలు: తల్లిదండ్రులకు ఎన్నో ఉపయోగాలు!కార్మికులకు ఆరోగ్య సంరక్షణను పెంచే ప్రయత్నంలో భాగంగా.. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) కింద ఉన్న లబ్ధిదారులు త్వరలో ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఉన్న ఆసుపత్రులలో ఉచిత వైద్య చికిత్స పొందగలరని ఆయన చెప్పారు. అంతే కాకుండా.. సామాజిక భద్రతా కవరేజీని విస్తరించడానికి ఎంపిక చేసిన ఛారిటీలు నడిపే ప్రైవేట్ ఆసుపత్రులను కూడా దీని పరిధిలోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. -
ITR: తొలిసారి ట్యాక్స్పేయర్స్కు 5 కీలక విషయాలు
కొత్తగా ట్యాక్స్ పేయర్స్ అవుతున్నవారికి మొదటిసారి ఆదాయపు పన్ను రిటర్న్లు దాఖలు చేయడం కష్టంగా అనిపించవచ్చు. కానీ ముఖ్యమైన అంశాలను అర్థం చేసుకోవడం ద్వారా ఈ ప్రక్రియ సులభం అవుతుంది. అసెస్మెంట్ ఇయర్ (AY) 2025-26, ఫైనాన్షియల్ ఇయర్ (FY) 2024-25కి సంబంధించి, మొదటిసారి పన్ను చెల్లించేవారు గుర్తుంచుకోవలసిన ఐదు కీలక అంశాలు ఇక్కడ అందిస్తున్నాం.సరైన ఐటీఆర్ ఫారమ్ను ఎంచుకోండిమీ ఆదాయ వనరులు, నివాస స్థితి, మొత్తం ఆదాయం ఆధారంగా సరైన ఐటీఆర్ ఫారమ్ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఉదాహరణకు, ITR-1 (సహజ్) అనేది జీతం, ఒక ఇంటి ఆస్తి, లేదా ఇతర వనరుల నుండి (ఉదా., వడ్డీ) రూ.50 లక్షల వరకు ఆదాయం ఉన్న నివాసిత వ్యక్తులకు సరిపోతుంది. ITR-2 అనేది క్యాపిటల్ గెయిన్స్ లేదా ఒకటి కంటే ఎక్కువ ఇంటి ఆస్తులు ఉండి వ్యాపార ఆదాయం లేనివారి కోసం ఉద్దేశించింది.ITR-3 లేదా ITR-4 ఫారాలు ప్రొఫెషనల్స్ లేదా ప్రిసంప్టివ్ టాక్సేషన్ కింద ఉన్నవారికి వర్తిస్తాయి. తప్పు ఫారమ్ ఉపయోగిస్తే రిటర్న్ తిరస్కరణకు గురికావచ్చు. కాబట్టి మీ ఆదాయ వనరులను జాగ్రత్తగా అంచనా వేయండి. ఆదాయపు పన్ను విభాగం ఈ-ఫైలింగ్ పోర్టల్ సరైన ఫారమ్ను నిర్ణయించడానికి ఒక సాధనాన్ని అందిస్తుంది. తప్పులు జరగకుండా అన్ని వివరాలను ఒకటికి రెండుసార్లు సరిచూసుకోండిపాత, కొత్త పన్ను విధానాలను అర్థం చేసుకోండిఅసెస్మెంట్ ఇయర్ 2025-26 కోసం, కొత్త పన్ను విధానం డిఫాల్ట్గా ఉంటుంది. ఇది తక్కువ పన్ను రేట్లను అందిస్తుంది కానీ తక్కువ డిడక్షన్లు ఉంటాయి. ఇందులో జీతం పొందే వ్యక్తులకు రూ.75,000 స్టాండర్డ్ డిడక్షన్, సెక్షన్ 87A కింద రూ.60,000 వరకు రిబేట్ ఉంటాయి. దీనివల్ల రూ.12 లక్షల వరకు ఆదాయం పన్ను రహితంగా ఉంటుంది. పాత విధానం సెక్షన్ 80C, 80D, లేదా 24(b) (హోమ్ లోన్ వడ్డీ కోసం) వంటి ఎక్కువ డిడక్షన్లను అనుమతిస్తుంది కానీ ఎక్కువ పన్ను రేట్లను కలిగి ఉంటుంది.మొదటిసారి ఫైలర్లు పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి రెండు విధానాలనూ పోల్చాలి. నాన్ బిజినెస్ పన్ను చెల్లింపుదారులు ప్రతి సంవత్సరం ఏదో ఒక విధానాన్ని ఎంచుకోవచ్చు. కానీ ఫైలింగ్ గడువు (ఆడిట్ లేని కేసులకు జూలై 31) లోపు ఎంపిక చేయాలి. గడువు మిస్ అయితే, ఆలస్య ఫైలింగ్ కోసం కొత్త విధానంలోనే ఉండాల్సి వస్తుంది.అన్ని ఆదాయ వనరులను నివేదించాలిమీ మొత్తం ఆదాయం పన్ను విధించే పరిమితి (60 ఏళ్లలోపు వ్యక్తులకు కొత్త విధానంలో రూ.3 లక్షలు) కంటే తక్కువ ఉన్నప్పటికీ, అన్ని ఆదాయ వనరులను నివేదించాలి. ఇందులో జీతం, సేవింగ్స్ ఖాతా లేదా ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ, అద్దె ఆదాయం, పెట్టుబడుల నుండి క్యాపిటల్ గెయిన్స్, రూ.50,000 కంటే ఎక్కువ విలువైన బహుమతులు కూడా ఉంటాయి.ఫారమ్ 16 (యజమానుల నుండి), ఫారమ్ 26AS, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ (AIS) వంటి డాక్యుమెంట్లు ఆదాయం, టీడీఎస్ వివరాలను ధృవీకరించడానికి సహాయపడతాయి. ఏ ఆదాయాన్ని నివేదించకపోతే, ఆదాయపు పన్ను విభాగం నుండి పరిశీలన లేదా నోటీసులు రావచ్చు. ఈ డాక్యుమెంట్ల రికార్డులను భవిష్యత్తు అవసరాల కోసం దగ్గర ఉంచుకోండి. అయితే వీటిని ఐటీ రిటర్నుకు జోడించాల్సిన అవసరం లేదు.గడువులను పాటించండి.. ఈ-వెరిఫై చేయండిఆడిట్ లేని పన్ను చెల్లించేవారికి ఐటీఆర్ దాఖలు చేయడానికి గడువు జూలై 31. ఈ గడువు మిస్ అయితే రూ.5,000 జరిమానా (ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువ ఉంటే రూ.1,000) చెల్లించాల్సి ఉంటుంది. దీంతోపాటు చెల్లించని పన్నుపై సెక్షన్ 234A కింద నెలకు 1% వడ్డీ విధిస్తారు. మీరు డిసెంబర్ 31, 2025 వరకు ఆలస్య రిటర్న్ లేదా నాలుగు సంవత్సరాలలోపు (మార్చి 31, 2029 నాటికి) అప్డేటెడ్ రిటర్న్ (ITR-U) దాఖలు చేయవచ్చు కానీ జరిమానాలు ఉంటాయి.ఐటీఆర్ దాఖలు చేసిన తర్వాత, 30 రోజులలోపు ఆధార్ OTP, నెట్ బ్యాంకింగ్ లేదా ఈవీసీ ఉపయోగించి ఈ-వెరిఫికేషన్ చేయడం తప్పనిసరి. మీ పాన్ ఆధార్తో లింక్ అయి ఉండాలి. ఎందుకంటే ఇనాక్టివ్ పాన్ కార్డుల వల్ల రిఫండ్లు లేదా ప్రాసెసింగ్ ఆలస్యం కావచ్చు. ఏప్రిల్ లేదా మేలో ముందుగానే ఐటీఆర్ దాఖలు చేస్తే, AIS/ఫారమ్ 26ASతో వివరాలు సరిపోలితే, ఒక వారంలో రిఫండ్లు వస్తాయి.👉 ఇదీ చదవండి: ‘పన్ను’ పాతదే కావాలంటే త్వరపడాల్సిందే..డిడక్షన్లను క్లెయిమ్ చేయండి.. తప్పులు చేయొద్దుపాత విధానంలో, సెక్షన్ 80C కింద రూ.1.5 లక్షలు (ఉదా., PPF, ELSS), సెక్షన్ 24(b) కింద హోమ్ లోన్ వడ్డీపై రూ.2 లక్షలు, లేదా సెక్షన్ 80D కింద మెడికల్ ఇన్సూరెన్స్ వంటి డిడక్షన్లను క్లెయిమ్ చేయవచ్చు. కొత్త విధానంలో డిడక్షన్లు పరిమితం, కానీ స్టాండర్డ్ డిడక్షన్, ఫ్యామిలీ పెన్షన్ డిడక్షన్ వర్తిస్తాయి.AIS, ఫారమ్ 26ASతో క్రాస్-చెక్ చేసి ఖచ్చితత్వాన్ని నిర్ధారించండి, లేకపోతే తప్పులు ప్రాసెసింగ్ను ఆలస్యం చేయవచ్చు లేదా నోటీసులకు దారితీయవచ్చు. ఇక్కడ తప్పులు అంటే తప్పుడు వ్యక్తిగత వివరాలు, ఆదాయం దాచడం, తప్పు విధానం ఎంచుకోవడం వంటివి అన్నమాట. 80DD లేదా 80U వంటి డిడక్షన్లు క్లెయిమ్ చేస్తే, ఫారమ్ 10-IA దాఖలు చేయండి. ప్రక్రియను పూర్తి చేయడానికి వెంటనే ఈ-వెరిఫై చేయండి.అదనపు చిట్కాలుAIS, ఫారమ్ 26AS నుండి డేటాను ఆటో-ఫిల్ చేసే సదుపాయం ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్లో ఉంది. ఉపయోగించండి. మీ ఆదాయం ఎక్సెంప్షన్ లిమిట్ కంటే తక్కువ ఉన్నప్పటికీ, రూ.1 కోటి కరెంట్ ఖాతాలలో డిపాజిట్ చేయడం, రూ.2 లక్షలు విదేశీ ప్రయాణంలో ఖర్చు చేయడం, లేదా రూ.25,000 కంటే ఎక్కువ TDS/TCS ఉన్నట్లయితే ఐటీఆర్ దాఖలు చేయండి. క్యాపిటల్ గెయిన్స్ వంటి సంక్లిష్ట ఆదాయ వనరులకు సంబంధించి సందేహం ఉంటే టాక్స్ ప్రొఫెషనల్ను సంప్రదించండి. -
చిన్న చిన్న పెట్టుబడులు.. రూ.40,000 కోట్లు అవుతాయ్!
నెలవారీ క్రమానుగత పెట్టుబడులు (సిప్) వచ్చే 18–24 నెలల్లో రూ.40,000 కోట్లకు పెరగనున్నట్టు యూనియన్ ఏఎంసీ సీఈవో మధు నాయర్ అంచనా వేస్తున్నారు. ఖర్చు చేసే ఆదాయంలో పెరుగుదల, క్రమశిక్షణతో కూడిన దీర్ఘకాల పెట్టుబడుల పట్ల ఇన్వెస్టర్లలో అవగాహన విస్తృతం అవుతుండడం సిప్ పెట్టుబడులను ఇతోధికం చేస్తుందన్నది ఆయన విశ్లేషణ.ఈ ఏడాది మార్చి నెలలో సిప్ రూపంలో ఈక్విటీ ఫండ్స్లోకి వచ్చిన పెట్టుబడులు రూ.25,925 కోట్లుగా ఉంటే.. 2024–25 ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు సిప్ పెట్టుబడులు రూ.24,113 కోట్లకు పెరగడం గమనార్హం. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇవి నెలవారీ రూ.16,602 కోట్లుగా ఉన్నాయి. ఫండ్స్ నిర్వహణలోని మొత్తం సిప్ పెట్టుబడులు 2024 మార్చి నాటికి ఉన్న రూ.10.71 లక్షల కోట్ల నుంచి 2025 మార్చి నాటికి రూ.13.31 లక్షల కోట్లకు వృద్ధి చెందాయి.బడ్జెట్లో ప్రకటించిన పన్ను ప్రయోజనాలు, మార్కెట్ విలువలు ఆకర్షణీయంగా మారడం సిప్ పెట్టుబడులను పెంచేందుకు సానుకూలిస్తాయని నాయర్ ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు యూనియన్ మ్యూచువల్ ఫండ్ తన తాజా త్రైమాసికం నివేదికలో భారత ఈక్విటీ మార్కెట్లను ‘ఆకర్షణీయ జోన్’కు అప్గ్రేడ్ చేసింది. అంతకుముందున్న మోస్తరు ఖరీదు నుంచి మెరుగుపడడం గమనార్హం. ఇటీవలి స్టాక్స్ దిద్దుబాటుకు తోడు, కంపెనీల ఆదాయాలు కాస్త మెరుగుపడడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీర్ఘకాలంలో మెరుగైన పనితీరు.. దీర్ఘకాల పెట్టుబడులకు ఉన్న ప్రాధాన్యాన్ని మధు నాయర్ గుర్తు చేశారు. స్వల్పకాల ప్రభావాన్ని అతిగా ఊహించుకోవడం, దీర్ఘకాల సామర్థ్యాలను తక్కువగా అంచనా వేయడం ఇన్వెస్టర్లలో సాధారణంగా కనిపించేదిగా పేర్కొన్నారు. వచ్చే 10–15 ఏళ్ల కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ, ఈక్విటీ మార్కెట్లు మంచి పనితీరు చూపిస్తాయని భావిస్తున్నట్టు చెప్పారు. -
ఐసీఐసీఐ సేవింగ్స్ డిపాజిట్ రేటు తగ్గింపు
ముంబై: ఐసీఐసీఐ బ్యాంక్ సేవింగ్స్ డిపాజిట్ (సేవింగ్స్ ఖాతాల్లోని బ్యాలెన్స్)పై వడ్డీ రేటును పావు శాతం మేర తగ్గించింది. సేవింగ్స్ ఖాతాల్లో బ్యాలెన్స్ రూ.50 లక్షల వరకు ఉన్న వారికి ఇక మీదట 2.75 శాతం రేటు అమలవుతుంది. అదే మాదిరి రూ.50 లక్షలకు పైన బ్యాలెన్స్ ఉన్న వారికి 3.25 శాతం రేటు లభిస్తుంది.బుధవారం నుంచే కొత్త రేటు అమల్లోకి వచ్చింది. ఎస్బీఐ సైతం సేవింగ్స్ డిపాజిట్లపై 2.70 శాతం రేటు అమలు చేస్తుండడం గమనార్హం. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కూడా తాజాగా సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీ రేటును 0.25% తగ్గించి 2.75% చేసింది. రూ.50 లక్షలకు మించిన మొత్తంపై వడ్డీ రేటు 3.5% ఉండగా 3.25 శాతానికి తగ్గించింది. -
‘పన్ను’ పాతదే కావాలంటే త్వరపడాల్సిందే..
ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయడానికి గడువు సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలోని పన్ను చెల్లింపుదారులు 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ పాత పన్ను విధానంలో కొనసాగాలా లేక కొత్త విధానంలోకి వెళ్లాలా అనేది ఎంచుకునే పనిలో ఉన్నారు. డిడక్షన్లు, మినహాయింపులకు ప్రసిద్ధి చెందిన పాత పన్ను విధానం గణనీయమైన పెట్టుబడులు, ఖర్చులు ఉన్నవారికి ఇప్పటికీ ఆకర్షణీయమైన ఎంపికగా ఉంది. కానీ దీనికి పన్ను చెల్లింపుదారులు తప్పనిసరిగా పాటించాల్సిన నిర్దిష్ట అవసరాలు ఉన్నాయి.జీతం పొందే ఉద్యోగులుపాత పన్ను విధానం కింద ట్యాక్స్ పేయర్స్ సుమారు 70 డిడక్షన్లను క్లెయిమ్ చేయవచ్చు. వీటిలో సెక్షన్ 80సీ కింద పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్, ఎన్పీఎస్ వంటి పెట్టుబడులకు రూ.1.5 లక్షల వరకు, గృహ రుణ వడ్డీకి రూ.2 లక్షల వరకు, హౌస్ రెంట్ అలవెన్స్ (HRA), లీవ్ ట్రావెల్ అలవెన్స్ (LTA) కోసం మినహాయింపులు ఉన్నాయి. అయితే, ఈ విధానాన్ని ఎంచుకోవడానికి త్వరపడాల్సిన అవసరం ఉంది. జీతం పొందే ఉద్యోగులు తాము ఈ పన్ను విధానాన్ని ఎంచుకుంటున్నట్లు ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే తమ యజమానులకు తెలియజేయాలి. తద్వారా టీడీఎస్ (TDS) సరిగ్గా లెక్కించేందుకు వీలుంటుంది. ఈ సమాచారం ఇవ్వకపోతే యజమాన్యాలు కొత్త విధానాన్ని డిఫాల్ట్గా అప్లయి చేస్తారు. ఇది తక్కువ పన్ను రేట్లను అందిస్తుంది కానీ డిడక్షన్లు తక్కువగా ఉంటాయి.వ్యాపారులువ్యాపారం లేదా వృత్తిపరమైన ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారులకు ప్రక్రియ మరింత కఠినంగా ఉంటుంది. వారు పాత విధానాన్ని ఎంచుకోవడానికి ఐటీఆర్ గడువు జూలై 31 లోపల ఫారం 10-IEA ను ఆన్లైన్లో దాఖలు చేయాలి. ఈ ఫారాన్ని ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. ఇది వారిని పాత విధానంలో లాక్ చేస్తుంది. కొత్త విధానానికి తిరిగి మారడానికి ఒక్కసారి మాత్రమే అవకాశం ఉంటుంది. గడువు తప్పడం లేదా ఆలస్యంగా ఐటీఆర్ దాఖలు చేయడం వల్ల పన్ను చెల్లింపుదారులు కొత్త విధానంలోకి డీఫాల్ట్గా వెళతారు. ఇది వారికి విలువైన డిడక్షన్లను కోల్పోయేలా చేస్తుంది.ఇదీ చదవండి: ఐటీ రిటర్నుకు సిద్ధంకండి.. బ్యాంకు అకౌంట్లు విశ్లేషించండి..పన్ను ప్రణాళిక సౌలభ్యంపాత విధానం ఆకర్షణ దాని పన్ను ప్రణాళిక సౌలభ్యంలోనే ఉంది. ముఖ్యంగా హెచ్ఆర్ఏ లేదా సెక్షన్ 80సీ పెట్టుబడుల వంటి సంవత్సరానికి రూ.2.5 లక్షలకు మించిన డిడక్షన్లు ఉన్న అధిక ఆదాయ వ్యక్తులకు ఇది అనువుగా ఉంటుంది. సీనియర్ సిటిజన్లు కూడా ఎక్కువ మినహాయింపు పరిమితుల (60–79 సంవత్సరాల వారికి రూ.3 లక్షలు, 80 ఏళ్లు పైబడిన వారికి రూ.5 లక్షలు) నుండి ప్రయోజనం పొందుతారు. అయితే, ఇది అదనపు డాక్యుమెంటేషన్, ఉదాహరణకు అద్దె రసీదులు, పెట్టుబడి రుజువులు, ఐటఆర్ దాఖలు సమయంలో లేదా ఆడిట్ సమయంలో ధ్రువీకరించడానికి అవసరం.రెండూ పోల్చుకోండి..ఆదాయపు పన్ను విభాగం ఆన్లైన్ కాలిక్యులేటర్ను ఉపయోగించి రెండు పన్ను విధానాలనూ పోల్చిచూసుకోవాలని ట్యాక్స్ పేయర్స్కు పన్ను నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే పాత విధానం ప్రయోజనాలు వ్యక్తిగత పరిస్థితులపై ఆధారపడతాయి. కొత్త విధానం డిఫాల్ట్గా ఉన్నందున, పాత విధానం ప్రయోజనాలను పొందడానికి పన్ను చెల్లింపుదారులు త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలి. -
ఐటీ రిటర్నుకు సిద్ధంకండి.. బ్యాంకు అకౌంట్లు విశ్లేషించండి..
ఏప్రిల్లో అడుగుపెట్టామంటే రెండు ఆలోచనలు వస్తాయి. మొదటిది 2025 మార్చి 31తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నులు దాఖలు చేయడానికి సిద్ధమవడం. రెండోది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) పన్ను ప్రణాళికలను తయారు చేసుకోవడం. అందరూ కొత్త విధానానికి మొగ్గుచూపుతున్న పరిస్థితుల్లో పెట్టుబడులు/సేవింగ్స్పరంగా ప్లానింగ్కి తక్కువ అవకాశాలున్నాయి. అందుకని 2025 ఆర్థిక సంవత్సరానికి రిటర్ను వేయడానికి ఎలా సిద్ధంగా ఉండాలో తెలుసుకుందాం. 1. మీకున్న అన్ని బ్యాంకుల ఖాతాలకు సంబంధించి స్టేట్మెంట్లు/పాస్బుక్స్లని అప్డేట్ చేయించండి. 2. ప్రతి బ్యాంకు అకౌంట్ సేట్ట్మెంటుని తెచ్చుకొండి. 3. గత ఆర్థిక సంవత్సరం తొలి రోజు (1.4.2024) నుంచి చివరి రోజు (31.3.2025) వరకు బ్యాంకులోని జమలు పరిశీలించండి.పతి జమకు వివరణ రాసుకొండి. అంటే నగదు ద్వారా, చెక్కు ద్వారా, బదిలీ ద్వారా, గూగుల్ ద్వారా వచ్చిందా? మీరే స్వయంగా నగదు డిపాజిట్ చేసారా అని తెలుకొండి. ఆదాయమా.. అప్పు తీసుకున్నారా..? మీకు ఎవరైనా అప్పు చెల్లించారా? డివిడెండా.. వడ్డీనా .. జీతమా.. ఇంటి కిరాయా .. వ్యాపార ఆదాయమా.. షేర్ల విక్రయం ద్వారా వచ్చిన ఆదాయమా? క్యాపిటల్ గెయిన్స్ ద్వారా వచ్చిన ఆదాయమా.. స్థిరాస్తి అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయమా? పీఎఫ్ విత్డ్రా ద్వారా వచ్చినదా.. ఎన్ఎస్సీ లేదా ఎల్ఐసీ పాలసీ మెచ్యూరిటీ ద్వారా వచ్చినది డిపాజిట్ చేశారా..? అలాగే చిట్ఫండ్ పాట ద్వారా వచ్చిందా? మన కుటుంబ సభ్యులు పంపించారా.., మన దేశం నుంచి వచ్చిందా.., విదేశాల నుంచి వచ్చిందా అనే దానిపై కచ్చితమైన అవగాహన ఉండాలి.వీటిలో కొన్నింటిపై పన్ను ఉంటుంది. కొన్ని పన్ను భారానికి గురికావు. కొన్ని ఆదాయ పరిధిలోకి వస్తాయి. కొన్నింటికి మినహాయింపు ఉంటుంది. ఇవి నిర్ధారించాలంటే మనకు ఎవరిచ్చారో కచ్చితంగా తెలియాలి. ఇచ్చిన వ్యక్తి పేరు, చిరునామా, పాన్ నెంబర్ సిద్ధంగా ఉంచుకోవాలి. దేని నిమిత్తం వచ్చిందో రాసుకోవాలి. ప్రతిదానికి రుజువులు ఉండాలి. ఇలా అన్ని అకౌంట్లలో అన్ని జమలకు వివరణ ఉండాలి. ఎందుకంటే ఈ వివరణ మీదే మీ పన్ను భారం ఆధారపడి ఉంటుంది. ఇక రెండవ సైడు ... రెండో కాలమ్.. ఖర్చు కాలమ్. డెబిట్లోని పద్దులు/ఎంట్రీలు .. ఈ వ్యవహారాలు కూడా చాలా ముఖ్యమైనవి. ఇవి ఖర్చులే కదా అని అశ్రద్ధ వహించకండి. ఖర్చులు/డెబిట్లు మీ ఆదాయాన్ని నిర్ధారిస్తాయి. ఉదాహరణకు ఆదాయానికి మించిన ఖర్చులుంటే వాటికి తగిన ‘మార్గాలు’ లేకపోయినా .. లేదా మీరు ఇవ్వకపోయినా ఆ ఖర్చును ఆదాయంగా భావిస్తారు. ఖర్చు దేని మీద చేసారు? ఏ నిమిత్తం చేసారు అనేది మీకు డెబిట్. మరో అకౌంట్లో జమ అంటే క్రెడిట్. అది మీకు ఆదాయం కాదంటే, అటువైపు వ్యక్తికి ఆదాయం కావచ్చు/కాకపోవచ్చు. దీన్ని నిరూపించాలి.అంటే ఈ మేరకు మీరు స్వయంగా ‘కన్ఫర్మ్’ చేయాలి. అందుకని డెబిట్ను విశ్లేషించండి. కొన్ని చెల్లింపుల్లో ఆదాయపన్ను చట్టప్రకారం మీరే బాధ్యులుగా ఉంటారు. ఉదాహరణకు మీరు జీతం ఇస్తారనుకుందాం... టీడీఎస్ తీసేశారా (కట్ చేశారా).., కమీషన్ ఇస్తే టాక్స్ రికవరీ చేశారా.., షేర్లు కొంటే వాటి మీద డివిడెండ్ ఎంత? ఎవరికైనా అప్పు ఇస్తే వడ్డీ వచ్చిందా, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాని మీద ఆదాయమెంత, ఏవైనా స్థిరాస్తులు కొంటే దాని మీద ఆదాయమెంత? ఈ స్థిరాస్తి కొనేందుకు ఎంత అయ్యింది? ఎలా ఖర్చు పెట్టారు .. సోర్స్ ఏమిటి? ఇలా ప్రతి బ్యాంకు అకౌంటులో జమలు/ఖర్చులు విశ్లేషించాలి. వివరణలు రాసుకోవాలి. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు. -
అప్పుడు ఏ ఆర్థిక సంవత్సరంలో ట్యాక్స్ పడుతుంది?
మ్యూచువల్ ఫండ్స్లో నా పెట్టుబడులను విక్రయించేందుకు గత ఆర్థిక సంవత్సరం చివరి రోజైన 2025 మార్చి 31న ఆర్డర్ పెట్టాను. నాకు చెల్లింపులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్లో వచ్చాయి. ఇక్కడ ఆర్థిక సంవత్సరం మారిపోయింది. అప్పుడు ఏ ఆర్థిక సంవత్సరంలో నా మూలధన లాభాలను పరిగణనలోకి తీసుకుంటారు? – చరణ్దాస్ఇన్వెస్టర్లలో ఆర్థిక సంవత్సరం చివర్లో సాధారణంగా కనిపించే అయోమయమే ఇది. పెట్టుబడుల ఉపసంహరణ జరిగిన తేదీ ఆధారంగానే మూలధన లాభాలపై పన్నును పరిగణనలోకి తీసుకుంటారు. అంతేకానీ, మీరు విక్రయ అభ్యర్థన ఎప్పుడు పెట్టారన్నది కాదు. సెబీ నిబంధనల ప్రకారం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఉపసంహరణకు కటాఫ్ టైమ్ పనిదినాల్లో మధ్యాహ్నం 3 గంటలు.మధ్యాహ్నం 3 గంటల్లోపు అభ్యర్థన సమర్పించినట్టయితే అదే రోజు నెట్ అసెట్ వ్యాల్యూ (ఎన్ఏవీ) ఆధారంగా ఆ లావాదేవీ ప్రాసెస్ అవుతుంది. ఒకవేళ మధ్యాహ్నం 3 గంటల తర్వాత సమర్పించినట్టయితే తర్వాతి పనిదినం రోజు ఎన్ఏవీ ఆధారంగా ప్రాసెస్ చేస్తారు. మీరు 2025 మార్చి 31న సెల్ ఆర్డర్ పెట్టారు. ఆ రోజు మార్కెట్లకు సెలవు. కనుక మీ అభ్యర్థనను ఏప్రిల్ 1న ప్రాసెస్ చేయనున్నారు. కనుక పెట్టుబడుల విక్రయంపై వచ్చిన లాభాన్ని 2025–26 ఆర్థిక సంవత్సరం మూలధన లాభాలు కింద పరిగణనలోకి తీసుకుంటారు. మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లు వారసత్వంగా వచ్చినప్పుడు వాటిపై పన్ను ఎలా అమలవుతుంది? మూలధన లాభాల లెక్కింపునకు వాటి అసలు కొనుగోలు తేదీని పరిగణనలోకి తీసుకుంటారా లేక వారసులకు బదిలీ అయిన తేదీని పరిగణనలోకి తీసుకుంటారా? – జె.తిరుమలరావు అసలు పెట్టుబడిదారు మరణించిన సందర్భాల్లో మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లు వారసులకు బదిలీ అయితే.. అప్పుడు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ పెట్టుబడులు మరొకరి పేరిట బదిలీ అయ్యాయే కానీ, విక్రయించలేదు. ఇక మూలధన లాభాలపై పన్ను లెక్కింపునకు మొదట పెట్టుబడి పెట్టిన తేదీని పరిగణనలోకి తీసుకుంటారు. బదిలీ అయిన రోజును కాదు. ఈక్విటీ ఫండ్స్: ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.25 లక్షల దీర్ఘకాల మూలధన లాభంపై (ఏడాదికి మించిన పెట్టుబడులు) పన్ను లేదు. అంతకుమించిన మొత్తంపై 12.5 శాతం చెల్లించాలి. అదే స్వల్పకాల మూలధన లాభాలపై (ఏడాదిలోపు విక్రయించినవి) 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.డెట్ ఫండ్స్: 2023 ఏప్రిల్ 1 తర్వాత పెట్టుబడి పెట్టి.. విక్రయించగా వచ్చిన లాభం ఇన్వెస్టర్ లేదా వారి వారసుల వార్షిక ఆదాయానికి కలుస్తుంది. వారికి వర్తించే శ్లాబు రేటు ప్రకారం పన్ను చెల్లించాలి. ఒకవేళ అసలు పెట్టుబడిని 2023 ఏప్రిల్ 1లోపు చేసి.. వాటిని రెండేళ్లలోపు విక్రయిస్తే లాభం మొత్తం ఇన్వెస్టర్ వార్షిక ఆదాయానికి కలుస్తుంది. ఆ ప్రకారం పన్ను చెల్లించాలి. రెండేళ్ల తర్వాత విక్రయిస్తే వచ్చిన లాభంపై నికరంగా 12.5 శాతం పన్ను చెల్లించాలి.ఉదాహరణకు 2019 జనవరి 1న ఈక్విటీ ఫండ్స్లో రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టారని అనుకుందాం. 2024 జనవరిలో ఇన్వెస్టర్ కాలం చేశారు. ఈ పెట్టుబడులను వారి వారసులు 2025 మార్చిలో రూ.12 లక్షలకు విక్రయించారు. ఏడాదికి మించిన పెట్టుబడి కనుక దీర్ఘకాల మూలధన లాభం కిందకు వస్తుంది. అసలు పెట్టుబడి రూ.5 లక్షలు మినహాయించగా నికర లాభం రూ.7 లక్షలు అవుతుంది. ఇందులో రూ.1.25 లక్షలపై పన్ను లేదు. రూ.5.75 లక్షలపై 12.5 శాతం ప్రకారం రూ.71,875 పన్ను చెల్లించాల్సి ఉంటుంది.సమాధానాలు:: ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
మహిళలకు ప్రత్యేక బీమా పాలసీలు
మహిళ ఆరోగ్యం ఒక కుటుంబానికి ఎంతో అవసరం. ఆమె ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం సాఫీగా ముందుకునడుస్తుంది. అయితే మహిళల ఆరోగ్య సంరక్షణ ప్రత్యేకంగా ఉంటుంది. ప్రసూతి సంబంధిత ఖర్చులు, గైనకాలజీ సమస్యలు, రొమ్ము లేదా గర్భాశయ క్యాన్సర్ వంటి క్లిష్టమైన అనారోగ్యాలు వంటి ప్రత్యేకమైన ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొంటున్న మహిళలకు ఆరోగ్య బీమా ఒక కీలకమైన ఆర్థిక రక్షణగా నిలుస్తుంది.అందుకే దేశంలోని అనేక బీమా ప్రొవైడర్లు ఇప్పుడు ఈ అవసరాలను తీర్చే మహిళల కోసమే ప్రత్యేకంగా ఆరోగ్య బీమా పథకాలను అందిస్తున్నాయి. ఆర్థిక స్థిరత్వం, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందుబాటులోకి తెస్తున్నాయి. దేశంలో అందుబాటులో ఉన్న కొన్ని టాప్ ఉమెన్ స్పెసిఫిక్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు, అవి ఎలాంటి ప్రయోజనాలు అందిస్తున్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.బజాజ్ అలయంజ్ లైఫ్ సూపర్ఉమన్ టర్మ్ ప్లాన్క్యాన్సర్ సహా 60 క్రిటికల్ అనారోగ్యాలకు కూడా కవరేజీ లభించేలా మహిళల కోసం బజాజ్ అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రత్యేక పాలసీని ప్రవేశపెట్టింది. దీని పేరు ’బజాజ్ అలయంజ్ లైఫ్ సూపర్ఉమన్ టర్మ్ (ఎస్డబ్ల్యూటీ) ప్లాన్’. ఇది సంప్రదాయ జీవిత బీమా పరిధికి మించి టర్మ్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలను, మహిళలకు మాత్రమే పరిమితమయ్యే తీవ్రమైన అనారోగ్యాలకు సంబంధించిన బెనిఫిట్స్, ఆప్షనల్ చైల్డ్ కేర్ బెనిఫిట్ మొదలైన వాటితో ఆర్థిక భద్రతను అందిస్తుంది. హెచ్డీఎఫ్సీ లైఫ్ స్మార్ట్ ఉమెన్ ప్లాన్ » గర్భధారణ సంబంధిత సమస్యలను కవర్ చేస్తుంది.» క్లిష్టమైన అనారోగ్యాలకు ఆర్థిక సహాయం అందిస్తుంది.టాటా-ఏఐజీ వెల్సూరెన్స్ ఉమెన్ పాలసీ» హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్స్ అందిస్తుంది.» క్యాన్సర్, స్ట్రోక్ వంటి క్లిష్టమైన అనారోగ్యాలను కవర్ చేస్తుందిస్టార్ వెడ్డింగ్ గిఫ్ట్ ఇన్సూరెన్స్ పాలసీ» ప్రసూతి, వైద్య అత్యవసర పరిస్థితులను కవర్ చేస్తూ నవ వధూవరుల కోసం రూపొందించిన ప్రత్యేక పాలసీ ఇది.రెలిగేర్ జాయ్ మెటర్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ» ప్రసూతి ప్రయోజనాలు, నవజాత శిశువుల సంరక్షణపై దృష్టి పెడుతుందిన్యూ ఇండియా ఆశా కిరణ్ పాలసీ» మహిళలు, బాలికల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ప్లాన్ వారికి పూర్తి ఆరోగ్య కవరేజీని కల్పిస్తుంది.రిలయన్స్ హెల్త్ పాలసీ» అదనపు వెల్ నెస్ లక్షణాలతో సమగ్ర ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.సరైన ప్లాన్ను ఎలా ఎంచుకోవాలి?ఉత్తమ హెల్త్ ప్లాన్ను ఎంచుకోవడం వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది.కవరేజ్: పాలసీలో మీకు సంబంధించిన ప్రసూతి, క్రిటికల్ ఇల్ నెస్ కవర్ అయ్యేలా చూసుకోండి.ప్రీమియం ఖర్చు: ఖర్చు, ప్రయోజనాల ఆధారంగా విభిన్న ప్లాన్లను పోల్చి చూడండి.వెయిటింగ్ పీరియడ్: ప్రసూతి కవరేజీ, ముందుగా ఉన్న పరిస్థితుల కోసం వెయిటింగ్ పీరియడ్ చెక్ చేయండి.అదనపు ప్రయోజనాలు: వెల్నెస్ కార్యక్రమాలు, నివారణ సంరక్షణ, ఆసుపత్రిలో చేరిక ప్రయోజనాల కోసం చూడండి. -
బీమాతో సైబర్ మోసాలకు చెక్!
ఐటీ ఉద్యోగి వంశీరామ్ (32) మొబైల్కు ఒక సందేశం వచ్చింది. విద్యుత్ బిల్లు గడువు ముగిసిపోయిందని.. వెంటనే చెల్లించకపోతే కనెక్షన్ నిలిపివేస్తామని అందులో ఉంది. వెంటనే లింక్పై క్లిక్ చేసి చెల్లించేశాడు వంశీ. కానీ, ఖాతా నుంచి రూ.80,000 డెబిట్ అయిపోవడం చూసి నిర్ఘాంతపోయాడు. ఇలాంటివి రోజుకు వేలాది ఘటనలు జరుగుతున్నాయి. గ్రోసరీ షాపింగ్, సోషల్ మీడియా ముచ్చట్లు, వర్తకులకు క్యూఆర్ కోడ్ చెల్లింపులు, యుటిలిటీ బిల్లులు, బ్యాంకింగ్ సేవలు.. నేడు లావాదేవీలన్నీ మొబైల్ ఫోన్ల నుంచే. దాదాపు అన్ని ఆర్థిక లావాదేవీలు డిజిటల్ రూపంలోకి మళ్లాయి. సౌకర్యంగా ఉండడంతో అందరూ స్మార్ట్ఫోన్ నుంచే కానిచ్చేస్తున్నారు. ఫలితంగా ఇది సైబర్ మోసాలకు అడ్డాగా మారిపోయింది. ఏటా 15 లక్షల సైబర్ మోసాలు ఇప్పుడు నమోదవుతున్నాయి. ఫలితంగా సామాన్యులు ఆర్థికంగా కుదేలవుతున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ సైబర్ మోసాల నుంచి రక్షణ కల్పించుకోవడంపై తప్పకుండా దృష్టి సారించాలి. దీని గురించి అవగాహన కల్పించే కథనం ఇది... 2018లో సైబర్ నేరాలు 2.08 లక్షలు కాగా, ఇప్పుడు ఏటా 15 లక్షలకు చేరాయని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ) గణాంకాలు తెలియజేస్తున్నాయి. బాధితులు అందరూ బయటకు చెప్పుకోలేరు. కనుక, ఇలాంటి మోసాలు ఇంకా ఎక్కువే ఉండొచ్చన్నది నిపుణుల అంచనా. సైబర్ నేరాలతో ఆర్థికంగా నష్టపోవడమే కాదు, మానసికంగా ఎంతో వేదనకు గురికావాల్సి వస్తుంది. ఈ ఇబ్బందుల నుంచి ఆదుకునేదే సైబర్ ఇన్సూరెన్స్. దేశంలో 84 శాతం ఇంటర్నెట్ యూజర్లు ఆన్లైన్ ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. షాపింగ్, బ్యాంకింగ్ లేదా సోషల్ మీడియా చాటింగ్, ఆన్లైన్ కార్యకలాపాలు ఏవైనా సరే... ఇంటర్నెట్తో అనుసంధానమైన ప్రతి ఒక్కరికీ డేటా లీకేజీ, సైబర్ దాడులు, మోసాల రిస్క్ ఉంటుంది. సైబర్ నేరస్థులు డీప్ఫేక్ టెక్నాలజీ, ఏఐ తదితర అత్యాధునిక టెక్నాలజీలతో దాడులకు దిగుతున్నారు. ఆన్లైన్లో డాక్టర్ అపాయింట్మెంట్ బుకింగ్ను సైతం తప్పుదోవ పట్టించి.. నకిలీ లింక్ ద్వారా బ్యాంక్ ఖాతా ఊడ్చేస్తున్న ఘటనలు వింటున్నాం. టెక్నాలజీ గురించి పెద్దగా పరిచయం లేని విశ్రాంత జీవుల నుంచి జీవితకాల పొదుపు నిధులను మాయం చేస్తున్నారు. నేడు ప్రపంచం మొత్తం డిజిటల్గా అనుసంధానమై ఉంది. దీంతో నేరగాళ్లు ఏదో ఒక దేశంలో ఉండి, మరో దేశంలోని వారిని సులభంగా మోసం చేయగలుగుతున్నారు. ఒకవైపు సైబర్ నేరాలు గణనీయంగా పెరుగుతుంటే.. మరోవైపు సైబర్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్న వారి సంఖ్య అతి స్వల్పంగా ఉంటోంది. చాలా మందికి దీని గురించి అవగాహన లేకపోవడం ఒకటి అయితే, తాము జాగ్రత్తగా ఉంటామన్న ధీమా కొందరిని బీమాకు దూరంగా ఉంచుతోంది. సైబర్ రక్షణ...సైబర్ మోసాల వల్ల జరిగే నష్టాన్ని పాలసీదారులకు సైబర్ ఇన్సూరెన్స్ చెల్లిస్తుంది. రూ.లక్ష నుంచి రూ.5 కోట్ల వరకు సమ్ అష్యూర్డ్ (బీమా) తీసుకోవచ్చు. రూ.లక్ష కవరేజీకి ప్రీమియం సుమారు రూ.600 వరకు.. రూ.కోటి కవరేజీకి రూ.25,000 వరకు ఉంటుంది. సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేసి దురి్వనియోగం చేయడం, సైబర్ వేధింపులు, బెదిరింపులు, వ్యక్తిగత ప్రతిష్టకు నష్టం వంటి కేసుల్లో.. చట్టపరమైన చర్యలకు అయ్యే వ్యయాలను బీమా కంపెనీ చెల్లిస్తుంది. మాల్వేర్, రాన్సమ్వేర్ రక్షణ కూడా ఉంటుంది. మాల్వేర్ దాడుల కారణంగా సర్వర్, నెట్వర్క్, కంప్యూటర్లకు వాటిల్లే నష్టానికి పరిహారం లభిస్తుంది. సైబర్ నేరస్థులు డివైజ్ను (మొబైల్ లేదా పీసీ/ల్యాప్టాప్) హ్యాక్ చేసి డబ్బులు డిమాండ్ చేయొచ్చు. అలాంటి సందర్భాల్లో డేటా రికవరీకి, డివైజ్ రిపేర్ వ్యయాలను బీమా కంపెనీ భరిస్తుంది. డేటా చోరీతో వాటిల్లే నష్టాన్ని భర్తీ చేస్తుంది. ఆన్లైన్ బ్లాక్ మెయిల్, సైబర్ బుల్లీయింగ్ తదితర ఘటనల్లో న్యాయపరమైన చర్యలకు, సాంకేతిక సాయానికి అయ్యే వ్యయాలను బీమా సంస్థ చెల్లిస్తుంది. సైబర్ ఇన్సూరెన్స్లోనూ విభిన్న ప్లాన్లు ఉన్నాయి. ఆన్లైన్ షాపింగ్ మోసాలకు సంబంధించి కూడా ప్రత్యేక ప్లాన్లు ఉన్నాయి. మొబైల్ వాలెట్లకూ రక్షణ కల్పించుకోవచ్చు. ఈమెయిల్ స్పూఫింగ్ దాడి వల్ల ఎదురయ్యే ఆర్థిక నష్టం, నేరస్థులపై చర్యలకు అయ్యే వ్యయాలకూ చెల్లింపులు ఉంటాయి. సందేశాలు పంపడం, ఫోన్ కాల్స్, నకిలీ వెబ్సైట్ల ద్వారా సున్నితమైన డేటాను పొందడం ద్వారా ఆర్థికంగా నష్టం కలిగించడం వంటి ఫిషింగ్ దాడుల నుంచి రక్షణ పొందొచ్చు. ఎంత కవరేజీ అవసరం? కంపెనీలు రూ.కోట్లు ఖర్చు పెట్టి ఫైర్వాల్స్ వంటి సాఫ్ట్వేర్ టూల్స్తో సైబర్ దాడుల నిరోధానికి చర్యలు తీసుకుంటూ ఉంటాయి. అదే మాదిరి వ్యక్తులు సైతం తమ వంతుగా సైబర్ బీమా రక్షణను తీసుకోవడం మంచి ఆలోచన అవుతుంది. ముందుగా బ్యాంక్ ఖాతాల్లో బ్యాలెన్స్, క్రెడిట్ కార్డ్ లిమిట్, ఈ–వ్యాలెట్ ఇలా సైబర్ దాడుల రిస్క్ ఉన్న పెట్టుబడుల విలువను ఒకసారి పరిశీలించాలి. మీ లిక్విడ్ అసెట్స్ విలువకు సరిపడా కవరేజీ తీసుకోవాలన్నది నిపుణుల సూచన. తరచూ, అధిక మొత్తంలో ఆర్థిక లావాదేవీలు నిర్వహించే వారికి అధిక కవరేజీ అవసరం. వీటికి కవరేజీ రాదు.. సైబర్ ఇన్సూరెన్స్లో మినహాయింపులు కూడా ఉంటాయి. వీటి గురించి పాలసీదారులు ముందుగానే సమగ్రంగా తెలుసుకోవాలి., చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా చేసే వ్యవహారాలు, లావాదేవీలు, ఉద్దేశపూర్వక ఉల్లంఘనల కారణంగా జరిగే నష్టానికి ఇందులో పరిహారం రాదు. వాణిజ్య రహస్యాలు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులకు సంబంధించి ఎదురయ్యే చెల్లింపుల బాధ్యతలకూ ఇందులో మినహాయింపులు ఉన్నాయి. యుద్ధం, సైబర్ యుద్ధం, సహజ ప్రమాదాల కారణంగా వాటిల్లే నష్టానికీ రక్షణ ఉండదు. క్రిప్టో పెట్టుబడులు, గ్యాంబ్లింగ్, మోసపూరిత చర్యలు, అనధికారికంగా డేటా సమీకరించడం, నిషేధిత సైట్లలోకి ప్రవేశించడం వల్ల వాటిల్లే నష్టం తదితర వాటికి సైబర్ బీమాలో కవరేజీ ఉండదు. వెంటనే రిపోర్ట్ చేయాలి.. మోసపూరిత లావాదేవీలు జరిగాయంటే వెంటనే బ్యాంక్ కస్టమర్ కేర్కు కాల్ చేసి వాటి ఖాతా/క్రెడిట్/డెబిట్కార్డుల యాక్సెస్ను తాత్కాలికంగా బ్లాక్ చేయించాలి. వెంటనే బ్యాంక్ అధికారులకు సమాచారం అందించాలి. 1930కు కాల్ చేసి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. తర్వాత బీమా కంపెనీకి సమాచారం అందించాలి. పోలీసుల వద్ద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అనంతరం, ఆ కాపీ తీసుకుని బీమా కంపెనీ వద్ద నిబంధనల మేరకు క్లెయిమ్ దాఖలు చేయాలి. బ్యాంక్/ఎన్బీఎఫ్సీ వద్ద ఫిర్యాదుకు సంబంధించి రుజువులను జత చేయాలి. జరిగిన నష్టానికి సంబంధించి ఆధారాలూ సమర్పించాలి. సైబర్ టిప్స్.. → చాలా మంది ఆన్లైన్ లావాదేవీల సమయంలో జాగ్రత్తలు తీసుకోకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరించడం సైబర్ దాడులకు అవకాశం ఇచి్చనట్టు అ వుతోంది. ప్రతి ఒక్కరూ తమవంతు రక్షణ చర్యలు తీసుకోవడంపై దృష్టి పెట్టాలి. → స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, టాబ్లెట్లలో సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. → తెలియని వెబ్సైట్లను యాక్సెస్ చేయకుండా ఉండాలి. → గూగుల్ సెర్చ్లో శోధించే క్రమంలో ఎదురయ్యే వెబ్ పోర్టళ్లు, కాంటాక్టుల వివరాలు, చిరునామాలు నిజమైనవేనా? అన్న పరిశీలన తర్వాతే ముందుకు వెళ్లాలి. → డొమైన్ చిరునామాలో హెచ్టీటీపీఎస్ లేకపోతే యాక్సెస్కు దూరంగా ఉండాలి. → బలహీన పాస్వర్డ్లు కాకుండా.. స్మాల్, క్యాపిటల్ లెటర్లు, స్పెషల్ క్యారెక్టర్లు, నంబర్లతో కూడిన పటిష్ట పాస్వర్డ్లు ఏర్పాటు చేసుకోవాలి. → పబ్లిక్ వైఫై, ఉచిత నెట్ వర్క్ల యాక్సెస్కు దూరంగా ఉండాలి → టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2ఎఫ్ఏ)ను ఎనేబుల్ చేసుకోవాలి. → ఫోన్లో ఆపరేటింగ్ సిస్టమ్, యాప్లు, యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఎప్పుడూ అప్డేటెడ్గా ఉంచుకోవాలి. → సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలను కొత్తవారు యాక్సెస్ చేయకుండా నియంత్రణలు పెట్టుకోవాలి. → మెయిల్, వాట్సాప్, ఎస్ఎంఎస్ రూపంలో వచ్చే యూఆర్ఎల్ లింక్లపై క్లిక్ చేయొద్దు. అవి విశ్వసనీయ సంస్థల నుంచి వచి్చనవేనా అన్నది ధ్రువీకరించుకోవాలి. → పేమెంట్ యాప్లు సహా అన్ని ముఖ్యమైన యాప్లకు ఫింగర్ ప్రింట్ లాగిన్ ఎనేబుల్ చేసుకోవాలి. → ఎప్పటికప్పుడు ముఖ్యమైన డేటాను క్లౌడ్ ప్లాట్ఫామ్లోకి బ్యాకప్ తీసుకోవాలి. → ఓటీపీలు, ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతా, చిరునామా, ఫోన్ నంబర్లు ఇలా కీలక వివరాలను ఫోన్లో, ఆన్లైన్లో ఎవరితోనూ పంచుకోరాదు. → ఈ జాగ్రత్తలతోపాటు తగినంత రక్షణ కవరేజీతో సైబర్ బీమా తీసుకోవడం మరవొద్దు. హెచ్ఏఎల్కు నేరగాళ్ల బురిడీప్రభుత్వరంగ రక్షణ ఉత్పత్తుల కంపెనీ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ను సైతం సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించడం గమనార్హం. కంపెనీ కాన్పూర్ శాఖను తప్పుదోవ పట్టించి రూ.55 లక్షలు కాజేశారు. యూఎస్కు చెందిన పీఎస్ ఇంజనీరింగ్ ఐఎన్సీ నుంచి హెచ్ఏఎల్ విడిభాగాలు కొనుగోలు చేయాలనుకుంది. కంపెనీ అధికారిక ఈ మెయిల్తో సంప్రదింపులు మొదలుపెట్టింది. ఈ రెండు సంస్థల మధ్యలో సైబర్ నేరగాళ్లు ప్రవేశించారు. యూఎస్ కంపెనీ పీఎస్ ఇంజనీరింగ్ అధికారిక ఈమెయిల్ చిరునామాలో ఒక ఇంగ్లిష్ ‘ఇ’ తొలగించి, మిగిలిన అక్షరాలన్నీ ఉండేలా ఈమెయిల్ ఐడీ సృష్టించి హెచ్ఏఎల్తో సంప్రదింపులు చేశారు. రూ.55 లక్షల అడ్వాన్స్ను తమ ఖాతాలోకి బదిలీ చేయించుకున్నారు. జరిగిన మోసాన్ని హెచ్ఏల్ ఆలస్యంగా గుర్తించింది. అలాగే, ఆ మధ్య ఓ ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి చెందిన కీలక డేటా లీక్ అయ్యింది. 68,000 డాలర్లు చెల్లించాలంటూ హ్యాకర్ డిమాండ్ చేశాడు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
వాయిదాలపై చెల్లిద్దాం..
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల్లో మూడింట ఒక వంతు రుణ ఆధారితమేనని ‘ఫి కామర్స్’ సంస్థ వెల్లడించింది. 2024 సంవత్సరంలో 20,000 మర్చంట్ లావాదేవీలను అధ్యయనం చేసి ఈ వివరాలు విడుదల చేసింది. ప్రతి మూడు డిజిటల్ చెల్లింపుల లావాదేవీల్లో క్రెడిట్కార్డు, వడ్డీతో కూడిన ఈఎంఐలు ఒకటి ఉండడం గమనార్హం. మొత్తం లావాదేవీల్లో యూపీఐతో చేసినవి 65 శాతంగా ఉన్నట్టు ఫి కామర్స్ తెలిపింది. స్వల్ప, మధ్య స్థాయి చెల్లింపులను ఎక్కువగా యూపీఐ సాయంతో చేస్తుంటే, పెద్ద లావాదేవీలు క్రెడిట్ కార్డులు, ఈఎంఐల రూపంలో ఉంటున్నాయి. ఫీజుల చెల్లింపులు, వైద్య పరమైన చెల్లింపులకు క్రెడిట్కార్డులను ఉపయోగిస్తున్నారు. పండుగల సందర్భంగా కొనుగోళ్లు, స్కూళ్లలో ప్రవేశాలు, సీజన్ వారీ అవసరాలకు రుణాలనే నమ్ముకుంటున్నారు. అంటే స్వల్పకాల రుణాలకు వినియోగదారులు క్రెడిట్ కార్డులు, రుణ ఈఎంఐలపై ఆధారపడుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా విద్యా సంబంధిత చెల్లింపులకు 10 శాతం, హెల్త్కేర్ చెల్లింపులకు 15 శాతం, ఆటో విడిభాగాల కొనుగోళ్లకు 15 శాతం మేర రుణ సాధనాల ఆధారితంగానే చెల్లిస్తున్నారు. ఒకేసారి చెల్లింపుల కంటే రుణ ఆధారిత చెల్లింపులకు ఆసక్తి చూపిస్తున్నట్టు.. వినియోగదారుల ధోరణిలో మార్పునకు ఈ ఫలితాలు నిదర్శమని ఈ నివేదిక పేర్కొంది. -
ప్రత్యేక బ్యాంక్ స్కీమ్ నిలిపివేత
బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ప్రత్యేక 400 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఇందులో 7.30% వరకు వడ్డీ రేటు లభిస్తుంది. ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి వచ్చే వివిధ ఫిక్స్డ్ డిపాజిట్ కాలపరిమితులపై బ్యాంక్ వడ్డీ రేట్లను విస్తృతంగా సర్దుబాటు చేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.సవరించిన రేట్ల ప్రకారం 91 నుండి 179 రోజుల మధ్య మెచ్యూరిటీ డిపాజిట్లకు 4.25 శాతం, 180 రోజుల నుండి ఒక సంవత్సరం కంటే తక్కువ మెచ్యూరిటీ ఉన్న డిపాజిట్లకు 5.75 శాతం వడ్డీ లభిస్తుంది. ఇక ఏడాది మెచ్యూరిటీ ఉన్న డిపాజిట్లపై 7.05 శాతం, ఏడాది నుంచి రెండేళ్ల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై 6.75 శాతం వడ్డీ అందిస్తుంది.రూ .3 కోట్ల నుండి రూ .10 కోట్ల లోపు డిపాజిట్లకు సవరించిన వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.. 91 నుండి 179 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లకు 5.75%, 180 నుండి 210 రోజులకు 6.25%, 211 రోజుల నుండి ఒక సంవత్సరం కంటే తక్కువ కాలపరిమితికి 6.50%. ఏడాది కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీ రేటు 7.05 శాతంగా, ఏడాది కంటే ఎక్కువ కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై 6.70 శాతంగా ఉంది. ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ మెచ్యూరిటీ వ్యవధితో రూ .3 కోట్ల లోపు డిపాజిట్లపై సూపర్ సీనియర్ సిటిజన్లకు 0.65 శాతం, సీనియర్ సిటిజన్లకు 0.50 శాతం అదనపు వడ్డీ రేటును బ్యాంక్ అందిస్తుంది.మరోవైపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కూడా అమృత్ కలష్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పథకం కింద అందించే వడ్డీ రేటుకు సంబంధించిన వివరాలను ప్రకటనలో వెల్లడించలేదు. అయితే ఫిక్స్డ్ టర్మ్ ఇన్వెస్ట్ మెంట్స్ కోరుకునే కస్టమర్లకు బ్యాంక్ ప్రత్యామ్నాయ మార్గాలను అందిస్తూనే ఉంది. దేశంలోని రెండు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ అధిక వడ్డీ పథకాలను ఉపసంహరించుకోవడం మారుతున్న మార్కెట్ పరిస్థితులు, నియంత్రణ మార్గదర్శకాలకు ప్రతిస్పందనగా వ్యూహాత్మక మార్పును సూచిస్తుంది -
యూపీఐ సేవల్లో అంతరాయం: స్పందించిన ఎన్పీసీఐ
దేశ వ్యాప్తంగా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) సేవల్లో మరోసారి అంతరాయం ఏర్పడింది. ట్రాన్సక్షన్స్ జరగడం లేదని చాలామంది యూజర్లకు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నాడు. మధ్యాహ్నం 12:43 గంటకు సమస్య తీవ్రతరం అయిందని, 2,000 మందికి పైగా వినియోగదారులు సమస్యలను నివేదించారని డౌన్ డిటెక్టర్ వెల్లడించింది.గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం వినియోగదారులు యూపీఐ సేవలను యాక్సెస్ చేయడంలో సమస్యలను ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. డౌన్ డిటెక్టర్ ప్రకారం.. సుమారు 79 శాతం మంది వినియోగదారులు చెల్లింపులకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొన్నారు. 19 శాతం మంది నిధులను బదిలీ చేయలేకపోయారు. మరో 2 శాతం ఫిర్యాదులు UPI ద్వారా కొనుగోళ్లకు సంబంధించిన సమస్యలను నివేదించారు.యూపీఐ సేవల్లో అంతరాయాలకు సంబంధించిన సమస్యలు తలెత్తడం ఇదే మొదటిసారి కాదు. మార్చి 26న, ఏప్రిల్ 2న కూడా ఇలాంటి సమస్యలే తలెత్తాయి.టెక్నికల్ సమస్యల కారణంగా ఈ యూపీఐ సేవల్లో అంతరాయం జరిగినట్లు అప్పుడు ఎన్పీసీఐ వెల్లడించింది. కాగా ఇప్పుడు మరోమారు ఈ సమస్య తెరమీదకు వచ్చింది.ఇదీ చదవండి: తత్కాల్ బుకింగ్ టైమింగ్స్లో మార్పు లేదు: ఐఆర్సీటీసీ క్లారిటీస్పందించిన ఎన్పీసీఐకొన్ని సాంకేతిక సమస్యల కారణంగా లావాదేవీలకు ఆటంకం కలుగుతోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాము. మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము అని ఎన్పీసీఐ ట్వీట్ చేసింది.NPCI is currently facing intermittent technical issues, leading to partial UPI transaction declines. We are working to resolve the issue, and will keep you updated. We regret the inconvenience caused.— NPCI (@NPCI_NPCI) April 12, 2025 -
ప్రయాణంలో రైలు టికెట్ చిరిగిపోతే ఫైన్ కట్టాలా?
రైలులో ప్రయాణిస్తున్నప్పుడు కొన్ని కారణాలతో ప్రయాణికుల టికెట్ చిరిగిపోతూ ఉంటుంది. లేదా ఇంకొన్ని సందర్భాల్లో టికెట్ ఎక్కడో పడిపోతుంది. అలాంటప్పుడు వేరే టికెట్ తీసుకోవాలా? లేదా అప్పటికే ప్రయాణంలో ఉంటే రైలు నుంచి దింపేస్తారా? అనే అనుమానం ఎప్పుడైనా వచ్చిందా.. అయితే రైల్వే నిబంధనల ప్రకారం అలాంటి సందర్భంలో టీటీఈ (ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్) ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో.. ప్రయాణికులు అందుకు అనుగుణంగా ఎలా స్పందించాలో కింద తెలుసుకుందాం.టికెట్ లేకుండా ప్రయాణం చేయడం చట్టరీత్యా నేరం. ఒకవేళ అసలు టికెట్ తీసుకోకుండానే ప్రయాణం చేసీ టీటీఈకి పట్టుబడితే పూర్తి టికెట్ ఛార్జీతో పాటు అదనపు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇది కనీసం రూ.250 లేదా టికెట్ మొత్తానికి రెట్టింపు ఉంటుంది. ఒకవేళ ఆ మొత్తం చెల్లించలేకపోతే టీటీఈ తదుపరి స్టేషన్లో దింపి రైల్వే పోలీసులకు అప్పగించే అధికారం ఉంది. కొన్నిసార్లు ప్రయాణికులు రైలు ఎక్కిన తర్వాత టికెట్ కొనాలనుకుంటారు. ఇది సాధ్యమే, కానీ ఖాళీ సీటు అందుబాటులో ఉండాలి. అందుకోసం సాధారణ ఛార్జీల కంటే అదనంగా రుసుము వసూలు చేస్తారు.పోయిన లేదా చిరిగిన టిక్కెట్లుప్రయాణంలో మీ టికెట్ పోయినట్లయితే లేదా చిరిగిపోతే మిమ్మల్ని టికెట్ లేని ప్రయాణికుడిగా పరిగణించరు. మీరు టీటీఈ నుంచి డూప్లికేట్ టికెట్ పొందవచ్చు. కానీ అప్పటికే మీరు పోయిన టికెట్కు డబ్బు చెల్లించినప్పటికీ కొత్తగా తీసుకునే టికెట్ను ఉచితంగా అందించరు. అందుకు నిర్ణీత మొత్తాన్ని చెల్లించాలి. వెరిఫికేషన్ కోసం మీ ఐడీని చూపించాల్సి ఉంటుంది. మొబైల్లో ఆన్లైన్ టికెట్ అందుబాటులో ఉంటే డూప్లికేట్ టికెట్ అవసరం లేదు. మొబైల్లో మీ ఈ-టికెట్ను టీటీఈకి చూపించవచ్చు. అది చెల్లుబాటు అవుతుంది.ఇదీ చదవండి: పొదుపు సీక్రెట్ రివీల్ చేసిన నితిన్ కామత్రైలు ఆలస్యమైతే రీఫండ్భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం మీరు ప్రయాణించాలనుకున్న రైలు 3 గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యమైతే టికెట్ ఛార్జీలు రీఫండ్ పొందవచ్చు. ఇందుకోసం టీడీఆర్ (టికెట్ డిపాజిట్ రసీదు) దాఖలు చేయాలి. రైలు ప్రయాణంలో ఏదైనా అత్యవసర పరిస్థితి (దొంగతనం లేదా దాడి వంటివి) జరిగితే రైల్వే హెల్ప్లైన్ నంబర్ 139కు కాల్ చేయవచ్చు లేదా టీటీఈ లేదా రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. -
పొదుపు సీక్రెట్ రివీల్ చేసిన నితిన్ కామత్
అనవసరంగా ఖర్చు చేయడం, తర్వాత అప్పులు చేయడం వంటి తప్పిదాలు చేయకూడదని జెరోధా సీఈఓ నితిన్ కామత్ తెలిపారు. స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాదించాలంటే ఎలాంటి షార్ట్కట్లు లేవని, స్థిరమైన అలవాట్లు, సహనం ద్వారానే నిజమైన సంపద సృష్టించవచ్చని అన్నారు. తనను తరచుగా స్టాక్స్ చిట్కా కోసం చాలా మంది అడుగుతుంటారని ఎక్స్ ఖాతాలో తెలుపుతూ డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలో సీక్రెట్ రివీల్ చేశారు.‘ధనవంతులు కావడానికి షార్ట్ కట్లు లేవు. దీనికి మంచి అలవాట్లు, సహనం అవసరం. మీకు అవసరం లేని వస్తువులను కొనడం లేదా వాటిని కొనడానికి అప్పు చేయడం వంటి విషయాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్య బీమా లేకపోవడం కూడా చాలా మందిని పేదరికంలోకి నెట్టివేస్తుంది’ అన్నారు. ఎక్కువ సంపాదించడం అంటే ఎక్కువ పొదుపు చేయడం మాత్రమే కాదనే సందేశంతో కూడిన వీడియోను కామత్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.ఇదీ చదవండి: ఆన్లైన్లో ఈజీగా హైసెక్యూరిటీ ప్లేట్లు‘వాస్తవానికి చాలామంది తరచుగా గాడ్జెట్లు, దుస్తులు, ఫ్యాన్సీ భోజనం..వంటి వాటికోసం అధికంగా ఖర్చు చేస్తుంటారు. ఇందులో ఎక్కువ భాగం ఈఎంఐ (సులభమైన నెలవారీ వాయిదాలు)లపైనే కొనుగోలు చేస్తారు. కాబట్టి ఇంకా సంపాదించని డబ్బు ఇప్పటికే ఖర్చు చేసి ఉంటారు. జీతం రాకముందే దేనికి వెచ్చించాలో కమిట్ అయిపోతారు. దాంతో పేదరికంలోకి వెళుతున్నారు. మీ సంపాదనలో నెలకు రూ.50,000 ఖర్చు చేస్తారని భావిస్తే కేవలం 1% అంటే రూ.500 నుంచి ఆదా చేసేందుకు ప్రయత్నించండి. కేవలం ఒక ఆన్లైన్ ఆర్డర్ను దాటవేయడం వల్ల దీన్ని ఆదా చేసుకోవచ్చు. ఈ మొత్తాన్ని 10-12% సీఏజీఆర్ రాబడి ఉన్న ఇండెక్స్ ఫండ్లో పెట్టుబడి పెడుతున్నట్లు భావిస్తే కాలక్రమేణా ఆ చిన్న పొదుపు అధిక రాబడిని అందిస్తుంది’ అన్నారు. -
ట్యాక్స్ పేయర్లకు లాస్ట్ ఛాన్స్: ఆ స్కీమ్ తుది గడువు ప్రకటించిన ఐటీ శాఖ
న్యూఢిల్లీ: పన్ను వివాదాల పరిష్కారానికి తీసుకువచ్చిన వివాద్ సే విశ్వాస్ పథకానికి ఆదాయపన్ను శాఖ తాజాగా తుది గడువును ప్రకటించింది. పన్ను చెల్లింపుదారులు 2025 ఏప్రిల్ 30లోగా పథకాన్ని వినియోగించుకునేందుకు డిక్లరేషన్ను సమర్పించవలసి ఉంటుందని స్పష్టం చేసింది. తద్వారా 2024 అక్టోబర్1న ప్రవేశపెట్టిన ఈ పథకానికి తొలిసారి తుది గడువును సీబీడీటీ నోటిఫై చేసింది.పన్ను సంబంధ బకాయిలపై ప్రత్యక్ష పన్నుల పథకాన్ని ఆశ్రయించేవారు ఈ నెల 30లోగా డిక్లరేషన్ను ఇవ్వవలసి ఉంటుందని ఆదాయపన్ను శాఖ ఎక్స్లో పోస్ట్ చేసింది. పన్ను సంబంధిత వివాదాలు లేదా వివిధ అప్పీళ్లలో భాగమైన పన్ను చెల్లింపుదారులు పథకాన్ని తుది గడువులోగా వినియోగించుకోవచ్చునని వివరించింది.సుమారు 2.7 కోట్ల ప్రత్యక్ష పన్ను డిమాండ్ల ద్వారా రూ. 35 లక్షల కోట్లు వివిధ వివాదాలలో నమోదైన నేపథ్యంలో పథకానికి ప్రాధాన్యత ఏర్పడింది. పన్ను చెల్లింపుదారులు ఈ పథకాన్ని వినియోగించుకోవాలంటే.. వివాదంలో ఉన్న పన్నుపై 110 శాతాన్ని చెల్లించవలసి ఉంటుంది. 2024 వివాద్ సే విశ్వాస్ పథకానికి 2024–25 బడ్జెట్లో తెరతీశారు. 2024 అక్టోబర్ 1న నోటిఫై చేశారు. -
క్రెడిట్ కార్డ్ బిల్లుల భారం.. ఉందిగా ఉపాయం!
ప్రస్తుతం క్రెడిట్ కార్డుల (credit card) వినియోగం బాగా పెరిగింది. దీంతో ఖర్చుల మీద నియంత్రణ లేక క్రెడిట్ కార్డుల బిల్లులు భారీగా పెరిగిపోతున్నాయి. ఇలా వచ్చిన భారీ మొత్తం బిల్లులను ఒకేసారి కట్టడానికి కార్డుదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇందు కోసమే దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ ఎస్బీఐ (SBI) క్రెడిట్ కార్డు వినియోగదారుల కోసం ప్రత్యేక ఫీచర్ అందుబాటులో ఉంది.క్రెడిట్ కార్డు పెద్ద మొత్తం బిల్లుల నిర్వహరణను ‘ఎస్బీఐ కార్డ్ ఫ్లెక్సీపే’ సదుపాయం సులభతరం చేస్తుంది. ఈ ఫీచర్ ద్వారా కార్డుదారులు పెద్ద కొనుగోళ్లను సులభమైన నెలవారీ వాయిదాలుగా (EMI) మార్చుకోవచ్చు. తద్వారా ఒకేసారి ఏకమొత్తం చెల్లించాల్సిన ఇబ్బందిని లేకుండా చేసుకోవచ్చు. అసలేంటీ ఎస్బీఐ ఫ్లెక్సీపే ఫీచర్.. అర్హత ప్రమాణాలు, ఇతర వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.ఎస్బీఐ ఫ్లెక్సీపేఫ్లెక్సీపే అనేది ఎస్బీఐ కార్డ్ అందించే ఫీచర్. ఇది మీ లావాదేవీలను సులభమైన వాయిదాలుగా మార్చుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. రూ.500 లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలను ఈఎంఐలుగా మార్చుకోవచ్చు. ఇది మూడు, ఆరు, తొమ్మిది, 12, 18, 24 నెలలు వంటి రీపేమెంట్ కాలపరిమితి ఎంపికలను అందిస్తుంది.ఇక రూ.30,000 లేదా అంతకంటే ఎక్కువ కొనుగోళ్లకు 36 నెలల ఈఎంఐ ప్లాన్ ఎంచుకోవచ్చు. ఫ్లెక్సీపే కోసం కనీస బుకింగ్ మొత్తం రూ .2,500, అయితే ఇది ఆఫర్ల ఆధారంగా మారవచ్చు. అలాగే, గత 30 రోజుల్లో చేసిన లావాదేవీలను ఫ్లెక్సీగా మార్చుకోవచ్చు. క్రెడిట్ కార్డు బిల్లులను ఈఎంఐలను మార్చుకునే ముందు మీ క్రెడిట్ స్కోర్, క్రెడిట్ యుటిలైజేషన్ రేషియోను ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది.ఈఎంఐలుగా మార్చుకోండిలా..ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా వినియోగదారులు తమ ఎస్బీఐ కార్డ్ ఆన్లైన్ ఖాతాలోకి లాగిన్ అయి, 'ఈఎంఐ అండ్ మోర్' విభాగానికి వెళ్లి 'ఫ్లెక్సీపే' ఎంచుకోవచ్చు. మార్చాలనుకుంటున్న లావాదేవీని, తగిన కాలపరిమితిని ఎంచుకుని అభ్యర్థనను ధృవీకరించండి.అధికారిక వెబ్సైట్లో పేర్కొన్న ఎస్బీఐ కార్డ్ కస్టమర్ సర్వీస్ హెల్ప్ లైన్కు కూడా కస్టమర్లు కాల్ చేసి కస్టమర్ సపోర్ట్ టీమ్ సహాయంతో ఈఎంఐ మార్పిడిని అభ్యర్థించవచ్చు. వాళ్లు మీకు ప్రక్రియపై మార్గనిర్దేశం చేస్తారు.అలాగే వినియోగదారులు ఎస్బీఐ కార్డ్ మొబైల్ యాప్లోనూ ఫ్లెక్సీపే ఎంపికను యాక్సెస్ చేయవచ్చు. అవసరమైతే లావాదేవీ మొత్తాన్ని సవరించి, కాలపరిమితిని ఎంచుకుని అప్లయి చేయవచ్చు. -
ఆర్బీఐ తాజా నిర్ణయం.. గృహ రుణంపై ఊరట
భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో గృహ, వాహన, వ్యక్తిగత, కార్పొరేట్ రుణాలపై వడ్డీ రేట్లు దిగిరానున్నాయి. దీంతో ఈఎంఐల భారం తగ్గనుంది. గత ఐదేళ్లుగా ఆర్బీఐ రెపో రేటును స్థిరంగా ఉంచింది. 2025 ఫిబ్రవరిలో చాలాకాలం తర్వాత 25 పాయింట్లు తగ్గించింది. మరోసారి తాజాగా మరో 25 పాయింట్లు తగ్గుస్తున్నట్లు తెలిపింది. దాంతో ప్రధానంగా అధిక కాలం ఈఎంఐలు కొనసాగే గృహ రుణ గ్రహీతలకు ఇది బంపర్ అవకాశమనే చెప్పొచ్చు. అటు మందగమనంతో ఆశగా ఎదుచుచూస్తున్న రియల్ ఎస్టేట్ రంగానికి కూడా తాజా తగ్గింపు తగిన బూస్ట్ ఇస్తుందని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.గృహ రుణంపై ఊరట ఎంతంటే..?ఒక వ్యక్తి తాజా రెపో రేటు కోతకు ముందు 8.75 శాతం వడ్డీ రేటుతో 20 ఏళ్ల కాలానికి రూ.25 లక్షల ఇంటి రుణం తీసుకున్నారనుకుందాం. అతనికి ప్రస్తుతం రూ.22,093 చొప్పున నెలవారీ వాయిదా (ఈఎంఐ) పడుతుంది. ఆర్బీఐ తాజా పావు శాతం రేటు కోత నేరుగా బ్యాంకులు వర్తింపజేస్తే.. గృహ రుణంపై వడ్డీ రేటు 8.5 శాతానికి తగ్గుతుంది. దీని ప్రకారం ఈఎంఐ రూ.21,696కు దిగొస్తుంది. అంటే నెలకు రూ.397 తగ్గినట్లు లెక్క. మిగతా రుణ వ్యవధిలో ఇతరత్రా ఎలాంటి మార్పులు జరగకుండా ఉంటే, దీర్ఘకాలంలో రుణ గ్రహీతకు రూ.95,280 వేలు మిగులుతాయి. ఒకవేళ అదే ఈఎంఐ మొత్తాన్ని కొనసాగిస్తే.. రుణ కాల వ్యవధి 10 నెలలు తగ్గుతుంది.ఇదీ చదవండి: ఆర్బీఐ మరోసారి వడ్డీరేట్లపై కీలక నిర్ణయంరెపో రేటు అంటే..రెపో రేటు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు వేసే వడ్డీ రేటు. రెపో రేటు పూర్తి రూపం రీపర్చేజ్ అగ్రిమెంట్ లేదా రీపర్చేజింగ్ ఆప్షన్. బ్యాంకులు అర్హత కలిగిన సెక్యూరిటీలను అమ్మడం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి రుణాలు పొందే అవకాశం ఉంటుంది. మార్కెట్లో డబ్బు ప్రవాహాన్ని నియంత్రించడానికి, పెంచడానికి కేంద్ర బ్యాంకు రెపో రేటును ఉపయోగిస్తుంది. ద్రవ్యోల్బణం మార్కెట్పై ప్రభావం చూపినప్పుడు ఆర్బీఐ రెపో రేటును పెంచుతుంది. -
ముద్రా యోజనకు పదేళ్లు: రూ.20 లక్షల వరకు ఈజీ లోన్స్
ప్రధాన మంత్రి ముద్రా యోజన (పీఎమ్ఎమ్వై) పథకం ఈ రోజుకు (ఏప్రిల్ 8) పదేళ్లను పూర్తిచేసుకుంది. 2015 ఏప్రిల్ 8న ఈ స్కీమ్ ప్రారంభమైనప్పటి నుంచి.. భారతదేశం అంతటా 52 కోట్లకు పైగా లబ్ధిదారులకు రూ. 33 లక్షల కోట్లకు పైగా పూచీకత్తు లేని రుణాలను పంపిణీ చేసింది.పీఎమ్ఎమ్వైస్క్రీన్ పదేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో, ముద్రా యోజన పథకం ఎంతో మందికి.. వ్యవస్థాపక నైపుణ్యాలను ప్రదర్శించడానికి అవకాశాలను కల్పించింది. ఈ పథకం ద్వారా మేలుపొందిన కొంతమందితో మాట్లాడాను. వారి ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం.. అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.Mudra Yojana has given opportunities to countless people to showcase their entrepreneurial skills. Interacted with some of the beneficiaries of the scheme. Their journey is inspiring. #10YearsOfMUDRA https://t.co/QcoIK1VTki— Narendra Modi (@narendramodi) April 8, 2025ప్రధాన మంత్రి ముద్రా యోజన (PMMY) పథకంవ్యాపారాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రారంభమైన ప్రధాన మంత్రి ముద్రా యోజన పథకం.. ఎంతోమంది ఎగడానికి ఆర్థికంగా ఉపయోగపడింది. గతంలో ఈ స్కీమ్ ద్వారా రూ. 10 లక్షలు లోన్ ఇచ్చేవారు. అయితే 2024-25 కేంద్ర బడ్జెట్లో పరిమితిని రూ. 20 లక్షలకు పెంచారు. ఈ పథకం నాలుగు రకాలుగా ఉంటుంది. అవి శిశు, కిషోర్, తరుణ్, తరుణ్ ప్లస్.ఇదీ చదవండి: చైనా సుంకాల ప్రభావం: గోల్డ్ రేటు మరింత తగ్గుతుందా?శిశు: చిన్న వ్యాపారాలను ప్రారంభించాలనుకునే వారికి రూ. 50000 వరకు లోన్ అందిస్తారు.కిషోర్: వ్యాపారంలో కొంత స్థిరపడిన తరువాత.. దానిని మరికొంత విస్తరించుకోవడానికి రూ. 50వేలు నుంచి రూ. 5 లక్షల వరకు లోన్ లభిస్తుంది.తరుణ్ & తరుణ్ ప్లస్: వ్యాపారాలను మరింత విస్తరించాలనుకునేవారికి రూ. 5 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు లోన్ లభిస్తుంది. -
EMIలు తగ్గుతాయ్.. లోన్ కస్టమర్లకు గుడ్న్యూస్..
దేశంలోని రుణగ్రహీతలకు శుభవార్త. అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) తన ఎంసీఎల్ఆర్ (వడ్డీ రేటు)ను 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. సవరించిన తర్వాత హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ 9.10 శాతం నుంచి 9.35 శాతం మధ్య ఉంటుంది. సవరించిన రేట్లు ఏప్రిల్ 7 నుంచి వర్తిస్తాయి.ఎంసీఎల్ఆర్.. దాని ప్రభావంమార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేట్ లేదా ఎంసీఎల్ఆర్ అనేది ఒక నిర్దిష్ట రుణం కోసం బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు వసూలు చేయాల్సిన కనీస వడ్డీ రేటు. ఇది రుణానికి వడ్డీ రేటు తక్కువ పరిమితిని నిర్దేశిస్తుంది. ఆర్బీఐ 2016లో ఎంసీఎల్ఆర్ను ప్రవేశపెట్టింది.గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, వాహన రుణాలతో సహా వివిధ ఫ్లోటింగ్-రేట్ రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయించడానికి బ్యాంకులు ఉపయోగించే బెంచ్మార్క్ రేటును ఎంసీఎల్ఆర్ అంటారు. ఈ ఎంసీఎల్ఆర్ తగ్గడం వల్ల రుణ ఈఎంఐలు లేదా రుణ కాలపరిమితి తగ్గుతుంది. ఇది దీర్ఘకాలికంగా రుణగ్రహీతలకు ప్రయోజనం చేకూరుస్తుంది. అయితే ఈ ప్రయోజనం పరిధి, సమయం రుణ ఒప్పందంలో పేర్కొన్న రీసెట్ క్లాజ్పై ఆధారపడి ఉంటుంది.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రుణ రేట్లుఓవర్నైట్, ఒక నెల ఎంసీఎల్ఆర్ కాలపరిమితిని 10 బేసిస్ పాయింట్లు తగ్గించి 9.20 శాతం నుంచి 9.10 శాతానికి తగ్గించింది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ను 9.30 శాతం నుంచి 9.20 శాతానికి, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ను 9.40 శాతం నుంచి 9.30 శాతానికి తగ్గించింది. ఏడాది, రెండేళ్ల ఎంసీఎల్ఆర్ రేటును 9.40 శాతం నుంచి 9.30 శాతానికి తగ్గించింది. మూడేళ్ల ఎంసీఎల్ఆర్ను 9.45 శాతం నుంచి 9.35 శాతానికి తగ్గించింది. -
ష్.. ఈ విషయాలు ఎవరికీ చెప్పకండి!
పని ప్రదేశాల్లో వీలు దొరికినప్పుడల్లా చిట్చాట్ చేస్తూంటారు. స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించుకోవడం మంచిదే. అంతమాత్రానా తోటి ఉద్యోగులతో అన్ని విషయాలు పంచుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. వ్యక్తిగత వివరాలు, విశ్వాసాలు, ఆరోగ్య విషయాలు.. వంటి కొన్ని అంశాలను తోటి ఉద్యోగులతో చర్చించకపోవడమే మేలని సూచిస్తున్నారు. ఒకవేళ వారితో ఆయా విషయాలను చర్చిస్తే వృత్తిపరంగా, వ్యక్తిగతంగా జరిగే మేలు కంటే చేటే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. తోటి ఉద్యోగులతో పంచుకోకూడని కొన్ని అంశాలను నిపుణులు తమ మాటల్లో తెలియజేస్తున్నారు.వ్యక్తిగత, ఆర్థిక సమాచారంమీ వ్యక్తిగత, ఆర్థిక పరిస్థితిని గోప్యంగా ఉంచాలి. మీరు పొందుతున్న జీతం, అప్పులు, పెట్టుబడులు కార్యాలయంలో అనవసరమైన ఒత్తిడి, పోటీని సృష్టిస్తాయి. మీ జీవనశైలిని ప్రభావితం చేసే అంశాలపై తోటి ఉద్యోగులు ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల వృత్తిపరంగా నష్టం జరగవచ్చు.ఆరోగ్య సమస్యలుసెలవులు తీసుకోవడానికి, టార్గెట్లు తప్పించుకోవడానికి తరచూ చాలామంది ఆఫీస్లో ఆరోగ్య సమస్యలున్నట్లు చెబుతారు. అందుకు బదులుగా మీకు నిజంగా ఏదైనా సమస్యలుంటే దాన్ని ఎలా అధిగమిస్తున్నారో హెచ్ఆర్, మేనేజర్కు మాత్రమే చెప్పండి. భవిష్యత్తులో మీరు సెలవు అడిగినప్పుడు మీ సమస్యపై వారికి అవగాహన ఉంది కాబట్టి అనుమతించే అవకాశం ఉంటుంది. తోటి ఉద్యోగులకు చెప్పడం వల్ల మీరు టార్గెట్లు తప్పించుకునేందుకే ఇలా చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేయవచ్చు.రాజకీయ, మత విశ్వాసాలుపని ప్రదేశంలో విభిన్న విశ్వాసాలు కలిగిన వారు ఉంటారు. మీ రాజకీయ, మత విశ్వాసాలను వారిపై రుద్దడం కంటే అసలు ఆ ప్రస్తావన లేకుండా వృత్తి జీవితం సాఫీగా సాగేలా జాగ్రత్త పడాలి.సహోద్యోగులు, మేనేజ్మెంట్పై కామెంట్లుసహచరులు / మేనేజ్మెంట్ గురించి తోటి ఉద్యోగులతో చెడుగా మాట్లాడటం లేదా గాసిప్లు క్రియేట్ చేయడం ఆపేయాలి. సంస్థకు సంబంధించిన మీ అభిప్రాయాలు సరైనవే అయినా ఇతరులతో పంచుకోకూడదు. మీ విమర్శలు ఏవైనా ఉంటే నేరుగా మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లడం మంచిది.ఇదీ చదవండి: వైద్య రంగంలో గేమ్ ఛేంజర్గా కృత్రిమేమేధభవిష్యత్ ఉద్యోగ ప్రణాళికలుమీరు అధికారిక ప్రకటన చేయకుండా కంపెనీ మారే ఆలోచనను ఎవరితోనూ పంచుకోకూడదు. మీ భవిష్యత్ ఉద్యోగ ప్రణాళికలను గోప్యంగా ఉంచడం ఉత్తమం. ఈ విషయాన్ని ముందుగానే చెబితే ప్రస్తుత మీ స్థానానికి ప్రతికూలంగా మారే అవకాశం ఉంటుంది. -
బీమాతో ధీమా.. హెల్త్ ఇన్సూరెన్స్ ఎంచుకోండిలా
'ఆరోగ్యమే మహాభాగ్యం'.. ఈ మాటను చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. కానీ కొంత పెద్దయిన తరువాత మహాభాగ్యం అంటే మిద్దెలు, మెడలు అనుకున్నాం. నిజానికి మనిషి ఆరోగ్యంగా లేకపోతే.. ఎంత సంపాదించినా అది వ్యర్థమే. కాలం మారిపోయింది.. ఎప్పుడు ప్రాణం పోతుందో కూడా తెలియని పరిస్థితిలో బతుకుతున్నాం.చరిత్ర చదువుకేటప్పుడు క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని చదువుకున్నట్లు.. ఆరోగ్యం అంటే కరోనా ముందు, కరోనా తరువాత అన్నట్లు అయిపోయింది. కోవిడ్ మహమ్మారి ప్రజల జీవితాలను అంతలా తలకిందులు చేసింది. చేతిలో డబ్బులు లేక.. ఆసుపత్రులలో ఖర్చులు పెట్టుకోలేక పడ్డ ఇబ్బందులు కోకొల్లలు. ఆ తరువాత చాలామంది కళ్ళు తెరిచారు. హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకున్నారు. అవసరానికి చేతిలో డబ్బులు ఉండకపోవచ్చు. కాబట్టి ముందు జాగ్రత్తగా ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఈ విషయం బహుశా అందరికీ తెలిసి ఉన్నప్పటికీ.. 'ప్రపంచ ఆరోగ్య దినోత్సవం' సందర్భంగా హెల్త్ ఇన్సూరెన్స్ను ఎలా ఎంచుకోవాలనే విషయాన్ని ఈ కథనంలో చూసేద్దాం..హెల్త్ ఇన్సూరెన్స్ అనేది.. ఆరోగ్య స్థితిని బట్టి మాత్రమే కాకుండా, నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు, ఎలాంటి ఆసుపత్రిలో చికిత్స తీసుకోవానుకుంటున్నావు అనేదానిపై కూడా ఆధారపడి ఉంటుంది. మెట్రోపాలిటన్ నగరాల్లో నివసిస్తున్న అనేక మధ్యతరగతి కుటుంబాలకు..హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ రూ. 5 లక్షలు సరిపోదని స్పష్టమైపోయింది. చాలా మంది ఆర్థిక సలహాదారులు, ఆరోగ్య బీమా నిపుణులు సైతే కనీసం రూ. 10 లక్షల కవరేజ్ సిఫార్సు చేస్తున్నారు.నాణ్యమైన ఆరోగ్య సేవల కోసంతగినంత పెద్ద కవరేజ్ ఉండటం వల్ల.. మీరు మీకు నచ్చిన ఆసుపత్రులు చికిత్స తీసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రతి వ్యక్తి నాణ్యమైన ఆరోగ్య సేవలను పొందటానికి ఉత్తమమైన మార్గం వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీ. వయసులో ఉన్నప్పుడు వచ్చే ఆరోగ్య సమస్యలు తక్కువే అయినప్పటికీ.. వయసు మీదపడే కొద్దీ ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతాయి.35 ఏళ్ల వ్యక్తి కనీసం రూ. 10 లక్షల కవర్తో ఇన్సూరెన్స్ ప్రారంభించడం ఉత్తమం. దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స అవసరం అయినప్పుడు లేదా తరచూ ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రులకు వెళ్ళేవాళ్ళకు ఇంకా పెద్ద కవరేజ్ అవసరం అవుతుంది. కాబట్టి వ్యక్తి ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని.. పాలసీ ఎంచుకోవడం ఉత్తమం.ఇదీ చదవండి: బంగారం కొనడానికి ఇదే మంచి సమయం.. మరింత తగ్గిన రేటుమెట్రో నగరాల్లో నివసించేవారికిచిన్న పట్టణాలలో నివసిస్తున్న వారితో పోలిస్తే.. మెట్రో నగరాల్లో నివసిస్తున్నవారికి పెద్ద కవరేజ్ అవసరం అవుతుంది. ముంబై వంటి మహానగరాల్లో, ఇండోర్ వంటి టైర్-II నగర్లో నివసిస్తున్న వ్యక్తి ఆసుపత్రికి వెళ్లాలంటే.. కొంత ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి మీరు కవరేజ్ మొత్తాన్ని నిర్ణయించేటప్పుడు మీ నగరంలోని ఖర్చులను కూడా దృష్టిలో పెట్టుకోవాలి.కుటుంబంలో ప్రతి వ్యక్తికి రూ. 10 లక్షల వరకు వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ ఉండటం మంచిది. ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీని కొనుగోలు చేయాలనుకుంటే.. కనీసం రూ. 20 లక్షల కవర్తో ప్రారంభించడం ఉత్తమం. ఆర్థిక స్థోమత అడ్డంకి కాకుండా ఉండాలంటే.. ఆరోగ్య సమస్యలను నుంచి బయట పడాలంటే.. బీమా తీసుకోవాల్సిందే. -
రుణ వేధింపులకు చెక్ పెడదాం..!
ఢిల్లీకి చెందిన అనుజ్ (35) వ్యాపారంలో సమస్యలు ఎదుర్కొంటున్నాడు. తాను తీసుకున్న వ్యక్తిగత రుణం ఈఎంఐలను సకాలంలో చెల్లించలేకపోయాడు. దాంతో రుణ వసూళ్ల ఏజెంట్ల బృందం ఆయన ఇంటి ముందు వాలిపోయింది. నినాదాలూ చేస్తూ, ఆ దారిలో వెళ్లే ఒక్కొక్కరిని పిలిచి అనుజ్ రుణం ఎగ్గొట్టాడంటూ దు్రష్పచారం మొదలు పెట్టారు. తద్వారా అనుజ్కు పరువుపోయినట్టయింది. ఇది అనుజ్ ఒక్కడి సమస్యే అనుకుంటే పొరపాటు. ఏటా లక్షలాది మంది ఇలా రుణ రికవరీ ఏజెంట్ల వేధింపులకు గురవుతున్నవారే. వీటిని భరించలేక బలవన్మరణానికి పాల్పడిన వారూ ఉన్నారు. రుణ గ్రహీతలకూ కొన్ని హక్కులు ఉన్న విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. రుణం చెల్లించకపోతే వసూలు చేసుకునే విషయంలోనూ బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలు/వాటి ఏజెంట్లకూ నిర్దేశిత నిబంధనలు, పరిమితులు ఉన్నాయి. వాటిని హద్దుమీరి వ్యవహరిస్తుంటే సహించక్కర్లేదు. అనుచిత చర్యల నుంచి రక్షణ కోరడమే కాదు, ఉపశమనం పొందొచ్చు. ఈ విషయమై సమాచారం అందించే కథనమే ఇది. గతంతో పోల్చితే నేడు రుణాలు ఎంతో సులభంగా లభిస్తున్నాయి. దీంతో రుణ ఎగవేతలు కూడా పెరిగాయి. సూక్ష్మ రుణాలు, వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డు రుణాల్లో ఇటీవలి కాలంలో చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయి. కొన్ని వర్గాల రుణ గ్రహీతలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల ప్రభావం బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీల రుణ వసూళ్లపై ప్రభావం చూపిస్తున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని నెలల పాటు వసూలు కాకుండా ఉండిపోయిన రుణాలను మొదట బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలు తమ రుణ రికవరీ బృందాలకు అప్పగిస్తాయి. లేదా రుణ రికవరీ ఏజెన్సీలకు అప్పగిస్తుంటాయి. ఫలితం లేకపోతే అస్సెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలకు (ఏఆర్సీలు) విక్రయిస్తాయి. రుణ రికవరీ ఏజెన్సీలు రుణం వసూలు చేసినందుకు ఇంత చొప్పున తీసుకుంటాయి. ఏఆర్సీలు అయితే మొండి బాకీలను తక్కువ రేటుకు కొనుగోలు చేసుకుని, వాటిని వసూలు చేసుకునేందుకు చర్యలు మొదలు పెడతాయి. ఇక్కడ ఎక్కువ సందర్భాల్లో కనిపించేది.. రుణం తీసుకున్న వారిని నయానో, భయానో నానా రకాలుగా వెంటపడి, వేధించి వసూలు చేసుకోవడమే ఏజెంట్ల పని. స్పష్టమైన నిబంధనలు రుణ వసూళ్లకు రుణదాతలు కఠిన చర్యలకు పాల్పడుతున్న విషయం ఆర్బీఐ దృష్టికి రావడంతో.. రుణ రికవరీ ఏజెంట్ల నియంత్రణ విషయమై, వారి నడవడికపై లోగడే సమగ్రమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఆ తర్వాత పలు విడతలుగా వాటిని మెరుగుపరుస్తూ నోటిఫికేషన్లను జారీ చేసింది. రుణ గ్రహీతలకు ఉన్న హక్కులను గౌరవిస్తూనే, నైతిక విధానాల్లో వసూలుకు నిబంధనలు అమల్లో పెట్టింది. వీటి ప్రకారం.. రుణాన్ని పారదర్శకమైన విధానాల్లోనే వసూలు చేసుకోవాలి. మాటలతో లేదా చేతలతో వేధింపులకు దిగకూడదు. రుణానికి సంబంధించి, రుణ గ్రహీతకు సంబంధించి గోప్యత, గౌరవాన్ని కాపాడాలి. వారి పరువు నష్టానికి భంగం కలిగించకూడదు. బెదిరించకూడదు. రుణం చెల్లించలేదంటూ నోటీసు జారీ చేసి చట్టబద్ధమైన మార్గాల్లోనే వసూలుకు చర్యలు తీసుకోవాలి. అంతేకాదు రుణ గ్రహీతకు కాల్స్ చేయడం కూడా ఉదయం 8 గంటల తర్వాత, రాత్రి 7గంటల్లోపేనని నిబంధలు చెబుతున్నాయి. రుణం చెల్లింపులు ఆగిపోయిన అన్ని కేసుల్లోనూ ఉద్దేశపూర్వకమని చెప్పలేం. ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోవడం, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు ఎదురుకావడం వంటివి చోటు చేసుకోవచ్చు. కనుక చెల్లింపులు చేయని రుణ గ్రహీతలు అందరినీ ఒకే గాటన కట్టడాన్ని సమర్థించలేం. గుర్తింపును ధ్రువీకరించుకోవాలి..నేడు సైబర్ మోసాలు పెరిగిపోయాయి. తమకు వస్తున్న కాల్స్ అన్నీ రుణం వసూలు కోసమని భావించడానికి లేదు. అందులో సైబర్ మోసగాళ్ల కాల్స్ కూడా ఉండొచ్చు. అందుకని రుణం విషయమై వచ్చే కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. అవతలి వ్యక్తి బ్యాంక్ అదీకృత ఉద్యోగియేనా? లేదంటే సంబంధిత వ్యక్తికి బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీ ధ్రువీకరణ ఉందా? అన్నది నిర్ధారించుకోవాలి. వారి గుర్తింపు కార్డ్ను చూపించాలని కోరాలి. ఆ ఐడీ కార్డ్ మీరు రుణం తీసుకున్న బ్యాంక్ లే దా ఎన్బీఎఫ్సీ జారీ చేసిందేనా? అని పరిశీలించాలి. సరైనదని భావిస్తేనే వారితో వివరాలు పంచుకోవచ్చు. లేదంటే నేరుగా బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీ సిబ్బందితోనే డీల్ చేసుకుంటామని తెగేసి చెప్పేయాలి.నిబంధనలు పాటించాల్సిందే.. ఆర్బీఐ నియంత్రణలోని బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లు, కోపరేటివ్ బ్యాంక్లు అన్నీ కూడా ఆర్బీఐ ప్రవర్తనా నియమావళికి కట్టుబడి ఉండాల్సిందే. ఈ విషయంలో ఏజెంట్లకు సరైన శిక్షణ ఇవ్వాలని, వారి ప్రవర్తనకు బ్యాంక్లే బాధ్యత వహించాలని ఆర్బీఐ ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి. బ్యాంక్లు తమ వెబ్సైట్లలో రికవరీ ఏజెన్సీల వివరాలను వెల్లడించాలి. ఫలానా రికవరీ ఏజెంట్ లేదా ఏజెన్సీకి రుణ వసూలు బాధ్యత అప్పగించామని రుణగ్రహీతకు బ్యాంక్ ముందస్తు సమాచారం ఇవ్వాలి. బ్యాంక్ అదీకృత లేఖ, బ్యాంక్ నోటీసును ఏజెంట్లు చూపించాలి. ఒకవేళ ఏజెంట్ల నుంచి అనుచిత, అనైతక తీరును ఎదురైతే అప్పుడు రుణ గ్రహీతలు తమ హక్కులను కాపాడుకునేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. కాల్స్ చేసి వేధించినట్టయితే కాల్ రికార్డులను భద్రపరుచుకోవాలి. ఈ మెయిల్స్, ఎస్ఎంఎస్ల రూపంలో వేధిస్తే వాటిని సైతం జాగ్రత్త పరుచుకోవాలి. ఇంటికొచ్చి వేధిస్తుంటే వీడియో తీసి సేవ్ చేసుకోవాలి. ముందుగా సంబంధిత బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలి. స్పందన లేకపోతే అప్పుడు ఆర్బీఐని ఆశ్రయించొచ్చు.ఇలా చేస్తే నయం.. → ఆర్బీఐ రిజిస్టర్డ్ సంస్థల నుంచే రుణాలను తీసుకోవాలి. ఒకవేళ సమస్య ఎదురైతే పరిష్కరించుకోవడం సులభం. → రుణాన్ని సకాలంలో చెల్లించలేకపోవడానికి సహేతుక కారణాలను బ్యాంక్ సిబ్బందికి తెలియజేసి, తగిన సమయం కోరొచ్చు. రుణాన్ని తిరిగి చెల్లించే ప్రణాళికను సమరి్పంచొచ్చు. → రుణం తీసుకునే ముందు ఒప్పందం నిబంధనలను, తమ హక్కుల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. వేధింపులపై చర్యలు → రుణ రికవరీ ఏజెంట్ల వేధింపులు, బెదిరింపులకు సంబంధించి ఆధారాలను సేకరించాలి. వీటిని బ్యాంక్ లోన్ ఆఫీసర్ లేదా నోడల్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లాలి. → స్పందన లేకపోతే, వేధింపులు ఆగకపోతే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలి. → బ్యాంక్ సేవలపై కన్జ్యూమర్ కోర్టులో ఫిర్యాదు దాఖలును పరిశీలించొచ్చు. → వేధింపుల నుంచి ఉపశమనం కోసం స్థానిక కోర్టులో సివిల్ వ్యాజ్యం దాఖలు చేసి ఇంజంక్షన్ ఉత్తర్వులు పొందొచ్చు. → తమ ఆందోళనలను బ్యాంక్ పట్టించుకోకపోతే అప్పుడు ఆర్బీఐ అంబుడ్స్మన్కు ఫిర్యాదు చేయొచ్చు. ప్రతీ ప్రాంతానికి ప్రత్యేక అంబుడ్స్మన్ ఉంటారు. వారి చిరునామా, కాంటాక్ట్ వివరాలను ఆర్బీఐ వెబ్సైట్ నుంచి పొందొచ్చు. → వేధింపులకు సంబంధించి ఆధారాలకు దొరకకుండా ఉండేందుకు రికవరీ ఏజెంట్లు గుర్తించడానికి వీల్లేని ఫోన్ నంబర్లు లేదా వాట్సాప్ ద్వారా సంప్రదింపులు చేసే అవకాశం లేకపోలేదు. అలా గుర్తించినట్టయితే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు. → రికవరీ ఏజెంట్లు రుణ గ్రహీత కుటుంబ సభ్యులు, సమీప బంధువులు, స్నేహితుల నంబర్లకు కాల్ చేసి బెదిరిస్తున్న ఘటనలు కూడా చూస్తున్నాం. ఇలా చేసినా లేదా పనిచేసే కార్యాలయం, నివాస సమీపంలో సమస్యలు సృష్టించినట్టయితే వారిపై పరువునష్టం కేసు దాఖలు చేయొచ్చు. → అనుమతి లేకుండా ఇంట్లోకి ప్రవేశించినట్టయితే కోర్టులో కేసు వేయొచ్చు. → రుణ రికవరీ ఏజెంట్ల వేధింపులపై న్యాయ నిపుణులతో చర్చించి వారి సలహా మేరకు సరైన చర్యలు చేపట్టొచ్చు.ఆర్బీఐ కఠిన చర్య హెచ్డీఎఫ్సీ బ్యాంక్పై ఆర్బీఐ ఇటీవలే రూ.కోటి జరిమానా విధించింది. రికవరీ ఏజెంట్లకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలడంతో కఠినంగా వ్యవహరించింది. అది కూడా నిర్దేశించిన వేళల్లో (ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటలు) కాకుండా ఇతర సమయంలో కాల్స్ చేసి రుణ గ్రహీతలను వేధించినట్టు బయటపడింది. రుణ వసూళ్లలో పేరున్న సంస్థలు సైతం ఎలా వ్యవహరిస్తున్నాయన్న దానికి ఇదొక ఉదాహరణ. కఠిన చట్టాలు...సూక్ష్మ రుణ గ్రహీతల కోసం కర్ణాటక ప్రభుత్వం ఇటీవలే ఓ సంచలనాత్మక చట్టాన్ని తీసుకొచ్చింది. వేధింపులు, బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు, శిక్షలకు ఇందులో చోటు కల్పించింది. రాష్ట్రంలో రుణ వసూళ్ల ఆగడాలు పెరిగిపోవడంతో ఇలాంటి చర్యకు దిగింది. సూక్ష్మ రుణ సంస్థల నుంచి రుణాలు తీసుకున్న వారి హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. ఆర్బీఐ నిర్దేశించిన రుణ వసూలు నిబంధనలను ఉల్లంఘించే రుణ రికవరీ ఏజెంట్లు, ఫైనాన్స్ కంపెనీ యజమానులపై సుమోటో కేసులు నమోదు చేసేందుకు, హెల్ప్లైన్ ఏర్పాటుకు ప్రతి జిల్లా స్థాయిలో చర్యలకు ప్రభుత్వం ఆదేశించడం గమనార్హం. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
నెలకు ₹5000 ఆదాతో రూ.8 లక్షలు చేతికి
ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో ఎంతో కొంత ఆదా చేయాలని చూస్తారు. అయితే డబ్బు సురక్షితంగా ఉంటాలంటే?, మంచి రాబడి పొందాలంటే?.. తప్పకుండా పోస్టాఫీస్ పథకాలలో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. ఇందులో ఒకటి 'పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్'. ఈ స్కీమ్ ద్వారా ఎంత వడ్డీ వస్తుంది. ఇతర ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకంలో మీరు నెలకు 5000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే.. రూ. 8 లక్షల రిటర్న్స్ పొందవచ్చు. ఎలా అంటే.. మీరు నెలకు రూ. 5000 ఇన్వెస్ట్ చేస్తే.. ఏడాదికి రూ. 60వేలు అవుతుంది. మీకు ఈ స్కీములో 6.7 శాతం వడ్డీ లభిస్తుంది. ఇలా ఐదేళ్లు ఇన్వెస్ట్ చేస్తుంటే.. మీ మొత్తం రూ. 3లక్షలు అవుతుంది. దీనికి వడ్డీ కింద రూ. 56,830 లభిస్తాయి.మీరు ఈ స్కీమ్ కింద రూ. 5000.. పదేళ్లు ఇన్వెస్ట్ చేస్తే మీ పెట్టుబడి రూ.6 లక్షలు అవుతుంది. ఈ డిపాజిట్పై 6.7 శాతం వడ్డీ మొత్తం రూ. 2,54,272 అవుతుంది. దీని ప్రకారం 10 సంవత్సరాల కాలంలో మీ మొత్తం డిపాజిట్ చేసిన మొత్తం రూ. 8,54,272 అవుతుంది. ఇలా పదేళ్లలో రూ. 5000 ఇన్వెస్ట్ చేస్తూ రూ. 8లక్షల కంటే ఎక్కువ పొందువచ్చు.ఇదీ చదవండి: ఇన్వెస్టర్లు ధనవంతులవుతారు.. ఇదే మంచి సమయం: డొనాల్డ్ ట్రంప్గత సంవత్సరం 2023లో.. ప్రభుత్వం పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్పై వడ్డీ రేట్లను పెంచింది. వడ్డీ పెరగడం వల్ల పెట్టుబడిదారులకు లభించే రిటర్న్స్ కూడా ఆశాజనకంగా ఉంటాయి. పోస్ట్ ఆఫీస్ చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి సవరిస్తుంది, పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ వడ్డీ చివరి సవరణ 29 సెప్టెంబర్ 2023న జరిగింది.50 శాతం వరకు లోన్ తీసుకోవచ్చుమీరు సమీపంలోని ఏదైనా పోస్టాఫీసుకు వెళ్లి పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్లో ఖాతాను ఓపెన్ చేయవచ్చు. ఇందులో పెట్టుబడిని రూ.100 నుంచి ప్రారంభించవచ్చు. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ మెచ్యూరిటీ వ్యవధి ఐదు సంవత్సరాలు, కానీ మీరు ఈ వ్యవధి పూర్తయ్యేలోపు ఖాతాను మూసివేయాలనుకుంటే.. క్లోజ్ చేసుకోవచ్చు. ఇందులో లోన్ సౌకర్యం కూడా ఉంటుంది. ఈ అకౌంట్ ఒక ఏడాది పాటు యాక్టివ్గా ఉన్న తరువాత.. మీరు డిపాజిట్ చేసిన మొత్తంలో 50 శాతం వరకు లోన్ తీసుకోవచ్చు. దీనిపై వడ్డీ రేటు 2 శాతం కంటే ఎక్కువ. -
అధిక వడ్డీ ఇచ్చే స్కీమ్ నిలిపేసిన ఎస్బీఐ
డబ్బు పొదుపు చేసుకోవాలనుకునేవారు సాధారణంగా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవాలనే చూస్తారు. అందులోనూ కొంత ఎక్కువ వడ్డీ వచ్చే పథకాలు ఎమున్నాయా అని వెతుకుతారు. అలాంటి వారికోసం 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (SBI) అందిస్తున్న 'అమృత్ కలశ్ ఫిక్స్డ్ డిపాజిట్' స్కీమ్ నిలిపివేసింది.గతంలో ఎస్బీఐ.. తన అమృత్ కలశ్ ఫిక్స్డ్ డిపాజిట్ గడువు ముగిసినప్పటికీ దానిని పొడిగించింది. అయితే ఇప్పుడు గడువును పొడిగించకపోగా.. స్కీమును ఏప్రిల్ 1 నుంచి నిలిపివేసింది. రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను తగ్గించడం వల్ల.. బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను తగ్గించాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే అధిక వడ్డీ ఇచ్చే ఈ పథకాన్ని బ్యాంక్ నిలిపివేసింది.ఇదీ చదవండి: ఇన్వెస్టర్లు ధనవంతులవుతారు.. ఇదే మంచి సమయం: డొనాల్డ్ ట్రంప్స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించిన అమృత్ కలశ్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా.. సాధారణ పెట్టుబడిదారులకు సంవత్సరానికి 7.10 శాతం వడ్డీని, 400 రోజుల డిపాజిట్పై సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం వడ్డీని అందించింది. ఇకపై ఈ స్కీమ్ అందుబాటులో ఉండదని తెలియడంతో కస్టమర్లు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. -
EPFO కీలక మార్పులు..
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియను సులభతరం చేయడానికి రెండు ముఖ్యమైన మార్పులను ప్రవేశపెట్టింది. ఈ సంస్కరణలు ఈపీఎఫ్ సభ్యులకు గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తాయని, కార్యకలాపాలను క్రమబద్ధీకరిస్తాయని, ఆలస్యాన్ని తగ్గిస్తాయని భావిస్తున్నారు.డాక్యుమెంట్ అప్లోడ్ అవసరం లేదుఫిర్యాదులను తగ్గించడానికి, క్లెయిమ్లను దాఖలు చేసే సౌలభ్యాన్ని మెరుగుపరిచే చర్యలో భాగంగా ఆన్లైన్ క్లెయిమ్ చేసేటప్పుడు సభ్యులు చెక్ లీవ్స్ లేదా ధ్రువీకరించిన బ్యాంక్ పాస్బుక్ వివరాల స్కాన్ చిత్రాలను అప్లోడ్ చేయాల్సిన అవసరాన్ని ఈపీఎఫ్ఓ తొలగించింది. గతంలో ఈ డాక్యుమెంట్లను నాసిరకంగా అప్లోడ్ చేయడం వల్ల చాలా క్లెయిమ్లు తిరస్కరణకు గురయ్యేవి. ఈ ఆవశ్యకతను తొలగించడం ద్వారా, ప్రక్రియ సులభతరం కావడం కాకుండా క్లెయిమ్ ఆమోదం వేగవంతమయ్యే అవకాశం ఉంటుంది.కంపెనీ ఆమోదం అక్కర్లేదు సభ్యుల బ్యాంకు ఖాతాలను వారి యూనివర్సల్ అకౌంట్ నంబర్లతో (యూఏఎన్) అనుసంధానించే ప్రక్రియలో యజమాన్యం (కంపెనీ) అనుమతి అవసరాన్ని ఈపీఎఫ్ఓ తొలగించింది. యూఏఎన్కు బ్యాంకుల ఖాతాల లింక్ కోసం సభ్యులు పెట్టుకున్న వినతులకు అనుమతులివ్వడంలో కొన్నిసార్లు యాజమాన్యాల వద్ద జాప్యం జరుగుతోంది. దీంతో క్లెయిమ్లు, ఇతర వాటి కోసం సభ్యులు సభ్యులు ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు తాజా మార్పుతో సభ్యులు ఇబ్బందులు తొలగుతాయి.Under the leadership of PM Shri @narendramodi ji, EPFO continues its reform journey! Two major reforms have been introduced to make the claim settlement process simpler, faster, and hassle-free for crores of EPF members & employers:✅ No need to upload image of cheque leaf/… pic.twitter.com/YScWOkw0gn— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) April 3, 2025 -
ఆ పోస్టాఫీస్ స్కీమ్ నిలిపివేసిన ప్రభుత్వం
మహిళా సాధికారతను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన.. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ (MSSC) పథకం 2025 మార్చి 31 నుంచి నిలిపివేశారు. ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం (DEA).. ఎంఎస్ఎస్సీ పథకం గడువు తరువాత కొనసాగదని అధికారికంగా వెల్లడించింది. కాబట్టి ఇకపై ఈ పథకం కింద కొత్త డిపాజిట్లు లేదా పెట్టుబడులకు ఆస్కారం లేదు.మహిళల ఆర్థిక భద్రతను ప్రోత్సహించడానికి ప్రభుత్వం 2023 బడ్జెట్ సమయంలో ఈ ఎంఎస్ఎస్సీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా మహిళలు పొదుపు చేసేందుకు ప్రోత్సాహం లభించింది. ఎంఎస్ఎస్సీ పథకం నిలిపివేయడం వల్ల కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకున్న మహిళలకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉంది. అయితే, మార్చి 31, 2025లోపు ఎంఎస్ఎస్సీలో పెట్టుబడి పెట్టిన వారికి మాత్రం 7.5 శాతం వడ్డీ రేటుతో ప్రయోజనం ఉంటుంది.ప్రత్యామ్నాయ పెట్టుబడి ఎంపికలుమహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకం మిస్ అయిన వారు.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, ఫిక్స్డ్ డిపాజిట్స్ వంటి వాటిలో పెట్టుబడులు పెట్టవచ్చు. -
పీపీఎఫ్ నామినీ మార్పునకు ఛార్జీలు లేవు: నిర్మలా సీతారామన్
నామినీ వివరాలను అప్డేట్ చేసినప్పుడు లేదా మార్చినప్పుడు 'పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్' (PPF) చందాదారులు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' తెలిపారు. ఈ విషయాన్ని తన అధికారిక ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.పీపీఎఫ్ ఖాతాలకు నామినీ పేర్లను మార్చడానికి ఆర్ధిక సంస్థలు రూ.50 వసూలు చేసినట్లు మా దృష్టికి వచ్చింది. ఈ చార్జీలను తొలగించడానికే జీవో తీసుకురావడం జరిగింది. దీనికోసం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అవసరమైన మార్పులు చేసినట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు.ఇటీవల ఆమోదం పొందిన బ్యాంకింగ్ సవరణ బిల్లు 2025 ప్రకారం.. డిపాజిటర్ల డబ్బు, సురక్షిత కస్టడీలో ఉంచిన వస్తువులు, భద్రతా లాకర్ల చెల్లింపు కోసం నలుగురు వరకు నామినీలు ఉండవచ్చు.ఇదీ చదవండి: తారాస్థాయికి చేరిన గోల్డ్ రేటు: ఇదే ఆల్టైమ్ రికార్డ్!నామినేషన్ కోసం ఫారం-10 ని దాఖలు చేయడం ద్వారా మీరు మీ పీపీఎఫ్ ఖాతాలోని నామినీ వివరాలను మార్చవచ్చు. దీన్ని ఆన్లైన్, ఆఫ్లైన్ రెండింటిలోనూ అప్డేట్ చేసుకోవచ్చు. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ వంటి కొన్ని బ్యాంకులు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చందాదారులు వివరాలను నవీకరించడానికి అనుమతిస్తాయి.Recently was informed that a fee was being levied by financial institutions for updating/modifying nominee details in PPF accounts. Necessary changes are now made in the Government Savings Promotion General Rules 2018 via Gazette Notification 02/4/25 to remove any charges on… pic.twitter.com/Hi33SbLN4E— Nirmala Sitharaman (@nsitharaman) April 3, 2025 -
నేరుగా వాట్సాప్లో.. ఇన్వెస్టర్లకు సరికొత్త ఫీచర్
హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ వాట్సాప్ ఆధారిత ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ ‘ట్యాప్2ఇన్వెస్ట్’ను ప్రవేశపెట్టింది. ఈ ఇండస్ట్రీ-ఫస్ట్ ఫీచర్ ప్రస్తుత కేవైసీ-వెరిఫైడ్ ఇన్వెస్టర్లను వాట్సాప్లో క్లిక్ ఆధారిత ఇంటర్ఫేస్ ద్వారా మ్యూచువల్ ఫండ్ పథకాలలో పెట్టుబడి పెట్టడానికి అనుమతిస్తుందని మ్యూచువల్ ఫండ్ హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది.టెక్ట్స్ కమాండ్లపై ఆధారపడే సాంప్రదాయ వాట్సాప్ ఆధారిత పెట్టుబడి సేవల మాదిరిగా కాకుండా, ట్యాప్ 2ఇన్వెస్ట్ వాట్సాప్లో యూజర్ ఫ్రెండ్లీ, యాప్ లాంటి అనుభవాన్ని అందిస్తుంది. పెట్టుబడిదారులు నేరుగా వాట్సాప్ (+91-82706 82706) ద్వారా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (సిప్) ప్రారంభించవచ్చు. లేదా పెద్ద మొత్తం పెట్టుబడులను సైతం పెట్టవచ్చు.యూపీఐ ఆటోపే, నెట్ బ్యాంకింగ్, ఇతర డిజిటల్ పేమెంట్ ఆప్షన్లకు ఈ ప్లాట్ఫామ్ సపోర్ట్ చేస్తుందని ఫండ్ హౌస్ తెలిపింది. వాట్సాప్ వంటి సుపరిచిత ప్లాట్ఫామ్లో ఇన్వెస్టర్లు తమ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను నిర్వహించడానికి ‘ట్యాప్2ఇన్వెస్ట్’ సురక్షితమైన మార్గాన్ని అందిస్తుందని హెచ్డీఎఫ్సీ ఏఎంసీ ఎండీ, సీఈఓ నవనీత్ మునోత్ వివరించారు. -
బంగారం భారీగా పడిపోతుందా? అనలిస్టుల కొత్త అంచనా
అంతర్జాతీయంగా బంగారం ధరలు అంతే లేకుండా పెరిగిపోతున్నాయి. ఇటీవల కొన్ని నెలలుగా రికార్డు గరిష్టాలకు చేరుకున్న బంగారం ధర ఇన్వెస్టర్లకు వరంగా ఉన్నా, ఆభరణాలు కొనుగోలు చేసే వినియోగదారులకు మాత్రం భారంగా మారింది. అయితే ఇది ఎంతో కాలం ఉండదని, త్వరలోనే బంగారం ధరలు భారీగా పడిపోయే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. బంగారం ధరలు దాదాపు 40 శాతం తగ్గుతాయని కొన్ని అంచనాలు వెలువడ్డాయి.అమెరికాకు చెందిన ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ మార్నింగ్స్టార్లో మార్కెట్ స్ట్రాటజిస్ట్ జాన్ మిల్స్ బంగారం ధర ఔన్స్కు 1,820 డాలర్లకు పడిపోవచ్చని అంచనా వేశారు. ప్రస్తుతం (ఏప్రిల్ 2) ఒక ఔన్స్ పసిడి ధర 3,123 డాలర్ల వద్ద ఉంది. భారత్లో (ఢిల్లీ) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.92,990 వద్ద, 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.85,250 వద్ద ఉంది. ఇదే అంచనా నిజమైతే బంగారం ధరలు భారీగా దిగొస్తాయి.భౌగోళిక రాజకీయ అనిశ్చితి, ఆర్థిక అస్థిరత, ద్రవ్యోల్బణ ఆందోళనల కలయికతో బంగారం ఇటీవల పుంజుకుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ మార్కెట్లలో ఒడిదుడుకులకు భయపడి ఇన్వెస్టర్లు సురక్షిత స్వర్గధామంగా బంగారం వైపు మొగ్గు చూపారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాలనలో కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు ఈ ఆందోళనలను మరింత తీవ్రతరం చేశాయి. బంగారానికి డిమాండును మరింత పెంచాయి.తగ్గేందుకు చెబుతున్న కారణాలుబంగారానికి ప్రస్తుత బుల్లిష్ ట్రెండ్ కొనసాగుతోంది. బ్యాంక్ ఆఫ్ అమెరికా, గోల్డ్ మన్ శాక్స్ వంటి ప్రధాన ఆర్థిక సంస్థలు బంగారంపై బుల్లిష్ గా ఉన్నాయి. వచ్చే రెండేళ్లలో బంగారం ధర ఔన్స్కు 3,500 డాలర్లకు చేరుకోవచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా వేయగా, గోల్డ్మన్ శాక్స్ ఈ ఏడాది చివరి నాటికి ఔన్స్ ధర 3,300 డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. అయితే ఇందుకు భిన్నంగా మిల్స్తోపాటు మరికొందరు విశ్లేషకులు బంగారం ధరలలో గణనీయమైన తగ్గుదల వస్తుందని భావిస్తున్నారు. అందుకు కొన్ని కారణాలను పేర్కొంటున్నారు.పెరిగిన సరఫరా: ప్రపంచవ్యాప్తంగా బంగారం సరఫరా వేగంగా పెరుగుతోంది. 2024 రెండో త్రైమాసికంలో గోల్డ్ మైనింగ్ లాభాలు ఔన్స్కు 950 డాలర్లకు చేరుకున్నాయి. ఇది ఉత్పత్తిని పెంచింది. ప్రపంచ బంగారు నిల్వలు 9% పెరిగి 2,16,265 టన్నులకు చేరుకున్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా తన బంగారం ఉత్పత్తిని పెంచగా, పాత బంగారం రీసైక్లింగ్ కూడా పెరిగింది. ఇది మరింత సరఫరాను జోడించింది.డిమాండ్ తగ్గే సంకేతాలు: సెంట్రల్ బ్యాంకులు, ఇన్వెస్టర్లు దూకుడుగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నప్పటికీ, ఈ ధోరణి కొనసాగకపోవచ్చని తాజా గణాంకాలు సూచిస్తున్నాయి. గత ఏడాది సెంట్రల్ బ్యాంకులు 1,045 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయగా, వరుసగా మూడో ఏడాది 1,000 టన్నులకు పైగా కొనుగోళ్లు జరిగాయి. అయితే 71% కేంద్ర బ్యాంకులు తమ బంగారు నిల్వలను పెంచుకోకూడదని భావిస్తున్నాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సర్వే కనుగొంది.మార్కెట్ సంతృప్తత: పసిడి పరిశ్రమలో విలీనాలు, కొనుగోళ్లు పెరగడం తరచుగా మార్కెట్ గరిష్టాలను సూచిస్తుంది. 2024 లో, బంగారం రంగంలో డీల్ మేకింగ్ 32% పెరిగింది. ఇది మార్కెట్ వేడెక్కవచ్చని సూచిస్తుంది. అంతేకాకుండా, బంగారం ఆధారిత ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్) పెట్టుబడులలో ఇటీవలి పెరుగుదల బంగారం ధరలు పుంజుకోకముందుటి పరిస్థితులకు దగ్గర ఉండటం ధరల పతనం తక్షణమే ఉండవచ్చనే వాదనలను బలపరుస్తోంది. -
EPFO విత్డ్రా లిమిట్ రూ.5 లక్షలకు పెంపు!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO).. ఆటో సెటిల్మెంట్ పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచాలని యోచిస్తోంది. ఇదే జరిగితే.. 7.5 కోట్ల కంటే ఎక్కువ ఈపీఎఫ్ఓ సభ్యులకు లబ్ది చేకూరుస్తుంది.గత వారం జరిగిన సమావేశంలో కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి 'సుమితా దావ్రా' ఈ పరిమితిని పెంచే ప్రతిపాదనను ఆమోదించారు. అయితే ఈ సిఫార్సును ఇప్పుడు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) ఆమోదం కోసం సమర్పించనున్నారు. ఇవన్నీ పూర్తయిన తరువాత ఈపీఎఫ్ఓ సభ్యులు ఆటో సెటిల్మెంట్ ద్వారా రూ. 5 లక్షల వరకు విత్డ్రా చేసుకోవచ్చు.ఈపీఎఫ్ఓ ఆటో సెటిల్మెంట్ మోడ్ను ఏప్రిల్ 2020లో అందుబాటులోకి తీసుకొచ్చింది. అప్పటి నుంచి వైద్య ఖర్చుల కోసం, విద్య, వివాహం, గృహనిర్మాణం వంటి వాటి కోసం అడ్వాన్స్గా నగదు తీసుకునేందుకు అవకాశం లభించింది. అయితే మే 2024లో ఆటో అప్రూవ్డ్ క్లెయిమ్ల పరిమితిని రూ.50,000 నుంచి రూ.1 లక్షకు పెంచారు. ఆ తరువాత చాలామంది దీనిని ఉపయోగించుకున్నారు.ఇదీ చదవండి: ఈ రూల్ అతిక్రమిస్తే.. డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్!: నితిన్ గడ్కరీమార్చి 6, 2025 నాటికి 2.16 కోట్ల ఆటో క్లెయిమ్లు ప్రాసెస్ చేయబడ్డాయి. గతంలో కంటే కూడా ఇప్పుడు కేవలం మూడు రోజుల్లోనే 95 శాతం ఆటో మోడ్ క్లెయిమ్లు పరిష్కారమయ్యాయి. తిరస్కరణ రేటు 50 శాతం నుంచి 30 శాతానికి తగ్గింది. -
ఎస్బీఐ సేవల్లో అంతరాయం: నిలిచిపోయిన ట్రాన్సాక్షన్స్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లు ఆన్లైన్ సేవలతో సమస్యలను ఎదుర్కొంటున్నారు. వెబ్సైట్ పర్ఫామెన్స్ ట్రాకింగ్ ప్లాట్ఫామ్ డౌన్డెటెక్టర్ ప్రకారం, ఈరోజు ఉదయం 8:15 గంటలకు ఈ అంతరాయం ప్రారంభమైంది. 11:45 గంటలకు సమస్య తీవ్రమై 800 కంటే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి.వార్షిక ముగింపు కార్యకలాపాల కారణంగా.. ఏప్రిల్ 1 మధ్యాహ్నం 1:00 గంట నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో లైట్, యూపీఐ సేవల వంటి డిజిటల్ సర్వీసులు అందుబాటులో ఉండవని.. ఈ అంతరాయానికి క్షమించమని ఎస్బీఐ తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించింది.ఇదీ చదవండి: రూ.8000 కోట్లకు కంపెనీ అమ్మేసి.. ఫిజిక్స్ చదువుతున్నాడుడౌన్డెటెక్టర్ ప్రకారం, సుమారు 64 శాతం మొబైల్ బ్యాంకింగ్కు సంబంధించిన ఫిర్యాదులు, 33 లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి. ఈ అంతరాయం నుంచి బయటపడటానికి కస్టమర్లు యూపీఐ లైట్, ఏటీఎమ్ ఉపయోగించుకోవచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.pic.twitter.com/hoCuUxJIdJ— State Bank of India (@TheOfficialSBI) April 1, 2025 -
నేటి నుంచి అమల్లోకి కొత్త ఆర్థిక మార్పులు
నూతన ఆర్థిక సంవత్సరంలో కొన్ని కీలక ఆర్థిక మార్పులు చోటుచేసుకున్నాయి. ఆదాయపన్ను దగ్గర్నుంచి క్రెడిట్ కార్డు రివార్డులు, టీడీఎస్ వరకు జరిగే ఈ మార్పుల ప్రభావం.. వ్యక్తిగత బడ్జెట్, ఆర్థిక ప్రణాళికలపై కచ్చితంగా ఉంటుంది. వీటిపై ఓసారి దృష్టి సారిద్దాం.2025–26 బడ్జెట్లో కొత్త ఆదాయపన్ను విధానంలో కలి్పంచిన పన్ను ప్రయోజనాలు 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చేశాయి. నూతన విధానంలో రూ.12 లక్షలకు మించకుండా ఆదాయం ఉన్న వారు పన్ను చెల్లించక్కర్లేదు. వేతన జీవులు అయితే స్టాండర్డ్ డిడక్షన్ రూ.75వేలతో కలుపుకుని రూ.12.75 లక్షలకు మించని ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉపశమనం కల్పించారు.వేతన జీవులు, పెన్షనర్లకు ఇంతకుముందు వరకు నూతన పన్ను విధానంలో రూ.50 వేలుగానే ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనం రూ.75 వేలకు పెరిగింది. 60 ఏళ్లు నిండిన వృద్ధులకు (సీనియర్ సిటిజన్స్) బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50వేలు మించితే టీడీఎస్ అమలు చేసేవారు. ఇప్పుడు ఈ పరిమితి రూ.లక్షకు పెంచారు. దీంతో వృద్ధులకు పెద్ద ఉపశమనం దక్కింది. 60 ఏళ్లలోపు ఉన్న డిపాజిట్లకు వడ్డీ ఆదాయం రూ.40వేలు మించితే టీడీఎస్ అమలు చేస్తుండగా, ఈ పరిమితి రూ.50వేలకు పెరిగింది. ఇన్సూరెన్స్ బ్రోకర్లకు వచ్చే కమీషన్ ఆదాయం ఏడాదిలో రూ.15,000 మించితే టీడీఎస్ అమలు చేస్తుండగా, ఈ పరిమితి రూ.20,000కు పెరిగింది. యాక్టివ్గా లేని (కార్యకలాపాల్లేని) ఖాతాలకు అనుసంధానమైన యూపీఐ ఐడీలు ఇక పనిచేయవు. భద్రత దృష్ట్యా వీటిని డీయాక్టివేట్ చేయనున్నారు. తమ ఖాతాలను యాక్టివ్గా మార్చుకుని తిరిగి యూపీఐ ఐడీ క్రియేట్ చేసుకోవచ్చు. సెబీ ఆదేశాల ప్రకారం మ్యూచువల్ ఫండ్స్ కొత్త పథకాల (ఎన్ఎఫ్వోలు) రూపంలో ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసిన నిధులను, ఇష్యూ ముగిసిన తర్వాత 30 పనిదినాల్లో ఇన్వెస్ట్ చేయడం తప్పనిసరి.ఇదీ చదవండి: యాపిల్పై రూ.1,350 కోట్లు జరిమానాస్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (సిఫ్) పేరుతో సెబీ ప్రకటించిన కొత్త తరహా పెట్టుబడుల విభాగం ఆచరణలోకి రానుంది. ఇన్వెస్టర్లు కనీసం రూ.10 లక్షలతో ఇందులో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఇన్వెస్టర్లు తమ డీమ్యాట్ అకౌంట్ స్టేట్మెంట్లు, కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్లను నేరుగా డిజీలాకర్లోకి వెళ్లేలా చేసుకోవచ్చు. తద్వారా ఇన్వెస్టర్లు, వారి నామినీలు ఈక్విటీ పెట్టుబడుల వివరాలను కోరుకున్నప్పుడు సులభంగా పొందేందుకు వీలుంటుంది. ఎస్బీఐ తన క్రెడిట్ కార్డుల్లో కొన్ని రకాలపై రివార్డు పాయింట్ల పరంగా చేసిన మార్పులు అమల్లోకి వచ్చేశాయి. దీంతో సింప్లీ క్లిక్ ఎస్బీఐ కార్డు దారులు స్విగ్గీ షాపింగ్పై ప్రస్తుతం పొందుతున్న పది రెట్ల రివార్డు పాయింట్లు కాస్తా ఐదు రెట్లకు తగ్గిపోయాయి. అమెరికా డిమాండ్ల మేరకు ఆ దేశం నుంచి దిగుమతయ్యే కొన్ని రకాల ఉత్పత్తులపై భారత్ టారిఫ్లు తగ్గించాలనుకుంటోంది. దీని ఫలితంగా అమెరికా నుంచి వచ్చే యాపిల్స్, బాదం, ఆటో ఉత్పత్తుల ధరలు దిగిరావొచ్చు. -
తెల్లవారితే మారే రూల్స్ ఇవే!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25) మరికొన్ని గంటల్లో ముగుస్తుంది. ఏప్రిల్ 1, 2025 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది. రేపటి నుంచి కొన్ని ముఖ్యమైన అంశాల్లో ఆర్థిక మార్పులు అమల్లోకి వస్తాయి. ప్రధానంగా కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన రెగ్యులేటరీ అప్డేట్లు, పన్ను సంస్కరణలు, విధాన మార్పులతోపాటు ఇటీవల ప్రభుత్వ అధికారులు తెలిపిన కొన్ని విభాగాల్లో మార్పులు రేపటి నుంచి అమల్లోకి వస్తాయి. వాటి గురించి కింద తెలుసుకుందాం.ఆదాయపు పన్ను సంస్కరణలుకొత్త పన్ను శ్లాబులు, మినహాయింపులువార్షికంగా రూ.12 లక్షల వరకు సంపాదించే వ్యక్తులను కొత్త పన్ను విధానంలో ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇది గతంలో రూ.7 లక్షల పరిమితి నుంచి భారీగా పెరిగింది. వేతన ఉద్యోగులు రూ.75,000 స్టాండర్డ్ డిడక్షన్ నుంచి ప్రయోజనం పొందుతారు. దాంతో పన్ను రహిత ఆదాయ పరిమితి రూ.12.75 లక్షలకు చేరింది.సెక్షన్ 87ఎ కింద పన్ను మినహాయింపు రూ .25,000 నుంచి రూ.60,000కు పెరుగుతుంది. ఇది రూ.12 లక్షల పన్ను రహిత పరిమితికి మద్దతుగా నిలుస్తుంది. అయితే ప్రత్యేక పన్ను రేట్లు (ఉదా.మూలధన లాభాలు) ఉన్న ఆస్తుల నుంచి వచ్చే ఆదాయానికి ఇది వర్తించదు.అధిక టీడీఎస్/ టీసీఎస్ పరిమితులుడిపాజిట్లపై వడ్డీ: సాధారణ పౌరులకు రూ.50,000 (గతంలో రూ.40,000), సీనియర్ సిటిజన్లకు రూ.లక్ష (గతంలో రూ.50,000) వరకు వడ్డీ ఆదాయంపై మూలం వద్ద పన్ను మినహాయింపు లేదు.టీడీఎస్ మినహాయింపును నెలకు రూ.20,000 (వార్షికంగా రూ.2.4 లక్షలు) నుంచి రూ.50,000 (వార్షికంగా రూ.6 లక్షలు)కు పెంచారు.లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్): రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్ఆర్ఎస్ కింద విదేశీ రెమిటెన్స్లపై టీడీఎస్ రూ .7 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. ఇది చిన్న లావాదేవీలకు పన్ను భారాన్ని తగ్గిస్తుంది.ఐటీఆర్-యూ గడువు: అప్డేటెడ్ ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్-యూ) దాఖలు చేయడానికి విండో సంబంధిత మదింపు సంవత్సరం చివరి నుంచి 48 నెలల వరకు ఉంటుంది. ఇది పన్ను చెల్లింపుదారులకు గత ఫైలింగ్లను సరిదిద్దడానికి మరింత వెసులుబాటును ఇస్తుంది.పెన్షన్, రిటైర్మెంట్యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్): ఏప్రిల్ 1, 2025 నుంచి నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని యూపీఎస్ భర్తీ చేస్తుంది. 25 సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్న ఉద్యోగులు గత 12 నెలల్లో వారి సగటు మూల వేతనంలో 50 శాతానికి సమానమైన పెన్షన్ పొందుతారు. ఇది సుమారు 23 లక్షల మంది కార్మికులకు ప్రయోజనం చేకూరుస్తుంది.డిజిటల్ పేమెంట్స్ అండ్ బ్యాంకింగ్యూపీఐ నిబంధనలు: మోసాలను అరికట్టడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఇన్యాక్టివ్ మొబైల్ నంబర్లతో లింక్ అయి ఉన్న యూపీఐ ఐడీలను (12 నెలలు ఉపయోగించనివి) డీయాక్టివేట్ చేయాలని ఆదేశించింది. మార్చి 31, 2025లోగా బ్యాంక్ రిజిస్టర్డ్ నెంబర్లను అప్డేట్ చేసుకోవాలి. యూపీఐ లైట్ వినియోగదారులు మెరుగైన భద్రత కోసం తప్పనిసరి పిన్, పాస్ కోడ్ లేదా బయోమెట్రిక్ అథెంటికేషన్తో వాలెట్ అమౌంట్ను తిరిగి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయవచ్చు.మినిమమ్ బ్యాలెన్స్ఎన్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ వంటి బ్యాంకులు ఏప్రిల్ 1, 2025 నుంచి సేవింగ్స్ ఖాతాలకు కనీస బ్యాలెన్స్ నిబంధనలను అమలు చేస్తున్నాయి.ఏటీఎం ఛార్జీలునాన్ ఫైనాన్షియల్ ఏటీఎం లావాదేవీలకు (ఉదా.బ్యాలెన్స్ తనిఖీలు, మినీ స్టేట్మెంట్లు) రుసుము రూ.6 నుంచి రూ.7 వరకు పెరగవచ్చు. బ్యాంకు విధానాలు, ఉచిత లావాదేవీల పరిమితులను బట్టి నగదు ఉపసంహరణ ఛార్జీలు రూ.2 వరకు పెరిగే అవకాశం ఉంది.యులిప్లపై మూలధన లాభాలువార్షిక ప్రీమియం రూ.2.5 లక్షలకు మించిన యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ (యులిప్) నుంచి ఉపసంహరణలు బడ్జెట్ 2025 ప్రతిపాదనలకు అనుగుణంగా మూలధన లాభాల్లోకి వస్తాయి.వస్తు సేవల పన్ను (జీఎస్టీ)హోటల్ రెస్టారెంట్ సేవలు: రోజుకు రూ.7,500 కంటే ఎక్కువ రూమ్ టారిఫ్ ఉన్న హోటళ్లలోని రెస్టారెంట్లు 18% జీఎస్టీ (ఇన్పుట్ టాక్స్ క్రెడిట్తో కలిపి) పరిధిలోకి వస్తాయి. ఇది లగ్జరీ ఆతిథ్య ఖర్చులను ప్రభావితం చేస్తుంది.ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ (ISD) సిస్టమ్: రాష్ట్రాల మధ్య పన్ను ఆదాయాన్ని పంపిణీ చేయడానికి ఐఎస్డీ వ్యవస్థను తప్పనిసరిగా అమలు చేయడం, జీఎస్టీ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తారు.ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యంత సంపన్నురాలుఆటోమొబైల్ ధరలుమారుతీ సుజుకి (4% వరకు), హ్యుందాయ్, మహీంద్రా, టాటా మోటార్స్, రెనాల్ట్, కియా (2-4%) వంటి కంపెనీలు కార్ల ధరలను పెంచుతున్నాయి. ఇది 2025 ఏప్రిల్ 1 నుంచి కొనుగోలుదారులను ప్రభావితం చేస్తుంది. -
కొత్త లోన్ రూల్.. అమల్లోకి..
ఎడాపెడా అప్పులు చేసే ధోరణిని కట్టడి చేసే కొత్త నిబంధన ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తోంది. దేశ రుణ వితరణ వ్యవస్థను మార్చే ఈ నియమం మూడు కంటే ఎక్కువ రుణదాతల (బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు) నుండి రుణాలు తీసుకోకుండా రుణగ్రహీతలను కట్టడి చేస్తుంది. అధిక వినియోగాన్ని అరికట్టడం, బాధ్యతాయుతమైన రుణాలను ప్రోత్సహించడమే ఈ నిబంధన లక్ష్యం.ఎందుకీ నిబంధన?మైక్రోఫైనాన్స్ రంగం అణగారిన వర్గాల సాధికారతలో కీలక పాత్ర పోషించినప్పటికీ, రుణగ్రహీతలు బహుళ వనరుల నుండి రుణాలు పొందడం చూసింది. ఇది నిర్వహణకు సాధ్యంకాని రుణానికి దారితీస్తుంది. ఈ మితిమీరిన వినియోగం, కొన్ని సంస్థల దూకుడు రుణ విధానాలు వ్యవస్థలో బలహీనతలను సృష్టించాయి. రుణగ్రహీతలను మూడు రుణదాతలకు పరిమితం చేయడం ద్వారా ఆర్థిక క్రమశిక్షణను పెంపొందించాలని, డిఫాల్టర్ల ప్రమాదాన్ని తగ్గించాలని భావిస్తున్నారు.రుణగ్రహీతలపై తక్షణ ప్రభావంప్రస్తుతం మూడు కంటే ఎక్కువ సంస్థల్లో రుణాలు తీసుకుంటున్న 45 లక్షల మంది రుణగ్రహీతలకు, ఈ నియమం సవాలుగా మారుతుంది. వీరు తరచుగా వర్కింగ్ క్యాపిటల్, అత్యవసర అవసరాలు లేదా రోజువారీ మనుగడ కోసం అతివ్యాప్త రుణాలపై ఆధారపడతారు. మూడు బ్యాంకుల పరిమితితో, రుణగ్రహీతలు లిక్విడిటీ కొరతను ఎదుర్కోవచ్చు.ఇది వారి ఆర్థిక వ్యూహాలను పునఃసమీక్షించుకునేలా, ఖర్చులను తగ్గించుకునేలా చేస్తుంది. అంతేకాదు క్రెడిట్ మదింపులు కఠినంగా మారతాయి. ముఖ్యంగా అధిక-రిస్క్ గా భావించే రుణగ్రహీతలకు రుణ తిరస్కరణలు పెరగవచ్చు. ఇది కొంతమందిని అధిక వడ్డీలు ఉండే అనధికారిక రుణ మార్గాలవైపు నెట్టవచ్చు.రుణదాతలకూ సవాళ్లు..కొత్త రూల్ రుణదాతలకూ అనేక సవాళ్లను కలిగిస్తుంది. మైక్రోఫైనాన్స్ సంస్థలు తమ పోర్ట్ఫోలియో వ్యూహాలను సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. దీంతో స్వల్పకాలంలో వారి కస్టమర్ బేస్ ఎంతో కొంత కోల్పోయే అవకాశం ఉంది. అంతేకాక, సంస్థలు రుణ వితరణ విషయంలో మరింత క్షణ్ణమైన ప్రక్రియలను పెంపొందించుకోవాలి. రుణగ్రహీతలు మూడు-రుణదాతల పరిమితిని మించకుండా చూసుకోవాలి. ఇందుకోసం బలమైన వ్యవస్థలు, సమన్వయం అవసరమవుతాయి.వాస్తవానికి ఈ నిబంధన జనవరి 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా, సజావుగా జరిగేందుకు ఏప్రిల్ 1కి వాయిదా పడింది. ఈ జాప్యం వాటాదారులకు సన్నద్ధం కావడానికి సమయం అందించినప్పటికీ, రుణగ్రహీతలు, రుణదాతలు ఈ ముఖ్యమైన మార్పుకు ఎలా అలవాటు పడతారనేదే అసలైన పరీక్ష. -
కొత్త విధానంలో పీపీఎఫ్పై ట్యాక్స్ కట్టాల్సిందేనా?
ఒక ఇన్వెస్టర్ ఒక పథకంలో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ను నిలిపివేసి, ఆ పెట్టుబడులను కొనసాగించినట్టయితే.. ఎక్స్పెన్స్ రేషియోని ఆ పెట్టుబడుల నుంచి వసూలు చేస్తూనే ఉంటారా? – అనిల్ మిశ్రామ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులను కొనసాగించినంత కాలం వాటి విలువపై ఎక్స్పెన్స్ రేషియోని అమలు చేస్తుంటారు. ఎక్స్పెన్స్ రేషియో అన్నది మ్యూచువల్ ఫండ్ సంస్థ వసూలు చేసే వార్షిక చార్జీ. పెట్టుబడుల నిర్వహణ కోసం అయ్యే వ్యయాలు, ఇతర నిర్వహణ వ్యయాలను చార్జీల రూపంలో వసూలు చేసుకుంటాయి. వార్షిక చార్జీ అయినప్పటికీ.. దీన్ని ఏరోజుకారోజు పెట్టుబడుల విలువ నుంచి మినహాయించుకుంటాయి. మనకు రోజువారీగా మార్పునకు గురయ్యే ఫండ్ యూనిట్ల ఎన్ఏవీ తెలుసుకదా.చార్జీలను మినహాయించుకున్న తర్వాతే ఈ ఎన్ఏవీ ఖరారవుతుంది. సిప్ నిలిపివేశారంటే అప్పటి నుంచి ఆయా పథకంలో మీరు తాజా పెట్టుబడులు పెట్టరనే అర్థం. కానీ, అప్పటికే చేసిన పెట్టుబడులను ఆ ఫండ్ సంస్థ నిర్వహించాలి కదా. అందుకని తమ నిర్వహణలోని మొత్తం ఆస్తులపై (ఏయూఎం) ఎక్స్పెన్స్ రేషియోని వసూలు చేసుకుంటాయి. కాకపోతే తక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉన్న పథకాన్ని ఎంపిక చేసుకోవడం ద్వారా దీర్ఘకాలంలో రాబడులను మరింత వృద్ధి చేసుకోవచ్చు. నేను పన్ను ఆదా కోసం ప్రజా భవిష్యనిధి పథకంలో (పీపీఎఫ్) క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఆదాయపన్నులో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానంలోనూ నేను పీపీఎఫ్ పెట్టుబడులపై పన్ను ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చా? ఈ ప్రయోజనం గరిష్టంగా ఎంత వరకు ఉంటుంది? – బల్లూ నాయక్ఆదాయపన్ను పాత విధానంలో పీపీఎఫ్లో ఒక ఆర్థిక సంవత్సరంలో చేసే పెట్టుబడి గరిష్టంగా రూ.1.5 లక్షలపై సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. దీనికి అదనంగా వడ్డీ ఆదాయం, గడువు తీరిన తర్వాత చేతికి వచ్చే మొత్తంపైనా పన్ను లేదు. ఒకవేళ కొత్త పన్ను విధానాన్ని మీరు ఎంపిక చేసుకున్నట్టయితే.. సెక్షన్ 80సీ కింద పీపీఎఫ్లో చేసే పెట్టుబడులపై పన్ను ప్రయోజనాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఎందుకంటే కొత్త ఆదాయపన్ను విధానం తక్కువ పన్ను రేట్లతో ఉంటుంది. ఇందులో చాలా వరకు పన్ను మినహాయింపులను తొలగించేశారు.పీపీఎఫ్లో పెట్టుబడులపై పన్ను ఆదా ప్రయోజనం కూడా కొత్త విధానంలో లేదు. అయితే, కొత్త పన్ను విధానాన్ని ఎంపిక చేసుకోవాలా లేక పాత విధానమా? అన్నది మీ ఆదాయం, మినహాయింపులను ఎంత మేర క్లెయిమ్ చేసుకోగలరన్న పరిస్థితులపైనే ఆధారపడి ఉంటుంది. పాత పన్ను విధానంలో పీపీఎఫ్, ఇన్సూరెన్స్, గృహ రుణం చెల్లింపులు.. ఇలా అన్ని రకాల మినహాయింపులను క్లెయిమ్ చేసుకునేట్టు అయితే అదే ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తుంది. కొత్త విధానం సులభతరంగా, తక్కువ పన్ను రేట్లతో ఉంటుంది.సమాధానాలు : ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
అరుదైన వ్యాధులు వస్తే.. ఇదిగో ఈ ఇన్సూరెన్స్..
హీమోఫీలియా, మర్ఫాన్ సిండ్రోమ్ లాంటి అరుదైన వ్యాధులు కొద్ది మందికి మాత్రమే వస్తాయి. కానీ వాటి తీవ్రత మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల మంది 7 వేల పైగా రకాల అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారని అంచనా. ఇలాంటి వాటికి నాణ్యమైన చికిత్స దొరకడం కష్టంగానే ఉంటోంది.. అలాగే చికిత్స వ్యయాలు భారీగానే ఉంటున్నాయి.భారత్ విషయానికొస్తే 7 కోట్ల మంది అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారని అంచనాలున్నాయి. అవగాహనారాహిత్యం, వైద్యపరీక్షల వ్యయాలు భారీగా ఉండటం, ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు అంతగా లేకపోవడం వంటి అంశాల కారణంగా వారు సమయానికి సరైన చికిత్సను పొందలేకపోతున్నారు.ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) 4,001 అరుదైన వ్యాధులను గుర్తించింది. కానీ, 450 వ్యాధుల రికార్డులు మాత్రమే ఆస్పత్రుల్లో అధికారికంగా అందుబాటులో ఉంటున్నాయి. వైద్యపరీక్షలు, డేటా సేకరణపరమైన సవాళ్లను ఇది సూచిస్తోంది. 80 శాతం అరుదైన వ్యాధులు జన్యుపరమైనవే కాగా మిగతావి ఇన్ఫెక్షన్లు, ఆటోఇమ్యూన్ లేదా పర్యావరణంపరమైన అంశాల వల్ల వస్తున్నాయి.50 శాతం పైగా అరుదైన వ్యాధుల లక్షణాలు ఎక్కువగా పిల్లల్లోనే ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత ముందుగా వైద్యపరీక్షలు చేసి గుర్తించడం కీలకంగా ఉంటుంది. అరుదైన వ్యాధులకు ప్రత్యేకమైన చికిత్సలు, జీవిత కాల సంరక్షణ, కొన్ని సందర్భాల్లో ప్రయోగాత్మక చికిత్సలు కూడా అవసరమవుతాయి. అందుకే తగినంత బీమా కవరేజీ ఉండాలి. ఈ నేపథ్యంలో సాధారణ హెల్త్ ఇన్సూరెన్స్, క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ల మధ్య వ్యత్యాసాలు, వాటితో ఏయే ప్రయోజనాలు ఉంటాయో తెలియజేసేదే ఈ కథనం. క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ అంటే.. సాధారణ ఆరోగ్య బీమాతో పోలిస్తే క్రిటికల్ ఇల్నెస్ (సీఐ) స్వరూపం భిన్నంగా ఉంటుంది. ఆస్పత్రిలో చికిత్స వ్యయాలకు మాత్రమే చెల్లించడం కాకుండా, వ్యాధి నిర్ధారణయినప్పుడు ఏకమొత్తంగా బీమా మొత్తాన్ని కంపెనీ చెల్లిస్తుంది. దీన్ని చికిత్స వ్యయాల కోసం కావచ్చు, కోల్పోయిన ఆదాయాన్ని భర్తీ చేసుకోవడం కోసం కావచ్చు, ఇతరత్రా ప్రత్యామ్నాయ చికిత్స కోసం కావచ్చు, పాలసీదారు తనకు కావాల్సిన విధంగా ఉపయోగించుకోవచ్చు.లూపస్ లేదా స్లెరోడెర్మాలాంటి అరుదైన ఆటోఇమ్యూన్ వ్యాధులకు సీఐ ప్లాన్తో ఆర్థికంగా కొంత ఉపశమనం లభించవచ్చు. సాధారణంగా ముందస్తుగా నిర్ణయించిన వ్యాధుల కేటగిరీలకు మాత్రమే సీఐ ప్లాన్లు బీమా మొత్తాన్ని చెల్లిస్తాయి. ఒకవేళ ఏదైనా అరుదైన వ్యాధికి కవరేజీ నుంచి మినహాయింపు ఉంటే, పాలసీదారుకు ఆర్థిక ప్రయోజనం దక్కదు. కవరేజీల్లో వ్యత్యాసం.. ఏది మెరుగైనది.. అరుదైన వ్యాధుల విషయంలో ప్రాథమిక ఆరోగ్య బీమా, హాస్పిటలైజేషన్, తక్షణ వైద్య వ్యయాలకు ఉపయోగపడుతుంది. డాక్టర్లను సంప్రదించడం, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేరడం, అవసరమైన ప్రొసీజర్లు మొదలైన వాటికి పాలసీ చెల్లిస్తుంది. అయితే, ఆదాయ నష్టం, దీర్ఘకాల సంరక్షణలాంటి పరోక్ష వ్యయాలకు కవరేజీనివ్వదు. మరోవైపు, క్రిటికల్ ఇల్నెస్ పాలసీ అనేది ఏకమొత్తంగా చెల్లిస్తుంది. దాన్ని పాలసీదారు తనకు కావాల్సిన విధంగా ఉపయోగించుకోవచ్చు.అయితే, సదరు వ్యాధి గురించి పాలసీలో ప్రస్తావిస్తేనే ఇది వీలవుతుంది. లేకపోతే కవరేజీ లభించదు. సాధారణంగా సీఐ పాలసీలు చాలా మటుకు అరుదైన వ్యాధులకు కవరేజీనివ్వవు. కాబట్టి ఆర్థిక భద్రత కోసం వాటిని మాత్రమే నమ్ముకోవడానికి ఉండదు. అరుదైన సమస్యలు ఉన్న వారు అధిక కవరేజీ ఉండే బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్, క్రిటికల్ ఇల్నెస్ పాలసీని కలిపి తీసుకుంటే ఆర్థికంగా భరోసాగా ఉంటుంది. అసాధారణ వ్యాధుల కోసం ఆర్థిక ప్రణాళిక.. అరుదైన వ్యాధులతో అధిక రిస్కులున్న వారు రెండు రకాల బీమాను తీసుకుంటే భరోసాగా ఉంటుంది. అధిక కవరేజీ ఉండే సాధారణ ఆరోగ్య బీమా పాలసీ, ఆస్పత్రి.. వైద్య వ్యయాలకు కవరేజీనిస్తుంది. ఇక క్రిటికల్ ఇల్నెస్ పాలసీ (ఒకవేళ తీసుకుంటే) వైద్యయేతర వ్యయాలకు ఆర్థికంగా తోడ్పాటు అందిస్తుంది. కవరేజీల్లో అంతరాలను తగ్గించుకునేందుకు టాప్ అప్ ప్లాన్లు, నిర్దిష్ట వ్యాధి సంబంధిత పాలసీల్లాంటివి పరిశీలించవచ్చు.రెగ్యులర్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే.. సమగ్ర ఆరోగ్య బీమా పాలసీలనేవి హాస్పిటలైజేషన్ చార్జీలు, డాక్టర్ల కన్సల్టేషన్లు, వైద్య పరీక్ష ప్రొసీజర్లు, ఆస్పత్రిలో చేరడానికి ముందు అలాగే ఆ తర్వాత తలెత్తే వ్యయాలకు కవరేజీనిస్తాయి. హంటింగ్టన్స్ డిసీజ్ లేదా రెట్ సిండ్రోమ్లాంటి నరాల సంబంధిత అరుదైన వ్యాధుల విషయంలో హాస్పిటలైజేషన్.. సపోర్టివ్ కేర్కి, జీవక్రియ సంబంధ గౌచర్ వ్యాధి లేదా ఫ్యాబ్రీ వ్యాధి, ఎంజైమ్ మార్పిడి థెరపీ కూడా కవరేజీ లభిస్తుంది. అయితే, సాధారణ పాలసీల్లో అన్ని రకాల అరుదైన వ్యాధులూ కవర్ కావు. కాబట్టి, జేబు నుంచి భారీగా పెట్టుకోవాల్సి వస్తుంది.అమితాబ్ జైన్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ -
కొత్త ఏడాది.. తెలివైన పెట్టుబడి
వైద్య ఖర్చులు అనూహ్యంగా పెరుగుతున్న ఈ కాలంలో వాటి కోసం కేవలం సొంత డబ్బుపైనే ఆధారపడితే ఇబ్బందులు తప్పవు. ఊహించని అత్యవసర వైద్య పరిస్థితులు పొదుపు సొమ్మును హరించేస్తాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్య బీమా పెరుగుతున్న వైద్య ఖర్చుల నుండి ఒక ముఖ్యమైన రక్షణ కవచంగా నిలుస్తుంది. ఆర్థిక ఒత్తిడి లేకుండా నాణ్యమైన వైద్య సంరక్షణను అందిస్తుంది. గుర్తుంచుకోండి.. మీరు ఆరోగ్యంపై పెట్టుబడి పెడుతున్నారంటే.. మీతోపాటు కుటుంబ భవిష్యత్తు కోసం కూడా పెట్టుబడి పెడుతున్నారని అర్థం.సంపూర్ణ కవరేజీ ఆధునిక ఆరోగ్య బీమా ఆసుపత్రిలో చేరినప్పుడు మాత్రమే కాదు.. ఓపీడీ సంప్రదింపులు, టెలిమెడిసిన్, ప్రివెంటివ్ చెకప్లు, వెల్నెస్ కార్యక్రమాలను కూడా కవర్ చేస్తుంది. చాలా పాలసీలు ఇప్పుడు ప్రసూతి సంరక్షణ, మానసిక ఆరోగ్యం, రీహాబిలిటేషన్ థెరపీ వంటి సేవలతో సంపూర్ణ కవరేజీ అందిస్తున్నాయి. మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి జీవనశైలి వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక రక్షణ చాలా కీలకం. వ్యాధి-నిర్దిష్ట విధానాలు, క్రిటికల్ ఇల్నెస్ రైడర్లు దీర్ఘకాలిక భద్రతను నిర్ధారిస్తాయి.పన్ను ప్రయోజనాలూ..ఇటు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80డి కింద గణనీయమైన పన్ను ప్రయోజనాలను అందించడంతో పాటు అటు అవసరమైన ఆరోగ్య సంరక్షణ కవరేజీని అందించే రెండు వైపులా పదునుండే కత్తిలా హెల్త్ ఇన్సూరెన్స్ పనికొస్తుంది. ఆరోగ్య బీమా కోసం చెల్లించే ప్రీమియంలకు పన్ను మినహాయింపులు ఉంటాయి. ఇది ఆర్థికంగా తెలివైన పెట్టుబడిగా మారుతుంది. 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు తమ ఆరోగ్య బీమా ప్రీమియంపై సంవత్సరానికి రూ .25,000 వరకు మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక సీనియర్ సిటిజన్ల సిటిజన్ల విషయానికి వస్తే.. వారికి వైద్య ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి ఈ పరిమితి రూ .50,000 వరకు ఉంటుంది.ఎస్బీఐ జనరల్ హెల్త్ ఇన్సూరెన్స్లో విభిన్న ప్లాన్లుఎస్బీఐ జనరల్ హెల్త్ ఇన్సూరెన్స్ విభిన్న ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా సరసమైన, సౌకర్యవంతమైన ప్లాన్లను అందిస్తోంది. ఈ పాలసీలు హాస్పిటలైజేషన్, ఓపీడీ కన్సల్టేషన్లు, ప్రసూతి ప్రయోజనాలు, క్రిటికల్ ఇల్నెస్తో సహా విస్తృతమైన కవరేజీతో పాలసీదారులరకు బలమైన ఆర్థిక భద్రతను అందిస్తాయి.మనం కొత్త ఆర్థిక సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న తరుణంలో, ఆరోగ్య బీమా పాలసీలో పెట్టుబడి పెట్టడం ఆర్థిక ఆరోగ్యం, స్థిరత్వానికి ఒక ముఖ్యమైన దశ. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కేవలం ఖర్చు మాత్రమే కాదు, ఇది మీ ఆర్థిక, శారీరక శ్రేయస్సు కోసం తెలివైన పెట్టుబడి. -
పోస్టాఫీస్ పథకాల వడ్డీ రేట్లు ప్రకటించిన కేంద్రం
పోస్టాఫీస్ పొదుపు పథకాలకు వడ్డీ రేట్లలో.. కేంద్ర ప్రభుత్వం ఎటువంటి మార్పును ప్రకటించలేదు. కొత్తగా ప్రకటించిన రేట్లు 2025-26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ - జూన్ త్రైమాసికాలకు వర్తిస్తాయి. ఆర్థిక వ్యవహారాల శాఖ జారీ చేసిన సర్క్యులర్ ద్వారా దీనిని ధ్రువీకరించింది.కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, సుకన్య సమృద్ధి ఖాతా, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) మొదలైనవాటికి వర్తిస్తుంది. ఈ పథకాలకు 2024-25 ఆర్ధిక సంవత్సరంలో నిర్ణయించిన వడ్డీ రేట్లే వర్తిస్తాయి.ఏప్రిల్ 1, 2025 & జూన్ 30, 2025 మధ్య పోస్టాఫీస్ స్కీమ్ వడ్డీ రేట్లు➜పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతా: 4 శాతం➜పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్: 6.7 శాతం➜పోస్టాఫీస్ నెలవారీ ఆదాయ పథకం: 7.4 శాతం➜పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ (1 సంవత్సరం): 6.9 శాతం➜పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ (2 సంవత్సరాలు): 7 శాతం➜పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ (3 సంవత్సరాలు): 7.1 శాతం➜పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ (5 సంవత్సరాలు): 7.5 శాతం➜కిసాన్ వికాస్ పత్ర (KVP): 7.5 శాతం➜పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF): 7.1 శాతం➜సుకన్య సమృద్ధి యోజన: 8.2 శాతం➜నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్: 7.7 శాతం➜సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ (SCSS): 8.2 శాతంచిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను ప్రభుత్వం త్రైమాసికానికి ఒకసారి నిర్ణయిస్తుంది. అయితే 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో కేంద్రం చివరగా వడ్డీ రేట్లను నిర్ణయించింది. ఆ తరువాత ఇప్పటి వరకు వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. ఇప్పుడు కూడా అదే వడ్డీ రేట్లను నిర్ణయిస్తూ నిర్ణయం తీసుకుంది.వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచాలనే నిర్ణయానికి ప్రధాన కారణం.. మార్కెట్ పరిస్థితులనే చెప్పాలి. మార్కెట్లు నష్టాల్లో సాగుతున్న సమయంలో వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచడం వల్ల ఈ పథకాలలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపేవారి సంఖ్య ఎక్కువవుతుంది. ఈ చిన్న పొదుపు పథకాలు సాధారణ ప్రజలకు స్థిరమైన పెట్టుబడి అవకాశాలను అందించడం ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. -
ఏటీఎం విత్ డ్రాపై ఛార్జీల మోత.. బ్యాంకులకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్
ఢిల్లీ: ఏటీఎంలో నగదు లావాదేవీలపై కస్టమర్లకు షాకిచ్చేందుకు బ్యాంకులు సిద్ధమయ్యాయి. సొంత బ్యాంక్ ఏటీఎం నుంచి నెలలో ఉచితంగా ఐదు లావాదేవీలు చేసుకోవచ్చు. అయితే, మే 1 నుంచి వీటి పరిమితి దాటితే ఒక్కో లావాదేవీపై రూ.23 వసూలు చేసేందుకు బ్యాంకులకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది.ప్రస్తుతం, వినియోగదారులు ఉచిత లావాదేవీ పరిమితిని దాటిన తర్వాత ప్రతి లావాదేవీకి రూ.21 చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ మొత్తాన్ని పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. అదే వేరే బ్యాంకు ఏటీఎం నుంచి అయితే మెట్రో ప్రాంతాల్లో ఐదు లావాదేవీలు, ఇతర ప్రాంతాల్లో 3 లావాదేవీలకు అనుమతి ఉంది. ఆర్బీఐ తాజాగా అనుమతించిన నేపథ్యంలో ఆ మొత్తం రూ.23కి పెరగనుంది. -
ఏప్రిల్లో బ్యాంకులు పనిచేసేది 15 రోజులే!
మార్చి 2025 ముగుస్తోంది. దేశంలోని బ్యాంకుల నియంత్రణ సంస్థ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఏప్రిల్లో బ్యాంకులు ఎన్ని రోజులు పనిచేస్తాయి, ఎన్ని రోజులు క్లోజ్లో ఉంటాయనే జాబితాను (Bank Holidays) విడుదల చేసింది. వచ్చే నెలలో వివిధ పనుల నిమిత్తం బ్యాంకులకు వెళ్లాల్సినవారు తప్పకుండా ఈ సెలవుల జాబితాను తెలుసుకోవాలి. తద్వారా మీ ప్రాంతంలో బ్యాంకులు ఎన్ని రోజులు మూసిఉంటాయో.. ఏయే రోజుల్లో పనిచేస్తాయో తెలుస్తుంది. తదనుగుణంగా బ్యాంకింగ్ పనిని ప్లాన్ చేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది.ఏప్రిల్లో బ్యాంక్ హాలిడేస్➤1 ఏప్రిల్: యాన్యువల్ బ్యాంక్ క్లోజింగ్➤5 ఏప్రిల్: బాబూ జగ్జీవన్ రామ్ పుట్టినరోజు (తెలంగాణ/ హైదరాబాద్లోని బ్యాంక్లకు సెలవు)➤6 ఏప్రిల్: ఆదివారం (శ్రీరామనవమి)➤10 ఏప్రిల్: మహావీర్ జయంతి (గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ్ బెంగాల్, తెలంగాణలోని బ్యాంక్లకు సెలవు)➤12 ఏప్రిల్: రెండవ శనివారం➤13 ఏప్రిల్: ఆదివారం➤14 ఏప్రిల్: అంబేద్కర్ జయంతి ➤15 ఏప్రిల్: బెంగాలీ నూతన సంవత్సరం, భోగ్ బిహు (అసోం, పశ్చిమ్ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లోని బ్యాంక్లకు సెలవు)➤18 ఏప్రిల్: గుడ్ ఫ్రైడే (ఛండీగఢ్, త్రిపుర, అసోం, రాజస్థాన్, జమ్ము, హిమాచల్ ప్రదేశ్, శ్రీనగర్లోని బ్యాంక్లకు సెలవు)➤20 ఏప్రిల్: ఆదివారం➤21 ఏప్రిల్: గరియా పూజ (త్రిపురలోని బ్యాంక్లకు సెలవు)➤26 ఏప్రిల్: నాల్గవ శనివారం➤27 ఏప్రిల్: ఆదివారం➤29 ఏప్రిల్: పరశురామ జయంతి (హిమాచల్ ప్రదేశ్లోని బ్యాంక్లకు సెలవు)➤30 ఏప్రిల్: బసవ జయంతి, అక్షయ తృతీయ (కర్ణాటకలోని బ్యాంక్లకు సెలవు)బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పని చేసుకోవాలనుకునే వారు బ్యాంక్ హాలిడేస్ గమనించి ముందుగానే పనులు పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్లైన్ సేవలు అన్నీ సెలవు దినాల్లో కూడా అందుబాటులో ఉంటాయి.(బ్యాంకింగ్ సెలవుల షెడ్యూల్ మారవచ్చు.. కాబట్టి హాలిడే క్యాలెండర్లో ఏవైనా అప్డేట్లు లేదా రివిజన్ల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. లేదా మీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక ప్రకటనలను గమనించాల్సి ఉంటుంది). -
మార్చి 31 డెడ్లైన్.. ఇవన్నీ పూర్తి చేశారా?
మార్చి 31తో 2024-25 ఆర్థిక సంవత్సరం ముగియనుంది. అంతే కాకుండా ఆదాయ పన్ను, మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్, యూపీఐ రూల్, అప్డేటెడ్ ఐటీఆర్ డెడ్లైన్ మొదలైనవాటికి కూడా అదే ఆఖరి రోజు కావడం గమనార్హం. కాబట్టి ఈ కథనంలో ఏప్రిల్ 1నుంచి ఎలాంటి మార్పులు రాబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం.మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్మహిళలు, బాలికల కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల్లో 'మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్' (MSSC) ఒకటి. ఈ పథకాన్ని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ 2023 జూన్ 27న ప్రారంభించింది. ఇది ఈ నెల చివరి నాటికి క్లోజ్ అవుతుంది. ఈ పథకంలో రూ. 1000 నుంచి రూ. 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ స్కీమ్ గడువు రెండేళ్లు. ఇందులో వడ్డీ 7.5 శాతం ఉంటుంది.యూపీఐ రూల్నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) లావాదేవీల భద్రతను మెరుగుపరచడానికి కొత్త ఆదేశాలను ప్రకటించింది. ఇవి ఏప్రిల్ 1, 2025 నుండి అమల్లోకి వస్తాయి.ఐటీఆర్ డెడ్లైన్భారతదేశంలోని పన్ను చెల్లింపుదారులు 2025 మార్చి 31కు ముందే తమ అప్డేటెడ్ ఆదాయపు పన్ను రిటర్న్లను (ITR-U) దాఖలు చేసుకోవాలి. గడువులోపల ఐటీఆర్ ఫైల్ చేసుకుంటే.. దాఖలు చేసిన రిటర్న్లకు 25% తక్కువ అదనపు పన్ను రేటు ఉంటుంది. గడువు దాటితే.. అదనపు పన్ను భారం మోయాల్సి ఉంటుంది.హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యువల్2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆరోగ్య భీమాకు సంబంధించిన ఏవైనా ప్రీమియంలు చెల్లించాల్సి ఉంటే మార్చి 31లోపల క్లియర్ చేసుకోవాలి. సెక్షన్ 80D కింద పన్ను మినహాయింపును కోల్పోకుండా ఉండటానికి గడువు లోపల చెల్లింపులు పూర్తవ్వాలి. అలా చేయడంలో విఫలమైతే గడువులోగా ప్రీమియంలు చెల్లించకపోతే ఆరోగ్య కవరేజీని కోల్పోయే ప్రమాదం ఉంది.అడ్వాన్స్ ట్యాక్స్అదనపు ఆదాయాలపై ముందస్తు పన్ను చెల్లించడంలో విఫలమైన.. జీతం పొందుతున్న ఉద్యోగులు మార్చి 31 లోపల చెల్లించవచ్చు. పన్ను చెల్లింపుదారులు 2021-22 ఆర్థిక సంవత్సరానికి అప్డేట్ చేయబడిన రిటర్న్(ITR-U)ను దాఖలు చేయడం ద్వారా గత ఆదాయపు పన్ను రిటర్న్లను సరిదిద్దవచ్చు. దీనికి కూడా మార్చి 31 చివరిరోజు.ఇదీ చదవండి: మూడో కంటికి చిక్కని ‘సిగ్నల్’.. ఈ యాప్ గురించి తెలుసా?ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్పన్ను చెల్లింపుదారులు మార్చి 31 లోపల.. ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్స్, డిక్లరేషన్స్ సమర్పించాల్సి ఉంటుంది. పన్ను భారం తగ్గించుకునేందుకు సరైన ప్లాన్ చేసుకుంటే గడువు లోపల పన్ను చెల్లించాలి. అయితే పాత పన్ను విధానాన్ని ఎంపిక చేసుకునేవారే ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్ మెంట్లు చేసుకోవచ్చు. కొత్త పన్న విధానానికి ఇది వర్తించదు.ఎస్బీఐ క్రెడిట్ కార్డు రూల్స్ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ తమ క్రెడిట్ కార్డు పాలసీల్లో కీలక మార్పులు చేస్తోంది. ఎస్బీఐ తన క్లబ్ విస్తారా ఎస్బీఐ, క్లబ్ విస్తారా ఎస్బీఐ ప్రైమ్ క్రెడిట్ కార్డుల నిబంధనలను సవరించింది. 2025 ఏప్రిల్ 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. -
బ్యాంకులకు వరుస సెలవులు..
ఉగాది, రంజాన్ వచ్చేస్తున్నాయి. వారాంతం, వెంటనే పండుగల కారణంగా బ్యాంకులకు వరుస సెలవులు లభిస్తున్నాయి. రెండు, నాలుగో శనివారాలు, ఆదివారాలు కాకుండా.. ప్రత్యేకంగా పండుగలను దృష్టిలో ఉంచుకుని కూడా బ్యాంకులకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలవులు అందిస్తుంది.మార్చి 28న జుమాత్-ఉల్-విదా కారణంగా జమ్మూకశ్మీర్లో బ్యాంకులకు సెలవు, ఆ తరువాత 30న ఉగాది సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు. 31వ తేదీ రంజాన్ సందర్బంగా కూడా బ్యాంకులకు సెలవు.ఆర్ధిక సంవత్సరం చివరి రోజు (మార్చి 31)రంజాన్ మార్చి 31న వచ్చింది. సాధారణంగా ఆ రోజు బ్యాంకులకు సెలవు. కానీ ఆర్ధిక సంవత్సరం చివరి రోజు కాబట్టి బ్యాంకులు పనిచేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెల్లడికావాల్సి ఉంది.మొత్తం మీద 28వ తేదీ నుంచి 31 వరకు మూడు రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటాయని తెలుస్తోంది. బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పని చేసుకోవాలనుకునే వారు బ్యాంక్ హాలిడేస్ గమనించి ముందుగానే పనులు పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్లైన్ సేవలు అన్నీ సెలవు దినాల్లో కూడా అందుబాటులో ఉంటాయి.(బ్యాంకింగ్ సెలవుల షెడ్యూల్ మారవచ్చు.. కాబట్టి హాలిడే క్యాలెండర్లో ఏవైనా అప్డేట్లు లేదా రివిజన్ల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. లేదా మీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక ప్రకటనలను గమనించాల్సి ఉంటుంది). -
UPI Down: ఫోన్పే, గూగుల్ పే యూజర్లకు షాక్.. యూపీఐ సేవల్లో అంతరాయం
యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) సేవలకు దేశవ్యాప్తంగా అంతరాయం ఏర్పడింది. చాలామంది వినియోగదారులు లావాదేవీలను చేయలేకపోయినట్లు వెల్లడించారు. బుధవారం రాత్రి 7:50 గంటలకు 2,750 యూపీఐ లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి. గూగుల్పే వినియోగదారుల నుంచి 296 ఫిర్యాదులు వచ్చాయి.యూపీఐ సేవలు డౌన్ అవ్వడంతో.. దేశ వ్యాప్తంగా వినియోగదారులు లావాదేవీలు చేయడంలో అంతరాయాన్ని ఎదుర్కొంటున్నారు. వినియోగదారులు సోషల్ మీడియా వేదికగా.. వారు ఎదుర్కొన్న సమస్యలను పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ సమస్య కారణం ఏమిటనేది తెలియాల్సి ఉంది.Is UPI down? Anyone facing the issue? #Upidown— Sumit Mishra (@SumitLinkedIn) March 26, 2025UPI Down ⚠️Nationwise issue or it's only me ?— Crypto with Khan ( SFZ ) (@Cryptowithkhan) March 26, 2025Anyone facing UPI app issues or just me facing?? #phonepe #gpay #paytm— Anoop CSKian 💛 (@Anoopraj_7) March 26, 2025 -
డెబిట్ కార్డు లేకుండానే యూపీఐ పిన్ సెట్ చేసుకోండిలా..
ఆన్లైన్ ట్రాన్సక్షన్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత జేబులో డబ్బులు పెట్టుకునేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీంతో చాలామంది యూపీఐ వాడుతున్నారు. అయితే బ్యాంక్ ఖాతా ఉన్నవారు యూపీఐ ఐడీ సెట్ చేసుకోవచ్చు. అయితే వారికి డెబిట్ కార్డు ఉండాలి. కానీ బ్యాంకులు అందరికీ.. డెబిట్ కార్డులు ఇవ్వదు. అలాంటి వారు యూపీఐ ఐడీ ఎలా సెట్ చేసుకోవాలో ఇక్కడ చూసేద్దాం.డెబిట్ కార్డు లేకుండా.. యూపీఐ ఐడీ సెట్ సేసుకోవాలనుకుంటే, ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. అది బ్యాంక్ ఖాతాకు లింక్ అయి ఉండాలి. అంతే కాకుండా ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ కూడా రిజిస్టర్ అయి ఉండాలి. ఆలా ఉన్నప్పుడే.. యూపీఐ ఐడీ సెట్ చేసుకోవాలి.యూపీఐ పిన్ ఎలా సెట్ చేసుకోవాలంటే?➤స్మార్ట్ఫోన్లో యూపీఐ యాప్ ఓపెన్ చేసి, బ్యాంక్ వివరాలను నమోదు చేయాలి. ➤తరువాత యూపీఐ పిన్ సెట్ చేసుకోవడానికి కావాల్సిన ఆప్షన్ ఎంచుకోవాలి.➤పిన్ సెట్ చేసుకునే ఆప్షన్ ఎంచుకున్నప్పుడు.. అక్కడ మీకు డెబిట్ కార్డు, ఆధార్ ఓటీపీ అనే ఆప్షన్ కనిపిస్తాయి.➤అక్కడ ఆధార్ ఓటీపీ ఎంపిక చేసుకోవాలి.➤ధృవీకరణ కోసం ఆధార్ నెంబర్ మొదటి ఆరు అంకెలను ఎంటర్ చేయాలి.➤ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తరువాత రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది.➤ఓటీపీ ఎంటర్ చేసిన తరువాత.. యూపీఐ పిన్ సెట్ చేసుకోమని చూపిస్తుంది. మీకు నచ్చిన ఒక పిన్ సెట్ చేసుకోవచ్చు.ఇదీ చదవండి: జీఎమ్ఎస్ గోల్డ్ స్కీమ్ నిలిపేసిన ప్రభుత్వం: బ్యాంకులు మాత్రం.. -
జీఎమ్ఎస్ గోల్డ్ స్కీమ్ నిలిపేసిన ప్రభుత్వం: బ్యాంకులు మాత్రం..
బంగారం ధరలు రోజు రోజుకు విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా బుధవారం నుంచి 'గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్' (GMS)ను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే.. బ్యాంకులు తమ స్వల్పకాలిక గోల్డ్ డిపాజిట్ పథకాలను (1-3 సంవత్సరాలు) కొనసాగించవచ్చని ఒక ప్రకటనలో వెల్లడించింది.పసిడి దిగుమతులపై దేశం ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి మాత్రమే కాకుండా.. గృహాలు, సంస్థలు తమ బంగారాన్ని ఉత్పాదక ప్రయోజనాల కోసం ఉపయోగించుకునేలా ప్రోత్సహించడానికి ఈ పథకాన్ని 2015 సెప్టెంబర్ 15న ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి నవంబర్ 2024 వరకు 31,164 కేజీల బంగారాన్ని సమీకరించారు.నిజానికి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అనేది మూడు విధాలుగా ఉంటుంది. అవి షార్ట్ టర్మ్ బ్యాంక్ డిపాజిట్ (1-3 సంవత్సరాలు), మిడ్ టర్మ్ గవర్నమెంట్ డిపాజిట్ (5-7 సంవత్సరాలు), లాంగ్ టర్మ్ గవర్నమెంట్ డిపాజిట్ (12-15 సంవత్సరాలు).బంగారం ధరలు పెరుగుతున్న తరుణంలో.. ప్రభుత్వం తన మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ డిపాజిట్లను నిలిపివేయాలని నిర్దారించింది. షార్ట్ టర్మ్ డిపాజిట్ల విషయాన్ని నిర్వహించడం లేదా నిర్వహించకపోవడం అనేది పూర్తిగా బ్యాంకులే నిర్ణయించుకునేలా మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.ఇదీ చదవండి: ఈ పాలసీతో వాహనాల ధరలు తగ్గుతాయి: నితిన్ గడ్కరీనవంబర్ 2024 వరకు సమీకరించిన మొత్తం 31,164 కిలోల బంగారంలో.. షార్ట్ టర్మ్ బ్యాంక్ డిపాజిట్ కింద 7,509 కేజీలు, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ ప్రభుత్వ డిపాజిట్స్ కింద వరుసగా 9728 కేజీలు, 13926 కేజీల బంగారం ఉంది. కాగా జీఎమ్ఎస్ పథకంలో ఉన్న డిపాజిటర్ల సంఖ్య 5693 మంది. -
EPFO: కేంద్రం ప్రకటన.. ఏటీఎం నుంచి పీఎఫ్ విత్ డ్రా అప్పటి నుంచే..
ఢిల్లీ: ఈపీఎఫ్వో చరిత్రలో తొలిసారిగా పీఎఫ్ విత్ డ్రా కోసం కేంద్రం సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఫోన్పే, గూగుల్పే వంటి యూపీఐ పేమెంట్స్, ఏటీఎంలలో ఈపీఎఫ్వో విత్డ్రా చేసుకునేలా ఉద్యోగులకు అవకాశం కల్పిస్తుంది. ఇందులో భాగంగా ఈపీఎఫ్వోలోని ఈ కీలక సంస్కరణలపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. యూపీఐ ద్వారా ఈపీఎఫ్వో విత్ డ్రా చేసుకునే వెసులు బాటు కల్పించాలన్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్సీపీఐ) ప్రతిపాదనను కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఇదే అంశంపై ఆ శాఖ కార్యదర్శి సుమిత్రా దావ్రా తెలిపారు. ఉద్యోగులు ఈ సంవత్సరపు మే లేదా జూన్ నెల నుంచి తమ ఈపీఎఫ్వో విత్ డ్రాను యూపీఐ యాప్స్, ఏటీఎంల ద్వారా విత్ డ్రా చేసుకోవచ్చని వెల్లడించారు.ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా రూ.1 లక్ష వరకు తక్షణమే విత్డ్రా చేసుకోవచ్చు. కోరుకున్న బ్యాంక్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. దీంతో పాటు క్షణాల్లో ఈపీఎఫ్వో బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చని చెప్పారు. -
బంగారు ఆభరణాలు అమ్మితే పన్ను చెల్లించాలా?
నా బంగారం ఆభరణాలను విక్రయించాలనుకుంటున్నాను? మూలధన లాభానికి ఇండెక్సేషన్ ప్రయోజనం లభిస్తుందా? – ప్రణయ్ఇండెక్సేషన్ అంటే ద్రవ్యోల్బణానికి తగినట్టుగా కొనుగోలు ధరను సర్దుబాటు చేయడం. కానీ, బంగారు ఆభరణాలకు ఇండెక్సేషన్ ప్రయోజనం ఇప్పుడు లేదు. ఆభరణాలను విక్రయించగా వచ్చిన లాభంపై పన్ను ఎంత చెల్లించాలన్నది.. వాటిని ఎంత కాలం పాటు కొని ఉంచుకున్నారన్న దానిపై ఆధారపడి ఉంటుంది. రెండేళ్లకుపైగా ఉంచుకుంటే అప్పుడు దీర్ఘకాల మూలధన లాభంపై 12.5% పన్ను పడుతుంది. రెండేళ్లలోపు విక్రయిస్తే ఆ మొత్తం స్వల్పకాల మూలధన లాభం అవుతుంది. ఇది మీ వార్షిక ఆదాయానికి కలుస్తుంది. అప్పుడు మీ మొత్తం ఆదాయం ఏ శ్లాబు పరిధిలోకి వస్తే, ఆ మేరకు పన్ను చెల్లించాలి. ఆభరణాలు వారసత్వంగా మీకు సంక్రమించినా లేక బహుమతి రూపంలో వచ్చినా.. అప్పుడు ఆ ఆభరణం కొన్న అసలు తేదీ, అప్పటికి ఉన్న ధరను పరిగణనలోకి తీసుకుంటారు. ఇదీ చదవండి: ప్రభుత్వ బ్యాంకుల డివిడెండ్ అప్పెట్టుబడులపై ఎలా..?గోల్డ్ ఈటీఎఫ్ల్లో 2023 ఏప్రిల్ 1, ఆ తర్వాత ఇన్వెస్ట్ చేసి.. 2025 మార్చి 31లోపు విక్రయిస్తే.. లాభం మొత్తం వార్షికాదాయానికి కలుస్తుంది. 2025 ఏప్రిల్ 1, ఆ తర్వాత విక్రయిస్తే.. హోల్డింగ్ పీరియడ్ (ఉంచిన కాలం) ఏడాదికి మించితే లాభంపై 12.5% పన్ను పడుతుంది. ఆభరణాల హోల్డింగ్ పీరియడ్ ఏడాదిలోపు ఉంటే లాభం మొ త్తం వార్షిక ఆదాయానికి కలుస్తుంది. గోల్డ్ ఫండ్స్ లో 2023 ఏప్రిల్ 1, ఆ తర్వాత ఇన్వెస్ట్ చేసి.. 2025 మార్చి 31లోపు విక్రయిస్తే, వచి్చన లాభం వార్షి కాదాయానికి కలుస్తుంది. 2025 ఏప్రిల్ 1 తర్వాత విక్రయిస్తే, హోల్డింగ్ పీరియడ్ రెండేళ్లకు పైన ఉంటే లాభంపై 12.5% పన్ను చెల్లించాలి. ఆలోపు ఉంటే లాభం వార్షిక ఆదాయానికి కలుస్తుంది. -
ఈపీఎఫ్ఓలో ఇన్ని రకాల పెన్షన్లు ఉన్నాయా?
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పెన్షన్ పథకాల ద్వారా దేశంలోని ఉద్యోగులకు ఆర్థిక స్థిరత్వాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్-95) కింద ఏర్పాటైన నిబంధనలు రిటైర్మెంట్ బెనిఫిట్స్, ముందస్తు క్లెయిమ్లు, ఫ్యామిలీ అసిస్టెన్స్ అందించడం ద్వారా ఉద్యోగులకు, వారి కుటుంబాలకు ఆర్థిక భద్రతను కల్పిస్తున్నాయి. అసలు ఈపీఎఫ్లో ఎలాంటి పెన్షన్ పథకాలు ఉన్నాయి.. వాటి ప్రయోజనాలు ఏంటి అన్నది ఇక్కడ తెలుసుకుందాం.సూపర్ యాన్యుయేషన్ పెన్షన్ఈపీఎఫ్ఓ పెన్షన్ పథకాలకు ఇది మూలస్తంభం. ఉద్యోగులు కనీసం 10 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి ఉంటే 58 ఏళ్లు నిండిన తర్వాత నెలవారీ పెన్షన్ పొందడానికి అర్హులు. ప్రయోజనాలను గరిష్టంగా పెంచుకునేందుకు సభ్యులు 60 సంవత్సరాల వయస్సు వరకు ఈ పథకానికి కంట్రిబ్యూషన్ కొనసాగించవచ్చు. తద్వారా అధిక పెన్షన్ మొత్తాన్ని పొందవచ్చు.ముందస్తు పెన్షన్ ఎంపికలుఅధికారిక పదవీ విరమణ వయస్సుకు ముందే ఆర్థిక సహాయం కోరుకునేవారికి, ఈపీఎస్ పథకం 50 సంవత్సరాల వయస్సు నుంచే ముందస్తు క్లెయిమ్లను అనుమతిస్తుంది. అయితే 58 ఏళ్ల లోపు ప్రతి ఏడాది పెన్షన్ మొత్తంలో 4 శాతం తగ్గుతుంది. ఇది ఫ్లెక్సీబిలిటీ అందిస్తున్నప్పటికీ, తగ్గిన పెన్షన్ చెల్లింపుల దీర్ఘకాలిక ప్రభావాలను బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది.వైకల్య పెన్షన్సర్వీస్ సమయంలో శాశ్వత, సంపూర్ణ వైకల్యం సంభవించినప్పుడు, ఆర్థిక భద్రతను అందించడానికి ఈపీఎఫ్ఓ వైకల్య పింఛన్లను అందిస్తుంది. దివ్యాంగులైన ఉద్యోగులు, వారి కుటుంబాల తక్షణ అవసరాలను తీర్చుకోవడానికి 10 సంవత్సరాల కనీస సర్వీస్ పీరియడ్ అనే తప్పనిసరి నిభందనతో పని లేకుండా ఈ ప్రయోజనాన్ని క్లెయిమ్ చేయవచ్చు.కుటుంబ ప్రయోజనాలుఈపీఎఫ్ఓ పెన్షన్ స్కీమ్ సభ్యుడి అకాల మరణం సమయంలో కుటుంబ సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఈ ప్రయోజనాలలో ఇవి ఉన్నాయి:వితంతు పింఛను: జీవిత భాగస్వామి నెలవారీ పింఛనుకు అర్హులు.పిల్లల పెన్షన్: ఇద్దరు పిల్లలకు 25 ఏళ్లు వచ్చే వరకు పెన్షన్ లభిస్తుంది.అనాథ పింఛన్: జీవిత భాగస్వామి లేకపోతే పింఛన్ ను అనాథలకు కేటాయిస్తారు.వైకల్య పిల్లల పెన్షన్: దివ్యాంగులైన పిల్లలకు, అదనపు సహాయం కోసం జీవితకాల పెన్షన్ అందిస్తారు.నామినీ పెన్షన్కుటుంబం లేని సభ్యులకు, వారు మరణిస్తే పింఛను పొందే లబ్ధిదారుడి నామినేషన్ను ఈ పథకం అనుమతిస్తుంది.ఉపసంహరణ ప్రయోజనాలుపెన్షన్ అర్హతకు అవసరమైన 10 సంవత్సరాలు పూర్తి చేయకుండా సర్వీసు నుండి నిష్క్రమించిన సభ్యులు ఉపసంహరణ ప్రయోజనాన్ని పొందవచ్చు. దీని ద్వారా తక్కువ సర్వీస్ పీరియడ్ ఉన్నవారు కూడా పదవీ విరమణ లేదా శ్రామిక శక్తి నుండి నిష్క్రమించినప్పుడు ఆర్థిక సహాయం లభిస్తుంది.పెన్షన్ లెక్కింపు ఫార్ములాపెన్షన్ మొత్తాన్ని నెలవారీ పెన్షన్ = (పెన్షనబుల్ శాలరీ × పెన్షనబుల్ సర్వీస్) / 70 అనే ఫార్ములా ద్వారా నిర్ణయిస్తారు. ఇక్కడ "పెన్షనబుల్ శాలరీ" అనేది గత 60 నెలల్లో సగటు నెలవారీ జీతం. -
నిజంగానే వ్యవసాయ ఆదాయం ఉందా? లేక...
మీ అందరికీ తెలిసిందే. వ్యవసాయం మీద ఆదాయం చేతికొస్తే, ఎటువంటి పన్ను భారం లేదు. ఈ వెసులుబాటు 1961 నుంచి అమల్లో ఉంది. చట్టంలో నిర్వచించిన ప్రకారం వ్యవసాయ భూమి ఉంటే, అటువంటి భూమి మీద ఆదాయం/రాబడికి ఆదాయపు పన్ను లేదు. కేవలం వ్యవసాయం మీదే ఆధారపడి ఎటువంటి ఏ ఇతర ఆదాయం లేకపోతే, వచ్చిన ఆదాయం ఎటువంటి పరిమితులు, ఆంక్షలు లేకుండా మినహాయింపులోనే ఉంటుంది. ఎటువంటి పన్నుకి గురి కాదు. భూమి, ఆదాయం ఈ రెండూ, తూ.చా. తప్పకుండా ఆదాయపు పన్ను చట్టంలో నిర్వచించిన ప్రకారం ఉండాలి. ఎటువంటి తేడాలు ఉండకూడదు. అలాంటప్పుడు మాత్రమే మినహాయింపు ఇస్తారు.కొంత మందికి అటు వ్యవసాయ ఆదాయం, ఇటు వ్యవసాయేతర ఆదాయం రెండూ ఉండొచ్చు. వారు రిటర్న్ వేసేటప్పుడు రెండు ఆదాయాలను జోడించి వేయాలి. దానికి అనుగుణంగా ఆ ఆదాయాలపై పన్ను లెక్కించి, అందులో మినహాయింపులు ఇవ్వడమనేది .. ఇదంతా ఒక రూలు. దాని ప్రకారం లెక్క చెప్తే పన్నుభారం పూర్తిగా సమసిపోదు కానీ ఎక్కువ శాతం రిలీఫ్ దొరుకుతుంది. పై రెండు కారణాల వల్ల, రెండు ఉపశమనాల వల్ల ట్యాక్స్ ఎగవేసే వారు.. ఎప్పుడూ ఎలా ఎగవేయాలనే ఆలోచిస్తుంటారు. ట్యాక్స్ ప్లానింగ్లో ప్రతి ఒక్కరికి అనువుగా దొరికేది వ్యసాయ ఆదాయం. అక్రమంగా ఎంతో ఆర్జించి, దాని మీద ట్యాక్స్ కట్టకుండా బైటపడే మార్గంలో అందరూ ఎంచుకునే ఆయుధం ‘వ్యవసాయ ఆదాయం’. దీన్ని ఎలా చూపిస్తారంటే..👉 తమ పేరు మీదున్న పోరంబోకు జాగా, 👉 ఎందుకు పనికిరాని జాగా. 👉 వ్యవసాయ భూమి కాని జాగా 👉 సాగుబడి చేయని జాగా 👉 తమ పేరు మీద లేకపోయినా చూపెట్టడం 👉 కౌలుకి తీసుకోకపోయినా దొంగ కౌలు చూపడం 👉 కుటుంబంలో తాత, ముత్తాతల పొలాలను తమ పేరు మీద చూపెట్టుకోవడం 👉 బహుమతులు, ఇనాముల ద్వారా వచ్చిన జాగా 👉 దురాక్రమణ చేసి స్వాధీనపర్చుకోవడం మరికొందరు నేల మీదే లేని జాగాని చూపెడతారు. ఇలా చేసి ఈ జాగా.. చక్కని మాగణి అని.. బంగారం పండుతుందని బొంకుతారు. కొంత మంది సంవత్సరానికి రూ. 50,00,000 ఆదాయం వస్తుందంటే ఇంకొందరు ఎకరానికి రూ. 5,00,000 రాబడి వస్తుందని చెప్పారు. ఈ మేరకు లేని ఆదాయాన్ని చూపించి, పూర్తిగా పన్ను ఎగవేతకు పాల్పడ్డారు. ఈ ధోరణి అన్ని రాష్ట్రాల్లోకి పాకింది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా కొనసాగింది. హైదరాబాద్, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో భూముల మీద లెక్కలేనంత ఆదాయం చూపించారు. అధికారులు, మామూలుగానే, వారి ఆఫీసు రూమ్లో అసెస్మెంట్ చేస్తేనే అసెస్సీలకు పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి. అధికారులు అడిగే ప్రశ్నలకు, ఆరా తీసే తీరుకు కళ్లు బైర్లు కమ్ముతాయి. అలాంటిది, ఈసారి అధికారులు శాటిలైట్ చిత్రాల ద్వారా వారు చెప్పిన జాగాలకు వెళ్లారు. అబద్ధపు సర్వే నంబర్లు, లేని జాగాలు, బీడు భూములు, అడవులు, చౌడు భూములు, దొంగ పంటలు, దొంగ కౌళ్లు, లేని మనుషులు, దొంగ అగ్రిమెంట్లు.. ఇలా ఎన్నో కనిపించాయి. ఇక ఊరుకుంటారా.. వ్యసాయ ఆదాయాన్ని మామూలు ఆదాయంగా భావించి, అన్ని లెక్కలూ వేశారు. ఇరుగు–పొరుగువారు ఎన్నో పనికిమాలిన సలహాలు ఇస్తారు. వినకండి. ఫాలో అవ్వకండి. ఒకవేళ ఫాలో అయినా తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఎగవేతకు ఒక మార్గమే ఉంది. కానీ ఇప్పుడు ఎగవేతలను ఏరివేసి, సరిచేసి, పన్నులు వసూలు చేసే మార్గాలు వందలాది ఉన్నాయి. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు. -
తొలిసారిగా ఇన్వెస్ట్ చేస్తున్నవారి కోసం.. ‘ఛోటీ సిప్’
తొలిసారిగా ఇన్వెస్ట్ చేస్తున్న వారి కోసం కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (కేఎంఏఎంసీ) ‘ఛోటీ సిప్’ను ప్రవేశపెట్టింది. నెలవారీగా అత్యంత తక్కువగా రూ. 250తో కూడా సిప్ రూపంలో పెట్టుబడులు పెట్టొచ్చు. దీని కింద కనీసం 60 నెలల పాటు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. దీర్ఘకాలంలో పెట్టుబడి వృద్ధికి దోహదపడేలా ఇది గ్రోత్ ఆప్షన్తో మాత్రమే లభిస్తుంది. కొత్త ఇన్వెస్టర్లలో క్రమశిక్షణతో కూడుకున్న పొదుపు అలవాటును పెంపొందించేందుకు ఇది తోడ్పడుతుందని సంస్థ ఎండీ నీలేష్ షా తెలిపారు.ఆదిత్య బిర్లా సన్ లైఫ్లోనూ..ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ కూడా తాజాగా ఛోటీ సిప్ను (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) ప్రారంభించింది. డెట్, సెక్టోరల్, థీమ్యాటిక్లాంటి కొన్ని ఫండ్స్కి తప్ప మిగతా అన్ని రకాల స్కీములకు ఇది అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. నెలవారీగా రూ. 250 నుంచి ఈ సిప్లో ఇన్వెస్ట్ చేయొచ్చు.కనీసం 60 వాయిదాలు కట్టాల్సి ఉంటుందని సంస్థ ఎండీ ఎ. బాలసుబ్రమణియన్ తెలిపారు. క్రమశిక్షణతో పెట్టుబడులు పెట్టే ధోరణిని అలవర్చుకునేందుకు ఈ విధానం తోడ్పడగలదని పేర్కొన్నారు. ఇందులో, ముందస్తుగా విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. -
రెండింటిలోనూ ఇన్వెస్ట్ చేసే ఫండ్..
ఇటీవలి కాలంలో మన మార్కెట్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇది చూసి దీర్ఘకాలానికి ఈక్విటీలు బ్రహ్మాండమైన రాబడులు ఇస్తాయన్న ప్రచారంలో వాస్తవం ఎంత? అన్న సందేహాలు కూడా కొందరు ఇన్వెస్టర్లలో ఏర్పడ్డాయి. ఈ సమయంలో ఈక్విటీ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టాలా? లేక డెట్లో పెట్టుబడులు పెట్టుకోవాలన్న సంశయం కూడా ఎదురుకావచ్చు. కానీ, పెట్టుబడుల ప్రయాణం చాలా సుదీర్ఘమైనది. దీర్ఘకాల లక్ష్యాల కోసం నిధిని సమకూర్చుకోవాలని కోరుకునే ఇన్వెస్టర్ల పోర్ట్ఫోలియోలో ఈక్విటీలకు తప్పకుండా చోటు ఉండాలి. అదే సమయంలో పెట్టుబడినంతా ఈక్విటీల్లోనే పెట్టేయడం సరికాదు. డెట్కు సైతం కొంత కేటాయింపులు అవసరం. ఈక్విటీ, డెట్ పెట్టుబడులకు వీలు కల్పించే పథకాల్లో కోటక్ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ ఒకటి. రాబడులు గడిచిన ఏడాది కాలంలో కోటక్ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్లో రాబడి 7.30 శాతంగా ఉంది. గత ఐదు నెలలుగా మార్కెట్లు తీవ్ర కుదుపులను చూస్తున్నాయి. అలాంటి తరుణంలోనూ ఏడాది కాలంలో రాబడి సానుకూలంగా ఉండడం గమనార్హం. ఏడాది కాల పనితీరు విషయంలో ఈక్విటీ ఆధారిత హైబ్రిడ్ విభాగంలో ఈ పథకం రెండో స్థానంలో నిలిచింది. మూడేళ్ల కాలంలో ఈ పథకం ఏటా 14 శాతం చొప్పున పెట్టుబడులపై ప్రతిఫలాన్ని తెచ్చిపెట్టింది. ఇక ఐదేళ్లలో చూస్తే 21 శాతం, ఏడేళ్లలో 14 శాతం, 10 ఏళ్లలో 12.75 శాతం చొప్పున వార్షిక రాబడిని అందించింది. అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్ విభాగంతో పోల్చి చూస్తే అన్ని కాలాల్లోనూ ఈ పథకంలోనే రాబడి అధికంగా ఉండడాన్ని గమనించొచ్చు. పెట్టుబడుల విధానం ఈ పథకం అగ్రెస్సివ్ అలోకేషన్ విధానాన్ని అనుసరిస్తుంది. 75 శాతం వరకు ఈక్విటీలకు, 25 శాతం వరకు డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటుంది. వివిధ మార్కెట్ క్యాప్ల మధ్య తగినంత వైవిధ్యాన్ని పాటిస్తుంది. అధిక వేల్యూషన్లకు చేరితే లాభాలు స్వీకరించి, అదే సమయంలో చౌక విలువల వద్ద అందుబాటులో ఉన్న స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం ఈ పథకం పెట్టుబడుల విధానంలో భాగంగా గుర్తించొచ్చు.ఇందుకు నిదర్శనం గత ఆరు నెలల్లో క్యాపిటల్ గూడ్స్, ఆటోల్లో అమ్మకాలు చేయగా, అదే సమయంలో టెక్నాలజీ, కెమికల్స్, ఫార్మా, హెల్త్కేర్లో ఎక్స్పోజర్ పెంచుకుంది. ఈ విధానంతో నష్టాలను పరిమితం చేసి లాభాలను పెంచుకునే వ్యూహాన్ని ఫండ్ నిర్వహణ బృందం అమలు చేసింది. ఈ తరహా విధానాలతో రిస్క్ తగ్గించి, రాబడులు పెంచుకునే విధంగా పథకం పనిచేస్తుంటుంది. పోర్ట్ఫోలియో ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.6,324 కోట్ల పెట్టుబడులున్నాయి. ఇందులో 73 శాతం వరకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసింది. డెట్ సాధనాల్లో 25 శాతం పెట్టుబడులు పెట్టగా, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్)లలో 0.43 శాతం మేర ఇన్వెస్ట్ చేసింది. 1.64 శాతం మేర నగదు నిల్వలు ఉన్నాయి. ఈక్విటీ పెట్టుబడులను గమనిస్తే 68 శాతం మేర లార్జ్క్యాప్ కంపెనీల్లోనే ఉన్నాయి. మిడ్క్యాప్ కంపెనీల్లో 30 శాతం ఇన్వెస్ట్ చేస్తే, స్మాల్క్యాప్ కంపెనీలకు 1.92 శాతం కేటాయించింది.ఈక్విటీల్లో టెక్నాలజీరంగ కంపెనీల్లో అత్యధికంగా 18 శాతం మేర ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత 15 శాతం మేర బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ కంపెనీలకు, 9.68 శాతం మెటీరియల్స్ కంపెనీలకు, 8 శాతం హెల్త్కేర్ కంపెనీలకు కేటాయించింది. డెట్ పెట్టుబడుల్లో రిస్క్ దాదాపుగా లేని ఎస్వోవీల్లో (ప్రభుత్వ బాండ్లు) 20 శాతం ఇన్వెస్ట్ చేయగా, మెరుగైన క్రెడిట్ రేటింగ్కు నిదర్శనంగా ఉండే ఏఏఏ సెక్యూరిటీల్లో 3.41 శాతం పెట్టుబడులు ఉండడాన్ని గమనించొచ్చు.టాప్ ఈక్విటీ హోల్డింగ్స్ కంపెనీ పెట్టుబడులు శాతం1భారతీ ఎయిర్టెల్ 4.49 2హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 3.89 3ఇన్ఫోసిస్ 3.18 4ఫోర్టిస్ హెల్త్ 2.905అల్ట్రాటెక్ సిమెంట్ 2.88 6విప్రో 2.747ఎన్టీపీసీ 2.398పవర్ఫైనాన్స్ 2.259ఒరాకిల్ ఫైనాన్స్ 1.96 10ఐసీఐసీఐ బ్యాంక్ 1.89 -
పోయిన పాన్, ఆధార్ నంబర్లు తెలుసుకోండిలా..
దేశంలో నివసించే ప్రజలకు అత్యంత కీలకమైన కార్డులు రెండు ఉన్నాయి. అవి ఒకటి ఆధార్ కార్డు, రెండోది పాన్ కార్డు. ప్రతిరోజూ ఏదో ఒక పని కోసం ఈ డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. ఈ రెండు డాక్యుమెంట్లు లేకపోతే అనేక పనులు నిలిచిపోతాయి.అందుకే ఈ రెండు డాక్యుమెంట్లు మీ దగ్గర ఉండటం చాలా ముఖ్యం. కొంతమంది ఈ ముఖ్యమైన డాక్యుమెంట్లను పోగొట్టుకుంటుంటారు. వాటి నంబర్లు కూడా తెలియవు. అలాంటి పరిస్థితిలో ఏం చేయాలి? ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ రెండింటి గురించి మీరు ఆన్లైన్లో తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి ప్రక్రియ ఏమిటి.. సులభమైన మార్గాలను ఇక్కడ తెలుసుకుందాం.ఆధార్ నెంబర్ రీట్రీవ్ చేసుకోండిలా..యూఐడీఏఐ అధికారిక వెబ్సైట్ను సందర్శించండి'రిట్రీవ్ లాస్ట్ ఆర్ ఫర్గాటెన్ ఈఐడీ/యూఐడీ' ఆప్షన్ కోసం చూడండి.క్యాప్చా కోడ్తోపాటు మీ పూర్తి పేరు, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా ఆధార్తో లింక్ చేసిన ఈ-మెయిల్ ఐడీ వివరాలను నమోదు చేయండిమీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) వస్తుంది. ముందుకు సాగడం కోసం దానిని నమోదు చేయండి.విజయవంతంగా వెరిఫికేషన్ చేసిన తర్వాత, మీ ఆధార్ నంబర్ మీకు ఎస్ఎంఎస్ ద్వారా వస్తుంది.ఒకవేళ మీ మొబైల్ నంబర్ ఆధార్తో లింక్ చేయకపోతే, సహాయం కోసం ఆధార్ నమోదు కేంద్రాన్ని సందర్శించాలి.పాన్ నెంబర్ పొందండిలా..ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ వెబ్సైట్ సందర్శించండి'నో యువర్ పాన్'పై క్లిక్ చేయండిమీ పూర్తి పేరు, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్ నమోదు చేయండి.అథెంటికేషన్ కోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది.వెరిఫికేషన్ తర్వాత మీ పాన్ నంబర్ స్క్రీన్పై కనిపిస్తుంది. -
ఎక్కువ వడ్డీ అందించే పోస్టాఫీస్ స్కీమ్: ఎలా అప్లై చేయాలంటే?
మహిళలు, బాలికల కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల్లో 'మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్' (MSSC) ఒకటి. ఈ పథకాన్ని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ 2023 జూన్ 27న ప్రారంభించింది. ఇది ఈ నెల చివరి నాటికి క్లోజ్ అవుతుందని తెలుస్తోంది. ఇంతకీ ఈ పథకానికి అర్హులు ఎవరు?, ఎలా అప్లై చేయాలి? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.MSSC స్కీమ్ కోసం ఎవరు అర్హులు➤ఈ పథకం కోసం అప్లై చేసుకోవాలనుకునేవారు భారతీయులే ఉండాలి.➤ఈ స్కీమ్ కేవలం స్త్రీలకు మాత్రమే.➤వ్యక్తిగతంగా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. మైనర్ ఖాతా అయితే తండ్రి / సంరక్షకులు ఓపెన్ చేయవచ్చు.➤గరిష్ట వయోపరిమితి లేదు, కాబట్టి ఎవరైనా మహిళలు అప్లై చేసుకోవచ్చు.ఎలా అప్లై చేసుకోవాలి?●మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్ కోసం అప్లై చేసుకోవాలనుకునేవారు.. సమీపంలో ఉండే పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్ లేదా ఈ ఫథకం ఉన్న బ్యాంకులో అప్లై చేసుకోవాలి.●ముందుగా అధికారిక వెబ్సైట్ నుంచి ఫామ్ డౌన్లోడ్ చేసుకుని, అవసరమైన వివరాలను ఫిల్ చేసిన తరువాత.. కావలసిన డాక్యుమెంట్స్ జతచేయాల్సి ఉంటుంది. ●ఎంత డిపాజిట్ చేస్తారో ధరఖాస్తులోనే వెల్లడించాలి (రూ. 1000 నుంచి రూ. 2 లక్షల వరకు).అప్లై చేయడానికి అవసరమైన డాక్యుమంట్స్మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకానికి అప్లై చేసుకోవడానికి.. పాస్పోర్ట్ సైజ్ ఫొటో, బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, డిపాజిట్ చేసే మొత్తం లేదా చెక్, అడ్రస్ ప్రూఫ్ కోసం పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ వంటి డాక్యుమెంట్స్ అవసరం.పెట్టుబడి ఎంత పెట్టాలి? వడ్డీ ఎంత వస్తుందిమహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకంలో రూ. 1000 నుంచి రూ. 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం గడువు రెండేళ్లు. ఇందులో వడ్డీ 7.5 శాతం ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు ఈ స్కీమ్ కింద ఇన్వెస్ట్ చేస్తే.. రెండు సంవత్సరాల తరువాత అసలు, వడ్డీ కలిపి తీసుకోవచ్చు. ఏదైనా అత్యవసర సమయంలో డిపాజిట్ మొత్తంలో 40 శాతం విత్డ్రా చేసుకోవచ్చు. ముందుగా విత్డ్రా చేసుకుంటే వడ్డీ రేటు తగ్గే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: వారానికి 70 గంటల పని: మొదటిసారి స్పందించిన సుధామూర్తి -
సెబీ కొత్త రూల్స్: ఏప్రిల్ 1 నుంచే..
న్యూఢిల్లీ: అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీల్లో (ఏఎంసీలు/మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ సంస్థలు) పనిచేసే ఉద్యోగులకు సెబీ నిబంధనల పరంగా ఊరట కల్పించింది. మఖ్య నిర్వహణ అధికారి (సీఈవో), ముఖ్య పెట్టుబడుల అధికారి (సీఐవో), ఫండ్ మేనేజర్లు తదితర ఎంపిక చేసిన కీలక ఉద్యోగులు తమ వార్షిక వేతనంలో 20 శాతం మేర తమ సంస్థ నిర్వహిస్తున్న మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోనే ఇన్వెస్ట్ చేయాలని ప్రస్తుత నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. అంతేకాదు ఇలా చేసిన పెట్టుబడులకు మూడేళ్ల పాటు లాకిన్ ఉంటుంది. దీన్నే ‘స్కిన్ ఇన్ ద గేమ్’గా చెబుతారు.ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధనల అమలులో కొంత ఉపశమనాన్ని సెబీ కల్పించింది. స్థూల వార్షిక పారితోషికం ఆధారంగా మ్యూచువల్ ఫండ్స్ సంస్థల ఉద్యోగులు సొంత నిర్వహణ పథకాల్లో చేయాల్సిన పెట్టుబడుల శాతంలో మార్పులు చేసింది. మ్యూచువల్ ఫండ్స్ ఉద్యోగుల నైతిక నడవడిక, సొంత పథకాల నిర్వహణలో బాధ్యతను పెంచడం, ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణ ఇందులోని ఉద్దేశ్యాలుగా ఉన్నాయి.కొత్త నిబంధనలు..కొత్త నిబంధనల కింద రూ.25 లక్షలకు మించని వేతనం ఉన్న వారు సొంత మ్యూచువల్ ఫండ్స్ సంస్థ పథకాల్లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు.రూ.25 లక్షలకు మించి ఆదాయం ఉన్న వారు 10 శాతం ఇన్వెస్ట్ చేయాలి. ఇసాప్లు/ఉద్యోగ స్టాక్ ఆప్షన్లు కూడా కలుపుకుంటే 12.5% పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది.రూ.50 లక్షల నుంచి రూ.కోటి మధ్య వేతనం ఉన్న వారు కనీసం 14 శాతం మేర (ఒకవేళ స్టాక్ ఆప్షన్లు కూడా ఉంటే 17.5 శాతం) పెట్టుబడులు పెట్టాలి. -
ఇన్సూరెన్స్ ప్రీమియంలపై త్వరలో భారీ నిర్ణయం!
దేశంలోని లక్షలాది మంది బీమా పాలసీదారులకు ఉపశమనం కలగనుంది. ఆరోగ్య బీమా, టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ GST) త్వరలో తగ్గే అవకాశం ఉంది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) తన సిఫారసులను సమర్పించడంతో జీఎస్టీ కౌన్సిల్ తుది నిర్ణయానికి మార్గం సుగమమైంది.ప్రస్తుతం హెల్త్, టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై 18% జీఎస్టీ విధిస్తున్నారు. ఇన్సూరెన్స్ అన్నది అత్యవసర సేవగా మారిన నేపథ్యంలో చాలా మంది వినియోగదారులకు జీఎస్టీ భారంగా మారింది. ప్రతిపాదిత తగ్గింపు బీమాను మరింత చౌకగా మార్చి తద్వారా ప్రపంచ ప్రమాణాలతో పోలిస్తే బీమా కవరేజీ తక్కువగా ఉన్న భారతదేశంలో బీమా వ్యాప్తిని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది.త్వరలోనే నిర్ణయంబీమాపై మంత్రుల బృందం (జీవోఎం) ఏప్రిల్ లో సమావేశమై తమ సిఫార్సులను ఖరారు చేయనుంది. తరువాత వాటిని జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం కోసం సమర్పించనుంది. బహుశా ఏప్రిల్ చివరిలో లేదా మే ప్రారంభంలో జరగనున్న తన తదుపరి సమావేశంలో కౌన్సిల్ ఈ విషయాన్ని చర్చించే అవకాశం ఉంది. ఈ నిర్ణయానికి రాష్ట్రాల నుండి విస్తృత మద్దతు లభించింది. బీమా రంగంలో జీఎస్టీ ఉపశమనం ఆవశ్యకతపై రాష్ట్రాల ప్రభుత్వాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి.జీఎస్టీ తగ్గింపు వల్ల బీమా ప్రీమియంల మొత్తం తగ్గి తద్వారా నేరుగా పాలసీదారులకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. ఈ చర్య మరింత మందిని ఆరోగ్య బీమా, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేలా ప్రోత్సహిస్తుంది. వారికి ఆర్థిక భద్రతను, నిశ్చింతను అందిస్తుంది.సవాళ్లూ ఉన్నాయి..ఈ ప్రతిపాదనకు సవాళ్లు లేకపోలేదు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్స్ (ఐటీసీ) క్లెయిమ్ చేసుకునే సామర్థ్యంపై జీఎస్టీ మినహాయింపుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని బీమా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఖర్చులు అంతిమంగా వినియోగదారుల మీదే పడతాయి. దీంతో పన్ను తగ్గింపు ఉద్దేశిత ప్రయోజనాలు దెబ్బతినవచ్చు. ఈ అడ్డంకులు ఉన్నప్పటికీ, సగటు భారతీయుడికి బీమాను మరింత అందుబాటులో, చౌకగా చేసే దిశగా ఈ చొరవ ఒక సానుకూల అడుగును సూచిస్తుంది. -
ఏకీకృత పెన్షన్ విధానంలో కొత్త నిబంధనలు
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) ఆధ్వర్యంలో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్(యూపీఎస్) కోసం పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) కొత్త నిబంధనలను ప్రవేశపెట్టనుంది. ఈ నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని పీఎఫ్ఆర్డీఏ ఒక ప్రకటనలో తెలిపింది. వివిధ కేటగిరీల్లోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, అర్హులైన రిటైర్డ్ వ్యక్తులు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో వివరాలు నమోదు చేసుకోవడానికి వీలు కల్పించే సరళీకృత, సమగ్ర ఫ్రేమ్వర్క్ను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.ఈ నిబంధనల కింద 2025 ఏప్రిల్ 1 నాటికి ఇప్పటికే సర్వీసులో ఉన్నవారు, ఎన్పీఎస్ పరిధిలోకి వచ్చేవారు, 2025 ఏప్రిల్ 1 తరువాత చేరిన కొత్త నియామకాలు, పదవీ విరమణ చేసిన, స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసిన, యూపీఎస్కు అర్హులైన రిటైర్డ్ ఉద్యోగులతో సహా విభిన్న కేటగిరీల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నమోదు ప్రక్రియను సులభతరం చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. మరణించిన ఉద్యోగుల జీవిత భాగస్వాములు కూడా యూపీఎస్ను ఎంపిక చేసుకునేందుకు అవకాశం ఉందని ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో 23 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.ఏప్రిల్ 1, 2025 నుంచి యూపీఎస్లో చేరుతున్నారా.. లేదా.. అనే నిర్ణయాన్ని మూడు నెలల్లోగా తీసుకోవాలి. ఈ విధానాన్ని ఎంచుకోవాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని తిరిగి అప్డేట్ చేసుకునే అవకాశం ఉండదు. ఏప్రిల్ 1, 2025 నుంచి ఆన్లైన్లో నమోదు, క్లెయిమ్ ఫారాలు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.యూపీఎస్ విశేషాలివీ...అష్యూర్డ్ పెన్షన్: ఉద్యోగులు రిటైర్మెంట్కు ముందు తమ చివరి 12 నెలల సగటు బేసిక్ వేతనంలో సగం మొత్తాన్ని పెన్షన్గా అందుకుంటారు. ఇందుకోసం కనీసం పాతికేళ్ల సర్వీసు పూర్తి చేసుకుని ఉండాలి. అంతకంటే తక్కువైతే సర్వీసు కాలాన్ని బట్టి పెన్షన్ మొత్తం నిర్ధారణ అవుతుంది.అష్యూర్డ్ మినిమం పెన్షన్: కనీసం పదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి రిటైర్మెంట్ అనంతరం నెలకు రూ.10 వేల కనీస పెన్షన్ అందుతుంది. తద్వారా అల్ప వేతనాలుండే దిగువ స్థాయి ఉద్యోగులకు ఇది ఆర్థిక భద్రత కల్పిస్తుంది.అష్యూర్డ్ ఫ్యామిలీ పెన్షన్: పెన్షనర్ మరణిస్తే కుటుంబానికి అతని పెన్షన్లో 60 శాతాన్ని అందజేస్తారు. తద్వారా ఆ కుటుంబానికి కనీస ఆర్థిక భద్రత కలుగుతుంది. ఏకమొత్తంలో ప్రయోజనం: ప్రతి ఆర్నెల్ల సర్వీసుకూ నెలవారీ వేతనం (జీతం+డీఏ)లో పదోవంతు చొప్పున రిటైర్మెంట్ సమయంలో ఏకమొత్తంగా అందజేస్తారు. గ్రాట్యుటీ తదితర బెనిఫిట్లకు ఇది అదనం.సర్వీసులో ఉన్న ఉద్యోగుల మాదిరిగా యూపీఎస్ పెన్షనర్లకు కూడా ద్రవ్యోల్బణ సూచిక, డీఆర్ ప్రయోజనాలను వర్తింపజేస్తారు.ఇప్పటికే ఎన్పీఎస్ కింద రిటైరైన వారితో పాటు 2025 మార్చి 31 నాటికి రిటైరయ్యే ఉద్యోగులకు కూడా యూపీఎస్ వర్తిస్తుంది. వారికి గత బకాయిలను పీపీఎఫ్ వడ్డీరేటుతో చెల్లిస్తారు.ఉద్యోగులు ఎన్పీఎస్, యూపీఎస్ల్లో దేన్నయినా ఎంచుకోవచ్చు.ఇదీ చదవండి: భవిష్యత్తులో ఉచిత వైద్య కార్యక్రమాలుయూపీఎస్ బెనిఫిట్ల నిమిత్తం ఉద్యోగులపై అదనపు భారమేమీ పడబోదు. పెన్షన్ ఖాతాకు వారి చెల్లింపుల వాటా 10 శాతంగానే కొనసాగుతుంది. కేంద్రం వాటా ఇప్పుడున్న 14 శాతం నుంచి 18.5 శాతానికి పెరగనుంది. దీనివల్ల కేంద్రంపై రూ.6,250 కోట్ల దాకా భారం పడనుంది. బకాయిల రూపేణా మరో రూ.800 కోట్ల భారం పడుతుందని అంచనా.రాష్ట్ర ప్రభుత్వాలు కూడా యూపీఎస్ను అమలు చేయాలని కేంద్రం సూచించింది. తద్వారా 90 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని పేర్కొంది. -
నెలకు రూ.3000 చాలు.. పదేళ్లకు రూ.లక్షలు..
స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులపై అవగాహన చాలా మందిలో ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. చిన్న మొత్తాల్లో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి సిప్ (SIP) మంచి మార్గంగా మారింది. సిప్లో ప్రతి నెలా మీరు పెట్టుబడి పెట్టే చిన్న మొత్తమే కాలక్రమేణా పెరుగుతుంది. తద్వారా మీ పెట్టుబడిపై మంచి రాబడి లభిస్తుంది.సిప్ అంటే ఏమిటి.. ఇదెలా పనిచేస్తుంది?సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్.. దీన్నే సంక్షిప్తంగా సిప్ అని వ్యవహరిస్తారు. అంటే రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇందులో మీరు ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. సిప్ అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, మీరు చిన్న మొత్తాలతో కూడా పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. ఇది కాలక్రమేణా పెద్ద మొత్తంగా మారుతుంది. ఈ ప్రక్రియలో మీరు పదేపదే పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ప్రతి నెలా ఒక నిర్ణీత మొత్తం ఆటోమేటిక్గా మీ బ్యాంక్ ఖాతా నుంచి కట్ అయి మ్యూచువల్ ఫండ్కు వెళుతుంది.నెలకు రూ.3000 ఇన్వెస్ట్ చేస్తే..సిప్ ద్వారా ఇప్పుడు మీరు ప్రతి నెలా రూ .3000 పెట్టుబడి పెట్టడం మొదలుపెడితే, 10 సంవత్సరాల తరువాత మీ పెట్టుబడి ఎలా పెరుగుతుందన్నది ఉదాహరణ ద్వారా చూద్దాం.. మీరు సిప్ ద్వారా మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెడితే, అది సగటున 12% వార్షిక రాబడిని ఇస్తుంది. అప్పుడు 10 సంవత్సరాలలో మీ మొత్తం పెట్టుబడి రూ.3,60,000 అవుతుంది. అదే సమయంలో ఈ పెట్టుబడిపై వచ్చే రాబడి సుమారు రూ .3,37,017 ఉంటుంది. అంటే పదేళ్ల తర్వాత మీ చేతికి మొత్తంగా రూ.6,97,017 వస్తుంది.సిప్ ప్రయోజనాలుచిన్న పెట్టుబడులతో ప్రారంభించి కాలక్రమేణా పెద్ద మొత్తంలో రాబడి సంపాదించవచ్చు. ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ పద్ధతి ఆర్థిక ఒత్తిడిని తగ్గిస్తుంది.సిప్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు, మీరు మార్కెట్ ఒడిదుడుకులను ఎదుర్కోవచ్చు. కానీ దీర్ఘకాలికంగా ఇది రాబడిని సమతుల్యం చేస్తుంది. అంటే మార్కెట్ పడిపోయినా, కాలక్రమేణా మీ పెట్టుబడి సరైన దిశలో పెరగడానికి సిప్ సహాయపడుతుంది.సిప్లో పెట్టుబడులను మీ సౌలభ్యానికి అనుగుణంగా సెట్ చేసుకోవచ్చు. ప్రతి నెలా మీ ఖాతా నుండి నిర్ణీత మొత్తం నేరుగా మ్యూచువల్ ఫండ్లో జమయ్యేలా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ పూర్తిగా ఆటోమేటెడ్ కాబట్టి మీరు మళ్లీ మళ్లీ ఆలోచించాల్సిన అవసరం ఉండదు.సిప్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో మెరుగైన రాబడిని పొందుతారు. మ్యూచువల్ ఫండ్స్ రాబడులు కాలక్రమేణా మెరుగుపడతాయి.గుర్తుంచుకోవాల్సినవి..సరైన మ్యూచువల్ ఫండ్ ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. మంచి పనితీరు కనబరిచే ఫండ్లను ఎంచుకోవడం వల్ల మంచి రాబడి పొందవచ్చు.మీ సామర్థ్యాన్ని బట్టి ఇన్వెస్ట్ చేయండి. మీరు రూ.500తో కూడా సిప్ లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించవచ్చు.సిప్ లో ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ ఒడిదుడుకులను నివారించి మంచి రాబడి పొందవచ్చు.క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తేనే సిప్ బెనిఫిట్ లభిస్తుంది. ఎంత ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేస్తే అంత ఎక్కువ రాబడి పొందొచ్చు. -
ఇంట్లో బంగారం.. ఇదిగో వచ్చేస్తున్నాం!
భారతదేశంలో బంగారం అనేది కేవలం లోహం మాత్రమే కాదు.. అది వారసత్వం, సంప్రదాయం, విశ్వాసానికి చిహ్నం. ఉత్తరం నుంచి దక్షిణం వరకు భారతీయులకు బంగారంతో ప్రత్యేక అనుబంధం ఉంది. పెళ్లి అయినా, పండుగ అయినా బంగారం లేకుండా పూర్తవదు. ఈ కారణంగానే భారతీయ కుటుంబాలు తరతరాలుగా బంగారాన్ని కూడబెట్టుకుంటున్నాయి.అయితే ఆదాయపు పన్ను శాఖ కూడా మీ బంగారం కొనుగోళ్లపై ఓ కన్నేసి ఉంచుతుందన్న విషయం మీకు తెలుసా? నిర్ణీత పరిమితి కంటే ఎక్కువ బంగారం ఉంటే, దాని చట్టబద్ధతను మీరు నిరూపించలేకపోతే ఆదాయపు పన్ను నోటీసు లేదా దాడులు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ నేపథ్యంలో మీరు చట్టబద్ధంగా ఇంట్లో ఎంత బంగారాన్ని ఉంచుకోవచ్చో తెలుసుకోవడం చాలా ముఖ్యం.నిబంధనలేంటి?భారతదేశంలో బంగారం కొనుగోలు, నిల్వకు సంబంధించి ప్రభుత్వం కొన్ని నిబంధనలు ఏర్పాటు చేసింది. ఈ నిబంధనల ప్రకారం వివాహిత మహిళలు ఇంట్లో 500 గ్రాముల బంగారాన్ని ఉంచుకోవచ్చు.సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) ప్రకారం ఇంట్లో నిర్ణీత మొత్తంలో బంగారాన్ని ఉంచుకోవచ్చు. అయితే మీ వద్ద ఎంత బంగారం ఉన్నా, అది మీకు ఎలా వచ్చిందో రుజువు ఉండాలి.వివాహిత మహిళ తన వద్ద 500 గ్రాముల బంగారాన్ని ఉంచుకోవచ్చని ఆదాయపు పన్ను చట్టాలు చెబుతున్నాయి. పెళ్లికాని మహిళలైతే 250 గ్రాముల పసిడిని తమ వద్ద ఉంచుకోవచ్చు. ఇక కుటుంబంలోని పురుషులు 100 గ్రాముల వరకు మాత్రమే బంగారాన్ని ఉంచువడానికి అనుమతి ఉంది.పన్నులేమైనా ఉంటాయా?మీరు ప్రకటించిన ఆదాయం లేదా పన్ను మినహాయింపు ఆదాయం (వ్యవసాయం వంటివి) నుంచి బంగారాన్ని కొనుగోలు చేసినట్లయితే లేదా చట్టబద్ధంగా వారసత్వంగా పొందినట్లయితే దానిపై ఎటువంటి పన్ను ఉండదు. దాడులు నిర్వహిస్తే నిర్ణీత పరిమితిలో దొరికిన బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకోలేరు. బంగారాన్ని ఇంట్లో పెట్టుకుంటే పన్ను చెల్లించాల్సిన అవసరం లేనప్పటికీ, బంగారాన్ని విక్రయిస్తే మాత్రం దానిపై పన్ను చెల్లించాలి.2024 జూలైలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024లో ప్రభుత్వం స్వల్పకాలిక మూలధన లాభాలు, దీర్ఘకాలిక మూలధన లాభాలకు అర్హత పొందడానికి భౌతిక బంగారంతో సహా కొన్ని ఆస్తుల హోల్డింగ్ పీరియడ్ ప్రమాణాలను మార్చింది. ఫిజికల్ గోల్డ్ కోసం, స్వల్పకాలిక మూలధన లాభాల హోల్డింగ్ వ్యవధిని 3 ఏళ్ల నుండి 2 సంవత్సరాలకు తగ్గించింది. దీర్ఘకాలిక మూలధన లాభాలకు అర్హత సాధించడానికి, హోల్డింగ్ వ్యవధి 2 ఏళ్లు కంటే ఎక్కువ ఉండాలి. అంటే మీరు బంగారాన్ని 2 సంవత్సరాలు నిల్వ చేసిన తర్వాత అమ్మితే వచ్చిన లాభం ఎటువంటి ఇండెక్సేషన్ ప్రయోజనం లేకుండా 12.5% దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నుకు లోబడి ఉంటుంది. -
దాచుకోవాల్సిన డబ్బులు.. వాడేసుకుంటున్నారు!
ఉద్యోగ భవిష్య నిధి(ఈపీఎఫ్) భారతదేశంలోని కోట్ల మంది వేతన జీవులకు కీలకమైన పొదుపు సాధనంగా ఉంది. ఇది ఆర్థిక భద్రతను, పదవీ విరమణ అనంతర ప్రయోజనాలను అందిస్తుంది. అయితే ఈపీఎఫ్లోని యువ చందాదారులు తమ మొత్తం ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) కార్పస్ను ముందస్తుగానే ఉపసంహరించుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. ఇటీవల ఈ ధోరణి మరింత పెరుగుతోందని తెలిపారు. ఇందుకుగల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.అనిశ్చిత సమయాల్లో ఆర్థిక ఒత్తిడిఆర్థిక అనిశ్చితులు, కొవిడ్-19 మహమ్మారి వంటి సమయాల్లో చాలామందికి ఈపీఎఫ్ పొదుపు ఆసరాగా మారింది. ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడినా గతంలోని వైఖరినే చందాదారులు పాటిస్తున్నారు. చిన్నచిన్న అవసరాలకు కూడా పీఎఫ్ డబ్బును ఉపసంహరిస్తున్నారు. దాంతోపాటు ఇటీవల ఉద్యోగుల తొలగింపులు, జీతాల్లో కోతలు, పెరుగుతున్న ఖర్చుల కారణంగా తక్షణ ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఈ పొదుపును వాడుతున్నారు.జాబ్ మార్కెట్ అస్థిరతయువ నిపుణులు తరచుగా ఉద్యోగాలు మారుతుంటారు. దాంతో ఖర్చుల కోసం పీఎఫ్ ఉపసంహరణలు చేస్తున్నారు. కొత్త ఉద్యోగంలో చేరినప్పుడు ఈపీఎఫ్ఓ ప్రవేశపెట్టిన ఆన్లైన్ అకౌంట్ బదిలీ విధానాలు అందుబాటులో ఉన్నప్పటికీ పాత కంపెనీకి అనుగణంగా ఉన్న పీఎఫ్ను ఉపసంహరించుకోవడం సులభమని భావిస్తున్నారు.దీర్ఘకాలిక ప్రయోజనాలపై అవగాహన లేమిదీర్ఘకాలిక పెట్టుబడి సాధనంగా ఈపీఎఫ్ ప్రాముఖ్యతను యువ చందాదారులు తక్కువగా అంచనా వేస్తున్నారు. వారిలో ఈపీఎఫ్ అందించే కాంపౌండెడ్ వడ్డీ, పన్ను ప్రయోజనాల గురించి పరిమిత అవగాహన ఉంది. ముందస్తు ఉపసంహరణలు స్వల్పకాలిక లక్ష్యాలకు ఆకర్షణీయంగా కనిపిస్తున్నప్పటికీ దీర్ఘకాలంలో సమకూరే రాబడులపై తీవ్ర ప్రభావం చూపుతాయి.కొత్త పెట్టుబడుల అన్వేషణయువ చందాదారులు ఈపీఎఫ్ కార్పస్ను వ్యాపారాలు ప్రారంభించడానికి, ఉన్నత విద్యను అభ్యసించడానికి లేదా మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీలు వంటి ఇతర ఆర్థిక సాధనాల్లో పెట్టుబడి పెట్టడానికి అందుబాటులో ఉన్న డబ్బుగా చూస్తున్నారు. ఇవి స్వల్ప కాలంలో అధిక రాబడిని ఇచ్చే అవకాశం ఉంది.అత్యవసర నిధి లేకపోవడంకొంతమందికి అత్యవసర నిధి లేకపోవడం, తరచుగా వైద్య ఖర్చులు, వివాహ ఖర్చులు లేదా కుటుంబ బాధ్యతలను పూర్తి చేయడానికి సరిపడా డబ్బు కొరత ఏర్పడుతుంది. దాంతో పీఎఫ్ కార్పస్ను విత్డ్రా చేస్తున్నారు. ఎమర్జెన్సీ కార్పస్ అవసరంపై యువకులు సరైన అవగాహన పెంపొందించుకోవాలి.ఉపసంహరణల కట్టడికి ఏమి చేయవచ్చు?అవగాహన కార్యక్రమాలు: ఈపీఎఫ్ఓ, కంపెనీల యాజమాన్యాలు పీఎఫ్ పొదుపును నిలుపుకోవడం వల్ల కలిగే దీర్ఘకాలిక ప్రయోజనాల గురించి యువ చందాదారులకు అవగాహన కల్పించాలి.ప్రోత్సాహకాలు అందించడం: పీఎఫ్ నిధులను ఎక్కువ కాలం కొనసాగించే చందాదారులకు ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి.సరళీకృత బదిలీ ప్రక్రియలు: ఆన్లైన్ వ్యవస్థలు ఉన్నప్పటికీ ఉద్యోగ మార్పుల సమయంలో పీఎఫ్ బదిలీ ప్రక్రియను మరింత సరళీకరించేలా చర్యలు తీసుకోవాలి.ఎమర్జెన్సీ ఫండ్స్పై అవగాహన: అత్యవసర నిధి ప్రాముఖ్యతపై స్పష్టతనిచ్చే ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాలు యువ చందాదారులు తమ పీఎఫ్ పొదుపును విత్డ్రా చేయకుండా కట్టడి చేయడంలో తోడ్పడుతాయి.ఇదీ చదవండి: స్టార్లింక్ సర్వీసులపై స్పెక్ట్రమ్ ఫీజు?పీఎఫ్ కార్పస్ ఉపసంహరించుకోవడం స్వల్పకాలిక ఉపశమనం కలిగించినప్పటికీ దీర్ఘకాలిక పరిణామాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఆర్థిక స్థిరత్వం, భవిష్యత్తు భద్రతకు ఈపీఎఫ్ను తాత్కాలిక వెసులుబాటుగా కాకుండా సంపద సృష్టించే సాధనంగా చూసేలా యువ చందాదారులను ప్రోత్సహించడం చాలా ముఖ్యం. అవగాహనను పెంపొందించడం, మెరుగైన మార్గాలు అన్వేషించడం ద్వారా ఈ ఉపసంహరణలను కట్టడి చేయవచ్చు. -
లోన్ క్లియర్ చేయడం ఆలస్యమైతే ప్రయోజనాలా?: పోస్ట్ వైరల్
ఎవరైనా బ్యాంక్ నుంచి లేదా ఇతర ఫైనాన్సియల్ సంస్థ నుంచి లోన్ తీసివుంటే.. ఎప్పుడెప్పుడు దాన్ని క్లియర్ చేసి ప్రశాంతంగా ఉందామా అనుకుంటారు. కానీ ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్ మాత్రం మూడేళ్ళలో క్లియర్ చేయాల్సిన లోన్ను ఎనిమిదేళ్లలో క్లియర్ చేసాడు. ఎందుకు ఆలస్యం చేసాడు అనేదానికి సంబంధించిన వివరాలను రెడ్డిట్లో షేర్ చేసాడు.ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIM) బెంగళూరు పూర్వ విద్యార్థి.. మొదట్లో సాధ్యమైనంత త్వరగా తన లోన్ క్లియర్ చేసుకోవాలని అనుకున్నాడు. కానీ ఆలస్యం చేయడంలో లాభాలు ఉన్నాయని కొన్ని లెక్కల ద్వారా తెలుసుకుని.. లోన్ చెల్లించడానికి తొందరపడటం ఉత్తమ చర్య కాదని గ్రహించాడు.ఎంబీఏ గ్రాడ్యుయేట్ లోన్ ఆలస్యంగా చెల్లించాలి, అనుకోవడానికి ప్రధాన కారణం పన్ను ప్రయోజనాలు అని రెడ్డిట్లో వెల్లడించారు. బహుశా ఈ ప్రయోజనాల గురించి ఎవరికీ తెలుసుకుండకపోవచ్చు లేదా తెలిసినా పట్టించుకోకుండా ఉండొచ్చు. కానీ ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80E కింద, పన్ను చెల్లింపుదారులు ఎనిమిది సంవత్సరాల వరకు చెల్లించే వడ్డీపై 100% పన్ను మినహాయింపు పొందుతారు. రెండు లేదా మూడేళ్ళలో లోన్ క్లియర్ చేస్తే ఈ మినహాయింపు లభించదు. కాబట్టి పూర్తి వ్యవధిలో లోన్ చెల్లించి పన్ను విధించదగిన ఆదాయాన్ని ఎందుకు తగ్గించకూడదని.. అన్నారు.రెండో కారణం ఏమిటంటే.. ఒక వ్యక్తి రూ. 20 లక్షలు లోన్ తీసుకున్నాడు అనుకుంటే.. 9 శాతం వడ్డీతో మొత్తం రూ. 25 లక్షల నుంచి రూ. 27 లక్షల వరకు చెల్లించాల్సి వస్తుంది. లోన్ తీసుకున్న మొదటి రోజుల్లో లేదా ఈఎంఐలో అసలు కంటే వడ్డీనే ఎక్కువ కట్ అవుతుంది. క్రమంగా ఆ వడ్డీ తగ్గుతూ వస్తుంది. కాబట్టి నా డబ్బును తొందరగా తిరిగి చెల్లించడానికి బదులు.. దానిని పొదుపులు & పెట్టుబడులతో సమతుల్యం చేసుకున్నానని పేర్కొన్నాడు.ఇదీ చదవండి: మైక్రో రిటైర్మెంట్: ఉద్యోగుల్లో ఇదో కొత్త ట్రెండ్నేను లోన్ తీసుకుని.. దానిని మళ్ళీ చెల్లించే విషయంలో చాలా తెలివిగా నిర్ణయం తీసుకున్నాను. ఇది నేను తీసుకున్న ఉత్తమ ఆర్థిక నిర్ణయం అని ఎంబీఏ గ్రాడ్యుయేట్ పేర్కొన్నాడు. అయితే త్వరగా అప్పులు తీర్చుకోవడం మంచిది, కానీ ఆర్థిక విషయాల్లో తెలివిగా ఉండటం కూడా మంచిదని.. అదే తాను నేర్చుకున్న పాఠమని వెల్లడించారు. -
కాసులు కురిపిస్తున్న పసిడి.. ఎనిమిదేళ్లలో 200 శాతం రాబడి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సార్వత్రిక గోల్డ్ బాండ్ల(ఎస్జీబీ)కు సంబంధించి తుది రిడంప్షన్ ధరను ప్రకటించడంతో ఇన్వెస్టర్ల సంపద భారీగా పెరగబోతుంది. 2016-17 సిరీస్ 4(ఎనిమిదేళ్లు), 2019-20 సిరీస్ 4(ఐదేళ్లు)లో పెట్టుబడిదారులు ఈమేరకు గణనీయమైన రాబడిని పొందనున్నారు. బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో ఎస్జీబీ ఇన్వెస్టర్ల సంపద దాదాపు మూడు రెట్లు పెరగవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి.2017 ఫిబ్రవరిలో గ్రాముకు రూ.2,943 చొప్పున జారీ చేసిన 2016-17 సిరీస్ 4 బాండ్లను ఇప్పుడు గ్రాముకు రూ.8,624గా రీడీమ్ చేసి 193 శాతం రాబడిని అందించనున్నారు. అదే ధరకు 2019 సెప్టెంబర్లో జారీ చేసిన 2019-20 సిరీస్ 4లో ఇన్వెస్టర్లు గ్రాముకు రూ.8,634 చొప్పున బాండ్లను రీడీమ్ చేసుకోవచ్చు. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) ప్రచురించిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది మార్చి 10 నుంచి మార్చి 13 మధ్య 999 స్వచ్ఛత బంగారం సగటు ముగింపు ధర ఆధారంగా ఈ రెండు సిరీస్లకు రిడంప్షన్ను మార్చి 17న షెడ్యూల్ చేశారు.రిడంప్షన్ ధర ఎలా లెక్కిస్తారంటే..బాండ్లను రిడంప్షన్ చేసుకునేవారికి ఆ తేదీకి ముందు గడిచిన మూడు పనిదినాల్లో సగటు బంగారం ధర (999 స్వచ్ఛత) ఆధారంగా ఉంటుంది రాబడిని లెక్కిస్తారు. ఈ బాండ్ సిరీస్ కోసం ఐబీజేఏ 2025 మార్చి 11, 12, 13 తేదీల్లో బంగారం ధరలను లెక్కించింది. సావరిన్ గోల్డ్ బాండ్స్ (ఎస్జీబీ) ఎనిమిదేళ్ల మెచ్యూరిటీని కలిగి ఉంటాయి. కానీ పెట్టుబడిదారులు ఐదేళ్ల తర్వాత వీటిని రిడీమ్ చేసుకోవచ్చు. ఈమేరకు సంబంధిత వడ్డీ చెల్లింపు తేదీల్లో మాత్రమే ఉపసంహరించుకోవచ్చు. ఎస్జీబీ సిరీస్ 4 2019-20కు సంబంధించి ఐదేళ్లకాలానికి రిడీమ్ తేదీని మార్చి 17గా నిర్ణయించారు.రిడీమ్ ప్రక్రియ ఇలా..బాండ్లను ముందుగానే రిడీమ్ చేసుకోవడానికి పెట్టుబడిదారులు వడ్డీ చెల్లింపు తేదీకి 30 రోజుల ముందు నిర్దేశించిన బ్యాంకు, ఎస్హెచ్సీఐఎల్ కార్యాలయం, పోస్టాఫీసు లేదా ఏజెంట్ వద్ద దరఖాస్తు సమర్పించాలి. ఈ అభ్యర్థన మార్చి 17 కంటే కనీసం ఒక రోజు ముందుగా విజయవంతంగా ప్రాసెస్ అవుతుంది. ఇది ఆమోదం పొందిన తర్వాత వచ్చే ఆదాయం నేరుగా ఎస్జీబీ అప్లికేషన్తో లింక్ చేయబడిన ఇన్వెస్టర్ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. మెచ్యూరిటీ కంటే ముందు కూడా అత్యవసర సమయాల్లో పెట్టుబడులను ఉంపసంహరించుకోవచ్చు. కానీ దానిపై అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. దాంతో రాబడి తగ్గుతుంది.మెచ్యూరిటీ వరకు ఎస్జీబీలను ఉంచడం వల్ల కలిగే ప్రయోజనాలుపన్ను రహిత లాభాలు: మెచ్యూరిటీ వరకు ఉంచితే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉండదు.గ్యారంటీడ్ వడ్డీ: 2.5 శాతం వార్షిక వడ్డీ స్థిరమైన ఆదాయాన్ని నిర్ధారిస్తుంది.మార్కెట్ లింక్డ్ రిటర్న్స్: ప్రస్తుతం ఉన్న బంగారం ధరలతో ముడిపడి రాబడి పెరుగుతుంది.భద్రత: ప్రభుత్వ మద్దతు ఉండే ఎస్జీబీలు పెట్టుబడులకు భద్రత కల్పిస్తాయి.ఏమిటీ ఎస్జీబీలు..?ఇవి భారత ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జారీ చేసిన ప్రభుత్వ సెక్యూరిటీలు. నిజమైన (భౌతిక) బంగారానికి ఇవి ప్రత్యామ్నాయ రూపం. పెట్టుబడిదారులు భౌతికంగా బంగారం కలిగి ఉండాల్సిన అవసరం లేకుండా దానిపై పెట్టుబడి పెట్టడానికి ఈ బాండ్లు వీలు కల్పించాయి. పెట్టుబడిదారులు ఇష్యూ ధరను నగదు రూపంలో చెల్లించాలి. బాండ్ల గడువు ముగిసిన తర్వాత పెట్టుబడిదారులకు నగదు రూపంలోనే తిరిగి చెల్లిస్తారు.బంగారం దిగుమతులను నిరుత్సాహపరచడం ద్వారా విదేశీ మారకం నిల్వలను కాపాడుకోవచ్చన్న భావనతో కేంద్రం ఈ బాండ్ల జారీని ప్రారంభించింది.ఇదీ చదవండి: భారత్లో యాపిల్-గూగుల్ భాగస్వామ్యం..?భారంగా మారిన బాండ్లుభారత్లో పెరుగుతున్న బంగారం దిగుమతులను తగ్గించాలన్న లక్ష్యంతో పదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించింది. ఆశించిన ప్రయోజనం అటుంచితే పెరుగుతున్న బంగారం ధరలతో ఖజానాపై ఊహించని ఆర్థిక భారం పడింది. దీంతో ప్రభుత్వం చివరకు ఈ పథకాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. గోల్డ్ బాండ్స్లో ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి రూ.85,000 కోట్లను తాకనుందని 2024 జూలై మధ్యంతర బడ్జెట్ సందర్భంగా ప్రభుత్వం వెల్లడించింది. ఈ విలువ 2019–20తో పోలిస్తే దాదాపు తొమ్మిది రెట్లు అదనం. -
టాటా ఏఐఏ కొత్త ఇన్కం ప్లాన్.. మహిళలకు ప్రత్యేక డిస్కౌంట్
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక భద్రతపరమైన భరోసానివ్వడంతో పాటు సంపద సృష్టికి కూడా ఉపయోగపడేలా టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ శుభ్ ఫ్లెక్సి ఇన్కం ప్లాన్ పేరిట వినూత్న జీవిత బీమా పొదుపు సాధనాన్ని ఆవిష్కరించింది. వివిధ వర్గాల ఆర్థిక ప్రణాళికలు, అవసరాలకు అనుగుణంగా ఇందులో ఎండోమెంట్, ఎర్లీ ఇన్కం, డిఫర్డ్ ఇన్కం ఆప్షన్లు ఉంటాయి. మహిళా పాలసీదార్లకు ప్రత్యేక డిస్కౌంటు ఉంటుంది.బోనస్లపై వడ్డీని పొందుతూ, దాన్ని భవిష్యత్తు ప్రీమియం చెల్లింపులకు ఉపయోగించుకునేలా సబ్–వాలెట్ ఫీచరు కూడా ఉంది. పాలసీదారు దురదృష్టవశాత్తూ కన్ను మూసిన పక్షంలో భవిష్యత్తులో కట్టాల్సిన ప్రీమియంల నుంచి మినహాయింపు లభిస్తుంది. వారి కుటుంబ సభ్యులకు భవిష్యత్తు బోనస్లు, ఇతర ప్రయోజనాలు యథాప్రకారం లభిస్తాయి. -
ప్రతి నెలా రూ.5,000 ఇన్వెస్ట్ చేస్తూ పెద్ద మొత్తం ఎలా?
నేను ప్రతి నెలా రూ.5,000 మొత్తాన్ని సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా ఇన్వెస్ట్ చేస్తూ పెద్ద మొత్తాన్ని సమకూర్చుకోవాలని అనుకుంటున్నాను. దీర్ఘకాలానికి మెరుగైన పథకాలను సూచించగలరు. – అహ్మద్ వానిదీర్ఘకాలానికి ఈక్విటీ ఫండ్స్ మెరుగైనవే. మార్కెట్లలో ఉండే ఆటుపోట్ల దృష్ట్యా మీకు సౌకర్యమైన పథకాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మొదటిసారి ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటే, హైబ్రిడ్ ఫండ్స్ మంచి ఎంపిక అవుతాయి. ఇవి మూడింత రెండొంతులు పెట్టుబడులను ఈక్విటీలకు, మిగిలినది డెట్కు కేటాయిస్తుంటాయి. మార్కెట్ పతనాల్లో పెట్టుబడుల విలువ క్షీణతకు డెట్ పెట్టుబడులు కుషన్గా పనిచేస్తాయి. ప్రతి నెలా రూ.5,000 చొప్పున గత 20 ఏళ్ల నుంచి అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఆ మొత్తం రూ.51.25 లక్షలుగా మారి ఉండేది.అంటే వార్షిక సిప్ రాబడి 12.18 శాతం. ఒకవేళ పెట్టుబడుల్లో అనుభవం ఉండి, మార్కెట్ ఆటుపోట్లను తట్టుకునేట్టు అయితే ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ను పరిశీలించొచ్చు. ఈ పథకాలు పూర్తిగా ఈక్విటీల్లో.. అది కూడా లార్జ్, మిడ్, స్మాల్క్యాప్ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతుంటాయి. అధిక రిస్క్ తీసుకున్నప్పటికీ 20 ఏళ్ల కాలంలో చూస్తే ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్లో వార్షిక రాబడి 12.66 శాతమే ఉంది. కనుక ఇన్వెస్టర్లు తమ రిస్క్కు అనుగుణంగా ఎంపిక చేసుకోవాలి. ఒక మ్యూచువల్ ఫండ్ సంస్థ నుంచి పలు న్యూ ఫండ్ ఆఫర్లు (ఎన్ఎఫ్వోలు/కొత్త పథకాలు) ప్రారంభం కావడం చూశాను. అవి ఎంతో ఆకర్షణీయంగా అనిపించాయి. కానీ, ఇప్పటికే పెట్టుబడులకు అందుబాటులో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ పథకాల కంటే ఎన్ఎఫ్వోల్లో ఇన్వెస్ట్ చేయడం మెరుగైనదా? అన్న విషయంలో నాకు స్పష్టత లేదు. ఎన్ఎఫ్వోల్లో పెట్టుబడులు పెట్టే ముందు చూడాల్సిన అంశాలు ఏవి? – కరుణాకర్మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు తరచుగా కొత్త పథకాలను ప్రవేశపెడుతుంటాయి. ప్రస్తుత పథకాలతో పోల్చి చూస్తే వీటిల్లో ఉండే వ్యత్యాసం కొంతే. కొన్ని ఎన్ఎఫ్వోలు మాత్రం కొత్త పెట్టుబడుల అవకాశాలతో ముందుకు వస్తుంటాయి. ఇన్వెస్టర్లు ఇప్పటికే మంచి పనితీరు చూపిస్తున్న పథకాలకు పరిమితం కావడం మంచిది. ఎన్ఎఫ్వోల్లో ఇన్వెస్ట్ చేసే ముందుకు ప్రశ్నించుకోవాల్సిన అంశాలు చూద్దాం. ఎన్ఎఫ్వోలో కొత్తదనం ఏదైనా ఉందా? అన్నది చూడాలి. చాలా ఎన్ఎఫ్వోలు ప్రస్తుత పథకాలకు మాస్క్ మాదిరిగా ఉంటాయి. ఇంటర్నేషనల్ ఈక్విటీ, గోల్డ్ ఫండ్స్ తదితర వినూత్నమైన ఆఫర్లు మినహా సాధారణమైన ఎన్ఎఫ్వోలతో పోర్ట్ఫోలియోకు అదనంగా ఒనగూడే ప్రయోజనం ఏదీ ఉండదు. థీమ్ లేదా సెక్టార్ ఫండ్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సంబంధిత ఎన్ఎఫ్వో తమ పెట్టుబడుల అవసరాలను తీర్చే విధంగా ఉందా? అన్నది చూడాలి.మీ ప్రస్తుత పెట్టుబడులు మీ ఆర్థిక లక్ష్యాలను తీర్చే విధంగా ఉంటే, ఎన్ఎఫ్వో మెరుగైన ఆప్షన్ కాకపోవచ్చు. ప్రతీ ఫండ్ మీ పోర్ట్ఫోలియోలో చేరాలనేమీ లేదు. కొత్తగా వచ్చిన ఎన్ఎఫ్వో మాదిరిగా పెట్టుబడుల విధానాన్ని ఆఫర్ చేస్తున్న పథకాలు ఇప్పటికే ఏవైనా ఉన్నాయేమో పరిశీలించాలి. ఒకవేళ ఉంటే, వాటిల్లో రాబడుల పనితీరు కొన్నేళ్ల నుంచి మెరుగ్గా ఉందా? లేదా అన్నది పరిశీలించాలి.సమాధానాలు: ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
కొత్త ఫండ్ గురూ: సిల్వర్ ఈటీఎఫ్.. టాప్ 20.. ఫోకస్డ్ 25
పారిశ్రామిక కమోడిటీగాను, విలువైన లోహంగా పెట్టుబడికి అనువైన సాధనంగాను వెండి ద్విపాత్రాభినయం పోషిస్తోంది. ఇందులో ఇన్వెస్ట్ చేసేందుకు వీలు కల్పించేలా 360 వన్ అసెట్ మేనేజ్మెంట్ (గతంలో ఐఐఎఫ్ఎల్ అసెట్ మేనేజ్మెంట్) సిల్వర్ ఈటీఎఫ్ను ఆవిష్కరించింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ మార్చి 20 వరకు అందుబాటులో ఉంటుంది. కనీసం రూ. 1,000 నుంచి ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది దేశీయంగా వెండి ధరలను ట్రాక్ చేస్తూ, దానికి అనుగుణమైన పనితీరు కనపరుస్తుందని సంస్థ సీఈవో రాఘవ్ అయ్యంగార్ తెలిపారు. వెండి ధరల కదలికలకు అనుగుణంగా దీర్ఘకాలిక సంపద సృష్టి, ఆదాయం కోరుకునే ఇన్వెస్టర్లకు అనువైనదిగా ఉంటుందని పేర్కొన్నారు. మొత్తం అసెట్స్లో 95 శాతాన్ని వెండి లేదా వెండి సంబంధిత సాధనాల్లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. హెచ్డీఎఫ్సీ ‘నిఫ్టీ టాప్ 20’ ఇండెక్స్ ఫండ్ హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ కొత్తగా నిఫ్టీ టాప్ 20 ఈక్వల్ వెయిట్ ఇండెక్స్ ఫండ్ను ప్రవేశపెట్టింది. ఇది మార్చి 21తో ముగుస్తుంది. సమాన వెయిటేజీ పెట్టుబడి విధానం ద్వారా దేశీ బ్లూ చిప్ కంపెనీల దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను, ప్రయోజనాలను అందిపుచ్చుకోవాలనుకునే ఇన్వెస్టర్లకు ఈ స్కీము అనువైనదిగా ఉంటుంది. ఒకే స్టాక్లో అధికంగా ఇన్వెస్ట్ చేయడం కాకుండా సమాన స్థాయిలో పెట్టుబడిని కేటాయించడం వల్ల రిస్కులు తగ్గించుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. వెయిటేజీ ప్రతి మూడు నెలలకోసారి మారుతుంది. కనీసం రూ. 100 నుంచి ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చని సంస్థ ఎండీ నవ్నీత్ మునోట్ తెలిపారు. బజాజ్ అలయంజ్ లైఫ్ ఫోకస్డ్ 25 ఫండ్ ప్రైవేట్ రంగ జీవిత బీమా సంస్థ బజాజ్ అలయంజ్ లైఫ్ తాజాగా ఫోకస్డ్ 25 ఫండ్ పేరిట న్యూ ఫండ్ ఆఫర్ను ప్రకటించింది. కంపెనీకి చెందిన యులిప్ పథకాలతో పాటు ఇది అందుబాటులో ఉంటుంది. వివిధ మార్కెట్ క్యాపిటలైజేషన్లవ్యాప్తంగా 25 వరకు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో పెట్టుబడి వృద్ధికి దోహదపడుతుంది. ఈ ఎన్ఎఫ్ఓ మార్చి 20 వరకు అందుబాటులో ఉంటుందని సీఎఫ్ఓ శ్రీనివాస్ రావు రావూరి తెలిపారు. -
క్లోజ్ అవుతున్న పోస్టాఫీస్ స్కీమ్..
ప్రజల్లో ఆర్థిక పొదుపును ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. సామాన్య ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా పోస్టాఫీసుల ద్వారా వీటిని అమలు చేస్తోంది. అలాంటి మంచి స్కీముల్లో మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎంఎస్ఎస్సీ) పథకం ఒకటి.మహిళల కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి ఇక చాలా తక్కువ రోజులే సమయం ఉంది. పోస్టాఫీస్ కింద నిర్వహించే ఎంఎస్ఎస్సీ పథకంలో పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీ మార్చి 31. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్లో పెట్టుబడి సమయాన్ని ప్రభుత్వం ఇంకా పొడిగించలేదు. ఇప్పటి వరకు ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయని మహిళలకు కొన్ని రోజులే సమయం ఉంది. ఈ నేపథ్యంలో దీని గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..మహిళలకు ప్రత్యేకంస్వాతంత్య్ర అమృత్ మహోత్సవ్ కింద భారత ప్రభుత్వం 2023 మార్చి 31న మహిళలు, బాలికల కోసం ఎంఎస్ఎస్సీ (మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్) పథకాన్ని ప్రారంభించింది. అయితే ఇది రెండు సంవత్సరాల కాలానికి అమలు చేస్తున్న స్వల్పకాలిక డిపాజిట్ స్కీమ్. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి వారికి ఆర్థిక స్వావలంబన కల్పించడమే ఈ పథకం లక్ష్యం.ఎంత వడ్డీ లభిస్తుంది?దేశంలోని ఏ మహిళ అయినా ఈ పథకంలో 2 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ స్కీమ్ కింద ఆకర్షణీయమైన వడ్డీ లభిస్తుంది. ఎంఎస్ఎస్సీ స్కీమ్పై 7.5% వార్షిక వడ్డీ చెల్లిస్తున్నారు. ఇది బ్యాంకులలో 2 సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇస్తున్న వడ్డీ కంటే ఎక్కువ. ఇది సురక్షితమైన పథకం ఎందుకంటే ఇది ప్రభుత్వమే నిర్వహిస్తుంది. దీని కింద పోస్టాఫీస్ లేదా రిజిస్టర్డ్ బ్యాంకుల్లో సులభంగా ఖాతా తెరవవచ్చు.పెట్టుబడి ఎంత పెట్టవచ్చు?మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకం కింద దేశంలో నివసించే ఏ మహిళ అయినా కనీసం రూ .1,000 నుంచి గరిష్టంగా రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. 2 సంవత్సరాల వ్యవధి తర్వాత, అసలు, వడ్డీ మొత్తం చెల్లిస్తారు. ఏదైనా అవసరం పడితే ఒక సంవత్సరం తరువాత డిపాజిట్ మొత్తంలో 40% వరకు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. తీవ్రమైన అనారోగ్యం లేదా ఖాతాదారు మరణం వంటి పరిస్థితులలో ఖాతాను ముందస్తుగా మూసివేయవచ్చు. డిపాజిటర్ 6 నెలల తర్వాత ఖాతాను మూసివేస్తే వడ్డీ రేటు తగ్గవచ్చు. -
విదేశీ ఆస్తులు, ఆదాయం చూపించలేదా..
మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. 2024 నవంబర్ 17 నుంచి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఓ ప్రచార కార్యక్రమం ప్రారంభించింది. ‘మీలో ఎవరైనా విదేశీ ఆస్తులు, విదేశీ ఆదాయాన్ని డిక్లేర్ చేశారా లేదా. ఒకవేళ చేయకపోతే వెంటనే చేయండి‘ అనేది దీని సారాంశం. సాధారణంగా ఐటీఆర్లు దాఖలు చేసినప్పుడు, ప్రతి అస్సెస్సీ ముఖ్యంగా రెసిడెంట్ స్టేటస్ గల వారు తమ ఆదాయాన్ని .. అంటే మనదేశంలో వచ్చిన ఆదాయంతో పాటు విదేశాల్లో వచ్చినదాన్ని కూడా చూపించాలి.నాన్ రెసిడెంట్లు కేవలం మన దేశంలో వచ్చిన ఆదాయాన్ని చూపిస్తే చాలు. విదేశాల్లోని ఆస్తులు, ఆదాయాలు డిక్లేర్ చేయక్కర్లేదు. పన్ను భారమనేది అస్సెస్సీ రెసిడెన్షియల్ స్టేటస్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు భారత్లో ఒక ఆర్థిక సంవత్సరంలో ఉన్న వ్యవధి 182 రోజులు లేదా అంతకన్నా ఎక్కువగా ఉంటే రెసిడెంట్ అవుతారు. లేకపోతే నాన్ రెసిడెంట్లవుతారు. ఈ వ్యవధిని లెక్కించడానికి పాస్పోర్ట్లోని పద్దులు, ఎంట్రీలను ప్రాతిపదికగా తీసుకుంటారు. వాటి ప్రకారం రోజులను లెక్కిస్తారు.సాధారణంగా మనందరం రెసిడెంట్లు అవుతాం. పిల్లలు విదేశాల్లో ఉద్యోగం చేస్తుండటం వల్ల వారు నాన్ రెసిడెంట్లు అవుతారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ స్టేటస్ను తప్పుగా పేర్కొనకూడదు. ఈ విషయాన్ని అందరికీ తెలియజేసేందుకు, అవగాహన కల్పించేందుకు, విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా తప్పులుంటే/తప్పులు జరిగితే సరిదిద్దుకోండి. మీ రిటర్నును రివైజ్ చేసుకోండి .. అని చెప్పారు. దీనిపై మెసేజీలు పంపారు. ఇవి రాగానే అందరూ ఉలిక్కిపడ్డారు.వెంటనే తమ స్టేటస్ని, ఆదాయాన్ని, ఆస్తుల వివరాలను చెక్ చేసుకున్నారు. 30,161 మంది అస్సెస్సీలు తమ తప్పులను సరి చేసుకున్నారు. వారి వారి ఆస్తులను (విదేశాల్లోనివి) డిక్లేర్ చేశారు. వీరిలో 24,678 మంది రివ్యూ చేసుకున్నారు. 5,483 మంది తమ రిటర్నులను రివైజ్ చేసుకున్నారు. దీనితో రూ. 29,208 కోట్ల విదేశీ ఆస్తులు అదనంగా ఉన్నట్లు బైటపడింది. వాటి ద్వారా అదనంగా రూ. 1,089 కోట్ల ఆదాయం బైటికొచ్చింది.అంతే కాకుండా 6,734 మంది వారి స్టేటస్ను రెసిడెంటు నుంచి నాన్ రెసిడెంటుగా మార్చుకున్నారు. ఇలాంటి ప్రచారం వల్ల ఎన్నో మంచి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అవగాహన, పారదర్శకత పెరుగుతోంది. నిబంధనలను పాటించడం (కాంప్లయెన్స్) పెరిగింది. కీలక వివరాలు తెలిశాయి. పన్నుల వసూళ్లు పెరిగాయి.కామన్ రిపోర్టింగ్ స్టాండర్డ్ (సీఆర్ఎస్) ద్వారా విదేశాల్లోని పన్ను అధికారుల నుంచి సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. అన్ని దేశాల నుంచి సమగ్రమైన సమాచారం వస్తోంది. అంతే కాకుండా విదేశీ ఖాతాల నుంచి సమాచారం వస్తోంది. పలు చోట్ల సెమినార్లు, వెబినార్లు నిర్వహించారు. కరపత్రాలు, బ్రోచర్లు పంచారు. సోషల్ మీడియా వాడుకున్నారు. ఇదంతా ఇప్పటివరకు స్నేహపూర్వకంగా జరుగుతోంది. ఇలాగే కొనసాగాలంటే, ‘వాళ్లు మన గురించి తెలుసుకుంటున్నారన్న విషయాన్ని‘ మనం అర్థం చేసుకుని మసలుకోవాలి.పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు. -
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ’ఛోటీ సిప్’.. రూ. 250 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు
సాక్షి, హైదరాబాద్: ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ తాజాగా ఛోటీ సిప్ను (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) ప్రారంభించింది. డెట్, సెక్టోరల్, థీమ్యాటిక్లాంటి కొన్ని ఫండ్స్కి తప్ప మిగతా అన్ని రకాల స్కీములకు ఇది అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. నెలవారీగా రూ. 250 నుంచి ఈ సిప్లో ఇన్వెస్ట్ చేయొచ్చు.కనీసం 60 వాయిదాలు కట్టాల్సి ఉంటుందని సంస్థ ఎండీ ఎ. బాలసుబ్రమణియన్ తెలిపారు. క్రమశిక్షణతో పెట్టుబడులు పెట్టే ధోరణిని అలవర్చుకునేందుకు ఈ విధానం తోడ్పడగలదని పేర్కొన్నారు. ఇందులో, ముందస్తుగా విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. -
శాలరీ అకౌంట్ ఉంటే ఇవన్నీ ఉన్నట్టే..
వివిధ సంస్థల్లో పనిచేసే చాలా మంది ఉద్యోగులకు శాలరీ అకౌంట్ ఉంటుంది. ఇది సాధారణ బ్యాంకు ఖాతా లాగే పనిచేస్తుంది. ఇందులో కంపెనీల యాజమాన్యాలు ప్రతి నెలా జీతాన్ని జమ చేస్తారు. ఈ డబ్బును ఖాతాదారులు ఉపసంహరించుకుంటారు.. లావాదేవీలు చేస్తారు.. ఖర్చులను నిర్వహిస్తారు. అయితే శాలరీ అకౌంట్ తో వచ్చే ఎక్స్ క్లూజివ్ బెనిఫిట్స్ ఏంటో తెలుసా? ఖాతా తెరిచే సమయంలో చాలా బ్యాంకులు ఈ ప్రయోజనాలను వెల్లడించవు.క్లాసిక్ శాలరీ అకౌంట్స్, వెల్త్ శాలరీ అకౌంట్స్, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్స్-శాలరీ, డిఫెన్స్ శాలరీ అకౌంట్స్ ఇలా వివిధ రకాల శాలరీ ఖాతాలను బ్యాంకులు అందిస్తున్నాయి. వీటిలో దాగిఉన్న ఆర్థిక ప్రయోజనాల గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.యాక్సిడెంటల్ డెత్, హెల్త్ ఇన్సూరెన్స్చాలా శాలరీ అకౌంట్లు యాక్సిడెంటల్ డెత్ కవర్ లేదా హెల్త్ ఇన్సూరెన్స్ ను అదనపు భద్రతా ఫీచర్ గా కలిగి ఉంటాయి. ఖాతాదారులకు, వారి కుటుంబాలకు ఆర్థిక రక్షణను అందిస్తాయి.రుణాలపై తక్కువ వడ్డీ రేట్లుశాలరీ అకౌంట్ హోల్డర్లకు బ్యాంకులు వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలపై ప్రిఫరెన్షియల్ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. దీనివల్ల రుణ కాలపరిమితిలో గణనీయమైన మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు.ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీఅత్యంత ఉపయోగకరమైన ప్రయోజనాలలో ఒకటి ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం. ఇది అత్యవసర పరిస్థితుల్లో మీ ఖాతా బ్యాలెన్స్ జీరో ఉన్నప్పటికీ కొంత డబ్బును ఉపసంహరించుకునే అవకాశం కల్పిస్తుంది.ప్రాధాన్య బ్యాంకింగ్ సేవలువేగవంతమైన ప్రాసెసింగ్, డెడికేటెడ్ కస్టమర్ సర్వీస్, ఎక్స్ క్లూజివ్ బ్యాంకింగ్ ఆఫర్లతో సహా అనేక బ్యాంకులు శాలరీ అకౌంట్ హోల్డర్లకు ప్రాధాన్యతా సేవలను అందిస్తున్నాయి.ఉచిత క్రెడిట్ కార్డులు, రివార్డులుబ్యాంకులు తరచుగా శాలరీ అకౌంట్లతో కాంప్లిమెంటరీ క్రెడిట్ కార్డులను అందిస్తాయి. వార్షిక రుసుమును మాఫీ చేస్తాయి. రివార్డ్ పాయింట్లు, క్యాష్ బ్యాక్, ప్రత్యేక డిస్కౌంట్లను అందిస్తాయి.ఆన్ లైన్ షాపింగ్ & డైనింగ్ డీల్స్శాలరీ అకౌంట్ హోల్డర్లకు ఆన్లైన్ షాపింగ్, డైనింగ్పై క్యాష్బ్యాక్ ఆఫర్లతో సహా ప్రత్యేక డిస్కౌంట్లు లభిస్తాయి. జీవనశైలి ఖర్చులను మరింత చౌకగా చేస్తాయి.ఉచిత డిజిటల్ లావాదేవీలుసాధారణ ఖాతాల మాదిరిగా కాకుండా, చాలా బ్యాంకులు శాలరీ ఖాతాదారులకు నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ ఛార్జీలను మాఫీ చేస్తాయి.ఫ్రీగా చెక్ బుక్, డెబిట్ కార్డులుశాలరీ అకౌంట్ కస్టమర్లకు చాలా వరకు బ్యాంకులు ఎటువంటి రుసుములు లేకుండా చెక్ బుక్ లు, డెబిట్ కార్డులను అందిస్తుంటాయి. ఇవి చిన్నపాటివే అయినా పునరావృతమయ్యేవి కాబట్టి ప్రయోజనం ఉంటుంది.ఉచిత ఏటీఎం లావాదేవీలుఅనేక బ్యాంకులు ప్రతి నెలా ఎక్కువ సంఖ్యలో ఉచిత ఏటీఎం ఉపసంహరణలను అనుమతిస్తాయి. దీంతో అదనపు ఛార్జీల గురించి ఆందోళన లేకుండా నగదును యాక్సెస్ చేసుకోవచ్చు.జీరో బ్యాలెన్స్ ఫెసిలిటీచాలా శాలరీ అకౌంట్లు జీరో బ్యాలెన్స్ ఫీచర్తో వస్తాయి. అంటే కనీస బ్యాలెన్స్ నిర్వహించాల్సిన అవసరం ఉండదు. ఇది సాధారణ సేవింగ్స్ ఖాతాలకు లేని ప్రయోజనం. -
EPFO: ఫ్రీగా రూ.7 లక్షల ఇన్సూరెన్స్
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO).. దేశంలోని అతిపెద్ద సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. సంఘటిత రంగంలోని ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్స్, పెన్షన్ పథకాల నిర్వహణ బాధ్యతను చూస్తుంది. అంతేకాకుండా ఈపీఎఫ్ఓలో చేరిన ఉద్యోగులకు ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (ఈడీఎల్ఐ) పథకం కింద రూ.7 లక్షల వరకు జీవిత బీమా కవరేజీ అందిస్తోంది. ఇందుకోసం ఉద్యోగులు ప్రీమియం కూడా చెల్లించాల్సిన పని లేదు. ఇది విలువైన ఆర్థిక రక్షణ అయినప్పటికీ చాలా మంది ఉద్యోగులకు దీని గురించి తెలియదు.ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మిస్లేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్, 1952 కింద ఈడీఎల్ఐ స్కీమ్ పనిచేస్తుంది. ఇది సంఘటిత రంగంలోని ఉద్యోగులకు జీవిత బీమా కవరేజీని నిర్ధారిస్తుంది. బీమా ప్రీమియం నామమాత్రంగా ఉంటుంది. ప్రతి ఉద్యోగికి నెలకు గరిష్టంగా రూ .75 ఛార్జీ ఉంటుంది. ఇది కూడా ఉద్యోగి చెల్లించనక్కర లేదు. వారు పనిచేసే యాజమాన్యాలే దీన్ని భరిస్తాయి.ఈడీఎల్ఐ స్కీమ్ ప్రత్యేకతలుఒక ఉద్యోగి తన సర్వీస్ కాలంలో మరణిస్తే, అతని చట్టబద్ధమైన నామినీ లేదా వారసులు బీమా సొమ్మును పొందడానికి అర్హులు. ప్రస్తుతం ఈ పథకం కింద కనీస రూ .2.5 లక్షలు, గరిష్టంగా రూ .7 లక్షలు మరణించిన ఉద్యోగి కుటుంబానికి చెల్లిస్తారు. గత 12 నెలల్లో ఉద్యోగి సగటు నెలవారీ జీతం ఆధారంగా తుది మొత్తాన్ని లెక్కిస్తారు.ఈపీఎఫ్ సభ్యులందరూ ఆటోమేటిక్గా ఈడీఎల్ఐ పథకానికి అర్హులవుతారు. మొత్తం ప్రీమియంను యాజమాన్యం భరిస్తుంది కాబట్టి ఉద్యోగులు ఎటువంటి అదనపు కంట్రిబ్యూషన్లు చేయాల్సిన అవసరం లేదు. ప్రీమియంను ఉద్యోగి ప్రాథమిక నెలవారీ వేతనంలో 0.5 శాతంగా లెక్కిస్తారు. ముఖ్యంగా, ఈ బీమా కవరేజీ స్వతంత్రంగా ఉంటుంది. అంటే ఉద్యోగి కలిగి ఉన్న ఇతర వ్యక్తిగత బీమా పాలసీలతో ఎటువంటి సంబంధం లేకుండా ఇది అమలవుతుంది.గతంలో ఈడీఎల్ఐ స్కీమ్ కింద గరిష్టంగా రూ.6 లక్షల బీమా చెల్లింపు ఉండేది. అయితే 2024 ఏప్రిల్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) ఈ మొత్తాన్ని సవరించి, కనీస చెల్లింపును రూ .2.5 లక్షలకు, గరిష్టంగా రూ .7 లక్షలకు పెంచింది. ఉద్యోగుల అకాల మరణం సంభవిస్తే వారి కుటుంబాలకు మరింత ఆర్థిక భద్రత కల్పించడమే ఈ పెంపు లక్ష్యం.క్లెయిమ్ ఎలా ఫైల్ చేయాలి?ఈడీఎల్ఐ స్కీమ్ కింద బీమా మొత్తాన్ని క్లెయిమ్ చేయడానికి, నామినీలు లేదా చట్టబద్ధమైన వారసులు ఫారం 5ఐఎఫ్తో పాటు ఉద్యోగి మరణ ధృవీకరణ పత్రం, నామినేషన్ రుజువు వంటి అవసరమైన పత్రాలను సమర్పించాలి. పూర్తి చేసిన క్లెయిమ్ ఫారమ్, సపోర్టింగ్ డాక్యుమెంట్లతో పాటు సంబంధిత ఈపీఎఫ్ఓ కార్యాలయంలో సమర్పించాలి. -
PMSGMBY: పూచీకత్తు లేకుండా రూ.2 లక్షల లోన్
ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లి యోజన (PMSGMBY) కింద ఇప్పటికే 10 లక్షల ఇళ్లకు సౌర విద్యుత్ అందించింది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఈ సంఖ్యను 20 లక్షలకు పెంచాలనే కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. 2027 నాటికి మొత్తం కోటి ఇళ్లకు సోలార్ విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.2024 ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన.. ఈ ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లి యోజన కింద 10 లక్షల ఇళ్లకు సోలార్ విద్యుత్ అందించడం జరిగిందని మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ 'ప్రహ్లాద్ జోషి' వెల్లడించారు.డాక్యుమెంట్స్ అవసరం లేకుండా రూ.2 లక్షల లోన్ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లి యోజన పథకం కింద.. ఇళ్లలో సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకోవడానికి 40 శాతం వరకు సబ్సిడీ అందిస్తారు. దీనికోసం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు 6.75 శాతం సబ్సిడీ వడ్డీ రేటుతో ఎలాంటి పూచీకత్తు అవసరం లేకుండా రూ. 2 లక్షల వరకు లోన్ అందిస్తాయి. ఇందులో రూ. 78,000 వరకు సబ్సిడీ లభిస్తుంది.ఏడాదికి 6.75 శాతం వడ్డీ రేటుతో.. రూ. 6 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. అయితే రూ. 2 లక్షల వరకు ఎలాంటి పూచీకత్తు అవసరం లేదు. సోలార్ ఏర్పాటు చేసుకోవడానికి అయ్యే మొత్తం ఖర్చులో 90 శాతం వరకు బ్యాంక్ ఫైనాన్సింగ్ సదుపాయం ఎంచుకోవచ్చు.ఎవరు అప్లై చేసుకోవచ్చు➤భారతీయ పౌరుడై ఉండాలి.➤సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకోవడానికి అనువైన పైకప్పు ఉన్న ఇంటిని కలిగి ఉండాలి.➤చెల్లుబాటు అయ్యే విద్యుత్ కనెక్షన్ ఉండాలి.➤ఇప్పటివరకు సౌర ఫలకాలను సంబంధించిన ఎలాంటి ఇతర సబ్సిడీలను పొంది ఉండకూడదు.ఇదీ చదవండి: కేంద్ర ప్రభుత్వ స్కీమ్.. వయోపరిమితి 60 ఏళ్లకు తగ్గింపు!ఎలా అప్లై చేసుకోవాలి?➤అధికారిక వెబ్సైట్ను ఓపెన్ చేసి, అక్కడే కనిపిస్తున్న కన్స్యూమర్ ట్యాబ్కి వెళ్లి, అందులో 'అప్లై నౌ' ఎంచుకోండి.➤లాగిన్ డ్రాప్డౌన్ మెనుని ఓపెన్ చేసి కూడా కన్స్యూమర్ లాగిన్ ఎంచుకోవచ్చు.➤మొబైల్ నెంబర్తో లాగిన్ అయి.. ద్రువీకరించండి. పేరు, రాష్ట్రం మరియు ఇతర వివరాలను అందించండి. ➤మీ ఈమెయిల్ ఐడీని ధ్రువీకరించిన తరువాత.. మీ ప్రొఫైల్ను సేవ్ చేయండి. ➤విక్రేత కోసం, మీ అవసరాన్ని బట్టి అవును లేదా కాదు సెలక్ట్ చేసుకోండి.➤'సోలార్ రూఫ్టాప్ కోసం అప్లై చేసుకోండి'పై క్లిక్ చేసి.. రాష్ట్రం, జిల్లా డిస్కామ్ వంటి ఇతర వివరాలను అందించండి.➤అన్ని పూర్తి చేసిన తరువాత విక్రేతను ఎంపిక చేసుకుని మీ బ్యాంక్ వివరాలను అందించండి.➤మీ సబ్సిడీ మంజూరైన తర్వాత సోలార్ ప్లాంట్ను ఏర్పాటు చేసుకోవచ్చు. -
కేంద్ర ప్రభుత్వ స్కీమ్: వయోపరిమితి 60 ఏళ్లకు తగ్గింపు!
భారత ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నెన్నో పథకాలను (స్కీమ్స్) అందిస్తోంది. ఇందులో సీనియర్ సిటిజన్ల ఆరోగ్యానికి సంబంధించిన స్కీమ్ 'ఆయుష్మాన్ భారత్' (Ayushman Bharat) కూడా ఉంది. దీని కవరేజికి మరింత విస్తరించడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.ఆయుష్మాన్ భారత్ పథకం కింద కవరేజీని విస్తృతం చేయడానికి, ఆయుష్మాన్ వే వందన కార్డు (Ayushman Vay Vandana Card) అర్హత వయస్సును 70 నుంచి 60 సంవత్సరాలకు తగ్గించాలని, ప్రతి కుటుంబానికి ఏటా అందించే ఆరోగ్య సంరక్షణ కవరేజీని పెంచాలని పార్లమెంటరీ కమిటీ సూచించింది. ఇది అమలులోకి వస్తే.. మరో 4.5 కోట్ల కుటుంబాలు ప్రయోజనం పొందుతాయి.ప్రస్తుతం భారతదేశంలో 40 శాతం కంటే ఎక్కువ మంది ప్రజలు ఆయుష్మాన్ భారత్ కింద్ ఆరోగ్య సౌకర్యాలను పొందుతున్నారు. కాగా ఇప్పుడు నిర్ణీత వయసును 70 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తే.. ఇది మరింత మంది వృద్దులకు ఉపయోగకరంగా ఉంటుందని.. పార్లమెంటరీ కమిటీ యోచిస్తోంది.ఇదీ చదవండి: డీఏ పెంపు ప్రకటన త్వరలో..: ఈ సారి ఎంతంటే?ఆయుష్మాన్ భారత్ ప్రయోజనాలను మరింత మందికి అందించడానికి వయసును తగ్గించడం మాత్రమే కాకుండా.. కవరేజికి కూడా పెంచాలని భావిస్తున్నారు. ఇదే జరిగితే ప్రస్తుతం రూ.5 లక్షలు ఉన్న కవరేజీ రూ.10 లక్షలకు చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న ఆయుష్మాన్ భారత్-ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB-PMJAY)లోని అంతరాలను కూడా పార్లమెంటరీ కమిటీ తన నివేదిక హైలైట్ చేసింది. -
ఈ చిన్న పని చేస్తే ఆధార్ కార్డులు భద్రం!
ప్రస్తుతం ఆధార్ కార్డుల దుర్వినియోగం, మోసాలు పెరిగిపోయాయి. మనకు తెలియకుండానే మన ఆధార్ కార్డులను దుర్వినియోగం చేస్తున్న సంఘనలు చూస్తున్నాం. డిజిటల్ భద్రతకు పెద్దపీట వేస్తున్న ఈ కాలంలో వ్యక్తిగత సమాచారాన్ని పరిరక్షించుకోవడం చాలా అవసరంగా మారింది.భారతదేశ ప్రత్యేక గుర్తింపు వ్యవస్థ అయిన ఆధార్లో వేలిముద్రలు, ఐరిస్ స్కాన్లు, ఫేసియల్ రికగ్నిషన్ వివరాలు వంటి సున్నితమైన బయోమెట్రిక్ డేటా ఉంటుంది. ఈ డేటాను ఇతరులు దుర్వినియోగం చేయకుండా రక్షించడానికి, యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) బయోమెట్రిక్ లాకింగ్ ఫీచర్ను అందిస్తోంది. దీని ద్వారా మీ ఆధార్ బయోమెట్రిక్స్ను ఆన్లైన్లో ఎలా లాక్ చేయాలో ఈ కథనంలో తెలుసుకుందాం.ఇలా లాక్ చేయండి..మీ ఆధార్ బయోమెట్రిక్స్ను లాక్ చేయడం అనేది యూఐడీఏఐ వెబ్సైట్, ఎంఆధార్ యాప్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా కూడా చేయవచ్చు.యూఐడీఏఐ వెబ్సైట్లో.. » యూఐడీఏఐ బయోమెట్రిక్ లాక్/అన్లాక్ పేజీని సందర్శించండి.» మీ 12 అంకెల ఆధార్ నంబర్, ప్రదర్శించిన భద్రతా కోడ్ను నమోదు చేయండి.» మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు వన్ టైమ్ పాస్వర్డ్ పొందడానికి "సెండ్ ఓటీపీ" పై క్లిక్ చేయండి.» ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.» "ఎనేబుల్ బయోమెట్రిక్ లాకింగ్" అనే ఆప్షన్ ఎంచుకోండి.» కన్ఫర్మ్ చేయండి. మీ బయోమెట్రిక్స్ విజయవంతంగా లాక్ అవుతాయి.ఎంఆధార్ యాప్ ద్వారా..» గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఎంఆధార్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోండి.» మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఉపయోగించి లాగిన్ అవ్వండి. 4 అంకెల పాస్వర్డ్ను సెట్ చేయండి.» మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీతో వెరిఫై చేయడం ద్వారా మీ ఆధార్ ప్రొఫైల్ను యాడ్ చేయండి.» "బయోమెట్రిక్ సెట్టింగ్స్" ఆప్షన్ కు నావిగేట్ చేయండి.» బయోమెట్రిక్ లాకింగ్ను ఎనేబుల్ చేయడానికి, కన్ఫర్మ్ చేయడానికి స్విచ్ ను టోగిల్ చేయండి.ఎస్ఎంఎస్ ద్వారా..» మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి GETOTP అని 1947కు ఎస్ఎమ్ఎస్ పంపండి.» రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది.» LOCKUID <ఆధార్ నంబర్> <ఓటీపీ> ఫార్మాట్ లో 1947 మరో ఎస్ఎంఎస్ పంపండి.» మీ బయోమెట్రిక్స్ లాక్ అయినట్లు సూచించే కన్ఫర్మేషన్ మెసేజ్ మీకు వస్తుంది.ఆధార్ బయోమెట్రిక్స్ లాక్ ఎందుకు ముఖ్యమంటే..» మీ బయోమెట్రిక్స్ ను లాక్ చేయడం వల్ల మీ వేలిముద్రలు, ఐరిస్ స్కాన్ లు, ఫేస్ రికగ్నిషన్ డేటాను మీ సమ్మతి లేకుండా ధ్రువీకరణ కోసం ఉపయోగించలేరు. ఇది గుర్తింపు (ఐడెంటిటీ) చోరీ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.» ఆర్థిక లావాదేవీలు లేదా సిమ్ కార్డు జారీ వంటి ఆధార్ లింక్డ్ సేవలకు అనధికారిక యాక్సెస్ మోసానికి దారితీస్తుంది. బయోమెట్రిక్స్ ను లాక్ చేయడం వల్ల అదనపు భద్రత లభిస్తుంది.» మీ బయోమెట్రిక్స్ ను లాక్ చేయడం ద్వారా, మీరు మీ వ్యక్తిగత డేటాను నియంత్రణలోకి తీసుకుంటారు. అనధికార ప్రయోజనాల కోసం దుర్వినియోగం కాకుండా చూసుకుంటారు.» ఒక వేళ మీరే మీ బయోమెట్రిక్స్ను ప్రామాణీకరణ కోసం ఉపయోగించాల్సి వస్తే, మీరు వాటిని అదే పద్ధతుల ద్వారా తాత్కాలికంగా అన్లాక్ చేయవచ్చు. తర్వాత ఇది దానంతటదే లాక్ అవుతుంది. -
సిబిల్ స్కోర్ అప్డేట్.. ఆర్బీఐ ఆరు నిబంధనలు
ఆర్థిక అవసరాలు నిత్యం పెరుగుతున్నాయి. వాటిని తీర్చుకునేందుకు చాలామంది రుణాలు తీసుకుంటున్నారు. ఆర్థిక సంస్థలు రుణాలపై విధించే వడ్డీరేట్లు కూడా భారీగా ఉన్నాయి. మంచి క్రెడిట్ స్కోరు సొంతం చేసుకుంటే తక్కువ వడ్డీకే రుణాలు పొందే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల ఆర్బీఐ కస్టమర్ల రుణ ప్రక్రియను సులభతరం చేయడానికి కొన్ని నిబంధనలు జారీ చేసింది. ఆర్బీఐ విడుదల చేసిన ఈ ఆరు నిబంధనలు వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉండనున్నాయి.సిబిల్ స్కోర్ అప్డేషన్లో మార్పులుఆర్బీఐ జారీ చేసిన నిబంధనల ప్రకారం క్రెడిట్ స్కోర్ 30 రోజులకు బదులుగా ప్రతి 15 రోజులకు అప్డేట్ అవుతుంది. ఈ నిబంధనలు 2025 జనవరి 1 నుంచే అమల్లోకి వచ్చాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ క్రెడిట్ స్కోర్ను వీలైనంత త్వరగా అప్డేట్ చేసుకోవాలని ఆర్బీఐ బ్యాంకులకు సూచించింది. దీనితో పాటు క్రెడిట్ సంస్థలు ప్రతి నెలా కస్టమర్ క్రెడిట్ సమాచారాన్ని సీఐసీ(చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్)కి తెలియజేయాలి.తనిఖీ చేస్తే సమాచారంబ్యాంకు లేదా ఎన్బీఎఫ్సీ ఖాతాదారుల క్రెడిట్ రిపోర్టును తనిఖీ చేసినప్పుడల్లా ఆయా సమాచారాన్ని కస్టమర్లకు పంపాలని ఆర్బీఐ అన్ని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు తెలిపింది. నిబంధనల ప్రకారం ఈ సమాచారాన్ని కస్టమర్లకు పంపడానికి ఎస్ఎంఎస్ లేదా ఇమెయిల్ ఉపయోగించవచ్చు.అభ్యర్థన తిరస్కరణకు కారణాన్ని తెలిపేలా..ఖాతాదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కస్టమర్ అభ్యర్థనలను బ్యాంకులు తిరస్కరించినట్లయితే దానికిగల కారణాన్ని వారికి చెప్పాలి. తద్వారా వినియోగదారులు వారి అభ్యర్థన ఎందుకు తిరస్కరించబడిందో తెలుసుకోవచ్చని, వారు దాన్ని సకాలంలో మెరుగుపరచవచ్చని ఆర్బీఐ తెలిపింది.ఉచిత క్రెడిట్ రిపోర్టులునిబంధనల ప్రకారం కస్టమర్లు తమ క్రెడిట్ హిస్టరీని సరిగ్గా తెలుసుకునేందుకు వీలుగా ఏడాదికి ఒకసారి క్రెడిట్ కంపెనీలకు ఉచితంగా పూర్తి క్రెడిట్ స్కోర్లను అందించాలి. ఇందుకోసం క్రెడిట్ కంపెనీలు తమ వెబ్సైట్లో ప్రత్యేకంగా లింక్ను డిస్ప్లే చేయాలి.నోడల్ అధికారి నియామకంఏదైనా బ్యాంక్ కస్టమర్ను డిఫాల్ట్గా ప్రకటించబోతున్నట్లయితే అంతకుముందు ఆర్థిక సంస్థలు ఆ విషయాన్ని సదరు వ్యక్తికి సమాచారం అందించాలి. ఇందుకోసం రుణాలు ఇచ్చిన సంస్థలు ఎస్ఎంఎస్/ ఈ-మెయిల్ ద్వారా ఖాతాదారులకు సమాచారాన్ని చేరవేయాలి. దీనితో పాటు బ్యాంకు లేదా రుణం ఇచ్చిన సంస్థలు నోడల్ అధికారిని (నోడల్ ఆఫీసర్) నియమించాలి. ఖాతాదారుల క్రెడిట్ స్కోర్కు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ఈ నోడల్ అధికారి పనిచేస్తారు.ఇదీ చదవండి: పాక్ రైల్వే విస్తీర్ణం ఎంతో తెలుసా..?త్వరితగతిన ఫిర్యాదుల పరిష్కారంఖాతాదారులకు ఏవైనా సమస్యలు ఉంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీకి ఫిర్యాదు చేయవచ్చు. ఈ కంపెనీలు 30 రోజుల్లోగా వినియోగదారుల సమస్యలను పరిష్కరించకపోతే రోజుకు రూ.100 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. -
‘పెట్టుబడుల కంటే ప్రధానమైనవి ఇవే..’ కామత్ సూచన
పర్సనల్ ఫైనాన్స్(Personal Finance) ప్రణాళికలు మెరుగ్గా ఉంటే భవిష్యత్తులో ఆర్థిక స్వతంత్రం సాధించవచ్చని అనుకుంటారు. దాన్ని సాధించేందుకు చాలామంది స్టాక్మార్కెట్ లేదా ఇతర పెట్టుబడి మార్గాలవైపు మొగ్గు చూపుతారు. కానీ జెరోధా స్టాక్ బ్రోకింగ్ కంపెనీ వ్యవస్థాపకుడు నితిన్ కామత్(Nitin Kamat) మాత్రం పర్సనల్ ఫైనాన్స్ కంటే ముఖ్యమైన అంశాలపై పెట్టుబడిదారులు దృష్టి సారించాలని సూచించారు. ఇటీవల కామత్ తన బ్లాగ్లో స్పందిస్తూ పర్సనల్ ఫైనాన్స్ కంటే ప్రతిఒక ఇన్వెస్టర్ తప్పకుండా తెలుసుకోవాల్సిన అంశాలేంటో తెలియజేశారు.‘మీరు చేసే పెట్టుబడులు దీర్ఘకాలంలో మంచి రాబడులు అందించే అవకాశం ఉంటుంది. అందుకోసం చాలామంది స్టాక్ మార్కెట్లు, ఇతర మార్గాలను ఎంచుకుంటున్నారు. కానీ కుటుంబంలో మీపై ఆదారపడినవారు ఉంటే ముందుగా మీరు పెట్టుబడుల కంటే జీవిత బీమాకే తీసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అదే మీ గొప్ప పెట్టుబడి ఆలోచనవుతుంది. మీ కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడం మీ ప్రాథమిక బాధ్యత. అది చాలా అవసరం కూడా’ అని కామత్ రాశారు.ఇదీ చదవండి: ఒకే వాహనం.. 14 కెమెరాలు, 9 రాడార్లు, 6 సెన్సార్లు‘మారుతున్న జీవన ప్రమాణాలు, ఆహార అలవాట్ల దృష్ట్యా మనుషుల ఆరోగ్య సంరక్షణ ఖర్చులు పెరుగుతూ, ఆయుర్దాయం తగ్గుతోంది. ఊహించని వైద్య ఖర్చులను నిర్వహించేలా తగినంత ఆరోగ్య బీమాను ఎంచుకోండి. మీపై ఆధారపడిన వారి ఆర్థిక అవసరాలకు అనుగుణంగా మంచి టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. మారుతున్న జీవన పరిస్థితులకు అనుగుణంగా కవరేజీని క్రమానుగతంగా పునఃసమీక్షించాలి. ఈ చర్యలు మీ కుటుంబానికి ఆర్థిక కష్టాల నుంచి కాపాడటమే కాకుండా మనశాంతిని అందిస్తాయి. ఫలితంగా పెట్టుబడిదారులు ఆత్మవిశ్వాసంతో తమ ఆర్థిక లక్ష్యాలను కొనసాగించడానికి ఈ విధానాలు వీలు కల్పిస్తాయి’ అని తెలిపారు.దీర్ఘకాలిక దృక్పథంతో పెట్టుబడులుమార్కెట్ కరెక్షన్ల సమయంలో క్రమానుగత పెట్టుబడి విధానం(సిప్)లను ఆపవద్దని కామత్ ఇన్వెస్టర్లకు సూచించారు. ‘మార్కెట్ క్షీణత భయపెట్టవచ్చు, కానీ అవి దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలను అందిస్తాయి’ అని తెలిపారు. క్రమశిక్షణతో ఉండటం, సిప్ కంట్రిబ్యూషన్లను నిర్వహించడం ద్వారా పెట్టుబడిదారులు దీర్ఘకాలంలో మంచి రాబడులు పొందవచ్చు. పెట్టుబడి పెట్టడానికి కంటే ముందుకు ప్రతిఒక్కరు విధిగా జీవిత, ఆరోగ్య బీమాలు తీసుకోవాలని కామత్ కోరారు. -
ఇక యూపీఐ, రూపే లావాదేవీలపై ఛార్జీలు..
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI), రూపే డెబిట్ కార్డుల ద్వారా నిర్వహించే లావాదేవీలపై మర్చెంట్ ఫీజులను తిరిగి తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. ఈ మేరకు బ్యాంకింగ్ సమాఖ్య పంపిన ప్రతిపాదనలకు కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.ప్రస్తుతం ఈ లావాదేవీలపైన ఎటువంటి అదనపు ఛార్జీలు లేవు. అయితే వార్షిక ఆదాయం రూ. 40 లక్షల కంటే ఎక్కువ ఉన్న వ్యాపారుల యూపీఐ చెల్లింపుల మీద 'మర్చెంట్ డిస్కౌంట్ రేట్' (MDR)ను మళ్ళీ తీసుకురావాలని ప్రతిపాదిస్తూ బ్యాంకింగ్ ఇండస్ట్రీ ప్రతినిధులు కేంద్రానికి పంపించారు. దీనిపై కేంద్రం కూడా సానుకూలంగా స్పందించడంతో.. ఇది త్వరలోనే అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే వీసా కార్డు, మాస్టర్ కార్డు వంటి డెబిట్ కార్డులు.. క్రెడిట్ కార్డుల లావాదేవీలపై మర్చెంట్ డిస్కౌంట్ రేట్ చెల్లిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వారు యూపీఐ, రూపే డెబిట్ కార్డుల లావాదేవీలపై కూడా ఛార్జీలు ఎందుకు చెల్లించకూడదు?. ఈ విషయాన్ని కేంద్రం అలోచించి సానుకూలంగా స్పందించింది. అయితే వార్షిక ఆదాయం రూ. 40 లక్షల కంటే తక్కువ ఉన్నవారు ఈ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడంలో భాగంగా.. ప్రభుత్వం 2022 బడ్జెట్లో ఎండీఆర్ చార్జీలను తొలగిస్తున్నట్లు వెల్లడించారు. అప్పటి వరకు వ్యాపారుల లావాదేవీ మొత్తంలో ఒక శాతం కంటే తక్కువ ఛార్జీ వసూలు చేసేవారు. తరువాత ఈ ప్రాసెసింగ్ ఖర్చులను భర్తీ చేయడానికి బ్యాంకులు, ఫిన్టెక్ కంపెనీలకు కేంద్రం సబ్సిడీలు ఇస్తూ వచ్చింది. అయితే ఈ సబ్సిడీ కూడా ఈ ఏడాది రూ. 3,500 కోట్ల నుంచి రూ. 437 కోట్లకు తగ్గింది. ఇప్పుడు మళ్ళీ ఛార్జీలు వసూలు చేయడానికి కేంద్రం గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసింది.ఇదీ చదవండి: దిగొచ్చిన బంగారం.. మరోసారి తగ్గిన రేటుఇటీవల కొత్తగా నియమితులైన ఆర్బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రాతో జరిగిన సమావేశంలో ఫిన్టెక్ అధికారులు డిజిటల్ చెల్లింపులపై ఎండీఆర్ అంశాన్ని లేవనెత్తారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) డేటా ప్రకారం, ఫిబ్రవరి 2025లో యూపీఐ లావాదేవీల మొత్తం 16.11 బిలియన్ డాలర్లు అని తెలుస్తోంది. -
మహిళలకూ కావాలి సమగ్ర బీమా
సంరక్షకులుగా, కుమార్తెలుగా, మాతృమూర్తులుగా తమ కుటుంబాల సంక్షేమం కోసం మహిళలు సమాజంలో ఎంతో కీలకమైన, వైవిధ్యమైన పాత్రలు పోషిస్తుంటారు. అయితే ఈ బాధ్యతలను నిర్వర్తించడంలో వారు సాధారణంగానే తమ సొంత ఆర్థిక, వైద్య భద్రత విషయాలను అంతగా పట్టించుకోరు. అందుకే చాలా మంది మహిళలకు తగినంత బీమా భద్రత లేకపోవడమో లేదా పూర్తిగా తమ జీవిత భాగస్వామి లేదా బంధువు బీమాపైనో ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటోంది. జీవిత కాలం ఎక్కువగా ఉండటం, కెరియర్లో అంతరాయాలు, భారీ ఆరోగ్య సంరక్షణ ఖర్చుల్లాంటి ప్రత్యేక ఆరోగ్య, ఆర్థిక సవాళ్లెన్నో మహిళలకు ఉంటాయి. అందుకే వారి స్వాతంత్య్రానికి, స్థిరత్వానికి తగినంత బీమా రక్షణ ఉండటం ఎంతో అవసరం.కీలకంగా బీమా ..సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువ కాలం జీవించినప్పటికీ, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక పరిమితుల కారణంగా సుదీర్ఘ కాలం పాటు మెరుగైన జీవితాన్ని గడిపే అవకాశం ఉండకపోవచ్చు. సమగ్రమైన బీమా కవరేజీ ఉంటే సముచితమైన ఆరోగ్య సంరక్షణ పొందడానికి అవకాశాలు గణనీయంగా మెరుగుపడగలవు. 2023, 2024 మధ్య కాలంలో చూస్తే 15 నుంచి 49 ఏళ్ల వరకు వయస్సున్న మహిళల్లో 30 శాతం మందికి ఎటువంటి ఆరోగ్య బీమా గానీ ఆర్థిక రక్షణ కవచం గానీ లేదని వెల్లడైంది. ఇలా చాలా మంది మహిళలు తమ సొంత అవసరాలను పక్కన పెట్టి కుటుంబ అవసరాలకే ప్రాధాన్యమిస్తుంటారు. ఆర్థిక పరిమితుల వల్ల నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను పొందలేకపోతుంటారు.మెటర్నిటీ, కుటుంబ భద్రతప్రసవానికి పూర్వ పరీక్షలు, ప్రసవ వ్యయాలు, ప్రసవానంతర సంరక్షణ, నవజాత శిశువుల వైద్య అవసరాలకు అవసరమైన కీలక ఆర్థిక సహాయాన్ని మెటర్నిటీ ఇన్సూరెన్స్ అందిస్తుంది. పిల్లల కోసం సన్నద్ధమవుతున్న యువ జంటలకు ఇలాంటి పాలసీలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. శిశుజననం, సంబంధిత ఖర్చుల విషయంలో ఆర్థికంగా సన్నద్ధంగా ఉండేందుకు ఇవి సహాయకరంగా ఉంటాయి. చాలా మంది మహిళలు సాధారణంగా ఉద్యోగాలు చేసే సంస్థ ఇచ్చే బీమాపైనో లేదా జీవిత భాగస్వామి బీమాపైనో ఆధారపడుతుంటారు. కానీ సొంతంగా పాలసీ ఉంటే మరింత ఆర్థిక భద్రత ఉంటుంది. కెరియర్ మార్పుల వల్ల లేదా జీవితంలో మార్పుల వల్ల కవరేజీపై ప్రభావం పడే పరిస్థితుల్లో ఇదెంతో అండగా ఉంటుంది.రిటైర్మెంట్, దీర్ఘకాలిక సంరక్షణ ప్రణాళికమహిళలు సాధారణంగా పెద్ద వయస్సులోని బంధువుల బాగోగులను చూసుకునే సంరక్షకుల పాత్రను కూడా పోషిస్తూ ఉంటారు. ఇది భావోద్వేగాలపరంగా, ఆర్థికంగా భారంగా ఉండొచ్చు. దీర్ఘకాలిక సంరక్షణ బీమా అనేది వైద్య వ్యయాలను, ఆర్థిక ఒత్తిళ్లను అధిగమించేందుకు ఉపయోగపడుతుంది. సంరక్షకులు అలాగే వారిపై ఆధారపడిన వారికి కూడా మెరుగైన సహాయం లభించేలా తోడ్పడుతుంది. అంతేగాకుండా, జీవిత కాలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రిటైర్మెంట్ త ర్వాత కూడా స్థిరమైన, మెరుగైన జీవితాన్ని సాగించేలా మహిళలు పెన్షన్ ప్లాన్లు లేదా యాన్యుటీ ఆధారిత బీమా పాలసీలను తప్పక పరిశీలించాలి.వైకల్యం, ఆదాయ భద్రతపిల్లల సంరక్షణ కోసం కావచ్చు లేదా వయస్సు పైబడుతున్న తల్లిదండ్రుల సంరక్షణ కోసం కావచ్చు చాలా మంది మహిళలకు కెరియర్లో అంతరాయాలు ఏర్పడుతుంటాయి. దీనితో వారు పని చేసే కంపెనీల నుంచి బీమా ప్రయోజనాలు పరిమితంగానే ఉండొచ్చు. అలాగే దీర్ఘకాలిక పొదుపు కూడా తగ్గుతుంది. అనారోగ్యం లేదా ప్రమాదం బారిన పడి పని చేసే పరిస్థితి లేనప్పుడు కూడా స్థిరమైన ఆదాయం లభించేలా డిజేబిలిటీ ఇన్సూరెన్స్ అనేది ఆర్థిక భద్రతను అందిస్తుంది. జీవితపు అనిశ్చితుల్లోనూ ఆర్థిక భద్రత ఉండేందుకు ఈ రక్షణ ఉపయోగపడుతుంది.స్థిరమైన భవిష్యత్తుకు రక్షణ కవచంమహిళలు తమ ఆర్థిక స్వతంత్రత, ఆరోగ్య సంరక్షణ భద్రతకు తప్పక ప్రాధాన్యమివ్వాలి. వీలైనంత ముందుగా సమగ్ర బీమా పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల, అనూహ్య ఆర్థిక కష్టాల నుంచి రక్షణను, దీర్ఘకాలికంగా స్థిరత్వాన్ని పొందేందుకు వీలవుతుంది. క్రియాశీలకమైన చర్యలు తీసుకోవడం ద్వారా అనుకోని సవాళ్ల నుంచి మహిళలు తమను, తమ కుటుంబాలను రక్షించుకోవచ్చు.స్వతంత్రంగా నిర్ణయాలుతొలినాళ్లలోనే బీమా పాలసీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మహిళలు ఆర్థిక ప్రణాళికల విషయంలో క్రియాశీలకంగా వ్యవహరించాలి. చిన్న వయస్సులోనే బీమా తీసుకోవడం వల్ల ప్రీమియంల భారం తక్కువగా ఉంటుంది. అలాగే ప్రీ–ఎగ్జిస్టింగ్ కండీషన్స్కి సంబంధించిన ఎక్స్క్లూజన్స్ కూడా తగ్గుతాయి. యుక్తవయస్సులోని చాలా యువతులకు తమ తల్లిదండ్రుల హెల్త్ ఇన్సూరెన్స్తో కవరేజీ లభిస్తుంది. అయితే, స్వతంత్ర పాలసీకి మారడం వల్ల, డిపెండెంట్ కవరేజీ వయో పరిమితిని దాటిన తర్వాత కూడా నిరంతరాయ కవరేజీ, అదనపు ప్రయోజనాలను పొందవచ్చు.ఇదీ చదవండి: ఈటీఎఫ్లు–ఇండెక్స్ ఫండ్స్ మధ్య వ్యత్యాసం?స్మార్ట్ ఆర్థిక ప్రణాళికఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ, 80డీ కింద జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీలకు పన్ను ప్రయోజనాలు ఉంటాయి. ఆ రకంగా చూస్తే ఇవి ఆర్థికంగా స్మార్ట్ పెట్టుబడి సాధనాలుగా కూడా ఉంటాయి. వీలైనంత ముందుగా ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టిన మహిళలకు తక్కువ ప్రీమియంలతో ఎక్కువ కవరేజీ, తద్వారా దీర్ఘకాలం పాటు ఆర్థిక భద్రత ప్రయోజనాలు లభిస్తాయి. మెటర్నిటీ కేర్, డెలివరీ, ఫెర్టిలిటీ చికిత్సలు సహా మహిళలకు సంబంధించిన ప్రత్యేకమైన ఆరోగ్యసంరక్షణ అవసరాలను తీర్చే విధంగా బీమా పాలసీలు ఉంటాయి. మూడేళ్ల పాటు లైఫ్ కవరేజీ సహా సరోగేట్ తల్లులకు పూర్తి కవరేజీ ఉండాలని బీమా రంగ నియంత్రణ మరియు అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) నిర్దేశిస్తోంది.-అమితాబ్ జైన్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ -
మీ బ్యాంక్ డిపాజిట్ ఎంత భద్రం?
ముంబైకి చెందిన ధన్రాజ్ (50) ఉదయం నిద్రలేచి, పేపర్ చూడగానే ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాడు. న్యూ ఇండియా సహకార బ్యాంక్లో స్కామ్ జరిగిందనేది ఆ వార్త సారాంశం. చిరుద్యోగి అయిన ధన్రాజ్ తన కుమార్తె వివాహం కోసమని రూ.4 లక్షలను అదే బ్యాంక్లో కొన్నాళ్ల క్రితం డిపాజిట్ చేశాడు. కంగారుగా బ్యాంక్ శాఖకు చేరుకుని విచారించగా, డిపాజిట్లకు ఢోకా లేదన్న సమాచారం విని కాస్తంత కుదుటపడ్డాడు. రూ.5 లక్షల వరకు డిపాజిట్లపై బీమా సదుపాయం ఉంటుందని కస్టమర్లు చెప్పుకుంటుండగా విని.. హమ్మయ్య అని ఊపిరిపీల్చుకున్నాడు. బ్యాంక్ డిపాజిట్.. దేశంలో చాలా మందికి తెలిసిన, ఇష్టమైన పెట్టుబడి సాధనం. చాలా మంది తమ పొదుపు సొమ్మును డిపాజిట్ రూపంలో మదుపు చేయడం కూడా చూస్తుంటాం. కానీ, ఇందులో ఉండే రిస్క్ ల గురించి అవగాహన ఉండదు. డిపాజిటర్లు అందరూ దీనిపై ఓసారి దృష్టి సారించాల్సిన అవసరాన్ని న్యూ ఇండియా కో ఆపరేటివ్ బ్యాంక్ ఉదంతం గుర్తు చేస్తోంది. ఒకప్పుడు ప్రతి కుటుంబ ఆర్థిక సాధనాల్లో బ్యాంక్ డిపాజట్ (ఎఫ్డీ) తప్పకుండా ఉండేది. కాలక్రమంలో ఇతర సాధనాల పట్ల ఆసక్తి పెరుగుతూ వస్తోంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ ఈటీఎఫ్లు తదితర వాటిల్లో పెట్టుబడులు పెరుగుతూ, డిపాజిట్లు తగ్గుతున్నాయి. ఇప్పటికీ 15 శాతం గృహ పొదుపులు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లలోకే (ఎఫ్డీలు/టర్మ్ డిపాజిట్లు) వెళుతున్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఎఫ్డీలు ఎంతో మందికి నమ్మకమైన, మెరుగైన సాధనం. దీర్ఘకాలంలో గొప్ప రాబడి రాకపోయినా సరే, అత్యవసరంలో వేగంగా వెనక్కి తీసుకునేందుకు అనుకూలంగా ఉండడం చాలా మందికి నచ్చే అంశం. పైగా డిపాజిట్ అంటే ఏ మాత్రం రిస్క్ ఉండదని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. ప్రభుత్వ గ్యారంటీ (సావరీన్) ఉంటే తప్పించి, బ్యాంక్ ఎఫ్డీ అయినా, ఏ ఇతర పెట్టుబడి సాధనంలో అయినా ఎంతో కొంత రిస్క్ ఉంటుంది. దీనిపట్ల ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం. మెరుగైన నియంత్రణలు ఎఫ్డీ ఎంతో ప్రాచుర్యానికి నోచుకోవడం వెనుక అందులోని సరళత్వం, భద్రత కీలకమని చెప్పుకోవాలి. ఏవో కొన్ని బ్యాంకు వైఫల్యాలను పక్కన పెడితే, మన దేశంలో బ్యాంకింగ్ రంగం పటిష్ట నియంత్రణల మధ్య కొనసాగుతుంటుంది. ప్రజల్లో నమ్మకం ఏర్పడడానికి ఇది కూడా ఒక కారణం. బ్యాంక్ యాజమన్యాలు/ఉద్యోగుల మోసపూరిత వ్యవహారం, రుణ వ్యాపారంలో దూకుడైన తీరు కొన్ని సందర్భాల్లో సమస్యలు, సంక్షోభాలకు దారితీయవచ్చు. ఎంత కట్టుదిట్టమైన నియంత్రణలు ఉన్నా కానీ, 2019లో పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంక్, 2020లో యస్ బ్యాంక్, ఇప్పుడు న్యూ ఇండియా కోపరేటివ్ బ్యాంక్ సంక్షోభాలు చోటుచేసుకున్నాయి. అంతకుముందు గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ కరాడ్ ఉదంతాలూ గుర్తుండే ఉంటాయి. కనుక బ్యాంక్ డిపాజిట్లలోనూ రిస్క్ ఉంటుందని అర్థం చేసుకోవాలి. కాకపోతే మనదగ్గర ఆర్బీఐ పటిష్ట నియంత్రణల కారణంగా ఈ తరహా సంక్షోభాలు చాలా తక్కువగా కనిపిస్తుంటాయి.డిపాజిట్పై బీమా ఆర్బీఐ నియంత్రణ పరిధిలోని అన్ని బ్యాంకుల్లోనూ రూ.5 లక్షల వరకు డిపాజిట్కు బీమా రక్షణ ఉంటుంది. అసలు లేదా అసలుతోపాటు వడ్డీ కలుపుకుని రూ.5 లక్షలకు మించి ఉన్నప్పటికీ బీమా రూ.5 లక్షలకే పరిమితం. బ్యాంక్ ఏదైనా సంక్షోభం పాలైతే అప్పుడు ఒక్కో డిపాజిట్ దారుడికి గరిష్టంగా రూ.5 లక్షలు వెనక్కి వస్తాయి. సేవింగ్స్, ఫిక్స్డ్, కరెంట్, రికరింగ్ ఇలా అన్ని డిపాజిట్లకూ ఈ రక్షణ వర్తిస్తుంది. ఈ వ్యవహారం అంతా చూసేది ఆర్బీఐ అనుబంధ సంస్థ అయిన ‘డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ (డీఐసీజీసీ). ప్రతి రూ.100 డిపాజిట్పై రూ.12 పైసలు చొప్పున ప్రీమియం కింద బ్యాంక్లు డీఐసీజీసీకి చెల్లించాల్సి ఉంటుంది. ఒక బ్యాంక్కు చెందిన ఒకటికి మించిన శాఖలో డిపాజిట్లు ఉన్నప్పటికీ.. ఒక్కో ఖాతాదారుని పేరు మీద గరిష్ట బీమా రూ.5 లక్షలుగానే ఉంటుంది. కనుక ఒక బ్యాంక్లో రూ.5 లక్షలకు మించి చేసే డిపాజిట్పై కచ్చితంగా రిస్క్ ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఒక వ్యక్తి వేర్వేరు బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తే.. అప్పుడు విడిగా ఒక్కో బ్యాంక్ పరిధిలో సంబంధిత వ్యక్తికి గరిష్టంగా రూ.5 లక్షల డిపాజిట్కు బీమా రక్షణ వర్తిస్తుంది.బ్యాంక్ కుదుటపడితే.. బ్యాంకులో మోసం కావచ్చు. లేదా లిక్విడిటీ సంక్షోభం తలెత్తవచ్చు. రుణ ఎగవేతలతో క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్లిపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఆర్బీఐ తప్పకుండా జోక్యం చేసుకుంటుంది. తాత్కాలిక నిర్వహణ బాధ్యతల కోసం బోర్డ్ను ఏర్పాటు చేస్తుంది. బ్యాంక్ వ్యవహారాలను లోతుగా పరిశీలించి, చక్కదిద్దే వరకు డిపాజిట్ల ఉపసంహరణపై పూర్తిగా లేదా పాక్షికంగా ఆంక్షలు విధిస్తుంది. పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంక్లో రుణ అవకతవకలు సంక్షోభానికి దారితీయగా, ఆర్బీఐ దాన్ని చక్కదిద్దింది. అది ఇప్పుడు యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో భాగం అయింది. యస్ బ్యాంక్లోనూ రుణ మోసాలు బయటపడగా, కొత్త బోర్డ్ను ఏర్పాటు చేసి గాడిన పెట్టింది. రూ.5 లక్షలకు పైగా డిపాజిట్లు కలిగిన వారు.., రూ.5 లక్షలకు పైబడిన మొత్తాన్ని తిరిగి పొందడం కోసం బ్యాంక్ గాడిన పడే వరకు వేచి చూడాల్సిందే. అప్పటికీ పూర్తి మొత్తం వెనక్కి వస్తుందన్న గ్యారంటీ ఉండదు. ఎంత కోత పడుతుందన్నది బ్యాంక్ ఆర్థిక పద్దుల ఆరోగ్యంపైనే ఆధారపడి ఉంటుంది.బ్యాంకు నుంచే చెల్లింపులు బ్యాంక్లో సమస్య తలెత్తినప్పుడు డిపాజిట్దారులు డీఐసీజీసీని సంప్రదించాల్సిన అవసరం ఉండదు. బ్యాంక్ నిర్వహణ బాధ్యతలు చూసే బోర్డ్.. డిపాజిట్దారుల వివరాలతో జాబితాను డీఐసీజీసీకి పంపిస్తుంది. ఆ వివరాల వాస్తవికతను 30 రోజుల్లోపు డీఐసీజీసీ తేల్చాలి. అక్కడి నుంచి 15 రోజుల్లోపు డిపాజిట్దారులకు చెల్లించాల్సిన బీమా మొత్తాన్ని బ్యాంక్కు డీఐసీజీసీ బదిలీ చేస్తుంది. అప్పుడు ఖాతాదారులకు బ్యాంక్ సిబ్బంది చెల్లింపులు చేస్తారు. బ్యాంక్పై ఆంక్షలు విధించిన నాటి నుంచి 90 రోజుల్లో డిపాజిట్దారులకు బీమా మొత్తం వెనక్కి చెల్లించాలని నిబంధనలు చెబుతున్నాయి. విచారించుకున్న తర్వాతే.. ఆర్బీఐ పరిధిలోని అన్ని బ్యాంక్లు తప్పనిసరిగా డీఐసీజీసీ పరిధిలోకి వస్తాయి. అవి డిపాజిట్లపై బీమా ప్రీమియం కచ్చితంగా చెల్లించాల్సిందే. సందేహం ఉంటే డిపాజిట్ చేసే ముందు బ్యాంక్ అధికారిని అడిగి బీమా ఉందా? అని నిర్ధారించుకోవచ్చు. అన్ని ప్రభుత్వరంగ బ్యాంక్లు, ప్రైవేటు షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంక్లు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లు, భారత్లో కార్యకలాపాలు నిర్వహించే విదేశీ బ్యాంక్లు, కో ఆపరేటివ్ బ్యాంక్లు, లోకల్ ఏరియా బ్యాంక్లు, రీజినల్ రూరల్ బ్యాంక్లు, పేమెంట్స్ బ్యాంక్లు, స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్లు, అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్లు డీఐసీజీసీ పరిధిలోకి వస్తాయి. ప్రైమరీ కో ఆపరేటివ్ సొసైటీలు మాత్రం దీని కిందికి రావు.అధిక వడ్డీ రేట్లు.. అన్నీ చూసాకే ప్రభుత్వరంగ బ్యాంక్లు, ప్రైవేటు యూనివర్సల్ బ్యాంకులతో పోల్చితే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తుంటాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు రుణాలపై అధిక రేట్లను చార్జ్ చేస్తుంటాయి. కనుక అవి డిపాజిట్లను ఆకర్షించేందుకు ఎక్కువ రేట్లను ఇస్తుంటాయి. ఏ బ్యాంక్ అయినా సరే అధిక వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తుంటే, అందులో ఇన్వెస్ట్ చేసే ముందు ఈ రేషియోలను ఒక్కసారి పరిశీలించడం మంచిది. సీఆర్ఏఆర్: క్యాపిటల్ టు రిస్క్ అస్సెట్ రేషియో అని, దీన్నే క్యాపిటల్ అడెక్వెసీ రేషియో అని కూడా అంటారు. ప్రభుత్వరంగ బ్యాంక్లకు ఇది కనీసం 12 శాతంగా, ప్రైవేటు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్లకు 9 శాతం మేర ఉండాలి. అదే స్మాల్ ఫైనాన్స్బ్యాంక్లకు 15 శాతం ఉండాలి. బ్యాంక్ తనకు ఎదురయ్యే చెల్లింపుల బాధ్యతలను ఎంత సమర్థంగా ఎదుర్కోగలదన్నది ఇది తెలియజేస్తుంది. ఎల్సీఆర్: లిక్విడిటీ కవరేజీ రేషియో 100 శాతం ఉండాలి. 30 రోజుల అవసరాలకు సరిపడా నిధులు బ్యాంకుల వద్ద ఉంచడం కోసం ఈ నిబంధన. దీనివల్ల లిక్విడిటీ షాక్లను బ్యాంక్లు సమర్థంగా ఎదుర్కోగలవు. అసలు రాబడి ఎంత? అత్యవసర నిధిని అట్టి పెట్టుకునేందుకు, స్వల్పకాలిక అవసరాలకు ఉద్దేశించిన నిధులను బ్యాంక్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేసుకుంటానంటే ఫర్వాలేదు. కానీ, దీర్ఘకాల లక్ష్యాల కోసం నిధిని సమకూర్చుకునేందుకు, సంపద సృష్టికి బ్యాంక్ డిపాజిట్ మెరుగైన సాధనం కాబోదు. ఈక్విటీలపై దీర్ఘకాలంలో 12 శాతం, బంగారంలో 8 శాతం మేర సగటు రాబడి ఉంటోంది. ఈక్విటీ, బంగారంలో పెట్టుబడిని విక్రయించినప్పుడే లాభాలపై పన్ను చెల్లిస్తే సరిపోతుంది. బ్యాంక్ డిపాజిట్లపై అలా కాదు. ప్రతి ఏటా ఆర్జించే వడ్డీ రాబడి అదే ఏడాది ఇన్వెస్టర్ వార్షిక ఆదాయానికి కలిపి చూపించాలి. అవసరమైతే పన్ను చెల్లించాలి. ఎఫ్డీ రాబడిపై పన్ను చెల్లించగా, మిగిలే నికర రాబడి ద్రవ్యోల్బణ స్థాయిలోనే ఉంటుంది. కనుక డిపాజిట్లలో కాంపౌండింగ్ ప్రయోజనం పెద్దగా ఉండదు.బీమా మరింత పెంచేనా..? 2019లో పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంక్లో సంక్షోభం తలెత్తిన తర్వాతే.. డిపాజిట్లపై రూ.లక్షగా ఉన్న బీమా పరిమితిని 2020 ఫిబ్రవరిలో రూ.5 లక్షలకు పెంచారు. ఈ బీమా రక్షణను మరింత పెంచాలన్న ప్రతిపాదన పరిశీలనలో ఉందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎం.నాగరాజు ఇటీవల చేసిన ప్రకటన ఈ దిశగా డిపాజిటర్లలో అంచనాలను పెంచింది. ఇప్పటికిప్పుడు దీన్ని పెంచకపోయినా, భవిష్యత్తులో ఇందుకు తప్పక అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఎన్బీఎఫ్సీ డిపాజిట్ల సంగతేంటి? బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ తదితర డిపాజిట్లు స్వీకరించే ఆర్బీఐ అనుమతి కలిగిన ఎన్బీఎఫ్సీలు (ఎన్బీఎఫ్సీ–డీ) దేశంలో 25 ఉన్నాయి. వీటి పరిధిలో 2024 మార్చి నాటికి రూ.1,02,994 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. మరి ఉన్నట్టుండి వీటిల్లో ఏదైనా ఎన్బీఎఫ్సీకి నిధుల సమస్య తలెత్తితే పరిస్థితి ఏంటి? బ్యాంకుల్లో మాదిరి వీటిల్లో డిపాజిట్లకు డీఐసీజీసీ కింద ఎలాంటి బీమా రక్షణ లేదు. ఇవన్నీ ప్రజల డిపాజిట్లే కనుక వీటిని సైతం డీఐసీజీసీ కిందకు తీసుకురావాలన్న డిమాండ్లు ఉన్నాయి. వీటిల్లో డిపాజిట్ చేసే ముందు ఇన్వెస్టర్లు రిస్క్ లను అర్థం చేసుకోవాలి. బ్యాంకులకూ రేటింగ్ ఉండాలి.. ఎన్బీఎఫ్సీలు తమ నిధుల అవసరాల కోసం బాండ్లు, ఎన్సీడీలను జారీ చేస్తుంటాయి. సంబంధిత ఎన్బీఎఫ్సీ ఆర్థిక ఆరోగ్యం ఆధారంగా రేటింగ్ ఏజెన్సీలు క్రెడిట్ రేటింగ్ను ప్రకటిస్తాయి. నిబంధనల ప్రకారం రేటింగ్ తప్పనిసరి. బ్యాంక్లు సైతం బాండ్లను జారీ చేయాలంటే రేటింగ్ తీసుకోవాల్సిందే. కానీ బ్యాంక్ డిపాజిట్లకు వచ్చే సరికి ఈ తరహా రేటింగ్ విధానం లేకపోవడాన్ని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. బ్యాంక్ డిపాజిట్లకు సైతం రేటింగ్ను తప్పనిసరి చేయడం వల్ల పాలన మెరుగుపడుతుందని ఎన్ఎస్జీ అండ్ పార్ట్నర్స్ పార్ట్నర్ రవి భడానీ అభిప్రాయపడ్డారు. దీనివల్ల డిపాజిట్ చేసే సమయంలో ఆయా బ్యాంక్లకు సంబంధించి రిస్క్ ను ఇన్వెస్టర్లు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అలా చేస్తే అప్పుడు బలహీన బ్యాంక్ల నుంచి అధిక రేటింగ్ ఉన్న బ్యాంకుల్లోకి డిపాజిట్లు తరలిపోయే రిస్క్ ఏర్పడుతుందని ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ డైరెక్టర్ సతీష్ మరాటే పేర్కొన్నారు. దీనికి బదులు మెరుగైన రేటింగ్ ఉన్న బ్యాంకులకు డిపాజిట్లపై బీమా ప్రీమియం తక్కువ వసూలు చేసే విధానం ఫలితమిస్తుందన్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
క్రెడిట్ కార్డు రూల్స్లో కీలక మార్పులు
ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ, ప్రయివేట్ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకులు తమ క్రెడిట్ కార్డు పాలసీల్లో కీలక మార్పులు చేస్తున్నాయి. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ మైల్స్టోన్ టికెట్ వోచర్లతో సహా అనేక ప్రయోజనాలను నిలిపివేయనుండగా, ఎస్బీఐ తన క్లబ్ విస్తారా ఎస్బీఐ, క్లబ్ విస్తారా ఎస్బీఐ ప్రైమ్ క్రెడిట్ కార్డుల నిబంధనలను సవరించింది. 2025 ఏప్రిల్ 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి.ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డు మార్పులుఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ 2025 మార్చి 31 నుండి మైల్స్టోన్ టికెట్ వోచర్లు, పునరుద్ధరణ ప్రయోజనాలు, ఇతర ఫీచర్లను అందించడాన్ని నిలిపివేయనుంది. అయితే 2026 మార్చి 31 వరకు మహారాజా పాయింట్లు కొనసాగుతాయి. ఆ తర్వాత కార్డు పూర్తిగా నిలిచిపోతుంది. బ్యాంక్ ప్రకటన ప్రకారం కీలక మార్పులు ఇవే..క్లబ్ విస్తారా సిల్వర్ మెంబర్ షిప్ ఇకపై అందుబాటులో ఉండదు.వన్ ప్రీమియం ఎకానమీ టికెట్, వన్ క్లాస్ అప్ గ్రేడ్ వోచర్ తో సహా కాంప్లిమెంటరీ వోచర్లు నిలిచిపోతాయి.ప్రీమియం ఎకానమీ టికెట్లకు మైల్ స్టోన్ వోచర్లు ఇకపై జారీ కావు.2025 మార్చి 31 తర్వాత కార్డులను రెన్యువల్ చేసుకునే కస్టమర్ల వార్షిక రుసుమును ఏడాది పాటు రద్దు చేస్తారు.ఎస్బీఐ క్రెడిట్ కార్డు పాలసీల్లో మార్పులుక్లబ్ విస్తారా ఎస్బీఐ క్రెడిట్ కార్డుదారులకు ఎకానమీ టికెట్ వోచర్లు ఇకపై ఉండవు.రూ.1.25 లక్షలు, రూ.2.5 లక్షలు, రూ.5 లక్షల వార్షిక ఖర్చులకు మైల్ స్టోన్ బెనిఫిట్స్ నిలిపివేయనున్నారు.క్లబ్ విస్తారా ఎస్బీఐ ప్రైమ్ క్రెడిట్ కార్డు ఇకపై ప్రీమియం ఎకానమీ టికెట్ వోచర్లను అందించదు.బేస్ కార్డు రెన్యువల్ ఫీజు రూ.1,499, పీఎం కార్డు రెన్యువల్ ఫీజు రూ.2,999.వినియోగదారులకు ఫీజు మాఫీకి ఇంకా అవకాశం ఉంటుంది.మార్పుల వెనుక కారణంగత ఏడాది నవంబర్లో విస్తారా-ఎయిరిండియా విలీనం తర్వాత ఈ మార్పులు జరిగాయి. ఇది ఎయిరిండియా మహారాజా క్లబ్ లాయల్టీ కార్యక్రమంలో సర్దుబాట్లకు దారితీసింది. ఎస్బీఐ, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ తమ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలను సవరించగా, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ ఇంకా ఎటువంటి మార్పులను ప్రకటించలేదు. -
క్రిప్టో మార్కెట్ వైపు అతివల అడుగులు: కారణం ఇదే..
క్రిప్టో కరెన్సీ విలువ రోజురోజుకి వృద్ధి చెందుతున్న తరుణంలో.. చాలామంది చూపు దీనిపై పడింది. అయితే క్రిప్టో కరెన్సీలో పెట్టుబడిపెడుతున్న వారిలో పురుషులే అధికంగా ఉన్నప్పటికీ.. స్త్రీల సంఖ్య కూడా కొంత పెరిగిందని, దేశంలోని ప్రముఖ క్రిప్టో ఎక్స్ఛేంజ్ 'జియోటస్' వెల్లడించింది.మహిళా పెట్టుబడిదారులు భారత క్రిప్టో మార్కెట్లోకి మునుపటి కంటే ఎక్కువగా ప్రవేశిస్తున్నారు. ఈ సంఖ్య 20 శాతం పెరిగిందని జియోటస్ స్పష్టం చేసింది. మహిళా పెట్టుబడిదారులు దీర్ఘకాలిక పెట్టుబడులలో మాత్రమే కాకుండా.. బిట్కాయిన్, ఎథెరియం వంటి వాటిలోకి ప్రవేశిస్తున్నారు.మహిళలు క్రిప్టో కరెన్సీవైపు ఎక్కువ ఆసక్తి చూపించడానికి ప్రధాన కారణం.. చదువుకున్న వారికి డిజిటల్ అవగాహన, పెట్టుబడికి సంబంధించిన అవగాహన పెరగడం అని తెలుస్తోంది. యువత ఎక్కువగా క్రిప్టోలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నట్లు ఆర్ధిక నిపుణులు కూడా చెబుతున్నారు.ఇదీ చదవండి: శివ్ నాడార్ కీలక నిర్ణయం.. కుమార్తెకు భారీ గిఫ్ట్ఇప్పుడు పెద్ద పెద్ద పట్టణాల్లో ఉన్న మహిళలు మాత్రమే కాకుండా. టైర్ 2, టైర్ 3 నగరాల్లోని మహిళలు కూడా వివిధ రంగాలలో పెట్టుబడులు పెడుతున్నారు. ఇందులో క్రిప్టో కరెన్సీ కూడా ఉంది. రాబోయే రోజుల్లో మహిళా పెట్టుబడిదారుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉందని జియోటస్ అంచనా వేస్తోంది. -
డీఏ పెంపు.. ఈ సారి ఎంత ఉంటుందంటే?
హోలీకి ముందు కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్ (DA) & డియర్నెస్ రిలీఫ్ (DR) పెంపును ప్రకటించే అవకాశం ఉంది. ఇదే జరిగితే 1.2 కోట్ల కంటే ఎక్కువ మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.. పదవీ విరమణ చేసిన వారికి ప్రయోజనం చేకూరుతుంది.ప్రభుత్వం సంవత్సరానికి రెండుసార్లు (జనవరి, జూలై) డీఏను సమీక్షిస్తుంది. జనవరి సవరణ సాధారణంగా మార్చిలో జరిగితే.. జూలై సవరణ అక్టోబర్ లేదా నవంబర్లో ప్రకటిస్తారు. అయితే ఈ సారి డీఏ పెంపు 2 శాతం వరకు ఉండొచ్చని సమాచారం. గత ఏడాది.. కేంద్ర ప్రభుత్వం డీఏను రెండు సార్లు పెంచింది. దీంతో డీఏ 46 శాతం నుంచి 50 శాతానికి పెరిగింది. ఆ తరువాత అక్టోబర్లో 50 నుంచి 53 శాతానికి పెరిగింది. ఇప్పుడు వస్తున్న ఊహాగానాలు నిజమైతే.. డీఏ 53 శాతానికి చేరుతుంది.మార్చి 5న న్యూఢిల్లీలో జరిగిన కేబినెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుపై ఎటువంటి చర్చ జరపలేదని తెలుస్తోంది. అయితే దీనిపై స్పష్టత రావడానికి హోలీ వరకు వేచి చూడాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాలను సమీక్షించడానికి 8వ వేతన సంఘం ఏర్పాటును ప్రభుత్వం జనవరి 2025లో ప్రకటించింది. ఇది వచ్చే ఏడాది జనవరి నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది.ఇదీ చదవండి: నెలకు 10 రోజులు.. టెక్ కంపెనీ కొత్త రూల్!కేంద్రం 8వ వేతన సంఘం ఏర్పాటు ప్రకటించినప్పటి నుంచి.. జీతం, పెన్షన్లలో సవరణలకు సంబంధించిన ఊహాగానాలు పెరిగిపోతున్నాయి. అయితే ఈ 8వ వేతన సంఘం తన సిఫార్సులను సంకలనం చేయడానికి దాదాపు ఒక సంవత్సరం పడుతుంది. ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల ప్రతినిధులను సంప్రదించి తుది ప్రతిపాదనలు చేసే ముందు వారి ఆందోళనలను అర్థం చేసుకుంటుంది. -
గోల్డ్ లోన్లు ఇక అంత ఈజీ కాదు..
గోల్డ్ లోన్లు (Gold Loans) పొందడం రానున్న రోజుల్లో అంత సులువు కాకపోవచ్చు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ విభాగంలో అవకతవకలను అరికట్టడం, ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడమే లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బంగారు రుణాలపై నిబంధనలను కఠినతరం చేయనుంది.బంగారు ఆభరణాలు, వస్తువులు హామీగా పెట్టి తీసుకునే రుణాలు ఇటీవల కాలంలో అసాధరణంగా పెరిగాయి. 2024 సెప్టెంబర్ నుండి బంగారు రుణాలు 50% పెరుగుదలను చూశాయి. ఈ నేపథ్యంలో ఎటువంటి అనైతిక పద్ధతులకు ఆస్కారం లేకుండా బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (NBFC) రుణ విధానాలను ప్రామాణికం చేయడానికి సెంట్రల్ బ్యాంక్ చురుకైన చర్యలు తీసుకుంటోందని పరిశ్రమ వర్గాలతోపాటు ఆర్బీఐ ఆలోచనల గురించి తెలిసిన వ్యక్తులను ఉటంకిస్తూ వార్తా సంస్థ రాయిటర్స్ కథనం పేర్కొంది.కీలక ఆందోళనలు.. ప్రతిపాదిత మార్పులుగత 12 నుంచి 16 నెలలుగా ఆర్బీఐ నిర్వహించిన ఆడిట్లలో గోల్డ్ లోన్ రంగంలో అనేక అవకతవకలు వెలుగు చూశాయి. వాటిలో కొన్ని..సరిపోని నేపథ్య తనిఖీలు: తాకట్టు పెట్టిన బంగారం యాజమాన్యాన్ని ధ్రువీకరించడంలో, రుణగ్రహీతలపై క్షుణ్ణంగా శ్రద్ధ వహించడంలో బ్యాంకులు, రుణ సంస్థల లోపాలు కనిపించాయి.వాల్యుయేషన్ సమస్యలు: రుణగ్రహీత లేకుండా బంగారాన్ని మదింపు చేసిన సంఘటనలు, వాల్యుయేషన్ పద్ధతుల్లో అసమానతలు ఆందోళన కలిగిస్తున్నాయి.అనైతిక పద్ధతులు: కొన్ని రుణ సంస్థలు డిఫాల్ట్ రుణగ్రహీతలకు తెలియజేయకుండా, పారదర్శక నిబంధనలను ఉల్లంఘించి తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేశాయి.ఔట్ సోర్సింగ్ ప్రమాదాలు: ప్రామాణిక ప్రోటోకాల్స్ ను దాటవేస్తూ బంగారాన్ని సేకరించడం, నిల్వ చేయడం, తూకం వేయడం వంటి పనులను ఫిన్ టెక్ ఏజెంట్లకు అప్పగించారు.ఈ సమస్యలను పరిష్కరించడానికి, ఆర్బీఐ కఠినమైన అండర్ రైటింగ్ విధానాలను అమలు చేయాలని, రుణ వినియోగాన్ని నిశితంగా పర్యవేక్షించాలని, రుణదాతలందరికీ ఒకే విధమైన మార్గదర్శకాలను నిర్ధారించాలని యోచిస్తోంది. థర్డ్ పార్టీ ఏజెంట్లపై అతిగా ఆధారపడటాన్ని నివారించడం, రుణ సంస్థలు బంగారం మదింపు, నిల్వ వంటి కీలకమైన ప్రక్రియలను స్వయంగా నిర్వహించేలా చూడటం సెంట్రల్ బ్యాంక్ లక్ష్యం.పరిశీలన ఎందుకు?ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారం వినియోగదారు అయిన భారత్ లో రికార్డు స్థాయిలో బంగారం ధరలు పెరగడం, అన్ సెక్యూర్డ్ లెండింగ్ పై నిబంధనలను కఠినతరం చేయడంతో బంగారం రుణాలు పెరిగాయి. కుటుంబాలు సాంప్రదాయకంగా పండుగలు, వివాహాలకు బంగారాన్ని కొనుగోలు చేస్తాయి. ఇది రుణాలను పొందడానికి విలువైన ఆస్తిగా మారుతుంది. ఏదేమైనా, ఈ విభాగం వేగవంతమైన వృద్ధి మొత్తం రుణ వృద్ధిని అధిగమించింది. దీంతో ఆర్బీఐ జోక్యం చేసుకుని రుణ పద్ధతులు నైతికంగా, పారదర్శకంగా ఉండేలా చూడటానికి ప్రేరేపించింది.రుణగ్రహీతలు, సంస్థలపై ప్రభావంప్రతిపాదిత మార్పులు రుణగ్రహీతలకు బంగారు రుణాలను మరింత సురక్షితంగా, విశ్వసనీయంగా మారుస్తాయని భావిస్తున్నారు. అయితే కఠినమైన నిబంధనలు రుణాలను ప్రాసెస్ చేయడానికి అవసరమైన సమయం, శ్రమను కూడా పెంచుతాయి. దీంతో రుణగ్రహీతలకు త్వరగా నిధులను పొందడం కష్టతరం అవుతుంది. ఇక రుణ సంస్థల విషయానికి వస్తే.. బంగారు రుణాలకు సంబంధించి ఆర్బీఐ ప్రమాణాలకు అనుగుణంగా శిక్షణ, సాంకేతికత, సమ్మతి చర్యలకు ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరాన్ని కొత్త నిబంధనలు కల్పిస్తాయి. -
లక్ష మంది పిల్లలకు ఎన్పీఎస్ వాత్సల్య
న్యూఢిల్లీ: ఎన్పీఎస్ వాత్సల్య పథకాన్ని లక్ష మంది పిల్లల పేరిట తెరిచినట్టు పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి మండలి (పీఎఫ్ఆర్డీఏ) వెల్లడించింది. గతేడాది సెప్టెంబర్లో ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది.దేశంలో పింఛను సదుపాయం ఉన్నవారు తక్కువగా ఉండడంతో ఈ పథకాన్ని మరింత మందికి చేరువ చేసేందుకు ఎన్నో చర్యలను అమలు చేస్తున్నట్టు పీఎఫ్ఆర్డీఏ చైర్పర్సన్ దీపక్ మహంతి తెలిపారు.‘అప్పుడే పుట్టిన శిశువులు సైతం ఎన్పీఎస్ను ఎంపిక చేసుకోవచ్చు. ఆర్ధిక మంత్రి గత సెప్టెంబర్లో ఈ పథకం ప్రారంభించిన నాటి నుంచి లక్ష మందికి పైగా శిశువులు ఎంపిక చేసుకున్నందుకు సంతోషంగా ఉంది’’అని చెప్పారు. ఎన్పీఎస్ వాత్సల్యలో 18 ఏళ్లు నిండని వారంతా చేరొచ్చు. పీఎఫ్ఆర్డీఏ నిర్వహించే అన్ని పింఛను పథకాల కింద (ఎన్పీఎస్, ఏపీఎస్) 7 కోట్ల మంది చందాదారులు ఉన్నట్టు మహంతి తెలిపారు. -
EPFO: క్షణాల్లో ఈపీఎఫ్వో విత్డ్రా
ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)ఖాతాదారులకు శుభవార్త. ఇప్పటికే ఉద్యోగుల సౌలభ్యం కోసం ఈపీఫ్ఓవో సంస్థ ఈపీఎఫ్వో అకౌంట్లలో పలు కీలక మార్పులు చేపట్టింది. ఈపీఎఫ్వో క్లయిమ్, వివరాలను చేర్చడం, తొలగించడం, ఎగ్జిట్ అవ్వడాన్ని సులభతరం చేసింది.తాజాగా, ఉద్యోగుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఫోన్పే,గూగుల్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్ల ద్వారా ఈపీఎఫ్వో విత్ర్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తేనున్నట్లు తెలుస్తోంది వెలుగులోకి వచ్చిన నివేదికల ప్రకారం.. ప్రస్తుతం ఈపీఎఫ్వో సంస్థ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)తో కలిసి ఈ సౌకర్యాన్ని ప్రారంభించేందుకు చర్చలు జరుపుతుంది. సాధ్యసాధ్యాలను బట్టి సౌకర్యాన్ని ఈ ఏడాది మే, లేదా జూన్ నాటికి ప్రారంభించే యోచనలో ఈపీఎఫ్వో ఉందని వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. దీంతో పాటు ఈపీఎఫ్వో3.0లో ఏటీఎం ద్వారా ఈపీఎఫ్వో విత్డ్రా చేసుకునే వెసులు బాటు ఈ ఏడాది జూన్ నుంచి ప్రారంభించనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు.ఉద్యోగులకు లభించే ప్రయోజనాలుయూపీఐ ద్వారా ఈపీఎఫ్వో విత్ డ్రా వల్ల ఉద్యోగలకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా అత్యవసర సమయాల్లో డబ్బుల్ని తక్షణమే పొందవచ్చు. పారదర్శకతతో పాటు ఈపీవోఎఫ్వో విత్ డ్రా ప్రక్రియ మరింత సజావుగా జరగనుంది.ఈపీఎఫ్వో 3.0 ప్రారంభంఈపీఎఫ్వో 3.0 అమల్లోకి వస్తే, సభ్యులు తమ పొదుపులను సాధారణ బ్యాంకు అకౌంట్ల నుంచి డబ్బులను ఉపసంహరించుకోవడం మరింత సులభం అవుతుంది. -
ఇన్వెస్టర్లూ.. ఇలాంటి స్కామ్లపై జాగ్రత్త!
అత్యంత మోసపూరితమైన ఆర్థిక నేరాల్లో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ (investment fraud) కూడా ఒకటి. టెక్నాలజీతో పాటు స్కాములు కూడా రూపాంతరం చెందుతున్న నేపథ్యంలో ఇలాంటి సైకలాజికల్ మోసాల బారిన పడకుండా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ (NPCI) ఇన్వెస్టర్లను అప్రమత్తం చేస్తూ అవగాహన కల్పిస్తోంది.ఆర్థిక నిపుణుల ముసుగులో, పేరొందిన సంస్థల పేరిట ఎండార్స్మెంట్స్తోనూ, కొన్ని సందర్భాల్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ఫేక్ వీడియోలను ఉపయోగించి మోసగాళ్లు అమాయకులకు వల వేస్తారు. అసాధారణమైన రాబడులొస్తాయని, విశిష్టమైన పెట్టుబడి అవకాశాలని, పరిమిత కాలం పాటే ఉండే డీల్స్ అంటూ కనీసం ఆలోచించుకోనివ్వకుండా ఇన్వెస్ట్ చేసేలా ప్రేరేపిస్తారు. ఇక ఇన్వెస్ట్ చేసిన వెంటనే మోసగాళ్లు ఠక్కున మాయమైపోతారు లేదా తాము మోసపోతున్నాననే విషయాన్ని బాధితులు గ్రహించే వరకు వారి నుంచి డబ్బు లాగుతూనే ఉంటారు.ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్లో రకాలుఫేక్ ట్రేడింగ్ ప్లాట్ఫాంలు, యాప్లు: స్కామర్లు అచ్చం చట్టబద్ధమైన బ్రోకర్లు, ఫండ్ హౌస్లు లేదా ఎక్స్చేంజీలవిగా అనిపించే బోగస్ ఇన్వెస్ట్మెంట్ యాప్లు లేదా వెబ్సైట్లను తయారు చేస్తారు. ఫేక్ స్క్రీన్లపై వర్చువల్ లాభాలను చూపించడం ద్వారా డబ్బు డిపాజిట్ చేసేలా తొలుత యూజర్లను వలలోకి లాగుతారు. యూజర్లు గణనీయమైన మొత్తాలను ఇన్వెస్ట్ చేశాక, వారు ఆ నిధులను విత్డ్రా చేసుకోకుండా అడ్డుపడతారు.డిస్కౌంట్ ధరల్లో షేర్లు: ఎవరికీ అంతగా తెలియని, అతి తక్కువ వాల్యూమ్స్తో ట్రేడయ్యే షేర్లను మోసగాళ్లు ప్రమోట్ చేస్తారు. ముందుగా అతి కొద్ది మంది క్లయింట్లకు మాత్రమే, భారీగా డిస్కౌంట్ రేట్లకు అవి లభిస్తాయని నమ్మబలుకుతారు. దురుద్దేశపూరితంగా, ఎక్స్చేంజ్ లేదా బ్రోకింగ్ హౌస్లకు కాకుండా తమ వ్యక్తిగత ఖాతాల్లోకి నిధులను బదిలీ చేయాలంటూ ఇన్వెస్టర్లను కోరతారు. షేర్ల ట్రేడింగ్ ద్వారా భారీ లాభాలు గడించొచ్చని మభ్యపెడుతూ, ఈ తరహా స్కామ్లలో మోసగాళ్లు సాధారణంగా లక్షల్లో భారీ ఎత్తున నిధులను కొల్లగొడతారు.ఫేక్ జాబ్ స్కామ్లు: సోషల్ మీడియా పేజీలను లైక్ చేయడం లేదా లేదా రివ్యూలు రాయడంలాంటి తేలికైన పనులు చేసే ఉద్యోగాలిచ్చే కంపెనీల ముసుగులో స్కామర్లు సంప్రదించవచ్చు. నమ్మకాన్ని చూరగొనేందుకు ముందు కాస్త మొత్తం చెల్లించవచ్చు. ఆ తర్వాత ప్రాథమిక పెట్టుబడుల అవకాశాలంటూ చిన్న చిన్న కొనుగోళ్లు జరిపేలా బాధితులను మోసగిస్తారు. ఆ తర్వాతెప్పుడో ఈ స్కీముల మోసపూరిత స్వభావం బయటపడుతుంది.పోంజి, పిరమిడ్ స్కీములు: ఈ తరహా స్కాముల్లో అధిక రాబడులు వస్తాయని ఇన్వెస్టర్లకు నమ్మబలుకుతారు. తొలుత వచ్చిన ఇన్వెస్టర్లకు వాస్తవ లాభాలను కాకుండా కొత్త ఇన్వెస్టర్ల నుంచి వచ్చే డబ్బు నుంచి చెల్లిస్తారు. కొత్తగా డబ్బు రావడం ఆగిపోతే ఇవి కుప్పకూలిపోతాయి.స్కామ్ల నుంచి ఇలా దూరంగా ఉండండి..ఇన్వెస్ట్ చేసే ముందు ధ్రువీకరించుకోవాలి: ఆయా సంస్థలు రిజిస్టర్ అయినవా లేదా అనేది సెబీ (SEBI), ఆర్బీఐ (RBI) లేదా ఇతరత్రా అధికారిక నియంత్రణ సంస్థల వెబ్సైట్లలో చెక్ చేసుకోవాలి.అధిక రాబడుల హామీలపై అప్రమత్తంగా ఉండాలి: ఏదైనా పెట్టుబడి నమ్మశక్యం కానంతగా బాగుందనిపిస్తోందంటే, అది మ్ అయి ఉండొచ్చు.ఒత్తిళ్లకు తలొగ్గవద్దు: చట్టబద్ధమైన పెట్టుబడులను చేసేందుకు అత్యవసరంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉండదువెబ్సైట్, ఈమెయిల్ను చెక్ చేసుకోవాలి: HTTPS, అధికారిక డొమైన్ పేర్లు చూసుకోవాలి, అవాంఛిత లింకులపై క్లిక్ చేయకూడదు.వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను షేర్ చేయొద్దు: మోసపుచ్చేందుకు, డబ్బు కాజేసేందుకు మోసగాళ్లు వీటిని ఉపయోగించుకుంటారు.అనుమానాస్పద నంబర్ల గురించి 1930కి డయల్ చేయడం ద్వారా నేషనల్ సైబర్క్రైమ్ హెల్ప్లైన్కి లేదా టెలికం డిపార్ట్మెంట్కి ఫిర్యాదు చేయండి. మెసేజీలను సేవ్ చేసుకోండి. స్క్రీన్షాట్లు తీసుకోండి. సంప్రదింపుల వివరాలను భద్రపర్చుకోండి. -
ఎస్బీఐ కొత్త స్కీమ్.. మామూలు కంటే ఎక్కువ వడ్డీ
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ (Fixed Deposit) పథకాన్ని ప్రారంభించింది. 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు వారికి సురక్షితమైన, ఆకర్షణీయమైన పెట్టుబడి ఎంపికను అందించడం, వారి పదవీ విరమణ సంవత్సరాల్లో స్థిరమైన రాబడి, ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడం ఈ పథకం లక్ష్యం.పథకం ముఖ్య లక్షణాలుఅధిక వడ్డీ రేట్లు: సీనియర్ సిటిజన్లు సాధారణ డిపాజిటర్లకు అందించే ప్రామాణిక ఎఫ్డీ రేట్ల కంటే 0.50% అదనపు వడ్డీ రేటు నుండి ప్రయోజనం పొందుతారు. దీంతో వారి పెట్టుబడులపై అధిక రాబడులు లభిస్తాయి.ఫ్లెక్సిబుల్ కాలపరిమితి ఎంపికలు: ఈ పథకం అనేక రకాల కాలపరిమితి ఎంపికలను అందిస్తుంది. కస్టమర్లు వారి ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా వ్యవధిని ఎంచుకోవచ్చు. కాలపరిమితి స్వల్పకాలిక డిపాజిట్ల నుంచి 10 ఏళ్ల వరకు దీర్ఘకాలిక ఎంపికల వరకు ఉంటుంది.త్రైమాసిక చెల్లింపు: క్రమానుగత ఆదాయాన్ని కోరుకునేవారికి, ఈ పథకం త్రైమాసిక చెల్లింపు ఎంపికను అందిస్తుంది. లిక్విడిటీ, స్థిరమైన నగదు ప్రవాహాన్ని నిర్ధారిస్తుంది.సేఫ్టీ అండ్ సెక్యూరిటీ: ప్రభుత్వ మద్దతుతో చేపట్టిన ఈ పథకం డిపాజిట్ల భద్రతకు హామీ ఇస్తుంది. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) కింద డిపాజిట్లకు రూ .5 లక్షల వరకు బీమా ఉంటుంది.అర్హత, దరఖాస్తు ప్రక్రియ60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లకు ఈ స్కీమ్ ప్రత్యేకంగా అందుబాటులో ఉంది. ఆసక్తి ఉన్నవారు ఏదైనా ఎస్బీఐ శాఖను సందర్శించి లేదా బ్యాంక్ అధికారిక ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తు ప్రక్రియ కూడా సరళంగానే ఉంటుంది. వయస్సు, గుర్తింపు, చిరునామా రుజువు వంటి ప్రాథమిక డాక్యుమెంటేషన్ ఉంటే చాలు. -
నెలకు రూ.82,000 వేతనం.. ఇంటి ఖర్చులు భారం..
నెలవారీ ఎంత సంపాదిస్తున్నా జీవన వ్యయాలు భారమవుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులకు సంబంధించి ఇటీవల ఓ వ్యక్తి రెడ్డిట్లో చేసిన పోస్ట్ వైరల్గా మారింది. నెలకు రూ.82,000 సంపాదించే ఆ వ్యక్తి తీసుకున్న గృహ రుణం భారంగా మారిందని తెలిపారు. దాంతోపాటు పెరుగుతున్న జీవన వ్యయాల వల్ల ఇంటి ఖర్చుల నిర్వహణలో సవాళ్లు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. తన ఆదాయం పెరిగేలా ఏదైనా సలహాలు ఇవ్వాలని కోరారు. తాను చేసిన పోస్ట్కు నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.రెడ్డిట్లో చేసిన పోస్ట్ ప్రకారం.. ‘నా నెలవారీ సంపాదన రూ.82,000. జీతంలో గణనీయమైన భాగం అంటే రూ.36,000 నేను గతంలో తీసుకున్న రూ.46 లక్షల గృహ రుణానికి ఈఎంఐ చెల్లిస్తున్నాను. సౌకర్యవంతమైన ఆదాయం ఉన్నప్పటికీ ఇతర ఇంటి ఖర్చులను భరించడానికి ఇబ్బంది అవుతుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉద్యోగం చేస్తున్నాను. రాత్రి 7 గంటలకు ఇంటికి వస్తాను. వచ్చాక డిన్నర్ ప్రిపేర్ చేసేందుకు నా భార్యకు సాయం చేస్తాను. ఇది నా షెడ్యుల్. గృహ రుణానికి అధిక మొత్తం కేటాయించడంతో ఇంటి ఖర్చులు భారమవుతున్నాయి. ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు నెలకు అదనంగా రూ.15,000 నుంచి రూ.20,000 సంపాదించాలని అనుకుంటున్నాను. కాన్వా, పవర్పాయింట్ డిజైనింగ్లో నైపుణ్యాలు ఉన్నాయి. పబ్లిక్ స్పీకింగ్, కస్టమర్ సర్వీస్లో ఆసక్తి ఉంది. తీరిక సమయాల్లో చరిత్ర, సాహిత్యంపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నాను. ఈ సామర్థ్యాలను సద్వినియోగం చేసుకోవడానికి నా షెడ్యూల్కు సరిపడే పార్ట్టైమ్వర్క్కు సంబంధించి సలహాలు ఇవ్వండి’ అంటూ పోస్ట్ చేశాడు.నెటిజన్ల స్పందన ఇలా..కొంతమంది నెటిజన్లు ఈ పోస్ట్కు విభిన్నంగా స్పందించారు. తన నైపుణ్యాన్ని పెంచుకుని అధిక వేతనంతో కూడిన మరో ఉద్యోగానికి మారాలని కొందరు సూచించారు. మరికొందరు ఫ్రీలాన్స్ అవకాశాలను అన్వేషించాలని లేదా యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాలని సిఫార్సు చేశారు. పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్, హిస్టరీపై ఉన్న ఆసక్తి దృష్ట్యా కొందరు గెస్ట్ లెక్చరర్గా పని చేయాలని చెప్పారు.చాలా మంది మధ్యతరగతి వృత్తి నిపుణులు, కొంత మెరుగైన ఆదాయం ఉన్నవారు ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను ఈ వ్యక్తి చేసిన పోస్ట్ హైలైట్ చేస్తుంది. పెరుగుతున్న స్థిరాస్తి ధరలు, అధికమవుతున్న జీవన వ్యయం చాలా మందికి భారంగా మారుతుంది. మెరుగైన ఆర్థిక ప్రణాళిక, నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరాన్ని ఈ పోస్ట్ గుర్తు చేస్తుంది.ఇదీ చదవండి: రాబడులపై పన్ను తగ్గింపు..?జాబ్ మార్కెట్లో కొన్ని నైపుణ్యాలకు అధిక డిమాండ్ ఉంది. కింద తెలిపిన స్కిల్స్ నేర్చుకుంటే మంచి వేతనంతో మెరుగైన ఉద్యోగ భవిష్యత్తు ఉంటుందని నిపుణులు సలహా ఇస్తున్నారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్: ఇవి హెల్త్ కేర్, ఫైనాన్స్, మార్కెటింగ్ వంటి రంగాల్లో ఆటోమేషన్, డెసిషన్ మేకింగ్కు సహకరిస్తాయి.క్లౌడ్ కంప్యూటింగ్: ఏడబ్ల్యుఎస్, మైక్రోసాఫ్ట్ అజూర్, గూగుల్ క్లౌడ్ వంటి టెక్నాలజీలపై అవగాహన.సైబర్ సెక్యూరిటీ: సున్నితమైన డేటాను రక్షించడం మొదటి ప్రాధాన్యత. ఇది సైబర్ సెక్యూరిటీ విశ్లేషకులు, ఎథికల్ హ్యాకర్లకు ఎంతో ముఖ్యం.డేటా అనాలిసిస్, డేటా సైన్స్: కంపెనీలు డేటా ఆధారిత ఇన్పుట్స్పై ఆధారపడతాయి. కాబట్టి పైథాన్, ఎస్క్యూఎల్, టాబ్లో వంటి డేటా విజువలైజేషన్ సాధనాల్లో నైపుణ్యాలకు డిమాండ్ ఉంది.సాఫ్ట్వేర్ డెవలప్మెంట్: జావాస్క్రిప్ట్, పైథాన్ వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, రియాక్ట్ వంటి ఫ్రేమ్వర్క్లో ప్రావీణ్యం కీలకం. -
పదేళ్లు, అంతకుమించిన ఇన్వెస్ట్ చేయాలనుకుంటే..
ఈక్విటీలు ఎప్పుడూ అస్థిరతలతో చలిస్తుంటాయి. కొంత కాలం పాటు ర్యాలీ చేసి, కొంత కాలం దిద్దుబాటుకు గురవుతుంటాయి. భారత్ వేగంగా వృద్ధి చెందుతూ, అభివృద్ధి చెందిన దేశం కావాలన్న ఆకాంక్షలతో అడుగులు వేస్తోంది. కనుక దీర్ఘకాలంలో ఈక్విటీల్లో మెరుగైన రాబడులకే ఎక్కువ అవకాశాలున్నాయి.ఇన్వెస్టర్లు ముఖ్యమైన ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీల్లో, అది కూడా లార్జ్క్యాప్, మిడ్క్యాప్ విభాగంలో పెట్టుబడి పెట్టుకోవడం ద్వారా దీర్ఘకాలంలో మెరుగైన రాబడులు పొందే అవకాశాలుంటాయన్నది నిపుణుల సూచన. ఈ రెండు విభాగాల్లో పెట్టుబడికి వీలు కల్పిస్తున్నదే మిరే అస్సెట్ లార్జ్ అండ్ మిడ్క్యాప్ ఫండ్. కనీసం 10 ఏళ్లు అంతకుమించిన దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇన్వెస్టర్లు ఈ పథకంలో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) పెట్టుబడులను పరిశీలించొచ్చు.రాబడులుఈ పథకం గడిచిన ఏడాదిలో ఒక శాతం నష్టాన్నిచ్చింది. ఇటీవలి కాలంలో స్టాక్స్ గణనీయంగా దిద్దుబాటుకు గురి కావడం చూస్తున్నాం. దీని ఫలితమే ఏడాది కాలంలో రాబడి కాస్తా నష్టంగా మారిపోవడం. మూడేళ్ల కాలాన్ని పరిశీలిస్తే 12 శాతానికి పైనే వార్షిక రాబడి ఈ పథకంలో ఇన్వెస్టర్లకు లభించింది. అదే ఐదేళ్లలో ఏటా 17 శాతం పెట్టుబడులపై రాబడి తెచ్చి పెట్టింది. ఏడేళ్లలోనూ 14.63 శాతం, పదేళ్లలో 16 శాతం చొప్పున వార్షిక రాబడులను అందించింది. ఈ పథకం గతంలో మిరే అస్సెట్ ఎమర్జింగ్ బ్లూచిప్ ఫండ్ పేరుతో పనిచేసింది. 2010 జూలైలో పథకం ప్రారంభం కాగా, నాటి నుంచి చూస్తే ఇప్పటి వరకు వార్షిక రాబడి 19 శాతంగా ఉండడం గమనార్హం.పెట్టుబడుల విధానంపేరులో ఉన్నట్టుగా ఈ పథకం లార్జ్క్యాప్, మిడ్క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటుంది. కంపెనీల భవిష్యత్ వృద్ధి సామర్థ్యాలపై ఈ పథకం ప్రధానంగా దృష్టి పెడుతుంది. భవిష్యత్లో దిగ్గజాలుగా ఎదిగే సామర్థ్యాలున్న కంపెనీలను ముందుగానే ఎంపిక చేసి ఇన్వెస్ట్ చేస్తుంది. దీర్ఘకాలం పాటు పెట్టుబడులు కొనసాగిస్తుంటుంది. ఈ పథకం సాధారణంగా 35 - 65 శాతం మధ్య లార్జ్క్యాప్ కంపెనీలకు (మార్కెట్ విలువ పరంగా 100 అగ్రగామి కంపెనీలు) కేటాయిస్తుంటుంది.మిడ్క్యాప్ కంపెనీలకు (మార్కెట్ విలువ పరంగా 101 నుంచి 250వరకు ఉన్నవి) కేటాయింపులు 35–65 శాతం మధ్య నిర్వహిస్తుంటుంది. భవిష్యత్ బ్లూచిప్ కంపెనీల్లో ముందే పెట్టుబడికి ఈ పథకం వీలు కల్పిస్తుంది. బోటమ్అప్, వ్యాల్యూ ఇన్వెస్టింగ్ విధానాలను అనుసరించి స్టాక్స్ను ఎంపిక చేస్తుంటుంది. అధిక నాణ్యమైన కంపెనీల్లో సహేతుక ధరల వద్దే పెట్టుబడులు పెడుతుంది. ఈ పథకం మొదలైన నాటి నుంచి నీలేష్ సురానా ఫండ్ మేనేజర్గా వ్యవహరిస్తున్నారు. పోర్ట్ఫోలియో ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.36,514 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 99.31 శాతాన్ని ఇప్పటికే ఇన్వెస్ట్ చేసింది. మిగిలినది నగదు రూపంలో కలిగి ఉంది. పోర్ట్ఫోలియోలో మొత్తం 103 స్టాక్స్ ఉన్నాయి. ప్రస్తుతం లార్జ్క్యాప్లో 63 శాతం పెట్టుబడులు ఉన్నాయి. మిడ్క్యాప్లో 34 శాతానికి పైనే ఇన్వెస్ట్ చేసింది. స్మాల్క్యాప్ కంపెనీలకు 2.49 శాతం కేటాయింపులు చేసింది. అత్యధికంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు 28 శాతం పెట్టుబడులు కేటాయించింది. ఇండ్రస్టియల్స్ కంపెనీల్లో 13.71 శాతం, టెక్నాలజీ కంపెనీల్లో 13 శాతం, మెటీరియల్స్ కంపెనీల్లో 11 శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి. -
ఐటీఆర్ తప్పులు.. ట్యాక్స్పేయర్లకు అలర్ట్..
2024-25 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు గత రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నుల్లో ఏవైనా తప్పులు, పొరపాట్లు ఉంటే సరిదిద్దుకునే కీలక అవకాశం ఉంది. 2022 ఫైనాన్స్ చట్టంలో ప్రవేశపెట్టిన అప్డేటెడ్ రిటర్న్లను దాఖలు చేసే నిబంధన పన్ను చెల్లింపుదారులను 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాలకు వారి రిటర్నులను ఈ మార్చి 31 లోపు అప్డేట్ చేయడానికి అనుమతిస్తుంది..అప్డేటెడ్ ఐటీఆర్ నిబంధనస్వచ్ఛంద సమ్మతిని ప్రోత్సహించడానికి, లిటిగేషన్ను తగ్గించడానికి అప్డేటెడ్ రిటర్న్ నిబంధనను ప్రవేశపెట్టారు. సంబంధిత మదింపు సంవత్సరం ముగిసిన రెండు సంవత్సరాలలోపు అప్డేటెడ్ రిటర్న్ను సమర్పించడం ద్వారా పన్ను చెల్లింపుదారులు గతంలో దాఖలు చేసిన రిటర్న్లలో తప్పులు లేదా లోపాలను సరిదిద్దడానికి ఇది అనుమతిస్తుంది. ఉదాహరణకు 2022-23 మదింపు సంవత్సరానికి (2021-22 ఆర్థిక సంవత్సరం) తమ రిటర్నులను అప్డేట్ చేయాలనుకున్నవారు 2025 మార్చి 31లోగా ఫైల్ చేయాలి.గమనించాల్సిన కీలక అంశాలుఅప్డేటెడ్ రిటర్న్ దాఖలు చేయడానికి అదనపు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. అదనపు పన్ను మొత్తం సంబంధిత మదింపు సంవత్సరం ముగిసినప్పటి నుండి గడిచే సమయంపై ఆధారపడి ఉంటుంది. ఎంత ఎక్కువ జాప్యం చేస్తే అంత అదనపు పన్ను పెరుగుతుంది.కొన్ని అసాధారణ సందర్భాల్లో మినహా చాలా సందర్భాల్లో అప్డేటెడ్ రిటర్న్ దాఖలు చేయవచ్చు. ఉదాహరణకు సవరించిన ఆదాయం తక్కువ పన్ను బాధ్యతకు దారితీస్తే, పన్ను రిఫండ్ లేదా అధిక రిఫండ్కు దారితీస్తే లేదా పన్ను చెల్లింపుదారు పన్ను అధికారుల విచారణలో ఉంటే అప్డేటెడ్ రిటర్న్ దాఖలుకు వీలుండదు.తొలుత అప్డేటెడ్ రిటర్న్ దాఖలుకు గరిష్టంగా రెండేళ్ల వరకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత 2025 బడ్జెట్లో ఈ గడువును 48 నెలలకు పొడిగించారు. ఇది పన్ను చెల్లింపుదారులకు వారి ఫైలింగ్లలో ఏవైనా వ్యత్యాసాలను పరిష్కరించడానికి ఎక్కువ సమయం ఇస్తుంది.అప్డేటెడ్ రిటర్న్ ఎలా ఫైల్ చేయాలంటే..ఆదాయపు పన్ను శాఖకు సంబంధించిన ఈ-ఫైలింగ్ పోర్టల్లో అందుబాటులో ఉన్న ఐటీఆర్-యు ఫారాన్ని ఉపయోగించి పన్ను చెల్లింపుదారులు అప్డేటెడ్ రిటర్న్ను దాఖలు చేయవచ్చు. ఈ ప్రక్రియలో ఈ కింది దశలు ఉంటాయి..ఈ-ఫైలింగ్ పోర్టల్లోకి వెళ్లి మీ క్రెడిన్షియల్స్ను ఉపయోగించి లాగిన్ చేయండి.సంబంధిత అసెస్మెంట్ సంవత్సరానికి ఐటీఆర్-యు ఫారాన్ని ఎంచుకోండి.అదనపు ఆదాయం, చెల్లించాల్సిన పన్నుతో సహా అవసరమైన వివరాలను అందించండి.సంబంధిత మదింపు సంవత్సరం ముగిసినప్పటి నుండి గడిచిన సమయం ఆధారంగా చెల్లించాల్సిన అదనపు పన్నును లెక్కించండి.వివరాలను సమీక్షించి అప్డేటెడ్ రిటర్న్ సబ్మిట్ చేయండి. -
బీమా సంస్థలకు ఐఆర్డీఏ గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: పోర్ట్ఫోలియోలకు హెడ్జింగ్గా డెరివేటివ్స్ను వినియోగించుకునేందుకు బీమా కంపెనీలను వీలు చిక్కింది. బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ ఇందుకు తాజాగా అనుమతించింది. బీమా రంగ సంస్థల వినతులమేరకు ఈక్విటీ డెరివేటివ్స్ ద్వారా హెడ్జింగ్కు తెరతీసేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది.వెరసి ఆటుపోట్లను చవిచూస్తున్న క్యాపిటల్ మార్కెట్లో రిస్కులను తగ్గించుకునేందుకు వీలు కల్పించింది. ప్రస్తుత హెచ్చుతగ్గుల క్యాపిటల్ మార్కెట్లలో హెడ్జింగ్ చేపట్టడం ద్వారా ఈక్విటీ పోర్ట్ఫోలియోల రిసు్కలను తగ్గించుకునేందుకు బీమా కంపెనీలకు దారి ఏర్పడింది.తద్వారా ఈక్విటీ పెట్టుబడులను సంరక్షించుకునేందుకు ఐఆర్డీఏ మద్దతిస్తోంది. బీమా కంపెనీలు ఫార్వార్డ్ రేట్ అగ్రిమెంట్స్, ఇంటరెస్ట్ రేట్ స్వాప్స్, ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఇంటరెస్ట్ ఫ్యూచర్స్ ద్వారా రుపీ ఇంటరెస్ట్ రేట్ డెరివేటివ్స్లో లావాదేవీలు చేపట్టేందుకు ప్రస్తుత నిబంధనలు అనుమతిస్తున్నాయి. -
ఈపీఎఫ్ వడ్డీ రేటు ఖరారు: ఈసారీ అంతే..
2024-25 ఆర్థిక సంవత్సరానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) డిపాజిట్లపై.. వడ్డీ రేటును ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నిర్దారించింది. ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ 8.25 శాతం వడ్డీరేటు యధావిధిగా కొనసాగించాలని నిర్ణయించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం పొందిన తర్వాత.. ఈ వడ్డీ రేటు ఏడు కోట్లకు పైగా చందాదారులకు జమ అవుతుంది.2022-23లో ఈ వడ్డీ 8.15 శాతంగా ఉండేది. అయితే దీనిని 2023-24లో 8.25 శాతానికి పెంచారు. 2018-19లో ఈ రేటు 8.65గా ఉండేది. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో వడ్డీ రేటు ఏకంగా 8.1 శాతానికి పడిపోయింది. ఇప్పుడు గత ఏడాది మాదిరిగానే 8.25 శాతం వద్దనే కొనసాగుతుందని ప్రకటించారు.ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయడం ఎలా?ఉమాంగ్ యాప్: ఉమాంగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని.. మీ ఫోన్ నంబర్తో నమోదు చేసుకోండి. ఆ తరువాత EPF పాస్బుక్, క్లెయిమ్లు, బ్యాలెన్స్ చెక్ వంటి సేవలను యాక్సెస్ చేసుకోవచ్చు.ఈపీఎఫ్ఓ పోర్టల్: EPFO అధికారిక వెబ్సైట్ను సందర్శించండి, "మెంబర్ పాస్బుక్" విభాగానికి వెళ్లి, మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.మిస్డ్ కాల్: మీ UAN-రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 011-22901406 కు మిస్డ్ కాల్ ఇవ్వండం ద్వారా కూడా ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.ఇదీ చదవండి: పతనమవుతున్న పసిడి ధరలు: కొనడానికి ఇదే మంచి ఛాన్స్! -
ఎస్బీఐ అప్డేట్.. క్రెడిట్కార్డ్ బిల్ పేమెంట్ ఈజీ..
ప్రస్తుతం క్రెడిట్ కార్డుల (Credit Card) వినియోగం పెరిగిపోయింది. చాలా మంది దగ్గర ఒకటికి మించి క్రెడిట్ కార్డులు కూడా ఉన్నాయి. వీటితో ఖర్చు చేసేటప్పుడు సులువుగా ఉన్నా వాటి బిల్లుల చెల్లింపులో చిక్కులు ఎదురవుతుంటాయి. వేరువేరు గడువు తేదీలు, అధిక వడ్డీ రేట్లు, సంక్లిష్ట స్టేట్మెంట్, సాంకేతిక సమస్యల కారణంగా క్రెడిట్ కార్డు బిల్లులను చెల్లించడం సవాలుగా ఉంటుంది. ఈ తలనొప్పులేవీ లేకుండా ఎస్బీఐ (SBI) క్రెడిట్ కార్డు బిల్లులను యూపీఐ యాప్ల ద్వారా చెల్లించే అవకాశం ఉందని మీకు తెలుసా?దేశంలో డిజిటల్ చెల్లింపు వ్యవస్థలో యూపీఐ భారీ మార్పులను తీసుకువచ్చింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అభివృద్ధి చేసిన రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్ ఇది. దీని ద్వారా వినియోగదారులు సెకన్లలో డబ్బు పంపవచ్చు. అలాగే స్వీకరించవచ్చు. యూపీఐ సేవలు నిరంతరం అందుబాటులో ఉంటాయి. ఈ క్రమంలో ఏ యూపీఐ యాప్ (UPI App) ద్వారా అయినా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ బిల్లును సులువుగా చెల్లించవచ్చు.నేడు మార్కెట్లో పేటీఎం, క్రెడ్, మొబిక్విక్, ఫోన్పే, అమెజాన్ పే వంటి అనేక ప్రసిద్ధ థర్డ్ పార్టీ మొబైల్ యాప్స్ ఉన్నాయి. వీటి ద్వారా క్రెడిట్ కార్డు బిల్లును చెల్లించవచ్చు. అయితే, ఈ యాప్ల ద్వారా చెల్లింపులు చేసేటప్పుడు సెటిల్మెంట్లో జాప్యం జరగవచ్చు. మరోవైపు యూపీఐ ద్వారా చెల్లింపు చేసినప్పుడు అది వెంటనే మీ క్రెడిట్ కార్డు ఖాతాలో ప్రతిబింబిస్తుంది. యూపీఐ ద్వారా చేసిన చెల్లింపులు తక్షణమే ప్రాసెస్ అవుతాయి. మీ క్రెడిట్ కార్డ్ బిల్లు సకాలంలో చెల్లింపు అవుతుంది.యూపీఐ యాప్ ద్వారా చెల్లించండిలా..» మీ స్మార్ట్ ఫోన్ లో మీకు ఇష్టమైన యూపీఐ యాప్ను తెరవండి» పేమెంట్ సెక్షన్కు వెళ్లి 'పే' లేదా 'సెండ్ మనీ' ఎంచుకోండి» మీ ఎస్బీఐ క్రెడిట్ కార్డుకు లింక్ చేసిన వర్చువల్ పేమెంట్ అడ్రస్ (వీపీఏ) ఎంటర్ చేయండి.» మీ క్రెడిట్ కార్డ్ బిల్లు కోసం మీరు చెల్లించాలనుకుంటున్న మొత్తాన్ని పేర్కొనండి.» వివరాలను సరిచూసుకుని పేమెంట్ను కన్ఫమ్ చేయండి.» ఈ మొత్తం మీ బ్యాంక్ ఖాతా నుండి డెబిట్ అయి మీ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఖాతాకు క్రెడిట్ అవుతుంది.క్యూఆర్ కోడ్ ద్వారా అయితే ఇలా..» మీ యూపీఐ యాప్ను తెరిచి 'స్కాన్ క్యూఆర్ కోడ్' ఆప్షన్ ఎంచుకోండి.» క్రెడిట్ కార్డు చెల్లింపుల కోసం ఎస్బీఐ అందించే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి.» మీరు చెల్లించాలనుకుంటున్న మొత్తాన్ని నమోదు చేయండి.» వివరాలను సరిచూసుకుని పేమెంట్ను కన్ఫమ్ చేయండి. -
హోలీ.. ఉగాది పండుగలు: మార్చిలో బ్యాంక్ హాలిడేస్ ఇవే..
ఫిబ్రవరి 2025 ముగుస్తోంది. దేశంలోని బ్యాంకుల నియంత్రణ సంస్థ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్చిలో బ్యాంకులు ఎన్ని రోజులు మూసి ఉంటాయో జాబితాను (Bank Holidays) విడుదల చేసింది. వచ్చే నెలలో వివిధ పనుల నిమిత్తం బ్యాంకులకు వెళ్లాల్సినవారు తప్పకుండా ఈ సెలవుల జాబితాను తెలుసుకోవాలి. తద్వారా మీ ప్రాంతంలో బ్యాంకులు ఎన్ని రోజులు మూసిఉంటాయో.. ఏయే రోజుల్లో పనిచేస్తాయో తెలుస్తుంది. తదనుగుణంగా బ్యాంకింగ్ పనిని ప్లాన్ చేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది.మార్చిలో బ్యాంక్ హాలిడేస్➤మార్చి 7 (శుక్రవారం): 'చాప్చార్ కుట్' పండుగను సందర్భంగా మిజోరాంలో సెలవు దినం.➤మార్చి 13 (గురువారం): మార్చి 13న హోలిక దహన్, అట్టుకల్ పొంగళ పండుగ కారణంగా జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కేరళ వంటి రాష్ట్రాల్లో సెలవు ఉంటుంది.➤మార్చి 14 (శుక్రవారం): హోలీ పండుగ సందర్భంగా.. త్రిపుర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, మణిపూర్, కేరళ, నాగాలాండ్ మినహా ఇతర రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో సెలవు.➤మార్చి 15 (శనివారం): కొన్ని రాష్ట్రాలు మార్చి 14కి బదులుగా మార్చి 15న హోలీని జరుపుకుంటాయి. ఈ జాబితాలో త్రిపుర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, మణిపూర్ ఉన్నాయి.➤మార్చి 22 (శనివారం): 'బీహార్ దివస్' లేదా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మార్చి 22న బీహార్లో బ్యాంకులకు సెలవు.➤మార్చి 27-28 (గురువారం-శుక్రవారం): ఇస్లామిక్ క్యాలెండర్లో ముఖ్యమైన రోజు అయిన షబ్-ఎ-ఖదర్ను పురస్కరించుకుని జమ్మూ కాశ్మీర్ మార్చి 27న సెలవు దినంగా పాటిస్తుంది. రంజాన్ నెల చివరి శుక్రవారం అయిన జుమాత్-ఉల్-విదాను పురస్కరించుకుని కేంద్రపాలిత ప్రాంతం మార్చి 28న సెలవు దినంగా పాటిస్తుంది.➤మార్చి 31 (సోమవారం): మిజోరం, హిమాచల్ ప్రదేశ్ మినహా.. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మార్చిలో ఈద్ సందర్భంగా ప్రభుత్వ సెలవు దినంగా పాటిస్తాయి.బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పని చేసుకోవాలనుకునే వారు బ్యాంక్ హాలిడేస్ గమనించి ముందుగానే పనులు పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్లైన్ సేవలు అన్నీ సెలవు దినాల్లో కూడా అందుబాటులో ఉంటాయి.(బ్యాంకింగ్ సెలవుల షెడ్యూల్ మారవచ్చు.. కాబట్టి హాలిడే క్యాలెండర్లో ఏవైనా అప్డేట్లు లేదా రివిజన్ల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. లేదా మీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక ప్రకటనలను గమనించాల్సి ఉంటుంది). -
EPFO కీలక ప్రకటన: ఆ గడువు మార్చి 15 వరకు పొడిగింపు
ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కటికీ ఈపీఎఫ్ఓ అకౌంట్ ఉంటుంది. వీరందరూ.. ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ (ELI) పథకం కింద ప్రయోజనాలను పొందడానికి, యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) యాక్టివేట్ చేయడానికి మాత్రమే కాకుండా.. మీ బ్యాంక్ ఖాతాను ఆధార్తో లింక్ చేయాలి. దీనికి గడువును ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) మార్చి 15, 2025 వరకు పొడిగించింది.ఈపీఎఫ్ఓ.. ఈఎల్ఐ స్కీమ్ కింద ప్రయోజనాలను పొందడానికి, యూఏఎన్ యాక్టివేషన్ & బ్యాంక్ ఖాతాలను ఆధార్తో లింక్ చేయడం తప్పనిసరి. దీనికోసం గడువును మార్చి 15కు పొడిగిస్తూ ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 21, 2025న జారీ చేసిన సర్క్యులర్లో పేర్కొంది. ఈ గడువును ఇప్పటికే పలుమార్పు పొడిగించారు. కాగా ఇప్పుడు మరోమారు పొడిగించారు.యూఏఎన్ అంటే ఏమిటి?యూఏఎన్ అనేది.. అర్హత కలిగిన జీతం పొందే ఉద్యోగికి 'ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్' కేటాయించిన 12-అంకెల సంఖ్య. ఇది వారి కెరీర్ అంతటా వివిధ యజమానులలో వారి PF ఖాతాలను నిర్వహించడానికి ఒకే యాక్సెస్ పాయింట్గా పనిచేస్తుంది. ఒకే సంఖ్య కింద వారి ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్లను ట్రాక్ చేయడానికి, యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది.యూఏఎన్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే?➤ఈపీఎఫ్ఓ మెంబర్ మొదట అధికారిక ఈపీఎఫ్ఓ పోర్టల్ ఓపెన్ చేయాలి.➤అధికారిక పోర్టల్ ఓపెన్ చేసిన తరువాత సర్వీసెస్ సెలక్ట్ చేసి.. అందులో ఫర్ ఎంప్లాయీఎస్ ఆప్షన్ ఎంచుకోవాలి.➤తరువాత మెంబర్ యూఏఎన్ లేదా ఆన్లైన్ సర్వీసెస్ మీద క్లిక్ చేయాలి. ఆలా క్లిక్ చేసిన తరువాత ఓ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.➤కొత్త పేజీలో.. కుడివైపు కింద భాగంలో ఇంపార్టెంట్ లింక్స్ విభాగంలో యాక్టివేట్ యువర్ యూఏఎన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.➤క్లిక్ చేయగానే.. ఒక ఫారమ్ వంటిది కనిపిస్తుంది. అందులో మీ పేరు, పుట్టిన తేదీ, ఫోన్ నెంబర్ వంటి అవసరమైన అన్ని వివరాలను ఫిల్ చేయాలి.➤అన్నీ ఫిల్ చేసిన తరువాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి, ధృవీకరించడానికి కింద కనిపించే బాక్స్ మీద క్లిక్ చేయాలి.➤తరువాత గెట్ ఆథరైజేషన్ పిన్ మీద క్లిక్ చేయాలి. ఇలా చేసిన తరువాత మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది.➤ఓటీపీ ఎంటర్ చేసిన తరువాత.. ఐ అగ్రీపై క్లిక్ చేయాలి. -
యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ గురించి తెలుసా..?
సంప్రదాయ ఉద్యోగ ఆధారిత పథకాలను మించిన యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ పథకం మెరుగైన ఫలితాలు ఇస్తుందని, ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా దీన్ని రూపొందిస్తున్నట్లు కొన్ని సంస్థలు కథనాలు ప్రచురిస్తున్నాయి. అందులోని వివరాలు కింది విధంగా ఉన్నాయి.అసంఘటిత రంగాల్లోని కార్మికులు, వ్యాపారులు, 18 ఏళ్లు పైబడిన స్వయం ఉపాధి పొందుతున్న అన్ని వర్గాల వారికి ఈ పథకం వర్తిస్తుందని భావిస్తున్నారు. అలాగే ఈ పథకం ఏ నిర్దిష్ట ఉపాధితో ముడిపడి ఉండదని చెబుతున్నారు. వ్యక్తులు తమ పదవీ విరమణ తర్వాత పెన్షన్ పొందేలా దీన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ పెన్షన్ పథకంపై కార్మిక మంత్రిత్వ శాఖ చర్చలు ప్రారంభించిందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు.రెండు పథకాలను కలుపుతారా..?ఈ పథకానికి సంబంధించిన పూర్తి ఫ్రేమ్వర్క్ను ఖరారు చేసిన తర్వాత, ఇతర వివరాలను జోడించేందుకు, దాన్ని మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కీలక భాగస్వాముల నుంచి సూచనలు కోరుతుంది. ఇప్పటికే ఉన్న ప్రధాన మంత్రి-శ్రమ యోగి మాన్ధన్ స్కీమ్ (పీఎం-ఎస్వైఎం), నేషనల్ పెన్షన్ స్కీమ్ ఫర్ ట్రేడర్స్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ (ఎన్పీఎస్-ట్రేడర్స్) వంటి పెన్షన్ పథకాలను ఒకే వ్యవస్థ కింద క్రమబద్ధీకరించడం, వాటిని మరింత ప్రయోజనకరంగా, సులభంగా అందుబాటులో ఉంచడం ఈ పథకం లక్ష్యంగా భావిస్తున్నారు. ఈ రెండు పథకాలు స్వచ్ఛందంగా 60 ఏళ్ల తరువాత నెలకు రూ.3000 పెన్షన్ అందిస్తుంది. అందుకు వయసును అనుసరించి రూ.55 నుంచి రూ.200 వరకు కంట్రిబ్యూట్ చేయాలి.అటల్ పెన్షన్ యోజన పథకం కూడా కొత్త పథకంలో చేరే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు. బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ (బీవోసీడబ్ల్యూ) చట్టం కింద వసూలు చేసిన మొత్తాన్ని ఈ రంగంలోని కార్మికులకు పింఛన్ల కోసం ఉపయోగించే అవకాశం ఉందని భావిస్తున్నారు.ఇదీ చదవండి: ఐదేళ్లలో రిలయన్స్ రూ.50,000 కోట్ల పెట్టుబడులుఈ పథకం ఎందుకు అవసరం?భారతదేశంలో 60 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్న సీనియర్ సిటిజన్ జనాభా 2036 నాటికి 22.7 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. వారికి ఎలాంటి ఆదాయం లేని సమయంలో సమగ్ర సామాజిక భద్రత లేదా పెన్షన్ పథకం అవసరం ఉంటుంది. అమెరికా, యూరప్, కెనడా, రష్యా, చైనా వంటి అనేక దేశాల్లో పింఛన్లు, ఆరోగ్యం, నిరుద్యోగం వంటి వాటికి సామాజిక బీమా వ్యవస్థలు ఉన్నాయి. భారతదేశంలో సామాజిక భద్రత అధికంగా ప్రావిడెంట్ ఫండ్ వ్యవస్థ, వృద్ధాప్య పింఛన్లు, ఆరోగ్య భీమాపై ఆధారపడి ఉంది. ఇది ప్రధానంగా దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి ప్రయోజనం చేకూరుస్తుంది. -
ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ చెల్లింపులు: ఎలా చేయాలంటే..
ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా.. యూపీఐ చెల్లింపులు చేయడం సాధ్యం కాదని అందరూ అనుకుంటారు. కానీ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రారంభించిన *99# సర్వీస్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండానే లావాదేవీలను పూర్తి చేయవచ్చు. ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా యూపీఐ ట్రాన్సక్షన్ ఎలా చేయాలి?.. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.ఎన్పీసీఐ ప్రారంభించిన *99# సర్వీస్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండానే.. బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఇంటర్బ్యాంక్ ఫండ్ బదిలీ చేయవచ్చు, యూపీఐ పిన్ను సెట్ చేసుకోవచ్చు లేదా మార్చుకోవచ్చు. అయితే యూపీఐ చెల్లింపులు చేయాలంటే కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది.ఇంటర్నెట్ లేకుండా యూపీఐ చెల్లింపు చేయడం ఎలా..➤మీ బ్యాంక్ ఖాతాకు లింక్ అయిన.. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి *99# కు డయల్ చేయండి.➤డయల్ చేసిన తరువాత భాషను ఎంచుకోవాలి.➤మీ బ్యాంక్ పేరును ఎంటర్ చేసిన తరువాత.. మీ మొబైల్ నెంబర్కు లింక్ అయిన బ్యాంక్ ఖాతాల జాబితా కనిపిస్తుంది.➤కావాల్సిన ఖాతాను ఎంచుకోవాలి. ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయడానికి.. డెబిట్ కార్డ్ చివరి ఆరు అంకెలు, గడువు తేదీని ఎంటర్ చేయాలి.➤యూపీఐ పిన్ నెంబర్ సెట్ చేయకపోతే.. సెట్ చేసుకోవాలి. ఈ పిన్ లావాదేవీలను నిర్దారించడానికి ఉపయోగపడుతుంది.డబ్బు పంపించాలంటే..➤మీ ఫోన్లో *99# డయల్ చేసిన తరువాత.. డబ్బు పంపడానికి ఆప్షన్ ఎంచుకోవాలి.➤ఆ తరువాత ఎవరికైతే డబ్బు పంపించాలనుకుంటున్నారో.. వారి యూపీఐ ఐడీ లేదా బ్యాంక్ ఖాతా నెంబర్ ఎంటర్ చేయడానికి కావలసిన ఆప్షన్ ఎంచుకోవాలి.➤మీరు పంపించాలనుకున్న మొత్తాన్ని.. ఎంటర్ చేసి చేసిన తరువాత.. లావాదేవీలను ధృవీకరించడానికి పిన్ నెంబర్ నమోదు చేయండి. -
ఆదాయపన్నులో మార్పులు.. తరచూ అడిగే ప్రశ్నలు
ఈసారి బడ్జెట్ ప్రతిపాదనలతో పాటు సందేహాల నివృత్తి కోసం తరచుగా అడిగే ప్రశ్నలకు జవాబులు కూడా పొందుపర్చారు. ఇలా చేయటంతో డిపార్టుమెంటువారీ స్నేహభావం, సన్నద్ధంగా ఉండే విధానం రెండూ తెలుస్తున్నాయి. వ్యక్తుల ఆదాయపు పన్ను వరకు 21 ప్రశ్నలు ఉన్నాయి. వాటి సారాంశమే ఈ వారం కథనం.కొత్త విధానం అంటే ఏమిటి?కొత్త విధానంలో రాయితీ ఉండే పన్ను రేట్లు, ఉదారమైన శ్లాబులుంటాయి. స్టాండర్డ్ డిడక్షన్ మినహా ఎటువంటి మినహాయింపులు ఉండవు.రేట్లు, శ్లాబులుగతంలో ఈ శ్లాబులు, రేట్ల గురించి తెలియజేశాం. ఇక్కడ బేసిక్ లిమిట్ రూ.3,00,000 నుంచి రూ.4,00,000కు పెంచారు. రూ.4 లక్షల వరకు పన్ను ఉండదు. రూ.12 లక్షలు దాటిన వారికి మాత్రం రూ.4,00,000 నుంచి పన్ను శ్లాబుల ప్రకారం వడ్డిస్తారు. శ్లాబుల విషయంలో నాలుగో ఎక్కం.. రేట్ల విషయంలో ఐదో ఎక్కం గుర్తు పెట్టుకుంటే చాలు. ప్రతి రూ.ఒక లక్ష ఆదాయం పెరుగుదలకు ఎంత పన్ను భారం ఏర్పడుతుంది? ప్రస్తుతం ఎంత? ప్రతిపాదనల వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది? అనే విషయాలను అంకెలతో ఉదాహరణగా పట్టిక పొందుపరిచారు.ఎంత వరకు పన్ను చెల్లించనక్కర్లేదు?కొత్త విధానంలో రూ.12,00,000 వరకు పన్ను భారం ఏర్పడదు.పన్ను భారం ‘నిల్‘గా ఉండాలంటే ఏం చేయాలి?రూ.12,00,000 వరకు ఆదాయంపై పన్ను భారం నిల్గా ఉండాలంటే కొత్త విధానాన్ని విధిగా ఎంచుకోవాలి. ఆ మేరకు రిటర్నులు దాఖలు చేయాలి. కొత్త విధానం ఎవరికి వర్తిస్తుంది?కొత్త విధానం వ్యక్తులకు, హిందూ ఉమ్మడి కుటుంబాలకు, వ్యక్తుల కలయిక లేదా సంస్థలకు వర్తిస్తుంది.పన్నెండు లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి ఏమిటి ప్రయోజనం?ఒకప్పుడు రూ.12,00,000 ఆదాయం ఉన్న వారు రూ.80,000 వరకు పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు వారు ఏమీ చెల్లించనక్కర్లేదు.ఆదాయ పరిమితిని పెంచినట్లా?అవుననే చెప్పాలి. నిల్గా పన్ను భారం రావాలంటే రూ.12,00,000 లోపల ఆదాయం ఉండాలి. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే ట్యాక్సబుల్ పరిమితిని పెంచినట్లు. అంటే రిబేటును పూర్తిగా వాడుకున్నట్లు.గతంలో ‘నిల్’కి లిమిట్ ఎంత ఉంది?ఒకప్పుడు ఇటువంటి లిమిట్ రూ.7,00,000గా ఉండేది. ఇప్పుడు ఈ పరిమితిని రూ.12,00,000కు పెంచారు.కొత్త విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ తగ్గిస్తారా?కొత్త విధానంలో ఉద్యోగస్తులకు రూ.75,000 తగ్గిస్తారు. ఈ తగ్గింపును పరిగణనలోకి తీసుకుంటే ఉద్యోగస్తులకు రూ.12,75,000 వరకు పన్ను ఉండదు.పాత విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ ఎంత?పాత విధానంలో రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్ మాత్రమే. ఎటువంటి పెంపుదల లేదు. మార్జినల్ రిలీఫ్ను ఎలా లెక్కించాలి?రూ.12,00,000 దాటితే రూ.4,00,000 నుంచి పన్ను భారం లెక్కించాలి. మీ ఆదాయం రూ.12,10,000 అనుకోండి, సాధారణంగానైతే పన్ను భారం రూ.61,500. ఇటువంటి వారికి ఇచ్చే ఉపశమనాన్నే మార్జినల్ రిలీఫ్ అంటారు. ఈ రిలీఫ్ వల్ల స్వల్పంగా అదనపు ఆదాయం ఉన్నా అధిక పన్ను చెల్లించనక్కర్లేదు. ఇలాంటప్పుడు పన్నుభారం రూ.10,000 మాత్రమే. ఇలా రూ.12,75,000 వరకు రిలీఫ్ కల్పించారు. ఈ మేరకు చక్కటి, సంపూర్ణమైన ఉదాహరణ ఇచ్చారు.ఎంత మొత్తం రిబేటు ఉంటుంది?రిబేటు రూ.60,000 దాటి ఇవ్వరు.రిబేటుకి మార్జినల్ రిలీఫ్కి తేడా ఏమిటి?రూ.12,00,000 లోపు ఆదాయం ఉన్నప్పుడు ఇచ్చేది రిబేటు. రూ.12,00,000 దాటిన తర్వాత (రూ.12,75,000 వరకు) వచ్చేది మార్జినల్ రిలీఫ్.ఇదీ చదవండి: ఫండ్ పనితీరు మదింపు ఇలా..ఇతర ఆదాయాలకు రిబేటు వర్తిస్తుందా?మూలధన లాభాలు, లాటరీ మొదలైన వాటి వల్ల ఏర్పడ్డ ఆదాయాలకు ఈ రిబేటు వర్తించదు. ఏ ఆదాయం మీద స్పెషల్ రేటు ఉందో, దాని మీద రిబేటు రాదు.ఎంత మంది లబ్ధిదార్లు ఉన్నారు?గత సంవత్సరం 8.75 కోట్ల మంది కొత్త విధానంలో రిటర్నులు వేశారు. వారందరికీ ఇప్పుడు లాభం చేకూరుతుంది.ఎంత ఆదా అవుతుంది?ఈ మార్పుల వల్ల సుమారుగా రూ.లక్ష కోట్లు ట్యాక్స్పేయర్స్ చేతిలో మిగులుతుంది. అదే వినియోగం పెరిగేందుకు నాంది.-కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య ట్యాక్సేషన్ నిపుణులు -
స్టాక్స్ అమ్మి ఫ్లాట్ కొనడం మంచిదా?
స్టాక్స్లో, మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న పెట్టుబడులను విక్రయించి, ఉత్తర బెంగళూరులో ఫ్లాట్ కొనాలన్నది నా ఆలోచన. వచ్చే ఐదేళ్ల కాలానికి ఇది మంచి ఆప్షన్ అవుతుందా? లేదంటే మరో ఐదేళ్లపాటు ఈ పెట్టుబడులు కొనసాగించిన అనంతరం ఫ్లాట్ కొనుగోలు చేసుకోవాలా? ఈ రెండింటిలో ఏది మెరుగైన ఆప్షన్? – శంకర్ కృష్ణమూర్తిఈ విషయంలో కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫ్లాట్ కొనుగోలు చేస్తే ఎంత మేర లాభపడొచ్చు? దీని ద్వారా వచ్చే అద్దె ఆదాయం ఏ మేరకు ఉంటుంది? ఇవన్నీ పరిశీలించాలి. ఫ్లాట్పై పెట్టుబడి విలువకు వృద్ధి ఉండి, 4–6 శాతం మేర అద్దె రాబడి వచ్చేట్టు అయితే ఇప్పుడే స్టాక్స్ విక్రయించి కొనుగోలు చేయడం మంచి నిర్ణయం అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులను విక్రయించేంత వరకు ఎలాంటి పన్నులు చెల్లించక్కర్లేదు. కనుక పెట్టుబడి వృద్ధి, రిస్క్, పెట్టుబడి పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అద్దె ఇంట్లో ఉంటూ, సొంత అవసరాల కోసం ఇల్లు కొనుగోలు చేస్తున్నట్టు అయితే ఇప్పుడు కొనుగోలు చేయడం మంచి నిర్ణయం అవుతుంది. అలాంటప్పుడు తక్కువ రాబడి వచ్చినా ఫర్వాలేదు.మిడ్క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ తమ నిర్వహణ ఆస్తుల్లో (ఏయూఎం/పెట్టుబడులు) 30 శాతాన్ని లార్జ్క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. అలాంటప్పుడు ప్రత్యేకంగా లార్జ్క్యాప్ ఫండ్లో పెట్టుబడికి బదులు ఒకే మిడ్క్యాప్ ఫండ్లో ఎందుకు పెట్టకూడదు? దీనివల్ల రీబ్యాలన్స్ చేయాల్సిన అవసరం తప్పుతుందిగా? – రాఘేవేంద్ర సోరబ్మిడ్క్యాప్ ఫండ్లో అంతర్గతంగా ఉండే అస్థిరతల పట్ల సౌకర్యంగా ఉండేట్టు అయితే ఇన్వెస్ట్ చేయడం మంచి వ్యూహమే అవుతుంది. మిడ్క్యాప్ మ్యూచువల్ ఫండ్స్కు నిబంధనల పరంగా కొంత వెసులుబాటు ఉంది. అవి తమ నిర్వహణ ఆస్తుల్లో కనీసం 65 శాతాన్ని మిడ్క్యాప్ స్టాక్స్ కేటాయించాల్సి ఉంటుంది. మిగిలిన 35 శాతం పెట్టుబడులను లార్జ్క్యాప్ లేదా స్మాల్క్యాప్లో ఎక్కడైనా, ఎంత మేరకు అయినా కేటాయింపులు చేసుకోవచ్చు. ఇది ఫండ్ మేనేజర్ విచక్షణపైనే ఆధారపడి ఉంటుంది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఫండ్ మేనేజర్లు 35 శాతం పెట్టుబడులను వివిధ విభాగాల మధ్య మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. అయితే, చాలా మిడ్క్యాప్ ఫండ్స్ లార్జ్క్యాప్కు చాలా తక్కువగా అంటే.. సగటున 12 శాతం మేర కేటాయింపులు చేస్తున్నాయి. ఇవి ఎక్కువ శాతం పెట్టుబడులను మిడ్క్యాప్ స్టాక్స్కే కేటాయిస్తుంటాయి. ఇదీ చదవండి: ఆరోగ్య బీమా.. భారం తగ్గేదెలా?మిడ్క్యాప్ ఫండ్ ఆస్తుల సైజు చిన్నగా ఉంటే అప్పుడు ఫండ్ మేనేజర్ లార్జ్క్యాప్ ఎక్స్పోజర్ బదులు నూరు శాతం పెట్టుబడులను మిడ్క్యాప్ కోసమే కేటాయించడం సరైన విధానం అవుతుంది. లార్జ్, మిడ్, స్మాల్క్యాప్ వ్యాప్తంగా వైవిధ్యమైన పెట్టుబడులను మీరు కోరుకుంటుంటే అప్పుడు మిడ్క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం మంచి నిర్ణయం కాబోదు. మల్టీక్యాప్ ఫండ్స్ అయితే లార్జ్, మిడ్, స్మాల్క్యాప్ విభాగాల్లో కనీసం 25 శాతం చొప్పున పెట్టుబడులు పెడుతుంటాయి. ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్కు ఏ మార్కెట్ క్యాప్ విభాగంలో అయినా ఇన్వెస్ట్ చేసే స్వేచ్ఛ వీటికి ఉంటుంది. అయినప్పటికీ ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ 80 శాతం వరకు లార్జ్క్యాప్ కంపెనీలకే కేటాయిస్తుంటాయి.ధీరేంద్ర కుమార్, వ్యాల్యూ రీసెర్చ్ సీఈవో -
ఆరోగ్య బీమా.. భారం తగ్గేదెలా?
ఆరోగ్య అత్యవసర స్థితి చెప్పి రాదు. ఆహారం, నిద్ర వేళల్లో మార్పులు.. గంటల తరబడి కూర్చొని చేసే ఉద్యోగాల ప్రభావంతో జీవనశైలి వ్యాధుల రిస్క్ పెరిగింది. వీటి కారణంగా ఆస్పత్రి పాలైతే బిల్లులు చెల్లించడం మెజారిటీ వ్యక్తులకు అసాధ్యమే కాదు, ఆర్థికంగా కుదేలయ్యే పరిస్థితి. ఇలాంటి అనిశ్చితులకు రక్షణ కవచమే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. కరోనా తర్వాత వీటి ప్రీమియంలు దాదాపుగా రెట్టింపయ్యాయి. మోయలేనంత భారంగా మారాయి. ఇది చూసి ఇప్పటికీ హెల్త్ ప్లాన్కు దూరంగా ఉన్నవారు ఎందరో. కానీ, ప్రతి వ్యక్తికీ, ప్రతి కుటుంబానికీ ఇది తప్పనిసరి. కావాలంటే ప్రీమియం తగ్గించుకునే మార్గాన్ని వెతకండి. అంతేకానీ, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా రక్షణ కల్పించే హెల్త్ ఇన్సూరెన్స్కు దూరంగా ఉండొద్దనేది నిపుణుల మాట! ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అధ్యయనం ప్రకారం.. దేశంలో 35 శాతం మంది హైపర్టెన్షన్ (అధిక రక్తపోటు)తో బాధపడుతున్నారు. 10 శాతం మందికి మధుమేహం సమస్య ఉంటే, 28 శాతం మంది అధిక కొలెస్ట్రాల్ను ఎదుర్కొంటున్నారు. జీవనశైలి వ్యాధులు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. మరోవైపు వైద్య రంగంలో అత్యాధునిక చికిత్సా విధానాలు.. మరింత కచ్చితత్వంతో, మెరుగైన ఫలితాలనిచ్చే రోబోటిక్ సర్జరీలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ వ్యయాలను అందరూ భరించలేరు. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ తప్పకుండా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే.. హెల్త్ ఇన్సూరెన్స్ను వీలైనంత చిన్న వయసులోనే తీసుకోవాలి. అంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు తీసుకోవడం వల్ల ప్రీమియం తక్కువగా ఖరారవుతుంది. వయసు, ఆరోగ్య చరిత్ర తదితర అంశాలను బీమా సంస్థ పాలసీ జారీకి ముందు మదింపు చేస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు విషయంలో.. 25 ఏళ్ల వయసు వ్యక్తికి, 40 ఏళ్ల వయసు వ్యక్తికి ప్రీమియంలో ఎంతో వ్యత్యాసం ఉంటుంది. చిన్న వయసులో, ఆరోగ్యంగా ఉన్నప్పుడు పాలసీ తీసుకుంటే, ఆ తర్వాతి కాలంలో ప్రీమియం పెరగదా? అన్న సందేహం రావచ్చు. 35 ఏళ్లు నిండిన తర్వాత, 45 ఏళ్లు, 55 ఏళ్లు, 60 ఏళ్లు నిండిన తర్వాత వయసువారీ ప్రీమియం రేట్లు కచ్చితంగా సవరణకు నోచుకుంటాయి. కానీ, 35–40 ఏళ్ల తర్వాత కొత్తగా పాలసీ తీసుకునే వారితో పోల్చితే, 25 ఏళ్లలోపు వారికి ప్రీమియం తక్కువే ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు తీసుకుంటే, మూడేళ్లలో అన్ని రకాల వెయిటింగ్ పీరియడ్లు దాటేస్తారు. ముందస్తు వ్యాధులకు సైతం కవరేజీ అర్హత లభిస్తుంది. పైగా పాలసీ తీసుకుని 60 నెలలు (ఐదేళ్ల ప్రీమియం చెల్లింపులు) ముగిస్తే, ఆరోగ్య చరిత్రను సరిగ్గా వెల్లడించలేదనో, సమాచారం దాచిపెట్టారనే కారణంతో క్లెయిమ్ను బీమా సంస్థ తిరస్కరించడానికి కుదరదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ముందుగా తీసుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలతోపాటు ప్రీమియం భారం తగ్గుతుంది. బోనస్, రీస్టోరేషన్ కేవలం రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్నే తీసుకున్నప్పటికీ అదనపు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండా కవరేజీని పెంచుకునే మార్గాలు కూడా ఉన్నాయి. దాదాపు అన్ని బీమా కంపెనీలు నో క్లెయిమ్ బోనస్, రీస్టోరేషన్ ఫీచర్లను అందిస్తున్నాయి. ఒక పాలసీ సంవత్సరంలో ఎలాంటి క్లెయిమ్ లేకపోతే 50–200 శాతం మేర సమ్ అష్యూర్డ్ (బీమా కవరేజీ)ను నో క్లెయిమ్ బోనస్ రూపంలో బీమా సంస్థలు ఇస్తుంటాయి. అప్పుడు రూ.5 లక్షల కవరేజీ రూ.10–15 లక్షలకు చేరుతుంది. రీస్టోరేషన్ సదుపాయం అన్నది.. హాస్పిటల్లో చేరినప్పుడు కవరేజీ పూర్తిగా అయిపోతే అంతే మొత్తాన్ని తిరిగి ఆ పాలసీ సంవత్సరానికి పునరుద్ధరించడం. కొన్ని బీమా సంస్థలు ఏడాదిలో ఒక్క రీస్టోరేషన్నే ఇస్తుంటే, కేర్, ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ తదితర కంపెనీలు కొన్ని ప్లాన్లలో అపరిమిత రీస్టోరేషన్ సదుపాయాలను ఆఫర్ చేస్తున్నాయి. ఇవి తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల బేస్ సమ్ అష్యూర్డ్ తక్కువగా ఎంపిక చేసుకున్నప్పటికీ ఎలాంటి నష్టం ఉండదు. పైగా ప్రీమియం భారం తగ్గుతుంది. చిన్న క్లెయిమ్లకు దూరం ఏడాదిలో ఎలాంటి క్లెయిమ్ లేకపోతేనే నో క్లెయిమ్ బోనస్ వస్తుంది. కనుక చిన్న క్లెయిమ్లకు దూరంగా ఉండాలి. ఉదాహరణకు రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్కు ఎలాంటి క్లెయిమ్ లేకపోతే ఏటా 50 నుంచి 100 శాతం చొప్పున సమ్ అష్యూర్డ్ పెరుగుతుంది. ఒకవేళ క్లెయిమ్ చేస్తే ఎంత అయితే పెరిగిందో, అంతే మేర తగ్గిపోతుంది. కనుక చిన్న క్లెయిమ్ కోసం రూ.2.5–5 లక్షల సమ్ అష్యూర్డ్ను ఒక ఏడాదిలో నష్టపోవాల్సి వస్తుంది. అందుకే రూ.50 వేల లోపు చిన్న వ్యయాలను సొంతంగా భరించడమే మంచిది. మంచి ఆహారం, జీవనశైలి.. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం కదా అన్న భరోసాతో ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తామా? అలా చేయడం మన సమస్యలను మరింత పెంచుతుంది. మంచి ఆరోగ్యం కోసం తమ వంతు కృషి చేయాల్సిందే. దీనివల్ల ఆస్పత్రి పాలు కావడాన్ని సాధ్యమైన మేర నివారించొచ్చు. దీనివల్ల ప్రీమియం కూడా తగ్గుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో చాలా వరకు ఈ ప్రయోజనాన్ని అందిస్తున్నాయి. ఎన్ని కేలరీలు ఖర్చు చేస్తే అంత ప్రయోజనం లభిస్తుంది. రోజువారీ నడక, పరుగు, ఏరోబిక్ వ్యాయా మాలు చేయడం ద్వారా హెల్త్ క్రెడిట్స్ పొందొచ్చు. వీటిని ప్రీమియంలో సర్దుబాటు చేసుకోవచ్చు. తద్వారా ప్రీమియంలో 100% రాయితీని సైతం కొన్ని సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. ముఖ్యంగా పొగతాగడం, మద్యపానం, గుట్కా/జర్దాలకు దూరంగా ఉండాలి. ఈ అలవాట్ల గురించి ఆరోగ్య చరిత్రలో వెల్లడించాల్సిందే. వీటి కారణంగా ప్రీమియం గణనీయంగా పెరిగిపోతుంది. వీటిని మానేయడం ద్వారా ప్రీమియం తగ్గించుకోవచ్చు.సూపర్ టాపప్ నేటి రోజుల్లో నలుగురు సభ్యుల ఒక కుటుంబానికి కనీసం రూ.10 లక్షల హెల్త్ కవరేజీ ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఇది కూడా చాలకపోవచ్చు. కానీ, రూ.10 లక్షల హెల్త్ ప్లాన్ కోసం 30 ఏళ్ల వ్యక్తి కుటుంబానికి రూ. 20 వేల వరకు ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. దీనికి బదులు రూ.5 లక్షల బేసిక్ ఇండెమ్నిటీ ప్లాన్ పరిశీలించొచ్చు. దీనికి అదనంగా రూ.5 లక్షల డిడక్టబుల్తో సూపర్ టాపప్ ప్లాన్ తీసుకోవాలి. ఉదాహరణకు రూ.50 లక్షల సూపర్ టాపప్ ప్లాన్ రూ.3,000కే వస్తుంది. ఇందులో మొదటి రూ.5 లక్షల బిల్లును మినహాయించి, ఆపై ఉన్న మొత్తానికి చెల్లింపులు లభిస్తాయి. రూ.10 లక్షల హెల్త్ ప్లాన్ ప్రీమియం అందుబాటు ధరలోనే వస్తే, అప్పుడు రూ.10 లక్షల డిడక్టబుల్తో రూ.50 లక్షలు లేదా రూ.కోటికి సూపర్ టాపప్ ప్లాన్ జోడించుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. మెరుగైన క్రెడిట్ స్కోర్ వ్యక్తిగత రుణ చరిత్రకు, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంకు సంబంధం ఏంటని అనుకుంటున్నారా?.. కొన్ని బీమా సంస్థలు మెరుగైన సిబిల్ స్కోర్ ఉన్న కస్టమర్లకు ప్రీమియంలో తగ్గింపు ఇస్తున్నాయి. ఎక్కువ స్కోరు ఉందంటే.. ఆర్థిక క్రమశిక్షణతో నడుచుకుంటున్నారని అర్థం. ఇలాంటి వారిని తక్కువ రిస్క్ కస్టమర్లుగా చూస్తూ ప్రీమియంలో డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నాయి. 15 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు.ఆన్లైన్లో కొనుగోలు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ, ఫీచర్లపై అవగాహన కలిగిన వారు ఆన్లైన్లో కొనుగోలు చేయడం ద్వారా ప్రీమియంలో డిస్కౌంట్ పొందొచ్చు. పైగా పాలసీబజార్ పోర్టల్పై మొబైల్ ఓటీపీతో లాగిన్ అయ్యి, అన్ని బీమా సంస్థల పాలసీలను పరిశీలించొచ్చు. వాటి ఫీచర్లు, ప్రీమియం వ్యత్యాసాన్ని గమనించొచ్చు. తద్వారా మెరుగైన ఫీచర్లతో, తక్కువ ప్రీమియంతో ఉండే పాలసీని గుర్తించొచ్చు. బీమా సంస్థ పోర్టల్ ద్వారా నేరుగా పాలసీని కొనుగోలు చేయవచ్చు. దీనివల్ల స్వయంగా వివరాలు నమోదు చేయడం, నియమ, నిబంధనల గురించి అవగాహన కూడా ఏర్పడుతుంది. కొంత రాజీపడితే? సదుపాయాల విషయంలో కొంత రాజీధోరణితో వెళ్లేట్టు అయితే అప్పుడు కూడా ప్రీమియం భారాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఇందులో రూమ్ టైప్ ఒకటి. ఆస్పత్రిలో చేరినప్పుడు రోగికి ఐసీయూ వెలుపల పడక అవసరమవుతుంది. జనరల్ వార్డ్, షేరింగ్, సింగిల్ రూమ్, డీలక్స్ రూమ్ ఇలా పలు రకాలుంటాయి. పడక విషయంలో ఎలాంటి పరిమితుల్లేని పాలసీకి ఎక్కువ మంది మొగ్గు చూపిస్తుంటారు. ఒక విధంగా ఇదే సౌకర్యమైనది. ప్రీమియం భరించగలిగే వారు రూమ్ రెంట్లో పరిమితులు లేకుండా ఎంపిక చేసుకోవాలి. ప్రీమియం భారంగా భావించే వారు.. షేరింగ్ ఆప్షన్ను ఎంపిక చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రైవేటు రూమ్ల్లోని సేవలతో పోల్చినప్పుడు షేరింగ్లో అందించే వైద్య సేవల చార్జీలు తక్కువగా ఉంటాయి. కనుక మొత్తం మీద బిల్లు తగ్గుతుంది. ఇది బీమా సంస్థపై భారాన్ని తగ్గిస్తుంది. షేరింగ్లోనూ రోగికి మెరుగైన సేవలే అందుతాయి. కనుక దీన్ని పరిశీలించొచ్చు. పైన చెప్పుకున్న అన్ని ఆప్షన్లు దాటి వచి్చన తర్వాత కూడా ప్రీమియం భారంగా అనిపిస్తే.. కోపేమెంట్కు వెళ్లడమే. ఈ విధానంలో ప్రతి ఆస్పత్రి బిల్లులో పాలసీదారు తన వంతు చెల్లించాల్సి వస్తుంది. ఉదాహరణకు 10 శాతం కో–పేమెంట్ ఎంపిక చేసుకున్నారని అనుకుందాం. రూ.2 లక్షల బిల్లు వచి్చనప్పుడు రోగి తన జేబు నుంచి రూ.20 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ కోపేమెంట్ ఆప్షన్కైనా వెళ్లొచ్చు. కానీ, దీనివల్ల ఏటా ప్రీమియం భారం తగ్గుతుంది కానీ, ఆస్పత్రిలో చేరినప్పుడు ఆ మేరకు జేబుపై భారం పడుతుందిఈఎంఐ రూపంలో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఏడాదికి ఒకే వాయిదాలో చెల్లించాల్సి ఉంటుంది. జీవిత బీమాలో మాదిరి నెలవారీ లేదా త్రైమాసికం లేదా ఆరు నెలలకోసారి ఆప్షన్ లేదు. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఒకే విడత అంత మొత్తం అంటే భారంగా అనిపించొచ్చు. అలాంటి వారు ఈఎంఐ ఆప్షన్ ఎంపిక చేసుకోవచ్చు. కొన్ని రకాల కార్డులపై బీమా సంస్థలు ఈ సదుపాయం కల్పిస్తున్నాయి. నెట్వర్క్ ఆస్పత్రుల్లోనే.. ప్రతి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ నెట్వర్క్ ఆస్పత్రులతో ఒక జాబితాను నిర్వహిస్తుంటుంది. తమ క్లయింట్లకు కొంచెం తగ్గింపు రేట్లపై సేవలు అందించే దిశగా ఆయా ఆస్పత్రులతో బీమా కంపెనీకి టైఅప్ ఉంటుంది. కనుక నాన్ నెట్వర్క్ ఆస్పత్రులతో పోల్చి చూస్తే నెట్వర్క్ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకోవడం వల్ల తక్కువ చార్జీలు పడతాయి. ఈ మేరకు బీమా కంపెనీలకు ఆదా అవుతుంది. కనుక స్టార్ హెల్త్ వంటి కొన్ని బీమా సంస్థలు నెట్వర్క్ ఆస్పత్రుల్లోనే చికిత్స తీసుకుంటే ప్రీమియంలో 15 శాతం వరకు రాయితీని అందిస్తున్నాయి. ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ కుటుంబంలో ప్రతి ఒక్కరికీ ఇండివిడ్యువల్ హెల్త్ కవరేజీ తీసుకుంటే ప్రీమియం ఎక్కువ పడుతుంది. దీనికి బదులు కుటుంబం అంతటికీ ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకోవాలి. ఎందుకంటే కుటుంబంలో అందరికీ కలిపి కవరేజీ ఒక్కటే అవుతుంది. కనుక ప్రీమియం తగ్గుతుంది. వెల్నెస్ ప్రయోజనాలు ఉపయోగించుకోవాలి.. తీసుకునే హెల్త్ ప్లాన్లో హెల్త్ చెకప్ వంటి వెల్నెస్ ప్రయోజనాలు ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల ఏడాదికోసారి ఉచితంగా అన్ని రక్త పరీక్షలు చేయించుకోవచ్చు. ఇందుకు అదనంగా పడే ప్రీమియం ఉండదు. కానీ, ఆరోగ్యం ఎలా ఉందన్నది గమనించుకోవచ్చు. ఈ మేరకు కొంత ఆదా చేసినట్టే అవుతుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఈపీఎఫ్ కనీస పెన్షన్.. నెలకు రూ. 7500?
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కింద ఉన్న, ప్రైవేట్ రంగ ఉద్యోగులు చాలా కాలంగా తమ కనీస పెన్షన్ను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన 2025-26 బడ్జెట్ సమావేశంలో నిర్మలా సీతారామన్ ప్రకటిస్తారేమో అని చూసారు. కానీ ఫలితం లేకుండా పోయింది. అయితే ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో దీనికి సంబంధించిన ప్రకటలను వెలువడే అవకాశం ఉంది.2024-25 ఆర్థిక సంవత్సరానికి.. ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును ఖరారు చేయడానికి EPFO సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) ఫిబ్రవరి 28, 2025న సమావేశం కానుంది. ఇందులో పెన్షన్ సవరణకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. వడ్డీ రేటుకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా.. పెన్షన్ పెంపుదల అంశం చర్చనీయాంశంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.2014 నుంచి మినిమమ్ పెన్షన్ నెలకు రూ. 1,000గా ఉంది. దీనిని 7500 రూపాయలకు పెంచాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. EPF సభ్యులు తమ జీతంలో 12 శాతం ప్రావిడెంట్ ఫండ్కు జమ చేస్తారు. అంతే మొత్తంలో సంస్థ కూడా జమచేస్తుంది. కంపెనీ జమచేసి 12 శాతంలో.. 8.33 శాతం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS)కి కేటాయిస్తారు. మిగిలిన 3.67 శాతం EPF స్కీమ్కి వెళుతుంది.గత కొన్ని సంవత్సరాలుగా.. పెన్షనర్లు, న్యాయవాద సంఘాలు ప్రస్తుత పెన్షన్ స్కీమును విమర్శిస్తున్నాయి. దాదాపు నాలుగు దశాబ్దాలుగా నెలకు రూ.1,000 పెన్షన్ సరిపోదని చెబుతున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వైద్య ఖర్చులతో, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఈ డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. కాబట్టి ఇక సీబీటీ నిర్ణయం కోసం వారందరూ ఎదురు చూస్తున్నారు.EPFO కనీస పెన్షన్ పెంపు2025 బడ్జెట్కు ముందు.. EPS-95 పదవీ విరమణ చేసిన వారి ప్రతినిధి బృందం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి, నెలకు రూ. 7,500 కనీస పెన్షన్ పెంపు, డియర్నెస్ అలవెన్స్ (DA) గురించి వివరించారు. ఆ విషయాలను తప్పకుండా పరిశీలిస్తామని ఆర్థిక మంత్రి హామీ ఇచ్చారని EPS-95 జాతీయ కమిటీ పేర్కొంది. దీన్ని బట్టి చూస్తే.. మినిమమ్ పెన్షన్ పెంపు తప్పకుండా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. -
ఈపీఎఫ్ విత్డ్రా.. ఇక నేరుగా యూపీఐ..
ఈపీఎఫ్ (EPF) విత్డ్రా ఇక మరింత సులువు కానుంది. పీఎఫ్ మొత్తాన్ని నేరుగా యూపీఐ ద్వారా చెల్లింపులకు వాడుకునే వెసులుబాటు రానుంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) రాబోయే మూడు నెలల్లో ఈపీఎఫ్ క్లెయిమ్ల కోసం యునైటెడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) ఆధారిత ఉపసంహరణలను ప్రవేశపెట్టనుంది .ఈపీఎఫ్ విత్డ్రా (EPF Withdrawal) ప్రక్రియను మరింత సులువుగా మార్చడమే లక్ష్యంగా ఈపీఎఫ్వో ఈ వెసులుబాటు తీసుకొస్తోంది. దీని ద్వారా దాని లక్షల మంది చందాదారులకు ఈపీఎఫ్ ఉపసంహరణ వేగవంతంగా మరింత అందుబాటులో ఉంటుంది. దీని కోసం ఈపీఎఫ్ఓ ఇప్పటికే ఒక ప్రణాళికను సిద్ధం చేసి యూపీఐ ప్లాట్ఫామ్లలో ఈ ఫీచర్ను ప్రారంభించడానికి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.ఇది చదివారా? త్వరలో ప్రభుత్వ క్రెడిట్ కార్డులు.. రూ.5 లక్షలు లిమిట్తో..ఒకసారి ఇంటిగ్రేట్ ప్రక్రియ పూర్తయి ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే క్లెయిమ్ మొత్తాలను సబ్స్క్రైబర్లు డిజిటల్ వాలెట్ల ద్వారా సులభంగా యాక్సెస్ చేయవచ్చు. ఇది ప్రాసెసింగ్ సమయాన్ని తగ్గించి వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. ఉపసంహరణలను సులభతరం చేయడానికి, జాప్యాలను నివారించడానికి, కాగితపు పనిని తగ్గించడానికి, పారదర్శకతను మెరుగుపరచడానికి కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), వాణిజ్య బ్యాంకుల సహకారంతో ఈపీఎఫ్వో డిజిటల్ వ్యవస్థలను అప్గ్రేడ్ చేస్తోంది.పెన్షన్ సేవలను మెరుగుపరచడం, ప్రావిడెంట్ ఫండ్ ( PF ) క్లెయిమ్ల కోసం క్లెయిమ్ ప్రాసెసింగ్ను సులభతరం చేయడం లక్ష్యంగా ఇప్పటికే ఈపీఎఫ్వో అనేక సంస్కరణలు అమలు చేస్తోంది. అందులో భాగమే ఈ చొరవ. 2025 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్లో 5 కోట్లకు పైగా చందాదారుల క్లెయిమ్లను ప్రాసెస్ చేసి, రూ . 2.05 లక్షల కోట్లకు పైగా సొమ్మును పంపిణీ చేసింది. -
త్వరలో ప్రభుత్వ క్రెడిట్ కార్డులు..
కేంద్ర ప్రభుత్వం నుంచి క్రెడిట్ కార్డులను (Credit Cards) సూక్ష్మ పరిశ్రమ వ్యవస్థాపకులు త్వరలో అందుకోనున్నారు. 2025 కేంద్ర బడ్జెట్లో (Union Budget 2025-26) హామీ ఇచ్చినట్లుగా మైక్రో ఎంట్రాప్రెన్యూర్లకు రూ. 5 లక్షల పరిమితితో క్రెడిట్ కార్డులను ఏప్రిల్ నుంచి కేంద్ర ప్రభుత్వం జారీ చేయనుంది.ఈ సౌకర్యం రాబోయే కొన్నేళ్లలో సూక్ష్మ-యూనిట్లకు అదనంగా రూ. 30,000 కోట్ల నిధులను అందించగలదు. ఇది వ్యాపార విస్తరణ కోసం ఇతర రుణ ఎంపికలకు అనుబంధంగా ఉంటుంది. ఈ పథకం నుండి ప్రయోజనం పొందడానికి, క్రెడిట్ కార్డు అందుకునేందుకు చిరు వ్యాపారులు నమోదు చేసుకోవాలి. ఈ నేపథ్యంలో రూ. 5 లక్షల పరిమితితో ఈ క్రెడిట్ కార్డును పొందడానికి అర్హత ప్రమాణాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..క్రెడిట్ కార్డు లిమిట్, షరతులురూ. 5 లక్షల లిమిట్ కలిగిన ఈ క్రెడిట్ కార్డ్.. చిరు దుకాణాలను, చిన్న తరహా తయారీ పరిశ్రమలను నిర్వహించేవారికి అందుబాటులో ఉంటుంది. దరఖాస్తుదారుల యూపీఐ లావాదేవీలు, బ్యాంక్ స్టేట్మెంట్లు వ్యాపార పరిస్థితులు అంచనా వేసిన తర్వాత ఈ క్రెడిట్ కార్డులు మంజూరు చేస్తారు. కార్డుకు ఒక సంవత్సరం చెల్లుబాటు వ్యవధి ఉంటుంది. రూ. 10-25 లక్షల మధ్య వార్షిక టర్నోవర్ ఉన్నవారు మాత్రమే ప్రభుత్వ మైక్రో-క్రెడిట్ కార్డుకు అర్హులు.దరఖాస్తు ప్రక్రియప్రభుత్వం జారీ చేసే ఈ క్రెడిట్ కార్డును పొందడానికి, దేశవ్యాప్తంగా ఉన్న చిరు వ్యాపారులు ముందుగా ఉద్యమ్ (Udyam) పోర్టల్లో నమోదు చేసుకోవాలి. అనంతరం ఎంఎస్ఎంఈ క్రెడిట్ కార్డును పొందవచ్చు. పోర్టల్లో నమోదుకు ఈ దశలు పాటించండి..» అధికారిక ఉద్యమ్ పోర్టల్ msme.gov.in వెబ్సైట్ను సందర్శించండి. » 'క్విక్ లింక్స్' పై క్లిక్ చేయండి.» 'ఉద్యమ్ రిజిస్ట్రేషన్' ఎంచుకోండి.» రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి తదుపరి సూచనలను అనుసరించండి. -
22న యూపీఐ సేవలు బంద్!.. హెచ్డీఎఫ్సీ ప్రకటన
స్మార్ట్ఫోన్ వాడకంలోకి వచ్చిన తరువాత దాదాపు చాలామంది లావాదేవీల కోసం 'ఫోన్పే, గూగుల్ పే' వంటి యూపీఐ యాప్లను ఉపయోగిస్తున్నాయి. అయితే తాజాగా హెచ్డీఎఫ్సీ ఖాతాను.. యూపీఐ పేమెంట్స్ యాప్లకు లింక్ చేసుకున్నవారికోసం బ్యాంక్ ఓ సందేశం అందించింది.బ్యాంక్ అందించిన సందేశం ప్రకారం.. శనివారం (ఫిబ్రవరి 22) ఉదయం 2:30 AM నుంచి 7 AM వరకు.. హెచ్డీఎఫ్సీ ఖాతాకు లింక్ అయిన యూపీఐ సేవలు పనిచేయవు. అంటే 4:30 గంటలు యూపీఐ సేవలను నిలిపివేస్తున్నట్లు బ్యాంక్ అధికారికంగా వెల్లడించింది. తన ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించడంలో భాగంగానే సిస్టం మెయిటెనెన్స్ చేపడుతున్నట్లు హెచ్డీఎఫ్సీ వెల్లడించింది.హెచ్డీఎఫ్సీ ప్రకారం.. ఆ సమయంలో లావాదేవీలు పూర్తిగా నిలిచిపోతాయి. ఒకవేళా ఒకటికంటే ఎక్కువ ఖాతాలను కలిగి ఉన్నవారు.. ప్రైమరీ అకౌంట్గా హెచ్డీఎఫ్సీని లింక్ చేసి ఉంటే.. అత్యవసరం అనుకుంటే మార్చుకోవడం మంచింది. లేకుంటే 7 గంటల తరువాత యూపీఐ సేవలను యదావిధిగా కొనసాగించవచ్చు.చదవండి: 'ఆ నిర్ణయం నన్ను ఎంతగానో బాధించింది': బిల్ గేట్స్కేవలం హెచ్డీఎఫ్సీ అకౌంట్ మాత్రమే ఉన్నవాళ్లు.. ముందుగానే ఏటీఎం నుంచి డబ్బు విత్డ్రా చేసి పెట్టుకోండి. ఏదైనా ప్రయాణం సమయంలో, లేదా ఇతర అత్యవసర సమయంలో ఉపయోగించుకోవచ్చు. ఫిబ్రవరి 22న ఏ సమయంలో యూపీఐ పనిచేయదనే విషయాన్ని కస్టమర్లకు హెచ్డీఎఫ్సీ మెయిల్ ద్వారా తెలియజేసింది. -
పాలసీ జారీ తర్వాతే ప్రీమియం వసూలు
కొత్తగా బీమా పాలసీలు తీసుకునే వారి సౌలభ్యం కోసం బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (IRDAI) కీలక ఆదేశాలు జారీ చేసింది. పాలసీ జారీ చేసిన తర్వాతే అందుకు సంబంధించి ప్రీమియం వసూలు చేసుకునేందుకు వీలుగా.. బీమా–ఏఎస్బీఏ(Bima-Applications Supported by Blocked Amount) సదుపాయాన్ని అందించాలంటూ అన్ని బీమా సంస్థలను ఆదేశించింది.ఇదీ చదవండి: విద్యుత్ రంగంలో రూ.60 లక్షల కోట్ల పెట్టుబడులుపాలసీ జారీ అయ్యేంత వరకు ప్రీమియంకు సరిపడా మొత్తం కస్టమర్ బ్యాంక్ ఖాతాలో బ్లాక్ అయి ఉంటుంది. ప్రస్తుతం ఐపీవోలకు ఈ విధానం అమల్లో ఉంది. దీన్ని అప్లికేషన్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్ (ఏఎస్బీఏ) సదుపాయంగా చెబుతారు. ఇదే మాదిరి బీమా–ఏఎస్బీఏ విధానాన్ని బీమా పాలసీలకు అమలు చేయాలని ఐఆర్డీఏఐ సూచించింది. మార్చి 1 నాటికి ఈ సదుపాయాన్ని అమల్లోకి తీసుకురావాలని ఐఆర్డీఏఐ తెలిపింది. ఈ విధానంలో ప్రపోజల్ను ఆమోదిస్తున్నట్టు బీమా సంస్థ కస్టమర్కు తెలియజేసిన తర్వాతే, ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని ఐఆర్డీఏఐ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. -
ఎల్ఐసీ కొత్త ప్లాన్: సింగిల్ పేమెంట్.. జీవితాంతం ఆదాయం!
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ఆఫ్ ఇండియా 'స్మార్ట్ పెన్షన్' (Smart Pension) ప్లాన్ను ప్రారంభించింది. పదవీ విరమణ సమయంలో ఆర్థిక భద్రతను అందించే లక్ష్యంతో సంస్థ ఈ ప్లాన్ స్టార్ట్ చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు వివరంగా.. ఈ కథనంలో చూసేద్దాం.ఒక ఉద్యోగి తన పదవీ విరమణ తరువాత కూడా.. క్రమం తప్పకుండా ఆదాయం వస్తే బాగుంటుందని, ఇలాంటి ప్లాన్స్ కోసం వెతుకుతుంటారు. అలాంటి వారికి ఎల్ఐసీ ప్రారంభించిన ఈ స్మార్ట్ పెన్షన్ ప్లాన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది సింగిల్-ప్రీమియం, నాన్-పార్, నాన్-లింక్డ్ ప్లాన్ సింగిల్ లైఫ్, జాయింట్ లైఫ్ యాన్యుటీ వంటి ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.సింగిల్ లైఫ్, జాయింట్ లైఫ్ అవసరాలకు అనుగుణంగా స్మార్ట్ పెన్షన్ ప్లాన్ ఎంచుకోవచ్చు. జీవిత భాగస్వాములు, తల్లిదండ్రులు, పిల్లలు, మనవరాళ్ళు, తోబుట్టువులు, అత్తమామలు వంటి కుటుంబ సభ్యుల కోసం జాయింట్ లైఫ్ యాన్యుటీని ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్ ఎంచుకుంటే.. ప్రియమైనవారికి ఆర్థిక స్థిరత్వాన్నిఅందించవచ్చు.నెల, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరం ఇలా మీకు తగిన విధంగా యాన్యుటీ చెల్లింపులు ఎంచుకోవచ్చు. కొన్ని షరతులకు లోబడి.. కొంత మొత్తం లేదా పూర్తిగా కూడా విత్డ్రా చేసుకోవచ్చు. ఈ ప్లాన్ను.. పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్స్-లైఫ్ ఇన్సూరెన్స్ (POSP-LI) మరియు కామన్ పబ్లిక్ సర్వీస్ సెంటర్స్ (CPSC-SPV) వంటి ఏజెంట్ల ద్వారా ఆఫ్లైన్లో కొనుగోలు చేయవచ్చు. లేదా ఎల్ఐసీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చు.అర్హత & ప్లాన్ వివరాలు18 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులు ఎవరైనా ఈ ప్లాన్ ఎంచుకోవచ్చు. అయితే మీరు ఎంచుకునే యాన్యుటీ ఆప్షన్లను బట్టి.. అర్హత మారుతుంది. ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే.. ఒకసారి యాన్యుటీ ఆప్షన్ ఎంచుకున్న తరువాత, దానిని మళ్ళీ మార్చలేము. ఎంచుకునే సమయంలోనే జాగ్రత్తగా సెలక్ట్ చేసుకోవాలి.స్మార్ట్ పెన్షన్ ప్లాన్కు.. మార్కెట్తో సంబంధం లేదు. మార్కెట్లు లాభాల్లో ఉన్నా.. నష్టాల్లో ఉన్న మీ డబ్బుకు గ్యారెంటీ లభిస్తుంది. నెలకు రూ. 1,000, మూడు నెలలకు రూ. 3,000, ఏడాది రూ. 12,000 చొప్పున పాలసీదారు యాన్యుటీని ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్ కోసం కనీస కొనుగోలు మొత్తం రూ. 1 లక్ష. గరిష్ట కొనుగోలుకు ఎలాంటి పరిమితి ఉండదు.ఇదీ చదవండి: అమితాబ్ అల్లుడు.. వేలకోట్ల కంపెనీకి రారాజు: ఎవరీ నందా?5, 10, 15, 20 సంవత్సరాలు.. ఇలా ఎంచుకున్న కాలమంతా స్మార్ట్ పెన్షన్ ప్లాన్ ద్వారా ఆదాయం వస్తుంది. అంతే కాకుండా ప్రతి ఏటా 3 శాతం లేదా 6 శాతం పెన్షన్ పెరుగుతూనే ఉంటుంది. జీవితాంతం పెన్షన్ అందుకునే యాన్యుటీనికి కూడా ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్ పరిచయం చేస్తూ.. ''పదవీ విరమణ అనేది సంపాదనకు ముగింపు కాదు, ఇది ఆర్థిక స్వేచ్ఛకు ప్రారంభం'' అని ఎల్ఐసీ తన ఎక్స్ ఖాతాలో పేర్కొంది.Retirement isn’t the end of earning—it’s the beginning of financial freedom! With LIC of India’s Smart Pension, enjoy a lifetime of steady income and stress-free golden years.https://t.co/YU86iMOu9M#LIC #SmartPension #PensionPlan pic.twitter.com/4bXUXbz90g— LIC India Forever (@LICIndiaForever) February 19, 2025 -
రూ.80 వేలు ఇన్వెస్ట్ చేస్తే రూ.1.15 లక్షలు గ్యారెంటీ!
table, th, td { border: 1px solid black; } పోస్టాఫీస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్సీ) పథకాన్ని సురక్షితమైన, గ్యారెంటీ రాబడిని కోరుకునే వ్యక్తులు మంచి పెట్టుబడి ఎంపికగా చూస్తారు. ప్రభుత్వ పథకం కావడంతో రిస్క్ తక్కువగా ఉంటుందనే భావనే ఇందుకు కారణం. అయితే ఈ స్కీమ్లో ఎంత పెట్టుబడి పెడితే ఎంత మొత్తం సమకూరుతుందో చాలామందికి సరైన అవగాహన ఉండదు. దానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడంతోపాటు ఈ పథకం కీలక అంశాలను కింద చూద్దాం.పోస్టాఫీస్ ఎన్ఎస్సీ పథకంనేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్సీ) అనేది భారతీయ తపాలా కార్యాలయం అందించే స్థిర ఆదాయ పెట్టుబడి పథకం. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద స్థిరమైన రాబడులు, పన్ను ప్రయోజనాల హామీతో చిన్న, మధ్యతరహా పెట్టుబడిదారులను పొదుపు చేయడానికి ప్రోత్సహించడానికి దీన్ని రూపొందించారు.కీలక ఫీచర్లు..రిస్క్లేని పెట్టుబడి: భారత ప్రభుత్వ మద్దతు ఉండడంతో ఎన్ఎస్సీను సురక్షితమైన పెట్టుబడి ఎంపికగా పరిగణిస్తున్నారు.ఫిక్స్డ్ వడ్డీ రేటు: వడ్డీ రేటును ఏటా ఫిక్స్ చేసి కాంపౌండ్ చేస్తారు. 2024 మొదటి త్రైమాసిక కాలం నాటికి వడ్డీ రేటు ఏడాదికి 7.7 శాతంగా ఉంది.పన్ను ప్రయోజనాలు: రూ.1.5 లక్షల వరకు పెట్టుబడులకు సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది.గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు: పెట్టుబడిదారులు ఎన్ఎస్సీలో చేసే ఇన్వెస్ట్మెంట్కు గరిష్ట పరిమితి లేదు. ఎంతైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు.చక్రవడ్డీ: వడ్డీని ఏటా తిరిగి పెట్టుబడిగా పెడతారు. ఇది మెచ్యూరిటీ సమయంలో అధిక రాబడిని అందిస్తుంది.కనీస పెట్టుబడి: కనీస పెట్టుబడి మొత్తం రూ.1,000.ఇదీ చదవండి: పేరు మార్చుకుంటే రూ.8,400 కోట్లు ఆఫర్!ఐదేళ్ల తరువాత ఎంత వస్తుంది?ఐదేళ్ల కాలపరిమితికి ఎన్ఎస్సీ పథకంలో పెట్టుబడి చేస్తే రూ.80,000 ఇన్వెస్ట్మెంట్కు మెచ్యూరిటీ మొత్తం కింది విధంగా ఉంటుంది.(రూ.ల్లో)ఏడాదిఅసలు వడ్డీ మొత్తం 180,000 6,160 86,160286,160 6,633 92,7933 92,7937,14599,938499,938 7,695 1,07,63351,07,6338,2861,15,919 -
అంకెలు మారాయి కానీ.. ప్రశ్న మారలేదు..
మూడు బడ్జెట్ల నుంచి ఇదే ప్రశ్న.. పాత పన్ను విధానమా? కొత్త పన్ను విధానమా? ఏది మంచిది. ఏది ఎక్కువ ఉపయోగకరం. ఏది ఎవరికి ఎక్కువ ప్రయోజనకరం. ఏది మంచిదని ప్రశ్నించే బదులు ఏది ఉపయోగం అనేది సరైన ప్రశ్న. మళ్లీ పాత ప్రశ్నే. ఇరవై ఏళ్లు లేదా అంతకన్నా ముందు నుంచి అస్సెస్సీలతో సేవింగ్స్ చేయించి, అలా చేసినందుకు ఆ మేరకు మినహాయింపును ఇస్తూ వచ్చేవారు. ఏయే సెక్షన్ల ప్రకారం సేవ్ చేస్తే మినహాయింపు వస్తుంది.. అని ఆలోచించి అడుగేసేవాళ్లు.ఉద్యోగస్తులకు కంపల్సరీగా పీఎఫ్ తప్పదు. అంతేకాకుండా, ట్యాక్స్ విధానంలో ‘మినహాయింపు’ను అతిగా వాడారు. డిపాజిట్ చేస్తే మినహాయింపు, విత్డ్రా చేస్తే మినహాయింపు, దాని మీద వడ్డీకి కూడా మినహాయింపు. సంక్షేమం అనుకోండి, పొదుపు అనుకోండి, అలవాటు అనుకోండి, ఆకర్షణీయం అనుకోండి.. పీఎఫ్ను అతిగా ఆశ్రయించారు. ఇలాగే ఎన్నో పథకాలు. 80సీని ప్రోత్సహిస్తూ ఇరవై పైచిలుకు పథకాలను ప్రవేశపెట్టారు. లిమిట్ని పెంచుతూ, 10 సంవత్సరాల పాటు రూ.1,50,000 గరిష్ట పరిమితిగా ఉంచారు. ప్రతి సంవత్సరం ఆ రూ.1,50,000 పరిమితి పెరుగుతుందని అందరూ ఎదురుచూస్తూ వచ్చారు. కానీ నిరాశే. ఎటువంటి మార్పూ లేదు. కనీసం ద్రవ్యోల్బణానికి అనుగుణంగా కూడా మార్పులు తేలేదు. ఇది. అన్యాయమే. అలాగే ఉద్యోగస్తులకు ప్రత్యేకంగా ఇచ్చే వెసులుబాటైన స్టాండర్డ్ డిడక్షన్ మినహాయింపులో పెంపుదల.. రద్దు.. పునరుద్ధరణ .. పెంపుదల ఇలా మార్పులు తెచ్చారు. ఈ మినహాయింపుని అలాగే కొనసాగిస్తూ ద్రవ్యోల్బణానికి అనుగుణంగా మారిస్తే బాగుండేది. ఇలాంటివి ఎన్నో మినహాయింపులు ఉన్నాయి.ఇదీ చదవండి: ఆర్బిట్రేజ్ ఫండ్స్తో మెరుగైన రాబడులుపాతకాలం నాటి అంకెలు.. ఆంక్షలు.. వీటిని ఏమీ మార్చకపోవడాన్ని ‘పాలసీ’ అని సరిపెట్టుకోలేము. ప్రభుత్వపు అనిశ్చితి వైఖరి ఇది అనే చెప్పాలి. గత నెలలో ట్రంప్ గెలుపు, తీసుకురాబోయే విప్లవాత్మక మార్పులు, వాటి తీవ్ర ప్రభావం మన ప్రజల మీద ఉంటుంది అని తెలిసినా స్పష్టత లేదు. అలాంటి పరిస్థితుల్లో వచ్చింది మన సీతమ్మగారి పద్దు. ఒక ప్రశ్న మాత్రం మారలేదు. అదేమిటంటే.. ఏది బెటర్? పాత విధానమా లేక కొత్త విధానమా? అయితే, నిస్సందేహంగా ప్రభుత్వ జోరు, హోరు, వైఖరి, ధోరణి అంతా కొత్త విధానం వైపే మొగ్గు చూపుతోంది. ‘పొమ్మనలేక పొగబెట్టినట్లు’ పాత విధానాన్ని ప్రోత్సహించలేదు. అది ఉంటుందా అని అడిగితే కొనసాగిస్తున్నాం అని అన్నారు ఆర్థిక మంత్రి. అయితే, కొన్ని తేడాలు, సలహాలు, సూచనలను తెలుసుకోవాలి. అవేమిటంటే..భారీగా మినహాయింపు పొందాలనుకునే వారికి పాతది మంచిది. వినియోగం వైపు మొగ్గు చూపించే వారికి కొత్త విధానం ఆకర్షణీయంగా ఉంటుంది. నిలకడగా, నిర్దిష్టంగా, నిశ్చింతగా ఆలోచించే వారికి పాతదే బెటరేమో? స్వతంత్రంగా వ్యవహరించాలి. సులువుగా ఉండాలి. అనువుగా ఉండాలి. కమిట్మెంట్ వద్దనే వారికి కొత్త విధానం బెటరు. మీ ఆదాయాన్ని లెక్కించండి. కంపల్సరీ సేవింగ్స్ని పరిగణనలోకి తీసుకుని ఆలోచించండి. ఇప్పుడు మార్కెట్లో ఎన్నో రెడీమేడ్ కాల్క్యులేటర్స్ ఉన్నాయి. అప్పుడు సరైన విధానాన్ని ఎంచుకోండి. కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య ట్యాక్సేషన్ నిపుణులు