breaking news
Personal Finance
-
ఐటీఆర్ గడువు పొడిగిస్తారా? వెల్లువెత్తుతున్న విజ్ఞప్తులు
ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో, పన్ను నిపుణులు, పన్ను చెల్లింపుదారుల నుంచి గడువు పొడిగింపుపై డిమాండ్లు పెరుగుతున్నాయి. తాజాగా, బీజేపీకి చెందిన ఇద్దరు పార్లమెంటు సభ్యులు భర్తృహరి మహతాబ్ (కటక్), పీపీ చౌదరి (పాలీ) కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖలు రాసి గడువును పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. ఐటీఆర్ దాఖలుకు గడువు సెప్టెంబర్ 15న ముగియనుంది.పొడిగింపు కోరడానికి కారణాలుఐటీఆర్-5, ఆడిట్ సంబంధిత ఫారాలతో సహా ఐటీఆర్ ఫారాలను విడుదల చేయడంలో జాప్యం జరిగింది. జూలై, ఆగస్టు నెలల్లో ఐటీఆర్ ఫారాలు అందుబాటులోకి వచ్చాయి.ఐటీఆర్ పోర్టల్లో ధ్రువీకరణ లోపాలు, అప్లోడ్ నెమ్మదించడం, ఫారం 26ఏఎస్, ఏఐఎస్, టీఐఎస్లో అసమతుల్యత వంటి సాంకేతిక లోపాలు.ఒడిశాలో వరదలతో సహా ప్రకృతి వైపరీత్యాలు, విద్యుత్తు, ఇంటర్నెట్ సదుపాయానికి అంతరాయం కలిగించాయి. దీంతో సకాలంలో ఐటీఆర్ దాఖలు చేయడం కష్టతరం చేసింది.మరోవైపు పండుగ సీజన్ పరిమితులు.గణేష్ పూజ, దుర్గా పూజ, దసరా వంటి ప్రధాన సెలవుదినాలు సిబ్బంది లభ్యతను పరిమితం చేశాయి.ఐసీఏఐ కొత్త ఫార్మాట్ల కారణంగా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ల తయారీకి అదనపు సమయం అవసరమవుతోంది.ఏకకాలంలో ఏకకాలంలో జీఎస్టీ ఫైలింగ్స్, ఐటీఆర్ ఫైలింగ్ పన్ను నిపుణుల పనిభారాన్ని పెంచుతోంది.ప్రతిపాదిత పొడిగింపులుఐటీఆర్ (నాన్-ఆడిట్) దాఖలుకు గడువు సెప్టెంబర్ 15 వరకు ఉండగా సెప్టెంబర్ 30 వరకు పొడింగించాలని కోరుతున్నారు. ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ (TAR) గడువు సెప్టెంబర్ 30 ఉండగా అక్టోబర్ 31 వరకు, టీఏఆర్ తో ఐటీఆర్ ఫైలింగ్కు అక్టోబర్ 31 చివరి తేదీ కాగా నవంబర్ 30 పొడిగించాలని విజ్ఙప్తి చేస్తున్నారు. ఇక ఆలస్యంగా ఐటీఆర్ దాఖలు గడువును కూడా డిసెంబర్ 31 నుంచి 2026 ఫిబ్రవరి 28 వరకు పొడిగించాలని అభ్యర్థనలు వచ్చాయి.విస్తృత మద్దతు కర్ణాటక స్టేట్ చార్టర్డ్ అకౌంటెంట్స్ అసోసియేషన్ (KSCAA), అడ్వకేట్స్ టాక్స్ బార్ అసోసియేషన్ (ATBA), ఐసీఏఐకి సంబంధించిన సెంట్రల్ ఇండియా రీజినల్ కౌన్సిల్ (CIRC) వంటి పన్ను నిపుణుల సంఘాలు కూడా గడువు పొడిగింపును కోరుతున్నాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ విజ్ఞప్తులను పరిశీలిస్తున్న నేపథ్యంలో, లక్షలాది మంది పన్ను చెల్లింపుదారులు, నిపుణులు అధికారిక నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
పొదుపు, పెట్టుబడులకే తొలి ప్రాధాన్యం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి పెద్ద ఎత్తున మినహాయింపులతో కొత్త పన్ను విధానం అమల్లోకి రాగా, అధిక వేతనం ఆర్జించే వారికి గణనీయంగా పన్ను ఆదా కానుంది. ఇలా ఆదా అయ్యే మొత్తాన్ని పొదుపు, పెట్టుబడులకు మళ్లిస్తామని 57 శాతం మంది ఉద్యోగులు నౌకరీ నిర్వహించిన సర్వేలో తెలిపారు. విచక్షణారహిత వ్యయాలకు బదులు పెట్టుబడులకు, రుణాల తిరిగి చెల్లింపులకు ఆదా అయ్యే మొత్తాన్ని వెచ్చిస్తామని నిపుణులు చెప్పారు. రూ.12.75 లక్షల వరకు ఆర్జించే 20వేల మంది నిపుణుల అభిప్రాయాలను నౌకరీ సర్వేలో భాగంగా తెలుసుకుంది. కొత్త పన్ను విధానంలో కల్పించిన పన్ను ప్రయోజనాల గురించి తెలుసనని 64 శాతం మంది చెప్పగా, 43 శాతం మంది తమకు దీనిపై స్పష్టత లేదనో, అసలు తెలియదనో చెప్పడం గమనార్హం.పన్ను మినహాయింపుల కారణంగా మిగిలే మొత్తాన్ని పెట్టుబడులకు మళ్లిస్తామని 57 శాతం మంది వెల్లడించారు. రుణాల చెల్లింపులకు వినియోగిస్తామని 30 శాతం మంది తెలిపారు.9 శాతం మంది మెరుగైన జీవనం కోసం ఖర్చు చేస్తామని, 4 శాతం మంది ప్రయాణాలు, విహార యాత్రల కోసం ఖర్చు చేస్తామని చెప్పారు. ఢిల్లీ, గురుగ్రామ్ ప్రాంతాల్లో అత్యధికంగా 63–64 శాతం మంది నిపుణులు మిగులు ఆదాయాన్ని పక్కన పెడతామని తెలిపారు. చెన్నైలో 44 శాతం నిపుణులు రుణ చెల్లింపులకు వినియోగిస్తామని చెప్పగా, ముంబైలో 51 శాతం మంది రిటైర్మెంట్ అవసరాలకు మళ్లిస్తామని తెలిపారు.ఇదీ చదవండి: గ్లోబల్ కంపెనీలకు కేంద్రం స్వాగతం -
ఈఎంఐలపై ఫోన్ కొన్నవారికి షాక్! ఆర్బీఐ ఓకే అంటే మాత్రం..
బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల నుంచి రుణంపై మొబైల్ ఫోన్లు తీసుకుని ఆ రుణాన్ని తిరిగి చెల్లించడంలో డీఫాల్ట్ అయితే అలాంటి ఫోన్లను వినియోగించేందుకు వీలు లేకుండా ఆ బ్యాంకులు లేదా రుణ సంస్థలు రీమోట్గా లాక్ చేయబోతున్నాయి. ఎందుకంటే వాటికి ఆర్బీఐ ఆ మేరకు అనుమతి ఇవ్వబోతోందంటూ రాయిటర్స్ కథనం పేర్కొంది.వినియోగదారుల వాస్తవ ప్రయోజనాలను కాపాడుతూనే మరోవైపు నిరర్థక రుణాలను తగ్గుంచుకునే ప్రయత్నంలో భాగంగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపింది. ఫోన్లతో సహా మూడింట ఒక వంతు కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ భారతదేశంలో చిన్న-టికెట్ వ్యక్తిగత రుణాలపై కొనుగోలు చేస్తున్నట్లు హోమ్ క్రెడిట్ ఫైనాన్స్ 2024 అధ్యయనం చూపించింది.గతేడాది కూడా బ్యాంకులు, రుణ సంస్థలు ఇలాగే రుణ గ్రహీతలు డీఫాల్ట్ అయితే రుణంపై కొనుగోలు చేసిన మొబైల్ ఫోన్లను లాక్ చేయడానికి ప్రయత్నించగా ఆ ప్రయత్నాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అడ్డుకుంది. అయితే ఇప్పుడు ఇలాంటి నిరర్థక రుణాలు పెరిగిపోతుండటంతో రికవరీ పెంచుకోవడంలో భాగంగా కస్టమర్ల ఫోన్లను లాక్ చేసేందుకు ఆర్బీఐ రుణ సంస్థలకు అనుమతి ఇచ్చే ఆస్కారం ఉందని రాయిటర్స్ వివరించింది.బ్యాంకులు, రుణసంస్థలతో సంప్రదింపులు జరిపిన తరువాత, ఫోన్-లాకింగ్ మెకానిజమ్పై మార్గదర్శకాలను ప్రవేశపెడుతూ ఆర్బీఐ తన ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్ను కొన్ని నెలల్లో అప్డేట్ చేస్తుందని భావిస్తున్నారు. ఫోన్ లాకింగ్కు సంబంధించి రుణగ్రహీతల నుండి ముందస్తు సమ్మతిని తప్పనిసరి చేయడంతోపాటు లాక్ చేసిన ఫోన్లలో వ్యక్తిగత డేటాను రుణ సంస్థలు యాక్సెస్ చేయకుండా కూడా నిషేధించేలా ఈ నిబంధనలు ఉంటాయని చెబుతున్నారు.ఈ చర్య అమలైతే, బజాజ్ ఫైనాన్స్, డీఎంఐ ఫైనాన్స్, చోళమండలం ఫైనాన్స్ వంటి ప్రధాన కన్జూమర్ ఫైనాన్స్ సంస్థలకు రికవరీలు మెరుగవుతాయని భావిస్తున్నారు. క్రెడిట్ బ్యూరో సీఆర్ఐఎఫ్ హైమార్క్ ప్రకారం.. రూ.1 లక్ష లోపు రుణాలే ఎక్కువగా డిఫాల్ట్ అయ్యే ప్రమాదం ఉంది. కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్లలో 85% నాన్-బ్యాంక్ రుణ సంస్థల వద్దే ఉన్నాయి. -
ఈపీఎఫ్ఓ కనీస పెన్షన్ పెంపు..?
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) అక్టోబర్ 10-11 తేదీల్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సమావేశం ఏర్పాటు చేయనుంది. ఈ సమావేశంలో ఉద్యోగులకు తీపికబురు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ మీటింగ్కు సంబంధించిన ఎలాంటి ఎజెండా ఇంకా ఖరారు కాలేదు. కొన్ని సంస్థలు, ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం ఇందులో కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అందులోకి అంశాలు కింది విధంగా ఉన్నాయి.ఏటీఎం ద్వారా విత్డ్రా..ప్రావిడెంట్ ఫండ్ వ్యవస్థకు బ్యాంకు లాంటి కార్యాచరణను తీసుకురావనే ప్రణాళికలున్నాయి. ఇందులో ఏటీఎంల ద్వారా పాక్షిక ఉపసంహరణలను అనుమతించడం, యూపీఐ ఆధారిత చెల్లింపులను ప్రారంభించడం వంటివి ఉన్నాయి. 8 కోట్లకు పైగా ఈపీఎఫ్ఓ సభ్యులు తమ పదవీ విరమణ పొదుపును ఎలా నిర్వహిస్తారనే దానిపై గణనీయమైన మార్పులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈపీఎఫ్ఓ 3.0 ప్రతిపాదన డిజిటల్ చెల్లింపులు, ఈజ్-ఆఫ్-యాక్సెస్ ఫీచర్లను ఏకీకృతం చేయాలని నిర్ణయించింది. ఆధునిక బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలకు అనుగుణంగా ఇందులో మార్పులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇవి ఆమోదం పొందితే చందాదారులకు సర్వీసులు సులభతరం అవుతాయి.ప్రావిడెంట్ ఫండ్లో కొంత భాగాన్ని ఏటీఎంల ద్వారా విత్ డ్రా చేసుకోవచ్చు.ఎంపిక చేసిన లావాదేవీల కోసం వారి ఈపీఎఫ్ ఖాతాల నుంచి నేరుగా చెల్లింపులు చేయడానికి యూపీఐను ఉపయోగించవచ్చు.పెన్షన్ పెంపుప్రస్తుతం రూ.1,000గా నిర్దేశించిన కనీస నెలవారీ పెన్షన్ను రూ.1500 నుంచి రూ.2,500 వరకు పెంచే ప్రతిపాదన కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ద్రవ్యోల్బణం, జీవన వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో ఈమేరకు నిర్ణయాలు తీసుకుంటారని అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: ప్రపంచ కుబేరుడిగా లారీ ఎల్లిసన్ -
బ్యాంక్ ఆఫ్ బరోడాలో ప్రత్యేక అకౌంట్..
ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్తగా ‘బీఓబీ యాస్పైర్ ఎన్ఆర్ఐ సేవింగ్స్ అకౌంట్’ ప్రవేశపెట్టింది. విదేశాలకు వెళ్లే ముందు, భారత్లోనే ఉన్నప్పుడే కస్టమర్లు బీఓబీ యాస్పైర్ ఎన్ఆర్ఈ సేవింగ్స్ అకౌంటు తెరవాలి. ఇలా తెరిచిన ఖాతా, తొలుత ‘ఇనాక్టివ్ మోడ్’లో ఉంటుంది.ఖాతాదారులు తమ ఎన్నారై హోదాను ధృవీకరిస్తూ ఇమ్మిగ్రేషన్ స్టాంపుతో పాస్పోర్ట్ కాపీ, విదేశాల్లోని చిరునామా ధృవీకరణ పత్రాన్ని సమర్పించిన తర్వాత ఖాతా పూర్తి స్థాయిలో యాక్టివ్గా మారుతుంది. ఈ అకౌంటుపై తొలి రెండు త్రైమాసికాల్లో ఎలాంటి కనీస బ్యాలెన్స్ చార్జీలు ఉండవు.తదుపరి ప్రతి క్వార్టర్కు సగటున రూ.1,000 బ్యాలెన్స్ నిబంధన వర్తిస్తుంది. అకౌంటు బ్యాలెన్స్లో గరిష్ట పరిమితేమీ ఉండదు. ఖాతాపై వచ్చిన ఆదాయానికి, ఇన్కం టాక్స్ నుంచి, బ్యాలెన్స్లకు వెల్త్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఉంటుంది.ఎయిర్పోర్ట్ లాంజ్ ఫెసిలిటీతో పాటు మరెన్నో ప్రయోజనాలు అందించేలా కస్టమైజ్ చేసిన డెబిట్ కార్డు ఉంటుంది. భావి ప్రవాస భారతీయుల(ఎన్నారై) అవసరాలకు అనుగుణంగా ‘బీఓబీ యాస్పైర్ అకౌంట్’ను ప్రవేశపెట్టామని బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీనా వహీద్ తెలిపారు. -
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఛార్జీల మోత..
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కొన్ని సర్వీస్ ఛార్జీలలో మార్పులను ప్రకటించింది. లాకర్ ఛార్జీలు, స్టాప్ పేమెంట్ ఇన్స్ట్రక్షన్ ఛార్జీలు, స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ (ఎస్ఐ) ఫెయిల్యూర్ ఛార్జీలు, నామినేషన్ ఛార్జీలకు సవరణలు వర్తిస్తాయి. కొత్త ఛార్జీలు అక్టోబర్ 1 నుండి అమల్లోకి వస్తాయి.లాకర్ జారీ ఛార్జీలులాకర్ పరిమాణం, బ్రాంచ్ స్థానాన్ని బట్టి బ్యాంక్ లాకర్ అద్దె ఛార్జీలను పెంచింది. సవరించిన లాకర్ అద్దె తదుపరి వార్షిక అద్దె గడువు తేదీకి వర్తిస్తుంది. ప్రతిపాదిత సవరణల ప్రకారం, చిన్న లాకర్లకు గ్రామీణ ప్రాంతాల్లో రూ .1,000 (పాత ఛార్జీ), సెమీ అర్బన్ ప్రాంతాలకు రూ .1,500 (గతంలో రూ .1250), పట్టణ, మెట్రో ప్రాంతాలకు రూ .2,000 (పాత ఛార్జీ).మీడియం సైజ్ లాకర్లకు గ్రామీణ ప్రాంతాల్లో రూ.2,500 (గతంలో రూ.2,200), సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ.3,000 (గతంలో రూ.2,200), అర్బన్, మెట్రో ప్రాంతాల్లో రూ.4,000 (గతంలో రూ.3,500).పెద్ద లాకర్లకు గ్రామీణ ప్రాంతాల్లో రూ.4,000 (గతంలో రూ.2,500), సెమీ అర్బన్ ప్రాంతాలకు రూ.5,000 (గతంలో రూ.3,000), పట్టణ ప్రాంతాలకు రూ.6,500, మెట్రో ప్రాంతాలకు రూ.7,000 (రెండూ గతంలో రూ.5,500).అతిపెద్ద (వెరీ లార్జ్) లాకర్లకు గ్రామీణ ప్రాంతాలకు రూ.6,000(పాత ఛార్జీ), సెమీ అర్బన్ ప్రాంతాలకు రూ.7,000 (గతంలో రూ.6,000), పట్టణ ప్రాంతాలకు రూ.8,500, మెట్రో ప్రాంతాలకు రూ.9,000 (రెండూ గతంలో రూ.8,000).ఎక్స్ట్రా లార్జ్ లాకర్లకు గ్రామీణ ప్రాంతాలకు రూ.10,000 (పాత ఛార్జీ), సెమీ అర్బన్ ప్రాంతాలకు రూ.10,500, పట్టణ ప్రాంతాలకు రూ.11,000, మెట్రో ప్రాంతాలకు రూ.12,000 (మొత్తం మూడూ గతంలో రూ.10,000) ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.వన్-టైమ్ రిజిస్ట్రేషన్ ఛార్జీలులాకర్లను లీజుకు ఇచ్చే సమయంలో వన్-టైమ్ రిజిస్ట్రేషన్ ఛార్జీల విషయానికొస్తే, ప్రస్తుతం గ్రామీణ, సెమీ అర్బన్ శాఖలకు రూ .200, అర్బన్, మెట్రో శాఖలకు రూ .500 ఛార్జీలు ఉండేవి. కొత్త ఛార్జీల ప్రకారం, గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లోని అన్ని పరిమాణాల లాకర్లకు రూ .200, పట్టణ, మెట్రో ప్రాంతాలలో చిన్న, మీడియం లాకర్లకు రూ .500, పట్టణ, మెట్రో ప్రాంతాలలో లార్జ్, వెరీ లార్జ్, ఎక్స్ట్రా లార్జ్ లాకర్లకు రూ .1,000 వసూలు చేస్తుంది.స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఫెయిల్యూర్ ఛార్జీలుస్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ (ఎస్ఐ) వైఫల్య ఛార్జీల కింద ప్రస్తుతం ప్రతి లావాదేవీకి రూ .100 తో పాటు రెమిటెన్స్ ఛార్జీలు, వాస్తవ పోస్టేజీని వసూలు చేస్తుండగా ప్రతిపాదిత మార్గదర్శకాల ప్రకారం, ప్రతి లావాదేవీకి ఛార్జ్ చేయడానికి బదులుగా, నెలకు రూ .100 ఫ్లాట్ ఫీజు, జీఎస్టీ వసూలు చేయనున్నారు. అంతేకాకుండా టర్మ్ లోన్లు (టిఎల్), రికరింగ్ డిపాజిట్లు (ఆర్డీ) మొదలైన వాటికి గరిష్టంగా మూడు ఎస్ఐ లావాదేవీలకు అవకాశం ఉంటుంది.నామినేషన్ ఛార్జీలుప్రస్తుత నిబంధన ప్రకారం.. మొదటిసారి అకౌంట్ నామినీ నమోదు ఉచితం. ఆ తర్వాత ఒక్కో సందర్భానికి రూ.100 రుసుము వసూలు చేస్తున్నారు. ప్రతిపాదిత సవరణల ప్రకారం, మొదటిసారి అభ్యర్థన ఉచితం. ఆ తరువాత, నామినీ మరణించినప్పుడు మినహా ఒక్కో సందర్భానికి రూ .100 వసూలు చేస్తారు.స్టాప్ పేమెంట్ ఇన్స్ట్రక్షన్ ఛార్జీలుపీఎన్బీ సేవింగ్స్ ఖాతాలో స్టాప్ పేమెంట్ సూచనల కోసం ప్రస్తుత ఛార్జీలు ఒక్కో సాధనానికి రూ .100. వరుస చెక్కుల కోసం స్టాప్ పేమెంట్ అభ్యర్థించిన సందర్భాల్లో, బ్యాంకు మూడు లేదా అంతకంటే ఎక్కువ చెక్కుల పరిధికి రూ .300 ఛార్జీ విధిస్తుంది.అక్టోబర్ 1 నుండి సవరణల ప్రకారం, పొదుపు ఖాతాల కోసం స్టాప్ పేమెంట్ ఇన్స్ట్రక్షన్ జారీ చేయడానికి ఛార్జీలు గతంలో లాగే ఒక్కో సాధనానికి రూ .100 ఉంటాయి. అయితే, వరుస చెక్కులకు సూచనలు ఇస్తే, ఐదు లేదా అంతకంటే ఎక్కువ చెక్కుల పరిధికి రూ .500 రుసుము ఉంటుంది. -
దేశంలో క్రెడిట్ కార్డులు 11.16 కోట్లు
దేశంలో క్రెడిట్ కార్డుల సంఖ్య, వాటి ద్వారా చేసే వ్యయం ఏటా పెరుగుతోంది. క్రెడిట్ కార్డుల వినియోగం గత ఏడు నెలల్లో గణనీయంగా పెరిగింది. రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. 2025 జనవరిలో 10.89 కోట్ల క్రెడిట్ కార్డులు ఉండగా, జూలై నాటికి ఈ సంఖ్య 11.16 కోట్లకు చేరింది.ఖర్చు కూడా పెరుగతోంది..కార్డుల జారీతోపాటు వినియోగదారులు నెలకు చేసే సగటు ఖర్చు కూడా పెరుగుతోంది. సగటున ఒక కార్డు ద్వారా చేసిన వ్యయం ఈ ఏడాది జనవరిలో రూ.16,950 నుంచి జులై నాటికి రూ.17,399కి ఎగబాకింది. అంటే 2.65 శాతం వృద్ధి. ఇది వినియోగదారుల ఖర్చు అలవాట్లలో మార్పును సూచిస్తుంది.వినియోగదారుల ప్రవర్తనలో మార్పులుఈఎంఐ, బీఎన్పీఎల్ స్కీములు, క్యాష్బ్యాక్లు, రివార్డుల వల్ల వినియోగం పెరుగుతోంది.డిజిటల్ చెల్లింపుల పెరుగుదలతో చిన్న లావాదేవీలు కూడా కార్డుల ద్వారా జరుగుతున్నాయి.కార్డు జారీలు పెరగడం, సులభమైన అంగీకార విధానాలు వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి.ఇదీ చదవండి: జాబ్కు అప్లయి చేస్తున్నారా? జాగ్రత్త! -
యూపీఐలో కీలక మార్పులు: సెప్టెంబర్ 15 నుంచి అమలు
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) డిజిటల్ చెల్లింపులకు సంబంధించిన.. ఎంపిక చేసిన వర్గాలకు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) లావాదేవీ పరిమితులను పెంచింది. దీంతో వినియోగదారులు, వ్యాపారులు ఎక్కువ లావాదేవీలు చేసుకోవడానికి అవకాశం లభించింది. కొత్త పరిమితులు 2025 సెప్టెంబర్ 15 నుంచి అమలులోకి వస్తాయి.యూపీఐ కొత్త పరిమితుల కింద.. వినియోగదారుడు 24 గంటల్లో 10 లక్షల వరకు లావాదేవీలను చేసుకోవచ్చు. ప్రత్యేక ధ్రువీకరణ పొందిన యూజర్లు.. వ్యాపార చెల్లింపులకు ఇది వర్తిస్తుంది. కాగా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి జరిగే లావాదేవీలలో ఎటువంటి మార్పు లేదు (రోజుకు రూ. లక్ష).యూపీఐ పరిమితులలో కీలక మార్పులు➤క్యాపిటల్ మార్కెట్ పెట్టుబడులు, బీమా చెల్లింపుల కోసం పరిమితులు రూ.2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచారు. అంతే కాకుండా 24 గంటల్లో గరిష్టంగా రూ. 10 లక్షల వరకు అనుమతి లభిస్తుంది.➤ప్రయాణ రంగంలో.. లావాదేవీ పరిమితి రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెరిగింది. రోజువారీ పరిమితి రూ. 10 లక్షలు. క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులను ఇప్పుడు ఒకేసారి రూ. 5 లక్షల వరకు చేయవచ్చు. అయితే రోజువారీ పరిమితి రూ. 6 లక్షలకు పరిమితం చేశారు.➤లోన్, ఈఎమ్ఐ పరిమితులు రూ. 5 లక్షలకు చేరాయి. గరిష్టంగా రోజుకు రూ. 10 లక్షల వరకు లావాదేవీ చేయవచ్చు. ఆభరణాల కొనుగోళ్లు రూ. 1 లక్ష నుంచి రూ. 2 లక్షలకు పెంచారు. రోజువారీ పరిమితి రూ. 6 లక్షలు.➤బ్యాంకింగ్ సేవలలో, డిజిటల్ ఆన్బోర్డింగ్ ద్వారా టర్మ్ డిపాజిట్లను రోజుకు రూ. 5 లక్షల వరకు అనుమతించారు. దీని పరిమితి గతంలో రూ. 2 లక్షలు మాత్రమే. -
లీగల్ హైయిర్ సర్టిఫికెట్లు.. ఇబ్బందులు
వారసులు హక్కులే కాదు బాధ్యతలు కూడా స్వీకరించాలి. అలాంటి ఎన్నో బాధ్యతల్లో ఒకానొక బాధ్యత.. చనిపోయిన వారి తరఫున వారి వారసులు ఆదాయపు పన్ను చట్టం ప్రకారం రిటర్నులు దాఖలు చేయాలి. దాఖలు చేయడానికి వారసులకు ధృవీకరణ పత్రం ఉండాలి. దాన్నే వాడుక భాషలో 'లీగల్ హైయిర్ సర్టిఫికెట్' అని అంటారు.మరణించిన వారి ఆస్తులను పొందడానికి, బ్యాంకు అకౌంటులోని డబ్బులు పొందడానికి ఈ ధృవీకరణ పత్రం ఉండాలి. ఈ పత్రంలో వారసుల పేర్లు ఉంటాయి. వారే, మరణించిన వ్యక్తికి సంబంధించిన ఆస్తులు, బీమా పాలసీలు, బ్యాంకు అకౌంటులో ఫిక్సిడ్ డిపాజిట్లు మొదలైనవి పొందగలరు. ఇలాంటి ధృవీకరణ వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా ప్రక్రియ మొదలవుతుంది. సర్టిఫికెట్ ఎలా వస్తుంది..మన కాలమ్లో ఇది అప్రస్తుతం అయినా, దరఖాస్తు చేసిన తర్వాత మండల/తహసీల్దారు/కోర్టులు రుజువులు అడుగుతాయి. డాక్యుమెంట్లు ఇవ్వాలి. విచారణ ఉంటుంది. ఆ తర్వాత జారీ చేస్తారు. మిగతా అధికార్లు త్వరగా జారీ చేస్తారేమో కానీ కోర్టుకి వెళ్తే చాలాకాలం పడుతుంది.ఆదాయపు పన్ను చట్టం ప్రకారం..మరణించిన వ్యక్తికి సంబంధించి తాను జీవించి ఉన్నంత వరకు, తన చేతికి వచ్చిన ఆదాయం మీద పన్ను అధికారికి రిటర్నులు వేయాలి. నిన్ననే ఒక వ్యక్తి పోయారనుకోండి. 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 వరకు ఒక రిటర్ను, 2025 ఏప్రిల్ 1 నుంచి 2025 సెప్టెంబర్ 7 వరకు మరొక రిటర్ను.. ఇలా రెండు దాఖలు చేయాలి. గడువు తేదీలోపల చేయాలి.వారసులేం చేయాలి..చట్టప్రకారం వారసులు మరణించిన వ్యక్తికి సంబంధించిన రిటర్నులు వేయాలి. ఆదాయం ఎంత, పన్ను భారం ఎంత, టీడీఎస్, టీసీఎస్ మొదలైన విషయాలు అందరికీ మామూలే. ఏం కాగితాలు /డాక్యుమెంట్లు జతపర్చాలి .. చనిపోయిన వ్యక్తి పాన్కార్డు చనిపోయిన వ్యక్తి డెత్ సర్టిఫికెట్ లీగల్ హైయిర్ సర్టిఫికెట్లుచనిపోయిన వారి విషయంలో పాస్ చేసిన ఆర్డర్లు/నోటీసులు.పై జాబితాలో (1), (2), అలాగే (4) సులువుగా దొరుకుతాయి. అవన్నీ అప్లోడ్ చేయొచ్చు.లీగల్ హైయిర్ సర్టిఫికెట్ అంటే..ఈ కింది వాటిని మాత్రమే ఆదాయపు పన్ను వారి పోర్టల్లో పొందుపర్చారు కోర్టు జారీ చేసిన సర్టిఫికెట్రెవెన్యూ అధికారులు జారీ చేసిన సర్టిఫికెట్రెవెన్యూ అధికారులు జారీ చేసిన కుటుంబ సభ్యుల జాబితా సరి్టఫికెట్ రిజిస్టర్ అయిన వీలునామా స్టేట్ / సెంట్రల్ ప్రభుత్వం జారీ చేసిన పెన్షన్ సర్టిఫికెట్ బ్యాంకు లేదా ఆర్థిక సంస్థలు జారీ చేసిన సర్టిఫికెట్. అందులో నామినీ పేరుండాలి. పైన చెప్పిన డాక్యుమెంట్లు, ఇంగ్లీషులో ఉంటే మంచిది. లేకపోతే ప్రాంతీయ భాషల్లో ఉంటే వాటిని ఆంగ్లంలోకి తర్జుమా చేసి అనువాదం ఇవ్వాలి.అసలు సమస్య ఏమిటంటే..గడువు తేదీలోపల రిటర్నులు వేయడానికి ప్రధాన ప్రతిబంధకం ఏమిటంటే, పైన చెప్పిన డాక్యుమెంట్లు సకాలంలో జారీ అవ్వకపోవడమే. కోర్టు జారీ చేయడమంటే.. సంవత్సరాలు పట్టేస్తుంది. రెవెన్యూ అధికారులు జారీ చేయడం అంటే నెలలు పడుతుంది. గడువు తేదీలోపల రావడం జరగదు. ఇవి లేకపోతే రిటర్నులు వేయడానికి కుదరడం లేదు. వీలునామా సులువుగా దొరుకుతుంది. వీలునామాలో ఆస్తి పంపకాలే ఉంటాయి కానీ వారసత్వం గురించి ఉండొచ్చు.. ఉండకపోవచ్చు. పెన్షన్ సరి్టఫికెట్లో కూడా కేవలం పెన్షన్ ఎవరికి చెందుతుందో వారి పేరే ఉంటుంది. వారసులందరి పేర్లు ఉండకపోవచ్చు. బ్యాంకు వారు జారీ చేసే సరి్టఫికెట్లో నామినీ పేరుంటుంది కానీ వారసుల పేర్లు ఉండకపోవచ్చు.పైన చెప్పిన సమస్యల గురించి డిపార్టుమెంటు వారు ఆలోచించాలి. పరిశీలించాలి. ప్రాక్టికల్గా పరిగణనలోకి తీసుకుని కేవలం డెత్ సర్టిఫికెట్తో ఫైల్ చేసుకునే వీలు కల్పించాలి. అవసరం అయితే, వారసుల ధృవీకరణ కోసం అసెస్మెంట్ను పెండింగ్లో పెట్టొచ్చు. ట్యాక్సేషన్ నిపుణులు: కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి & కె.వి.ఎన్ లావణ్య -
ప్రాపర్టీ విక్రయించా.. పెట్టుబడి దారేది?
మూడేళ్లలో రూ.10 లక్షలు సమకూర్చుకోవాలన్నది నా ఆలోచన. లార్జ్క్యాప్ ఫండ్స్, ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చా? – సాత్విక్మూడేళ్లలో రూ.10లక్షలు రావాలని కోరుకుంటుంటే.. అందుకు ఈక్విటీ పెట్టుబడులు అనుకూలం కాదు. స్వల్పకాలానికి ఈక్విటీలు ఎంతో రిస్క్తో ఉంటాయి. కనుక స్వల్పకాలం కోసం భద్రతతో పాటు, స్థిరమైన రాబడులను ఇచ్చే సాధనాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఫిక్స్డ్ ఇన్కమ్ విభాగంలో షార్ట్ డ్యురేషన్ డెట్ ఫండ్స్ను పరిశీలించొచ్చు. వీటిల్లో స్థిరమైన రాబడులు ఉంటాయి. దీంతో మీ పెట్టుబడులు మార్కెట్ అస్థిరతలకు గురికావు. ఒకవేళ లక్ష్య కాలాన్ని మూడేళ్లకు మించి పెంచుకోగలిగి, రిస్క్ తీసుకునేట్టు అయితే అప్పుడు ఈక్విటీ పెట్టుబడులను పరిశీలించొచ్చు. కనీసం ఐదేళ్లు, అంతకుమించిన కాలానికే ఈక్విటీలు సూచనీయం. దీర్ఘకాలంలో మార్కెట్ అస్థిరతలను అధిగమించి పెట్టుబడులు వృద్ధి చెందుతాయి. ప్రాపర్టీ విక్రయించగా వచ్చిన లాభం నుంచి పన్ను చెల్లించి మిగిలిన మొత్తాన్ని ఈక్విటీ ఆధారిత సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలా? లేక దీర్ఘకాల మూలధన లాభాల పన్ను నుంచి మినహాయింపు కోసం ఆర్ఈసీ, పీఎఫ్సీ, ఐఆర్ఎఫ్సీ జారీ చేసే సెక్షన్ 54ఈసీ బాండ్లలో ఇన్వెస్ట్ చేసుకోవాలా..? – వీరేశ్ప్రాపర్టీని విక్రయించిన ఆరు నెలల్లోపు క్యాపిటల్ గెయిన్ బాండ్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 54ఈసీ కింద రూ.50 లక్షల వరకు లాభాన్ని మూలధన లాభాల నుంచి మినహాయింపునకు అవకాశం ఉంటుంది. ప్రభుత్వ మద్దతు గల ఆర్ఈసీ, పీఎఫ్సీ, ఐఆర్ఎఫ్సీ తదితర ఇన్ఫ్రా ఫైనాన్సింగ్ కంపెనీలు జారీ చేసే బాండ్లను క్యాపిటల్ గెయిన్ బాండ్లుగా చెబుతారు. ఇవి ఐదేళ్ల లాకిన్ పీరియడ్తో ఉంటాయి. వీటిపై 5.25 శాతం వార్షిక వడ్డీ రేటు వర్తిస్తుంది. ఈ వడ్డీ పన్ను పరిధిలోకి వస్తుంది. 30 శాతం పన్ను పరిధిలో ఉన్న వారికి పన్ను పోను ఈ బాండ్లపై లభించే నికర రాబడి 3.68 శాతం అవుతుంది. ఈక్విటీ ఫండ్స్తో పోల్చి చూసినప్పుడు క్యాపిటల్ గెయిన్ బాండ్లపై లభించే 5.25 శాతం రేటు చాలా తక్కువ. ఈక్విటీల్లో దీర్ఘకాలానికి రెండంకెల రాబడి వస్తుంది.ఫ్లెక్సీక్యాప్ ఫండ్ గత ఐదేళ్ల కాల సగటు రాబడి 20 శాతంగా ఉంది. ఇప్పుడు పన్ను ఆదా కోసం క్యాపిటల్ గెయిన్ బాండ్లలో ఐదేళ్ల కాలానికి రూ.50 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే, 5.25 శాతం రేటు ప్రకారం గడువు తీరిన తర్వాత రూ.63 లక్షలు సమకూరుతుంది. అదే రూ.50 లక్షల లాభంపై 20 శాతం క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ (రూ.10లక్షలు) చెల్లించి, మిగిలిన రూ.40 లక్షలను ఫ్లెక్సీక్యాప్ పథకాల్లో క్రమానుగతంగా ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్లలో రూ.70 లక్షలు సమకూరొచ్చు. ఇలా చూస్తే మూలధన లాభాల పన్ను చెల్లించి, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవడం మెరుగైనది అవుతుంది. కానీ, ఈక్విటీల్లో మెరుగైన రాబడి వస్తుందని చెప్పి మొత్తం తీసుకెళ్లి ఇన్వెస్ట్ చేయడం సరికాదు. ఐదేళ్లు, అంతకుమించిన కాలాలకు ఈక్విటీల్లో మెరుగైన రాబడులు వస్తాయి. కానీ ఇది కచ్చితమని చెప్పలేం. ఆటుపోట్లు ఉంటాయి. కానీ, క్యాపిటల్ గెయిన్ బాండ్లు హామీతో కూడిన పన్ను లేని రాబడిని ఇస్తాయి. కనుక రిస్క్ లేని రాబడి కోరుకుంటూ, ఐదేళ్ల తర్వాత కచ్చితంగా పెట్టుబడి మొత్తం తిరిగి వెనక్కి తీసుకోవాలని అనుకుంటే క్యాపిటల్ గెయిన్ బాండ్లకు వెళ్లొచ్చు. కొంత రిస్క్ తీసుకుని, అవసరమైతే ఐదేళ్లకు అదనంగా మరికొంత కాలం పాటు ఇన్వెస్ట్ చేసేట్టు అయితే దీర్ఘకాల మూలధన లాభాల పన్ను చెల్లించి మిగిలిన మొత్తాన్ని ఈక్విటీ పథకాలకు కేటాయించుకోవచ్చు.ఇదీ చదవండి: ప్రభుత్వ బ్యాంకుల్లోనే.. జీతం ఎక్కువ! -
అలవోకగా రూ.కోట్లు సంపాదించే మార్గం..
డబ్బే డబ్బును సంపాదిస్తుంది. అదేలా..అంటారా? మనం చేసే పెట్టుబడులే దీర్ఘకాలంలో భారీగా సంపదను సృష్టిస్తాయి. అందుకు చాలామంది రియల్ఎస్టేట్, వ్యాపారం, ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, బంగారం.. వంటివి ఎంచుకుంటారు. ఏటా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. దీన్ని తట్టుకొని మన సంపద దీర్ఘకాలంలో భారీగా పెరగాలంటే సరైన ఇన్వెస్ట్మెంట్, టైమ్ ఎంతో అవసరం. పైన తెలిపిన పెట్టుబడి మార్గాల్లో ఇన్వెస్ట్ చేయాలంటే భారీగా నగదు కావాల్సి ఉంటుంది. అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అలాంటి వారికోసం స్టాక్మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ క్రమానుగత పెట్టుబడులు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో కనిష్ఠంగా రూ.100 నుంచి పొదుపు చేసి దీర్ఘకాలంలో సంపద సృష్టించవచ్చు. ఇలా యుక్త వయసులో చేసిన పొదుపును రిటైర్మెంట్ తర్వాత సంతోషంగా ఖర్చు పెట్టవచ్చు. అలా ఖర్చు పెడుతూ కూడా తిరిగి సంపదను సృష్టించే ఎస్డబ్ల్యూపీ విధానాల గురించి కూడా ఈ కథనంలో తెలుసుకుందాం.క్రమానుగత పెట్టుబడి విధానం(సిప్)స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులపై అవగాహన చాలా మందిలో ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. చిన్న మొత్తాల్లో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి సిప్ (SIP) మంచి మార్గంగా మారింది. సిప్లో ప్రతి నెలా మీరు పెట్టుబడి పెట్టే చిన్న మొత్తమే కాలక్రమేణా పెరుగుతుంది. తద్వారా మీ పెట్టుబడిపై మంచి రాబడి లభిస్తుంది.సిప్ అంటే ఏమిటి.. ఇదెలా పనిచేస్తుంది?సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్.. దీన్నే సంక్షిప్తంగా సిప్ అని వ్యవహరిస్తారు. అంటే రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇందులో మీరు ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. సిప్ అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, మీరు చిన్న మొత్తాలతో కూడా పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. ఇది కాలక్రమేణా పెద్ద మొత్తంగా మారుతుంది. ఈ ప్రక్రియలో మీరు పదేపదే పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ప్రతి నెలా ఒక నిర్ణీత మొత్తం ఆటోమేటిక్గా మీ బ్యాంక్ ఖాతా నుంచి కట్ అయి మ్యూచువల్ ఫండ్కు వెళుతుంది.నెలకు రూ.3000 ఇన్వెస్ట్ చేస్తే..సిప్ ద్వారా ఇప్పుడు మీరు ప్రతి నెలా రూ .3000 పెట్టుబడి పెట్టడం మొదలుపెడితే, 10 సంవత్సరాల తరువాత మీ పెట్టుబడి ఎలా పెరుగుతుందన్నది ఉదాహరణ ద్వారా చూద్దాం.. మీరు సిప్ ద్వారా మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెడితే, అది సగటున 12% వార్షిక రాబడిని ఇస్తుంది. అప్పుడు 10 సంవత్సరాలలో మీ మొత్తం పెట్టుబడి రూ.3,60,000 అవుతుంది. అదే సమయంలో ఈ పెట్టుబడిపై వచ్చే రాబడి సుమారు రూ.3,37,017 ఉంటుంది. అంటే పదేళ్ల తర్వాత మీ చేతికి మొత్తంగా రూ.6,97,017 వస్తుంది.సిప్ ప్రయోజనాలుచిన్న పెట్టుబడులతో ప్రారంభించి కాలక్రమేణా పెద్ద మొత్తంలో రాబడి సంపాదించవచ్చు. ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ పద్ధతి ఆర్థిక ఒత్తిడిని తగ్గిస్తుంది.సిప్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు, మీరు మార్కెట్ ఒడిదుడుకులను ఎదుర్కోవచ్చు. కానీ దీర్ఘకాలికంగా ఇది రాబడిని సమతుల్యం చేస్తుంది. అంటే మార్కెట్ పడిపోయినా, కాలక్రమేణా మీ పెట్టుబడి సరైన దిశలో పెరగడానికి సిప్ సహాయపడుతుంది.సిప్లో పెట్టుబడులను మీ సౌలభ్యానికి అనుగుణంగా సెట్ చేసుకోవచ్చు. ప్రతి నెలా మీ ఖాతా నుండి నిర్ణీత మొత్తం నేరుగా మ్యూచువల్ ఫండ్లో జమయ్యేలా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ పూర్తిగా ఆటోమేటెడ్ కాబట్టి మీరు మళ్లీ మళ్లీ ఆలోచించాల్సిన అవసరం ఉండదు.సిప్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో మెరుగైన రాబడిని పొందుతారు. మ్యూచువల్ ఫండ్స్ రాబడులు కాలక్రమేణా మెరుగుపడతాయి.గుర్తుంచుకోవాల్సినవి..సరైన మ్యూచువల్ ఫండ్ ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. మంచి పనితీరు కనబరిచే ఫండ్లను ఎంచుకోవడం వల్ల మంచి రాబడి పొందవచ్చు.మీ సామర్థ్యాన్ని బట్టి ఇన్వెస్ట్ చేయండి. మీరు రూ.500తో కూడా సిప్ లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించవచ్చు.సిప్ లో ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ ఒడిదుడుకులను నివారించి మంచి రాబడి పొందవచ్చు.క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తేనే సిప్ బెనిఫిట్ లభిస్తుంది. ఎంత ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేస్తే అంత ఎక్కువ రాబడి పొందొచ్చు.సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్(ఎస్డబ్ల్యూపీ)సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్(ఎస్డబ్ల్యూపీ).. ఇదేంటి.. మనకు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) గురించి తెలుసు తప్ప ఈ ఎస్డబ్ల్యూపీ ఎక్కడి నుంచి వచ్చిందని అనుకుంటున్నారా? నిజమే!! ఇది సిప్కు పూర్తి రివర్స్ పద్ధతి. ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడానికి సంబంధించి సిప్ అన్నది అందరికీ మూలమంత్రంగా మారిపోయింది. చాలా మంది చిన్న, మధ్య స్థాయి ఇన్వెస్టర్లు.. ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేందుకు వివిధ కారణాల రీత్యా ఈ మార్గాన్నే ఎంచుకుంటున్నారు.ఎస్డబ్ల్యూపీలో ప్రతి నెలా లేదా నిర్దిష్ట కావధుల్లో నిర్దిష్ట మొత్తాన్ని విత్డ్రా చేసుకునే వీలుంటుంది. ఎస్డబ్ల్యూపీని వినియోగించుకునే ప్రతీసారి సదరు తేదీన ఫండ్ ఎన్ఏవీ ఆధారంగా యూనిట్ల రిడెంప్షన్, చెల్లింపులు ఉంటాయి.ఎవరి కోసమిది?చేతిలో కాస్త పెద్ద మొత్తం ఉండి.. నెలవారీనో, మూడు నెలలకోసారో ఇలా నిర్ధిష్ట కావధుల్లో చేతిలోకి డబ్బు రావాలనుకునేవారికి ఎస్డబ్ల్యూపీ విధానం చాలా అనుకూలం. ఇక పదవీ విరమణ చేసి (రిటైరీలు) క్రమానుగత ఆదాయాన్ని ఆశించే వారికీ ఇది అనువైన విధానమే. అయితే, దీన్ని ఎంచుకునే ముందు.. దీని తీరుతెన్నుల గురించి అవగాహన కలిగి ఉండటం మంచిది. ఇలా చేసిన బాలాజీ మూర్తి గురించి మీకు చెబుతాను. ఆయన దాదాపు 35 ఏళ్ల సర్వీసు తర్వాత ప్రభుత్వ రంగ సంస్థ నుంచి ఇటీవలే రిటైరయ్యారు. ఏకమొత్తంగా రూ.45 లక్షలు చేతికి వచ్చాయి. క్రమానుగతంగా ఆదాయాన్నిచ్చే సాధనంలో ఇన్వెస్ట్ చేద్దామని ఆయన అనుకుంటుంటే ఎవరో ఎస్డబ్ల్యూపీ గురించి సలహా ఇచ్చారు. ఆయన ఒకవేళ వారి సలహాను పాటిద్దామని భావించాడనుకోండి. అపుడు ఏం జరుగుతుందో చూద్దాం...ఎస్డబ్ల్యూపీ తీరుతెన్నులుబాలాజీ తనకందిన డబ్బు నుంచి సుమారు రూ.10 లక్షల మొత్తాన్ని ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా మేరకు ఒక డెట్ ఫండ్లో ఎస్డబ్ల్యూపీ కింద ఇన్వెస్ట్ చేశారు. రూ.10 ఎన్ఏవీ ఉన్న లక్ష యూనిట్లు కొన్నారు. ప్రతి నెలా 5వ తారీఖున రూ.10,000 విత్డ్రా చేసుకునేలా ఆయన ఎస్డబ్ల్యూపీని సెట్ చేసుకున్నారు. తర్వాత నెల 5వ తేదీన సదరు ఫండ్ ఎన్ఏవీ రూ.10.50గా ఉంది. ఆ రోజున ఆయన విత్డ్రా చేసుకోవాల్సిన రూ.10,000కు సరిసమానంగా రూ.10.50 రేటుతో 952.3810 యూనిట్లు రిడీమ్ చేశారు. ఫలితంగా ఎస్డబ్ల్యూపీ రిడెంప్షన్ అనంతరం ఆయన వద్ద ఇక 99,047.619 యూనిట్లు మిగిలాయి. అటుపైన ప్రతి నెలా ఇదే ప్రక్రియ కొనసాగుతుంది. ఒకవేళ ఎన్ఏవీ రూ.10 వద్దే స్థిరంగా ఉండి, ప్రతి నెలా రూ.10,000 విత్డ్రా చేసుకుంటూ పోతే ఆయన ఇన్వెస్ట్ చేసిన రూ.10 లక్షల పెట్టుబడి.. 100 నెలల దాకా సరిపోతుంది. అయితే, అది డెట్ ఫండ్ కాబట్టి నష్టాలు తక్కువ. రాబడులు కాస్త స్థిరంగానే వస్తుంటాయి. కాబట్టి 100 నెలలు పైబడి కూడా ఎస్డబ్ల్యూపీ కొనసాగవచ్చు.ఎస్డబ్ల్యూపీ ఎన్నాళ్ల పాటు కొనసాగవచ్చు అనే విషయాన్ని పరిశీలిస్తే బాలాజీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో ఏటా 12 శాతం రాబడులు ఇస్తుండగా.. ప్రతి నెలా కార్పస్ నిధి నుంచి 1 శాతం మేర విత్డ్రా చేసుకుంటూ పోయినా ఎస్డబ్ల్యూపీ జీవితాంతం కొనసాగుతోంది. ఎస్డబ్ల్యూపీలో ప్రత్యేకత ఇదే. మ్యూచువల్ ఫండ్ ఏటా సానుకూల రాబడులు అందిస్తున్నంత కాలం.. ఆయన ఎస్డబ్ల్యూపీ కచ్చితంగా 100 నెలల వ్యవధికి మించి కొనసాగుతుంది.గుర్తుంచుకోదగినవి..ఎస్డబ్ల్యూపీలనేవి దీర్ఘకాలిక కోణంలోనే ఉపయోగపడేవి. స్వల్పకాలిక కోణంలో ఇన్వెస్టరుకు పెద్దగా ప్రయోజనం ఉండదు.ఎస్డబ్ల్యూపీ అనేది ఇతరత్రా నెలనెలా వచ్చే ఆదాయానికి అనుబంధంగా రాబడినిచ్చేదే తప్ప.. ఇదే ప్రధాన ఆదాయవనరు కాదు.దీర్ఘకాలికంగా బ్యాలెన్స్డ్ ఫండ్స్ను ఎంచుకుంటే మెరుగైన ఫలితాలు పొందవచ్చు.తొలినాళ్లలో ఎక్కువగా అసలు మొత్తం నుంచే విత్డ్రాయల్ జరుగుతుంది.ఇదీ చదవండి: ఆధునిక రైల్వే వ్యవస్థల అభివృద్ధికి సై -
ప్రభుత్వ లోన్ స్కీమ్: కొత్త నియమాలు.. ప్రయోజనాలు
చిరు వ్యాపారులు, వీధి విక్రేతలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. ప్రధాన మంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి, అంటే పీఎం స్వనిధి యోజన కాలపరిమితిని ఇప్పుడు 31 మార్చి 2030 వరకు పొడిగించారు. కరోనా మహమ్మారి సమయంలో ప్రారంభమైన ఈ పథకం కొత్త నియమాలు, ప్రయోజనాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.కోవిడ్-19 మహమ్మారి కారణంగా వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిని చిన్న వ్యాపారులు, వీధి విక్రేతలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో 2020 జూన్లో ఈ పథకాన్ని ప్రారంభించారు. వారు మళ్లీ స్వయం సమృద్ధి సాధించడం దీని ప్రధాన ఉద్దేశం. సాధారణంగా చిరు వ్యాపారులకు రోజువారీ వ్యాపార అవసరాలకోసం వెంటనే డబ్బు అవసరం పడుతుంటుంది. కానీ వారికి బ్యాంకు నుండి రుణం పొందడం అంత సులభం కాదు. ఎలాంటి గ్యారంటీ లేకుండా రుణ సదుపాయం కల్పించడం ద్వారా వారి ఈ సమస్యను ఈ పథకం పరిష్కరిస్తుంది.పథకం వ్యవధి, రుణ పరిమితి పెంపుపీఎం స్వనిధి యోజన కాలపరిమితిని కేంద్ర కేబినెట్ ఇటీవల పొడిగించింది. దీంతోపాటు మరికొన్ని ప్రధాన మార్పులు చేసింది. ఇప్పుడు ఈ పథకం 2030 మార్చి 31 వరకు కొనసాగుతుంది. ఇందుకోసం రూ.7,332 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ పథకంలో లబ్ధిదారులకు మూడు విడతలుగా రుణం అందిస్తారు. మొదటి విడతలో గతంలో రూ.10,000 రుణం ఇచ్చేవారు. ఇప్పుడు దాన్ని రూ.15,000వేలకు పెంచారు. ఇది తిరిగి చెల్లించాక రెండో విడత రూ.20 వేలు గతంలో ఇస్తుండగా ఇప్పుడు రూ.25,000 ఇస్తున్నారు. దీన్ని కూడా సకాలంలో తిరిగి చెల్లించిన తర్వాత మూడో విడతగా రూ.50,000 రుణం లభిస్తుంది.ఇతర ప్రయోజనాలుఈ పథకం కింద ప్రభుత్వం 7% వడ్డీ సబ్సిడీ ఇస్తుంది. అంటే మీరు బ్యాంక్కు చెల్లించే వడ్డీపై 7% వరకు ప్రభుత్వం తిరిగి మీ ఖాతాలో జమ చేస్తుంది. అలాగే సకాలంలో వాయిదాలు చెల్లించే విక్రేతలకు రూపే క్రెడిట్ కార్డు ఇస్తారు. ఇది వారి వ్యాపారం లేదా ఇతర అవసరాల కోసం డబ్బును సులభంగా ఉపయోగించడానికి వీలు కల్పిస్తుంది. ఇది కాకుండా, డిజిటల్ చెల్లింపులను అవలంబించేవారికి రూ .1,600 వరకు క్యాష్బ్యాక్ కూడా లభిస్తుంది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ ప్రయోజనం అందిస్తోంది. -
మొదటిసారి అప్పు చేస్తున్నారా?
అత్యవసరాలకు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండాలంటే కొన్నిసార్లు అప్పు చేయడం తప్పదు. అయితే అప్పు తీసుకోవాలనుకుంటే క్రెడిట్ స్కోర్ తప్పకుండా ఉండాలని చాలా మంది భావిస్తుంటారు. దాంతో మొదటిసారి అప్పు చేయాలంటే సిబిల్ లేదనే ఉద్దేశంతో బ్యాంకుల ద్వారా కాకుండా ఇతర మార్గాల ద్వారా అప్పు చేసి అధిక వడ్డీలు చెల్లిస్తుంటారు. అలాంటి వారికోసం బ్యాంకులు ఇతర ప్రత్యామ్నాయ డేటాను ఉపయోగించి రుణాలు మంజూరు చేస్తున్నాయి. క్రెడిట్ హిస్టరీ లేని న్యూ-టు-క్రెడిట్ (ఎన్టీసీ) కస్టమర్లకు రుణాలను విస్తరించాలని బ్యాంకులను కోరిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజా ఆదేశాలకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి.సంప్రదాయకంగా క్రెడిట్ బ్యూరో స్కోరు(సిబిల్) రుణ ఆమోదం ప్రక్రియలో కీలక నిర్ణయాంశంగా ఉంది. తగినంత లేదా క్రెడిట్ చరిత్ర లేకపోవడం వల్ల చాలా మంది రుణాలకు దూరంగా ఉంటున్నారు. అందులో కొందరు ఇతర మార్గాలు, అధిక వడ్డీలకు అప్పులు తీసుకొని ఇబ్బందులు పడుతున్నారు. మొదటిసారి రుణాలు పొందేవారికి క్రెడిట్ హిస్టరీ ఉండదు కాబట్టి అలాంటి వారి రుణ అర్హతను అంచనా వేయడానికి బ్యాంకులు విస్తృత సూచికలను పాటిస్తున్నాయి.ప్రత్యామ్నాయ డేటా వనరులుఎన్టీసీ కస్టమర్లకు రుణాలు మంజూరు చేయడానికి యుటిలిటీ పేమెంట్స్, మొబైల్, టెలికాం బిల్లులు, యూపీఐ ట్రాన్సాక్షన్స్, ఈ-కామర్స్ బిహేవియర్ వంటి ప్రత్యామ్నాయ డేటా వనరులను ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ రజనీష్ కార్ణటక్ అన్నారు. 2025 ఆర్థిక సంవత్సరంలో మొదటిసారి రుణగ్రహీతలకు 16 శాతం రుణాలను మాత్రమే బ్యాంకులు మంజూరు చేశాయని, మిగిలినవి బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ) నిర్వహిస్తున్నారని ఆయన వివరించారు. ఈ వ్యత్యాసం రుణగ్రహీతలకు సంబంధించి నిర్మాణాత్మక డేటా అందుబాటులో లేకపోవడం వల్ల ఏర్పడిందని కార్ణటక్ తెలిపారు.ఎన్టీసీ రుణగ్రహీతలకు మద్దతుప్రభుత్వం కూడా ఎన్టీసీ రుణగ్రహీతలకు మద్దతుగా నిలుస్తోంది. వీరికి రుణాలు ఇవ్వడానికి ఆర్బీఐ కనీస క్రెడిట్ స్కోర్ను తప్పనిసరి చేయలేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఇటీవల స్పష్టం చేశారు. జనవరి 6, 2025 నాటి ఆర్బీఐ మాస్టర్ డైరెక్షన్ను ప్రస్తావిస్తూ ‘మొదటిసారి రుణగ్రహీతలకు క్రెడిట్ హిస్టరీ అవసరం లేదు.. కాబట్టి వారి రుణ దరఖాస్తులను తిరస్కరించకూడదు’ అని చౌదరి నొక్కి చెప్పారు.ఇదీ చదవండి: ఇన్సైడర్ ట్రేడింగ్కు చెక్ పెట్టాలి -
పోర్ట్ఫోలియోకు ‘ప్యాసివ్’ దన్ను
మార్కెట్ల పరిస్థితి ఒక్కో రోజు ఒక్కో రకంగా ఉంటుంది. ఒకరోజేమో అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు, మారిపోతున్న సమీకరణాల వల్ల కార్పొరేట్లపై ఎలాంటి ప్రభావం ఉంటుందోననే ఆందోళన. మరుసటి రోజు కార్పొరేట్ల ఆదాయాలు, వృద్ధి అంచనాలు సానుకూలంగా కనిపించడంతో చాలా ఉత్సాహం. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు కొత్త ధోరణుల వెంటబడటం కాకుండా ఒక స్పష్టమైన, దీర్ఘకాలిక ప్రణాళిక ఉండటం మంచిది. ఇది గుర్తించే చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు ప్రస్తుతం ప్యాసివ్ వ్యూహాల వైపు మళ్లుతున్నారు.తక్కువ వ్యయాలతో, పారదర్శకంగా, అందుబాటులో ఉండే ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్లు మెరుగ్గా రాణిస్తుండటంతో ఈ వ్యూహాన్ని ఎంచుకునే రిటైల్ ఇన్వెస్టర్లు కూడా పెరుగుతున్నారు. సులభతరంగా ఇన్వెస్ట్ చేసేందుకు, పెట్టుబడులను ట్రాక్ చేసుకునేందుకు డిజిటల్ ప్లాట్ఫాంలు వీలు కల్పిస్తుండడం, నియంత్రణ సంస్థలపరమైన మద్దతు, కొత్త ఆవిష్కరణలు కూడా ప్యాసివ్ ఫండ్స్ మరింత ప్రాచుర్యంలోకి రావడానికి దోహదపడుతున్నాయి.పలు ప్రయోజనాలు ..తక్కువ వ్యయాలుప్యాసివ్ ఇన్వెస్టింగ్లో అత్యంత ప్రయోజనకరమైన అంశమేమిటంటే, వీటిలో వ్యయాలు చాలా తక్కువగా ఉంటాయి. సాధారణంగా తరచుగా ట్రేడింగ్ చేయడం లేదా క్రియాశీలకమైన నిర్వహణ అవసరం ఉండదు కాబట్టి ఈ ఫండ్స్ వ్యయ నిష్పత్తులు చాలా తక్కువగా ఉంటాయి. ఈ వ్యత్యాసం తొలినాళ్లలో పెద్దగా తెలియకపోయినప్పటికీ, కాలక్రమేణా పోర్ట్ఫోలియో విలువ గణనీయంగా పెరిగినప్పుడు తెలుస్తుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక ప్రణాళికలున్న వారికి, కెరియర్ ప్రారంభ దశలోని ఇన్వెస్టర్లకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కాంపౌండింగ్ కారణంగా, ఫీజుల భారం కొంచెం తగ్గినా కూడా, దీర్ఘకాలిక రాబడులు పెరిగేందుకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. వైవిధ్యంవైవిధ్యమైన పోర్ట్ఫోలియోను రూపొందించుకోవడం చాలా సవాళ్లతో కూడుకున్నదై ఉంటుంది. ముఖ్యంగా కొత్త ఇన్వెస్టర్లకు ఇది ఇంకా కష్టంగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఒకే ఇన్వెస్ట్మెంట్తో విస్తృత పెట్టుబడుల అవకాశాలను ప్యాసివ్ ఫండ్స్ కల్పిస్తాయి. ఇండెక్స్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్లనేవి వివిధ రంగాల్లోను, భౌగోళికంగా వివిధ ప్రాంతాలవ్యాప్తంగా కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా, పెట్టుబడులపరమైన రి స్క్లను తగ్గించుకునేందుకు తోడ్పడతాయి. అంతగా సమయం కేటాయించలేనివారు, కొత్తగా ఇన్వెస్ట్ చేస్తున్నవారు ఒక్కొక్క సెక్యూరిటీని విడివిడిగా ఎంచుకోవాల్సిన అవసరం లేకుండానే డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోను నిర్మించుకునేందుకు ఇవి ఉపయోగపడతాయి.పారదర్శకతబెంచ్మార్క్ సూచీలను ప్రతిబింబించడం ద్వారా ప్యాసివ్ ఫండ్స్ ఒక సిస్టమాటిక్ విధానాన్ని పాటిస్తాయి. భావోద్వేగాలతో, మార్కెట్ ఊహాగానాలతో నిర్ణయాలు తీసుకోవడం లేదా వ్యూహాల్లో స్వల్పకాలిక మార్పులు, చేర్పులు చేయడంలాంటి ధోరణులు వీటిలో ఉండవు. క్రమశిక్షణకు విలువనిస్తూ, దీర్ఘకాలిక లక్ష్యాలపై ప్రధానంగా దృష్టి పెట్టే ఇన్వెస్టర్లకు ఈ పారదర్శకత ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. రాబడులపై ప్రతికూల ప్రభావం చూపే భావోద్వేగాలపరమైన నిర్ణయాలు తీసుకోకుండా, మార్కెట్ పరిస్థితులకు అతీతంగా పెట్టుబడులను కొనసాగించేందుకు ఇన్వెస్టర్లకు ఇవి తోడ్పడతాయి. పోర్ట్ఫోలియోకి స్థిరత్వం ఎలాంటి పెట్టుబడి వ్యూహానికైనా ప్యాసివ్ ఫండ్స్ అనేవి పటిష్టమైన పునాదిగా నిలుస్తాయి. రిటైర్మెంట్, గృహం, పిల్లల చదువు లేదా సంపద సృష్టి ఇలా ఏ లక్ష్యం కోసం ఇన్వెస్ట్ చేస్తున్నా సరే, దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు అవసరమైన స్థిరత్వం, క్రమశిక్షణను ప్యాసివ్ ఫండ్స్ అందిస్తాయి. కొత్త ఇన్వెస్టర్ల విషయానికొస్తే చాలా సరళంగా, చాలా తక్కువ వ్యయాలతో పెట్టుబడులు ప్రారంభించేందుకు సహాయకరంగా ఉంటాయి. అనుభవజ్ఞులైన ఇన్వెస్టర్ల విషయాన్ని తీసుకుంటే యాక్టివ్ వ్యూహాలతో సమతూకం పాటించేందుకు, ఓవరాల్ ఖర్చులను తగ్గించుకునేందుకు ఉపయోగపడతాయి. ప్యాసివ్ ఇన్వెస్టింగ్ పరిధి మరింత విస్తృతమవుతోంది. కేవలం లార్జ్ క్యాప్ ఈక్విటీ సూచీలకే పరిమితం కాకుండా డెట్ మార్కెట్లు, అంతర్జాతీయంగా పెట్టుబడులు, సెక్టార్ ఆధారిత సూచీలు, ఫ్యాక్టర్ స్ట్రాటజీల్లో అంతర్జాతీయంగా ప్యాసివ్ ఆప్షన్స్కి ఆదరణ పెరుగుతోంది.ఇంతటి వైవిధ్యం వల్లే మీ లక్ష్యాలకు అనుగుణంగా పోర్ట్ఫోలియోను తీర్చిదిద్దుకునేందుకు, ఎలాంటి మార్కెట్ పరిస్థితుల్లోనైనా అది పటిష్టంగా ఉండేలా చూసుకునేందుకు ప్యాసివ్ వ్యూహం తోడ్పడుతుంది. ఊహాగానాలు, అంచనాలు, వేగవంతమైన ట్రేడింగ్లతో హడావిడిగా ఉండే ప్రపంచంలో, ప్యాసివ్ ఇన్వెస్టింగ్ అనేది ఒక స్పష్టతనిస్తుంది. దీర్ఘకాలిక లక్ష్యాలపై ఫోకస్ పెట్టేందుకు, కాంపౌండింగ్ ప్రయోజనాలు పొందేందుకు, నిరంతరం మార్కెట్ను ట్రాక్ చేయాల్సిన ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఇవి తోడ్పడతాయి. ఇప్పుడిప్పుడే పెట్టుబడుల ప్రస్థానం ప్రారంభిస్తున్నా లేక రిటైర్మెంట్ నిధిని ఏర్పర్చుకోవాలనుకుంటున్నా అందుకు తగిన స్థిరత్వాన్ని, నిలకడను ప్యాసివ్ ఫండ్స్ అందిస్తాయి. నిఫ్టీ 100 లేదా నిఫ్టీ 500 ఇండెక్స్ ఫండ్లాంటి సరళమైన ప్యాసివ్ ఫండ్ను ప్రధాన సాధనంగా తీసుకుని ఇన్వెస్టర్లు, పెట్టుబడులను ప్రారంభించవచ్చు. ఇన్వెస్ట్మెంట్లను కొనసాగిస్తూ వెళ్తే కాలక్రమేణా సత్ఫలితాలు వాటంతటవే వస్తాయి. -
మరో బీమా సంస్థ సూపర్ టాపప్ ప్లాన్.. తీసుకోవచ్చా?
నాకు రూ.4 లక్షలకు బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉంది. అదే బీమా సంస్థ నుంచి రూ.6 లక్షలకు సూపర్ టాపప్ ప్లాన్ కూడా ఉంది. ఇప్పుడు రూ.10 లక్షల డిడక్టబుల్తో రూ.40 లక్షల సూపర్ టాపప్ ప్లాన్ను మరో బీమా సంస్థ ఆఫర్ చేస్తోంది. తీసుకోవచ్చా? – షావలిటాపప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది డిడక్టబుల్కు పైన ఉన్న మొత్తానికి బీమా కవరేజీని ఇస్తుంది. డిడక్టబుల్ అంటే, మొత్తం బిల్లులో అంతకు మించిన క్లెయిమ్కే చెల్లింపులు లభిస్తాయి. డిడక్టబుల్ మేర పాలసీదారు భరించాల్సి ఉంటుంది. సూపర్ టాపప్ ప్లాన్ తీసుకునేందుకు బేసిక్ కవరేజీ ఉండాల్సిన అసవరం లేదు. టాపప్ ప్లాన్లో డిడక్టబుల్ అనేది హాస్పిటల్లో చేరిన ప్రతి సందర్భంలోనూ అమలవుతుంది. అదే సూపర్ టాపప్ ప్లాన్లో ఒక ఏడాది మొత్తం మీద అయిన హాస్పిటల్ ఖర్చులకు డిడక్టబుల్ అమలవుతుంది. కనుక టాపప్ ప్లాన్లతో పోలిస్తే సూపర్ టాపప్ ప్లాన్ మరింత ప్రయోజనకరం. ఒకే సమయంలో రెండు సూపర్ టాపప్ ప్లాన్లను కలిగి ఉండే విషయంలో ఎలాంటి నియంత్రణలు లేవు.ప్రస్తుతం ఉన్న ప్లాన్లో లేని మెరుగైన సదుపాయాలను కొత్త సూపర్ టాపప్ ప్లాన్ ఆఫర్ చేస్తుంటే నిస్సందేహంగా తీసుకోవచ్చు. బేసిక్ పాలసీలో లేని రక్షణను సూపర్ టాపప్ ప్లాన్ ఇస్తుంటే తీసుకోవచ్చు. ఉదాహరణకు మీ ఆస్పత్రి బిల్లు రూ.18 లక్షలు అయిందనుకోండి. అప్పుడు బేసిక్ పాలసీ నుంచి రూ.4 లక్షలు, మొదటి సూపర్ టాపప్ నుంచి రూ.6 లక్షలు చెల్లింపులు లభిస్తాయి. అప్పుడు మరో రూ.8 లక్షలు మిగిలి ఉంటుంది. రెండో సూపర్ టాపప్ ప్లాన్ నుంచి రూ.8 లక్షలు క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే, ఎక్కువ సూపర్ టాపప్ ప్లాన్లు ఉంటే బీమా క్లెయిమ్ ప్రక్రియ సంక్లిష్టంగా మారుతుంది. ఒకటికి మించిన సంస్థల వద్ద క్లెయిమ్ దాఖలుకు శ్రమించాల్సి వస్తుంది. బేసిక్ పాలసీకి అదనంగా ఒక్క సూపర్ టాపప్ ప్లాన్ను కలిగి ఉండడమే సౌకర్యం.బంగారం, వెండి, ఈక్విటీలు, డెట్, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టే మల్టీ అస్సెట్ ఫండ్స్తో ప్రయోజనాలు ఏమిటి? – నగేష్ బంగారుమల్టీ అస్సెట్ ఫండ్స్ కనీసం మూడు రకాల సాధనాల్లో (సాధారణంగా ఈక్విటీ, డెట్, గోల్డ్) పెట్టుబడులు పెడుతుంటాయి. ఈక్విటీ మార్కెట్ అస్థిరతల నేపథ్యంలో పెట్టుబడులను వైవిధ్యం చేసుకోవాలి. 2008 నుంచి సెన్సెక్స్ పది దారుణ పతనాలను గమనించండి. ఆ సమయంలో ఈక్విటీలు ఒక నెలలో 22.5 శాతం మేర నష్టపోయాయి. అదే సమయంలో బంగారం ధరలు కూడా తగ్గాయి. కాకపోతే ఈక్విటీలతో పోల్చి చూస్తే బంగారంలో క్షీణత తక్కువ. పెట్టుబడుల విలువను రక్షించే స్థాయిలో ఈ వ్యత్యాసం లేదు. 2008, 2024 సంవత్సరాలు ఇందుకు మినహాయింపు. అప్పుడు ఈక్విటీలతో పోల్చితే బంగారం మెరుగ్గా పనిచేసింది. దీర్ఘకాలంలో ఈక్విటీలంత కాకపోయినా, కొంత వ్యత్యాసంతో బంగారం సైతం మెరుగైన రాబడులను ఇచ్చింది. కనుక మెరుగైన రాబడుల కోణంలో కాకుండా వైవిధ్యం కోసం మల్టీ అస్సెట్ ఫండ్స్లో కొంత మొత్తం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.ఇదీ చదవండి: టారిఫ్లతో ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు -
‘రిచ్ డాడ్..’ రాబర్ట్ కియోసాకి మరో ముఖ్యమైన హెచ్చరిక..
గ్లోబల్ ఫైనాన్స్ ఎడ్యుకేటర్, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) మరో ముఖ్యమైన అంశంపై ఇన్వెస్టర్లను హెచ్చరించారు. ఇటీవల తన సోషల్ మీడియా పోస్టుల ద్వారా “టాకింగ్ యువర్ బుక్” (talking your book) అనే ఆర్థిక పదాన్ని వివరించారు. దీని అర్థం తనకు లాభం వచ్చే ఆస్తులను ప్రచారం చేయడం, అది విద్య పేరుతో జరిగినా, వాస్తవంగా అమ్మకానికి దారితీస్తే అది నైతికంగా తప్పు అని ఆయన అభిప్రాయం.“నేను నా రియల్ ఎస్టేట్ ద్వారా మిలియన్లు సంపాదించాను… కానీ నేను మీకు ఏ ఆస్తి లేదా మోర్టగేజ్ అమ్మడం లేదు. నేను బోధిస్తున్నాను, అమ్మడం కాదు,” అని కియోసాకి పేర్కొన్నారు. అలాగే, ఒక యూట్యూబ్ రియల్ ఎస్టేట్ కుటుంబం తమ ఆర్థిక సదస్సులో “ఒక ప్రత్యేక పెట్టుబడి అవకాశాన్ని” ప్రస్తావిస్తూ, “మీరు అర్హులైతే” అని చెప్పడం ద్వారా విద్యను అమ్మకానికి మలచడం జరిగిందని ఆయన విమర్శించారు.బిట్కాయిన్, బంగారం, వెండి కొంటాను..టాకింగ్ యువర్ బుక్ పాఠంపై పోస్టుకు కొనసాగింపుగా మరో చేసిన పోస్టులో, కియోసాకి తన పెట్టుబడి విధానాన్ని స్పష్టంగా చెప్పారు. “నేను బంగారం, వెండి, బిట్కాయిన్ కొనుగోలు చేస్తాను. అమ్మడం చాలా అరుదు” అంటూ రాసుకొచ్చారు. ఇది దీర్ఘకాలిక ఆస్తులపై ఆయన నమ్మకాన్ని సూచిస్తుంది. మార్కెట్ను ప్రభావితం చేయాలనే ఉద్దేశం లేకుండా, ఆయన తన ఆర్థిక నమ్మకాలను పంచుకుంటున్నారని ఇది సూచిస్తుంది.VERY IMPORTANTANT $ LESSON;Q: What does “talking your book” mean?A: When a person is “talking their book” they have stopped teaching and are now selling.For example: I often state I make millions from my real estate…using debt. When I state that I am teaching… not…— Robert Kiyosaki (@theRealKiyosaki) August 31, 2025 -
డబ్బులు దాచుకునే పిగ్గీ బ్యాంక్ ఎప్పుడు పుట్టిందో తెలుసా?
పిల్లలూ... మీరంతా డబ్బులను భద్రంగా దాచుకునేందుకు పిగ్గీ బ్యాంక్ను ఉపయోగిస్తుంటారు కదూ. పెద్దలు అప్పుడప్పుడూ ఇచ్చిన డబ్బుల్ని ఇందులో దాచుకొని, అది నిండాక పగలగొట్టి వాడుకుంటారు కదూ. వరాహం ఆకారంలో ఉండే ఈ పిగ్గీ బ్యాంక్ వాడేందుకే కాదు, చూసేందుకూ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అందుకే చాలామంది దీన్ని ఇంట్లో అలంకరణ వస్తువుగానూ పెట్టుకుంటారు.ఇలా డబ్బు దాచుకునే సాధనాలను వాడే అలవాటు క్రీ.పూ 2వ శతాబ్దంలో మొదలైందని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపినప్పుడు ఆ కాలంలో వారు డబ్బులు దాచే పెట్టెలు, హుండీలు బయటపడ్డాయి. వాటిని వివిధ రకాల లోహాలతో తయారు చేశారు. అయితే వరాహ ఆకారంలో ఇలాంటివి తయారు చేయడం మాత్రం క్రీ,శ, 12వ శతాబ్దంలో మొదలైందని అంటారు.వరాహ ఆకారంలో ఉన్న ఈ హుండీలు జావా ద్వీపంలో మొట్టమొదటిసారి దొరికినట్లు చెబుతున్నారు. ఇండోనేషియాలోని తూర్పు జావా ప్రావిన్స్లో పెద్ద సంఖ్యలో వరాహ ఆకారపు పిగ్గీ బ్యాంకులు కనుగొన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఆకారంలోని పిగ్గీ బ్యాంకులు 13వ శతాబ్దంలో జర్మనీలో తయారయ్యాయని అంటున్నారు. అక్కడ పందులను అదృష్టానికి చిహ్నాలుగా గౌరవించేవారని, అందుకే పంది ఆకారంలో వాటిని తయారు చేసేవారని భావిస్తున్నారు.ఈ పిగ్గీ బ్యాంక్లు సిరామిక్ లేదా పింగాణీతో తయారు చేస్తారు. వివిధ సైజులు, ఆకారాలతో ఇవి లభ్యమవుతాయి. విదేశాల్లో పిల్లలకు పుట్టినరోజు బహుమతులుగా వీటిని ఇచ్చేందుకు చాలామంది ఆసక్తి చూపుతారు. పిల్లల్లో పొదుపు ఆలోచన పెంచేందుకు కొన్ని విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఈ పిగ్గీ బ్యాంకులను వారికి ఉచితంగా అందిస్తుంటాయి. -
నెలకు రూ. 35వేలతో.. కోటీశ్వరులయ్యే మార్గం
కోటీశ్వరులవ్వాలనే కల అందరికీ ఉంటుంది. అయితే కోటీశ్వరులవ్వడం ఎలా అని మాత్రం చాలామందికి తెలియకపోవచ్చు. సరైన ఆర్థిక ప్రణాళిక, సరైన పెట్టుబడి ఎవ్వరినైనా కోటీశ్వరులను చేస్తుంది. ఈక్విటీ షేర్లు లేదా బంగారం వంటి వాటిలో పెట్టె పెట్టుబడి తప్పకుండా ధనవంతులను చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదేలాగో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.మీరు నెలకు కేవలం రూ. 35,000 పెట్టుబడి పెడితే.. కోటీశ్వరులవుతారు. మీరు పెట్టే పెట్టుబడిన బంగారం, స్టాక్ మార్కెట్, ఫిక్స్డ్ డిపాజిట్ లేదా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్ (PPF) వంటి వాటిలో కొంత, కొంత విభజించి ఇన్వెస్ట్ చేయాలి. ఎలా అంటే.. మ్యూచువల్ ఫండ్స్లో రూ. 20000, బంగారంపై రూ. 10000, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో రూ. 5 వేలుగా విభజించి పెట్టుబడి పెట్టాలి.మ్యూచువల్ ఫండ్●నెలవారీ ఇన్వెస్ట్మెంట్: రూ. 20,000●కాల వ్యవధి: 12 సంవత్సరాలు●అంచనా వేసిన రిటర్న్స్: సంవత్సరానికి 12 శాతం ●పెట్టుబడి పెట్టిన మొత్తం: రూ. 28,80,000 ●ఎస్టిమేటెడ్ రిటర్న్స్: రూ. 35,65,043 ●మొత్తం విలువ: రూ. 64,45,043బంగారంపై పెట్టుబడి●నెలవారీ పెట్టుబడి: రూ. 10,000 ●కాల వ్యవధి: 12 సంవత్సరాలు ●అంచనా వేసిన రాబడి: సంవత్సరానికి 10 శాతం ●పెట్టుబడి పెట్టిన మొత్తం: రూ. 14,40,000 ●ఎస్టిమేటెడ్ రిటర్న్స్: రూ. 13,47,415 ●మొత్తం విలువ: రూ. 27,87,415పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ●నెలవారీ: రూ. 5,000 ●కాల వ్యవధి: 15 సంవత్సరాలు ●అంచనా వేసిన రాబడి: 7.1 శాతం●పెట్టుబడి పెట్టిన మొత్తం: రూ. 9,00,000 ●ఎస్టిమేటెడ్ రిటర్న్స్: రూ. 7,08,120 ●మొత్తం విలువ: రూ. 16,08,120ఇప్పుడు మీకు వచ్చిన మొత్తం కలిపితే రూ. 64,45,043 (మ్యూచువల్ ఫండ్) + రూ. 27,87,415 (బంగారం) + రూ. 16,08,120 (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్)= రూ. 1,08,40,578 అవుతుంది. ఇది కేవలం అంచనా మాత్రమే. వడ్డీ శాతం పెరిగితే ఇంకా ఎక్కువ మొత్తంలో లాభాలను పొందే అవకాశం కూడా ఉంటుంది.NOTE: పెట్టుబడి పెట్టడం అనేది మీ సొంత నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. అంతే కాకుండా పెట్టుబడి పెట్టడానికి ముందు.. పెట్టుబడులను గురించి తెలుసుకోవడానికి, తప్పకుండా ఆర్ధిక నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్కరికీ భారీ లాభాలు వస్తాయని చెప్పలేము. కొన్ని సార్లు కొంత నష్టాన్ని కూడా చవిచూడాల్సి ఉంటుంది. కాబట్టి పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్స్ జాగ్రత్తగా ఉండాలి. -
కార్ లోన్ కస్టమర్లకు గుడ్న్యూస్..
పండుగ సీజన్ ప్రారంభాన్ని పురస్కరించుకుని బ్యాంక్ ఆఫ్ బరోడా కారు రుణ వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఫ్లోటింగ్ కార్ లోన్ వడ్డీ రేట్లు ఇప్పుడు సంవత్సరానికి 8.15 శాతం నుండి ప్రారంభమవుతాయి. ఇంతకు మందు ప్రారంభ వడ్డీ రేటు 8.40 శాతం ఉండేది.కొత్త ప్రారంభ 8.15 శాతం వార్షిక వడ్డీ రేటు కొత్త కారు కొనుగోలు రుణాలపై వర్తిస్తుంది. ఆర్బీఐ ఈ ఏడాది మూడు మానిటరీ పాలసీ సమావేశాల్లో రెపో రేటును 100 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఫిబ్రవరి, ఏప్రిల్ పాలసీ సమావేశాల్లో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు, జూన్లో 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో చాలా బ్యాంకులు కూడా రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించడం ప్రారంభించాయి.తనఖా రుణాలపైనా..బ్యాంక్ ఆఫ్ బరోడా తనఖా రుణం (ప్రాపర్టీపై రుణం) వడ్డీ రేట్లను కూడా వార్షికంగా 9.85 శాతం నుంచి 9.15 శాతానికి తగ్గించింది. దరఖాస్తుదారులు బ్యాంక్ డిజిటల్ లెండింగ్ ప్లాట్ఫామ్ - బరోడా డిజిటల్ కార్ లోన్ ద్వారా బ్యాంక్ ఆఫ్ బరోడా కార్ లోన్కు డిజిటల్గా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా సమీప బ్యాంక్ శాఖను సందర్శించవచ్చు. బ్యాంక్ 6 నెలల ఎంసీఎల్ఆర్తో లింక్ చేసిన బరోడా కార్ లోన్పై ఆకర్షణీయమైన ఫిక్స్డ్ వడ్డీ రేటును కూడా బ్యాంక్ అందిస్తుంది. -
జన్ధన్ ఖాతాలు 56.16 కోట్లు: డిపాజిట్లు ఎంతంటే?
ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం కింద ఖాతాల సంఖ్య ఆగస్టు 13 నాటికి 56.16 కోట్లకు చేరింది. ఇందులో రూ.2.68 లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ఎక్స్ ప్లాట్ఫామ్పై ప్రకటించింది. 2015 మార్చి నాటికి ఈ ఖాతాల సంఖ్య 14.72 కోట్లుగా ఉన్నట్టు తెలిపింది. 11 ఏళ్లలో గణనీయంగా పెరిగినట్టు పేర్కొంది. జన్ధన్ ఖాతాదారుల్లో 56 శాతం మహిళలేనని.. 67 శాతం ఖాతాలు గ్రామీణ, చిన్న పట్టణాల్లో తెరిచినట్టు వెల్లడించింది.లబ్ధిదారుల ఖాతాలకు ప్రత్యక్ష నగదు బదిలీ రూపంలో రూ.45 లక్షల కోట్లను బదిలీ చేసినట్టు తెలిపింది. జన్ధన్ ఖాతాదారులకు 38.68 కోట్ల రూపే డెబిట్ కార్డులు మంజూరైనట్టు వెల్లడించింది.దేశంలో 94 శాతం వయోజనులకు బ్యాంక్ ఖాతాలున్నట్టు తెలిపింది. అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేయాలన్న సంకల్పంతో కేంద్ర సర్కారు 2014 ఆగస్ట్ 28న ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకాన్ని ప్రారంభించడం గమనార్హం. దీనికంద సున్నా బ్యాలన్స్, ఉచిత రూపే డెబిట్ కార్డు, ప్రమాద బీమా తదితర సదుపాయాలతో సేవింగ్స్ ఖాతాను ప్రారంభించేందుకు అవకాశం కల్పించింది. -
భార్యతో కలిసి ఇన్వెస్ట్ చేసే పోస్టాఫీసు ప్రత్యేక స్కీమ్..
అసలుకు ఎటువంటి రిస్క్ లేకుండా మంచి రాబడినిచ్చే పొదుపు పథకాలు పోస్టాఫీసుల్లో ఎన్నో ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ ఏడాది రెపో రేటును 1 శాతం తగ్గించింది. ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్ నెలల్లో వరుసగా కోతలు విధించింది. దీనికి అనుగుణంగా బ్యాంకులు కూడా పొదుపు ఖాతాలపై వడ్డీని బ్యాంకులు తగ్గించాయి. కానీ పోస్టాఫీసుల్లో పథకాల వడ్డీ రేట్లు మాత్రం మారలేదు.సురక్షితమైన పెట్టుబడితో ప్రతి నెలా స్థిర ఆదాయం కోరుకునే వారి కోసం పోస్టాఫీసులో అద్భుతమైన పథకం ఉంది. అదే పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (ఎంఐఎస్) ఈ పథకంలో ఒకసారి ఏకమొత్తంలో మొత్తంలో పెట్టుబడి పెడితే దానిపై వడ్డీ ప్రతి నెలా వారి పొదుపు ఖాతాలో నేరుగా జమవుతుంది. ఈ పథకం 5 సంవత్సరాల పాటు ఉంటుంది. మెచ్యూరిటీ తర్వాత అసలు మొత్తం తిరిగి లభిస్తుంది. ఈ స్కీమ్లో ఒకే ఖాతా ద్వారా గరిష్టంగా రూ.9 లక్షలు డిపాజిట్ చేయొచ్చు. అదే జాయింట్ అకౌంట్ ద్వారా అయితే రూ.15 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు.వడ్డీ ఎంత వస్తుందంటే..పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ 7.4% వార్షిక వడ్డీని (ఆగస్టు 2025 నాటికి) అందిస్తుంది. పెట్టుబడి పూర్తిగా సురక్షితం. ప్రతి నెలా గ్యారెంటీ వడ్డీని ఇస్తుంది. ఉదాహరణకు భార్యభర్తలిద్దరూ కలిసి ఉమ్మడి ఖాతాలో రూ .15 లక్షలు పెట్టుబడి పెడితే ప్రతి నెలా సుమారు రూ .9,250 వడ్డీ వస్తుంది. ఈ పథకం ప్రత్యేకమైనది ఎందుకంటే దాని వడ్డీ రేటు స్థిరంగా, బ్యాంకు కంటే ఎక్కువగా ఉంటుంది. దీనికి ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తుంది కాబట్టి పెట్టుబడి చాలా సురక్షితం. ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని పొందడం వల్ల క్రమం తప్పకుండా ఆదాయం లభిస్తుంది. -
బ్యాంకులకు వరుస సెలవులు
ఆగస్టు నెల ముగింపునకు వచ్చేసింది. తర్వాత సెప్టెంబర్ నెల ప్రారంభం కాబోతోంది. సెస్టెంబర్ నెలలో పెద్ద సంఖ్యలో పండుగలు ఉండటంతో బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నాయి. కర్మ పూజ, ఓనం, ఈద్-ఎ-మిలాద్, ఇంద్రజాత్ర, నవరాత్రి స్థాపన, దుర్గా పూజ మహారాజా హరి సింగ్ జీ జయంతి వంటి పండుగలు, ప్రాంతీయ సందర్భాల కోసం వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు.అయితే ప్రాంతాలను బట్టి సెలవులు మారుతూ ఉంటాయి కాబట్టి బ్యాంకు బ్రాంచీలను సందర్శించే ముందు వినియోగదారులు రాష్ట్రాల వారీగా సెలవుల జాబితాను పరిశీలించాలి. ఆదివారాలు, జాతీయ, ప్రాంతీయ బ్యాంకుల సెలవులతో పాటు నెలలోని రెండు, నాలుగో శనివారాల్లో కూడా బ్యాంకులు మూతపడతాయి.సెప్టెంబర్లో బ్యాంకు సెలవులుఆర్బీఐ ప్రకటించిన సెలవుల జాబితా ప్రకారం సెప్టెంబర్ నెలలో బ్యాంకులకు సెలవులు ఇలా ఉన్నాయి.. కర్మ పూజ, మొదటి ఓనం, ఈద్-ఎ-మిలాద్, తిరువోనం, ఈద్-ఎ-మిలాద్, ఇంద్రజాత్ర, ఈద్-ఇ-మిలాద్-ఉల్-నబీ తర్వాత వచ్చే శుక్రవారం, నవరాత్ర స్థాపన, మహారాజా హరి సింగ్ జీ జన్మదినం, మహా సప్తమి / దుర్గా పూజ వంటి సందర్భాల్లో వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు సెలవులు పాటిస్తూ మూసి ఉంటాయి.సెప్టెంబర్ 3, 2025 (బుధవారం) కర్మ పూజ సందర్భంగా జార్ఖండ్లో బ్యాంకులకు సెలవుసెప్టెంబర్ 4, 2025 (గురువారం) ఓనం పండుగ సందర్భంగా కేరళలో బ్యాంకులకు సెలవు.సెప్టెంబర్ 5, 2025 (శుక్రవారం) గుజరాత్, మిజోరాం, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, హైదరాబాద్, విజయవాడ, మణిపూర్, జమ్మూ, ఉత్తరప్రదేశ్, కేరళ, న్యూఢిల్లీ, జార్ఖండ్, జమ్మూ, శ్రీనగర్లలో ఈద్-ఎ-మిలాద్, తిరువోనం సందర్భంగా బ్యాంకులు పనిచేయవు.సెప్టెంబర్ 6, 2025 (శనివారం) ఈద్-ఎ-మిలాద్ (మిలాద్-ఉన్-నబీ)/ఇంద్రజాత్ర కోసం సిక్కిం, ఛత్తీస్గడ్లలో బ్యాంకులకు సెలవుసెప్టెంబర్ 12, 2025 (శుక్రవారం) ఈద్-ఇ-మిలాద్-ఉల్-నబీ తరువాత శుక్రవారం జమ్మూ, శ్రీనగర్లో బ్యాంకులు మూసివేస్తారు.సెప్టెంబర్ 22, 2025 (సోమవారం) నవరాత్రి స్థాపన సందర్భంగా రాజస్థాన్లో బ్యాంకులకు సెలవుసెప్టెంబర్ 23, 2025 (శనివారం) మహారాజా హరి సింగ్ జీ జన్మదినాన్ని పురస్కరించుకుని జమ్మూ, శ్రీనగర్లో బ్యాంకులకు సెలవుసెప్టెంబర్ 29, 2025 (సోమవారం) మహా సప్తమి, దుర్గా పూజను జరుపుకోవడానికి త్రిపుర, అస్సాం, పశ్చిమ బెంగాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.సెప్టెంబర్ 30, 2025 (మంగళవారం) త్రిపుర, ఒడిశా, అస్సాం, మణిపూర్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, మహా అష్టమి / దుర్గాష్టమి / దుర్గా పూజ సందర్భంగా బ్యాంకులకు సెలవు. -
మిడిల్ క్లాస్ నుంచి రిచ్ అవ్వాలా?
చదువు పూర్తి చేసుకుని కెరియర్లోకి అడుగుపెడుతున్న చాలా మంది యువతకు పర్సనల్ ఫైనాన్స్పై పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు. అప్పుడే చదువు అయిపోయి ఉంటుంది..కొత్త ఉద్యోగం.. కొత్త కొలీగ్స్.. పార్టీలు.. బ్రాండెడ్ వస్తువులు.. డైనింగ్లు.. ఇలా చాలా వాటికి విచ్చలవిడిగా ఖర్చు చేస్తుంటారు. కానీ కెరియర్ ఇనిషియల్ స్టేజ్ నుంచే పొదుపు ప్రారంభించాలని నిపుణులు సూచిస్తున్నారు. దాంతో దీర్ఘకాలంలో భారీ కార్పస్ను క్రియేట్ చేయవచ్చని చెబుతున్నారు. అందుకు ఏం చేయాలో సలహాలు ఇస్తున్నారు.త్వరగా పొదుపు ప్రారంభించాలి..మొదటి జీతం పెద్దగా లేకపోయినా, ప్రతి నెలా ఎంతో కొంత పొదుపు చేయడం ప్రారంభించాలి. చక్రవడ్డీ నిజంగా దీర్ఘకాలంలో అద్భుతాలు చేస్తుందని నమ్మండి. ఈ రోజు పొదుపు చేసిన డబ్బు కాలక్రమేణా గణనీయంగా పెరుగుతుంది. ఉదా..22 సంవత్సరాల వయసు నుంచి నెలకు రూ.1,000 పొదుపు చేస్తే రిటైర్మెంట్ నాటికి ఏటా 12 శాతం రిటర్న్తో లెక్కిస్తే కనీసం రూ.50 లక్షలు సమకూరుతాయి.ఖర్చులను ట్రాక్ చేయాలి..సంపాదించడం ప్రారంభించినప్పటి నుంచే డబ్బు ప్రవాహాన్ని ట్రాక్ చేయాలి. అందుకు అవసరమయ్యే ఎక్సెల్ షీట్స్ వంటి బడ్జెట్ టూల్స్ను ఉపయోగించవచ్చు. దీనికి అధికంగా ఖర్చు చేస్తున్నారో షీట్లో చూసుకొని, ఖర్చు తగ్గించుకుంటే ఫలితం ఉంటుంది.అనవసరమైన ఈఎంఐలు..ఈఎంఐ ద్వారా లేటెస్ట్ కాస్ట్లీ ఫోన్ లేదా బైక్ కొనడం సులభంగా అనిపించవచ్చు. కానీ నెలవారీ ఈఎంఐ మీ ఆర్థిక భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అత్యవసరం లేదా పెట్టుబడి సాధనం(విద్య లేదా గృహనిర్మాణం వంటివి) రుణాలను తీసుకోవద్దు.అత్యవసర నిధిజీవితం అనూహ్యమైంది. మారుతున్న టెక్నాలజీ వల్ల ఏవరి ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో చెప్పలేం. ఉద్యోగం కోల్పోవడం లేదా వైద్య సమస్యలు ఎప్పుడైనా ఎదురవ్వొచ్చు. కనీసం 3 నుంచి 6 నెలలకు సరిపడా ఖర్చులను ప్రత్యేక, సులభంగా నగదుగా మార్చగలిగే సాధనాల్లో పొదుపు చేయాలి.టర్మ్ ఇన్సూరెన్స్చదువు అయిపోయి ఉద్యోగంలో చేరిన వెంటనే ముందుగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇది తక్కువ ప్రీమియంతో అధిక కవరేజీని అందిస్తుంది. ఎండోమెంట్స్ లేదా యులిప్స్ వంటి జీవిత బీమా పథకాలకు దూరంగా ఉండండి. ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ప్రీమియం తక్కువ పడుతుంది.మ్యూచువల్ ఫండ్స్లో సిప్మంచి మ్యూచువల్ ఫండ్స్లో ప్రతినెలా క్రమానుగత పెట్టుబడులు(సిప్) పెట్టాలి. ఇది దీర్ఘకాలిక సంపదను పెంపొందించడానికి సహాయపడుతుంది. ప్రత్యేకంగా మార్కెట్కు సమయం కేటాయించాల్సిన అవసరం లేదు.ఇదీ చదవండి: ఈపీఎఫ్ఓ 3.0 కీలక ఫీచర్లు.. 8 కోట్ల మందికి ప్రయోజనం -
పెళ్లిలో వచ్చే కానుకలపై పన్ను ఉంటుందా?
పెళ్లి అంటే రూ.లక్షల ఖర్చుతో కూడిన వ్యవహారం. ముఖ్యంగా భారతీయ వివాహాలు ఎంతో ఆర్భాటంగా నిర్వహిస్తారు. పెళ్లి భోజనాలు ఎంత ఘనంగా వడ్డిస్తారో ఆ పెళ్లికి వచ్చే కానుకలూ అంతే ఘనంగా ఉంటాయి. రూ.లక్షల్లో బహుమతులు చేతికందుతాయి. మరి వీటికి పన్ను ఉంటుందా? చెప్పకుండా దాచేస్తే ఆదాయపు పన్ను శాఖ కనిపెడుతుందా?పెళ్లి సందర్భంలో వచ్చే కానుకలపై పన్ను అంశం పన్ను చట్టంలో స్పష్టంగా నిర్వచించారు. ఇది ఎవరికి వస్తోంది, ఎప్పుడు వస్తోంది, ఎంత మొత్తం వస్తోంది అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి సంబంధించి తాజాగా అహ్మదాబాద్ ఇన్కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (ITAT) ఇచ్చిన తీర్పు స్పష్టతను తీసుకొచ్చింది. ఈ తీర్పు ప్రకారం, పెళ్లి సందర్భంలో వచ్చిన బహుమతులు, డాక్యుమెంటేషన్ సరైనదైతే, పన్ను మినహాయింపు పొందవచ్చు.పెళ్లి కానుకలపై పన్ను చట్టం ప్రకారం..పెళ్లి జరిగే వ్యక్తి అంటే పెళ్లి కొడుకు లేదా పెళ్లి కూతురుకి వచ్చిన బహుమతులు (నగదు లేదా ఇతరం) ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 56(2)(x) ప్రకారం పన్ను మినహాయింపు పొందుతాయి. పెళ్లి జరిగే వ్యక్తి కాకుండా ఇతరులు అంటే వారి తల్లిదండ్రులు, తోడబుట్టినవారు పెళ్లి కానుకలు అందుకుంటే వాటికి సరైన డాక్యుమెంటేషన్ ఉంటేనే పన్ను మినహాయింపు ఉంటుంది. సాధారణంగా రూ.50,000కు మించి వచ్చిన బహుమతులను పన్ను వర్తించే ఆదాయంగా పరిగణిస్తారు.ఇటీవలి ఐటీ ట్రిబ్యునల్ తీర్పుగుజరాత్కు చెందిన మనుభాయ్ అనే వ్యక్తి తన కుమారుడి పెళ్లికి రూ.4.31 లక్షల నగదు బహుమతులు స్వీకరించారు. అయితే ఇవి పెళ్లి తేదీ కంటే ముందే వచ్చాయి. దీంతో ఆదాయపు పన్ను శాఖ వీటిని "అస్పష్ట ఆదాయం"గా పేర్కొంటూ పన్ను విధించింది.దీనిపై కోర్టుకు వెళ్లిన మొదట సీఐటీ (అపీల్స్) వద్ద కేసు కోల్పోయారు. తరువాత ఐటీఏటీ అహ్మదాబాద్ అప్పీల్ దాఖలు చేశారు. పెళ్లి ఆహ్వాన పత్రిక, అతిథుల జాబితా, వివాహ ధృవపత్రం వంటి ఆధారాలు సమర్పించారు. 2025 ఆగస్టు 12న ట్రిబ్యునల్ ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. రూ.4.31 లక్షల ఆదాయంపై పన్ను మినహాయించాలని ఆదేశించింది.పన్ను చెల్లింపుదారులకు సూచనలు పెళ్లిలో వచ్చిన బహుమతులకు రిజిస్టర్ నిర్వహించాలి (పేరు, మొత్తం, తేదీతో సహా). పెళ్లి ధృవపత్రాలు, ఆహ్వాన పత్రాలు భద్రంగా ఉంచుకోవాలి. పెళ్లిలో కానుకలుగా వచ్చిన ఆదాయాన్ని ఐటీఆర్లో మినహాయింపు ఆదాయంగా బహుమతులను ప్రకటించాలి. పూర్తి డాక్యుమెంటేషన్ ఉంటే, పన్ను శాఖ ప్రశ్నించినా రక్షణ పొందవచ్చు. -
మీరు ఆస్తిపరులా? లేదా ధనవంతులా?
ఈరోజుల్లో చాలా కుటుంబాల్లో ఇల్లు, బంగారం, భూమి కొనుగోలు కోసం అధికంగా పెట్టుబడులు పెడుతున్నారు. ఇవి దీర్ఘకాలంలో భద్రతా భావనను కలిగిస్తాయి. సామాజికంగా గౌరవం తెస్తాయి. ఇవి ఆర్థికంగా జీవితంలో విజయానికి సంకేతంగా నిలుస్తాయి. కానీ ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితులు వస్తే వెంటనే ఉన్న భూమి అమ్మి ఖర్చు చేయలేని పరిస్థితులు నెలకొంటాయి. స్థిరాస్తులు వెంటనే నగదుగా మార్చుకోలేని ఆస్తులని గుర్తించాలి. పెద్ద ఇల్లు, బంగారం, వేల గజాల భూమి ఉన్నా నెలవారీ ఖర్చులు, ఆరోగ్య సమస్యలను తీర్చలేవు. ఇందువల్లే మనం నిజంగా ‘ఆస్తిపరులమా? ధనవంతులమా?’ అనే భావన వస్తుంది.ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తాయి?సామాజిక ఒత్తిడిచదువు పూర్తయి ఉద్యోగం సంపాదించి పెళ్లి జరిగేలోపు ఇల్లు కొనాలి అనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది. దీనివల్ల పెద్ద మొత్తంలో ఈఎంఐతో స్థిరాస్తిలో కొనుగోలు చేస్తుంటారు. ఇది వారి ఆదాయాన్ని కొన్నేళ్లపాటు పరిమితం చేస్తుంది.ఆర్థిక ప్రణాళిక లోపాలుచాలా మంది అత్యవసర నిధిని ఏర్పాటు చేయరు. తగిన బీమా కవరేజీ ఉండదు. అన్ని పెట్టుబడులు బంగారం, భూమి వంటి స్థిరమైన ఆస్తులపైనే ఉండిపోతాయి. వాటితో రెగ్యులర్ ఆదాయం ఒనగూరదు.ఆదాయాన్నిచ్చే ఆస్తులను విస్మరించడంమ్యూచువల్ ఫండ్స్, డివిడెండ్ స్టాక్స్, అద్దె ఇల్లు, సైడ్ బిజినెస్ వంటి ఆదాయమిచ్చే పెట్టుబడులను విస్మరిస్తారు. భద్రత అనే నెపంతో బంగారం, స్థిరాస్తుల్లోనే మొత్తం పెట్టుబడిని మళ్లిస్తారు. కానీ అవి మిగతా అవసరాలను తీర్చలేవని గ్రహించరు.ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి?ఆస్తుల్లో పెట్టుబడి పెట్టే ముందు కనీసం 3–6 నెలల ఖర్చులకు సరిపడే ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. తగిన హెల్త్, లైఫ్, ఆస్తి బీమా ఉండాలి. డబ్బును సులభంగా విత్డ్రా చేసే వీలుండే లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్స్ (సిప్, షార్ట్ టర్మ్ ఫండ్స్)లో ఇన్వెస్ట్ చేయాలి. నిరంతర నగదు ప్రవాహం కోసం డివిడెండ్ స్టాక్స్లో పెట్టుబడి పెట్టాలి. క్రమానుగత పెట్టుబడులు ప్రారంభించి దీర్ఘకాలిక ఆదాయానికి మార్గాలు వేయాలి. వీలైతే ఫ్రీలాన్సింగ్ లేదా సైడ్ బిజినెస్ ప్రారంభించాలి. అద్దె ఇల్లు/ కమర్షియల్ ప్రాపర్టీ వంటి ఆదాయ ఆస్తులను అన్వేషించాలి.ఇదీ చదవండి: పండగ రోజు బంగారం ధరల తుపాను.. తులం ఎంతంటే.. -
జీవితం సాఫీగా సాగాలంటే ఎంత డబ్బు కావాలి?
ప్రతి మనిషికి సాధారణంగా జీవితం సాఫీగా సాగాలంటే ఎంత మొత్తంలో డబ్బు అవసరం అవుతుందోననే ప్రశ్న ఉంటుంది. ఒకవేళ పెళ్లి అయితే తన ఫ్యామిలీ ఆర్థికంగా భద్రంగా ఉంటుందా ఉండదా.. అనే సందేహంతో తన వద్ద ఎంత డబ్బు ఉంటే సరిపోతుందనే లెక్కలు వేసుకుంటారు. ప్రస్తుత లైఫ్స్టైల్, ఖర్చులు, ఇతర సౌకర్యాలకు కోటి రూపాయలు ఉంటే సరిపోతుందా.. లేదా రెండు కోట్లు కావాలా.. ఐదు కోట్లు కావాలా..? అనే ప్రశ్నలు వస్తుంటాయి. మనలో చాలా మందికి ఏదో ఒక సందర్భంలో ఈ ప్రశ్న వచ్చే ఉంటుంది కదా. ఒక్కొక్కరి అవసరాలు వారివారి జీవన విధానాన్ని బట్టి ప్రత్యేకంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.ఎంతైనా సరిపోకపోవచ్చు..సాధారణంగా చాలామంది తమ లైప్ సెటిల్ కావాలంటే ఎంత మొత్తం డబ్బుకావాలో చెప్పమంటే రాండమ్గా తోచిన నంబర్లు చెప్పేస్తుంటారు. ఒక్కొక్కరి అవసరాలు ఒక్కోలా ఉంటాయి. కొంతమందికి కోటి రూపాయలు ఉంటే వారి ఖర్చులు, అవసరాలు.. అన్నింటికీ సరిపోవచ్చు. ఇంకొందరికి రూ.10 కోట్లు ఉన్నా సరిపోకపోవచ్చు. ఎంత డబ్బు కావాలనేది కుటుంబ సభ్యులు, వారి అభిరుచులు, ఖర్చు నేపథ్యం, భవిష్యత్తు ప్రణాళికలను బట్టి ఆధారపడుతుంది.ఒక్కొక్కరి అవసరాలు ఒక్కోలా..ఆధునిక సమాజంలో ఎంత డబ్బు సంపాదించిన మరింత ఆర్జించాలనే భావన వస్తుంది. కష్టపడి పని చేసి కొంత ఆదాయం సంపాదిస్తే, మరింత ఆదాయం కావాలనిపిస్తుంది. ఈ అంతులేని కోరిక వల్ల ఆందోళన, అసంతృప్తి ఎదురవుతుందని కొందరు నిపుణులు చెబుతున్నారు. అలా అని సంపాదన లేకుండా ఉండాలని వారు చెప్పడం లేదు. ఇలాంటి కోరికల వల్ల నిజమైన ఆర్థిక స్వాతంత్ర్యం రాదు. కోరుకున్న జీవితాన్ని గడపడానికి వాస్తవంగా ఏమి అవసరమో తెలుసుకోవడం కీలకం. మీ నియమాలకు, ఖర్చులకు, భవిష్యత్తు ప్రణాళికలు, అత్యవసరాలకు, ఆరోగ్య సంరక్షణకు సరిపోయే డబ్బు సంపాదిస్తే సరిపోతుందని సూచిస్తున్నారు. కొంతమందికి సౌకర్యవంతమైన ఇల్లు, స్థిరమైన ఉద్యోగం, కుటుంబంతో వారాంతాల్లో ట్రిప్కు వెళ్లడం సౌకర్యంగా ఉంటుంది. ఇంకొందరికి ముందస్తు పదవీ విరమణ, ప్రయాణాలు చేయడం లేదా ఆర్థిక ఒత్తిడి లేకుండా సృజనాత్మక అభిరుచులను కొనసాగించాలనుకుంటారు.ముందుగా చేయాల్సింది..మొత్తంగా ఎంత డబ్బు సంపాదించాలనే దానిపై కాకుండా భవిష్యత్తులో ఎలాంటి జీవితం గడపాలనుకుంటున్నారు? అనే దానిపై స్పష్టత వస్తే ఎంత సంపాదించాలో తెలుస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకు మీ సౌకర్యం, ఆరోగ్యం, సంతోషం కోసం రాజీపడని అంశాలు ఏమిటని గుర్తించాలి. ఆర్థికంగా సురక్షితంగా ఉండటానికి ఏవి దోహదం చేస్తాయో తెలుసుకోవాలి. కష్టపడే వయసులో సంపాదించే మొత్తాన్ని దుబారా ఖర్చు చేయకుండా, పొదుపు చేసి భవిష్యత్తులో జీవితం సాఫీగా సాగేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. అందుకు మెరుగైన పెట్టుబడి మార్గాలను ఎంచుకోవాలి.ఇదీ చదవండి: మార్వాడీలు వ్యాపారంలో ఎందుకు విజయం సాధిస్తారు? -
మార్వాడీలు వ్యాపారంలో ఎందుకు విజయం సాధిస్తారు?
భారతదేశంలో ఎన్నో సామాజిక వర్గాలకు చెందినవారు వ్యాపారాలు సాగిస్తున్నారు. అందులో చాలామంది విజయం సాధిస్తున్నారు. అయితే మార్వాడీ సామాజిక వర్గానికి మాత్రం వ్యాపారం చేయడంలో, అందులో విజయం సాధించడంలో ప్రత్యేక స్థానం ఉంది. వారి ఆర్థిక ఆలోచనా విధానం, వ్యాపార పద్ధతులు కాస్త భిన్నంగా ఉంటాయి. దాంతో వీరు వ్యాపారంలో ముందుంటున్నారనే వాదనలున్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం తీసుకురావడంలో ఈ వర్గం ప్రావీణ్యం పొందిందని కొందరు చెబుతుంటారు. అయితే వీరు అనుసరిస్తున్న ఆర్థిక విధానాల్లో కొన్నింటి గురించి తెలుసుకుందాం.చిన్నతనం నుంచే...మార్వాడీ కుటుంబాల్లో చిన్నప్పటి నుంచే వ్యాపార అంశాలను పిల్లలకు నేర్పిస్తారు. చాలా షాపులు, వ్యాపారాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను చిన్నతనం నుంచే మెలకువలు నేర్పిస్తారు.ఖర్చు చేయడం కన్నా పొదుపు చేయడంపైనే దృష్టి కేంద్రీకరిస్తారు.మార్వాడీలు ఏదైనా వస్తువు కొంటే ధర తగ్గించేందుకు భేరమడడం అలవాటు చేసుకుంటారు. ఇది తమ వ్యాపారాల్లో పెట్టుబడిని తగ్గించి లాభాలకు కారణం అవుతుంది.వ్యాపారంలోని ప్రమాదాలను స్వీకరించి అందుకు అనుగుణంగా ముందుకుసాగేలా సానుకూలతను అలవర్చుకుంటారు.నగదు ప్రవాహంపై ఫోకస్అధిక రుణాలు తీసుకొని వ్యాపారాన్ని ప్రారంభించడం కంటే సొంత నిధులతో బిజినెస్ నడిపిస్తారు.లాభాలను తిరిగి వ్యాపారంలోకే మళ్లిస్తారు.నగదు ప్రవాహంపైనే ప్రధానంగా దృష్టి పెడుతారు.బిజినెస్ మోడల్స్వ్యాపారం, డిస్ట్రిబ్యూషన్ రంగాల్లో ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.ఎక్కువ రిస్క్ ఉన్న వ్యాపారాల జోలికి వెళ్లరు.దశల వారీగా పెరిగే అవకాశాలున్న వ్యాపారాలనే ఎంచుకుంటారు.కమ్యూనిటీ నెట్వర్క్నమ్మకంతో బిజినెస్ సంబంధాలను పెంపొందించుకుంటారు.అప్పు, పెట్టుబడి, మార్కెట్ యాక్సెస్ కోసం సామాజిక సంబంధాలను ఆర్థికంగా ఎదిగేందుకు ఉపయోగించుకుంటారు.తరతరాల సంపద నిర్మాణంవ్యాపార వారసత్వాన్ని జాగ్రత్తగా, ప్రణాళికబద్ధంగా ఉండేలా చూసుకుంటారు.ఆస్తులను, తమ పెట్టుబడులను విభిన్న రంగాలకు విస్తరిస్తారు. రియల్ ఎస్టేట్, గోల్డ్, స్టాక్ మార్కెట్లు వంటి వాటిలో పెట్టుబడి పెడుతారు.ఇదీ చదవండి: అమెజాన్ కొత్తగా మరో 40 ఆశ్రయ్ కేంద్రాలు -
రెండు కొత్త గోల్డ్ ఫండ్స్.. రూ. 1,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు..
ఏంజెల్ వన్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ కొత్తగా గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్లను (ఎఫ్వోఎఫ్) ప్రవేశపెట్టింది. గోల్డ్ ఈటీఎఫ్ సెప్టెంబర్ 2తో, ఎఫ్వోఎఫ్ సెప్టెంబర్ 3తో ముగుస్తుంది. దేశీయంగా పసిడి ధరలను ట్రాక్ చేసే ఈ ఫండ్స్.. పుత్తడిలో సులభతరంగా ఇన్వెస్ట్ చేసే సాధనాలుగా ఉపయోగపడతాయి.ఈటీఎఫ్లో రూ. 1,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. డీమ్యాట్ లేకుండానే పసిడిలో ఇన్వెస్ట్ చేసేందుకు ఫండ్ ఆఫ్ ఫండ్ ఉపయోగపడుతుంది. ఇందులో రోజుకు రూ. 250 నుంచి సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ యాంఫీ ప్రకారం దేశీయంగా పసిడి ఆధారిత ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ మార్కెట్, 2024 జూలైలో రూ. 34,455 కోట్లుగా ఉండగా 2025 జూలై నాటికి రూ. 67,634 కోట్లకు పెరిగింది. యాక్సిస్ నిఫ్టీ 500 క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్.. దేశీయంగా అత్యంత నాణ్యమైన యాభై కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసేందుకు వీలుగా నిఫ్టీ500 క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్ను యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ప్రవేశపెట్టింది. ఇందులో సెప్టెంబర్ 4 వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. నిఫ్టీ 500 నుంచి ఎంపిక చేసిన యాభై స్టాక్స్ ఈ సూచీలో ఉంటాయి.ఈక్విటీపై అత్యధిక రాబడులు, తక్కువ రుణభారం, స్థిరమైన ఆదాయ వృద్ధిలాంటి అంశాలను స్టాక్స్ ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటారు. ఇందులో కనీసం రూ. 100 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. 2025 జూలైతో ముగిసిన 15 ఏళ్ల వ్యవధిలో నిఫ్టీ 50 వార్షికంగా 12.1 శాతం వృద్ధి చెందగా, నిఫ్టీ 500 క్వాలిటీ 50 ఇండెక్స్ 15. 6 శాతం వృద్ధి రేటు సాధించినట్లు సంస్థ తెలిపింది. -
యూఎస్లో రూ.1 కోటి సంపాదిస్తే ఎంత మిగులుతుంది?
భారతీయ నిపుణులు చాలామంది, ముఖ్యంగా టెక్ పరిశ్రమలో సర్వీసులు అందిస్తున్నారు. అమెరికాలో పనిచేయాలని కలలు కంటారు. అందుకు ప్రధాన కారణం అక్కడ వేతనాలు ఎక్కువగా ఉంటాయి. లైఫ్స్టైల్ మెరుగ్గా ఉంటుందనే భావన ఉంది. ఇది నిజమే అయినా అక్కడా కట్టాల్సిన ట్యాక్స్లు, అవసరాలకు చేయాల్సిన ఖర్చులు చాలానే ఉంటాయి. అసలు అమెరికా, ఇండియాలో ఏడాదికి సుమారు కోటి రూపాయల వరకు సంపాదించే ఇద్దరు వ్యక్తులకు ఎంత మిగులుతుందనే అనుమానాలు చాలా మందిలోనే ఉంటాయి. దానికి సంబంధించిన విషయాలు కింద తెలుసుకుందాం.అమెరికాలో ఉద్యోగాలు, వేతనాలుఎంఎస్ గ్రాడ్యుయేట్లు & సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు జీతాలు(నైపుణ్యాలకు అనుగుణంగా వేతనాలు మారుతుంటాయని గమనించాలి)బేస్ జీతం: ఏటా 1,00,000 డాలర్లు - 1,40,000 డాలర్లుబోనస్ + స్టాక్ ఆప్షన్లు: తరచుగా 10,000 డాలర్లు - 30,000 డాలర్లు అదనం.దాంతో ప్రస్తుత మారకం రేటు ప్రకారం ఏటా సుమారు రూ.83 లక్షల నుంచి రూ.1.2 కోట్ల వరకు ఉంటుంది. ఇది చాలా పెద్ద అమౌంట్గా తోస్తుంది. అయితే ఇందులో కొన్ని కటింగ్స్ ఉంటాయి.అమెరికాలో పన్నులు ఇలా..ఏడాదికి 1,20,000 డాలర్ల జీతం వస్తుందనుకుంటే..స్థూల జీతం నెలవారీగా: 10,000 డాలర్లుఫెడరల్ + స్టేట్ ట్యాక్స్(కటింగ్స్): 2,500 నుంచి -3,000 డాలర్లుసోషల్ సెక్యూరిటీ & మెడికేర్(కటింగ్స్): 750 డాలర్లునెట్ టేక్ హోమ్ పే: 6,200 - 6,500 డాలర్లుఅంటే నెలకు భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.5.1 లక్షలు మిగులుతుంది. అదే భారత్లో సంవత్సరానికి రూ.80 లక్షలు (పన్నుకు ముందు నెలకు సుమారు రూ.6.5 లక్షలు) అందించే భారతీయ ఉద్యోగంతో దీన్ని పోల్చుదాం. ఇక్కడ పన్ను నిర్మాణం, తగ్గింపులను బట్టి టేక్-హోమ్ నెలకు సుమారు రూ.4.5-రూ.5 లక్షలు ఉండవచ్చు.యూఎస్, ఇండియాలో నెలవారీ ఖర్చులు ఇలా.. యూఎస్ఏ(డాలర్లు)ఇండియా(రూ.లలో)అద్దె (1BHK)1,500 - 2,50025వేలు – 45 వేలుకిరాణా సరుకులు300 - 5005 వేలు – 10 వేలుయుటిలిటీస్ + ఇంటర్నెట్150 - 2502 వేలు – 5 వేలురవాణా200 - 4002వేలు – 8 వేలుఆరోగ్య బీమా400 - 700వెయ్యి – 2 వేలు (ప్రైవేట్)మొత్తం2,550 - 4,35035 వేలు – 70 వేలు యూఎస్, ఇండియాలోని ఇద్దరు ప్రొఫెషనల్స్ వేతనాలు పోల్చినప్పుడు యూఎస్ఏఇండియానెలవారీ టేక్-హోమ్రూ.5.1 లక్షలు రూ.4.8 లక్షలునెలవారీ ఖర్చులురూ.2.8 లక్షలు(సుమారు)రూ.70వేలు(సుమారు)నెలవారీ పొదుపు రూ.2.3 లక్షలురూ.4.1 లక్షలుయూఎస్కు వెళ్లడం కేవలం ఒక డబ్బు సంపాదనకే కాకుండా చాలామంది గ్లోబల్ వర్క్ కల్చర్ కోసం వెళ్తుంటారని గమనించాలి. కొందరు కెరీర్ ఎదుగుదల కోసం కూడా అమెరికా బాట పడుతుంటారు.ఇదీ చదవండి: టీసీఎస్ లేఆఫ్స్.. కార్మిక సంఘాలు నిరసన -
ఈ వారం బ్యాంకులకు వరుస సెలవులు.. ఎందుకంటే..
ఈ వారం బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నాయి. ఆగస్టు 25 నుంచి 31వ తేదీ వరకూ ఏయే రోజుల్లో బ్యాంకు సెలవులు ఉన్నాయో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించింది. ఆర్బీఐ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద పండుగలు, ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకుని ఈ వారంలో దేశంలోని పలు ప్రాంతాల్లో బ్యాంకులు మూసివేయనున్నారు.బ్యాంకింగ్ లావాదేవీలు లేదా ఇతర సేవలకు సంబంధించి నేరుగా బ్యాంకు శాఖల్లో ముఖ్యమైన కార్యకలాపాలను ప్లాన్ చేసేవారి కోసం ముఖ్యమైన సమాచారాన్ని ఇక్కడ ఇస్తున్నాం. ఈ వారం ఏయే రోజుల్లో ఎక్కడెక్కడ బ్యాంకులకు సెలవులు ఉంటాయో ఆ ఆజాబితాను తెలియజేస్తున్నాం. తదనుగుణంగా ప్లాన్ చేసుకుని చివరి నిమిషంలో అసౌకర్యాన్ని నివారించవచ్చు.ఇదిగో సెలవుల జాబితా..ఆగస్టు 25 (సోమవారం) - శ్రీమంత శంకరదేవుని తిరుభవ్ తిథి కారణంగా గౌహతి (అస్సాం) లో బ్యాంకులకు సెలవుఆగస్టు 27 (బుధవారం) - వినాయక చవితి సందర్భంగా దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాలలో సెలవు.ఆగస్టు 28 (గురువారం) - గణేష్ చతుర్థి (రెండవ రోజు) / నువాఖై కారణంగా భువనేశ్వర్, పనాజీలో బ్యాంకుల మూసివేతఆగస్టు 31 (ఆదివారం) - వారాంతపు సెలవు దినం కావడంతో దేశవ్యాప్తంగా అన్ని చోట్ల బ్యాంకుల మూసివేతప్రాంతీయ, స్థానిక ఆచార సంప్రదాయాల కారణంగా దేశంలో సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారవచ్చు.చెక్కులు, ప్రామిసరీ నోట్ల జారీకి సంబంధించిన నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ నిబంధనల ప్రకారం బ్యాంక్ వార్షిక హాలిడే క్యాలెండర్ను ఆర్బీఐ ప్రకటిస్తుంది. అందువల్ల ఈ లిస్టెడ్ సెలవు దినాల్లో ఈ సాధనాలకు సంబంధించిన లావాదేవీలు అందుబాటులో ఉండవు.బ్యాంకు సెలవులు శాఖ కార్యకలాపాలను తాత్కాలికంగా ప్రభావితం చేసినప్పటికీ, డిజిటల్ బ్యాంకింగ్ మీ లావాదేవీలు సజావుగా కొనసాగేలా చేస్తుంది.నగదు అత్యవసరాల కోసం ఏటీఎంలు యథావిధిగా విత్ డ్రా చేసుకునేందుకు అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్ చెల్లింపుల కోసం సంబంధిత బ్యాంక్ యాప్, పయూపీఐని కూడా ఉపయోగించవచ్చు.ఇదీ చదవండి: బంగారం ధరలకు బ్రేక్.. తులానికి ఎంతంటే.. -
జీవిత బీమాపై ఈ అపోహలొద్దు..
భవిష్యత్తులో ఆర్థిక భద్రతకు, దీర్ఘకాలిక పొదుపునకు, రిటైర్మెంట్ అనంతరం ఆదాయానికి హామీనిచ్చే సాధనంగా జీవిత బీమా అవసరంపై అవగాహన క్రమంగా పెరుగుతోంది. దీనితో పరిశ్రమ కూడా వృద్ధి చెందుతోంది. జీవిత బీమా సంస్థలు టెక్నాలజీని ఉపయోగించి కస్టమర్లకు సరళతరమైన సాధనాలను అందిస్తున్నాయి. అయినప్పటికీ జీవిత బీమాపై కొన్ని అపోహలు ఉంటున్నాయి. అందరికీ బీమా భద్రత లక్ష్యం సాకారం కావాలంటే వీటిని తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తమతో పాటు తమకెంతో ప్రియమైన వారికి ఆర్థిక భద్రత కల్పించనివ్వకుండా వెనక్కు లాగుతున్న అపోహల్లో కొన్నింటిని చూస్తే..అపోహ 1: యువతకు లైఫ్ ఇన్సూరెన్స్ అవసరం లేదుకొత్తగా ఆర్జన ప్రారంభించిన యువతలో చాలా మంది అప్పుడే తాము జీవిత బీమా తీసుకోవాల్సిన అవసరం లేదనుకుంటారు. కానీ వీలైనంత ముందుగా తీసుకోవడం వల్ల దీర్ఘకాలం కవరేజీ లభిస్తుంది. ప్రీమియంల భారం తక్కువగా ఉంటుంది. అలాగే భవిష్యత్తులో ఆర్థిక స్థిరత్వానికి కూడా పటిష్టమైన పునాది ఏర్పడుతుంది. అందుకే ఆర్థిక స్వాతంత్య్రం సాధించి తొందరగా రిటైర్ అవ్వాలనుకునే కొత్త తరం యంగ్స్టర్స్ కోసం జీవిత బీమా సంస్థలు ప్రత్యేకంగా పలు సేవింగ్స్ ప్రోడక్టులను ప్రవేశపెట్టాయి. అత్యంత తక్కువగా నెలకు రూ. 1,000 నుంచి ప్రారంభమయ్యే ఇన్వెస్ట్మెంట్ ఆధారిత పథకాలను అందిస్తున్నాయి. అపోహ 2: ఇది అర్థం కాని సంక్లిష్టమైన వ్యవహారం మొబైల్ ఆధారిత ప్లాట్ఫాంలు, డిజిటల్ ప్రక్రియలు, అదే రోజున పాలసీ జారీ తదితర అంశాల దన్నుతో జీవిత బీమాను అర్థం చేసుకోవడం, కొనుగోలు చేయడం నేడు మరింత సులభతరంగా ఉంటోంది. ఒకప్పుడు సంక్లిష్టమైన వ్యవహారంగా అనిపించిన ఈ ప్రక్రియ ప్రస్తుతం భాష, పథకాలపరంగా కూడా చాలా సరళంగా మారింది. అపోహ 3: క్లెయిమ్లు సెటిల్మెంట్ కష్టందేశీయంగా చాలా మటుకు జీవితబీమా సంస్థల క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి స్థిరంగా 98 శాతం నుంచి 99 శాతం స్థాయిలో ఉంటోంది. కొన్ని సంస్థలు, నిబంధనలకు అనుగుణంగా ఉన్న క్లెయిమ్లను, అన్ని పత్రాలు అందిన మరుసటి రోజే సెటిల్ చేస్తున్నాయి. అపోహ 4: ఇది చాలా ఖరీదైన, తాహతుకు మించిన వ్యవహారంపొగ తాగని ఓ 30 ఏళ్ల వ్యక్తి రూ.1 కోటి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకుంటే, రోజుకు రూ. 30 కన్నా తక్కువే ప్రీమియం ఉంటుంది. ఇది కెఫేలో కాఫీ ఖరీదు కన్నా తక్కువే. అంతేగాకుండా ప్రీమియంలపై పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ముఖ్యంగా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది, పాలసీదారుపై ఆధారపడిన వారికి ఆదాయ భర్తీ సాధనంగా కూడా ఉపయోగపడుతుంది. గృహ రుణంలాంటి ఆర్థిక రుణభారాలను క్లియర్ చేసుకునేందుకు తోడ్పడుతుంది. అపోహ 5: మరణానంతరం మాత్రమే ఉపయోగకరంకొత్త తరహా లైఫ్ ఇన్సూరెన్స్ పథకాలు, పాలసీదార్లకు జీవితకాలంలోనే పలు ప్రయోజనాల అందించే విధంగా ఉంటున్నాయి. ఉదాహరణకు క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ తీసుకుంటే, నిర్దిష్ట అనారోగ్యాల చికిత్సకయ్యే ఖర్చులను చెల్లించేందుకు ఉపయోగపడుతుంది. తద్వారా కుటుంబ అవసరాల కోసం దాచిపెట్టే పొదుపు మొత్తాన్ని ముట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుత పరిస్థితుల్లో జీవిత బీమా కేవలం భద్రతకే పరిమితం కాకుండా పలు భవిష్యత్ అవసరాలకు కూడా ఉపయోగపడే స్మార్ట్ సాధనంగా ఉంటోంది. దేశం ఆర్థిక సమ్మిళితత్వం వైపుగా వెళ్తున్న నేపథ్యంలో కాలం చెల్లిన అపోహల నుంచి బైటపడాల్సిన సమయమిది. ఈ క్రమంలోనే ప్రజలు ఆర్థికంగా సురక్షితమైన భవిష్యత్తును నిర్మించుకోవడంలో సహాయకరంగా ఉండే సరళమైన పథకాలను, ప్రక్రియలను అందించడంపై ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ మరింతగా దృష్టి పెడుతోంది.వికాస్ గుప్తాచీఫ్ ప్రోడక్ట్ ఆఫీసర్, ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ఇదీ చదవండి: జాయింట్ ఖాతాకు నామినీ అవసరమా..? -
జాయింట్ ఖాతాకు నామినీ అవసరమా..?
నా వద్ద రూ.30 లక్షలు ఉన్నాయి. వీటిని మెరుగైన రాబడులు ఇచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలన్నది యోచన. ఇందుకు ఎలాంటి సాధనాలను ఎంపిక చేసుకోవాలి? – వైశాలి సురేంద్రన్ప్రతీ ఇన్వెస్టర్ తన పెట్టుబడిపై అధిక రాబడి కోరుకోవడం సహజం. కానీ ఇన్వెస్టర్గా మీ లక్ష్యం గరిష్ట రాబడి ఒక్కటే కాకూడదు. రిస్క్ను కూడా తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. ఈ దృష్ట్యా సరైన పెట్టుబడి సాధనాన్ని ఎంపిక చేసుకోవాలి. కేవలం రాబడి కోణంలోనే పెట్టుబడి సాధనాన్ని ఎంపిక చేసుకుంటే అది నష్టానికి దారితీయవచ్చు. అందుకుని ప్రతీ పెట్టుబడి సాధనంలోనూ ఉండే సానుకూల, ప్రతికూలతలను చూడాలి. ఈక్విటీ పథకాలు స్వల్పకాలంలో అధిక రాబడులు ఇవ్వగలవు. కానీ అది కచ్చితం అని చెప్పలేం. ప్రతికూల పరిస్థితుల్లో స్వల్పకాలంలో నష్టాలనూ ఇస్తాయి. అస్థిరతలు ఎక్కువ. మార్కెట్ ఏ సమయంలో అయినా దిద్దుబాటుకు గురికావచ్చు.మనకు పెట్టుబడులు అవసరమైన అత్యవసర పరిస్థితుల్లో మార్కెట్లు కరెక్షన్కు లోనైతే అప్పుడు నష్టానికి అమ్ముకోవాల్సి వస్తుంది. అందుకుని స్వల్పకాలానికి ఈ తరహా రిస్్కను అధిగమించేందుకు డెట్ సాధనాల్లోనూ కొంత మేర ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఈక్విటీ పెట్టుబడులు ఐదేళ్లు, అంతకుమించిన కాలానికి ఉండాలి. ఇక మీ పెట్టుబడులను వివిధ రకాల మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవడం ద్వారా వైవిధ్యం ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా ఫండ్ బలహీన పనితీరు చూపిస్తే, మరో ఫండ్ మంచి పనితీరుతో రాబడుల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసుకోవడం మరో మార్గం. ఇందుకు సిప్ను ఎంపిక చేసుకోవచ్చు. దీనివల్ల స్వల్ప కాలంలో పెట్టుబడులపై మార్కెట్ కరెక్షన్ల ప్రభావాన్ని అధిగమించొచ్చు. ఈక్విటీ, డెట్ సాధనాల మధ్య పెట్టుబడుల వ్యూహమైన అస్సెట్ అలోకేషన్ను పాటించాలి. డెట్, ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడంతోనే పని ముగిసినట్టు కాదు. తప్పకుండా ఏడాదికోసారి వాటి పనితీరు ఎలా ఉందన్నది తప్పకుండా సమీక్షించుకోవాలి. మీ లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యానికి అనుగుణంగా డెట్, ఈక్విటీ కేటాయింపుల్లో మార్పులు చేసుకోవాలి. ఎనీవన్ లేదా సర్వైవర్ అనే ఆప్షన్తో ఉన్న జాయింట్ బ్యాంక్ ఖాతాకు నామినీ నమోదు అవసరమా? – జోషి భవేరాబ్యాంక్ ఖాతా అయినా, పెట్టుబడి అయినా నామినీ నమోదు చేయడం ఎంతో అవసరం. ఎనీవన్ లేదా సర్వైవర్ బ్యాంక్ ఖాతాని ఇద్దరు కంటే ఎక్కువ మంది నిర్వహించొచ్చు. బ్యాంకింగ్ లావాదేవీలపై ఎవరో ఒకరు సంతకం చేస్తే సరిపోతుంది. ఎవరైనా ఒక ఖాతాదారు దురదృష్టవశాత్తూ మరణిస్తే, అప్పుడు ఆ ఖాతాలోని బ్యాలన్స్, వడ్డీని జీవించి ఉన్న ఖాతాదారుకు చెల్లిస్తారు. ఆ తర్వాత అదే ఖాతాను కొనసాగించుకోవచ్చు. ఒకవేళ ఏ ఖాతాదారుడూ జీవించి లేకపోతే, ఆ ఖాతాకు నామినీ నమోదు చేసి లేకపోతే.. అప్పుడు ఖాతాదారుడి వారసులు అన్ని రకాల పత్రాలు సమర్పించిన అనంతరం అందులోని బ్యాలన్స్ను క్లెయిమ్ చేసుకోగలరు. నామినీని నమోదు చేయడం వల్ల అనుకోని పరిస్థితుల్లో అవి సాఫీగా బదిలీ అయ్యేందుకు వీలుంటుంది. అందుకని ఎనీవన్ లేదా సర్వైవర్ ఖాతాకు సైతం నామినీ నమోదు చేసుకోవడం అనవసర సమస్యలను తప్పిస్తుంది. -
రుణం భారమా...‘రాజీ’ ఉందిగా!
ఎన్నో అవసరాలకు నేడు అరువు ఆధారంగా మారుతోంది. రుణంపై ఖరీదైన కొనుగోళ్లకు సైతం వెనుకాడడం లేదు. ఈఎంఐతో చిన్నగా తీర్చేయొచ్చులే అన్న ధీమా కనిపిస్తోంది. కానీ, ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోతే..? లేదంటే ప్రమాదం/వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల కారణంగా ఆర్థిక పరిస్థితులు తలకిందులై.. రుణం తీర్చడం కష్టంగా మారితే? ఈ రిస్క్ ను రుణం తీసుకునే ముందు ఎవరూ ఆలోచించడం లేదు. ఒకవేళ రుణం చెల్లించలేని క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్లినప్పుడు ఉన్న ఏకైక మార్గం.. రాజీ (సెటిల్మెంట్) చేసుకోవడమే. ఇది ఎలా పనిచేస్తుంది..? రుణ చరిత్రపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? తదితర విషయాలతో కూడిన కథనమిది.రుణ వాయిదాలను సకాలంలో చెల్లించకపోవడం వల్ల అసలుకు వడ్డీ తోడవుతుంది. దీనిపై పెనాల్టీ తదితర చార్జీలు కూడా పడతాయి. సకాలంలో రుణాన్ని చెల్లించాల్సిన బాధ్యత రుణ గ్రహీతలపై, దీన్ని చట్టబద్ధంగా వసూలు చేసుకునే హక్కు రుణదాతలకు ఉంటుంది. అసాధారణ పరిస్థితులు ఎదురై రుణాన్ని సకాలంలో చెల్లించలేని పరిస్థితుల్లో వన్టైమ్ లోన్ సెటిల్మెంట్ (రుణ పరిష్కారం) కోసం అభ్యర్థించొచ్చు. రుణం ఇచ్చిన బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీ ఇందుకు అనుమతిస్తే.. చెల్లించాల్సిన మొత్తం చాలా వరకు తగ్గిపోతుంది. కానీ, దీని కారణంగా తర్వాతి కాలంలో రుణం పొందడం కష్టంగా మారొచ్చు. ‘‘వ్యక్తిగత రుణం, వాహన రుణం, గృహ రుణం, విద్యా రుణం, వ్యాపార రుణం, క్రెడిట్ కార్డు రుణం తదితర రుణాల్లో సెటిల్మెంట్కు వెళ్లొచ్చు. రుణాన్ని పరిష్కరించుకునే ముందు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు కొన్ని ఉన్నాయి. ఇది క్రెడిట్ స్కోరుపై, ఆర్థిక భవిష్యత్పై గణనీయమైన ప్రభావం చూపిస్తుంది’’ అని ఎంపాకెట్ (ఇన్స్టంట్ లోన్ ప్లాట్ఫామ్) వ్యవస్థాపకుడు, సీఈవో గౌరవ్ జలాన్ వివరించారు. రుణ పరిష్కారం అన్నది అంతిమ ఆప్షన్గానే ఉండాలన్నది నిపుణుల సూచన. నెలవారీ చెల్లింపులు చేయలేక రుణ ఎగవేత పరిస్థితుల్లోకి వెళ్లినప్పుడే లోన్ సెటిల్మెంట్ను పరిగణనలోకి తీసుకోవాలని ‘బేసిక్ హోమ్ లోన్’ సంస్థ సీఈవో అతుల్ మోంగా సూచించారు. దీనివల్ల చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సిన అవసరం తప్పుతుందన్నారు.ప్రధానంగా.. ‘‘అన్ సెక్యూర్డ్ రుణాలైన వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డు, వ్యాపార రుణాల విషయంలో రుణ పరిష్కారాన్ని పరిశీలించొచ్చు. అదే సమయంలో సెక్యూర్డ్ కిందకు వచ్చే గృహ రుణాలు, ఆటో రుణాలు లేదా ప్రాపర్టీపై రుణాలు, బంగారంపై రుణాల పరిష్కారానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే తనఖాలో ఉన్న వాటిని రుణదాతలు స్వా«దీనం చేసుకుంటారు’’ అని మైమనీ మంత్ర డాట్ కామ్ వ్యవస్థాపకుడు, ఎండీ రాజ్ ఖోస్లా పేర్కొన్నారు.తగ్గే భారం ఎంత? రుణం తీర్చే అవకాశం లేనప్పుడు పరిష్కారం మాత్రం ఎందుకు? అని సందేహించొచ్చు. చట్టపరమైన చర్యలకు దూరంగా ఎంతో కొంత చెల్లించి భయపడే మార్గం దీంతో లభిస్తుంది. దీనివల్ల మానసిక నిశి్చంత లభిస్తుంది. సెటిల్మెంట్తో తగ్గే భారం ఎంత? అన్న దానికి ఇతమిద్ధమైన సూత్రం ఏమీ లేదు. రుణం ఇచ్చిన సంస్థతో బేరసారాలు.. నియమ, నిబంధనలు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రుణగ్రహీత చెల్లింపుల సామర్థ్యాలపైనే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా అధిక వడ్డీ భారం ఉండే క్రెడిట్ కార్డు, వ్యక్తిగత రుణాల విషయంలో సెటిల్మెంట్తో చెప్పుకోతగ్గ భారం తగ్గుతుంది. రుణగ్రహీత తన ఇబ్బందికర పరిస్థితుల గురించి రుణదాతకు సమర్థవంతంగా వివరించగలిగితే.. పాక్షిక చెల్లింపులకు బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీ అంగీకరించొచ్చు. అవకాశం ఉంటే పూర్తి మొత్తంతో పరిష్కరించుకోవడం మెరుగైన ఆప్షన్ అవుతుందని నిపుణుల సూచన. మొత్తం బకాయి ఎంత? దానిపై వడ్డీ భారం ఎంత? చర్చల సామర్థ్యంపైనే తుదకు ఎంత మొత్తం చెల్లించాలన్నది ఆధారపడి ఉంటుందని అతుల్ మోంగా తెలిపారు. అసలు రుణం కంటే కొంచెం ఎక్కువగాను.. అసలు, వడ్డీ అన్ని చార్జీలు మొత్తం కంటే తక్కువ చెల్లించే పరిష్కారానికి వీలుంటుంది. ‘‘ఏక మొత్తంలో చెల్లిస్తారు గనుక మొత్తం బకాయిలో తక్కువకే రుణ దాతలు అంగీకరిస్తారు. ఒకవేళ పాక్షిక చెల్లింపులకు సైతం కటకట ఎదుర్కొంటుంటే.. మొత్తం బకాయిలో 25 శాతం లేదా 30 శాతం చెల్లించే ప్రతిపాదన చేయొచ్చు. మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి రుణదాతకు వివరించాలి. దీంతో చెల్లించాల్సిన మొత్తం 30–50 శాతానికి పరిమితం అవుతుంది’’ అని విద్యా రుణాల పంపిణీ సంస్థ ‘ప్రాపెల్డ్’ వైస్ ప్రెసిడెంట్ రవికిషోర్ గోయల్ తెలిపారు. చెల్లించాల్సిన మొత్తం భారీగా ఉండి, చెల్లించే సామర్థ్యం చాలా తక్కువగా ఉంటే మరింత తక్కువ మొత్తానికి లోన్ సెటిల్ చేసుకునేందుకు అభ్యర్థించొచ్చని ఖోస్లా సూచించారు. బకాయిలో 10 నుంచి 50 శాతం మధ్య చెల్లింపులు చేసేందుకు సిద్ధం కావాలన్నారు. సాధారణంగా రుణదాతలు బకాయిలో 50 శాతానికి పైన చెల్లించే పరిష్కారానికి అంగీకరిస్తుంటారని.. అయినప్పటికీ, సాధ్యమైనంత తక్కువకు పరిష్కారం కుదుర్చుకునేందుకు ప్రయత్నం చేయొచ్చని సూచించారు. సమీప కాలంలో ఆర్థిక పరిస్థితులు కుదుటపడే అవకాశం లేని పరిస్థితుల్లోనే లోన్ సెటిల్మెంట్ను పరిశీలించాలన్నారు. కొన్ని సందర్భాల్లో ఒకే విడత కాకుండా నిర్ణీత కాల వ్యవధిలోపు ఒకటికి మించిన వాయిదాల్లో చెల్లించే పరిష్కారం సైతం కుదుర్చుకునేందుకు అవకాశం ఉంటుంది. మధ్యవర్తుల సాయం.. రుణ గ్రహీతల తరఫున రుణ పరిష్కారం కోసం బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలతో చర్చలు నిర్వహించేందుకు డెట్ కౌన్సిలర్ లేదా డెట్ సెటిల్మెంట్ ఏజెన్సీ సేవలు సైతం అందుబాటులో ఉన్నాయి. రుణ పరిష్కారం గురించి ఎలాంటి అవగాహన లేని వారు, ఎలా మాట్లాడాలో తెలియని వారు ఈ తరహా సేవలను పొందొచ్చు. ‘‘నిపుణుల సాయం తీసుకోవడం వల్ల స్పష్టమైన ప్రయోజనాలు లభిస్తాయి. సంప్రదింపుల్లో డెట్ సెటిల్మెంట్ కంపెనీలు ఎంతో అనుభవం కలిగి ఉంటాయి. రుణగ్రహీత తరఫున మెరుగైన ప్రయోజనాలతో కూడిన పరిష్కారాన్ని చూడగలవు’’ అని గౌరవ్ జలాన్ తెలిపారు. అంగీకార పత్రాలు సంబంధిత డాక్యుమెంట్ల పని కూడా సులభతరం అవుతుందన్నారు. ఇలాంటి సేవలు అందించే కంపెనీల చార్జీలు ఎక్కువగా ఉంటాయి. కనుక అందుబాటు ధరలపై అందించే సంస్థలను చూసుకోవడం ముఖ్యం. కొన్ని సంస్థలు ఫ్లాట్ ఫీజు వసూలు చేస్తుంటే, కొన్ని బకాయిలో 15–25% వరకు తీసుకుంటాయని మోంగా తెలిపారు. ఇలాంటి సంస్థల సేవలను పొందే ముందు వాటి విశ్వసనీయతను ధ్రువీకరించుకోవాలి.క్రెడిట్ స్కోరుపై ప్రభావంరుణాన్ని సెటిల్ చేసుకున్న తర్వాత ఆ సమాచారాన్ని బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీ క్రెడిట్ బ్యూరోలకు అందిస్తాయి. ‘సెటిల్డ్’ లేదా ‘సెటిల్డ్ ఫర్ లెస్ దెన్ ద ఫుల్ అమౌంట్’ (అసలు కంటే తక్కువ మొత్తంతో పరిష్కారం) అంటూ బ్యాంక్లు తెలియజేస్తాయి. రుణ గ్రహీత క్రెడిట్ రిపోర్ట్లోకి ఇదే సమాచారం చేరుతుంది. సెటిల్డ్ అకౌంట్కు సంబంధించిన సమాచారం ఏడేళ్ల వరకు క్రెడిట్ రిపోర్ట్లో కొనసాగుతుంది. సెటిల్డ్ అని ఉంటే రుణం తిరిగి చెల్లించే సామర్థ్యం లేమిని సూచిస్తుంది. కనుక క్రెడిట్ స్కోరుపై గణనీయమైన ప్రభావమే పడుతుంది. దీంతో భవిష్యత్తులో అవసరానికి రుణం లభించదు. ఒకవేళ రుణం లభించినా ఇతరులతో పోలి్చతే చెల్లించాల్సిన వడ్డీ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. రుణ బకాయిని పూర్తిగా చెల్లించినట్టయితే క్రెడిట్ రిపోర్ట్లో అది క్లోజ్డ్ (ముగిసినట్టు) అని ఉంటుంది. మరో రుణం పుడుతుందా? రుణాన్ని పరిష్కరించుకున్నాక చేయాల్సిన మొదటి పని, తిరిగి తమ క్రెడిట్ స్కోర్ను పునర్నిర్మించుకోవడం. తిరిగి మరో రుణం తీసుకునేందుకు కనీసం రెండేళ్లయినా విరామం ఇవ్వాలన్నది నిపుణుల సూచన. అప్పటి వరకు ఏ రుణం కోసం విచారణ చేయొద్దు. రుణ విచారణలు సైతం క్రెడిట్ స్కోర్పై ప్రభావం చూపిస్తాయి. రుణ పరిష్కారం చేసుకున్న వారు సెక్యూర్డ్ క్రెడిట్ కార్డు తీసుకోవడం మంచి ఆలోచన. అంటే ఫిక్స్డ్ డిపాజిట్పై జారీ చేసే క్రెడిట్ కార్డు. ఈ కార్డుపై 30–50 రోజుల కాలానికి వడ్డీ లేని రుణ సదుపాయం లభిస్తుంది. ఈ కార్డు మొత్తం లిమిట్లో 50 శాతం మించకుండా క్రమశిక్షణతో వినియోగిస్తూ, సకాలంలో చెల్లింపులు చేస్తూ వెళ్లాలి. దీనివల్ల రెండేళ్ల కాలంలో క్రెడిట్ స్కోరు బలపడుతుంది. తద్వారా గతంలో చేసుకున్న రుణ పరిష్కారం తాలూకు ప్రభావాన్ని అధిగమించొచ్చు. చివరి ఎంపికే.. క్రెడిట్ స్కోరుపై ప్రభావం చూపిస్తుంది కనుక లోన్ సెటిల్మెంట్ అన్నది చివరి ఎంపికగానే ఉండాలి. దీనికంటే ముందు రుణ బకాయి మొత్తాన్ని చెల్లించే మార్గాలను పరిశీలించాలి. రుణదాతతో చర్చించుకుని, కొంత కాలం పాటు మారటోరియం (విరామం/6–12 నెలలు) కోరొచ్చు. ఈ లోపు ఆర్థిక పరిస్థితులను గాడిన పెట్టుకుని రుణ బకాయిని వడ్డీ సహా చెల్లించే వెసులుబాటును పరిశీలించాలి. లేదంటే దీర్ఘకాలానికి రుణాన్ని పునర్వ్యవస్థీకరించి, తక్కువ నెలసరి వాయిదాలతో చెల్లించే పరిష్కారం కుదుర్చుకోవచ్చు. ఏవైనా ఆస్తులు ఉంటే విక్రయించి చెల్లించడం మెరుగైన మార్గం అవుతుంది. అవసరమైతే కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల సాయంతో గట్టెక్కే మార్గం చూడొచ్చు. ఏ విధంగా చూసినా అవకాశం లేనప్పుడు రుణ పరిష్కారానికి వెళ్లొచ్చు. ఇవి గుర్తుంచుకోండి... కొన్ని వేల రూపాయిల బకాయి కోసం లోన్ సెటిల్మెంట్ కోరడం అస్సలు సూచనీయం కాదు. ఎంత కష్టమైనా సరే చెల్లించడమే మెరుగైన ఆప్షన్ అవుతుంది. రుణ బకాయి వ్యక్తి వార్షిక ఆదాయంలో 20–30 శాతం ఉన్నప్పుడు లోన్ సెటిల్మెంట్ ఆప్షన్ ఎంపిక చేసుకుని క్రెడిట్ స్కోరులో రాజీ పడవద్దని ఖోస్లా సూచించారు. → లోన్ సెటిల్మెంట్లో భాగంగా అంగీకారం మేర చెల్లింపులు చేసిన తర్వాత మిగిలిన మొత్తాన్ని రుణ దాత మాఫీ చేస్తారు. దాంతో చట్టపరంగా ఇకమీదట చెల్లించాల్సిన బాధ్యత ఉండదు. → రుణ పరిష్కారం కంటే దివాలా పిటిషన్ దాఖలు చేయడమే తేలిక కదా అని అనుకోవద్దు. దివాలాతో రుణాలకు శాత్వతంగా దారులు మూసుకుపోయినట్టు అవుతుంది. దీనికంటే సెటిల్మెంట్ నయం. → కొన్ని బ్యాంక్లు లేదా ఎన్బీఎఫ్సీలు తక్కువ మొత్తం చెల్లింపులకు అంగీకరించకపోవచ్చు. → రుణం చెల్లించకుండా లేదా పరిష్కారం కుదుర్చుకోకుండా కాలయాపన చేస్తే బ్యాంక్లు/ఎన్బీఎఫ్సీలు చట్టపరమైన చర్యలు మొదలు పెడతాయి. రుణగ్రహీతలపై కోర్టులో సివిల్ కేసు దాఖలు చేస్తాయి. కొన్ని సందర్భాల్లో క్రిమినల్ కేసు దాఖలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దీనివల్ల లేనిపోని చార్జీల భారం నెత్తిన పడుతుంది. → సకాలంలో వసూలు కాని రుణ ఖాతాలను బ్యాంక్లు/ఎన్బీఎఫ్సీలు థర్డ్ పార్టీ సంస్థలకు అప్పగించొచ్చు. దీనివల్ల వారి నుంచి కఠిన వసూళ్ల చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
పోస్టాఫీసుల్లో మ్యూచువల్ ఫండ్స్.. లక్ష మంది పోస్ట్మ్యాన్లకు శిక్షణ
తపాలా శాఖతో మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) ఒప్పందం చేసుకుంది. పోస్టల్ శాఖకు చెందిన లక్ష మంది పోస్ట్మ్యాన్లకు మ్యూచువల్ ఫండ్స్పై శిక్షణ ఇవ్వనుంది. దీంతో మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు మ్యూచువల్ ఫండ్స్ సేవలను తపాలా శాఖ ద్వారా చేరువ చేయొచ్చన్నది యాంఫి లక్ష్యంగా ఉంది.యాంఫి 30వ వ్యవస్థాపక దినం సందర్భంగా తపాలా శాఖ, యాంఫి ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. మ్యూచువల్ ఫండ్స్ సేవలపై అవగాహనను విస్తృతం చేసేందుకు గాను నివేష్ కా సహి కదమ్, భారత్ నివేష్ రైల్ యాత్ర తదితర కార్యక్రమాలను ఈ సందర్భంగా యాంఫి ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఇన్వెస్టర్ క్యాంపుల నిర్వహణ, వందే భారత్ రైళ్లలో అవగాహన కార్యక్రమాలు చేపట్టనుంది. ముఖ్యాంశాలులక్ష మంది పోస్ట్మ్యాన్లకు శిక్షణ: మొదటగా బిహార్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మేఘాలయ రాష్ట్రాల్లో ప్రారంభం.మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లుగా శిక్షణ: ప్రతి జిల్లాలో కనీసం 10 మంది డిస్ట్రిబ్యూటర్లు ఉండేలా లక్ష్యం.భారత్ నివేష్ రైల్ యాత్ర & వందే భారత్ అవగాహన క్యాంపులు: మ్యూచువల్ ఫండ్స్పై అవగాహన పెంచేందుకు దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు.నివేష్ కా సహి కదమ్: పెట్టుబడులపై సరైన నిర్ణయాలు తీసుకునేలా ప్రజలకు మార్గనిర్దేశం చేసే కార్యక్రమం.B30 నగరాలపై దృష్టి: చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో మ్యూచువల్ ఫండ్స్ విస్తరణకు ప్రాధాన్యత.ఈ భాగస్వామ్యం ద్వారా, ఫైనాన్షియల్ లిటరసీని గ్రామీణ ప్రాంతాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది.ఇదీ చదవండి: పదేళ్లలో వేలకొద్దీ కిలోల బంగారం సీజ్.. ఆర్థిక శాఖ లెక్కలు చూస్తే.. -
డబ్బు అదా చేయడానికి 10-30-50 రూల్: రాధిక గుప్తా
డబ్బు సంపాదించాలన్నా.. డబ్బు ఆదా చేయాలన్నా, తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. ఖర్చులు పెరిగినప్పుడు, ఆదా చేయడం ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ ఎండీ & సీఈఓ రాధిక గుప్తా మాత్రం ఓ ఫార్మలా సూచిస్తూ.. డబ్బును, ఇలా అదా చేయొచ్చని వెల్లడించారునిరంజన్ అవస్థితో కలిసి రాసిన తన కొత్త పుస్తకం 'మ్యాంగో మిలియనీర్'లో రాధిక గుప్తా 10-30-50 రూల్ గురించి వివరించారు. ''అదా చేయడం అంటే.. క్రికెట్ మ్యాచ్కు ముందు చేసే ప్రాక్టీస్ అని అన్నారు. ఆర్ధిక విజయానికి తప్పకుండా పునాది అవసరం. ఏ క్రేడాకారుడు.. సాధన లేకుండా మ్యాచ్లోకి అడుగు పెట్టాలని కలలు కనడు. అలాగే.. పెట్టుబడిదారుడు కూడా, ముందు పొదుపులో నైపుణ్యం సాధించాలి, అప్పుడే విజయం సాధిస్తాడు'' అని వెల్లడించారు.రాధిక గుప్తా 10-30-50 నియమం20 ఏళ్లలో 10 శాతం: పొదుపు చేయడం చిన్నగా ప్రారంభించండి. పొదుపు చేయడం అంటే.. మీ భవిష్యత్తుకు మీరే డబ్బు చెల్లించుకోవడం ని రాధికా గుప్తా పేర్కొన్నారు. ఆడంబరమైన, అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయడం మానుకోవాలి.30 ఏళ్ల నుంచి 40 ఏళ్లలో 30 శాతం: ఉద్యోగంలో ప్రమోషన్లు లేదా వ్యాపారం బాగా వృద్ధి చెందుతున్నప్పుడు.. వస్తున్న ఆదాయంలో పొదుపును 30 శాతానికి పెంచండి.40 ఏళ్లు పైబడిన వారు 50 శాతం: పదవీ విరమణ, పిల్లల విద్య కోసం ఖర్చులు పెరుగుతున్న సమయంలో ఆదాయం కొంత ఎక్కువ పొదుపు చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు సంపాదించే ఆదాయంలో 50 శాతం వరకు పొదుపు చేయండి.ఇదీ చదవండి: ఫెడ్ చైర్మన్ కీలక ప్రకటన: బంగారం ధరల్లో ఊహించని మార్పు! -
ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంక్స్
డబ్బు దాచుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ ఫిక్స్డ్ డిపాజిట్ మాత్రం అత్యంత సురక్షితమైన మార్గం అని చాలామంది విశ్వసిస్తారు. ఈ కారణంగానే తమ వద్ద ఉన్న డబ్బును బ్యాంకులలో దాచుకుంటారు. అయితే ఎక్కడ డిపాజిట్ చేస్తే ఎక్కువ వడ్డీ వస్తుందనే విషయం బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకుందాం.బ్యాంకు వెబ్సైట్ల నుంచి వచ్చిన లేటెస్ట్ డేటా ప్రకారం.. కొన్ని ప్రధాన బ్యాంకులు ప్రస్తుతం ఒక సంవత్సరం ఫిక్స్డ్ డిపాజిట్లపై ఆకట్టుకునే వడ్డీ రేట్లను అందిస్తున్నాయి.HDFC బ్యాంక్ ప్రస్తుతం 2025 జూన్ 25 నుంచి అమలులోకి వచ్చేలా.. రెగ్యులర్ కస్టమర్లకు ఒక సంవత్సరం ఫిక్స్డ్ డిపాజిట్లపై 6.25%, సీనియర్ సిటిజన్లకు 6.75% వడ్డీని అందిస్తోంది. ICICI బ్యాంక్ & కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా ఇదే రేట్లను అందిస్తున్నాయి.ఫెడరల్ బ్యాంక్ విషయానికి వస్తే.. ఇది రెగ్యులర్ కస్టమర్లకు 6.40% వడ్డీని, సీనియర్ సిటిజన్లకు 6.90% వడ్డీ అందిస్తోంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆగస్టు 20 నుండి అమలులోకి వచ్చే ఫెడరల్ బ్యాంక్ రేట్లకు అనుగుణంగా వడ్డీను అందిస్తోంది.భారతదేశంలో అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కూడా జూలై 15 నుంచి సాధారణ కస్టమర్లకు 6.25%, సీనియర్ సిటిజన్లకు 6.75% వడ్డీని అందిస్తోంది.వివిధ బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లకు అందించే వడ్డీ చాలా చిన్న మొత్తంలో తేడా ఉంటుంది. రేట్లలో చిన్న వ్యత్యాసం కూడా మంచి లాభాన్ని అందిస్తుంది. సీనియర్ సిటిజన్లు ప్రత్యేకంగా.. ఎక్కువ ప్రయోజనం పొందే అవకాశం ఉంది. కాబట్టి.. ఒక సంవత్సరం ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకునేవారు వడ్డీ రేట్లను పరిశీలించి ఎంచుకోవడం ఉత్తమం. -
ఈఎస్ఐ సేవలకు ఆధార్.. ఇక తప్పనిసరి కాదు..
ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ (ఈఎస్ఐ) పథకం సేవలకు ఆధార్.. ఇక తప్పనిసరి కాదు. బీమా చేసిన వ్యక్తులు, వారి కుటుంబాలకు ఆధార్ ఆధారిత ధృవీకరణ ఐచ్ఛికంగానే ఉంటుందని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) స్పష్టం చేసింది. ఈఎస్ఐ పథకం లబ్ధిదారులు ఆధార్ ద్వారా ధృవీకరించుకోకపోయినా తమ వైద్య, నగదు ప్రయోజనాలను పొందగలరు.కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కింద చట్టబద్ధమైన సంస్థగా, ఈఎస్ఐసీ సంఘటిత రంగంలోని కార్మికులకు సమగ్ర ఆరోగ్య బీమా, సామాజిక భద్రతను అందిస్తుంది. ఇందులో వైద్య సంరక్షణ, అనారోగ్యం, ప్రసూతి ప్రయోజనాలు, వికలాంగుల పరిహారంతోపాటు సభ్యులపై ఆధారపడినవారికి పెన్షన్లు ఉన్నాయి.బెనిఫిట్ డెలివరీని సులభతరం చేయడానికి, కాగిత ప్రక్రియను తగ్గించడం కోసం గతంలో ఆధార్ ధృవీకరణను ప్రవేశపెట్టినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ వివరించింది. అయితే ఆధార్ వెరిఫికేషన్ లేని కారణంతో లబ్ధిదారులకు సేవలను నిరాకరించబోమని ఈఎస్ఐసీ స్పష్టం చేసింది. ఆధార్ స్థానంలో పాస్ పోర్టులు, పాన్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు వంటి ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాలను స్వీకరిస్తున్నట్లు వెల్లడించింది.మరిన్ని సేవలు.. కొత్త పోర్టల్ఈఎస్ఐసీ సేవలను మరింత మెరుగుపరిచేందుకు పలు కీలక కార్యక్రమాలను లోక్ సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కార్మిక మంత్రిత్వ శాఖ వివరించింది. ద్వితీయ, తృతీయ ఆరోగ్య సేవలను మెరుగుపరచడానికి ఆయుష్మాన్ భారత్-ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (పిఎంజెఎవై) ఆసుపత్రులతో సహకారం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. శాశ్వత అంగవైకల్యం పొందిన సభ్యులు, వారి మీద ఆధారపడిన కుటుంబ సభ్యులకు పరిహారాన్ని మరింత పెంచినట్లు వివరించింది.బీమా లబ్ధిదారులు, ముఖ్యంగా మహిళలు నగదు ప్రయోజన క్లెయిమ్లను డిజిటల్గా సమర్పించడానికి వీలు కల్పించే కొత్త ఆన్లైన్ పోర్టల్ను కూడా ప్రారంభించినట్లు పేర్కొంది.ఈఎస్ఐ పథకానికి ఎవరు అర్హులు?ఈఎస్ఐ పథకం ఉద్యోగులందరికీ వర్తించదు. ఎవరైతే నెలకు రూ.21 వేలు లేదా అంత కంటే తక్కువ జీతం పొందుతున్నారో వారికే ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ వర్తిస్తుంది. అదే దివ్యాంగ ఉద్యోగులు అయితే రూ.25 వేల వరకూ జీతం పొందుతున్నవారు కూడా ఈ పథకానికి అర్హులు. -
పోస్టాఫీస్ స్కీమ్: 5 ఏళ్లలో రూ.7 లక్షలు వస్తాయ్..
భవిష్యత్తులో ఆర్థిక భద్రత కావాలంటే ఇప్పటి నుంచే ఎంతో కొంత పొదుపు చేయడం చాలా అవసరం. పిల్లల చదువులు, ఇల్లు కొనడం, పెళ్లి ఖర్చులు లేదా రిటైర్మెంట్ కోసం ఎక్కువ మొత్తంలో డబ్బు అవసరం అవుతుంది. ఇందు కోసం ప్రతిఒక్కరూ పొదుపు మార్గాలను అన్వేషిస్తారు. అయితే చాలా మంది రిస్క్ లేని కానీ లాభదాయకమైన పెట్టుబడి ఎంపిక కోసం చూస్తారు. అలాంటి ఇన్వెస్టర్లకు పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ) స్కీమ్ మంచి ఎంపిక.పోస్టాఫీస్ ఆర్డీ స్కీమ్ అంటే ఏమిటి?పోస్టాఫీస్ ఆర్డీ అనేది ప్రభుత్వ మద్దతు కలిగిన పొదుపు పథకం. ఇది సురక్షితమైన పెట్టుబడి ఎంపికలలో ఒకటి. ఇందులో మీరు ప్రతి నెలా ఒక నిర్ణీత మొత్తాన్ని డిపాజిట్ చేస్తారు. దీనిపై ప్రతి మూడు నెలలకోసారి చక్రవడ్డీని లెక్కించి జమ చేస్తారు. దీంతో రాబడి వేగంగా వృద్ధి చెందుతుంది.పోస్టాఫీస్ ఆర్డీ స్కీమ్లో కనీస నెలవారీ డిపాజిట్ రూ.100. ఆపై మీరు ఎంతైనా డిపాజిట్ చేయొచ్చు. గరిష్టంగా ఎటువంటి పరిమితి ఉండదు. కాల పరిమితి 5 ఏళ్లు. కావాలంటే మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు.ఈ స్కీమ్కు ప్రస్తుతం 6.7% వార్షిక వడ్డీని చెల్లిస్తున్నారు. దీనిని ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి సమీక్షిస్తుంది. జూలై-సెప్టెంబర్ 2025 కోసం 6.7% వార్షిక వడ్డీని నిర్ణయించింది.ఆర్డీ పథకంలో మీరు జమ చేస్తున్న సొమ్ముపై అత్యవసర పరిస్థితుల్లో రుణ సదుపాయం కూడా ఉంటుంది. మీకు ఆకస్మిక ఆర్థిక అవసరం ఎదురైతే, మీరు ఒక సంవత్సరం తర్వాత మీ డిపాజిట్ చేసిన మొత్తంలో 50% వరకు రుణం తీసుకోవచ్చు. అయితే, ఈ రుణంపై మీ ఆర్డీ రేటు కంటే 2% ఎక్కువ వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది.5 ఏళ్లలో రూ.7 లక్షలు పొందండిలా..పోస్టాఫీస్ ఆర్డీ స్కీమ్లో నెలకు రూ .10,000 డిపాజిట్ చేస్తే రూ.7 లక్షలు పొందే అవకాశం ఉంది. 5 సంవత్సరాల పాటు నెలకు రూ .10,000 చొప్పున డిపాజిట్ చేస్తే మీ మొత్తం పెట్టుబడి రూ. 6 లక్షలు అవుతుంది. 6.7% వార్షిక వడ్డీ (త్రైమాసిక చక్రవడ్డీ)తో మీ మెచ్యూరిటీ మొత్తం రూ.7,13,659 అవుతుంది. అంటే మీరు వడ్డీ రూపంలో రూ.1,13,659 పొందుతారు. అసలు, వడ్డీ మొత్తం సొమ్ము ఎలాంటి రిస్క్ లేకుండా చేతికందుతుంది. -
పాలసీ ఏజెంట్లు చెప్పని విషయాలు
ఒక వ్యక్తి ఆర్థిక భవిష్యత్తును సురక్షితంగా ఉంచడంలో ఆరోగ్య బీమా కీలకం. ముఖ్యంగా భారతదేశం వంటి వైద్య ఖర్చులు అధికంగా ఉన్న దేశంలో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రధానపాత్ర పోషిస్తోంది. అయితే పాలసీలను విక్రయించే రేసులో చాలా మంది ఇన్సూరెన్స్ ఏజెంట్లు కస్టమర్లను తప్పుదోవ పట్టిస్తున్నారు. కొందరు అనుసరిస్తున్న మోసపూరిత ఎత్తుగడలు ఆరోగ్య బీమా పాలసీలపై అవగాహన పెంపొందించడాన్ని హైలైట్ చేస్తున్నాయి. ఏజెంట్లు వినియోగదారులను ఎలా తప్పుదోవ పట్టిస్తున్నారో.. పాలసీల్లో ఉన్న రహస్యాలను చెప్పకుండా ఎలా దాచే ప్రయత్నం చేస్తున్నారో తెలుసుకుందాం.మినహాయింపులు, వెయిటింగ్ పీరియడ్చాలా మంది బీమా ఏజెంట్లు పాలసీదారులకు మినహాయింపులు, వెయిటింగ్ పీరియడ్ ఎంతనే విషయాలను హైలైట్ చేయరు. వాటి గురించి చెబితే పాలసీ తీసుకోరేమోననే భయాలుంటాయి. కాబట్టి పెద్దగా వీటి గురించి మాట్లాడరు. ఇవి పాలసీదారుడి కవరేజీని అర్థం చేసుకోవడానికి కీలకం. మినహాయింపుల్లో ప్రీహెల్త్ కండిషన్, నిర్దిష్ట చికిత్సలు, పాలసీని కొనుగోలు చేసిన వెంటనే చేయించాలనుకునే వ్యాధుల వివరాలు ఉంటాయి. వీటి గురించి ఏజెంట్లు చెప్పకపోయినా పాలసీదారులే తెలుసుకోవాలి. కొన్ని షరతుల కోసం (ప్రసూతి కవరేజీ లేదా నిర్దిష్ట శస్త్రచికిత్సలు వంటివి) వెయిటింగ్ పీరియడ్ 1 నుంచి 4 సంవత్సరాల వరకు ఉంటాయి. ఏయే పాలసీలో ఎంత వెయిటింగ్ పీరియడ్ ఉందో తీసుకునేముందు తెలుసుకోవాలి.గది అద్దె పరిమితులుచాలా బీమా పాలసీలు గది అద్దెపై పరిమితులను విధిస్తాయి. ఇది ఆసుపత్రిలో చేరిన సందర్భంలో కవరేజీని నేరుగా ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు, ఆసుపత్రిలో చేరిన తర్వాత ఒక పాలసీ సాధారణ వార్డులో చేరడాన్ని మాత్రమే కవర్ చేస్తుంది. కొన్ని గది అద్దెలో రోజుకు కొంత నిర్దిష్ట మొత్తాన్నే మాత్రమే చెల్లిస్తాయి. బీమా చేసిన వ్యక్తి చికిత్సకు వైద్యపరంగా ఇతర గది అవసరమైనప్పటికీ సదరు మొత్తాన్ని చెల్లించవు. ఈ వివరాలను ఏజెంట్లు చెప్పకపోవచ్చు.జీవితకాల కవరేజీ..చాలా మంది ఏజెంట్లు పాలసీలను ఎలాగోలా కట్టబెట్టాలనే ఉద్దేశంతో ‘ఏదైనా ఆసుపత్రిలో నగదు రహిత చికిత్స’ లేదా ‘జీవితకాల కవరేజీ’ అని ప్రచారం చేస్తారు. అయితే నగదు రహిత చికిత్స సౌకర్యాలు పాలసీ ఆసుపత్రుల నెట్వర్క్కు పరిమితం అవుతాయి. పాలసీదారులు ఇతర ఆసుపత్రిని ఎంచుకుంటే ముందుగా డబ్బు చెల్లించి తర్వాత క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది. కొందరు ఏజెంట్లు జీవితకాల కవరేజీ గురించి ప్రచారం చేస్తున్నప్పటికీ వృద్ధులకు వయసు పరిమితులు లేదా మినహాయింపులు ఉంటాయి.ఇప్పుడేం చేయాలంటే..తప్పుదోవ పట్టించే ఆరోగ్య బీమా పాలసీల బారిన పడకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. పాలసీ తీసుకోవడానికి ముందు ముందస్తు చర్యలు తీసుకోవడం చాలా అవసరం.ఏజెంటు చూపించే బ్రోచర్ మాత్రమే కాకుండా పాలసీలోని అంతర్గతంగా దాగి ఉన్న అంశాలను తెలుసుకోవాలి. వాటి గురించి ప్రత్యేకంగా ఏజెంట్లును, నిపుణులను అడిగి తెలుసుకోవాలి. పాలసీ అధికారిక వెబ్సైట్ల్లో పూర్తి వివరాలు ఉంటాయి.ఐఆర్డీఏఐ అధికారిక వెబ్సైట్లో అన్ని పాలసీ సంస్థలు వివరాలు ఉంటాయి. ఏటా క్లెయిమ్ పర్సంటేజ్కు సంబంధించిన విషయాలు ఉంటాయి.క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తిని తనిఖీ చేయడానికి, వివిధ పాలసీ ప్లాన్లను పోల్చడానికి ఐఆర్డీఏఐ సాధనాలను అందిస్తుంది.ఏజెంట్ ఏదైనా వాగ్దానాలు లేదా మౌఖిక హామీలు (ప్రతిచోటా నగదు రహితం, జీవితకాల కవరేజీ వంటివి) ఇస్తే వాటిని పాలసీ డాక్యుమెంటేషన్లో చూపించమని డిమాండ్ చేయాలి.నిజంగా అవి డాక్యుమెంట్లో ఉంటే క్లెయిమ్ దాఖలు చేసేటప్పుడు వ్యత్యాసాల సమయంలో ఇది సాక్ష్యంగా ఉపయోగపడుతాయి.ఆరోగ్య బీమా పాలసీలు వివిధ అవసరాలను తీర్చడానికి రూపొందించబడ్డాయి. ఒక వ్యక్తికి మెరుగ్గా పనిచేసే పాలసీ మరొకరికి తగినది కాకపోవచ్చనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏవరి ప్రత్యేక అవసరాలు వారికి ఉంటాయని గమనించాలి. ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే ముందు నిపుణుల సలహా తప్పకుండా తీసుకోవాలి.ఇదీ చదవండి: పెళ్లైన కుమార్తెకు తల్లి ఆస్తిలో వాటా ఉంటుందా? -
ఆర్థిక ప్రణాళికల్లో తెలంగాణ టాప్
దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడంలో తెలంగాణ ప్రజలు ముందుంటున్నారని ఇన్సూరెన్స్ ఎవేర్నెస్ కమిటీ (ఐఏసీ–లైఫ్), ఐఎంఆర్బీ కాంటార్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. దీని ప్రకారం రాష్ట్రంలో 94 శాతం మంది జీవితంలో తలెత్తే అనూహ్య పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తుగా ప్రణాళికలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.జీవిత బీమా అనేది పొదుపు, రక్షణ సాధనంగా ఉపయోగపడుతుందని రాష్ట్రంలో 100 శాతం అవగాహన ఉంది. వచ్చే 3 నెలల్లో జీవిత బీమా కొనాలని 38 శాతం మంది భావిస్తున్నారు. సబ్సే పెహ్లే లైఫ్ ఇన్సూరెన్స్ 2.0 ప్రచారానికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఐఏసీ–లైఫ్ కో–చెయిర్పర్సన్ వెంకటాచలం ఈ విషయాలు తెలిపారు.రాష్ట్రంలో టర్మ్, చైల్డ్, పొదుపు ప్లాన్లతో పాటు ఇతర బీమా పథకాల గురించి ప్రాంతీయంగా టీవీ, డిజిటల్ తదితర మాధ్యమాల ద్వారా ఇన్ఫ్లుయెన్సర్లతో ప్రచార కార్యక్రమాలను మరింతగా నిర్వహించనున్నట్లు వివరించారు.అధ్యయనం ముఖ్యాంశాలు94% మంది తెలంగాణ ప్రజలు అనూహ్య పరిస్థితులకు ముందుగానే ప్రణాళికలు వేసుకోవడం అలవాటు చేసుకున్నారు.100% అవగాహన జీవిత బీమా గురించి ఉంది — ఇది పొదుపు మరియు రక్షణ సాధనంగా ఉపయోగపడుతుందని ప్రజలు అర్థం చేసుకున్నారు.38% మంది వచ్చే 3 నెలల్లో జీవిత బీమా కొనాలని భావిస్తున్నారు.87% మంది పొదుపు ప్లాన్లను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇవి గ్యారంటీడ్ లంప్సమ్ లేదా నెలవారీ ఆదాయాన్ని అందించే ప్లాన్లు.90% మంది టీవీ ద్వారా జీవిత బీమా గురించి తెలుసుకుంటే 56% మంది ఇన్సూరెన్స్ ఏజెంట్ల ద్వారా సమాచారం పొందారు.84% మంది దీర్ఘకాలిక పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నారు.87% మంది త్వరగా రిటైర్ కావాలనే లక్ష్యంతో పొదుపు అలవాటు చేసుకుంటున్నారు. ఇది సర్వే చేసిన మెట్రో మార్కెట్లలో అత్యధిక శాతం. -
జీఎస్టీ మినహాయింపు: టర్మ్, లైఫ్ ప్లాన్లపై ప్రయోజనం
బీమా పాలసీలపై వస్తు, సేవల పన్నును (జీఎస్టీ) మినహాయించేందుకు రాష్ట్రాల మంత్రులతో కూడిన బృందం (జీవోఎం) ఆమోదం తెలపడంతో.. ఇది అమల్లోకి వస్తే ప్రధానంగా టర్మ్, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు ప్రయోజనం కలుగుతుందని నిపుణులు భావిస్తున్నారు.కమీషన్, రీ ఇన్సూరెన్స్లకు సైతం మినహాయింపు లభిస్తుందని.. దీంతో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) నిలిపివేయడం అన్న సమస్య ఎదురుకాకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమైంది. ప్రస్తుతం వ్యక్తిగత ఆరోగ్య బీమా, జీవిత బీమా ప్లాన్లపై 18 శాతం రేటు అమలవుతోంది. దీన్ని పూర్తిగా మినహాయించాలని కేంద్రం ప్రతిపాదించింది. దీనికి జీఎస్టీ మంత్రుల బృందం సైతం ఆమోదం తెలిపి జీఎస్టీ కౌన్సిల్కు నివేదించింది.18% తగ్గకపోవచ్చు.. బీమా పాలసీలపై జీఎస్టీని మినహాయించినా గానీ, తగ్గింపు అన్నది 18 శాతంగా ఉండకపోవచ్చని ఈవై ఇండియా ట్యాక్స్ పార్ట్నర్ సౌరభ్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. కమీషన్లు, ఆఫీస్ అద్దెలు, సాఫ్ట్వేర్ తదితర వాటిపై తాము చెల్లించిన జీఎస్టీని కంపెనీలు తిరిగి క్లెయిమ్ చేసుకోలేవని చెప్పారు.దీంతో కంపెనీలపై పడే ఇన్పుట్ ట్యాక్స్ ఆధారంగా నికర తగ్గింపు ఆధారపడి ఉంటుందని వివరించారు. జీఎస్టీ మినహాయింపు కన్నా సున్నా రేటు కింద పరిగణిస్తే, అప్పుడు కంపెనీలు తమ ఇన్పుట్ వ్యయాలపై చెల్లించిన జీఎస్టీని తిరిగి క్లెయిమ్ చేసుకోగలవన్నారు. అలాంటప్పుడు బీమా పాలసీలపై తగ్గింపు 18 శాతంగా ఉండొచ్చన్నారు. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సేవలు రెండు రోజులు బంద్
ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు సంబంధించిన కొన్ని సేవలకు స్వల్ప అంతరాయం ఏర్పడనుంది. వాట్సాప్ ద్వారా చాట్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ వంటి ఫీచర్లు ఆగస్టు 22, 23 తేదీల్లో స్వల్ప కాలానికి అందుబాటులో ఉండవని బ్యాంక్ తెలిపింది. ఈ సమయంలో బ్యాంక్ కస్టమర్ కేర్ సేవలకు కూడా అంతరాయం కలగనుంది.ఖాతాదారులకు మొత్తం బ్యాంకింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి వ్యవస్థల నిర్వహణను చేపడుతున్నందున ఈ సేవలు అందుబాటులో ఉండవని పేర్కొంది. "మీ బ్యాంకింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి, ఆగస్టు 22 రాత్రి 11:00 గంటల నుండి ఆగస్టు 23 ఉదయం 6:00 గంటల వరకు అవసరమైన సిస్టమ్ మెయింటెనెన్స్ నిర్వహిస్తున్నాం" అని బ్యాంక్ ఒక నోటీసులో తెలిపింది.దీంతో కొన్ని బ్యాంకింగ్ సేవలు ఏడు గంటల పాటు అందుబాటులో ఉండవు. ఈ కాలంలో కస్టమర్ కేర్ సేవలు (ఫోన్ బ్యాంకింగ్ ఐవీఆర్, ఈమెయిల్ & సోషల్ మీడియా), వాట్సాప్లో చాట్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ అందుబాటులో ఉండవని బ్యాంక్ వెల్లడించింది.మెయింటెనెన్స్ పీరియడ్ లో ఫోన్ బ్యాంకింగ్ ఏజెంట్ సేవలు, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, పేజాప్, మై కార్డ్స్ సేవలు మాత్రం యథావిధిగా అందుబాటులో ఉంటాయని ఈ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం వివరించింది. -
క్రెడిట్ హిస్టరీ లేదని లోన్ రిజెక్ట్ చేయొచ్చా? ఆర్థిక శాఖ స్పష్టత
క్రెడిట్ స్కోర్, హిస్టరీ అనేది బ్యాంకులు, ఇతర రుణ సంస్థల నుంచి లోన్ పొందడంలో కీలకంగా మారింది. అయితే తొలిసారి రుణం కోసం దరఖాస్తు చేసుకునేవారికి ఎలాంటి క్రెడిట్ హిస్టరీ ఉండదు. ఇలాంటి వారికి క్రెడిట్ హిస్టరీ లేదన్న కారణంతో లోన్ మంజూరు చేయకుండా రుణ సంస్థలు తిరస్కరిస్తాయన్న ఆందోళన ఉంటుంది. దీనికి సంబంధించి తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వైఖరిని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.మొదటిసారి రుణగ్రహీతలకు క్రెడిట్ హిస్టరీ లేనందున రుణ దరఖాస్తును తిరస్కరించరాదని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది, ఇటీవల పార్లమెంటులో ఒక ప్రశ్నకు సమాధానంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి క్రెడిట్ స్కోర్ కు సంబంధించిన అనేక అంశాలను స్పష్టం చేశారు. సిబిల్ నివేదికలు, క్రెడిట్ రిపోర్టులను జారీ చేయడానికి అధీకృత ఏజెన్సీలు, మొదటిసారి రుణానికి దరఖాస్తు చేయడానికి క్రెడిట్ హిస్టరీ తప్పనిసరా వంటి వాటిపై స్పష్టత ఇచ్చారు.2025 జనవరి 6న ఆర్బీఐ విడుదల చేసిన మాస్టర్ డైరెక్షన్ ప్రకారం, అన్ని క్రెడిట్ ఇన్స్టిట్యూషన్లు (CI) తమ విధానాల్లో ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఆర్బీఐ పేర్కొన్న ప్రకారం, కనీస క్రెడిట్ స్కోరు అవసరం లేదు. అంటే ఆర్బీఐ ఎలాంటి క్రెడిట్ స్కోరు నిర్దేశించలేదు. కాబట్టి బ్యాంకులు తమ సొంత వాణిజ్య పరమైన విధానాల ఆధారంగా రుణ దరఖాస్తులను పరిశీలించవచ్చు. -
ఫ్యామిలీకంతా రూ.కోటి ఉన్నా చాలు.. హెచ్డీఎఫ్సీ కొత్త ఆప్షన్
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) తన ప్రీమియం “ఇంపీరియా” ప్రోగ్రామ్కు సంబంధించి కొత్త అర్హత ప్రమాణాన్ని ప్రకటించింది. అక్టోబర్ 1, 2025 నుంచి, కస్టమర్లు రూ.1 కోటి “టోటల్ రిలేషన్షిప్ వాల్యూ (TRV)” ఆధారంగా కూడా ఈ ప్రోగ్రామ్కు అర్హత పొందవచ్చు. ఇది వ్యక్తిగత ఖాతాలకే కాకుండా, కుటుంబ సభ్యులు లేదా బిజినెస్ గ్రూప్లతో కలిపి ఉన్న మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది.ఇంతకు ముందు హెచ్డీఎఫ్సీ ఇంపీరియా ప్రోగ్రామ్లో టీఆర్వీ ఆధారంగా అర్హత పొందాలంటే, రూ.1 కోటి విలువను వ్యక్తిగత ఖాతా స్థాయిలో నిర్వహించాల్సి ఉండేది. అంటే, ఒక కస్టమర్కి చెందిన సేవింగ్స్, ఎఫ్డీ, పెట్టుబడులు, లోన్లు, డీమాట్, ఇన్సూరెన్స్ ప్రీమియం మొదలైనవి కలిపి రూ.1 కోటి టీఆర్వీ ఉండాలి. తాజా మార్పు ప్రకారం.. గ్రూప్ స్థాయిలో రూ.1 కోటి టీఆర్వీ ఉంటే సరిపోతుంది. కుటుంబ సభ్యులు లేదా బిజినెస్ ఎంటిటీల ఖాతాలు కలిపి ఈ విలువ చేరవచ్చు.టీఆర్వీ కాకుండా ఇతర అర్హత మార్గాల ద్వారా హెచ్డీఎఫ్సీ ఇంపీరియా ప్రోగ్రామ్లో చేరాలంటే కరెంట్ ఖాతాలో రూ.15 లక్షల సగటు త్రైమాసిక బ్యాలెన్స్ నిర్వహించాలి. అదే సేవింగ్స్ ఖాతాలో అయితే రూ.10 లక్షల సగటు నెలవారీ బ్యాలెన్స్ ఉండాలి. ఎఫ్డీ, సేవింగ్స్, కరెంట్ ఖాతాలన్నీ కలిపి అయిఏత రూ.30 లక్షల సగటు బ్యాలెన్స్ ఉండాలి. హెచ్డీఎఫ్సీ కార్పొరేట్ ఖాతాల్లో రూ.3 లక్షల పైగా నెలవారీ జీతం జమయ్యేవారికి కూడా ఇంపీరియా ప్రోగ్రామ్ ప్రయోజనాలు లభిస్తాయి.ఇంపీరియా ప్రోగ్రామ్.. దాని ప్రయోజనాలుహెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఇంపీరియా ప్రోగ్రాం అనేది హై-వ్యాల్యూ కస్టమర్ల కోసం రూపొందించిన ప్రీమియం బ్యాంకింగ్ సేవల ప్యాకేజీ. దీని ముఖ్యమైన ప్రయోజనాలు కస్టమర్కు ప్రత్యేకత, ప్రాధాన్యత, ఆర్థిక సౌలభ్యాన్ని అందిస్తాయి.ప్రత్యేక రిలేషన్షిప్ మేనేజర్:వ్యక్తిగతంగా సేవలు అందించే రిలేషన్షిప్ మేనేజర్పెట్టుబడులు, లోన్లు, ఇన్సూరెన్స్ వంటి అంశాల్లో గైడెన్స్వెల్త్ అడ్వయిజరీ సేవలు:ఫైనాన్షియల్ ప్లానింగ్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్మార్కెట్ ట్రెండ్స్ ఆధారంగా సలహాలుఉచిత, తగ్గింపు సేవలు:చెక్బుక్, స్టాప్ పేమెంట్, ఇంటర్-బ్రాంచ్ ట్రాన్స్ఫర్ వంటి సేవలు ఉచితంమొదటి లాకర్ ఉచితం, రెండవది 50% తగ్గింపుప్రాధాన్యత ధరలు:ఫారెక్స్ ట్రాన్సాక్షన్లు, లోన్లు, ఎఫ్డీలు, ఇతర ఉత్పత్తులపై ప్రత్యేక రేట్లుప్రత్యేక ఆఫర్లు, ప్రోమోషన్లు:హెచ్డీఎఫ్సీ భాగస్వామ్య బ్రాండ్స్ వద్ద క్యాష్ బ్యాక్లు, రివార్డ్ పాయింట్లు, రివార్డ్పాయింట్లు, లైఫ్స్టైల్ బెనిఫిట్లు -
చదువుతో ఆర్థిక అక్షరాస్యత వస్తుందా?
చదువుకు, ఆర్థిక అక్షరాస్యతకు సంబంధం ఉందా అంటే లేదనే చెప్పొచ్చు. దేశంలోనే అధిక అక్షరాస్యత శాతం కలిగిన రాష్ట్రంగా కేరళకు గుర్తింపు ఉంది. అదే సమయంలో లాటరీ టికెట్లు కొని భారీగా డబ్బు నష్టపోతున్న జనాభా ఎక్కువగా ఉన్న రాష్టంగా కూడా కేరళకు గుర్తింపు ఉంది. దాంతో చదువు ఆర్థిక పరిజ్ఞానాన్ని పూర్తిగా నేర్పించడం లేదనే అభిప్రాయలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకు చదువుల్లో ఆర్థిక సంబంధ అంశాలపై పరిజ్ఞానం పెంచాలని కొందరు భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈమేరకు అకడమిక్ సిలబస్లో ఫైనాన్షియల్ టాపిక్స్ను బోధిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు మాత్రం ఇంకా చర్యలు తీసుకోలేదు. అందుకు ఏవరి కారణాలు వారికి ఉంటాయి. ఈ సంగతి అటుంచితే తల్లిదండ్రులుగా పిల్లల ఫైనాన్షియల్ లిటరసీ పెరగడానికి ఏం చేయాలనే దానిపై దృష్టి సారించాలి.పిల్లలు చాలా సమయాల్లో సాధారణంగా మనం చెప్పింది చేయరు. మనం ఏదైనా పని చేస్తూ ఉంటే వారు చూస్తూ దాన్ని అనుకరిస్తారు. అంటే ముందు తల్లిదండ్రులకు ఫైనాన్షియల్ డిసిప్లెయిన్ ఉండి, క్రమశిక్షణగా నడుచుకుంటుంటే దాన్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు. తరగతి గదిలో చెప్పిన పాఠం కంటే ప్రయోగశాలలో నేర్చుకుంది ఎక్కువగా గుర్తుంటుంది.పిల్లలకి ఫైనాన్షియల్ డిసిప్లెయిన్ నేర్పించాలంటే పరిస్థితులను అనుసరించి వీలైప్పుడు ఆర్థిక లావాదేవీల్లో వారిని ఇన్వాల్వ్ చేయాలి. ఉదాహరణకు.. మీరు సూపర్ మార్కెట్కు వెళ్లాలనుకుంటున్నారు. ముందే బడ్జెట్ రాసుకోండి. ఈరోజు మీరు చేయబోయే షాపింగ్ రూ.3000.. కొనవాల్సిన వస్తువులు ఇవి..అని జాబితా సిద్ధం చేసుకోవాలి. షాపులోకి వెళ్లాక వాటిని బడ్జెట్లో కొనటం ఎలాగో పిల్లలకి టాస్క్ ఇవ్వండి. ప్రాక్టికల్గా చూపించండి. ఆ సమయంలో అవసరాలు, అత్యావసరాలు, నిత్యావసరాలు ఏంటో గమనించేలా చేయాలి. భవిష్యత్తులో ఏదైనా షాపింగ్ వెళ్లినప్పుడు పిల్లలకి బడ్జెట్ కేటాయించాలి. దాన్ని దాటి చేసే ఖర్చులను కట్టడి చేయాలి. ఉన్న బడ్జెట్లో క్వాలిటీ వస్తువులను ఎలా ఎంచుకోవాలి.. అందుకు ఏయే మార్గాలున్నాయో తెలియజేయాలి. క్రమంగా కొంతకాలంపాటు దీన్ని అనుసరిస్తే తప్పకుండా పిల్లల్లో మార్పు వస్తుంది.ఇదీ చదవండి: బడ్జెట్ కార్ల ధరలో రూ.80,000 వరకు రాయితీ? -
IT Returns: ఫైలింగ్ యాప్లతో జాగ్రత్త..
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ప్రాక్టీస్ చేస్తున్న సీఏలు, సీఎంఏలు, లాయర్లు, ట్యాక్స్ ప్రాక్టీషనర్లు.. ఇలా వృత్తి నిపుణులు ఉన్నారు. డిపార్టుమెంటు దగ్గర రిజిస్టర్ చేసుకుని, ఇన్కం ట్యాక్స్ ప్రాక్టీషనర్లుగా చలామణీ అయ్యే వారితోను ఫైల్ చేయించుకోవచ్చు. మీరే స్వయంగా చేసుకోవచ్చు. అనుభవం ఉన్న ఫ్రెండ్స్ సహాయంతో ఫైలింగ్ చేసుకోవచ్చు. కొన్ని సంస్థలు కూడా ఈ ఫైలింగ్ పనులు చేస్తున్నాయి. వీరందరితో మీరు స్వయంగా మాట్లాడవచ్చు. కలవవచ్చు. డిస్కస్ చేసి, రిటర్నులు వేయొచ్చు.ప్రస్తుతం ఈ ఆధునిక డిజిటల్ యుగంలో ప్రతి పనికి మనం ఎన్నో అప్లికేషన్లను వాడుతున్నాం. చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. అరచేతిలో స్వర్గం చూస్తున్నట్లు యాప్లను ఇన్స్టాల్ చేసేస్తున్నాం. వాడుతున్నాం. ఆదాయపు పన్ను ఫైలింగ్కి కూడా రకరకాలుగా యాప్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీరెంతో ఆలోచించాలి. ఒక విషయం గుర్తు పెట్టుకోండి. ఫైలింగ్ అంటే నాలుగంకెలను నాలుగు కాలమ్లలో నింపి, అప్లోడ్ చేసి క్లిక్ కొట్టడం కాదు. చట్టంలోని సెక్షన్లు, వాటిలో ఇమిడి ఉన్న చిక్కులు, లెక్కలు, వాటి ప్రభావం తెలిసి ఉండాలి. అప్లికేషన్స్ వల్ల ఎండమావుల్లాగా కంటికి కనిపించే ప్రయోజనాలు. చాలా త్వరగా పూర్తవుతుంది. అతి తక్కువ ఖర్చు. మీ సీటులో నుంచి కదలక్కర్లేదు. కానీ, ఈ యాప్లను చెక్ చేసుకోకుండా వాడటం వల్ల చాలా ఇబ్బందులుంటాయి. అవేంటంటే..చాలా త్వరగా ఫైలింగ్ చేయొచ్చు. ఇంత చౌకగా సర్వీసులు అందిస్తున్నారంటే, వారు పూర్తిగా కృత్రిమ మేథస్సు మీద ఆధారపడుతున్నారన్న మాట. కృత్రిమ మేథస్సు వల్ల త్వరగా అవుతుందేమో గానీ, ఎన్నో అంశాల్లో జడ్జిమెంట్ కావాలి.కేవలం కాగితాల్లో ఉన్న అంకెలను చదివి, వాటిని నింపడం/రాయడం/ఎక్కించడం మాత్రమే చేస్తారు. గతంలో మనం చదివాం. ఫారం 16లో తప్పులు, ఫారం 26ఏఎస్లో తప్పులు, డబుల్ ఎంట్రీలు, మీకసలు వర్తించని అంశాలు, మీకు సంబంధం లేని అంశాలు, అలాగే టీఐఎస్లో కూడా తప్పులు, డబుల్ ఎంట్రీలు, మీవి కాని/సంబంధం లేనివి ఉంటాయి. వాటిని చెక్ చేసి, విశ్లేషించే ప్రక్రియ ఉండదు. మక్కీకి మక్కీ మాత్రమే కొడతారు.ఏ తప్పులు దొర్లినా, ఎటువంటి బాధ్యతలు వహించరు. తప్పుల మేరకు సరిదిద్దాలంటే డబ్బులు అడుగుతారు. అడగడం కాదు గుంజుతారు. జడ్జిమెంటు. సహజసిద్ధమైన మానవ మేథస్సును వాడకపోవడం వల్ల మనకు డ్యామేజీ జరగవచ్చు. ఎక్కువ పన్ను చెల్లించడం, రిఫండు తగ్గిపోవడంలాంటివి జరిగే అవకాశం ఉంది.డిడక్షన్లను తప్పుగా క్లెయిం చేసే అవకాశం ఉంది. కొత్త విధానమా, పాత విధానమా అనేది ఎంచుకోవడంలో తప్పు జరగవచ్చు. క్యాపిటల్ గెయిన్స్ విషయంలో వర్గీకరణ తప్పుగా చేయొచ్చు. సర్దుబాటు చేయాల్సిన నష్టాలు తీసుకోకపోవచ్చు. నష్టాల బదిలీ జరగకపోవచ్చు. నోటీసులు వస్తే ప్రమాదం. పెనాల్టీ పడితే వాళ్లు పరార్.వందల అంశాలు మీతో ముఖాముఖి చర్చించే పరిస్థితికి బదులు ఎకాయెకిన ఫేస్లెస్గా, బేస్లెస్గా ఒక క్లిక్ చేస్తే, అర్థం లేని ఫైలింగ్తో మీరు అనర్ధాలు కొనుక్కుంటారు. సాఫ్ట్వేర్లో తప్పులున్నా.. ఉండొచ్చు. అలా వేసే ప్రక్రియలో ఆలోచనలకు, విశ్లేషణలకు తావుండదు.మహా అయితే, ఫారం 1 విషయంలో రిస్క్ తీసుకుని ‘మమ‘ అనిపించవచ్చు. కానీ, మిగతా ఫారాల విషయంలో ఎటువంటి ప్రయోగం చేయొద్దు.ఇదేమీ గేమ్ యాప్ కాదు. చౌకగా సర్వీసులు దొరికాయని సంబరపడకండి. వందల రూపాయలు మిగిలాయని, మితిమీరి సంతోషపడితే వేలల్లో/లక్షల్లో నష్టాన్ని చూడాల్సి రావొచ్చు. కేవలం ఆర్థికంగానే కాదు.. చట్టాలని పాటించనందుకు గాను ఎన్నో చిక్కుల్లో పడతారు.చివరగా, ఏడాదికోసారి, జాతి సేవలో పాలుపంచుకునేందుకు ఇదొక చక్కటి అవకాశం. నీతి, నిజాయితీతో ఆదర్శంగా ఉండే అంశం. సజ్జనుడిలాగా సగౌరవంగా సాగించాల్సిన సాలుసరి సత్కార్యం. కాబట్టి, వృత్తి నిపుణులను సంప్రదించండి. స్వయంగా టచ్లో ఉండండి. అన్ని కాగితాలు ఇవ్వండి. డిస్కస్ చేయండి. రిటర్న్ సరిగ్గా ఫైల్ చేయండి. -
ఇన్వెస్టర్లూ.. ఇవిగో కొత్త ఫండ్లు
యూనియన్ మ్యుచువల్ ఫండ్ సంస్థ తాజాగా డైవర్సిఫైడ్ ఈక్విటీ ఆల్ క్యాప్ యాక్టివ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్వోఎఫ్)ను ఆవిష్కరించింది. ఇది సెప్టెంబర్ 1న ప్రారంభమై 15న ముగుస్తుంది. ఈ ఎఫ్వోఎఫ్ ప్రధానంగా యూనియన్ ఎంఎఫ్కి చెందిన లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ ఈక్విటీ స్కీముల్లో ఇన్వెస్ట్ చేస్తుంది.దీనితో మార్కెట్ టైమింగ్, దేనికి ఎంత కేటాయించాలి, ఒక ఫండ్ నుంచి మరో ఫండ్కి మారేటప్పుడు పడే పన్ను ప్రభావాలు మొదలైన వాటి గురించి ఆలోచించాల్సిన బాదరబందీ ఉండదని సంస్థ ఎండీ మధు నాయర్ తెలిపారు. స్వల్పకాలికం నుంచి దీర్ఘకాలికం వరకు వివిధ కాలావధుల వ్యూహాలతో, ఈక్విటీ ఫండ్లకు వర్తించే పన్ను ప్రయోజనాలను అందించేలా ఈ ఫండ్ ఆఫ్ ఫండ్ ఉంటుందని వివరించారు. ఎడెల్వీజ్... మల్టీ అసెట్ ఓమ్ని ఎఫ్వోఎఫ్ ఎడెల్వీజ్ మ్యూచువల్ ఫండ్ తాజాగా ‘ఎడెల్వీజ్ మల్టీ అసెట్ ఓమ్ని ఫండ్ ఆఫ్ ఫండ్’ (ఎఫ్వోఎఫ్) పేరుతో కొత్త పథకాన్ని ఇన్వెస్టర్ల కోసం తీసుకొచ్చింది. ఈ పథకం ఈక్విటీతోపాటు బంగారం, వెండి, డెట్ సాధనాల్లో పెట్టుబడులు పెడుతుంది. లంప్సమ్ లేదా సిప్ రూపంలో అయినా కనీసం రూ.100 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 65% పెట్టుబడులను దేశీ ఈక్విటీలకు కేటాయిస్తుంది. పసిడి ఈటీఎఫ్లకు 10%, వెండి ఈటీఎఫ్లకు 10%, ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాలకు 15% చొప్పున కేటాయిస్తుంది. పెట్టుబడులను వైవిధ్యం చేసి, దీర్ఘకాలంలో స్థిరమైన రాబడిని అందించడం ఈ పథకం ఉద్దేశం. ఈ నెల 23న ఎన్ఎఫ్వో ముగుస్తుంది. ఇది ఓపెన్ ఎండెడ్ ఫండ్ కావడంతో తిరిగి సెప్టెంబర్ 11 నుంచి పెట్టుబడులకు అందుబాటులోకి వస్తుంది. పెట్టుబడులను 90 రోజుల్లోపు ఉపసంహరించుకుంటే 1% ఎగ్జిట్ లోడ్ పడుతుంది. -
నాకొచ్చే జీతానికి 50/30/20 బడ్జెట్ రూల్ సరిపోతుందా?
బడ్జెట్కు సంబంధించి 50/30/20 సూత్రం గురించి విన్నాను. నా ఆర్థిక ప్రణాళికకు దీన్ని అనుసరించడం మంచి మార్గమేనా? – కరుణాకరన్బడ్జెట్కు సంబంధించి బాగా ప్రాచుర్యంలో ఉన్నదే 50/30/20 నియమం. మీ నెలవారీ ఆదాయాన్ని మూడు భాగాలుగా వర్గీకరించడం ఇందులోని సూత్రం. ఇందులో 50 శాతాన్ని మీ అవసరాల కోసం కేటాయించుకోవాలి. అంటే ఇంటి అద్దె, గ్రోసరీ, విద్యుత్, రుణ వాయిదా చెల్లింపులు, స్కూల్ ఫీజులు అన్నీ కలిపి 50 శాతంలోపే ఉండాలి. మరో 30 శాతం అన్నది కోరికల కోసం. అంటే రెస్టారెంట్లో విందులు, ఓటీటీ చందాలు, విహార యాత్రలు, షాపింగ్ వంటివన్నీ 30 శాతం బడ్జెట్కు పరిమితం కావాలి.మిగిలిన 20 శాతాన్ని భవిష్యత్తు కోసం, దీర్ఘకాల లక్ష్యాల కోసం పొదుపు, మదుపు చేసుకోవాలి. ఇది ఒక సాధారణ సూత్రమే కానీ, అందరికీ వర్తించేది కాదు. మీ ఆదాయం ఎంత వస్తోంది? జీవన వ్యయాలు ఎంత? వ్యక్తిగత బాధ్యతలు ఏ మేరకు ఇలాంటి విషయాలన్ని బడ్జెట్ను నిర్ణయిస్తాయి.ఉదాహరణకు ఓ యువ ఉద్యోగి నెలవారీ రూ.40,000 ఆదాయం సంపాదిస్తున్నాడని అనుకుందాం. అతను ఉండేది మెట్రోలో. ఇంటి అద్దె, రవాణా వ్యయాలకే 50 శాతం ఖర్చవుతుంది. అప్పుడు ఇతర అవసరాలు, కోరికలు, పొదుపులకు మిగిలేది పెద్దగా ఉండదు. అదే రూ.2లక్షల వేతనం సంపాదించే వ్యక్తి కేవలం 30–35 శాతం బడ్జెట్లోనే అవసరాలను తీర్చుకోగలరు. అప్పుడు సదరు వ్యక్తి 30–40 శాతం ఆదా చేయగలరు. కనుక ఆదాయాన్ని బట్టి ఈ ప్రణాళిక ఆధారపడి ఉంటుంది.50/30/20 అన్నది బడ్జెట్ మొదలు పెట్టడానికి అనుసరించొచ్చు. ముఖ్యంగా మీ జీవన వ్యయాలు ఆదాయాన్ని మించకుండా చూసుకోవాలి. మరీ ముఖ్యంగా ఆదాయంలో 20 శాతాన్ని తప్పకుండా ఆదా చేసుకోవాలి. కోరికలకు సంబంధించిన బడ్జెట్లో రాజీ పడినా ఫర్వాలేదు. పొదుపు విషయంలో రాజీ పడకూడదు. ఈక్విటీ మార్కెట్లలో తరచుగా కనిపించే అస్థిరతలను ఎలా అధిగమించాలి? – శ్యామలఈక్విటీల్లో అస్థిరతలన్నవి సర్వసాధారణం. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మార్కెట్లు చలిస్తుంటాయి. గడిచిన ఐదు, పదేళ్లుగా మార్కెట్లలో ఇదే ధోరణి కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు వీటిని ఎదుర్కోడం ఎలాగో తెలిసి ఉండాలి. ఇందుకోసం కొన్ని చర్యలను అమలు చేయాలి.ముందుగా ప్రతీ ఇన్వెస్టర్ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లను తీసుకుని తమకు, తమ కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించుకోవాలి. అత్యవసర సందర్భాల్లో ఈక్విటీ పెట్టుబడులను కదలించకుండా ఉండాలి. ఇందుకోసం ప్రత్యేకంగా అత్యవసర నిధిని (ఈఎఫ్) ఏర్పాటు చేసుకోవాలి. ఈక్విటీల్లో మీ పెట్టుబడులను కనీసం ఐదు నుంచి ఏడేళ్ల పాటు కదపకూడదు. ఈక్విటీ అస్థిరతలను అధిగమించేందుకు ఈ చర్యలు అవసరం.అలాగే, సిప్ వంటి సాధనాల ద్వారా ఇన్వెస్ట్ చేయడం వల్ల మార్కెట్ అస్థిరతల నుంచి ప్రయోజనాన్ని పొందొచ్చు. సిప్ రూపంలో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసే వారికి మార్కెట్లలో కరెక్షన్లు అదనపు పెట్టుబడుల అవకాశాలను తెస్తాయి. ఎందుకంటే ఆ సమయాల్లో ఎక్కువ ఫండ్ యూనిట్లను తక్కువ ధరకే సమకూర్చుకోవచ్చు.మార్కెట్లు దిద్దుబాటుకు గురైతే చౌకగా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ, ప్రతికూల సమయాల్లో చాలా మంది భయంతో పెట్టుబడులకు వెనుకాడుతుంటారు. కొందరు అమ్మకాలు కూడా చేస్తుంటారు. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. ఆ సమయంలో తప్పకుండా సిప్ను కొననసాగించాలి. వీలైతే సిప్ మొత్తాన్ని పెంచుకోవాలి. దీనివల్ల దీర్ఘకాలంలో మరిన్ని రాబడులు సమకూర్చుకోవడానికి వీలుంటుంది.సమాధానాలు :: ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
మహిళల కోసం టాటా ఏఐఏ కొత్త పాలసీ
జీవిత బీమా సంస్థ టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్.. ప్రత్యేకంగా మహిళల కోసం శుభ్ శక్తి పేరిట టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ను ప్రవేశపెట్టింది. ప్రెగ్నెన్సీ సమయంలో ప్రీమియం హాలిడే, పురుషుల పాలసీలతో పోలిస్తే ప్లాన్ వ్యవధి ఆసాంతం ప్రీమియంపై 15% సుమారు డిస్కౌంటు, సింగిల్ మదర్స్కి దీనికి అదనంగా 1% మేర జీవితకాల డిస్కౌంటులాంటి ఫీచర్లు ఈ పాలసీలో ఉంటాయి.అలాగే సర్వికల్ క్యాన్సర్, హెచ్పీవీ మొదలైన వాటికి టీకాలపరమైన మద్దతు, ఐవీఎఫ్ కౌన్సెలింగ్, స్పెషలిస్ట్ కన్సల్టేషన్లు, వార్షిక హెల్త్ చెకప్ల వంటి ప్రయోజనాలు ఉంటాయని సంస్థ చీఫ్ కాంప్లయెన్స్ ఆఫీసర్ గాయత్రి నాథన్ తెలిపారు.పాలసీ ముఖ్య లక్షణాలుప్రీమియం హాలిడే: బిడ్డ పుట్టిన తర్వాత 12 నెలల పాటు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది పాలసీ వ్యవధిలో రెండుసార్లు వర్తిస్తుంది.తక్కువ ప్రీమియం: పురుషుల పాలసీలతో పోలిస్తే మహిళలకు 15% తక్కువ ప్రీమియం ఉంటుంది. ఇది పాలసీ కాలం మొత్తం వర్తిస్తుంది.ఒంటరి తల్లులకు ప్రత్యేక రాయితీ: జీవితకాల ప్రీమియంపై అదనంగా 1% తగ్గింపు.ఆరోగ్య ప్రయోజనాలు: సర్వికల్ క్యాన్సర్, హెచ్పీవీ వంటి వ్యాధులకు టీకాల మద్దతుఐవీఎఫ్ కౌన్సెలింగ్, స్పెషలిస్ట్ కన్సల్టేషన్లు, వార్షిక హెల్త్ చెకప్లుప్రీమియం వెయివర్: జీవిత భాగస్వామి ప్రమాదవశాత్తూ మరణిస్తే, తదుపరి ప్రీమియాలు చెల్లించాల్సిన అవసరం లేదు.అదనపు ప్రయోజనం: అదనపు ప్రీమియంతో పిల్లల విద్య కోసం నెలవారీ ఆదాయం పొందే అవకాశం (21 లేదా 25 ఏళ్ల వరకు) -
సిప్ సరే.. ఇక సిఫ్ చేస్తారా!
పెట్టుబడుల ప్రపంచం ఎప్పుడూ ఒకే మాదిరి ఉండదు. ఎప్పటికప్పుడు కొంగొత్త సాధనాలు అందుబాటులోకి వస్తుంటాయి. ఒకప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్, ఎల్ఐసీ ఎండోమెంట్ పాలసీల హవా. ఇప్పుడు మెజారిటీ పెట్టుబడులు ఈక్విటీల వైపే. ఇందులోనూ స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఎస్ఐఎఫ్–సిఫ్) పేరుతో కొత్త సాధనం అందుబాటులోకి వచ్చింది. దీనికితోడు ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్లు)కు సైతం ఆదరణ పెరుగుతోంది. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ (పీఎంఎస్) ఎప్పటి నుంచో ఉన్నదే. ఈ భిన్న సాధనాల్లో రిస్క్, రాబడుల పరంగా ఎంతో వ్యత్యాసం గమనించొచ్చు. ఇన్వెస్టర్లందరికీ ఈ సాధనాలు అనుకూలమని చెప్పలేం. తమ ఆకాంక్షలకు అనుగుణంగా సరైన సాధనాన్ని ఎంపిక చేసుకుని, దీర్ఘకాలం పాటు కొనసాగితే సంపద సృష్టి సాధ్యమే.సంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్, పీఎంఎస్, ఏఐఎఫ్, సిఫ్ మధ్య పోలికలు తక్కువ. వైరుధ్యాలే ఎక్కువ. రాబడుల్లోనూ స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తుంది. అన్ని ఆదాయ వర్గాల వారికీ అందుబాటులో ఉన్న సాధనం సంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్. ఇక సిఫ్, పీఎంఎస్, ఏఐఎఫ్ అన్నీ కూడా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే వారికి ఉద్దేశించినవి. వీటి నిర్వహణ తీరులోనూ వైరుధ్యం కనిపిస్తుంది. వీటన్నింటిపైనా సెబీ నియంత్రణ, పర్యవేక్షణ ఉంటుంది. ఎంపిక బాధ్యత మాత్రం ఇన్వెస్టర్లదే. సంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీయే కాకుండా డెట్, గోల్డ్, రియల్ ఎస్టేట్ తదితర సాధనాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు సంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్ వీలు కల్పిస్తున్నాయి. విడివిడిగా, లేదంటే వీటి కలయికతో కూడిన హైబ్రిడ్ ఫండ్స్ను సైతం ఆఫర్ చేస్తున్నాయి. వేలాది పథకాల నుంచి ఇన్వెస్టర్లు తమకు అనుకూలమైన దానిని ఎంపిక చేసుకోవచ్చు. రూ.100 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సెబీ పర్యవేక్షణ, నియంత్రణల మధ్య పనిచేస్తుంటాయి. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా వారం, పక్షం, నెలకొకసారి చొప్పున పెట్టుబడులు పెట్టుకోవచ్చు. పెట్టుబడి నుంచి ఆదాయం కోరుకుంటే సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్ (ఎస్డబ్ల్యూపీ) ద్వారా ప్రతి నెలా నిరీ్ణత మొత్తం ఉపసంహరించుకోవచ్చు. లక్షలాది మంది ఇన్వెస్టర్లను ఉద్దేశించి రూపొందించిన సాధనాలు ఇవి. పదుల సంఖ్యలో విభాగాల నుంచి తమకు అనుకూలమైన ఫండ్స్ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. లిక్విడిటీ ఎక్కువ. అంటే కోరుకున్నప్పుడు పెట్టుబడులను సులభంగా, వేగంగా వెనక్కి తీసుకోగలరు. ఇందులో యాక్టివ్, ప్యాసివ్ ఫండ్స్ ఉంటాయి. ప్యాసివ్ ఫండ్స్లో 0.2 శాతం (మొత్తం పెట్టుబడుల విలువలో), యాక్టివ్ ఫండ్స్లో 0.5 శాతం నుంచి ఎక్స్పెన్స్ రేషియో ప్రారంభమవుతుంది. రాబడులు: ఎంపిక చేసుకున్న విభాగం, పథకం ఆధారంగా 5–20 శాతం మధ్య దీర్ఘకాలంలో ఉంటాయి. పన్ను బాధ్యత: ఈక్విటీ ఫండ్స్(ఈక్విటీల్లో కనీసం 65 శాతం పెట్టుబడులు పెట్టే), ఆర్బిట్రేజ్ ఫండ్స్లో పెట్టుబడులను ఏడాదిలోపు విక్రయించినప్పుడు వచ్చిన లాభంపై 20 శాతం పన్ను చెల్లించాలి. ఏడాది తర్వాత విక్రయించినప్పుడు వచ్చిన లాభం మొదటి రూ.1.25 లక్షలపై పన్ను లేదు. తర్వాతి మొత్తంపై 12.5 శాతం పన్ను చెల్లించాలి. ఇక డెట్ ఫండ్స్లో పెట్టుబడిని ఎప్పుడు విక్రయించినా వచి్చన లాభంపై పన్ను ఒకే మాదిరి ఉంటుంది. లాబాన్ని వ్యక్తిగత వార్షిక ఆదాయానికి కలిపి పన్ను చెల్లించాలి.పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ (పీఎంఎస్) ఇన్వెస్టర్ల రాబడుల ఆకాంక్షలకు అనుగుణంగా పెట్టుబడుల సేవలు అందించేవి పీఎంఎస్ సంస్థలు. అనుభవజు్ఞలైన ఫండ్ మేనేజర్లు ఇన్వెస్టర్ల ఖాతాల నుంచే వారి తరఫున పెట్టుబడుల వ్యవహారాలను నిర్వహిస్తారు, పర్యవేక్షిస్తుంటారు. కనీసం రూ.50 లక్షలు అంతకుమించి పెట్టుబడి పెట్టాలి. ఇన్వెస్టర్ల రాబడి ఆకాంక్షలు, ఎంత రిస్క్ తీసుకుంటారు తదితర అంశాల ఆధారంగా వారి కోసమే ప్రత్యేకమైన పోర్ట్ఫోలియోని నిర్వహిస్తారు. కొత్త అవకాశాలను గుర్తించినప్పుడు పోర్ట్ఫోలియోలో మార్పులు చేర్పులు చేస్తుంటారు. పీఎఎంస్లోనూ డిస్క్రీషినరీ, నాన్ డిరస్కీషినరీ అని రెండు రకాలు ఉంటాయి. డిస్క్రీషినరీలో అయితే ఫండ్ మేనేజర్ తన విచక్షణ ఆధారంగా స్వతంత్రంగా పెట్టుబడుల నిర్ణయాలు అమలు చేస్తుంటారు. నాన్ డిస్క్రీషినరీలో క్లయింట్ అనుమతి తీసుకున్న తర్వాతే లావాదేవీలు నిర్వహిస్తుంటారు. ఈ రెండూ కాకుండా అడ్వైజరీ పేరుతో మరో విభాగం కూడా ఉంది. ఇక్కడ ఇన్వెస్టర్కు పోర్ట్ఫోలియో మేనేజర్ సలహాలు ఇవ్వడం వరకే పరిమితం అవుతారు. వాటిని పాటించడం, పాటించకపోవడం ఇన్వెస్టర్ అభీష్టమే. మ్యూచువల్ ఫండ్స్లో లక్షలాది మంది ఇన్వెస్టర్లను దృష్టిలో పెట్టుకుని పోర్ట్ఫోలియోలను నిర్వహిస్తుంటారు. పీఎంఎస్లలో ఒక్కో ఇన్వెస్టర్ అవసరాలకు అనుగుణంగా విడిగా పోర్ట్ఫోలియో ఉంటుంది. ఫండ్స్ మాదిరే పీఎంఎస్ల్లోనూ పారదర్శకత ఎక్కువ. పెట్టుబడిదారులకు ముఖ్యమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలి. కానీ, మ్యూచువల్ ఫండ్స్ మాదిరి వీటి పనితీరు, ఫోర్ట్పోలియో తదితర సమాచారం ఓపెన్ ఫ్లాట్పామ్లపై (ఆన్లైన్ ప్రపంచం) ఉండదు. పీఎంఎస్ ఇన్వెస్టర్లకే తెలుస్తుంది. ఈక్విటీలతోపాటు డెరివేటివ్స్ పొజిషన్ల ద్వారా అధిక రాబడినిచ్చే విధంగా పీఎంఎస్లు పనిచేస్తాయి. సంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్ కంటే ఇందులో లిక్విడిటీ కొంచెం తక్కువ. వీటిలో ఫీజులు 3.5 శాతం నుంచి 5.5 శాతం వరకు ఉంటాయి. ఫీజును ఇన్వెస్టర్ స్వయంగా చెల్లించడం వీలుకానప్పుడు, పోర్ట్ఫోలియోలోని కొన్ని స్టాక్స్ను విక్రయించడం ద్వారా పీఎంఎస్ సంస్థ తన ఫీజులను రాబట్టుకుంటుంది. రాబడులు: గత ఏడాది కాలంలో సగటు రాబడులు 30 శాతంగా, ఐదేళ్ల కాలంలో 18.99 శాతం, పదేళ్లలో 17.35 శాతం చొప్పున ఉన్నాయి. పన్ను బాధ్యత: పీఎంఎస్ ఫండ్ మేనేజర్లు కొనుగోలు చేసిన షే ర్లు ఇన్వెస్టర్ డీమ్యాట్ ఖాతాలోనే ఉంటాయి. ఇన్వెస్టర్ పేరిటే చేస్తుంటారు కనుక ఈక్విటీలకు మాదిరే స్వల్ప, దీర్ఘకాల మూలధన లాభాల పన్ను అమలవుతుంది. ఇన్వెస్టర్ల పోర్ట్ ఫోలియోలోని కంపెనీలు జారీ చేసే డివిడెండ్ ఆదాయం వా ర్షిక ఆదాయానికి కలుస్తుంది. ఫండ్ మేనేజర్లు పోర్ట్ఫోలియో లోని స్టాక్స్ను ఎంత తరచుగా మార్పులు, చేర్పులు చేస్తున్నారనే దాని ఆధారంగా పన్ను బాధ్యత ఆధారపడి ఉంటుంది.ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్లు) ప్రైవేటు ఈక్విటీ, స్టార్టప్లు, హెడ్జ్ ఫండ్స్, డిరస్టెస్డ్ అసెట్స్ (ప్రాపర్టి), డెట్, రియల్ ఎస్టేట్ తదితర సాధనాల్లో ఏఐఎఫ్లు పెట్టుబడులు పెడుతుంటాయి. ఇందులో కనీస పెట్టుబడి కోటి రూపాయలు. ఇన్వెస్టర్లు అందరికీ అనుకూలమైన సాధనాలు కావు. వీటిలో మూడు కేటగిరీలు ఉన్నాయి. కేటగిరీ–1 ఫండ్స్.. ఆరంభ దశలోని వెంచర్లు, సోషల్ వెంచర్లు, సామాజిక ప్రభావం చూపించే ప్రాజెక్టులు, ఇన్ఫ్రాపై పెట్టుబడులు పెడతాయి. కేటగిరీ–2 ఏఐఎఫ్లు ప్రైవేటు ఈక్విటీ (పీఈ), రియల్ ఎస్టేట్ ఫండ్స్, డిరస్టెస్డ్ అసెట్స్ (ప్రాపర్టి), డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. కేటగిరీ–3 ఏఐఎఫ్లు హెడ్జింగ్ వ్యూహాలను అమలు చేస్తుంటాయి. లిస్టెడ్తోపాటు అన్లిస్టెడ్ కంపెనీలు, డెరివేటివ్స్లోనూ పెట్టుబడులు పెడుతుంటాయి. అవసరమైతే రుణం తీసుకుని మరీ ఇవి ఇన్వెస్ట్ చేస్తాయి. మూడు విభాగాల్లోనూ కేటగిరీ–3లో రిస్క్ చాలా ఎక్కువ. వీటిలో సాధారణంగా మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. దీంతో లిక్విడిటీ తక్కువ. అధిక రిస్క్ తీసుకునే ధనిక ఇన్వెస్టర్లు (హెచ్ఎన్ఐలు), ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు అనుకూలం. సంప్రదాయ డెట్, ఈక్విటీలకు ప్రత్యామ్నాయంగా ఇతర పెట్టుబడుల అవకాశాలను ఇవి అందిస్తుంటాయి. వీటిలో స్పెక్యులేషన్ ఉండదు. కనుక అస్థిరతలు తక్కువ. అదే సమయంలో రిస్క్ ఎక్కువ. వీటిలో అస్సెట్ మేనేజ్మెంట్ ఫీజు 2 శాతం మేర ఉంటుంది. అంతేకాదు ఇన్వెస్టర్ల రాబడిపై 20 శాతం లెవీ కింద వసూలు చేస్తుంటాయి. లిక్విడిటీ తక్కువ. పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలంటే నిరీ్ణత కాలం వరకు వేచి ఉండాల్సి వస్తుంది. ఏఐఎఫ్లు సెబీ నియంత్రణల పరిధిలో పనిచేస్తుంటాయి. సంప్రదాయ సాధనాలకు వెలుపల పెట్టుబడులను వైవిధ్యం చేసుకోవాలని భావించే వారు, అధిక రిస్క్ తీసుకునే సామర్థ్యం, అధిక మొత్తంలో పెట్టబుడులు పెట్టగలిగే వారికి ఇవి ప్రత్యేకం. రాబడులు: ఎంపిక చేసుకున్న విభాగం ఆధారంగా రాబడి భిన్నంగా ఉంటుంది. పన్ను బాధ్యత: కేటగిరీ 1, 2 ఏఐఎఫ్లో మూలధన లాభాలపై 12.5 శాతం పన్ను చెల్లించాలి. ఒకవేళ వ్యాపార ఆదాయంగా పరిగణిస్తే అప్పుడు 30 శాతం పన్ను పడుతుంది. ఇక కేటగిరీ 3 ఏఐఎఫ్లలో లాభంపై పన్ను ఫండ్ స్థాయిలోనే అమలవుతుంది. ఇన్వెస్టర్ ప్రత్యేకంగా ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు.స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (సిఫ్)సంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్, పీఎంఎస్/ఏఐఎఫ్ మధ్య అంతరాన్ని భర్తీ చేసేందుకు సిఫ్ సాధనాన్ని సెబీ గతేడాది మార్చిలో ప్రవేశపెట్టింది. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడుల పరంగా ఉన్న సౌలభ్యం వీటిల్లోనూ ఉంటుంది. పీఎంఎస్లో మాదిరి ఇన్వెస్టర్ల ఆకాంక్షలకు తగిన పెట్టుబడుల విధానాలు సిఫ్లలో ఉంటాయి. అన్లిస్డెడ్ సెక్యూరిటీలు, రియల్ ఎస్టేట్, స్ట్రక్చర్డ్ డెట్లో పెట్టుబడులు పెట్టే స్వేచ్ఛతో ఉంటాయి. కనీసం రూ.10లక్షల పెట్టుబడి పెట్టాలి. ఆధునిక ధోరణి కలిగి, అధిక రాబడి కోరుకునే దూకుడైన ఇన్వెస్టర్లకు అనుకూలం. డెరివేటివ్స్లోనూ పెట్టుబడులు పెడతాయి. లాంగ్–షార్ట్ వ్యూహాలను అమలు చేస్తుంటాయి. సమీప కాలంలో విలువ పెరుగుతుందని భావించినప్పుడు కొనుగోలు చేయడం (లాంగ్), స్టాక్స్ ధరలు ఖరీదుగా మారి సమీప కాలంలో దిద్దుబాటుకు గురవుతాయని భావించినప్పుడు డెరివేటివ్స్లో షార్ట్ చేస్తాయి (అమ్మకం). ఇందుకు ఫండమెంటల్స్తో పాటు, సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఇందులో ఓపెన్ ఎండెడ్ (ఎప్పుడైనా కొనుగోలు, విక్రయాలకు అందుబాటులో), క్లోజ్ ఎండెడ్ (నిరీ్ణత కాలం వరకు లాకిన్) ఉంటాయి. పోర్ట్ఫోలియో వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడించాలి. సంప్రదాయ ఈక్విటీ ఫండ్స్ మాదిరే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్), సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్ (ఎస్డబ్ల్యూపీ) ఆప్షన్లు ఇందులో ఉంటాయి. ఈక్విటీ, డెట్ లేదంటే ఈక్విటీ–డెట్ కలిసిన హైబ్రిడ్ విధానాల్లో ఏదో ఒకదానినే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో పెట్టుబడి విలువ ఏదేనీ కారణంతో రూ.10 లక్షల లోపునకు తగ్గిపోతే.. ఇన్వెస్టర్ ఆ మేరకు తిరిగి సమకూర్చాల్సి ఉంటుంది. ఇందుకు 30 రోజుల గడువు ఉంటుంది. అప్పటికీ సర్దుబాటు చేయలేకపోతే పెట్టుబడులను ఏఎంసీ విక్రయించి వెనక్కి ఇచ్చేస్తుంది. ఇందులో పెట్టుబడుల ఉపసంహరణ గడువు 15 రోజులు. సంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్తో పోలి్చతే సిఫ్లలో ఫండ్ మేనేజర్లు అధిక రాబడుల దృష్ట్యా అగ్రెస్సివ్ పెట్టుబడుల విధానాలను అనుసరించొచ్చు. ఈ విభాగంలో ఇటీవలే క్వాంట్ మ్యూచువల్ ఫండ్ ‘సిఫ్ ఈక్విటీ లాంగ్ షార్ట్ ఫండ్’ను ప్రారంభించింది. ఇందులో డెరివేటివ్స్కు కీలక పాత్ర ఉంటుంది. రాబడి: ఇటీవలే అందుబాటులోకి వచ్చిన సాధనం. ఒకటి రెండేళ్లు గడిస్తే కానీ వీటిపనితీరును విశ్లేషించలేం. పన్ను బాధ్యత: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మాదిరే వీటి రాబడులపైనా పన్ను అమలవుతుంది. → 2025 జూన్ చివరికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని ఆస్తుల విలువ (ఏయూఎం): రూ.33.47లక్షల కోట్లు → 2025 ఏప్రిల్ చివరికి పీఎంఎస్ల నిర్వహణలోని ఆస్తులు: రూ.32 లక్షల కోట్లు → 2025 మార్చి చివరికి ఏఐఎఫ్ల నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ :రూ.13.49 లక్షల కోట్లు – సాక్షి, బిజినెస్ డెస్క్ -
మీ పిల్లలను కోటీశ్వరులను చేయొచ్చు..
పిల్లల భవిష్యత్తు కోసం, వారి ఆర్థిక స్థిరత్వం కోసం ప్రతి తల్లిదండ్రులూ ఆలోచిస్తారు. ఇందు కోసం ఎంతో కొంత పొదుపు చేయాలని ఆరాటపడతారు. ముఖ్యంగా ఉన్నత విద్య, ప్రత్యేక శిక్షణలు, విదేశీ కోర్సులు వంటి ఖర్చులు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో, ముందుగానే వ్యూహాత్మకంగా పెట్టుబడులు పెట్టడం ఎంతో అవసరం. ఒక క్రమ పద్ధతిలో పొదుపు చేస్తే తక్కువ కాలంలోనే వారికి దాదాపు కోటి రూపాయలు కూడబెట్టవచ్చు.పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టేందుకు అనేక సాధనాలు అందుబాటులో ఉన్నాయి. మ్యూచ్వల్ ఫండ్స్, బంగారం, ప్రభుత్వ పొదుపు పథకాల వంటి వివిధ పెట్టుబడి సాధనాల సమ్మిళితంతో పిల్లల విద్య కోసం అవసరమైన కోటి రూపాయలను సులువుగానే కూడబెట్టవచ్చు. వీటిలో మ్యూచ్వల్ ఫండ్స్ సిప్లు (SIP) అధిక వృద్ధి అవకాశాలను అందిస్తే, పీపీఎఫ్ (PPF) లాంటి పథకాలు భద్రతతో పాటు పన్ను ప్రయోజనాలను కూడా కలిగిస్తాయి. బంగారం పెట్టుబడి ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనే సాధనంగా పనిచేస్తుంది.15 ఏళ్లలో రూ.కోటి కూడబెట్టే ప్రణాళికమ్యూచువల్ ఫండ్స్ – సిప్ ద్వారా- నెలవారీ పెట్టుబడి: రూ.6,000 - ప్రతి సంవత్సరం 10% పెంపు - రాబడి అంచనా: 12% - మొత్తం పెట్టుబడి: రూ.22.87 లక్షలు - అంచనా లాభం: రూ.29.22 లక్షలు - తుది మొత్తం: రూ.52.10 లక్షలు బంగారంపై..- నెలవారీ పెట్టుబడి: రూ.5,500 - రాబడి అంచనా: 10% - మొత్తం పెట్టుబడి: రూ.9.90 లక్షలు - అంచనా లాభం: రూ.13.08 లక్షలు - తుది మొత్తం: రూ.22.98 లక్షలు పీపీఎఫ్ ద్వారా- నెలవారీ పెట్టుబడి: రూ.7,500 - వడ్డీ రేటు: 7.1% - మొత్తం పెట్టుబడి: రూ.13.50 లక్షలు - వడ్డీ లాభం: రూ.10.90 లక్షలు - తుది మొత్తం: రూ.24.40 లక్షలు పై మూడు మార్గాల్లో చెప్పినట్లు ప్రతినెలా 15 ఏళ్లపాటు పొదుపు చేస్తే తల్లిదండ్రులు పిల్లల విద్య కోసం అవసరమైన కోటి రూపాయలను చేరుకోవచ్చు. ఇది కేవలం ఊహజనిత ప్రణాళిక మాత్రమే. పైన పేర్కొన్న రాబడులు అంచనా మాత్రమే. తల్లిదండ్రులు తమకు అనువైన పెట్టుబడి మార్గాలను ప్రయత్నించవచ్చు.ఘ👉 ఇదీ చదవండి: కస్టమర్లకు వింత షాకిచ్చిన ఎస్బీఐ -
కస్టమర్లకు వింత షాకిచ్చిన ఎస్బీఐ
రుణాలను చౌకగా చేయడానికి ఓవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రయత్నిస్తుంటే మరోవైపు దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మాత్రం రుణ గ్రహీతకు వింత షాకిచ్చింది. ఆర్బీఐ ఇటీవల రెపో రేటును 5.5 శాతానికి తగ్గించినప్పటికీ, ఎస్బీఐ గృహ రుణ వడ్డీ రేట్లను పెంచి ఆశ్చర్యపరిచింది. ఈ బ్యాంక్లో కొత్త రుణ గ్రహీతలకు వడ్డీ రేటు ఇప్పుడు 25 బేసిస్ పాయింట్లు పెరగనుంది.ఎస్బీఐ హోమ్ లోన్ వడ్డీ రేట్ల గరిష్ట పరిమితిని 25 బేసిస్ పాయింట్లు పెంచింది. లోయర్ ఎండ్ 7.50 శాతం వద్ద కొనసాగుతుండగా, ఎగువ బ్యాండ్ 8.45 శాతం నుంచి 8.70 శాతానికి పెరిగింది. ఈ మార్పు తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న రుణగ్రహీతలను ఎక్కువగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వారు సాధారణంగా అధిక వడ్డీ రేటు పరిధిలోకి వస్తారు.యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రస్తుతం 7.35 శాతం నుండి ప్రారంభమయ్యే వడ్డీ రేట్లతో గృహ రుణాలను అందిస్తున్నాయి. ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా ఎస్బీఐ బాటలో పయనించే అవకాశం ఉంది. ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఆర్బీఐ రెపో రేటును వరుసగా మూడుసార్లు తగ్గించింది. ఆర్బీఐ రెపో రేటును తగ్గించడం వల్ల గృహ రుణాలతో సహా రుణాలపై వడ్డీ రేట్లు తగ్గడం వల్ల పరోక్షంగా ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది.ఆర్బీఐ రెపో రేటును తగ్గించడం వల్ల గృహ రుణాలు చౌకగా లభిస్తాయని ఇదే ఎస్బీఐ గతంలో ఒక నివేదికను విడుదల చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రీసెర్చ్ సేకరించిన డేటా ప్రకారం.. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు ఇచ్చిన మొత్తం రుణాలలో 60 శాతం ఉన్న ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లెండింగ్ రేటు (ఈబీఎల్ఆర్)తో అనుసంధానించిన రుణాలలో ఈ మార్పు చాలా వెంటనే కనిపిస్తుంది.👉 ఇదీ చదవండి: ఎస్బీఐ ప్రత్యేక లోన్: తాకట్టు లేకుండా రూ.4 లక్షలు -
ఈపీఎఫ్ఓ కొత్త అప్డేట్.. ఇకపై ఆలస్యానికి చెక్
లక్షలాది మంది చందాదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పనిచేస్తోంది. ఇందులో భాగంగానే ఆధార్ను యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)తో అనుసంధానించడంలో ఉన్న ఇబ్బందులను సరళీకృతం చేస్తూ.. ప్రాసెస్ను మరింత సులభతరం చేసింది.ఆగస్టు 13, 2025 నాటి EPFO సర్క్యులర్ ప్రకారం.. UANలో సభ్యుని పేరు, లింగం, పుట్టిన తేదీ ఆధార్తో సరిగ్గా సరిపోలితే, యజమాని పోర్టల్లోని కేవైసీ ఫంక్షనాలిటీ ద్వారా నేరుగా ఆధార్ను సీడ్ చేయవచ్చు. దీనికి ఈపీఎఫ్ఓ నుంచి ప్రత్యేకంగా ఆమోదం పొందాల్సిన అవసరం లేదు. అన్నీ సరిగ్గా ఉంటే ఆలస్యానికి ఆస్కారం లేదు.UAN & ఆధార్ సీడింగ్యూనివర్సల్ అకౌంట్ నంబర్ అనేది ప్రతి సభ్యునికి ఈపీఎఫ్ఓ కేటాయించిన 12 అంకెల ఐడెంటిఫైయర్. వ్యక్తి ఉద్యోగాలు మారినప్పటికీ నెంబర్ మాత్రం అలాగే ఉంటుంది. ఆధార్ను UANకి లింక్ చేయడం వలన సభ్యులు నేరుగా సేవలను పొందగలుగుతారు. కానీ ఆధార్ డేటా.. యూఐడీఏఐ ద్వారా ధృవీకరణ పొందాల్సిన అవసరం ఉందని తప్పకుండా గమనించాలి.ఇదీ చదవండి: ఐదు ఏఐ కోర్సులు.. పూర్తిగా ఉచితంఆధార్ లింక్ ఎలా?ఉమాంగ్ యాప్ ఉపయోగించి ఆధార్ లింక్ చేయాలనుకునే వారు ఈ కింద దశలను అనుసరించి.. ఆధార్ లింక్ చేసుకోవచ్చు.➤యాప్ ఓపెన్ చేసిన తరువాత మీ యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేయలి.➤తరువాత యూఏఎన్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు వచ్చిన ఓటీపీ వెరిఫై చేయాలి. ➤ఆధార్ వివరాలను ఎంటర్ చేయాలి. ➤ఆధార్ వివరాలను ఎంటర్ చేసిన తరువాత.. ఆధార్ నెంబరుకు లింక్ అయిన మొబైల్ & ఈమెయిల్కు వచ్చిన ఓటీపీ ద్వారా వెరిఫై చేయాల్సి ఉంటుంది. ➤ఇవన్నీ పూర్తిగా తరువాత ఆధార్ UANతో లింక్ అవుతుంది. -
టర్మ్ ఇన్సూరెన్స్ దండగా?
బతికి ఉన్నప్పుడు చూడలేని డబ్బు మనకెందుకని చాలా మంది అనుకుంటారు. దాంతో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేందుకు ఆసక్తి చూపించరు. తీసుకున్నవారిలో కొందరేమో ‘ఛా.. ప్రీమియం అంతా వేస్ట్ అవుతుందే’ అని అనుకుంటూంటారు. అయితే టర్మ్ ఇన్సూరెన్స్ గురించి చాలా మందిలో ఉన్న కొన్ని అపోహలు, వాస్తవాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.అపోహ-1‘టర్మ్ ఇన్సూరెన్స్ వల్ల డబ్బు దండగ. టర్మ్ ఇన్సూరెన్స్ కడితే బతికుంటే డబ్బు రాదు.. చనిపోతే వస్తుంది. అప్పుడు ఆ డబ్బు అనుభవించలేరు. అలాంటప్పుడు నాకేంటి లాభం..’ అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. అసలు ఇన్సూరెన్స్ ఉపయోగించుకోకుండా చివరిదాకా జీవించి ఉన్నారంటే ఎంత ఆరోగ్యవంతులో, ఎంతో అదృష్టవంతులో ఆలోచించాలి. దురదృష్టవశాత్తు మీకేమైనా జరిగితే వచ్చే ఇన్సూరెన్స్ వల్ల పిల్లల చదువులు గానీ, పెళ్లిళ్లు గానీ ఆగిపోవు. ఈఎంఐలు నిలిచిపోవు. స్థూలంగా మీ కుటుంబం లైఫ్స్టైల్ అలాగే ఉంటుంది. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది లాభం కోసం కాదు.. భరోసా కోసం తీసుకోవాలి.అపోహ-2‘టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్టు. అందరికీ అర్థం కాని విషయం’ అని కొందరు భావిస్తుంటారు. ఇన్సూరెన్స్ పాలసీల్లో సింపుల్గా అర్థమయ్యే పాలసీ టర్మ్ఇన్సూరెన్స్ అని గుర్తించాలి. మీ బైక్ కోసం లేదా కారు కోసం ప్రతి సంవత్సరం ప్రీమియం కడతారు కదా. ఈ క్రమంలో ఒకవేళ మీ వాహనానికి యాక్సిడెంట్ జరిగితే డబ్బు వస్తుంది. లేదంటే ఉచితంగా రిపేర్ చేస్తారు. అలాగే టర్మ్ ఇన్సూరెన్స్లోనూ ఇదే విధానం అమలవుతుంది. మీకు ఏదైనా జరిగితే డబ్బు రావాలంటే, దాంతో కుటుంబంపై ఆర్థిక భారం పడకుండా ఉండాలంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి.అపోహ-3‘నేను ఇంకా యువకుడినే. ఆరోగ్యంగా ఉన్నాను. కాబట్టి నాకు ఇన్సూరెన్స్ అవసరం లేదు’ అని కొందరు భావిస్తారు. కొత్త కారు కొన్నప్పుడు ఇన్సూరెన్స్ లేనిదే షోరూమ్ నుంచి బయటికి ఇవ్వరు. పాత వాహనం యక్సిడెంట్ అయి షెడ్లో ఉంటే దానికి ఎవరూ ఇన్సూరెన్స్ ఇవ్వరనే విషయం గుర్తుంచుకోవాలి. మీకు ఏదైనా జబ్బు చేస్తే అప్పుడు ఇన్సూరెన్స్ ఇస్తారా.. ఇవ్వరా.. అనేది మీ మెడికల్ రిపోర్ట్ను బట్టి ఉంటుంది. అదే చిన్న వయసులో ఆరోగ్యంగా ఉన్నప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ ఈజీగా ఇస్తారు. ప్రీమియం కూడా తక్కువగా ఉంటుంది. ఇందులో ప్రీమియం అనేది ప్రతి సంవత్సరం మారదు. మీరు మొదటి సంవత్సరం ఉదాహరణకు రూ.10,000 కడితే 20 సంవత్సరాల తర్వాత కూడా అదే రూ.10,000 కట్టాల్సి ఉంటుంది. ద్రవ్యోల్బణంతో సంబంధం ఉండదు. తర్వాత మీ ఆరోగ్యం క్షీణించినా పాలసీపై ఎలాంటి ప్రభావం ఉండదు. మీ వయసు పెరిగిన తర్వాత తీసుకుంటే ప్రీమియం ఎక్కువ అవుతుంది. మెడికల్ చెకప్ కూడా అవసరం ఉండొచ్చు.అపోహ-4‘అన్ని టర్మ్ పాలసీలు ఒకేలా ఉంటాయి. చనిపోతే డబ్బులు వస్తాయి. పాలసీలు ఒకటే కంపెనీలే మారుతాయి’ అని అనుకుంటారు. ఒక్కో పాలసీకి ఒక్కో క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో(క్లెయిమ్ ఎంత త్వరగా, ఎంత మందికి చేస్తున్నారో తెలిపే సూచిక) ఉంటుంది. ఒక్కో పాలసీకి రైడర్స్, బెనిఫిట్స్, ప్రీమియం, సర్వీసెస్ అన్నీ వేరువేరుగా ఉంటాయి. అవి పాలసీని అనుసరించి మారుతాయి. అందులో మీకేది అవసరమో మంచి అడ్వైజర్ను సంప్రదించి తెలుసుకోవడం ముఖ్యం.ఇదీ చదవండి: కబ్జాసురుల పాపం పండేలా..కొన్ని చిట్కాలుఅపోహ-5‘నాకు కంపెనీ ఇచ్చిన ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. పర్సనల్గా ఇంకొకటి అవసరం లేదు’ అని చెబుతారు. చాలా కార్పొరేట్ కంపెనీలు తమ ఎంప్లాయీస్కు గ్రూప్ ఇన్సూరెన్స్ ఇస్తూ ఉంటాయి. గ్రూప్ ఇన్సూరెన్స్ అంటే గుంపులో గోవింద. ప్రత్యేకంగా మీ అవసరాలకు, బాధ్యతలకు తగ్గట్టుగా ఆ పాలసీ ఉండకపోవచ్చు. కంపెనీ పాలసీ ప్రకారం మాత్రమే వాటిని ఇష్యూ చేస్తారు. భవిష్యత్తులో కంపెనీ మారితే, ఉద్యోగం మానిస్తే ఇన్సూరెన్స్ ఉండదు. అక్కడితో ఆగిపోతుంది. అందుకే కంపెనీ ఇచ్చిన ఇన్సూరెన్స్ ఉన్నా పర్సనల్గా ఒక టర్మ్ పాలసీ తీసుకోవడం తప్పనిసరి. -
ఎస్బీఐ ప్రత్యేక లోన్: తాకట్టు లేకుండా రూ.4 లక్షలు
ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత సైన్యంలోని అగ్నివర్ల కోసం ప్రత్యేక వ్యక్తిగత రుణ పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద ఎస్బీఐలో శాలరీ అకౌంట్ ఉన్న అగ్నివీర్లు ఎటువంటి పూచీకత్తు లేదా ప్రాసెసింగ్ ఫీజు లేకుండా రూ .4 లక్షల వరకు రుణాలు పొందవచ్చని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.ఈ రుణాన్ని తిరిగి చెల్లించే కాలపరిమితి అగ్నిపథ్ పథకం కాలపరిమితి అంటే సైనికులు సర్వీసులో ఉండే కాలానికి అనుగుణంగా ఉంటుంది. దేశం కోసం సైన్యంలో సేవలు అందించి తిరిగి సాధారణ పౌర జీవితంలో వచ్చే సైనికులకు ఆర్థికంగా సహకారం అందించే లక్ష్యంతో ఎస్బీఐ ఈ ప్రత్యేక లోన్ స్కీమ్ను ప్రకటించింది. అలాగే 2025 సెప్టెంబర్ 30 వరకు రక్షణ సిబ్బంది తీసుకునే రుణాలకు 10.50 శాతం ఫ్లాట్ వడ్డీ రేటును ఎస్బీఐ అందిస్తోంది.‘మన స్వాతంత్య్రాన్ని కాపాడుతున్న వాళ్లకు తమ భవిష్యత్తును నిర్మించుకునేందుకు మా అచంచలమైన మద్దతు అవసరమని మేము నమ్ముతున్నాం. ఈ జీరో ప్రాసెసింగ్ ఫీజు కేవలం ఆరంభం మాత్రమే. రాబోయే సంవత్సరాల్లో భారతదేశ సాహస వీరులకు సాధికారత కల్పించే పరిష్కారాలను సృష్టించడం కొనసాగిస్తాం’ అని ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి పేర్కొన్నారు.ఇదే కాకుండా తమ బ్యాంక్లో శాలరీ అకౌంట్లు ఉన్న భారత సాయుధ దళాల సిబ్బందికి అనేక ప్రయోజనాలను ఎస్బీఐ కల్పిస్తోంది. జీరో బ్యాలెన్స్ ఖాతాలు, ఉచిత అంతర్జాతీయ గోల్డ్ డెబిట్ కార్డులు, దేశవ్యాప్తంగా ఎస్బీఐ ఏటీఎంలలో అపరిమిత ఉచిత ఏటీఎం లావాదేవీలు, డెబిట్ కార్డులపై వార్షిక మెయింటెనెన్స్ ఛార్జీల మాఫీ వంటి అనేక ప్రయోజనాలను ఈ ప్యాకేజీ అందిస్తున్నట్లు బ్యాంక్ తెలిపింది. వీటితోపాటు రూ.50 లక్షల కాంప్లిమెంటరీ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, రూ.కోటి ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, రూ.50 లక్షల వరకు శాశ్వత అంగవైకల్యానికి కవరేజీ లభిస్తుంది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొత్త రూల్స్.. ఛార్జీలు పెంపు
ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సేవింగ్స్, శాలరీ, ఎన్ఆర్ ఖాతాదారులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన సేవలపై ఛార్జీలను పెంచింది. ఈ మార్పులు ఆగస్టు 1, 2025 నుంచి అమల్లోకి వచ్చాయి. బ్యాంక్ తన బ్రాంచ్లలో ఫిజికల్గా అందించే సేవలకు సంబంధించి ఛార్జీలను సవరించి కొత్త రేట్లను ప్రకటించింది. ముఖ్యంగా నగదు లావాదేవీలు, సర్టిఫికెట్ సేవలు, పాత రికార్డుల ప్రతులు, ఫండ్ ట్రాన్స్ఫర్ ఛార్జీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.ఉచిత లావాదేవీల పరిమితి తగ్గింపుముందుగా నగదు లావాదేవీల ఉచిత పరిమితిలో కీలకమైన మార్పు జరిగింది. ఇంతకు ముందు నెలకు నాలుగు ఉచిత లావాదేవీలు ఉండేవి. వాటి మొత్తం పరిమితి రూ.2 లక్షలు. ఇప్పుడు అదే నాలుగు లావాదేవీలు ఉచితంగా కొనసాగుతున్నప్పటికీ మొత్తం పరిమితిని రూ.1 లక్షకు తగ్గించారు. అంటే ఖాతాదారులు నెలకు రూ.1 లక్ష వరకు మాత్రమే ఉచితంగా నగదు తీసుకోవచ్చు. ఆ పరిమితిని మించితే, ప్రతి అదనపు లావాదేవీకి రూ.150 ఛార్జీ వసూలు చేయనున్నారు.కొత్త ఛార్జీలుఅలాగే బ్యాలెన్స్ సర్టిఫికెట్, వడ్డీ సర్టిఫికెట్, అడ్రస్ కన్ఫర్మేషన్ వంటి సేవలకు కూడా ఛార్జీలు విధించారు. రెగ్యులర్ కస్టమర్లకు రూ.100, సీనియర్ సిటిజన్లకు రూ.90 చొప్పున వసూలు చేయనున్నారు. ఇదే విధంగా పాత రికార్డులు, పెయిడ్ చెక్కుల కాపీల కోసం రెగ్యులర్ ఖాతాదారులు రూ.80, సీనియర్ సిటిజన్లు రూ.72 చెల్లించాలి. ఇంతకు ముందు ఈ సేవలు ఉచితంగా అందించేవారు. కానీ ఇప్పుడు వాటికి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.ఫండ్ ట్రాన్స్ఫర్లకూ..ఫండ్ ట్రాన్స్ఫర్ సేవల విషయంలో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. ఈసీఎస్,ఏసీహెచ్ రిటర్న్ ఛార్జీలను సవరించారు. మొదటి రిటర్న్కు రూ.450 (సీనియర్ సిటిజన్కు రూ.400), రెండవ రిటర్న్కు రూ.500 (సీనియర్కు రూ.450), మూడవ రిటర్న్ నుంచి రూ.550 (సీనియర్కు రూ.500) వసూలు చేయనున్నారు. ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ వంటి డిజిటల్ ఫండ్ ట్రాన్స్ఫర్ ఛార్జీలను కూడా కొత్త రేట్లతో అమలు చేస్తున్నారు.ఉదాహరణకు, నెఫ్ట్ ద్వారా రూ.10,000 లోపు ట్రాన్సాక్షన్కు రూ.2, రూ.1 లక్ష వరకు రూ.4, రూ.2 లక్ష వరకు రూ.14, 2 లక్షల పైగా రూ.24 చొప్పున ఛార్జీలు విధించనున్నారు. ఆర్టీజీఎస్ ద్వారా రూ.2 లక్షలు–రూ.5లక్షలు మధ్య ట్రాన్సాక్షన్కు రూ.20, రూ.5లక్షలకుపైగా లావాదేవీకి రూ.45 వసూలు చేస్తారు. ఐఎంపీఎస్ ద్వారా రూ.1,000 లోపు ట్రాన్సాక్షన్కు రూ.2.50, రూ.1లక్ష లోపు అయితే రూ.5, రూ.1లక్షకు పైగా లావాదేవీకి రూ.15 చొప్పున ఛార్జీలు వర్తిస్తాయి. -
మినిమమ్ బ్యాలెన్స్: ఏ బ్యాంకులో ఎంత ఉండాలంటే?
భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకులైన హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ.. సేవింగ్స్ ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ విషయంలో చేసిన ప్రకటనలు చాలామంది ఖాతాదారులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ వేలరూపాయల్లో ఉంచాలనే బ్యాంకుల నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ కథనంలో ఏ బ్యాంకులో ఎంత మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయాలనే విషయాన్ని తెలుసుకుందాం.ఐసీఐసీఐ (ICICI) బ్యాంక్మెట్రో, అర్బన్ ప్రాంతాలు: రూ. 15,000సెమీ అర్బన్ ప్రాంతాలు: రూ. 7,500గ్రామీణ ప్రాంతాలు: రూ. 2,500హెచ్డీఎఫ్సీ (HDFC) బ్యాంక్మెట్రో, అర్బన్ ప్రాంతాలు: రూ. 10,000సెమీ అర్బన్ ప్రాంతాలు: రూ. 5,000గ్రామీణ ప్రాంతాలు: రూ. 2,500స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో ఖాతాదారులు ప్రత్యేకించి సేవింగ్స్ ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం లేదు.కోటక్ మహీంద్రా (Kotak Mahindra) బ్యాంక్:దేశంలో మూడో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయినా కోటక్ మహీంద్రా.. ఖాతాదారుల సేవింగ్స్ ఖాతా రకాన్ని బట్టి రూ. 10,000 నుంచి రూ. 20,000 మధ్య మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయాలని నిర్దేశించింది.యాక్సిస్ బ్యాంక్యాక్సిస్ బ్యాంక్ తన వినియోగదారులు సెమీ-అర్బన్ లేదా రూరల్ బ్రాంచ్లతో సహా అన్ని ప్రదేశాలకు నెలకు సగటున రూ. 10,000 బ్యాలెన్స్ లేదా 12 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలానికి కనీసం రూ. 50,000 ఫిక్స్డ్ డిపాజిట్ను కలిగి ఉండాలని ఆదేశించింది.బ్యాంక్ ఆఫ్ బరోడామెట్రో శాఖలు: రూ. 2,000సెమీ అర్బన్ శాఖలు: రూ. 1,000గ్రామీణ శాఖలు: రూ. 500పంజాబ్ నేషనల్ బ్యాంక్మెట్రో శాఖలు: రూ. 2,000అర్బన్ శాఖలు: రూ. 2,000సెమీ అర్బన్ శాఖలు: రూ. 1,000గ్రామీణ శాఖలు: రూ. 500యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియామెట్రో & అర్బన్ శాఖలు: రూ. 1,000సెమీ అర్బన్ శాఖలు: రూ. 500గ్రామీణ శాఖలు: రూ. 250కెనరా బ్యాంక్కెనరా బ్యాంక్ కూడా అన్ని రకాల సేవింగ్స్ ఖాతాలకు మినిమమ్ బ్యాలెన్స్ అవసరాన్ని మాఫీ చేసింది.ఐడీబీఐ బ్యాంక్మెట్రో & అర్బన్ శాఖలు: రూ. 10,000సెమీ అర్బన్ శాఖలు: రూ. 5,000గ్రామీణ శాఖలు: రూ. 2,500ఇండియన్ బ్యాంక్మెట్రో & అర్బన్ బ్రాంచ్ స్థానాల్లో చెక్ సౌకర్యాలు ఉన్న పొదుపు ఖాతాలకు నెలకు రూ. 2,500 కనీస ఖాతా బ్యాలెన్స్ మరియు చెక్కు సౌకర్యాలు లేని ఖాతాలకు రూ. 1,000 నిర్వహించాలి.సెమీ-అర్బన్ & గ్రామీణ శాఖల విషయంలో, బ్యాంకు తన కస్టమర్లు చెక్కు సౌకర్యాలతో రూ. 1,000, చెక్కు సౌకర్యాలు లేకుండా రూ. 500 మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయాలి.ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్ వంటి ప్రైవేట్ రంగ బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ నిబంధనలు పాటించకపోతే పెనాల్టీలు విధిస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ మొత్తం లోటులో 6% లేదా రూ.500 ఏది తక్కువైతే అది వసూలు చేస్తుంది. హెచ్డీఎప్సీ బ్యాంక్ మెట్రో ప్రాంతాల్లో రూ.600 వరకు జరిమానా విధిస్తుంది. బ్యాంకు ఖాతా, ప్రదేశాన్ని అనుసరించి యాక్సిస్ బ్యాంక్ విభిన్నంగా పెనాల్టీలు విధిస్తుంది.గమనిక: బ్యాంకులు సేవింగ్స్ ఖాతాల మినిమమ్ బ్యాలెన్స్ విషయంలో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తుంటాయి. కాబట్టి మినిమమ్ బ్యాలెన్స్ గురించి కచ్చితమైన సమాచారం తెలుసుకోవడానికి బ్రాంచ్ సందర్శించి తెలుసుకోవాలి. -
వెనక్కి తగ్గిన ఐసీఐసీఐ బ్యాంక్..
ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ మినిమమ్ బ్యాలెన్స్ పరిమితిపై వెనక్కి తగ్గింది. కొత్త పొదుపు ఖాతాలకు పెంచిన కనీస సగటు బ్యాలెన్స్ (ఎంఏబీ) ని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. పట్టణ ప్రాంతాల్లో నిర్వహించాల్సిన కనీస సగటు బ్యాలెన్స్ను రూ.50 వేల నుంచి రూ.15 వేలకు తగ్గిస్తున్నట్లు వెల్లడించింది.ఐసీఐసీఐ బ్యాంక్ ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త పొదుపు ఖాతాలకు కనీస సగటు బ్యాలెన్స్ (ఎంఏబీ) నిబంధనల్లో ఇటీవలె మార్పులు తీసుకొచ్చింది. బ్యాంక్ ఇదివరకు సవరించిన పాలసీ ప్రకారం.. మెట్రో, అర్బన్ కస్టమర్లకు ఎంఏబీ ఐదు రెట్లు పెరిగి రూ.50,000కు చేరింది. సెమీ అర్బన్ ప్రాంతాలకు రూ.25 వేలకు పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు రూ.10,000గా ఉంది. ఇది మునుపటి కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉండడం గమనార్హం. ఈ మార్పులు కొత్త ఖాతాదారులకు మాత్రమే వర్తిస్తాయని బ్యాంకు తెలిపింది. ఇప్పటికే ఉన్న ఖాతాదారులపై ఈ విధానం ప్రభావం చూపదని చెప్పింది.అయితే ఐసీఐసీఐ బ్యాంక్ ఎంఏబీని అత్యంత భారీగా పెంచడంతో ఖాతాదారులు, ఫైనాన్స్ నిపుణుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా అధిక శాతం మంది ఖాతాదారులు నెలకు రూ.25,000 కంటే తక్కువే సంపాదిస్తున్నారు. అలాంటిది బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో స్థిరంగా నగదు మెయింటెన్ చేయాలంటే వారి నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘పొదుపు ఖాతాలో రూ.50,000 ఎంఏబీ చాలామంది భారతీయులకు ఆచరణీయం కాదు. 90 శాతం మంది భారతీయులు నెలకు రూ.25,000 కంటే తక్కువ సంపాదిస్తున్నారు. ఈ మార్పు వారికి శాపంగా మారుతుంది’ అని ప్రముఖ బ్యాంకర్ జే కోటక్ తన ఎక్స్ ఖాతాలో చెప్పారు. దీనిపై ఆర్బీఐ కూడా స్పందించింది. ఎంఏబీని నిర్ణయించుకోవడం పూర్తిగా బ్యాంకుల ఇష్టమంటూ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. -
ఆ మాత్రం బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాల్సిందే!
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ కూడా ఐసీఐసీఐ బ్యాంక్ బాటలోకే వచ్చేసింది. తమ బ్యాంకులో పొదుపు ఖాతాలకు మినిమమ్ బ్యాలెన్స్ అవసరాన్ని భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. మెట్రో లేదా పట్టణ శాఖలో కొత్త పొదుపు ఖాతాను తెరిచే ఎవరైనా రూ .25,000 కనీస సగటు బ్యాలెన్స్ (ఎంఏబీ) నిర్వహించాల్సి ఉంటుంది. ఇది మునుపటి అవసరం రూ .10,000 కంటే రెట్టింపు.ఈ మార్పు ఆగస్టు 1 నుండి అమల్లోకి వస్తుందని హెచ్డీఎఫ్సీ బ్యాంకు పేర్కొంది. అయితే ఈ కొత్త ఎంఏబీ నిబంధన కొత్త ఖాతాదారులకు మాత్రమే వర్తిస్తుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ఇప్పటికే పొదుపు ఖాతా ఉన్న కస్టమర్లకు ఇప్పటివరకూ ఉన్న నిబంధనలే కొనసాగుతాయి. ఏదేమైనా ఆగస్టు నుంచి ఖాతాలు తెరిచే వారు అవసరమైన బ్యాంక్ బ్యాలెన్స్ను నిర్వహించకపోతే పెనాల్టీ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని బ్యాంక్ స్పష్టం చేసింది.కొత్త నిబంధనలుఅప్డేట్ చేసిన నిబంధనల ప్రకారం.. ఖాతాదారులు స్థిరంగా రూ .25,000 బ్యాలెన్స్ నిర్వహించాలి. సగటు నెలవారీ బ్యాలెన్స్ ఈ పరిమితి కంటే తక్కువగా ఉంటే బ్యాంకు జరిమానా విధిస్తుంది. పట్టణ, మెట్రో శాఖలకు లోటులో 6 శాతం లేదా రూ.600లో ఏది తక్కువైతే అది జరిమానాగా లెక్కిస్తారు. ఈ సవరణకు ముందు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఎంఏబీ అవసరాలు పట్టణ శాఖలకు రూ.10 వేలు, సెమీ అర్బన్ బ్రాంచ్ లకు రూ.5,000 (నెలవారీ సగటు ), గ్రామీణ శాఖలకు రూ.2,500 (త్రైమాసిక సగటు)గా ఉండేది. సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతానికి ఈ పరిమితులు మారలేదు. తాజా సవరణ ప్రత్యేకంగా మెట్రో, పట్టణ ప్రాంతాల్లోని కొత్త ఖాతాలకు వర్తిస్తుంది.ఐసీఐసీఐ బ్యాంక్ మరీ భారీగా..ఓ వైపు ఎస్బీఐ, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు సాధారణ పొదుపు ఖాతాలకు కనీస బ్యాలెన్స్ నిబంధనలను రద్దు చేస్తుంటే.. ప్రైవేటు బ్యాంకులు మాత్రం ఇప్పటికీ ఇలాంటి నిబంధనలను అమలు చేస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ మరింత దూకుడుగా మెట్రో, పట్టణ శాఖలలో కొత్త పొదుపు ఖాతాలకు ఎంఏబీని ఏకంగా రూ .50,000 కు పెంచేసింది. ఇది కూడా ఆగస్టు 1 నుంచే అమల్లోకి వస్తుంది. కాగా విమర్శలు వెల్లువెత్తడంతో ఐసీఐసీఐ బ్యాంక్ దిగివచ్చింది. కనీస సగటు బ్యాలెన్స్ (ఎంఏబీ) అవసరాన్ని రూ.15 వేలకు తగ్గించింది. మరి హెచ్డీఎఫ్సీ బ్యాంకు కూడా అదే బాటలో తన నిర్ణయం మార్చుకుంటుందో లేదో వేచి చూడాలి.👉 చదవండి: హమ్మయ్య.. ఈఎంఐలు ఇక కాస్తయినా తగ్గుతాయ్.. -
ఫారం 16: ఎన్నో ప్రశ్నలు.. అన్నింటికీ జవాబులు
ఫారం 16. దీనికి సంబంధించి ఎన్నెన్నో ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ ప్రశ్నలు.. అలాగే వాటికి జవాబులు ఇక్కడ తెలుకుందాం.ఇదివరకే చాలాసార్లు దీనికి సమాధానం రాశాం. ముందుగా ఆదాయాన్ని లెక్కించండి. అంటే .. అందులో ఏయే అంశాలున్నాయనేది చూసుకోండి. ఉదాహరణకు వేతనమా? ఇంటి మీద అద్దె? వ్యాపారమా? ఉద్యోగం చేస్తున్నారా? క్యాపిటల్ గెయిన్స్ ఉన్నాయా? ఇవన్నీ కాకుండా అదనంగా ఇంకా ఏమేమి ఆదాయాలు ఉన్నాయి, మొత్తంగా ఎన్ని ఉన్నాయో తెలుసుకొని ఒక పద్ధతి ప్రకారం క్రమంగా వ్రాయండి. ఇలా చేయడానికి మీరు కాస్త కసరత్తు చేయాలి. జీతానికి సంబంధించిన వివరాలు, అలాగే పెన్షన్ వివరాలు.. ఒక ఏడాది కాలంలో యాజమాని లేదా ఉద్యోగం మారారా? మారితే ఫారం 16 ఇచ్చారా ? అందులో ఎంత జీతం చూపించారు. ఇద్దరూ చెరొకసారి స్టాండర్డ్ డిడక్షన్ ఇచ్చారా? అలా ఇవ్వకూడదు. అలాగే ఇద్దరూ బేసిక్ లిమిట్ పరిగణలోకి తీసుకున్నారా? అలా తీసుకోకూడదు.చాలా మంది స్టాండర్డ్ డిడక్షన్ని, బేసిక్ లిమిట్ని రెండు చోట్ల తీసుకొని.. ఎక్కడా పన్ను భారం లేదు కదా అని మురిసిపోతుంటారు. తీరా రెండూ కలిపి లెక్కలు తీసి, పన్ను భారం వేసేసరికి షాక్ అవుతుంటారు. కొందరు యజమానులను, కన్సల్టెంట్లను తిట్టుకుని, ఇరుగు పొరుగుని సంప్రదించి ఎగవేతల వెంకటేశ్వరరావుని ఆదర్శంగా తీసుకుని సంతోషపడినా.. మరొక దూరపు బంధువు జాగ్రత్తల జగన్నాధం అలాంటి ‘శషభిషలు’ పనికి రావు అని శాసిస్తే.. చివరికి సరైన దారిలోకి వస్తుంటారు.అంటే రెండు చోట్లా డిడక్షన్లు క్లయిం చేస్తారు. యజమాని సహకారం, ఉదాసీనత, అరకొర జ్ఞానం, మిడిమిడి జ్ఞానం మొదలగు వాటి ముసుగులో హెచ్ఆర్ఏ విషయంలో దొంగ రశీదులు, ఎక్కువ చెల్లించినట్లు రశీదులు, చనిపోయిన మావగారింట్లో చూరుపట్టుకొని వేలాడుతూ ఇల్లరికం అల్లుడిలా చెలామణి అవుతూ, మావగారి సంతకంతో ఒక రశీదు పడేస్తారు.ఆఫీసులో కొంతమంది ప్రబుద్ధులు, భార్యభర్తలు .. అద్దె చెల్లించకుండా, తండ్రి ఇంట్లో ఉచితంగా ఉంటూ, ఇద్దరూ హెచ్ఆర్ఏ విషయంలో క్లెయిం చేసి చేతులు దులుపుకుంటున్నారు. కొందరు సొంత ఇంట్లోనే ఉంటూ, తన పేరు మీదే ఇల్లు ఉన్నా, గతంలో ఒక ఇల్లు/వాకిలి/స్థలం అమ్మేసిన సొమ్ము వస్తే, ఆ సంగతి ఆదాయపు పన్ను శాఖ వారికి చెప్పకుండా, అదృష్టం బాగుండి ఏ అప్పూ లేకుండా ఇల్లు పూర్తి చేస్తుంటారు. తన పేరు మీదే మున్సిపల్ ట్యాక్స్ చెల్లించినా కూడా హెచ్ఆర్ఏ సంగతి గుర్తుకు రాగానే, కంగుతిని, భార్యామణి చేత సంతకం పెట్టించి, ఆమెనే ఓనరుగా చూపించి హెచ్ఆర్ఏ క్లెయిం చేస్తుంటారు. అలాగే యజమాని సహకారం/ ప్రేమ/ జాలి / కరుణ గల ఉద్యోగ రత్నాలు తమకు వర్తించే అన్ని డిడక్షన్లు క్లెయిం చేస్తున్నారు. ఒక విధంగా దొంగ క్లెయిమ్లు చూపించి, వాటిని ఫారం 16లో పొందుపరిచి, వాటికి పవిత్రను ఆపాదించే ఉద్యోగ రాయుళ్లు ఉన్నారు.ఇదీ చదవండి: ఫారం 16లో జరిగిన మార్పులు.. గమనించారా?అందుకే కాబోలు...డిపార్ట్మెంట్ వారు కఠినంగా వ్యవహరించేందుకు సన్నద్ధులు అయ్యారు. ఆ యుద్ధం చేసే ముందు ఒక మంచి అవకాశం ఇస్తున్నారు. అదేమిటంటే ప్రతి డిడక్షన్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలి. ఆ కాగితాలను జతపరచకపోయినా వాటిలోని వివరాలు చాలా ఇవ్వాలి. ఇస్తే ఎటువంటి సమస్య ఉండదు. ఇవ్వకపోతే క్లెయిమ్/డిడక్షన్ ఇవ్వరు. ఫారంలో వివరాలు ఇస్తే గనుక, రిటర్నులు దాఖలు చేయాలి. ఫారం 16 అంశాలు సమీక్షించి సరైన కాగితాలు సమకూర్చుకుని, సన్నద్ధం కండి.ట్యాక్సేషన్ నిపుణులు: కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి & కె.వి.ఎన్ లావణ్య -
ఆర్థిక స్వేచ్ఛ అంతరార్థం తెలుసా?
అంతా ఆర్థిక స్వేఛ్చ గురించి మాట్లాడుతుంటారు గానీ దాని అంతరార్థం గురించి చాలా మందికి పెద్దగా అవగాహన ఉండదు. సాధారణంగా ఆర్థిక స్వేచ్ఛ అనగానే సంపద పోగేసుకుని, విశాలమైన ఇల్లు కట్టుకుని, విలాసవంతంగా విహారయాత్రలు చేస్తుండటమో, ఎర్లీగా రిటైర్ కావడమో అనుకుంటూ ఉంటారు. మన దగ్గరున్న డబ్బు గురించే తప్ప దాన్ని సంపాదించడానికి, నిలబెట్టుకోవడానికి అవసరమైన అలవాట్ల గురించి ఎక్కువగా ఆలోచించరు. కానీ, ఆర్థిక స్వేచ్ఛ అంటే మన దగ్గర ఎంత డబ్బు ఉంది, మన విలువ ఎంతఅనేది మాత్రమే కాదు.మనం కాలక్రమేణా అలవాటు చేసుకునే ఆర్థిక క్రమశిక్షణ కూడా చాలా ముఖ్యం. ఆర్థిక స్వేచ్ఛకు సరికొత్త నిర్వచనం భారీగా సంపాదించడం లేదా బాగా పొదుపు చేసుకుని దాచి పెట్టుకోవడమనేది ఆర్థిక భద్రత అనిపించవచ్చు. కానీ సంపాదన బాగా ఉన్నంత మాత్రాన మనశ్సాంతి గానీ ఆర్థిక సమస్యల నుంచి ఊరట గానీఉంటాయని గ్యారంటీ లేదు. అంతా అసూయపడేంత ఆదాయం ఉన్నవాళ్లు కూడా అప్పులతో సతమతమవుతూ నెలనెలా జీతమొస్తే గానీ గడవని పరిస్థితి ఉంటుంది. ఎంత వచ్చినా సరిపోవడం లేదనిపిస్తుంది. మరోవైపు, మరికొందరు అంతంత మాత్రం సంపాదన, ఒక మోస్తరు వనరులు ఉన్నా ఆర్థికంగా సాధికారత కలిగి ఉన్నట్లుగా కనిపిస్తారు. రెండు వర్గాల మధ్య వ్యత్యాసం క్రమశిక్షణే. పని, కుటుంబం, లైఫ్స్టయిల్ విషయాల్లో మనం సరైనవి ఎంచుకునేందుకు అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని ఇది అందిస్తుంది.సంపద పరిమితులు..బోలెడంత డబ్బుంటే ఆటోమేటిక్గా ఆర్థిక కష్టాలన్నీ తీరిపోతాయనిపిస్తుంది. అయితే, సంపదతో అవకాశాలు వచ్చినా, రిస్క్లు కూడా పెరుగుతాయి. వివేకంతో వ్యవహరించకపోతే ఎంత సంపదైనా వేగంగా కరిగిపోతుంది. కొన్ని సందర్భాల్లో ఈ ధోరణి చాలా స్పష్టంగా కనిపిస్తుంటుంది. వారసత్వంగానో లాటరీల రూపంలోనో వచ్చిపడే డబ్బు కొన్నేళ్లలోనే ఆవిరైపోతుంది. అంతకు ముందు కన్నా పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. దీనికి కారణం వనరులు లేకపోవడం కాదు. సరైన ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడమే. కాబట్టి సంపదతో స్వేచ్ఛను సాధిస్తామా లేక ఆర్థిక కష్టాలను మరింతగా పెంచుకుంటామాఅనేది మన అలవాట్లను బట్టే ఉంటుంది.ఆర్థిక క్రమశిక్షణకు మూలస్తంభాలుఆర్థికంగా దీర్ఘకాలిక సంక్షేమం అనేది రాత్రికి రాత్రి వచ్చేది కాదు. అలాగని దీనికి అసాధారణ మేథోశక్తో లేదా అదృష్టమో అవసరం లేదు. చిన్న చిన్న మంచి అలవాట్లే కాలక్రమేణా ఆర్థిక స్వేచ్ఛకు పునాదులు వేస్తాయి. అలాంటి అలవాట్లు కొన్ని చూద్దాం..బడ్జెట్ వేసుకోవడం: ఆదాయాన్ని, ఖర్చుల తీరుతెన్నులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకుంటూ ఉంటే అనవసర ఖర్చులను నివారించుకోవచ్చు. సిస్టమాటిక్గా పొదుపు: పొదుపు ఉద్దేశపూర్వకంగానే ఉండాలే తప్ప మిగిలిపోయిన డబ్బును దాచిపెట్టుకునే వ్యవహారంగా ఉండకూడదు. ఆటోమేటిక్గా పొదుపు చేసే అలవాటును అలవర్చుకోవాలి.నిలకడగా పెట్టుబడులు: మార్కెట్లు ఎలా ఉన్నా సరే నిలకడగా పెట్టుబడులను కొనసాగిస్తే కాలక్రమేణా కాంపౌండెడ్ వృద్ధితో ప్రయోజనాలను పొందడం సాధ్యపడుతుంది. లైఫ్స్టయిల్ ప్రలోభాలకు లొంగకపోవడం: ఆదాయం పెరిగే కొద్దీ, లైఫ్స్టయిల్ని కూడా అప్గ్రేడ్ చేసుకోవాలనే కోరిక బలంగా పెరుగుతుంది. కానీ, అదనపు ఆదాయాన్ని సంపద నిర్మించుకునే అసెట్స్లోకి మళ్లిస్తూ, నిర్దిష్ట జీవన ప్రమాణాలను కొనసాగిస్తేనే సిసలైన పురోగతి సాధ్యపడుతుంది. సాధనాలు, సిస్టంలతో క్రమశిక్షణకు దన్ను క్రమశిక్షణకు సంకల్పంతో పాటు నిర్దిష్ట సాధనాలు కూడా తోడైతే మరిన్ని సత్ఫలితాలను పొందవచ్చు. పెట్టుబడుల ఆటోమేషన్: సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లనేవి (సిప్) మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నా క్రమానుగతంగా నిర్దిష్ట మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తూ ముందుకెళ్లేందుకు ఉపయోగపడతాయి. లక్ష్యాల ఆధారిత ప్లానింగ్: ఇంటి కొనుగోలు, పిల్లల చదువు లేదా రిటైర్మెంట్.. ఇలా ఏదో ఒక లక్ష్యాన్ని పెట్టుకుని, దానికి తగ్గట్లుగా ఇన్వెస్ట్ చేస్తే మీ పెట్టుబడులకు ఒక దశ, దిశా ఏర్పడతాయి. నిర్మాణాత్మకమైన లక్ష్యాలు స్ఫూర్తిని కలిగించేవిగా ఉంటాయి. వివేకవంతంగా కేటాయింపులుమీ ప్రొఫైల్కి తగ్గట్లుగా రిస్క్లు, రివార్డుల మధ్య సమతూకం ఉండేలా, పెట్టుబడుల్లో వైవిధ్యాన్ని పాటించాలి. వివిధ సాధనాలకు కేటాయింపుల విషయంలో క్రమశిక్షణతో ఉంటే ఒడిదుడుకుల్లోనూ మీ దీర్ఘకాలిక వ్యూహం పట్టాలు తప్పకుండా ఉంటుంది. ఇలా ఆటోమేటిక్గా పొదుపు చేయడం, ఖర్చులను సమీక్షించుకునేందుకు రిమైండర్లను పెట్టుకోవడం లాంటి చిన్న చిన్న అలవాట్లనేవి మెరుగైన ఫలితాలను అందిస్తాయి. క్రమశిక్షణను భారంగా కాకుండా రోజువారీ జీవితంలో భాగంగా మారుస్తాయి.చివరిగా చెప్పేదేమిటంటే, బ్యాంకు అకౌంటులో మ్యాజిక్ ఫిగర్ బ్యాలెన్స్తోనో, ఒకేసారి వచ్చి పడే లాభాలతోనో ఆర్థిక స్వేచ్ఛ రాదు. ఇది క్రమశిక్షణ, వివేకవంతమైన చిన్న చిన్న నిర్ణయాలతో ముడిపడి ఉండే జీవితకాలపు ప్రక్రియ. మీ ‘స్వాతంత్య్ర దినోత్సవం’ అనేది మీ సంపాదన పరిమాణంపై ఆధారపడి ఉండదు. ఆర్థిక స్వేచ్ఛకు దోహదపడే అలవాట్లను, క్రమశిక్షణను అలవర్చుకోవడంపైనే ఆధారపడి ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. మొదటి అడుగు ముందుకు వేయండి.మైండ్సెట్లో మార్పుఇవన్నీ జరగాలంటే ముఖ్యంగా మైండ్సెట్ను మార్చుకోవాలి. సాధారణంగా రియాక్టివ్, ప్రోయాక్టివ్ అంటూ రెండు రకాల మైండ్సెట్లు ఉంటాయి. పరిస్థితిని బట్టి ప్రతిస్పందించే రియాక్టివ్ ధోరణిలో ప్రతి నెలా ఎంత మిగిలితే అంతే పొదుపు చేయడం. అత్యవసర పరిస్థితులు వస్తే అప్పటికప్పుడు హడావిడిగా ఏర్పాట్లు చేసుకోవడం, దీర్ఘకాలికంగా పనికొచ్చేవి అలవాటు చేసుకోవడం కన్నా సత్వర లాభాల వెంట పరుగులు తీయడంలాంటి తీరు ఉంటుంది. క్రియాశీలకమైన, ప్రోయాక్టివ్ మైండ్సెట్ దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ముందుగా మన అవసరాలను చూసుకోవడం, అత్యవసర పరిస్థితుల కోసం ప్లానింగ్ చేసుకోవడం, ముందుగా నిర్దేశించుకున్న ఫ్రేమ్వర్క్కి లోబడే ఖర్చులు ఉండేలా చూసుకోవడంలాంటివి ఈ ధోరణిలో ఉంటాయి. ఇది ఆర్థికంగా ఆందోళనను తగ్గిస్తుంది. స్పష్టతనిస్తుంది. పరిస్థితులను మన అదుపులో ఉంచుకునేలా నియంత్రణను ఇస్తుంది. కాలక్రమంలో నిజమైన ఆర్థిక స్వేచ్ఛ దిశగా ముందుకెళ్లే అవకాశాన్ని కల్పిస్తుంది.ఇదీ చదవండి: పిల్లల విద్య కోసం పెట్టుబడి మార్గం? -
పిల్లల విద్య కోసం పెట్టుబడి మార్గం?
నేను రూ.30 లక్షలు ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. వీటిపై మెరుగైన రాబడులకు ఉన్న మార్గం ఏంటి? – సుదీప్త్ సేన్ఏ ఇన్వెస్టర్ అయినా గరిష్ట రాబడి కోరుకోవడం సహజమే. కానీ, అధిక రాబడి ఒక్కటే ప్రామాణికం కాకూడదు. పెట్టుబడులపై మెరుగైన రాబడులను పొందేందుకు కొన్ని అంశాల పరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముందుగా సరైన పెట్టుబడి సాధనాన్ని ఎంపిక చేసుకోవాలి. కేవలం రాబడి కోణంలోనే పెట్టుబడి సాధనాన్ని ఎంపిక చేసుకుంటే అది నష్టానికి దారితీయవచ్చు. అందుకుని ప్రతీ పెట్టుబడి సాధనం ఎంపిక ముందు అందులోని సానుకూల, ప్రతికూలతలను చూడాలి. ఈక్విటీ పథకాలు స్వల్పకాలంలో అధిక రాబడులు ఇవ్వగలవు. కానీ, దీనికి గ్యారంటీ ఉండదు. మార్కెట్ ఏ సమయంలో అయినా దిద్దుబాటుకు గురికావచ్చు. అస్థిరతలు ఎక్కువగా ఉంటుంటాయి. అత్యవసర పరిస్థితుల్లో మార్కెట్లు కరెక్షన్కు లోనై ఉంటే అప్పుడు నష్టానికి అమ్ముకోవాల్సి వస్తుంది. అందుకుని స్వల్పకాలానికి ఈ తరహా రిస్క్ను అధిగమించేందుకు డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి.ఐదేళ్లు అంతకుమించిన కాలానికి ఈక్విటీలను ఎంపిక చేసుకోవాలి. అలాగే పెట్టుబడులను వివిధ రకాల మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవడం ద్వారా వైవిధ్యం ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా ఒక ఫండ్ బలహీన పనితీరు చూపించినా.. మరో ఫండ్ మంచి పనితీరుతో రాబడుల్లో స్థిరత్వం ఉంటుంది. క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసుకోవడం మరో మార్గం. ఇందుకు సిప్ను ఎంపిక చేసుకోవచ్చు. దీనివల్ల స్వల్ప కాలంలో పెట్టుబడులపై మార్కెట్ కరెక్షన్ల ప్రభావాన్ని అధిగమించొచ్చు. చివరిగా అస్సెట్ అలోకేషన్ను పాటించాలి. డెట్, ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడంతోపాటు, ఆ పెట్టుబడులను ఏడాదికోసారి సమీక్షించుకోవాలి. మీ లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యానికి అనుగుణంగా డెట్, ఈక్విటీ పెట్టుబడుల్లో, కేటాయింపుల్లో మార్పులు చేసుకోవాలి. నాకు పదేళ్లలోపు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి ఉన్నత విద్య కోసం ఏక మొత్తంలో పెట్టుబడి పెట్టాలన్నది ఆలోచన. ఇందుకు ఏ సాధనాలను ఎంచుకోవాలి? – విద్యారణ్యపిల్లల భవిష్యత్తు కోసం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనే విషయంలో చాలా మంది తల్లిదండ్రులు సందేహం ఎదుర్కొంటుంటారు. ఒకే విడత పెట్టుబడితోపాటు క్రమానుగత పెట్టుబడి (సిప్)ని సైతం ఎంపిక చేసుకోవచ్చు. ఉన్నత విద్య కోసం అనుకుంటే అందుకు, సాధారణంగా పదేళ్ల కాల వ్యవధి ఉంటుంది. అటువంటప్పుడు ఈక్విటీలు మెరుగైన సాధనమే అని చెప్పాలి. ఫ్లెక్సీక్యాప్ విభాగం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఫ్లెక్సీక్యాప్ పథకాలు పెట్టుబడుల్లో వైవిధ్యం ఉండేలా చూస్తాయి. అన్ని రంగాల పరిధిలో, భిన్న మార్కెట్ క్యాప్ కలిగిన (డైవర్సిఫైడ్) కంపెనీల్లో పెట్టుబడులు పెడుతుంటాయి. ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ ఐదేళ్ల కాలంలో సగటున 12 శాతానికి పైనే వార్షిక రాబడులు ఇచ్చాయి. ఈ రాబడి రేటు ప్రకారం ఎవరైనా రూ.లక్షను పదేళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేస్తే.. రూ.3.14 లక్షలు సమకూరుతుంది.ఇదీ చదవండి: కరెంట్ బిల్లు పరిధి దాటితే ఐటీఆర్ ఫైల్ చేయాల్సిందే!ఈక్విటీల్లో అస్థిరతలు సహజంగా ఉంటాయి. కనుక ఫ్లెక్సీక్యాప్ పథకాల్లోనూ ఈ ప్రభావం కనిపిస్తుంది. అందుకనే ఈక్విటీల్లో ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం కాకుండా, తమ దగ్గరున్న పెట్టుబడులను కొన్ని విడతలుగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల కొనుగోలు ధర సగటుగా మారి, మార్కెట్లు గరిష్టాల వద్ద ఉన్నప్పుడు రిస్క్ను తగ్గిస్తుంది. మీ దగ్గర ఉన్న మొత్తాన్ని ఒక డెట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి.. దాని నుంచి ప్రతి నెలా సిస్టమ్యాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ (ఎన్టీపీ) రూపంలో ఎంపిక చేసుకున్న ఈక్విటీ పథకాల్లోకి మళ్లించుకోవాలి. మూడేళ్ల కాలంలో దీన్ని పూర్తి చేయాలి. దీనివల్ల మార్కెట్ల ర్యాలీ, కరెక్షన్లలోనూ ఇన్వెస్ట్ చేసినట్టు అవుతుంది. -
హాలీడే ట్రిప్.. జాలీగా సాగాలంటే!
కొత్త జంట హనీమూన్ కోసమని యూరప్ దేశాలకు ప్రయాణమైంది. రెండో రోజు వారి లగేజీ బ్యాగ్ కనిపించకుండా పోయింది. అందులో విలువైన వస్తువులు, డాక్యుమెంట్లు ఉండడంతో ఆందోళన చెందిన ఆ జంట పర్యటనను కుదించుకుని వెంటనే వెనక్కి వచ్చేసింది. ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంది. కానీ, తక్కువ ప్రీమియంకు వస్తుందని చెప్పి చౌక ప్లాన్ తీసుకోవడంతో అది అక్కరకు రాలేదు. ఫలితంగా పర్యటనను ఆస్వాదించకుండానే, ఆర్థిక నష్టంతో వెనుదిరగాల్సి వచ్చింది. అన్ని విధాలుగా ఆదుకునే ట్రావెల్ ఇన్సూరెన్స్ అవసరంపై అవగాహన కల్పించే కథనమిది... నేడు విదేశీ విహార యాత్రలకు ఎక్కువ మంది ఉత్సాహం చూపిస్తున్నారు. దుబాయ్, శ్రీలంక, థాయ్లాండ్, మలేషియా, ఇండోనేషియా, సింగపూర్ తదితర పర్యాటక ప్రదేశాలను తక్కువ సమయంలోనే చూసి వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. విద్య, వ్యాపార అవకాశాల కోసం.. దూరంగా ఉన్న పిల్లలను చూసి వచ్చేందుకు ఎంతో మంది విదేశాలకు వెళ్లివస్తున్నారు. కానీ, ఈ సమయంలో తప్పకుండా ఉండాల్సిన ట్రావెల్ ఇన్సూరెన్స్ పట్ల అశ్రద్ధ కనిపిస్తోంది. బీమా అన్నది వీసా కోసం తీసుకునేది ఎంత మాత్రం కాదు. ఊహించనివి జరిగితే ఆదుకునే మొదటి సాధనమే ఇది. వైద్యపరంగా అత్యవసర పరిస్థితి ఎదురుకావొచ్చు. విమానం ఆలస్యం కావొచ్చు. పాస్పోర్ట్ కనిపించకుండా పోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ట్రావెల్ ఇన్సూరెన్స్ చేదోడుగా నిలుస్తుంది. ముఖ్యంగా కొన్ని దేశాల్లో అడుగు పెట్టాలంటే ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటేనే సాధ్యం. కనుక దీని ప్రాధాన్యాన్ని పూర్తిగా అర్థం చేసుకుని, సమగ్ర బీమా రక్షణతో పర్యటనకు ప్లాన్ చేసుకోవడం మంచిది. వైద్య రక్షణ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీల్లో ఉండే అత్యంత ముఖ్యమైన సదుపాయం మెడికల్ కవరేజీ. యూఎస్, కెనడా లేదా యూకే వంటి దేశాల్లో వైద్య చికిత్సల వ్యయాలు భారీగా ఉంటాయి. ఆయా దేశాల్లో పర్యటించే వారు అనారోగ్యంతో లేదా ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చేరాల్సి వస్తే ఇన్సూరెన్స్ కంపెనీయే చెల్లింపులు చేస్తుంది. అంతేకాదు సర్జరీ చేయాల్సి వచ్చినా లేదా వైద్య పరంగా అత్యవసరంగా ఉన్న చోట నుంచి ఆస్పత్రికి తరలించడానికి అయ్యే వ్యయాలను సైతం బీమా కంపెనీయే భరిస్తుంది. అనారోగ్యం కారణంగా విదేశాల్లోనే నిర్ణీత కాలానికి మించి ఉండాల్సిన సందర్భాల్లో అయ్యే ఖర్చులను సైతం దీని కింద పొందొచ్చు. తిరుగు ప్రయాణానికి ఆరోగ్యం సహకరిస్తుందని వైద్యులు ధ్రువీకరించేంత వరకు సాయం తీసుకోవచ్చు. కుటుంబంతో కలసి వెళుతుంటే అందరికీ కలిపి (60 ఏళ్లలోపు ఇద్దరు పెద్దలు, 21 ఏళ్లలోపు పిల్లలు) ఒకటే పాలసీ తీసుకోవచ్చు. 60 ఏళ్లు నిండిన వృద్ధుల కోసం విడిగా తీసుకోవాలి. కేవలం 2–3 రోజుల పర్యటనకు ట్రావెల్ ఇన్సూరెన్స్ వృథా అని భావించొద్దు. లగేజీ కోల్పోతే.. మీకు సంబంధించిన లగేజీని ఎవరైనా చోరీ చేసినా లేదా కనిపించకుండా పోయిన సందర్భాల్లోనూ ఈ పాలసీలో రక్షణ ఉంటుంది. ఎయిర్లైన్స్ నిర్వహణ సరిగ్గా లేని కారణంగా బ్రీఫ్ కేసులోని విలువైన వస్తులకు నష్టం వాటిల్లినట్టయితే.. క్రెడిట్/డెబిట్ కార్డు/పాస్పోర్ట్లను కోల్పోయిన సందర్భాల్లోనూ ఆర్థిక నష్టాలను భర్తీ చేస్తుంది. కోల్పోయిన వాటిని తిరిగి పొందేందుకు అయ్యే ఖర్చులను బీమా కంపెనీ నుంచి పొందొచ్చు. మనవల్ల ఇతరులకు నష్టం జరిగితే.. పర్యటన సమయంలో మన తప్పిదం లేదా మన పిల్లల కారణంగా ఎవరికైనా గాయం కావడం లేదంటే ఇతరుల ప్రాపర్టీకి నష్టం వాటిల్లడం వంటి సంఘటనల్లో చెల్లింపుల మేర బీమా కంపెనీ నుంచి పరిహారం పొందొచ్చు. పాలసీ నియమ నిబంధనలపై ఈ మొత్తం ఆధారపడి ఉంటుంది. ఇంటికి రక్షణ కొన్ని రకాల ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో ఇంటికి సైతం రక్షణ ఉంటోంది. పర్యటన సమయంలో ఇంట్లో చోరీ.. లేదంటే అగ్ని ప్రమాదం కారణంగా ఆస్తి నష్టం వాటిల్లితే ఆ మేరకు పరిహారం పొందొచ్చు. ఫ్లయిట్ రద్దయితే..విమానం అనుకున్న సమయానికి కాకుండా, షెడ్యూలింగ్ మారిపోతే లేదా వాతావరణం అనుకూలించక ఏకంగా సర్వీసు రద్దు అయితే, దీనివల్ల పర్యటన ప్రణాళిక దెబ్బతింటుంది. ఇలాంటివి చోటు చేసుకుంటే వేరొక విమాన సర్వీసులో బుక్ చేసుకునేందుకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. హోటల్ బుకింగ్లపైనా నష్టపోవాల్సి వస్తుంది. ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటే ఇలాంటి ఖర్చులను బీమా కంపెనీ భరిస్తుంది. ప్రయాణానికి చివరి ఘడియల్లో కుటుంబంలో అత్యవసర పరిస్థితి కారణంగా ట్రిప్ రద్దు చేసుకోవాల్సి రావచ్చు. అలాంటప్పుడు నష్టాన్ని ఈ పాలసీ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. విదేశీ పర్యటనలో అనారోగ్యం లేదా ఇతర కారణాల దృష్ట్యా పర్యటనను కుదించుకోవాల్సి వచ్చిన సందర్భంలోనూ బీమా కంపెనీలు కవరేజీని ఆఫర్ చేస్తున్నాయి. వీటికి మినహాయింపులు.. ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ ఏదైనా సరే, కొన్ని మినహాయింపులు ఉంటాయి. ముఖ్యంగా ముందస్తు వ్యాధుల కారణంగా పర్యటన సమయంలో వైద్య చికిత్సలు అవసరం పడితే కవరేజీ ఉండదు. కావాలని గాయం చేసుకున్నా లేదా యుద్ధం, ఉగ్రవాదం, అల్లర్ల కారణంగా ఏర్పడే నష్టానికి పరిహారం రాదు. అధిక రిస్క్ ఉండే సాహస క్రీడలకు సంబంధించి మినహాయింపులు ఉంటాయి. ప్రీమియం ఎంత ఉండొచ్చు? అంతర్జాతీయ పర్యటన 3–5 రోజుల కోసం అయితే ఒక్కొక్కరికీ రూ.200–700 మధ్య ఉంటుంది (60 ఏళ్ల లోపు వారికి). ఎంపిక చేసుకున్న ప్రాంతం, వయసు, సమ్ ఇన్సూర్డ్ (బీమా రక్షణ)పై బీమా ప్రీమియం ఆధారపడి ఉంటుంది. యూరప్ ట్రిప్ కోసం 50వేల నుంచి లక్ష డాలర్ల సమ్ ఇన్సూర్డ్ తీసుకునేట్టు అయితే.. ప్రీమియం రూ.500 వరకు ఉంటుంది. దేశీ పర్యటనలు అయితే ప్రీమియం రోజువారీ రూ.20–50 మధ్య ఉంటుంది.తీసుకునే ముందు చూడాల్సినవి.. → పాలసీ నియమ, నిబంధనలను పూర్తిగా చదివి వేటికి కవరేజీ ఉంటుంది? వేటికి ఉండదన్న విషయాలను స్పష్టంగా తెలుసుకోవాలి. కొన్ని పాలసీల్లో ఖరీదైన ఎల్రక్టానిక్స్ వస్తువులకు కవరేజీ ఉండడం లేదు. ప్రీమియం ఎక్కువైనా సరే అన్నింటికీ రక్షణనిచ్చే పాలసీని తీసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. → కొన్ని దేశాల వీసా నిబంధనలు ప్రత్యేకంగా ఉంటున్నాయి. ఉదాహరణకు యూరప్ టూరిస్ట్ వీసా కోసం కనీసం 30,000 పౌండ్ల మెడికల్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. కనుక వెళుతున్న దేశానికి సంబంధించిన నిబంధనలు తెలుసుకోవాలి. వీసా కోసం తప్పనిసరి కాకపోయినప్పటికీ.. పర్యటించే దేశాల్లో వైద్య సేవల ఖర్చులను తెలుసుకుని, అందుకు అనుగుణంగా మెరుగైన బీమా రక్షణతో పాలసీ తీసుకోవాలి. → ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్లు అన్నీ ఒకే రకమైనవి కావు. వ్యాపార పర్యటన, చదువు కోసం వెళ్లేవారు, కుటుంబంతో కలసి సెలవుల్లో విహరించేందుకు వెళ్లే వారు, సాహస క్రీడల కోసం వెళ్లేవారు తమకు అనుకూలమైన ప్లాన్లపై దృష్టి సారించాలి. → కేవలం విదేశీ పర్యటనల కోసమే అని కాదు. దేశీయంగానూ విహార యాత్రల కోసం వెళ్లేవారు సైతం ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు. → దేశీయంగా రోడ్డు లేదా ట్రెయిన్ మార్గంలో టూర్కు ప్లాన్ చేసుకున్న వారు.. అప్పటికే తమ కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ప్లాన్తోపాటు, వ్యక్తిగత ప్రమాద బీమా కలిగి ఉంటే ట్రావెల్ ఇన్సూరెన్స్ అవసరం ఉండదు. ఆస్పత్రిలో చేరాల్సి వస్తే అప్పటికే ఉన్న బీమా ప్లాన్ ద్వారా నగదు రహిత సేవలు పొందొచ్చు. బస్సు, రైలు, హోటల్ బుకింగ్లు రద్దు చేసుకున్నా, పూర్తి మొత్తం వెనక్కి వచ్చే విధంగా జాగ్రత్త పడితే సరిపోతుంది. → కేవలం 24 గంటల ప్రయాణమే అయి, హోటల్ లేదా ఫ్లయిట్ బుకింగ్లు లేకుండా వెళ్లే వారికీ ట్రావెల్ ఇన్సూరెన్స్ అవసరపడదు. → దేశీ పర్యటనలు, అవి కూడా సమీప ప్రాంతాల్లోని వాటికి ట్రావెల్ ఇన్సూరెన్స్ అంత లాభదాయం కాదు. దేశంలోనే పర్వత ప్రాంతాలు, సున్నితమైన మారుమూల పర్యాటక ప్రదేశాలు, విదేశీ పర్యటనలకు ఇది ఉపయోకరంగా ఉంటుంది. → ప్రీమియం తక్కువే ఉంటుంది. కనుక, అనవసర ఖర్చు కింద చూడడం సరికాదు. → హెల్త్ లేదా వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ లేని వారు మాత్రం దగ్గర, దూర పర్యటనంతో సంబంధం లేకుండా ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి.ఈ తప్పులు చేయొద్దు.. → కొన్ని దేశాల వీసా ప్రాసెసింగ్కు బీమా తప్పనిసరి అని చెప్పి, చౌక పాలసీ తీసుకోవద్దు. అత్యవసర పరిస్థితుల్లో ఆదుకోనప్పుడు పాలసీ ఉన్నా నిష్ప్రయోజనమే. → పర్యటనలో ఏ ఇబ్బందీ రాదులే లేదా కొన్ని రోజులే కదా అని భావించి బీమాను పక్కన పెట్టొద్దు. → పాలసీ తీసుకునే నాటికి ఉన్న ఆరోగ్య సమస్యలను తప్పకుండా వెల్లడించాలి. → రూ.100–200 ఆదా కోసం తక్కువ కవరేజీకి పరిమితం కావొద్దు. → కొన్ని క్రెడిట్ కార్డులు ఆఫర్ చేసే ట్రావెల్ ఇన్సూరెన్స్పై ఆధారపడొద్దు. వాటి కవరేజీ ఎన్నో షరతులు, పరిమితులతో ఉంటుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ట్రంప్ గ్రేట్ అంటున్న ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ కియోసాకి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రేట్ అంటున్నారు ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత, వ్యాపారవేత్త రాబర్ట్ కియోసాకి. క్రిప్టోకరెన్సీలో పెన్షన్ పొదుపు చేసే అవకాశాన్ని కల్పించినందుకు ప్రశంసించారు. అమెరికన్లలో అత్యంత ప్రాచుర్యం పొందిన 401(కె) రిటైర్మెంట్ ప్లాన్ల బ్యాలెన్స్లలో ఉన్న నిధులను డిజిటల్ ఆస్తులలో పెట్టుబడి పెట్టడానికి అనుమతించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ట్రంప్ ఇటీవల సంతకం చేశారు.నేడు ఈ పొదుపు మొత్తం 12,5 ట్రిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు.కాబట్టి వర్చువల్ కరెన్సీ మార్కెట్లోకి బిలియన్ డాలర్లు ప్రవహించవచ్చు. అయితే, డిజిటల్ ఆస్తుల యజమానులు ఇప్పుడే సంతోషించడం తొందరపాటు అవుతుంది. రిస్క్ లను తగ్గించడానికి, యూఎస్ నివాసితుల ప్రయోజనాలను రక్షించడానికి పెన్షన్ పొదుపును ఖర్చు చేయడానికి ఫెడరల్ ప్రభుత్వం కొన్ని నిబంధనలను రూపొందించిన తరువాత మాత్రమే ఈ చట్టం ఆచరణలోకి వస్తుంది.క్రిప్టోకరెన్సీల్లోనే కాకుండా రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి ఇతర ప్రత్యామ్నాయ ఆస్తుల్లో కూడా పొదుపు చేసే హక్కును రెగ్యులేటరీ చట్టం కల్పించడం గమనార్హం. అందువల్ల వర్చువల్ కరెన్సీల్లో ఎంత డబ్బు ఇన్వెస్ట్ చేస్తారో తెలియదు.డోనాల్డ్ ట్రంప్కు తన ఆమోదాన్ని తెలియజేస్తూ రాబర్ట్ కియోసాకి ‘ఎక్స్’(ట్విటర్)లో ఇలా పోస్ట్ చేశారు.. ‘బిట్ కాయిన్ కొనుగోలుకు ప్రజలు తమ రిటైర్మెంట్ పొదుపును ఖర్చు చేయడానికి ట్రంప్ అనుమతించడం గొప్ప వార్త. గొప్ప అధ్యక్షుడు, గొప్ప నాయకుడు. మీరు బిట్ కాయిన్ సేవ్ చేస్తున్నారా?’ అంటూ రాసుకొచ్చారు. TRUMP allowing retirement accounts to save Bitcoin is big news. Great President…great leader.Are you saving Bitcoin?— Robert Kiyosaki (@theRealKiyosaki) August 7, 2025 -
ఇల్లు అమ్ముతున్నారా? ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయొద్దు
ఆర్థిక ఇబ్బందులతోనో లేక ఇతర కారణాల వల్లో చాలా మంది తమ ఇల్లు అమ్ముతుంటారు. ఇలా ఇంటిని అమ్మగా వచ్చిన ఆదాయంపై క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వర్తిస్తుంది. అయితే కొంత మంది చేస్తున్న పొరపాట్ల వల్ల అనవసరంగా అధిక పన్ను చెల్లించాల్సి వస్తోంది.చాలా మంది తమ ఇళ్లను విక్రయించేటప్పుడు చేసే కొన్ని ఖరీదైన తప్పులను ట్యాక్స్బడ్డీ డాట్ కామ్ (TaxBuddy.com) వ్యవస్థాపకుడు సుజిత్ బంగర్ ఎత్తి చూపారు. అవి గణనీయంగా అధిక పన్ను చెల్లింపులకు దారితీస్తాయి. ఇలాగే ఒక క్లయింట్ పన్ను మినహాయింపులను విస్మరించడంతో దాదాపు రూ .1.87 లక్షలు అదనంగా చెల్లించాల్సి వచ్చేదన్న విషయాన్ని ఇటీవల లింక్డ్ఇన్ పోస్ట్లో బంగర్ పంచుకున్నారు.‘మా క్లయింట్ (రామ్) తన ఇంటి అమ్మకంపై రూ .1,87,500 అదనంగా పన్ను చెల్లించాల్సి వచ్చేది. మేము చట్టబద్ధంగా అనుమతించిన అన్ని ఖర్చులను జోడించాం. అతని పన్ను భారాన్ని విజయవంతంగా తగ్గించాం’ అని బంగర్ పేర్కొన్నారు.మూలధన లాభాలను లెక్కించేటప్పుడు, పన్ను చెల్లింపుదారులు తరచుగా కొనుగోలు లేదా మెరుగుదల వ్యయంలో భాగంగా అర్హతను తక్కువగా అంచనా వేస్తారని ఆయన చెప్పారు. చాలా మంది దీనిని కేవలం కొనుగోలు ధరకు పరిమితం చేస్తారు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 55 కింద అనుమతించిన చట్టబద్ధమైన మినహాయింపులను కోల్పోతారు.చట్టబద్ధంగా ఏ ఖర్చులను క్లెయిమ్ చేయవచ్చు?🔸స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు🔸బ్రోకరేజీ లేదా కమిషన్🔸మూలధన మెరుగుదల ఖర్చులు🔸లీగల్, డాక్యుమెంటేషన్ ఛార్జీలు🔸సొసైటీ బదిలీ ఫీజులు🔸గృహ రుణ వడ్డీ (సెక్షన్ 24(బి) కింద ఇప్పటికే క్లెయిమ్ చేయనట్లయితే)🔸వీటన్నింటికీ సరైన డాక్యుమెంటేషన్ ఉండాలిఆ క్లయింట్ చేసిన తప్పు ఇదే..బంగర్ పేర్కొన్న క్లయింట్ చేసిన పొరపాటు ఏంటంటే.. ఇల్లు మొత్తం అమ్మకం ధర రూ .1.2 కోట్లు కాగా వాస్తవ కొనుగోలు ధర రూ .80 లక్షలను మాత్రమే నివేదించాడు. అతను విస్మరించిన ఖర్చులు ఇవే..🔸బ్రోకరేజీలో రూ.80,000🔸రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీలో రూ.4,70,000🔸ప్రధాన రిపేర్ ఖర్చులు రూ.6,00,000🔸లీగల్ ఛార్జీలు రూ.50 వేలు🔸హోమ్ లోన్ వడ్డీ రూ.3,00,000"సరైన డాక్యుమెంటేషన్ ఈ ఖర్చులను గుర్తించడానికి, అతని పన్ను పరిధిలోకి వచ్చే లాభాలను గణనీయంగా తగ్గించడానికి మాకు సహాయపడింది" అని బంగర్ పేర్కొన్నారు.👉 చదవండి: ‘ఇదే మా ఇల్లు’.. ప్రపంచంలోనే ఖరీదైన పెద్ద ప్యాలెస్ -
భయంతోనే బంగారం కొంటున్నారా?
పెట్టుబడుల ప్రపంచంలో వారెన్ బఫెట్ అగ్రస్థానంలో ఉన్నారు. అధిక రాబడులనిచ్చే స్టాక్స్ ఎంచుకునే చాతుర్యానికి పేరుగాంచిన బఫెట్ స్టాక్ మార్కెట్లో తిరుగులేని రారాజు. మరి ఆయన సంపద ఎంతనుకుంటున్నారు..? 140 బిలియన్ డాలర్లు. అంటే దాదాపు రూ.12 లక్షల కోట్లు. ఇంత భారీ సంపద ఉన్నా ఆయన దగ్గర రవ్వంత బంగారం కూడా లేదంటే నమ్ముతారా?బంగారంపై ఇన్వెస్ట్ చేసే విషయానికి వస్తే వారెన్ బఫెట్ చాలా క్లియర్ గా ఉంటాడు. ఆయనకు బంగారంపై ఎటువంటి పెట్టుబడులు లేవు. బంగారం వంటి ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టకూడదనేది వారెన్ బఫెట్ గోల్డెన్ రూల్. తన వాల్యూ ఇన్వెస్ట్ మెంట్ స్ట్రాటజీకి బంగారం సరిపోదని కొన్నేళ్లుగా ఆయన చెబుతూ వస్తున్నారు. బఫెట్కు ఏకైక బంగారు పెట్టుబడి బారిక్ గోల్డ్ అనే గోల్డ్ మైనింగ్ కంపెనీలో ఉండేది. అది కూడా ఆయన అంతర్గత మనీ మేనేజర్లలో ఎవరైనా స్వతంత్రంగా పెట్టి ఉండవచ్చు. దాన్ని తర్వాత ఆరు నెలలోనే బఫెట్ విరిమించుకున్నారు.బఫెట్ దగ్గర బంగారం ఎందుకు లేదంటే..?బఫెట్ బంగారాన్ని ఉత్పాదకత లేని ఆస్తిగా భావిస్తారు. ‘బంగారంలో రెండు ముఖ్యమైన లోపాలు ఉన్నాయి. అది పెద్దగా ఉపయోగం లేనిది అలాగే ఉత్పాదకత లేనిది’ అని 2011లో వారెన్ తన షేర్ హోల్డర్లతో అన్నారు. బంగారానికి కొంత పారిశ్రామిక ఉపయోగం, ఆభరణాలుగా పనికొస్తుంది కానీ అంతకు మించి ఇంకేం లేదు. ఇది తప్పుడు పెట్టుబడి అనేది ఆయన అభిప్రాయం.2011లో బఫెట్ ఈ వైఖరి తీసుకున్నప్పుడు 1,750 డాలర్లుగా ఉన్న ఔన్స్ బంగారం ప్రస్తుతం 3,350 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అంటే పద్నాలుగేళ్లలో బంగారం ధర రెట్టింపు అయింది. దీన్ని బట్టి బఫెట్ అభిప్రాయం తప్పని చాలా మందికి అనిపిస్తుంది. కానీ కాంపౌండ్ యాన్యువలైజ్డ్ గ్రోత్ రేట్ (సీఏజీఆర్) పరంగా చూస్తే ఇది కేవలం 5 శాతం మాత్రమే. ఇదే సమయంలో యూఎస్ స్టాక్స్ 14 శాతానికి పైగా సీఏజీఆర్ పెరిగాయి. కాబట్టి బంగారం విషయంలో బఫెట్ అభిప్రాయం కరెక్టే..బంగారం ధర పెరగడానికి భయమే కారణంపెట్టుబడిదారులకు వారెన్ బఫెట్ చెప్పే ప్రసిద్ధమైన మాట ఏమిటంటే ‘ఇతరులు అత్యాశతో ఉన్నప్పుడు భయపడాలి.. ఇతరులు భయంతో ఉన్నప్పుడు ఆశ పడాలి’. బంగారం విషయంలో ఇదే వర్తిస్తుందంటాయన. బంగారం ధర పెరగడానికి భయమే కారణమనేది ఆయన అభిప్రాయం. -
ఉమాంగ్ యాప్లో యూఏఎన్.. ఈపీఎఫ్ఓ కొత్త రూల్
ఉమాంగ్ యాప్లో (UMANG App) యూఏఎన్ (UAN) యాక్టివేషన్కు సంబంధించి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO ఈపీఎఫ్ఓ) కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా యూఏఎన్ పొందడానికి, యాక్టివేట్ చేసుకునేందుకు ఫేస్ ఆథెంటికేషన్ టెక్నాలజీ (ఎఫ్ఏటీ)ని తప్పనిసరి చేసింది. ఈ కొత్త ప్రక్రియ ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చింది.యూఏఎన్ అంటే యూనివర్సల్ అకౌంట్ నంబర్. ఈపీఎఫ్ఓ సభ్యులు అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు, వివరాలను అప్డేట్ చేసేందుకు, ఈపీఎఫ్ నిధులను ఉపసంహరించుకునేందుకు, ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ (ఈఎల్ఐ) వంటి పథకాల కింద ప్రయోజనాలు పొందడానికి యూఏఎన్ అవసరం. యూఏఎన్ యాక్టివేట్ చేయకుండా సభ్యులు ఈ ఆన్లైన్ సేవలను పొందలేరు.ఉమాంగ్ యాప్ గురించి..యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్ (ఉమాంగ్) అనేది ఒక ప్రభుత్వ యాప్. ఇది ఒకే ప్లాట్ఫామ్పై అనేక ఈ-గవర్నెన్స్ సేవలను అందిస్తుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై), నేషనల్ ఈ-గవర్నెన్స్ డివిజన్ (ఎన్ఈజీడీ) అభివృద్ధి చేసిన ఈ యాప్ ద్వారా పౌరులు కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వ సంస్థల సేవలను వినియోగించుకోవచ్చు.ఉమాంగ్ యాప్ ద్వారా ఈపీఎఫ్ఓ సభ్యులు ఇప్పుడు వారి యూఏఎన్ను జనరేట్ లేదా యాక్టివేట్ చేసుకోవచ్చు. బయోమెట్రిక్ రికార్డులను అప్డేట్ చేయవచ్చు. ఈపీఎఫ్ఓ కార్యాలయానికి వెళ్లకుండానే తమ స్మార్ట్ఫోన్ల నుండి నేరుగా వారి ఈ-యూఏఎన్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతర్జాతీయ కార్మికులు, నేపాల్, భూటాన్ పౌరులకు తప్ప మిగతా ఉద్యోగులందరికీ ఆగస్టు 1 నుంచి ఉమాంగ్ యాప్ ద్వారా యూఏఎన్ జనరేషన్ లేదా యాక్టివేషన్కు ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ను ఈపీఎఫ్వో తప్పనిసరి చేసింది. -
బ్యాంకులకు 15 రోజులే టైమ్.. సెటిల్ చేయాల్సిందే!
మరణించినవారి బ్యాంకు ఖాతాలు, సేఫ్ లాకర్ల క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియను సులభతరం చేసే ప్రతిపాదనలతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా ముసాయిదా సర్క్యులర్ జారీ చేసింది. ప్రతిపాదిత మార్గదర్శకాలు డిపాజిట్ ఖాతాలు, సేఫ్ లాకర్లు నిర్వహించే అన్ని వాణిజ్య, సహకార బ్యాంకులకు వర్తిస్తాయి. ముసాయిదా సర్క్యులర్ పై ఆగస్టు 27లోగా అభిప్రాయాలు తెలపాలని సెంట్రల్ బ్యాంక్ కోరింది. వీలునామా, కోర్టు ఉత్తర్వులు లేదా వివాదం లేకపోతే వారసత్వ ధృవీకరణ పత్రాలు లేదా ప్రొబేట్ వంటి చట్టపరమైన పత్రాలపై పట్టుబట్టకుండా నామినీలు లేదా జీవించి ఉన్న ఖాతాదారులకు బ్యాంకులు నిధులను విడుదల చేయాలని సర్క్యులర్లో పేర్కొంది. క్లెయిమ్దారులు నామినీ క్లెయిమ్ ఫారం, మరణ ధృవీకరణ పత్రం, చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాన్ని సమర్పిస్తే చాలు.ఆలస్యమైతే పరిహారంఏదైనా డిపాజిట్ సంబంధిత క్లెయిమ్ గడువులోగా పరిష్కరించబడకపోతే, అటువంటి ఆలస్యానికి గల కారణాలను బ్యాంకు హక్కుదారులకు తెలియజేయాలి. “… ఆలస్యమైతే, ఆ ఆలస్య కాలానికి సెటిల్మెంట్ మొత్తంపై ప్రస్తుత బ్యాంకు రేటు సంవత్సరానికి 4% కంటే తక్కువ కాకుండా వడ్డీ రూపంలో క్లెయిమ్దారులకు బ్యాంకు పరిహారం చెల్లిస్తుంది" అని సర్క్యులర్లో పేర్కొన్నారు.ఇక సేఫ్ డిపాజిట్ లాకర్ లేదా సేఫ్ కస్టడీలో ఉన్న వస్తువులకు సంబంధించి క్లెయిమ్లను ప్రాసెస్ చేయడంలో జాప్యం జరిగితే, ఆలస్యం జరిగిన ప్రతి రోజుకు బ్యాంకు రూ .5,000 చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.నాన్-నామినీ, జాయింట్ అకౌంట్ క్లెయిమ్ల సెటిల్మెంట్మరణించిన డిపాజిటర్ నామినీని పేర్కొనకపోయి ఉన్నప్పుడు లేదా జాయింట్ అకౌంట్ల విషయంలో నామినీ లేదా సర్వైవర్ క్లాజ్ లేని సందర్భాల్లో క్లెయిమ్ల పరిష్కారానికి బ్యాంకులు సరళీకృత విధానాన్ని అవలంబించాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. ఇటువంటి క్లెయిమ్ల సెటిల్మెంట్ కోసం ఒక బ్యాంకు దాని రిస్క్ మేనేజ్మెంట్ వ్యవస్థల ఆధారంగా రూ .15 లక్షల పరిమితిని నిర్ణయించాలి.బ్యాంకులు పూర్తి డాక్యుమెంట్లు అందిన 15 రోజుల్లోగా క్లెయిమ్లను సెటిల్ చేయాల్సి ఉంటుంది. సేఫ్ డిపాజిట్ లాకర్/వస్తువులు సేఫ్ కస్టడీలో ఉన్నట్లయితే, అవసరమైన అన్ని పత్రాలను అందుకున్న 15 రోజుల్లోగా, బ్యాంకు క్లెయిమ్ ప్రాసెస్ చేయాలి. -
హమ్మయ్య.. ఈఎంఐలు ఇక కాస్తయినా తగ్గుతాయ్..
లక్షలాది లోన్ కస్టమర్లకు ఊరట కల్పిస్తూ.. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంపీఎల్ఆర్) ను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 7 నుండి అమల్లోకి వచ్చిన ఈ తగ్గింపు గృహ రుణాలు, కారు లోన్లు, వ్యక్తిగత రుణాలపై ఈఎంఐలను తగ్గిస్తుంది.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రెండేళ్ల కాలపరిమితి మినహా మిగతా అన్ని కాలపరిమితులలో ఎంసీఎల్ఆర్ను 0.05 శాతం తగ్గించింది. ఓవర్నైట్, ఒక నెల ఎంసీఎల్ఆర్ 8.60 శాతం నుంచి 8.55 శాతానికి, మూడు నెలల ఎంసీఎల్ఆర్ 8.65 శాతం నుంచి 8.60 శాతానికి తగ్గింది. ఇక ఆరు నెలలు, ఏడాది కాలపరిమితి ఎంసీఎల్ఆర్ను 5 బేసిస్ పాయింట్లు తగ్గించి 8.70 శాతానికి తగ్గించింది. మూడేళ్ల ఎంసీఎల్ఆర్ 8.80 శాతం నుంచి 8.75 శాతానికి తగ్గింది.సవరించిన ఎంసీఎల్ఆర్ రేట్లు ఇవే..కాలపరిమితికొత్త ఎంసీఎల్ఆర్పాత ఎంసీఎల్ఆర్ఓవర్నైట్8.55%8.60%1 నెల8.55%8.60%3 నెలలు8.60%8.65%6 నెలలు8.70%8.75%1 సంవత్సరం8.70%8.75%2 సంవత్సరాలు8.75%8.75%3 సంవత్సరాలు8.75%8.80%(మూలం: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వెబ్సైట్)ఈఎంఐలు ఎలా ప్రభావితం అవుతాయంటే..ముఖ్యంగా ఫ్లోటింగ్ వడ్డీ రేట్లను ఎంచుకున్న రుణగ్రహీతలకు ఎంసీఎల్ఆర్ రేట్ల ద్వారా రుణ ఈఎంఐలు నేరుగా ప్రభావితమవుతాయి. ఎంసీఎల్ఆర్ తగ్గడం అంటే సాధారణంగా రుణాలపై వడ్డీ రేట్లు తగ్గినట్లే. ఇది ఈఎంఐలు తగ్గడానికి దారితీస్తుంది. తాజా మార్పుతో, ప్రస్తుత రుణగ్రహీతలు వారి రుణాల రీసెట్ కాలాన్ని బట్టి వారి నెలవారీ ఈఎంఐలలో స్వల్ప క్షీణతను చూడవచ్చు.👉 చదవండి: చనిపోయినవారి బ్యాంకు అకౌంట్లపై కీలక నిర్ణయం -
‘జీవితం’పై జాగ్రత్త మనవాళ్లకే ఎక్కువండోయ్..
జీవిత బీమాపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. కుటుంబ ఆర్థిక రక్షణకు ప్రాధాన్యత అధికమవుతోంది. ఈ విషయంలో దేశంలోని ఇతర ప్రాంతాల కంటే దక్షిణాది ప్రాంతం ఎంతో ముందుంది. జీవిత బీమా యాజమాన్యం, ఆర్థిక రక్షణలో దక్షిణ భారతదేశం జాతీయ స్థాయిలో ముందంజలో ఉందని ఇటీవలి ఇండియా ప్రొటెక్షన్ కోషియెంట్ (ఐపీక్యూ) 7.0 నివేదిక వెల్లడించింది. పట్టణ కేంద్రాల్లో నిర్వహించిన ఈ అధ్యయనంలో దక్షిణ భారత ప్రాంతాలలో జీవిత బీమా 84 శాతం చొచ్చుకుపోయినట్లు వెల్లడైంది. ఇది దేశంలోనే అత్యధికం.ఫైనాన్షియల్ ప్రొటెక్షన్లో రీజనల్ లీడర్ షిప్చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలు కీలక సూచీల్లో జాతీయ బెంచ్ మార్క్ లను అధిగమించాయి. యాజమాన్యంలో చెన్నై అగ్రస్థానంలో, ఆర్థిక భద్రతలో హైదరాబాద్ అగ్రస్థానంలో, అవగాహనలో బెంగళూరు అగ్రస్థానంలో నిలిచాయి. నేను లేకపోతే నా కుటుంబం ఏమౌతుందో.. అన్న ఆందోళనతో ఆర్థిక ప్రణాళికకు చాలామంది సిద్ధమవుతున్నారు.ఈ నివేదిక టర్మ్ ఇన్సూరెన్స్కు పెరుగుతున్న ప్రాధాన్యతను హైలైట్ చేస్తోంది. ఇందులో పాల్గొన్నవారిలో 77% మంది కుటుంబ రక్షణ కోసం ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రదాయ పొదుపు-ఆధారిత పాలసీల నుండి స్వచ్ఛమైన రిస్క్ కవరేజీకి మారడాన్ని ఇది సూచిస్తుంది.మహిళలకు మరీ ఎక్కువజీవిత బీమా, ఆర్థిక రక్షణపై జాగ్రత్త మహిళల్లోనే మరీ ఎక్కువ కనిపిస్తోంది. గుర్తించదగిన ధోరణిలో 86% మంది దక్షిణ భారత మహిళలు జీవిత బీమాను కలిగి ఉన్నట్లు ఈ నివేదికలో వెల్లడైంది. ఇది పురుషల సగటు (83%), జాతీయ మహిళా సగటు (75%) రెండింటినీ అధిగమించింది. ఆర్థిక పరిజ్ఞానం, భద్రతలో కూడా మహిళలు ఎక్కువ మార్కులు సాధించారు, ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో లింగ అంతరాన్ని తగ్గించారు.యువతలోనూ..టర్మ్ ప్లాన్లు, యులిప్లు, పొదుపు ఆధారిత పాలసీలతో సహా వివిధ బీమా ఉత్పత్తులను అవలంబించడంలో యువత ముందంజలో ఉంది. దీంతోపాటు పిల్లల విద్య, వివాహం, సొంతిల్లు వంటి మైలురాళ్ల కోసం చాలా మంది పెట్టుబడులు పెడుతున్నట్లు కూడా నివేదిక పేర్కొంది.సవాళ్లూ ఉన్నాయ్..అధిక మొత్తంలో బీమా యాజమాన్యం ఉన్నప్పటికీ సవాళ్లూ ఉన్నాయి. ప్రతి ముగ్గురు పట్టణ ప్రాంత దక్షిణ భారతీయులలో ఒకరు టర్మ్ ఇన్సూరెన్స్ను ఎప్పుడూ పరిగణనలోకి కూడా తీసుకోలేదు. ఇందుకు ఆర్థిక స్థోమత, అత్యవసరత లేకపోవడం వంటివి అవరోధాలుగా ఉన్నాయి. ముఖ్యంగా యువత, తక్కువ-ఆదాయ సమూహాలలో ఇది ఎక్కువగా ఉంది. -
కరెంట్ బిల్లు పరిధి దాటితే ఐటీఆర్ ఫైల్ చేయాల్సిందే!
‘నేను ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. కాబట్టి నేను ఎందుకు రిటర్నులు వేయాలి?’ చాలా మంది ఇలానే భావిస్తుంటారు. ఆదాయపన్ను చట్టం 1961 ప్రకారం.. స్థూల ఆదాయంపై ఉన్న పరిమితులు దాటితే తప్పకుండా రిటర్నులు వేయాల్సిందే. చట్టంలో కల్పించిన రాయితీలు, మినహాయింపుల ప్రకారం ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేకపోయినా సరే.. రిటర్నులు సమర్పించడం ద్వారానే వాటిని క్లెయిమ్ చేసుకుని, పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. రిటర్నులు దాఖలు చేయకపోతే మినహాయింపులను క్లెయిమ్ చేసుకునే హక్కును కోల్పోతారు. సెప్టెంబర్ 15 ఐటీఆర్ దాఖలుకు చివరి తేదని గుర్తుంచుకోవాలి.పరిమితులుఒక వ్యక్తి వార్షిక ఆదాయం బేసిక్ ఎగ్జెంప్షన్ (ప్రాథమిక మినహాయింపు) పరిమితి దాటితే రిటర్నులు (ఐటీఆర్) తప్పనిసరిగా దాఖలు చేయాలని చట్టం నిర్దేశిస్తోంది.పాత పన్ను విధానంలో 60 ఏళ్లు దాటని వారికి రూ.2,50,000 ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితిగా ఉంది. 60–80 ఏళ్ల మధ్యవయసు వారికి రూ.3,00,000, 80 ఏళ్లు నిండిన వారికి రూ.5,00,000 పరిమితి అమల్లో ఉంది.కొత్త విధానం కింద అన్ని వయసుల వారికి ఈ పరిమితి రూ.3,00,000గా ఉంది. ఆదాయం ఈ పరిమితుల్లోనే ఉన్నా కానీ కొన్ని సందర్భాల్లో పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది.ఎవరు ఫైల్ చేయాలంటే..👉ఉదాహరణకు కుమార్ వార్షిక ఆదాయం రూ.2.4 లక్షలు. పింఛను, బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ రూపంలో ఈ మొత్తం సమకూరింది. కానీ, వడ్డీ ఆదాయంపై 10 శాతం టీడీఎస్ కింద బ్యాంక్ మినహాయించింది. ఈ కేసులో ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. కానీ, బ్యాంక్ నుంచి ఆదాయపన్ను శాఖకు వెళ్లిన టీడీఎస్ మొత్తాన్ని తిరిగి పొందాలంటే (రిఫండ్) రిటర్నులను నిర్ణీత గడువులోపు సమర్పించడం ద్వారానే సాధ్యపడుతుంది. 👉ఎవరైనా ఒక ఆర్థిక సంవత్సరం పరిధిలో తమ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో రూ.50 లక్షలకు మించి డిపాజిట్ చేస్తే తప్పకుండా ఐటీఆర్ దాఖలు చేయాలి.👉ఒకటి లేదా ఒకటికి మించిన కరెంట్ ఖాతాలలో కలిపి (వాణిజ్య, కోపరేటివ్ బ్యాంకుల) రూ.కోటి, అంతకు మించి డిపాజిట్ చేస్తే రిటర్నులు సమర్పించాలి. వ్యక్తులకే గానీ వ్యాపార సంస్థలకు ఈ నిబంధన వర్తించదు.👉ఏడాదిలో అమ్మకాల ఆదాయం రూ.60 లక్షలు మించితే వ్యాపార సంస్థలు రిటర్నులు వేయాలి. 👉ఒక విద్యుత్ బిల్లు రూ.లక్ష మించినా లేదా ఒక ఆర్థిక సంవత్సరం మొత్తం మీద విద్యుత్ బిల్లు రూ.లక్షకు మించిన సందర్భంలోనూ పన్ను రిటర్నులు సమర్పించాల్సి ఉంటుంది.👉వివిధ రూపాల్లో టీడీఎస్ ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.25,000, అంతకు మించి ఉంటే అప్పుడు కూడా రిటర్నులు వేయాల్సిందే. 60 ఏళ్లు నిండిన వారికి ఈ పరిమితి రూ.50,000గా ఉంది. 👉విదేశీ ఆస్తుల సమాచారాన్ని ఐటీఆర్లోని షెడ్యూల్ ఎఫ్ఏ కింద తప్పకుండా వెల్లడించాలి. విదేశీ ఖాతాకు సంతకం చేసే అధికారం కలిగి ఉన్న వారు సైతం రిటర్నులు వేయాల్సిందే. భార్యా, భర్తలు సంయుక్తంగా విదేశాల్లో ఆస్తికి యజమానులుగా ఉంటే అప్పుడు ఇద్దరూ విడిగా రిటర్నులు దాఖలు చేసి, ఆస్తి వివరాలు వెల్లడించాలి. ఇదీ చదవండి: ‘నెలకు రూ.2 లక్షల స్టైపెండ్’.. పుచ్ఏఐ సీఈఓ ప్రకటన👉విదేశీ కంపెనీల షేర్లను కలిగి వారు సైతం రిటర్నులు ద్వారా ఆ వివరాలు వెల్లడించాలి.👉దేశీయ అన్లిస్టెడ్ కంపెనీల్లో వాటాలు (షేర్లు) కలిగిన వారు కూడా రిటర్నులు దాఖలు చేసి వెల్లడించాలి. 👉ఒక ఆర్థిక సంవత్సరంలో విదేశీ పర్యటనలపై (తనకోసం, ఇతరుల కోసం) చేసిన ఖర్చు రూ.2 లక్షలకు మించినట్టయితే పన్ను రిటర్నులు తప్పకుండా దాఖలు చేయాలి. 👉మూలధన నష్టాలను క్యారీ ఫార్వార్డ్ (తదుపరి ఆర్థిక సంవత్సరాలకు బదిలీ) చేసుకోవాలని అనుకుంటే సెక్షన్ 139(3) కింద గడువులోపు రిటర్నులు వేయడం తప్పనిసరి. సెక్షన్ 54, 54బి, 54ఈసీ లేదా 54 ఎఫ్ కింద మూలధన నష్టాలపై మినహాయింపులు క్లెయిమ్ చేసుకోవడం రిటర్నుల దాఖలుతోనే సాధ్యపడుతుంది. 👉సెక్షన్ 10(1) కింద వ్యవసాయ ఆదాయంపై పన్ను లేదు. వ్యవసాయంపై ఆదాయానికి అదనంగా.. వ్యవసాయేతర కార్యకలాపాల ద్వారా ఆదాయం ప్రాథమిక మినహాయింపు పరిమితికి మించి ఉంటే అప్పుడు రిటర్నులు సమర్పించాల్సిందే. -
చనిపోయినవారి బ్యాంకు అకౌంట్లపై కీలక నిర్ణయం
మరణించిన ఖాతాదారుల బ్యాంకు ఖాతాలు, సేఫ్ డిపాజిట్ లాకర్లకు సంబంధించిన క్లెయిమ్ సెటిల్మెంట్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సెటిల్మెంట్ ప్రక్రియను ప్రామాణీకరించనున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ ప్రకటన చేశారు.చనిపోయినవారి బ్యాంకు ఖాతాలలో ఉన్న సొమ్ము, విలువైన వస్తువులను నామినీలకు లేదా చట్టబద్ధమైన వారసులకు అప్పగించడంలో వివిధ బ్యాంకుల్లో భిన్న ప్రక్రియలను అనుసరిస్తున్నారు. దీంతో క్లయిమ్ సెటిల్మెంట్లో ఇబ్బందులు, తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది. బ్యాంకులు అనుసరించే ఈ ప్రక్రియలలో ఏకరూపతను తీసుకురావడమే ఈ చర్య లక్ష్యం.రూ .67,000 కోట్లకుపైగా అన్క్లెయిమ్ డిపాజిట్లుబ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. జూలై 28న పార్లమెంటులో సమర్పించిన ప్రభుత్వ డేటా ప్రకారం, భారతీయ బ్యాంకులు జూన్ 30, 2025 నాటికి రూ .67,000 కోట్లకు పైగా క్లెయిమ్ చేయని డిపాజిట్లను ఆర్బీఐ డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ (డీఈఏ) నిధికి బదిలీ చేశాయి.క్లెయిమ్ చేయని మొత్తం డిపాజిట్లలో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా రూ.58,330.26 కోట్లు. ఇందులో ఎస్బీఐ రూ.19,329.92 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.6,910.67 కోట్లు, కెనరా బ్యాంక్ రూ.6,278.14 కోట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ప్రైవేట్ బ్యాంకుల్లో ఐసీఐసీఐ బ్యాంక్ రూ.2,063.45 కోట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.1,609.56 కోట్లు, యాక్సిస్ బ్యాంక్ రూ.1,360.16 కోట్లు అన్క్లయిమ్ డిపాజిట్లు ఉన్నాయి.ప్రస్తుత నిబంధనల ప్రకారం 10 ఏళ్ల పాటు ఇనాక్టివ్ గా ఉన్న సేవింగ్స్, కరెంట్ అకౌంట్లు, అదేవిధంగా మెచ్యూరిటీ తర్వాత 10 ఏళ్లపాటు క్లెయిమ్ చేయని టర్మ్ డిపాజిట్లను డీఈఏ ఫండ్ కు బదిలీ చేస్తారు.కాగా పాలసీ రెపో రేటును యథాతథంగా 5.5 శాతంగా ఉంచాలని ఆర్బీఐ నిర్ణయించింది. అంతర్జాతీయ టారిఫ్ అనిశ్చితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) రేటును యథాతథంగా కొనసాగించాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. -
వచ్చే ఏడాది నుంచి పాన్ 2.0: పాత కార్డులు రద్దవుతాయా?
పర్మనెంట్ అకౌంట్ నంబర్లు (PAN), టాక్స్ డిడక్షన్ అండ్ కలెక్షన్ అకౌంట్ నంబర్లు (TAN)కు సంబంధించిన అన్ని సేవలను ఒకే ప్లాట్ఫామ్పైకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన 'పాన్ 2.0' (PAN 2.0) ప్రాజెక్ట్ అమలు చేయడానికి కేంద్రం సన్నద్ధమవుతోంది. ఈ ప్రాజెక్ట్ అమలు కోసం 'ఎల్టీఐమైండ్ట్రీ' (LTIMindtree) సంస్థను ఆదాయ పన్ను శాఖ ఎంపిక చేసింది.పాన్ 2.0 ప్రాజెక్ట్ అమలు కోసం 18 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. డిజైన్, డెవలప్మెంట్, కార్యకలాపాలు వంటి వాటితో పాటు నిర్వహణను కూడా ఎల్టీఐమైండ్ట్రీ చూసుకుంటుంది.పాన్ సంబంధిత సేవల కోసం ప్రస్తుతం.. ఈ-ఫైలింగ్ పోర్టల్, యూటీఐఐటీఎస్ఎల్ పోర్టల్, ప్రొటీన్ ఈ-గవర్నెన్స్ పోర్టల్ అనే ప్లాట్ఫామ్లు ఉన్నాయి. అయితే పాన్ 2.0 వీటన్నింటినీ ఒకే ఏకీకృత పోర్టల్గా అనుసంధానిస్తుంది. దీనికోసం నవంబర్ 2024న కేంద్ర ఆర్ధిక వ్యవహారాల కంపెనీ రూ. 1435 కోట్లను కేటాయించింది.ఇదీ చదవండి: FASTag Annual Pass: ఒక్కసారి చెల్లిస్తే.. ఏడాదంతా ఫ్రీ జర్నీపాత పాన్ కార్డులు రద్దవుతాయా?క్యూర్ కోడ్ పాన్ కార్డులు వస్తే.. పాత పాన్ కార్డులు రద్దవుతాయా? అనే అనుమానం చాలామందికి ఉంటుంది. కానీ పాత పాన్ కార్డులు రద్దు అయ్యే అవకాశం లేదని ఆదాయ పన్ను శాఖ క్లారిటీ ఇచ్చింది. పాన్ 2.0 ప్రవేశపెట్టడంలో ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే.. కొత్త టెక్నాలజీతో ట్యాక్స్ పేయర్లకు మెరుగైన సేవలు అందించడమే. నాణ్యమైన సేవలను సులభంగా, వేగవంతంగా అందించాలనే లక్ష్యంతో కేంద్రం ఈ పాన్ 2.0కు సిద్ధమైంది. కాబట్టి రాబోయే పాన్ కార్డులు క్యూఆర్ కోడ్తో రానున్నాయి. -
ఎస్బీఐ క్రెడిట్కార్డులకు ఆ ఉచిత సదుపాయం బంద్!
ఎస్బీఐ క్రెడిట్ కార్డు యూజర్లకు సంబంధించి ముఖ్యమైన వార్త ఇది. ఈ కార్డుదారులకు ఇప్పటివరకూ ఉచితంగా అందిస్తున్న ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ సదుపాయాన్ని ఆగస్టు 11 నుండి కార్డు జారీ సంస్థ నిలిపివేయబోతోంది. ఈ మార్పు విమాన ప్రయాణంలో భద్రత కోసం ఈ సదుపాయంపై ఆధారపడిన వారిని నేరుగా ప్రభావితం చేస్తుంది.ఇప్పటివరకు ఎస్బీఐ ప్రీమియం, కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులపై రూ.కోటి లేదా రూ.50 లక్షల వరకు కాంప్లిమెంటరీ (ఉచిత) విమాన ప్రమాద బీమా అందుబాటులో ఉండేది. ఆగస్టు 11 తర్వాత ఈ బెనిఫిట్ అందుబాటులో ఉండదు. ఈ సదుపాయం ముగిసే కార్డులలో ఈ కిందివి ఉన్నాయి..రూ.1 కోటి ఇన్సూరెన్స్ కవర్ ఉన్న కార్డులుఎస్బీఐ కార్డ్ ఎలైట్ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్యూకో బ్యాంక్ ఎస్బీఐ కార్డ్ ఎలైట్సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ కార్డ్ ఎలైట్అలహాబాద్ బ్యాంక్ ఎస్బీఐ కార్డ్ ఎలైట్పీఎస్బీ ఎస్బీఐ కార్డ్ ఎలైట్కరూర్ వైశ్యా బ్యాంక్ (కెవిబి) ఎస్బీఐ కార్డ్ ఎలైట్కేవీబీ ఎస్బీఐ సిగ్నేచర్ కార్డురూ.50 లక్షల ఇన్సూరెన్స్ కవరేజీ ఉన్న కార్డులుఎస్బీఐ కార్డ్ ప్రైమ్ఎస్బీఐ కార్డ్ పల్స్యూకో బ్యాంక్ ఎస్బీఐ కార్డ్ ప్రైమ్సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ కార్డ్ ప్రైమ్పీఎస్బీ ఎస్బీఐ కార్డ్ పీఎంకేవీబీ ఎస్బీఐ కార్డ్ ప్రైమ్కేవీబీ ఎస్బీఐ ప్లాటినం క్రెడిట్ కార్డుసౌత్ ఇండియన్ బ్యాంక్ ఎస్బీఐ కార్డ్ ప్రైమ్సౌత్ ఇండియన్ బ్యాంక్ ఎస్బీఐ ప్లాటినం క్రెడిట్ కార్డుకర్ణాటక బ్యాంక్ ఎస్బీఐ కార్డ్ ప్రైమ్కర్ణాటక బ్యాంక్ ఎస్బీఐ ప్లాటినం క్రెడిట్ కార్డుసిటీ యూనియన్ బ్యాంక్ ఎస్బీఐ కార్డ్ ప్రైమ్యూబీఐ ఎస్బీఐ ప్లాటినం క్రెడిట్ కార్డుఓబీసీ ఎస్బీఐ వీసా ప్లాటినం కార్డుఫెడరల్ బ్యాంక్ ఎస్బీఐ ప్లాటినం క్రెడిట్ కార్డుమీరు ఎస్బీఐ క్రెడిట్కార్డు యూజర్లు అయితే ఇప్పుడు విమాన ప్రయాణ సమయంలో మీకు ఈ అదనపు రక్షణ లభించదు. అటువంటి పరిస్థితిలో, మీరు తరచుగా ప్రయాణిస్తూ ఉచిత బీమాపై ఆధారపడి ఉంటే, ఇప్పుడు ప్రత్యేక ప్రయాణ లేదా వ్యక్తిగత ప్రమాద బీమా తీసుకోవలసి ఉంటుంది. ఈ బెనిఫిట్ మీకు ముఖ్యమైతే కచ్చితంగా మార్కెట్లో అందుబాటులో ఉన్న వ్యక్తిగత ట్రావెల్ లేదా పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీని పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.చదవండి: ఏటీఎంలో రూ.500 నోట్లు కనుమరుగు! ఆర్బీఐ ఆర్డరు నిజమేనా? -
‘అఫర్డబుల్’ జీవిత బీమాకు ప్రాధాన్యత
అనిశ్చితి నుంచి రక్షణ కల్పించే సంప్రదాయ సాధనంగా నిలుస్తున్న జీవిత బీమా కొన్నాళ్లుగా గణనీయ మార్పులకు లోనైంది. ఒకప్పుడు రియాక్టివ్ రక్షణ కవచంగా వ్యవహరించేది కాస్తా ఇప్పుడు ఆర్థిక సాధికారత కల్పించే క్రియాశీల ప్రోయాక్టివ్ సాధనంగా మారింది. మారుతున్న జీవన విధానాలు, డిజిటల్ వినియోగానికి అనుగుణంగా బీమా పరిశ్రమ తనను తాను మల్చుకునే కొద్దీ, జీవిత బీమా అసలు అవసరమా అనే ప్రశ్న కన్నా వినియోగదారులకు సంస్థలు ఆఫర్ చేసే పథకాలు నిజంగా వారి అవసరాలకు తగ్గట్టుగానే ఉన్నాయా లేదా అనేది ప్రధాన ప్రశ్నగా ఉంటోంది.ప్రతి దశలో ఆర్థిక భాగస్వామి..డిజిటల్ మౌలిక సదుపాయాలు, డేటా అనలిటిక్స్ మొదలైన అంశాల దన్నుతో బీమా పథకాలు మరింత సరళతరంగా, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మారాయి. సంపద సృష్టి, ఆదాయార్జన, కుటుంబానికి ఆర్థిక సంరక్షణ తదితర లక్ష్యాల సాధనకు తోడ్పడేవిగా ఉంటున్నాయి. భవిష్యత్ అవసరాల కోసం పొదుపు చేసుకోవడంలో కెరియర్ ప్రారంభిస్తున్న యువ ప్రొఫెషనల్స్కి, పిల్లల చదువులు కోసం పొదుపు చేయడంలో కుటుంబాలకు, స్థిరమైన ఆదాయాన్ని కోరుకునే రిటైరీల నిర్దిష్ట ఆర్థిక లక్ష్యాల సాధనకు ఉపయోగపడేదిగా జీవిత బీమా ఉంటోంది. 2024 సెప్టెంబర్ నాటికి దేశీయంగా మొత్తం సమ్ అష్యూర్డ్ వార్షిక ప్రాతిపదికన 15% పెరిగి రూ. 36.37 లక్షల కోట్లకు చేరడమనేది ఈ ట్రెండ్నే సూచిస్తోంది. జీవిత బీమాపై పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనం.ఖరీదైనదనే అపోహ..జీవిత బీమా పాలసీలతో అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, చాలా మంది వీటిని తీసుకోవడం లేదు. ఇవి చాలా ఖరీదైనవనే అపోహే ఇందుకు కారణం. సాధారణంగా వీలైనంత తక్కువ వయస్సులోనే తీసుకుంటే పాలసీలు చాలా తక్కువ ప్రీమియంలతో, అత్యధిక కవరేజీని పొందవచ్చు. కానీ ఖరీదైనవనే అపోహల వల్ల యువత కూడా సాధ్యమైనంత ముందుగా బీమాను తీసుకోవడం తక్కువగా ఉంటోంది. ఐఆర్డీఏఐ నివేదిక ప్రకారం, 2024 ఆర్థిక సంవత్సరంలో భారత్లో జీవిత బీమా కవరేజీ అనేది స్థూల దేశీయోత్పత్తిలో 2.8 శాతంగానే ఉంది.అంతర్జాతీయ సగటు అయిన 7 శాతంతో పోలిస్తే ఇది చాలా తక్కువ కావడం గమనార్హం. ఈ రెండింటి మధ్య భారీ వ్యత్యాసం ఉన్నప్పటికీ, బీమాను విస్తరించేందుకు (ముఖ్యంగా యువతలో, అంతగా సేవలు అందని వర్గాల్లో) గణనీయంగా అవకాశాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో జీవిత బీమా అనేది ఎంత అఫోర్డబుల్గా, ఎంత ఉపయోగకరంగా ఉంటుందనే విషయాలపై అవగాహన పెంపొందించడంపై, అలాగే తమ ఆర్థిక భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకోవడంలో ప్రజలకు తోడ్పాటు అందించడంపై బీమా పరిశ్రమ మరింతగా దృష్టి సారించాల్సి ఉంటుంది.ప్రస్తుతం జీవిత బీమా అంటే రక్షణకు మాత్రమే పరిమితం కాకుండా, ప్రజలు తమ ఆర్థిక లక్ష్యాలను ప్లాన్ చేసుకునేందుకు, సాధించుకునేందుకు కూడా సహాయపడుతోంది. ఉదాహరణకు యులిప్లు (యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు) ఒకవైపు కవరేజీ అందిస్తూనే మరోవైపు ఫైనాన్షియల్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసేందుకు కూడా ఉపయోగపడతాయి. మీ వయస్సు, అవసరాలు, రిస్కు సామర్థ్యాలను బట్టి ఇన్వెస్ట్మెంట్ స్టయిల్ను మార్చుకునేలా ఇవి సరళతరంగా కూడా ఉంటాయి. మరోవైపు, ఎండోమెంట్ లేదా గ్యారంటీడ్ రిటర్న్ పాలసీలు, స్థిరంగా నిర్దిష్ట రాబడులు అంది స్తాయి. భద్రత, అంచనా వేయతగిన విధంగా రాబడులు ఉండాలని కోరుకునే వారికి ఇవి అనువైనవిగా ఉంటాయి. ఇలాంటి ప్లాన్లన్నీ, పిల్లల చదువులు లేదా రిటైర్మెంట్ నిధి రూపొందించుకోవడం లాంటి దీర్ఘకాల అవసరాలకు ఉపయోగపడతాయి.రిటైర్మెంట్ వేళ.. భద్రత..జీవన ప్రమాణాలు, ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రిటైర్మెంట్ తర్వాత ఆర్థికంగా స్వతంత్రంగా ఉండటమనేది చాలా కష్టంగా మారుతోంది. యాన్యుటీ ప్లాన్ల ద్వారా జీవిత బీమా ఇలాంటి సమస్యను అధిగమించడంలో తోడ్పాటు అందిస్తుంది. ఈ ప్లాన్లు మీ అవసరాలను బట్టి తక్షణం కావచ్చు లేదా భవిష్యత్లో కావచ్చు మీ పొదుపు మొత్తాన్ని క్రమానుగత ఆదాయంగా అందిస్తాయి. వయస్సు మీద పడిన తర్వాత ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఇవి సహాయపడతాయి. అలాగే, పదవీ విరమణ పొందినవారు ఆత్మగౌరవం, ఆర్థిక స్వాతంత్య్రంతో జీవించేందుకు ఉపయోగపడతాయి.సరళమైన, పర్సనలైజ్డ్ కవరేజీ..జీవిత బీమా మరింత పర్సనలైజ్డ్ సాధనంగా మారుతోంది. డిటల్ సాధనాలు, కస్టమర్ డేటాను ఉపయోగించి బీమా కంపెనీలు నేడు పాలసీదారుల విశిష్టమైన లైఫ్స్టయిల్, జీవిత దశలకు అనుగుణమైన పథకాలను అందిస్తున్నాయి. క్రిటికల్ ఇల్నెస్ కవరేజీ, ప్రీమియం చెల్లింపుల్లో అంతరాయాల నుంచి రక్షణ, అదనపు ప్రయోజనాలు కల్పించే ఫీచర్ల కారణంగా జీవిత బీమా పాలసీలు మరింత సరళంగా, అధునాతనంగా మారాయి. జీవన విధానాల్లో మార్పులు, నిధుల సంక్షోభాలు, వ్యక్తిగతంగా కొత్త లక్ష్యాల సాధన వంటి సందర్భాల్లో బీమా పాలసీలు దన్నుగా ఉంటాయి.ఆర్థిక భద్రతదీర్ఘకాలంలో ఎలాంటి సవాలునైనా ధీమాగా ఎదుర్కొనే సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి అఫర్డబుల్, వినూత్నమైన జీవిత బీమా అవసరం ఎంతో ఉంది. చౌకగా, సరళతరంగా, రోజువారీ అవసరాలకు అనుగుణంగా ఉండేలా బీమా సంస్థలు తమ పాలసీలను సరళతరం చేస్తున్నాయి. ఆధునీకరిస్తున్నాయి. నేటి ఒడిదుడుకుల ప్రపంచంలో జీవిత బీమాను ఒక రక్షణాత్మక కవచంగానే కాకుండా భవిష్యత్తుకు భద్రత కల్పించే పురోగామి ఆర్థిక సాధనంగా చూడాలి. బీమాను స్మార్ట్, వ్యూహాత్మక ఆర్థిక సాధనంగా పరిశ్రమ కూడా ప్రమోట్ చేయాలి. -
మిడ్క్యాప్లో మెరుగైన పనితీరు
మిడ్క్యాప్ విభాగంలో ఇన్వెస్ట్ చేసుకోవాలని భావించే వారి ముందున్న ఎంపికల్లో ఫ్రాంక్లిన్ ఇండియా మిడ్క్యాప్ ఫండ్ ఒకటి. ఇది ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పథకం. మిడ్క్యాప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో పెట్టుబడులను వృద్ధి చేసేందుకు కృషి చేస్తుంది. అధిక రాబడుల కోసం అధిక రిస్క్ తీసుకునే వారికి ఇది అనుకూలం. కనీసం 7–8 ఏళ్లకు మించి పెట్టుబడులు పెట్టే వారికే మిడ్క్యాప్ విభాగం సూచనీయం.రాబడులు ఈ పథకంలో ఏ కాలంలో చూసినా రాబడులు మెరుగ్గా కనిపిస్తాయి. గత పదేళ్లలో ఏటా 16 శాతం చొప్పున పెట్టుబడులపై రాబడులు అందించింది. ఏడేళ్లలో రాబడి ఏటా 17 శాతం చొప్పున ఉంది. ఐదేళ్లలోనూ ఏటా 27 శాతానికి పైనే ప్రతిఫలాన్ని తెచ్చిపెట్టింది. ఇక ఏడాది కాలంలో మాత్రం రాబడి కేవలం 2.41 శాతంగా ఉంది. గత ఏడాది కాలంలో మార్కెట్ల పనితీరు స్తబ్దుగా ఉండడం వల్ల రాబడులు తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పథకం 1993లో ప్రారంభమైంది. నాటి నుంచి చూసుకున్నా రాబడి ఏటా 19.41 శాతంగా ఉండడం గమనించొచ్చు. అధిక రిస్క్ కేటగిరీ కిందకు ఈ పథకం వస్తుంది.పెట్టుబడుల విధానం ఈ పథకం పోర్ట్ఫోలియో పరంగా మంచి వైవిధ్యాన్ని పాటిస్తుంటుంది. బలమైన వృద్ధి అవకాశాలున్న కంపెనీలను ఎంపిక చేసిన పెట్టుబడులు పెడుతుంటుంది. వివిధ వ్యాపార సైకిల్స్ను గమనిస్తూ.. ఆరంభంలోనే అవకాశాలను సొంతం చేసుకునే మార్గంలో పనిచేస్తుంది. వ్యాల్యూ అదే సమయంలో గ్రోత్.. ఈ రెండు పెట్టుబడుల విధానాలకు ప్రాధాన్యం ఇస్తుంటుంది. వాస్తవ అంతర్గత విలువ కంటే తక్కువలో ట్రేడవుతున్న కంపెనీలను గుర్తించి పెట్టుబడులు పెట్టడాన్ని వ్యాల్యూ ఇన్వెస్టింగ్గా చెబుతారు.ఆయా రంగాల్లో స్వల్పకాల ప్రతికూలతలు, ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న పరిస్థితుల కారణంగా కొన్ని సందర్భాల్లో కంపెనీల విలువలు మరింత ఆకర్షణీయమైన స్థాయికి దిగొస్తుంటాయి. అలాంటి సందర్భాలను ఫండ్ మేనేజర్ గుర్తించి ఇన్వెస్ట్ చేస్తుంటారు. పెట్టుబడులకు రంగాల వారీ కాకుండా స్టాక్స్ వారీగా పరిశీలన (బోటమ్ అప్) చేస్తుంది. రుణ భారం లేని, తక్కువగా ఉన్న కంపెనీలకే ప్రాధాన్యం ఇస్తుంది. ఈ పథకం పేరు జూలై 11 ముందు వరకు ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ఫండ్గా కొనసాగడం గమనార్హం.పోర్ట్ఫోలియో ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.12,785 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఎక్స్పెన్స్ రేషియో డైరెక్ట్ ప్లాన్లో 0.94 శాతంగా ఉంటే, రెగ్యులర్ ప్లాన్లో 1.76 శాతం చొప్పున ఉంది. రెగ్యులర్ ప్లాన్ అంటే మధ్యవర్తులకు కమీషన్ చెల్లించేది. దీంతో ఇన్వెస్టర్ల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తుంటారు. దీర్ఘకాలంలో అధిక రాబడి కోసం డైరెక్టర్ ప్లాన్ ఎంపికే మెరుగైనది అవుతుంది. మొత్తం పెట్టుబడుల్లో 97.4 శాతాన్ని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయగా, 2.4 శాతం నగదు నిల్వలు కలిగి ఉంది. పెట్టుబడులను గమనిస్తే 20 శాతం బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కంపెనీల్లో ఉన్నాయి. కన్జ్యూమర్ డిస్క్రీషినరీ కంపెనీల్లో 18.6 శాతం, ఇండస్ట్రియల్స్ కంపెనీల్లో 13.8 శాతం, మెటీరియల్స్ కంపెనీల్లో 13.3 శాతం, హెల్త్కేర్ కంపెనీల్లో 10.6 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసింది. -
ఆస్తిపాస్తులు గోప్యంగా ఉంచితే అంతే..
యాపిల్, అమెజాన్, టెస్లా వంటి టెక్ దిగ్గజాలను కలిగి ఉన్న యూఎస్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని చాలామంది ఇతర దేశాల పెట్టుబడిదారులు యోచిస్తుంటారు. యూఎస్ మార్కెట్ ఆకర్షణీయంగా తోస్తున్నా భారతీయ పెట్టుబడిదారులు అక్కడ ఇన్వెస్ట్ చేసేముందు చాలా విషయాలు తీలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతర్జాతీయ పెట్టుబడి బ్రోకర్ ఖాతా తెరవడం, స్టాక్ ఎంచుకోవడం, అందులో పెట్టుబడి పెట్టడం అంత సులభం కాదని చెబుతున్నారు.విదేశాల్లో ముఖ్యంగా యు.ఎస్లో పెట్టుబడి పెట్టడంతోపాటు భారతీయ ఇన్వెస్టర్లకు అక్కడ అమల్లో ఉన్న సంక్లిష్టమైన చట్టపరమైన ఫ్రేమ్ వర్క్లు, పన్ను చిక్కులు, ఖర్చులపై స్పష్టమైన అవగాహన ఉండాలి. అక్కడ పెట్టుబడి పెట్టి భారతీయ విధానాలు పాటించడంలో విఫలమైతే భారీ జరిమానాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి.లీగల్ ఫ్రేమ్వర్క్ఆర్బీఐ 2004లో ప్రవేశపెట్టిన లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద భారతీయులు విదేశాల్లో పెట్టుబడులు పెట్టవచ్చు. ప్రస్తుత పరిమితి మైనర్లతో సహా ప్రతి వ్యక్తికి ఆర్థిక సంవత్సరానికి 2,50,000 డాలర్లుగా ఉంది. ట్రావెల్, ఎడ్యుకేషన్, యూఎస్ ఈక్విటీలతో సహా విదేశీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం వంటి వివిధ లావాదేవీలు ఇందులో కవర్ అవుతాయి. ఇన్వెస్టర్ల మొత్తం వార్షిక విదేశీ రెమిటెన్స్ రూ.10 లక్షలు దాటితే మూలం వద్ద వసూలు చేసిన పన్ను (టీసీఎస్) వర్తిస్తుంది.డివిడెండ్లుఅమెరికా కంపెనీల నుంచి డివిడెండ్లు వస్తే వాటిని భారత్లో విదేశీ ఆదాయంగా వర్గీకరిస్తారు. ఆదాయ స్థాయితో సంబంధం లేకుండా అమెరికా 25% పన్నును ముందస్తుగా నిలిపివేస్తుంది. అయితే, భారత్-అమెరికాల పరిధిలో డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ (డీటీఏఏ) అమలులో ఉంది. భారతీయ పన్నులను దాఖలు చేసేటప్పుడు ఈ మినహాయింపు కోసం విదేశీ పన్ను క్రెడిట్ను క్లెయిమ్ చేయవచ్చు.క్యాపిటల్ గెయిన్స్అమెరికా పన్ను నిబంధనల ప్రకారం ప్రవాస భారతీయులుగా పరిగణించే భారతీయ నివాసితుల మూలధన లాభాలపై అమెరికా పన్ను విధించదు. కానీ భారత్లో పన్నులు చెల్లించాల్సిందే. 24 నెలల కంటే ఎక్కువకాలం ఉన్న పెట్టుబడి లాభాలపై లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎల్టీసీజీ)గా ఇండెక్సేషన్, సర్ఛార్జ్, సెస్తో కలిపి 20 శాతం పన్ను విధిస్తారు. 24 నెలల కంటే తక్కవగా ఉన్నవాటిని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎస్టీసీజీ)గా పరిగణించి ఆదాయ శ్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారు.స్టాక్స్ వివరాలు తెలపాల్సిందే..భారతదేశంలో ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేసేటప్పుడు అన్ని విదేశీ ఆస్తులను షెడ్యూల్ ఎఫ్ఏ (విదేశీ ఆస్తులు) కింద ప్రకటించాలి. చిన్నమొత్తంలోని పెట్టుబడులను సైతం బహిర్గతం చేయాలి. అందులో విఫలమైతే బ్లాక్మనీ (అప్రకటిత విదేశీ ఆదాయం, ఆస్తులు), పన్ను విధింపు చట్టం, 2015 కింద తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. ఈ వివరాలు వెల్లడించని వారికి ఏడాదికి రూ.10 లక్షల జరిమానా విధిస్తారు.రివైజ్డ్ రిటర్న్ఏదైనా పరిస్థితుల్లో ఐటీఆర్ దాఖలు చేసేపుడు విదేశీ హోల్డింగ్స్ను ప్రకటించడంలో విఫలమైతే గడువులోగా రివైజ్డ్ రిటర్న్ ఫైల్ చేయాలి. లేదంటే సెక్షన్ 139(8ఏ) కింద అప్డేటెడ్ రిటర్న్ (ఐటీఆర్యూ) ఆప్షన్ను ఉపయోగించాలి. ఏదేమైనా మీ ఫైలింగ్లను సమీక్షించడానికి, పూర్తి సమ్మతిని నిర్ధారించడానికి అర్హత కలిగిన పన్ను నిపుణులను సంప్రదిస్తే మేలు.ఇదీ చదవండి: ఆర్బీఐ ఎంపీసీ దారెటు..?విదేశాల్లో పెట్టుబడులు పెట్టే ముందు..చట్టపరమైన ఆంక్షలు, విధానలను అర్థం చేసుకోవాలి.రెండు దేశాల్లో వాటి పన్ను ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి.ప్రతి హోల్డింగ్, ఆదాయ మార్గాన్ని ఐటీఆర్లో వెల్లడించాలి.అవసరమైనప్పుడు ప్రొఫెషనల్ గైడెన్స్ తీసుకోవాలి.ఎంతైనా తప్పును ఐటీ అధికారుల ముందు సమర్థించుకోవడం కంటే ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది. -
ఫారం 26ఏఎస్: ఏఐఎస్ - టీఐఎస్ తప్పొప్పులు
ఫారం 26ఏఎస్ ఒక సమగ్రమైన సమాచార పట్టిక. మీరు వెబ్సైట్లో లాగిన్ అయితే, ఈ స్టేట్మెంట్ ఉంటుంది. ఇందులో ఏయే సమాచారం పొందుపరుస్తారంటే..టీడీఎస్టీసీఎస్మీరు చెల్లించిన అడ్వాన్స్ ట్యాక్స్, సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ఈ ఆర్థిక సంవత్సరంలో మీకు వచ్చిన రిఫండ్ వివరాలునిర్దేశిత ఆర్థిక వ్యవహారాలుస్థిరాస్తి విక్రయ సందర్భంలో జరిగిన టీడీఎస్టీడీఎస్లో జరిగిన పొరపాట్లుమీరు చెల్లించాల్సిన డిమాండ్లు.. అంటే గత సంవత్సరపు బకాయిలుఅలాగే రిఫండ్ వివరాలుమీ కేసులో పెండింగ్లో ఉన్న ప్రొసీడింగ్స్. అలాగే పూర్తయిన వివరాలుడిపార్టుమెంట్ వారు జారీ చేసిన ‘తరచుగా అడిగే ప్రశ్నలు-జవాబులు’, అంటే, ఎఫ్ఏక్యూ శీర్షికలో కేవలం ట్యాక్స్ సమాచారానికి సంబంధించిన ‘మిస్-మ్యాచ్’ల విషయమే ప్రస్తావించారు. సలహా ఏమిటంటే.. పాన్ వెరిఫై చేయండి. సంవత్సరం వెరిఫై చేయెడి. చలాన్ నంబర్ చెక్ చేయండి.బ్యాంకు పేరు, బ్రాంచ్ పేరు, బ్రాంచ్ కోడ్, తేదీ ఇలాంటివన్నీ కూడా వెరిఫై చేయమంటున్నారు. ఇలాంటి విషయాల్లో తప్పులు జరగడం సహజం. ఒక్క అక్షరం తప్పయినా లేక ఒక్క అంకె తప్పయినా, ఎంట్రీలు జమ అవ్వవు. అప్పుడప్పుడు ఆదాయ పన్ను శాఖ ట్రెజరీ అకౌంటులో కొన్ని కోట్ల మొత్తం.. సమన్వయం కాకపోవడం వల్ల పేరుకుపోయి ఉంటుంది. అందుకని సమాచారం రాసినప్పుడు తగిన జాగ్రత్త వహించాలి. ఇదంతా పన్నుకి సంబంధించినది.ఇంకో క్షోభ. ఫ్యామిలీ పెన్షనర్ కృష్ణవేణమ్మగారి కేసులో మూడు నెలల పెన్షన్ మాత్రమే ఫారం 26 ఏఎస్ కనిపిస్తోంది. ఇంతే మొత్తం ఇతర ఫారాల్లో కూడా పడింది. ఫ్యామిలీ పెన్షన్ మీద టీడీఎస్ ఉండదు. మూడు నెలల్లో రూ. 3,00,000 దాటలేదు. నిజానికి పన్నెండు నెలల పెన్షన్, మేడమ్ గారి బ్యాంకు అకౌంటులో జమయ్యింది. ఆవిడగారికి పక్కింటి పరంధామయ్య గారు చెప్పిన రూలు.. ఈ మూడు ఫారాలు, వెబ్సైట్, ఇన్కం ట్యాక్స్ పోర్టల్లోని వివరాలకు మించి వెళ్లకూడదు. అధిగమించకూడదు. అతిక్రమించకూడదు అని. మేడంగారిని ఒప్పించడానికి తలప్రాణం తోకకి వచ్చింది. 26ఏఎస్లో తప్పులు దొర్లితే సర్దుబాటుకి వెసులుబాటు లేదు. ఏఐఎస్లో తప్పు దొర్లితే తప్పుని సరి చేయమని వేడుకోవచ్చు.ఇక్కడ బేసిక్ విషయం ఏమిటంటే, ఇప్పటికీ కొన్ని గవర్నమెంటు కార్యాలయాల నుంచి సమాచారం అరకొరగా వస్తోంది. పూర్తిగా రావడం లేదు. దాన్నే 26ఏఎస్లో చూపిస్తున్నారు. అటు, రెడ్డిగారి కేసులో టీఐఎస్ ఫారంలోనే బ్యాంకు వడ్డీ, రికరింగ్ డిపాజిట్, వడ్డీ వేయడంతో.. ఒక కాలమ్లోని మొత్తానికి, మరో కాలమ్లోని మొత్తానికి తేడాలున్నాయి. దేన్ని తీసుకోవాలనేది ప్రశ్న.ఇక మోహన్గారి విషయంలో ఏఐఎస్లో బ్యాంకు వడ్డీ రెండు సార్లు రిపీట్ అయ్యింది. దానివల్ల డబుల్ ట్యాక్సేషన్ జరిగినట్లు నిర్ధారించవచ్చు. అసలే అమెరికా నుంచి అర్ధరాత్రి నిద్ర మానుకుని లెక్కలు చూసుకుంటున్న మోహన్గారికి భయం, నిద్రలేమి, కోపం, బీపీ, టెన్షన్ పెరిగిపోయాయి. కామేశ్వరమ్మగారి కేసులో ఫారం 26ఏఎస్ బ్యాంకు వడ్డీ, ఏఐఎస్లోని వడ్డీ .. ఒకేగా లేదు. తేడా వేలల్లో ఉంది. ఈ మూడింటిలోని అంశాలు ఒకదానితో ఒకటి పెర్ఫెక్టుగా ట్యాలీ అయ్యిందంటే, మీరు అదృష్టవంతులనుకోవాలి. దేవుడికి కొబ్బరికాయ కొట్టి, ఫైలింగ్ ప్రక్రియ మొదలెట్టండి.ఇక మ్యుచువల్ ఫండ్స్ ద్వారా వచ్చే క్యాపిటల్ గెయిన్స్ విషయం తీసుకుంటే ఇదివరకు చాలా మంది క్లయింట్లు ఈ సమాచారాన్ని చెప్పకుండా దాచేసి, మతలబు చేసేవారు. ఇప్పుడది కాస్తా బట్టబయలవుతోంది. అయితే, దురదృష్టవశాత్తూ, ఈ విషయంలోనూ రెండు పెద్ద సంస్థలు, ఒకటి నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్, మరొకటి సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ అండ్ రీకన్సిలియేషన్ సెంటర్ ఇస్తున్న సమాచారంలో తేడాలు ఉంటున్నాయి. అగ్నికి ఆజ్యం పోసినట్లు. ట్యాక్స్ కంప్యూటేషన్ సాఫ్ట్వేర్లో సమస్యలు తలెత్తడం వల్ల క్లయింట్లు కలవరపడుతున్నారు.ఈ పొరపాట్లు తాత్కాలికమే కావచ్చు.. టెక్నికల్ గ్లిచెస్ కావచ్చని తీసిపడేయకండి. న్నీ డిక్లేర్ చేసి ఆదాయ పన్ను కడదామనుకునే వారికి అడ్డుపడుతూ, ఏదైనా అవకాశం దొరికితే ఎగవేసేందుకు ఎదురుచూసే వారికి ఇవి అవకాశాలు కలిగించేలా ఉన్నాయి. మీరు జాగ్రత్త వహించండి.ట్యాక్సేషన్ నిపుణులు: కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి & కె.వి.ఎన్ లావణ్య -
రిటైర్మెంట్ ఫండ్ కోసం ఉత్తమ మార్గం
నా వయసు 42 ఏళ్లు. రిటైర్మెంట్ తర్వాతి అవసరాల కోసం ఇప్పటి నుంచి ప్రతి నెలా రూ.50,000 చొప్పున ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఏ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి? – వినోద్రావు అథవాలేరిటైర్మెంట్ కోసం ఎంత మొత్తం అవసరమవుతుందన్నది ముందుగా నిర్ణయించుకోవాలి. అంత మొత్తాన్ని ఎలా సమకూర్చుకోవాలన్న స్పష్టత కలిగి ఉండాలి. విశ్రాంత జీవన అవసరాలకు కావాల్సినంత సమకూర్చుకునే ప్రణాళికలను రూపొందించుకోవాలి. రెండు నుంచి మూడు వరకు మంచి ఫ్లెక్సీక్యాప్ పథకాలను ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న రూ.50వేలలో 60 శాతాన్ని అంటూ రూ.30వేలను రెండు మూడు పథకాల్లో పెట్టుబడి పెట్టుకోవాలి. రిటైర్మెంట్కు 16 ఏళ్లు సమయం మిగిలి ఉంది. కనుక మీ పెట్టుబడి అప్పటికి గణనీయంగా వృద్ధి చెందుతుంది.ఈక్విటీ పథకాల్లో రిస్క్ల పట్ల పెద్దగా అవగాహన లేకపోతే, అప్పుడు అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇవి అచ్చమైన ఈక్విటీ పథకాలతో పోలిస్తే కొంచెం తక్కువ అస్థిరతలతో ఉంటాయి. అలాగే రూ.20వేలను ఫిక్స్డ్ ఇన్కమ్ పథకాలకు కేటాయించుకోవాలి. దీనివల్ల రిటైర్మెంట్ అనంతరం.. ఈక్విటీ పెట్టుబడులను ఫిక్స్డ్ ఇన్కమ్ పథకాల్లోకి మార్చాల్సిన అవసరం ఏర్పడదు. ఎందుకంటే సగం పెట్టుబడులు ఫిక్స్డ్ ఇన్కమ్ (డెట్ ఫండ్స్) సాధనాల్లోనే ఉంటాయి. ఈక్విటీ, డెట్ మధ్య పెట్టుబడుల కేటాయింపు జాగ్రత్తగా ఉండాలి. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని అధిగమించేలా, వడ్డీ రేట్లు తగ్గినప్పుడు ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాలపై పడే ప్రభావాన్ని అధిగమించేలా ఈ సమతూకం ఉండాలి.నా పెట్టుబడుల్లో అధిక భాగంగా ఈక్విటీల్లోనే ఉన్నాయి. మార్కెట్లలో అస్థిరతలు, ఆటుపోట్లను అధిగమించడం ఎలా? – బ్రదర్ జోసెఫ్ఈక్విటీల్లో అస్థిరతలు సహజం. ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు అనుగుణంగా ఇవి చలిస్తుంటాయి. వీటిని ఎదుర్కోవడం ఎలా అన్నది ఇన్వెస్టర్లకు తెలిసి ఉండాలి. ప్రతీ ఇన్వెస్టర్ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లను తీసుకుని తమకు, తమ కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించుకోవడం అన్నింటికంటే ముందు చేయాల్సి నపని. అత్యవసర సందర్భాల్లో, తాత్కాలిక అవసరాలకు ఈక్విటీ పెట్టుబడులను కదలించకుండా.. విడిగా అత్యవసర నిధిని (ఈఎఫ్) ఏర్పాటు చేసుకోవాలి. ఈక్విటీల్లో పెట్టుబడులను కనీసం ఐదు నుంచి ఏడేళ్ల పాటు కదపకుండా ఉండాలా ఏర్పాట్లు చేసుకోవాలి.ఈక్విటీ అస్థిరతలను అధిగమించేందుకు ఈ చర్యలు అవసరం. అలాగే, సిప్ వంటి సాధనాల ద్వారా ఇన్వెస్ట్ చేయడం వల్ల మార్కెట్ దిద్దుబాట్ల నుంచి అదనపు రాబడుల ప్రయోజనాన్ని పొందొచ్చు. సిప్ రూపంలో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసే వారికి మార్కెట్లలో కరెక్షన్లు నిజంగా మంచి అవకాశాలను తెస్తాయి. ఎందుకంటే ఆ సమయాల్లో ఎక్కువ ఫండ్ యూనిట్లను తక్కువ ధరకే సమకూర్చుకోవచ్చు. మార్కెట్లు దిద్దుబాటుకు గురైతే చౌకగా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. అనవసరపు ఆందోళనతో సిప్ నిలిపివేయడం, ఈక్విటీ పెట్టుబడులను విక్రయించడం చేయరాదు. పైగా ఆ సమయంలో తప్పకుండా సిప్ను కొనసాగించాలి. వీలైతే సిప్ మొత్తాన్ని పెంచుకుని అదనంగా ఇన్వెస్ట్ చేయాలి. దీనివల్ల దీర్ఘకాలంలో రాబడులను గణనీయంగా పెంచుకోవచ్చు.ధీరేంద్ర కుమార్: సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
పోస్టల్ బ్యాంకుల్లో ఇక ఆధార్ ఫేస్ ఆథెంటికేషన్
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుల్లో ఆధార్ ఆధారిత ఫేస్ ఆథెంటికేషన్ సదుపాయం ప్రారంభమైంది. సామాన్య ప్రజలకు ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులకు బ్యాంకింగ్ను మరింత సురక్షితంగా, సమ్మిళితంగా, సౌకర్యవంతంగా చేయడానికి ఈ ఆధార్ ఆధారిత ఫేస్ ఆథెంటికేషన్ సదుపాయాన్ని తీసుకొచ్చారు.యూఐడీఏఐ (యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) ఫ్రేమ్వర్క్ కింద అభివృద్ధి చేసిన ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ ద్వారా ఖాతాదారులు ముఖ గుర్తింపును ఉపయోగించి బ్యాంకింగ్ లావాదేవీలను పూర్తి చేయవచ్చు. ఇకపై వేలిముద్రలు లేదా ఓటీపీల వంటి భౌతిక బయోమెట్రిక్ ఇన్పుట్ల అవసరం ఉండదు."ఐపీపీబీలో, బ్యాంకింగ్ అందుబాటులో ఉండటమే కాదు.. హుందాగా ఉండాలని మేము నమ్ముతున్నాం. ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ ద్వారా బయోమెట్రిక్ వేలిముద్రలు లేదా ఓటీపీ ధృవీకరణలో పరిమితుల కారణంగా ఏ కస్టమర్ కూడా ఇబ్బంది పడకుండా చేస్తున్నాం. ఇది కేవలం టెక్ ఫీచర్ మాత్రమే కాదు. ఇది ఆర్థిక సమ్మిళితాన్ని పునర్నిర్వచించే దిశగా ఒక అడుగు" అని ఐపీపీబీ ఎండీ, సీఈవో ఆర్ విశ్వేశ్వరన్ పేర్కొన్నారు.ఫేస్ ఆథెంటికేషన్ ఫీచర్ కీలక ప్రయోజనాలుఓటీపీ లేదా ఫింగర్ ప్రింట్ సెన్సార్లపై ఆధారపడకుండా ఆధార్ ఆథెంటికేషన్ సురక్షితంసులువైన కస్టమర్ అనుభవం కోసం వేగవంతమైన, కాంటాక్ట్ లెస్ లావాదేవీలుఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో సురక్షితమైన బ్యాంకింగ్ఖాతా తెరవడం, బ్యాలెన్స్ విచారణ, ఫండ్ ట్రాన్స్ఫర్లు, యుటిలిటీ చెల్లింపులతో సహా అన్ని బ్యాంకింగ్ సేవలకు మద్దతు. -
4 యాప్లతో రూ.300 కోట్లు హాంఫట్!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో మరో ఆన్లైన్ పెట్టుబడుల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, వరంగల్ తదితర జిల్లాల్లో నాలుగు క్రిప్టో కరెన్సీ యాప్ల ద్వారా కేటుగాళ్లు సుమారు రూ. 300 కోట్లు కొల్లగొట్టి జనాన్ని నిండా ముంచారు. ఈ వ్యవహారంలో పరారీలో ఉన్న ముంబైకి చెందిన ప్రధాన నిందితుడు హిమాన్ష్ను గత నెల 31న హైదరాబాద్లోని ఉప్పల్ పరిధిలో మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ముంబైకి చెందిన డాక్టర్ హిమాన్ష్ మొదట ఓ క్రిప్టో యాప్ ద్వారా సుమారు రూ. 150 కోట్ల మేర పెట్టుబడులు సేకరించాడు. ఆపై ఉన్నపళంగా దాన్ని మూసేసి దుబాయ్ పరారయ్యాడు. కొన్ని రోజులకు తిరిగివచ్చి ఇంకో యాప్లో సుమారు రూ. 130 కోట్ల మేర పెట్టుబడులు రాబట్టాడు. ఆ యాప్ను కూడా 6 నెలల క్రితం మూసేసి మళ్లీ దుబాయ్ చెక్కేశాడు. ఇటీవలే మళ్లీ వచ్చి ఇంకో యాప్ ద్వారా పెట్టుబడులు సేకరించాడు. పెట్టుబడి పెట్టిన వారిలో 40 మందిని ఇటీవలే విహారయాత్ర కోసం బ్యాంకాక్కు తీసుకెళ్లాడు. గత నెల 31న హైదరాబాద్లోని ఓ హోటల్లో పెట్టుబడిదారులతో సమావేశం నిర్వహిస్తుండగా మేడిపల్లి పోలీసులు హిమాన్ష్ను అరెస్ట్ చేశారు.కరీంనగర్కు చెందిన జమీల్, అనిల్, సిరిసిల్లకు చెందిన వంశీ, నిజామాబాద్కు చెందిన శ్రీనివాస్లను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెట్టుబడుల సొమ్మును హిమాన్ష్ దుబాయ్ మళ్లించడంతో ఈ స్కాం వెనుక అంతర్జాతీయ ముఠా ప్రమేయం ఉందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. నిందితులు నెక్ట్స్బిట్ అనే క్రిప్టో కరెన్సీ యాప్ ద్వారా రూ. 19 కోట్లు సేకరించినట్లు సుమారు 400 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో హిమాన్ష్కు రికీ ఫామ్ (ఫారిన్ ఆపరేటర్), అశోక్ శర్మ (థాయ్లాండ్ ఆపరేటర్), డీజే సొహైల్ (రీజినల్ రిక్రూటర్), మోహన్ (సహాయకుడు), అశోక్కుమార్ సింగ్ (హిమాన్ష్ సహాయకుడు) సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే హిమాన్ష్ గతంలో రిక్సోజ్ అనే క్రిప్టో యాప్ను నడిపించినట్లు కనుగొన్నారు. అయితే బాధితులు మాత్రం హిమాన్ష్ మరో రెండు యాప్లను సైతం నిర్వహించి తమను మోసగించారని ఆరోపిస్తున్నారు. త్వరలో మెటా యాప్పైనా చర్యలు.. ఇదే తరహాలో కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్లలో మెటా యాప్ పేరుతో రూ. 100 కోట్ల వరకు కొల్లగొట్టిన మెటా యాప్ నిర్వాహకులపైనా పోలీసులు దృష్టిపెట్టారు. దీనిపై ఇప్పటికే డీజీపీ కార్యాలయానికి ఫిర్యాదులు వెళ్లాయి. నిఘా వర్గాలు సైతం ఈ కేసులో సూత్రధారిగా ఉన్న లోకేశ్, ఓ మాజీ కార్పొరేటర్, ప్రకాశ్, రమేశ్, రాజు అనే వ్యక్తులపై పూర్తి వివరాలు సేకరించారు. లోకేశ్ ప్రస్తుతం దేశం విడిచి పరారయ్యాడని పోలీసులు నిర్ధారించుకున్నారని సమాచారం. ఈ కేసులో అరెస్టుల పర్వం మొదలైతే నిందితుడిని ఇండియాకు రప్పించడం ప్రహసనంగా మారనుంది. -
యూపీఐలో కొత్త మార్పులు వచ్చేశాయ్..
యూపీఐ చెల్లింపుల్లో కొత్త మార్పులు వచ్చేశాయి. గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం వంటి యాప్లలో డిజిటల్ చెల్లింపు కార్యకలాపాలను ఆప్టిమైజ్ చేయడమే లక్ష్యంగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) అమలు చేస్తున్న ఈ మార్పులను తీసుకొచ్చింది. ఈ మార్పులు రోజువారీ ఉపయోగంలో పలు యూపీఐ ప్రక్రియలను ప్రభావితం చేస్తాయి. అవేంటో ఈ పథనంలో క్లుప్తంగా తెలుసుకుందాం..ఆటోపే అభ్యర్థనలకు ప్రత్యేక సమయంఇకపై ఓటీటీ సబ్స్క్రిప్షన్లు, యుటిలిటీ బిల్లులు లేదా సిప్ ఇన్వెస్ట్మెంట్స్ వంటి సేవల కోసం యూపీఐ ఆటోపే అభ్యర్థనలు అర్ధరాత్రి 12:00 గంటల నుంచి ఉదయం 7:00 గంటల మధ్య మాత్రమే చేసే వీలుంటుంది. పగటిపూట యూపీఐ వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించడానికి ఈ ఏర్పాటు చేశారు.బ్యాలెన్స్ చెక్ లిమిట్యూపీఐ యాప్ల ద్వారా తరచూ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఇకపై రోజువారీ పరిమితికి లోబడి ఉంటుంది. పరిమితి బహిరంగంగా పేర్కొనబడనప్పటికీ, చాలా మంది వినియోగదారులు రోజుకు కొన్నిసార్లు వారి బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే ఎటువంటి అంతరాయం కనిపించదు.లావాదేవీ ఫెయిలైతే వెంటనే తెలుస్తుందిపేమెంట్ ఫెయిల్యూర్స్ కు సంబంధించి కీలక అప్ డేట్స్ లో ఇది ఒకటి. ఒక లావాదేవీ విజయవంతమైందా లేదా విఫలమైందా అని యూపీఐ యాప్స్ కొన్ని సెకన్లలోనే ధృవీకరించాలి. ఇది వినియోగదారులు తమ చెల్లింపులను "ప్రాసెసింగ్" గా ఎక్కువ కాలం మార్క్ చేసినప్పుడు తరచుగా ఎదుర్కొనే నిరీక్షణ సమయాలను తగ్గిస్తుంది.బ్యాంకు అకౌంట్ లింక్కు కఠిన తనిఖీలుకొత్త బ్యాంకు ఖాతాలను యూపీఐతో అనుసంధానం చేసే విషయంలో భద్రతా నిబంధనలను కఠినతరం చేశారు. లింకింగ్ ప్రక్రియలో వినియోగదారులు తమ బ్యాంకుల నుండి అదనపు ధృవీకరణను ఎదుర్కోవాల్సి రావచ్చు. అనధికారిక ఖాతా చేర్పులను నిరోధించడానికి దీన్ని అమలు చేస్తున్నారు. -
పిల్లలంతా కలిసి కోట్లు కూడబెట్టారు!
ఇంజనీరింగ్లో చేరిన 17 ఏళ్ల కపిశ్ ల్యాప్టాప్ కొనుక్కోవడానికి వాళ్ల నాన్నను డబ్బులు అడిగాడు. కాలేజీ ఫీజుకే అప్పుచేసిన అతడి తండ్రి ల్యాప్టాప్ కొనడానికి మళ్లీ అప్పు చేయడానికి రెడీ అయ్యాడు. చదువులు అన్నాక అవసరమైనవి కొనక తప్పదు. ఈ రోజుల్లో ఉన్నత చదువులకు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టాల్సివస్తోంది. ఫీజులతో పాటు పుస్తకాలు, ల్యాప్టాప్ల కోసం అదనంగా బడ్జెట్ సమకూర్చుకోవాల్సి వస్తోంది. దీంతో పిల్లల చదువులు తల్లిదండ్రులకు తలకు మించిన భారం అవుతున్నాయి. అయితే తమకు అలాంటి బాధ లేదంటున్నారు గుజరాత్లోని సబర్కాంత జిల్లా ఇదార్ తహసీల్లోని గ్రామాలకు చెందిన ప్రజలు. ఎందుకంటే వారికి అండగా బాలగోపాల్ బ్యాంక్ ఉంది. నిజానికిది బ్యాంక్ కాదు, కోపరేటివ్ సొసైటీ!పల్కిన్ రావల్ అనే 12వ తరగతి విద్యార్థిని తాను కూడబెట్టిన డబ్బులతో ఇటీవల ల్యాప్టాప్ (Laptop) కొనుక్కుంది. పదో తరగతి ట్యూషన్ ఫీజు కూడా తన సేవింగ్స్ నుంచే కట్టింది. అంతేకాదు కొత్త సైకిల్ కూడా కొనుక్కుంది. బాలగోపాల్ బ్యాంక్లో దాచుకున్న డబ్బుతో ఇవన్ని చేసింది. ఇంత చేసి ఆమెది ధనవంతులు కుటుంబమేమీ కాదు. ఇదార్ పట్టణంలో వాళ్ల నాన్న టీ స్టాల్ నడుపుతాడు. బాలగోపాల్ బ్యాంక్లో క్రమంగా తప్పకుండా చేస్తున్న చిన్న మొత్తాల పొదుపే వారి అవసరాలు తీరుస్తోంది. పల్కిన్ రావల్ తోబుట్టువులు కూడా ఇదే బ్యాంక్లో పొదుపు చేస్తున్నారు. దాదాపు 30 వేల మందిపైగా పిల్లలు ఈ బ్యాంక్లో తమ డబ్బులు దాచుకుంటున్నారు. ఇలా పిల్లలు పొదుపు చేసిన మొత్తం రూ. 30 కోట్లు పైమాటే అంటే ఆశ్చర్యం కలగకమానదు. ఇంతకీ బాలగోపాల్ బ్యాంక్ (Bal Gopal Bank) ఇదంతా ఎలా చేయగలిగింది?ఎవరు స్థాపించారు?ఇదార్ పట్టణవాసి అశ్విన్ పటేల్ ఆలోచనలకు ప్రతిరూపమే ఈ బాలగోపాల్ బ్యాంక్. 16 ఏళ్ల క్రితం ఆయన ఈ బ్యాంక్ను ప్రారంభించారు. రైతులకు, మహిళలకు సహకార సంఘాలు ఉన్నట్టుగా పిల్లలకు ఎందుకు లేవన్న ప్రశ్న ఆయనకు ఎదురైంది. దీనికి సమాధానంగా 2009, మే 30న సబర్కాంత జిల్లాలోని జవాన్పురా గ్రామంలో 'బాలగోపాల్ సేవింగ్స్ అండ్ క్రెడిట్ కోపరేటివ్ సొసైటీ' స్థాపించారు. 100 మంది పిల్లలతో ప్రారంభమైన ఈ సంస్థలో ఇప్పుడు 335 గ్రామాల నుంచి 30 వేలమందిపైగా పిల్లలు సభ్యులుగా ఉన్నారు. దేశంలో పిల్లల కోసం నడుస్తున్న ఏకైక సహకార సంస్థ తమదేనని 58 ఏళ్ల అశ్విన్ పటేల్ వెల్లడించారు. దీంతో స్థానికంగా అందరూ దీన్ని బాలగోపాల్ బ్యాంక్గా పిలుస్తున్నారు. ఎలా పని చేస్తుంది?పిల్లలు పుట్టిన వెంటనే తల్లిదండ్రులు రూ. 110 చెల్లించి బాలగోపాల్ బ్యాంక్లో ఖాతా తెరవాలి. వారికి సంస్థ ప్రతినిధులు ఒక పిగ్గీ బ్యాంక్ (డిబ్బి) ఇస్తారు. ఇందులో పొదుపు చేసిన డబ్బును ప్రతినెలా ఇంటికి వచ్చి తల్లిదండ్రులు లేదా పెద్దవారి సమక్షంలో లెక్కిస్తారు. తర్వాత ఈ మొత్తాన్ని తీసుకెళ్లి పిల్లల ఖాతాల్లో వేస్తారు. పొదుపు చేసిన డబ్బుకు సంవత్సరానికి 6 శాతం వడ్డీ చెల్లిస్తారు. పిల్లలు తమకు అవసరమైనప్పడు లోన్లు కూడా తీసుకోవచ్చు. వెయ్యి మందిపైగా రుణాలు తీసుకున్నారని బ్యాంక్ తెలిపింది. బాలగోపాల్ బ్యాంక్ పనితీరు ప్రశంసనీయంగా ఉండడంతో ఆదరణ అంతకంతకు పెరుగుతోంది. 'మొదట్లో పిల్లలతో పొదుపు ప్రారభింపజేయడానికి స్థానిక పాఠశాలల్లో ప్రత్యేకంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు నిర్వహించేవాళ్లం. ఇప్పుడైతే తల్లిదండ్రులే తమ పిల్లలతో కలిసి వచ్చి బ్యాంక్లో ఖాతాలు తెరుస్తున్నార'ని అశ్విన్ పటేల్ తెలిపారు. 10 నుంచి 12 పిల్లలు తమ దగ్గర పొదుపు చేసిన డబ్బుతో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం ఫీజులు చెల్లించారని ఆయన వెల్లడించారు. అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి 18 ఏళ్లలోపు ఎవరైనా తమ సంస్థలో డబ్బులు దాచుకోవచ్చని చెప్పారు. దీంతో స్థానికంగా అందరూ దీన్ని 'పిల్లల బ్యాంక్'గా పిలుస్తున్నారు.పేరెంట్స్ ప్రశంసలుబాలగోపాల్ బ్యాంక్ సేవలను పేరెంట్స్ ప్రశంసిస్తున్నారు. తమ పిల్లలు చిన్నతనం నుంచే ఆర్థిక అక్షరాస్యత, పొదుపు పాఠాలను ప్రాక్టికల్గా నేర్చుకుంటున్నారని వారు అంటున్నారు. డబ్బు పొదుపు ప్రాముఖ్యతతో పాటు, సేవ్ చేసిన సొమ్ములను సరైన వాటికి ఖర్చుచేయడం వారికి అలవాటు అవుతోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పొదుపు చేసిన డబ్బుతో పిల్లల చదువులు సజావుగా సాగుతున్నాయని తెలిపారు.చదవండి: పిల్లలూ బ్యాంక్ తలుపు తట్టండి!పైలట్ ప్రాజెక్ట్గా.. బాలగోపాల్ బ్యాంక్ విజయవంతంగా నడుస్తుండడంతో దీన్ని మిగతా ప్రాంతాల్లోనూ అమలు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 25 పాఠశాలల్లో 'బాల్ గోపాల్ బచత్ బ్యాంక్ యోజన’ పైలట్ ప్రాజెక్ట్గా అమలు చేస్తోంది. 5 నుంచి 18 ఏళ్ల వయసున్న పిల్లల కోసం దీన్ని ప్రవేశపెట్టింది. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ సొంత నియోజకవర్గం ఘట్లోడియాలోని గుజరాతీ, హిందీ, ఇంగ్లీషు మీడియం స్కూళ్లలో బాల్ గోపాల్ బచత్ బ్యాంక్ యోజనను తాత్కాలికంగా అమలు చేస్తున్నారు. బాలగోపాల్ బ్యాంక్ గురించి తెలిసిన వారు తమ ప్రాంతంలోనూ ఇలాంటి పిల్లల బ్యాంకు ఉంటే బాగుండు అనుకుంటున్నారు. -
ఉజ్వల భవిష్యత్తు కోసం.. ఎల్ఐసీ స్కీమ్: నెలకు రూ.7000 అకౌంట్లోకి
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) 'ఎల్ఐసీ బీమా సఖి యోజన'ను ప్రారంభించింది. దీని లక్ష్యం ఏమిటంటే.. మహిళలకు స్థిరమైన నెలవారీ ఆదాయాన్ని సంపాదించే అవకాశాన్ని అందించడం మాత్రమే కాకుండా.. దీని ద్వారా వారికి సాధికారత కల్పించడం, బీమా అవగాహన.ఎల్ఐసీ బీమా సఖి యోజన గురించిదేశవ్యాప్తంగా మహిళలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా.. ఎల్ఐసీ బీమా సఖి యోజన పేరుతో ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2024 డిసెంబర్ 9న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ పథకంలో మహిళలు బీమా సఖీలుగా మారడానికి శిక్షణ ఇస్తారు.ఎల్ఐసీ బీమా సఖి పథకం మహిళలు ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవడానికి సహాయపడుతుంది, తద్వారా సాధికారత వైపు అడుగులు వేయడానికి వీలు కల్పిస్తుంది. బలమైన మహిళలు, బలమైన భవిష్యత్తు అంటూ.. ఎల్ఐసీ ఇండియా ట్వీట్ చేసింది.దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలుకనీసం పదో తరగతి పూర్తి చేసిన 18 నుంచి 70 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.కావలసిన డాక్యుమెంట్స్➤జనన ధ్రువీకరణ పత్రం➤అడ్రస్ ప్రూఫ్➤విద్యా అర్హత సర్టిఫికేట్స్➤లేటెస్ట్ పాస్పోర్ట్ సైజు ఫోటోలుస్టైఫండ్ వివరాలుఎల్ఐసీ బీమా సఖి యోజన పథకంలో చేరినవారు మూడు సంవత్సరాల పాటు ప్రత్యేక శిక్షణ పొందుతారు. ఈ సమయంలో వారికి నెలవారీ స్టైఫండ్ అందిస్తారు. మొదటి ఏడాది స్టైపెండ్ రూ.7000, రెండో ఏడాది రూ.6000, మూడో ఏడాది రూ.5000 ఉంటుంది. అంతే కాకుండా.. నిబంధనలకు అనుగుణంగా ఇన్సెంటివ్లు అందిస్తారు. బీమా విక్రయ లక్ష్యాలను సాధించిన మహిళలు కమీషన్ ఆధారిత రివార్డులను కూడా పొందవచ్చు.దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులుప్రస్తుత ఎల్ఐసీ ఏజెంట్లు, ఎల్ఐసీ ఉద్యోగుల దగ్గర బంధువులు (భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, తోబుట్టువులు, అత్తమామలు), పదవీ విరమణ చేసిన కార్పొరేషన్ ఉద్యోగులు, మాజీ ఏజెంట్లు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.Strong Women, Stronger Futures!LIC's Bima Sakhi scheme helps women build a brighter future, enabling them to take steps towards self-reliance and empowerment.Swawalambi Naari,Khushhali Hamari#LIC #BimaSakhi #WomenEmpowerment pic.twitter.com/cVuY3Xha42— LIC India Forever (@LICIndiaForever) July 17, 2025 -
రిటైర్ అవుతున్నారా? అద్దె ఆదాయం కొంత వరకే!
పింఛను సదుపాయం ఏర్పాటు చేసుకున్న వారిని మినహాయిస్తే రిటైర్మెంట్ తర్వాత చాలా మందికి స్థిరమైన ఆదాయం పెద్ద సవాలుగా మారుతుంది. రిటైర్మెంట్ తర్వాత స్థిరాస్తులు కొందరు ఇంటి అద్దె రూపంలో ఆదాయ మార్గంపై ఆధారపడుతుంటారు. కానీ ఇంటి అద్దె స్థిరమైనదని చెప్పలేం. కిరాయిదారు ఉన్నట్టుండి ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవచ్చు. కొత్త వారు రావడానికి కొంత సమయం పడితే అప్పటి వరకు అద్దె ఆదాయం ఉండదు.ఇంటికి మరమ్మతులు, పన్నులు తదితర ఇతర నిర్వహణ వ్యయాల భారం మోయాల్సి ఉంటుంది. ఇల్లు పాతదవుతుంటే అద్దె పెరుగుదల ఆశించిన మేర ఉండదు. కరోనా సమయంలో చాలా మంది ఇంటి అద్దెలను సకాలంలో చెల్లించలేకపోయారు. ఉద్యోగాలు కోల్పోయిన సందర్భాల్లోనూ కిరాయిదారు అద్దెను సకాలంలో చెల్లించలేకపోవచ్చు. కొందరు వడ్డీ వ్యాపారం చేస్తుంటారు. కానీ, ఇందులో రిస్క్ ఎక్కువ. కాబట్టి పెట్టుబడులపై స్థిరమైన ఆదాయానికి మార్గం చూడాలి.పెట్టుబడి వృద్ధి చెందేలా..పెట్టుబడికి ఎంపిక చేసుకునే సాధనం కచ్చితంగా ద్రవ్యోల్బణాన్ని మించి వృద్ధి చెందేలా ఉండాలి. అలాంటప్పుడే నెలవారీ రాబడి మేర ఉపసంహరించుకున్నా కానీ, పెట్టుబడి విలువను స్థిరంగా కాపాడుకోవచ్చు. ఈక్విటీలు ఈ విషయంలో ఎంతో మెరుగైనవి. ఉదాహరణకు రూ.20 లక్షల మొత్తాన్ని 7 శాతం రాబడినిచ్చే డెట్ సాధనంలో ఇన్వెస్ట్ చేసి ప్రతి నెలా రూ.20,000 చొప్పున ఉపసంహరించుకున్నారనుకోండి. ఏడాది ముగిసిన తర్వాత రూ.18.92 లక్షల పెట్టుబడి మిగిలి ఉంటుంది. అంటే ఏడాదిలో రూ.3 లక్షలను ఉపసంహరించుకోవడంతో పెట్టుబడి సైతం రూ.1.08 లక్షలు తరిగింది.ఇదీ చదవండి: ‘వేగంగా ఏఐ విస్తరణ.. మార్పునకు సిద్ధపడాలి’ఇలాగే ఉపసంహరించుకుంటూ వెళితే 12 ఏళ్లకు ఆ పెట్టుబడి కరిగిపోతుంది. అదే ఈక్విటీల్లో అయితే 12% వరకు సగటు వార్షిక రాబడి ఉంటుంది. రిస్క్ తక్కువగా ఉండే హైబ్రిడ్, సేవింగ్స్ ఫండ్స్లో అయితే 10% వరకు రాబడిని ఆశించొచ్చు. ఈ తరహా సాధనాలతో స్థిరమైన ఆదాయానికి తోడు పెట్టుబడినీ కాపాడుకోవచ్చు, వృద్ధి చేసుకోవచ్చు. ఇదే రూ.20 లక్షలను 12% రాబడినిచ్చే ఫండ్లో ఇన్వెస్ట్ చేసి ప్రతి నెలా రూ.20వేల చొప్పున ఉపసహరిస్తే 26 ఏళ్ల కాలానికి ఆ పెట్టుబడి స్థిర ఆదాయాన్నిస్తుంది. 10% రాబడి ప్రకారమైనా 17 ఏళ్ల పాటు ఆదాయాన్నిస్తుంది. వార్షిక రాబడి రేటులో మైనస్ 3% చొప్పున ఉపసంహరణకు పరిమితం కావడం వల్ల.. మిగిలిన 3% పెట్టుబడి వృద్ధికి చాన్సుంటుంది. దీంతో ద్రవ్యోల్బణం వల్ల పెరిగే జీవన వ్యయాలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. -
ఫ్రీగా ఇచ్చే క్రెడిట్ కార్డులు.. పైకి కనిపించని ఛార్జీలు
ప్రస్తుత రోజుల్లో క్రెడిట్ కార్డుల వినియోగం విస్తృతంగా పెరిగిపోయింది. దాదాపు అన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డులు జారీ చేస్తుంటాయి. వీటితో పలు ఇతర సంస్థలూ క్రెడిట్ కార్డులు ఇస్తున్నాయి. వీటిలో అనేక రకాలు ఉన్నాయి. క్రెడిట్ కార్డులకు సాధారణంగా వార్షిక రుసుము ఉంటుంది. ఇది కార్డు రకాన్ని, జారీ చేసే బ్యాంకు, సంస్థను బట్టి ఉంటుంది. కానీ ఎలాంటి రుసుము లేకుండా జీవితకాల ఉచిత క్రెడిట్ కార్డులూ కొన్ని సంస్థలు లేదా బ్యాంకులు ఇస్తున్నాయి. ఉచితమే కదా చాలామంది వీటిని తీసుకుంటున్నారు. అయితే ఎలాంటి రుసుము లేకపోయినప్పటికీ కంటికి కనిపించని కొన్ని ఛార్జీలు వీటికి ఉంటాయి. 'లైఫ్ టైమ్ ఫ్రీ' అయిన క్రెడిట్ కార్డుల విషయంలో దాగిఉన్న ఖర్చులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..అధిక వడ్డీ రేట్లువార్షిక రుసుములు లేనప్పటికీ, ఈ కార్డులు అధిక వడ్డీ రేట్లను కలిగి ఉండవచ్చు. తద్వారా మీ కార్డు వాడకం మరింత ఖరీదైనదిగా మారుతుంది. 'లైఫ్ టైమ్ ఫ్రీ' క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసేటప్పుడు దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి.విదేశీ లావాదేవీ మార్పిడి రుసుమువార్షిక రుసుము లేనప్పటికీ, ఈ కార్డులకు ఫారెక్స్ మార్క్-అప్ ఫీజు (2 నుండి 4 శాతం మధ్య) ఉండవచ్చు. ఇది యూఎస్ డాలర్ లేదా బ్రిటిష్ పౌండ్లు వంటి విదేశీ కరెన్సీలో ఏదైనా ఉత్పత్తి లేదా సర్వీస్ కోసం చెల్లింపు సమయంలో వసూలు చేస్తారు. . 'లైఫ్ టైమ్ ఫ్రీ' క్రెడిట్ కార్డు పొందే సమయంలో ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.ఓవర్ లిమిట్ ఫీజుమీరు నగదు ఉపసంహరణను ఎంచుకున్నప్పుడు లేదా క్రెడిట్ లిమిట్ దాటి కార్డును ఉపయోగించినప్పుడు, బ్యాంకు దానిపై ఓవర్ లిమిట్ ఫీజును విధించవచ్చు. ఇది గుర్తుంచుకోవలసిన మరొక అంశం.ఆలస్య చెల్లింపు పెనాల్టీలుకార్డు జీవితకాలం ఉచితం అయినప్పటికీ క్రెడిట్ కార్డు బిల్లును సకాలంలో చెల్లించనప్పుడు ఆలస్య చెల్లింపు పెనాల్టీలు ఉండవచ్చు. ఇది ఇతర కార్డుల కంటే ఎంత ఎక్కువగా ఉందో చూసుకోవాలి.ఇనాక్టివిటీ ఫీజులుకొంత మంది కార్డును తరచుగా ఉపయోగించరు. దీనికిగానూ కొన్ని కార్డు ప్రొవైడర్ సంస్థలు రుసుము విధించవచ్చు. మునుపటి సంవత్సరంలో మొత్తం ఖర్చు ఒక పరిమితిని దాటినప్పుడు మాత్రమే బ్యాంకులు కొన్ని కార్డులకు వార్షిక రుసుమును మాఫీ చేస్తాయి.ప్రాసెసింగ్ ఫీజుఇది బ్యాంకులు విధించే సాధారణ రుసుము కానప్పటికీ, ప్రాసెసింగ్ లేదా నిర్వహణ ఖర్చుల కోసమంటూ దీన్ని బ్యాంకులు చేస్తాయి. ఇది మీ కార్డుకు సాధారణంగానే ఉందా లేదా మరీ ఎక్కువగా ఉందా అన్న అన్న విషయాన్ని గమనించాలి. -
ఆగస్టులో బ్యాంకులు.. వరుస సెలవులు
పలు పండుగలు, జాతీయ సెలవులు రావడంతో ఈ ఆగస్టు నెలలో దేశం అంతటా బ్యాంకులు 15 రోజుల వరకు మూసి ఉంటాయి. అయితే ఈ సెలవులు అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉండవు. బ్యాంక్ సెలవుల జాబితా, వాటి ప్రాంతీయ ప్రాముఖ్యత, సెలవుల నేపథ్యంలో వినియోగదారులు తమ లావాదేవీలను ముందుగానే ఎలా ప్లాన్ చేయవచ్చో ఈ కథనంలో తెలుసుకుందాం.ఆగస్టులో బ్యాంకు సెలవుల పూర్తి జాబితారిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) క్యాలెండర్ ప్రకారం.. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద సెలవుదినం, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ హాలిడే, బ్యాంకుల ఖాతాల మూసివేత అనే మూడు కేటగిరీల కింద బ్యాంకులు సెలవు దినాలను పాటిస్తాయి. 2025 ఆగస్టులో గుర్తించదగిన మూసివేతలు ఇలా ఉంటాయి.ఆగష్టు 1 బ్యాంకు సెలవు (రాష్ట్రాలను బట్టి మారుతుంది)ఆగస్టు 3 - ఆదివారంఆగస్టు 8 - రక్షా బంధన్ (రాజస్థాన్, ఉత్తరాఖండ్, యూపీ)ఆగస్టు 9 - రెండో శనివారంఆగస్టు 10 - ఆదివారంఆగస్టు 15 - స్వాతంత్ర్య దినోత్సవం / పార్శీ నూతన సంవత్సరం (ముంబై, నాగపూర్)ఆగస్టు 16 - కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో జోనల్ సెలవుఆగస్టు 17 - ఆదివారంఆగష్టు 23- నాలుగో శనివారంఆగస్టు 24 - ఆదివారంఆగష్టు 25 జన్మాష్టమి (అనేక రాష్ట్రాలు)ఆగస్టు 31 - ఆదివారంతీజ్, హర్తాలికా, ఓనం వంటి స్థానిక పండుగల ఆధారంగా ఇతర ప్రాంతీయ సెలవులు వ్యక్తిగత రాష్ట్రాల్లో వర్తించవచ్చు.ఆన్లైన్ సేవలుబ్యాంకుల ఫిజికల్ బ్రాంచీలు మూసివేసినప్పటికీ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం విత్డ్రా వంటి ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. వినియోగదారులు చెల్లింపులు చేయడం, బ్యాలెన్స్ చెకింగ్, డిజిటల్ ట్రాన్స్ఫర్లు చేసుకోవచ్చు. -
కార్డు ఉంది కదా అని రెచ్చిపోతున్నారు!
భారత్లో క్రెడిట్ కార్డు రుణ సంక్షోభం పెరుగుతోంది. ప్రముఖ క్రెడిట్ బ్యూరో సీఆర్ఐఎఫ్ హై మార్క్ దీనికి సంబంధించిన డేటాను విడుదల చేసింది. బ్యాంకుల నుంచి తీసుకున్న క్రెడిట్కార్డుల బిల్లులు కట్టలేక డిఫాల్ట్లు అధికమవుతున్నట్లు తెలిపింది. అన్సెక్యూర్డ్ లోన్ల చెల్లింపులు బ్యాంకింగ్ వ్యవస్థకు ప్రమాదకరంగా మారుతుందని పేర్కొంది.సీఆర్ఐఎఫ్ హై మార్క్ నివేదికలోని అంశాలు..2025 మార్చి నాటికి 91 నుంచి 360 రోజుల వరకు చెల్లించని క్రెడిట్ కార్డు రుణాలు రూ.33,886 కోట్లకు పెరిగాయి. ఇది ఏడాది ప్రాతిపదికన 44% పెరిగింది.91-180 రోజుల గడువు కార్డు రుణాలు రూ.29,983.6 కోట్లు (2024లో రూ.20,872.6 కోట్ల నుంచి పెరిగింది)గా ఉంది.పోర్ట్ఫోలియో ఎట్ రిస్క్ (పీఏఆర్) 2024లో 6.9 శాతంగా ఉంది కాస్తా ఇప్పుడు 8.2 శాతానికి పెరిగింది.181-360 రోజులు గడువు ముగిసిన పీఏఆర్ 0.9 శాతం నుంచి 1.1 శాతానికి పెరిగింది.పెరుగుతున్న క్రెడిట్ కార్డు వినియోగం..కొన్నేళ్లుగా డిజిటల్ విస్తరణ, ఫైనాన్షియల్ టెక్నాలజీ ఇన్నోవేషన్, పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో భారత క్రెడిట్ కార్డ్ మార్కెట్ అధికమైంది.డిఫాల్ట్లు ఎందుకు పెరుగుతున్నాయి?ఆకర్షణీయమైన ఆఫర్లు: క్యాష్ బ్యాక్ రివార్డులు, ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్, నో కాస్ట్ ఈఎంఐలు ఆదాయానికి మించి ఖర్చును ప్రోత్సహిస్తున్నాయి.లైఫ్స్టైల్ ద్రవ్యోల్బణం: క్రెడిట్ కార్డులు స్టేటస్ సింబల్స్గా మారాయి. ఇది వినియోగదారులను బారీగా ఖర్చు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నాయి.ఆర్థిక నిరక్షరాస్యత: చాలా మంది వినియోగదారులకు బిల్లింగ్ సైకిల్స్, లేట్ పేమెంట్ లేదా కాంపౌండింగ్ వడ్డీ ఎలా పనిచేస్తుందో అవగాహన లేదు.ఆర్థిక వ్యవస్థకు హెచ్చరికక్రెడిట్ కార్డు ఎన్పీఏలు (నిరర్థక ఆస్తులు) పెరగడంతో బ్యాంకింగ్ వర్గాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) హెచ్చరిస్తోంది.అన్ సెక్యూర్డ్ లెండింగ్: క్రెడిట్ కార్డులు స్వభావరీత్యా అధిక రిస్క్ కలిగి ఉంటాయి. ఎందుకంటే తిరిగి చేసే చెల్లింపులపై ఎలాంటి పూచీకత్తు ఉండదు. మొండిబకాయిలు పెరగడం వల్ల బ్యాంకులు నష్టాల్లోకి జారుకుంటున్నాయి.రెగ్యులేటరీ చర్య: 2023లో ఆర్బీఐ క్రెడిట్ కార్డు రుణాలపై రిస్క్ పెంచింది. సంభావ్య నష్టాలను పూడ్చడానికి బ్యాంకులు ఎక్కువ మూలధనాన్ని కేటాయించవలసి వస్తుంది.కఠిన రుణ నిబంధనలు: డిఫాల్ట్లు పెరిగేకొద్దీ బ్యాంకులు రుణాలు జారీ చేయడంలో మరింత జాగ్రత్తలు వహించాలి.ఇదీ చదవండి: దేశంలో ఏఐ, ఎడ్టెక్ల విస్తరణ.. కానీ..వినియోగదారులు చేయాల్సింది..క్రెడిట్ కార్డులను ఆర్థిక సాధనాలుగా పరిగణించాలి. కానీ ఉచితంగా వచ్చే డబ్బుగా భావించకూడదు.అధిక వడ్డీ ఛార్జీల నుంచి తప్పించుకోవడానికి సకాలంలో పూర్తి బకాయిలు చెల్లించాలి.మెరుగైన క్రెడిట్ స్కోర్ కోసం సకాలంలో చెల్లింపులు చేయాలి. అందుకు క్రెడిట్ రిపోర్టులను పర్యవేక్షించాలి.బిల్లింగ్ సైకిల్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలి. ఆఫర్లు, ఈఎంఐలపై అవగాహన పెంచుకోవాలి. -
ఫైనాన్షియల్ మోసాలకు చెక్ పెట్టేలా 5 చర్యలు
డిజిటల్ లావాదేవీలు, ఆన్లైన్ పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక నియంత్రణ సంస్థలు అత్యవసర సర్వీసులు ప్రారంభిస్తున్నాయి. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) సంయుక్తంగా పెట్టుబడిదారుల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా హెచ్చరికలను జారీ చేస్తున్నాయి.డిజిటల్ ఫైనాన్షియల్ మోసాలు పెరుగుతున్నందున, రిటైల్ ఇన్వెస్టర్లను లక్ష్యంగా చేసుకుని కొందరు సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఈ తరుణంలో ఇన్వెస్టర్లకు పెట్టుబడి సాధనాలతోపాటు టెక్నాలజీపై అవగాహన కల్పించడమే లక్ష్యం పెట్టుకున్నాయి. మొబైల్ యాప్లు, ఆన్లైన్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లు, ఇన్ఫ్లుయెన్సర్ ఆధారిత కంటెంట్ పెరిగిపోతుండడంతో ఇన్వెస్టర్లు మోసాల బారిన పడుతున్నారు.గ్యారెంటీడ్ రిటర్న్స్.. ఇన్వెస్టర్ల పెట్టుబడులపై గ్యారెంటీడ్ రిటర్న్స్ అంటూ సైబర్ నేరగాళ్లు తప్పుదోవ పట్టిస్తున్నారు.డిజిటల్ హైజీన్: ఇన్వెస్టర్లు సెబీ రిజిస్టర్డ్ యాప్లను మాత్రమే ఉపయోగించాలి. అధికారిక ఛానెళ్లలో మధ్యవర్తులను వెరిఫై చేసుకోవాలి. కాదని ప్రత్యేకంగా నేరగాళ్లు పంపే లింక్లపై క్లిక్ చేస్తే మొదటికే మోసం వస్తుంది.పెట్టుబడి సలహాలు: ముఖ్యంగా సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్లు లేదా ఈమెయిల్స్ లోని తెలియని సోర్స్ నుంచి వస్తున్న సమాచారాన్ని నమ్మవద్దు. ఉచిత సలహా వెనుక ఉన్న ఉద్దేశాన్ని ఎవరికివారు నిత్యం ప్రశ్నించుకోవాలి.సెబీ రిజిస్టర్డ్ యాప్లు: సెబీ రిజిస్టర్డ్ యాప్లను మాత్రమే డౌన్ లోడ్ చేసుకోవాలి. సదరు యాప్ సెబీ అధికారిక జాబితాలో లేకపోతే దాన్ని వెంటనే డిలీట్ చేయాలి. ఫిషింగ్, మోసం స్కీమ్ల్లో నకిలీ యాప్లే సాధనంగా ఉంటాయి.మధ్యవర్తులను వెరిఫై చేయడం: బ్రోకర్లు, సలహాదారులు, ఇతర ప్లాట్ఫామ్ల చట్టబద్ధతను ధ్రువీకరించుకోవాలి. అందుకు సెబీ అధికారిక పోర్టలో ఉపయోగపడుతుంది.ఇదీ చదవండి: ‘ఏఐ మా ఉద్యోగులను ఏం చేయలేదు’అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే రిపోర్ట్ చేయాలి. ముందస్తు రిపోర్టింగ్ ఇతరులను రక్షించడంలో సహాయపడుతుంది. రెగ్యులేటర్లు వేగంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. -
ఇన్వెస్టర్లూ.. ఇవిగో కొత్త ఫండ్లు
మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్.. స్పెషల్ అపార్చూనిటీస్ ఫండ్ పేరుతో న్యూ ఫంఢ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో)ను ప్రకటించింది. ఆగస్ట్ 8తో ముగుస్తుంది. తిరిగి ఆగస్ట్ 21 నుంచి పెట్టుబడులకు అందుబాటులోకి వస్తుంది. వ్యాపార పరంగా ప్రత్యేక అవకాశాలను చూస్తున్న కంపెనీల్లో ఈ పథకం పెట్టుబడులు పెడుతుంది. కార్పొరేట్ స్థాయిలో కంపెనీ వ్యాపారాల విభజన, విలీనాలు, కొనుగోళ్లు, ప్రభుత్వ విధానాల్లో మార్పులు, ఏదైనా రంగాల్లో కొత్తగా అవకాశాలు ఏర్పడుతుండడం, నియంత్రణపరమైన మార్పులను అవకాశాలుగా మలుచుకుని ఇన్వెస్ట్ చేస్తుంది.కనీసం రూ.500 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పెట్టుబడిని మొదటి మూడు నెలల్లో వెనక్కి తీసుకుంటే 1% ఎగ్జిట్ లోడ్ చార్జీ పడుతుంది. ఆ తర్వాత ఉపసంహరణపై ఎలాంటి చార్జీలుండవు. ఈ పథకంలో రిస్క్ ఎక్కువ. నిఫ్టీ 500 టీఆర్ఐ ఈ పథకం పనితీరుకు ప్రామాణికం. అజయ్ ఖండేల్వాల్, అతుల్ మెహ్రా, బాలచంద్ర షిండే, రాకేశ్ శెట్టి, సునీల్ సావంత్ ఫండ్ మేనేజర్లుగా సేవలు అందించనున్నారు. జెరోధా మల్టీ అస్సెట్ ప్యాసివ్ ఎఫ్వోఎఫ్ జెరోధా మ్యూచువల్ ఫండ్ కొత్తగా జెరోదా మల్టీ అస్సెట్ ప్యాసివ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్వోఎఫ్)ను ప్రారంభించింది. ఈక్విటీ, డెట్ ఇండెక్స్ ఫండ్స్/ఈటీఎఫ్లు, కమోడిటీ ఈటీఎఫ్లలో ఇన్వెస్ట్ చేస్తుంది. ఆగస్ట్ 8న ఎన్ఎఫ్వో ముగుస్తుంది. ఐదు పనిదినాల అనంతరం తిరిగి క్రయ, విక్రయాలకు అందుబాటులోకి వస్తుంది. ఈక్విటీ, డెట్, కమోడిటీల్లో పెట్టుబడులకు ఈ పథకం వీలు కల్పిస్తుంది.పోర్ట్ఫోలియోకి రిస్క్, అస్థిరతలు తగ్గించడం ప్రధాన ధ్యేయం. ముఖ్యంగా 50–70 శాతం పెట్టుబడులను ఈక్విటీ ఈటీఎఫ్/ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. 10–20 శాతం డెట్ ఈటీఎఫ్/ఇండెక్స్ ఫండ్స్, 20–30 శాతం కమోడిటీ ఈటీఎఫ్లకు (బంగారం, వెండి) కేటాయిస్తుంది. పెట్టుబడులను వివిధ సాధనాల మధ్య వైవిధ్యం చేసుకోవాలని చూసే వారి కోసం ఈ పథకం తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. -
పెన్షనర్లు.. ట్యాక్స్ ప్లానింగ్
అరవైఏళ్లు, 80 ఏళ్లు దాటిన వారు.. ఇలా వయసు పైబడిన వారికి, అంటే సీనియర్ సిటిజన్లకు బేసిక్ లిమిట్ మారుతుంది. ఇదంతా పాత పద్ధతిలో. కొత్త పద్ధతిలో సీనియారిటీతో సంబంధం లేకుండా అందరికీ ఒకే బేసిక్ లిమిట్. ఈ బేసిక్ లిమిట్లు, శ్లాబులు, రేట్లూ మీకు తెలిసినవే. పెన్షన్ని ‘జీతాల’ పరిధిలో పరిగణిస్తారు. పెన్షన్ కూడా ట్యాక్సబుల్ ఆదాయమే. రూ.10,000 పన్ను భారం దాటిన వారు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాలి. సీనియర్ సిటిజన్లకు వ్యాపారం, వృత్తి మీద ఆదాయం లేకపోతే అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాల్సినవసరం లేదు.ఆదాయపు పన్ను చట్ట ప్రకారం, జీతాన్ని ఎలా ట్యాక్సబుల్గా భావిస్తారో, అలాగే పెన్షన్లను కూడా భావిస్తారు. చాలా మంది పెన్షన్ మీద మినహాయింపు ఉందనుకుంటారు. కానీ, అది నిజం కాదు. పెన్షన్ ట్యాక్సబుల్ ఆదాయమే. బేసిక్ లిమిట్ లోపు ఉంటే తప్ప.. పన్ను భారం తప్పించుకోవడం ఉండదు. గవర్నమెంటులో రిటైర్ అయిన వారికి కమ్యూటెడ్ పెన్షన్ మినహాయింపు ఉంది. ముందుగా లెక్కలు కట్టి, ట్యాక్స్ ప్లానింగ్ ద్వారా కమ్యుటెడ్ పెన్షన్ మార్చుకోవచ్చు. పరమ్వీర్ చక్ర, మహా వీర్ చక్ర, వీర్ చక్ర మొదలైన వాటికి సంబంధించిన పెన్షన్లకు మినహాయింపు ఉంది. విదేశాల్లో సెటిల్ అయిన పెన్షనర్లకు వచ్చే పెన్షన్లను మన దేశంలోని ఆదాయంగా పరిగణిస్తారు. పెన్షన్లలో ఎరియర్స్ అంటే .. బకాయిలు వస్తే, వాటిని పన్ను పరిధిలోకి చేర్చి 89(1) సెక్షన్ కింద రిలీఫ్ పొందవచ్చు. ఈ పెన్షన్లో స్టాండర్డ్ డిడక్షన్ మినహాయింపు ఉంది.ఇక ఫ్యామిలీ పెన్షన్ విషయానికొద్దాం. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత, తన పెన్షన్ని కుటుంబంలోని వ్యక్తికి ఇవ్వొచ్చు. ఇలాంటి చెల్లింపులను ఫ్యామిలీ పెన్షన్ అంటారు. ఇక్కడ పెన్షన్ అని పేరుంది కానీ, ఇలాంటి పెన్షన్ను ‘జీతం’గా భావించరు. ఇతర ఆదాయంగా భావిస్తారు. టీడీఎస్ అంశాలు వర్తించవు. పాత పద్ధతి అయితే రూ.15,000 మినహాయింపు ఇస్తారు. కొత్త పద్ధతి అయితే, రూ.25,000 మినహాయింపు వస్తుంది. సైన్యంలోని ఫ్యామిలీ సభ్యులకు మినహాయింపు పూర్తిగా ఇస్తారు. ఈ విషయానికి సంబంధించి చాలా పరిస్థితులనే పొందుపర్చారు. కానీ విధి నిర్వహణలో ఉండగా, సైన్యంలో చనిపోతే వారి కుటుంబానికి వచ్చే పెన్షన్ మీద మినహాయింపు ఉంటుంది. పెన్షన్, ప్యామిలీ పెన్షన్కి సంబంధించి ట్యాక్స్ ప్లానింగ్ విషయాలు..పాత పద్ధతిలో వెళ్తే మంచిదా. కొత్త పద్ధతిలో వెళ్తే మంచిదా అనేది ఆలోచించుకోవాలి.వైద్యానికి సంబంధించిన మినహాయింపులను గత వారం తెలుసుకున్నాం. ఇవి పాత పద్ధతిలో ఉంటాయి. పెన్షనరీ బెనిఫిట్స్ భారీగా వస్తాయి. వాటిని సక్రమంగా, సరిగ్గా, సమగ్రంగా ఆలోచించి ఇన్వెస్ట్ చేయొచ్చు.80సీ డిడక్షన్లు అనవసరం అనుకునే వాళ్లు చాలా మంది ఉన్నారు. వార్ధక్యంలో సేవింగ్ మీద పెద్ద మొత్తాల్ని ‘బ్లాక్’ చేసుకోవడం ఎందుకు. చేతిలో లేదా అందుబాటులో బ్యాంకు బ్యాలెన్సులు ఉంటే మంచిది. ఉదాహరణకు వైద్యంలాంటి ఏ అవసరానికైనా ఉపయోగపడుతుందనేది ఆలోచన.సీనియర్ సిటిజన్లకు ఎన్నో స్కీములు ఉన్నాయి. సరైన నిర్ణయం తీసుకోండి. ఆకర్షణీయమైన ప్రైవేట్ వ్యక్తుల చేతిల మోసపోకండి. అయితే, ఎన్నో మంచి ఇన్వెస్ట్మెంట్లు, స్కీములు ఉన్నాయి. కేవలం పాత పద్ధతిలోనే వాటిపై వడ్డీకి మినహాయింపులు ఉన్నాయి. ఎన్నారై సిటిజన్లు 15హెచ్ ఇవ్వకూడదు. కానీ రెసిడెంట్లు ఇవ్వొచ్చు. బ్యాంకు ఫిక్సిడ్ డిపాజిట్ల మీద వడ్డీ రూ. లక్ష దాటితే, టీడీఎస్ వర్తిస్తుంది. ట్యాక్సబుల్ ఇన్కం లోపల ఆదాయం ఉంటే, 15హెచ్ ఇస్తే పన్ను రికవరీ చేయరు. బేసిక్ లిమిట్ దాటితే 15హెచ్ ఇవ్వకూడదు.గ్రాట్యుటీ, లీవ్ ఎన్క్యాష్మెంట్, పీఎఫ్, సూపర్ యాన్యుయేషన్ ఫండ్ .. వీటన్నింటికీ పూర్తి మినహాయింపు ఉంది. కానీ, అవి ఇన్వెస్ట్ చేస్తే వచ్చే వడ్డీ/ఆదాయంపై మినహాయింపు కొత్త విధానంలో లేదు.75 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్లకు పెన్షన్ ఉండి, ఒకే ఒక బ్యాంకు అకౌంటులో నుంచి వడ్డీ .. ఈ రెండింటి మీదా పన్ను రికవరీ అయితే, రిటర్ను వేయనక్కర్లేదు.రిటైర్మెంట్ బెనిఫిట్స్తో పిల్లల చదువు కోసమా, స్వంత వైద్యానికా, ఇల్లు కొనుక్కోవడమా, బంగారం కొనడమా, షేర్స్లో ఇన్వెస్ట్ చేయడమా, పిల్లలకు బహుమతిగా ఇవ్వడమా.. ఇలా ఎన్నో ఆలోచనలు.తన సొంత పెన్షన్, భార్య ఫ్యామిలీ పెన్షన్.. ఇలా రెండూ కలిపి తడిసి మోపెడై.. పన్ను భారం చెల్లించే పెన్షనర్లు ఇంకొందరు. ఆదాయం అధికంగా ఉంటే పన్ను చెల్లించడమే ట్యాక్స్ ప్లానింగ్. -
ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా? త్వరపడితే బెటర్!
ఉద్యోగులు, ఆదాయ పరిమితులు మించినవారు చాలా మంది ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయాలని భావిస్తారు. అయితే ఆ ఐటీఆర్లను ఫైల్ చేసేందుకు అవసరమైన ధ్రువపత్రాలు ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలి. ఇటీవల జులై 31 వరకు ఉండే ఐటీఆర్ ఫైలింగ్ చివరి తేదీని ప్రభుత్వం సెప్టెంబర్ 15 వరకు పొడిగించింది. కాబట్టి ముందుగా కింది ధ్రువపత్రాలను సిద్ధం చేసుకొని, వీలైనంత త్వరగా ఐటీఆర్ దాఖలు చేయాలి.ఫారమ్–16వేతనంతోపాటు, టీడీఎస్ వివరాలు ఇందులో ఉంటాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారిపోతే, పాత–కొత్త యాజమాన్యాల నుంచి ఫారమ్–16ను తప్పకుండా తీసుకోవాలి. ఇందులో పార్ట్–ఏ కింద టీడీఎస్ మినహాయిస్తే ఆ వివరాలు నమోదవుతాయి. పార్ట్–బీ కింద జీతభత్యాలు, మినహాయింపుల క్లెయిమ్ వివరాలు ఉంటాయి. ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీపై టీడీఎస్, బీమా కంపెనీ నుంచి కమీషన్కు సంబంధించి వివరాల కోసం ‘ఫారమ్–16ఏ’ని తీసుకోవాలి.ప్రాపర్టీ లావాదేవీ విలువ (రిజిస్టర్డ్) రూ.50 లక్షలకు మించినప్పుడు టీడీఎస్ అమలు చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ‘ఫారమ్–16బీ’ని కొనుగోలుదారుడు విక్రయదారుడికి జారీ చేస్తారు. నెలవారీ ఇంటి అద్దె రూ.50,000 మించితే, అప్పుడు సైతం టీడీఎస్ అమలు చేయాలి. కిరాయిదారుడు ఇంటి యజమానికి ‘ఫారమ్–16సీ’ని అందిస్తారు. ఐటీఆర్ దాఖలు చేసే సమయంలో ఈ వివరాలు ముందుగానే నింపి ఉండడం గమనించొచ్చు. వాటిని సరిపోల్చుకుని, అవసరమైతే అదనపు వివరాలు నమోదు చేసి సమర్పించాల్సి ఉంటుంది. మూలధన లాభాల రిపోర్ట్షేర్లు, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులను విక్రయించినప్పుడు స్వల్ప, దీర్ఘకాల మూలధన లాభాలు వస్తుంటాయి. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ నివేదికను బ్రోకర్ల నుంచి, ఫండ్స్ సంస్థల నుంచి తీసుకోవాలి. ఇందులోని వివరాలను ఐటీఆర్లో నమోదు చేయడం తప్పనిసరి. క్లియర్ ట్యాక్స్ తదితర సంస్థల ద్వారా రిటర్నులు వేసేట్టు అయితే క్యాపిటల్ గెయిన్స్ రిపోర్ట్ను అప్లోడ్ చేస్తే ఐటీఆర్ పత్రంలో ఆ వివరాలన్నీ ఆటోమేటిక్గా భర్తీ అవుతాయి. ఏఐఎస్/ఫారమ్–26ఏఎస్‘ఫారమ్–26ఏఎస్’లో టీడీఎస్, టీసీఎస్ వివరాలు ఉంటాయి. ఏఐఎస్లో అద్దె, డివిడెండ్లు, ఆస్తుల అమ్మకాలు ఇలా అన్ని రకాల ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడులు, విదేశీ చెల్లింపులు, డిపాజిట్లపై వడ్డీ ఆదాయం, జీఎస్టీ టర్నోవర్ వివరాలు ఉంటాయి. ఏఐఎస్నే టీఐఎస్ అని కూడా అంటారు. వీటితోపాటు బ్యాంక్లు, పోస్టాఫీసులు, ఆర్థిక సంస్థలు జారీ చేసే ఇంటరెస్ట్ సర్టీఫికెట్లు, పన్ను మినహాయింపు పెట్టుబడులు, వ్యయాలకు సంబంధించిన ఆధారాలు (బీమా ప్రీమియం సర్టీఫికెట్, ట్యూషన్ ఫీజులు తదితర) సిద్ధంగా ఉంచుకోవాలి.ఇదీ చదవండి: ఓలా కృత్రిమ్లో రెండో విడత లేఆఫ్స్కొన్ని ముఖ్యమైన గుర్తింపు పత్రాలుపాన్ కార్డ్: ఆదాయ, వ్యయాల రికార్డు కోసం.ఆధార్ కార్డ్: ఈవెరిఫికేషన్ కోసం.పే స్లిప్పులు: ఆదాయ మార్గాలను క్రాస్ వెరిఫికేషన్ చేయడానికి.ఫారం 16ఏ/బీ/సీ/డీ: వడ్డీ, ఆస్తి అమ్మకం, అద్దె లేదా ప్రొఫెషనల్ ఫీజులపై టీడీఎస్ కోసం.క్యాపిటల్ గెయిన్స్ స్టేట్మెంట్స్: బ్రోకర్లు లేదా మ్యూచువల్ ఫండ్ ప్లాట్ఫామ్ల నుంచి తీసుకోవాలి.అద్దె ఆదాయ వివరాలు: మునిసిపల్ పన్ను రశీదులు, రుణ వడ్డీ ధ్రువీకరణ పత్రాలు.వ్యాపార ఆదాయ రికార్డులు: లాభనష్టాల స్టేట్మెంట్లు, బ్యాలెన్స్ షీట్లు.వడ్డీ ధ్రువీకరణ పత్రాలు: పొదుపు ఖాతాలు, ఎఫ్డీలు, పోస్టాఫీసు పథకాలు కోసం.అడ్వాన్స్ ట్యాక్స్/సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ రిసిప్ట్స్పెట్టుబడి రుజువులుసెక్షన్ 80సీ (ఎల్ఐసీ, పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్, ట్యూషన్ ఫీజు)సెక్షన్ 80డీ (ఆరోగ్య బీమా)సెక్షన్ 80ఈ (ఎడ్యుకేషన్ లోన్ వడ్డీ)సెక్షన్ 80జీ (విరాళాలు) -
ఒకటికి మించిన ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా?
సిస్టమ్యాటిక్ విత్ డ్రాయల్ ప్లాన్ (ఎస్డబ్ల్యూపీ) అంటే ఏంటి? ఏక మొత్తంలో ఓ పథకంలో పెట్టుబడి పెట్టి, తదుపరి నెల నుంచి ఎస్డబ్ల్యూపీ ద్వారా ఆదాయం పొందొచ్చా? అలా అయితే అది నా పెట్టుబడిపై ప్రభావం చూపిస్తుందా? – రాఘవరాజుపెట్టుబడులను పెట్టడమే కాదు.. వాటిని వెనక్కి తీసుకునే విషయంలోనూ తగిన ప్రణాళిక కలిగి ఉండాలి. మార్కెట్లలో అస్థిరతలను అధిగమించేందుకు క్రమానుగత పెట్టుబడులకు సిప్ ఎలా ఉపయోగపడుతుందో..? అదే మాదిరి.. పెట్టుబడిని నిర్ణీత కాలానికి ఓసారి వెనక్కి తీసుకునేందుకు ఎస్డబ్ల్యూపీ వీలు కల్పిస్తుంది. మార్కెట్లు కనిష్టాల్లో (తక్కువ విలువల వద్ద) ఉన్నప్పుడు పెట్టుబడి మొత్తాన్ని ఒకేసారి వెనక్కి తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఎస్డబ్ల్యూపీ సాయపడుతుంది. రిటైర్మెంట్ తీసుకున్న వారికి, అదనపు ఆదాయం కోరుకునే వారికి అనుకూలం. దీని ద్వారా వారు తమకు కావాల్సినంత స్థిరమైన ఆదాయం పొందే ఏర్పాటు చేసుకోవచ్చు. ఎన్ని రోజులకు ఒకసారి ఆదాయం రావాలన్నది నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉంటుంది.ఇన్వెస్టర్ ప్రతీ నెలా నిర్ణీత తేదీన, నిర్ణీత మొత్తాన్ని ఎస్డబ్ల్యూపీ ద్వారా రావాలని నిర్ణయించుకుంటే.. అదే రోజు ఆ మొత్తం బ్యాంకు ఖాతాకు జమ అవుతుంది. ఆ మేరకు పెట్టుబడుల విలువ తగ్గుతుంటుంది. సిప్ ఎంపిక చేసుకుంటే.. ప్రతీ నెలా నిర్ణీత మొత్తం బ్యాంకు ఖాతా నుంచి మ్యూచువల్ ఫండ్ పథకంలో పెట్టుబడిగా వెళుతుంది. దీనికి పూర్తి వ్యతిరేకంగా పనిచేసేదే ఎస్డబ్ల్యూపీ. మీ మొత్తం పెట్టుబడుల్లో కనీసం మూడింట ఒక వంతును ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఒక ఏడాదిలో ఎస్డబ్ల్యూపీ ద్వారా ఉపసంహరించుకునే మొత్తం పెట్టుబడుల విలువలో 4–6 శాతం మించకుండా జాగ్రత్తపడాలి. దీనివల్ల పెట్టుబడికి నష్టం లేకుండా ఉంటుంది.ఇదీ చదవండి: ‘దేశానికి రక్షణ కల్పించండి.. మీ సమస్యలతో మేం పోరాడుతాం’ఉదాహరణకు మీ పెట్టుబడులపై రాబడి వార్షికంగా 8–9 శాతంగా ఉండి, 5 శాతాన్ని వెనక్కి తీసుకునేట్టు అయితే.. అప్పుడు మిగిలిన 3–4 శాతం రాబడి పెట్టుబడిని వృద్ధి చేస్తుంటుంది. దీనివల్ల ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెట్టుబడి విలువ క్షీణించకుండా స్థిరంగా ఉంటుంది. ఎస్డబ్ల్యూపీ ద్వారా ఏటా ఉపసంహరించుకునే మొత్తంపై పన్ను పడదు. నికర లాభంపై పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఏడాదిలో రూ.1.25 లక్షల దీర్ఘకాల మూలధన లాభంపై పన్ను లేదు. అంతకు మించిన మొత్తంపైనే దీర్ఘకాల మూలధన లాభాల పన్ను పడుతుందని గుర్తు పెట్టుకోవాలి. ఏడాదిలోపు ఈక్విటీ పెట్టుబడులపై 15 శాతం స్వల్పకాల మూలధన లాభం చెల్లించాలి. డెట్ పెట్టుబడులపై లాభం వార్షిక ఆదాయానికి కలుస్తుంది. ఒకటికి మించిన ఫండ్ విభాగాల్లో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచి నిర్ణయమేనా? – చిట్టి లాస్యఒకటికి మించిన మ్యూచువల్ ఫండ్స్ విభాగాల్లో పెట్టుబడులు పెట్టుకున్నప్పటికీ.. నిర్ణీత కాలానికి ఒకసారి పోర్ట్ఫోలియోని రీబ్యాలన్స్ (సమీక్ష/మార్పులు, చేర్పులు) చేసుకోవడం మర్చిపోవద్దు. ప్రత్యామ్నాయంగా ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోడాన్ని పరిశీలించొచ్చు. ఎందుకంటే ఈ పథకాలు అన్నిరకాల మార్కెట్ విభాగాల్లోని కంపెనీల్లో (స్మాల్క్యాప్, మిడ్క్యాప్, లార్జ్క్యాప్) ఇన్వెస్ట్ చేస్తుంటాయి. మార్కెట్ పరిస్థితులు, వ్యాల్యూయేషన్ల ఆధారంగా ఆయా విభాగాలకు కేటాయించే పెట్టు బడుల మొత్తం మారిపోతుంటుంది.సాధారణంగా ఫ్లెక్సీక్యాప్ పథకాలు తమ నిర్వహణలోని పెట్టుబడుల్లో 70–75 శాతాన్ని లార్జ్క్యాప్ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. మిగిలిన పెట్టుడులను మిడ్క్యాప్, స్మాల్క్యాప్ పథకాలకు కేటాయిస్తుంటాయి. మీరు రెండు నుంచి మూడు ఫ్లెక్సీ క్యాప్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఫ్లెక్సీక్యాప్ పథకాలు ఎక్కువ మొత్తాన్ని లార్జ్క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. కాబట్టి మీరు విడిగా లార్జ్క్యాప్ ఫండ్స్ను ఎంపిక చేసుకోవాల్సిన అవసరం లేదు. పెట్టుబడులపై అధిక రాబడులు కోరుకుంటూ, రిస్క్ తీసుకునే సామర్థ్యం కలిగిన వారు.. ఫ్లెక్సీక్యాప్నకు అదనంగా 10–15 శాతం పెట్టుబడులను మిడ్, స్మాల్క్యాప్ ఫండ్స్కు కేటాయించుకోవచ్చు. -
ప్యాసివ్ పెట్టుబడులకు ఆదరణ
గత కొన్నేళ్లుగా, దేశీయంగా ప్యాసివ్ తరహా పెట్టుబడులకు ఆదర ణ పెరుగుతోంది. మ్యుచువల్ ఫండ్స్ అసోసియేషన్ యాంఫీ తాజా నివేదిక ప్రకారం 2025 జూన్ నాటికి ప్యాసివ్ ఫండ్స్లో ఇన్వెస్టర్ల ఏయూఎం రూ. 12 లక్షల కోట్లుగా ఉంది. ఇది నెలవారీగా 3% వృద్ధిని, మొత్తం మ్యుచువల్ ఫండ్ పరిశ్రమ ఏయూఎంలో (నిర్వహణలోని ఆస్తులు) 17 శాతాన్ని ప్రతిబింబిస్తుంది. సంపద సృష్టి విషయంలో భారతీయ ఇన్వెస్టర్ల ధోరణుల్లో ఫండమెంటల్గా చోటు చేసుకుంటున్న మార్పునూ సూచిస్తోంది. ఒకప్పుడు చాలా నైపుణ్యాలు అవసరమ య్యే లేదా అనుబంధ వ్యూహంగానో పరిగణించిన ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ వ్యూహాలు ఇప్పుడు క్రమంగా ఇన్వెస్టర్ పోర్ట్ఫోలియోల్లో కీలక భాగంగా మారుతు న్నాయి. సరళంగా, పారదర్శకంగా, తక్కువ ఖర్చులతో కూడుకున్నవిగా ఉండటం వల్లే కొత్త తరం ఇన్వెస్టర్లకు ఇవి బాగా ఆకర్షణీయంగా ఉంటున్నాయి. క్రమంగా ముందుకు .. భారత్లో ప్యాసివ్ ఇన్వెస్టింగ్ ప్రస్థానమనేది క్రమంగా, అనేక మైలురాళ్లను అధిగమిస్తూ ముందుకు సాగుతోంది. 2010 తొలినాళ్లలో రిటైల్ ఇన్వెస్టర్లకు ఈటీఎఫ్లు, ఇండెక్స్ ఫండ్స్ అనేవి అంతగా తెలియదు. ప్రధానంగా నిఫ్టీ50, బీఎస్ఈ సెన్సెక్స్ ఆధారితమై, ప్రోడక్టు పరిధి చాలా పరిమితంగా ఉండేది. ప్యాసివ్ ఇన్వెస్టింగ్పై ఇన్వెస్టర్లకు పెద్దగా అవగాహన ఉండేది కాదు. సంప్రదాయ యాక్టివ్ ఫండ్స్ వైపే మొగ్గు చూపే వారు. దీనితో ప్యాసివ్ ఫండ్స్ పక్క వాయిద్యాలుగానే ఉండిపోయేవి. అయితే, ఈటీఎఫ్ల ద్వారా డిజిన్వెస్ట్ చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టడంతో పాటు ఈక్విటీ ఈటీఎఫ్లలో ఇన్వెస్ట్ చేయాలన్న ఈపీఎఫ్వో కీలక నిర్ణయంతో ప్యాసివ్ ఇన్వెస్టింగ్పై ఫోకస్ పెరిగింది. నియంత్రణ సంస్థ సెబీ కూడా ఈ తరహా ఇన్వెస్టింగ్, నిర్వహణను సరళతరం చేసేలా మార్గదర్శకాలను రూపొందించింది. ఫలితంగా మ్యుచువల్ ఫండ్ కంపెనీలు ఇప్పుడు విస్తృత స్థాయిలో ప్యాసివ్ ఫండ్స్ను అందిస్తున్నాయి. ఇక, ఫిన్టెక్ ప్లాట్ఫాంలు పెరగడం కూడా ఈ ప్రోడక్టులు మరింతగా అందుబాటులోకి రావడానికి తోడ్పడింది. ఇన్వెస్టర్లు ఇప్పుడు యాప్ల ద్వారా సులువుగా ఈటీఎఫ్లు, ఇండెక్స్ ఫండ్స్ను కొనుక్కోగలుగుతున్నారు. ట్రాక్ చేయగలుగుతున్నారు. ఆ విధంగా ఇన్వెస్టింగ్ మరింత అందుబాటులోకి, యూజర్లకు మరింత అనుకూలమైనదిగాను మారింది. నియంత్రణ సంస్థపరమైన మద్దతు, సంస్థాగత భాగస్వామ్యం, ప్యాసివ్ ఇన్వెస్టింగ్పై ఇన్వెస్టర్లలో అవగాహన కల్పించేందుకు అసెట్ మేనేజ్మెంట్ పరిశ్రమ కృషి, సాంకేతిక ఆవిష్కరణల మేళవింపు కలిసి ప్యాసివ్ ఫండ్స్ను అన్ని వర్గాలకు అనువైన ఓ పెట్టుబడి సాధనంగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. తక్కువ వ్యయాలు.. ప్యాసివ్ ఫండ్స్ ప్రాచుర్యంలోకి రావడానికి ఒకానొక కారణం, ఇవి తక్కువ వ్యయాలతో కూడుకున్నవి కావడమే. ఈటీఎఫ్లు, ఇండెక్స్ ఫండ్స్ వ్యయ నిష్పత్తులు, మిగతా పెట్టుబడి సాధనాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటాయి. అందుకే వ్యయాల గురించి ఆలోచించే ఇన్వెస్టర్లకు ఇవి ఆకర్షణీయంగా ఉంటున్నాయి. మార్కెట్లో విస్తృత స్థాయిలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉండటం, ఒకే సాధనంపై మొత్తం ఇన్వెస్ట్ చేయడం మూలంగా వచ్చే రిసు్కలను తగ్గించడం, మార్కెట్ వృద్ధిలో స్థిరంగా పాలుపంచుకునే అవకాశం కల్పించడం వంటివి వీటికి సానుకూలాంశాలు. డిజిటల్ విప్లవం కూడా ప్యాసివ్ ఫండ్స్కు దన్నుగా నిలిచింది. ఫిన్టెక్లు, ఆన్లైన్ ప్లాట్ఫాంలు, ఇన్వెస్ట్మెంట్ ప్రక్రియను సరళతరం చేశాయి. ‘సాషే ఇన్వెస్టింగ్’, అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (సిప్లు) ద్వా రా చిన్న మొత్తాల్లో, క్రమం తప్పకుండా ప్యా సివ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే అవకాశం కల్పించాయి. తొలిసారిగా ఇన్వెస్ట్ చేసే వారికి ఎంట్రీపరమైన అవరోధాలు తగ్గేందుకు ఇది దోహదపడింది. క్రమశిక్షణతో పెట్టుబడులు పెట్టే ధోరణిని పెంపొందించింది. అంతేగాకుండా, వివిధ డి్రస్టిబ్యూషన్ మోడల్స్ కూడా ప్యాసివ్ ఫండ్స్ను మెట్రోలు, పట్టణ కేంద్రాల పరిధిని దాటి ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు కూడా మరింత చేరువ చేశాయి.కొత్త ఆవిష్కరణలు.. ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ అనేది కేవలం విస్తత మార్కెట్ సూచీలకే పరిమితం కావడం లేదు. లో వోలటైలిటీ, క్వాలిటీ, వేల్యూ, లేదా మొమెంటంలాంటి అంశాల ప్రాతిపదికన ఉండే సూచీలను ట్రాక్ చేసే స్మార్ట్ బీటా ఫండ్స్లాంటి ఆవిష్కరణలు వచ్చాయి. మరింత అధునాతనమైన ప్యాసివ్ ఇన్వెస్టింగ్ విధానాన్ని అందిస్తున్నాయి. ఇంటర్నేషనల్ ఈటీఎఫ్లనేవి నేరుగా విదేశాల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఉండే సంక్లిష్టతల బాదరబందీ లేకుండా భారతీయ ఇన్వెస్టర్లు అంతర్జాతీయంగా పెట్టుబడులను డైవర్సిఫై చేసేందుకు, విదేశీ మార్కెట్లు మరియు కరెన్సీల్లో పెట్టుబడులు పెట్టేందుకు తోడ్ప డుతున్నాయి. హెల్త్కేర్, కన్జంప్షన్లాంటి థీమ్ల ఆధారితమైన థీమ్యాటిక్ ఇండెక్స్ ఫండ్స్ తరహాలోనే కమోడిటీల (గోల్డ్, సిల్వర్) ఆధారిత ఈటీఎఫ్లు, ఎఫ్వోఎఫ్లు కూడా ఇన్వెస్టర్లను ఆక ర్షిస్తున్నాయి. ప్యాసివ్ ఫండ్స్ ఆధిపత్యం పెరుగు తుండటమనేది భారత్లో అసెట్ మేనేజ్మెంట్ పరిశ్రమ రూపురేఖలను మారుస్తోంది. ఏఎంసీలు తమ ప్యాసివ్ ప్రోడక్ట్లను విస్తరిస్తున్నాయి. ప్యాసివ్ వ్యూహాలను తగిన విధంగా ఉపయోగించుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలను పొందవచ్చనే దానిపై ఇన్వెస్టర్లలో అవగాహన కల్పించడంపై ఇన్వెస్ట్ చేస్తున్నాయి. పారదర్శకత, తక్కువ వ్యయాలతో అధిక ప్రయోజనాలను అందించడం, దీర్ఘకాలికంగా సంపద సృష్టించడం, ఇన్వెస్టర్లకు ప్రయోజనం చేకూర్చేలా పనిచేయడం, వారి ప్రయోజనాలే పరమావధిగా పనిచేయడం వైపుగా పరిశ్రమ మళ్లుతోంది. ప్యాసివ్ ఇన్వెస్టింగ్ మరింత పుంజుకోవాలంటే, ఈ కోవకు చెందిన ఫండ్స్లో పెట్టుబడులను ప్రోత్సహించే విధానాలు కూడా ఉంటే శ్రేయస్కరంగా ఉంటుంది. పన్ను మినహాయింపుల్లాంటివి (ఈఎల్ఎస్ఎస్ స్కీముల తరహాలో) ఇస్తే, సగటు భారతీయుల పొదుపు మొత్తాలు, ఆదాయాన్నిచ్చే ఫిక్సిడ్ ఇన్కం పోర్ట్ఫోలియో నుంచి సంపదను సృష్టించే ప్యాసివ్ ఈక్విటీ ఫండ్స్ పోర్ట్ఫోలియోలోకి మళ్లేందుకు తోడ్పడతాయి. వందన త్రివేది హెడ్ (ఇనిస్టిట్యూషనల్ బిజినెస్, ప్యాసివ్స్), యాక్సిస్ ఏఎంసీ -
రిటర్నులకు వేళాయెనే..!
వేతన జీవుల్లో చాలా మంది ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేస్తుంటారు. చిరుద్యోగులు, స్వయం ఉపాధి పొందేవారు, కొన్ని రకాల వృత్తి నిపుణులు మాత్రం దూరంగా ఉండడం గమనించొచ్చు. పైగా రిటర్నులు వేయడం కేవలం ఉద్యోగులు, వ్యాపారులకు సంబంధించిన విషయమేనని కొందరు భావిస్తుంటారు. అసలు ఆదాయపన్ను రిటర్నులు ఎవరు దాఖలు చేయాలి..? పన్ను పరిధిలోకి వచ్చేంత ఆదాయం లేకపోయినా సరే.. రిటర్నులు దాఖలు చేయాల్సిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. విద్యార్థులు, విశ్రాంత జీవులు, రైతులు, చివరికి గృహిణులు సైతం నిబంధనల ప్రకారం రిటర్నులు వేయాల్సిందే. ఎప్పుడు ఎలా అన్న విషయమై అవగాహన కల్పించే ప్రయత్నమే ఇది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి (2025–26 అసెస్మెంట్ సంవత్సరం) ఆదాయపన్ను రిటర్నుల దాఖలుకు సెపె్టంబర్ 15 వరకు గడువు ఉంది. వాస్తవ గడువు జూలై 31 కాగా, కొన్ని సాంకేతిక అంశాల కారణంగా గడువును పెంచుతూ ఆదాయపన్ను శాఖ నిర్ణయం తీసుకుంది. అధిక ఆదాయ పరిధిలో ఉన్న వారే రిటర్నులు వేయాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ, ఇది పొరపాటు. పన్ను చెల్లించాల్సిన అదాయం లేకపోయినా సరే చట్టంలోని నిబంధనల ప్రకారం పన్ను రిటర్నులు వేయాల్సి రావచ్చు. పైగా రిటర్నులు సమర్పించడం మంచి సంప్రదాయం కిందకు వస్తుంది. పరిమితులు.. ఒక వ్యక్తి వార్షిక ఆదాయం బేసిక్ ఎగ్జెంప్షన్ (ప్రాథమిక మినహాయింపు) పరిమితి దాటినట్టయితే రిటర్నులు (ఐటీఆర్) తప్పనిసరిగా దాఖలు చేయాలని చట్టం నిర్దేశిస్తోంది. పాత పన్ను విధానంలో 60 ఏళ్లు దాటని వారికి రూ.2,50,000 ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితిగా ఉంది. 60–80 ఏళ్ల మధ్యవయసు వారికి రూ.3,00,000, 80 ఏళ్లు నిండిన వారికి రూ.5,00,000 పరిమితి అమల్లో ఉంది. కొత్త విధానం కింద అన్ని వయసుల వారికి ఈ పరిమితి రూ.3,00,000గా ఉంది. ఆదాయం ఈ పరిమితికి మించకపోతే సాధారణంగా ఐటీఆర్ దాఖలు చేయడం తప్పనిసరి కాదు. కానీ, ఆదాయం ఈ పరిమితుల్లోనే ఉన్నా కానీ, పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఐటీఆర్ వేయాల్సిందే.. ‘‘నేను ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. కనుక నేను ఎందుకు రిటర్నులు వేయాలి?’’ చాలా మంది ఇలానే భావిస్తుంటారు. ఆదాయపన్ను చట్టం 1961 ప్రకారం.. స్థూల ఆదాయం పైన చెప్పుకున్న పరిమితులను దాటితే తప్పకుండా రిటర్నులు వేయాల్సిందే. చట్టంలో కల్పించిన రాయితీలు, మినహాయింపుల ప్రకారం ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేకపోయినా సరే.. రిటర్నులు సమర్పించడం ద్వారానే వాటిని క్లెయిమ్ చేసుకుని, ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. రిటర్నులు దాఖలు చేయకపోతే మినహాయింపులను క్లెయిమ్ చేసుకునే హక్కును కోల్పోతారు. → ఉదాహరణకు రవివర్మ వార్షిక ఆదాయం రూ.2.4 లక్షలు. పింఛను, బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ రూపంలో ఈ మొత్తం సమకూరింది. కానీ, వడ్డీ ఆదాయంపై 10 శాతం టీడీఎస్ కింద బ్యాంక్ మినహాయించింది. ఈ కేసులో ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. కానీ, బ్యాంక్ నుంచి ఆదాయపన్ను శాఖకు వెళ్లిన టీడీఎస్ మొత్తాన్ని తిరిగి పొందాలంటే (రిఫండ్) రిటర్నులను నిరీ్ణత గడువులోపు సమర్పించడం ద్వారానే సాధ్యపడుతుంది. → ఎవరైనా ఒక ఆర్థిక సంవత్సరం పరిధిలో తమ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో రూ.50 లక్షలకు మించి డిపాజిట్ చేస్తే తప్పకుండా ఐటీఆర్ దాఖలు చేయాలి. → ఒకటి లేదా ఒకటికి మించిన కరెంట్ ఖాతాలలో కలిపి (వాణిజ్య, కోపరేటివ్ బ్యాంకుల) రూ.కోటి, అంతకు మించి డిపాజిట్ చేస్తే రిటర్నులు సమర్పించాలి. వ్యక్తులకే గానీ వ్యాపార సంస్థలకు ఈ నిబంధన వర్తించదు. → ఏడాదిలో అమ్మకాల ఆదాయం గనుక రూ.60 లక్షలు మించితే వ్యాపార సంస్థలు రిటర్నులు వేయాలి. → వృత్తి ద్వారా ఆదాయం రూ.10 లక్షలకు మించినప్పుడు రిటర్నులు దాఖలు చేయాలి. → ఒక విద్యుత్ బిల్లు రూ.లక్ష మించినా లేదా ఒక ఆర్థిక సంవత్సరం మొత్తం మీద విద్యుత్ బిల్లు రూ.లక్షకు మించిన సందర్భంలోనూ పన్ను రిటర్నులు సమర్పించాల్సి ఉంటుంది. → వివిధ రూపాల్లో టీడీఎస్ ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.25,000, అంతకు మించి ఉంటే అప్పుడు కూడా రిటర్నులు వేయాల్సిందే. 60 ఏళ్లు నిండిన వారికి ఈ పరిమితి రూ.50,000గా ఉంది. → విదేశీ ఆస్తుల సమాచారాన్ని ఐటీఆర్లోని షెడ్యూల్ ఎఫ్ఏ కింద తప్పకుండా వెల్లడించాలి. విదేశీ ఖాతాకు సంతకం చేసే అధికారం కలిగి ఉన్న వారు సైతం రిటర్నులు వేయాల్సిందే. భార్యా, భర్తలు సంయుక్తంగా విదేశాల్లో ఆస్తికి యజమానులుగా ఉంటే అప్పుడు ఇద్దరూ విడిగా రిటర్నులు దాఖలు చేసి, ఆస్తి వివరాలు వెల్లడించాలి. → విదేశీ కంపెనీల షేర్లను కలిగి వారు సైతం రిటర్నులు ద్వారా ఆ వివరాలు వెల్లడించాలి. → దేశీయ అన్లిస్టెడ్ కంపెనీల్లో వాటాలు (షేర్లు) కలిగిన వారు కూడా రిటర్నులు దాఖలు చేసి వెల్లడించాలి. → ఒక ఆర్థిక సంవత్సరంలో విదేశీ పర్యటనలపై (తనకోసం, ఇతరుల కోసం) చేసిన ఖర్చు రూ.2 లక్షలకు మించినట్టయితే పన్ను రిటర్నులు తప్పకుండా దాఖలు చేయాలి. → మూలధన నష్టాలను క్యారీ ఫార్వార్డ్ (తదుపరి ఆర్థిక సంవత్సరాలకు బదిలీ) చేసుకోవాలని అనుకుంటే సెక్షన్ 139(3) కింద గడువులోపు రిటర్నులు వేయడం తప్పనిసరి. సెక్షన్ 54, 54బి, 54ఈసీ లేదా 54 ఎఫ్ కింద మూలధన నష్టాలపై మినహాయింపులు క్లెయిమ్ చేసుకోవడం రిటర్నుల దాఖలుతోనే సాధ్యపడుతుంది. → సెక్షన్ 10(1) కింద వ్యవసాయ ఆదాయంపై పన్ను లేదు. వ్యవసాయంపై ఆదాయానికి అదనంగా.. వ్యవసాయేతర కార్యకలాపాల ద్వారా ఆదాయం ప్రాథమిక మినహాయింపు పరిమితికి మించి ఉంటే అప్పుడు రిటర్నులు సమర్పించాల్సిందే.ప్రయోజనాలు..పన్ను చెల్లించాల్సిన అవసరం లేకపోయినా పన్ను రిటర్నులు దాఖలు చేయడం వల్ల కొన్ని ప్రయోజనాలున్నాయి. ఒక వ్యక్తి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి పాస్పోర్ట్గా పన్ను రిటర్నులు పనిచేస్తాయి. రుణం కోసం దరఖాస్తు చేసుకున్న సందర్భంలో బ్యాంక్ ఐటీఆర్ కాపీ కోరొచ్చు. తిరిగి చెల్లించే సామర్థ్యానికి ఐటీఆర్ను పరిగణనలోకి తీసుకుంటాయి. టీడీఎస్లను తిరిగి పొందేందుకు, మూలధన నష్టాలను క్యారీఫార్వార్డ్ చేసుకుని, తదుపరి ఆర్థిక సంవత్సరాల్లో మూలధన లాభాలతో సర్దుబాటు చేసుకునేందుకు ఐటీఆర్ దాఖలు వీలు కల్పిస్తుంది. ముఖ్యంగా యూఎస్, యూకే, షెంజెన్ దేశాలకు (29 యూరప్ దేశాల సమూహం), కెనడా వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే క్రితం 2–3 సంవత్సరాలకు సంబంధించి పన్ను రిటర్నుల కాపీలను సమర్పించాల్సి వస్తుంది. లేదంటే దరఖాస్తును తిరస్కరించొచ్చు. ముఖ్యంగా స్వయం ఉపాధిలో ఉన్న వారికి, కుల వృత్తులు నిర్వహించుకునే వారికి ఆదాయ రుజువులు ఉండవు. వీరికి ఐటీఆర్ ఆదాయ ధ్రువీకరణగా పనికొస్తుంది. ఇలాంటి వారు రుణం, టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఐటీఆర్ కాపీని సమర్పిస్తే సరిపోతుంది. స్టార్టప్లు, వ్యాపారాల నమోదు సమయంలో గత కాలపు ఐటీఆర్లు మంచి ఆధారంగా పనికొస్తాయి. చట్టపరమైన చర్యలకు బాధ్యులు..విదేశాల్లో బ్యాంక్ ఖాతాలు, పెట్టుబడులు, ఈ–సాప్లు, స్థిరాస్తులను కలిగిన వారు ఆదాయంతో సంబంధం లేకుండా తప్పకుండా వెల్లడించాల్సిందే. లేదంటే బ్లాక్ మనీ అండ్ ఇంపోజిషన్ యాక్ట్ కింద పెనాల్టీలు పడతాయి. అవసరమైతే విచారణను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా వివిధ దేశాలు సంయుక్త వెల్లడి ప్రమాణాలను (సీఆర్ఎస్) అమలు చేస్తున్నాయి. దీనికింద సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకుంటున్నాయి. విదేశీ ఆస్తుల సమాచారం పన్ను అధికారులకు తెలియదని అనుకోవడం పొరపాటే అవుతుంది. నిబంధల ప్రకారం పన్ను రిటర్నులు సమర్పించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, దాఖలు చేయనట్టు గుర్తిస్తే.. అప్పుడు ఆదాయపన్ను శాఖ నోటీసు జారీ చేస్తుంది. రిటర్నులు దాఖలు చేయాలని కోరుతుంది. అప్పుడు అయినా రిటర్నులు సమర్పించడం ద్వారా తప్పును సరిదిద్దుకోవచ్చు. లేదంటే పెనాల్టీ చార్జీలు, దానిపై వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఉండీ, రిటర్నులు కూడా వేయకపోతే అప్పుడు చట్టం పరిధిలో అసలు పన్నుకు ఎన్నో రెట్ల జరిమానా, జైలు శిక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
యూపీఐ చెల్లింపులపై జీఎస్టీ.. కేంద్ర ప్రభుత్వం క్లారిటీ
యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించే అంశంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రూ.2000 మించిన యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించే యోచన ప్రభుత్వానికి లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ రాజ్యసభలో స్పష్టం చేసింది. రూ.2000 దాటిన యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించాలని జీఎస్టీ కౌన్సిల్ నుంచి ఎలాంటి సిఫారసు చేయలేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభ వర్షాకాల సమావేశాల్లో చెప్పారు.రూ.2000 మించిన యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందా అనే ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, జీఎస్టీ రేట్లు, మినహాయింపులను కేంద్రం, రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల సభ్యులతో కూడిన రాజ్యాంగ సంస్థ అయిన జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సుల ఆధారంగా నిర్ణయిస్తామని సభకు తెలిపారు. యూపీఐ ట్రాన్సాక్షన్ డేటా ఆధారంగా కర్ణాటకలోని వ్యాపారులకు దాదాపు 6,000 జీఎస్టీ డిమాండ్ నోటీసులు అందాయి.మరోవైపు యూపీఐ లావాదేవీలను మరింత లోతుగా స్క్రూటినీ చేస్తూ, వాటి ఆధారంగా జీఎస్టీని దూకుడుగా అమలు చేస్తే మొదటికే మోసం రావొచ్చని ఎస్బీఐ రీసెర్చ్ ఒక నివేదికలో హెచ్చరించింది. దీనివల్ల చిన్న వ్యాపారులు తిరిగి నగదు లావాదేవీల వైపు వెళ్లిపోయే అవకాశం ఉందని పేర్కొంది. అలా జరగకుండా జీఎస్టీ అమలు విషయంలో జాగ్రత్తగా, బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుందని నివేదిక సూచించింది. -
రూ.15 వేలు బోనస్.. ఆగస్టు 1 నుంచి కొత్త పథకం
కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం ఆగస్టు 1 నుంచి ప్రారంభం కానుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)లో రిజిస్టర్ చేసుకున్న మొదటిసారి ఉద్యోగులు అంటే ఇప్పుడే కొత్తగా ఉద్యోగంలో చేరుతున్నవారికి కొత్తగా ప్రారంభిస్తున్న పీఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన (పీఎం-వీబీఆర్వై) కింద రూ.15,000 లభిస్తాయి. ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ (ఈఎల్ఐ)గా పిలిచే ఈ పథకానికి రూ.99,446 కోట్ల బడ్జెట్తో కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదం తెలిపిందని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. పీఎం-వీబీఆర్వై పథకం యాజమాన్యాలకు ప్రోత్సాహకాలను అందించడం ద్వారా కొత్త ఉద్యోగాలను సృష్టించడానికి ప్రోత్సహిస్తుంది. వివిధ రంగాల్లో, ముఖ్యంగా తయారీ రంగంలో ఉద్యోగావకాశాలను పెంచడమే దీని ప్రధాన లక్ష్యం. ఉపాధి ఆధారిత అభివృద్ధి ద్వారా భారత ఆర్థిక వృద్ధిని నడిపించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తుంది.పథకం అమలు తీరు ఇలా..ఈ పథకం రెండు విధాలుగా ప్రోత్సాహాలు అందిస్తుంది. ఒకటి మొదటిసారి ఉద్యోగుల కోసం, మరొకటి యజమానుల కోసం. ఈ భాగం మొదటిసారిగా శ్రామిక శక్తిలో చేరిన (ఈపీఎఫ్ఓలో నమోదై ఉండాలి) వారిని లక్ష్యంగా చేసుకుంటుంది. అర్హత కలిగిన ఉద్యోగులు (రూ .1 లక్ష వరకు వేతనం ఉన్నవారు) రూ .15,000 వరకు వన్ టైమ్ ఈపీఎఫ్ వేతన ప్రయోజనాన్ని పొందుతారు.దీన్ని ఉద్యోగంలో చేరిన 6 నెలల తరువాత, మళ్లీ 12 నెలల నిరంతర సర్వీస్ తర్వాత రెండు వాయిదాలలో చెల్లిస్తారు. రెండో విడత పొందాలంటే ఉద్యోగులు తప్పనిసరిగా ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్ పూర్తి చేయాలి. పొదుపు అలవాట్లను పెంపొందించడానికి ఈ ప్రోత్సాహకంలో కొంత భాగాన్ని పొదుపు ఖాతా లేదా సాధనానికి కేటాయిస్తారు. దాన్ని తరువాత ఉపసంహరించుకోవచ్చు.ఇక కొత్తగా ఉద్యోగాలు కల్పిస్తున్న యాజమాన్యాలకూ ఈ పథకం కింద ప్రోత్సాహాలు ఉంటాయి. ముఖ్యంగా తయారీ రంగంలో కొత్త కార్మికులను నియమించుకునే యాజాన్యాలకు కనీసం ఆరు నెలల పాటు ఉద్యోగంలో కొనసాగే ప్రతి కొత్త ఉద్యోగికి నెలకు రూ.3,000 వరకు ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఈ మద్దతు రెండు సంవత్సరాలు కొనసాగుతుంది. అదే తయారీ యూనిట్లకు అయితే ప్రోత్సాహక కాలాన్ని మూడు, నాల్గవ సంవత్సరాలకు కూడా పొడిగించే అవకాశం ఉంటుంది.ఈ పథకం నుండి ప్రయోజనం పొందడానికి,ఈపీఎఫ్ఓలో నమోదైన కంపెనీలు కొత్త ఉద్యోగులను నియమించుకుని వారిని కనీసం ఆరు నెలల పాటు కొనసాగించాల్సి ఉంటుంది. 50 మంది కంటే తక్కువ ఉద్యోగులు ఉన్న సంస్థలైతే కనీసం ఇద్దరిని, 50 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థలు కనీసం ఐదుగురిని కొత్తగా నియమించుకోవాలి.ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ (ఏబీపీఎస్)ను ఉపయోగించి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) ద్వారా తొలిసారి ఉద్యోగులకు చెల్లింపులు జరుగుతాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో లబ్ధిదారు కంపెనీలకు ప్రోత్సాహకాలను నేరుగా ఆ సంస్థ పాన్ లింక్ అయిన బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. -
అంత తక్కువ వడ్డీ అంటే అనుమానించాలి కదా?
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నగర శివార్లలోని తెల్లాపూర్లో ఉంటున్న ఓ వ్యక్తి తాను ముంబైలో ఉంటున్నట్లు ఆన్లైన్లో ప్రచారం చేసుకున్నాడు. ఫిన్పెయిర్ పేరుతో వెబ్సైట్ ఏర్పాటు చేసి వ్యాపారాభివృద్ధికి రుణం ఇస్తానంటూ ఎర వేశాడు. నమ్మి ముందుకు వచ్చిన నగర వ్యాపారి నుంచి రూ.1.5 కోట్లు స్వాహా చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడు డి.నాగరాజును అరెస్టు చేసినట్లు డీసీపీ దార కవిత శుక్రవారం వెల్లడించారు.తెల్లాపూర్ రోడ్డులోని హోనర్ వివాంటీస్లో నివసించే నాగరాజు ఆన్లైన్లో ఫిన్ పెయిర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను ఏర్పాటు చేశాడు. దీనికోసం ఓ వెబ్సైట్ను రూపొందించిన ఇతగాడు అందులో ఇది ముంబై కేంద్రంగా పని చేస్తున్నట్లు పేర్కొన్నాడు. వివిధ రకాలైన వ్యాపారులను వారి వ్యాపారాభివృద్ధి కోసం తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తామంటూ ఆన్లైన్ వేదికగా ప్రచారం చేశాడు.నగరానికి చెందిన ఓ వ్యాపారి (39) ఆన్లైన్లో వచ్చిన ఈ ప్రకటన చూసి ఆకర్షితుడయ్యాడు. తనకు రుణం కావాలంటూ ఆ ప్రకటనలో పొందపరచగా...అది చూసిన నాగరాజు 2023 జూన్లో సదరు వ్యాపారిని సంప్రదించాడు. వ్యాపారి పూర్వాపరాలు, రుణం అవసరాలను తెలుసుకున్న నాగరాజు భారీ మొత్తం తక్కువ వడ్డీకి ఇవ్వడానికి అంగీకరించాడు. ఆపై వివిధ రకాలైన రుసుముల పేరు చెప్పి ఆ ఏడాది నవంబర్ నుంచి దశల వారీగా రూ. కోటీ 55 లక్షలు స్వాహా చేశాడు.అప్పటి నుంచి త్వరలో రుణం మంజూరై ఖాతాలో పడుతుందంటూ నమ్మబలుకుతున్నాడు. ఎట్టకేలకు మోసపోయానని తెలుసుకున్న బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీన్ని దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ కె.సతీష్ రెడ్డి నేతృత్వంలోని బృందం నిందితుడిని అరెస్టు చేసింది. ఇతడు ఇలాంటి నేరాలు ఇంకా ఏవైనా చేశాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తోంది. -
యూపీఐ పేమెంట్లపై ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) పేమెంట్లపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీఐ ద్వారా పూర్తిగా ఉచిత డిజిటల్ లావాదేవీల శకం శాశ్వతంగా ఉండకపోవచ్చని సూచిస్తూ భవిష్యత్తులో యూపీఐ ఇంటర్ఫేస్ను ఆర్థికంగా సుస్థిరం చేయాల్సిన అవసరం ఉందన్నారు మల్హోత్రా.ప్రస్తుతం ఉచితంయూపీఐ వ్యవస్థ ప్రస్తుతం వినియోగదారులకు ఉచితమని, బ్యాంకులు, ఇతర భాగస్వాములకు సబ్సిడీ ఇవ్వడం ద్వారా ఖర్చులను ప్రభుత్వం భరిస్తోందని ఆయన అన్నారు. ‘మనకు విశ్వవ్యాప్తంగా సమర్థవంతమైన వ్యవస్థ అవసరం. ప్రస్తుతానికి ఎలాంటి ఛార్జీలు లేవు. యూపీఐ చెల్లింపుల వ్యవస్థలో బ్యాంకులు, ఇతర భాగస్వాములకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది’ అన్నారు.ఉచితం శాశ్వతం కాదుడిజిటల్ చెల్లింపుల మౌలిక సదుపాయాలను కొనసాగించాలంటే ఎవరోఒకరు ఖర్చును భరించాల్సి ఉంటుందని, ఉచిత యూపీఐ లావాదేవీలు శాశ్వతంగా ఉండవని ఆర్బీఐ గవర్నర్ అన్నారు. 'సహజంగానే కొన్ని ఖర్చులు చెల్లించాల్సి ఉంటుంది. ఏ ముఖ్యమైన మౌలిక సదుపాయాలైనా ఫలాలు ఇవ్వాలి. ఏ సేవ అయినా నిజంగా నిలకడగా ఉండాలంటే, దాని ఖర్చును సమిష్టిగా గానీ లేదా వినియోగదారు గానీ చెల్లించాలి' అని వ్యాఖ్యానించారు.మౌలిక సదుపాయాలపై భారంయూపీఐ లావాదేవీలు గత కొన్నేళ్లుగా విపరీతమైన వృద్ధిని సాధించాయి. గ్లోబల్ పేమెంట్స్ దిగ్గజం వీసాను అధిగమించాయి. గత జూన్లో 1839 కోట్ల యూపీఐ లావాదేవీల ద్వారా రూ .24.03 లక్షల కోట్లకు పైగా చెల్లింపులు జరిగాయి. దీంతో వేగవంతమైన చెల్లింపులలో భారత్ గ్లోబల్ లీడర్గా మారింది. అయితే, ఈ పెరుగుదల బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) వంటి బ్యాక్ ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై చాలా ఒత్తిడిని కలిగిస్తుంది. యూపీఐ లావాదేవీలు ఉచితం కావడంతో వాటి ద్వారా ఎటువంటి ఆదాయ ప్రవాహం లేకపోవడం వల్ల ఇది ఆర్థికంగా నిలకడలేని నమూనాగా మారింది. -
ఇన్కమ్ ప్రూఫ్ లేకుండా ఇచ్చే క్రెడిట్ కార్డులు
క్రెడిట్ కార్డులు అనేవి ప్రస్తుతం ప్రతిఒక్కరికి దైనందిన జీవితంలో కనీస అవసరాలుగా మారిపోయాయి. ఉద్యోగులు, వ్యాపారులు ఇలా అన్ని వర్గాల వారికి ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు అనేక రకాల క్రెడిట్ కార్డులు ఇస్తున్నాయి. ఈ క్రెడిట్ కార్డులు ఇప్పుడు పెద్దలకు మాత్రమే ఆర్థిక సాధనాలు కాదు.. విద్యార్థులలో కూడా ప్రాచుర్యం పొందుతున్నాయి. సాధారణంగా చాలా బ్యాంకులు నిరుద్యోగులు, సరైన క్రెడిట్ హిస్టరీ లేని వారికి క్రెడిట్ కార్డులు ఇవ్వవు. అయితే, విద్యార్థులు ఇందుకు మినహాయింపు.చదువుల కోసం కుటుంబాలకు దూరంగా ఉంటున్న యువత కోసం పలు బ్యాంకులు స్టూడెంట్ క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. వివిధ బిల్లులు, కిరాణా సరుకులు లేదా రూం అద్దెలు వంటి చెల్లింపుల కోసం క్రెడిట్ కార్డు ఉపయోగకరంగా ఉంటుంది. ఇది విద్యార్థులు రోజువారీ ఖర్చులను నిర్వహించడానికి సహాయపడటమే కాకుండా మంచి క్రెడిట్ హిస్టరీని నిర్మించడానికి కూడా సహాయపడుతుంది. ప్రస్తుతం ఏయే బ్యాంకులు విద్యార్థులకు క్రెడిట్ కార్డులు ఇస్తున్నాయి.. వీటిలో టాప్ ఐదు ఉత్తమ క్రెడిట్ కార్డుల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.ఎస్బీఐ స్టూడెంట్ ప్లస్ అడ్వాంటేజ్ క్రెడిట్ కార్డు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నుంచి ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్న విద్యార్థుల కోసం ప్రత్యేకంగా దీన్ని రూపొందించారు. కార్డుపై ఖర్చు చేసిన ప్రతి రూ.100కు 1 రివార్డ్ పాయింట్, రూ.500 నుంచి రూ.3,000 మధ్య లావాదేవీలపై 2.5% ఫ్యూయల్ సర్చార్జ్ మినహాయింపు లభిస్తుంది. దీనితో పాటు, మీరు మీ ఇతర క్రెడిట్ కార్డుల బకాయి బిల్లులను ఈ ఎస్బీఐ స్టూడెంట్ ప్లస్ అడ్వాంటేజ్ క్రెడిట్ కార్డుకు తక్కువ వడ్డీ రేటుతో బదిలీ చేయవచ్చు.ఐడీఎఫ్సీ ఫస్ట్ వావ్ క్రెడిట్ కార్డ్ ఈ కార్డుకు ఎలాంటి డాక్యుమెంటేషన్ అవసరం లేదు కాబట్టి ఇది విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. క్రెడిట్ స్కోర్ చెక్ కూడా ఉండదు. విద్యార్థులు ఎలాంటి ఆదాయ రుజువు లేకుండా ఈ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు 1,500 రెస్టారెంట్లలో 20% వరకు తగ్గింపును ఆస్వాదించవచ్చు. ఆన్లైన్, ఆఫ్లైన్ ఖర్చులపై 4 రెట్ల వరకు రివార్డులను పొందవచ్చు.కోటక్ 811 డ్రీమ్ డిఫరెంట్ క్రెడిట్ కార్డు ఈ కార్డులో జాయినింగ్ లేదా వార్షిక రుసుము ఉండదు. ఇది ఆల్-ఇన్-వన్ క్రెడిట్ కార్డు. ఇది 48 రోజుల వరకు వడ్డీ లేని నగదు ఉపసంహరణలు, అన్ని కొనుగోళ్లపై రివార్డులు, మీ టర్మ్ డిపాజిట్ మొత్తంలో 90% వరకు క్రెడిట్ పరిమితిని అందిస్తుంది. ఇది జీవితకాల ఉచిత క్రెడిట్ కార్డు. ఇది విద్యార్థులకు ఖర్చు లేని ఎంపిక.యాక్సిస్ బ్యాంక్ స్టూడెంట్స్ ఫారెక్స్ కార్డు ఇది విదేశీ కరెన్సీతో లోడ్ చేసిన ఫారెక్స్ కార్డు. విదేశాల్లో చదువుకునే విద్యార్థుల కోసం దీన్ని రూపొందించారు. మీరు సందర్శించే దేశం స్థానిక కరెన్సీలో సౌకర్యవంతంగా నగదును ఉపసంహరించుకోవచ్చు. ఒకే కార్డుపై 16 కరెన్సీలను లోడ్ చేయవచ్చు. లాక్-ఇన్ ఎక్స్ఛేంజ్ రేటు నుండి ప్రయోజనం పొందవచ్చు. ఇది కరెన్సీ హెచ్చుతగ్గులపై ఎక్కువ ఖర్చు చేయకుండా నిరోధిస్తుంది.ఐసీఐసీఐ కోరల్ కాంటాక్ట్లెస్ క్రెడిట్ కార్డు ఈ కార్డుతో బుక్ మైషో బుకింగ్స్, డైనింగ్, రైల్వే, ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్, ఇంధనం నింపిన ప్రతిసారీ ఫ్యూయల్ సర్ఛార్జ్పై 1% పూర్తి మినహాయింపు లభిస్తుంది. ఇది చిప్, పిన్ సెక్యూరిటీతో వస్తుంది. ఇక్కడ మీరు మర్చంట్ అవుట్లెట్లలో లావాదేవీల కోసం టెర్మినల్పై మీ పిన్ నంబర్ నమోదు చేయాలి. -
రూ.75 లక్షల జాబ్ ఆఫర్.. తీసుకోవాలా.. వద్దా?
ఎక్కువ జీతం వచ్చే జాబ్ ఆఫర్ వచ్చిందంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. ఇంకేం ఆలోచించకుండా వెంటనే ఓకే చెప్పేస్తారు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏడాదికి రూ.75 లక్షల జీతంతో జాబ్ ఆఫర్ వచ్చింది.. తీసుకోవాలా.. వద్దా అని సందిగ్ధంలో ఉన్నానని ఇటీవల ఓ సోషల్ మీడియాలో షేర్ చేశారు. భారతదేశంలో అధిక పన్ను కారణంగా ఈ ఆఫర్ను తాను స్వీకరిస్తానని ఖచ్చితంగా చెప్పలేనన్నారు.తాను ఇప్పటికే దాదాపు రూ.12 లక్షల పన్నులు చెల్లిస్తున్నానని, కొత్త జాబ్ ఆఫర్ స్వీకరిస్తే ఆ పన్ను మొత్తం దాదాపు రెట్టింపు అయి రూ.22 లక్షలకు చేరుకుంటుందని చెప్పారు. ‘20 ఏళ్ల అనుభవంతో ప్రస్తుతం భారత్ లో ఏటా రూ.48 లక్షలు సంపాదిస్తున్నాను. ఈ మధ్యనే రూ.75 లక్షలకు ఆఫర్ వచ్చింది. ఇది గణనీయమైన పెరుగుదల అయినప్పటికీ, ప్రధానంగా పన్ను బాధ్యతలో విపరీతమైన పెరుగుదల కారణంగా దానిని అంగీకరించాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. ప్రస్తుతం రూ.12 లక్షల వరకు పన్నులు చెల్లిస్తున్నాను. రూ .50 లక్షలకు పైగా ఆదాయంపై వర్తించే అదనపు 10% సర్ఛార్జ్ కారణంగా కొత్త ఆఫర్తో ఆ మొత్తం దాదాపు రెట్టింపు అయి రూ .22 లక్షలకు చేరుకుంటుంది" అని యూజర్ రెడ్డిట్ పోస్ట్లో పేర్కొన్నారు.ట్యాక్స్ ఎక్కువ కట్టేందుకు పనిచేయాలా?కొత్త వేతన నిర్మాణంలో పన్ను ఆదా చేసే అంశాలను చేర్చే వెసులుబాటు లేదని ఆయన అన్నారు. ‘కాబట్టి, నా టేక్-హోమ్ వేతనం సుమారు 50% పెరగవచ్చు, పన్ను భారం దాదాపు రెట్టింపు అవుతుంది. తక్కువ పన్ను లేదా అస్సలు చెల్లించని వారితో పోలిస్తే ఎటువంటి అదనపు స్పష్టమైన ప్రయోజనాలను పొందకుండా, ప్రభుత్వానికి ఎక్కువ పన్ను చెల్లించడానికి నేను ఎందుకు ఎక్కువగా కష్టపడాలి?" అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు.ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. సదరు వ్యక్తికి వచ్చిన సందిగ్ధ పరిస్థితిపై నెటిజన్లు సానుభూతి వ్యక్తం చేస్తూనే అభిప్రాయాలనూ వ్యక్తీకరించారు. నేరుగా ఉద్యోగంలో చేరకుండా కన్సల్టెంట్ గా పరిహారం అందుకుంటే పెద్ద మొత్తంలో పన్ను ఆదా చేసుకోవచ్చని, కానీ ప్రభుత్వానికి ఎక్కువ ట్యాక్స్ చెల్లించడం ఇష్టం లేక వేతన పెంపు తీసుకోకపోవడం సరికాదంటూ ఓ యూజర్ సలహా ఇచ్చారు. ఇప్పుడొస్తున్న దానికంటే 50% ఎక్కువ జీతం వస్తున్నా కూడా ట్యాక్స్ పెరుగుతుంది కాబట్టి జాబ్ ఆఫర్ను వదులుకుంటాననడం మూర్ఖత్వం అని మరో వ్యక్తి పేర్కొన్నారు.దేశంలో ఏప్రిల్ 1, 2025 నుండి అమల్లోకి వచ్చిన కొత్త ఆదాయపు పన్ను విధానంలో రూ .4 లక్షల వరకు ఆదాయంపై సున్నా పన్ను ఆ తర్వాత 5% నుండి 30% వరకు పన్ను రేట్లు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే రూ.12 లక్షల వరకు వార్షికాదాయం ఉన్న పన్ను చెల్లింపుదారులు (వేతన జీవులకు రూ.12.75 లక్షలు) అధిక రిబేట్, స్టాండర్డ్ డిడక్షన్ కారణంగా ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక పాత విధానం ఎంచుకునేవారికి 80సీ, హెచ్ఆర్ఏ వంటి సెక్షన్ల కింద మినహాయింపులు ఉన్నాయి. అధిక ఆదాయం ఉన్న వ్యక్తులకు సర్ ఛార్జీలు వర్తిస్తాయి.👉 ఇదీ చదవండి: ఐటీ రిటర్న్ కొత్త డెడ్లైన్.. మిస్ అయితే పెద్ద తలనొప్పే! -
‘గుడ్ న్యూస్.. పెద్ద క్రాష్ రాబోతోంది’
రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ద్వారా ప్రసిద్ధి చెందిన రాబర్ట్ కియోసాకి ఏదో క్రాష్ రాబోతోందని హెచ్చరించారు. బంగారం, వెండి, బిట్ కాయిన్ సహా అసెట్ క్లాసుల్లో బుడగలు పేలబోతున్నాయంటూ ఈ 78 ఏళ్ల ఇన్వెస్టర్, ఎంట్రాప్రెన్యూర్ సంకేతాలిచ్చారు.సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్)లో రాబర్ట్ కియోసాకి ఒక పోస్ట్ చేశారు. "బుడగలు పేలడం ప్రారంభించాయి.. బుడగలు పేలినప్పుడు బంగారం, వెండి, బిట్ కాయిన్ కూడా పతనమవుతాయి. గుడ్ న్యూస్’ అంటూ రాసుకొచ్చారు.క్రాష్ అంటూ హెచ్చరిస్తున్నప్పటికీ రానున్న పతనాన్ని కొనుగోలు అవకాశంగా కియోసాకి పేర్కొన్నారు. ధరలు పడిపోతే తాను బంగారం, వెండి, బిట్ కాయిన్లలో ఎక్కువ పెట్టుబడి పెడతానని చెప్పుకొచ్చారు. బంగారం, వెండి, బిట్ కాయిన్ వంటి ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టడానికి ఉత్తమ సమయం ధరలు తక్కువగా ఉన్నప్పుడు, భయం ఎక్కువగా ఉన్నప్పుడు అని ఆయన వివరించారు.BUBBLES are about to start BUSTING.When bubbles bust odds are gold, silver, and Bitcoin will bust too.Good news.If prices of gold, silver, and Bitcoin crash…. I will be buying.Take care.— Robert Kiyosaki (@theRealKiyosaki) July 21, 2025 -
ఐటీ రిటర్న్ కొత్త డెడ్లైన్.. మిస్ అయితే పెద్ద తలనొప్పే!
దేశంలో ప్రస్తుతం ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్) సీజన్ నడుస్తోంది. ఐటీ రిటర్నులు దాఖలు చేయడం భారతీయ పన్ను చెల్లింపుదారులందరికీ కీలకమైన బాధ్యత. అన్ని ఆదాయ మార్గాలను ప్రకటించడం, అర్హత వ్యయాలను మినహాయించడం, పన్ను బాధ్యతలను ఆదాయపు పన్ను శాఖకు నివేదించడంతో పాటు పన్ను చట్టాలను పాటించడం అవసరం.ఐటీఆర్ దాఖలుకు కొత్త డెడ్లైన్2024–25 ఆర్థిక సంవత్సరానికి (అసెస్మెంట్ ఇయర్ 2025–26) నాన్ ఆడిట్ పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్ దాఖలు చేయడానికి సాధారణంగా జూలై 31 వరకూ గుడువు ఉంటుంది. అయితే ఈసారి గడువును 2025 సెప్టెంబర్ 15 వరకు పొడిగించారు. ఒకవేళ గడువు దాటితే ఆలస్య రుసుము, వడ్డీ చెల్లించి 2025 డిసెంబర్ 31లోగా లేట్ రిటర్న్ దాఖలు చేయవచ్చు.గడువు దాటిపోతే పర్యవసానాలుఐటీఆర్ దాఖలు చేయకుండా గడువు దాటిపోతే సెక్షన్ 234ఏ కింద తీవ్రమైన జరిమానాలు, అభియోగాలు, సెక్షన్ 234ఎఫ్ కింద ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది.వడ్డీ: గడువు తర్వాత మీరు మీ రిటర్న్ సబ్మిట్ చేస్తే, సెక్షన్ 234ఎ కింద చెల్లించని పన్ను మొత్తంపై నెలకు 1% లేదా ఒక నెలలో కొంత భాగం వడ్డీ చెల్లించాలి.ఆలస్య రుసుము: సెక్షన్ 234ఎఫ్ కింద ఆలస్య రుసుము వసూలు చేస్తారు. రూ.5 లక్షలకు పైగా ఆదాయం ఉంటే రూ.5,000, రూ.5 లక్షల లోపు ఆదాయం ఉంటే రూ.1,000 ఆలస్య రుసుము వసూలు చేస్తారు.నష్టాల సర్దుబాటు: స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఇళ్లు లేదా మీ వ్యాపారాల నుండి మీకు నష్టాలు వచ్చి ఉంటే వాటిని మరుసటి సంవత్సరం మీ ఆదాయానికి వ్యతిరేకంగా సర్దుబాటు చేసుకోవచ్చు. దీనివల్ల తరువాతి సంవత్సరాలలో మీరు చెల్లించాల్సిన పన్ను గణనీయంగా తగ్గుతుంది. అయితే గడువులోగా ఐటీఆర్ దాఖలు చేయకపోతే ఈ నష్టాలను సర్దుబాటు చేసుకునే వెసులుబాటు ఉండదు.👉 ఇదీ చదవండి: రూ.75 లక్షల జాబ్ ఆఫర్.. అంత ట్యాక్స్ కట్టి అవసరమా? -
అవీవా కొత్త పాలసీ.. బాల వికాస్ యోజన
న్యూఢిల్లీ: అవీవా ఇండియా నూతనంగా అవీవా భారత్ బాల వికాస్ యోజన పేరుతో బీమా ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఇది ఈక్విటీ మార్కెట్తో సంబంధం లేని, నాన్ పార్టిసిపేటింగ్ జీవిత బీమా ప్లాన్. తమ పిల్లల భవిష్యత్ భద్రతకు ఇది భరోసానిస్తుందని కంపెనీ తెలిపింది. ప్రీమియం నెలకు రూ.1,000 నుంచి మొదలవుతుంది.జీవిత బీమా రక్షణకుతోడు హామీతో కూడిన మెచ్యూరిటీ ప్రయోజనం కూడా ఇందులో భాగంగా ఉంటుంది. 3 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసు పరిధిలోని వారు.. 12–30 ఏళ్ల కాలానికి తీసుకోవచ్చు. గరిష్ట కాల వ్యవధి పాలసీదారుడికి 80 ఏళ్ల వరకు ఉంటుంది.నెలవారీ, త్రైమాసికం లేదా అర్ధ సంవత్సరం లేదా ఏడాదికోసారి ప్రీమియం చెల్లింపు ఆప్షన్ను ఎంపిక చేసుకోవచ్చు. గ్యారంటీడ్ సమ్ అష్యూర్డ్ పేరుతో కాల వ్యవధి ముగిసిన తర్వాత చెల్లించే ప్రయోజనం పిల్లల భవిష్యత్ అవసరాలకు ఆర్థిక భరోసానిస్తుందని కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ వినీత్ కపాహి తెలిపారు. -
వారెన్ బఫెట్ ప్రకారం.. ఆ 5 తప్పులివే...
అమెరికాకు చెందిన వారెన్ బఫెట్, ప్రపంచంలోని అత్యాధునిక అత్యంత తెలివైన పెట్టుబడిదారుల్లో ఒకరు. ఆయన గురించి తెలియని విద్యావంతులు ఉంటారేమో కానీ ఆర్ధికవేత్తలు ఉండరు. ప్రపంచంలో అత్యధిక ధనవంతుల్లో 5వ వ్యక్తి అయిన వారెన్ బఫెట్ 94 వయస్సులోనూ అత్యంత తెలివిగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతూ లాభాలను ఆర్జిస్తున్నారు. సంపదను అర్జించడంతో పాటు దానిని రక్షించుకోవడం, దాని విలువను పెంచుకోవడం వంటి విషయాలపై ఆయన తరచుగా చెప్పే సూత్రాలు ఆర్ధిక నిరక్షరాస్యులకు ఓ రకంగా పాఠాల లాంటివే నని చెప్పాలి. సంపన్నులు కాలేకపోయిన మధ్య తరగతి జీవులు తరచుగా చేసే తప్పుల గురించి ఆయన చెప్పిన కొన్ని విషయాలివి...కొత్త కారు...పెద్ద వృధా..చాలా మంది తమ స్థాయి మెరుగుపరచడం కోసం కాకుండా మెరుగైందని చెప్పుకోవడం కోసం ఎక్కువ ఆరాట పడతారు. అలాంటి వారికి బఫెట్ చెబుతున్న సలహా ఏమిటంటే...కొత్త కారు షోరూం నుంచి బయటకి తీసుకొచ్చిన రెండో నిమిషం నుంచే విలువ తగ్గిపోవడం మొదలవుతుంది, ఐదు సంవత్సరాల్లో దాని విలువ 60% వరకు కోల్పోతుంది. వేల కోట్ల ఆస్తులున్న బఫెట్ 2014 మోడల్ క్యాడిల్లాక్ ఎక్స్టిఎస్ ను వినియోగిస్తుంటారు. అదీ జనరల్ మోటార్స్ వాళ్లు భారీ డిస్కౌంట్ ధరపై ఇస్తేనే కొనుగోలు చేశారు. ఆయనేమంటారంటే... ‘‘కారును ఒక విజయంలా కాదు, ఒక ప్రయాణ మార్గంగా మాత్రమే చూడాలి’’.క్రెడిట్ కార్డ్ ఓ వల...బహుశా భారతదేశంలో ఇప్పుడు క్రెడిట్ కార్డు గురించి తెలియని వారిని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చేమో కానీ... క్రెడిట్ కార్డ్ వల్ల వచ్చే నష్టాలు మాత్రం లెక్కలేనన్ని అంటున్నారు బఫెట్.. దాని అప్పులపై అత్యధికంగా 30% వడ్డీ చెలించాల్సి వుంటుంది. ఉదాహరణకు రూ.1 లక్ష తీసుకుంటే రూ.30 వేల దాకా వార్షిక వడ్డీ చెల్లించవలసి ఉంటుంది. ‘‘మీరు తెలివిగా ఉంటే, అప్పు బాధ వదిలిపోవచ్చు’’ అంటారాయన. క్రెడిట్ కార్డ్ను అత్యవసర సమయాల్లో ఉపకరించేదిగా మాత్రమే చూడాలి తప్ప అత్యధిక వ్యయానికి అవకాశంగా చూడకూడదని ఆయన హెచ్చరిస్తున్నారు.లాటరీ, జూదం రెండూ ప్రమాదమే..జూదం, లాటరీలను ‘‘మ్యాథ్ ట్యాక్స్’’ అని పేర్కొంటారు బఫెట్, అంటే మ్యాథమేటిక్స్, లాజిక్ తెలియని వారికి వడ్డించే అదనపు పన్ను అని అర్ధం. ఇవి వ్యక్తుల్ని వారి మేధా శక్తిని నిర్వీర్యం చేసి చివరకు అదృష్టం మీద ఆధారపడే దుస్థితికి చేరుస్తుందని ఆయన అంటున్నారు.ఇల్లు...అవసరమా? విజయమా?అవసరానికి ఇల్లు కొనవచ్చు. అయితే అవసరానికి మించి పెద్ద ఇల్లు ఉంటే అది నష్టమే అంటున్నారు బఫెట్. ఆయన తాను 1958లో కొనుక్కున్న పాత ఇంటిలోనే ఆయన ఇప్పటికీ జీవిస్తున్నారు. ఇల్లు జీవించడానికి రెండు పడకగదుల ఇల్లు సరిపోయేవారు 4 పడక గదుల ఇల్లు కొనడం అంటే రూ.లక్షలు ఏటా వృధా చేస్తున్నట్టే వారికి పన్నులు, నిర్వహణ, సిబ్బంది ఖర్చులు, మెయిన్టెనెన్స్ అన్నీ డబుల్ అవుతాయి. కాబట్టి ఇల్లు కొనుగోలులో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి అని సూచిస్తున్నారాయన.అవగాహన లేని చోట ఎప్పుడూ పెట్టుబడి పెట్టవద్దుమనకు ఉన్న అదనపు సొమ్మును లాభాల కోసం రకరకాల మార్గాల్లో పెట్టుబడులుగా మార్చడం సరైనదే. అయితే మనం దేనిలో పెట్టుబడి పెడుతున్నాం? అనేది పూర్తి అవగాహన ఉండాలి. అలా కాకుండా ఏ మాత్రం తెలియని వ్యాపారం, రంగంలో పెట్టుబడి పెడితే... అది ఎప్పటికైనా నష్టాలే తెస్తుంది. ముందు పొదుపు చెయ్యి, ఆ తర్వాత ఖర్చు చెయ్యి తెలివిగా ఇన్వెస్ట్ చెయ్యి...అంటూ సూత్రీకరించే బఫెట్.. మనకు.వందల వేల కోట్ల ఆస్తులున్నా సరే.. ఆర్ధిక భధ్రత కోసం రెండే రూల్స్ పెట్టుకోవాలని సూచిస్తున్నారు. అవి 1. ఎప్పుడూ డబ్బును నష్టపోవద్దు. 2.మొదటి రూల్ని ఎప్పటికీ మరచిపోవద్దు. -
మెడికల్.. ఇన్సూరెన్సూ.. సెక్షన్ 80 మినహాయింపులు
ఈ వారం సెక్షన్ 80లో పొందుపర్చిన అంశాలు... వైద్యానికి సంబంధించిన మినహాయింపులు గురించి తెలుసుకుందాం. ముఖ్య విషయం ఏమిటంటే ఇవన్నీ కూడా కేవలం పాత పద్ధతిని అనుసరించిన వారికే మాత్రమే వర్తిస్తాయి.80డీ – మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఈ సెక్షన్ వ్యక్తులకు మాత్రమే వర్తిస్తుంది. ఒక వ్యక్తి తన కోసం, జీవిత భాగస్వామి కోసం తన మీద ఆధారపడ్డ పిల్లల కోసం చెల్లించే మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంకి వర్తిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.25,000 పరిమితిని మించి మినహాయింపు ఇవ్వరు. తల్లిదండ్రులు 60 సంవత్సరాల లోపు వారయితే అదనంగా రూ.25,000 వారి నిమిత్తం చెల్లించే ప్రీమియంలపై, మొత్తం మీద రూ.50,000 మినహాయింపు ఇస్తారు. కుటుంబంలో ఏ వ్యక్తి చెల్లిస్తాడో... ఆ వ్యక్తి ఇన్కంలోంచి మినహాయింపు ఇస్తారు. ఇతరులకు ఇవ్వరు. నగదులో చెల్లించిన ప్రీమియంలకు మినహాయింపు దొరకదు. చెక్కు ద్వారా, డీడీ ద్వారా ఆన్లైన్ ద్వారా చెల్లించాలి.వ్యక్తి, అతని తల్లిదండ్రులు.. అందరూ 60 సంవత్సరాల్లోపు ఉంటే మొత్తం రూ.50వేలు, వ్యక్తి 60 సంవత్సరాల్లోపు ఉండి, తల్లిదండ్రులు అరవై ఏళ్లు దాటిన వారు అయితే రూ.25,000 కాకుండా అదనంగా రూ.50,000 దాకా మినహాయింపు ఇస్తారు. వ్యక్తి, తల్లిదండ్రులు 60 ఏళ్లు దాటితే రూ.50వేలు + 50వేలు = మొత్తం రూ. 1,00,000 ఇస్తారు. ఇవన్నీ కాకుండా ప్రివెంటివ్ హెల్త్ చెకప్ నిమిత్తం రూ.50 వేలు ఖర్చు పెట్టొచ్చు. ఈ మేరకు నగదు చెల్లించవచ్చు. కానీ ఖర్చు మొత్తం గరిష్ట పరిమితికి లోబడి ఉంటుంది. రెండో అంశం 80డీడీ ఒక వ్యక్తి మీద ఆధారపడ్డ మనిషి దివ్యాంగుడైతే, అతని వైద్యం నిమిత్తం చేసిన ఖర్చులకు మినహాయింపు ఉంది. ఈ అంగవైకల్యాన్ని శాతాల్లో చెప్పాలంటే ... 40% లోపల ఉంటే రూ.75,000; 80 శాతానికిపైన ఉంటే రూ.1.25 లక్షల మినహాయింపు ఉంటుంది. వైద్య ఖర్చులే కాకుండా, ఈ వ్యక్తుల మీద చేసిన జీవిత బీమా ప్రీమియం చెల్లింపులకు కూడా వర్తిస్తుంది. వైద్య ఖర్చులు, నర్సింగ్, పునరావాస నిమిత్తం మొదలైనవి ఇందులో క్లెయిమ్ చేసుకోవచ్చు. మానసిక, చెవుడు, బుద్ధి మాంద్యం, మస్తిష్క పక్షవాతం, ఆటిజం, గుడ్డితనం, చూపుతక్కువ, లోకోమోటర్ వైకల్యం (అవయవాలు లేదా శరీరభాగాలు కదలికలకు సంబంధించింది) కుష్టు వ్యాధి మొదలైన వాటికి మినహాయింపు ఉంది. ఫారం 101ఏ జతపరచాలి. వైద్య అధికారులు సర్టిఫై చేయాలి.ఇది కాకుండా సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. అంగవైకల్యం మారుతూ ఉంటుంది. తేడాలు వస్తాయి. సర్టిఫికెట్లలో ధృవీకరించిన శాతాన్ని బట్టే మినహాయింపు ఉంటుంది. దివ్యాంగుడు ముందుగా మరణిస్తే, స్కీమ్ ద్వారా వచ్చిన మొత్తాన్ని, ఏ వ్యక్తి అకౌంటులోకి వస్తుందో, ఆ వ్యక్తి ఆదాయంలో కలుపుతారు. దివ్యాంగుడు జీవించి ఉన్నప్పుడు, 60 సంవత్సరాలు తర్వాత వచ్చే యాన్యుటీకి మినహాయింపు ఉంది. ఈ సెక్షన్లో మినహాయింపును తీసుకున్న వ్యక్తి, ఈ ప్రయోజనాన్ని సెక్షన్ 80యూ ప్రకారం పొందకూడదు. 80 డీడీబీదీని ప్రకారం వ్యక్తి తన కోసం లేదా తన మీద ఆధారపడిన వ్యక్తి నిర్దేశిత జబ్బుల చికిత్సకు అయిన ఖర్చు క్లెయిమ్ చేసుకోవచ్చు. గరిష్ట పరిమితి రూ.40 వేలు (60 ఏళ్ల లోపల) రూ.1,00,000 సీనియర్ సిటిజన్లకు తగ్గిస్తారు. 11 డీడీ రూల్ ప్రకారం క్లెయిమ్ చెయ్యాలి. న్యూరాలజిస్ట్, అంకాలజిస్ట్, యూరాలాజిస్ట్, హెమొటాలాజిస్ట్, ఇమ్యూనోలాజిస్ట్, మొదలైన స్పెషలిస్టులు ధృవీకరించాలి. పూర్తి వివరాలు ఇవ్వాలి. సంతకం కచ్చితంగా ఉండాలి. అసెస్సీతో సంబంధం లేకుండా పేషెంటు వయస్సుని బట్టి మినహాయింపు ఉంటుంది. సీనియర్ సిటిజన్లకు రూ.1 లక్ష దాకా, ఇతరులకు రూ.40,000 ఇస్తారు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ వచ్చినట్లయితే ఆ విలువ మేరకు మినహాయిపు తగ్గుతుంది. చివరిగా మరొకటి.. 80యూదీని ప్రకారం మినహాయింపు. మెడికల్ ఆధారిటీతో సర్టిఫై చేయిస్తే అంగవైకల్యం 40% దాటి ఉంటే రూ.75 వేలు, 80% దాటి ఉంటే రూ.1.25 లక్షల మినహాయింపు ఇస్తారు. ఫారం 101ఏ ఫైల్ చేయాలి. గవర్నమెంట్ హాస్పిటల్లోని సివిల్ సర్జన్లు/ చీఫ్ మెడికల్ అధికారి సర్టిఫై చేయాలి. అంగవైకల్యం సర్టిఫికెట్ కొత్తది జతపర్చాలి. అంధత్వం, కుష్టు, చెవుడు, మానసిక వైకల్యం, మానసిక మాంద్యం... వీటి విషయంలోనే ఇస్తారు. డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు.చివరగా హెచ్చరిక ఏమిటంటే.. సరైన ధృవపత్రాలుండాలి. నకిలీ డాక్టర్లు, నకిలీ పత్రాలు వద్దు. అన్నింటికి రికార్డు స్పష్టంగా ఉండాలి. -
ఆర్థిక సంక్షేమానికి ‘కస్టమైజ్డ్’ ఆరోగ్య బీమా
దేశీయంగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో నాటకీయ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చికిత్స ఖర్చులు, తీవ్రమైన వ్యాధులు, ప్రివెంటివ్ కేర్పై వినియోగదారుల్లో అవగాహన పెరుగుతుండటం తదితర అంశాల వల్ల సంప్రదాయ ఆరోగ్య బీమా పాలసీల తీరుతెన్నులు మారిపోయాయి. అందరికీ ఒకే రకం పాలసీలనేవి ఇప్పటి పరిస్థితులకు అనువైన విధానంగా ఉండటం లేదు. నేటి కస్టమర్లు తమ వాస్తవిక అవసరాలు, వ్యక్తిగత వైద్య చరిత్ర, మారే జీవన దశలకు అనుగుణంగా, సమయోచితంగా, సరళంగా ఉండే పాలసీలను కోరుకుంటున్నారు. 30లలో ఉన్న ఒంటరి వర్కింగ్ ఉమన్ కావచ్చు లేదా మధుమేహం ఉన్న సీనియర్ సిటిజన్ కావచ్చు లేదా పిల్లల కోసం ప్లానింగ్ చేసుకుంటున్న యువ జంట కావచ్చు ఒక్కొక్కరి అవసరాలు ఒక్కో రకంగా ఉంటాయి. ఒకే రకమైన పాలసీ వల్ల వారి అవసరాలు తీరవు. ఇలా వినియోగదారుల మైండ్సెట్ మార డం వల్ల, తమకు అనువైన విధంగా మార్చుకోగలిగే మాడ్యులర్ లేదా కస్టమైజబుల్ హెల్త్ ప్లాన్లకు ఆదరణ పెరుగుతోంది. ఆరోగ్య సంరక్షణకు సంబంధించి ఇది స్మార్ట్ విధానంగా ఉంటోంది. ఈ హెల్త్ ప్లాన్లలో ప్రత్యేకతలు..కస్టమైజబుల్ లేదా మాడ్యులర్ హెల్త్ ప్లాన్లనేవి నిర్దిష్టమైన ఆరోగ్య సంరక్షణ అవసరాలకు తగ్గ కవరేజీని తీసుకునేలా పాలసీదారులకు వెసులుబాటు కల్పిస్తాయి. చాలా మటుకు పథకాల్లో, బేస్ హాస్పిటలైజేషన్ కవరేజీ ఉంటుంది. వ్యక్తిగత అవసరాలను బట్టి మరిన్ని ఫీచర్లను జోడించుకునేందుకు ఇవి యూజర్లకు వీలు కలి్పస్తాయి. ఉదాహరణకు, ప్రీ–సెట్ రూమ్ కేటగిరీకే పరిమితమైపోకుండా, పాలసీదారులు షేర్డ్ రూమ్ల నుంచి మొదలుపెట్టి ఎలాంటి పరిమితులు లేని లేదా సూట్ స్థాయి గదుల వరకు వేర్వేరు రూమ్ రెంట్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. సమ్ ఇన్సూర్డ్ రిస్టోరేషన్ అనేది మరో ప్రధాన ఫీచరు. ఒకవేళ పాలసీదారుకు, సంవత్సరం మధ్యలో కవరేజీ అయిపోతే, చాలా మటుకు ప్లాన్లు ఆటోమేటిక్గా బీమా మొత్తాన్ని పూర్తిగా పునరుద్ధరిస్తాయి. ఇలా ఏడాదిలో ఒకసారికి మించి పునరుద్ధరిస్తాయి. కాలక్రమేణా, సంవత్సరాల తరబడి ఎలాంటి క్లెయిమూ చేయకపోతే పర్మనెంట్ నో–క్లెయిమ్ బోనస్ ప్రయోజనం దక్కుతుంది. అదనపు పేపర్వర్క్ లేదా గణనీయంగా ప్రీమియంల పెరిగే ప్రసక్తి లేకుండానే సమ్ ఇన్సూర్డ్ పరిమాణం పెరిగే అవకాశం ఉంటుంది. ఈ ప్లాన్లు పలు యాడ్–ఆన్లను అందిస్తాయి. మెటర్నిటీ, కవరేజీ, క్రిటికల్ ఇల్నెస్ సంరక్షణ, అంబులెన్స్ సర్వీసులు, హోమ్ కేర్, ఆయుష్ చికిత్సలు, దంత సంరక్షణలాంటి అనేక ప్రయోజనాలను కల్పిస్తాయి. జీవిత దశలను బట్టి రైడర్లను తీసుకునే మాడ్యులర్ ప్లాన్లు ఆకర్షణీయమైనవిగా ఉంటాయి. యువ ప్రొఫెషనల్స్, అవసరమైతే ప్రీమియంను తగ్గించుకునేందుకు, మెటర్నిటీ ప్రయోజనాలను వదులుకుని, అధిక డిడక్టబుల్ని ఎంచుకోవచ్చు. పిల్లల కోసం ప్లానింగ్ చేసుకుంటున్న జంట మొదటి రోజు నుంచి మెటర్నిటీ, నవజాత శిశువు, ఓపీడీ కేర్ను ఎంచుకోవచ్చు. ఇలాంటి అనేకానేక అవకాశాలు ఉండటమనేది పాలసీదారులు తమ బడ్జెట్కు తగ్గట్లుగా ప్లాన్ చేసుకునేందుకు వీలవుతుంది. అలాగే, తమకు ప్రస్తుతం అవసరమైనది మాత్రమే తీసుకుని, తర్వాత పరిస్థితులు మారే కొద్దీ కవరేజీని పెంచుకునేందుకు ఉపయోగకరంగా ఉంటుంది.ఎవరికి ఎక్కువ ప్రయోజనం?20ల ఆఖర్లోను, 40ల మధ్యలోను ఉన్న వారికి, అంటే తమ కెరియర్లలో ప్రారంభ, మధ్య దశల్లో ఉన్నవారికి ఇలాంటి ప్లాన్లు ప్రయోజనకరంగా ఉంటాయి. తమ జీవన విధానం, ఫ్యామిలీ ప్లానింగ్, దీర్ఘకాలిక ఆరోగ్య లక్ష్యాల ఆధారంగా పథకాన్ని మార్చుకోగలిగే వెసులుబాటుతో తక్కువ ప్రీమియంలను లాక్ ఇన్ చేసుకునే అవకాశం పొందవచ్చు. యువ ప్రొఫెషనల్స్ చాలా తక్కువ యాడ్–ఆన్లు, అధిక డిడక్టబుల్స్ను ఎంచుకోవచ్చు. అలాగే జంటలు లేదా యువ కుటుంబాలు మెటరి్నటీకి, నవజాత శిశువు సంరక్షణ, వెల్నెస్ ఫీచ ర్లకు ప్రాధాన్యమివ్వొచ్చు. 50లకు చేరువవుతు న్న వారూ బేస్ పాలసీని సమూలంగా మార్చే సుకోకుండా, క్రిటికల్ ఇల్నెస్ లేదా తీవ్రమైన అనారోగ్యాల నియంత్రణకు సంబంధించిన నిర్దిష్ట కవరేజీలను తీసుకోవడం ద్వారా మాడ్యులర్ ప్లాన్ల నుంచి ప్రయోజనం పొందవచ్చు.క్లెయిమ్లపై ప్రభావంఅయితే, కస్టమైజ్ చేసుకునేటప్పుడు అన్ని వివరాలను సంపూర్ణంగా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కొన్ని కవరేజీలను వదిలివేయడం లేదా తక్కువ లిమిట్స్ను ఎంచుకోవడం (ఉదాహరణకు రూమ్ రెంట్కి పరిమితులు) లేదా క్రిటికల్ ఇల్నెస్ను ఎంచుకోకపోవడం లాంటి అంశాల వల్ల, వైద్యపరంగా తీవ్రమైన పరిస్థితులు ఎదురైనప్పుడు తగినంత కవరేజీ లేకుండా పోయే అవకాశం ఉంది. కో–పే పర్సంటేజీలు, ఉప–పరిమితులు, వెయిటింగ్ పీరియడ్లు, మినహాయింపులు మొదలైన ముఖ్యమైన వివరాలన్నీ పాలసీ డాక్యుమెంట్లలో ఉంటాయి. ఇవన్నీ కూడా క్లెయిమ్లపై గణనీయమైన ప్రభావం చూపుతాయి.ఇదీ చదవండి: రిటైర్మెంట్ కోసం స్మాల్క్యాప్ బెటరా?క్లెయిమ్ల ప్రాసెసింగ్ లేదా ఆమోదించడానికి పట్టే సమయంపై కొన్ని యాడ్–ఆన్లు ప్రభావం చూపవచ్చు. కాబట్టి, పర్సనలైజ్ చేసుకునే సౌకర్యం ఉన్నప్పటికీ, పాలసీని కేవలం అఫోర్డబిలిటీ కోణంలోనే చూడకుండా అత్యవసర పరిస్థితుల్లో అర్ధవంతమైన విధంగా భద్రత లభించేలా ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోవడం కూడా చాలా ముఖ్యం. కస్టమైజ్ చేసుకోదగిన ప్లాన్లనేవి ప్యాసివ్ ఇన్సూరెన్స్ విధానానికి భిన్నంగా ఆరోగ్య సంరక్షణ కోసం క్రియాశీలకంగా ప్లానింగ్ చేసుకునేందుకు తోడ్పడతాయి. మరింత నియంత్రణను, మరింత విలువను, అలాగే మీ అవసరాలకు అనుగుణంగా మార్చుకునే వెసులుబాటును అందిస్తాయి. ఆరోగ్యపరమైన రిసు్కలు అనూహ్యమైన విధంగా ఉంటున్న నేపథ్యంలో మాడ్యులర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లనేవి, ఆర్థిక సంక్షేమానికి సుస్థిర విధానంగా ఉపయోగపడగలవు. -
రిటైర్మెంట్ కోసం స్మాల్క్యాప్ బెటరా?
మనీ మార్కెట్ ఫండ్ ఎవరికి అనుకూలం? – స్వర్ణముఖిమనీ మార్కెట్ ఫండ్ అన్నది డెట్ మ్యూచువల్ ఫండ్ పథకం. ఏడాది కాలంలో గడువు ముగిసే స్వల్ప కాల డెట్ ఇన్స్ట్రుమెంట్లు, ఇతర సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. రిస్క్లేని ఊహించదగిన రాబడులను ఇవి ఇవ్వగలవు. ఇవి అధిక నాణ్యత కలిగిన సాధనాల్లోనే ఇన్వెస్ట్ చేస్తాయి. కనుక మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ దాదాపు రిస్క్లేని, అధిక రక్షణతో కూడినవి. స్వల్పకాలానికి ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే కాస్త అధిక రాబడులను ఇస్తాయి. ఎందుకంటే ఇవి వైవిధ్యమైన సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఏడాది కాలానికి ఇన్వెస్ట్ చేసుకునే వారు వీటిని పరిశీలించొచ్చు. బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో డిపాజిట్లపై రాబడి కంటే అధిక రాబడిని ఇవ్వగలవు. బ్యాంక్ ఖాతాల్లో ఎక్కువ బ్యాలన్స్ ఉంచుకునే వారు ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.మొత్తం 16 రకాల డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఉండగా, లిక్విడ్ ఫండ్స్, షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ అన్నవి రిటైల్ ఇన్వెస్టర్లకు అనుకూలంగా ఉంటాయి. మీ పెట్టుబడుల కాల వ్యవధి ఏడాది అయితే లిక్విడ్ ఫండ్స్ మంచివి. ఇవి తక్కువ రిస్క్ పథకాలు. అత్యవసర నిధికి వీటిని ఉపయోగించుకోవచ్చు. ఏడాదికి మించిన కాలానికి ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే షార్ట్ డ్యురేషన్ ఫండ్ను ఎంపిక చేసుకోండి. ఏడాది నుంచి మూడేళ్ల కాల సాధనాల్లో ఇవి ఇన్వెస్ట్ చేస్తాయి. డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడంలో ఉన్న ప్రాథమిక లక్ష్యం పెట్టుబడి పరిరక్షణతోపాటు, కొంత రాబడి కోరుకోవడం. ఈ దృష్ట్యా లిక్విడ్ ఫండ్స్, షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి.రిటైర్మెంట్ నిధి కోసం స్మాల్క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా? – అనిరుధ్ భట్టాచార్యదీర్ఘకాలంలో సంపద సృష్టికి స్మాల్క్యాప్ పథకాలను పరిశీలించొచ్చు. స్మాల్క్యాప్లో పెట్టుబడులకు దీర్ఘకాలం ఒక్కటే ప్రామాణికం కాదు. నష్ట భయాన్ని, యూనిట్ల విలువ క్షీణించినా తట్టుకునే గుండె నిబ్బరం కావాలి. ఇవి నిర్ణీత సమయాల్లో (సైకిల్స్) భారీ నష్టాలకు గురవుతుంటాయి. మార్కెట్లో ఇతర విభాగాలు మంచి పనితీరు చూపిస్తూ, స్మాల్క్యాప్లో పెట్టుబడులు నష్టాలను చూపిస్తుంటే ఆందోళన చెందడం సహజం. అందుకనే మీ మొత్తం పెట్టుబడుల్లో 10–15% మించి స్మాల్క్యాప్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోకుండా ఉండడం సూచనీయం. చిన్న కంపెనీని ఎంపిక చేసుకుంటే, అది ఆ తర్వాతి కాలంలో పెద్ద కంపెనీగా మారితే, మంచి సంపద సృష్టి జరుగుతుంది. కానీ, అలా ఎంపిక చేసుకున్న ప్రతి కంపెనీ బడా కంపెనీ అవ్వాలనేమీ లేదు. సంపదను తుడిచిపెట్టేవీ ఉంటాయి. ఆటుపోట్లను తట్టుకునే బలం చిన్న కంపెనీలకు తక్కువ. లార్జ్క్యాప్ కంపెనీలతో పోలిస్తే మంచి వృద్ధిని చూపించగలవు.ఇదీ చదవండి: దీర్ఘకాలానికి మంచి ట్రాక్ రికార్డుమరీ చిన్న కంపెనీలు అయితే ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు సైతం దూరంగా ఉంటారు. స్మాల్క్యాప్ విభాగం పెద్దది. స్మాల్క్యాప్ విభాగంలో వివిధ పథకాల మధ్య ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. కనుక సిప్ ద్వారా స్మాల్క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా స్మాల్క్యాప్ కంపెనీలకు సంబంధించి తగినంత లిక్విడిటీ ఉండదు. చిన్న కంపెనీలు కావడంతో ఫ్రీ ఫ్లోటింగ్ ఈక్విటీ తక్కువ. దీంతో మార్కెట్ల కరెక్షన్లలో కొద్ది విక్రయాలకే ఎక్కువ నష్టపోతుంటాయి. మిడ్క్యాప్, లార్జ్క్యాప్ కంపెనీలతో పోలిస్తే స్మాల్క్యాప్ కంపెనీలు రిస్క్ ఎక్కువతో ఉంటాయి. చిన్న కంపెనీల్లో ఏ ధరలో ప్రవేశించారు, ఎక్కడ విక్రయించారన్నది రాబడులకు కీలకం అవుతుంది. -
మీ పాన్కార్డుతో ఎవరైనా లోన్ తీసుకున్నారేమో..
కొందరికి అప్పు అంటే మహా చెడ్డ భయం. దాని జోలికి కూడా వెళ్లరు. మీరు తీసుకోరు సరే.. మరి ఎవరైనా మీ పేరుతో అదేనండి మీకు తెలియకుండా మీ పాన్ కార్డు వివరాలతో లోన్ తీసుకుని ఉంటే.. అమ్మో ఇది ఫ్రాడ్. అవును ఫ్రాడే మరి. డౌట్గా ఉందా? మీ పాన్ కార్డును ఎవరైనా దుర్వినియోగం చేశారేమో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎలాగో ఈ కథనంలో చదివేయండి వెంటనే..రుణ మోసాలు, సున్నితమైన, ఆర్థికపరమైన డాక్యుమెంట్ల దుర్విగియోగం వంటివి ఇటీవల ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో మీ కార్డులేమైనా దుర్వినియోగానికి గురయ్యాయా అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ పాన్ కార్డు మీ క్రెడిట్ రిపోర్ట్ తో లింక్ అయి ఉంటుంది. దానిని ఉపయోగించి తీసుకున్న ఏదైనా రుణం (మీ సమ్మతితో లేదా సమ్మతి లేకుండా) మీ క్రెడిట్ రేటింగ్, మీ రుణ సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి మీ పాన్ కార్డు దుర్వినియోగం అయ్యిందో లేదో తెలుసుకోండిలా..మీ క్రెడిట్ రిపోర్టును క్రమం తప్పకుండా చెక్ చేయండిమీ పాన్ కార్డును ఉపయోగించి ఏదైనా రుణం తీసుకున్నారో లేదో తెలుసుకోవడానికి సులభమైన మార్గం మీ క్రెడిట్ రిపోర్ట్ చూడటం. సిబిల్, ఎక్స్ పీరియన్, ఈక్విఫాక్స్, సీఆర్ఐఎఫ్ హై మార్క్ వంటి క్రెడిట్ బ్యూరోలు మీ పేరిట తీసుకున్న అన్ని రుణాలు, క్రెడిట్ కార్డుల రికార్డును నిర్వహిస్తాయి. ఆయా సైట్లకు వెళ్లి మీ పాన్, మొబైల్ నంబరు ఇచ్చి క్రెడిట్ రిపోర్ట్ తీసుకోవచ్చు. అది కూడా ఉచితంగా.మీ క్రెడిట్ రిపోర్టులో ఇవి గమనించండిమీరు క్రెడిట్ రిపోర్టును సమీక్షిస్తున్నప్పుడు, మీరు దరఖాస్తు చేయని రుణాలు లేదా క్రెడిట్ కార్డులు, తప్పు ఖాతా నంబర్లు, పరిచయం లేని రుణ సంస్థల పేర్లు లేదా మీరు ఆమోదించని కొత్త హార్డ్ ఎంక్వైరీలు ఏమైనా ఉన్నాయేమో చూడండి.మీ పాన్ కార్డును ఎవరైనా దుర్వినియోగం చేశారనడానికి ఇవి సంకేతాలు. మీరు ఇటువంటి అనేక ఎంట్రీలను చూసినట్లయితే, మీ క్రెడిట్ మరింత క్షీణించకుండా వెంటనే చర్యలు తీసుకోండి.👉 ఇది చదివారా? ఈపీఎఫ్వో రూల్స్లో మార్పులు.. ఆ కండీషన్లు ఇక ఉండవుఫేక్ లోన్ బయటపడితే ఏం చేయాలి?మీరు మోసపూరిత రుణాన్ని ఎదుర్కొన్నట్లయితే, దానిని రుణ సంస్థ దృష్టికి తీసుకురండి. అలాగే దానిని నివేదించిన క్రెడిట్ బ్యూరోతో చర్చించండి. చాలా వివాదాలను క్రెడిట్ బ్యూరోలు ఆన్లైన్లో దాఖలు చేయవచ్చు. ఐడీ ప్రూఫ్, లోన్కు సంబంధించిన వాస్తవాలు, సంతకం చేసిన అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది. అదనంగా, మీ స్థానిక పోలీసు సైబర్ క్రైమ్ సెల్లో ఫిర్యాదు చేయండి. పాన్ దుర్వినియోగం అయినట్లు ఆధారాలను సమర్పించండి.భవిష్యత్తులో పాన్ దుర్వినియోగం కాకూడదంటే..అసురక్షిత సైట్లు, యాప్లు లేదా వాట్సాప్ ఫార్వార్డ్లలో మీ పాన్ కార్డు నంబర్ను ఎప్పుడూ పంచుకోవద్దు. బహిరంగంగా షేర్ చేయడం, అనవసరంగా ఎవరికైనా అప్పగించడం చేయొద్దు. మీ పాన్ కార్డు పోతే, రీప్రింట్ కోసం దరఖాస్తు చేయండి. ఆ సమయంలో కొన్ని నెలలు మీ క్రెడిట్ రిపోర్ట్ను సమీక్షించండి. ఫైనాన్షియల్ అకౌంట్ లకు బలమైన పాస్ వర్డ్ లను సెట్ చేసుకోండి. మీ పాన్ తో లింక్ చేసిన లోన్ లేదా క్రెడిట్ అప్లికేషన్ ల కోసం ఎస్ఎంఎస్/ఈమెయిల్ నోటిఫికేషన్ లను ఎనేబుల్ చేయండి. -
ఈపీఎఫ్వో రూల్స్లో మార్పు.. ఆ కండీషన్లు ఇక ఉండవు
ఈపీఎఫ్ఓ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) ఈడీఎల్ఐ అంటే ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ నిబంధనల్లో కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ భారీ ఊరటనిచ్చింది. ఇప్పుడు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మునుపటిలా కఠినమైన షరతులు ఉండవు. దీని వల్ల లక్షలాది మంది ఉద్యోగులు, వారి కుటుంబాలకు, ముఖ్యంగా విధుల్లో ఉండగా మరణించిన ఉద్యోగి కుటుంబాలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుతుంది.కనీసం రూ .50,000 బీమాతాజా నోటిఫికేషన్ ప్రకారం.. ఇప్పుడు ఉద్యోగి పీఎఫ్ బ్యాలెన్స్ రూ .50,000 కంటే తక్కువగా ఉన్నప్పటికీ, ఆ ఉద్యోగి మరణించినప్పుడు వారి కుటుంబానికి కనీసం రూ .50,000 బీమా ప్రయోజనం లభిస్తుంది. ఇంతకు ముందు ఈ ప్రయోజనాన్ని పొందడానికి, ఉద్యోగి ఖాతాలో నిర్ణీత పరిమితి వరకు బ్యాలెన్స్ ఉండాలి. కానీ ఇప్పుడా షరతు తొలగించారు.మరో ముఖ్యమైన మార్పుకనీస పీఎఫ్ బ్యాలెన్స్ షరతును తొలగించడంతోపాటు ఈ పథకంలో మరో ముఖ్యమైన మార్పు చేశారు. ఈ పథకం కోసం 12 నెలల నిరంతర సర్వీసును లెక్కించేటప్పుడు, ఉద్యోగి కంపెనీలు మారిన సందర్భంలో రెండు ఉద్యోగాల మధ్య 60 రోజుల వరకు గ్యాప్ ఉంటే, దాన్ని ఇకపై విరామంగా పరిగణించరు. అంటే ఉద్యోగి రెండుమూడు ఉద్యోగాలు చేసి, వాటి మధ్య 2 నెలల కంటే తక్కువ విరామం ఉంటే, అప్పుడు అన్ని ఉద్యోగాలు ఒకే (నిరంతర) సర్వీసుగా పరిగణిస్తారుఅంతే కాకుండా పీఎఫ్ పథకంలో సభ్యుడైన ఉద్యోగి చివరి పీఎఫ్ కంట్రిబ్యూషన్ నుండి 6 నెలల్లోపు మరణించిప్పుడు కూడా వారి కుటుంబానికి ఈ పథకం కింద బీమా మొత్తాన్ని ఇస్తారు. అయితే ఆ సమయంలో ఉద్యోగి కంపెనీ రోల్స్లో నమోదై ఉండాలి. కుటుంబంలో సంపాదించే వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో మరణించినప్పుడు వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడం ఈపీఎఫ్ఓ ఈడీఎల్ఐ పథకం ప్రధాన ఉద్దేశం. -
పోస్టాఫీసులు వరుసగా మూడు రోజులు బంద్
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని పలు పోస్టాఫీసులు మూడు రోజులపాటు తాత్కాలికంగా మూతపడ్డాయి. డిజిటల్ ఎక్సలెన్స్, జాతి నిర్మాణం దిశగా నెక్ట్స్ జనరేషన్ ఏపీటీ అప్లికేషన్ను అందుబాటులోకి తెచ్చినట్లు తపాలా శాఖ ప్రకటించింది. ఇందులో భాగంగా తిరుపతి డివిజన్ లోని అన్ని పోస్టాఫీసుల్లో ఈ నెల 22న అప్ గ్రేడ్ విధానాన్ని అమలు చేయనున్నారు.ఈ అధునాతన డిజిటల్ ప్లాట్ఫామ్కు అవాంతరాలు లేకుండా సురక్షితంగా మారడానికి వీలుగా జూలై 19 నుండి 21 వరకు ప్రణాళికాబద్ధమైన డౌన్టైమ్ అమలు చేస్తున్నారు. దీంతో ఆయా రోజుల్లో పోస్టాఫీసులలో ఎటువంటి ప్రజా లావాదేవీలు జరగవని పోస్టాఫీసుల సీనియర్ సూపరింటెండెంట్ మేజర్ సయిదా తన్వీర్ ఒక ప్రకటనలో తెలిపారు. డేటా మైగ్రేషన్, సిస్టమ్ ధృవీకరణలు, కాన్ఫిగరేషన్ ప్రక్రియలను సులభతరం చేయడానికి, కొత్త సిస్టమ్ సజావుగా, సమర్థవంతంగా లైవ్ లోకి వెళ్లేలా చూసుకోవడానికి సేవల తాత్కాలిక నిలిపివేత అవసరమని వివరించారు.మెరుగైన వినియోగదారు అనుభవం, వేగవంతమైన సర్వీస్ డెలివరీ, మరింత కస్టమర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ను అందించడానికి ఏపీటీ అప్లికేషన్ను రూపొందించారు. నెక్ట్స్ జనరేషన్ ఏపీటీ అప్లికేషన్ అమలులో భాగంగా జూలై 21న తెలంగాణలోని రంగారెడ్డి, నల్లగొండ, యాదాద్రి-భువనగిరి జిల్లాలు మినహా అన్ని పోస్టాఫీసుల్లో ఎలాంటి లావాదేవీలు జరగవని అసిస్టెంట్ పోస్ట్మాస్టర్ జనరల్ (టెక్-ఆపరేషన్స్) నరేష్ ఒక ప్రకటనలో తెలిపారు. -
పన్ను రిఫండ్ మెయిల్స్ పట్ల జాగ్రత్త
పన్ను రిఫండ్లకు సంబంధించి వచ్చే మోసపూరిత ఫిషింగ్ ఈ–మెయిల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని పన్ను చెల్లింపుదారులను ఆదాయపన్ను శాఖ హెచ్చరించింది. ఈ పేరుతో వచ్చే అనుమానాస్పద లింక్లపై క్లిక్ చేయొద్దని సూచించింది. బ్యాంక్ వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని మె యిల్స్ ద్వారా ఆదాయపన్ను శాఖ ఎప్పుడూ కోరదంటూ ఎక్స్ ప్లాట్ఫామ్పై చేసిన పోస్ట్లో పేర్కొంది.ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాంక్ ఇండియాలోనే..అధికారిక పోర్టల్ www.incometax.gov.in పైనే పన్ను రిఫండ్ పురోగతి గురించి తెలుసుకోవాలని సూచించింది. ‘ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్.. తక్షణమే మాన్యువల్ ధ్రువీకరణ అవసరం’ అంటూ మెయిల్ వస్తే అది ఫిషింగ్ స్కామ్ కావొచ్చని హెచ్చరించింది. తెలియని లింక్లపై క్లిక్ చేయవద్దని, అటాచ్మెంట్లను డౌన్లోడ్ చేయవద్దని పేర్కొంది. మీ రిఫండ్ స్టేటస్ను ట్రాక్ చేయడానికి ఆదాయపు పన్ను పోర్టల్లోని ఏఐఎస్, టీఐఎస్ టూల్స్ను ఉపయోగించాలని చెప్పింది. -
34 ఏళ్లకే రిటైర్ అవ్వొచ్చు!
దేశం వదిలి వెళ్లినవారు ఎంతో కొంత సంపాదించి కొంత ఆర్థిక స్వాతంత్ర్యం పొందిన తర్వాత తిరిగి స్వదేశానికి రావాలనుకుంటారు. 34 ఏళ్ల ఎన్ఆర్ఐ రూ.4 కోట్లు సంపాదించి భారత్కు తిరిగి వచ్చి త్వరగా రిటైర్ అవ్వాలని యోచిస్తున్నట్లు సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపారు. తన వద్ద రూ.4 కోట్లు ఉన్నాయని చెప్పారు. అందులో రూ.రెండు కోట్లు బ్యాంకు ఖాతాలో ఉందని, మరో రూ.రెండు కోట్లను రిటైర్మెంట్ కోసం పొదుపు చేయబోతున్నట్లు తెలిపారు. అయితే సోషల్మీడియా వేదికగా తనకు ఎవరైనా ఆర్థిక సలహా ఇవ్వమని కోరాడు. దాంతో ఆ పోస్ట్ కాస్తా వైరల్గా మారింది.పోస్ట్లోని వివరాల ప్రకారం.. ‘నేను ఇండియా వచ్చి రిటైర్ అయినా పార్ట్టైమ్గా పనిచేయడానికి సిద్ధంగానే ఉన్నాను. నా భార్యకు నేను రిటైర్ అవ్వడం ఇష్టం లేదు. పీహెచ్డీ పూర్తికావడంతో భారత్లో నాకు మంచి ఉద్యోగమే వస్తుందని నమ్ముతున్నాను. నా పొదుపులో నుంచి ఒక ఇంటిని అద్దెకు తీసుకుంటే మొత్తం ఖర్చులు కలిపి నెలకు సుమారు రూ.1లక్ష-రూ.1.50 లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనా. నా వద్ద ఉన్న నిధులు సరిపోతాయా? అనే అనుమానం ఉంది. ఈ ఖర్చులను పరిగణించి దయచేసి రిటైర్మెంట్ ప్రణాళికలు సూచించండి’ అని కోరాడు.ఇదీ చదవండి: 'సుకన్య సమృద్ధి' లాభదాయకమేనా?‘మీరు త్వరగా పదవీ విరమణ చేసి భారతదేశానికి తిరిగి రావాలనుకుంటే అగ్రెసివ్ పెట్టుబడులు చేయవద్దు. నిధులు సరిపోతాయనే దిగులు వద్దు. అయితే మీ బడ్జెట్ విషయంలో మాత్రం చాలా కఠినంగా వ్యవహరించాలి. సుమారు 5-6% వడ్డీ సమకూరే ఎఫ్డీలో రూ.1 కోటి ఉంచండి. మీ బడ్జెట్ అంచనా నెలకు రూ.1లక్ష-రూ.1.5 లక్షలుగా ఉంది. లోయర్ టైర్ సిటీలో ఇంటి అద్దెలు తక్కువగా ఉంటాయి. కాబట్టి కొన్నేళ్ల పాటు అక్కడ ఉండండి. మరో రూ.3 కోట్లను దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలోకి మళ్లించేలా బ్యాలెన్స్డ్ స్టాక్ మార్కెట్ ఫండ్లో పెట్టుబడి పెట్టండి. కనీసం 5-6 సంవత్సరాల వరకు దీన్ని విత్డ్రా చేయకూడదు. దాంతో ఇది బాగా పెరుగుతుంది. మార్కెట్ సంక్షోభాన్ని ఎదుర్కోగలదు. దాంతో నెలకు కనీసం రూ.లక్ష సమకూరుతుంది. దాంతోపాటు మీరు పెట్టిన కార్పస్పై ప్రభావం ఉండదు’ అని ఒక యూజర్ తెలిపారు. -
'సుకన్య సమృద్ధి' లాభదాయకమేనా?
దేశంలో అత్యంత ప్రజాదరణ పిల్లల పెట్టుబడి పథకం సుకన్య సమృద్ధి యోజన (SSY). ప్రత్యేకంగా బాలికల భవిష్యత్తుకు ఆర్థికంగా భద్రత కల్పించేందుకు భారత ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది. అత్యధిక వడ్డీ రేటు అందించే ఈ పథకంలో చాలా మంది బాలికల తల్లిదండ్రులు పొదుపు చేస్తున్నారు. అయితే ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇది అంత లాభదాయకం కాదంటున్నారు గువాహటికి చెందిన ఒక ఫైనాన్షియల్ ప్లానర్.'సుకన్య సమృద్ధి మీ కూతురికి రూ.69 లక్షలు ఇవ్వదు.. 21 ఏళ్లకు ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేసిన తర్వాత ఆమెకు వచ్చేది రూ.17 లక్షలే' అంటూ గౌరవ్ ముంద్రా అనే ఫైనాన్షియల్ ప్లానర్ ఇటీవల లింక్డ్ఇన్లో ఓ పోస్ట్ చేశారు. సుకన్య సమృద్ధి యోజన (SSY), ఎన్పీఎస్ వాత్సల్య వంటి దీర్ఘకాలిక పెట్టుబడుల వాస్తవ ప్రపంచ విలువను మ్యూచువల్ ఫండ్ ప్రత్యామ్నాయాలతో పోల్చారు.సుకన్య సమృద్ధి పథకంలో 15 ఏళ్ల పాటు సంవత్సరానికి రూ .1.5 లక్షలు పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ తర్వాత సుమారు రూ .69 లక్షలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఆ మొత్తం నేటి నిబంధనల ప్రకారం సుమారు రూ .17–18 లక్షలే అవుతుంది అంటున్నాయన.నేషనల్ పెన్షన్ సిస్టమ్కు సంబంధించిన చైల్డ్-ఫోకస్డ్ వేరియంట్ ఎన్పీఎస్ వాత్సల్యకు కూడా అదే పోలికను వర్తింపజేసిన ముంద్రా ఇది రూ .1.4 కోట్ల మెచ్యూరిటీని చూపించినప్పటికీ, కేవలం రూ .35 లక్షలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇది 21 సంవత్సరాలలో 6% ద్రవ్యోల్బణానికి సర్దుబాటు చేస్తే నేడు కేవలం రూ .8.4 లక్షలకు సమానం."ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి: రెండు దశాబ్దాల తరువాత మీ పిల్లల చదువు లేదా వివాహానికి ఈ రూ.8 లక్షలు లేదా రూ.17 లక్షలు సరిపోతాయా?" అంటూ పిల్లల తల్లిదండ్రులను ఆయన ప్రశ్నించారు. దీనికి బదులుగా, పిల్లలపై దృష్టి సారించిన మ్యూచువల్ ఫండ్లు 12% వార్షిక రాబడితో పన్నుకు ముందు రూ .1.4 కోట్లు, పన్ను తర్వాత సుమారు రూ .1.2 కోట్లు లేదా నేటి విలువలో సుమారు రూ .34 లక్షలు ఇవ్వగలవని ముంద్రా సూచిస్తున్నారు.‘బేటీ బచావో, బేటీ పడావో’ కార్యక్రమం కింద 2015లో భారత ప్రభుత్వం ఈ స్కీమును ప్రారంభించింది. బాలికల విద్య, వివాహ ఖర్చులకు పొదుపు చేయడం దీని లక్ష్యం. 10 సంవత్సరాల లోపు వయసున్న బాలికల పేరుతో ఖాతా ప్రారంభించవచ్చు. పోస్టాఫీసులు లేదా అనుమతి పొందిన బ్యాంకులలో ప్రారంభించవచ్చు. కనీసం రూ.250 నుండి గరిష్టంగా సంవత్సరానికి రూ.1.5 లక్షల వరకు జమ చేయవచ్చు. ఈ పథకం వ్యవధి 21 సంవత్సరాలు లేదా బాలిక వివాహం జరిగే వరకు (18 సంవత్సరాల తర్వాత) ఉంటుంది. -
పోస్టాఫీసుల్లో కొత్త రూల్స్.. ఆ అకౌంట్లన్నీ ఫ్రీజ్
చిన్న మొత్తాల పొదుపు పథకాల (ఎస్సీఎస్) ఖాతాలకు తపాలా శాఖ కొత్త నిబంధనలను జారీ చేసింది. వీటికి అనుగుణంగా లేని ఖాతాలను మూసివేసే అవకాశం ఉంది. ముఖ్యంగా మెచ్యూరిటీ పీరియడ్ ముగిసిన తర్వాత మూడేళ్లు దాటినా కూడా క్లోజ్ చేయని ఖాతాలను అధికారులు ఇప్పుడు స్తంభింపజేయనున్నారు.పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్సీ), కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ), పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (ఎంఐఎస్), పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ (టీడీ), పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ) వంటి చిన్న పొదుపు పథకాల ఖాతాలకు ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి.మూడేళ్ల మెచ్యూరిటీ తర్వాత కూడా క్లోజ్ చేయని స్మాల్ సేవింగ్స్ స్కీమ్ ఖాతాలను స్తంభింపజేస్తూ తపాలా శాఖ జూలై 15న ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్వెస్టర్ల సొమ్మును కాపాడటమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధనల ప్రకారం, ఇన్ యాక్టివ్, మెచ్యూరిటీ తీరిపోయిన పొదుపు పథకాల అకౌంట్లను ఖాతాదారులు అధికారికంగా పొడిగించుకోకపోతే పోస్టాఫీస్ ఇప్పుడు సంవత్సరానికి రెండుసార్లు గుర్తించి స్తంభింపజేస్తుంది.డిపాజిటర్లు కష్టపడి సంపాదించి పొదుపు చేసుకున్న డబ్బుకు భద్రతను మరింత పెంచడానికి ఈ ఫ్రీజింగ్ యాక్టివిటీని సంవత్సరానికి రెండుసార్లు నిరంతర చక్రంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు పోస్టల్ డిపార్ట్మెంట్ తెలిపింది. ఏటా జనవరి 1, అలాగే జూలై 1న రెండు సార్లు ఈ ప్రక్రియ జరగనుంది. ఈ తేదీల నుంచి 15 రోజుల్లో ఇలాంటి ఖతాలను గుర్తించడం, స్తంభింపజేయడం పూర్తవుతుంది. ఏటా జూన్ 30, డిసెంబర్ 31 నాటికి మూడేళ్ల మెచ్యూరిటీ పూర్తి చేసుకున్న ఖాతాలను గుర్తించి స్తంభింపజేస్తామని తపాలా శాఖ తెలిపింది.మెచ్యూరిటీ తీరిన తమ పొదుపు పథకాల ఖాతాలు స్తంభింపజేయకుండా ఉండటానికి, ఖాతాదారులు డిపాజిట్ పథకాన్ని అధికారికంగా పొడిగించడానికి అభ్యర్థనలను సమర్పించాల్సి ఉంటుంది. ఒక వేళ పొడిగింపు వద్దనుకుంటే ఖాతా మూసివేతకు దరఖాస్తు చేయాలి. కాగా 2025-26 ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి అన్ని చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన కొద్ది రోజులకే ఈ నిబంధనలు వచ్చాయి. -
క్రెడిట్ కార్డే దిక్కు!
తక్కువ ఆదాయ వర్గాల వారికి క్రెడిట్ కార్డులు ఆధారంగా మారుతున్నాయి. రూ.50,000లోపు ఆదాయం ఉన్న వేతన జీవుల్లో 93 శాతం మంది అవసరాల కోసం క్రెడిట్ కార్డులపై ఆధారపడుతున్నట్టు థింక్ 360.ఏఐ సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. స్వయం ఉపాధిపై ఉన్న వారిలో 85 శాతం మంది క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. ఉద్యోగం, స్వయం ఉపాధిలో ఉన్న 20,000 మంది వ్యక్తుల ఏడాది కాల ఆర్థిక తీరును అధ్యయనం చేసి థింక్ 360 ఈ వివరాలను విడుదల చేసింది.బై నౌ పే లేటర్ (బీఎన్పీఎల్/ఇప్పుడు కొని తర్వాత చెల్లించే సదుపాయం) సేవలను సైతం వీరు వినియోగిస్తున్నారు. స్వయం ఉపాధిలోని వారిలో 18%, వేతన జీవుల్లో 15% మంది బీఎన్పీఎల్ను వినియోగిస్తున్నారు. ఒకప్పుడు ఆకాంక్షలుగానే ఉన్న క్రెడిట్ కార్డులు, బీఎన్పీఎల్ సేవలు నేడు నిపుణుల నుంచి తాత్కాలిక ఉద్యోగుల వరకు.. ప్రతి ఒక్కరికీ నిత్యావసరంగా మారాయని థింక్360 వ్యవస్థాపకుడు, సీఈవో అమిత్దాస్ తెలిపారు. డిజిటల్ రుణాల్లో ఫిన్టెక్లు పోషిస్తున్న ముఖ్య పాత్రను కూడా ఈ సంస్థ తన నివేదికలో ప్రస్తావించింది.ఇదీ చదవండి: గగనతలంలో గస్తీకాసే రారాజులుక్రెడిట్ కార్డు యూజర్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ ఏడాది మార్చి నాటికి యాక్టివ్ కార్డులు 10 కోట్ల మార్క్ను దాటగా.. వచ్చే ఐదేళ్లలో (2029 మార్చి నాటికి) 20 కోట్లకు పెరుగుతాయని ఇటీవల పీడబ్ల్యూసీ అంచనా వేసింది. యూపీఐ దెబ్బకు డెబిట్ కార్డుల వినియోగం గణనీయంగా తగ్గిపోయింది. చెల్లింపులకు వచ్చే సరికి యూపీఐ తర్వాత క్రెడిట్ కార్డుల హవాయే నడుస్తోంది. బ్యాంకు ఖాతాలో బ్యాలన్స్ ఉంటేనే యూపీఐ. బ్యాలన్స్ లేకపోయినా క్రెడిట్ (అరువు)తో కొనుగోళ్లకు క్రెడిట్ కార్డులు వీలు కల్పిస్తాయి. అందుకే వీటి వినియోగం పట్ల ఆసక్తి పెరుగుతూ పోతోంది. కానీ, క్రెడిట్ కార్డ్లను ఇష్టారీతిన వాడేయడం సరికాదు. ఇది క్రెడిట్ స్కోర్ను ప్రభావితం చేస్తుంది. భవిష్యత్లో రుణాల అర్హతకు గీటురాయిగా మారుతుంది. రుణ ఊబిలోకి నెట్టేసే ప్రమాదం లేకపోలేదు. -
సైబర్ మోసాలకు చెక్ పెట్టేలా 5 జాగ్రత్తలు
దేశవ్యాప్తంగా కోట్లాది మందికి రోజువారీ లావాదేవీలను డిజిటల్ చెల్లింపులు సులభతరం చేశాయి. వాడకం పెరిగే కొద్దీ, డిజిటల్ చెల్లింపుల భద్రత పట్ల వినియోగదారుల్లో అవగాహన కూడా పెరగాల్సి ఉంది. సురక్షితమైన చెల్లింపు విధానాలను పాటించడం పెద్ద కష్టమేమీ కాదు. ఇవి వినియోగదారులకు డిజిటల్ భద్రతను అందిస్తాయి. డిజిటల్ చెల్లింపులను సురక్షితంగా జరిపేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) 5 జాగ్రత్తలను సూచిస్తోంది.లావాదేవీ ముందే సరిచూసుకోవడం..ఏదైనా డిజిటల్ పేమెంట్ చేసేటప్పుడు స్క్రీన్పైన కనిపించే పేరును తప్పకుండా తనిఖీ చేయాలి. మీరు ఎవరికైతే డబ్బు పంపిస్తున్నారో వారి పేరే స్క్రీన్ మీద ఉందో లేదో నిర్ధారించుకోవాలి. దీనికి పెద్దగా సమయం కూడా పట్టదు. తొందరపడి పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడాలి.ఆథరైజ్డ్ యాప్లు, వెబ్సైట్లే వాడేలా..ఎప్పుడూ అధికారిక యాప్లు లేదా వెబ్సైట్ల ద్వారా మాత్రమే చెల్లింపులు జరపాలి. తెలియని వారు, లేదా మరేదైనా వెబ్సైట్లో సూచించిన విధంగా లింకుల ద్వారా యాప్లను డౌన్లోడ్ చేయవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసి లావాదేవీలు చేయవద్దు.గోప్యంగా ఓటీపీయూపీఐ పిన్ లేదా మెయిల్, ఫోన్కు వచ్చే ఓటీపీ (వన్ టైమ్ పాస్వర్డ్), లేదా బ్యాంక్ వివరాలు అత్యంత గోప్యమైనవని గమనించాలి. ఈ వివరాలు బ్యాంకువారు కూడా అడగరని గుర్తించాలి. బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నాం, లేదా పోలీసులం, లేదంటే ప్రభుత్వ కార్యాలయానికి చెందినవారం అని ఎవరైనా ఆయా వివరాలు అడిగితే స్కామర్లని వెంటనే తెలుసుకుని ఫిర్యాదు చేయాల్సి.హడావిడి పేమెంట్లు వద్దు..వెంటనే పేమెంట్ చేయాలని లేదా మీ వివరాలను అత్యవసరంగా ఇవ్వాలని ఎవరైనా మిమ్మల్ని తొందరపెడితే కంగారుపడకండి. కాస్త సమయం తీసుకోండి. ఒకటికి రెండుసార్లు సరిచూసుకోండి. అవసరమైతే వారికి తిరిగి కాల్ చేస్తానని చెప్పండి. మీకు కావాల్సినంత సమయం తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు.ఇదీ చదవండి: లక్షల మందిని ఊచకోత కోసి ఇప్పుడేం చేస్తుందో తెలుసా?పేమెంట్ అలర్ట్లను ఆన్ చేసుకోవడం..మీరు చేసే చెల్లింపులకు సంబంధించిన ఎస్ఎంఎస్, యాప్ నోటిఫికేషన్లను ఎప్పుడూ ఆన్ చేసి ఉంచండి. ప్రతి అలర్ట్ను జాగ్రత్తగా చదవండి. ఏదైనా తేడాగా అనిపిస్తే వెంటనే మీ బ్యాంక్ లేదా పేమెంట్ యాప్ను సంప్రదించండి. -
ఎవరు చెప్పినా వినండి.. కానీ..
డబ్బు ఖర్చులు, పెట్టుబడులపై ఒక్కొక్కరి నిర్ణయాలు ఒక్కోలా ఉంటాయి. మనకు బాగా తెలిసినవారు డబ్బుకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో దాదాపు వాటినే మనలో చాలా మంది అనుసరిస్తుంటారు. కానీ ఒక్కొక్కరి భవిష్యత్తు అవసరాలు వేర్వేరుగా ఉంటాయి. అందుకు అనుగుణంగా ఇన్వెస్ట్మెంట్ వ్యూహాలుండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈఓ రాధికా గుప్తా ఇందుకు సంబంధించిన కొన్ని అంశాలను తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు.‘డబ్బు విషయానికి వస్తే ప్రతి ఒక్కరికీ ఒక అభిప్రాయం ఉంటుంది. మీ అంకుల్ స్మాల్ క్యాప్ షేర్లపై పెట్టుబడి పెట్టొచ్చు. క్రిప్టోనే భవిష్యత్తు అని మీ స్నేహితుడు ఎంచుకోవచ్చు. మీ పక్కింటివారు ఫిక్స్డ్ డిపాజిట్లలో మాత్రమే తమ పెట్టుబడిని కొనసాగించవచ్చు. అయినంత మాత్రాన వారి నిర్ణయాలను కాపీ కొట్టాలా? కాదు కదా.. మీ పోర్ట్ ఫోలియో మీ పరిస్థితులకు అనుగుణంగా, అవసరాలను తీర్చేలా ఉండాలి. పొరుగువారిని అనుసరించి పెట్టుబడులు పెట్టకూడదు. మీ సొంత ప్రణాళికలు రూపొందించుకోండి. చాలా ఉచిత సలహాలు మిమ్మల్ని గందరగోళానికి గురి చేస్తాయి. మీ అవసరాలకు సరిపోని వాటిని ఎంచుకోకూడదు. మీ ఆత్మీయులు చెప్పింది వినండి. కానీ మీకు నిజంగా ఏది అవసరమో అదే చేయండి’ అని రాసుకొచ్చారు.ఇదీ చదవండి: భవిష్యత్తులో కొదవలేని బిజినెస్ ఇదే..ప్రతి ఒక్కరికీ వారి సొంత పెట్టుబడి మార్గం ఉండాలి. కానీ చాలా మంది పక్కవారి అవసరాలను పరిగణించుకోకుండా గుడ్డిగా వారి నిర్ణయాలను అనుసరిస్తారు. మెరుగైన ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోను నిర్మించడం చాలాముఖ్యం. పిల్లల చదువు కోసం మీరు పొదుపు చేయవచ్చు.. హాలిడే కోసం ప్లాన్ చేయవచ్చు.. లేదా ఎమర్జెన్సీ నిధిని ఏర్పాటు చేయవచ్చు. అందుకు వేరొకరిని అనుసరించకూడదని నిపుణులు చెబుతున్నారు. -
ఈసారి రిఫండ్ త్వరగా రాకపోవచ్చు..
ఈసారి రిటర్నులు ఫైల్ చేస్తున్నారు. ఇంచుమించు కోటి దాకా రిటర్నులు వేసినట్లు అంచనా. అందులో చాలా మంది వెరిఫై కూడా చేశారు. గతంలో రిటర్ను వేసిన ఒకటి, రెండు రోజుల్లో రిఫండ్ వచ్చేసిన కేసులున్నాయి. సాధారణంగా 20 నుంచి 45 రోజుల్లోపల మీ బ్యాంకు ఖాతాకి రిఫండ్ మొత్తం జమ అవుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో జాప్యం జరగొచ్చు. ఏ కారణం వల్ల రిఫండ్ త్వరగా రాదంటే..చాలా మంది వెరిఫై చేయడం లేదు. ఇలా వెరిఫై చేయనంతవరకు రిటర్నులను ముట్టుకోరు. ప్రాసెస్ చెయ్యరు. అందుకని రిటర్నులను వేసిన వెంటనే వెరిఫై చేయడం మరిచిపోవద్దు. బ్యాంకు అకౌంట్ వివరాలు పూర్తిగా ఇవ్వకపోతే రిఫండు రాదు. బ్యాంకుల విలీనం వల్లో, అడ్రెస్సులు పోవడం వల్లో, కోడ్లలో వచ్చిన మార్పులను తెలియచేయకపోవడం వల్లో కూడా ఇలా జరగొచ్చు. బ్యాంకు అకౌంటు నంబరు ఇప్పుడు పొడుగ్గా ఉంటోంది. ఏ ఒక్క అంకె తప్పొచ్చినా, సమాచారం లోపం వల్ల జమ ఆగిపోతుంది. పెద్ద సమస్య ఎక్కడ వస్తుందంటే .. మిస్మ్యాచింగ్. రిటర్నుల్లో దాఖలు చేసిన అంశాలు, అన్నీ పూర్తిగా 26 ఏఎస్, ఏ19తో సరిపోయి ఉండాలి. 26ఏఎస్, ఏఐఎస్, ఈ రెండూ ఆదాయపు పన్ను వెబ్సైట్లో దొరుకుతాయి. ఇవి చాలా స్పష్టంగా మీకు సంబంధించిన సమాచారాన్ని సమగ్రంగా క్రోడీకరించి చూపిస్తాయి. సర్వసాధారణంగా తప్పులు ఉండవు. చాలా మంది ఏం చేస్తుంటారంటే, వీటిలో సమాచారం బేస్గా రిటర్నులు వేసేస్తుంటారు. అ ప్పుడు మిస్మ్యాచ్ ఉండదు. ఇదొక సేఫ్ గేమ్. అలా అని మీరు 26ఏఎస్, ఏఐఎస్ అంశాలతో పూర్తిగా ఏకీభవించాలని లేదు. అందులోని అంశాలు తప్పని అనిపించినా, రెండు సార్లు కనిపించినా, మీవి కాకపోయినా, మీరు విభేదించవచ్చు. అప్పుడు, మిస్మ్యాచ్ తథ్యం. ఇలాంటప్పుడు రిఫండు ఆలస్యం అవుతుంది. కొంత మంది ఫారం ఎంచుకోవడంలో పొరపా టు చేస్తారు. అలాంటి పొరపాటు జరిగినా, రి ఫండు ఆలస్యం కావచ్చు. జాగ్రత్త వహించాలి. సాంకేతికపరమైన సమస్యలు ఉత్పన్నమవ్వొచ్చు. ఇవి తాత్కాలికం కావొచ్చు. తాత్కాలికం అయితే, గంటలోనో లేదా రోజులోపలో దానంతట అదే సాల్వ్ అయిపోతుంది. కొన్ని వారం, పది రోజులు పట్టొచ్చు. అధికార్లకు ఈ సమస్య తెలియకపోవచ్చు. సిస్టమ్ అధికార్లకు కూడా వెనువెంటనే తెలియదు. ఈ మేరకు ప్రాసెసింగ్ లేటు అవుతుంది. పన్నులు చెల్లింపుల మూడు రకాలు. టీడీఎస్, అడ్వాన్స్ ట్యాక్స్, సెల్ఫ్ అసెస్మెంట్. ఈ చలాన్లలోని అంశాలు రాసేటప్పుడు ఏ పొరపాటు జరిగినా .. చెల్లింపులకు సంబంధించిన పద్దు, గవర్నమెంటు ఖాతాలో మీ పేరున జమ అవ్వదు. సస్పెన్స్లో పెడతారు. దాన్ని పట్టుకోవడం సులువైన పని కాదు. అలాగే టీడీఎస్ రికవరీలు, చెల్లింపులు, రిటర్నులు వేయడం – ఈ మూడు దశల్లో ఎక్కడ తప్పు జరిగినా, పెండింగ్లో పడిపోతుంది. అటు పక్క వ్యక్తి తప్పులు చేసినా మీరే సఫర్ అవుతారు. చెక్ చేసుకోండి. ఇలాంటి సమస్యల వల్ల రిఫండ్ ఆగిపోతుంది. పాత/ముందు సంవత్సరాల్లో చెల్లించాల్సిన బకాయిలుంటే వాటిని రికవరీ చేయడం వల్ల ప్రస్తుత సంవత్సరపు రిఫండ్ ఆగిపోవచ్చు. ఈ మధ్య ఓ కేసులో 18 ఏళ్ల క్రితం ఉన్న బకాయిల నిమిత్తం నోటీసులు ఇచ్చారు. కాగితాలు సకాలంలో దొరక్కపోవటం వల్ల జవాబు ఇవ్వలేదు. ఆ సంవత్సరం బకాయిల నిమిత్తం కరెంటు రిఫండును తొక్కి పెట్టేశారు. వాళ్లకి వాళ్లు పన్నులను రికవర్ చేసుకోవడానికి ఎంత వెనక్కయినా వెళ్తారు. మన కష్టాలు పట్టించుకోరు. అందుకనే అన్ని సంవత్సరాల రికార్డులూ భద్రంగా దాచిపెట్టుకోవాలి. అశ్రద్ధ వద్దు. రికవరీ చేసుకున్నామని మీకు చెప్పరు కూడా. ఇక అధికార్ల వద్ద మరో బ్రహ్మాస్త్రం ఉంటుంది. అదే స్క్రూటినీ ప్రొసీడింగ్స్. ఏదైనా కారణాల వల్ల మీ కేసు స్క్రూటినీకి ఎంపిక అయిందనుకోండి. అధికార్లు ఆరా తీస్తారు. ఆరాలో తొక్క తీస్తారు. తొక్క తీసి తోలు కడతారు. అలా అయ్యేవరకు రిఫండ్ రాదు. అలాగని స్క్రూటినీ అంటే భయపడక్కర్లేదు కానీ, జాప్యం ఎక్కువ జరగొచ్చు. అనిశ్చితి .. అయోమయం పరిస్థితి నెలకొనవచ్చు.ఈ సంవత్సరానికి గాను గతంలోలాగా వెనువెంటనే రిఫండులు జారీ చేయడం లేదు. ఒకటికి పది సార్లు చెక్ చేసి, గతానికి వెళ్లి, అన్ని చేక్ చేసి కానీ రిఫండులు ఇవ్వడం లేదు. అలా అని మీరేమీ గాభరాపడక్కర్లేదు. -
పదేళ్లలో ఆరింతలైన ఐటీ రిఫండ్లు
ఆదాయపన్ను రిఫండ్లు, రిటర్నులు బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ పాలనలో గణనీయంగా పెరిగాయి. యూపీఏ–2 పాలనలో చివరి ఆర్థిక సంవత్సరం 2013–14లో పన్ను చెల్లింపుదారులకు ఆదాయపన్ను శాఖ చేసిన చెల్లింపులు (రిఫండ్) రూ.83,008 కోట్లుగా ఉంటే.. 2024–25 సంవత్సరం (ఎన్డీఏ పాలనలో 11వ సంవత్సరం) నాటికి రిఫండ్లు రూ.4.77 లక్షల కోట్లకు పెరిగాయి. అంటే 474 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. అంతేకాదు 2013–14 సంవత్సరంలో ఐటీ రిఫండ్లకు 93 రోజుల సగటు వ్యవధి తీసుకోగా, అది 2024–25 సంవత్సరానికి 17 రోజులకు తగ్గింది.ఇక ఈ పదేళ్లలో స్థూల పన్ను వసూళ్లు, ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసే వారిలోనూ మంచి వృద్ధి కనిపించింది. 2013–14 సంవత్సరానికి స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.7.22 లక్షల కోట్లుగా ఉంటే, 2024–25 సంవత్సరంలో ఈ మొత్తం రూ.27.03 లక్షల కోట్లకు పెరిగింది. ఐటీ రిటర్నుల దాఖలు 133 శాతం పెరిగింది. 2013లో 3.8 కోట్ల ఆదాయపన్ను రిటర్నులు (ఐటీఆర్లు) దాఖలు కాగా, 2024లో 8.89 కోట్ల ఐటీఆర్లు నమోదయ్యాయి. వ్యవస్థ మార్పు ఫలితమే పన్ను రిఫండ్లు గణనీయంగా పెరగడం, రిఫండ్ల కాలవ్యవధి కూడా 17 రోజులకు తగ్గడం అన్నది పన్ను యంత్రాంగంలో వచ్చిన మార్పు ఫలితమేనని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా డిజిటల్ వసతులు, పూర్తిగా ఆన్లైన్లోనే రిటర్నుల దాఖలు, ప్రత్యక్ష హాజరు అవసరం లేని పన్ను రిటర్నుల మదింపులు (ఫేస్లెస్) అన్నవి ఐటీఆర్లను మరింత కచ్చితత్వంతో ప్రాసెస్ చేసేందుకు వీలు కల్పిస్తున్నట్టు పేర్కొన్నాయి.ముందుగానే భర్తీ అయిన పన్ను రిటర్నులు (టీడీఎస్, ఫామ్ 16, 26ఏఎస్ తదితర మార్గాల్లో వచ్చిన సమాచారంతో నిండినవి), రిఫండ్ ప్రాసెస్ను ఆటోమేట్ చేయడం, టీడీఎస్ సర్దుబాట్లు, ఆన్లైన్లో ఫిర్యాదుల పరిష్కారం అన్నవి కాల వ్యవధిని తగ్గించి, పన్ను చెల్లింపుదారులకు మెరుగైన అనుభవానికి తోడ్పడుతున్నట్టు తెలిపాయి. 2013–14లో స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లలో రిఫండ్లు 11.5 శాతంగా ఉంటే, 2024–25లో 17.6 శాతానికి పెరగడం గమనార్హం. ‘‘పన్ను చెల్లింపుదారుల సంఖ్య విస్తరించడం, ముందస్తు పన్ను చెల్లింపులు, టీడీఎస్ యంత్రాంగం మరింత బలంగా మారినప్పుడు రిఫండ్లు సైతం పెరగడం సాధారణమే. వ్యవస్థలో పరిణతికి ఇది నిదర్శనం’’అని ఆ వర్గాలు తెలిపాయి. -
హోమ్ ఫైనాన్స్కు రూ.858 కోట్ల రుణం
ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు (ఏఐఐబీ) నుంచి రూ.858 కోట్ల (100 మిలియన్లు) రుణాన్ని పొందినట్లు ఐఐఎఫ్ఎల్ హోమ్ ఫైనాన్స్ సంస్థ శనివారం తెలిపింది. ‘‘దేశవ్యాప్తంగా పేద కుటుంబాలకు సొంతింటి ఏర్పాటు అవకాశాలు మెరుగుపరిచే లక్ష్య సాధనలో ఏబీబీ నుంచి నిధులు అందడం ఒక కీలక ఘట్టం’’ అని ఐఐఎఫ్ఎల్ హెచ్ఎఫ్ఎల్ సీఈవో మోను రాత్రా తెలిపారు.ఐఐఎఫ్ఎల్ హెచ్ఎఫ్ఎల్ భాగస్వామ్యం ద్వారా భారత గృహ నిర్మాణ రంగంలో పర్యావరణ అనుకూల భవనాలు (గ్రీన్ బిల్డింగ్) ప్రమాణాలు మరింత మెరుగుతాయని ఏఐఐబీ డైరెక్టర్ జనరల్ గ్రెగొరీ లియు తెలిపారు. ఏఐఐబీ నుంచి పొందిన నిధులు దేశ అఫర్డబుల్ హౌసింగ్ వ్యవస్థలో డిమాండ్తోపాటు సరఫరా సామర్థ్యాలను మెరుగుపరుచుకునేందుకు సహాయపడతాయని ఐఐఎఫ్ఎల్ హోమ్ ఫైనాన్స్ భావిస్తోంది.డిమాండ్కు ప్రతిస్పందనగా ఐఐఎఫ్ఎల్ హోమ్ ఫైనాన్స్ ప్రధానంగా పట్టణ ప్రాంతాలలోని ఆర్థికంగా వెనుకబడిన, అల్పాదాయ వర్గాలు తమ సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు గృహ రుణ వితరణను మరింత పెంచనుంది. ఇక సప్లయిపరంగా అందుబాటు ధరల్లో గృహాలు అభివృద్ధి చేసే హౌసింగ్ డెవలపర్లకు ఫైనాన్స్ సాయం అందించనుంది. -
కొత్త ఇన్సూరెన్స్ ప్లాన్.. 100 ఏళ్ల వరకూ బీమా రక్షణ
బంధన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వినూత్నమైన బీమా ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఇందులో 100 ఏళ్ల వయసు వరకు జీవిత బీమాను తీసుకోవచ్చు. పాలసీ కాలవ్యవధిలోపు పాలసీదారు మరణించినట్టయితే వారసులకు ఏక మొత్తం బీమా పరిహారాన్ని చెల్లిస్తుంది. అంతేకాదు అక్కడినుంచి క్రమం తప్పకుండా ఆదాయాన్ని చెల్లిస్తుంటుంది. గడువు తీరిన మెచ్యూరిటీ ప్రయోజనాలు కూడా లభిస్తాయి.కనీసం మూడు నెలల వయసు నుంచే ఈ పాలసీ తీసుకోవచ్చు. ఇలా తల్లిదండ్రులు, సంరక్షకులు చిన్న వయసు నుండే తమ పిల్లల కోసం ఆర్థిక రక్షణ కల్పించేందుకు వీలుంటుంది. విద్య, వివాహం లేదా ఇల్లు కొనుగోలు వంటి అవసరాలకు ఈ పాలసీ సహాయపడుతుంది. ఈ ఇన్సూరెన్స్ ప్లాన్ అనువైన చెల్లింపు ఎంపికలతోపాటు మహిళా పాలసీదారులకు అదనపు రాబడిని కూడా అందిస్తుంది.స్వల్ప, దీర్ఘకాలిక ఆర్థిక అవసరాలను తీర్చేలా ఈ ప్లాన్ను రూపొందించారు. కస్టమర్లు తమకు సౌకర్యవంతమైన ఆదాయ చెల్లింపు ఎంపికలను ఎంచుకోవచ్చు లేదా తరువాతి దశలో ఆదాయాన్ని కూడబెట్టి ఉపసంహరించుకోవచ్చు. రోజువారీ ఖర్చులను నిర్వహించడం, అత్యవసర నిధిని నిర్మించడం లేదా భవిష్యత్తు లక్ష్యాల కోసం పొదుపు చేయడం, ప్రణాళిక వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా ఉంటుంది. -
ఈ క్రెడిట్ కార్డు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదు
ఈరోజుల్లో దాదాపు ప్రతిఒక్కరి దగ్గర ముఖ్యంగా ముఖ్యంగా వర్కింగ్ ప్రొఫెషనల్స్ అందరి దగ్గరా క్రెడిట్ కార్డులు ఉన్నాయి. కొందరి దగ్గరైతే రెండు, మూడుకు మించి కూడా క్రెడిట్ కార్డులు ఉంటున్నాయి. క్రెడిట్ సదుపాయంతోపాటు ఆకర్షణీయమైన ప్రయోజనాల కోసం చాలా మంది క్రెడిట్ కార్డులను వినియోగిస్తుంటారు. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రెడిట్ కార్డు గురించి తెలుసా? దీని కోసం ఎంత ఖర్చవుతుందో తెలిస్తే నోరెళ్లబెడతారు..నేటి ప్రపంచంలో క్రెడిట్ కార్డులు రోజువారీ జీవితంలో భాగంగా మారాయి. చాలా మంది ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను కలిగి ఉంటారు. అసరమైనప్పుడు ఖర్చు చేసేందుకు మాత్రమే కాకుండా సినిమా టిక్కెట్లపై డిస్కౌంట్లు, రివార్డ్ పాయింట్లుక,ఉచిత ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్ వంటి ప్రయోజనాలను కూడా క్రెడిట్ కార్డులు. ఈ ప్రయోజనాలు పరోక్షంగా డబ్బు ఆదా చేయడానికి సహాయపడతాయి. అయితే క్రెడిట్ కార్డులను జాగ్రత్తగా ఉపయోగించకపోతే మాత్రం ఆర్థిక ఒత్తిడికి దారితీస్తుంది.భారత్లో 200 మంది దగ్గరే..ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రెడిట్ కార్డు ఒకటి ఉంది. దీని పేరు అమెరికన్ ఎక్స్ ప్రెస్ సెంచూరియన్ కార్డ్. సింపుల్గా అమెక్స్ బ్లాక్ కార్డ్ అని పిలుస్తారు. దీనిని అమెరికన్ ఎక్స్ ప్రెస్ బ్యాంక్ జారీ చేస్తుంది.ఈ కార్డు ఖరీదైనది మాత్రమే కాదు. చాలా ప్రత్యేకమైనది కూడా. ఇది అందరికీ అందుబాటులో ఉండదు. సాధారణ కార్డుల మాదిరిగా దీనికి దరఖాస్తు చేయలేము. నివేదికల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా కేవలం లక్ష మందికి మాత్రమే ఈ కార్డు ఉంది. భారత్ లో అయితే కేవలం 200 మంది దగ్గర మాత్రమే ఈ కార్డు ఉందని చెబుతున్నారు. ఇది 2013లో భారత మార్కెట్లోకి ప్రవేశించింది.రూ.10 కోట్లు ఖర్చు చేసే సామర్థ్యం ఉండాలిఅమెక్స్ బ్లాక్ కార్డు ఆహ్వానం ద్వారా మాత్రమే ఇస్తారు. అది కూడా చాలా అధిక ఆదాయం, ఖర్చు అలవాట్లు ఉన్నవారికి. అర్హత సాధించాలంటే రూ.10 కోట్ల వరకు ఖర్చు చేసే సామర్థ్యం ఉండాలి. దీన్నిబట్టి ఈ కార్డు కేవలం ధనవంతుల కోసమేనని స్పష్టమవుతోంది. అమెరికన్ ఎక్స్ ప్రెస్ సెంచూరియన్ కార్డ్తో ప్రపంచ స్థాయి హోటళ్లలో బస, ప్రైవేట్ జెట్ సేవలు, ఎయిర్పోర్ట్లలో వీఐపీ ట్రీట్మెంట్ వంటి అల్ట్రా లగ్జరీ సదుపాయాలు లభిస్తాయి.రూ.లక్షల్లో కార్డు ఫీజుఅమెక్స్ బ్లాక్ కార్డు ఖరీదు మామూలుగా ఉండదు. భారత్లో ఈ కార్డ్ ఇనీషియేషన్ ఫీజు రూ.7 లక్షలు, జాయినింగ్ ఫీజు రూ.2.75 లక్షలు ఉంటుంది. వీటికి జీఎస్టీ అదనం. అంటే ఈ క్రెడిట్ కార్డుకు మొదటి ఏడాది చెల్లించాల్సి మొత్తం రూ.11.5 లక్షలు దాటుతుంది. ఇక వార్షిక రుసుము రూ.2.75 లక్షలు జీఎస్టీతో కలుపుకొంటే రూ.3,24,500 అవుతుంది. -
పట్టి పీడించే ‘డార్క్ ప్యాటర్న్స్’
భారతదేశంలోని పలు ఫైనాన్షియల్ సర్వీసెస్ యాప్స్ను ‘డార్క్ ప్యాటర్న్స్’గా అభివర్ణిస్తూ జెరోధా సహ వ్యవస్థాపకుడు, కంపెనీ సీఈఓ నితిన్ కామత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కంపెనీలు ఎక్కువ డబ్బు సంపాదించడానికి, తమ ప్రయోజనాలే ముఖ్యంగా నిబంధనలకు వ్యతిరేకంగా ప్రజలను ఆర్థిక ఇబ్బందుల్లో నెట్టివేసేందుకు కొన్ని ట్రిక్స్ అనుసరిస్తున్నాయని కామత్ చెప్పారు.కామత్ తన ఎక్స్లో తెలిపిన వివరాల ప్రకారం.. ‘ఆర్థిక సేవల వ్యాపారాన్ని నిర్మించడంలో ప్రోత్సాహకాలు కీలకంగా మారుతాయి. అయితే ఇవి కస్టమర్ కోసం కాకుండా వ్యాపారానికి మంచి చేసేలా వక్రీకరించబడి ఉంటాయి. తాత్కాలికంగా వినియోగదారులకే పెద్దపీట వేసినట్లు ఉన్నా, నిలకడగా కస్టమర్లకు మొదటి స్థానం కల్పించడం చాలా కష్టం. ఇది కాసినో గేమ్ వంటిది. స్పష్టమైన ఫీచర్లు, స్థిరమైన నోటిఫికేషన్లు, వివరాలు లేకుండా ప్రమాదకరమైన ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టివేస్తాయి. చాలా ఫైనాన్షియల్ యాప్స్ డిజైనింగ్ ప్రజలు క్రమంగా ఎక్కువ ఖర్చు చేయడానికి, అజాగ్రత్తగా పెట్టుబడి పెట్టడానికి, నిత్యం అదే యాప్కు బానిస అయ్యేలా రూపొందించబడ్డాయి. ఈ డార్క్ ప్యాటర్న్స్ యాప్స్, వెబ్సైట్లో ఉపయోగించే డిజైన్ ట్రిక్స్’ అని చెప్పారు.One of the biggest challenges in building a financial services business is that the incentives are often skewed toward doing what’s good for the business and not for the customer. It’s very hard to consistently put customers first.This is one of the main reasons why finance… pic.twitter.com/AZR1hiiIfb— Nithin Kamath (@Nithin0dha) July 9, 2025 -
పిల్లలూ.. బ్యాంకు తలుపు తట్టండి!
ఇంట్లో నాన్న తీసుకొచ్చిన కిడ్డీబ్యాంక్ గుర్తుందా.. అమ్మ, నాన్న, ఎప్పుడైనా బంధువులు వస్తూపోతూంటే ఇచ్చే చిల్లర డబ్బులు దాచుకునేందుకు కిడ్డీబ్యాంకు ఉపయోగిస్తారు. ఏదైనా అత్యవసర సమయాల్లో పిల్లలు ఆ డబ్బును వాడుకుంటారు. చిన్నప్పటి నుంచే డబ్బు పొదుపు చేయడం అలవాటు చేసుకోయాలని అలా చేస్తారు. స్కూల్కు వెళ్లే దారిలోనో..సండే అలా పేరెంట్స్తో సరదాగా బయటకు వెళ్లే సమయంలోనే ఎస్బీఐ బ్యాంక్.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. ఐసీఐసీఐ బ్యాంక్ అని పేర్లు కనిపిస్తుంటాయి. ఇంట్లో ఉన్న కిడ్డీబ్యాంకు గురించి తెలుసుకానీ.. ఇవేం బ్యాంకులని చిన్నారుల్లో ఎన్నో అనుమానాలు ఉంటాయి.ఈ బ్యాంకులు కూడా ఇంట్లోని కిడ్డీ బ్యాంకుల్లాగే పని చేస్తాయి. పిల్లలు నిత్యం ఎలాగైతే డబ్బు పొదుపు చేసి అవసరమైనప్పుడు వాటిని వాడుకుంటారో.. అదే మాదిరిగా సేవింగ్స్, ఎఫ్డీ వంటి ఖాతాలో డబ్బు దాచుకొని అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. కాదంటే.. కిడ్డీ బ్యాంకులో ముందుగా ఎంతైతే డబ్బు వేస్తామో చివరిదాకా అంతే మొత్తం ఉంటుంది. కానీ బయట చూసే బ్యాంకుల్లో డబ్బు దాస్తే కొంత అధిక మొత్తం కలిపి ఇస్తారు. ఇలా బ్యాంకువారు కలిపి ఇచ్చే మొత్తాన్నే వడ్డీ అంటారు. కాబట్టి ప్రాథమికంగా కిడ్డీబ్యాంకులో డబ్బు పొదుపు చేయడం అలవాటు చేసుకొని, తర్వాత బ్యాంకుల్లో దాచుకోవడం నేర్చుకోవాలి. దాన్నివల్ల అదనంగా వడ్డీ సమకూరుతుంది కదా!పిల్లలే నేరుగా బ్యాంకు ఖాతాను తెరిచేందుకు వెళ్తే పాటించాల్సినవి..బ్యాంకులోకి ఎంటర్ అయ్యే ముందు గేట్వద్దే తుపాకీ పట్టుకొని బారుమీసాలతో గంభీరంగా ఒక వ్యక్తి ఉంటాడు. చిన్నారులూ.. అతడిని చూసి భయపడకండి. ఆ మీసాల మామ మనోడే.. మీ ఇంట్లోనీ కిడ్డీ బ్యాంకును ఎలాగైతే జాగ్రత్తగా ఒకచోట దాస్తారో.. అలాగే ఆ బ్యాంకుకు తాను నిత్యం భద్రత అందిస్తూ కాపలాకాస్తాడు. కాబట్టి మీరు వేసే డబ్బులు మరింత భద్రంగా ఉంటుంది.మామకు గుడ్మార్నింగ్ చెప్పి బ్యాంకులోకి వెళితే చాలామంది ఉంటారు. వారిలో చాలావరకు బ్యాంకులో ఏదోఒక పని కోసం వచ్చినవారే. కంగారు పడకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాబిన్లో కూర్చున్నవారిని గమనించండి. వారే బ్యాంకు సిబ్బంది.బ్యాంకులో డిపార్ట్మెంట్ల వారీగా చాలా మంది సిబ్బంది పని చేస్తారు. అంటే.. డబ్బులు మన నుంచి తీసుకునే వారు కొందరు ఉంటే.. ఇప్పటికే బ్యాంకులో డబ్బు వేస్తే తిరిగి ఇచ్చేవారు ఇంకొందరుంటారు. దాంతోపాటు ప్రత్యేకంగా లోన్లు ఇచ్చే వారుంటారు. మీ తరగతిలో లీడర్ ఎలాగైతే ఉంటాడో.. బ్యాంకులోనూ వీరందరినీ మ్యానేజ్ చేసే లీడర్ ఉంటారు. అతడే మేనేజర్.ప్రతి బ్యాంకులో ‘మే ఐ హెల్త్ యూ’ అని లేదా ‘ఎంక్వైరీ’ సైన్ బోర్డుతో ఒక క్యాబిన్ ఉంటుంది. అందులో ఉన్న అంకుల్ దగ్గరకు వెళ్లి.. ‘బ్యాంకులో ఖాతా ఓపెన్ చేయానుకుంటున్నాను.. ప్రాసెస్ ఏంటి’ అని అడిగితే తాను ఖాతా ఓపెన్ చేసేందుకు అవసరమైన డాక్యుమెంట్ల గురించి చెబుతారు. దాంతోపాటు ఎలాంటి రకాల ఖాతాలున్నాయో వివరిస్తారు.పిల్లల కోసం బ్యాంకులు అందిస్తున్న కొన్ని ఖాతాలు..యూత్ లేదా మైనర్ అకౌంట్: ఇది మైనర్ల కోసం రూపొందించిన ప్రామాణిక పొదుపు ఖాతా. ఇది సాధారణంగా తల్లిదండ్రులు లేదా సంరక్షకుడు ఖాతాకు జోడించబడి ఉంటుంది. ఈ ఖాతాలను చిన్న మొత్తాలను నిర్వహించవచ్చు.కస్టోడియల్ అకౌంట్: ఈ ఖాతా పిల్లల పేరు మీదే ఉంటుంది. కానీ తల్లిదండ్రులు లేదా సంరక్షకుడు పిల్లల వయసు (సాధారణంగా 18 లేదా 21) వచ్చే వరకు ఖాతాను నిర్వహిస్తాడు.జాయింట్ అకౌంట్: కొన్ని బ్యాంకులు తల్లిదండ్రులు తమ పిల్లలతో జాయింట్ అకౌంట్ తెరిచేందుకు అనుమతిస్తాయి. ఈ ఖాతాలో పిల్లలు, తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి నిర్వహించవచ్చు.బ్యాంకు ఎంచుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..అన్ని బ్యాంకులు పిల్లల ఖాతాలకు ఒకే రకమైన ప్రయోజనాలు అందించవు. ఆన్లైన్ సహాయంతో పిల్లల ఖాతాలు తెరిచేందుకు అనువైన బ్యాంకులను సెర్చ్ చేయాలి.నెలవారీ రుసుము లేకుండా.. నెలవారీ రుసుము వసూలు చేయని బ్యాంకులను ఎంచుకోవాలి. ఎందుకంటే దీని వల్ల పిల్లల చిన్నపాటి పొదుపు హరించుకుపోతుంది.తక్కువ లేదా నో మినిమమ్ డిపాజిట్.. కొన్ని బ్యాంకుల్లో ఖాతా తెరవడానికి కనీస డిపాజిట్ అవసరం ఉంటుంది. కాబట్టి తక్కువ లేదా ఎలాంటి డిపాజిట్ అవసరంలేని బ్యాంకులను ఎంచుకోవాలి.ఆన్లైన్ బ్యాంకింగ్.. చాలా బ్యాంకులు యువ ఖాతాదారుల కోసం మొబైల్ యాప్లు, ఆన్లైన్ బ్యాంకింగ్ను అందిస్తున్నాయి. అలాంటి సదుపాయం ఉన్న బ్యాంకుల తలుపు తట్టండి.ఎడ్యుకేషనల్ టూల్స్.. కొన్ని బ్యాంకులు పిల్లలకు పొదుపు, బడ్జెట్, డబ్బు నిర్వహణ గురించి నేర్పడానికి రూపొందించిన సాధనాలను అందిస్తాయి. అలాంటి ఆర్థిక అక్షరాస్యత నేర్పే వాటిని ఎంచుకోవాలి.ఇదీ చదవండి: పెరుగుతున్న కార్మిక కొరత.. జనాభా సంక్షోభంఖాతా తెరవడానికి అవసరమైన పత్రాలు..తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు సంబంధించిన ప్రభుత్వం జారీ చేసిన ఐడీకార్డులు (డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్ మొదలైనవి).చిరునామా రుజువు (యుటిలిటీ బిల్లు, లీజు ఒప్పందం మొదలైనవి).పిల్లల జనన ధ్రువీకరణ పత్రం లేదా పాస్పోర్ట్ (వయసును ధ్రువీకరించడానికి అవసరం)చిరునామా రుజువు (పిల్లవాడి పేరు మీద శాశ్వత చిరునామా ఉంటే ఇవ్వాలి)కొన్ని బ్యాంకులు అదనపు డాక్యుమెంట్లను అడగవచ్చు. కాబట్టి ఆయా బ్యాంకు వెబ్సైట్లలో ముందుగా వివరాలు తనిఖీ చేయడం మంచిది. -
తెలుగులోనూ ట్యాక్స్ ఫైలింగ్
ఫిన్టెక్ సంస్థ క్లియర్ట్యాక్స్ తాజాగా ఐటీ రిటర్నులను ఫైలింగ్ చేసేందుకు సంబంధించి తెలుగు తదితర 7 భాషల్లో సహాయం పొందే అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. బహు భాషల్లో పని చేసే కృత్రిమ మేథ (ఏఐ) ఆధారిత క్లియర్ట్యాక్స్ ఏఐ అసిస్టెంట్ను ఆవిష్కరించింది. దీనితో వాట్సాప్, స్లాక్ తదితర మాధ్యమాల ద్వారా తమకు కావాల్సిన భాషలో చాటింగ్ చేస్తూ, మూడు నిమిషాల వ్యవధిలోనే ఫైలింగ్ చేయొచ్చని సంస్థ వివరించింది. మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా ఫైల్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది. దీనితో కొత్తగా 1 కోటి మంది ట్యాక్స్ ఫైలర్లను వ్యవస్థ పరిధిలోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.ఇదీ చదవండి: కుబేరులకు దేశాలు రెడ్కార్పెట్ఐటీఆర్ కొత్త నిబంధనలు..కఠినమైన జరిమానాలు: తప్పుదారి పట్టించే లేదా తప్పుడు ఐటీఆర్ దాఖలు చేసిన వారికి 200 శాతం జరిమానా, 24 శాతం వార్షిక వడ్డీ, సెక్షన్ 276సి ప్రకారం శిక్ష కూడా విధిస్తారు.పన్ను చెల్లింపుదారుల బాధ్యత: సీఏ లేదా కన్సల్టెంట్ పొరపాటు చేసినా కూడా పన్ను చెల్లింపుదారుడే బాధ్యత వహించాలి.అందరికీ వర్తింపు: ఉద్యోగులు, ఫ్రీలాన్సర్లు, వ్యాపారులు, ప్రొఫెషనల్స్ అందరికీ ఈ నిబంధనలు వర్తిస్తాయి.సాధారణ తప్పులు: తప్పు ఐటీఆర్ ఫారమ్ ఎంపిక, తప్పుడు మినహాయింపులు, ఆదాయాన్ని ప్రకటించకపోవడం జరిమానాలకు దారి తీస్తాయి.రివైజ్డ్ రిటర్న్తోనూ లాభం లేదు: ఇచ్చిన సమాచారం తప్పుగా ఉందని పన్ను శాఖ గుర్తిస్తే, రివైజ్డ్ రిటర్న్ దాఖలు చేసినా జరిమానా తప్పదు.సరైన ఐటీఆర్ ఫారమ్ ఎంపిక: ITR-1 (సాధారణ ఆదాయం), ITR-3 (వ్యాపార ఆదాయం) వంటి వివిధ ఫారమ్లు ఆదాయ రకాన్ని బట్టి ఎంచుకోవాలి.తప్పు క్లెయిమ్లు చేయొద్దు: వ్యాపార ఖర్చులుగా వ్యక్తిగత ఖర్చులను చూపడం, తప్పుడు హౌస్ రెంట్ అలవెన్స్ క్లెయిమ్లు జరిమానాలకు దారి తీస్తాయి.పన్ను చెల్లింపుదారులకు జాగ్రత్తలు: వార్షిక సమాచార ప్రకటనలోని వివరాలతో సరిపోల్చుకోవడం, సరైన రికార్డులు నిర్వహించడం, పన్ను నిపుణుల సలహా తీసుకోవడం ద్వారా జరిమానాలను నివారించవచ్చు. -
ఈపీఎఫ్ వడ్డీ జమ.. ఈవారమే
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) సభ్యుల ఖాతాల్లో పొదుపు నిధిపై.. 2024–25 సంవత్సరానికి 8.25 శాతం వడ్డీ జమను ఈ వారంలోనే పూర్తి చేయనున్నట్టు కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ‘33.56 కోట్ల సభ్యులకు సంబంధించిన 13.88 లక్షల సంస్థల వార్షిక అకౌంట్ అప్డేషన్ పూర్తయింది. జులై 8 నాటికి 13.86 లక్షల సంస్థలకు చెందిన 32.39 కోట్ల సభ్యుల ఖాతాల్లో వడ్డీ జమ చేయడం ముగిసింది. అంటే ఇప్పటికే 96.51 సభ్యుల ఖాతాలకు వడ్డీ జమైంది’ అని మంత్రి వివరించారు.గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సభ్యుల నిధిపై, అంతకుముందు ఆర్థిక సంవత్సరం మాదిరే 8.25% వడ్డీ రేటును ఇవ్వాలని ఈపీఎఫ్వో ఫిబ్రవరి 28న నిర్ణయించగా.. కేంద్ర ప్రభుత్వం మే 22న ఆమోదం తెలపడం గమనార్హం. దీంతో జూన్ 6 నుంచే వార్షిక ఖాతాల అప్డేషన్ మొదలైనట్టు తెలిపారు. 2023–24 సంవత్సరానికి సంబంధించి ఆగస్ట్–డిసెంబర్లో వడ్డీ జమ జరిగింది.వడ్డీ జమయిందో లేదో చూసుకోండిలా..స్టెప్ 1: ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్ ( epfindia.gov.in )సందర్శించండిస్టెప్ 2: అవర్ సర్వీసెస్ > ఫర్ ఎంప్లాయీస్ > మెంబర్ పాస్బుక్కు వెళ్లండిలేదా నేరుగా ( passbook.epfindia.gov.in ) లింక్ను క్లిక్ చేయండి.స్టెప్ 3: యూఏఎన్, పాస్వర్డ్, క్యాప్చా ఉపయోగించి లాగిన్ అవ్వండి.స్టెప్ 4: ఇక్కడ మీ అన్ని మెంబర్ ఐడీలు (మునుపటి, ప్రస్తుత కంపెనీలతో లింక్ అయినవి)కనిపిస్తాయి.స్టెప్ 5: పాస్బుక్ చూడటానికి ప్రస్తుత మెంబర్ ఐడీపై క్లిక్ చేయండిపాస్బుక్లో ఉద్యోగి కంట్రిబ్యూషన్, కంపెనీ కంట్రిబ్యూషన్, జమ అయిన వడ్డీ కనిపిస్తాయి. దీన్ని పీడీఎఫ్ గా కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. -
‘కొత్త’గా ఇన్వెస్ట్ చేస్తారా.. ఇవిగో ఎన్ఎఫ్వోలు
ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్.. ఇన్వెస్కో ఇండియా ఇన్కమ్ ప్లస్ ఆర్బిట్రేజ్ యాక్టివ్ ఫండ్ ఆఫ్ ఫండ్ను కొత్తగా తీసుకొచ్చింది. ఈ నూతన ఫండ్ ఆఫర్ 2న ప్రారంభం కాగా.. 16వ తేదీ వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. యాక్టివ్గా నిర్వహించే డెట్ ఫండ్స్, ఈక్విటీ ఆర్బిట్రేజ్ ఫండ్స్లో ఈ పథకం పెట్టుబడులు పెడుతుంటుంది.సంప్రదాయ డెట్ పథకాలకు ప్రత్యామ్నాయంగా ఈ పథకాన్ని రూపొందించి తీసుకొచ్చినట్టు ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్ తెలిపింది. తక్కువ రిస్క్తో కూడిన రాబడి, పన్ను పరంగా మెరుగైన ప్రయోజనం కోరుకునే దీర్ఘకాల పెట్టుబడులకు ఈ పథకం అనుకూలంగా ఉంటుందని పేర్కొంది. మొత్తం పెట్టుబడుల్లో 60–65 శాతాన్ని ఇన్వెస్కో ఇండియా కార్పొరేట్ బాండ్ ఫండ్లో పెడుతుంది. 35–40 శాతం మధ్య ఇన్వెస్కో ఇండియా ఆర్బిట్రేజ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తుంది.యాక్సిస్ సర్వీసెస్ ఆపర్చూనిటీస్ ఫండ్ యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా సర్వీసెస్ ఆపర్చూనిటీస్ ఫండ్ పేరిట ఓపెన్ ఎండెడ్ స్కీమును ప్రకటించింది. ఇది జూలై 18 వరకు అందుబాటులో ఉంటుంది. బ్యాంకింగ్ నుంచి మొదలుకుని ఈ–కామర్స్, ఫిన్టెక్, హెల్త్కేర్ వరకు వివిధ రంగాల్లో అత్యుత్తమంగా రాణిస్తున్న సంస్థల్లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది.భారీ స్థాయిలో వృద్ధి చెందగలిగి, పెట్టుబడులను సమర్థంగా వినియోగించుకుంటూ, పోటీ సంస్థలతో పోలిస్తే మెరుగ్గా ఉన్న కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో పెట్టుబడుల వృద్ధి ప్రయోజనాలను కల్పించడం ఈ ఫండ్ ప్రధాన లక్ష్యం. సేవల రంగానికి అనుకూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో దేశ ఆర్థిక ప్రగతికి ఇది కీలకంగా ఉంటుందని యాక్సిస్ ఏఎంసీ ఎండీ బి. గోపకుమార్ తెలిపారు. -
యువత కోసం కొత్త యులిప్ పథకం
యువతకు దీర్ఘకాలంలో సంపద సృష్టికి దోహదపడేలా ఐసీఐసీఐ ప్రూ స్మార్ట్ ఇన్సూరెన్స్ ప్లాన్ ప్లస్ పేరిట మార్కెట్ ఆధారిత యులిప్ ప్లాన్ను ప్రవేశపెట్టింది ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్. దీన్ని నెలవారీగా రూ. 1,000 ప్రీమియంకే కొనుగోలు చేయొచ్చని సంస్థ తెలిపింది.ఇటు లైఫ్ కవరేజీతో పాటు అటు దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల సాధనకు కూడా ఇది ఉపయోగపడుతుందని కంపెనీ చీఫ్ ప్రోడక్ట్, డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ అమిత్ పల్టా తెలిపారు. వీలైనంత ముందుగా ఇన్వెస్ట్మెంట్ మొదలుపెట్టి దీర్ఘకాలం కొనసాగించేలా యువతకు యులిప్ ప్లాన్లు ఉపయుక్తంగా ఉంటాయన్నారు.బజాజ్ అలియాంజ్ లైఫ్ కొత్త ఫండ్జీవిత బీమా సంస్థ బజాజ్ అలియాంజ్ లైఫ్ తాజాగా నిఫ్టీ 500 మల్టీఫ్యాక్టర్ 50 ఇండెక్స్ ఫండ్ పేరిట న్యూ ఫండ్ ఆఫర్ను (ఎన్ఎఫ్వో) ప్రకటించింది. దీన్ని తమ యులిప్ పాలసీల కింద అందిస్తుంది. ఇది నిఫ్టీ 500 మల్టీఫ్యాక్టర్ MQVLV 50 ఇండెక్స్ను ట్రాక్ చేసే విధంగా ఉంటుంది. పాలసీదారులకు ఇటు లైఫ్ కవరేజీతో పాటు అటు మల్టీఫ్యాక్టర్ ఆధారిత ఈక్విటీ ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేసే అవకాశాన్ని కూడా ఇస్తుంది. ఎన్ఎఫ్వో జూలై 14తో ముగుస్తుంది. -
ఇక ఈ బ్యాంక్లోనూ మినిమమ్ బ్యాలెన్స్ అక్కర్లేదు..
పేదలు, సామాన్యులకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఒక్కొక్కటిగా ముందుకువస్తున్నాయి. ఇందులో భాగంగా బ్యాంక్ ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ నిర్వహించకపోతే విధించే చార్జీలను రద్దు చేస్తున్నాయి. తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ జాబితాలో చేరింది. ప్రామాణిక పొదుపు ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ ఛార్జీలను తొలగించింది.బ్యాంక్ ఆఫ్ బరోడాలో మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీల తొలగింపు జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మార్పు ప్రీమియం ఉత్పత్తులు మినహా అన్ని సాధారణ పొదుపు ఖాతాలకు వర్తిస్తుంది.కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్లు ఇటీవలే పొదుపు ఖతాలకు కనీస బ్యాలెన్స్ ఛార్జీలు తొలగించిన తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా అనుసరించింది. ఇక అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2020లోనే మినిమమ్ బ్యాలెన్స్ ఆవశ్యకతలను ఎత్తివేస్తూ ఈ దిశగా చర్యలు తీసుకుంది.మినిమమ్ బ్యాలెన్స్ లేని ఖాతాలపై విధిస్తున్న జరిమానాలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ, ప్రభుత్వ రంగ బ్యాంకుల మధ్య చర్చలు కొనసాగుతున్న క్రమంలో ఈ మార్పు చోటు చేసుకుంది. చౌక కరెంట్, పొదుపు ఖాతాల డిపాజిట్ల వాటాలో తగ్గుదలను బ్యాంకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ అంశం దృష్టిని ఆకర్షించింది. -
రిటర్నులు ఎవరు వేయక్కర్లేదంటే..
2025 సంవత్సరం మొదలైందంటే 31.3.2025 నాటి కల్లా ప్లానింగ్, సేవింగ్స్, టీడీఎస్, టీసీఎస్, అడ్వాన్స్ టాక్స్ చెల్లింపులు... అలాగే 1.4.2025 దాటిదంటే రిటర్ను వేయడానికి సన్నద్ధం కావాలి. ఏ ఫారం వేయాలి. గడువు తేదీ ఏమిటి..? ఎంత పన్ను చెల్లించాలి..? ఇలా ఉంటాయి అందరి అలోచనలు. ఈ వారం టాక్స్ కాలంలో వ్యక్తులు ఏయే సందర్భాలలో రిటర్నులు వేయనక్కర్లేదో వివరంగా తెలుసుకుందాం.టాక్స్బుల్ ఇన్కం లిమిట్ దాటని వ్యక్తులు నికర ఆదాయాన్ని టాక్స్బుల్ ఇన్కం అంటారు. నికర ఆదాయం టాక్సబుల్ ఇన్కం లిమిట్ లోపల ఉంటే రిటర్నులు వేయాల్సిన పనిలేదు. ఇది మీకు తెలిసిన విషయమే. కొత్త విధానంలో ఏ వయసువారికైనా బేసిక్ లిమిట్ రూ.3 లక్షలుగా ఉంటుంది. వయసు బట్టి మార్పు లేదు. కానీ పాత విధానంలో మార్పులు ఉన్నాయి. ఈ బేసిక్ లిమిట్ లోపల పన్నుభారం ఉండదు. అయితే కొత్త విధానంలో రిబేటుని ఇస్తారు. అంటే పన్ను భారంలోంచి తగ్గిస్తారు. ఆదాయంలోంచి కాదు. రిబేటుని రూ.60,000కు పెంచడం వలన రూ.12 లక్షల లోపల ఆదాయం ఉన్నవారికి పన్ను పడదు.కేవలం బ్యాంకు వడ్డీ / పెన్షన్ ఉండి, ఎటువంటి టీడీఎస్ లేకపోతే... మీ ఆదాయం కేవలం వడ్డీ అనుకొండి. సేవింగ్స్ అకౌంట్స్ కానీ ఎఫ్డీలు కానీ లేదా పెన్షన్ కానివ్వండి లేదా ఈ రెండు కలిపి కానివ్వండి.. వెరసి మొత్తం టాక్సబుల్ ఇన్కం దాటకూడదు. అలాగే డివిడెండ్లు, టీడీఎస్ ఉండకూడదు. అటువంటి వారు నిశ్చింతగా ఉండొచ్చు. ఇదే ఉదాహరణలో టీడీఎస్ ఉంటే రిటర్ను వేయాలి.గృహిణులు, విద్యార్థులు కూడా వేయనవసరం లేదు. ఇంటి నిర్వహణ నిమిత్తం భర్త తన టాక్సబుల్ ఇన్కం నుంచి లేదా మిహాయింపు రశీదులో ఎంత ఇచ్చినా పన్ను పడదు. పోపుల డబ్బాలో మిగిలిన మొత్తానికి పన్ను ఉండదు. అలాగే పిల్లలకు ఇచ్చిన పాకెట్ మనీకి కూడా పన్ను పడదు.ఎన్నారైలకు ఇండియాలో టాక్స్బుల్ ఇన్కం లిమిట్ రూ.2.50 లక్షల లోపల ఉంటే రిటర్ను వేయక్కర్లేదు.సీనియర్స్ సిటిజన్లు... కానీ షరతులకు లోబడి సెక్షన్ 194 ... ఇదొక వరం లాంటిది. కానీ అందరూ లబ్ధిదారులు కాదు. 75 సంవత్సరాలు దాటిన వారికి వర్తిస్తుంది.రెసిడెంటు అవ్వాలి75 సంవత్సరాలు లేదా అంతకుపైబడిన వారికి మాత్రమేఆదాయంలో కేవలం పెన్షన్, ఒకే బ్యాంకు అకౌంటులోని వడ్డీ ఉండాలి. ఒకే బ్యాంక్ అకౌంటు ఉండాలి. అది కూడా నిర్దేశిత బ్యాంకు అయ్యి ఉండాలి. అందులోనే పెన్షన్ జమ అవ్వాలిపెన్షన్+వడ్డీ మీద టీడీఎస్... ఆ బ్యాంకు లెక్కించి రికవరీ చేయాలిబ్యాంకు 80 ఇ, 80 ఈ మొదలైన డిడక్షన్లు పరిగణలోకి తీసుకుంటుంది. ఇదీ చదవండి: పసిడి ప్రియుల్లో మళ్లీ ఆశలు.. పడుతున్న ధరలుఈ వెసులుబాటు మాత్రం ఎంగిలి చేత్తో కాకిని తోలినట్లే కొద్ది మందికే ఉపయోగపడవచ్చు. దానిని వక్రీకరించి చాలామంది, 75 ఏళ్ల వారికి పన్ను లేదని పిడివాదన చేస్తుంటారు. అది నమ్మకండి. -
ఒడిదొడుకుల మార్కెట్లో చేయాల్సింది ఇదే..
అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో స్థూల ఆర్థిక పరిస్థితులు బలహీనంగా కనిపిస్తున్నాయి. వాణిజ్య ఉద్రిక్తతలు, పాలసీపరంగా అనిశ్చితి, వినియోగదారుల్లో విశ్వాసం సన్నగిల్లడం తదితర అంశాల కారణంగా 2025 గ్లోబల్ జీడీపీ వృద్ధి అంచనాలను అంతర్జాతీయ ద్రవ్య నిధి 2.8 శాతానికి కుదించింది. అయితే, ఇలాంటి అస్థిరత మధ్య కూడా భారత ఆర్థిక మూలాలు పటిష్టంగానే కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఆర్థిక నియంత్రణకు కట్టుబడి ఉండటం, వృద్ధిని ప్రోత్సహించేలా ద్రవ్య విధానాలు ఉండటం వంటి అంశాలు దేశీయంగా స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉండటంలో కీలక పాత్ర పొషిస్తున్నాయి.2026 ఆర్థిక సంవత్సరంలో భారత ఎకానమీ 6.5% వృద్ధి సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి. గ్రామీణ డిమాండ్ స్థిరంగా ఉండటం, పట్టణప్రాంతంలో వినియోగం మెరుగుపడటం, పెట్టుబడులు స్థిరంగా పుంజుకోవడం ఇందుకు దోహదపడనున్నాయి. మే 2025 నాటికి ద్రవ్యోల్బణం 2.8 శాతానికి తగ్గింది. 2019 ఫిబ్రవరి తర్వాత ఇది అత్యల్ప స్థాయి. ఆహారపదార్థాల ధరలు తగ్గడంతో పాటు సానుకూల రుతుపవనాల అంచనాలు కూడా ఇందుకు తోడ్పడ్డాయి. ఇవన్నీ సానుకూలమే అయినప్పటికీ మార్కెట్లో అస్థిరత పెరుగుతుండటంలాంటి అంశాల కారణంగా డైవర్సిఫికేషన్కి ప్రాధాన్యమిచ్చే మల్టీ అసెట్ ఫండ్స్ ఆవశ్యకత కనిపిస్తోంది. ఎందుకంటే, 2024లో ఈక్విటీ మార్కెట్లో అన్ని విభాగాలు మెరుగ్గా రాణించడంతో డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు ఒక స్థాయికే పరిమితమైనట్లు కనిపించింది. కానీ, మార్కెట్ అస్థిరత మళ్లీ పెరుగుతుండటం, వివిధ రంగాల మధ్య పనితీరులో అంతరాలు కనిపిస్తుండటం వంటి పరిణామాల నేపథ్యంలో డైవర్సిఫికేషన్ వ్యూహాలకు మళ్లీ ప్రాధాన్యం పెరుగుతోంది.ఈక్విటీలకు దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణానికి మించి రాబడులు అందించే సామర్థ్యం ఉండగా, హైబ్రిడ్ ఫండ్లు స్థిరంగా, రిస్క్లకు తగ్గ అనుకూల రాబడిని అందించగలవు. ఇవి ముఖ్యంగా పెట్టుబడికి భద్రత, పోర్ట్ఫోలియోకి స్థిరత్వాన్ని కోరుకునే పెట్టుబడిదారులకు అనువైనవిగా ఉంటాయి. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో, మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ లాంటి హైబ్రిడ్ ఫండ్లు మదుపరులకు మెరుగ్గా నిలుస్తున్నాయి. ఇవి సందర్భాన్ని బట్టి వివిధ సాధనాలకు వివిధ రకాలుగా కేటాయించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈక్విటీలు, ఫిక్స్డ్ ఇన్కం, కమోడిటీల మధ్య పెట్టుబడులను అటూ, ఇటూ మారుస్తూ, రిస్క్లను సమర్ధవంతంగా అధిగమిస్తూ, అవకాశాలను అందిపుచ్చుకోగలిగే వెసులుబాటు వీటికి ఉంటుంది. ఈక్విటీ వేల్యుయేషన్స్ అధిక స్థాయిలో, బాండ్లపై రాబడులు స్థిరంగా ఉండగా.. ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లు, మార్కెట్ హెచ్చుతగ్గుల నుంచి రక్షణ కల్పించే కమోడిటీలకు – ముఖ్యంగా బంగారానికి కూడా పోర్ట్ఫోలియోలో చోటు కల్పించడం కీలకంగా మారింది. ఎందుకంటే, సంక్లిష్టమైన స్థూలఆర్థిక పరిస్థితుల్లో రిసు్కలకు తగ్గ రాబడులను అందించే విషయంలో మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఇదీ చదవండి: ఎంతో హెచ్చరించా.. వినలేదు.. చివరకు..ఇలాంటి, అతి తక్కువ లేదా నెగిటివ్ కో–రిలేషన్ ఉన్న ఆర్థిక సాధనాలతో వైవిధ్యభరితంగా ఉండే పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్ చేయడం వల్ల పెట్టుబడులు భారీగా పతనం కాకుండా కాస్త రక్షణ లభిస్తుంది. నెగటివ్ కో–రిలేషన్ అంటే, ఆర్థిక లేదా భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతల వల్ల ఈక్విటీ మార్కెట్ క్షీణించినప్పటికీ, సురక్షితమైన సాధనాలుగా పరిగణించే డెట్, పసిడిలాంటి సాధనాలు పెరుగుతాయి. ఇలా ఒడిదుడుకులు నెలకొన్నప్పుడు, పరస్పర విరుద్ధంగా వ్యవహరించే సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా, ఇన్వెస్టర్లకు రిసు్కలను తగ్గించి, మెరుగైన రాబడినిచ్చే విధంగా మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ ఉంటాయి. ఇవి వివిధ సాధనాలవ్యాప్తంగా కేటాయింపులను సత్వరం మార్చగలిగే విధంగా పనిచేస్తాయి. అయితే, నిబంధనల ప్రకారం ఈక్విటీలకు తప్పనిసరిగా కనీసం 65 శాతమైన నిధులు కేటాయించాలి కాబట్టి, వీటిపై వచ్చే మూలధన లాభాలకు శ్లాబ్ రేట్ల వారీగా కాకుండా ఈక్విటీ ట్యాక్సేషన్ వర్తిస్తుంది. కాబట్టి, దీర్ఘకాలిక పెట్టుబడి లక్ష్యాల సాధన కోసం పన్నులు ఆదా అయ్యే మార్గాలను అన్వేషించే ఇన్వెస్టర్లు, ఈ ఫండ్స్ను పరిశీలించవచ్చు. ఇవి సమీప భవిష్యత్తులో క్షీణత నుంచి రక్షణ, అలాగే పన్నులపరంగా ప్రయోజనాలు కల్పిస్తూనే దీర్ఘకాలికంగా పెట్టుబడి వృద్ధి అవకాశాలను కూడా అందిస్తూ, ఇన్వెస్టర్లకు అనువుగా ఉంటాయి. -
లార్జ్క్యాప్ – మిడ్క్యాప్లో ఏది మెరుగు?
నేను ప్రతి నెలా రూ.5,000 చొప్పున 20 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేయడం ద్వారా పెద్ద మొత్తాన్ని సమకూర్చుకోవాలని అనుకుంటున్నాను. దీర్ఘకాలం కోసం మంచి మ్యూచువల్ ఫండ్స్ పథకాలు ఏవైనా ఉన్నాయా? – వాణిమీ పెట్టుబడులకు తగినంత దీర్ఘకాలం ఉంది. కనుక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మీకు మంచి ఎంపిక అవుతుంది. ఈక్విటీ మార్కెట్లన్నవి ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఉంటాయి. మీ సౌకర్యానికి అనుగుణంగా మంచి పథకాన్ని ఎంపిక చేసుకోవాలి. మీరు మొదటిసారి ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అయితే అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్తో ఆరంభించొచ్చు. పెట్టుబడుల్లో మూడింట రెండొంతులను ఈక్విటీలకు, మిగిలిన ఒక వంతును డెట్ సాధనాలకు ఇవి కేటాయిస్తాయి. ఈక్విటీ విభాగం ఆటుపోట్లను ఎదుర్కొనే సమయంలో డెట్ పెట్టుబడులు కుషన్గా పనిచేస్తాయి. అచ్చమైన ఈక్విటీ పథకాల్లో పెట్టుబడులతో పోల్చి చూసినప్పుడు ఆటుపోట్ల ప్రభావం హైబ్రిడ్ పెట్టుబడులపై తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ దీర్ఘకాలంలో మంచి రాబడులను అందిస్తాయి.నెలకు రూ.5,000 చొప్పున 20 ఏళ్ల పాటు సిప్ చేస్తూ వెళితే 12.18 శాతం రాబడుల ఆధారంగా (గత 20 ఏళ్ల సగటు రాబడి) రూ.51.25 లక్షలు సమకూరుతుంది. పెట్టుబడుల్లో కొంత మొత్తాన్ని ఫిక్స్డ్ ఇన్కమ్ (డెట్) సాధనాలకు కేటాయించుకోవడం ఎంతో అవసరం. ఎందుకంటే మార్కెట్ కరెక్షన్లలో ఇన్వెస్టర్లు ఆందోళనకు గురికావడం సహజం. ఆ సమయంలో నష్టాలకు సైతం ఈక్విటీ పెట్టుబడులు అమ్మేస్తుంటారు. అలాంటి తరుణంలో అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ పెట్టుబడుల విలువ క్షీణతను పరిమితం చేస్తాయి. మార్కెట్ల ఆటుపోట్లను తట్టుకునే సామర్థ్యం ఉన్నవారు.. ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ను సైతం పరిశీలించొచ్చు. ఇవి లార్జ్, మిడ్, స్మాల్క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఒక్కో విభాగంలో పెట్టుబడులను మార్పులు చేర్పులు చేస్తుంటాయి. చారిత్రకంగా చూస్తే వీటి వార్షిక రాబడి గత 20 ఏళ్లలో 12.66 శాతం చొప్పున ఉంది. అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ కంటే కొంచెం అదనపు రాబడులను ఇవ్వగలవు.ఇదీ చదవండి: ఎంతో హెచ్చరించా.. వినలేదు.. చివరకు..ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో లార్జ్క్యాప్, మిడ్క్యాప్ ఫండ్స్లో వేటిని ఎంపిక చేసుకోవాలి. – అనిరుధ్దీర్ఘకాలంలో ఏ విభాగం అధిక రాబడులను ఇస్తుందన్నది ఊహించడమే అవుతుంది. ముఖ్యంగా ఈక్విటీల్లో పెట్టుబడులు పెడుతున్నప్పుడు కాల వ్యవధి కనీసం ఐదేళ్లకు తగ్గకుండా చూసుకోవాలి. ఇన్వెస్ట్ చేసిన తొలి ఐదేళ్ల కాలంలోనే మార్కెట్ సైకిల్ (దిద్దుబాటు) ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో లార్జ్క్యాప్ కంపెనీలు మంచి పనితీరు చూపిస్తే.. కొన్ని సందర్భాల్లో మిడ్క్యాప్ కంపెనీలు మంచి ప్రదర్శన చేస్తాయి. కొన్ని సందర్భాల్లో స్మాల్క్యాప్ విభాగం అధిక రాబడులను ఇస్తుంటుంది. కనుక ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఫ్లెక్సీక్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఫ్లెక్సీక్యాప్ ఫండ్ మేనేజర్కు ఏ విబాగంలో అయినా ఇన్వెస్ట్ చేసే స్వేచ్ఛ ఉంటుంది. మార్కెట్ సైకిల్లో ఒక విభాగం మంచి పనితీరు, మరో విభాగం బలహీన పనితీరు చూపిస్తున్న సందర్భాల్లో ఫ్లెక్సీక్యాప్ పథకం ద్వారా ఆ సైకిల్ను చక్కగా అధిగమించగలరు. -
బ్యాంక్ లాకర్.. ఎంత భద్రం?
చాలా మందికి బ్యాంక్ లాకర్ నమ్మకమైన, భద్రమైన వేదిక. రక్షణ దృష్ట్యా విలువైన డాక్యుమెంట్లు, బంగారం, వెండి, వజ్రాభరణాలను ఇంట్లో ఉంచకుండా బ్యాంక్ లాకర్లలో భద్రపరుస్తుంటారు. కొందరు నగదును కూడా లాకర్లలో పెడుతుంటారు. బ్యాంకు లాకర్లపై కొండంత భరోసాతో ఉండేవారికి యూపీలోని మొరాదాబాద్లో 2023లో జరిగిన ఒక ఘటనను గుర్తు చేయాల్సిందే. ఒక మహిళ తన కుమార్తె వివాహ అవసరాల కోసం ఉద్దేశించిన రూ.18 లక్షల నగదును, ఆభరణాలతోపాటు లాకర్లో ఉంచగా.. చెదలు ఆ నోట్లను చిత్తు చిత్తు చేసేశాయి. ఈ కేసులో ఆమెకు ఒక్క రూపాయి పరిహారం ముట్టలేదు. అందుకే లాకర్ను వినియోగించుకునే ప్రతి ఒక్కరూ ముందుగా నియమ, నిబంధనలను పూర్తిగా తెలుసుకోవాలి. లాకర్లో ఉంచిన వాటికి నష్టం జరిగతే బ్యాంక్ బాధ్యత ఏ మేరకు అన్నది స్పష్టత తీసుకోవాలి. అవసరమైతే బీమా రక్షణతో భరోసా కల్పించుకోవాలి. బ్యాంకు లాకర్లో పెట్టేశాం కదా ఇక నిశ్చింతగా ఉండొచ్చనుకుంటే పొరపాటే. అధిక తేమ లేదా చెదలు లాకర్లో ఉంచిన డాక్యుమెంట్లు, కరెన్సీ నోట్లను దెబ్బతీసే అవకాశం లేకపోలేదు. దీనికితోడు వరదల కారణంగా లాకర్లలోకి నీరు చేరొచ్చు. భూకంపం కారణంగా నిర్మాణమే దెబ్బతినొచ్చు. చోరీ, దోపిడీలన్నవి అరుదుగా జరుగుతుంటాయి. ఇలాంటి అన్ని రకాల నష్టాలకూ బ్యాంక్లు పరిహారం చెల్లించవన్న విషయం కచ్చితంగా తెలుసుకోవాలి. ‘‘విలువైన వాటిని స్టోర్ చేసుకునేందుకు బ్యాంక్ లాకర్లు భద్రమైన ఎంపికే. కానీ, ఇందులో రిస్క్ లు కూడా ఉన్నాయి. వీటిని అర్థం చేసుకుని సరైన చర్యలు తీసుకోవడం ద్వారా అందులో ఉంచిన మీ వస్తువులను రక్షించుకోవచ్చు’’ అని సాల్వే బస్సెల్స్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ మేనేజ్మెంట్ క్వాంటిటేటివ్ అనలిస్ట్ స్నేహాశిష్ దాస్ తెలిపారు. వేటికి పరిహారం.. లాకర్ విషయంలో ఆర్బీఐ 2021లో కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. లాకర్లలో ఉంచిన వాటికి నష్టం జరిగితే బ్యాంక్ బాధ్యత ఏ మేరకో ఇందులో స్పష్టత ఇచ్చారు. బ్యాంకుల నిర్లక్ష్యం కారణంగా దొంగతనం, అగి్నప్రమాదం, భవనం కూలిపోవడం లేదా ఉద్యోగి మోసం కారణంగా లాకర్లలో ఉన్న వాటికి నష్టం వాటిల్లితే పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా బ్యాంక్ లాకర్ వార్షిక అద్దె/చార్జీకి గరిష్టంగా 100 రెట్ల వరకే బ్యాంక్లు చెల్లిస్తాయి. ఉదాహరణకు బ్యాంక్ లాకర్ చార్జీ ఏటా రూ.5,000 ఉందనుకుంటే.. లాకర్లలో ఉంచిన వాటికి నష్టం జరిగితే బ్యాంక్ గరిష్టంగా రూ.5 లక్షలను చెల్లిస్తుంది. బ్యాంక్లు సరైన చర్యలు తీసుకున్నప్పటికీ వరదలు, భూకంపాల కారణంగా లాకర్లలో ఉంచిన వాటికి నష్టం వాటిల్లితే అలాంటి సందర్భాల్లో బాధ్యత వహించబోవని దాస్ తెలిపారు. అంతేకాదు డాక్యుమెంట్లను సరైన భద్రతతో కూడిన ప్యాకేజీతో ఉంచకపోయినా నష్టానికి బ్యాంక్లు బాధ్యత తీసుకోవని చెప్పారు. తేమకు దెబ్బతినని, నీటితో తడిసినా దెబ్బతినని పాలిథీన్ బ్యాగుతోపాటు చెదలు పట్టలేని ప్యాక్తో రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. కస్టమర్ల నిర్ల క్ష్యం వల్ల వాటిల్లే నష్టానికి బ్యాంకులు పరిహారం చెల్లించవు. లాకర్ను సరైన విధంగా లాక్ చే యకుండా వెళ్లిపోయిన సందర్భాల్లో నష్టానికి కస్టమర్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్లాన్ అహెడ్ వెల్త్ అడ్వైజర్స్ సీఎఫ్పీ విశాల్ ధావన్ తెలిపారు. వీటికి అనుమతి.. బంగారం, వెండి, వజ్రాభరణాలు, బంగారం/వెండి వస్తువులు, బంగారం కాయిన్లు, బిస్కెట్లు లాకర్లలో ఉంచొచ్చు. చట్టబద్ధమైన డాక్యుమెంట్లు, బీమా పత్రాలు, వీలునామాలు, ప్రాపర్టీ రిజి్రస్టేషన్ పత్రాలు, బర్త్ సర్టిఫికెట్, మ్యారేజ్ సర్టిఫికెట్లు ఉంచొచ్చు. షేరు సర్టిఫికెట్లు, మ్యూచువల్ ఫండ్స్ తదితర పెట్టుబడుల పత్రాలను కూడా భద్రంగా పెట్టుకోవచ్చు. ప్రముఖ బ్యాంక్లు లాకర్లలోనూ భిన్న రకాల సైజులను (నాలుగు రకాలు) ఆఫర్ చేస్తున్నాయి. వీటి చార్జీలు, సదుపాయాలు వేర్వేరుగా ఉన్నాయి. తమ అవసరాలకు అనుకూలమైన దాన్ని ఎంపిక చేసుకోవాలి. లాకర్ ఇన్సూరెన్స్.. లాకర్లో ఉంచిన వాటికి నష్టం జరిగితే కొన్ని సందర్భాల్లో బ్యాంకుల నుంచి పరిహారం రాదు. కనుక లాకర్ సదుపాయం వినియోగించే ప్రతి ఒక్కరూ లాకర్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఎందుకంటే బ్యాంక్లు చెల్లించే పరిహారం సైతం వార్షిక అద్దెకు గరిష్టంగా 100 రెట్లకు మించదు. లాకర్లో అంతకుమించి విలువైన వాటిని ఉంచే వారు తప్పకుండా ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాలి. లాకర్లో ఉంచిన వస్తువుల విలువను తెలియజేసే సర్టిఫికెట్లు/ధ్రువీకరణలను జాగ్రత్తగా దగ్గర ఉంచుకోవాలి. లాకర్లో ఉంచిన వాటి విలువకు తగ్గకుండా బీమా కవరేజీ తీసుకోవాలి. అగ్నిప్రమాదం, చోరీ, ఉగ్రవాదం, ప్రకృతి విపత్తుల కారణంగా లాకర్లోని వాటికి నష్టం వాటిల్లితే పరిహారం లభిస్తుంది. లాకర్లో విలువైన డాక్యుమెంట్లకు కవరేజీ కోసం రైడర్లు తీసుకోవాల్సి ఉంటుంది. లాకర్లో ఉంచిన వాటిని నిర్ధారించేందుకు వీలుగా ఫోన్లో ఫొటో తీసి పెట్టుకోవడం మంచిది. చాలా కంపెనీలు రూ. 3–40 లక్షల మధ్య సమ్ అష్యూర్డ్తో లాకర్ ఇన్సూరెన్స్ను ఆఫర్ చేస్తున్నాయి. హోమ్ ఇన్సూరెన్స్లోనూ లాకర్లో ఉంచిన వాటికి కవరేజీని భాగం చేసుకోవచ్చు. కాకపోతే హోమ్ ఇన్సూరెన్స్ మొత్తం కవరేజీలో లాకర్కు సంబంధించి 20% మించదు. వీటిని ఉంచడం చట్టవిరుద్ధమే.. → ఆయుధాలు, పేలుడు పదార్థాలు, డ్రగ్స్ నిషేధం. చెడిపోయే పదార్థాలు కూడా ఏవీ ఉంచకూడదు. హానికారకమైనవీ పెట్టకూడదు. → కరెన్సీ నోట్లను సైతం లాకర్లలో ఉంచకూడదు. ఒకవేళ ఉంచినట్టయితే వాటికి నష్టం వాటిల్లితే బ్యాంకులపై బాధ్యత ఉండదు. → బ్యాంక్లో శబ్ద కాలుష్యానికి దారితీసేవి, బ్యాంక్ లాకర్ల భద్రతకు ముప్పు కలిగించే వాటిని ఉంచడం నిబంధనలకు విరుద్ధం. భద్రత విషయంలో పూచీ ఉందా?లాకర్ల భద్రత విషయంలో బ్యాంక్లు ఎన్నో రకాల చర్యలు తీసుకుంటూ ఉంటాయి. అయినప్పటికీ అక్కడక్కడ లోపాలకు అవకాశం లేదని భావించకూడదు. లాకర్లను రీన్ఫోర్స్డ్ స్టీల్తో చేయించడమే కాకుండా, భద్రత ఎక్కువగా ఉండే ప్రాంతంలో, యాక్సెస్ పరిమితంగా ఉండే చర్యలు తీసుకుంటాయి. వీటిని సీసీటీవీ కెమెరాలు, అత్యాధునిక అలారమ్ వ్యవస్థలతో పర్యవేక్షిస్తుంటాయి. బ్యాంక్ ఉద్యోగి, కస్టమర్ ఇద్దరి వద్ద ఉండే తాళం చెవులతో (డ్యుయల్ కీ) తెరవాల్సి ఉంటుంది. ఇది కూడా భద్రతా సదుపాయమే. తేమ, చెదలను తట్టుకునే విధంగా అధిక నాణ్యత కలిగిన లాకర్లను కొన్ని బ్యాంక్లు వినియోగిస్తున్నాయి. బ్యాంక్లు చెదల నివారణకు చర్యలు కూడా తీసుకుంటుంటాయి’’ అని దాస్ వివరించారు. బ్యాంక్ వైపు నుంచి భద్రతా పరంగా లోపాలను గుర్తించినట్టయితే వాటిని అధికారుల దృష్టికి లిఖితపూర్వకంగా తీసుకెళ్లడం మంచిదే. ఈ నిర్లక్ష్యం కారణంగా భవిష్యత్తులో తమ లాకర్లలోని వాటికి నష్టం వాటిల్లితే ఆధారంగా పనికొస్తుంది.కొత్త ఒప్పందంపై సంతకం చేశారా? కొన్నేళ్ల క్రితం లాకర్ తీసుకుని, 2021 ఆగస్ట్ తర్వాత బ్యాంక్తో కొత్త అగ్రిమెంట్పై సంతకం చేయని వారు.. వెంటనే ఆ పనిచేయాలి. సవరించిన లాకర్ ఒప్పందాలపై కస్టమర్ల అంగీకారం తీసుకోవాలంటూ ఆర్బీఐ నాడు ఆదేశించింది. ఇందుకు గడువును తొలుత 2023 జనవరి 1కి పొడిగించింది. తర్వాత అదే ఏడాది డిసెంబర్ 31 వరకు, తర్వాత 2024 మార్చి 31 వరకు పొడిగించడం గమనార్హం. కానీ, 2025 చివరి వరకు గడువు ఇవ్వాలని బ్యాంక్లు కోరుతున్నాయి. లాకర్ ఖాతాదారుల్లో 20 శాతం వరకు ఇంకా ఒప్పందాలపై సంతకాలు చేయకపోవడమే ఇందుకు కారణం. సవరించిన కొత్త లాకర్ ఒప్పందాలపై సంతకాలు చేయకపోతే అప్పటి వరకు లాకర్ వినియోగించుకునేందుకు బ్యాంక్లు అనుమతించకపోవచ్చని బ్యాంక్ బజార్ సీఈవో ఆదిల్ శెట్టి పేర్కొన్నారు. తుది నోటీసు జారీ చేసి, అప్పటికీ కస్టమర్ల నుంచి స్పందన లేకపోతే లాకర్లను సీల్ చేయొచ్చని ప్లాన్అహెడ్ వెల్త్ అడ్వైజర్స్ సీఎఫ్పీ విశాల్ ధావన్ తెలిపారు. కొత్త లాకర్ నిబంధనల ప్రకారం బ్యాంక్లు.. ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని కస్టమర్లను కోరొచ్చు. గతంలో ఈ డిపాజిట్ ఎంత మొత్తం అన్న పరిమితి లేదు. ఇప్పడు లాకర్ మూడేళ్ల అద్దె, కస్టమర్ డిఫాల్ట్ అయితే లాకర్ తెరిచేందుకు అయ్యే చార్జీలకు సరిపడానే డిపాజిట్ తీసుకోవాల్సి ఉంటుంది. కొత్త అగ్రిమెంట్కు అయ్యే చార్జీలను బ్యాంకులే భరిస్తాయి. నామినేషన్ తప్పనిసరి.. లాకర్ తెరిచే సమయంలో సర్వైవర్షిప్ క్లాజును నమోదు చేయాలి. లేదా నామినేషన్ను అయినా తప్పకుండా నమోదు చేయాలి. ఖాతాదారుడు మరణించిన సందర్భంలో నామినీని లాకర్ తెరిచేందుకు బ్యాంక్ అనుమతిస్తుంది. ఉమ్మడిగా మరొకరితో కలసి లాకర్ తెరిచినట్టయితే.. ఇద్దరి సంతకాల ఆమోదంతో నిర్వహించే ఆప్షన్ను ఎంపిక చేసుకోవచ్చు. ఇలాంటప్పుడు తమ వారసులను నామినీలుగా నమోదు చేయాలి. సర్వైవర్షిప్ క్లాజ్ ఎంపిక చేసుకుంటే. ఎనీవన్ లేదా సరై్వవర్ (ఎవరైనా లేక జీవించి ఉన్న వారు) ఆప్షన్ అనుకూలంగా ఉంటుంది. ఇవేమీ లేకుండా లాకర్ తీసుకుంటే.. దురదృష్టవశ్తాతూ మరణించిన సందర్భంలో లాకర్లో ఉన్న వాటిని పొందడానికి వారసులు ఎంతో శ్రమ పడాల్సి వస్తుంది. మరణ ధ్రువీకరణ సర్టి ఫికెట్, సక్సెషన్ సర్టిఫికెట్ లేదా లెటర్ ఆఫ్ అడ్మిని్రస్టేషన్ను సమర్పించాల్సి వస్తుంది. సాక్షులు, వారసుల సమక్షంలో లాకర్లో ఉన్న వాటిని బ్యాంక్ సిబ్బంది నమోదు చేయాల్సి వస్తుంది. కేవైసీ వివరాలతో క్లెయిమ్ సమర్పించాలి. ఈ ప్రక్రియలన్నీ ముగిసి లాకర్లో వాటిని పొందేందుకు చాలా సమయం పడుతుంది. ముందు జాగ్రత్తలు.. → డాక్యుమెంట్లను నీటికి తడవని, అగ్ని ప్రమాదంలో కాలిపోని విధంగా ప్యాక్ చేసి ఉంచుకోవాలి సురక్షితం. → నోట్లను లాకర్లో ఉంచకపోవడం మంచిది. దీనికి బదులు ఎఫ్డీ చేసుకోవడం వల్ల రక్షణతోపాటు రాబడి కూడా వస్తుంది. → లాకర్లో ఉంచిన ప్రతీ వస్తువు వివరాలను డైరీలో రాసుకోవాలి. ప్రతీ వస్తువును ఫొటో తీసి పెట్టుకోవాలి. → అవసరం లేకపోయినా సరే లాకర్లో ఉంచిన వాటిని నిర్ణీత కాలానికి ఒకసారి పరిశీలించుకోవాలి. కనీసం ఆరు నెలలకు ఒకసారి అయినా లాకర్ను తెరిచి చూడాలి. → లాకర్లో ఉంచే అన్నింటికీ కవరేజీ వర్తించే పాలసీ తీసుకోవాలి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఎంతో హెచ్చరించా.. వినలేదు.. చివరకు..
బ్యాంకులో డబ్బు ఉంటే పెద్దగా సంపద సృష్టి జరగదు. పైగా పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి దాని విలువ తగ్గిపోతుంది. ప్రస్తుతం రూ.100కు కొనుగోలు చేసే వస్తువులను 10 ఏళ్ల తర్వాత కొనాలంటే అంతకంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఇదే సూత్రాన్ని తెలుపుతూ రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి కొన్ని విషయాలను తన ఎక్స్లో పంచుకున్నారు. కొన్ని విలువైన ఆర్థిక అంశాలను కొందరు చాలా శ్రద్ధతో విని పాటిస్తారని, ఇంకొందరు చాలా తేలికగా తీసుకుంటారని చెప్పారు.‘పందులకు పాడటం నేర్పకండి.. ఇది మీ సమయాన్ని వృథా చేస్తుంది. దాంతోపాటు మీ వల్ల పందికి కూడా చికాకు కలుగుతుంది. నేను ఒక స్నేహితురాలితో మాట్లాడుతుంటే పొదువు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఆమె, తన భర్త స్థానిక బ్యాంకులో డాలర్ల రూపంలో పొదుపు చేశామని చెప్పారు. అందుకు ఆమె చాలా గర్వపడింది. తన పొదుపు విలువ రానున్న రోజుల్లో తగ్గుతుందని ఎంతో హెచ్చరించాను. ఆమె తీరు పాడటం నేర్చుకోవడానికి ఇష్టపడని పందిలా మారింది. ఈ సంఘటన 1973లో హవాయిలో జరిగింది’ అన్నారు.“DONT TEACH PIGS TO SING…. it wastes your time and you annoy the pig.”I was talking to a friend….about my age….and she was so proud that she and her husband are holding their financial future in dollars, in their local bank. When I attempted to caution her about the…— Robert Kiyosaki (@theRealKiyosaki) July 4, 2025ఇదీ చదవండి: ధూళి రాకుండా ‘గాలి మేడ’‘అప్పటి నుంచి ఇప్పటివరకు డాలర్ విలువ 95 శాతం కోల్పోయింది. నేను గతంలో చేసిన హెచ్చరికలో భాగంగా ఆహారం ధర పెరుగుతుండడం గమనించారా అని ఆమెను అడిగాను. అప్పుడైనా అందులో దాగిఉన్న ద్రవ్యోల్బణ అంశాన్ని ఆమె గ్రహించలేకపోయింది. మీరందరూ నాతో ఏకీభవిస్తారని నేను ఆశించను. మీరు అనుసరిస్తున్న తీరును నేను అభినందిస్తాను. బ్యాంకులో పెద్ద మొత్తంలో డబ్బు ఉన్న నా స్నేహితుల గురించి నాకు దిగులు లేదు. డబ్బును దీర్ఘకాలంలో మంచి రాబడినిచ్చే సాధనంలో పెట్టుబడి పెట్టకుండా కేవలం బ్యాంకు ఖాతాల్లో సేవ్ చేసేవారు లూజర్స్తో సమానం. ఈ విషయాలు నా పుస్తకంలోనూ రాశాను’ అని తెలిపారు. -
లేదని బాధపడకు.. వశం చేసుకోవాలని ఆరాటపడు!
డబ్బు లేదని బాధపడడం కంటే దాన్ని ఎలా వశం చేసుకోవాలనే దాని గురించి ఆలోచించేవారి సంఖ్య తగ్గుతుంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు తమ ఆర్థిక పరిమితులు ఇంతేనని.. తమ జీవితాలు ఏం చేసినా బాగోవు..అనే ధోరణికి వచ్చేస్తున్నారు. ఇందుకు బదులుగా పాజిటివ్ దృక్పథాన్ని అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మధ్యతరగతివారు ఆర్థిక అంశాలపట్ల తమ నమ్మకాలను పరిమితంగా ఉంచుకుంటారని ఇన్వెస్టర్, పోర్ట్ఫోలియో స్ట్రాటజిస్ట్ శ్యామ్ శేఖర్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆ మనస్తత్వం నుంచి ఎలా బయటపడాలో కనీసం ఆలోచించేందుకు సైతం వారు నిరాకరిస్తున్నారని చెప్పారు.శ్యామ్ శేఖర్ ఎక్స్లో తెలిపిన వివరాల ప్రకారం..‘మధ్యతరగతి కుటుంబాలు తమ మనస్తత్వం మర్చుకోవు. అందుకే ఆర్థికంగా ఎదగలేవు. కనీసం ఆ దిశగా ఆలోచించడానికిసైతం నిరాకరిస్తారు. ఇంట్లో ఎయిర్ కండీషనర్, కారు ఉండాలని కలలు కనే మధ్యతరగతి కుటుంబాలు చాలా ఉన్నాయి. అయితే ఈ అవసరాలు నిజంగా తమ సామర్థ్యాలతో పోలిస్తే చాలా తక్కువ. అయితే ఉన్న పరిధిలో ఆర్థికంగా పుంజుకునేందుకు ఎలాంటి ప్రయత్నం చేయరు. కాబట్టి ఈ అవసరాలే వారికి పెద్ద లక్ష్యాలుగా తోస్తాయి’ అన్నారు.Why do middle class families stay middle class? It is because they refuse to think of what will make them break out of the middle class mindset.What is the middle class mindset?It is something which stops you from dreaming of what you feel is beyond your present reach. You…— Shyam Sekhar (@shyamsek) July 4, 2025ఇదీ చదవండి: ఉద్యోగుల్లో వేతన సంక్షోభం‘డబ్బు సంపాదనను కాంపౌండింగ్ దృష్టితో చూడాలి. దీర్ఘకాలంలో భారీ సంపద చేకూర్చే మార్గాలను కనుగొనాలి. ఇలాంటి ఆలోచనలతో మీరు జీవితాన్ని చాలా భిన్నంగా చూడటం ప్రారంభిస్తారు. రూ.కోటి చేరువలో ఉన్న వ్యక్తి రూ.20 కోట్లకు సులువుగా చేరుకోవచ్చు. కాంపౌండింగ్తో ఇది సాధ్యమే. దీర్ఘకాలంలో మంచి రాబడినిచ్చే సంపదను సృష్టిస్తే తరాలు అది కొనసాగుతోంది. పర్సనల్ ఫైనాన్స్పై పరిమిత ఆలోచనల నుంచి బయటకురావాలి’ అన్నారు. -
ఉద్యోగుల్లో వేతన సంక్షోభం
ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న జీడీపీల్లో భారత్ ఒకటిగా నిలవడం ఆశావాదానికి అద్దం పడుతోంది. అయితే దేశంలోని కార్పొరేట్ కంపెనీల లాభాలు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నప్పుడు అందులో పని చేసే ఉద్యోగుల జీవితాలు, జీతాల్లో మాత్రం మార్పు ఉండడంలేదు. కార్పొరేట్ లాభాలను ఆయా యాజమాన్యాలు వ్యక్తిగతంగా ఎదగడానికి మాత్రమే ఖర్చు చేస్తున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీన్ని ‘ది గ్రేట్ ఇండియన్ శాలరీ క్రైసిస్’ అని పిలుస్తున్నారు. భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని చంకలు చరిచేలోపే.. శ్రామిక శక్తి ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాలు నివ్వెర పరుస్తున్నాయి.దేశంలో ఆర్థిక పురోభివృద్ధి ఉన్నప్పటికీ సగటు కార్మికుడి పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా, వేతనాలు స్తబ్దుగా ఉన్నాయి. వారి సంపాదనకు, ఖర్చులకు ఏమాత్రం పొంతన లేకుండా ఉంది. ఉద్యోగుల శ్రమకు తగిన ప్రతిఫలం ఉండకపోవడంతో వారి ఆర్థిక ప్రణాళికలు అస్తవ్యస్తంగా మారి ప్రధాన నగరాల్లోని నిపుణులు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.స్తబ్దుగా వేతనాలుభారత జీడీపీ విస్తరిస్తున్నప్పటికీ జీతాల వృద్ధి మాత్రం గణనీయంగా మందగించింది. 2023 లో సగటు వేతన పెరుగుదల కేవలం 9.2% మాత్రమే ఉండడం దీనికి నిదర్శనం. ఈ పెంపు ద్రవ్యోల్బణానికి అనుగుణంగా లేదు. ద్రవ్యోల్బణం రేట్లు ముఖ్యంగా ఆహారం, ఇంధనం, ఇతర నిత్యావసరాల ధరలు వేతనాల పెరుగుదలను మించిపోయాయి. కంపెనీలు రికార్డు లాభాలను నమోదు చేసేందుకు దోహదపడే ఉద్యోగుల వేతన పెంపుపై యాజమాన్యాలు మొండి వైఖరి అనుసరిస్తున్నాయి. సంపన్నులు, సగటు కార్మికుడి మధ్య ఆర్థిక అంతరం విస్తృతంగా పెరుగుతోంది. అధిక వేతనం పొందే రంగాల్లో కొంతమంది ఎన్నో ప్రయోజనాలను పొందుతున్నారు. తక్కువ ఆదాయ వర్గాల్లో ఎక్కువ మంది ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ఇదీ చదవండి: పాకిస్థాన్లో మైక్రోసాఫ్ట్ కార్యాలయం మూసివేతపట్టణాల్లో మరింత ఖర్చులునోయిడా, ఢిల్లీ, చెన్నై, పుణె, బెంగళూరు, హైదరాబాద్.. వంటి ప్రధాన పట్టణ కేంద్రాల్లో నివసిస్తున్న వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. జీవన వ్యయం అదుపు తప్పడంతో నగరంలోని ఉద్యోగులు అధిక అద్దెలు, ఈఎంఐలు, ఆరోగ్య సంరక్షణ ఖర్చులతో సతమతమవుతున్నారు. ఓ పాతికేళ్ల కిందట మోస్తారు ఖర్చులతో కాలం వెళ్లదీసుకొచ్చినవారికి ఇప్పుడు అవే ఖర్చులు ఊపిరి పీల్చుకోనివ్వకుండా చేస్తున్నాయి. -
కొత్త రకం బ్యాంక్.. ఏటీఎం.. క్రెడిట్ కార్డ్
ఫిన్టెక్ కంపెనీ ‘స్లైస్’ దేశంలో మొట్టమొదటి యూపీఐ ఆధారిత ఫిజికల్ బ్యాంక్ బ్రాంచ్ ఏటీఎంతో పాటు స్లైస్ యూపీఐ క్రెడిట్ కార్డు అనే పేరుతో తన ఫ్లాగ్షిప్ క్రెడిట్ కార్డును విడుదల చేసింది. ఈ స్లైస్ యూపీఐ క్రెడిట్ కార్డుకు ఎటువంటి జాయినింగ్ లేదా వార్షిక రుసుము ఉండదు వినియోగదారులు తమ క్రెడిట్ లైన్ నుండి డ్రాయింగ్ ద్వారా యూపీఐ లావాదేవీలు చేసుకోవచ్చు.ఇతర ప్రయోజనాలుస్లైస్ యూపీఐ క్రెడిట్ కార్డుతో పలు ఇతర ప్రయోజనాలూ ఉన్నాయి. అన్ని లావాదేవీలపై కార్డుదారులకు 3 శాతం వరకు క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఇందులో "స్లైస్ ఇన్ 3" ఫీచర్ కూడా ఉంది. అంటే వినియోగదారులు కొనుగోలును మూడు వడ్డీ లేని వాయిదాలుగా విభజించుకోవచ్చు. "స్లైస్ తో వినియోగదారులు తమ క్రెడిట్ కార్డును నేరుగా యూపీఐకి లింక్ చేసుకోవచ్చు. బ్యాంక్ ఖాతాను ఉపయోగించినట్లే దీనిని ఉపయోగించవచ్చు. క్యూఆర్ లను స్కాన్ చేయడం, స్టోర్లలో చెల్లించడం, బిల్ స్ల్పిట్, ఆన్లైన్ లో ఆర్డర్ వంటివి చేసుకోవచ్చు" అని స్లైస్ తెలిపింది.యూపీఐ బ్యాంక్.. ఏటీఎంక్రెడిట్ కార్డుతో పాటు స్లైస్ బెంగళూరులోని కోరమంగళలో యూపీఐ ఆధారిత బ్యాంక్ శాఖను స్లైస్ ప్రారంభించింది. ఈ శాఖలో యూపీఐ ఏటీఎం ఉంది. ఇక్కడ వినియోగదారులు క్యాష్ విత్డ్రాలు, డిపాజిట్లు చేయవచ్చు. ఖాతాలను తెరవడం వంటి ఇతర సేవలను వినియోగించుకోవచ్చు. స్లైస్ అధికారిక పత్రికా ప్రకటన ప్రకారం.. ఈ బ్రాంచ్ అన్ని కస్టమర్ ఇంటరాక్షన్ లలో మొత్తం యూపీఐ ఇంటిగ్రేషన్ ను అందిస్తుంది. ఎటువంటి సుదీర్ఘ ప్రక్రియలు లేకుండా తక్షణ కస్టమర్ ఆన్బోర్డింగ్ చేస్తుంది. -
ఎల్ఐసీ కొత్త పాలసీలు..
ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) తాజాగా నవ జీవన్ శ్రీ, నవ జీవన్ శ్రీ - సింగిల్ ప్రీమియం పేరుతో రెండు కొత్త సేవింగ్ పాలసీలను ప్రారంభించింది. ఇవి నాన్ పార్టిసిపేటింగ్, నాన్ లింక్డ్, లైఫ్ కవరేజ్ కలిగిన వ్యక్తిగత సేవింగ్ ప్లాన్లు. బీమా రక్షణతో పాటు పెట్టుబడికి భద్రత, వడ్డీ రాబడి కోరుకునేవారికి ఇవి అనువుగా ఉంటాయి. ఈ పాలసీలు 2025 జూలై 4 నుంచి 2026 మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని ఎల్ఐసీ తెలిపింది. నవ జీవన్ శ్రీ - రెగ్యులర్ ప్రీమియం (ప్లాన్ నెం.912) ఇది ఒకేసారి కాకుండా విడతల వారీగా ప్రీమియం చెల్లించే వారికి అనువైన ప్లాన్. కనీస సమ్ అష్యూర్డ్ రూ.5 లక్షలు, గరిష్ఠ పరిమితి లేదు. వయస్సు పరిమితి 30 రోజుల నుంచి 75 ఏళ్ల వరకు. మెచ్యూరిటీ నాటికి కనిష్ట వయసు 18 సంవత్సరాలు కాగా గరిష్ట వయసు 75 ఏళ్లు. 6, 8, 10 లేదా 12 సంవత్సరాల ప్రీమియం చెల్లింపు వ్యవధులను ఎంచుకోవచ్చు. పాలసీ టర్మ్ కనీసం 10 సంవత్సరాలు. 15, 16, 20 ఏళ్ల వ్యవధిని కూడా ఎంచుకోవచ్చు. గ్యారెంటీడ్ అడిషన్లు: 10-13 ఏళ్ల పాలసీకి - 8.50 శాతం, 14-17 సంవత్సరాలకు 9 శాతం, 18-20 ఏళ్ల కాలానికి 9.50 శాతం చొప్పున గ్యారెంటీడ్ అడిషన్లు లభిస్తాయి.డెత్ బెనిఫిట్: ఆప్షన్ 1 కింద - కనీస సమ్ అష్యూర్డ్తోపాటు వార్షిక ప్రీమియానికి 7 రెట్లు, ఆప్షన్ 2 కింద - వార్షిక ప్రీమియానికి 10 రెట్లు + బేసిక్ సమ్ అష్యూర్డ్ చెల్లిస్తారు.దీనికి కూడా యాక్సిడెంట్ డెత్ & డిజేబిలిటీ బెనిఫిట్ రైడర్, యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్, న్యూ టర్మ్ అష్యూరెన్స్ రైడర్, ప్రీమియం వెయివర్ బెనిఫిట్ రైడర్ వంటి వాటిని జోడించుకునే వెసులుబాటు ఉంది. మెచ్యూరిటీ తర్వాత లేదా రిస్క్ జరిగినప్పుడు చెల్లింపు: మొత్తం డబ్బును ఒకేసారి లేదా నెలవారీ/త్రైమాసిక/అర్ధవార్షిక/వార్షిక ప్రాతిపదికన పొందవచ్చు. ప్రీమియం చెల్లింపును కూడా ఇదే విధంగా ఎంపిక చేసుకోవచ్చు.నెలకు రూ.10 వేలతో రూ.26 లక్షలుఒక వ్యక్తి రూ.10 లక్షల సమ్ అష్యూర్డ్తో 20 ఏళ్ల కాలానికి పాలసీ తీసుకుంటే.. ఆప్షన్ 2 కింద 10 సంవత్సరాల ప్రీమియం చెల్లింపు వ్యవధిని ఎంచుకుంటే వార్షిక ప్రీమియం రూ.1,10,900 కట్టాలి. అదే నెలవారీ అయితే రూ.10,000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇలా పదేళ్లకూ చెల్లించే మొత్తం సొమ్ము: రూ.11,09,000 అవుతుంది. పాలసీ వ్యవధి 20 సంవత్సరాలు పూర్తయ్యాక రూ.16,58,786 గ్యారెంటీడ్ అడిషన్ రూపంలో లభిస్తాయి. మొత్తం కలుపుకొంటే మెచ్యూరిటీ తర్వాత రూ.26,58,786 లభిస్తుంది.నవ జీవన్ శ్రీ- సింగిల్ ప్రీమియం (ప్లాన్ నం.911) ఈ పాలసీ ఒకేసారి ఏకమొత్తం పెట్టుబడి పెట్టదలచుకున్న వారికి అనువుగా ఉంటుంది. ఈ పాలసీని 30 రోజుల నుండి 60 ఏళ్ల వయస్సు వరకూ ఎవరైనా తీసుకోవచ్చు. అయితే ఆప్షన్ 2 కింద మాత్రం గరిష్ఠ వయస్సు 40 ఏళ్లు మాత్రమే. మెచ్యూరిటీ సమయానికి కనీస వయస్సు 18 ఏళ్లు, గరిష్ఠంగా 75 ఏళ్లు (ఆప్షన్ 2లో 60) ఉండాలి. పాలసీ వ్యవధి కనీసం 5 సంవత్సరాలు, గరిష్ఠంగా 20 సంవత్సరాలు. కనీస హామీ మొత్తం (Sum Assured) రూ.1 లక్ష. గరిష్ఠ పరిమితి లేదు. డెత్ బెనిఫిట్: ఆప్షన్ 1 కింద - సింగిల్ ప్రీమియానికి 1.25 లేదా బేసిక్ సమ్ అష్యూర్డ్లో ఏది ఎక్కువైతే ఆ మొత్తాన్ని చెల్లిస్తారు. ఆప్షన్ 2 కింద - సింగిల్ ప్రీమియానికి 10 రెట్లు రిస్క్ కవరేజీ లభిస్తుంది.గ్యారెంటీడ్ అడిషన్: ప్రతి వెయ్యి రూపాయల బేసిక్ సమ్ అష్యూర్డ్పై రూ.85 చొప్పున గ్యారెంటీడ్ అడిషన్ లభిస్తుంది. యాక్సిడెంట్ డెత్ & డిజేబిలిటీ రైడర్, న్యూ టర్మ్ అష్యూరెన్స్ రైడర్ వంటి అదనపు రైడర్లను కూడా జోడించుకోవచ్చు.రిస్క్ లేదా మెచ్యూరిటీ సమయంలో చెల్లింపు: మొత్తాన్ని ఒకేసారి లేదా నెలవారీ, త్రైమాసిక, అర్ధవార్షిక లేదా వార్షిక పద్ధతిలో పొందే అవకాశముంది. రూ.5 లక్షలకు రూ.7.12 లక్షలు18 ఏళ్ల వ్యక్తి ఐదేళ్ల వ్యవధికి రూ.5 లక్షల సమ్ అష్యూర్డ్తో పాలసీ తీసుకుంటే.. సింగిల్ ప్రీమియం రూ.5,39,325 చెల్లించాలి. దీనికి ప్రతి ఏడాది గ్యారెంటీడ్ అడిషన్గా రూ.42,500 వస్తుంది.(మొత్తం రూ.2,12,500). ఐదేళ్ల తర్వాత మెచ్యూరిటీ సమయంలో మొత్తంగా రూ.7,12,500 లభిస్తుంది. ఒకవేళ చివరి సంవత్సరంలో రిస్క్ జరిగితే గరిష్టంగా రూ.9.17 లక్షలు ఎల్ఐసీ నుంచి లభిస్తాయి. -
హోమ్ లోన్ కస్టమర్లు మరింత హ్యాపీ..
హోమ్ లోన్ గ్రహీతలకు ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా మరోసారి శుభవార్త చెప్పింది. గృహ రుణాలపై వడ్డీ రేటును 7.45 శాతానికి తగ్గించింది. ప్రస్తుతం ఇది 7.50 శాతంగా ఉంది. అలాగే కొత్త రుణ గ్రహీతలకు ప్రాసెసింగ్ ఫీజును కూడా మాఫీ చేసినట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించింది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పాలసీ రెపో రేటును తగ్గించిన తరువాత గత జూన్లో బ్యాంక్ ఆఫ్ బరోడా ఇప్పటికే గృహ రుణ రేట్లను 8.00 శాతం నుండి 7.50 శాతానికి తగ్గించింది. ఇప్పుడు వడ్డీ రేటును ఇంకాస్త తగ్గించడంతో హోమ్లోన్ కస్టమర్లకు మరింత ఉపశమనం కలగనుంది. ఈ తాజా తగ్గింపు గృహ యాజమాన్యం మరింత చౌకగా మారుతుందని, దేశంలోని గృహ రంగంలో డిమాండ్ను ఉత్తేజపరిచే ప్రభుత్వ విస్తృత ఆర్థిక లక్ష్యానికి మద్దతు ఇస్తుందని భావిస్తున్నారు.జీరో ప్రాసెసింగ్ ఫీజుగృహ రుణాలను మరింత చేరువ చేయడంలో భాగంగా బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్తగా హోమ్ లోన్కు దరఖాస్తు చేసుకునేవారికి ప్రాసెసింగ్ ఫీజును కూడా రద్దు చేసింది. ఇంతవరకూ ఈ బ్యాంక్ లోన్ మొత్తంలో అర శాతం వరకూ ప్రాసెసింగ్ రుసుముగా తీసుకొనేది. ఇది గరిష్టంగా రూ.15 వేల వరకూ ఉంటుంది. దీనికి జీఎస్టీ అదనం. కస్టమర్లు లోన్ కోసం బ్యాంక్ బ్రాంచిల్లోనే కాకుండా పూర్తిగా డిజిటల్ విధానంలో బ్యాంక్ వెబ్సైట్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. -
ఉద్యోగులకు త్వరలో తీపికబురు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జులై 2025 నుంచి కరువు భత్యం (డీఏ) 4 శాతం పెరిగే అవకాశం ఉందని కొన్ని సంస్థలు అంచనా వేస్తున్నాయి. వాటిలోని వివరాల ప్రకారం ఇటీవలి ద్రవ్యోల్బణ గణాంకాల ఆధారంగా ఈమేరకు ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న 55 శాతం డీఏను 59 శాతానికి పెంచాలని యోచిస్తోంది. ఈ పెంపు జులై నుంచి అమల్లోకి రానుండగా ఆగస్టు లేదా సెప్టెంబర్ లేదా అక్టోబర్లో పండుగ సీజన్కు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.సీపీఐ డేటా ఆధారంగా..డీఏ లెక్కింపునకు ఆధారమైన ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ (ఏఐసీపీఐ-ఐడబ్ల్యూ) 2025 మేలో 0.5 పాయింట్లు పెరిగి 144కు చేరింది. గత మూడు నెలల్లో సూచీ స్థిరమైన పెరుగుదలను చూపించింది. ఇది మార్చిలో 143, ఏప్రిల్లో 143.5, మేలో 144గా ఉంది. ఇండెక్స్ ఇదే జోరును కొనసాగించి జూన్లో 144.5కు పెరిగితే ఏఐసీపీఐ-ఐడబ్ల్యూ 12 నెలల సగటు 144.17కు చేరుకుంటుందని అంచనా. 7వ వేతన సంఘం ఫార్ములాను ఉపయోగించి డీఏను సర్దుబాటు చేసినప్పుడు ఇది సుమారు 58.85% రేటుగా మారుతుంది. దాంతో 2025 జులై నుంచి 59 శాతం డీఏకు ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉంది.ఇదీ చదవండి: పాత వాహనాలపై నిషేధం ఎత్తివేత7వ వేతన సంఘం డీఏ పెంపు ఫార్ములాడియర్నెస్ అలవెన్స్ను ఏడాదికి రెండుసార్లు జనవరి, జులైలో సవరిస్తారు. గత 12 నెలల్లో ఏఐసీపీఐ-ఐడబ్ల్యూ డేటా సగటు ఆధారంగా ఈ డీఏను లెక్కిస్తారు. ఇందుకోసం ఉపయోగించే ఫార్ములా కింది విధంగా ఉంటుంది.డీఏ(%) = [(గత 12 నెలల సగటు సీపీఐ ఐడబ్ల్యూ- 261.42)/261.42]*100దాని ప్రకారం..డీఏ(%) = [(144.17-261.42)/261.42]*100=58.85 శాతం.ఇక్కడ, 261.42ను గతేడాది గణాంకాల ప్రకారం లెక్కింపునకు మూల విలువగా పరిగణిస్తారు. పై ఫ్యార్ములాలో మైనస్ వ్యాల్యూ వస్తుంది. దీన్ని సవరించి దనాత్మకంగా లెక్కిస్తారు. ఈ పద్ధతిని ఉపయోగించి ఈసారి డీఏ పెరుగుదలను 4 శాతంగా అంచనా వేశారు. -
లోన్ కస్టమర్లకు గుడ్న్యూస్.. ఆర్బీఐ కొత్త రూల్
వ్యక్తిగత, గృహ, వ్యాపార రుణాల గ్రహీతలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అన్ని ఫ్లోటింగ్-రేట్ రుణాలకు వర్తించే ప్రీ-పేమెంట్ ఛార్జీలను రద్దు చేసింది. గృహ రుణాలు, వ్యాపార అవసరాల కోసం తీసుకున్నవి, వ్యక్తులు, ఎంఎస్ఈలు పొందిన రుణాలన్నింటికీ ఆర్బీఐ కొత్త నిబంధన వర్తిస్తుంది. 2026 జనవరి 1 లేదా ఆ తర్వాత మంజూరు చేసే లేదా పునరుద్ధరించే రుణాలు, అడ్వాన్సులకు ఈ నిబంధన వర్తిస్తుందని సెంట్రల్ బ్యాంక్ జారీ చేసిన సర్క్యులర్లో పేర్కొంది.ఈ మేరకు బ్యాంకులు, ఇతర రుణ సంస్థలకు (కో-ఆపరేటివ్ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ, అఖిల భారత ఆర్థిక సంస్థలు) ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం, బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు వ్యాపారం కాకుండా ఇతర ప్రయోజనాల కోసం వ్యక్తిగత రుణగ్రహీతలకు మంజూరు చేసిన ఏదైనా ఫ్లోటింగ్ రేటు టర్మ్-లోన్పై జప్తు ఛార్జీలు / ప్రీ-పేమెంట్ పెనాల్టీలను విధించడానికి వీల్లేదని ఆర్బీఐ సర్క్యులర్ తెలిపింది. ఎంఎస్ఈలకు సులభమైన, సరసమైన ఫైనాన్సింగ్ లభ్యత అత్యంత ముఖ్యమైనదని తెలిపింది.ఎంఎస్ఈలకు మంజూరు చేసిన రుణాల విషయంలో ముందస్తు చెల్లింపు ఛార్జీల విధింపునకు సంబంధించి నియంత్రిత సంస్థల (ఆర్ఈ) మధ్య భిన్నమైన పద్ధతులను ఆర్బీఐ పర్యవేక్షక సమీక్షల్లో గుర్తించింది. దీనిపై ఫిర్యాదులు, వివాదాలు కూడా వెల్లువెత్తాయి. ముసాయిదా సర్క్యులర్పై వచ్చిన స్పందన, ప్రజల ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఆర్బీఐ ఇప్పుడు ఈ తాజా ఆదేశాలను జారీ చేసింది. -
రాబోతోంది పెను మార్పు.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్
ఆధునిక చరిత్రలోనే అతిపెద్ద మార్పు రాబోతోందని ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచియిత రాబర్ట్ కియోసాకి హెచ్చరించారు. "కృత్రిమ మేధ (AI ) చాలా మంది 'స్మార్ట్ విద్యార్థులు' తమ ఉద్యోగాలను కోల్పోయేలా చేస్తుంది.. భారీ నిరుద్యోగం కలిగిస్తుంది.. విద్యా రుణాలు పెరగిపోతాయి.." అని అప్రమత్తం చేస్తూ తాజాగా ఆయన సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ ‘ఎక్స్’(ట్విటర్)లో ఓ పోస్ట్ పెట్టారు.ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్తో కలగనున్న పరిణామాలపై కియోసాకి విద్యార్థులను అప్రమత్తం చేశారు. చాలా మంది తెలివైన విద్యార్థులు కూడా ఉద్యోగాలు కోల్పోక తప్పదన్నారు. ఒకప్పుడు డోకా లేదనుకున్న ఉద్యోగాలను కూడా ఏఐ ఆటోమేట్ చేస్తున్న నేపథ్యంలో నిరుద్యోగం భారీగా పెరిగిపోతుందని ఆయన అంచనా వేస్తున్నారు. రుణ సాయంతో విద్యను పూర్తి చేసి ఉద్యోగాల కోసం వస్తున్న గ్రాడ్యుయేట్లకు ఉద్యోగావకాశాలు లేక రుణ భారం తప్పదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. "నాకు ఉద్యోగం లేదు కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నన్ను తొలగించలేదు" అంటూ ఉద్యోగం కంటే వ్యాపారం, ఇన్వెస్ట్మెంట్లే నయమని చెప్పే ప్రయత్నం చేశారు.సాంప్రదాయిక విద్య, ఉద్యోగ మార్గాన్ని కియోసాకి ఇప్పటికీ వ్యతిరేకిస్తూనే ఉన్నారు. బడికి వెళ్లడం, మంచి గ్రేడ్లు సాధించడం, ఉద్యోగం సంపాదించడం, డబ్బు ఆదా చేయడం వంటి విధానాలు ఇకపై ఆర్థిక భద్రతకు హామీ ఇవ్వవని ఆయన వాదిస్తున్నారు. శరవేగంగా మారుతున్న నేటి ప్రపంచంలో, ఆయన తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. తన "రిచ్ డాడ్" మనస్తత్వానికి అనుకూలంగా తన "పూర్ డాడ్" సలహాను ఎలా విస్మరించిందీ వివరించారు. సంప్రదాయ మార్గానికి విరుద్ధంగా ఎంట్రెప్రెన్యూర్ అయ్యానని, రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టానని, బంగారం, వెండి, ప్రస్తుతం బిట్కాయిన్లలో పొదుపు చేస్తున్నానని పేర్కొన్నారు.ఈ ఆర్థిక పరివర్తన కాలంలో నిష్క్రియాత్మక పరిశీలనకు గురికావద్దని కియోసాకి తన ఫాలోవర్లకు సూచించారు. "దయచేసి చరిత్రలో ఈ కాలానికి బలైపోవద్దు" అని హెచ్చరించారు. స్వతంత్రంగా ఆలోచించాలని, వ్యక్తిగత ఎదుగుదలకు పెట్టుబడులు, సాంప్రదాయ వ్యవస్థలకు వెలుపల ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యూహాలను అన్వేషించాలని హితవు పలికారు. BIGGEST CHANGE in MODERN HISTORYAI will cause many “smart students” to lose their jobs.AI will cause massive unemployment.Many still have student loan debt.AI cannot fire me because I do not have a job.If you are in this category please take proactive action. Please do…— Robert Kiyosaki (@theRealKiyosaki) July 1, 2025 -
మినిమమ్ బ్యాలెన్స్ చార్జీలు ఎత్తేసిన మరో బ్యాంక్..
అన్ని సేవింగ్స్ ఖాతాలకు సంబంధించి కనీస బ్యాలెన్స్ నిర్వహణ చార్జీలను ఎత్తివేస్తున్నట్టు ప్రభుత్వరంగ ఇండియన్ బ్యాంక్ ప్రకటించింది. జూలై 7 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది. దీనివల్ల మరింత మందికి బ్యాంకింగ్ సేవలు చౌకగా అందుబాటులోకి వస్తాయని పేర్కొంది.మరోవైపు ఇండియన్ బ్యాంక్ ఏడాది కాల మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటును (ఎంసీఎల్ఆర్) 5 బేసిస్ పాయింట్లు (0.05శాతం) తగ్గించి 9 శాతానికి సవరించినట్టు ప్రకటించింది. 3వ తేదీ నుంచి ఈ రేటు అమల్లోకి వస్తుందని తెలిపింది. దీనివల్ల రుణగ్రహీతలకు ఉపశమనం లభిస్తుందని పేర్కొంది. ఆటో, వ్యక్తిగత, గృహ రుణాల రేట్లకు ఏడాది కాల ఎంసీఎల్ఆర్ బెంచ్మార్క్గా ఉంటుంది.పొదుపు ఖాతాలలో కనీస సగటు బ్యాలెన్స్ (ఎంఏబీ) నిర్వహించకపోతే విధించే జరిమానా ఛార్జీలను ఎత్తివేస్తున్నట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కూడా ఇదివేరకే ప్రకటించింది. అంతకు ముందు కెనరా బ్యాంక్ కూడా అన్ని పొదుపు ఖాతాల్లో కనీస సగటు బ్యాలెన్స్ (ఎంఏబీ) నిర్వహించనందుకు విధించే పెనాల్టీ ఛార్జీలను తొలగించింది. ఎంఏబీ అనేది ఒక నిర్దిష్ట కాలంలో (సాధారణంగా నెల) మీ పొదుపు ఖాతాలో నిర్వహించాల్సిన సగటు మొత్తం. -
రూ.లక్షల్లో క్రెడిట్కార్డు బాకీ ఇలా తీరిపోయింది..
ఉపయోగించుకోవాలే గానీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వ్యక్తిగత జీవితానికి ఎంత ప్రభావంతవంతంగా ఉపయోగపడుతుందో తెలిపే ఉదాహరణ ఇది. అమెరికాలో ఓ మహిళ పర్సనల్ ఫైనాన్స్లో మార్గదర్శకత్వం కోసం ఏఐ సాధనం చాట్జీపీటీ ఆశ్రయించి 23,000 డాలర్లకు పైగా (సుమారు రూ . 19.69 లక్షలు) మేర ఉన్న తన క్రెడిట్ కార్డు బాకీలో సగానికి పైగా సులువుగా తీర్చేసింది.డెలావేర్కు చెందిన 35 ఏళ్ల జెన్నిఫర్ అలెన్ తన ఆర్థిక నిర్వహణకు చాట్జీపీటీ ఎలా ఉపయోగపడిందో వివరించారు. రియల్టర్, కంటెంట్ క్రియేటర్ అయిన ఆమె న్యూస్వీక్ వార్తాసంస్థతో మాట్లాడుతూ.. తాను బాగా సంపాదించినప్పటికీ, ఆర్థిక నిర్వహణ విషయంలో చాలా కాలం కష్టపడ్డానని చెప్పారు. "నేను తగినంతగా సంపాదించకపోవడం వల్ల కాదు, ఆర్థిక అక్షరాస్యత పెంచుకోకపోవడమే దీనికి కారణం" అని ఆమె చెప్పారు.కుమార్తె పుట్టిన తరువాత అలన్ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. వైద్య అత్యవసర పరిస్థితులు, పాప ఆలనాపాలన ఖర్చులు ఆమె ఎక్కువగా క్రెడిట్ కార్డులపై ఆధారపడటానికి కారణమయ్యాయి. "మేమేం విలాసవంతంగా జీవించలేదు. సాధారణ జీవనమే గడిపాం. కానీ చూడకుండానే అప్పులు పేరుకుపోయాయి' అని ఆమె వివరించారు.పరిస్థితి నుంచి బయటపడేందుకు అలెన్ 30 రోజుల పర్సనల్ ఫైనాన్స్ ఛాలెంజ్ కోసం చాట్ జీపీటీని ఆశ్రయించింది. ప్రతిరోజూ ఆమె ఈ ఏఐ సాధనాన్ని ఉపయోగించి నిరుపయోగ సబ్స్క్రిప్షన్లను తొలగించడం, మరచిపోయిన ఖాతాలలో ఉపయోగించని నిధులను గుర్తించడం వంటి చేసేవారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సూచనలు సరళమైనవే కానీ ప్రభావవంతమైనవి. ఈ క్రమంలో చాట్జీపీటీ ఆమెను ఓ పని చేయాలని సూచించింది. అదేంటంటే ఫైనాన్స్ యాప్లను, బ్యాంకు ఖాతాలను ఓసారి చెక్ చేసుకోవాలని చెప్పింది. చాలా కాలం ఉపయోగంలో లేని బ్రోకరేజీ ఖాతాతో సహా పలు అకౌంట్లలో అన్క్లెయిమ్ సొమ్ము 10,000 డాలర్లు (రూ .8.5 లక్షలు) బయటపడ్డాయి.అలాగే ప్యాంట్రీ-ఓన్లీ అంటే వంట గదిలో ఉన్నవాటితోనే వండుకోవడం ప్రణాళికను అవలంభించింది. దీంతో ఆమె నెలవారీ కిరాణా బిల్లు దాదాపు రూ .50,000 తగ్గింది. అలా ఛాలెంజ్ ముగిసే సమయానికి అలెన్ మొత్తంగా 12,078.93 డాలర్లు (సుమారు రూ.10.3 లక్షలు) పొదుపు చేసి తన క్రెడిట్ కార్డు బాకీలో సగానికిపైగా తీర్చేసింది. -
పోస్టాఫీసు స్కీములు.. వడ్డీ రేట్ల ప్రకటన
పోస్టాఫీసుల ద్వారా నిర్వహిస్తున్న పలు పొదుపు స్కీములకు సంబంధించిన వడ్డీ రేట్లపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో దేశంలోని ప్రసిద్ధ చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు యథాతథంగా ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్లో తెలిపింది. అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎసీఎస్ఎస్), సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై) వంటి సాధనాలపై ఆధారపడిన పొదుపుదారులకు ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో వారి రాబడిలో ఎలాంటి మార్పులు కనిపించవు.పన్ను ప్రయోజనాలు, దీర్ఘకాలిక పొదుపు సామర్థ్యానికి ప్రసిద్ధి చెందిన ప్రభుత్వ మద్దతు పథకం పీపీఎఫ్ గత త్రైమాసికంలో మాదిరిగానే వడ్డీ రేటును కొనసాగిస్తుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎసీఎస్ఎస్), సుకన్య సమృద్ధి సమృద్ధి స్కీమ్లకు ఆకర్షణీయమైన వార్షిక రేటును 8.2% కొనసాగుతుంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ లో ఇన్వెస్టర్లు 7.7 శాతం, పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (పీవోఎంఐఎస్) 7.4 శాతం వద్ద స్థిరంగా ఉన్నాయి. కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ) కూడా మారలేదు. ఇది 115 నెలల మెచ్యూరిటీ వ్యవధితో 7.5% రేటును అందిస్తుంది.ఇక పోస్టాఫీస్ సేవింగ్స్ డిపాజిట్లపై 4 శాతం వడ్డీ లభిస్తుంది. క్రమం తప్పకుండా నెలవారీ పొదుపునకు అవకాశం ఉండే ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ) పథకం 6.7% వడ్డీ రేటును అందిస్తుంది. ఈ చిన్న మొత్తాల పొదుపు పథకాలు గ్యారంటీ రాబడులను అందిస్తాయి, ఎంచుకున్న పథకం ఆధారంగా నెలవారీ, త్రైమాసిక లేదా వార్షిక ప్రాతిపదికన వడ్డీని జతచేస్తాయి.ప్రధానంగా పోస్టాఫీసులు, బ్యాంకుల ద్వారా నిర్వహిస్తున్న ఈ చిన్న పొదుపు పథకాలు సురక్షితమైన, స్థిర-ఆదాయ రాబడిని కోరుకునే లక్షల మంది భారతీయులకు కీలక పెట్టుబడి సాధనాలు. శ్యామల గోపీనాథ్ కమిటీ సిఫారసు చేసిన విధంగా ప్రభుత్వ సెక్యూరిటీలపై రాబడులకు సంబంధించిన ఫార్ములాను ఉపయోగించి ప్రభుత్వం ప్రతి త్రైమాసికానికి వాటి రేట్లను సమీక్షిస్తుంది. అయితే మార్కెట్ రేట్లలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ఈ రేట్లను స్థిరంగా ఉంచాలని కేంద్రం నిర్ణయించింది.పథకంవడ్డీ రేటుపోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్4%పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్6.7%పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్7.4%పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ (1 సంవత్సరం)6.9%ప్రస్థితి పోస్ట్ టైమ్ డిపాజిట్ (2 సంవత్సరాలు)7%పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ (3 సంవత్సరాలు)7.1%పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ (5 సంవత్సరాలు)7.5%కిసాన్ వికాస్ పత్ర (కేవీయపీ)7.5%పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్)7.1%సుకన్య సమృద్ధి యోజన8.2%నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్7.7%సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్)8.2% -
‘ఇండియాలో సమయం విలువ తెలియని వారే ఎక్కువ’
ఆన్లైన్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్ క్రెడ్ వ్యవస్థాపకులు, సీఈఓ కునాల్ షా ఇటీవల ‘డబ్బు-సమయం’పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఫోర్బ్స్ తో మాట్లాడుతూ చాలా మంది భారతీయులకు డబ్బుకు సంబంధించి సమయం విలువ తెలియదని షా అన్నారు.‘మిలియన్ డాలర్లు సంపాదించే అమెరికన్లు తమ గంట వేతన విలువను సరిగ్గా అర్థం చేసుకుంటారు. అదే భారతదేశంలో ఎవరినైనా గంటకు తమ జీతం ఎంత అని అడిగితే.. వారికి ఎలాంటి క్లూ ఉండదు’ అని షా అన్నారు. ఈ ధోరణి దీర్ఘకాలంలో భారీ మొత్తం నష్టపోయేందుకు దారితీస్తుందని చెప్పారు. భారత్లో చాలామంది సమయాన్ని ఎక్కువగా వృథా చేస్తున్నట్లు తెలిపారు. ‘గంటకు రూ.10వేలు సంపాదించే వారు విమాన టికెట్పై రూ.500 ఆదా చేసుకోవడానికి మరో గంట సమయం వెచ్చిస్తున్నారు’ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: లాంచ్ అయిన 3 నిమిషాల్లోనే 2 లక్షల బుకింగ్స్మహిళా భాగస్వామ్యం అంతంతే..‘భారత్లో కాకుండా నేను వెళ్లిన ప్రతి మీటింగ్లోనూ పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉండేవారు. ముఖ్యంగా ప్రొడక్ట్ టెక్ కంపెనీల్లో ఆర్థిక పరమైన అంశాలపై ఇతర ప్రాంతాల్లో మహిళలదే పైచేయి. కానీ భారత్లో వీరి సంఖ్య చాలా పరిమితంగా ఉంది. ఈ స్పష్టమైన వ్యత్యాసం దేశ ఆర్థిక భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతుంది. శ్రామిక శక్తిలోనూ మహిళల భాగస్వామ్యం చాలా తక్కువగా ఉంది. పురుషులే పనిచేస్తే భారత్ తలసరి ఆదాయం పెరగదు. మహిళలకు ప్రాతినిథ్యం పెరగాలి’ అని చెప్పారు.