Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Singayya Incident in YS Jagan Sattenapalli Tour | Big Shock to Yellow Media 1
సింగయ్య మరణంపై కుట్రలు.. ఎల్లో మీడియాకు బిగ్‌ షాక్‌

సాక్షి,గుంటూరు: సింగయ్య మరణంపై పుంకాలు పుంకాలుగా ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియా అండ్‌ గ్యాంగ్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. సింగయ్య ప్రమాదం సమయంలో ఏం జరిగిందో తెలిపేలా ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. దీంతో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై కూటమి ప్రభుత్వం, ఎల్లో మీడియా చేస్తున్న కుట్రలు మరోసారి బట్టబయలయ్యాయి. వైఎస్‌ జగన్‌పై కొనసాగుతున్న ప్రజల ఆదరాభిమానాలను చూసి కూటమి ప్రభుత్వం ఓర్వలేకపోతోంది. అందుకే వైఎస్‌ జగన్‌ను ప్రజల్లో తిరిగే అవకాశం లేకుండా, ఆటంకాలు సృష్టించేందుకు తన ఎల్లో మీడియాతో కలిసి కుట్రకు తెరతీసింది. అందుకు రెంటపాళ్ల వైఎస్‌ జగన్‌ పర్యటనను వినియోగించుకుంది కూటమి ప్రభుత్వంలో నేతలు, పోలీసుల వేధింపులు తాళలేక పల్నాడు జిల్లా, సత్తెన పల్లి నియోజకవర్గం రెంటపాళ్ల ఉపసర్పంచ్‌ నాగమల్లేశ‍్వరరావు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, నాగమల్లేశ్వరరావు కుటుంబసభ్యుల్ని పరామర్శించేందుకు జూన్‌ 18న వైఎస్‌ జగన్‌ రెంటపాళ్ల వెళ్లారు. వెళ్లే సమయంలో వైఎస్‌ జగన్‌ కాన్వాయ్‌ ఢీకొని సింగయ్య అనే వ్యక్తి మృతి చెందాడని ఎల్లో మీడియా అబద్ధాలు ప్రచారం చేసింది. కానీ కొద్ది సేపటికే ఎల్లో మీడియా కుట్రలు బయటపడ్డాయి. వైఎస్‌ జగన్‌ కాన్వాయ్‌కి కంటే ముందు వెళ్లిన వాహనం ఢీకొట్టిన తర్వాత సింగయ్య రోడ్డు పక్కన గాయాల పాలవ్వగా.. అప్రమత్తమైన స్థానికులు 108 ఫోన్‌ చేశారు. 108 వాహనం రావడం, అందులో సింగయ్యను తరలించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. వీడియో లభ్యం కావడంతో ఎల్లో మీడియా కుట్ర బట్టబయలైంది. వైఎస్ జగన్ వాహనం ఢీకొట్టడంతో సింగయ్య మరణించారంటూ పచ్చ మీడియా విష ప్రచారం చేసిన కొద్ది సేపటికే ఒరిజినల్‌ వీడియో రావడంతో ఎల్లో గ్యాంగ్‌ అడ్డంగా దొరికింది.

Iranian foreign minister to visit Moscow Key Meet With Putin2
అమెరికా దాడులు.. ఇరాన్‌కు అండగా రష్యా..!

టెహ్రాన్‌: ఇరాన్‌పై యుద్ధం వద్దూ అంటూ ఇది వరకే అమెరికాను హెచ్చరించిన రష్యా... ఈ మేరకు దిద్దబాటు చర్యలు చేపట్టడానికి నడుంబిగించింది. ఇరాన్‌కు అణ్వాయుధాలు సరఫరా చేయడానికి చాలా దేశాలే సిద్ధంగా ఉన్నాయని రష్యా మరోసారి హెచ్చరికలు పంపింది.రష్యాకు ఇరాన్‌ రక్షణమంత్రిఇజ్రాయిల్‌, అమెరికాలు.. ఇరాన్‌ను అతలాకుతులం చేసే దిశగా యుద్ధాన్ని తీవ్రతరం చేయడంతో ఇరాన్‌ ఏం చేయాలనే దానిపై ఆలోచనలో పడింది. దీనిలో భాగంగా తమకు అండగా ఉన్న రష్యా సహకారం కోసం ఇరాన్‌ ప్రయత్నాలు ఆరంభించింది. ఈ మేరకు ఇరాన్‌ రక్షణమంత్రి అబ్బాస్‌ అరాగ్చీ.. అగమేఘాల మీద రష్యాకు బయల్దేరారు. రేపు(సోమవారం) రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశం కానున్నారు. ఈ విషయాన్ని ఇరాన్‌ రక్షణశాఖ అధికారికంగా వెల్లడించింది. రక్షణమంత్రి అరాగ్చీ.. రష్యాకు వెళ్లే విషయాన్ని వెల్లడించారు. మూడు ఇరాన్‌ కీలక అణుస్థావరాలపై అమెరికా బాంబుల దాడితో విరుచుకుపడిన తరుణంలో.. రష్యా ఆదేశాలతో ఇరాన్‌ ముందుకెళ్లే అవకాశం ఉంది.‘ఇరాన్‌కు రష్యా మిత్రదేశం. మేము ఎప్పుడూ రష్యాను ఆశ్రయిస్తూనే ఉంటాం. నేను మాస్కోకు అత్యవసరంగా బయల్దేరి వెళుతున్నా. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కీలక సమావేశం ఉండనుంది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం మాపై అమెరికా చేసే దాడి కచ్చితంగా అతిక్రమణ కిందకే వస్తుంది. మా అణుస్థావరాలపై దాడులకు దిగిన అమెరికా రెడ్‌ లైన్‌ క్రాస్‌ చేసింది. ఐక్యరాజ్యసమితిలో మాకున్న హక్కులను కాపాడుకోవడమే మా తదుపరి కర్తవ్యం. మేము కచ్చితంగా వారికి బుద్ధి చెబుతాం’ అని అరాగ్చీ ‍స్పష్టం చేశారు. ట్రంప్‌ మరో యుద్ధాన్ని మొదలుపెట్టారు..ఇరాన్‌పై అమెరికా దాడులకు దిగడాన్ని రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్‌ ఖండించారు. ఇరాన్‌పై దాడులతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరో యుద్ధానికి తెరలేపారని విమర్శించారు. ఈ యుద్దంతో అమెరికా సాధించింది ఏమీ లేదనే విషయం తెలుసుకుంటే మంచిదన్నారు. ప్రస్తుతం ఇరాన్‌పై అమెరికా చేపట్టిన ఆపరేషన్‌ ఎటువంటి గణనీయమైన సైనిక లక్ష్యాలను ఛేదించడంలో విఫలమైందన్నారు. ఇక్కడ ఇరాన్‌ స్వల్ప నష్టాన్ని మాత్రమే చవిచూసిందన్నారు.ఆ దుస్సాహసం వద్దు.. రష్యా వార్నింగ్‌ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యకు దిగడం సరైన చర్య కాదంటూ హెచ్చరించింది. ఇరాన్‌పై అమెరికా దాడులు చేయడానికి దిగడానికి ముందుగానే రష్యా క్లియర్‌ మెస్సేజ్‌ ఇచ్చింది. ఇజ్రాయిల్‌-ఇరాన్‌ల యుద్ధంలో అమెరికా సైనిక చర్యకు దిగితే అది ఎంతమాత్రం సమర్థనీయంగా కాదని రష్యా విదేశాంగా ప్రతినిధి మారియా జకారోవా ఇదివరకే స్పష్టం చేశారు. ‘అమెరికాను ముందుగా హెచ్చరించే విషయం ఏంటంటే.. ‘ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇజ్రాయిల్‌-ఇరాన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధానికి అమెరికా దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ అమెరికా సైనిక చర్యకు దిగితే అది దుస్సాహసమే అవుతుంది. ఈ యుద్ధంలో ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా సైనిక చర్యకు దిగడం అనేది చాలా ప్రమాదకరం. ఊహించని పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంది. ఆ యోచనను పక్కన పెడితేనే మంచిది’ అని ఆమె స్పష్టం చేశారు.మరొకవైపు ఇరాన్‌లోని బుషెహర్ అణు విద్యుత్ ప్లాంట్‌పై ఇజ్రాయెల్ దాడి చెర్నోబిల్(1986లో ఉక్రెయిన్‌లో సంభవించిన ఒక పెద్ద అణు విపత్తే చెర్నోబిల్. అణు విద్యుత్ కేంద్రంలోని రియాక్టర్ పేలిపోయి, రేడియోధార్మిక పదార్థాలు గాలిలోకి విడుదలయ్యాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన అణు ప్రమాదాలలో ఒకటిగా లెక్కించబడింది) తరహా విపత్తుకు దారితీయవచ్చని రష్యా అణుశక్తి కార్పొరేషన్ సైతం హెచ్చరించింది. ఏదైనా జరగొచ్చు..ఇరాన్‌కు అణ్వాయుధాలు సరఫరా చేయడానికి చాలా దేశాలే సిద్ధంగా ఉన్నాయని అమెరికాను పరోక్షంగా హెచ్చరించిన రష్యా.. నేరుగా రంగంలోకి దిగితే యుద్ధం మరింత ముదరడం ఖాయం. ఇరాన్‌కు ఆది నుంచి మద్దతు ఇస్తూ వస్తున్న రష్యా.. ఇప్పుడు ఏం చేయాలనే దానిపై సమాలోచనలు చేస్తోంది. ఇరాన్‌ రక్షణమంత్రితో భేటీ అనంతరం రష్యా తదుపరి కర్తవ్యం ఏమటనేది తెలిసే అవకాశం ఉంది. ఒకవేళ రష్యా యుద్ధంలోకి దిగి ఇరాన్‌కు మద్దతిస్తే మాత్రం భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ శాంతి చర్చలు అనేది చాలా కీలకమని వారు భావిస్తున్నారు. ఇరాన్‌ రక్షణమంత్రితో జూన్‌ 23వ తేదీన పుతిన్‌ భేటీలో ఈ విషయంపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. యుద్ధాన్ని ఇక్కడితో ముగిస్తే మంచిదని ఇరాన్‌కు పుతిన్‌ ఆదేశాలు ఇస్తే ఫర్వాలేదు కానీ, నేరుగా రష్యా కూడా యుద్ధంలోకి వస్తే మాత్రం సైనిక పరంగా రెండు అగ్రదేశాల మధ్య వార్‌ మరింత హీట్‌ పుట్టించే అవకాశాలు కూడా లేకపోలేదు.

Reiterated Our Call For De escalation : PM Modi Speaks To Iran President3
ఇజ్రాయెల్‌,అమెరికా విరుచుకు పడుతున్న వేళ.. ఇరాన్‌కు ప్రధాని మోదీ ఫోన్‌ కాల్‌!

సాక్షి,ఢిల్లీ: ఇరాన్‌పై ఇజ్రాయెల్,అమెరికా దాడులకు తెగబడుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరు దేశాలు శాంతి నెలకొల్పేలా చర్చలు జరపాలంటూ భారత ప్రధాని మోదీ (Narendra Modi) ఇరాన్‌ అధ్యక్షుడితో ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్‌తో (Masoud Pezeshkian) ఫోన్‌లో మాట్లాడారు. ఈమేరకు ప్రధాని మోదీ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌లో ‘ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్‌తో నేను మాట్లాడాను. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా జరుపుతున్న దాడుల గురించి చర్చించాం. ఈ దాడులపై ఆందోళన వ్యక్తం చేశాం. ప్రాంతీయంగా శాంతి, భద్రత, స్థిరత్వాన్ని త్వరగా పునరుద్ధరించడానికి, తక్షణ ఉద్రిక్తతలను తగ్గించడం, శాంతి చర్చలు జరపాలని చెప్పినట్లు ’ పేర్కొన్నారు. Spoke with President of Iran @drpezeshkian. We discussed in detail about the current situation. Expressed deep concern at the recent escalations. Reiterated our call for immediate de-escalation, dialogue and diplomacy as the way forward and for early restoration of regional…— Narendra Modi (@narendramodi) June 22, 2025సుదీర్ఘకాలం నుంచి ఇరాన్‌తో పాటు ఇరాన్‌ మద్దతిస్తున్న హమాస్, హెజ్‌బొల్లా వంటి మిలిటెంట్లు గ్రూపులు ఇజ్రాయెల్‌పై దాడులకు తెగబడుతున్నాయి. ఈ దాడులు తన భద్రతకు ముప్పుగా భావిస్తోంది. అందుకే ఇజ్రాయెల్‌ హమాస్‌, హెజ్‌బొల్లాతో పాటు ఇరాన్‌పై దాడుల్ని తీవ్రతరం చేసింది.ఇరాన్‌పై అమెరికా ఎందుకు దాడులు చేస్తోంది?ఈ ఇరు దేశాల యుద్ధంలో ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా ప్రత్యక్షంగా రంగంలోకి దిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో అమెరికా సైన్యం శనివారం (జూన్ 21, 2025న) ఇరాన్‌లోని మూడు ప్రధాన అణు కేంద్రాలపై వైమానిక దాడులు చేసింది. ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ అనే అణు కేంద్రాలపై B-2 స్పిరిట్ బాంబర్లతో భారీ బాంబుల వర్షం కురిపించింది. ట్రంప్ సైతం ఈ దాడి విజయవంతమైందని పేర్కొన్నారు. ( ఫొటొ:ఇరాన్‌ అణు కేంద్రాలపై అమెరికా ప్రయోగించిన బీ-2 స్పిరిట్‌ బాంబార్స్‌), image source: (యూఎస్‌ఏ టుడే)ఈ దాడి ద్వారా అమెరికా అధికారికంగా యుద్ధంలోకి దిగినట్టయింది. ఇరాన్ అణు ఆయుధాలు తయారు చేయకుండా అడ్డుకోవడమే ప్రధాన ఉద్దేశమని ట్రంప్ తెలిపారు. అయితే, ఈ చర్యపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇది యుద్ధాన్ని మరింత పెంచుతుందా లేక శాంతికి దారి తీస్తుందా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి నాంది కావొచ్చని పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ యుద్ధానికి కారణంఇరాన్ ప్రధానంగా హమాస్ (పాలస్తీనా), హెజ్బొల్లా (లెబనాన్) వంటి మిలిటెంట్‌ గ్రూపులకు ఆర్థిక సహాయం, ఆయుధాలు, శిక్షణ అందిస్తోంది. ఈ శిక్షణను ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ)లోని ఖుద్స్ ఫోర్స్ అనే విభాగం నిర్వహిస్తోంది.హమాస్: ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7,2023న జరిగిన దాడికి ముందు, హమాస్ మిలిటెంట్లు ఇరాన్‌లో శిక్షణ పొందినట్లు ఇజ్రాయెల్ ఆరోపించింది. వీరికి డబ్బు,ఆయుధాలు,సాంకేతిక సహాయం కూడా అందించినట్లు ఆరోపించింది. హెజ్ బొల్లా: ఇది లెబనాన్‌లో ఉన్న షియా మిలిటెంట్ గ్రూప్. దీనికి ఇరాన్ మద్దతు ఇస్తుంది. హెజ్ బొల్లాకు ఆయుధాలు, శిక్షణతో పాటు వ్యూహాత్మక సలహాలు సూచనలు ఇస్తోంది.అందకు హెజ్‌బొల్లా, హమాస్‌తో పాటు ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడుల్ని తీవ్రతరం చేసింది. హెజ్‌బొల్లా,హమాస్‌ గ్రూపుల్ని నిర్విర్యం చేసింది. ఆ రెండు గ్రూపులకు కీలకంగా వ్యవహరిస్తున్న టాప్‌ కమాండర్లను హతమార్చింది. ఇప్పుడు ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ విరుచుకుపడుతోంది.

Kannappa Director Mukesh Kumar Singh Details4
ఫైనల్లీ కనిపించిన 'కన్నప్ప' డైరెక్టర్.. ఈయన ఎవరంటే?

మంచు ఫ్యామిలీ తీసిన 'కన్నప్ప'.. ఈ వీకెండ్ (జూన్ 27న) థియేటర్లలోకి రాబోతుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్లలో కాస్త జోరు పెంచారు. తాజాగా శనివారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. టీమ్ అంతా మూవీ కబుర్లు చెబుతూ సందడి చేశారు. మిగతా వాళ్ల సంగతేమో గానీ చిత్ర దర్శకుడు కూడా కనిపించడం ఆసక్తికరంగా అనిపించింది. ఇంతకీ ఆయనెవరు? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?(ఇదీ చదవండి: న్యూజిలాండ్‌లో 7000 ఎకరాలు కొన్నాం: మోహన్‌బాబు)గత కొన్నాళ్ల నుంచి 'కన్నప్ప' ప్రమోషన్లు చేస్తున్నారు. చాలావరకు హీరో కమ్ నిర్మాత అయిన మంచు విష్ణునే కనిపిస్తున్నాడు. చిత్ర సంగతులన్నీ చెప్పాడు. ఇప్పటికీ ఏదో ఓ ఇంటర్వ్యూ ఇస్తూ మరిన్ని విషయాలు చెబుతూనే ఉన్నాడు. సాధారణంగా ఏ సినిమా అయినా రిలీజ్ దగ్గరుందంటే దర్శకుడు కూడా ప్రమోషన్లలో కనిపిస్తారు. 'కన్నప్ప' విషయంలో సదరు డైరెక్టర్ తప్పితే అందరూ కనిపిస్తూ వచ్చారు. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనే ఈయన కనిపించారు.సడన్‌గా 'కన్నప్ప' దర్శకుడు ఎవరిని అడిగితే చాలామంది చెప్పలేరు. ఎందుకంటే తొలి నుంచి విష్ణు, ప్రభాస్ లేదంటే మోహన్ లాల్ పేర్లు మాత్రమే ప్రమోషన్లలో వినిపించాయి. కానీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ముకేశ్ కుమార్ సింగ్‌ కూడా మామూలోడు ఏం కాదు. ఎందుకంటే 2012లో రామాయణ్, 2013-14లో మహాభారత్ సీరియల్స్‌లో కొన్ని ఎపిసోడ్స్‌కి దర్శకత్వం వహించారు. వీటితో పాటు తెనాలి రామ, మేరే సాయి తదితర భక్తిరస సీరియల్స్ తీసిన అనుభవం ఈయన సొంతం. 2008 నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు కాకపోతే ఎక్కువశాతం సీరియల్స్‌కి మాత్రమే దర్శకత్వం వహించడంతో సినిమా ప్రేక్షకులకు ఈయన గురించి పెద్దగా తెలియలేదు.(ఇదీ చదవండి: ప్రభాస్‌ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని.. : మంచు విష్ణు)అలా పీరియాడికల్, భక్తి సీరియల్స్ తీసిన అనుభవం ఉండటంతోనే ముకేశ్ కుమార్ సింగ్‌కి.. 'కన్నప్ప' దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. ట్రైలర్ చూస్తే ఆయన పనితనం బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది. రిలీజ్ తర్వాత ఆయన వర్క్ ఏంటనేది పూర్తిగా తెలుస్తుంది. కాకపోతే ప్రమోషన్లలో ఆయనని ఎక్కువగా హైలైట్ చేయకపోవడానికి కూడా కారణమున్నట్లు కనిపిస్తుంది. స్వతహాగా ఆయనో హిందీ డైరెక్టర్. తెలుగు వాళ్లకు తెలిసింది చాలా తక్కువ. అందుకేనేమో మంచు విష్ణు.. ప్రమోషన్ల బాధ్యతని తన నెత్తిన వేసుకున్నాడు. దర్శకుడిని పెద్దగా కష్టపెట్టలేదనిపిస్తుంది.మంచు విష్ణు హీరో కమ్ నిర్మాతగా తీసిన 'కన్నప్ప'లో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ తదితరులు అతిథి పాత్రలు పోషించారు. మోహన్ బాబు, కాజల్, మధుబాల లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతున్న ఈ మూవీపై తెలుగులో ఓ మాదిరి అంచనాలున్నాయి. మరి ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: మోహన్ బాబు ఇంటికొచ్చి ప్రాధేయపడ్డారు: బ్రహ్మనందం)

Congress Supporters Try To Attack Telangana Bhavan5
తెలంగాణ భవన్‌ ముట్టడికి కాంగ్రెస్‌ యత్నం

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ ఆందోళన చేపట్టింది. దీనిలో భాగంగా ఆదివారం(జూన్‌ 22) తెలంగాణ భవన్‌ను ముట్టడించడానికి యత్నించారు కాంగ్రెస్‌ కార్యకర్తలు. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టిన కాంగ్రెస్‌ కార్యకర్తలు.. తెలంగాణ భవన్‌లోకి దూసుకుపోవడానికి యత్నించారు. దీన్ని పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం కాంగ్రెస్‌ కార్యకర్తల్ని చెదరగొట్టి పలువుర్ని అదుపులోకి తీసుకున్నారు. సీఎం బినామీలే అక్రమ మైనింగ్‌ చేస్తున్నారని, తెలంగాణ మంత్రులు ఇసుక దందాకు పాల్పడుతున్నారని నిన్న(శనివారం) వరంగల్‌లో కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను తెలంగాణ భవన్‌ వేదికగా బయటపెడతాననని కౌశిక్‌రెడ్డి విమర్శించారు.

2 Arrested for Sheltering Pakistani Terrorists6
‘పహల్గామ్’ ఉగ్రవాదులకు ఆశ్రయం.. ఇద్దరు అరెస్ట్‌

న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడిలో భాగస్వామ్యం కలిగిన ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)ఆదివారం అరెస్టు చేసింది. వీరిని పహల్గామ్‌కు చెందిన పర్వైజ్ అహ్మద్ జోథర్, బషీర్ అహ్మద్ జోథర్‌లుగా గుర్తించింది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)తో సంబంధం కలిగిన ముగ్గురు సాయుధ ఉగ్రవాదులకు వీరు ఆశ్రయం కల్పించడంలో పాటు వారికి ఆహారం, ఇతర సదుపాయాలు కల్పించారని ఎన్‌ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది.దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఉగ్రదాడి కేసుపై ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఈ దాడికి ముందు హిల్ పార్క్ ప్రాంతంలోని ఈ ఉగ్రవాదులను నిందితులు దాచి ఉంచారని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. విచారణ సమయంలో పర్వైజ్, బషీర్‌ ఈ ఉగ్రదాడిలో పాల్గొన్నవారి గుర్తింపులను వెల్లడించారని, వారు పాకిస్తానీ జాతీయులని నిర్ధారించారని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. పర్యాటకులను వారి మతపరమైన గుర్తింపు ఆధారంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఇది ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో జరిగిన భారీ ఉగ్రదాడులలో ఒకటిగా నిలిచింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం, 1967లోని సెక్షన్ 19 కింద వీరిద్దరినీ అరెస్టు చేశారు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లోని బైసరన్ లోయలో పాకిస్తాన్ ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపి, 26 మందిని పొట్టనపెట్టుకున్నారు. ఈ దాడుల్లో16 మంది గాయపడ్డారు.ఇది కూడా చదవండి: అమెరికా అంతటా హై అలర్ట్‌.. ఇరాన్‌పై దాడుల ఫలితం

LPU Student Secures Record Breaking Rs 2 5 Crore Placement Offer7
ఐఐటీలకు ధీటుగా ఎల్‌పీయూ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీ

భారతదేశంలో ఇంజినీరింగ్ ప్లేస్‌మెంట్ల విషయానికి వస్తే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఎప్పటి నుంచో బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. అందుకు ఏమాత్రం తీసిపోకుండా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ (ఎల్‌పీయూ)లో ఇటీవలి ఫ్లేస్‌మెంట్‌ ఫలితాలు కీలకంగా మారుతున్నాయి. ఎల్‌పీయూ విద్యార్థులు దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక సంస్థల కంటే ప్రత్యర్థి సంస్థలు, కొన్ని సందర్భాల్లో వారి కంటే అధిక ఆఫర్లతో ఉద్యోగం సాధిస్తున్నారు.ఎల్‌పీయూలో బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న శ్రీవిష్ణు ప్రముఖ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ కంపెనీ నుంచి ఏడాదికి రూ.2.5 కోట్ల డొమెస్టిక్ ప్యాకేజీని పొందారు. ఈ ఏడాది భారతదేశంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఇంజినీరింగ్ విద్యార్థికి అందించే అత్యధిక ప్యాకేజీల్లో ఇది ఒకటి.ఎల్‌పీయూ ప్లేస్‌మెంట్‌ జోరు అక్కడితో ఆగిపోలేదు. ఈసీఈ విభాగంలో ఫైనల్ ఇయర్ చదువుతున్న బేతిరెడ్డి నాగవంశీరెడ్డికి ప్రముఖ ఏఐ రోబోటిక్స్ సంస్థ నుంచి రూ.1.03 కోట్ల అంతర్జాతీయ ఆఫర్ లభించింది. ఈ విజయాలు అధిక నైపుణ్యం కలిగిన ఇంజినీరింగ్ ప్రతిభను కోరుకునే టాప్ రిక్రూటర్లకు గమ్యస్థానంగా నిలుస్తున్నాయి. ఇవి ఎల్‌పీయూకు పెరుగుతున్న ఖ్యాతిని నొక్కిచెబుతున్నాయి.‘ఈ విజయాలు అత్యున్నత స్థాయిలో పరిశ్రమ పోటీని తట్టుకొని సిద్ధంగా ఉండే గ్రాడ్యుయేట్లను అందించడంలో ఎల్‌పీయూ కట్టబడి ఉంది’ అని ఎల్‌పీయూ కెరీర్ సర్వీసెస్ విభాగానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.ఆకట్టుకునే ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌తో ఆకర్షణీయ వేతనాలుఆకట్టుకునే పేస్కేల్‌తో భారీ ఎల్‌పీయూ ప్లేస్‌మెంట్‌ డ్రైవ్ ఆకర్షిస్తోంది. ఎల్‌పీయూ గ్రాడ్యుయేట్లకు పరిశ్రమలో ఉన్న డిమాండ్‌ను ప్రతిబింబిస్తూ వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో విద్యార్థులకు మొత్తం 7,204 జాబ్ ఆఫర్లు అందాయి. 1,602 మంది విద్యార్థులకు బహుళ ఉద్యోగ ఆఫర్లు లభించడం వారి ఉద్యోగ సామర్థ్యాన్ని మరింత పెంచింది. టాప్ 25% విద్యార్థుల సగటు వేతన ప్యాకేజీ ఏడాదికి రూ.10.23 లక్షలుగా ఉంది. పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌, మైక్రోసాఫ్ట్, అమెజాన్, సర్వీస్ నౌ వంటి ప్రతిష్ఠాత్మక కంపెనీలు క్యాంపస్‌ను సందర్శించిన టాప్ రిక్రూటర్లలో ఉన్నాయి. బీటెక్ ఈసీఈ విద్యార్థి ఆదిరెడ్డి వాసు ఏడు ఉద్యోగావకాశాలు సాధించి సంస్థాగత రికార్డు నెలకొల్పాడు.గ్లోబల్‌గా అధిక ప్యాకేజీ ఆకర్షిస్తున్న నైపుణ్యాలుసైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ ఇంజినీరింగ్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్‌ వంటి అత్యాధునిక రంగాల్లో అసాధారణ సాంకేతిక, విశ్లేషణాత్మక నైపుణ్యం అవసరమయ్యే డొమైన్లలో విద్యార్థులు అత్యంత డిమాండ్ ఉన్న ఉద్యోగాలు పొందుతున్నారని ఎల్‌పీయూ తాజా ప్లేస్‌మెంట్‌ డేటా పేర్కొంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి టెక్ దిగ్గజాలు అద్భుతమైన ఆఫర్లు ఇచ్చాయి. మైక్రోసాఫ్ట్ అత్యధిక ప్యాకేజీ ఏటా రూ.52.20 లక్షలు, అమెజాన్ రూ.46.94 లక్షలు అందించాయి. ఇది విశ్వవిద్యాలయంలోని ప్రతిభను ప్రతిబింబిస్తుంది.పరిశ్రమ దిగ్గజాల నుంచి భారీగా నియామకాలుఎల్‌పీయూ పరిశ్రమ భాగస్వామ్యాలు గ్లోబల్‌గా విస్తరించాయి. అన్ని విభాగాల్లో విద్యార్థుల ఉపాధి పట్ల లోతైన నిబద్ధతను ప్రదర్శిస్తున్నాయి. క్యాప్ జెమినీ, మైండ్ ట్రీ, కాగ్నిజెంట్, యాక్సెంచర్, టీసీఎస్ వంటి టాప్ టైర్ రిక్రూటర్లు ఎల్‌పీయూ విద్యార్థులకు వందలాది ఉద్యోగాలను ఆఫర్ చేయగా, క్యాప్ జెమినీ 700 మందికి పైగా, మైండ్ ట్రీ 420+, కాగ్నిజెంట్ 400+, యాక్సెంచర్, టీసీఎస్ రెండూ 250+ విద్యార్థులను చేర్చుకున్నాయి. ఈ ఆకట్టుకునే ప్లేస్‌మెంట్‌ పనితీరు వ్యక్తిగత విజయగాథల కంటే కూడా పరిశ్రమ నిమగ్నతకు, విద్యార్థుల సంసిద్ధతకు ఎల్‌పీయూ క్రమబద్ధమైన విధానాన్ని హైలైట్ చేస్తుంది.టెక్ టాలెంట్‌కు ప్రపంచ ఖ్యాతిఎల్‌పీయూ క్రమంగా ప్రపంచ ఖ్యాతిని సంపాదించుకుంది. యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లు ఇప్పుడు యూఎస్‌ఏ, యూకే, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లోని ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఏడాదికి రూ.1 కోటికి మించిన ప్యాకేజీలతో పని చేస్తున్నారు. రోబోటిక్స్, ఆటోమేషన్, ఈసీఈ, సీఎస్‌ఈ, మెకానికల్ ఇంజినీరింగ్ వంటి కోర్ స్ట్రీమ్స్ దేశీయ, అంతర్జాతీయ ప్లేస్‌మెంట్‌ రోస్టర్లలో ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి.ఐఐటీలు మాత్రమే కాదు.. ఎల్‌పీయూ ఎందుకంటే?ఎల్‌పీయూ అనుసరిస్తున్న స్కిల్-ఫస్ట్ విధానంలో ప్లేస్‌మెంట్‌ రహస్యం దాగి ఉంది. దీనికి యూనివర్సిటీ అమలు చేస్తోన్న ఎడ్యుకేషన్‌ రివల్యూషన్ ఫ్రేమ్ వర్క్ ఉదాహరణ. విద్యార్థులు రెండో సంవత్సరం నుంచి రియల్-వరల్డ్ ఎక్స్పోజర్, ఇండస్ట్రీ సర్టిఫికేషన్లు, డెడికేటెడ్‌ ప్లేస్‌మెంట్‌ ట్రెయినింగ్‌ పొందుతారు.‘ఎల్‌పీయూలో మేము విద్యార్థులను ఉద్యోగాల కోసం సిద్ధం చేయడమే కాదు.. నాయకత్వం వహించడానికి, సృజనాత్మకతకు అద్దపట్టేలా, పరిశ్రమలో ముందువరుసలో ఉండేలా సిద్ధం చేస్తాం’ అని ఎల్‌పీయూ వ్యవస్థాపక ఛాన్సలర్, రాజ్యసభ ఎంపీ డాక్టర్ అశోక్ కుమార్ మిట్టల్ తెలిపారు. యూనివర్సిటీ పనితీరు దేశ ఇంజినీరింగ్ విద్య, ప్లేస్‌మెంట్‌ ల్యాండ్ స్కేప్‌లో బలమైన పోటీదారుగా ఉంచుతుంది.త్వరలో ముగియనున్న ప్రవేశాలుఎల్‌పీయూలో 2025 విద్యాసంవత్సరానికి దరఖాస్తులు త్వరలో ముగియనున్నాయి. దరఖాస్తుదారులు గ్లోబల్ కెరీర్ను ప్రారంభించడానికి, భారతదేశం అత్యంత డైనమిక్, పరిశ్రమ ఆధారిత విశ్వవిద్యాలయంలో భాగం కావడానికి సిద్ధంగా ఉంటే ఇదే మంచి సమయం. సీట్లు పరిమితంగా ఉండడంతో డెడ్ లైన్లు దగ్గరపడుతున్నాయి. దరఖాస్తుదారులు వెంటనే https://bit.ly/43340ai సందర్శించండి.

Shock Waves in Telugu States, Husband Found Dead Just a Month After Marriage8
మరో హనీమూన్ మర్డర్?: తెలుగు రాష్ట్రాల్లో కలకలం.. పెళ్లైన నెల రోజులకే భర్త హత్య?

సాక్షి,కర్నూల్‌: మేఘాలయ హనీమూన్‌ మర్డర్‌ (meghalaya honeymoon case) తరహాలో.. తెలుగు రాష్ట్రాల్లో మరో హనీమూన్‌ మర్డర్‌ కలకలం రేపుతోంది. పెళ్లైన నెలరోజులకే, కొత్త పెళ్లి కొడుకు దారుణంగా హతమయ్యాడు. ఈ హత్యకు పాల్పడింది బాధితుడి భార్యేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.11 రోజులకే హనీమూన్‌ పేరుతో ప్రియుడు రాజ్ కుష్వాహతో కలిసి భార్య సోనమ్‌ రఘువంశీ (Sonam Raghuvanshi)తన భర్త రాజా రఘువంశీని (raja raghuvanshi) మేఘాలయాలో హతమార్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే తరహా ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. అయితే, ఈ హనీమూన్‌ హత్య ప్రణాళికా హత్యా? లేక పాతకక్షల కారణంగా జరిగిందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.వివరాల్లోకి వెళితే.. జోగులాంబ గద్వాల జిల్లాలో అదృశ్యమైన యువకుడు నంద్యాల జిల్లా పాండ్యంలో హత్యకు గురయ్యాడు. మహబూబ్‌ నగర్‌ పట్టణం ఘంటవీధికి చెందిన జి.తేజేశ్వర్‌ లైసెన్స్‌ సర్వేయర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 17నుంచి తేజేశ్వర్‌ కనపకడపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తేజేశ్వర్‌ నంద్యాల జిల్లా పాణ్యం సమీపంలోని పిన్నాపురంలో దారుణ హత్యకు గురయ్యాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు తేజేశ్వర్‌కు కర్నూల్‌ చెందిన యువతితో వివాహం జరిగింది. నిందితుల్ని గుర్తించిన కఠినంగా శిక్షించాలని బాధితుని కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు.మే 18న బీచ్‌పల్లిలో తేజేశ్వర్‌కు కర్నూలు జిల్లాకు చెందిన యువతితో వివాహం జరిగింది. వివాహం జరిగిన రోజుల వ్యవధిలో భర్త తేజేశ్వర్‌ హత్యకు గురికావడం కలకలం రేపింది. తేజేశ్వర్‌ హత్యపై అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు అతని భార్యపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధితుడి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Commercial Property Investment in Hyderabad9
హైదరాబాద్‌లో కమర్షియల్‌ స్థలం.. కొంటున్నారా?

వాణజ్య సముదాయాల్లో పెట్టే పెట్టుబడిపై 8 నుంచి 11 శాతం అద్దె గిట్టుబాటు అయితే.. ఇళ్లపై రాబడి 2 నుంచి 4 శాతం వరకే ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. అధిక సరఫరా, ప్రతికూల మార్కెట్, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక ఒడిదుడుకులు తదితర కారణాలతో ప్రధాన నగరాల్లో వాణిజ్య స్థలాల ధరలు తగ్గాయి. దీంతో వీటిలో పెట్టుబడి పెట్టడానికి ఇదే సరైన సమయమని నిపుణులు సూచిస్తున్నారు. వాణిజ్య సముదాయల్లో స్థలం కొన్న తర్వాత దాన్ని అమ్ముకోగానే మెరుగైన ఆదాయం గిట్టుబాటు అవుతుంది. ఇదొక్కటే కాదు ప్రతినెలా ఆశించిన స్థాయిలో అద్దె కూడా లభిస్తుంది. అన్ని విధాలా అభివృద్ధికి ఆస్కారం ఉన్న చోట నిర్మించే వాణిజ్య నిర్మాణాల్లో స్థలం తీసుకోవాలి. కాకపోతే పెట్టుబడి పెట్టే ముందు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాకే తుది నిర్ణయానికి రావాలి. –సాక్షి, సిటీబ్యూరోఇవే కీలకం..వాణిజ్య భవనాల్లో స్థలం తీసుకోవడం మెరుగైన నిర్ణయం అయినప్పటికీ ఇందులో పెట్టుబడి పెట్టడం ఆషామాషీ వ్యవహారం కాదు. అధ్యయనం, ముందుచూపు, ప్రణాళిక.. ఈ మూడు ఉంటేనే వీటిలో మదుపు చేయాలి.ఒక ప్రాంతంలో నిర్మించే వాణిజ్య సముదాయంలో స్థలం కొనడానికి వెళ్లే ముందు ఆయా స్థలానికి గిరాకీ ఉంటుందా లేదా అనే విషయాన్ని పక్కాగా అంచనా వేయాలి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మీరు కొనే భవనానికి ప్రజలు వచ్చే అవకాశం ఉందా? అనే విషయాన్ని బేరీజు వేయాలి.భవనాన్ని నిర్మించే డెవలపర్‌ గత చరిత్రను గమనించాలి. ఆయా సముదాయానికి ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులో ఉందా? భవన నిర్వహణ సక్రమంగా ఉంటుందా లేదా అనే అంశాన్ని నిశితంగా పరిశీలించాలి. ఇలాంటి భవనాల్లో నిర్వహణ మెరుగ్గా ఉంటేనే గిరాకీ ఉంటుంది.👉 ఇది చదివారా? ఖరీదైన 1164 ఫ్లాట్లు.. 7 రోజుల్లో ఫినిష్‌!మీరు వాణిజ్య స్థలం కొనాలనుకున్న ప్రాంతం భవిష్యత్తులో అభివృద్ధి చెందడానికి అవకాశముందా? ఉద్యోగావకాశాలు పెరగానికి ఆస్కాముందా? ఆయా ప్రాంతంలో జనాభా పెరుగుతుందా వంటి అంశాల్ని గమనించాలి.మీరు కొనాలని భావించే స్థలం వాణిజ్య సముదాయంలో ఎక్కడుంది? సందర్శకులకు నేరుగా కనిపిస్తుందా? స్థలం ముందు భాగాన్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దారా? ఇలాంటి విషయాల్ని కూడా తప్పకుండా చూడాలి.వాణిజ్య సముదాయంలో స్థలం కొనాలన్న నిర్ణయానికి వచ్చేముందు.. నెలసరి నిర్వహణ సొమ్ము ఎంత? ఆస్తి పన్ను, భవనం బీమా వంటివి కనుక్కోవాలి. ఖాళీ లేకుండా ఉండేలా చేసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం కోరుకున్న రాబడి గిట్టుబాటవుతుంది.

Former England Pacer David Lawrence Dies After Battle With Motor Neurone Disease10
దిగ్గ‌జ క్రికెట‌ర్ క‌న్నుమూత‌.. నివాళులర్పించిన ఇంగ్లండ్‌-భార‌త్ ఆట‌గాళ్లు

ఇంగ్లండ్ క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ జ‌ట్టు మాజీ ఫాస్ట్ బౌల‌ర్‌, గ్లౌసెస్టర్‌షైర్ దిగ్గ‌జం డేవిడ్ వాలెంటైన్ లారెన్స్(61) కన్నుమూశారు. గత కొంత కాలంగా మోటార్ న్యూరోన్ వ్యాధితో బాధపడుతున్న లారెన్స్.. ఆదివారం తుది శ్వాస విడిచారు.1988లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన లారెన్స్‌.. ఇంగ్లండ్ తరపున ఐదు టెస్టులు ఆడి 18 వికెట్లు సాధించారు. 1991లో ది ఓవల్‌లో వెస్టిండీస్‌పై అద్బుతమైన ఫైవ్ వికెట్ల హాల్ సాధించారు. ఆ సమయంలో విండీస్‌ దిగ్గజం వివ్ రిచర్డ్స్‌ను అవుట్ చేశారు.అయితే అద్బుతమైన టాలెంట్ ఉన్నప్పటికి మెకాలి గాయం కారణంగా 1992లో ఆయన్ కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడింది. పస్ట్ క్లాస్ క్రికెట్‌లో మాత్రం ఆయన ఎన్నో ఘనతలను అందుకున్నారు. 185 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన లారెన్స్‌..515 వికెట్లు పడగొట్టారు. లిస్ట్‌-ఎ క్రికెట్‌లో కూడా ఆయన పేరిట 155 వికెట్లు ఉన్నాయి.నివాళులర్పించిన ఇంగ్లండ్‌-భార‌త్ ఆట‌గాళ్లు..లారెన్స్ మృతి పట్ల భారత్‌-ఇంగ్లండ్ ఆటగాళ్లు సంతాపం వ్యక్తం చేశారు. లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆట ఆరంభానికి ముందు ఇరు జట్ల ఆటగాళ్లు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంత‌రం ఆయ‌న సేవ‌ల‌ను కొనియాడుతూ ఆట‌గాళ్లు చ‌ప్ప‌ట్లు కొట్టారు. అదేవిధంగా ఇంగ్లండ్‌-భారత్ ప్లేయర్లు భుజానికి నల్ల బ్యాండ్లు క‌ట్టుకుని బ‌రిలోకి దిగారు. ఈ విష‌యాన్ని బీసీసీఐ ఎక్స్ వేదిక‌గా వెల్ల‌డించింది.ఇంగ్లండ్‌ ఐదో వికెట్‌ డౌన్‌..మూడో రోజు ఆటలో భారత బౌలర్లు రాణిస్తున్నారు. 67 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్‌ 5 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. నాలుగో వికెట్‌గా సెంచూరియన్‌ ఓలీ పోప్‌(106) ఔట్‌ కాగా.. ఐదో వికెట్‌గా కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌(20) పెవిలియన్‌కు చేరాడు.భారత బౌలర్లలో ఇప్పటివరకు బుమ్రా మూడు వికెట్లు పడగొట్టగా.. ప్రసిద్ద్‌ కృష్ణ తలా వికెట్‌ సాధించారు. ఇంగ్లండ్‌ ఇంకా టీమిండియా స్కోర్‌కు 189 పరుగులు వెనకంజలో ఉంది. క్రీజులో ఇంగ్లండ్‌ బ్యాటర్లు హ్యారీ బ్రూక్‌(42), జేమీ స్మిత్‌(5) ఉన్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement