-
పేరు మార్చుకున్న రష్మిక.. కొత్త పేరు ఇదే!
రష్మిక మందన్న పేరు మార్చుకున్నారు. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న విజయ్ దేవరకొండ, రష్మిక.. ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత రష్మిక పేరు చివరన దేవరకొండ లేదా విజయ్ అని యాడ్ చేస్తారని చాలా మంది భావించారు. గతంలో చాలా మంది హీరోయిన్లు పెళ్లి చేసుకోగానే భర్త ఇంటిపేరు లేదా భర్త పేరుని తమ పేరుకు జోడించేవారు. కానీ రష్మిక అలా చేయలేదు. తన సోషల్ మీడియా ఖాతాలన్నీ పెళ్లికి ముందు ఉన్న పేరుతోనే ఉన్నాయి. దీంతో ఆమె పేరులో ఎలాంటి మార్పు ఉండదని అనుకున్నారు. అయితే తాజాగా రష్మిక కూడా తన పేరు చివరన భర్త ఇంటిపేరుని యాడ్ చేశారు. తాజాగా ఆమె భర్త విజయ్ దేవరకొండతో కలిసి అత్తాగారి సొంతూరు నాగర్కర్నూల్ జిల్లా తుమ్మన్పేటలో వెళ్లారు. అక్కడ ‘ది దేవరకొండ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో 2026 విద్యా సంవత్సరంలో 9, 10వ తరగతుల్లో అత్యుత్తమ మార్కులు సాధించి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన వారికి ఉపకారవేతనాలు అందజేశారు.ఈ సందర్భంగా రష్మిక తనని తాను రష్మిక మందన్న దేవరకొండగా పరిచయం చేసుకున్నారు. ‘ఈ రోజు రష్మిక మందన్న దేవరకొండలా మీ ముందు మాట్లాడుతున్నా. చాలా ఆనందంగా ఉంది. 9,10వ తరగతిలో ఫస్ట్, సెండర్ ర్యాంకులు సాధించి మీరు(విద్యార్థులను ఉద్దేశించి) నా కంటే ముందే ఉన్నారు. చాలా కష్టపడి ఈ ర్యాంకులు సాధించారు. లైఫ్లో కొన్నిసార్లు విన్ అవుతాం, కొన్నిసార్లు ఫెయిల్ అవుతాం.. కానీ ప్రతిసారి నేర్చుకుంటాం. పేరెంట్స్, టీచర్స్ నుంచి నేర్చుకొని గొప్పగా ఎదగండి.’ అని విద్యార్థులకు సూచించారు.అయితే రష్మిక తొలిసారి తనపేరుని రష్మిక మందన్న దేవరకొండ అని పరిచయం చేసుకోవడం విశేషం. సోషల్ మీడియా ఖాతాల్లో కూడా పేరు మార్చుకుంటారా లేదా అలానే ఉంచుతారా? చూడాలి. -
22 ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకున్నారు
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రస్తుతం బాధ్యతలు నిర్వహణలో బిజీగా ఉన్నారు. ఓవైపు రాజకీయాలు చూసుకుంటూనే మరోవైపు తనతో పాటు కలిసి నటించిన సినిమా సెలబ్రిటీలని ఎప్పటికప్పుడు కలుస్తూనే ఉన్నారు. సీఎం అయిన తర్వాత కోలీవుడ్కి చెందిన చాలామంది విజయ్ని కలిశారు. అయితే వాళ్లతో పోలిస్తే తాజాగా జరిగిన రీయూనియన్ ఎవర్గ్రీన్ అని చెప్పొచ్చు. అందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: వైరల్ 'చికిరి చికిరి' ఫుల్ వీడియో వచ్చేసింది)టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్ సిమ్రాన్.. ప్రస్తుతం సహాయ పాత్రలతో అడపాదడపా మూవీస్ చేస్తోంది. అయితే 1997-2004 మధ్య కాలంలో దళపతి విజయ్తో కలిసి నెరుక్కు నెర్ (1997), వన్స్ మోర్ (1997), తుళ్లత్త మనముమ్ తుళ్లుమ్ (1999), ప్రియమనవలె(2000), యూత్ (2002), ఉదయ(2004) తదితర చిత్రాలు చేసింది. వీటిల్లో వీరిద్దరూ కెమిస్ట్రీకి పెద్ద ఫ్యాన్ బేసే ఉంది. అలాంటిది మళ్లీ ఇన్నేళ్ల తర్వాత విజయ్ని కలిశానని చెబుతూ సిమ్రాన్ పోస్ట్ పెట్టింది.తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విజయ్ని నా కుటుంబంతో కలిసి కలుసుకోవడం ఆనందంగా అనిపించింది. సీఎం విజయ్ ఆప్యాయత, వినయం, నిజాయితీ ఇప్పటికీ అలానే ఉన్నాయి. ప్రజల ప్రేమని సంపాదించుకున్న ఆయన వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పు రాలేదు. తమిళనాడు అభివృద్ధి కోసం విజయ్ దూరదృష్టి, సంకల్పం ఎంతో స్ఫూర్తిదాయకం. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే ఆయన నాయకత్వానికి శుభాకాంక్షలు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా అని సిమ్రాన్ రాసుకొచ్చారు. సిమ్రాన్తో పాటు ఈమె ఇద్దరు కొడుకులు, భర్త ఉన్నారు.(ఇదీ చదవండి: హీరోయిన్గా ఫేమస్ తెలుగు యూట్యూబర్ నాగదుర్గ.. టీజర్ రిలీజ్) View this post on Instagram A post shared by SIMRAN (@actorsimranofficial) -
'నమ్మకం' లేదు
'నమ్మకం' లేదు -
లీటర్ పెట్రోల్.. 914 కిలోమీటర్ల మైలేజీ..
అసలే చమురు ధరలు మండిపోతున్నాయి. కారు రోడ్డు మీదకు వస్తే 15–20 కిలోమీటర్ల దూరానికే లీటరు చమురు ఆవిరైపోతుంది. ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వచ్చినా, వాటితో ఇబ్బందులు ఉండనే ఉంటున్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో అతి తక్కువ చమురుతోనే సుదూరాలకు పరుగు తీయగల కారును అమెరికాలోని ఉటా రాష్ట్రానికి చెందిన బ్రిగ్హామ్ యంగ్ యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించారు. ఈ కారు లీటరు పెట్రోలుకు ఏకంగా 914 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. మామూలు కార్లతో పోల్చుకుంటే, దీని బరువు కూడా చాలా తక్కువ. ఈ సూపర్ మైలేజీ కారు బరువు కేవలం 49 కిలోలు మాత్రమే! ఈ కారుకు దాని పనితీరుకు తగినట్లే ‘సూపర్ మైలేజ్’ అని పేరు పెట్టారు. అయితే, దీనిని రేసు ట్రాక్లపై పరుగులు తీయించడానికి ప్రయోగాత్మకంగా తయారు చేశారు. -
డోంట్ వర్రీ సార్! ఈసారి అమరావతి గ్రాఫిక్స్ ఏఐలో చేద్దాం!!
డోంట్ వర్రీ సార్! ఈసారి అమరావతి గ్రాఫిక్స్ ఏఐలో చేద్దాం!! -
గృహలక్ష్మి ఇప్పుడు... ఇన్వెస్ట్మెంట్ మహాలక్ష్మి
ఒకప్పుడు భారతీయ మహిళల ఆర్థిక ప్రపంచం.. బంగారు నగలు,పోస్టాఫీస్ సేవింగ్స్, చిట్ఫండ్లు, ఫిక్స్డ్ డిపాజిట్ల వరకే పరిమితమై ఉండేది. కుటుంబ భవిష్యత్తు కోసం భాగస్వామితో కలిసి అంతో ఇంతో పొదుపు చేసేవారు, సంపద పెంచాలి, పెంచుకోవాలి అనే తపన తక్కువగానే ఉండేది. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా దృశ్యం పూర్తిగా మారుతోంది. భర్త సంపాదించి ఇచ్చినా, తాను స్వయంగా కష్టపడి సంపాదించినా వచ్చే ప్రతి రూపాయిలో రిటైర్మెంట్ కలలు, విదేశీ యాత్రల లక్ష్యాలు, ఆర్థిక స్వాతంత్య్రఆశయాలు కూడా చేరుతున్నాయి. భారత మహిళలు సేవింగ్స్ నుంచి ఇన్వెస్టింగ్కి మారడం లేదు... సేవింగ్స్కే కొత్త అర్థం చెబుతున్నారు. – సాక్షి, వెల్త్ డెస్క్అమ్మమ్మ తరం బంగారం దాచింది. అమ్మ తరం ఫిక్స్డ్ డిపాజిట్లు వేసింది.ఇప్పుడు కూతురు తరం షేర్లు, ఈక్విటీలు, సిప్(సిస్టమేటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్)లలో పెట్టుబడులు పెడుతోంది. మూడు తరాలు... మూడు ఆర్థిక తత్వాలు. కానీ లక్ష్యం మాత్రం ఒక్కటే ... భవిష్యత్తు భద్రత. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే కొత్త తరం మహిళలు డబ్బును కేవలం దాచడం కాదు... దాచిన దానితో తిరిగి డబ్బు సంపాదించడం కూడా నేర్చుకుంటున్నారు. అందుకే భారత మహిళల చేతుల్లో ఇప్పుడు కేవలం నగల పెట్టెలు కాదు, మొబైల్ ఫోన్లలో మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోలు కూడా కనిపిస్తున్నాయి. మహిళలు కేవలం పొదుపుదారులుగానే కాకుండా, సమర్థవంతమైన ఇన్వెస్టర్లుగా ఎదుగుతున్నారు. సంప్రదాయ బంగారంతో పాటు మ్యూచువల్ ఫండ్లు,సిప్లు, ఈక్విటీ ఆధారిత పెట్టుబడులు, రిటైర్మెంట్ కార్పస్ నిర్మాణం దిశగా దూసుకెళ్తున్నారు.ఈ మార్పు కేవలం వ్యక్తిగత పెట్టుబడి ధోరణి కాదు. భారత ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యాన్ని తిరిగి నిర్వచిస్తున్న నిశ్శబ్ద విప్లవం.సంఖ్యల్లో మహిళల ఆర్థిక దూకుడు మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ వెలువరించిన గణాంకాలు మహిళల భాగస్వామ్యం ఎంత వేగంగా పెరుగుతోందో స్పష్టంగా చూపిస్తున్నాయి. 🔸 దేశీ పెట్టుబడుల్లో మహిళా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ల వాటా 25 శాతం దాటింది. 🔸 వ్యక్తిగత మ్యూచువల్ ఫండ్ ఏయూఎంలో వాటా 33 శాతం పైగా ఉంది. 🔸 మహిళల నిర్వహణలో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ఆస్తులు రూ.11.3 లక్షల కోట్లు 🔸 మొత్తం మ్యూచువల్ ఫండ్స్ ఇన్ఫ్లోలలో వాటా 35 శాతం 🔸 35 ఏళ్లలోపు పెట్టుబడులు ప్రారంభించిన మహిళలు 80శాతం ఈ గణాంకాలు ఒక కీలక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.నేటి తరం మహిళలు ఇప్పుడు కేవలం డబ్బు దాచడం కాదు... డబ్బుతో పని చేయించడం నేర్చుకుంటున్నారు.బంగారం నుంచి సిప్ లకు కాదు... బంగారంతో పాటు సిప్లకు మహిళలు బంగారాన్ని కొనడం పూర్తిగా మానేశారా అంటే లేదనే చెప్పాలి. వాస్తవానికి వారు సంప్రదాయ పెట్టుబడులను ఆధునిక ఆరి్ధక సాధనాలతో కలిపి సరికొత్త సమతుల్య పోర్ట్ఫోలియోలను నిర్మిస్తున్నారు. బంగారం అంతో ఇంతో తరచూ కొనడం ఇప్పటికీ వారికి కుటుంబ సంప్రదాయమే. ఆనందం కలిగించే విషయమే. బంగారం అత్యవసర సమయాల్లో లిక్విడిటీ అందిస్తుంది. పిల్లల ఉన్నత చదువులు, వివాహ అవసరాలకు, అనారోగ్య పరమైన ఖర్చుల విషయంలో భద్రతనిస్తుంది. అయితే దీర్ఘకాలిక సంపద పెరగాలంటే కాంపౌండింగ్ శక్తి అవసరమని కొత్త తరం మహిళలు గ్రహిస్తున్నారు. అందుకే ప్రతి నెలా సిప్ల రూపంలో క్రమశిక్షణతో పెట్టుబడులు పెడుతున్నారు.నేటి మహిళల కొత్త పెట్టుబడి సూత్రం..భద్రతకు బంగారం... సంపదకు సిప్ అనే మార్పునకు మూడు కారణాలున్నాయి.🔸 పెరిగిన ఆదాయాలు. కుటుంబంలో పెరుగుతున్న నిర్ణయాధికారం. ఐటీ, బ్యాంకింగ్, ఆతిథ్యం, ఆరోగ్యరంగం, కార్పొరేట్ సేవలు, స్టార్టప్లు, ఫ్రీలాన్సింగ్ రంగాల్లో ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో కుటుంబ ఆదాయం పెరుగుతోంది. మహిళలు కూడా కుటుంబ ఆర్థిక నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒకప్పుడు తండ్రి లేదా భర్త తీసుకునే పెట్టుబడి నిర్ణయాలను ఇప్పుడు మహిళలే చొరవచూపి స్వయంగా తీసుకుంటున్నారు.🔸 డిజిటల్ విప్లవం షేర్లు, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలంటే ఒకప్పుడు బ్రోకర్లు,బ్యాంక్ శాఖల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అనేక దరఖాస్తు ఫారాలు నింపాల్సి ఉండేది.నేడు స్మార్ట్ఫోన్ ద్వారా బ్యాంకుఖాతా, ఆధార్, పాన్ కార్డు ఉంటే చాలు స్మార్ట్ ఫోన్ ద్వారా డీమ్యాట్ అకౌంట్లు తెరిచే అవకాశం పెరిగింది. కేవలం పది నిమిషాల్లో సిప్ ఖాతాలు ప్రారంభించగలుగుతున్నారు. ఈ సాంకేతిక విప్లవమే లక్షలాది మహిళలను ఆర్థిక మార్కెట్లకు దగ్గర చేసింది.🔸 లక్ష్యాల కోసం పెట్టుబడులు గత తరాలు పిల్లల చదువు,పెళ్లిళ్ల అవసరాల కోసం మాత్రమే పొదుపు గురించి ఆలోచించేవి. కానీ నేటి ఆధునిక తరం మహిళలు మాత్రం వ్యక్తిగత రిటైర్మెంట్, విదేశీ విహార యాత్రలు, సొంత వ్యాపారాలు ప్రారంభించేందుకు, ఎమెర్జన్సీ అవసరాలకు ఇలా అనేక ప్రత్యేక లక్ష్యాలతో పెట్టుబడుల వైపు దూసుకెళుతున్నారు.మెరుగైన ఇన్వెస్టర్లుగా మహిళలు?గణాంకాలను పరిశీలిస్తే పెట్టుబడుల ప్రపంచంలో ఒక ఆసక్తికరమైన వాస్తవం వెలుగులోకి వస్తోంది. పురుషుల్లాగా మహిళలు వెంటవెంటనే కొనుగోలుఅమ్మకాలు జరపడంలేదు. ఏదో కారణంతో తరచూ పడిపోయే స్టాక్ మార్కెట్లో భయపడి పెట్టుబడులు ఉపసంహరించుకోవడంలేదు. దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టి క్రమశిక్షణతో కొనసాగుతున్నారు.మహిళా ఇన్వెస్టర్ల ప్రత్యేకత🔸 సిప్లను నిరంతరంగా కొనసాగించడం 🔸 దీర్ఘకాలిక దృష్టి 🔸 తక్కువ రిస్్కతో సమతుల్య పెట్టుబడులు 🔸 భావోద్వేగ నిర్ణయాలకు దూరంగా ఉండటం 🔸 లక్ష్యంతో పెట్టుబడి ప్రణాళికలు వేయడం ఈ కారణాల వల్ల మహిళల పోర్ట్ఫోలియోలు దీర్ఘకాలంలో మెరుగైన ఫలితాలు ఇస్తున్నాయని పరిశ్రమ విశ్లేషకులు చెబుతున్నారు.చిన్న పట్టణాల్లోనూ పెద్ద మార్పుమహిళల పెట్టుబడుల విప్లవం కేవలం దేశంలోని మెట్రో నగరాలకే పరిమితం కాలేదు. విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ వంటి టైర్2 (ద్వితీయ శ్రేణి) , టైర్3 తృతీయ శ్రేణి నగరాల్లో కూడా మహిళలు భారీగా సిప్ పెట్టుబడులు ప్రారంభిస్తున్నారు.ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి వచి్చన ఫైనాన్షియల్ కంటెంట్, యూట్యూబ్ ఛానళ్లు, డిజిటల్ ఫిన్టెక్ యాప్లు కూడా ఈ పెట్టుబడి విప్లవానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.ఆర్థిక స్వాతంత్య్రం అంటే జీతం కాదు... ఆస్తులుఆర్థిక స్వాతంత్య్రమంటే జీతం సంపాదించడం మాత్రమే కాదు.దాన్ని సంపదగా మార్చడమని నేటి మహిళలు కొత్త నిర్వచనం చెబుతున్నారు. ఆమె దృష్టిలో నిజమైన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే 🔸 తన పేరుమీద ఆస్తులు ఉండటం ళీ ఎమర్జెన్సీ ఫండ్ ఉండటం 🔸 తన రిటైర్మెంట్ కోసం ప్రత్యేక కార్పస్ నిర్మించుకోవడం 🔸 జీవితంలోని అనిశ్చిత పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవడం 🔸 ప్రతి మహిళ పర్సనల్ ఫైనాన్స్ చెక్లిస్ట్ తయారుచేసుకోవాలితనను తాను ఇలా ప్రశ్నించుకోవాలి 🔸 నా పేరుమీద పెట్టుబడులు ఉన్నాయా? 🔸 బంగారం, ఫిక్స్డ్ డిపాజిట్లకు మించి ఈక్విటీ లు, మ్యూచువల్ ఫండ్సులో ఇన్వెస్ట్చేస్తున్నానా? 🔸 రిటైర్మెంట్కు ప్రత్యేక కార్పస్ ఫండ్ ఉందా? 🔸 ప్రతి ఏడాది సిప్ మొత్తాన్ని పెంచుతున్నానా? 🔸 ఏదైనా కారణంతో ఒక సంవత్సరం ఆదాయం ఆగిపోతే ఆర్థికంగా నిలబడగలనా? చివరగా... భారత మహిళలు బంగారాన్ని వదిలేయడం లేదు. కానీ బంగారం ఒక్కటే భవిష్యత్తు కాదని అర్థం చేసుకుంటున్నారు. భద్రత కోసం బంగారం, స్థిరత్వం కోసం ఫిక్స్డ్ డిపాజిట్లు, సంపద సృష్టి కోసం మ్యూచువల్ ఫండ్లు అనే సమతుల్య పెట్టుబడి విధానాన్ని అవలంబిస్తున్నారు. నేటి మహిళల పెట్టుబడి నిర్ణయాలు రేపటి భారత ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది వేయబోతున్నాయి. కుటుంబ పొదుపులను సంపదగా, సంపదను ఆర్థిక స్వాతంత్య్రంగా మార్చుతున్న ఈ నిశ్శబ్ద విప్లవమే రాబోయే దశాబ్దంలో భారత వృద్ధికి కొత్త ఇంధనంగా మారనుంది. ఇంటి బడ్జెట్ను చూసుకునే మహిళ.. ఇప్పుడు దేశ సంపద నిర్మాణంలోనూ కీలక భాగస్వామి అవుతోంది. -
కొంపముంచిన అర్జున్ టెండూల్కర్
ముంబై లీగ్ టీ20 లీగ్-2026 విజేతగా ఎమ్ఎస్సి మరాఠా రాయల్స్ నిలిచింది. శనివారం వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో ఆర్క్స్ అంధేరిపై 8 పరుగుల తేడాతో విజయం సాధించిన మరాఠా రాయల్స్.. వరుసగా రెండో ఎంటీఎల్ టైటిల్ను కైవసం చేసుకుంది.ఈ తుది పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన మరాఠా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి కేవలం 154 పరుగులకే పరిమితమైంది. ఎమ్ఎస్సి బ్యాటర్లలో చిన్మయ్ రాజేష్ సుతార్(61) టాప్ స్కోరర్గా నిలవగా.. కెప్టెన్ సిద్దేశ్ లాడ్(33) కాస్త దూకుడుగా ఆడాడు. వీరిద్దరూ మినహా మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అంధేరి బౌలర్లలో అర్జున్ టెండూల్కర్ రెండు, శివమ్ దూబే, ముషీర్ ఖాన్ తలా వికెట్ సాధించారు.కొంపముంచిన అర్జున్అయితే 155 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆర్క్స్ అంధేరి సునాయసంగా ఛేదిస్తుందని అంతా అనుకున్నారు. కానా మరాఠా రాయల్స్ కంటే అంధేరి బ్యాటర్లు దారుణమైన ప్రదర్శన కనబరిచారు. ఆరంభంలోనే స్టార్ ఓపెనర్ ముషీర్ ఖాన్(0) వికెట్ను ఆర్క్స్ జట్టు కోల్పోయింది. ఈ క్రమంలో ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన అర్జున్ టెండూల్కర్ అంధేరి కొంపముంచాడు. జిడ్డు బ్యాటింగ్ చేస్తూ తర్వాత వచ్చిన బ్యాటర్లపై ఒత్తిడి పెంచాడు.కనీసం స్ట్రైక్ కూడా రోటేట్ చేయలేకపోయాడు. అతడు 12 బంతులు ఎదుర్కొని కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అంధేరి విజయానికి కావాల్సిన రన్రేట్ పెరిగిపోయింది. ఆ తర్వాత వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ ప్రసాద్ పవార్ అవుటైనప్పటికి, ఓపెనర్ దివ్యాన్ష్ సక్సేనా( 38 బంతుల్లో 50 పరుగులు) నిలకడగా ఆడుతూ గెలుపుపై ఆశలు రేకెత్తించాడు. అయితే దివ్యాన్ష్ ఔటయ్యక అంధేరి వికెట్ల పతనం మొదలైంది. ప్రగ్నేష్ కన్పిల్లెవార్(21 బంతుల్లో 28), కెప్టెన్ శివమ్ దూబే(15) వెంటవెంటనే ఔటయ్యారు. చివరిలో వేగంగా ఆడిన గౌరవ్ జాతర్ కూడా (17 బంతుల్లో 23 పరుగులు) కూడా 19 ఓవర్లో పెవిలియన్కు చెరాడు.ఈ క్రమంలో ఆఖరి ఓవర్లో అంధేరి విజయానికి 14 పరుగులు అవసరమవ్వగా.. మరాఠా బౌలర్ రాజే కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో మరాఠా రాయల్స్ ఛాంపియన్స్గా నిలవగా.. అంధేరి రన్నరప్తో సరిపెట్టుకుంది.చదవండి: IND vs AFG: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. వరల్డ్ రికార్డు బ్రేక్ -
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజజ్యేష్ఠ మాసం, తిథి: శు.పాడ్యమి ఉ.6.44 వరకు, తదుపరి విదియ తె.4.22 వరకు (తెల్లవారితే బుధవారం), నక్షత్రం: ఆరుద్ర రా.7.30 వరకు, తదుపరి పునర్వసు, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ఉ.8.05 నుండి 8.57 వరకు, తదుపరి రా.10.54 నుండి 11.38 వరకు,అమృత ఘడియలు: లేవు.సూర్యోదయం : 5.29సూర్యాస్తమయం : 6.31రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకుయమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు మేషం.... పరిచయాలు పెరుగుతాయి.స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. వాహనయోగం. ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం.వృషభం... మిత్రులతో కలహాలు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.మిథునం.... నూతన ఉద్యోగాలు పొందుతారు. సోదరులు, సోదరుల నుంచి కీలక సమాచారం. భూవివాదాల పరిష్కారం. పనులు సకాలంలో పూర్తి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు.కర్కాటకం.... రుణాలు చేయాల్సివస్తుంది. ప్రయాణాలు వాయిదా. పనుల్లో అవాంతరాలు. అనారోగ్యం. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగులకు శ్రమాధిక్యం.సింహం.... కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఊహించని పదోన్నతులు.కన్య.... దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు ఫలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతబాకీలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.తుల... మిత్రులను కలుసుకుంటారు. కుటుంబంలో స్వల్ప వివాదాలు. అనుకోని ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారులకు స్వల్పలాభాలు. ఉద్యోగులకు బాధ్యతలు మీదపడతాయి.వృశ్చికం.... పనుల్లో ఆటంకాలు. దుబారా వ్యయం. ఆరోగ్య సమస్యలు. అనుకోని ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.ధనుస్సు...... కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తిలాభం. వృత్తి, వ్యాపారాలలో పూర్వవైభవం.మకరం.....శ్రమకు ఫలితం కనిపిస్తుంది. భూములు, వాహనాలు కొంటారు. రావలసిన సొమ్ము అందుతుంది. శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.కుంభం...పనులు నిదానంగా సాగుతాయి. ఆరోగ్య, ఆర్థిక సమస్యలు. కుటుంబసభ్యులతో విభేదాలు. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.మీనం.....వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. బంధువర్గంతో అకారణంగా విభేదాలు. అనారోగ్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగులకు పనిభారం. -
CM Vijay: సీఎం విజయ్ విడాకుల కేసు.. రెండోసారి కూడా..!
విజయ్ సీఎం కాకముందే తన భార్య సంగీతతో విడాకుల వివాదం మొదలైంది. మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నారని ఆరోపిస్తూ ఆయన భార్య సంగీత స్వర్ణలింగం డివోర్స్ పిటిషన్ దాఖలైంది. తమిళనాడు ఎన్నికల ముందే ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ కేసును చెంగల్పట్టు మహిళా కోర్టు విచారిస్తోంది. తాజాగా సీఎం విజయ్, సంగీత విడాకులపై సోమవారం విచారణకు వచ్చింది.ఈ కేసును విచారించిన చెంగల్పట్టు మహిళా కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్ తదుపరి విచారణ ఆగస్టు 7వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసును మొదట ఏప్రిల్ 20న విచారణ చేపట్టగా.. అప్పట్లో విజయ్, సంగీత హాజరు కాలేదు. దీంతో జూన్ 15న హాజరు కావాలని చెంగల్పట్టు కుటుంబ న్యాయస్థానం వారిని ఆదేశించింది. ఇవాళ కూడా హాజరు కాకపోవడంతో మరోసారి వాయిదా వేసింది.కాగా.. విజయ్, సంగీత 1999లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు తమ 27 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికేందుకు సిద్ధమయ్యారు. ఈ ఏడాది జరిగిన తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ తమిళగ వెట్రి కజగం (టీవీకే) చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. దీంతో విజయ్ మే 10న తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. -
చహల్ విధ్వంసం.. 29 బంతుల్లోనే శతక్కొట్టాడు!
టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చహల్ బ్యాట్తో ఇరగదీశాడు. కేవలం 29 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఆకాశమే హద్దుగా సిక్సర్ల వర్షం కురిపిస్తూ సెంచరీ చేశాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికా బ్యాటింగ్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న ‘రికార్డు’ను బద్దలుకొట్టాడు.ఇంతటి పవర్ హిట్టరా? చహల్ ఇంతటి పవర్ హిట్టరా? ఎప్పుడూ అతడి బ్యాటింగ్ చూడలేదే! అంటూ ఆశ్చర్యపోతున్నారా?!.. ఆగండాగండి.. చహల్ శతక్కొట్టింది.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ నిర్వహించే ఓ యూట్యూబ్ చాలెంజ్ షోలో!..శ్రేయస్ అయ్యర్ 22 బంతుల్లోనే..అవును.. పీటర్సన్ నిర్వహించే ఈ యూట్యూబ్ షోలో ఇప్పటికే పలువురు భారత క్రికెటర్లు, విదేశీ ఆటగాళ్లు పాల్గొన్నారు. డివిలియర్స్ 30 బంతుల్లో శతకం చేయగా.. టీమిండియా స్టార్ శ్రేయస్ అయ్యర్ 22 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. ఇక భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇటీవల 25 బంతుల్లో శతక చాలెంజ్ను పూర్తి చేశాడు.తాజాగా చహల్ కూడా ఈ చాలెంజ్ను స్వీకరించాడు. యాభై బంతుల్లో సెంచరీ కొట్టాలని పీటర్సన్ సవాలు చేశాడు. ఇక తొలి బంతి గంటకు 51 మీటర్ల వేగంతో వస్తుందని.. అయితే, ఆ తర్వాత ప్రతీ బంతికి 1 మీటర్ వేగం మేర పెరుగుతుందని పీటర్సన్ షరతు విధించాడు. అంతేకాదు.. చహల్ కోసం బౌండరీని 40 మీటర్లకు కుదించాడు.14 బంతుల్లోనే 50 పరుగులుఈ క్రమంలో మొదటి బంతికే సిక్సర్ బాదిన చహల్.. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించాడు. మధ్యలో చాలాసార్లు ఫీల్డర్లు అతడి క్యాచ్ జారవిడవడంతో లైఫ్ పొందిన చహల్.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఈ క్రమంలో 14 బంతుల్లోనే 50 పరుగులు మార్కు అందుకున్నాడు చహల్.29వ బంతికి సిక్సర్ బాది శతకంఆ తర్వాత కవర్స్ మీదుగా సిక్సర్ బాదే క్రమంలో చహల్ ఫీల్డర్కు దొరికిపోయాడు. అయితే, ఇందుకు ప్రతిగా అతడి స్కోరులో ఐదు పరుగుల కోత విధించిన పీటర్సన్.. తర్వాత ఆటను కొనసాగించాల్సిందిగా సూచించాడు. ఈ క్రమంలో 25 బంతుల్లో 90 పరుగులు పూర్తి చేసుకున్న చహల్.. 29వ బంతికి సిక్సర్ శతక మార్కు అందుకున్నాడు.చహల్ విధ్వంసకర ఇన్నింగ్స్లో ఏకంగా 17 సిక్సర్లు ఉండటం విశేషం. ఇక పీటర్సన్ 50 బంతుల్లో సెంచరీ చేయాలనే షరతు విధించగా.. ఈ స్పిన్ బౌలర్ మరో 21 బంతులు మిగిలి ఉండగానే.. అంటే 29 బంతుల్లో శతక్కొట్టడం మరో విశేషం. చదవండి: IND vs SL: కొంప ముంచేశాడు!
