breaking news
-
ఈ రాశి వారు కొత్త పనులను ప్రారంభిస్తారు.. ఆస్తిలాభం పొందుతారు
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తిక మాసం, తిథి: బ.ద్వాదశి తె.5.10 వరకు (తెల్లవారితే సోమవారం), తదుపరి త్రయోదశి, నక్షత్రం: హస్త రా.3.33 వరకు, తదుపరి చిత్త, వర్జ్యం: ఉ.10.59 నుండి 12.41 వరకు, దుర్ముహూర్తం:సా.3.52 నుండి 4.35 వరకు, అమృత ఘడియలు: రా.9.10 నుండి 10.54 వరకు.సూర్యోదయం : 6.09సూర్యాస్తమయం : 5.21రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకుయమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు మేషం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థికాభివృద్ధి. నూతన పరిచయాలు వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులు సమస్యలు అధిగమిస్తారు..వృషభం: కుటుంబంలో సమస్యలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. బంధువులతో విభేదాలు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారులు నిదానం పాటించాలి. ఉద్యోగులకు పనిభారం తప్పదు.మిథునం: ముఖ్య కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.కర్కాటకం: దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం. విందువినోదాలు. పరపతి పెరుగుతుంది. కార్యజయం. వాహనయోగం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.సింహం: ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో ఆటంకాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు ఒడిదుడుకులు.కన్య: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు.తుల: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగులకు శ్రమ తప్పదు. మిత్రులతో మాటపట్టింపులు.వృశ్చికం: నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. యత్నకార్యసిద్ధి. కీలక సమాచారం. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు చికాకులు తొలగుతాయి..ధనుస్సు: మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాల సందర్శనం. ఆస్తిలాభం. యత్నకార్యసిద్ధి. నూతన విద్యావకాశాలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు హోదాలు.మకరం: పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ తప్పదు. బంధుమిత్రులతో వివాదాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.కుంభం: రుణాలు చేస్తారు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమ పెరుగుతుంది. పనుల్లో జాప్యం. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి. దైవదర్శనాలు.మీనం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. -
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం...ఉత్సాహంగా అనుకున్న కార్యాలు పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. చిన్ననాటి స్నేహితులతో మంచీచెడ్డా విచారిస్తారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులకు ఒత్తిడులు తొలగుతాయి. రాబడి సంతృప్తినిస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. వ్యాపారులకు మరింత అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగులకు విధుల్లో చికాకులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు కృషి ఫలిస్తుంది. కళాకారులు, క్రీడాకారులకు ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో శారీరక రుగ్మతలు. దూరప్రయాణాలు. పసుపు, ఎరుపు రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.వృషభం...చేపట్టిన కార్యాలు దిగ్విజయంగా సాగుతాయి. బంధువులు లేదా స్నేహితుల నుంచి ముఖ్య సందేశం అందుతుంది. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు పొందుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆశించిన ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడతారు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు లభిస్తుంది. కళాకారులు అనుకున్నది సాధిస్తారు. క్రీడాకారులు, పరిశోధకులకు అనుకూల సమాచారం. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. మానసిక అశాంతి. ధనవ్యయం. నీలం, ఆకుపచ్చ రంగులు. సూర్యారాధన చేయండి.మిథునం....రాబడి ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్య కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. కొన్ని వేడుకలకు ఎట్టకేలకు హాజరవుతారు. ఆస్తి వ్యవహారాలలో సమస్యలు తీరతాయి. బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థుల్లోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు కొత్తగా సంస్థలు ప్రారంభించే వీలుంది. ఉద్యోగులకు అనుకోని బాధ్యతలు లభిస్తాయి. రాజకీయవేత్తల యత్నాలు సఫమవుతాయి. కళాకారులు, క్రీడాకారులకు కొన్ని అవకాశాలు దక్కుతాయి. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. శారీరక రుగ్మతలు. గులాబీ, తెలుపు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.కర్కాటకం...వీరికి అన్ని విధాలా అనుకూల సమయమే. అప్రయత్నకార్యసిద్ధి. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. గృహయోగం కలిగే సూచనలు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. నిరుద్యోగులకు కొంత ఊరట లభిస్తుంది. ఆదాయం కొంత మెరుగుపడి అవసరాలు తీరతాయి. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారులు లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగులకు మరిన్ని ప్రశంసలు అందుతాయి. పారిశ్రామికవేత్తలకు అనూహ్యమైన అవకాశాలు లభిస్తాయి. వారం మధ్యలో ఖర్చులు అధికం. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. నీలం, ఆకుపచ్చ రంగులు. దేవీస్తోత్రాలు పఠించండి.సింహం...అనుకున్న కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురుకావచ్చు. ఆదాయవ్యయాలు సమానంగా ఉంటాయి. తొందరపాటు మాటలతో బంధువులతో వివాదాలు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. చిన్ననాటి స్నేహితులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. ఒక ఆసక్తికర సమాచారం అందుతుంది. నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. దేవాలయాలు సందర్శిస్తారు. . వ్యాపారులకు స్వల్ప లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఊహించని మార్పులు ఉంటాయి. రాజకీయవేత్తలకు చికాకులు తప్పకపోవచ్చు. కళాకారులు, క్రీడాకారులకు అవకాశాలు చేజారతాయి. వారం మధ్యలో ధనలబ్ధి. పరిచయాలు పెరుగుతాయి. ఆహ్వానాలు అందుతాయి.. ఎరుపు, పసుపు రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.కన్య...కొన్ని సమస్యలు ఎదురైనా నేర్పుగా పరిష్కరించుకుంటారు. బంధువులు, స్నేహితులతో వివాదాలు సర్దుకుంటాయి. ముఖ్యమైన కార్యక్రమాలు కొన్ని అనుకున్న సమయానికి పూర్తి కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆస్తి విషయాలలో ఒప్పందాలు చేసుకుంటారు. సోదరుల నుంచి ముఖ్య సందేశం. వాహనయోగం. వ్యాపారులు అవరోధాలు అధిగమిస్తారు. పెట్టుబడులకు మార్గం ఏర్పడుతుంది. ఉద్యోగులకు విధుల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారులు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం. వారం చివరిలో వృ«థా ఖర్చులు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. నృసింహస్తోత్రాలు పఠించండి.తుల....అనుకున్న కార్యాలు కొంత నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలులో వెనుకడుగు వేస్తారు. రాబడి కొంత ఆశాజనకమే. రుణభారాలు తొలగుతాయి. చిరకాల ప్రత్యర్థులు మీకు అండగా నిలుస్తారు. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు సఫలం. కాంట్రాక్టర్లకు కొంత అనుకూల సమయం. దైవకార్యాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణయత్నాలు వేగవంతం చేస్తారు. విద్యార్థులకు అనుకూల సమాచారం అందుతుంది. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగులకు మరిన్ని మార్పులు ఉంటాయి. రాజకీయవేత్తలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. కళాకారులు, క్రీడాకారులకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో శారీరక రుగ్మతలు. దూరప్రయాణాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. గులాబీ, తెలుపు రంగులు. శ్రీరామస్తోత్రాలు పఠించండి.వృశ్చికం...అనుకున్నది సాధించే వరకూ విశ్రమించరు. ఆత్మీయులు మరింత సహకరిస్తారు. సమాజంలో విశేష గౌరవం పొందుతారు. ఏ కార్యక్రమమైనా తేలిగ్గా పూర్తి చేస్తారు. వాహనాలు, విలువైన వస్తువులు కొంటారు. సోదరుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. దేవాలయాలు సందర్శిస్తారు. స్థిరాస్తుల కొనుగోలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగులకు విధులలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. పారిశ్రామికవేత్తలకు కొత్త ఆశలు. క్రీడాకారులు, పరిశోధకులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో వృథా ఖర్చులు. ఆరోగ్య సమస్యలు. ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు, ఆంజనేయ దండకం పఠించండి.ధనుస్సు...రాబడి మరింత ఆశాజకనంగా ఉంటుంది. అనుకున్న కార్యాలు సజావుగా సాగుతాయి. చిన్ననాటì స్నేహితులను కలుసుకుని కష్టసుఖాలు పంచుకుంటారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. దైవకార్యాలలో పాల్గొంటారు. విద్యార్థులకు ఒక సమాచారం ఊరటనిస్తుంది. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఒక పాత సంఘటన గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారులకు కొత్త భాగస్వాములు సహకరిస్తారు. ఉద్యోగులు బాధ్యతల విషయంలో రాజీలేకుండా పనిచేస్తారు. రాజకీయవేత్తలకు ఊహించని పదవులు దక్కుతాయి. పరిశోధకులు, క్రీడాకారుల ఆశలు ఫలించే సమయం. వారం చివరిలో అనారోగ్యం. స్నేహితులతో తగాదాలు. గులాబీ, నేరేడు రంగులు, శ్రీదుర్గాదేవి స్తోతాలు పఠించండి.మకరం...కార్యక్రమాలలో ప్రతిబంధకాలు తొలగుతాయి. ఆదాయం గతం కంటే మెరుగుపడుతుంది. బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. రియల్ ఎస్టేట్ల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు కీలక సమాచారం అందుతుంది. మీ కార్యదీక్షకు కుటుంబసభ్యులు సహకరిస్తారు. దైవకార్యాలలో పాల్గొంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పరపతి పెరుగుతుంది. వ్యాపారులకు మరింత లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగులకు హోదాలు సంతోషం కలిగిస్తాయి. కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. క్రీడాకారులు మరిన్ని విజయాలు సాధిస్తారు. వారం ప్రారంభంలో ఆకస్మిక ప్రయాణాలు. అనుకోని ఖర్చులు. తెలుపు, నీలం రంగులు. అంగారక స్తోత్రాలు పఠించండి.కుంభం....పట్టుదలతో కార్యక్రమాలను పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవమర్యాదలు పొందుతారు. ఊహించని విధంగా ఆదాయం సమకూరుతుంది. విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. కొన్ని వేడుకలకు హాజరవుతారు. దైవారాధన కార్యక్రమాలు చేపడతారు. కాంట్రాక్టర్లకు అనుకూల సమయం. చిన్ననాటి స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారులకు పెట్టుబడులు ఉత్సాహాన్నిస్తాయి, లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు ఉన్నత స్థితి దక్కే అవకాశం. పారిశ్రామికవేత్తలకు శుభవర్తమానాలు. పరిశోధకులు, వైద్యుల సేవలకు గుర్తింపు లభిస్తుంది. వారం ప్రారంభంలో కుటుంబంలో చికాకులు. శారీరక రుగ్మతలు. నలుపు, ఆకుపచ్చ రంగులు. విష్ణుధ్యానం చే యండి.మీనం....కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. కొంత కష్టించినా ఫలితం కనిపిస్తుంది. విద్యార్థుల యత్నాలు అనుకూలిస్తాయి. దైవకార్యాలలో పాల్గొంటారు. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. మీ మనస్సుకు తోచిన విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. శత్రువులను కూడా అనూకూలంగా మలచుకుంటారు. వాహనసౌఖ్యం. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు వివాదాలు సర్దుకుంటాయి. రాజకీయవేత్తలు, కళాకారులకు ఊహించని శుభవార్తలు. పరిశోధకులకు మంచి గుర్తింపు లభిస్తుంది. వారం మధ్యలో స్వల్ప అనారోగ్యం. చికాకులు. బంధువర్గంతో తగాదాలు.గులాబీ, పసుపు రంగులు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి. -
అమరావతి గురించి అడిగితే హైదరాబాద్ను డెవలప్ చేశానని అంటున్నాడ్సార్
అమరావతి గురించి అడిగితే హైదరాబాద్ను డెవలప్ చేశానని అంటున్నాడ్సార్ -
IPL 2026: కెప్టెన్ పేరును ప్రకటించిన సీఎస్కే
ఐపీఎల్-2026 మినీ వేలానికి (IPL 2026 Auction) ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కీలక నిర్ణయం తీసుకుంది. పదమూడేళ్లుగా తమతో ఉన్న రవీంద్ర జడేజాను రాజస్తాన్ రాయల్స్కు ట్రేడ్ చేసింది. జడ్డూకు బదులుగా రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ (Sanju Samson)ను జట్టులోకి చేర్చుకుంది.ఏకంగా రూ. 18 కోట్లుసంజూ కోసం సీఎస్కే ఏకంగా రూ. 18 కోట్లు చెల్లించగా.. రాయల్స్ మాత్రం జడ్డూ ధరను రూ. 18 కోట్ల నుంచి రూ. 14 కోట్లకు తగ్గించింది. జడేజాతో పాటు సామ్ కర్రాన్ను సీఎస్కే నుంచి ట్రేడ్ చేసుకుంది. ఇక కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్కు సీఎస్కే ఇంతటి ప్రాధాన్యం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.కెప్టెన్ పేరును ప్రకటించిన సీఎస్కేఈ నేపథ్యంలోనే సంజూకు సీఎస్కే కెప్టెన్సీ అప్పగిస్తారనే అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. అయితే, ఈ ఊహాగానాలకు సీఎస్కే ఫ్రాంఛైజీ స్వయంగా తెరదించింది. రుతురాజ్ గైక్వాడ్నే తమ కెప్టెన్గా కొనసాగిస్తామని శనివారం స్పష్టం చేసింది. ‘‘ముందుకు నడిపించే సారథి.. మా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్’’ అంటూ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ధ్రువీకరించింది.వైస్ కెప్టెన్గా?అంతేకాదు.. సంజూను వికెట్ కీపర్గానూ ఉపయోగించుకునేందుకు సీఎస్కే సిద్ధంగా లేనట్లే. దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని ఉండగా.. కీపింగ్ సేవలు వేరే ఎవరి చేతికి ఇచ్చేందుకు ఫ్రాంఛైజీ ఆసక్తి చూపదన్నది బహిరంగ రహస్యమే. కాబట్టి సంజూ సీఎస్కేలో ఓ సాధారణ క్రికెటర్గా మాత్రమే ఉంటాడు. అయితే, టాపార్డర్లో అతడు కీలక ఆటగాడు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ రుతుకు డిప్యూటీగా వైస్ కెప్టెన్గా నియమితుడైనా ఆశ్చర్యం లేదు.కేవలం నాలుగే గెలిచికాగా గత నాలుగు సీజన్లుగా రాజస్తాన్ రాయల్స్ సారథిగా ఉన్న సంజూ.. 2022లో జట్టును ఫైనల్కు చేర్చాడు. ఇదిలా ఉంటే.. 2024 సీజన్లో ధోని నుంచి పగ్గాలు అందుకున్న రుతురాజ్ కెప్టెన్గా ఇంత వరకు తనదైన ముద్ర వేయలేదు. తాజా ఎడిషన్లో గాయం కారణంగా అతడు మధ్యలోనే నిష్క్రమించగా.. మళ్లీ ధోనినే జట్టును ముందుకు నడిపించాడు.అయితే, ఈసారి సీఎస్కే ప్రదర్శన మరీ దారుణంగా ఉంది. పద్నాలుగింట కేవలం నాలుగే గెలిచి పాయింట్ల పట్టికలో చిట్టచివరన పదోస్థానంలో నిలిచింది. అందుకే ఐపీఎల్-2026కు ముందే చాలా మంది ఆటగాళ్లను వదిలించుకున్న సీఎస్కే.. వేలంలో మెరికల్లాంటి ప్లేయర్లను కొనుగోలు చేయాలనే వ్యూహంతో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ అట్టి పెట్టుకున్న ఆటగాళ్లు (CSK Retention List)రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్, ఎంఎస్ ధోనీ, ఉర్విల్ పటేల్, సంజు శాంసన్ (RR నుంచి ట్రేడింగ్), శివమ్ దూబే, జామీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జన్ప్రీత్ సింగ్, నాథన్ ఎల్లిస్, శ్రేయాష్ గోపాల్, ముకేశ్ చౌదరి.చెన్నై సూపర్ కింగ్స్ విడిచిపెట్టిన ఆటగాళ్లుమతీశ పతిరణ, డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, దీపక్ హుడా, వన్ష్ బేడి, సి ఆండ్రీ సిద్దార్థ్, షేక్ రషీద్, కమ్లేశ్ నాగర్కోటి, రవీంద్ర జడేజా (ట్రేడింగ్), సామ్ కర్రాన్ (ట్రేడింగ్).చదవండి: వెంకటేశ్ అయ్యర్కు భారీ షాక్.. పది ఫ్రాంఛైజీలు విడిచిపెట్టిన ఆటగాళ్లు వీరే -
సంతోషంలో పింకీ.. గ్రాండ్గా కొడుకు బారసాల ఫంక్షన్
తెలుగు సినీ నటి పింకీ సుదీప (Pinky Sudeepa) తల్లిగా ప్రమోషన్ పొందింది. తనకు కొడుకు పుట్టాడన్న శుభవార్తను ఆలస్యంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాజాగా బాబు బారసాల ఫంక్షన్ ఘనంగా చేసింది. ఈ మేరకు ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది. అందులో బాబును నవమోసాలు మోసిన సుదీప పొట్టను ఆమె భర్త శ్రీరంగనాథ్ ఆప్యాయంగా ముద్దాడాడు. తర్వాత దంపతులిద్దరూ బాబును ఎత్తుకుని చూపించారు. ఇది చూసిన అభిమానులు ఆమెకు మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.సినిమాసుదీప.. 1994లో ధర్మరాజు ఎం.ఏ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. మా అన్నయ్య, అల్లుడుగారు వచ్చారు, బొమ్మరిల్లు, స్టాలిన్, బిందాస్, మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రాల్లో నటించింది. నువ్వు నాకు నచ్చావ్ మూవీతో పింకీగా పాపులారిటీ తెచ్చుకుంది. తెలుగు బిగ్బాస్ ఆరో సీజన్లోనూ పాల్గొంది. షోలో ఉన్నప్పుడు... తనకు గర్భ స్రావం అయిన విషయాన్ని చెప్తూ ఎమోషనలైంది. తాను 2015లో తొలిసారి గర్భం దాల్చానని, కానీ థైరాయిడ్ ఎక్కువవడం వల్ల బిడ్డను కోల్పోయానని కన్నీళ్లు పెట్టుకుంది. మళ్లీ పదేళ్ల తర్వాత పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. View this post on Instagram A post shared by Pinky Sudeepa (@pinky_sudeepaofficial) చదవండి: పెళ్లిరోజే గుడ్న్యూస్ చెప్పిన బాలీవుడ్ హీరో -
పని చేయకున్నా జీతాలివ్వాలా?
సాక్షి, అమరావతి/ సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఉక్కు కార్మికులపై సీఎం చంద్రబాబు నోరు పారేసుకున్నారు. ఏ పనీ చేయకుండా పడుకొని జీతాలు ఇవ్వమంటే ఎలా సాధ్యమవుతుందని మండిపడ్డారు. ‘మేం పని చేయం.. అయినా కేంద్రం, రాష్ట్రం డబ్బులు ఇవ్వాలంటే కుదరదు’ అంటూ రెచ్చిపోయారు. శనివారం సీఐఐ పెట్టుబడుల సమావేశ వివరాలు తెలియజేయడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓ విలేకరి విశాఖ స్టీల్ పరిశ్రమ పరిస్థితిపై ప్రశ్న అడగ్గానే చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా వస్తున్న ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ను మెచ్చుకుంటూ కార్మికుల వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్కు నష్టాలు వస్తున్నాయంటూ శివాలెత్తారు. దేశ వ్యాప్తంగా అన్ని స్టీల్ ప్లాంటులు లాభాల్లో నడుస్తుంటే ఒక్క వైజాగ్ స్టీల్ మాత్రమే ఎందుకు నష్టాల్లో నడుస్తోంది.. ఇందుకు మీరు బాధ్యులు కారా అంటూ నిలదీశారు. ‘ఇప్పటికే రూ.12,000 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించాం.. ప్రాపర్టీ ట్యాక్స్ వదులుకున్నాం.. సెక్యురిటీలిచ్చాం.. ఇలా ప్రతిసారి పని చేయం.. అయినా డబ్బులు ఇవ్వాలంటే ఎలా? ఎన్నిసార్లు డబ్బులివ్వాలి మీకు? ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ.. మనం కష్టపడి పని చేయాలి.. పని చేయకుండా తెల్ల ఏనుగులా మారితే ఎలా?’ అని అన్నారు. పక్కనే కొత్తగా మరో స్టీల్ ప్లాంట్ వస్తోందని, అది లాభాల్లో నడుస్తుంది చూడండని చెప్పారు. ‘ పబ్లిక్ సెక్టార్ కంపెనీలో ఉండి బెదిరిస్తే ఎలా? ఇలాగే ఈ మధ్య ఒక కెమికల్ కంపెనీలో చేస్తే వెంటనే పీడీ యాక్ట్ తీసుకొచ్చి వారిని దారిలోకి తెచ్చా’ అని విశాఖ కార్మికులను హెచ్చరించారు. ఇక నుంచి ప్రతి 3 నెలలకోసారి విశాఖ స్టీల్పై సమీక్షిస్తానని, 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి వాటిని ఎన్నో చూశానన్నారు. విశాఖ స్టీల్ కార్మికులు పద్ధ్దతి మార్చుకోకపోతే కంపెనీ వేరే రాష్ట్రాలకు పోతుందన్నారు. మిట్టల్ స్టీల్పై ప్రేమ ఒకవైపు విశాఖ స్టీల్ ప్లాంట్పై ప్రశ్న అడిగిన విలేకరిపై నువ్వు చదువుకున్నవాడివేనా అంటూ ఎగతాళి చేస్తూ విశాఖ స్టీల్ కార్మికులపై ఒంటికాలిపై లేచిన చంద్రబాబు ఆర్సెలర్ మిట్టల్ స్టీల్పై తనకున్న ఆవ్యాజ ప్రేమను పలుమార్లు వ్యక్తం చేశారు. లోకేశ్ మాట్లాడి ఈ కంపెనీని రాష్ట్రానికి తీసుకొచ్చాడన్నారు. ఈ కంపెనీకి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండీసీ ముడి ఇనుమును లారీల ద్వారా సరఫరా చేస్తానంటే మిట్టల్ స్టీల్ గొట్టాలు (స్లరీ) ద్వారా సరఫరా చేయాలని కోరిందని చెప్పారు. అయితే దీనిపై కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో తాను స్వయంగా మాట్లాడినా పనికాకపోతే.. ప్రధాని మోదీని కలిసి ఒకటికి రెండుసార్లు గట్టిగా చెప్పి పనిచేయించానని తెలిపారు. చరిత్రలో ఎక్కడా జరగనంత వేగంగా అన్ని అనుమతులు మంజూరు చేయించామన్నారు. ఈ కంపెనీ త్వరలోనే లాభాల్లోకి వస్తుందంటూ కితాబు ఇచ్చారు.చంద్రబాబు బుకాయిస్తున్నారు స్టీల్ ప్లాంట్ విషయంలో సీఎం చంద్రబాబు బుకాయిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం, కుట్రపూరితం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.12,500 కోట్లలో కార్మికుల సంక్షేమానికి 10 రూపాయలు కూడా ఉపయోగించలేదు. ఆ డబ్బులు మొత్తం బ్యాంకులకు కట్టడానికే సరిపోయాయి. పరిశ్రమ నడుస్తున్నప్పుడు ఎవరూ ప్రశ్నించరు. ప్రభుత్వం చేయకపోతేనే అడుగుతారు. రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు కార్మికులకు జీతాలు ఆగలేదు. ఇప్పుడు నడవడం లేదు కాబట్టి అడుగుతున్నాం. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తామని ఒక పక్క కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెబుతోంది. చంద్రబాబు బుకాయిస్తే ఎలా? ఎంపీలు అడిగితే ప్రైవేటీకరణ చేస్తామని రాత పూర్వకంగా చెబుతోంది. తాము అధికారంలోకి వస్తే ప్రైవేటీకరణ నుంచి తప్పిస్తామని మీరు మా నిరసన టెంట్వ ద్దకు వచ్చి చెప్పలేదా? ఇప్పుడు ఆ హామీని ఎందుకు నిలబెట్టుకోవడం లేదు? ముడిసరుకు పూర్తి స్థాయిలో ఇస్తే ప్రభుత్వాలను డబ్బులు అడగాల్సిన అవసరం లేదు. గనులు లేవు కాబట్టి ఉత్పత్తి తగ్గుతోంది. – డి.వి.రమణారెడ్డి, వైఎస్సార్టీయూసీ ప్రధాన కార్యదర్శికార్మికులపై నెపం నెట్టడం తగదు స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి రాకపోవడానికి కార్మికులు కారణం కాదు. ప్రభుత్వ, యాజమాన్య విధానాల వల్ల మాత్రమే ఈ పరిస్థితి తలెత్తింది. పరిశ్రమలో 45 రోజులకు సరిపడా ముడి సరుకు నిల్వ ఉండాలి. ఈరోజు లైమ్ లేకపోవడం వల్ల ఉత్పత్తి ఆపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఎవరన్నది చంద్రబాబే చెప్పాలి. దీనికి నూరు శాతం యాజమాన్యానిదే బాధ్యత. ప్లాంట్లో మెషినరీ పాతదైపోయింది. మరమ్మతులకు సంబంధించి స్పేర్ పార్ట్స్ కూడా ఇవ్వడం లేదు. ఉత్పత్తి కోసం యాజమాన్యం, ప్రభుత్వం ప్లానింగ్ చేయాలి. అది మానేసి కార్మికులపై తోసేయడం సరికాదు. – జె.అయోధ్యరామ్, సీఐటీయూ ప్రధాన కార్యదర్శివైట్ ఎలిఫెంట్తో పోల్చడం తగదు విశాఖ స్టీల్ ప్లాంట్ను చంద్రబాబు వైట్ ఎలిఫెంట్ (తెల్ల ఏనుగు)తో పోల్చడం ఆయన స్థాయికి తగదు. ఈ పరిశ్రమ లక్ష కోట్ల రూపాయలు ఈ దేశానికి చెల్లించి ఉపయోగపడింది. సొంత గనులు లేకపోయినా లాభాలు సాధించింది. పథకం ప్రకారం ఈ కంపెనీని నీరుగార్చుతున్నారు. ఈ సమయంలో చంద్రబాబు ఈ ప్రకటన చేయడం కార్మికులను కించపరచడమే. దేశంలో నష్టాలు వచ్చిన అన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమలకు రూ.వేల కోట్ల సహాయం చేశారు. భద్రావతి, సేలం, బిలాయ్ స్టీల్ ప్లాంట్లకు రూ.65 వేల కోట్లు ప్యాకేజీ ఇచ్చారు. సొంత మైన్స్ ఉన్నప్పటికీ అవి 30 ఏళ్ల నుంచి నష్టాల్లోనే ఉన్నాయి. మైన్స్ లేకుండా లాభాల్లో ఉన్న కంపెనీ విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక్కటే. వరుసగా అందరినీ ఇళ్లకు పంపిస్తూ ఇలా మాట్లాడటం భావ్యం కాదు. – డి.ఆదినారాయణ, ఉక్కు గుర్తింపు సంఘం ప్రధాన కార్యదర్శి ప్లాంట్ను చంపేయాలని చూస్తున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ 3 మిలియన్ టన్నుల స్థాయి ఉన్నప్పుడు బ్రహ్మాండమైన ఉత్పత్తిని సాధించి రూ.12 వేల కోట్ల రిజర్వు ఫండ్ ఉండేది. ఆ తర్వాత విస్తరణకు తీసుకెళ్లాం. కేంద్రానికి రూ.50 వేల కోట్ల పన్నులు చెల్లించాం. ఇంత మొత్తంలో ఏ ప్రైవేట్ సంస్థ కట్టింది? రాష్ట్రానికి, కేంద్రానికి పన్నులు, జీఎస్టీలు నిరంతరం వెళ్లాయి. ఈ కంపెనీ ప్రగతిపై, ఉత్పత్తిపై కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రణాళికంటూ లేదు. ఉన్న ప్రణాళికల్లా ఈ కంపెనీని ఎలా చంపేయాలని చూడటమే. కార్మికుల సంఖ్య 20 వేల నుంచి 10 వేలకు తగ్గించారు. కార్మికులు అహరి్నశలు కష్టపడి పని చేస్తున్నారు. ఈ విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చిన వారెవరో చంద్రబాబు బయట పెట్టాలి. అసలు విశాఖ ప్లాంట్కు ఎందుకు మైన్స్ అడగడం లేదు? – మంత్రి రాజశేఖర్, ఐఎన్టీయూసీ చీఫ్ ప్యాట్రన్ చంద్రబాబు గాలి కబుర్లు మానుకోవాలి స్టీల్ ప్లాంట్ విషయంలో చంద్రబాబు తప్పుడు మాటలు మానుకోవాలి. కేంద్రం నుంచి రూ.12 వేల కోట్లు తీసుకొచ్చాననడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే. రూ.12 వేల కోట్లు ఎవరికిచ్చారు? అలాగైతే స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు జీతాలు ఎందుకు ఇవ్వలేదు? స్టీల్ ప్లాంటుపై చంద్రబాబు ఇలాంటి గాలి కబుర్లు మానుకోవాలి. చిత్తశుద్ధి ఉంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి. – జేవీ సత్యనారాయణమూర్తి, సీపీఐ జాతీయ నేత -
ఒకే రోజు రెండోసారి.. మరింత తగ్గిన గోల్డ్ రేటు!
బంగారం ధరలు ఉదయం గరిష్టంగా రూ. 770 తగ్గింది. అయితే సాయంత్రానికి మరో 810 రూపాయలు తగ్గింది. దీంతో ఈ రోజు (శుక్రవారం) గోల్డ్ రేటు 1580 రూపాయలు తగ్గిందన్నమాట. దీంతో 10 గ్రాముల పసిడి ధర రూ. 1,27,040 వద్దకు చేరింది. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై నగరాల్లో ఉదయం రూ.118400 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. సాయంత్రానికి రూ. 1,16,450 వద్దకు చేరింది. అంటే ఈ రోజు 24 గంటలు కాకముందే రూ. 1450 తగ్గిందన్న మాట. (ఉదయం 700 రూపాయలు మాత్రమే తగ్గింది, ఇప్పడు మరో 750 రూపాయలు తగ్గి.. మొత్తం రూ. 1450 తగ్గింది).24 క్యారెట్ల గోల్డ్ విషయానికి వస్తే, రూ. 1580 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ. 127040 వద్దకు చేరింది. (24 క్యారెట్ల గోల్డ్ రేటు ఉదయం 770 రూపాయలు తగ్గింది. సాయంత్రానికి మరో 810 రూపాయలు తగ్గడంతో రెండూ కలిపి మొత్తం రూ. 1580 తగ్గింది).ఢిల్లీలో కూడా బంగారం ధర ఒకే రోజు రెండోసారి తగ్గింది. దీంతో 24 క్యారెట్ల ధర రూ. 1580 తగ్గడంతో 10 గ్రాముల రేటు రూ. 127190 వద్ద నిలిచింది. 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 1450 తగ్గి.. 1,16,600 రూపాయల వద్దకు చేరింది.ఇక చెన్నైలో విషయానికి వస్తే.. ఇక్కడ కూడా బంగారం ధరలు సాయంత్రానికి మరింత తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1750 తగ్గడంతో రూ. 128070 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1600 తగ్గి.. 117400 రూపాయల వద్దకు చేరింది.ఇదీ చదవండి: సొంత డబ్బుతో కాదు.. అప్పు చేసి ఇల్లు కొనండి!: రాబర్ట్ కియోసాకి -
సన్రైజర్స్ వ్యూహం.. అతడు జట్టుతోనే.. పర్సులో ఇంకెంత?
ఐపీఎల్-2026 వేలం నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫ్రాంఛైజీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే టీమిండియా వెటరన్ పేసర్ మొహమ్మద్ షమీ (Mohammed Shami)ని.. లక్నో సూపర్ జెయింట్స్కు ట్రేడ్ చేసింది ఎస్ఆర్హెచ్. తాజాగా వచ్చే సీజన్కు గానూ అట్టిపెట్టుకునే, వదిలేసిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది.రాహుల్ చహర్, అభినవ్ మనోహర్, ఆడం జంపా (Adam Zampa), సిమర్జీత్ సింగ్ వంటి ఆటగాళ్లను వదిలించుకుని పర్సును ఖాళీ చేసుకుంది. షమీని ట్రేడ్ చేయడం ద్వారా రూ. 10 కోట్లను ఖాతాలో వేసుకుంది. అయితే, ముందు నుంచి ప్రచారం జరిగినట్లుగా సౌతాఫ్రికా స్టార్ హెన్రిచ్ క్లాసెన్ను సన్రైజర్స్ వేలంలోకి వదల్లేదు.అతడు జట్టుతోనే.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, ట్రవిస్ హెడ్ వంటి స్టార్ ప్లేయర్లతో పాటు.. క్లాసెన్ను అట్టిపెట్టుకుంది. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఐపీఎల్-2025లో సన్రైజర్స్ టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. 13 ఇన్నింగ్స్లో కలిపి 487 పరుగులు సాధించాడు. ఇందులో ఓ అజేయ శతకం (105) ఉండటం విశేషం.ఈ సీజన్లో సన్రైజర్స్ పద్నాలుగింట కనీసం ఆరైనా గెలిచిందంటే అందుకు కారణమైన వాళ్లలో క్లాసెన్ ముఖ్యుడు. అయితే, అతడి ప్రైజ్ ట్యాగ్ (రూ. 23 కోట్లు) కారణంగానే వేలంలోకి వదులుతారనే ఊహాగానాలు వచ్చినా.. ఫ్రాంఛైజీ మాత్రం ఆ పని చేయలేదు.పర్సులో వేలం కోసం రూ. 25.50 కోట్లురాబోయే సీజన్కు ముందు మొత్తానికి సన్రైజర్స్ ఎనిమిది మంది ఆటగాళ్లను వదిలేసింది. ఇందులో ఇద్దరు విదేశీ ప్లేయర్లు ఉండగా.. ఆరుగురు భారత క్రికెటర్లు ఉన్నారు. వీరిని రిలీజ్ చేయడం ద్వారా సన్రైజర్స్ పర్సులో వేలం కోసం రూ. 25.50 కోట్లు మిగిలాయి. మొత్తంగా పది స్లాట్లు ఖాళీ ఉండగా.. ఇందులో ఇద్దరు విదేశీ ఆటగాళ్లకు చోటు ఉంటుంది.సన్రైజర్స్ హైదరాబాద్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాప్యాట్ కమిన్స్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ట్రవిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కట్, స్మరణ్ రవిచంద్రన్, అనికేత్ వర్మ, జీషన్ అన్సారీ, హర్ష్ దూబే, కమిందు మెండిస్, ఇషాన్ మలింగ, బ్రైడన్ కార్స్. సన్రైజర్స్ విడుదల చేసిన ఆటగాళ్లు వీరేరాహుల్ చహర్ (రూ. 3.20 కోట్లు), అభినవ్ మనోహర్ (రూ. 3.20 కోట్లు), ఆడం జంపా (రూ. 2.40 కోట్లు), ఆడం జంపా (రూ. 2.40 కోట్లు), సిమర్జీత్ సింగ్ (రూ. 1.50 కోట్లు), వియాన్ ముల్దర్ (రూ. 70 లక్షలు), అథర్వ టైడే (రూ. 30 లక్షలు), సచిన్ బేబి (రూ. 30 లక్షలు), మొహమ్మద్ షమీ (రూ. 10 కోట్లు- ట్రేడింగ్).చదవండి: వెంకటేశ్ అయ్యర్కు భారీ షాక్.. పది ఫ్రాంఛైజీలు విడిచిపెట్టిన ఆటగాళ్లు వీరే -
చరిత్ర సృష్టించిన జడేజా.. భారత తొలి క్రికెటర్గా..
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) సత్తా చాటాడు. కోల్కతా వేదికగా శనివారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా బ్యాట్తో, బాల్తో రాణించాడు.భారత తొలి ఇన్నింగ్స్లో 45 బంతులు ఎదుర్కొన్న జడ్డూ.. మూడు ఫోర్ల సాయంతో 27 పరుగులు చేశాడు. అయితే, సైమన్ హార్మర్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ కావడంతో ఈ లెఫ్లాండర్ పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ఏదేమైనా భారత్ 189 పరుగుల మెరుగైన స్కోరు చేయడంలో జడ్డూ తన వంతు పాత్రను పోషించాడని చెప్పవచ్చు.ఆకాశమే హద్దుగాఇక సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో ఎనిమిది ఓవర్ల బౌల్ చేసి పదమూడు పరుగులు మాత్రమే ఇచ్చిన జడ్డూ.. వికెట్ మాత్రం తీయలేకపోయాడు. అయితే, రెండో ఇన్నింగ్స్లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈడెన్ గార్డెన్స్లో శనివారం నాటి రెండో రోజు ఆటలో జడ్డూ 13 ఓవర్లు బౌలింగ్ చేసి 29 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు.భారత తొలి క్రికెటర్గా రికార్డుప్రొటిస్ బ్యాటర్లు ఐడెన్ మార్క్రమ్ (4), వియాన్ ముల్దర్ (11), టోనీ డి జోర్జి (2) రూపంలో మూడు వికెట్ల తన ఖాతాలో వేసుకున్న జడ్డూ.. ట్రిస్టన్ స్టబ్స్ (5)ను కూడా వెనక్కి పంపించాడు. ఈ క్రమంలో రవీంద్ర జడేజా సరికొత్త చరిత్ర సృష్టించాడు. సొంతగడ్డపై టెస్టుల్లో 2 వేల పరుగులు పూర్తి చేసుకోవడంతో పాటు 250 వికెట్ల క్లబ్లో చేరిన భారత తొలి క్రికెటర్గా రికార్డు సాధించాడు.ప్రపంచంలో రెండో ప్లేయర్గాఅంతేకాదు.. ఓవరాల్గా ప్రపంచంలో స్టువర్ట్ బ్రాడ్ తర్వాత ఈ ఘనత సాధించిన (స్వదేశంలో 2000+ 250 వికెట్లు) రెండో ఆటగాడిగా జడేజా నిలిచాడు. అదే విధంగా.. టెస్టుల్లో ఓవరాల్గా నాలుగు వేల పరుగుల మైలురాయిని చేరుకోవడంతో పాటు 300కి పైగా వికెట్లు తీసిన నాలుగో ప్లేయర్గా ఫీట్ నమోదు చేశాడు. ఈ జాబితాలో ఇయాన్ బోతమ్, కపిల్ దేవ్, డానియెల్ వెటోరి జడ్డూ కంటే ముందు వరుసలో ఉన్నారు.కాగా భారత్తో తొలి టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 159 పరుగులకు ఆలౌట్ అయింది. ఇందుకు బదులుగా టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్లో 189 పరుగులు సాధించింది. ముప్పై పరుగుల ఆధిక్యం సంపాదించింది.ఈ క్రమంలో శనివారం నాటి రెండో రోజు ఆటలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది సౌతాఫ్రికా. ఆట పూర్తయ్యేసమయానికి 35 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 93 పరుగులు చేసింది. తద్వారా టీమిండియా కంటే 63 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.చదవండి: అందుకే రాజస్తాన్ రాయల్స్ను వీడాను: సంజూ శాంసన్ పోస్ట్ వైరల్ -
జీవితాన్ని మార్చుకోవడానికి అత్యుత్తమ మార్గం..
వ్యాపారవేత్త, పెట్టుబడిదారుడు, రచయిత అయిన రాబర్ట్ కియోసాకి.. పలు సందర్భాల్లో ధనవంతులవ్వాలంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?, డబ్బు కూడబెడితే జరిగే నష్టం ఏమిటి? అనే చాలా విషయాలను వెల్లడించారు. ఇప్పుడు తాజాగా జీవితాన్ని మార్చుకోవాలంటే ఏమి చేయాలనే విషయాన్ని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఎవరితో గడుపుతున్నారు?మీ జీవితాన్ని మార్చుకోవడానికి అత్యుత్తమ మార్గం.. మీరు పనిచేసే లేదా మీ చుట్టూ ఉన్న మనుషులను మార్చేయడమే అని పేర్కొన్నారు. కుటుంబంతో కాకుండా మీరు ఎక్కువ సమయం ఎవరితో గడుపుతారు? అని ప్రశ్నిస్తూ మూడు (ధనవంతులు?, మిడిల్ క్లాస్?, పేదవాళ్లు?) ఆప్షన్స్ ఇచ్చారు.మీరు ధనవంతులు అవ్వాలంటే.. ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వాళ్లతో ఎక్కువ సమయం గడపండి. ఒక ఉద్యోగం చేసేవ్యక్తి.. మరికొంతమంది ఉద్యోగులతో కలిసి ఉంటే.. దాదాపు ఉద్యోగానికి సంబంధించిన ఆలోచనలే చేస్తారు. వారు పెట్టుబడికి సంబంధించిన విషయాలు, డబ్బు సంపాదించడానికి సరికొత్త మార్గాలను అన్వేషించరు.ఎలాంటివాళ్ల దగ్గర సమయం గడిపితే..ఒక ధనవంతుడు.. డబ్బు, పెట్టుబడి, వ్యవస్థాపకత వంటి విషయాల గురించి ఆలోచిస్తాడు. వారు ధనవంతులవ్వడానికి.. కొత్త మార్గాలను అన్వేషిస్తారు. నేను నిరంతరం సెమినార్లకు హాజరవుతున్నాను. డబ్బు, వ్యవస్థాపకత, పెట్టుబడిపై సెమినార్లలో నేను భాగస్వాములను కలుస్తాను అని కియోసాకి పేర్కొన్నారు. కాబట్టి ఈ రోజు కెన్ మెక్ఎల్రాయ్ వంటి నా స్నేహితులు చాలా మంది లిమిలెస్ & ది కలెక్టివ్ వంటి అత్యుత్తమ సెమినార్లలో పాల్గొంటున్నారు. మీరు ఎలాంటివాళ్ల దగ్గర సమయం గడిపితే.. మీకు అలాంటి ఆలోచనలే వస్తాయని కియోసాకి స్పష్టం చేశారు.ఇదీ చదవండి: సొంత డబ్బుతో కాదు.. అప్పు చేసి ఇల్లు కొనండి!: రాబర్ట్ కియోసాకిమీతో ఉన్న ఐదుమంది స్నేహితులు ఆర్ధిక సెమినార్లకు హాజరవుతున్నారా? లేక ఉద్యోగులుగా ఉండటానికి అడ్వాన్స్ డిగ్రీల కోసం కాలేజీకి వెళ్తున్నారా? అని ప్రశ్నించారు. చివరగా ''గుర్తుంచుకోండి, మీ జీవితాన్ని మార్చడానికి వేగవంతమైన మార్గం మీ విద్యను, తరువాత మీ స్నేహితులను మార్చడమే'' అని అన్నారు.BIRDS of a FEATHER do FLOCK TOGETHERThere is a lot of truth and wisdom in that ancient saying.One way to change your life is to change the people you work with and friends you hang with.Quick Rich Dad test:Are the 5 people you spend the most time with…. Outside your…— Robert Kiyosaki (@theRealKiyosaki) November 15, 2025
