-
వైభవ్ సూర్యవంశీపై నిషేధం?
రాజస్తాన్ రాయల్స్ మేనేజర్ రోమీ భిందర్ డగౌట్ ఫోన్లో వాడడం వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. రోమీ భిందర్ ఐపీఎల్ యాంటీ కరప్షన్ ప్రోటోకాల్ను ఉల్లంఘించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ వ్యవహారంలో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ పేరు కూడా వినిపిస్తుడడం తీవ్ర చర్చనీయాంశమైంది.ఈ ఘటనపై బీసీసీఐ కూడా సీరియస్ అయింది. "మేనేజర్గా రోమీ భిందర్ ఫోన్ తీసుకెళ్లవచ్చు. కానీ దానిని డగౌట్లో వాడకూడదు. వీడియో ఫుటేజీని, చిత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటాం" అని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా తెలిపారు. ఇప్పటికే రోమీ భిందర్ బీసీసీఐ అనినీతి వ్యతిరేక, భద్రతా విభాగం అతడికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.ఏమి జరిగిదంటే?ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా రాజస్తాన్ డగౌట్లో రోమీ భిందర్ ఫోన్ వాడుతూ టీవీ కెమెరాల కంట పడ్డాడు. అతడే పక్కన కూర్చున్న వైభవ్ సూర్యవంశీ కూడా ఆ ఫోన్ స్క్రీన్ చూస్తూ కన్పించాడు. ఇందుకు సబంధించిన వీడియోను సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారింది. ఈ ఘటనపై ఐపీఎల్ మాజీ చైర్మెన్ లలిత్ మోదీ కూడా తీవ్రంగా స్పందించాడు.దీంతో ఈ విషయాన్ని బీసీసీఐ సీరియస్గా తీసుకుంది. దీనిపై బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ అంతర్గత విచారణ జరపనుంది. కాగా ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా (PMOA) నిబంధనల ప్రకారం.. మ్యాచ్ జరుగుతున్న వేళ డగౌట్లో మొబైల్ ఫోన్లు వాడటం నిషిద్ధం. అయితే డ్రెస్సింగ్ రూమ్లో మేనేజర్ ఫోన్ ఉపయోగించవచ్చు.వైభవ్పై వేటు!కాగా నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే భిందర్పై జరిమానా లేదా నిషేధం పడే అవకాశం ఉంది. అలాగే పక్కన ఉండి ఫోన్ చూసిన వైభవ్ సూర్యవంశీపై కూడా బీసీసీఐ చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది. అతడిపై జరిమానా లేదా ఓ మ్యాచ్ నిషేధం విధించే అవకాశముందని క్రికెట్ నిపుణలు అభిప్రాయపడుతున్నారు.చదవండి: Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ కూడబెట్టిన ఆస్తులు తెలిస్తే షాకవ్వాల్సిందే? -
సూర్యకుమార్ యాదవ్పై వేటు!
టీమిండియాకు టీ20 ప్రపంచకప్ అందించిన కెప్టెన్గా భారత క్రికెట్ చరిత్ర పుటల్లో తన పేరును లిఖించుకున్నాడు సూర్యకుమార్ యాదవ్. సొంతగడ్డపై అతడి సారథ్యంలో ఈ ఏడాది భారత్ వరల్డ్కప్ ట్రోఫీని ముద్దాడింది. తద్వారా మొత్తంగా మూడుసార్లు.. వరుసగా రెండుసార్లు.. స్వదేశంలో తొలిసారి పొట్టి క్రికెట్ వరల్డ్కప్ గెలిచిన తొలి జట్టుగా నిలిచింది.ఒలింపిక్స్-2028లో ఆడటమే లక్ష్యంఇక ఈ టోర్నీకి ఆరంభం ముందు నుంచే సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) కెప్టెన్సీ గురించి వదంతులు వ్యాపించిన సంగతి తెలిసిందే. సారథిగా టీమిండియాకు తిరుగులేని విజయాలు అందించినప్పటికీ.. బ్యాటర్గా అతడి ప్రదర్శన దిగజారడం ఇందుకు కారణం. అయితే, సూర్య వరల్డ్కప్ విన్నింగ్ కెప్టెన్ కావడంతో ఇక అతడికి తిరుగులేదని అభిమానులు భావిస్తున్నారు.సూర్య సైతం తాను ఇప్పట్లో రిటైర్ కాబోనని.. ఒలింపిక్స్-2028లో ఆడటమే లక్ష్యమని తెలిపాడు. అయితే, టీమిండియా యాజమాన్యం ప్రణాళికలు మాత్రం వేరుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ పర్యటన తర్వాత సూర్యను కెప్టెన్గా తప్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.స్ట్రైక్రేటు మరీ దారుణంకాగా ఒకప్పుడు ప్రపంచంలోనే నంబర్ వన్ టీ20 బ్యాటర్గా కొనసాగిన సూర్యకుమార్.. కెప్టెన్సీ చేపట్టిన తర్వాత ఆటగాడిగా విఫలమవుతున్నాడు. గతేడాది అతడి స్ట్రైక్రేటు మరీ దారుణంగా 120లోపు పడిపోగా.. ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు.ఇక 2026లో మొత్తంగా నాలుగు అర్ధ శతకాలు బాదిన సూర్య.. టీ20 ప్రపంచకప్లో అమెరికాపై సత్తా చాటాడు. అయితే పెద్ద జట్లైన సౌతాఫ్రికాపై 18, వెస్టిండీస్పై 18, సెమీ ఫైనల్లో ఇంగ్లండ్పై 11, ఫైనల్లో న్యూజిలాండ్పై 0 పరుగులతో తీవ్రంగా నిరాశపరిచాడు.ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఐపీఎల్-2026తో బిజీగా ఉన్న టీమిండియా ఆటగాళ్లు.. తదుపరి పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడేందుకు ఇంగ్లండ్కు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్లో సూర్య బ్యాటింగ్ ప్రదర్శనపైనే అతడి భవితవ్యం ఆధారపడి ఉందని తెలుస్తోంది.ఇంగ్లండ్లో విఫలమతే అంతే సంగతులుఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు PTIతో మాట్లాడుతూ.. ‘‘సూర్యనే కెప్టెన్. అయితే, బ్యాటర్గా అతడు నిలకడగా రాణించాల్సి ఉంది. ఈ విషయంలో సెలక్టర్లకు నమ్మకం కలిగించాలి. ఇంగ్లండ్ టూర్లో అతడే కెప్టెన్.అయితే, 2028 నాటికి అతడు జట్టుతో కొనసాగాలంటే కచ్చితంగా మంచి ప్రదర్శనలు ఇవ్వాల్సిందే’’ అని పేర్కొన్నాయి. కాగా వైభవ్ సూర్యవంశీ, ఆయుశ్ మాత్రే వంటి చిచ్చరపిడుగులు టీమిండియా టీ20 జట్టు వైపు దూసుకువస్తున్నారు. వీరితో పాటు ఇప్పటికే ఎంతో మంది తమను తాము నిరూపించుకున్నారు. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ ఇటు కెప్టెన్గా.. అటు బ్యాటర్గా టీ20 ఫార్మాట్లో దుమ్ములేపుతున్నాడు. ఇలాంటి తరుణంలో సూర్య ఇకనైనా తన బ్యాటింగ్పై మరింతగా దృష్టి పెడితేనే జట్టులో కొనసాగే అవకాశం ఉంటుంది.చదవండి: రాయల్స్ వైఖరిపై అసంతృప్తిలో వైభవ్ -
న్యాయం చేయండి.. తప్పు చేస్తే శిక్షించండి.. సజ్జనార్తో మంగ్లీ
ప్రముఖ సింగర్ మంగ్లీ, న్యాయవాది సుబ్బారావు వివాదం అనేక మలుపులు తిరుగుతుంది. ఈ క్రమంలో ఆమె తాజాగా CP సజ్జనార్ను కలిశారు. ఇదే కేసులో పంజగుట్ట పోలీస్స్టేషన్లో ఇప్పటికే హైడ్రామా చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మైక్రోఫైనాన్స్ పేరుతో మంగ్లీ, ఆమె తమ్ముడు మోసం చేశారంటూ న్యాయవాది సుబ్బారావు భాధితులతో కలిసి ఆధారాలు సమర్పించేందుకు పోలీస్ స్టేషన్కు వచ్చారు. తన మాటతీరు చూసి పోలీసులు ఆల్కహాల్ టెస్ట్ నిర్వహించారు. సుబ్బుకు 27 రీడింగ్ రావడంతో అందరూ షాక్ అయ్యారు.మైక్రోఫైనాన్స్ పేరుతో తాను డబ్బులు వసూలు చేశానని న్యాయవాది సింగపోగు సుబ్బు చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని మంగ్లీ ఇప్పటికే పోలీస్స్టేషన్కు వెళ్లి తెలిపారు. ఆయన చెప్పిన దానిలో వాస్తవం ఉంటే అధారాలు చూపించాలని కోరారు. ఈ క్రమంలోనే తాజాగా CP సజ్జనార్ను ఆమె కలిశారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే తన మీద దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారని, అందకు కారణమైన అడ్వకేట్ సుబ్బరావ్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. అదే సమయంలో మైక్రోఫైనాన్స్ పేరుతో మోసపోయిన బాధితులకి న్యాయంచేయాలని కోరింది. డబ్బు కాజేసిన అసలు వ్యక్తులను పట్టుకోవాలని మంగ్లీ కోరడంతో నెటిజన్లు కూడా ఆమెకు మద్ధతుగా నిలుస్తున్నారు.నాకు ఎలాంటి వ్యాపారం లేదుతనకు పాటల ప్రపంచం పాటలు తప్ప వేరే వ్యాపారం లేదని మంగ్లీ తెలిపారు. న్యాయవాది అని చెప్పుకునే సింగపోగు సుబ్బు డబ్బు డిమాండ్ చేయడమే కాకుండా, తనతో అసభ్యంగా ప్రవర్తించాడని అతడు, అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని సత్యవతి ముడావత్ అలియాస్ మంగ్లీ పంజగుట్ట పోలీసులకు తన న్యాయవాదితో కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తన పేరు చెప్పుకొని ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. డబ్బుల వసూలులో తన పాత్ర ఉందంటే తాను ఏ పోలీస్, కోర్టు మెట్లు ఎక్కేందుకైనా సిద్ధమే అన్నారు. డబ్బుల కట్టలు ఉన్న వీడియోలో డబ్బు లెక్కపెట్టేది తన సోదరుడు కాదని, అనవసరంగా అతన్ని ప్రచారం చేస్తున్నారని అన్నారు. న్యాయవాది సుబ్బుకు భరతనాట్యం వస్తుందని, అతను బిగ్బాస్ వెళ్లాలని, ఫేమస్ కావాలని ఇప్పటికే ఫేమస్గా ఉన్న తనను వాడుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. గత నెల 22వ తేదీన న్యాయవాది సుబ్బు అతని అనుచరులు తనను కలిసి సామాజిక మాధ్యమాల్లో తనకు వ్యతిరేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చిన వీడియోలు డిలీట్ చేయాలంటే రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని, దానికి తాను ఒప్పుకోకపోవడంతో తనను బెదిరించడం, వేధించడం చేశారన్నారు. View this post on Instagram A post shared by Mangli 🎙️ (@iammangli) -
ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. నిన్నటి మార్కెట్లో తగ్గిన ధరలు ఈరోజు ఒక్కసారిగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
రూ.90 లక్షలు ఇస్తేనే ఫస్ట్నైట్ : తీవ్ర ఘర్షణ, కట్ చేస్తే!
ఆగ్రాలో జరిగిన ఒక వింత సంఘటన పెళ్లి చేసుకున్న మొదటి రోజే ఆ కొత్త పెళ్లికొడుకు ఆశలను అడియాశలు చేసింది. పెళ్లిలో మూడు ముళ్ల ముచ్చటను పూర్తి చేసుకొని ఫస్ట్నైట్ ముచ్చట కోసం ఎదురు చూస్తున్న వరుడుకి భారీ షాక్ తగిలింది. చివరికి ఇది ఘర్షణకు, ఆ తరువాత పోలీస్ కేసు వరకు దారి తీసింది. విషయం ఏమిటంటే..ఒకటీ రెండూ కాదు ఏకంగా రూ. 90 లక్షల డిమాండ్ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో జగదీష్పురా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. తొలి రాత్రే వధువు తన భర్తను రూ. 90 లక్షలు డిమాండ్ చేసిన ఘటన వైరల్గా మారింది. ఆగ్రాలోని జగదీష్పురా ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి (ఒక డాక్టర్ తమ్ముడు), హత్రాస్కు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. పెళ్లి వేడుకలు ఘనంగా ముగిసాయి. సాంప్రదాయం ప్రకారం దంపతులు శోభనం గదిలోకి వెళ్లారు. ఈ వేడకలో భాగంగా వధువు కొంగున ఎంతో కొంత బంగారం మూట గట్టడం ఆనవాయితీ. కానీ ఈ వధువు తనకు ఏకంగా రూ. 90 లక్షల నగదు కావాలని డిమాండ్ చేసింది. అది ఇస్తేనే శారీరక సంబంధానికి అంగీకరిస్తానని భర్తతో చెప్పింది. దీంతో షాకైన భర్తఅందుకు నిరాకరించడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.పెళ్లికొడుకు కుటుంబ సభ్యులు ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు, కానీ వధువు తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి రప్పించింది. దీంతో వారొచ్చి నానా హంగామా సృష్టించడంతో వివాదం మరింత ముదిరింది. తీవ్ర ఘర్షణకు దారి తీసింది. వరుడి ఇంటిపై దాడి చేసిన వస్తువులను ధ్వంసం చేశారు.అక్కడితో ఆగలేదు... పెళ్లికొడుకు కుటుంబాన్ని లోపల ఉంచి బయట నుంచి తాళం వేశారు.ఇంట్లో ఉన్న పీఎన్జీ (PNG) గ్యాస్ పైప్లైన్ను పగులగొట్టి, గ్యాస్ లీక్ చేసి ఇంటికి నిప్పు పెట్టాలని చూశారని ఆపోపణలు. మొత్తానికి పొరుగువారి సహాయంతో వరుడి కుటుంబం ప్రాణాలతో బయటపడింది. దీంతో నిందితులు, వధువు అక్కడినుంచి పారిపోయారు. పోతూ పోతూ, వధువు తనతో పాటు అత్తగారి నగలను, విలువైన వస్తువులను తీసుకుని ఉడాయించింది.ఈ ఘటనపై వరుడి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వధువు, ఆమె కుటుంబ సభ్యులపై తీవ్ర ఆరోపణలు చేసింది. అసలు ఆమె ఉద్దేశం పెళ్లి కాదని, కేవలం డబ్బు సంపాదించడమేనని ఆమె లక్ష్యమని బాధితులు తమ ఫిర్యాదులో తెలిపారు. ఈ విషయాన్నివధువు స్వయంగా ఒప్పుకుందని కూడా వారు పేర్కొన్నార. అలాగే గ్యాస్ పేల్చి, అందరినీ చంపేయాలని చూశారని బాధితులు ఆరోపించారు. తొలుత పోలీసులు స్పందించకపోవడంతో, వరుడి కుటుంబం కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు జగదీష్పురా పోలీసులు వధువు, ఆమె తండ్రి , ఇతరులపై కేసు నమోదు చేశారు.ఎట్టకేలకు కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. ఈ పెళ్లి కుదిర్చిన మధ్యవర్తి కోసం కూడా గాలిస్తున్నారు. ఇది అసలైన మోసమా లేక వరకట్న వేధింపుల కేసు నుంచి తప్పించుకోవడానికి ముందుగా ప్లాన్ చేసిన గొడవా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఈ నెలలోనే ఆర్టీసీ సమ్మె సైరన్
-
అసంతృప్తిలో వైభవ్
ఐపీఎల్ 2026లో సంచలన ప్రదర్శనలతో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ సొంత జట్టు వైఖరిపై అసంతృప్తిగా ఉన్నాడని తెలుస్తుంది. ఈ విషయాన్ని జట్టు అసిస్టెంట్ కోచ్ ట్రెవర్ పెన్నీ స్వయంగా వెల్లడించారు. రాయల్స్కు ఫీల్డింగ్ కోచ్ కూడా అయిన పెన్నీ నిన్న (ఏప్రిల్ 13) సన్రైజర్స్తో మ్యాచ్ సందర్భంగా మాట్లాడుతూ.. వైభవ్కు ఫీల్డింగ్ అంటే చాలా ఇష్టం. కానీ డొనోవన్ ఫెరియెరా ఫిట్నెస్ పాస్ చేశాడు. అతను గన్ ఫీల్డర్. అందుకే అతనిని మెయిన్ XIలో ఉంచాం. వైభవ్ దీని పట్ల సంతోషంగా లేడు. ఈ విషయంలో జట్టు ఉద్దేశం వైభవ్ మంచి ఫీల్డర్ కాదని కాదు. ప్రస్తుతానికి ఫెరియెరా ఫీల్డింగ్ అత్యుత్తమంగా ఉంది. ఆ ఉద్దేశంతోనే వైభవ్ను ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడిస్తున్నామని అన్నాడు.కాగా, ప్రస్తుత ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ గత కొద్ది మ్యాచ్లుగా ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగుతున్నాడు. తాజాగా ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లోనూ అతను ఇంపార్ట్ సబ్స్టిట్యూట్గా (బ్యాటర్గా మాత్రమే) ఆడాడు. రాయల్స్ మొదట బౌలింగ్ ఎంచుకోవడంతో అతను డగౌట్కే పరిమితమయ్యాడు. 217 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో యశస్వి జైస్వాల్తో కలిసి ఓపెనర్గా బరిలోకి దిగి గోల్డెన్ డకౌటయ్యాడు. ఎస్ఆర్హెచ్ అరంగేట్రం పేసర్ ప్రఫుల్ హింగే అద్భుతమైన బంతితో వైభవ్ను బోల్తా కొట్టించాడు. ఈ మ్యాచ్లో హింగే వైభవ్తో పాటు మరో ముగ్గురిని కూడా ఔట్ చేసి ఎస్ఆర్హెచ్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. తొలి ఓవర్లోనే హింగే వైభవ్తో పాటు జురెల్, ప్రిటోరియస్లను కూడా డకౌట్ చేసి ఐపీఎల్ చరిత్రలో తొలి ఓవర్లోనే ముగ్గురిని ఔట్ చేసిన తొలి బౌలర్గా చరిత్ర సృష్టించాడు.ఇదిలా ఉంటే, ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఎస్ఆర్హెచ్ మ్యాచ్కు ముందు వైభవ్ అత్యుత్తమ ఫామ్లో ఉన్నాడు. 5 మ్యాచ్ల్లో సగటు 40, స్ట్రైక్ రేట్ 263.16తో 200 పరుగులు చేసి, లీడింగ్ స్కోరర్గా ఉన్నాడు. సీఎస్కే, ఆర్సీబీపై 15 బంతుల్లో హాఫ్ సెంచరీలు చేసి సంచలనం సృష్టించాడు. -
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. వ్యాపారాలు విస్తరిస్తారు
గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: బ.త్రయోదశి రా.8.23 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం: పూర్వాభాద్ర ప.1.19, తదుపరి ఉత్తరాభాద్ర, వర్జ్యం: రా.10.44 నుండి 12.19 వరకు, దుర్ముహూర్తం: ప.11.35 నుండి 12.24 వరకు, అమృత ఘడియలు: లేవు, మాస శివరాత్రి.సూర్యోదయం : 5.49సూర్యాస్తమయం : 6.10రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకుయమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు మేషం.... వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి.వృషభం.... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. పనులు చకచకా సాగుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహలు నిజం కాగలవు.మిథునం..... కొత్త పరిచయాలు. శుభవార్తలు. వాహనయోగం. పనులలో విజయం. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.కర్కాటకం.... కొన్ని పనులు వాయిదా వేయాల్సివస్తుంది. ప్రయాణాలు కుదించుకుంటారు. అనారోగ్యం. శ్రమాధిక్యం. బంధువులతో మాటపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.సింహం.... ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు. కొన్ని పరిస్థితులకు ఎదురీదవలసివస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.కన్య..... గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. పనులు అనుకున్న రీతిలో సాగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.తుల..... ఆశ్చర్యకరమైన సంఘటనలు. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రతిబంధకాలు తొలగుతాయి.వృశ్చికం... పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో అకారణంగా వివాదాలు. అనారోగ్యం. పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.ధనుస్సు.... మిత్రులతో వివాదాలు. ఆలోచనలు అంతగా కలసిరావు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. కొత్త రుణయత్నాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.మకరం.... పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం. ఆలయ దర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలత.కుంభం.. సన్నిహితులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.మీనం... సన్నిహితులతో సఖ్యత. శుభకార్యాలపై చర్చలు. ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. -
'బావ బావ అంటాంటే.. బాగుందే నీతో ఉంటాంటే'.. రవితేజ వారసుడి లవ్ సాంగ్ రిలీజ్
మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు మాధవ్ భూపతిరాజు హీరోగా వస్తోన్న తాజా చిత్రం మారెమ్మ. ఈ సినిమాకు మంచాల నాగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ యధార్థ సంఘటనల ఆధారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాలో దీపా బాలు హీరోయిన్గా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఈ మూవీ నుంచి బావ బావ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. బావ, మరదళ్ల లవ్ సాంగ్ ఆడియన్స్ను ఆకట్టుకుంటోంది. ఈ పాటకు కమల్ ఎస్లావత్ లిరిక్స్ అందించగా.. శృతి రంజని ఆలపించారు. ఈ పాటను ప్రశాంత్ ఆర్.విహారి కంపోజ్ చేశారు.కాగా.. ఈ చిత్రాన్ని గ్రామీణ నేపథ్యంలో సాగే రియల్ స్టోరీగా తెరకెక్కిస్తున్నారు. ఓ ఊరికి శాపం చుట్టుకోవడంతో గ్రామ దేవత మారెమ్మ ఎలా కాపాడిందనే కోణంలో కథ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మోక్ష ఆర్ట్స్ పతాకంపై మయూర్ రెడ్డి బండారు నిర్మించారు. ఈ సినిమాలో వికాస్ వశిష్ట, వినోద్ కుమార్, వీఎస్ రూపా లక్ష్మి, దయానంద్ రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ప్రశాంత్ ఆర్.విహారి సంగీతమందిస్తున్నారు. -
నోటీసు లేకుండానే 300 మంది తొలగింపు!
ఐటీ రంగంలో మానవీయ విలువలకు, గ్రామీణ ప్రతిభకు పెద్దపీట వేస్తుందని పేరున్న ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ ‘జోహో’లోనూ లేఆఫ్స్ కలకలం రేపుతున్నాయి. ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే దాదాపు 300 మంది ట్రైనీలను కంపెనీ ఒక్కసారిగా విధుల్లోంచి తొలగించినట్లు తెలుస్తోంది. టెక్ నిపుణుల వేదిక ‘బ్లైండ్’లో బాధిత ఉద్యోగి ఒకరు చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఏం జరిగింది? ఈ నిర్ణయానికి కారణమేంటి?బాధితుడి కథనం ప్రకారం.. కంపెనీలో అంతర్గతంగా జరిగిన కొన్ని పరిణామాలే ఈ తొలగింపులకు కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఒక సీనియర్ ఉద్యోగి, ‘మీరు మమ్మల్ని (అనుభవజ్ఞులను) తీసేసి తక్కువ జీతానికే వచ్చే ట్రైనీలతో ఖాళీలు భర్తీ చేయాలని చూస్తున్నారా?’ అని యాజమాన్యాన్ని ప్రశ్నించినట్లు సమాచారం. ఈ చర్చ జరిగిన కొద్ది రోజుల్లోనే ఫ్రెషర్లను భర్తీ చేస్తున్నారనే అపవాదు పోగొట్టుకోవడానికి కంపెనీ ఏకంగా 300 మంది ట్రైనీలను తొలగించిందని సదరు యూజర్ ఆవేదన వ్యక్తం చేశారు.ఫ్రెషర్ల ఆవేదన‘నేను ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం నుంచి వచ్చాను. ఈ ఉద్యోగం నాకు కెరీర్తోపాటు నా కుటుంబానికి జీవనాధారం. టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలను వదులుకుని జోహోలో చేరాను. అక్కడైతే కనీసం బెంచ్ మీద ఉన్నా భద్రత ఉండేది. ఇక్కడ కనీసం నోటీసు పీరియడ్ కూడా ఇవ్వకుండా రోడ్డున పడేశారు’ అని ఒక బాధిత యువకుడు ‘బ్లైండ్’లో వాపోయాడు.వెంబు మాటలకు, చేతలకు పొంతన లేదు!జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు తరచుగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, చిన్న పట్టణాల నుంచి ప్రతిభను వెలికితీయడం గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని బాధితులు విమర్శిస్తున్నారు. ‘చిన్న పట్టణాల నుంచి నియామకాలు చేపడుతున్నామని గొప్పగా చెప్పుకోవడం కాదు, వివరణ లేకుండా వందలాది మంది యువత భవిష్యత్తును దెబ్బతీయడం ఏ రకమైన సంస్కృతి?’ అని బాధితులు ప్రశ్నిస్తున్నారు.టెక్ వర్గాల్లో తీవ్ర నిరసనఈ వ్యవహారంపై గూగుల్, గోల్డ్మన్ సాక్స్, హెచ్పీ వంటి దిగ్గజ సంస్థల ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ‘300 మంది కెరీర్లతో ఆటలాడటం దారుణం. ఫ్రెషర్లను పావులుగా వాడుకుంటున్నారు’ అని గోల్డ్మన్ సాక్స్లో పనిచేసే ఒక ఉద్యోగి వ్యాఖ్యానించారు. ‘అంతర్గత రాజకీయాల క్రాస్ఫైర్లో ఎప్పుడూ అమాయక ఫ్రెషర్లే బలిపశువులవుతున్నారు’ అని మరొకరు పేర్కొన్నారు.కంపెనీ స్పందన కోసం నిరీక్షణఈ ఆరోపణలపై వివరణ కోరుతూ జోహో సంస్థకు కొన్ని మీడియా సంస్థలు ఈమెయిల్ పంపాయని తెలుస్తుంది. అయితే దీనిపై కంపెనీ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ అంశాలను కంపెనీ అధికారికంగా ధృవీకరించలేకపోయినా, సోషల్ మీడియాలో వస్తున్న వరుస పోస్టులు మాత్రం ఐటీ నిపుణుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.ఇదీ చదవండి: ‘మధ్య తరగతి’ బండి సాగేదెలా?
