breaking news
-
‘రానూ బొంబాయికి రాను’.. బడ్జెట్ 5 లక్షలు.. కలెక్షన్స్ ఎంతంటే?
ఈ మధ్య తెలంగాణ ఫోక్ సాంగ్స్ యూట్యూబ్లో దుమ్మురేపుతున్నాయి. ఒక్కోపాటకి మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. పెళ్లి బరాత్ మొదలు ఏ ఈవెంట్కి వెళ్లిన ఈ పాటలే వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు వచ్చిన అన్ని పాటలు ఒకెత్తు.. ‘రాను బొంబాయికి రాను..’ పాట మరో ఎత్తు. ఫోక్ సాంగ్స్లో ఇదొక సంచలనం అని చెప్పొచ్చు. చిన్న పిల్లలు మొదలు.. ముసలి వాళ్ల వరకు ఈ పాటను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పాట మాత్రమే కాదు ఆ పాటకు రాము రాథోడ్, లిఖిత వేసిన స్టెప్పులు కూడా బాగా వైరల్ అయ్యాయి. ఈ ఒక్క పాటతో అటు వారిద్దరు ఫేమస్ అయిపోయారు. అయితే ఈ పాటకు చేసిన ఖర్చు, వచ్చిన ఆదాయంపై రకరకాల పుకార్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై తాజాగా డ్యాన్సర్ లిఖిత క్లారిటీ ఇచ్చింది.రెండు రోజుల షూటింగ్.. ఖర్చు ఎంతంటే..రాము రాథోడ్ అన్నతో ముందుగా రెండు పాటలు అనుకున్నాం. ‘రాను బొంబాయికి..’ రెండో పాట. ఒక్క రోజులోనే షూటింగ్ కంప్లీట్ చేశాం. ముందుగా ప్రొమో విడుదల చేశాం. అది బాగా వెళ్లింది. ఈ పాట కోసం చేసిన రీల్కి ఒకే రోజు మిలియన్ వ్యూస్ వచ్చాయి. దీంతో మేం కొన్ని మార్పులు చేశాం. పాట బాగా వెళ్లేలా ఉందని..రెండో రోజు వేరే చోట షూట్ చేశాం. అలా ఈ పాట కోసం మొత్తం రెండు రోజులు కేటాయించాం. ఇది హిట్ అవుతుందని తెలుసు కానీ..ఇంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా గుర్తుపట్టి పలకరిస్తున్నారు. నా పేరు తెలియకపోయినా..‘రాను బొంబాయి రాను’ అమ్మాయి అంటూ దగ్గరికి వచ్చి ఫోటోలు దిగుతున్నారు.రూ.కోటి వచ్చింది నిజమే కానీ.. ఈ పాటను రామ్ రాథోడ్ తన యూట్యూబ్ నుంచే రిలీజ్ చేశాడు. ఇప్పటి వరకు రూ. కోటికి పైగా ఆదాయం వచ్చింది నిజమే. అయితే రామ్ రాథోడ్ అన్నయ్య విల్లా కొన్నాడు.. బెంజ్ కారు కొన్నాడు అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఆయన ఏమి కొనలేదు. ఇక నా రెమ్యునరేషన్ విషయానికొస్తే.. రెండు రోజులకు ఎంత మాట్లాకున్నామో అంతే ఇచ్చేశాడు. భారీగా లాభం వచ్చింది కదా అని మేం ఎక్కువ అడగలేదు. ఎంత చెప్పారో అంతే ఇచ్చారు. ఇప్పుడు ఇంకా ఏమైనా ఇవ్వాలా వద్దా? అనేది వాళ్ల ఇష్టం. నేను అయితే ఏమి ఆశించడం లేదు. మేం పడిన కష్టానికి గుర్తింపు వచ్చినందుకు సంతోషంగా ఉంది’ అని లిఖిత చెప్పుకొచ్చింది. కాగా, ఈ పాటకు రాము రాథోడ్ లిరిక్స్ అందించడమే కాకుండా ప్రభతో కలిసి చక్కగా ఆలపించాడు కూడా. శేఖర్ వైరస్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటకి కళ్యాణ్ కీస్ సంగీతం అందించారు. రామ్ రాథోడ్ తన సొంత డబ్బులతో ఈ పాటను తెరకెక్కించాడు. -
అలా చేయడం నచ్చలేదు.. అందుకే తెలుగు సినిమాల నుంచి తప్పుకున్నా!
ఆనంద్ మూవీతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది కమలినీ ముఖర్జీ. స్టైల్, గోదావరి, గమ్యం, గోపి గోపిక గోదావరి.. ఇలా పలు సినిమాల్లో కథానాయికగా నటించింది. చివరగా తెలుగులో గోవిందుడు అందరివాడేలే సినిమాలో కనిపించింది. ఆ తర్వాత రెండు పరభాషా చిత్రాలు చేసిన ఆమె 2016 నుంచి ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది.విభిన్న పాత్రల్లో..తాజాగా తను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తెలుగులో నేను అన్ని రకాల ఎమోషన్స్ ఉండే అమ్మాయిగా నటించాను. చాలా సినిమాల్లో నేను అమ్మానాన్న లేని అనాథగానే కనిపించాను. బలమైన స్త్రీ పాత్రలు చేశాను. అదే సమయంలో చాలా సున్నితమైన అమ్మాయిగానూ కనిపించాను. కానీ, రానురాను అలాంటి బలమైన క్యారెక్టర్లు నాకు టాలీవుడ్లో రాలేదు.అందుకే వెనకడుగు వేశా..గోవిందుడు అందరివాడేలే సినిమాలో నాకు సరైన ప్రాముఖ్యత లేదనిపించింది. మూవీ పూర్తయ్యాక నేను పోషించిన పాత్ర చూసుకుని నాకే ఇబ్బందిగా అనిపించింది. బాధపడ్డాను కూడా! దానికోసం నేను గొడవపడాలని, రచ్చ చేయాలని అనుకోలేదు. అందుకే.. గోవిందుడు అందరివాడేలే తర్వాత తెలుగు సినిమాలు చేయకూడదని నిర్ణయించుకుని టాలీవుడ్కు దూరంగా ఉన్నాను. అలా అని నాకు ఎవరిపైనా కోపం లేదు.టాలీవుడ్ నుంచి తప్పుకున్నా..సినిమాలో చాలా జరుగుతుంటాయి. దర్శకుడు ఓ సీన్ చేయమంటారు. తీరా అది అవసరం లేదనో, బాగోలేదనో దాన్ని ఎడిటింగ్లో తీసేస్తుంటారు. ఆ విషయాన్ని మాకు చెప్పరు. ఒక మాటైనా చెప్పకుండా మన సీన్, డైలాగులు తీసేస్తే బాధనిపిస్తుంది. దాన్ని నేను లైట్ తీసుకోలేను. బాధగా అనిపించడంతో తెలుగు సినిమా నుంచి తప్పుకుని ఇతర భాషల్లో చేశాను.పెళ్లిమలయాళ మూవీ పులి మురుగన్(2016) తర్వాత నాకు పెళ్లయింది. అందుకే సినిమాలకు దూరంగా ఉన్నాను. చిన్నప్పుడు చదువుకే కేటాయించాను. పెద్దయ్యాక సినిమాలు చేశాను. ఇప్పుడు భార్యగా కుటుంబాన్ని చూసుకోవాలనుకున్నాను అని కమలినీ ముఖర్జీ చెప్పుకొచ్చింది.చదవండి: అఫీషియల్: వచ్చేవారమే బిగ్బాస్ 9 ప్రారంభం -
ఈ రాశి వారికి అన్నింటా విజయం.. సన్నిహితుల నుంచి ధనలాభం
మేషం: చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.వృషభం: కొత్త వ్యక్తుల పరిచయం. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార లావాదేవీలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.మిథునం: కుటుంబంలో ఒత్తిడులు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు. నిరుద్యోగులకు గందరగోళం.కర్కాటకం: వ్యయప్రయాసలు ఉండవచ్చు. ధనవ్యయం. పనుల్లో ఆటంకాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు అంతగా అనుకూలించవు. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు. విద్యార్థులకు ఒత్తిడులు.సింహం: కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ధనలాభం. పనుల్లో విజయం. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి విముక్తి.కన్య: .పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు అంతంత మాత్రమే. ఉద్యోగాలలో కొన్ని మార్పులు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు.తుల: ఉత్సాహంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో కొత్త ఆశలు. దైవదర్శనాలు.వృశ్చికం: ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. శ్రమాధిక్యం. పనుల్లో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు.ధనుస్సు: నూతన ఉద్యోగయోగం. పనుల్లో మరింత పురోగతి. ఇంటాబయటా అనుకూలం. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు ఉత్సాహంగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.మకరం: పనుల్లో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం. వస్తు,వస్త్ర లాభాలు. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. వ్యాపారాలలో అనుకూలత. ఉద్యోగాలలో పురోగతి.కుంభం: సన్నిహితులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. అనారోగ్య సూచనలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.మీనం: శ్రమ తప్పదు. పనుల్లో ఆటంకాలు. బంధువులు, మిత్రులతో వివాదాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. ఆలయ దర్శనాలు. -
ఒంటరితనం నా వల్లకాదు, నీకోసం ప్రతిరోజు కన్నీళ్లు.. పూర్ణ భర్త భావోద్వేగం
సీమ టపాకాయ్, అవును చిత్రాలతో హీరోయిన్గా పేరు తెచ్చుకుంది పూర్ణ (Poorna). మొదట్లో కథానాయికగా నటించినా తర్వాత సహాయ నటిగా మారింది. అఖండ, దృశ్యం 2, దసరా, భీమా.. ఇలా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా యాక్ట్ చేసింది. గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాటలో నటించింది. ఇదిలా ఉంటే పూర్ణ.. 2022లో వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీని పెళ్లి చేసుకుంది. ఆ మరుసటి ఏడాదే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. రాత్రిళ్లు నీ జ్ఞాపకాలే..తల్లయ్యాక కూడా ఏదో ఒక షోలు, ఈవెంట్స్ అంటూ బిజీగానే గడిపేస్తోంది. అయితే భార్య కోసం తాను కన్నీళ్లు పెట్టుకున్నానంటూ పూర్ణ భర్త చేసిన పోస్ట్ ఒకటి నెట్టింట వైరల్గా మారింది. 'ఈ 45 రోజులు నా జీవితంలోనే మర్చిపోలేను. ఒంటరితనపు నిశ్శబ్ధాన్ని భరించలేకపోయాను. రాత్రిళ్లు నీ జ్ఞాపకాలతోనే గడిపేశాను. ప్రతిరోజు ఉదయం నిన్ను తల్చుకుని ఏడ్చేవాడిని.నా భార్య తిరిగొచ్చిందిఈ 45 రోజుల్లో నాకు ప్రేమ గొప్పదనం తెలిసొచ్చింది. మనల్ని ప్రేమించేవారు మనతో ఉండటమే జీవితంలో అన్నిటికంటే గొప్పనైన వరం. ఈరోజు నా భార్య నా దగ్గరకు తిరిగొచ్చేసింది. ఎన్నో ఎదురుచూపుల తర్వాత జరిగిన ఈ రీయూనియన్ వల్ల ఆనందభాష్పాలు వస్తున్నాయి అని చెప్పుకొచ్చాడు. ఇది చూసిన చాలామంది ఈ దంపతుల మధ్య ఏం జరిగింది? వీరిద్దరూ కలిసి లేరా? అన్న అనుమానాలు వ్యక్తం చేశారు. క్లారిటీ ఇచ్చిన పూర్ణ భర్తదీనికి పూర్ణ భర్త స్పందిస్తూ.. నా భార్య 20 రోజులు చెన్నైలో, 15 రోజులు మలప్పురంలో, ఆ తర్వాత జైలర్ 2 మూవీ కోసం అక్కడ తనింట్లో ఉంది. అంటే మొత్తం 45 రోజులు నాకు దూరంగా ఉంది. మాకు పెళ్లయి మూడేళ్లవుతున్నా.. ఇన్నిరోజులు దూరంగా ఎప్పుడూ లేము. అందుకే, అలా పోస్ట్ పెట్టాను. దాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకోకుండి. దేవుడి దయ వల్ల మేమంతా సంతోషంగా ఉన్నాం అని వివరణ ఇచ్చాడు. ఇందుకు తన ఫ్యామిలీ ఫోటోలు జత చేశాడు. View this post on Instagram A post shared by DrShanid Thalekoden (@dr.shanid_asifali) View this post on Instagram A post shared by DrShanid Thalekoden (@dr.shanid_asifali) చదవండి: భర్తతో వినాయక చవితి సెలబ్రేషన్స్.. లావణ్య బేబీ బంప్ ఫోటో -
అమెరికా సుంకాలకు ఇండియన్ యూనివర్సిటీ ఝలక్
అమెరికా విధించిన 50% దిగుమతి సుంకాలపై నిరసనగా, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU) తన క్యాంపస్లో అమెరికా బ్రాండ్ల పానీయాలపై పూర్తిస్థాయి నిషేధం విధించింది. కోకా-కోలా, పెప్సీ వంటి ప్రముఖ బ్రాండ్లు ఇకపై విద్యార్థులకు అందుబాటులో ఉండవు.ఈ నిర్ణయాన్ని విశ్వవిద్యాలయ ఛాన్సలర్, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు అశోక్ కుమార్ మిట్టల్ ప్రకటించారు. “భారతదేశం అమెరికా ఆర్ధిక బలాయింపు ముందు తలవంచదు. ఇది స్వదేశీ 2.0 ఉద్యమం,” అని ఆయన పేర్కొన్నారు.నిషేధానికి కారణంఅమెరికా ఇటీవల భారత దిగుమతులపై సుంకాలను 50%కి పెంచింది. భారతీయ ఉత్పత్తులపై ఈ చర్యను “ఆర్ధిక దౌర్జన్యం”గా అభివర్ణిస్తూ, మిట్టల్ ఈ నిషేధాన్ని ప్రతిస్పందనగా ప్రకటించారు. “అమెరికా కంపెనీలు భారత మార్కెట్ నుండి సంవత్సరానికి రూ.6.5 లక్షల కోట్లకు పైగా ఆదాయం సంపాదిస్తున్నాయి. ఇది ఒకవైపు లాభాలు, మరోవైపు ఆంక్షలు” అని ఆయన ఓ బహిరంగ లేఖలో అమెరికా అధ్యక్షుడికి రాశారు.ఆందోళలో వ్యాపార వర్గాలుయూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. సామాజిక మాధ్యమాల్లో స్వదేశీ2.0 ( #Swadeshi2.0 ) అనే హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఈ చర్య పంజాబ్లోని విద్యా సంస్థలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇతర విశ్వవిద్యాలయాలు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. వ్యాపార వర్గాలు, ముఖ్యంగా బాటిల్డ్ డ్రింక్ డిస్ట్రిబ్యూటర్లు, ఈ నిషేధాన్ని ఆందోళనతో చూస్తున్నారు.If the US goes ahead and imposes 50% tariffs on Indian exports, Lovely Professional University will not sit quietly.Let me remind the US once again - we will ban all American soft drinks on campus, if the US doesn’t withdraw the unfair tariffs by 27th August.I urge every… pic.twitter.com/PhBsVNSJHe— Ashok Kumar Mittal (@DrAshokKMittal) August 24, 2025 -
బిర్యానీని ఇంగ్లీషులో ఏమంటారో తెలుసా?
భారతీయ బిర్యానీలలో టాప్ ఇవే...బిర్యానీ అంటే ఒక వంటకం కాదు, అది ఒక అనుభూతి. భారత దేశంలో అత్యధిక సంఖ్యలో భోజన ప్రియులు బిర్యానీని ఇష్టపడతారు. మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడే ఈ రుచికరమైన బిర్యానీ సువాసనగల బాస్మతి బియ్యాన్ని మ్యారినేట్ చేసిన మాంసం, కూరగాయలు సుగంధ ద్రవ్యాలతో తయారవుతుంది. గొప్ప రుచి సువాసనకు ప్రసిద్ధి చెందిన బిర్యానీ దక్షిణాసియాలో అత్యంత ప్రసిద్ధి చెందిన వంటకాల్లో ఒకటి, దీనిని రోజువారీ భోజనంలో పండుగ సందర్భాలలో రెండింటిలోనూ ఎంజాయ్ చేస్తారు.పుట్టుక వెనుక...బిర్యానీ అనే పదం పర్షియన్ పదం అయిన ‘‘బిరియన్’’ నుంచి పుట్టింది. ఈ పదానికి అర్థం ’వంటకు ముందు వేయించినది’. ఇదే బిర్యానీని ఇంగ్లీషులో మిక్స్డ్ రైస్ డిష్ అంటూ పేర్కొంటారు. దీనిని 16వ శతాబ్దంలో మొఘలులు భారతదేశానికి పరిచయం చేశారని నమ్ముతారు. కాలక్రమేణా, హైదరాబాదీ దమ్ బిర్యానీ నుంచి లక్నోయి అవధి శైలి వరకు వైవిధ్యాలు బిర్యానీకి ప్రాంతీయ పరిçమళాలు అద్దాయి. ప్రతి ఒక్కటి ప్రత్యేకమైన వంట పద్ధతి సుగంధ ద్రవ్యాల మిశ్రమంతో దేనికదే ప్రత్యేకత చాటుకుంటున్నాయిు. అయితే అన్నింట్లోనూ టాప్గా నిలుస్తోంది హైదరాబాదీ బిర్యానీయే.సుగంధ ద్రవ్యాలు, కుంకుమ పువ్వు, కారామెలైజ్డ్ ఉల్లిపాయలు దమ్ వంట శైలికి ప్రసిద్ధి చెందింది. హైదరాబాదీ చికెన్ బిర్యానీతో పాటు ఆన్లైన్లో ఎక్కువగా శోధించిన బిర్యానీ వంటకాలలో హైదరాబాదీ మటన్ బిర్యానీ కూడా ఉంది. ఆ తర్వాత స్థానంలో ఉంది లక్నోయి (అవధి) బిర్యానీ – మాంసం, బియ్యం సువాసనగల సుగంధ ద్రవ్యాలతో కలిపి దీనిని వండుతారు. ఈ అవధి బిర్యానీ శైలి తక్కువ కారం ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది. ఆ తర్వాతి స్థానంలో కోల్కతా బిర్యానీ నిలుస్తుంది. బంగాళాదుంపలు ఉడికించిన గుడ్లతో పాటు సువాసనగల బాస్మతి బియ్యం జోడించడంతో ఈ బిర్యానీ ప్రసిద్ధి చెందింది. కోల్కతా బిర్యానీలో సూక్ష్మమైన తీపి తేలికైన మసాలా మిశ్రమం ఉంటుంది, ఇది వెజ్ బిర్యానీ ప్రియులకు మాత్రమే కాదు నాన్–వెజ్ బిర్యానీ అభిమానులకు కూడా ప్రసిద్ధ ఎంపికగా నిలిచింది.కేరళ రాష్ట్రపు మలబార్ బిర్యానీ కూడా భోజన ప్రియుల అభిమానాన్ని దక్కించుకుంటోంది. షార్ట్–గ్రెయిన్ జీరకాసల అనే బియ్యంతో తయారు అవుతుంది. కొబ్బరి, నెయ్యి తాజా మసాలాల కలయిక దీనికి కొత్త రుచులు అద్దుతుంది. మలబార్ చికెన్ బిర్యానీతో పాటు మలబార్ ఫిష్ బిర్యానీ కూడా బాగా పాప్యులర్.పాకిస్తాన్లోని సింథ్ మూలాలు కలిగిన టాంగీ బిర్యానీ, పెరుగు, టమోటాలు, పచ్చిమిర్చి గాఢమైన మసాలాలతో వండుతారు. సింధీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ప్రసిద్ధి చెందాయి,మరోవైపు పాకిస్తాన్ వంటకంగా పేరొందిన ఆఫ్ఘని బిర్యానీ భారతీయ బిర్యానీలతో పోలిస్తే తక్కువ కారంగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్, పప్పులు, తేలికైన మసాలా మిశ్రమాన్ని కలిగి ఉంటాయి. పాకిస్తానీ బిర్యానీ, ఆఫ్ఘని చికెన్ బిర్యానీ కాబూలి పులావ్ మధ్యప్రాచ్యం మధ్య ఆసియాలో పేరొందాయి. -
భారత్పై టారిఫ్ల ఎఫెక్ట్: కంపెనీల దివాళా, లక్షల ఉద్యోగాలు ఉష్కాకి!!
సాక్షి,న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ విధింపులపై ప్రముఖ భారత మార్కెట్ నిపుణులు అజయ్ బగ్గా హెచ్చరికలు జారీ చేశారు. నేటి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త టారిఫ్లతో సంస్థలు దివాళా తీయడం, వాటిల్లో పనిచేస్తున్న సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయేందుకు దారితీయనుందని అన్నారు. రష్యా నుంచి ముడిచమురు కొంటున్న భారత్పై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా 50శాతం విధించిన అదనపు సుంకాలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ తాజా పరిణామాలపై మార్కెట్ నిపుణులు అజయ్ బగ్గా స్పందించారు.అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై భారత్ 50శాతం టారిఫ్ చెల్లిస్తోంది. వీటివల్ల భారత్పై కొంతకాలం ప్రతికూల ప్రభావం పడుంది. పలు సంస్థలు దివాళా తీయోచ్చు. షార్ట్ టర్మ్ ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందనే అంచనా వేశారు.అదనపు టారిఫ్ కారణంగా భారత్ ఉత్పత్తి రంగంపై 30 నుంచి 40 బిలియన్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అజయ్ బగ్గా అభిప్రాయం వ్యక్తం చేశారు. దీని ఫలితంగా సమీప భవిష్యత్తులో భారతదేశ జీడీపీ 0.5 శాతం నుంచి 1శాతం వరకు తగ్గుతుంది. రూ.5.25 లక్షల కోట్లు నష్టం వాటిల్లనుంది. అలా అని పరిస్థితులు ఇలాగే స్థిరంగా ఉంటాయా? అని ప్రశ్నిస్తే.. లేదనే సమాధానం చెబుతున్నారు. రష్యా నుంచి ముడిచమురు కొంటున్న భారత్పై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా ఆగస్టు 7న నుంచి 25శాతం అదనపు సుంకాలు విధించింది. నేటి నుంచి మరో 25శాతం అదనపు సుంకాలు.. మొత్తంగా 50శాతం అదనపు సుంకాలు చెల్లిస్తూ భారత్ ప్రపంచంలోనే అత్యధిక పన్ను చెల్లిస్తున్న దేశాల జాబితాలో చేరినట్లైంది.ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధం కొనసాగేందుకు రష్యా నుంచి భారత్ ముడిచమురు కొనుగోళ్లే కారణమని ట్రంప్ ఆరోపించారు. ఆ కొనుగోళ్లను ఆపకపోతే భారత్ ఎగుమతులపై సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. అయితే, ట్రంప్ హెచ్చరికల్ని భారత్ భేఖాతరు చేసింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొనసాగిస్తూ వస్తోంది. ఈ క్రమంలో భారత్ నిర్ణయంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదనపు టారిఫ్ చెల్లించాలని ప్రకటించారు. దీంతో అమెరికా విధించిన అదనపు సుంకాలు నేటినుంచి అమల్లోకి వచ్చాయి. ఆ దేశ కాలమానం ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి దాటాక బుధవారం తెల్లవారుజామున 12.01 గంటల (భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 9.30 గంటలు) నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో గతంలో విధించిన 25 శాతానికి అదనంగా మరో 25 శాతం కలిపి భారత్ ఎగుమతులపై 50శాతం భారం పడుతోంది. -
భారత్లో యూఎస్ టార్గెట్ అదే..
పెరుగుతున్న ప్రపంచ ఇంధన అనిశ్చితి, మారుతున్న అంతర్జాతీయ భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో భారత్దేశానికి అతిపెద్ద ముడి చమురు, సహజ వాయువు సరఫరాదారుగా మారడానికి ప్రయత్నిస్తున్నట్లు యునైటెడ్ స్టేట్స్ తెలిపింది. భారత్ రష్యా ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలని అమెరికా ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన రావడం గమనార్హం. ఇండో-అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐఏసీసీ) ఇంధన సదస్సులో భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం ప్రిన్సిపల్ కమర్షియల్ ఆఫీసర్ జియాబింగ్ ఫెంగ్ ఈమేరకు వివరాలు వెల్లడించారు.ప్రధాన సరఫరాదారుగా మారేందుకు..ఈ సదస్సులో ఫెంగ్ మాట్లాడుతూ..‘ఇంధన భద్రత, ఆర్థిక వృద్ధి లక్ష్యాలకు మద్దతుగా భారత్తో కలిసి పనిచేసేందుకు అమెరికా సిద్ధంగా ఉంది. నాణ్యమైన ప్రపంచ స్థాయి ఉత్పత్తులు, సేవల ఎగుమతి ద్వారా మద్దతు ఇచ్చేందుకు అమెరికా కట్టుబడి ఉంది. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఇంధన వినియోగదారు అయిన భారతదేశానికి ముడి చమురు, ద్రవీకృత సహజ వాయువు(ఎల్ఎన్జీ) ప్రధాన సరఫరాదారుగా మారడానికి యూఎస్ ఎంతో ఆసక్తి చూపుతోంది’ అన్నారు.దౌత్యపరమైన ఒత్తిడిప్రస్తుత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య రష్యా చమురు దిగుమతులను తగ్గించాలని భారతదేశాన్ని కోరుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఇటీవల దౌత్యపరమైన ఒత్తిళ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ సదస్సులోని ప్రకటన మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. చమురు, గ్యాస్, అణుశక్తిపై సహకారంతో బలమైన ద్వైపాక్షిక ఇంధన భద్రతా భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవడానికి కలిసి రావాలని ఫెంగ్ అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గతంలో అమెరికా పర్యటనను హైలైట్ చేశారు. శిలాజ ఇంధనాలతో పాటు గ్రిడ్ ఆధునీకరణ, అణు ఇంధనం, అభివృద్ధి చెందుతున్న క్లీన్ టెక్నాలజీ రంగాల్లో కూడా భారత్తో భాగస్వామ్యం కావడానికి అమెరికా ఆసక్తిగా ఉంది. వీటిలో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు (ఎస్ఎంఆర్లు), అధునాతన సహజ వాయువు మౌలిక సదుపాయాలు ఉన్నాయి.ఇంధన భాగస్వామ్యాలు..కీలకమైన ఖనిజాలను ఇరు దేశాలు సంయుక్తంగా భద్రపరచాలని, సోలార్ మాడ్యూల్ ఉత్పత్తిని పెంచాలని, అణువిద్యుత్, స్మార్ట్ గ్రిడ్లపై భారీగా పెట్టుబడులు పెట్టాలని ఐఏసీసీ రీజినల్ ప్రెసిడెంట్ అతుల్ చౌహాన్ సూచించారు. ఐఏసీసీలో క్లైమేట్ ఛేంజ్ అండ్ ఈఎస్జీ ఛైర్మన్ సునీల్ జైన్ మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య సమీకృత ఎనర్జీ భాగస్వామ్యాలు అవసరమని అన్నారు. భవిష్యత్తులో భారతదేశ ఇంధన మౌలిక సదుపాయాలకు అణు, ఎస్ఎంఆర్లతో సహా కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో సంప్రదాయ వనరులు కీలకంగా మారుతాయన్నారు.ఇదీ చదవండి: పిల్లల ఆధార్ అప్డేట్.. యూఐడీఏఐ లేఖఅమెరికా భారత్పై విధించిన 50 శాతం సుంకాలు నిన్నటి నుంచి అమల్లోకి వచ్చాయి. టారిఫ్లకు భయపడి భారత్ డిమాండ్లకు ఒప్పుకుంటుందని భావించిన ట్రంప్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. భారత్ చౌకగా దిగుమతి చేసుకుంటున్న రష్యా చమురు స్థానంలో యూఎస్ క్రూడ్ దిగుమతులు పెంచాలని ఇటీవల ఒత్తిడి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. -
మా ఐటీ ఉద్యోగులకు మాటిస్తున్నా..
ఐటీ పరిశ్రమలో ఏఐ పేరు చెబితేనే ఉద్యోగులు బెంబేలెత్తిపోతున్నారు. కారణం ఎడాపెడా లేఆఫ్లు. ఒక కంపెనీ ఏఐపై దృష్టి పెట్టిందంటేనే ఇక ఆ సంస్థలో మానవ ఉద్యోగాలకు మూడినట్టేనన్న చర్చ సాగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో హెచ్సీఎల్ ఉద్యోగులకు మంచి మాట చెప్పారు ఆ కంపెనీ చైర్ పర్సన్ రోష్ని నాడార్.ఇటీవల జరిగిన హెచ్సీఎల్టెక్ వార్షిక సర్వసభ్య సమావేశంలో చైర్పర్సన్ రోషిణి నాడార్ మల్హోత్రా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ముడిపడి ఉన్న ఉద్యోగాల కోతలపై పెరుగుతున్న ఆందోళనలను ప్రస్తావించారు. తాము మానవ ప్రతిభను మరింత పెంచడానికే తప్ప దాన్ని భర్తీ చేయడం కోసం ఏఐని వినియోగించడం లేదని స్పష్టం చేశారు. ఆ రకంగా ఉద్యోగాల తొలగింపు కాకుండా వాటి సృష్టిపై కంపెనీ దృష్టి సారించిందని ఆమె వాటాదారులకు భరోసా ఇచ్చారు.బాధ్యతాయుతమైన వ్యూహానికి కట్టుబడి ఉన్నాంమానవ సామర్థ్యాలను పెంపొందించడానికి ఏఐని కో పైలట్ గా ప్రవేశపెడుతున్నామని, వాటి స్థానంలో కాదని ఆమె అన్నారు. ‘కొన్ని ఉద్యోగాల్లో మార్పులు ఉండొచ్చు కానీ, అధిక విలువ పనులను చేపట్టడానికి ఉద్యోగుల నైపుణ్యాలను పెంచడంపైనే మా దృష్టి ఉంది. ఉద్యోగాల కోత కంటే వాటి పెరుగుదల, ఉద్యోగ పరివర్తనకు ప్రాధాన్యమిచ్చే బాధ్యతాయుతమైన ఏఐ స్వీకరణ వ్యూహానికి మేం కట్టుబడి ఉన్నాం’ అని రోష్ని నాడార్ సపష్టం చేశారు.ఐటీ రంగంలో నియామకాలు మందకొడిగా సాగుతున్న తరుణంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశంలోని అగ్రశ్రేణి ఐటీ కంపెనీలలో సిబ్బంది నికర చేర్పులు తక్కువగా ఉన్నాయి. ఇది నియామకంలో మరింత జాగ్రత్తగా విధానాన్ని సూచిస్తుంది. కొన్ని కంపెనీలు స్వల్ప లాభాలను నమోదు చేయగా, మొత్తం ట్రెండ్ ప్రకారం నియామకాలు చల్లబడ్డాయి.జూన్ తో ముగిసిన త్రైమాసికంలో హెచ్సీఎల్ టెక్ 1,984 మంది ఫ్రెషర్లను నియమించుకుంది. గత త్రైమాసికంలో 2,23,420గా ఉన్న మొత్తం ఉద్యోగుల సంఖ్య ఆ త్రైమాసికంలో 2,23,151కి తగ్గింది. మార్చిలో 13 శాతంగా ఉన్న అట్రిషన్ రేటు జూనలో 12.8 శాతానికి తగ్గింది.ఇదీ చదవండి: విప్రో చేతికి హర్మన్ డీటీఎస్.. రూ. 3,270 కోట్ల డీల్ -
క్రమశిక్షణ చర్యల కింద ఎమ్మెల్యేలను తీవ్రంగా దండిస్తున్నారు!
క్రమశిక్షణ చర్యల కింద ఎమ్మెల్యేలను తీవ్రంగా దండిస్తున్నారు!