-
పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో.. డాక్టర్తో నిశ్చితార్థం
ఉపేంద్ర కన్నడ ఇండస్ట్రీకి చెందినవాడే అయినప్పటికీ తెలుగులోనూ బోలెడంతమంది ఫ్యాన్స్ ఉన్నాడు. గతంలో ఈయన చేసిన చిత్రాలు కల్ట్ స్టేటస్ దక్కించుకున్నాయి. ప్రస్తుతం హీరోగా, సహాయ పాత్రలు చేస్తూ బిజీగా ఉన్న ఈయన ఇంట్లో శుభకార్యం జరిగింది. ఈయన అన్న కొడుకు, హీరో నిరంజన్ నిశ్చితార్థం అట్టహాసంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) ఉపేంద్ర అన్న కొడుకు అయిన నిరంజన్ సుధీంద్ర.. 2018లో వచ్చిన 'సెకండాఫ్' మూవీతో నటుడిగా పరిచయమయ్యాడు. 2022లో రిలీజైన 'నమ్మ హుడుగురు' మూవీలోనూ నటించాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజైన 'సీతా పయనం'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. దీనికి ప్రముఖ నటుడు అర్జున్ సర్జా దర్శకత్వం వహించగా ఇతడి కూతురు ఐశ్వర్య హీరోయిన్గా చేసింది. భాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ పెద్దగా వర్కౌట్ కాలేదు.నటుడు నిరంజన్ సుధీంద్ర.. డాక్టర్ సంజనా రాజ్ని ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఈ వేడుకకు కుటుంబ సమేతంగా హాజరైన ఉపేంద్ర.. కాబోయే వధూవరులని మనసారా దీవించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలని ఉపేంద్ర సతీమణి తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకుంది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకోవడం కంటే కుక్కని పెంచుకోవడం చాలా బెటర్: టాలీవుడ్ హీరోయిన్) -
కవలలకు జన్మనిచ్చిన సీరియల్ హీరోయిన్
ప్రముఖ సీరియల్ నటి దివ్యాంక త్రిపాఠి, వివేక్ దహియా దంపతులు శుభవార్త చెప్పేశారు. తమకు మంగళవారం కవల మగబిడ్డలు జన్మించినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మేము ఆనందాన్ని కోరుకున్నాం. దేవుడు 'డబుల్గా తీసుకోండి' అన్నాడు. మా జీవితంలోకి కవల మగబిడ్డలు వచ్చారు' అని చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: 'ధురంధర్' హీరోపై బాలీవుడ్లో నిషేధం)కొన్ని నెలల క్రితం దివ్యాంక తాను ప్రెగ్నెన్సీతో ఉన్న సంగతి బయటపెట్టింది. దాదాపు ఆరు నెలల పాటు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచామని ఆమె చెప్పుకొచ్చింది. మాకు ఇప్పుడు బిడ్డ కావాలని అనిపించింది. ప్రయత్నించాం… దేవుడు ఆశీర్వదించాడు అని అప్పట్లో ఆమె చెప్పింది. ఇప్పుడు ఇద్దరబ్బాయిలకు తల్లయింది. 'యే హై మొహబ్బతేన్' సీరియల్ షూటింగ్ టైంలో దివ్యాంక, వివేక్ ఒకరికి ఒకరు పరిచయమయ్యారు. 2016 జూలై 8న పెళ్లి చేసుకున్నారు. (ఇదీ చదవండి: ముమైత్ ఖాన్ ఇప్పుడేం చేస్తోంది? పాక్తో ఈమెకు సంబంధమేంటి?) View this post on Instagram A post shared by Vivek Dahiya (@vivekdahiya) -
రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్లో కొత్త పద్ధతి!
రైల్వే కౌంటర్లలో తత్కాల్ టికెట్ల కోసం గంటల తరబడి పడిగాపులు కాసే ప్రయాణికుల ఇబ్బందులకు స్వస్తి పలికేందుకు భారతీయ రైల్వే కీలక అడుగు వేసింది. పశ్చిమ మధ్య రైల్వే (WCR) పరిధిలోని ప్రతిష్టాత్మక కోటా డివిజన్ తన పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్లలో వినూత్నమైన ‘టోకెన్ వ్యవస్థ’ను ప్రవేశపెట్టింది. తత్కాల్ బుకింగ్ ప్రక్రియలో పారదర్శకతను పెంచడం, కౌంటర్ల వద్ద తోపులాటలు, గందరగోళాన్ని నివారించడమే లక్ష్యంగా ఈ కొత్త నిబంధనలను అమలు చేయనున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న కోటా డివిజన్ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ కీలక నిర్ణయం తీసుకుంది.కొత్త విధానం ఎలా పనిచేస్తుంది?కౌంటర్ల వద్ద క్యూ లైన్ల నిర్వహణను క్రమబద్ధీకరించేందుకు రైల్వే శాఖ ఒక స్పష్టమైన ప్రణాళికను రూపొందించింది. ప్రయాణికులు ముందుగా నిర్ణయించిన సమయానికి బుకింగ్ కార్యాలయానికి చేరుకోవాలి. కౌంటర్ సిబ్బంది నుండి కేటగిరీకి సంబంధించిన టోకెన్ను తీసుకోవాలి. టోకెన్ నంబర్ల వరుస క్రమం ఆధారంగానే ప్రయాణికులను కౌంటర్ వద్దకు అనుమతిస్తారు. మీ వంతు వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా తత్కాల్ టికెట్ పొందవచ్చు.టోకెన్ పంపిణీ సమయాలు ఇవే..తత్కాల్ బుకింగ్ ప్రారంభం కావడానికి ముందే కౌంటర్ల వద్ద ఈ టోకెన్ల పంపిణీ జరుగుతుంది. ఏసీ క్లాస్ (AC Classes) కేటగిరీ ప్రయాణికులకు ఉదయం 9:00 నుండి 9:25 వరకు టోకెన్లు ఇస్తారు. ఉదయం 10:00 గంటలకు తత్కాల్ బుకింగ్ ప్రారంభవుతుంది. ఇక స్లీపర్ క్లాస్ (Sleeper Class) ప్రయాణికులకు ఉదయం 9:30 నుండి 9:55 వరకు టోకెన్ పంపిణీ ఉంటుంది. ఉదయం 11:00 గంటలకు తత్కాల్ టికెట్ల బుకింగ్ ప్రారంభం మొదలవుతుంది. సాధారణ రైల్వే నిబంధనల ప్రకారం ప్రయాణ తేదీకి ఒక రోజు ముందే తత్కాల్ విండో తెరుచుకుంటుంది. కౌంటర్లతో పాటు ఐఆర్సీటీసీ (IRCTC) అధికారిక వెబ్సైట్ ద్వారా కూడా డిజిటల్గా తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు.రైల్వే చార్ట్ తయారీలో మార్పులుప్రయాణికుల సౌకర్యార్థం రైలు బయలుదేరే సమయాన్ని బట్టి మొదటి రిజర్వేషన్ చార్ట్ తయారీ సమయాలను కూడా రైల్వే శాఖ ఇటీవల పునరుద్ధరించింది. ఉదయం 05:01 నుండి మధ్యాహ్నం 14:00 గంటల మధ్య బయలుదేరే రైళ్లకు ప్రయాణానికి ముందటి రోజు రాత్రి 20:00 గంటల (8:00 PM) లోపు మొదటి చార్ట్ సిద్ధం చేస్తారు. మధ్యాహ్నం 14:01 నుండి రాత్రి 23:59 వరకు, అర్ధరాత్రి 00:00 నుండి తెల్లవారుజామున 05:00 గంటల మధ్య బయలుదేరే రైళ్లకు రైలు ప్రయాణ సమయానికి కనీసం 10 గంటల ముందే మొదటి రిజర్వేషన్ చార్ట్ తయారు చేశారు.రైల్వే కౌంటర్ల వద్ద దళారుల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు, సాధారణ ప్రయాణికులకు సులభంగా టికెట్లు అందించేందుకు కోటా డివిజన్ తెచ్చిన ఈ టోకెన్ విధానం ఎంతో మేలు చేకూరుస్తుంది. ఇదే పద్ధతిని ఇతర రైల్వే డివిజన్లలోనూ అమలు చేస్తే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది. -
గోవధ నిషేధంపై పిటిషన్.. సీజేఐ ఘాటు వ్యాఖ్యలు!
న్యూఢిల్లీ: బక్రీద్ పండుగ సమీపిస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా గోవధ నిషేధ చట్టాలను కఠినంగా అమలు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పండుగకు కేవలం రెండు రోజుల ముందు ఈ అభ్యర్థన రావడంపై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.చివరి నిమిషంలో పిటిషన్ ఎందుకు?అఖిల భారత హిందూ మహాసభ మాజీ ఉపాధ్యక్షుడు సతీష్ కుమార్ అగర్వాల్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. గోవధను నిషేధించే చట్టాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని, అలాగే వధశాలల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలను రూపొందించేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు. బుధవారమే ఈ అంశంపై విచారణ చేపట్టాలని న్యాయవాది బారున్ కుమార్ సిన్హా కోర్టును కోరారు.సుప్రీంకోర్టు ఘాటు స్పందనఈ అభ్యర్థనను విన్న వెంటనే ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జయమల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఘాటుగా స్పందించింది. ‘పండుగకు ఒక్కరోజు ముందు మీకు ఇది గుర్తుకొచ్చిందా? ఇందులో ఎటువంటి అత్యవసర పరిస్థితి లేదు. ధన్యవాదాలు’ అని వ్యాఖ్యానిస్తూ, విచారణను చేపట్టేందుకు స్పష్టంగా నిరాకరించింది. సమయానుకూలంగా కాకుండా, పండుగ వేళ ఇలాంటి అంశాలను కోర్టు ముందుకు తేవడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.న్యాయపరమైన పరిణామాలుప్రస్తుతానికి ఈ పిటిషన్పై ఎలాంటి అత్యవసర ఉత్తర్వులు జారీ కాకపోవడంతో, పాత చట్టాలు, మార్గదర్శకాల ప్రకారమే పండుగ ఏర్పాట్లు కొనసాగనున్నాయి. చట్టాల అమలు, వధశాలల నియంత్రణకు సంబంధించి పిటిషనర్ లేవనెత్తిన అంశాలను తదుపరి సాధారణ విచారణలో పరిశీలించాల్సి ఉంటుంది. అత్యవసర విచారణ కోరిన న్యాయవాది విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించడంతో, ఈ వివాదం ప్రస్తుతానికి సద్దుమణిగింది. -
ముందు ఇండియా కూటమి ఎక్కడుందో తెలుసుకోవాడానికి అర్జంటుగా ఓ సమావేశం పెట్టాలి
-
వచ్చేస్తోంది కొత్త రకం స్టవ్!
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల కంటే వంటను చౌకగా చేయగల, కొత్త ఇథనాల్ ఆధారిత స్టవ్ టెక్నాలజీని ఆవిష్కరించారు. ఇది భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న బయోఫ్యూయల్ మిషన్లో మరో ప్రధాన ముందడుగును సూచిస్తుంది.నాగ్పూర్లో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడుతూ.. ఇథనాల్ ఆధారిత కొత్త స్టవ్ ద్వారా, వంట గ్యాస్ సిలిండర్ల కంటే తక్కువ ఖర్చుతోనే వంట చేయవచ్చని తెలిపారు. ఇది దేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతికతగా పేర్కొన్నారు. ఇథనాల్ను నీటితో కలిపి మంటను ఉత్పత్తి చేయడం ద్వారా ఈ స్టవ్ పనిచేస్తుంది. ఇది సంప్రదాయ ఎల్పీజీ వంటి ఇంధనాల కంటే తక్కువ కాలుష్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి గృహ వినియోగానికి ఇది ఒక ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉంది.భారతదేశం చమురు అవసరాల కోసం.. సుమారు 87 శాతం దిగుమతులపైనే ఆధారపడుతుంది. ఈ పరిస్థితిని తగ్గించేందుకు ప్రభుత్వం ఇథనాల్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని పెంచుతోంది. ఇప్పటికే దేశంలో పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమం కలిపి వినియోగించడం కొనసాగుతోంది. 2014లో 1.5 శాతం నుంచి 2025 నాటికి దాదాపు 20 శాతానికి ఇథనాల్ వినియోగం పెరిగింది.ఇదీ చదవండి: పెరుగుతున్న ధరలు.. నిర్మలా సీతారామన్ హెచ్చరిక!ఇథనాల్ అనేది ప్రధానంగా.. చెరకు, మొక్కజొన్న, వ్యవసాయ వ్యర్థాల నుంచి ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ఇది మండినప్పుడు కూడా తక్కువ కాలుష్యం విడుదలవుతుంది. అందువల్ల దీనిని పర్యావరణహిత ఇంధనంగానే పరిగణిస్తారు.ఈ కొత్త టెక్నాలజీ విజయవంతమైతే.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వంట గ్యాస్పై ఆధారపడటం చాలావరకు తగ్గుతుంది. ఇదే జరిగితే.. ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉంది. అయితే దీనికోసం భారీ మొత్తంలో ఇథనాల్ ఉత్పత్తి అవసరం అవుతుంది. సరఫరా మాత్రమే కాకుండా.. భద్రత కూడా చాలా ముఖ్యం. ఇవన్నీ సాధ్యమైతేనే ప్రజలు దీనిని విశ్వసిస్తారు. వినియోగించడానికి ముందుకు వస్తారు. -
IPL 2026: శ్రేయస్ అయ్యర్ పోస్ట్ వైరల్!
ఐపీఎల్-2026లో పంజాబ్ కింగ్స్ ప్రయాణం విచిత్రంగా సాగింది. ఆరంభంలో వరుసగా ఏడు మ్యాచ్లలో ఓటమన్నదే ఎరుగని శ్రేయస్ అయ్యర్ సేన.. ఆ తర్వాత వరుసగా ఆరు మ్యాచ్లలో ఓడిపోయింది.పంజాబ్కు తప్పని పరాభవంఫలితంగా ప్లే ఆఫ్స్ చేరేందుకు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. ఆఖరి లీగ్ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్పై గెలిచి.. ముంబై ఇండియన్స్పై ఆశలు పెట్టుకుంది. అయితే, రాజస్తాన్ రాయల్స్ చేతిలో ముంబై ఓడిపోవడంతో పంజాబ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.పైసా వసూల్ ప్రదర్శనఈ నేపథ్యంలో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్పై విమర్శలు వచ్చాయి. కాగా గతేడాది వేలంలో రూ. 26.75 కోట్ల భారీ ధరకు పంజాబ్ శ్రేయస్ను కొనుగోలు చేసి పగ్గాలు అప్పగించింది. అందుకు తగ్గట్లుగానే ఈ ముంబైకర్ పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చాడు.బ్యాటర్గా 604 పరుగులు సాధించిన అయ్యర్.. కెప్టెన్గా జట్టును ఫైనల్కు చేర్చాడు. అయితే, టైటిల్ పోరులో ఆర్సీబీ చేతిలో ఆరు పరుగుల స్వల్ప తేడాతో ఓడిన పంజాబ్.. తొలిసారి ట్రోఫీని గెలిచే అవకాశాన్ని చేజార్చుకుంది.ఆరంభంలోనూ అదుర్స్ఇక గతేడాది మాదిరే ఐపీఎల్-2026లోనూ జోరు కొనసాగించిన పంజాబ్ వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ ఫేవరెట్గా ముందుకు సాగింది. కానీ అనూహ్య రీతిలో డబుల్ హ్యాట్రిక్ ఓటములతో డీలా పడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.స్పందించిన శ్రేయస్ఈ నేపథ్యంలో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొలిసారి స్పందించాడు. ఇన్స్టా వేదికగా జట్టుతో ఉన్న దృశ్యాలను పంచుకుంటూ.. ‘‘ప్రతీ పరుగు.. ప్రతీ క్షణం.. ప్రతీ పోరాటం. ఈ అధ్యాయం కృతజ్ఞతతో ముగిసింది. ఆకలి, కసితో తదుపరి అధ్యాయం మొదలవుతుంది’’ అని శ్రేయస్ అయ్యర్ క్యాప్షన్ జతచేశాడు.తద్వారా 2027లో తాము రెట్టించిన ఉత్సాహం, ఆత్మవిశ్వాసంతో తిరిగి వస్తామని అయ్యర్ చెప్పకనే చెప్పాడు. కాగా ఈ సీజన్లో ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 14 మ్యాచ్లలో కలిపి 498 పరుగులు సాధించాడు. ఆఖరి లీగ్ మ్యాచ్లో లక్నోపై శ్రేయస్ (101 నాటౌట్) శతక్కొట్టడం విశేషం.చదవండి: వాళ్లిద్దరు తేలిపోతే ఆర్సీబీకి కష్టమే: సెహ్వాగ్ View this post on Instagram A post shared by Shreyas Iyer (@shreyasiyer96) -
ఈ చిత్రం చూశారా.. వైభవ్ ఫ్యామిలీ మొత్తం ఒకేలా!
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్లో 14 మ్యాచ్లాడిన వైభవ్ 583 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు అర్థసెంచరీలున్నాయి. ఆదివారం ముంబై ఇండియన్స్పై గెలిచిన రాజస్తాన్ రాయల్స్ నాలుగో జట్టుగా ప్లేఆఫ్స్లో అడుగుపెట్టింది.మే 27న (బుధవారం) ఎస్ఆర్హెచ్తో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనుంది. ఈ సంగతి పక్కనబెడితే సోషల్ మీడియాలో వైభవ్ సూర్యవంశీకి సంబంధించిన ఫ్యామిలీ వీడియో వైరల్గా మారింది. ఆదివారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్ను వీక్షించడానికి వైభవ్ కుటుంబం మొత్తం తరలివచ్చింది.మ్యాచ్లో వైభవ్ తుస్సుమన్నప్పటికీ రాజస్తాన్ గెలవడం, ప్లేఆఫ్ చేరడంతో అతడి కుటుంబం సంతోషంతో ఇంటిబాట పట్టారు. ఈ నేపథ్యంలో స్టేడియం నుంచి బయటికి వస్తున్న వైభవ్ సూర్యవంశీ కుటుంబం సహా అతడి సోదరులు కెమెరా కంటికి చిక్కారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. 'ఫ్యామిలీ అంతా ఒకేలా ఉంది' అంటూ కామెంట్స్ చేయడం ఆసక్తి కలిగించింది.కాగా, వైభవ్కు ముగ్గురు సోదరులు ఉన్నారు. ఉజ్వల్, విశాల్ అతడి కంటే పెద్దవాళ్లు కాగా, ఆశీర్వాద్ అందరికంటే చిన్నవాడు. ఈ నలుగురు అన్నదమ్ములు కూడా హైట్లో తేడా ఉన్నప్పటికీ ముఖ కవలికల్లో మాత్రం అచ్చు గుద్దినట్లు ఒకేలా ఉండడం విశేషం. ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ 30 పరుగుల తేడాతో విజయం సాధించింది.తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. జురెల్ (38), జోఫ్రా ఆర్చర్ (32) సహా మిగతా బ్యాటర్లు తలా కొన్ని పరుగులు చేయడంతో రాజస్తాన్ 200 పరుగుల మార్క్ను దాటింది. అనంతరం లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులకే పరిమితమైంది. View this post on Instagram A post shared by Filmymantra Media (@filmymantramedia)Vaibhav’s carbon copy cute Family 🩷🤭 pic.twitter.com/WLUDhFyg0c— Charvi Vyas (@4Vvyas) May 25, 2026చదవండి: మెగాటోర్నీకి ముందు ఆసీస్ స్టార్ షాకింగ్ నిర్ణయం! -
25 బంతుల్లోనే సెంచరీ బాదిన వైభవ్!
ఐపీఎల్ 2026 సీజన్లో ఎక్కువగా ట్రెండింగ్లో నిలిచిన పేరు వైభవ్ సూర్యవంశీ. రాజస్తాన్ రాయల్స్కు ఆడుతున్న ఈ 15 ఏళ్ల చిన్నోడు బ్యాటింగ్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. తాజాగా ఇంగ్లండ్ మాజీ ఆల్రౌండర్ కెవిన్ పీటర్సన్ నిర్వహించిన యూట్యూబ్ షోలో పాల్గొన్న వైభవ్ సూర్యవంశీ 25 బంతుల్లోనే సెంచరీ సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. విషయంలోకి వెళితే పీటర్సన్ తన యూట్యూబ్ చానెల్లో వైభవ్ సూర్యవంశీతో ఒక ప్రత్యేక ఎపిసోడ్ చేశాడు. ఆ ఎపిసోడ్లోనే పీటర్సన్ వైభవ్కు 50 బంతుల్లో 100 పరుగులు చేయాలంటూ సవాల్ విసిరాడు. కానీ వైభవ్ మాత్రం పీటర్సన్ విసిరిన సవాల్ను 25 బంతుల్లోనే అందుకోవడం విశేషం. బౌలింగ్ మెషిన్ నుంచి వచ్చిన బంతులను వైభవ్ భారీ సిక్సర్లుగా మలిచాడు. అయితే 25 బంతుల్లోనే శతకం సాధించినప్పటికీ ఇదే పీటర్సన్ షోలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 22 బంతుల్లో సాధించిన వంద పరుగుల రికార్డును మాత్రం బద్దలుకొట్టలేకపోయాడు. మూడు బంతుల తేడాతో అయ్యర్ రికార్డును బ్రేక్ చేసే అవకాశాన్ని వైభవ్ కోల్పోయాడు. ఇక పీటర్సన్ షోలో అత్యంత వేగంగా సెంచరీలు బాదిన ఆటగాళ్ల జాబితాలో వైభవ్ సూర్యవంశీ రెండో స్థానంలో ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్, వైభవ్ తర్వాత నికోలస్ పూరన్ (28 బంతులు) మూడో స్థానంలో ఉన్నాడు. అంతకముందు ఏబీ డివిలియర్స్ 30 బంతుల్లో వంద పరుగులు సాధించాడు. ఇక రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 47 బంతుల్లో వంద పరుగులు సాధించడం గమనార్హం. ఇదే ఎపిసోడ్లో సూర్యవంశీ తన కోరికను వెల్లడించాడు. టీ20ల్లో డబుల్ సెంచరీ చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు. అయితే టీ20 క్రికెట్లో ఇప్పటివరకు అత్యధిక వ్యక్తిగత స్కోరు విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ (175 పరుగులు) పేరిట ఉంది. 2013 ఐపీఎల్ సీజన్లో గేల్ ఆర్సీబీ తరఫున 175 పరుగులు ఇన్నింగ్స్ ఆడాడు. గేల్ రికార్డును బద్దలుకొట్టడంతో పాటు టీ20ల్లో డబుల్ సెంచరీ బాదడమే తన టార్గెట్ అని మరోసారి స్పష్టం చేశాడు.ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ప్లేఆఫ్స్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆదివారం ముంబై ఇండియన్స్పై 30 పరుగుల తేడాతో విజయం సాధించిన రాజస్తాన్ 16 పాయింట్లతో నాకౌట్ దశకు చేరుకుంది. బుధవారం (మే 27న) జరగనున్న ఎలిమినేటర్ పోరులో ఎస్ఆర్హెచ్ను ఎదుర్కోనుంది. ఇక రాజస్తాన్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ సీజన్లో 14 మ్యాచ్లాడి 583 పరుగులు సాధించాడు.చదవండి: మెస్సీకి గాయం.. ఫిఫా ప్రపంచకప్కు దూరం! -
'ధురంధర్' హీరోపై బాలీవుడ్లో నిషేధం
'ధురంధర్' రెండు సినిమాలతో బ్లాక్బస్టర్ హిట్స్ కొట్టిన హీరో రణ్వీర్ సింగ్పై నిషేధం. బాలీవుడ్లో ఇకపై ఇతడు సినిమాలు చేయడం కష్టమే అనే మాట ఇప్పుడు వినిపిస్తోంది. దీనికి కారణం 'డాన్ 3' అనే మూవీ. సడన్గా తప్పుకోవడంతో ఆ చిత్ర దర్శకనిర్మాత.. రణ్వీర్పై ఫిర్యాదు చేయడమే దీనికి కారణం. మరి ఈ నిషేధం వల్ల రణ్వీర్కి నష్టమేంటి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) హిందీ హీరోల్లో రణ్వీర్ సింగ్ పేరున్న హీరోనే. పద్మావత్, రామ్ లీల్ లాంటి సినిమాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. కానీ ఇతడికి గత కొన్నేళ్ల నుంచి సరైన హిట్ అనేది లేదు. సరిగ్గా ఈ టైంలో 'ధురంధర్' మూవీస్ సక్సెస్ కావడం ఇతడి గ్లోబల్ వైడ్ గుర్తింపు తీసుకొచ్చింది. అయితే ఈ చిత్రాల్లో నటించడానికి ముందే 'డాన్ 3' అనే ప్రాజెక్ట్ ఒప్పుకొన్నాడు.2023 ఆగస్టులోనే 'డాన్ 3'కి సంబంధించిన ప్రకటన వచ్చింది. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో రణ్వీర్, కియారా అడ్వాణీ హీరోహీరోయిన్లు అని అనౌన్స్ చేశారు. అయితే పలు కారణాల వల్ల ఈ చిత్రం ఆలస్యమవుతూ వచ్చింది. 'ధురంధర్' రావడానికి ముందు కూడా ఫర్హాన్, రణ్వీర్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయనే టాక్ వినిపించింది. తర్వాత కొన్నాళ్లకు రణ్వీర్ ఈ మూవీ నుంచి తప్పుకొన్నాడు. అయిత షూటింగ్ మొదలవడానికి కొన్నివారాల ముందు ఇలా చేయడంతో తమకు రూ.40-45 కోట్ల నష్టం వాటిల్లిందని ఫర్హాన్.. ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్(FWICE)ని ఆశ్రయించాడు.ఈ క్రమంలోనే సినీ ఎంప్లాయిస్ ఫెడరేషన్.. రణ్వీర్ సింగ్పై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించడంతో అంతా షాకయ్యారు. అయితే ఈ ఆదేశం చట్టపరమైన నిషేధం కాదు. కాకపోతే ఈ ఫెడరేషన్కి అనుబంధంగా ఉన్న కార్మికులు, టెక్నీషియన్లు, ఇతర సినీ ఉద్యోగులు రణవీర్ సింగ్తో కలిసి పని చేయడానికి కుదరదు. బాలీవుడ్ చాలావరకు ఈ వర్గాలపై ఎక్కువగా ఆధారపడటం వల్ల, ఇది సదరు హీరో భవిష్యత్ ప్రాజెక్టులపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.ఈ వివాదంపై స్పందించిన రణవీర్ సింగ్ తరఫు ప్రతినిధి మాత్రం పబ్లిక్గా దీని గురించి స్పందించడం ఇష్టం లేదని.. వృత్తిపరమైన విభేదాలను వ్యక్తిగతంగా పరిష్కరించుకోవాలని రణవీర్ భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే దీనంతటికి 'ధురంధర్' సక్సెస్ కారణమా అని సందేహం కలుగుతోంది. ఎందుకంటే ఈ మూవీ హిట్ అయినా సరే బాలీవుడ్ టాప్ హీరోలు, దర్శకనిర్మాతలు కనీసం స్పందించలేదు. బహుశా ఈ కారణంతోనే రణ్వీర్పై ప్రతీకారం తీర్చుకుంటున్నారా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో.. డాక్టర్తో నిశ్చితార్థం)
