breaking news
-
ఈ రాశి వారు శుభవార్తలు వింటారు.. ఆకస్మిక ధనలాభం
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: బ.పాడ్యమి రా.2.13 వరకు, తదుపరి విదియ, నక్షత్రం: పూర్వాషాఢ ఉ.6.33 వరకు, తదుపరి ఉత్తరాషాఢ, వర్జ్యం: ప.2.50 నుండి 4.30 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.12 నుండి 9.04 వరకు, తదుపరి ప.12.31 నుండి 1.23 వరకు, అమృత ఘడియలు: రా.12.51 నుండి 2.30 వరకు; రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు, యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు, సూర్యోదయం: 5.35, సూర్యాస్తమయం: 6.35. మేషం.. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటాబయటా కొంత నిరుత్సాహం. శారీరక రుగ్మతలు. వృత్తి, వ్యాపారాలు కొంత ఇబ్బందిపరుస్తాయి.వృషభం.... కొన్ని కార్యాలు వాయిదా వేస్తారు. ఆదాయం తగినంత లేక అప్పులు చేస్తారు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి,వ్యాపారాలు మందగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.మిథునం... కార్యక్రమాలలో విజయం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. దైవారాధనలో పాల్గొంటారు. వృత్తి,వ్యాపారాలలో మీరు అనుకున్నట్లే జరుగుతుంది. కళాకారులకు ప్రయత్నాలు సఫలం.కర్కాటకం.... రాబడికి లోటు లేదు. సన్నిహితుల సాయం అందుతుంది. కార్యక్రమాలలో అవాంతరాలు తొలగుతాయి. సోదరుల నుంచి శుభవార్తలు. వృత్తి, వ్యాపారాలలో మీ ఊహలు నిజం కాగలవు. వస్తులాభాలు.సింహం... కార్యక్రమాలలో తొందరపాటు. బాధ్యతలు పెరుగుతాయి. బంధువర్గంతో విభేదాలు. ఆలోచనలు కలసిరావు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు. కళాకారులకు చికాకులు.కన్య... కష్టానికి ఫలితం కనిపించదు. ముఖ్య కార్యాలలో తొందరపాటు. ఆస్తి వివాదాలు. రాబడికి మించిన ఖర్చులతో సతమతమవుతారు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. దేవాలయ దర్శనాలు.తుల... సంఘంలో మీదే పైచేయిగా ఉంటుంది. అదనపు రాబడితో అవసరాలు తీరతాయి. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఆహ్వానాలు అందుతాయి. కార్యజయం. వృత్తి, వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. దేవాలయ దర్శనాలు.వృశ్చికం... ఆదాయం అంతగా కనిపించదు. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. కుటుంబసభ్యులతో వివాదాలు. శారీరక రుగ్మతలు. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.ధనుస్సు.... కార్యక్రమాలు సకాలంలో చకచకా సాగుతాయి. అదనపు ఆదాయంతో ఉత్సాహంగా గడుపుతారు. చిన్ననాటి స్నేహితుల కలయిక. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.మకరం..... కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలు. ఆదాయం ఉన్నా ఖర్చులు సైతం పెరుగుతాయి. ప్రతి విషయానికి కలత చెందుతారు. ఆలోచనలు కలిసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు..కుంభం... సన్నిహితుల సాయం అందుతుంది. కార్యక్రమాలలో విజయం. ఆదాయం మరింత సంతృప్తినిస్తుంది. వాహనయోగం. చర్చలు సఫలం. వృత్తి,వ్యాపారాలు అనుకూల పరిస్థితులు. పారిశ్రామికవేత్తలు కాస్త ఉపశమనం పొందుతారు.మీనం... కొత్త విషయాలు తెలుసుకుంటారు. మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సోదరుల నుంచి ముఖ్య సమాచారం. అదనపు ఆదాయం సమకూరుతుంది. వ్యాపార, ఉద్యోగాలు అవాంతరాలు తొలగుతాయి. -
డబ్బులొద్దు.. నా కోరిక తీర్చు ప్లీజ్!
సిరిసిల్ల: ఇక్కడా.. అక్కడా అని ఏమీ లేదు. జిల్లా వ్యాప్తంగా మహిళలు పనిచేసే ప్రదేశాల్లో వేధింపులు ఎక్కువయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లోనూ మహిళా ఉద్యోగిణులు సహచరులతో వేధింపులకు గురవుతున్నారు. ప్రభుత్వ శాఖలతోపాటు బీడీలు చేసే చోట, గార్మెంట్రంగంలో పనిచేసే ప్రదేశాల్లో వేధింపులకు గురవుతున్నారు. అయినా ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపోతున్నారు. ‘సిరిసిల్ల పట్టణంలోని ఓ ఇంట్లో కరెంట్ పోయింది. విద్యుత్ సరఫరా లేక పోవడంతో ‘సెస్’ సంస్థకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. ఓ గంటకు ‘సెస్’ సంస్థలో పనిచేసే ఓ ఉద్యోగి ఆ ఇంటికి వచ్చాడు. ఇంట్లోకి వచ్చే సర్వీసు వైరు పాడైపోయిందని, కొత్తది తెచ్చి వేయాలని సదరు ఉద్యోగి చెప్పడంతో ఆ వైరు ఏదో మీరే తెండి. నాకు తెచ్చే వాళ్లు ఎవరూ లేరని ఇంట్లోని మహిళ కోరింది. రూ.2వేలు ఇవ్వడంతో సదరు ‘సెస్’ ఉద్యోగి కొత్త వైరు తెచ్చి బిగించాడు. అతను చేసిన పనిని గౌరవిస్తూ సదరు మహిళ రూ.500 ఇచ్చేందుకు ప్రయత్నించగా.. ‘సెస్’ ఉద్యోగి డబ్బులు వద్దు కానీ.. తన కోర్క తీర్చాలని ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆ మహిళ చేయి పట్టుకున్నట్లు సమాచారం. ఆ మహిళ తిరగబడడంతో విషయం ఎవరికీ చెప్పొద్దు అంటూ ప్రాధేయపడి వెళ్లాడు.’‘అందరూ సార్లు బాగానే ఉన్నారు. కానీ ఆ ఒక్కసారు చూపులే వేరుగా ఉన్నాయి. అందరి దృష్టిలో అతను మంచోడు. కానీ ఆమెతో అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో తెలియడం లేదు. ఆ సారు మాట్లాడే తీరు.. చూపులు.. తనకు ఇబ్బందిగా ఉన్నాయి. ఏ డ్రెస్లో వచ్చినా విడ్డూరంగా మాట్లాడడం.. ఆఫీస్లో ఎవరూ లేకుంటే చేయి తగిలించడం వంటివి చేస్తున్నాడు. ఇదంతా ఇంట్లో చెబితే పెద్ద గొడవే అవుతుంది. ఎవరికైనా ఫిర్యాదు చేస్తే పరువుపోతుంది. ఏం చేయాలో తెలియక అతని నుంచి తప్పించుకు తిరుగుతోంది ఓ ఉద్యోగిని.‘అదో మారుమూల పల్లె. వారికి పెద్దగా వ్యవసాయభూమి లేదు. కుటుంబ పోషణకు భర్త గల్ఫ్ దేశానికి వెళ్లాడు. అప్పులు ఉన్నాయి. ఇ ల్లు గడిచేందుకు ఆమె ఉపాధిహామీ పనికి వెళ్తుంది. తోటి కూలీలతోపాటు పనిచేస్తుంది. కానీ అక్కడే పనిచేసే ఓ యువకుడు ఆమెపై కన్నేశాడు. పనులు ముగించుకుని వస్తుండగా.. ఒంటరిగా ఉన్న ఆమెను సదరు యువకుడు మాటలతోనే వేధించాడు. అయినా అవేమీ పట్టించుకోలేదు. కానీ ఎవరికైనా చెబితే పరువు పోతుంది. ఇంటి వద్ద భర్త లేడు కాబట్టి తననే తప్పు పట్టే ప్రమాదం ఉంది. అత్తమామలకు చెబుదామంటే.. వాళ్లు వృద్ధులు. ఎవరికీ చెప్పుకోలేక ఉపాధిహామీ పనికి వెళ్లలేక ఇంటి వద్దనే సదరు మహిళ కుమిలిపోతుంది.’‘అది జిల్లాలో విద్యుత్ పంపిణీ చేసే సహకార సంస్థ(సెస్) ఆఫీస్. ఆ ఆఫీస్ పరిధిలో పనిచేసే ఓ ఉద్యోగి అనారోగ్యంతో మంచం పట్టారు. అతను ఉద్యోగం చేసేందుకు అన్ఫిట్ కావడంతో ఆ కుటుంబానికి ఉపాధి కల్పనకు సదరు ఉద్యోగి భార్యకు సంస్థలో ఉద్యోగాన్ని కల్పించారు. సదరు మహిళ కింద స్థాయి ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. అదే ఆఫీస్లో పనిచేసే ఓ ఉద్యోగి ఆమెను తరచూ వేధించడంతో భరించలేక ఆఫీస్ నుంచి బదిలీ చేయించుకుని మరో చోటికి వెళ్లింది. కానీ సదరు ప్రబుద్ధుడి వేధింపులు ఆగలేదు. మరింత ఎక్కువయ్యాయి. ఉద్యోగం చేయలేక.. వేధింపులు భరించలేక సదరు మహిళా ఉద్యోగి మానసిక వేదనకు గురవుతున్నారు.’మొక్కుబడిగా ఐసీసీ కమిటీలుపనిచేసే చోట మహిళలపై లైంగిక వేధింపుల నిరోధానికి 2013లో మహిళా హక్కుల పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం చట్టం తెచ్చింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీస్లు, వ్యాపార, వాణిజ్య సంస్థల్లో ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ(ఐసీసీ)లను ఏర్పాటు చేసి మహిళల ఆత్మగౌరవం దెబ్బతినకుండా అంతర్గతంగా విచారణ చేపట్టి చర్యలు తీసుకునేలా చట్టాన్ని రూపొందించారు. కానీ జిల్లాలో ఎన్నో పోక్సో కేసులు నమోదవుతున్నా అంతర్గతంగా విచారణలు జరుపుతున్నా ఐసీసీ కమిటీలు మహిళలను వేధిస్తున్న కేసుల్లో మొక్కుబడిగానే పనిచేస్తున్నారు. జిల్లాలో 200లకు పైగా ప్రభుత్వ ఆఫీస్లు, ప్రైవేటు సంస్థల్లో ఐసీసీ కమిటీలను వేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 35 ఆఫీస్ల్లో మాత్రమే కమిటీలు వేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. అవీ కూడా మొక్కుబడిగానే పనిచేస్తున్నారు. ఐసీసీ కమిటీల నిర్మాణంమహిళలు పనిచేసే సంస్థలు, సహకార సంఘాల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందులో ఆఫీస్, లేదా సంస్థ సీనియర్ మహిళా ఉద్యోగి చైర్పర్సన్గా, మరో ఇద్దరు ఇందులో ఒక్కరు మహిళ, మరొకరు మహిళ కానీ వ్యక్తులు, లేదా న్యాయశాస్త్రం చట్టాలపై అవగాహన కలిగిన వ్యక్తులు, మరో వ్యక్తి సమాజ సేవకులు సభ్యులుగా ఉంటారు. మహిళల నుంచి ఐసీసీకి ఫిర్యాదులు వచ్చినప్పుడు వెంటనే అంతర్గతంగా విషయం బయటకు చెప్పకుండా విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. బాధిత మహిళకు ఫిర్యాదు చేసినట్లు రశీదు ఇవ్వాల్సి ఉంటుంది.ఐసీసీ సిపార్సుల మేరకు..నేరం తీవ్రతను బట్టి వేధించిన వ్యక్తిని బదిలీ చే యడం, ఉద్యోగం నుంచి తొలగించడం, హెచ్చరించి వదిలేయడం, ప్రమోషన్ నిలుపుదల చేయడం, జరిమానా విధించడం, బాధితురాలికి ఇప్పించడం వంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. 90 రోజుల్లో శిక్ష విధించాలి. విచారణ నివేదికను కలెక్టర్ లేదా జిల్లా మహిళా, శిశుసంక్షేమ శాఖ అధికారికి అందించాల్సి ఉంటుంది. కానీ జిల్లాలో ఐసీసీ కమిటీ నిర్మాణం, సిపార్సులు పెద్దగా లేవు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో షీటీమ్లు విద్యాసంస్థల్లో, బస్టాండుల్లో, ఉపాధిహామీ కూలీలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లాలో పూర్తి స్థాయిలో ఐసీసీ కమిటీలను నియమించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.చర్యలు తీసుకుంటున్నాంజిల్లాలో ఐసీసీ కమిటీలను ఏర్పాటు చేశాం. ఫిర్యాదులు రాగానే నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటున్నాం. ఇవి బహిర్గతం చేయకూడదు కాబట్టి ప్రచారం చేయడం లేదు. ఇప్పుడు ఆన్లైన్లోనూ మెయిల్స్ ద్వారా ఫిర్యాదులను స్వీకరించే అవకాశం ఉంది. ‘షీ బాక్స్’ అనే కొత్త ఆన్లైన్ ఫిర్యాదులను ఏర్పాటు చేశారు. జిల్లాలో రెండు గ్రూపులుగా ఐసీసీ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ‘షీ బాక్స్’కు ఆన్లైన్లో ఫిర్యాదు చేస్తే నేరుగా మాకు చేరుతుంది. దీనిపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తాం.– లక్ష్మీరాజం, జిల్లా సంక్షేమ అధికారిఇలా చేస్తే ఫిర్యాదు చేయండిభౌతికంగా శరీరాన్ని తాకడం.శారీరకంగా కలవాలని అభ్యర్థించడం, బలవంతపెట్టడం.అసభ్య సంభాషణలు, కామెంట్లు, చేష్టలతో ఇబ్బంది పెట్టడం.మానసికంగా బాధ కలిగించేలా మాట్లాడడం, అసభ్యంగా వర్ణించడం.నిస్సహాయురాలిని చేసి ప్రవర్తించడం. అవాంఛనీయంగా, అనైతికంగా బలవంతం చేయడం.ద్వంద్వార్థాలు వచ్చేలా మాట్లాడడం. దుఃఖం, బాధ కలిగించేలా ప్రవర్తించడం. ఆడవాళ్ల వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నించడం, సలహాలివ్వడం, కుళ్లుజోకులు వేయ డం, బూతుబొమ్మలు, ఎస్ఎంఎస్లు, వాట్సా ప్లు, ఈమెయిల్స్, భయపెట్టేలా బ్లాక్ మెయి ల్ చేయడం. మహిళా సిబ్బందికి సముచిత గౌరవం లేకుండా ప్రవర్తించడం, ఆడవారి రూపాన్ని, వేషభాషల్ని గురించి కామెంట్ చేయడం కూడా వేధింపుల కిందకే వస్తాయి. -
టీమిండియా చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఇంగ్లండ్ గడ్డపై టాస్ విషయంలో టీమిండియాను బ్యాడ్లక్ వెంటాడుతోంది. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో వరుసగా మూడో మ్యాచ్లోనూ భారత కెప్టెన్ శుబ్మన్ గిల్ టాస్ ఓడిపోయాడు. లార్డ్స్ వేదికగా ప్రారంభమైన మూడో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు తొలుత బ్యా టింగ్ ఎంచుకుంది. అయితే అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఏడాది ఆరంభం నుంచి భారత్ టాస్ ఓడిపోవడం ఇది వరుసగా 13వ సారి కావడం గమనార్హం.ఈ క్రమంలో టీమిండియా ఓ చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. అంతర్జాతీయ క్రికెట్(మూడు ఫార్మాట్లు)లో వరుసగా అత్యధిక సార్లు టాస్ ఓడిపోయిన జట్టుగా భారత్ నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ పేరిట ఉండేది. విండీస్ 1999లో వరుసగా 12 మ్యాచ్ల్లో టాస్ గెలవలేకపోయింది. తాజా మ్యాచ్తో విండీస్ను మెన్ ఇన్ బ్లూ అధిగమించింది.ఈ మ్యాచ్లో ఇంగ్లండ్, భారత జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగాయి. ఇంగ్లండ్ జట్టులోకి జోఫ్రా ఆర్చర్ రాగా.. టీమిండియాలోకి జస్ప్రీత్ బుమ్రా రీ ఎంట్రీ ఇచ్చాడు. 35 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో రెండు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. క్రీజులో జో రూట్(27), పోప్(19) ఉన్నారు. ఓపెనర్లు జాక్ క్రాలీ(18), బెన్ డకెట్(23)ను నితీశ్ కుమార్ రెడ్డి పెవిలియన్కు పంపాడు.తుదిజట్లుభారత్శుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్దీప్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి.ఇంగ్లండ్బెన్ స్టోక్స్ (కెప్టెన్), జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, షోయబ్ బషీర్. -
Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..!
అధిక బరువు సమస్య కొంతమందిని వేధిస్తే, ముందుకు పొడుచుకు వచ్చిన బాన పొట్ట మరికొంతమందిని బాధిస్తుంది. కానీ మన ఇంట్లోనే, మన పోపుల పెట్టెలోనే సులువుగా లభించే దినుసులతో బెల్లి ఫ్యాట్ను కరిగించుకోవచ్చు. అదెలాగో ఇవాల్టి ‘టిప్ ఆఫ్ ది డే’ లో భాగంగా తెలుసుకుందాం.బెల్లీ ఫ్యాట్ను తగ్గించుకునేందుకు సోంపు, జీలకర్ర, ధనియాలతో చేసిన కషాయం బాగా పనిచేస్తుందని ఆయుర్వేదనిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఇది శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ కషాయం త్రాగడం వలన జీర్ణక్రియ మెరుగు పడుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది, శరీరంలో మంటను తగ్గిస్తుంది.ఎలా తయారుచేసుకోవాలిరెండు స్పూన్ల ధనియాలు, రెండు స్పూన్ల సోంపు, రెండు స్పూన్ల జీలకర్ర4 కప్పుల నీళ్లు తీసుకోవాలి. ఇందులో జీలకర్ర, సోంపు, ధనియాలు వేసి 10-15 నిమిషాలు ఉడికించాలి. బాగా మరిగిన తరువాత ఈ కషాయాన్ని వడపోసుకోవాలి. ఉదయాన్నే పరగడుపున (empty stomach)న తాగాలి. కనీసం మూడు నెలల పాటు క్రమం తప్పకుండా ఇలా చేస్తే ఎంత వేలాడే పొట్ట అయినా సరే ఫ్లాట్గా మారిపోతుంది.మరిన్నిలాభాలుజీర్ణక్రియకు మంచిది, తద్వారా బరువు తగ్గుతుంది.గట్ హెల్త్ మెరుగుపడుతుంది. గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. దీని వలన అనేక సమస్యలకు ఉపశమనం లభిస్తుంది. మలబద్ధకం అనేక సమస్యలకు మూలం. సోంపు, జీలకర్ర, ధనియాలలో యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలో మంటను తగ్గిస్తాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.చర్మం ప్రకాశం వంతంగా ఉంటుంది. మొటిమలు, మచ్చలు మటుమాయవుతాయి.ఇది మర్చిపోవద్దు : అయితే ఈ కషాయం తాగుతున్నాం కదా అని ఆహార నియమాల పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఈ చిట్కాను పాటిస్తూనే, కొద్ది సేపు నడక, కొవ్వు పదార్థాలు, నూనెలో వేయించిన పదార్థాలకు దూరంగా ఉండాలి. తగినన్ని నీళ్లు సేవించాలి. రాత్రి భోజనం తొందరగా ముగించాలి. ప్రతీ భోజనం తరువాత కనీసం పది నిమిషాలు నడిస్తే అద్భుతమైన ఫలితాలు సాధించడం ఖాయం.నోట్: ఈ ప్రక్రియ కొందరికి వారి వారి బాడీ మెటబాలిజాన్ని బట్టి కొంచెం ఆలస్యం కావచ్చు ఓపిగ్గా ప్రయత్నించాలి. బరువుతగ్గాలంటే ఆ మాత్రం ఓపిక తప్పదు మరి. అలాగే ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, ఈ నీటిని త్రాగే ముందు వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. ఇదీ చదవండి: Tip of the Day : రాగుల జావతో మ్యాజిక్ -
కన్నప్ప సినిమా.. చీటింగ్ చేసిన అక్షయ్ కుమార్?!
మంచు విష్ణు కన్నప్ప సినిమా (Kannappa Movie)లో నార్త్ నుంచి సౌత్ వరకు పెద్ద పెద్ద స్టార్స్ భాగమయ్యారు. ప్రభాస్, మోహన్లాల్, శరత్కుమార్, అక్షయ్కుమార్.. ఇలా పలువురు కన్నప్ప చిత్రంలో నటించారు. అక్షయ్కుమార్ శివుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతిగా యాక్ట్ చేశారు. మొదట ఈ మూవీ చేసేందుకు అక్షయ్ అసలు ఒప్పుకోనేలేదు. రెండుసార్లు రిజెక్ట్ చేశాడు. అయినా విష్ణు పట్టు వదలకుండా ప్రయత్నించి ఆయన్ను ఎలాగోలా ఒప్పించాడు. డైలాగ్స్ చెప్పేందుకు అక్షయ్ కుమార్ తిప్పలుఅలా అక్షయ్ కుమార్ వెండితెరపై మహాశివుడిగా కనిపించాడు. జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది, కానీ కలెక్షన్లు మాత్రం రాలేదు. తాజాగా ఈ సినిమాలోని ఓ క్లిప్ నెట్టింట విపరీతంగా వైరలవుతోంది. అందులో అక్షయ్ కుమార్ డైలాగులు నేర్చుకుని సొంతంగా చెప్పినట్లు కనిపించడం లేదు. టెలిప్రాంప్టర్ను చూస్తూ అక్కడ రాసున్న డైలాగ్స్ చదువుతున్నట్లుగా ఉంది. అది అతడి కళ్లు తిప్పడం చూస్తేనే అర్థమైపోతుంది.ఇది చీటింగ్ కాదా?ఇది చూసిన నెటిజన్లు అక్షయ్పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్నా ఇప్పటికీ డైలాగ్స్ గర్తుపెట్టుకుని చెప్పలేడా? ఎందుకిలా సగం సగం యాక్టింగ్ చేయడం? శివుడి వేషం కట్టుకుని చిన్న డైలాగ్స్ కూడా చెప్పడం రాకపోతే ఎలా? ఇది జనాల్ని చీటింగ్ చేయడమే అవుతుంది అని కామెంట్లు చేస్తున్నారు. అయితే సదరు వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. కాగా అక్షయ్ కుమార్.. ఇలా ప్రాంప్టర్ చూసుకుంటూ డైలాగ్స్ చెప్పడం కొత్తేమీ కాదు. సర్ఫిరా సినిమాలోనూ ఓ సీన్లో ఇలాగే డైలాగ్స్ చూసుకుంటూ చదివాడు. అక్షయ్ ప్రస్తుతం జాలీ ఎల్ఎల్బీ 3, వెల్కమ్ టు ద జంగిల్ సినిమాలు చేస్తున్నాడు.చదవండి: ప్రియుడితో శ్రద్ధా.. సీక్రెట్ వీడియో వైరల్.. ఇంత పని చేస్తారనుకోలేదు -
చరిత్ర సృష్టించిన జో రూట్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్(Joe Root) అరుదైన ఘనత సాధించాడు. టీమిండియాపై టెస్టుల్లో 3000 పరుగులు మైలురాయిని అందుకున్న తొలి బ్యాటర్గా వరల్డ్ రికార్డు సృష్టించాడు. లార్డ్స్ వేదికగా భారత్తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో 45 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ ఫీట్ నమోదు చేశాడు.ఓవరాల్గా టెస్టుల్లో ఒక జట్టుపై బ్యాటర్ 3000 పరుగులు చేయడం ఇది మూడో సారి. రూట్ కంటే ముందు వెస్టిండీస్ దిగ్గజం గ్యారీ సోబర్స్ ఇంగ్లండ్పై, సచిన్ టెండూల్కర్ ఇంగ్లండ్పై ఈ ఫీట్ సాధించారు. ఇక ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో రూట్ 54 పరుగులతో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు.తన అద్బుత బ్యాటింగ్తో భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్నాడు. 49 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో రెండు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. క్రీజులో రూట్తో పాటు ఓలీ పోప్(44) ఉన్నారు. అదేవిధంగా భారత్-ఇంగ్లండ్ మధ్య అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రూట్ కొనసాగుతున్నాడు.ఇంగ్లండ్ వర్సెస్ భారత సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లు వీరే..జో రూట్ - 3007సచిన్ టెండూల్కర్ - 2535సునీల్ గవాస్కర్ - 2483సర్ అలస్టెయిర్ కుక్ - 2431విరాట్ కోహ్లీ - 1991చదవండి: IND vs ENG: లార్డ్స్ టెస్టులో టీమిండియాకు భారీ షాక్ -
సార్! ఇప్పుడిక్కడున్నది మన ప్రభుత్వమే! కేజ్రీవాల్ది కాదు!!
సార్! ఇప్పుడిక్కడున్నది మన ప్రభుత్వమే! కేజ్రీవాల్ది కాదు!! -
‘ది 100’ మూవీ రివ్యూ
టైటిల్ : ది 100నటీనటులు: ఆర్కే సాగర్, మిషా నారంగ్, ధన్య బాలకృష్ణ, విష్ణు ప్రియ, తారక్ పొన్నప్ప తదితరులునిర్మాణ సంస్థలు : కెఆర్ఐఏ ఫిల్మ్ కార్ప్, ధమ్మ ప్రొడక్షన్స్నిర్మాతలు: రమేష్ కరుటూరి, వెంకీ పూశడపుకథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాఘవ్ ఓంకార్ శశిధర్సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్విడుదల తేది : జులై 11, 2024‘మొగలి రేకులు’, ‘చక్రవాకం’ సీరియళ్లతో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటుడు ఆర్కే సాగర్ అలియాస్ ఆర్కే నాయుడు. సీరియళ్లతో వచ్చిన ఫేమ్తో వెండితెర ఎంట్రీ ఇచ్చాడు. మాన్ అఫ్ ది మ్యాచ్, సిద్ధార్థ, షాది ముబారక్ సినిమాలలో హీరోగా నటించి, నటనపరంగా మంచి మార్కులే సంపాదించుకున్నాడు. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ‘ది 100’ మూవీ(The 100 Movie Review)తో నేడు( జులై 11) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.‘ది 100’ కథేంటంటే..విక్రాంత్(ఆర్కే సాగర్).. ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఏసీపీగా బాధ్యతలు చేపట్టిన వెంటనే నగరంలో జరుగుతున్న రాబరీ గ్యాంగ్ హత్య కేసు టేకాప్ చేస్తాడు. అదే సమయంలో తను ఇష్టపడిన యువతి ఆర్తి(మిషా నారంగ్) కూడా వీరి బాధితురాలిగా మారినట్లు తెలుస్తుంది. దీంతో విక్రాంత్ ఈ కేసుని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకొని.. తనదైన శైలీలో విచారించగా అతనికో సంచలన నిజం తెలుస్తుంది. అదేంటి? ఆ గ్యాంగ్ ఆర్తి(మిషా నారంగ్) ఫ్యామిలీనే ఎందుకు టార్గెట్ చేసింది? సాఫ్ట్వేర్ ఉద్యోగి మధు ( విష్ణు ప్రియ) ఆత్మహత్య వెనుక ఉన్న అసలు నిజం ఏంటి? వ్యాపారవేత్త వల్లభ(తారక్ పొన్నప్ప)తో ఈ కేసు ఉన్న సంబంధం ఏంటి? స్నేహితురాలు విద్యా(ధన్య బాలకృష్ణ) సహాయంతో విక్రాంత్ ఈ కేసుని ఎలా సాల్వ్ చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే(The 100 Movie Review).ఎలా ఉందంటే..విలన్ ఒక క్రైమ్ చేయడం.. పోలీసు అధికారి అయిన హీరో అతన్ని పట్టుకోవడం.. మధ్యలో ఓ ట్విస్ట్, ప్లాష్ బ్యాక్ స్టోరీ.. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ అన్ని దాదాపు ఇలానే ఉంటాయి. అయితే దీంట్లో క్రైమ్ జరిగిన తీరు.. దాని చుట్టు అల్లుకున్న మైండ్ గేమ్, హీరో ఎంత తెలివిగా విలన్ను పట్టుకున్నాడనే దానిపై సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. ప్రేక్షకుడి ఊహించని ట్విస్టులు, కట్టుదిట్టమైన స్క్రీన్ప్లే, ఉత్కంఠ కలిగించే సన్నివేశాలతో కథనాన్ని నడిపించాలి. అప్పుడే ప్రేక్షకుడు చూపు తిప్పుకోకుండా కథలో లీనమవుతాడు. ఈ విషయంలో ‘ది 100’ (The 100 Movie Review)కొంతవరకు మాత్రమే సఫలం అయింది. దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్ ఎంచుకున్న కాన్సెప్ట్ బాగున్నప్పటికీ తెరపై దాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడంలో కాస్త తడబడ్డాడు. అమ్మాయి ఆత్మహత్య సీన్తో కథను ఆసక్తికరంగా ప్రారంభించాడు. ఆ తర్వాత ఐపీఎస్ అధికారి విక్రాంత్గా హీరో ఎంట్రీ సీన్ని చక్కగా ప్లాన్ చేశాడు. హీరో ఏసీపీగా బాధ్యతలు చేపట్టి రాబరీ గ్యాంగ్ కేసుని టేకాప్ చేసిన తర్వాత కథపై ఆసక్తి పెరుగుతుంది. రాబరీ గ్యాంగ్ని పట్టుకునేందుకు హీరో చేసే ప్రయత్నం.. ఈ క్రమంలో వచ్చే ఓ ట్విస్ట్.. కథనంపై మరింత ఆసక్తిని పెంచుతుంది. రాబరీ గ్యాంగ్ బంగారం మాత్రమే ఎందుకు ఎత్తుకెళ్తడం వెనుక ఉన్న రహస్యం ఏంటనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. అయిగే ఆ గ్యాంగ్ దొరికిన తర్వాత వచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. ఇక సెకండాఫ్ కాస్త ఎమోషనల్గా ప్రారంభం అవుతుంది. వ్యాపారవేత్త వల్లభ(తారక్ పొన్నప్ప) ఎంట్రీ తర్వాత కథనం మరో మలుపు తిరుగుతుంది. మధు ప్లాష్బ్యాక్ ఎమోనల్కి గురి చేస్తుంది. అయితే ట్విస్ట్ తెలిసిన తర్వాత కథనం స్లోగా, ఊహకందేలా సాగుతుంది. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా కొన్ని చోట్ల సినిమాటిక్గా అనిపిస్తుంది. క్లైమాక్స్లో మంచి సందేశం ఇచ్చారు.ఎవరెలా చేశారంటే..మొగలి రేకులు సీరియల్లో పోలీసు పాత్రలో నటించి ఫేమస్ అయిన ఆర్కే సాగర్.. ఈ చిత్రంలోనూ అదే పాత్రే పోషించి మెప్పించాడు. ఐపీఎస్ అధికారి విక్రాంత్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఆయన మాట, నడక, మాట..ప్రతిదీ అచ్చం పోలీసు ఆఫీసర్లాగానే అనిపిస్తుంది. యాక్షన్ సీన్స్లో అదరగొట్టేశాడు. ఇక ఆర్తిగా మిషా నారంగ్ తనదైన నటనతో ఆకట్టుకుంది. ఎమోషనల్ సీన్లలో బాగా నటించింది. సాఫ్ట్వేర్ ఉద్యోగి మధుగా విష్ణు ప్రియ, హీరో స్నేహితురాలు విద్యాగా ధన్య బాలకృష్ణ చక్కగా నటించారు. సెకండాఫ్లో వీరిద్దరి పాత్రల నిడివి ఎక్కువగా ఉంటుంది. తారక్ పొన్నప్ప విలనిజం బాగా పండించాడు. గిరిధర్, ఆనంద్, లక్ష్మీ గోపాల స్వామి, కల్యాణి నటరాజన్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. హర్షవర్ధన్ రామేశ్వర్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పాటలు అంతగా ఆకట్టుకోలేవు. శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ పనితీరు పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
ఫిష్ వెంకట్కు సాయం చేసిన మరో హీరో..
సినీ నటుడు ఫిష్ వెంకట్ (Fish Venkat) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. రెండు కిడ్నీలు చెడిపోవడంతో కచ్చితంగా ఒక కిడ్నీ అయినా మార్చాలని వైద్యులు చెప్తున్నారు. ఇందుకోసం రూ.50 లక్షలు అవసరమవుతాయన్నారు. అంత డబ్బు చెల్లించే ఆర్థిక స్థోమత తమకు లేదని వెంకట్ కుటుంబ సభ్యులు వాపోయారు. దీనస్థితిలో ఉన్న తమను ఆదుకోవాలంటూ మీడియా ముందుకు వచ్చారు.విశ్వక్ సాయంఈ క్రమంలో హీరో ప్రభాస్ పేరు చెప్పి కొందరు ఆకతాయిలు వారికి సాయం చేస్తామని మాటిచ్చారు. తీరా అది ఫేక్ కాల్ అని తెలియడంతో వెంకట్ ఫ్యామిలీ మరోసారి సాయం కోసం అర్థించింది. నటుడి అనారోగ్యం గురించి తెలుసుకున్న హీరో విశ్వక్ సేన్ రూ.2 లక్షలు ఆర్థిక సాయం చేసి మంచి మనసు చాటుకున్నాడు.ముందుకొచ్చిన మరో హీరోతాజాగా మరో హీరో.. వెంకట్ పరిస్థితి చూసి చలించిపోయాడు. జెట్టి సినిమా హీరో కృష్ణ మానినేని సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. కృష్ణ మానినేని ఆధ్వర్యంలో, ఆయన స్థాపించిన సేవా సంస్థ 100 Dreams Foundation ద్వారా రూ.2 లక్షల ఆర్థిక సాయం చేశారు. వెంకట్ కూతురు స్రవంతికి ఆమేర డబ్బు అందించాడు.అవయవదానం..ఈ సందర్భంగా కృష్ణ మానినేని మాట్లాడుతూ.. 100 Dreams Foundationలో ఒక కార్యక్రమం అయిన పునరపి (అవయవ దానం అవగాహన కార్యక్రమం) మా ఆశయం మాత్రమే కాదు.. అవసరంలో ఉన్నవారికి జీవితం ఇవ్వాలన్న సంకల్పం. అవయవ దానం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఒక్క నిర్ణయం – ఒక జీవితాన్నే మార్చేస్తుంది" అని తెలిపాడు.చదవండి: ప్రముఖ నటి షోలో చనిపోయేందుకు ట్రై చేసింది: బిగ్బాస్ టీమ్ -
లార్డ్స్ టెస్టులో టీమిండియాకు భారీ షాక్
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియాకు ఊహించని ఎదురదెబ్బ తగిలింది. తొలి రోజు ఆట సందర్భంగా భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయపడ్డాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 34వ ఓవర్ వేసిన జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో రెండో బంతిని అందుకునే క్రమంలో పంత్ ఎడమ చేతి వేలికి గాయమైంది.బంతిని తీసుకున్నాక పంత్ తీవ్రమైన నొప్పితో విల్లవిల్లాడు. అంతకుముందు ఓవర్ కూడా పంత్ కాస్త ఆసౌకర్యంగా కన్పించాడు. ఫిజియో వచ్చి మ్యాజిక్ స్ప్రే చేసినప్పటికి అతడు నొప్పి తగ్గలేదు. ఈ క్రమంలోనే పంత్ ఫిజియో సాయంతో మైదానం నుంచి బయటకు వెళ్లిపోయాడు. అతడి స్ధానంలో సబ్స్ట్యూట్ వికెట్ కీపర్గా ధ్రువ్ జురెల్ మైదానంలోకి వచ్చాడు. అయితే పంత్ గాయం తీవ్రమైనది కాకుడదని భారత అభిమానులు కోరుకుంటున్నారు. పంత్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్లో సెంచరీల మోత మ్రోగించిన పంత్.. రెండో టెస్టులో హాఫ్ సెంచరీతో మెరిశాడు.41 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో రెండు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. క్రీజులో జో రూట్(37), పోప్(24) ఉన్నారు. ఓపెనర్లు జాక్ క్రాలీ(18), బెన్ డకెట్(23)ను నితీశ్ కుమార్ రెడ్డి పెవిలియన్కు పంపాడు.తుదిజట్లుభారత్శుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్దీప్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి.ఇంగ్లండ్బెన్ స్టోక్స్ (కెప్టెన్), జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, షోయబ్ బషీర్.చదవండి: IND vs ENG: టీమిండియా చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి జట్టుగా