breaking news
-
World Cup 2025: భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. స్ప్రే ప్రయోగించిన పాక్ కెప్టెన్
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (ICC Women's World Cup 2025) భాగంగా భారత్-పాకిస్తాన్ (India vs Pakistan) మధ్య ఇవాళ (అక్టోబర్ 5) జరుగుతున్న మ్యాచ్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మ్యాచ్ మధ్యలో పాక్ కెప్టెన్ ఫాతిమా సనా మ్యాజిక్ స్ప్రేను (Spray) ప్రయోగించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్మీడియాలో వైరలవుతున్నాయి. ఇంతకీ పాక్ కెప్టెన్ ఎందుకలా చేసిందని అభిమానులు ఆరా తీస్తున్నారు.వివరాల్లో వెళితే.. కొలొంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి చిన్నచిన్న పురుగులు మైదానమంతా వ్యాపించి ఇరు జట్ల ఆటగాళ్లను ఇబ్బంది పెట్టాయి. ఈ పరుగుల కారణంగా మ్యాచ్కు పలు మార్లు అంతరాయం కలిగింది.ఇన్నింగ్స్ మధ్యలో పురుగుల ప్రభావం చాలా ఎక్కువైంది. దీని వల్ల భారత ఆటగాళ్లు బ్యాటింగ్ చేయలేకపోయారు. ఈ విషయమై అప్పుడు క్రీజ్లో ఉన్న భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ అంపైర్కు ఫిర్యాదు చేసింది. పురుగుల వల్ల తాను బంతిపై దృష్టి సారించలేకపోతున్నానని తెలిపింది.దీంతో ఇన్నింగ్స్ 28వ ఓవర్లో అంపైర్ పురుగులు తరిమే స్ప్రేను ఉపయోగించేందుకు పర్మిషన్ ఇచ్చాడు. పాక్ సబ్స్టిట్యూట్ ప్లేయర్ ఒకరు స్ప్రే తీసుకొచ్చి వారి కెప్టెన్ ఫాతిమా సనాకు ఇవ్వగా, ఆమె దాన్ని ఉపయోంచి పురుగులను తరిమికొట్టింది. స్ప్రే ఉపయోగించిన తర్వాత కాస్త ఉపశమనం లభించడంతో భారత ఆటగాళ్లు బ్యాటింగ్కు కొనసాగించారు.శ్రీలంకలోని క్రికెట్ మైదానాల్లో ఇలాంటి సన్నివేశాలు తరుచూ కనిపిస్తుంటాయి. పురుగులు, జంతువులు, పాములు పిలవని పేరంటాలకు వచ్చి పోతుంటాయి. తాజాగా భారత జట్టు ప్రాక్టీస్ చేస్తుండగా మైదానంలోకి పెద్ద పాము ప్రవేశించింది. పాములు పట్టే వారు వచ్చి దాన్ని తీసుకెళ్లి అడవిలో వదిలేశారు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ 44 ఓవర్ల తర్వాత 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. ప్రతీక రావల్ (31), స్మృతి మంధన (23), హర్లీన్ డియోల్ (46), హర్మన్ప్రీత్ (19), జెమీమా రోడ్రిగెజ్ (32) ఔట్ కాగా.. దీప్తి శర్మ (24), స్నేహ్ రాణా (16) క్రీజ్లో ఉన్నారు.చదవండి: భారత్తో నిర్ణయాత్మక మూడో వన్డే.. ఆస్ట్రేలియా భారీ స్కోర్ -
క్లీంకార ముఖాన్ని దాచిపెట్టడానికి కారణమదే: ఉపాసన
పెళ్లయిన పదమూడేళ్ల తర్వాత రామ్ చరణ్-ఉపాసన దంపతులకు మెగా గారాలపట్టి క్లీంకార పుట్టింది. అయితే పుట్టి ఏడాది దాటిపోయినా సరే ఇప్పటికీ చిన్నారి ముఖాన్ని బయటపెట్టకుండా చాలా జాగ్రత్తగా కాపాడుతూ వస్తున్నారు. అయితే దీనికి ఓ కారణం ఉందని, కావాలనే ఇలా ఫేస్ కవర్ చేస్తున్నామని ఉపాసన చెప్పుకొచ్చింది. తాజాగా ఢిల్లీలో దసరా వేడుకల్లో పాల్గొన్న ఈమె.. కూతురు క్లీంకార గురించి మాట్లాడింది. అలానే తనని ట్యాగ్స్ పెట్టి పిలవడంపైనా స్పందించింది.'ప్రపంచం చాలా వేగంగా మారిపోతోంది దానికి తోడు కొన్ని సంఘటనలు తల్లిదండ్రులుగా మమ్మల్ని భయపెట్టాయి. మా పాపకు స్వేచ్ఛ ఇవ్వాలని అనుకుంటున్నాం. అందుకే ఎయిర్పోర్ట్కి వెళ్లేటప్పుడు పాప ముఖానికి మాస్క్ వేస్తుంటాం. చెప్పాలంటే ఇది పాపకు తల్లిదండ్రులుగా నాకు, చరణ్కి పెద్ద పని. అయితే మేం కరెక్ట్ పని చేస్తున్నామా లేదా అనేది మాకు తెలీదు. కానీ పాప ముఖాన్ని దాస్తున్న విషయంలో రామ్, నేను సంతోషంగానే ఉన్నాం.' అని ఉపాసన చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: 'కాంతార 1'లో రిషభ్ శెట్టి భార్య కూడా నటించింది.. గుర్తుపట్టారా?)అలానే స్టార్ హీరోకు భార్య అనే ట్యాగ్ గురించి మాట్లాడిన ఉపాసన.. సానుకూలంగానే స్పందించింది. 'నన్ను ఎలాంటి ట్యాగ్తో పిలిచినా ఇష్టమే. ఎవరైనా మనకు ఓ ట్యాగ్ ఇచ్చారంటే వాళ్లు మనల్ని ఇష్టపడుతున్నట్లే కదా. ఈ విషయంలో నేను సంతోషంగానే ఉన్నాను. అలానే ఇది ఓ బాధ్యత కూడా' అని చెప్పింది.ఈ ఏడాది 'గేమ్ ఛేంజర్' సినిమాతో వచ్చిన రామ్ చరణ్.. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో 'పెద్ది' చేస్తున్నాడు. ఇది వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్లలోకి రానుంది. ఉపాసన విషయానికొస్తే.. తల్లిగా క్లీంకారని చూసుకుంటూనే మరోవైపు ఆస్పత్రి వ్యవహారాలు చూసుకుంటోంది. ఈ మధ్యే ఏర్పాటు చేసిన తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో ఛైర్మన్గానూ ఉపాసనని నియమించారు. ఇలా పలు పనులు చేస్తూనే తల్లిగానూ క్లీంకారని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు) -
50 ఓవర్ల క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ.. ఆసీస్ బ్యాటర్ విధ్వంసం
భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియా క్రికెటర్ హర్జాస్ సింగ్ (Harjas Singh) ఊహకందని రీతిలో బ్యాట్తో చెలరేగాడు. కేవలం 141 బంతుల్లోనే 314 పరుగులు సాధించాడు. ఆసీస్ దేశీ క్రికెట్లో భాగంగా యాభై ఓవర్ల మ్యాచ్లో ఈ మేరకు విధ్వంసకర ట్రిపుల్ సెంచరీ (Triple Century In 50 Over Cricket)తో విరుచుకుపడ్డాడు.వెస్టర్న్ సబ్అర్బ్స్ (Western Suburbs) జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న 20 ఏళ్ల హర్జాస్ సింగ్.. సిడ్నీ క్రికెట్ క్లబ్ జట్టుతో మ్యాచ్ సందర్భంగా ఇలా పరుగుల సునామీ సృష్టించాడు. తద్వారా గ్రేడ్ లెవల్ క్రికెట్లో పరిమిత ఓవర్ల మ్యాచ్లో త్రిశతకం బాదిన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు.చండీగఢ్ నుంచి..హర్జాస్ సింగ్ మెరుపు ఇన్నింగ్స్లో ఏకంగా 35 సిక్సర్లతో పాటు 14 ఫోర్లు ఉండటం విశేషం. భారత సంతతికి చెందిన హర్జాస్ ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జన్మించాడు. అతడి తల్లిదండ్రులు 2000లోనే చండీగఢ్ నుంచి వలస వెళ్లారు.సౌతాఫ్రికా వేదికగా అండర్-19 వరల్డ్కప్-2024 ఫైనల్లో భారత్- ఆసీస్ మధ్య మ్యాచ్ సందర్భంగా హర్జాస్ సింగ్ తొలిసారి వెలుగులోకి వచ్చాడు. టైటిల్ పోరులో 64 బంతుల్లో 55 పరుగులతో సత్తా చాటి.. ఆసీస్ను గెలిపించాడు.ఇది ప్రత్యేకం తాజాగా పరిమిత ఓవర్ల క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ సాధించడం పట్ల హర్జాస్ సింగ్ హర్షం వ్యక్తం చేశాడు. పవర్ హిట్టింగ్ ఆడటం తనకు అలవాటని.. ఈరోజు మాత్రం తన కెరీర్లో అత్యంత ప్రత్యేకమైనదని పేర్కొన్నాడు. కాగా హర్జాస్ సింగ్ ఇలాగే చెలరేగితే.. ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు ఆడుతున్న తన సహచర ఆటగాడు సామ్ కొన్స్టాస్ మాదిరి త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టడం ఖాయం.ఇక పరిమిత ఓవర్ల క్రికెట్లో హర్జాస్ సింగ్ ట్రిపుల్ సెంచరీ సాధిస్తే.. అంతకుముందు ఫస్ట్ గ్రేడ్ క్రికెట్లో న్యూ సౌత్వేల్స్ తరఫున ఫిల్ జాక్వెస్ (321), విక్టర్ ట్రంపర్ (335) ట్రిపుల్ సెంచరీ చేశారు.196 పరుగుల తేడాతో జయభేరిమ్యాచ్ విషయానికొస్తే... హర్జాస్ విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా వెస్టర్న్ సబ్అర్బ్స్ యాభై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 483 పరుగులు భారీ స్కోరు సాధించింది. అయితే, కొండంత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సిడ్నీ క్రికెట్ క్లబ్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 287 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా వెస్టర్న్ సబ్అర్బ్స్ ఏకంగా 196 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.చదవండి: అందుకే రోహిత్ శర్మపై వేటు: అగార్కర్ -
కలర్ ఫొటోలు అనేసరికి ప్రచారం స్టయిల్ మార్చాడు!
కలర్ ఫొటోలు అనేసరికి ప్రచారం స్టయిల్ మార్చాడు! -
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: శు.చతుర్దశి ప.11.24 వరకు, తదుపరి పౌర్ణమి, నక్షత్రం: పూర్వాభాద్ర ఉ.6.04 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర తె.5.04 వరకు (తెల్లవారితే మంగళవారం), వర్జ్యం: ప.3.16 నుండి 4.48 వరకు, దుర్ముహూర్తం: ప.12.09 నుండి 12.55 వరకు, తదుపరి ప.2.28 నుండి 3.14 వరకు, అమృత ఘడియలు: రా.12.23 నుండి 1.54 వరకు.సూర్యోదయం : 5.54సూర్యాస్తమయం : 5.44రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకుయమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు మేషం.... ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమ తప్పదు. ఆరోగ్యభంగం. ఆలయాల సందర్శనం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. నిరుద్యోగుల యత్నాలు విఫలం.వృషభం.... పరిచయాలు పెరుగుతాయి. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలం. చిన్ననాటి మిత్రుల కలయిక. ఆహ్వానాలు.మిథునం...... శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కర్కాటకం... ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తాయి. శ్రమ పెరుగుతుంది. పనులు ముందుకు సాగవు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో కొంత ఇబ్బందిగా ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ముందుకు సాగవు.సింహం..... రుణాలు చేస్తారు. విద్యార్థులకు కొంత నిరాశ. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. దైవదర్శనాలు. ఆస్తుల వ్యవహారాలలో మరిన్ని చికాకులు. మానసిక అశాంతి.కన్య.....వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం. కొత్త వ్యక్తుల పరిచయం. ఇంటాబయటా అనుకూలం.తుల.... పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత. శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం.వృశ్చికం.... కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ధనవ్యయం. అనారోగ్యం. పనులలో ఆటంకాలు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. ఆలయాలు సందర్శిస్తారు. సోదరుల నుంచి ఒత్తిడులు. భూవివాదాలు.ధనుస్సు.... బంధువులతో వివాదాలు. ధనవ్యయం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. ఆస్తి ఒప్పందాలు వాయిదా వేస్తారు. శ్రమ తప్పదు.మకరం... ఆర్థికాభివృద్ధి. పనులలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. సమాజసేవలో పాల్గొంటారు. వాహనయోగం. చర్చలు సఫలం.కుంభం... రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధుమిత్రులతో వివాదాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. వాహనాలు విషయంలో జాగ్రత్తలు పాటించండి.మీనం.... కుటుంబంలో చికాకులు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. వృత్తి, వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. పనులు చకచకా సాగుతాయి. ఇంటర్వ్యూలు అందుతాయి. -
పిల్లాడలా దగ్గుతుంటే జ్వరమే ఉంది, దగ్గులేదంటావేం!
-
‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు అన్న మాటతో ఇలా..: సిరాజ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో సత్తా చాటి టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఆటగాళ్ల జాబితాలో మొహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) కూడా ఉన్నాడు. 2017లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున క్యాష్ రిచ్ లీగ్లో అడుగుపెట్టిన ఈ పేస్ బౌలర్.. అదే ఏడాది అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లోనూ ఎంట్రీ ఇచ్చాడు.ఆ తర్వాత రెండేళ్లకు వన్డేల్లో.. మూడేళ్లకు టెస్టుల్లో అరంగేట్రం చేసిన సిరాజ్.. ప్రస్తుతం టీమిండియా పేస్ దళంలో జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)తో పాటు ప్రధాన బౌలర్గా ఎదిగాడు. ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో విశ్రాంతి లేకుండా వెయ్యికి పైగా బంతులు బౌల్ చేసి.. ఐదు టెస్టుల్లో కలిపి 23 వికెట్లు పడగొట్టాడు.ఇక ప్రస్తుతం వెస్టిండీస్తో స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్తో బిజీగా ఉన్న సిరాజ్.. కెరీర్ తొలినాళ్లలో తనపై ట్రోలింగ్ జరిగిన తీరు.. ఆ సమయంలో దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) ఇచ్చిన సలహాల గురించి తాజాగా పంచుకున్నాడు. ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ..ధోని ఆరోజు నాకో మాట చెప్పాడు‘‘నేను టీమిండియాలో అడుగుపెట్టినపుడే ఎంఎస్ ధోని నాకో మాట చెప్పాడు. ‘ఇతరులు ఏమంటున్నారో అస్సలు పట్టించుకోకు. నువ్వు బాగా ఆడినపుడు ప్రపంచం మొత్తం నీతోనే ఉంటుంది. ఒకవేళ నువ్వు విఫలమైతే మాత్రం నిన్ను దూషించడానికి కూడా ఎవరూ వెనుకాడరు’ అని అన్నాడు.అవును.. కెరీర్ తొలినాళ్లలో నేనూ ట్రోలింగ్ బారినపడ్డాను. ఏదేమైనా ట్రోల్స్ చేయడం చెడ్డ విషయం. నేను బాగా ఆడినపుడు అభిమానులతో పాటు ఈ ప్రపంచం మొత్తం.. ‘వారెవ్వా.. సిరాజ్ లాంటి బౌలర్ మరొకరు లేనేలేరు’ అని ప్రశంసిస్తారు.వెళ్లి మీ నాన్నతో కలిసి ఆటో తోలుకోఒకవేళ నేను ఫెయిల్ అయితే.. ‘వెళ్లు.. వెళ్లి మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’ అన్నవాళ్లూ లేకపోలేదు. ఇదే తరీఖా?.. ఓ మ్యాచ్లో హీరో అయిన వాళ్లు మరో మ్యాచ్లో పూర్తిగా జీరో అయిపోతారా? (నవ్వులు).ప్రజలు అంత త్వరగా తమ మాటలు మార్చేస్తారా?.. బయట వ్యక్తుల అభిప్రాయాలను పట్టించుకోవద్దని నేను చాన్నాళ్ల క్రితమే నిర్ణయించుకున్నా. సహచర ఆటగాళ్లు, కుటుంబ సభ్యులు నా గురించి ఏమనుకుంటున్నారనేదే ముఖ్యం. వేరే వాళ్లను అసలు పట్టించుకోను. ఇతరులు నా గురించి ఏం అంటున్నా నేను లెక్క చేయను’’ అని సిరాజ్ చెప్పుకొచ్చాడు.తీవ్ర విషాదాన్ని దిగమింగుకుని..కాగా హైదరాబాద్కు చెందిన సిరాజ్ పేద కుటుంబం నుంచి వచ్చాడు. అతడి తండ్రి మొహమ్మద్ గౌస్ ఆటో నడిపి కుటుంబాన్ని పోషించేవారు. అయినప్పటికీ క్రికెటర్ కావాలన్న కుమారుడి కలకు ఆయన ఊతమిచ్చారు. అయితే, తనకెంతో ఇష్టమైన సంప్రదాయ ఫార్మాట్లో కొడుకు అరంగేట్రం చేయడానికి కొన్ని రోజుల ముందే గౌస్ మరణించారు.ఊపిరితిత్తుల్లో సమస్య కారణంగా కోవిడ్ సమయంలో సిరాజ్ తండ్రి మృతి చెందారు. అయితే, సిరాజ్ మాత్రం అరంగేట్రం కోసం ఆస్ట్రేలియాలోనే ఉండిపోయాడు. తన తండ్రికి టెస్టు ఫార్మాట్ అంటే ఇష్టమని.. ఆయనకు తనిచ్చే నివాళి ఇదేనంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఇక అప్పటి నుంచి ప్రతి సిరీస్కు ముందు తండ్రి సమాధిని దర్శించుకోవడం ఆనవాయితీగా పెట్టుకున్నాడు. ఆటో డ్రైవర్ కొడుకు క్రికెటర్ అవుతాడా అన్న హేళనలకు ఆటతోనే సమాధానం ఇచ్చి టీమిండియాలో కీలక సభ్యుడిగా ఎదిగి... రూ. కోట్లు సంపాదిస్తూ ఆర్థికంగానూ నిలదొక్కుకున్న సిరాజ్ యువతరానికి స్ఫూర్తిగా నిలిచాడు.కాగా 31 ఏళ్ల సిరాజ్ ఇప్పటి వరకు తన అంతర్జాతీయ కెరీర్లో 44 వన్డేలు, 42 టెస్టులు, 16 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఈ రైటార్మ్ పేసర్ టెస్టుల్లో 130, వన్డేల్లో 71, టీ20లలో 14 వికెట్లు కూల్చాడు. ఐపీఎల్లో 108 మ్యాచ్లలో కలిపి 109 వికెట్లు పడగొట్టాడు. చదవండి: Rishabh Pant Facts: రిషభ్ పంత్ నెట్వర్త్ ఎంతో తెలుసా? -
80's స్టార్స్ రీయూనియన్.. 31 మంది నటులందరూ ఒకేచోట!
స్టార్ హీరోలందరూ ఒక్కచోటకు చేరారు. 80వ దశకంలో వెండితెరపై సందడి చేసిన అగ్రనటులందరూ ఒకేచోట కలిసి ఎంతో ఘనంగా రీయూనియన్ (The 80s Stars Reunion) పార్టీ చేసుకున్నారు. 80's రీయూనియన్ అంటూ ప్రతి ఏడాది సెలబ్రిటీలందరూ ఒకేచోటకు చేరి సంతోషంగా గడుపుతారన్న విషయం తెలిసిందే! ఈ ఏడాది అక్టోబర్ 4న చెన్నైలో ఘనంగా గెట్ టు గెదర్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈసారి కోలీవుడ్ స్టార్ జంట రాజ్కుమార్ సేతుపతి- శ్రీప్రియ తమ ఇంట్లోనే ఈ పార్టీని ఏర్పాటు చేశారు.31 మంది స్టార్స్టాలీవుడ్ నుంచి చిరంజీవి (Chiranjeevi Konidela), వెంకటేశ్, నరేశ్ ఈ పార్టీలో పాల్గొన్నారు. కోలీవుడ్, మాలీవుడ్, సాండల్వుడ్, అలాగే బాలీవుడ్ నుంచి కూడా స్టార్స్ వచ్చారు. జాకీ ష్రాఫ్, మీనా, శరత్కుమార్, నదియా, రాధ, సుహాసిని, రమ్యకృష్ణ, జయసుధ, సుమలత, ఖుష్బూ, లిస్సీ, శోభన, మేనక, సురేశ్, భాను చందర్, ప్రభు, రెహ్మాన్, రేవతి తదితరులు ఈ వేడుకలో సందడి చేశారు. దాదాపు 31 మంది నటీనటులు ఈ పార్టీలో పాల్గొన్నారు. ఈసారి చిరుత థీమ్ ప్లాన్ చేశారు. అందరూ చీతా ప్రింట్స్ ఉన్న డ్రెస్సులోనే మెరిశారు. మొదటిసారి కలిసినట్లే ఉంది: చిరు80s స్టార్స్ రీయూనియన్కు సంబంధించిన ఫోటోలను మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేశారు. 80's స్నేహితులతో ప్రతి రీయూనియన్ మధుర జ్ఞాపకాల వీధిలో ఒక నడకలా ఉంటుంది. నవ్వులు, ఆప్యాయత, పాత జ్ఞాపకాలు తలుచుకుంటూ ఆనందం, ప్రేమతో గడుస్తుంది. ఎన్ని సార్లు కలిసినా, ప్రతి సారి కొత్తగా, మొదటిసారి కలిసినట్టే సంతోషంగా అనిపిస్తుంది అన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి.అప్పుడు మొదలైంది80's స్టార్స్ రీయూనియన్ 2009లో ప్రారంభమైంది. లిస్సీ, సుహాసిని తొలిసారి ఈ పార్టీ ఏర్పాటు చేశారు. 2019లో మెగాస్టార్ చిరంజీవి తన నివాసంలో 10వ రీయూనియన్ పార్టీ నిర్వహించారు. 2022లో చివరిసారి గెట్ టు గెదర్ జరిగింది. అప్పుడు బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్, నటి పూనమ్ ధిల్లాన్ పార్టీ హోస్ట్ చేశారు. 2023లో రీయూనియన్ జరగలేదు. 2024లో చెన్నైలో వరదల కారణంగా పార్టీ వాయిదా వేశారు. ఇన్నాళ్లకు మళ్లీ పార్టీ చేసుకుని ఎంజాయ్ చేశారు. పార్టీలో సరదా ఆటలు, పాటలు, డ్యాన్సులు ఉండనే ఉంటాయి. ఇలా ప్రతి ఏడాది జరగే ఈ “80s Stars Reunion” స్నేహం, ఐక్యత, భిన్నత్వంలో ఏకత్వం విలువలకు ప్రతీకగా నిలుస్తోంది. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) చదవండి: ట్రెండింగ్లో దెయ్యం సినిమా..'సుమతి వలవు' మూవీ రివ్యూ -
నేను ఇంటింటికి వెళ్లి చెత్త తీస్తా.. అంత చులకనా?: శ్రీజ తండ్రి
అగ్నిపరీక్షలో దుమ్ము లేపింది శ్రీజ దమ్ము (Srija Dammu). ఏ టాస్క్ ఇచ్చినా చకచకా ఆడేసేది. బ్రేకుల్లేని బైకులా మాట్లాడటం మొదలుపెడితే ఆపేదే కాదు. ఫుల్ ఎనర్జీతో తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్ (Bigg Boss Telugu 9)లో అడుగుపెట్టింది. కానీ, ఇక్కడకు వచ్చాక సీన్ రివర్స్ అయింది. తనకు ఉన్న క్రేజ్, వచ్చిన పాజిటివిటీ అంతా కూడా నెగెటివ్గా మారింది.గంజి తాగి స్కూలుకి..ప్రతివిషయానికి నోరేసుకుని పడిపోవడంతో శ్రీజపై నెట్టింట ట్రోల్ జరిగింది. అయితే తనపై వ్యతిరేకత వస్తున్న విషయం గ్రహించి శ్రీజ తనను తాను మార్చుకునే ప్రయత్నం చేసింది. కాస్త సైలెంట్ అయిపోయింది. ఆటలో మాత్రం శివంగిలా ఆడుతోంది. తాజాగా శ్రీజ తండ్రి దమ్ము శ్రీనివాసరావు ఓ ఇంటర్వ్యూలో తన కుటుంబం గురించి అనేక విషయాలు పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. శ్రీజ చిన్నప్పుడు గంజి తాగి స్కూలుకు వెళ్లేది. సన్మానించారుతనకు ఒక్క మార్కు తక్కువ వేసినా ఊరుకునేది కాదు. ఏదైనా అనుకుంటే సాధించి తీరుతుంది. అగ్నిపరీక్షకు వెళ్లే ఒకరోజు ముందు తను సెలక్ట్ అయినట్లు చెప్పింది. తనకు మేమెప్పుడూ అడ్డు చెప్పలేదు. బిగ్బాస్కు వెళ్తానంటే సరేనన్నాం. ఎంతోమందిని దాటుకుని షో దాకా వెళ్లడమే గొప్ప విషయం. వైజాగ్ అమ్మాయి శ్రీజ.. బిగ్బాస్కు వెళ్లిందంటూ నన్ను పిలిచి మా ఊర్లో సన్మానం చేశారు.కించపరిచేలా ట్రోలింగ్నేను పారిశుద్ధ్య కార్మికుడిని. నా వృత్తిని కించపరిచేలా ట్రోలింగ్ వీడియోలు చేస్తున్నారు. చెత్త తీసుకెళ్లడం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ చేతులతో చెత్త పట్టుకోవడం అంత ఈజీ కాదు. నా కూతురు చెత్త బ్యాగ్ పట్టుకున్న వీడియోను.. చెత్తబండివచ్చిందమ్మా చెత్తబండి అన్న వాయిస్ పెట్టి ట్రోల్ చేస్తున్నారు. నేను ఇంటింటికి వెళ్లి చెత్త తీస్తా.. నా పనిని కించపరుస్తూ నా కూతురిపై కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయంలో చాలా బాధేసింది అని చెప్పుకొచ్చారు. కాగా శ్రీజ.. రూ.2 లక్షల జీతం వచ్చే సాఫ్ట్వేర్ జాబ్ను పక్కన పెట్టి మరీ బిగ్బాస్కు వెళ్లడం విశేషం.చదవండి: సంజనాకు పెద్ద శిక్ష వేసిన నాగ్.. రీతూది మోసం కాదట! -
మా ఓటమికి కారణమదే.. లేదంటే ఈజీగా గెలిచేవాళ్లం: పాక్ కెప్టెన్
ఐసీసీ మహిళల ప్రపంచకప్లో కొలంబో వేదికగా ఆదివారం భారత్తో జరిగిన మ్యాచ్లో 88 పరుగుల తేడాతో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్ ఓటమి పాలైంది. బౌలింగ్లో పర్వాలేదన్పించిన పాక్ జట్టు.. బ్యాటింగ్లో మాత్రం తేలిపోయింది. 248 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ జట్టు 43 ఓవర్లలో 159 రన్స్కే కుప్పకూలింది.యువ ఫాస్ట్ బౌలర్ క్రాంతి గౌడ్, సీనియర్ ఆల్రౌండర్ దీప్తి శర్మ తలా మూడు వికెట్లు పడగొట్టి పాక్ పతనాన్ని శాసించారు. వీరితో పాటు స్నేహ్ రాణా రెండు వికెట్లు తీశారు. పాక్ బ్యాటర్లలో సిద్రా అమిన్ (106 బంతుల్లో 81; 9 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేసింది.అంతకుముందు భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 247 పరుగుల వద్ద ఆలౌటైంది. హర్లీన్ డియోల్ (65 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్గా నిలవగా.. రిచా ఘోష్ (20 బంతుల్లో 35 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) దూకుడుగా ఆడింది. మహిళల వన్డేల్లో పాక్పై భారత్కు ఇది వరుసగా 12వ విజయం కావడం విశేషం. అయితే ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం పాక్ కెప్టెన్ ఫాతిమా సనా స్పందించింది. ప్రత్యర్ధి భారత జట్టును తక్కువ పరుగులకే కట్టడి చేయడంలో విఫలమయ్యామని సనా చెప్పుకొచ్చింది."పవర్ప్లేలో మేము చాలా పరుగులు ఇచ్చాము. అదే విధంగా డెత్ ఓవర్లలో మేము మెరుగ్గా బౌలింగ్ చేయలేకపోయాము. నేను బౌలింగ్ చేసినప్పుడు బంతి స్వింగ్ అవుతున్నట్లు అన్పించింది. కానీ డయానా బేగ్ మాత్రం సీమ్, స్వింగ్ మధ్య కాస్త కన్ఫూజన్కు గురైంది.నేను మాత్రం బంతి స్వింగ్ అవుతుందని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దని నేను పదేపదే చెబుతునే ఉన్నాను. మా తదుపరి మ్యాచ్లో ఆమె మెరుగ్గా రాణిస్తుందని అశిస్తున్నాను. తొలుత భారత్ను 200 కంటే తక్కువ పరుగులకు పరిమితం చేసి ఉంటే బాగుండేది. ఆ టోటల్ను మేము సులువుగా చేధించేవాళ్లం.అయితే బ్యాటింగ్లో మేము కాస్త తడబడ్డాము. కానీ మా బ్యాటింగ్ లైనప్ అద్బుతంగా ఉంది. టాప్ 5లో మంచి బ్యాటర్లు ఉన్నారు. మా తర్వాతి మ్యాచ్లో రాణిస్తారని భావిస్తున్నారు. బ్యాటింగ్లో భాగస్వామ్యాలు నెలకొల్పడం అవసరం. ఈ మ్యాచ్లో మేడు అది చేయలేకపోయాము. అయితే సిద్రా పోరాటం గురించి ఎంత చెప్పుకొన్న తక్కువే. ఆమె నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తుంది. మా జట్టులో సిద్రా కీలక సభ్యురాలు" అని సనా పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో పేర్కొంది. ఈ మ్యాచ్లో బేగ్ నాలుగు వికెట్లు పడగొట్టినప్పటికి 69 పరుగులు సమర్పించుకుంది.చదవండి: IND vs AUS: ఒకప్పుడు కోహ్లితో కలిసి ఆడారు.. కట్ చేస్తే.. ఇప్పుడు అంపైర్లగా!