-
గంట సేపు సముద్రం చీలుతుంది
చూడగలగాలే గానీ ఈ ప్రకృతి అనేక వింతలను మన కళ్ళముందు ఉంచుతుంది. అలాంటి ఒక వింతే దక్షిణ కొరియాలోని మిరాకిల్ ఆఫ్ జిండో. ఏంటి దీని ప్రత్యేకత అని అనుకుంటున్నారా? సౌత్ కొరియాలోని జిండో సముద్రంలో ఆటుపోట్లు అసాధారణ స్థాయిలో మార్పు చెందడం వలన నీరు రెండు పాయలుగా విడిపోయి, జిండో ద్వీపం నుండి మోడో ద్వీపం వరకు ఒక ఇసుక దారి ఏర్పడుతుంది. ఈ దారి సుమారు 2.8 కిలోమీటర్ల పొడవు, 40 మీటర్ల వెడల్పు కలిగి ఉండి కేవలం ఒక గంటపాటు మాత్రమే ఉంటుంది. ఈ సమయంలో వేలాది మంది పర్యాటకులు, స్థానికులు ఈ ఇసుక దారిపై నడిచి, మోడో ద్వీపాన్ని చేరుకుంటారు. దారి ఏర్పడిన గంట తర్వాత, సముద్రం మళ్లీ సాధారణ స్థితికి చేరుకుని ఈ దారి నీటిలో మునిగి΄ోతుంది. ఈ అరుదైన దృశ్యం సంభవించే సమయంలో, స్థానికులు ‘జిండో మిరాకిల్ సీ రోడ్ ఫెస్టివల్’ పేరుతో పండుగ జరుపుకుంటారు. ఇదీ చదవండి: కాన్స్లో వివాదాల బ్యూటీ ఊర్వశి : ఈ సారి రూ. 5లక్షల డైమండ్ బ్యాగ్తోఈ పరిస్థితిని పరిశోధించడానికి వచ్చిన ఫ్రెంచ్ అంబాసిడర్ Pierre Landi ఆశ్చర్యానికి గురై, బైబిల్లో మోసెస్ సముద్రాన్ని చీల్చే సన్నివేశంతో పోలుస్తూ ‘కొరియన్ మిరాకిల్ ఆఫ్ మోసెస్’ అనే పేరుతో ఫ్రెంచ్ పత్రికలో వ్యాసం రాశాడు. దీంతో ఈ జిండో సముద్రానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. జిండో సముద్ర విభజన గురించి దక్షిణ కొరియా సాహిత్యంలో అనేక కథలు ప్రచారంలోకి వచ్చాయి. అందులో ఒక జానపద కథను స్థానికులు బలంగా విశ్వసిస్తారు. ఒకప్పుడు జిండో ద్వీపంలో ‘‘హోలాంగి’’ అనే భయంకరమైన పులి నివసించేది. ఈ పులి దాడుల నుండి తప్పించుకోవడానికి ద్వీపవాసులు సముద్రం గుండా మోడో ద్వీపానికి కోల్పోతారు. చదవండి: ఆటో డ్రైవర్గా మొదలై.. రూ 800 కోట్ల కంపెనీ, వరల్డ్ నెం.1 లగ్జరీ కారుఅయితే, ఒక వృద్ధ మహిళ అనుకోకుండా వెనుకబడి పోవడం వల్ల ఆమె భయంతో సముద్ర దేవతకు ప్రార్థన చేస్తుంది. అప్పుడు ఆ దేవత ఆమెను రక్షించడానికి సముద్రాన్ని విభజించి, ఒక దారిని సృష్టిస్తుంది. ఈ దారి ద్వారా ఆ ముసలమ్మ మోడో ద్వీ΄ానికి చేరుకుని ఆమె కుటుంబంతో తిరిగి కలుస్తుంది.చదవండి: భగవద్గీత శ్లోకం, బ్లాక్ వెల్వెట్ గౌను : ఐశ్వర్య సెకండ్ లుక్పై ప్రశంసలు -
అప్పుడు రూ.1.25 లక్షల జీతం.. ఇప్పుడు ఫుడ్ డెలివరీ ఉద్యోగం..
జీవితం అందరికీ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎత్తుపల్లాలు.. ఒడిదుడుకులు ఉంటాయి. ఒక్కోసారి నిచ్చెనెక్కించి గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది. కొన్నిసార్లు ఊహించని విధంగా కిందకు పడేస్తుంది. ఉన్నత స్థాయికి చేరి ఉత్తమ జీవనం గడుపుతున్నప్పటికీ ఎప్పుడేం జరుగుతుందో తెలీదు. అందుకే అన్నింటికీ సిద్ధమై ఉండాలి. ఏది ఎదురైనా ఆనందంగా స్వీకరించాలి.. సంతోషంగా ఆస్వాదించాలి.. ఈ ఫుడ్ డెలివరీ ఉద్యోగి జీవితం చెబుతున్న పాఠం ఇదే..ఒక ఫుడ్ డెలివరీ రైడర్ తనకు ఆహారం మాత్రమే కాదు.. జీవిత పాఠాన్ని అందించారంటూ ఆయన స్ఫూర్తిదాయకమైన కథను ఫేస్బుక్లో షేర్ చేశారు పుణెకు చెందిన శ్రీపాల్ గాంధీ. ఈ జీవితగాథ సోషల్ మీడియాలో నెటిజనులను హత్తుకుంటోంది. ప్రశంసలు వెల్లువను అందుకుంటోంది. ప్రస్తుతం ఆన్లైన్ ఫుడ్ డెలివరీలు మన దైనందిన జీవితంలో భాగమయ్యాయి. చాలా మంది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి ఆహారం తెప్పించుకుంటుంటారు. ఏదైనా మిస్ అయినా, పొరపాటు జరిగినా ఆ తెచ్చిన వ్యక్తి మీద అరుస్తుంటారు. కానీ శ్రీపాల్ గాంధీ డెలివరీ రైడర్ను మెల్లగా కదిలించి అతని జీవితం గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు.శ్రీపాల్ గాంధీ సబ్వే నుండి లంచ్ ఆర్డర్ పెట్టారు. ఫుడ్ డెలివరీ రైడర్ ఆహారాన్ని తీసుకొచ్చాడు. కానీ పాకెట్ చూడగానే అందులో శాండ్విచ్ మాత్రమే ఉందని, మిగిలిన పదార్థాలు మిస్ అయ్యాయని శ్రీపాల్ గుర్తించి డెలివరీ రైడర్కు చెప్పారు. కాసేపు కంగారు పడిన డెలివరీ రైడర్ "రెస్టారెంట్ లేదా జొమాటోకు కాల్ చేయండి సార్" అంటూ వినయంగా జవాబిచ్చాడు. దీంతో శ్రీపాల్ సబ్వే వారిని సంప్రదించగా క్షమాపణలు చెప్పి 'రైడర్ ను వెనక్కి పంపగలరా?' మిస్ అయిన వాటిని తిరిగిపంపుతాం.. అతనికి రూ.20 చెల్లిస్తాం' అని బదులిచ్చారు.ఎంత వినయం?ఫుడ్ అగ్రిగేటర్ ప్లాట్ఫామ్ జొమాటో ఆదేశిస్తే తప్ప డెలివరీ భాగస్వాములు రెస్టారెంట్కు తిరిగి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తమ రైడర్లకు చెల్లించేది జొమాటో. రెస్టారెంట్ కాదు. అయినా ఈ డెలివరీ ఏజెంట్ ఏమాత్రం వెనుకాడలేదు. "సార్, అది నా బాధ్యత. కస్టమర్ సంతోషమే తాను కోరుకుంటాను" అంటూ మళ్లీ రెస్టారెంట్కు వెళ్లి మిస్ అయిన వాటిని తిరిగి తీసుకొచ్చాడు. సబ్వే వాళ్ల నుంచి రూ.20 పరిహారాన్ని కూడా ఆయన తీసుకోలేదు. "దేవుడు నాకు ఎ౦తో ఇచ్చాడు. ఒకరు చేసిన పొరపాటుకు నేను ఈ డబ్బు ఎందుకు తీసుకోవాలి? అంటూ అతను శ్రీపాల్ను ఆశ్చర్యానికి గురిచేసింది.జీవిత గమనాన్ని మార్చిన కారు ప్రమాదంరైడర్ తన గతం గురించి శ్రీపాల్ గాంధీ వద్ద ఓపెన్ అయ్యాడు. షాపూర్జీ పల్లోంజీలో కన్స్ట్రక్షన్ సూపర్వైజర్గా పనిచేస్తూ నెలకు రూ.1.25 లక్షల జీతం అందుకునేవారు. కానీ ఒక కారు ప్రమాదం అతని జీవిత గమనాన్ని మార్చేసింది. ఎడమ చేయి, కాలు పక్షవాతానికి గురయ్యాయి. తన ఉద్యోగాన్ని, స్థిరత్వాన్ని, కొంతకాలానికి ఆశను కోల్పోయాడు. ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో అతనికి తోడ్పాడు అందించింది. ఫుడ్ డెలివరీ పార్ట్నర్గా అవకాశమిచ్చింది.తన కుమార్తె ఇప్పుడు దంతవైద్యం చదువుతోందని శ్రీపాల్తో ఫుడ్ డెలివరీ రైడర్ అన్నారు. కేవలం ఆదాయం కోసమే కాకుండా తన కలను సజీవంగా ఉంచుకోవడానికి ఆయన రైడ్ చేస్తున్నారని శ్రీపాల్ గాంధీ తన పోస్ట్లో పేర్కొన్నారు. "అతను జీవితాన్ని నిందించలేదు. ఫిర్యాదులు చేయలేదు. సాకులు చెప్పలేదు" అని రాసుకొచ్చారు. స్వామి సమర్థ్ను విశ్వసించే అతను 'దేవుడు నాతో ఉన్నాడు. నేనెందుకు కంగారు పడాలి?" అని నవ్వుతూ అన్నాడని శ్రీపాల్ వివరించారు."ఈ రోజు నాకు శాండ్ విచ్ వచ్చింది. కానీ కృతజ్ఞత, స్థిరత్వం, ఆశావాదం నా దగ్గరే నిలిచిపోయాయి" అంటూ తన పోస్ట్ ను ముగించారు. అతనికి ఉపాధి కల్పించిన జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పోస్ట్ వైరల్గా మారి నెటిజనుల ప్రశంసలు అందుకుంది. అలాంటి వారికి సెల్యూట్.. వావ్, అద్భుతం.. నిజంగా స్ఫూర్తిదాయకం అంటూ కామెంట్లు పెట్టారు. -
మీ పనే బాగుంది సార్! ముందు యుద్ధాలకు ఉసిగొల్పి.. తర్వాత కాల్పుల విరమణ అని భలే బిల్డప్ ఇస్తున్నారు!!
మీ పనే బాగుంది సార్! ముందు యుద్ధాలకు ఉసిగొల్పి.. తర్వాత కాల్పుల విరమణ అని భలే బిల్డప్ ఇస్తున్నారు!! -
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. శుభవార్తలు
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి: బ.చతుర్దశి ఉ.11.19 వరకు, తదుపరి అమావాస్య, నక్షత్రం: భరణి ఉ.7.40 వరకు, తదుపరి కృత్తిక, వర్జ్యం: రా.6.51 నుండి 8.21 వరకు, దుర్ముహూర్తం: ప.12.21 నుండి 1.13 వరకు, తదుపరి ప.2.56 నుండి 3.48 వరకు,అమృతఘడియలు: రా.3.45 నుండి 5.16 వరకు.సూర్యోదయం : 5.29సూర్యాస్తమయం : 6.24రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకుయమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు మేషం.. నూతన ఉద్యోగయోగం. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.వృషభం.. మిత్రులతో మాటపట్టింపులు. కొత్త రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. ఆధ్యాత్మిక చింతన.మిథునం... కొత్త పనులు చేపడతారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార , ఉద్యోగాలలో పురోగతి.కర్కాటకం... కొత్త కార్యక్రమాలు చేపడతారు. బంధువులతో వివాదాల పరిష్కారం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. ఆలయాల సందర్శనం. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.సింహం... వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య భంగం. కుటుంబసభ్యులతో కలహాలు. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.కన్య.... ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దూరప్రయాణాలు. ఒప్పందాల్లో ఆటంకాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. శ్రమకు ఫలితం అంతగా ఉండదు.తుల.... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.వృశ్చికం... కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వాహన, కుటుంబసౌఖ్యం. వృత్తి,వ్యాపారాలలో ముందడుగు.ధనుస్సు..... పనుల్లో స్వల్ప ఆటంకాలు. వృథా ఖర్చులు. అదనపు బాధ్యతలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు ఒడిదుడుకులు. దూరప్రయాణాలు.మకరం...... రుణఒత్తిడులు. పనులలో కొద్దిపాటి ఆటంకాలు. అనుకోని‡ప్రయాణాలు. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం.కుంభం... వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలు. చిన్ననాటి మిత్రులను కలుస్తారు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.మీనం... బంధువులతో మాటపట్టింపులు. రుణయత్నాలు. తీర్థయాత్రలు. అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. -
వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన మంత్రులు
సాక్షి, ప్రకాశం జిల్లా: ఈ నెల 28న పొదిలిలో పొగాకు బోర్డును వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సందర్శించనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో మంత్రుల హడావుడి మొదలైంది. వైఎస్ జగన్ దెబ్బకు మంత్రులు దిగొచ్చారు. పొగాకు రైతులతో మార్టూరులో సమావేశం నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పలువురు రైతులతో మాట్లాడారు. 28 లోపు పొగాకు కొనుగోలు జరపాలంటూ అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం.మంత్రి అచ్చెన్నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలుఈ క్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతులకు ఆశ ఎక్కువ .. పంట పండించక ముందు ఆలోచించాలి. పండించాక నష్టపోయామని బాధపడకూడదంటూ వ్యాఖ్యానించారు. మార్కెట్ లో పంట అమ్మకాలను పసిగట్టి పంటలు వేసుకోవాలంటూ రైతులకు ఉచిత సలహా ఇచ్చారు.కాగా, పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిరప, వరి, కంది, పొగాకు వంటి పంటలకు కనీస మద్దతు ధర కూడా ఇవ్వకుండా రైతులను నష్టాలబాట పట్టించిందని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు. జిల్లాలో పొగాకు రైతుల కష్టాలు అన్నీఇన్నీ కావు. వేలం కేంద్రానికి వెళ్లి పొగాకు అమ్ముడుపోక బేళ్లను వెనక్కు తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో పొగాకు రైతుల కష్టాలు తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు ఈ నెల 28వ తేదీన వైఎస్ జగన్ పొదిలి వేలం కేంద్రానికి రానున్నారు. -
పారిపోండ్రోయ్..!!
ఇస్లామాబాద్: శత్రువు ఎదురొస్తే అతని ప్రాణం తీయడమో లేదంటే తన ప్రాణాలు పోయేదాకా పోరాడటమే వీరుని లక్షణం. పాకిస్తాన్ సైన్యాధికారికి ఇవేం లేనట్లు తాజాగా ఉదంతంతో స్పష్టమైంది. ఆపరేషన్ సిందూర్ వేళ సైనిక చర్యలో భాగంగా పాకిస్తాన్ సైనిక స్థావరంపై భారత్ దాడులు చేస్తుంటే దీటుగా స్పందించాల్సింది పోయి పారిపోయిన పాక్ బ్రిగేడ్ కమాండర్ పలాయనపర్వం తాజాగా వెలుగులోకి వచ్చింది. భారత క్షిపణులు పాక్ సైనికుల వెన్నులో వణుకు పుట్టించిందన్న వార్త వాస్తవమని తాజా ఘటనతో నిరూపితమైంది. నాయకుడై ముందుండి నడిపించాల్సిందిపోయి తన కింద పనిచేసే జవాన్లకు పిరికిమందు నూరిపోసిన బ్రిగేడ్ కమాండర్ వివరాలు అక్కడి ఒక జూనియర్ ఆఫీసర్ చేసిన ‘రేడియో సిగ్నళ్ల’డీకోడ్ ద్వారా వెల్లడయ్యాయి. అంతా సర్దుకున్నాక తాపీగా వస్తా జూనియర్ అధికారి ఇతర అధికారులకు ‘రేడియో సిగ్నళ్ల ద్వారా పంపిన సందేశాలను భారత సైన్యం విజయవంతంగా డీకోడ్ చేయగా అందులో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పాక్ ఆక్రమిత కశీ్మర్లోని ముజఫరాబాద్ వద్ద పాక్ ఆర్మీలోని 75వ ఇన్ఫ్యాంట్రీ బ్రిగేడ్ స్థావరం ఉంది. దానికి ఒక కమాండర్ నేతృత్వం వహిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్లో భాగంగా పాక్పై భారత్ సైనిక చర్య మొదలెట్టింది. ఈ 75వ బ్రిగేడ్ స్థావరం మీదా భారత్ దాడులు జరిపింది. వెంటనే భయంతో వణికిపోయిన కమాండర్ అక్కడి నుంచి ఉడాయించాడు. పత్తాలేకుండా పోయిన కమాండర్ గురించి అక్కడి జూనియర్ అధికారి ఆరాతీశాడు. కమాండర్ యుద్ధక్షేత్రంలో మాయమై మసీదులో తేలాడు. అక్కడ నమాజ్ చేసుకుంటూ తలదాచుకుంటున్నట్లు తెల్సింది. వెంటనే ఆర్మీబేస్కు రావాలని జూనియర్ అధికారి కోరగా.. ‘‘నేనిప్పుడు రాను. భారత దాడి ఆగిపోయాక, పరిస్థితి అంతా సద్దుమణిగాక వస్తా. మీరు కూడా అక్కడ ఉండకండి. ప్రాణాలు కాపాడుకునేందుకు పారిపోండి. ఉద్రిక్తతలు తగ్గాక ఆర్మీ బేస్ కార్యాలయాన్ని తాపీగా తెరుద్దాం’’అని కరాఖండిగా చెప్పేశాడు. ఇది విన్న జూనియర్ ఆఫీసర్ హుతాశుడై సంబంధిత సమాచారాన్ని ఇతర అధికారులకు చేరవేశాడు. ఇతర అధికారులతో చెబుతున్న రేడియో చాటింగ్ వివరాలను భారత సైన్యం డీకోడ్ చేసింది. -
చరిత్ర సృష్టించిన సునీల్ నరైన్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
కోల్కతా నైట్రైడర్స్ స్టార్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 క్రికెట్లో ఒకే జట్టు తరపున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్గా నరైన్ చరిత్ర సృష్టించాడు. సునీల్ కేకేఆర్ తరుపన ఇప్పటివరకు ఐపీఎల్లో 191, ఛాంపియన్స్ లీగ్ టీ20 (CLT20)లో 18 వికెట్లు తీశాడు. మొత్తంగా 209 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్-2025లో భాగంగా ఢిల్లీ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో నరైన్ ఈ ఫీట్ సాధించాడు. కాగా సునీల్ నరైన్ ఐపీఎల్ ఆరంభం నుంచి కోల్కతా నైట్ రైడర్స్ (KKR)కే ఆడుతున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటివరకు ఈ రికార్డు ఇంగ్లండ్ క్రికెట్ క్లబ్ నాటింగ్హామ్షైర్ బౌలర్ సమిత్ పటేల్ పేరిట ఉండేది. నాటింగ్హామ్షైర్ తరపున పటేల్ 208 వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్తో సమిత్ వరల్డ్ రికార్డును నరైన్ బ్రేక్ చేశాడు. నరైన్ పటేల్, తర్వాతి స్ధానంలో హాంప్షైర్ బౌలర్ క్రిస్ వుడ్ 199 ఉన్నాడు. ముంబై ఇండియన్స్ మాజీ బౌలర్ లసిత్ మలింగ 195 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు.పురుషుల టీ20 క్రికెట్లో ఒక జట్టుకు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు210* – సునీల్ నరైన్ (కోల్కతా నైట్ రైడర్స్)208 – సమిత్ పటేల్ (నాటింగ్హామ్షైర్)199 – క్రిస్ వుడ్ (హాంప్షైర్)195 – లసిత్ మలింగ (ముంబై ఇండియన్స్)193 – డేవిడ్ పేన్ (గ్లౌసెస్టర్షైర్) -
‘కాజీపేట’కు రెడ్సిగ్నల్!
అది ప్రధాని మోదీ 2023 జూలై 8న స్వయంగా శంకుస్థాపన చేసిన రైల్వే ప్రాజెక్టు. కానీ విచిత్రంగా రైల్వే బోర్డు మాత్రం ఇప్పటివరకు ఆ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వలేదు. ఫలితంగా ప్రాజెక్టు నిర్మాణ పనులు మూడొంతులు పూర్తయినా ఆధునిక యంత్రాల కోసం దిగుమతి ఆర్డర్ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. వెరసి.. మరికొద్ది నెలల్లో ఉత్పత్తి ప్రారంభం కావాల్సిన యూనిట్ ఇప్పట్లో అందుబాటులోకి వచ్చేలా కనిపించట్లేదు. ఇదీ కాజీపేట రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ (మినీ కోచ్ ఫ్యాక్టరీ) దుస్థితి.సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజల దశాబ్దాల కలల ప్రాజెక్టు అయిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై ఏళ్ల తరబడి నాన్చుతూ వచ్చిన కేంద్రం చివరకు దానికి పచ్చజెండా ఊపింది. తొలుత రైల్వే వ్యాగన్ ఓవర్ హాలింగ్ వర్క్షాపుగా మంజూరైన ప్రాజెక్టును కోచ్ తయారీ యూనిట్గా అప్గ్రేడ్ చేసింది. ఇందులో ఎలక్ట్రిక్ మెమూ యూనిట్లు (ఈఎంయూ), సరుకు రవాణా వ్యాగన్లు తయారవుతాయని ప్రకటించింది. దేశవ్యాప్తంగా వందేభారత్ రైళ్లను వేగంగా పట్టాలెక్కించే ఉద్దేశంతో వీలైనన్ని ప్రాంతాల్లో ఆ కోచ్లను తయారు చేయాలని నిర్ణయించి కాజీపేట యూనిట్ను కూడా అందుకు అనుగుణంగా ఉపయోగించుకోవాలని ఆ తర్వాత నిర్ణయించింది. భవిష్యత్తులో కాజీపేట యూనిట్లోనూ వందేభారత్ కోచ్ల తయారీకి వీలుగా మౌలిక వసతులు సిద్ధం చేయాలనుకుంది. దీనికి సంబంధించిన ఆధునిక యంత్రాలను జపాన్కు చెందిన టైకిషా కంపెనీ నుంచి దిగుమతి చేసుకోనున్నట్లు ప్రకటించింది.ఇంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాతే పరిస్థితి తలకిందులైంది. ప్రధాని శంకుస్థాపన చేసిన తర్వాత.. ఈ యూనిట్ నిర్మాణ బాధ్యతను రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్)కు రైల్వేశాఖ అప్పగించింది. ఈ యూనిట్ను ఓవర్హాలింగ్ వర్క్షాప్గా ప్రతిపాదించినప్పుడే ఆర్వీఎన్ఎల్ టెండర్లు పిలవగా పవర్మెక్–టైకిషాలతో కూడిన జాయింట్ వెంచర్ దీన్ని దక్కించుకుంది. తొలుత రూ. 269 కోట్ల యూనిట్ వ్యయాన్ని ఆ తర్వాత రూ. 362 కోట్లకు పెంచిన కేంద్రం.. మినీ కోచ్ ఫ్యాక్టరీగా అప్గ్రేడ్ చేశాక దాన్ని రూ. 530 కోట్లకు పెంచింది. అనంతరం ప్రధాని మోదీ ఈ యూనిట్ పనులకు శంకుస్థాపన చేశారు. ఇప్పటికే మూడొంతుల పనులు పూర్తవగా వచ్చే మార్చికల్లా యూనిట్ పూర్తిగా సిద్ధం కానుంది. వీలైతే ఈ ఏడాది చివరికల్లా సిద్ధం చేసే వీలుందని అధికారులు చెబుతున్నారు. ఓవైపు షెడ్లు సిద్ధమవుతున్న నేపథ్యంలో నిర్మాణ సంస్థతో ఉన్న ఒప్పందం మేరకు జపాన్కు చెందిన టైకిషా కంపెనీ నుంచి అత్యాధునిక పరికరాలు, యంత్రాలను దిగుమతి చేసుకోవాల్సి ఉంది. ఆ మేరకు అనుమతి కోరుతూ ఆర్వీఎన్ఎల్ ఇటీవల రైల్వే బోర్డు అనుమతి కోరగా బోర్డు అనూహ్యంగా షాక్ ఇచ్చింది. కొర్రీలతో బ్రేకులు! కాజీపేటలో రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్కు అనుమతే ఇవ్వలేదని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. పెంచిన అంచనా వ్యయానికి తాము అనుమతి ఇవ్వనిదే యంత్రాలు ఎలా కొంటారని ఎదురు ప్రశ్నించింది. పైగా అన్ని షెడ్లు, యంత్రాలు ఎందుకో చెప్పడంతోపాటు జపాన్ నుంచి కొనాల్సిన అవసరం ఏమిటో లిఖితపూర్వకంగా తెలియజేయాలని ఆదేశించింది. దీంతో ఆర్వీఎల్ఎల్ అధికారులు ఒక్కో దానికి సమాధానం ఇస్తూ వచ్చారు. ఇంతలో ఈ వ్యవహారాలు చూసే రైల్వే బోర్డు ఉన్నతాధికారి బదిలీ కావడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. పాత అధికారి స్థానంలో వచ్చిన కొత్త అధికారి మరిన్ని కొర్రీలు పెడుతున్నారు. ఆ యూనిట్ లేఅవుట్ పంపాలని.. దాన్ని చూశాక మరిన్ని సందేహాలు తీర్చాలంటూ ఐదారు రోజుల క్రితం అడిగారు. ఈ నేపథ్యంలో ఆ యూనిట్లో ఉత్పత్తి ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. రైల్వే బోర్డు తీరు చూస్తే ఇప్పట్లో ఉత్పత్తి మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు. ప్రధాని శంకుస్థాపన చేసిన ఓ ప్రాజెక్టు విషయంలో రైల్వే బోర్డు ఇలా వ్యవహరిస్తుండటం స్థానిక అధికారులనే అయోమయానికి గురిచేస్తోంది. -
ఐఏఎస్, ఐపీఎస్లుగా రైతు బిడ్డలు
సాక్షి, చెన్నై: 2004లో సునామీ సృష్టించిన విలయతాండవం సమయంలో కడలూరులో ఐఏఎస్ అధికారిగా గగన్దీప్సింగ్ బేడీ పనితీరును చిన్న పిల్లలుగా ఉన్న ఇద్దరు సిస్టర్స్ కనులార చూశారు. సునామీ విలయం నుంచి బయటపడిన జీడి పప్పు రైతు కుటుంబంలోని ఈ ఇద్దరు తాము సైతం ఐఏఎస్ కావాలన్న కలతో ముందుకు సాగారు. ఇందులో ఒకరు ఐఏఎస్గా, మరొకరు ఐపీఎస్గా విధుల్లో చేరి రాణిస్తున్నారు. కడలూరు జిల్లా బన్రూట్టి సమీపంలోని మరుంగూర్ గ్రామానికి చెందిన రామనాథన్, ఇలవరసి దంపతుల కుమార్తెలు సుస్మిత, ఐశ్వర్య. ఈ ఇద్దరి మధ్య ఏడాదిన్నర వయస్సు తేడా. 2004లో జరిగిన సునామీ తాండవం సమయంలో ప్రస్తుతం ప్రభుత్వంలో సీనియర్ ఐఏఎస్గా ఉన్న గగన్దీప్సింగ్ బేడి అప్పట్లో కడలూరులో వీరోచితంగా సేవలు అందించడంలో శ్రమించారు. దీనిని చిన్న పిల్లలుగా ఉన్న సుస్మిత, ఐశ్వర్య చూసి, తాము సైతం ఐఏఎస్లు కావాలన్న లక్ష్యంతో చదివారు. అన్నావర్సిటీలో పట్టభద్రులయ్యారు. కల సాకారం యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమయ్యారు. తమ ప్రతిభను చాటుకున్నారు. ప్రస్తుతం వీరిలో సుస్మిత ఆంధ్రప్రదేశ్ బ్యాచ్ ఐపీఎస్గా కాకినాడలో ఏఎస్పీగా వ్యవహరిస్తున్నారు. ఐశ్వర్య తమిళనాడులోని తూత్తుకుడి అదనపు కలెక్టర్గా పనిచేస్తున్నారు. ఏదో ఒక రోజున ఒక జిల్లాకు ఎస్పీగా ఒకరు, ఒక జిల్లాకు కలెక్టర్గా మరొకరు బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఒకే ఇంటికి చెందిన ఈ ఇద్దరు సిస్టర్స్ విధుల్లో రాణిస్తున్నారు. తన కుమార్తెల గురించి రామనాథన్ మాట్లాడుతూ తన పిల్లలు ఇద్దరు ఐపీఎస్, ఐఏఎస్లుగా ఉండడంతో ఆనందం వ్యక్తం చేశారు. కలెక్టర్ గగన్ దీప్ సింగ్బేడి పనితీరును తన ఇద్దరు పిల్లలు ఆదర్శంగా తీసుకున్నారని పేర్కొన్నారు. సివిల్ సర్వీసులో రాణించి వారి కలను సాకారం చేసుకున్నారని, ఇద్దరు గెలిచారని ఆనందం వ్యక్తం చేశారు. -
భారత్తో మనుగడకే ప్రమాదం
ఇస్లామాబాద్: భారత్ వల్ల తన అస్తిత్వమే ప్రమాదంలో పడిందని పాకిస్తాన్ భయపడుతోంది. సైనికపరంగా పైచేయిగా ఉన్న భారత్ను నిలువరించేందుకు తనకున్న ఏకైక మార్గం అణ్వస్త్రాలే అని భావిస్తోంది. అందుకే, తన వద్ద ఉన్న అణ్వ్రస్తాలను ఆధునీకరించుకునే పనిలో పడింది. ఇందుకోసం సైనిక, ఆర్థిక పరమైన సాయం అందిస్తోంది’..ఈ విషయాలు ఆదివారం అమెరికా రక్షణ నిఘా విభాగం(యూఎస్డీఐఏ) వరల్డ్ త్రెట్ అసెస్మెంట్ పేరుతో విడుదల చేసిన నివేదికలో ఉన్నాయి. రాబోయే సంవత్సరాల్లో పొరుగు దేశాలతో సరిహద్దుల్లో ఘర్షణలను ఎదుర్కోవడం పాకిస్తాన్ మిలటరీ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని నివేదిక పేర్కొంది. ఇందులో భాగంగానే అణ్వస్త్రాల నవీకరణ కొనసాగించాలని నిర్ణయించుకుంది. ఈ ఆయుధ సంపత్తిని భద్రంగా కాపాడుకోవడం, కమాండ్ కంట్రోల్ వంటి వాటిపైనా పాక్ మిలటరీ దృష్టి పెట్టిందని తెలిపింది. సామూహిక జన హననాని(డబ్ల్యూఎండీ)కి అవసరమయ్యే ఆయుధ సామగ్రిని విదేశీ ఉత్పత్తి సంస్థలు, దళారుల ద్వారా సేకరించడం ఆర్మీ తప్పనిసరని భావిస్తోంది. డబ్ల్యూఎండీ తయారీ, అభివృద్ధిలో వాడే సామగ్రి, సాంకేతికతను ప్రధానంగా చైనా నుంచి పొందుతోంది. ఇందులో కొన్నిటిని హాంకాంగ్, సింగపూర్, తుర్కియే, యూఏఈల ద్వారా తెప్పించుకుంటోందని యూఎస్డీఐఏ నివేదిక తెలిపింది. ‘పాక్కు ప్రధాన ఆయుధ సరఫరాదారు చైనా కొనసాగుతున్నప్పటికీ, పాక్లో వివిధ ప్రాజెక్టుల కోసం పనిచేసే చైనీయులపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్న ఘటనలు రెండు దేశాలకు ఇబ్బందికరంగా మారాయి. రెండు మిత్ర దేశాల మధ్య ఇవి ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి’అని పేర్కొంది. నివేదికలో భారత్ గురించి ఏముంది? జమ్మూకశీ్మర్లోని పహల్గాంలో ఏప్రిల్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్లోని ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా క్షిపణులను ప్రయోగించిన విషయాన్ని కూడా యూఎస్డీఐఏ తన నివేదికలో ప్రస్తావించింది. ‘మే 7 నుంచి 10వ తేదీ వరకు క్షిపణి, డ్రోన్, ఆర్టిలరీ కాల్పులు చోటు చేసుకున్నాయి. 10వ తేదీన రెండు దేశాల సైన్యాలు పూర్తి స్థాయి కాల్పుల విరమణకు అంగీకరించాయి’అని పేర్కొంది. ‘చైనా పలుకుబడికి చెక్ పెట్టేందుకు భారత్ కూడా వ్యూహాత్మకంగా హిందూ మహా సముద్ర తీర, ద్వీప దేశాలతో ద్వైపాక్షిక రక్షణ భాగస్వామ్యాలను పెంచుకుంటోంది’అని నివేదిక తెలిపింది. భారత్–చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల ప్రస్తావన సైతం ఇందులో ఉంది. ‘తూర్పు లద్దాఖ్లోని వివాదాస్పద వాస్తవా«దీన రేఖ వెంబడి చిట్టచివరి రెండు ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి ఇరు దేశాలు సైన్యాలను ఉపసంహరించుకున్నప్పటికీ సరిహద్దు విభజన వివాదం అపరిష్కృతంగానే ఉండిపోయింది’అని పేర్కొంది. మిలటరీ ఆధునీకరణ, ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకునే క్రమంలో దేశీయ రక్షణ పరిశ్రమను బలోపేతమయ్యేలా భారత్ ‘మేడ్ ఇన్ ఇండియా’కార్యక్రమాన్ని కొనసాగించే అవకాశముంది.