breaking news
-
సాక్షి కార్టూన్ 23-12-2025
-
2026 నుంచి చైనా గేమ్ ప్లాన్ ఇదే..
ఇటీవల కాలంలో బంగారం అంటేనే కొండెక్కి కూర్చునే ధర అనుకున్న వారికి, ఇప్పుడు వెండి తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. కేవలం ఏడాది కాలంలోనే సుమారు 120 శాతం పైగా రాబడి అందించి, కిలో వెండి ధర రికార్డు స్థాయిలో రూ.2 లక్షలను దాటింది. అయితే, ఈ పెరుగుదల ఇక్కడితో ఆగేలా లేదు. 2026 జనవరి 1 నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద వెండి ఉత్పత్తిదారు అయిన చైనా ఎగుమతులపై ఆంక్షలు విధించనుందనే వార్తలు గ్లోబల్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్నాయి.సౌర విద్యుత్, ఎలక్ట్రిక్ వాహనాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) కోసం మైక్రోచిప్ల తయారీలో వెండి వినియోగం పెరగడమే దీనికి ప్రధాన కారణం. ఒకప్పుడు కేవలం ఆభరణాలకే పరిమితమైన వెండి, ఇప్పుడు గ్రీన్ ఎనర్జీకి కీలకంగా మారింది. సరఫరా తక్కువ, డిమాండ్ ఎక్కువ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో 2026 ప్రారంభానికి ముందే కిలో వెండి ధర రూ.2.5 లక్షలకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అటు చైనా ఎగుమతుల కోత, ఇటు పెరుగుతున్న టెక్నాలజీ అవసరాల మధ్య వెండి ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు వెళ్లనున్నాయి.వెండి ఎగుమతులపై చైనా ఆంక్షలుప్రపంచంలో వెండి ఉత్పత్తిలోనూ, ఎగుమతిలోనూ చైనాది కీలక పాత్ర. అయితే జనవరి 1, 2026 నుంచి చైనా ప్రభుత్వం వెండి ఎగుమతులపై కొత్త నిబంధనలను అమలు చేయాలని చూస్తోంది. అయితే వీటిని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ప్రతిపాదిత అంశాల ప్రకారం.. ఇకపై వెండిని ఎగుమతి చేయాలంటే కంపెనీలు ప్రత్యేక ప్రభుత్వ లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. ఇది 2027 వరకు అమలులో ఉండే అవకాశం ఉంది. ఏడాదికి 80 టన్నుల కంటే తక్కువ ఉత్పత్తి చేసే చిన్న సంస్థలకు ఎగుమతి అనుమతులు నిరాకరించే అవకాశం ఉంది. కేవలం పెద్ద, ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలకే ఈ అవకాశం దక్కుతుంది. చైనా తన దేశీయ అవసరాల కోసం (ముఖ్యంగా సోలార్, ఎలక్ట్రానిక్స్ రంగాలు) వెండి నిల్వలను కాపాడుకోవడం, అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధరలను ప్రభావితం చేయడం ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.డిమాండ్ పెరగడానికి కారణాలుగ్రీన్ ఎనర్జీ విప్లవం.. వెండికి విద్యుత్ వాహకత చాలా ఎక్కువ. సౌర ఫలకాల తయారీలో వెండిని కీలకమైన సిల్వర్ పేస్ట్ రూపంలో వాడతారు. ప్రపంచం శిలాజ ఇంధనాల నుంచి పునరుత్పాదక ఇంధనం వైపు మళ్లుతుండటంతో సోలార్ ప్యానెల్స్ తయారీకి వెండి డిమాండ్ 2020తో పోలిస్తే 2024 నాటికి దాదాపు 150% పెరిగింది.ఎలక్ట్రిక్ వాహనాలు, ఏఐ.. సాధారణ కార్ల కంటే ఎలక్ట్రిక్ వాహనాల్లో వెండి వినియోగం చాలా ఎక్కువ. బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్, సెన్సార్లు, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వెండిని విరివిగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డేటా సెంటర్ల విస్తరణ వల్ల అత్యాధునిక చిప్లు, సెమీకండక్టర్ల తయారీలోనూ వెండి వాటా పెరుగుతోంది.సరఫరాలో లోటు.. గడిచిన ఐదేళ్లుగా వెండి ఉత్పత్తి కంటే వినియోగం ఎక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా మైనింగ్ ద్వారా వచ్చే వెండి పరిమితంగా ఉంది. వెండి అనేది ఎక్కువగా రాగి, బంగారం, సీసం వంటి లోహాల వెలికితీతలో ఉప-ఉత్పత్తిగా ఉంది. కాబట్టి, డిమాండ్ పెరిగిన వెంటనే వెండి ఉత్పత్తిని పెంచడం మైనింగ్ సంస్థలకు సాధ్యం కావడం లేదు.సురక్షిత పెట్టుబడిగా వెండి.. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాల వల్ల పెట్టుబడిదారులు వెండిని సురక్షితమైన ఆస్తిగా భావిస్తున్నారు. అందుకే ఈ ఏడాది వెండి దాదాపు 120% పైగా రాబడిని ఇచ్చింది.2026 నాటి చైనా ఎగుమతి ఆంక్షలు అమలులోకి వస్తే గ్లోబల్ మార్కెట్లో వెండి కొరత మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఇది కేవలం ఆభరణాల రంగాన్నే కాకుండా ఆధునిక సాంకేతిక, ఇంధన రంగాలను కూడా ప్రభావితం చేస్తుంది. భారతీయ మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం, 2026 నాటికి వెండి ధరలు కిలోకు రూ.2.4 లక్షల నుంచి 2.5 లక్షల వరకు చేరే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో వెండి కేవలం ఒక లోహంగా మాత్రమే కాకుండా, వ్యూహాత్మక వనరుగా మారబోతోంది.ఇదీ చదవండి: రూపాయి విలువ తగ్గినా మంచికే! -
ఒకేరోజు భారీగా పెరిగిన బంగారం ధర.. ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
రవీంద్ర జడేజా కీలక నిర్ణయం
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కీలక నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ-2025లో భాగమయ్యేందుకు సిద్ధమయ్యాడు. సొంత జట్టు సౌరాష్ట్ర తరపున జడ్డూ రెండు మ్యాచ్లు ఆడనున్నాడు.ఈ విషయాన్ని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధికారి ఒకరు ధ్రువీకరించారు. కర్ణాటకలోని ఆలూర్లో జనవరి 6, 8న జరిగే మ్యాచ్లలో సౌరాష్ట్ర జట్టుకు జడేజా ప్రాతినిథ్యం వహిస్తాడని టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్గా నిలిచిన తర్వాత రవీంద్ర జడేజా (Ravindra Jadeja) అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.ఆసీస్ టూర్కు ఎంపిక చేయలేదుఈ క్రమంలో ప్రస్తుతం వన్డే, టెస్టుల్లో కొనసాగుతున్న జడ్డూను.. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన నుంచి సెలక్టర్లు తప్పించారు. వన్డే జట్టులో అతడికి స్థానం కల్పించలేదు. దీంతో వన్డే వరల్డ్కప్-2027 ప్రణాళికల్లో జడ్డూ లేడా అన్న సందేహాలు నెలకొన్నాయి.ఈ విషయంపై చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) నాడు స్పందిస్తూ.. ‘‘మా ప్రణాళికల్లో అతడు భాగమే. చాంపియన్స్ ట్రోఫీ జట్టులోనూ అతడు ఉన్నాడు. నాడు పిచ్ పరిస్థితులకు అనుగుణంగా అదనపు స్పిన్నర్లకు జట్టులో చోటిచ్చాం.అయితే, ఆసీస్టూర్లో జట్టు సమతూకంగా ఉండేలా చూసుకోవాలి. కాబట్టి వాషీ, కుల్దీప్లతో మేము ముందుకు వెళ్తున్నాం. ఒక్కోసారి ఆటగాళ్ల మధ్య తీవ్రమైన పోటీ ఉన్నపుడు ఇలాంటి నిర్ణయాలు తప్పవు. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో పిచ్ పరిస్థితులకు తగ్గట్లే జట్టును ఎంపిక చేశాము’’ అని జడ్డూను తప్పించడానికి గల కారణాన్ని వెల్లడించాడు.సఫారీలతో సిరీస్లో సత్తా చాటిన జడ్డూఅయితే, ఈ టూర్ తర్వాత స్వదేశంలో ఇటీవల సౌతాఫ్రికా (IND vs SA) తో జరిగిన వన్డే సిరీస్కు జడేజాను ఆడించింది యాజమాన్యం. తొలి వన్డేలో 20 బంతుల్లోనే 32 పరుగులు చేసిన జడ్డూ.. రెండో వన్డేలో 24 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే, ఈ సిరీస్లో ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్.. కేవలం ఒకే ఒక్క వికెట్ తీయగలిగాడు.కాగా టీమిండియా తరఫున విధుల్లో లేని సమయంలో ఆటగాళ్లంతా దేశీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ ఇటీవలే కచ్చితమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. గాయం, ఫిట్నెస్ సమస్యలు ఉన్నవాళ్లకు మాత్రమే ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కూడా తమ జట్లు ముంబై, ఢిల్లీ తరఫున బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు.ఇక కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, శుబ్మన్ గిల్, అర్ష్దీప్ సింగ్, అభిషేక్ శర్మ తదితరులు కూడా తమ జట్ల తరఫున ఆడేందుకు సిద్ధం కాగా.. తాజాగా జడ్డూ కూడా ఈ జాబితాలో చేరిపోయాడు. కాగా లిస్-ఎ క్రికెట్లో లెఫ్టాండర్ జడేజా 260 మ్యాచ్లు ఆడి.. 3911 పరుగులు చేయడంతో పాటు 293 వికెట్లు కూడా పడగొట్టాడు. కాగా విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొన్న తర్వాత.. టీమిండియా స్టార్లు.. న్యూజిలాండ్తో సిరీస్తో బిజీ అవుతారు.చదవండి: Virat Kohli: చరిత్రకు ఒక్క పరుగు దూరంలో.. -
భారత్తో వన్డే సిరీస్.. విలియమ్సన్ సంచలన నిర్ణయం!
న్యూజిలాండ్ పురుషల క్రికెట్ జట్టు వచ్చే ఏడాది జనవరిలో భారత పర్యటనకు రానుంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్లో కివీస్ తలపడనుంది. తొలుత వన్డే సిరీస్ జరగనుంది. ఈ క్రమంలో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్స్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. టీమిండియాతో వన్డే సిరీస్కు విలియమ్సన్ను దూరంగా ఉండనున్నాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్లో ఆడేందుకు కేన్ ఇప్పటికే డర్బన్ సూపర్ జెయింట్స్ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ లీగ్ డిసెంబర్ 26 నుండి జనవరి 26 వరకు జరగనుంది. ఈ లీగ్ కారణంగానే అతడు భారత్తో జరిగే వన్డేలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. భారత్ వర్సెస్ న్యూజిలాండ్ వన్డే సిరీస్ జనవరి 11న ప్రారంభమై.. జనవరి 18న ముగియనుంది.ఇప్పటికే అంతర్జాతీయ టీ20 క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విలియమ్సన్.. ప్రస్తుతం వన్డే, టెస్టు ఫార్మాట్లలోనే కొనసాగుతున్నాడు. సెంట్రల్ కాంట్రాక్ట్ను కూడా వదులుకున్నాడు. ఎక్కవగా కుటంబంతో సమయం గడిపేందుకే కేన్ మామ ప్రాధాన్యత ఇస్తున్నాడు. గత నెలలలో వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్కు కూడా అతడు దూరమయ్యాడు. కానీ ఈ కివీ మాజీ కెప్టెన్ విండీస్తో టెస్టు సిరీస్లో మాత్రం మాడాడు. మౌంట్మంగనూయ్ వేదికగా విండీస్-న్యూజిలాండ్ మూడో టెస్టు ముగిసిన అనంతరం విలియమ్సన్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు."ఒక్కో సిరీస్కు కాస్త విరామం తీసుకుని మళ్లీ జాతీయ జట్టుకు ఆడుతాను. నా కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నాను. ముఖ్యంగా పిల్లలతో గడపడం నాకు చాలా ముఖ్యం. అయితే క్రికెట్ పట్ల నాకున్న మక్కువ ఇసుమంత కూడా తగ్గలేదు. కానీ నా వ్యక్తిగత జీవితాన్ని, నా ప్రొపిషనల్ లైఫ్ను బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నా" అని విలియమ్సన్ పేర్కొన్నాడు. ఐపీఎల్-2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టుకు వ్యూహాత్మక సలహాదారుగా కేన్ వ్యవహరించనున్నాడు. -
హీరోయిన్లపై శివాజీ అభ్యంతరకర వ్యాఖ్యలు.. చిన్మయి స్ట్రాంగ్ రిప్లై
కొందరు సెలబ్రిటీలు మైక్ పట్టుకుంటే నోరు అదుపులో ఉండదు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేస్తుంటారు. తాము చెప్పదలుచుకున్నది మంచి విషయమే కావొచ్చు. కానీ ఎలా చెబుతున్నమనేది కూడా ముఖ్యమే. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే నటుడు శివాజీ.. సోమవారం జరిగిన 'దండోరా' ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ హీరోయిన్ల డ్రస్సింగ్ స్టైల్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. మరీ ముఖ్యంగా రెండు బూతు పదాల్ని స్టేజీపై బహిరంగంగా అనడం చర్చనీయాంశమైంది. స్పందించిన సింగర్ చిన్మయి.. ఆగ్రహంతో ట్వీట్ చేసింది.(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)శివాజి ఏమన్నాడంటే?'హీరోయిన్లు ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకునిపోతే దరిద్రం అనుభవించాల్సి వస్తుంది. మీ అందం చీరలోనో, నిండుగా కప్పుకొనే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనిపించే దానిలో ఏం ఉండదు. చూసినప్పుడు నవ్వుతారు గానీ దరిద్రపు ము**, ఇలాంటి బట్టలెందుకు వేసుకున్నావ్, మంచివి వేసుకోవచ్చుగా బాగుంటావుగా అని లోపల అనుకుంటారు కానీ బయటకు చెప్పరు. గ్లామర్ అనేది ఒకదశ వరకే ఉండాలి. స్వేచ్ఛ అనేది అదృష్టం. దాన్ని కోల్పోవద్దు' అని శివాజీ అన్నాడు. అయితే ఇందులో ఓ బూతు పదంతో పాటు సోషల్ మీడియాలో ఎక్కువగా మాట్లాడుకునే సామాను అనే చిల్లర పదం ఉపయోగించడం ఇక్కడ వివాదాస్పదమైంది.సింగర్ చిన్మయి రెస్పాన్స్ శివాజీ పబ్లిక్గా స్టేజీపై చేసిన వ్యాఖ్యలపై సింగర్ చిన్మయి ఘాటుగా స్పందించింది. 'తెలుగు నటుడు శివాజీ.. బూతు పదాలతో హీరోయిన్లకు అనవసర సలహా ఇచ్చాడు. ఆయా పదాల్ని ఎక్కువగా పోకిరీలు ఉపయోగిస్తారు. ఓ అద్భుతమైన సినిమాలో శివాజీ విలన్గా నటించాడు. తద్వారా పోకిరీలకు హీరో అయిపోయాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే పబ్లిక్గా ఇలాంటి పదాలు వాడటం. ఆయనేమో జీన్స్, హూడీ వేసుకున్నాడు. మరి ఆయన చెప్పిన దానిబట్టి చూస్తే ధోతీ కట్టుకుని భారతీయ సంప్రదాయాన్ని అనుసరించాలిగా. ఒకవేళ ఆయనకు పెళ్లయి ఉంటే బొట్టు, మెట్టెలు కూడా పెట్టుకోవాలి. అసలు మహిళలని ఇక్కడ ఎలా చూస్తున్నారో అర్థమవుతోంది' అని చిన్మయి ఆవేదన వ్యక్తం చేసింది.(ఇదీ చదవండి: 'ధురంధర్' కలెక్షన్స్లో మాకు షేర్ ఇవ్వాలి: పాక్ ప్రజలు) -
నేరుగా ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
ప్రముఖ సంగీత దర్శకుడు కోటి గురించి తెలిసే ఉంటుంది. ఆయన కొడుకు రాజీవ్.. హీరోగా పలు సినిమాలు చేశాడు. కాకపోతే ఒక్కటి కూడా హిట్ కాలేదు. 2021లో చిరంజీవి చేతుల మీదగా ఓ మూవీని లాంచ్ చేశారు. అయితే ఆ చిత్రం చాన్నాళ్లుగా థియేటర్లో రిలీజ్ కాలేకపోయింది. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా సినిమా?(ఇదీ చదవండి: హీరోయిన్లకు సలహా సరే.. ఈ 'సామాను' కామెంట్ అవసరమా శివాజీ?)కోటి తనయుడు రాజీవ్ హీరోగా నటించిన సినిమా '11:11'. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కథతో తీశారు. అయితే ఆర్థిక కారణాలా లేదా మరే కారణమో తెలీదు గానీ గత రెండు మూడేళ్లుగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయలేకపోయారు. ఎలాగోలా ఇప్పుడు ఆహా ఓటీటీలోకి సైలెంట్గా తీసుకొచ్చేశారు. తెలుగులో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే రామ్ 'ఆంధ్ర కింగ్ తాలూకా', కీర్తి సురేశ్ 'రివాల్వర్ రీటా' చిత్రాలు బుధ, గురువారాల్లో వరసగా స్ట్రీమింగ్ కానున్నాయి. ఏక్ దివానే కీ దివానియత్, 'మిడిల్ క్లాస్' చిత్రాలు కూడా డిజిటల్గా అందుబాటులోకి రానున్నాయి. అలానే తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్ 'స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2' ఈ శుక్రవారం ఓటీటీలోకి రానుంది.(ఇదీ చదవండి: 'ధురంధర్' కలెక్షన్స్లో మాకు షేర్ ఇవ్వాలి: పాక్ ప్రజలు) -
హీరోయిన్ల డ్రెస్పై శివాజీ వ్యాఖ్యలు... అనసూయ పోస్ట్ వైరల్
హీరోయిన్లు ధరించే దుస్తులపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదస్పదంగా మారాయి. పలువురు సినీ ప్రముఖులతో పాటు నెటిజన్స్ కూడా శివాజీ వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. ఎలాంటి దస్తులు ధరించాలో ఆయన చెప్పాల్సిన అవసరం లేదంటూ ఘాటుగానే స్పందిస్తున్నారు.తప్పు డ్రెస్సింగ్లో లేదని.. చూసే చూపులోనే ఉందంటూ మరికొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. సింగర్ చిన్మయి అయితే శివాజీనీ ఏకంగా పోకిరీల హీరో అని విమర్శించారు. బూతు పదాలతో హీరోయిన్లకు అనవసరపు సలహాలు ఇచ్చిన శివాజీ..ముందుగా జీన్స్, హూడీ ధరించకుండా ధోతీ కట్టుకుని భారతీయ సంప్రదాయాన్ని అనుసరించాలంటూ చిన్మయి కాస్త ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు.(చదవండి: మహిళలని ఇక్కడ ఎలా చూస్తున్నారో అర్థమవుతోంది: చిన్మయి)ఇక తాజాగా నటి, యాంకర్ అనసూయ(Anasuya Bharadwaj) కూడా తన యాంకర్ శివాజీ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ప్రత్యేక్షంగా శివాజీని విమర్శించకపోయినా.. పరోక్షంగా మాత్రం ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ..‘ఇది నా శరీరం.. నీది కాదు’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇది శివాజీకి కౌంటర్ లాగా ఉంది అంటూ కొంతమంది నెటిజెన్లు అనసూయ కి సపోర్ట్ గా నిలిచారు. మరికొంతమంది ఏమో శివాజీ మంచి సలహానే ఇచ్చారంటూ అనసూయని విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు. శివాజీ ఏమన్నారంటే.. ?శివాజీ ప్రధాన పాత్రలో నటించిన దండోరా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం హైదరాబాద్లోని ఓ ప్రముఖ హోటల్లో జరిగింది. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ.. 'హీరోయిన్లు ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకునిపోతే దరిద్రం అనుభవించాల్సి వస్తుంది. మీ అందం చీరలోనో, నిండుగా కప్పుకొనే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనిపించే దానిలో ఏం ఉండదు. చూసినప్పుడు నవ్వుతారు గానీ దరిద్రపు ము**, ఇలాంటి బట్టలెందుకు వేసుకున్నావ్, మంచివి వేసుకోవచ్చుగా బాగుంటావుగా అని లోపల అనుకుంటారు. కానీ బయటకు చెప్పరు. గ్లామర్ అనేది ఒకదశ వరకే ఉండాలి. స్వేచ్ఛ అనేది అదృష్టం. దాన్ని కోల్పోవద్దు'అన్నాడు. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
Virat Kohli: చరిత్రకు ఒక్క పరుగు దూరంలో..
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి దాదాపు పదిహేనేళ్ల తర్వాత విజయ్ హజారే ట్రోఫీ ఆడనున్నాడు. సొంత జట్టు ఢిల్లీ తరఫున ఈ దేశీ వన్డే టోర్నమెంట్ బరిలో దిగనున్నాడు. ఆంధ్ర జట్టుతో బుధవారం (డిసెంబరు 24) నాటి మ్యాచ్ సందర్భంగా కోహ్లి మరోసారి ఢిల్లీ జెర్సీలో కనిపించనున్నాడు. ఈ జట్టుకు టీమిండియా స్టార్ రిషభ్ పంత్ కెప్టెన్.ఇక ఐపీఎల్లో కోహ్లి ప్రాతినిథ్యం వహించే ఆర్సీబీకి సొంత మైదానం అయిన.. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఇందుకు వేదిక కావడం మరో విశేషం. కాగా 2010లో కోహ్లి చివరగా విజయ్ హజారే ట్రోఫీ (VHT) టోర్నీ ఆడాడు. సర్వీసెస్తో మ్యాచ్లో ఢిల్లీ తరఫున 16 పరుగులు సాధించాడు.వరుస సెంచరీలుఇక ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టు ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి (Virat Kohli).. కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో తొలి రెండు వన్డేల్లో డకౌట్ అయిన కోహ్లి.. మూడో వన్డేలో ధనాధన్ ఫిఫ్టీతో ఫామ్లోకి వచ్చాడు.అనంతరం సౌతాఫ్రికాతో స్వదేశంలో వన్డే సిరీస్లో వరుస సెంచరీలతో చెలరేగి ఆకట్టుకున్నాడు. ప్రొటిస్తో తొలి వన్డేల్లో ఏకంగా 135 పరుగులు సాధించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. రెండో వన్డేలోనూ 102 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే వన్డేల్లో 53 శతకాలతో ఆల్టైమ్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఇక ప్రొటిస్తో మూడో వన్డేలోనూ కేవలం 45 బంతుల్లో 65 పరుగులతో అజేయంగా నిలిచాడు కోహ్లి.చరిత్రకు ఒక్క పరుగు దూరంలోఅంతర్జాతీయ వన్డే కెరీర్లో 14557 పరుగులు చేసిన కోహ్లి.. తద్వారా లిస్ట్-ఎ క్రికెట్లో ఓవరాల్గా ఇప్పటికి 15,999 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఆంధ్రతో బుధవారం నాటి విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్కు ముందు చరిత్రకు ఒక్క పరుగు దూరంలో నిలిచాడు. సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లి ఆంధ్రతో మ్యాచ్లో ఒక్క రన్ చేస్తే.. లిస్ట్-ఎ క్రికెట్లో 16 వేల పరుగుల మైలురాయి అందుకున్న భారత రెండో క్రికెటర్గా నిలుస్తున్నాడు.ఈ జాబితాలో సచిన్ టెండుల్కర్ కోహ్లి కంటే ముందు వరుసలో ఉన్నాడు. లిస్ట్-ఎ క్రికెట్లో 21,999 పరుగులు సాధించాడు. కాగా వన్డేలతో పాటు విజయ్ హజారే ట్రోఫీ, భారత్-ఎ, జోనల్ జట్ల తరఫున సాధించిన పరుగులను లిస్ట్-ఎ జాబితాలో చేర్చుతారు. కాగా ఓవరాల్గా ఈ లిస్టులో ఇంగ్లండ్ క్రికెటర్ గ్రాహమ్ గూచ్ 22,211 పరుగులతో టాప్లో ఉన్నాడు.లిస్ట్-ఎ క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాటర్లు👉సచిన్ టెండుల్కర్- 538 ఇన్నింగ్స్లో 21,999 రన్స్👉విరాట్ కోహ్లి- 329 ఇన్నింగ్స్లో 15,999 రన్స్👉సౌరవ్ గంగూలీ- 421 ఇన్నింగ్స్లో 15,622 రన్స్ 👉రోహిత్ శర్మ- 338 ఇన్నింగ్స్లో 13,758 రన్స్👉శిఖర్ ధావన్- 298 ఇన్నింగ్స్లో 12,074 రన్స్.చదవండి: వరల్డ్కప్లో టీమిండియా ఫినిషర్ ఎవరు? -
కెప్టెన్గా ఇషాన్ కిషన్
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ మరోసారి జార్ఖండ్ జట్టుకు నాయకత్వం వహించేందుకు సిద్దమయ్యాడు. విజయ్ హాజారే ట్రోఫీ 2025-26కు కోసం జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్గా కిషన్ ఎంపికయ్యాడు. కిషన్ ఇటీవలే జార్ఖండ్కు తొలి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని అందించాడు. ఇప్పుడు దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హాజారే ట్రోఫీలో తన జట్టును విజయ పథంలో నడిపించేందుకు కిషన్ ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ టోర్నీలో కిషన్కు డిప్యూటీగా వికెట్ కీపర్ బ్యాటర్ కుమార్ కుషాగ్రా వ్యవహరించనున్నాడు. అదేవిధంగా ఈ జట్టులో విరాట్ సింగ్, అనుకుల్ రాయ్, రాబిన్ మింజ్ వంటి టాలెంటెడ్ ఆటగాళ్లకు చోటు దక్కింది. జార్ఖండ్ తమ తొలి మ్యాచ్లో డిసెంబర్ 24న కర్ణాటకతో తలపడనుంది.ఇక టీ20 ప్రపంచకప్-2026కు ఎంపిక చేసిన భారత జట్టులో ఇషాన్ కిషన్కు చోటు దక్కింది. దేశవాళీ క్రికెట్ టోర్నీలో అద్భుత ప్రదర్శన కారణంగా అతడిని సెకెండ్ వికెట్ కీపర్ బ్యాటర్గా సెలక్టర్లు ఎంపిక చేశారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కిషన్ దుమ్ములేపాడు. ఈ టోర్నీలో 10 మ్యాచ్లు ఆడిన ఈ పాకెట్ డైన్మైట్ 57.44 సగటుతో 571 పరుగులు చేశాడు. ఫైనల్లో కూడా సెంచరీతో సత్తాచాటాడు. ఈ క్రమంలోనే రెండేళ్ల తర్వాత జాతీయ జట్టుకు అతడు ఎంపికయ్యాడు.విజయ్ హాజారే ట్రోఫీకి జార్ఖండ్ జట్టుఇషాన్ కిషన్ (కెప్టెన్), విరాట్ సింగ్, ఉత్కర్ష్ సింగ్, కుమార్ కుషాగ్రా (వైస్ కెప్టెన్), రాబిన్ మింజ్, అనుకుల్ రాయ్, శరణదీప్ సింగ్, శిఖర్ మోహన్, పంకజ్ కుమార్, బాల కృష్ణ, మహ్మద్ కౌనైన్ ఖురైషీ, శుభ్ శర్మ, అమిత్ కుమార్, మనీషి, అభినవ్ శరణ్, సుశాంత్ మిశ్రా, వికాస్ సింగ్, సౌరభ్ శేఖర్, రాజందీప్ సింగ్, శుభమ్ సింగ్.చదవండి: IND vs NZ: భారత్తో వన్డే సిరీస్.. విలియమ్సన్ సంచలన నిర్ణయం!
