ఏపీ శాసన మండలి అప్డేట్స్..
ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి కామెంట్స్..
- అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు.
- జగన్ హిందూ వ్యతిరేకి అని అవాస్తవాలు మాట్లాడుతున్నారు
- వైవీ సుబ్బారెడ్డి సతీమణి గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం
- సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణమ్మ గురించి మీకు ఏం తెలుసని ప్రశ్నిస్తున్నా
- బైబిల్ పట్టుకున్నంత మాత్రాన స్వర్ణమ్మ క్రిస్టియన్ అయిపోతుందా?.
- మీరు కూడా అనేక సార్లు మీ మీటింగ్లలో బైబిల్ పట్టుకున్నారు
- మీరు కూడా క్రిస్టియన్లే అని ఒప్పుకుంటారా?
- మీ రాజకీయాల కోసం ఇంట్లో ఉన్న మహిళలను బయటికి తేవడం మంచి పద్ధతి కాదు
- చంద్రబాబు కూల్చిన గుళ్లను పునఃనిర్మించిన చరిత్ర వైఎస్ జగన్ది.
- శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆలయాలను నిర్మించారు
- 801 ఆలయాలను పునఃరుద్ధరణ చేశారు
- నవనీత సేవ కోసం గోశాలను ఏర్పాటు చేశారు
- వైఎస్సార్, వైఎస్ జగన్ హిందూ సాంప్రదాయాలను కాపాడిన వ్యక్తులు
- 21 మందితో ధార్మిక పరిషత్ ఏర్పాటు చేసింది వైఎస్సార్.
- దూపదీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది వైఎస్సార్
- ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక కూటమి నేతలు వైఎస్ జగన్పై బురద జల్లుతున్నారు
- ఇప్పటికైనా చంద్రబాబు దేవుడిపై రాజకీయం చేయడం మానుకోవాలి
ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం కామెంట్స్..
- ఆరోగ్య శ్రీ రాజశేఖర్ రెడ్డి మానస పుత్రిక.
- వైద్యానికి వైఎస్సార్, వైఎస్ జగన్ పెద్దపీట వేశారు
- ఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసింది.
- నెట్ వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించడం మానేసింది
- బిల్లులు నిలిపివేయడం వల్ల నెట్ వర్క్ ఆసుపత్రులు ఇబ్బందుల్లో పడ్డాయి
శాసనమండలి మీడియా పాయింట్..
ఎమ్మెల్సీ తూమాటి మధవరావు కామెంట్స్..
- పోర్టులకు ఎంత ఖర్చు చేశారని అడిగితే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు
- తప్పుడు సమాచారంతో సభను తప్పుదోవ పట్టిస్తున్నారు
- గత ప్రభుత్వంలో చేసిన ఖర్చులనే ఈ ప్రభుత్వం చేసినట్లు చెబుతున్నారు
- ప్రభుత్వం మారగానే అంచనాలు, టెండర్లు ఎందుకు మార్చారని అడిగితే వివరాలు లేవంటున్నారు
- ఆరు ఫిషింగ్ హార్బర్లు అసలు మొదలు పెడతారా లేదా?
- పోర్టుల అనుసంధానం వల్లనే రహదారులు అభివృద్ధి చెందుతున్నాయి
- గత ప్రభుత్వంలో 50-60 శాతం పనులు చేస్తే, ఈ ప్రభుత్వంలో 5% కూడా చేయలేదు
- రేపటిలోగా మా ప్రశ్నలకు సమాధానాలు రాకపోతే ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తాం
సమాధానం చెప్పలేక టీడీపీ అడ్డగోలు వాదన..
- ఆడబిడ్డ నిధిపై మండలిలో టీడీపీ అడ్డగోలు వాదన
- ఆడబిడ్డ నిధిపై సమాధానం చెప్పకుండా వైఎస్సార్సీపీ సభ్యులపై మంత్రుల ఎదురుదాడికి
- మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, కొలుసు పార్ధసారథి, కూటమి ఎమ్మెల్సీలు అత్యుత్సాహం
- కూటమి ఎమ్మెల్సీల తీరుపై అసహనం వ్యక్తం చేసిన మండలి చైర్మన్
- ఆడబిడ్డ నిధి పథకంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పొంతనలేని సమాధానం
- మంత్రి సమాధానంపై అసహనం వ్యక్తం చేసిన వైఎస్సార్సీపీ సభ్యులు
- ఆడబిడ్డ నిధి గురించి కాకుండా మిగిలిన అంశాలపై మాట్లాడిన మంత్రి
- సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్కు సూచించిన చైర్మన్
ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కామెంట్స్..
- ఆడబిడ్డ నిధి పథకం ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీ
- 18 ఏళ్లు నిండిన ప్రతీ మహిళకు నెలకు 1500 ఇస్తామని చెప్పారు
- నీకు 18 వేలు నీకు 18 వేలు ఇస్తామని ఇంటింటికి తిరిగి చెప్పారు
- ఎన్నికల్లో తిరిగి మరీ ప్రచారం చేశారు
- మూడు బడ్జెట్లు పెట్టినా ఆడబిడ్డ నిధి ఊసేలేదు
వాటర్ పైప్ లైన్లుపై దృష్టి పెట్టాలి: బొత్స
- శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ కామెంట్స్..
- వాటర్ ట్యాంకుల నిర్వహణ లోపం వల్లే డయేరియా వ్యాప్తి.
- ప్రభుత్వం వాటర్ పైప్ లైన్లు, ట్యాంకుల నిర్వహణపై దృష్టిపెట్టాలి.
బాబుకి భోగాపురానికి సంబంధమే లేదు..
- ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు కామెంట్స్..
- భోగాపురం ఎయిర్ పోర్టుకి చంద్రబాబు టెంకాయ కొట్టి వదిలేశారు
- 377 ఎకరాలు మాత్రమే భూ సేకరణ చేసి వదిలేశారు
- కోర్టు కేసులు క్లియర్ చేయలేదు
- ఎన్ఓసీ తీసుకురాలేదు
- వైఎస్ జగన్ సీఎం అయ్యాకే భోగాపురం ఎయిర్ పోర్టు పనులు పరుగులు పెట్టించారు
- అన్ని అనుమతులు తెచ్చింది జగన్
- కేంద్రంతో మాట్లాడి బీచ్ కారిడార్ అభివృద్ధికి ఆరు వేల కోట్లు తెచ్చారు
- ఈ ప్రభుత్వం వచ్చి 20 నెలలు పూర్తైనా ఎయిర్ పోర్టు రోడ్ల అనుసంధాన ప్రక్రియ ప్రారంభించలేదు.
నేడు మండలిలో ప్రారంభమైన సమావేశాలు
- ప్రశ్నోత్తరాలు ప్రారంభం
- నేడు వ్యవసాయంపై లఘు చర్చ
శాసనమండలి..
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ కామెంట్స్..
- డయేరియాపై ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదు
- గతంలో జగ్గయ్యపేట, తురకపాలెం, విజయవాడ, ఇప్పుడు శ్రీకాకుళంలో డయేరియా విజృంభించింది
- తురకపాలెంలో ప్రజలు ఈ నీళ్లు మేం తాగలేమని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదు
- డయేరియా కట్టడికి ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో సమాధానం చెప్పాలి


