Assembly
-
ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి.. ఎన్ని కుట్రలు చేసినా ప్రజల తరఫున పోరాటం ఆపం
-
రేపు అసెంబ్లీకి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు
-
బీసీలు తగ్గిందెక్కడ?
సాక్షి, హైదరాబాద్: ఎలాంటి రాజకీయ ప్రయోజనాలకు తావు లేకుండా, బీసీల ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవాలనే చిత్తశుద్ధితో కులగణన సర్వే జరిపామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. 2014లో జరిగిన సమగ్ర కుటుంబ సర్వే అంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న నివేదికకు ఎలాంటి ప్రామాణికత లేదని అన్నారు. సమగ్ర కుటుంబ సర్వే నివేదిక కేవలం ఎంసీఆర్హెఆర్డీ వెబ్సైట్లో తప్ప మరెక్కడా అందుబాటులో లేకుండా చేశారని పేర్కొన్నారు.వాళ్లు చేశారని చెపుతున్న సర్వేలో కూడా బీసీల జనాభా 1,85,61,856 మంది అంటే 51 శాతం మాత్రమే కాగా, తాజా కులగణన సర్వేలో బీసీల సంఖ్య 56.33 శాతమని తేలిందని, అలాంటప్పుడు తగ్గింది ఎక్కడో చెప్పాలని సీఎం అన్నారు. ఇక ఓసీలు 71,18,858 మంది అంటే 21 శాతం కాగా, ఇప్పుడు తాము శాస్త్రీయంగా చేసిన సర్వేలో 15.7 శాతంగా తేలిందని తెలిపారు. అలాగే అప్పుడు ఎస్సీలు 18 శాతం కాగా ఎస్టీలు 10 శాతమని చెప్పారు. ముస్లిం కేటగిరీనే చూపించలేదన్నారు. శాసనసభలో మంగళవారం సమగ్ర కుల గణనపై జరిగిన చర్చ సందర్భంగా విపక్ష పారీ్టలు దానిపై పలు అభ్యంతరాలు లేవనెత్తాయి. ఈ సందర్భంగా సీఎం జోక్యం చేసుకుని మాట్లాడారు. బీసీల జనాభాను తగ్గిస్తే నాకు లాభమేంటి? ‘బీసీల జనాభాను తగ్గిస్తే నాకు వచ్చే లాభం ఏమిటి? దీనిపై అనవసరంగా అపోహాలు సృష్టించవద్దు. ఎక్కడిదో పోగేసుకుని వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు. మీరు సర్వే చేసి మంత్రివర్గానికి, శాసనసభకు నివేదికను ఇవ్వకపోవడానికి కారణం ఏమిటి? కులగణనలో పాల్గొనని వారికి సభలో మాట్లాడడానికి అవకాశం ఇవ్వొద్దు. తమ లెక్కలు బయటపడతాయనే కేసీఆర్ కుటుంబం సర్వేలో పాల్గొనలేదు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు, పద్మారావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డితో పాటు బీజేపీ ఎంపీ డీకే అరుణ వంటి వారు తమ వివరాలు ఇవ్వలేదు. స్వాతంత్య్రం రాకముందు నుంచి ప్రతి పదేళ్లకోసారి దేశంలో జనాభా లెక్కలు తీశారు.2011 తర్వాత 14 ఏళ్లుగా జనాభా లెక్కలు లేవు. 2014లో ప్రధానిగా మోదీ వచ్చిన తర్వాతే ఈ పరిస్థితి నెలకొంది. రాహుల్గాంధీ పార్లమెంటులో డిమాండ్ చేసినా స్పందన లేదు. అబద్ధాల సంఘం (బీఆర్ఎస్ను ఉద్దేశించి) ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. 2014 డాక్యుమెంటును మీరెందుకు బహిర్గతం చేయలేదు? ఒక కుటుంబం కోసం చేసిన సర్వే అది. ఇప్పుడు శాస్త్రీయ పద్ధతిలో సర్వే చేశాం. ఇవే అధికారిక లెక్కలు. వీటికి కట్టుబడి ఉంటాం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి. అది సాధ్యమయ్యే అవకాశం ప్రస్తుతానికి లేదు.రాజ్యాంగ సవరణ జరిగే వరకు పార్టీ తరఫున 42 శాతం సీట్లు బీసీలకు ఇస్తాం. ఇందుకు మా పీసీసీ అధ్యక్షుడిని కూడా ఒప్పించా. మీరు సిద్ధమా? బీజేపీ, బీఆర్ఎస్ తేల్చుకోవాలి..’అని సీఎం సవాల్ విసిరారు. ‘కుల గణన సర్వే నివేదికను సభ ముందుంచడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే, సర్వే నివేదిక మొత్తం నాలుగు పుటలుగా ఉంది. ఇందులో మూడు పుటలు కులగణన, ఇతర వివరాలు కాగా నాలుగో భాగంలో ప్రజల వ్యక్తిగత వివరాలున్నాయి. వీటిని బయటపెట్టడం చట్ట రీత్యా నేరం. కాబట్టి మిగతా మూడు పుటలను సభ ముందు ఉంచడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు..’అని ముఖ్యమంత్రి అన్నారు. -
రిజర్వేషన్లు లేకుండా ఎందుకీ నివేదిక?
సాక్షి, హైదరాబాద్: హడావుడిగా ప్రత్యేక సమావేశాలు పెడితే 42 శాతం రిజర్వేషన్ బిల్లు తెస్తారని అందరూ అనుకున్నారని, తీరా ప్రయోజనం లేని నివేదిక పెట్టారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీ రామారావు విమర్శించారు. కులగణనపై శాసనసభలో మంగళవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ 42 శాతం రిజర్వేషన్ బిల్లు తెస్తామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో రేవంత్ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. తమ హయాంలో సమగ్ర కుటుంబ సర్వే జరుగుతుంటే రేవంత్ రెడ్డి వివరాలు ఇవ్వొద్దని ప్రజలకు బహిరంగంగా పిలుపునిచ్చారని, 57 రకాల వివరాలను ఎవరికి పడితే వారికి ఎలా ఇస్తాం? అని మాట్లాడారని కేటీఆర్ తెలిపారు.2014లో తాము ప్రభుత్వ అధికారులతోనే సర్వే చేయించామని, ఇది ముమ్మాటికీ అధికారిక పత్రమేనన్నారు. దాన్ని ఎంసీఆర్ హెచ్ఆర్డీ వెబ్సైట్లో పెట్టామని చెప్పారు. తమ హయాంలో నిర్వహించిన సర్వేలో 1.03 కోట్ల కుటుంబాలు, 3.68 కోట్ల జనాభా పాల్గొన్నారని కేటీఆర్ వెల్లడించారు. ఈ సర్వే ప్రకారం బీసీల సంఖ్య 1,85,61,856గా ఉందని, బీసీలు 51 శాతం ఉన్నారని, ముస్లిం బీసీలు 10 శాతం కలుపుకుంటే 61 శాతమని పేర్కొన్నారు. 51 శాతం ఉన్న బీసీల సంఖ్య 46 శాతానికి ఎందుకు తగ్గిందని ప్రశ్నించారు. అధికార పార్టీ ఎమ్మెల్సీనే ఈ సర్వే తప్పుల తడకగా ఉందని దాన్ని తగలబెట్టండని చెబుతున్నారని కేటీఆర్ అన్నారు. మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్కుమార్రెడ్డి విలేకరుల సమావేశంలో చెప్పిన విషయాలనే సభలోనూ చెప్పారని విమర్శించారు. ప్రభుత్వ కుట్రకు నిరసనగా వాకౌట్: కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలు, బలహీన వర్గాలకు చేసిన ద్రోహానికి నిరసనగా వాకౌట్ చేస్తున్నట్టు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రకటించారు. షెడ్యూల్ కులాల్లోని ప్రత్యేక వర్గాల ఉపవర్గీకరణను స్వాగతిస్తూనే, బీసీలకు చేసిన ద్రోహానికి వాకౌట్ చేస్తున్నట్టు తెలిపారు. ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్రావు, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి, కేపీ వివేకానంద్, చింతా ప్రభాకర్, సీహెచ్.మల్లారెడ్డి, రాజశేఖరరెడ్డి తదితరులు బీసీ వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ డౌన్డౌన్ అంటూ నినదిస్తూ సభ నుంచి బయటకు వెళ్లారు. అంతకుముందు ఎస్సీ వర్గీకరణపై చర్చపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ మాట్లాడుతూ బీసీల సంఖ్యను ఐదు శాతం తగ్గించి బీసీల గొంతుకోసిన ప్రభుత్వ కుట్రకు నిరసనగా వాకౌట్ చేస్తున్నామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణపైన ప్రభుత్వం చేసిన ప్రకటనకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు. ప్రభుత్వం వర్గీరణ కోసం చేసే ప్రతి ప్రయత్నానికి అండగా ఉంటామని తెలిపారు. సభ వాయిదాపై అభ్యంతరం: మంగళవారం ఉదయం అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే సమావేశాలను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించడంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. శాసనసభాపతి చాంబర్లో స్పీకర్ ప్రసాద్కుమార్తో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, జగదీశ్రెడ్డి, కోవా లక్ష్మి, కౌశిక్రెడ్డి, చింతా ప్రభాకర్ భేటీ అయ్యారు. దీనిపై మాజీ మంత్రి హరీశ్రావు ‘ఎక్స్’లో స్పందిస్తూ ‘అసెంబ్లీ ప్రారంభమైన 2 నిమిషాలకే వాయిదా వేయడమేంటి? కేబినెట్ భేటీ ఇంకా కొనసాగుతున్నదని, సబ్జెక్ట్ నోట్స్ సిద్ధం చేయలేదని సభను వాయిదా వేయాలని మంత్రి శ్రీధర్బాబు కోరడం హాస్యాస్పదం. నాడు ప్రతిపక్షంలో ఉన్నా ప్రిపేర్ కాలేదు. నేడు పాలకపక్షంలో ఉన్నా ప్రిపేర్ కాలేదు’ అని పేర్కొన్నారు.వాట్ ఏ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ‘అసెంబ్లీలో ఓవైపు సమగ్ర కుటుంబ సర్వే అంశం ప్రస్తావనకు వచ్చిన నేపథ్యంలో ఎంసీహెచ్ఆర్డీ వెబ్సైట్ నుంచి సర్వే నివేదికను అధికారులు మాయం చేశారు’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘వెల్డన్ తెలంగాణ సీఎంఓ.. వాట్ ఏ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్’ అని ఎద్దేవా చేశారు. -
స్వతంత్ర భారత్లో ఇదే తొలి కులగణన
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన, బలహీన వర్గాల హక్కుల కోసం ఉద్దేశించిన తొలి సమగ్ర కుల గణన, స్వతంత్ర భారతదేశంలో తెలంగాణలోనే జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. గత ఏడాది ఫిబ్రవరి 4న రాష్ట్ర మంత్రిమండలి కులగణన సర్వే ప్రక్రియపై నిర్ణయం తీసుకుంటే, సరిగ్గా సంవత్సరానికే దీనిపై నివేదిక శాసనసభ ముందుకు వచ్చిందని చెప్పారు. రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర బలహీన వర్గాల స్థితిగతులను మెరుగు పరిచేందుకు, వివిధ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాల కోసం ప్రణాళికలను రూపొందించి అమలు చేయడం కోసం ఈ సర్వేను చేపట్టినట్లు పేర్కొన్నారు.దీంతో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీల జనాభా లెక్క తేలిందని తెలిపారు. ఇది భవిష్యత్కు మోడల్గా మారుతుందని, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఈ నివేదికే ప్రామాణికంగా ఉంటుందని స్పష్టం చేశా రు. ‘సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే–2024’ నివేదికపై మంగళవారం శాసనసభ ప్రత్యేక సమావేశంలో సీఎం ప్రకటన చేశారు. ఇదే కచ్చితమైన, శాస్త్రీయమైన సర్వే.. ‘దేశంలో 1931లో జరిగిన కులగణన తర్వాత మళ్లీ ఏ రాష్ట్రంలోనూ కులగణన జరగలేదు. జనాభా లెక్కల్లో ఎస్సీ, ఎస్టీల జనాభా వివరాలే ఉండేవి. దీంతో వెనుకబడిన, బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతూ వచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఎన్నికల సందర్భంగా రాహుల్గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కులగణనపై హామీ ఇచ్చింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత తెలంగాణలో ఈ సర్వే చేపట్టాం.గతంలో బిహార్ వంటి రాష్ట్రాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి నేతృత్వంలో దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క వంటి మంత్రులతో కమిటీ ఏర్పాటు చేశాం. సర్వేకు శ్రీకారం చుట్టాం. దీనిపై అధ్యయనం చేయించాం. మేమెంతో మాకంత ఇవ్వమన్న ఆయా వర్గాల డిమాండ్కు అనుగుణంగా రూ.160 కోట్లు వెచ్చించి సర్వే చేశాం. ఇదే కచ్చితమైన, శాస్త్రీయమైన సర్వే..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. అన్ని వర్గాల అభిప్రాయాలతో సర్వే షెడ్యూల్ ‘వివిధ ప్రజా సంఘాలు, సామాజికవేత్తలు, మేధావులు, ఇతర స్టేక్ హోల్డర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని హౌస్ లిస్టింగ్ షెడ్యూల్, సర్వే షెడ్యూల్, ఎన్యూమరేటర్లకు మార్గదర్శకాల ఆధారంగా సర్వే షెడ్యూల్ రూపొందించాం. సర్వే ఫామ్లో 57 ప్రశ్నలు ఉండగా, అదనపు ఉప ప్రశ్నలతో కలిపి మొత్తం 75 విభాగాల్లో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల అంశాలకు సంబంధించిన సమాచారం సేకరించాం. రాష్ట్రంలోని ప్రతి జిల్లాను ఒక్కొక్కటి 150 కుటుంబాలతో కూడిన 94,261 ఎన్యూమరేషన్ బ్లాకులుగా ఏర్పా టు చేశాం. ప్రతి బ్లాక్కి ఒక ఎన్యూమరేటర్ను, ప్రతి 10 మంది ఎన్యూమరేటర్లకు ఒక సూపర్వైజర్ని నియమించాం. రాష్ట్ర వ్యాప్తంగా 1,03,889 ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు ఈ సర్వేలో పాలుపంచుకున్నారు..’ అని సీఎం తెలిపారు.క్షేత్ర స్థాయిలో సర్వే.. ‘రాష్ట్రంలో 2024 నవంబర్ 6న సర్వే ప్రారంభమై 2024 డిసెంబర్ 25తో పూర్తయింది. హౌస్–లిస్టింగ్ చేసిన కుటుంబాలు 1,15,71,457 కాగా 1,12,15,134 కుటుంబాల సర్వే జరిగింది. అంటే సర్వే కవరేజ్ 96.9 శాతం. వివిధ కారణాల వల్ల సర్వే చేయని కుటుంబాల సంఖ్య 3,56,323. ఇవి జీహెచ్ఎంసీ, ఇతర నగరాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. సర్వేలో నమోదైన కుటుంబాల ఆధారంగా రాష్ట్రంలో 3,54,77,554 మందిని సర్వే చేయగా, సామాజిక వర్గాల వారీగా చూస్తే ఎస్సీల్లో 61,84,319 మందిని (17.43 శాతం), ఎస్టీల్లో 37,05,929 మందిని (10.45 శాతం) ముస్లిం మైనారిటీ మినహా బీసీల్లో 1,64,09,179 మందిని (46.25 శాతం), ముస్లిం మైనారిటీ బీసీలు 35,76,588 (10.08 శాతం) మందిని, ముస్లిం మైనారిటీల్లో మొత్తం 44,57,012 (12.56 శాతం) మందిని సర్వే చేయడం జరిగింది. ముస్లిం మైనారిటీల్లో ఓసీలు 8,80,424 (2.48 శాతం) మంది కాగా ఓసీలు 56,01,539 మంది (15.79 శాతం), ముస్లిం మైనారిటీ మినహా ఓసీలు 47,21,115 (13.31శాతం) మంది ఉన్నారు. మొత్తం 3.70 కోట్ల జనాభాగా తేలింది..’ అని రేవంత్ చెప్పారు. -
59 కులాలు 3 గ్రూపులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) జనాభాకు రిజర్వేషన్లను మూడు కేటగిరీలుగా అమలు చేయాలని ఏక సభ్య కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పునకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణపై అధ్యయనం జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ షమీమ్ అక్తర్ ఏక సభ్య కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ గతేడాది నవంబర్ 11నుంచి 82 రోజుల పాటు వివిధ కోణాల్లో అధ్యయనం చేసింది.సోమవారం (Monday) 199 పేజీలతో కూడిన పూర్తిస్థాయి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పింపంచింది. ఈ నివేదికలోని వివరాలతో కూడిన ఒక ప్రకటనను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. 2011 జనగణన (Census) ఆధారంగా రాష్ట్రంలో ఎస్సీ కేటగిరీ కింద ఉన్న 59 కులాలను వారి సామాజిక స్థితిగతుల ఆధారంగా మూడు గ్రూపులుగా కమిషన్ వర్గీకరించింది. గ్రూప్–1లో 15 కులాలు, గ్రూప్–2లో 18 కులాలు, గ్రూప్–3లో 26 కులాలను చేర్చింది.మూడింటికి ఓకే.. ఒక సిఫారసుకు నో» ఎస్సీ వర్గీకరణ అమలుకు జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు సిఫారసులు చేసింది. ఇందులో మూడింటికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపగా, ఒక సిఫారసును తిరస్కరించింది.» ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉండగా, ఇందులో సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అత్యంత వెనుకబడిన, ఇంతవరకు పట్టించుకోని షెడ్యూల్డ్ కులాలను కమిషన్ గ్రూప్–1 కేటగిరీలోకి చేర్చింది. వీరి జనాభా మొత్తం ఎస్సీల్లో 3.288 శాతం ఉండడంతో వారికి ఒక (1)శాతం రిజర్వేషన్ అమలు చేయాలని సిఫారసు చేసింది.» ఎస్సీల్లో మధ్యస్తంగా లబ్ధి పొందిన షెడ్యూల్డ్ కులాలను గ్రూప్–2లో చేర్చింది. ఎస్సీల్లో వీరి జనాభా 62.748 శాతం ఉండగా, వారికి 9% రిజర్వేషన్ కల్పించాలని సిఫారసు చేసింది. » మెరుగైన ప్రయోజనం పొందిన షెడ్యూల్డ్ కులాలను గ్రూప్–3లో చేర్చింది. ఎస్సీ జనాభాలో 33.963%ఉన్న వీరికి 5% రిజర్వేషన్ ఇవ్వాలని సిఫారసు చేసింది.» ఎస్సీ రిజర్వేషన్లలో క్రీమీలేయర్ ప్రవేశపెట్టాలని కమిషన్ సిఫారసు చేసింది. ఎమ్మెల్యే, ఎంపీ, జెడ్పీ చైర్మన్, మేయర్ తదితర ప్రజాప్రతినిధులతో పాటు గ్రూప్–1 సర్వీ సుల్లో ఉన్న వారిని క్రీమీలేయర్ కేటగిరీగా పరిగణించాలని స్పష్టం చేసింది. ఈ వ్యక్తులకు సంబంధించి రెండో తరానికి రిజర్వేషన్ల ప్రయోజనం నుంచి మినహాయింపు ఇవ్వాలని సూచించింది. అయితే ఈ సిఫారసును రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది.» ఇక ఉద్యోగ నియామకాల్లో క్రమపద్ధతిలో అనుసరించేందుకు వన్మెన్ కమిషన్ ప్రాధాన్యత నమూనాను రూపొందించింది. గ్రూప్–1లో నోటిఫై చేసిన అలాగే భర్తీ చేయని ఖాళీలను తదుపరి ప్రాధాన్యత గ్రూప్లో అంటే గ్రూప్–2లో భర్తీ చేయాలి. ఇందులో భర్తీ చేయని ఖాళీలను గ్రూప్–3లో భర్తీ చేయాలి. అన్ని గ్రూపుల్లో తగిన అభ్యర్థులు అందుబాటులో లేకుంటే ఆ పోస్టులను క్యారీ ఫార్వర్డ్ చేయాలి. -
‘సర్వే రిపోర్ట్ను కాంగ్రెస్ ఎమ్మెల్సీలే తగలబెట్టమన్నారు’
సాక్షి,హైదరాబాద్ : ‘సర్వే రిపోర్ట్ను తగలపెట్టాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీలే అన్నారు. ఇవ్వాళ సీఎం రేవంత్ రెడ్డి లెక్కలు..మొన్ననే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. కొత్త లెక్కలు ఏం ఉన్నాయి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. కులగణనపై తెలంగాణ అసెంబ్లీలో జరుగుతున్న ప్రత్యేక చర్చలో కేటీఆర్ మాట్లాడారు. ‘42 శాతం రిజర్వేషన్లు అమలు కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెడుతున్నారు అనుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం లేదు. సమగ్ర కుటుంబ సర్వేపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని అధికారులకు గుర్తు చేశాం. సమగ్ర కుటుంబ సర్వేను అధికారులే చేశారు. ఆ డాక్యుమెంట్ అందుకే వెబ్సైట్స్లో పెట్టాం. సమగ్ర కుటుంబ సర్వే 3కోట్ల 64లక్షలు పాల్గొన్నారు. 51శాతం. ముస్లింలు 10 శాతం వాళ్లను కలిపితే మొత్తం 61 శాతం. కాంగ్రెస్ సర్వే రిపోర్ట్ను తగలపెట్టాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీలే అన్నారు. ఇవ్వాళ సీఎం రేవంత్ రెడ్డి లెక్కలు.. మొన్ననే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. కొత్త లెక్కలు ఏం ఉన్నాయి’ అని అన్నారు. -
కులగణనపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చ: Revanth Reddy
-
రిజర్వేషన్ల అమలు కోసం బీజేపీ మాతో కలిసి రావాలి: సీఎం రేవంత్
Telangana Assembly Updatesఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్..ఎస్సీ వర్గీకరణ నివేదికను సభలో ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డిఎస్సీలలో 59 కులాలు ఉన్నాయివీరికి 15 శాతం రిజర్వేషన్ ను కమిషన్ కేటాయించిందిఎస్సీల్లో అత్యంత వెనకబడిన కులాలకు 1% , మాదిగ , దిగ ఉప కులాలకు 9%, మాల ,మాల ఉప కులాలకు 5% రిజర్వేషన్లు కేటాయించింది.క్రిమిలేయర్ విధానాన్ని కేబినెట్ తిరస్కరించింది.ఎస్సీ వర్గీకరణ కమీషన్ సూచన మేరకు రిజర్వేషన్లు అమలు చేస్తాంవైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీర్మానం చేసారు\మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది.నా రాజకీయ జీవితంలో కులగణన, ఎస్సీ వర్గీకరణ ద్వారా జీవితం పరిపూర్ణం అయింది.కులగణన ,ఎస్సీ వర్గీకరణ తో దేశం లోని ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలవబోతుంది.42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ అవసరంరిజర్వేషన్లు అమలు కోసం మాతో కలిసి బిజెపి రావాలి.పిసిసి ఆమోదం తీసుకొని పార్టీపరంగా రిజర్వేషన్లను అమలు చేస్తాం.ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ కీలక ప్రకటనతెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి ఎస్సీ వర్గీకరణపై కీలక ప్రకటన చేశారు. కమిషన్ సిఫారసు సారాంశాన్ని అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఎస్సీలను 3 గ్రూపులుగా వర్గీకరించాలని కమిషన్ సిఫారసు చేసింది. ఎస్సీలలో మొత్తం 59 ఉప కులాలను కమిషన్ గుర్తించింది. దాని ప్రకారం 3 గ్రూపులుగా వర్గీకరణ చేయాలని సూచించింది.కులగణన తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కేంద్రానికి కోరుతూ తీర్మానం జరిపాం. ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తాం. మిగితా రాష్ట్రాల కంటే ముందే ఎస్సీవర్గీకరణ అమలు చేస్తాం. రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని ఏక సభ్య కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఎస్సీ కులాలను గ్రూప్1,2,3గా వర్గీకరించాలని సిఫారసు. 15శాతం ఎస్సీ రిజర్వేషన్ను 3 గ్రూపులకు పెంచుతూ సిఫారసు. గ్రూప్-1లో 15 ఉపకులాలకు 1శాతం రిజర్వేషన్ సిఫారసు. గ్రూప్-2లో 18 ఉపకులాలకు 9శాతం రిజర్వేషన్ సిఫారసు. గ్రూప్-3లో 26 ఉపకులాలకు 5శాతం రిజర్వేషన్ సిఫారసు చేసినట్లు వ్యాఖ్యానించారు.అంతకుముందు సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణలో చేపట్టిన సమగ్ర సర్వే దేశానికి దిక్సూచి వంటిదని సీఎం రేవంత్రెడ్డి (revanth reddy) అన్నారు. కులగణనపై (telangana census survey) తెలంగాణ అసెంబ్లీ (telangana assembly) లో సీఎం రేవంత్ బీఆర్ఎస్ నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. భూముల వివరాలు అడిగినందుకే బీఆర్ఎస్ నేతలు కులగణన సర్వేలో పాల్గొనలేదని అన్నారు. ‘అపోహల సంఘం బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ను తప్పుదోవ పట్టిస్తుంది. ఓ ఫేక్ డేటాను సర్క్యూలేట్ చేసి జనాభా ఎక్కువ ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారు.గత ప్రభుత్వం సర్వే రికార్డులో 33వ పేజీలో జనాభా పై క్లారిటీ ఉంది చెక్ చేసుకోండి. 2014 సర్వే ప్రకారం బీసీ జనాభా 51 శాతం ఉంటే..ఇప్పుడు 56 శాతం ఉన్నారు. అదే ఓసీలు 2014 సర్వే ప్రకారం 21 శాతం ఉంటే ఇప్పుడు 15 శాతం ఉన్నారు. బీసీ జనాభా పెరిగింది కానీ..తగ్గింది అని ఎలా చెప్తారు.సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ అధికారికమో కాదో హరీష్ రావు, కేటీఆర్ చెప్పాలి. అధికారం అని చెప్తే..దానిపైనే చర్చ చేద్దాం. కేసీఆర్ ,కేటీఆర్ ,హరీష్ రావు ,పద్మారావు ,పల్లా రాజేశ్వర్ రెడ్డి ,పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, డీకే అరుణ లాంటి వారు సర్వేలో పాల్గొనలేదు. భూమి వివరాలు అడిగినందుకే వీరంతా సమాచారం ఇవ్వలేదు’ అని దుయ్యబట్టారు. సర్వేలో పాల్గొనండిజనాభా లెక్కించడం బీజేపీకి ఇష్టం లేదు. 2021లో జరగాల్సిన జనగణనను బీజేపీ ఇప్పటి వరకు ఎందుకు చేయడం లేదు. సమగ్ర కుటుంబ సర్వే ను గత ప్రభుత్వం అధికారిక రిపోర్ట్గా ప్రకటించలేదు. 2011 జనాభా లెక్కలు మినహా.. ఏ అధికారిక లెక్కలు లేవు. అపోహలు సృష్టించే డాక్యుమెంట్స్ తెచ్చి సభ్యులు సభను తప్పుదోవ పట్టించుకోకండి. ఇప్పటికైనా సర్వేలో పాల్గొనని వారు వివరాలు ఇవ్వండి.1931 తర్వాత దేశంలో కులగణన జరగలేదుఇప్పటి వరకు ఎవరి జనాభా ఎంత అనే సైంటిఫిక్ డేటా లేదు. అందుకే కులగణన చేశాం. 1931 తర్వాత దేశంలో కులగణన జరగలేదు. కేవలం ఎస్సీ, ఎస్టీ జనాభా వివరాలు మాత్రమే ఇప్పటి వరకు మన దగ్గర ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల కారణంగా కులగణన కొంత ఆలస్యం అయింది.వివిధ రాష్ట్రాలలో సర్వేలు చేసి..పకడ్బందీగా కులగణన చేశాం.లక్షకు పైగా అధికారులతో కులగణన వివరాలు సేకరించారు. 76 వేల మంది ఉద్యోగులు డేటా ఎంట్రీ చేశారు. రాహుల్గాంధీ ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేపట్టాం. ఏడాదిలోపు సర్వేను పూర్తి చేశాం. సర్వే సామిజక ఎక్సరేలాంటి. బలహీన వర్గాలకు విద్యా,రాజకీయంగా రిజర్వేషన్ కల్పిస్తాం. డేటా పూర్తి చేయడానికి 36 రోజులు పట్టింది. 75 అంశాలతో రాష్ట్రంలో సర్వే నిర్వహించాం. తెలంగాణలో మొత్తం కోటీ 12లక్షల కుటుంబాలు. అందులో బీసీలు 46:25శాతం, ఎస్సీలు-17:43శాతం, ఎస్టీలు-10:45శాతం, ముస్లీం బీసీలు కలిపితే 56:33శాతం ఉన్నారు. సర్వేలో 1,12,15,134 కుటుంబాలు పాల్గొన్నాయి. కులగణనలో పాల్గొన్న వారందరిని ,పనిచేసిన వారందరినీ పార్టీలకు అతీతంగా అభినందించాలి’ అని అన్నారు. రాహుల్గాంధీ ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేపట్టాం. ఏడాదిలోపు సర్వేను పూర్తి చేశాం. సర్వే సామిజక ఎక్సరేలాంటి. బలహీన వర్గాలకు విద్యా,రాజకీయంగా రిజర్వేషన్ కల్పిస్తాం. డేటా పూర్తి చేయడానికి 36 రోజులు పట్టింది. 75 అంశాలతో రాష్ట్రంలో సర్వే నిర్వహించాం. తెలంగాణలో మొత్తం కోటీ 12లక్షల కుటుంబాలు. అందులో బీసీలు 46:25శాతం, ఎస్సీలు-17:43శాతం, ఎస్టీలు-10:45శాతం, ముస్లీం బీసీలు కలిపితే 56:33శాతం ఉన్నారు. సర్వేలో 1,12,15,134 కుటుంబాలు పాల్గొన్నాయి. కులగణనలో పాల్గొన్న వారందరిని ,పనిచేసిన వారందరినీ పార్టీలకు అతీతంగా అభినందించాలి’ అని అన్నారు. -
ఆరేళ్ల తర్వాత తొలి బడ్జెట్
జమ్ము: కొంగొత్త ఆశలతో ఆరేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్లో తొలి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. కేబినెట్ ప్రతిపాదనకు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆమోదం తెలపడంతో జమ్మూకశ్మీర్ ప్రభుత్వం మార్చి మొదటి వారంలో తొలి అసెంబ్లీ సమావేశాలకు సమయాత్తమవుతుంది. అసెంబ్లీ సమావేశాలు మార్చి 3నుండి ప్రారంభమై 21 రోజుల పాటు జరగనున్నాయి. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా 2025-2026 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. జనవరి 21న ఒమర్ అబ్దుల్లా అధ్యక్షతన జరిగిన జమ్మూకశ్మీర్ కేబినెట్ మార్చి మొదటి వారం నుంచి సెషన్ను నిర్వహించాలని ప్రతిపాదించింది. ఆ ప్రతిపాదనకు సిన్హా ఆమోదం తెలిపారని, మార్చి మొదటి వారంలో సెషన్ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.లెఫ్టినెంట్ గవర్నర్ మార్చి 3 నుంచి తొలి రాష్టబడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు స్పీకర్ రహీమ్ రాథర్తో సంప్రదింపులు జరిపారు. ఇరువురి చర్చల అనంతరం అసెంబ్లీ కార్యదర్శి తెలియజేస్తారని, సమావేశాల ప్రారంభ తేదీ,వ్యవధిని చర్చిస్తారని సమాచారం. కాగా, జమ్మూ కశ్మీర్లో శాసనసభ లేకపోవడంతో మునుపటి ఐదు బడ్జెట్లను పార్లమెంటు ప్రవేశపెట్టింది. అయితే పీడీపీ-బీజేపీ ప్రభుత్వం పతనం తర్వాత అప్పటి గవర్నర్ సత్యపాల్ మాలిక్ నేతృత్వంలోని 2019-2020 బడ్జెట్ను ఆమోదించింది. -
తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
-
ఢిల్లీలో ఒకే విడతలో ఎన్నికలు.. ఫిబ్రవరి 5న పోలింగ్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. విజ్ఞాన్ భవన్లో జరిగిన సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. ఢిల్లీలో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి ఐదో తేదీన అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి ఎనిమిదో తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ఇలా.. జనవరి 10న ఎన్నికల నోటిఫికేషన్ ఎన్నికలకు పోలింగ్.. ఫిబ్రవరి 5ఎన్నికల ఫలితాలు.. ఫిబ్రవరి 8నామినేషన్లకు చివరి తేదీ.. జనవరి 17నామినేషన్ల విత్ డ్రా చివరి తేదీ.. జనవరి 20 #WATCH | Delhi to vote in a single phase on February 5; counting of votes on February 8 #DelhiElections2025 pic.twitter.com/QToVzxxADK— ANI (@ANI) January 7, 2025ఈ సందర్భంగా సీఈసీ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. దేశంలో ఓటర్ల సంఖ్య 99 కోట్లు దాటింది. గతేడాది ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాం. ఢిల్లీలో దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఉంటారు. ఓట్ల తొలగింపు ఆరోపణలను ఖండిస్తున్నాం. ఎన్నికలను పారదర్శంగా నిర్వహిస్తున్నాం. ఈవీఎంల పనితీరుపై పూర్తి విశ్వాసంగా ఉన్నాం. ఈవీఎంల వాడకంలో పారదర్శకత ఉంది. ఈవీఎంలు ట్యాపరింగ్ జరిగినట్టు ఆధారాలు లేవు. ఈవీఎంల విషయంలో అసత్యాలను నమ్మవద్దు. ఈ ఏడాది తొలి ఎన్నికల్లో ఢిల్లీలో జరగబోతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ(Delhi Assembly)లో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఢిల్లీ అసెంబ్లీ ఏడవది. దీని గడువు ఫిబ్రవరి 15వ తేదీతో ముగియనుంది. ఢిల్లీకి స్టేట్ స్టేటస్ వచ్చాక 1993లో జరిగిన తొలి ఎన్నికల్లో బీజేపీ నెగ్గింది. అయితే ఐదేళ్ల పాలనలో ముగ్గురు సీఎంలను మార్చింది. ఆపై జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నెగ్గింది. షీలా దీక్షిత్ సారథ్యంలో హస్తం పార్టీ హ్యాట్రిక్ పాలన సాగించింది. ఇక..2013 నుంచి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో కొనసాగుతోంది. దీంతో..ఈసారి ఎలాగైనా హస్తినను చేజిక్కించుకోవాలని బీజేపీ(BJP) భావిస్తోంది. మరోసారి అధికారం దక్కించుకోవాలని ఆప్ భావిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి అధికారంపై కన్నేసింది. హర్యానా ఎన్నికల తర్వాత ఇండియా కూటమి మిత్రపక్షాలైన ఆప్-కాంగ్రెస్లు మరోసారి ఢిల్లీ ఎన్నికల ముక్కోణ్ణపు పోటీలో తలపడనున్నాయి. -
ఏంటా రహస్యం?.. అసెంబ్లీలో మల్లు సోదరుల గుసగుసలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క.. ఆయన సోదరుడు, నాగర్కర్నూల్ లోక్సభ సభ్యుడు మల్లు రవి గుసగుసలాడుకున్నారు. అసెంబ్లీ లాబీల్లోని భట్టి చాంబర్కు మల్లురవి రాగా, ఆ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావుతో పాటు ఇతరులు భట్టి చాంబర్లోనే ఉన్నారు. దీంతో తన సోదరుడితో రహస్యంగా మాట్లాడి మల్లు రవి వెళ్లిపోయారు.అయితే, అసెంబ్లీలో ఈ అన్నదమ్ములు ఎందుకు గుసగుసలాడారా అన్న విషయంపై ‘సాక్షి’ ఆరా తీయగా, రహస్యమేమీ లేదని ఎంపీ మల్లురవి చెప్పారు. అసెంబ్లీ ఆమోదం పొందిన మన్మోహన్సింగ్ సంతాప తీర్మానం ఇప్పించాలని, దానిపై తెలంగాణ ఎంపీల సంతకాలు పెట్టించి రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రికి ఇస్తానని భట్టికి చెప్పానని ఆయన వెల్లడించారు.ఇదీ చదవండి: హుస్సేన్ సాగర్ చుట్టూ నో ఎంట్రీ... హద్దు మీరితే అంతే -
మన్మోహన్ చిరస్థాయిగా నిలిచిపోతారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉన్నంతకాలం మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ పేరు నిలిచిపోతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుకు పార్లమెంట్లో అవసరమైన బలం లేకున్నా ప్రతిపక్షాలను ఒప్పించి నాటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాం«దీ, ప్రధాని మన్మోహన్ తెలంగాణ బిల్లును ఆమోదింపజేశారని గుర్తు చేసుకున్నారు. సోమవారం శాసనసభ ప్రత్యేక సమావేశంలో మన్మోహన్కు నివాళి అర్పిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చలో భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు ఉత్తమ్, శ్రీధర్బాబు, దామోదర రాజనర్సింహా, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క తదితరులు మాట్లాడారు. రుణమాఫీకి స్ఫూర్తినిచ్చారు: భట్టి చర్చలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ‘‘ఎందరో పుట్టి మాయం అవుతారు. కొందరు మాత్రమే ఈ భూమిపై మానవీయ పరిమళాలు వెదజల్లుతారు. అందులో మన్మోహన్ ఒకరు. దేశంలో తొలిసారిగా రైతు రుణమాఫీ చేసిన ప్రధాని ఆయనే. నేడు రాష్ట్రంలో రూ.2 లక్షల రుణమాఫీ అమలుకు స్ఫూర్తి ప్రదాత ఆయనే. దేశ ఆర్థిక, సామాజిక స్థితులను అర్థం చేసుకొని సమాచార హక్కు, అటవీ హక్కు, భూసేకరణ, ఉపాధి హామీ వంటి చట్టాలను తీసుకువచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడగా... ఉపాధి హామీతో దేశ ప్రజలు ఆర్థిక మాంద్యం బారిన పడకుండా కాపాడగలిగారు..’’అని పేర్కొన్నారు. అణు ఒప్పందం చేసుకున్న ధీశాలి: ఉత్తమ్ దేశానికి రైతు వెన్నెముక అయితే.. దేశ రైతాంగానికి మాజీ ప్రధాని మన్మోహన్ వెన్నెముకగా నిలిచారనని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. యావత్ దేశ రైతాంగానికి ఏకకాలంలో ఋణమాఫీ చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని చెప్పారు. అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవడంతోపాటు ప్రతిపక్షాలు వ్యతిరేకించినా ఉభయసభల్లో బిల్లు పెట్టి ఆమోదింపజేసుకున్న ధీశాలి మన్మోహన్ అని కొనియాడారు. తన రాజకీయ గురువు పీవీ నరసింహారావు జన్మదిన వేడుకలను సంవత్సరం పొడవునా నిర్వహించాలని తమకు సూచించి గురుభక్తిని చాటుకున్నారని చెప్పారు. 114 ప్రెస్మీట్స్ పెట్టినా మౌన ప్రధానిగా విమర్శలు: శ్రీధర్బాబు మన్మోహన్ ప్రధానిగా మీడియా, విపక్షాల నుంచి నిరంతరం విమర్శలను ఎదుర్కొన్నారని మంత్రి శ్రీధర్బాబు గుర్తు చేసుకున్నారు. ఆయన 114 ప్రెస్మీట్లు పెట్టి మాట్లాడినా.. అన్యాయంగా మౌన ప్రధాని అని విమర్శించారని పేర్కొన్నారు. తెలుగు బిడ్డ పీవీ నాయకత్వంలో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ తీసుకొచ్చిన సరళీకృత ఆర్థిక విధానాలే నేడు దేశ ప్రగతికి దోహదపడుతున్నాయని చెప్పారు. మన్మోహన్కు గుర్తుగా పార్కు: కోమటిరెడ్డి విగ్రహం ఏర్పాటు మాత్రమే కాకుండా మన్మోహన్ సింగ్కు గుర్తుగా మంచి పార్కును రూపొందించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కోరారు. పార్లమెంటు ఎదుట ఎంపీలుగా తాము ధర్నాలో ఉండగా, తమ మధ్య కూర్చుకుని మద్దతు తెలపటాన్ని ఎన్నటికీ మరువలేమన్నారు. ఆయన వల్లే దేశ సుస్థిర ఆర్థిక పురోగతి: దామోదర రాజనర్సింహ దేశం స్థిరమైన ఆర్థిక పురోగతిని సాధించటంలో ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా మన్మోహన్ సింగ్ తీసుకున్న నిర్ణయాలే ప్రధాన కారణమని మంత్రి దామోదర రాజనర్సింహ కొనియాడారు. రాబోయే తరాలు కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన గొప్ప వ్యవహార శైలి మన్మోహన్సింగ్దని పేర్కొన్నారు. దేశమంతా మాట్లాడుకునేలా చేశారు: మంత్రి పొన్నం మన్మోహన్సింగ్ ఎక్కువగా మాట్లాడరని అంతా అంటారని, కానీ తాను చేసిన కార్యక్రమాలపై ప్రపంచమంతా మాట్లాడుకునేలా చేసిన గొప్ప వ్యక్తి ఆయన అని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ప్రపంచంలో మరే రాజకీయ నేత సాహసించని రీతిలో ఆయన సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. ఆయన మాట్లాడితే ప్రపంచమంతా వింటుంది: సీతక్క విద్యకు ఒకేసారి రూ.70 వేల కోట్లను బడ్జెట్లో ప్రతిపాదించటమే కాకుండా దేశవ్యాప్తంగా 30 వేల పాఠశాలలను ఏర్పాటు చేశారని మన్మోహన్ను మంత్రి సీతక్క కొనియాడారు. మన్మోహన్ మాట్లాడితే ప్రపంచమంతా వింటుందని అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా గొప్పగా చెప్పారని గుర్తు చేశారు. -
మన్మోహన్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలి: హరీశ్ రావు
-
తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభం
-
రేపు అసెంబ్లీ ప్రత్యేక భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ సోమవారం ప్రత్యేకంగా సమావేశం కానుంది. దేశాన్ని ఆర్థిక చిక్కుల నుంచి బయటపడేసి, అభివృద్ధి పథంలో పయనించేలా మార్గనిర్దేశం చేసిన మాజీ ప్రధాని మన్మోహన్సింగ్కు నివాళులు అర్పించనుంది. దేశానికి మార్గం చూపిన ఆయనకు భారత రత్న ఇవ్వాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇటీవల జరిగిన శాసనసభ శీతాకాల సమావేశాల అనంతరం ఈ నెల 21న సభ నిరవధికంగా వాయిదాపడిన సంగతి తెలిసిందే.అయితే సభను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇంకా ప్రోరోగ్ చేయకపోవడంతో.. ఈ నెల 30న సోమవారం ప్రత్యేక భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. దీనిపై స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ ఆదేశాల మేరకు సోమవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభించనున్నట్టు శాసనసభ వ్యవహారాల కార్యదర్శి డాక్టర్ నరసింహాచార్యులు శనివారం లేఖ విడుదల చేశారు. ఈ ప్రత్యేక సమావేశం ఒక్కరోజుకే పరిమితం చేయనున్నారు. మన్మోహన్ను కొనియాడుతూ తీర్మానం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈనెల 3వ తేదీ వరకు ఏడు రోజుల పాటు సంతాప దినాలుగా పాటిస్తున్నాయి. ఈ క్రమంలో మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటాన్ని గుర్తు చేసుకుంటూ, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో ఆయన కృషిని కొనియాడుతూ తీర్మానం చేయడం ద్వారా నివాళి అర్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఆధునిక భారత దేశ ఆర్థిక సంస్కర్తగా పేరుగాంచిన మన్మోహన్కు ‘భారతరత్న’ఇవ్వాలని కోరుతూ తీర్మానం చేసే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.ప్రత్యేక భేటీకి ప్రతిపక్ష నేత కేసీఆర్మాజీ ప్రధాని మన్మోహన్కు నివాళి అర్పించేందుకు సోమవారం నిర్వహిస్తున్న అసెంబ్లీ ప్రత్యేక భేటీకి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలిసింది. మన్మోహన్ నేతృత్వంలోని కేబినెట్లో కొంతకాలం కేంద్ర మంత్రిగా పనిచేసిన కేసీఆర్.. పలు సందర్భాల్లో ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక తెలంగాణ ఏర్పాటులో మన్మోహన్ సహకారాన్ని రికార్డుల్లో చేర్చాలని కోరుతూ అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు కూడా. ఈ నేపథ్యంలో మన్మోహన్ కృషిని కొనియాడుతూ, నివాళి అర్పించే అసెంబ్లీ ప్రత్యేక భేటీకి ప్రతిపక్ష నేతగా కేసీఆర్ హాజరవుతారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. -
రైతు సాయానికి కోతలు పెట్టే కుట్ర
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులకు అందాల్సిన పెట్టుబడి సాయంలో కోతలు పెట్టేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కె.తారక రామారావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రైతు బంధుపై దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఎలాంటి ఆంక్షలు, కత్తిరింపులు లేకుండా రైతు భరోసా అమలు చేయాలని డిమాండ్ చేశారు. శాసనసభలో శనివారం రైతు భరోసా అంశంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చర్చను ప్రారంభిస్తూ.. ఈ పథకంపై సభ్యులు సూచనలు చేయాలని, దీని ఆధారంగా విధివిధానాలు రూపొందిస్తామని తెలిపారు.కేటీఆర్ ఈ చర్చలో మాట్లాడారు. ‘‘రైతు భరోసాకు రూ.23 వేల కోట్లు అవసరమైతే రూ.15 వేల కోట్లు మాత్రమే బడ్జెట్లో కేటాయించడం కోత విధించడానికే. రైతు భరోసాపై మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదికను ప్రజల ముందుంచాలి. ఎన్నికల హామీ ప్రకారం రాష్ట్రంలో ఉన్న 22 లక్షల మంది కౌలుదార్లకు కూడా రైతు భరోసా ఇస్తారా?’’అని ప్రశ్నించారు. ప్రభుత్వం యాసంగి, వానాకాలం కలిపి ఒక్కో రైతుకు రూ.17,500 చొప్పున... రైతులందరికీ కలిపి రూ.26,775 కోట్లు బాకీ పడిందని చెప్పారు. గెలిచిన వెంటనే ఎకరానికి రూ.15 వేలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఆంక్షలు లేకుండా పెట్టుబడి సాయం ఇవ్వాలిరైతులు పచ్చగా ఉంటే కొంతమంది కళ్లు మండుతున్నాయని కేటీఆర్ విమర్శించారు. రైతు బంధు తీసుకుంటున్న వారిలో 98 శాతం సన్న, చిన్నకారు రైతులే ఉన్నారని తెలిపారు. 91.33 శాతం లబ్ధిదారులు ఐదెకరాల కంటే తక్కువ ఉన్నవారేనని.. 5 నుంచి 10 ఎకరాలు 7.28 శాతం మందికే ఉన్నాయని, 10 ఎకరాలు పైబడి ఉన్నవాళ్లు 1.39 శాతమేనని పేర్కొన్నారు. 25 ఎకరాలపైన ఉన్న పెద్ద రైతులు కేవలం 0.09 శాతం మాత్రమేనని చెప్పారు.రైతుబంధు నిధుల్లో 70 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతుల ఖాతాల్లోనే పడ్డాయని వివరించారు. గిరిజనులకు చెందిన 4.5 లక్షల ఆర్వోఎఫ్ఆర్ భూములకు, పత్తి, కంది ఉద్యానవనాలకు రైతు భరోసా ఇస్తారా? లేదా? చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరిగే వరకు కూడా ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతు బంధు ఇవ్వాలన్నదే తమ ఉద్దేశమని తెలిపారు.రుణమాఫీ నిరూపిస్తే రాజీనామా.. ‘‘రాష్ట్రంలో ఏ గ్రామంలోనైనా వంద శాతం రుణమాఫీ జరిగినట్టు కాంగ్రెస్ సర్కారు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా. రుణమాఫీకి రూ.49,500 కోట్లు అవసరమని లెక్క తేల్చారు. రూ.40 వేల కోట్లు అవుతుందని సీఎం అన్నారు. కేబినెట్లో రూ.31 వేల కోట్లు అన్నారు. తీరా బడ్జెట్లో రూ.26 వేల కోట్లు కేటాయించారు. ఆఖరుకు రూ.17,934 కోట్లే మాఫీ చేశారు..’’అని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎక్కడన్నా 24 గంటల ఉచిత విద్యుత్ అందించినట్టు లాక్బుక్కుల్లో చూపిస్తే తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.నల్లగొండకు నీళ్లు ఇచ్చిన అంశంపై ఆ జిల్లాలోనే తేల్చేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులు చేపట్టి వలసలు ఆపామని చెప్పారు. తెలంగాణలో ఎవరైనా చనిపోతే స్నానానికి కూడా నీళ్లు లేని పరిస్థితి ఉందని గతంలో కాంగ్రెస్ పారీ్టపై సీఎం రేవంత్ చేసిన విమర్శలను కేటీఆర్ గుర్తు చేశారు. రైతుబంధు వల్ల రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తి పెరిగిందని కేటీఆర్ తెలిపారు.రుణమాఫీపై చర్చిద్దాం.. రెడీనా?సీఎం రేవంత్రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ ఇచ్చిన మాట మేరకు పెట్టుబడి సాయం పెంచి ఇవ్వాల్సిందేసాక్షి, హైదరాబాద్: మొత్తం రుణమాఫీ చేశామని సీఎం రేవంత్రెడ్డి చెబుతున్నారని... దీనిపై ఆయన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో అయినా, సొంత నియోజకవర్గం కొడంగల్లోనైనా రైతుల ముందు చర్చిద్దామా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కె.తారక రామారావు సవాల్ చేశారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.వివరాలు ఆయన మాటల్లోనే... ‘‘రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్రెడ్డి బండారం బయటపడటంతో అసెంబ్లీలో ఆగమయ్యారు. ఆరు గ్యారంటీలు, రుణమాఫీ అమలు చే యడం చేతకాదని చెప్పకనే చెప్పారు. రూ.49,500 కోట్ల రుణమాఫీ రూ.26 వేల కోట్లతో ఎలా అయిందో రేవంత్ చెప్పలేకపోయారు. కేవలం 25శాతం రుణమాఫీ చేసి 100శాతం అయిందని చెబుతున్నారు. రైతుబంధులో రూ.22 వేల కోట్లు ఎవరికి ఇచ్చారో అడిగితే ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదు. కంది, పత్తి, మొక్కజొన్నల రెండో పంటకు రైతుబంధు ఇవ్వకుండా కుట్ర చేస్తున్నారు. బీఆర్ఎస్ పదేళ్లలో రూ.28 వేల కోట్ల రుణమాఫీ చేస్తే.. కాంగ్రెస్ రూ.12 వేల కోట్లు మాత్రమే చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీయండి రైతుబంధుకు పాన్కార్డు ఆప్షన్ పెడితే 1.30 కోట్ల మంది నష్టపోతారు. ఐటీ ఉన్న వారందరికీ రైతుబంధు కట్ చేస్తే ఇక మిగిలేదెవరు? మాజీ సీఎం కేసీఆర్ చెప్పినట్టుగా కాంగ్రెస్ వస్తే రైతుబంధు బంద్ అయింది. రుణమాఫీ, రైతుబంధు ఏమైందని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రజలంతా నిలదీయాలి. ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలయ్యేదాకా కాంగ్రెస్ పార్టీని వదిలేది లేదు. రేవంత్రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని నీడలా వెంటాడుతూనే ఉంటాం. రైతు ఆత్మహత్యలపై అన్నీ అబద్ధాలే.. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెప్పే దుస్థితికి దిగజారింది. కేంద్ర నేర గణాంక సంస్థ (ఎన్సీఆర్బీ) లెక్కల ప్రకారం... 2014లో 1,348 రైతు ఆత్మహత్యలు జరిగితే... రైతు బంధు పథకం ప్రారంభమైన తర్వాత 2022 నాటికి కేవలం 178 మందికే తగ్గింది. పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం ఇవ్వడంతోనే ఆత్మహత్యలు తగ్గాయి. రాష్ట్రం ఏర్పడక ముందు దేశంలోనే తెలంగాణ ప్రాంతం రైతు ఆత్మహత్యల్లో తొలి రెండు స్థానాల్లో ఉండేది. ఓటుకు నోటు దొంగ రేవంత్రెడ్డి చెప్పే ప్రతీ మాటా నమ్మాల్సిన అవసరం లేదు. రైతు భరోసా ఇచ్చేదెప్పుడో! సంక్రాంతి తర్వాత రైతుభరోసా ఇస్తామంటున్న ప్రభుత్వం ఏ సంక్రాంతికో చెప్పడం లేదు. రైతు భరోసాపై కాలయాపన కోసమే కమిటీ వేశారు. ప్రజలు కోరుకున్నది పేర్ల మార్పిడి కాదు, గుణాత్మకమైన మార్పు. మేం సీఎం రేవంత్రెడ్డి కేసులకు, ఈడీ, మోదీలకు భయపడబోం’’అని కేటీఆర్ పేర్కొన్నారు. -
నేను తొక్కుకుంటూ వచ్చా..
సాక్షి, హైదరాబాద్: ‘‘నేను నల్లమల నుంచి వచ్చా. క్రూరమృగాల మధ్య పెరుగుకుంటూ వచ్చా. తొక్కుకుంటూ వచ్చా. ఇక్కడున్నోళ్లను తొక్కితే అక్కడ తేలిన్రు. నేను అయ్య పేరుమీదనో, మామ పేరుమీదనో వచి్చనోడిని కాదు. స్వశక్తిని నమ్ముకొని పైకొచ్చినవాడ్ని. అమెరికాలోనో, గుంటూరులోనో చదువుకున్న చావు తెలివితేటలు వాళ్లకుంటే ఉండొచ్చు. నాకు సామాన్యుడి తెలివితేటలు ఉన్నాయి. నా వ్యక్తిగత కోపతాపాలు చూపవద్దని ఇంతకాలం ఓపికతో ఉన్నా.ఈ ఆర్థిక విధ్వంసకారులను నియంత్రించే శక్తి, క్రూరమృగాలను కూడా బోనులో బంధించే శక్తి నా సభకు, సభ్యులకు ఉంది’’అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. శనివారం శాసనసభలో రైతు భరోసాపై జరిగిన స్వల్పకాలిక చర్చలో సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. అందులో ముఖ్యాంశాలు రేవంత్ మాటల్లోనే... ‘‘తెలంగాణపై కమిట్మెంట్ ఉన్నోళ్లు కూడా కొందరు అటువైపు ఉన్నారు. వారికి చెప్తున్నా.. దొంగలకు సద్దులు మోసేవాళ్ల సావాసం మంచిది కాదు. వాళ్లు ఇదే నగరంలో పుట్టినవారు. హైదరాబాద్ కూడా Éఢిల్లీలా కాలుష్యం కోరల్లో చిక్కుకోవాలా? నల్లగొండకు ఫ్లోరైడ్ నుంచి మోక్షం వద్దా? బావాబామ్మర్దులిద్దరూ రండి. నల్లగొండకో, రంగారెడ్డికో, భువనగిరికో, మునుగోడుకో, ఎల్బీనగర్కో, సూర్యాపేటకో పోదాం. మూసీ పునరుజ్జీవం చేయాలా? వద్దా? ప్రజలను అడుగుదాం. నేను, రాజగోపాల్రెడ్డి గన్మన్ లేకుండా వస్తాం. మీరూ రండి. జనం మధ్యనే తేల్చుకుందాం. వాళ్లలా ఇస్తే ప్రతిపక్షాల సీట్లలోనే ఉంటాం.. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో రైతు భరోసాకు శ్రీకారం చుట్టింది. దీనిపై ఎవరికీ అనుమానాలు అవసరం లేదు. గత ప్రభుత్వం గొప్పగా చెప్పుకొనే రైతుబంధు కేవలం పెట్టుబడి సహాయ పథకం మాత్రమే. ఆ రూపంలో రూ.72,816 కోట్లు ఇస్తే.. అందులో రూ.22,606 కోట్లు సాగులోనే లేని రాళ్లురప్పలకు, గుట్టలకు, రోడ్లు, రియల్ ఎస్టేట్ భూములు, పరిశ్రమల స్థలాలకు ఆయాచితంగా చెల్లించారు. గిరిజనులకు అందించిన పోడు భూములకు బీఆర్ఎస్ నేతలు నకిలీ పట్టాలు రూపొందించి రైతుబంధు పొందారు. ఇప్పుడు మేం కూడా అలా చెల్లించాలంటూ బీఆర్ఎస్ నేతలు నీతులు చెప్తున్నారు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే మేం ఇక్కడ ఎందుకు కూర్చుంటాం, ప్రతిపక్షాల సీట్లలోనే ఉంటాం కదా. ఇక వారి నేత ఆయన చేసిన అద్భుతాలపై ప్రశి్నస్తారన్న భయంతో సభకే రావడం లేదు. నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పే సంఘానికి అధ్యక్షుడు ఆయన. ఉపాధ్యక్షుడు.. అదే వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చి రైతు ఆత్మహత్యలపై అబద్ధాలు చెప్పారు. ఇక వారు చేసిన రుణమాఫీ వడ్డీలకే మాత్రమే సరిపోయింది. అదికూడా ఔటర్ రింగురోడ్డును తెగనమ్మి రూ.7,500 కోట్లు తెచ్చి రుణమాఫీకి వాడేశారు. మేం కేవలం 27 రోజుల్లో రూ.17,869.21 కోట్లు రుణమాఫీ చేశాం. సాంకేతిక కారణాలతో మాఫీ కాని వారికోసం నవంబర్లో రూ.2,747 కోట్లు విడుదల చేశాం. మొత్తం 25,35,963 మందికి రూ.20,616 కోట్లు మాఫీ చేసి వారి రుణం తీర్చుకున్నాం. స్విస్ బ్యాంకు కూడా అప్పులిస్తారు.. రైతుల రుణాలను ఒకేసారి మాఫీ చేయలేం. రూ.8 వేల కోట్లు కావాలి. మా దగ్గర నల్లధనం లేదు అని నాటి సీఎం అన్నారు. నల్లధనం ప్రభుత్వం వద్ద లేదేమోగానీ వారి వద్ద ఎందుకుండదు? అంతా అక్కడికే కదా చేరింది. స్విస్ బ్యాంకుకు కూడా అప్పు ఇచ్చే సామర్థ్యం వాళ్లది.ఆయన కోసం ఏడాది నుంచి ఎదురుచూస్తున్నా..గత ప్రభుత్వం చేసిన అప్పులు రూ.7,11,807 కోట్లు. మేం అధికారంలోకి వచ్చాక రూ. 1,27,208 కోట్లు అప్పు చేశామంటున్నారు. రెండూ కలిపితే దాదాపు 8.39 లక్షల కోట్లు కావాలి. రెండు రోజుల క్రితం తీసుకున్న లెక్కల ప్రకారం రాష్ట్ర అప్పులు మొత్తం రూ.7,22,788 కోట్లే. 58 ఏళ్లలో 16 మంది సీఎంలు చేసిన అప్పు రూ.72 వేల కోట్లే. గత ప్రభుత్వం చేసిన అప్పులు, బకాయిల భారం లేకపోతే.. మేం అద్భుతాలు సృష్టించి ఉండేవాళ్లం. గత పదేళ్లలో కనీసం హాస్టళ్లకు భవనాలు కూడా కట్టలేకపోయారు. దీనిపై ముక్కు నేలకు రాసి దళిత, గిరిజన, మైనారిటీ పిల్లలకు క్షమాపణ చెప్పాలి. ముఖం చాటేస్తున్న ఆయన సభకు వస్తే అడిగి, కడుగుదామని సంవత్సరం నుంచి ఎదురుచూస్తున్నా.అన్నీ అడ్డుకుంటే అభివృద్ధి ఎలా? నా ప్రాంతం కాకున్నా కొడంగల్లో ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. అక్కడే మళ్లీ గెలిచి సీఎం అయ్యా. ఆ వెనకబడ్డ ప్రాంత ప్రజల రుణం తీర్చుకోవాలనుకున్నా, పరిశ్రమలు తేవాలని నిర్ణయించా. ఓ 50 వేల మందికి ఉద్యోగాలు రావటంతోపాటు ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనుకున్నా. దీన్ని సహించలేని కొందరు డబ్బు, మద్యం పంచి అధికారులపై దాడులు చేయించారు. మూసీ వద్దంటారు, మెట్రో పొడిగిస్తామంటే వద్దంటారు, ఫ్యూచర్ సిటీ అంటే వద్దంటారు, పరిశ్రమలు వద్దంటారు.. తెలంగాణను అభివృద్ధి పథం వైపు నడిపించడం ఎలా సాధ్యం. తెలంగాణ పురోగతిని అడ్డుకునే వాళ్లను ఏం చేయాలో ప్రజలే చెప్పాలి..’’అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. -
సినిమా వాళ్లు స్పెషలా?: సీఎం రేవంత్
సినీ పరిశ్రమకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటి విషయాల్లో అమానవీయంగా వ్యవహరించొద్దు. మీరు సినిమా తీయండి. వ్యాపారం చేసుకోండి. డబ్బులు సంపాదించండి. ప్రత్యేక ప్రోత్సాహకాలు, సబ్సిడీలు అన్నీ తీసుకోండి. షూటింగ్స్ కోసం ఏమేం కావాలో అదీ తీసుకోండి. అయితే ఎవరిదైనా హత్య జరిగాక, ఎవరిదైనా ప్రాణం పోయాక మాత్రం స్పెషల్ ప్రివిలేజెస్ కోరితే.. అవి ఎట్టిపరిస్థితుల్లోనూ దొరకవు. నేను సీఎం సీట్లో ఉన్నంత వరకూ అది జరగదు. – సీఎం రేవంత్సాక్షి, హైదరాబాద్: సినిమా వాళ్లకు మానవత్వం లేకపోవడాన్ని ఏమనాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రశ్నించారు. సినీ పరిశ్రమ తీరు అమానవీయమని.. ఎవరి ప్రాణాలైనా పోయిన తర్వాత ప్రత్యేక హక్కు కావాలంటే దొరకదని పేర్కొన్నారు. కేవలం ఒక్కరోజు పోలీస్స్టేషన్కు వెళ్లిన హీరోను పరామర్శించిన సినీ పరిశ్రమ పెద్దలు... బాధిత కుటుంబీకులను కనీసం పరామర్శించలేదని మండిపడ్డారు. సాధారణ ప్రజల ప్రాణాలు కాపాడటం తమకు ప్రధానమని.. ప్రాణాలు పోయేందుకు ఎవరు కారణమైనా విడిచిపెట్టబోమని హెచ్చరించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమైన వారిని విచారించి శిక్షించే వరకు విడిచిపెట్టబోమని ప్రకటించారు. శనివారం అసెంబ్లీలో రైతుభరోసాపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. ‘‘సంధ్య థియేటర్ తొక్కిసలాట విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అతిగా స్పందించిందన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఒక మహిళ చనిపోగా, ఒక బాలుడు కోమాలో, మరొకరు తొక్కిసలాటలో ఇరుక్కుపోతే.. ఆ హీరో కనీసం పట్టించుకోకుండా అభిమానులకు చేతులు ఊపుతూ వెళ్లడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?’’అని పేర్కొన్నారు. దీంతో సీఎం రేవంత్రెడ్డి జోక్యం చేసుకుంటూ సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘ఈ అంశం సభలో చర్చకు వస్తుందని అనుకోలేదు. డిసెంబర్ 4న పుష్ప–2 విడుదల సందర్భంగా హీరో, హీరోయిన్ వస్తారని బందోబస్తు కల్పించాలని డిసెంబర్ 2న సంధ్య టాకీస్ వాళ్లు చిక్కడపల్లి పోలీస్స్టేషన్లో దరఖాస్తు చేశారు. ఆ ప్రాంతంలో రద్దీతోపాటు సంధ్య థియేటర్లోకి వెళ్లడానికి, బయటికి రావడానికి ఒకే గేటు ఉన్న కారణంగా సెక్యూరిటీ కల్పించలేమని అనుమతి నిరాకరిస్తూ 3న అక్కడి సీఐ సమాధానమిచ్చారు. అయినా 4న రాత్రి 9 గంటల ప్రాంతంలో అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్రోడ్డు మీదుగా తన కారు రూఫ్టాప్ ఓపెన్ చేసి రోడ్షో నిర్వహిస్తూ థియేటర్కు వచ్చారు. తీవ్ర ట్రాఫిక్ రద్దీ ఉన్న ఆ ప్రాంతంలో వేలమంది ఒకచోట చేరడంతో పరిస్థితి అదుపు తప్పింది. అల్లు అర్జున్ 50, 60 మంది ప్రైవేట్ సెక్యూరిటీ అడ్డుగా ఉన్న వారిని తోసేయడం తొక్కిసలాటకు దారితీసింది. రేవతి అనే మహిళ, శ్రీతేజ్ అనే బాలుడు స్పృహ తప్పినట్టుగా పోలీసులు గుర్తించారు. అప్పటికే రేవతి మరణించగా, శ్రీతేజ్ బ్రెయిన్డెడ్గా వైద్యులు ప్రకటించారు. పోలీసులు చెప్పినా పట్టించుకోలేదు ఏసీపీ ఆ రోజు రాత్రి 11 గంటల సమయంలో సంధ్య థియేటర్కు వెళ్లి పరిస్థితి బాగో లేదని.. హీరోను అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరినా పూర్తి సినిమా చూస్తానంటూ ఆయన పట్టించుకోలేదు. తర్వాత డీసీపీ వెళ్లారు. వెంటనే వెళ్లిపోకపోతే అరెస్ట్ చేయాల్సి ఉంటుందని హెచ్చరించడంతో బయటికి వచ్చారు. ఇంత ప్రమాదం జరిగి, ఒకరు చనిపోయాక కూడా హీరో కారు రూఫ్టాప్ ఓపెన్ చేసి అభిమానులకు చెయ్యి ఊపుతూ వెళ్లారంటే... ఆయన ఎలాంటి మనిషి అనుకోవాలి? నేను సీఎం కుర్చీలో కూర్చుని మౌనంగా ఉండలేను. ఇంటికెళ్లిన పోలీసులతో దురుసుగా.. తొక్కిసలాట ఘటనపై పోలీసులు కేసు పెట్టారు. కొందరిని అరెస్ట్ చేశారు. కొన్నిరోజుల తర్వాత హీరో నివాసానికి కూడా వెళ్లి తమ వెంట రావాల్సిందిగా కోరారు. కానీ పోలీసులపై వారు దురుసుగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి. ఆ హీరోను పోలీసుస్టేషన్కు తీసుకెళ్లగానే... నా రాజకీయ మిత్రుల కోసం కేసు పెట్టానంటూ సోషల్ మీడియాలో కొన్ని రాజకీయపార్టీల వారు నన్ను పైశాచికంగా, నీచంగా తిడుతూ పోస్టులు పెట్టారు. బాధితులను కనీసం పరామర్శించలేదు శ్రీతేజ్ తండ్రి నెలకు రూ.30 వేలు సంపాదించే మామూలు ఉద్యోగి. కొడుకు ఆ హీరో అభిమాని కావడంతో.. స్పెషల్ షో కోసం ఒక్కో టికెట్కు రూ.మూడేసి వేల చొప్పున రూ.12 వేలు పెట్టి కొన్నారు. తల్లి రేవతి చనిపోయి, అబ్బాయి తీవ్ర అస్వస్థతకు గురై 11 రోజులు గడిచినా ఆ కుటుంబ సభ్యులను హీరో, ప్రొడ్యూసర్, మరెవరూ పరామర్శించలేదు. ఇది ఏరకమైన మానవత్వం? ఇలా వ్యవహరించే వారిని ఏమనాలి? విధి నిర్వహణలో భాగంగా హీరోను పోలీస్స్టేషన్కు తీసుకెళితే.. పదేళ్లు మంత్రిగా ఉన్న ఓ వ్యక్తి, ఉద్యమాల టైంలో షూటింగ్లు జరపొద్దంటూ దాడులు చేసిన వ్యక్తి విమర్శలు చేస్తారు. ఈ హీరో భగవత్ స్వరూపుడు, ఆయనను పోలీసులు ముట్టుకుంటారా? అసలేం జరుగుతోంది? అంటారు. అంటే మీ స్నేహితులైతే అరెస్ట్ చేయొద్దా? వారేం చేసినా మాఫీనా? ప్రత్యేక రాయితీలిచ్చింది మా సర్కారే కదా! సినీ పరిశ్రమను ప్రోత్సాహించాలని ఆ సినిమాకు టికెట్ రేట్ల పెంపు, స్పెషల్ షోలకు అనుమతినిచ్చింది మా ప్రభుత్వమే. అయితే ఇలా ప్రోత్సహించే క్రమంలో ప్రాణాలు తీసే ఘటనలు జరిగినా ఏమీ చేయకూడదంటే ఎలా? అంటే ఫిల్మ్స్టార్, సూపర్స్టార్, రాజకీయ ప్రముఖులు ఎవరినైనా హత్యచేసినా... వారిని ప్రాసిక్యూట్ చేయొద్దని ఏదైనా ప్రత్యేక చట్టం ఉంటే చెప్పండి పాటిస్తాం. సినీ ప్రముఖులను సూటిగా అడుగుతున్నా.. తల్లి చనిపోయింది, పిల్లవాడు బ్రెయిన్డెడ్ అయ్యి కోమాలో ఉంటే ఒక్కరైనా వెళ్లారా? సినీ ప్రముఖులను సూటిగా అడుగుతున్నా.. ఆ సినీ హీరోకు ఏమైంది కాలు పోయిందా? చెయ్యి పోయిందా? కన్ను పోయిందా? కిడ్నీలు దెబ్బతిన్నాయా? ఏమైంది.. వెళ్లి పరామర్శించడానికి.. అదే చావుబతుకుల్లో ఉన్న పిల్లవాడిని ఒక్కరూ పరామర్శించలేదు. ఇది సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. హీరో అయితే అర్ధరాత్రి జైలు నుంచి వదిలిపెట్టాలా? హీరోకు హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ఆయనను అర్ధరాత్రి 11, 12 గంటలకు విడుదల చేయాలని చాలా మంది గట్టిగా కోరారు. అర్ధరాత్రి జైలు నుంచి వదిలేందుకు చట్టంలో ఏదైనా వెసులుబాటు ఉందా? సినీహీరో కాబట్టి అర్ధరాత్రి వదిలిపెట్టాలంటే ఎలా? కొన్ని రాజకీయ పార్టీల నేతలు, పదేళ్లు మంత్రిగా ఉన్న వారు ఆ హీరోపై కేసు పెట్టడాన్ని తప్పుబడుతున్నారు. హీరో కాబట్టి ఏం చేసినా చెల్లుతుందా? మేం అంబేడ్కర్ రాసిన రాజ్యాంగానికి అనుగుణంగా చట్టం, న్యాయం ప్రకారం నడిపిస్తాం’’ అని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. -
అట్టుడికిన అసెంబ్లీ
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ‘ఫార్ములా–ఈ’రేసుపై ఏసీబీ కేసు మీద చర్చకు బీఆర్ఎస్ పట్టుబట్టడం, స్పీకర్ అంగీకరించకపోవడంతో నిరసనకు దిగడం, స్పీకర్ పోడియంను ముట్టడించే క్రమంలో వారికి మార్షల్స్కు మధ్య తోపులాట జరగడం, కాంగ్రెస్ సభ్యులు కూడా ఢీ అంటే ఢీ అన్నట్టు సిద్ధమవటంతో కొద్దిసేపు తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సభ వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమయ్యాక కూడా బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన కొనసాగించారు.తొలుత ఏసీబీ కేసుపై చర్చించాల్సిందే: హరీశ్రావు శుక్రవారం ఉదయం సభ ప్రారంభం కాగానే భూ భారతి బిల్లు పై చర్చను ప్రారంభించేందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ సిద్ధమయ్యారు. అయితే బీఆర్ఎస్ సభ్యుడు హరీశ్రావు జోక్యం చేసుకుని ముందుగా ఫార్ములా–ఈ రేస్ విషయంలో ఏసీబీ కేసుపై చర్చించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ వెంటనే చర్చించలేని పక్షంలో ఎప్పుడు చర్చకు అనుమతిస్తారో ప్రకటించాలని కోరారు. ముందైతే భూ భారతి బిల్లుపై చర్చను కొనసాగిద్దామని, ఆ తర్వాత ఈ ఫార్ములా రేస్ అంశంపై చూద్దామని స్పీకర్ పేర్కొనగా.. హరీశ్రావు అభ్యంతరం చెప్పారు. ఆ సభ్యుడికి అవకాశం ఇవ్వాలి కదా.. ‘కేటీఆర్పై పెట్టింది అక్రమ కేసు కాకుంటే, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ సభలో ఈ–కార్ రేసింగ్ అంశంపై చర్చించాలని కోరుతున్నా. అసెంబ్లీ జరుగుతున్న సమయంలో ఓ సభ్యుడిపై అక్రమ కేసు పెట్టినప్పుడు ఆ సభ్యుడికి చెప్పుకునే అవకాశం ఇవ్వాలి కదా.. ఆయనకు చెప్పుకునే అవకాశం ఇస్తే ఆ కేసులో ఆయనది తప్పా, ఒప్పా అన్న విషయంలో ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు కూడా ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ముమ్మాటికీ అక్రమ కేసు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీల గురించి, లగచర్ల అంశం గురించి ప్రశి్నస్తున్నాడు గనుకనే కేటీఆర్ను వేధించే క్రమంలో ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసు పెట్టారు..’అని హరీశ్రావు పేర్కొన్నారు. భూ భారతి రాష్ట్రానికి సంబంధించిన అంశం: స్పీకర్ స్పీకర్ స్పందిస్తూ..‘శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి సభలో లేరు. ఆయన వచ్చిన తర్వాత మీ వినతిపై నిర్ణయం తీసుకుంటాం. ముందైతే భూ భారతి మీద చర్చను కొనసాగిద్దాం..’అని అన్నారు. అయినా హరీశ్రావు, ఇతర బీఆర్ఎస్ సభ్యులు ముందు వరసలోకి వచ్చి ఫార్ములా–ఈ రేసుపై చర్చకు పట్టుబట్టారు. దీంతో ‘భూ భారతి రాష్ట్రానికి సంబంధించిన అంశం. మీరు అడుగుతోంది ఓ సభ్యుడికి సంబంధించింది.ముందు భూ భారతిపై చర్చ జరుపుదాం..’అని స్పీకర్ మరోసారి కోరారు. కానీ బీఆర్ఎస్ సభ్యులు పట్టువీడలేదు. కాంగ్రెస్ సభ్యుడు రేవూరి ప్రకాశ్రెడ్డి లేచి, ఈ–కార్ రేసింగ్పై విచారణకు గవర్నర్ అనుమతిచ్చాక, ఏసీబీ కేసు పెట్టిన తర్వాత శాసనసభలో దానిపై చర్చించే అంశమే ఉత్పన్నం కాదని, ప్రజల్లో ఓ అయోమయాన్ని సృష్టించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని విమర్శించారు. అనంతరం భూ భారతి బిల్లుపై స్పీకర్ చర్చ ప్రారంభించారు. స్పీకర్పైకి ప్లకార్డు ముక్కలు, కాగితాలు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చర్చను ప్రారంభిస్తూ.. భూ భారతి చట్టం తేవాలనుకోవటానికి గల కారణాలను వివరించటం ప్రారంభించారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు వెల్లోకి వచ్చి, ఈ–కార్ రేస్పై పెట్టిన కేసు కక్షపూరితమైందని పేర్కొనే ప్లకార్డులు పట్టుకుని నినాదాలివ్వటం ప్రా రంభించారు. తర్వాత స్పీకర్ పోడియం దగ్గర గుమిగూడారు. మార్షల్స్ను తోసుకుంటూ పోడియంను ముట్టడించారు.ఈ క్రమంలో మార్షల్స్కు, బీఆర్ఎస్ సభ్యులకు మధ్య తోపులాట జరిగింది. ఇంతలో మరికొందరు మార్షల్స్ అక్కడికి చేరుకుని బీఆర్ఎస్ సభ్యులను పోడియంకు దూరంగా నెట్టుకుంటూ తీసుకెళ్లారు. ఆ సమయంలో బీఆర్ఎస్ సభ్యుడు కౌశిక్రెడ్డి తన చేతిలోనే ప్లకార్డును ముక్కలు చేసి స్పీకర్పైకి విసిరారు. మరికొందరు సభ్యులు, అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించిన కాగితాలను పోడియం పైకి విసిరారు. బీఆర్ఎస్ సభ్యుడొకరు మంత్రి పొంగులేటి వైపు దూసుకు రావడంతో కొందరు కాంగ్రెస్ సభ్యులు ఆయనకు రక్షణగా నిలబడ్డారు. బీఆర్ఎస్ సభ్యులపైకి కాగితాలు ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ సభ్యులు కొందరు ముందు వరసలోకి వచ్చి కాగితాలను బీఆర్ఎస్ సభ్యులపైకి విసిరారు. పరిస్థితి చేయిదాటేలా ఉండటంతో స్పీకర్ సభను 15 నిమిషాలపాటు వాయిదా వేశారు. స్పీకర్ చాంబర్లో దీనిపై కాంగ్రెస్ సభ్యులు ఆయనతో చర్చించారు. 35 నిమిషాల తర్వాత సభ తిరిగి ప్రారంభం కాగా.. మంత్రి పొంగులేటి ప్రసంగాన్ని కొనసాగించారు. అయితే ఆయన మాట్లాడుతున్నంత సేపు బీఆర్ఎస్ సభ్యులు వెల్లో నినాదాలిస్తూ నిరసన తెలుపుతూనే ఉన్నారు.చర్చకు సహకరించాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్బాబు కోరినా బీఆర్ఎస్ సభ్యులు పట్టువీడలేదు. చర్చలో భాగంగా బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చిన స్పీకర్, ఆ పార్టీ సభ్యుడు పల్లా రాజేశ్వరరెడ్డిని మాట్లాడాల్సిందిగా సూచించినా.. ఆయన నిరసనలోనే ఉండి మాట్లాడ్డానికి రాలేదు. దీంతో బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డికి స్పీకర్ అవకాశం ఇచ్చారు. అయినా బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన కొనసాగించారు. దీంతో చాంబర్కు వస్తే మాట్లాడదామని వారికి చెప్పిన స్పీకర్ సభను వాయిదా వేశారు. మధ్యాహ్నం తర్వాతా కొనసాగిన ఆందోళన మధ్యాహ్నం తర్వాత సభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్లకార్డులు పట్టుకుని స్పీకర్ పోడియం వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. పల్లా రాజేశ్వర్రెడ్డి, పాడి కౌశిక్రెడ్డి తదితరులు ముందుకు దూసుకువస్తుండడంతో మహిళా మార్షల్స్ను వారికి అడ్డుగా నిలబెట్టి నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ గందరగోళంలోనే మహేశ్వర్రెడ్డి భూభారతి బిల్లుపై చర్చలో పాల్గొన్నారు. అప్పుడు కూడా బీఆర్ఎస్ సభ్యులు తమ ఆందోళన కొనసాగించారు.మహేశ్వర్రెడ్డి, ఆ తర్వాత మంత్రి పొంగులేటి, ఎంఐఎం నేత అక్బరుద్దీన్లు మాట్లాడుతున్నంత సేపు నినాదాలు చేశారు. దాదాపు 45 నిమిషాల పాటు నిరసన కొనసాగించినా స్పీకర్ పట్టించుకోక పోవడం, అధికార పక్షం స్పందించకపోవడం, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక వ్యక్తి కోసం తాపత్రయపడుతున్నారంటూ వ్యాఖ్యానించడంతో సభ నుంచి ని్రష్కమించారు. ఆ సమయంలో మాట్లాడుతున్న అక్బరుద్దీన్..‘బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓడిపోయి వెళ్లిపోతున్నారు.’అని వ్యాఖ్యానించారు. మండలిలో వాయిదాల పర్వం శాసనమండలిలో శుక్రవారం వాయిదాల పర్వం కొనసాగింది. శుక్రవారం ఉదయం మండలి ప్రారంభం కాగానే ఫార్ములా ఈ–రేస్ విషయంలో ఏసీబీ కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. మధుసుదనాచారి, సత్యవతి రాథోడ్, కవిత, వాణీదేవి తదితరులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభ ముందుకు సాగనీయకుండా అడ్డుకున్నారు. చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఎదుటకు వచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు.కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో చైర్మన్ స్వల్ప విరామం ఇస్తూ సభను వాయిదా వేశారు. ఆ తర్వాత సభ ప్రారంభం కాగా.. బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన కొనసాగించడంతో చైర్మన్ భోజన విరామం కోసం వాయిదా వేశారు. ఆ తర్వాత సభ ప్రారంభమైనప్పుడు కూడా అదే వాతావరణం నెలకొనడంతో శనివారం ఉదయానికి వాయిదా వేశారు. -
హైదరాబాద్ లో బీజేపీ ఎమ్మెల్యేల వినూత్న నిరసన
-
దమ్ముంటే ‘ఫార్ములా–ఈ రేస్’ పై చర్చించండి
సాక్షి, హైదరాబాద్: ‘ఫార్ములా–ఈ రేస్’అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ మీడియా ద్వారా అవాస్తవాలు ప్రచారం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తద్వారా ఫార్ములా–ఈ రేస్ నిర్వహణలో ఏదో జరిగిందనే అపోహలు సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. దమ్ముంటే ఫార్ములా–ఈ రేస్ అంశంపై శాసనసభలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి కేటీఆర్ బుధవారం లేఖ రాశారు. ‘ఫార్ములా–ఈ రేస్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నెలలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంతోపాటు నా మీద అనేక నిరాధార ఆరోపణలు చేస్తున్నది. అసెంబ్లీ ఆవరణలో సీఎం ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై గంటన్నర పాటు చర్చించినట్టు వార్తా కథనాలు వచ్చాయి. ఈ అంశం మీద నాలు గు గోడల నడుమ చర్చించడానికి బదులు గా శాసనసభ వేదికగా నాలుగు కోట్ల మంది ప్రజల ముందు సవివర చర్చ జరిగితే అందులో నిజానిజాలు ఏమిటో అందరికీ తెలు స్తాయి’అని కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నా రు. ‘తెలంగాణ, హైదరాబాద్ నగరానికి మంచి జరగాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ‘ఫార్ములా–ఈ రేస్’ నిర్వాహ కులతో ఒప్పందం చేసుకుంది. తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సుమారు రూ.700 కోట్ల లబ్ధి చేకూరిందని నీల్సన్ నివేదిక స్పష్టం చేసింది. 2024లో మరోదఫా రేస్ జరగాల్సి ఉండగా, కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేసింది. ఒప్పందం పారదర్శకంగా జరిగినా ప్రభుత్వం మాత్రం దుష్ప్రచారం మానడం లేదు. నిజానిజాలేమిటో తెలుసుకునే హక్కు రాష్ట్ర ప్రజలకు ఉన్నందున శాసనసభలో ‘ఫార్ములా–ఈ రేస్’అంశంపై చర్చ పెట్టాలి’అని కేటీఆర్ సీఎం రేవంత్కు రాసిన లేఖలో పేర్కొన్నారు.ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలి: స్పీకర్కు బీఆర్ఎస్ వినతిఫార్ములా– ఈ రేస్ అంశంలో కేటీఆ ర్పై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న నిరాధార ఆరోపణలపై చర్చించాలని బీఆర్ఎస్ శాసనసభాపక్షం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మాజీ మంత్రి హరీశ్రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం బుధవారం స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్కు వినతిపత్రం అందజేసింది. సీఎం రేవంత్కు కేటీఆర్ రాసిన లేఖలోని అంశాలను ఉటంకిస్తూ ప్రస్తుత సమావేశాల్లో సభకు అనుకూలమైన రోజు ఈ అంశంపై చర్చించాలని స్పీకర్ను కోరారు. స్పీకర్ను కలిసిన వారిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్రెడ్డి, కాలేరు వెంకటేశ్, కేపీ.వివేకానంద, కల్వకుంట్ల సంజయ్, విజయుడు, మాణిక్రావు, చామకూర మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డి, చింత ప్రభాకర్ ఉన్నారు. -
ఆటోల్లో అసెంబ్లీకి..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై రోజుకో రూపంలో నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బుధవారం ఖాకీ చొక్కాలతో అసెంబ్లీకి వచ్చారు. ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్కు ఉదయం 9.30కు చేరుకున్న నేతలు ఖాకీ చొక్కాలు ధరించి ఆటోల్లో అసెంబ్లీకి బయలుదేరారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, బండారి లక్ష్మారెడ్డి స్వయంగా ఆటోలు నడిపారు.మార్గంమధ్యలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తన వాహనాన్ని ఆపి నిరసన తీరు బాగుంది అంటూ వీడియో తీసుకున్నారు. కాగా బీఆర్ఎస్ జెండాలతో కూడిన ఆటోలతో పలువురు ఆటో కార్మికులు కేటీఆర్ నడుపుతున్న ఆటోను అనుసరిస్తూ అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. ప్రవేశ ద్వారం వద్ద ఆటోలను పోలీసులు అడ్డుకోవడంతో ఎమ్మెల్యేలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ సభకు వచ్చారు. అంతకుముందు ఆదర్శనగర్ క్వార్టర్స్ వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలేమయ్యాయి? ‘అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 8 లక్షల మంది ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరి జాబితాను గత అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వానికి ఇచ్చినా స్పందించడం లేదు. కాంగ్రెస్ ఇచి్చన హామీ మేరకు ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12 వేలు ఇవ్వడంతో పాటు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి..’అని కేటీఆర్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్మిక విభాగం నేతలు ఆటో డ్రైవర్ల సమస్యలతో కూడిన జాబితాను కేటీఆర్కు అందజేశారు. ఇలావుండగా ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలు, హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యంపై బీఆర్ఎస్ శాసనసభా పక్షం అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచి్చంది. అదానీతో ఒప్పందాలు రద్దు చేసుకోవాలి కాంగ్రెస్ చలో రాజ్భవన్ సందర్భంగా బీఆర్ఎస్ను ఉద్దేశించి సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నిరసనకు దిగింది. సభ విరామ సమయంలో హరీశ్రావు నేతృత్వంలో లాబీలోని బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయం నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు అదానీ, రేవంత్రెడ్డి కలిసి ఉన్న ఫొటోలను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ‘గల్లీలో దోస్తీ.. ఢిల్లీలో కుస్తీ, అదానీ..సీఎం భాయ్..భాయ్’అంటూ నినదించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దకు చేరుకుని, అదానీతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న రూ.12,400 కోట్ల ఒప్పందాలు రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. సభా హక్కుల ఉల్లంఘనపై చర్చకు అనుమతించండి శాసనమండలిలో బుధవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా.. మూసీ సుందరీకరణ అంశంపై సీఎం రేవంత్ తరఫున మంత్రి శ్రీధర్బాబు తప్పుడు సమాచారం ఇచ్చారని బీఆర్ఎస్ శాసనసభా పక్షం ఆరోపించింది. ఎమ్మెల్సీ కవిత అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ.. మూసీ డీపీఆర్, ప్రపంచ బ్యాంకు నుంచి ఆర్థిక సాయం అంశంలో మంత్రి తప్పుడు సమాచారం ఇచ్చారని పేర్కొంది. శాసనమండలి నియమావళి 168 (ఏ) కింద సీఎం రేవంత్రెడ్డి, మంత్రి శ్రీధర్బాబుపై తామిచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసుపై చర్చకు అనుమతించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డికి వినతిపత్రం సమరి్పంచింది. -
శాసనసభలో కరీంనగర్ పంచాయితీ
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ పంచాయితీకి కొద్దిసేపు శాసనసభ వేదిక అయ్యింది. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మధ్య వాగ్వాదం జరిగింది. అది వ్యక్తిగత విమర్శల దాకా వెళ్లింది. గురుకులాల్లో సౌకర్యాల కల్పనపై అసెంబ్లీలో సాగిన స్వల్పకాలిక చర్చలో మంత్రి సీతక్క మాట్లాడిన అనంతరం బీఆర్ఎస్ నుంచి గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణకు ఏర్పాటు కాక ముందు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు విద్య అందించలేదని, చదువు చెప్పలేదని వ్యాఖ్యానించారు.దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ ‘ఆయన మారుమూల ప్రాంతం నుంచి కరీంనగర్కు వచ్చి కాంగ్రెస్ హయాంలో చదువుకోలేదా? ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో చదివితే ఆ బాధ తెలుస్తది. ఆయన ప్రభుత్వ పాఠశాలలో చదవలే. బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో చదవలే. మీకేం తెలుసు ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల గురించి’అని అన్నారు. దానికి గంగుల స్పందిస్తూ.. ‘మీరు మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ఇచి్చన అన్నరు. పార్లమెంట్, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ తెలవయ్’అని వ్యాఖ్యానించారు. దానికి స్పందించిన పొన్నం ‘మొదటిసారి ఎమ్మెల్యేలకు ఏం తెలియదన్నట్లా, అజ్ఞానులన్నట్టా? పార్లమెంట్ మెంబర్ చేసిన, తెలంగాణ కోసం కొట్లాడిన. మీ నాయకుడు నిన్ను ‘షేర్ పటాక’అన్నాడు.తెలంగాణ ఉద్యమంల పార్టీ మారి ఇట్ల మాట్లాడితే ఎట్ల?’అని అన్నారు. దానికి కమలాకర్ బదులిస్తూ... ‘షేర్ పటాకనా, పెప్పర్ స్ప్రే డూప్లికేటా అని నేననలే. దొంగేడుపు ఏడవలే. కండ్లు పోయినయని ఏడువలె ’అని తెలంగాణ బిల్లు సందర్భంగా పార్లమెంట్లో జరిగిన సంఘటనలపై వ్యాఖ్యానించారు. దీంతో పొన్నం సీరియస్ అవుతూ ‘పార్లమెంట్లో పెప్పర్ స్ప్రే ఒరిజనలా, డూప్లికేటా రికార్డులు పరిశీలిద్దాం. కుక్క షేర్ పటాక.. ఎక్కడ శవం కనిపిస్తే అక్కడికి పోయి ఏడుస్తడని వాళ్ల నాయకుడు అన్నడు’అని వ్యాఖ్యానించారు. దీంతో గంగుల స్పందిస్తూ ‘మేం కరీంనగర్ తెలంగాణ చౌక్ల కొట్లాడిన దాన్ని అసెంబ్లీ దాక తీసుకొస్తున్నాడు.కరీంనగర్లో ఎందుకు ఓడిపోయినవ్ , ఎందుకు హుస్నాబాద్ పారిపోయినవ్ అని నేను అన్ననా? జిల్లా విడిచిపెట్టి పోతరా ఎవరన్నా? ’అని కామెంట్ చేశారు. దీనికి స్పందిస్తూ ‘కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు పోటీ చేయడానికి పారిపోయిన్రా? దమ్ముంటే రా. నెక్ట్స్ టైం వచ్చి నామీద పోటీ చేయ్. వేరే నియోజకవర్గానికి పోవడం తప్పా? నీలాగా కోట్ల కోట్లు లేవు. నాకు దమ్ముంది. అక్కడికి పోయి గెలిచిన’అని తీవ్రస్థాయిలో స్పందించారు. మంత్రి శ్రీధర్బాబు జోక్యంతో కరీంనగర్ పంచాయితీ సద్దుమణిగింది. -
సామాన్యుడి భూహక్కుల పరిరక్షణకే భూభారతి
భూభారతి చట్టాన్ని పూర్తిస్థాయిలో ఆన్లైన్లోకి తెచ్చిన తర్వాత 2014కు ముందు సబ్ రిజ్రిస్టార్ల వద్ద ఉన్న రికార్డులను అప్డేట్ చేస్తాం. 2014కు ముందు ప్రభుత్వ భూములుగా రికార్డుల్లో ఉండి తర్వాత అన్యాక్రాంతమైన భూములను తిరిగి స్వాధీనం చేసుకొని పేదలకు పంచే విషయాన్ని పరిశీలిస్తున్నాం. ధరణి లోపాలను పూర్తిగా సవరించి, ప్రతి అంశాన్ని క్షుణ్నంగా చర్చించి కొత్త చట్టాన్ని రూపొందించాం..’’ సాక్షి, హైదరాబాద్: సామాన్యుల భూహక్కుల పరిరక్షణే ధ్యేయంగా ‘ఆర్వోఆర్ –భూభారతి’ చట్టాన్ని రూపొందించామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో 49 ఏళ్ల క్రితం నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్ఓఆర్ చట్టం అద్భుతంగా పనిచేసిందని.. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఏడేళ్ల పాటు కొనసాగిందని చెప్పారు. కానీ నాలుగు గోడల మధ్య అసంబద్ధంగా రూపొందించిన ‘ధరణి’తో కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టుగా పరిస్థితి తయారైందని విమర్శించారు.లక్షల మందిని నానా తిప్పలు పెట్టిన ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామన్న హామీని అమల్లోకి తెచ్చి... దాని స్థానంలో ప్రజల భూమి హక్కులను సంరక్షించే సరికొత్త భూభారతి చట్టాన్ని తెస్తున్నామని ప్రకటించారు. బుధవారం శాసనసభలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూభారతి బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రసంగించారు. వివరాలు పొంగులేటి మాటల్లోనే... ‘‘కొత్త చట్టంపై ఆగస్టు 2న ముసాయిదా ప్రవేశపెట్టాం. 40 రోజుల పాటు వెబ్సైట్లో ఉంచి, చర్చావేదికలు నిర్వహించి ప్రజాప్రతినిధులు, కవులు, మేధావులు, విశ్రాంత అధికారులు, సాధారణ ప్రజల సలహాలు, సూచనలు స్వీకరించి కొత్త చట్టాన్ని రూపొందించాం. మాజీ మంత్రి హరీశ్రావు వంటి వారు ఇచ్చిన సూచనలను కూడా పరిగణనలోకి తీసుకున్నాం. 18 రాష్ట్రాల్లోని ఆర్వోఆర్ చట్టాలను అధ్యయనం చేసి, ఉత్తమ విధానాలను కొత్త చట్టంలో పొందుపరిచాం. ధరణి తప్పులను భూభారతితో సరిదిద్దుతాం గత ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ వల్ల లక్షలాది మంది మానసిక క్షోభకు గురయ్యారు. రవి అనే బీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీ సభ్యుడు నా వద్దకు వచ్చి.. 1,398 ఎకరాల భూములపై గిరిజనులు హక్కులు కోల్పోవాల్సి వచ్చిందని, ధరణిలో వాటిని అటవీ భూములుగా చూపారని వాపోయారు. వేలాది పుస్తకాలు చదివిన మేధావి తీసుకొచ్చిన ధరణి పోర్టల్తో లక్షలాది కొత్త సమస్యలు తలెత్తాయి. మానవ సంబంధాలను సైతం ధరణి దెబ్బతీసింది.భూయజమానికి తెలియకుండానే భూమి చేతులు మారిపోయేలా చేసింది. గత చట్టంలోని తప్పులను అధ్యయనం చేసి భూ–భారతి ద్వారా సరిదిద్దేలా ఏర్పాట్లు చేశాం. ధరణి పోర్టల్ పార్టు–బీలో ఉన్న 18 లక్షల ఎకరాలకు పరిష్కారం లభిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ఆబాదీ/గ్రామకంఠం సమస్యలకు తెరపడుతుంది. భవిష్యత్తులో భూవివాదాలకు తావు లేకుండా ప్రత్యేక సర్వే ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుంది. రిజ్రిస్టేషన్ దస్తావేజుల ద్వారా మ్యుటేషన్ జరిగేప్పుడు ఏవైనా తప్పులు జరిగితే అప్పీల్ చేసుకునే వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నాం. రిజ్రిస్టేషన్, ఆ వెంటనే మ్యుటేషన్ జరిగే వెసులుబాటు కలి్పంచటం ధరణిలో మెరుగైన అంశం. ఆ సమయంలో పొరపాట్లు జరిగితే కూడా సరిదిద్దే కొత్త ఏర్పాటుతో దాన్ని కొత్త చట్టంలో పొందుపరిచాం. ఆధార్ తరహాలో భూదార్.. ఆధార్ నంబర్ తరహాలో ‘భూదార్’ నంబర్ తీసుకొస్తాం. ప్రతి రైతుకు ఒక కోడ్ ఇస్తాం. గతంలో రెవెన్యూ గ్రామాల్లో ఒక ఏడాదిలో జరిగిన భూలావాదేవీలను పొందుపరిచేందుకు నిర్వహించే జమాబందీని బీఆర్ఎస్ ప్రభుత్వం తొలగించింది. దానిని తిరిగి తీసుకొస్తున్నాం. రైతుల భూములకు సంబంధించిన ఫిర్యాదులపై అప్పీల్ చేసుకునేందుకు ప్రస్తుతం ఎలాంటి వ్యవస్థ లేదు. దీనికోసం గతంలో కొనసాగిన ల్యాండ్ ట్రిబ్యునల్స్ను పునరుద్ధరించనున్నాం. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తుల ఆక్రమణల నుంచి రక్షించేందుకు సీసీఎల్ఏ ద్వారా చర్యలు తీసుకోనున్నాం. గతంలో పట్టదారు పాస్బుక్లలో ఉన్న అనుభవదారులు, కాస్తుదారుల కాలం (నిలువు వరుస)ను పునరుద్ధరించాలని నిర్ణయించాం. అక్రమాలకు పాల్పడే అధికారులపై కఠిన చర్యలు ఆన్లైన్లో ధరణి తీసుకొచ్చిన తర్వాత భూములకు సంబంధించిన పాత రికార్డులు లేకుండా చేశారు. ఇకపై ఆన్లైన్తోపాటు మాన్యువల్ పహాణీలను నమోదుచేయాలని కొత్త చట్టంలో పొందుపరిచాం. ప్రభుత్వ భూములను ఉద్దేశపూర్వకంగానో, ప్రలోభాలకు లోనైగానీ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించిన అధికారులు, ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోనున్నాం. సులువుగా తెలుసుకునేలా భూముల వివరాలు గత ప్రభుత్వం ధరణిని 3 మాడ్యూల్స్తో ప్రారంభించి 33 మాడ్యూల్స్కు తీసుకొచ్చింది. తద్వారా పేద, చిన్నకారు రైతుల భూములు కనిపించని పరిస్థితి ఏర్పడింది. మేం భూభారతి ద్వారా 33 మాడ్యుల్స్ బదులు 6 మాడ్యుల్స్ తెస్తున్నాం. అలాగే గతంలో 32 కాలమ్స్ (నిలువు వరుసలు)లో ఉన్న పహాణీలను ఒకే కాలమ్లోకి తెచ్చారు. దీనిని భూభారతిలో 11 కాలమ్స్కు పెంచాం. ధరణి పోర్టల్లో సొంత భూమిని కూడా చూసుకునే వీలు లేకుండా దాచేవారు. భూభారతి ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సర్వే నంబర్ల ఆధారంగా భూమి వివరాలు తెలుసుకోవచ్చు..’’ అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
TG: గురుకులాలపై అసెంబ్లీలో మాటల యుద్ధం
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలోని గురుకులాల విద్యార్థుల సమస్యలపై తెలంగాణ అసెంబ్లీలో బుధవారం(డిసెంబర్18) హాట్హాట్గా చర్చ జరిగింది. ఈ చర్చలో బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఇటీవల రాష్ట్రంలోని గురుకులాల్లో వివిధ కారణాలతో విద్యార్థులు మరణించడంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇలా ఎంత మంది విద్యార్థుల చావులకు కారణమవుతారని ప్రశ్నించారు. వెంటనే గురుకులాల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.దీనికి స్పందించిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ అక్కడక్కడా గురుకులాల్లో ఫుడ్పాయిజన్ ఘటనలు జరిగిన విషయం వాస్తవమేనని ఒప్పుకున్నారు. తమ ప్రభుత్వం గురుకులాల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. ఇటీవల విద్యార్థులకు 40 శాతం డైట్ ఛార్జీలు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో 54 యంగ్ ఇండియా స్కూళ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు.మంత్రి పొన్నం వర్సెస్ గంగులఇదే విషయమై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో గురుకులాలను పట్టించుకున్న పాపాన పోలేదని ఎదురుదాడి చేశారు.దీనికి గంగుల స్పందిస్తూ మొదటిసారి సభకు వచ్చిన వ్యక్తి తాను మాట్లాడుతుండగా అడ్డుకోవడం సరికాదన్నారు. దీనిపై పొన్నం అభ్యంతరం చెప్పారు. తాను ఎంపీగా పనిచేశానని, తనను మొదటిసారి సభ్యుడు అనడాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. తాను డబ్బుల సంచులతో గెలిచేవాడని కాదని, హుస్నాబాద్కు పారిపోయి గెలవలేదన్నారు. సభ్యుడు తొలిసారి వచ్చినా ఎన్నిసార్లు వచ్చిన గౌరవం ఇవ్వాలని మరో మంత్రి శ్రీధర్బాబు గంగులకు సూచించారు.గురుకులాల విషయమై కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి కూడా మాట్లాడారు. బీఆర్ఎస్ గురుకులాలకు కనీసం భవనాలు కట్టలేకపోయిందని విమర్శించారు.గురుకులాల్లో ప్రతి పనిని పెండింగ్లో పెట్టిందన్నారు. తాము ఎప్పుడూ సామాన్యులవైపే ఉంటామని,గురుకులాల అభివృద్ధికి కట్టుబడి ఉంటామని చెప్పారు. -
Formula E case: సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. దమ్ముంటే ఫార్ములా ఈ-రేస్ అంశంపై రాష్ట్ర శాసనసభలో చర్చ పెట్టాలని లేద్వారా సవాల్ విసిరారాయన.‘‘ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో మీ ప్రభుత్వం కొన్ని నెలలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, ముఖ్యంగా నా మీద అనేక నిరాధార అరోపణలు చేస్తోంది. విషయం మీద ఈ వారం మీ ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో గంటన్నర సేపు చర్చ కూడా జరిగినట్టు వార్తా కథనాలు వచ్చాయి. ఈ అంశం మీద నాలుగు గోడల మధ్య చర్చ కన్నా రాష్ట్ర శాసన సభలో నాలుగు కోట్ల మంది ప్రజల ముందు చర్చ జరగితే నిజానిజాలు ఏమిటో అందరికీ తెలుస్తాయి.తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి మంచి జరగాలనే సదుద్దేశంతో గత ప్రభుత్వం ఫార్ములా-ఈ రేస్ నిర్వాహకులతో ఒక ఒప్పందం చేసుకున్నది. ఈ రేసు వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సుమారు రూ.700 కోట్ల రూపాయల లబ్ది చేకూరింది అని నీల్సన్ సంస్థ నివేదిక స్పష్టం చేసింది. 2024లో మరో దఫా రేస్ జరగవలసి ఉండగా మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని ఏకపక్షంగా రద్దు చేయడం జరిగింది. అప్పటి నుంచి.. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ రేస్ గురించి అనేక అవాస్తవాలను మీడియా ద్వారా ప్రచారం చేసి, ఇందులో ఏదో జరిగింది అనే అపోహలు సృష్టించే ప్రయత్నం మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. ఫార్ములా-ఈ రేస్ ఒప్పందం అంతా పారదర్శకంగా జరిగింది. రేసు నిర్వాహకులకు చెల్లింపులు కూడా పారదర్శకంగానే జరిగాయి అని ఇదివరకే నేను వివరంగా చెప్పడం జరిగింది. అయినా మీ ప్రభుత్వం మాత్రం దుష్ప్రచారం మానడం లేదు.రాష్ట్ర ప్రజలకు నిజాలేమిటో తెలుసుకునే హక్కు ఉన్నది. కాబట్టే మీరు శాసనసభలో ఈ అంశంపై చర్చ పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాను. దీనిపైన శాసనసభలో సవివరమైన చర్చ జరిగితే నిజానిజాలేమిటో నిగ్గుతేలుతాయి అని లేఖలో కోరారాయన.💥 దమ్ముంటే ఫార్ములా-ఈ రేస్ అంశంపై రాష్ట్ర శాసనసభలో చర్చ పెట్టండి - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే @KTRBRS లేఖ❇️ ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో మీ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా నాపై, అనేక నిరాధార ఆరోపణలు చేస్తున్నది.❇️ ఈ అంశంపై ఇటీవల మీ… pic.twitter.com/Iv2fNkjAfl— BRS Party (@BRSparty) December 18, 2024 -
తెలంగాణ అప్పులపై అసెంబ్లీలో అధికార, విపక్షాల సమరం
-
కనీసం వెయ్యి కోట్లయినా ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.5,020 కోట్ల మేర పేరుకు పోయాయని, అందులో కనీసం రూ.1,000 కోట్లయినా విడుదల చేయాలని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వాన్ని కోరారు. 20 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన బకాయిలు విడుదల చేయకపోవడంతో కళాశాలల నిర్వహణ కష్టంగా మారిందని మంగళవారం జీరో అవర్ సందర్భంగా ఆయన అసెంబ్లీ దృష్టికి తెచ్చారు. విదేశీ విద్యానిధి పథకం కింద విద్యార్థికి రూ.20 లక్షలు మంజూరు చేసేందుకు రూ.5 లక్షలు కమీషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారని.. ఏపీ, తెలంగాణలో లక్షలాది మంది విద్యార్థులు ప్రయోజనం పొందారని గుర్తుచేశారు. ఉస్మానియా తరలింపు ఆపండి: రాజాసింగ్ ఉస్మానియా ఆస్పత్రిని గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్కు తరలించే ప్రతిపాదనను రద్దు చేయాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. గోషామహల్లో ఆస్పత్రి కడితే ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని, ఉస్మానియా వెనుకవైపు ఉన్న విశాలమైన స్థలంలో కొత్త నిర్మాణం జరపాలని సూచించారు. సింగరేణిలో పనిచేస్తున్న 30 వేల మంది కాంట్రాక్టు కారి్మకులకు కనీస వేతనాలను అమలు చేయాలని ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, రాజ్ఠాకూర్ మక్కాన్సింగ్ కోరారు. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలను కలిపి కార్పొరేషన్గా ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. దళితబంధు పథకం కింద హుజూరాబాద్లో 5 వేల కుటుంబాలకు ఇవ్వాల్సిన రెండోవిడత ఆర్థిక సాయాన్ని విడుదల చేయాలని కోరారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యూల్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ తదితరులు తమ నియోజకవర్గాల్లోని సమస్యలను సభ దృష్టికి తెచ్చారు. -
రెవెన్యూ డివిజన్లు, మండలాల గందరగోళాన్ని సరిదిద్దుతాం: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘గత ప్రభుత్వ హయాంలో కొత్తగా రెవెన్యూ డివిజన్లు, మండలాలను అస్తవ్యస్తంగా ఏర్పాటు చేశారు. దీంతో ఇప్పుడు ఇ బ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యమంత్రి, ఇతర మంత్రులతో చర్చించి వాటిని సరిచేసేందుకు సానుకూల నిర్ణయం తీసుకుంటాం’అని రె వెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల స మయంలో పెద్దసంఖ్యలో సభ్యులు, రెవెన్యూ డి విజన్లు, మండలాల గందరగోళంపై అడిగిన ప్ర శ్నలకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. చేర్యాలను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ సభ్యుడు పల్లా రాజేశ్వరరెడ్డి కోరారు.ఐదు మండలాలున్న చేర్యాల ప్రాంతంలో ప్రజలకు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని, పోలీసు సంబంధిత పనులకు హుస్నాబాద్కు, వ్యవసాయశాఖ పనులకు గజ్వేల్ కార్యాలయానికి, కలెక్టరేట్ కోసం సిద్దిపేటకు తిరగాల్సి వస్తోందని, దీన్ని సరిదిద్దాల్సిన అవసరముందన్నారు. ముధోల్, తాండూరు, జడ్చర్ల, వేములవాడ, నారాయణఖేడ్, వర్ధన్నపేట, మహబూబాబాద్.. ఇలా పలు నియోజకవర్గాల పరిధిలో నెలకొన్న ఇలాంటి సమస్యలపై సభ్యులు లేవనెత్తారు. చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అంశం కలెక్టర్ పరిశీలనలో ఉందని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇలాంటి సమస్యలపై సీఎం, సహచర మంత్రులతో చర్చించి వాటిని సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. -
దద్దరిల్లిన అసెంబ్లీ: చేతికి సంకెళ్లతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ నిరసన చేపట్టారు. నల్ల దుస్తులు, బేడీలతో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. రైతులకు బేడీలా సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేశారు. లగచర్ల రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు.‘లగచర్ల’ఘటనపై నిన్న (సోమవారం) కూడా శాసనసభ అట్టుడికింది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సభ్యుల నిరసనలు, నినాదాలతో హోరెత్తింది. ‘రాష్ట్రంలో పర్యాటక విధానం’అంశంపై మంత్రి జూపల్లి కృష్ణారావు లఘుచర్చను ప్రారంభించగానే బీఆర్ఎస్ సభ్యులంతా లేచి.. ‘లగచర్ల’రైతుల నిర్బంధం, అరెస్టులపై చర్చించాలని పట్టుబట్టారు. స్పీకర్ అంగీకరించకపోవడంతో ప్లకార్డులను ప్రదర్శిస్తూ, నినాదాలు చేశారు. వెల్లోకి దూసుకొచ్చి నిరసన తెలిపారు.మరోవైపు, లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి, చిత్రహింసలకు గురిచేశారని.. దీనిపై మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలపాలని బీఆర్ఎస్ పిలుపు ఇచ్చింది. జైళ్లలో నిర్బంధించి, రైతన్న చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ అమానవీయ, అణచివేత విధానాలను నిలదీయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. లగచర్ల రైతులపై కేసులను ఎత్తివేసి వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: ‘ఈ కార్ రేసు’ కేసు.. స్పందించిన కేటీఆర్ -
ఆ విషయం తెలిసే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు: మంత్రి కోమటిరెడ్డి
సాక్షి,హైదరాబాద్:బీఆర్ఎస్పై మరోసారి ఫైరయ్యారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి. ఆ పార్టీ ఎమ్మెల్యేలను కేసీఆర్ హౌలా గాళ్లను చేస్తుండని సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం(డిసెంబర్16)కోమటిరెడ్డి అసెంబ్లీలో మీడియాతో చిట్చాట్గా మాట్లాడారు.‘గతంలో కాంగ్రెస్ పార్టీకి ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా భట్టి విక్రమార్క రోజు సభకు వచ్చారు.ఇప్పుడు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ ఎందుకు సభకు రావడం లేదు?ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి కంటే ఎక్కువ విలువ ప్రతిపక్ష నాయకుడికి ఉంటుంది.భవిష్యత్తులో బీఆర్ఎస్ ఖతం అవుతుంది అని కేసిఆర్ ముందే తెలుసుకొని సభకు రావడం లేదు. బీఆర్ఎస్ సభలో ఎంత అరిచి గీ పెట్టినా ఉపయోగం ఉండదు’అని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.కాగా, సోమవారం అసెంబ్లీలో లగచర్ల రైతులకు బేడీలు వేసిన అంశంపై చర్చించాలని బీఆర్ఎస్ పట్టుబట్టిన విషయం తెలిసిందే. దీనికి ఒప్పుకోని ప్రభుత్వం టూరిజం పాలసీని చర్చకు పెట్టింది. దీంతో సభలో తీవ్ర గందరగోళం రేగి సభ మంగళవారానికి వాయిదా పడింది. -
‘చాయ్ బిస్కట్’ సమావేశాలు కాదు: హరీశ్రావు ఫైర్
సాక్షి,హైదరాబాద్:బీఏసీ సమావేశం నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. అసెంబ్లీని కనీసం 15 రోజుల పాటు నడపాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఎన్ని రోజులు సభ నడుపుతారో క్లారిటీ ఇవ్వకపోవడంతో వాకౌట్ చేసినట్లు బీఆర్ఎస్ నేత హరీశ్రావు తెలిపారు. బీఏసీ నుంచి బయటికి వచ్చిన సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ బీఏసీ అంటే బిస్కట్ అండ్ చాయ్ సమావేశం కాదని ఎద్దేవా చేశారు.‘అసెంబ్లీ సమావేశాలపై ఏమీ తెల్చకపోవడంతో బయటకు వచ్చినం.ఎన్ని రోజులు సభ నడుపుతారో చెప్పక పోవడంతో బీఏసీ నుంచి వాకౌట్ చేశాం. రేపు లగచర్ల అంశంపై చర్చకు బీఅర్ఎస్ పట్టు పట్టింది. ఒక రోజు ప్రభుత్వానికి,మరొక రోజు విపక్షానికి ఇవ్వడం సంప్రదాయం. లగచర్లపైన చర్చకు పట్టుపట్టినం. రైతులకు బేడీలు వేసిన అంశం మాకు చాల కీలకం.కచ్చితంగా ఈ అంశంపైన చర్చకు అవకాశం ఇవ్వాల్సిందే.బీఏసీకి కేవలం సూచన చేసే అధికారం మాత్రమే ఉందన్న సీఎం వ్యాఖ్యలపైన బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. హౌస్ కమీటీ ఏర్పాటుచేయాలి. బీఏసీపైన తమ పార్టీ అభిప్రాయం తెలుసుకోకుండా ఎలా నిర్ణయం తీసకుంటారని స్పీకర్ను అడిగాం. బీఏసీలో లేకుండా సభలో బిల్లులు ప్రవేశపెట్టడంపైన అభ్యంతరం వ్యక్తం చేశాం’అని హరీశ్రావు చెప్పారు.కాగా, సోమవారం అసెంబ్లీలో లగచర్ల రైతులకు బేడీలు వేసిన అంశంపై చర్చించాలని బీఆర్ఎస్ పట్టుబట్టింది. దీనికి ఒప్పుకోని ప్రభుత్వం టూరిజం పాలసీని చర్చకు పెట్టింది. దీంతో సభలో తీవ్ర గందరగోళం చెలరేగి సభను స్పీకర్ మంగళవారానికి వాయిదా వేశారు. -
తెలంగాణలో ఉత్తమ శాసనసభ వక్త అవార్డు: శ్రీధర్ బాబు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ అంటే అందరిదీ.. ఏ ఒక్క పార్టీకి చెందినది కాదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కొత్తగా శాసనసభకు ఎన్నికైన నేతలందరూ సభకు హాజరయ్యే సంప్రదాయం కొనసాగించాలని కోరారు. సిద్ధాంతపరంగా బేధాలున్నప్పటికీ.. సభలో ఎవరి పాత్ర వాళ్లు పోషించాలన్నారు.శాసనసభ వ్యవహారాలపై తెలంగాణ శాసనసభ, మండలి సభ్యులకు బుధ, గురువారాల్లో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..‘మొదటి సారి ఎన్నికైన శాసనసభ్యులు 57 మంది శాసన సభలో ఉన్నారు. శాసన సభ అందరిది.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలో మరొక పార్టీదో కాదు. ఈ ట్రైనింగ్ సెషన్స్ కోసం అందరికీ ఆహ్వానం పంపించాము.పాత రోజుల్లో సిద్ధాంత పరంగా భేదాభిప్రాయాలు ఉన్నా సభలో ఎవరి పాత్ర వారు పోషించారు. నేను మొదటిసారి ఎన్నికైనప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. నేను నాలుగోసారి సభలో ఉన్నప్పుడు పీఏసీని ప్రతిపక్షానికి ఇవ్వలేదు. ఎమ్మెల్యేలు అందరూ శాసనసభకు హాజరయ్యే సాంప్రదాయం కొనసాగించాలి. ఎమ్మెల్యేగా గెలిచి సభ రాకుండా దూరంగా ఉండకండి. పార్లమెంట్లో ఎలాగైతే ఉత్తమ పార్లమెంటేరియన్ ఇస్తున్నారో అదే విధంగా ఉత్తమ శాసనసభ వక్త అవార్డు ఇవ్వాలని స్పీకర్ను కోరుతున్నాం’ అంటూ కామెంట్స్ చేశారు.స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ..‘చట్టాలను రూపొందించే హక్కు శాసన సభ్యులకు ఉంటుంది. గతంలో శాసనసభ సమావేశాలు ఉంటే సినిమా రిలీజ్ వాయిదా వేసుకునే వారు. ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి గొప్ప వ్యక్తులు బాగా మాట్లాడి మంచి పేరు తెచ్చుకున్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్ మాదిరిగా ఉత్తమ శాసనసభ వక్త అవార్డు పరిశీలన చేస్తాం’ అంటూ చెప్పుకొచ్చారు.తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ..‘గాలివాటం రాజకీయాలు ప్రారంభం అయినప్పటికీ కొత్త వాళ్ళు మళ్ళీ గెలవడం లేదు. మొదటిసారి ఎన్నికై రాజకీయాల్లో సక్సెస్ అయ్యే వారి శాతం 25శాతమే. కొందరు నాయకులు గెలిచాక ప్రజలతో మమేకం కావడం లేదు. ఎమ్మెల్యేకు కోటరీ వల్ల ప్రజలు స్వయంగా ఎమ్మెల్యేను కలిసే అవకాశం ఎక్కువగా ఉండదు. ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండాలి.. ఫోన్లు ఎత్తాలి. నేను ఒకసారి ఓడిపోవడానికి నాకు సెక్యూరిటీ సమస్య వల్లే. ప్రజలు ఎమ్మెల్యేకు దూరం అవ్వడానికి కారణం పీఏలు, పీఆర్వోలు అంటూ కామెంట్స్ చేశారు. -
అసెంబ్లీ వద్ద టెన్షన్ టెన్షన్
-
శీతాకాల సమరం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 10:30 గంటలకు శాసనమండలి, శాసనసభ భేటీకానున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన వేళ జరుగుతున్న ఈ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీతోపాటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, బీజేపీ కూడా అస్త్రశస్త్రాలను, వ్యూహాలను సిద్ధం చేసుకున్నాయి. గత ఏడాది కాలంలో రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఇతర కార్యక్రమాలను ప్రజల ముందుంచేందుకు అధికార కాంగ్రెస్ సిద్ధమైంది.అదే సమయంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను ఎత్తిచూపడం, అప్పటి రుణాలను తీర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేయాల్సి వస్తోందని ప్రజల్లోకి తీసుకెళ్లడం లక్ష్యంగా వ్యూహాలు పన్నుతోంది. మరోవైపు గత ఏడాది కాలంలోని రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడం, హామీల అమలుపై నిలదీయడమే ఎజెండాగా ప్రతిపక్షాలు సభకు హాజరుకానున్నాయి. రైతు రుణమాఫీ జరిగిన తీరు, రైతు భరోసా ఇవ్వకపోవడం, ధాన్యం కొనుగోళ్లు, ఆరు గ్యారంటీల అమలు, ఫోన్ ట్యాపింగ్, లగచర్ల ఘటన, గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్ తదితర అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ వ్యూహాలు పన్నుతోంది.ఇక రాష్ట్ర ప్రభుత్వం హామీల అమల్లో విఫలమైందంటూ చార్జిషీట్లు ప్రకటించిన బీజేపీ.. ఆయా అంశాలను, ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇక హైదరాబాద్ నగరంలో జరుగుతున్న అభివృద్ధిపై చర్చించాలని కోరాలని ఎంఐఎం భావిస్తోంది. రెవెన్యూ చట్టం.. మహిళా వర్సిటీ.. శాసనసభ శీతాకాల సమావేశాల్లో రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్)–2024 చట్టాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆర్వోఆర్–2020 చట్టానికి పలు సవరణలు చేసి దీనిని రూపొందించింది. ‘హైడ్రా’కు చట్టబద్ధత కలి్పంచనుంది. మహిళా యూనివర్సిటీ, ట్రిపుల్ ఐటీ బిల్లులు కూడా సభ ముందుకు రానున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన అనంతర కార్యాచరణ, స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. రైతు రుణమాఫీ జరిగిన తీరును, రైతు భరోసా విధివిధానాలను అసెంబ్లీ వేదికగానే ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.మరోవైపు గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లు, జెన్కో ప్రాజెక్టుల నిర్మాణంపై ఏర్పాటు చేసిన జస్టిస్ మదన్ బి లోకూర్ కమిటీ ఇచి్చన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించేందుకు కాంగ్రెస్ సర్కారు సిద్ధమవుతున్నట్టు సమాచారం. సోమవారం ఉదయం సభ ప్రారంభమైన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై సీఎం రేవంత్ ప్రకటన చేయనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఏర్పాట్లపై సమీక్షించిన మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ సోమవారం నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులతో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ ప్రాంగణంలోని స్పీకర్ చాంబర్లో జరిగిన ఈ భేటీలో శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వివిధ శాఖల ఉన్నతాధికారులు, డీజీపీ జితేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై చర్చించి అధికారులకు పలు సూచనలు చేశారు. సభ ఔన్నత్యాన్ని కాపాడాలి: స్పీకర్ ప్రసాద్కుమార్ అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభల హుందాతనం, ఔన్నత్యాన్ని కాపాడుతూ ప్రతి అంశంపై సమగ్రంగా చర్చించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ కోరారు. సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలని, సభకు సమర్పించే సమాధాన పత్రాలను ముందుగానే సభ్యులకు పంపాలని, సమాచారాన్ని తెలుగు, ఉర్దూ, ఇంగ్లిషు భాషల్లో ముద్రించాలని అధికారులకు సూచించారు.అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని, అసెంబ్లీ సమావేశాల కోసం ప్రతి శాఖ ఓ నోడల్ అధికారిని నియమించుకోవాలని ఆదేశించారు. అసెంబ్లీ, మండలి భేటీలు ఎలాంటి ఇబ్బంది లేకుండా శాంతియుత వాతావరణంలో జరిగేలా పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలని సూచించారు. పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయండి: మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి సమావేశాలు జరుగుతున్న సమయంలో అసెంబ్లీ, మండలి పరిసరాల్లో ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా పోలీసు శాఖ జాగ్రత్తలు తీసుకోవాలని, గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఆదేశించారు. మండలి సభ్యుల ప్రొటోకాల్ విషయంలో ఇబ్బందులు వస్తున్నాయని, ఉల్లంఘనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. సభ సజావుగా జరగడానికి ప్రభుత్వ పక్షం నుంచి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని చెప్పారు. ఏయే రోజుల్లో... ఎన్నిరోజులు సమావేశాలు? అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమైనా... ఎన్నిరోజుల పాటు, ఏయే రోజుల్లో కొనసాగుతాయన్న దానిపై సందిగ్ధత నెలకొంది. దానిపై రెండు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సోమవారం సభ వాయిదా పడిన తర్వాత మంగళ, బుధవారాలు మినహాయించి గురువారం నుంచి మళ్లీ సమావేశాలు జరుగుతాయని, వారం పాటు కొనసాగుతాయని చర్చ జరుగుతోంది. మరోవైపు సోమవారం తర్వాత ఈ నెల 16వ తేదీకి అసెంబ్లీ వాయిదా పడుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది.గత ఏడాది డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం నేతృత్వంలో తొలి సమావేశాలు ప్రారంభమైనందున మళ్లీ డిసెంబర్ 9న సభ ప్రారంభానికి నోటిఫికేషన్ వచ్చిందని... అసెంబ్లీలో పలు కీలక అంశాలకు సంబంధించిన ప్రక్రియ కొంత పూర్తి కావాల్సి ఉండటంతో విరామం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో.. రైతు భరోసా అమలుపై విధివిధానాల రూపకల్పనపై ఏర్పాటు చేసిన సబ్కమిటీ మరో రెండు జిల్లాల్లో పర్యటించాల్సి ఉందని, కమిటీ నివేదికకు సమయం అవసరమని అధికార వర్గాలు చెబుతున్నాయి.ఇక సామాజిక, రాజకీయ, ఆర్థిక, కులగణనకు సంబంధించిన రిపోర్టు పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదు. ఈ రెండు అంశాలపై స్పష్టమైన ప్రకటన చేశాకే అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగించాలనేది అధికార పక్షం ఉద్దేశమని.. అందుకే సోమవారం తర్వాత వాయిదా వేసి, డిసెంబర్ 16 నుంచి తిరిగి కొనసాగించవచ్చని సమాచారం. అయితే సోమవారం జరిగే సభా వ్యవహారాల కమిటీ (బీఏసీ) భేటీలో శీతాకాల అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ను ఖరారు చేయనున్నారు. -
9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. డిసెంబర్ 9న ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభం కానున్నాయి. అనంతరం బీఏసీ సమావేశం జరుగనుంది.ప్రతీ రోజూ ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయని నోటిఫికేషన్లో ప్రభుత్వం పేర్కొంది. ఈ సమావేశాల్లో పలు కీలక చట్టాల ఆమోదానికి రేవంత్ సర్కారు సిద్ధం చేస్తోంది. పంచాయతీ ఎన్నికలపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. నూతన ఆర్ఓఆర్ చట్టం, కులగణన సర్వే, బీసీ రిజర్వేషన్, పలు కొత్త చట్టాలు అసెంబ్లీలో చర్చించనున్నట్లు తెలిసింది. -
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు లేకుండా సభా సంఘం ఏర్పాటు
సాక్షి, విజయవాడ: విశాఖ డైరీ అవినీతి విచారణకు ప్రత్యేక హౌస్ కమిటీ ఏర్పాటు చేయగా, ప్రతిపక్ష సభ్యులు లేకుండానే అసెంబ్లీ సభా సంఘం ఏర్పాటు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శాసనసభ తీర్మానం మేరకు సభా సంఘం ఏర్పాటు చేయగా, కేవలం అధికార టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలతోనే సభా సంఘం ఏర్పాటైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష సభ్యులు లేకుండా సభా సంఘం ఏర్పాటు చేశారు. సభా సంఘం చైర్మన్గా టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, సభ్యులుగా బొండ ఉమామహేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణ బాబు, పళ్లా శ్రీనివాసరావు, గౌతు శిరీష , ఆర్.వి.ఎస్.కే.కె.రంగా రావు, దాట్ల సుబ్బరాజులను నియమించారు. రెండు నెలల్లోగా నివేదిక సమర్పించాలని కమిటీకి స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. -
మామా అల్లుళ్ల సవాల్, నువ్వా..నేనా? అంటూ కూతురు, చివరికి!
మహారాష్ట్రలో ఇటీవల 288 అసెంబ్లీ నియోజక వర్గాలకు జరిగిన ఎన్నికల్లో అనేక చోట్ల వివిధ రాజకీయ పార్టీలకు చెందిన బడా నాయకులు తమ కుటుంబ సభ్యులను బరిలోకి దింపారు. వార్డుల పునర్విభజన తరువాత తమకు ఓటు బ్యాంకు ఉన్న నియోజక వర్గాలు పక్కనున్న నియోజక వర్గాల్లోకి వెళ్లిపోవడం, కొన్ని నియోజక వర్గాలు వివిధ కులాలకు, మహిళలకు రిజర్వుడు కావడంతో రాజకీయ అనుభమున్న సీనియర్ నేతలకు పోటీచేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో గత్యంతరం లేక అనేక మంది నేతలు, మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ భార్యలను లేదా కుటుంబ సభ్యులను బరిలోకి దింపాల్సి వచ్చింది. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన పలువురు అభ్యర్ధులు విజయ ఢంకా మోగించారు.అనేక చోట్ల భార్యలు, కూతుళ్లు, సొంత సోదరులు, సోదరీమణులు, మామా, అల్లుడు, కోడళ్లు ఇలా దగ్గరి బంధువులు వివిధ పార్టీల టికెట్లపై లేదా ఇండి పెండెంట్లుగా బరిలోకి దిగారు. కొన్ని చోట్ల ఓడిపోయినప్పటికీ అనేక చోట్ల గెలిచారు. ఓటమి బాధించినా కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు ఎమ్మెల్యే కావడం వారిలో సంతోషాన్ని నింపింది. మహాయుతి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత జరిగే మంత్రివర్గ విస్తరణలో వీరిలో కొంతమందికి చోటు దక్కే అవకాశముండటంతో తమ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు ప్రభుత్వంలో కొనసాగుతారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బారామతిలో మామా అల్లుళ్ల పోటీకాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన ఇద్దరు అన్నదమ్ముల్లో అమిత్ దేశ్ముఖ్ విజయం సాధించగా, లాతూర్ రూరల్ నియోజక వర్గంలో పోటీచేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే ధీరజ్ దేశ్ముఖ్ ఓటమి పాలయ్యారు. అదేవిధంగా ముంబై రీజియన్ బీజేపీ అధ్యక్షుడు ఆశీష్ శేలార్ పశ్చిమమ బాంద్రా నియోజక వర్గంలో గెలిచారు. కానీ ఆయన సోదరుడు వినోద్ శేలార్ పశ్చిమ మలాడ్ నియోజక వర్గంలో ఓడిపోయారు. మాజీ మంత్రి అనీల్ దేశ్ముఖ్ తనయుడు సలిల్ దేశ్ముఖ్ కాటోల్ నియోజక వర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. కానీ ఆయన సోదరుడి కొడుకు ఆశీష్ దేశ్ముఖ్ సావనేర్ నియోజక వర్గంలో గెలిచారు. అనీల్ దేశ్ముఖ్ సొంత మేనల్లుడు, ఎంపీ అమర్ కాళే సతీమణి మయురా కాళే ఆర్వీ నియోజక వర్గంలో ఓటమిని చవిచూశారు. మంత్రి ఛగన్ భుజబల్ యేవలాలో గెలిచారు. కానీ ఆయన మేనల్లుడు సమీర్ భుజబల్ నాంద్గావ్లో పరాజయం పాలయ్యారు. బహుజన్ వికాస్ ఆఘాడి నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే హితేంద్ర ఠాకూర్ వసాయ్లో, ఆయన తనయుడు క్షితిజ్ ఠాకూర్ నాలాసోపారాలో ఓడిపోయారు. అదేవిధంగా అజిత్ పవార్ వర్గానికి చెందిన ఇంద్రనీల్ నాయిక్ పుసద్ నియోజక వర్గంలో గెలిచారు. కానీ ఆయన సోదరుడు యయాతీ (ఇండిపెండెంట్) కారంజాలో ఓడిపోయారు. ఇక బారామతిలో మేనమామ, మేనల్లుడు మధ్య పోరు జరిగింది. వీరిలో మామ అజిత్ పవార్ గెలుపొందగా, మేనల్లుడు యుగేంద్ర పరాజయం పాలయ్యారు. న్యూ ముంబైలోని ఏరోలీలో తండ్రి, కొడుకుల మధ్య పోరు జరిగింది. వీరిలో తండ్రి, మాజీ మంత్రి గణేశ్ నాయిక్ (బీజేపీ) గెలుపొందగా, తనయుడు సందీప్ నాయిక్ బేలాపూర్లో ఎస్పీ వర్గం టికెట్పై పోటీచేసి ఓడిపోయారు. ఆయన్ని బీజేపీ అభ్యర్ధి మందా మాత్రే ఓడించారు. బోకర్లో తండ్రిపై కుమార్తె విజయంగడ్చిరోలీ జిల్లా అహేరీ నియోజక వర్గం ఎన్సీపీ(ఏపీ) అభ్యర్థి, మంత్రి ధర్మరావ్బాబా ఆత్రం తన సొంత కూతురు భాగ్యశ్రీ ఆత్రంను ఓడించారు. భాగ్యశ్రీ ఇండిపెండెంట్గా, తండ్రికి ప్రత్యర్ధిగా పోటీ చేశారు. భాగశ్రీతోపాటు ఆయన మేనల్లుడైన అంబరీష్ రాజే ఆత్రం కూడా ఇండిపెండెంట్గా పోటీచేసి ఓడిపోయారు. అయినప్పటికీ కుటుంబంలో ఒకరు ఎమ్మెల్యే కావడం విశేషం. మరోవైపు నాందేడ్ జిల్లా లోహా నియోజక వర్గం నుంచి ఎన్సీపీ(ఏపీ) తరపున పోటీచేసిన మాజీ ఎంపీ ప్రతాప్రావ్ పాటిల్ చిఖిలీకర్ స్వయాన తన సోదరి ఆశా శిందేను ఓడించారు. మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ను ఆయన సొంత కూతురు శ్రీజయ బోకర్ నియోజక వర్గంలో ఓడించారు. ఆమె బీజేపీ టికెట్పై పోటీ చేశారు. బోకర్ నియోజక వర్గం అశోక్ చవాన్కు గట్టిపట్టున్న ప్రాంతంగా పేరు పొందింది. పారంపర్యంగా వస్తున్న గెలుపును మళ్లీ చేజిక్కించుకునేందుకు ఆయన ఎంతో ప్రయత్నం చేశారు. కానీ కూతురు చేతిలో చవాన్ ఓడిపోక తప్పలేదు. అయినప్పటికీ కుటుంబంలో ఒకరు ఎమ్మెల్యే అయ్యారు. ఎన్సీపీ(ఏపీ) ప్రదేశ్ అధ్యక్షుడు, ఎంపీ సునీల్ తట్కరే కుమార్తై, రాష్ట్ర క్యాబినెట్ మంత్రి అదితీ తట్కరే శ్రీవర్ధన్ నియోజక వర్గంలో ఆయన్ని ఓడించారు. చదవండి: ఈవీఎంలపై కట్టలు తెంచుకున్న జనాగ్రహం.. కరెక్టేనా?కాగా బోకర్, శ్రీవర్ధన్ రెండు చోట్ల కుమార్తైలు తండ్రులను ఓడించడం విశేషం. మరోవైపు ఆదివాసి సంక్షేమ శాఖ మంత్రి విజయ్కుమార్ గావిత్ నందుర్బార్ నియోజక వర్గంలో భారీ మెజారిటీతో గెలిచారు. కాని ఆయన ఇద్దరు సొంత సోదరులైన రాజేంద్రకుమార్ గావిత్ (కాంగ్రెస్) శహదా నియోజక వర్గంలో, శరద్ గావిత్ (ఇండిపెండెంట్) నవాపూర్ నియోజక వర్గంలో ఓడిపోయారు. అదేవిధంగా విజయ్కుమార్ గావిత్ కుమార్తై హినా గావిత్ అక్కల్కువా నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో గావిత్ కుటుంబంలో ఒక్కరికే ఎమ్మెల్యే అయ్యే అవకాశం దక్కింది. ఇక మాజీ కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ సీనియర్ నేత రావ్సాహెబ్ దానవే తనయుడు సంతోష్ దానవే బోకర్ నియోజక వర్గంలో మరోసారి గెలిచారు. కన్నడ్ నియోజక వర్గం నుంచి శివసేన ఏక్నాథ్ శిందే వర్గం టికెట్పై పోటీచేసిన రావ్సాహెబ్ కుమార్తై సంజనా విజయకేతనం ఎగురవేశారు. కాగా లోక్సభ ఎన్నికల్లో స్వయంగా రావ్సాహెబ్ ఓటమి పాలయ్యారు. కానీ పిల్లలిద్దరూ ఎమ్మెల్యేలుగా ఎన్నికవడంతో ఆయనకు డబుల్ గిఫ్ట్ లభించినట్లైంది. లాతూర్లో మాజీ ముఖ్యమంత్రి దివంగత విలాస్రావ్ దేశ్ముఖ్ ఇద్దరు తనయుల్లో ఒకరు ఓడిపోయారు.తండ్రి ఎంపీ.. కుమారులిద్దరూ ఎమ్మెల్యేలుగా ఎన్నిక మహారాష్ట్ర చరిత్రలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు కొడుకులు, తండ్రి ఇలా ముగ్గురూ అధికారంలో కొనసాగడం చర్చనీయాంశమైంది. మాజీ కేంద్ర మంత్రి నారాయణ్ రాణే ఇద్దరు కొడుకుల్లో ఒకరైన నితేష్ రాణే కంకావలి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి, రెండో కొడుకు నిలేష్ రాణే కుడాల్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి భారీ మెజారీ్టతో గెలిచారు. దీంతో వారిద్దరూ శాసనసభలో అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే నారాయణ్ రాణే ఎంపీగా కొనసాగుతున్నారు. అదేవిధంగా పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సామంత్ రత్నగిరి నియోజక వర్గం నుంచి పోటీచేసి గెలిచారు. ఆయన సోదరుడు కిరణ్ సామంత్ రత్నగిరి జిల్లా రాజాపూర్ నియోజక వర్గం నుంచి గెలిచారు. ఇరువురూ ఏక్నాథ్ శిందే వర్గం తరపున పోటీ చేశారు. అలాగే తూర్పుబాంద్రా నియోజక వర్గంలో వరుణ్ సర్దేశాయ్ విజయఢంకా మోగించారు. వరుణ్ సర్దేశాయ్, ఉద్ధవ్ ఠాక్రే సతీమణీ రష్మీ ఠాక్రేకు స్వయానా చెల్లెలి కుమారుడు. మరోవైపు ఉద్ధవ్ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రే వర్లీ నియోజక వర్గం నుంచి గెలిచారు. దీంతో వరుస సోదరులిద్దరూ అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. అదేవిధంగా రాష్ట్ర సహకార శాఖ మంత్రి దిలీప్ వల్సే పాటిల్ ఎన్సీపీ(ఏపీ) తరపున పుణేలోని అంబేగావ్ నియోజక వర్గం నుంచి పోటీచేసి గెలిచారు. ఆయన సోదరి సాయితాయి డహాకే కరాంజ నియోజక వర్గంలో బీజేపీ టికెట్పై పోటీ చేసి గెలిచారు. దీంతో ఒకే కుటుంబానికి చెందిన సోదరుడు, సోదరి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. -
మహాయుతి దెబ్బకు ‘ఎల్వోపీ’ సీటు గల్లంతు
ముంబయి: మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆధ్వర్యంలోని మహాయుతి కూటమి సునామీలా విరుచుపడింది. మహాయుతి దెబ్బకు షాక్కు గురవడం ప్రత్యర్థి పార్టీల వంతైంది. హోరాహోరీగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలుంటాయని చెప్పిన ఎగ్జిట్పోల్స్ అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి.మహారాష్ట్ర అసెంబ్లీలో ఈ టర్ములో ఏ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కే అకాశం లేకుండా పోయిందంటే మహాయుతి కూటమి ప్రభంజనం ఏ మేర ఉందో అర్థం చేసుకోవచ్చు. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కాలంటే పార్టీలకు కనీసం 29 సీట్లు రావాల్సి ఉంటుంది.అయితే ఈ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఓటమి చవిచూసిన మహావికాస్ అఘాడీ(ఎంవీఏ)కూటమిలోని ఏ పార్టీకి 29 సీట్లు రాకపోవడంతో ప్రతిపక్ష హోదా కలిగిన పార్టీ రానున్న ఐదేళ్లపాటు అసెంబ్లీలో ఉండదు. ఎంవీఏలో శివసేన(ఉద్ధవ్) పార్టీకి 20, కాంగ్రెస్కు 16, ఎన్సీపీ(శరద్పవార్) పార్టీకి 10 సీట్లు మాత్రమే వచ్చాయి. ఇక ఎన్నికల్లో విజయం సాధించిన మహాయుతి కూటమిలోని బీజేపీకి అత్యధికంగా 132, శివసేన(షిండే)పార్టీకి 57,అజిత్ పవార్ ఎన్సీపీకి 41 సీట్లు వచ్చాయి.ఇదీ చదవండి: రాజ్భవన్లో సొంత విగ్రహం.. గవర్నర్పై విమర్శలు -
అప్పులపై అడ్డగోలు లెక్కలా?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘అధికారంలోకి వచ్చి ఆర్నెల్లు అవుతోంది.. ప్రభుత్వ యంత్రాంగమంతా నీ చేతుల్లోనే ఉంది.. నీ చేతుల్లో ఉన్న అధికారులతో అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టావు.. అందులో అంకెలన్నీ నువ్వు పెట్టినవే.. ఆ లెక్కలను కాగ్(కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) కూడా ధ్రువీకరించింది.. మరి నువ్వు ప్రవేశపెట్టిన బడ్జెట్లోనే 2018–19 నాటికి అంటే నువ్వు అధికారంలోకి నుంచి దిగిపోయే నాటికి గ్యారంటీలతో కలిపి రాష్ట్ర అప్పులు రూ.3.13 లక్షల కోట్లు అని లెక్క చూపావు.. 2023–24 నాటికి అంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి గ్యారంటీలతో కలిపి రాష్ట్ర అప్పులు రూ.6.46 లక్షల కోట్లు అని తేల్చావు.. మరి ఇప్పడేమో లేదు లేదు.. రాష్ట్ర అప్పులు రూ.10.47 లక్షల కోట్లని ఒకరు.. రూ.11 లక్షల కోట్లని మరొకరు..! పక్కకు వస్తే వేరే నెంబర్లు చెబుతా అని అంటావా? గుంజీలు తీయిస్తానంటావా? సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రజలు నిలదీస్తారనే భయంతో.. బొంకిందే బొంకుతున్న నిన్ను ‘బొంకుల బాబు..’ అని ఎందుకు అనకూడదు?’’ అని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుపై మండిపడ్డారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అప్పుల నుంచి పోలవరం దాకా భిన్న అంశాలపై సీఎం చంద్రబాబు, మంత్రులు పదే పదే అబద్ధాలు చెబుతుండటాన్ని ఎండగట్టారు. కూటమి ప్రభుత్వం వైఫల్యాలు, మోసాలు, అక్రమాలపై ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులు, ప్రజాస్వామికవాదులపై అక్రమ కేసులను బనాయిస్తూ, నిర్భందిస్తూ అరాచకంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..తప్పైతే అసెంబ్లీలో ఎందుకు ప్రవేశపెట్టారు?2018–19 నాటికి రూ.3.13 లక్షల కోట్లున్న అప్పులు మా ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.6.46 లక్షల కోట్లకు చేరాయని చంద్రబాబే స్వయంగా ఒప్పుకున్నారు. ఇదే విషయాన్ని నిర్థారిస్తూ రాష్ట్ర ప్రభుత్వ పద్దులను ఆడిట్ చేసే కాగ్ ఇచ్చిన నివేదికను కూడా అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు ప్రభుత్వమే ప్రవేశపెట్టింది. అందులోనూ రాష్ట్ర అప్పు రూ.6.46 లక్షల కోట్లుగానే తేల్చారు. మరి వాస్తవాలు ఇలా ఉంటే.. ఎన్నికలకు ముందు రాష్ట్ర అప్పు రూ.11 లక్షల కోట్లు.. రూ.12.50 లక్షల కోట్లు.. రూ.14 లక్షల కోట్లని మీరు చేసింది తప్పుడు ప్రచారం కాదా? ఇలా దుష్ఫ్రచారం చేయడం ధర్మమేనా? చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీలోని తన వదినమ్మ, ఎల్లో మీడియాతో కలిసి అబద్ధాలకు రెక్కలు కట్టి ఎలా వ్యవస్థీకృత నేరాలకు (ఆర్గనైజ్డ్ క్రైమ్స్) పాల్పడుతున్నారనేందుకు రాష్ట్ర అప్పులపై వారు చేసిన దు్రష్ఫచారమే తార్కాణమని గత మీడియా సమావేశంలోనే చెప్పా. బడ్జెట్ ప్రవేశపెట్టాక కూడా రాష్ట్ర అప్పులపై అబద్ధాలను నిజాలుగా చిత్రీకరించేందుకు చంద్రబాబు దుష్ఫ్రచారం కొనసాగిస్తున్నారు. అప్పులపై బడ్జెట్లో చూపించింది తప్పైతే మరి ఆ బడ్జెట్ను అసెంబ్లీలో ఎందుకు ప్రవేశపెట్టావు బాబూ? పైగా మరో అడుగు ముందుకేసి బకాయిలపై (స్పిల్ ఓవర్ అకౌంట్స్) పదే పదే అబద్ధాలా? ప్రభుత్వం వివిధ పనులకు సంబంధించి చెల్లించాల్సిన బిల్లులు ఏటా స్పీల్ ఓవర్ కింద మరుసటి ఏడాదికి రావడం సహజం. 2019లో చంద్రబాబు దిగిపోతూ రూ.42,183 కోట్ల బకాయిలు పెట్టారు. గతంలో ఏ ప్రభుత్వాలు ఈ స్థాయిలో బకాయిలు పెట్టిన దాఖలాలు లేవు. అయినా సరే చిరునవ్వుతో ఆ బకాయిలన్నీ మేం చెల్లించాం. ఇలా సర్వసాధారణ విషయాన్ని బూతద్దంలో చూపిస్తూ ఏదో జరిగిపోతోందనే భ్రాంతి కలిగించడంలో చంద్రబాబు దిట్ట.ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా?.. మేమిచ్చినవీ ఊడగొట్టారుమెగా డీఎస్సీ అని హామీ ఇచ్చారు. ఉన్న డీఎస్సీ కూడా ఆగిపోయింది. మేం 6,100 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చాం. వీళ్లు 16,347 పోస్టులతో ఇస్తున్నామన్నారు. అది కూడా వాయిదా పడింది. ఇప్పటికి ఆర్నెల్లు గడిచిపోయాయి. అదే మేం అధికారంలోకి వచి్చన ఆర్నెళ్లు తిరగకమునుపే అక్టోబర్ 2వతేదీన గాంధీ జయంతి నాటికి గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి 1.30 లక్షల ఉద్యోగాలు సృష్టించాం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి 58 వేల మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశాం. 2.66 లక్షల మంది వలంటీర్ల నియామకాలు చేశాం. ఇవన్నీ ఆర్నెళ్ల లోపే చేశాం. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోగా.. ఉన్న ఉద్యోగాలు ఊడపీకుతున్నారు. ఇప్పటికే 2.66 లక్షల మంది వలంటీర్లు, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్లో ఔట్ సోర్సింగ్లో పని చేస్తున్న 15 వేల మందిని పీకేశారు. ఆర్థిక విధ్వంస కారుడు బాబే..» ఎఫ్ఆర్బీఎం (ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం) పరిమితికి మించి 2014–19 మధ్య రూ.28,457 కోట్లు అప్పులు చేసింది నువ్వు కాదా బాబూ? ఈ అంశాన్ని కాగ్ నివేదిక, కేంద్ర ఆర్థిక సంఘం నివేదిక కూడా స్పష్టం చేసింది. చంద్రబాబు పరిమితికి మించి అప్పులు చేయడం వల్ల ఆ మేరకు మా హయాంలో అప్పులపై కోత పడింది. మా హయాంలో కేవలం రూ.1,600 కోట్లు మాత్రమే పరిమితికి మించి అప్పులు చేశాం. ఈ గణాంకాలు చాలు.. ఎవరు ఆర్థిక విధ్వంసకారుడో.. ఎవరు ఆర్థిక క్రమశిక్షణతో నడిచారో.. ప్రభుత్వాన్ని నడిపించారో చెప్పడానికి! సూపర్ సిక్స్లు, సూపర్ సెవెన్లు ఎగ్గొట్టేందుకే చంద్రబాబు అప్పులను భూతంగా చూపే కార్యక్రమాలు చేస్తున్నాడు.» చంద్రబాబు హయాంలో కోవిడ్ లాంటి మహమ్మరి లేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేళ్ల పాటు కరోనా ప్రభావంతో రాష్ట్రానికి ఆదాయ వనరులు తగ్గిపోయాయి. అనుకోని ఖర్చులు పెరిగిపోయాయి. దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా కోవిడ్ వల్ల అనూహ్య పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ చంద్రబాబు హయాంతో పోల్చితే వైఎస్సార్సీపీ హయాంలో వార్షిక అప్పుల వృద్ధి రేటు (సీఏజీఆర్) తక్కువగానే ఉంది. నాడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చే నాటికి రూ.1.32 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర అప్పులు ఆయన దిగిపోయే నాటికి రూ.3.13 లక్షల కోట్లకు చేరగా.. సీఏజీఆర్ 19.54 శాతంగా నమోదైంది. అనంతరం మా హయాంలో అప్పులు రూ.3.13 లక్షల కోట్ల నుంచి రూ.6.46 కోట్లకు చేరాయి. సీఏజీఆర్ 15.61 శాతంగా ఉంది. అంటేæ చంద్రబాబు హయాంలో కంటే వార్షిక అప్పుల వృద్ధి రేటు 4 శాతం తక్కువగా ఉన్నట్లు ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ గణాంకాలలోనే స్పష్టంగా కనిపిస్తోంది. ఎవరు ఆర్ధిక విధ్వంసకారుడో చెప్పేందుకు ఈ లెక్కలే సాక్ష్యం. » నాన్ గ్యారంటీ అప్పులు బడ్జెట్లోకి రావు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలయిన ఎస్బీఐ, ఐవోసీ, హెచ్పీసీఎల్ లాంటి సంస్థలు చేసే అప్పులు కూడా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఖాతాలో కనిపించవు. ఎందుకంటే ఇవన్నీ నాన్ గ్యారంటీ అప్పులు కాబట్టి. అయినా సరే ఈ నాన్ గ్యారంటీ అప్పులు కూడా కలిపి చూసినా నాడు చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి రూ.8,638 కోట్లుగా ఉంటే ఆయన దిగిపోయే నాటికి రూ.77,229 కోట్లకు తీసుకుపోయిన ఘనత కూడా బాబుదే. మా హయాంలో వాటిని రూ.75,386 కోట్లకు తగ్గించాం. అంటే రూ.2 వేల కోట్లకుపైగా అప్పులు తగ్గించాం. ఈ నాన్ గ్యారంటీ అప్పుల వార్షిక వృద్ధి రేటు చంద్రబాబు హయాంలో 54.98 శాతం ఉంటే మా హయాంలో అది 0.48 శాతం తగ్గింది. రాష్ట్ర అప్పులు, గ్యారంటీ అప్పులు, నాన్ గ్యారంటీ అప్పులు కలిపి చూస్తే నాడు చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి రూ.1.40 లక్షల కోట్లు ఉన్న అప్పులు ఆయన దిగిపోయే నాటికి రూ.3.90 లక్షల కోట్లకు పెరిగాయి. అంటే అప్పుల వార్షిక వృద్ధిరేటు 22.63 శాతంగా నమోదైంది. మా హయాంలో ఆ అప్పులు రూ.3.90 లక్షల కోట్ల నుంచి రూ.7.21 లక్షల కోట్లకు చేరాయి. అంటే అప్పుల వార్షిక వృద్ధి రేటు 13.57 శాతం మాత్రమే. ఈ లెక్కలు చూస్తే ఎవరు ఆరి్ధక విధ్వంసకారుడో ఇట్టే అర్ధమవుతుంది. » చంద్రబాబు ఏ స్థాయిలో అబద్ధాలు ఆడతారో ఇంకొక ఉదాహరణ చెప్పాలి. మా హయాంలో తలసరి ఆదాయం 9 నుంచి 2 శాతానికి తగ్గినట్టు తప్పుడు లెక్కలతో మరో అబద్ధాన్ని ప్రచారం చేశాడు. చంద్రబాబు సర్కార్ దిగిపోయేనాటికి 2018–19లో రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం రూ.1.54 లక్షలు మాత్రమే ఉంటే మా హయాంలో 2024 మార్చి నాటికి రూ.2,42,479గా నమోదైంది. తలసరి ఆదాయంలో చంద్రబాబు హయాంలో మన రాష్ట్రం దేశంలో 18వ స్థానంలో ఉంటే.. రెండేళ్లు కోవిడ్ లాంటి ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ మా హయాంలో 15వ స్థానానికి ఎగబాకింది. ఈ ఏడాది లెక్కలు కూడా కలిపితే మరో 3 స్థానాలు పెరిగే అవకాశం ఉంటుంది. 2019–24 మధ్య ఏ రంగాన్ని తీసుకున్నా సరే ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏపీ వృద్ధి రేటు దేశం కంటే ఎక్కువగా ఉంది. అయినా సరే వాస్తవాలకు ముసుగేసి చంద్రబాబు వక్రీకరిస్తూ దు్రష్ఫచారం చేస్తున్నారు. ప్రతికూలతలోనూ పారిశ్రామిక వృద్ధి..బడ్జెట్ సమావేశాల్లో చంద్రబాబు మాట్లాడుతూ 2014–19 వరకు రాష్ట్ర వృద్ధి రేటు 13.50 శాతం ఉంటే 2019–24 మధ్య 10.60 శాతానికి పడిపోయిందన్నారు. బాబూ..! నీ హయాంలో కోవిడ్ లేదు. ప్రపంచమంతా రెండేళ్ల పాటు కోవిడ్తో అతలాకుతలమైంది. 2014–19తో పోల్చి చూస్తే గత ఐదేళ్లలో వృద్ధి రేటు ప్రతి రాష్ట్రంలోనూ తక్కువే ఉంది. దేశ వృద్ధి రేటు చూస్తే 2014–19 మధ్య 10.97 శాతం ఉంటే 2019–24 మధ్య 9.28 శాతం ఉంది. 2014–19 మధ్య మన రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సగటున 11.92 శాతం ఉండగా 2019–24 మధ్య 12.61 శాతంగా నమోదైంది. ఇవేమీ నేను చెప్పిన లెక్కలు కాదు. బడ్జెట్తో పాటు చంద్రబాబు ప్రవేశపెట్టిన సామాజిక ఆరి్థక సర్వే నివేదికలో వెల్లడించిన అంశాలే ఇవన్నీ! రాష్ట్ర పారిశ్రామిక రంగంలో స్థూల వస్తు ఉత్పత్తి విలువ (జీవీఏ) చూస్తే 2014–19 మధ్య రూ.1.07 లక్షల కోట్ల నుంచి రూ.1.88 లక్షల కోట్లకు పెరిగింది. అంటే వార్షిక వృద్ధిరేటు 11.92 శాతంగా నమోదైంది. అదే 2019–24 మధ్య కోవిడ్ ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ రూ1.88 లక్షల కోట్ల నుంచి రూ.3.41 లక్షల కోట్లకు పెరిగింది. అంటే వార్షిక వృద్ధిరేటు 12.61 శాతం పెరిగింది. జాతీయ స్థాయి వృద్ధి రేటుతో పోల్చితే పారిశ్రామిక రంగంలో జీవీఏలో 2018–19లో 11 స్థానంలో ఉన్న రాష్ట్రం 2019–24 మధ్య 8వ స్థానంలోకి ఎగబాకింది. ఏపీ ఇండస్ట్రీ ఉత్పత్తి విలువ (జీవీఏ) 12.61 శాతం ఉంటే దేశంలో సగటున ఉత్పత్తి విలువ 8.17 శాతంగా నమోదైంది. అంటే పారిశ్రామికాభివృద్ధి దేశంలో కంటే రాష్ట్రంలో 4 శాతం ఎక్కువగా ఉంది. మేకపిల్ల – కుక్కపిల్ల కథలో గజదొంగల్లా..!చంద్రబాబు అబద్ధాలు చూస్తే ఓ కథ గుర్తుకొస్తోంది. ఒక ఊరిలో ఓ అమాయకుడు భుజాన మేకపిల్లను వేసుకుని అమ్ముకోవాలని బజారుకు బయలుదేరతాడు. ఇంటి గడప దాటగానే ఒకడొచ్చి నీ కుక్క భలే ఉందంటాడు! దాంతో ఆ అమాయకుడు ఆలోచనలో పడతాడు. వీధి చివరికి వచ్చేసరికి మరొకడు ఎదురై నీ కుక్క పిల్ల చాలా తెల్లగా, బాగుంది అంటాడు. ఎక్కడి నుంచి తెచ్చావు? అంటాడు. మళ్లీ ఆ అమాయకుడు సందిగ్ధంలో పడి.. ఇది మేకపిల్లే.. కుక్కపిల్ల కాదు.. నీకు కళ్లు కనిపించట్లేదా అనుకుంటూ ముందుకువెళ్తాడు. అక్కడి నుంచి కిలోమీటరు ముందుకు వెళ్లేసరికి ఇంకొకడు కనిపిస్తాడు. అరే.. నీ కుక్కపిల్ల బాగుంది.. నాకు అమ్ముతావా? అంటాడు! ఇక.. ఆ అమాయకుడిలో గందరగోళం ప్రారంభం అవుతుంది. నేను మేక పిల్లలను భుజాన వేసుకుని వెళ్తుంటే ఇంతమంది అది కుక్క పిల్లే అని అంటున్నారు. నా కళ్లకు ఏమైనా అయ్యిందా? నాకు ఏమైనా జరిగిందా? అనే అనుమానంతో మేకపిల్లను కిందకు దించి నాకు మేకపిల్లా వద్దూ.. కుక్క పిల్లా వద్దూ! అనుకుని వెళ్లిపోతాడు. ఈ కథ చంద్రబాబు వ్యవస్థీకృత నేరానికి పాల్పడుతూ రాష్ట్రాన్ని ఎలా కబళిస్తున్నారో చెప్పేందుకు అతికినట్లు సరిపోతుంది. ఈ కథలో తొలి వ్యక్తి పేరు చంద్రబాబు! రెండో వ్యక్తి దత్తపుత్రుడు! మూడో వ్యక్తి బీజేపీలో ఉన్న తన వదినమ్మ..! నాలుగో వ్యక్తి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5..లాంటి ఎల్లో మాఫియా. వీళ్లంతా కలిసి ఆంధ్రప్రదేశ్కు లేని అప్పులు ఉన్నట్టుగా వ్యవస్థీకృత నేరానికి పాల్పడి ఒక అబద్ధానికి రెక్కలు కట్టి ప్రచారం చేస్తున్నారు. ఇదంతా సూపర్ సిక్స్లు, సూపర్ సెవన్లు ప్రజలకు ఇవ్వకుండా మోసం చేసేందుకే. ఈ కథలో రాష్ట్ర ప్రజలు అమాయకులు అయితే.. మేక పిల్ల మన రాష్ట్రం. ఆ నలుగురు గజదొంగలు కలసి కింద పడేసిన మేకను తీసుకెళ్లి బిర్యానీ వండుకుని పంచుకుని తిన్నట్లుగా.. ఈ నలుగురు రాష్ట్ర ప్రజలను మోసం చేసి రాష్ట్రాన్ని దోచేసే పంచుకు తింటున్నారు. ఇంతకంటే దిక్కుమాలిన ప్రభుత్వం ఉంటుందా?ఆరోగ్యశ్రీ గతంలో వెయ్యి ప్రొసీజర్స్కు మాత్రమే పరిమితం కాగా మేం 3,300 ప్రొసీజర్స్కు పెంచి రూ.25 లక్షల వరకు పేదలకు ఉచిత వైద్యాన్ని అందించేలా పథకాన్ని విస్తరించాం. గతంలో చంద్రబాబు పాలనలో ఆరోగ్యశ్రీ బిల్లులు రూ.వెయ్యి కోట్ల కంటే తక్కువే ఉన్న పరిస్థితి నుంచి మా హయాంలో ఏకంగా రూ.3,762 కోట్లకు చేరాయి. కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సామాజిక ఆరి్థక సర్వే నివేదికను పరిశీలిస్తే 2023–24లో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం అని పేర్కొన్నారు. 2023–24లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఉండగా దాన్ని మార్చేసి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ స్కీంగా పెట్టేశారు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద 13,22,319 మంది రోగులకు మేలు చేశారట! రూ.3,762 కోట్లు ఖర్చు చేశారట! 1–4–2023 నుంచి 31–3–2024 మధ్య ఎవరి ప్రభుత్వం ఉంది? వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.3,762 కోట్లు ఖర్చు చేసి 13 లక్షల మందికిపైగా పేదలకు వైద్యం అందిస్తే ఆ మంచి ఎక్కడ వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి వస్తుందోననే ఆందోళనతో ఇలా చేశారు. మేం ఖర్చు పెట్టింది వాళ్లు (చంద్రబాబు) వ్యయం చేసినట్లు రాసుకుని.. దొంగ పబ్లిసిటీ.. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటే మీకంటే (చంద్రబాబు) దిక్కుమాలిన ప్రభుత్వం ఇంకొకటి ఉంటుందా? నాలుగు నెలల నుంచి జీతాలు అందట్లేదని 104, 108 ఉద్యోగులు ధర్నాలు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లులను పెండింగ్లో పెట్టేశారు. రోగుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. మా హయాంలో జీరో వేకెన్సీ పాలసీతో తగినంత మంది స్పెషలిస్టు డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకున్నాం. 17 కొత్త వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టాం. పులివెందుల సహా మరో రెండు కొత్త కాలేజీలకు కేంద్ర ప్రభుత్వం సీట్లను కేటాయించినా అడ్డుపడిన చరిత్ర మీది. 32.79 లక్షల మందికి ఉద్యోగాలు..అసెంబ్లీలో చంద్రబాబు ప్రవేశపెట్టిన సామాజిక ఆర్ధిక సర్వే నివేదికలో పేర్కొన్న గణాంకాలను పరిశీలిస్తే.. ఎంఎస్ఎంఈ రంగంలో ఆయన హయాంలో 2014–19 మధ్య 8.67 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తే.. వైఎస్సార్సీపీ హయాంలో 2019–24 మధ్య 32,79,770 ఉద్యోగాలు కల్పించినట్లు వెల్లడైంది. ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందనేందుకు ఈ గణాంకాలే నిదర్శనం. భారీ, మెగా ప్రాజెక్టులతో మా హయాంలో 1,02,407 ఉద్యోగాలు కల్పిస్తే చంద్రబాబు హయాంలో ఉపాధి కల్పన చాలా తక్కువగా నమోదైంది. మేనిఫెస్టోతో మోసం..చంద్రబాబు అధికారంలోకి రావడానికి ఆర్గనైజ్డ్ క్రైమ్ను ఉపయోగించారు. సూపర్ సిక్స్లు, సూపర్ సెవన్లు అంటూ హామీలిచ్చి మేనిఫెస్టో అంటూ ఒక మాయా పుస్తకాన్ని రచించారు. దాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లి ప్రచారం చేశారు. ప్రతి ఒక్కరి మనోభావాలతో ఆడుకుని, వాడుకున్నారు. ఉచిత బస్సు, గ్యాస్ సిలిండర్లు సూపర్ సిక్స్లు, సూపర్ సెవన్లలో అతి చిన్న అంశాలు! కూటమి నాయకులు ఎన్నికల వేళ ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లిన సమయంలో చిన్న పిల్లలు కనిపిస్తే చాలు.. ఎంత మంది ఉన్నా సరే.. నీకు రూ.15 వేలు.. నీకు రూ.15 వేలు.. నీకు రూ.15వేలు..నీకు రూ.15 వేలు.. సంతోషమా? అనేవాళ్లు. వాళ్ల అమ్మ.. చిన్నమ్మలు బయటకొస్తే నీకు రూ.18 వేలు.. నీకు రూ.18 వేలు.. నీకు రూ.18 వేలు.. అనేవాళ్లు! అంతటితో ఆగకుండా ఆ ఇంట్లో పెద్ద వయసు మహిళలు కనిపిస్తే నీకు రూ.48 వేలు..నీకు రూ.48 వేలు.. నీకు రూ.48 వేలు అనేవాళ్లు. ఇంట్లో 26 ఏళ్ల యువకుడు కనిపిస్తే నీకు రూ.36 వేలు.. నీకు రూ.36 వేలు..నీకు రూ.36 వేలు అనేవాళ్లు.రైతు కనిపిస్తే నీకు రూ.20 వేలు.. సంతోషమా? అనేవాళ్లు. ఇవన్నీ సూపర్ సిక్స్లో భాగమే. పెద్దవి కూడా. మోసాల్లో భాగంగా ఇవన్నీ ఎలాగూ చేయరనుకుంటే చిన్న చిన్న వాటిల్లోనూ మోసాలే! రాష్ట్రంలో యాక్టివ్ గ్యాస్ కనెక్షన్లు 1.55 కోట్లు ఉన్నాయి. కర్నాటకలో 1.84 కోట్లు, కేరళలో 96 లక్షలు, తమిళనాడులో 2.33 కోట్లు, తెలంగాణలో 1.24 కోట్లున్నాయి. ఏపీలోని 1.55 కోట్ల కనెక్షన్లకు సిలిండర్కు రూ.895 చొప్పున ఏడాదికి మూడు సిలిండర్లు ఇచ్చేందుకు రూ.4,200 కోట్లు ఖర్చవుతుంది. బడ్జెట్లో మాత్రం రూ.895 కోట్లే పెట్టారు. అంటే ఇచ్చేది ఒక్క సిలిండర్.. అది కూడా అందరికీ ఇవ్వరు. ఒక్కో సిలిండర్ ఇవ్వాలంటే ఏడాదికి రూ.1,400 కోట్లు కావాలి. అందరికీ ఇవ్వడానికి నీకు (చంద్రబాబు) మనసు లేదు. 40 లక్షల మంది మాత్రమే లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారని అసెంబ్లీలో నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు. ఆర్థిక మంత్రి ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తామంటారు. పౌరసరఫరాల శాఖ మంత్రి ఈ సంవత్సరానికి ఒకటే ఇస్తామంటారు. ఒక మంత్రి చెప్పేదానికి.. ఇంకో మంత్రి చెప్పేదానికి పొంతన లేదు. పోనీ ఒక్కటన్నా అందరికీ ఇస్తున్నారంటే అదీ లేదు. దారుణమైన అబద్ధాలు, మోసాలకు ఇది నిదర్శనం కాదా? -
నా ఆలోచనలతో సంపద సృష్టిస్తా: చంద్రబాబు
సాక్షి, అమరావతి : ‘అన్ని వర్గాల వారిలో మా ప్రభుత్వంపై ఆకాంక్షలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, హామీల అమలుకు అప్పులు తేవాలంటే ఎఫ్ఆర్బీఎం షరతులున్నాయి. అమ్మడానికి ఆస్తులు కూడా లేవు’.. అని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. హామీలు అమలుచేయడానికి డబ్బుల్లేవుగానీ, తన దగ్గర కొత్త ఆలోచనలున్నాయని చెప్పారు. వాటితో సంపద సృష్టించి, పేదరికాన్ని నిర్మూలిస్తానన్నారు. బడ్జెట్పై శుక్రవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కూటమి నుంచి 21 మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారని.. ఫలితంగా ఢిల్లీలో పలుకుబడి పెరిగిందన్నారు. హామీల అమలుకు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచి సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చుపెడతామని.. ఇందులో భాగంగా ఆరు కొత్త పాలసీలను ప్రకటించామని సీఎం చెప్పారు. గడిచిన ఐదేళ్లలో వైఎస్సార్సీపీ పాలనతో ప్రభుత్వంలోని అన్ని శాఖలు అస్తవ్యస్థంగా మారాయని, వివిధ పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయని ఆయన ఆరోపించారు. ఇది ఉత్తమ బడ్జెట్.. రూ.2.94 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టామని.. ఇది ఎంతో ఉత్తమ బడ్జెట్ అని చంద్రబాబు అభివర్ణించారు. ఎన్నికల సమయంలో ఇచి్చన సూపర్ సిక్స్ హామీలను పూర్తిగా నెరవేరుస్తూ అదనపు హామీలను అమలుపరుస్తున్నామని చెప్పారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ముందుకెళ్తున్నామన్నారు. ఇప్పటికే కేంద్రం నుంచి వచ్చిన నిధులతో అమరావతిని పట్టాలెక్కించామని.. గోదావరి, పెన్నా, వంశధార నదుల అనుసంధానానికీ చర్యలు తీసుకుంటామన్నారు. ఇక సంక్రాంతిలోపు రహదారులపై గుంతలన్నింటినీ పూడుస్తామని.. నూతన మద్యం పాలసీ అమలుతో రాష్ట్రంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మద్యం బ్రాండ్లన్నింటినీ అందుబాటులోకి తెచ్చామని.. ప్రజలు కూడా తమ జీవితాలు ఎలా మారాయో చర్చించుకోవాలన్నారు. భూములు అమ్ముకుంటే రాజధాని నిర్మాణం పూర్తి.. ఇక అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు అని చంద్రబాబు చెప్పారు. రాజధాని కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టే అవసరంలేదని తాను గతంలో చాలా సందర్భాల్లో చెప్పానన్నారు. ఇక్కడ 10 వేల ఎకరాల భూమి ఉందని.. దీనిని అమ్ముకుంటే దశల వారీగా రాజధాని నిర్మాణం పూర్తవుతుందని ఆయన తెలిపారు. ఆడబిడ్డల రక్షణ కోసం తమ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని.. సోషల్ మీడియాలో వారిని కించపరిచేలా పోస్టులు పెడితే వారు ఏ పార్టీ వారైనా విడిచిపెట్టబోమని హెచ్చరించారు. డిసెంబరులోగా పేదలకు లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తిచేస్తామన్నారు. ఇసుక విధానంపై మా ఎమ్మెల్యేలే అసహనంతో ఉన్నారు.. సభలో ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. అమరావతి కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన రూ.15 వేల కోట్లు గ్రాంటా అప్పా అనే సందేహాలపై త్వరలోనే స్పష్టత వస్తుందన్నారు. అప్పులపై ఆధారపడితే రాష్ట్రం ఎక్కువ కాలం మనుగడ సాగించలేదని.. గత ప్రభుత్వంలో చేసిన అప్పుల్లో 80 శాతం మేర సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చుపెట్టారని.. అదే బాబు పాలనలో చేసిన అప్పుల్లో 40 శాతం మాత్రమే సంక్షేమానికి ఖర్చుచేశారని పయ్యావుల చెప్పారు. నూతన ఇసుక విధానాన్ని తీసుకొచ్చామని.. అయితే, దీనిపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. అంతేకాక, చాలా జిల్లాల్లో సమస్యలు ఉన్నట్లు తమ ఎమ్మెల్యేలే అసహనం వ్యక్తంచేస్తున్నారని పయ్యావుల సభ దృష్టికి తీసుకొచ్చారు. ఇక ఇసుక పాలసీలో ప్రభుత్వానికి మంచిపేరు రావడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. -
ఇసుక పాలసీ బాలేదన్న జ్యోతుల.. మైక్ కట్ చేసిన రఘురామ!
సాక్షి, గుంటూరు: ఇసుక పాలసీపై సొంత పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇసుక పాలసీ అంత మంచిగా లేదని ఇసుక పాలసీపై ప్రభుత్వం పునరాలోచించాలని జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. బడ్జెట్పై చర్చ సందర్భంగా మాట్లాడిన జ్యోతుల.. ఇసుక విధానాన్ని వ్యతిరేకించారు. సామాన్యులకు అందే పరిస్థితి లేదని అసెంబ్లీలో ప్రస్తావించారు. ఇసుక పక్క రాష్ట్రాలకు పోతుందని మాట్లాడుతుండగానే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మైక్ కట్ చేసేశారు.తాను అందరికంటే సీనియర్నని.. మాట్లాడేందుకు కొంత సమయం ఇవ్వాలంటూ స్పీకర్ని జ్యోతుల నెహ్రూ రిక్వెస్ట్ చేశారు. అయినా కూడా ఆయన విజ్ఞప్తిని పట్టించుకోకుండా డిప్యూటీ స్పీకర్ మైక్ కట్ చేశారు. మైక్ లేకపోయినా తన ప్రసంగాన్ని జ్యోతుల కొనసాగించారు. రెండు నిమిషాల సమయం ఇవ్వాలంటూ మిగిలిన సభ్యులు చెప్పగా, జ్యోతుల నెహ్రూ ప్రసంగ సమయంలో రఘురామకృష్ణం రాజు అసహనం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు విజయసాయిరెడ్డి సవాల్కాగా, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం భవన నిర్మాణ రంగానికి శాపంగా మారింది. నిర్మాణ రంగంలో ప్రధానమైన ముడి సరకు ఇసుక. కూటమి ప్రభుత్వ విధానం పుణ్యమా అని.. పేరుకు ఉచితమే అయినా.. ఇసుక కోసం వస్తున్న వారిని అధికారం అండతో అక్రమార్కులు ఎక్కడికక్కడ నిలువు దోపిడీ చేస్తున్నారు. ముక్కుపిండి మరీ అధిక ధరలు వసూలు చేస్తున్నారు.ఒక యూనిట్ ఇసుకను రూ.5వేల నుంచి రూ.10 వేల వరకూ విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారంటే ఇసుక దోపిడీ ఏ రీతిలో జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఆన్లైన్లో కంటే ఆఫ్లైన్లోనే ఇసుక విక్ర యాలు అధికంగా జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం, అధికారులు చెబుతున్న మాటలకు, ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద పరిస్థితికి ఏమాత్రం పొంతన ఉండటం లేదు. పలు ర్యాంపుల్లో రాత్రి వేళ యథేచ్ఛగా ఇసుక తవ్వుతూ వందలాది లారీల్లో ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. -
మాక్ అసెంబ్లీలో చిన్నారులతో రేవంత్
-
జగన్ హయాంలో జనహిత పాలన
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ హయాంలో సామాజిక రంగం వ్యయం భారీగా పెరిగిందని కాగ్ (కంప్టోల్రర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదిక స్పష్టం చేసింది. 2023–24 ఆర్థి క సంవత్సరానికి సంబంధించిన ఆర్థి క నివేదికను కాగ్ బుధవారం అసెంబ్లీకి సమర్పించింది. సామాజికరంగ వ్యయంతో పాటు 2023–24 ఆర్థిక సంవత్సరంలో డీబీటీ ద్వారా గ్రాంట్ రూపంలో ఇచ్చిన వివరాలతోపాటు స్థానిక సంస్థలు, ఇతర సంస్థలకు గడచిన ఐదేళ్లలో గ్రాంటు రూపంలో ఇచ్చిన మొత్తం ఎలా పెరిగిందనే వివరాలను.. ఐదేళ్లలో పన్ను ఆదాయం పెరుగుదలను కాగ్ వివరించింది. సామాజిక రంగంలో (ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, నీటి సరఫరా, ఎస్సీ, ఎస్టీ తదితర సంక్షేమాలకు) 2022–23లో రూ.88,647 కోట్లు వ్యయం చేయగా 2023–24లో రూ.97,396 కోట్లు వ్యయం చేసినట్టు కాగ్ స్పష్టం చేసింది. అలాగే 2023–24 ఆర్థిక సంవత్సరంలో వేతనాల తరువాత అత్యధిక వ్యయం డీబీటీ ద్వారా గ్రాంటుగా ఇచ్చినట్టు వెల్లడించింది. అలాగే రాష్ట్ర సొంత పన్నులు, కేంద్ర పన్నుల వాటా రాబడి 2019–20లో రూ.85,843 కోట్లు ఉండగా.. 2023–24 నాటికి రూ.1,31,633 కోట్లకు పెరిగినట్టు నివేదిక స్పష్టం చేసింది. అలాగే స్థానిక సంస్థలు, ఇతర సంస్థలకు గ్రాంటు రూపంలో 2019–20లో రూ.59,915 కోట్లు ఇవ్వగా.. 2023–24 నాటికి ఆ గ్రాంట్ మొత్తం రూ.91,248 కోట్లకు పెరిగినట్టు వివరించింది. -
నేటి నుంచి అసెంబ్లీ
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా ప్రజల కళ్లుగప్పటం... రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలపై ఎవరూ ప్రశ్నించకుండా రెడ్బుక్ అమలుతో దృష్టి మళ్లింపు రాజకీయాలే లక్ష్యంగా సాగుతున్న సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు సోమవారం శాసనసభలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. నేటి ఉదయం 9 గంటలకు అసెంబ్లీలోని సీఎం చాంబర్లో చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశమై బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది. అనంతరం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. శాసన సభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ను ప్రవేశపెడతారు. అదే సమయానికి శాసన మండలిలో గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ను ప్రవేశపెడతారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడం పూర్తి అయిన అనంతరం వ్యవసాయ బడ్జెట్ను ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సభలో ప్రవేశపెడతారు. మండలిలో మంత్రి నారాయణ వ్యవసాయ బడ్జెట్ను చదువుతారు.సూపర్ సిక్స్ హామీల్లో పేర్కొన్నట్లుగా యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదంటే నెలకు రూ.3 వేలు చొప్పున భృతి, స్కూల్కు వెళ్లే ప్రతి విద్యార్థికీ తల్లికి వందనం కింద ఏడాదికి రూ.15 వేలు, రైతన్నలకు ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం, ప్రతి మహిళకు (19–59 ఏళ్ల వయసు) నెలకు రూ.1,500 చొప్పున ఆర్థిక సాయం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం లాంటి వాగ్దానాలను నెరవేర్చకుండా మభ్యపెడుతున్న కూటమి సర్కారు అసెంబ్లీ సమావేశాలను సైతం డైవర్షన్ రాజకీయాలకే వినియోగించుకోవాలని ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై యథేచ్ఛగా జరుగుతున్న అఘాయిత్యాలు, లైంగిక దాడులు, హత్యలు, శాంతి భద్రతల వైఫల్యం నుంచి దృష్టి మళ్లించేందుకు.. ఇప్పుడే కొత్తగా సోషల్ మీడియాలో పోస్టులు వచ్చినట్లు, వాటిపైనే చర్చించాలనే వైఖరితో ప్రభుత్వం ఉందనే అభిప్రాయాన్ని అధికార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. పలుచోట్ల మైనర్ బాలికలు అత్యాచారాలు, హత్యలకు గురి కావడం నుంచి దృష్టి మళ్లించడమే లక్ష్యంగా సోషల్ మీడియా పోస్టులపై ప్రభుత్వ పెద్దలు ఇటీవల గగ్గోలు పెడుతున్నారు. ఇదే అంశాన్ని అసెంబ్లీలో కూడా ప్రస్తావించాలని సన్నద్ధమైనట్లు సమాచారం. మరోపక్క సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి బడ్జెట్ సమావేశాల్లో గత సర్కారుపై ఆరోపణలు, నిందలు మోపేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. సూపర్ సిక్స్ హామీ కింద యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని లేదంటే నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని కూటమి పార్టీలు హామీలిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు దీనిపై సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సూపర్ సిక్స్ హామీ కింద స్కూల్కు వెళ్లే ప్రతి విద్యార్థికీ ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఇస్తామన్నారు. దీని గురించి కూడా సర్కారు నోరు విప్పడం లేదు. ఏటా రైతన్నలకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని ఇస్తామన్నారు. ప్రతి మహిళకు (19–59 ఏళ్ల వరకు) నెలకు రూ.1,500 చొప్పున ఆర్థిక సాయాన్ని ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇన్నాళ్లూ వీటి అమలు గురించి ప్రస్తావించకుండా డైవర్షన్ రాజకీయాలతో కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి బడ్జెట్లో ఈ పధకాలకు కేటాయింపులు ఉంటాయో లేదో నేడు తేలనుంది. ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాలుగు నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. అనంతరం అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టకుండా మరో నాలుగు నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ నెలాఖరుతో గడువు ముగుస్తుండటంతో పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతోంది.శాసన సభ సమావేశాల నేపథ్యంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు బందోబస్తు ఏర్పాట్లపై డీజీపీ ద్వారకా తిరుమల రావు, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి పోలా భాస్కర్, శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్తో ఆదివారం సమీక్షించారు. -
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ స్పీకర్గా అబ్దుల్ రహీమ్ రాథర్
శ్రీనగర్: కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్ అసెంబ్లీ తొలి సమావేశాలు నేటి(సోమవారం) నుంచి ప్రారంభమయ్యాయి. సీనియర్ నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) నేత, చరార్-ఎ-షరీఫ్ స్థానం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన అబ్దుల్ రహీమ్ రాథర్ అసెంబ్లీ స్పీకర్గా ఎన్నికయ్యారు.ఐదు రోజుల పాటు కొనసాగనున్న ఈ అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజున ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ప్రొటెం స్పీకర్ ముబారక్ గుల్ కొత్త అసెంబ్లీ స్పీకర్ అబ్దుల్ రహీమ్ రాథర్కు నూతన బాధ్యతలను అప్పగిస్తూ, అభినందనలు తెలియజేశారు. 80 ఏళ్ల అబ్దుల్ రహీమ్ రాథర్ గతంలో కూడా జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో స్పీకర్ పదవిని నిర్వహించారు. 2002 నుంచి 2008 వరకు పీడీపీ-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు.సోమవారం జరిగే అసెంబ్లీ తొలి సమావేశంలో స్పీకర్ను ఎన్నుకుంటారని అసెంబ్లీ సచివాలయం ఇంతకుముందు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా నరేంద్ర సింగ్ రైనాను బీజేపీ ఎన్నుకుంది. అదే సమయంలో ప్రతిపక్ష నేత బాధ్యతలను సునీల్ శర్మకు అప్పగించారు. అబ్దుల్ రహీమ్ రాథర్ ఏడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇది కూడా చదవండి: అది ఫేక్ సర్వే: తాజా పోల్పై మండిపడ్డ ట్రంప్ -
జార్ఖండ్ ఎన్నికల్లో విచిత్రం.. సక్సెస్ @ 60
రాంచీ: జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు యువ నాయకత్వానికి ఝలక్ ఇస్తూ, అనుభవజ్ఞులకు మద్దతు పలుకుతున్నారు. రాష్ట్రంలో గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన గణాకాంలను పరిశీలిస్తే, పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.2005 ఎన్నికల్లో రాష్ట్రంలో 60 ఏళ్లు పైబడిన 18 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా, వీరిలో ఐదుగురు విజయం సాధించారు. గెలుపొందిన 60 ఏళ్లు పైబడిన అభ్యర్థుల్లో కడియా ముండా, ఇందర్ సింగ్ నామ్ధారి లోక్నాథ్ మహతో తదితరులు ఉన్నారు. నాటి ఎన్నికల్లో 60 ఏళ్లు పైబడిన రాజేంద్ర ప్రసాద్ సింగ్, యమునా సింగ్, సమరేష్ సింగ్ (ముగ్గురూ మరణించారు) ఓడిపోయారు. 2005 ఎన్నికలలో కడియా ముండా, హరు రాజ్వర్లు 68 ఏళ్లు దాటిన అభ్యర్థులు వీరిద్దరూ ఎన్నికల్లో గెలిచారు. అయితే అత్యంత వృద్ధ అభ్యర్థి డాక్టర్ విశేశ్వర్ ఖాన్ (83) నాటి ఎన్నికల్లో ఓడిపోయారు.2009 ఎన్నికల్లో కూడా రాష్ట్ర ఓటర్లు అనుభవజ్ఞులపై నమ్మకం వ్యక్తం చేశారు. 2005తో పోలిస్తే జార్ఖండ్ అసెంబ్లీలో 60 ఏళ్లు పైబడిన నేతల సంఖ్య పెరిగింది. 2005లో ఈ సంఖ్య ఐదు కాగా, 2009లో ఎనిమిదికి పెరిగింది. ఈ ఎన్నికల్లో రాజేంద్ర సింగ్, సమేష్ సింగ్లు తిరిగి ఎన్నికల్లో పోటీచేశారు. రాజేంద్ర సింగ్ బెర్మో నుంచి, సమరేష్ సింగ్ బొకారో నుంచి గెలుపొందారు. అలాగే మాజీ స్పీకర్ ఇందర్ సింగ్ నామ్ధారి 2007లో తన 63 ఏళ్ల వయసులో అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. 2009లో ఛత్ర ఎంపీ అయ్యారు. ఎన్నికల్లో గెలిచిన 60 ఏళ్లు పైబడిన అభ్యర్థుల్లో సైమన్ మరాండి (61), నలిన్ సోరెన్ (61), ఫూల్చంద్ మండల్ (66), మన్నన్ మల్లిక్ (64), సవన లక్రా (69), చంద్రశేఖర్ దూబే అలియాస్ దాదాయ్ దూబే (66) తదితరులు ఉన్నారు.2014 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక వయసు కలిగిన అభ్యర్థి ఫూల్చంద్ మండల్ (71 సంవత్సరాలు)విజయం సాధించారు. 60 ఏళ్లు పైబడిన అభ్యర్థులు సరయూ రాయ్ (63), రామచంద్ర చంద్రవంశీ (68), రాజ్ కిషోర్ మహతో (68), యోగేశ్వర్ మహతో (60), అలంగీర్ ఆలం (60), స్టీఫెన్ మరాండి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో 60 ఏళ్లు పైబడిన 20 మంది ప్రధాన అభ్యర్థులు ఉండగా, వారిలో 10 ఎన్నికల్లో విజయం సాధించగా, 10 ఓడిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయిన వారిలో హాజీ హుస్సేన్ అన్సారీ (66), లాల్ చంద్ మహతో (62), మాధవ్ లాల్ సింగ్ (62), రాజేంద్ర ప్రసాద్ సింగ్ (68), సమరేష్ సింగ్ (73) తదితరులు ఉన్నారు.2019లో 60 ఏళ్లు పైబడిన 27 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేశారు. వీరిలో 17 మంది విజేతలుగా నిలిచారు. ఎన్నికల్లో గెలిచిన ప్రముఖులలో రాజేంద్ర ప్రసాద్ సింగ్ (73), రామచంద్ర చంద్రవంశీ (72), డాక్టర్ రామేశ్వర్ ఓరాన్ (72), నలిన్ సోరెన్ (71), హాజీ హుస్సేన్ అన్సారీ (70), అలంగీర్ ఆలం (69), సరయూ రాయ్ (68), లోబిన్ హెంబ్రామ్ (68), డాక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ (66), స్టీఫెన్ మరాండి (66), చంపై సోరెన్ (63), సిపి సింగ్ (63), ఉమాశంకర్ అకెలా (61), బాబులాల్ మరాండి (61), డా. రవీంద్ర నాథ్ మహతో (60) మరియు కమలేష్ కుమార్ సింగ్ (60) ఉన్నారు.ఇది కూడా చదవండి: బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల సంఖ్య పెంపు..ఎంతంటే.. -
Pulwama Assembly: పుల్వామాలో గట్టి పోటీ
పుల్వామా: నేడు(సోమవారం) హర్యానాతో పాటు జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. జమ్ముకశ్మీర్లోని 90 నియోజకవర్గాల్లో పుల్వామా అసెంబ్లీ స్థానం ఒకటి. పుల్వామా అనంతనాగ్ లోక్సభ నియోజకవర్గంలో భాగం. ఈసారి పుల్వామా సీటుపై గట్టి పోటీ నెలకొంది.నేషనల్ కాన్ఫరెన్స్ పుల్వామా సీటు నుంచి మహ్మద్ ఖలీల్ బంద్ను నిలబెట్టింది. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ వాహిద్ పారాకు టిక్కెట్ ఇచ్చింది. ఎన్నికలకు ముందు నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ మధ్య పొత్తు ఉండడంతో ఈ సీటు నేషనల్ కాన్ఫరెన్స్ ఖాతాలో చేరింది. ఈ స్థానానికి 1962లో మొదటిసారి ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, పీడీపీ మాత్రమే ఈ స్థానాన్ని గెలుచుకుంటూ వస్తున్నాయి.ఈ సీటుపై బీజేపీ నేటికీ ఖాతా తెరవలేదు.2014 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి పీడీపీకి చెందిన మహ్మద్ ఖలీల్ విజయం సాధించారు. పుల్వామా జిల్లా మొత్తం జనాభా 5.60 లక్షలు. జిల్లా పరిపాలనా కేంద్రం శ్రీనగర్కు 31 కిలోమీటర్ల దూరంలో పుల్వామాలో ఉంది. జిల్లాలో 85.65శాతం జనాభా గ్రామీణ ప్రాంతాల్లో, 14.35శాతం పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఈ జిల్లా ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉంది. ఈ ప్రాంతం వరితో పాటు నాణ్యమైన కుంకుమపువ్వు ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది.ఇది కూడా చదవండి: Haryana Election Result : ఈ నేతల ఫలితంపైనే అందరి దృష్టి -
Haryana Elections-2024: ఆ సీట్లపైనే అందరి దృష్టి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అందరి దృష్టి హర్యానా అసెంబ్లీ ఎన్నికలపై నిలిచింది. ఈ రాష్ట్రం రాజధాని ఢిల్లీకి ఆనుకుని ఉన్నందున ఈ ఎన్నికలు దేశ రాజకీయాల్లో కీలకం కానున్నాయి. 90 అసెంబ్లీ స్థానాలున్న హర్యానాలో ఈసారి బీజేపీతో పాటు కాంగ్రెస్, ఐఎన్ఎల్డీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), జేజేపీ, బీఎస్పీ, ఆజాద్ సమాజ్ పార్టీ (ఏఎస్పీ) పోటీలో ఉన్నాయి. జేజేపీ, ఆజాద్ సమాజ్ పార్టీ కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి.రాష్ట్రంలో మొత్తం 1,031 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో తమ భవితవ్యాన్ని పరీక్షించుకోనున్నారు. రాష్ట్రంలో రెండు కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఒక కోటి 5 లక్షల మంది పురుషులు, 95 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అధికార బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని సాధించాలనే తపనతో ఉండగా, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తన సత్తా చాటాలనే ప్రయత్నంలో ఉంది. హర్యానా ఎన్నికల్లో తొలిసారిగా అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా విజయం కోసం ఉవ్విళ్లూరుతోంది. పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కోర్టు నుంచి బెయిల్ పొందిన తర్వాత హర్యానా ఎన్నికల్లో ఆప్ సత్తాను చాటాలని ప్రయత్నిస్తున్నారు. కాగా హర్యానాలోని కొన్ని సీట్లు అధికార పీఠానికి చేరువ చేసేవిగా పరిగణిస్తారు. వాటి వివరాల్లోకి వెళితే..లాడ్వాలాడ్వా స్థానం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ పోటీ చేస్తున్నారు. ఈ స్థానం కురుక్షేత్ర లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుండి బీజేపీకి 47 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. ఈ సీటు బీజేపీకి సురక్షితమైన సీటుగా చెబుతారు. ఈ సీటు నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన జోగా సింగ్, ఐఎన్ఎల్డీకి చెందిన షేర్ సింగ్ బర్సామి, కాంగ్రెస్ అభ్యర్థి మేవా సింగ్, జేజేపీకి చెందిన వినోద్ శర్మ పోటీపడుతున్నారు.జులానాహర్యానాలోని జులనా సీటు కూడా అధికారానికి కీలకమైనదని చెబుతారు. మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ ఈ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున ఎన్నికల్లో పోటీకి దిగారు. ఇక్కడ దాదాపు రెండు లక్షల మంది ఓటర్లు ఉన్నారు. యోగేష్ బైరాగికి బీజేపీ టిక్కెట్టు ఇచ్చింది. గత ఎన్నికల్లో 49 శాతం ఓట్లతో గెలిచిన అమర్జీత్ ధండాకు జేజేపీ టికెట్ ఇచ్చింది. సురేంద్ర లాథర్కు ఐఎన్ఎల్డీ టికెట్ ఇచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ కైత దలాల్కు టికెట్ కేటాయించింది.హిసార్ఈసారి అందరి చూపు హిసార్ స్థానంపైనే నిలిచింది. ఇక్కడి నుంచి సావిత్రి జిందాల్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కమల్ గుప్తా ఇక్కడి నుంచి ఎన్నికల పోరులో దిగారు. ఆయన 2014 ఎన్నికల్లో జిందాల్ కమల్ గుప్తా చేతిలో ఓడిపోయారు. నాడు సావిత్రి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. ఇప్పుడు ఈ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ రామ్ నివాస్ రారాను బరిలోకి దింపింది. హర్యానా అసెంబ్లీకి అక్టోబర్ 5న ఒకే దశలో పోలింగ్ జరగనుండగా, 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇది కూడా చదవండి: మాగ్నైట్కు ఎగుమతి కేంద్రంగా భారత్ -
Jammu and Kashmir Assembly Polls: సాయంత్రం 5 గంటల వరకు 65.84 శాతం ఓటింగ్ నమోదు
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల మూడవ, చివరి దశ పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు అత్యంత ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. జమ్ము ప్రాంతంలోని జమ్ము, ఉధంపూర్, సాంబా, కథువా జిల్లాలు, ఉత్తర కాశ్మీర్లోని బారాముల్లా, బండిపోరా, కుప్వారా జిల్లాలకు చెందిన 39.18 లక్షల మంది ఓటర్లు 5,060 పోలింగ్ స్టేషన్లలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సాయంత్రం అయిదు గంటల వరకు 65.84 శాతం ఓటింగ్ నమోదైంది. ఉధంపూర్ జిల్లాలో అత్యధికంగా 72.91%, సాంబా (72.41%), కథువా (70.53%), జమ్ము (66.79%), బండిపోరా (63.33%), కుప్వారా (62.76%), బారాముల్లా (55.73%) పోలింగ్ నమోదైంది.నియోజకవర్గాలలో జమ్మూ జిల్లాలోని ఛంబ్ మొదటి 10 గంటల్లో 77.35% పోలింగ్తో ముందంజలో ఉంది. ఒకప్పుడు తీవ్రవాద, వేర్పాటువాదుల కోటగా ఉన్న సోపోర్ సెగ్మెంట్లో అత్యల్పంగా 41.44% పోలింగ్ నమోదైంది.#JKAssemblyPolls2024Voting percentage upto 05:00 pm for #PhaseII: 65.48%#NoVoterToBeLeftBehind #IVote4Sure #Trends #MyVoteMyPride pic.twitter.com/FCPCPnohga— CEO UT OF J&K (@ceo_UTJK) October 1, 2024జమ్ము కశ్మీర్ చివరి దశ పోలింగ్: మధ్యాహ్నం 1 గంట వరకు 44 శాతం ఓటింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 11 గంటల వరకు 28.12 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా ఉదంపూర్లో 33.84 శాతం ఓటింగ్ నమోదైంది. బారాముల్లాలో 23.20 శాతం ఓటింగ్ నమోదైంది. #WATCH | Baramulla, J&K: National Conference candidate from Sopore, Irshad Rasool Kar casts his vote in the third and the last phase of Assembly elections today pic.twitter.com/DIbJ3iHvqQ— ANI (@ANI) October 1, 2024జమ్ముకశ్మీర్ అసెంబ్లీ తుదివిడత పోలింగ్లో మొత్తం 415 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ దశ ఎన్నికల్లో మాజీ ఉప ముఖ్యమంత్రులు తారా చంద్, ముజఫర్ బేగ్ పోటీలో ఉన్నారు. పశ్చిమ పాకిస్తాన్ శరణార్థులు, వాల్మీకి సమాజానికి చెందినవారు, గూర్ఖా కమ్యూనిటీవారు ఈ ఎన్నికల్లో అత్యధిక ఓటర్లుగా ఉన్నారు. ఎన్నికలు జరుగుతున్న ఏడు జిల్లాల్లో 20,000 మందికి పైగా పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.#WATCH सांबा: जम्मू-कश्मीर विधानसभा चुनाव के तीसरे चरण का मतदान शुरू हो गया है। लोग भारी संख्या में मतदान करने के लिए पहुंच रहे हैं। वीडियो सांबा के एक मतदान केंद्र से है। pic.twitter.com/iyDIei160g— ANI_HindiNews (@AHindinews) October 1, 2024శాంతియుతంగా ఓటింగ్ జరిగేందుకు పోలింగ్ ప్రాంతాల్లో తగిన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జమ్ము రీజియన్ అదనపు పోలీసు డైరెక్టర్ జనరల్ (ఏడీజీపీ) ఆనంద్ జైన్ తెలిపారు. జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో 61.38 శాతం పోలింగ్ నమోదుకాగా, సెప్టెంబర్ 26న జరిగిన రెండో దశలో 57.31 శాతం పోలింగ్ నమోదయ్యింది. నేడు జరగనున్న తుదివిడత ఎన్నికల్లో 18 నుండి 19 ఏళ్ల మధ్య వయసు గల 1.94 లక్షల మంది యువకులు, 35,860 మంది వికలాంగ ఓటర్లు, 85 ఏళ్లు పైబడిన 32,953 మంది వృద్ధ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది.ఇది కూడా చదవండి: అమెరికా ఎన్నికల్లో ట్రంప్ ప్రహేళిక -
బెంగాల్ అసెంబ్లీ ముందుకు అత్యాచార నిరోధక బిల్లు
కోల్కతా: కోల్కతా ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన పశ్చిమ బెంగాల్ రాజకీయాలను కుదిపేస్తోంది. దీనిపై విపక్షాలు, విద్యార్ధి సంఘాలు, వైద్యుల నిరసనలతో మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ సమయంలో బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం.. సోమవారం నుంచి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను ప్రారంభించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో తాజాగా అత్యాచారానికి పాల్పడిన దోషులకు మరణశిక్ష విధించేలా బిల్లును బెంగాల్ న్యాయ మంత్రి మోలోయ్ ఘటక్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీనికి 'అపరాజిత స్త్రీ, చైల్డ్ బిల్లు (పశ్చిమ బెంగాల్ క్రిమినల్ చట్టాలు, సవరణ) బిల్లు 2024'గా పేరు పెట్టారు. ప్రస్తుతం ఉన్న చట్టాలను సవరించి అత్యాచారం, లైంగిక నేరాలకు సంబంధించిన కొత్త నిబంధనలను ప్రవేశపెట్టి మహిళలు పిల్లలకు రక్షణను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ బిల్లు తీసుకొచ్చింది.ఈ బిల్లులో ఏమి ఉంటుంది అత్యాచారం, హత్య కేసుల్లో మరణశిక్ష విధించే నిబంధన.ఈ బిల్లు ప్రకారం ఛార్జ్ షీట్ దాఖలు చేసిన 36 రోజుల్లోగా మరణశిక్ష విధించే నిబంధన ఉంటుంది.అత్యాచారం మాత్రమే కాదు యాసిడ్ దాడి కూడా అంతే తీవ్రమైన నేరం, దీనికి జీవిత ఖైదు విధించే నిబంధన ఈ బిల్లులో ఉంది.ప్రతి జిల్లాలో స్పెషల్ ఫోర్స్-అపరాజిత టాస్క్ ఫోర్స్ ఏర్పాటు.ఈ అపరాజిత టాస్క్ ఫోర్స్ అత్యాచారం, యాసిడ్ దాడి లేదా వేధింపుల కేసుల్లో చర్య తీసుకుంటుంది.ఎవరైనా బాధితురాలి గుర్తింపును వెల్లడిస్తే, అతనిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటారు.కాగా ఈ బిల్లు గురించి గతంలో మమతా బెనర్జీ ప్రస్తావించిన సంగతి తెలిసిందే. అత్యాచార ఘటనలను ప్రభుత్వం ఏమాత్రం సహించబోదని దీదీ స్పష్టం చేశారు. ప్రస్తుతమున్న చట్టాలను సవరించి, అత్యాచార నిందితులకు మరణ శిక్ష పడేలా అసెంబ్లీలో వచ్చేవారం బిల్లును ప్రవేశపెడతామని ప్రకటించారు. ఆ బిల్లును గవర్నర్ ఆమోదం కోసం పంపుతామని, దానికి ఆమోదం లభించకపోతే.. రాజ్భవన్ బయట నిరసన తెలుపుతామని హెచ్చరించారు.#WATCH | Kolkata, West Bengal: Junior Doctors continue to sit at the protest site in the Lalbazar area. They have been demanding justice for a woman doctor who was raped and murdered at RG Kar Medical College and Hospital on August 9. pic.twitter.com/HZ7mfOxAE2— ANI (@ANI) September 3, 2024 కోల్కతా వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసుపై సీబీఐ రెండు సమాంతర దర్యాప్తులు జరుపుతోంది. మొదటిది అత్యాచారం, హత్య కేసుకు సంబంధించినది కాగా, రెండవది ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో ఆర్థిక అవకతవలకు సంబంధించినది. ఈ నేరానికి సంబంధించి ఆర్జీ కర్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ను సీబీఐ సోమవారం అరెస్టు చేసింది.మరోవైపు కోల్కతాలోని వివిధ వైద్య కళాశాలలకు చెందిన జూనియర్ వైద్యులు మంగళవారం ఉదయం బిబి గంగూలీ వీధిలో తమ నిరసనను కొనసాగించారు. కోల్కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ర్యాలీ నిర్వహిస్తున్నారు. బీబీ గంగూలీ స్ట్రీట్లో పోలీసులు భారీ సంఖ్యలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. లాల్బజార్లోని కోల్కతా పోలీస్ హెడ్క్వార్టర్స్కు ర్యాలీగా తరలివెళ్లే ప్రయత్నం చేశారు. -
మహిళల కనీస వివాహ వయసు 21 ఏళ్లు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో ఇకపై మహిళల కనీస వివాహ వయసు 21 ఏళ్లు. నిర్దేశిత వయసు కంటే తక్కువ వయసున్న మహిళలకు పెళ్లి చేస్తే నేరం అవుతుంది. మహిళ కనీస వివాహ వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెంచుతూ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందింది. ఈ మేరకు బాల్య వివాహాల నిషేధ చట్టం–2006 స్థానంలో బాల్య వివాహాల(హిమాచల్ ప్రదేశ్) నిషేధ సవరణ–2024 చట్టం తీసుకొచ్చారు. 2006 నాటి చట్టం ప్రకారం మహిళల కనీస వివాహ వయసు 18 ఏళ్లు కాగా, పురుషుల కనీస వివాహ వయసు 21 ఏళ్లుగా ఉంది -
గజపతినగరం... ఇక్కడా మాక్ పోలింగ్తోనే ఈసీ సరి!
సాక్షి, విజయనగరం: గజపతినగరం నియోజకవర్గంలో ఈవీఎం తనిఖీ అనుమానాస్పదంగా మారింది. గజపతినగరం అసెంబ్లీ సెగ్మెంట్ ఓట్లపై వైఎస్సార్సీపీ నేతలు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. పోలింగ్ బూత్ నంబర్ 20, పెదకాద ఈవీఎం తనిఖీ చేయాలని, వీవీప్యాట్ లెక్కించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే వైఎస్సార్సీపీ ఫిర్యాదుకు సంబంధం లేకుండా అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించడం వివాదస్పదంగా మారింది.పెదకాద ఈవీఎంలో డేటా మొత్తం అధికారులు తొలగించారు. వీవీప్యాట్ బాక్స్లోనూ వీవీప్యాట్లు కనిపించలేదు. ఈవీఎంలో డేటా తొలగించి కొత్త గుర్తులను లోడ్ చేశారు. అయితే కొత్త గుర్తులతో మాక్ పోలింగ్ నిర్వహించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్సార్సీపీ అడిగిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రం సీసీ ఫుటేజ్, బాటరీ లెవెల్ డేటాను ఎన్నికల అధికారులు ఇవ్వలేదు.దీంతో ఒంగోలు తరహాలోనే మాక్ పోలింగ్తో అధికారులు డ్రామా నడిపిస్తున్నట్లు ఆరోపణలు వస్తన్నాయి. కొత్త గుర్తులతో 1400 ఓట్లు మాక్ పోలింగ్ జరిగింది. ఫ్యాన్, సైకిల్ గుర్తులు లేకుండానే మాక్ పోలింగ్ నిర్వహణ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
హర్యానా అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ వ్యూహమిదే?
హర్యానాలో ఈ ఏడాది అక్టోబరులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం పలు పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీకి చెందిన రాజకీయ అనుభవజ్ఞులు హర్యానా అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించారు. ఈ ఎన్నికలకు బీజేపీ పటిష్టమైన వ్యూహం సిద్ధం చేస్తోంది. దీనిలో కుల సమీకరణలకు ప్రాధాన్యతనివ్వనున్నారని సమాచారం.ఢిల్లీకి ఆనుకుని ఉన్న హర్యానాలోని ఓటర్లను ఆకట్టుకునేందుకు ఢిల్లీకి చెందిన ఏడుగురు బీజేపీ ఎంపీలు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జాట్లు, గుర్జర్లు, వాల్మీకులు, వ్యాపార వర్గాలతో సహా పూర్వాంచలిలను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. హర్యానా ఎన్నికల్లో గెలవడం బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఢిల్లీ బీజేపీ ఎంపీలు బన్సూరి స్వరాజ్, మనోజ్ తివారీ కీలకపాత్ర పోషించనున్నారు.దక్షిణ ఢిల్లీ ఎంపీ రామ్వీర్ సింగ్ బిధూరి హర్యారాలోని గుర్జర్ ఓటర్లను ఆకట్టుకునేందుకు, పశ్చిమ ఢిల్లీ ఎంపీ కమల్జిత్ సెహ్రావత్ జాట్ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నించనున్నారు. నార్త్-వెస్ట్ ఢిల్లీ ఎంపీ యోగేంద్ర చందోలియా రిజర్వ్డ్ తరగతిని ఆకట్టుకునేందుకు ప్రచారం సాగించనున్నారు. చాందినీ చౌక్ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ వ్యాపార వర్గాల్లో తన పరిధిని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈయనకు ఎంపీగా మారకముందు నుంచే వ్యాపార వర్గాలవారితో సన్నిహిత సంబంధాలున్నాయి. కేంద్ర సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా హర్యానాలోని పంజాబీ కమ్యూనిటీ ఓటర్లను ఆకట్టుకునే దిశగా ముందుకు కదులుతున్నారు. -
యూపీ అసెంబ్లీ ఉప ఎన్నికలు: అభ్యర్థులను ప్రకటించిన మాయావతి, ఆజాద్
ఉత్తరప్రదేశ్లోని పది అసెంబ్లీ స్థానాలకు త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాల్లో బీఎస్పీ, చంద్రశేఖర్ ఆజాద్ పార్టీ ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరాం) మధ్య ఆసక్తికరమైన పోటీ నెలకొననున్నదనే మాట వినిపిస్తోంది. చాలా కాలం తర్వాత ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని బీఎస్పీ నిర్ణయించుకుంది. లోక్సభలో విజయం సాధించిన చంద్రశేఖర్ ఆజాద్ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల పోరులోకి దూకారు. ఇప్పటి వరకూ మాయావతి రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించగా, ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) మూడు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది.ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) ఘజియాబాద్ సదర్ స్థానం నుండి చౌదరి సత్పాల్, ముజఫర్నగర్లోని మీరాపూర్ స్థానం నుండి జాహిద్ హసన్, మీర్జాపూర్లోని మజ్వాన్ స్థానం నుండి ధీరజ్ మౌర్యలను ఎన్నికల బరిలోకి దించినట్లు ప్రకటించింది. మిగిలిన ఏడు స్థానాల్లో పోటీకి దిగే అభ్యర్థుల పేర్లను త్వరలో ప్రకటిస్తామని పార్టీ తెలిపింది.ఇక బీఎస్పీ విషయానికొస్తే మిల్కిపూర్, మిరాపూర్ నుండి పోటీ చేయబోయే అభ్యర్థులను ప్రకటించింది. మిల్కీపూర్ టిక్కెట్ను రామ్ గోపాల్ కోరికి ఇవ్వగా, మీరాపూర్ నుండి చంద్రశేఖర్ ఆజాద్కు సన్నిహితుడైన షా నాజర్ను అభ్యర్థిగా నిలబెట్టారు. షా నాజర్ ప్రస్తుతం బీఎస్పీ జిల్లా పంచాయతీ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఆయన చంద్రశేఖర్ ఆజాద్ పార్టీలో సభ్యునిగా ఉన్నారు. -
తెలంగాణ అసెంబ్లీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
-
అసెంబ్లీ, మంత్రుల నివాసాలకు వరద నీరు
పాట్నా: బిహార్ రాజధాని పాట్నాలో ఆదివారం(ఆగస్టు12) కురిసిన భారీ వర్షానికి వరదలు పోటెత్తాయి. నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. రోడ్లపై ట్రాఫిక్ ఎక్కడికక్కడ జామ్ అయింది. రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలోకి వరదనీరు వచ్చింది. అసెంబ్లీకి కొద్ది దూరంలో ఉన్న మంత్రుల బంగ్లాలున్న ప్రాంతంలోనూ భారీగా నీరు నిలిచింది. గడిచిన కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు గండక్, కోసి, గంగా, మహానంద, కమల నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సీఎం నితీశ్కుమార్ పాట్నాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. భారీ వర్షాలు పడినపుడు వరద నీరు నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
రాష్ట్ర విభజనకు వ్యతిరేకం: బెంగాల్ అసెంబ్లీ తీర్మానం
కలకత్తా: రాష్ట్ర విభజన కోసం జరిగే ఎలాంటి ప్రయత్నాలనైనా వ్యతిరేకిస్తున్నట్లు వెస్ట్బెంగాల్ అసెంబ్లీ సోమవారం(ఆగస్టు5) ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. ‘మేం కో ఆపరేటివ్ ఫెడరలిజాన్ని నమ్ముతున్నాం. బెంగాల్ విభజనకు జరిగే ఎలాంటి ప్రయత్నాన్నైనా వ్యతిరేకిస్తాం’అని సీఎం మమతాబెనర్జీ అన్నారు. ఈ తీర్మానానికి అసెంబ్లీలో ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి కూడా మద్దతిచ్చారు. తాము కూడా రాష్ట్ర విభజనకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఉత్తర వెస్ట్బెంగాల్ను విభజించి ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలన్న డిమాండ్ల నేపథ్యంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ అసెంబ్లీలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీనికి ప్రతిపక్ష బీజేపీ మద్దతివ్వడంతో మూజువాణి ఓటుతో తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం లభించింది. -
Maharashtra: మహాయుతి సీట్ల సద్దుబాటు ఫార్ములా ఇదే..
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించనప్పటికీ, రాష్ట్రంలో రాజకీయ వేడి అంతకంతకూ పెరుగుతోంది. సీట్ల సద్దుబాటుకు సంబంధించి మహాయుతి (బీజేపీ, శివసేన, ఎస్సీపీల కూటిమి)లో రాజకీయ గందరగోళం నెలకొన్నదనే వార్తలు వస్తున్న తరుణంలో మరో ఆస్తకికర పరిణామం చోటుచేసుకుంది.రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సీట్ల సద్దుబాటు ఫార్ములాను ఆగస్టు 15 నాటికి మహాయుతి ఖరారు చేయనుంది. కూటమిలోని వివిధ పార్టీల ఎమ్మెల్యేలు గతంలో గెలిచిన స్థానాలలోనే తిరిగి పోటీ చేసేలా ఫార్ములా రూపొందించనున్నట్లు ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తెలిపారు.ఈ ప్రకటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్కులే స్పందిస్తూ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో బీజేపీ వారైనా, షిండే లేదా అజిత్ పవార్ వర్గం వారైనా వారి మనోభావాలను గౌరవిస్తామన్నారు. అయితే అక్కడక్కడ ఒకటి లేదా రెండు సీట్ల కేటాయింపులలో తేడా ఉండవచ్చన్నారు. పొత్తు విషయంలో దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ మధ్య చర్చలు జరగాలని ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారన్నారు. -
జాబ్ కేలండర్ను శాసనసభకు సమర్పించిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. ఇంకా ఇతర అప్డేట్స్
-
బజారుభాషతో రేవంత్ పైశాచిక ఆనందం
సాక్షి, హైదరాబాద్: జాబ్ కేలండర్పై చర్చించాలని అడిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీ మారినవారితో బజారుభాషలో తిట్టిస్తూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాడిస్ట్ సీఎం రేవంత్ అందరినీ ఉసిగొల్పుతూ దిగజారుడు..దివాలాకోరుతనంతో వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. శాసనసభలో ఇది చీకటిరోజు అని, అధికార పక్షం బజారుభాష వినలేక సభ నుంచి బయటకు వచ్చేశామన్నారు. బోగస్ జాబ్ కేలండర్ పేరిట మోసగిస్తున్న కాంగ్రెస్ నాయకులను యువత ఎక్కడికక్కడ నిలదీసి కొట్టాలన్నారు.గన్పార్కు అమరుల స్తూపం వద్ద కేటీఆర్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందుకు హైదరాబాద్ అశోక్నగర్కు వచి్చన రాహుల్గాంధీ అధికారంలోకి వచ్చిన తొలిఏడాదే 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని డ్రామా చేశారన్నారు. దమ్ముంటే రాహుల్గాంధీ, రేవంత్ అశోక్నగర్కు వచ్చి ఒక్క ఉద్యోగం ఇచి్చనట్టు రుజువు చేసినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరమూ రాజీనామా చేస్తామని చెప్పారు. రేవంత్ మగాడైతే సిటీ సెంట్రల్ లైబ్రరీకి రావాలంటూ సవాల్ చేశారు. మార్పు పేరిట నిరుద్యోగులను మభ్య పెట్టిన రేవంత్ను తన్ని తరమడం ఖాయమని కేటీఆర్ హెచ్చరించారు. జాబ్ కేలండర్పై అసెంబ్లీలో చర్చించకుండా ప్రభుత్వం పారిపోయినందునే గన్పార్క్ వద్ద నిరసన తెలుపుతున్నామన్నారు. శాసనసభ చరిత్రలో బ్లాక్ డే: హరీశ్రావు అసెంబ్లీ చరిత్రలో ఇది బ్లాక్ డే అని ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఇందిరమ్మ రాజ్యంతో మహిళా ఎమ్మెల్యేలను అవమానించేలా సభా నాయకుడే తిట్టిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ రౌడీïÙటర్ భాషతో కన్నతల్లులను అవమానించేలా మాట్లాడుతున్నాడని, ఉద్యమ సమయంలోనూ ఇలాగే మాట్లాడాడని చెప్పారు. హైదరాబాద్ ఏమైనా ఆయన జాగీరా అని ప్రశి్నస్తూ, దానం నాగేందర్ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ జాబ్ కేలండర్పై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం చేసిన ప్రకటన చిత్తు కాగితంలా ఉందన్నారు. అశోక్నగర్కు సమయం, తేదీ చెబితే..తామూ వస్తామని, కాంగ్రెస్ బెదిరింపులకు భయపడేది లేదని హరీశ్రావు స్పష్టం చేశారు. సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడిన దానం నాగేందర్పై స్పీకర్ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీలో అసభ్యకరంగా మాట్లాడిన దానం నాగేందర్ రాజీనామా చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి డిమాండ్ చేశారు. పోస్టులు పెంచాలని అడుగుతున్న నిరుద్యోగులపై లాఠీచార్జ్ చేస్తూ కేసులు పెడుతున్నారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే దానం వ్యాఖ్యలతో... జాబ్ కేలండర్పై చర్చించాలంటూ స్పీకర్ పోడియం వద్ద నిరసన తెలుపుతున్న తమ పార్టీ ఎమ్మెల్యేలపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మండిపడింది. అయితే దానం వ్యాఖ్యలపై స్పీకర్ స్పందించక పోవడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశ మందిరం నుంచి మూకుమ్మడిగా బయటకు వచ్చారు. లాబీలోని బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో భేటీ అయ్యారు.నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచి్చన హామీని ఉల్లంఘిస్తున్న తీరును ఎండగట్టాలని నిర్ణయించారు. దీంతో కేటీఆర్ నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలు చేసుకుంటూ గన్పార్కుకు చేరుకున్నారు. బీఆర్ఎస్ ఆందోళన నేపథ్యంలో గన్పార్కు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. గన్పార్కు నుంచి వెళ్లాలని పోలీసులు కోరినా బీఆర్ఎస్ నేతలు నిరాకరించడంతో కేటీఆర్, హరీశ్రావు సహా ఆందోళన చేస్తున్న నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వారిని తెలంగాణ భవన్కు నేతలను తరలించే క్రమంలో గన్పార్కు వద్ద ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ భవన్కు చేరుకున్న బీఆర్ఎస్ నేతలను పలువురు నిరుద్యోగులు కలిసి ఉద్యోగాల భర్తీ జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. -
క్రీడాకారులకు సర్కారీ ఉద్యోగాలు
సాక్షి, హైదరాబాద్: ప్రతిభా వంతులైన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించడానికి వీలుగా తెలంగాణ(పబ్లిక్ సర్వీస్ నియామ కాల క్రమబద్ధీకరణ, సిబ్బంది, వేతనాల హేతుబద్ధీకరణ) చట్ట సవరణ బిల్లును శుక్రవారం శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్, కాలేజీ సర్వీస్ కమిషన్, ఏదైనా కమిటీ, ఎంప్లాయ్మెంట్ ఎక్సే్ఛంజీ, పత్రికల్లో బహిరంగ ప్రకటనల ద్వారా మినహా ఇతర పద్ధతుల్లో ఉద్యోగాల భర్తీపై ఈ చట్టం ద్వారా నిషేధం విధించారు.కారుణ్య నియామకాలతో పాటు పోలీసు కాల్పులు/ బాంబు పేలుళ్లు/ తీవ్రవాదుల హింస బాధితులు, అత్యాచారాలకు గురైన ఎస్సీ, ఎస్టీల విషయంలో మినహాయింపు ఉంది. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్, అంతర్జాతీయ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్కు డీఎస్పీ ఉద్యోగం ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇకపై క్రీడాకారులకు సైతం ఉద్యోగాలు ఇచ్చేందుకు వీలుగా ఈ చట్టానికి ప్రభుత్వం సవరణలను ప్రతిపాదించింది. మరో రెండు బిల్లులకు ఆమోదం..: జూనియర్ సివిల్ జడ్జీల ద్రవ్య అధికార పరిధిని రూ.20 లక్షల నుంచి రూ.10 లక్షలకు కుదించడానికి ప్రతిపాదించిన తెలంగాణ సివిల్ కోర్టు చట్ట సవరణ బిల్లుతో పాటు తెలంగాణ సంక్షిప్తనామాన్ని ‘టీఎస్’నుంచి ‘టీజీ’కి మార్చుతూ ప్రతిపాదించిన కొత్త చట్టం బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. -
అసెంబ్లీలో దానం దాదాగిరి
సాక్షి,హైదరాబాద్ : అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సహనం కోల్పోయారు. తీవ్ర పదజాలంతో బీఆర్ఎస్ సభ్యులపై ఫైరయ్యారు. ‘తోలు తీస్తా . మిమ్మల్ని బయటకు కూడా తిరగనివ్వం ఏం అనుకుంటున్నార్రా’ అంటూ బెదిరించారు. అయితే దానం వ్యాఖ్యల్ని బీఆర్ఎస్, ఎంఐఎంలు నేతలు ఖండించారు. దానం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. అభ్యంతర వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.దీంతో దానం క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని కోరారు. తాను మాట్లాడింది హైదరాబాద్ లోకల్ భాష అని, ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నానని అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్. -
కేసీఆర్ ఆబ్సెంట్తో అసెంబ్లీలో కిక్కులేదు: రాజగోపాల్రెడ్డి
సాక్షి,హైదరాబాద్: ప్రతిపక్షనేత కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం వల్ల సభలో తమకు కిక్కు రావడం లేదని, కేసీఆర్ వస్తే మజా వస్తదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. అసెంబ్లీ లాబీల్లో శుక్రవారం(ఆగస్టు2) రాజగోపాల్రెడ్డి మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.కేసీఆర్ లేకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ నేతలు తల్లి లేని పిల్లలుగా అనిపిస్తోందన్నారు. ప్రతిపక్షనేత హోదా కేటిఆర్, హరీశ్లలో ఎవరికి ఇచ్చినా బీఆర్ఎస్ పార్టీ ఆగం అవుతుందన్నారు. ‘హరీశ్ రావు వర్కర్ ..కానీ ఆయనకు ఇవ్వరు. కేటీఆర్కు అవగాహన లేదు. విద్యుత్ మీద డిస్కషన్లో కేసిఆర్ ఉండి ఉంటే ఇంకా బాగా జరిగేది. కేసిఆర్ ఓడిపోయినా ఇంకా జాతిపిత అనుకుంటున్నాడు. ఆయన ఊహల్లో బతుకుతుండు అని రాజగోపాల్రెడ్డి సెటైర్లు వేశారు. -
సుప్రీంకోర్టు తీర్పుపై తెలంగాణ అసెంబ్లీ హర్షం..
-
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఫైర్
-
రేవంత్ వ్యాఖ్యలపై భగ్గుమంటున్న బీఆర్ఎస్
-
సీఎం, డిప్యూటీ సీఎం వ్యవహార శైలిపై కేటీఆర్ ఆగ్రహం
-
తెలంగాణ అసెంబ్లీలో మాటల యుద్ధం..
-
ఇక్కడ ముంచి.. అక్కడ తేలిండ్రు
సాక్షి, హైదరాబాద్: ‘మేము కలిసి వస్తాం. ప్రభుత్వానికి సహకరిస్తాం అని కేటీఆర్ పదే పదే చెప్తున్నారు. మీరు కలిసి వస్తారా?! అన్నం ఉడికిందా లేదా? అన్నది ఒక్క మెతుకు పట్టి చూస్తే తెలుస్తుంది. ప్రతిపక్ష నాయకుడు (కేసీఆర్) సభకే రారు. వీరు కలిసి వస్తా అంటే నమ్మేది ఎవరు? నేను అందుకే వారికి (కేటీఆర్) సూచన చేస్తున్నా. నీ వెనకాల ఉండే అక్కలు ఇక్కడ (కాంగ్రెస్లో) ఉండి చెప్పి చెప్పి, ఇక్కడ ముంచి అక్కడ (బీఆర్ఎస్)తేలిండ్రు.. ఆ అక్కల మాటలు విన్నడు అనుకో, జూబ్లీ బస్టాండ్లో కూర్చోవాల్సి వస్తది..’ అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు.శాసనసభలో బుధవారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ సభ్యుడు కేటీఆర్ మాట్లా డారు. ఆయన ప్రసంగం ముగించగానే ఆయన వెనకాల ఉన్న బీఆర్ఎస్ సభ్యులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి తదితరులు గట్టిగా బల్లలు చరుస్తూ మద్దతు పలికారు. ఈ నేపథ్యంలోనే సీఎం మాట్లాడుతూ.. ‘వెనకాల ఉండే అక్కలు..’ అనే వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వారి అరుపులు, నినాదాలు, కాంగ్రెస్ సభ్యుల ప్రతి నినాదాలతో గందరగోళం మధ్యే రేవంత్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అండగా నిలబడతానని చెప్పి మోసం చేశారు: రేవంత్ ‘ప్రజాజీవితంలో ఉన్నప్పుడు వ్యక్తిగత, ప్రజాజీవితానికి సంబంధించిన చర్చ ఉంటుంది. నాకు, సబితక్కకి మధ్య జరిగిన వ్యక్తిగత చర్చను ఆమె సభలో చెప్పారు. కాబట్టి దానికి కొనసాగింపుగా జరిగిన కొన్ని చర్చలను నేను సభలోనే చెప్పాల్సిన అసవరముంది. కాంగ్రెస్ పారీ్టలోకి నన్ను సబిత ఆహ్వానించడం, పెద్ద లీడర్ అవుతావని చెప్పడం వాస్తవమే. నేను ఆమె మాటను విశ్వసించి, సొంత అక్కగా భావించి, కుటుంబ సంబంధాలు, ఇతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆనాడు కాంగ్రెస్లో చేరా. 2019లో కాంగ్రెస్ పార్టీ నన్ను పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయమంది.అప్పుడు సబితక్క నన్ను పిలిచి మల్కాజిగిరి నుంచి పోటీ చెయ్యి.. ఎన్నికల్లో అండగా నిలబడతానని మాట ఇచ్చారు. కానీ నన్ను పార్టీ ఎంపీ అభ్యరి్థగా ప్రకటించిన మరుక్షణమే ఆమె టీఆర్ఎస్లో చేరారు. కేసీఆర్ మాయమాటలను నమ్మి అధికారం కోసం కాంగ్రెస్ను వదిలి టీఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవి పొంది తమ్ముడిని మోసం చేశారు. (ఇది నిజమా? కాదా? అని సబితారెడ్డినుద్దేశించి ప్రశ్నించారు) కాబట్టే ఆమెను నమ్మవద్దని కేటీఆర్కు సూచించా. బీఆర్ఎస్లో చేరి మంత్రి పదవులు పొంది ఈ రోజు వచ్చి మాకు నీతులు చెబితే మేము ఏమైనా అమాయకులమా?..’ అంటూ సీఎం ప్రశ్నించారు. ‘మైనారిటీలకు మంత్రి పదవి ఇవ్వలేదని కేటీఆర్ మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. 2014–19 మధ్యకాలంలో ఒక్క మహిళా మంత్రి లేకుండా ప్రభుత్వాన్ని నడిపించారు. ప్రభుత్వానికి సహకరించేది ఉంటే ప్రతిపక్ష నాయకుడిని సభలో కూర్చోమని చెప్పండి..’ అని రేవంత్ అన్నారు. తాను కొత్త గవర్నర్కు ఆహా్వనం పలకడానికి విమానాశ్రయానికి వెళ్తున్నానని, తిరిగి వచి్చన తర్వాత అందరికీ సమాధానమిస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి సభ నుంచి వెళుతుండగా బీఆర్ఎస్ సభ్యులు ‘షేమ్ ..షేమ్’ అంటూ నినాదాలు చేశారు. దీనికి ముందు బీఆర్ఎస్ సభ్యుల నిరసనల నేపథ్యంలో స్పీకర్ అవకాశం ఇవ్వడంతో సబిత గద్గద స్వరంతో మాట్లాడారు. ఏం మోసం చేశాం: సబితా ఇంద్రారెడ్డి ‘రేవంత్రెడ్డి కాంగ్రెస్ పారీ్టలో చేరినప్పుడు నేను అక్కగా ఆశీర్వదించా. నువ్వు చాలా ఎదుగుతావు.. ఈ రాష్ట్రానికి సీఎం అవుతావు..అంటూ పారీ్టలోకి ఆహా్వనించా. సీఎం గుండెల మీద చెయ్యి వేసుకుని ఇది నిజమా? కాదా? చెప్పాలి. ఈ రోజు నాపై ఎందుకు కక్ష తీర్చుకుంటున్నాడో అర్థం కావడం లేదు. ప్రతిసారీ అసెంబ్లీలో ఒక ఆడబిడ్డకు బాధ అవుతుంటే వినే స్థితిలో లేరా? ఎందుకు నన్ను టార్గెట్ చేసిండ్రు. నీ వెనక కూర్చున్న అక్కలను నమ్ముకోవద్దు.. మోసం చేస్తరని అన్నడు? ఏం మోసం చేశాం? ఏం ముంచినం? వీళ్లను ముంచినమా? ఎన్నికల సమయంలో కూడా నా నియోజకవర్గంలో మాట్లాడుతూ సబితక్క పొద్దునొక్క మాట, రాత్రి ఒక్క మాట మాట్లాడతది అన్నాడు.పొద్దునొక్క మాట, రాత్రి ఒక్క మాట ఏం మాట్లాడిన? ఎవరిని, ఎందుకు అవమానిస్తున్నవు? ఎందుకీ కక్ష ? ప్రతిసారీ టార్గెట్ చేస్తున్నరు. ఏం చేసినం మేము ఆడబిడ్డలం. సీఎం తన మాటలను ఉపసంహరించుకోవాలి..’ అని సబిత డిమాండ్ చేశారు. సబిత ఆ మాట అనగానే స్పీకర్ మైక్ కట్ చేశారు. అంతకు ముందు ‘సీఎం రేవంత్ ఏ పార్టీలో నుంచి వచ్చారు? కేసీఆర్ ఇంటిపై వాలిన కాకి నా ఇంటిపై వాలినా కాలి్చవేస్తా అని గతంలో అన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి అంత మందిని ఎందుకు చేర్చుకున్నారు..’ అని సబిత నిలదీశారు. -
కేటీఆర్ కౌంటర్లు - రేవంత్ కథలు
-
అసెంబ్లీలో కేటీఆర్ ను కలిసిన బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి
-
బీఆర్ఎస్ మళ్లీ గెలిచుంటే...మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం(జులై 30) అసెంబ్లీలో మీడియాతో చిట్చాట్ మాట్లాడారు. బీఆర్ఎస్ మూడోసారి గెలిచి ఉంటే తాను హోమ్ మంత్రి అయ్యేవాడినన్నారు. సినిమాలు తీసేవాడినని, టీవి ఛానల్ పెట్టేవాడినని చెప్పారు. బీఆర్ఎస్ గెలిస్తే రాష్ట్రంలో తన ప్లేస్ వేరే లెవెల్లో ఉండేదన్నారు. -
ఫార్మాసిటీ భూములు వెనక్కివ్వండి: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: ఫార్మా సిటీ రద్దు చేసింనందున దాని కోసం సేకరించిన భూములు తిరిగి రైతులకు ఇచ్చేస్తారా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. బడ్జెట్లో మంగళవారం(జులై 30) చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ‘రూ. 16 వేల కోట్లతో మూసీ బ్యూటిఫికేషన్ కు అంతా సిద్ధం చేశాం. లక్షా 50 వేల కోట్లు మీ ప్రభుత్వానికి ఎందుకు అవసమరమవుతున్నాయి. హైదరాబాద్లో ఎస్ఆర్డీపీ రోడ్ల నిర్మాణ పనులను కొనసాగించాలి’అని కేటీఆర్ కోరారు. -
‘విద్యుత్’ ఒప్పందాల కథ వెలికితీస్తాం..
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వ బాధ్యతారహిత నిర్ణయాల వల్ల విద్యుత్శాఖ రూ.వేల కోట్లు నష్ట పోయిందని శాసనసభలో కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ధ్వజమెత్తారు. అసెంబ్లీలో సోమ వారం ఆయన ‘విద్యుత్’అంశంపై చర్చను ప్రారంభించారు. ఉచిత విద్యుత్ తీసుకొచి్చన ఘనత వైఎస్ రాజశేఖర్రెడ్డిదేనని..గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ముందుచూపుతో ప్రణాళికలు రూపొందించబట్టే విద్యుదుత్పత్తి పెరిగిందన్నారు.గత పదేళ్లు ఇష్టానుసారం విద్యుత్ నిర్ణయాలు తీసుకున్న వ్యక్తి సభలో లేకపోవడం దురదృష్టకరమని మాజీ సీఎం కేసీఆర్ను ఉద్దేశించి విమర్శించారు. కేసీఆర్ సభకు రాకూ డదనుకుంటే ప్రతిపక్ష నేత హోదా వదులుకోవాలన్నారు. విద్యుత్ రంగంలో జరిగిన దోపిడీపై విచారణ జరుగుతుందని, ఒప్పందాల కథ వెలికితీస్తామని చెప్పారు. ఈ విద్యుత్ ఒప్పందాలు ఎందుకు? ‘‘భద్రాద్రి ప్లాంట్ నిర్మాణం ప్రారంభించే నాటికే సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అందుబాటులో ఉంది. దాన్ని కాదని ఎప్పుడో 15 ఏళ్ల క్రితం ఇండియాబుల్ వాళ్ల ప్లాంట్ కోసం తయారు చేసిన టర్బన్ బాయిలర్ వాడటం వల్ల భద్రాద్రి ప్లాంట్ పనిచేయని దుస్థితి ఏర్పడింది. ఎప్పుడూ ఏదో ఒక యూనిట్ ఆగిపోతోంది. అది పదేళ్ల కిందటి పాత ప్లాంటులా ఉందని చీఫ్ ఇంజనీర్ నివేదిక కూడా ఇచ్చారు. గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఈ ప్లాంట్ వ్యయం రూ.7,200 కోట్ల నుంచి రూ.10 వేలకోట్లకు పెరిగింది..’’అని రాజగోపాల్రెడ్డి ఆరోపించారు.బీహెచ్ఈఎల్కు నామినేటెడ్ పద్ధతిలో కాంట్రాక్టు ఇవ్వడం, ఆ తర్వాత సివిల్ పనులు బీఆర్ఎస్ నేతల బినామీలకు ఇవ్వడం నిజం కాదా అని ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేస్తుంటే అడ్డుకోవడానికి బీఆర్ఎస్ ప్రయతి్నస్తోందని మండిపడ్డారు. పదేళ్లు రాష్ట్రంలో కుటుంబ పాలన నడిచిందని, ఐఏఎస్ అధికారులతో కాళ్లు మొక్కించుకున్న చరిత్ర వారిదని రాజగోపాల్రెడ్డి మండిపడ్డారు. -
‘విద్యుత్’ను బలోపేతం చేసిందే మేము
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలో విద్యుత్ రంగం బలోపేతమైందని.. కేసీఆర్ ముందు చూపు కారణంగానే అన్ని రంగాలకు నాణ్యమైన 24 గంటల విద్యుత్ అందుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సభ్యుడు జి.జగదీశ్రెడ్డి శాసనసభలో స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటైన సమయంలో తీవ్రంగా ఉన్న విద్యుత్ కొరతను తీర్చేందుకే కొనుగోళ్లు చేశామని.. కొత్త ప్లాంట్ల ఏర్పాటును చేపట్టామని వివరించారు. కానీ కాంగ్రెస్ సర్కారు ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు.సోమవారం జగదీశ్రెడ్డి శాసనసభలో ‘విద్యుత్’పద్దుపై బీఆర్ఎస్ తరఫున మాట్లాడారు. ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘సీలేరు ప్రాజెక్టును కొట్టేయడానికే ఖమ్మం జిల్లా లోని ఏడు మండలాలను చంద్రబాబు కుట్రపూరితంగా తీసుకున్నాడు. మనకు ఇవ్వాల్సిన విద్యుత్ వాటా ఇవ్వకపోగా.. మేం కొనుగోలు చేద్దామనుకున్నా ఇవ్వకుండా ప్రైవేటు ప్లాంట్ల వాళ్లను బెదిరించాడు. ఆ పరిస్థితుల్లో విద్యుత్ డిమాండ్ను తట్టుకోవడానికి చాలా కష్టపడ్డాం. బీహెచ్ఈఎల్తో ఒప్పందం చేసుకుంటే.. ఏదో జరిగిందని ప్రచారం చేయడం ఏంటి? ప్రభుత్వ రంగ సంస్థకు నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టు ఇవ్వొచ్చు. అదే సమయంలో ఏపీలో నాటి చంద్రబాబు ప్రభుత్వం విజయవాడలో 800 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణాన్ని బీహెచ్ఈఎల్కు నామినేషన్ పైనే ఇచి్చంది. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు కోసం మేం ఇచ్చింది యూనిట్కు రూ.3.90 మాత్ర మే. ఇప్పుడు ఎనీ్టపీసీ నుంచి రూ.5.70 చెల్లించి కొనుగోలు చేస్తున్నట్టు తెలిసింది. కాంగ్రెస్ సర్కారు కూడా నామినేషన్పై బీహెచ్ఈఎల్కు కాంట్రాక్టులు ఇస్తే మేం మద్దతిస్తాం. ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందాల్లో ఏదో వెదుకుతామని చూడటం. పక్క రాష్ట్రంలో తమ బాస్ చేస్తే మాత్రం కరెక్ట్ అనడం ఏమిటి? మా హయాంలోనే విద్యుత్ వ్యవస్థ బలోపేతం మేం విద్యుత్ ఉత్పాదన సామర్థ్యం పెంచాం. 400 కేవీ, 220కేవీ, 132 కేవీ, 33 కేవీ సబ్స్టేషన్లు పెరిగాయి. విద్యుత్ ట్రాన్స్మిషన్, పంపిణీ లైన్లు పెరిగాయి. సౌర విద్యుత్ పెరిగింది. డిస్కమ్ల ఆర్థిక పరిస్థితిని పరిపుష్టం చేయడానికి ఉదయ్ పథకంలో చేరాలని కేంద్రం కోరితేనే చేరాం. బిల్లులు వసూలుకాని ప్రాంతాల్లోని సమీప విద్యుత్ కార్యాలయాల్లో స్మార్ట్ మీటర్లు పెట్టాం. ఉదయ్ పథకం కింద రూ.9 వేల కోట్ల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వంపై వేసుకున్నాం. తల తెగిపడినా రైతులకు మీటర్లు పెట్టనివ్వలేదు. అప్పుల వాదన అర్థరహితం.. మా హయాంలో అప్పులు అయ్యాయనే వాదన అర్థరహితం. మేం అధికారంలోకి వచ్చేప్పటికే విద్యుత్ రంగంపై రూ.24 వేల కోట్ల అప్పులున్నాయి. అయినా రైతులు, అన్నివర్గాల ప్రయోజనం కోసమే విద్యుత్ రంగాన్ని అప్పులు చేసి అయినా బలోపేతం చేశాం. గత 60 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేయని అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగింది.అదానీకి ఇవ్వాలనేదే మీ ఆలోచనవిద్యుత్ పనులు బీహెచ్ఈఎల్కు వద్దని, అదానీకే ఇవ్వాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచన. ఓల్డ్సిటీలో విద్యుత్ సరఫరా బాధ్యతను అదానీకి అప్పగించే అంశంపై ఎంఐఎం సభ్యులు ప్రశ్నించినప్పుడు.. కాంగ్రెస్ సర్కారు తేలుకుట్టిన దొంగల్లా గమ్మున ఉండిపోయారు. సబ్ కాంట్రాక్టులు ఎవరికి ఇప్పించుకోవాలో మీకు తెలిసిన విద్య. మా చుట్టాలెవరూ కాంట్రాక్టు పనులు చేయలేదు. మంత్రివర్గంలో, వారి చుట్టాల్లో ఎందరో కాంట్రాక్టర్లు ఉన్నారు.తప్పుదారి పట్టించే ప్రయత్నాలు..సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్ అంటూ ప్రభుత్వం తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తోంది. కేంద్రం తెచి్చన మెమో ప్రకారం.. సోలార్ విద్యుదుత్పత్తి జరిగేప్పుడు సూపర్ క్రిటికల్ ప్లాంట్లు సైతం ఉత్పత్తిని 50 శాతానికి తగ్గించుకోవాల్సి ఉంటుంది. దానితో సూపర్ క్రిటికల్ కూడా సబ్ క్రిటికల్ అయిపోతుంది. ఎన్జీటీ కేసులు, కరోనాతోనే యాదాద్రి, భద్రాద్రి ప్లాంట్ల నిర్మాణం ఆలస్యమైంది. వెనుకబడ్డ నల్లగొండ జిల్లాను అభివృద్ధిలోకి తీసుకెళ్లాలనే యాదాద్రి ప్లాంట్ చేపట్టాం.కానీ కొందరు నల్లగొండ జిల్లా నేతలు జిల్లాలో ప్లాంట్ వద్దని మాట్లాడారు. వారి సంగతిని ప్రజలే చూసుకుంటారు. విద్యుత్ సరఫరా సమస్యలపై హెల్ప్లైన్కు ఫోన్ చేస్తే కేసులు పెట్టి జైలుకు çపంపుతున్నారు. వారి ఇళ్లకు లైన్మెన్లు పోయి సోషల్ మీడియాలో పోస్టులు తీసేయాలని బెదిరిస్తున్నారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో పోస్టుపెట్టిన మహిళా జర్నలిస్టు రేవతిపై కేసు పెట్టారు..’’అని జగదీశ్రెడ్డి పేర్కొన్నారు.ముందే మాట్లాడుకుని జస్టిస్ నరసింహారెడ్డితో కమిషన్! జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి భూకబ్జాదారుడంటూ గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి, వీహెచ్ ఆందోళన చేశారని.. అలాంటి వ్యక్తిని విచారణ కమిషన్ చైర్మన్గా ఎలా నియమించారని జగదీశ్రెడ్డి తప్పుబట్టారు. దీనిపై మంత్రి శ్రీధర్బాబు జోక్యం చేసుకుని.. కమిషన్ చైర్మన్ వ్యక్తిగత విషయాలను, న్యాయస్థానం పరిధిలో ఉన్న అంశాలను సభలో మాట్లాడరాదంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో న్యాయస్థానం పరిధిలో ఉన్నప్పుడు సీఎం ఈ అంశంపై ఎలా మాట్లాడారని జగదీశ్రెడ్డి నిలదీశారు.ప్రభుత్వం వేసింది న్యాయ విచారణ కాదని వ్యాఖ్యానించారు. ‘‘విద్యుత్ ఒప్పందాలపై విచారణ మొత్తం పూర్తయిందని.. జరిగిన నష్టాన్ని అంచనా వేయడమే మిగిలిందని జస్టిస్ నరసింహారెడ్డి విలేకరుల సమావేశంలో అన్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం, జస్టిస్ నరసింహారెడ్డి మాట్లాడుకునే కమిషన్ వేసినట్టు మాకు అర్థమైంది. ఈ అంశంలో కేసీఆర్ వాదన కరెక్ట్ అని సుప్రీంకోర్టు కూడా పేర్కొంది. ఇప్పుడు సుప్రీంకోర్టును కూడా మీరు తప్పుదోవపట్టిస్తున్నారా?’’అని జగదీశ్రెడ్డి ప్రశ్నించారు. -
కేసీఆర్కు క్లీన్చిట్ రాలేదు
సాక్షి, హైదరాబాద్: ‘విద్యుత్’విషయంలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు క్లీన్చిట్ ఏమీ రాలేదని.. విద్యుత్ కమిషన్ చైర్మన్ను మార్చాలని మాత్రమే సుప్రీంకోర్టు చెప్పిందని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. కమిషన్ను రద్దు చేయాలన్న కేసీఆర్ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు, హై కోర్టు తిరస్కరించాయని గుర్తుచేశారు. కానీ బీఆర్ఎస్ సభ్యుడు జగదీశ్రెడ్డి కోర్టు నిర్ణయాన్ని వక్రీకరిస్తూ మాట్లాడారని, అలా చేస్తే ప్రాసిక్యూట్ చేయాల్సి వస్తుందని హె చ్చరించారు.శాసనసభలో విద్యుత్ పద్దుపై సోమ వారం జరిగిన చర్చలో రేవంత్ మాట్లాడారు. ఈ సందర్భంగా జగదీశ్రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టడంతోపాటు గత బీఆర్ఎస్ సర్కారు నిర్ణయాలపై తీవ్రంగా మండిపడ్డారు. సీఎం రేవంత్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఒప్పందాలు, ప్రాజెక్టుల్లో అవినీతి జరిగింది.విద్యుత్ కొనుగోళ్లపై బీఆర్ఎస్ కోరితేనే విచారణకు ఆదేశించాం. కేసీఆర్ సత్యహరిశ్చంద్రుడికి వారసుడన్నట్టు జగదీశ్రెడ్డి మాట్లాడుతున్నారు. కానీ విచారణ కమిషన్తో వారి అవినీతి ఎక్కడ బయటపడుతుందోనని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారు కోర్టుకు వెళ్లారు. కానీ విచారణ ఆపాలని కోర్టు చెప్పలేదు. సుప్రీంకోర్టు సలహా మేరకు కమిషన్ చైర్మన్ను మారుస్తున్నాం. కొత్త వ్యక్తిని త్వరలో నియమిస్తాం. గతంలోని కాంగ్రెస్ సర్కారు నిర్ణయాలతోనే.. విద్యుత్ ఉత్పత్తి తమ హయాంలోనే పెరిగిందని బీఆర్ఎస్ గొప్పలు చెప్పుకోవడం విడ్డూరం. గతంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో తీసుకున్న నిర్ణయాల వల్లే హైదరాబాద్ నగరానికి ఆదాయం పెరిగింది. విభజన తర్వాత విద్యుత్ కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరగకుండా కాంగ్రెస్ వ్యవహరించింది. అప్పటి కేంద్ర మంత్రి జైపాల్రెడ్డి దీనికోసం కృషి చేశారు. అసెంబ్లీ ఈ వాస్తవాలు చెప్పేందుకు తాను ప్రయతి్నస్తే.. కేసీఆర్ సర్కార్ అవకాశం ఇవ్వలేదు. మార్షల్స్ను పెట్టి గెంటేయించారు. పేరుకే బీహెచ్ఈఎల్.. కాంట్రాక్టులు బినామీలకా? బీహెచ్ఈఎల్కు కాంట్రాక్టులు ఇస్తే తప్పేంటని, అవినీతికి ఆస్కారం ఎక్కడిదని జగదీశ్రెడ్డి చేస్తున్న వాదన అర్థరహితం. బీహెచ్ఈఎల్కు కేవలం ఎలక్రో్ట, మెకానికల్ పనులు చేసే సామర్థ్యమే ఉంటుంది. సివిల్ పనులు చేసే శక్తి లేదు. అందుకే బీహెచ్ఈఎల్కు విద్యుత్ ప్లాంట్ కాంట్రాక్టు ఇచ్చి ఆ సంస్థ నుంచి సివిల్ కాంట్రాక్టులను బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు, బినామీలకు, పార్టీ మారిన అప్పటి ఎమ్మెల్యేలకు ఇప్పించారు.ఇందులో వేల కోట్ల దోపిడీ జరిగింది. నిజానికి జార్ఖండ్లో 2,400 మెగావాట్ల సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ కోసం టెండర్లు పిలిస్తే.. బీహెచ్ఈఎల్, ఎల్అండ్టీ, కొరియన్ సంస్థలు ముందుకొచ్చాయి. బీహెచ్ఈఎల్ 18% తక్కువకు టెండర్ వేసింది. అలా తెలంగాణలో టెండర్లు పిలిస్తే.. ఇక్కడా బీహెచ్ఈఎల్ 18 శాతం తగ్గించేది. కానీ అలా చేయకుండా వేలకోట్ల నష్టానికి కారణమయ్యారు. వేల కోట్లు చేతులు మారాకే.. నిజానికి ఇండియాబుల్స్ సంస్థ గతంలోనే సబ్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ ఏర్పాటు కోసం బీహెచ్ఈఎల్కు ఆర్డర్ ఇచ్చింది. ఆ యూనిట్లు సిద్ధమవుతున్న తరుణంలోనే.. కేంద్రం సూపర్ క్రిటికల్ పరిజ్ఞానంతో ప్లాంట్లు కట్టాలని చట్టం చేసింది. దీంతో ఆ సబ్ క్రిటికల్ యూనిట్లు తమకు వద్దని ఇండియాబుల్స్ సంస్థ చెప్పగా.. అప్పటికే తయారీ పూర్తయిందని బీహెచ్ఈఎల్ స్పష్టం చేసింది. ఇక్కడే వేల కోట్లు చేతులు మారాయి. గత ప్రభుత్వం కాలం చెల్లిన ఆ సబ్ క్రిటికల్ యూనిట్లతో తెలంగాణలోని భద్రాద్రి ప్లాంట్ పెట్టి.. ఇండియాబుల్స్ సంస్థను గట్టెక్కించింది. పైగా విద్యుత్ కోతలు నివారించడానికే ఇలా చేశామంటూ బీఆర్ఎస్ నేతలు తప్పుడు మాటలు చెప్తున్నారు. అడ్డగోలుగా వ్యయం పెంచి.. రామగుండంలో ఎనీ్టపీసీ 2016లో 1,600మెగావాట్ల విద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని ప్రారంభించి 2024 ఫిబ్రవరిలో పూర్తి చేసింది. ఆ ప్లాంట్ వ్యయం ఒక్కో మెగావాట్కు రూ.7.38 కోట్లు అయితే.. భద్రాద్రి వ్యయం రూ.9.73కోట్లకు, యాదాద్రి వ్యయం రూ.8.64కోట్లకు పెరిగింది. యాదాద్రి పూర్తయ్యేసరికి రూ.10కోట్లకు పెరుగుతుంది. యాదాద్రిలో ఒక్కో మెగావాట్కు రూ.2.5 కోట్లు చొప్పున మొత్తం రూ.10వేల కోట్లు మింగింది ఎవరో? భద్రాద్రిలో మింగింది ఎవరో తేల్చడానికే విచారణ కమిషన్ ఏర్పాటు చేశాం. నష్టం వద్దనే ఎనీ్టపీసీ ఒప్పందానికి దూరం ఎన్టీపీసీతో ఒప్పందం చేసుకుంటే మరో ఐదేళ్లలో ఆ ప్లాంట్ పూర్తవుతుంది. రూ.8–9కి యూనిట్ చొప్పున విద్యుత్ లభిస్తుందని లెక్కలు వేశాం. ప్రస్తుతం మార్కెట్లో రూ.5 నుంచి రూ 5.30కే యూనిట్ విద్యుత్ లభిస్తోంది. అందుకే ఎనీ్టపీసీతో ఒప్పందం చేసుకోలేదు. పాపం తగిలి మీ ఇళ్లలోని వారూ జైలుకెళ్తున్నారు ఓ టీవీ చానల్కు సీఈఓగా ఉన్న మహిళా జర్నలిస్టుపై ఎస్సీ, ఎస్టీ కేసుపెట్టి అరెస్టు చేసి టీవీ చానల్ను గుంజుకున్నారు. నేను నా న్యాయవాదిని పెట్టి ఆమెకు బెయిల్ ఇప్పించా. ఆడపిల్లను జైలుకు పంపిన పాపం ఊరికే పోదు. మంది పిల్లలను జైలుకు పంపిస్తే.. మీ ఇళ్లలో కూడా జైలుకుపోతున్నారు. నిబంధనలు ఉల్లంఘించి ఫామ్హౌస్ కట్టారని బయటపెట్టినందుకు నన్ను 16 రోజులు చర్లపల్లి జైలులో పెట్టారు’’అని సీఎం రేవంత్ మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు కోరుకుంటే ఆగస్టు 1, 2 తేదీల్లోనూ అసెంబ్లీ నిర్వహించి.. గత పదేళ్ల పాలనపై రాత్రింబవళ్లు చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు.ఆ తప్పులకు మీరే బాధ్యులు..‘‘నాడు చంద్రబాబుతో అంటకాగి 610 జీవోనే వద్దని, మానవ వనరులు ఎక్కడున్నా వాడుకోవాలని చెప్పింది మీ నాయకుడు కేసీఆర్ కాదా? మీరు (హరీశ్రావు) కనీసం వార్డు మెంబర్ కూడా కాకపోయినా మంత్రిగా అవకాశం ఇచ్చింది వైఎస్ ప్రభుత్వం. పోతిరెడ్డిపాడు పొక్క పెద్దగా చేసినప్పుడు కడప జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్నది నాయిని నరసింహారెడ్డే కదా. చంద్రబాబు, వైఎస్సార్ పంచన చేరి ఊడిగం చేశారు. ఆ తప్పిదాలకు మీరే బాధ్యులు’’అని బీఆర్ఎస్ నేతలపై రేవంత్రెడ్డి మండిపడ్డారు. ఎవరో త్యాగాలు, ఆత్మబలిదానాలు చేస్తే వారి శవాల మీద అధికారంలోకి వచ్చారని విమర్శించారు. -
'పవర్' ప్రకంపనలు
సాక్షి, హైదరాబాద్: ‘విద్యుత్’ పద్దుపై సోమవారం అసెంబ్లీలో జరిగిన చర్చ ప్రకంపనలు రేపింది. అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం, సవాళ్లు– ప్రతిసవాళ్లు, ఆరోపణలు– ప్రత్యారోపణలు, రాజీనామా డిమాండ్లతో సభ అట్టుడికింది. అదే సమయంలో ఇరుపక్షాల నేతల మధ్య వ్యక్తిగత దూషణలూ చోటుచేసుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఏడాది విద్యుత్ రంగానికి బడ్జెట్లో నిధుల కేటాయింపుపై సోమవారం శాసనసభలో చర్చ జరిగింది. కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి చర్చను ప్రారంభించారు. గత ప్రభుత్వ విధానాల వల్లే విద్యుత్ రంగం నష్టాల్లోకి వెళ్లిందని ఆక్షేపించారు. విద్యుత్ కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగిందని, ఆ కథంతా వెలికి తీస్తామని పేర్కొన్నారు. అనంతరం బీఆర్ఎస్ సభ్యుడు జగదీశ్రెడ్డి మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తిని పెంచామంటూ పలు గణాంకాలను వివరించారు. అవినీతి అంటూ కాంగ్రెస్ సర్కారు కక్షపూరితంగా రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. ఈ దశలో సీఎం రేవంత్ జోక్యం చేసుకున్నారు. బీఆర్ఎస్ హయాంలోని విద్యుత్ ఒప్పందాలన్నీ అవినీతిమయమంటూ తీవ్రంగా మండిపడ్డారు. దీనికి కౌంటర్గా జగదీశ్రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతిగా సీఎం రేవంత్, మంత్రి కోమటిరెడ్డి ఇద్దరూ వ్యక్తిగత ఆరోపణలతో విరుచుకుపడ్డారు. ఈ సమయంలో ఇరుపక్షాల సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో శాసనసభ దద్దరిల్లింది.