breaking news
YSRCP
-
పోలీస్ VS కాసు మహేష్ రెడ్డి
-
డోన్ లో DSC అక్రమాలపై వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీ సక్సెస్
-
YSRCP నిరసన ర్యాలీల విజయవంతం పై YS జగన్ హర్షం
-
కొడుకును కాపాడుకోవడం కోసం చరిత్ర హీనులవుతారా?
సాక్షి, అమరావతి: ‘డీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ, అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి. ఈ స్కామ్కు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలి. ఫీజు రీయింబర్స్మెంట్ రూ.9 వేల కోట్ల బకాయి.. వసతి దీవెన బకాయి వెంటనే చెల్లించాలి. ఇంటింటికీ బాండ్లు ఇచ్చి, మేనిఫెస్టోలో చెప్పినట్టుగా నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి బకాయిలతో కలిపి చెల్లించాలి. ఇంత స్పష్టంగా విద్యార్థులు, యువత, ప్రజలు చంద్రబాబును డిమాండ్ చేస్తుంటే, వాటిని డైవర్ట్ చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేయడం ఎంత వరకు సమంజసం?’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం చంద్రబాబును నిలదీశారు. ప్రజలు అడుగుతున్న డిమాండ్లను అంగీకరిస్తారా? లేక కొడుకును కాపాడుకోవడం కోసం చరిత్ర హీనులుగా మిగిలిపోతారా? అని ప్రశ్నించారు. ఈ మేరకు సోమవారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో సోమవారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీల్లో లక్షలాదిగా విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు, ప్రజలు పాల్గొన్నారని పేర్కొన్నారు. తప్పు చేసిన ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తూ, స్ఫూర్తిదాయకంగా నిలిచారని అభినందించారు. విద్యార్థులు, యువకుల కోసం, వారి భవిష్యత్తు కోసం గత రెండు నెలలుగా అన్ని వర్గాల మద్దతుతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు చేసిన పోరాటాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయన్నారు. 10 కార్యక్రమాలకు విశేష మద్దతు‘చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ఉల్లంఘనకు పూనుకున్నారు. పోలీసు బలంతో అణచి వేయాలని చూశారు. నిర్బంధాలు, బెదిరింపులు, నోటీసులను ఖాతరు చేయకుండా, నియంతృత్వానికి ఎదురొడ్డి.. ప్రజలతో కలిసి, లక్షలాది సంఖ్యలో బయటకు వచ్చి గట్టిగా పోరాటం చేశారు. నిర్బంధాలన్నింటినీ ఎదుర్కొంటూ, ప్రతి అడ్డంకినీ అధిగవిుస్తూ శాంతియుతంగా ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాం. గడిచిన 74 రోజుల్లో రాష్ట్ర గవర్నర్ను కలవడం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నిర్వహించిన 10 కార్యక్రమాలు.. అశేష ప్రజానీకం మద్దతుతో అత్యంత విజయవంతం అయ్యాయి’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఈ ఏడాది మే నెల నుంచి ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.మే 29 – రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి విభాగం నిరసనలు⇒ జూన్ 1 – జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసనలు, వినతి పత్రాలు⇒ జూన్ 8, 9 – నియోజకవర్గ స్థాయి టౌన్ హాల్ సమావేశాలు⇒ జూన్ 12 – 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు⇒ జూన్ 18 – రాష్ట్ర గవర్నర్ను కలిసి డీఎస్సీపై విచారణ కోరుతూ వినతిపత్రం⇒ జులై 28 – రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి, యువజనుల నిరసన ర్యాలీలు⇒ జులై 31 – జిల్లా కలెక్టర్లు జేసీలకు వినతులు⇒ ఆగస్టు 3, 4 – రాష్ట్ర వ్యాప్తంగా రౌండ్ టేబుల్, టౌన్హాల్ సమావేశాలు⇒ ఆగస్టు 6, 8 – నియోజకవర్గాల స్థాయిలో రిలే నిరాహార దీక్షలు⇒ ఆగస్టు 10 – రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలుఇంత మంది అడుగుతున్నా నోరు విప్పరా?ఇన్ని కార్యక్రమాల ద్వారా లక్షల మంది ప్రశ్నించినా చంద్రబాబు నోరు మెదపడం లేదని, లోకేశ్ సమాధానం చెప్పడం లేదని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘డీఎస్సీ పేపర్ లీకేజీ, అక్రమాలు, ఫీజు రీయింబర్స్మెంట్ (విద్యా దీవెన), వసతి దీవెన కింద దాదాపుగా రూ.9 వేల కోట్ల బకాయిల చెల్లింపు, ఎన్నికల సమయంలో బాండ్లు ఇచ్చి, మేనిఫెస్టోలో పెట్టి, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పేరిట హామీలు, నెలా నెలా రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి.. ఇవేవీ లేవు. నిరుద్యోగ భృతి కింద ఏడాదికి రూ.36 వేల చొప్పున మూడేళ్లకు రూ.1.08 లక్షలు ప్రతి నిరుద్యోగికీ బాకీ పడ్డారు. ఈ బాకీ సహా ఏ డిమాండ్పైనా ఇప్పటి వరకు చంద్రబాబు నోరు తెరవలేదు. చంద్రబాబు కుమారుడు లోకేశ్ కూడా ప్రజలు వేస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. విద్యార్థులు, నిరుద్యోగులు, లక్షలాది కుటుంబాల భవిష్యత్తుకు సంబంధించిన అంశాలపై సీఎంగా చంద్రబాబు, సంబంధిత మంత్రిగా ఆయన కుమారుడు నోరు విప్పక పోవడం దౌర్భాగ్యం. సమాధానాలు చెప్పకుండా ప్రశ్నించే గొంతులను పోలీసులతో అణచి వేయడం పరిష్కారం కాదు. ఇది అధికార జులుంతో తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నమే అవుతుంది. ఉద్యోగం కోసం సంవత్సరాలుగా చదివిన అభ్యర్థులు.. తమ పిల్లల చదువుల కోసం అప్పులు చేసిన కుటుంబాలు, ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు.. వీళ్లంతా చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన బాండ్లను చూపిస్తూ నిరుద్యోగ భృతి హామీ కోసం యువత నిలదీస్తోంది. చంద్రబాబు స్పందించకపోతే విద్యార్థులు, నిరుద్యోగులు, విడిచి పెట్టరు. జెన్–జీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పితీరాలి. అంత వరకు పోరాటాలు ఆగవు’ అని వైఎస్ జగన్ తేల్చి చెప్పారు. -
అప్పర్ భద్ర ప్రాజెక్టుపై 2023లోనే సుప్రీంకోర్టుకు ఏపీ
సాక్షి, న్యూఢిల్లీ: కర్ణాటక చేపడుతున్న ఎగువ భద్ర ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2023 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టులో ప్రత్యేక అనుమతి పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేసిందని కేంద్ర జలశక్తిశాఖ సహాయమంత్రి రాజ్భూషణ్ చౌదరి తెలిపారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి ప్రశ్నకు మంత్రి బదులిస్తూ.. కృష్ణా జలవివాదాల ట్రైబ్యునల్–1 (కేడబ్ల్యూడీటీ–1) 1976 అవార్డు ప్రకారం కర్ణాటకకు మొత్తం 734 టీఎంసీల నీరు కేటాయించినట్లు తెలిపారు. ఎగువ భద్ర ప్రాజెక్టుకు కర్ణాటక కేటాయించిన 29.90 టీఎంసీల నీటి వినియోగం కేడబ్ల్యూడీటీ–1 కింద ఆ రాష్ట్రానికి చేసిన కేటాయింపుల పరిధిలోనే ఉందని కేంద్ర జలసంఘం పరిశీలనలో తేలిందన్నారు. దీంతో అంతర్రాష్ట్ర కోణంలో ప్రాజెక్టును ఆమోదయోగ్యంగా గుర్తించినట్లు తెలిపారు. అదే సమయంలో కేడబ్ల్యూడీటీ–2 తీర్పు ఇంకా అమల్లోకి రాలేదని స్పష్టం చేశారు. 20 శాతానికి మించి ఇథనాల్పై నిర్ణయం తీసుకోలేదు పెట్రోల్లో 20 శాతానికి మించి ఇథనాల్ కలపడంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర పెట్రోలియం, సహజవాయువుశాఖ సహాయమంత్రి సురేశ్ గోపీ స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ ఎంపీ గొల్ల బాబూరావు ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. భవిష్యత్లో శాస్త్రీయ, సాంకేతిక అధ్యయనాలు, సంబంధిత భాగస్వాములతో సంప్రదింపుల అనంతరమే ఇథనాల్ మిశ్రమాన్ని పెంపుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.నియామకాలు, బదిలీల్లో ఆన్లైన్ విధానం అవసరంలోక్సభలో వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి ప్రశ్నకు కేంద్రం జవాబుసాక్షి, న్యూఢిల్లీ: ఉపాధ్యాయుల నియామకాలు, బదిలీల్లో పారదర్శకమైన, పటిష్టమైన, సాధ్యమైనంతవరకు ఆన్లైన్ విధానాన్ని పాటించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సూచిస్తున్నట్లు కేంద్ర కారి్మక, ఉపాధిశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ చెప్పారు. లోక్సభలో సోమవారం వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి ప్రశ్నకు మంత్రి బదులిస్తూ.. ఉపాధ్యాయుల నియామకం, వారి సరీ్వస్ పరిస్థితులు, పోస్టింగులకు సంబంధించిన అంశాలు రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలన పరిధిలోనే ఉంటాయని తెలిపారు. విద్య ఉమ్మడి జాబితాలోని అంశం కావడంతో దేశంలోని మెజారిటీ పాఠశాలలు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలన నియంత్రణలో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ పరీక్షల్లో పారదర్శకత, నిష్పాక్షికత, విశ్వసనీయత పెంచడంతో పాటు అక్రమాలను నిరోధించేందుకు పార్లమెంట్ 2024లో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) చట్టాన్ని తీసుకొచి్చందని గుర్తుచేశారు. ఈ చట్టాన్ని రాష్ట్రాలు తమ అవసరాలకు అనుగుణంగా స్వీకరించవచ్చని చెప్పారు. తిరుపతిలో నవోదయ విద్యాలయానికి అనుమతి లేదు తిరుపతి జిల్లాలో కొత్త జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటుకు అనుమతి మంజూరు చేయలేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. వైఎస్సార్సీపీ ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. దేశంలోని ప్రతిజిల్లాలో ఒక నవోదయ విద్యాలయం ఏర్పాటు చేయాలన్నది నవోదయ విద్యాలయ పథకం లక్ష్యమని తెలిపారు. అయితే కొత్త విద్యాలయాల ఏర్పాటు నిరంతర ప్రక్రియగా ఉంటుందని, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అనువైన భూమిని సమకూర్చడంతో పాటు శాశ్వత భవనం నిర్మాణం పూర్తయ్యేవరకు తాత్కాలిక భవనాన్ని ఉచితంగా అందుబాటులోకి తేవాల్సి ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు నవోదయ పథకం పరిధిలో ఉన్నాయని, ప్రకాశం (ప్రస్తుతం మార్కాపురం), తూర్పుగోదావరి (ప్రస్తుతం పోలవరం) జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల ప్రాతిపదికన మంజూరైన మరో రెండు విద్యాలయాలు కూడా పనిచేస్తున్నాయని తెలిపారు. మొత్తం రాష్ట్రంలో 15 నవోదయ విద్యాలయాలు పనిచేస్తున్నాయని చెప్పారు.సాంకేతికతకు అనుగుణంగా చట్టాల్లో మార్పులు అవసరంరాజ్యసభలో బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్లుపై చర్చలో వైఎస్సార్సీపీ ఎంపీ నిరంజన్రెడ్డి సాంకేతికతకు అనుగుణంగా చట్టాల్లో మార్పులు అవసరం సాక్షి, న్యూఢిల్లీ: మారుతున్న కాలానికి, సాంకేతికతకు అనుగుణంగా చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని వైఎస్సార్సీపీ ఎంపీ ఎస్.నిరంజన్రెడ్డి చెప్పారు. రాజ్యసభలో సోమవారం బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్లు–2026పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. పాత చట్టాలను ఆధునికీకరిస్తూ సాంకేతికతను జోడించి ఈ బిల్లును తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేశారు. బ్యాంకింగ్ రంగానికి చట్టబద్ధమైన ప్రామాణిక ఫారం తీసుకురావడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఈ ఫారాన్ని జారీచేసే బ్యాంకు అధికారి.. కంప్యూటర్, క్లౌడ్ వ్యవస్థల డేటా సమగ్రతను (ఇంటిగ్రిటీని) ధ్రువీకరించాల్సి ఉంటుందన్నారు. ఒక సామాన్య బ్యాంకు అధికారికి క్లౌడ్ డేటా భద్రతను ధ్రువీకరించడం కష్టసాధ్యమనే విష యాన్ని ఆరి్థకమంత్రి పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. బిల్లులోని క్లాజ్ 14 ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ ఇబ్బందులను అధిగమించేందుకు ఆదేశాలిచ్చే అవకాశం ఉండటం ఉపశమనం కలిగించే అంశమన్నారు. బిల్లుకు తమపార్టీ మద్దతు ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. -
ఈపీఎస్–95 పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్–95) పరిధిలోకి వచ్చే లక్షలాదిమంది విశ్రాంత ఉద్యోగులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు, న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వైఎస్సార్సీపీ లోక్సభాపక్ష నేత పి.వి.మిథున్రెడ్డి కేంద్ర కారి్మక, ఉపాధి కల్పన, యువజన వ్యవహారాలు, క్రీడలశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను కోరారు. ఈపీఎస్–95 నేషనల్ అజిటేషన్ కమిటీ సమర్పించిన వినతిపత్రాన్ని జతచేస్తూ వినతిపత్రం ఇచ్చారు.పార్టీ ఎంపీలు డాక్టర్ మద్దిల గురుమూర్తి, డాక్టర్ గుమ్మా తనూజారాణితో కలిసి ఆయన సోమవారం పార్లమెంట్ భవన్లో కేంద్రమంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మిథున్రెడ్డి పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస పెన్షన్ మొత్తాన్ని గౌరవప్రదమైన రీతిలో పెంచాలని కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అర్హులైన పెన్షనర్లందరికీ హైయర్ పెన్షన్ సదుపాయాన్ని తక్షణమే వర్తింపజేయాలన్నారు. ఈపీఎస్–95 పథకం పరిధిలోకి రాని ఇతర విశ్రాంత ఉద్యోగులకు కూడా ఆర్థికభద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. మానవహక్కులకు విరుద్ధం ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆస్పత్రుల్లో ఏళ్లకు ఏళ్లుగా సేవలందిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి కేంద్రమంత్రిని కోరారు. ఏపీ మెడికల్–హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఇచి్చన వినతిపత్రాన్ని జతచేస్తూ ఒక వినతిపత్రం ఇచ్చారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు అనుగుణంగా కాంట్రాక్ట్ సిబ్బందికీ రెగ్యులర్ ఉద్యోగుల కనీస టైమ్స్కేల్కు సమానంగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వారికి వారాంతపు సెలవు (వీక్లీ ఆఫ్) ఇవ్వకపోవడాన్నీ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇది శ్రామిక చట్టాలకు, వారి మానవ హక్కులకు విరుద్ధమని చెప్పారు. దీనికి స్పందించిన కేంద్రమంత్రి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఒకే రకమైన విధులు నిర్వర్తిస్తున్న అందరికీ ఒకేవిధంగా వేతనం ఉండేలా విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఏజెన్సీ ప్రాంతాల్లో క్రీడావసతులు పెంచాలి గిరిజన ప్రాంతాల్లో అపారమైన క్రీడా ప్రతిభ దాగి ఉన్న విద్యార్థులు, యువతను ప్రోత్సహించేందుకు ట్రైబల్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజారాణి కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయను కోరారు. ఈ మేరకు ఆమె వినతిపత్రం ఇచ్చారు. అరకు కేంద్రంగా ట్రైబల్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్–అరకు పేరుతో ప్రత్యేక క్రీడాభివృద్ధి ప్రాజెక్టును ప్రారంభించాలని కోరారు. మిగతా ఏజెన్సీ ప్రాంతాల్లో క్రీడావసతులు మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు. గిరిజనులకు ప్రత్యేక ఆసక్తి ఉండే విలువిద్య, షూటింగ్ వంటి విభాగాలకు ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, గిరిజన బాలబాలికల కోసం క్రీడాహాస్టళ్లు లేదా రెసిడెన్షియల్ అకాడమీలు నెలకొల్పాలని కోరారు. ఈ సదుపాయాలను ‘ఖేలో ఇండియా’ పథకంతో అనుసంధానించాలని విన్నవించారు. తమ డిమాండ్లకు సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఎంపీ తనూజారాణి చెప్పారు. గ్రామీణ డాక్ సేవకుల కోసం కమిటీ వేయాలి గ్రామీణ ప్రాంతాల పోస్టల్ సేవల్లో కీలకపాత్ర పోషిస్తున్న గ్రామీణ డాక్ సేవకుల (జీడీఎస్ల) వేతన నిర్మాణం, సర్వీసు నిబంధనలను సమీక్షించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ లోక్సభాపక్ష నేత పి.వి.మిథున్రెడ్డి కేంద్ర కమ్యూనికేషన్లశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను కోరారు. ఈ మేరకు ఆయన కేంద్రమంత్రికి వినతిపత్రం అందించారు. -
దగా డీఎస్సీపై దద్దరిల్లిన రాష్ట్రం.. 'కదం తొక్కిన జనం'
సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్: దగా డీఎస్సీపై వైఎస్సార్సీపీ సోమవారం చేపట్టిన ర్యాలీలతో రాష్ట్రం దద్దరిల్లింది. మెగా డీఎస్సీ పేరుతో దగా చేసిన చంద్రబాబు సర్కారుపై యువత భగ్గుమంది. దగా డీఎస్సీకి కారకుడైన మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని, సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన ప్రజా పోరు విజయవంతమైంది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సోమవారం భారీ ర్యాలీల ద్వారా వైఎస్సార్సీపీ శ్రేణులు, యువత కదం తొక్కారు. టీడీపీ శ్రేణులను, పోలీసులను పురిగొల్పి ఎన్ని అడ్డంకులు కల్పించినా, మూడు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ చేపట్టిన రిలే దీక్షలను విజయవంతం చేసిన జెన్ జీ యువత ర్యాలీలకు సైతం భారీగా తరలి వచ్చింది. మెగా డీఎస్సీలో ప్రశ్నపత్రాల లీకేజీ, అక్రమాలు, స్పోర్ట్స్ కోటా అవకతవకలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలని, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు తక్షణమే విడుదల చేయాలని, ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేలు భృతి ఇవ్వాలని పెద్ద ఎత్తున నినదించారు. జెన్ జీ యువత పెద్ద ఎత్తున ఉద్యమానికి మద్దతు పలకడంతో తన కుమారుడి భవితవ్యం ఇబ్బందుల్లో పడుతుందని కలవరపడుతున్న చంద్రబాబు మూడు రోజులపాటు నిర్వహించిన రిలే దీక్షలను అడ్డుకునేందుకు టీడీపీ శ్రేణులను, పోలీసులను పురిగొల్పిన సంగతి తెల్సిందే. సోమవారం నిర్వహించిన ర్యాలీలను సైతం అడ్డుకునేందుకు పోలీసులను ప్రయోగించారు. దీంతో భారీగా మోహరించిన పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయడం, నోటీసులు ఇవ్వడం, హౌస్ అరెస్టులు, అరెస్టులతో రెచ్చిపోయారు. అయినా ప్రజలు, యువత నిరసన ర్యాలీలకు భారీగా తరలివచ్చారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని వైఎస్సార్సీపీ శ్రేణులు స్పష్టం చేశాయి. లోకేశ్ రాజీనామా చేయాల్సిందేనని సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరిలో కదంతొక్కిన నిరుద్యోగులు, యువత అడుగడుగునా చంద్రబాబు సర్కారు జులుండీఎస్సీ స్కామ్పై వైఎస్సార్సీపీ, యువత ఆందోళనలతో బెంబేలెత్తిపోతున్న సీఎం చంద్రబాబు.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని సోమవారం కూడా వైఎస్సార్సీపీ నిర్వహించిన ర్యాలీలపై జులుం ప్రదర్శించారు. వైఎస్సార్ కడప జిల్లాలోని పులివెందులలో వైఎస్సార్సీపీ శ్రేణులపై డీఎస్పీ మురళీనాయక్ నాయకత్వంలో పోలీసులు అమానుషంగా లాఠీచార్జీ చేశారు. కడపలో వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి నేతృత్వంలో ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ను పోలీసులు అడ్డుకోగా, ఆయన ఇంటి గేటు వద్దే బైఠాయించి నిరసన తెలిపారు. భరత్ ఇంటిపై దాడికి టీడీపీ నేతలు దూసుకువచ్చారు. వైఎస్సార్సీపీ ర్యాలీకి పోటీగా కావాలనే టీడీపీ ర్యాలీ నిర్వహించే ప్రయత్నం చేయడంతో హైటెన్షన్ నెలకొంది. ఎక్కడ అడ్డుకుంటే అక్కడే బైఠాయింపుచిత్తూరులో ర్యాలీకి వచ్చిన వైఎస్సార్సీపీ కార్యకర్తలను పోలీసులు దారుణంగా ఈడ్చి పడేశారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో శాసన మండలిలో వైఎస్సార్సీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణతోపాటు పార్టీ శ్రేణులు ముందుకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బొత్స తదితర నేతలు రోడ్డుపైనే బైఠాయించారు. అనంతపురం జిల్లాలో ముచ్చుకోట వద్ద తాడిపత్రికి వెళ్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో ఆయన రోడ్డుపైనే బైఠాయించారు. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఇంట్లోకి వెళ్లాలని పోలీసులు ఒత్తిడి చేశారు. ర్యాలీకి వస్తే కేసులు పెడతామని బెదిరింపులువిజయవాడ సెంట్రల్ వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును ఇంటి వద్దే అడ్డుకున్న పోలీసులు వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ను అడ్డుకోవాలని చూశారు. వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి అవినాష్ పోలీసుల బారికేడ్లు దాటుకుని వచ్చి ర్యాలీ నిర్వహించారు. విశాఖ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ను అరెస్ట్ చేసిన పోలీసులు జగదాంబ జంక్షన్లో వైఎస్సార్సీపీ ర్యాలీని అడ్డుకున్నారు. విశాఖ నార్త్లో ర్యాలీ నిర్వహించిన వైఎస్సార్సీపీ శ్రేణులను అడ్డుకుని బైక్ల తాళాలు తీసుకుని పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావును పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. ర్యాలీకి వస్తే కేసులు పెడతామని, బైకులు, కార్లు సీజ్ చేస్తామని భయపెట్టారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలకు నోటీలు ఇచ్చిన పోలీసులు పలుచోట్ల ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రికత్త నెలకొంది. చినమేరంగిలో మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. గుంటూరు జిల్లా పొన్నూరు ఐలాండ్ సెంటర్లో వైఎస్సార్సీపీ ఏర్పాటు చేసిన టెంట్ను పోలీసులు దౌర్జన్యంగా పీకేశారు. గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అవనిగడ్డలో ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నెల్లూరు సిటీ నియోజకవర్గం ట్రంక్ రోడ్డులో వైఎస్సార్సీపీ నిర్వహించిన ర్యాలీలో భారీగా పాల్గొన్న శ్రేణులు బెదిరింపులను ఖాతరు చేయని ప్రజలు కర్నూలులో మాజీ ఎంపీ బుట్టా రేణుక, ఎస్వీ విజయ మనోహరిని పోలీసులు అడ్డుకోవడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ శ్రేణులు నినాదాలు చేశారు. రాజమండ్రిలో మాజీ ఎంపీ మార్గాని భరత్ను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భరత్ ఇంటి గేటు వద్దే బైఠాయించి నిరసన చేపట్టారు. రాజమండ్రిలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇంటి వద్ద పోలీసులు మోహరించడంతో ఆయన ఇంటి వద్దే ధర్నాకు దిగారు. నెల్లూరు జిల్లా మనుబోలులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, కాకాణి పూజిత ఆధ్వర్యంలో సాగిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. కాకినాడలో కురసాల కన్నబాబును అడ్డుకునేందుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. పోలీస్ ఆంక్షలను సైతం లెక్క చేయకుండా ఏడు కిలోమీటర్ల మేర బైక్ ర్యాలీ నిర్వహించారు.సాగు అవసరాల కోసం వెళితే పోలీస్స్టేషన్లో పెట్టారు‘మేమంతా సాగు అవసరాల కోసం టెక్కలి వచ్చాం. అయితే మీరంతా ధర్నాకు వెళ్తున్నారని పోలీసులు పోలీస్స్టేషన్కు తీసుకువచ్చారు’ అని శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం అన్నాపురం రైతులు వాపోయారు. వీరు యూరియా, ఇతర సాగు అవసరాల కోసం ఆటోలో టెక్కలి వస్తుండగా పోలీసులు ఆపేసి స్టేషన్కు తీసుకెళ్లారు. భూమి పత్రాలు చూపించినా వదల్లేదు. ఆటోతో సహా స్టేషన్కు తీసుకెళ్లారు. గంటల తరబడి స్టేషన్లోనే ఉంచారు.మెరిట్ సాధించినా అన్యాయమేనేను స్కూల్ అసిస్టెంట్ సోషల్ అభ్యర్థిని. రేయింబవళ్లు కష్టపడి చదివి పరీక్ష రాయడంతో మొదటి మెరిట్ లిస్ట్లో చోటు సంపాదించా. జిల్లా స్థాయిలో 139వ ర్యాంకు సాధించాను. ఉద్యోగం గ్యారెంటీ అనుకున్న తరుణంలో నా పేరు ఫైనల్ లిస్ట్లో లేదు. ప్రస్తుతం ఒక ప్రైవేటు పాఠశాలలో టీచర్గా పని చేస్తున్నాను. తక్కువ జీతంతో కుటుంబాన్ని నెట్టుకు రావడం కష్టంగా ఉంది. మానసిక ఆందోళనతో రోజూ ఇబ్బంది పడుతున్నా. నా ప్రతిభకు న్యాయం జరగాలని కోర్టుకు వెళ్దామంటే కనీసం లాయర్ ఫీజులు భరించే ఆర్థిక స్థోమత కూడా నాకు లేదు. మెరిట్ సాధించినా మా లాంటి పేద అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ తట్టుకోలేకపోతున్నాను.– జుత్తుగ శ్రీనివాస్, ఉండ్రాజవరం, నిడదవోలు నియోజకవర్గం, తూర్పుగోదావరి జిల్లాఫేక్ సర్టిఫికెట్లకే పెద్దపీట కఠోర శ్రమతో డీఎస్సీ పరీక్షకు చదివి స్కూల్ అసిస్టెంట్ (సోషల్)గా జిల్లా స్థాయిలో 130వ ర్యాంకు సాధించాను. ప్రభుత్వం కేటాయించిన ఈడబ్ల్యూఎస్ కోటాలో నేను ఉద్యోగానికి అర్హుడిగా నిలిచాను. అయితే నాకంటే తక్కువ అర్హత ఉండి, అక్రమ మార్గంలో ఫేక్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ పొందిన ఒక అభ్యర్థికి అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగం కట్టబెట్టారు. ఈ అన్యాయంపై హైకోర్టును ఆశ్రయించగా, నా వాదనల్లోని నిజాయతీని గుర్తించి ఉద్యోగం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పు ఇచ్చి ఇన్ని రోజులవుతున్నా విద్యాశాఖ అధికారులు మాత్రం ఆ ఆదేశాలను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేస్తున్న పోరాటంతో నాలాంటి డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది.– కరుటూరి వెంకట సతీష్, కాల్దారి, ఉండ్రాజవరం మండలం, తూర్పుగోదావరి జిల్లా -
జానకి రెడ్డి మృతి పట్ల వైఎస్ జగన్ తీవ్ర సంతాపం
సాక్షి,తాడేపల్లి: ఏలూరు జిల్లా వైఎస్సార్సీపీ ఉపాధ్యక్షురాలు జగ్గవరపు జానకి రెడ్డి మృతి పట్ల పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.జానకి రెడ్డి హఠాన్మరణం చెందడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ఆమె కుమార్తె అజితా రెడ్డితో వైఎస్ జగన్ ఫోన్లో మాట్లాడారు. ఈ కష్టసమయంలో ధైర్యంగా ఉండాలని ఆమెను ఓదార్చారు. జానకి రెడ్డి మృతి చెందడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావం నుండి ఆమె అందించిన సేవలు ఎనలేనివని కొనియాడారు. వైఎస్సార్సీపీ కుటుంబం ఎల్లప్పుడూ జానకి రెడ్డి కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీల సక్సెస్పై వైఎస్ జగన్ హర్షం
తాడేపల్లి : డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసన ర్యాలీలు విజయవంతం కావడంపై పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు, యువకులు, నిరుద్యోగుల మద్దతుతో ర్యాలీలు సక్సెస్ అయ్యాయని, అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారని ప్రశంసించారు. ఇంత జరుగుతున్నా నోరు మెదపని చంద్రబాబు సర్కారు తీరుపై ధ్వజమెత్తారు. ఈ మేరకు ట్వీట్ చేశారు వైఎస్ జగన్.‘విద్యార్థులు, యువకులు కోసం, వారి భవిష్యత్తుకోసం గడచిన 2 నెలలుగా అన్నివర్గాల మద్దతుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చేసిన పోరాటాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. చంద్రబాబూ.. మీరు అధికార దుర్వినియోగం చేస్తూ, రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ఉల్లంఘిస్తూ, పోలీసు బలంతో అణచివేయాలని చూసినా నిర్బంధాలు, బెదిరింపులను లెక్క చేయకుండా, నోటీసులను ఖాతరు చేయకుండా, నియంతృత్వానికి ఎదురొడ్డి, ప్రజలతో కలిసి, లక్షలాది సంఖ్యలో బయటకు వచ్చి గట్టిగా పోరాటం చేశారు.నిర్బంధాలన్నింటినీ ఎదుర్కొంటూ, ప్రతి అడ్డంకినీ అధిగమిస్తూ శాంతియుతంగా ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. అందుకే ఈ 74 రోజుల్లో గవర్నర్ను కలవడం దగ్గరనుంచి రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నిర్వహించిన 10 కార్యక్రమాలు అశేష ప్రజానీకం మద్దతుతో అత్యంత విజయవంతగా జరిగాయి’ అని పేర్కొన్నారు.డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ ఏ తేదీల్లో ఏం నిరసన కార్యక్రమ జాబితాను కూడా వైఎస్ జగన్ పోస్ట్ చేశారు. మే 29, 2026 - రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి విభాగం నిరసనలుజూన్ 1, 2026 - జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసనలు, వినతిపత్రాలుజూన్ 8-9, 2026 - నియోజకవర్గ స్థాయి టౌన్ హాల్ సమావేశాలు.జూన్ 12, 2026 - 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలుజూన్ 18, 2026 - రాష్ట్ర గవర్నర్ను కలిసి డీఎస్సీపై విచారణ కోరుతూ వినతిపత్రంజులై 28, 2026 - రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి, యువజనుల నిరసన ర్యాలీలుజులై 31, 2026 - జిల్లా కలెక్టర్లు/జాయింట్ కలెక్టర్లకు వినతిపత్రాలుఆగస్టు 3-4, 2026 - రాష్ట్రవ్యాప్తంగా రౌండ్టేబుల్, టౌన్హాల్ సమావేశాలుఆగస్టు 6-8, 2026 - నియోజకవర్గాల స్థాయిలో రిలే నిరాహార దీక్షలుఆగస్టు 10, 2026 - రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలుఇన్ని కార్యక్రమాల ద్వారా లక్షల మంది ప్రశ్నించినా చంద్రబాబు మీరు నోరుమెదపడంలేదు. డీఎస్సీ లీకేజీ, అక్రమాలు, ఫీజు రీయింబర్స్ మెంట్ ( విద్యాదీవెన), వసతిదీవెన కింద దాదాపుగా రూ.9వేల కోట్లు బకాయిలు, పైగా ఎన్నికల సమయంలో బాండ్లు ఇచ్చి, మేనిఫెస్టోలో పెట్టి, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పేరిట నిరుద్యోగ భృతికింద నెలా నెలా రూ.3వేల చొప్పున ఇస్తానన్న సొమ్ము చూస్తే ఈమూడేళ్లకు రూ.36,000X3సంవత్సరాలు = రూ.1,08,000లు చొప్పున ప్రతి నిరుద్యోగికీ పడ్డ బాకీ సహా ఏ డిమాండ్పైనా ఇప్పటివరకూ నోరు తెరవలేదు.మీ కుమారుడు లోకేష్కూడా ప్రజలు వేస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంలేదు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. విద్యార్థులు, నిరుద్యోగులు, లక్షలాది కుటుంబాల భవిష్యత్తుకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రిగా మీరు, సంబంధిత మంత్రి అయిన మీ కుమారుడు నోరువిప్పకపోవడం దౌర్భాగ్యకరంగా ఉంది. సమాధానాలు చెప్పకుండా ప్రశ్నించే గొంతులను పోలీసులతో అణచివేయడం పరిష్కారం కాదు చంద్రబాబూ ఇది మీ తప్పులను మీ అధికార జులంతో కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడమే. విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు, ప్రజల డిమాండ్లు చాలా స్పష్టంగా ఉన్నాయి.’ అని పేర్కొన్నారు.ఆ డిమాండ్ల జాబితా ఇదే..1.డీఎస్సీ లీకేజీ, అక్రమాలపై సీబీఐ విచారణ2.దీనికి బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా3.రూ.9వేల కోట్ల బకాయి పడ్డ ఫీజురీయింబర్స్మెంట్, వసతి దీవెనల చెల్లింపు4.ఇంటింటికీ బాండ్లు ఇచ్చి, మేనిఫెస్టోలో చెప్పినట్టుగా నెలకు రూ.3వేల చొప్పున నిరుద్యోగ భృతి, బకాయిలతో కలిపి, ఈ మూడేళ్లకాలానికి చెల్లించాలి.ఇంత స్పష్టంగా డిమాండ్లు ఉన్నా, డైవర్ట్ చేస్తూ మీరు తప్పించుకునే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం?, చంద్రబాబూ.. ప్రజలు అడుగుతున్న ఈ డిమాండ్లకు అంగీకరిస్తారా?, లేక కొడుకును కాపాడుకోవడం కోసం చరిత్ర హీనులుగా మిగిలిపోతారా?, ఉద్యోగం కోసం సంవత్సరాలుగా చదివిన అభ్యర్థులు,. తమ పిల్లల చదువుల కోసం అప్పులు చేసిన కుటుంబాలు, ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు వీళ్లంతా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన బాండ్లను చూపిస్తూ నిరుద్యోగ భృతి హామీ కోసం యువత ప్రశ్నిస్తోంది. చంద్రబాబూ.. మీరు స్పందించకపోతే విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు మిమ్మల్ని విడిచిపెట్టరు.Gen-Z ప్రశ్నలకు మీరు తప్పక సమాధానాలు చెప్పాలి. అంతవరకూ ఈ పోరాటాలు ఆగవు’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.విద్యార్థులు, యువకులు, నిరుద్యోగుల మద్దతుతో రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గ వర్గాల్లో ఇవాళ వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీల్లో లక్షలాదిగా విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు, ప్రజలు పాల్గొని తప్పుచేసిన ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తూ, స్ఫూర్తిదాయకంగా నిలిచారు.… pic.twitter.com/7SSXeSc9zO— YS Jagan Mohan Reddy (@ysjagan) August 10, 2026 -
నీకు దమ్ముంటే నీ కొడుకుని రాజీనామా చేయమని చెప్పు
-
‘చట్టం ఏమైనా మీ చుట్టమా?’
విజయనగరం: నిరంకుశ పాలన సాగిస్తున్న కూటమి సర్కారును మరోసారి ఉతికి ఆరేశారు మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ. డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు శాంతియుతంగా నిరసన చేపడితే అడ్డుకోవడమే కాకుండా లాఠీచార్జ్ చేస్తారా? అంటూ ధ్వజమెత్తారు. చట్టం ఏమైనా మీ చుట్టం అనుకుంటున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరం నుంచి ప్రెస్మీట్ నిర్వహించిన ఆయన.. ‘కొత్త జీవోలో డైరెక్ట్గా ఉద్యోగాలు ఇచ్చే వెసులబాటు ఉందా లేదా అని అడుగుతున్నాం.. ఆటలు రాక పోయినా సర్టిఫికెట్లు ఇచ్చారు. లీకేజీ అయింది. అందులో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ర్యాంక్ వచ్చింది.శాంతియుతంగా నిరసన చేస్తుంటే వైఎస్సార్సీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకుంటున్నారు. నిరసన చేసేందుకు వీలు లేదని పోలీసులు అడ్డుకోవడం ఏంటి?, కొన్ని ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. చట్టం ఏమైనా మీ చుట్టమా?, ఇదేనా కూటమి పరిపాలన. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి, ప్రజలకు వాస్తవాలను చెప్పాలి. ఆరోగ్యశ్రీ పథకానికి తూట్లు పొడిచారు. విద్య, వైద్య రంగాలను పూర్తిగా నిర్వీర్యం చేశారు’ అని మండిపడ్డారు.డీఎస్సీ అక్రమాలపై గత 74 రోజులుగా తాము చేస్తున్న పోరాటాలతో పాటు ఈరోజు(సోమవారం, ఆగస్టు 10వ తేదీ) చేపట్టిన ఏపీ వ్యాప్త ర్యాలీలు విజయవంతమయ్యాయన్నారు డీఎస్సీ అక్రమాలపై విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామాతో పాటు థర్డ్ పార్టీ విచారణ చేయమని డిమాండ్ చేస్తున్నామన్నారు బొత్స. -
YSRCP ర్యాలీలు సక్సెస్
-
దమ్ముంటే సీబీఐ ఎంక్వైరీ పెట్టు
-
విచారణ అంటే బాబు వణికిపోతున్నాడు
-
‘వైఎస్సార్సీపీ ర్యాలీలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన’
తాడేపల్లి: వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందని పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తాజాగా డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త నిరసన ర్యాలీలు విజయవంతం కావడంతో సజ్జల మీడియాతో మాట్లాడారు. తాము అడిగిన దాంట్లో వాస్తవం లేకపోతే ప్రజల నుంచి ఇంత స్పందన ఎలా వస్తుందని ప్రశ్నించారు. ‘వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీలకు ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. డీఎస్సీ అక్రమాలపై కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు. నిరసనలపై కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మా పోరాటాలను అణచివేయాలని చూస్తున్నారు. వైఎస్సార్సీపీ ర్యాలీలు విజయవంతమయ్యాయి. వైఎస్సార్సీపీ చేపట్టిన ప్రతి కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. నిరసన కార్యక్రమాలను ఓ ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తున్నాం. అందుకే వైఎస్సార్సీపీ పోరాటాను అణగదొక్కాలనే ప్రయత్నం చేస్తున్నారు. డీఎస్సీలో అక్రమాలు జరిగింది వాస్తవం కాబట్టే చంద్రబాబు ఉలిక్కిపడుతున్నారు. ఈ స్కాం నుంచి చంద్రబాబు, లోకేష్ తప్పించుకోలేరు. డీఎస్సీ అక్రమాలపై కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు. నిరసనలపై కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇప్పటివరకూ ఇవ్వలేదు. మేం అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతోంది. డీఎస్సీలో అక్రమాలు జరిగినట్లు క్లియర్గా తెలుస్తోంది. ఉన్నతస్థాయిలోనే తప్పు జరిగిందనే విషయం అర్థమవుతోంది. అక్రమాలు జరిగాయి కాబట్టే సీబీఐ విచారణకు భయపడుతున్నారు. లీకేజీ జరిగిందనడానికి తిరుగులేని ఆధారాలున్నాయిఒక తప్పును కవర్ చేయడానికి తప్పుల మీద తప్పులు చేశారు. అక్రమాలు బయటకు రావడంతో సర్టిఫికెట్లు కూడా టాంపర్ చేసి మార్చారు’ అని ధ్వజమెత్తారు సజ్జల. -
నారా లోకేష్పై YSRCP దావులూరి దొరబాబు సంచలన వ్యాఖ్యలు
-
అతని మీద ఎలాంటి కేసు పెట్టారంటే.. చింతాడ రవి అరెస్ట్ పై సంచలన నిజాలు
-
పుష్ప శ్రీవాణిని అడ్డుకున్న పోలీసులు
-
బద్వేల్ లో YSRCP ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
-
నిరసనలో పోలీసులకు గులాబీలు.. అంబటి కామెడీ
-
పేకాటలో గెలిస్తే గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చేస్తారా..? నువ్వేం మంత్రివయ్యా
-
విశాఖలో ఉద్రిక్తత.. KK రాజు అరెస్ట్
-
దద్దరిల్లిన కర్నూల్.. కొట్టినా.. అరెస్ట్ చేసినా YSRCP నిరసనలు
-
గుడివాడలో కొడాలి నాని భారీ ర్యాలీ
-
చంద్రబాబు సర్కార్ పిరికిపంద చర్య
సాక్షి, అమరావతి: డీఎస్సీ అక్రమాలను నిలదీస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాలు కూటమి ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడిని పెంచాయి. అయితే ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ర్యాలీలను అడ్డుకోవడం, నేతలను అదుపులోకి తీసుకోవడం.. పలు చోట్ల లాఠీఛార్జీలు చేయడంపై వైఎస్సార్సీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నిరసనలను అడ్డుకోవడం చంద్రబాబు ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనమని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు.డీఎస్సీ నియమకాల్లో జరిగిన అవినీతికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయడం, ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ అభ్యర్థులు, డీఎస్సీ సంఘాలతో వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పలుచోట్ల పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ర్యాలీలు, నిరసనలకు అనుమతి లేదంటూ అడ్డుకునే ప్రయత్నం చేశారు.పులివెందులలో లాఠీఛార్జ్.. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి నియోజకవర్గంలో పోలీసులు దౌర్జన్యకాండకు పాల్పడ్డారు. పులివెందులలో ఆర్డీవోకు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన వైఎస్సార్సీపీ శ్రేణులపై లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో పలువురికి గాయాలు కాగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు వినిపించాయి. అంతకు ముందు.. ఎంపీ అవినాశ్రెడ్డికి ర్యాలీ నిర్వహించడానికి వీల్లేదంటూ పోలీసులు నోటీసులు అందించారు.చీపురుపల్లిలో బొత్సకు అడ్డంకులుచీపురుపల్లిలో నిర్వహించాల్సిన నిరసన కార్యక్రమానికి వెళ్తున్న సీనియర్ నేత, మండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణను పోలీసులు అడ్డుకున్నారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉన్నప్పటికీ పోలీసులు అడ్డుకోవడం సరికాదని బొత్స మండిపడ్డారు. రోడ్డుపైనే ఆయన ఆందోళన చేపట్టారు. కొడాలి నాని హౌస్ అరెస్ట్మాజీ మంత్రి కొడాలి నానిని గుడివాడ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. డీఎస్సీ అంశంపై నిరసనల్లో పాల్గొనకుండా ముందస్తుగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ పరిణామంపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు మండిపడుతున్నారు.అటు రాజమండ్రిలోనూ మాజీ ఎంపీ భరత్ ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతుండగా.. పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై ఆయన మండిపడ్డారు. విశాఖలో అరెస్టులువిశాఖపట్నంలోని మారియట్ సెంటర్ వద్ద నిరసనకు ప్రయత్నించిన వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. కేకే రాజు సహా పలువురిని అదుపులోకి తీసుకున్నారని తెలిపారు.విజయవాడలో దేవినేని ర్యాలీకి అడ్డంకులువిజయవాడలో దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అనుమతి లేదంటూ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ శ్రేణులు బారికేడ్లు దాటేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.అవనిగడ్డలోనూ అడ్డగింతఅవనిగడ్డలోనూ వైఎస్సార్సీపీ నేతల నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల సమస్యలపై గొంతెత్తే హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించింది.తిరుపతిలో భూమన కరుణాకర్రెడ్డి నేతృత్వంలో.. గన్నవరంలో వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో ర్యాలీలు జరుగుతున్నాయి. నెల్లూరు, కర్నూల్, అనంతపురం, అవనిగడ్డ.. ఇలా పలు చోట్ల వైఎస్సార్సీపీ ర్యాలీలు నిర్వహించకుండా పోలీసులు అడ్డుపడుతున్నారు. నిరసన తెలియజేస్తున్న వాళ్లపైకి లాఠీ ప్రయోగిస్తున్నారు.‘శాంతియుత నిరసనలకు ఎందుకు అభ్యంతరం?’డీఎస్సీ అంశంపై శాంతియుతంగా ర్యాలీలు నిర్వహిస్తే ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, దాన్ని అడ్డుకోవడం సరికాదని అన్నారు. -
అనంత పోలీసుల దౌర్జన్యం.. రోడ్డుపైనే పెద్దిరెడ్డి బైఠాయింపు
సాక్షి, అనంతపురం: ఏపీలో దగా డీఎస్సీపై ప్రజాపోరు కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ ఆధర్వ్యంలో పోరాటం ఉధృతమైంది. అయితే శాంతియుతంగా నిర్వహిస్తున్న ర్యాలీలను మాత్రమే కాదు.. ఈ దౌర్జన్యకాండను నిలదీస్తున్న వైఎస్సార్సీపీ నేతలను సైతం పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం తాడిపత్రి నియోజకవర్గం ముచ్చుకోట వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాడిపత్రిలో ఇవాళ యువత ర్యాలీకి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఏర్పాట్లు చేశారు. అయితే పోలీసులు మాత్రం అధికార టీడీపీ కార్యక్రమం ఉందంటూ ఆ ర్యాలీని అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాడిపత్రికి బయల్దేరారు. మార్గమధ్యంలో ముచ్చుకోట వద్ద పోలీసులు ఆయన్ని అడ్డుకోవడంతో.. ఆయన రోడ్డుపైనే బైఠాయించి ఆయన నిరసన తెలియజేశారు. పోలీసులను నిలదీసిన పెద్దిరెడ్డిశాంతియుతంగా నిర్వహించే కార్యక్రమాలను ఎలా అడ్డుకుంటారని పోలీసులను పెద్దిరెడ్డి ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోలీసులతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు.. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది.డీఎస్సీ అంశంపై ప్రభుత్వంపై విమర్శలుసాక్షితో మాట్లాడిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. వైఎస్సార్సీపీ ర్యాలీలను అడ్డుకోవడం దుర్మార్గమని ఆరోపించారు. “మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ ఎందుకు జరపడం లేదు? మంత్రి లోకేశ్ కనుసన్నల్లోనే డీఎస్సీలో అక్రమాలు జరిగాయి. నైతిక బాధ్యతగా ఆయన రాజీనామా చేయాలి” అని డిమాండ్ చేశారు.హైవేపై బైఠాయింపుపోలీసుల తీరుకు నిరసనగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు అనంతపురం-తాడిపత్రి హైవేపై బైఠాయించారు. పోలీసుల వ్యవహారశైలిపై నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నేతలు వెంకటరెడ్డి, విశ్వేశ్వర్రెడ్డి కూడా పోలీసుల తీరును తప్పుబట్టారు. శాంతియుత కార్యక్రమాలను అడ్డుకోవడం సరికాదని మండిపడ్డారు. -
Watch Live: DSC అక్రమాలపై కదం తొక్కిన YSRCP
-
డీఎస్సీపై ప్రశ్నిస్తే దాడులా?.. ‘క్రిమినల్స్ అడ్డా’ ఎవరిది బాబు?
విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమమహేశ్వరరావు తన అనుచరులతో కలిసి గత గురువారం నాడు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్ష శిబిరంపై దాడి చేశారు. టెంట్ పీకేశారు. అక్కడ కొందరు టీడీపీ గూండాలు వికృత చేష్టలకు పాల్పడ్డారు. సరిగ్గా అదే టైమ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సమావేశంలో ఉన్నారు. బోండా ఉమ అరాచక ప్రవర్తనపై ఆయనకు సమాచారం అందే ఉండాలి. అయినా అలాంటివి చేయవద్దని చెప్పకపోగా, వైఎస్సార్సీపీవారిని ఉద్దేశించి గొడ్డలి పార్టీ, క్రిమినల్స్ తయారీ అడ్డా అంటూ చంద్రబాబు విమర్శించారట.కొన్నాళ్ల క్రితం బోండా ఉమ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పక్కన కూర్చుంటే చంద్రబాబుకు కోపం వచ్చింది. వెంటనే ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి పార్టీ కమిటీ వేసి మందలించే ఏర్పాటు చేశారు. తదుపరి తన కుమారులతో కలిసి బోండా ఉమ చంద్రబాబును కలిశారు. అక్కడ ఏమి మాట్లాడుకున్నారో తెలియదు కాని, మరుసటి రోజే ఉమా విజయవాడలో గూండాయిజానికి బరి తెగించారు. వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై ఆయన అనుచరులు దాడి చేశారు. విజిటేరియన్ అయిన విష్ణుపై కోడిగుడ్లు విసిరారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు, మంత్రి లోకేష్ రాజీనామా కోరుతూ వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తోంది. వారు తమ డిమాండ్తో ప్రశాంతంగా దీక్షలు చేస్తున్నారు. దీనిని భరించడం టీడీపీ నాయకత్వానికి కష్టంగా మారింది.నీట్ ప్రశ్నాపత్రాల లీక్పై ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన ఫలితంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయవలసి వచ్చింది. జార్ఖండ్లో కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆందోళనలు సాగుతున్నాయి. వాటికి ప్రభుత్వంలో భాగస్వామి అయిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా మద్దతు ఇస్తున్నారు. ఏపీలో కూడా డీఎస్సీ టీచర్ల ఎంపికలో అక్రమాలు జరిగాయని మాజీ సీఎం జగన్ ఆధార సహితంగా ఆరోపణలు చేశారు. ఆయన అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వ పక్షాన సరైన జవాబు ఇవ్వలేకపోతున్నారు. పలువురు డీఎస్సీ అభ్యర్ధులు తమకు అన్యాయం జరిగిందని సాక్ష్యాలు చూపుతున్నారు. అయినా ప్రభుత్వం డబాయించి తప్పించుకోవాలని చూస్తోంది.ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ వివిధ రూపాలలో ఆందోళనలు సాగిస్తోంది. డీఎస్సీ అక్రమాలపై జరుగుతున్న ప్రచారం ప్రజలలోకి వెళుతుండడంతో చంద్రబాబు, లోకేష్లు అసహనానికి గురవుతున్నారు. అందువల్లే ప్రభుత్వం అనుకుంటే రెండు నిమిషాలలో అణచివేయగలదని బెదిరించడం, ఆందోళన చేస్తున్న రైతులను, నిరుద్యోగ యువతను గంజాయి బాచ్ అని అనడం వంటివి చేశారనిపిస్తుంది. ఇవన్ని ముఖ్యమంత్రి స్థాయికి తగనివని ఆయనకు తెలిసినా ఏదో నిస్సహాయ స్థితిలో పడ్డారనిపిస్తుంది. ఎదురుదాడిలో భాగంగా కర్నూలులో కొందరితో ప్రదర్శన చేయించారు. వారు ఏ తరహా వారో తెలియదు. ఎల్లో మీడియా ప్రముఖంగా ఆ కథనాన్ని ఇచ్చింది. అంటే ప్రభుత్వానికి అనుకూలంగా ర్యాలీ చేస్తే వారు పవిత్రులు, వ్యతిరేకంగా చేస్తే గంజాయి బాచ్లని ప్రచారం చేస్తారన్నమాట. తనవైపు వాదన సరిగా లేనప్పుడే ప్రభుత్వాలు ఇలాంటి చర్యలకు పాల్పడతాయన్న అబిప్రాయం ఉంది. దేవరపల్లిలో జగన్ టూర్లో ఒక చిన్న హోటల్లో జరిగిన ఉదంతాన్ని కూడా పెద్దదిగా ఫోకస్ చేయాలని యత్నించి చంద్రబాబు అండ్ కో భంగపడ్డారు. ఆ హోటల్ యజమానురాలు లక్ష్మి వచ్చి జగన్ను కలిశారు. వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయాలని ఒత్తిడి చేసినా ఆమె ఒప్పుకోకపోవడం గొప్ప విషయమే. ఇలాంటి పరిస్థితిలో చంద్రబాబు, లోకేష్లను సంతృప్తిపరచడానికి బోండా ఉమా కాని, మరికొన్ని చోట్ల ఇతర టీడీపీ నేతలు కాని దాడులు చేస్తున్నట్లు వైఎస్సార్సీపీ విమర్శిస్తోంది. దానికి తగినట్లే ఉమా మాట్లాడుతూ లోకేష్ను విమర్శిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. అనుమతి లేకుండా దీక్ష శిబిరాలు నిర్వహిస్తారా అని అంటున్నారు.నిజానికి విష్ణు పోలీసులకు చెప్పే దీక్ష శిబిరం ఏర్పాటు చేసుకున్నారు. చిత్రంగా శిబిరానికి రక్షణ కల్పించవలసిన పోలీసులు దాడికి పాల్పడ్డ ఉమాను కాకుండా, శాంతియుతంగా కూర్చుని ఉన్న విష్ణును వాహనం ఎక్కించి తరలించారు. అదే టీడీపీ ఎక్కడైనా సభ పెడితే ఆ సమీపంలోకి అయినా విపక్షాలను రానిస్తారా? ఇప్పుడు చెప్పండి.. క్రిమినల్స్ తయారీ అడ్డాగా టీడీపీ ఉందా? వైఎస్సార్సీపీ ఉందా? ఈ దాడుల ద్వారా డీఎస్సీ అక్రమాల వ్యవహరం మరింతగా ప్రజలలోకి వెళుతుంది. ప్రభుత్వ తీరుపై మరిన్ని అనుమానాలు బలపడతాయి. మరికొన్ని ఉదాహరణలు గమనించండి.ఒక మంత్రి తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఒక ఎన్ఆర్ఐ మహిళ స్వయంగా లోకేష్కు ఫిర్యాదు చేశారట. అయినా ఆ మంత్రిపై చర్య తీసుకోలేదే? అంటే ఎవరు క్రిమినల్స్ అడ్డాలో ఉన్నట్లు అవుతుంది! ఆలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షిపై తప్పుడు ఆరోపణలు చేసి అరెస్టు చేశారే. ఒక టీడీపీ నేత తన భార్య నైటీని తానే చించి ఎమ్మెల్యేపై ఆరోపించిన విషయం వీడియో సహితంగా బయటపడి ఉండకపోతే, ఎమ్మెల్యేపై ఆరోపణలను నమ్మే పరిస్థితి వచ్చేది కదా? ఇలాంటివాటిని చేసేవారిని కదా క్రిమినల్స్ అనాల్సింది. అలాంటివారిని ఎంకరేజ్ చేసే పార్టీని కదా క్రిమినల్స్ తయారు చేసే అడ్డా అనాల్సింది అని వైఎస్సార్సీపీ నేతలు అంటున్నారు. దానిని కాదనగలరా?ఈ మధ్యనే గుంటూరులో ఒక మహిళను నడిరోడ్డుపై వివస్త్రను చేసింది కూడా టీడీపీ నేతే కదా! అంతేకాదు. కొందరు కూటమి ఎమ్మెల్యేలు కొంతమంది మహిళలపై ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడింది ఫిర్యాదులు వచ్చాయే. ఏకంగా ఒక ఎమ్మెల్యే అసెంబ్లీ నుంచే వీడియో కాల్ చేసిన ఘట్టం మరిచిపోయారా? ఆ ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసిన యువతిని నడిరోడ్డులో పోలీసు లాఠీతో కొట్టింది జనసేన నేత కదా! ఆ ఎమ్మెల్యేపై కాని, దౌర్జన్యం చేసిన జనసేన నేతపై కాని ఏమైనా చర్య తీసుకున్నారా? పలు చోట్ల బాధితులపైనే కేసులు పెడుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది.గతంలో వైఎస్సార్సీపీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలపై చంద్రబాబు, లోకేష్లు ఇలాగే క్రిమినల్స్ అంటూ ఆరోపణలు చేసేవారు. ఎన్నికల సమయానికి వారిలో పలువురిని టీడీపీలో చేర్చుకున్నారు. అంటే టీడీపీ క్రిమినల్స్ అడ్డాగా మారిందని ఒప్పుకుంటున్నటా?కాదా? డీఎస్సీలో అక్రమాలు జరిగాయన్నది వైఎస్సార్సీపీ ఆరోపణ. దానికి సమాధానం ఉంటే చెప్పాలి. లేదా ధైర్యం ఉంటే సీబీఐ విచారణకు ఒప్పుకోవచ్చు.గతంలో చంద్రబాబు డిమాండ్ చేసిన వెంటనే తన కుమారుడు జగన్పై సీబీఐ విచారణకు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఒప్పుకున్న ఘటనను పలువురు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు తన కుమారుడిపై డీఎస్సీ ఆరోపణలు వస్తే ఆ ధైర్యం ఎందుకు చేయలేకపోతున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. గత రెండేళ్లుగా వైఎస్సార్సీపీ నేతలపైన, కార్యకర్తలపైన జరిగిన హత్యలు, హత్యాయత్నం ఘటనలు, టీడీపీ నేతల దౌర్జన్యాలు ఇవన్ని చూస్తుంటే 1983లో తెలుగుదేశం ఆవిర్భావ సమయంలో ఎన్టీ రామారావు చెప్పిన ఆదర్శాలు ఏమిటి? ఇప్పుడు జరుగుతున్నదేమిటి?ఒక వైపు క్రిమినల్స్ను ప్రోత్సహిస్తూ మరో వైపు వైఎస్సార్సీపీపై అదే విమర్శ చేయడం చంద్రబాబుకే చెల్లిందని వైఎస్సార్సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఎవరు తప్పు చేసినా తప్పే అని, నిష్ఫక్షపాతంగా పనిచేయండని పోలీసులకు చెప్పవలసిన సీనియర్ నేత చంద్రబాబు ఈ వయసులో కూడా ఇలాంటి ప్రమాణరహిత రాజకీయాలు చేయడం వల్ల ఆయనకు అప్రతిష్ట అవుతుందా? కాదా? అన్నది ఆలోచించుకోవాలి. రెడ్బుక్ అరాచకాలకు స్వస్థి పలికి, ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించకపోతే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికే నష్టం.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
అసంతపురం, గుడివాడలో టెన్షన్ టెన్నన్.. అర్థరాత్రి పోలీసుల నోటీసులు
-
వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్త ర్యాలీలు విజయవంతం
వైఎస్సార్సీపీ నిరసనలు అప్డేట్స్.. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ చేపట్టిన ఏపీ రాష్ట్ర వ్యాప్త ర్యాలీలు విజయవంతమయ్యాయి. వైఎస్సార్సీపీ ర్యాలీలను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించినా ఆ నిరసన ర్యాలీలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. నిరసన ర్యాలీలకు విధించిన భారీ ఆంక్షలను ప్రజలు తమ నిరసనల రూపంలోనే తిప్పికొట్టారు. వైఎస్సార్సీపీ చేపట్టిన ర్యాలీలకు ప్రజలు భారీ సంఖ్యలో హాజరై తమ సంఘీభావం తెలిపారు. ఈ నిరసన ర్యాలీల్లో డీఎస్సీ అక్రమాలపై నిగ్గు తేల్చాలని, సీబీఐ విచారణకు అప్పగించాలని, లోకేష్ రాజీనామా చేయాలనే డిమాండ్లు ప్రధానంగా వినిపించాయి. వైయస్సార్ జిల్లాడీఎస్సీ అవకతవకలపై వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీర్యాలీని అడ్డుకునేందుకు భారీగా పోలీసులు మోహరింపు వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి మెుదలైన ర్యాలీర్యాలీలో పాల్గొన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిఅడ్డుకునేందుకు విశ్వప్రయత్నం చేసిన పోలీసులుపోలీసుల బంధనాలను తెంచుకుని ముందుకు సాగిన ర్యాలీఎట్టిపరిస్థితిల్లో డీఎస్సీ ఆందోళనలు జరగడానికి వీళ్లేదంటూ పోలీసులకు ఆదేశాలిచ్చిన ఆదినారాయణరెడ్డిబీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఆదేశాలతో నిన్న దీక్షను భగ్నం చేసేందుకు ప్రయత్నించిన పోలీసులుఒకరి తర్వాత ఒకరు దీక్షను కొనసాగించడంతో నేడు ర్యాలీని అడ్డుకోవాలని కుట్రవైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించినా ముందుకు సాగిన ర్యాలీపెద్ద ఎత్తున పాల్గొన్న వైఎస్సార్సీపీ శ్రేణులు..కూటమి నేతలకు చెంపపెట్టులా ప్రారంభమైన ర్యాలీర్యాలీలో పాల్గొన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డివైయస్సార్ జిల్లాజమ్మలమడుగులో ఉద్రిక్త వాతావరణం2025లో జరిగిన డీఎస్సీ అవకతవకలపై ర్యాలీకి సిద్ధమైన వైఎస్సార్సీపీ నాయకులుఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీకి సిద్ధమైన కార్యకర్తలు వారిని అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ భారీ గేట్లు వేసిన పోలీసు అధికారులుజమ్మలమడుగులో పెద్ద ఎత్తున మొహరించిన పోలీసు బలగాలుఎన్ని బలగాలు అడ్డుపడిన తగ్గేదేలే అంటున్న వైఎస్సార్సీపీ నేతలుఎట్టిపరిస్థితుల్లో ర్యాలీ చేసి తీరుతాం అంటున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలువైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి పెద్ద ఎత్తున చేరుకున్న కార్యకర్తలుఈ నేపథ్యంలో జమ్మలమడుగులో ఉద్రిక్త పరిస్థితులుచిత్తూరు జిల్లాపూతలపట్టు నియోజకవర్గం కేంద్రం పూతలపట్టులో మెగా డీఎస్సీ అక్రమాలు పై మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ..పోలీసులు ఆంక్షలు విధించినా భారీ సంఖ్యలో స్వచ్ఛందంగా పాల్గొన్న వైఎస్ఆర్సిపి నాయకులు , కార్యకర్తలు.అంబేద్కర్ విగ్రహం నుంచి తాసిల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీడీఎస్సీ నియామకాల అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ తిరుపతి జిల్లా:శ్రీకాళహస్తిలో డీఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ..మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని భారీ ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టిన మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డినెల్లూరు జిల్లామనుబోలులో ఉద్రిక్త పరిస్థితిమనుబోలులో డీఎస్సీ అక్రమాలపై నిరసన ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, కాకాణి పూజిత.వీరభద్ర దేవస్థానం నుండి జాతీయ రహదారి వద్ద ఉన్న రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద వరకు భారీ ర్యాలీ..ఈ ర్యాలీని అడుగడుగునా అడ్డుకున్న పోలీసులు,వైఎస్సార్సీపీ నాయకులపై పోలీసుల తోపులాట.కాకాణి గోవర్ధన్ రెడ్డి కామెంట్స్నిరుద్యోగులను మోసం చేసిన ప్రభుత్వం కూటమి సర్కార్ నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి..ప్రతిపక్ష నిరసనలపై పోలీసులతో అణచివేత, బ్యానర్లో చించి వేస్తూ తాడులకు తెగబడుతున్నారని మాజీ మంత్రి ఆరోపణ.వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న పోరాటం విజయవాడ..బోండా ఉమాకుదేవినేని అవినాష్ వార్నింగ్డీఎస్సీ అక్రమాలపై శాంతియుతంగా నిరసనలు చేస్తున్నాంమేం నిరసనలు చేస్తుంటే కొంతమంది జోకర్లు , కమెడియన్లను మా పైకి పంపించారుజోకర్లు , కమెడియన్లు పులులం , సింహాలం అని బిల్డప్ ఇస్తున్నారుజోకర్లు , కమెడియన్లకు వైఎస్సార్సీపీ భయపడదువిద్యార్ధులకు జరిగిన అన్యాయం పై మాట్లాడమంటే మా కుటుంబం గురించి మాట్లాడుతున్నారుమా కుటుంబం గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారుమా ముత్తాత దేవినేని సూర్యనారాయణ నెప్పల్లి గ్రామానికి 18 ఏళ్లు సర్పంచ్ గా పనిచేశారుమా తాతగారు దేవినేని రామకృష్ణ వరప్రసాద్ ఈ జిల్లాలోనే తొలి ఇండస్ట్రియలిస్ట్ప్రకాశం బ్యారేజ్ కు గడ్డర్లు సప్లై చేసింది మా కుటుంబం నుంచి వచ్చిన సువర్ణ ఇండస్ట్రీస్ అనంతపురం..మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి కామెంట్స్..డీఎస్సీ అక్రమాలపై మంత్రి నారా లోకేష్ను ప్రాసిక్యూట్ చేయాలినీట్ లీకేజీకి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించి రాజీనామా చేశారుడీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఎందుకు రాజీనామా చేయలేదు?లక్షల మంది డీఎస్సీ అభ్యర్థుల జీవితాలతో టీడీపీ కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోందిడీఎస్సీ అభ్యర్థుల నుంచి వచ్చిన 35వేల ఫిర్యాదులను ఎందుకు బుట్టదాఖలు చేశారు.దీనిపై చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సమాధానం చెప్పాలి తూర్పుగోదావరి జిల్లా..రాజమండ్రి రూరల్ బొమ్మూరులో మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో ర్యాలీర్యాలీని అడ్డుకున్న పోలీసులుడీఎస్సీలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ర్యాలీలో భారీ సంఖ్యలో పాల్గొన్న పార్టీ శ్రేణులు. కృష్ణా..డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలంటూ భారీ నిరసన ర్యాలీపెనమలూరు నియోజకవర్గలో దేవభక్తుని చక్రవర్తి ఆధ్వర్యంలో ర్యాలీదేవభక్తుని చక్రవర్తి కామెంట్స్విద్యాశాఖ మంత్రి నారా లోకేష్పై సీబీఐ విచారణ జరపాలి.డీఎస్సీలో జరిగిన బాగోతాలు బయటపెడుతుంటే మాపై దాడులు చేస్తున్నారుఅర్హత లేని వారికి ఉద్యోగాలు ఇచ్చారుకూటమి ప్రభుత్వం ఉద్యోగులను, యువతను మోసం చేసిందినారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా అనర్హుడునైతిక బాధ్యత వహించి నారా లోకేష్ రాజీనామా చేయాలితూర్పుగోదావరి జిల్లా..రాజమండ్రిలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో డీఎస్సీ అక్రమాలపై ఆందోళనరాజా ఇంటి వద్ద పెద్ద ఎత్తున పోలీసుల మోహరింపు.పోలీసులు బయటకు వెళ్లనివ్వకపోవడంతో ఇంటివద్దే ధర్నాకు దిగిన జక్కంపూడి రాజాపెద్ద సంఖ్యలో ఆందోళనలో పాల్గొన్న పార్టీ నేతలు, యువకులుడీఎస్సీ అక్రమాలపై విచారణ కొనసాగాలని లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ కాకినాడ..కురసాల కన్నబాబు కామెంట్స్....డీఎస్సీ అక్రమాలపై సీబీఎన్ విచారణ కాదు.. సీబీఐ విచారణ కావాలి.డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి.ఫీజు రియింబర్స్మెంట్ , నిరుద్యోగ భృతి బకాయిలు విడుదల చేయాలి.డీఎస్సీపై విచారణ అంటే చంద్రబాబు వణికిపోతున్నాడుమంత్రి లోకేష్ భయపడుతున్నాడుర్యాలీ చేయవద్దని పోలీసులు నాకు రెండు నోటీసులు ఇచ్చారు.పోలీసులు కేసులు పెడతామన్నా ఏడు కిలోమీటర్ల దూరం బైక్ ర్యాలీ చేశాం వైఎస్సార్ జిల్లా...బద్వేలులో డీఎస్సీ అక్రమాలపై జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ.ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా, రాష్ట్ర విద్యార్థి విభాగ ప్రధాన కార్యదర్శి ఆదిత్ రెడ్డి.శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే అడ్డుకున్న పోలీసులు..పోలీసులకు, పార్టీ నాయకుల మధ్య వాగ్వాదం..ర్యాలీ జరగనివ్వమంటూ రవీంద్రనాథ్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు..పోలీసుల తీరుపై మండిపడ్డ రవీంద్రనాథ్ రెడ్డి..శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే అడ్డుకోవాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నేతలుపోలీసులను తోసుకుని ముందుకు దూసుకుపోయి ర్యాలీని నిర్వహించిన నేతలు కృష్ణాజిల్లా..గన్నవరం వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.రోడ్డుపైకి రాకుండా బారికేడ్లు అడ్డు పెట్టిన పోలీసులు.పోలీసులు, నాయకుల మధ్య వాగ్వివాదం.పోలీసులు తీరుకు నిరసనగా రోడ్డుపై ధర్నాకు దిగిన వైఎస్సార్సీపీ నాయకులు.మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కామెంట్స్కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు మెగా డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు ఇస్తామని ఊదరగొట్టారు.అధికారంలోకి వచ్చాక డీఎస్సీ తీశారు.చంద్రబాబు ప్రభుత్వం తీసిన మెగా డీఎస్సీ దగా డీఎస్సీగా మారింది.అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి.డీఎస్సీ నియామకం ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయింది.డీఎస్సీపై ఎందుకు సీబీఐ విచారణ వేయడం లేదు.గతంలో ఎన్నో నీతులు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదు?.ఎంతో మంది యువకులు కష్టపడి చదివి ఉద్యోగం రాకపోతే..బ్రోకర్లు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మోసం చేస్తున్నారు.ప్రతిపక్షంలో ఉండగా ఎన్ని చేసిన చంద్రబాబు..అధికారంలోకి వచ్చాక మాట్లాడిన వారిపై అక్రమ కేసులు, ఉపా కేసులు కూడా పెడుతున్నారు.వ్యవస్థ మీద నమ్మకం ఉండాలంటే చంద్రబాబు సీబీఐ విచారణ చేయాలి.విశాఖ..కదిరి బాబురావు కామెంట్స్.. అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం.అక్రమ అరెస్టులు ప్రజాస్వామ్యానికి విరుద్ధం..శాంతియుతంగా నిర్వహించే ర్యాలీలను అడ్డుకోవడం సరికాదు.డీఎస్సీ అవకతవకలపై సీబిఐ విచారణ జరిపించాలి.మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి..ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అరెస్ట్..ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం..శాంతియుతంగా పోరాటం చేస్తున్నా అడ్డుకుంటున్నారు..పోలీసుల తీరు చాలా దారుణంగా ఉంది: కళ్యాణిగుంటూరు..అంబటి రాంబాబు కామెంట్స్..యువగళంలో లోకేష్తో నడిచిన వారికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇచ్చారుఇందుకోసం పేపర్ లీక్ చేశారుజీవో నెంబర్ 4, 47లు తెచ్చి అక్రమాలు చేశారుసర్టిఫికేట్ తెచ్చుకుంటే చాలు ఉద్యోగం ఇచ్చారుతమకు కావాల్సిన వారికి ఉద్యోగం ఇచ్చుకుని మరో జీవో తెచ్చారుదీనిపై మేము ఉద్యమం చేస్తే మా దీక్షా శిబిరాలపై దాడులు చేశారుటీడీపీ నేతలే టెంట్లు పీకటం దుర్మార్గంవాస్తవాలు బయటకు వస్తాయని టీడీపీ నేతలు భయపడుతున్నారుపోలీసులతో మా దీక్షలను అడ్డుకునే ప్రయత్నం చేశారుగాంధేయ పద్దతిలో చేసే నిరసనలను అడ్డు కోవటం సరికాదుపొన్నూరు, చిలకలూరిపేట, విజయవాడలో పోలీసులే టెంట్లు పీకారుపోలీసుల పని టెంట్లు పీకటమా?ఇప్పటికైనా లోకేష్ రాజీనామా చేసి చిత్తశుద్ది నిరూపించుకోవాలి.డీఎస్సీ అభ్యర్దులు లేరంటూ డైవర్షన్ పాలిటిక్స్కు టీడీపీ పాల్పడుతుంది.డీఎస్సీపై పోరాటం ఆపం.రాబోయే రోజుల్లో అందరూ ఉద్యమబాట పడతారు.వెంటనే లోకేష్ రాజీనామా చేయాలి. తూర్పుగోదావరి జిల్లా..రాజమండ్రిలో మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ ఇంటి వద్ద ఉద్రిక్తతర్యాలీగా పార్టీ శ్రేణులతో శాంతియుతంగా బయలుదేరిన మాజీ ఎంపీని అడ్డుకున్న పోలీసులుపోలీసుల తీరుపై మండిపడిన భరత్ప్రభుత్వం పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలుడీఎస్సీ అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్గేటు వద్దే కూర్చుని నుంచి ఆందోళన నిర్వహిస్తున్న భరత్పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలులోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్విశాఖ:విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఉద్రిక్తత..ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు అరెస్ట్..పోలీసు వాహనాలను అడ్డుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు..కృష్ణాజిల్లా..గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నానిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులుడీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలని కైలే అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీ..ర్యాలీకి అనుమతి లేదంటూ అడ్డుకుంటున్న పోలీసులు..విశాఖ..విశాఖలో తీవ్ర ఉద్రిక్తత..పోలీసులకు వైఎస్సార్సీపీ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం.కేకే రాజును బలవంతంగా అరెస్టు చేసిన పోలీసులు.పోలీసులకు పార్టీ నేతలకు మధ్య తోపులాట.భారీ బందోబస్తు మధ్య కేకే రాజును అరెస్టు చేసిన పోలీసులు.విజయవాడవిజయవాడలో ఉద్రిక్తతదేవినేని అవినాష్ ఆధ్వర్యంలో ర్యాలీని అడ్డుకున్న పోలీసులుపోలీసు బారికేడ్లు తోసుకుంటూ దూసుకెళ్లిన వైఎస్సార్సీపీ కార్యకర్తలుడీఎస్సీపై సీబీఐ విచారణ జరపాలని, లోకేష్ రాజీనామా చేయాలని ఆందోళనదేవినేని అవినాష్ కామెంట్స్..చంద్రబాబు ప్రభుత్వం భయపడుతుందియువత ఉద్యమాన్ని చూసి లోకేష్ భయపడుతున్నారుఅందుకే పోలీసులు చేత ఉద్యమాన్ని అణగదొక్కుతున్నారుఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదుడీఎస్సీలో భారీ అక్రమాలు జరిగాయిపేపర్ లీక్పై సీబీఐ విచారణ జరగాలితూర్పుగోదావరి జిల్లా..రాజమండ్రిలో మాజీ ఎంపీ భరత్ ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులుకార్యకర్తలు ఎవరిని లోపలికి రానివ్వకుండా బారికేడ్లు ఏర్పాటుర్యాలీకి అనుమతి లేదంటూ నోటీసులు జారీ చేసిన పోలీసులు వైఎస్సార్ జిల్లాపులివెందులలో తీవ్ర ఉద్రిక్తతఆర్డీవో కార్యాలయంలో వినతి పత్రం అందించేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ శ్రేణులులోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసుల లాఠీఛార్జ్అనంతపురం..మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్..తాడిపత్రి వెళ్తున్న నన్ను అడ్డుకోవడం దుర్మార్గంశాంతియుతంగా నిరసన తెలిపే హక్కు లేదా?డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందేలోకేష్ డైరెక్షన్లోనే డీఎస్సీ అక్రమాలు జరిగాయిఒక్కో ఉపాధ్యాయ ఉద్యోగాన్ని లక్షల రూపాయలకు అమ్ముకున్నారుతాడిపత్రి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కక్ష సాధింపు చర్యలు దారుణంపెద్దారెడ్డి ఏ కార్యక్రమం నిర్వహించినా.. పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గంతాడిపత్రిలో వైఎస్సార్సీపీని లేకుండా చేయాలని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కుట్రలు చేస్తున్నారుజేసీ ఆగడాలకు పోలీసులు వత్తాసు పలకడం సరికాదు. నెల్లూరు..డీఎస్సీ అవకతవకలపై నెల్లూరు సిటిలో వైఎస్సార్సీపీ భారీ నిరసన ర్యాలీఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులు, యువతతో ఆందోళనకార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి కాకాణిభారీగా పోలీసుల మోహరింపు, ర్యాలీకి అనుమతి లేదన్న పోలీసులుఅంబేద్కర్ సర్కిల్ వద్దకు భారీగా చేరుకున్న విద్యార్థులు, యువత, పార్టీ శ్రేణులు విశాఖ..విశాఖ నార్త్ నియోజకవర్గంలో పోలీసులు అత్యుత్సాహం..ర్యాలీకి తరలివచ్చిన వైఎస్సార్సీపీ కార్యకర్తల బైక్ తాళాలు తీసుకున్న పోలీసులు..ర్యాలీ నిర్వహించకుండా భారీగా పోలీసుల బందోబస్తు.పోలీసులు తీరుపై జిల్లా అధ్యక్షుడు కేకే రాజు తీవ్ర ఆగ్రహంవైఎస్సార్ జిల్లాపులివెందులలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీప్రభుత్వం అడ్డంకులు సృష్టించినా ఆగని పోరాటంపెద్ద ఎత్తున పాల్గొన్న విద్యార్ధులు, వైఎస్సార్సీపీ శ్రేణులుర్యాలీలో పాల్గొన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డిడీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్చిత్తూరు జిల్లాకుప్పంలో పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన మెగా డీఎస్సీ వ్యతిరేక ర్యాలీపై పోలీసుల ఆంక్షలు..కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ హౌస్ అరెస్ట్..ఇంటి ముందే నిరసన చేపట్టిన ఎమ్మెల్సీ భరత్..డీఎస్సీ అక్రమాలపై విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి: ఎమ్మెల్సీ భరత్మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి.వారం రోజుల ముందే కుప్పం డీఎస్పీకి ర్యాలీకి పర్మిషన్ ఇవ్వాలని రిక్వెస్ట్ లెటర్ పెట్టాం.టీడీపీ వారు మాకన్నా ముందే పర్మిషన్ తీసుకున్నారని మాకు అనుమతి తిరస్కరించారు. అనకాపల్లినర్సీపట్నంలో నిరసన దీక్షకు పోలీసులు ఆంక్షలుమాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఇంటి దగ్గర పోలీసులు మోహరింపు.గణేష్ ర్యాలీకి వెళ్లకుండా అడ్డగింత.నిరసన తెలిపి తీరుతామన్న మాజీ ఎమ్మెల్యే గణేష్ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పోలీస్ వ్యవహరిస్తున్నారన్న గణేష్.రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారుప్రభుత్వం చేసిన తప్పులను తెలియ పరచడం ప్రతిపక్ష ధర్మం అనంతపురం..తాడిపత్రి నియోజకవర్గం ముచ్చుకోట వద్ద పోలీసుల అత్యుత్సాహంమాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అడ్డుకున్న పోలీసులుపోలీసులతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి వాగ్వాదంపోలీసుల తీరుకు నిరసనగా అనంతపురం-తాడిపత్రి హైవేపై బైఠాయించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిశాంతియుత ర్యాలీని ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించిన పెద్దిరెడ్డి.విజయవాడమాజీ మంత్రి వెల్లంపల్లి ఇంటి వద్ద నుండి ప్రారంభమైన ర్యాలీ..ర్యాలీలో భారీగా పాల్గొన్న విద్యార్థులు, యువకులు..మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని నినాదాలు..చిత్తూరుచిత్తూరులో ఉద్రిక్తత వాతావరణంగంగినేని చెరువు వద్ద నుంచి విజయానంద రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన మెగా డీఎస్సీ నిరసన ర్యాలీ అడ్డుకున్న పోలీసులుపోలీసులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పార్టీ నాయకులు కార్యకర్తలుఅడ్డుకునేందుకు యత్నించిన పోలీసులు.. ముందుకు సాగుతున్న నిరసన ర్యాలీనర్సీపట్నం..నర్సీపట్నంలో నిర్వహించే నిరసన ర్యాలీకి అనుమతి లేదంటే పోలీసుల ఆంక్షలు.మాజీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరింపు..పార్టీ నాయకులు ర్యాలీకి తరలి రాకుండా పోలీసుల ఆంక్షలు.నాయకులకు కార్యకర్తలకు ఫోన్ చేసి బెదిరిస్తున్న పోలీసులు.ర్యాలీకి వస్తే కేసులు పెడతామని బెదిరింపువిశాఖవైఎస్సార్సీపీ నిరసన ర్యాలీలపై పోలీసులు ఆంక్షలు..ర్యాలీకి రావద్దంటూ పార్టీ శ్రేణులను బెదిరిస్తున్న పోలీసులు..నాయకులకు ఫోన్ చేసి ర్యాలీకి అనుమతి లేదంటున్న పోలీసులు.ర్యాలీకి వస్తే కేసులు పెడతామని బెదిరింపులు ..బైకులు, కార్లు సీజ్ చేస్తామని హెచ్చరిక.నిరసన ర్యాలీలు చేపట్టే ప్రాంతంలో భారీగా మోహరించిన పోలీసులు..పోలీసుల ఆంక్షలపై వైఎస్సార్సీపీ నేతల ఆగ్రహం.తూర్పుగోదావరి జిల్లా...మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలపై పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన వైఎస్సార్సీపీపార్టీ ఆధ్వర్యంలో ఇవాళ నియోజకవర్గ స్థాయిలో భారీ ర్యాలీలుర్యాలీలకు అనుమతి లేదంటూ నేతకు నోటీసులు జారీ చేసిన పోలీసులుమాజీ ఎంపీ మార్గాని భరత్, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇంటి వద్ద మొహరించిన పోలీసులు...గాజువాక..ర్యాలీ చేసేందుకు వెళుతున్న గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త దేవన్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు..ర్యాలీకి అనుమతి లేదంటూ ఇంటి దగ్గరే ఆపివేసిన పోలీసులుఎన్టీఆర్ జిల్లా:తిరువూరు నియోజకవర్గంలో ర్యాలీలకు అనుమతి లేదంటూ పోలీసులు హుకుం..తిరువూరు జెడ్పీటీసీ వై.రామచంద్రా రెడ్డి, విస్సన్నపేట లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి శిరసాని ప్రకాష్ పలువురి నేతలకు నోటీసులు..ర్యాలీ తలపెట్టిన ఫ్యాక్టరీ సెంటర్లో పోలీసులు మోహరింపు..విజయవాడమాజీ మంత్రి వెల్లంపల్లి ఇంటి వద్ద భారీగా మొహరించిన పోలీసులు..ర్యాలీకి అనుమతి లేదంటూ వాట్సాప్ ద్వారా వెల్లంపల్లికి తెలిపిన పోలీసులు..ర్యాలీకి సిద్దమైన వైఎస్సార్సీపీ శ్రేణులు..ర్యాలీ చేస్తే అరెస్ట్ చేస్తామంటున్నా పోలీసులు.. అనంతపురం:తాడిపత్రిలో ఉద్రిక్తతడీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ పెద్దారెడ్డి భారీ ర్యాలీతాడిపత్రిలోని స్వగృహం నుంచి బయలుదేరిన కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులుపోలీసులతో పెద్దారెడ్డి వాగ్వాదంవైఎస్సార్సీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాటతాడిపత్రికి వచ్చే వైఎస్సార్సీపీ శ్రేణుల వాహనాలను అడ్డుకున్న పోలీసులుడీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలని పెద్దారెడ్డి డిమాండ్..చిత్తూరు జిల్లా ..కుప్పంలో వైఎస్సార్సీపీ తలపెట్టిన నిరసన ర్యాలీకి పర్మిషన్ లేదని నోటీసులు జారీ చేసిన డీఎస్పీ పార్థసారథిఏకపక్షంగా వ్యవహరిస్తున్న పోలీసులుటీడీపీ తలపెట్టిన విజయోత్సవ ర్యాలీకి పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో వైఎస్సార్సీపీ ర్యాలీకి అనుమతి నిరాకరించినట్లు నోటీసులు.పర్మిషన్ లేకపోవడంతో నేతలు ఎవరు ర్యాలీలో పాల్గొనకూడదని సూచించిన డీఎస్పీఎవరైనా ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు..కాకినాడ..తునిలో వైఎస్సార్సీపీ ర్యాలీని అడ్డుకునేందుకు కూటమి కుట్రపార్టీ ముఖ్య నేతలకు నోటీసులు ఇచ్చిన పోలీసులుసెక్షన్ 30 అమలులో ఉందని.. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులునేడు వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలునేడు వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలుడీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాలనీ..మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ నిరసన ప్రదర్శనలుఇప్పటికే పలు రూపాల్లో నిరసనలు తెలిపిన వైఎస్సార్సీపీకలెక్టర్లకు వినతి పత్రాలు, టౌన్ హాలు సమావేశాలు, రిలే నిరాహార దీక్షలు నిర్వహణప్రభుత్వం స్పందించేంత వరకు పోరాటం ఆపేదిలేదంటున్న వైఎస్సార్సీపీ. కర్నూలు..డీఎస్సీలో జరిగిన అవకతవకలపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీర్యాలీకి అనుమతి లేదంటూ కర్నూలు టూ టౌన్ పోలీసులు ఆంక్షలుఅనుమతి లేకుండా ర్యాలీ నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని అంటూ పోలీసుల బెదిరింపులుకర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎటువంటి ర్యాలీకి అనుమతి లేదంటున్న పోలీసులువైఎస్సార్సీపీ నేతలకు అర్థరాత్రి నోటీసులు అందించిన పోలీసులు.గుడివాడలో.. గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో నిర్వహించనున్న నిరసన ర్యాలీకి అనుమతి లేదంటూ వైఎస్సార్సీపీ నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ర్యాలీ నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అర్ధరాత్రి వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు వెళ్లిన పోలీసులు నోటీసులు అందజేయడం గమనార్హం. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు.తాడిపత్రిలోనూ ర్యాలీకి బ్రేక్..అనంతపురం జిల్లా తాడిపత్రిలోనూ వైఎస్సార్సీపీ చేపట్టనున్న నిరసన ప్రదర్శనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. డీఎస్సీ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో భారీ నిరసన ర్యాలీకి ఏర్పాట్లు చేశారు.అయితే ఇదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్రెడ్డి, ఆయన తండ్రి జేసీ ప్రభాకర్రెడ్డి పోటీగా మరో కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీంతో రెండు వర్గాల కార్యక్రమాలకు అనుమతి ఇస్తే శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు.. అనుమతి నిరాకరించారు. -
నీ కొడుకుని పదవి నుండి తొలగించు..!? లోకేష్ రాజీనామా చేసే వరకు మా పోరాటం ఆగదు..!
-
ఖబర్దార్ బోండా ఉమా.. ఒళ్లు దగ్గర పెట్టుకో! మీ ఇంటిని ముట్టడించడం ఖాయం!
-
ఎన్ని అడ్డంకులున్నా నేడు ర్యాలీలు ఆగవు
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025 పరీక్షల్లో అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలను వెంటనే చెల్లించాలని, నిరుద్యోగ భృతి అమలును డిమాండ్ చేస్తూ సోమవారం (ఆగస్టు 10న) రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో వైఎస్సార్సీపీ చేపట్టనున్న ర్యాలీలను అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసు వ్యవస్థను ప్రయోగించడాన్ని శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యన్నారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా సోమవారం వైఎస్సార్సీపీ శాంతియుత ర్యాలీలు నిర్వహిస్తుందని ఆయన తేల్చిచెప్పారు. ఈ మేరకు ఆదివారం ఆయనొక ప్రకటన విడుదల చేస్తూ.. శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించే ర్యాలీలకు అనుమతులు నిరాకరించడం, పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎక్కడికక్కడ పోలీసులు నోటీసులు ఇవ్వడం అత్యంత దుర్మార్గమైన చర్య అని అన్నారు. బొత్స ఇంకా ఏమన్నారంటే.. ప్రశ్నించే హక్కునూ కాలరాస్తున్నారు.. విద్యార్థులు, నిరుద్యోగ యువతకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించే హక్కును కూడా కాలరాయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గత కొన్నిరోజులుగా వైఎస్సార్సీపీ ఉద్యమాలు అత్యంత శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతుల్లో నడిచాయి. అయినా అడ్డుకునేందుకు కుట్రలు చేయడం దుర్మార్గం. డీఎస్సీలో ఎలాంటి అక్రమాలు జరగలేదని ప్రభుత్వం భావిస్తే సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతోంది? విద్యార్థులు, నిరుద్యోగులు తమ సమస్యలపై శాంతియుతంగా గొంతెత్తితే పోలీసులతో అణిచివేయాలని చూడటం చంద్రబాబు ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనం.నోటీసులతో ప్రజాస్వామ్యాన్ని నిర్బంధించలేరు ఎన్నికలకు ముందు యువతకు పెద్దఎత్తున హామీలు ఇచ్చిన కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాక వాటిని అమలుచేయకుండా మోసం చేస్తుండడాన్ని ప్రశ్నిస్తున్న విద్యార్థులు, యువత, ప్రతిపక్షంపై నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నాయి. డీఎస్సీ ప్రక్రియపై నిష్పక్షపాత విచారణ కోరుతుంటే ప్రభుత్వం పోలీసు నోటీసులతో గొంతునొక్కుతోంది. అరెస్టులు, కేసులు, నోటీసులతో ప్రజాస్వామ్యాన్ని నిర్బంధించలేరు. ఎన్ని ఆటంకాలు కల్పించినా సోమవారం వైఎస్సార్సీపీ శాంతియుత ర్యాలీలు జరుగుతాయి. విద్యార్థులు, యువత భవిష్యత్తుతో ముడిపడిన ఈ సమస్యపై ప్రభుత్వం స్పందించే వరకు తమ పార్టీ వారి తరఫున పోరాటాన్ని కొనసాగిస్తుంది. -
ఈనెల 13న కర్నూలుకు మాజీ సీఎం వైఎస్ జగన్
కర్నూలు (టౌన్): మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 13వ తేదీన కర్నూలుకు రానున్నట్లు ఎమ్మెల్సీ, పార్టీ ప్రోగ్రామ్ కో–ఆర్డీనేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. ఆదివారం కర్నూలులో తలశిల మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసిందని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేను పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం తాడేపల్లి నుంచి కర్నూలు ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుంటారని పేర్కొన్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన సబ్జైలుకు వెళ్లి విరూపాక్షిని పరామర్శిస్తారని వెల్లడించారు. -
డీఎస్సీలో అక్రమాలు జరిగినా మాట్లాడకూడదా?
కర్నూలు (సెంట్రల్)/కల్లూరు: డీఎస్సీ–2025 స్పోర్ట్స్ కోటాలో జరిగిన అక్రమాలపై మాత్రమే వైఎస్సార్సీపీ ప్రశ్నిస్తోందని.. కానీ, వాటిని ప్రశ్నించకూడదన్నట్లుగా టీడీపీ నేతల ప్రవర్తన ఉంటోందని వైఎస్సార్సీపీ నేత, మాజీమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. ఆదివారం కర్నూలులోని కాటసాని రాంభూపాల్రెడ్డి నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్పోర్ట్స్ కోటాలో జరిగిన అక్రమాలపై తమ పార్టీ ప్రశ్నిస్తుంటే టీడీపీ నాయకులు భుజాలు తడుముకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇందులో భాగంగానే ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులతో ర్యాలీలకు తెరతీశారన్నారు. డీఎస్సీ–2025లో ఉద్యోగాలు పొందిన వారందరూ అక్రమ మార్గాల్లో పోస్టులు సాధించినట్లు తమ పార్టీ ఎక్కడా చెప్పలేదని బుగ్గన స్పష్టంచేశారు. అయితే వారు తమ పార్టీపై అభాండాలు వేస్తూ ర్యాలీల్లో పాల్గొనడం దురదృష్టకరమన్నారు. స్పోర్ట్స్ కోటా నియామకాల్లో నిబంధనలు పాటించలేదని, ఏదో ఒక ఫెడరేషన్ సర్టిఫికెట్ ఎలా చెల్లుబాటవుతుందని ఆయన ప్రశ్నించారు. సర్టిఫికెట్లను రూ.15 లక్షలు నుంచి రూ.25 లక్షల వరకు అమ్ముకున్నారని, ఇందులో టీడీపీ నేతల ప్రమేయం ఉందన్నదే తమ పార్టీ ఆరోపణ అన్నారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా అక్రమాలపై సీబీఐ విచారణ, లోకేశ్ రాజీనామా చేసేవరకు తమ పార్టీ పోరాడుతూనే ఉంటుందని తేల్చి చెప్పారు. -
ప్రపంచ బ్యాంకు తేల్చిన నిజం.. వైఎస్ జగన్ హయాంలోనే 'ఆరోగ్య భాగ్యం'
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజారోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వ వైద్య ఆరోగ్య రంగాన్ని ప్రాథమిక స్థాయి నుంచి సమూలంగా సంస్కరించారని ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రశంసించింది. విలేజ్ క్లినిక్స్, పట్టణ క్లినిక్స్తో పాటు తొలిసారిగా వినూత్న రీతిలో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేయడం గ్రామీణ, గిరిజన ప్రాంతాల ప్రజలకు ఎంతో మేలు చేసిందని విశ్లేషించింది. టెలి మెడిసిన్ ద్వారా గత ప్రభుత్వంలో ప్రజలకు భారీ ఎత్తున సేవలు అందాయని తెలిపింది. ఇక వైద్య ఆరోగ్య వ్యవస్థలో జీరో వేకెన్సీ విధానాన్ని అమలు చేస్తూ రెండేళ్లలోనే సుమారు 50,000 మంది వైద్య సిబ్బందిని నియమించారని పేర్కొంది. రాష్ట్ర ప్రజలకు వైద్య ఆరోగ్య సేవలందించడంలో మాజీ సీఎం వైఎస్ జగన్ది ప్రభుత్వ రంగం బాట అయితే సీఎం చంద్రబాబుది ప్రైవేట్ రంగం బాట అని ప్రపంచ బ్యాంకు నివేదిక కుండబద్దలు కొట్టింది. వైద్య కళాశాలలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లాంటి వాటిని నడపడం కోసం చంద్రబాబు సర్కారు ప్రైవేట్ రంగం, అవుట్ సోర్సింగ్పై ఆధారపడటం ప్రారంభించిందని ప్రపంచ బ్యాంకు నివేదికలో స్పష్టం చేసింది. ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయంతో నాడు వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థ బలోపేతం ప్రాజెక్టును అమలు చేసింది. ఆ ప్రాజెక్టు అమలు ఫలితాల నివేదికను ప్రపంచ బ్యాంకు ఇటీవల విడుదల చేసింది. వైద్య ఆరోగ్య రంగంలో సేవలపై వైఎస్ జగన్ విధానాలు, చంద్రబాబు సర్కారు పోకడలపై ఈ నివేదికలో ప్రపంచ బ్యాంకు పలు ఆసక్తికర అంశాలను ప్రస్తావించింది. ఆ వివరాలివీ...⇒ ప్రపంచ బ్యాంకు నుంచి ప్రాజెక్టు ఆమోదం పొందిన వెంటనే వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రైవేట్ రంగ కాంట్రాక్టులపై ఆధారపడకుండా ప్రభుత్వ రంగంలో వైద్య సేవల నాణ్యత మెరుగుదల, ఆరోగ్య సేవలను విస్తరించడంపై దృష్టి పెట్టాలని నిర్ణయించింది. ప్రాజెక్టు లక్ష్యాలను సాధించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం నిబద్ధత, అంకిత భావంతో పనిచేసింది. ముఖ్యమంత్రి క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించడంతో పాటు అగ్ర రాజకీయ నాయకత్వం ప్రాజెక్టుకు స్పష్టమైన ప్రాధాన్యత ఇచ్చింది. నిరంతర పర్యవేక్షణ, క్రమం తప్పకుండా సమీక్షలు ఫలితాల సాధనకు దోహదం చేశాయి. తద్వారా ప్రభుత్వ రంగంలోనే మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యాన్ని సాధించింది.⇒ వైద్య ఆరోగ్య రంగంలో దీర్ఘకాలంగా అనుసరిస్తున్న మూస విధానాలను పక్కనపెట్టి మాజీ సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఉదాహరణకు మెరుగైన ఆరోగ్య సేవలు, నాణ్యత అనే లక్ష్యాలను సాకారం చేసేందుకు ఆంధ్రప్రదేశ్లో ‘సున్నా ఖాళీల విధానం’ (జీరో వేకెన్సీ) పాలసీని అమలు చేశారు. సిబ్బంది నియామకాలను హేతుబద్ధీకరించారు. అడ్డంకులను తొలగించి భారీ నియామక కార్యక్రమాన్ని చేపట్టారు. వైద్య ఆరోగ్య సిబ్బందికి ప్రోత్సాహకాలు, పదోన్నతులు కల్పించారు. మారుమూల ప్రాంతాలలో పని చేసినందుకు అదనపు వేతనాన్ని అందచేశారు. అరుదైన నైపుణ్యాలు కలిగిన వైద్య నిపుణులను ఆకర్షించేందుకు సాధారణం కంటే ఎక్కువ వేతనాలు ప్రకటించి ప్రజారోగ్యం పట్ల నిబద్ధత చాటుకున్నారు.⇒ ‘జీరో వేకెన్సీ’ విధానంలో భాగంగా వేగంగా నియామకాలు చేపట్టేందుకు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేశారు. జీతభత్యాలు, ప్రోత్సాహకాలను సవరించారు. పీజీ వైద్య విద్యార్థులందరికీ తప్పనిసరి గ్రామీణ సేవను ప్రవేశపెట్టారు. అన్ని పీహెచ్సీలు, వీహెచ్సీ (విలేజ్ హెల్త్ క్లినిక్)లలో తగినంత మంది సిబ్బందిని నియమించారు. ప్రతి పీహెచ్సీలో ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు, 12 మంది పారామెడికల్ సిబ్బంది... ప్రతి వీహెచ్సీలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎంతో పాటు ఆశాలు సేవలు అందించేలా చర్యలు తీసుకున్నారు. రెండేళ్లలోనే సుమారు 50,000 మంది వైద్య ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని నియమించారు.⇒ ప్రజలు దూర ప్రాంతాల నుంచి వైద్య నిపుణులను సంప్రదించేందుకు టెలిమెడిసిన్ వేదికను ప్రారంభించారు. ఇది ముఖ్యంగా గ్రామీణ, గిరిజన జనాభాకు ప్రయోజనం చేకూర్చింది. రోజూ 75,000కిపైగా టెలికన్సల్టేషన్లు, ప్రిస్క్రిప్షన్లు అందచేశారు. దేశవ్యాప్తంగా జాతీయ టెలికన్సల్టేషన్లలో దాదాపు మూడింట ఒక వంతు ఆంధ్రప్రదేశ్లోనే నమోదయ్యాయి.⇒ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రాథమిక స్థాయి నుంచి ఆరోగ్య రంగం మౌలిక సదుపాయాల బలోపేతం, పునర్నిర్మాణం చేపట్టింది. ప్రతి పీహెచ్సీని 12–13 వీహెచ్సీలకు మ్యాప్ చేశారు. ప్రతి వీహెచ్సీ పరిధిలో 2,500–4,500 మంది జనాభాకు సేవలందాయి (గిరిజన ప్రాంతాలలో స్థానిక అవసరాలకు అనుగుణంగా సర్దుబాటు చేశారు). 4,345 కొత్త వీహెచ్సీలు, 88 కొత్త పీహెచ్సీలు ఏర్పాటు చేశారు. 977 గ్రామీణ, 184 పట్టణ పీహెచ్సీలను పునరుద్ధరించారు. హెల్త్ వెల్నెస్ సెంటర్లు రెట్టింపు చేయడం ద్వారా 10,086కు చేరాయి. అధిక రక్తపోటు, మధుమేహం, సాధారణ క్యాన్సర్ల కోసం స్క్రీనింగ్, తల్లి, శిశు ఆరోగ్య సంరక్షణ, కుటుంబ నియంత్రణ, నోటి ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, అత్యవసర ప్రసూతి సంరక్షణతో కూడిన విస్తరించిన సేవలను అందించడానికి అవసరమైన పరికరాలు, సిబ్బందిని సమకూర్చారు.⇒ 2022–23లో నిర్వహించిన ఎన్సీడీ–2 సర్వే ద్వారా రాష్ట్ర జనాభాలో సుమారు 80 శాతం మందికి స్క్రీనింగ్ నిర్వహించి ప్రత్యేకంగా ఆరోగ్య గుర్తింపు కార్డు కేటాయించారు. ⇒ అత్యవసర మందుల జాబితాలోని 105 ఔషధాలు, 14 ప్రాథమిక రోగ నిర్ధారణ పరీక్షల సామర్థ్యంతో మొబైల్ మెడికల్ యూనిట్లను అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కేటాయించారు. ప్రతి జిల్లాలో ఒక రిజర్వ్ మొబైల్ మెడికల్ యూనిట్ను ఏర్పాటు చేశారు. అవసరమైనప్పుడు విధులు నిర్వర్తించడానికి నలుగురు అదనపు వైద్యులను కేటాయించారు. వైద్యుడితో పాటు ప్రతి యూనిట్లో డ్రైవర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉండేలా చర్యలు తీసుకున్నారు.⇒ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ను అధికారికంగా 2023 ఏప్రిల్లో ప్రారంభించారు (2022 అక్టోబర్లో పైలట్ దశ తర్వాత). ఈ కార్యక్రమం కింద మొబైల్ మెడికల్ యూనిట్తో సహా డాక్టర్ ప్రతి నెలా రెండు సార్లు విలేజ్ హెల్త్ క్లినిక్స్ను సందర్శించారు. క్రమబద్ధమైన షెడ్యూల్తో వైద్యులను ఇంటి వద్దకే పంపించారు. ⇒ అన్ని ఆరోగ్య కేంద్రాలలో టెలికమ్యూనికేషన్ కనెక్టివిటీ, డిజిటల్ పరికరాలు ఏర్పాటు చేశారు. వైద్య సిబ్బంది అందరికీ కొత్త డిజిటల్, వైద్య సాంకేతిక పరిజ్ఞానాల వినియోగంలో శిక్షణ ఇచ్చారు. సెంట్రల్ డిజిటల్ క్వాలిటీ డాష్బోర్డ్ ద్వారా ఎప్పటికప్పుడు పనితీరు సూచికలను విశ్లేషించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారు.కోవిడ్లో కాపాడారు..!⇒ కోవిడ్ సమయంలో 10,000 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, వెంటిలేటర్లు, వ్యక్తిగత రక్షణ పరికరాలు, ఇన్ఫెక్షన్ నివారణ సామగ్రితో సహా కీలకమైన వైద్య సామగ్రిని అందుబాటులో ఉంచారు. జిల్లా, బోధనాస్పత్రులలో ప్రత్యేకంగా కోవిడ్ వార్డులు, ఆక్సిజన్తో కూడిన పడకలు, క్రిటికల్ కేర్ యూనిట్లను సిద్ధం చేశారు. 100కు పైగా ప్రయోగశాలలకు కోవిడ్ పరీక్షా సామర్థ్యాన్ని కల్పించారు. మారుమూల ప్రాంతాలకు మొబైల్ పరీక్షా యూనిట్లను పంపించారు. గ్రామీణ, అణగారిన వర్గాల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని చికిత్స, వ్యాక్సినేషన్ సకాలంలో అందించి ప్రజల ప్రాణాలను కాపాడారు. -
డీఎస్సీ నియామకాల్లో భారీ అక్రమాలు
గాందీనగర్ (విజయవాడ సెంట్రల్): చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ–2025 నియామక ప్రక్రియలో భారీగా అవకతవకలు, అక్రమాలు జరిగాయని ఏపీ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ కూటమి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. విజయవాడ ప్రెస్క్లబ్లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో జేఏసీ కన్వీనర్ ఎంబేటి రామచంద్ర, నిరుద్యోగ జేఏసీ కో–కన్వినర్ రామ్ షా మాట్లాడారు. డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటాను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందన్నారు. అర్హతలు, పరీక్షలు లేకుండానే కొంతమందికి సబ్జెక్ట్ టీచర్ పోస్టులు కల్పించేందుకు జీఓ నెం.4ను తీసుకురావడం.. స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అవకతవకలు.. 1:1 సర్టిఫికెట్ వెరిఫికేషన్, స్పోర్ట్స్ సర్టిఫికెట్ల పరిశీలన అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. వారు ఇంకా ఏమన్నారంటే.. ఎందుకింత వివాదానికి తెరలేపారు? ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా కేటాయింపులు, జీఓ నెం.4 తెచ్చిన మార్పులు, పేపర్ లీకేజీ అనుమానాలు లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశాయి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా డీఎస్సీపై కోర్టులో 330 రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిలో 60కి పైగా స్పోర్ట్స్ కోటాకు సంబంధించినవే. ఇంత వివాదానికి ఎందుకు తెరలేపారు? ఈ మొత్తం వ్యవహారంపై తక్షణమే సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో జ్యుడీషియల్ విచారణ జరిపించాలి. అసలు డీఎస్సీలో దాదాపు 32 వేల వినతిపత్రాలు, అభ్యంతరాలు ఎందుకొచ్చాయి? 1:1 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్కు పిలిచారంటేనే ఉద్యోగం వస్తుందని అభ్యర్థులు ఆశపడతారు. కానీ, చివరికి స్పోర్ట్స్ కోటా పేరుతో వారిని బయటకు పంపడం ఎంతవరకు సమంజసం? డీఎస్సీకి సరిగ్గా ఒకరోజు ముందు (ఏప్రిల్ 19న) తీసుకొచ్చిన జీఓ.4 తీవ్ర వివాదాస్పదమైంది. ఎటువంటి పరీక్షలు, అర్హతలు లేకపోయినా సబ్జెక్ట్ టీచర్లుగా పోస్టులిచ్చేలా ఈ జీఓ తెచ్చారు. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఇలా ఎలా మినహాయింపులు ఇస్తారు? రహస్యంగా డీఎస్సీ ప్రక్రియ ముగింపు.. ఇక చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా డీఎస్సీ మెరిట్ లిస్ట్, కటాఫ్ మార్కులు, సెలెక్షన్ లిస్టులను డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ హెడ్ క్వార్టర్లలో లేదా వెబ్సైట్లో బహిరంగంగా పెట్టలేదు. కేవలం వ్యక్తిగత లాగిన్స్, మొబైల్స్కు మాత్రమే సమాచారం పంపి గోప్యంగా ప్రక్రియ ముగించారు. ఒక కోచింగ్ సెంటర్ నిర్వహకుడి భార్యకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం వెనుక ఉన్న అంతర్గత లింకులు బయటకు రావాలి. ఈ అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలి. ప్రభుత్వం స్పందించకపోతే ఐక్య కార్యాచరణ ద్వారా రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతాం. -
డీఎస్సీ అక్రమాలపై ఉద్యమం మరింత ఉధృతం
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం సాగించిన అక్రమాలపై వైఎస్సార్సీపీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో సోమవారం భారీ ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ శ్రేణులు, యువత స్వచ్ఛందంగా ర్యాలీల్లో పాల్గొని సర్కారుకు తమ నిరసనను తెలియజేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను అడ్డంపెట్టుకుని ర్యాలీలను అడ్డుకునేందుకు కుట్రలకు తెరతీసింది. దమనకాండను దాటుకుని రిలే దీక్షలు విజయవంతంమెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగ యువతను దగా చేశారని... డీఎస్సీ స్కామ్కు నైతిక బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని.. సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన రిలే దీక్షలపై చంద్రబాబు సర్కారు దమనకాండ సాగించింది. 175 నియోజకవర్గాల్లో గాంధేయ మార్గంలో రిలే నిరాహార దీక్షలు చేస్తుంటే టెంట్లను తొలగించేందుకు కుట్ర చేసింది. కొన్నిచోట్ల టీడీపీ నేతలతో పాశవికంగా దాడులు చేయించడంతోపాటు పోలీసులతో అక్రమ అరెస్టులకు పాల్పడింది. చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజినీని ఈడ్చుకెళ్లడం, జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డి, ఆయన సతీమణిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లడం, విజయవాడలో దీక్షా శిబిరంపై టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా దాడి చేయడం, ఆ పార్టీ నాయకుడు బుద్దా వెంకన్న వర్గం బెదిరింపులకు దిగడం రాష్ట్ర ప్రజలంతా చూశారు. అయినప్పటికీ ఈ దీక్షలు విజయవంతం కావడం, జెన్–జీ(యువత) కదం తొక్కడంతో రోజురోజుకూ ఉద్యమం రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. అంతేకాకుండా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, నిరుద్యోగ భృతితోపాటు ఎన్నికల్లో యువతకు ఇచ్చిన అన్ని హామీలను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయాలనే డిమాండ్లు దీక్షా శిబిరాల్లో పెద్ద ఎత్తున వినిపించాయి. యువతను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని జెన్–జీ మండిపడింది. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు లోకేశ్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించింది. ధర్మేంద్ర ప్రధాన్ తరహాలో లోకేశ్ రాజీనామా చేయాల్సిందే... నీట్ పేపర్ లీకేజీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని, అదే తరహాలో డీఎస్సీలో అక్రమాలకు పక్కా ఆధారాలు ఉన్నాయని బాధిత అభ్యర్థులు వెల్లడిస్తున్నందువల్ల నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది. అదే సమయంలో లోకేశ్ రాజీనామా చేయాలన్న డిమాండ్ జెన్–జీ, రాష్ట్ర ప్రజల నుంచి బలంగా వినిపిస్తోంది. దీంతో తన తనయుడు లోకేశ్ రాజకీయ భవిష్యత్పై చంద్రబాబులో తీవ్ర ఆందోళన నెలకొంది. డీఎస్సీ అక్రమాలపై జెన్–జీ, ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహావేశాలను డైవర్ట్ చేసేందుకు ఆయన కొత్త పన్నాగాలు పన్నుతున్నారు. దీక్షా శిబిరాల్లో ఉన్నవారిని రౌడీలు, బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లుగా చంద్రబాబు చిత్రీకరించారు. అయినా యువత ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ‘పోలీసులతో అడ్డుకున్నా... మాపై అక్రమ కేసులు పెట్టినా మా పోరాటం ఆగదు. రిలే దీక్షలు ముగిసినా సోమవారం 175 నియోజకవర్గాల్లో ప్రజాస్వామ్యవాదులతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తాం’ అని విద్యార్థులు, యువత, నిరుద్యోగులు స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహించేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు సన్నద్ధమయ్యాయి. మలిదశ ఉద్యమంలో భాగంగా ఆందోళన కార్యక్రమాలను సోమవారం వైఎస్సార్సీపీ ప్రకటించనుంది. శాంతియుత ర్యాలీలకు అనుమతి లేదంటూ పోలీసుల నోటీసులుఇదిలా ఉండగా, వైఎస్సార్సీపీ ర్యాలీలకు అనుమతి లేదంటూ ఆయా నియోజకవర్గ నేతలకు పోలీసులు నోటీసులిచ్చారు. 175 నియోజకవర్గ కేంద్రాల్లో శాంతియుతంగా చేపట్టే ర్యాలీలకు అనుమతి ఇవ్వాలని చట్టబద్ధంగా పోలీసులను వైఎస్సార్సీపీ నేతలు కోరారు. -
వ్యవస్థలు నిర్వీర్యం.. ప్రియాంక కేసే నిదర్శనం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ వ్యవస్థలు, పోలీసు యంత్రాంగం ఏ స్థాయిలో నిర్వీర్యమైపోయాయో రాజమండ్రిలో మెడికల్ పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రియాంక మృతి ఘటన మరోసారి రుజువు చేసిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. ఈ ఘటనపై ఆదివారం ‘ఎక్స్’ వేదికగా ఆయన స్పందించారు. ఆగస్టు 3వ తేదీ రాత్రి ఓ షాపింగ్మాల్ గేటు బయట ఘటన జరిగినా, నిందితులు మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసినా పోలీసులు వెంటనే సీసీ కెమెరాలను పరిశీలించి, ఘటన తీవ్రతకు అనుగుణంగా కేసులు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించారని జగన్ పేర్కొన్నారు. కానీ, ఘటనను సాధారణ రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి, నిందితులను కూడా వదిలేసి చేతులు దులుపుకోవడం అత్యంత దారుణమన్నారు. నిందితులు డాక్టర్ ప్రియాంక ప్రయాణిస్తున్న స్కూటర్ను కారుతో ఢీకొట్టడమే కాకుండా, ఆ తర్వాత కూడా అమానవీయంగా ప్రవర్తించారని జగన్ ఆరోపించారు. బాధితురాలి మీదుగా కారు వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ పోలీసు యంత్రాంగం ఎందుకు ఇంత అలసత్వంగా వ్యవహరించిందో తేల్చేందుకు పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.సామాన్యుల కేసుల్లో చట్టం ఎందుకు పనిచేయదు?ప్రతిపక్ష నేతలపైనా, ప్రశ్నించేవారిపైనా, ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపేవారిపైనా ‘రెడ్బుక్ రాజ్యాంగం’ పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటూ, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ప్రభుత్వం.. సామాన్యులకు సంబంధించిన కేసుల్లో మాత్రం చట్టప్రకారం వ్యవహరించడంలో ఘోరంగా విఫలమవుతోందని జగన్ విమర్శించారు. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చూపిస్తూ తప్పుడు కేసులు పెట్టడం, రాజకీయ వేధింపులు, కక్షసాధింపుల కోసం పోలీసు వ్యవస్థను ఉపయోగించుకోవడం కూడా రాష్ట్రంలో వ్యవస్థల పతనానికి కారణమని ఆరోపించారు.తల్లిదండ్రుల ఆవేదనకు ప్రభుత్వం సమాధానం చెప్పాలిఎన్నో త్యాగాలు, కష్టాలను ఎదుర్కొని కుమార్తెను డాక్టర్గా తీర్చిదిద్దిన తల్లిదండ్రులకు.. ఆమె ఎండీ చదువులు పూర్తి చేసి పదిమందికి వైద్య సేవలందించే స్థాయికి ఎదుగుతున్న సమయంలోనే తీవ్ర విషాదం ఎదురుకావడం అత్యంత బాధాకరమని జగన్ పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో భగవంతుడు ప్రియాంక కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. డాక్టర్ ప్రియాంక తండ్రి ఆవేదనకు ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం తప్పకుండా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పౌరులందరినీ సమానంగా చూడాల్సిన వ్యవస్థల్లో రాజకీయ కక్షసాధింపులు, పక్షపాతం, ‘మీది ఏ పార్టీ?’ అనే ధోరణులను తీసుకురావడం వల్లే వ్యవస్థల పునాదులు కదిలిపోయే పరిస్థితి ఏర్పడిందని జగన్ విమర్శించారు. ఈ విషయాన్ని చంద్రబాబు ఇప్పటికైనా గుర్తించాలని అన్నారు. మద్యం, గంజాయికి బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబు తీరు..వీధికి రెండు బెల్టుషాపులు, ప్రతి కిలోమీటర్కు మద్యం దుకాణాలు, ప్రతి వీధి చివర బార్ అండ్ రెస్టారెంట్లతో మద్యం, గంజాయికి బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబు తీరు ఉందని జగన్ మండిపడ్డారు. గుడి, బడి, బీచ్ అనే తేడా లేకుండా మద్యం అందుబాటును పెంచడం వల్లే ఇలాంటి ఘటనలకు అనుకూల వాతావరణం ఏర్పడుతోందని విమర్శించారు. డాక్టర్ ప్రియాంక కేసులో వ్యవస్థల వైఫల్యాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నా, వాటికి సమాధానం చెప్పలేక ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం నిమిషాల వ్యవధిలో ఆ కంటెంట్ను తొలగిస్తోందని జగన్ ఆరోపించారు. -
నువ్వేం మంత్రివయ్యా! పేకాటలో గెలిస్తే గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చేస్తారా..?
-
టీడీపీకి షాక్.. వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు
సాక్షి, పశ్చిమగోదావరి: జిల్లాలోని ఆచంట నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. పెనుమంట్ర మండలంలో ఈ రోజు (ఆదివారం) టీడీపీ కార్యకర్తలు పెద్దఎత్తున వైఎస్సార్సీపీలో చేరారు. మాజీ మంత్రి రంగనాథరాజు ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు. పెద్దఎత్తున కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరడంతో పచ్చపార్టీకి భారీ షాక్ తగిలినట్లయింది. -
YSRCP: ఘనంగా ఆదివాసీ దినోత్సవ వేడుకలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గిరిజన మహిళలు.. సంప్రదాయ నృత్యాలతో అలరించారు. ఆదివాసీ నేతల చిత్రపటాలకు పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఆదివాసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్ర, గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణమూర్తి, ఎస్సీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ నేతలపై కొనసాగుతున్న కుట్ర ప్రభుత్వ కక్షసాధింపు చర్యలు
సాక్షి,విజయవాడ:రాష్ట్రంలో డీఎస్సీ నియామకాల్లో జరిగిన భారీ అవకతవకలపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో విజయవాడలో ఆందోళన నిర్వహిస్తున్న వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు మరో 100 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు కేసులు బనాయించడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. విజయవాడ ముత్యాలంపాడులో వైఎస్సార్సీపీ నేతలు శాంతియుతంగా ఏర్పాటు చేసుకున్న దీక్షా శిబిరంపై బోండా ఉమా తన అనుచరులతో కలిసి దాడికి తెగబడ్డారు. దీక్షా శిబిరాన్ని ధ్వంసం చేసి రౌడీయిజానికి పాల్పడిన బోండా ఉమాపై,ఆయన అనుచరులపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. కూటమి నేతల్ని వదిలేసి బాధిత వైఎస్సార్సీపీ నేతలపై కేసులు నమోదు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తమ పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుని కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, పోలీసులను అడ్డుపెట్టుకుని అక్రమ కేసులు పెట్టిస్తోందని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు.డీఎస్సీ ప్రక్రియలో అనేక అక్రమాలు జరిగాయని, అర్హులకు తీవ్ర అన్యాయం జరిగిందని వైఎస్సార్సీపీ నేతలు ధ్వజమెత్తారు. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. డీఎస్సీ అక్రమాలపై తాము పారదర్శకమైన చర్చకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసిన నేతలు, ఈ వ్యవహారంపై సీబీఐ చేత విచారణ జరిపించాలని కోరుతున్నారు. చర్చకు రావాల్సిందిగా తాము సవాల్ విసురుతున్నా మంత్రి నారా లోకేష్ ఎందుకు వెనుకాడుతున్నారని వైఎస్సార్సీపీ నేతలు ఈ సందర్భంగా గట్టిగా నిలదీశారు. -
అధః పాతాళానికి తొక్కకపోతే... జెన్ -జీ పై బాబు వ్యాఖ్యలకు వెంకట్ రెడ్డి మాస్ కౌంటర్
-
YSRCP చింతాడ రవికుమార్ అరెస్ట్
-
రేపు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న శాంతియుత రిలే నిరాహార దీక్షలను అడ్డుకోవడం, దీక్షా శిబిరాలపై దాడులు చేయడం, అక్రమ అరెస్టులు, లాఠీచార్జీలకు పోలీసులు పాల్పడటం చంద్రబాబు ప్రభుత్వ అప్రజాస్వావిుక వైఖరికి నిదర్శనమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ఆరోపించారు. రిలే దీక్షలు ముగిసినా ఈనెల 10న రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో విద్యార్థులు, యువత, నిరుద్యోగులు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులతో కలిసి నిరసన ర్యాలీలు నిర్వహిస్తామన్నారు.తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డీఎస్సీ–2025 అక్రమాలపై న్యాయంచేయాలని కోరుతూ గాంధేయ మార్గంలో నిరసన చేస్తున్న విద్యార్థులు, నిరుద్యోగులు, పార్టీ శ్రేణులపై ఉక్కుపాదం మోపడం దారుణమన్నారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కాలరాసే అధికారం ఎవరికీలేదని ఆయన చెప్పారు. డీఎస్సీ పరీక్ష ప్రక్రియ ప్రారంభం నుంచి అనేక అనుమానాస్పద పరిణామాలు చోటుచేసుకున్నాయని.. వీటన్నింటికీ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.కీలక అధికారులు ఎందుకు బదిలీ అయ్యారు?అలాగే, డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం సీబీఐ విచారణకు సిద్ధంకావాలని, మంత్రి లోకేశ్ రాజీనామా చేసేవరకూ పోరాటం కొనసాగుతుందని అప్పిరెడ్డి తేల్చిచెప్పారు. అప్పట్లో కీలక బాధ్యతల్లో ఉన్న అధికారులు వరుసగా ఎందుకు బదిలీ అయ్యారని ప్రశ్నించారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు, కార్యదర్శి కోన శశిధర్, పీఎస్ గిరీష్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ ఇప్పుడా స్థానాల్లో లేరని.. స్పోర్ట్స్ కోటా, డీఎస్సీ పరీక్షలతో సంబంధం ఉన్న అధికారులు, శాప్ అధికారులను కూడా ఎందుకు మార్చారని ఆయన నిలదీశారు. ఇక డీఎస్సీపై శాసనసభ, శాసన మండలిలో వాయిదా తీర్మానం ద్వారా చర్చకు తీసుకొస్తామని.. మంత్రి లోకేశ్ చర్చకు సిద్ధంగా ఉండాలన్నారు. ఇక అమరావతిలో అద్దాలు, భవనాల కోసం రూ.వేల కోట్లు ఖర్చుచేస్తున్న ప్రభుత్వం పేద విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఎందుకు విడుదల చేయడంలేదని అప్పిరెడ్డి ప్రశ్నించారు.డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే: మాజీ మంత్రి సాకే శైలజానాథ్ డీఎస్సీలో అక్రమాలు ఆధారాలతో సహా బయటపడినా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా, అధికారులతో పాత వివరణలే ఇప్పిస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత సాకే శైలజానాథ్ మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. అధికారులు ఇస్తున్న వివరణకు డీఎస్సీ అభ్యర్థులు అడుగుతున్న ప్రశ్నలకు పొంతన ఉండటం లేదన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు ఉందని చెబుతున్న చంద్రబాబు.. వైఎస్సార్సీపీ నేతలు డీఎస్సీ స్కాంపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా దాడులు చేయించడం ఏంటని నిలదీశారు. డీఎస్సీ అక్రమాలపై ఏదో ఒకటి చెప్పేసి తప్పించుకుందామంటే కుదరదని, మంత్రి లోకేశ్ దీనిపై సమాధానం చెప్పాల్సిందేనని అని అన్నారు.యువత కోసం వైఎస్సార్సీపీ రాజీలేని పోరు:వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజుసాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోని నిరుద్యోగులు, విద్యార్థుల భవిష్యత్తు కోసం వైఎస్సార్సీపీ రాజీలేని పోరాటం చేస్తుందని ఆ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు స్పష్టంచేశారు. విశాఖ నగరంలో మూడో రోజు రిలే నిరాహార దీక్ష ముగిసిన అనంతరం శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం 2025 డీఎస్సీని ‘దగా డీఎస్సీ’గా మార్చేసిందని.. అర్హులైన అభ్యర్థులకు అన్యాయం చేస్తూ టీచర్ పోస్టులను అమ్ముకుందని ఆరోపించారు. ప్రభుత్వం చేస్తున్న అక్రమాలపై ప్రజలను చైతన్యపరుస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వీధిపోరాటాలు కొనసాగుతాయని కేకే రాజు స్పష్టంచేశారు. -
లోకేశ్ తప్పుకోవాల్సిందే
సాక్షి, అమరావతి : మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగ యువతను దగా చేశారని, డీఎస్సీ స్కామ్కు బాధ్యత వహించి మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని.. సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన రిలే దీక్షలపై మూడవ రోజు శనివారం కూడా చంద్రబాబు సర్కారు దమనకాండ సాగించింది. అయినప్పటికీ ఎక్కడికక్కడ దీక్షలు విజయవంతం కావడం, జెన్ జీ యువత కదం తొక్కడంతో రోజురోజుకు ఉద్యమం ఉధృతం అవుతోంది. ఫలితంగా చంద్రబాబు ప్రభుత్వానికి వణుకు పుట్టింది. డీఎస్సీ అక్రమాలపై జెన్ జీ యువత, ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహావేశాలను డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు కొత్త పన్నాగాలు పన్నుతున్నారు. తన తనయుడి రాజకీయ భవితపై బెంబేలెత్తుతూ ఇప్పటికే పోలీసులు, టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టి రిలే దీక్షల భగ్నానికి విఫలయత్నం చేస్తున్నారు. అడ్డంకులను అధిగమించి ఉధృతంగా పోరుడీఎస్సీ–2025 అక్రమాలపై వైఎస్సార్సీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మూడో రోజూ రాష్ట్ర వ్యాప్తంగా హోరెత్తాయి. వేలాది మంది నిరుద్యోగులు, డీఎస్సీ బాధిత అభ్యర్థులు, జెన్జీ యువత, వైఎస్సార్సీపీ శ్రేణులు దీక్షా శిబిరాలకు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. పోలీసుల ఆంక్షలు, నిర్బంధాలు, టీడీపీ శ్రేణుల అడ్డంకులను అధిగమించి రిలే దీక్షలను కొనసాగించారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించడంతో పాటు.. స్కామ్కు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలనే డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగింది.ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, నిరుద్యోగ భృతితోపాటు ఎన్నికల్లో యువతకు ఇచ్చిన అన్ని హామీలను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయాలనే డిమాండ్ దీక్షా శిబిరాల్లో విన్పించింది. యువతను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని జెన్ జీ యువత మండిపడింది. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు లోకేశ్ ఎందుకు భయపడుతున్నారని యువత ప్రశ్నించింది. విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు చేయొద్దని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే వరకు పోరాటం ఆగదని వైఎస్సార్సీపీ స్పష్టం చేసింది. రోజురోజుకూ ఉద్యమానికి యువత మద్దతు పెరుగుతుండటంతో ప్రభుత్వ పెద్దల్లో ఆందోళన తీవ్రమైంది. చిలకలూరిపేటలో పోలీసుల దౌర్జన్యంచిలకలూరిపేటలో రిలే దీక్షలను అడ్డుకునేందుకు పోలీసులు దౌర్జన్యం చేశారు. దీక్షకు మద్దతుగా మాజీ మంత్రి విడదల రజిని, పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ పాల్గొన్నారు. అంతలో దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు దీక్షా శిబిరాన్ని తొలగించేందుకు ప్రయత్నించడంతో రజిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో విడదల రజిని కిందపడిపోయారు. మహిళా నేత అని కూడా చూడకుండా పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించడంపై వైఎస్సార్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.జమ్మలమడుగులో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని అడ్డుకున్న పోలీసులువైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో టీడీపీ నేతల ఒత్తిడితో రంగంలోకి దిగిన పోలీసులు వైఎస్సార్సీపీ చేపట్టిన రిలే దీక్షలను అడ్డుకున్నారు. దీక్షలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, ఆయన సతీమణి ఇందిరమ్మలను అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇది సరికాదని వైఎస్సార్సీపీ శ్రేణులు నిలదీయడంతో పోలీసులు వాగ్వాదానికి దిగారు. రామసుబ్బారెడ్డిని తరలించే క్రమంలో తోపులాట చోటు చేసుకుంది. క్యారమ్స్ ఆడుతాం.. మాకూ ఉద్యోగాలివ్వండిబాపట్లలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో శనివారం వినూత్న నిరసన నిర్వహించారు. డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా పేరుతో పేకాట, లూడో ప్రామాణికంగా టీచర్ ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారని వినూత్న నిరసన చేపట్టడం ప్రజలను ఆలోచింపజేసింది. రిలే దీక్షా శిబిరం వద్ద క్యారం బోర్డు ఆడుతూ.. ‘మాకు కూడా డీఎస్సీ ఉద్యోగాలు ఇవ్వండి’ అంటూ నిరసన తెలిపారు. ఇదిలా ఉండగా చంద్రబాబు సర్కారు కుటిలయత్నాలు, కుట్రలను అధిగమించి వైఎస్సార్సీపీ శనివారం మూడవ రోజు రిలే దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతమయ్యాయి. ఈ నెల 10న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధమయ్యాయి.సంతలో సరుకుల్లా డీఎస్సీ కొలువులు⇒ కూరగాయల బుట్టల్లో పోస్టుల విక్రయాల నాటిక⇒ క్రీడా కోటాకు ‘తొక్కుడు బిళ్ల’ ఆటలతో వినూత్న నిరసన పార్వతీపురం రూరల్: పార్వతీపురం వైఎస్సార్ కూడలి వద్ద వైఎస్సార్సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సారథ్యంలో జరిగిన ఈ ఆందోళనలో మహిళలు, జెన్–జి యువత వినూత్న రీతిలో ప్రభుత్వ తీరును ఎండగట్టారు. డీఎస్సీ టీచర్ పోస్టులను కూటమి నాయకులు అంగడిలో సరుకుల్లా అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ దీక్షా శిబిరం వద్ద మహిళలు ప్రదర్శించిన నాటికలు అందరి దృష్టిని ఆకర్షించాయి.కూరగాయల బుట్టల్లో ‘ఎస్జీటీ పోస్టు’, ‘సూ్కల్ అసిస్టెంట్ పోస్టు’ అని బోర్డులు ఉంచి.. ‘రండి బాబు రండి.. రేటు మాట్లాడితే ఉద్యోగం మీదే.. చదువుతో పనిలేదు, డబ్బులిస్తే చాలు’ అంటూ వీధి వ్యాపారుల్లా అరుస్తూ నిరసన తెలిపారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అనర్హులకు పోస్టులు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ.. మహిళలు ‘తొక్కుడు బిళ్ల’ ఆడుతూ, వీధి ఆటలను కూడా కూటమి ప్రభుత్వం స్పోర్ట్స్ కోటాలో చేర్చే అవకాశం ఉంది అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
వైఎస్సార్సీపీ నేత చింతాడ రవికుమార్ అరెస్ట్
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ నేత చింతాడ రవికుమార్ను ఎచ్చెర్ల మండలం చిలకపాలెం జంక్షన్ సమీపంలో పోలీసులు అదుపులో తీసుకున్నారు. శ్రీకాకుళం డిఎస్పీ ముందు లొంగిపోయేందుకు వెళ్తుండగా రోడ్డుపై ఆయన కారును ఆపి అదుపులోకి తీసుకున్నారు.చింతాడ రవి కుమార్ మాట్లాడుతూ.. ‘‘నా అనుచరులను ఇబ్బంది పెడుతున్నారు. వైఎస్సార్సీపీ నేతలను, నా కుటుంబ సభ్యులను విచారణ పేరుతో వేధిస్తున్నారు. దాదాపు 50 నుంచి 60 మంది వరకు కార్యకర్తలు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. రాష్ట్రంలో అరాచక పాలన ఈ రోజు సాగుతుంది. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో ఎక్కడికి తీసుకు వెళ్తున్నారో కనీసం చెప్పడం లేదు. ప్రతిరోజు పదిమంది పోలీసులు వచ్చి వైఎస్సార్సీపీ నేతలను వేధిస్తున్నారు...హైకోర్టులో ఓ వైపు న్యాయ పోరాటం చేస్తున్నాం. కార్యకర్తలు ఇబ్బంది పడకూడదని డిఎస్పీ వద్ద లొంగిపోదామని వెళ్తున్నా.. మార్గ మధ్యలో నన్ను ఆపారు. ఎక్కడకి తీసుకువెళ్తున్నారో చెప్పడం లేదు. ఎవరు తీసుకెళ్తున్నారో తెలియదు.. బలవంతంగా కారు ఎక్కిస్తున్నారు’’ అంటూ చింతాడ రవికుమార్ మండిపడ్డారు. -
నువ్వు బిరియాని కనిపెడితే ఇరానీలు ఏం చేసినట్లు? బాబుపై బుగ్గన సెటైర్లే సెటైర్లు
-
దిశా చట్టాన్ని పేరు మార్చి అయినా చట్టాన్ని అమలు చెయ్.. అనితకు వరుదు కళ్యాణి సూచన
-
నీ కంటే అడుక్కున్నవాడు నయం..! బాబు,లోకేష్ ని ఏకిపారేసిన లక్ష్మీ పార్వతి
-
అన్యాయం జరిగిన వారికి ఉద్యోగాలు ఇవ్వాల్సిందే
-
ఈ దీక్షా శిబిరం వద్దకు వచ్చాక నాకు మా అమ్మా నాన్నలు గుర్తొచ్చారు
-
రోజులన్నీ ఒకేలా ఉండవు రెడ్ బుక్ సంగతి తేలుస్తాం
-
DSCలో అక్రమాలు జరగకపోతే రాత్రికిరాత్రి ఆ ఇద్దర్ని ఎందుకు ట్రాన్స్ ఫర్ చేశారు
-
నాపైనా, నా భర్త పైన కక్ష సాధింపు... కూటమిపై విరుచుకుపడ్డ MLC కల్పలత
-
TDP ఫేక్ ట్రోల్స్ పై జగన్ ఫ్యాన్ మాస్ కౌంటర్
-
‘డీఎస్సీలో అక్రమాలకు ఇవి నిదర్శనం కాదా?’
తాడేపల్లి : డీఎస్సీ అక్రమాలపై విచారణ అడిగితే భయమెందుకని మాజీ మంత్రి శైలజానాథ్ ప్రశ్నించారు. డీఎస్సీ అక్రమాలపై బాధితులు, ప్రతిపక్షం అడిగే దానికి ప్రభుత్వం చెప్పే సమాధానాలకు పొంతన ఉండటం లేదన్నారు. అధికారులు మాత్రం అభ్యర్థులను తప్పుదారి పట్టించేలా మాట్లాడుతున్నారన్నారు.‘డీఎస్సీ-2025లో డీఎస్సీ కన్వీనర్ని ఎందుకు పక్కన పెట్టారు?, ఫస్ట్ ర్యాంకర్ నవీన్ అనే యువకుడికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు?, పరీక్షల సిస్టంలో పని చేసిన నవీన్కు ఫస్ట్ ర్యాంకు రావటం మీద అనుమానం ఉంది. దీనిపై ప్రభుత్వం ఇప్పటికీ ఎందుకు సరైన సమాధానం చెప్పటం లేదు?, రెండో ర్యాంకు వచ్చిన వ్యక్తికి మొదటి ర్యాంకు ఎందుకు ఇచ్చారు?, డీఎస్సీలో అక్రమాలు జరిగాయనటానికి ఇదొక నిదర్శనం. స్పోర్ట్స్ కోటాను 2 నుండి 3 శాతానికి పెంచటం వెనుక కుట్ర ఉంది. జీవో నెంబర్ 4, 47 తేవటం వెనుక కుట్ర ఉంది. ఆ జీవోలు సరైనవే ఆయితే మళ్ళీ జీవో నెంబర్ 56 ఎందుకు తెచ్చారు?ఈమధ్యలోనే భారీగా అక్రమాలు జరిగాయి. జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ తెచ్చుకున్న దుర్గయ్యకు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు?, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన వారి రాజకీయ బ్యాక్గ్రౌండ్ పై కూడా విచారణ జరపాలి. రూ.15 లక్షల చొప్పున ఉద్యోగాలను అమ్ముకున్నారు. దానిపై విచారణ జరపాలని అడిగితే కేసులు పెడుతున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లాదిపై దాడి దుర్మార్గం..మల్లాది విష్ణుపై కోడిగుడ్లతో దాడి చేయటం దుర్మార్గపు చర్య. మా రిలే దీక్షల్లో రౌడీలు ఉన్నారన చంద్రబాబు అనటం దారుణం. ఆ మాటలను వెనక్కు తీసుకోవాలి. దీక్షల శిబిరాల దగ్గరకు వెళ్ళి చూస్తే చంద్రబాబుకు వాస్తవాలు తెలుస్తాయి’ అని స్పష్టం చేశారు. -
ఏపీ విద్యాశాఖలో రెడ్బుక్ అరాచకం
సాక్షి, విజయవాడ: విద్యాశాఖలో రెడ్ బుక్ అరాచకం నడుస్తోంది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డిపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగింది. కల్పలత భర్త ప్రతాప్ రెడ్డిపై చర్యలకు ఛార్జ్ మెమో జారీ చేసింది. ఐదేళ్ల కిందట సెలవు పెట్టినందుకు ఇప్పుడు ఛార్జ్ మెమో ఇచ్చింది.ఎస్సీఈఆర్టీ డైరెక్టర్గా పనిచేసిన ప్రతాప్ రెడ్డి.. ప్రస్తుతం వయోజన విద్య జేడీగా ఉన్నారు. ఉద్యోగుల సమస్యలు లేవనెత్తినందుకు కల్పలత కుటుంబంపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు తెరతీసింది. ప్రభుత్వం కక్ష సాధింపుపై ఎమ్మెల్సీ కల్పలతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘‘నా గొంతు నొక్కడానికి కక్ష సాధిస్తున్నారు. మొట్టమొదటి మహిళా టీచర్ ఎమ్మెల్సీపై కక్ష సాధిస్తారా..?’’ అంటూ ఆమె మండిపడ్డారు.‘‘టీచర్లు, ఉద్యోగుల సమస్యలపై మాట్లాడుతున్నందుకు కక్ష కట్టారు. నా భర్త సెలవు పెడితే ఎన్నికల్లో ఎలా ప్రభావితం చేస్తారు..?. ఎంఈవోలు అసలు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ పరిధిలో ఉంటారా?. ఐదేళ్లలో ఒక్క సమావేశంకూడా పెట్టలేదు. నేను ఉద్యోగుల కోసం మాట్లాడితే ఇంకో ఛార్జ్ మెమో ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. నా పైనా, నా భర్త పైన జరుగుతున్న కక్ష సాధింపుపై పోరాడతాను. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో కలిసి పోరాడతాను...మీరు ఎంత టార్గెట్ చేసిన ఉద్యోగుల సమస్యలపై మాట్లాడతాను. ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్ ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేసింది. ఉద్యోగులకు ఐదు డీఏల బకాయిలు చెల్లించాలి. పోలీసులు, సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. మీరు ఎంత టార్గెట్ చేస్తే అంత గట్టిగా పోరాడతాను’’ అంటూ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి స్పష్టం చేశారు. -
మీకసలు బుర్ర ఉందా.. ఏమైనా జరిగితే.. పోలీసులకు ఇచ్చిపడేసిన విడదల రజిని
-
రాష్ట్రానికి పట్టిన శని... నారా లోకేష్పై పెద్దిరెడ్డి ఫైర్
-
DSC స్కామ్ పై అదిరిపోయే స్కిట్.. లోకేష్, పవన్ ఫోటోతో మాస్ ర్యాగింగ్
-
చెప్పడానికి నాకే అసహ్యంగా ఉంది.. మీరు చేసిన నీచమైన పని.. సంచలన వ్యాఖ్యలు..
-
పాలన ఎలా ఉందో వాళ్లనే అడుగు: బాబుపై బుగ్గన ఫైర్
సాక్షి, హైదరాబాద్: చంద్రబాబు విడుదల చేస్తున్న శ్వేతపత్రాలు వాస్తవాలను ప్రతిబింబించేవి కావని.. అవి కేవలం రాజకీయ జిమ్మిక్కులేనని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అంటున్నారు. చంద్రబాబు మాటలకు, చేతలకు ఎలాంటి సంబంధం ఉండదని ఎద్దేవా చేశారు. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో బుగ్గన, కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించేలా చంద్రబాబు హామీలు ఇస్తారని, కానీ ఆచరణలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయన్నారు. ప్రొగ్రెస్ కార్డు అనే కాన్సెప్ట్ తెచ్చిన చంద్రబాబు.. అది తనకు తానే ఇచ్చుకుంటున్నాడని, కానీ అది ఇవ్వాల్సింది ప్రజలని బుగ్గన గుర్తు చేశారు. చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించే మీడియా కూడా అదే తరహాలో ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ‘హైదరాబాద్ను కడితే.. కుతుబ్ షా ఏం చేసినట్లు?’చంద్రబాబు హైదరాబాద్ అభివృద్ధి గురించి చెప్పుకునే తీరుపై బుగ్గన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హైదరాబాద్ను తానే నిర్మించానన్నట్లుగా చెప్పుకోవడం సరికాదన్నారు. “చంద్రబాబు హైదరాబాద్ను కడితే.. కుతుబ్ షా ఏం చేసినట్లు? చంద్రబాబు బిర్యానీ కనిపెడితే.. ఇరానీయులు ఏం చేసినట్లు?. అందరినీ అమెరికాకు తానే పంపానని అంటారు.. ఇతర రాష్ట్రాల వాళ్లను కూడా ఆయనే పంపారా?” అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రకటనలు, రాజకీయ వ్యాఖ్యలు చూస్తే ఇతర దేశాల్లో అయితే ఆయనను పబ్లిక్ లైఫ్ నుంచి వెల్లగొట్టేవారని బుగ్గన అన్నారు.వాళ్లను అడిగితే సరిపోదా?.. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలని బుగ్గన సూచించారు. చంద్రబాబు పాలన ఎలా ఉందో మహిళలను అడిగితే చెబుతారని, నిరుద్యోగులు, విద్యార్థులు, కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులను అడిగినా వాస్తవ పరిస్థితి తెలుస్తుందని అన్నారు. రాష్ట్రంలో రైతులు సమస్యలతో రోడ్డెక్కుతున్నారని గుర్తు చేశారు. చంద్రబాబు పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని విమర్శించారు. ఆయన సభలకు వచ్చిన ప్రజలు మధ్యలోనే వెళ్లిపోతున్నారని వ్యాఖ్యానించారు.ఆరోగ్యశ్రీపై విమర్శలురాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం సరిగా అమలు కావడం లేదని బుగ్గన ఆరోపించారు. ప్రజా సంక్షేమ పథకాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని అన్నారు. రైతులు, విద్యార్థులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.జగన్ జనాదరణపై వ్యాఖ్యలుచంద్రబాబు మీటింగ్ పెడితే జనం మధ్యలో వెళ్లిపోతున్నారన్న బుగ్గన.. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బయటకు వస్తే లక్షలాది మంది ప్రజలు తరలివస్తున్నారని అంటున్నారు. అది చూసి చంద్రబాబు ప్రభుత్వం ఇబ్బంది పడుతోందని అన్నారు. ప్రజల్లో తమ పార్టీకి ఇంకా ఆదరణ ఉందని పేర్కొన్నారు. -
YSR జిల్లా జమ్మలమడుగులో ఉద్రిక్తత.. MLC రామసుబ్బారెడ్డి అరెస్ట్
-
కర్నూలు పార్లమెంట్ ఇంచార్జ్ గా నియామకం.. మీ అందరికీ మాట ఇస్తున్నా...
-
హెరిటేజ్ కోసమే చలసానిపై లోకేష్ కుట్ర: పేర్ని నాని
కృష్ణా జిల్లా: విజయ డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు రాజీనామా వ్యవహారంపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నాయకుడు పేర్ని నాని తీవ్రస్థాయిలో స్పందించారు. విజయ డెయిరీని దెబ్బతీసి హెరిటేజ్ వ్యాపారాన్ని పెంచుకునేందుకు మంత్రి నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. కంచే చేను మేసిన చందంగా లోకేష్ తీరు ఉంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఆంజనేయులు రాజీనామా అంశంపై పేర్ని నాని తాజాగా స్పందిస్తూ.. సహకార సంఘాల ద్వారా నిర్మితమై విజయవంతంగా కొనసాగుతున్న విజయ డెయిరీని లోకేష్ ధనదాహం, అధికార మదంతో దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. దాదాపు రూ.1,000 కోట్ల వ్యాపార లావాదేవీలతో విజయ డెయిరీ బలమైన సంస్థగా ఎదిగిందని, దాని విలువైన ఆస్తులను హస్తగతం చేసుకునే కుట్ర జరుగుతోందని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహకారంతో మండవ జానకిరామయ్య హయాంలో విజయ డెయిరీ అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. 2019-24 మధ్య సహకార సంఘాల ద్వారా కొనసాగుతున్న డెయిరీ అభివృద్ధికి జగన్ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. మండవ జానకిరామయ్య బాటలోనే చలసాని ఆంజనేయులు కూడా విజయ డెయిరీ అభివృద్ధికి సేవలు అందించారని చెప్పారు.చలసాని ఆంజనేయులు రాజీనామా వెనుక ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ ఉందని ఆరోపించారు. సహకార సంఘాల సభ్యుల ద్వారా ఎన్నికైన చైర్మన్ను పదవి నుంచి తప్పించేందుకు మంత్రులకు ఏం హక్కు ఉందని ప్రశ్నించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆంజనేయులును ఐసీయూలోనే బెదిరించి రాజీనామా చేయించారని, రాజీనామా చేయకపోతే అక్రమ కేసులు పెట్టి ఆయన కుమార్తె, కుమారుడిని అరెస్టు చేయిస్తామని బెదిరించినట్లు ఆరోపించారు. కూటమి నేతల ఒత్తిడి, బెదిరింపుల కారణంగానే ఆంజనేయులుకు గుండెపోటు వచ్చింది. వైఎస్సార్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు, అరెస్టుల పర్వం కొనసాగిస్తున్న కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు టీడీపీ, జనసేన నేతలపైనా అదే విధానాన్ని ప్రయోగిస్తోందని విమర్శించారు.పాలు, పాల ఉత్పత్తుల విక్రయాలతో విజయవంతంగా నడుస్తున్న విజయ డెయిరీని బలహీనపరిచి హెరిటేజ్ను అభివృద్ధి చేసుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయని నాని ఆరోపించారు. సహకార సంఘాల ద్వారా సమర్థవంతంగా నడుస్తున్న విజయ డెయిరీని అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లనివ్వబోమన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత డెయిరీపై కుట్రలకు పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. -
వణుకుతున్న లోకేష్.. దీక్ష చేస్తే భయమెందుకు సార్
-
Z+ క్యాటగిరి భద్రతగా ఎంతమంది పోలీసులు ఉంటారో నీకు తెలుసా? అనితను రఫ్ఫాడించిన నాగమల్లీశ్వరి
-
ఏజెన్సీ బంద్.. పాడేరులో ఉద్రిక్తత..
ఏజెన్సీ బంద్ అప్డేట్స్..పాడేరు బస్ డిపో ముందు ఉద్రిక్తత.బంద్పై పోలీసుల ఉక్కు పాదం..బంద్ను విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం కుట్ర.బంద్ నేపథ్యంలో వందలాది మంది పోలీసులు మోహరింపు.బస్ స్టేషన్ ముందు జేఏసీ నేతలు నిరసన..జేఏసీ నేతలను నెట్టివేసిన పోలీసులు..దగ్గరుండి ఆర్టీసీ బస్సులను నడిపిస్తున్న పోలీసులు.పోలీసులు తీరుపై మండిపడుతున్న జేఏసీ నేతలు.పోలవరం జిల్లా..గిరిజన సంఘాల ఆధ్వర్యంలో మన్యం బంద్కు పిలుపు...ఏజెన్సీలో గిరిజనేతరుల ఆక్రమణలను అడ్డుకోవడం వంటి ప్రధాన డిమాండ్లతో రోడ్డెక్కిన గిరిజనులు..ఏజెన్సీలో పలు చోట్ల ట్రాఫిక్ అంతరాయం.పార్వతీపురం మన్యం జిల్లా..జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలలో గిరిజన బంద్ ప్రభావం.గుమ్మలక్ష్మి పురంలో మూత పడ్డ దుకాణలు.నిలిపేసిన ఆర్టీసీ బస్సుల రాకపోకలు..👉ఏపీలో 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, జీఓ నంబర్-3ను పునరుద్ధరించాలనే డిమాండ్లతో ఏజెన్సీ ప్రాంతంలో బంద్ కొనసాగుతోంది. బంద్కు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. మన్యం బంద్ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు.👉బంద్ను విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జేఏసీ నేతలు ఆరోపించారు. వ్యాపారులు బంద్కు సహకరించకుండా పోలీసులు, అధికారులు సంప్రదింపులు జరిపారని, షాపులను యథావిధిగా తెరవాలని ఆదేశాలు ఇచ్చారని వారు పేర్కొన్నారు. అయితే బంద్కు సహకరిస్తామని పలువురు వ్యాపారులు, వర్తకులు స్పష్టం చేసినట్లు తెలిపారు.👉జీఓ నంబర్-3ను పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో 100 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, అల్లూరి జిల్లాను జోన్-1లో కొనసాగించాలని కోరారు. అలాగే 1/70 చట్టంపై సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని, గిరిజన చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. 👉బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు నిలిపివేయడంతో పాటు హైడ్రో పవర్ ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని కోరారు. ఏజెన్సీ బంద్కు అన్ని వర్గాల ప్రజలు సహకరిస్తున్నారని జేఏసీ నేతలు తెలిపారు. పోలీసు బలగాలను భారీగా మోహరించి బంద్ను విచ్ఛిన్నం చేయాలని ప్రభుత్వం చూస్తోందని వారు ఆరోపించారు. -
రాష్ట్రంలో దళితుల జీవనం దయనీయం..
తిరుపతి సిటీ: ‘రాష్ట్రంలో దళితుల జీవనం దయనీయంగా మారిందని, నిత్యం దాడులు, బెదిరింపులు, లాకప్డెత్లతో బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన దుస్థితి ఏర్పడిందని వైఎస్సార్సీపీ నేతలు ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వం అంబేడ్కర్ రాజ్యాంగాన్ని కాలరాస్తూ రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని మండిపడ్డారు. అయినా కేంద్రం పట్టించుకోవడంలేదని అన్నారు. దళితులపై దాడులను సోదాహరణంగా వివరిస్తూ పలుమార్లు ఢిల్లీ వెళ్లి జాతీయ ఎస్సీ కమిషన్కు వినతిపత్రాలు ఇచ్చిన ప్రయోజనం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి నేతృత్వంలో వైఎస్సార్సీపీకి చెందిన దళిత ప్రజాప్రతినిధులు మేరుగు నాగార్జున, నందిగం సురేష్, కె. నారాయణ స్వామి, ఆదిమూలం సురేష్, సుధాకర్బాబుతో పాటు పార్టీ నేత అంబటి మురళీకృష్ణ తదితరులు శుక్రవారం తిరుపతి వచ్చిన జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానాను కలిశారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దారుణాలను విన్నవించారు. నల్ల బ్యాడ్జిలు దర్శించి నిరసన తెలిపారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. జాతీయ ఎస్సీ కమిషన్ తక్షణం స్పందించాలి రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు, లాకప్ డెత్లు, అక్రమ కేసులపై తక్షణం స్పందించాలని జాతీయ ఎస్సీ కమిషన్ను కోరినట్లు వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. దళితుల సమస్యలపై ప్రజా ప్రతినిధుల వినతులను కనీసం 5 నిమిషాల పాటు వినే పరిస్థితిలో చైర్మన్ లేకపోవడం బాధ కలిగించిందన్నారు. పేదల ఇళ్ల కూల్చివేతలు, దాడులు, లాకప్ డెత్ల వంటి ఘటనల్లో బాధితులకు న్యాయం జరగడంలేదని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసి, ప్రశ్నించే దళితులపై దాడులు చేయడం, హింసించడం, పోలీస్ స్టేషన్లలో హత్యలు చేయడం వంటి అరాచక చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. జాతీయ ఎస్సీ కమిషన్ అధికార పార్టీకి వంతపాడుతోంది తప్ప పేద దళితుల సమస్యలను పట్టించుకోవడం లేదని అన్నారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ తన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించడం లేదన్నారు. దళితులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండడాన్ని చంద్రబాబు జీరి్ణంచుకోలేక పోతున్నారని చెప్పారు. బాబు సర్కారు పోలీసు వ్యవస్థను అ«దీనంలోకి తీసుకుని ఎంతోమంది దళితులను పొట్టన పెట్టుకుంటోందన్నారు. సీఐ నాగరాజు చేతిలో గతంలో పల్నాడు జిల్లాలో దళిత సాయి, మంద సాల్మాన్ హత్యకు గురయ్యారని చెప్పారు. -
దగా డీఎస్సీపై ఉద్యమం ఉధృతం
సాక్షి, అమరావతి : ‘‘కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాం.. కానీ ఏం లాభం..? మాకు పేకాట రాదు.. బ్రిడ్జి గేమ్ సర్టిఫికెట్ లేదు.. చంద్రబాబు సర్కారు కొత్త కొత్త జీవోలు ప్రవేశపెట్టి తమ అనుయాయులు, పేకాట రాయుళ్లకు ఉపాధ్యాయ ఉద్యోగాలను కట్టబెట్టింది..! పేకాట తెలియకపోవడమే మా అనర్హతకు కారణమవుతుందని తెలిస్తే ఏదో విధంగా నేర్చుకునే వాళ్లం..! డీఎస్సీలో జాబ్ రావాలంటే కష్టపడటం ఒక్కటే చాలదు.. ఓ స్పోర్ట్స్ సర్టిఫికెట్, రూ.15 లక్షల డబ్బులు కూడా కావాలని అర్థమైంది..! అక్రమ పద్ధతిలో టీచర్ పోస్టులు భర్తీ చేసి మాకు కనీసం నిరుద్యోగ భృతైనా ఇవ్వరా..!’’ ఇదీ మెగా డీఎస్సీ స్కామ్పై రెండో రోజు దీక్షా శిబిరాల వద్ద బాధిత అభ్యర్థుల ఆవేదన!! మెగా డీఎస్సీ 2025 స్కామ్పై పోరులో భాగంగా రిలే దీక్షలతో వైఎస్సార్సీపీ చేపట్టిన శాంతియుత ఉద్యమం రెండో రోజూ నిరసనలతో హోరెత్తగా.. ప్రజాస్వామ్య హక్కులను పాశవికంగా కాలరాస్తూ చంద్రబాబు సర్కారు తన నియంతృత్వ పోకడలను కొనసాగించింది. టీడీపీ మూకల దాడులు, పోలీసుల ఆంక్షలు రెండో రోజు కూడా యథావిధిగా కొనసాగాయి. మెగా డీఎస్సీ స్కామ్కు బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాల్సిందేనని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని బాధిత అభ్యర్థులు, నిరుద్యోగులు, జెన్జీ యువత నినదించింది. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి సహా ఎన్నికల హామీలన్నీ చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమానికి జెన్జీ మద్దతు రోజురోజుకూ పెరగడం ప్రభుత్వ పెద్దలను తీవ్ర కలవరపాటుకు గురి చేస్తోంది. దీంతో రెండో రోజు కూడా ఒకవైపు పోలీసులతో ఆటంకాలు కల్పిస్తూ.. మరోవైపు దీక్షలను భగ్నం చేసేందుకు టీడీపీ గూండాలను బరిలోకి దించారు. అనంతపురంలో రిలే దీక్షలో పాల్గొన్న యువతీయువకులకు మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి సంఘీభావం బొండాగిరీ బాటలోనే బుద్ధా..! బెజవాడలో తొలిరోజు వైఎస్సార్ సీపీ శ్రేణుల దీక్షా శిబిరం వద్ద విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఆయన అనుచరులు దాడులకు తెగబడి అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. బ్రాహ్మణనేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు దీక్షా శిబిరం టెంట్ను తొలగించి కోడిగుడ్లు, టమాటాలు, రాళ్లు రువ్వి పచ్చమూకలు కవ్వింపు చర్యలకు దిగాయి. ఇక అమానవీయ చర్యలకు పరాకాష్టగా మరింత దిగజారిపోయి బాటిల్లో మూత్రం పట్టుకొచ్చి నిరసనకారులపై చల్లారు. దీనికి కొనసాగింపుగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న గ్యాంగ్ వైఎస్సార్సీపీ దీక్షా శిబిరం వద్ద శుక్రవారం హల్చల్ చేసింది. శాంతియుతంగా నిర్వహిస్తున్న నిరసనను భగ్నం చేసేందుకు రెచ్చగొట్టే నినాదాలు చేశారు. పచ్చమూకలు గొడవలు సృష్టించేందుకు యత్నించడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. విజయవాడలో దీక్ష చేస్తున్న యువత, విద్యార్థులకు మద్దతు పలుకుతున్న దేవినేని అవినాశ్ కడపలో రిలే దీక్షలో పాల్గొన్న యువకులు రోడ్డుపైనే బైఠాయించిన అబ్బయ్య చౌదరి దెందులూరు నియోజకవర్గం మాదేపల్లిలో వైఎస్సార్సీపీ చేపట్టిన దీక్షకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరిని పోలీసులు అడ్డుకున్నారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేదా? అంటూ వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద రోడ్డుపైనే అబ్బయ్య చౌదరి బైఠాయించారు. మాదేపల్లిలో దీక్షా శిబిరాన్ని తొలగించిన పోలీసులు వైఎస్సార్సీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. దెందులూరులో రోడ్డుపై అబ్బయ్యచౌదరి బైఠాయింపు బెజవాడలో దీక్షాశిబిరం వద్ద టీడీపీ గూండాగిరీ..తొండంగిలో టెంట్లు తొలగింపు.. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగిలో పోలీసుల తీరుతో ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్ సీపీ రిలే దీక్షలు చేపట్టిన రెండు టెంట్లను పోలీసులు తొలగించారు. గురువారం రాత్రి తొండంగి కార్పొరేషన్ బ్యాంక్ సమీపంలో ఏర్పాటు చేసిన టెంట్ను తొలగించగా శుక్రవారం ఉదయం జియో కార్యాలయం వద్ద టెంట్ను తొలగించడంతో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేతల డైరెక్షన్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. మండుటెండను లెక్క చేయక రోడ్డుపై బైఠాయించి వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసన తెలిపాయి. దీక్షలకు పెరుగుతున్న జెన్ జీ మద్దతు.. మెగా డీఎస్సీ 2025 నియామకాల్లో అక్రమాలపై కేంద్ర సంస్థ సీబీఐతో విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలనే డిమాండ్తో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన దీక్షలకు జెన్ జీ యువత భారీగా మద్దతు పలుకుతోంది. తిరుపతి నుంచి శ్రీకాకుళం వరకు.. అనంతపురం నుంచి కోనసీమ దాకా దాదాపు అన్ని జిల్లాల్లో యువత, విద్యార్థులు, నిరుద్యోగులు, బాధిత అభ్యర్థులు భారీగా పాల్గొని కూటమి సర్కారు నిర్వాకాలపై మండిపడ్డారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాతోపాటు మొత్తం నియామక ప్రక్రియపై నిష్పాక్షిక దర్యాప్తు జరిపి, అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.నేడు కొనసాగనున్న రిలే దీక్షలు.. 10న భారీ ర్యాలీలు.. వైఎస్సార్సీపీ చేపట్టిన రిలే దీక్షలు ఈ నెల 8న కూడా అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో కొనసాగుతాయని పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ప్రకటించింది. ఈ నెల 10న రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించనున్నారు. ర్యాలీలు ముగిసిన తర్వాత ప్రభుత్వంపై ఒత్తిడి మరింత పెంచేలా మలిదశ ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నట్లు వైఎస్సార్సీపీ వెల్లడించింది.స్పోర్ట్స్ కోటాలో ’పేకాట’.. డీఎస్సీలో లూడో! దగా డీఎస్సీపై పార్వతీపురంలో వైఎస్సార్ సీపీ స్కిట్ పార్వతీపురం రూరల్: మెగా డీఎస్సీలో ఉపాధ్యాయ పోస్టులను దొడ్డిదారిలో కట్టబెట్టి.. పేకాట, లూడో లాంటి వాటిని ప్రభుత్వం క్రీడా కోటా జాబితాలో చేర్చిందంటూ పార్వతీపురంలో వైఎస్సార్సీపీ శ్రేణులు శుక్రవారం వినూత్న రీతిలో నిరసన చేపట్టాయి. పట్టణంలోని వైఎస్సార్ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు నేతృత్వంలో రెండో రోజు రిలే నిరాహార దీక్షలు జరిగాయి. ఈ సందర్భంగా కూటమి నేతల్లా నటిస్తూ.. పేకాట, లూడో ఆడుతూ గెలుపొందిన వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కష్టపడి చదివిన అభ్యర్థులను, ప్రతిభావంతులైన క్రీడాకారులను పక్కనపెట్టి.. స్పోర్ట్స్ కోటా పేరుతో నకిలీ సర్టిఫికెట్లు సృష్టించారని మండిపడ్డారు. అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలని, సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. 4వ ర్యాంక్ సాధించినా నిరాశే..! పులివెందులలో డీఎస్సీ బాధిత అభ్యర్థి జిలాని పులివెందుల: విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే టీచర్ పోస్టుపై ఎంతో మక్కువతో మెగా డీఎస్సీకి రెండేళ్ల పాటు సిద్ధమైనట్లు డీఎస్సీ బాధిత అభ్యర్థి జిలాని పేర్కొన్నాడు. ఇంటికి దూరంగా ఉంటూ కడప, ప్రొద్దుటూరులో డీఎస్సీకి ప్రిపేరైనట్లు చెప్పాడు. శుక్రవారం పులివెందులలోని ఆర్డీవో కార్యాలయం వద్ద తొండూరు మండల ఇన్చార్జీ వైఎస్ మధురెడ్డి డీఎస్సీ రిలే దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిలాని మాట్లాడుతూ బీఈడీలో 75 శాతంతో ఉత్తీర్ణత సాధించానన్నారు. డీఎస్సీ రాసిన తర్వాత వందకు 71 మార్కులు, టీచింగ్లో 69.60 మార్కులు వచ్చాయన్నారు. దీని ప్రకారం తాను నాలుగో ర్యాంకులో ఉన్నట్లు చెప్పాడు. కానీ డీఎస్సీలో జాబ్ రావాలంటే కష్టపడటం ఒక్కటే కాదు.. ఒక స్పోర్ట్స్ సర్టిఫికెట్, రూ.15 లక్షల డబ్బులూ కావాలని అర్థమైందన్నారు. టీజీటీలో ఆరు పోస్టులు ఉండగా.. బీసీలకు నాలుగు పోస్టులు ఉండాలని, కానీ 1, 2, 3వ ర్యాంకర్లకు పోస్టులు ఇచ్చాక జిల్లాలో 4వ ర్యాంకర్, టీజీటీలో 276వ ర్యాంకర్ను తీసేసి 2,217వ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి పోస్టు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశాడు. డీఎస్సీలో అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని, అలాంటి సమయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ నేనున్నానని చెప్పడంతో ధైర్యం వచ్చిందన్నారు. నాకు పేకాట రాదు.. అందుకే ఉద్యోగం రాలేదు! నెల్లూరు (వేదాయపాళెం): మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా పేరుతో అనేక అక్రమ నియామకాలు జరిగాయని బాధిత అభ్యర్థి షేక్ కరీంబాషా వాపోయాడు. శుక్రవారం నెల్లూరులోని కరెంటాఫీసు సెంటర్లో వైఎస్సార్ సీపీ రిలే నిరాహార దీక్ష శిబిరం వద్దకు స్వచ్ఛందంగా వచ్చిన కరీంబాషా మైకు ద్వారా తనకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తాడు. కొత్త కొత్త జీవోలు ప్రవేశపెట్టి పేకాటను బ్రిడ్జి గేమ్ పేరుతో ఒక క్రీడగాపరిగణించి ప్రభుత్వం తమ అనుయాయులు, పేకాట రాయుళ్లకు ఉపాధ్యాయ ఉద్యోగాలను కట్టబెట్టిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు పేకాట రాదని, తన వద్ద బ్రిడ్జి గేమ్ సర్టిఫికెట్ లేదని, కానీ తాను కష్టపడి చదివి మంచి మార్కులు సాధించానన్నారు. పేకాట తెలియకపోవడమే తన అనర్హతకు కారణమవుతుందని తెలిసి ఉంటే ఏదో విధంగా పేకాట నేర్చుకునే వాడినన్నాడు. ప్రభుత్వ ఉద్యోగానికి ఈ ఏడాదితో వయో పరిమితి దాటి పోయిందని కన్నీటి పర్యంతమయ్యాడు. అక్రమ పద్ధతిలో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టిన చంద్రబాబు సర్కారు తనకు కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. -
మీ ప్రభుత్వం ఇంకా ఎంతగా దిగజారుతుంది?
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025 ప్రశ్నాపత్రం లీకేజీ, నియామకాల్లో జరిగిన తీవ్రమైన అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ చేపట్టిన శాంతియుత రిలే నిరాహార దీక్షలపై తమ అనుచరులతో కలిసి టీడీపీ ఎమ్మెల్యేలు దాడులు చేయడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. మీ కుమారుడిని కాపాడుకోవడానికి మీ ప్రభుత్వం ఇంకా ఎంతగా దిగజారుతుంది? అంటూ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగిన నిరుద్యోగ యువతకు హింసతో సమాధానం చెప్పాలనుకుంటున్నారా? అంటూ నిలదీశారు.నారా లోకేశ్ను బాధ్యత నుంచి తప్పించకుండా మీ ఎమ్మెల్యేలను, పార్టీ శ్రేణులను, పోలీసు యంత్రాంగాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు? అంటూ ప్రశ్నించారు. డీఎస్సీ–2025 ప్రక్రియ అంతా పారదర్శకంగానే జరిగిందని మీరు చెబుతున్నప్పుడు, సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు? అంటూ చంద్రబాబును వైఎస్ జగన్ ప్రశ్నించారు. ‘మీరు దీక్షా శిబిరాలను ధ్వంసం చేయవచ్చు.. మీ పోలీసులను, పార్టీ శ్రేణులను ప్రయోగించవచ్చు.. నిరసనకారులను అరెస్టు చేయవచ్చు.. కానీ డీఎస్సీ లీకేజీ, అక్రమాలపై ఆధారాలను మాత్రం చెరిపేయలేరు.నిరుద్యోగ యువతలో రగులుతున్న ఆగ్రహాన్ని అణచి వేయలేరు. ఆంధ్రప్రదేశ్ జెన్–జెడ్ గొంతును మూయలేరు. న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు’ అని స్పష్టం చేశారు. రిలే నిరాహార దీక్ష శిబిరాలపై టీడీపీ ఎమ్మెల్యేలు అనుచరులతో కలిసి చేసిన దాడుల వీడియోలను ట్యాగ్ చేస్తూ శుక్రవారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వైఎస్ జగన్ పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ప్రశ్నించే హక్కు లేకుండా చేస్తారా? ‘‘చంద్రబాబు గారూ.. మీ కుమారుడిని కాపాడుకోవడానికి మీ ప్రభుత్వం ఇంకా ఎంతగా దిగజారుతుంది? నిరుద్యోగ యువతకు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని వారు అడిగితే... దానికి మీరు హింసతో సమాధానం చెప్పాలనుకుంటున్నారా? డీఎస్సీ–2025 ప్రశ్నాపత్రం లీక్, నియామకాల్లో జరిగిన తీవ్రమైన అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాలని కోరుతూ విజయవాడలో శాంతియుతంగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షపై మీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడి చేసి, దీక్షా శిబిరాన్ని ధ్వంసం చేశారు. పోలీసుల కళ్ల ముందే, వారి సమక్షంలోనే టెంట్లు లాగి పడేశారు. మా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుని రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారు. మహిళలపై దాడులకు తెగబడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా శిబిరాలపై నిర్బంధకాండను కొనసాగించారు. చిలకలూరిపేట, కనిగిరి, యాడికి, తాడిపత్రి, పలమనేరు, రేపల్లె, గుంటూరు, పొన్నూరు, వేమూరు, మాచర్ల, గురజాల, కందుకూరు, బాపట్లలో నిరసన శిబిరాలపై దాడులు చేశారు. నాయకులను నిర్బంధించారు. శాంతియుతంగా దీక్షలు చేస్తూ మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును కూడా నిరుద్యోగ యువతకు లేకుండా చేశారు. సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు? నారా లోకేశ్ను బాధ్యత నుంచి తప్పించకుండా మీ ఎమ్మెల్యేలను, పార్టీ శ్రేణులను, పోలీసు యంత్రాంగాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు? డీఎస్సీ–2025 ప్రక్రియ అంతా పారదర్శకంగానే జరిగిందని మీరు చెబుతున్నప్పుడు, సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు? ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కష్టపడి చదివిన యువతకు న్యాయం జరగాలి. నియామకాల్లో జరిగిన అక్రమాలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. ప్రస్తుతం రూ.9,000 కోట్లకు చేరిన విద్యా దీవెన (ఫీజు రీయింబర్స్మెంట్), వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలి. మీ ఎన్నికల మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ హామీ ప్రకారం నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతిని, గత రెండేళ్ల బకాయిలతో సహా వెంటనే చెల్లించాలి. న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదు చంద్రబాబు గారూ.. మీరు దీక్షా శిబిరాలను ధ్వంసం చేయవచ్చు.. మీ పోలీసులను, పార్టీ శ్రేణులను ప్రయోగించవచ్చు.. నిరసనకారులను అరెస్టు చేయవచ్చు.. కానీ డీఎస్సీ లీకేజీ, అక్రమాలపై ఆధారాలను మాత్రం చెరిపేయలేరు. నిరుద్యోగ యువతలో రగులుతున్న ఆగ్రహాన్ని అణచి వేయలేరు. ఆంధ్రప్రదేశ్ జెన్ జెడ్ గొంతు నొక్కలేరు. న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. చేనేత కార్మికుల ప్రతి అడుగులోనూ తోడుగా నిలిచాంజాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు ఐదేళ్లలో రూ.3,706.16 కోట్ల సాయం అందించాం ఆర్థికంగా, సామాజికంగా మద్దతుగా నిలిచాం చేనేత వ్రస్తాలకు దేశ, విదేశాల్లో మార్కెట్.. ఈ కామర్స్ సంస్థలతో ఒప్పందాలు ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి కృషి చేశాం ఎన్నికల హామీలను విస్మరించిన చంద్రబాబు ప్రభుత్వం సాక్షి, అమరావతి: చేనేత అనేది కేవలం ఒక వృత్తి కాదని.. మన సంస్కృతికి, సంప్రదాయానికి, తెలుగువారి కళా నైపుణ్యానికి నిలువెత్తు ప్రతీక అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని నేతన్నలు, చేనేత కళాకారులు, వారి కుటుంబ సభ్యులందరికీ శుక్రవారం ఆయన హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. 2019–24 మధ్య తమ ప్రభుత్వంలో నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపాలని, వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలని ప్రతి అడుగులోనూ అండగా నిలిచామని చెప్పారు. వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ.24 వేల చొప్పున ఐదేళ్లలో రూ.1.20 లక్షలను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు. ఈ ఒక్క పథకం ద్వారానే రూ.969.77 కోట్లు అందించామని, నేతన్నల పింఛన్ల కోసం రూ.1,396.45 కోట్లు, ఆప్కో పాత బకాయిల చెల్లింపునకు రూ.468.84 కోట్లు వెచ్చించామని చెప్పారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా మొత్తంగా రూ.3,706.16 కోట్ల సాయం అందించి నేతన్నలకు ఆర్థికంగా, సామాజికంగా మద్దతుగా నిలిచామన్నారు. చేనేత మగ్గాలకు ఉచిత విద్యుత్, పవర్లూమ్స్కు రాయితీ విద్యుత్ అందించామని తెలిపారు. నేతన్నలు తయారు చేసే వస్త్రాలకు దేశ, విదేశాల్లో మార్కెట్ కల్పించేందుకు ప్రముఖ ఈ కామర్స్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని, వారి ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి కృషి చేశామని చెప్పారు. ఎన్నికల హామీలకు చంద్రబాబు తూట్లు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత రెండేళ్లుగా నేతన్న నేస్తం పథకాన్ని నిలిపి వేసిందని వైఎస్ జగన్ ఆరోపించారు. ఏడాదికి రూ.25 వేలు అందిస్తామన్న ఎన్నికల హామీని అమలు చేయలేదని విమర్శించారు. హ్యాండ్లూమ్స్కు నెలకు 200 యూనిట్లు, పవర్లూమ్స్కు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి, ఆ హామీలను కూడా అమలు చేయలేదన్నారు. 1,03,534 కుటుంబాలకు పథకం వర్తింప జేస్తామని ప్రకటించి, నేడు కేవలం 71,536 కుటుంబాలకు ఇస్తున్నట్లు ప్రకటిస్తున్నారన్నారు. ఆచరణకు వచ్చేసరికి వారిలో ఎంత మందికి ఆ సాయం అందుతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. జీఎస్టీ రీయింబర్స్మెంట్ హామీని కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. నేతన్నల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం, చేనేత రంగ పరిరక్షణ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
అర్ధరాత్రి వరకూ పోలీసుల అదుపులో ఇద్దరు వైఎస్సార్సీపీ నేతలు
శ్రీకాకుళం: ఆమదాలవలసలో అర్ధరాత్రి పోలీసుల చర్యలు కలకలం రేపాయి. వైఎస్సార్సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్పై నమోదైన కేసులో భాగంగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఎఫ్ఐఆర్లో పేర్లు లేని వారిని కూడా విచారణ పేరుతో స్టేషన్కు పిలిపిస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.చింతాడ రవికుమార్ తమ్ముడు చింతాడ కృష్ణ, బొడ్డేపల్లి రమేష్ కుమార్లను సాయంత్రం 5 గంటలకు విచారణకు పిలిచిన పోలీసులు, ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. రాత్రి 12 గంటలు కావస్తున్నా ఇద్దరినీ పోలీసులు విడిచిపెట్టలేదని, పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో పోలీస్ స్టేషన్లోకి స్పెషల్ టాస్క్ఫోర్స్ బృందాలు చేరుకున్నాయి.కృష్ణ, రమేష్ కుమార్లను వేర్వేరు పోలీస్ స్టేషన్లకు తరలించినట్లు సమాచారం. వారిని ఎందుకు అదుపులోకి తీసుకున్నారనే విషయంపై పోలీసులు స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి సమయంలో వైఎస్సార్సీపీ నాయకులు పోలీస్ స్టేషన్ల వద్దకు చేరుకుంటున్నారు. -
ఏపీలో మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజు’
సాక్షి, తాడేపల్లి: ‘‘దిశ”ను ఉపసంహరించుకోవటంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆయన మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. మహిళల భద్రతకు అండగా నిలిచిన ఒక సమగ్ర రక్షణ వ్యవస్థను.. రాజకీయ ఈర్ష్యతో నిర్వీర్యం చేయడం అత్యంత దురదృష్టకరమన్నారు.‘‘మహిళలు, చిన్నారులపై నేరాలు, దర్యాప్తులో జాప్యం, న్యాయ ప్రక్రియలో ఆలస్యం వంటి సమస్యలకు పరిష్కారంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం “దిశ”ను తీసుకొచ్చింది. నేరం జరగకుండా నిరోధించడం నుంచి, నేరం జరిగితే వెంటనే స్పందించడం, బాధితులకు రక్షణ, వేగంగా దర్యాప్తు, ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ, చార్జిషీటు, ప్రత్యేక కోర్టుల ద్వారా సత్వర న్యాయం వరకు ఒక సమగ్ర వ్యవస్థను నిర్మించాం...దిశలో భాగంగా మహిళలు ప్రమాదంలో ఉన్నప్పుడు SOS బటన్ నొక్కినా, ఫోన్ను 5 సార్లు షేక్ చేసినా నిమిషాల వ్యవధిలో పోలీసులు స్పందించే వ్యవస్థ తీసుకొచ్చాం. 1.51 కోట్ల మంది దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. దిశ ద్వారా వచ్చిన 31,607 అత్యవసర కాల్స్ను అప్పట్లో మా ప్రభుత్వంలో పోలీసులు పరిష్కరించారు. 18 ప్రత్యేక మహిళా పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేశాం. ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో మహిళా పోలీసును అందుబాటులోకి తీసుకొచ్చి 13,500 మందితో క్షేత్రస్థాయి భద్రత, రిపోర్టింగ్ వ్యవస్థను నిర్మించాం...900 ద్విచక్ర వాహనాలు, 163 నాలుగు చక్రాల వాహనాలతో ప్రత్యేక పెట్రోలింగ్ ఏర్పాటు చేశాం. నేరస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకునే అవకాశం లేకుండా ఈ కేసుల దర్యాప్తులో శాస్త్రీయ ఆధారాలకు ప్రాధాన్యం ఇస్తూ ఆరు నగరాల్లో ఫోరెన్సిక్ వ్యవస్థను బలోపేతం చేశాం. సత్వర విచారణ కోసం 13 ప్రత్యేక POCSO కోర్టులు, 12 మహిళా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశాం. 2,17,467 మంది లైంగిక నేరస్తుల వివరాలతో ప్రత్యేక డేటాబేస్ను రూపొందించాం. అందుకనే దిశ విజయవంతగా మహిళలకు, చిన్నారులకు గొప్ప భద్రతా సేవలను అదించింది’’ అని వైఎస్ జగన్ వివరించారు.‘‘2017లో మహిళలపై నేరాల దర్యాప్తుకు సగటున 156 రోజులు పట్టగా, 2022 నాటికి అది 28 రోజులకు తగ్గించగలిగారు. 164 అత్యాచారం కేసులు, 378 లైంగిక నేరాల కేసుల్లో కేవలం 7 రోజుల్లోనే ఛార్జిషీట్లు దాఖలు చేశారు. తీవ్రమైన కేసుల్లో 51 శాతానికిపైగా నిందితులను 48 గంటల్లోపు అరెస్టు చేశారు. గతంలో డీఎన్ఏ నివేదికలకు నెలలు పట్టేది. దిశ ఫోరెన్సిక్ వ్యవస్థతో వాటిని రోజుల్లోనే అందించే పరిస్థితి తీసుకొచ్చాం. 214 కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయి. మే 2024 నాటికి మహిళలపై నేరాలు 27 శాతం తగ్గాయి. వార్షిక సగటు కేసులు 14,338 నుంచి 10,426కు తగ్గాయి...ఇదీ దిశ ఇచ్చిన భరోసా. ఇవీ దిశ సాధించిన ఫలితాలు. అందుకే 19జాతీయ అవార్డులను మా ప్రభుత్వ హయాంలో “దిశ’’ గెలుచుకుంది. “దిశ” అనేది కాగితాల మీదున్న పేరు కాదు. ప్రమాదంలో ఉన్న మహిళ SOS నొక్కిన క్షణం నుంచి, నిందితుడికి శిక్ష పడే వరకు ఆమెకు అండగా ఉండే సజీవమైన మహిళా రక్షణ నెట్వర్క్. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం “BNS (భారతీయ న్యాయ సంహిత) చాలు, దిశ అవసరం లేదు” అంటోంది. మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన SOS వ్యవస్థ, ప్రత్యేక మహిళా పోలీస్స్టేషన్లు, గ్రామ స్థాయి నుంచే మహిళా పోలీసులు, ప్రత్యేక పెట్రోలింగ్, లైంగిక నేరస్తుల డేటాబేస్, వేగవంతమైన ఫోరెన్సిక్ వ్యవస్థ, ప్రత్యేక ప్రాసిక్యూషన్, ప్రత్యేక కోర్టులు, నిర్ణీత సమయంలో దర్యాప్తు! న్యాయం అనే లక్ష్యానికి BNS ప్రత్యామ్నాయం ఎలా అవుతుంది?“దిశ”ను ఉపసంహరించుకుంటూ చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్లో మహిళలు, చిన్నారులకు ఒక చీకటి రోజు. మహిళల భద్రతకు అండగా నిలిచిన ఒక సమగ్ర రక్షణ వ్యవస్థను రాజకీయ ఈర్ష్యతో నిర్వీర్యం చేయడం అత్యంత దురదృష్టకరం.మహిళలు, చిన్నారులపై నేరాలు, దర్యాప్తులో జాప్యం,… pic.twitter.com/cF3dc8uSpT— YS Jagan Mohan Reddy (@ysjagan) August 7, 2026..మహిళలు, చిన్నారులపై తీవ్రమైన దారుణాలు జరిగినప్పుడు 7 పని రోజుల్లో పోలీసు దర్యాప్తు, ఛార్జ్షీట్ దాఖలైన తర్వాత 14 పని రోజుల్లో కోర్టు విచారణ పూర్తి చేసేలా దిశ ద్వారా తీసుకొచ్చిన ప్రభుత్వం కూడా వైయస్సార్సీపీదే. 21 రోజుల్లోగా బాధితులకు న్యాయం అందించాలన్న అలాంటి లక్ష్యాన్ని కూడా ఈ ప్రభుత్వం విమర్శించడం మరింత బాధాకరం. ఆ లక్ష్యం వెనుక ఉద్దేశం ఒక్కటే, దర్యాప్తులో జాప్యం ఉండకూడదు. విచారణలో ఆలస్యం ఉండకూడదు. మహిళలు, చిన్నారులపై నేరాలను అత్యంత ప్రాధాన్యతతో వేగంగా విచారించాలి. నేరం చేస్తే చట్టం వేగంగా, కఠినంగా స్పందిస్తుందనే భయం నేరస్తుల్లో ఉండాలి. అలాంటి వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సింది పోయి.. వేగంగా న్యాయం అందించాలనే లక్ష్యాన్నే తప్పుపట్టడం మహిళలకు ఏ సందేశం పంపుతోంది?..మహిళలు, చిన్నారులకు సకాలంలో న్యాయం జరగాలని కోరుకోవడమే ఈ ప్రభుత్వానికి అభ్యంతరమా?. “దిశ”ను ఉపసంహరించుకోవడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం నేరస్తుల్లో చట్టంపై ఉన్న భయాన్ని తగ్గిస్తోంది. బాధిత మహిళల్లో ప్రభుత్వంపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీస్తోంది. మహిళలు తమ రక్షణ కవచంగా భావించిన వ్యవస్థను లేకుండా చేస్తోంది. మంత్రివర్గం ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి. దిశను రద్దు చేయడం కాదు.. రక్షించాలి. దిశను నిర్వీర్యం చేయడం కాదు.. మరింత బలోపేతం చేయాలి’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. -
మల్లాది విష్ణు టెంట్ వేసి దీక్ష చేస్తున్నాడు ... దమ్ముంటే ఈరోజు వెళ్లు.. బోండా ఉమాకు పేర్శినాని వార్నింగ్
-
‘అరాచక బ్యాచ్లన్నీ చంద్రబాబు చెంతనే ఉన్నాయి’
తాడేపల్లి : చంద్రబాబు పాలనలో ఏపీ సర్వం భ్రష్టు పట్టిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకట్రెడ్డి ధ్వజమెత్తారు. అన్ని రకాల అరాచక బ్యాచ్లన్నీ చంద్రబాబు చెంతనే ఉన్నాయని, అలాంటి చంద్రబాబు తమపై విమర్శలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈరోజు(శుక్రవారం, ఆగస్టు 7వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడని కారుమూరి.. చేనేతలకు వైఎస్ జగన్ ఐదేళ్ల పాటు రూ. 24వేలు చొప్పున ఇస్తే.. చంద్రబాబు రెండేళ్లుగా ఎగ్గొట్టి ఇప్పుడు డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. ‘మొత్తం రూ.75 వేలు చొప్పున చేనేతలకు చంద్రబాబు బకాయి పడ్డారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేశామని చెప్పటం సిగ్గుచేటు. కుప్పం వెళ్లి ఎవర్ని అడిగినా సూపర్ సిక్స్ అమలయ్యాయో లేదో చెప్తారు. లేదా మంగళగిరి వెళ్లి అడగినా జనమే సరైన సమాధానం చెప్తారు. రోడ్లన్నీ అద్దాల్లాగ మార్చేశామని పచ్చి అబద్దాలు చెప్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో రోడ్లు ఎలా ఉన్నాయో చూస్తే వాస్తవం తెలుస్తుంది. చంద్రబాబు అరాచకం తట్టుకోలేక పరిశ్రమలు పారిపోతున్నాయి. రూ.6వేల కోట్ల పెట్టబడి వస్తే రూ.23 లక్షల కోట్ల పెట్టుబడి వచ్చిందంటూ నిస్సిగ్గుగా చెప్తున్నారు. గోదావరి పుష్కరాలు వస్తున్నాయంటే జనం భయపడి పోతున్నారు. విశాఖలో మత్స్యకారులు చనిపోతే చంద్రబాబు ఎందుకు పరామర్శించలేదు?, డీఎస్సీలో ఉద్యోగాలు అమ్ముకున్నారు. జెన్ జీ ని గొడ్డలి బ్యాచ్ అని, గంజాయి బ్యాచ్ అంటూ కించపరచటం దుర్మార్గం. చంద్రబాబు అహంకారపు మాటలను జెన్ జీ గ్రహిస్తూనే ఉంది. టీడీపీలో మట్టిబ్యాచ్, నకిలీ మద్యం బ్యాచ్, వెన్నుపోటు బ్యాచ్, భార్యల చీరలు చించే గలీజు బ్యాచ్, చికెన్ షాపులో కమీషన్లు కొట్టేసే బ్యాచ్.. ఇలాంటి బ్యాచులన్నీ ఉన్నాయి. ఆ బ్యాచ్లన్నిటికీ చంద్రబాబే హెడ్. డ్రగ్స్ తీసుకుని పార్లమెంటుకి వెళ్లే బ్యాచ్ కూడా చంద్రబాబు దగ్గరే ఉంది.చంద్రబాబు పేరుకే ముఖ్యమంత్రి. కానీ ఏ ఒక్క సమస్య నూ పరిష్కారం చేయటం లేదు. అందుకే జనం జగన్ దగ్గరకు వస్తున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత చంద్రబాబు, లోకేష్ రాష్ట్రం వదిలి వెళ్లకుండా ఉండాలి. హోంమంత్రి అనిత డమ్మీ మంత్రి. ఒక్క కానిస్టేబుల్ను కూడా ట్రాన్సఫర్ చేయించుకోలేని హోంమంత్రి ఆమె. అలాంటి హోంమంత్రి మాటలకు విలువ లేదు. పవన్ కళ్యాణ్కు క్యాబినెట్ అంటే లెక్క లేదు. అందుకే పదేపదే క్యాబినెట్ సమావేశాలకు ఎగ్గొడుతున్నారు. ఎన్ఆర్ఐ మహిళను వేధించిన మంత్రిపై ఏం చర్యలు తీసుకున్నారు?’ అని నిలదీశారు. -
ఏంటి అరుస్తున్నావ్..! SIకి ఇచ్చిపడేసిన మార్గాన్ని భారత్
-
జగన్ పర్యటనతో మాకు ఏ నష్టం జరగలేదు.. బయటపెట్టిన హోటల్ ఓనర్ లక్ష్మి
-
పోలీసుల ఓవరాక్షన్ చిలకలూరిపేటలో ఉద్రిక్తత విడదల రజినిని అడ్డుకుని....
-
YSRCP దీక్షా శిబిరాలపై దాడులు.. AP Gen Z గొంతు మూయలేరు
-
Gen Z పై చంద్రబాబు సంచలన కామెంట్స్ ఇక మీకు చుక్కలే...
-
హోంమంత్రి అనితకు పుష్ప శ్రీ వాణి నాన్ స్టాప్ కోటింగ్
-
ఎన్ని దాడులు చేస్తారో చేసుకోండి... మీకు ఈ రెండేళ్లే టైం...
-
వైఎస్సార్సీపీ దీక్షా శిబిరాలపై దాడులు.. వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ దీక్షా శిబిరాల మీద దాడుల పట్ల ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ ఘటనపై తీవ్రంగా మండిపడ్డారు. దాడుల వీడియోను ఎక్స్లో పోస్టు చేసిన వైఎస్ జగన్.. చంద్రబాబూ మీ కుమారుడిని కాపాడుకోవడానికి మీ ప్రభుత్వం ఇంకా ఎంత దిగజారుతుంది? అంటూ నిలదీశారు. నిరుద్యోగ యువతకు, వారికి మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగితే… దానికి మీరు హింసతో సమాధానం చెప్పాలనుకుంటున్నారా? అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.‘‘డీఎస్సీ-2025 ప్రశ్నాపత్రం లీక్, నియామకాల్లో జరిగిన తీవ్రమైన అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాలని కోరుతూ విజయవాడలో శాంతియుతంగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షపై మీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడి చేసి, దీక్షా శిబిరాన్ని ధ్వంసం చేశారు. పోలీసుల కళ్లముందే, వారి సమక్షంలోనే టెంట్లు లాగిపడేశారు. మా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుని రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారు. మహిళలపై దాడులకు తెగబడ్డారు...రాష్ట్రవ్యాప్తంగా దీక్షా శిబిరాలపై నిర్బంధకాండను కొనసాగించారు. చిలకలూరిపేట, కనిగిరి, యాడికి, తాడిపత్రి నుంచి పలమనేరు, రేపల్లె, గుంటూరు, పొన్నూరు, వేమూరు, మాచర్ల, గురజాల, కందుకూరు, బాపట్ల వరకు నిరసన శిబిరాలపై దాడులు చేశారు. నాయకులను నిర్బంధించారు. శాంతియుతంగా దీక్షలు చేస్తూ మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును కూడా నిరుద్యోగ యువతకు లేకుండా చేశారు. నారా లోకేష్ను బాధ్యత నుంచి తప్పించడానికి మీ ఎమ్మెల్యేలను, పార్టీ శ్రేణులను, పోలీసు యంత్రాంగాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు?’’ అంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు.‘‘డీఎస్సీ –2025 ప్రక్రియ అంతా పారదర్శకంగానే జరిగిందని మీరు చెబుతున్నప్పుడు, సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు?. ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కష్టపడి చదివిన యువతకు న్యాయం జరగాలి. నియామకాల్లో జరిగిన అక్రమాలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. ప్రస్తుతం రూ.9,000 కోట్లకు చేరిన పెండింగ్ విద్యా దీవెన (ఫీజు రీయింబర్స్మెంట్), వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలి. మీ ఎన్నికల మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ హామీ ప్రకారం నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతిని, గత రెండేళ్ల బకాయిలతో సహా వెంటనే చెల్లించాలి...చంద్రబాబూ.. మీరు దీక్షా శిబిరాలను ధ్వంసం చేయవచ్చు. మీ పోలీసులను, పార్టీ శ్రేణులను ప్రయోగించవచ్చు. నిరసనకారులను అరెస్టు చేయవచ్చు. కానీ డీఎస్సీ లీకేజీ, అక్రమాలపై ఆధారాలను చెరిపేయలేరు. నిరుద్యోగ యువతలో రగులుతున్న ఆగ్రహాన్ని అణచివేయలేరు. ఆంధ్రప్రదేశ్ జెన్ జీ గొంతును మూయలేరు. న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.@ncbn గారూ, మీ కుమారుడిని కాపాడుకోవడానికి మీ ప్రభుత్వం ఇంకా ఎంత దిగజారుతుంది? నిరుద్యోగ యువతకు, వారికి మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగితే… దానికి మీరు హింసతో సమాధానం చెప్పాలనుకుంటున్నారా?#DSC2025 ప్రశ్నాపత్రం లీక్, నియామకాల్లో జరిగిన తీవ్రమైన అక్రమాలపై సీబీఐతో విచారణ… pic.twitter.com/SbndqNaPsD— YS Jagan Mohan Reddy (@ysjagan) August 7, 2026 -
ఇంతకంటే దారుణం ఉంటుందా?: దేవినేని అవినాష్
సాక్షి, విజయవాడ: డిఎస్పీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని.. యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని వైఎస్సార్సీపీ రెండో రోజు రిలే నిరహార దీక్ష చేపట్టింది. ఆటోనగర్లో రిలే నిరాహార దీక్ష చేసిన వైఎస్సార్సీపీ నేతలు.. నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. మోసపోయిన డిఎస్పీ అభ్యర్థులకు న్యాయం కోసం పోరాటం చేస్తున్నామన్నారు.‘‘యువతను కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. పోలీసుల పర్మిషన్ తీసుకుని శాంతియుత కార్యక్రమం చేస్తున్నాం. రెండు రోజుల ముందు పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. ఈ రోజు ఉదయం 100 మంది పోలీసులు వచ్చి మా టెంట్ పీకేశారు.. గీత గీసి ముందుకు రాకూడదని ఏసీపీ అంటున్నారు. భారతదేశంలో ఉన్నామా? ఏ కాలంలో ఉన్నాం. భారత రాజ్యాంగం ఏపీలో నడవడం లేదు. చంద్రబాబు, లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది’’ అంటూ దేవినేని అవినాష్ మండిపడ్డారు...మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై కోడి గుడ్లతో దాడి చేశారు. టమోటాలతో దాడి చేశారు. టీడీపీ కార్యకర్తలు బాటిల్లో యూరిన్ పోసి దాడి చేశారు. ఇంతకంటే దారుణం ఉంటుందా?. దమ్ముంటే సీబీఐ ఎంక్వయిరీ వేయండి. నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్మెంట్పై స్పందించండి. రాత్రి అయిన తరువాత పగలు వస్తుంది.. మరో మూడేళ్లు మాత్రమే టీడీపీ అధికారంలో ఉండేది. నిరుద్యోగ యువత, విద్యార్థుల కోసం ప్రతి నియోజకవర్గంలో ర్యాలీలు చేస్తాం’’ అని దేవినేని అవినాష్ పేర్కొన్నారు. -
గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద YS జగన్
-
రాష్ట్రమంతటా రౌడీ రాజ్యంపై YSRCP రిలే నిరాహార దీక్షలు
-
వెకిలి నవ్వు నవ్వడానికి సిగ్గులేదా.. అనితపై వరుడు కళ్యాణి ఫైర్
-
దగా DSCపై YSRCP రిలే నిరాహార దీక్ష
-
నువ్వు ఇంట్లో మమ్మీ.. హోమ్ మినిస్టర్ గా డమ్మీ..
-
YSRCP శిబిరాన్ని తొలగించిన కూటమి
-
నేతన్నకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: నేడు జాతీయ చేనేత దినోత్సవం. ఈ సందర్భంగా రాష్ట్రంలోని నేతన్నలు, చేనేత కళాకారులు, వారి కుటుంబ సభ్యులందరికీ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. చేనేత అనేది కేవలం ఒక వృత్తి కాదు. మన సంస్కృతికి, సంప్రదాయానికి, తెలుగు వారి కళా నైపుణ్యానికి నిలువెత్తు ప్రతీక వ్యాఖ్యానించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘చేనేత అనేది కేవలం ఒక వృత్తి కాదు. మన సంస్కృతికి, సంప్రదాయానికి, తెలుగు వారి కళా నైపుణ్యానికి నిలువెత్తు ప్రతీక. అందుకే 2019-24 మధ్య మా ప్రభుత్వంలో నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపాలని, వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలని ప్రతి అడుగులోనూ వారికి అండగా నిలిచాం.వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ.24 వేల చొప్పున ఐదేళ్లలో రూ.1.20 లక్షలను నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేశాం. ఈ ఒక్క పథకం ద్వారానే రూ.969.77 కోట్లు అందించాం. నేతన్నల పింఛన్ల కోసం రూ.1,396.45 కోట్లు, ఆప్కో పాత బకాయిల చెల్లింపునకు రూ.468.84 కోట్లు వెచ్చించాం. వివిధ సంక్షేమ పథకాల ద్వారా మొత్తంగా రూ.3,706.16 కోట్ల సాయం అందించి నేతన్నలకు ఆర్థికంగా, సామాజికంగా మద్దతుగా నిలిచాం.జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని నేతన్నలు, చేనేత కళాకారులు, వారి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.చేనేత అనేది కేవలం ఒక వృత్తి కాదు. మన సంస్కృతికి, సంప్రదాయానికి, తెలుగు వారి కళా నైపుణ్యానికి నిలువెత్తు ప్రతీక. అందుకే 2019-24 మధ్య మా ప్రభుత్వంలో నేతన్నల…— YS Jagan Mohan Reddy (@ysjagan) August 7, 2026చేనేత మగ్గాలకు ఉచిత విద్యుత్, పవర్లూమ్స్కు రాయితీ విద్యుత్ అందించాం. నేతన్నలు తయారుచేసే వస్త్రాలకు దేశ, విదేశాల్లో మార్కెట్ కల్పించేందుకు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని, వారి ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి కృషి చేశాం.కానీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్ల పాటు నేతన్న నేస్తాన్ని నిలిపివేసింది. ఏడాదికి రూ.25 వేలు అందిస్తామన్న ఎన్నికల హామీని గాలికొదిలేసింది.హ్యాండ్లూమ్స్కు నెలకు 200 యూనిట్లు, పవర్లూమ్స్కు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి వాటినీ గాలికి వదిలేసింది. 1,03,534 కుటుంబాలకు పథకం వర్తింపజేస్తామని ప్రకటించి, ఇప్పుడు కేవలం 71,536 కుటుంబాలకు ఇస్తున్నట్లుగా ప్రకటనలు చేస్తోంది. చివరికి వారిలో ఎంతమందికి అందుతుందో చూడాలి. జీఎస్టీ రీయింబర్స్మెంట్ హామీని కూడా అమలు చేయడం లేదు. నేతన్నల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం, చేనేత రంగ పరిరక్షణ కోసం వైఎస్సార్సీపీ ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుందని మాట ఇస్తూ మరొక్కసారి మీ అందరికీ శుభాకాంక్షలు’ అని పోస్టు చేశారు. -
విజయవాడ వెస్ట్లో ఉద్రిక్తత.. బుద్ధా వెంకన్న అనుచరుల హల్చల్
సాక్షి, విజయవాడ: విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్సీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్ష కార్యక్రమం వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. శాంతియుతంగా జరుగుతున్న నిరసనను భంగపరిచేందుకు టీడీపీ నేతలు అక్కడికి చేరుకుని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్ష కార్యక్రమం వద్దకు టీడీపీ నేత బుద్ధా వెంకన్న అనుచరులు చేరుకుని నినాదాలు చేశారు. శాంతియుతంగా జరుగుతున్న నిరసనను భంగపరిచేందుకు, వైఎస్సార్సీపీ శ్రేణులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. మళ్లీ గొడవలు సృష్ఠించేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు అప్రమత్తమై పరిస్థితిని పర్యవేక్షించారు. -
ఏపీలో కొనసాగుతున్న టీడీపీ రాక్షస క్రీడ
సాక్షి, అమరావతి: డీఎస్సీ అవకతవకలపై వైఎస్సార్సీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కూటమి ప్రభుత్వానికి వణుకు పుట్టిస్తున్నాయి. నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేశ్ రాజీనామా చేయాలని, అలాగే సీబీఐతో దర్యాప్తు చేయించాలనే డిమాండ్లకు ఇటు డీఎస్సీ అభ్యర్థులు, సంఘాలు కూడా మద్దతు ప్రకటిస్తున్నాయి. దీంతో కూటమి పెద్దలు ఏం చేయాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో దుష్ట రాజకీయానికి తెర తీశారు. ఏపీవ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో.. ఇవాళ రెండో రోజు కూడా పలు చోట్ల దీక్షను భగ్నం చేసే కుట్రలు కొనసాగుతున్నాయి. ఓవైపు పోలీసుల రూపంలో ఆటంకాలు కలిగిస్తున్న కూటమి ప్రభుత్వం.. మరోవైపు టీడీపీ గూండాలతో దౌర్జన్యకాండకు దిగుతోంది. ఈ రాక్షస క్రీడపై వైఎస్సార్సీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. డీఎస్సీ వ్యవహారంపై దెందులూరు నియోజకవర్గం మాదేపల్లిలో వైఎస్సార్సీపీ రిలే నిరాహార దీక్ష చేపట్టింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిని పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పటికే పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారని ఆ పార్టీ నేతలు తెలిపారు. మాదేపల్లిలో ఏర్పాటు చేసిన దీక్షా టెంట్ను టీడీపీ గూండాలు తొలగించారని తెలుస్తోంది. ఆపై వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించగా.. అబ్బయ్య చౌదరి నేలపై బైఠాయించి నిరసన కొనసాగించారు.తునిలో ఎండలోనే దీక్షలుకాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న రిలే దీక్షల టెంట్లను పోలీసులు తొలగించారు. రాత్రి కార్పొరేషన్ బ్యాంక్ సమీపంలో ఏర్పాటు చేసిన టెంట్ను, అనంతరం ఉదయం జియో కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మరో టెంట్ను తొలగించినట్లు తెలిపింది. టీడీపీ నేతల సూచనతోనే పోలీసులు ఈ పని చేశారని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. అయితే టెంట్లు తొలగించినా వెనక్కి తగ్గేది లేదని వైఎస్సార్సీపీ శ్రేణులు స్పష్టం చేశాయి. ఎండలోనే బైఠాయించి తమ నిరసన కొనసాగిస్తున్నారు.విజయవాడ వెస్ట్లో ఉద్రిక్తత!విజయవాడ వెస్ట్లో వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న రిలే దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ నేత బుద్ధా వెంకన్న దీక్షా ప్రదేశానికి చేరుకుని వైఎస్సార్సీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా నినాదాలు చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న కార్యకర్తలను రెచ్చగొట్టి గొడవ సృష్టించే ప్రయత్నం చేశారు. నిన్న మల్లాది విష్ణు ఆధ్వర్యంలో జరిగిన దీక్ష వద్ద కూడా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నది తెలిసిందే. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా అక్కడికి రావడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. మహిళలపై దాడులు జరగ్గా.. బోండా అనుచరుడు ఒకడు జుగుప్పాసకంగా వ్యవహరించాడు. మహిళా జర్నలిస్టుల మీద దాడి జరుగుతున్నా కూడా.. పోలీసులు చూస్తూ ఉండిపోయారు.కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా.. టీడీపీ శ్రేణులు ఎంత బరితెగించినా వైఎస్సార్సీపీ శ్రేణులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవినీతి, అవకతకవలకు నారా లోకేశ్ కచ్చితంగా రాజీనామా చేయాలని, జాతీయ దర్యాప్తు సంస్థతో ఈ వ్యవహారంపై విచారణ జరిపించాల్సిందేనని పట్టుబడుతోంది. -
ప్రశ్నిస్తే కేసులు.. డీఎస్సీపై శ్వేతపత్రం ఎక్కడ?: అబ్బయ్య చౌదరి
సాక్షి, ఏలూరు: డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతును నొక్కే ప్రయత్నం జరుగుతోందని, ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగ నియామకాల్లో పూర్తి పారదర్శకత ఉండాలని సూచించారు.మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తాజాగా మాట్లాడుతూ.. డీఎస్సీ పరీక్ష ప్రశ్నపత్రాలను స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ (SCERT) ద్వారా రూపొందించారని, వాటిని ఆన్లైన్లో అందుబాటులోకి తెచ్చింది కూడా అదే సంస్థేనని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో అక్కడే పనిచేస్తున్న ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగికి మెరిట్ జాబితాలో తొలి ర్యాంకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. దీనివల్ల ప్రశ్నాపత్రం లీకైందనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని అన్నారు.ఏళ్ల తరబడి కష్టపడి చదివిన నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకపోగా, యువగళం పాదయాత్రలో నారా లోకేష్ వెంట నడిచిన వారికి స్పోర్ట్స్ కోటా పేరుతో ఉద్యోగాలు ఇచ్చారంటూ ఆరోపించారు. ఇంటర్ కాలేజీ, ఇంటర్ స్టేట్ స్థాయి పోటీల్లో పాల్గొన్న వారికి కూడా డీఎస్సీలో ఉద్యోగాలు ఇచ్చారని, ఇందుకోసం ప్రభుత్వ ఉత్తర్వులు (జీవోలు) సైతం మార్చారని విమర్శించారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అంశాలపై కూటమి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసిన ఆయన రూ.15 లక్షలు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తామని ఫోన్, వీడియో కాల్ సంభాషణలు జరిగాయా లేదా అనే అంశంపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.రాష్ట్రంలో ఒక్క నిరుద్యోగికి అన్యాయం జరిగినా ప్రతిపక్షంగా వారి తరఫున గళం వినిపిస్తాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సచివాలయ వ్యవస్థ ద్వారా 1.20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని, ఆ నియామకాల్లో ఎక్కడైనా అవినీతి జరిగిందా అని ప్రశ్నించారు. ఉద్యోగ నియామకాల్లో పూర్తి పారదర్శకత ఉండాలని సూచించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తమపై కేసులు నమోదు చేస్తున్నారని, ఇంటి వద్ద సమావేశం నిర్వహించుకున్నా సెక్షన్ 30, 144 అమలు చేస్తున్నారని ఆరోపించారు. దెందులూరులో నిరసనలు ఎక్కడ నిర్వహించాలో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.విజయవాడలో జరిగిన ఘటన దారుణమని వ్యాఖ్యానించిన అబ్బయ్య చౌదరి, బోండా ఉమా అనుచరులు రౌడీయిజానికి పాల్పడ్డారని ఆరోపించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలు జరిగి ఉంటే అప్పటి ప్రతిపక్షం ధర్నాలు చేసేదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తే ప్రతిపక్షంగా తాము కూడా అభినందిస్తామని ఆయన అన్నారు. -
అమిత్ షాను కలిసిన YSRCP ఎంపీలు.. జగన్ భద్రత, DSC అంశంపై ఫిర్యాదు
-
దీక్ష శిబిరంపై మూత్రం.. పచ్చ గుండాల వికృత చేష్టలు
-
పల్నాడులో YSRCP నేత దారుణ హత్య
-
అసలు దాడి ఎలా చేసారంటే..! మీ కేసులకు, దాడులకు తగ్గేదేలే.. బోండా ఉమాపై మల్లాది విష్ణు ఫైర్
-
బరితెగించిన లోకేష్ గూండాలు.. వీడియోలో అడ్డంగా దొరికిపోయారు..
-
పచ్చ బ్యాచ్ రౌడీయిజం
సాక్షి, అమరావతి, సాక్షి, నెట్వర్క్: ప్రజాస్వామ్యం పట్టపగలే ఖూనీ అయింది.. అధికార మదంతో అత్యంత దుర్మార్గంగా వ్యవహరించారు... ఉన్మాదంతో నీచాతి నీచానికి ఒడిగట్టారు... మునుపెన్నడూ లేనివిధంగా నిరసన శిబిరాలపై పాశవిక దాడులకు తెగబడి, దారుణ ఘటనకు పురిగొల్పి విష సంస్కృతికి తెర తీశారు. మహాత్ముడు జన్మించిన దేశంలో నిరసన తెలియ చేయడం ప్రజల ప్రజాస్వామ్య హక్కు. అలాంటి హక్కును కిరాతకంగా కాలరాశారు. నిరసన శిబిరాలపై దాడులకు తెగబడి దౌర్జన్యం చేయడం.. విజయవాడలో ఏకంగా బాటిల్లో మూత్రం తీసుకొచ్చి పైశాచికంగా శిబిరంలో ఉన్నవారిపై చల్లడం.. నడిరోడ్డుపై రౌడీయిజానికి దిగడం.. కానీ దెబ్బలు తిన్నవారిపైనే పోలీసులు తిరిగి కేసులు పెట్టడం.. నిజంగా ఇది రాష్ట్ర చరిత్రలో బ్లాక్ డే! ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, వసతి దీవెన బకాయిలు వెంటనే విడుదల చేయడం.. యువతకు రెండేళ్లుగా ఎగ్గొడుతున్న నిరుద్యోగ భృతి చెల్లించడం.. మెగా డీఎస్సీ 2025 స్కామ్పై సీబీఐతో విచారణ.. ఈ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలనే డిమాండ్లతో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన శాంతియుత ఆందోళనలపై చంద్రబాబు సర్కారు దమనకాండకు పాల్పడింది. మెగా డీఎస్సీ పేపర్ లీక్, స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు, అర్హులను వెనక్కి నెట్టి పోస్టులను అమ్ముకోవటాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 6వతేదీ నుంచి 9 వరకు రిలే నిరాహార దీక్షలకు పిలుపునిచ్చింది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో జెన్జీ యువత పెద్ద ఎత్తున తరలి వచ్చి ఉద్యమిస్తోంది. దగా పడిన డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగ యువత, పార్టీ యువజన–విద్యార్థి విభాగాలు ఇందులో పాల్గొంటున్నాయి. ఉద్యమం తీవ్రరూపం దాలుస్తుండటంతో తన కుమారుడి రాజకీయ భవిత అంధకారంలో పడుతుందని బెంబేలెత్తిన సీఎం చంద్రబాబు టీడీపీ శ్రేణులు, పోలీసులను రంగంలోకి దించారు. ఖాకీల అండతో పచ్చమూకలు విచ్చలవిడిగా వ్యవహరించాయి. పలు ప్రాంతాల్లో నేరుగా శిబిరాల వద్దకు చేరుకుని వీరంగం సృష్టించాయి. రెడ్బుక్ రాజ్యాంగం అమలులో నిమగ్నమైన పోలీసులు ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యారు. శాంతియుత ఆందోళనలను అడ్డుకోవడం, ప్రజాస్వామ్య హక్కులను చంద్రబాబు సర్కారు కాలరాయడంపై యువత మండిపడుతోంది. వైఎస్సార్సీపీ చేపట్టిన రిలే దీక్షలను భగ్నం చేసేందుకు యత్నించడంతో రాష్ట్రంలో పలుచోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. దీక్షా శిబిరం వద్ద ఏర్పాటు చేసిన టెంట్లు పీకేస్తున్న టీడీపీ మూకలు బ్రాహ్మణనేత మల్లాది శిబిరంపై కోడిగుడ్లు విసిరి.. మూత్రం పోసి!బ్రాహ్మణనేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడలో పాల్గొన్న నిరసన దీక్ష శిబిరంపై కోడిగుడ్లు, రాళ్లు, టమాటాలు విసిరిన పచ్చమూక అంతటితో ఆగకుండా అత్యంత దారుణంగా మూత్రం పోసి రెచ్చిపోయాయి. టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు స్వయంగా దీన్ని పర్యవేక్షించడం గమనార్హం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని ముత్యాలంపాడు గవర్నమెంట్ ప్రెస్ వద్ద మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో రిలే దీక్షా శిబిరం ఏర్పాటైంది. గురువారం ఉదయం 10 గంటల సమయంలో అక్కడకు చేరుకున్న టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ తన అనుచరులతో కలసి దుర్భాషలకు దిగారు. టెంట్ వేసి ధర్నాలు చేయడం ఏమిటి..? లోకేశ్, చంద్రబాబును తిడితే తోలు తీస్తామంటూ ఎమ్మెల్యే బొండా టెంట్ పీకేయడంతో ఆయన వెంట వచ్చిన అనుచరులు మరింత చెలరేగిపోయారు. రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలతో శిబిరంలో ఉన్నవారిపై దాడి చేశారు. ముందుగానే బాటిల్లో తెచ్చుకున్న మూత్రాన్ని శిబిరంలో ఉన్నవారిపై చల్లి భీతావహ పరిస్థితి సృష్టించారు. మహిళా కార్యకర్తలపై కూడా దాడి చేశారు. ఇంత జరుగుతున్నా అక్కడే ఉన్న పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారే గానీ టీడీపీ మూకలను నిలువరించే యత్నం చేయలేదు. ఓ మహిళా కార్యకర్త టీడీపీ జెండా కర్రతో మల్లాది విష్ణు చేతిపై దాడి చేసింది. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును పోలీసులు బలవంతంగా వ్యాన్లోకి ఎక్కించి ధర్నా చౌక్కు తరలించడంతో అందులో కూర్చునే సాయంత్రం వరకు నిరసన తెలిపారు.టీడీపీ మూకల దాడిపై వైఎస్సార్సీపీ నిరసన..టీడీపీ మూకల దాడిని నిరసిస్తూ ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్కుమార్, ఎండీ రుహుల్లా, నగర మాజీ డిప్యూటీ మేయర్ అవుతూ శైలజ, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అసిఫ్ తదితరులు విజయవాడ ధర్నా చౌక్లో రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. శాంతియుత ఆందోళనకు ముందుగానే పోలీసుల అనుమతి తీసుకున్నామని, అయినప్పటికీ టీడీపీ మూకల నుంచి భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లాది విష్ణు శిబిరంపై దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ శ్రేణులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాబును కలిసిన మర్నాడే బొండా బరి తెగింపు..సీఎం చంద్రబాబు వద్దకు తన కుమారులను వెంటబెట్టుకుని వెళ్లిన మరుసటి రోజే ఎమ్మెల్యే బొండా ఉమ ఈ దమనకాండకు తెగబడటం గమనార్హం. తన కుమారుడు లోకేశ్ రాజకీయ జీవితాన్ని రక్షించుకునేందుకే బొండాను ఉసిగొల్పినట్లు స్పష్టమవుతోంది. పలు సందర్భాల్లో కాపు నేతలనే చంద్రబాబు పావులుగా వాడుకుంటున్నారు. గతంలో గుడివాడ, మాచర్ల ఘటనల్లోనూ బొండా ఉమను పంపి దాడులకు పురిగొల్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. యూట్యూబర్ రావణ్పై నమోదైన కేసులన్నీ జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల పరిధిలోనే ఉండటం గమనార్హం. చంద్రబాబు తన రాజకీయ కుతంత్రంతో కాపు యువతను వాడుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.⇒ గుంటూరు, మాచర్ల, గురజాల, కందుకూరు, తాడిపత్రి, బాపట్ల తదితర ప్రాంతాల్లో దీక్షా శిబిరాలను పోలీసులు బలవంతంగా తొలగించారు. వైఎస్సార్సీపీ నేతలను నిర్బంధించి దీక్షలను అడ్డుకునే యత్నం చేశారు. మాచర్ల, గురజాలలో పోలీసుల ఓవరాక్షన్పై వైఎస్సార్సీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. మాచర్లలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన సొంత స్థలంలో ఏర్పాటు చేసుకున్న నిరసన దీక్ష టెంట్ వద్దకు చేరుకున్న పోలీసులు బెదిరింపులకు దిగారు. దీక్షలు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించగా.. అక్రమ కేసులకు భయపడేది లేదని పిన్నెల్లి తేల్చి చెప్పారు. అన్నమయ్య జిల్లా పుంగనూరులో రిలే దీక్షల్లో పాల్గొన్న మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ⇒ రేపల్లె, పలమనేరు, చిలకలూరిపేట, వేమూరు, పొన్నూరులో రిలే దీక్షలను పోలీసులు అడ్డుకున్నారు. దీక్షా శిబిరాలను తొలగించే యత్నాలను వైఎస్సార్సీపీ కార్యకర్తలు నిరోధించడంతో వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. మార్కాపురం జిల్లా కనిగిరిలో రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఉదయాన్నే కూల్చి వేశారు. కనిగిరి ఇంఛార్జ్ నారాయణయాదవ్ను పోలీసులు ఈడ్చేశారు. అనంతపురం జిల్లా యాడికిలో దీక్ష టెంట్ను టీడీపీ నేతలు దౌర్జన్యంగా తొలగించారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఇంటివద్దే పోలీసులు అడ్డుకున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిర్వహించిన రిలే దీక్షలను దర్గామిట్ట పోలీసులు అడ్డుకున్నారు. 24 గంటల్లోగా బొండా ఉమాను అరెస్టు చేయాలిలేదంటే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ఉ«ధృతం చేస్తాం: మల్లాది విష్ణు టీడీపీ జెండాతో వైఎస్సార్సీపీ నేత మల్లాది విష్ణు, తదితరులపై దాడి చేస్తున్న టీడీపీ గూండాలు సాక్షి ప్రతినిధి, విజయవాడ/గాంధీనగర్: పోలీసులు పూర్తిగా టీడీపీకి తొత్తులుగా మారారు. వైఎస్సార్సీపీ రిలే నిరాహార దీక్షకు అనుమతి ఉందా? లేదా? అనే విషయంలో ఎమ్మెల్యేకి ఏం సంబంధం? శిబిరం గురించి మేం పోలీసులకు సమాచారం ఇచ్చాం. ఎమ్మెల్యే మాపై దాడికి వస్తున్నట్లు ఒక గంట ముందే పోలీసులకు సమాచారం ఇచ్చాం. ఈ విషయం సీఐ సహా పై అధికారులందరికీ చెప్పాం. ధర్నా చేస్తుంటే టెంట్ పీకాల్సిన అవసరం ఏమిటి? రాళ్లు, కోడిగుడ్లు, టమోటాలు వేశారు. మహిళలపై దాడి చేశారు. ఇది మంచి ప్రభుత్వమా? ప్రతిపక్షం ఏమీ మాట్లాడకూడదు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు.. ఏదైనా మాట్లాడితే తోలు తీస్తాం అంటూ బెదిరింపులు! ఇలాంటి రౌడీయిజం, గుండాయిజాన్ని సహించేది లేదు. మంత్రి లోకేశ్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిందే. అంతవరకు మా పోరాటం ఆగదు. సీఎంవో డైరెక్షన్లో..ఎమ్మెల్యే బొండా ఉమా తన అనుచరులు, రౌడీ మూకలతో వచ్చి దాడికి తెగబడ్డారు. దాదాపు రెండు గంటల పాటు వైఎస్సార్సీపీ దీక్షా శిబిరం వద్ద బీభత్సం సృష్టించారు. టీడీపీ కార్యకర్తలు కోడిగుడ్లు, టమోటాలు, కుళ్లు పట్టిన పదార్థాల్లో మూత్రం పోసి వైఎస్సార్ సీపీ నాయకులు, మహిళలపై విసిరి రాక్షసానందం పొందారు. దాడి చేస్తున్న బొండా ఉమా రౌడీ మూకలను పోలీసులు అడ్డుకోకుండా, మౌనంగా దీక్ష చేస్తున్న వైఎస్సార్సీపీ నేతలను, కార్యకర్తలను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి తరలించారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే నేరుగా డైరెక్షన్ రావడం వల్లే పోలీసులు దాడిని అడ్డుకోలేదు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో యమధర్మరాజు స్కిట్ రూపంలో వినూత్నంగా రిలే నిరాహార దీక్ష.. సంఘీభావం తెలిపిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ ఈ దాడి ఘటనపై హోంమంత్రి, డీజీపీ ఏం సమాధానం చెబుతారు? డీఎస్సీలో అక్రమాలు, అభ్యర్థులకు జరిగిన అన్యాయానికి పూర్తి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి. శాంతియుత దీక్షపై భౌతిక దాడులకు పాల్పడిన ఎమ్మెల్యే బొండా ఉమా, ఆయన అనుచరులపై 24 గంటల్లోగా పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్టు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలను మరింత ఉ«ధృతం చేస్తాం. కాగా, శాంతియుతంగా నిరసన చేస్తున్న తమపై దాడి చేసి గాయపర్చిన టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా, ఆయన అనుచరులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్సీపీ నేతలు గుండె సుందర్పాల్, వరలక్ష్మీ, మాన్యం జగదీష్ ఎస్ఎన్ పురం పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. -
వైఎస్ జగన్ను ఎలా అడ్డుకుందాం?
సాక్షి, అమరావతి : మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలకు ప్రజల నుంచి వస్తున్న అనూహ్య స్పందనపై గురువారం రాష్ట్ర మంత్రివర్గంలో విస్తృత చర్చ జరిగింది. అజెండా అంశాలు ముగిసిన తర్వాత మంత్రులతో ప్రత్యేక సమావేశంలో జగన్ పర్యటనలు, డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ చేస్తున్న ఆందోళనలపై చంద్రబాబు చాలాసేపు మాట్లాడారు. వైఎస్ జగన్ క్షేత్రస్థాయి పర్యటనలకు ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న స్పందనపై చంద్రబాబు చర్చించారు. ఆ పర్యటనలను తప్పుబడుతూ మాట్లాడాలని, అక్కడ జరిగిన విషయాలను ప్రజలకు వ్యతిరేకంగా చూపాలని ఆదేశించినట్లు తెలిసింది. ఉద్యమంపై బురద చల్లండి..! తాజాగా తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో వైఎస్ జగన్ పర్యటన అంచనాలకు అందని రీతిలో విజయవంతం కావడం, జనవాహిని పోటెత్తడంపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ఆ పర్యటలను నీరుగార్చేలా ప్రచారాలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇక మెగా డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ రాజీనామా డిమాండ్తో వైఎస్సార్సీపీ చేస్తున్న ఉద్యమంపై మంత్రులు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది.ఇది ఇంకా తీవ్రమైతే ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతుందని పేర్కొన్నట్లు తెలిసింది. యువతలో దీనిపై చర్చ జరుగుతోందని, ఇది జెన్జీని తీవ్ర స్థాయిలో ప్రభావితం చేస్తుందని మంత్రులు ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ఆ ఉద్యమంపై బురద జల్లాలని చంద్రబాబు మంత్రులకు సూచించనట్లు తెలిసింది. ఆ ఉద్యమంలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్లు ఉన్నాయని ప్రచారం చేయాలని చెప్పినట్లు సమాచారం. వైఎస్సార్సీపీ నేతలకు రిజర్వేషన్ల గురించి తెలియదని చెప్పాలని ఆదేశించినట్లు తెలిసింది. మరోసారి పవన్ డుమ్మామంత్రివర్గ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి డుమ్మా కొట్టారు. గత మంత్రివర్గ సమావేశానికి కూడా ఆయన హాజరు కాలేదు. వరుసగా రెండు మంత్రివర్గ సమావేశాలకు ఆయన హాజరు కాకపోవడం కూటమిలో చర్చనీయాంశంగా మారింది. భుజానికి శస్త్ర చికిత్స జరగడంతో ఆయన సమావేశంలో పాల్గొనలేదని టీడీపీ సర్దిచెప్పుకుంటున్నా పవన్ కావాలనే రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మంత్రివర్గ సమావేశాలకు దూరంగా ఉంటూ తన శాఖకు సంబంధించిన అధికారులతో పవన్ కళ్యాణ్ సమీక్షలు నిర్వహిస్తుండడం విశేషం. -
ఏపీలో దిగజారిన శాంతిభద్రతలు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా క్షీణించాయని, ‘రెడ్బుక్’ దౌర్జన్యాలు పెచ్చుమీరాయని వైఎస్సార్సీపీ ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసింది. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో పార్టీ లోక్సభ పక్ష నేత పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, ఎంపీలు వైఎస్ అవినాశ్రెడ్డి, డాక్టర్ మద్దిల గురుమూర్తి, డాక్టర్ గుమ్మా తనూజారాణి, రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి, గొల్ల బాబూరావు గురువారం సాయంత్రం ఢిల్లీలో అమిత్షాతో భేటీ అయ్యారు. మెగా డీఎస్సీ అక్రమాలతో లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్ ప్రమాదంలో పడడం, భారతి సిమెంట్స్, ఫ్రెంచ్ గ్రూపు వికాట్ వంటి మల్టీనేషనల్ కంపెనీలను అధికారమదంతో బెదిరించడం, వాటి కార్యకలాపాలకు అడ్డంకులు సృష్టించడం వంటి కీలక అంశాలపై వైఎస్సార్సీపీ ఎంపీల బృందం కేంద్ర హోం మంత్రి వద్ద తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజా సమస్యలపై జిల్లాలు, నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంట లక్షలాదిగా ప్రజలు తరలివస్తున్న విషయం తెలిసినా అందుకు అనుగుణంగా పోలీసు రక్షణ కల్పించకుండా రాష్ట్రప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తోందని వివరించింది. వైఎస్సార్సీపీ ఎంపీలు లేవనెత్తిన అంశాలపై హోం మంత్రి సానుకూలంగా స్పందించారని, తగిన విధంగా పరిశీలిస్తానని హామీ ఇచ్చారని వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వివరించారు.. ఎంపీల బృందం లేవనెత్తిన అంశాలివే..పెచ్చుమీరిన కక్షసాధింపు రాజకీయాలు రాష్ట్రంలో పోలీసు యంత్రాంగాన్ని, చట్టాలను టీడీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తోందని ఎంపీలు కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల అక్రమ నిర్బంధాలు, రాజకీయ కక్షసాధింపు కేసులతో వేధిస్తోందని విమర్శించారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, ఆదోని మాజీ ఎమ్మెల్యే విరూపాక్షల అరెస్టులు ఇందుకు నిదర్శనమని చెప్పారు. గత రెండు నెలల్లోనే నాలుగు లాకప్ డెత్లు చోటుచేసుకోవడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నియామకాల్లో భారీ అక్రమాలు టీడీపీ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన డీఎస్సీ నియామక ప్రక్రియలో, ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా అమలులో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని ఎంపీలు ఫిర్యాదు చేశారు. అవినీతి, చేతివాటం కారణంగా అర్హులైన నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఇది రాష్ట్రంలోని నిరుద్యోగ యువతలో తీవ్ర ఆందోళనకు దారితీస్తోందని అమిత్షాకు వివరించారు. ఆయా అక్రమాలపై సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థతో నిష్పక్షపాత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని కోరారు. భారతి సిమెంట్స్ను లక్ష్యంగా చేసుకుంటున్నారు ఫ్రెంచ్ గ్రూపు వికాట్, భారతి సిమెంట్స్ను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని వైఎస్సార్సీపీ ఎంపీలు ఆరోపించారు. ప్రభుత్వపెద్దల ఆదేశాలతో అధికార పార్టీ మద్దతుదారులు, ఎమ్మెల్యేలు రహదారులను దిగ్బంధించడం, సంస్థ కార్యకలాపాలకు ఆటంకం కలిగించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గతంలో అ్రల్టాటెక్ సిమెంట్స్ విషయంలోనూ ఇదే తరహా పరిణామాలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. పరిశ్రమల కార్యకలాపాలను ఈ విధంగా అడ్డుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్పై పెట్టుబడిదారుల్లో విశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉందని ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజన హక్కుల పరిరక్షణకు చట్టబద్ధత కల్పించాలి గిరిజనుల విద్య, ఉద్యోగ, ఉపాధి హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా జీవో నెం.3కు ప్రత్యామ్నాయంగా చట్టబద్ధ వ్యవస్థను అమలు చేయడంతో పాటు అవసరమైన చట్ట సవరణలు చేపట్టాలని ఎంపీ డాక్టర్ గుమ్మ తనూజరాణి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. జీవో నెం.3, 1/70 చట్టానికి సంబంధించిన అంశాలను సమగ్రంగా పరిశీలించి గిరిజనుల రాజ్యాంగబద్ధ హక్కులు పరిరక్షించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ జగన్కు భద్రతా వైఫల్యంపై ఆందోళన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి తగిన భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలపై నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న పర్యటనల్లో ఆయనకు రక్షణ కరవైందని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా దేవరపల్లి పర్యటనలో లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చినప్పటికీ, పోలీసుల మోహరింపు నామమాత్రంగానే ఉందని, ఈ ఉదాసీనత వైఖరి వల్ల ప్రతిపక్ష నేతకు తీవ్రమైన భద్రతా ముప్పునకు దారితీసిందని చెప్పారు. గత రెండేళ్లుగా టీడీపీ ప్రభుత్వం దుర్బుద్ధితోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఫిర్యాదు చేశారు. కేంద్రం జోక్యం చేసుకోవాలి రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు, ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించేలా, చట్టబద్ధతను కాపాడేలా, పారిశ్రామికాభివృద్ధికి అనుకూలమైన పెట్టుబడి వాతావరణాన్ని నిలబెట్టేలా కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీలు కోరారు. ఆయా సమస్యలపై తక్షణమే జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్సీపీ ఎంపీల బృందం లేవనెత్తిన ప్రధానాంశాలపై కేంద్ర హోంమంత్రి సానుకూలంగా స్పందించారని, తగిన పరిశీలన చేస్తామని హామీ ఇచ్చారని వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు. -
డీఎస్సీ అక్రమాలపై పోరాటం కొనసాగింపు
సాక్షి,అమరావతి: డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, వాటికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన ఆందోళన కార్యక్రమాలను కొనసాగించనున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. దీనిలో భాగంగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్ర, శనివారాల్లో (7, 8 తేదీల్లో) అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో రిలే నిరాహార దీక్షలను కొనసాగించాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులకు కేంద్ర కార్యాలయం పిలుపునిచి్చంది. అలాగే ఈ నెల 10న రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, నిరుద్యోగ యువతతో పాటు ప్రజలు ఈ కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరింది. ఈ నెల 10న నిర్వహించే ర్యాలీలు ముగిసిన అనంతరం ప్రభుత్వంపై ఒత్తిడి మరింత పెంచేలా మలిదశ ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నట్లు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది. -
ఆ శ్వేతపత్రం అబద్ధాల పుట్ట
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం అంతా తప్పుల తడక అని, ఒక అబద్ధాల పుట్ట అని కనీసం ఆ లెక్కలకు ఆధారాలు కూడా చూపించలేకపోయారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యుడు దువ్వూరి కృష్ణ ఆక్షేపించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వాస్తవ ఆర్థిక పరిస్థితిని దాచిపెట్టి చంద్రబాబు మరోసారి అంకెల గారడీ చేశారని ఆయన దుయ్యబట్టారు. గత వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందంటూ మరోసారి పచ్చి అబద్ధాలు చెప్పారన్నారు. కాగ్, ఇతర ఆర్థిక సంస్థల లెక్కలు చూస్తే ఎవరి పాలనలో విధ్వంసం జరిగిందో ఇట్టే అర్థం అవుతోందని చెప్పారు. శ్వేతపత్రం పేరుతో సీఎం చంద్రబాబు విషంకక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇంకా ఏమన్నారంటే.. అన్నీ కాకిలెక్కలే.. ‘‘రెండేళ్లలో సూపర్ సిక్స్ పథకాల ఖర్చు రూ.31,483 కోట్లే. వాస్తవంగా ఖర్చు చేయాల్సింది రూ.2,39,628 కోట్లు. అంటే మొత్తం హామీల అమలు ఖర్చులో అది 13 శాతమే. తల్లికి వందనంలో రూ.15 వేలకు బదులు రూ.13 వేలు అంటూ.. రూ.8 – 9 వేలే ఇచ్చారు. డ్వాక్రా రుణ పరిమితి పెరగలేదు. సున్నా వడ్డీకి నిధులివ్వరు. రాష్ట్ర అప్పులపై చంద్రబాబు ఇంకా దు్రష్పచారం చేస్తున్నారు. రూ.14 లక్షల కోట్లు అన్నారు. పుస్తకాల గణాంకాల్లో చూస్తే రూ.6.46 లక్షల కోట్ల అప్పు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పు చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లలోనే దాటేశారు. వైఎస్సార్సీపీ పాలనలో ఆర్థిక సంఘం నిధులు ఎక్కువగా వాడేసినట్లు అబద్ధాలు చెబుతున్నారు. వ్యవసాయ రంగం ఆదాయంపైన, తలసరి ఆదాయంపైనా చంద్రబాబు కాకి లెక్కలు చెబుతున్నారు. కూటమి పాలనలో ఆర్థిక పరిస్థితి పూర్తిగా అస్తవ్యస్తమైంది. జీఎస్డీపీ వృద్ధి నాడు వైఎస్సార్సీపీ హయాంలో అగ్రస్థానంలో రాష్ట్రం ఉండేది. అయినా విధ్వంసం అంటూ చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఎగ్గొట్టడానికే చంద్రబాబు కుట్ర. అందుకే జీతభత్యాలపై అసత్యాలు, తప్పుడు లెక్కలు చెబుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆస్తుల్ని తాకట్టు పెట్టిందని అబద్ధాలు చెబుతున్నారు. కానీ ఇప్పుడు ఇదే వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం రూ.9 వేల కోట్ల రుణం కోసం ఏకంగా రూ.1.91 లక్షల కోట్ల ఖనిజ సంపదను తాకట్టు పెట్టింది. కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాల ప్రకారం ఏపీకి రూ.1.78 లక్షల కోట్లు పీపీపీ విధానంలో వచ్చాయి. ఇందులో 41 శాతం పెట్టుబడులు ఇప్పటికే ఉపసంహరించుకున్నారు. 30 శాతం ప్రీ డీపీఆర్ స్థాయిలో ఉన్నాయి. కేటాయించినవి ఐదు ప్రాజెక్టులు మాత్రమే. మరో రూ.14 వేల కోట్లు రెడీగా ఉన్నాయని చెబుతున్నారు. ఇందులో 8 ప్రభుత్వ ఆస్పత్రులు, రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం పోర్టులు మాత్రమే. ఇవి ఏ రకంగా మీ ఘనతో చెప్పాలి’’ అని దువ్వూరి పేర్కొన్నారు. ఆర్బీఐ బాండ్ల వడ్డీ రేటు కంటే చంద్రబాబు ప్రభుత్వమే ఎక్కువ వడ్డీకి రుణాలు తెస్తోందన్నారు. అబద్ధాల శ్వేతపత్రం పేరుతో డ్రామా చేశారని ఆయన వివరించారు. -
వైఎస్ జగన్ను కలిసిన వైఎస్సార్సీపీ గిరిజన నేతలు
సాక్షి, తాడేపల్లి: గిరిజన చట్టాలు, ఆదివాసీల హక్కుల పరిరక్షణకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని.. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. గిరిజనుల హక్కులకు భంగం కలిగించే ప్రభుత్వ చర్యలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ఆదివాసీల తరఫున బలమైన ప్రజాగొంతుకగా నిలవాలని పార్టీ ఎస్టీ సెల్ నాయకులకు సూచించారు.వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు, పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, డాక్టర్ తమర్బ నర్సింగరావు దంపతులు గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. వారితోపాటు పార్టీ మైదాన ప్రాంత ఎస్టీ సెల్ అధ్యక్షుడు సురేంద్ర, ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ నాయక్ కూడా వైఎస్ జగన్ను కలిశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి జ్ఞాపికను బహూకరించారు.ఈ సందర్భంగా గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీ చట్టాల పరిరక్షణ, జీవో నంబర్–3 పునరుద్ధరణ, 1/70 చట్టంపై గిరిజనేతరులు దాఖలు చేసిన కేసులు, బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు, హైడ్రో పవర్ ప్రాజెక్టులపై గిరిజనుల్లో నెలకొన్న ఆందోళన తదితర అంశాలను వారు వైఎస్ జగన్కు వివరించారు. ఆయా అంశాలపై వారితో విపులంగా చర్చించిన వైఎస్ జగన్.. ఆదివాసీల ప్రయోజనాలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్–97ను రద్దు చేసి ఆదివాసీల హక్కులకు రక్షణగా నిలిచిన విషయాన్ని ప్రజలకు గుర్తుచేయాలని వైఎస్ జగన్ సూచించారు. గిరిజనుల చట్టాలు, హక్కులకు భంగం కలిగించే ఏ చర్యనూ ఉపేక్షించబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించాలన్నారు.కూటమి ప్రభుత్వ పాలనలో గిరిజన చట్టాలు, హక్కుల భద్రతపై ఆదివాసీల్లో తీవ్ర ఆందోళన నెలకొందని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఇటీవల యువత చేపట్టిన ఉద్యమానికి లభించిన స్పందనే గిరిజనుల్లో నెలకొన్న ఆందోళనకు నిదర్శనమన్నారు. ఆదివాసీల హక్కులను కాపాడేందుకు వైఎస్సార్సీపీ తరఫున నిరంతరం పోరాటం చేయాలని, ప్రభుత్వంపై పోరాడే విషయంలో ఎక్కడా రాజీపడవద్దని కొట్టగుళ్లి భాగ్యలక్ష్మితో పాటు ఎస్టీ సెల్ నాయకులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. -
వైఎస్ జగన్ భద్రతపై కేంద్ర హోంమంత్రికి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
ఢిల్లీ: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రతపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వైఎస్సార్సీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్కు రాష్ట్ర ప్రభుత్వం తగిన భద్రత కల్పించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ జిల్లాల పర్యటనల్లో వరుసగా భద్రతా వైఫల్యాలు చోటుచేసుకుంటున్నాయని అమిత్ షాకు వివరించారు.ఇటీవల దేవరపల్లి పర్యటనకు భారీగా హాజరైనా సరిపడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయలేదని ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ ఎంపీలు.. గత రెండేళ్లుగా వైఎస్ జగన్ రాష్ట్ర పర్యటనలన్నింటిలో ఇదే పరిస్థితి కొనసాగుతోందన్నారు. వైఎస్ జగన్ భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందన్న వైఎస్సార్సీపీ ఎంపీలు.. ఆయనకు పటిష్టమైన భద్రత కల్పించేలా తక్షణమే జోక్యం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రికి విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్సీపీ ఎంపీల ఫిర్యాదుపై అమిత్ షా సానుకూలంగా స్పందించారు. వైఎస్ జగన్ భద్రత అంశాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఏపీలో క్షీణించిన శాంతిభద్రతలపై ఫిర్యాదుఅమిత్ షాను కలిసిన వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని ఎంపీల బృందం.. వైఎస్ జగన్ భద్రతతో పాటు డీఎస్సీ అక్రమాలు, రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలపై ఫిర్యాదు చేశారు. డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా దుర్వినియోగం, అవినీతి జరిగిందని అమిత్ షా దృష్టికి ఎంపీలు తీసుకెళ్లారు.డీఎస్సీ అక్రమాలపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో నిష్పాక్షిక విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై రాజకీయ కక్షతో అక్రమ కేసులు, అరెస్టులు చేస్తున్నారని ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ ఎంపీలు.. మాజీ మంత్రి అప్పలరాజు, మాజీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టులను అమిత్ షాకు వివరించారు. గత రెండు నెలల్లో రాష్ట్రంలో నాలుగు లాకప్ మరణాలు సంభవించాయని ఆందోళన వ్యక్తం చేశారు.భారతి సిమెంట్స్ను అధికార పార్టీ నేతలు ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని కార్యకలాపాలకు ఆటంకాలు కల్పిస్తున్నారని ఎంపీలు ఫిర్యాదు చేశారు. రాజకీయ కక్షసాధింపు చర్యలు రాష్ట్రంలో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరించిన ఎంపీలు.. ప్రజాస్వామ్య హక్కులు, న్యాయపాలన, ప్రజల భద్రతను కాపాడేందుకు కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
టెంట్లు పీకేసి, కోడిగుడ్లు విసిరి.. మూత్రం పోసి.. టీడీపీ సైకోల దాడి
-
‘ఎన్ఆర్ఐ మహిళను వేధించిన ఆ మంత్రిపై చర్యలేవీ?’
సాక్షి, తాడేపల్లి: అమెరికాలోని డల్లాస్లో రాష్ట్ర మంత్రి ఒకరు తనను వేధించారంటూ ‘ప్యూర్’ (పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్) సంస్థ వ్యవస్థాపకురాలు, ఎన్ఆర్ఐ డాక్టర్ శైలా తాళ్లూరి మంత్రి నారా లోకేష్కు పూర్తి వివరాలతో ఫిర్యాదు చేసినా, ఇప్పటి వరకు వెన్నుపోటు పార్టీ కానీ, ఈ ప్రభుత్వం కానీ స్పందించలేదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగ మల్లీశ్వరి ఆక్షేపించారు.ఎన్ఆర్ఐ అయిన తెలుగు మహిళను వేధించిన ఆ మంత్రిని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో పాటు, ఆయనపై కేసు నమోదు చేసి విచారణ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మహిళల భద్రతను పూర్తిగా గాలికొదిలేసిందని, వారు అధికారంలోకి వచ్చిన 26 నెలలుగా మహిళలపై వేధింపులు, దాడులు, అవమానాలు పెరిగిపోయాయని చెప్పారు. మహిళలను రక్షించాల్సిన ప్రజాప్రతినిధులే నిత్యం వేధింపులకు పాల్పడుతున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నాగ మల్లీశ్వరి గుర్తు చేశారు. ఆమె ఇంకా ఏం మాట్లాడారంటే..అమెరికాలోని డల్లాస్లో వెన్నుపోటు పార్టీకి చెందిన ఓ మంత్రి తనను వేధించారంటూ ఎన్ఆర్ఐ తెలుగు మహిళ సోషల్ మీడియాలో తీవ్రమైన ఆరోపణలు చేసినా, ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే మహిళల రక్షణకు ఈ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు అద్దం పడుతోంది. ఆ మహిళను ఒంటరిగా కాఫీకి రావాలని పిలవడం, ఫొటోలు పంపి ఇబ్బంది పెట్టడం వంటి ఆరోపణలను సైతం వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం చాలా తేలిగ్గా తీసుకోవడం అత్యంత హేయం.ఇంత జరిగినా వెన్నుపోటు పార్టీ తేలు కుట్టిన దొంగలా వ్యవహరిస్తోంది. బాధిత మహిళ సోషల్ మీడియా వేదికగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, హోం మంత్రి అనిత తదితరులని ట్యాగ్ చేస్తూ న్యాయం కోసం అభ్యర్థించినా వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం స్పందించక పోవడం హేయం.రాష్ట్రంలో మహిళలపై అన్యాయం జరిగిన ప్రతిసారీ తిరిగి బాధితుల పైనే కేసులు పెట్టే పరిస్థితిని వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. మహిళా కమిషన్, హోం శాఖ, మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థలు ప్రజల కోసం కాకుండా అధికార వెన్నుపోటు పార్టీ నాయకుల కోసం మాత్రమే పని చేస్తున్నాయనే భావన కలుగుతోంది.వెన్నుపోటు పార్టీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలపై వేధింపులు, అఘాయిత్యాలు నిత్యకృత్యంగా మారాయి. ఇప్పుడు అవి సరిహద్దులు కూడా దాటాయి. చివరకు అమెరికాలో సైతం ఏకంగా రాష్ట్ర మంత్రి, ఒక ఎన్ఆర్ఐ మహిళను వేధించడం వెన్నుపోటు పార్టీ, ఈ ప్రభుత్వ ఉన్మాదానికి పరాకాష్ట. వెన్నుపోటు పార్టీ ప్రభుత్వానికి ఏ మాత్రమైనా నైతికత ఉంటే, తక్షణమే ఆ మంత్రిని బర్తరఫ్ చేసి, కేసు పెట్టి విచారణ చేయాలని నాగ మల్లీశ్వరి డిమాండ్ చేశారు. -
ధర్మేంద్ర బాటలో లోకేష్ రాజీనామా చెయ్యాల్సిందే..
-
YS జగన్ ను కలిసిన విద్యార్థి,నిరుద్యోగ JAC నేతలు
-
దీక్షా శిబిరంపై బోండా ఉమ దాడి.. డీజీపీ ఆఫీసుకి వైఎస్సార్సీపీ నేతలు
తాడేపల్లి: ఏపీ డీజీపీ కార్యాలయానికి గురువారం వైఎస్సార్సీపీ నేతలు వెళ్లారు. వారిలో మాజీ మంత్రులు పేర్ని నాని, తానేటి వనిత, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, తదితరులు ఉన్నారు. విజయవాడలో పార్టీ దీక్షా శిబిరంపై బోండా ఉమ చేసిన దాడిపై ఫిర్యాదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా శిబిరాలపై జరిగిన దాడులపై నేతలు ఫిర్యాదులు చేయనున్నారు. వైఎస్ జగన్ భద్రతలో పోలీసుల వైఫల్యాలపై కూడా ఫిర్యాదు చేశారు.అనంతరం తానేటి వనిత మాట్లాడుతూ... ‘‘కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నాయి. పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు. డీఎస్సీ అక్రమాలపై దీక్షలు చేస్తుంటే టెంట్లు పీకేస్తున్నారు. పోలీసులే ఇలా వ్యవహరించటం దారుణం. విజయవాడలో బోండా ఉమ తన మనుషులతో దాడులు చేశారు. కర్రలు, రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేశారు. అసలు ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? రాక్షస పాలనలో ఉన్నామా? అనిపిస్తోంది. నిన్న దేవరపల్లికి జగన్ వస్తే తొలుత అన్ని పర్మిషన్ లు ఇచ్చారు. కానీ రాత్రికి రాత్రి పోలీసులను విత్ డ్రా చేసుకున్నారు. జగన్ పర్యటనలో ఎక్కడా ఒక్క పోలీసు కూడా లేడు. మాజీ సీఎం పర్యటనకు వెళ్తే ఎందుకు అన్ని కుట్రలు? వీటన్నింటిపై డీజీపీకి ఫిర్యాదు చేయటానికి వచ్చాం. లా అండ్ ఆర్డర్ డీజీ ఫకీరప్ప మా వినతి పత్రాన్ని తీసుకున్నారు. డీజీపీకి అందిస్తానన్నారు’’ అని తెలిపారు.టీడీపీ నేతలే టెంట్లు తొలగించారు..లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘పోలీసులే మా దీక్షా శిబిరాలను తొలగించటం దుర్మార్గం. కొన్ని చోట్ల టీడీపీ నేతలే టెంట్లు తొలగించారు. విజయవాడలో మల్లాది విష్ణు రిలే దీక్షలో కూర్చుంటే బోండా ఉమా దాడి చేశారు. దౌర్జన్యం చేసి టెంట్ పీకేశారు. కోడి గుడ్లు, రాళ్లతో దాడి చేశారు. సీపీ కార్యాలయానికి సమీపంలోనే ఈ దాడి జరగటం సిగ్గుచేటు.దీక్షా శిబిరం పైన మూత్రం పోయటం అమానుష చర్య. ఇవన్నీ డీఐజీకి తెలిపాం. రాష్ట్రంలో శాంతిభద్రతలు కొరవడటంపై ఫిర్యాదు చేశాం. మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నాం. ఫిర్యాదు చేయటానికి వస్తే డీజీపీ ఎప్పటిలాగే డీజీపీ అందుబాటులోకి రాలేదు. విజయవాడలో దాడి చేసిన వారిని వదిలేసి, మల్లాది విష్ణును అరెస్టు చేశారు. పోలీసులు తప్పుడు మార్గంలో వెళ్లవద్దు. టీడీపీ నేతల మాటలు విని తప్పు చేస్తే తర్వాత ఇబ్బంది పడతారు.చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ.. ‘‘విజయవాడ ఘటన అమానవీయం. మల్లాది విష్ణుపై దాడి దుర్మార్గం. శిబిరంపై మూత్రం పోయటం అమానుష చర్య. ఇలాంటి ఘటనలను ప్రజలు సహించరు. ఈ ఘటనలపై పూర్తి విచారణ జరపాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలి. శిబిరాలపై దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి’’ అని చెప్పారు. -
మా హోటల్ ని ఎవరూ పాడు చేయలేదు.. అసలు ఏమి జరిగిందో పూసగుచ్చినట్లు చెప్పిన నిర్వాహకులు
-
N (NARA) ట్యాక్స్ దెబ్బకు భారీ పరిశ్రమలన్నీ పారిపోతున్నాయి
-
లీకుల లీడర్ లోకేష్.. YSRCP దీక్షలతో దద్దరిల్లిన AP
-
అనిత వెస్ట్ అని పవన్ కల్యాణే... వెళ్తూ.. వెళ్తూ అనితకు ఇచ్చిపడేసిన పేర్ని నాని
-
మీ ప్రభుత్వం చేసే కంపును ఎన్ని రోజులు ఇసుకేసి ఆపుతారు పేర్ని నాని ఫైర్
-
మా హోటల్లో ఏదో జరిగిందంటూ చెప్పమన్నారు: లక్ష్మీ
సాక్షి, తాడేపల్లి: టీడీపీ నేతలు తమపై ఒత్తిడి చేశారని తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి హోటల్ నిర్వాహకులు లక్ష్మీ అన్నారు. ‘‘మా హోటల్లో ఏదో జరిగిందంటూ చెప్పమన్నారు. తర్వాత తహశీల్దారు మా దగ్గరకు వచ్చి కలెక్టర్ దగ్గరకు రమ్మన్నారని చెప్పారు. కారు పంపిస్తామనీ అందులో రావాలనీ చెప్పారు. మాకు భయం వేసింది. వైఎస్ జగన్ హయాంలో మాకు ఇంటి స్థలాలు వచ్చాయి. ఆయన హయాంలో మాకు చాలా మేలు జరిగింది’’ అని ఆమె మీడియాకు వివరించారు.ఇవాళ.. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని దేవరపల్లి హోటల్ నిర్వాహకులు కలిశారు. వైఎస్ జగన్ దేవరపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రం పర్యటనలో జనం రద్దీ వల్లే తోపులాట జరిగిందని.. అంతేకానీ వైఎస్సార్సీపీకి ఎలాంటి సంబంధం లేదని వైఎస్ జగన్కు హోటల్ నిర్వాహకులు చందన వరలక్ష్మి, చందన దివ్య వివరించారు.వైఎస్సార్సీపీ కార్యకర్తలు తమ హోటల్ ధ్వంసం చేశారన్న ప్రచారంలో వాస్తవం లేదన్న నిర్వాహకులు.. వైఎస్ జగన్ ప్రభుత్వంలో తమ కుటుంబం లబ్ధిపొందినట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు. -
దీక్షా శిబిరంపై బోండా ఉమా దాడి... పేర్ని నాని సంచలన రియాక్షన్
-
YSRCP నేతల టెంటు పీక్కెళ్లిన పోలీసులు
-
మల్లాది విష్ణుపై బోండా ఉమా దాడి.. పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్!
-
మల్లాది విష్ణు అరెస్ట్
-
ఛీ.. మీకు మీ పరిపాలనకు దండం ఇక మీ చాప్టర్ క్లోజ్.. మహిళల ఆగ్రహం
-
YSRCP దీక్షా శిబిరాల వద్ద బోండా ఉమా కు ఏం పని..?
-
రెడ్ బుక్ అరాచకం రక్తం వచ్చేలా దాడి..
-
బోండా ఉమా రౌడీయిజం పేర్ని నాని స్ట్రాంగ్ వార్నింగ్
-
తాడిపత్రిలో ఉద్రిక్తత.. పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు
-
సిగ్గుండాలి లోకేష్..! జగన్ తో నీకు పోలికేంటి
-
చంద్రబాబు శ్వేతపత్రం అబద్ధాల పుట్ట.. ఆథారాలతో బయటపెట్టిన దువ్వూరి కృష్ణ
-
దమ్ముంటే ఆ మంత్రిని తొలగించు.. బాబుకు వరుదు కళ్యాణి సవాల్
-
వైఎస్ జగన్ దేవరపల్లి టూర్ హైలైట్స్
-
కోడిగుడ్లతో,కర్రలతో దాడి చేస్తారా బొండా ఉమా ఇదే నా ఫైనల్ వార్నింగ్
-
గుర్తుపెట్టుకో ఇదే పోలీసులతో నీకు... బొండా ఉమా కు YSRCP స్ట్రాంగ్ వార్నింగ్
-
విజయవాడలో కొనసాగుతున్న ఉద్రిక్తత
-
వైఎస్ జగన్ భద్రతను ప్రభుత్వం గాలికొదిలేసింది: పేర్నినాని
తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతను ప్రభుత్వం గాలికొదిలేసిందని మాజీ మంత్రి పేర్నినాని అన్నారు. వైఎస్ జగన్ పర్యటనలో ఒక్క పోలీస్ కూడా కనిపించలేదని తెలిపారు. భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? అని అన్నారు. జగన్ పర్యటనకు జనం రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. జనం రాకుండా పెద్ద ఎత్తున బారికేడ్లు పెట్టారు. పోలీసులను చంద్రబాబు ప్రైవేట్ సైన్యంగా వాడుకుంటున్నారు. గతంలో మేడరమెట్ల, రాప్తాడు, సత్తెనపల్లి పర్యటనల్లోనూ భద్రతా లోపాలు బయటపడ్డాయని తెలిపారు. జెడ్ ప్లస్ కేటగిరి భద్రతలో ఉన్న మాజీ ముఖ్యమంత్రికి ఇచ్చే భద్రత ఇదేనా?ఇంజిన్ లేకుండా నడుపుతున్నారు!పొగాకు రైతులు గతంలో ఎప్పుడూ చూడని కష్టాలు చూస్తున్నారని పేర్ని నాని అన్నారు. ‘‘అసలు కొనే నాథుడే లేకుండా పోయారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అని ప్రగల్భాలు పలుకుతున్నారు. అసలు ఇంజిన్ లేకుండా నడుపుతున్నారు. గత ఏడాది పరిస్థితులు చూసైనా ఈ ఏడు అయినా జాగ్రత్తలు తీసుకోలేదు. ఈ ఏడాది కూడా పొగాకు రైతుల గురించి పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారు. జగన్ పొగాకు రైతుల ఇబ్బందులపై ప్రశ్నించేందుకు వెళ్లారు. జెడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్న జగన్ భద్రతను హోంశాఖ నిర్లక్ష్యం వహించింది. కానీ ఆయన సభలకు జనం రాకుండా అంచెలంచెలుగా ప్రజలను అడ్డుకుంటారు. ఈ ప్రభుత్వం వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరూ అన్ని దారుల్లో వస్తున్నారు. దేవరపల్లి చుట్టూ ఐదు కిలోమీటర్ల పరిధిలో జనాన్ని లోపలకి రానీయకుండా బారికేడ్లు పెట్టడానికి వందల మంది పోలీసులు ఉంటారు.చంద్రబాబు పోలీసులను ప్రైవేట్ సైన్యంలా వాడుకోవటం దారుణం. డీజీపీ అయినా పోలీసులను మందలించలేదు. ఈ రెండేళ్లలో భద్రతా లోపాలు అనేకసార్లు కేంద్రానికి పంపాం. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా డీజీపీ స్పందించలేదు. అనంతపురం జిల్లా లో హెలికాఫ్టర్ దగ్గర భద్రత లేక విండ్ షీల్డ్ పగిలితే పైలెట్లను వేధించారు.గతంలో ఇలాగే చేసి ఉంటే మీరు తిరగ గలిగేవారా? ఏపీలో పోలీస్ వ్యవస్థ దిగజారిందని జనం మాట్లాడుకుంటున్నారు. జగన్ చేస్తుంది రాజకీయ పర్యటనలు కాదు. ప్రజల కష్టాలు చూడటానికే ఆయన వెళ్తున్నారు. సిగ్గులేకుండా బాధ్యత లేకుండా పోలీసులు వ్యవహరిస్తున్నారు. జగన్ పర్యటనల్లో తొక్కిసలాటలు జరగాలి అని చూస్తున్నారు. జగన్ పర్యటనపై లోకేశ్ ట్వీట్ పెట్టి అక్కసు వెళ్లగక్కారు. వైసీపీ శ్రేణులు ఒక దుకాణం పగులగొట్టి హిందూ దేవుడి ఫొటో పగులగొట్టారని ట్వీట్ చేశారు.మరి సింహాచలం, తిరుపతి, శ్రీకాకుళం ఘటనల్లో పలువురు మృతి చెందారు.. మిమ్మల్ని ఎవరు క్షమిస్తారు? మీ ఆత్రమే తప్ప.. ఈ ప్రభుత్వం బతికేది లేదు. మీ ప్రభుత్వం పోవాలని టీడీపీ కార్యకర్తలే పూజలు చేస్తున్నారు. మీ ప్రభుత్వంలో కమ్మలు, కాపులు కూడా ఏడుస్తున్నారు. ఏపీలో అవినీతి చేయటానికి దేన్నీ వదలటం లేదు. దుకాణదారురాలు లక్ష్మీ వైసీపీ అభిమాని కాబట్టి మీ పప్పులు ఉడకలేదు’’ అని తెలిపారు.విజయ్కు జనాన్ని దూరం చేయగలిగారా? తమిళనాడులో విజయ్ సభలో ఏదో చేద్దామని ఆయన ప్రత్యర్థులు చూశారని అక్కడ ఏం సాధించారని పేర్ని నాని ప్రశ్నించారు. ‘‘విజయ్కు జనాన్ని దూరం చేయగలిగారా? సీఎం కాకుండా ఆపారా ? మీకు కూడా అదే గతి రాదా? సత్తెనపల్లి జగన్ పర్యటనలో కూడా ఇదే తరహాలో చేశారు. రెండేళ్లలో ఓటు వేసిన ప్రభుత్వాన్ని కూల్చే అధికారం లేదు కాబట్టి ప్రజలు మిన్నకుండిపోయారు. పోలీసులను జగన్ భద్రతకు వహించాలని డిమాండ్ చేస్తున్నాం. జగన్ మావిగన్ దెబ్బకి అమరావతిలో విజయవాడ, గుంటూరులు కలిపి ఉంచుతాం అంటున్నారు’’ అని తెలిపారు. -
వైఎస్ జగన్ని కలిసిన దేవరపల్లి హోటల్ నిర్వాహకులు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి హోటల్ నిర్వాహకులు ఇవాళ(గురువారం) కలిశారు. తమ హోటల్ని పార్టీ కార్యకర్తలు ధ్వంసం చేశారంటూ టీడీపీ నేతలు చేస్తున్న విష ప్రచారాన్ని హోటల్ నిర్వాహకురాలు లక్ష్మీ ఖండించారు. వైఎస్ జగన్ పర్యటనలో జనం రద్దీ వల్లే తోపులాట జరిగిందన్న లక్ష్మీ.. అంతేకానీ వైఎస్సార్సీపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే తమ కుటుంబం లబ్ధిపొందిందని హోటల్ నిర్వాహకులు అన్నారు.టీడీపీ నేతలు మాపై ఒత్తిడి చేశారు. మా షాపులో ఏదో జరిగిందంటూ చెప్పమన్నారు. తర్వాత తహశీల్దారు మా దగ్గరకు వచ్చి కలెక్టర్ దగ్గరకు రమ్మన్నారని చెప్పారు. కారు పంపిస్తామనీ అందులో రావాలనీ చెప్పారు. మాకు భయం వేసింది. జగన్ హయాంలో మాకు ఇంటి స్థలాలు వచ్చాయి. ఆయన హయాంలో మాకు చాలా మేలు జరిగింది. ఇవాళ వైఎస్ జగన్ని కలిసినందుకు ఆనందంగా ఉందని నిర్వాహకులు అన్నారు. -
అవనిగడ్డలో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ నిరాహార దీక్ష
సాక్షి, కృష్ణా జిల్లా: కృష్ణా డెల్టాకు సాగునీరివ్వాలని కోరుతూ అవనిగడ్డలో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు నిరాహార దీక్షకు దిగారు. కృష్ణా డెల్టాకు సాగునీరు ఇవ్వలేమని.. చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయంతో కృష్ణా డెల్టా రైతాంగం ఆందోళనకు దిగారు. రైతుల తరఫున సింహాద్రి రమేష్ దీక్ష చేపట్టారు. పులిచింతల, పట్టిసీమల నుంచి నీరు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నిరాహారదీక్షకు పెనమలూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జి దేవభక్తుని చక్రవర్తి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ.. ‘‘ఏరువాక చేసి కొబ్బరికాయలు కొట్టి హడావుడి చేశారు. నాట్లు వేసి, వెదలు జల్లాక నీరు లేవని చెబుతున్నారు. వరి పంట వేయొద్దని చెబుతున్నారు. కృష్ణా డెల్టాలో వరి తప్ప మరో పంటకు ఆస్కారమే లేదు. పులిచింతల, పట్టిసీమ నుంచి నీరు తీసుకుని కృష్ణాడెల్టాకు ఇస్తే సాగుకు ఇబ్బంది లేదు. 2003లో కృష్ణానదిలో పదివేల మందితో నిరసన చేపట్టాం. వర్షాకాలం మొదట్లోనే నీరు ఇవ్వలేమంటున్నారు. వ్యవసాయాన్ని చంపేయాలనే చంద్రబాబు ఇలా చేస్తున్నారు’’ అంటూ ఆయన మండిపడ్డారు.‘‘ప్రకాశం బ్యారేజ్ దిగువున రిజర్వాయర్లు కట్టాలి. గత ప్రభుత్వంలో మట్టి నమూనాలు కూడా సేకరించాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం రిజర్వాయర్లు కట్టాలి. కృష్ణా డెల్టాకు సాగునీరివ్వాలి. సాగునీరివ్వకపోతే రైతుల తరపున ఉద్యమిస్తాం. ప్రభుత్వం స్పందించకపోతే అవనిగడ్డ నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకూ పాదయాత్ర చేపడతాం’’ అని సింహాద్రి రమేష్ బాబు పేర్కొన్నారు.రైతులంటే చంద్రబాబుకు పడదు: దేవభక్తుని చక్రవర్తి దేవభక్తుని చక్రవర్తి మాట్లాడుతూ.. ‘‘రైతులంటే చంద్రబాబుకు పడదు. రైతులను ఇబ్బంది పెట్టి వ్యవసాయాన్ని నాశనం చేయాలని చూడొద్దు. నాట్లు వేయకముందే నీరు ఇవ్వలేమని ఎందుకు చెప్పలేకపోయారు?. ఇప్పుడు నీరివ్వలేం వరివేయొద్దని చెబుతున్నారు. ఎల్నినో గురించి ముందు మీకు తెలియదా?. పెట్టుబడి పెట్టి నాట్లు వేశాక ఇప్పుడు నీళ్లివ్వలేమని చెబుతున్నారు. విత్తనాలు ఇచ్చే ముందు నీరు ఇవ్వలేమని మీకు తెలియదా?. నాట్లు వేసినప్పుడు ఎందుకు చెప్పలేదు?..కుంటిసాకులు చెప్పడం మానుకుని రైతులకు నీరివ్వండి. రైతులు రోడ్డెక్కే పరిస్థితి తెచ్చుకోవద్దు. కృష్ణాడెల్టా రైతులు కన్నీరు పెడుతున్నారు. యూరియా వాడితో క్యాన్సర్ వస్తుందని చంద్రబాబు చెబుతున్నారు. క్యాన్సర్ వస్తుందని చెప్పి ఓటిపిలు పెట్టి మరీ యూరియా ఇచ్చారు. రైతులకు నీరివ్వని పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. రైతులను కన్నీరు పెట్టిస్తే ఏ ప్రభుత్వం బాగుపడదు’’ అని దేవభక్తుని చక్రవర్తి పేర్కొన్నారు. -
అరాచక ప్రదేశ్లో బాబు సర్కార్.. నూకలు చెల్లాయ్
సాక్షి, కృష్ణా/తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ అక్రమాల ఆరోపణలపై కొనసాగుతున్న రాజకీయ వేడి మరింత పెరిగింది. గురువారం విజయవాడలో వైఎస్సార్సీపీ దీక్షా శిబిరంపై జరిగిన దాడి ఘటనను ప్రస్తావిస్తూ మాజీ మంత్రి పేర్ని నాని కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బాబు ప్రభుత్వానికి నూకలు చెల్లాయని, తప్పుడు పనులు, రౌడీయిజానికి ప్రజలు త్వరలోనే సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు.కృష్ణాడెల్టాకు సాగునీరు ఇవ్వాలని కోరుతూ అవనిగడ్డలో పులిగడ్డ ఆక్విడెక్ట్ వేదికగా మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ నిరాహారదీక్ష చేపట్టారు. ఈ దీక్షకు సంఘీభావం తెలిపిన మాజీ మంత్రి పేర్నినాని అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘బోండా ఉమా అధికార మదంతో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు శిబిరంపై దాడి చేశారు. దీక్షా శిబిరంలో కోడిగుడ్లు విసరడం, షామియానాలు ధ్వంసం చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు. అధికార పార్టీ నేతలు రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారు అని మండిపడ్డారు.“బోండా ఉమా లాంటి వంద మంది రౌడీలను పోగేసుకుని చంద్రబాబు, లోకేష్ శునకానందం పొందొచ్చు. కానీ ఆ ఆనందం ఎన్నో రోజులు ఉండదు. మీ పాపాలన్నీ శిశుపాలుడి పాపాల మాదిరిగా లెక్కిస్తున్నారు” అంటూ పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు.ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఇంటికొచ్చి కొడతామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారన్న ఆయన.. “మీ చేతనైంది చేసుకోండి.. ఎంతమందిని కొడతారో చూస్తాం” అంటూ సవాల్ విసిరారు. దాడులతో తమకు జరిగే నష్టం ఏమీ లేదని, ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని అన్నారు. ఈ క్రమంలో బోండా ఉమాను ఉద్దేశించి పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “మీ కార్యకర్తలే మీ ఇళ్లకు వచ్చి ప్రశ్నించకుండా చూసుకోండి” అంటూ హెచ్చరించారు. అధికార దర్పంతో చేసే చర్యలకు ప్రజలు తగిన సమాధానం చెబుతారని పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్ను అరాచక ప్రదేశ్గా మార్చారు: లేళ్ల అప్పిరెడ్డిఇటు విజయవాడ ఘటనపై తాడేపల్లిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కూడా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ను అరాచక ప్రదేశ్గా మార్చారని, అక్రమాలు, అన్యాయాలకు కేంద్రంగా మారిందని ఆరోపించారు. డీఎస్సీ అక్రమాలపై శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై దాడులు చేయడం దారుణమని అన్నారు. మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలోనే ఎమ్మెల్యే బోండా ఉమా దాడులకు దిగారని ఆరోపించారు. దీక్షా శిబిరంలో మహిళలు, విద్యార్థులపై దాడి చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడ్డారు.ఆందోళనకారులపై మూత్రం పోశారనే ఆరోపణలను ప్రస్తావిస్తూ.. ఇది అత్యంత నీచమైన చర్య అని విమర్శించారు. పోలీస్ కమిషనర్ కార్యాలయానికి సమీపంలోనే ఘటన జరగడం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పడుతోందని అన్నారు. దాడి చేసిన వారిని వదిలి.. మల్లాది విష్ణును అరెస్ట్ చేశారని, పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తుందని, అందుకే తమ కార్యకర్తలు సంయమనం పాటిస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో బెదిరింపులు, దాడులకు భయపడబోమని స్పష్టం చేశారు.డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలికితే న్యాయపోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. -
100 మంది గుండాలతో YSRCP దీక్ష శిబిరాలకు బోండా ఉమా.. కోడిగుడ్లు, టమాటాలతో దాడి!
-
వైఎస్సార్సీపీ గర్జనతో టీడీపీలో వణుకు
సాక్షి, అమరావతి: డీఎస్సీ అక్రమాల వ్యవహారం ఏపీ రాజకీయాలను వేడెక్కించింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని.. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు కూటమి ప్రభుత్వం బెదిరిపోయింది. ఈ క్రమంలోనే.. పోలీసులను ప్రయోగించింది. అయినా పోరాటం ఆగకపోవడంతో నేరుగా టీడీపీ గుండాలను రంగంలోకి దించింది. డీఎస్సీ అవకతకవలపై పోరాటాలను వైఎస్సార్సీపీ ఉదృతం చేసింది. ఇప్పటికే పలు రూపాల్లో నిరసనలు చేపట్టిన వైఎస్సార్సీపీ.. నియోజకవర్గాల వారీగా రిలే దీక్షలకు పిలుపునిచ్చింది. డీఎస్సీ అభ్యర్థులు, సంఘాలతో కలిసి పార్టీ యువజన విభాగం ఆధ్వరంలో గురువారం నుంచి నాలుగు రోజులపాటు ఈ దీక్షలు మొదలయ్యాయి. అయితే లోకేశ్ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు.. దీక్షకు అనుమతి లేదంటూ అడ్డుకునే ప్రయత్నాల చేశారు. అంతటితో ఆగకుండా.. టెంట్లను సైతం పీకేసి వెళ్లిపోయారు. అయితే.. పలు చోట్ల దీక్షలు సజావుగా సాగడంతో కూటమి ప్రభుత్వం భరించలేకపోయింది. ఈ క్రమంలోనే టీడీపీ గూండాలను దీక్షా శిబిరాలపైకి ఉసిగొల్పింది. దీంతో రాష్ట్రంలో పలు దీక్షా శిబిరాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఇందుకు విజయవాడలో జరిగిన దౌర్జన్యకాండే ఉదాహరణగా నిలిచింది. విజయవాడలోని దీక్షా శిబిరాలపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా నేరుగా దాడి చేశారు. కొందరు వ్యక్తులు టమాటాలు, కోడిగుడ్లు, రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. నిరసన కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన టెంట్లను తొలగించారు. అక్కడ ఉన్న మహిళా కార్యకర్తలపై కూడా దాడులు చేశారు. మహిళా జర్నలిస్టులను, పోలీసులను కూడా వదలకుండా దాడులు చేశారు. మరో అడుగు ముందుకు వేసి.. ఓ అనుచరుడు నీచంగా ప్రవర్తించాడు. దీక్షా శిబిరం పై నుంచి అక్కడున్నవాళ్లపై మూత్రం పోశాడు. ఏపీలో ఇవాళ చాలా చోట్ల ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. ఆ సమయాల్లో.. పోలీసులు తగిన చర్యలు తీసుకోలేదు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహిస్తున్న నిరసనలకు రక్షణ కల్పించాల్సింది పోయి.. ప్రేక్షక పాత్ర వహించారు. దాడులను అడ్డుకోవడంలో పోలీసులు దారుణంగా విఫలమయ్యారు. అయితే.. ఏం జరిగినా తమ పోరాటం ఆగబోదని వైఎస్సార్సీపీ అంటోంది. అరెస్టులు.. దాడులు తమని ఆపవని అంటోంది. డీఎస్సీ కుంభకోణానికి కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలంటోంది. నైతిక బాధ్యత వహిస్తూ లోకేశ్ రాజీనామా చేయాలని, సీబీఐ విచారణకు ఆదేశించాలని.. చంద్రబాబు ప్రభుత్వం దిగి వచ్చేదాకా పోరాటం ఆగదని కుండబద్దలు కొడుతోంది. -
జక్కంపూడి సేవలు చిరస్మరణీయం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: మాజీ మంత్రి, సీనియర్ నేత జక్కంపూడి రామ్మోహన్రావుకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జక్కంపూడి చిత్రపటానికి పూలమాల వేసి ఆయన స్మరించుకున్నారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. జక్కంపూడి రామ్మోహన్రావు ప్రజల కోసం ఎన్నో సేవలు అందించిన నాయకుడని కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన ఎంతో చొరవ చూపారని గుర్తు చేశారు. వైఎస్సార్ కుటుంబంతో జక్కంపూడి రామ్మోహన్రావుకు సుదీర్ఘ అనుబంధం ఉందని జగన్ పేర్కొన్నారు.ప్రజలతో మమేకమై పనిచేసిన నేతగా, ప్రజా సమస్యలపై నిరంతరం స్పందించిన నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ప్రజల పట్ల జక్కంపూడి చూపిన అంకితభావం, చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని వైఎస్ జగన్ అన్నారు. -
బోండా ఉమా దౌర్జన్యం.. మల్లాది విష్ణు అరెస్ట్..
సాక్షి, విజయవాడ: విజయవాడలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మెగా డీఎస్సీ పరీక్షలో అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ ముత్యాలపాడు వద్ద వైఎస్సార్సీపీ నేతలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా దౌర్జన్యానికి దిగారు. అనంతరం, పోలీసులు.. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సహా పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా, ఆయన అనుచరులు దౌర్జన్యంగా, అత్యంత నీచంగా వ్యవహరించారు. వైఎస్సార్సీపీ నేతల దీక్షా శిబిరాన్ని ధ్వంసం చేశారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడికి దిగారు. దీక్షా శిబిరంపైకి ఎక్కి.. టీడీపీ కార్యకర్త ఒకరు టాయిలెట్ చేశారు. అంతటితో ఆగకుండా వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు గుడ్లు విసిరారు. దీంతో, టీడీపీ కార్యకర్తులు, వైఎస్సార్సీపీ కార్యకర్తల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. పోలీసులు అక్కడ ఉన్న సమయంలోనే ఇదంగా జరగడం గమనార్హం. టీడీపీ నేతల దాడి కారణంగా ఓ మహిళా వైఎస్సార్సీపీ కార్యకర్త స్పృహ తప్పిపోయి కిందపడిపోయినట్టు సమాచారం. మంత్రి నారా లోకేశ్ ఆదేశాలతోనే వైఎస్సార్సీపీ నేతలపై దాడులు జరిగాయని పార్టీ నేతలు ఆరోపించారు. అనంతరం, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. టీడీపీ ఎమ్మెల్యే గూండాయింజ చేశారు. ఇలాంటి ఎమ్మెల్యే ఉండటం మన దురదృష్టం. పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదు. పోలీసుల సమక్షంలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా దౌర్జన్యం చేశారు అని అన్నారు. దీక్షా శిబిరంలో ఉన్న మహిళలపై కూడా దాడులు చేయడం గమనార్హం. ఈ ఘర్షణల తర్వాత.. వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం. టీడీపీ శ్రేణులు ఘర్షణలకు కారణమైనప్పటికీ వారిని మాత్రం పోలీసులు పట్టించుకోలేదు. -
జగన్పై చంద్రబాబు వ్యాఖ్యలు.. అసహనమా? భయమా?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ సమావేశాలలో ఏమని చెబుతుంటారో కాని, ఎల్లో మీడియాలో మాత్రం వచ్చే కధనాలు చూస్తే మాత్రం ఆయన ఇలా మాట్లాడడమేమిటా అనిపిస్తుంది. సుదీర్ఘకాలంగా ముఖ్యమంత్రిగా, విపక్ష నేతగా , ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రిని ఇంతలా కించపరిచేలా ప్రసంగాలు చేస్తున్నారంటే అది ఆయనలోని భయం తెలియచేస్తుంది తప్ప మరొకటి కాదన్న అభిప్రాయం కలుగుతుంది. కొద్ది రోజుల క్రితం పార్టీ యూనిట్ ఇన్జార్జీల శిక్షణ తరగతులలో ఆయన స్పీచ్ ఇచ్చిన సందర్భంలో చేసిన వ్యాఖ్యలు ఆయనకు కూడా తగులుతాయన్న సంగతి మర్చిపోతున్నట్లుగా ఉంది. జనం ఛీకొట్టినా జగన్ ఇంతే అంటూ చంద్రబాబు మాట్లాడారని ఎల్లో మీడియాకు చెందిన ఒక పత్రిక హెడింగ్ పెట్టింది. ప్రజల మనోభావాలు గొడ్డలి పార్టీకి పట్టవు అని చంద్రబాబు అన్నట్లు మరో ఎల్లో మీడియా రాసింది. రాజకీయాలలో జనం ఛీకొట్టడం ఏమిటి? గెలుపుఓటములు అన్నవి సహజంగానే ఉంటాయి కదా!అంత మాత్రాన రాజకీయ పార్టీలు తమ కార్యకలాపాలను మానివేస్తాయా?ప్రజలలోకి వెళ్లకుండా ఉంటాయా?జగన్ శ్రీకాకుళం టూర్పై ఆయన తన అసహనం వ్యక్తం చేశారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభానికి ప్రధాని వస్తుంటే, జగన్ రెండు రోజుల ముందు ఈ టూర్ పెట్టుకోవడమని ఆయన ప్రశ్నించారట. అదేమిటి? ఈ కార్యక్రమానికి, జగన్ యాత్రకు సంబంధం ఏమిటి?అసలు సమస్య జగన్ కు జనం విపరీతంగా రావడం అన్నమాట. తమ సభలకు జనాన్ని బస్ లలో తరలించాల్సి వస్తుంటే జగన్ కు స్వచ్చందంగా ప్రజలు వస్తుండడం ఏమిటని ఆయనకు అనిపించవచ్చు. భోగాపురం సభకు జనాన్ని తీసుకురావడానికి వందల బస్సులు పెట్టడాన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు. జగన్కు జనంలో అంత విలువ,ఆదరణ ఉందేమిటన్నదే ఆయన కంగారుగా ఉంది. అది ఆయన బాధ. జగన్ యాత్రకు జనం రాకపోయి ఉంటే, ఇదే చంద్రబాబు ఏమనేవారు!ప్రజలు ఎవరూపట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించేవారా?కాదా? 2024లో ఎన్నికలలో ఏ కారణంతో అయితేనేమి.. వైఎస్సార్సీపీ ఓడిపోయిన మాట నిజమే కావచ్చు. కాని కూటమి అదికారంలోకి వచ్చిన అనతికాలంలోనే ఎందుకు వ్యతిరేకత తెచ్చుకుంది. ఈ రెండేళ్లకాలంలో జగన్ ఎక్కడికి వెళ్లినా ప్రజలు పోటెత్తుతున్నారే?దీనిపై ఆలోచించకుండా జగన్ ను తిడితే ఏమి ప్రయోజనం వస్తుంది. చంద్రబాబు చెబుతున్న దాని ప్రకారం ఏదైనా పార్టీ ఓడిపోతే జనంలోకి వెళ్లకూడదా!మరి తెలుగుదేశం పార్టీ 2019లో ఓడిపోయింది కదా! అయినా అవకాశం ఉన్నా,లేకపోయినా, కావాలని కల్పించుకుని టూర్లు పెట్టుకుని ఎన్నిచోట్ల చంద్రబాబు అలజడులు సృష్టించారో తెలియదా!ఆయన చేస్తే అది ప్రజాస్వామ్యం.. ఎదుటివారు వెళితే అది ఇంకొకటి అవుతుందా!తెలుగుదేశం పార్టీ1983లో ఆవిర్భావం తర్వాత ఎన్నిసార్లు ఓటమికి గురైందో గుర్తు లేదా! ఉమ్మడి ఏపీలో 1989లో టీడీపీ అదికారం కోల్పోయింది. స్వయంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు కల్వకుర్తిలో పరాజయం చెందారు. ఆయన నుంచి పార్టీని గుంజుకున్న తర్వాత 2004లో చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ ఓడిపోయిందే!2009లో ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసి టిఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నా మళ్లీ ఎందుకు ఓడిపోయింది? రాష్ట్ర విభజన తర్వాత 2019లో ఓడిపోయింది కనుక చంద్రబాబు ప్రజలలోకి వెళ్లకుండా లేరే! పార్టీ క్యాడర్ను ఆయా సందర్భాలలో ఎలా రెచ్చగొట్టారో తెలియదా!మరో మాట చెప్పాలి. వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం పులివెందుల నుంచి 1978 నుంచి గెలుస్తూనే వస్తోంది. జగన్ ఒకసారి ఎంపీగా రాజీనామా చేసి తరిగి పోటీచేస్తే 5.45 లక్షల ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. చంద్రబాబు 1978లో చంద్రగిరి నుంచి గెలిచినా, 1983లో ఓడిపోయారు. ఆ తర్వాత అక్కడ నుంచి కుప్పం ను తన స్థావరంగా మార్చుకున్నారు. ఎందుకు సొంత నియోజకవర్గం వదలిపెట్టారో ఎప్పుడైనా చెప్పారా!అందువల్ల చంద్రబాబు తను చేసే విమర్శలు తనకే తగులుతాయన్న సంగతి తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది కదా! ఇక ఈ మధ్య టీడీపీ ఎమ్మెల్యేలు కొందరిపై వస్తున్న ఆరోపణలు ఒక ఎత్తు అయితే, కూటమి ప్రభుత్వంపై ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులురెడ్డి చేసిన తీవ్ర ఆరోపణలు సంచనలంగా ఉన్నాయి. ప్రభుత్వంలో పెరిగిపోయిన అవినీతిని ఆయన ఎండగట్టారు.బహుశా ఆయనను దృష్టిలో ఉంచుకునేనేమో , పార్టీ టిక్కెట్ ఇచ్చింది కాబట్టే హీరోలు, లేకుంటే జీరోలే అని హెచ్చరించినట్లు అనిపించింది. పార్టీకి నష్టం కలిగించేవారిపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. వరదరాజులరెడ్డి సీనియర్ నేత. ప్రొద్దుటూరు నుంచి పలుమార్లు గెలిచారు. ఆయన పార్టీకి నష్టం చేసేలా మాట్లాడారా? లేక ప్రభుత్వంలోని అవినీతిని ఎత్తి చూపారా?ముద్రగడ పద్మనాభం సంతాప సభలకు కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు,నేతలు వెళ్లడంపై కూడా ఆయన అసహనంగా ఉన్నారన్నది తెలిసందే. వారందరి గురించి పరోక్షంగా ఆయన మాట్లాడినట్లు ఉంది. అయితే చంద్రబాబు వ్యాఖ్యలను ఆ ఎమ్మెల్యేలు కూడా అంత సీరియస్ గా తీసుకుంటారా?లేదా?అన్నది చర్చనీయాంశమే. ఎందుకంటే పార్టీలో, ప్రభుత్వంలో ఏమి జరుగుతుందో వారికి కూడా బాగానే తెలుస్తుంది కదా!నిత్యం వైఎస్సార్సీపీని గొడ్డలి పార్టీ అని సంభోధించి ఆత్మానందం చెందుతున్నారేమో తెలియదు. దానికి ప్రతిగా కొందరు వైఎస్సార్సీపీ నేతలు టీడీపీని బూడిద పార్టీ అని, వెన్నుపోటు పార్టీ అని అడ్రస్ చేస్తున్నారు జగన్ పైన, వైఎస్సార్సీపీ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం చంద్రబాబు అలవాటుగా మార్చుకు్న్నారు. అయినా జగన్ పర్యటనలకు . జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారంటే తన వ్యాఖ్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని చంద్రబాబు అర్ధం చేసుకుంటే మంచిది కదా.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
లోకేశ్ ఆదేశాలు.. పోలీసులు సమక్షంలో రెచ్చిపోతున్న టీడీపీ గూండాలు
డీఎస్సీ-2025 నియామకాల్లో అవకతవకలు, పేపర్ లీకేజీ వ్యవహారాలపై వైఎస్సార్సీపీ పోరుబాట చేపట్టింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసన దీక్షలను అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దించింది కూటమి ప్రభుత్వం. అయినప్పటికీ పలు జిల్లాల్లో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.. YSRCP DSC Porubata Updatesఏపీలో జంగిల్రాజ్వైఎస్సార్సీపీ రిలే నిరాహార దీక్షలను భగ్నం చేసేందుకు కూటమి సర్కార్ యత్నంపోలీసుల సమక్షంలోనే కొనసాగుతున్న దౌర్జన్యకాండవైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులకు పాల్పడుతున్న టీడీపీ గూండాలుకీలక నేతలు దీక్షా శిబిరాలకు వెళ్లకుండా అడ్డగింతపోలీసుల సమక్షంలోనే దీక్షా టెంట్లను పీకేస్తున్న టీడీపీ శ్రేణులుఅడ్డుపడుతున్న వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులుపలు నియోజకవర్గాల్లో తీవ్ర ఉద్రిక్తతలువిజయవాడలో అమానుషం.. అత్యంత నీచంగా వ్యవహరించిన బోండా ఉమా అనుచరులుదీక్షా శిబిరం పైనుంచి మూత్రం పోసిన బోండా అనుచరుడుమహిళలపై సైతం దాడులకు పాల్పడుతున్న టీడీపీ రౌడీలుబోండా ఉమా దౌర్జన్యం.. దాడికి యత్నండీఎస్సీ పరీక్షల్లో అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ముత్యాలపాడులో వైఎస్సార్సీపీ రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైసీపీ కార్యకర్తలు దీక్షల్లో పాల్గొన్నారు. దీక్ష శిబిరాన్ని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ధ్వంసం చేశారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వైస్సార్సీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. టీడీపీ నాయకులు గుడ్లు విసిరి దాడులకు పాల్పడ్డారు. అనంతపురం జిల్లా యాడికిలో ఉద్రిక్తతడీఎస్సీ అక్రమాలపై యాడికి మండల కేంద్రంలో వైఎస్సార్సీపీ నేతలు చేపట్టిన నిరసన దీక్ష ఉద్రిక్తతకు దారితీసింది. దీక్షా శిబిరాన్ని టీడీపీ నేతలు తొలగించారు. జేసీ వర్గీయుల కవ్వింపు చర్యలతో పాటు దౌర్జన్యం జరిగిందని తెలిపింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారని పేర్కొంది. ఈ ఘటనను వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్రంగా ఖండించారు.ఏలూరు జిల్లాలో.. డీఎస్సీ-2025 అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ కైకలూరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఏలూరు రోడ్డులో నిర్వహించిన దీక్షలకు జిల్లా అధ్యక్షుడు, కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో యువజన, విద్యార్థి విభాగాల నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. డీఎస్సీ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని, విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు చెల్లించాలని, నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేశారు.పులివెందులలో.. కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో అక్రమాలు జరిగాయని వైఎస్సార్ జిల్లా పులివెందులలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద నాలుగు రోజుల పాటు దీక్షలు కొనసాగనున్నాయి. దీక్షలో కూర్చున్న డీఎస్సీ అభ్యర్థులు, వైఎస్సార్సీపీ నాయకులకు పూలమాలలు వేసి పార్టీ నేత వైఎస్ మధురెడ్డి దీక్షలను ప్రారంభించారు.రేపల్లెలో ఉద్రిక్తత..డీఎస్సీ స్కామ్కు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రేపల్లె తాలూకా సెంటర్లో వైఎస్సార్సీపీ నిరసన దీక్ష చేపట్టింది. నియోజకవర్గ సమన్వయకర్త పీటా మోహన్కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, వైఎస్సార్సీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పీటా మోహన్కృష్ణను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.అనంతపురం జిల్లాలో.. మెగా డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ఈ దీక్షల్లో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు. డీఎస్సీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని, నిరుద్యోగులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా పార్టీ నేతలు డిమాండ్ చేశారు.శ్రీ సత్యసాయి జిల్లాలో..డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ధర్మవరంలో వైఎస్సార్సీపీ రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించిన దీక్షల్లో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు పాల్గొన్నారు. డీఎస్సీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు.ఎన్టీఆర్ జిల్లాలో జెన్జీ నిరసనలుతిరువూరు నియోజకవర్గ కేంద్రం బోసుబొమ్మ సెంటర్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఏపీ జెన్-జెడ్ రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. యువజన, విద్యార్థి విభాగాల నాయకులు, పార్టీ నేతలు దీక్షలో పాల్గొన్నారు. నియోజకవర్గ ఇన్చార్జి నల్లగట్ల స్వామిదాస్ పూలమాలలు వేసి దీక్షలను ప్రారంభించారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని, స్పోర్ట్స్ కోటాలో అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, నిరుద్యోగులకు రూ.3 వేల భృతి అందించాలని డిమాండ్ చేశారు.వైఎస్సార్ జిల్లాలో..2025లో జరిగిన డీఎస్సీ అక్రమాలపై జమ్మలమడుగులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. మైలవరం మండలానికి చెందిన విద్యార్థులు దీక్షలో పాల్గొనగా, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వారికి సంఘీభావం తెలిపారు. డీఎస్సీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు.ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న దీక్షలు.. నేటి నుండి వైఎస్సార్సీపీ రిలే నిరాహార దీక్షలురాష్ట్రమంతటా అన్ని నియోజకవర్గాల్లో కొనసాగుతున్న దీక్షలుడీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని.. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ఇప్పటికే పలు రూపాల్లో నిరసనలు తెలిపిన వైఎస్సార్సీపీకలెక్టర్లకు వినతి పత్రాలు, నిరసన ప్రదర్శనలు, టౌన్ హాలు సమావేశాలుఈరోజు నుండి 9 వరకు నియోజకవర్గాల్లో రిలే నిరాహార దీక్షలుప్రభుత్వం స్పందించకుంటే 10న పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలకు నిర్ణయంనంద్యాల జిల్లాలో.. ఆత్మకూరు ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా వైఎస్సార్సీపీ రిలే నిరాహార దీక్ష చేపట్టింది. దీక్షలో శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలు, అమలు కాని నిరుద్యోగ భృతి, పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని శిల్పా చక్రపాణిరెడ్డి డిమాండ్ చేశారు.నెల్లూరు జిల్లాలో..కోవూరులో వైఎస్సార్సీపీ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి రాష్ట్ర పీఏసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, ఆయన కుమారుడు రజిత్రెడ్డి దీక్షలో కూర్చున్నారు. మెగా డీఎస్సీ స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలని, డీఎస్సీ లీకేజీ వ్యవహారంలో మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి వెంటనే అందించాలని కోరారు.తిరుపతిలో భూమన నేతృత్వంలో దీక్షలు..మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ తిరుపతిలో వైఎస్సార్సీపీ రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట భూమన కరుణాకరరెడ్డి, భూమన అభినయ్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన దీక్షల్లో నిరుద్యోగులు, పార్టీ యువజన, విద్యార్థి విభాగాల నాయకులు పాల్గొన్నారు. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆధారాలతో సహా వెల్లడించినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా యువత రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారని, డీఎస్సీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.గురజాలలో పోలీసుల ఓవరాక్షన్డీఎస్సీ స్కాంపై లోకేష్ రాజీనామా చేయాలని బ్రహ్మనాయుడు సర్కిల్లో రిలే దీక్ష దీక్షకు సిద్ధమైన వైఎస్సార్సీపీ యువజన విద్యార్థి విభాగందీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేస్తే ఊరుకోమని హుకుం జారీ చేసిన పోలీసులుకనీసం దీక్ష శిబిరం ఏర్పాటు కూడా చెయ్యనివ్వని పోలీసులుదీక్ష శిబిరానికి సంబంధించిన టెంటును వెనుక పంపిచేసిన పోలీసులుబాపట్ల జిల్లా వేమూరులో.. అమృతలూరులో పోలీసుల ఓవరాక్షన్డీఎస్సీ స్కాంపై లోకేష్ రాజీనామా చేయాలని దీక్ష చేయడానికి రెడీ యువజన విభాగ నాయకులుదీక్షా శిబిరాన్ని తొలగించడానికి ప్రయత్నించిన పోలీసులుఅడ్డుకున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు.. ఉద్రిక్తతమాచర్లలో దీక్షకు అడ్డంకులుపల్నాడు జిల్లా మాచర్లలో డీఎస్సీ అక్రమాలపై నిరసనగా దీక్ష చేపట్టేందుకు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన సొంత స్థలం వద్ద శిబిరం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే పోలీసులు అక్కడికి చేరుకుని ఏర్పాట్లను అడ్డుకున్నారు. “మా సొంత స్థలంలో దీక్ష చేసుకుంటాం.. దానికి కూడా అనుమతి లేదా?” అంటూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసులను ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నప్పుడు తమ దీక్షను మాత్రమే ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు.గుంటూరులో టెంట్ తొలగింపుగుంటూరు జిల్లాలోనూ డీఎస్సీ వ్యవహారంపై నిరాహార దీక్షలకు వైఎస్సార్సీపీ నేతలు సిద్ధమయ్యారు. పొన్నూరులో తహసీల్దార్ కార్యాలయం ఎదుట దీక్షా శిబిరం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారని ఆ పార్టీ నేతలు తెలిపారు. శిబిరానికి వేసిన టెంట్ను పోలీసులు తొలగించారని మండిపడ్డారు. కనిగిరిలోనూ ఉద్రిక్తతమార్కాపురం జిల్లా కనిగిరిలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఏర్పాటు చేసిన రిలే దీక్ష శిబిరాన్ని పోలీసులు తొలగించారు. పట్టణంలో సాధారణంగా ధర్నాలు నిర్వహించే ప్రదేశంలోనే టెంట్ ఏర్పాటు చేశామని, అయినప్పటికీ డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు వచ్చి తొలగించారని పేర్కొన్నారు. డీఎస్సీ అక్రమాలపై శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ప్రయత్నిస్తున్న జెన్జీ విద్యార్థులను అడ్డుకోవడం సరికాదని వైఎస్సార్సీపీ కనిగిరి ఇన్చార్జి ధద్దాల నారాయణ యాదవ్ విమర్శించారు.డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ రణభేరిడీఎస్సీ-2025 నియామకాల్లో పారదర్శకత లేదంటున్న వైఎస్సార్సీపీ.. విద్యార్థులు, డీఎస్సీ అభ్యర్థులు, వివిధ సంఘాలతో కలిసి ఆందోళనలు కొనసాగించాలని నిర్ణయించింది. పార్టీ నేతలు ఈ పోరాటానికి మద్దతు ప్రకటించారు. ఈ నెల 10న విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించేందుకు కూడా సిద్ధమయ్యారు.మరోవైపు.. ఈ నిరసనల నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం అప్రమత్తమై పోలీసులను రంగంలోకి దించడం గమనార్హం. నిరసనలను అణచివేసేందుకు అధికార యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్నారని వైఎస్సార్సీపీ మండిపడుతోంది. -
ఉప్పెనలా తరలొచ్చిన జనం.. జగన్పై చెక్కుచెదరని అభిమానం (ఫొటోలు)
-
మాచర్లలో పోలీసుల ఓవరాక్షన్.. పిన్నెల్లితో వాగ్వాదం
సాక్షి, పల్నాడు: మాచర్లలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. డీఎస్సీ పరీక్షల్లో అవకతవకలు, పేపర్ లీకేజీ వ్యవహారంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ఇవాళ రాష్ట్రవ్యాప్త నిరాహార దీక్షల్లో నిర్వహించనుంది. ఇందులో భాగంగా మాచర్లలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాన్ని గతరాత్రి పోలీసులు అడ్డుకున్నారు.మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సొంత స్థలం వద్ద దీక్ష నిర్వహించేందుకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఏర్పాట్లు చేపట్టారు. అయితే శిబిరం ఏర్పాటు చేస్తున్న సమయంలో పోలీసులు అక్కడికి చేరుకుని అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. దీంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.“సొంత స్థలంలో దీక్ష చేసుకునే హక్కు కూడా లేదా?”ఈ సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసులను ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నిరసన దీక్షలు చేపడుతుంటే మాచర్లలో మాత్రమే ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. తన సొంత స్థలంలో శాంతియుతంగా దీక్ష నిర్వహించుకుంటామని స్పష్టం చేశారు. అయితే పోలీసులు మాత్రం అనుమతులు లేకుండా దీక్ష నిర్వహించేందుకు వీల్లేదని తేల్చి చెప్పారు. సొంత స్థలమైనప్పటికీ శాంతిభద్రతల దృష్ట్యా అనుమతి అవసరమని పేర్కొంటూ ఏర్పాట్లను నిలిపివేశారు.నేడు వైఎస్సార్సీపీ నిరసనలుడీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా నిరాహార దీక్షలకు పిలుపునిచ్చింది. ఈ వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది. అయితే ఇటు మాచర్లలో దీక్షా శిబిరం ఏర్పాట్లను పోలీసులు అడ్డుకోవడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. వైఎస్సార్సీపీ నేతలు దీనిని ప్రభుత్వ అణచివేతగా మండిపడుతున్నారు. -
జెన్జీ.. ప్రభంజనం దేవరపల్లిలో జన జాతర
సాక్షి ప్రతినిధి, కాకినాడ: మాజీ సీఎం వైఎస్ జగన్ దేవరపల్లి పర్యటనకు ప్రజలు, యువత బ్రహ్మరథం పట్టారు. దేవరపల్లి వీధులన్నీ జనసంద్రంగా మారాయి. వైఎస్ జగన్ బుధవారం ఉదయం 10.29 గంటలకు దేవరపల్లి గ్రామంలోని హెలిప్యాడ్కు చేరుకున్నారు. అక్కడి నుంచి పొగాకు వేలం కేంద్రానికి కేవలం 2.6 కిలోమీటర్ల దూరం ఉంది. ఆ మాత్రం దూరానికి 2 గంటలకు పైగా సమయం పట్టిందంటే ఏ స్థాయిలో ప్రజలు ఆయనకు స్వాగతం పలికారో అర్థం చేసుకోవచ్చు. వైఎస్ జగన్ హెలికాఫ్టర్ దిగిన వెంటనే పెద్ద ఎత్తున యువత, ప్రజలు, అభిమానులు హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. పర్యటన సాగిన మార్గమంతా యువత, అభిమానులు, కార్యకర్తల సందడితో కోలాహలంగా మారింది. రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. ఎటు చూసినా జన సంద్రమే కనిపించింది. దారిపొడవునా జగన్ ప్రజలకు అభివాదం చేస్తూ వచ్చారు. జగన్ పర్యటనకు ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలోని పలు గ్రామాలు, పట్టణాల నుంచి కార్యకర్తలు, అభిమానులు, రైతులు, ప్రజలు భారీ సంఖ్యలో తరలి రావడంతో దేవరపల్లిలో భారీ జనసందోహం కనిపించింది. ఉరకలేసిన జెన్ జీ వైఎస్ జగన్ రాక సందర్భంగా దేవరపల్లిలో యువత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా జెన్జీ యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి జగన్కు స్వాగతం పలికారు. యువకులు, విద్యార్థులు రోడ్ల వెంట నిలబడి జెండాలు, ప్లకార్డులతో స్వాగతం పలికారు. జగన్ వాహనం కనిపించగానే ‘జై జగన్.. సీఎం.. సీఎం’ అంటూ పెద్ద పెట్టున నినాదాలతో హోరెత్తించారు. పలుచోట్ల పూల వర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. మిద్దెలు, చెట్లెక్కిన అభిమానం వైఎస్ జగన్ను చూసేందుకు యువత, అభిమానులు చెట్లెక్కారు. మహిళలు మిద్దెలెక్కి మరీ జననేతను చూశారు. అడుగో.. జగన్.. అంటూ పిల్లలకు చూపించారు. జగన్ వారికి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, కోనసీమ పార్లమెంట్ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, సత్తి సూర్యనారాయణరెడ్డి, జి.శ్రీనివాసులు నాయుడు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ జగన్ దేవరపల్లి పర్యటన గోదావరి జిల్లాల్లో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపింది. -
తొక్కిసలాట జరగాలి.. జగన్పైకి తోయాలి
సాక్షి, రాజమహేంద్రవరం/సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి పర్యటనను విఫలం చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరించింది. హెలిప్యాడ్ వద్ద, పొగాకు వేలం కేంద్రంలో పోలీసుల వైఫల్యం కళ్లకు కట్టింది. మాజీ ముఖ్యమంత్రి పర్యటనలో ఉద్దేశ పూర్వకంగానే సెక్యూరిటీని తగ్గించి.. తద్వారా గందరగోళం సృష్టించి.. తొక్కిసలాట జరిగితే జగన్ పైకి అపవాదు నెట్టేయాలన్నది ప్రభుత్వ పెద్దల కుతంత్రం అని స్పష్టమవుతోంది. అయితే వైఎస్సార్సీపీ నేతల పర్యవేక్షణతో ప్రభుత్వ పన్నాగం బెడిసికొట్టింది. వైఎస్ జగన్ బుధవారం ఉదయం 10.27 గంటలకు దేవరపల్లి సమీపంలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. అభిమాన నాయకుడికి స్వాగతం పలికేందుకు వైఎస్సార్సీపీ నాయకులు, శ్రేణులు అప్పటికే అక్కడికి భారీగా చేరుకున్నారు. అయినప్పటికీ పోలీసు ఉన్నతాధికారులు నామమాత్రంగా సిబ్బందిని కేటాయించారు. వారు దూరంగా ఉండటంతో ఒక్కసారిగా జనం బారికేడ్లను తోసుకుని హెలీప్యాడ్ వద్దకు దూసుకుపోయారు. అప్పుడు అక్కడ కనీసం ఒక్క కానిస్టేబుల్ కూడా లేడు. దీంతో అతి కష్టం మీద వైఎస్ జగన్ కారు వద్దకు చేరుకుని.. ఎక్కారు. అప్పటికే చాలా మంది ఆ వాహనం చుట్టూ చేరిపోయారు. ఇటీవల మరణించిన పొగాకు రైతు పాల వెంకటేశ్వరరావు భార్య సీతారత్నం, కుమారుడు శ్రీనివాస్, కుమార్తె వెంకటరత్నం తమ సమస్యలు విన్నవించుకోగా.. నేనున్నానని భరోసా ఇస్తున్న వైఎస్ జగన్ ఈ క్రమంలో జరిగిన తోపులాటలో పలువురు నేతలు, కార్యకర్తలు కింద పడిపోయారు. వెంటనే పలువురు నేతలు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అక్కడి నుంచి ర్యాలీగా పొగాకు వేలం కేంద్రంలో రైతులతో మాట్లాడేందుకు వైఎస్ జగన్ చేరుకోగానే, అక్కడా భారీగా జనం దూసుకొచ్చారు. వారిని నియంత్రించేందుకు లోపల పోలీసులు లేకపోవడం గమనార్హం. ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన ఆదేశాల మేరకే పోలీసు ఉన్నతాధికారులు ఇలా ఇబ్బందికర, ప్రమాదకర పరిస్థితిని సృష్టించారని తెలుస్తోంది. ఇది ముమ్మాటికీ కుట్రే ‘వారం రోజులుగా తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్సీపీ నాయకులు హెలిప్యాడ్, ఇతర పరి్మషన్లు, సెక్యూరిటీ గురించి కలెక్టర్కు, ఎస్పీకి లేఖల ద్వారా విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. 400 మంది పోలీసులతో బందోబస్తు ఇస్తామని చెప్పి, అర్ధరాత్రి హుటాహుటిన ఆ సంఖ్యను సగం కంటే ఎక్కువగా తగ్గించారు. దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న నాయకుడికే రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం, సామాన్య ప్రజలకు ఇంకేమి రక్షణ కల్పిస్తుంది? జగన్కు ఉన్న ప్రజాదరణను చూసి ఓర్వలేక, ప్రభుత్వం పెద్దలే కుట్రపూరితమైన ఆలోచనతో సెక్యూరిటీని తగ్గించారు. ఇది ముమ్మాటికీ కుట్రే. ఈ విషయమై అవసరమైతే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి, న్యాయ పోరాటం చేస్తాం’ అని వైఎస్సార్సీపీ పేర్కొంది.జన సందోహం వల్లేతోపులాటదీనితో వైఎస్సార్సీపీకి సంబంధం లేదుస్పష్టం చేసిన హోటల్ నిర్వాహకులుఓ ఛానల్ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని వెల్లడిదేవరపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోసం ప్రజలు విశేష సంఖ్యలో రావడం, వారిలో చాలా మంది తమ హోటల్కు రావడం వల్ల రద్దీ ఏర్పడి, స్వల్ప నష్టం జరిగిందని, ఈ ఘటనకు వైఎస్సార్సీపీకి సంబంధం లేదని తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలోని హోటల్ నిర్వాహకులు చందన వరలక్ష్మి, చందన దివ్య తెలిపారు. తమ కుటుంబం వైఎస్ జగన్ అభిమానులమని, ఆయన వల్ల ఎంతో లబ్ధి పొందామని వరలక్ష్మి చెప్పారు. తమ హోటల్ పొగాకు వేలం కేంద్రం గేటు పక్కన ఉండడం, పలువురు హోటల్లోకి రావడం వల్ల స్పల్ప తోపులాట జరిగి, కొంత నష్టం జరిగిందన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు హోటల్ను ధ్వంసం చేసినట్టు ఓ టీవీ ఛానల్ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. హోటల్లో వీడియో తీయవద్దని, తమకు నష్ట పరిహారం వద్దని చెప్పామని, అయినా ఆ ఛానల్ ప్రతినిధి వీడియో తీసి తప్పుగా ప్రచారం చేశాడని మండిపడ్డారు. తాము ఎప్పటికీ జగన్ అభిమానులమేనని వరలక్ష్మి స్పష్టం చేశారు. -
మాజీ ఎమ్మెల్యే ముస్తఫాకు 14 రోజులు రిమాండ్ విధించిన కోర్టు
ఆంధ్రప్రదేశ్: గుంటూరు తూర్పు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా, ఆయన తనయుడు బషీర్పై నూజివీడు పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మంగళవారం గుజరాత్లో ఉన్న ముస్తఫాను పోలీసులు అదుపులోకి తీసుకుని నూజివీడుకు తీసుకొచ్చారు.అనంతరం ఆయనను నూజివీడు కోర్టులో హాజరుపరచగా, కేసును విచారించిన న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు ముస్తఫాను నెల్లూరు జైలుకు తరలించారు. కాగా, ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ న్యాయస్థానంలో కొనసాగనుంది.


