YSRCP
-
చంద్రబాబూ.. ఇంత బరితెగింపా?: ఎమ్మెల్యే చంద్రశేఖర్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు కాదని.. విషం చిమ్మే నాయకుడంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. చంద్రబాబు బరితెగించి మాట్లాడుతున్నారని.. ఆయనకు ఎందుకింత కక్ష అంటూ ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు చేసింది విద్వేషపూరిత వ్యాఖ్యలు.. మేం తలుచుకుంటే వైఎస్సార్సీపీ నేతలు రోడ్లపై తిరగలేరని హోంమంత్రి మాట్లాడుతున్నారు’’ అని చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘చంద్రబాబుకి ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉందా?. పచ్చబిళ్ల పెట్టుకున్న వాళ్ల పనులు చేసిపెట్టమన్న అచ్చెన్నాయుడి వ్యాఖ్యలకు కొనసాగింపే చంద్రబాబు వ్యాఖ్యలు. రాగ ద్వేషాలతో సీఎం, హోంమంత్రి మాట్లాడుతున్నారు. వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడితే అక్రమంగా కేసులు పెడుతున్నారు. దాడులు చేస్తున్నారు. అనారోగ్యంతో ఉన్నా క్రూరంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి కేవలం టీడీపీ నేతల కోసం పనిచేస్తారా.. లేక ప్రజలందరి కోసం పనిచేస్తారా?’’ అంటూ చంద్రశేఖర్ నిలదీశారు.‘‘తన కొడుకును సీఎం చేసుకోవటానికి లోకేష్ నియోజకవర్గానికి నిధులు మళ్లిస్తున్నారు. ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తున్నారు. కులం, మతం చూడకుండా జగన్ పాలన చేశారు. ప్రస్తుత కూటమి పాలనలో అంతా వివక్షే. రెడ్డి సామాజికవర్గంపై కక్ష సాధిస్తున్నారు. దళిత ఆఫీసర్లను ఇబ్బందులు పెడుతున్నారు. తన వ్యాఖ్యలపై చంద్రబాబు తక్షణమే క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు వ్యాఖ్యలపై గవర్నర్, కేంద్రం స్పందించాలి’’ అని చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.‘‘గుక్కెడు నీటి కోసం ఇబ్బంది పడే పశ్చిమ ప్రకాశంపై ఎందుకు మీకింత పగ?. వెలిగొండ ప్రాజెక్ట్పై నిజాలు మాట్లాడే దమ్ముందా?. మంత్రి నిమ్మల రామానాయుడు వెలిగొండ ప్రాజెక్టు ఆర్అండ్ఆర్ ప్యాకేజ్కు నిధులు కేటాయించకుండా మాటలు చెబుతున్నారు. వెలిగొండ కోసం త్వరలో పాదయాత్ర చేపట్టబోతున్నాం. ఎర్రగొండపాలెనికి మీ శాఖ ద్వారా ఏం చేశారో పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. వెలిగొండను సందర్శించి పవన్ కళ్యాణ్ వాస్తవాలు తెలుసుకోవాలి’’ అని చంద్రశేఖర్ హితవు పలికారు. -
చంద్రబాబు వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్దం: శైలజానాథ్
అనంతపురం: ఏపీలో టీడీపీ కూటమికి చట్టం చుట్టామా అని అన్నారు. మాజీ మంత్రి శైలజానాథ్. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధం అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు సంక్షేమం, అభివృద్ధి అందకూడదు అంటే ఎలా? అని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ నాయకులు శైలజానాథ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్థాయిని దిగజార్చుకున్నారు. ఆయన వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధం. చేసిన ప్రమాణానికి విరుద్ధంగా చంద్రబాబు వ్యవహార శైలి ఉంది. అంతఃకరణ శుద్ధితో పనిచేయాలని భారత రాజ్యాంగం చెబుతోంది. సీఎం, మంత్రులు రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాలి. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు సంక్షేమం, అభివృద్ధి అందకూడదు అంటే ఎలా?.రాష్ట్రంలో కులాలు, మతాలకు అతీతంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సంక్షేమ ఫలాలు అందించారు. వైఎస్ జగన్ను చూసి చంద్రబాబు పాలన నేర్చుకోవాలి. వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై అసభ్య పదజాలంతో టీడీపీ కూటమి నేతలు పోస్టింగ్స్ పెడుతున్నారు. టీడీపీ కూటమికి చట్టం చుట్టమా?. వారు ఎన్ని తప్పులు చేసినా ఎక్కడా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు ఎందుకు?’ అని ప్రశ్నించారు.రెడ్బుక్ పేరుతో లోకేష్ అరాచకలు..మరోవైపు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు దుర్మార్గం. వైఎస్సార్సీపీ నేతలపై చంద్రబాబు వ్యాఖ్యలు అప్రజాస్వామికం. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ప్రజలందరికీ బాధ్యుడిగా ఉండాలి. చంద్రబాబు తన వ్యాఖ్యలను వెంటనే ఉప సంహరించుకోవాలి. లేకపోతే ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు అనర్హుడు అని భావిస్తాం. రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో నారా లోకేష్ అరాచకాలు చేస్తున్నారు. బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగితే సీఎం హోదాలో ఉన్న వైఎస్సార్ రాజకీయాలు చూడలేదు. కులాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్ జగన్దే’ అని తెలిపారు. -
వైఎస్సార్ సీపీ యూత్ లీడర్ ఈశ్వర్ అరెస్ట్
నర్సీపట్నం(అనకాపల్లి): కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగాన్నే అమలు చేస్తూ వైఎస్సార్సీపీశ్రేణులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వరుస అరెస్ట్ లకు తెరతీసింది. ఆదివారం నర్సీపట్నం వైఎస్సార్సీపీయూత్ లీడర్ ఈశ్వర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిరుద్యోగులను మోసం చేశాడని అక్రమ కేసు బనాయింది అరెస్ట్ చేశారు పోలీసులు. ఈశ్వర్ ను అరెస్ట్ చేసిన అనంతరం ఆసుపత్రికి తరలించారు.ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్.. ఈశ్వర్ ను ఆసుపత్రిలో పరామర్శించారు. దీనిలో భాగంగా ఉమా శంకర్ గణేష్ మాట్లాడుతూ.. ‘ వైఎస్సార్సీపీనేతలపై తప్పుడు కేసులు పెట్టి భయపెట్టాలని అయన్న పాత్రుడు పని చేస్తున్నాడు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఒత్తిడితోనే అధికారులు పని చేస్తున్నారు. ఈ శ్వర్ పై పెట్టిన కేసు అక్రమ కేసని పోలీసుల మనస్సాక్షికి కూడా తెలుసు. కానీ అయ్యన్న ఒత్తిడి ముందు ఆలోచించి పనిచేస్తున్నారు. చీటింగ్ కేసులో స్వయంగా డీఎస్పీ రంగంలోకి దిగడం ఆశ్చర్యం కల్గించింది’ అని పేర్కొన్నారు.ఇటీవల వైఎస్సార్ సీపీకి చెందిన నేత వల్లభనేని వంశీతో పాటు, ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళిని సైతం అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
‘జల్జీవన్’కు రాజకీయ జాఢ్యం
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ నీటి కుళాయిల ఏర్పాటుకు అమలు చేస్తున్న జల్జీవన్ కార్యక్రమానికి రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం రాజకీయ రంగు పులుముతోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన పనులను రద్దుచేసి, తిరిగి టీడీపీ నేతలు, అధికార పార్టీల ఎమ్మెల్యేలు సిఫారసు చేసిన వాటికి మళ్లీ అనుమతిస్తోంది. నిజానికి.. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక, కుళాయిల ఏర్పాటు కోసం గత ప్రభుత్వం మంజూరు చేసిన 44,194 పనులను రద్దు చేసింది. వీటిల్లోని 7,792 పనులను తిరిగి కొనసాగించేందుకు శుక్రవారం నాటి కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపింది. గత డిసెంబరులో రద్దు చేసిన పనుల విలువ రూ.10,680.50 కోట్లు కాగా.. వాటిలో తిరిగి కొనసాగించాలని నిర్ణయించిన పనుల విలువ రూ.2,210 కోట్లు. ఎన్నికల్లో అందరికీ అని హామీ ఇచ్చి..మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్కళ్యాణ్ తమ ఉమ్మడి మేనిఫెస్టోలో ‘ఇంటింటికీ తాగునీరు–ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్’ అంటూ హామీ ఇచ్చారు. కానీ, వీరి ప్రభుత్వం ఇప్పుడు ఆమోదం తెలిపింది కేవలం మూడు లక్షలకే. ఈ హామీ పట్ల కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గత ప్రభుత్వం మంజూరు చేసిన మొత్తం 25.08 లక్షల ఇళ్లకు కుళాయిల ఏర్పాటు పనులను రద్దు చేసేదే కాదు. పైగా.. అలా రద్దయిన వాటిలోనూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ టీడీపీ నేతలు సూచించిన కొన్ని పనులను తిరిగి కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయించడం కేంద్ర ప్రభుత్వ కార్యక్రమానికి రాజకీయ రంగు పులమడమే అవుతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.జగన్ హయాంలో 39.34 లక్షల ఇళ్లకు కుళాయిలు..వాస్తవానికి.. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 95.53 లక్షల ఇళ్లుండగా.. 2019 ఆగస్టు 15 వరకు అంటే గత 72 ఏళ్లుగా కేవలం 30.74 లక్షల ఇళ్లకు మాత్రమే కుళాయిలు ఉన్నాయి. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు కొత్తగా 39.71 లక్షల ఇళ్లలో ఏర్పాటుకాగా, ఇందులో 39.34 లక్షల కుళాయిలు వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే ఏర్పాటయ్యాయి. ఇంకా 25.08 లక్షల ఇళ్లకు ఏర్పాటు చేయాల్సి ఉంది. -
వైఎస్సార్సీపీ వాళ్లకు చిన్న పని చేసినా ఊరుకోను: చంద్రబాబు
చూశారా.. ఇద్దరు నాయకుల మధ్య ఎంత తేడానో! తనకు ఓటు వేయకపోయినా అర్హత ఉంటే చాలు.. సంక్షేమ పథకాలు అందించాలనే తపన కలిగిన వ్యక్తిత్వం ఒకరిది.. తనకు ఓటు వేయని వారిని పాముతో పోల్చిన నైజం ఇంకొకరిది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు చేరవేయాలనే తాపత్రయం ఒకరిది.. తన వాళ్లకు మాత్రమే లబ్ధి జరగాలనే స్వార్థం మరొకరిది.. ప్రతి కుటుంబం, ప్రతి ఒక్కరూ బాగుండాలని అనుక్షణం పరితపించిన తీరు ఒకరిది.. ఎదుటి వాళ్లపై కక్ష సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న కుతంత్రం మరొకరిది.. తను చనిపోయాక కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా మంచి చేయాలన్న ఆరాటం ఒకరిది.. మనవాళ్లు కాని వారందరినీ అణచి వేయాలన్న కుట్ర మరొకరిది.. చిత్తూరు అర్బన్/ సాక్షి, అమరావతి : వైఎస్సార్సీపీ వాళ్లకు చిన్న పని చేసినా ఊరుకోనని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే అధికారులు, టీడీపీ నేతలను హెచ్చరించడం కలకలం రేపింది. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరులో శనివారం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం సర్వత్రా విస్మయ పరిచింది. కులం, మతం, ప్రాంతం, రాజకీయం చూడకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలని గత సీఎం వైఎస్ జగన్ పరితపిస్తే.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఇలా మాట్లాడటం విస్తుగొలిపింది.విజనరీనని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా, కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ వారికి ఎలాంటి లబ్ధి చేకూరకూడదని బహిరంగంగా ఆదేశించడంపై రాజకీయ విశ్లేషకులు, పలు పార్టీల నేతలు విస్తుపోతున్నారు. బహుశా ప్రపంచంలోనే ఇలా ఎక్కడా జరిగి ఉండదు. రాగద్వేషాలకు అతీతంగా పని చేస్తానని ప్రమాణం చేసి.. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా దిగజారి వ్యవహరించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. రాజ్యాంగ బద్ధమైన ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఇలా వ్యాఖ్యానించడం సబబేనా అనే చర్చ మొదలైంది. సీఎం స్థానంలో ఉంటూ ప్రజలందరినీ సమాన దృష్టితో చూడాల్సిందిపోయి ఇలా మాట్లాడటం తగదంటున్నారు. నాడు వైఎస్ జగన్ కూడా ఇలానే ఆలోచించారా.. అంటూ ప్రశ్నిస్తున్నారు. నాడు సంతృప్త స్థాయిలో పథకాలు అమలు చేయడం మీరు గమనించలేదా.. రాజకీయాలు అనేవి ఎన్నికల వరకేనని, ఆ తర్వాత అందరూ మనవాళ్లేనని వైఎస్ జగన్ పదేపదే చెప్పడం గుర్తు లేదా అని ప్రజలు గుర్తు చేస్తున్నారు. జగన్ పథకాల వల్ల తాము ఎంతగానో లబ్ధి పొందామని ఊరూరా అందరితోపాటు టీడీపీ వారు సైతం అప్పట్లో స్వచ్ఛందంగా చెప్పుకున్నారని చెబుతున్నారు. ఏం చేయాలో దిక్కు తెలియడం లేదట! ఓ వైపు రాష్ట్రంలో ఆదాయం లేదని, ఏం చేయాలో దిక్కు తోచడం లేదని చెప్పుకొచి్చన ముఖ్యమంత్రి చంద్రబాబు మరో వైపు అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే 12.9 శాతం వృద్ధి రేటు సాధించేశానని లేని గొప్పలు చెప్పడం విస్తుగొలుపుతోంది. సంక్షేమ పథకాలు ఎలా అమలు చేయాలో దిక్కు తెలియడం లేదని అంటూనే వృద్ధి రేటు పెంచేశానని చెప్పుకోడం పచ్చి అబద్ధమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఆదాయం అంతా తన చుట్టూ ఉన్న వారికి కమిషన్ల రూపంలో దోచిపెట్టి.. ‘నీకింత.. నాకింత’ అని పంచుకోవడానికే సరిపోతోందని అంటున్నారు.నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టులు కట్టబెడుతూ, మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేస్తూ.. వాటిలో కమిషన్లు కొట్టేస్తూ ఆదాయం లేదనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆద్యంతం వైఎస్సార్సీపీ నేతలను తిట్టిపోశారు. రూ.10 లక్షల కోట్లు అప్పులు చేశారని, ఆ అప్పుల నుంచి ఎలా బయట పడాలో తెలియడం లేదని.. తానొక్కడినే పరుగెడుతూ ఉన్నానని చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరు ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని, వారి బాగోగులను చూసే బాధ్యత తనదన్నారు. సూపర్ సిక్స్ హామీల సంగతి చెప్పవయ్యా అంటే.. ఆకాశానికి నిచ్చెన వేసేలా మాట్లాడటం చూసి ప్రజలు నవ్వుకున్నారు. రెండు రాష్ట్రాల్లో పార్టీని కాపాడుకోవడం చారిత్రాత్మక అవసరం అన్నారు. చిన్న పిల్లల తల్లిదండ్రుల వ్యక్తిగత విషయాలు బహిర్గతం చేస్తారా? ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు తాను ఏం చేస్తున్నాననే విషయం విస్మరించారు. ఎనిమిది, పదేళ్ల వయస్సున్న ఇద్దరు ఆడ పిల్లల్ని సభలో తన పక్కన కూర్చోబెట్టుకుని అధికారులు, మీడియా ఎదుట వారి తల్లిదండ్రుల వ్యక్తిగత విషయాలను వెల్లడించడం చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. వీళ్ల నాన్న మరో మహిళతో వెళ్లిపోయాడు.. వీళ్ల అమ్మ మరో వ్యక్తి వెంట వెళ్లిందంటూ మాట్లాడటం విస్తుగొలిపింది. తద్వారా ఆ పిల్లల మనస్సును ఎంతగా గాయ పరిచారో సీఎం తెలుసుకోలేకపోయారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం.. వాసు, సెల్వి దంపతుల ఇంట్లోకి వెళ్లి పింఛన్ డబ్బులిచ్చారు. ‘సార్ కాస్త నీళ్లు తాగండి..’ అంటూ సెల్వి ఆప్యాయంగా అడగ్గా.. ‘అవి వద్దమ్మా.. నా వద్ద ఉన్న నీటినే తాగుతాను’ అంటూ హిమాలయ కంపెనీ నీళ్ల బాటిల్ చూపిస్తూ అందులోని నీళ్లు తాగారు. సర్పంచ్ వి.సి. సుబ్రమణ్యం యాదవ్ వైఎస్సార్సీపీకి చెందిన వారని వేదికపై చోటు కల్పించలేదు. -
వైఎస్సార్సీపీ శ్రేణులే లక్ష్యంగా చంద్రబాబు కక్షపూరిత వ్యాఖ్యలు
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు చర్యలు ఒక్కోక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వైఎస్సార్సీపీ శ్రేణులే లక్ష్యంగా ఇప్పటికే కుట్ర పూరిత రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు.. ఈసారి ఏకంగా ఆ పార్టీకి చెందిన వారికి ఏ పనులు చేయొద్దంటూ వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం రేపుతోంది. వైఎస్సార్ సీపీకి చెందిన వారికి ఎటువంటి పనులు చేయొద్దని చంద్రబాబు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా వైఎస్సార్ సీపీ శ్రేణులకు ఏ పనులు చేయకండని, అన్ని స్థాయిల్లోనూ ఇది వర్తిస్తుందని వ్యాఖ్యానించారు. తన సొంత జిల్లా(చిత్తూరు జిల్లా) పర్యటనలో భాగంగా ప్రజా వేదిక పేరుతో ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు ఈ రకంగా కక్ష పూరిత వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలపై విమర్శలుముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు ఈ తరహా కక్ష సాధింపు వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. గతంలో పార్టీ రహితంగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాలన అందిస్తే, ఇప్పుడు చంద్రబాబు ఇలా వ్యాఖ్యానించడం కక్ష పూరిత రాజకీయం కాకపోతే ఏంటని రాజకీయ విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. సీఎంగా ప్రమాణం చేసే సమయంలో రాజ్యాంగాన్ని గౌరవిస్తానంటూ చంద్రబాబు చేసిన ప్రమాణం ఏమైందని మండిపడుతున్నారు. ఇది రాజ్యాంగానికి, సీఎం ప్రమాణానికి విరుద్ధమంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
‘మేం చర్చకు సిద్ధం ...మీరు సిద్ధమా?’
విజయవాడ: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పాలన, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో పాలనపై చర్చకు సిద్ధమా అంటూ ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ సవాల్ విసిరారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా వైఎస్సార్ సీపీపై ఆరోపణలు చేస్తూ జగన్ పాలన పై కూటమి నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డ అవినాష్.. ఇరు ప్రభుత్వాల పాలనపై చర్చకు సిద్ధమా అంటూ కూటమి ప్రభుత్వాన్ని సవాల్ చేశారు.ఇచ్చిన హామీల గురించి పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదు. కూటమి ప్రభుత్వం బడ్జెట్ తో అందరినీ మోసం చేసింది. ఈ బడ్జెట్ చూసి రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరూ బాధ పడుతున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు కలిసి ప్రజలను మోసం చేశారు. ఇచ్చిన హామీల గురించి పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదు. రైతులను,విద్యార్థులను, నిరుద్యోగులను, మహిళల్ని మోసం చేశారు. జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి పాలన చేశారు. గ్రూప్ 2 కి ప్రిపేర్ అయిన వారిని అనేక ఇబ్బందులు పెట్టారు. రాష్ట్రంలో టార్గెట్ చేసి వైఎస్సార్ సీపీ నాయకులు హింసిస్తున్నారు. వైఎస్సార్ సీపీ నేతలను ఇబ్బంది పెడితే పార్టీ అండగా ఉంటుంది’ అని దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. -
ఏపీ బడ్జెట్లో ఉద్యోగులకు తీరని అన్యాయం: చంద్రశేఖర్రెడ్డి
సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర బడ్జెట్లో ఉద్యోగులకు తీరని అన్యాయం జరిగిందని వైఎస్సార్సీపీ ఎంప్లాయిస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.30,000 కోట్ల బకాయిలపై బడ్జెట్లో ఎక్కడా కేటాయింపులు లేకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలపై బడ్జెట్లో ప్రస్తావనే లేకపోవడం నిరాశను మిగిల్చిందని ధ్వజమెత్తారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..ఉద్యోగులకు ఇచ్చిన హామీలను విస్మరించారుఉద్యోగులకు మెరుగైన పీఆర్సీని ఇస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. అధికారలోకి వచ్చి తొమ్మిది నెలలు అయినా కూడా ఇప్పటి వరకు పే రివిజన్ కమిషన్ ఏర్పాటే చేయలేదు. బడ్జెట్ లో పీఆర్సీ గురించి ఎక్కడా మాట్లాడలేదు. అసలు ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చే ఉద్దేశమే ఈ ప్రభుత్వానికి లేదని తెలుస్తోంది. ప్రభుత్వం రాగానే మధ్యంతర భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు దీని గురించి మాట్లాడేవారే లేరు. బడ్జెట్లో దీనికి ఒక్క రూపాయి కూడా దీనికి కేటాయించలేదు. గతంలో వైఎస్ జగన్ మా ప్రభుత్వం వస్తే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చారు.ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చి, కేవలం ఒక్క నెలలో మాత్రమే దానిని కార్యరూపంలో చూపించారు. గత ఎనిమిది నెలల నుంచి ఏ తేదీన జీతాలు, పెన్షన్లు ఇస్తారో తెలియడం లేదు. ఉద్యోగులకు సంబంధించి దాదాపు రూ.30 వేల కోట్లు బకాయిలు ఇవ్వాల్సి ఉంది. గ్రాట్యుటీ, మెడికల్ రీయింబర్స్ మెంట్, సరెండర్ లీవులు, పీఆర్సీ, డీఏ ఎరియర్స్ ఉన్నాయి. వాటన్నింటినీ సకాలంలో ఇవ్వాల్సని బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఈ బకాయిలను ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందా? ఈ బకాయిల చెల్లింపుల కోసం ఎంత కేటాయిస్తున్నారో బడ్జెట్ లో ఎక్కడా చెప్పలేదు.తాత్కాలిక ఉద్యోగులను మోసం చేశారుఅవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలను వర్తింప చేస్తామని హామీని నేటికీ నెరవేర్చలేదు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం, మా ప్రభుత్వం రాగానే అయిదు నుంచి పదివేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. వాలంటీర్లను ఇప్పుడు రోడ్డుమీద పడేశారు. ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ కింద పనిచేస్తున్న పదివేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను వీధుల్లోకి తీసుకువచ్చారు. వారికి కనీస ఉద్యోగ భద్రత కల్పించలేదు. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ను రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం భర్తీ చేయాల్సీ ఉంది. గత ప్రభుత్వంలో పదివేల మందిని గుర్తించి, వారిలో మూడు వేల మందికి అపాయింట్ మెంట్ ఆర్డర్లు కూడా ఇవ్వడం జరిగింది. మిగిలిన ఏడు వేల మందికి ఇప్పటి వరకు అపాయింట్ మెంట్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. గ్రామసచివాలయాల్లో పదిహేను వేలు, రైతుభరోసా కేంద్రాల్లో ఆరువేల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది. వీటి గురించి బడ్జెట్ లో ఎక్కడా ప్రస్తావించకపోవడం దారుణం.మెగా డీఎస్సీ పేరుతో ప్రభుత్వ దగాకూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత మెగా డీఎస్సీని నిర్వహించి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మొదటి ఫైల్గా దీనిపైనే సంతకం చేశారు. కానీ నోటిఫికేషన్ షెడ్యూల్, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మాత్రం మొదలు పెట్టలేదు. ఇవ్వేవీ చేయకుండా బడ్జెట్లో డీఎస్సీ కింద 16,347 టీచర్ ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టామంటూ గొప్పగా చెప్పుకున్నారు. అంటే వచ్చే అయిదేళ్ల పాటు ఇదే చెప్పుకుంటూ పోతారా? ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత నాలుగు లక్షల ఉద్యోగాలను కల్పించామని గవర్నర్ ప్రసంగంలో అబద్దాలు చెప్పారు.అంగన్వాడీలకు గ్రాట్యూటీ చెల్లిస్తున్నామంటూ బడ్జెట్ లో పేర్కొనడం ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటి వరకు దీనిపై ఎటువంటి అధికారిక ఉత్తర్వులు లేకుండానే అమలు జరిగిపోతోందోని చెప్పడం ఎంత వరకు సమంజసం? పోలీస్ విభాగంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.920 కోట్లు ఉంటే, దానిలో రూ.250 కోట్లు చెల్లించామని చెప్పుకున్నారు. మిగిలిన బకాయిల విషయం ఏమిటనే దానిపై స్పష్టత లేదు.ఇప్పటి వరకు రాష్ట్రంలో మూడు డీఏలు బకాయి పెట్టారు. ధరలు పెరుగుతుండటం వల్ల ఉద్యోగులకు ఇబ్బంది ఉండకూడదనే డీఏ ఇస్తుంటారు. దానిని కూడా మూడు విడతలు బకాయి పెట్టడం దారుణం. నిరుద్యోగభృతి అమలుకు కేటాయింపులు లేవు. కొత్త ఉద్యోగాల భర్తీకి గానూ ప్రకటిస్తామన్న జాబ్ క్యాలెండర్ ఏదీ? అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించేందుకు గత ప్రభుత్వం అప్కాస్ ను తీసుకువచ్చింది. దానిని నిర్వీర్యం చేస్తూ కూటమి ప్రభుత్వం దళారీల వ్యవస్థను ప్రోత్సహిస్తోంది. ఉద్యోగుల ఆరోగ్యభద్రతకు సంబంధించిన హెల్త్ కార్డ్ లకు ఉద్యోగులు, పెన్షనర్లు తమ వాటాను వారు చెల్లిస్తున్నా, ప్రభుత్వం చెల్లించాల్సిన వాటాను సకాలంలో చెల్లించడం లేదు. దీనివల్ల ఉద్యోగులకు వైద్యం చేసేందుకు ఆసుపత్రులు నిరాకరిస్తున్నాయి. -
అబద్ధాల కుప్పగా ఏపీ బడ్జెట్: మార్గాని భరత్
సాక్షి, తూర్పుగోదావరి: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అబద్ధాల కుప్పగా, చంద్రబాబు మోసాలకు ప్రతిరూపంగా ఉందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆక్షేపించారు. ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పిన మాటలకు, ఇప్పుడు కేటాయింపులకు పొంతన లేకుండా బడ్జెట్ రూపొందించారని, ఇదంతా సూపర్ సిక్స్ పథకాల అమల్లో ప్రజలను మోసం చేయడంలో భాగమే అని ఆయన ఆరోపించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు అరకొర నిధులు కేటాయించడం చూశాక వాటిని కూడా సక్రమంగా అమలు చేయరన్నది స్పష్టమవుతోందని రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన మార్గాని భరత్ చెప్పారు.మార్గాని భరత్ ఇంకా ఏమన్నారంటే..:ఎవరు కౌటిల్యుడు? ఎవరు చంద్రగుప్తుడు?:అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా పయ్యావుల కేశవ్ తనను తాను కౌటిల్యుడిగా, చంద్రబాబును చంద్రగుప్త మౌర్యుడిగా పోల్చాడు. సామాన్యుడి సంక్షేమమే తన సంక్షేమంగా భావించి ప్రజలకు మేలు చేసిన చంద్రగుప్త మౌర్యుడితో చంద్రబాబును పోల్చడం విడ్డూరంగా ఉంది. సూపర్ సిక్స్ హామీలకు సంబంధించిన బడ్జెట్లో నిధులు కేటాయించకుండా గొప్పలు చెప్పుకోవడం కన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా?. ఇప్పటికే కూటమి ప్రభుత్వం దాదాపు రూ.1.40 లక్షల కోట్ల అప్పు చేసింది. మరోవైపు బడ్జెట్ ప్రసంగంలో భారతదేశంలో అప్పు తీసుకునే శక్తి లేని రాష్ట్రంగా ఏపీ తయారైందని ఆర్థిక మంత్రి పచ్చి అబద్ధాలు చెప్పారు. ప్రభుత్వం ప్రతిపాదించిన రూ.3.22 లక్షల కోట్ల బడ్జెట్లో ఆదాయం కింద రూ.2.17 లక్షల కోట్లు వస్తుందని అంచనా వేశారు. ఇందులో రూ. 1.04 లక్షల కోట్లు అప్పు కింద సమీకరిస్తున్నామని వారే చెప్పారు.మాటలకు చేతలకు పొంతన లేదు:అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా తీసుకెళ్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం రెవెన్యూ వ్యయం కింద రూ.2.51 లక్షల కోట్లు కేటాయించి, మూలధన వ్యయం కింద కేవలం రూ.40 వేల కోట్లు కేటాయించింది. అంటే వారు చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన లేదని అర్థమవుతుంది. 1995లో ఉమ్మడి రాష్ట్రంలో తొలిసారి సీఎం అయిన చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే నాటికి ప్రభుత్వం జీతాలివ్వలేని స్థితిలో ఉందని చెప్పి, అంతకు ముందు పాలించిన ఎన్టీఆర్ను ఘోరంగా అవమానించారు. వాస్తవానికి ఆ రోజుల్లో మిగులు బడ్జెట్ ఉంటే ప్రజలకు పచ్చి అబద్ధాలు చెప్పారు. చంద్రబాబు సీఎం అయ్యాకే రాష్ట్రం అప్పులపాలైంది. సీనియర్ నాయకుడు అయి ఉండి కూడా బడ్జెట్ ప్రసంగంలో పయ్యావుల కేశవ్ తన మంత్రి పదవి కాపాడుకోవడానికి నారా లోకేష్ను, సీఎం చంద్రబాబును పొగిడే దుస్థితికి దిగజారిపోయారు.పారిశ్రామికవేత్తలను తరిమేస్తున్నారు:పెయిడ్ ఆర్టిస్టును అడ్డం పెట్టి చంద్రబాబు ప్రభుత్వం సజ్జన్ జిందాల్ను వేధించి ఏపీ నుంచి తరిమేస్తే ఆయన కంపెనీ జేఎస్డబ్ల్యూ మహారాష్ట్రలో రూ.3 లక్షల కోట్లు పెట్టుబడులు పెడుతోంది. ఇలాంటోళ్లు జగన్ పారిశ్రామికవేత్తలను తరిమేశాడని తప్పుడు ప్రచారం చేశారు. పొరుగునే ఉన్న తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు దావోస్లో లక్షల కోట్లు ఒప్పందాలు చేసుకుంటే.. రాష్ట్ర యువతకు ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలిస్తామన్న తండ్రీ కొడుకులు చంద్రబాబు, లోకేష్ ఉత్త చేతులతో తిరిగొచ్చారు. ఉద్యోగాలివ్వలేని పక్షంలో నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు, ఆ పథకానికి బడ్జెట్లో రూపాయి కూడా కేటాయించకుండా 20 లక్షల మంది నిరుద్యోగ యువతను నిలువునా మోసగించాడు.పథకాలన్నీ నిర్వీర్యం:ఎన్టీఆర్ వైద్య సేవ అని పేరు మార్చి ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ట్రస్టు మోడల్ నుంచి ఇన్సూరెన్స్ మోడల్కి మార్చేసి పేదలకు ఉచిత వైద్యం అందని ద్రాక్షగా మార్చేశారు. గతేడాది బడ్జెట్లో సూపర్ సిక్స్లో ఏ ఒక్క హామీని అమలు చేయకపోగా, ఈ ఏడాది బడ్జెట్లో కూడా ఫ్రీ బస్, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి వంటి పథకాలకు ఒక్క రూపాయి కూడా కేటాయించకపోగా, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు అరకొర నిధులు కేటయించి అమలు చేయడంపైనా ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నారు. 50 ఏళ్లు దాటిన బీసీలకు పింఛన్ ఇస్తామని మాట తప్పారు. అందుకే చంద్రబాబును నమ్మితే పులి నోట్లో తల పెట్టడమేనని, ఎన్నికల ముందు జగన్ చెప్పిన మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయని మార్గాని భరత్ గుర్తు చేశారు. -
పోసాని ఆరోగ్యం బాగోలేదు: ఎమ్మెల్యే ఆకేపాటి
అన్నమయ్య, సాక్షి: కూటమి కుట్రలతో జైలు పాలైన ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళిని వైఎస్సార్సీపీ నేతలు శనివారం పరామర్శించారు. అయితే ములాఖత్ సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేష్పై గతంలో పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారని.. సినీ పరిశ్రమలో కులాల పేరుతో చిచ్చు పెట్టేలా మాట్లాడారని కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసుల్లో అరెస్టైన పోసాని.. రిమాండ్లో ఉన్నారు. పోసానిపై కూటమి ప్రభుత్వం కక్ష గట్టిందని.. ఆయనకు వైఎస్సార్సీపీ అన్నివిధాల అండగా ఉంటుందని పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలో.. రాజంపేట సబ్ జైలులో ఉన్న పోసాని కృష్ణమురళితో స్థానిక వైఎస్సార్సీపీ నేతలు ములాఖత్ అయ్యారు. అనంతరం ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పోసాని అనారోగ్యంతో బాధపడుతున్నారని వెల్లడించారు. మరోవైపు.. ములాఖత్ కోసం రైల్వే కోడూరు మాజీ MLA కొరముట్ల శ్రీనివాసులు పెట్టుకున్న విజ్ఞప్తిని జైలు అధికారులు తిరస్కరించారు. దీంతో సబ్ జైలర్ మల్ రెడ్డిపై కొరముట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. పోసాని బెయిల్ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. -
‘పవన్, బాబు.. ఉచిత బస్సుకు నిధులేవీ?’
సాక్షి, వైఎస్సార్: ఏపీ బడ్జెట్ చూస్తే చంద్రబాబు ఇచ్చిన హామీలకు కేటాయింపులకు పొంతన లేదన్నారు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి. నిరుద్యోగ భృతికి ఒక్క రూపాయి అయినా కేటాయించావా చంద్రబాబు?. ఉచిత బస్సుకు నిధులేవీ? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు సంపద సృష్టించే సత్తా ఉంటే ఎందుకు వ్యాపారాలు తగ్గిపోతున్నాయి? అని వ్యాఖ్యలు చేశారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు ఎన్నో హామీలు ఇచ్చారు. ఇచ్చిన హామీల అమలుకు మాత్రం బడ్జెట్లో కేటాయింపులు లేవు. సూపర్ సిక్స్ అందించే ఉద్దేశ్యం ఉందా? లేదా?. నిరుద్యోగ భృతికి ఒక్క రూపాయి అయినా కేటాయించావా చంద్రబాబు?. స్త్రీ నిధి పేరుతో ప్రతీ మహిళకు నెలకు 1500 అన్నావు.. బడ్జెట్లో ఎక్కడ?. ఉచిత బస్సు ఎక్కడ?. తల్లికి వందనం 12వేల కోట్లు అవసరమైతే 9వేల కోట్లు ఇచ్చారు. దీపం పథకం 60 శాతం మందికి అందడం లేదు. మీరు గ్రామాలకు వచ్చి వాకబు చేసే ధైర్యం ఉందా?. అన్నదాత సుఖీభవకి కూడా అరకొర నిధులు కేటాయించావు. హామీలు నెరవేర్చకపోతే చొక్కా పట్టుకుని అడగమన్నాడు లోకేష్.. ఇప్పుడు ఏం చేయాలి?అదేమంటే సంపద సృష్టిస్తాను అన్నావు.. ఆ సంపద సృష్టి ఎక్కడ?. ఇప్పటి వరకు లక్ష కోట్ల అప్పులు తెచ్చావు. ఆ నిధులన్నీ ఎక్కడికి వెళ్లాయి?. గతంలో పెట్రోల్ రేట్లు పెరిగాయి.. అధిక పన్నులు వేస్తున్నారని అన్నావ్. మరి మీరేం తగ్గించారు?. అభివృద్ధి ఎక్కడ జరిగింది?. వైఎస్సార్సీపీ హయాంలో ప్రతీ కుటుంబానికి లక్ష వరకూ డీబీటీ ఇచ్చాం. కడప ఉక్కు కోసం జిందాల్ సంస్టను తెచ్చాం.. ఈరోజు ఎందుకు ముందుకు పోవడం లేదు?. వైద్య విద్యలో మాకు సీట్లు కావాలని రాష్ట్రాలు పోటీ పడతాయి. వైఎస్ జగన్ తెచ్చిన సీట్లు వెనక్కు పంపిన ఘనత చంద్రబాబుదే.మీపై మాట్లాడారని పోసానిని అరెస్ట్ చేశారు. లోకేష్, పవన్లు వైఎస్ జగన్ను ఎన్నెన్ని మాటలు అన్నారు. చంద్రబాబుపై కేసు పెట్టేందుకు నేను సిద్ధం. పోలీసులు మీ లిమిట్స్ దాటకండి. తప్పు చేస్తే ఇరు పక్షాల వారిపై చర్యలు తీసుకోండి. చంద్రబాబు మాటలపై విశ్వసనీయత లేదని పవన్తో అబద్ధాలు చెప్పించాడు. పవన్.. ఇచ్చిన ప్రతీ హామీకి నువ్వే బాధ్యత తీసుకుని నెరవేర్చు. రెడ్బుక్లో మా హక్కులు కాలరాస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదు. ఈ రాష్ట్రం చంద్రబాబు, లోకేష్ జాగీరు ఏమీ కాదు. మాకు కూడా రాజ్యాంగ హక్కులు ఉన్నాయి. సీజ్ ద షిప్ ఏమైంది?.. తిరుపతి లడ్డూ ఏమైంది?. అబద్దాలు చెప్పడం కాదు.. కొన్ని పనులు చేసైనా నిరూపించుకోండి’ అని హితవు పలికారు. -
పవనూ.. మరీ ఇంతకు దిగజారాలా!
జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఏపీ అసెంబ్లీలో చేసిన కొన్ని వ్యాఖ్యలు తమాషాగా ఉన్నాయి. ‘‘కింద పడతాం.. మీద పడతాం.. అవి మా ఇంటి విషయాలు.. కూటమి విషయాలు. ఒక మాట అనవచ్చు. నాకేం అభ్యంతరం లేదు. కానీ గవర్నర్కు గౌరవం ఇవ్వని పార్టీ సభలో అడుగు పెట్టకూడదు’’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పొంతన లేని అంశాలను బలవంతంగా అతికినట్టుగా అనిపిస్తుంది. ‘‘ఇది తన గురించో, చంద్రబాబుల గురించి కాదని, ప్రజల కోసం నిలబడి ఉన్నామని, కలిసి ఉండకపోతే ప్రజలకు ద్రోహం చేసినవాళ్లం అవుతామని, అందుకే మాటిస్తున్నానని అంటూ, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని అధిగమనించి మరో పదిహేనేళ్లు కలిసి ఉంటాము’’ అని పవన్ అనడం దేనికి సంకేతం?.. తెలుగుదేశంతో పొత్తు పుణ్యమా అని పవన్ కల్యాణ్ ఎలాగోలా శాసనసభలోకి అడుగుపెట్టి డిప్యూటీ సీఎం కూడా అయిపోయారు. అభిమానులకు, జనసేన కార్యకర్తలకు అది సంతోషమే. కానీ ఆయన సమస్యలపై ప్రశ్నించకుండా.. ప్రభుత్వంలో జరిగే తప్పులపై గొంతెత్తకుండా ఆత్మపరిశీలన చేసుకోకుండా, చేసిన బాసలను గాలికి వదలి పలాయన వాదంతో ప్రవర్తిస్తున్నారని చెప్పడానికి ఈ వ్యాఖ్యల కన్నా ఉదాహరణ అవసరం లేదేమో!.👉ఇంతకీ పవన్ చేసిన ఆ వ్యాఖ్యల సారాంశం ఏమిటి? తమలో తాము ఎన్ని గొడవలు పడ్డా కలిసే ఉంటామని చెప్పడమే కదా! ఈ మాట అంటున్నారంటేనే ప్రజలకు ద్రోహం చేయడం అవుతుంది. ప్రభుత్వం సమర్థంగా పని చేస్తుందని హామీ ఇవ్వకుండా వీరిద్దరూ తిట్టుకుంటే ఎవరికి కావాలి? కిందపడితే ఏంటి? మీద పడితే ఎవరికి ఆసక్తి? ఆయన అన్నట్టే అది వారి అంతర్గత వ్యవహారం. ప్రజలకు సంబంధించిన అంశం కాదు. అయితే... శాసనసభ ఎన్నికలకు ముందు ఆయన చెప్పిన మాటలేమిటి? చేసిన వాగ్దానాలేమిటి? ఇప్పుడు వాటిని గాలికి వదిలేసిన వైనం ఏమిటి? వీటిని ప్రశ్నించకుండా ఎవరూనా ఎలా ఉండగలరు? సుగాలి ప్రీతి మృతి కేసు నుంచి 31 వేల మంది మహిళలు మిస్సింగ్ అయ్యారంటూ సంచలనం కోసం పిచ్చి ఆరోపణలు చేసిన పవన్ కల్యాణ్.. తీరా పదవి వచ్చాక వాటి గురించి ఎందుకు మాట్లాడడం లేదు? ఈ మధ్య కాలంలో జరిగిన వివిధ పరిణామాలలో పవన్ పలు అవమానాలకు గురయ్యారని జనసేన కార్యకర్తలు బాధ పడ్డారు. కానీ పవన్ తన మాటల ద్వారా ఆ అవమానాలను పట్టించుకోబోనని చెప్పినట్లు అయ్యింది. ఎంత పదవిలో ఉంటే మాత్రం పవన్ టీడీపీకి ఇంతగా లొంగి ఉండాలా అన్నది జనసేన కార్యకర్తల ఆవేదన. తిరుపతి తొక్కిసలాట ఘటన(Tirumala Stampede Incident) తర్వాత పవన్ కల్యాణ్ ఓవరాక్షన్ చేశారని టీడీపీ ముఖ్యనేతలే వ్యాఖ్యానించిన సంగతిని ఆయన పట్టించుకోకపోవచ్చు. కానీ ఆత్మాభిమానం కలిగిన జనసేన క్యాడర్ సహించలేక సోషల్ మీడియాలో టీడీపీ వారికి పోటీగా ఎలా పోస్టులు పెట్టిందో తెలియదా! ఇవన్ని ఎవరి ఇంటి విషయాలు..? అంటే జనసేన కూడా టీడీపీలో భాగమని చెబుతున్నారా? కూటమి విషయాలైతే ఎన్నడైనా చర్చించుకున్నారా? అంత దాకా ఎందుకు.. పిఠాపురంలో పోలీసులు తన మాట వినడం లేదని ఎందుకు చెప్పారు? నెల రోజుల పాటు ఎవరి మీద అలిగి ఫైళ్ల జోలికి వెళ్లకుండా ఉన్నారు? ఇది ఎవరి ప్రయోజనం కోసం? సనాతని వేషధారణ వేసుకున్నాక, ధర్మ బద్దంగా ఉండాలి కదా! అసత్య వచనాలు పలకరాదని కదా ఆ ధర్మం చెబుతోంది. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని కదా ఏ ధర్మం అయినా చెప్పేది. కాని పవన్ కల్యాణ్ వాటిని పాటిస్తున్నారా?. తిరుమల లడ్డూ విషయంలో(Tirumala Laddu Row) ఆయన చేసిన వ్యాఖ్యలు హిందూ ధర్మానికి అపచారం కాదా? వలంటీర్ల పొట్టకొట్టబోనని పవన్ హామీ ఇచ్చారా? లేదా? అధికారం ఎంజాయ్ చేస్తూ వారి గురించి మాట్లాడకపోగా.. అసలు వలంటీర్లు ఎక్కడ ఉన్నారని వ్యాఖ్యానించడం పొట్ట కొట్టడం అవుతుందా? లేదా? ఇదేనా సనాతన ధర్మం చెప్పేది? శాసనసభలో ఆయన మాట్లాడిన విషయాలలో సత్యదూరమైనవి ఎన్ని ఉన్నాయి? వైఎస్సార్సీపీ(YSRCP) వాళ్లు నినాదాలు చేసినందుకే... గవర్నర్కు గౌరవం ఇవ్వని పార్టీ సభలోకి అడుగు పెట్టకూడదని ఆయన కొత్త సూత్రం చెబుతున్నారే..! మరి గవర్నర్ వ్యవస్థే వద్దన్న టీడీపీతో పొత్తు ఎలా పెట్టుకున్నారు? గతంలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రసంగిస్తుంటే.. తెలుగుదేశం సభ్యులు ఆయన కుర్చీని కూడా లాగి పారేశారు. అలా చేసిన వారిలో ఒకరైనా రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. గత టర్మ్లో గవర్నర్ హరిచందన్ స్పీచ్ సమయంలో కానీ, స్పీకర్ పై కానీ టీడీపీ సభ్యులు ఎన్ని అల్లర్లు చేశారో ఒకసారి రికార్డులు తిరగేస్తే తెలుస్తుంది. తన సహ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ఒక విజిల్ పట్టుకువచ్చి సభలో ఈల వేస్తూ తిరిగారే. మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలు కాగితాలు చింపి, స్పీకర్ తమ్మినేని సీతారామ్ను బెదిరించేవారే! కొందరు టీడీపీ నేతలు ఎలా దూషించారో ఆయనకు గుర్తు ఉండకపోవచ్చు. ఇవన్ని మంచి పద్దతులేనా? అలాంటి పార్టీతో కలిసి అధికారంలోకి వచ్చాక సుద్దులు చెబితే సరిపోతుందా?. ఏమిటో కొత్తగా స్టేట్ రికన్సిలియేషన్ కేబినెట్ (Reconciliation Cabinet) అని అంటున్నారు. స్వాతంత్రం వచ్చాక ఎన్నికలకు ముందు ఏదో జరిగిందని, ఇప్పుడు కూడా అలాగే ఉందని అనడం ఏమిటో?. బాబూ రాజేంద్ర ప్రసాద్ కూడా నెహ్రూ కేబినెట్ లో ఉన్నా ఆయా అంశాలపై విబేధించేవారని అన్నారు. అంటే ఏపీలో కూడా అలాగే చంద్రబాబును నిలదీస్తారా? ఆ ధైర్యం పవన్కు నిజంగా ఉందా? అలా ఉంటే ఇప్పటివరకు జరిగిన అనేక పరిణామాలలో ఒక్కసారైనా ప్రజల పక్షాన మాట్లాడారా? శాంతిభద్రతల విషయంలో మాట్లాడినట్లే మాట్లాడి వెంటనే ఎందుకు జారిపోయారు? ప్రతిపక్షం ముఖం చాటేస్తే తామే ఆ బాధ్యత నిర్వహిస్తామని అన్నారు. 👉పవన్ ఆ పని చేసినా, చేయకపోయినా, ముందుగా సూపర్ సిక్స్ గురించి చంద్రబాబును ప్రశ్నించి ఉంటే, తన బాధ్యత ఏమిటో చెప్పి ఉంటే అప్పుడు ఆయన ఏమి చెప్పినా జనం నమ్మవచ్చు. తన శాఖకు సంబంధించి ఆయన గ్రామ సభలు, గోకులాలు అంటూ ఏవేవో చెప్పుకున్నారు. కాని వాటిని టీడీసీ వారే ఎవరూ పట్టించుకోవడం లేదన్న సంగతి ఆయనకు కూడా తెలిసి ఉండాలి. ఆంధ్రులకు కుల భావన ఉందని శాసనసభలో బాధ పడినట్లు నటించారు. మరీ ఇదే పవన్ కల్యాణ్ గతంలో కనీసం కుల భావన అయినా తెచ్చుకోండని అన్నారే! తనకైనా ఫలానా కులం వారు ఓట్లు వేయాలని అన్నది వాస్తవం కాదా! దీనికి సంబంధించి అప్పట్లో వీడియోలు వచ్చాయే! ఎవరిని మభ్య పెట్టడానికి ఈ మాటలు?. 👉విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆగిందని అంటున్నారు. సంతోషమే కానీ.. భవిష్యత్తులో కూడా జరగదని చెప్పగలిగితే బాగుంటుంది. ఒకపక్క అక్కడ అనేక మందిని ఉద్యోగాలనుంచి తొలగిస్తుంటే, మరోపక్క పవన్ ఇలా మాట్లాడుతున్నారు. బూతులు ఎవరు మాట్లాడినా తప్పే. కాని టీడీపీ, జనసేనల దూషణలకు, పెట్టిన బూతు పోస్టింగ్లకు ఆయన ఎలా మద్దతు ఇస్తున్నారు?. తిరుపతిలో కిరణ్ రాయల్ అనే స్థానిక నేతపై మహిళల వేధింపు ఆరోపణలు వస్తే కనీసం పార్టీ నుంచి సస్సెండ్ కూడా చేయలేక పోయారే! ఆ మాటకు వస్తే ఎన్నికల సమయంలో పవన్ ఎన్ని దూషణలకు పాల్పడింది ఆధార సహితంగా ఉన్నాయి కదా! 2009లోనే యువరాజ్యం అధ్యక్షుడుగా ఉండి కాంగ్రెస్ వాళ్ల పంచెలు ఊడగొడతానని అన్నది ఈయనే గదా అని పలువురు గుర్తు చేసుకుంటున్నారు. చంద్రబాబును జైలులో ఎందుకు పెట్టింది తెలియదా? స్కిల్ స్కామ్లో తొలుత కేసు పెట్టింది ఈడి కాదా? గతంలో కులాలు, మతాల మధ్య గొడవలు వచ్చేలా రోజుల తరబడి మీడియా సమావేశాలు పెట్టి లైవ్ లో మాట్లాడిన ఒక నేతను ఇప్పుడు పెద్ద పదవిలో కూటమి కూర్చోపెట్టుకుందే!. చంద్రబాబు, లోకేష్లతో ఏదో జిగిరి దోస్తి ఉన్నట్లు ఇప్పుడు చెబుతున్నారు కాని, 2018లో ఇదే పవన్ వారిని ఉద్దేశించి ఎన్ని తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసింది తెలియదా? రాజకీయాలలోకి వచ్చి చెగువేరా అన్నారు. ఆ తర్వాత చంద్రబాబు, మోదీ అన్నారు. తదుపరి వారిని కాదని బీఎస్పీ అధినేత్రి మాయావతి, వామపక్షాలతో కలిసి జట్టుకట్టారు. ఆ తర్వాత మళ్లీ మోదీ, చంద్రబాబు అన్నారు. .. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ఎవరు చెబుతారు? నిజంగానే కిందా, మీద పడి పదవిలోకి వచ్చిన పవన్.. ఆ పదవి మీద మోజు పెంచుకోవడం తప్పు కాదు. కానీ అదే ప్రధానమన్నట్లుగా వ్యవహన్నారనే భావన ఏర్పడుతోంది. ప్రజల కోసం నిలబడకుండా చంద్రబాబు, లోకేష్ ల మెప్పు కోసం పనిచేస్తూ, సనాతని వేషం ధరించి కూడా అబద్దాలు, అర్ధ సత్యాలు చెప్పడం ఏ ధర్మం అవుతుందో ఆయనకే తెలియాలి!. :::కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఏపీలో పరాకాష్టకు చేరిన కూటమి ప్రభుత్వ అరాచకాలు
-
‘సుప్రీం ఆదేశాలను పోలీసులు తుంగలో తొక్కుతున్నారు’
విజయవాడ: తమ పార్టీకి చెందిన నేతల పట్ల పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ సీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డి విమర్శించారు. గండూరు ఉమామహేశ్వర శాస్త్రిపై హత్యాయత్నం కేసులో విచారణకు గౌతమ్ రెడ్డి పోలీస్ స్టేషన్ కు పిలిచారు పోలీసులు. సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ లో నార్త్ ఏసీపీ స్రవంతి రాయ్ ఎదుట విచారణకు హాజరయ్యారు గౌతమ్ రెడ్డి. అనంతరం గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ వైఎస్సార్ సీపీ నేతల పట్ల పోలీసులు కక్ష పూరిత చర్యలకు పాల్పడుతున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను విజయవాడ పోలీసులు తుంగలో తొక్కుతున్నారు.పోలీసులు పిలిచినప్పుడు విచారణకు సహకరించాలని మాత్రమే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కానీ పోలీసులు విచారణతో సంబంధం లేకుండా ప్రతి సోమవారం హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఇది కోర్టు నిబంధనలకు విరుద్ధం. ప్రాథమిక హక్కులు హరించేలా పోలీసుల వైఖరి ఉంది కక్ష సాధింపు చర్యలో భాగంగా పోలీసులు విచారణ చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. దీనిపై ప్రజాస్వామ్య వాదులంతా స్పందిస్తారని అనుకుంటున్నా. పోలీసుల వైఖరి పై, నోటీసు జారీ చేసిన తీరుపై మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా’ అని గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. -
AP Budget 2025: చంద్రబాబు సంపద సృష్టిపై బుగ్గన సెటైర్లు
సాక్షి,తాడేపల్లి : ఏపీ బడ్జెట్ బుక్లో కలర్ ఎక్కువ.. కంటెంట్ తక్కువ అని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సెటైర్లు వేశారు. అప్పుల లెక్కలపై మీరు కరెక్టా.. కాగ్ కరెక్టా? కూటమి నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్పై తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుగ్గన మీడియాతో మాట్లాడారు. అప్పుల లెక్కలపై కూటమి సర్కార్ చేస్తున్న సర్కస్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందన్నారు. కూటమి సర్కార్ బడ్జెట్ను మసిపూసి మారేడుకాయ చేసింది. బడ్జెట్లో అప్పుల లెక్కలు మాయం చేశారు. 9నెలల్లోనే రికార్డ్ స్థాయిలో లక్షా 30వేల కోట్లకుపైగా అప్పులు ఉన్నాయని ఆరోపించారు. చంద్రబాబు ఎప్పుడు పీఠం ఎక్కినా రెవెన్యూ లోటు ఉంటుంది. సూపర్ సిక్స్లో ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదు. సంపద ఎక్కడ సృష్టించారో నిజాయితీగా చెప్పగలరా? సంపద సృష్టి అంటే ఇదేనా. స్థూల ఉత్పత్తిపై కూటమి సర్కార్ పచ్చి అబద్ధాలు చెప్పింది. గత బడ్జెట్లో కేటాయించిన నిధులకే దిక్కులేదు.గతేడాది అన్నదాత సుఖీభవకు రూ.4,500కోట్లు కేటాయించారు.గతేడాది అన్నదాత సుఖీభవ ఎవరికైనా వచ్చిందా? రెండేళ్లు అన్నదాత సుఖీభవకు రూ.21వేల కోట్లు అవసరం. అన్నదాత సుఖీభవకు కేటాయించింది రూ.6300కోట్లే. హామీల అమలుకు టైమ్ టేబులంటూ ఏమీలేదు. రాష్ట్ర బడ్జెట్ కలర్ ఎక్కువ, కంటెంట్ తక్కువ అన్నట్టుగా ఉంది. బడ్జెట్ ప్రసంగం నెగటివ్ మాటలతో మాట్లాడారు. అరాచకం, విధ్వంసం అంటూ మొత్తం 35 సార్లు అన్నారు.సూపర్ సిక్స్ పేరుతో ఎన్నికలకు ముందు తెగ హడావుడి చేశారు. ఇప్పటికీ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదు. వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోన్రెడ్డి తన హయాంలో కేలండర్ పెట్టి మరీ సంక్షేమ పథకాలు ఇచ్చారు చంద్రబాబు ఎక్కువ ఇస్తాననేసరికి జనం నమ్మారు. కానీ చంద్రబాబు మళ్ళీ జనాన్ని మోసం చేశారు. సంవత్సరం కాకముందే లక్షన్నర కోట్లు అప్పు చేశారు. ప్రజల మీద ఎక్కువ పన్నుల భారం వేయకూడదని చాణక్యుడు చెప్పాడు. కానీ చంద్రబాబు అధిక భారాలు వేస్తూ చాణక్యుడి పేరు వాడటం హాస్యాస్పదం. మా ప్రభుత్వాన్ని హేళన చేస్తూ మాట్లాడారు.మధ్యలో దళారులు లేకుండా సంక్షేమం అందిస్తే బటన్ నొక్కుడు అంటూ హేళన చేశారు. రాష్ట్రం శ్రీలంక అవుతుందంటూ ప్రచారం చేశారు. ఎన్నికల టైం వచ్చేసరికి మా కంటే మూడు రెట్లు ఎక్కువగా ఇస్తామని చంద్రబాబు హామీలు ఇచ్చారు. తీరా అధకారంలోకి వచ్చాక ఏదీ అమలు చేయటం లేదు.కూటమి ప్రభుత్వంలో పెట్టే కేసులు పెరిగాయి. ప్రజల్లో అసంతృప్తులు బాగా పెరిగాయి. గ్రామాల్లో ప్రజలు అప్పుల పాలయ్యారు. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అన్నారు. అధికారంలోకి వచ్చాక సంపద సృష్టి తర్వాతనే ఇస్తామంటున్నారు.రూ.4,500 కోట్లు అన్నదాత సుఖీభవ కింద ఇవ్వకుండానే ఇచ్చేసినట్టు చెప్పారు. ఏ రైతుకైనా అన్నదాత సుఖీభవ డబ్బులు ఇచ్చారా?. కార్పోరేషన్ల అప్పుల్లో కూడా తప్పడు లెక్కలు చూపెట్టారు. వస్తుందో రాదో తెలియని ఆదాయాన్ని ఇప్పుడు లెక్కల్లో చూపించి ఖర్చు పెడతామంటున్నారు.ఒక విధానం, ఒక టైంటేబుల్ అనేదే లేదు. ఎవరో రాసిచ్చిన లెక్కలు చదవటం తప్ప బడ్జెట్లో ఇంకేం లేదు. రాష్ట్ర అభివృద్ధిని దేశ అభివృద్ధితో పోల్చాలేగానీ, గత ప్రభుత్వాలతో పోల్చుతారా?. అసెంబ్లీలో ఉత్సాహం, ఊపు ఎవరిలోనూ కనపడలేదు.గత బడ్జెట్లో పెట్టి కూడా ఇప్పటివరకు నిధులు ఇవ్వలేదు. ఉచిత బస్సు, ఉచిత గ్యాసు ఊసేలేదు.తల్లికివందనం కింద ఎంతమందికి ఇచ్చేదీ క్లారిటీ లేదు. 55 లక్షల మంది పిల్లలకి మాత్రమే ఇచ్చేలా బుక్లో రాశారు. అంటే మిగతావారి పరిస్థితి ఏంటి?.గవర్నర్ ప్రసంగంలో సూపర్ సిక్స్ ప్రస్తావనే లేదు.రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ప్రభుత్వ కొనుగోళ్ళు లేక ప్రయివేటు వారికి అమ్ముకునే పరిస్థితి వచ్చింది. పత్తి, మిర్చి, కంది, మినుముల ధర మా హయాంతో పోల్చితే ఇప్పుడు సగానికి సగం తగ్గింది. ఉద్యోగుల పరిస్థితి దారుణంగా తయారయింది.ఈ ప్రభుత్వంలో కనీసం వారి సమస్యలు వినే పరిస్థితే లేదు. మా హయాంలో ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగాలు 31 లక్షల మందికి ఇచ్చాం.ఈ ప్రభుత్వం ఇప్పటికి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోగా, ఉన్నవి తొలగిస్తున్నారు.అమరావతి కోసం రూ.76 వేల కోట్లు అప్పు చేశారు.మేము చేస్తే అప్పు, మీరు చేస్తే నిప్పా?. స్థూల ఉత్పత్తి బాగుంటే రాష్ట్ర ఆదాయం పెరగాలి కదా?. మరి ఆ పెరిగిన ఆదాయం ఎందుకు కనపడటం లేదు?. సంపద సృష్టిస్తామనే వారు మా హయాంలో కంటే తక్కువ ఆదాయాన్నే రాష్ట్రానికి సమకూర్చారు. మీది P4 ఐతే మాది W4. అంటే సంక్షేమం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా? లేక ఇంటిలిజెన్స్ ఆర్టిఫిషియలో అర్థం కావటం లేదు. ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యం ఉంటుందా? -
‘కూటమి’ వంచన.. బడ్జెట్పై వైఎస్సార్సీపీ రియాక్షన్
సాక్షి, అమరావతి: బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం చేశారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. శుక్రవారం ఆయన ఏపీ అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రజలను వంచించిందని ధ్వజమెత్తారు. కూటమి నేతలు హామీలను విస్మరించారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు’’ అని బొత్స నిలదీశారు.‘‘గిట్టుబాటు ధరలేక రైతులు అవస్థలు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం బడ్జెట్తో ఎవరికీ ప్రయోజనం లేదు. రైతులు, మహిళలు, యువత అన్ని వర్గాలను విస్మరించారు. ధరల స్థిరీకరణ కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.3వేల కోట్లు కేటాయించింది. కూటమి ప్రభుత్వం కేవలం రూ.300 కోట్లు మాత్రమే పెట్టింది’’ అని బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆత్మ స్తుతి, పరనిందాగానే బడ్జెట్ సాగింది. గత ప్రభుత్వాన్ని తిట్టడం.. చంద్రబాబు, లోకేష్ని పొగడడం తప్ప ఏమీ లేదు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని కూటమి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుంది. కూటమి ఇచ్చిన వాగ్దానాల్లో అరకొరగా ఒకటి రెండు తప్ప ఏమీ చేయలేదు. షూరిటీ కాదు.. ప్రజల మోసం అనాలి. మహిళలకు 15 వందలు, విద్యార్థులకు 15వేలు, రైతుకు 20వేలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కేటాయింపులు మాత్రం అరకొరగా ఉన్నాయి. 81లక్షల మంది విద్యార్థులు ఉంటే 12వేల కోట్లు కావాలి.. కానీ కేటాయింపులు 9400 కోట్లు కేటాయించారు. మిగిలినవి ఏ విధంగా ఇస్తారు. ఎక్కడ సేకరిస్తారు? చెప్పలేదు. 50 లక్షల మందికి గత ప్రభుత్వంలో రైతుభరోసా ఇచ్చాం’’ అని బొత్స పేర్కొన్నారు.‘‘అన్నదాత సుఖీభవ ఇస్తే రూ.12 వేల కోట్లు కావాలి. మహిళలు, నిరుద్యోగుల ఊసే లేదు. ఉచిత బస్సు మాట లేదు.. ఉలుకు పలుకే లేదు. రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గత ప్రభుత్వంలో 3వేల కోట్లు మార్కేట్ ఇంటర్వెన్షన్ కోసం పెడితే.. ఇప్పుడు సున్నా తీసేసి 300 కోట్లు పెట్టారు. మిర్చి రైతుల సమస్య పై పోరాటం చేస్తే జగన్పై కేసు పెట్టారు. ఒక్కో కిలో, ఒక్క క్వింటా, ఒక్క బస్తా అయినా కొన్నారా?. ఎంతసేపు పొగుడుకోవడం తప్ప రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదు. బడ్జెట్ పై పూర్తి అధ్యయనం చేసిన తర్వాత మాట్లాడతా. ప్రజలనిమాటలతో గారడి చేసి మోసం చేసే బడ్జెట్ ఇది.’’ అంటూ బొత్స ధ్వజమెత్తారు.అంకెలే తప్ప అభివృద్ధి కానరాలేదు: ఎమ్మెల్సీ రవిబాబుచంద్రబాబు, లోకేష్ ని పొగిదేందుకే సరిపోయింది. వెనుక బడిన తరగతుల అభివృద్ధి కి కేటాయింపులు లేవు. ఉత్పాదక రంగంపై కేటాయింపులు జరిగితే అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఉత్పాదకరంగంపై కేటాయింపులు లేవు. ప్రజలకు ఇచ్చిన హామీని పూర్తిగా మరిచారు. నిరుద్యోగులకు 3వేల హామీ బడ్జెట్లో లేదు. ఉత్పాదకరంగంపై కేటాయింపులు లేకుండా సంపద సృష్టి అంటే కేవలం మోసం చేయడమే.బడ్జెట్ పేరుతో మోసం: ఎమ్మెల్సీ వరుదు కల్యాణిఇది పేదల వ్యతిరేక బడ్జెట్.. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలను మోసం చేశారు. జగన్ కంటే ఎక్కువ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చాకా ఒక్క హామీ అమలు చేయలేదు. మహాశక్తికి కేటాయింపులే లేవు. నిరుద్యోగులను రూపాయి కూడా కేటాయింపు చేయకుండా నిట్టనిలువునా ముంచారు. 12 వేల కోట్లు తల్లికి వందనంకి కావాలి.. కానీ కేటాయింపులు అరకొరగా కేటాయించారు. రైతుల్ని మోసం చేశారు. కోటి 55 లక్షల మంది దీపం పథకానికి అర్హులైతే.. 95లక్షల కి కుదించారు..4వేల కోట్లు అవసరం ఐయితే రెండున్నర వేల కోట్లు మాత్రమే కేటాయించారు. గత ప్రభుత్వాన్ని తిట్టడం, లోకేష్ని పొగడడం పనిగా పెట్టుకున్నారు. లోకేష్ని పోగిడే దానిపై పెట్టిన శ్రద్ధ.. బడ్జెట్పై పెడితే బాగుండేది. బడ్జెట్పై చర్చలో హామీల అమలు గురించి ఒత్తిడి తీసుకొస్తాంబడ్జెట్పై జరిగే చర్చల్లో పోరాటం చేస్తాం: ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డిఆడబిడ్డ నిధి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.. వైఎస్ జగన్ ఐఆర్ ప్రకటించడంతో ఉద్యోగులను హ్యాపీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం సంవత్సరం అవుతున్న ఒక్క ఐఆర్ కూడా ప్రకటించలేదు. మెగా డీఎస్సీ అన్నారు. నోటిఫికేషన్ ఇవ్వలేదు. 5 లక్షల మంది కోచింగ్స్ తీసుకొంటున్నారు. నిరుద్యోగ భృతి గురించి కూడా ఎక్కడా మాట్లాడలేదు. ఫీజు రియంబర్స్మెంట్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. బడ్జెట్పై జరిగే చర్చల్లో పోరాటం చేస్తాం.. వీసీలు 17 మందిని బలవంతంగా రాజీనామాలు చేయించారు. అన్ని ఆధారాలు బయట పెడతాం.. ఉన్నత విద్య మండలిలో తప్పులపై ఎంక్వయిరీ చేయిస్తాం.అంకెల గారడీ మాత్రమే: ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం అంకెల గారడీ మాత్రమేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ అన్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మూడు లక్షల కోట్ల బడ్జెట్లో పేదలకు ఒరిగేదేమీ లేదు. లక్ష కోట్ల అప్పులు తెచ్చిన మీరు అవి ఏం చేశారో చెప్పాలి. తల్లికి వందనం లో కోత పెట్టారు. చేనేతలను ఆదుకునే ఒక్క పథకం లేదు. గృహ నిర్మాణ కేటాయింపులు లేవు. బీసీ, ఎస్సీ, ఎస్టీలను ప్రభుత్వం మోసం చేసింది. గట్టిగా అడిగితే రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ కేసులు పెడుతున్నారు’’ అని బొమ్మి ఇజ్రాయెల్ మండిపడ్డారు. -
కక్షా రాజకీయాల్లో భాగంగానే పోసాని అరెస్ట్ : YSRCP
-
పోసాని అరెస్ట్ ను ఖండించిన YSRCP నేతలు
-
ఏపీలో ఉన్నామా..? అఫ్గనిస్తాన్ లో ఉన్నామా..?: విశ్వేశ్వర్ రెడ్డి
-
పాలనలో సమన్వయ లోపం
ఈ నెల 11న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అధ్యక్షతన ప్రభుత్వ కార్యదర్శులు, శాఖాధి పతులు, మంత్రుల సమీక్షా సమావేశం 12 గంటల పాటు జరిగింది. గత అనుభవంతో సీబీఎన్ త్వరితంగా పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చుకోవలసి ఉండగా, ఇప్పటికీ మూడుసార్లు కలెక్టర్ల సమా వేశాలు నిర్వహించి, ఎనిమిది నెలలుగా నిత్యం ఏదో ఒక శాఖ సమీక్ష చేస్తున్నా... మళ్ళీ మరో సమన్వయ సమావేశం ఎందుకు నిర్వహించినట్లు? నిజానికి ఐదేళ్ళ వైసీపీ పాలన తర్వాత ‘బ్యురోక్రసీ’ వైఖరితో ‘కూటమి’ ప్రభుత్వం సమన్వయ సమస్య ఏదైనా ఎదుర్కొంటున్నదా? అనేది ఇక్కడ కీలకం. కొత్తగా 13 జిల్లాలు ఏర్పడిన 2022 ఉగాది నాడు జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో జగన్ మోహన్ రెడ్డి– ‘సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్’ సాధించే దిశలో ‘స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్’ (ఎస్ఓపీ) పాటించి తీరాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు. ‘సరళీకరణ’ కాలంలో పొలిటికల్ ఎగ్జిక్యుటివ్ అధికా రులను ‘మార్గదర్శక నిబంధనలు దాట డానికి వీలులేదు’ అనే మాట పైకి అనడం చిన్న విషయం కాదు. ఈ మార్పుకు కారణం, గతంలో పాలన ‘పిరమిడ్’ తరహాలో పైన ఒక్కరిదే నిర్ణయమైతే, దిగువ పలు అంచెల్లో దాన్ని అమలుచేసే యంత్రాంగం ఉండేది. వైసీపీ ప్రభుత్వంలో పైన ఉండే నిర్ణయ శిఖరం ‘చతురస్రం’గా మారింది. విధాన నిర్ణయంలో సమష్టి బాధ్యత వచ్చింది. మండల గ్రామ సచివాలయ సిబ్బంది నిర్ణయాల అమలుకు దఖలు పడ్డారు. సీబీఎన్ శైలి దీనికి పూర్తిగా భిన్నమైంది.రాజకీయ నాయకుల నిర్ణయాల అమలుకు మాత్రమే ఐఏఎస్లను పరిమితం చేస్తే, తదుపరి పరిణామాలకు జడిసి కొందరు అధికారులు పోస్టులు మారుతున్నారు. సీఎం తనది ‘పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్’ అని కలెక్టర్ల సమావేశంలో చెప్పడం అంటే, అది ‘నీతి ఆయోగ్’ అయినా, ప్రపంచ బ్యాంకు షరతులు అయినా మాకు వర్తించవు’ అని చెప్పడమే అవుతుంది. సీఎం కలెక్టర్లకు చెప్పిందే సెక్రటరీలకు వర్తిస్తుంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వంలో బహుశా వేగంగా కదలని ‘ఫైళ్ళు’ ఈ సమావేశ నిర్ణయానికి కారణం కావొచ్చు.అయితే, అధికారులు ఉన్నదే వారు తమ బాధ్యతలు తాము నిర్వర్తించడానికి కనుక... ఇక్కడ 2019 ఎన్నికల ముందు జరిగింది ఒకటి చెప్పాలి. ‘సొసైటి ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ’ (‘సెర్ప్’) సంస్థ 2019 ఫిబ్రవరి 16 నాటికి ‘ఆంధ్రప్రదేశ్ రూరల్ ఇంక్లూజివ్ గ్రోత్ ప్రాజెక్టు, సోషల్ మేనేజ్మెంట్ ఫ్రేం వర్క్’ పేరుతో ఒక డాక్యుమెంట్ను విడుదల చేసింది. ఈ పనిలో ప్రపంచ బ్యాంక్ది ప్రధాన భూమిక.రాష్ట్ర విభజన జరిగిన నాలుగున్నర ఏళ్ల తర్వాత, ఎన్నికల ముందు పేదరిక నిర్మూలన కొరకు రూపొందించిన అధికారిక ‘డాక్యుమెంట్’ ఇది. ఇది జరిగిన నాలుగు నెలలకు రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. మనకు ‘నెట్’లో అందుబాటులో ఉన్న ఈ పత్రం– ‘వైరుధ్య –ఆంధ్రప్రదేశ్’ అనే ముందుమాటతో మొదలవుతుంది. అందులో – ‘ఇక్కడ ఒకపక్క వృద్ధి స్పష్టంగా కనిపిస్తున్నది. విద్యుత్తు, మౌలిక వసతుల కల్పన, పరిశ్రమలు, ఐటీ వృద్ధికి పబ్లిక్–ప్రైవేట్ పెట్టుబడులు మెండుగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవతో పేదరికం కూడా తగ్గుతున్నది. కానీ ఇక్కడి వ్యవసాయ రంగంలో రైతుల వెతలు అలాగే ఉన్నాయి. సామాజిక మానవీయ విలువల సూచీ అట్టడుగున ఉంది. ఇక్కడి మహిళా స్వయం సహాయ సంఘాల చొరవ గొప్ప మార్పుకు నాంది పలికినా అది ఎస్సీ, ఎస్టీల విషయంలో సామాజిక పెట్టుబడిగా రూపాంతరం చెందలేదు. దాంతో వారి ఆరోగ్యం, విద్య, పారిశుద్ధ్య వసతుల మెరుగు దలను అది ఏ మాత్రం ప్రభావితం చేయలేక మినిమవ్ు డెవలప్మెంట్ గోల్స్ (ఎండీజీ) వద్దకు వారిని చేర్చలేక పోయింది.’ ఇది చదివాక, మన కామన్ సెన్స్కు వచ్చే ప్రశ్నలు రెండు. ఈ పత్రంలోని అంశాలు తన ప్రభుత్వ కృషి ఫలితం అని సీబీఎన్...పైకి అనకపోవడానికి కారణం ఏమిటి? ఈ నివేదికలో గుర్తించిన వ్యత్యాసాలను అధిగమించేలా తదుపరి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం తమ పథకాలను అమలు చేసింది. అయితే వాటిలో లోపాలు ఉంటే వాటిని చూపడం కాకుండా, ‘సంక్షేమమేనా... అభివృద్ధి ఏదీ?’అంటూ ముప్పేట దాడి చేయడం ఏమిటి? ఈ ‘పత్రం’ సీబీఎన్ ప్రాధాన్యాలలోని అంశం కాకపోవచ్చు. అలాగే పేదలకు మేలు చేసేది కనుక వైసీపీ దాన్ని తన మేనిఫెస్టోలో చేర్చి ఉంటుంది. ఇప్పుడు కూడా ‘కూటమి’ దాని ఊసు ఎత్తడం లేదంటే దాన్ని అమలుచేసే ఆలోచన లేక కావొచ్చు.జాన్సన్ చోరగుడి వ్యాసకర్త అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత -
మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటికి పోలీసులు
సాక్షి,అనంతపురం : ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగం కొనసాగుతోంది. నిన్న..రాజకీయాలకు స్వస్తి పలికిన నటుడు పోసాని కృష్ణ మురళీని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని తన నివాసంలో ఉన్న ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటికి పోలీసులు వచ్చారు. వాసిరెడ్డి పద్మ ఫిర్యాదుపై విజయవాడ పోలీసుల విచారణ చేపట్టేందుకు గోరంట్ల మాధవ్ ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా గోరంట్ల మాధవ్కు పోలీసులు నోటీసులు అందించారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కు విజయవాడ పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని వైఎస్సార్సీసీ నేతలు ఖండిస్తున్నారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది
-
వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచే అవకాశం
-
Advocate Sai Ram: పోసానిపై నమోదైన కేసులివే !
-
సినీ నటుడు పోసాని కృష్ణమురళి అక్రమ అరెస్ట్
-
YSRCP కార్యకర్త హరికృష్ణపై టీడీపీ నేతల దాడి
-
సైలెంట్ గా ఉన్న వ్యక్తిని లేపి తన్నించుకుంటున్నారు...
-
అంతకంత తిరిగిస్తాం.. పోసాని అరెస్ట్ పై పేర్ని కిట్టు రియాక్షన్..
-
ప్రజలు, దేవుడు.. అంతా చూసున్నారు: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) అక్రమ అరెస్ట్ను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఖండించారు. పోసాని భార్య కుసుమలతను ఫోన్లో పరామర్శించిన ఆయన.. పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ‘‘ప్రజలు, దేవుడు అంతా చూస్తున్నారు. పోసాని కృష్ణమురళికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. మేం అందరం మీకు తోడుగా ఉంటాం. పార్టీ తరఫున న్యాయ సహాయం అందిస్తాం. సీనియర్ న్యాయవాదులకు ఆ బాధ్యతలు అప్పగించాం. పొన్నవోలు సహా అందరినీ రాజంపేటకు పంపించాం. నాయకులందరినీ కోర్టు వద్దకు పంపించాం. ఈ కష్టకాలంలో మీరు ధైర్యంగా ఉండండి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలన ఎక్కువ రోజులు కొనసాగదు’’ అని వైఎస్ జగన్(YS Jagan) అన్నారు. ఇదిలా ఉంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏపీఎఫ్టీవీడీసీ ఛైర్మన్గా పోసాని పని చేశారు. అయితే ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆపై ప్రెస్ మీట్ నిర్వహించి మరీ ఇకపై రాజకీయాలు మాట్లాడబోనని, వాటికి దూరంగా ఉంటానని ప్రకటించారు. అయితే.. అనూహ్యంగా హైదరాబాద్లో ప్రత్యక్షమైన అన్నమయ్య జిల్లా రాయచోటి పోలీసులు.. ఆయనపై కేసు నమోదైందని చెబుతూ అప్పటికప్పుడే ఆయన భార్యకు నోటీసులు అందజేసి వెంట తీసుకెళ్లారు. తన ఆరోగ్యం బాగోలేదని, భోజనం చేసి తానే వస్తానని చెప్పినా వినలేదు. ఈ క్రమంలో పోసాని కుటుంబ సభ్యులతోనూ రాయచోటి పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మరోవైపు పోసానిని ఎక్కడికి తీసుకెళ్తున్నారనే విషయం కూడా చెప్పకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. గతంలో.. సినిమా పరిశ్రమపై విమర్శలు చేశారని జనసేన(Jana Sena) నేత మణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోసాని కృష్ణ మురళిపై అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు తెలుస్తోంది. పోసానిపై 196, 353(2), 111 రెడ్విత్ 3(5) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: పోసాని అరెస్ట్.. అసలు జరిగింది ఇదే! -
మొత్తం 12 కేసులు.. పక్కా ప్లాన్ తోనే అరెస్ట్ !
-
పోసాని కృష్ణమురళి అరెస్ట్ పై YSRCP నేతల ఆగ్రహం
-
సోషల్ మీడియాను మరింత అణగదొక్కేందుకు ఏపీ ప్రభుత్వం కుట్రలు
-
పవన్ పై నారాయణస్వామి కామెంట్స్
-
ఫోన్ లాక్కుని నలుగురు పోలీసులు చుట్టుముట్టారు: పోసాని భార్య కుసుమలత
సాక్షి, అమరావతి/గచ్చిబౌలి: చంద్రబాబు ప్రభుత్వం మరోసారి రెడ్బుక్ కుట్రకు బరితెగించింది. టీడీపీ కూటమి నియంతృత్వ పాలన రాష్ట్రంలో రాజ్యాంగ హక్కులను కాలరాస్తోంది. ప్రముఖ సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళిని అక్రమంగా అరెస్ట్ చేసి తన రాజకీయ వికృతరూపాన్ని నిస్సిగ్గుగా ప్రదర్శించింది.అన్నమయ్య జిల్లా సంబేపల్లి పోలీసులు పోసాని కృష్ణ మురళిని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఆయన నివాసంలో బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. ఆయన్ను హైదరాబాద్ నుంచి అన్నమయ్య జిల్లాకు తరలించారు. గతంలో కుట్రపూరితంగా ఏపీలోని పలు జిల్లాల్లో ఆయనపై టీడీపీ, జనసేన పార్టీలు అక్రమ ఫిర్యాదులు చేశాయి. తద్వారా తాము ఎప్పుడు అనుకుంటే అప్పుడు అక్రమంగా అరెస్ట్ చేసి తరలించేందుకు ముందస్తు పన్నాగం పన్నాయి. ఆ ఫిర్యాదులపై పోసాని కృష్ణ మురళిని ఇప్పటివరకు విచారించడంగానీ ఇతరత్రా దర్యాప్తు ప్రక్రియగానీ కొనసాగలేదు. కానీ హఠాత్తుగా బుధవారం ఆయన్ను అరెస్ట్ చేసి అన్నమయ్య జిల్లాకు తరలించడం గమనార్హం. అసలు ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో కూడా స్పష్టంగా చెప్పలేదు.పోసాని అనంతరం ఆయన సతీమణి కుసుమలత స్పందించారు. ఈ సందర్బంగా కుసుమలత మాట్లాడుతూ..‘మా ఆయనను అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు చెప్పారు. రాత్రి 8:50 గంటలకు పోలీసులు వచ్చారు. రాత్రి 9:10 గంటల వరకు తీసుకెళ్లిపోయారు. ఎలాంటి సమయం ఇవ్వకుండా వెంటనే తీసుకెళ్లారు. ఆయనకు ఆరోగ్యం బాగాలేదు. ఆయన అరెస్ట్పై చాలా అనుమానాలున్నాయి. ఆయనను ఎటూ కదలనివ్వలేదు. నలుగురు పోలీసులు చుట్టుముట్టారు. నోటీసులు తీసుకుని నేడు వస్తామన్నా పోలీసుల వదల్లేదు. పోలీసులు పోసాని ఫోన్ లాక్కున్నారు. పోసానిని ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియదు. మా ఆయన తప్పును మాత్రమే తప్పు అని చెప్పారు.. దానికే ఆయనను అరెస్ట్ చేయాలా?. ఆయన అరెస్ట్పై మాకు ఆందోళన, భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం, పోసాని కుమారుడు మాట్లాడుతూ.. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పలేదు అని తెలిపారు. ఫిర్యాదు ఎవరు చేశారు?అన్నమయ్య జిల్లా సంబేపల్లి పోలీస్ స్టేషన్లో గతంలో నమోదు చేసిన కేసులో పోసానిని అరెస్ట్ చేస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు. ఆయన్ను పోలీసులు బలవంతంగా తమ వాహనంలో తరలించారు. అసలు సంబేపల్లి పోలీస్ స్టేషన్లో తనపై ఎవరు ఫిర్యాదు చేశారు..? ఏ విషయంలో ఫిర్యాదు చేశారో చెప్పాలని ప్రశ్నించినా పోలీసులు సరైన సమాధానమే ఇవ్వలేదు. ఆయన్ని అరెస్ట్ చేస్తున్నట్టు ఓ నోటీసు ఇచ్చి తమతో తీసుకుపోయారు. 111, ఇతర సెక్షన్ల కింద కేసులు..సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోసానిపై అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో 111, 196, 353, 299, 366(3)(4), 341, 61(2) సెక్షన్ల కింద సీఐడీ పోలీసులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసులు నమోదు చేశారు.నేడు కోర్టులో హాజరు పరిచే అవకాశంపోసానిని గచ్చిబౌలిలోని ఆయన నివాసంలో బుధవారం రాత్రి 8.45 గంటలకు సంబేపల్లె ఎస్ఐ భక్తవత్సలం ఆధ్వర్యంలో అరెస్టు చేసినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు నిర్ధారించారు. పోలీసు వాహనంలో అన్నమయ్య జిల్లాకు తరలిస్తున్నట్లు తెలిపారు. కోర్టుకు హాజరు పరిచేముందు పూర్తి వివరాలు తెలియజేస్తామని చెప్పారు. ఓబులవారిపల్లె పీఎస్, సంబేపల్లె పీఎస్లలో పోసానిపై కేసులు నమోదైనట్లు చర్చించుకుంటున్నారు. గురువారం ఉదయం రాజంపేట లేదా రైల్వేకోడూరు కోర్టులో పోసానిని హాజరుపరిచే అవకాశాలు ఉన్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. పోసానికి దారిలో వైద్య పరీక్షలు చేయించినట్లు సమాచారం. -
అబద్ధపు వాంగ్మూలంతో అక్రమ అరెస్టులకు కుట్ర!
సాక్షి, అమరావతి: రెడ్బుక్ కుట్రలతో బరి తెగిస్తున్న చంద్రబాబు సర్కారు ఏకంగా న్యాయ ప్రక్రియను అపహాస్యం చేస్తూ అడ్డదారులు తొక్కుతోంది. దర్యాప్తు పేరిట కొండను తవ్వినప్పటికీ కనీసం ఎలుకను కూడా పట్టుకోలేకపోయిన సీఐడీ సరికొత్త కుట్రకు తెరతీసింది. న్యాయ ప్రక్రియలో అత్యంత కీలకమైన 164 సీఆర్పీసీ వాంగ్మూలాల (183 బీఎన్ఎస్ఎస్) నమోదు ముసుగులో కుతంత్రం పన్నుతోంది. నిబంధనలకు విరుద్ధంగా వాంగ్మూలాలను నమోదు చేస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగి సత్యప్రసాద్తో సీఆర్పీసీ 164 కింద అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించడం ద్వారా కుట్రకు మరింత పదునుపెట్టింది. ఆ అబద్ధపు వాంగ్మూలం ఆధారంగా రెడ్బుక్ కుట్రను అమలు చేసేందుకు పావులు కదుపుతోంది. టీడీపీ ఆఫీసులో తయారీ.. న్యాయమూర్తి ఎదుట నమోదువైఎస్సార్సీపీ హయాంలో మద్యం విధానానికి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం మోపిన అక్రమ కేసు దర్యాప్తులో సీఐడీ అడ్డదారులు తొక్కుతోంది. పూర్తిగా టీడీపీ ప్రధాన కార్యాలయం ఆదేశాల మేరకు దర్యాప్తును కొనసాగిస్తోంది. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తాము అందచేసిన జాబితాలో ఉన్నవారిపై అక్రమ కేసు నమోదు చేయాల్సిందేనని ఇటీవల డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన హరీశ్ కుమార్ గుప్తాకు ప్రభుత్వ పెద్దలు స్పష్టం చేశారు. ఈమేరకు దర్యాప్తు పేరిట వేధింపులను పర్యవేక్షించే బాధ్యతను రిటైర్డ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్కు అప్పగించారు. దీంతో మద్యం అక్రమ కేసులో సీఐడీ అడ్డగోలుగా వ్యవహరిస్తోంది. బెవరేజస్ కార్పొరేషన్లో గతంలో పని చేసిన సత్యప్రసాద్ను సీఐడీ అధికారులు అనధికారికంగా అదుపులోకి తీసుకుని బెదిరింపులకు గురి చేశారు. ఆయన కుటుంబ సభ్యులను కూడా అక్రమ కేసులతో వేధిస్తామని హెచ్చరించారు. దీంతో సీఐడీ అధికారులు చెప్పినట్టుగా వాంగ్మూలం ఇచ్చేందుకు సత్యప్రసాద్ సమ్మతించినట్లు తెలిసింది. ఈ క్రమంలో టీడీపీ ఆఫీసులో తిష్టవేసిన రిటైర్డ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ను సీఐడీ అధికారులు సంప్రదించారు. టీడీపీ ప్రధాన కార్యాలయంలో అప్పటికే రూపొందించిన వాంగ్మూలం ప్రతిని ఆయన సీఐడీ అధికారులకు పంపినట్లు సమాచారం. అందులో ఉన్నట్లుగా సత్యప్రసాద్తో 164 సీఆర్పీసీ కింద న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇప్పించాలని ఆదేశించారు. దాంతో సీఐడీ అధికారులు గుట్టు చప్పుడు కాకుండా సత్యప్రసాద్ను తరలించి న్యాయమూర్తి ఎదుట 164 సీఆర్పీసీ వాంగ్మూలం ఇప్పించినట్లు సమాచారం. సీఐడీ అధికారులు రాసిచ్చిన సమాచారాన్నే యథాతథంగా తాను వాంగ్మూలంగా న్యాయమూర్తి ఎదుట చదివి వినిపించానని సత్యప్రసాద్ తన సన్నిహితుల వద్ద పేర్కొనడం గమనార్హం. సంబంధం లేని వ్యక్తుల పేర్లు...!మద్యం కేసులో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న కూటమి సర్కారు న్యాయ ప్రక్రియను పక్కదారి పట్టిస్తోంది. 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలం నమోదుకు నిర్దేశించిన విధానాన్ని సీఐడీ నిర్భీతిగా ఉల్లంఘిస్తోంది. బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగి సత్య ప్రసాద్తో వాంగ్మూలం నమోదు చేయించిన తీరే అందుకు నిదర్శనం. టీడీపీ కార్యాలయం రూపొందించిన వాంగ్మూలాన్నే ఆయన న్యాయమూర్తి ఎదుట వల్లె వేసేలా పక్కా కుట్రతో కథ నడిపించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎలాంటి పదవులు నిర్వర్తించని వారు.. రాష్ట్రంలో ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు లేనివారు... పొరుగు రాష్ట్రాల్లో నివసిస్తున్నవారు... ఇలా పలువురి పేర్లను మద్యం విధానం, వ్యవహారాలతో ముడిపెడుతూ తప్పుడు వాంగ్మూలం నమోదు చేయించినట్లు తెలుస్తోంది. అసలు బెవరేజస్ కార్పొరేషన్ వ్యవహారాలతో ఏమాత్రం సంబంధం లేనివారు, ప్రభుత్వంలో ప్రత్యక్షంగాగానీ పరోక్షంగా భాగస్వాములుకానివారు, జీవితంలో తాను ఏనాడూ ప్రత్యక్షంగా చూడనివారు, అసలు ఆంధ్ర ప్రదేశ్లోనే లేనివారి పేర్లను కూడా ప్రభుత్వ పెద్దలు సత్య ప్రసాద్ అబద్ధపు వాంగ్మూలం ద్వారా చెప్పించినట్టు సమాచారం. 164 సీఆర్పీసీ నిబంధనల ప్రకారం కేసుతో నేరుగా ప్రమేయం ఉన్నవారి గురించే వాంగ్మూలంలో పేర్కొనాలి. అంతేగానీ ఆ వ్యవహారాలతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తుల పేర్లను వాంగ్మూలంలో ప్రస్తావించడం నిబంధనలకు విరుద్ధం. తాము చెప్పే వాటికి సంబంధించి డాక్యుమెంటరీ ఆధారాలతో నిరూపించగలిగే వాటినే చెప్పాలి. అంతేగానీ గాలి కబుర్లు, అక్కడ ఇక్కడ విన్నవాటిని చెప్పడం నిబంధనలకు విరుద్ధం. 164 సీఆర్పీసీ వాంగ్మూలం స్వచ్ఛందంగా ఇవ్వాలేగానీ అధికారులు, ఇతరుల ఒత్తిడితో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు. ఈ రెండు నిబంధనలకు విరుద్ధంగా అబద్ధపు వాంగ్మూలం నమోదు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునేందుకు చట్టంలో వెసులుబాటు ఉంది. అయితే ప్రభుత్వ పెద్దల కుట్రను అమలు చేయడమే ధ్యేయంగా పెట్టుకున్న సీఐడీ అధికారులు నిబంధనలను కాల రాస్తున్నారు. అంటే చట్టప్రకారం సాగాల్సిన దర్యాప్తును చంద్రబాబు ప్రభుత్వం ఎంతగా భ్రష్టుపట్టిస్తోందన్నది స్పష్టమవుతోంది. అంతేకాదు న్యాయమూర్తి ఎదుట నమోదు చేసే వాంగ్మూలం ప్రక్రియను కూడా అపహాస్యం చేస్తోందనడానికి పరాకాష్ట ఈ ఉదంతం. ఆ అబద్ధపు వాంగ్మూలాన్ని ఏకైక ఆధారంగా చేసుకుని ఈ కేసులో అక్రమ అరెస్టులకు సీఐడీ రంగం సిద్ధం చేస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సలహాదారుగా వ్యవహరించిన రాజ్ కసిరెడ్డి, బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డిలతోపాటు మరికొందర్ని అరెస్టు చేసి వేధించాలన్నది సీఐడీ పన్నాగం. అనంతరం వారిని విచారణ పేరిట వేధించి తాము చెప్పినట్లుగా నడుచుకునేలా ఒత్తిడి తేవాలన్నది కుతంత్రం. దర్యాప్తు నిబంధనలు, న్యాయ విచారణ ప్రక్రియ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ సీఐడీ బరితెగిస్తున్న తీరుపై పోలీసు వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ పెద్దల కుట్రను అమలు చేసే సాధనంగా సీఐడీ దిగజారిపోయిందని పోలీసు ఉన్నతాధికారులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రశ్నించే గొంతు నొక్కాలనే..ప్రశ్నించే గొంతు నొక్కాలన్నదే టీడీపీ కూటమి ప్రభుత్వం ఉద్దేశ్యం. రాజకీయాల నుంచి తప్పుకున్నానని పోసాని ప్రకటించినా చంద్రబాబు వెంటాడ్డం అన్యాయం. చంద్రబాబు కక్ష సాధింపు రాజకీయాలతో రాష్ట్రం రగిలిపోతోంది. నాగరిక సమాజం నుంచి మళ్లీ ఆటవిక సమాజంలోకి తీసుకెళ్తున్నారు. చట్టాలను, న్యాయవ్యవస్థలను సీఎం అపహాస్యం చేస్తున్నారన్నారు. – సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రిప్రజాస్వామ్యం ఖూనీ..రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. విమర్శలను టీడీపీ కూటమి ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది. అందుకే పోసాని లాంటి వారి అరెస్టులు జరుగుతున్నాయి. ప్రజల రక్షణకు కాక రాజకీయ కక్షలకు పోలీసులను వాడుకుంటున్నారు. పోసాని కృష్ణమురళి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా.– గడికోట శ్రీకాంత్రెడ్డి,మాజీ చీఫ్ విప్ఒక నియంతలా చంద్రబాబు చంద్రబాబు ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలు ఎల్లకాలం కొనసాగవు. పోసాని అరెస్టుతో ప్రభుత్వ అరాచకం తీవ్రస్థాయికి చేరినట్లయింది. కచ్చితంతా ప్రజలు గుణపాఠం చెప్తారు. చట్టానికి వ్యతిరేకంగా నడుచుకోవద్దని పోలీసులను కోరుతున్నాం. పోసాని ఆరోగ్యానికి ప్రభుత్వం, పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. – మేరుగు నాగార్జున, మాజీ మంత్రికక్ష రాజకీయాలు మంచివి కావురాజకీయాల నుంచి దూరంగా వెళ్తున్నానని పోసాని ఎప్పుడో ప్రకటించారు. అయినా ఆయనపై దుర్మార్గంగా కేసులు పెట్టారు. కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. బ్రిటిష్ పాలనలోనే స్వేచ్ఛగా ఉన్నామేమోనన్న భావన ప్రజలకు వస్తోంది. ప్రజాస్వామ్యంలో కక్ష రాజకీయాలు మంచివి కావు. – కురసాల కన్నబాబు, మాజీ మంత్రిపండగ పూటా హింసిస్తున్నారుశివరాత్రి రోజున కూడా చంద్రబాబు ప్రజలను హింసిస్తున్నారు. పోసాని కృష్ణమురళి అరెస్టే దీనికి నిదర్శనం. చంద్రబాబును ఎవ్వరూ ప్రశ్నించకూడదా? పోసాని అనారోగ్యంతో ఉన్నా చంద్రబాబు వేధిస్తున్నారు. పోలీసులు బలిపశువులు కావొద్దని కోరుతున్నా. చట్టాన్ని మీరితే ఎప్పటికైనా తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. – అంబటి రాంబాబు, మాజీ మంత్రికక్ష సాధింపులకు పరాకాష్ట..పోసాని కృష్ణమురళి అరెస్టు టీడీపీ కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనను గాలికొదిలేసి, ఎంపిక చేసుకున్న వారిపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న పోసాని కృష్ణమురళిని అక్రమంగా అరెస్టుచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. చంద్రబాబు ప్రభుత్వ చర్యలు దుర్మార్గం. – కాకాణి గోవర్థన్రెడ్డి, మాజీ మంత్రి -
వంశీపై అక్రమ కేసు.. వీడియో బయటపెట్టిన వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: వల్లభనేని వంశీపై పెట్టిన అక్రమ కేసులో వీడియోను వైఎస్సార్సీపీ బయట పెట్టింది. షాపింగ్ చేస్తున్న సత్యవర్థన్ వీడియోను ఆ పార్టీ విడుదల చేసింది. ‘సత్యమేవ జయతే’ అంటూ ట్వీట్ చేసింది. ‘‘తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ.. తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలతో చట్టాన్ని.. న్యాయ వ్యవస్థలను అపహాస్యం చేస్తున్న చంద్రబాబు సర్కారు తీరుకు నిలువెత్తు నిదర్శనం ఇది’’ అని వైఎస్సార్సీపీ ఆధారాలతో సహా బట్టబయలు చేసింది.‘‘ఈ వీడియోలో బ్లూషర్ట్ వేసుకున్న వ్యక్తే సత్యవర్థన్. వల్లభనేని వంశీ కిడ్నాప్ చేశారంటూ పోలీసులు చెప్తున్న వ్యక్తి ఇతనే. మరి ఈ వీడియోను చూస్తే సత్యవర్థన్ కిడ్నాప్నకు గురైనట్టుగా ఉందా?’’ అని వైఎస్సార్సీపీ ప్రశ్నించింది.‘‘పోలీసులు ఆరోపిస్తున్న ఫిబ్రవరి 12న విశాఖపట్నంలోని ఆనందపురం జంక్షన్లో ఒక బట్టల దుకాణంలో స్వేచ్చగా షాపింగ్ చేసుకుంటున్న సత్యవర్థన్ వీడియో ఇది. కిడ్నాప్ చేసి, నిర్బంధించిన వ్యక్తి బయటకు ఎలా వస్తారు?. ఇలా స్వేచ్ఛగా షాపింగ్ ఎలా చేస్తారు?. దీని అర్థం పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని.. వారి కుటుంబ సభ్యులను భయపెట్టి, బెదిరించి తప్పుడు ఫిర్యాదు తీసుకున్నారని ఈ వీడియో సాక్షిగా బయటపడింది’’ అని వైఎస్సార్సీపీ ట్వీట్ చేసింది.💣 Truth Bomb 💣సత్యమేవ జయతేతీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలతో చట్టాన్ని, న్యాయవ్యవస్థలను అపహాస్యం చేస్తున్న @ncbn సర్కారు తీరుకు నిలువెత్తు నిదర్శనం ఇది.ఈ వీడియోలో బ్లూషర్ట్ వేసుకున్న వ్యక్తే సత్యవర్థన్. వల్లభనేని వంశీ కిడ్నాప్… pic.twitter.com/pAa5VMknV9— YSR Congress Party (@YSRCParty) February 26, 2025ఇదీ చదవండి: లోకేష్.. ఇవిగో ఆధారాలు..! -
పోలవరం ఎత్తు తగ్గించడం సంపద సృష్టా? తోపుదుర్తి స్ట్రాంగ్ కౌంటర్
-
Chandrasekhar Reddy: లోకేష్ చాలెంజ్కి దిమ్మతిరిగే కౌంటర్
-
‘ప్రధాన ప్రతిపక్ష గుర్తింపుపై చంద్రబాబు సర్కార్ నిరంకుశ వైఖరి’
సాక్షి, తాడేపల్లి: ప్రజాస్వామ్య స్పూర్తికి తూట్లు పొడుతూ అసెంబ్లీలో అసలు ప్రధాన ప్రతిపక్ష గుర్తింపునే ఇవ్వకుండా, ప్రశ్నించే గొంతు వినిపించకుండా కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మండిపడ్డారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాన ప్రతిపక్ష గుర్తింపు అంటే ఏదో రాజకీయపరమైన హోదాగా కూటమి పార్టీలు విషప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్ష గుర్తింపు అనేది ఒక బాధ్యత, దీనివల్ల అసెంబ్లీలో ఎక్కువ సమయం ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు ఉండే అవకాశం వైఎస్సార్సీపీకి దక్కుతుందన్నారు. దీనిని కూడా వక్రీకరించడం దుర్మార్గమన్నారు.ఇంకా ఆయన ఏమన్నారంటే..ఏపీ అసెంబ్లీలో నాలుగు పార్టీలు ఉంటే, దానిలో మూడు పార్టీలు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాయి. మిగిలిన వైఎస్సార్సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాల్సి ఉంది. పార్లమెంట్ చట్టం 1977 ప్రకారం సభలో సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రధాన ప్రతిపక్షంను గుర్తించాలి. కూటమి ప్రభుత్వం దీనిని ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. ప్రధాన ప్రతిపక్ష గుర్తింపును వైఎస్సార్సీపీ కోరుతుంటే దీనిని రాజకీయం చేయడం దుర్మార్గం. దీనిపై కూటమి పార్టీలు చేస్తున్న ఈ విమర్శలను చూసి ప్రజాస్వామికవాదులే ఆశ్చర్యపోతున్నారు.ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా అడ్డుకుంటున్నారుతొమ్మిది నెలల కూటమి పాలనపై ఇప్పటికే ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ప్రారంభమైంది. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను ఎక్కడా నెరవేర్చడం లేదు. మరోవైపు గ్రూప్-2 నిరుద్యోగులు, మిర్చి రైతులు, విద్యుత్ చార్జీల భారాన్ని మోయలేని ప్రజలు బాహాటంగానే ప్రభుత్వం మీద తమ నిరసనను తెలియచేస్తున్నారు. వీటన్నింటినీ ప్రజల పక్షాన ఎక్కడ వైఎస్సార్సీపీ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఎండగడుతుందోననే భయంతోనే కూటమి ప్రభుత్వం ఉంది. న్యాయంగా వైఎస్సార్సీపీకి దక్కాల్సిన ప్రధాన ప్రతిపక్ష గుర్తింపును దూరం చేస్తూ, ప్రజా సమస్యలపై ఎక్కడ వైఎస్సార్సీపీ తమను ప్రశ్నిస్తుందోనని కంగారుపడుతోంది. ప్రతిపక్షంగా అడిగే ప్రశ్నలకు అసెంబ్లీలో సమాధానం చెప్పుకోలేని నిస్సహాయ స్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది. తమ పాలనా వైఫల్యాలను ప్రజాగొంతుకగా వైఎస్సార్సీపీ సభలో వినిపిస్తే తట్టుకోలేమనే ఉద్దేశంతోనే ప్రధాన ప్రతిపక్ష గుర్తింపును నిరాకరిస్తున్నారు.ప్రధాన ప్రతిపక్షంగా శాసనమండలిలో పోరాడుతున్నాంశాసనమండలిలో ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ అనేక ప్రజా సమస్యలపై మాట్లాడుతోంది. ప్రధాన ప్రతిపక్ష గుర్తింపు ఉండటం వల్ల వైఎస్సార్సీపీ సభ్యులకు ఎక్కువ సమయం లభిస్తోంది. తాజాగా వైస్ చాన్సలర్ల బలవంతపు రాజీనామాలపై ప్రభుత్వాన్ని నిలదీయడంతో సమాధానం చెప్పలేక కూటమి ప్రభుత్వం కంగారు పడింది. గవర్నర్ ప్రసంగంలో మాట్లాడించిన మాటలు, చెప్పించిన అబద్ధాలపై నిలదీయడంతో అధికారపక్షం నీళ్ళు నమిలింది. తమ తప్పులను ఒప్పుకోవాల్సిన పరిస్థితిలో పడింది.ప్రజాస్వామ్యంలో అధికారపక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో, ప్రధాన ప్రతిపక్షంకు అంతకంటే ఎక్కువ బాధ్యత ఉంటుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తెలుగుదేశానికి ప్రతిపక్షంగా చట్టసభల్లో మాట్లాడేందుకు ఎంతో సమయం లభించింది. సభలో ప్రధాన ప్రతిపక్షం లేకుండా చర్చలు జరిగితే వాటిని అర్థమవంతమైనవని అంటారా? ప్రధాన ప్రతిపక్షంగా ప్రశ్నించే వాటికి ధీటుగా సమాధానం చెప్పగలిగితేనే కూటమి ప్రభుత్వ పాలనా సామర్థ్యం ప్రజలకు తెలుస్తుంది. ఇటువంటి సంప్రదాయాలకు తిలోదకాలు ఇస్తూ, అసలు ప్రధాన ప్రతిపక్ష గుర్తింపే లేకుండా, ప్రశ్నించేవారే లేకుండా ఏకపక్షంగా పాలనను సాగించాలని అనుకోవడం నిరంకుశత్వం అవుతుంది. సంఖ్యాబలం రీత్యా మాకే ప్రధాన ప్రతిపక్ష గుర్తింపు వస్తుందంటే, జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాలి. -
High Court: విచారణ సందర్భంగా పోలీసులపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
-
రాజారెడ్డి ఐ ఆస్పత్రిని ప్రారంభించిన వైఎస్ జగన్
-
అట్టుడికిన ఆంధ్రప్రదేశ్ శాసన మండలి... వీసీల రాజీనామా.. ఆరున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు.. 4 లక్షల ఉపాధి అవకాశాలపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్సార్సీపీ సభ్యులు
-
దశ, దిశ లేకుండా గవర్నర్ ప్రసంగం
సాక్షి, అమరావతి: గవర్నర్ ప్రసంగంలో దశ, దిశ లేదని శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చెప్పారు. మంగళవారం శాసన మండలి సమావేశాల నుంచి వాకౌట్ చేసిన తరువాత వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలతో కలిసి ఆయన అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడారు. గవర్నర్తో రాజకీయ విమర్శలు, గత ప్రభుత్వ విధ్వంసం వంటి అసంబద్ధ వ్యాఖ్యలు చేయించడం దారుణమని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల గురించి కాకుండా 2047 నాటికి అమలు చేయబోయే సూపర్ టెన్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. అంటే ఇప్పుడు చెప్పిన సూపర్ సిక్స్కు నీళ్లొదిలినట్లేనని వారు చెబుతున్నారా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదాపై డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడారని ధ్వజమెత్తారు. శాసన సభలోని రాజకీయ పార్టీల్లో మూడు పక్షాలు అధికార పక్షంగా ఉన్నాయని, మిగిలింది వైఎస్సార్సీపీనే కాబట్టి ప్రతిపక్షంగా గుర్తించాలని కోరామని తెలిపారు. గవర్నర్ ప్రసంగం రోజున సభకు హాజరైనా లెక్కకు రాదన్న వాదనలను తాము పట్టించుకోవడం లేదని తెలిపారు. తాము హాజరు కోసం సభకు రాలేదని, తమకున్న హక్కును గవర్నర్ ద్వారా ప్రజల దృష్టికి తీసుకురావాలనే అసెంబ్లీకి వచ్చామని చెప్పారు. స్పీకర్ పిలిచి అడిగినా ఇదే చెబుతామన్నారు. తమది రాజకీయ పార్టీ అని, అన్ని అంశాలపైనా సందర్భం, సమయాన్ని బట్టి తయారుగా ఉంటామన్నారు.వీసీల మూకుమ్మడి రాజీనామాలపై విచారణ జరగాలికూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో యూనివర్సిటీ వైస్ చాన్సలర్లు (వీసీలు) అందరితో మూకుమ్మడిగా చేయించిన రాజీనామాలపై విచారణ జరగాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. వీసీలను అధికార బలంతో బెదిరించి రాజీనామాలు చేయించి, వారికి నచ్చిన వారితో భర్తీ చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. దీనిపై సభలోనే విద్యా శాఖ మంత్రి లోకేశ్ వ్యాఖ్యలకు సమాధానం చెప్పామన్నారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించామని అన్నారు. గ్రూప్ 2 అభ్యర్థుల అభ్యంతరాలను ప్రభుత్వం పట్టించుకోలేదని బొత్స మండిపడ్డారు. వారి ఆందోళనలను పరిశీలిస్తామని, న్యాయం చేస్తామని విద్యా శాఖ మంత్రి లోకేశ్ ఎక్స్ వేదికగా చెప్పినా, న్యాయం జరగలేదన్నారు. గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని సీఎం కార్యాలయం నుంచి లేఖ పంపినా ఏపీపీఎస్సీ ఖాతరు చేయలేదని వారే చెప్పారని అన్నారు. సీఎం కార్యాలయం లేఖకే విలువ లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబుకు అవమానం కాదా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు కుంభా రవిబాబు, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తోట త్రిమూర్తులు, కపిలవాయి సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. -
మీ ఒత్తిడితోనే వీసీల రాజీనామా
సాక్షి, అమరావతి: ‘మీ ఒత్తిడితోనే యూనివర్సిటీల వైస్ ఛాన్స్లర్లు రాజీనామా చేశారు.. ఆధారాలు ఇవిగో.. ఏమాత్రం నిజాయితీ ఉన్నా న్యాయబద్ధంగా విచారణ చేయించాలి. లేదా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి’ అంటూ ‘ఎక్స్’ వేదికగా వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు నెల్లూరు విక్రమ సింహపురి యూనివర్సిటీ వీసీ రాజీనామా లేఖను ట్యాగ్ చేస్తూ మంగళవారం ‘ఎక్స్’ ఖాతాలో ట్వీట్ చేసింది.‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ద్వారా విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ రాష్ట్రంలోని యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్లను రాజీనామా చేయాలని ఒత్తిడి తెచ్చినట్లు ఆధారాలివిగో.. నారా లోకేశ్ ఆదేశాలతో చైర్మన్ స్వయంగా వీసీలను పిలిచి రాజీనామా చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఒక వీసీ తన రాజీనామా లేఖలో మంత్రి లోకేశ్ బెదిరించినట్లు స్పష్టంగా రాశారు’ అంటూ వైఎస్సార్సీపీ ఎత్తి చూపింది. ‘వీసీలపై రాజీనామా చేయాలంటూ ఎందుకు ఒత్తిడి తెచ్చారని మంత్రి నారా లోకేశ్ను శాసన మండలిలో వైఎస్సార్సీపీ ప్రశ్నించింది.వీసీలను బెదిరించినట్లు ఆధారాలు చూపితే విచారణకు ఆదేశిస్తామన్నారు. వైస్ ఛాన్స్లర్లు గవర్నర్ అధికారం కిందకు వస్తారని లోకేశ్ బుకాయించారు. ‘ఇదిగో.. ఇప్పుడు నారా లోకేశ్ ఒత్తిడితోనే వీసీలు రాజీనామా చేసినట్లు ఆధారాలను బయట పెడుతున్నాం. ఏమాత్రం నిజాయితీ ఉన్నా ఈ విషయమై న్యాయబద్ధంగా విచారణ చేయించాలి. లేదా నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేశ్ రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేసింది. అప్పుడే వాస్తవాలు బయటికి వస్తాయని, న్యాయం గెలుస్తుందని స్పష్టం చేసింది. -
రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు.. 4 లక్షల ఉపాధి అవకాశాలా?
సాక్షి, అమరావతి: ‘టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు.. 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించారా..? ఎక్కడో చూపించండి..!’ అని వైఎస్సార్సీపీ సభ్యులు శాసనమండలిలో నిలదీశారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలో చర్చ సందర్భంగా మండలిలో మంగళవారం ఈ అంశంపై అధికార, విపక్ష సభ్యుల మధ్య కొద్దిసేపు వాడివేడిగా చర్చ జరిగింది. చివరికి సమాధానం చెప్పలేక మంత్రులు నీళ్లు నమలాల్సి వచ్చింది. నాలుగు ఉద్యోగాలూ కల్పించలేదుఏకంగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం తొమ్మిది నెలలుగా ఒక్క ఉద్యోగం కాదు కదా.. కనీసం ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ధ్వజమెత్తారు. గవర్నర్ ప్రసంగంలో నిరుద్యోగ భృతి గురించి ప్రస్తావనే లేదన్నారు. గవర్నర్ ప్రసంగంలో నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పించారని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి విమర్శించారు. ఏ శాఖలో.. ఏ కంపెనీలో.. ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. నాలుగు లక్షలు కాదు.. నలుగురికి కూడా ఉద్యోగాలివ్వలేదని మండిపడ్డారు.ఈ సమయంలో మంత్రి నారా లోకేశ్ జోక్యం చేసుకుంటూ.. ‘రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాం. 4 లక్షల ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పామే కానీ.. కల్పించినట్లుగా ఎక్కడా చెప్పలేదు’ అని ఇంగ్లీషు వెర్షన్లో ఉన్న గవర్నర్ ప్రసంగాన్ని చదివి బుకాయించబోయారు. తెలుగులో గవర్నర్ ప్రసంగాన్ని చదవాలని సభ్యులు పట్టుబట్టడంతో.. ‘ఇంగ్లీషులో చదువుతున్నా కదా’ అంటూ ఆంగ్లంలో ఉన్న ప్రసంగం పాఠాన్ని మరోసారి చదివి వినిపించారు. పొరపాటును లోకేశ్ ఒప్పుకోవాలన్న బొత్స శాసన మండలిలో వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ బొత్స సత్యనారాయణ జోక్యం చేసుకుని తెలుగు ప్రసంగ పాఠంలో ఉన్న అంశాలను చదివి వినిపించారు. ‘4 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించబడింది’ అని అందులో స్పష్టంగా ఉందన్నారు. తెలుగులో తర్జుమా చేయడంలో పొరపాటు జరిగి ఉంటుందని, అదే విషయాన్ని హుందాగా అంగీకరించి సరిచేస్తామని చెబితే సరిపోతుంది కదా! అని హితవు పలికారు. నాడు రాష్ట్ర ప్రయోజనాలు కనిపించలేదా? టీడీపీ, జనసేన ఎంపీలపై ఆధారపడి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతున్నందున ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు సాధించలేకపోతున్నారని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ప్రశ్నించారు. తాము బేషరతుగానే మద్దతు ఇస్తున్నట్లు లోకేశ్ చెప్పారు. ‘2014లో మీకు రాష్ట్ర ప్రయోజనాలు కనిపించలేదా? అప్పుడు ప్రత్యేక హోదా వద్దని ప్యాకేజీ ఎందుకు తీసుకున్నారు?’ అని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశి్నంచారు. దీనికి మంత్రులు సమాధానం దాట వేశారు. ఏఐ... తెలుగులో ఉంటుందా? వైఎస్సార్సీపీ హయాంలో ఇంగ్లీష్ మీడియం బోధన ప్రవేశపెట్టి మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా చేసిందని ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు పేర్కొన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం తెలుగు, ఇంగ్లీషు మీడియంలలో దేన్ని అనుసరిస్తుందో చెప్పలేకపోతోందన్నారు. సీఎం చంద్రబాబు తరచూ చెప్పే ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్వేర్ టెక్నాలజీ తెలుగులో ఉంటాయా? అని ప్రశ్నించారు. తెలుగును అవమానిస్తున్నారని మంత్రులు అనిత, సవిత అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. తానేమీ తప్పుగా మాట్లాడలేదని, ఇంగ్లీషు మీడియం విషయంలో ప్రభుత్వ వైఖరిని గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించలేదని తూమాటి పేర్కొన్నారు.ఉచిత గ్యాస్ అంటూ 9 నెలల్లో ఒక్క సిలిండర్ మాత్రమే ఇచ్చారన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 17 కొత్త మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టగా ఐదు కాలేజీలను ప్రారంభించడంతోపాటు మరో కాలేజీకి అనుమతి సాధించామన్నారు. మిగిలిన కళాశాలలు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటాయా? ప్రైవేట్కు అప్పగిస్తారా? అనేది చెప్పడం లేదన్నారు. ఐదేళ్లలో 30 వేల మంది మహిళలు మిస్సింగ్ అని ఆరోపణలు చేశారని, 700 మంది మాత్రమే మిస్సింగ్ అని ఆనాడే డీజీపీ స్థాయి అధికారులు తేలి్చనా పదేపదే అవే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.నాడు తొలి ఆర్నెలల్లోనే 1.25 లక్షల ఉద్యోగాలు.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఆరు నెలల్లోనే ఏకంగా 1.25 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు మెగా డీఎస్సీ అంటూ ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజల జీవితాలు తలకిందులయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. సూపర్ సిక్స్ హామీలను ఎగ్గొట్టడం.. రూ.లక్ష కోట్లకుపైగా అప్పులు చేయడం.. బెల్టు షాపులతో మద్యం ఏరులై పారించడం.. మెగా డీఎస్సీ ఇవ్వకపోవడం.. 83 లక్షల మందికి తల్లికి వందనం ఎగ్గొట్టడం.. ప్రజలపై రూ.15 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారం మోపడం.. పోలవరం ఎత్తు తగ్గించడం సుపరిపాలనా? అని నిలదీశారు.జనవరి 1వ తేదీన ఇస్తామన్న జాబ్ క్యాలెండర్ ఏమైందన్నారు. ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ అని చెప్పి పీఆర్సీ చైర్మన్ను బెదిరించి వెళ్లగొట్టారన్నారు. అధికారంలోకి వస్తే వలంటీర్లకు రూ.5 వేలు కాదు.. రూ.10 వేలు ఇస్తామని చివరికి వారిని రోడ్డు పాలు చేశారని మండిపడ్డారు. గత 8 నెలల్లో ఒక్క రూపాయి కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. 2023లో వలంటీర్లను రెన్యువల్ చేయకపోవడం వల్లే జీతాలు ఇవ్వలేకపోయామని, కొనసాగించలేకపోయామని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి పేర్కొన్నారు. -
మంత్రి లోకేష్కి వైఎస్సార్సీపీ స్ట్రాంగ్ కౌంటర్
తాడేపల్లి: ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి మంత్రి నారా లోకేష్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది వైఎస్సార్ సీపీ. ఈ మేరకు వైఎస్సార్ సీపీ శానమండలి సభ్యులు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, వరుదు కళ్యాణిలు పత్రికా ప్రకటన విడుదల చేశారు. శాసనసభలోగానీ, మండలిలోగానీ అధికార పక్షం తర్వాత ఎక్కువ సీట్లు ఉన్న పార్టీనే ప్రతిపక్షం అంటూ చట్టంలో ఉన్న విషయాన్ని ఎమ్మెల్సీలు బయటపెట్టారు.కూటమి ప్రభుత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీల తర్వాత ఉన్న ఏకైక పార్టీ వైఎస్సార్ సీపీనేనని, కాబట్టి కచ్చితంగా వైఎస్సార్ సీపీని ప్రతిపక్షంగా గుర్తించాలన్నారు. ప్రజా సమస్యలపై వివరంగా మాట్లాడటానికి అప్పుడే తగినంత సమయం హక్కుగా వస్తుందన్నారు. కానీ ప్రభుత్వ లోపాలనె ఎత్తిచూపుతారనే భయంతోనే వైఎస్సార్ సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదన్నారు. ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పీఏసీని సైతం ఇవ్వకుండా అడ్డుకున్నారని, ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీలు స్పష్టం చేశారు. -
పులివెందుల పర్యటనలో వైఎస్ జగన్.. అభిమానం అంటే ఇదే కదా..
సాక్షి,వైఎస్సార్జిల్లా : అభిమానానికి హద్దుండదు. ఆత్మీయతకు వయస్సుతో పనిలేదు. ఈ రెండింటికి సరైన చిరునామా వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చిన్నారుల్లో జననేతకు ఉన్న క్రేజ్ చూస్తూనే ఉన్నాం. అది కుప్పం అయినా, విజయవాడ,గుంటూరు,పులివెందుల అయినా సరే. వైఎస్ జగన్పై ఉన్న అభిమానం, ఆప్యాయత మరోమారు నిరూపిమతమైంది. బాలుడి పేరు మెహబూబ్ షరీష్. పులివెందులకు ఐదుకిలోమీటర్ల దూరంలో ఉన్న కొండారెడ్డి కాలనీలో నివాసం ఉంటాడు. అతనికి వైఎస్ జగన్ అంటే పిచ్చి. ఎలాగైనా ఈ రోజు తమ అభిమాన నేత వైఎస్ జగన్ను కలవాలని తెల్లవారు జామున ఐదుగంటలకు చెప్పుల్లేకుండా కాలి నడకన బయలుదేరాడు. వైఎస్ జగన్ హెలిఫ్యాడ్ వద్ద దిగుతారని తెలుసుకొని అక్కడే ఎదురు చూశాడు ఈ బాలుడు.మధ్యాహ్నం 12గంటల సమయంలో వైఎస్ జగన్ పులివెందులకు చేరుకున్నారు. అక్కడికి వచ్చిన వైఎస్ జగన్ను ఎలాగైనా కలవాల్సిందేనని ప్రయత్నించాడు ఈ బాలుడు. ఎట్టకేలకు వైఎస్ జగన్ను చూడగానే బాలుడు ఆనంద భాష్పాలు రాల్చాడు. ఆ పిల్లాడిని గమనించిన వైఎస్ జగన్ దగ్గరకు తీసుకున్నారు. వైఎస్ జగన్ బాలుడి కళ్ల నీళ్లు తుడిచి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బాలుడి అభిమానానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి చలించిపోయారు. మొత్తానికి వైఎస్ జగన్తో బాలుడు ఫొటో దిగాడు. జాగ్రత్తగా ఆ బాలుడిని ఇంటి వద్ద దిగబెట్టాలని పార్టీ నేతలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు.అభంశుభం తెలియని బాలుడే వైఎస్ జగన్పై చూపిన ప్రేమను నాటి వైఎస్సార్సీపీ పాలనకు సాక్షమని పరిశీలకులు అంటున్నారు. బాలుడికి కోరిక తీర్చి వైఎస్ జగన్ పెద్దమనసు చాటుకున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అలాగే, వైఎస్ జగన్ తన పాలనలో అమ్మఒడిని అమలు చేశారని, నాడు,నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చారని, అందుకే చిన్నారుల గుండెల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి చెరగని ముద్రవేసుకున్నారని వైఎస్సార్సీపీ అంటోంది. -
మిర్చి రైతుల్ని నిట్టనిలువునా మోసం చేస్తూ.. అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
సాక్షి, అమరావతి : మిర్చి రైతులను చంద్రబాబు ప్రభుత్వం నిట్టనిలువునా మోసం చేసింది. కేంద్రం మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయమన్నా.. చేయలేమని చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు.వేరే రాష్ట్రాలనుంచి మిర్చి వస్తుంది కాబట్టి..మిర్చి విషయంలో మార్కెట్లో జోక్యం చేసుకోలేమని తేల్చేశారు. అదే సమయంలో ఇ-క్రాప్ ఆధారంగా రైతులవారీగా సబ్సిడీ ఆలోచన చేస్తామన్నారు. అదికూడా ఆలోచనలోనే ఉందన్నారు. అయితే, మరి అదే ఇ-క్రాప్ ఆధారంగా మార్కెట్లో జోక్యం ఎందుకు చేసుకోలేకపోతున్నారని, రైతుకు మంచి ధర ఎందుకు ఇవ్వలేకపోతున్నారని రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
వైఎస్ జగన్,వైఎస్సార్సీపీ అంటే చంద్రబాబుకు భయం : కురసాల
సాక్షి,కాకినాడ: ‘ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర వైఎస్సార్సీపీదే. వైఎస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తన రంగు భయటపడుతుందని చంద్రబాబు భయపడుతున్నారు. చంద్రబాబుకు వైఎస్సార్సీపీ అన్నా.. వైఎస్ జగన్ అన్నా భయమే.’ వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు.ధన్యవాదాలు తీర్మానంలో సీఎం చంద్రబాబు మాటలు వింటే..ఎవరి డప్పు వాళ్ళు కొట్టుకోవాలి అని సినిమా డైలాగ్ గుర్తుకువస్తుంది. గౌరవ సభలో చంద్రబాబు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు మండిపడ్డారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడారు. సభా మర్యాదలు చూస్తే చిత్రంగా ఉంది. సభా మర్యాదలను మంట కలిపే శ్రీకారం చుట్టుంది చంద్రబాబే. ఎన్టీఆర్ను పదవి లోంచి దించే సమయంలో ఆయనకు మైక్ ఇవ్వలేదు.మాజీ గవర్నర్ నరసింహన్ చంద్రబాబును చూసి బిత్తరపోయారు. హరిచందన్ గవర్నర్గా ఉన్నప్పుడు చంద్రబాబు ఏవిధంగా కించపరిచారో అందరికి తెలుసు. వీళ్లా సభలో వైఎస్సార్సీపీ గవర్నర్కు మర్యాద ఇవ్వలేదు అని అంటున్నారు. నిరనసగా వాకౌట్ చేసి వెళ్లి పోవడం చాలా కాలం నుంచి నడుస్తోంది. చాల పార్టీలు చేస్తున్నాయి. ధన్యవాదాలు తీర్మానంలో చంద్రబాబు మాటలు వింటే..ఎవరి డప్పు వాళ్ళు కొట్టుకోవాలి అని సినిమా డైలాగ్ గుర్తుకువస్తుంది. గౌరవ సభలో చంద్రబాబు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు. ఈ తొమ్మిది నెలల కాలంలో ప్రజలు ఏమీ అనుకుంటున్నారో తెలుసుకోండి. గ్రూప్-2 అభ్యర్ధులైతే..తాము తప్పు చేశామని చెప్పులతో కొట్టుకుంటున్నారు. గత ప్రభుత్వం రూ.14 లక్షల కోట్లు అప్పు చేసిందని ఆబద్దాలు చెప్పారు. రూ.7 లక్షల కోట్ల అప్పు అని తేలింది. ఒక అబద్దాన్ని జనంలోకి తీసుకు వెళ్లి దానిని నిజమని నమ్మిస్తారు. ఈ తొమ్మిది నెలల కాలంలో లక్ష కోట్లు కూటమీ ప్రభుత్వం అప్పులు చేసింది. ఆ అప్పులు దేని కోసం ఖర్చు చేశారు? ఏ వర్గాన్ని వదలకుండా మోసం చేయడానికి సిగ్గులేదా?. గవర్నర్తో అబద్దాలు చెప్పించారు. నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చేశామని చెబుతున్నారు.వీసీలను రాత్రికి రాత్రి బెదిరించి రాజీనామాలను చేయించారు. దీనిపై విచారణ జరిపించండి. తొమ్మిది నెలల కాలంలో మీ అసలు రంగు బయట పడింది. ప్రతిపక్ష హోదా మీద పార్లమెంటు చట్టం ఏం చెప్పిందో తెలుసుకోండి.వైఎస్సార్సీపీ అంటే మీకు భయం.. వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా మీ పాలనను ఎండగడతారని భయం. 151 సీట్లు వచ్చినా..11 సీట్లు వచ్చినా టీడీపీ వైఎస్ జగన్ చూసి భయపడుతోంది. ఆ ఒకే ఒక్కడు 49% ఓటు బ్యాంక్ పొందారు. ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర వైఎస్సార్సీపీదే అని అన్నారు. -
లోకేష్.. ఇవిగో ఆధారాలు..!
తాడేపల్లి : యూనివర్శిటీలలో వైస్ చాన్సలర్లు(వీసీ)లను బెదిరించి రాజీనామాలు చేయించిన సాక్ష్యాలను వైఎస్సార్ సీపీ బయటపెట్టింది. దీనికి సంబంధించిన ఆధారాలను వైఎస్సార్ సీపీ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ద్వారా విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలోని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లను రాజీనామా చేయమని ఒత్తిడి తెచ్చారు. నారా లోకేష్ ఆదేశాలతో ఛైర్మన్ స్వయంగా వీసీలను పిలిచి రాజీనామా చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఒక వీసీ తన రాజీనామా లేఖలో మంత్రి లోకేష్ బెదిరించినట్లు స్పష్టంగా రాశారు.వీసీలు రాజీనామా చేయాలంటూ ఎందుకు ఒత్తిడి తెస్తున్నారని శాసనమండలిలో వైఎస్సార్ సీపీ ప్రశ్నించగా, లోకేష్ అడ్డంగా దొరికిపోయారు. వైస్ చాన్సలర్లు గవర్నర్ అధికారం కిందకు వస్తారంటూ లోకేష్ బుకాయించారు. వీసిలను బెదిరించినట్లు ఆధారాలు చూపితే విచారణకు ఆదేశిస్తామన్నారు. అయితే ‘ మీరే బెదిరించి.. మీరే విచారణ జరిపితే నిజాలు బయటకు వస్తాయా?’ అని ప్రశ్నిస్తే లోకేష్ కు మౌనమే సమాధానమైంది.ఇవిగో ఆధారాలు.. న్యాయబద్ధంగా విచారణ చేయించండినారా లోకేష్ ఒత్తిడితో రాజీనామా చేసినట్లు ఆధారాలను బయటపెడుతున్నామని, ఏ మాత్రం నిజాయితీ ఉన్నా వీసీల రాజీనామాపై లోకేష్ న్యాయబద్ధంగా విచారణ చేయించాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేస్తోంది. ఒకవేళ అలా కాకపోతే ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ లోకేస్ రాజీనామా చేయాలని పేర్కొంది. అప్పుడే వాస్తవాలు బయటకి వస్తాయని, న్యాయం గెలుస్తుందని వైఎస్సార్ సీపీ స్పష్టం చేసింది.💣 Truth Bomb 💣ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ద్వారా విద్యా శాఖ మంత్రి @naralokesh రాష్ట్రంలోని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లను రాజీనామా చేయమని ఒత్తిడి తెచ్చినట్లు ఆధారాలివిగో నారా లోకేష్ ఆదేశాలతో ఛైర్మన్ స్వయంగా వీసీలను పిలిచి రాజీనామా చేయాలని ఆదేశించారు. ఈ… pic.twitter.com/9MKjYOtlHL— YSR Congress Party (@YSRCParty) February 25, 2025 -
సూపర్ సిక్స్లోకి అడ్డంగా బుక్కైన చినబాబు
సాక్షి,విజయవాడ: శాసనమండలిలో మంత్రి నారా లోకేష్ అడ్డంగా బుక్కయ్యారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల దెబ్బకి నిజాలు ఒప్పుకున్నారు. నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించలేదని అంగీకరించారు. గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పించారు. ఇదే అంశంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు నిలదీయడంతో నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదని లోకేష్ ఒప్పుకున్నారు. దీంతో పాటు మెగా డీఎస్సీ, జాబ్ క్యాలండర్పై నిలదీస్తే సమాధానం దాటవేశారు.రాష్ట్రంలో భారీ ఎత్తున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల రాజీనామాలపై విచారణకు ఆదేశించాలని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఆధారాలు చూపించండంటూ విచారణకు చేపట్టేందుకు ఆయన ముందుకు రాలేదు. అదే సమయంలో కేంద్రం ప్రభుత్వం టీడీపీ, జనసేన మీద ఆధారపడిలేదన్న లోకేష్.. ప్రత్యేక హోదా డిమాండ్ చేసేసరికి బేషరతుగా మద్దతిచ్చామన్నారు. టీడీపీ ఎంపీలపై ఆధారపడ్డ కేంద్రం ప్రభుత్వం నుండి హోదా సాధించమని పరోక్షంగా లోకేష్ అంగీకరించారు. అయితే, ఇలా మంత్రి లోకేష్ తీరుతో ఇరకాటంలో పడ్డామని టీడీపీ ఎమ్మెల్సీలు పెదవి విరుస్తున్నారు. -
‘పోరాడేందుకు వైఎస్ జగన్ స్ఫూర్తినిచ్చారు’
ఢిల్లీ: టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, జోగి రమేష్, దేవినేని అవినాష్ సహా 24 మందికి సుప్రీంకోర్టులో ఊరట లభించిన సంగతి తెలిసిందే. ఈరోజు(మంగళవారం) విచారణలో భాగంగా పలువురు వైఎస్సార్ సీపీ నాయకులకు ముందస్తు బెయిల్ను మంజూరు చేసింది. విచారణ జరిపిన జస్టిస్ సుధాంశు దులియా ధర్మాసనం.. షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.అనంతరం వైఎస్సార్ సీపీ తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘వైఎస్ జగన్ తన కార్యకర్తలని, నాయకుల్ని కాపాడుకుంటున్నారు. టీడీపీ గెలిచిన నాటి నుంచి ఫ్రధాన ప్రతిపక్షానికి చెందిన నాయకులను వెంటాడి వేటాడి హింసిస్తున్నారు. మూడేళ్ల క్రితం జరిగిన దాడి.. ఇప్పుడు కొత్త కేసులు పెట్టి 128 మందిని ముద్దాయిలను చేసి హింసిస్తున్నారు. టిడిపి కార్యాలయం, చంద్రబాబు నివాసం పై దాడి కేసుల్లో సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. ప్రతి ఒక్కరిని కాపాడుకుంటాం, ఏ ఒక్కరూ భయపడాల్సిన అవసరం లేదు. దేవినేని అవినాష్, జోగి రమేష్ లతో పాటు పలువురికి ముందస్తు బెయిల్ వచ్చింది. మన కార్యకర్తలు, నాయకులు కోసం పోరాడాలని వైఎస్ జగన్ ఆదేశించారు. పోరాడేందుకు వైఎస్ జగన్ స్ఫూర్తినిచ్చారు. ఇందుకు ప్రతీ వైఎస్సార్సీపీ కార్యకర్త, నాయకులు గర్వించాలి. ఎవరికి బెయిల్ రాకుండా, ప్రభుత్వం తరఫున న్యాయవాదులు చివరి వరకు ప్రయత్నం చేశారు. పోలీసుల విచారణకు మా నాయకులు హాజరై సహకరిస్తారు’ అని పొన్నవోలు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో వైఎస్సార్సీపీ నేతలకు ఊరట -
వైఎస్ఆర్ సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి: సుబ్రమణ్యస్వామి
-
సుప్రీంకోర్టులో వైఎస్ఆర్ సీపీ నేతలకు ఊరట
-
ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపీనే: సుబ్రహ్మణ్య స్వామి
అమరావతి, సాక్షి: ఏపీలో ప్రధాన ప్రతిపక్ష హోదా వైఎస్సార్సీపీకే దక్కాలని బీజేపీ ఫైర్బ్రాండ్, ప్రముఖ లాయర్ సుబ్రహ్మణ్య స్వామి (Subramanian Swamy) అంటున్నారు. ఇటీవల తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగిన హింసపై ఆయన కోర్టుకెక్కారు. ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే మీడియాకు వెల్లడించారు.‘‘తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక(Tirupati Deputy Mayor Election) సందర్భంగా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. చాలామందిని భయపెట్టి దాడులు చేశారు. ఎన్నికల సమయంలో హింసను నివారించేందుకు తీవ్రమైన చర్యలు తీసుకోవాలి అని పిల్ వేశా. నేను వేసిన పిల్ మార్చి 12వ తేదీన విచారణకు వస్తుంది’’ అని మీడియాకు తెలిపారాయన. తిరుపతి ఘటనలో కేవలం ఎఫ్ఐఆర్ మాత్రమే వేశారని, ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారాయన. ఈ విషయంపై కోర్టు చర్యలు తీసుకుంటే.. దేశవ్యాప్తంగా ఇదొక చట్టంగా మారుతుంది అని సుబ్రహ్మణ్య స్వామి అభిప్రాయడ్డారు.ప్రధాన ప్రతిపక్ష హోదా వైఎస్సార్సీపీదేఏపీలో ప్రతిపక్షంలో ఒక్క వైఎస్సార్సీపీ(YSRCP)నే ఉంది. కాబట్టి ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష(Principal Opposition) హోదా ఇవ్వడంలో ఎలాంటి తప్పులేదు. అసెంబ్లీలో తక్కువ మంది ఎమ్యెల్యేలు ఉన్నా వైఎస్సార్సీపీకి ఆ హోదా దక్కాల్సిందే అని స్పష్టం చేశారాయన. ఈ క్రమంలో ఆయన మరికొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 👉తిరుపతి లడ్డూ అంశం(Tirupati Laddu Controversy) ముగిసిపోయింది. కల్తీలాంటి అంశాలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. తిరుపతి లడ్డూను కల్తీ చేయాలని నిజమైన భక్తులు ఎవరూ అనుకోరు. 👉మంచి విషయం ఎవరు చెప్పినా పార్టీలకతీతంగా అంగీకరించాలి. నా నిర్ణయాలను పార్టీ ఎన్నడూ వ్యతిరేకించలేదు అని అన్నారాయన. ఇదిలా ఉంటే.. ఏపీ కూటమి ప్రభుత్వం (AP Kutami Prabhutvam)లో బీజేపీ భాగమై ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు దారి తీసే అవకాశం లేకపోలేదు. -
సుప్రీంకోర్టులో వైఎస్సార్సీపీ నేతలకు ఊరట
సాక్షి, ఢిల్లీ: టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, జోగి రమేష్, దేవినేని అవినాష్ సహా 24 మందికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ముందస్తు బెయిల్ను మంజూరు చేసింది. విచారణ జరిపిన జస్టిస్ సుధాంశు దులియా ధర్మాసనం.. షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు.. విచారణకు సహకరించాలని ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం తరువు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా.. బెయిల్ను వ్యతిరేకించగా, ఈ కేసుపైనే ఎందుకు స్పెషల్ అటెన్షన్ అంటూ సిద్ధార్థ లూత్రాను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ.. ఇది రాజకీయపరమైన కేసు అని.. పాస్ పోర్ట్ను ఇప్పటికే సరెండర్ చేశామన్నారు. దాడికి పాల్పడ్డ 30 మందికి ఏపీ హై కోర్టు ఇప్పటికే రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. టీడీపీ ఆఫీస్పై దాడి జరిగిన రోజు అక్కడ లేరు. వీళ్ల ప్రమేయంపై ఎలాంటి ఆధారాలు లేవు’’ అని కపిల్ సిబల్ పేర్కొన్నారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి, న్యాయవాది అల్లంకి రమేష్ హాజరయ్యారు. -
ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి YSRCPకి అన్ని అర్హతలు ఉన్నాయి
-
ప్రశాంతంగా ఉండాలనే రాజీనామా చేస్తున్నాను తునిలో రెడ్ బుక్ పాలన
-
‘ప్రజలకు మేలు జరగాలంటే వైఎస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్షహోదా ఇవ్వాల్సిందే’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్ జగన్ అడిగే ప్రధాన ప్రతిపక్ష హోదా ఆయన కోసం కాదని.. అసెంబ్లీలో ప్రజల తరఫున పోరాటం చేయడానికి తగిన సమయం కోసం అడుగుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ను నమ్మడం వల్లే ప్రజలు వారికి పట్టం కట్టారని.. చంద్రబాబు అబద్ధాలు నమ్మడం లేదని పవన్తో పచ్చి అబద్ధాలు మాట్లాడించారంటూ దుయ్యబట్టారు.‘‘ప్రధాన ప్రతిపక్ష హోదా లేదంటున్న పవన్ కళ్యాణ్.. ప్రధాన ప్రతిపక్ష హోదా ఆయన పోషిస్తాడా..?. ప్రజల తరఫున పోరాటం చేస్తావా..?. నిన్ను శాశ్వతంగా భూస్థాపితం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. షర్మిల నువ్వు చంద్రబాబుకు చెంచాగిరి చేస్తున్నావా..?. నీ వ్యక్తిగత సమస్యలు ఉంటే ఇంట్లో చూసుకో. పవన్, షర్మిలను వినియోగించుకుని చంద్రబాబు గేమ్ ఆడుతున్నాడు. సమర్థమైన చర్చలు ప్రధాన ప్రతిపక్షం లేకుండా ఎలా జరుగుతాయి..?’’ అంటూ సతీష్కుమార్రెడ్డి నిలదీశారు.‘‘మీరు ప్రధాన ప్రతిపక్ష హోదా లేదంటే ప్రజలు సమర్థించరు. సభ్యత్వం పోతోందంటున్నారు. సోనియాపై పోరాటం చేసిన చరిత్ర జగన్ది. రాజీనామా చేసి మళ్లీ పోటీ చేస్తే 5.46 లక్షల ఓట్లతో ఆనాడు ఎంపీగా గెలిచిన వైఎస్ జగన్ ముందు మీరు ఫ్లూట్ ఊదుతున్నారా..?. మీరు కోర్టుకు ఇంతవరకూ ఎందుకు అఫిడవిట్ వేయడం లేదు..?. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే జరిగే నష్టం ప్రజలకే. అధికారపక్షంతో పాటు ప్రతిపక్షం ముఖ్యమే. జగన్ చరిష్మా, సామర్థ్యం ఏంటో ఒకసారి తెలుసుకోండి. ఆయన అడుగు బయటపెడితే జనం ప్రభంజనంగా వస్తున్నారు. అనవసరమైన మాటలు మాట్లాడవద్దు.. జన ప్రభంజనంలో కొట్టుకుపోతారు. నువ్వు హామీగా నిలబడ్డ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించు. పవన్ కళ్యాణ్.. ఇప్పటీకైన మేలుకో.. లేదంటే చంద్రబాబు నిన్ను ముంచేస్తాడు. షర్మిల.. మీరు కాంగ్రెస్కు వ్యతిరేకమైన పార్టీలతో పోరాడుతున్నారా? లేక వ్యక్తిగత ఎజెండా అమలు చేస్తున్నావా..?’’ అంటూ సతీష్రెడ్డి దుయ్యబట్టారు. -
రెడ్ బుక్ దెబ్బ జీవీ రెడ్డి అవుట్
-
శాసనమండలిలో వైఎస్సార్సీపీ వర్సెస్ టీడీపీ
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2025.. Day 2 Live Updatesమంత్రి లోకేష్ వ్యాఖ్యలపై విపక్ష నేత బొత్స ఆగ్రహం👉వీసీలను ఒకేసారి రాజీనామా చేయించారు👉బలవంతంగా చేయించకపోతే దాని మీద లోకేష్ విచారణ కు సిద్ధమా👉విచారణ జరిపిస్తే.. మేము నిరూపిస్తాం👉విచారణ వేయడానికి ఎందుకు భయ పడుతున్నారుశాసనమండలిలో వైఎస్సార్సీపీ వర్సెస్ టీడీపీ👉గవర్నర్ ప్రసంగంపై చర్చలో వాదోపవాదనలు👉ఎమ్మెల్సీ వరుద కళ్యాణి ప్రసంగాన్నిఅడ్డుకునేందుకు ప్రయత్నించిన మంత్రులు👉ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రసంగాన్ని అడ్డుకున్న మంత్రి నారా లోకేష్👉నాలుగు లక్షల ఉద్యోగాలు చెప్పలేదన్న మంత్రి నారా లోకేష్👉గవర్నర్ ప్రసంగంలో కల్పించినట్టు రాశారన్న వరుదు కళ్యాణి👉తాము ఇంగ్లీష్ స్పీచ్ లో ఉన్నదే చెప్తామంటూ మంత్రి లోకేష్ వితండ వాదం👉మంత్రులు మాటిమాటికీ అడ్డు తగలడంపై విపక్షనేత బొత్స అభ్యంతరం👉మంత్రుల తీరుపై బొత్స సత్యనారాయణ ఆగ్రహం👉ఉద్యోగాలు ఇచ్చేశాం అని ఎలా చెప్తారంటూ బొత్స అభ్యంతరం👉ఎన్ డీఏ మా మీద ఆధారపడి ఉందని ఎవరు చెప్పారు👉కేంద్రానికి మేం బేషరతుగా మద్దతు ఇచ్చాం👉కేంద్ర ప్రభుత్వం టీడీపీ, జనసేన పై ఆధారపడి ఉన్నా ప్రత్యేక హోదా సాధించలేదన్న వరుదు కళ్యాణి👉వరుదు కళ్యాణి వ్యాఖ్యల పట్ల మళ్లీ అభ్యంతరం తెలిపిన మంత్రి నారా లోకేష్👉మేం కేంద్రానికి బేషరతుగా మద్దతు ఇచ్చాం👉మా మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడిందని ఏనాడూ అనలేదన్న మంత్రి లోకేష్👉మంత్రి లోకేష్ వ్యాఖ్యలపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం👉కేంద్రంలో ఉన్నది వీళ్ల ఉమ్మడి ప్రభుత్వం కాదా..?👉మా మీద ఆధారపడలేదని చెప్తారా..?👉రాష్ట్ర ప్రయోజనాల కోసమన్నారు...అదే మా సభ్యురాలు చెప్తున్నది👉2014 నుండి 2019 మధ్యలో ప్యాకేజీ కోసం హోదాను వదిలేయలేదా..?👉గవర్నర్ ప్రసంగం వాస్తవాలకు విరుద్ధంగా ఉంది: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి👉చంద్రబాబు పాలన గొప్పలు చెప్పుకుంటున్నారు👉కానీ ఓటేసిన జనం చెప్పులతో కొట్టుకుంటున్నారు👉తొమ్మిది నెలల్లో రైతులు, మహిళలు, పేదల జీవితాలు తలకిందులైపోయాయి👉సూపర్ 6 పథకాలకు ఎగనామం పెట్టడం సుపరిపాలనా..?👉ఉద్యోగులకు డీఏ, ఐ ఆర్, పీ ఆర్ సీ ఇవ్వకపోవడమే సుపరిపాలనా..?👉అమ్మ ఒడి, రైతు భరోశా ఎగ్గొట్టడం సుపరిపాలన అవుతుందా.?👉15 వేల కోట్ల విద్యుత్ ఛార్జీల భారం మోపారు👉60 శాతం నిత్యవసర వస్తువులు ధరలు పెంచారు👉4 లక్షలు ఉద్యోగాలు ఇచ్చేశాం అని చెప్పారు..ఎక్కడ ఇచ్చారు..? చూపించండి👉గతం వై ఎస్ జగన్ 6 నెలల్లో లక్షా 25 వేల ఉద్యోగాలు ఇచ్చారు👉తొలి సంతకం పెట్టిన మెగా డిఎస్సీని కూడా పూర్తి చేయలేదు👉జాబ్ క్యాలెండర్ ఇస్తామని కూడా ఇవ్వకుండా మోసం చేశారు👉టీడీపీ పై ఆధారపడ్డ కేంద్ర ప్రభుత్వం ఉన్నా ప్రత్యేక హోదాను సాధించలేదుఏపీ శాసన మండలి:వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ప్రసంగానికి అడ్డు తగిలిన మంత్రులు👉4 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ప్రస్తావన లేదు: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తుమాటి మాధవరావు👉రైతులకు ప్రభుత్వం ఇంతవరకు పెట్టుబడి సాయం అందించకపోగా ఏదో చేసినట్లు గొప్పగా చెప్పుకుంటున్నారు.👉సూపర్ సిక్స్ వాగ్దానాలతో గెలిచి అధికారంలోకి వచ్చారు.👉రైతులను మోసం చేశారు👉యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు👉మొదటి ఏడాదిలో ఒక్క నోటిఫికేషన్ వెలువడలేదు👉గవర్నర్ ప్రస్తావనలో నిరుద్యోగ భృతి అంశం లేదు👉హామీలు అమలు చేసే ఆలోచనలో లేరు👉సాఫ్ట్వేర్ పితామహులం అని చెప్పే వీరు గత ప్రభుత్వ హయాంలో తెచ్చిన ఇంగ్లీష్ మీడియాన్ని విమర్శిస్తున్నారు..👉ఏఐ ఉద్యోగాలు రావాలంటే తెలుగు మీడియంలో చదివితే వస్తాయా?👉వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తెలుగును అవమానిస్తున్నారంటూ అడ్డుపడిన హోం మంత్రి అనిత👉ఎమ్మెల్సీ మాధవరావు తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్👉తిరిగి మంత్రి అనితకు కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్సీ మాధవరావు👉తాను తెలుగు మీడియంలో చదువుకున్నాను👉ఇంగ్లీష్ మీడియం వల్ల ఉపయోగాలు చెబుతున్నానన్న మాధవరావు👉ఎమ్మెల్సీ మాధవరావు వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని మంత్రి బాల వీరాంజనేయస్వామి డిమాండ్👉తాము తెలుగును కించ పరచలేదు.. గత ప్రభుత్వంలో ఇంగ్లీషు మీడియానికి ప్రాధాన్యత కల్పించాం..👉ఈ ప్రభుత్వ విధానం ఏంటని ప్రశ్నించామన్న ఎమ్మెల్సీ మాధవరావు👉పెన్షన్ నాలుగు వేలకు పెంచారు.. ఇచ్చే సంఖ్యలో కోత విధించారు👉ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అన్నారు.. ఈ ఏడాది ఒక్క సిలెండర్ తో సరిపెట్టారు👉స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలను గత ప్రభుత్వం కాపాడింది👉మెట్ట ప్రాంత రైతుల కోసం గత ప్రభుత్వ హయాంలో కొత్త పరిశ్రమలు తెచ్చాం👉అప్పటి టీడీపీ ప్రభుత్వం రామాయపట్నం పోర్టుకు ఎన్ఓసీ కూడా లేకుండా ప్రారంభం చేశారు. అసెంబ్లీలో కొనసాగుతున్న ‘సాక్షి టీవీ’పై ఆంక్షలు👉‘సాక్షి టీవీ’ సహా నాలుగు ఛానళ్ల జర్నలిస్టులకు అనుమతి నిరాకరణ👉దేశంలో ఏ రాష్ట్ర అసెంబ్లీలో లేని ఆంక్షలు విధించిన ప్రభుత్వం👉రాష్ట చరిత్రలో 4 ఛానళ్లపై నిషేధం విధించడం ఇదే ప్రథమం👉ప్రభుత్వ వైఖరీని తీవ్రంగా ఖండిస్తున్న జర్నలిస్ట్ సంఘాలుప్రారంభమైన శాసన మండలి సమావేశాలు👉వైఎస్సార్సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన చైర్మన్👉గవర్నర్ ప్రసంగంపై ప్రారంభమైన చర్చ👉ప్యానెల్ వైస్ చైర్మన్ లుగా పరుచూరి అశోక్ బాబు, తిరుమల నాయుడు, నిజాం భాషా, రమేష్ యాదవ్.మరికాసేపట్లోప్రారంభం కానున్న అసెంబ్లీ👉కాసేపట్లో రెండోరోజు అసెంబ్లీ సమావేశాలు వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానండశాసన మండలిలో వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం👉సూపర్ సిక్స్ పథకాల అమలుపై సభలో చర్చించాలని వాయిదా తీర్మానం👉ప్రతిపక్ష హోదా డిమాండ్ చేస్తూ సమావేశాలకు దూరంగా ఉన్నYSRCP ఎమ్మెల్యేలు👉 ప్రజా సమస్యలపై కూటమి ప్రభుత్వంతో పోరాడాలని MLA, MLCలకు వైఎస్ జగన్ దిశానిర్దేశంఅసెంబ్లీలో కొనసాగుతున్న సాక్షి టీవీపై ఆంక్షలు👉నేడు రెండో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు👉ఉభయ సభల్లో నేడు గవర్నర్ ప్రసంగం కి ధన్యవాదాలు తీర్మానం పై చర్చ👉సాక్షి టీవీ సహా 4 టివి చానెళ్లు జర్నలిస్టులకు అనుమతి నిరాకరణ👉దేశంలో ఏ రాష్ట్ర అసెంబ్లీలో లేని ఆంక్షలు విధించిన ప్రభుత్వం👉రాష్ట్ర చరిత్రలో 4 టివి ఛానెళ్ల పై నిషేధం విధించడం ఇదే ప్రధమం👉ప్రభుత్వం వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్న జర్నలిస్ట్ సంఘాలు అసెంబ్లీ సాక్షిగా గవర్నర్తోనూ చంద్రబాబు పచ్చి అబద్దాలు చెప్పించారు. ఇప్పటికే కరెంటు ఛార్జీల పేరుతో చంద్రబాబు.. ప్రజలపై రూ.15 వేల కోట్ల భారం వేశారు. కానీ అసలు కరెంటు చార్జీలే పెంచలేదంటూ గవర్నరుతో అబద్దాలు పలికించారు. ఇటీవలే లిక్కర్ బాటిల్ పై రూ.10-20ల పెంచిన కూటమి ప్రభుత్వం.. అసలు లిక్కర్ రేట్లను పెంచలేదంటూ అసెంబ్లీలో గవర్నరుతో చంద్రబాబు అబద్దాలు వల్లెవేయించారు. సూపర్ సిక్స్ సహా 143 హామీల అమలు ఎప్పటినుంచో గవర్నర్తో చెప్పించని ప్రభుత్వం.. 2047 నాటికి పేదలందరినీ కోటీశ్వరులని చేయిస్తానంటూ చెప్పించింది. అసెంబ్లీ సాక్షిగా గవర్నరుతో అబద్దాలు చెప్పించటంపై ప్రజాస్వామ్యవాదులు విస్తుపోతున్నారు.మార్చి 21 వరకు అసెంబ్లీ సమావేశాలుఅసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మంగళవారం నుంచి 16 రోజులపాటు నిర్వహించాలని నిర్ణయించారు. సోమవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన తర్వాత స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్, జనసేన, బీజేపీ తరఫున మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ పాల్గొన్న ఈ సమావేశంలో మార్చి 21 వరకు సభ నిర్వహించాలని నిర్ణయించారు.ఈ నెల 25న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ, 26, 27 తేదీలు సెలవులిచ్చి, తిరిగి 28న సభ నిర్వహిస్తారు. ఆ రోజు మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ను ప్రవేశపెడతారు. వ్యవసాయ బడ్జెట్ ప్రత్యేకంగా ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన రోజును వర్కింగ్ డేగా పరిగణించడం లేదని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. -
ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం కొనసాగించాలి... వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు
-
కూటమి సర్కార్ ‘రాజకీయ కూల్చివేతలు’ షురూ!
నర్సీపట్నం: రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అరెస్టులు, బెదిరింపులతో రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న బాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, ఇప్పుడు వైఎస్సార్సీపీ నాయకుల భవనాలే లక్ష్యంగా ‘రాజకీయ కూల్చివేతలను’ షురూ చేసింది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో రెండు నెలల క్రితం గచ్చపువీధిలోని చిటికెల కరుణాకర్ భవనాన్ని కూల్చివేసిన మున్సిపల్ అధికారులు, తాజాగా శారదానగర్లోని బీసీ కార్పొరేషన్ స్టేట్ మాజీ డైరెక్టర్ కర్రి శ్రీనివాసరావు సోదరుడు సత్యనారాయణ భవనం కూల్చివేతకు పాల్పడ్డారు. తహసీల్దార్ రామారావు సోమవారం ఉదయం 7 గంటలకే భారీ సంఖ్యలో పోలీసులు, రెవెన్యూ సిబ్బందిని వెంట పెట్టుకొని బిల్డింగ్ దగ్గరకు చేరుకున్నారు.విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కూడా పార్టీ నాయకులతో భవనం వద్దకు చేరుకున్నారు. నోటీసులో రెండు రోజులు గడువు ఇచ్చినందున, భవనాన్ని యజమానే తొలగించుకునేందుకు సహకరించాలని మాజీ ఎమ్మెల్యే తహసీల్దార్ను కోరినప్పటికీ వినలేదు. భవనంలో ఫర్నిచర్ను రెవెన్యూ సిబ్బంది బయటకు తీస్తుండగా భవన యజమాని, పార్టీ నాయకులు అడ్డుకున్నారు.తనపై కక్షతోనే స్పీకర్ కావాలనే తన సోదరుని బిల్డింగ్ను కొట్టిస్తున్నాడని, ఇలా ఎంత మందిని నాశనం చేస్తారంటూ శ్రీనివాసరావు ఆవేదన చెందారు. కాగా, 10.47 గంటలకు కూల్చివేత పనులు నిలిపి వేయాలంటూ హైకోర్టు ఇంజక్షన్ ఉత్తర్వులు ఇవ్వడంతో అధికారులు అక్కడ నుండి జారుకున్నారు. కానీ అప్పటికే రెండో ఫ్లోర్ శ్లాబ్ సగం తొలగించారు. కింద పోర్షన్ గోడలు తొలగించి ద్యామేజ్ చేశారు. అయ్యన్నపాత్రుడి కక్షపూరిత చర్యలు: మాజీ ఎమ్మెల్యే గణేష్ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే గణేష్ ఈ సందర్భంగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్పీకర్ అకృత్యాలను న్యాయస్ధానాల ద్వారా ఎదుర్కొంటామన్నారు. అయ్యన్నపాత్రుడు కుట్రలపై కోర్టుల్లో న్యాయం జరుగుతుందని క్యాడర్కు భరోసా ఇచ్చారు. అధికారం శాశ్వతం కాదన్న విషయం స్పీకర్ గ్రహించాలని హెచ్చరించారు. మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి, వైస్ చైర్మన్లు కోనేటి రామకృష్ణ, తమరాన అప్పలనాయుడు, కో–ఆప్షన్ సభ్యులు షేక్ రోజా, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఏకా శివప్రసాద్ తదితరులు ఆయన వెంట ఉన్నారు. -
దిగజారిన ప్రజాస్వామ్యం
తుని: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మరో మెట్టు దిగజారింది. తెలుగుదేశం పార్టీ నేతల బరితెగింపు పరాకాష్టకు చేరింది. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికల్లో గెలుపొందిన ఓ ప్రజాప్రతినిధిపై దారుణంగా ఒత్తిళ్లుతెచ్చారు. ఈ ఒత్తిళ్లు తట్టుకోలేక కాకినాడ జిల్లా తుని మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరి సుధారాణి సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. ‘రాష్ట్రంలో తునికి ఉన్న మంచి పేరును టీడీపీ ప్రభుత్వం కాలరాసింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కౌన్సిలర్లను పోలీసుల సహకారంతో చిత్రహింసలకు గురి చేసింది.సహచర కౌన్సిలర్లపై జరుగుతున్న దమనకాండను చూడలేక కలత చెంది చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది’ అని ఆమె ఉద్వేగంతో చెప్పారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ తన రాజీనామాకు గల కారణాలను వెల్లడించారు. గత ఎన్నికల్లో తుని మున్సిపాలిటీ 30కి 30 వార్డులనూ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుందని తెలిపారు.ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థను నిట్టనిలువునా కూల్చేందుకు కుట్ర చేస్తోందన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్–2 ఎన్నిక కోసం మున్సిపల్ కార్యాలయానికి వెళ్తే.. టీడీపీ గూండాలు కౌన్సిల్ హాల్లోకి ప్రవేశించి అడ్డుకున్నారని, చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు, అధికారులు టీడీపీకి వత్తాసు పలికారని ఆవేదన వ్యక్తం చేశారు.శాంతియుత వాతావరణంలో వైస్ చైర్మన్ ఎన్నిక జరిపించాలని జిల్లా కలెక్టర్, ఎస్పీ, స్థానిక పోలీసులను కోర్టు ఆదేశించినా.. అధికారులు అధికార పార్టీకి వంతపాడటంతో టీడీపీ దాష్టికాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందన్నారు. వీరి దారుణాల కారణంగా వైస్ చైర్మన్ ఎన్నిక నాలుగోసారి కూడా వాయిదా పడిందని చెప్పారు. కౌన్సిలర్లకు భద్రత కల్పించిన తనపై, తమకు అండగా నిలిచిన మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపై పోలీసులు అక్రమ కేసులు బనాయించారని చెప్పారు. జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని చైర్పర్సన్ పదవికి రాజీనామా చేయక తప్పడం లేదంటూ భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం సహచర కౌన్సిలర్లు 15 మందితో కలిసి మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని, కమిషనర్ వెంకట్రావుకు రాజీనామా పత్రాన్ని అందజేశారు.మున్సిపల్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశానని కౌన్సిలర్గా కొనసాగుతానన్నారు. మహిళలతో కన్నీరు పెట్టించిన టీడీపీకి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కాగా తుని చైర్పర్సన్ రాజీనామా ఉదంతం రాష్ట్రంలో దిగజారిన ప్రజాస్వామ్యానికి నిలువెత్తు నిదర్శనమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రాజీనామా నిర్ణయం తీసుకునేలా చేశారంటే ఎంత ఒత్తిడి చేశారో, ఎంతకు బరితెగించారో అర్ధం చేసుకోవచ్చని వారు పేర్కొంటున్నారు. ప్రాణంపోయినా వైఎస్సార్సీపీని వీడేది లేదు : కౌన్సిలర్ జ్యోతి ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన తనకు టీడీపీ నాయకులు ఆదివారం రాత్రంతా నరకం చూపారని ఒకటో వార్డు కౌన్సిలర్ వారాధి జ్యోతి ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు ఇనుగంటి సత్యనారాయణ, మళ్ల గణేష్, డి.శ్రీనివాసరాజు తదితరులు తనను ఇంటి నుంచి బలవంతంగా బయటకు లాకెళ్లి వైఎస్సార్సీపీలోంచి టీడీపీలోకి చేరాలంటూ బెదిరించారని.. ప్రాణం ఉన్నంత వరకూ వైఎస్సార్సీపీలోనే కొనసాగుతానని చెప్పారు. ఈ వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోందని, అదే జరిగితే దానికి టీడీపీ నాయకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పులివెందులకు వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు, రేపు వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇందుకోసం మంగళవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 11.45 గంటలకు పులివెందుల చేరుకుంటారు. స్థానికంగా అందుబాటులో ఉంటారు.బుధవారం ఉదయం 10 గంటలకు పులివెందులలోని గుంత బజార్ రోడ్డుకు చేరుకుంటారు. అక్కడ వైఎస్సార్ ఫౌండేషన్, ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా ఆధునీకరించిన ‘వైఎస్ రాజారెడ్డి ఐ సెంటర్’ను వైఎస్ జగన్ ప్రారంభిస్తారు. -
హోదా ఇవ్వాల్సిందే
సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా.. చట్టసభలో ప్రజల గళాన్ని వినిపించనివ్వకుండా చేయాలనే కుట్రతో కూటమి సర్కారు వ్యవహరిస్తోందని విపక్ష పార్టీ నేతలు మండిపడ్డారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించి సభ నుంచి వాకౌట్ చేసిన అనంతరం వైఎస్సార్సీపీ నేతలు బొత్స, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టి.చంద్రశేఖర్, వరుదు కళ్యాణి బయట మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష హోదా ఇస్తే తమ పాలనా వైఫల్యాలను చట్టసభ సాక్షిగా నిలదీస్తారనే భయంతోనే కూటమి సర్కారు ఇలాంటి దుర్మార్గ పోకడలను అనుసరిస్తోందని ధ్వజమెత్తారు.ప్రజా గొంతుక వినిపించడానికి వీల్లేకుండా టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్ర పన్నిందని అంతకుముందు వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు శాసనసభలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఉన్న ఏౖకైక విపక్షం వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా కల్పించకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి పాతరేసిన చంద్రబాబు ప్రభుత్వ వైఖరికి నిరసనగా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం కొనసాగుతున్న సమయంలో సభ నుంచి వైఎస్సార్సీపీ వాకౌట్ చేసింది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jaganmohan Reddy) నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉభయ సభల సంయుక్త సమావేశానికి హాజరయ్యారు. ఆయన వెంట శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు.సభలో ఉన్నవి రెండే పక్షాలు: బొత్స సత్యనారాయణ, శాసన మండలిలో ప్రతిపక్షనేతరాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. ప్రజల వాణిని వినిపించేది, వారి కష్టాలపై ఎలుగెత్తేది ప్రతిపక్షమే. అలాంటి ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన హోదా, గౌరవం ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. సభలో ఉన్నవి రెండే పక్షాలు. ఒకటి అధికారంలో ఉన్న కూటమి పార్టీలు... మరొకటి ప్రతిపక్షంగా నిలిచిన వైఎస్సార్సీపీ. సభలో మేం ఒక్కరమే విపక్షంలో ఉన్నాం కాబట్టే మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించాలని కోరాం.మిర్చి రైతులు పడుతున్న ఇబ్బందులు, వారి కష్టాల గురించి సభలో ప్రస్తావించాం. వైఎస్ జగన్ గుంటూరు మిర్చియార్డు వద్దకు వెళ్లిన తరువాతే ఈ ప్రభుత్వం మేలుకుని రైతుల గురించి ఆలోచించడం మొదలు పెట్టింది. అయినా నేటికీ మిర్చి కొనుగోళ్లు చేయడం లేదు. కేంద్రం స్పందించాలని, కేంద్రమే కొనుగోలు చేయాలని అంటున్నారు. మార్క్ఫెడ్ ద్వారా మిర్చి ఎందుకు కొనుగోలు చేయడం లేదు? ఇటువంటి అంశాలపై మాట్లాడాలంటే మాకు ప్రతిపక్ష హోదా కావాలి. అప్పుడే మాకు తగినంత సమయం లభిస్తుంది. మిర్చి రైతులను కలిసిన మా నాయకుడిపై కేసులు పెట్టారు.మ్యూజికల్ నైట్ కోసం హంగూ ఆర్భాటంగా వెళ్లిన వారిపై మాత్రం ఎటువంటి కేసులు లేవు. ఇటువంటి నిరంకుశ విధానాలను ప్రశ్నించాలంటే ప్రతిపక్షంగా మాకు సరైన సమయం ఇవ్వాలి. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అంటూ హామీలు ఇచ్చారు. నేటికీ వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారు. కొత్తగా ప్రవేశపెట్టే బడ్జెట్లోనూ కేటాయింపులు లేకుండా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం. సర్కారు వైఖరిని ఎండగడుతూ ప్రజల సమస్యలను మీడియా ముఖంగా ప్రశ్నిస్తాం. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లి పోరాటం చేస్తాం.ప్రభుత్వ వైఫల్యాలను చొక్కా పట్టుకుని నిలదీస్తాం. రాష్ట్రంలో అన్ని వర్గాల వారు ఇబ్బందుల్లో ఉన్నారు. మిర్చి రైతులకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. మార్కెట్ జోక్యంతో ఆదుకోకుండా కేంద్రం ఎప్పుడో కొనుగోలు చేస్తుందని మిర్చి రైతులను గాలికి వదిలేయడం సరికాదు. అప్పటి వరకు రైతులు తట్టుకునే పరిస్థితిలో లేరు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితిని కల్పించవద్దు. ప్రభుత్వం వెంటనే దీనిపై ఆలోచన చేయాలనేది మా డిమాండ్. అసెంబ్లీకి వెళ్లాలా వద్దా అనే దానిపై ప్రభుత్వ ప్రతిస్పందన చూసి నిర్ణయం తీసుకుంటాం.సభలో నిలదీస్తామనే భయంతోనే: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రిటీడీపీ కూటమి ప్రభుత్వం ప్రతి సందర్భంలోనూ వైఎస్సార్ సీపీని లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున విష ప్రచారం చేస్తోంది. గత ప్రభుత్వంలో విధ్వంసం జరిగిందంటూ బురద చల్లటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఎనిమిది నెలలు గడుస్తున్నా ప్రజలకు ఏం చేస్తారో మాత్రం చెప్పడం లేదు. ప్రజల గళాన్ని వినిపిస్తుందనే భయంతోనే వైఎస్సార్సీపీని ప్రతిపక్షంగా గుర్తించడం లేదు. మా నాయకుడు వైఎస్ జగన్ సభలో మాట్లాడేందుకు ప్రతిపక్ష నేతగా అవకాశం కల్పించాలి. ఇప్పటికే దీనిపై న్యాయ పోరాటం కూడా చేస్తున్నాం.వైఎస్సార్సీపీని ప్రతిపక్షంగా గుర్తించాలని గవర్నర్ని కోరాం. ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడంతో నిరసన వ్యక్తం చేసి సభ నుంచి వాకౌట్ చేశాం. దేశంలో ఎక్కడైనా సరే ప్రతిపక్షానికే పీఏసీ చైర్మన్ పదవి ఇస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనూ ఆ పదవిని ప్రతిపక్షానికే ఇచ్చాం. గతంలో ఒకే ఒక్క శాసనసభ్యుడు ఉన్న కాంగ్రెస్ పార్టీకి పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారు. ప్రపంచంలో ఒక్క ఆఫ్ఘనిస్తాన్లో మాత్రమే తాలిబన్ల పాలనలో కేవలం అధికార పక్షం మాత్రమే పని చేస్తుంది. ప్రతిపక్షం లేకుండా టీడీపీ మన రాష్ట్రంలో తాలిబన్ పాలన సాగిస్తోంది. దేశంలో మరెక్కడా లేదు: వరుదు కళ్యాణి ఎమ్మెల్సీరాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోంది. సభలో మూడు పార్టీలు అధికార పక్షంగానే ఉన్నాయి. వైఎస్సార్సీపీ ఒక్కటే ప్రతిపక్షం. కాబట్టి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరు? ఒక్క ఏపీ మినహా దేశంలో ఎక్కడా ఇలా లేదు. గతంలో ఢిల్లీలో బీజేపీ తరఫున కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు ఎన్నిక కాగా, ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కల్పించారు. కూటమి పాలనలో జరుగుతున్న అక్రమాలను ఎక్కడ సభలో నిలదీస్తారోననే భయంతోనే వైఎస్సార్ సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు.కూటమి పాలన చూశాక ఇటువంటి పార్టీలకు ఎందుకు ఓటు వేశామని ప్రజలు బాధపడుతున్నారు. ప్రతిపక్ష హోదాపై కోర్టులో పిటిషన్ వేస్తే స్పీకర్ కనీసం కౌంటర్ కూడా దాఖలు చేయకపోవడం దారుణం. కేంద్రంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ఏపీకి ప్రత్యేక హోదాపై ఎందుకు ప్రశ్నించడం లేదు? పోలవరం ఎత్తు తగ్గిస్తున్నా ఎందుకు నిలదీయలేకపోతున్నారు? వైఎస్సార్ సీపీకి అప్పు రత్న అవార్డు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు తొమ్మిది నెలల్లోనే ఏకంగా రూ.1.19 లక్షల కోట్లు అప్పులు తెచ్చిన సీఎం చంద్రబాబుకు అంతకంటే గొప్ప బిరుదు ఏం ఇవ్వాలో పవన్ కళ్యాణ్ చెప్పాలి.11 మందిని ఎదుర్కొనే సత్తా లేదా?పదకొండు మందిని ప్రతిపక్షంగా ఎదుర్కొనే సత్తా కూటమి ప్రభుత్వానికి లేదా? ప్రజలు వైఎస్సార్ సీపీకి 41 శాతం ఓట్ షేర్ ఇచ్చారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభలో మా గళం వినిపించేందుకు తగిన సమయం లభిస్తుంది. కూటమి ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసింది. తమ వైఫల్యాలను సభలో ఎండగడతారనే భయంతో ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీని గుర్తించేందుకు నిరాకరిస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యం, రైతుల పక్షాన మాట్లాడాల్సిన అవసరం లేదా? అధికార మదంతో ప్రతిపక్షం గొంతును నొక్కేస్తున్నారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత గవర్నర్కు లేదా? ప్రజాస్వామిక విలువలను కాపాడి ప్రజల పక్షాల పాలన సాగేలా ఆయన చొరవ తీసుకోవాలి. కూటమి సర్కారు నిరంకుశ పాలనకు పరాకాష్ట నాలుగు మీడియా సంస్థలను నిషేధించడం. దేశ చరిత్రలో నోటీస్ ఇవ్వకుండా నాలుగు చానెళ్లను బహిష్కరించిన ఘటనలు ఎప్పుడూ లేవు. – ఎమ్మెల్యే టి.చంద్రశేఖర్విపక్షం వాకౌట్చట్ట సభలో ప్రజల గొంతుక వినిపించాలంటే వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా కల్పించాల్సిందేనని పార్టీ ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో పట్టుబట్టారు. శాసనసభ సభలోకి గవర్నర్ ప్రవేశించి ప్రసంగిస్తుండగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ స్థానాల్లో నిలబడి ఆందోళన చేశారు. వారి ఆందోళనను పట్టించుకోకుండా గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ క్రమంలో సేవ్ డెమోక్రసీ.. ఉయ్ వాంట్ జస్టిస్.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పీకర్ పోడియం వద్దకు చేరుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి.. వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా కల్పించండి... అంటూ నినాదాలు చేశారు. బాబు ష్యూరిటీ.. మోసం, బాదుడు గ్యారంటీ!మద్దతు ధర లభించక తీవ్రంగా నష్టపోయిన మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు సభలో ప్లకార్డులు ప్రదర్శించారు. బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ.. బాబు ష్యూరిటీ.. ధరల బాదుడు గ్యారంటీ.. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు. నిరసనలను పట్టించుకోకుండా గవర్నర్ ప్రసంగాన్ని కొనసాగిస్తుండటంతో సభ నుంచి వైఎస్సార్ సీపీ వాకౌట్ చేసింది. వైఎస్ జగన్ వెంట నినాదాలు చేస్తూ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ నుంచి నిష్క్రమించారు. -
తునిలో రెడ్బుక్ రాజ్యాంగం.. వైఎస్సార్సీపీ నేతలకు బెదిరింపులు
కాకినాడ: ఏపీలో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగానికే సై అంటోంది. వేరే పార్టీల నాయకులను బెదిరించడంతో పాటు వారిపై అక్రమ కేసులు బనాయించి టీడీపీలో చేర్చుకుంటోంది. తాజాగా తునిలో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను బెదిరించడంతో పాటు అక్రమ కేసులు బనాయించింది. దాంతో వారు టీడీపీలో చేరకతప్పలేదు. ఇప్పటికే 10 మంది కౌన్సిలర్లు యనమల సమక్షంలో టీడీపీలో చేరారు.గత మున్సిపల్ ఎన్నికల్లో 30కి 30 స్థానాలను వైఎస్సార్ సీపీ గెలవగా, ఇప్పుడు తాజాగా టీడీపీ రాజకీయ కుట్రలకు తెరలేపింది. టీడీపీకి సంఖ్యా బలం లేకపోయినా దౌర్జన్యాలు, బెదిరింపులతో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను టీడీపీలో చేరేలా కుట్రలు చేశారు యనమల.ఇప్పటికే మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికను నాలుగు సార్లు వాయిదా వేయించిన టీడీపీ.. చైర్మన్ సుధాబాలు రాజీనామా చేసేలా ఆయనపై అక్రమ కేసులు బనాయించింది. ఈ క్రమంలోనే సుధాబాలు తన పదవికి రాజీనామా చేశారు. పోలీసుల సహకారంతో టీడీపీ రెడ్ బుక్ రాజ్యాంగానికి తెరలేపి.. వైఎస్సార్ సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తోంది. -
కూటమి పాలనపై రోజా విమర్శనాస్త్రాలు
-
కావాలనే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని YSRCP నేతలు మండిపడ్డారు
-
‘గవర్నర్ ప్రసంగంలో సూపర్ సిక్స్ హామీల ఊసే లేదు’
తాడేపల్లి : ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో(AP assembly sessions) భాగంగా గవర్నర్ అబ్దుల్ నజీర్(abdul Nazeer) ప్రసంగంపై వైఎస్సార్ సీపీ పలు ప్రశ్నలు సంధించింది. అసలు గవర్నర్ ప్రసంగలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల ఊసే లేకపోవడానికి కారణం ఏమిటో అని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగం ఆత్మ స్తుతి, పరనిందలా ఉందని విమర్శించింది.‘సీఎం చంద్రబాబు(Chandrababu Naidu).. గవర్నర్ ప్రసంగంలో పిట్ట కథలు చెప్పించారు. ప్రజలను ఎలా మోసం చేయాలో గవర్నర్ తో చెప్పించారు. విద్యా వ్యవస్థ సర్వ నాశనం అవుతున్నా.... లోకేష్ క్రికెట్ మ్యాచ్ కోసం దుబాయ్ వెళ్ళారు. మరొకవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీర్థ యాత్రలు చేస్తారు. మంత్రి లోకేష్ ఆయన శాఖను పట్టించుకోరు.పవన్ కళ్యాణ్.. డిప్యూటీ సిఎం పోస్టు రాజ్యాంగం లో ఉందా?, ఆరు శాతం ఓట్లు వచ్చిన జనసేన కు డిప్యూటీ సీఎం పదవి ఎలా వచ్చింది?, ప్రజా స్వామ్యం అంటే పవన్ కళ్యాణ్ కి తెలుసా PAC చైర్మన్ పదవి అనేది ప్రతి పక్ష పార్టీకి ఇవ్వాలి. జనసేన పార్టీ PAC చైర్మన్ పదవి ఎలా తీసుకున్నారు?2019 లో రెండు చోట్ల ఓడి పోయాక మూడు సంవత్సరాలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు అడ్రెస్ లేరు.భారత రాజ్యాంగం గురించి పవన్ కళ్యాణ్ తెలుసుకుంటే మంచిది. ఎల్లోమీడియా నా పై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోంది. వైఎస్ జగన్ నన్ను తన పక్కన కుర్చీ వేసి కూర్చో బెట్టుకుంటారు. అది ఆయన మాకు ఇచ్చే గౌరవం. ఎల్లోగ్యాంగ్ ఈ సంగతి తెలుసుకుంటే మంచిది’ అని ఆయన స్పష్టం చేశారు. -
‘కూటమి ప్రభుత్వానికి దమ్ముంటే వైఎస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి’
సాక్షి,వైఎస్సార్జిల్లా: వైఎస్సార్సీసీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తమ బాగోతం బయటపడుతుందనే భయం అధికార పక్షానికి పట్టుకుంది. అందుకే తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేస్తుందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. దమ్ముంటే వైఎస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం (ఫిబ్రవరి24) ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కూటమి ప్రభుత్వం తర్వాత సభలో ఉంది తామేనని, కాబట్టి ప్రజాగళం వినిపించేందుకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే అంశంపై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ప్రతిపక్షం ఉండేది కేవలం వైఎస్సార్సీపీనే. 11 సీట్లంటున్నారు. కానీ.. 40 శాతం ఓట్లు వచ్చాయనేది మర్చిపోతున్నారా?. నలుగురు ఎంపీలున్నారు..11 మంది ఎమ్మెల్యేలున్నారు. నిజంగా ఈ ప్రభుత్వానికి దమ్ముంటే ప్రజల గొంతు వినే ఉద్దేశం ఉంటే వైఎస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. ఇతర ఎమ్మెల్యేలకు ఇచ్చినట్లు వైఎస్సార్సీపీ అధినేత, వైఎస్ జగన్మోహన్రెడ్డికి రెండు నిమిషాలు మాత్రమే మైక్ ఇస్తామంటే ఎలా? అదే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే ముఖ్యమంత్రి గంట మాట్లాడితే 40 నిమిషాలు ప్రధాన ప్రతిపక్షనేత మాట్లాడే అవకాశం ఉంటుంది. ప్రజల గొంతుక అసెంబ్లీలో వినిపించే అవకాశం ఉంటుంది. ప్రధాన ప్రతిపక్షహోదా ఇవ్వకపోతే ప్రజల సమస్యలను వినిపించే అవకాశమే ఉండదు. వైఎస్ జగన్ను అవమానిస్తున్నామని స్పీకర్, చంద్రబాబు అనుకుంటున్నారు కానీ..ప్రజలను అవమానిస్తున్నారనేది మర్చిపోతున్నారు.ప్రధాన ప్రతిపక్షాన్ని గుర్తించండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అనే నినాదంతోనే మేం అసెంబ్లీకి వెళ్లాం. ప్రధాన ప్రతిపక్షనేతగా జగన్ వెళ్తే వీళ్లకి ఏ రకమైన సినిమా కనిపిస్తుందో వాళ్లకు తెలుసు. వాళ్లిచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదు.ఇదే అంశంపై వైఎస్ జగన్ మాట్లాడటం మొదలు పెడితే వాళ్లు సమాధానం చెప్పలేరు. దాని నుంచి తప్పించుకోవడం కోసమే ప్రధాన ప్రతిపక్షహోదా ఇవ్వకుండా ఇలా వ్యవహరిస్తున్నారు.నిజంగా పులివెందులకు ఉప ఎన్నిక వస్తుందనే ముచ్చట పడితే కూటమి గాలిలో 65 వేల ఓట్లతో బీటెక్ రవి ఓడిపోయాడు.వాళ్లకు అంత ముచ్చటగా ఉంటే..పులివెందుల, కుప్పం, మంగళగిరి, పిఠాపురం నాలుగు చోట్లా రాజీనామాలు చేయండి. ఎన్నికలకు వెళ్దాం.ఈ తొమ్మిది నెలల పాలనకు రిఫరెండంగా, సూపర్ సిక్స్ పాలనకు రిఫరెండంగా ఎన్నికలకు వెళ్లి చూసుకుందాం. ప్రజలేం తీర్పు ఇస్తారో చూద్దాం..కాకమ్మ కబుర్లు, దద్దమ్మ మాటలు మాట్లాడొద్దు’ అని కూటమి ప్రభుత్వంపై ఘాటు విమర్శలతో విరుచుకు పడ్డారు. -
ప్రశ్నించే ప్రతిపక్షం ఉండకూడదనే ఆలోచనతోనే కుట్రలు చేస్తున్నారు
-
జనసేన ఉండగా ప్రతిపక్షం ఎలా ఇస్తారు?: పవన్ కల్యాణ్
అమరావతి, సాక్షి: వైఎస్సార్సీపీ ప్రధాన ప్రతిపక్ష హోదా అంశంపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం తర్వాత సభలో ఉంది తామేనని, కాబట్టి ప్రజాగళం వినిపించేందుకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ వైఎస్సార్సీపీ(YSRCP) డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఆ లోటును తాము భర్తీ చేస్తామన్న రీతిలో పవన్ మాట్లాడారు.గవర్నర్ ప్రసంగం ముగిశాక.. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద జనసేన ఎమ్మెల్యేలతో పవన్ మాట్లాడారు. అసెంబ్లీలో అధికార టీడీపీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీ జనసేన పార్టీ(Jana Sena Party). అలాంటిది జనసేన ఉండగా వైఎస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు?. జనసేన కంటే ఒక్క సీటు వచ్చి ఉన్నా వాళ్లకు ఆ హోదా దక్కేది.ఓట్ల శాతం ప్రకారం ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలని అనుకుంటే గనుక జర్మనీకి వెళ్లాలి. ఎందుకంటే అక్కడ మాత్రమే అది సాధ్యమవుతుంది. ఇవాళ గవర్నర్ ప్రసంగాన్ని(Governor Speech) వైఎస్సార్సీపీ బహిష్కరించడం కరెక్ట్ కాదు. అది ఎవరో ఇచ్చేది కాదు. గౌరవీనయులైన సీఎం చంద్రబాబుగారి చేతిలో అది లేదు. దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఈ ఐదేళ్లలో మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వబడదు. దానికి మీరు ప్రిపేర్ అవ్వండి’’ అని పవన్ వైఎస్సార్సీపీని ఉద్దేశించి అన్నారు.ఇదీ చదవండి: ఇదీ చంద్రబాబు రాజకీయం! -
ఇసుక దోపిడీతో వంద కోట్లకు సోమిరెడ్డి స్కెచ్: కాకాణి
సాక్షి, నెల్లూరు: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకృతి వనరులు దోపిడీకి గురవుతున్నాయని ఆరోపించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. సర్వేపల్లి నియోజకవర్గంలో వంద కోట్ల మేర ఇసుక దోపిడీకి సోమిరెడ్డి స్కెచ్ వేశారని తెలిపారు. రీచ్లకు అనుమతి లేకపోయినా ఇసుకను తవ్వుతున్నారని చెప్పుకొచ్చారు.మాజీ మంత్రి కాకాణి తాజాగా నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి పాలన అంతా దోపిడీమయమే. సర్వేపల్లి నియోజకవర్గంలో ఇష్టానుసారంగా ఇసుక దోపిడీ చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి దోపిడీకి స్కెచ్ వేశారు. ఇటీవల జిల్లా మైనింగ్ అధికారి ఇరువూరు వద్ద అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న లారీ, టిప్పర్లను పట్టుకున్నారు. ఈ రీచ్కు అనుమతి లేకపోయినా ఇసుకను తవ్వుతున్నారు. వాహనాలను పట్టుకున్న అధికారులను సోమిరెడ్డి బెదిరించారు. రీచ్లో ఇసుకను తీసుకెళ్లే దారులను తెగ్గొట్టారు.టీడీపీ నేతలు సూచించిన దారుల్లోనే వెళ్లాలని చెబుతున్నారు. ఇష్టానుసారంగా ఇసుక దోపిడీ చేస్తున్నారు. అధికారులను బెదిరించి మరీ సోమిరెడ్డి దోచుకుంటున్నారు. పూడికలు తీయకుండానే బిల్లులు చేసుకున్నారు. దీనివల్ల నీరు చివరకు చేరక రైతులు ఇబ్బంది పడుతున్నారు. సర్వేపల్లిలో అనధికార బార్లను నిర్వహిస్తున్నారు. ఇసుక, నీటి పారుదల, గ్రావెల్లలో అక్రమాలతో పాటు అనధికారికంగా బెల్ట్ దుకాణాలు.. బార్లను కొనసాగిస్తున్నారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. జిల్లాకు కలెక్టర్, ఎస్సీలు ఉన్నా.. వారు లేనట్టుగానే ఉంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అవినీతి అధికారులపై చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించారు. -
కావాలనే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు: చంద్రశేఖర్
-
ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి.. ఎన్ని కుట్రలు చేసినా ప్రజల తరఫున పోరాటం ఆపం
-
అయ్యన్నపాత్రుడి నియోజకవర్గంలో YSRCP నేత ఇల్లు కూల్చివేత
-
ప్రజల పక్షాన పోరాడితే గెలుపు మనదే: వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: క్షేత్రస్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా ఉందని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి బయటికి వచ్చిన తర్వాత సోమవారం(ఫిబ్రవరి24) తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ‘మనం యుద్ధ రంగంలో ఉన్నాం, విజయం దిశగా అడుగులు వేయాలి. ప్రజా సమస్యల విషయంలో రాజీలేని పోరాటం చేయాలి. నిజాయితీ, చిత్తశుద్ధితో ప్రజల తరఫున పోరాటం చేయాలి.ప్రజలకు తోడుగా, ప్రజల్లో ఉంటే గెలుపు సాధించినట్టే. అందుకనే ప్రజాసమస్యలపై పోరాటంలో వెనుకడుగు వేయొద్దు. ఈ ప్రభుత్వాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికీ నేను భరోసా ఇస్తున్నాను, అండగా ఉంటా.ప్రతిపక్షంలో మన సమర్థతను నిరూపించుకోవడానికి ఇదొక అవకాశం. పార్టీకోసం, ప్రజలకోసం గట్టిగా పనిచేస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. కళ్లుమూసుకుని, తెరిచేలోగా ఏడాది గడిచిపోతోంది. జమిలి ఎన్నికలు అంటున్నారు. అదే జరిగితే ఎన్నికలు మరింత ముందుగా వస్తాయి. అందుకే ప్రజా సమస్యల విషయంలో ఎక్కడా రాజీ వద్దు. ప్రజల తరఫున గొంతు విప్పే విషయంలో ఎక్కడా తగ్గాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో మనం విలువలు, విశ్వసనీయత పాటిస్తున్నాం కాబట్టే ఎన్నో క్లిష్టపరిస్థితులను అధిగమించాం. ఇంత దూరం ప్రయాణం చేశాం. అసెంబ్లీలో మనం తప్ప వేరే ప్రతిపక్షం లేదు. ప్రతిపక్ష హోదా విషయంలో అధికార పార్టీ వైఖరిని ప్రజలకు తేటతెల్లం చేసేందుకే ఇవాళ అసెంబ్లీకి వెళ్లాం. ప్రతిపక్షహోదా ఇస్తే.. హక్కుగా మనకు సమయం ఇవ్వాల్సి వస్తుంది. సభా నాయకుడితో దాదాపు సమాన స్థాయిలో సమయం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకనే ప్రతిపక్ష హోదాను ఇచ్చేందుకు ముందుకు రావడంలేదు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. నేను ఏ అంశంపై మాట్లాడినా నిందలకు, దూషణలకు దూరం. ప్రతి అంశాన్నీ ఆధారాలు, రుజువులతో మాట్లాడతాను. అసెంబ్లీలో ఎలాగూ అవకాశం లేదు కాబట్టి ప్రెస్మీట్లలో ప్రజలకు వివరిస్తున్నాను. కౌన్సిల్లో మంచి మెజార్టీ ఉంది. దీన్ని వినియోగించుకోవాలి’ అని వైఎస్ జగన్ సూచించారు.అన్యాయంగా ఇళ్లపట్టాలు రద్దు చేస్తున్నారు: వైఎస్ జగన్ దృష్టికి తీసుకు వచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుమన ప్రభుత్వ హయాంలో 31 లక్షలమందికి ఇళ్లపట్టాలు ఇచ్చామని వైఎస్ జగన్ అన్నారు. ‘పార్టీలు చూడకుండా, పక్షపాతం లేకుండా ఇళ్లపట్టాలు ఇచ్చాం, ఎవరైనా ఇళ్లుకట్టుకోకపోతే ప్రభుత్వం వారికి ఇళ్లు మంజూరుచేసి ఇవ్వాలి. అంతేగాని, పేదలపై కక్ష కట్టి పట్టాలు రద్దుచేయడం ఏంటి? పట్టాలు రద్దు చేస్తే తప్పకుండా కోర్టును ఆశ్రయిస్తాం. ఎవరు ఇళ్లస్థలాలు ఇచ్చారో, ఎవరు కాలనీలు ఏర్పాటు చేశారో ప్రజలకు తెలుసు. విజయవాడలో అంబేద్కర్ స్మృతి వనాన్ని మనం నిర్మించాం. కాని పేరు తీసేయాలన్న ఉద్దేశంతో ఏకంగా అంబేద్కర్ విగ్రహంమీదే దాడికి దిగారు. ప్రభుత్వం ఆదేశాలతో ఏకంగా అధికారులే దీనికి ఒడిగట్టారు. స్మృతివనం ఎవరు కట్టారో ప్రజలకు తెలియదా?’ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. -
అసెంబ్లీ నుంచి YSRCP బాయ్కాట్
-
వైఎస్ఆర్ సీపీ నేతల ప్రెస్ మీట్