YSRCP
-
వాళ్లు దిగజారి మాట్లాడుతున్నారు: రోజా
చిత్తూరు జిల్లా: పుత్తూరు మున్సిపాలిటీలో 99 శాతం అభివృద్ధి పనులు వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా చేశామని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. 35-40 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ నాయకులమని చెప్పుకునే వాళ్లు ఏమీ చేయలేదని అన్నారు. కరోనా సమయంలో ఎన్నో కీలకమైన పనులు చేసినట్లు వివరించారు.చిత్తూరు జిల్లాలో రోజా మీడియాతో మాట్లాడుతూ... ‘పుత్తూరులో అందమైన షాదీమహల్ నిర్మించాం. అది పూర్తయినా ప్రారంభించకుండా నిర్లక్ష్యంగా ఉంచారు. జగనన్న పాలనలో మూడేళ్లలో నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్లు నిర్మించాం. పుత్తూరు ప్రభుత్వ హాస్పిటల్ను ఆధునికీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చాం.ఎమ్మెల్యే గాలి భానుకు ఫేస్ వాల్యూ లేదు. మున్సిపల్ కమిషనర్, పోలీసుల్ని పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారు. జనసేన పార్టీ నాయకులు దిగజారి మాట్లాడుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్కడున్నారు? ఉగాది పండగకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కొండపై లేరు. జనసేనలో క్యారెక్టర్ లేని వాళ్లతో మాట్లాడిస్తున్నారు. వాళ్ల బ్రతుకులు ప్రజలకు తెలుసు.. అది జనసేన కాదు కామసేన.మేము అధికారంలోకి వచ్చాక అద్బుతమైన పార్కులు నిర్మించాం. గతంలో పుత్తూరులో ప్రభుత్వ హస్పిటల్ నిర్మాణానికి నిధులువస్తే టీడీపీ నాయకులు కుట్రచేసి అడ్డుకున్నారు. పుత్తూరులో ఎలా గెలిచారో ప్రజలకు తెలుసు. పెన్షన్, రేషన్ కోసం గంటలు తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంది. సున్నావడ్డీ రుణాలు ఇవ్వకుండా మహిళల్ని కూటమి ప్రభుత్వం మోసం చేస్తోంది. చంద్రబాబు సిగ్గు లేకుండా ఉగాది రోజు అబద్ధాలు చెబుతున్నారు. ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన చెబుతున్నారు.తిరుమలను అపవిత్రం చేస్తున్నారు. పుట్టా సుధాకర్ కొడుకు పుట్టా మహేష్ డ్రగ్ వ్యవహారంలో దొరికారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాసలీలలు ఆడుతూ వీడియోతో సహా బయటపడ్డారు. ఆయనను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. వెంకటేశ్వరస్వామి అందరి లెక్కలను తేల్చేస్తారు. మనం చూస్తూ ఉంటే చాలు.రేణిగుంట నుంచి పుత్తూరు వరకు జాతీయ రహదారి పూర్తి అయ్యేందుకు ఢిల్లీ స్థాయిలో పోరాటం చేశాం. పుత్తూరు నుంచి నగరి వరకు రద్దు అయిన రోడ్డు టెండర్లు పూర్తి చేశాం’ అని రోజా అన్నారు. -
‘బీఆర్ నాయుడు భక్తుల మనోభావాలను దెబ్బతీశారు’
సాక్షి, విశాఖపట్నం: భగవద్గీతపై బీఆర్ నాయుడు అహంకారంతో మాట్లాడారని.. భక్తుల మనోభావాలను దెబ్బతీశారని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. తిరుపతి ప్రతిష్టని చంద్రబాబు మంట కలిపారని.. బీఅర్ నాయుడు అసభ్య వీడియోలు బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయనను ఎందుకు టీటీడీ చైర్మన్గా కొనసాగిస్తున్నారంటూ వరుదు కళ్యాణి ప్రశ్నించారు.‘‘చంద్రబాబు తప్పులను టీవీ5 ఛానల్ కప్పిపుచ్చుతుంది. అందుకే బీఆర్ నాయుడును టీటీడీ చైర్మన్గా తొలగించలేదు. ఒక చేతగాని వ్యక్తిని టీటీడీ చైర్మన్గా చంద్రబాబు నియమించారు. బీఆర్ నాయుడు వైఫల్యం వల్లే క్యూలైన్లో భక్తులు చనిపోయారు. భగవంతుడు అంటే భక్తి లేని వ్యక్తి బీఆర్ నాయుడు. ప్రసాదంలో నాణ్యత లేదని కూటమినేతలే చెప్తుతున్నారు’’ అంటూ వరుదు కళ్యాణి దుయ్యబట్టారు.‘‘మహిళలను మోసం చేసే దుర్మార్గుడిని ఎందుకు టీటీడీ చైర్మన్గా నియమించారు. టీటీడీ ఫుడ్ సేఫ్టీ విభాగం వైఎస్ జగన్ హయాంలో ఏర్పాటు చేశారు.. హిందూ ద్రోహి చంద్రబాబు. విజయవాడ నడిబొడ్డున 40 దేవాలయాలను కూల్చారు’’ అంటూ కళ్యాణి మండిపడ్డారు. -
ఆక్రమిత భూముల్లో గీతం వర్సిటీ నిర్మాణాలు: కేకే రాజు
విశాఖ: ఆక్రమిత భూముల్లో గీతం యూనివర్సిటీ నిర్మాణాలు చేపడుతోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. 5 వేల కోట్ల రూపాయల భూములను కబ్జా చేయడమే కాకుండా నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. ఒక ప్రజా ప్రతినిధి అయి ఉండి ఎంపీ భరత్ భూకబ్జాకు పాల్పడ్డారని చెప్పారు.‘కోర్టులో కేసులు ఉండగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. అక్రమ మార్గంలో యూనివర్సిటీ కోసం జీవీఎంసీ సమావేశంలో వాటిని క్రమబద్ధీకరించారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఏ ఎంపీ 5 వేల కోట్ల రూపాయల భూ కబ్జాకు పాల్పడలేదు. ప్రభుత్వ భూముల బోర్డులను తొలగించి అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు. గీతం భూకబ్జాపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. మళ్లీ అధికారంలోకి రాబోమని తెలిసి భూ దోపిడీకి పాల్పడుతున్నారు. జీవీఎంసీ కమిషనర్ కు ఐఏఎస్కు ఉండాల్సిన లక్షణాలు ఒకటీ లేవు. గీతం భూకబ్జాపై ప్రైవేట్ కేసులు వేస్తున్నాము. ఈ కేసుల్లో కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్, ఆర్డీఓలను భాగస్వాములగా చేస్తున్నాము. ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులకు బానిసలు కాదు. ఊరు, పేరు లేని కంపెనీలకు 99 పైసలకే వేల కోట్ల రూపాయల భూములు కట్టబెడుతున్నారు. విశాఖ నగరంలో జరుగుతున్న భూ కేటాయింపులు ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద కుంభకోణం. కూటమి భూ రాబందుల నుంచి విశాఖ నగరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది’ అని తెలిపారు. -
బీఆర్ నాయుడు దూరంగా ఉండటం చంద్రబాబు నటనే: భూమన
సాక్షి, తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబుతో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అంటకాగుతున్నారని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. బీఆర్ నాయుడును దూరంగా ఉంచినట్టు చంద్రబాబు నటించారని చెప్పుకొచ్చారు. వెంకటేశ్వర స్వామితో చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. బీఆర్ నాయుడును అటెండర్ కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..‘తిరుమల పర్యటన సందర్భంగా చంద్రబాబు.. బీఆర్ నాయుడును దూరంగా ఉంచినట్టు నటించారు. చంద్రబాబు కార్యకర్తలతో కూడా నాటకాలు ఆడుతున్నారు. బీఆర్ నాయుడుది కల్మష స్వభావం. చంద్రబాబు అన్నప్రసాదానికి వెళ్లే బీఆర్ నాయుడు నక్కి నక్కి ఉన్నారు. బీఆర్ నాయుడుకు అటెండర్ కూడా పట్టించుకోరు. నీతి మాలిన బీఆర్ నాయుడు నిస్సిగ్గుగా తిరుగుతున్నాడు. బీఆర్ నాయుడును తీసేసి దేవాలయ ప్రతిష్ట కాపాడితే అర్థవంతంగా ఉండేది.కీలక సమావేశంలోనే బీఆర్ నాయుడు.. చంద్రబాబు పక్కన లేడు. బీఆర్ నాయుడు ఏ టెక్నాలజీతో మాయం అయ్యాడో?. ప్రసాదం ఇచ్చే సమయంలోనూ మాయావి బీఆర్ నాయకుడు మాయమయ్యాడు. బీఆర్ నాయుడికి సిగ్గు ఉంటే వెంటనే రాజీనామా చేయాల్సిందే. వీధిలో ఉండలేడు, ఇంట్లోకి రానివ్వరు అన్నట్టు బీఆర్ నాయుడు పరిస్థితి ఉంది. నిన్న ఘటన చూసిన తర్వాత బీఆర్ నాయుడుకి ఎవరైనా మర్యాద ఇస్తారా?. అధికారం లేని పదవి, ఆదరణలేని ఉద్యోగుల మధ్య ఉండటం అవసరమా?. బీఆర్ నాయుడుని తీసేయడానికి చంద్రబాబుకు భయం. చంద్రబాబు పరిస్థితి మింగలేక, కక్కలేక అన్నట్టుగా ఉంది. చంద్రబాబు, బీఆర్ నాయుడు ఇద్దరూ స్వామి వారి ద్రోహులే. చంద్రబాబు ఓ కళంకితుడికి పదవి ఇచ్చారు. అసమర్థుడు అని తేలిన తర్వాత కూడా బీఆర్ నాయుడు పదవి అంటిపెట్టుకున్నారు. పవన కల్యాణనంద స్వాముల వారు కొండపై ప్రతీ రాయిని కడిగినా పాపం పోదు.బీఆర్ నాయుడు కుమారుడు జూబ్లీహిల్స్ సొసైటీ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. ఏప్రిల్ ఐదో తేదీన జూబ్లీహిల్స్ సొసైటీ ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల కోసమే బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవిలో కొనసాగుతున్నారా?. బీఆర్ నాయుడుని ఇంకా పదవిలో కొనసాగించడం అత్యంత హేయం అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు. -
బొత్సను పరామర్శించిన YSRCP నేతలు
-
టీసీ రాజన్ నిజమైన గాంధేయవాది.. వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, అమరావతి: ప్రముఖ గాంధేయవాది, మాజీ ఎమ్మెల్యే ఠానేదార్ చిన్న రాజన్ (టీసీ రాజన్) మరణం పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పలమనేరు నియోజకవర్గం నుంచి 1967లో స్వతంత్ర పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన టీసీ రాజన్ విలువలకు కట్టుబడి పని చేశారని కొనియాడారు.ఆచార్య ఎన్జీ రంగా అనుచరుడిగా స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష కూడా అనుభవించారని చెప్పారు. ఎమ్మెల్యేగా గెలిచి ఆ పదవికే వన్నె తెచ్చారన్నారు. జీవితాంతం నిజమైన గాంధేయవాదిగా నిలిచిన టీసీ రాజన్ నిస్వార్థ రాజకీయ నేతగా ప్రజాసేవకే అంకితం అయ్యారని గుర్తు చేశారు. నిండు నూరేళ్లకు పైగా జీవించిన టీసీ రాజన్ రాష్ట్ర రాజకీయాల్లో చిరస్మరణీయుడని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు, బంధు మిత్రులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
అనపర్తిలో ఆగని అధికార పార్టీ ఆగడాలు
అనపర్తి: తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గంలో అధికార పార్టీ ఆగడాలు ఆగడం లేదు. నియోజకవర్గంలోని బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తపై అధికార పార్టీ శ్రేణులు విచక్షణారహితంగా దాడులు చేశాయి. ఈ ఘటనలో స్పృహ కోల్పోయిన బాధితుడిని ఆస్పత్రికి తరలించాయి వైఎస్సార్సీపీ శ్రేణులు. ఈ దాడిపై బాధిత కుటుంబ సభ్యలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ దాడికి కారణమైన నిందితులకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు పోలీసులు. దాడులకు పాల్పడిన వారికి ఇలా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించడం విమర్శలకు దారి తీసింది. నిందితులపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు.. అధికార పార్టీకి కొమ్ముకాస్తూ నిందితుల్ని ఇలా స్టేషన్ బెయిల్పై పంపించడం ఏంటని వైఎస్సార్సీపీ ప్రశ్నిస్తోంది. పల్నాడులో టీడీపీ గూండాలు దాడులుల్నాడు జిల్లాలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ గూండాలు దాడులకు దిగారు. ఈ దాడిలో ఇద్దరు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
ఆ పేరు ఎత్తలంటేనే సిగ్గుగా ఉంది BR నాయుడుపై శ్యామల ఫైర్
-
మా భారతమ్మ పై పడి ఏడుస్తారు కదా ఉగాది వేడుకల్లో మరి మీ భార్యలు ఎక్కడ..?
-
పేర్ని కిట్టు ప్లెక్సీలపై కూటమి నేతల కడుపు మంట
-
జగన్ ప్రభుత్వమే బాగుండేది కొంపముంచిన అకాల వర్షాలు కూటమిపై రైతుల ఆగ్రహం
-
జగన్ ఓర్పుగా ఉన్నాడని.. శత్రువులతో చేతులు కలిపి చాలా పెద్ద తప్పు చేస్తున్నారు
-
YSRCP నేతలపై నోరుజారిన జనసేన ఎమ్మెల్యే
-
ఇంత అన్యాయమా తల్లీ!
ప్రొద్దుటూరు: షర్మిలకు మేలు చేయడానికి.. వైఎస్ జగన్మోహన్రెడ్డికి అన్యాయం చేయడానికే వారి తల్లి విజయమ్మ ప్రకటన విడుదల చేశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. జగన్పై షర్మిల చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని, కోట్లాది మంది ఆడబిడ్డలు ఆయన్ని దేవుడిచ్చిన అన్నగా ఆరాధిస్తుంటే... రక్తసంబంధం కలిగిన షర్మిల శత్రువులు కూడా ఇలా ఉండరు అనడం బాధాకరమని ఆయన అన్నారు. షర్మిల మాటలు విజయమ్మకు బాధ కలిగించి ఉండాలి, కానీ అలా జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విజయమ్మ ఇచ్చిన స్టేట్మెంట్ కు నోటరీ చేయించి మరీ విడుదల చేయడం వెనుక వ్యూహం ఉందన్నారు. వైఎస్సార్ భార్యగా, ఆమె ఏమి చెప్తే అది ప్రజలు నమ్ముతారన్న అభిప్రాయంతో నోటరీ చేసి మరీ లేఖ విడుదల చేశారన్నారు. ఈ లేఖ మొదటగా టీడీపీకి చెందిన సోషల్ మీడియా గ్రూపుల్లో కనిపించిందని, దీన్ని బట్టి స్క్రిప్ట్ ఎవరు రాస్తున్నారు?, ఎక్కడ తయారవుతుంది? అన్నదానిపై ప్రజలకు అవగాహన కలిగిందన్నారు. విజయమ్మ అనేక సందర్భాల్లో తాను షర్మిలవైపే అన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారన్నారు. విజయమ్మ రాసిన లేఖలో మేనల్లుడు, మేనకోడలికి అంటే షర్మిల కుమార్తెకు, కుమారుడుకి జగన్ తీవ్రమైన అన్యాయం చేశాడంటూ పేర్కొనడం చాలా బాధాకరమన్నారు. నిజంగా ఈ మాట ఎవరైనా నమ్మితే.. మీ కుమారుడు జగన్ ఇంత అన్యాయస్తుడని భావించరా? మీ కుమార్తె షర్మిలను రక్షించే ప్రయత్నంలో కుమారుడి గౌరవాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత కింద స్థాయికి తీసుకుని పోయే విధంగా మాట్లాడ్డం తగునా? అంటూ విజయమ్మను రాచమల్లు ప్రశ్నించారు. జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి షర్మిల చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పందిస్తే గోబెల్స్ ప్రచారం అంటూ విజయమ్మ లేఖలో రాయడం అన్యాయమన్నారు. తాము వాస్తవాలనే ప్రజలకు చెప్తున్నామని, చంద్రబాబు కుట్రలో పాలుపంచుకుంటూ తమ నాయకుడిని వ్యక్తిత్వహననం చేస్తుంటే, దానినుండి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. విజయమ్మ ఒక తల్లిగా తన కుమారుడి కోసం పడాల్సిన ఆరాటం, పార్టీ నాయకులుగా తాముపడుతున్నామని, తమతోపాటు జగన్ని అభిమానించే లక్షలాది కుటుంబాలు ఆరాటపడుతున్నాయన్నారు. తాము ఇంత ఇంత బాధ పడుతుంటే.. కుమారుడి ప్రతిష్టను కాపాడేందుకు ఆరాటపడకపోగా, షర్మిల కోసం జగన్ని దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. షర్మిల, జగన్ తమకు రెండు కళ్లతో సమానమని, ఏ కంటిని కూడా గాయపర్చే పని చేయబోమని, కానీ జగన్పై అసత్య ప్రచారానికి అడ్డుకట్ట వేయడానికి తాము స్పందించాల్సి వస్తోందన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...వారు చంద్రబాబు చేతిలో.. మీరు షర్మిల చేతిలో..చంద్రబాబు స్వార్థ రాజకీయాలకోసం, ఆయన చేతిలో షర్మిల, సునీత పావులుగా మారి, మా నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, మా పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మాట్లాడటంతో, మనసుకు బాధ కలిగి, రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతో కొన్నిరోజులుగా నేను మీడియా ముందుకు వస్తున్నా. రాజశేఖరరెడ్డిగారి కుటుంబంలో ఉన్న వ్యక్తుల గురించికాని, ఆ కుటుంబ వ్యవహారాల గురించి కానీ మాట్లాడాల్సి వస్తుందని కలలో కూడా మేం ఎన్నడూ అనుకోలేదు, ఊహించలేదు. కానీ మాట్లాడే ఆ పరిస్థితులను సృష్టిస్తున్నది ఎవరని విజయమ్మగారు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు చేతిలో షర్మిల పావుగా మారితే, షర్మిల పెట్టే ఒత్తిళ్లకు, ఆమె ప్రభావానికి లోనై.. షర్మిల చేతిలో విజయమ్మ పావులాగ మారారనేది స్పష్టం అవుతోంది. స్క్రిప్టు ఎక్కడ తయారవుతోందో ఎవరికి తెలియదు?చంద్రబాబు ఆదేశాల మేరకు, ఆయనకు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు, డైవర్షన్ రాజకీయాలు చేయాల్సి వచ్చినప్పుడల్లా, షర్మిల, సునీత ఇద్దరూ హద్దులు దాటి, చులకనగా మాట్లాడి, కోట్లమంది అభిమానుల మనసు గాయపరిచేలా, వ్యక్తిత్వ హననం చేస్తుంటే.., అబద్ధాలను, అసత్యాలను చెప్తుంటే.. మేం మాట్లాడమా తల్లీ. అసలు మీడియాకు ఎక్కుతున్నది ఎవరు? మీరు మాట్లాడవద్దంటూ పరోక్షంగా మా పార్టీ నాయకులను ఉద్దేశించి చేతులు జోడిస్తున్నామంటూ బహిరంగ లేఖలో ప్రస్తావించడం మాకు ఆవేదన కలిగిస్తోంది. అసలు మాట్లాడే పరిస్థితి కల్పిస్తున్నది షర్మిల కాదా? సునీత ప్రజలకు తెలిసి చంద్రబాబును రెండుసార్లు కలిశారు. ఎవరికీ తెలియకుండా 19 సార్లు కలిశారు. ఇలా కలిసిన ప్రతిసారీ ఈ కుటుంబంలో జరిగిన ప్రతి విషయం చంద్రబాబుకు చెబుతున్నారు. షర్మిల ఒక్కరోజు కూడా చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించరు. జగన్ను మాత్రం టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్నారు. ప్రజలందరికీ ఇవన్నీ తెలుసు.అన్యాయంగా ఆరోపణలు చేస్తున్న షర్మిలను కట్టడి చేయలేరా?మంగళవారం ఎన్సీఎల్టీలో కౌంటర్ దాఖలు చేయడం, ఆ మరుక్షణంలో చంద్రబాబు ఆఫీసుకు అది చేరడం, మరుసటిరోజు ఆ కౌంటర్లను అడ్డుపెట్టుకుని బుధవారం ఎల్లోవీుడియా ప్రధాన పత్రికలో అందులోని అంశాలు రావడంం ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? మరి వీటిని ఒక తల్లిగా మీరు ఎందుకు నియంత్రించలేకపోతున్నారు? ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు? మొన్న విశాఖపట్నం ఎయిర్పోర్టులో సొంత అన్నను పట్టుకుని, కోట్లమంది అభిమానిస్తున్న నాయకుడ్ని పట్టుకుని.. ఇలాంటి అన్న ఉంటే శత్రువులు కూడా అవసరం లేదని, పైగా అన్న అనే పదానికి కళంకం అంటూ షర్మిల మాట్లాడిన మాటలు విన్న తర్వాత మాలాంటి వాళ్లు మాట్లాడకుండా.. ఎలా ఉంటారు? అసలు అలాంటి మాటలు అనకుండా, తప్పమ్మా .. అని ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు?జగన్ స్వార్జిత ఆస్తుల్లో షర్మిల వాటాలు కోరిన దగ్గరనుంచి.. ఈ వ్యవహారంలో జగన్ ఒక్కసారి కూడా మాట్లాడలేదు కదా? రచ్చ చేయలేదు కదా? కించపరిచి మాట్లాడటమో, తక్కువచేసి మాట్లాడటమో, అలాంటి పనులు ఏనాడూ చేయలేదు కదా? కానీ షర్మిల దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నా.. ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? రచ్చచేస్తున్నా, కుటుంబ పరువును దెబ్బతీసేలా వ్యవహరిçస్తున్నా ఎందుకు ఆమెను నియంత్రించలేకపోతున్నారు.ఎన్సీఎల్టీ తీర్పు అర్థమేమిటి?న్యాయాన్యాయాలు తేల్చమని జగన్ ఎన్సీఎల్టీ కోర్టుకు వెళ్లారు. కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీని అర్థం ఏంటి? ఆయన పక్కన న్యాయం ఉన్నట్టే కదా? మళ్లీ దీన్ని సవాల్ చేస్తూ చెన్నై కోర్టుకు వెళ్లారు. వాదనలు జరుగుతున్నాయి. మరి ఈ కేసు తేలేంతవరకూ ఎందుకు ఆగలేకపోతున్నారు? జగన్ ఒక్కమాట కూడా మాట్లాడలేదు కదా? కానీ షర్మిల కట్టుబడి లేరు కదా? తప్పు ఎవరిది? మీరు ఒక సైడ్ తీసుకోవడం న్యాయమా?చంద్రబాబు ఆదేశాల మేరకు షర్మిల అయినా, సునీత అయినా హద్దులు దాటి, పరుష పదాలతో మాట్లాడతారు. చంద్రబాబుకు అవసరమైనప్పుల్లా రంగంలోకి దిగి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా అటాక్ చేసూ్తనే ఉన్నారు. మేం వాటికి స్పందిస్తే.. మాకు చేతులు జోడించి మాట్లాడొద్దని చెప్తున్నారు. ఇది ధర్మమేనా? న్యాయమేనా? సరస్వతీ పవర్, ఈడీ అటాచ్మెంట్లో ఉండగా, వాటికి సంబంధించిన ఒరిజనల్ షేర్ సర్టిఫికెట్లు జగన్ దగ్గరే ఉన్నా, ఈడీ అటాచ్మెంట్లో ఉన్న కంపెనీ షేర్లను బదలాయిస్తే జగన్ బెయిల్ రద్దయ్యే ప్రమాదం ఉన్నా తప్పుడు అఫిడవిట్తో షేర్ సర్టిఫికెట్లు పోయాయని చెప్పి మీరు షేర్లు బదిలీ చేశారంటే దీని అర్థం ఏంటి? షర్మిల ప్రభావం మీమీద ఎంత ఉందో తెలుస్తుంది. చట్ట విరుద్ధంగా చేసిన ఈపని వల్ల జగన్ బెయిల్ రద్దుకు దారితీస్తుందని తెలిసికూడా, మీ చేత సంతకాలు పెట్టించడం భావ్యమా తల్లీ? మీ కొడుకు అక్రమ కేసుల్లో ఇబ్బందులు పడుతున్నాడని తెలిసీ, మిమ్మల్ని నాశనం చేయాలని చంద్రబాబు లాంటి వ్యక్తులు కాసుకు కూర్చున్నాడని తెలిసి కూడా మీచేత సంతకాలు చేయించడం, మీరు సంతకాలు చేయడం దీని అర్థం మీరు వన్సైడ్ తీసుకున్నారనేగా తల్లీ. కుటుంబ విలువలు తెలుసా చంద్రబాబుకు?బంధాలు, బంధుత్వాల గురించి, కుటుంబ విలువల గురించి చంద్రబాబుకు ఏం తెలుసు? ఆస్తులు కాదు కదా ఏనాడైనా అక్కకు గానీ, చెల్లెకు గానీ ఏ చిన్న సాయమైనా చేసిన చరిత్ర ఉందా చంద్రబాబుకు? అసలు చంద్రబాబు సోదరీమణుల పేర్లయినా తెలుసా ఈ రాష్ట్రంలో ఎవరికైనా? సొంత తమ్ముడిని సైతం అన్యాయం చేసిన చరిత్ర ఆయనది. చంద్రబాబు చేసిన ద్రోహాల గురించి తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏకంగా పుస్తకమే రాశారు. అలాంటి చంద్రబాబు పంచన చేరతారా షర్మిల, సునీత? అవాస్తవాలు ప్రచారం చేస్తుంటే భరించలేకపోతున్నాం..విజయమ్మ తల్లిగా, కుటుంబ పెద్దగా కొడుకు, కుమార్తెను కూర్చోబెట్టి ఆస్తిలో భాగం అడగడానికి నీకు అధికారం లేదమ్మా అని షర్మిలకు చెప్పవచ్చు. నీకు ఫలానా ఆస్తి కావాలని అడిగితే అన్నగా నీకు ఇస్తాడని చెప్పవచ్చు. జగన్కు చెప్పి ఏదైనా కూతురుకు ఇప్పించాలి. ఇది చేయకుండా వైఎస్సార్ శత్రువు ఇంటికి వెళ్లి, ఇంటి వ్యవహారాలు చంద్రబాబుకు చెబితే ఏ అన్నకైనా ప్రేమ ఎలా ఉంటుంది? ప్రజలంతా ఆలోచించాలి.’’ అని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు.ఇంతకన్నా అన్యాయం, దుర్మార్గం ఉంటుందా?షర్మిల వాదనను నిలబెట్టేందుకు కొడుకును పూర్తి అన్యాయస్తుడిగా చూపేందుకు ఇవాళ విజయమ్మ ఓ ప్రకటన విడుదల చేశారు. మేనల్లుడు, మేనకోడలుకు జగన్ అన్యాయం చేస్తున్నాడని విజయమ్మ ప్రకటన ఇచ్చారు. ఇంతకంటే అన్యాయం, దుర్మార్గం ఏమైనా ఉంటుందా? అవసరమైన ప్రతి సందర్భంలోనూ షర్మిలకు మేలు చేసేందుకు జగన్ను దెబ్బతీయడం అన్యాయం కదా? అయినా కూడా ఒక్కరోజు కూడా జగన్ మాట్లాడలేదు. షర్మిలకు ఆపద కలిగిన ప్రతి సందర్భంలోనూ విజయమ్మ గారు బయటకు వచ్చి షర్మిల తరఫున సాక్ష్యం ఇస్తారు. ఎందుకంటే రాజశేఖరరెడ్డి భార్యగా మీ సాక్ష్యాన్ని ప్రజలంతా నమ్ముతారు. మీరు చెబితే ప్రజలు నమ్ముతారని అప్పుడప్పుడు బయటకు వచ్చి సాక్ష్యం ఇస్తున్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే సమయంలో మీరు ఆమెను నిరోధించాల్సిన అవసరం మీకు లేదా? వైఎస్సార్ చనిపోయిన సందర్భంలో గుండె ఆగిపోయిన ఆయన అభిమానుల కుటుంబాలను పరామర్శిస్తానని జగన్ చెబితే అంగీకరించని సోనియా పార్టీలోకి మీ కూతురు వెళ్తుంటే ఎందుకు అడ్డుకోలేదు? కడపలో మీ కుమారుడు పోటీ చేస్తుంటే అమెరికా నుంచి కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయమని ప్రకటన చేశారు. మీ బిడ్డను ఓడించమని చెబుతారా? ఎంతటి పక్షపాతం తల్లీ! కుమారుడి గౌరవాన్ని సర్వనాశనం చేస్తారా? అయినా జగన్ భరించారు. సరస్వతి పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన షేర్లు బదలాయింపు చేస్తే కొడుకు జైలుకు వెళ్తాడని తెలిసి కూడా నా కూతురుకు ఆస్తి రావాలి, కొడుకు జైలుకు వెళ్లినా ఫర్వాలేదనేంత కాఠిన్యమా తల్లీ? షర్మిలకు ఆస్తి రావాలి, జగన్ జైలుకు వెళ్లినా ఫర్వాలేదా?ఇవన్నీ పంచి ఇచ్చిన ఆస్తులు కావా?2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించడానికి ముందే ఆస్తుల పంపకం జరిగిందని మేం చాలాసార్లు చెప్పాం. తాజా లేఖలో మీరు కూడా దాన్ని అంగీకరించారు. షర్మిల పేరు మీద రాజశేఖరరెడ్డి ఏ ఆస్తులైతే రిజిస్టర్ చేశారో అవి ఆమెకు ఇచ్చినట్లే అని మీరు అంగీకరించారు. కాకపోతే పంపకం కాదు అంటున్నారు. బంజారా హిల్స్ రోడ్ నెంబరు–2లో ఇల్లు, ఇడుపులపాయలో 51 ఎకరాలు, 15 మెగావాట్ల ఎస్ఆర్ఎస్ హైడ్రో పవర్ ప్రాజెక్టు, 22.5 మెగావాట్ల స్వస్తిక్ హైడ్రో పవర్ ప్రాజెక్టు ఇచ్చారని ఈ లేఖలో మీరూ అంగీకరించారు. విజయవాడ యువరాజ్ సినిమా «థియేటర్ లో 35 శాతం, పులివెందులలో 7.60 ఎకరాల విలువైన స్థలం, విజయలక్ష్మి మినరల్ అండ్ ట్రేడింగ్ కంపెనీ 100 శాతం ఇచ్చారని అంగీకరించారు. కోడురులో రాజారెడ్డి ఆఫీసు స్థలం, కోడూరులో శెట్టిగుంట దగ్గర 90 ఎకరాల వ్యవసాయ భూమి ఇచ్చారంటే దాన్ని కూడా అంగీకరించారు. కానీ ఇవన్నీ పంపకం కాదని విజయమ్మ చెప్పడం ఎంతవరకు సబబు? ఉగాది, సంక్రాంతి, క్రిస్మస్ కు ఒకటి చొప్పున తమాషాగా ఇచ్చిన ఆస్తులా అవి? మరోవైపు షర్మిలమ్మకు ఇచ్చినట్లే జగన్కు కూడా ఇచ్చారని చెప్పారు. మేం కూడా అదే మాట చెప్పాం. జగన్, షర్మిల ఎవరి ఆస్తులు వారివి. ఎవరి వ్యాపారాలు వారివి. ఆ తర్వాత ఎవరైనా పెరగొచ్చు, తరగొచ్చు. దేవుడి దయ లేకపోతే ఇద్దరివీ తరగొచ్చు. మంచి పిల్లలైతే పెరిగిన వారు తరిగిన వాటికి సహాయం చేస్తారు. లేకపోతే పట్టించుకోరు. ఉత్తమ సంతానంలో భాగంగా జగన్ జన్మించారు కాబట్టి వంశానికి మంచి కీర్తి తెచ్చారు. ఇన్ని కోట్ల మంది ప్రజలకు మేలు చేశాడు. ఇంతమంది పేద ప్రజలకు వెలుగై ఉన్నాడు. అదే సందర్భంలో చెల్లెలు మీద ప్రేమతో ఇవ్వాల్సిన దానికన్నా అధికంగా డబ్బు, ఆస్తి కూడా ఇచ్చాడు. షర్మిల వివాహమయిన దాదాపు 15 ఏళ్ల తర్వాత.. 2009 మొదలు... 2023 వరకు జగన్ తన సొంత వ్యాపారాల ద్వారా సంపాదించుకున్న దానిలో నుంచి చెల్లెలన్న ప్రేమ అభిమానాలతో షర్మిలకు పలు దఫాలుగా అడిగినప్పుడల్లా రూ.230 కోట్లు వైట్ మనీ ఇచ్చారు. 2009లో వైఎస్సార్ మరణం తర్వాత ఎవరి ఆస్తులు వారి పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా జరిగింది. ఆ తర్వాత 2009 నుంచి 2019 వరకు ఎవరి వ్యాపారాలు వారు నిర్వహించుకున్నారు. 2019 ఆగస్టులో జగన్ ఎన్నికల అనంతరం సీఎం అయిన తర్వాత తన చెల్లెలు మీద ప్రేమ, మమకారంతో తన ఆస్తుల్లో నుంచి ఎంఓయూ రాశారు. ఈడీ కేసులలో ఆయన ఆస్తులు అటాచ్ మెంట్ కారణంగా ఆస్తుల బదలాయింపునకు అవకాశం లేకుండా పోయింది. ఆ తర్వాత 2023 నాటికి షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీని భుజాన ఎత్తుకోవడం, వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా వీధిలోకి వచ్చి రచ్చ చేయడం వంటి ఘటనలన్నీ జరిగాయి. అప్పుడు జగన్ తన పట్ల షర్మిల ప్రవర్తన సక్రమంగా లేనందున, తనతో విభేదిస్తున్నందున తాను ప్రేమతో ఇవ్వాలనుకున్న వాటిని రద్దు చేసుకున్నారు.ఈ ప్రశ్నలకు బదులుందా విజయమ్మగారూ?వైఎస్సార్గారు బతికి ఉన్న నాటికే షర్మిల పెళ్లి అయి 15 సంవత్సరాలు అయ్యింది. జగన్కు పెళ్లి అయి దాదాపుగా 14 సంవత్సరాలు అయ్యింది. ఆ మధ్య కాలంలో ఎవరి వ్యాపారాలు వారివి.. ఎవరి కుటుంబాలు వారివి.. వైఎస్సార్ గారు సంపాదించిన ఆస్తులు ఆయన ఎవరికైనా ఇచ్చుకునే స్వేచ్ఛ ఆయనకు ఉంటుంది. కానీ ఆయనకు సంబంధంలేని.. ఆయన కొడుకు సంపాదన కానీ, లేకపోతే ఆయన కూతురు సంపాదన అయినా కానీ తను ఎవరికైనా ఎలా ఇవ్వగలుగుతారు?తాను బతికి ఉన్నంతకాలం ఉన్న ఏ ఆస్తి అయినా కూడా, అది ఎవరిదైనా కూడా మీ ప్రకారం ఇవ్వాలని అంటే.. ఇప్పుడు చంద్రబాబు చెల్లెలు రాజ్యలక్ష్మి ఉంది. ఇప్పటికీ చంద్రబాబు బతికే ఉన్నాడు. చంద్రబాబు పేరుమీద ఉన్న ఆస్తి, చంద్రబాబు భార్య సంపాదించిన ఆస్తి, చంద్రబాబు కొడుకు సంపాదించిన ఆస్తి, వారిపేరు మీద ఉన్న ఆస్తిలో చంద్రబాబు చెల్లెలు రాజ్యలక్ష్మి చంద్రబాబు ఆస్తిలో భాగం అడిగితే అది సబబే అవుతుందా? అంతెందుకు వైఎస్సార్గారి చెల్లెలు విమలమ్మగారు ఇంకా బతికే ఉన్నారు. ఆమె కూడా ఇదే మాదిరిగా వైఎస్సార్గారు బతికి ఉన్నంతవరకు సంపాదించిన ఆస్తి, ఎవరు సంపాదించినా.. అది ఎవరిపేరు మీద ఉన్నా దాంట్లో నాకూ భాగం ఉందని అంటే మీరు షర్మిల విషయంలో ఆలోచన చేసినట్లుగానే విమలమ్మగారి విషయంలోనూ ఆలోచన చేస్తారా?ఎవరైనా ఎవరి ఆస్తిలోనైనా లేదా ఎవరి వ్యాపారాలలోనైనా భాగం లేదా వాటా ఎప్పుడు అడగగలుగుతారు? జగన్ కంపెనీలలో మీలో ఎవరైనా పెట్టుబడులు పెట్టారా? ఆ కంపెనీలు చేసిన అప్పులకు పర్సనల్ గ్యారెంటీలు ఇచ్చారా? ఆ కంపెనీలు నష్టాలలో ఎపుడైనా పాలు పంచుకున్నారా? ఆ కంపెనీల నష్టాలలోనూ, కోర్టు కేసులలోనూ ఏ రోజైనా పాలు పంచుకున్నారా? ఏ రోజైనా భాగం అయ్యారా? కేసులు ఎపుడైనా పట్టించుకున్నారా? మీ ఆస్తులను ఎపుడైనా సీబీఐ లేదా ఈడీ అటాచ్ చేసిందా.. ఉమ్మడి ఆస్తులు కాదు కాబట్టే.. అవి జగన్ ఆస్తులు కాబట్టే దర్యాప్తు సంస్థలు అటాచ్ చేశాయి.. మరి ఇవేవీ లేకుండా వేరేవారి కంపెనీలలో మనం ఎలా వాటాలు ఆశించగలం?.. అలా ఎవరైనా ఆశించడం ధర్మమేనా?రాజశేఖరరెడ్డి గారు 2004 ఎలక్షన్ కమిషన్కు అప్లై చేసిన అఫిడవిట్, 2009 లో అప్లై చేసిన అఫిడవిట్ చూసినా ఎవరికైనా అర్థమవుతుంది. ఆ మధ్య కాలంలో ఆయన సంపాదించిన ఆస్తులు, ఆయన పంపకాలు చేశారని తెలుస్తుంది. ఆయన ఆస్తులు, ఆయన సంపాదించిన ఆస్తులు కాబట్టి ఆయన పంపకం చేయగలిగినారు. కానీ ఆయనకు సంబంధంలేని ఆయన కొడుకు ఆస్తిలో, కొడుకు కంపెనీలో లేక కూతురు ఆస్తులో లేక కూతురు కంపెనీలో ఆయన పంపకాలు చేయలేరు కదా?ఒక పిల్లాడు బాగున్నాడని, ఒకరు అంతగా బాగోలేరని, బాగున్న పిల్లాడి ఆస్తిని బాగోలేని పిల్లాడికి పంపకాలు చేయించాలని భావోద్వేగంతో ఏ తల్లి అయినా అనుకోవచ్చు కానీ అలా ఇవ్వాలి అంటే అటువైపున అభిమానంతో ప్రేమలు, ఆప్యాయతలు ఉంటే అంతో ఇంతో ఇస్తారేమో కానీ ఇలా హక్కుగా ఆశించడం తప్పు కాదా? ఈడీ అటాచ్మెంట్లో ఉన్న కంపెనీ షేర్స్ బదలాయించకూడదని, అలా బదలాయిస్తే జగన్ బెయిల్ రద్దయ్యే ప్రమాదముందని, సుప్రీంకోర్టు జడ్జిలు లిఖితపూర్వక ఒపీనియన్ ఇచ్చినప్పటికీ దానిని బేఖాతరు చేసి... జగన్ దగ్గరే ఉన్న షేర్స్ సర్టిఫికెట్స్ పోయినట్లుగా ఏకంగా తప్పుడు అఫిడవిట్ ఇచ్చి మరీ షేర్స్ బదలాయించారు. షర్మిల ఒత్తిడి ప్రభావం మీమీద ఎంత వరకు ఉందో దీనిని బట్టి తెలియడం లేదా?మీరు అఫిడవిట్ ఇచ్చిన తర్వాత ఎన్సీఎల్టీలో వాదనలు జరిగాయి. ఆ తరువాత జగన్కు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయినా మేలుకోకుండా రాజకీయంగా దుమారం రేపడం కోసం షర్మిల ఆధ్వర్యంలో మీరు మళ్లీ కోర్టును అప్రోచ్ అయ్యారు. ఇపుడు తెలిసిపోతుంది కదా? ఈలోగా మీరే దీనిని దుమారం చేస్తూ షర్మిల ప్రెస్మీట్లు పెడుతున్నారు. దానివీుద మేము సహజంగానే స్పందిస్తాం. మేం స్పందించకూడదా?అసలు మీడియాకు ఎక్కుతున్నది ఎవరు? ఆస్తుల వ్యవహారానికి సంబంధించి మొదటిసారిగా చంద్రబాబు ద్వారా, టీడీపీ మీడియా ద్వారా షర్మిల తన అన్నకు రాసిన లేఖను ఎవరు లీక్ చేశారు? షర్మిల కాదా? మరి ఆ లేఖను అడ్డుపెట్టుకుని, మా నాయకుడి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ, అసత్యాలను ప్రచారం చేస్తుంటే.. వాస్తవాలను చెప్పడం తప్పవుతుందా తల్లీ?విజయమ్మగారు.. మీరు పెద్దవారు. మేం ఏమీ అనలేం. కానీ ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం మీరు మొదటనుంచీ వన్సైడ్ తీసుకున్నారు. షర్మిల సైడ్ తీసుకున్నారు. షర్మిల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని మీరు అమెరికా నుంచి వీడియో మెసేజ్ ద్వారా పిలుపునివ్వడం నిజం కాదా? ఏ కాంగ్రెస్ పార్టీ అయితే జగన్ను ఇబ్బంది పెట్టిందో, వైఎస్సార్గారి పేరును ఎఫ్ఐఆర్లో చేర్చిందో అలాంటి పార్టీకి మద్దతు ఇవ్వమని జగన్కు వ్యతిరేకంగా షర్మిల కోసం మీరు పిలుపు ఇచ్చారు.టీటీడీ కల్తీనెయ్యి, హెరిటేజ్ తప్పులు, బీఆర్ నాయుడు తప్పులు, పుట్టా మహేష్ డ్రగ్స్ విషయం నేపథ్యంలో టాపిక్ డైవర్ట్ చేయడానికి షర్మిలతో చంద్రబాబు ప్రెస్మీట్లు పెట్టిస్తారు. దానివీుద మేము రియాక్ట్ అయితే మీరు రంగంలోకి దిగుతారు. కోర్టులలో ఇప్పటికే సమర్పించిన తప్పుడు అఫిడవిట్లలో భాగంగా మరో తప్పుడు అఫిడవిట్ మీరు రిలీజ్ చేస్తారు. కానీ అది కోర్టుకు పోదు. కోర్టుకన్నా ముందు టీడీపీ ఆఫీస్లోని వెబ్సైట్లకు వెళుతుంది. అదే ఎల్లో మీడియాలో చూపిస్తారు. ఈ కుట్రలలో భాగంగా మీరు బురద వేస్తూ మమ్మల్ని రెస్పాండ్ కావద్దని మళ్లీ విన్నవిస్తారు. ఇది ధర్మమేనా? ఇది న్యాయమేనా? -
నారా కాస్త నీరో లోకేష్ అయ్యాడు..లోకేష్ పై నిప్పులు చెరిగిన తాటిపర్తి
-
‘జాబ్ క్యాలెండర్ను లోకేష్ జోక్ క్యాలెండర్గా మార్చేశారు’
సాక్షి, తాడేపల్లి: నారా లోకేష్ జాబ్ కేలండర్ని జోక్ కేలండర్గా మార్చారంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆ కేలండర్లో డేట్లు ఉన్నాయి.. గానీ ఉద్యోగాల డేటా లేదు. తూతూమంత్రంగా 10 వేల ఉద్యోగాలు ప్రకటించి చేతులు దులుపున్నారు. లోకేష్, చంద్రబాబే కొన్ని వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని గతంలో చాలాసార్లు చెప్పారు. మాటల్లో మాత్రం గ్లోబల్ లెవల్లో మాట్లాడతారు. చేతల్లో మాత్రం ఏమీ ఉండదు’’ అంటూ తాటిపర్తి ధ్వజమెత్తారు.‘‘నారా వారు కాదు.. నీరో వారని నిరూపించుకున్నారు. నిరుద్యోగ భృతి రెండేళ్లుగా ఇవ్వలేదు. లోకేష్ చదువుకున్న వ్యక్తి కాదు.. చదువుకొన్న వ్యక్తి. అందుకే నిరుద్యోగుల కష్టాలు ఆయనకు తెలియవు. అరచేతిలో వైకుంఠం చూపించటం తప్ప లోకేష్ చేస్తున్నది లేదు. అర్హత లేని లోకేష్, పవన్ కళ్యాణ్ మంత్రులు అయ్యారుగానీ నిరుద్యోగులకు ఉద్యోగాల్లేవ్..వైఎస్ జగన్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలను చంద్రబాబు తీసేశారు. ఔట్ సోర్సింగ్లోనే 9 వేల ఉద్యోగాలు తొలగించారు. ఏపీ ఫైబర్లో 2 వేల మంది ఉద్యోగులను తొలగించారు. రేషన్ వాహనాల్లో పని చేసే 2,900 ఉద్యోగులను తొలగించారు. బేవరేజ్ కార్పొరేషన్లోని 18 వేల మందిని తొలగించారు. తొలగించటమే తప్ప చంద్రబాబు ఇచ్చేదేమీ ఉండదు. గ్రూప్-2 కోసం ఏళ్లుగా ఎదురు చూస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. నిరుద్యోగుల జీవితాలతో లోకేష్ బంతాట ఆడుకుంటున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ భృతి పేరుతోనూ మోసం చేశారు. బడ్జెట్లో నిరుద్యోగ భృతికి కేటాయింపుల్లేవ్. ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ ఊసే లేదు. వారి సమస్యలను పట్టించుకునే పరిస్థితే లేదు’’ అంటూ తాటిపర్తి చంద్రశేఖర్ దుయ్యబట్టారు. -
కూటమి కుట్రలను ఛేదిస్తూ..! పిన్నెల్లి విడుదల
-
నెల్లూరు: చలో ‘జువ్వలదిన్నె’ను అడ్డుకున్న పోలీసులు
కూటమి పాలనలో ఫిషింగ్ హార్బర్ను ప్రైవేట్పరం చేసే కుట్ర: వైఎస్సార్సీపీ నేతలుమత్య్సకారులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదుమత్స్సకారులపై చంద్రబాబు కక్ష సాధిస్తున్నారుజువ్వలదిన్నె హార్బర్ను ప్రైవేట్కు కట్టబెట్డడం దుర్మార్గంమత్స్యకారులకు చెందాల్సిన ఫిషింగ్ హార్బర్ ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారుపోలీసుల తీరుకు నిరసనగా వైఎస్సార్సీపీ కార్యకర్తల ఆందోళనవైఎస్ జగన్ హయాంలో ప్రారంభమైన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్వైఎస్సార్సీపీ చలో జువ్వెలదిన్నెను అడ్డుకున్న పోలీసులుఫిషింగ్ హార్బర్ ప్రైవేట్ పరం కాకుండా వైఎస్సార్సీపీ నిరసనలుకావలి నుంచి వైఎస్సార్సీపీ నేతల భారీ ర్యాలీమాజీ మంత్రి కాకాణి, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీకేవలం 25 మందిని మాత్రమే అనుమతిస్తామంటున్న పోలీసులుపోలీసుల తీరుకు నిరసనగా వైఎస్సార్సీపీ కార్యకర్తల ఆందోళన👉కావలి నుంచి భారీగా బయల్దేరిన వైఎస్సార్సీపీ నేతలుకాకాణి, ప్రతాప్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీజువ్వలదిన్నె సమీపంలో వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకున్న పోలీసులువైఎస్ జగన్ హయాంలో ప్రారంభమైన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్కూటమి పాలనలో ఫిషింగ్ హార్బర్ను ప్రైవేట్పరంచేసే కుట్రజువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడానికి వ్యతిరేకంగా ఇవాళ(మార్చి 20, శుక్రవారం) వైఎస్సార్సీపీ చలో జువ్వలదిన్నె కార్యక్రమాన్ని చేపట్టింది. చలో జువ్వలదిన్నెకు పిలుపునిచ్చిన వైఎస్సార్సీపీ.. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రైవేట్పరం కాకుండా నిరసనలు చేపట్టనుంది. కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం జరగనుంది. మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి పాల్గొననున్నారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్కు 70 ఎకరాల స్థలాన్ని సేకరించి అభివృద్ధి చేశారని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి అన్నారు. 29.5 ఎకరాల భూమిని ప్రైవేట్ సంస్థ అయిన సాగర్ డిఫెన్స్ సంస్థకు అప్పజెప్పడం మంచి పద్ధతి కాదన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు తాము, తమ పార్టీ వ్యతిరేకం కాదన్నారు. వారికి స్థలాన్ని వేరేచోట ఇచ్చి స్థానిక ప్రజలకు ఉపాధి కల్పిస్తే మంచిదన్నారు. కానీ హార్బర్ కోసం సేకరించిన స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. -
పల్నాడులో దుమ్మురేపిన పిన్నెల్లి కాన్వాయ్
-
రాజకీయాల్లోకి VV వినాయక్! మా తమ్ముడు YSRCPనే..
-
షర్మిల మాటలు హద్దులు దాటుతున్నాయి: రాచమల్లు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: గత మూడు, నాలుగేళ్లుగా షర్మిల, సునీత.. వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిన్న షర్మిలమ్మ మాట్లాడిన మాటలు హద్దులు దాటాయన్నారు. కనీస ఆలోచన లేకుండా హద్దులు దాటి సొంత అన్నపై వ్యక్తిత్వ దాడి చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘వైఎస్సార్ కుమార్తె, జగన్కు చెల్లెలు కదా అని మేం చాలా వరకూ మిన్నకుండిపోయాం. ఆమె నిన్న మాట్లాడుతూ అన్న అనే పదానికే నువ్వు కలంకం అన్నారు. ఈ మాట మమ్మల్ని చాలా బాధించింది. బట్ట కాల్చి మసి మీ అన్న ముఖాన వేసి తుడుచుకో అంటే ఒప్పుకోరు తల్లీ. అన్న అనే పదానికే ఆయన అనర్హుడు అన్న తర్వాత మీ అన్న మీకు చేసిన అన్యాయం ఏంటో మీరు చెప్పాలి. నువ్వు ఏదేదో మాట్లాడి బురద జల్లి పోతానంటే కుదరదు. నీ పట్ల మీ అన్న చేసిన అన్యాయం ఏంటో స్పష్టంగా తెలుగు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది.’’ అని రాచమల్లు పేర్కొన్నారు.‘‘మీ అన్నపై ఇంతటి విషాన్ని చిమ్మడానికి ఏం కారణం..? ఏమి నీకు అన్యాయం జరిగింది..?. నాలుగు గోడల మధ్య ఏదైనా సమస్యలుంటే పరిష్కరించుకోవాల్సింది. పోయి పులివెందుల పూల అంగళ్ల సర్కిల్లో పరిచినారు. మీ ఇంట్లో ఏదైనా చర్చించుకుంటే మరుసటి రోజే ఆంధ్రజ్యోతి పత్రికలో బ్యానర్ ఐటమ్గా వస్తుంది. ఇవన్నీ వారికి ఎవరు చెప్తున్నారు. షర్మిల, సునీతల ఫోన్లు పరిశీలిస్తే ఏబీఎన్ రాధాకృష్ణ, చంద్రబాబుతో టచ్లో ఉన్న విషయం ఇట్లే బయటపడుతుంది. మీ తండ్రి చనిపోతే సంతోషించిన చంద్రబాబు లాంటి వ్యక్తితో మీరు చెలిమి చేస్తారా?. అన్న అనే పదానికే కళంకం తెచ్చాడంటున్న నీవు నీకు ఏ విషయంలో అన్యాయం చేశాడు..?’’ అంటూ రాచమల్లు ప్రశ్నించారు.‘‘ఆస్తి విషయంలో చేశాడా..? అధికారం విషయంలో అన్యాయం చేశాడా..?. వైఎస్సార్ 2004లో అఫిడవిట్లో చూపించిన ఆస్తులు 2009లో లేవు. ఈ మధ్య కాలంలో రాజశేఖరరెడ్డి తన ఆస్తులను నీకు, జగన్కు పంచేశారు. మీ తండ్రి చట్ట ప్రకారం మీ అన్నకు, నీకు సమానంగా ఆస్తులు పంచారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని ఇళ్లు షర్మిలమ్మకే ఇచ్చారు. ఇడుపులపాయలో 51 ఎకరా వ్యవసాయ భూమిని షర్మిల పేరుతో రిజిస్టర్ చేయించారు. 15 మెగావాట్ల ఎస్సారెస్ స్మాల్ హైడ్రో ప్రాజెక్టు ఆమెకే ఇచ్చారు. స్వస్తిక్ హైడ్రో పవర్ ప్రాజెక్టునూ ఆమెకే ఇచ్చాడు...విజయవాడ యువరాజ్ థియేటర్లో 36 శాతం భాగం షర్మిలమ్మకే రాసిచ్చాడు. పులివెందులలో 7 ఎకరాల 60 సెంట్ల స్థలాన్ని ఆమెకే రాసిచ్చారు. విజయలక్ష్మి ట్రేడ్ అండ్ మినరల్స్ వంద శాతం వాటా ఆమెకే ఇచ్చేశారు. రాజారెడ్డి గారి హయాం నుంచి రైల్వే కోడూరులో ఉన్న ఇంటిని కూడా ఆమెకే రాసిచ్చాడు. రైల్వే కోడూరు మండలం శెట్టిగుంటలో 90 ఎకరాల వ్యవసాయ భూమిని ఆమెకే ఇచ్చారు. ఇలా నీకు సగం వాటాను ఇస్తుంటే అంగీకరించడం అనేది జగన్ గొప్పతనం. మీరిద్దరూ ఒకే కడుపున పుట్టారు కాబట్టి మీ అన్న ఒప్పుకున్నాడు అంటే సరే.. మీ వదిన ఎలా ఒప్పుకుంది..?..సమాజంలో ఏ ఇంటి కోడలూ ఆడబిడ్డకు సమాన ఆస్తి ఇస్తే అంగీకరిస్తుందా..?. అయినా భారతమ్మ ఒప్పుకున్నారు అంటే మీ తండ్రి, మీ అన్న కంటే వెయ్యి రెట్లు ఆమె గొప్పది. ఇన్ని ఆస్తులు తీసుకున్నందుకేనా వైఎస్ జగన్ అన్న అనే పదానికి కళంకం...?. వైఎస్సార్ మరణించినప్పటి నుంచీ నువ్వు జగన్తో విభేదించే వరకూ తాను సంపాదించుకున్న దాంట్లో జగన్ నీకు రూ.236 కోట్లు ఇచ్చారు...అయినా మీరు ఆయన వ్యక్తిత్వంపై దాడి చేస్తూ మా అన్న దుర్మార్గుడు అంటున్నారు. మీ అన్న ముఖ్యమంత్రిగా చేసిన పనులకు దేశమంతా పొగుడుతుంటే నువ్వు విమర్శలు చేశావు. అవన్నీ చాలవన్నట్లు వివేకానందరెడ్డి హత్య రక్తపు మరకలను జగన్ నెత్తిన వేసి ఆయన రాజకీయ జీవితాన్ని నాశనం చేసేందుకు ఇంత నిందలు వేస్తావా..?. ఇవన్నీ చాలవన్నట్లు చంద్రబాబుతో చెలిమి చేస్తూ.. ఏబీఎన్ రాధాకృష్ణకు ఉప్పందించి బజారుకీడుస్తావా...?. నీకు ఎక్కడ న్యాయం ఉంది.. ఎక్కడ కృతజ్ఞత ఉందమ్మా నీకు..?. నీ స్థానంలో ఏ చెల్లి ఉన్నా జగన్ లాంటి అన్నను గుండెల్లో పెట్టుకుని ఉండేవారు...నువ్వు కొంగుపట్టుకుని జగన్కి, అవినాష్కి ఓటు వేయవద్దని పులివెందుల పూలఅంగళ్ల సర్కిల్లో అర్థించావు. అవినాష్ రెడ్డి వివేకాను చంపి ఉంటే నాకు ఓటు వేయండి.. లేదంటే అవినాష్కు ఓటు వేయండి అని కొంగుపట్టి మరీ అడిగావు. నువ్వు చెప్పిన మాటలు ప్రజలు నమ్మారా? అవినాష్రెడ్డి గెలిచాడు. నువ్వు చెప్పిన తప్పుడు మాటల వల్ల జిల్లాలో మేం ఐదుమంది ఎమ్మెల్యేలం ఓడిపోయాం. నీ లెక్క ప్రకారం వివేకా హత్యలో అవినాష్రెడ్డికి సంబంధం లేదని ప్రజలు నమ్మారు కాబట్టే ప్రజలు ఆయన్ను గెలిపించారు...అంతటితో ఆగకుండా చంద్రబాబు ఏ కీ ఇస్తే దాన్ని సునీతమ్మ మాట్లాడుతుంది. మూడు నాలుగు రోజుల తర్వాత మీరొచ్చి అవే మాటలు మాట్లాడతారు. జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసి ఆయన రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలనేదే మీ లక్ష్యం. నీకు ఆస్తి పంపకానికి ఒప్పుకుని, సొంతంగా డబ్బిచ్చి.. తన సొంత ఆస్తుల నుంచి కూడా నీకు భాగాలిస్తే.. నీకు సంతృప్తి లేదు. సరస్వతి భూముల విషయంలో ఆమె చేసిన వ్యవహారం వింటే చాలా బాధ కలుగుతుంది...జగన్పై కేసుల కారణంగా ఆ భూములు అటాచ్మెంటులో ఉంటే.. దానిలోని విజయమ్మ పేరుపై ఉన్న భూములను తన పేరుపై రాయించుకోవాలని చూశారు. దాని కోసం ఆ షేర్ కాగితాలు పోయాయని కేసు పెట్టి.. ఆ తర్వాత విజయమ్మ ఆస్తిని తన పేరుపై బదలాయింపు చేసుకుంది. ఈడీ అటాచ్మెంట్లో ఉన్న ఆస్తిని బదలాయింపు చేయకూడదని అందరికీ తెలుసు. అలా చేస్తే వైఎస్ జగన్ బెయిల్ రద్దు అవుతుందని కూడా అందరికీ తెలుసు. అయినా బదలాయింపు చేశావంటే.. మీ అన్న మళ్లీ జైలుకు పోవాలనేగా..?..పగోడు పదహారు నెలలు జైల్లో పెడితే.. చెల్లెలు 32 నెలలు జైల్లో పెట్టాలనుకుంది. వైఎస్ జగన్ ఆ విషయం తెలుసుకుని ఎన్సీఎల్టీకి వెళ్లి జాగ్రత్త పడ్డాడు. ఆ కేసులో షర్మిలమ్మ ఓడిపోయింది. మళ్లీ విజయమ్మతో చెన్నై కోర్టులో కేసు వేయించింది. ఆ కేసు కాగితాలు చెన్నై కోర్టులో వేయించిన గంటకే చంద్రబాబు చేతిలో ఉన్నాయి. ఇక్కడ ఏం జరుగుతుందో ప్రతి ఒక్క విషయం చంద్రబాబు, ఏబీఎన్ రాధాకృష్ణలకు తెలుసు. షర్మిల, సునీతలు జగన్కు ఒక్క చెల్లెల్లే. కానీ రాష్ట్రంలో కోటి మంది మహిళలు ఆయనకు ఓటేశారు. వారంతా వైఎస్ జగన్ మాకు దేవుడిచ్చిన అన్న అంటున్నారు...వాళ్లంతా దేవుడిచ్చిన అన్న అంటుంటే రక్త సంబంధం కలిగిన నీకు మాత్రం కళంకితుడా..?. ఈ రాష్ట్రంలో షర్మిలమ్మ, సునీతలను చూసిన తర్వాత చెల్లెల్లు అంటే భయపడే పరిస్థితికి వచ్చింది. నీలాంటి చెల్లెలు కావాలని ఏ అన్నా కోరుకోడు. వారి వారి స్థాయిని బట్టి నువ్వొక్కదానివే కాదు. .మేమంతా పార్టీ కోసం కష్టపడ్డాం. షర్మిలమ్మ జగన్తో గొడవ పడకుండా ఉండాలంటే ముఖ్యమంత్రి పదవినే పంచాలి. అప్పుడే ఆమె శాంతిస్తుంది. ఇప్పుడు జగన్ పెట్టుబడులు, ఆస్తులు మొత్తం ఊడ్చి షర్మిలకు ఇస్తే అప్పుడు శాంతిస్తుందేమో..?. ఎక్కడన్నా జగన్ వ్యాపారాల్లో నువ్వు పెట్టుబడి పెట్టావా..? ఏమీ లేకపోయినా తన సొంత సంపాదనలో నీకు వాటా ఇచ్చాడు...మీరు టీడీపీ కండువా కప్పుకోకపోయినా.. సైకిల్ ఎక్కకపోయినా మీరు మాత్రం టీడీపీనే. వైఎస్సార్ కూతురు ఇలా టీడీపీకి వెళ్తుందని మేము కలలో కూడా ఊహించలేదు. రాష్ట్రంలో చంద్రబాబు ఇన్ని తప్పులు చేస్తున్నా, లక్షల కోట్ల అప్పులు చేస్తున్నా ఆమె ఒక్క మాట కూడా విమర్శించదు. ప్రజావ్యతిరేక పాలన చేస్తున్న వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ప్రశ్నించాల్సిన నువ్వు జగన్ను టార్గెట్ చేస్తున్నావు. ఇక మీదట మీరు జగన్ వ్యక్తిత్వ హననానికి పాల్పడితే ఎన్ని సార్లైనా మిమ్మల్ని ప్రశ్నిస్తాను. ఇక మా దృష్టిలో మీరు రాజశేఖరరెడ్డి కూతురు అని కానీ, జగన్ చెల్లెలు అని కాని ఉండదు. నాకైతే నువ్వు ఒక చెడ్డ చెల్లెలు అనే అభిప్రాయం మాత్రమే ఉంది. ఇంత మేలు చేసిన అన్నను పట్టుకుని అన్ననే పదానికే కళంకం అంటావా..?..చంద్రబాబుకు ఒక చెల్లెలు ఉందన్న విషయమే ప్రపంచానికి తెలియదు. అలాంటి చంద్రబాబు వద్దకు మాకు న్యాయం చేయండి అని ఈ చెల్లెల్లు వెళ్లారు. ఇదిగో నా చెల్లెలు షర్మిల.. నేను వదిలిన రామబాణం అని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి జగన్. నువ్వు ఇన్ని మాటలు ఆయన్ను మాట్లాడుతున్నా ఒక్క రోజు కూడా జగన్ నీపై నోరెత్తలేదు. అది ఆయన సంస్కారం.. నా చెల్లిపై మాట్లాడితే అది నాకే కదా అవమానం అనుకున్నాడు జగన్. కానీ మీరు ఒకే సారి వంద ఈటెలు తీసుకుని పొడిచినట్లు చేస్తున్నారు...తల్లికి చెల్లికి న్యాయం చేయలేనోడని చంద్రబాబు మాట్లాడుతున్నాడు. చంద్రబాబూ అసలు నీ చెల్లెలు ఎవరో ఈ సమాజానికి తెలుసునా..?. చంద్రబాబుకు తమ్ముడున్నాడని తెలుసు.. ఆయన ఎలా చనిపోయాడో కూడా ప్రజలకు తెలుసు. చంద్రబాబుకు కుటుంబ వ్యవస్థపై గౌరవం ఉందా..? అలా ఉంటే హరికృష్ణకు, ఆయన పిల్లలకు అన్యాయం చేస్తాడా?. సొంత వారినే మోసం చేసిన చంద్రబాబు.. షర్మిలమ్మ, సునీతమ్మలకు న్యాయం చేస్తాడా..?. మీ ఇద్దరిని నడి ఏట్లోకి తీసుకెళ్లి ముంచేస్తాడు.. గుర్తుంచుకోండి...5 కోట్ల మంది ప్రజలను, సొంత కుటుంబ సభ్యులను మోసం చేసిన చంద్రబాబుకు షర్మిల, సునీతలను మోసం చేయడం ఒక లెక్కా?. ఆ చంద్రబాబు చేతిలో మోసం పోయి చిట్టచివరకు మళ్లీ ఆ అన్న వద్దకే మీరిద్దరూ చేరతారు. అన్నా.. తప్పయిందని ప్రాయశ్చిత్తం మీ అన్నా, వదిలనల వద్దకే వచ్చే రోజు ముందుంది. షర్మిలమ్మ.. అన్నతో సమానంగా వైఎస్సార్ ఆస్తులు పంచిన విషయంపై సమాధానం చెప్పాలి. నీకు అవసరం అయినప్పుడల్లా రూ.236 కోట్లు ఇచ్చినది నిజమా? కాదా? అనేది షర్మిల చెప్పాలి. జగన్, భారతీలు వివేకాను చంపారని మీరు మీ పిల్లలపై ఒట్టేసి చెప్పగలరా?. చంద్రబాబుకు కష్టం వచ్చినప్పుడల్లా.. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా సునీత, షర్మిల తెరమీదకు వస్తారు...నిజంగా షర్మిలమ్మకు చిత్తశుద్ధి ఉంటే మేం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. మాట్లాడితే నీ సైతాన్ సైన్యం అంటున్నారు.. కానీ నువ్వు జగన్కు రక్తం పంచుకుపుట్టిన చెల్లివి అయినా.. మేం రక్తం పంచుకోకపోయినా చివరికి వరకూ ఆయన కోసం, ఆయన వెంటే ఉంటాం. ఆస్తులకు మీరు భాగస్థులు.. కానీ మేం అభిమానానికి భాగస్థులం.. సైతాన్ సైన్యం కానే కాము. జగన్ కోసం ప్రాణం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న మమ్మల్ని పట్టుకుని సైతాన్ అంటారా..?. మన ఇంటి గుట్టును ఏబీఎన్ రాధాకృష్ణకు, చంద్రబాబుకు ఇస్తున్న మీరు తప్పు చేసిన మనుషులు. అన్ననే పదానికి కళంకం అన్నందుకు బాధతో మేం మాట్లాడుతున్నాం. అన్న అనే పదానికి, వదిన అనే పదానికి అర్థం చెప్పిన వాళ్లు జగన్, భారతమ్మలు. షర్మిలమ్మ ప్రెస్మీట్ పెట్టి వీటన్నిటికీ సమాధానం చెప్పాలి’’ అని రాచమల్లు శివప్రసాద్రెడ్డి అన్నారు. -
జగన్ హయాంలోనే పేదలకు అత్యధిక ఇళ్ల నిర్మాణం కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
-
ఆ రోజు వివేక చనిపోయినప్పుడు టీడీపీలో ఉన్న కానీ... మీకు ఎవ్వరికి తెలియని విషయం..
-
అబద్దంలా నక్షత్రం.. వెన్నుపోటు రాశి.. చంద్రబాబుకు వరుదు కళ్యాణి కౌంటర్
-
‘కూటమి నేతలకు రాజపూజ్యం.. ప్రజలకు అవమానం’
సాక్షి, విజయవాడ: కూటమి ప్రభుత్వం అబద్ధాల నక్షత్రంలో వెన్నుపోటు రాశిలో ఏర్పడిందని.. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు. కూటమి నేతల ఆదాయం పెరిగింది.. పేద ప్రజల ఆదాయం పెరగలేదు. కూటమి మంత్రులకు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు రాజ్యపూజ్యం.. ప్రజలకు అవమానం. నిరుద్యోగులు, రైతులు, కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులను కూటమి మోసం చేసింది’’ అని వరుదు కల్యాణి మండిపడ్డారు.‘‘ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో విద్యార్థులకు కాలేజీలు సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు. రైతులకు పెట్టుబడిసాయం లేదు.. గిట్టుబాటు ధర లేదు. మహిళలకు ఎన్నోహామీలు ఇచ్చి ఒక్కటి అమలు చేయలేదు. మహిళల రక్షణ పూర్తిగా గాలికి వదిలేశారు. ఉద్యోగుల పరిస్థితి కక్కలేక.. మింగలేక అన్నట్టు ఉంది. కూటమి పాలన అత్యంత దారుణంగా ఉంది. ఎన్నికల కోసం రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు. చంద్రబాబు మోసానికి మరోసారి గురికావద్దని రాష్ట్ర ప్రజలను కోరుతున్నాం’’ అని వరుదు కల్యాణి పేర్కొన్నారు.ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదు: కల్పలతారెడ్డివైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏవర్గం ప్రజలు పండగ చేసుకోలేదని.. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని ప్రభుత్వం అమలు చేయలేదని మండిపడ్డారు. ‘‘ప్రభుత్వ ఉద్యోగులు బకాయిలు విడుదల చేస్తారని ఎదురు చూస్తున్నారు. ఉగాది కాదు దగాదిగా భావిస్తున్నారు. ఈ ఉగాదికి అయినా మేలు జరుగుతుందని ఉద్యోగులు ఆశించారు. పీఆర్సీ, ఐఆర్, డీఏకి సంబంధించిన జీవోలు విడుదల చేస్తారని ఆశించారు. వెయ్యి రూపాయిలు కూడా ప్రభుత్వం వేతనం పెంచలేదు..అధికారంలోకి వచ్చిన వెంటనే మంచి చేస్తామని చెప్పారు. మంచి ఐఆర్ అన్నారు, పెండింగ్ బకాయిలు అని ఉద్యోగులను మోసం చేసింది. ఉద్యోగస్తులపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రతి పండగకి ఉద్యోగస్తులు ఎదురుచూస్తున్నారు. పండగ వచ్చి పొతుంది తప్ప ఒక్క మేలు మాత్రం జరగడం లేదు. గతంలో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే 27 శాతం ఐఆర్ ఇచ్చారు. కరోనా సమయంలో 23శాతం పిట్మెంట్ ఇచ్చారు. ఉద్యోగస్తులు రోడ్డెక్కుతున్న కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పీఆర్సీ కమిషన్ని నియమించాలని కోరుతున్నా కానీ ప్రభుత్వం స్పందించడం లేదు. ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదు. పిఆర్సీ కమిషన్ని త్వరగా నియమించాలి. పిఆర్సీ ఆలస్యం అయితే ఐఆర్ ప్రకటించాలి. 29 శాతం పిఆర్సీని అమలు చేయాలి. ఉద్యోగస్తులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలి’’ అని కల్పలతారెడ్డి డిమాండ్ చేశారు. -
షర్మిల లాంటి పనికిమాలిన చెల్లెలు మాకొద్దని.... సతీష్ రెడ్డి సంచలన కామెంట్స్
-
ఉగాది వేడుకల్లో YSRCP నేతలు
-
ఎన్నికల్లో షర్మిల ఖర్చు పెట్టిన ప్రతీ పైసా చంద్రబాబుదే: సతీష్ రెడ్డి
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ను విమర్శిస్తే కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలను ఎల్లో మీడియా హైలైట్ చేస్తోందన్నారు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్రెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతిలో షర్మిల, సునీత పావులు అని విమర్శించారు. జగన్తో యుద్ధం చేయలేక చంద్రబాబు.. షర్మిల, సునీతను వాడుకుంటున్నారని ఆరోపించారు. గత ఎన్నికలలో షర్మిల ఖర్చు పెట్టిన ప్రతీ పైసా చంద్రబాబు ఇచ్చినదే అని వ్యాఖ్యలు చేశారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్రెడ్డి తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా షర్మిలకు ఏనాడూ ఎల్లో మీడియా వార్తలు రాయలేదు. వైఎస్ జగన్ను షర్మిల విమర్శిస్తే మాత్రం పెద్ద అక్షరాలతో వార్తలు రాస్తారు. వైఎస్సార్ బతికున్నప్పుడే షర్మిలకు ఆస్తి రాసిచ్చారు. జూబ్లీహిల్స్లో ఇల్లు, ఇడుపులపాయలో భూమి, హైడ్రో ప్రాజెక్టు, స్వస్తి హైడ్రో ప్రాజెక్టులో వాటా.. ఇలా అనేక ఆస్తులు రాసిచ్చారు. కొడుకు కన్నా షర్మిలకే వైఎస్ఆర్ ఎక్కువ ఆస్తి ఇచ్చారు. ఇప్పుడు జగన్ సొంతంగా సంపాదించుకున్న ఆస్తిలో కూడా వాటా కావాలని అడగటం అన్యాయం. గత ఎన్నికలలో షర్మిల ఖర్చు పెట్టిన ప్రతీ పైసా చంద్రబాబు ఇచ్చినదే. షర్మిల లాంటి చెల్లెలు తమకు వద్దని సామాన్యులు కూడా అనుకుంటున్నారు.దస్తగిరి అనే వ్యక్తి వివేకానంద రెడ్డిని హత్య చేశారు. వివేకానందరెడ్డికి కొన్ని బలహీనతలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి ఇమేజ్కి దెబ్బ తగలకూడదని అవినాష్ భావించారు. ఇప్పటికీ సునీతక్క, వివేకం పెదనాన్న అనే అవినాష్ మాట్లాడతారు. అవినాష్ అంత ప్రేమను చూపిస్తుంటే సునీత మాత్రం వివేకా పేరును చెడగొడుతోంది. సీబీఐతో విచారణ కావాలని పిటిషన్ వేసిందే సునీత. ఆమె కోరిక ప్రకారం సీబీఐ విచారణ జరిపింది. ఒక భూమి విషయంలో ఎర్ర గంగిరెడ్డి, వివేకానందరెడ్డికి వివాదాలు వచ్చాయని దస్తగిరి స్టేట్మెంట్ ఇచ్చారు. సునీల్ యాదవ్ వివేకానంద రెడ్డిపై దాడి చేశాడని దస్తగిరి చెప్పాడు. వివేకానందరెడ్డిని హతమార్చే సమయంలో కొన్ని పేపర్ల కోసం వెతికారని కూడా చెప్పాడుఆ పేపర్లు ఏంటి? వివేకానంద రెడ్డికి ఇతర మహిళలతో ఉన్న సంబంధాలు ఏంటి?. అవినాష్ రెడ్డి జీవితంలో చిన్న మరక కూడా లేదు. కానీ అవినాష్ను అభాసు పాలు చేసేలా సునీత వ్యవహరిస్తున్నారు. ఎంపీ సీటు కోసం హత్య చేశారన్న షర్మిల మాటలు అవివేకం. వివేకా హత్య జరిగే సమయానికే అవినాష్ రెడ్డికి జగన్ సీటు ఇచ్చారు. వివేకా కూడా అవినాష్ గెలుపు కోసం ప్రచారం చేశారు. సునీత, చంద్రబాబు, షర్మిల, దస్తగిరి ఒక్కటే. వారందరికీ కోర్టులో వాదించేది ఒక్కరే న్యాయవాది. ఈ విషయాలపై చర్చించేందుకు మేము సిద్దమే. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టి ఎందుకు వదిలేశారు?. ఏపీలో జగన్ను ఓడించటానికి చంద్రబాబు ఆడిన నాటకంలో షర్మిల పాత్రధారి. తాను చెప్పినట్టే సీబీఐ, సుప్రీంకోర్టు వినాలి అన్నట్టుగా సునీత వ్యవహరిస్తున్నారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
ఉగాది వేడుకల్లో పాల్గొన్న వైఎస్ జగన్ దంపతులు
-
పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో వైఎస్ జగన్ దంపతులు (ఫొటోలు)
-
Iftar Vindu 2026: ఇఫ్తార్ విందులో YS జగన్
-
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ ఉగాది శుభాకాంక్షలు
-
జైలు నుంచి పిన్నెల్లి విడుదల..
సాక్షి, నెల్లూరు: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు జైలు నుంచి నుంచి విడుదలయ్యారు. గురజాల కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన బయటకు వచ్చారు. ఈ క్రమంలో పిన్నెల్లికి వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు, పార్టీ శ్రేణులు స్వాగతం పలికాయి. అయితే, జంట హత్యల కేసులో పిన్నెల్లిపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసు బనాయించిన సంగతి తెలిసిందే.జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం పిన్నెల్లి మాట్లాడుతూ..‘పెందుర్తి మండలంలో టీడీపీ వర్గాల గొడవలో నాపై అక్రమ కేసు బనాయించారు. ఆధిపత్య పోరులో జరిగిన హత్యల ఘటనకు సంబంధించి ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని ఇరికించారు. ఆనాటి ఎస్పీ సైతం ఈ హత్యలు ఇరువర్గాల పోరుగా తేల్చారు. అయినప్పటికీ మమ్మల్ని అన్యాయంగా జైలుకు పంపించారు. భవిష్యత్త్లో మాకు తప్పకుండా ఒక రోజు వస్తుంది. ఆరోజు దీని వెనుక ఎవరు ఉన్నారో బయటకు లాగుతాము, ఎవ్వరినీ వదిలిపెట్టే సమస్య లేదు. రాజకీయ నాయకులు, అధికారులు ఎవ్వరు ఉన్నా చట్టం ముందు నిలబెడుతాం. 99 రోజులు జైల్లో పెట్టి మానసిక క్షోభకు గురిచేశారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఉగాది వేడుకల్లో వైఎస్ జగన్
-
తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు : వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ముగిశాయి. ఉగాది వేడుకల్లో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి దంపతులు పాల్గొన్నారు. సాంప్రదాయ పంచెకట్టు, భుజాన కండువాలో ఉగాది వేడుకలకు వైఎస్ జగన్ హాజరయ్యారు.ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణం కార్యక్రమానికి వచ్చిన వైఎస్ జగన్ దంపతులకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ దంపతులకు పార్టీ ముఖ్యనేతలు, నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు ఆహ్వానం పలికారు. ఉగాది వేడుకల కోసం పార్టీ కేంద్ర కార్యాలయంలో శాస్త్రోక్తంగా పూజ తర్వాత పిడపర్తి భాస్కర సుబ్రమణ్యశాస్త్రి పంచాంగ శ్రవణం వినిపించారు. పంచాంగ శ్రవణం అనంతరం వైఎస్ జగన్ దంపతులకు వేదపండితులు వేద ఆశీర్వచనం ఇచ్చి, తీర్ధప్రసాదాలు అందించారు.పంచాంగ శ్రవణం అనంతరం కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరితో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.. ఇంకా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉగాది పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటున్న అందరికీ వైఎస్ జగన్, హృదయపూర్వకంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పంచాంగ శ్రవణం చేసిన పిడపర్తి భాస్కర సుబ్రమణ్యశాస్త్రితో పాటు, వేద పండితులను సన్మానించారు.ఉగాది వేడుకలు ముగిసిన అనంతరం వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకల్లో పాల్గొని, శ్రీ పరాభవ నామ సంవత్సరం మీ అందరి జీవితాల్లో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు తీసుకురావాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.’అని పేర్కొన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకల్లో పాల్గొని, శ్రీ పరాభవ నామ సంవత్సరం మీ అందరి జీవితాల్లో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు తీసుకురావాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.#Ugadi2026 pic.twitter.com/PKVxkh9Jxw— YS Jagan Mohan Reddy (@ysjagan) March 19, 2026 -
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ ఉగాది శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా తెలుగు ప్రజలందరికీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘శ్రీ పరాభవ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు జరగాలి. విజయాలు సిద్ధించాలి. సమృద్ధిగా వానలు కురిసి.. పంటలు బాగా పండి.. రైతులకు మేలు కలగాలి. సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలి’ అని ఆయన ఆకాంక్షించారు. అలాగే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని.. పల్లెలు, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతి సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని వైఎస్ జగన్ తన సందేశంలో అభిలషించారు. -
ఒక్క ప్రశ్నకైనా బదులివ్వగలరా?
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ కుట్రలో సునీత, షర్మిల పావులుగా మారారని పదేపదే రుజువవుతోందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆరోపించారు. వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి లేవనెత్తిన అంశాలలో ఒక్క దానికైనా సునీతగానీ, షర్మిలగానీ జవాబివ్వగలరా అని ఆయన ప్రశ్నించారు. నిజాలకు పాతరేసి దర్యాప్తు సంస్థలను, న్యాయస్థానాలను తప్పుదోవ పట్టించడమే లక్ష్యమన్నట్లు వారి తీరు ఉందని రాచమల్లు బుధవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రశ్నలను సంధించారు. ధైర్యముంటే వాటికి జవాబివ్వాలని రాచమల్లు సవాల్ చేశారు. ఆ ప్రశ్నలిలా ఉన్నాయి.» వివేకా హత్య కేసులో అతి ముఖ్యమైన అంశాలను వదిలేసి సంబంధం లేని అంశాలను ప్రస్తావిస్తూ ఎందుకు తప్పుదోవపట్టిస్తున్నారు? ఎవరి ప్రయోజనం కోసం మీరు పనిచేస్తున్నారు? » సునీత కుటుంబం వివేకాకు చెక్పవర్ తీసేసి ఖర్చులకు డబ్బులు కూడా లేని పరిస్థితికి తీసుకురావడం నిజం కాదా? » సునీత తండ్రిని హత్య చేసింది తానేనని ఒప్పుకున్న దస్తగిరి దర్జాగా బయట తిరుగుతున్నా అతనికి మీరు మద్దతుగా నిలవడం వెనక మర్మమేమిటి? అతనిని శిక్షించాలని ఎందుకు కోరడం లేదు? » చంద్రబాబుకు, సునీతకు, దస్తగిరికి ఒకే న్యాయవాది ఎందుకు ఉన్నారు? అత్యంత ఖరీదైన న్యాయవాది లూథ్రాను దస్తగిరి బెయిల్ రద్దు కాకుండా సునీత నియమించడమేమిటి? » హత్యకు ముందు రోజు వివేకా అటెండర్ పండంటి రాజశేఖర్ను వివేకా భార్య సౌభాగ్యమ్మ, సునీత భర్త రాజశేఖర్ సెలవు ఇచ్చి మరీ కాణిపాకం ఎందుకు పంపించారు? » వివేకాను హత్య చేయడానికి ముందు కొన్ని డాక్యుమెంట్ల కోసం ఆయన్ను హింసించామని దస్తగిరి చెప్పాడు. డాక్యుమెంట్లను వెరిఫై చేసుకున్న తర్వాతనే హత్య చేసినట్లు చెప్పాడు. హత్య చేశాక కూడా ఒకటికి రెండుసార్లు డాక్యుమెంట్లు వెరిఫై చేసుకున్న తర్వాతే బయటకు వెళ్లినట్లు చెప్పాడు. రౌండ్ సీల్తో ఉన్న ఆ డాక్యుమెంట్లు ఏమిటి? వాటి గురించి మీరు ఎందుకు పట్టుబట్టడం లేదు? » హత్య జరిగిన చోట లేఖను సునీత భర్త రాజశేఖర్ ఎందుకు దాచినట్లు? లేఖలో విషయాలు ఎవరికీ చెప్పకుండా లేఖను దాచాల్సిందిగా పీఏ కృష్ణారెడ్డిని ఆదేశించాల్సిన అవసరమేమిటి? » హత్య గురించి తెలియజేసే కీలకమైన వివేకా లేఖ గురించి సునీత సీబీఐకి రెండు రకాల స్టేట్మెంట్లు ఎందుకు ఇచ్చారు? అసలు సీబీఐ సునీతకు ఆ వెసులుబాటు ఎందుకు ఇచ్చినట్లు? » వివేకాకు అనేకమందితో అక్రమ సంబంధం ఉందని పేర్లతో సహా దస్తగిరి స్టేట్మెంట్లో ఉంది. ఆ మహిళల భర్తలు, పిల్లలు వివేకాపై కక్షపెంచుకున్నారని ఆ స్టేట్మెంట్లో ఉంది. వారిపై విచారణ ఎందుకు కోరడంలేదు? » వివేకాను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఆయన జీవించి ఉంటే 30 నుంచి 40శాతం ఆస్తులను తన రెండో భార్యకు ఇచ్చేవారు. అందుకని ఇది మొదటిభార్య కుటుంబం చేసిన మర్డర్ ఫర్ గెయిన్ కాదా? ఈ కోణంలో మీరు ఎందుకు విచారణ కోరడం లేదు? » వివేకా రెండో భార్య షమీమ్కు, వివేకాకు మధ్య నడిచిన చాట్స్ను బయటపెట్టే ధైర్యం మీకు ఉందా? » షమీమ్ కుమారుడికి డీఎన్ఏ టెస్ట్ చేయించడానికి మీరు సిద్ధమేనా? » చంద్రబాబుతో కలసి ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ను మీరు అనుకున్నట్లు నడిపిస్తుండడం నిజం కాదా? పలువురి చేత తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పించడం అందుకు రుజువు కాదా? హిమకుంట్లకు చెందిన ఓ వ్యక్తిపై సునీత, ఆమె భర్త రాజశేఖర్ చెప్పినట్లు చెప్పాల్సిందిగా ఒత్తిడి చేయడం నిజం కాదా? » ఏదో ఒక అంశాన్ని తీసుకొచ్చి కోర్టుకు వెళ్లడం, విచారణను అడ్డుకోవడం.. గడచిన రెండు మూడేళ్లుగా సునీతకు ఇదే పని కదా? ఎవరి ప్రయోజనం కోసం విచారణ పూర్తికాకుండా అడ్డుకుంటున్నారు? » చంద్రబాబుకు ప్రయోజనం చేకూర్చడమే మీ లక్ష్యమని రాష్ట్ర ప్రజలకు అర్ధమయ్యింది. వచ్చే ఎన్నికల వరకు ఈ కేసును లాగాలని, తద్వారా చంద్రబాబుకు మేలు చేయాలని మీరు పనిగా పెట్టుకున్నారు. మీరు చంద్రబాబు చేతిలో పావులుగా మారడం నిజం కాదా? -
ఇఫ్తార్ విందులో వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘‘సబ్కో అస్సలామ్ అలై కుమ్.. (అందరికీ అల్లా కృప ఉండాలి).. అడ్వాన్స్ ఈద్ ముబారక్ (ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు)..’’ అంటూ ముస్లిం సోదరులకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని బుధవారం రాత్రి వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్లో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన వైఎస్ జగన్కు ముస్లిం మతపెద్దలు, నేతలు చౌకత్తో సన్మానించి సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలసి వైఎస్ జగన్ ప్రార్థనలు (నమాజ్) నిర్వహించారు. అనంతరం ఉపవాస దీక్షను విరమింపజేస్తూ వైఎస్ జగన్ వారికి ఖర్జూరం తినిపించారు. ముస్లిం మత పెద్దలు, మైనార్టీ నేతలు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరైన ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్ అందరికీ ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతి, సోదరభావం, పరస్పర గౌరవం సమాజానికి అత్యంత అవసరమని పేర్కొన్నారు. రంజాన్ మాసం సేవా భావం, సామరస్యం, దాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుందని గుర్తు చేశారు. అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా, సామరస్యంతో జీవించాలని ఆకాంక్షించారు.ఇఫ్తార్ విందులో వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆత్మీయంగా ఖర్జూరం తినిపిస్తున్న ముస్లిం సోదరులు జగన్ సీఎం కావాలంటూ ‘దువా..’మాజీ ఉపముఖ్యమంత్రి అంజాద్బాషా, వైఎస్సార్సీపీ మైనారిటీ విభాగం అధ్యక్షుడు ఖాదర్బాషా, ఎంఎస్ మక్బూల్, పలు జమాత్ల పెద్దలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి కృషి చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. మైనార్టీలను ఆర్థిక, రాజకీయ, సామాజికంగా వైఎస్ జగన్ చేయిపట్టుకుని ముందుకు నడిపించారన్నారు. ముస్లింల అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేసిన వైఎస్ జగన్కు అల్లా దయ, అందరి ప్రేమాభిమానాలు ఉంటాయన్నారు. కాబోయే సీఎం వైఎస్ జగన్ అంటూ దువా (ప్రార్థన) చేశారు.ఇఫ్తార్ ప్రార్థనల్లో పాల్గొన్న ముస్లిం సోదరులు హోరెత్తిన అభిమానం..వైఎస్ జగన్ను చూసేందుకు విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ వద్దకు భారీగా తరలివచ్చిన ప్రజలు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఇఫ్తార్ విందుకు అభిమాన జనం పెద్ద ఎత్తున పోటెత్తారు. సీఎం.. సీఎం.. అనే నినాదాలతో సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా, వైఎస్సార్సీపీ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఖాదర్బాషా, ఎమ్మెల్సీలు ఎండీ రుహుల్లా, ఇస్సాక్ బాషా, తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్కుమార్, రమేష్యాదవ్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్, అత్తర్ చాంద్బాషా, మల్లాది విష్ణు, గడికోట శ్రీకాంత్రెడ్డి, వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఉప్పాల రాము, పి.గౌతంరెడ్డి, దేవభక్తుని చక్రవర్తి, తన్నీరు నాగేశ్వరరావు, పోతిన మహేష్, ముస్లిం నేతలు మక్బుల్, నదీమ్ అహ్మద్, అసిఫ్, అహ్మద్ అలీ, ఫారుఖీ, షేక్ మునీర్ అహ్మద్ తదితర జమాత్ల పెద్దలు పాల్గొన్నారు. -
బార్ కౌన్సిల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయదుందుభి
సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మకంగా జరిగిన ఏపీ బార్ కౌన్సిల్ (న్యాయవాద మండలి) ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి చెందిన న్యాయవాదులు విజయదుందుభి మోగించారు. మొత్తం 23 మంది సభ్యుల్లో ఏడుగురు వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన వారు నలుగురు, కమ్యూనిస్టు పార్టీకి చెందిన మరో నలుగురు గెలిచారు. జనసేనకు చెందిన ఇద్దరు, బీజేపీ అభ్యర్థి ఒకరు, ఐదుగురు తటస్థులు బార్ కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికయ్యారు. బుధవారం ఉదయం ఓట్ల లెక్కింపు పూర్తి కావడంతో 23 మంది అభ్యర్థులు ఎన్నికైనట్టు సుప్రీంకోర్టు హైపవర్ కమిటీ ప్రకటించింది. బార్ కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికైన వారిలో అజయ్కుమార్ చలసాని, చిదంబరం కలిగినీడి, రామిరెడ్డి ఆలూరు, శాంతకుమార్ గొర్రెముచ్చు, బ్రహ్మారెడ్డి వట్టిజొన్నల, బాలాజీ యలమంజుల, కృష్ణారెడ్డి బీవీ, శ్రీనివాసరాజు ఉప్పలపాటి, రాజేంద్రప్రసాద్ సుంకర, శ్రీనివాసులరెడ్డి కొమ్మసాని, సుమంత్ ఎన్వీ, రవి బెల్లాన, వెంకటరమణమూర్తి బండారు, రామారావు ఘంటా, రామ జోగేశ్వరరావు కీర్తి, వెంకట్రామిరెడ్డి కొవ్వూరి, మాధవి రోళ్ల, కృష్ణమోహన్.ఎస్, అంకయ్య సత్తు, శ్రీదేవి జంపాని, మంజులత దోని, దుర్గనాగశ్రీ, గంగాభవాని రాగి ఉన్నారు. రిజర్వేషన్తో మహిళలకు సముచిత స్థానం ఎన్నికైన 23 మందిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. ఈ సారి ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించడంతో ఇంత మంది ఎన్నిక కాగలిగారు. మరో ఇద్దరు మహిళలను కో–ఆప్షన్ కింద హైపవర్ కమిటీ ఎంపిక చేయనుంది. ఎన్నికైన వారిలో రామారావు ఘంటా గతంలో బార్ కౌన్సిల్ చైర్మన్గా చేశారు. రామిరెడ్డి ఆలూరు ప్రస్తుతం బీసీఐ సభ్యుడిగా కొనసాగుతున్నారు. రామజోగేశ్వరరావు గతంలో వైస్ చైర్మన్గా పనిచేయగా, కృష్ణమోహన్ ప్రస్తుతం వైస్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత చైర్మన్ నల్లారి ద్వారకనాథరెడ్డి కుమారుడు సుమంత్ ఎన్వీ తొలిసారి ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు. శాంతకుమార్, బాలాజీ, శ్రీనివాసరాజు, శ్రీనివాసులరెడ్డి, సుమంత్, రవి బెల్లాన, వెంకటరమణమూర్తి, అంకయ్య, శ్రీదేవి, మంజులత, దుర్గనాగశ్రీ, గంగాభవాని తొలిసారిగా బార్ కౌన్సిల్కు ఎన్నికయ్యారు. బార్ కౌన్సిల్లో మొత్తం 26 మంది సభ్యులుగా ఉంటారు. ఇందులో 25 మందిని ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. అడ్వొకేట్ జనరల్ ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉంటారు. ఈ 25 మందిలో ఇప్పుడు 23 మందిని ఎన్నికైనట్టు ప్రకటించారు. మరో ఇద్దరిని కో –ఆపె్టడ్ సభ్యులుగా హైపవర్ కమిటీ ఎంపిక చేస్తుంది. బార్ కౌన్సిల్ చైర్మన్ రేసులో అజయ్కుమార్, చిదంబరం, బాలాజీ, బీవీ కృష్ణారెడ్డి ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. రేయింబవళ్లు ఓట్ల లెక్కింపు ఎన్నికలు గత నెల 13న జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 143 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 149 కేంద్రాల్లో పోలింగ్ జరగ్గా.. గత నెల 16 నుంచి ఈ నెల 18 వరకు నిరాటంకంగా ఓట్ల లెక్కింపు కొనసాగింది. ఎలాంటి గందరగోళం, అవాంతరాలు లేకుండా ఓట్ల లెక్కింపును పూర్తి చేసినందుకు బార్ కౌన్సిల్ అధికారులను న్యాయవాద వర్గాలు అభినందించాయి. ప్రాధాన్యత ఓట్ల ప్రాతిపదికన ఎన్నికలు జరగడంతో ఓట్ల లెక్కింపు పూర్తి కావడానికి సుదీర్ఘ సమయం పట్టింది. సుప్రీంకోర్టు హైపవర్ కమిటీ నిర్దేశించిన గడువు దగ్గర పడటంతో బార్ కౌన్సిల్ అధికారులు, ఉద్యోగులు చివరి మూడు రోజులు రోజుకు రెండు మూడు గంటల విరామం మాత్రమే తీసుకుని రేయింబవళ్లు ఓట్లు లెక్కించారు. చివరి రోజున ఓట్ల లెక్కింపు చాలా ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా సాగింది. అంకయ్య సత్తు, మరో సభ్యుడు వేనాటి చంద్రశేఖరరెడ్డి మధ్య విజయం దోబూచులాడింది. చివరకు అంకయ్య 20 ఓట్ల తేడాతో గెలుపొందారు. వీరిద్దరూ నెల్లూరు బార్ అసోసియేషన్ సభ్యులు కావడం విశేషం.రూ.కోట్లు ఖర్చు చేసిన అభ్యర్థులు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి రిటర్నింగ్ అధికారిగా, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా సీనియర్ న్యాయవాది వి.వేణుగోపాలరావు, న్యాయవాది పీఎస్పీ సురేష్ కుమార్, పరిశీలకులుగా విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ వ్యవహరించారు. పోటీ చేసిన అభ్యర్థుల్లో అత్యధికులు భారీ స్థాయిలో ఖర్చు చేశారు. కొందరు అభ్యర్థుల ఖర్చు రూ.5 కోట్లు దాటింది. ఫలానా రాజకీయ పార్టీ తరఫున పోటీ చేస్తున్నామని అభ్యర్థులు ప్రత్యక్షంగా చెప్పకపోయినా, పరోక్షంగా వైఎస్సార్సీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన, కమ్యూనిస్ట్, కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. గతంలో బార్ కౌన్సిల్కు ప్రాతినిధ్యం వహించిన పలువురు ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. -
‘చంద్రబాబు సర్కార్ పంటల బీమా పథకాన్ని ఎత్తేసింది’
సాక్షి, ఢిల్లీ: ఏపీలో రైతులకు 3,500 కోట్ల రూపాయల పంట బీమా క్లెయిమ్ లను ఇప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని లోక్సభలో వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ లోక్సభలో వ్యవసాయ శాఖ పద్దులపై చర్చలో ఆయన మాట్లాడుతూ.. పీఎం కిసాన్ పథకం కింద సహాయాన్ని పదివేల రూపాయలకు పెంచాలన్నారు.‘‘ఏపీలో వైఎస్సార్సీపీ హయాంలో ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేశాం. 54 లక్షల మంది రైతులకు 7,802 కోట్ల రూపాయల బీమాను అందించాం. కానీ, ప్రస్తుత బాబు ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని ఎత్తేసింది. 2024 -25 బడ్జెట్లో దీనికి ఎలాంటి నిధులు కేటాయించలేదు. 2025-26లో 1000 కోట్ల రూపాయలు కేటాయించినా బీమా కంపెనీలకు ఒక రూపాయి కూడా విడుదల చేయలేదు. రైతులకు పంట బీమాను చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది’’ అని వైఎస్ అవినాష్రెడ్డి మండిపడ్డారు.‘‘2,492 కోట్ల రూపాయల ప్రీమియం చెల్లించకపోవడంతో ఏపీని ఇన్సూరెన్స్ కంపెనీలు బ్లాక్ లిస్టులో పెట్టాయి. దాంతో రాష్ట్రంలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించకపోవడంతో.. రైతులు ప్రీమియం చెల్లించడానికి యాప్ ఓపెన్ కావడం లేదు. ప్రీమియం చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. 3,500 కోట్ల రూపాయల పంట బీమా క్లెయిమ్లను ఇప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఏపీ రైతులకు బీమాను చెల్లించేలా చర్యలు తీసుకోవాలి..ఇరాన్ యుద్ధం వల్ల అరటి, మామిడి, మస్క్ మెలన్, వాటర్ మెలన్ ధరలు ఘోరంగా పడిపోయాయి. రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. పెండింగ్ ఇన్పుట్ బకాయిలను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశించాలి. రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయాలి. హార్టికల్చర్ హబ్గా ఉన్న రాయలసీమలో భారీ ఎత్తున అరటి మామిడి మస్క్ మిలన్ వాటర్ మిలన్ పంటలు పండుతున్నాయి. పప్పులపై దిగుమతి సుంకం తొలగించడం వల్ల విదేశాల నుంచి భారీ ఎత్తున పప్పులు దిగుమతి అయ్యాయి. దాని ఫలితంగా దేశీయ పప్పులు పండించే రైతులు గిట్టుబాటు ధర కంటే తక్కువకి అమ్ముకోవాల్సిన పరిస్థితి పడింది.ఏపీలో 3.7 లక్షల ఎకరాల్లో శనగ పంట పండిస్తున్నారు. పప్పు ధాన్యాలు పండించే రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేలా చర్యలు తీసుకోవడం, పప్పు ధాన్యాలపై దిగుమతి పాలసీని పున:పరిశీలన చేయాలి. ప్రతి గ్రామంలో వ్యవసాయ గిడ్డంగులను ఏర్పాటు చేయాలి. మండల లెవెల్లో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలి. ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలి. వ్యవసాయంత్రీకరణ కు నిధులు కేటాయించాలి’’ అని వైఎస్ అవినాష్రెడ్డి డిమాండ్ చేశారు. -
‘దివ్యాంగులకు 16 సర్వీసుల్లో ఫ్రీ బస్సు వర్తింపచేయాలి’
సాక్షి, తాడేపల్లి: కేవలం 5 సర్వీసుల్లో మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ దివ్యాంగుల జీవితాలను మార్చేసినట్టు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లు బస్సెక్కి హడావుడి చేశారని వైఎస్సార్సీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పులిపాటి దుర్గారెడ్డి ఆక్షేపించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే దివ్యాంగులకు ఆర్టీసీ ప్రయాణ ఛార్జీలో 50 శాతం సబ్సిడీ ఉందని గుర్తు చేశారు.చంద్రబాబుకి దివ్యాంగుల సంక్షేమం పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే మొత్తం 16 బస్సు సర్వీసుల్లోనూ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని, దివ్యాంగుల సహాయకులకు 50 శాతం సబ్సిడీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దివ్యాంగుల బతుకు భారంగా మారిందని, ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకపోగా సదరం సర్టిఫికెట్ల పేరుతో వేధిస్తున్నారని మండిపడ్డారు. ఇంద్రధనస్సు పేరుతో ఇచ్చిన ఏడు హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రెస్మీట్లో పులిపాటి దుర్గారెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..ప్రచార ఆర్భాటంతో సరి:కేవలం 5 ఆర్టీసీ సర్వీసుల్లోనే ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ దివ్యాంగుల జీవితాలు మార్చేసినట్టు కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ దివ్యాంగులకు మేలు చేసినట్టు ఆర్భాటంగా మంగళగిరిలో బస్సెక్కి హడావుడి చేశారు. ఇప్పటికే దివ్యాంగులకు ఆర్టీసీ బస్సు చార్జీలో 50 శాతం సబ్సిడీ పథకం అమల్లో ఉంది. ఇప్పుడు చంద్రబాబు కల్పిస్తున్నది కేవలం 50 శాతం మాత్రమే.అది కూడా 5 సర్వీసులకే వర్తింపజేస్తున్నారు. చంద్రబాబుకి దివ్యాంగుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే మిగిలిన 11 సర్వీసుల్లోనూ ఉచిత బస్సు ప్రయాణం కల్పించేవాడు. వారితోపాటు వచ్చే సహాయకులకు 50 శాతం రాయితీని అన్ని ఆర్టీసీ సర్వీసుల్లో వర్తింపజేసేవారు. టిడ్కో ఇళ్లలో గ్రౌండ్ ఫ్లోర్ లో ఇళ్లు కేటాయిస్తామని చెప్పినా రెండేళ్లలో ఒక్క ఇల్లు ఇచ్చింది లేదు. అమరావతిలో దివ్యాంగులకు దివ్యాంగ భవన్ కడతామని చెప్పారు. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు.2016 నాటి చట్టం అమలు చేయాలి:ఇప్పటికే మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వం, వాటిలో ఎక్కడా దివ్యాంగుల ఊసే ఎత్తలేదు. 2016 నాటి చట్టం ప్రకారం రాష్ట్ర బడ్జెట్లో 4 శాతం నిధులు అంటే, రూ.12 వేల కోట్లు దివ్యాంగుల సంక్షేమానికి కేటాయించాలి. కానీ రెండేళ్లలో కనీసం రూ.100 కోట్లు కూడా కేటాయించలేదు. నియోజకవర్గానికి 5 ట్రై మోటార్ సైకిళ్లు ఇస్తామని చెప్పినా అరకొరగా పంపిణీ చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. ఆ ఇచ్చే వాటిని కూడా అర్హులైన వారికి కాకుండా టీడీపీ కార్యకర్తలకు ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది. దివ్యాంగులు ఎక్కడికెళ్లినా ఇబ్బందులు:చంద్రబాబు దివ్యాంగులకు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చకపోగా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎన్నో విధాలుగా వేధిస్తున్నాడు. గతంలో వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 365 రోజులపాటు ఎప్పుడైనా సదరం సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకుంటే వలంటీర్ వ్యవస్థ ద్వారా డాక్టర్లు నేరుగా ఇంటికొచ్చి వైద్య పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు అందజేసేవారు.కానీ నేడు కూటమి పాలనలో సోమ, మంగళవారాలు మాత్రమే దరఖాస్తు చేసుకునే నిబంధన పెట్టారు. పైగా వైద్య పరీక్షల కోసం సొంత జిల్లాలకు కాకుండా పక్క జిల్లాలకు వెళ్లే నిబంధన పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. పైగా సదరం సర్టిఫికెట్లలో తప్పులు దొర్లితే వాటిని సరి చేసుకునే అవకాశం కూడా ఉండటం లేదు.డిజెబిలిటీ శాతం తక్కువగా చూపించి పింఛన్లలో కోతలు విధిస్తున్నారు. పింఛన్ల మీద ఆధారపడి బతుకుతున్న దివ్యాంగులకు పింఛన్లు తీసేసి వారి బతుకులను చంద్రబాబు అంధకారంలోకి నెట్టేశాడు. రెండేళ్లలో పింఛన్లు తీసేయడమే కానీ, దివ్యాంగులకు కొత్తగా ఒక్క పింఛన్ ఇచ్చిన పాపాన పోలేదు. గతంలో దివ్యాంగులకు అందజేసే ట్రై మోటార్ సైకిళ్లు, హియరింగ్ యంత్రాలు, బ్లైండ్ పర్సన్స్ కి స్టిక్స్ వంటివి ఇవ్వడం ఆపేశారు. దివ్యాంగుల పిల్లలకు ప్రత్యేకమైన స్కూల్స్, ప్రత్యేక వైద్యసేవలు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించి మోసగించారు.దివ్యాంగ విద్యార్థులకు వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అందే స్కాలర్షిప్స్ కూడా అందకుండా చేశారు. ప్రభుత్వ కాలేజీలు, స్కూల్స్, ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లో ర్యాంపులు, వీల్ చైర్లు ఉండటం లేదు. దివ్యాంగులకు హక్కుగా దక్కాల్సిన సౌకర్యాలు కల్పించడం లేదు. దివ్యాంగులు ఆలయాలకు వెళ్లినా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ ఎప్పుడు?:వైఎస్సార్సీపీ తరఫున రోడ్డెక్కి ఉద్యమిస్తే కానీ 2024–25, 2025–26 బ్యాక్ లాగ్ ఉద్యోగాల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వలేదు. తూతూమంత్రంగా కడప, అనంతపురం, కృష్ణా జిల్లాల్లో నోటిఫికేషన్ ఇప్పించారు. కానీ ఇంతవరకు ఆ ప్రక్రియ మొదలు కాలేదు. 3 జిల్లాల్లో నోటిఫికేషన్ ఇచ్చేస్తే మిగతా జిల్లాల పరిస్థితి ఏంటో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.వైఎస్సార్సీపీ హయాంలో రుణ సబ్సిడీలు ఇచ్చి స్వయం ఉపాధిని ప్రోత్సహించడంతో పాటు, నైపుణ్యాభివృద్ధికి తోడ్పడడం జరిగింది. కానీ నేడు ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేయడంతో దివ్యాంగులకే ఎక్కువ నష్టం జరిగింది టీడీపీ కూటమి ఎన్నికల ముందు దివ్యాంగులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి. లేని పక్షంలో పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని పులిపాటి దుర్గారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
జగన్ నీకు చేసిన అన్యాయం ఏమిటి? షర్మిలపై కొండా రాఘవ రెడ్డి ఫైర్
-
విజయవాడ ఇఫ్తార్ విందులో YS జగన్
-
వక్ఫ్ భూముల జోలికొస్తే.. కూటమికి అంజాద్ బాషా వార్నింగ్
-
ఇది నా న్యాయపోరాటంలో మొదటి అడుగు
-
జగన్ పాలనే బాగుంది YS షర్మిల సభలో రైతుల రియాక్షన్
-
మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి బెయిల్ మంజూరు
సాక్షి, పల్నాడు జిల్లా: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి గురజాల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 98 రోజుల పాటు పిన్నెల్లి.. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై కక్షసాధింపు చర్యల్లో భాగంగా టీడీపీ నేతల హత్య కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కూటమి సర్కార్ అక్రమ కేసు బనాయించింది. -
రేపు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు
సాక్షి, తాడేపల్లి: శ్రీపరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా రేపు(మార్చి 19, గురువారం) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 9 గంటలకు నిర్వహించనున్న ఉగాది వేడుకల్లో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది.ఉగాది సందర్భంగా రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీపరాభవ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు జరగాలని, విజయాలు సిద్ధించాలని, సమృద్ధిగా వానలు కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులకు మేలు కలగాలన్నారు.‘‘సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతి సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ప్రతి ఇంట్లో, ప్రతి ఒక్కరూ ఉగాది పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలి’’ అని వైఎస్ జగన్ అభిలషించారు. -
విశాఖలో భూ ఆక్రమణలు: బొత్స సత్యనారాయణ
విశాఖ: కూటమి అవినీతిని ప్రజలకు తెలియజేయాలని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖలో భూ ఆక్రమణలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. విశాఖను దోచుకు తింటున్నారని తెలిపారు. ఉద్యమ కార్యచరణ రూపొందించుకుని ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు. పార్టీతో ఉన్న కార్పొరేటర్లకు సాధ్యమైనంత వరకు జీవీఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు. జీవీఎంసీ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా అందుకు నాయకులు సిద్ధంగా ఉండాలని అన్నారు. -
‘కోర్టు తీర్పులకు భిన్నంగా పోలీసులు వ్యవహరించారు’
సాక్షి, తాడేపల్లి: న్యాయ స్థానాల తీర్పులకు భిన్నంగా పోలీసులు వ్యవహరించారని.. తనపై పెట్టిన అక్రమ కేసులపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశానని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సత్తెనపల్లి, నల్లపాడు, పట్టాభిపురం పోలీస్ స్టేషన్లలో అక్రమ కేసులు నమోదు చేశారన్నారు.‘‘ఏడేళ్ల లోపు శిక్షలు పడే కేసులకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపాలి. నేను 18 రోజులు సెంట్రల్జైల్లో ఉండాల్సి వచ్చింది. ఏడు సంవత్సరాలకు లోబడి శిక్ష పడే కేసుల్లో ముద్దాయిని కోర్టులో ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదని గత జడ్జిమెంట్లు చెబుతున్నాయి. చట్టాన్ని పోలీసులు ఉల్లంఘించారు. రాజకీయ ఒత్తిళ్లతో నన్ను ఎక్కువ రోజులు జైల్లో పెట్టేందుకు చిన్న కేసులో కూడా కోర్టులో ప్రవేశపెట్టారు. చంద్రబాబు, లోకేష్ చెప్తే పోలీసులు నన్ను కోర్టులో ప్రవేశపెట్టారు’’ అని అంబటి మండిపడ్డారు‘‘నా అరెస్టు, రిమాండ్ విధించిన వైనంపై న్యాయ పోరాటం చేస్తున్నా. సుప్రీంకోర్టు తీర్పులకు భిన్నంగా నన్ను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులకు కోర్టులో హాజరుపరచాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టు కోర్టు ఆదేశాలు అలాగే ఉంది. నా మీద ఉన్న కేసులన్నీ ఏడేళ్లలోపు శిక్ష పడేవే. అయినాసరే పోలీసులు రాజకీయ ఒత్తిడికి గురై ఎక్కువ కాలం జైల్లో ఉంచేందుకు ప్రయత్నించారు. దీనిపై నేను హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాను. కోర్టు అయినా రిమాండ్ విధించకుండా ఉండాల్సింది. ఈ విషయంపై కూడా హైకోర్టు రిజిస్టారుకి ఫిర్యాదు చేశాం’’ అని అంబటి పేర్కొన్నారు...మా ఇల్లు, కార్ల మీద దాడి ధ్వంసం చేసిన వారికి స్టేషను బెయిల్ ఇచ్చారు. ఈ వ్యవహారం పై కూడా న్యాయపోరాటం చేయబోతున్నా. నన్ను లాకప్ లో హింసించారు. ఈ కస్టోడియల్ టార్చర్ మీద కూడా న్యాయపోరాటం చేస్తా. ప్రజాస్వామ్యంలో అలా జరగటానికి వీల్లేదు. రాష్ట్రంలో పోలీసులు, దొంగలు కలిసిపోయినట్టుగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ ఒక్కటే మార్గం. చట్టం మీద గౌరవం పెంచటానికే న్యాయపోరాటం చేస్తున్నా. 7 గంటల 25 నిమిషాల పాటు నా ఇంటి మీద దాడి జరిగింది. మరి పోలీసులు ఏం చేస్తున్నట్టు?. నాపై దాడిని ఎందుకు అడ్డుకోలేదు?..ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ లేదని ఆ సంఘటన నిరూపించింది. నా ఇల్లు, కార్లు ధ్వంసం చేయడానికి పోలీసులు సహకరించారు. తమ కళ్ల ముందు జరుగుతున్న దాడులను అడ్డుకోని పోలీసులు కూడా నేరస్థులే. ఇలాగే పోలీసులు వ్యవహరిస్తే వ్యవస్థ మీద నమ్మకం కలుగుతుందా?. పోలీసు వ్యవస్థ సరైనదారిలో నడవాలంటే న్యాయవ్యవస్థ స్పందించాలి. దీనిపై ఎంతదూరం వెళ్లటానికైనా సిద్ధమే...రాష్ట్రంలో శాంతిభద్రతలు విఫలం అయ్యాయన్న సంగతి అందరికీ తెలిసి పోయింది. పోలీసులను మేనేజ్ చేస్తే ఏమైనా చేయొచ్చని జనం అనుకుంటే అరాచకం జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి జరగటానికి వీల్లేదు. ఫ్రెండ్లీ పోలీసింగ్ కేవలం పవన్ కళ్యాణ్ కి మాత్రమే. ప్రజలకు మాత్రం దుర్మార్గమైన ప్రభుత్వం. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేదే లేదు. ఉన్నదంతా ఆటవిక సమాజమే. పవన్ కళ్యాణ్ ఇంటిపై కూడా ఇలాంటి దాడి జరిగితే అప్పుడు తెలుస్తుంది’’ అని అంబటి రాంబాబు అన్నారు. -
600 ఏళ్ల చరిత్ర.. ఆలయాన్ని కాపాడండి..
-
ఇప్పుడు రండి.. గేటు మీద చేయి వేసి చూడండి
-
‘ముస్లింలను చంద్రబాబు మోసం చేశారు’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ముస్లింలను మోసం చేశారని.. పవిత్ర ఇఫ్తార్లో పాల్గొని కూడా అబద్ధాలు చెప్పటం బాధాకరమని వైఎస్సార్సీపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇమామ్లకు రూ. 10 వేలు, మౌజన్లకు రూ.5 వేలు ఇస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. చెప్పినట్టుగానే అధికారంలోకి రాగానే ఇచ్చిన ఘనత వైఎస్ జగన్ది’’ అని అంజాద్ బాషా గుర్తు చేశారు.‘‘చంద్రబాబు 2019-24 మధ్య పెట్టిన బకాయి రూ.24 కోట్లను కూడా జగనే తీర్చారు. మొన్నటి ఎన్నికలకు ముందు ముస్లింలకు ఇచ్చిన ఏ హామీని అమలు చేయలేదు. 50 ఏళ్లు దాటిన ముస్లింలకు పెన్షన్ ఇస్తానన్న చంద్రబాబు ఎందుకు ఇవ్వటం లేదు?. ఈద్గాలు, ఖబరస్థాన్లకు భూమి ఇస్తానన్న చంద్రబాబు ఎందుకు ఇవ్వలేదు?’’ అంటూ అంజాద్ బాషా నిలదీశారు.‘‘విజయవాడలో హజ్ హౌస్ నిర్మిస్తానని చెప్పి, ఇప్పటికీ స్థలం కూడా కేటాయించలేదు. నూర్ బాషా కార్పోరేషన్కు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. గౌరవ వేతనం కూడా ఆర్నేళ్లుగా ఇవ్వకుండా బకాయి పెట్టారు. గట్టిగా పోరాటం చేస్తే రిలీజ్ చేసి పండుగ చేసుకోమంటున్నారు. అడ్వాన్స్ ఇచ్చి పండగ చేసుకోమన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు. హజ్ యాత్రికులకు వైఎస్ జగన్ ఆర్థిక సహాయం అందించారు. 1870 మంది యాత్రికులు వెళ్తే కేవలం 72 మందికే చంద్రబాబు ఆర్థిక సాయం చేశారు. ఇదే మా ముస్లింల మీద చంద్రబాబుకు ఉన్న ప్రేమ?. ఈ ఏడాది వెళ్తున్న 2005 మంది హజ్ యాత్రికులకు అందరికీ లక్ష చొప్పున ఇవ్వాల్సిందే’’ అని అంజాద్ బాషా డిమాండ్ చేశారు.‘‘వైఎస్ జగన్ హయాంలో విజయవాడలోనే ఎంబార్కేషన్ పాయింట్ను ఓపెన్ చేశారు. ఒక్కొక్క ముస్లిం మీద పడిన రూ.83 వేలు అదనపు భారాన్ని కూడా వైఎస్ జగన్ ప్రభుత్వమే భరించింది. వైఎస్ జగన్ ముస్లింల సంక్షేమం కోసం రూ.24,304 కోట్లు ఖర్చు చేశారు. ముస్లింల మీద జగన్ ఎంత ప్రేమ చూపిస్తారో అర్థం చేసుకోవచ్చు. మైనారిటీలకు రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. ఐదుగురికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు. ఇక్బాల్కి ఎమ్మెల్సీ ఇచ్చారు. జకియాఖానంకి ఎమ్మెల్సీ ఇచ్చి మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవి ఇచ్చారు. 12 కార్పొరేషన్లకు ముస్లింలను ఛైర్మన్లుగా చేశారు. చంద్రబాబు హామీలు ఇవ్వటమే తప్ప.. ముస్లింలకు చేసింది ఏమీ చేయలేదు..వక్ఫ్ ఆస్తులు కాపాడటంలో కూటమి ప్రభుత్వం విఫలం. 460 ఎకరాల వక్ఫ్ భూమి కబ్జాకు గురైంది. చినకాకాని దగ్గర ఉన్న 71 ఎకరాల వక్ఫ్ భూమి మీద నారా లోకేష్ కన్ను పడింది. పరిశ్రమల పేరుతో తీసుకునేందుకు జీవో ఇచ్చారు. రాజధానిలో ఉన్న వేల ఎకరాల భూములను కాదని వక్ఫ్ భూములు ఎందుకు తీసుకుంటున్నారు?. వక్ఫ్ భూములను కాపాడుకోవటానికి మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. కూటమి ప్రభుత్వంలో ముస్లింలకు రక్షణ లేదు..వినుకొండలో రషీద్ అనే ముస్లిం యువకుడిని నడిరోడ్డు మీద చంపేశారు. పుంగనూరులో మైనారిటీ బాలికను హత్య చేసి నీళ్లలో పడేశారు. రాయచోటిలో కౌన్సిలర్ మీద టీటీడీ గూండాలు దాడి చేశారు. పులివెందులలో బీటెక్ రవి అనుచరులు.. దంపతుల మీద దాడి చేశారు. నెల్లూరు జిల్లాలో ఒక ముస్లింని హత్య చేశారు’’ అంటూ అంజాద్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆ నాలుగేళ్లు విశాఖకు వైభవం
డాబాగార్డెన్స్: విశాఖపట్నం మహా నగర పాలక సంస్థ(జీవీఎంసీ) పాలకవర్గం గడువు ముగియడంతో వైఎస్సార్ సీపీ హయాంలో విశాఖ సాధించిన ప్రగతి మరోసారి తెరపైకి వచ్చింది. 2021 ఏప్రిల్ నుంచి 2025 ఏప్రిల్ వరకు నాలుగేళ్ల పాటు మేయర్గా బాధ్యతలు నిర్వర్తించిన గొలగాని హరి వెంకటకుమారి హయాంలో నగరం అనేక రంగాల్లో అభివృద్ధిని సాధించింది. ఎలాంటి రాజకీయ పరిజ్ఞానం లేని విద్యావేత్త అయిన బీసీ సామాజికవర్గానికి చెందిన మహిళను, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నగర ప్రథమ పౌరురాలిగా ఎంపిక చేయడం విశాఖ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయానికి నాంది పలికింది. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో బాధ్యతలు చేపట్టిన పాలకవర్గం, ప్రజలకు అండగా నిలుస్తూనే నగరాన్ని ప్రగతి పథంలో నడిపించింది. ముఖ్యంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వ సహకారంతో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశారు. దశాబ్దాలుగా పాతనగరం వాసులను వేధిస్తున్న ఇరుకు రోడ్ల కష్టాలకు చెక్ పెడుతూ, జగదాంబ జంక్షన్ నుంచి పాత పోస్టాఫీసు వరకు రోడ్డు విస్తరణ పనులను విజయవంతంగా పూర్తి చేసి వారి చిరకాల స్వప్నాన్ని నెరవేర్చారు. అంతర్జాతీయ సదస్సులకు వేదికైన విశాఖను సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రధాన కూడళ్లను విద్యుత్ దీపాలు, వాటర్ ఫౌంటైన్లతో ఆకర్షణీయంగా మార్చారు. బీచ్లను సుందరంగా మార్చారు. రూ.2.3 కోట్ల స్మార్ట్ సిటీ నిధులతో జగదాంబ జంక్షన్లో 20 మీటర్ల క్లాక్ టవర్ను నిర్మించారు. పచ్చదనంతో నగరానికి కొత్త అందాలు అద్దారు. మూలకు చేరిన శివాజీ పార్కును ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడం, స్వర్ణభారతి ఇండోర్ స్టేడియానికి రూ.16.90కోట్లతో నూతన హంగులు తీసుకురావడం పాలకవర్గ పనితీరుకు నిదర్శనంగా నిలిచాయి. సమగ్రాభివృద్ధే లక్ష్యంగా.. : కేవలం సుందరీకరణకే పరిమితం కాకుండా, ప్రజల కనీస అవసరాలను తీర్చడంలో జీవీఎంసీ వైఎస్సార్ సీపీ పాలకవర్గం విశేష కృషి చేసింది. మధురవాడ జోన్–2 భూగర్భ మురుగునీటి వ్యవస్థకు ఏకంగా రూ.553 కోట్లు, రోడ్ల నిర్వహణ, గుంతల పూడ్చివేతకు రూ.770 కోట్లు, సామాజిక భవనాల నిర్మాణం, నిర్వహణకు రూ.700 కోట్లు, మురుగునీటి కాలువల నిర్మాణానికి రూ.159 కోట్లు, 24 గంటల మంచినీటి పథకానికి రూ.140 కోట్లు కేటాయించి నగర మౌలిక రూపురేఖలను మార్చారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం నాడు–నేడు ద్వారా నగరంలోని ప్రభుత్వ పాఠశాలలు, పబ్లిక్ హెల్త్ సెంటర్లను కార్పొరేట్ స్థాయిలో ఆధునికీకరించి పేదలకు మెరుగైన విద్య, వైద్యాన్ని చేరువ చేశారు. సింహాచలం వచ్చే భక్తుల కోసం మౌలిక వసతుల కల్పనతో పాటు అడవివరం రోడ్డును విస్తరించారు. ఈ మేరకు భూములు, ఇళ్లు కోల్పోయిన వారికి టీడీఆర్ బాండ్లు అందజేసి ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటుకున్నారు. పార్టీలకతీతంగా ప్రగతి పరుగులు కుల, మత, పారీ్టలకతీతంగా అందరినీ కలుపుకుపోతూ.. పారిశుధ్య నిర్వహణలో ఎక్కడా రాజీ పడకుండా పగలు, రాత్రి అనే తేడా లేకుండా మేయర్ స్వయంగా పర్యవేక్షించడం నగర స్వచ్ఛతకు ఎంతో దోహదపడింది. నగర ప్రథమ పౌరురాలిగా ఇద్దరు రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులకు, ముఖ్యమంత్రికి ఆతిథ్యం ఇవ్వడంతో పాటు ఐదుగురు కమిషనర్లు, ఒక స్పెషలాఫీసర్తో సమన్వయం చేసుకుంటూ హుందాగా పరిపాలన సాగించారు. మొత్తంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్గనిర్దేశంలో, మేయర్ హరి వెంకటకుమారి నేతృత్వంలో నగరం ఆ నాలుగేళ్లలో ప్రశాంతంగా.. అభివృద్ధిలో దూసుకుపోయిందని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. -
రోశయ్య తాత గుర్తొస్తున్నాడట.. లోకేష్ పై తాడిపత్రి చంద్రశేఖర్ పంచులు
-
YSRCP యువనేతను చూసి వణుకుతున్న టీడీపీ మంత్రి
-
పోర్టుకు సర్కారు పోటు
రాష్ట్ర అభివృద్ధికి కీలకంగా మారుతుందని భావించిన రామాయపట్నం పోర్టు నిర్మాణానికి కూటమి ప్రభుత్వంలో గ్రహణం పట్టుకుంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 2024 చివరి నాటికే వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించాలనే లక్ష్యంతో సాగిన పోర్టు నిర్మాణ పనులు కూటమి ప్రభుత్వంలో పూర్తిగా పడకేశాయి. ఈ ప్రభుత్వ రెండేళ్ల కాలంలో కనీసం 20 శాతం పనులు కూడా పూర్తి చేయలేని పరిస్థితి ఉంది. కీలకమైన బెర్తుల నిర్మాణం, డ్రెజ్జింగ్, బ్రేక్వాటర్ ఫీడర్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన వంటి కీలక పనుల్లో అడుగు ముందుకు పడడం లేదు. దీంతో పోర్టు ఎప్పటికి అందుబాటులోకి వస్తుందో తెలియని ప్రశ్నగా మిగిలింది. కూటమి ప్రభుత్వ పెద్దలు మాత్రం పోర్టు ప్రారంభంపై నెలకో తేదీ చెప్తూ కాలయాపన చేస్తున్నారు.కందుకూరు: ప్రకాశం జిల్లాలో ఉన్న సుదీర్ఘ తీర ప్రాంతానికి మణిహారంగా.. జిల్లా అభివృద్ధికి ఊతంగా ఉపయోగపడే రామాయపట్నం పోర్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో శ్రీకారం చుట్టిన ఈ పోర్టు నిర్మాణ పనులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి దాదాపు 60 శాతం వరకు పూర్తయ్యాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పోర్టు నిర్మాణ పనుల కాంట్రాక్టు సంస్థను తొలగించడంతో పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఆ తరువాత మరో బడా కాంట్రాక్టు సంస్థకు నిర్మాణ పనులు అప్పగించారు. కానీ పనులు మాత్రం ముందుకు సాగలేదు. ఈ రెండేళ్ల కాలంలో కనీసం 20 శాతం పనులను కూడా నూతన కాంట్రాక్టు సంస్థ పూర్తి చేయలేకపోయింది. పోర్టు నిర్మాణంలో కీలకమైన బెర్తుల నిర్మాణం ప్రస్తుతం నత్తనడకన సాగుతున్నాయి. మొత్తం నాలుగు బెర్తుల నిర్మాణం చేయాల్సి ఉండగా వాటిలో గత ప్రభుత్వంలోనే ఒక బెర్తు నిర్మాణం పూర్తయింది. మిగిలిన మూడు బెర్తుల నిర్మాణాన్ని పూర్తి చేయడంలో అలసత్వం వహిస్తున్నారు. అలాగే భారీ ఓడలు నిలిచే విధంగా సముద్రలోతు పెంచే డ్రెజ్జింగ్ పనులు కూడా పూర్తి కాలేదు. సౌత్, నార్త్ బ్రేక్వాటర్ ఫీడర్ల నిర్మాణాలు సాగుతూనే ఉన్నాయి. ఇక సిబ్బంది కోసం నిర్మించాల్సిన క్వార్టర్లు, కస్టమ్స్ రూమ్స్ వంటి పనులు పూర్తి కాలేదు. అలాగే చెన్నై–కోల్కత్తా జాతీయ రహదారిని అనుసంధానిస్తూ పోర్టు నుంచి చేపట్టిన కీలక రహదారి నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. అలాగే సమీపంలోని తెట్టు రైల్వే స్టేషన్ నుంచి పోర్టు వరకు రైల్వేలైన్ నిర్మించాల్సి ఉంది. ఈ పనులు ఇప్పటి వరకు ప్రారంభించిన దాఖలాలు లేవు. ఇలా పోర్టు నిర్మాణంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పనులు జరుగుతున్నాయి. దీంతో అసలు పోర్టు పనులు పూర్తి చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉందా లేదా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదీ నిర్మాణ ప్రణాళిక... కోస్తా తీర ప్రాంత అభివృద్ధిలో భాగంగా గత ప్రభుత్వం రామాయపట్నం పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు రూ.4,902 కోట్ల పెట్టుబడి అంచనాతో 2022లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తొలిదశలో 34.04 ఎంఎంటీపీఏ (మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానమ్) సామర్ధ్యంతో నాలుగు బెర్తులు (రెండు జనరల్, ఒకటి కోల్, ఒకటి మల్టీపర్పస్) నిర్మాణాన్ని ప్రారంభించారు. దీనిలో భాగంగా బ్రేక్ ఫీడర్ల నిర్మాణంతో పాటు, డ్రెజ్జింగ్, ఒక బల్్కబెర్తు నిర్మాణం, సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ విభాగాలకు చెందిన బిల్డింగ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు. బల్్కబెర్త్ నిర్మాణం పూర్తికావడంతో రామాయపట్నం పోర్టు నుంచి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించి మొదటి ఓడను నిలపాలని భావించారు. తరువాత ప్రభుత్వం మారడంతో అది సాధ్యం కాలేదు. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం పోర్టు పనుల పట్ల పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇప్పటికే ఒక బెర్తు పూర్తయినా మిగిలిన మూడు బెర్తుల నిర్మాణాన్ని రెండేళ్ల కాలంలో పూర్తి చేయలేకపోయింది. ఇలా అన్ని విభాగాల పనులు దాదాపు ఏడాది కాలం పాటు నిలిచిపోయాయి. ఆ తరువాత పనులు ప్రారంభించినా అనుకున్న స్థాయి లో పనులు జరగడం లేదు. ఇదే ప్రస్తుతం రామాయపట్నం పోర్టు పాలిట పెద్ద శాపంగా మారింది.నెలకో ప్రారంభ తేదీ... రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చే తేదీలపై అటు మారిటైంబోర్డు అధికారులు, ఇటు కూటమి ప్రభుత్వ పెద్దలు పొంతన లేని ప్రకటనలు చేస్తున్నారు. ఇటీవల పోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన మారిటైంబోర్డు అధికారులు ఈ ఏడాది ఏప్రిల్ నాటికి పోర్టు అందుబాటులోకి వస్తుందని ప్రకటిస్తే, ఇటీవల పోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన రాష్ట్ర మంత్రి బీసీ జనార్ధనరెడ్డి ఈ ఏడాది డిసెంబర్ నాటికి పోర్టు పనులు పూర్తి చేస్తామంటూ ప్రకటించారు. దీంతో పోర్టు పనుల పూర్తిపై ప్రజల్లో గందరగోళ వాతావరణం నెలకొంది. వాస్తవానికి అక్కడ జరుగుతున్న పనుల వేగాన్ని బట్టి చూస్తే మరో రెండు, మూడేళ్లకు కూడా పోర్టు నిర్మాణ పనులు పూర్తికావనే అభిప్రాయాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. -
నిర్లక్ష్యమే ప్రాణాలు తీసింది
ఫిబ్రవరి 15న రాత్రి పాల రూపంలో చేతికందిన కాలకూట విషం తాగి ఆస్పత్రుల పాలయ్యారు. చివరకు కిడ్నీలు పాడై రోజుకొకరు, ఇద్దరు చొప్పున ఓ చిన్నారి సహా 16 మంది.. సర్కారు నిర్లక్ష్యాన్ని నిలదీస్తూ ఇప్పటికే పాడెక్కారు. ఇద్దరు చిన్నారులు సహా మరో నలుగురు ఆస్పత్రుల్లోనే మరణ వేదన అనుభవిస్తుండగా.. వారి అవస్థల్ని చూడలేక ఆ కుటుంబాలు ఇప్పటికీ నరకయాతన పడుతున్నాయి. మొత్తానికి దేశంలోనే అత్యధిక ప్రాణాలను బలిగొన్న రాజమహేంద్రవరం ‘పాల’కూట విషపు మృత్యుఘోష ‘ఈ పాపం ఎవరిది బాబూ!’ అని బిగ్గరగా ప్రశ్నిస్తోంది. చంద్రబాబు ప్రచార ఆర్భాటం వల్ల 2015 గోదావరి పుష్కరాల మొదటి రోజున జరిగిన తొక్కిసలాటలో 30 మందికి పైగా భక్తులు మరణించగా.. మరో ఏడాదిలో రానున్న గోదావరి పుష్కరాలకు ముందు అదే చంద్రబాబు నిర్లక్ష్యం వల్ల కల్తీ పాల ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోవడాన్ని రాజమహేంద్రవరం వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. (యిర్రింకి ఉమామహేశ్వరరావు, ఎస్.ఫయాజ్/రాజమహేంద్రవరం) ‘రాజమహేంద్రవరం పాల కల్తీ కాటుపై చంద్రబాబు సర్కారు స్పందించడం లేటయ్యింది. ఒకే సమస్యతో ఎక్కువ మంది బాధితులు ఆస్పత్రుల్లో చేరినప్పుడే ప్రభుత్వం అప్రమత్తమై.. అందుకు కారణాలు నిర్ధారించి.. తక్షణ చర్యలు చేపట్టి ఉంటే 16 ప్రాణాలు నిలిచేవి. మరో నలుగురి ప్రాణాలు కొనఊపిరితో బిక్కుబిక్కుమనేవి కాదు. ఆస్పత్రుల్లో చేరిన బాధితులు వారం రోజుల తర్వాత తమ అస్వస్థతకు కల్తీ పాలే కారణమని చెప్పాక.. ప్రభుత్వం తీరుబడిగా స్పందించింది. వైఎస్సార్సీపీ నేతలు క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశాకే చంద్రబాబు ఈ ఘటనపై స్పందించారు’ రాజమహేంద్రవరంలో ఎవరిని కదిపినా ఇవే మాటలు చెబుతున్నారు. బాధితులకు సకాలంలో వైద్యసేవలు అందించడంలో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం.. వారు చనిపోయాక అరకొర పరిహారం అందించినా ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అయిన వారిని కోల్పోయి.. ప్రైవేట్ వైద్యానికి రూ.లక్షలకు లక్షలు దొరికిన చోటల్లా అప్పులు చేసిన కుటుంబాలు నెల రోజులు గడిచినా మనోవేదన నుంచి బయటపడలేదు. బాధితుల కుటుంబ సభ్యులను కదిలిస్తే.. కన్నీటి పర్యంతమవుతూ చెబుతున్న సన్నివేశాలు గుండెల్ని పిండేస్తున్నాయి.ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రాణాలు తీసిందిఒక్కో కుటుంబానిదీ ఒక్కో విషాదం చౌడేశ్వరి నగర్లోని గుండాబత్తుల ఫణి మధుకుమార్ ఇంటిని విషాదం వెంటాడుతోంది. కల్తీ పాలకు ఆయన తల్లి వెంకటలక్ష్మి (70), పెద్దనాన్న గంటా సూర్యారావు (80), పిన్ని రఘుపతి సూర్యకుమారి (62) బలైపోయారు. మధు తండ్రి వెంకటేశ్వరరావు రాజమహేంద్రవరం కిమ్స్ ఆస్పత్రిలో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. ఆయనకు ఇప్పటికే నాలుగు యూనిట్ల రక్తం ఎక్కించారు. అయినా గ్యారంటీ లేదని వైద్యులు చెబుతున్నారు. అదే ప్రాంతానికి చెందిన కుయ్యోటి ఛాయశ్రీ (54) కల్తీ పాలు తాగి ఫిబ్రవరి 16న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే రాజమహేంద్రవరం డెల్టా ఆస్పత్రిలో చేరి్పంచగా.. క్రియాటినిన్ పెరిగిపోవడంతో కిడ్నీ పనిచేయడం ఆగిపోయింది. డయాలసిస్ చేసినా ఫలితం లేక కిడ్నీకి స్టెంట్ వేశారు. అయినా పరిస్థితి విషమించడంతో ఛాయశ్రీ ప్రాణాలు దక్కించుకోవడం కోసం ఆమె భర్త మురళీకృష్ణ నగరంలోని రవి చైతన్య ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమె చికిత్స పొందుతూ ఫిబ్రవరి 20న ప్రాణాలు కోల్పోయింది.ఆమె మరణాన్ని ప్రభుత్వం లెక్కల్లోకి తీసుకోలేదు. అదేమంటే పోస్టుమార్టం చేయలేదనే సాకుతో పరిహారం ఎగ్గొట్టింది. ఇప్పటికే జయలక్ష్మి కో–ఆపరేటివ్ బ్యాంక్ బోర్డు తిప్పేయడంతో ఆ బ్యాంకులో డిపాజిట్ చేసిన రూ.15 లక్షలు కోల్పోయానని, కొందరిని నమ్మి రూ.10 లక్షల అప్పులు ఇస్తే ఎగ్గొట్టారని మురళీకృష్ణ తెలిపారు. ఆర్థికంగా దెబ్బతిన్న తాను ఇప్పుడు భార్యను కోల్పోవడం తట్టుకోలేకపోతున్నానన్నారు.అనుమానాలను నివృత్తి చేయని సర్కారు పాలలో ఇథలీన్ గ్లైకాల్ కలవడమే బాధితుల మృతికి కారణమని ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి కల్తీ పాలు, బాధితుల రక్త నమూనాలు సేకరించి ల్యాబ్లకు పంపినట్టు ప్రకటించిన ప్రభుత్వం.. ల్యాబ్ల నుంచి వచి్చన వాస్తవ నివేదికలను ఇప్పటికీ రహస్యంగానే ఉంచింది. వాస్తవానికి ఇథలీన్ గ్లైకాల్ కలిస్తే పాలు నీలం రంగులోకి మారిపోతాయని.. అయితే, బాధితులు తాగిన పాలు రంగు మారలేదని చెబుతున్నారు. మరికొందరు గడ్డి మందు ఏమైనా కలిసిందేమో అంటున్నారు. ఇంకొందరు పాల వ్యాపారం పోటీలో ఏదైనా కుట్ర జరిగిందా? అనే అనుమానాలు సైతం వ్యక్తం చేస్తున్నారు. ల్యాబ్ రిపోర్టులు అందితే పాలల్లో కల్తీ ఎలా జరిగింది?, ఏం కలిసింది?, బాధితులపై అంత ప్రభావం చూపడానికి కారణమేంటి? అనే విషయాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో రాజమహేంద్రవరంలో కల్తీ పాల ఘటనపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పాల పదార్థాలు తీసుకోవాలన్నా, టీ తాగాలన్నా జనం వణికిపోతున్నారు. గణేష్ సరఫరా చేసిన పాల నుంచి వెన్న సేకరించి నెయ్యిగా దాచుకున్న వారు ఉన్నారని.. వారిని అప్రమత్తం చేయడం, పాల కల్తీపై అవగాహన కల్పించండంలో ప్రభుత్వం విఫలమైందని ప్రజలు వాపోతున్నారు. వైద్యానికే రూ.4.50 లక్షలైంది ఇరిగేషన్ రిటైర్డ్ ఇంజినీర్ శేషగిరిరావు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన కుమారుడు, కోడలు విషయం తెలుసుకుని వచ్చి ఆయనను దక్కించుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వైద్య ఖర్చులు రూ.4.50 లక్షలయ్యాయి. ఆ కుటుంబానికి ప్రభుత్వ సాయం అందించాల్సి ఉంది. భర్త బతికాడు.. భార్య ప్రాణం పోయింది శివరాత్రి రోజు రాత్రి కల్తీ పాలతో కాఫీ కలిపి బండారు వీరలక్ష్మి (60) తన భర్త నాగమోహనరావుకు ఇచ్చింది. పాలు చేదుగా ఉన్నాయని గుర్తించిన భర్త ఆ కాఫీ తాగకుండా పారబోశారు. ‘కాఫీ పొడి ఎక్కువ వేసి ఉంటాను. అందుకే చేదుగా ఉందని చెప్పిన భార్య చేదు అనిపించినా కాఫీ తాగింది. ఆ తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించింది. తన భార్య కూడా ఆ కాఫీ తాగకుండా ఉంటే బతికేదని నాగమోహనరావు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రసాదం తిని పాప బతికింది లాలాచెరువు ప్రాంతానికే చెందిన జి.నాగవెంకటేష్ కు జైక్రిత్ రాజ్, జయ హిమాన్షి అనే ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. రెండున్నరేళ్ల వయసున్న వారిద్దరికి పాలు కలిపి ఇస్తే జైక్రిత్ తాగాడని.. అప్పటికే దేవుడి ప్రసాదం తిన్నందున జయ హిమాన్షి తాగలేదని చిన్నారుల తాతయ్య ప్రకాశరావు చెప్పారు. పాలు తాగి అస్వస్థతకు గురైన జైక్రిత్ రాజ్ను కాపాడుకునేందుకు అప్పులు చేసి ఎంత ఖర్చు చేసినా ప్రాణాలు దక్కలేదని అతడి తాతయ్య ఆవేదనతో చెప్పారు. పరిహారంలోనూ పరిహాసమే కల్తీ పాల ఘటనలో మృతుల కుటుంబాలకు చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం సైతం బాధిత కుటుంబాలను పరిహసిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వేట్లపాలెంలో ఫిబ్రవరి 28న బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన విస్ఫోటంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. అయితే, రాజమహేంద్రవరంలో కల్తీ పాల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం మాత్రమే ఇచ్చిందని బాధితులు వాపోతున్నారు. అయిన వారిని కోల్పోయిన వారికి పరిహారం పెంచాలని.. ఒక్కొక్కరు రూ.1.50 లక్షల నుంచి రూ.10 లక్షలకు పైగా అప్పులు తెచ్చి మరీ ఖర్చు చేసిన కుటుంబాలకు వైద్య ఖర్చులను తక్షణం చెల్లించి ఆదుకోవాలని వైఎస్సార్సీపీ, ప్రజా సంఘాల నేతలు పదేపదే డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. శేషజీవితం ప్రశాంతంగా గడుపుదామని వచ్చి.. విశాఖపట్నంలో ప్రైవేట్ ఉద్యోగం చేసి రిటైరైన మంచి రాధాకృష్ణమూర్తి (72) శేషజీవితాన్ని ప్రశాంతంగా గడిపేందుకు రాజమహేంద్రవరం వచ్చారు. కుమార్తెతోపాటు అయిన వారంతా ఇక్కడే ఉండటంతో ఆనందంగా గడపాలని భావించి ఇక్కడ స్థిరపడ్డారు. ఇటీవల కల్తీ పాలు తాగడంతో యూరిన్ ఆగిపోయి పరిస్థితి సీరియస్ అవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యానికి ఎంత ఖర్చు చేసినా ఫలితం లేకపోయిందని ఆయన కుమార్తె గడిశెట్టి వెంకటదుర్గ ఆవేదనతో తెలిపారు. పాలు తాగకపోవడంతో ప్రాణాలతో ఉన్నాం హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ అమ్మను చూసేందుకు చిన్నపిల్లలతో సహా రాజమండ్రికి వచ్చిన తాము పాలు తాగకపోవడంతో ప్రాణాలతో ఉన్నామని వియ్యూరి రాజేష్ తెలిపారు. శివరాత్రికి రెండు రోజుల ముందే తాను కుటుంబంతో హైదరాబాద్కు, తన తమ్ముడు జగన్నాథ్ వైజాగ్లోని అత్తారింటికి వెళ్లాడని చెప్పారు. శివరాత్రి తర్వాత రోజున తన తల్లి గొంతునొప్పి, చెవుల్లోంచి చీము కారడం, కళ్లు మంటలు ఉన్నట్టు ఫోన్ చేసి చెప్పిందన్నారు. గోరువెచ్చని నీళ్లు తాగడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పిందని.. తాము కూడా అక్కడే ఉంటే పాలు, మజ్జిగ, టీ తాగి ఉండే వాళ్లమని.. అదే జరిగితే తన రెండేళ్ల కుమారుడు, తన తమ్ముడి 7 నెలల కొడుకు పరిస్థితి ఎలా ఉండేదో తలచుకుంటేనే భయం వేస్తోందని రాజేష్ చెప్పారు. -
చంద్రబాబు, బీఆర్నాయుడు హైందవ ద్రోహులు
సాక్షి,అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు హైందవ ద్రోహులని వైఎస్సార్సీపీ శ్రేణులు మంగళవారం నిప్పులు చెరిగారు. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు తక్షణం రాజీనామా చేయాలని రాష్ట్రవ్యాప్తంగా కదంతొక్కారు. తిరుపతిలో బీఆర్ నాయుడికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ నాయకులు, మహిళలపై పచ్చ గూండాలు దాడులకు పాల్పడడంపై మండిపడ్డారు. తిరిగి బాధితులపైనే కేసులు నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లకార్డు చేత పట్టుకొని నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేపట్టారు. పలు చోట్ల రోడ్లపై బైఠాయించి బీఆర్ నాయుడు, చంద్రబాబు నాయుడు ద్వయంపై ధ్వజమెత్తారు. అసమర్థ సర్కారుకు వ్యతిరేకంగా నినదించారు. ఈ సందర్భంగా పలు చోట్ల పార్టీ నాయకులు మాట్లాడుతూ... ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును చంద్రబాబు సర్కారు అణచివేస్తోందని మండిపడ్డారు. మహిళలను గౌరవించడం హైందవ సంప్రదాయమని, అబలలపై దాడులకు పాల్పడడం అత్యంత పాశవికమని దుయ్యబట్టారు. స్త్రీమూర్తులపై దారుణాలకు ఒడిగట్టేవారు హైందవ ద్రోహులేనని, వారు తక్షణం పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మహిళలపైనే దాడులు చేసి, వారిపైనే తిరిగి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్న ఈ నిరంకుశ సర్కారుకు పతనం తప్పదని హెచ్చరించారు. మహిళామూర్తులను బాధించిన ఏ పాలకుడూ బతికిబట్టకట్టినట్టు చరిత్రలో లేదని ఆక్రోశించారు. బాబు దుశ్శాసన పాలనకు ఘోర పరాభవం తప్పదని దుయ్యబట్టారు. మహిళలపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. » ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదుట అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. ఈ దుష్ట సర్కారుకు సద్బుద్ధి ప్రసాదించాలని అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు.» నెల్లూరు వీఆర్సీ సెంటర్లో నల్ల కండువాలతో వైఎస్సార్సీపీ నేతలు నిరసన తెలిపారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. బాబు దుశ్శాసన పాలనకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. » ప్రకాశం జిల్లా ఒంగోలు బాపూజీ కాంప్లెక్స్లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ నేతలు ప్లకార్డులు చేతబట్టి నిరసన తెలిపారు. » ఏలూరులో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు భారీ ధర్నా చేశారు. » పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో వైఎస్సార్సీపీ శ్రేణులు చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు. » తూర్పు గోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరం మోరంపూడి సెంటర్లో అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్ సీపీ శ్రేణులు నిరసన తెలిపాయి. » డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో వైఎస్సార్ సీపీ నేతలు నిరసన తెలిపారు. బుద్ధ విహార్లో అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించి రోడ్డుపై బైఠాయించారు. » కాకినాడ ఇంద్రపాలెం వంతెన సమీపాన అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్ సీపీ నేతలు నిరసన తెలిపారు. » విజయనగరంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ నేతలు ధర్నా చేశారు. బాబు పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. » పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో వైఎస్సార్సీపీ నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. » శ్రీకాకుళంలోనూ పార్టీ శ్రేణులు నిరసన గళమెత్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేశారు. » విశాఖపట్నం ఎల్ఐసీ జంక్షన్లో అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ధర్నా చేశారు. » అనకాపల్లిలో వైఎస్సార్సీపీ నేతలు నల్లబ్యాడ్జీలు ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మానవహారం నిర్మించారు. » అనంతపురం నగరంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా పార్టీ నేతలు కదంతొక్కారు. నిరసన ప్రదర్శనలు చేశారు. » ఉమ్మడి తిరుపతి జిల్లాలోనూ వైఎస్సార్సీపీ నేతలు నిరసన తెలిపారు. ధర్నాలు చేశారు.అంబేడ్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించారు. » కర్నూలు, నంద్యాలలోనూ వైఎస్సార్సీపీ నేతలు బాబు సర్కారు హిందూ వ్యతిరేక విధానాలపై నిరసన తెలిపారు. -
నేడు ముస్లిం సోదరులకు వైఎస్సార్సీపీ ఇఫ్తార్ విందు.. పాల్గొననున్న వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో బుధవారం వైఎస్సార్సీపీ ఇఫ్తార్ విందు నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సాయంత్రం 6 గంటలకు హాజరవుతారు. ముస్లిం మత పెద్దలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యే ఈ ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులతో కలిసి వైఎస్ జగన్ ఉపవాస విరమణ కార్యక్రమంలో పాల్గొంటారు. -
రేపు విజయవాడకు వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని విజయవాడలో రేపు(మార్చి 18, బుధవారం) వైఎస్సార్సీపీ నిర్వహించే ఇఫ్తార్ విందు విందులో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొననున్నారు. ముస్లిం మత పెద్దలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యే ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులతో కలిసి వైఎస్ జగన్ ఉపవాస విరమణ కార్యక్రమంలో పాల్గొంటారు.రంజాన్ మాసం సోదరభావం, సామరస్యం, సేవా భావానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొంటూ ఈ ఇఫ్తార్ విందు నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ వేదికగా జరిగే ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనేందుకు సాయంత్రం 6 గంటలకు వైఎస్ జగన్ విజయవాడ చేరుకుంటారు. కార్యక్రమం అనంతరం తిరిగి అక్కడి నుంచి తాడేపల్లి బయలుదేరుతారు. -
కూటమి తీరుపై రాష్ట్రవ్యాప్తంగా వైస్సార్సీపీ భారీ నిరసన
-
రైతు సమస్యలపై చంద్రబాబు సర్కార్ స్పందించాలి: సాకే శైలజానాథ్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో రైతులు, రైతు కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వ్యవసాయం దండగ అనే రీతిలోనే ఇప్పటికీ చంద్రబాబు ఆలోచిస్తున్నారంటూ దుయ్యబట్టారు.‘‘సగటున రోజుకు 8 మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వ్యవసాయ రంగంలో ఉన్న సంక్షోభమే ఈ ఆత్మహత్యలకు కారణం. విపత్తులు వచ్చినా ప్రభుత్వం మాటలు తప్ప.. లబ్ధి చేకూర్చడం లేదు. ఎన్నికల ముందు రైతులకు, రైతు కూలీలకు అనేక హామీలు ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. అరకొర మినహా ఏ పంటకు గిట్టుబాటు ధరలు లేవు...మూడు లక్షల కోట్లకు పైగా అప్పులు తెచ్చినా ధరల స్థిరీకరణ నిధికి రూ.3,000 కోట్లు కూడా కేటాయించలేదు. వైఎస్సార్, జగన్ పరిపాలనలో రైతే రాజు అన్నట్లుగా పరిస్థితులు ఉండేవి. క్రాప్ ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించక రైతులు విపత్తులతో నష్టపోయారు. అన్నంపెట్టే రైతుల సమస్యలపై చంద్రబాబు ప్రభుత్వం వెంటనే స్పందించాలి. చిన్న, సన్నకారు రైతాంగాన్ని ఆదుకోవాలి’’ అని సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. -
ప్రతి ఇంట్లో ఇప్పుడు అదే చర్చ : వైఎస్ జగన్ (ఫోటోలు)
-
ఆకు రౌడీలంతా బీఆర్ నాయుడు చెంత చేరారు: భూమన
సాక్షి, తాడేపల్లి: ఆకు రౌడీలంతా బీఆర్ నాయుడు చెంత చేరారంటూ వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ నాయుడిని టీటీడీ ఛైర్మన్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ.. ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆందోళనలు చేపట్టింది. ఈ సందర్భంగా భూమన కరుణాకర్రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆకు రౌడీలను బీఆర్ నాయుడు పెంచి పోషిస్తున్నారంటూ దుయ్యబట్టారు.‘‘తిరుమల అరాచక శక్తుల, అసాంఘిక కార్యక్రమాలతో తల్లడిల్లుతోంది. బీఆర్ నాయుడు చైర్మన్ అయిన తర్వాత టీటీడీ ఔన్నత్యం, విశిష్టత దెబ్బతింది. టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు పూర్తిగా అనర్హుడు. బీఆర్ నాయుడు తీరుపై రాష్ట్ర ప్రజలు, హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా ప్రభుత్వం వెనకేసుకొస్తోంది.’’ అని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు.రూ.300 రూపాయల టికెట్లను కూడా ఆకు రౌడీలకు ఇచ్చి టీటీడీ ఛైర్మన్ వాళ్ళని పోషిస్తున్నారు. టీటీడీ చైర్మన్ తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపితే ఆకు రౌడీలు మా వారిపై దాడి చేశారు. శాంతి యుతంగా నిరసన తెలిపిన మహిళలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. అనుగ్రహ భాషనలతో ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరియాల్సిన చోట ఆకు రౌడీల బూతులు వినిపిస్తున్నాయి. అసాంఘిక శక్తులపై ఉద్యమ నాయకుడిగా 50 ఏళ్ల క్రితమే పోరాటం చేశాను’’ అని భూమన కరుణాకర్రెడ్డి పేర్కొన్నారు. -
లాగి చెంపకేసి ఒక్కటి పీకాల్సింది పోయి... ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ కేసుపై జగన్ స్టాంగ్ రియాక్షన్
-
జగన్ 2.0 ట్రేడ్ మార్క్ మొదటి ప్రాధాన్యత వాళ్లకే
-
వాళ్లంతా అడ్డంగా దొరికినా.. బాబు నో యాక్షన్: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: డ్రగ్స్ తీసుకుంటూ టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ పట్టుబడ్డాడని.. పార్లమెంటు చరిత్రలో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఎంపీ ‘పుట్టా’నేనని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఒంగోలు నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు, ప్రజా ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘పుట్టా మహేష్తో మొదలై... పుట్టా మహేష్తో ఆగిపోలేదు.. ఇలాంటి వాటిపట్ల చంద్రబాబు వ్యవరించిన తీరు అత్యంత దారుణం’’ అంటూ వైఎస్ జగన్ దుయ్యబట్టారు.‘‘ఒక పాలకుడిగా ఆయన వ్యవహరించలేదు. తప్పు చేసిన వారిపట్ల తయన చర్యలు తీసుకోలేదు. అందుకనే విచ్చలవిడిగా జరుగుతున్నాయి. అత్యాచారం చేశారని, ఆపై మోసం చేశారని బాధితురాలు స్వయంగా మోసం చేశారని ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తే.. దానిపై కమిటీలు అంట.. కోనేటి ఆదిమూలం మహిళ మీద దారుణమైన లైంగిక దాడిచేస్తే పంచాయితీ చేశారు. కేజీబీవీ మహిళా ప్రిన్సిపాల్ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ మీద నో యాక్షన్...మహిళలతో అశ్లీల వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మీద నో యాక్షన్. చివరకు మంత్రి సంధ్యారాణి పీఏ మీదా నో యాక్షన్. ప్రస్తుత టీటీడీ ఛైర్మన్ మీదా నో యాక్షన్. వీడియో, ఫొటోలతో పట్టుబడ్డా.. నో యాక్షన్. ఆదినారాయణరెడ్డి కొడుకు డ్రగ్స్ తీసుకుంటూ.. పట్టుబడితే.. నో యాక్షన్. ఇలాంటి వాటికి వత్తాసు పలికే భావన చంద్రబాబుకు ఉంది కాబట్టే.. ఇలాంటివి జరుగుతున్నాయి’’ అంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు.‘‘తన కొడుకు స్విమ్మింగ్ పూల్స్ వద్ద తాగుతూ, తూలుతూ అమ్మాయిలతో డ్యాన్స్లు చూస్తే నో యాక్షన్. తన బావమరిది అమ్మాయిలకు ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలని అని బహిరంగంగా మాట్లాడితే నో యాక్షన్. చిన్నప్పుడు తాను ఇంతకంటే ఎక్కువే చేశానని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు మైండ్ సెట్ ఎలాంటిదో ఇవన్నీ సూచిస్తున్నాయి. వీళ్లకు ప్రజలకు మంచి చేయాలన్న మైండ్ సెట్ లేదు’’ అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
LIVE: నో యాక్షన్..? జగన్ సంచలన కామెంట్స్...
-
కామ నాయుడుని కాపాడుతున్న చంద్రబాబుపై ఫైర్
-
KSR Live Show: మీ తండ్రిని చంపినోన్ని కాపాడుతావా?
-
గుండె ధైర్యం.. వైఎస్సార్సీపీ ట్రేడ్ మార్క్ : వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి : గుండె ధైర్యం.. వైఎస్సార్సీపీ ట్రేడ్ మార్క్ అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కేడర్తో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. వైఎస్ జగన్ భేటీలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఒంగోలు ఇంఛార్జి చుండూరు రవి, పార్లమెంటు ఇంఛార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహా స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ జగన్ది మాత్రమే కాదు.. వైఎస్సార్సీపీ అంతా కలిసి కట్టుగా నిర్మించుకున్నాం. వైఎస్సార్సీపీ విలువలు,విశ్వసనీయత మీద పుట్టింది. అదే పునాదుల మీద కొనసాగుతోంది. గుండె ధైర్యం.. వైఎస్సార్సీపీ ట్రేడ్ మార్క్,మనం మంచి చేశాం. కాబట్టే ప్రజలతో కలిసి ముందుకెళ్తున్నాం. మన పాలనకు, బాబు పాలనకు మధ్య తేడా ప్రజలు గుర్తించారు. ప్రతి ఇంట్లోనూ ఇదే చర్చ జరుగుతోంది. అవినీతి కోసం మాత్రమే వాళ్లు అధికారంలో ఉన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికొదిలేశారు. మనం అధికారంలోకి వచ్చినప్పుడు అద్భుతమైన రాష్ట్రాన్ని ఇచ్చినట్లు బాబు బిల్డప్. వ్యవస్థల్ని ఛిన్నాభిన్నం చేసి అప్పగించారు. కేవలంలో ఖజానాలో రూ.100కోట్లు మాత్రమే ఉంచారు. తర్వాత కోవిడ్ లాంటి కష్టాలు ఎదుర్కొన్నాం. ఆర్థికంగా ఒత్తిళ్ల మధ్య మన పరిపాలన సాగింది. ప్రజలకు ఇచ్చిన మాటను ఎప్పుడూ వదిలి పెట్టలేదు. దేశ చరిత్రలో జరగని విధంగా హామీలు అమలు చేశాం. ముందుగానే క్యాలండర్ ఇచ్చి హామీలను అమలు చేశాం. బడ్జెట్లో క్యాలెండర్ పెట్టి పథకాలు అమలు చేశాం. పేదలను, మధ్యతరగతి ప్రజలను ఆదుకున్నాం. మన హయాంలో రూ.3.31లక్షల కోట్లు అప్పు చేస్తే రూ.2.7లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాలో వేశాం. రెండేళ్లకే చంద్రబాబు కమిటెడ్ అప్పులు.. గ్రాస్ అప్పులు రెండేళ్లకే రూ.3.30లక్షల కోట్లు దాటాయి. చంద్రబాబు హామీలు మోసాలుగా తేలిపాయాయి’అని వైఎస్ జగన్ అన్నారు. ’మన పథకాలన్నీ చంద్రబాబు నాయుడు రద్దు చేశారు. ఈ డబ్బులన్నీ ఎవరి జేబులోకి వెళ్లిపోయాయి. జగన్ ఏం చేయగలిగాడు. బాబు ఎందుకు చేయలేకపోతున్నాడని చర్చిస్తున్నారు. అవినీతికి తావు లేకుండా మనం పథకాలు అమలు చేశాం. ఇప్పుడు దోచుకో.. పంచుకో.. తినుకో.. ఇదే కొనసాగుతుంది. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడం లేదు. అమరావతి పనుల్లో తీవ్రమైన అవినీతి. భూములను శెనక్కాయలకు, బెల్లానికి ఇచ్చేస్తున్నారు. ఏపీలో ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. డ్రగ్స్ తీసుకుంటూ టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ పట్టుబడ్డారు. పార్లమెంటు చరిత్రలో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఎంపీ ఆయనే. ఇలాంటి వాటిపట్ల చంద్రబాబు వ్యవహరించిన తీరు దారుణం. చంద్రబాబు ఒక పాలకుడిగా వ్యవహరించడం లేదు. మోసం చేశారని బాధితురాలు సీఎంకు ఫిర్యాదు చేస్తే కమిటీలు వేస్తామంటున్నారు. ఆదిమూలం మహిళపై లైంగిక దాడి చేస్తే పంచాయతీ చేశారు. కేజీబీవీ మహిళా ప్రిన్సిపల్పై వేధింపులకు పాల్పడ్డ ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్పై నో యాక్షన్. మహిళలకు అశ్లీల వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మీద నో యాక్షన్. చివరకు మంత్రి సంధ్యారాణి పీఏ మీద నో యాక్షన్. ప్రస్తుత టీటీడీ ఛైర్మన్ మీద కూడా నో యాక్షన్. వీడియో, ఫొటోలతో పట్టుబడ్డా నో యాక్షన్. ఆదినారాయణరెడ్డి కొడుకు డ్రగ్స్తో పట్టుబడితే నో యాక్షన్. తన కొడుకు స్విమ్మింగ్ పూల్స్ వద్ద తాగుతు, తూలుతూ అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తే నో యాక్షన్.తన బావమరిది మహిళలపై నీచంగా మాట్లాడితే నో యాక్షన్. చిన్నప్పుడు తాను ఇంతకంటే ఎక్కువే చేశానని బాబు అన్నారు. వీళ్లకు ప్రజలకు మంచి చేయాలన్న మైండ్ సెట్ లేదు. చంద్రబాబుకు ఇక మిగిలింది రెండేళ్లే. చివరి ఏడాది ఎలాగూ ఎన్నికలున్నాయి. మధ్యలో నా పాదయాత్ర కూడా ఉంటుంది. జగన్ 220లో కార్యకర్తలకు పెద్దపీట. కార్యకర్తల ద్వారానే ప్రజలకు మరింత మంచి’ అని అన్నారు. -
తిరుపతిలో వైఎస్సార్సీపీ నేతల నిరసన..
వైఎస్సార్సీపీ నేతల నిరసనలు అప్డేట్స్..అనంతపురం..అనంతపురం అంబేద్కర్ విగ్రహం ఎదుట వైఎస్సార్సీపీ నేతల నిరసనటీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్తిరుపతిలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై కేసు పెట్టడంపై ఆగ్రహంచంద్రబాబు సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన వైఎస్సార్సీపీ శ్రేణులునంద్యాల జిల్లా...నంద్యాలలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద పార్టీ నేతల నిరసనలు.కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన.టీటీడీ పవిత్రతను బీఆర్ నాయుడు, చంద్రబాబు అభాసు పాలు చేస్తున్నారని ఆగ్రహంబీఆర్ నాయుడుని పదవి నుండి తొలగించి డిమాండ్. ఏపీలో కూటమి ప్రభుత్వంలో తప్పుడు కేసులకు నిరసనగా తిరుపతిలో వైఎస్సార్సీపీ నేతలు నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం ఎదుట వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. దీంతో, తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ఎదుట భారీ ఎత్తున పోలీసులు మోహరించారు.తిరుపతితో పార్టీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో నిరసన కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై కొనసాగుతున్న తప్పుడు కేసులకు నిరసనగా పార్టీ నేతలు నిరసనలకు దిగారు. కూటమి ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలు, తప్పుడు కేసులు నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ నేతలు భూమన అభినయ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి, నూకతోటి రాజేష్, సుధాకర్ రెడ్డి.. అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి, నిరసన చేపట్టారు.ఈ సందర్బంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. నిన్న గ్రాండ్ రిడ్జ్ హోటల్ ఎదుట రోడ్డుపై శాంతియుతంగా నిరసన తెలిపిన వైఎస్సార్సీపీ శ్రేణులు 13 మందిపై అట్రాసిటీ కేసులు పెట్టడాన్ని నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కూటమి ప్రభుత్వం, పోలీసుల తీరుపై మండిపడ్డారు. అనంతరం, భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ..‘రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలుచేస్తున్నారు.. అంబేద్కర్ రాజ్యాంగం పక్కన పెట్టేశారు. అట్రాసిటీ కేసులతో వేధింపులకు గురిచేస్తున్నారు. తిరుమల పవిత్రతను కాపాడాలి అంటే బీఆర్ నాయుడు పదవికి రాజీనామా చేయాలి అని కామెంట్స్ చేశారు. -
జగన్ పాలనలో జోరు.. సంక్షేమం–అభివృద్ధి జోడు గుర్రాల దౌడు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలన అభివృద్ధి, సంక్షేమ రంగాలకు ప్రాధాన్యతతో కొనసాగిందని నీతి ఆయోగ్ కితాబు ఇచ్చింది. రాష్ట్ర వ్యయం నమూనా సంక్షేమ, మౌలిక సదుపాయాలపై బలమైన ప్రాధాన్యతకు నిదర్శనంగా నిలుస్తోందని పేర్కొంది. గత ప్రభుత్వ హయాంలో సొంత ఆదాయంలో ఆరోగ్యకరమైన పెరుగుదల ధోరణిని సూచించిందని నివేదిక తెలిపింది. 2023–24 రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య సూచికలపై నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలను ప్రస్తావించింది. రాష్ట్ర వ్యయం నమూనాను పరిశీలిస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చిందని.. ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణం, సాగునీరు, ఇంధన రంగాలకు పెద్దపీట వేసిందని నీతి ఆయోగ్ వెల్లడించింది. ఖర్చులలో ఎక్కువ భాగం జీతాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులు లాంటి తప్పనిసరి బాధ్యతలను నిర్వర్తిస్తూనే గత ప్రభుత్వం కీలక రంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఆదాయాలు ఆరోగ్యకరమైన పెరుగుదలను సూచించాయని, జీఎస్టీతోపాటు వస్తువుల పన్నులు పెరిగాయని నివేదిక పేర్కొంది.» రెవెన్యూ, మూలధనం.. రెండూ కలిపి మొత్తం అభివృద్ధి వ్యయం వైఎస్ జగన్ పాలనలో గణనీయంగా పెరిగిందని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. 2019ృ20లో మొత్తం అభివృద్ధి వ్యయం రూ.1.10 లక్షల కోట్లుగా ఉండగా 2023ృ24లో రూ.1.67 లక్షల కోట్లకు గణనీయంగా పెరిగినట్లు నివేదిక ప్రస్తావించింది. గత ప్రభుత్వంలో ఐదేళ్లలో మొత్తం దాదాపు 65 శాతం పెరుగుదల నమోదైందని నివేదిక స్పష్టం చేసింది. స్థిరమైన వృద్ధి ఆధారంగా సంక్షేమ రంగాలను బలోపేతం చేయడంపై గత ప్రభుత్వ ప్రాధాన్యతకు ఇది నిదర్శనంగా నిలుస్తోందని తెలిపింది.» గత ప్రభుత్వంలో మూలధన వ్యయం జీఎస్డీపీలో 4 నుంచి 9 శాతం పరిధిలో ఉండటం ఆస్తుల సృష్టి, మౌలిక సదుపాయాల అభివృద్ధి వైపు స్థిరమైన పురోగతిని సూచిస్తోందని నివేదిక స్పష్టం చేసింది. 2023ృ24లో మొత్తం వ్యయంలో సామాజిక సేవల వ్యయం 52.4 శాతంతో అతి పెద్ద వాటాను కలిగి ఉందని పేర్కొంది. ఇది విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణ రంగాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను ప్రతిబింబిస్తోందని తెలిపింది. ఇక ఆర్థిక సేవలు 44.6 శాతం వాటాను కలిగి ఉండగా ప్రధానంగా రవాణా, నీటి పారుదల, ఇంధన రంగాలు పెట్టుబడుల ద్వారా పురోగమించాయని నివేదిక పేర్కొంది. » 2023ృ24లో మొత్తం రెవెన్యూ వ్యయంలో దాదాపు 48.59 శాతం జీతాలు, వడ్డీ చెల్లింపులు, పెన్షన్లు లాంటి తప్పనిసరి ఖర్చులకు కేటాయించినట్లు నీతి ఆయోగ్ నివేదిక తెలిపింది. » గత ప్రభుత్వంలో రాష్ట్ర సొంత ఆదాయంలో ఆరోగ్యకరమైన పెరుగుదల నమోదైంది. 2023ృ24లో మొత్తం ఆదాయ వసూళ్లలో దాదాపు 52 శాతం సొంత పన్నుల ద్వారానే సమకూరినట్లు వెల్లడించింది. ఇందులో వస్తు సేవల పన్నులు అత్యధికంగా 35.5 శాతం వాటా కలిగి ఉండగా తరువాత జీఎస్టీ 34.1 శాతం వాటాగా నమోదైంది. » రాష్ట్ర సొంత ఆదాయం వైఎస్సార్సీపీ హయాంలో దాదాపు 48 శాతం వృద్ధిని నమోదు చేసిందని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. -
కోడిని కోస్తే నాన్ బెయిలబుల్ కేసు.. డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే బెయిలా?
సాక్షి, అమరావతి: ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోడిని కోస్తే నాన్ బెయిలబుల్ కేసు పెడుతున్నారు.. డ్రగ్స్ తీసుకుంటూ టీడీపీ ఎంపీ పట్టుబడితే మాత్రం స్టేషన్ బెయిల్పై విడుదల చేస్తున్నారు. చిన్న చిన్న కేసుల్లో అమాయకులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్న ప్రభుత్వం.. కూటమి నేతల డ్రగ్స్ కేసులు, మహిళలపై పాల్పడుతున్న నేరాల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఏ చర్యలూ చేపట్టకుండా ద్వంద్వ వైఖరి అవలంభిస్తోంది’ అని వైఎస్సార్సీపీ ధ్వజమెత్తింది. చంద్రబాబు కూటమి ప్రభుత్వ ఈ ద్వంద్వ వైఖరిని వైఎస్సార్సీపీ ఎక్స్ వేదికగా సోమవారం ప్రశ్నించింది. ఏలూరు నియోజకవర్గ లోక్సభ సభ్యుడు పుట్టా మహేష్ కుమార్ డ్రగ్స్ తీసుకున్న కేసులో అడ్డంగా పట్టుబడ్డారని, ఇలాంటి ఘటన పార్లమెంట్ చరిత్రలో అరుదని పేర్కొన్నారు. అయినప్పటికీ రాజకీయ బలాన్ని ఉపయోగించి బెయిల్పై బయటకు తీసుకురావడం, షోకాజ్ నోటీసుల పేరుతో డ్రామాలు చేయడం సరికాదని అన్నారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, హోం మంత్రి వంగలపూడి అనిత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ స్పందించాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. హైదరాబాద్లో డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నారన్న ఆరోపణలు, డ్రగ్స్ పరీక్షలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. రక్త పరీక్షల్లో కొకైన్ వాడినట్లు పాజిటివ్ వచ్చినట్లు చెబుతున్నారని, దీనిపై స్పందించాలని కోరారు. అలాగే మహిళలపై వేధింపులకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న కూటమి ప్రజాప్రతినిధులపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని వైఎస్సార్సీపీ మండిపడింది. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై వచ్చిన అత్యాచార ఆరోపణలు, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగిక దాడి ఆరోపణలు, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్పై వేధింపుల ఆరోపణలు, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్పై అశ్లీల వీడియో కాల్స్ ఆరోపణలు వచ్చినప్పటికీ చర్యలు లేవని ధ్వజమెత్తింది. మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి పీఏపై కూడా చర్యలు తీసుకోలేదని తెలిపింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కూడా ఒక మహిళను మోసం చేశాడని ఆరోపణలు వచి్చనప్పటికీ స్పందన లేకపోవడం ఆందోళనకరమని తెలిపింది. కమిటీల విచారణలు, షోకాజ్ నోటీసుల పేరుతో డ్రామాలు ఆపి, డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ఎంపీతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. లేకపోతే ప్రజలు చంద్రబాబు ప్రభుత్వాన్ని క్షమించరని ఎక్స్లో వైఎస్సార్సీపీ హెచ్చరించింది. -
వివేక ను చంపించాల్సిన అవసరం ఏంటి? " వైఎస్ సునీత వ్యాఖ్యలపై రాచమల్లు స్ట్రాంగ్ రిప్లై
-
Viveka Case: ‘సునీత కీలక అంశాలను పక్కదారి పట్టించారు’
న్యూఢిల్లీ: వివేకా కేసుకు సంబంధించి ఆయన కుమార్తె సునీత అనేక కీలకాంశాలను పక్కదారి పట్టించారన్నారు కడప ఎంపీ అవినాష్రెడ్డి. తనపై తప్పుడు సాక్ష్యాలు చెప్పాలని కొందరిపై సునీత ఒత్తిడి చేశారన్నారు. ఈ కేసులో తనను అన్యాయంగా ఇరికించారని, సీబీఐ కూడా దీనికి సమాధానం చెప్పాలన్నారు. వివేకా గుండెపోటుతో చనిపోయారని సృష్టించిందే సునీత అని అవినాష్రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు(సోమవారం, మార్చి 16వ తేదీ) న్యూఢిల్లీ నుంచి మీడియాతో మాట్లాడిన అవినాష్రెడ్డి.. వివేకాది గుండెపోటు అని సృష్టించింది సునీతతో పాటు నర్రెడ్డి, రాజశేఖర్రెడ్డి అనే వ్యక్తులు అని తెలిపారు. అసలు వివేకాది మర్డర్ ఫర్ గెయిన్ దిశగా సునీత ఎందుకు విచారణ కోరలేదని అవినాష్రెడ్డి ప్రశ్నించారు. వివేకా హత్య గురించి పోలీసులకు సమాచారం ఇచ్చింది తానేనని అవినాష్ పేర్కొన్నారు. ఇంకా ఈ కేసుకు సంబంధించి పలు విషయాలను మీడియాతో పంచుకున్నారు అవినాష్. సీబీఐ ఏకపక్షంగా దర్యాప్తు చేసింది..వివేకా హత్య కేసులో నాపై తప్పుడు సాక్ష్యాలు చెప్పాలని సునీత కొందరిపై ఒత్తిడి చేశారు. వారు చెప్పినట్లే సీబీఐకి చెప్పాలని కొందరని సునీత బెదిరించారు. రామ్సింగ్ విచారణ అధికారిగా వచ్చాక కేసు పక్కదారి పట్టింది. సీబీఐ డైరెక్టర్కు అనేక సాక్ష్యాలు సమర్పించి విచారణ చేయాలని మొరపెట్టుకున్నా. గతంలో సీబీఐకి నచ్చిన వారిని మాత్రమే పిలిచి మాట్లాడారు. సీబీఐ ఏకపక్షంగా దర్యాప్తు చేసింది’ అని స్పష్టం చేశారు.చంద్రబాబు రాజకీయంగా వాడుకుంటున్నారుఈ కేసును చంద్రబాబు రాజకీయంగా వాడుకుంటున్నారు. చంద్రబాబు హయాంలోనే వివేకా హత్య జరిగింది. వచ్చే ఎన్నికల వరకూ వివేకా కేసు సాగదీయాలనేది సునీత, చంద్రబాబు ఉద్దేశం. చంద్రబాబుకు రాజకీయంగా అవసరం ఉన్న సమయంలో సునీత బయటకొస్తారు. టాపిక్ డైవర్షన్ కోసం మీడియా ముందుకొచ్చి ఈ కేసు అంశాన్ని లేవనెత్తుతారు.వాటికి సునీత సమాధానం చెప్పలేదు..సీబీఐ స్టేట్మెంట్ తీసుకునే సమయంలో సునీతను లెటర్ గురించి అడిగారు. లెటర్ గురించి సీబీఐ అడిగిన ప్రశ్నలకు సునీత సమాధానం చెప్పలేదు.గతంలో సునీత మాటలను నేను కోర్టుకు సమర్పించాను. సునీత కీలక అంశాలను పక్కదారి పట్టించారు. చట్టం, ధర్మం, దేవుడిపై నాకు నమ్మకం ఉందిదస్తగిరి బెయిల్ రద్దు కాకుండా అడ్డుకుంటున్నారుసునీతకు దస్తగిరి అత్యంత ఆప్తుడు. దస్తగిరి బెయిల్ రద్దు కాకుండా సునీత అడ్డుకుంటున్నారు. దస్తగిరి తరఫున లూథ్రాను పెట్టి కేసు వాదనలు వినిపిస్తున్నారు. దస్తగిరి సీబీఐకి చెప్పిన స్టేట్మెంట్లో అనేక కీలక అంశాలున్నాయి. విచారణ సక్రమంగా చేయాలని సీబీఐ డైరెక్టర్కు చాలాసార్లు మొరపెట్టుకున్నా. మూడేళ్లుగా విచారణ సక్రమంగా జరగకుండా సునీత అడ్డుకుంటున్నారు. ఏదో ఒక రోజు నిజం నిగ్గు తేలుతుంది. ఈ కేసును సీబీఐ, న్యాయస్థానం త్వరగా విచారణ పూర్తి చేయాలి’ అని కోరారు.రాజకీయ లబ్ధి కోసమే సునీత ఆరాటం..ఈ కేసుకు సంబంధించి రాజకీయ లబ్ధి కోసమే సునీత ఆరాటపడుతున్నారన్నారు అవినాష్. ‘రాజకీయ లబ్ధి కోసమే సునీత ఆరాట పడుతున్నారు. దస్తగిరి, డ్రైవర్ ప్రసాద్, రాజశేఖ్ ఇచ్చిన స్టేట్మెంట్స్ను సునీత చదివారా?, హత్యకు ముందు రోజు రాజశేఖర్ను ఎందుకు శ్రీకాళహస్తికి పంపించారు. స్టేట్మెంట్లో రాజశేఖర్ అనేక విషయాలు చెప్పారు. చివరి రోజుల్లో వివేకానందరెడ్డిని మానసికంగా వేధించారు. డాక్యుమెంట్స్ కోసమే వివేకానందరెడ్డిన హత్య చేశామని దస్తగిరి చెప్పాడు. పీఏ కృష్ణారెడ్డి ఇచ్చిన లెటర్ను సునీత పోలీసులకు ఎందుకు ఇవ్వలేదు. దస్తగిరి బెయిల్ రద్దు చేయాలని మేం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాం’ అని స్సష్టం చేశారు. ఆ కోణంలో ఎందుకు విచారణ చేయలేదు..?సిబిఐ వన్ సైడ్ గా దర్యాప్తు జరిపింది. హత్య జరిగిన రోజు చంద్రబాబు అధికారంలో ఉన్నారు. సాక్షులకు శిక్షణ ఇచ్చి నాకు వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇప్పించారు. శివ ప్రకాష్ రెడ్డి తనకి ఫోన్ చేసి.. వివేకా కు గుండె పోటు అని చెప్పారు. గుండె పోటు వచ్చిందని థియరీ సృష్టించింది సునీతక్క, రాజశేఖర్ రెడ్డినే. దీనిపై ఎందుకు విచారణ అడగడం లేదు. వివేకాను ఆయన కుటుంబం వదిలేసింది. ఆయన చెక్ పవర్ తీసేశారు. షమీమ్, ఆమె కొడుకుకు ఆస్తులు పోవద్దనే వివేకాను హత్య చేసి ఉండవచ్చే కోణంలో ఎందుకు దర్యాప్తు చేయలేదు. వివేకాది మర్డర్ ఫర్ ది గెయిన్ అనే కోణంలో ఎందుకు విచారణ చేయలేదు. ఈ అంశాలపై ప్రధాన మంత్రి, హోమ్ మంత్రికి లేఖ రాశాను’ అని అవినాష్ స్పష్టం చేశారు. -
అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులతో సజ్జల రామకృష్ణారెడ్డి కీలక భేటీ
-
‘ప్రభుత్వ మోసపూరిత విధానాలను ప్రజలకు వివరించాలి‘
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వ మోసపూరిత విధానాలను ప్రజలకు వివరించాలని వైఎస్సార్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం పరిశీలకుల సమావేశం జరిగింది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిశీలకులు హాజరయ్యారు. పార్టీ కార్యక్రమాలపై సజ్జల రామకృష్ణారెడ్డి, కేంద్ర కార్యాలయ ఇన్చార్జి లేళ్ల అప్పిరెడ్డి, తదితరులు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘వైఎస్సార్సీపీ 15 ఏళ్లు పూర్తి చేసుకుని 16వ ఆవిర్భావ దినోత్సవంలోకి అడుగుపెట్టింది. ప్రజలతో కలిసి, ప్రజల కోసమే పనిచేస్తూ పార్టీ ముందుకు సాగుతోంది. జగన్ వెంట నడిచే ప్రతి కార్యకర్త గర్వంగా చెప్పుకునే స్థాయిలో పార్టీ ఉంది. ప్రజల్లో వైఎస్సార్సీపీపై విశ్వాసం మరింత పెరిగింది. పార్టీ భవిష్యత్ విజయానికి సంస్థాగత బలోపేతం అత్యంత అవసరం. క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయాలి. అన్ని స్థాయిల్లో కమిటీలను త్వరగా పూర్తి చేయాలి. నియోజకవర్గ ఇన్చార్జ్లకు పరిశీలకులు సపోర్టింగ్ సిస్టమ్లా పనిచేయాలి. మన హయాంలో చేసిన సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లాలి. కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసపూరిత విధానాలను ప్రజలకు వివరించాలి. టీడీపీ ఫేక్ ప్రచారం, పెయిడ్ క్యాంపెయినింగ్ను వాస్తవాలతో ఎదుర్కోవాలి. ఎన్నికల్లో విజయానికి బూత్ స్థాయి నిర్మాణం చాలా ముఖ్యం. ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలి’ అని అన్నారు. -
‘బాబూ.. ఎంపీ మహేష్ తాట తీస్తావా?.. కేవలం డైలాగులేనా?’
సాక్షి, తాడేపల్లి: టీడీపీ లోక్సభ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్పై చర్యలు తీసుకోకపోవడంపై వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకుని అడ్డంగా దొరికితే, పట్టుబడితే హాట్లైన్ రాజకీయాలతో బెయిల్ ఇప్పించడమే కాకుండా, షోకాజ్ నోటీసు పేరిట డ్రామా చేస్తారా? అని ప్రశ్నించింది. కోడిని కోస్తే నాన్ బెయిలబుల్ కేసు పెట్టి.. డ్రగ్స్ తీసుకునే వారిని వదిలేస్తారా? అంటూ ఘాటు విమర్శలు చేసింది.వైఎస్సార్సీపీ ట్విట్టర్ వేదికగా..‘కోడిని కోస్తే నాన్ బెయిలబుల్ కేసు పెట్టి, రాజకీయ కక్షలతో అమయాకులను రోడ్ల మీద పరేడ్ చేయించడమే కాకుండా, జైళ్లకు పంపిన మీరు, మీ పార్టీకి చెందిన లోక్సభ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకుని అడ్డంగా దొరికితే, పార్లమెంటు చరిత్రలో ఒక ఎంపీ ఇలా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే హాట్లైన్ రాజకీయాలతో బెయిల్ ఇప్పించడమే కాకుండా, షోకాజ్ నోటీసు పేరిట డ్రామా చేస్తారా?. చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్, హోం మంత్రి అనిత.. మీరు అనుసరించే చట్టం, న్యాయం, ధర్మం ఇదేనా? ఇలా చేసి సమాజానికి, యువతకు తప్పుడు సందేశం ఇస్తున్న మాట వాస్తవం కాదా?. హైదరాబాద్లో జరిగిన డ్రగ్స్ పార్టీలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పాల్గొన్నారన్నది వాస్తవం కాదా? ఆధారాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారన్నది వాస్తవం కాదా? డ్రగ్ నిర్ధారణ పరీక్షలను తారుమారు చేయడానికి యూరిన్ శాంపిల్స్లో భాగంగా యూరిన్ బదులు నీరు ఇచ్చారన్న ఆరోపణ కూడా ఉంది. చివరకు కొకైన్ తీసుకున్నట్టుగా రక్త పరీక్షల్లో పాజిటివ్గా తేలింది. ఇన్ని పక్కా ఆధారాలతో అడ్డంగా దొరికిపోయిన వ్యక్తిని ఎంపీ పదవికి రాజీనామా చేయించాల్సింది పోయి, తేలుకుట్టిన సామెత మాదిరిగా మౌనం దాల్చడం, పైగా పలుకుబడిని ఉపయోగించి, బెయిల్ మీద తీసుకురావడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. డ్రగ్స్ వ్యవహారాల్లో, మహిళలపై నేరాల విషయంలో ఎవరైనా తప్పులు చేస్తే తాటతీస్తా అని పదేపదే చెప్తున్న మాటలు కేవలం డైలాగులు మాత్రమేనని, చేతల్లో శూన్యమని, మీ అసలు రంగు ఇదేనని మరోసారి రుజువు అయ్యింది.కూటమికి చెందిన రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అత్యాచారం చేశారని, ఆపై మోసం చేశారని బాధితురాలు నేరుగా మీకే స్వయంగా ఫిర్యాదు చేసినా కమిటీల పేరుతో ఇంకా ఇంకా డ్రామా చేస్తూనే ఉన్నారు.టీడీపీకి చెందిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళమీద దారుణమైన లైంగిక దాడికి పాల్పడితే, పంచాయతీ చేశారు తప్ప నో యాక్షన్.KGBV మహిళా ప్రిన్సిపల్ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్మీద కూడా నో యాక్షన్. మహిళలకు అశ్లీలంగా వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మీద కూడా నో యాక్షన్.మహిళా ఉద్యోగి మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డ మంత్రి సంధ్యారాణి పీఏ మీద నో యాక్షన్.ఇక ప్రస్తుత టీటీడీ ఛైర్మన్, ఒక మహిళను మోసం చేసి, వీడియో, ఫొటోలతో అడ్డంగా దొరికిపోయినా నో యాక్షన్. తనను మోసం చేశాడని, ఇలాంటి వారికి ఎలాంటి పదవులు ఇవ్వొద్దని, విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని, బాధితురాలు నేరుగా మీకే లేఖ రాసినా టీటీడీ చైర్మన్లాంటి పోస్టులో పెట్టారు.కమిటీల విచారణ, షోకాజ్ నోటీసుల పేరిట చేస్తున్న డ్రామాలు ఇకనైనా కట్టిపెట్టి, డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ఎంపీ చేత తక్షణమే రాజీనామా చేయించడంతోపాటు, వీళ్లందరి మీద చర్యలు తీసుకోండి. లేకపోతే మీ పార్టీని ప్రజలు క్షమించరు’ అంటూ ఘాటు విమర్శలు చేసింది. 🚨 #TDPDrugMafiaకోడిని కోస్తే నాన్ బెయిలబుల్ కేసు పెట్టి, రాజకీయ కక్షలతో అమయాకులను రోడ్ల మీద పరేడ్ చేయించడమే కాకుండా, జైళ్లకు పంపిన మీరు, మీ పార్టీకి చెందిన లోక్సభ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకుని అడ్డంగా దొరికితే, పార్లమెంటు చరిత్రలో ఒక ఎంపీ ఇలా డ్రగ్స్… pic.twitter.com/uzpnXwd562— YSR Congress Party (@YSRCParty) March 16, 2026 -
పొట్టి శ్రీరాములును అవమానించిన వ్యక్తి చంద్రబాబు: వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ: ఏపీలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు నిధులు విడుదల చేయలేదని ప్రశ్నించారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగ ఫలితమే ఆంధ్రరాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. పొట్టి శ్రీరాములు జ్ఞాపకాలను లేకుండా చేయాలని కుట్ర చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ ఘాటు విమర్శలు చేశారు.అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలను వైఎస్సార్సీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. విజయవాడ త్రిమూర్తి చౌక్లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ నేతలు నివాళులర్పించారు. అనంతరం, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘ఆర్య వైశ్యుల చందాలతో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక అంగుళానికి 5 వేల చొప్పున వసూలు చేశారు. 158 అడుగుల ఎన్టీఆర్ విగ్రహానికి మాత్రం 17వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఎందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు.పొట్టి శ్రీరాములు రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను అర్పించారు. ఆయన ప్రాణత్యాగ ఫలితమే ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. ఆయన త్యాగాన్ని గుర్తించిన పార్టీ వైఎస్సార్సీపీ. నెల్లూరు జిల్లాకి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాం. వైఎస్సార్సీపీ హయాంలో ఆంధ్రరాష్ట్ర అవతరణ వేడుకలు మూడు రోజుల పాటు నిర్వహించాం. పొట్టి శ్రీరాములు కుటుంబ సభ్యులను సన్మానించాం. నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఒక్కసారి కూడా పొట్టి శ్రీరాములు జయంతి కానీ, ఆంధ్రరాష్ట్ర అవతరణ వేడుకలు కానీ నిర్వహించలేదు. పొట్టి శ్రీరాములుని అవమానించిన వ్యక్తి చంద్రబాబు. ఆయన జ్ఞాపకాలను లేకుండా చేయాలని కుట్ర చేసిన వ్యక్తి చంద్రబాబు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే మొదటి ఏడాది ఘనంగా అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు’ అని చెప్పుకొచ్చారు. -
పోలీసులతో మహిళలను, YSRCP నేతలను కొట్టిస్తున్న BR నాయుడు
-
తిరుపతిలో ఉద్రిక్తత.. బీఆర్ నాయుడు రాజీనామాకు డిమాండ్..
సాక్షి, తిరుపతి: తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.. తిరుపతిలోని గ్రాండ్ రిడ్జ్ హోటల్ ఉన్నారు. ఈ సందర్బంగా బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నేతలు నిరసనలకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు అత్యుత్సాహంతో వైఎస్సార్సీపీ నేతలను అరెస్ట్ చేశారు.వివరాల ప్రకారం.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఉన్న గ్రాండ్ రిడ్జ్ హోటల్ ఎదుట వైఎస్సార్సీపీ మహిళా విభాగం నేతలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం ఉదయం నిరసనలకు దిగారు. బీఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం నాయకురాలు గీత యాదవ్, సాయి కుమారి, పద్మజ, విజయ లక్ష్మీలను తిరుచానూరు పోలీసులు అరెస్ట్ చేశారు.అంతకుముందు హోటల్ ఎదుట నిరసనల్లో పాల్గొన్న వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను టీడీపీ నేత జేబీ అనుచరులు అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. ఈ సందర్బంగా తిరుపతి వైఎస్సార్సీపీ నార్త్ క్లస్టర్ అధ్యక్షుడు నవీన్పై దాడి చేయడంతో అతను గాయపడినట్టు సమాచారం. -
YSRCP లీడర్లకు భూమన సన్మానం
-
పొట్టి శ్రీరాములు గారికి వైఎస్ జగన్ నివాళి
సాక్షి,తాడేపల్లి: ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు ప్రాణత్యాగం చేసిన మహానీయుడు.. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి (మార్చి16) నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి నివాళులర్పించారు.తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక మహనీయుడు శ్రీ పొట్టిశ్రీరాములుగారు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం సాధించాలనే మహోన్నత లక్ష్యంతో ప్రాణత్యాగం చేసి చరిత్రలో అమరుడిగా నిలిచారు. ఆయన త్యాగం తరతరాలకు స్ఫూర్తి. నేడు శ్రీ పొట్టిశ్రీరాములు గారి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను.’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక మహనీయుడు శ్రీ పొట్టిశ్రీరాములుగారు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం సాధించాలనే మహోన్నత లక్ష్యంతో ప్రాణత్యాగం చేసి చరిత్రలో అమరుడిగా నిలిచారు. ఆయన త్యాగం తరతరాలకు స్ఫూర్తి. నేడు శ్రీ పొట్టిశ్రీరాములు గారి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను. pic.twitter.com/KWE9EpRC9X— YS Jagan Mohan Reddy (@ysjagan) March 16, 2026 -
బాబు ‘డ్రగుల్బాజీ’ పాలన
సాక్షి, అమరావతి/తిరుపతి మంగళం/నెల్లూరు రూరల్/ప్రొద్దుటూరు క్రైం/కాకినాడ రూరల్/ఏలూరు టౌన్: ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో దగుల్బాజీ పాలన సాగిస్తున్నారని, మత్తు పదార్థాలు, మగువలతో అధికార కూటమి నేతలు పట్టుబడుతున్నా.. ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. ఆయన పాలనలో రాష్ట్రం మాదక ద్రవ్యాలకు అడ్డాగా మారిపోయిందని, మత్తు ముఠాలు యథేచ్ఛగా దందాలు సాగిస్తున్నాయని విమర్శించారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ డ్రగ్స్ తీసుకుని పట్టుబడిన నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేతలు కురసాల కన్నబాబు, కాకాణి గోవర్ధన్రెడ్డి, రాచమల్లు శివప్రసాద్రెడ్డి, ఎస్వీ మోహన్రెడ్డి, టీజేఆర్ సుధాకర్బాబు, భూమన అభినయ్రెడ్డి, దూలం నాగేశ్వరరావు, మామిళ్లపల్లి జయప్రకాష్, కంభం విజయరాజు వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ను తప్పించేందుకు తన ఆత్మీయ సన్నిహితుడైన తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిని చంద్రబాబు రంగంలోకి దింపారని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే మత్తు పదార్థాలు లేకుండా చేస్తామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ఈ రోజు ఏం సమాధానం చెబుతారని ప్రశి్నంచారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, మత్తు పదార్థాల దందా విచ్చలవిడిగా సాగుతోందని మండిపడ్డారు. గతంలో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తనయుడు డ్రగ్స్ తీసుకుని పట్టుబడ్డారని గుర్తుచేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నప్పటి నుంచి మహిళలపై వేధింపులు ఎక్కువయ్యాయన్నారు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వంటి నేతలు రాసలీలలతో పట్టుబడినా వారిపై చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. బాబు పాలనలో టీడీపీ నేతలే ప్రధాన సూత్రధారులుగా గంజాయి దందా నడిపిస్తున్నారని మండిపడ్డారు. మద నపల్లిలో ఒక యువకుడు గంజాయి సేవించి ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి చేశాడని, కుప్పంలోనూ గంజాయి దొరికిందని విమర్శించారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో రూ.47 కోట్ల విలువైన డ్రగ్స్ దొరికినా పోలీసులేం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే డ్రగ్స్ తీసుకుని పట్టుబడిన ఏలూరు ఎంపీ చేత రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం పరువు జాతీయస్థాయిలో బజారున పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ సర్కారుతో బాబు అనైతిక బంధం కొనసాగిస్తున్నారని, తన తప్పుడు పనులు, స్కాంలు కప్పిపుచ్చుకునేందుకు ఆంధ్రరాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని దుయ్యబట్టారు. ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకునేందుకు ఇప్పటికే రాయలసీమ ఎత్తిపోతలను బాబు తాకట్టు పెట్టారని విమర్శించారు. -
‘ఇంత జరుగుతున్నా.. చంద్రబాబు నోరు విప్పరేం?’
సాక్షి, కాకినాడ జిల్లా: టీడీపీ.. తెలుగు డ్రగ్స్ పార్టీలా మారిందన్న అనుమానం ప్రజలకు వచ్చిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ పార్టీలో దొరికారు. ఇప్పటి వరకు దీనిపై చంద్రబాబు కానీ.. టీడీపీ నేతలు కానీ నోరెత్తలేదు. తెల్లవారు లేస్తే ప్రవచనాలు చెప్పే చంద్రబాబు.. డ్రగ్స్ తీసుకుని దొరికిన ఎంపీపై ఏం చెబుతారు అని మేము అడుగుతున్నాం’’ అంటూ కన్నబాబు నిలదీశారు.‘‘డ్రగ్స్ రహిత సమాజం సృష్టించాలని.. డ్రగ్స్ వద్దు బ్రో అంటూ మంత్రి లోకేష్ ఉద్యమంలా ప్రచారం చేశారు. డ్రగ్స్ వద్దని ప్రజలకు చెబుతారు కానీ.. మీ పార్టీలో వారు మాత్రం సేవిస్తూ ఉంటారు. ఎదుట వారికి చెప్పడానికే నీతులు.. మేము మాత్రం అన్ని పనులు చేస్తాం అన్నట్లు ఉంది టీడీపీ పరిస్థితి. ఒకాయన మహిళలతో రాసలీలలు.. మరోకరు డ్రగ్స్తో దొరికిన ప్రభుత్వ పరంగా ఏలాంటి చర్యలు ఉండవు. గంజాయి, డ్రగ్స్ నిర్మూలిస్తామని హోమంత్రి అనిత ప్రకటించిన పది రోజుల వ్యవధిలోనే చంద్రబాబు సొంత జిల్లాలో గంజాయి పట్టుబడింది...పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు.. తప్పుడు కేసులు కట్టడంలో బిజీగా ఉన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను గాలికి వదిలేశారు. టీడీపీ ఎంపీ డ్రగ్స్ కేసులో దొరికితే పార్టీ స్పందన ఏంటీ?. అంతకు ముందు కూటమి ఎమ్మెల్యేల బాగోతం.. తరువాత టీవీ 5 చైర్మన్ బాగోతం.. ఇప్పుడు ఏలూరు ఎంపీ బాగోతం చూస్తున్నాం’’ అంటూ కన్నబాబు దుయ్యబట్టారు. -
టీడీపీ.. తెలుగు డ్రగ్స్ పార్టీగా మారింది: టీజేఆర్
సాక్షి, తాడేపల్లి: పుట్టా మహేష్ను ఎంపీ పదవి నుంచి తొలగించాలంటూ వైఎస్సార్సీపీ నేత టీజేఆర్ సుధాకర్బాబు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ.. తెలుగు డ్రగ్ పార్టీగా మారిపోయిందన్నారు. టీడీపీ ఎంపీ మద్యం తాగుతూ డ్రగ్స్ తీసుకోవడం సిగ్గుచేటు. క్యారెక్టర్ లేని వ్యక్తులను చంద్రబాబు లోక్సభకు పంపారు. పార్లమెంట్లో అడుగుపెట్టే నైతిక హక్కు మహేష్కు లేదు’’ అంటూ టీజేఆర్ మండిపడ్డారు.‘‘రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ కేసులో దొరకటం సిగ్గుచేటు. ఎంపీ పుట్టా మహేష్ యాదవ్కు పార్లమెంటుకు వెళ్లే అర్హత లేదు. ఎంపీ మహేష్ను వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. ఎంపీ పదవి నుండి తొలగించాలి. డ్రగ్స్ నెట్వర్క్తో ఎంపీ పుట్టాకు సంబంధం ఉంది. రాజస్థాన్కి చెందిన మాజీ ఎమ్మెల్యేని డ్రగ్స్ పార్టీకి పిలవడమే ఇందుకు నిదర్శనం. టీడీపీ నేతలు బరితెగించారు...తప్పులు చేసి కూడా అయితే ఏంటంటా? అంటున్నారు. ఎంపీ పుట్టా మహేష్ అనేకమంది యువత జీవితాలను పెడదోవ పట్టించేలా వ్యవహరించారు. టీటీడీకి ఛైర్మన్గా పని చేసిన సుధాకర్ యాదవ్ కొడుకే ఎంపీ మహేష్. టీటీడీ ప్రస్తుత ఛైర్మన్ బీఆర్ నాయుడు ఇటీవలే వీడియోలతో దొరికాడు. అయినాసరే చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదు...ఇప్పుడు పుట్టా మహేష్ విషయంలో ఏం చర్యలు తీసుకుంటారు. పుట్టా మహేష్ యాదవ్ కు పార్లమెంటులోకి ప్రవేశించే అర్హత లేదు. ఆయన్ను ఎంపీ పదవి నుండి వెంటనే తొలగించాలి. గుంటూరు, విజయవాడ, అమరావతిలో ఇటీవల డ్రగ్స్, గంజాయి విపరీతంగా దొరుకుతోంది. అయినాసరే చంద్రబాబు చోద్యం చూస్తున్నారు. చంద్రబాబుకు రేవంత్, రాహుల్ గాంధీతో హాట్ లైన్ సంబంధం ఉంది. కాబట్టి రేవంత్తో మాట్కాడి పుట్టా కేసును నీరుగార్చుతారనే అనుమానం ఉంది. బీజేపీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్తో తిరుగుతున్న వ్యక్తి చంద్రబాబు. అలాంటి చంద్రబాబును ఎలా నమ్ముతున్నారో బీజేపీ, జనసేనకే తెలియాలి. రాయలసీమ లిఫ్టును కాంగ్రెస్ సీఎం అడిగాడని చంద్రబాబు ఆపేశారు. చంద్రబాబుతో సంబంధం లేకపోతే రేవంత్ రెడ్డి వెంటనే ఎంపీ మహేష్ పై చర్యలు తీసుకోవాలి. తెలంగాణ పోలీసుల నిజాయితీకి ఇది పరీక్ష. రెండు రాష్ట్రాలను డ్రగ్స్ రాష్ట్రాలుగా మార్చటం సిగ్గుచేటు’’ అంటూ టీజేఆర్ సుధాకర్బాబు మండిపడ్డారు. -
రేపల్లెలో దద్దరిల్లిన YSRCP మోహన కృష్ణ ర్యాలీ
-
ఇసుక అక్రమ తవ్వకాలపై వైఎస్సార్సీపీ కన్నెర్ర
పెళ్లకూరు: తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలో స్వర్ణముఖినదిలో ఇసుక అక్రమతవ్వకాలపై వైఎస్సార్సీపీ నాయకులు కన్నెర్ర చేశారు. మాజీ శాసనసభ్యుడు కిలివేటి సంజీవయ్య, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో శనివారం పరిసర ప్రాంతాల రైతులు, పార్టీ శ్రేణులు కలిసి ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్నారు. తవ్వకాలకు ఉపయోగించే యంత్రాలను, ఇసుక రవాణా చేస్తున్న లారీలను పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేశారు.నియోజకవర్గంలో 20 నెలలుగా టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి నెలవల సుబ్రమణ్యం ఆధ్వర్యంలో ఇసుక, మట్టి, గ్రావెల్ దోపిడీ జరుగుతోందని సంజీవయ్య ఆరోపించారు.టీడీపీ నాయకుల చర్యలతో స్వర్ణముఖినది పరివాహక గ్రామాలైన పుల్లూరు, కలవకూరు, ముమ్మారెడ్డిగుంట, చింతపూడి, రావులపాడు, పిడికిటిమాల, యడపూడి తదితర గ్రామాలకు తాగు, సాగునీరు ప్రశ్నార్థకంగా మారుతుందని మండిపడ్డారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు నన్నం ప్రిస్కిల్లా, ఎంపీపీ పోలంరెడ్డి శేఖర్రెడ్డి, రైతులు పాల్గొన్నారు. -
‘గిట్టుబాటు ధర లేక రైతులు కన్నీరు పెడుతున్నారు’
శ్రీకాకుళం: పంట పండితే కనీసం ధర ఇప్పించలేని దిక్కుమాలిన స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. పంటకు పండించేందుకు కావాల్సిన ఎరువు ఇప్పించలేని దయనీయ స్థితి ఇవాళ మన రాష్ట్రంలో నెలకొనడం నిజంగా సిగ్గుచేటన్నారు. కష్టకాలంలో రైతులకు ఆపన్నహస్తం అందించి మానవతను చాటుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడంపై ధర్మాన మీడియాతో మాట్లాడారు. ‘వెంటనే కొనుగోలు కేంద్రాలను తెరిచి మొక్కజొన్న రైతును ఆదుకోండి. కనీస మద్దతు ధర చెల్లింపునకు వెంటనే చర్యలు చేపట్టండి. కష్టకాలంలో రైతులకు ఆపన్నహస్తం అందించి మానవతను చాటుకోండి. పంటకు అవసరం అయిన యూరియా అందించడంలోనూ కూటమి ప్రభుత్వం విఫలమైంది. రైతులు యూరియాను బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. గిట్టుబాటు ధర లేక రైతులు కన్నీరు పెడుతున్నారు. ఎకరాకు 28 వేల రూపాయలు నష్టం వస్తుంది. దళారీల వల్ల మొక్కజొన్న రైతు దోపిడీ గురవుతున్నాడు. మొక్కజొన్న క్వింటాకు రెండు వేల 400 రూపాయలు చెప్పున ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. మార్కెట్లో క్వింట 1500 రూపాయలకు దళారీలు కొనడంతో రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. పంట పండితే కనీసం ధర ఇప్పించలేని దిక్కుమాలిన స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. పంటకు పండించేందుకు కావాల్సిన ఎరువు ఇప్పించలేని దయనీయ స్థితి ఇవాళ మన రాష్ట్రంలో నెలకొన్నాయి. వెంటనే కొనుగోలు కేంద్రాల ద్వారా మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని వైఎస్సార్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం’ అని అన్నారు. -
‘అప్పులపై ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోంది’
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం అరకొరగా పథకాలు అమలు చేసి అన్నీ ఇచ్చేశామని గొప్పలు చెప్పుకుంటోందని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం రూ.3.27 లక్షల కోట్ల అప్పులు చేసిందని తెలిపారు. రాష్ట్ర అప్పులపై కూటమి ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని అన్నారు.హైదరాబాద్ ప్రెస్క్లబ్లో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఆర్బీఐ నుంచి తెచ్చింది అప్పుకాదా? తాత్కాలికంగా చేసిన అప్పు తిరిగి కట్టాల్సిన పనిలేదా? రాజధాని అమరావతి కోసం రూ.47,837 కోట్ల అప్పు చేశారు. కార్పొరేషన్ల పేరుతో వేల కోట్ల రూపాయల అప్పులు చేసింది వాస్తవం కాదా? ఏ రంగాన్నీ వదిలిపెట్టకుండా చంద్రబాబు నాయుడు విచ్చలవిడిగా అప్పులు తెచ్చారు’ అని చెప్పారు. ‘వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024-25 సీఏసీ రిపోర్ట్ పై మాట్లాడారు. ఆయన మాట్లాడితే టీడీపీ నేతల్లో వణుకు ఎందుకు? సీఏసీ రిపోర్ట్ లోని అంశాలను ప్రస్తావించడమే తప్పు అన్నట్లుగా కూటమి నేతలు మాట్లాడుతున్నారు. కూటమి భాధ్యతను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తుచేశారు. టీడీపీ పుట్టిందే సినిమా బేస్ మీద. అందుకే ఎన్నికల హామీలు కూడా సినిమా టైటిల్స్ లా ఉన్నాయి.రాష్ట్రంలో గ్యాస్ కొరతతో పేదలు ఇబ్బంది పడుతున్నారు. కూటమి ప్రభుత్వం హామీ మేరకు 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలి. 2024-25లో రూ.60 వేల కోట్లు అప్పు చేశామని ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు. సీఏజీ రిపోర్ట్ ప్రకారం రూ.80 వేల కోట్లకు పైగా అప్పు చేశారు’ అని అన్నారు. -
అన్నదాత సుఖీభవ పేరుతో. చంద్రబాబు భారీ మోసం
-
వాలంటీర్ హబీబ్ కుమార్తెకు వైఎస్ జగన్ రూ.2 లక్షల ఆర్థిక సాయం
సాక్షి, విశాఖ: వాలంటీర్ హబీబ్ కుమార్తెకు వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూ.2 లక్షల ఆర్థిక సాయం చేశారు. ఆ చెక్కును హబీబ్ కుటుంబ సభ్యులకు వైసీపీ నేతలు కేకే రాజు, వాసుపల్లి గణేశ్ కుమార్ అందించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో విశాఖకు వచ్చిన సందర్భంగా ఆయనను హబీబ్ కుటుంబ సభ్యులు కలిశారు.అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తెను ఆదుకోవాలని హబీబ్ విజ్ఞప్తి చేశారు. చిన్నారిని చూసి రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో తన కుమార్తెకు ఆరోగ్య శ్రీ ద్వారా వైద్య సాయం అందించారని హబీబ్ గుర్తు చేసుకున్నారు. -
పోలీసుల అండతో జనసేన జెండా దిమ్మ ఏర్పాటు.. ఇచ్చిపడేసిన పేర్ని నాని, పేర్ని కిట్టు
-
నా ఇంటికి వచ్చిన వాళ్ళని తోసేస్తావా.. పోలీసులపై పేర్ని నాని ఉగ్రరూపం
-
పోలీస్ VS పేర్ని నాని.. స్ట్రాంగ్ వార్నింగ్
-
ఛీ ఛీ సిగ్గుండాలి.. BR నాయుడు వీడియోపై లక్ష్మీ పార్వతి రియాక్షన్
-
ఏపీలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయి: లక్ష్మీపార్వతి
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్లో మహిళలపై జరుగుతున్న దారుణాలపై వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. తాడేపల్లిలో లక్ష్మీపార్వతి మీడియా సమావేశంలో మాట్లాడారు. కూటమి అధికారంలోకి వచ్చాక మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని చెప్పారు. హహిళలపై ఎమ్మెల్యేలే అత్యాచారాలు చేస్తున్నారని ఆమె అన్నారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలాంటి వ్యక్తిని టీటీడీ ఛైర్మన్గా నియమించారో అందరికీ తెలుసని లక్ష్మీపార్వతి విమర్శించారు. వైఎస్సార్సీపీ హయాంలోనే మహిళలకు న్యాయం జరిగిందని ఆమె అన్నారు. చంద్రబాబు నాయుడు సిగ్గుమాలిన నాయకుడని ఆమె మండిపడ్డారు. ‘రాష్ట్రం అత్యాచారాల ఆంధ్రప్రదేశ్ గా మారిపోయింది. కొందరు ఎమ్మెల్యేలు కూడా మహిళలపై దారుణాలకు పాల్పడటం సిగ్గుచేటు. పాపాలను పంచుకోవటంలో జనసేన కూడా భాగం పంచుకుంటోంది. పోలీసులను పనికిమాలిన వారిగా మార్చేశారు. కిరణ్ రాయల్, అరవ శ్రీధర్, కోనేటి ఆదిమూలం, నసీర్ అహ్మద్, కూన రవికుమార్.. ఇలా చెప్పుకుంటే ఎంతోమంది మహిళలను వేధించారు. దేవుడే లేడన్న చంద్రబాబు సీఎం అయ్యారు. పూజ దీపం దగ్గర సిగరెట్ ముట్టిస్తాడంటూ తన తండ్రి గురించి చెప్పిన పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. ఇలాంటి వారి చేతిలో రాష్ట్రం అధోగతి పాలవుతోంది. మహిళలకు అన్యాయం చేసిన వారు ఏమయ్యారో చరిత్ర చూస్తే తెలుస్తుంది. చంద్రబాబు మహిళలను అడ్డం పెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పుడు మేకతోలు కప్పుకుని స్తోత్రాలు మాట్లాడవద్దు.టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడి వీడియోలు బయటకు వస్తే ఏం చర్యలు తీసుకున్నారు? ఒక మహిళ స్వయంగా లేఖ రాసినా చంద్రబాబు ఎందుకు పట్టించుకోలేదు? దేవునితో కూడా ఆటలు ఆడుకోవటం సరికాదు. జగన్ హయాంలో దిశ యాప్, దిశా పీఎస్ లు ఏర్పాటు చేసి మహిళలకు రక్షణ కల్పించారు. ఇలాంటి మేలు చేయటం చంద్రబాబు చరిత్రలో లేదు. ప్రజలు ఎంత అసహ్యించుకుంటున్నారో బయటకు వస్తే తెలుస్తుంది. ఆడపిల్లలను స్కూల్కి పంపాలన్నా కూడా ఇప్పుడు పేరెంట్స్ భయపడుతున్నారు. -
‘చంద్రబాబు సర్కార్ అప్పుల్లో రికార్డులు సృష్టిస్తోంది’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: సుదీర్ఘ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు.. ఆ అనుభవాన్ని రాష్ట్ర శ్రేయస్సు కోసం ఉపయోగించడం లేదంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు తన అనుభవాన్ని ఊరారా తప్పుడు ప్రచారాన్ని చేయడానికే వినియోగిస్తున్నారంటూ దుయ్యబట్టారు.‘‘దేశంలో నాకంటే సీనియర్ లేడని చెప్పుకునే చంద్రబాబు.. అబద్ధాలపైనే బతకాల్సిన పరిస్థితి. ఇతరుల వ్యక్తిత్వాన్ని హననం చేసి ఓటుగా మార్చుకోవాలని చంద్రబాబు చూస్తాడు. అందుకే ఇన్నాళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా చెప్పుకోడానికి ఏమీ లేని పరిస్థితి. ఆధారాలు లేకుండా తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు అన్నాడు. వైఎస్సార్సీపీని మిగిలిన వారికి దూరం చేయాలని దుష్ప్రచారానికి దిగాడు. సుప్రీం కోర్టు చెప్పినా ఇంకా అదే దుష్ప్రచారాన్ని చేస్తూనే ఉన్నాడు...చివరికి మండలి చైర్మన్ కులాన్ని ప్రశ్నించే స్థాయికి మీ పార్టీ దిగజారింది. లడ్డూ విషయంలో చంద్రబాబు ప్రపంచ వ్యాప్తంగా పరువు పోగొట్టుకున్నాడు. మా నాయకుడు వైఎస్ వివేకా అంశంలోనే ఇదే తరహా రాజకీయం చేశాడు. ఆ కుటుంబంలో చిచ్చు పెట్టడం కోసం కుటిల రాజకీయం చేశాడు. పాశవికంగా చంపిన వారీని దగ్గర పెట్టుకుని విషప్రచారం చేశాడు. నేడు సుప్రీం కోర్టులో వాస్తవలేంటి అనేది అందరికీ తెలిసిపోయింది. చంపిన వారు చంద్రబాబు ప్రభుత్వంలో సెటిల్మెంట్లు చేసుకుంటున్నాడు..ఆనాడు 14 లక్షల కోట్ల అప్పు అన్న వ్యక్తి.. ఇప్పుడు 3 లక్షల కోట్లు మాత్రమే అంటున్నాడు. నేడు రెండేళ్లలోనే మా ఐదేళ్లలో చేసిన అప్పులు చేశాడు. ఎవరు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచింది ఎవరో ప్రజలు గమనించాలి. అన్ని అంశాల్లో మోసంతోనే కాలం వెళ్లదీస్తున్నారు. నిరుద్యోగ భృతి నుంచి సూపర్ సిక్స్ గురించే కేటాయింపులు లేవు. చివరికి కేబినెట్పై కూడా పట్టు కోల్పోతున్నారు. పవన్ కళ్యాణ్ నిన్నటి కేబినెట్ మీటింగ్కు రాలేదు. పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ ధరలు పెంచుకునే బిజీలో ఉన్నాడు. రాష్ట్రంలో రైతులు నానా తంటాలు పడుతుంటే వీళ్లు సినిమా ప్రమోషన్లో ఉన్నారు..గత ఏడాది రైతులు అన్ని విధాల మోసం పోయారు. మళ్ళీ ఈ ఏడాది కూడా అదే తీరు. అన్నీ నేనే చేశాను అంటాడు. ఒక్క ప్రాజెక్ట్ డిజైన్ అయినా నువ్వు చేసావా బాబు..?. నేడు రాయలసీమ లిఫ్ట్ ఫణంగా పెట్టిన నువ్వు రాయలసీమను ఉద్ధరిస్తావా?. ఇన్ని రకాలుగా మా కడుపు కొడుతున్న నీకు దేవుడు కచ్చితంగా మొట్టికాయలు వేస్తాడు. నేడు పాలల్లో, నెయ్యిలో ఎక్కడ చూసినా అన్నిటా కల్తీ. ఇందాపూర్ ద్వారా హెరిటేజ్ నెయ్యి సప్లై చేసి కోట్లు కొల్లగొట్టవ్. హెరిటేజ్కి ఎన్ని రాయితీలు తీసుకున్నావో ప్రజలు గమనిస్తున్నారు. అప్పుడు, ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు. వివేకా కేసులో విచారించి వాస్తవాలెంటో తేల్చండి. ఎవరు తప్పు చేసినా మీరే చర్యలు తీసుకోండి’’ అంటూ శ్రీకాంత్రెడ్డి పేర్కొన్నారు. -
పోలీసుల ఓవరాక్షన్.. పేర్ని నాని ఇంటి వద్ద ఆంక్షలు
సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కోసం పేర్ని నాని ఇంటి వద్ద ఆంక్షలు విధించారు. పేర్ని నాని ఇంటికి ఎవరినీ రాకుండా పోలీసులు మోహరించారు. పేర్ని నాని ఇంట్లో పనివారిని కూడా రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. పేర్ని నాని ఇంటి వద్దే కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయం ఉండగా.. పార్టీ కార్యాలయంలో పనిచేసే సిబ్బందిని కూడా పోలీసులు వెళ్లనివ్వలేదు.పేర్ని నాని ఇంటికి వెళ్లే మార్గాన్ని బారికేడ్లతో పోలీసులు మూసేశారు. వైఎస్సార్సీపీ కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్ను పోలీసులు తోసేశారు. పోలీసుల తీరుపై పేర్ని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్షన్ 30 అమలులో ఉందంటూ పోలీసులు వింత సమాధానం ఇచ్చారు. జనసేన కార్యక్రమానికి వర్తించని సెక్షన్ 30.. తమకు ఎలా వర్తిస్తుందని పోలీసులను పేర్ని నాని నిలదీశారు. సెక్షన్ 30 ఆర్డర్ చూపించమంటూ పేర్ని నాని ప్రశ్నించారు. -
రెచ్చగొడుతున్న జనసైనికులు.. అర్ధరాత్రి ఉద్రిక్తత
-
ఎక్కువ తక్కువ మాట్లాడావంటే ఇంటికొచ్చి చెప్పుతీసి కొడతాం..
-
మీ రూ.3.27 లక్షల కోట్ల అప్పులకు లెక్కలివిగో: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: ఇరవై నెలల కూటమి పాలనలో కేవలం రూ.1.05 లక్షల కోట్ల అప్పులే చేశామని, ఏనాడూ నెట్ బారోయింగ్ సీలింగ్ (ఎన్బీసీ) అధిగమించలేదని చెబుతున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కి ఇవే మాటలను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శితో రాయించి అధికారికంగా ప్రకాటన విడుదల చేసే దమ్ముందా అంటూ కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని పేర్ని వెంకట్రామయ్య (నాని) సవాల్ చేశారు.తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి అధికారంలోకి వచ్చాక రూ.3.27 లక్షల కోట్ల అప్పులు చేసినట్టు పేర్ని నాని కాగ్ లెక్కలతో వివరించారు. ఎన్బీసీ దాటి అప్పులు చేయలేదని పయ్యావుల పచ్చి అబద్దం చెప్పాడని కాగ్ వెబ్సైట్ సాక్షిగా ఆయన నిరూపించారు. మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పినట్టు కూటమి అప్పులు రూ. 1.05 లక్షల కోట్లని వారం రోజుల్లో నిరూపించలేకపోతే అబద్ధాల కేశవ్ అని నేమ్ బోర్డు మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. రాష్ట్ర అప్పులపై అసెంబ్లీ, మండలిలో తప్పుడు సమాచారం ఇచ్చిన సంబంధిత అధికారులపై డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ), మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ మంత్రి అయిన ప్రధానికి ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు. చంద్రగిరిలో ఉన్న చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్ యూనిట్లో మెషినరీ అప్గ్రడేషన్ కోసం ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై ఆయన మండిపడ్డారు. దీనివల్ల రాష్ట్ర ప్రజలకు ఏం ప్రయోజనం ఉంటుందని ప్రశ్నించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..అప్పుల మంత్రి, అబద్ధాల కేశవ్రాష్ట్ర అప్పులపై పచ్చి అబద్ధాలతో వైఎస్ జగన్ మీద మరోసారి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తప్పుడు ప్రచారానికి పూనుకున్నాడు. పేరుకి ఆర్థికశాఖ మంత్రేకానీ నోటి మాటలతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడే ఆయన, తాను చేసిన ఆరోపణలు ఏ ఒక్కదానికీ ఆధారాలు చూపించే ధైర్యం చేయలేదు. ఈ అబద్ధాల అప్పుల మంత్రి ఏ ఒక్కరోజూ డాక్యుమెంట్ ఎవిడెన్స్తో మాట్లాడలేదు. వైఎస్ జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందనడానికి ఆయన దగ్గరున్న ఆధారాలుంటే చూపించాలి కదా. వైఎస్ జగన్ ప్రెస్మీట్లో చెప్పినవన్నీ అబద్ధాలని తేల్చేసిన పయ్యావుల.. ఏయే అంశాలు అబద్ధాలు చెప్పారు, వాటికి సంబంధించి నిజమైన ఆధారాలు దగ్గరుంటే బయటపెట్టాలి.మీ రూ.3.27 లక్షల కోట్ల అప్పులకు లెక్కలివిగో20 నెలల పాలనలో మా ప్రభుత్వం చేసింది కేవలం రూ.1.05 లక్షల కోట్ల అప్పేనని, కానీ వైయస్ జగన్ గారు రూ. 3.20 లక్షల కోట్ల అప్పులు చేసినట్టు చెప్పారని పయ్యావుల చెబుతున్నాడు. కానీ కరెక్టుగా చెప్పాలంటే ఆ అప్పు రూ. 3,27,370.37 కోట్లు. (రూ. 3.27 లక్షల కోట్లు). కాగ్ లెక్కల ప్రకారం 2024-25లో బడ్జెట్ బారోయింగ్స్ రూ.81,082.51 కోట్లని వెబ్సైట్లో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ దానికి పయ్యావుల మాత్రం రూ.69 వేల కోట్లేనని పచ్చి అబద్ధం చెబుతున్నాడు. ఏప్రిల్ 1, 2025 నుంచి 2026 జనవరి 31నాటికి బడ్జెట్ బారోయింగ్స్ రూ. 87,674.04 కోట్లని కాగ్ వెబ్సైట్ చెబుతోంది.అంటే, ప్రత్యక్షంగా ప్రభుత్వం నుంచి తీసుకున్న అప్పులు రూ. 1.70 లక్షల కోట్లు. ప్రభుత్వ గ్యారెంటీ ఇచ్చి వివిధ కార్పోరేషన్ల ద్వారా తీసుకొచ్చిన అప్పులు మరో రూ. 89,026.82 కోట్లు. ఇవేకాకుండా ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ బాండ్ల ద్వారా రూ.11,850 కోట్లు. ఫిబ్రవరి 2026, మార్చిలో ఎస్డీఎల్ బాండ్స్ ద్వారా రూ. 9,900 కోట్లు అప్పులు తెచ్చారు. మొత్తం 20 నెలల్లో కూటమి ప్రభుత్వం తెచ్చిన అప్పు రూ.3,27,370.37 కోట్లు. ఇవన్నీ రాష్ట్ర ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులు.అప్పులు రూ.1.05 లక్షల కోట్లేనని లేఖ ఇప్పించు..వైయస్సార్సీపీ ప్రభుత్వం రూ.9.74 లక్షల కోట్ల అప్పులను వారసత్వంగా ఇచ్చిందని చెబుతున్న పయ్యావుల కేశవ్.. ఇదే మాటను రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శితో రాయించి స్టేట్మెంట్ రిలీజ్ చేసే దమ్ముందా? మంత్రి మాట్లాడింది అబద్ధం కాదని, రెండేళ్లలో కూటమి ప్రభుత్వం చేసిన అప్పులు కేవలం రూ. 1.05 లక్షల కోట్లేనని వారం రోజుల్లో రాయించి ప్రభుత్వం తరఫున అధికారికంగా ఇవ్వగలరా? ఇవ్వలేకపోతే పయ్యావుల కేశవ్ ఛాంబర్ బయట అబద్దాల కేశవ్ అని పేరు మార్చుకోవాలని ఛాలెంజ్ విసురుతున్నా.నెట్ బారోయింగ్ ఎక్కడా మా ప్రభుత్వం అధిగమించలేదని పయ్యావుల మరో అబద్ధం చెప్పాడు. రాష్ట్ర జీఎస్డీపీ మీద 3 శాతం నెట్ బారోయింగ్ దాటి అప్పులు చేసినట్టు కాగ్ వెబ్సైట్లో చెప్పింది. ఏపీ ప్రభుత్వం 2024 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు ఎక్కడా నెట్ బారోయింగ్ అధిగమించలేదని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శితో ప్రభుత్వం తరఫున స్టేట్మెంట్ ఇప్పించే ధైర్యం పయ్యావులకు ఉందా? అసెంబ్లీ, కౌన్సిల్లో అప్పులపై తప్పుడు లెక్కలు రాసి ఇచ్చారో ఆ అధికారులందరిపై డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ మంత్రి అయిన ప్రధాని మోడీ గారికి ఫిర్యాదు చేస్తాం.ఎమ్మెల్యే బాధితురాలికి నేరం జరిగిందా?నిందితులను బాధితులుగా చేర్చడమే వైయస్ జగన్ పరిపాలన అంటాడు.. కూటమి ప్రభుత్వంలో రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే ఒక మహిళకు మాయమాటలు చెప్పి వివాహం చేసుకుంటానని నమ్మించి వేధించి పలుమార్లు అబార్షన్లు చేయిస్తే.. ఆమెకు మీ ప్రభుత్వం ఏం న్యాయం చేసిందో చెప్పాలి. మహిళలకు అన్యాయం చేసిన వాడికి అదే ఆఖరి రోజు అని పదే పదే చెప్పుకుని తిరిగే సీఎం చంద్రబాబు.. ఆ బాధిత మహిళకు ఏం న్యాయం చేశాడు? మీ ముఖ్యమంత్రి, మీ ఉప ముఖ్యమంత్రి, మీ మంత్రి లోకేష్లను కలిసి మొర పెట్టుకుంటే ఆమె జరిగిన న్యాయం ఏంటి? ఆ కూటమి ఎమ్మెల్యేని శిక్షించకపోగా తిరిగి ఆమె మీదనే కేసులు పెట్టి వేధించింది మీరు కాదా? ఆ కేసులను చూసి హైకోర్టు చీవాట్లు పెట్టలేదా? బాధితులను వేధించింది మీరు కాదా?హెరిటేజ్ మెషినరీ అప్గ్రేడ్ కోసం రూ.200 కోట్లు హెరిటేజ్ వ్యాపారం తన కుటుంబ సభ్యులు జీవనోపాధి కోసం చేస్తున్నారని, వారు ఏనాడూ ప్రభుత్వ టెండర్లలో పాల్గొనలేదని చంద్రబాబు అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు చెప్పాడు. ఎప్పుడెప్పుడు టెండర్లలో పాల్గొన్నారు. నెయ్యితో పాటు టెండర్లలో ఏవేవీ సప్లై చేశారు? ఎల్ -3 గా ఎప్పుడు వచ్చారు. 2 వేల కేజీల పాల పొడిని ఏ రేటుకు సప్లై చేశారు వంటి అన్ని వివరాలు ఆయన మాట్లాడిన కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయన అబద్ధం చెప్పాడని ప్రజలే తేల్చేశారు. అవేకాదు.. టీటీడీ సొమ్ము దోచుకోవడానికి హెరిటేజ్ డెయిరీ సిండికేట్ చేసిన దారుణాలు కూడా అన్ని వెలుగులోకి వచ్చాయి. ఇదంతా దేవుడి మహిమ. చంద్రబాబు పాపాలను దేవుడే దగ్గరుండి బయటపెట్టిస్తున్నాడు.ఇది కాకుండా ఈరోజు కేబినెట్లో చంద్రగిరి ప్రాంతంలో ఉన్న హెరిటేజ్ డెయిరీలో రూ. 200 కోట్లతో మిషనరీ అప్గ్రేడ్ కోసం ఇండస్ట్రియల్ పాలసీలో ఇచ్చే రాయితీలు కాకుండా టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్ సిద్ధం చేసి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా కొత్తగా 35 మందికి ఉద్యోగాలిస్తారట. నా జీవితం తెరిచిన పుస్తకం అని చెప్పుకునే చంద్రబాబు కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎందుకు దాచిపెట్టారు? దీనివల్ల రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం ఏమిటని అడిగితే ఫ్లేవర్డ్ పాలు 131 శాతం అదనంగా ఉత్పత్తి జరుగుతుందని చెబుతున్నారు. పన్నీరు 400 శాతం అదనంగా వస్తుందట. వాటి వల్ల ప్రయోజనం ప్రజలకా? లేక హెరిటేజ్కా? పైగా ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 పేరుతో హెరిటేజ్కి భారీ రాయితీలు ప్రకటించారు. కరెంట్ యూనిట్కి రూపాయి తగ్గింపు. ఐదేళ్లపాటు 100 శాతం జీఎస్టీ రీయింబర్స్మెంట్ ఇచ్చారు.బీఆర్ నాయుడితో రాజీనామా చేయించలేరా?టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడి అశ్లీల వీడియో బయటకొచ్చినా ఆయనతో ఇప్పటివరకు రాజీనామా చేయించని చంద్రబాబుకి దేవుడంటే భయం, భక్తి ఉందని ఎలా అనుకోవాలి? వీడియో బయటకొచ్చిన తర్వాతైనా పశ్చాత్తాపం చెందకుండా అంతలా బరితెగించి మాట్లాడుతున్న బీఆర్ నాయుడిని వెనకేసుకు రావడం సిగ్గుచేటు. టీటీడీ చైర్మన్కి ఉన్న పాత బాగోతాలను ఆపాదించవచ్చా అని ప్రశ్నిస్తున్న ఎల్లో మీడియాకి నా సూటి ప్రశ్న.. అలాంటి బాగోతాలున్న వ్యక్తిని దేవుడి సేవకు వాడటం కరెక్టా? ఇలాంటి బాగోతం గురించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్కి తెలిసే టీటీడీ చైర్మన్గా నియామకం జరిగిందని బాధితురాలి లేఖల ద్వారా ప్రపంచానికి తెలిసింది. అయినప్పటికీ ఆయన్ను చైర్మన్గా నియమించారు. వీడియోలు బయటకొచ్చినప్పుడైనా నిఆయనతో రాజీనామా చేయించి టీటీడీ ప్రతిష్ట కాపాడాలని అనిపించలేదా? లోకేష్ పాపానికి హెడ్ మాస్టర్ బలి రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగోలేదని రోజూ పేపర్ల నిండా వార్తలు, సోషల్ మీడియా నిండా వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. కానీ ఏనాడూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించలేదు. రెండేళ్లుగా ఈ సమస్య ఉన్నా నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించడానికి ఆయన ఏనాడూ ప్రయత్నించలేదు. పిల్లల ఆవేదన ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు. దేశాలు దాటి క్రికెట్ మ్యాచ్లు చూడటంపైన ఆయనకున్న శ్రద్ధ పిల్లలకు మంచి భోజనం పెట్టడం పైన లేదు.మధ్యాహ్న భోజనం బాగోలేదని మైలవరం తారకరామ నగర్ పాఠశాల హెచ్ఎం డ్రామా చేశాడని ఆంధ్రజ్యోతిలో వార్త రాస్తే, హెచ్ఎం బాధ్యత లేకుండా ప్రవర్తించాడన్న కారణంతో డీఈవో ఆయన్ను సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకున్నారు. కానీ వాస్తవానికి వంట బాగోలేదని ఎన్నోసార్లు విద్యార్థులు పోరు పెడుతున్నట్టు హెచ్ఎం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. ఎంక్వయిరీకి వెళ్లిన అధికారుల ముందు అన్నం బాగుండటం లేదని విద్యార్థులు ఏడుస్తూ చెప్పిన మాటలను కూడా ఈ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు? సోషల్ మీడియా దెబ్బకి నారా లోకేష్ వైఫల్యం గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగడంతో హెడ్ మాస్టర్ను బలి తీసుకున్నారు. ఇంతకన్నా దారుణం ఇంకోటి ఉంటుందా? విద్యాశాఖను నిర్వహించడం చేతకానప్పుడు ఏశాఖా లేని మంత్రి పదవి తీసుకుని లోకేష్ బయట తిరుగుతూ ఎంజాయ్ చేసినా విద్యార్థులకు మేలు చేసిన వాడవుతాడని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. -
జగన్ విలువ ఇప్పుడు తెలుస్తుంది.. YSRCP పేరు వింటేనే బాబుకు గజ గజ
-
ఊరూ వాడా ఘనంగా 16 ఏళ్ల పండుగ
సాక్షి నెట్వర్క్: ఆవిర్భావం నుంచి ప్రతి అడుగులోనూ విలువలు, విశ్వసనీయతతో రాజకీయ రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ వేడుకలు గురువారం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో ఘనంగా జరిగాయి. రాష్ట్రంలో గ్రామాల్లోనూ పండుగలా కార్యక్రమం కొనసాగింది. ప్రజా సంక్షేమం కోసం పురుడు పోసుకున్న పార్టీ జెండాను రాష్ట్రవ్యాప్తంగా ఊరూ వాడా పండుగ వాతావరణంలో కార్యకర్తలు, నేతలు, అభిమానుల కోలాహలం నడుమ ఎగురవేసి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయాల్లో పూజలు చేశారు. రక్తదాన, వైద్య శిబిరాలు నిర్వహించి సేవా సందేశాన్ని చాటారు. ఆస్పత్రుల్లో పండ్లు పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. కేక్లు కట్ చేసి కోట్ల మంది సంబరాన్ని పంచుకున్నారు.వైఎస్సార్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ పతాకాలను ఆవిష్కరించారు. ఉరిమే ఉత్సాహంతో బైక్ ర్యాలీలు.. జై జగన్.. జై వైఎస్సార్సీపీ నినాదాలతో హోరెత్తించారు. పార్టీ జెండా రెపరెపల నడుమ తమ గుండె చప్పుడు వైఎస్సార్సీపీ అని చాటి చెప్పారు. పలుచోట్ల వైఎస్ జగన్ హయాంలో అమలైన నవరత్నాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ఫ్లెక్సీలను ప్రదర్శించారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రజా ప్రతిని«ధులు, సీనియర్ నేతలు, నాయకులు, కార్యకర్తలతో పాటు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. నల్లకాలువలో వైఎస్ జగన్ ఇచ్చిన మాట కోసం 2011 మార్చి 12న పుట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనే కాదు.. దేశ రాజకీయాల్లోనే సంచలనం సృష్టించిందని గుర్తు చేసుకున్నారు.వైఎస్ జగన్ తన ఐదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేశారని చెప్పారు. అబద్ధపు హామీలతో మోసగించి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి సర్కారును తరిమికొట్టేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన నిరంతరం పోరాటం కొనసాగిస్తామని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని స్పష్టం చేశారు. పులివెందుల బాకరాపురంలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో నేతలు పార్టీ జెండాను ఆవిష్కరించారు. కాగా, న్యూఢిల్లీ, తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల ఈ కార్యక్రమాన్ని పార్టీ అభిమానులు ఘనంగా నిర్వహించారు.ఢిల్లీలో వైఎస్సార్సీపీ సంబరాలుసాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవాలు ఢిల్లీలో గురువారం ఘనంగా జరిగాయి. పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, అరకు ఎంపీ డాక్టర్ గుమ్మ తనూజారాణి కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. విలువలు, విశ్వసనీయతకు అర్థం చెబుతూ వైఎస్సార్సీపీ ఆవిర్భవించిందని ఎంపీలు పేర్కొన్నారు.తెలంగాణలో ఘనంగా వైఎస్సార్సీపీ ఆవిర్భావ వేడుకలుకూకట్పల్లి/అల్వాల్/ఖమ్మం మయూరి సెంటర్: వైఎస్సార్సీపీ ఆవిర్భావ వేడుకలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. పార్టీ నాయకులు, అభిమానులు గురువారం కేక్ కట్చేసి వేడుకలు నిర్వహించారు. మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలోని రమ్యా గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అరి్పంచారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. కూకట్పల్లి, నేరేడ్మెట్ ఆర్కేపురం, ఖమ్మంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. -
వైఎస్సార్సీపీ.. 'కోట్లాది మంది అభిమానులది': వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: విలువలతో కూడిన రాజకీయాలు మర్చిపోయి ఉన్న పరిస్థితుల మధ్య.. విలువలు, విశ్వసనీయత అనే పదాలకు అర్థం చెబుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టుక, ఆ తర్వాత ఎదుగుదల కొనసాగిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుర్తు చేశారు. ‘‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక్క జగన్ది మాత్రమే కాదు.. కొన్ని కోట్ల మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులది.. వైఎస్సార్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న నా కుటుంబ సభ్యులది అని నేను గర్వంగా చెబుతున్నా..’’ అని స్పష్టం చేశారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భారీ ఎత్తున కార్యకర్తలు, అభిమానులు, నాయకులు తరలిరావడంతో పార్టీ కేంద్ర కార్యాలయం జనసంద్రంగా మారింది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలు సమర్పించి నివాళులర్పించిన అనంతరం వైఎస్ జగన్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నేతలు, నాయకులు, కార్యకర్తలతో పాటు పెద్ద ఎత్తున పార్టీ అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున తరలి వచ్చిన పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులనుద్దేశించి వైఎస్ జగన్ ఏమన్నారంటే.. నల్లకాలువలో ఇచ్చిన మాటతో..మన పార్టీ ఆవిర్భవించి ఈరోజుకు 15 ఏళ్లు పూర్తయింది. 2011 మార్చి 12న పుట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దేశంలోనే ఒక మార్క్గా నిల్చింది. రాష్ట్రంలోనే కాదు, దేశ రాజకీయాల్లోనే ప్రబలంగా మన పార్టీ కనిపిస్తోంది. 15 సంవత్సరాల క్రితం పార్టీ ఎలాంటి పరిస్థితుల్లో పుట్టింది అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే.. ఆరోజు నల్లకాలువలో ఇచ్చిన ఒక మాట, మన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపన, ఎదుగుదలకు కారణమైంది. ఆ ఒక్క మాట నా కుటుంబ పరిస్థితుల్ని మార్చింది. రాష్ట్రం దశ, దిశ మార్చింది. ఆ ఒక్క మాట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంకురార్పణకు శ్రీకారం చుట్టింది. కాలర్ ఎగరేసుకుని గర్వంగా చెప్పుకునేలా పార్టీ అడుగులు వేస్తుంది..ఆరోజు జగన్ అనే వాడు ఒకే ఒక్కడు... కానీ జగన్ ఏనాడూ భయపడలేదు. ఆరోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ, దేశంలోనూ అధికారంలో ఉంది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలిసి కుట్రలు, కుతంత్రాలు పన్నిన పరిస్థితి చూశాం. కానీ, జగన్ ఏనాడూ భయపడలేదు. కారణం జగన్కు నమ్మకం ఉన్నది పైన ఉన్న దేవుడు, కింద ఉన్న మీమీద మాత్రమే అని గర్వంగా చెబుతా. నేను నమ్ముకున్న నా ప్రజలు, నేను నమ్ముకున్న నా దేవుడు.. ఇద్దరూ తోడుగా ఉండి నన్ను నడిపించారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విలువలు, విశ్వసనీయతకు ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని, నాతో పాటు నడిచే ప్రతి కుటుంబ సభ్యుడు కూడా కాలర్ ఎగరేసుకుని.. అదిగో అతడే మా నాయకుడు, అదిగో అదే మా పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని గర్వంగా చెప్పుకునేలా పార్టీ అడుగులు వేస్తుందని మరొక్కసారి మీ అందరికీ వినమ్రంగా, వినయపూర్వకంగా చెబుతున్నా. మీ అందరి ప్రేమాభిమానాలకు మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. వైఎస్సార్ను అభిమానించే ప్రతి గుండెకు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడికి, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వైఎస్సార్ను ప్రేమించే ప్రతి గుండె ఏ రాష్ట్రంలో ఉన్నా, ఆ ప్రతి గుండెకు ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. -
18న వైఎస్సార్సీపీ ఇఫ్తార్ విందు
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీన ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో జరిగే ఈ కార్యక్రమంలో మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొంటారని ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తెలిపారు. అవినాష్, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రుహుల్లా తదితరులు గురువారం ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముస్లిం మైనార్టీలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఏటా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో మైనార్టీలకు అన్ని విధాలా అండగా నిలిచి మేలు చేశారని చెప్పారు. -
‘చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే ఆలయాల్లో అపచారాలు’
తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం వల్లే ఆలయాల్లో అపచారాలు జరుగుతున్నాయని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. టీటీడీ లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు విష ప్రచారం తర్వాత రాష్ట్రంలోని ఆలయాల్లో అనేక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయన్నారు.ఈరోజు(గురువారం, మార్చి 12వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన మల్లాది విష్ణు.. కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘ చంద్రబాబు నిర్లక్ష్యం కారణంగా ఆలయాలకు వెళ్లిన భక్తులు క్షేమంగా తిరిగి వస్తారో లేదో అనే అనుమానం కలుగుతోంది. దసరా సమయంలో కనకదుర్గ ఆలయంలో విద్యుత్ సరఫరా నిలిపేసిన చరిత్ర కూటమి ప్రభుత్వానిది. ఆలయాల్లో జరుగుతున్న అపచారాలపై ఎన్నిసార్లు ప్రశ్నించినా ప్రభుత్వంలో స్పందన లేదు.శ్రీశైలంలో శివభక్తులపై లాఠీచార్జ్ చేసిన చరిత్ర కూటమి ప్రభుత్వానిదే. గతంలో ఆలయాల్లో ఇలాంటి అపశృతులు జరగలేదు. తిరుమల పరకామణిలో కోటి విలువైన బంగారం చోరీ కేసును సీరియస్గా తీసుకోలేదు. కూటమి ప్రభుత్వంలో ఆలయాల్లో విపరీతంగా అపచారాలు జరుగుతున్నాయి. చివరకు దేవునికి కూడా సరైన నైవేద్యం కూడా పెట్టటం లేదు.కోటప్పకొండ ఆలయంలో నాసిరకం ప్రసాదాలు పెట్టి అపచారం చేశారు. ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా?, పంచారామాలలో సైతం అపచారాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. బీఆర్ నాయుడు రాసలీల వీడియోలు బయటకు వచ్చాయి. అయినాసరే చంద్రబాబు ఎందుకు రాజీనామా చేయించలేదు?, పైగా నిస్సిగ్గుగా ఎదురుదాడి చేస్తారా?, హిందూ ధర్మాన్ని కాపాడే వారైతే కచ్చితంగా బీఆర్ నాయుడుతో రాజీనామా చేయించాలి’ అని డిమాండ్ చేశారు. -
అయ్యా TV5 సాంబా మీ సార్ కు ఏడు కొండలు గుర్తు రావడం లేదా? BR నాయుడు మిస్సింగ్...
-
YS Jagan: మీరే నా ధైర్యం, బలం
-
YSRCP ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
-
ఘనంగా వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
రాష్ట్రంలో వైఎస్సార్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. -
YSRCP ఆవిర్భావ దినోత్సవ వేడుకల గురించి MLC కళ్యాణి
-
తాడేపల్లి : వైఎస్సార్సీపీ ఆవిర్భావ వేడుకల్లో వైఎస్ జగన్ (ఫొటోలు)
-
నా ధైర్యం మీరే .. నా బలం మీరే : వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు, నాయకులకు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు పేరునా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ‘నా ధైర్యం మీరే…నా బలం మీరే…నాన్న గారి ఆశయ సాధన కోసం స్థాపించిన మన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, నన్ను మీరు గుండెల్లో పెట్టుకున్నారు, భుజాలపై మోస్తున్నారు. కష్టకాలంలో వెనక్కి తగ్గకుండా పార్టీ కోసం నిలబడుతున్నారు. పార్టీపై నమ్మకం పెట్టుకుని, నాపై నమ్మకం ఉంచి పార్టీ కోసం నిలిచిన మీరే మన పార్టీకి అసలైన బలం.. నా బలం. మన పార్టీ ప్రస్థానం కేవలం ఒక రాజకీయ ప్రయాణం మాత్రమే కాదు…ఒక లక్ష్యంతో లక్షలాది మంది కార్యకర్తల కష్టం, నమ్మకం, త్యాగాలకు నిలువెత్తు సాక్ష్యం. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు, నాయకులకు పేరు పేరునా శుభాకాంక్షలు.’ అని పేర్కొన్నారు. నా ధైర్యం మీరే…నా బలం మీరే…నాన్న గారి ఆశయ సాధన కోసం స్థాపించినమన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, నన్ను మీరు గుండెల్లో పెట్టుకున్నారు, భుజాలపై మోస్తున్నారు.కష్టకాలంలో వెనక్కి తగ్గకుండా పార్టీ కోసం నిలబడుతున్నారు. పార్టీపై నమ్మకం పెట్టుకుని, నాపై నమ్మకం ఉంచి పార్టీ కోసం… pic.twitter.com/avdEzEGkjg— YS Jagan Mohan Reddy (@ysjagan) March 12, 2026గురువారం పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి అభిమానులు, కార్యకర్తలు, నాయకులు తరలి రావడంతో పార్టీ కార్యాలయం జనసంద్రంగా మారింది. మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలు సమర్పించి నివాళులర్పించిన వైఎస్ జగన్, ఆ తర్వాత పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం భారీగా తరలివచ్చిన పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి ప్రసంగించారు. మన పార్టీ ఆవిర్భవించి ఈరోజుకు 15 ఏళ్లు పూర్తి. 2011, మార్చి 12న పుట్టిన మన పార్టీ, ఈరోజుకి 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇంకా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేది దేశంలోనే ఒక మార్క్గా నిల్చింది. రాష్ట్రంలోనే కాదు, దేశ రాజకీయాల్లోనే ప్రబలంగా మన పార్టీ కనిపిస్తోంది. 15 సంవత్సరాల క్రితం ఈ పార్టీ ఎలాంటి పరిస్థితుల్లో పుట్టింది అనేది మనం ఒకసారి జ్ఞప్తి చేసుకుంటే.. ఆరోజు నల్లకాలువలో ఇచ్చిన ఒక మాట, మన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపన, ఎదుగుదలకు కారణమైంది. ఆ ఒక్క మాట నా కుటుంబ పరిస్థితులు మార్చింది. రాష్ట్రంలో దశ, దిశ మార్చింది. ఆ ఒక్క మాట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అంకురార్పణకు శ్రీకారం చుట్టింది. విలువలతో కూడిన రాజకీయాలు మర్చిపోయి ఉన్న పరిస్థితుల మధ్య.. విలువలు, విశ్వసనీయత అన్న పదాలకు అర్ధం చెబుతూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టుక, ఆ తర్వాత ఎదుగుదల కొనసాగింది. ఈరోజు నేను ఒకటే చెబుతున్నాను. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక్క జగన్ది మాత్రమే కాదు. కొన్ని కోట్ల మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులది. వైఎస్సార్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న నా కుటుంబ సభ్యులది అని నేను గర్వంగా చెబుతున్నాను.ఆరోజు జగన్ అనే వాడు ఒకే ఒక్కడు. కానీ, జగన్ ఏనాడూ భయపడలేదు. ఆరోజు కాంగ్రెస్ పార్టీ.. ఇక్కడ, దేశంలో అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి కుట్రలు, కుతంత్రాలు పన్నిన పరిస్థితి చూశాం. కానీ, జగన్ ఏనాడూ భయపడలేదు. కారణం జగన్కు నమ్మకం ఉన్నది పైన ఉన్న దేవుడు. కింద ఉన్న మీమీద మాత్రమే అని గర్వంగా చెబుతాను. నేను నమ్ముకున్న నా ప్రజలు, నేను నమ్ముకున్న నా దేవుడు.. ఇద్దరూ తోడుగా ఉండి నన్ను నడిపించారు.ఈరోజు నేను చెబుతున్నాను. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా విలువలు, విశ్వసనీయతకు ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని, నాతో పాటు నడిచే ప్రతి కుటుంబ సభ్యుడు కూడా కాలర్ ఎగరేసుకుని.. అదిగో అతడే మా నాయకుడు, అదిగో అదే మా పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని గర్వంగా చెప్పుకునేలా ఈ పార్టీ అడుగులు వేస్తుందని చెప్పి, మరొక్కసారి మీ అందరికి కూడా వినమ్రంగా, వినయపూర్వకంగా, మీ అందరి ప్రేమాభిమానాలకు మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.ఈరోజు మరొక్కసారి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైఎస్సార్ను అభిమానించే ప్రతి గుండెకు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడికి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకా వైఎస్సార్ను ప్రేమించే ప్రతి గుండె, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఆ ప్రతి గుండెకు ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానంటూ వైఎస్ జగన్ ప్రసంగాన్ని ముగించారు. -
వైఎస్సార్సీపీ అభిమాని కాలర్ ఎగరేసేలా పార్టీ ఉంటుంది : వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: ‘అభిమాని కాలర్ ఎగరేసేలా పార్టీ ఉంటుందని’ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గురువారం (మార్చి 12) వైఎస్సార్సీపీ ఆవిర్భవించి 15 ఏళ్లు పూర్తి చేసుకుని 16వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా తాడేపల్లి పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ వేడుకల్లో వైఎస్ జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం ప్రసంగించిన వైఎస్ జగన్ పార్టీ భవిష్యత్తుపై తన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ‘2011 మార్చి 12న పార్టీ ఆవిర్భవించింది. వైఎస్సార్సీపీ ఆవిర్భావంతో దేశ రాజకీయాల్లోనే మార్పు కనిపించింది. నల్లకాల్వలో ఇచ్చిన మాట వైఎస్సార్సీపీ ఆవిర్భావానికి కారణమైంది. ఆ ఒక్క మాట రాష్ట్ర దశ, దిశను మార్చింది. వైఎస్సార్సీపీ పార్టీ కోట్లాది మంది ప్రజలది. మొదట్నుంచీ ప్రజలు,దేవుడినే నమ్ముకున్నా. విలువలు, విశ్వసనీయతకు ఎప్పటికీ కట్టుబడి ఉంటా. వైఎస్సార్సీపీ అభిమాని కాలర్ ఎగరేసేలా పార్టీ ఉంటుంది. మీ ప్రేమాభిమానాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. వైఎస్సార్సీపీ అభిమానించే ప్రతి గుండెకు శుభాకాంక్షలు’ తెలిపారు. ఇచ్చిన మాట కోసం ఎందాకైనా... వరుస ఓటములతో జీవచ్ఛవంలా మారిన కాంగ్రెస్కు ‘ప్రజా ప్రస్థానం’ పాదయాత్రతో జీవం పోసి... టీడీపీ దుర్మార్గపు పాలనకు తెరదించుతూ 2004 ఎన్నికల్లో ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో కాంగ్రెస్ను మహానేత ఒంటిచేత్తో అధికారంలోకి తెచ్చారు. ఉమ్మడి రాష్ట్ర సీఎంగా 2004 మే 14న ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్సార్... రాష్ట్ర సమగ్రాభివృద్ధికి బాటలు వేశారు. జనరంజక పాలనను మెచ్చిన ప్రజలు వైఎస్ నాయకత్వానికి దన్నుగా 2009 ఎన్నికల్లోనూ మళ్లీ అధికారాన్ని కట్టబెట్టారు. 2009 మే 20న రెండోసారి ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక... అదే ఏడాది సెప్టెంబరు 2న హెలికాప్టర్ ప్రమాదంలో హఠాన్మరణం చెందారు. ఈ విషాద వార్తకు తాళలేక వందలాది మంది మరణించడం జగన్ ను కలిచి వేసింది. ప్రమాదం చోటుచేసుకున్న కర్నూలు జిల్లా నల్లకాలువ వద్ద 2009 సెప్టెంబరు 25న నిర్వహించిన సంస్మరణ సభలో మాట్లాడుతూ... మరణించిన వారి కుటుంబాలను పరామ ర్శించడానికి ఓదార్పు యాత్ర చేపడతానని ప్రకటించారు. ఆ మాటకు కట్టుబడి 2010 ఏప్రిల్ 9న పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఓదార్పు యాత్ర ప్రారంభించారు. ఈ యాత్రను ఆపేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశించింది. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై కుట్రలు చేస్తుండటంతో తన తల్లి విజయమ్మతో కలిసి జగన్ కాంగ్రెస్ పార్టీకి, పులివెందుల శాసనసభ, కడప లోక్సభ స్థానాలకు రాజీనామాలు చేశారు. వైఎస్ ఆశయ సాధనే లక్ష్యంగా 2011 మార్చి 11న వైఎస్సార్సీపీ పేరును ప్రకటించారు. ఆ మరుసటి రోజే వైఎస్ సమాధి వద్ద పతాకాన్ని ఆవిష్కరించి, పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. -
శ్రీవారి పరకామణి వెనుక భారీ కుట్ర.. ఆధారాలతో బయటపెట్టిన YSRCP నాగార్జున యాదవ్
-
ఉరుసు ఉత్సవాలకు ఆహ్వానం
-
హామీలపై నోరు మెదపరేమి? : వైఎస్ జగన్
మహిళలకు మళ్లీ మోసం.. సూపర్ సిక్స్, సెవెన్ అని మోసం చేశావ్.. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మళ్లను అన్ని విధాలా దగా చేశావ్.. మహిళలకు అందించిన పథకాలన్నీ రద్దు చేశావ్. ఆఖరికి సున్నా వడ్డీ కూడా ఇవ్వకుండా దారుణంగా వంచించావ్.. ఇప్పుడు మరోసారి మభ్యపెడుతున్నావ్.. మహిళలకు ఆడబిడ్డ నిధి ఎప్పుడు ఇస్తారు? ఉద్యోగులకు రూ.35 వేల కోట్ల బకాయిలుఅధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు ‘ఐఆర్’ ఇస్తామన్న హామీకి అతీగతీ లేదు. పీఆర్సీ ప్రస్తావనే లేదు. నాలుగు పెండింగ్ డీఏలు ఎప్పుడిస్తారో స్పష్టత లేదు. జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, మెడికల్ రీయింబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవ్స్ కింద ఉద్యోగులకు రూ.35 వేల కోట్లు బాకీపడ్డారు. చివరికి ఆశ వర్కర్లు, అంగన్వాడీలకు ఇచ్చిన హామీలనూ నెరవేర్చకుండా పోలీసులతో దాడి చేయించారు.నెయ్యిపై దుమారం రేపి.. స్కామ్లుతిరుమలకు సరఫరా అయిన నెయ్యి టెండర్లను గమనిస్తే రూ.200 కోట్ల స్కామ్ బయటపడుతుంది. ఉద్దేశపూర్వకంగానే ఏడాదిలోనే కిలో నెయ్యి రేటును రూ.351 నుంచి రూ.716కు పెంచేశారు. ఇది ప్రపంచ చరిత్రలో కనీవినీ ఎరుగని స్కామ్. దేవుడంటే భయభక్తులు లేకుండా.. ఒక పక్కన నెయ్యిపై దుమారం రేపి.. అదే నెయ్యిని అడ్డుపెట్టుకుని స్కామ్లు చేస్తున్నారు. ఇదేనా తాట తీయడం? తాట తీస్తామని డైలాగులు చెప్పడం కాదు.. మహిళలపై దారుణాలకు పాల్పడ్డ కూటమి నేతల్లో ఎంతమందిపై చర్యలు తీసుకున్నారు? రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే తనపై అత్యాచారానికి ఒడిగట్టాడని బాధితురాలు నీకే ఫిర్యాదు చేసింది బాబూ! టీటీడీ చైర్మన్ ఓ మహిళను మోసం చేసి వీడియోలు, ఫొటోలతో దొరికిపోతే ఏం చేశావ్ బాబూ? కేజీబీవీ ప్రిన్సిపాల్పై టీడీపీ ఎమ్మెల్యే కూన వేధింపుల మీద చర్యలేవి? – మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, అమరావతి: ‘ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ సిక్స్.. సూపర్ సెవెన్ హామీలను ఎప్పుడు అమలు చేస్తారు? మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఉద్యోగులకు మీరు బకాయి పడిన నిధులు ఎప్పుడు ఇస్తారు? బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో నేను అడిగిన ప్రశ్నలకు.. 16 రోజులపాటు నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో నోరు మెదపలేదెందుకు?’ అంటూ సీఎం చంద్రబాబును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. ‘బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత మళ్లీ అడుగుతున్నా.. ఇప్పటికే మూడు బడ్జెట్లు పెట్టారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అధికారంలోకి వచ్చీ రాగానే 2024 జూన్ నుంచే అమలులోకి వస్తాయన్నారు. హామీల పేరిట బాకీ పడ్డ సొమ్ములు ఎప్పుడిస్తావు? అని అడిగితే మాత్రం నోరు మెదపడం లేదు’ అంటూ నిలదీశారు. గిట్టుబాటు ధర లేక, అప్పుల ఊబిలో కూరుకుపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ఆదుకోవాల్సింది పోయి 16 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో ఆటలు.. పాటలు.. స్కిట్లతో కాలక్షేపం చేస్తారా? అంటూ నిప్పులు చెరిగారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఎత్తిచూపుతూ.. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇచ్చిన హామీల వీడియోలు ప్రదర్శిస్తూ.. పత్రికల్లో ఇచ్చిన ప్రకటనలను గుర్తు చేస్తూ.. ఆ హామీల అమలుకు బడ్జెట్లో కేటాయింపులను వివరిస్తూ.. ప్రజలకు చంద్రబాబు సర్కార్ చేస్తున్న మోసాన్ని ఆధారాలతో సహా చూపుతూ నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..అన్నదాత సుఖీభవ.. నిలుపునా మోసం⇒ పీఎం కిసాన్ కాకుండా అన్నదాత సుఖీభవ పేరిట ఏటా రూ.20 వేలు ఇస్తామన్నాడు (గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే రూ.6 వేలు కాకుండా ప్రతి ఏటా రైతుకు రూ.20 వేలు ఇస్తామంటూ ఎన్నికల్లో చంద్రబాబు మాట్లాడిన మాటలతో కూడిన వీడియోను ప్రదర్శించారు). తొలి ఏడాది ఎగ్గొట్టాడు. రెండో ఏడాది రూ.20 వేలకు గాను అప్పుడో రూ.ఐదు వేలు.. అప్పుడో రూ.ఐదు వేలు ఇచ్చాడు. అంటే రెండేళ్లలో రూ.40 వేలకు గాను రూ.10 వేలు ఇచ్చాడు. ఒక్కో రైతుకు రూ.30 వేలు బాకీ పడ్డారు. మా హయాంలో 53.58 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇస్తే చంద్రబాబు ప్రభుత్వంలో వారి సంఖ్యను 46.85 లక్షల మందికి కుదించేశారు. దాదాపు 7 లక్షల మందికి ఎగ్గొట్టారు. పైగా కౌలు రైతులకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా ఒక్క పైసా ఇచ్చింది లేదు. ఈ బాకీ సొమ్ములు ఎప్పుడిస్తావు అని అడిగితే అసెంబ్లీ సమావేశాల్లో నోరు మెదపలేదు. ⇒ 2023–24 ఖరీఫ్కు సంబంధించి 2024 జూన్లో రాష్ట్ర ప్రభుత్వం రైతుల తరఫున ఇన్సూ రెన్స్ ప్రీమియం కట్టి ఉంటే.. కేంద్రం ఇవ్వాల్సింది జత చేసేది. ఆ వెంటనే రైతులకు ఇన్సూరెన్స్ కంపెనీలు బీమా పరిహారం చెల్లించేవి. ఈ పెద్దమనిషి 2024 జూన్లో ప్రీమియం డబ్బులు కట్టక పోవడంతో రైతులు రూ.1,324 కోట్లు నష్టపోయారు. ఉచిత పంటల బీమాను రద్దు చేసి రైతులను గాలికొదిలేశారు. చంద్రబాబు నిర్వాకాల వల్ల 2023–24, 2024–25 సీజన్లలో రూ.3,500 కోట్ల మేర బీమా పరిహారం నష్టపోయారు. ఇది ఎప్పుడు ఇస్తారని అడిగితే సమాధానం లేదు. ⇒ అక్టోబర్లో మోంథా తుపాన్తో నష్టపోయిన రైతులకు ఒక్క రూపాయి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తారని అడిగితే వీళ్ల నోటి నుంచి ఒక్క మాట రాదు. ⇒ మా ప్రభుత్వ హయాంలో ధరల స్థిరీకరణ నిధి రూ.3 వేల కోట్లు పెట్టి.. రూ.7,500 కోట్లు వెచ్చించి అండగా నిలిచాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి ఎకరాలో సాగైన ప్రతి పంటను ఈ–క్రాప్లో నమోదు చేసేవాళ్లం. ఏ రైతుకు అయినా తాను వేసిన ఏ పంటకైనా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉంటే సీఎం యాప్ (కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్) ద్వారా పర్యవేక్షిస్తూ ధరలు పడిపోయినా ప్రతిసారీ ఆదుకున్నాం. పైగా ప్రతీ ఆర్బీకేలో ప్రతి పంటకు నిర్దేశించిన మద్దతు ధరలతో బోర్డులు పెట్టి దళారుల వెన్నులో వణుకు పుట్టించేవాళ్లం. అంతకంటే తక్కువ రేటుకు కొనేందుకు సాహసిస్తే.. వెంటనే స్పందించేవాళ్లం. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో ఈ పరిస్థితి లేదు. ఇంత దారుణమా.. రైతులంటే ఇంత చులకనేంటయ్యా.. అని అడిగితే సమాధానం చెప్పకపోగా ఎదురుదాడి చేస్తున్నారు.ఏ ఒక్క పంటకు మద్దతు ధర లేదు⇒ గతేడాది వరి, మొక్కజొన్న, అరటి, కొబ్బరి, కందులు, మినుములు, పెసలు, సజ్జలు, శనగలు, మిర్చి, టమాటా, చీనీ, పత్తి అన్ని పంటలకు ధరలు పడిపోతే ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా మళ్లీ మిర్చి, శనగ, అరటి, మొక్కజొన్న పంటలకు ధరలు పడిపోయాయి. నెల క్రితం క్వింటా రూ.26 వేలున్న మిర్చి.. ఈ రోజు రూ.18 వేలకు పడిపోయింది. శనగ కనీస మద్దతు ధర రూ.5,875.. రైతులకు రూ.5 వేలకు మించి రావడం లేదు. మొక్కజొన్న మద్దతు ధర రూ.2,400 అయితే, రైతులు కేవలం రూ.1400–1500కు అమ్ముకుంటున్నారు. ఈ ఒక్క పంటపైనే రూ.3,500 కోట్లు నష్టపోతున్నారు.⇒ అరటి ఈ ఏడాది కూడా టన్ను రూ.5 వేలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి. మా హయాంలో టన్ను రూ.30 వేలు పలుకగా, ఈ రోజు రూ.5 వేలకు తెగనమ్ముకుంటున్నారు. టమాటా కిలో రూ.2కు అమ్ముకోవాల్సి వస్తోంది. బత్తాయి, పుచ్చకాయ, మస్క్మెలన్, సజ్జలు ఇలా అన్ని పంటల పరిస్థితి ఇలాగే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు అండగా ఉండేందుకు ధరల స్థిరీకరణ నిధి కింద రూ.3 వేల కోట్లు పెట్టి రైతులకు తోడుగా నిలవాల్సింది పోయి బడ్జెట్లో రూ.300 కోట్లు పెట్టారు. ఇంత తక్కువ ఎందుకు పెట్టారని అడిగితే నోరు మెదపడం లేదు.⇒ రైతులు ఇంత దారుణమైన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఆటలు, పాటలు, స్కిట్లతో కాలక్షేపం చేశారు. అసెంబ్లీలో వీళ్ల ప్రవర్తన చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. వ్యవసాయ రంగం ఎంత సంక్షోభంలో ఉందంటే.. వందలాది మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 2025–26లో 393 మంది రైతులు, 2,472 మంది రైతు కూలీలు ఆత్మహత్యలకు పాల్పడితే ఒక్క పైసా పరిహారం ఇచ్చిన పాపాన పోలేదు. వీరికి పరిహారం ఎప్పుడు ఇస్తారని అడిగితే అసెంబ్లీలో ఒక్క మాట చెప్పలేదు. కనీసం వ్యవసాయ రంగంలో సంక్షోభం, రైతుల కష్టాలపై అసెంబ్లీలో చర్చించడం, వారికి భరోసా కల్పించడం మచ్చుకైనా చేయలేదు. మరో 7.46 లక్షల పింఛన్లు కోత వేయబోతున్నారు⇒ 2024 ఎన్నికల షెడ్యూల్ నాటికి మార్చిలో మేము ఇచ్చిన పింఛన్ల సంఖ్య 66,34,372. ఈ నెలలో ఇచ్చిన పింఛన్ల సంఖ్య 60,69,664. అంటే ఇప్పటికే 5,64,708 పింఛన్లు కట్ చేశారు. 2026 ఫిబ్రవరిలో 60,96,108 మందికి పింఛన్లు ఇస్తే.. మార్చిలో 60,69,664 మందికి ఇచ్చారు. అంటే ఈ ఒక్క నెలలోనే 26 వేల పింఛన్లు కట్ చేశారు. ఇలా ప్రతీ నెలా పింఛన్లు కట్ చేసూ్తనే ఉన్నారు. కొత్తగా ఒక్క పింఛన్ ఇవ్వలేదు. ఇప్పటికే ప్రభుత్వం వద్ద పింఛన్ కోసం 2.50లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి.⇒ కొత్త పింఛన్ల మంజూరు కోసం ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. మా హయాంలో ప్రతి ఆర్నెల్లకోసారి జూన్, డిసెంబర్లలో పింఛన్లు అప్డేట్ చేసే వాళ్లం. ఈరోజు ఆ పరిస్థితి కన్పించడం లేదు. కనీసం మార్చిలో ఇచ్చిన పింఛన్ల సంఖ్యను బట్టి చూసినా ఈ ఏడాది బడ్జెట్లో రూ.31,554 కోట్లు పెట్టాలి. కానీ బడ్జెట్లో పెట్టింది కేవలం రూ.27,719 కోట్లు. అంటే మరో 7,45,993 పింఛన్లు కట్ చేయబోతున్నామని చెప్పకనే చెప్పారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని, బడ్జెట్లో ఎందుకు తగ్గించి చూపిస్తున్నారో చెప్పాలని అడిగాం. 16 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో కనీస ప్రస్తావన కూడా లేదు.తల్లికి వందనం పేరిట దగా⇒ తల్లికి వందనం కింద చదువుకునే ప్రతీ పిల్లాడికి రూ.15 వేలు చొప్పున ఎంత మంది పిల్లలుంటే అంత మందికి ఇస్తామన్నారు. తొలి ఏడాది ఎగ్గొట్టారు. రెండో ఏడాది ఏకంగా 20 లక్షల మంది పిల్లలకు పథకాన్ని కత్తిరించారు. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆన్ ఎడ్యుకేషన్ (యూడీఐఎస్ఈ–యూడైస్) ప్రకారం 2023–24లో బడికి వెళ్లే పిల్లలు 87,41,885 మంది ఉన్నారు. కానీ ఇచ్చింది 67 లక్షల మందికే.తల్లికీ వంచనే.. యూడైస్ ప్లస్ ప్రకారం 87,41,885 మంది పిల్లలకు తల్లికి వందనం కింద రూ.13,112 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. ఈ బడ్జెట్లో కేటాయించింది కేవలం రూ.8,456.48 కోట్లు మాత్రమే ⇒ పైగా ఏ ఒక్కరికి రూ.15 వేలు ఇవ్వలేదు. కొంత మందికి రూ.8 వేలు, మరికొంత మందికి రూ.9 వేలు, ఇంకొంత మందికి రూ.10 వేలు, అక్కడక్కడా అతి కొద్ది మందికి రూ.13 వేలు చొప్పున ఇచ్చారు. మొదటి ఏడాది ఎగ్గొట్టిన డబ్బులతో పాటు రెండో ఏడాది ఇవ్వాల్సిన మిగిలిన డబ్బులు ఎప్పుడిస్తారని అడిగితే సమాధానం లేదు. ⇒ ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. తీరా ఇప్పుడు షరతులు పెట్టారు. ఆర్టీసీలో 16 రకాల సర్వీసులుంటే కేవలం 5 రకాల సర్వీసులకే పరిమితం చేశారు. ఎందుకు ఈ మాదిరిగా షరతులు పెట్టారని అడిగితే నోరు మెదపడం లేదు. ⇒ దీపం పథకం కింద ప్రతి మహిళకు మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నారు. తొలి ఏడాది ఒక సిలిండర్కే ఇచ్చి మిగిలిన రెండు సిలిండర్లు డబ్బులు ఎగ్గొట్టారు. గ్యాస్ కంపెనీల డేటా ప్రకారం రాష్ట్రంలో కోటి 59 లక్షల కనెక్షన్లున్నాయి. ఒక్కో గ్యాస్ సిలిండర్కు రూ.855 చొప్పున 3 సిలిండర్లకు ఏడాదికి రూ.4 వేల కోట్లు ఖర్చు చేయాలి. అంటే మూడేళ్లకు రూ.12 వేల కోట్లు ఖర్చు చేయాలి. కానీ తొలి ఏడాది రూ.786 కోట్లు ఖర్చు చేశారు. రెండో ఏడాది రివైజ్డ్ ఎస్టిమేట్స్లో రూ.2,199 కోట్లుగా చూపించారు. ఇచ్చారో లేదో కూడా తెలియదు. ఈ బడ్జెట్లో రూ.2,600 కోట్లు పెట్టారు. మరి రూ.12 వేల కోట్లకు గానూ ఇచ్చింది సగం కూడా లేదు. ఈ పథకం కింద మహిళలకు రూ.6,144 కోట్లు బాకీ పడ్డారు. ఈ సొమ్ములు ఎప్పుడు ఇస్తారని అడిగితే నోరు మెదపడం లేదు.నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి ఏమైంది?⇒ యువగళం పేరు పెట్టి నిరుద్యోగ భృతి కింద రాష్ట్రంలోని ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. ఏటా రూ.36 వేల చొప్పున మూడేళ్లకు ప్రతి నిరుద్యోగికి బాకీపడ్డ రూ.1.08 లక్షలు ఎప్పుడు ఇస్తారో చెప్పమంటే నోరు మెదపడం లేదు. ఆడబిడ్డలకూ తీవ్ర అన్యాయం రాష్ట్రంలో 18 నుంచి 60 ఏళ్ల వయసు గల మహిళలు 1,78,99,440 మంది ఉండగా.. ఒక్కరికి కూడా ఆడబిడ్డ నిధి కింద ఇప్పటి వరకు పైసా ఇవ్వలేదు ⇒ సూపర్ సిక్స్లో రెండో కీలకమైన హామీ..18 ఏళ్లు నుంచి 60 ఏళ్ల వయసులోపు ఉన్న మహిళలకు ఆడబిడ్డ నిధి పేరిట నెలకు రూ.1,500 ఇస్తామన్నారు. ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో 2,10,58,615 మంది మహిళ ఓటర్లు ఉన్నారు. వీరిలో 60 ఏళ్లు పైబడిన వారిని తీసేస్తే 1,78,99,440 మంది అర్హులు. వీరికి ప్రతి నెలా రూ.1,500.. ఏడాదికి రూ.18 వేలు చొప్పున మూడేళ్లకు బాకీ పడ్డ రూ.54 వేలు ఎప్పుడు ఇస్తారని అడిగితే 16 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో కనీస ప్రస్తావన కూడా చేయలేదు. ⇒ మరో ముఖ్యమైన హామీ.. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్ పథకం. ఈ పథకం కింద నెలకు రూ.4 వేల చొప్పున ఏడాదికి రూ.48 వేలు..ఇలా మూడేళ్లలో రూ.1.44 లక్షలు బాకీ పడ్డారు. ఎప్పుడు ఇస్తారని అడిగితే కనీసం మాట్లాడటం లేదు.ప్రతినెలా 25 వేలకు పైగా పింఛన్ల కోత వైఎస్ జగన్ 2024 మార్చిలో 66,34,372 మందికి పింఛన్లు ఇవ్వగా.. చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో పింఛన్లు ఇచ్చినది 60,69,664 మందికి మాత్రమే ఆరోగ్యశ్రీ నిర్వీర్యం.. ఆరోగ్యశ్రీ పథకం నడవాలంటే బకాయిలతో కలిపి రూ.7,150 కోట్లు కావాలి. బడ్జెట్లో రూ.4 వేల కోట్లు మాత్రమే కేటాయించిన చంద్రబాబు గతంలో రూ.2 వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. నెట్వర్క్ ఆస్పత్రుల్లో సేవలు ఆగిపోతున్నా చంద్రబాబుకు చీమ కుట్టినట్లైనా లేదు. పిల్లల చదువులెలా సాగుతాయి? ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన కింద బకాయిలతో కలిపి మొత్తం రూ.10,328 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఈ ఏడాది బడ్జెట్లో కేటాయింపులు రూ.2,766 కోట్లు మాత్రమే. ఇలా అయితే పిల్లల చదువులు ఎలా సాగుతాయి? ఫీజులు కట్టలేక పిల్లలు చదువులు మానేస్తున్నారు. పెన్షన్లు కటింగ్...50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్ హామీని నెరవేర్చకుండా మూడేళ్లలో ఒక్కొక్కరికీ రూ.1.44 లక్షలు బాకీ పడ్డారు. మరోవైపు సామాజిక పెన్షన్లు ఇప్పటికే 5,64,708 కట్ చేశారు. ఒక్క నెలలోనే 26 వేల పింఛన్లు కట్ చేశారు. ప్రతీ నెలా పింఛన్లు కట్ చేస్తూనే ఉన్నారు. కొత్తగా ఒక్క పింఛనూ ఇవ్వలేదు. పింఛన్ కోసం 2.50లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. బడ్జెట్ కేటాయింపులను బట్టి మరో 7,45,993 పింఛన్లు కట్ చేయబోతున్నామని చెప్పకనే చెబుతున్నారు. 50 ఏళ్లకే పింఛన్ ఇంకెప్పుడు? బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని ఎన్నికల ముందు పచ్చ పత్రిక ఈనాడులో చంద్రబాబు ఇచ్చిన ప్రకటన అన్నదాతకు దగా...పీఎం కిసాన్ కాకుండా అన్నదాత సుఖీభవ పేరిట ప్రతి రైతుకూ ఏటా రూ.20 వేలు చొప్పున ఇస్తామన్నాడు. రెండేళ్లలో రూ.40 వేలకు గాను రూ.10 వేలు ఇచ్చాడు. ఒక్కో రైతుకు రూ.30 వేలు బాకీ పడ్డారు. 7 లక్షల మందికి ఎగ్గొట్టారు. కౌలు రైతులకు ఒక్క పైసా ఇవ్వలేదు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా ఒక్క పైసా ఇచ్చింది లేదు. ఉచిత పంటల బీమాను రద్దు చేసి రైతులను గాలికొదిలేశారు. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. ఏ ఒక్క పంటకూ మద్దతు ధర లేదు. ధరల స్థిరీకరణ నిధికి తూట్లు పొడిచారు. రైతులు ఇంత దారుణమైన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేల ఆటపాటలు, స్కిట్లతో కాలక్షేపం చేశారు. ఇళ్లపై దొంగ మాటలు..మేం 31 లక్షల పట్టాలిచ్చి 21 లక్షల ఇళ్లు శాంక్షన్ చేశాం. 10 లక్షల ఇళ్లను పూర్తి చేశాం. మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. కేంద్రం ఇచ్చిన డబ్బులను చంద్రబాబు మళ్లించడంతో ఈ పథకం ఆగిపోయింది. కనీసం మేం మంజూరు చేసిన ఇళ్లను పూర్తి చేసేందుకు డబ్బులు ఇవ్వాలని అడుగుతుంటే త్రిబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని దొంగ మాటలు చెబుతున్నారు. ఈ రెండేళ్లలో ఒక్క అక్క చెల్లెమ్మకైనా గజం స్థలం ఇచ్చారా? ఒక్క ఇంటి పట్టా ఇవ్వలేదు. కొత్తగా ఒక్క ఇంటిని కూడా మంజూరు చేయలేదు.ఇవన్నీ ఎవరి హయాంలో జరిగాయి?జగన్కు ఎలాంటి క్రెడిట్ ఇవ్వడం చంద్రబాబుకు నచ్చదు. కనీసం క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న ఉద్యోగులకూ థ్యాంక్స్ చెప్పరు. సర్వేయర్ల వ్యవస్థ, సచివాలయాల వ్యవస్థ ఎవరి వల్ల వచ్చింది? సర్వే పరికరాలు, కోర్ స్టేషన్లు, రోవర్స్ ఎవరు తీసుకొచ్చారు? విమానాలు, హెలికాప్టర్లలో సర్వేలు ఎవరి హయాంలో జరిగాయి? ఓఆర్ఐ రికార్డులు, సర్వే అనంతరం హద్దుల్లో పాతడానికి కోట్ల హద్దు రాళ్లు ఎవరి హయాంలో సమకూర్చారు? పాస్బుక్లో క్యూఆర్ కోడ్, జియో ట్యాగింగ్ హద్దు నిర్ణయం ఎవరి హయాంలో ప్రారంభమైంది? -
నేడు వైఎస్సార్సీపీ ఆవిర్భావ వేడుకలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం గురువారం ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయాన్ని విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. పార్టీ కార్యాలయంలోకి వెళ్లే మార్గాలను పార్టీ రంగుల తోరణాలతో సుందరంగా తీర్చిదిద్దారు. వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్పీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడలా పార్టీ పతాకాలు ఎగుర వేయాలని కేంద్ర కార్యాలయం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. దీంతో అన్ని జిల్లాల్లో నేతలు, అభిమానులు, కార్యకర్తలు అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. -
'ప్రజాహితమే' పరమావధి
ప్రజాహితమే పరమావధిగా, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన పార్టీ వైఎస్సార్సీపీ. 15 ఏళ్ల క్రితం 2011 మార్చి 12న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో వైఎస్ సమాధి వద్ద ఒక్కడితో మొదలై తిరుగులేని శక్తిగా ఆవిర్భవించింది. ఇచ్చిన మాట కోసం ఎందాకైనా... వరుస ఓటములతో జీవచ్ఛవంలా మారిన కాంగ్రెస్కు ‘ప్రజా ప్రస్థానం’ పాదయాత్రతో జీవం పోసి... టీడీపీ దుర్మార్గపు పాలనకు తెరదించుతూ 2004 ఎన్నికల్లో ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో కాంగ్రెస్ను మహానేత ఒంటిచేత్తో అధికారంలోకి తెచ్చారు. ఉమ్మడి రాష్ట్ర సీఎంగా 2004 మే 14న ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్సార్... రాష్ట్ర సమగ్రాభివృద్ధికి బాటలు వేశారు. జనరంజక పాలనను మెచ్చిన ప్రజలు వైఎస్ నాయకత్వానికి దన్నుగా 2009 ఎన్నికల్లోనూ మళ్లీ అధికారాన్ని కట్టబెట్టారు. 2009 మే 20న రెండోసారి ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక... అదే ఏడాది సెప్టెంబరు 2న హెలికాప్టర్ ప్రమాదంలో హఠాన్మరణం చెందారు. ఈ విషాద వార్తకు తాళలేక వందలాది మంది మరణించడం జగన్ ను కలిచి వేసింది. ప్రమాదం చోటుచేసుకున్న కర్నూలు జిల్లా నల్లకాలువ వద్ద 2009 సెప్టెంబరు 25న నిర్వహించిన సంస్మరణ సభలో మాట్లాడుతూ... మరణించిన వారి కుటుంబాలను పరామ ర్శించడానికి ఓదార్పు యాత్ర చేపడతానని ప్రకటించారు. ఆ మాటకు కట్టుబడి 2010 ఏప్రిల్ 9న పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఓదార్పు యాత్ర ప్రారంభించారు. ఈ యాత్రను ఆపేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశించింది. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై కుట్రలు చేస్తుండటంతో తన తల్లి విజయమ్మతో కలిసి జగన్ కాంగ్రెస్ పార్టీకి, పులివెందుల శాసనసభ, కడప లోక్సభ స్థానాలకు రాజీనామాలు చేశారు. వైఎస్ ఆశయ సాధనే లక్ష్యంగా 2011 మార్చి 11న వైఎస్సార్సీపీ పేరును ప్రకటించారు. ఆ మరుసటి రోజే వైఎస్ సమాధి వద్ద పతాకాన్ని ఆవిష్కరించి, పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. రైతులు, చేనేత కార్మికులు, విద్యార్థులు, మహిళలు, నిరు ద్యోగ వర్గాల సమస్యలపై నిత్యం పోరాటాలు చేస్తూ వచ్చారు. మొగ్గలోనే తుంచేసేందుకు కుట్రలు నైతిక విలువలతో రాజకీయాలు చేయాలన్నది జగన్ సిద్ధాంతం. వైఎస్సార్సీపీలో ఎవరైనా చేరాలంటే... వారు ఉంటున్న పార్టీకి, ఆ పార్టీ ద్వారా సంక్రమించిన పదవులకు రాజీనామా చేసి రావాలని షరతు విధించారు. దానికి కట్టుబడిన 19 ఎమ్మెల్యేలు, ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ ద్వారా సంక్ర మించిన పదవులకు రాజీనామా చేసి... వైఎస్సార్సీపీలో చేరారు. ఖాళీ అయిన 19 శాసనసభ, నెల్లూరు లోక్సభ స్థానాలకు ఎన్నికలను నిర్వహించడానికి 2012 ఏప్రిల్ 24న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదని గ్రహించిన కాంగ్రెస్, టీడీపీ అధిష్ఠానాలు కుమ్మక్కై కుట్రకు తెరతీశాయి. ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న జగన్ను విచారణ పేరుతో పిలిపించిన సీబీఐ 2012 మే 27న అరెస్టు చేసింది. జగన్ ను అక్రమంగా నిర్బంధించడం ద్వారా ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీని ఓడించాలన్నది ఆ పార్టీల పన్నాగం. ఏ కేసులోనైనా అరెస్టయిన వారికి 90 రోజుల్లో బెయిల్ ఇవ్వాలన్నది నిబంధన. కానీ 16 నెలల పాటు జైలులో అక్రమ నిర్బం«ధం వల్ల ప్రజల్లో ఆదరణ పెరిగింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో ఎన్నికల్లో ఒంటరిగా వైఎస్సార్సీపీని జగన్ బరిలోకి దించారు. 67 శాసనసభ స్థానాలు, ఏడు లోక్సభ స్థానాలు గెలుచుకున్న వైఎస్సార్సీపీ బలమైన ప్రతి పక్షంగా అవతరించింది. టీడీపీ అరాచకాలను నిలదీస్తూ ప్రజల పక్షాన ప్రతిపక్ష నేతగా ఇటు శాసనసభలో, అటు బయటా రాజీలేని పోరాటాలు చేశారు. వైఎస్సార్సీపీ బలీయమైన శక్తిగా మారుతుండటాన్ని చూసి ఓర్వలేని నాటి సీఎం చంద్రబాబు.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ద్వారా కుట్రలు చేశారు. ఫిరా యించిన ఎమ్మెల్యేల్లో నలుగురిని మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా రాజకీయాల్లో నైతిక విలువలకు సమాధి కట్టారు. దీన్ని నిరసిస్తూ... ప్రజల్లోనే తేల్చుకుంటానని ప్రకటిస్తూ 2017 అక్టోబర్ 26న శాసనసభ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు జగన్ ప్రకటించారు. తన తండ్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నుంచి 2017 నవంబర్ 6న ప్రజా సంకల్ప పాదయాత్రను ప్రారంభించారు. ఎముకలు కొరికే చలిలో, మండుటెండలో, కుంభ వృష్టిలో 14 నెలలపాటు 3,648 కిలోమీటర్ల దూరం సాగిన పాదయాత్రను 2019 జనవరి 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద ముగించారు. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రలో పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. టీడీపీ దుర్మార్గపు పరిపాలనను కూకటివేళ్లతో పెకలిస్తూ... 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి అఖండ విజయాన్ని ప్రజలు అందించారు. దేశ చరిత్రలో 50 శాతానికిపైగా ఓట్లతో 151 శాసనసభ (87 శాతం), 22 లోక్సభ (88 శాతం) స్థానాలను ఒక పార్టీ దక్కించుకున్న దాఖలాలు ఇదివరకు లేవు. సువర్ణాక్షరాల సుపరిపాలనవైఎస్సార్సీపీ అఖండ విజయాన్ని సాధించడంతో 2019 మే 30న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. దేశ చరిత్రలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం ద్వారా విశ్వసనీయతను చాటుకున్న ఏకైక పార్టీగా వైఎస్సార్సీపీ నిలిచింది. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజల గుమ్మం వద్దకే ప్రభుత్వాన్ని తీసుకెళ్లారు. ఐదేళ్లలో సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో పేదల ఖాతాల్లో ఏకంగా రూ. 2.73 లక్షల కోట్లు జమ చేశారు. దేశ చరిత్రలో ఇదో రికార్డు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తీసు కొచ్చారు. వికేంద్రీకరణతో సుపరిపాలన అందించారు.తొలి మంత్రివర్గంలో 56 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చి... 2022 ఏప్రిల్ 11న పునర్వ్యవస్థీకరణ ద్వారా ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో ఏకంగా 70 శాతం పదవులు ఆ వర్గాలకు ఇచ్చి సామాజిక మహా విప్లవాన్ని ఆవిష్కరించారు. నామి నేటెడ్ పదవుల్లో, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు.. మహిళలకు రిజర్వు చేసేలా చట్టం తెచ్చి మరీ ఆ వర్గాలకు పదవులు ఇచ్చారు. దేశ చరిత్రలో సామాజిక న్యాయానికి సిసలైన నిర్వచనం చెప్పింది వైఎస్సార్సీపీ ఒక్కటేనని సామాజిక వేత్తలు ప్రశంసించారు.అనునిత్యం ప్రజల్లోనే...అయితే టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి కట్టడం... ‘సూపర్ సిక్స్’తో పాటు 143 హామీలు ఇవ్వడంతో 2024 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అధికారం కోల్పోయింది. అయినా అనునిత్యం వైఎస్ జగన్ ప్రజలతో మమేకమవుతూ తమ విధానం ప్రజాపక్షమని చాటి చెబుతున్నారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చీ రాగానే కక్ష సాధింపు చర్యలు, విధ్వంసం, హత్యాకాండకు దిగింది. ఈ అరాచక పాలనను దేశానికి చాటి చెప్పేందుకు 2024 జూలై 24న ఢిల్లీ వేదికగా జగన్ ధర్నా నిర్వహించారు. గత 22 నెలలుగా రైతు సమస్యలు, విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ... విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ... మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ భారీ ఎత్తున పోరాటాలు చేశారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే పాటుపడుతున్నారు.– సాక్షి, అమరావతి బ్యూరో -
16వ వసంతంలోకి వైఎస్సార్సీపీ
సాక్షి తాడేపల్లి: రేపు వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు, అభిమానులకు శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 9.30గంటలకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ జెండా ఆవిష్కరించనున్నారు. దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్.0 వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాల సాధన కోసం ఆయన పాదాల చెంత 2011 మార్చి 12న పురుడుపోసుకున్న ప్రజల పార్టీనే వైఎస్సార్సీపీ. ఈ 16 ఏళ్ల ప్రయాణంలో అనేక పోరాటాలు, విజయాల మధ్య ప్రజల ఆశీర్వాదంతో వైఎస్సార్సీపీ పార్టీ ఎంతో గొప్పగా ఎదిగింది. ఎన్నో సంఘర్షణలు, ఆటుపోట్లు ఎదుర్కొని విజయవంతంగా 16వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కార్యకర్తలకు పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపింది. -
భవానీపురం దర్గా ఉరుసు ఉత్సవాలకు వైఎస్ జగన్కు ఆహ్వానం
సాక్షి, తాడేపల్లి: విజయవాడ భవానీపురంలో దర్గా ఉరుసు ఉత్సవాలు రేపటి నుంచి (గురువారం) జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని దర్గా ముజావర్ల కమిటీ ఆహ్వానించింది. సయ్యద్ గాలిబ్ షాషీద్ బాబాకు చాదర్, చందనం, శాండిల్ ఆయిల్ సమర్పించి శుభాకాంక్షలు తెలిపారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయనను కలిసిన వారిలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ మహ్మద్ రుహుల్లా, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాశ్ కూడా ఉన్నారు. -
రాసలీలలతో అడ్డంగా దొరికిపోయి కన్పించకుండా పోయిన బిఆర్ నాయుడు
-
అవిశ్వాస తీర్మానం వ్యతిరేకిస్తున్నాం: ఎంపీ గురుమూర్తి
లోక్సభ స్పీకర్పై అవిశ్వాస తీర్మాణాన్ని వైఎస్సార్సీపీ పార్టీ వ్యతిరేకిస్తుందని పార్టీ ఎంపీ గురుమూర్తి స్పష్టం చేశారు. ఈరోజు (బుధవారం) పార్లమెంటులో స్పీకర్ ఓంబిర్లాపై జరిగిన అవిశ్వాస తీర్మాన చర్చలో పార్టీ తరపున ఆయన పాల్గొన్నారు. తాము ఎన్డీఏతో సహా ఎవరి మిత్రపక్షం కాదని అయితే దేశ అత్యున్నత పదవిలో ఒకటైన స్పీకర్ పదవికి ఉన్న గౌరవం కాపాడాలనే తమ పార్టీ అభిమతం అని తెలిపారు. ప్రజలకు మేలు కలిగే ఏ అంశాలు చేపట్టినా ప్రభుత్వానికి మద్ధతిస్తామని పార్లమెంటు సజావుగా జరగాలంటే అందరూ సహకరించాలని కోరారు.ఏపీకి సంబంధించిన అనేక సమస్యలపై చర్చించేందుకు స్పీకర్ తమకు సమయం ఇచ్చారని అందుకు కృతజ్ఞతలని ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి అన్నారు. కాగా నిన్న మంగళవారం పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెట్టింది. రాష్ట్రపతి ప్రసంగంలో రాహుల్ గాంధీని మాట్లాడేందుకు అనుమతించకపోవడం, 8మంది కాంగ్రెస్ ఎంపీలను ఏకపక్షంగా సస్పెండ్ చేయడం, విపక్ష మహిళా ఎంపీలపై ఆరోపణలు చేయడం తదితర కారణాలతో తీర్మానం ప్రవేశపెట్టింది. దీనికి మద్దతుగా 118 మంది ఎంపీలు సంతకం చేశారు. -
కావూరి మృతి పట్ల వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత కావూరి సాంబశివరావు మృతి పట్ల వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భాంతి వ్యక్తం చేశారు. కావూరి సాంబశివరావు కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. సాంబశివరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ మేరకు ఎక్స్లో ట్వీట్ చేశారు.Deeply saddened by the passing of former Union Minister and senior leader Sri Kavuri Sambasiva Rao Garu. My heartfelt condolences to his family members. May his soul rest in peace. pic.twitter.com/uhnHH6ljNG— YS Jagan Mohan Reddy (@ysjagan) March 11, 2026 -
బీఆర్ నాయుడు, జనసేన శ్రీధర్పై చర్యలేవి?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: మహిళలపై దాడులు, అఘాయిత్యాలు చేసిన వారి తాట తీస్తామని చంద్రబాబు చెప్పారు.. మరి ఎంత మందిపై యాక్షన్ తీస్తున్నారని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. మహిళలపై దారుణాలపై పాల్పడ మీ ఎమ్మెల్యేలపై చర్యలేవి? అని నిలదీశారు. వీడియోలతో అడ్డంగా దొరికిన టీటీడీ చైర్మన్పై చర్యలేవి?. మంత్రులు, ఎమ్మెల్యేలు కాదు, కనీసం పీఏలు తప్పులు చేసినా చర్యలు తీసుకోవడం లేదన్నారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. ‘కళ్లార్పకుండా అబద్దాలు చెప్పడంతో చంద్రబాబు దిట్ట. తాను ఇచ్చిన హామీలు అమలు చేయకుండానే ప్రతి జంట కనీసం ముగ్గురు, నలుగురు పిల్లల్ని చంద్రబాబు కనమంటున్నాడు. పెళ్లిచేసుకున్న ప్రతి జంటకూ చంద్రన్నపెళ్లికానుక కింద రూ. లక్ష ఇస్తానంటూ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాడు. ఇప్పటివరకూ ఒక్క జంటకూ ఒక్కరూపాయి ఇచ్చింది లేదు. కానీ, మూడో బిడ్డను కంటే డబ్బులు ఇస్తాడంట. చంద్రబాబు మాటలను ఎవరైనా నమ్ముతారా? ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ కాదా?. మహిళల జోలికి వస్తే, తాటతీస్తానని చంద్రబాబుగారు డైలాగులు మీద డైలాగులు చెప్తున్నారు. మహిళలపై దారుణాలకు పాల్పడ్డ తన పార్టీకి చెందిన వారిపై ఎంతమంది మీద చర్యలు తీసుకున్నాడు. మహిళలపై దారుణాలపై పాల్పడ మీ ఎమ్మెల్యేలపై చర్చలేవి?’ అని ప్రశ్నించారు.లిస్ట్ ఇదే.. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నాడు?KGBV మహిళా ప్రిన్సిపల్ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్మీద చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నారు?మహిళలతో అశ్లీలంగా వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్మీద ఏం చర్యలు తీసుకున్నారు?టీడీపీకి చెందిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక దాడికి పాల్పడితే, ఈ చంద్రబాబుగారు ఏం చర్యలు తీసుకున్నారు?మంత్రి సంధ్యారాణి పీఏ మీద చంద్రబాబుగారు ఏం చర్యలు తీసుకున్నారు?. బాధితురాలి మీదే తప్పుడు కేసుపెట్టి జైలుకు పంపారు.ప్రస్తుత టీటీడీ ఛైర్మన్, ఒక మహిళను మోసంచేసి, వీడియో, ఫొటోలతో అడ్డంగా దొరికిపోయారు, అయినా చంద్రబాబు ఏం చేశాడు.తనను మోసం చేశాడని, ఇలాంటి వారికి ఎలాంటి పదవులు ఇవ్వొద్దని, విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని, బాధితురాలు నేరుగా చంద్రబాబుకు లేఖ రాసింది.దేవుడి పట్ల భయం, భక్తి, నిష్ట కలిగినవారే, టీటీడీ ఛైర్మన్ లాంటి పోస్టులో పెట్టాలని తెలిసి కూడా చంద్రబాబునాయుడు.. బీఆర్ నాయుడికే అప్పగించాడు. దేవుడి గురించి, పవిత్రత గురించి, ఆడవాళ్ల గురించి, వారి రక్షణ గురించా వీరు మాట్లాడేది? వీళ్లకి అసలు ఆ అర్హత ఉందా. ఆలయాల నిర్వహణలో చంద్రబాబుకు శ్రద్దలేదు. తిరుపతి, సింహాచలం, పలాసలో భక్తులు చనిపోయినా ఏం చర్యలు తీసుకున్నారు. కదిరి రథోత్సవంలో భక్తులు గాయపడ్డారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఇది జరిగిందన్నారు. బాబు పాలనలో పాలు తాగినా, నీళ్లు తాగినా చావే.. రెండేళ్లలో అక్కచెల్లెమ్మలకు చంద్రబాబు గజం స్థలం ఇచ్చారా? పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. మా హయాంలో అక్కచెల్లమ్మలకు 31 లక్షల ఇళ్ల పట్టాలిచ్చాం. బాబు పాలనలో పాలు తాగినా, నీళ్లు తాగినా చనిపోతున్నారు. స్కూల్స్, హాస్టళ్లలో నాణ్యమైన ఆహారం పెట్టడం లేదు. కలుషిత ఆహారం తిని విద్యార్థులు చనిపోతున్నారు. ప్రభుత్వం ఆసుపత్రుల్లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లీనిక్లను రద్దు చేశారు. పది లక్షల మంది ప్రభుత్వ స్కూల్స్ నుంచి వెళ్లిపోయారు. ప్రభుత్వ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం గాలికెగిరిపోయింది. కళ్లార్పకుండా అబద్దాలు చెప్పడంతో చంద్రబాబు దిట్ట. చంద్రన్న పెళ్లి కానుక ఏమైంది?. పెళ్లి కానుక గురించి మాట్లాడరు. ముగ్గురు, నలుగురు పిల్లలను కనాలట!. మహిళలపై దారుణాలపై పాల్పడ మీ ఎమ్మెల్యేలపై చర్చలేవి? అని ప్రశ్నించారు.లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాం.. పది లక్షల ఇళ్లు పూర్తి అయ్యాయి. వివిధ దశల్లో ఉన్న మిగతా ఇళ్లకు నిధులు కేటాయించడం లేదు. చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. సచివాలయాలు ఏర్పాటు చేసి రీసర్వేలు మేము మొదలుపెట్టాం. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్ ఎక్కడ?. ఉద్యోగులకు పెండింగ్ డీఏలు ఎప్పుడు ఇస్తారు? అని ప్రశ్నించారు. ఓఆర్ఐ, పాస్బుక్ క్యూఆర్ కోడ్ భూమలు జియో ట్యాగింగ్ తెచ్చింది మేమే. సచివాలయాలతో డిజిటల్ అసిస్టెంట్ వ్యవస్థను బలోపేతం చేశాం. గ్రామ/ వార్డు సచివాలయ ఉద్యోగులను వేధిస్తున్నారు’ అని మండిపడ్డారు. -
బాబు, లోకేష్ కోసం పవన్ జాకీలు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: అసెంబ్లీ సమావేశాల్లో తప్పులు లెక్కలు, సెల్ప్ డబ్బాలేనని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. ఒకరిని మరొకరు జాకీలు పెట్టి లేపే ప్రయత్నం చేసుకున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై అసెంబ్లీ ప్రస్తావన ఏదీ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం.. ఇటు విద్యార్థులను, అటు రైతులను మోసం చేస్తోందన్నారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏపీలో 16 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలకు ఒరిగింది సున్నా. అసెంబ్లీ సమావేశాల్లో తప్పులు లెక్కలు, సెల్ప్ డబ్బాలే. చంద్రబాబు తన కుమారుడికి జాకీలు వేసుకోవడమే సరిపోయింది. లోకేష్.. చంద్రబాబు కోసం జాకీలు వేశారు. చంద్రబాబు, లోకేష్ కోసం పవన్ కల్యాణ్ జాకీలు లేపే ప్రయత్నం చేశారు. అంతేకానీ, ప్రజలకు చేసిందేమీ లేదు. మీరు ఇచ్చిన హామీలపై అసెంబ్లీలో ప్రస్తావనే లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ప్రతీ నిరుద్యోగికి రూ.1.08 లక్షలు బకాయి పడ్డారు. నిరుద్యోగ భృతి అడుగుతుంటే సమాధానం లేదు. 18 ఏళ్లు నిండిన 60 ఏళ్ల లోపు మహిళలకు ఆడబిడ్డ నిధి కింద రూ.1500 ఇస్తామని హామీ ఇచ్చారు. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు నెలకు 4000 పెన్షన్ ఇస్తామన్నారు.. హామీ అమలు చేశారా?.ఎగ్గొట్టిన డబ్బులు ఎప్పుడు ఇస్తారు?60 ఏళ్ల లోపు మహిళలకు మా ప్రభుత్వ హయాంలో 66,34,372 మందికి పెన్షన్లు ఇచ్చాం. కూటమి ప్రభుత్వంలో 2026 ఫిబ్రవరి నాటికి 60,96,108 మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చారు. ఒక్క నెలలోనే 25వేల పెన్షన్లు కట్ చేశారు. కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదు. పెన్షన్ల కింద బడ్జెట్లో పెట్టాల్సింది రూ.31,554 కోట్లు అయితే బడ్జెట్ కేటాయించింది రూ.27,719 కోట్లు మాత్రమే. భవిష్యత్లో ఇంకా పెన్షన్లు కట్ చేసే అవకాశం ఉంది. పెన్షన్లపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సమాధానం లేదు. మా ప్రభుత్వంలో యూడీఐఎస్సీ ప్రకారం 87,41,885 మందికి అమ్మఒడి ఇచ్చాం. కానీ, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం తల్లికి వందనం పేరుతో 20 లక్షల మంది పిల్లలను తొలగించారు. తల్లికి వందనం కింద ఎగ్గొట్టిన డబ్బులు ఎప్పుడు ఇస్తారు?. ఏ ఒక్కరికి రూ.15000 ఇవ్వలేదు.అన్నదాత సుఖీభవ పేరుతో మోసం.. ఉచిత బస్సు హామీని కూడా పూర్తిగా నెరవేర్చలేకపోయారు. షరతులు పెట్టారు. ప్రతీ మహిళకు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. తొలి ఏడాది ఒక సిలిండర్ ఇచ్చి.. మిగతా రెండు ఎగ్గొట్టారు. అన్నదాత సుఖీభవ పేరుతో రైతులను మోసం చేశారు. రెండేళ్లలో ప్రతీ రైతుకు రూ.40వేలకు గాను పదివేలే ఇచ్చారు. అన్నదాత సుఖీభవ నుంచి 7 లక్షల మంది రైతులను తొలగించారు. కౌలు రైతుల ప్రస్తావనే లేదు. ఉచిత పంటల బీమాను చంద్రబాబు రద్దు చేశారు. మోంథా తుపాను కారణంగా నష్టపోయిన లక్షల మంది రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఇప్పటికీ ఇవ్వలేదు. ఒక్క రూపాయి కూడా రైతులకు చెల్లించలేదు. ఎప్పుడు ఇస్తారో వ్యవసాయశాఖ మంత్రైనా, ముఖ్యమంత్రి అయినా చెప్పారా?. ధరల స్థిరీకరణ నిధి కోసం రూ.300 కోట్లే కేటాయించడం ఏంటని శాసనమండలిలో మా సభ్యులు అడిగితే మంత్రులు ఎదురుదాడి చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో ఏయే పంటలు ఎంత ఖర్చుచేసి కొన్నామో సమగ్రమైన వివరాలను ప్రభుత్వానికి మా సభ్యులు చైర్మన్ ద్వారా ఇచ్చారు. ధరల స్థిరీకరణ నిధికి కేటాయింపులు పెంచి రైతులను ఆదుకోవాలన్న స్పృహ వారికి లేకుండా పోయింది. ఇప్పుడు మళ్లీ మిర్చి, శనగ, మొక్కజొన్న, అరటి పంటలకు ధరలు పడిపోయాయి. నెలరోజుల క్రితం రూ.26వేలు ఉన్న క్వింటా మిర్చి ధర, ఇప్పుడు రూ.18వేలకు తగ్గింది.ఆదుకోకుండా.. ఆటలు, పాటలు, స్కిట్లతో కాలక్షేపం.. శనగ ఎంఎస్పీ రూ.5,875 అయితే రైతులు రూ.5000లోపే అమ్ముకుంటున్నారు. మొక్కజొన్న MSP రూ.2,400 అయితే రైతులకు రూ.1400 నుంచి రూ. 1,500 కూడా దక్కని పరిస్థితి. ఒక్క మొక్కజొన్న విషయంలోనే రైతులు రూ.3,500 కోట్లు నష్టపోతున్నారు. అరటి మళ్లీ టన్ను రూ.5వేలకు పడిపోయింది. మా హయాంలో అరటి టన్ను రూ.30వేలకు అమ్ముకున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో దళారులకు వణుకు పుట్టించేవాళ్లం. రైతులకు భరోసా ఇవ్వాల్సింది పోయి ఆటలు, పాటలు, స్కిట్లతో కాలక్షేపం చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతులు, రైతు కూలీల కుటుంబాలకు ఎప్పుడు పరిహారం ఇస్తారో చెప్పలేదు. వ్యవసాయ రంగంలో ఉన్న సంక్షోభం గురించి, రైతుల కష్టాల గురించి చర్చించడం, మాట్లాడ్డం మచ్చుకైనా మాట్లాడలేదు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. -
చంద్రబాబు పాలనంతా ఆర్థిక విధ్వంసమే: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు పాలనంతా ఆర్థిక విధ్వంసమేనని ఆరోపించారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. కూటమి ప్రభుత్వం ఆర్థిక విధ్వంసాన్ని కళ్లకు కట్టినట్టు కాగ్ రిపోర్టు చెప్పిందన్నారు. చంద్రబాబు హయాంలో రాబడులు తగ్గాయన్నారు. రాష్ట్ర ఆదాయం తగ్గి, ఖర్చులు పెరిగాయని తెలిపారు. చంద్రబాబు ప్రతీసారి ఎన్బీసీని చంద్రబాబు ఉల్లంఘిస్తూనే ఉన్నారని క్లారిటీ ఇచ్చారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. ‘అసెంబ్లీ సమావేశాల తర్వాత ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా?. బడ్జెట్లో మోసాలు కల్పిత లెక్కలు మాత్రమే కనిపించాయి. కూటమి ప్రభుత్వం ఆర్థిక విధ్వంసాన్ని కళ్లకు కట్టినట్టు కాగ్ రిపోర్టు చెప్పింది. నేను చెప్పిన విషయాలనే కాగ్ రిపోర్టు చెప్పింది. 2023-24లో ప్రభుత్వం చేసిన మొత్తం ఖర్చు 2,36,486 కోట్లు. 2023-24లో రాబడులు రూ.1,70,767 కోట్లు. 2023-24లో రెవెన్యూ లోటు రూ.32,680 కోట్లు. ద్రవ్యలోటు రూ.62,719 కోట్లు. చంద్రబాబు వచ్చాక తొలి ఏడాది ఖర్చు రూ.2,49,096 కోట్లు. చంద్రబాబు ప్రభుత్వంలో రాబడులు 1,68,024 కోట్లు మాత్రమే. చంద్రబాబు హయాంలో రెవెన్యూ లోటు రూ.60,285 కోట్లు.అప్పుల్లోనూ ఉల్లంఘనలే.. చంద్రబాబు హయాంలో రాబడులు తగ్గాయి. రాష్ట్ర ఆదాయం తగ్గింది, ఖర్చులు పెరిగాయి. చంద్రబాబు వచ్చాక రెవెన్యూ లోటు 56 శాతం పెరిగింది. కూటమి వచ్చాక ద్రవ్య లోటు 32.5 శాతం పెరిగింది. చంద్రబాబు పాలనంతా ఆర్థిక విధ్వంసమే. 2024-25లో జీఎస్డీపీలో అప్పుల శాతం 5.89 శాతం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పుల శాతం 4.1 శాతమ మాత్రమే. మేము తూచా తప్పకుండా మేనిఫెస్టోను అమలు చేశాం. కోవిడ్ పరిస్థితులను ఎదుర్కొన్నాం. అయినా అప్పులు 4.1 శాతం మాత్రమే చేశాం. ఎన్బీసీకి లోబడే ఎవరైనా అప్పులు తీసుకోవాలి. చంద్రబాబు ప్రతీసారి ఎన్బీసీని ఉల్లంఘిస్తూనే ఉన్నారు. 2014-19 మధ్య అనుమతించిన దాని కన్నా అధికంగా అప్పులు చేశారు. చంద్రబాబు రూ.29,099 కోట్లు అధికంగా అప్పులు చేశారు. మా హయాంలో పరిమితి కన్నా తక్కువగా అప్పులు చేశాం. రూ.12,708 కోట్లు తక్కువగా అప్పులు చేశాం. కరోనా పరిస్థితులు కూడా తక్కువగానే అప్పులు చేశాం. చంద్రబాబు రాగానే మళ్లీ సీన్ రివర్స్ అయ్యింది. 2024-25లో పరిమితికి మించి 17,953 కోట్లు అధిక అప్పులు. 20 నెలల్లో బాబు తెచ్చిన అప్పులు 3.20 లక్షల కోట్లు దాటాయి. మేము ఐదేళ్ల కాలంలో రూ.3 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేశాం. మేము ఐదేళ్లలో చేసిన అప్పు.. బాబు రెండేళ్లలోనే చేశారు. ఏపీని దోచుకుంటున్నారు కాబట్టే ఆదాయం పెరగడం లేదు.కేంద్రానికి లేఖ రాస్తాం..బినామీలు, ఎల్లో మీడియా సహచరులు దోచుకుంటున్నారు. విశాఖలో రూ.5000 కోట్ల విలువైన భూమిని దోచిపెట్టారు. చంద్రబాబు సమీప బంధువుకు భూములు కట్టబెట్టారు. ఇలా దోచిపెడుతుంటే రాష్ట్రానికి ఆదాయం ఎలా వస్తుంది?. రాష్ట్ర ఖజానాలో మినిమమ్ బ్యాలెన్స్ కూడా లేదు. చంద్రబాబు పాలన చేయడం లేదు.. బిల్డప్ మాత్రమే. 2024-25 కాగ్ రిపోర్టు ప్రకారం అప్పు రూ.81,082 కోట్లు. అసెంబ్లీ సాక్షిగా రూ.60,485 కోట్లు అని బాబు తప్పుడు సమాచారం ఇచ్చారు. చంద్రబాబు తప్పుడు సమాచారంపై కేంద్రానికి లేఖ రాస్తాం. డీవోపీటీకి, కేబినెట్, ఫైనాన్స్ సెక్రటరీలకు లేఖ రాస్తాం' అని అన్నారు. -
చంద్రబాబు ఆర్థిక విధ్వంసం.. కాగ్ నివేదికే సాక్ష్యం
సాక్షి,తాడేపల్లి: చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి రాబడులు తగ్గాయని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు ఆర్థిక విధ్వంసంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ఆదాయం తగ్గింది.. అప్పులు పెరిగాయినేను చెప్పిన విషయాలనే కాగ్ రిపోర్టు చెప్పింది2023-2024లో ప్రభుత్వం చేసిన ఖర్చు 2,36,486 కోట్లు 2023-2024లో రాబడులు రూ.1,70,767 కోట్లు చంద్రబాబు వచ్చాక తొలి ఏడాది ఖర్చు రూ.2,49,906కోట్లు చంద్రబాబు వచ్చాక రాబడులు రూ.1,68,024 కోట్లు మాత్రమే చంద్రబాబు హయాంలో రెవిన్యూ లోటు రూ.60,285కోట్లు రాష్ట్ర ఆదాయం తగ్గింది, ఖర్చులు పెరిగాయి. చంద్రబాబు వచ్చాక రెవిన్యూ లోటు 56శాతం పెరిగిందిచంద్రబాబు వచ్చాక రాబడులు తగ్గాయిచంద్రబాబు వచ్చాక ద్రవ్య లోటు 30శాతం పెరిగిందికోవిడ్ ఉన్నా.. ఆదాయాలు తగ్గినా నెరవేర్చుతూ హామీలు నెరవేర్చాం.కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ మారిందిచంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు అమాంతం పెంచారునెట్ బారో సీలింగ్ పరిధి దాటిందిరాష్ట్ర ప్రభుత్వాలు ఎంత వరకు అప్పు తీసుకోవచ్చో కేంద్ర ప్రభుత్వం విధించే పరిమితి నెట్ బారో సీలింగ్ పరిధి దాటిందిచంద్రబాబు అండ్ కో దోచిపెట్టడమే సరిపోతుందిమట్టిని,ఇసుక,భూములు,లిక్కర్ దేన్ని వదలడం లేదుఅన్నీంట్లో దోపిడీయేప్రభుత్వానికి ఆదాయానికి ఎలా వస్తుందిప్రజలకు సంక్షేమం ఎలా అందుతుందివీళ్ల దోపిడికి వైజాగ్లో జరిగిన భూదోపిడీయే నిదర్శనంఇలా చేస్తే ఆదాయాలు వస్తాయి.చంద్రబాబు పాలనకు ఆయన బిల్డప్కు తేడా చూపించే మరో చరిత్రఓవైపు మాపై తప్పుడు ప్రచారాలు చేస్తారుఅప్పులు చేస్తారుఆ అప్పులు బయట పడకుండా దాచేస్తే ప్రయత్నం చేస్తారుకాగ్ రిపోర్టులో అప్పులు రూ.81,082.51 కోట్లుకానీ అసెంబ్లీలో రూ.60,485.40 కోట్లు సుమారు 20వేల కోట్లు వ్యత్యాసం ఉంది16రోజుల అసెంబ్లీ సమావేశాలతో ప్రజలు ఒరిగింది సున్నాచంద్రబాబుఅధికారంలోకి రాగానే మళ్లీ సీన్ రివర్స్:2024-25లోనే పరిమితికి మించి రూ.17,953కోట్లు అధికంగా అప్పులు తీసుకువచ్చారు:ఇక 2025-26 ఏడాదిలో పరిస్థితి ఇంతకన్నా కూడా ఘోరంగా ఉంది.ఈ రెండేళ్లలో చంద్రబాబు తెచ్చిన మొత్తం అప్పులు రూ.3.2లక్షల కోట్లు:మా హయాంలో చేసిన అప్పుల్లో 96% అప్పులు ఈ రెండేళ్లలోనే చేశారు: మా ఐదేళ్ల కాలంలో చేసిన అప్పులు కేవలం 3.31 లక్షల కోట్లు మాత్రమే : ఎవరు జాగ్రత్తగా ఆర్థిక వ్యవస్థను నిర్వహించారు, ఎవరు ఆర్థిక వ్యవస్థను Damage చేశారన్నది కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది:రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడంలేదు: విచ్చలవిడిగా జరుగుతున్న అవినీతి, దోపిడీ కారణంగా రాష్ట్రానికి ఆదాయాలు రావడంలేదు:వనరులన్నింటినీ కూడా దోచేసి సొంత జేబులు నింపుకుంటున్నారు:ఇసుక, మట్టి, సిలికా, క్వార్ట్స్, లెటరైట్, గ్రానైట్, లిక్కర్, భూములు, అధిక రేట్లకు పీపీఏలు దేన్నీ వదిలిపెట్టడంలేదు:దోపిడీ జరిగితే, ప్రభుత్వానికి ఆదాయాలు ఎలా వస్తాయి? సంక్షేమం, అభివృద్ధి ఎలా నడుస్తుంది?విశాఖపట్నంలో అత్యంత విలువైన భూములను కారుచవకగా కట్టబెడుతూ దోపిడీకి పాల్పడుతున్నారు:రూ.5వేల కోట్ల విలువ చేసే 54 ఎకరాల ప్రభుత్వ భూములను చంద్రబాబు బంధువు కబ్జాచేస్తున్నారు:పొక్లెయిన్లతో లెవల్ చేసి, ప్రభుత్వం పెట్టిన బోర్డులను పీకేసి ఆక్రమించుకుంటున్నారు:ఇంత బహిరంగంగా ఒక ముఖ్యమంత్రి, ఆయన బంధువు, లోక్సభ ఎంపీ కలిసి ప్రజల ఆస్తులను దోచేస్తున్నారు:ప్రభుత్వంతోపాటు వ్యవస్థలన్నీ చోద్యం చూస్తున్నాయి:ప్రజల ఆస్తులను రాబందుల్లా కొల్లగొడుతున్నారుఆర్బీఐ అడ్వాన్స్లమీద ఆధారపడకుండా, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో,మినిమం బ్యాలెన్స్ నగదు నిల్వ ఉండే రోజులు పడిపోయాయి:ఏ కష్టాలు లేనప్పటికీ 2024-25లో నగదు నిల్వలున్న సమయం కేవలం 8 రోజులకు పడిపోయింది. 365 రోజుల్లో 357 రోజులు మినిమం బ్యాలెన్స్ కూడా ట్రెజరీల్లో లేవు. చంద్రబాబు తాను చేస్తున్న పరిపాలనకు, ఆయన ఇస్తున్న బిల్డప్కు మధ్య తేడా కనిపిస్తోంది:వైయస్సార్సీపీ మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ మరోవైపు ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తున్నారుచేస్తున్న అప్పుల్ని బయటకు రానీయకుండా దాచేసే ప్రయత్నంచేస్తున్నారు.2024-25లో చేసిన బడ్జెట్ అప్పులు రూ.60,485 కోట్లని వీళ్ల ప్రభుత్వం చెప్తోంది, కాని కాగ్ మాత్రం ఆ ఏడాదిలో చేసిన అప్పులు రూ.81,071 కోట్లని తేల్చిచెప్పింది. దాదాపుగా రూ.20 వేల కోట్ల అప్పులను, వాస్తవంకంటే తక్కువ చేసి చూపించారు. 2024-25లో బడ్జెట్ వెలుపల చేసిన అప్పులపై వివరాలు ఇవ్వమని మండలిలో రాతపూర్వకంగా ప్రశ్నించాం: అలాంటి అప్పులేవీ చేయలేదంటూ ప్రభుత్వం దాటవేసే ప్రయత్నంచేసింది: రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అనేక సంస్థలు, ప్రభుత్వ గ్యారంటీతో, పెద్ద ఎత్తున అప్పులు తీసుకున్నాయి. వీటన్నింటినీకూడా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అనక ఏమంటారు? కాని వాటి లెక్కలను చెప్పడం లేదుసభను తప్పుదోవ పట్టించిన అధికారులపై డీవోపీటికి ఫిర్యాదు చేస్తాం మొత్తం 16 రోజులపాటు జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చూస్తే, తప్పుడు లెక్కలు, తప్పుడు ప్రచారాలు, సెల్ఫ్డబ్బాలు తప్ప ప్రజలకు ఒరిగింది సున్నా చంద్రబాబు తన కొడుక్కి జాకీలు పెట్టి ఎత్తితే, చంద్రబాబుకి ఆయన కొడుకు జాకీలు పెట్టి ఎత్తుతాడు. వీళ్లిద్దరికీ పవన్కళ్యాణ్ మరొక జాకీ పెట్టి లేపుతాడు ఆత్మస్తుతి... పరనింద మూడు బడ్జెట్లు ప్రవేశ పెట్టారుసూపర్ సిక్స్,సూపర్ సెవన్లు లేవు నిరుద్యోగ భృతి అడుగుతుంటే సమాధానం లేదు 18ఏళ్లు నిండిన 60ఏళ్ల లోపు మహిళలకు ఆడబిడ్డ నిధికింద రూ.1500ఇస్తామని హామీ ఇచ్చారు మీరు ఇచ్చిన హామీలపై అసెంబ్లీలో ప్రస్తావన లేదుప్రతి నిరుద్యోగికి రూ.1.08లక్షల బకాయి పడ్డారుఈ బడ్జెట్లలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల్ని ఎంతవరకు నెరవేర్చారు ఇదే విషయం గురించి చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా50ఏళ్లు నిండిన ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ మహిళలకు నెలకు రూ.4వేలు పెన్షన్ ఇస్తామన్నారు. హామీ అమలు చేశారా?మా హయాంలో 66,34,372 మందికి పెన్లను ఇచ్చాం2026ఫిబ్రవరి నాటికి 60,96,108 పెన్షన్లు మాత్రమే ఇచ్చారు2026 మార్చి నాటికి 60,69,664 పెన్షన్లు మాత్రమే ఇచ్చారుఒక్క నెలలో 25వేల పెన్షన్లు కట్ చేశారుమా హయాంలో 66,34,372 మందికి పెన్షన్లు ఇచ్చాంపెన్షన్ల కోసం బడ్జెట్లో పెట్టాల్సింది రూ.31,554 కోట్లుబడ్జెట్లో పెట్టింది రూ.27,719కోట్లు మాత్రమే భవిష్యత్లో ఇంకా పెన్షన్లు కట్ చేసే అవకాశం ఉందిపెన్షన్లపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సమాధానం లేదుudisc ప్రకారం 87,41,885 మందికి అమ్మ ఒడి ఇచ్చాంతల్లికి వందనం పేరుతో 20లక్షల మంది పిల్లలను తొలగించారుఉచిత బస్సు హామీని పూర్తిగా నెరవేర్చలేకపోయారు ఆ మిగిలిన డబ్బులు ఎప్పుడు ఇస్తారో చెప్పడంలేదు:పిల్లల సంఖ్యకు తగినట్టుగా బడ్జెట్ కేటాయింపులు లేవని గట్టిగా ప్రశ్నించినా చంద్రబాబు నోరు మెదపలేదు ఉచిత బస్సు ప్రయాణానికి దారుణమైన షరతులు పెట్టారు16 రకాల సర్వీసులు ఉంటే 5 రకాల సర్వీసులకే ఎందుకు పరిమితం చేశారని ప్రశ్నిస్తే… నోరుమెదపలేదు. “రైతు భరోసా’’ కింద మొదటి ఏడాది ఎగ్గొట్టిన డబ్బులు ఎప్పుడు ఇస్తారంటే మాట్లాడలేదు. రెండేళ్లకు గాను ఇవ్వాల్సింది రూ.40వేలు, ఇచ్చింది పదివేలే:ఈ పథకానికి దూరంచేసిన 7 లక్షలమంది రైతుల పరిస్థితి ఏమిటి అని అడిగితే నోరు మెదపలేదు:కౌలు రైతులకు ఒక్కరూపాయికూడా ఇవ్వడంలేదని ప్రశ్నిస్తే దానిగురించి కూడా మాట్లాడలేదు.ప్రీమింయ కట్టకపోవడం వల్ల 2023-24, 2024-25 వ్యవసాయ సీజన్లలో రూ.3,500 కోట్లు రైతులు నష్టపోయారు:వీరికి ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తారని అడిగితే.. ప్రభుత్వం వైపు నుంచి ఒక్క మాటకూడా మాట్లాడలేదు. రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఇప్పటికీ ఇవ్వలేదు:ఒక్క రూపాయి కూడా రైతులకు చెల్లించలేదు. ఎప్పుడు ఇస్తారో వ్యవసాయశాఖ మంత్రైనా, ముఖ్యమంత్రి అయినా చెప్పారా? ధరల స్థిరీకరణ నిధి కోసం రూ.300 కోట్లే కేటాయించడం ఏంటని శాసనమండలిలో మా సభ్యులు అడిగితే మంత్రులు ఎదురుదాడి చేశారు:వైఎస్సార్సీపీహయాంలో ఏయే పంటలు ఎంత ఖర్చుచేసి కొన్నామో సమగ్రమైన వివరాలను ప్రభుత్వానికి మా సభ్యులు ఛైర్మన్ ద్వారా ఇచ్చారు:ధరల స్థిరీకరణ నిధికి కేటాయింపులు పెంచి రైతులను ఆదుకోవాలన్న స్పృహ వారికి లేకుండా పోయింది. ఇప్పుడు మళ్లీ మిర్చి, శనగ, మొక్కజొన్న, అరటి పంటలకు ధరలు పడిపోయాయి:నెలరోజుల క్రితం రూ.26వేలు ఉన్న క్వింటా మిర్చి ధర, ఇప్పుడు రూ.18వేలకు తగ్గింది శనగ ఎంఎస్పీ రూ.5,875 అయితే రైతులు రూ.5 వేలలోపే అమ్ముకుంటున్నారు:మొక్కజొన్న ఎంఎస్పీ రూ.2,400 అయితే రైతులకు రూ.1400 నుంచి రూ. 1,500 కూడా దక్కని పరిస్థితి:ఒక్క మొక్కజొన్న విషయంలోనే రైతులు రూ.3,500 కోట్లు నష్టపోతున్నారు: అరటి మళ్లీ టన్ను రూ.5వేలకు పడిపోయింది:మా హయాంలో అరటి టన్ను రూ.30వేలకు అమ్ముకున్నారు:వైఎస్సార్సీపీ హయాంలో దళారులకు వణుకు పుట్టించేవాళ్లం: రైతులకు భరోసా ఇవ్వాల్సింది పోయి ఆటలు, పాటలు, స్కిట్లతో కాలక్షేపం చేశారు:ఆత్మహత్య చేసుకున్న రైతులు, రైతు కూలీల కుటుంబాలకు ఎప్పుడు పరిహారం ఇస్తారో చెప్పలేదు:వ్యవసాయ రంగంలో ఉన్న సంక్షోభం గురించి, రైతుల కష్టాల గురించి చర్చించడం, మాట్లాడ్డం మచ్చుకైనా మాటలాడలేదు ఫీజు రియింబర్స్ మెంట్, విద్యాదీవెన పథకానికి పెట్టిన బకాయిలు, వసతి దీవెన కింద పెట్టిన బకాయిలు ఎప్పుడు ఇస్తారన్నదానిపై ఒక్క మాటకూడా ముఖ్యమంత్రికాని, మంత్రులుకాని మాట్లాడలేదు.2024-26 రెండేళ్లకు విద్యాదీవెన, వసతి దీవెన బకాయలు రూ. 6,428కోట్లు.26-27 ఏడాదీ కలిపితే కలిపితే మొత్తం ఈ ఏడాది ఖర్చు చేయాల్సింది రూ.10,328 కోట్లు. కాని 2026-27 బడ్జెట్లో పెట్టింది కేవలం రూ.2,766 కోట్లుమరి పిల్లల చదువులు ఎలా సాగుతాయని అడితే దానిపై ఎవ్వరూ మాట్లాడలేదు. తల్లిదండ్రులమీద తీవ్ర ఒత్తిడి ఉంది, ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థి, పిల్లలు చదువులు మానుకోవాల్సిన పరిస్తి : ఉద్యోగులకు ఇస్తానన్న పీఆర్సీపైనా, ఐఆర్పైనా ప్రశ్నిస్తే దానిపైనా మట్లాడలేదు:ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.36వేల కోట్ల బకాయిలపైనా మాట్లాడలేదు:ఆశ వర్కర్స్, అంగన్వాడీల కు ఇచ్చిన హామీల ఊసు కూడా లేదు: సచివాలయాలు పెట్టి, రీసర్వే మొదలు పెట్టింది మేం:రీ సర్వే కోసం 40వేల మంది సిబ్బందిని పెట్టంది మేం:అన్నీ తానే చేశానన్నట్టుగా చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు:బేసిక్ పే ఇస్తానన్న హామీని అమలు చేయాలని సర్వేయర్లు డిమాండ్ చేస్తే వారిమీద కక్షసాధింపులకు దిగుతున్నాడు:డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ఇవ్వాల్సిన, ఎగరగొట్టిన సున్నావడ్డీ గురించి మాట్లాడలేదు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చంద్రబాబుగారు ఒకవైపు వెన్నుపోటు పొడుస్తూ మరోవైపు వారిని మభ్యపెడుతున్నారు:మహిళా సాధికారితపై చంద్రబాబు కోతలు కోస్తున్నాడు:మహిళలను పారిశ్రామిక వేత్తలను చేస్తానంటూ 2014-19లో కూడా చంద్రబాబు మాట్లాడారు:ఎంతమందిని మహిళలను పారిశ్రామిక వేత్తలను చేశాడో చంద్రబాబు చెప్పగలడా? మా ప్రభుత్వంలో మహిళా సాధికారితకోసం, స్వయం ఉపాధి పథకాలను రద్దుచేశారు:ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం, కాపునేస్తం, జగనన్నతోడు, జగనన్న చేదోడు, నేతన్న నేస్తం, వాహనమిత్ర, సున్నావడ్డీలను రద్దుచేశారు:ట్రిపుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తానంటూ చంద్రబాబు దొంగ మాటలు చెప్తున్నాడు. ఈ రెండేళ్లలో కొత్తగా అక్క చెల్లెమ్మలకు ఒక్క గజం స్థలం ఇవ్వలేదు. ఒక్క ఇంటిపట్టా ఇవ్వలేదు. కొత్తగా ఒక ఇంటినికూడా మంజూరుచేసి ఇవ్వలేదు. మా హయాంలో 31 లక్షల ఇళ్లపట్టాలిచ్చి, అందులో 21 లక్షల ఇల్లు మంజూరు చేశాం:10 లక్షల పైచిలుకు ఇళ్లు పూర్తి చేశాం: వివిధ దశల్లో ఉన్న, పూర్తయ్యే దశలో ఉన్న ఆ ఇళ్లకు డబ్బులుకూడా ఇవ్వడంలేదు. స్కూళ్లు, ప్రభుత్వాసుపత్రుల్లో నాడు-నేడు గురించి అసెంబ్లీ సమావేశాల్లో ఒక్క మాటకూడా మాట్లాడలేదు:ఆ 17 మెడికల్ కాలేజీలను ఏంచేస్తారో చెప్పడంలేదు :ఆరోగ్యశ్రీకి రూ.3,150కోట్లు బకాయిలు పెట్టారు:బకాయిలు ఇవ్వకపోతే అగ్రిమెంట్లు చేయబోమని నెట్వర్క్ ఆస్పత్రులు అల్టిమేటం ఇస్తున్నాయి. తాను ఇచ్చిన హామీలు అమలు చేయకుండానే ప్రతి జంట కనీసం ముగ్గురు, నలుగురు పిల్లల్ని చంద్రాబు కనమంటున్నాడు: చంద్రబాబు పాలనలో పాలు తాగినా, నీళ్లు తాగినా చనిపోతున్నారు. స్కూళ్లలో, హాస్టళ్లలో నాణ్యమైన భోజనం కూడా పెట్టలేకపోతున్నాడు. పరిశుభ్రమైన తాగునీరు, కలుషిత ఆహారం వల్ల పిల్లలు చనిపోతున్న పరిస్థితులు చూస్తున్నాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. మంచి చదువు ఇవ్వకుండా, మంచి వైద్యం ఇవ్వకుండా, ఉద్యోగ కల్పన చేయకుండా, ఎడాపెడా పిల్లల్ని కనమంటున్నాడు.పెళ్లిచేసుకున్న ప్రతి జంటకూ చంద్రన్నపెళ్లికానుక కింద రూ. 1లక్ష ఇస్తానంటూ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాడు.ఇప్పటివరకూ ఒక్క జంటకూ ఒక్కరూపాయి ఇచ్చింది లేదు. కానీ, మూడో బిడ్డను కంటే డబ్బులు ఇస్తాడంట. చంద్రబాబు మాటలను ఎవరైనా నమ్ముతారా? ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ కాదా?మహిళల జోలికి వస్తే, తాటతీస్తానని చంద్రబాబుగారు డైలాగులు మీద డైలాగులు చెప్తున్నారు. మహిళలపై దారుణాలకు పాల్పడ్డ తన పార్టీకి చెందిన వారిపై ఎంతమంది మీద చర్యలు తీసుకున్నాడు. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నాడు? KGBV మహిళా ప్రిన్సిపల్ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్మీద చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నారు?హిళలతో అశ్లీలంగా వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్మీద ఏం చర్యలు తీసుకున్నారు?టీడీపీకి చెందిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక దాడికి పాల్పడితే, ఈ చంద్రబాబుగారు ఏం చర్యలు తీసుకున్నారు?మంత్రి సంధ్యారాణి పీఏ మీద చంద్రబాబుగారు ఏం చర్యలు తీసుకున్నారు? బాధితురాలిమీదే తప్పుడు కేసుపెట్టి జైలుకు పంపారుప్రస్తుత టీటీడీ ఛైర్మన్, ఒక మహిళను మోసంచేసి, వీడియో, ఫొటోలతో అడ్డంగా దొరికిపోయారు,అయినా చంద్రబాబు ఏం చేశాడుతనను మోసం చేశాడని, ఇలాంటి వారికి ఎలాంటి పదవులు ఇవ్వొద్దని, విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని, బాధితురాలు నేరుగా చంద్రబాబుకు లేఖరాసింది:దేవుడిపట్ల భయం, భక్తి, నిష్ట కలిగినవారే, టీటీడీ ఛైర్మన్లాంటి పోస్టులో పెట్టాలని తెలిసికూడా, చంద్రబాబునాయుడు బి.ఆర్.నాయుడికే అప్పగించాడు. దేవుడిగురించి, పవిత్రత గురించి, ఆడవాళ్ల గురించి, వారి రక్షణ గురించి మాట్లాడేది? వీళ్లకి అసలు ఆ అర్హత ఉందా?ఆలయాల నిర్వహణలో చంద్రబాబుకు శ్రద్దలేదు తిరుపతి, సింహాచలం, పలాసలో భక్తులు చనిపోయినా ఏం చర్యలు తీసుకున్నారు:కదిరి రథోస్త్సవంలో భక్తులు గాయపడ్డారుప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఇది జరిగిందిచివరకు తిరుమలకు సప్లై అయిన నెయ్యి వ్యవహారంలో కూడా మా పార్టీ నుంచి మా ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు కూడా చెప్పలేదు.ఇందాపూర్ డెయిరీ - హెరిటేజ్ మధ్య సంబధాల గురించి నిలదీశాం. సమాధానం చెప్పలేదు. సంగం-వైష్ణవిల మధ్య సంబంధాల గురించి ప్రశ్నించాం. కాని నోరుమెదపలేదు. నెయ్యిపై దుమారం రేపుతూ మరోవైపు భయంకరమైన స్కాంకు పాల్పడుతున్నారు. తిరుమలకు సప్లై అవుతున్న నెయ్యి టెండర్ల డాక్యుమెంట్లు చూస్తే ఇప్పటివరకూ రూ.200 కోట్ల స్కాం బయటపడుతోంది. ఉద్దేశ పూర్వకంగానే ఏడాది కాలంలో కేజీ నెయ్యిరేటు రూ.351 నుంచి రూ.716కు పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్లారు:తిరుమల హుండీ డబ్బు లెక్కించే పరకామణి నుంచి ఏకంగా కోటి రూపాయలు విలువైన బంగారాన్ని చోరీ అయ్యింది:చంద్రబాబుగారి హయాంలో ఘోరమైన తప్పు జరిగింది:దొంగకు దగ్గరుండి బెయిల్ ఇప్పించి, మొత్తం కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారు. మా హయాంలో రూ.75వేల విలువ చేసే డాలర్ నోట్లు దొంగతనం జరిగితే, రూ.15కోట్ల విలువైన ఆస్తులు టీటీడీకి రాయించారు. కాని, కోటి రూపాయల విలువైన బంగారం చోరీచేస్తూ పట్టుబడితే ఆ కేసును బయటకు రానీయకుండా గూడుపుఠాణీ చేసి, తొక్కిపెట్టారు. జనవరి, 2025లో పరకామణిలో బంగారం దొంగతనాన్ని దాచిపెట్టిట్టారు: ఉద్దేశ పూర్వకంగా 2023లో జరిగిన వ్యవహారాన్ని తెరమీదకు తెచ్చారు:రూ.75వేల విలువైన అమెరికన్ డాలర్ల చోరీ జరిగితే, మా హాయంలో గుడికి రూ.15కోట్లు విలువైన ఆస్తులు రాయించాం:2025 జనవరి నాటి భారీ దొంగతనాన్ని, మహాపచారాన్ని దాచిపెట్టేందుకు 2023 నాటి వ్యవహారాన్ని 2025 సెప్టెంబరు నుంచి తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు: నెయ్యి వ్యవహారంలో కూడా అంతే :టెండర్లు ఖరారైందీ, సప్లై జరిగిందీ, టెస్టుల్లో ట్యాంకర్లు ఫెయిల్ అయ్యిందీ, వాటిని రిజెక్ట్ చేసిందీ, రిజెక్ట్ చేసిన ట్యాంకర్లు మళ్లీ లడ్డూ ప్రసాదంలోకి వెళ్లిందీ చంద్రబాబుహయాంలోనే:ఇది తెలిసికూడా, తప్పు తానుచేసి సెప్టెంబరు18, 2024న వైయస్సార్సీపీ మీదకు చంద్రబాబు నెట్టేశాడు:చంద్రబాబుగారు కుట్రలుమీద కుట్రలు చేశారు: -
పెంచలయ్య దొంగతనం చేసిన దేవుడి సొమ్ము ఎంత తెలుసా?
-
నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. సమకాలీన అంశాలపై ఆయన మాట్లాడనున్నారు. -
టీడీపీ కార్యకర్తల వీరంగం YSRCP కార్యకర్త, మహిళా సిబ్బందిపై దాడి
-
వందల ఎకరాలు దానం చేశాం తెలుసుకుని మాట్లాడు..
-
‘కూటమి నేతల తీరు ఆకతాయితనంగా ఉంది’
రాజమహేంద్రవరం : కల్తీ పాల ఘటన బాధితుల గురించి కూటమి నేతలు పట్టించుకునే స్థితిలో లేరని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ విమర్శించారు. కూటమి నేతలకు నాటకాలు వేయడానికి టైం ఉంది.. కానీ కల్తీ పాల బాధితుల గురించి పట్టించుకునే టైం లేదా అని ప్రశ్నించారు. ఈరోజు(మంగళవాం, మార్చి 10వ తేదీ) రాజమహేంద్రవరం ఆసుపత్రిలో కల్తీ పాల బాధితులను పరామర్శించారు మాజీ ఎంపీ మార్గాని భరత్.రాజమండ్రిలో కూటమి నేతల తీరు ఆకతాయితనంగా ఉంది. నాటకాలు వేయడానికి టైం ఉంది కానీ... చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మంత్రి సత్య కుమార్లకు కల్తీ పాల బాధితుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదా?, దీన్నో యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. బాధితుల శాంపిళ్ళు నేషనల్ ఫోరెన్సిక్ లేబరేటరీకి ఎందుకు పంపలేదు. ఈ వ్యవహారాన్ని సిబిఐకి అప్పగించాలి. అప్పుడే నిజానిజాలు వెల్లడవుతాయి. పోలీసులు అన్ని రకాలుగా దర్యాప్తు జరపాలి. 160 లీటర్ల పాలు తీసుకొస్తే 20 కుటుంబాలు మాత్రమే ఎందుకు ఎఫెక్ట్ అయ్యాయి. పాలలో యూరియా కలిసిందా... ఫార్మాలిన్ కలిసిందా... గిట్టని వాళ్లు ఏమైనా పురుగుల మందు కలిపారా... అన్న విషయాలు ఇప్పటివరకు స్పష్టం కాలేదు. బాధితు కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ ఘటనలు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ మిల్క్ ప్రొక్యూర్ మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు. ఆ చట్టాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదు. చిన్నారులు సైతం మృతువుతో పోరాడుతున్నారు. మీ కుటుంబంలోనే ఇటువంటి ఘటనలు జరిగితే ఇలాగే ప్రవర్తిస్తారా?, పురుగుల మందు తీసుకుని ఎలా తీవ్ర అనారోగ్యం ఎదుర్కొంటారో అటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ల్యాబ్ నుంచి రిపోర్టు రావడానికి వారాలు ఎందుకు పడుతుంది.ప్రభుత్వం హైడ్రామా ఆడుతోంది.ఈ ఘటన జరిగిన తర్వాత హెరిటేజ్ అడ్వర్టైజ్మెంట్లు విపరీతంగా పెంచింది. ఈ ఘటనను కూడా వ్యాపారం కోసం వాడుకుంటున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కల్తీయే. బాధిత కుటుంబాలకు 25 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలి’ అని డిమాండ్ చేశారు. -
‘టీటీడీని చంద్రబాబు రాజకీయ వేదికగా వాడుకుంటున్నారు’
నెల్లూరు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల ప్రాశస్త్యం మసకబారిందన్నారు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి. టీటీడీనే స్వయంగా చంద్రబాబే రాజకీయ వేదికా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. గో శాల, లడ్డూ, బిఆర్ నాయుడు రాసలీలు అనేక సంఘటనలు చూశాం. పరకామణీ కేసులో పెంచులయ్య 2025లో పట్టుబడ్డాడు. అతనికి బెయిల్ కూడా మంజీరా చేశారు. అదే రకమైన కేసులో రవి కుమార్ అనే నిందితుడు ఆస్తులు శ్రీవారికి రాసి ఇచ్చారు. కేసు నమోదు చేసి లోకాదలత్కు వెళ్ళింది.. పరకామణీ చోరి కేసులో కూటమి అధికారంలోకి వచ్చాక కేసును నీరు గార్చే ప్రయత్నాలు జరిగాయి. పెంచులయ్య ఎంత బంగారు చోరి చేశాడో అసలు నిజాలు బయటపెట్టలేదు. 2024 చివరిలో పెంచులయ్య చోరి చేస్తే బయటకు పొక్కకుండా చూశారు. పెంచులయ్య వెనుక ఎవరు వున్నారు. అసలు భద్రతా వ్యవస్థ పనిచేస్తుందా.. భద్రతా వైఫల్యం క్లియర్ గా కనబడుతుంది. శ్రీవారి పరకామణీలో చోరీ చేసిన నగలు కార్పొరేట్ దుకాణాల్లో మార్పిడి జరిగింది. మరీ వింతగా బ్యాంకులో శ్రీవారి నగలతో రుణాలు కూడా పొందారు.ఈ చోరీ వెనుక వున్న వారిని ఎవ్వరినీ విచారించిన పాపాన పోలేదు’ అని విమర్శించారు కాకాణి. -
గుర్తు పెట్టుకో భరత్.. జగన్ సీఎం అయ్యాక.. నువ్వు జైల్లోకే
-
Punyasheela: వేంకటేశ్వర స్వామికే భూములు అమ్మిన కేటుగాడు
-
YSRCPలో భారీ ప్రక్షాళన 18 లక్షల సైన్యాన్ని సిద్ధం చేస్తున్న జగన్
-
‘అక్కా అంటూనే.. ఇలాంటి మెసేజీలు ఏంట్రా?’
సాక్షి, సత్యసాయి జిల్లా: అతనో ఆకతాయి...పచ్చ నేతల పంచన చేరాడు. మద్యం మత్తులో పిచ్చి ముదిరి మహిళలను టార్గెట్ చేశాడు. అక్కా అంటూనే ఓ మహిళతో అసభ్యంగా మాట్లాడాడు. ఆమె చెప్పు తీస్తాననే సరికి కాళ్లబేరానికొచ్చాడు. ఆ తర్వాత అధికారపార్టీ నాయకుల కనుసన్నల్లో మెలుగుతూ సామాజిక మాధ్యమాల్లో ఇష్టానుసారం వాగడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డిపై కూడా సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీనిపై వైఎస్సార్సీపీ నాయకులు స్పందించారు. అతణ్ని కొన్నేళ్ల క్రితమే పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు పేర్కొంటూ.. చెన్నేకొత్తపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాగుడు...వాగుడు.. పులేటిపల్లికి చెందిన బి.భాస్కర్రెడ్డి మద్యం మత్తులో పలువురు మహిళలకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడటం పరిపాటిగా మార్చుకున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఓ ఆడియో సంభాషణ బయటకు వచ్చింది. ఓ మహిళను వేధింపులకు గురి చేసే విధంగా మెసేజీలు (రాయలేని భాషలో) చేయడంతో పాటు.. ఫోన్లో మాట్లాడిన ఉదంతం వెలుగు చూసింది. భాస్కర్రెడ్డి చేష్టలను గమనించిన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి.. గతంలోనే అతన్ని వైఎస్సార్సీపీ నుంచి సస్పెండ్ చేయించారు. ప్రస్తుతం అతను ‘పరిటాల’ కోటరీకి అనుకూలంగా ఉంటూ.. నిత్యం మద్యం సేవిస్తూ.. వైఎస్సార్సీపీని, మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడు. తనకు డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారంటూ లేనిపోని అభాండాలు వేస్తూ.. టీడీపీకి అనుకూలంగా ఉన్న మీడియాలో వార్తలు రాయిస్తున్నాడు. అధికారులను బెదిరించి.. తమ ప్రభుత్వం అధికారంలో ఉందంటూ.. రెవెన్యూ అధికారులను బెదిరించి కొన్ని భూములు కూడా కాజేశాడు. తనను ఎవరూ ఏమీ చేయలేరంటూ సామాన్య ప్రజలను సైతం భాస్కర్రెడ్డి భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు తెలిసింది. పులేటిపల్లికి చెందిన భాస్కర్రెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధమూ లేదని గతంలోనే పలుమార్లు వెల్లడించినట్లు చెన్నేకొత్తపల్లి మండల వైఎస్సార్సీపీ నాయకులు పేర్కొన్నారు. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సన్నిహితుల కనుసన్నల్లో నడుస్తూ.. వైఎస్సార్సీపీపై బురదజల్లే ప్రయత్నం మానుకోవాలని అతనికి సూచించారు. ‘చెప్పుతో కొడతా భాస్కర్’.. ఓ మహిళతో పులేటిపల్లి భాస్కర్రెడ్డి మాట్లాడిన ఆడియో సంభాషణ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అందులో ‘ఏం భాస్కర్.. అక్కా అంటావ్.. తలకాయ తిరిగే కూతలు కూస్తావా? నీ స్మైల్ బాగుంది.. ఐ లైక్ యూ.. ఐ లవ్ యూ అని మెసేజీలు చేస్తావా? పులేటిపల్లికి వచ్చి చెప్పుతో కొడతా.. ఏం అనుకుంటున్నావో! గతంలో కూడా ఓసారి వార్నింగ్ ఇచ్చినా.. అయినా మారలేదు. నీ పెళ్లాంతోనే చెప్పుతో కొట్టిస్తా. అక్కా అంటావ్.. ఇలాంటి మెసేజీలు చేస్తావా? నీ నంబరు కూడా నా దగ్గర లేదు. కొవ్వు పట్టి చేస్తున్నావ్. ఒకట్రెండు సార్లు కాదు.. ఇప్పటికే నాలుగైదు సార్లు ఇలా చేశావ్. కళ్లు తిరుగుతున్నాయా? బట్టలు ఊడదీసి ఊరేగిస్తా..’ అంటూ మహిళ ఘాటుగా హెచ్చరించారు. తగ్గి మాట్లాడిన భాస్కర్.. ‘అక్కా.. ఇంకోసారి మిస్టేక్ జరగదు. నేను స్థానికంగా లేను. బెంగళూరులో ఉన్నాను. ఏదో తెలియక చేసినా. నా గురించి తెలుసు కదా అక్కా. ఈసారికి వదిలెయ్ ప్లీజ్’ అంటూ బతిమాలాడు. నువ్వంటే గౌరవం అక్కా అంటూ నమ్మబలికాడు. -
కబ్జాలకు చరమ‘గీతం’ పాడండి
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ ఎంపీ భరత్కు చెందిన గీతం యూనివర్సిటీ భూ ఆక్రమణలపై జనాగ్రహం కట్టలు తెంచుకుంది. దురాక్రమణకు తెగబడిన ప్రభుత్వం గీతం వర్సిటీ నుంచి భూములను వెనక్కి తీసుకోవాల్సిందేనంటూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రజలు విశాఖపట్నం కలెక్టరేట్కు భారీగా పోటెత్తారు. టీడీపీ ఎంపీ భరత్ దురాగతాలపై గళమెత్తారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి జీవో రాకముందే రూ.5 వేల కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిలో లెవెలింగ్ పనులు చేపట్టిన వర్సిటీ యాజమాన్యంపై ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ అండతోనే ఎంపీ భరత్ చెలరేగిపోతున్నారని మండిపడ్డారు. తక్షణం భూములు వెనక్కి తీసుకోవాలని భారీగా గ్రీవెన్స్కు ఫిర్యాదులు తీసుకొచ్చారు. దీంతో కౌంటర్లు కిక్కిరిసిపోయాయి. ఏం చేయాలో పాలుపోని అధికారులు కంప్యూటర్లు పనిచేయడం లేదంటూ మీనమేషాలు లెక్కించారు. పోలీసులు ప్రజలపై జులుం ప్రదర్శించేందుకు యత్నించారు. దీంతో అధికారుల తీరుకు నిరసనగా ప్రజలు ఒక్కసారిగా నినాదాలు చేశారు. కలెక్టరేట్ ముందు వైఎస్సార్సీపీ నేతలతో కలిసి బైఠాయించారు. ఫలితంగా జన నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. ఒకానొక దశలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫిర్యాదులు తీసుకోవాల్సిందేనని వైఎస్సార్సీపీ నేతలు అధికారులను నిలదీశారు. దీంతో దిగొచ్చిన అధికారులు ఎట్టకేలకు 200 మంది నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. భరత్పై ల్యాండ్ గ్రాబింగ్ కేసు నమోదు చేయాలి : కేకే రాజు ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ చంద్రబాబు, లోకేష్ అండతోనే విశాఖ టీడీపీ ఎంపీ భరత్ భూ ఆక్రమణలకు పాల్పడుతున్నాడని విమర్శించారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి జీవో రాకముందే రూ.5 వేల కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేసి లెవెలింగ్ పనులు చేపడుతున్న భరత్పై ల్యాండ్ గ్రాబింగ్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం విశాఖ జిల్లాలో జరిగిన భూ ఆక్రమణలపై చర్యలు తీసుకుని సుమారు 2 వేల ఎకరాల భూమిని సంరక్షించిందని గుర్తుచేశారు. ఇందులో భాగంగా గీతం ఆక్రమించిన రూ.5 వేల కోట్ల విలువైన 54.79 ఎకరాలకు పైగా భూమిని అప్పట్లో స్వాధీనం చేసుకుని అందులో ప్రభుత్వ భూమి అని బోర్డులు ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఇంకా 14 ఎకరాలకుపైగా భూమిపై కోర్టులో కేసు పెండింగ్లో ఉందని, తుది తీర్పు వచ్చే వరకు ఎలాంటి చర్యలూ చేపట్టవద్దని కోర్టు స్టేటస్ కో ఇచ్చిందని వివరించారు. అయినప్పటికీ అధికారుల అండతో బోర్డులు పీకేసీ గీతం యాజమాన్యం లెవెలింగ్ పనులు చేపట్టడం ఏమిటని కేకే రాజు మండిపడ్డారు. బోర్డులు తొలగించిన గీతం యాజమాన్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తప్పు తెలుసుకుని భూములను ప్రభుత్వానికి స్వాధీనం చేయాల్సిన ఎంపీ.. తమ తాతల కాలం నుంచి ఆక్రమించామని, తమకు ఇచ్చేయాలని మీడియా ముందే నిస్సిగ్గుగా చెప్పడం గర్హనీయమన్నారు. గీతం భూకబ్జాపై కలెక్టరేట్లో గ్రీవెన్స్కు ప్రజలు భారీగా తరలివస్తే అధికారులు ఫిర్యాదులను స్వీకరించకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. పోలీసుజులుం ద్వారా తమ పోరాటాన్ని అణిచివేయాలని యత్నిస్తున్నారని కేకే రాజు మండిపడ్డారు. గీతం భూకబ్జాపై ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. గీతం యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు టీడీపీ కూటమి నాయకులకు బానిసలు కాదని ఆయన ధ్వజమెత్తారు. భూములను పరిరక్షించాలి : వాసుపల్లి గణేశ్మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ... టీడీపీ నాయకుల అవినీతి కేంద్రానికి మాయని మచ్చగా మిగులుతుందని హెచ్చరించారు. తక్షణం ఎంపీ భరత్ను జైల్లో పెట్టి ప్రభుత్వ భూములను పరిరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గాల సమన్వయకర్తలు మొల్లి అప్పారావు, దేవాన్రెడ్డి,మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు పాల్గొన్నారు. -
టాస్క్ ఫోర్స్ లా ఏర్పడి పని చేద్దాం ఓటర్ల జాబితా సవరణపై సజ్జల కీలక వ్యాఖ్యలు
-
మీకు 17 వరకు టైం ఇస్తున్న.. జడ శ్రవణ్ వార్నింగ్..
-
‘కూటమి పాలనలో అన్ని రంగాల్లో విధ్వంసమే’
తాడేపల్లి : కూటమి పాలనలో అన్ని రంగాల్లో విధ్వంసమే కనిపిస్తోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ విమర్శించారు. ఏ రంగంలో చూసినా అంత విధ్వంసమేనన్నారు. ఈరోజు(సోమవారం, మార్చి 9వ తేదీ) తాడేపల్లి నుంచి మాట్లాడిన శైలజానాథ్.. చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారన్నారు. ‘నిరుద్యోగుల జీవితాలను అన్యాయం చేశారు. వ్యవసాయ రంగాన్ని మరింత నాశనం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు యాభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామని మోసం చేశారు. PPP మోడ్ కింద ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వారికి అప్పనంగా ఇస్తున్నారు. కొన్ని జిల్లాలో కలెక్టర్లు, ఎస్పీలను రుణాలు కట్టాలని ఒత్తిడి చేస్తున్నారు.. ఎస్సీ,ఎస్టీలకు వివిధ కార్పొరేషన్ల కింద ఇచ్చిన రుణాలను భేషరతుగా మాఫీ చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
TV5 సాంబాని ఇమిటేట్ చేసి ఏకిపారేసిన భూమన
-
టీడీపీ ప్రభుత్వంలో ‘వైఎస్సార్సీపీ అంటే ఓట్లు తొలగింపే’
సాక్షి,తాడేపల్లి: 2019 ఎన్నికలకు ముందు టీడీపీ ప్రభుత్వం 40 లక్షల ఓట్లు తొలగించింది. మన ఓటర్లను మనమే కాపాడుకోవాలి. వారి ఓట్లు గల్లంతు కాకుండా చూసుకోవాలని వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు.సోమవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బూత్ లెవల్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా, జోనల్ అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ, నియోజకవర్గ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడారు. ‘ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడా పార్టీ ఓట్లు తొలగించకుండా జాగ్రత్త పడాలి. అవసరమైతే టాస్క్ఫోర్స్లా ఏర్పడి పని చేయాలి. ఈ విషయంలో బూత్ కమిటీలదే కీలకపాత్ర. 2019 ఎన్నికలకు మందు టీడీపీ ప్రభుత్వం 40 లక్షల ఓట్లు తొలగించింది. ఇంటింటికి వెళ్లి వైఎస్సార్సీపీ సానుభూతిపరులని తెలియగానే ఓట్లు తీసేశారు.దీనిపై అప్పట్లో మనం పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. మన ఓటర్లను కాపాడుకోవాలి. వారి ఓట్లు గల్లంతు కాకుండా చూసుకోవాలి.అందుకు అవసరమైతే టాస్క్ఫోర్స్ కూడా ఏర్పాటు చేసుకుందాం. బూత్ లెవెల్ పరిధిలో నాయకులను ఈ ప్రక్రియలో ప్రమేయం చేయాలి’ అని సూచించారు. -
‘చంద్రబాబు విజనరీ కాదు.. పాయిజనరీ’
తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విమర్శించారు. సూపర్ సిక్స్ పేరుతో మహా దగా చేసిన ఘనత చంద్రబాబుదన్నారు. మహిళలను మోసం చేసి మహిళా దినోత్సవాన్ని ఎలా జరుపుకుంటారని ప్రశ్నించారు. ఈరోజు(సోమవారం, మార్చి 9వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన వరుదు కళ్యాణి.. చంద్రబాబు విజనరీ కాదు.. పాయిజనరీ అంటూ ధ్వజమెత్తారు.‘మూడు జనరేషన్లను ఛీట్ చేసిన వ్యక్తి చంద్రబాబు. మహిళలను వేధించిన ఎమ్మెల్యేలను పక్కన కూర్చోపెట్టుకుని మహిళా దినోత్సవం జరుపుకుంటారా?, మహిళా ద్రోహి పార్టీ టీడీపీ. జగన్ తెచ్చిన పథకాలను కూడా చంద్రబాబు తన ఖాతాలో వేసుకున్నారు. ఎస్సీ ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు ఇప్పటికీ రాయితీలు ఇవ్వలేదు. డ్రాక్రా మహిళలకు సున్నా వడ్డీ డబ్బులే ఇవ్వకుండా వారిని కూడా పారిశ్రామిక వేత్తలను చేస్తానంటున్నారు. చంద్రబాబు పాలనలో డ్వాక్రా గ్రూపుల పరపతి తగ్గింది. బ్యాంకర్లు రుణాలను ఇవ్వటం తగ్గించారు. మరి పారిశ్రామిక వేత్తలను చేస్తానంటూ ఎలా మాట్లాడతారు?, జగన్ సున్నావడ్డీ కింద దాదాపు రూ.5 వేల కోట్లు మహిళలకు ఇచ్చారు. చంద్రబాబు వలన డ్వాక్రా గ్రూపులన్నీ నిర్వీర్యం అవుతున్నాయి. ఫ్రీ బస్, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలెండర్ పథకాలు ఎవరికిచ్చారు?, సగం మందికి కూడా ఇవ్వకుండా సక్సెస్ చేశామని ఎలా చెప్పుకుంటారు?, అసెంబ్లీలో, బయటా డ్రామా చేయడమే చంద్రబాబుకు తెలుసు. కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం.. అన్నీ చంద్రబాబేమంత్రులు, ఎమ్మెల్యేలు కేరక్టర్ ఆర్టిస్టులుగా మిగిలి పోయారు. చంద్రబాబు, వైఎస్ జగన్ పాలనకు నక్కకు, నాగ లోకానికి ఉన్నంత తేడా ఉంది. జగన్ అన్ని వర్గాల మహిళలకూ మేలు చేశారు. చంద్రబాబు అందరినీ నిలువునా మోసం చేశారు. మహిళా ద్రోహిగా చంద్రబాబు చరిత్రలో మిగిలిపోతారు. పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు మహిళలకు కనపడకుండా తిరుగుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై నిలదీస్తారని భయపడుతున్నారు. రాష్ట్రంలో రోజూ మహిళలపై లైంగిక దాడులు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది?, కాల్ సెంటర్కు కాల్ చేసినా ఏపీ పోలీసులు స్పందించటం లేదని సాక్షాత్తూ కేంద్ర మంత్రి అమిత్షానే లెటర్ రాశారుదేశంలోనే అట్టడుగు స్థానంలోకి ఏపీ పోలీసు వ్యవస్థ వెళ్లిపోయింది. మహిళలు, చిన్నారులకు ఏపీలో అసలు రక్షణే లేదు. హోంమంత్రి అనిత సొంత నియోజకవర్గంలోనే గంజాయి, డ్రగ్స్ దొరుకుతున్నాయి. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా గంజాయి పండించటం సిగ్గుచేటు. మహిళను వేధించిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదు?, లోకేష్ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్త మహిళల ఫోటోలు తీస్తూ దొరికాడు. మహిళలు అర్ధరాత్రి వరకు ధర్నాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. చంద్రబాబు విజనరీ కాదు.. పాయిజనరీ. మూడు జనరేషన్లను ఛీట్ చేసిన వ్యక్తి చంద్రబాబు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ముగ్గురు పిల్లల్ని కనమంటూ ఉచిత సలహా ఇస్తున్నారు’ అని ధ్వజమెత్తారు. -
రూ. వేల కోట్ల భూములు దోచుకున్నారు.. వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు
సాక్షి, విశాఖపట్నం: గీతం వర్సిటీ భూకబ్జాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వందలాది ప్రజలు ఈరోజు (సోమవారం) కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. అక్రమంగా కబ్జా చేసిన భూములలో నిర్మాణాలు ఆపాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకేరాజు, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ కలెక్టర్కు విన్నవించారు. అయితే ప్రజల ఫిర్యాదులను స్వీకరించకపోవడంతో వైఎస్సార్సీపీ నాయకులు కలెక్టరేట్లో బైఠాయించారు.విద్యా సంస్థల ముసుగులో ఎంపీ భరత్ రూ, 5 వేల కోట్లు దోచుకున్నారని వైఎస్ఆర్సీపి కార్పొరేటర్ల పై దాడి చేసి జీఎంసి కౌన్సిల్ సమావేశంలో అక్రమంగా భూమిని క్రమబద్ధీకరించుకున్నారని కేకే రాజు ఆరోపించారు. వందలాది మంది ప్రజ ప్రభుత్వ భూములను కాపాడాలని గ్రీవెన్స్ కు ఫిర్యాదు చేయడానికి వచ్చినా ఎంపీ భరత్ ఆదేశాల మేరకు ఫిర్యాదులు తీసుకోలేదన్నారు. కోర్టులో కేసులు ఉండగానే అక్రమ నిర్మాణాలు గీతంలో చేపడతారని ప్రశ్నించారు. పోలీసుల జూలంతో తమ పోరాటాన్ని అణిచివేయాలని చూస్తున్నారు.టీడీపీ నాయకుల అవినీతి బీజేపి నాయకులకు కనిపించట్లేదా అని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ అన్నారు. భూకబ్జాలు చేసిన ఎంపీ భరత్ ను జైల్లో పెట్టాలన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గీతం భూములను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. అక్రమ నిర్మాణాలను కూలదొస్తమని హెచ్చరించారు. గీతం భూబ్జాలపై ఫిర్యాదులు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. -
ధైర్యం ఉంటే రా చూసుకుందాం.. ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ కు నూరీ ఫాతిమా సవాల్


