breaking news
YSRCP
-
సమస్యలపై ఎలుగెత్తాలి: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘‘రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే మనకు ముఖ్యం.. ప్రజా ప్రయోజనాలు, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పార్లమెంట్లో గట్టిగా మన గళం వినిపించాలి..’’ అని పార్టీ ఎంపీలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు వైఎస్సార్ సీపీ ఇదివరకే మద్దతు ఇచ్చిందని గుర్తు చేస్తూ.. దాన్ని మరోసారి పునరుద్ఘాటిస్తున్నామని చెప్పారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ అధ్యక్షతన వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈనెల 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఎంపీలతో చర్చించి మార్గనిర్దేశం చేశారు. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ్రెడ్డి, గొల్ల బాబూరావు, లోక్సభలో వైఎస్సార్సీపీ పక్షనేత పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, లోక్సభ సభ్యులు ఎం.గురుమూర్తి, వైఎస్ అవినాష్రెడ్డి, గుమ్మా తనూజారాణి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. డీఎస్సీ 2025 ఒక పెద్ద స్కామ్..రాష్ట్రంలో పాలన గాలికి ఎగిరి పోయింది. ఎక్కడ చూసినా స్కాములే. డీఎస్సీ 2025 పోస్టుల భర్తీలో పెద్ద స్కాం చోటు చేసుకుంది. అసలు పోటీ పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు ఇవ్వడం ఏమిటి? డీఎస్సీ పరీక్ష పేపర్ల లీక్పైనా అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీలో అనేక అవకతవకలు జరిగాయి. కేవలం తమ వాళ్ల కోసం ప్రత్యేకంగా జీవోలు ఇచ్చారు. తమ పని అయిపోగానే ఆ జీవోలు రద్దు చేశారు. సర్టిఫికెట్లు ఇచ్చిన క్రీడా సంఘాలు కూడా వారి చేతుల్లోనే ఉన్నాయి. సాఫ్ట్ బాల్ అసోసియేషన్కు టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అధ్యక్షుడు. జూడో సంఘానికి గౌరవ అధ్యక్షుడిగా విశాఖపట్నం ఎంపీ, లోకేశ్ తోడల్లుడు భరత్ ఉన్నారు. అడ్డగోలుగా భూపందేరాలు.. అంతులేని అవినీతి..మరోవైపు రాష్ట్రంలో ఇష్టానుసారంగా భూముల పందేరం జరుగుతోంది. దాదాపు రూ.5 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను లోకేశ్ తోడల్లుడికి అప్పనంగా అప్పగించారు. ఘోరమైన అవినీతి జరిగింది. అటు అమరావతి నిర్మాణంలో కూడా విపరీతమైన దోపిడీ జరుగుతోంది. చదరపు అడుగుకు రూ.20 వేలకు పైగా ఖర్చు చేస్తున్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి రేట్లు లేవు. రోడ్ల నిర్మాణాల్లోనూ దోపిడీయే. పూలింగ్కు భూములు ఇవ్వని రైతులపై దారుణాలకు దిగుతున్నారు. బలవంతంగా వారి భూములను లాక్కుంటున్నారు. ఇప్పటికే తీసుకున్న వేల ఎకరాలకే దిక్కులేదు. ఇప్పుడు మళ్లీ మా భూములు ఎందుకు తీసుకుంటున్నారని రైతులు అడుగుతున్నారు. ప్రభుత్వ తప్పులను వెలికి తీస్తున్న, ప్రశ్నిస్తున్న వారిపై వేధింపులకు దిగుతున్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారు. సోషల్ మీడియా పేరిట చంద్రబాబు తీవ్ర అరాచకాలకు పాల్పడుతున్నారు. ఎవరి మీదనైనా సరే కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు. టీచర్లకు ‘టెట్’ ఇబ్బందులు..టీచర్ల ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి. టెట్ రాకముందు నుంచి టీచర్లుగా పని చేస్తున్న వారికి ఇప్పుడు ‘టెట్’ తప్పనిసరి చేయడం సరికాదు. పైగా వాళ్లంతా కాంపిటీటివ్ ఎగ్జామ్స్లో ఉత్తీర్ణులు అయిన వారే. వీళ్లు ఉద్యోగాలు పొందినప్పుడు టెట్ అనే పరీక్ష లేదు. ఇప్పుడు వీరిని టెట్ రాయమనడం భావ్యం కాదు. సుదీర్ఘ కాలంగా ఒకే సబ్జెక్టు బోధిస్తున్న వారిని ఇప్పుడు అన్ని సబ్జెక్టులున్న టెట్ పరీక్ష రాయమనడం, దాన్ని తప్పనిసరి చేయడం ఏ మాత్రం సరికాదు. దీనికి సంబంధించి కేంద్ర మంత్రిని కలవాలి. వారికి సమస్యను నివేదించాలి. ప్రజా ఆస్తులు పప్పుబెల్లాల్లా పంపకంరాష్ట్రంలో ప్రజల ఆస్తులను పప్పుబెల్లాల్లా పంచి పెడుతున్నారు. ప్రైవేటు పేరుతో ఎక్కడికక్కడ దోచిపెడుతున్నారు. పోర్టులు, హార్బర్లు సహా పలు సంస్థల ప్రైవేటీకరణ దారుణం. నిజానికి ఆయా ప్రాజెక్టుల పనులన్నీ మొదలై కొలిక్కి వస్తున్నాయి. అలాంటి వాటిని, దాదాపు పూర్తయిన వాటిని కూడా ఇప్పుడు ప్రైవేటుకు ఇవ్వడం అన్యాయం. దారుణమైన స్కామ్ ఇది. దాదాపుగా పూర్తైన రామాయపట్నం పోర్టును ప్రైవేటుకు ఇవ్వడం అతి దారుణం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మొదలై దాదాపుగా నిర్మాణం పూర్తైన పోర్టును ప్రైవేటుకు ఇవ్వడం ఏమిటి? రూ.5 వేల కోట్ల విలువైన పోర్టును రూ.1,500 కోట్లకు ఇవ్వడం స్కామ్ కాదా? ఇలాంటి వాటిని ప్రైవేటుకు ఇచ్చేస్తే ఇక రాష్ట్రానికి ఆదాయాలు ఎలా వస్తాయి?అప్పుల్లో రికార్డు... ప్రతిచోట అవినీతి, దోపిడీ..ఇష్టానుసారంగా భూముల కేటాయింపులు చేస్తున్నారు. ఇసుక, లిక్కర్, మైన్స్.. దేన్నీ వదలకుండా దోపిడీ చేస్తున్నారు. ప్రతిచోటా మాఫియా నడుస్తోంది. ఇంకా ఈ ప్రభుత్వం అడ్డగోలుగా అప్పులు చేస్తోంది. అప్పుల్లో రికార్డులు సృష్టిస్తోంది. ఈ రెండు సంవత్సరాల్లో ఏకంగా రూ.3.6 లక్షల కోట్ల మేర అప్పులు చేశారు. పరిమితి లేకుండా విపరీతంగా అప్పు చేస్తున్నారు. ఎఫ్ఆర్బీఎం చట్టాన్ని ఉల్లంఘించి మరీ అప్పులు చేస్తున్నారు. ఇన్ని అప్పులు చేసినా ప్రజలకు చేసింది శూన్యం. మరోవైపు సిండికేట్ కారణంగా ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేక రైతాంగం చాలా నష్టపోతోంది. భీమవరం సభ ద్వారా ఆక్వా రైతుల ఆగ్రహం పెల్లుబికింది. తాము దగాకు గురవుతున్నామని రైతులు ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు ఉద్యోగులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారికి గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు దిక్కులేదు. పీఆర్సీ లేదు.. ఐఆర్ లేదు.. 5 డీఏలు పెండింగ్.. సరెండర్ లీవ్స్ పెండింగ్.. ఉద్యోగులకు అన్నీ ఇబ్బందులే. వీటన్నింటినీ పార్లమెంట్ ఉభయ సభల్లో లేవనెత్తాలి. ఈ ప్రభుత్వ అవినీతి వ్యవహారాలను ఎండగట్టాలి. ముఖ్యంగా ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడాలి. -
రైతులు తిరగబడే రోజులు దగ్గర్లోనే..
కనిగిరి రూరల్: అన్నివిధాల తీవ్రంగా నష్టపోయిన రైతులు చంద్రబాబు ప్రభుత్వంపై తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మాజీమంత్రి, వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు హెచ్చరించారు. గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ పొగాకు రైతులకు మద్దతుగా మార్కాపురం జిల్లా కనిగిరిలో గురువారం పొగాకు రైతు దీక్ష నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ఈ దీక్షలో పెద్దఎత్తున పొగాకు రైతులు పాల్గొన్నారు. ఈ దీక్షలో కారుమూరి మాట్లాడుతూ రాష్ట్రంలో పంటలకు గిట్టుబాటు ధరలు లేవన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. రెండేళ్ల కూటమి పాలనలో మూడు పంటలు వచ్చాయని, ఒక్క పంటకూ బీమా చేయకపోవడం దారుణమని పేర్కొన్నారు. ‘గొంతు విప్పి వాస్తవాలు మాట్లాడితే అక్రమ కేసులు పెడతారా? కుటుంబాలను జైల్లో పెడతారా? ఎన్నాళ్లు సాగుతుంది మీ అరాచక పాలన. మీరు ఏం చేసినా భయపడం.. ప్రజలకు అండగా నిలబడతాం.. వారి తరఫున పోరాటాలు చేస్తాం’ అని చెప్పారు. మీ హామీల గురించి మాట్లాడితే మా గొంతులు నొక్కేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా కార్పొరేట్ శక్తులకు అండగా ఉంటారని, రైతులకు అండగా నిలబడేది వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. రైతులను పట్టించుకోని చంద్రబాబు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ పొగాకు రైతులు నాలుగు నెలలుగా రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నా.. చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని చెప్పారు. బడ్జెట్లో రైతుల కోసం రూ.వెయ్యికోట్లు కేటాయించలేరా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేంతవరకు పోరాటాలు చేస్తామని చెప్పారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ సొంత నియోజకవర్గం కుప్పంకు నీళ్లివ్వని చంద్రబాబు రైతులకు ఏం మేలు చేస్తాడని విమర్శించారు. చేయిచేయి కలుపుదాం.. పొగాకు రైతు కోసం పోరాడదాం.. అని పిలుపునిచ్చారు. జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున మాట్లాడారు. వైఎస్సార్సీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ దద్దాల నారాయణయాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ దీక్షలో వైఎస్సార్సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యేలు కసుకుర్తి ఆదెన్న, కుందురు నాగార్జునరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు, పీడీసీసీబీ మాజీ చైర్మన్లు వై.ఎం.ప్రసాద్రెడ్డి (బన్నీ), డాక్టర్ వెంకయ్య, పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్త పార్టీతో అనుసంధానం... ‘జగన్ 2.0 సూపర్ యాప్’
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ కార్యకర్తలను పార్టీ నాయకత్వంతో నేరుగా అనుసంధానిస్తూ... సమాచార మార్పిడి, సమస్యల పరిష్కారం, పార్టీ కార్యక్రమాలను ఒకే వేదికపైకి తెచ్చే లక్ష్యంతో రూపొందించిన ‘‘జగన్ 2.0 సూపర్ యాప్’’ను మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఆవిష్కరించారు. ప్రతి కార్యకర్త ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘జగన్ 2.0సూపర్ యాప్’ ఆవిష్కరణ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే..ప్రతి కార్యకర్త నిర్భయంగా అభిప్రాయం చెప్పవచ్చు..వైఎస్సార్సీపీ నుంచి ఈరోజు అధికారికంగా ‘జగన్ 2.0 సూపర్యాప్’ను ఆవిష్కరిస్తున్నాం. సోషల్ మీడియాలో మన వాళ్లు పోస్ట్ చేసిన కంటెంట్ను ఇష్టం వచ్చినట్లుగా డిలీట్ చేయడం, అందుకోసం కుట్రలు పన్నడం.. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో మనమే ఒక యాప్ తీసుకొచ్చి ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాం. అదే జగన్ 2.0 సూపర్యాప్. దీంట్లో ప్రతి కార్యకర్త నిర్భయంగా తన అభిప్రాయం చెప్పొచ్చు. అంతేకాకుండా దీని ద్వారా ప్రతి కార్యకర్త పార్టీతో అనుసంధానమై ఉంటాడు. ఇది మన యాప్ కాబట్టి, మన వాళ్లే ఇందులోకి వస్తారు కాబట్టి, ఎవరు పడితే వారు డిలీట్ చేసే (తొలగించే) హక్కు ఉండదు. ఇది ఒక మంచి పరిణామం. ఇష్టం వచ్చినట్లు చేసే కుట్రలు దీనివల్ల తిప్పి కొట్టొచ్చు. ప్రతి నాయకుడితో ప్రతి కార్యకర్త అనుసంధానం..పార్టీలో ఉన్న చిన్న కార్యకర్త మొదలు పార్టీ కేంద్ర కార్యాలయం వరకు.. నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి నాయకుడితో, ప్రతి కార్యకర్త అనుసంధానమై ఉంటాడు. ఎందుకంటే పార్టీలో ప్రతి ఒక్కరికి ఇది అందుబాటులో ఉంటుంది. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు గానీ, పోలీసుల వేధింపుల వల్ల కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులు గానీ, పార్టీకి సంబంధించిన ఏ అంశమైనా ఈ యాప్ ద్వారా నేరుగా ఒకరితో ఒకరు అనుసంధానమై టచ్లో ఉండే అవకాశం ఉంటుంది. ఈ యాప్లో మరో మంచి అంశం ఏమిటంటే పార్టీలో మనం నిర్వహించే ప్రతి సమావేశం, ప్రెస్మీట్లు, ముఖ్యమైన కార్యక్రమాలు, ప్రకటనలు.. అన్నీ కూడా ఈ యాప్లో లైవ్ ఫీడ్ ద్వారా ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటుంది. డిజిటల్ డైరీతో యాప్ను అనుసంధానిస్తాం..భవిష్యత్తులో ఈ యాప్ను ఇంకా అభివృద్ధి చేస్తాం. కార్యకర్తలు ఎక్కడైనా, ఏమైనా ఇబ్బంది పడుతుంటే వాటిని ఈ యాప్లో పోస్ట్ చేయడం, ఆ తర్వాత పార్టీ వాటిపై స్పందించడం, నియోజకవర్గంలో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త... ఆ కార్యకర్తకు అండగా నిలబడే అవకాశం ఉంటుంది. పోలీసుల వేధింపులతో ఇబ్బంది పడుతున్న మన పార్టీ వారు, రాజకీయ వేధింపులకు గురవుతున్న వారు, డిజిటల్ డైరీలో నమోదు చేస్తున్న వివరాలు.. ఈ యాప్తో అనుసంధానం అవుతాయి. అంటే ఈ యాప్లో ఆ డిజిటల్ డైరీ కూడా అందుబాటులోకి వస్తుంది.దాని వల్ల వేధింపులు, సమస్యలు ఎదుర్కొంటున్న వారు నేరుగా ఈ యాప్ ద్వారా డిజిటల్ డైరీలో ఫిర్యాదు చేయొచ్చు. ఆ వివరాలు నమోదు చేయొచ్చు. ఇతర సోషల్ మీడియా వేదికల్లో మనపై చేస్తున్న అనుచిత విమర్శలు, వీడియోలు, వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసి వాటిని తొలగింపచేసే ప్రయత్నం ఒకవైపు చేసూ్తనే, మరోవైపు ఈ సూపర్ యాప్ను ఎవరూ ఆపలేని విధంగా మనకు మనం సొంతంగా రూపొందించుకోవడం జరిగింది. ఈ యాప్ వల్ల ప్రతి కార్యకర్త నిత్యం, పార్టీ నాయకత్వంతో అనుసంధానమై ఉంటాడు. -
‘జగన్ గేమ్ ఛేంజర్.. చంద్రబాబు నేమ్ ఛేంజర్’
సాక్షి, తాడేపల్లి: చేనేత కార్మికుల సంక్షేమంలో వైఎస్ జగన్ ప్రభుత్వం గేమ్ ఛేంజర్గా నిలిస్తే, చంద్రబాబు ప్రభుత్వం పేర్లు మార్చడానికే పరిమితమైన "నేమ్ ఛేంజర్"గా మిగిలిపోయిందని వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మండిపడ్డారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ హయాంలో ఐదేళ్ల పాటు నిరంతరంగా అమలైన వైఎస్సార్ నేతన్న నేస్తం పథకానికి పేరు మార్చి, లబ్ధిదారుల సంఖ్యను తగ్గించి, రెండేళ్ల ఆలస్యంగా అమలు చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం చేనేత కుటుంబాలను తీవ్రంగా నిరాశపరిచిందని ధ్వజమెత్తారు. ప్రెస్మీట్లో రమేష్ యాదవ్ ఏమన్నారంటే..గత ప్రభుత్వంలో ఐదేళ్లు నిర్వీరామంగా నేతన్న నేస్తం..వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది నుంచే వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించి ఐదేళ్ల పాటు ప్రతి ఏడాది రూ.24 వేల చొప్పున సుమారు 80 వేలకుపైగా చేనేత కుటుంబాలకు అందించింది. ఒక్కో కుటుంబానికి మొత్తం రూ.1.20 లక్షలు చేరేలా చేసి, ఐదేళ్లలో సుమారు రూ.970 కోట్లను వెచ్చించి చేనేత కుటుంబాలకు అండగా నిలిచింది. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఈ పథకం అమలు ఆగలేదుపేరు మార్చి నేతన్నలకు వెన్నుపోటుచంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్ నేతన్న నేస్తం పేరును 'నేతన్న భరోసా'గా మార్చడమే తప్ప కొత్తగా చేసింది ఏమీ లేదు. 2025 ఆగస్టు 7న రూ.25 వేల ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి, రెండేళ్ల పాటు అమలు చేయకుండా ఆలస్యం చేశారు. చివరకు కేవలం రూ.1,000 మాత్రమే పెంచి, 80 వేలకుపైగా ఉన్న లబ్ధిదారులను 54 వేలకే పరిమితం చేసి సుమారు 30 వేల మంది నేతన్నలను ఈ పథకం పరిధి నుంచి తప్పించింది.ఒక్కో కుటుంబానికి రూ.50 వేల చొప్పున వెంటనే చెల్లించాలినిజంగా బీసీలపై ప్రేమ ఉంటే 2024-25, 2025-26 సంవత్సరాలకు సంబంధించిన బకాయిలతో కలిపి అర్హులైన 80 వేలకుపైగా నేతన్నలందరికీ ఒక్కో కుటుంబానికి రూ.50 వేల చొప్పున వెంటనే చెల్లించాలి. పేర్లు మార్చడం కాదు.. వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన స్థాయిలో సంక్షేమాన్ని కొనసాగించగలిగితేనే చేనేత కుటుంబాలకు నిజమైన న్యాయం చేసినట్టవుతుంది అని రమేష్ యాదవ్ పేర్కొన్నారు. -
కనిగిరి పొగాకు రైతులకు అండగా దీక్ష.. మాస్ వార్నింగ్ బాబుకి
-
జగన్ 2.0 SUPER APP లాంచ్
-
‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ
సాక్షి, తాడేపల్లి: పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘జగన్ 2.0 సూపర్ యాప్’ను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. పార్టీ కార్యక్రమాలు, కార్యకర్తలు కోసం యాప్ డిజైన్ చేశారు. పార్టీ నేతలంతా నేరుగా కార్యకర్తలతో టచ్లో ఉండేలా ఈ యాప్ను రూపొందించారు. సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ నుంచి ఇవాళ అధికారిక ‘జగన్ 2.0 సూపర్ యాప్’ను ఆవిష్కరిస్తున్నామన్నారు.‘‘ఈ రోజు ఏం జరుగుతోంది అంటే.. సోషల్ మీడియాలో మన వాళ్లు పోస్ట్ చేసిన కంటెంట్ను ఇష్టం వచ్చినట్లుగా డిలీట్ చేయడం, అందుకోసం ఇష్టానుసారం కుట్రలు పన్నడం.. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో మనమే ఒక యాప్ తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాం. అదే జగన్ 2.0 సూపర్ యాప్. దీంట్లో ప్రతి కార్యకర్త నిర్భయంగా తన అభిప్రాయం చెప్పొచ్చు...అంతే కాకుండా దీని ద్వారా ప్రతి కార్యకర్త పార్టీతో అనుసంధానమై ఉంటాడు. ఇది మన యాప్ కాబట్టి, మన వాళ్లే ఇందులోకి వస్తారు కాబట్టి, ఎవరు పడితే వారు డిలీట్ చేసే హక్కు కూడా వారికి ఉండదు. ఇది ఒక మంచి పరిణామం. ఇష్టం వచ్చినట్లు చేసే కుట్రలు కూడా దీనివల్ల తిప్పి కొట్టొచ్చు.’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.ఇంకా పార్టీలో ఉన్న చిన్న కార్యకర్త మొదలు, పార్టీ కేంద్ర కార్యాలయం వరకు.. నియోజకవర్గస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి నాయకుడితో, ప్రతి కార్యకర్త అనుసంధానమై ఉంటాడు. ఎందుకంటే పార్టీలో ప్రతి ఒక్కరికి ఇది అందుబాటులో ఉంటుంది కాబట్టి. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, పోలీసుల వేధింపుల వల్ల కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులు కానీ, పార్టీకి సంబంధించిన ఏ అంశంపై కానీ, ఈ యాప్ ద్వారా నేరుగా ఒకరితో ఒకరు అనుసంధానమై టచ్లో ఉండే అవకాశం ఉంటుంది.👉 Click here to download the Jagan 2.0 Super App.ఈ యాప్లో మరో మంచి అంశం ఏమిటంటే, పార్టీలో మనం నిర్వహించే ప్రతి సమావేశం, ప్రెస్మీట్లు, ముఖ్యమైన కార్యక్రమాలు, ప్రకటనలు.. అన్నీ కూడా ఈ యాప్లో లైవ్ ఫీడ్ ద్వారా ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటుంది. భవిష్యత్తులో ఈ యాప్ను ఇంకా అభివృద్ధి చేయడం జరుగుతుంది. కార్యకర్తలు ఎక్కడైనా, ఏమైనా ఇబ్బంది పడుతుంటే వాటిని ఈ యాప్లో పోస్ట్ చేయడం, ఆ తర్వాత పార్టీ వాటిపై స్పందించడం, నియోజకవర్గంలో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త ఆ కార్యకర్తకు అండగా నిలబడే అవకాశం కూడా ఉంటుంది...పోలీసుల వేధింపులతో ఇబ్బంది పడుతున్న మన పార్టీ వారు, ఇంకా రాజకీయ వేధింపులకు కూడా గురవుతున్న వారు ఇప్పుడు డిజిటల్ డైరీలో నమోదు చేస్తున్న వివరాలు.. ఆ డైరీ కూడా ఈ యాప్తో అనుసంధానం అవుతుంది. అంటే ఈ యాప్లో ఆ డిజిటల్ డైరీ కూడా అందుబాటులోకి వస్తుంది. దాని వల్ల వేధింపుల, సమస్యలు ఎదుర్కొంటున్న వారు నేరుగా ఈ యాప్ ద్వారా డిజిటల్ డైరీలో వాటిని ఫిర్యాదు చేయొచ్చు. ఆ వివరాలు నమోదు చేయొచ్చు...ఇతర సోషల్ మీడియా వేదికల్లో మనపై చేస్తున్న అనుచిత విమర్శలు, వీడియోలు, వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసి, వాటిని తొలగింపచేసే ప్రయత్నం ఒకవైపు చేస్తూనే, మరోవైపు ఈ సూపర్యాప్ను ఎవరూ ఆపలేని విధంగా మనకు మనం సొంతంగా రూపొందించుకోవడం జరిగింది. ఈ యాప్ వల్ల ప్రతి కార్యకర్త నిత్యం, పార్టీ నాయకత్వంతో అనుసంధానమై ఉంటాడు’’ అని వైఎస్ జగన్ వివరించారు. -
‘చంద్రబాబు, లోకేష్, డీజీపీ నాపై కక్ష కట్టారు’
సాక్షి,గుంటూరు: చంద్రబాబు, లోకేష్, డీజీపీ నాపై కక్ష కట్టారు. ఏదో విధంగా నన్ను అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. కిర్లంపూడిలో జరిగిన ఘటనపై అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ క్రమంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, లోకేష్, డీజీపీ నాపై కక్ష కట్టారు. ఏ విధంగా నన్ను అణచివేసేందుకు యత్నిస్తున్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. గత చంద్రబాబు ప్రభుత్వంలో ముద్రగడ కుటుంబాన్ని వేధించారు. మహిళలను అసభ్య పదజాలంతో తిడుతూ అవమానించారు. అధికారిక లాంఛనాలు వద్దని ముద్రగడ కుటుంబమే చెప్పింది. అయినా పోలీసులు ఎందుకు వచ్చారు? అని ప్రశ్నించారు. -
ఎంపీలతో YS జగన్ చర్చించిన అంశాలు
-
ఏపీలో పాలన గాలికి ఎగిరిపోయింది: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. కీలకమైన అంశాలపై ఎంపీలకు ఆయన దిశా నిర్దేశం చేశారు. వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే మనకు ముఖ్యం.. వాటికోసం గళం విప్పాలని పిలుపునిచ్చారు.‘‘మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఇదివరకే మనం మద్దతు ఇచ్చాం. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతును మరోసారి పునరుద్ఘాటిస్తున్నాం. రాష్ట్రంలో పాలన గాలికి ఎగిరిపోయింది. ఎక్కడ చూసినా స్కాములే. డీఎస్పీ పోస్టుల భర్తీ పెద్ద స్కాం చోటు చేసుకుంది. పోటీపరీక్ష రాయకుండా ఉద్యోగాలు ఇవ్వడం ఏంటి?. డీఎస్సీ భర్తీలో తీవ్రమైన అవకతవకలు జరిగాయి. డీఎస్సీ పరీక్ష పేపర్లుకూడా లీక్కు సంబంధించి అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి.’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.‘‘స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీలో తీవ్ర అవకతవకలు. తమ వాళ్లకోసం జీవోలు ఇచ్చారు. ఈ పని అయిపోగానే ఆ జీవోలను రద్దు చేశారు. సర్టిఫికెట్లు ఇచ్చిన క్రీడా సంఘాలు కూడా వారి చేతుల్లోనే ఉన్నాయి. సాఫ్ట్ బాల్ అసోసియేషన్కు టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అధ్యక్షుడు. జూడీ సంఘానికి గౌరవ అధ్యక్షుడిగా విశాఖపట్నం ఎంపీ, లోకేష్ తోడల్లుడు భరత్ ఉన్నాడు. మరో వైపు రాష్ట్రంలో ఇష్టానుసారంగా భూముల పందేరం జరుగుతోంది. ఐదు వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను లోకేష్ తోడల్లుడికి అప్పనంగా అప్పగించారు. ఘోరమైన అవినీతి జరిగింది’’ అని వైఎస్ జగన్ మండిపడ్డారు.‘‘అమరావతి నిర్మాణంలో కూడా విపరీతమైన దోపిడీ జరుగుతోంది. చదరపు అడుగుకు రూ.20 వేలపైనే పెడుతున్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి రేట్లు లేవు. రోడ్ల నిర్మాణాల్లోనూ దోపిడీయే. పూలింగ్కు భూములు ఇవ్వని రైతులపై దారుణాలకు దిగుతున్నారు. బలవంతంగా వారి భూములను లాక్కుంటున్నారు. ఇప్పటికే తీసుకున్న వేల ఎకరాలకే దిక్కులేదు. ఇప్పుడు మళ్లీ మా భూములు ఎందుకు తీసుకుంటున్నారని రైతులు అడుగుతున్నారు. ప్రభుత్వ తప్పులను వెలికి తీస్తున్న, ప్రశ్నిస్తున్నవారిపై వేధింపులకు దిగుతున్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారు...సోషల్ మీడియా పేరిట చంద్రబాబు తీవ్ర అరాచకాలకు పాల్పడుతున్నారు. ఎవరిమీదనైనా సరే కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు. టెట్ రూపంలో టీచర్ల ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి. టెట్ రాక ముందు నుంచీ టీచర్లుగా పనిచేస్తున్నవారికి టెట్ను తప్పనిసరి చేయడం సరికాదు. పైగా వాళ్లంతా కాంపిటీటివ్ ఎగ్జామ్స్లో ఉత్తీర్ణులు అయినవారే. వీళ్లు ఉద్యోగాలు పొందనప్పుడు వీళ్లకు టెట్ అనే పరీక్ష లేదు. ఇప్పుడు వీరిని టెట్ రాయమనడం భావ్యంకాదు. సుదీర్ఘకాలంగా ఒకే సబ్జెక్టు బోధిస్తున్నవారిని, ఇప్పుడు అన్ని సబ్జెక్టులున్న టెట్ పరీక్షను తప్పనిసరి చేయడం సరికాదు. దీనికి సంబంధించి కేంద్ర మంత్రిని కలవాలి, వారికి సమస్యను నివేదించాలి. ..రాష్ట్రంలో ప్రజల ఆస్తులను పప్పుబెల్లాల్లా పంచిపెడుతున్నారు. ప్రైవేటు పేరుతో దోచిపెడుతున్నారు. పోర్టులు, హార్బర్లు సహా పలు సంస్థల ప్రైవేటీకరణ దారుణం. వీటి పనులన్నీ మొదలై కొలిక్కి వస్తున్నాయి. అలాంటి వాటిని కూడా, దాదాపుగా పూర్తైనవాటిని కూడా ఇప్పుడు ప్రైవేటుకు ఇవ్వడం అన్యాయం. దారుణమైన స్కాం ఇది. దాదాపుగా పూర్తైన రామాయపట్నం పోర్టును ప్రైవేటుకు ఇవ్వడం దారుణం. వైఎస్సార్సీపీ హయాంలో మొదలై దాదాపుగా నిర్మాణం పూర్తైన పోర్టును ప్రైవేటుకు ఇవ్వడం ఏంటి?. రూ.5 వేల కోట్ల విలువైన పోర్టును రూ.1500 కోట్లుకు ఇవ్వడం స్కాం కాదా?. ఇలాంటి వాటిని ప్రైవేటుకు ఇచ్చేస్తే ఇక రాష్ట్రానికి ఆదాయాలు ఎలా వస్తాయి...రాష్ట్రంలో ప్రతిదీ అవినీతి, దోపిడీయే. ఇష్టాను సారంగా భూముల కేటాయింపులు, ఇసుక, లిక్కర్, మైన్స్.. అన్నీ దోపిడీ చేస్తున్నారు. ప్రతిచోటా మాఫియా నడుస్తోంది. ఇష్టానుసారం ఈ ప్రభుత్వం అప్పులు చేస్తోంది. అప్పులు చేయడంలో రికార్డులు సృష్టిస్తోంది. ఈ రెండు సంవత్సరాల్లో 3.6లక్షల కోట్లమేర అప్పులు చేశారు. విపరీతంగా అప్పులు చేస్తున్నారు. ఎఫ్ఆర్బీఎం చట్టాన్ని ఉల్లంఘించి అప్పులు చేస్తున్నారు. ఇన్ని అప్పులు చేసిన ప్రజలకు చేసింది శూన్యం...సిండికేట్ కారణంగా ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రైతులు తీవ్రంగా నష్టోతున్నారు. భీమవరం సభ ద్వారా రైతులు ఆగ్రహం పెల్లుబికింది. తాము దగాకు గురవుతున్నామని రైతులు ఆగ్రహంతో ఉన్నారు. మరో వైపు ఉద్యోగులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగులకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు దిక్కులేదు. పీఆర్సీలేదు. ఐఆర్ లేదు. 5 డీఏలు పెండింగ్, సరెండర్ లీవ్స్ పెండింగ్.. ఉద్యోగులకు అన్నీ ఇబ్బందులే.’’ అని వైఎస్ జగన్ వివరించారు. -
కూతురు క్రాంతి గురించి అనుచరులు బయటపెట్టిన నిజాలు
-
చనిపోయాక తండ్రి గుర్తొచ్చాడా? ముద్రగడ కూతురు క్రాంతి పై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్
-
YSRCP MPలతో జగన్ భేటీ.. పార్లమెంట్ సమావేశాలపై దిశా నిర్దేశం
-
లోకేష్ వల్ల ఒరిగింది శూన్యం : రాచమల్లు
పొద్దుటూరు: రాష్ట్ర ప్రజలను కూటమి ప్రభుత్వం దగా చేస్తున్నదని, వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని విమర్శించడమే వారు పనిగా పెట్టుకున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్రెడ్డి అన్నారు. జమ్మలమడుగు, ప్రొద్దుటూరులో నారా లోకేష్ పర్యటన వల్ల జిల్లాకు ఒనగూరిన ప్రయోజనం శూన్యం. జిల్లాకు వచ్చి జగన్పై ఆరోపణలు, నిందలు వేయడం, చేయని వాటిపై సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం తప్ప చేసిందేమీ లేదు. ఇప్పటికి రెండేళ్లయ్యింది...జగన్ పేరు ఉచ్చరించకుండా తండ్రీ కొడుకులకు ఒక్కరోజైనా గడిచిందా అని రాచమల్లు ప్రశ్నించారు. జగన్ నామస్మరణ చేయకపోతే తండ్రీకొడుకులకు సూర్యుడు ఉదయించడు..అస్తమించడు. జగన్ క్యాన్సర్ గడ్డ...చిన్నాన్నను లేపేసినాడు..ఎప్పుడూ ఇవే ఆరోపణలు. రైజింగ్ రాయలసీమ అనే సెల్ఫ్ డబ్బా..పరిశ్రమలన్నీ తామే తెస్తున్నట్లు కలరింగ్ ఇస్తున్నారు. స్పష్టంగా ప్రశ్నిస్తే ఒక్క దానికి కూడా సరైన సమాధానం చెప్పలేదు. జగన్ ఆయన చిన్నాన్నను చంపినాడా..? అరగదీసిన క్యాసెట్టు వేయడానికి కాస్తన్నా సిగ్గుండాలి అని రాచమల్లు అన్నారు.ఈ దేశంలోనే అత్యున్నత సంస్థలు సీబీఐ, సుప్రీం కోర్టు స్పష్టంగా జగన్ ఈ కేసులో ముద్దాయి కాదని స్పష్టంగా చెప్పింది. సీబీఐ ఈ కేసులో ఎవర్నీ విచారించాల్సిన అవసరం లేదని చెప్పిన తర్వాత కూడా అవే ఆరోపణలు చేస్తున్నారు. నువ్వు సీబీఐ కంటే గొప్పవాడివా లోకేష్..సుప్రీం కోర్టు కంటే గొప్ప న్యాయ వ్యవస్థవా? అని ప్రశ్నించారు. పదే పదే అవే అబద్ధాలు చెప్పి సుప్రీం కోర్టును, సీబీఐని నువ్వు అవమాన పరుస్తున్నావా...? జగన్పై మీకున్న అసూయ, పదవి ఉందనే అహంకారంతో మీరు ఈ మాటలు మాట్లాడుతున్నారు. వివేకాను జగన్ చంపాడనేది ఆబద్ధం..చంద్రబాబు మామను వెన్నుపోటు పొడిచింది నిజం. వివేకాను జగన్ చంపలేదు..విచారణ కూడా అవసరం లేదని సుప్రీం కోర్టు చెప్పింది నగ్న సత్యం అని రాచమల్లు పేర్కొన్నారు.అయినా మీకు సిగ్గు, మానం, మర్యాద లేకుండా తప్పుడు మాటలు మాట్లాడుతూనే ఉన్నారు. జగన్ క్యాన్సర్ గడ్డా...రాయలసీమలో పుట్టిన రత్నమా అనేది ప్రజల రెఫరెండం తీసుకుందామా..? జగన్ అనే వ్యక్తి భావితరాలకు బంగారు బాట వేసే గొప్ప నాయకుడు. ఒక్క సారి అవకాశం ఇస్తేనే ఆయన దీన్ని నిరూపించి చూపించాడు. రాయలసీమలో పుట్టిన రత్నం..ఆంధ్ర రాష్ట్రానికి అమూల్యమైన సంపద జగన్. నీ తండ్రి చంద్రబాబు ఈ రాష్ట్రానికి క్యాన్సర్ గడ్డ లాంటివాడైతే..నువ్వు టీడీపీకి క్యాన్సర్ గడ్డ లాంటి వాడివి. నీవల్ల తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కావడం ఎంతో కాలం లేదు అని రాచమల్లు అన్నారు.వ్యవసాయం దండగ అని చెప్పిన వాడు నీ తండ్రి..మరి ఎవరు రైతు ద్రోహి..? వ్యవసాయం పండుగ అన్న రాజశేఖరరెడ్డి రక్తం పంచుకుపుట్టిన వాడు జగన్. 2019–24 మధ్యలో వైఎస్ జగన్ ఎన్నో రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పింది జగన్..పంట నష్టం జరిగితే నెలరోజుల్లో పరిహారం ఇచ్చింది జగన్. సున్నా వడ్డీ రుణాల నుంచి..ఉచిత పంటల బీమా వరకూ చేసింది జగన్. రైతుకు ఆసరాగా రైతు భరోసా కల్పించింది జగన్..వ్యవసాయ పనిముట్లు ఇచ్చింది జగన్ అని రాచమల్లు గుర్తుచేశారు.అలాంటి జగన్ రైతు ద్రోహి ఎలా అవుతాడు..? రాయలసీమకు సాగునీరు ఇవ్వకుండా అన్యాయం చేసిన రైతు ద్రోహి చంద్రబాబు. రైతుల నుంచి అమరావతిలో బలవంతంగా కొట్టి, తిట్టి భూములు లాక్కుంటున్న మీరు రైతు ద్రోహులు. ఏ రైతైనా మీకు భూములు ఇవ్వకపోతే..బుల్డోజర్లు పంపుతున్నారు..నీళ్లతో నింపుతున్నారు. బలవంతంగా భూములు లాక్కుంటుంటే ఓ ఇళ్లాలు పెట్టిన కంటనీరు మీ ప్రభుత్వాన్ని సమూలంగా నాశనం చేస్తుంది లోకేష్.. ఇదేనా మీరు రైతులకు ఇస్తున్న గౌరవం..ఇదేనా రైతు అనుకూల ప్రభుత్వం..? అని నిలదీశారు.నోరుందని, అధికారం ఉందని ఏదంటే అది మాట్లాడితే కుదరదు లోకేష్.. రైజింగ్ రాయలసీమ అని నువ్వు చెప్పేదేంటి..? మా సీమ ఎప్పుడూ రైజింగ్ రాయలసీమే. రాయలేలిన సీమ..రతనాల సీమ మా రాయలసీమ. కానీ మీ తండ్రి చంద్రబాబు పుణ్యామాని మా రాయలసీమ రాళ్లసీమగా మారిపోయింది. మీరు రాయలసీమ వాళ్లు కానే కాదు..చిత్తూరులో పుట్టినా రాయలసీమ పట్ల ఏమాత్రం ప్రేమాభిమానాలు లేని కుటుంబం మీది. రాయలసీమ ప్రజలను మీరు సవతితల్లి బిడ్డలా చూశారు కాబట్టే ఎప్పుడూ సీమవాసులు మిమ్మల్ని ప్రేమించరు అని రాచమల్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలను తీసుకొచ్చింది వైఎస్ జగన్..పరిశ్రమలు తెచ్చామనే బ్రమను కల్పిస్తున్నది మాత్రం మీరు. సింగపూర్ పోతారు..ఎన్నో పరిశ్రమలు అంటారు..కానీ ఒక్కటి రాదు..కానీ సూటు బూటుతో విదేశాల్లో లోకేష్ షోకులు పడుతున్నాడు. జగన్ కడప జిల్లాకు ఏమేమి పరిశ్రమలు తెచ్చాడో ఒక్క సారి చరిత్ర తెలుసుకుని మాట్లాడు లోకేష్. పరిశ్రమలు తరిమికొట్టింది జగన్ కాదు...ఆయన తెచ్చిన పరిశ్రమలకు శంకుస్థాపనలు చేస్తూ జబ్బలు చరుచుకుంటున్నది మీరు. మా ప్రభుత్వంలో మంజూరైన పనులను ఆపేసిన ఘనత మీది..ఇక మీరు ఎక్కడ అభివృద్ధి చేశారో చూపించండి అని రాచమల్లు ప్రశ్నించారు. జగన్ తెచ్చిన 18 మెడికల్ కాలేజీలను పూర్తి చేయలేని వారు..సీట్లను వెనక్కు పంపిన వారు మీరా అభివృద్ధి గురించి మాట్లాడేది..? నిన్న లోకేష్ సందర్శించిన దొరసానిపల్లి స్కూల్ అభివృద్ధి చేసింది కూడా జగనే. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లను ఊటీ స్కూళ్ల మాదిరిగా అభివృద్ధి చేశాం. మీ తండ్రి సీఎంగా ఒక్క స్కూళ్లో బాత్రూమ్ కట్టించాడా...? రానున్న రోజుల్లో గాంధీ తాతను చంపింది కూడా జగనే అని చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తారు. నేడు వివేకాను చంపింది జగనే అన్నప్పుడు...గాంధీని చంపాడని ప్రచారం చేసినా ఆశ్చర్యమేమీ లేదు. మంట లేకుండా వంట చేయగలిగిన ఆయన ఇలాంటి అబద్ధాలు చెప్పడని గ్యారెంటీ ఏముంది..? వాళ్లది నాలుక కాదు...తాటి మట్ట..ఎన్ని అబద్ధాలనైనా చెప్తుంది అని రాచమల్లు పేర్కొన్నారు. -
తిరుమలలో ప్రోటోకాల్ రగడ.. నారాయణ స్వామికి అవమానం!
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శన వ్యవస్థపై మరోసారి విమర్శలు వెల్లువెత్తాయి. మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కె. నారాయణ స్వామి టీటీడీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు ప్రోటోకాల్ దర్శనం ఇవ్వాల్సి ఉండగా.. సాధారణ దర్శనానికి పంపించారని.. ఇది తనను అవమానించినట్లేనని పేర్కొంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.“దేవుడి దగ్గర అందరూ సమానమే. కానీ భక్తుల పట్ల మానవత్వం లేకుండా వ్యవహరించడం బాధాకరం. నాకు ప్రోటోకాల్ ఉన్నప్పటికీ సాధారణ దర్శనం ఇచ్చారు. ఇది అవమానంగా భావిస్తున్నాను” అని నారాయణ స్వామి అన్నారు. అలాగే తిరుమలలో వైఎస్సార్సీపీకి చెందిన నేతలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన వాపోయారు.అదే సమయంలో టీటీడీలో వీఐపీ సంస్కృతిపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. “తిరుమలలో పూర్తిగా వీఐపీ దర్శనాలను తొలగించి.. సామాన్య భక్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఎవరినీ అవమానించే పరిస్థితులు ఉండకూడదు” అని సూచించారు. ఈ అంశంపై సీఎం చంద్రబాబు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.ఇదిలా ఉండగా.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల దర్శన విధానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పండుగలు, రద్దీ రోజుల్లో సామాన్య భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో వీఐపీ, వీవీఐపీ దర్శనాలకు అధిక ప్రాధాన్యత లభిస్తోందన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ప్రోటోకాల్ పేరుతో ప్రముఖులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుండటంతో సాధారణ భక్తుల దర్శన సమయం మరింత ఆలస్యమవుతోందని పలువురు విమర్శిస్తున్నారు. క్యూలైన్ల నిర్వహణ, భక్తుల సౌకర్యాల పర్యవేక్షణలో పోలీసులు, విజిలెన్స్ విభాగం మరింత చురుగ్గా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రద్దీ సమయాల్లో భక్తుల ఇబ్బందులు, నీరు, ఆహారం, వైద్య సదుపాయాలపై మరింత దృష్టి పెట్టాలని భక్తులు కోరుతున్నారు. -
ముగిసిన వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పార్టీ ఎంపీలు పాల్గొన్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఉభయ సభల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, ప్రస్తావించాల్సిన ప్రజా సమస్యలు, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. -
కిర్లంపూడి: అంబటి రాంబాబుపై కేసు నమోదు
సాక్షి, కాకినాడ: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబుపై కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రముఖ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఆరోపిస్తూ పోలీసులు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది.ముద్రగడ పద్మనాభం మృతిచెందిన అనంతరం ఆయన కుటుంబ సభ్యులు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడాన్ని తిరస్కరించారు. తమ కుటుంబ నిర్ణయం మేరకే అంతిమ కార్యక్రమాలు జరపాలని స్పష్టం చేశారు. అయితే.. ప్రభుత్వం తరఫున పోలీసులు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ముద్రగడ అంత్యక్రియల సమయంలో.. గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహించే సమయంలో అంబటి రాంబాబు, మరికొందరు వైఎస్సార్సీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే అధికార లాంఛనాలు నిర్వహిస్తున్న పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారని, ఉన్నతాధికారుల సమక్షంలోనే విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు ఆరోపించారు.ఈ ఘటనపై ఏఆర్ ఎస్ఐ వెలుదూటి అప్పలరాజు, పలువురు కానిస్టేబుళ్లు ఫిర్యాదు చేశారు. గార్డ్ ఆఫ్ హానర్ ఇస్తున్న సమయంలో అంబటి రాంబాబు పోలీసులను తోసివేశారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే ఈ చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. దీంతో అంబటి రాంబాబుతో పాటు మరికొందరు వైఎస్సార్సీపీ నేతలపై బీఎన్ఎస్ 132, 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు.. వైఎస్సార్సీపీ నేతలు ఈ కేసును ఖండిస్తున్నారు. ముద్రగడ కుటుంబం ప్రభుత్వ లాంఛనాలను వద్దని స్పష్టంగా చెప్పినప్పటికీ.. ప్రభుత్వం బలవంతంగా గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహించిందని ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని గౌరవించాల్సిన ప్రభుత్వం.. అందుకు విరుద్ధంగా వ్యవహరించిందని విమర్శిస్తున్నారు. -
చంద్రబాబు సిండికేట్ దోపిడీని కూకటివేళ్లతో పెకిలించేస్తాం
మీ అందరికీ నేను ఒకటే హామీ ఇస్తున్నా.. ‘మీ కష్టాలు నాకు తెలుసు.. నేను ఉన్నాను’ అని మీ అందరికీ చెబుతున్నా. చూస్తుండగానే రెండేళ్లు గడిచాయి. కళ్లు మూసుకొని కళ్లు తెరిచే సరికే మరో మూడేళ్లు గడుస్తాయి. ఆ తర్వాత రైతుల ప్రభుత్వం వస్తుందని గర్వంగా చెప్పగలుగుతా. ఈరోజు మీరు చూపిస్తున్న ఈ ఆదరణ, అభిమానానికి నిజంగా నోటి నుంచి మాట రానంతగా భావోద్వేగం కలుగుతోంది. ఇసుక వేసినా రాలనంతగా కంటి చూపు మేరలో ఎక్కడా ఖాళీ స్థలం కనిపించనంతగా ఈ అభిమాన తరంగాల మధ్య మీరు చూపిస్తున్న ప్రేమ, అభిమానానికి ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు. చంద్రబాబు ఈ సీట్లోకి వచ్చారంటే చాలు, ఆ సిండికేట్కు పండగే పండుగ. మన రైతన్నకు మాత్రం కన్నీళ్లే కన్నీళ్లు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు మార్చాలని చెప్పి తపన, తాపత్రయ పడిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే.. అది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే అని గర్వంగా చెప్పగలను. మన హయాంలో ప్రతి రైతును అన్ని విధాలా చేయి పట్టుకుని నడిపించాం. ఈ రోజు రాష్ట్రంలో రైతు పరిస్థితి దయనీయంగా ఉంది. ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదు. ఆక్వా ఫీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లన్నీ చంద్రబాబు సానుభూతి పరులవే. దాంతో వాళ్లు ఎలా కావాలి అంటే అలా వ్యవహారం నడుపుతున్నారు. సీడ్ కొనేటప్పుడు రేటు ఎంతో వాళ్లే నిర్దేశిస్తారు. ఫీడ్ కొనేటప్పుడు కూడా ధర వాళ్లే నిర్దేశిస్తారు. ఆక్వా రైతన్నలు లక్షలు ఖర్చు చేసి ఆక్వా సాగు చేస్తే, తీరా ఆ పంట (రొయ్యలు) చేతికి వచ్చేసరికే వ్యాపారులంతా సిండికేట్గా ఏర్పడి, రేట్లు ఢమాల్ అని పడిపోయేలా చేస్తున్నారు. ఈ రోజు ఇలా చంద్రబాబు సానుభూతిపరుల సిండికేట్ రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని నడిపిస్తోంది. ఫలితంగా ఆక్వా రైతుల బతుకులు ఆ సిండికేట్ చేతుల్లో నలిగి పోతున్నాయి. – వైఎస్ జగన్సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఆక్వా సిండికేట్ను కూకటి వేళ్లతో సహా పెకిలిస్తామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు ఎప్పుడొచ్చినా ఆక్వాలో సిండికేట్దే పెత్తనమని మండిపడ్డారు. ఆయన అనుయాయ వర్గీయులే ఏవో కారణాలు, సాకులు చెప్పి అడ్డగోలుగా మేత ధరలు పెంచడంతోపాటు పంట ధరలను తగ్గించేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ పరిస్థితిలో ఆక్వా రైతులకు, రాష్ట్ర రైతాంగానికి తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు. బుధవారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా రైతులతో సమావేశంలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. రాబోయేది తమ ప్రభుత్వమేనని, అధికారంలోకి రాగానే ఆక్వాలో ఇప్పుడున్న సిండికేట్ను కూకటి వేళ్లతో సహా పెకిలించేసి.. అప్సడాకు పూర్వ వైభవం తీసుకువస్తామని తెలిపారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. సభలో ప్రసంగిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆక్వాతో 15 లక్షల మందికి ఉపాధి ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి గమనిస్తే లక్షన్నరకు పైగా రైతులు 5 లక్షలకు పైగా ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు. ఫలితంగా దాదాపు 15 లక్షల మందికి ఆక్వా రంగం ఉపాధి కల్పిస్తోంది. కానీ ఈ రంగంలో పరిస్థితులు చూస్తే, మానవత్వం ఉన్న ఏ ఒక్కరికైనా కన్నీళ్లు తెప్పిస్తాయి. అంత దయనీయమైన పరిస్థితిలో ఆక్వా రంగం ఉంది. ఇష్టానుసారంగా ఫీడ్ ధరలను పెంచుకుంటూ పోతున్నారు. నిజానికి «ఫీడ్ ధరల పెంపు అనేది రైతుల అంగీకారంతోనే జరగాలి కానీ, ఏకపక్షంగా కాదు. ఫీడ్ ధరలు పెంచాలంటే సమీక్ష నిర్వహించాలి. దానికి ఒక హేతుబద్ధత ఉండాలి. ధరల పెంపుపై సమీక్షించాలంటే.. ఫిష్ మీల్ సమృద్ధిగా ఉండే అక్టోబర్, నవంబర్ నెలల్లో హేతుబద్ధంగా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఫీడ్ రేట్లపై ఇష్టానుసారం రివ్యూ చేయకూడదు. దీనిపై ఇటీవల ఆక్వా రైతాంగం తమ గోడు వెళ్లబోసుకుంది. అందుకే ఈ ప్రభుత్వానికి అప్పుడే అల్టిమేటం జారీ చేశాం. సిండికేట్ చేతుల్లో నలిగిపోతున్న రైతు చంద్రబాబు చర్మం కొంచెం మందం. మీ అందరికీ కూడా ఇది తెలిసిన విషయమే. దున్నపోతు మీద వర్షం పడితే ఎలా చలనం ఉండదో.. చంద్రబాబు ప్రభుత్వం కూడా అలాగే తయారైందని చెప్పడానికి బాధపడుతున్నాను. మన ఖర్మ ఏమిటని ఒక్కసారి గమనిస్తే, ఆశ్చర్యంగా ఆక్వా రైతులకు సప్లయి చేసే ఫీడ్ కానీ, ఆ పంట కొనుగోలులో కానీ, చివరకు ప్రాసెసింగ్ ప్లాంట్లన్నీ కూడా చంద్రబాబు సానుభూతి పరులవే. దాంతో వాళ్లు ఎలా కావాలి అంటే అలా వ్యవహారం నడుపుతున్నారు. సీడ్ కొనేటప్పుడు రేటు ఎంతో వాళ్లే నిర్దేశిస్తారు. ఫీడ్ కొనేటప్పుడు కూడా ధర వాళ్లే నిర్దేశిస్తారు. ఆక్వా రైతన్నలు లక్షలు ఖర్చు చేసి ఆక్వా సాగు చేస్తే, తీరా ఆ పంట (రొయ్యలు) చేతికి వచ్చేసరికే వ్యాపారులంతా మొత్తం సిండికేట్గా ఏర్పడి, రేట్లు ఢమాల్ అని పడిపోయేలా చేస్తున్నారు. అలా చంద్రబాబునాయుడు సానుభూతిపరుల సిండికేట్ ఈరోజు రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని నడిపిస్తోంది. ఫలితంగా ఆక్వా రైతుల బతుకులు ఆ సిండికేట్ చేతుల్లో నలిగి పోతున్నాయి. చంద్రబాబు సీఎం సీట్లోకి వచ్చారంటే చాలు, ఆ సిండికేట్కు పండగే పండుగ. మన రైతన్నకు మాత్రం కన్నీళ్లే కన్నీళ్లు. ఇలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. మొట్టమొదటిసారిగా ఇలాంటి పరిస్థితులు మార్చాలి అని చెప్పి తపన, తాపత్రయ పడిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైఎస్సార్సీపీ ప్రభుత్వం అని గర్వంగా చెప్పగలను. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా సాగు అభివృద్ధి సంస్థ’ (అప్సడా)ను ఏర్పాటు చేస్తూ 2020 ఆగస్టులో మన ప్రభుత్వం ఏకంగా చట్టమే తీసుకొచ్చింది. ఆ అప్సడాకు ముఖ్యమంత్రి చైర్మన్గా వ్యవహరించేలా ఆ చట్టంలో నిర్దేశించాం. ఆక్వా రంగంలో అలా ఒక రెగ్యులేటరీ బాడీ ద్వారా సీడ్ రేట్లు, ఫీడ్ రేట్లు, మందుల రేట్లు, ప్రాసెసింగ్ ప్రక్రియ, కొనుగోలు ధరలతో పాటు, మార్కెటింగ్లో ఎక్కడ ఏ సమస్య వచ్చినా, రైతాంగానికి నేరుగా తోడుగా ముఖ్యమంత్రి ఉండేలా ఆ రోజు ఒక చట్టాన్ని తీసుకువచ్చి రైతన్నలకు తోడుగా నిలబడ్డాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన ఆక్వా రైతులతో ముఖాముఖి కార్యక్రమానికి హాజరైన అశేష జనసందోహంలో ఓ భాగం ముష్టి వేసినట్లు రూ.2 తగ్గించారు మొన్న ఫిబ్రవరిలో ఒకసారి రేటు పెంచారు. ఆ తర్వాత మరోసారి జూన్ లో పెంచారు. అంటే నాలుగు నెలలు కూడా తిరక్కముందే రెండుసార్లు రేటు పెంచారు. ఏకంగా కేజీకి రూ.14 నుంచి రూ.16 వరకు ఫీడ్ రేట్లు ఎడాపెడా పెంచుకుంటూ పోయారు. రైతుల అంగీకారం లేకుండానే, వారి గోడు వినకుండానే ‘అప్సడా’ చట్టాన్ని ధిక్కరించి ఇష్టానుసారం రేట్లు పెంచేశారు. అలా దారుణంగా పెంచి, ఆ తర్వాత తూతూ మంత్రంగా చంద్రబాబు చెప్పారంటూ కేజీకి రూ.2 తగ్గించారు. నాలుగు నెలలు తిరక్కుండానే కేజీకి రూ.14 నుంచి రూ.16 వరకు పెంపు ఎక్కడ? ముష్టి వేసినట్లు కేవలం రూ.2 తగ్గించడం ఏమిటి? ఇది చంద్రబాబు భాషలో చెప్పాలంటే 100 కొరడా దెబ్బలు కాదు.. 98 కొరడా దెబ్బలే అని చెప్పినట్లుగా ఉంది. చంద్రబాబును నేను ఒకటే అడుగుతున్నా. ఈ రోజు ఆక్వా పంట సాగులో 60 శాతం ఫీడ్ ఖర్చు ఉంటుంది. అలాంటిది ఇష్టానుసారం ఫీడ్ రేటు పెంచుకుంటూ పోతే రైతాంగం ఎలా బతుకుతుంది? ఇదే ఫీడ్ తయారు చేసే కంపెనీ వాళ్లు, అందుకోసం వాడే సోయా, ఫిష్ మీల్, ఇతర మినరల్ మిక్సర్ రేట్లు పెరిగాయి కాబట్టి మేము రేట్లు పెంచుతున్నామని, రేటు పెంచక తప్పడం లేదంటున్నారు. ఆ రేట్లు పెరిగినప్పుడు ఫీడ్ రేటు పెంచుతున్నప్పుడు మరి ఆ రేట్లు తగ్గినప్పుడు మీరు తగ్గించారా.. అని నేను అడుగుతున్నా. రేట్లు పెంచడానికైనా.. రేట్ల మీద నిర్ణయం తీసుకోవడానికైనా ఇదే చంద్రబాబు ప్రభుత్వానికి హేతుబద్ధత అనేది ఉండాలి కదా.. ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. మార్కెట్లో తక్కువ రేటుకు వాళ్లు కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత కొరత ఉందంటూ.. ఒక కారణం తర్వాత మరో కారణం చెప్పి, ఇష్టం వచ్చినట్లు రేట్ పెంచుకుంటూ పోతారు. ఇలా ఇప్పుడు సిండికేట్ రాజ్యం నడుస్తోంది. సభా వేదిక వద్ద అశేష జనవాహినికి చిరునవ్వుతో అభివాదం చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి మీ వైఖరి మార్చుకోండి నాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ఐదేళ్లలో ఫీడ్ కంపెనీలు మూడుసార్లు ధరలు పెంచితే, అప్సడా ద్వారా ఆ రేట్లు పూర్తిగా తగ్గించామని నేను గర్వంగా చెప్పగలను. అది రైతులపై వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఉన్న ప్రేమను చాటుతోంది. ఇంకా రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పనలో కూడా అంతకు ముందు ఎన్నడూ లేని విధంగా మన ప్రభుత్వమే కృషి చేసింది. ప్రతి 15 రోజులకు ఒకసారి అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యల రేట్లను సమీక్షిస్తూ, ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర.. ఏ రైతుకు తగ్గకుండా ఆ ఐదేళ్లలో రైతాంగానికి తోడుగా నిలుచుంది. కరోనా లాంటి కష్ట సమయంలో కూడా రైతన్నలకు అండగా నిలబడి కనీస మద్దతు ధర 100 కౌంట్ రూ.230కి తగ్గకూడదని చెప్పి ఏకంగా చట్టం చేసి మరీ రైతన్నలకు అండగా నిలిచిన పరిస్థితి ఒక్క మన ప్రభుత్వంలోనే జరిగింది. అదే ఈరోజు ఆక్వా రైతుల పరిస్థితి ఏమిటని చూస్తే, ఉత్పత్తి ఖర్చు కేజీకి రూ.275కు పెరిగింది. ఎందుకంటే ఇష్టం వచ్చినట్లు సీడ్, ఫీడ్ రేట్లు పెంచుతున్నారు. కానీ, పంట కొనుగోలు రేటుకు వచ్చేసరికి రూ.230 దాటని పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో రైతాంగం ఎలా బతుకుతుందని చంద్రబాబును గట్టిగా నిలదీస్తూ అడుగుతున్నా. అయ్యా చంద్రబాబు గారూ.. ఈ సిండికేట్తో మీరు కుమ్మక్కై మీకు ఇంత, నాకు ఇంత అని చెప్పి మీరు చేస్తున్న వైఖరి మార్చుకోవాలని గట్టిగా కోరుతున్నా. చంద్రబాబు ప్రతి అడుగులో మోసం చంద్రబాబునాయుడు ప్రభుత్వం ప్రతి అడుగులోనూ మోసం, మోసం, మోసం అనే పదాలే వినిపిస్తాయి. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు ఇచ్చి అమలు చేయకుండా మోసాలతో అడుగులు ముందుకు వేశాడు. ఎన్నికలప్పుడు ప్రతి ఇంటికి బాండ్లు పంపిణీ చేసి.. అధికారంలోకి రాగానే ప్రజలను మోసం చేశాడు. అదే మాదిరిగా ఆక్వా రైతులను కూడా ఆయన మోసం చేస్తూ వచ్చాడు. అవసరమైన జిల్లాల్లో 5 వేల టన్నుల సామర్థ్యంతో కోల్డ్ స్టోరేజ్లు అన్నాడు.. (చంద్రబాబు మేనిఫెస్టోలో ఏం చెప్పారో ప్రస్తావిస్తూ) మరి కట్టాడా? జోన్తో సంబంధం లేకుండా జోన్ వెలుపల ఉన్న చెరువులకు సబ్సిడీపై కరెంటు ఇస్తానని హామీ ఇచ్చాడు.. మరి ఇచ్చాడా? ట్రాన్స్ఫార్మర్ల ధరలు తగ్గిస్తానన్నాడు.. మరి తగ్గించాడా? ఏరియేటర్లకు సబ్సిడీ ఇస్తానన్నాడు.. మరి ఇచ్చాడా? (ఏవీ ఇవ్వలేదంటూ రైతులు పెద్దఎత్తున చేతులు ఊపారు) ఇవన్నీ ఇవ్వకపోగా, మనం అమలు చేసిన రూ.1.50కే యూనిట్ విద్యుత్ను కూడా చంద్రబాబు కత్తిరించే కార్యక్రమం మొదలు పెట్టాడు. అందుకోసం తాజాగా జీవో 169 జారీ చేశారు. దీని ప్రకారం ఆక్వా సాగులో ఉపయోగించే మోటార్లలో పవర్ ఫ్యాక్టర్ (పీఎఫ్) 0.90 నుంచి 0.95 మధ్య మెయింటైన్ చేయాలని చంద్రబాబు రైతులకు రూల్ పెట్టాడు. ఆక్వా రైతులు సాధారణంగా వాడే మోటార్లలో పీఎఫ్ 0.78 మాత్రమే ఉంటుంది. ఆ మోటార్లలో పవర్ ఫ్యాక్టర్ పెరగాలంటే మళ్లీ ఆ రైతులు కెపాసిటర్లు కొనాలి. అవి కొంటే తప్ప, పీఎఫ్ పెరగదు. 12 వేల కనెక్షన్లు పెండింగ్ కొత్తగా ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడం మానేశారు. దీంతో కనెక్షన్లు కూడా ఇవ్వడం లేదు. అలా 12 వేల వరకు కనెక్షన్లు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్లకు త్రీఫేస్ కరెంట్ కాకుండా, కేవలం సింగల్ ఫేస్ కరెంటు ఇచ్చి కోతల మీద కోతలు వేస్తూ రైతాంగం అల్లాడేలా చేస్తున్నాడు. దీంతో జనరేటర్లు పెట్టుకుని సాగు చేయాలంటే, ఆక్వా రైతులకు సాధ్యమయ్యే పనేనా చంద్రబాబూ? రైతుల గోడు పట్టని కూటమి ప్రభుత్వం నా పక్కనే పొగాకు రైతులు కనిపిస్తున్నారు. వారు తమ బాధలు చెప్పుకుంటూ, చూపిస్తున్నారు. వరుసగా రెండేళ్లు పొగాకు పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు రోడ్డెక్కుతున్నారు. రైతులు రోడ్ల మీద కనిపిస్తున్నా ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. ఇలా ఒక్క పొగాకు రైతే కాదు.. ఏ పంటకు చూసినా రైతన్నలకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి కనిపిస్తోంది. ఆర్బీకేలు నిరీ్వర్యం.. ఉచిత పంటల బీమా లేదు.. సమయానికే ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ లేదు.. రైతు భరోసా అన్నది ఒక మోసంగా మిగిలిపోయిన పరిస్థితి. ఈ రోజు ఇటువంటి బాధాకరమైన పరిస్థితిలో ఉన్న ప్రతి రైతన్నకు వైఎస్సార్సీపీ తోడుగా ఉంటుంది’ అని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. మన ప్రభుత్వంలో రూ.1.50కే యూనిట్ విద్యుత్ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే ఆక్వా రైతాంగానికి అండగా నిలుస్తూ అడుగులు పడ్డాయి. అంతవరకు ఎప్పుడూ చూడని విధంగా, గతంలో ఎప్పుడూ జరగని విధంగా రూ.1.50కే యూనిట్ విద్యుత్ సరఫరా చేశాం. ఇందుకోసం మన ప్రభుత్వ హయాంలో 57 నెలల పాటు ఏకంగా రూ.3,306 కోట్లు సబ్సిడీ భారం భరించాం. అదే అంతకు ముందు 2014–19 మధ్య చంద్రబాబు పాలనలో ఏం జరిగిందని చూస్తే, ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్పై రూ.3.85 వసూలు చేసి బాదారు. ఆ తర్వాత నా పాదయాత్రలో అధికారంలోకి రాగానే ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూ.1.50కే ఇస్తామని చెప్పాము. ఆ వెంటనే 2019లో ఎన్నికలకు 4 నెలల ముందు చంద్రబాబునాయుడు, ఆక్వా రైతులకు సరఫరా చేసే యూనిట్ విద్యుత్ రేటు రూ.2కు తగ్గిస్తూ జీవో జారీ చేశారు. కానీ, ఆ సబ్సిడీ ఇవ్వలేదు. దాన్ని కూడా మన వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక భరించింది. అందుకోసం రూ.451 కోట్లు చెల్లించామని గర్వంగా చెబుతున్నా. 35 చోట్ల ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు నాడు మన హయాంలో ఆక్వా రైతన్నలకు తోడుగా ఉండేలా సీడ్, ఫీడ్.. వాటి నాణ్యత, వ్యాధి నిర్ధారణ.. వాటన్నింటి కోసం ఏకంగా 35 ఆక్వా సాగు ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు ఏర్పాటు చేశాం. ఆర్బీకేల్లో ఏకంగా 782 మంది ఫిషరీస్ అసిస్టెంట్లు అంటే.. ఫిషరీస్ డిగ్రీ పట్టభద్రులను నియమించి, వారితో పాటు ఆక్వా ల్యాబ్ల ద్వారా ప్రతి రైతును చేయి పట్టుకుని నడిపించాం. మన హయాంలో ఏకంగా 120 రోజులు, 150 రోజుల పాటు ఉండే సీడ్ తీసుకొచ్చాం. అదే ఈరోజు కేవలం 90 రోజులకు మించి బతకని పరిస్థితి ఉంది. వీటన్నింటి ద్వారా ఆక్వా రైతన్న అల్లాడిపోతున్నాడు. క్వాలిటీ మానిటరింగ్ అనేది పూర్తిగా పక్కకు తప్పుకున్న పరిస్థితి కనిపిస్తోంది. నరసాపురంలో ఫిషరీస్ యూనివర్సిటీని మనం స్టార్ట్ చేస్తే, అందులో క్లాసులు కూడా మొదలు పెడితే, ఇప్పుడు చంద్రబాబు అవసరమైన నిధులు ఇవ్వకుండా దాన్ని ఆపేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇదే ప్రాంతంలోనే మెడికల్ కాలేజీ పనులు కూడా ఆపేశారు. భీమవరంలో తనను చూడటానికి వచ్చిన వారికి అభివాదం చేస్తున్న వైఎస్ జగన్ 51 లక్షల టన్నులకు పెరిగిన ఉత్పత్తి చంద్రబాబు గత హయాంలో చేపలు, రొయ్యల ఉత్పత్తి 39 లక్షల టన్నులు కాగా, మన ప్రభుత్వంలో అది ఏకంగా 51 లక్షల టన్నులకు పెరిగింది. ఎగుమతులు కూడా గణనీయంగా పెరిగాయి. అంతకు ముందు చంద్రబాబు పాలనలో చివరి ఏడాది.. అంటే 2018–19లో రాష్ట్రం నుంచి ఎగుమతుల విలువ రూ.13,855 కోట్లు కాగా, మన ప్రభుత్వంలో 2023–24 నాటికి అది రూ.20 వేల కోట్లకు చేరిందని గర్వంగా చెప్పగలుగుతాను. చంద్రబాబు హయాంలో 86 శాతం ఉన్న యాంటీ బయోటిక్స్ అవశేషాలను మన ప్రభుత్వ హయాంలో ఏకంగా 20 శాతం లోపునకు తగ్గించామని కూడా గర్వంగా చెప్పగలను. అందుకే మన ప్రభుత్వ హయాంలో రెండుసార్లు.. 2021–22, 2023–24లో రాష్ట్రానికి బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డులు దక్కాయి. భీమవరంలో వైఎస్ జగన్కు ఆత్మీయ స్వాగతం పలుకుతున్న ప్రజలు ఆక్వా రైతుల సభలో ముద్రగడకు జగన్ ఘన నివాళిభీమవరంలో ఆక్వా రైతుల సమావేశంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తొలుత.. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అంజలి ఘటించారు. అనంతరం ఆక్వా రైతులను ఉద్దేశించి మాట్లాడారు. మీ కష్టాలు నాకు తెలుసు మీ అందరికీ నేను ఒకటే హామీ ఇస్తున్నా.. ‘మీ కష్టాలు నాకు తెలుసు.. నేను ఉన్నాను’ అని మీ అందరికీ చెబుతున్నా. చూస్తుండగానే రెండేళ్లు గడిచాయి. కళ్లు మూసుకొని కళ్లు తెరిచే సరికే మరో మూడేళ్లు గడుస్తాయి. ఆ తర్వాత రైతుల ప్రభుత్వం వస్తుందని కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్పగలుగుతా. మళ్లీ ‘అప్సడా’ పూర్వ వైభవంలోకి వస్తుంది. ఆ సంస్థకు సీఎం చైర్మన్గా ఉంటాడు. ఇప్పుడున్న సిండికేట్ను కూకటి వేళ్లతో సహా పెకిలిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంత వరకు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆక్వా రైతులకు, రాష్ట్ర రైతాంగానికి, ప్రతి పంటకు, పంట వేసిన ప్రతి రైతు చేయి పట్టుకుని నడిపిస్తూ.. వారికి తోడుగా ఉంటుందని ఈ సందర్భంగా చెబుతున్నా. -
అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు
సాక్షి, కాకినాడ/ గోకవరం/ పిఠాపురం/ కిర్లంపూడి: కాపు ఉద్యమ నేత, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం అంతిమ యాత్ర అభిమానులు, పార్టీ నాయకులు, శ్రేణులు, కుటుంబ సభ్యులు, బంధువుల అశ్రునయనాల మధ్య సాగింది. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి గ్రామంలోని ఆయన ఇంటి ఆవరణలో కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. శ్వాసకోశ వ్యాధితో హైదరాబాద్లోని సింధు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముద్రగడ మంగళవారం సాయంత్రం కన్నుమూసిన సంగతి తెల్సిందే. ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి బుధవారం ఉదయం స్వగ్రామమైన కిర్లంపూడికి తీసుకొచ్చారు. ముద్రగడ భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఆయన స్వగృహంలో ఉంచారు. తమ ఉద్యమ నేతను కడసారిగా చూసేందుకు వేలాది సంఖ్యలో అభిమానులు, ప్రజలు, వివిధ పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు తరలిరావడంతో కిర్లంపూడి కిక్కిరిసిపోయింది. ముద్రగడ అభీష్టం మేరకు ఇంటి ఆవరణలోనే కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. పాడె మోసిన మాజీ సీఎం వైఎస్ జగన్ కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం భౌతికకాయానికి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ జగన్ రోడ్డు మార్గంలో కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి మధ్యాహ్నం 2.55 గంటలకు చేరుకున్నారు. అనంతరం ముద్రగడ భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పూలను పక్కకు జరిపి ముద్రగడను చివరి చూపు చూసిన వైఎస్ జగన్ కాసేపు ఉద్విగ్నంగా కనిపించారు. అనంతరం ముద్రగడ సతీమణి పద్మావతి, కుమారులు బాలు, గిరిబాబు, కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారిని ఓదార్చి, తానున్నానని ధైర్యం చెప్పారు. కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అక్కడే ఉండి ముద్రగడ అంత్యక్రియల్లో పాల్గొన్న వైఎస్ జగన్ స్వయంగా ఆయన పాడె మోశారు. అంత్యక్రియలు పూర్తయ్యేవరకు వైఎస్ జగన్ కిర్లంపూడిలోనే ఉన్నారు. అంతిమ సంస్కారాల్లోనూ అదే ‘ముద్ర’!జీవించినంతకాలం కొన్ని విలువలకు కట్టుబడి ఉన్న మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం తాను మరణించిన తరువాత కూడా ఏమి చేయాలన్నది ముందుగానే నిర్ణయించారు. దానిని ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు తూచ తప్పకుండా పాటించడం విశేషం. ఆయన బతికున్నప్పుడే తన అంత్యక్రియలు ఎలా చేయాలనే విషయమై ముందుగానే పలు సూచనలు చేసినట్టు బంధువులు చెబుతున్నారు. తన భౌతికకాయాన్ని ఆయన ఇంటి ఆవరణలోనే ఖననం చేయాలని సూచించారట. తాను చనిపోయేటప్పటికి తన ఒంటిపై ఏది ఉన్నా వాటన్నిటితోనూ ఖననం చేయాలని, తనకు అంత్యక్రియల అనంతరం ఎటువంటి దిన కార్యాలూ చేయొద్దని ఆయన చెప్పారట. తన భార్య జీవించి ఉన్నంతకాలం సుమంగళిగానే ఉండాలని ఆయన కోరినట్టు చెబుతున్నారు. ఆయన కోరిక మేరకు అన్నీ ఆయన చెప్పినట్టే చేస్తున్నట్టు బంధువులు తెలిపారు. అలాగే ప్రత్యర్థులతో చేతులు కలిపి కుటుంబంపై విమర్శలు చేసిన తన కుమార్తె క్రాంతిని తన భౌతికకాయం వద్దకు రానివ్వవద్దని కూడా ఆయన కుటుంబసభ్యులకు చెప్పారట. వీటన్నిటినీ కుటుంబ సభ్యులు పాటించారు.ముద్రగడ పద్మనాభం భౌతికకాయానికి నివాళి అర్పిస్తున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముద్రగడ సతీమణి పద్మావతిని ఓదార్చుతున్న మాజీ సీఎం వైఎస్ జగన్ క్రాంతి రాకతో గందరగోళంవారించినా వినకుండా ముద్రగడ కుమార్తె బార్లపూడి క్రాంతి భౌతికకాయం వద్దకు వచ్చే ప్రయత్నం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ‘గో బ్యాక్ క్రాంతి’ అంటూ ముద్రగడ అభిమానులు నినాదాలు చేయడంతో అక్కడ కొద్దిసేపు గందరగోళం నెలకొంది. అలాంటి పరిస్థితిలో కూడా పైనుంచి ఆదేశాలందుకున్నట్లుగా పోలీసులు క్రాంతిని భౌతికకాయం వరకు వెంటపెట్టుకుని తీసుకువచ్చారు. పరిస్థితి అదుపుతప్పుతుండడంతో ఆమెను బయటకు పంపించేయాలని ముద్రగడ భార్య, బంధువులు పోలీసులను కోరారు. తర్వాత ఆమెను అక్కడి నుంచి తరలించారు.ప్రభుత్వ లాంఛనాలను తిరస్కరించిన ముద్రగడ కుటుంబంనాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒక దఫా ఎంపీగా, రెండుసార్లు మంత్రిగా పని చేసిన ముద్రగడ పద్మనాభం రాష్ట్రానికి విశేష సేవలందించారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను ముద్రగడ కుటుంబ సభ్యులు తిరస్కరించారు. బతికి ఉన్నప్పుడు బజారుకీడ్చి.. ఇప్పుడు లాంఛనాలు అనడంలో అర్థమేమిటని వారు ప్రశ్నించారు. ముద్రగడను, ఆయన కుటుంబాన్ని చిత్రహింసలకు గురిచేసిన ప్రభుత్వం నుంచి తనకు ప్రకటించే ఏవిధమైన సహాయం అందుకోకూడదని ఆయన బతికి ఉన్నప్పుడే నిర్ణయించారని, ప్రభుత్వ లాంఛనాలతో చేస్తే ఆయన ఆత్మ శాంతించదని ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కాగా ముద్రగడ భౌతికకాయాన్ని ఖననం చేసే సమయంలో ప్రభుత్వ లాంఛనాల ప్రకారం చేస్తున్నట్లుగా పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపే ప్రయత్నం చేశారు. దీంతో అప్రమత్తమైన ముద్రగడ అనుచరులు వెంటనే పోలీసులను అడ్డుకున్నారు.నాడు వేధించి నేడు నాటకాలా! చంద్రబాబు ప్రభుత్వంలో ముద్రగడ పద్మనాభంను గతంలో అనేక రకాలుగా వేధించి, అవమానించారని వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా గుర్తుచేశారు. ముద్రగడ కుటుంబ సభ్యుల విషయంలోనూ అసభ్యంగా ప్రవర్తించారని విమర్శించారు. ఆయన బతికున్నప్పుడు ఇబ్బందులకు గురిచేసి.. ఇప్పుడు మృతి తర్వాత మొసలికన్నీరు కార్చాల్సిన అవసరం లేదని జక్కంపూడి రాజా స్పష్టం చేశారు. ముద్రగడ జీవించి ఉండగా అనేక విధాలుగా అవమానించారని, ఇప్పుడు అధికారిక గౌరవాలు, సానుభూతి అవసరం లేదని చెప్పారు. -
మీరు రావొద్దు... ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదు...
-
రేపు వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
సాక్షి, తాడేపల్లి: రేపు (గురువారం 16, జులై) ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పార్టీ ఎంపీలు పాల్గొననున్నారు.త్వరలో జరగనున్న పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఉభయ సభల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, ప్రస్తావించాల్సిన ప్రజా సమస్యలు, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. -
‘ముద్రగడ చనిపోయినా చంద్రబాబు కక్ష సాధింపు’
సాక్షి, కాకినాడ జిల్లా: ప్రభుత్వ తీరుపై ముద్రగడ పద్మనాభం అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారిక లాంఛనాలు వద్దన్నా కానీ, ప్రభుత్వం.. గార్డ్ ఆఫ్ హానర్ ఏర్పాటు చేసింది. ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదంటూ ముద్రగడ అభిమానులు ఆందోళనకు దిగారు. పోలీసులు గోబ్యాక్ అంటూ ముద్రగడ అభిమానులు నినాదాలు చేశారు.వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ముద్రగడలేని లోటును ఎవరూ పూడ్చలేరన్నారు. ‘‘ఈ దుష్ట ప్రభుత్వ లాంఛనాలు వద్దని ముద్రగడ ఎప్పుడో చెప్పారు. అధికార లాంఛనాలు వద్దన్నా పోలీసులు తుపాకులతో వచ్చారు. ముద్రగడ చనిపోయినా చంద్రబాబు కక్ష సాధిస్తూనే ఉన్నారంటూ అంబటి మండిపడ్డారు. -
ముద్రగడకు YSRCP నేతల కన్నీటి వీడ్కోలు
-
‘టీడీపీ నేతల తీరు మారకపోతే జనం తరిమికొడతారు’
సాక్షి, తాడేపల్లి: వేదిక ఏదైనా చంద్రబాబు, లోకేష్, కూటమి నేతల ధోరణి మారడం లేదని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నామనే అహంకారంతో పేట్రేగిపోతున్నారని.. వైఎస్ జగన్ను వ్యక్తిగతంగా తిట్టడమే పనిగా పెట్టుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘వైఎస్ జగన్ ఎక్కడికెళ్లినా వస్తున్న జనాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు. వైఎస్ జగన్ను వ్యక్తిగతంగా దూషిస్తూ తిడుతున్నారు. వ్యక్తిగత దూషణలు మా విధానం కాదు. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు తానే కట్టానని చంద్రబాబు ప్రచారం చేసుకుంటన్నాడు. ప్రాజెక్టులు కట్టడం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు. వెలిగొండ ప్రాజెక్టు శిలాఫలకానికి తప్ప చంద్రబాబు ఖర్చు చేసిందేమీ లేదు. వెలిగొండ ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించింది వైఎస్సార్...వైఎస్ జగన్ సీఎం అయ్యాక వెలిగొండ టన్నెల్స్ ప్రారంభమయ్యాయి. నీ హయాంలో వెలిగొండకు ఎంత ఖర్చు చేశావో లెక్కలు చెప్పగలవా?. పోలవరం కుడి, ఎడమ కాలువలు తవ్వించింది వైఎస్సార్. పోలవరం కుడి, ఎడమలకు పేర్లు పెట్టడం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదు. నాగార్జున సాగర్ నీరు రావడానికి కారణం బ్రహ్మనందరెడ్డి. ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఎక్కడికి చర్చకు రమ్మన్నా వస్తా మీరు రాగలరా?. నిధులు ఎంత ఖర్చు పెట్టావని అడిగితే చంద్రబాబు ఎదురుదాడి చేస్తున్నాడు’’ అంటూ శ్రీకాంత్రెడ్డి దుయ్యబట్టారు.‘‘పోలవరం ప్రాజెక్టు అవసరం లేదని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు నేనే పూర్తిచేశానని చెప్పుకుంటున్నాడు. వివేకా హత్య వైఎస్ జగన్ చేయించారని చెప్పడానికి లోకేష్కు కొంచెమైనా విజ్ఞత ఉందా? వివేకా హత్య జరిగింది మీ హయాంలో కేసు దర్యాప్తును సాగకుండా అడ్డుకున్నది మీరుకాదా?. నిందితుల తరపున న్యాయవాదులు మీవారేనా కాదా?. వాస్తవాలపై చర్చ జరగకుండా బూతులు తిడుతున్నారు. తిట్టడం కాదు ఎవరు చర్చకు వస్తారో రండి. మీరు ఇలాగే రోజూ వ్యక్తిగత దూషణలు చేస్తూ పోతే మిమ్మల్ని ప్రజలు తరిమికొడతారు’’ అంటూ గడికోట శ్రీకాంత్రెడ్డి హెచ్చరించారు. -
ఇది ట్రైలర్ మాత్రమే.. దద్దరిల్లిన భీమవరం...
-
CM చంద్రబాబుకు వల్లభనేని వంశీ సంచలన లేఖ
-
చంద్రబాబు ఇది నీకు ట్రైలర్ మాత్రమే! జగన్ స్పీచ్ దద్దరిల్లిన భీమవరం
-
చంద్రబాబు సిండికేట్లను కూకటివేళ్లతో పెకలిస్తాం: వైఎస్ జగన్
సాక్షి, పశ్చిమ గోదావరి: కూటమి పాలనలో రైతాంగం తీవ్ర అవస్థలు పడుతోందని.. ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేదని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. బుధవారం భీమవరంలో అక్వా రైతులతో ముఖాముఖి కార్యక్రమం సందర్బంగా ఆయన చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.అక్వా రంగం సమస్యల సుడిగుండంలో కూరుకుపోయింది. అక్వా రైతులు దీనావస్థలో ఉన్నారు. ధరల పెరుగుదల హేతుబద్ధంగా ఉండాలి. ఇష్టానుసారం ఫీడ్ ధరలు పెంచుకుంటూ పోతున్నారు. దున్నపోతు మీద వర్షం పడినట్లుగా ఉంది చంద్రబాబు ప్రభుత్వం తీరు అని జగన్ మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే సిండికేట్లకు పండగే పండగ.. రైతన్నలకు కన్నీరే. ఇప్పుడు అదే జరుగుతోంది. రాష్ట్రంలో చంద్రబాబు సానుభూతిపరులే సిండికేట్గా ఏర్పడ్డారు. ఫీడ్, సీడ్ రేట్లు చంద్రబాబు మనుషులే ఫైనల్ చేస్తారు. చంద్రబాబు సిండికేట్ రాష్ట్రాన్ని నడిపిస్తోంది. ఆ సిండికేట్ చేతుల్లో రైతులు నలిగిపోతున్నారు అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.అక్వా రంగంలో ఐదు లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. అందుకే మా ప్రభుత్వంలో రెగ్యులేటరీ బోర్ (అప్సడా) ఏర్పాటు చేశాం. సీడ్, ఫీడ్ మార్కెటింగ్లో సమస్యలు వస్తే పరిష్కరించాం. అక్వా రైతులకు యూనిట్కు రూ.1.50కే విద్యుత్ అందించాం. రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకున్నాం. మద్దతు ధర తగ్గకుండా మానిటర్ చేశాం. ఐదేళ్లలో సబ్సీడీ కింద రూ.3,306 కోట్లు చెల్లించాం. ఇందులో చంద్రబాబు ఎగ్గొట్టిన రూ.401 కోట్ల బకాయిల్ని మేమే చెల్లించాం. ఫీడ్రేట్లు, ధరల విషయంలో ఎప్పటికప్పుడు మానిటర్ చేశాం. 35 అక్వా ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు పెట్టాం. ఆర్బీకేల పరిధిలో ఫిషరీస్ అసిస్టెంట్లను నియమించాం. మా హయాంలో అక్వా ఎగుమతుల విలువ రూ.20 వేల కోట్లు. బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డు కూడా అందుకున్నాం అని జగన్ గుర్తు చేశారు.కానీ, చంద్రబాబు మేం తెచ్చిన చట్టాన్ని నిర్వీర్యం చేశారు. ఇప్పుడు ఏపీలో అక్వా రైతులు పరిస్థితి దయనీయంగా మారింది. ఈ రోజు కేజీ రొయ్య కౌంట్ రూ.230 దాటని పరిస్థితి. నాలుగు నెలల్లో ఫీడ్పై కేజీకి 14-16 రూపాయలు ఎడా పెడా పెంచేశారు. ఏకపక్షంగా ధరలు పెంచొద్దని అనేకసార్లు చెప్పాం. ఇష్టానుసారం ఫీడ్ ధరలు పెంచుకుంటూ వచ్చారు. రేట్లు పెంచితే పెంచారు.. తగ్గినప్పుడు తగ్గించరా?. ముష్టి వేసినట్లు రూ.2 లు తగ్గిస్తే సరిపోతుందా?. చంద్రబాబు తీరు వంద కొరడా దెబ్బలు కాదు.. 98 కొరడా దెబ్బలే అన్నట్లు ఉంది అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.పోనీ.. చంద్రబాబు అక్వా రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చారా?. చంద్రబాబు ప్రతీ అడుగు మోసం.. మోసం. నరసాపురంలో మేం తెచ్చిన ఫిషరీస్ వర్సిటీని నిలిపివేశారు. రూపాయిన్నర విద్యుత్కు కోత పెట్టారు. రైతులకు ఇవ్వాల్సిన 12 వేల విద్యుత్కనెక్షన్లు పెండింగ్లో ఉన్నాయి. అక్వా రైతులకు కొత్తగా ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడం లేదు. ఫలితంగా.. జనరేటర్లు పెట్టుకుని సాగు చేసే పరిస్థితి ఏర్పడింది. ఆఖరికి.. భీమవరం మెడికల్ కాలేజీ పనులు కూడా నిలిపివేశారు అని జగన్ అన్నారు.అక్వా రైతుల కష్టాలు నాకు తెలుసు.. నేనున్నాను. రైతుల కోసం ఉద్యమబాట పడతాం. మూడేళ్ల తర్వాత మన రైతు ప్రభుత్వం వస్తుంది. అప్సడాకు పూర్వవైభవం తెస్తాం. చంద్రబాబు సిండికేట్ను కూకటి వేళ్లతో సహా పెలికిస్తాం’’ అని వైఎస్ జగన్ ఉద్ఘాటించారు. -
చంద్రబాబు సిండికేట్ రాష్ట్రాన్ని నడిపిస్తోంది: వైఎస్ జగన్
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ భీమవరం పర్యటనకు సంబంధించి... -
కిర్లంపూడి చేరుకున్న ముద్రగడ భౌతికకాయం
-
ఇచ్చిన మాట కోసం పేరు మార్చుకున్నాడు.. చరిత్రలో ఎవరు లేరు..
-
ఆయనను ఎదుర్కొనే దమ్ము లేక... కన్న కూతురితో తిట్టించారు
-
మత్స్యకారులను బలిగొన్నది ప్రభుత్వ నిర్లక్ష్యమే
ఘటన జరిగిన వెంటనే స్పందించాల్సిన కలెక్టర్, ప్రభుత్వం, కమిషనర్.. ఎవ్వరూ స్పందించలేదు. ఎవరూ కో ఆర్డినేట్ చేయలేదు. ప్రభుత్వంలో ఏ పెద్దలూ స్పందించలేదు. ఇలాంటప్పుడు తప్పు జరిగిందని ఒప్పుకోకుండా.. త్రిసభ్య కమిటీ నివేదికలో దొంగ మాటలు చెప్పారు. బాధిత కుటుంబ సభ్యులు జూలై 5వ తేదీ ఉదయం 5 గంటల వరకు తమకు సమాచారం అందించలేదని ఆ నివేదికలో పేర్కొన్నారు. సరైన సమయంలో స్పందించకపోవడం తప్పు అయితే, ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకు త్రిసభ్య కమిటీ నివేదికలో తప్పులు రాస్తున్నారు. బాధిత కుటుంబంతో కలిసి మొత్తం ఏడుగురికి రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి. కొత్త బోటు ఇవ్వాలి. కనీసం వీరిని చూసేందుకు కూడా ఎవరూ ఇంటికి రాలేదు. మానవత్వం లేని ప్రభుత్వం. వీరి కుటుంబ సభ్యులకు అందరికీ చెబుతున్నా.. ఈ ప్రభుత్వం స్పందించకపోతే ఎవ్వరూ భయపడొద్దు.. బాధపడొద్దు. కళ్లు మూసి కళ్లు తెరిచేలోగా మూడేళ్లు గడుస్తాయి. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే జగనన్న ప్రభుత్వం ఈ కుటుంబాలకు తోడుగా ఉంటుంది. ఒక్క నెల రోజుల్లోగా మేలు చేస్తుందని మాట ఇస్తున్నా. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చి ఉంటే ఫిషింగ్ హార్బర్లు కళకళలాడుతుండేవి. సబ్సిడీతో బోట్లు కొనివ్వాలని భావించాం. తద్వారా ఒక్కో ఫిషింగ్ హార్బర్లో 10 వేల బోట్లు తిరుగుతుండేవి. ఏకంగా 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం గ్రాంటు ఇచ్చి, మరో 50 శాతం రుణం ఇప్పించి వీళ్లందరికీ మంచి చేయాలని భావించాం. ఒక్కో బోటుకు 7-8 మందిని ఓనర్లు చేసే వాళ్లం. తద్వారా మత్స్యకార కుటుంబాల్లో గొప్ప అడుగు ముందుకు పడి ఉండేది. ప్రభుత్వం మారడంతో ఫిషింగ్ హార్బర్లను అడ్డుపెట్టుకుని స్కామ్లు చేస్తోంది. -వైఎస్ జగన్సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: బోటు ప్రమాద ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఆరుగురు మత్స్యకారులు గల్లంతయ్యారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. జూలై 4వ తేదీ మధ్యాహ్నం ప్రమాదం జరిగితే.. రాత్రి 7 గంటలకే సమాచారం అందించినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా 5వ తేదీ ఉదయం 5 గంటల వరకు తమకు సమాచారం లేదంటూ త్రిసభ్య కమిటీ నివేదికలో పేర్కొనడం ద్వారా చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం మరో తప్పు చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రమాదానికి గురైన మత్స్యకార కుటుంబాలను సీఎంకానీ, సంబంధిత మంత్రులు అనిత, అచ్చెన్నాయుడు కానీ పరామర్శించలేదని ఎత్తి చూపారు. బాధిత ఏడు కుటుంబాలకు ఒక్కొక్కరికి వెంటనే రూ.కోటి నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రమాదానికి గురైన బోటు స్థానంలో కొత్త బోటు కొనివ్వాలని, ప్రభుత్వం స్పందించకపోతే వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోగా ఒక్కో కుటుంబానికి రూ.కోటి చొప్పున పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లి గంగవరం పోర్టుకు కేవలం 10 నాటికల్ మైళ్ల దూరంలో జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన ఆరుగురి కుటుంబాలతోపాటు, ప్రమాదం నుంచి బయటపడ్డ చిన్నా కుటుంబాన్ని వైఎస్ జగన్ మంగళవారం పరామర్శించారు. ఆ కుటుంబాలకు తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం విశాఖలోని జబ్బర్తోట జంక్షన్ వద్ద మీడియాతో మాటా్లడారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..అడుగడుగునా ప్రభుత్వ నిర్లక్ష్యంప్రభుత్వం ఎంత అన్యాయంగా, మానవత్వం లేకుండా ప్రవర్తించిందనే దానికి బోటు ప్రమాదం ఘటన అద్దం పడుతోంది. జూలై 1న చిన్నాతో పాటు మరో ఆరుగురు.. మొత్తం ఏడుగురు వేటకు బయలుదేరారు. జూలై 4న అంటే మూడు రోజుల తర్వాత చిన్న.. తన ఫోన్ నుంచి తన మేనల్లుడు గురునాథ్కు 2.31 గంటలకు (కాల్ డేటా చూపిస్తూ) ఫోన్ చేసి మరో గంటలో ఇంటికి వస్తున్నాం.. అని చెప్పాడు. దురదృష్టవశాత్తు ఫోన్ చేసిన గంటకే తీవ్రమైన అలలతో బోటు మునిగింది. వీళ్లంతా కూడా బోటుపైకి ఎక్కారు. ఫోన్లు సముద్రంలో పడిపోయాయి. అక్కడి నుంచి వీరి హృదయ విదారక గాధ ప్రారంభమైంది. పట్టించుకునే వారు లేరు. 10 నాటికల్ మైళ్లు ఈత కొడితే తప్ప ఒడ్డుకు రారు. గంట గంటకు బోటు మునిగిపోతోంది. అలాంటి పరిస్థితుల్లో బోటు కింది భాగంలో ఒక మనిషి చనిపోయాడు. మిగతా వారు అక్కడి నుంచి ఈత కొట్టడం మొదలు పెట్టారు. గంటలో ఇంటికి వస్తానన్న మనిషి 3 గంటలైనా రాకపోయే సరికి.. వీరి మేనల్లుడు తిరిగి ఫోన్లు చేయడం మొదలుపెట్టాడు. ఆ పక్కన ఫోన్లు రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో వారి కుటుంబీకులు అధికారులకు విన్నవించే ప్రయత్నం చేశారు. రాత్రి 7 గంటలకు మత్స్యశాఖ అధికారులను కలిసి విన్నవించినా ఎవరూ స్పందించ లేదు. ఏడుగురు కలిసి వేటకు వెళితే ప్రమాదానికి గురై 20 గంటల పైచిలుకు సముద్రంతో యుద్ధం చేసి ఒక్కడే తిరిగొచ్చారు. ఆదుకోవాలని సమాచారమిచ్చినా ప్రభుత్వం స్పందించలేదు. ఆదుకున్న పాపాన పోలేదు. సకాలంలో స్పందించి ఉంటే ఐదారుగురు బతికి ఉండేవాళ్లు. అసలు ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా? తోడుగా ఉన్నామన్న భరోసా ఏదీ?ఇంత ఘటన జరిగితే సీఎం పట్టించుకోరు. డిజాస్టర్ మేనేజ్మెంట్ చూసే ఈ జిల్లా వాసి అయిన మంత్రి కనీసం రాలేదు. ఇదే ఉత్తరాంధ్రకు చెందిన మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు కనీసం ఇంటికి కూడా రాలేదు. పైగా ఏమంటారో తెలుసా? వీడియో కాల్లో వీరి కుటుంబాలను పరామర్శించామని హోం మంత్రి అనితమ్మ అంటోంది. ఒక్కరంటే ఒక్కరు బాధ్యత గల స్థానాల్లో ఉన్న వారు పట్టించుకోలేదు. ఘటన జరిగిన వెంటనే స్పందించలేదని, ఇది మా తప్పే అని.. దానికి క్షమాపణ చెబుతున్నామని ఏ ఒక్కరూ అనలేదు. మనిషిని తీసుకురాలేక పోయినా.. మీకు తోడుగా ఉంటామని వారి కుటుంబ సభ్యులకు ఈ ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పే పని చేయలేదు. ఇది ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి. పైగా ముష్టి వేసినట్టు ఎక్స్గ్రేషియా కింద రూ.5–10 లక్షలు ఇచ్చి సంకలు గుద్దుకుంటున్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మత్స్యకారులు చనిపోతే నష్ట పరిహారం కింద రూ.5 లక్షలు ఇచ్చేవారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. అంటే వేటకు వెళ్లి ఎవరు చనిపోయినా వారి కుటుంబాలను ఆదుకునే ఉద్దేశంతో రూ.10 లక్షలకు పెంచాం. ప్రభుత్వం ఏ తప్పు చేయకపోయినా దుర్ఘటన జరిగితే రూ.10 లక్షలు నష్టపరిహారం ఇచ్చేవారం. ఇప్పుడు ప్రభుత్వం సకాలంలో స్పందించకుండా తప్పు చేసిన సమయంలో రూ.5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటామంటే ఇది న్యాయమేనా? ధర్మమేనా? విశాఖపట్నం విమానాశ్రయం వద్ద ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలిమరోసారి ఇటువంటివి జరగకుండా ఉండాలంటే.. ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందించాలంటే.. అధికారులకు ఒక షాక్ తగిలితే తప్ప స్పందన అనేది రాదు. సీరియస్గా చర్యలు ఉంటాయనేది ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వం అనేది రోల్మోడల్గా ఉండాలి. తప్పుచేసే ప్రభుత్వం ఉండకూడదు. చనిపోయిన ఆరుగురు మత్స్యకారుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున నష్టపరిహారమివ్వాలి. బాధిత కుటుంబంతో కలిసి మొత్తం ఏడుగురికి ప్రతి ఒక్కరికీ రూ.కోటి ఇవ్వాలి. కొత్త బోటు ఇవ్వాలి. కనీసం వీరిని చూసేందుకు కూడా ఇంటికి రాలేదు. కనీసం మానవత్వం లేని ప్రభుత్వం. వీరి కుటుంబ సభ్యులకు అందరికీ చెబుతున్నా.. ఈ ప్రభుత్వం స్పందించకపోతే ఎవ్వరూ భయపడొద్దు. బాధపడొద్దు. కళ్లు మూసి కళ్లు తెరిచేలోగా మూడేళ్లు గడుస్తాయి. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే జగనన్న ప్రభుత్వం ఈ కుటుంబాలకు తోడుగా ఉంటుంది. ఒక్క నెల రోజుల్లోగా మేలు చేస్తుంది. నాదీ బాధ్యత. కచ్చితంగా చేయిస్తామని మాట ఇస్తున్నా. సొంత కాళ్లపై నిలబడేందుకు...మత్స్యకారులు ఎక్కడెక్కడికో వెళ్లి నిర్బంధాలకు గురికాకూడదని, ఇటువంటి వాటికి ఫుల్స్టాప్ పెట్టాలని మన హయాంలో మత్స్యకారుల కోసం ఏకంగా 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం ప్రారంభించాం. నెల్లూరు జిల్లాలో జువ్వలదిన్నె, గుంటూరు జిల్లాలో నిజాంపట్నం, కృష్ణా జిల్లాలో మచిలీపట్నం, తూర్పుగోదావరి జిల్లాలో ఉప్పాడ, శ్రీకాకుళం జిల్లాలో బుడగట్ల పాలెం, మంచినీళ్ల పేట, అనకాపల్లి జిల్లాలో పూడిమడక, ప్రకాశం జిల్లాలో కొత్తపట్నం, ఓడరేవు, పశ్చిమగోదావరి జిల్లాలో బియ్యపుతిప్ప.. ఇలా 10 ఫిషింగ్ హార్బర్లకు శ్రీకారం చుట్టి వేగంగా పనులు చేయడం మొదలుపెట్టాం. ఇవి కాకుండా 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు చింతపల్లి, భీమిలి, రాజయ్యపేట, దొండవాక, ఉప్పల్లంక, రాయదరువు ప్రాంతాల్లో పనులు చేయించడానికి శ్రీకారం చుట్టాం. మనవాళ్లకు ఫిషింగ్ హార్బర్లు అందుబాటులోకి వస్తున్నందున సబ్సిడీతో బోట్లు కొనివ్వాలని భావించాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చి ఉంటే ఒక్కో ఫిషింగ్ హార్బర్లో 10 వేల బోట్లు తిరుగుతుండేవి. ఒక్కో బోటుకు 7–8 మందిని ఓనర్లు చేసి.. ఏకంగా 50% రాష్ట్ర ప్రభుత్వం గ్రాంటు ఇచ్చి, మరో 50% రుణం ఇప్పించి వీళ్లందరికీ మంచి చేయాలని భావించాం. దీంతో మత్స్యకార కుటుంబాల్లో గొప్ప అడుగు ముందుకు పడి ఉండేది. మత్స్యకారులను పరామర్శించిన అనంతరం విశాఖలోని జబ్బర్ తోట జంక్షన్ వద్ద మీడియాతో మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మారింది.. స్కామ్లు జరుగుతున్నాయిరాష్ట్ర ప్రభుత్వం మారడంతో ఈ రోజు ఏం జరుగుతోందంటే.. ఆ ఫిషింగ్ హార్బర్లను స్కామ్లుగా మారుస్తూ అమ్ముతున్నారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బరు ద్వారా చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు బోట్లు కొనిచ్చి, ఆ బోట్ల పార్కింగ్ కోసం వాడాల్సిన ప్రాంతాన్ని ప్రైవేటుకు కట్టబెట్టడం ద్వారా స్కామ్లు చేస్తూ చంద్రబాబు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. దీని గురించి రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. మత్స్యకారులకు వేధింపులుమన ప్రభుత్వంలో పలాస ఎమ్మెల్యే, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఘటన చూస్తే.. మత్స్యకారులను ఎంత దారుణంగా ఈ ప్రభుత్వం హింసిస్తోందో తెలుస్తుంది. సీదిరి అప్పలరాజు 18 ఏళ్ల కొడుకు బైకు నడుపుతూ దురదృష్టవశాత్తు ఢీకొట్టడంతో ఒక మనిషి చనిపోయారు. చేసింది కరెక్ట్ అని నేను చెప్పను. అయితే ప్రభుత్వం ఏకంగా మర్డరు కేసులు పెట్టి ఇరికించే ప్రయత్నం చేసింది. చివరకు జడ్జి జోక్యం చేసుకుని మర్డర్ కేసు ఎలా పెడతారయ్యా..అని తిట్టి సెక్షన్లు మార్పించారు. ఎంత దారుణంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందో ఆలోచించాలని కోరుతున్నా. జువ్వలదిన్నెలో తమిళనాడు నుంచి బోటు వచ్చి మన మత్స్యకారులను ఇబ్బంది పెడుతుంటే.. ఆ బోటును పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆ బోటును విడిపించింది ఎవరో తెలుసా టీడీపీకి చెందిన వీళ్లే. నెల్లూరు జిల్లాకు లోకేశ్ వెళతారు. ఆ మరుసటి రోజు బోటు రిలీజ్. పోలీస్స్టేషన్లో పెట్టిన బంగారం దొంగతనం అయినట్టుగా బోటు మాయమైపోతుంది. దానికి కారణం ఎవ్వరయ్యా అంటే లోకేశ్, అదే టీడీపీకి చెందిన ఓ రాజ్యసభ ఎంపీ.ప్రమాదం జరిగిన జూలై 4న రాత్రి 10:30 గంటలకే మత్స్యకార సంఘం నేత వాసుపల్లి జానకీరామ్ కలెక్టర్కు మెసేజ్ పంపగా..‘వెంటనే పరిశీలిస్తాం’ అంటూ కలెక్టర్ స్పందన తప్పు చేసి.. ఆపై తప్పించుకునే యత్నంరాత్రి 10.30 గంటలకు అసోసియేషన్ అధ్యక్షుడు జానకీరాం.. కలెక్టర్కు, మెరైన్ సీఐకి మెసేజ్ (మెసేజ్ చూపిస్తూ) పెట్టారు. గంగవరం పోర్టుకు సమీపంలో బోటు ప్రమాదం జరిగిందని తెలుపుతూ సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. విశాఖలో తూర్పు నావికాదళం ప్రధాన కేంద్రం ఉంది. అంటే ఇక్కడే నేవీ ఉంది. కోస్ట్గార్డు ఉంది. విశాఖలో హెలికాప్టర్లు ఉన్నాయి. కలెక్టర్లు, కమిషనర్లు ఉన్నారు. ఇంత మంది ఇక్కడే ఉండీ.. కేవలం 10 నాటికల్ మైళ్ల దూరం వెళితే వీళ్లను కాపాడుకునే పరిస్థితి ఉండేది. కనీసం 5వ తేదీ ఉదయం 7 గంటలకు మనుషులు వచ్చి ఉంటే కనీసం 5–6 మంది బతికి ఉండేవాళ్లం అని చిన్నా చెబుతున్నారు. అంటే ఎవ్వరూ రాలేదు. చివరకు దేవుడి దయతో చిన్నాను చైనీస్ బోటు వాళ్లు చూసి పొద్దున 8.30 గంటలకు రక్షించారు. ఇక్కడ స్పందించాల్సిన కలెక్టర్, ప్రభుత్వం, కమిషనర్.. ఎవ్వరూ స్పందించలేదు. ఎవరూ కో ఆర్డినేట్ చేయలేదు. ప్రభుత్వంలో ఏ పెద్దలూ స్పందించలేదు. తప్పు జరిగిందని ఒప్పుకోకుండా.. త్రిసభ్య కమిటీ నివేదికలో దొంగ మాటలు చెప్పారు. బాధిత కుటుంబ సభ్యులు జూలై 5న ఉదయం 5 గంటల వరకు తమకు సమాచారం అందించలేదని ఆ నివేదికలో పేర్కొన్నారు. సరైన సమయంలో స్పందించకపోవడం తప్పు అయితే, ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకు త్రిసభ్య కమిటీ నివేదికలోనూ తప్పులు రాస్తున్నారు.గల్లంతైన ఘటనపై మత్స్యకారుల కుటుంబాలకు జూలై 5న ఉదయం 5గంటలకు సమాచారం అందినట్లు పేర్కొన్న త్రిసభ్య కమిటీ నివేదిక వైఎస్సార్సీపీ, చంద్రబాబు ప్రభుత్వానికి తేడా ఇదీఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత దారుణంగా ఉందనేందుకు కొన్ని ఉదాహరణలు చెబుతాను. 2023 నవంబర్లో విశాఖ ఫిషింగ్ హార్బర్లో 49 బోట్లు కాలిపోతే ఏకంగా బోటు విలువలో 80 శాతం విలువ కట్టి.. రూ.7.11 కోట్లు వెంటనే విడుదల చేశాం. సుమారు 400 మంది మత్స్యకార హమాలీలు, కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున సహాయం అందించాం. 2018లో నా పాదయాత్ర జరుగుతున్నప్పుడు 22 మంది మత్స్యకారులు పాకిస్తాన్లో చిక్కుకున్నారు. వారి కుటుంబాల వారు వచ్చి నన్ను కలిశారు. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే మన చొరవతో కేంద్ర ప్రభుత్వం దౌత్యం జరిపింది. ఫలితంగా 2020 జనవరి 5వ తేదీన ఆ 22 మంది మత్స్యకారులను తీసుకు రావడమే కాకుండా ప్రతి కుటుంబానికి రూ.5 లక్షలు వారి చేతిలో పెట్టి జీవనాధారం చూపించింది. 2019లో మత్స్యకారులు వేటకు వెళ్లి బంగ్లాదేశ్ నిర్బంధానికి లోనైతే కేంద్రం ద్వారా దౌత్యం చేసి తొమ్మిది మందిని సురక్షితంగా ఇళ్లకు చేర్చింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే.ఎవరూ సంతోషంగా లేరు రాష్ట్రంలో ప్రతిదీ ఇలాగే ఉంది. రాష్ట్రంలో ఈ రోజు పిల్లలకు ఫీజు రీ యింబర్స్మెంట్ అందడం లేదు. స్కూళ్లు అన్యాయంగా తయారయ్యాయి. గోరుముద్ద కూడా సరిగా ఇవ్వని పరిస్థితి. పిల్లలకు కనీసం బ్యాగులు, బూట్లు, పుస్తకాలు కూడా సరిగా ఇవ్వని పరిస్థితి. ఆరోగ్యశ్రీ దారుణంగా తయారైంది. పేదవాడికి వైద్యం అందడం లేదు. రైతులకు ఏ పంటకూ మద్దతు ధర అందక రోడ్డు ఎక్కే పరిస్థితి. ఉచిత పంటల బీమా, ఆర్బీకేలు ఎగిరిపోయాయి. సూపర్ సిక్స్లు, సూపర్ సెవెన్లు అంటూ ఎన్నికల ముందు ప్రతి ఇంటికి వచ్చి సంతకాలు పెట్టి, బాండ్లు ఇచ్చి.. ఆపై మోసాలుగా మార్చి రాష్ట్ర ప్రజల జీవితాలతో చంద్రబాబు ఆటలాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో బాధిత ప్రజలందరికీ మేము అన్ని రకాలుగా తోడుంటాం. పార్టీ పరంగా చేయగలిగిన సహాయం చేస్తాం’ అని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, మాజీ స్పీకరు తమ్మినేని సీతారాం, మాజీ మంత్రులు అమర్నాథ్, బూడి ముత్యాలనాయుడు, ఎంపీ తనూజ రాణి, జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి తదితరులు పాల్గొన్నారు. -
ముద్రగడ పద్మనాభం మృతి పట్ల వైఎస్సార్సీపీ నేతల దిగ్భ్రాంతి
వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం మృతిపై వైఎస్సార్సీపీ నేతలు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ముద్రగడ మృతి పట్ల బొత్స సత్యనారాయణ సంతాపం వ్యక్తం చేశారు. కాపు ఉద్యమ నేతగా ముద్రగడ పోరాటం అద్భుతమని చెప్పారు. కాపుల కోసం ఆయన చేసిన ఉద్యమాలు స్ఫూర్తిదాయకమని అన్నారు.వైవీ సుబ్బారెడ్డి సంతాపం వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేసిన నాయకుడిగా, కాపు సమాజ హక్కుల కోసం జీవితాంతం అంకితభావంతో పనిచేసిన వ్యక్తిగా ముద్రగడ పద్మనాభం చిరస్మరణీయులని అన్నారు. ప్రజా జీవితంలో ఆయన ప్రదర్శించిన నిబద్ధత, ఉద్యమ స్ఫూర్తి, సామాజిక న్యాయం కోసం చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. ముద్రగడ పద్మనాభం మరణం రాష్ట్ర రాజకీయాలకు, ముఖ్యంగా కాపు సమాజానికి తీరని లోటని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు, అభిమానులకు, అనుచరులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారుజూపూడి ప్రభాకరరావు దిగ్భ్రాంతిముద్రగడ పద్మనాభం మృతిపై దళిత ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు ప్రగాఢ సంతాపం తెలిపారు. కాపు ఉద్యమానికి జీవితాంతం అంకితభావంతో సేవలందించిన ప్రముఖ ప్రజానేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ సారథి ముద్రగడ పద్మనాభం ఆకస్మిక మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేసిన ధీశాలి నాయకుడిగా, కాపు సమాజ హక్కులు, ఆత్మగౌరవం కోసం నిరంతరం కృషి చేసిన మహోన్నత వ్యక్తిగా ముద్రగడ పద్మనాభం చిరస్థాయిగా ప్రజల హృదయాలలో నిలిచిపోతారని అన్నారు.వెలంపల్లి శ్రీనివాసరావు తీవ్ర సంతాపంకాపు ఉద్యమ నేత,మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గారి హఠాన్మరణం పట్ల మాజీ మంత్రి,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు తీవ్ర దిగ్భ్రాంతిని,సంతాపాన్ని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వెలంపల్లి శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ ముద్రగడ పద్మనాభం గారు తన జీవితాంతం ప్రజల కోసం,ప్రత్యేకించి కాపు సామాజికవర్గ హక్కుల సాధన కోసం అలుపెరగని పోరాటం చేశారని కొనియాడారు.రాజకీయాల్లో ఆయన నిబద్ధత,నిష్కల్మషమైన వ్యక్తిత్వం అందరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.ఆయన మరణం రాష్ట్ర రాజకీయాలకే కాకుండా,ప్రజా ఉద్యమాలకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.ముద్రగడ పద్మనాభం గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ,వారి కుటుంబ సభ్యులకు,అభిమానులకు వెలంపల్లి శ్రీనివాసరావు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారుముద్రగడ మృతి తీరని లోటు: మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుముద్రగడ్డ పద్మనాభం మరణవార్త తనను ఎంతో కలచివేసిందని, ఆయన మృతి ప్రజా ఉద్యమాలకు, నగర రాజకీయాలకు తీరని లోటని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. విజయవాడ నగరంతో ముద్రగడ్డ పద్మనాభంకు దశాబ్దాల కాలంగా ఎంతో విడదీయరాని, ప్రత్యేకమైన అనుబంధం ఉందని గుర్తుచేశారు. ప్రస్తుత తరం నాయకుల్లో ఆయనలాంటి నిబద్ధత, నీతి, నిజాయితీ కలిగిన వ్యక్తిని చూడటం చాలా అరుదు అని మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. కాపు సామాజిక వర్గానికి తిరుగులేని ఉద్యమ నేతగా ముద్రగడ చరిత్రలో నిలిచిపోయారన్నారు. విలువలతో కూడిన రాజకీయాన్ని నమ్మి, దానికి కట్టుబడి జీవించిన ధీరుడు ముద్రగడ్డ పద్మనాభం అని ఆయన నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు మల్లాది విష్ణు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్టసమయంలో ఆ కుటుంబానికి కొండంత ధైర్యం కలగాలని ఆకాంక్షించారు.అనిల్ కుమార్ యాదవ్ దిగ్భ్రాంతి ముద్రగడ పద్మనాభం మృతి వైఎస్సార్సీపీకితీరని లోటని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఒక మంచి ఉద్యకారుడిని కోల్పోవడం చాలా బాధాకరమని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పారు. కేకే రాజు సంతాపంముద్రగడ పద్మనాభం మృతిపై విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు కేకే రాజు సంతాపం తెలిపారు. రాష్ట్రం అనుభవజ్ఞుడైన నేతను కోల్పోయిందని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముద్రగడ జీవిత కాలం కృషి చేశారని తెలిపారు. ముద్రగడ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు.-- -
మత్స్యకారుల జీవిత నావకు దిక్సూచి వైఎస్ జగన్
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మత్స్యకారులకు అండగా తాను ఉన్నానని మరోసారి భరోసా ఇచ్చారు. విశాఖలోని జబ్బర్తోటలో బాధిత మత్స్యకార కుటుంబాలను ఆయన మంగళవారం పరామర్శించిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్ అధికారంలో ఉన్న సమయంలో మత్స్యకారుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ చూపించి వారి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు.సముద్రంలో వేట నిషేధ సమయంలో మత్స్యకారులను ఆదుకునేందుకు వైఎస్ జగన్ 2020 మేలో మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులను ఆదుకునేందుకు రూ.10 వేలు ఆర్థికసాయం అందిస్తున్నామని ప్రకటించారు. బటన్ నొక్కి మత్స్యకారుల బ్యాంకు ఖాతాల్లో రూ. 10 వేల చొప్పున వైఎస్ జగన్ జమ చేసేవారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో వేట నిషేధ సమయంలో సాయం అందడంతో మత్స్యకారులు సంతోషంగా ఉండేవారు. అప్పటివరకు దేశంలో ఏ రాష్ట్రంలోనూ మత్స్యకారులకు ఇంత సాయం అందించలేదు. గత వైఎస్ జగన్ ప్రభుత్వం రాకముందు డీజిలుపై లీటరు మీద రూ.6 సబ్సిడీ ఇస్తే, వైఎస్సార్సీపీ సర్కారు రూ.9కు పెంచింది. ఈ విషయంలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చింది వైఎస్సార్సీపీ సర్కారు. డీజిల్ సబ్సిడీని మరిన్ని బోట్లకు అందించింది. దాదాపు 20 వేల బోట్లకు రూ.130 కోకు పైగా సబ్సిడీ ఇచ్చింది. డ్రిల్లింగ్ కారణంగా నష్టపోయిన మత్స్యకారులకు ఉపాధి అందించింది. అలాగే, ఆక్వా రైతులకు రూపాయిన్నరకే విద్యుత్ సబ్సిడీని అందించింది. దాదాపుగా రూ.3,500 కోట్లు సబ్సిడీగా ఇచ్చింది. ఈ ఆరు పథకాలలకు మొత్తం రూ.4,913 కోట్లు అందించింది. ఇవికాకుండా నవరత్నాలు ద్వారా అందించిన సాయం అదనం. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు కాని, ఫిషింగ్ హార్బర్ లేదా, ల్యాండింగ్ సెంటర్లను ఏర్పాటు చేసింది. హార్బర్లు, ల్యాండింగ్ సెంటర్లు, పోర్టుల నిర్మాణాలు చేసింది. తీరం వెంబడి మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరిచింది. బ్లూ ఎకనామీని పెంచేలా చర్యలు తీసుకుంది. ఇవేగాక, మత్స్యకారుల కోసం ఇంకా ఎన్నో కార్యక్రమాలను వైఎస్ జగన్ చేపట్టారు. అందుకే ఆయనకు మత్స్యకారులు ఇవాళ కూడా జేజేలు కొట్టారు.మరోవైపు, బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో అప్పట్లో ఓఎన్జీసీ పైపులైను కారణంగా ఉపాధి కోల్పోయిన 23,459 కుటుంబాలకు ఐదో విడతగా రూ.161.86 కోట్లను వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమచేశారు. దాంతో ఐదు విడతల్లో రూ.647.44 కోట్లను వైఎస్ జగన్ ప్రభుత్వం మత్య్సకారుల ఖాతాల్లో జమ చేసినట్లయ్యింది.రాజ్యాధికారంలో వాటా..సామాజికంగానూ, ఆర్థికంగానూ వెనుకబడిన మత్స్యకారులను వైఎస్ జగన్ అన్ని రకాలుగా ఆదుకున్నారు. రాజ్యాధికారంలో వాటాను పంచారు. ఆర్థికంగా చేయుతనిచ్చారు. ఎప్పుడూ లేని విధంగా మత్స్యకార వర్గానికి 4 ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టారు. మత్స్యకార సామాజికవర్గంలోని 14 ఉప కులాలను విభజించి ఐదు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. వైఎస్ జగన్ సీఎం అయ్యే వరకు టీటీడీ బోర్డులో మత్స్యకారులకు చోటే దక్క లేదు. తొలిసారిగా మొదట మల్లాడి కృష్ణారావుకూ, రెండవసారి ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్ కుమార్కూ టీటీడీ సభ్యులుగా అవకాశం కల్పించారు. నామినేటెడ్ పోస్టుల్లో మత్స్యకారుల సామాజిక వర్గానికి అత్యధిక పదవులు ఇచ్చారు. -
ముద్రగడ మృతిపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
సాక్షి,తాడేపల్లి: ప్రముఖ కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి పట్ల వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముద్రగడ మరణవార్త తనను ఎంతగానో బాధించిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో మా పార్టీ సీనియర్ నాయకులు, నాకు పితృసమానులైన ముద్రగడ పద్మనాభంగారి మరణవార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన క్రమంగా కోలుకుంటున్నారనే వార్త మాకు ఎంతో ధైర్యాన్నిచ్చింది. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి మన మధ్యకు వస్తారని ఆశిస్తున్న సమయంలోనే ఆయన ఇలా శాశ్వతంగా దూరం కావడం అత్యంత బాధాకరం.ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రజలకు చిరస్మరణీయమైన సేవలందించిన ముద్రగడగారు విలువలకు కట్టుబడి రాజకీయాలు చేశారు. పదవులకన్నా ప్రజలనే గొప్పగా భావించారు. తన జీవితాంతం పేదల బతుకుల్లో మార్పు కోసం తపించారు. ముఖ్యంగా కాపు సామాజికవర్గానికి పెద్దదిక్కుగా నిలిచి, వారి సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేశారు. తాను నమ్మిన మాటకు కట్టుబడి నిలబడే తత్వం, మంచికోసం ఎంతదూరమైనా వెళ్లే ధైర్యం ఆయన సొంతం. ఆత్మగౌరవానికి, నిజాయితీకి, వ్యక్తిత్వానికి ఆయన నిలువెత్తు రూపం. ముద్రగడగారి మరణం ఆయన కుటుంబానికే కాదు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఆయనను అభిమానించే లక్షలాది మందికి తీరని లోటు.ఈ విషాద సమయంలో ఆయన కుటుంబసభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని, ముద్రగడగారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముద్రగడగారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను’ అని పేర్కొన్నారు. అంతకుముందు ముద్రగడ పద్మనాభం మరణంపై వైఎస్ జగన్ స్పందిస్తూ.. ‘ముద్రగడ మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. ప్రజలకోసం ముద్రగడ చేసిన సేవలు చిరస్మరణీయం. ముద్రగడ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అని వెల్లడించారు. మా పార్టీ సీనియర్ నాయకులు, నాకు పితృసమానులైన ముద్రగడ పద్మనాభంగారి మరణవార్త నన్ను తీవ్రంగా కలచివేసింది.ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన క్రమంగా కోలుకుంటున్నారనే వార్త మాకు ఎంతో ధైర్యాన్నిచ్చింది. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి మన మధ్యకు వస్తారని ఆశిస్తున్న సమయంలోనే ఆయన ఇలా శాశ్వతంగా… pic.twitter.com/HReowspJ4e— YS Jagan Mohan Reddy (@ysjagan) July 14, 2026 -
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూత
సాక్షి, కాకినాడ: ప్రముఖ కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ (జులై 14) హైదరాబాద్లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ముద్రగడ మరణవార్తతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.ముద్రగడ పద్మనాభం 1953 జనవరి 22న ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించారు. ఆయన ప్రాథమిక పాఠశాల విద్య స్వగ్రామంలోనే సాగింది. ముద్రగడది మొదటి నుంచి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. ఆయన తాతయ్య పద్మనాభం గ్రామానికి మున్సుబ్గా పని చేయగా, తండ్రి ముద్రగడ వీర రాఘవరావు రాజకీయాల్లో అత్యంత క్రియాశీలంగా ఉండేవారు. వీర రాఘవరావు 1962, 1967 ఎన్నికలలో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నియోజకవర్గంలోని నిరుపేదలు, దళితులకు ఆయన అత్యంత అభిమాన నాయకుడిగా నిలిచారు.మాజీ భారత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డికి ముద్రగడ వీర రాఘవరావు అత్యంత ఆప్తుడు. 1977లో వీర రాఘవరావు మరణించిన తర్వాత, నీలం సంజీవరెడ్డి సూచన మేరకు ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1978లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నిరుపేదలు, గిరిజనులు, బీసీలు పద్మనాభంలో ఆయన తండ్రి రూపాన్ని చూసుకుని భారీ మెజారిటీతో గెలిపించారు. ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. 1978, 1983, 1985, 1989 శాసనసభ ఎన్నికలలో వరుసగా నాలుగు సార్లు ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో రెండు సార్లు రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడమే కాకుండా, కాకినాడ నియోజకవర్గం నుంచి లోక్సభ సభ్యుడిగా కూడా దేశ రాజధానిలో అడుగుపెట్టారు. రాజకీయ పదవుల కంటే కూడా కాపు సామాజిక వర్గాన్ని వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చాలంటూ ముద్రగడ పద్మనాభం చేసిన పోరాటాలు ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి.కాపు రిజర్వేషన్ల సాధన కోసం ఆయన తన జీవిత కాలంలో ఏకంగా ఏడుసార్లు ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టారు.2016లో తుని వేదికగా ఆయన నేతృత్వంలో నిర్వహించిన 'కాపు ఐక్య గర్జన' సభ అక్కడ జరిగిన రైల్వే ఘటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ఊపేసింది. ఈ ఘటనతో కాపు రిజర్వేషన్ల అంశాన్ని ఆయన జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. తద్వారా కాపు సామాజిక వర్గానికి తిరుగులేని ఉద్యమ నేతగా ముద్రగడ చరిత్రలో నిలిచిపోయారు. -
ఆంక్షలు పెట్టినా ఆగని జనం విశాఖ ఎయిర్ పోర్ట్ వద్ద జై జగన్ నినాదాలు
-
తూర్పుగోదావరి: రామవరంలో ఉద్రిక్తత
సాక్షి, తూర్పుగోదావరి: అనపర్తి మండలం రామవరంలో కూటమినేతల అరాచకం సృష్టించారు. వైఎస్సార్సీపీ నేతల ఇళ్లపై కూటమి నేతలు దాడులకు పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ నేత కృష్ణారెడ్డి ఇంటిపై కూటమి నేతలు దాడి చేశారు. కూటమి నేతల ఆగడాలను అదుపు చేయాలంటూ వైఎస్ఆర్సిపి కోఆర్డినేటర్ డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి రామవరంలో రోడ్డుపై బైఠాయించారు.సూర్యనారాయణ రెడ్డిని బలవంతంగా ఈడ్చుకెళ్లిన పోలీసులు.. వైఎస్సార్సీపీ కార్యకర్తల కోసం ఏర్పాటు చేసిన టెంట్లను కూడా పీకేశారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రోద్బలంతోనే ఈ దారుణానికి టీడీపీ నేతలు ఒడిగట్టారంటూ వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. ఘటనపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. -
బరితెగించిన కూటమి నేతలు YSRCP నేత కృష్ణారెడ్డి పై దాడి
-
మత్స్యకార కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ (ఫొటోలు)
-
బాధిత మత్స్యకార కుటుంబాలకు వైఎస్ జగన్ ఆర్థిక సాయం
విశాఖపట్నం: మత్స్యకార కుటుంబాలకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్థిక సాయం ప్రకటించారు. వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు దీని గురించి వివరాలు తెలిపారు.ఒక్కో బాధిత కుటుంబానికి రూ.7 లక్షల చొప్పున అందిస్తామని కేకే రాజు చెప్పారు. ఈ డబ్బును వైఎస్సార్సీపీ తరఫున అందిస్తామని అన్నారు. ప్రాణాలతో బయటపడ్డ చిన్నా కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని వివరించారు. చిన్నా కుటుంబానికి రూ.7 లక్షల సాయం చేస్తామని చెప్పారు. కాగా, ఇటీవల విశాఖ తీరంలో జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం(జూలై 14వ తేదీ) పరామర్శించారు. అదే ప్రమాదంలో మృత్యువుతో పోరాడి ప్రాణాపాయం నుంచి బయటపడిన కారి చిన్నాను కూడా వైఎస్ జగన్ పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇవి కూడా చదవండి: చంద్రబాబు సర్కార్కు మానవత్వం ఉందా?: వైఎస్ జగన్విశాఖ పర్యటనలో జగన్కు జై కొట్టిన జనం -
5 లక్షలు ముష్టి వేస్తున్నావా.. ప్రతి కుటుంబానికి కోటి రూపాయలు, కొత్త ఇల్లు
-
ప్రమాదం ఎలా జరిగిందో జగన్ కు వివరించిన కారె చిన్నా
-
మజ్జి కృష్ణవేణి మృతిపై వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, తాడేపల్లి: విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సాసీపీ విజయనగరం జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) మాతృమూర్తి మజ్జి కృష్ణవేణి మరణం పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.కృష్ణవేణి గారి మరణ వార్త తనను ఎంతో కలచివేసిందని వైఎస్ జగన్ పేర్కొన్నారు. కుటుంబానికి అండగా నిలుస్తూ, విలువలతో కూడిన జీవితం గడిపిన ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. ఈ విషాద సమయంలో మజ్జి శ్రీనివాసరావు, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. ఈ తీరని దుఃఖాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. -
జగన్ను చూడగానే కాళ్ళమీద పడి బోరున ఏడ్చేసిన బాధితుడు కారే చిన్నా
-
కాన్వాయ్ ఆపి మరీ వినతి పత్రాలు అందుకున్న జగన్
-
జగన్ అంటే ఎందుకంత భయం విశాఖ ఎయిర్ పోర్ట్ లో పోలీసుల ఆంక్షలు
-
YS Jagan LIVE : మత్స్యకార కుటుంబాలకు పరామర్శ
-
‘ఏపీ అంతా ఏసీ చేయిస్తానని చెప్పగలరు’.. భూమన వ్యంగ్యాస్త్రాలు
సాక్షి, తిరుపతి: అమరావతిలో అమెజాన్ అడవుల సృష్టిపై వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకరరెడ్డి సెటైర్లు విసిరారు. ‘‘అమరావతిలో మినీ అమెజాన్ నిర్మించబోతున్నట్లు పచ్చ పత్రిక ప్రచురించింది. 5 ఎకరాల్లో 20 వేలకు పైగా చెట్లు, 400 జాతులు మొక్కలు ఉంటాయని, పొడవైన చెట్లు ఏర్పాటు, జీవ వైవిధ్యం పెంపొందిస్తామని, కృత్రిమ సెలయేళ్ళు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు...శిక్షణ కేంద్రం ఉంటుందని పొగమంచుతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం అంటున్నారు. అమెజాన్ అడవులు వాతావరణంలో 4 డిగ్రీలు తగ్గిస్తామని కూడా చెప్తున్నారు. 7 ఎకరాల్లో పసిఫిక్ మహా సముద్రం కూడా తీసుకురావాలి. టైటానిక్ షిప్ను కూడా ఏర్పాటు చేయాలి’’ అంటూ భూమన వ్యంగ్యాస్త్రాలు సంధించారు...అమరావతిలో హిమాలయ పర్వతం ఏర్పాటు చేయండి. ఇంద్రుని అమరావతి కంటే.. మీ అమరావతిలో గొప్పగా సృష్టించండి. అన్ని ఎయిర్పోర్టుల్లో బార్లు తెరడానికి నిర్ణయించారు. ఏపీ అంతా ఏసీ చేయిస్తా అని చెప్పగలరు.. మీ పత్రికలు ద్వారా నమ్మించగలరు.’’ అంటూ భూమన మండిపడ్డారు. -
మానవత్వం ఉందా.. కోటి పరిహారం ఇవ్వాల్సిందే: వైఎస్ జగన్
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ విశాఖపట్నం పర్యటనకు సంబంధించి.. -
టీడీపీ కనుసన్నల్లోనే ‘సర్’
పిడుగురాళ్ల/నరసరావుపేట: పల్నాడు జిల్లాలో ‘సర్’ కార్యక్రమం అపహాస్యం పాలవుతోంది. టీడీపీ నేతల కనుసన్నల్లో ఈ తంతు నిర్వహిస్తున్నారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను నమోదుచేసేందుకు బీఎల్ఓలు సైతం ముందుకురాకపోవడంతో స్థానిక ఓటర్లు ఆందోళన వ్యక్తంచేశారు. సర్ ప్రక్రియకు ఇక సోమవారం ఒక్కరోజే గడువు మిగిలి ఉండడంతో వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను నమోదుచేసేందుకు బీఎల్ఓలు నానుస్తున్నారు. దీంతో కరాలపాడు ఓటర్లు, బీఎల్ఏలు అందరు కలిసి పిడుగురాళ్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించారు. గ్రామ ఇన్చార్జి ఆర్ఐ శ్రీనిబాబు, ఐదుగురు బీఎల్ఓలు గ్రామానికి వచ్చి విధులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అధికారులు మా గ్రామానికి వస్తేనే ఇక్కడ నుంచి కదులుతామని తేల్చిచెప్పడంతో గత్యంతరంలేక ఆర్ఐ శ్రీనిబాబుతోపాటు బీఎల్ఓలు కరాలపాడు గ్రామానికి స్థానికుల వెంట వెళ్లారు. అయినప్పటికీ టీడీపీ సానుభూతిపరులవి మాత్రమే నమోదుచేస్తుండడంతో అధికారులపై గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. కలెక్టర్కు కాసు మహేష్ రెడ్డి ఫిర్యాదు.. ఈ నేపథ్యంలో.. గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి జిల్లా కలెక్టర్ కృతిక శుక్లాకు ఫిర్యాదు చేశారు. దీంతో కోనంకి, కరాలపాడు గ్రామంలో పూర్తిస్థాయిలో సర్ కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ గురజాల ఆర్డీఓ మురళీకృష్ణ, తహసీల్దార్ మధుబాబులను ఆదేశించారు. ఈలోగా పోలీసులు కరాలపాడు సచివాలయం వద్దకు చేరుకుని టీడీపీ సానుభూతిపరులవి మాత్రమే బీఎల్ఓ ద్వారా దగ్గరుండి ఆన్లైన్ చేయిస్తున్నారు. తమను సచివాలయంలోకి రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారని వైఎస్సార్సీపీ బీఎల్ఏలు ఆరోపించారు. అలాగే, కోనంకి గ్రామంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓటర్లను ఆన్లైన్ చెయ్యొద్దని తహసీల్దార్ బీఎల్ఓలకు ఆన్లైన్ లాగిన్ ఇవ్వలేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరి ఓటు నమోదుచేయాలన్న లక్ష్యంతో సర్ ప్రక్రియ నిర్వహిస్తుంటే వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓటర్లను ఆన్లైన్లో నమోదుచేయకుండా ఉన్నతాధికారులే అడ్డుకుంటున్నారని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ విషయమై తహసీల్దార్ మధుబాబును వివరణ కొరేందుకు ప్రయతి్నంచినా ఆయన అందుబాటులోకి రాలేదు. మూడ్రోజుల ముందే ఆపేశారు: కాసు మరోవైపు.. నరసరావుపేటలో కలెక్టర్ను కలిసిన అనంతరం కాసు మహేష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నిబంధనల ప్రకారం ఈనెల 14 సాయంత్రం వరకు ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకుని డిజిటలైజ్ చేయాల్సి ఉన్నా మూడ్రోజుల ముందే కరాలపాడు, కోనంకి గ్రామాల్లోని బీఎల్ఓలు, ఎన్నికల అధికారులు ఓటర్ల దగ్గర నుంచి ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకోవడం నిలిపివేశారని చెప్పారు. దీన్ని తాము ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామన్నారు. -
పల్నాడు కల.. జగన్ సాకారం
సాక్షి, అమరావతి: వెనుకబడిన పల్నాడు ప్రాంత ప్రజలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందించే లక్ష్యంతో గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేసిన కృషి ఫలిస్తోంది. 2026–27 విద్యా సంవత్సరం నుంచి 100 ఎంబీబీఎస్ సీట్లతో పిడుగురాళ్ల వైద్య కళాశాల ప్రారంభానికి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అనుమతులు జారీ చేసింది. వైఎస్ జగన్ పిడుగురాళ్లలో ప్రభుత్వ నూతన వైద్య కళాశాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం కామేపల్లి వద్ద రూ.500 కోట్లతో అధునాత వసతులతో వైద్య కళాశాల, బోధనాస్పత్రి నిర్మాణాన్ని చేపట్టారు. గత ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం 2025–26 విద్యా సంవత్సరంలోనే 150 ఎంబీబీఎస్ సీట్లతో వైద్య కళాశాల ప్రారంభం కావాల్సి ఉంది. కళాశాలకు అనుమతులు రాబట్టాలంటే తొలుత బోధనాస్పత్రి అందుబాటులో ఉండాలి. ఈ నేపథ్యంలో 2024 సార్వత్రిక ఎన్నికల నాటికే బోధనాస్పత్రి నిర్మాణం కూడా పూర్తి చేశారు. మరోవైపు మొదటి ఏడాది ఎంబీబీఎస్ విద్యార్థులకు తరగతుల నిర్వహణకు వీలుగా కళాశాల, హాస్టల్స్, ఇతర నిర్మాణాలను దాదాపుగా పూర్తి చేశారు. ప్రాజెక్ట్ వ్యయంలో రూ.300 కోట్ల విలువైన పనులు ఎన్నికల నాటికే పూర్తయ్యాయి. ఎన్నికలకు ముందే ఆస్పత్రి భవనాన్ని వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే ప్రారంభించింది. అనంతరం ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.బాబు సర్కార్ బ్రేకులు..ఎన్నికల అనంతరం గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వం కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీలో ప్రైవేట్కు కట్టబెట్టాలని నిర్ణయించారు. దీంతో పిడుగురాళ్ల వైద్య కళాశాల నిర్మాణ పనులకు బ్రేకులు పడ్డాయి. తొలుత ఈ వైద్య కళాశాలను సైతం పీపీపీలో ప్రైవేట్కు కట్టబెట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. అయితే ఈ కళాశాల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం కూడా ఉంది. మరోవైపు కళాశాలలను ప్రైవేట్కు కట్టబెట్టడంపై వైఎస్సార్సీపీ పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేయడంతో పిడుగురాళ్ల వైద్య కళాశాలను ప్రైవేట్కు కట్టబెట్టే నిర్ణయాన్ని చంద్రబాబు విరమించుకున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కళాశాల ఏర్పాటుకు 19 నెలల అనంతరం చర్యలు ప్రారంభించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ కృషిని చంద్రబాబు కొనసాగించి ఉంటే 2024లోనే బోధనాస్పత్రి అభివృద్ధి అయిపోయి, గత విద్యా సంవత్సరంలోనే మన విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు సమకూరి ఉండేవి. చంద్రబాబు చేసింది శూన్యంవాస్తవ పరిస్థితులను క్షుణ్ణంగా గమనిస్తే పిడుగురాళ్ల వైద్య కళాశాల ప్రారంభం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చేసింది శూన్యమేనని బోధపడుతుంది. వైద్య కళాశాల ఏర్పాటు నిర్ణయం, భూ సేకరణ, టెండర్ పిలవడం, పనులు ప్రారంభించడం, మెజార్టీ శాతం పనులు పూర్తి చేయడం.. ఇలా కీలక అడుగులన్నీ వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే పడ్డాయి. మరోవైపు కళాశాల, బోధనాస్పత్రి కోసం పోస్టులను సైతం ఈ ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిందే లేదు. గత ప్రభుత్వంలో మార్కాపురం, పులివెందుల, ఆదోని, మదనపల్లె వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులకు కొత్తగా మంజూరు చేసిన 837 పోస్టులను చంద్రబాబు ప్రభుత్వం పిడుగురాళ్ల వైద్య కళాశాల, బోధనాస్పత్రికి సర్దుబాటు చేసింది. వాస్తవాలు ఇలా ఉంటే మెడికల్ కాలేజీ ఏర్పాటు చంద్రబాబు ప్రభుత్వం ఘనతే అనే రీతిలో హడావుడి చేస్తుండటం గమనార్హం.మన విద్యార్థులకు తీరని ద్రోహం..ప్రభుత్వ కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్కు కట్టబెట్టడం కోసం చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలోని వేల మంది విద్యార్థులకు తీరని ద్రోహం తలపెట్టింది. మాజీ సీఎం వైఎస్ జగన్ ఒకేసారి రాష్ట్రంలో 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణాన్ని చేపట్టారు. వాటిలో పది కాలేజీలను చంద్రబాబు సర్కారు ప్రైవేట్కు కట్టబెడుతోంది. పులివెందుల వైద్య కళాశాలకు 50 ఎంబీబీఎస్ సీట్లను ఎన్ఎంసీ మంజూరు చేయగా, లేఖ రాసి మరీ ఆ అనుమతులను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేయించింది. ఇలా పది వైద్య కళాశాలలకు బాబు అడ్డుపడటంతో 2024–25లో 700 ఎంబీబీఎస్ సీట్లు, 2025–26లో 1750 చొప్పున మొత్తంగా రెండేళ్లలో 2,450 సీట్లను మన విద్యార్థులు కోల్పోయారు. ఫలితంగా తెలంగాణ విద్యార్థులతో పోలిస్తే నీట్లో ఉత్తమ ర్యాంక్లు సాధించినప్పటికీ కన్వీనర్ కోటాలో సీట్ దక్కక నిరుపేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మధ్య తరగతి వర్గాలకు చెందిన మన విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. వైద్య విద్య కలను చంద్రబాబు సర్కారు ఛిద్రం చేయడంతో వారి జీవిత ఆశయం తలకిందులైంది. -
నేడు విశాఖలో వైఎస్ జగన్ పర్యటన
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఇటీవల విశాఖ తీరంలో జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. అదే ప్రమాదంలో మృత్యువుతో పోరాడి ప్రాణాపాయం నుంచి బయటపడిన కారి చిన్నాను కూడా వైఎస్ జగన్ పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోనున్నారు. బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని ఇప్పటికే వైఎస్సార్సీపీ నాయకులను వైఎస్ జగన్ ఆదేశించారు. ఈ విషాద ఘటనపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటూ బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలను నేరుగా వైఎస్ జగన్ పరామర్శించి వారికి ధైర్యం చెప్పనున్నారు. విశాఖ పర్యటన షెడ్యూల్ ఇలా.. వైఎస్ జగన్ మంగళవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరుతారు. విశాఖపట్నం చేరుకున్న అనంతరం జబ్బార్ తోటలో బాధిత మత్స్యకారుల కుటుంబాలను పరామర్శిస్తారు. అనంతరం ప్రమాదం నుంచి బయటపడిన కారి చిన్నాను పరామర్శించి దుర్ఘటన జరిగిన తీరు గురించి వివరాలు తెలుసుకుంటారు. అనంతరం తిరిగి తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు.రేపు భీమవరానికి వైఎస్ జగన్ ఆక్వా రైతులకు పరామర్శసాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆక్వా రైతుల సమస్యలను నేరుగా తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు వైఎస్ జగన్ భీమవరం వెళుతున్నారు. ఆక్వా రంగంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులపై రైతులతో ఆయన ముఖాముఖి చర్చిస్తారు. రైతుల సమస్యలను, నష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకుని అండగా నిలుస్తామని భరోసా ఇవ్వనున్నారు. ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని ఇప్పటికే పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసిన వైఎస్ జగన్... ఈ పర్యటన ద్వారా రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వారి తరఫున పోరాటాన్ని మరింత ఉధృతం చేయనున్నారు. -
చలో భీమవరం.. జగన్ పర్యటనపై సమావేశం
-
ఏ ఒక్కడినీ వదలను.. కట్టలు తెంచుకున్న రాచమల్లు ఆవేశం
-
కూటమి అధికారంలోకి వచ్చాక రాయలసీమ లిఫ్ట్ ను నిర్వీర్యం చేశారు
-
నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్'పై YSRCP ఫిర్యాదు
-
వైసీపీ అయితే లోపలేస్తావా..? నీకు టైమ్ దగ్గరపడింది లోకేశ్..! మాస్ వార్నింగ్
-
ఉండవల్లి రైతులతో అంబటి బాబుకు మాస్ వార్నింగ్
-
‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్ సీట్లు.. ఫలించిన వైఎస్ జగన్ కృషి
విజయవాడ: పిడుగురాళ్లలో 100 ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి ఎన్ఎంసీ ఆమోదం తెలిపింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచే ప్రవేశాలు చేపడుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి ఫలించింది. గత వైఎస్ జగన్ ప్రభుత్వం పిడుగురాళ్లలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టింది. 17 మెడికల్ కాలేజీల్లో భాగంగా పిడుగురాళ్ల కాలేజీని నిర్మించారు. పల్నాడు జిల్లా ఆరోగ్య భద్రత కోసం మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టారు వైఎస్ జగన్. 95 శాతం పనులు వైఎస్ జగన్ హయాంలోనే పూర్తయ్యాయి. ఈ ఏడాది నుంచి మెడికల్ కళాశాల ప్రారంభం కానుంది. ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీ అందుబాటులోకి రావడం వల్ల పల్నాడు ప్రాంత ప్రజలకు అధునాతన వైద్య సేవలు అందడమే కాకుండా, స్థానిక విద్యార్థులకు వైద్య విద్య అభ్యసించే సువర్ణావకాశం లభించనుంది. వైఎస్ జగన్ దూరదృష్టితో చేసిన ఆలోచనతో వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులకు ఇది ఓ చక్కటి అవకాశం కానుంది. -
స్వలాభం కోసమే రాయలసీమ లిఫ్ట్ తాకట్టు.. చంద్రబాబుపై సజ్జల ఫైర్
సాక్షి,నెల్లూరు: రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురవుతోందని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ టాస్క్ఫోర్స్ ఆధ్వర్యంలో నెల్లూరులో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రాధాన్యాన్ని ప్రజలకు వివరించడంతో పాటు, దాని కోసం పోరాటాన్ని బలోపేతం చేయడానికే టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేశామని తెలిపారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్వీర్యం చేసిందని ఆయన ఆరోపించారు. చంద్రబాబు తన స్వలాభం కోసం రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును తెలంగాణకు తాకట్టు పెట్టారని విమర్శించారు. ఒక ఇరిగేషన్ ప్రాజెక్టును రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ డీల్గా మార్చారని వ్యాఖ్యానించారు.రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు నిలిపివేత వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని సజ్జల అన్నారు. గతంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల అంశంపై చేసిన పోరాటం కంటే మరింత తీవ్రంగా ఈ అంశంపై ఉద్యమించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తే చంద్రబాబు ప్రభుత్వ విధానాల అసలు స్వరూపం అర్థమవుతుందని ఆయన అన్నారు. రాయలసీమ అభివృద్ధి, ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రాధాన్యంపై మేధావులు, విద్యావంతుల మధ్య విస్తృత చర్చ జరగాలని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. -
ఒక్క రోజులో మూడు పోలీస్ స్టేషన్లు.. బూతులు తిడుతూ బలవంతంగా
-
క్లార్క్స్ బర్గ్లో ఘనంగా మహానేత వైఎస్సార్ జయంతి
సాక్షి, అమరావతి: ప్రజాహృదయనేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 77వ జయంతిని అమెరికాలోని వైఎస్సార్సీపీ డీఎంవీ (డీసీ, మేరీల్యాండ్, వర్జీనియా) ఎన్ఆర్ఐ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మేరీల్యాండ్ రాష్ట్రంలోని క్లార్క్స్బర్గ్లో ఘనంగా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల ప్రవాస భారతీయులు, వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్పీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహానేత చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. భారీ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ జీవితం, ప్రజా సంక్షేమ పాలన, రైతు సంక్షేమం, విద్య, వైద్యం, పేదల అభ్యున్నతి కోసం చేపట్టిన చారిత్రాత్మక కార్యక్రమాలను ప్రతిబింబించే ప్రత్యేక ఆడియో–విజువల్ ప్రదర్శన అందరినీ భావోద్వేగానికి గురి చేసింది. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జనరల్ సెక్రటరీ (ఎన్ఆర్ఐ వ్యవహారాలు) డాక్టర్ ప్రదీప్ చింత, వైఎస్సార్సీపీ యూఎస్ఏ అడ్వైజర్ అండ్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు రమేష్ రెడ్డి వల్లూరు, వైఎస్సార్సీపీ యూత్ వింగ్ సెక్రటరీ సుబ్బు రాయాని మాట్లాడుతూ మహానేత ఆశయాలను ఆయన తనయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ సమర్ధంగా ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. సంక్షేమ పాలనకు కొత్త దిశను చూపారని పేర్కొన్నారు. -
నాంపల్లి కోర్టుకు నాగార్జున యాదవ్
-
నాగార్జున యాదవ్ అరెస్ట్ పై శేఖర్ రెడ్డి రియాక్షన్.. అసలు రావణ్ ఎవరు..?
-
ఏపీలో రేపే చివరి రోజు.. 'సర్'లో తీవ్ర గందరగోళం!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ ముగింపు దశకు చేరుకున్న వేళ.. మరోసారి వివాదాలు తెరపైకి వచ్చాయి. మంగళవారంతో ఈ ప్రక్రియ ముగియనున్నప్పటికీ.. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల వివరాల సవరణ, డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తిస్థాయిలో కొలిక్కి రాలేదని తెలుస్తోంది.ఒకవైపు సాంకేతిక సమస్యలు, మరోవైపు రాజకీయ జోక్యం కారణంగా ఎన్నికల ప్రక్రియ పారదర్శకతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ ప్రక్రియలో అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. దీంతో అనేక ప్రాంతాల్లో దరఖాస్తులు పెండింగ్లో ఉండగా, అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో నమోదు కావడం, తప్పులను సరిదిద్దడం ఆలస్యమవుతోందని తెలుస్తోంది. చివరి దశకు వచ్చినా ప్రక్రియ పూర్తిగా కొలిక్కి రాకపోవడం ఓటర్లు ఆందోళన చెందుతున్నారు.అంతేకాదు.. బూత్ లెవల్ అధికారులు (BLOలు) రాజకీయ ఒత్తిళ్ల మధ్య పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికార టీడీపీ నేతలు బీఎల్వోలపై ఒత్తిడి తెస్తూ.. తమకు అనుకూలంగా ఓటర్ల జాబితాలో మార్పులు చేయాలని ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా వైఎస్సార్సీపీకి మద్దతుగా భావిస్తున్న ఓటర్ల పేర్లు తొలగించాలని బెదిరిస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి.ఇటు ఎన్నికల సంఘం విధుల్లో అధికార పార్టీ జోక్యం పెరిగిందని కూడా వైఎస్సార్సీపీ అంటోంది. ఎన్నికల సంఘం నిర్వహించాల్సిన ప్రక్రియను అధికార పార్టీ ప్రభావితం చేస్తోందని, దీంతో రాజ్యాంగబద్ధ సంస్థ స్వతంత్రత దెబ్బతింటోందని పేర్కొంది. ఎన్నికల నిర్వహణలో పూర్తిస్థాయి తటస్థత కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది.మరోవైపు 'మై టీడీపీ' యాప్లో ఓటర్ల వివరాలు అందుబాటులో ఉండటంపై కూడా వైఎస్సార్సీపీ ప్రశ్నలు లేవనెత్తింది. ఎన్నికల సంఘం వద్ద మాత్రమే ఉండాల్సిన సమాచారం అధికార పార్టీ యాప్లోకి ఎలా వెళ్లిందని నిలదీసింది. దీనిపై పలుమార్లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆక్షేపిస్తోంది.రేపటితో SIR ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో పెండింగ్లో ఉన్న దరఖాస్తుల పరిష్కారం, ఓటర్ల జాబితా ఖచ్చితత్వం, రాజకీయ జోక్యంపై వచ్చిన ఆరోపణలకు ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వివాదాల మధ్య తుది ఓటర్ల జాబితా ఎంత పారదర్శకంగా సిద్ధమవుతుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. -
ఎల్లుండి భీమవరంలో వైఎస్ జగన్ పర్యటన
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎల్లుండి (బుధవారం) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పర్యటనకు వెళ్లనున్నారు.రాష్ట్రంలో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ఆక్వా రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు వైఎస్ జగన్ భీమవరం పర్యటన చేపడుతున్నారు. ఆక్వా ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, పెరిగిన ఉత్పత్తి వ్యయాలు, విద్యుత్ ఛార్జీలు, ఎగుమతుల్లో ఎదురవుతున్న ఇబ్బందులు, ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆక్వా రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్న పరిస్థితిని ఆయన పరిశీలించనున్నారు.ఈ సందర్భంగా ఆక్వా రైతులను పరామర్శించి, వారి సమస్యలు, ఇబ్బందులు, నష్టాలపై నేరుగా వివరాలు తెలుసుకుంటారు. రైతుల ఆవేదనను విని వారికి ధైర్యం చెప్పడంతో పాటు, వారి సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు.ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని ఇప్పటికే పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసిన వైఎస్ జగన్, ఈ పర్యటన ద్వారా రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వారి తరఫున పోరాటాన్ని మరింత బలోపేతం చేయనున్నారు. -
రేపు విశాఖకు వైఎస్ జగన్.. మత్స్యకార కుటుంబాలకు పరామర్శ
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (మంగళవారం) విశాఖలో పర్యటించనున్నారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన విషాదకర బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పనున్నారు. ప్రమాదంలో తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాలను కలిసి వారి యోగక్షేమాలు తెలుసుకుని, పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇవ్వనున్నారు.అదే ప్రమాదంలో మృత్యువుతో పోరాడి ప్రాణాపాయం నుంచి బయటపడిన కారి చిన్నాను కూడా వైఎస్ జగన్ పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోనున్నారు.పర్యటన షెడ్యూల్ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరుతారు. విశాఖపట్నం చేరుకున్న అనంతరం జబ్బార్ తోటలో బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శిస్తారు. అనంతరం ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన కారి చిన్నాను కలుస్తారు. కార్యక్రమం ముగిసిన తర్వాత మధ్యాహ్నం తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు.బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని ఇప్పటికే పార్టీ నాయకులను ఆదేశించిన వైఎస్ జగన్, ఈ విషాద ఘటనపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటూ బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేరుగా బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పనున్నారు. -
తెలంగాణలోనూ రెడ్బుక్ అరాచకమా?: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం రేపుతోంది. తెలంగాణ పోలీసులు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా అదుపులోకి తీసుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామంపై ఎర్రగొండపాలెం(ప్రకాశం) వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తీవ్రంగా స్పందించారు. "తెలంగాణలోనూ రెడ్బుక్ అరాచకమే నడుస్తోందా?" అంటూ ప్రశ్నించారు. నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేయడం ఎలా సాధ్యమైంది? అని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తెలంగాణ పోలీసులను నిలదీస్తున్నారు. ‘‘చట్టపరమైన ప్రక్రియను పక్కనబెట్టి అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. 41(A) నోటీసులు ఇవ్వకుండా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం చట్టబద్ధమేనా?. ఏపీ తరహాలో తెలంగాణలోనూ రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందా?.. వెంటనే నాగార్జున యాదవ్ను విడుదల చేసి, ఈ ఘటనపై వివరణ ఇవ్వాలి’’ అని ఆయన డిమాండ్ చేశారు. గుంటూరులోని తన మామ ఇంట్లో ఉన్న నాగార్జున యాదవ్ను ఆదివారం తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాము హైదరాబాద్లోని బేగంబజార్ పోలీస్స్టేషన్కు చెందిన సిబ్బందిమని చెబుతూ.. స్థానిక నల్లపాడు పోలీస్స్టేషన్కు సమాచారం ఇచ్చామని కుటుంబ సభ్యులకు తెలిపారు. అయితే అరెస్ట్కు సంబంధించి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, కారణాలను కూడా స్పష్టంగా చెప్పలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఎవరని ప్రశ్నించినందుకు.. నాగార్జున యాదవ్ భార్యతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని తెలుస్తోంది. బూతులు తిడుతూ ఆయన్ని బలవంతంగా తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయానికి సమాచారం ఇచ్చినా స్పందన రాలేదని నాగార్జున కుటుంబ సభ్యులు వాపోయారు.ఒకే రోజులో మూడు పోలీస్స్టేషన్లు తిప్పి..నాగార్జున యాదవ్ను మొదట గుంటూరులోని నల్లపాడు పోలీస్స్టేషన్కు తీసుకెళ్లిన పోలీసులు.. అక్కడి నుంచి హైదరాబాద్లోని పురానా హవేలీ టాస్క్ఫోర్స్ కార్యాలయానికి తరలించినట్లు సమాచారం. అక్కడ కొంతసేపు ఉంచిన అనంతరం బేగంబజార్ పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. ఒకే రోజులో మూడు ప్రాంతాలకు తిప్పి తీవ్ర వేధింపులకు గురిచేశారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.ఏ కేసులో అరెస్ట్?తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై లైవ్ డిబేట్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. అడ్వకేట్ కైలాష్ సజ్జన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూలై 10న హైదరాబాద్లోని బేగంబజార్ పోలీస్స్టేషన్లో నాగార్జున యాదవ్, ఇతరులపై కేసు నమోదు చేశారు. లైవ్ చర్చలో నాగార్జున యాదవ్ ముఖ్యమంత్రిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని, ప్రజల్లో విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా భారతీయ న్యాయ సంహిత (BNS)లోని 192, 352, 353(1), 353(2) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, ఈ వ్యవహారం వెనుక ముమ్మాటికీ రాజకీయ ప్రతీకారమే ఉందని వైఎస్సార్సీపీ అంటోంది. ప్రభుత్వాన్ని నిలదీసినందుకు కక్ష గట్టిన చంద్రబాబు సర్కార్.. రెండేళ్ల కిందటి నాటి వ్యాఖ్యలను ఇప్పుడు బయటకు తీసి కేసు నమోదు చేయించారని, చట్టపరమైన నిబంధనలను పాటించకుండా అరెస్ట్ చేశారని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న నాయకులను లక్ష్యంగా చేసుకుని కేసులు పెడుతున్నారని, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఇందుకు వినియోగిస్తున్నారని ఆ పార్టీ నేతలు విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఈ చర్యలు చేపట్టిందని అంటున్నారు. -
జగన్ కు అధికారం.. నీకు జైలు.. గెట్ రెడీ చంద్రబాబు...!
-
మేము తలుచుకుంటే ఈపాటికి మీ ఇద్దరూ ఊసలు లెక్కపెట్టేవాళ్లు...
-
నువ్వు మనిషివేనా... భూములు ఇవ్వకపోతే చంపేస్తావా.. పొలాల్లోకి దూసుకొచ్చిన బుల్డోజర్లు
-
నన్ను రెచ్చగొట్టారు.. బాబుకు బ్రిజేంద్ర రెడ్డి లేఖ.. అఖిల ప్రియలో టెన్షన్...
-
రెండేళ్ల క్రితం విమర్శించారని ఇప్పుడు కేసు
గుంటూరు రూరల్/సాక్షి, హైదరాబాద్: తన ప్రభుత్వ వైఫల్యాలు, హామీల అమలులో వెనకడుగుపై ప్రశి్నస్తున్న వారిపై అక్రమ కేసులతో తీవ్ర కక్ష సాధింపులకు దిగుతున్న చంద్రబాబు సర్కారు ఇప్పుడు ఈ దిశగా మరో అడుగు ముందుకు వేసింది. పొరుగు రాష్ట్ర సీఎంగా ఉన్న తన శిష్యుడి ప్రభుత్వం అండతో మరింతగా రెచ్చిపోతూ వేధింపులకు గురిచేస్తోంది. ఎప్పుడో రెండేళ్ల క్రితం తెలంగాణ సీఎంను విమర్శించారనే నెపంతో వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ను ముప్పుతిప్పలు పెట్టేలా ఇప్పుడు వ్యూహం రచించింది.అక్కడ కేసు పెట్టించి, ఇక్కడికొచ్చి పట్టుకుపోయేలా స్కెచ్ వేసింది. ఈ క్రమంలో ఆదివారం చెప్పాపెట్టకుండా వచ్చిన తెలంగాణ పోలీసులు.. నాగార్జున యాదవ్ను అదుపులోకి తీసుకుని గుంటూరు నల్లపాడు పోలీస్స్టేషన్కు తరలించారు. ఆపై హైదరాబాద్ పురానాహవేలిలోని టాస్్కఫోర్స్ స్టేషన్కు తీసుకెళ్లారు. అక్కడ రెండు గంటలు నిర్బంధించారు. అనంతరం బేగంబజార్ పోలీస్స్టేషన్కు తరలించారు. ఇలా ఒక్క రోజులోనే మూడు పోలీస్స్టేషన్లు తిప్పి తీవ్ర వేధింపులకు పాల్పడ్డారు. ఈ తతంగంలో కర్త, కర్మ, క్రియ ఏపీ ప్రభుత్వమేనన్నది బహిరంగ రహస్యం. సివిల్ డ్రెస్లో వచ్చి లాక్కెళ్లారు గుంటూరులోని తన మామ ఇంట్లో ఉన్న నాగార్జున యాదవ్ను తెలంగాణ పోలీసులు ఆదివారం అక్రమంగా అరెస్టు చేశారు. ఎటువంటి సమాచారం లేకుండా, నోటీసులు సైతం ఇవ్వకుండా సివిల్ డ్రెస్లో వచ్చి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. తాము హైదరాబాద్ సిటీ బేగంబçజారు పోలీస్స్టేషన్ నుంచి వచ్చామని, అరెస్టు విషయంపై నల్లపాడు పోలీస్స్టేషన్కు సమాచారం ఇచ్చామన్నారు. అయితే, విషయం తమకు స్పష్టంగా చెప్పాలని కుటుంబ సభ్యులు అడ్డుకోబోతే.. బూతులు తిడుతూ నాగార్జున యాదవ్ను లాక్కెళ్లారని ఆయన భార్య వాపోయారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఇంతగా దౌర్జన్యం చేస్తూ.. వేధిస్తారా అని ఆమె మండిపడ్డారు. వెంటనే జిల్లా ఎస్పీ కార్యాలయానికి సమాచారం ఇచ్చినా ఎలాంటి స్పందనలేదని నాగార్జున మామ అన్నారు. తెలంగాణ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందున ఆయన్ను అరెస్టు చేస్తున్నామని పోలీసులు తెలిపినట్లు సమాచారం. టీపీసీసీ సోషల్ మీడియా విభాగం ఇచ్చిన ఫిర్యాదుతో బేగంబజార్ పోలీసులు బీఎన్ఎస్లోని 192, 352, 353 (1), 353 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నాగార్జున యాదవ్ను సోమవారం న్యాయస్థానంలో హాజరు పరుస్తామని ఓ అధికారి తెలిపారు. అయితే, వచ్చిన వారు తెలంగాణ పోలీసులా లేక ఏపీ పోలీసులా అని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. కనీసం మహిళ అని కూడా చూడకుండా నాగార్జున యాదవ్ భార్యను సైతం బూతులు తిట్టారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. -
సచివాలయ ఉద్యోగుల పదోన్నతులపై సాగతీతే
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియను చంద్రబాబు సర్కారు రెండేళ్లుగా సాగదీస్తోంది. ఇంజనీరింగ్ అసిసెంట్లు, వెల్ఫేర్, ఎడ్యుకేషన్ అసిసెంట్లు, వార్డు అమెనిటీస్ సెక్రటరీల పదోన్నతులపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల శాఖలో మొత్తం 24 కేటగిరీల ఉద్యోగులు పనిచేస్తుండగా 20 విభాగాలకు సంబంధించి పదోన్నతుల ఛానల్స్ వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే ఖరారు చేసి వారికి పదోన్నతులు కూడా కల్పించారు. మిగిలిన నాలుగు విభాగాలకు సంబంధించి 2024 జూన్లో సీఎం చంద్రబాబు అధికారంలోకి రాగానే పక్కన పెట్టేసింది. వారికి పదోన్నతులు కల్పించకుండా మంత్రివర్గ ఉపసంఘం పేరుతో కాలక్షేపం చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఆధ్వర్యంలో సోమవారం సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనైనా తమ పదోన్నతుల ప్రక్రియ ఓ కొలిక్కి వస్తుందని నాలుగు విభాగాలకు చెందిన సచివాలయాల ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఇంజనీరింగ్ విభాగాల్లో బోలెడు ఖాళీలు.. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియ చంద్రబాబు ప్రభుత్వం రాగానే ఎక్కడిదక్కడే ఆగిపోయిందని ఉద్యోగుల సంఘం నేతలు పేర్కొంటున్నారు. పంచాయతీరాజ్ – ఇంజనీరింగ్, ఆర్డబ్ల్యూఎస్, రోడ్లు – భవనాలు, జలవనరులు తదితర విభాగాల్లో భారీ సంఖ్యలో మండల స్థాయి ఇంజనీరింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. మున్సిపాలిటీలు, పట్టణాభివృద్ధి ప్రాంతీయ కార్యాలయాలతో పాటు టౌన్ ప్లానింగ్, శానిటేషన్ విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్, శానిటరీ ఇన్స్పెక్టర్ తదితర పోస్టుల్లో ఖాళీలను వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతుల ద్వారా భర్తీకి అవకాశం ఉన్నా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని ఉద్యోగుల సంఘం నేతలు పేర్కొంటున్నారు. ఏడాది క్రితం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో వీలైనంత త్వరగా ఖాళీలు ఉన్న ప్రతిచోట పదోన్నతుల ప్రక్రియ పూర్తిచేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం విస్మరించిందని మండిపడుతున్నారు. రేషనలైజేషన్ పేరిట ఎడాపెడా కుదింపు.. వైఎస్సార్ సీపీ హయాంలో 2019–24 మధ్య పౌర సేవలు, పథకాలను ప్రజలకు ఇంటివద్దే అందించడంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థకు చంద్రబాబు ప్రభుత్వం తూట్లు పొడిచి నిర్వీర్యం చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల పేరును సైతం మార్చేసింది. వలంటీర్లకు వేతనాలను పెంచకపోగా ఏకంగా వ్యవస్థనే రద్దు చేసింది. మరోవైపు రేషనలైజేషన్ పేరిట సచివాలయాల ఉద్యోగుల సంఖ్యను సగానికి కుదించింది. పౌర సేవలకు పాతర వేసి సచివాలయాల ఉద్యోగులను ఇంటింటి సర్వేలు, సమాచార సేకరణ, ఇతర విధులకు పరిమితం చేసింది. -
బేగం బజార్ పీఎస్కు నాగార్జున యాదవ్ తరలింపు
హైదరాబాద్, సాక్షి: అక్రమంగా అరెస్ట్ చేసిన వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ను పోలీసులు బేగం బజార్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో యర్రగొండపాలెం ఎంఎల్ఏ తాటిపర్తి చంద్రశేఖర్ బేగం బజార్ పీఎస్ వద్దకు చేరుకుని నాగార్జున యాదవ్ అరెస్ట్ను ఖండించారు. 41(ఎ) నోటీసు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. నాగార్జున యాదవ్ను వెంటనే విడుదల చేయాలన్నారు.అలాగే నాగార్జున యాదవ్ అరెస్ట్ను మాజీ మంత్రి జోగి రమేష్ ఖండించారు. చంద్రబాబు బీసీలను వేధిస్తున్నారని, చంద్రబాబు, లోకేష్ ఒత్తిడితోనే అక్రమ అరెస్ట్లు జరుగుతున్నాయని ఆరోపించారు. బీసీలను అరెస్టులతో భయపెట్టాలని చూస్తున్నారన్నారు. -
‘చంద్రబాబు, లోకేష్ ఒత్తిడితోనే అక్రమ అరెస్టులు’
విజయవాడ: వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్టును మాజీ మంత్రి జోగి రమేష్ ఖండించారు. చంద్రబాబు, లోకేష్ ఒత్తిడితోనే అక్రమ అరెస్టులు చేస్తున్నారంటూ విమర్శించారు. చంద్రబాబు బీసీలను వేధిస్తున్నారని, బీసీలను అక్రమ అరెస్టులతో భయపెట్టాలని చూస్తున్నారని జోగి రమేష్ మండిపడ్డారు. కాగా, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నాగార్జున యాదవ్ని ఇంటి నుండి తీసుకెళ్లిన పోలీసులు.. తెలంగాణ పోలీసులమంటూ కుటుంబ సభ్యులకు చెప్పారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నాగార్జున యాదవ్ని పోలీసులు తీసుకెళ్లారు. నల్లపాడు పోలీస్ స్టేషన్కి సమాచారం ఇస్తామని పోలీసులు తెలిపారు. -
‘రైతుల బతుకులపై చంద్రబాబు దండయాత్ర’
సాక్షి, తాడేపల్లి: రైతుల బతుకుల మీద చంద్రబాబు దండయాత్ర చేశారని.. వందలాది మంది పోలీసులతో ఉండవల్లి రైతుల భూములను లాగేసుకున్నారని వైస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం.మనోహర్రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆ భూముల కేసు హైకోర్టులో ఉండగానే బలవంతపు స్వాధీనం అన్యాయం. తుది తీర్పు రాకముందే భూములపై బాబు సర్కార్ దుర్మార్గపు చర్యలు అంటూ దుయ్యబట్టారు.‘‘చంద్రబాబు కరకట్ట బంగ్లా సమీపంలోనే ఈ దుర్మార్గం జరిగింది. జనవరి 8 భూసేకరణ నోటిఫికేషన్ను రైతులు హైకోర్టులో సవాలు చేశారు. భూ సేకరణకు పరిపాలనా అనుమతి లేదని రైతులు కోర్టు దృష్టికి తెచ్చారు. న్యాయపరమైన అంశాలను లోతుగా పరిశీలించాల్సి ఉందని హైకోర్టు చెప్పింది. భూ సేకరణ ప్రక్రియ, అవార్డు రెండూ తుది తీర్పునకు లోబడి ఉంటాయని కూడా చెప్పింది. తుది విచారణ ఇంకా పెండింగ్లోనే ఉంది. ఆ భూముల్లోకి బుల్డోజర్లు పంపారు. రైతులు స్వచ్చందంగా ఇస్తే తీసుకోవాలి. కానీ ఇలా బెదిరించి లాక్కుంటారా?’’ అని మనోహర్రెడ్డి నిలదీశారు.‘‘అప్పటికప్పుడు అవార్డు ప్రకటించి భూములు లాక్కోవటం దుర్మార్గం. ప్రత్యామ్నాయం కూడా చూపకుండా భూమి లాక్కున్నారు. రైతులను తీవ్రంగా క్షోభ పెట్టారు. రైతులు కోర్టుకు వెళ్లకుండా శని, ఆదివారం చూసి భూముల్లోకి వచ్చారు. చంద్రబాబు ప్రభుత్వానికి కోర్టులపై గౌరవం ఉంటే ఇలా చేస్తారా?. ఉండవల్లిలో ఎకరం రూ.8 కోట్లు ఉంది. కానీ రూ.2.60 కోట్లు మాత్రమే ప్రభుత్వం పరిహారం ఎలా ఇస్తారు?. చంద్రబాబు బినామీలు ఆ చుట్టుపక్కలే రూ.8 కోట్ల చొప్పున కొన్నారు. మరి రైతులకు ఆ విధంగా పరిహారం ఎందుకు ఇవ్వటం లేదు?..రైతుల నుంచి భూములు లాక్కుని ఎవరికి కట్టబెట్టబోతున్నారు?. రానున్న రోజుల్లో ఉండవల్లి గ్రామమే కనుమరుగు కాబోతోంది. ఇప్పటికైనా బలవంతపు భూసేకరణను నిలిపేయాలి. హైకోర్టు తీర్పు వచ్చేంత వరకు భూముల్లోకి రాకూడదు. పంటలను ధ్వంసం చేయించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఉండవల్లి, పెనుమాక ప్రాంతంలో టీడీపీ నేతలు కొన్న భూముల వివరాలు బయట పెట్టాలి’’ అని మనోహర్రెడ్డి డిమాండ చేశారు. -
నాగార్జున యాదవ్ అరెస్ట్ వెనుక..
-
YSRCP అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్..
-
వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నాగార్జున యాదవ్ని ఇంటి నుండి తీసుకెళ్లిన పోలీసులు.. తెలంగాణ పోలీసులమంటూ కుటుంబ సభ్యులకు చెప్పారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నాగార్జున యాదవ్ని పోలీసులు తీసుకెళ్లారు. నల్లపాడు పోలీస్ స్టేషన్కి సమాచారం ఇస్తామని పోలీసులు తెలిపారు.నాగార్జున యాదవ్ అరెస్ట్పై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఆయన్ని అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీ రఘురాం, నాగార్జున యాదవ్ భార్య.. ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. -
వైఎస్ జగన్ ‘మావిగన్’.. టీడీపీ కూటమికి దడ పుట్టిస్తోందా?
ఆంధ్రప్రదేశ్ నవనిర్మాణ చారిత్రక పరిణామ క్రమంలో భౌగోళిక వ్యూహాలు, పరిపాలనా సౌలభ్యం, ప్రజా సంక్షేమం అనేవి కేవలం తాత్కాలిక రాజకీయ నినాదాలు కాకూడదు. ఒక రాష్ట్ర ఆర్థిక, సామాజిక ప్రగతి అనేది అక్కడ ఇప్పటికే దశాబ్దాలుగా అందుబాటులో ఉన్న సహజ వనరులు, చారిత్రక మౌలిక వసతుల సద్వినియోగం పైనే ఆధారపడి ఉంటుంది తప్ప, శూన్యం నుంచి సృష్టించాలనుకునే ఊహాజనిత రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాల మీద కాదు.ఈ మౌలిక సత్యాన్ని క్షేత్రస్థాయి వాస్తవాలతో విశ్లేషిస్తూ, కృష్ణా-గుంటూరు ప్రాంత పారిశ్రామిక హృదయభూమిని చారిత్రాత్మక తీరప్రాంతమైన మచిలీపట్నంతో అనుసంధానించాలనే వైఎస్ జగన్మోహన్రెడ్డి మావిగన్ వ్యూహాత్మక ఆలోచనల్లోని అంతర్లీన హేతుబద్ధతను ఒకదాని వెనుక ఒకటిగా లోతుగా పరిశీలించాల్సిన చారిత్రక సందర్భం ఇది.నిజమైన ప్రజాస్వామ్యంలో అధికారం, సంపద, అభివృద్ధి ఒకేచోట కేంద్రీకృతం కాకూడదు. అది సమాజంలోని ప్రతి ప్రాంతానికి, చివరి వ్యక్తి వరకు సమానంగా ప్రవహించాలి అన్న మహాత్మా గాంధీ సూక్తిని ఇక్కడ మనం స్మరించుకోవాలి. గతంలో ప్రతిపాదించిన అమరావతి నమూనా ఈ ప్రాథమిక వికేంద్రీకరణ సూత్రానికే పూర్తిగా విరుద్ధంగా సాగింది. ఒకే పరిమిత ప్రాంతంలో లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కుమ్మరించి, చుట్టుపక్కల దశాబ్దాలుగా సహజ సిద్ధమైన ఆర్థిక, సాంస్కృతిక శక్తులుగా ఎదిగిన నగరాలను పూర్తిగా విస్మరించడం తీవ్రమైన వ్యూహాత్మక లోపం.విజయవాడ, గుంటూరు నగరాలు ఎప్పటి నుంచో కోస్తాంధ్రాకు వాణిజ్య, విద్యా, రవాణా, వైద్య కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి. ఈ రెండు ప్రధాన నగరాల మధ్య అపారమైన మానవ వనరులు, అద్భుతమైన రోడ్డు నెట్వర్క్, రవాణా వసతులు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. ఉన్న వసతులను మరింత పటిష్టం చేసి, వాటిని పరిపాలనా కేంద్రాలుగా మలిచి ఉంటే రాష్ట్ర ఆర్థిక రంగానికి ఎంతో మేలు జరిగేది. కానీ, ఈ సహజసిద్ధమైన వసతులను కాదని, పచ్చటి పంట భూములను బలవంతంగా లాక్కొని కాంక్రీట్ వనంగా మార్చాలనుకోవడం అనాలోచిత ఆర్థిక ప్రణాళికే అవుతుంది.ఈ ప్రాంత రవాణా రంగంలో ఇప్పటికే అంతర్జాతీయ స్థాయికి ఎదిగేందుకు సిద్ధంగా ఉన్న వనరుల చారిత్రక నేపథ్యాన్ని మనం గమనించాలి. రెండవ ప్రపంచ యుద్ధ కాలం నాటి ఘన చరిత్ర కలిగిన గన్నవరం విమానాశ్రయం, దేశంలోనే అతిపెద్ద, అత్యంత రద్దీగా ఉండే రైల్వే జంక్షన్లలో ఒకటైన విజయవాడ జంక్షన్, అలాగే ప్రాంతీయ రవాణాకు, సరుకు రవాణాకు అత్యంత కీలకమైన గుంటూరు రైల్వే జంక్షన్లు ఈ నేలపైనే ఉన్నాయి. ఇంతటి అద్భుతమైన, చారిత్రక రవాణా నెట్వర్క్ కళ్లముందే సిద్ధంగా ఉన్నప్పుడు, వాటిని మరింత విస్తరించి, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునీకరించడం ఏ పాలకుడికైనా ఉండాల్సిన కనీస వివేకం. కానీ, ఈ అద్భుతమైన వ్యవస్థలను పక్కన పెట్టేసి, వాటికి కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న అమరావతి అనే ఊహాజనిత పరిధిలోనే సరికొత్తగా మరో అంతర్జాతీయ విమానాశ్రయం, సరికొత్త అధునాతన రైల్వే స్టేషన్ నిర్మిస్తామంటూ చంద్రబాబు నాయుడు ప్రతిపాదనలు చేయడం స్వార్థపూరిత, సంకుచిత వైఖరిని స్పష్టం చేస్తోంది. ఉన్న వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ, కొత్తవాటి పేరుతో కాలయాపన చేస్తూ, కేవలం ఒక నిర్దిష్ట ప్రాంతంలో భూముల విలువలను పెంచేందుకు ప్రయత్నించడం అల్పబుద్ధి కాక మరేమిటి? ఇటువంటి అనాలోచిత చర్యలు ప్రజాధనాన్ని వృథా చేయడమే కాక, రాష్ట్ర భవిష్యత్తును అప్పుల ఊబిలోకి నెట్టడమే అవుతుంది.భూమి అనేది కేవలం ఒక స్థిరాస్తి కాదు, అది తరతరాల రైతు జీవన విధానం, సంస్కృతి, జీవనాధారం. "రైతు కన్నీరు పెట్టిన నేల ఏనాడూ సంతోషంగా ఉండదు, అది సమాజ పురోగతికి బాటలు వేయలేదు" అనేది పెద్దల మాట. అమరావతి పరిధిలో సాగిన భూసేకరణ ప్రక్రియ తీవ్రమైన లోపాలతో, బలవంతపు ల్యాండ్ పూలింగ్ విధానాలతో సాగింది. మూడు పంటలు పండే పచ్చని మాగాణి భూములను, బహుళ పంటల సాగుకు అనుకూలమైన కృష్ణా డెల్టా భూములను వ్యవసాయానికి దూరం చేయడం ప్రకృతికి, పర్యావరణానికి చేసిన ద్రోహం. దేశానికి అన్నం పెట్టే ఇటువంటి సారవంతమైన భూములను కాంక్రీట్ అడవులుగా మార్చడం వల్ల ఎంతోమంది రైతులు, వ్యవసాయ కూలీలు తమ ఉపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారు.మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విధానం ఎప్పుడూ రైతాంగ శ్రేయస్సుకు, పర్యావరణ రక్షణకు ప్రథమ ప్రాధాన్యతనిస్తుంది. బలవంతంగా భూములు లాక్కోవడానికి బదులు, విజయవాడ, గుంటూరులలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను, మౌలిక వసతులను వాడుకుంటూ, వ్యవసాయ రంగాన్ని రక్షించడమే నిజమైన సమగ్ర ప్రణాళిక. విజయవాడ-గుంటూరు నగరాల పరిధిని మచిలీపట్నం తీరప్రాంతంతో అనుసంధానించడం ద్వారా అపారమైన పారిశ్రామిక, వాణిజ్య ప్రగతి సాధించవచ్చనేది మాజీ ముఖ్యమంత్రి వ్యూహంలోని అసలైన మాస్టర్ ప్లాన్.మచిలీపట్నం కేవలం ఒక సాధారణ పట్టణం కాదు, అది శతాబ్దాల చరిత్ర గల అంతర్జాతీయ ఓడరేవు కేంద్రం. డచ్, ఫ్రెంచ్, బ్రిటిష్ కాలంలోనే ప్రపంచ దేశాలతో వ్యాపార సంబంధాలు నెరిపిన ఘనత బందరు సొంతం. అటువంటి చారిత్రక తీరప్రాంతాన్ని, సముద్ర రవాణా మార్గాన్ని వదిలేసి, సముద్రానికి దూరంగా, కేవలం కొద్దిమంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రయోజనాల కోసం రాజధానిని ఒకే చోట నిర్బంధించడం చారిత్రక తప్పిదం. మచిలీపట్నం పోర్టును ఆధునీకరించి, విజయవాడ-గుంటూరు పారిశ్రామిక కారిడార్తో కలిపితే, ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అతిపెద్ద ఆర్థిక, పారిశ్రామిక మండలిగా మారుతుంది. ఈ సముద్ర తీర రవాణా సౌకర్యాన్ని, ఉన్న మౌలిక వసతులను సమర్థవంతంగా వాడుకోవాలనే ఆలోచన వెనుక ఉన్న దీర్ఘకాలిక ప్రయోజనాలను మనం గుర్తించాలి.భవనాల నిర్మాణంలో గతంలో జరిగిన అవినీతి, అసంపూర్ణ కట్టడాలు నేటికీ సాక్ష్యాలుగా నిలిచాయి. తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీల పేరిట చదరపు అడుగుకు దేశంలో ఎక్కడా లేని విధంగా వేల రూపాయలు ఖర్చు చేసినట్లు చూపించి, ప్రజాధనాన్ని కేవలం కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే వాడారనే విమర్శల్లో పూర్తి వాస్తవముంది. కనీసం ఒక వర్షానికి తట్టుకోలేని నాణ్యతా లోపాలు, లీకేజీలు బయటపడ్డాక ఆ నిర్మాణాల వెనుక ఉన్న అవినీతి ఏపాటిదో ప్రజలందరికీ అర్థమైంది. ఇటువంటి లోపభూయిష్టమైన నమూనా కంటే, విజయవాడ-గుంటూరులలో అందుబాటులో ఉన్న శాశ్వత కట్టడాలను కార్యాలయాలుగా మలిచి, మిగిలిన నిధులను మచిలీపట్నం పోర్టు అభివృద్ధికి, గన్నవరం విమానాశ్రయ విస్తరణకు, ఉన్న రైల్వే జంక్షన్ల ఆధునీకరణకు మళ్లించడం ఎంతో లాభదాయకం. ఒక ప్రభుత్వ విజయం కట్టే తాత్కాలిక బిల్డింగుల సంఖ్యను బట్టి కాదు, అది ప్రజల ఆర్థిక స్థితిగతులను ఎంతవరకు మెరుగుపరిచిందనే దానిపైనే ఆధారపడి ఉంటుంది.మహాత్మా గాంధీ కలలుగన్న 'గ్రామ స్వరాజ్యం' సమ్మిళిత అభివృద్ధిని సాధించాలంటే, అధికార కేంద్రీకరణ సంస్కృతికి స్వస్తి పలకాలి. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ప్రాంతాల త్రిభుజాకార అభివృద్ధి ద్వారా అటు పరిపాలన, ఇటు పారిశ్రామికీకరణ, మరోవైపు అంతర్జాతీయ వాణిజ్యం ఒకేసారి సాధ్యమవుతాయి. ఈ సహజసిద్ధమైన కారిడార్ను పటిష్టం చేయడమే వైఎస్ జగన్ తీసుకుంటున్న ప్రతి అడుగులోని అంతరార్థం. ఇది కేవలం ఒక ప్రాంతానికి పరిమితమైనది కాదు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించే వ్యూహాత్మక అడుగు.రైతుల హక్కులను కాపాడుతూ, ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ, పర్యావరణాన్ని రక్షించేలా సాగే నమూనా మాత్రమే స్థిరమైన భవిష్యత్తును ఇవ్వగలదు. అమరావతిలోని లోపాలను సరిదిద్దుకుంటూ, విజయవాడ, గుంటూరు నగరాల అనుభవజ్ఞతను, రైల్వే జంక్షన్ల రవాణా అనుకూలతలను, మచిలీపట్నం తీరప్రాంత వ్యూహాత్మక ప్రాధాన్యతను ఏకం చేస్తూ సాగుతున్న ఈ ప్రయాణం ఆంధ్రప్రదేశ్ ప్రగతికి ఒక దిక్సూచిగా నిలుస్తుంది. ప్రజా శ్రేయస్సే పరమావధిగా, క్షేత్రస్థాయి వాస్తవాల ఆధారంగా సాగుతున్న ఈ వ్యూహం దీర్ఘకాలంలో రాష్ట్ర ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక న్యాయాన్ని చేకూరుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.-కంచర్ల యాదగిరిరెడ్డి, మేనేజింగ్ ఎడిటర్, సాక్షి టీవీ -
మత్స్యకారులను పరామర్శించడానికి జగన్ వస్తున్నారు
-
రైతుల జీవనాధారాన్ని నాశనం చేసే అధికారం ఎవరిచ్చారు?
సాక్షి, అమరావతి: అమరావతి రాజధాని పేరుతో ఉండవల్లిలో రైతులపై చంద్రబాబు సర్కార్ సాగించిన దౌర్జన్యకాండపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుటుంబాలకు జీవనాధారమైన కొద్దిపాటి భూములను ఇచ్చేది లేదని రైతులు స్పష్టంగా చెబుతున్నా.. వారి అభిప్రాయాలు, అభ్యంతరాలను కనీసం పట్టించుకోక పోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. పోలీసులను మోహరించి.. బుల్డోజర్లతో పొలాల్లోకి దూసుకెళ్లి.. సాగులో ఉన్న పంటలను ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గమంటూ మండిపడ్డారు.రైతులను వారి పొలాల నుంచి బలవంతంగా ఈడ్చి పారేసి.. భయభ్రాంతులకు గురిచేసి.. భూములను స్వా«దీనం చేసుకోవడం చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్టగా అభివర్ణించారు. ధ్వంసం చేసిన పంటలకు ఎవరు పరిహారం చెల్లిస్తారంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. రాజధాని రైతుల భూముల్లో జరుగుతున్న బలవంతపు చర్యలను వెంటనే నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. రైతుల అంగీకారం లేకుండా ఒక్క సెంటు భూమిని కూడా స్వా«దీనం చేసుకోవడం సరికాదని చంద్రబాబు సర్కారుకు హితవు పలికారు. రైతుల హక్కులను కాపాడే పోరాటంలో వారికి వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే..⇒ అమరావతి రాజధాని పేరుతో ఉండవల్లిలో రైతులపై చంద్రబాబు ప్రభుత్వం సాగించిన రాక్షసకాండను తీవ్రంగా ఖండిస్తున్నాను. తమ కుటుంబాలకు జీవనాధారమైన కొద్దిపాటి భూములను ఇచ్చేది లేదని రైతులు స్పష్టంగా చెబుతున్నారు. అయినా వారి అభిప్రాయాలను, అభ్యంతరాలను కనీసం వినకుండా పోలీసులను మోహరించి, బుల్డోజర్లతో పొలాల్లోకి దూసుకెళ్లి, సాగులో ఉన్న పంటలను ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గం. రైతులను వారి పొలాల నుంచి బలవంతంగా ఈడ్చి పారేసి, భయభ్రాంతులకు గురిచేసి భూములను స్వా«దీనం చేసుకోవడం దారుణం. ⇒ బాధితుల్లో అత్యధికులు సన్న, చిన్నకారు రైతులే. వారి కుటుంబాలకు ఆ కొద్దిపాటి భూమే ఆధారం. ఆ భూమితోనే పిల్లలను చదివించుకుంటున్నారు. ఆ భూమిలో పండే పంటతోనే కుటుంబాలను పోషించుకుంటున్నారు. అలాంటి రైతులు ‘మా భూమి తీసుకుంటే మేం ఎలా బతకాలి?’ అని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా పోలీసు బలంతో వారి గొంతులను నొక్కడం చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ట. వారు పెట్టిన పెట్టుబడి ఏమవుతుంది? ధ్వంసం చేసిన పంటలకు ఎవరు పరిహారం చెల్లిస్తారు? రైతుల జీవనాధారాన్ని నాశనం చేసే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు?⇒ రాజధాని పేరుతో గతంలోనే వేల ఎకరాలు తీసుకున్నారు. మొదట భూములు ఇచి్చన రైతులకే దిక్కులేకుండా చేసిన ఈ ప్రభుత్వం.. ఇప్పుడు మళ్లీ కొత్తగా భూముల కోసం ఎందుకు రైతులను వెంటాడుతోంది? రైతులపై పోలీసులను ప్రయోగించడం ఏమిటి? రైతుల అంగీకారం లేకుండా వారి భూములపై ప్లాన్లు గీయడం, కాగితాల మీద అవార్డులు ప్రకటించుకున్నామని చెప్పడం, ఆ వివరాలను కూడా రైతులకు తెలియజేయకుండా ఏకపక్షంగా స్వా«దీనం చేసుకోవడం న్యాయమేనా? ⇒ ఈ భూములు మారుమూల ప్రాంతాల్లో లేవు. విజయవాడకు కూతవేటు దూరంలో, చెన్నై–కోల్కత జాతీయ రహదారికి అత్యంత సమీపంలో, తాడేపల్లి నగర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న అత్యంత విలువైన భూములివి. మార్కెట్లో భారీ ధరలు పలికే ఈ భూములకు అరకొర విలువలను మీరే నిర్ణయించుకుని, రైతుల సమ్మతి లేకుండా వాటిని లాక్కోవడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి? రైతుల భూములను తీసుకుని భవిష్యత్తులో ఎవరికి కట్టబెట్టాలనుకుంటున్నారు? అసలు లబి్ధదారులు రైతులా? లేక చంద్రబాబు అస్మదీయులా?⇒ రైతుల భూములను బలవంతంగా లాక్కుని, వారిని రోడ్డుమీద పడేసి, వారి జీవితాలను దెబ్బ తీస్తామంటే సహించేది లేదు. రైతు స్వచ్ఛందంగా భూమి ఇస్తే తీసుకోండి. కానీ పోలీసులను పెట్టి, పంటలను ధ్వంసం చేసి, రైతులను ఈడ్చి పారేసి లాక్కుంటామంటే అది ముమ్మాటికీ తప్పే అవుతుంది. ⇒ ఈ ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరిస్తున్నాం. చంద్రబాబు గారూ.. రాజధాని రైతుల భూముల్లో జరుగుతున్న బలవంతపు చర్యలను వెంటనే నిలిపివేయాలి. ధ్వంసం చేసిన పంటలకు పూర్తి పరిహారం చెల్లించాలి. రైతుల అంగీకారం లేకుండా ఒక్క సెంటు భూమిని కూడా స్వాధీనం చేసుకోవడం సరికాదు. రైతుల హక్కులను కాపాడే పోరాటంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా నిలుస్తుంది. -
పీసీసీ మాజీ అధ్యక్షుడు జీఎస్ రావు కన్నుమూత
నిడదవోలు/సాక్షి, అమరావతి: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ సెంట్రల్ కమిటీ మాజీ సభ్యుడు, ఉమ్మడి రాష్ట్ర మాజీ పీసీసీ అధ్యక్షుడు, కాపునాడు మాజీ అధ్యక్షుడు జీఎస్ రావు (90) వృద్ధాప్య సమస్యలతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామానికి చెందిన గెడ్డం సీతన్న, బుల్లమ్మ దంపతులకు ఆయన ఆరో సంతానం. విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలను ప్రదర్శించి 1962లో స్టూడెంట్ నేతగా ఎన్నికయ్యారు. ఆగ్రాలో ఎంఏ పూర్తి చేసి, ఉస్మానియా యూనివర్సిటీలో న్యాయ విద్యను అభ్యసించారు. 1968లో వ్యాపార రంగంలోకి ప్రవేశించి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూనే సమాజ సేవ వైపు దృష్టి సారించారు. రెండు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారు. 1982లో అప్పుడే ఏర్పాటైన కాపు, తెలగ, బలిజ, ఒంటరి సంఘానికి జాయింట్ కన్వీనర్గా పని చేశారు. అనంతరం ఈ సంఘం కాపునాడుగా రూపాంతరం చెందింది. 1988లో వంగవీటి మోహన రంగాను ముఖ్య అతిథిగా పిలిపించి భారీ బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించారు. 1991లో కాపునాడు అధ్యక్షుడిగా విశేష సేవలందించారు. 1994లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. కొవ్వూరు నుంచి కాంగ్రెస్ అభ్య ర్థిగా ఓటమి ఎదురైనా, 1999 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనంలో సత్తా చాటారు. 2000లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, 2003లో ఏపీసీసీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. దివంగత సీఎం రాజశేఖరరెడ్డితో మంచి సాన్నిహిత్యం కలిగిన నేతగా గుర్తింపు పొందారు. 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2009లో కొత్తగా ఏర్పడిన నిడదవోలు నియోజకవర్గం నుంచి ఆయన పెద్ద కుమారుడు శ్రీనివాస్ నాయుడును కాంగ్రెస్ అభ్య ర్థిగా బరిలోకి దించారు. 2014లో వైఎస్సార్సీపీలో చేరారు. సెంట్రల్ కమిటీ సభ్యుడిగా పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. 2019 ఎన్నికల్లో తన కుమారుడు జి.శ్రీనివాస్ నాయుడును నిడదవోలు (ప్రస్తుతం ఈ నియోజకవర్గం సమన్వయకర్త) వైఎస్సార్సీపీ అభ్య ర్థిగా నిలిపి గెలిపించుకున్నారు. కాగా, జీఎస్ రావుకు భార్య వెంకటలక్ష్మి, మరో కుమారుడు జి.సీతారామ్, కుమార్తె డాక్టర్ పద్మ ఉన్నారు.జీఎస్ రావు సేవలు చిరస్మరణీయంమాజీ సీఎం వైఎస్ జగన్ సంతాపం కుమారుడు జి.శ్రీనివాస్ నాయుడికి ఫోన్లో పరామర్శ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, ఉమ్మడి రాష్ట్ర పీసీసీ మాజీ అధ్యక్షుడు, కొవ్వూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జీఎస్.రావు మరణం పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన కుమారుడు, నిడదవోలు మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్నాయుడుతో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లో చికిత్స పొందుతున్న జీఎస్.రావు కన్ను మూయడం బాధాకరమని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ప్రజా జీవితంలో జీఎస్.రావు చేసిన సేవలు, రాజకీయ రంగంలో ఆయనకున్న విశిష్ట అనుభవం చిరస్మరణీయమని అన్నారు. జీఎస్.రావు మరణం రాజకీయ రంగానికి తీరని లోటు అని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రా ర్థిస్తున్నానన్నారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు, అనుచరులకు వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
‘ఆక్వా రైతులను చంద్రబాబు సర్కార్ మోసం చేసింది’
సాక్షి, కృష్ణా జిల్లా: ఆక్వా రైతులను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని.. ఫీడ్ ధర పెంచి రైతుల నడ్డి విరిచిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు రొయ్యల కంపెనీల గూడు పుఠాణిని రైతులు పసిగట్టారు.. అందుకే రైతులు పోరాటం మొదలుపెట్టారు. రొయ్యల మేత తయారీ దారులంతా చంద్రబాబు చందాదారులే. ధరలు పెంచే ప్రసక్తే లేదని మంత్రి అచ్చెన్నాయుడు కబుర్లు చెప్పాడు. కేజీకి 12 రూపాయలు పెంచి 2 రూపాయల తగ్గించారు’’ అని దుయ్యబట్టారు.‘‘రొయ్యల రైతుకు అండగా నిలిచేందుకు ఈనెల 15వ తేదీన జగన్ భీమవరం వెళ్తారు. హెలీకాప్టర్కు పర్మిషన్ లేదంటున్నారు. రొయ్యల రైతు కోసం బెజవాడ నుంచి భీమవరానికి జగన్ రైలెక్కి వెళ్తారు. వైఎస్ జగన్ను ఆపలేరు.. కష్టం చెప్పుకోవడానికి వచ్చే రైతులను ఆపలేరు’’ అని పేర్ని నాని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని మేల్కొలపడానికి ఒక్కోసారి యుద్ధం తప్పదన్నారు. -
లెజెండరీ గాయని జానకి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన అపూర్వ గాన మాధుర్యంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న లెజెండరీ గాయని ఎస్.జానకి మరణం పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దక్షిణ భారత సినీ సంగీత రంగంలో దశాబ్దాల పాటు తన గాన ప్రతిభతో చెరగని ముద్ర వేసిన ఎస్. జానకి సంగీత సరస్వతిగా అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ తదితర భాషల్లో వేలాది పాటలు ఆలపించి, భారతీయ సంగీత చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయాన్ని సృష్టించారని కొనియాడారు.తన స్వరంతో ఎన్నో తరాలను అలరించిన ఎస్.జానకి మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని వైఎస్ జగన్ అన్నారు. ఆమె పాడిన పాటలు, ఆమె అందించిన సంగీత వారసత్వం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఎస్. జానకి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించిన వైఎస్ జగన్.. ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సంగీత ప్రియులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.కాగా, ప్రముఖ దిగ్గజ నేపథ్య గాయని ఎస్.జానకి మైసూరులోని అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో మృతి చెందారు. “దక్షిణ భారత కోకిలగా ఆమె ప్రత్యేక గుర్తించారు. 1938 ఏప్రిల్ 23న జన్మించిన ఎస్. జానకి.. ఆరు దశాబ్దాలకు పైగా సినీ గాన సేవ చేశారు. 17 భాషల్లో 48 వేలకుపైగా పాటలు ఆలపించిన గానకోకిల.. మధురమైన గాత్రంతో కోట్లాది అభిమానుల మనసు గెలుచుకున్నారు. గ్రామీణ జానపదం నుంచి శాస్త్రీయ, మెలోడీ, భక్తి గీతాల వరకు విశేష ప్రతిభ కనపరిచారు. భారతీయ సినీ సంగీత రంగానికి ఎస్. జానకి సేవలు చిరస్మరణీయం. ఎస్. జానకి మృతితో భారతీయ సినీ సంగీత ప్రపంచంలో విషాదం నెలకొంది. గానకోకిల ఎస్. జానకికి సినీ, సంగీత ప్రముఖులు నివాళులర్పించారు. -
రాజధాని రైతులపై రాక్షసకాండను ఖండించిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: రాజధాని రైతులపై రాక్షసకాండను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. అమరావతి రాజధాని పేరుతో ఉండవల్లిలో రైతులపై ప్రభుత్వ నిర్వాకాన్ని వైఎస్ జగన్ ప్రశ్నించారు. తమ కుటుంబాలకు జీవనాధారమైన కొద్దిపాటి భూములను ఇచ్చేది లేదని రైతులు స్పష్టంగా చెబుతున్నా, వారి అభిప్రాయాలను, అభ్యంతరాలను కనీసం వినకుండా పోలీసులను మోహరించి, బుల్డోజర్లతో పొలాల్లోకి దూసుకెళ్లి, సాగులో ఉన్న పంటలను ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గం అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.‘‘రైతులను వారి పొలాలనుంచి బలవంతంగా ఈడ్చిపారేసి, భయభ్రాంతులకు గురిచేసి భూములను స్వాధీనం చేసుకోవడం దారుణం. బాధితుల్లో అత్యధికులు సన్న, చిన్నకారు రైతులే. వారి కుటుంబాలకు ఆ కొద్దిపాటి భూమే ఆధారం. ఆ భూమితోనే పిల్లలను చదివించుకుంటున్నారు. ఆ భూమిలో పండే పంటతోనే కుటుంబాలను పోషించుకుంటున్నారు. అలాంటి రైతులు “మా భూమి తీసుకుంటే మేం ఎలా బతకాలి?” అని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా పోలీసు బలంతో వారి గొంతులను నొక్కడం చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ట. వారు పెట్టిన పెట్టుబడి ఏమవుతుంది? ధ్వంసం చేసిన పంటలకు ఎవరు పరిహారం చెల్లిస్తారు? రైతుల జీవనాధారాన్ని నాశనం చేసే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు?’’ అంటూ వైఎస్ జగన్ నిలదీశారు.‘‘రాజధాని పేరుతో గతంలోనే వేల ఎకరాలు తీసుకున్నారు. మొదట భూములు ఇచ్చిన రైతులకే దిక్కులేకుండా చేసిన ఈ ప్రభుత్వం, ఇప్పుడు మళ్లీ కొత్తగా భూముల కోసం ఎందుకు రైతులను వెంటాడుతోంది? రైతులపై పోలీసులను ప్రయోగించడం ఏమిటి? రైతుల అంగీకారం లేకుండా వారి భూములపై ప్లాన్లు గీయడం, కాగితాల మీద అవార్డులు ప్రకటించుకున్నామని చెప్పడం, ఆ వివరాలను కూడా రైతులకు తెలియజేయకుండా ఏకపక్షంగా స్వాధీనం చేసుకోవడం న్యాయమేనా?..ఈ భూములు మారుమూల ప్రాంతాల్లో లేవు. విజయవాడకు కూతవేటు దూరంలో, చెన్నై–కోల్కత జాతీయ రహదారికి అత్యంత సమీపంలో, తాడేపల్లి నగర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న అత్యంత విలువైన భూములు. మార్కెట్లో భారీ ధరలు పలికే భూములకు అరకొర విలువలను మీరే నిర్ణయించుకుని, రైతుల సమ్మతి లేకుండా వాటిని లాక్కోవడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి? రైతుల భూములను తీసుకుని భవిష్యత్తులో ఎవరికి కట్టబెట్టాలనుకుంటున్నారు? అసలు లబ్ధిదారులు రైతులా? చంద్రబాబుగారి అస్మదీయులా?’’ అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.రైతుల భూములను బలవంతంగా లాక్కుని, వారిని రోడ్డుమీద పడేసి, వారి జీవితాలను దెబ్బతీస్తామంటే సహించేది లేదు. . రైతు స్వచ్ఛందంగా భూమి ఇస్తే తీసుకోండి. కానీ పోలీసులను పెట్టి, పంటలను ధ్వంసం చేసి, రైతులను ఈడ్చిపారేసి లాక్కుంటామంటే అది ముమ్మాటికీ తప్పే అవుతుంది. ఈ ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరిస్తున్నాం. చంద్రబాబూ.. రాజధాని రైతుల భూముల్లో జరుగుతున్న బలవంతపు చర్యలను వెంటనే నిలిపివేయాలి. ధ్వంసం చేసిన పంటలకు పూర్తి పరిహారం చెల్లించాలి. రైతుల అంగీకారం లేకుండా ఒక్క సెంటు భూమిని కూడా స్వాధీనం చేసుకోవడం సరికాదు. రైతుల హక్కులను కాపాడే పోరాటంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా నిలుస్తుంది’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. అమరావతి రాజధాని పేరుతో ఉండవల్లిలో రైతులపై చంద్రబాబు ప్రభుత్వం సాగించిన రాక్షసకాండను తీవ్రంగా ఖండిస్తున్నాను. తమ కుటుంబాలకు జీవనాధారమైన కొద్దిపాటి భూములను ఇచ్చేది లేదని రైతులు స్పష్టంగా చెబుతున్నా, వారి అభిప్రాయాలను, అభ్యంతరాలను కనీసం వినకుండా పోలీసులను మోహరించి, బుల్డోజర్లతో… pic.twitter.com/rA7pC3hXRS— YS Jagan Mohan Reddy (@ysjagan) July 11, 2026 -
సాగు చేసుకునే భూమిని.. వాళ్ళు ఎలా లాక్కుంటారు?
-
కాళేశ్వరం.. కూలేశ్వరం ఎందుకయ్యింది?: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: కిలాడీ కమిటీ మాపై ఒత్తిడి తెచ్చి ప్రజల ముందు మమ్మల్ని దోషులుగా నిలబెట్టాలని చూస్తున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కిలాడీ కమిటీతో తమకు పని లేదని.. ఎన్డీఎస్ఏ ఆదేశాల మేరకు పనిచేస్తామన్నారు. కేసీఆర్తో తప్పుడు పనులు చేయించి కాంట్రాక్టర్ల దగ్గర కోట్లు కొల్లగొట్టారంటూ విమర్శలు గుప్పించిన రేవంత్.. కాళేశ్వరం కూలేశ్వరం ఎందుకు అయ్యింది? లక్ష కోట్లు గోదావరిలో కొట్టుకుపోయాయంటూ దుయ్యబట్టారు.‘‘ఉత్తర తెలంగాణకు నీళ్లు అందించాలంటే మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారంలో నీళ్లు ఎత్తిపోయాలి. కాళేశ్వరానికి శ్రీపాద ఎల్లంపల్లి గుండెకాయ, మేడిగడ్డ వెన్నుపూస కన్నెపల్లి దగ్గర గేట్లు ఎత్తడానికి అవకాశమే లేదు. జూన్ 13, 2026న తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్పై ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఆరుగురితో కమిటీ వేశారు. జూన్ 30, 2026న కేంద్ర జలశక్తి శాఖ సాంకేతిక నిపుణులతో సూచన చేశారు’’ అని రేవంత్ చెప్పుకొచ్చారు.‘‘కేసీఆర్ ఏర్పాటు చేసిన కమిటీలో కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, ఈటల ఉన్నారు. కాళేశ్వరం కమిషన్లు తిన్న కొందరు రిటైర్డ్ ఇంజనీర్లే ఇప్పుడు నీరు ఎత్తిపోయాలని సూచించడం హాస్యాస్పదంగా ఉంది. మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టొద్దని రిటైర్డ్ ఇంజనీర్ శ్యాం ప్రసాద్ రెడ్డి చెప్పింది నిజం కాదా? కేసీఆర్ కీలాడి కమిటీలో చేరొద్దని ఈటలను కోరుతున్నా. హరీష్రావును కేసీఆర్ నమ్మకనే రెండో ప్రభుత్వంలో హరీష్ రావుకు ఇరిగేషన్ శాఖ ఇవ్వలేదు.నిన్ను మీ మామే నమ్మలేదు. కమిషన్ల దోపిడీకి హరీష్రావు పాల్పడుతున్నాడు. నారాయణ, శ్రీ చైతన్య కాలేజీలు దోచుకుంటున్నాయని మాట్లాడిన హరీష్ రావు... ఇప్పుడు ఆ కాలేజీలకు పాలు పొస్తున్నాడు. ఈటల రాజేందర్ మీరు తక్షణమే ఎన్డీఎస్ఏ దగ్గరకు వెళ్లి.. నీళ్లు ఎత్తిపోయాలని కోరండి. ప్రాజెక్టు గేట్లు మూస్తే గ్రామాలకు గ్రామాలకు కొట్టుకుపోతాయి. మీరు పదేళ్లు ఉద్దరిస్తేనే కాళేశ్వరం కూలింది.. ఇప్పుడు ఇంకేంచేస్తారు?. నీళ్లు ఎత్తిపోస్తామంటే ఎన్డీఎస్ఏకు ప్రాజెక్టు ఇవ్వడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఏపీ పట్టిసీమ కట్టింది. అప్పుడు హరీష్రావు ఏం చేస్తున్నారు?’’ అంటూ రేవంత్ ప్రశ్నించారు. -
మంగళగిరికి సెక్యూరిటీ లేకుండా వెల్లు ఎంత మంది కాలర్ పెట్టుకుంటారో చూస్తావ్
-
స్వాతి రెడ్డి కాదు.. శ్వేతా చౌదరి అడ్డంగా దొరికిన చంద్రబాబు
-
అమరావతి లో బలవంతంగా భూసేకరణ పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్
-
ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎన్ని కేసులు పెట్టిన YSRCP కార్యకర్త అనేవాడు తగ్గడు
-
‘దోచుకోవడం మీద ఉన్న శ్రద్ధ మత్స్యకారుల మీద లేదు’
విశాఖ: ఇటీవల సముద్రంలో వేటకు వెళ్లిన మత్య్సకారుల బోటు ప్రమాదానికి గురై గల్లంతైతే ప్రభుత్వం మాత్రం సరైన గాలింపు చర్యలు చేపట్టలేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. గల్లంతైన మత్స్యకారులు ఆచూకీ లభించకుండానే సెర్చ్ ఆపరేషన్ను మధ్యలోనే నిలిపివేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని ధ్వజమెత్తారు. ఇంకా తమ వారు వస్తారని బాధిత మత్స్యకార కుటుంబాలు ఎదురుచూస్తున్నాయన్నారు. తమ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు బాధిత మత్స్యకార కుటుంబాలను కలిసి, వారికి ధైర్యం చెప్పామన్నారు కురసాల కన్నబాబు. ‘వైఎస్ జగన్ ఆదేశాలతో మత్స్యకారులను కలిశాం. వారికి ధైర్యం చెప్పాం. ఇంకా గల్లంతైన మత్స్యకారులు వస్తారని వారి కుటుంబ సభ్యులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మానవత్వం లేని ప్రభుత్వం అధికారంలో ఉంది. సరిగ్గా గాలింపు చర్యలు చేపట్టలేదు. మత్స్యకారులను పరామర్శించాలని ఆలోచన సీఎం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, అనితా, అచ్చం నాయుడులలో లేదు. విశాఖలో భూములను దోచుకోవడం మీద ఉన్న శ్రద్ధ మత్స్యకారుల మీద లేదు2023 లో ప్రమాదం జరిగి బోట్లు తగలబడితే 48 గంటల్లో జగన్ పరిహారం ఇచ్చారు. ప్రస్తుత ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన కారె చిన్నకు బోటు పోయింది. ఒక్క రూపాయి పరిహారం కూడా కూటమి ప్రభుత్వం ఇవ్వలేదు. వైఎస్ జగన్ బాధిత మత్స్యకార కుటుంబాలను పరామర్శిస్తారు’ అని స్పష్టం చేశారు. -
యూట్యూబర్లకు పేమెంట్ ఇస్తాం..పచ్చిగా చెబుతున్న చంద్రబాబు
-
వియత్నాంలో బోటు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: వియత్నాంలో బోటు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో పలువురు తెలుగువారు దుర్మరణం చెందటంపై సంతాపం తెలిపారు. హాలాంగ్ బే వద్ద జరిగిన బోటు ప్రమాదంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు పర్యాటకులు దుర్మరణం చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. కడప, మచిలీపట్నం ప్రాంతాలకు చెందిన పలువురు మొబైల్ డిస్ట్రిబ్యూటర్లు ఈ ప్రమాదంలో మృతి చెందడం ఎంతో కలిచి వేసింది. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.‘‘ప్రమాదంలో గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. వియత్నాంలో చిక్కుకుపోయిన పర్యాటకులకు అవసరమైన సహాయ సహకారాలు అందేలా చూడాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలి. ప్రమాదంలో గల్లంతైన వారి ఆచూకీ కోసం ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాలి. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా నిలవాలి. అక్కడి వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి’’ అని వైఎస్ జగన్ అన్నారు. -
మాజీ ఎమ్మెల్యే జీఎస్రావు మృతిపై వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, తాడేపల్లి: తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) మాజీ అధ్యక్షుడు, కొవ్వూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జీఎస్ రావు మరణం పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుమారుడు జి.శ్రీనివాస్ నాయుడుతో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు.కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లో చికిత్స పొందుతున్న జీఎస్.రావు కన్నుమూయడం బాధాకరమని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ప్రజా జీవితంలో జీఎస్ రావు చేసిన సేవలు, రాజకీయ రంగంలో ఆయనకున్న విశిష్ట అనుభవం చిరస్మరణీయమని అని ఆయన అన్నారు. జీఎస్రావు మరణం రాజకీయ రంగానికి తీరని లోటన్నారు. జీఎస్.రావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ జగన్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
వారిపై ఐటీడీపీని ఉసిగొల్పుతున్నారు: పేర్ని నాని
సోషల్ మీడియా వికృతాలకు, వెర్రితలలకు పుట్టిల్లు టీడీపీ అంటూ మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ఇవాళ ఆయన తాడేపల్లిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేబినెట్ సమావేశంలో ప్రజాసమస్యల గురించి ఏ మాత్రం చర్చ జరగలేదని తెలిపారు.అమరావతిలో చంద్రబాబు, నారాయణ ఇళ్లు కట్టుకున్నారని పేర్ని నాని చెప్పారు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల గురించి కేబినెట్లో చర్చ జరగలేదని తెలిపారు. సోషల్ మీడియా సమాజానికి ఇబ్బందికర రోగంగా మారిందని చర్చించారట అని వ్యాఖ్యానించారు.చంద్రబాబు దుర్మార్గ లక్ష్యాలను ఎదిరించేవారిపై ఐటీడీపీని ఉసిగొల్పుతున్నారని తెలిపారు. ఐటీడీపీ వందలాది యూట్యూబ్ చానెళ్లను సృష్టించిందని చెప్పారు. రాజకీయ ప్రత్యర్థుల ఇళ్లల్లోని మహిళలపై కూడా విష ప్రచారం చేస్తున్నారని అన్నాఉ. నీచంగా, వికృతంగా, అడ్డగోలుగా ఐటీడీపీ ప్రచారాలు చేస్తోందని పేర్ని నాని తెలిపారు. -
టీ తాగుతున్న YSRCP నేతలపై.. కర్రలతో JC వర్గీయుల దాడి
-
లోకేష్ పై గుడివాడ లాస్ట్ పంచ్ అదుర్స్
-
పిరికిపందలు బాత్రూమ్లో దాక్కున్నారు..?
-
నువ్వు, మీ బాబు కలిసి చేసే దందా మాకు తెలియదనుకున్నావా..!
-
హాస్పిటల్ లో కుక్కలు తిరగడం ఏంటి..? చంద్రబాబు పై మల్లాది విష్ణు సీరియస్
-
నీకు దమ్ముంటే జగన్ ను ఆపి చూడు... చంద్రబాబుకు ఇచ్చిపడేసిన పేర్ని నాని
-
సచివాలయంలోనే వైఎస్సార్సీపీ బీఎల్ఏపై దాడి
సాక్షి టాస్క్ఫోర్స్: ఓటర్ల అక్రమ నమోదును అడ్డుకున్న వైఎస్సార్సీపీ బీఎల్ఏపై టీడీపీ వర్గీయులు సచివాలయంలోనే కర్రలతో దాడికి పాల్పడిన ఘటన కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని గడివేముల మండలం మంచాలకట్ట గ్రామంలో జరిగింది.‘సర్’లో భాగంగా శుక్రవారం ఓటరు లిస్టును స్థానిక సచివాలయంలో పరిశీలిస్తుండగా అక్రమంగా ఓటర్లను నమోదు చేసుకునేందుకు వచ్చిన టీడీపీ కార్యకర్తలను వైఎస్సార్సీపీ బీఎల్ఏ వెంకటకృష్ణ అడ్డుకున్నాడు. మా ఓట్లనే అడ్డుకుంటావా, నీ అంతు తేలుస్తామని ఆగ్రహించిన టీడీపీ కార్యకర్తలు సచివాలయం తలుపులు మూసి బీఎల్ఏ (బూత్ నెంబర్ 276) ఆవుల వెంకటక్రిష్ణపై కర్రలతో దాడి చేశారు. తీవ్రగాయాలపాలైన బాధితుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే గాయపడిన వెంకటకృష్ణపైనే పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం. ఇరువర్గాలు సచివాలయంలోనే గొడవపడినట్లు కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదుతో ఏ1గా వెంకటకృష్ణపై కేసు నమోదు చేయడం వివాదాస్పదమవుతోంది. ఇదే సమయంలో బాధితుడి ఫిర్యాదును కనీసం పరిగణనలోకి తీసుకోకపోవడమేంటని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మధుసూదన్ ప్రశ్నించారు. కాగా, టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన వెంకటక్రిష్ణను వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి ఫోన్లో పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ విషయాన్ని నంద్యాల ఎస్పీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. -
సర్.. హైజాక్!
సాక్షి, అమరావతి : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో అధికార తెలుగుదేశం పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. మరో నాలుగు రోజుల్లో ఇంటింటి సర్వే ముగియనుండటంతో ఎదుటి పార్టీ ఓట్లను తొలగించేలా అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తోంది. ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయాల దగ్గర నుంచి మున్సిపల్ ఆఫీసుల వరకు ఎక్కడ పడితే అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేరుగా కార్యాలయాల్లో కూర్చొని మరీ ఎన్యూమరేషన్ ఫారంలను బీఎల్వోల నుంచి బలవంతంగా తీసుకుంటున్నారు. ఇలా తీసుకున్న ఎన్యూమరేషన్ ఫారాలను మై టీడీపీ యాప్లో అప్లోడ్ చేసుకొని తిరిగి ఇస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వీడియోల సాక్షిగా ఈ దురాగతాలు బయట పడుతున్నా ఎన్నికల సంఘం అధికారులు కళ్లకు గంతలు కట్టుకొని కూర్చున్నారు. అధికార పార్టీ దుర్వినియోగంపై వైఎస్సార్సీపీ ప్రతినిధులు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ను కలిసి వినతి పత్రాలు ఇచ్చినా ఉపయోగం లేకుండా పోతోంది. భీమిలిలో తెలుగుదేశం కార్యకర్తలే ఓటర్లువిశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. తెలుగుదేశం కార్యకర్తలు నేరుగా సచివాలయంలో దర్జాగా కూర్చొని మరీ ఫారాలు పూర్తి చేస్తున్నారు. బీఎల్వోల నుంచి ఎన్యూమరేషన్ ఫారాలను తీసుకొని తెలుగుదేశం కార్యకర్తలే ఓటర్లుగా సంతకాలు చేసి ఇచ్చేస్తున్నారు. ఓటర్ల నుంచి సేకరించిన రెండు సెట్ల ఎన్యూమరేషన్ ఫారాలలో ఒక సెట్ను బీఎల్వోలు ఓటర్లకు ఇవ్వకుండా టీడీపీ నాయకులకు అందిస్తున్నారు. ఈ ఫారాలను తెలుగుదేశం కార్యకర్తలు మై టీడీపీ యాప్లో అప్లోడ్ చేసుకుంటున్నారు. కొన్ని సచివాలయాల్లో అయితే తెలుగుదేశం కార్యకర్తలే బీఎల్వో విధులు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ సంఘటనలకు సంబంధించి అనేక వీడియోలు వెలుగు చూసినా ఇప్పటి వరకు ఎన్నికల సంఘం నుంచి ఎటువంటి చర్యలు లేవని ప్రజలు ఆరోపిస్తున్నారు.బీజేపీనే తప్పు పడుతోందిరాష్ట్రంలో జరుగుతున్న ‘సర్’ ప్రక్రియను కూటమి పార్టీలే తప్పు పడుతున్నాయి. రాష్ట్రంలో సర్ ప్రక్రియ లోపభూయిష్టంగా జరుగుతోందని బీజేపీ రాష్ట్ర శాఖ ఆరోపించడమే కాకుండా నేరుగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ను కలిసి ఫిర్యాదు చేసింది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, బీజేపీ నేతలు అడ్డూరి శ్రీ రాం, శరణాల మాలతీ రాణి, హేమంత్ కుమార్, యాదవ్ తదితరులు సీఈవోను కలిశారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పలువురు బీఎల్వోలు ఇంకా ఓటర్లను ప్రత్యక్షంగా కలవలేదని, దీంతో అర్హులైన పలువురు ఓటర్లు ఈ ప్రక్రియకు దూరమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సర్ ప్రక్రియలో లోపాలను వెంటనే సరిదిద్ది అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. గిరిజన ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. తూర్పు గోదావరి జిల్లా బీజేపీకి చెందిన నేత సర్ పేరుతో ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరించడాన్ని తప్పుపట్టారు.న్యాయ సలహా తీసుకుంటున్నాం : వివేక్ యాదవ్రాష్ట్రంలో ‘సర్’ ప్రక్రియలో కొంత మంది అధికారులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారంటూ వస్తున్న ఫిర్యాదులపై న్యాయ సలహాలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఇప్పటికే పలు ఫిర్యాదులను స్టాండింగ్ కమిటీకి స్క్రూట్నీ కోసం పంపామని చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన కొంత మంది అధికారులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని తెలిపారు. తంబళ్లపల్లిలో బెదిరింపులుఅన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో తెలుగుదేశం పార్టీ ఆగడాలు శృతిమించాయి. కనీసం మహిళా ప్రభుత్వ ఉద్యోగి అన్న విషయం చూడకుండా తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే దౌర్జన్యం చేశారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వాలని మహిళా బీఎల్వోను బెదిరించారు. ఇలా ఆమె నుంచి తీసుకున్న ఫారాలను మై టీడీపీ యాప్లో నమోదు చేసుకుంటున్నారు. ఈ సంఘటన వెలుగు చూసి నాలుగు రోజులైనా సంబంధిత వ్యక్తులపై ఇంత వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ‘సర్’ పక్కదారి పట్టిందనడానికి నిదర్శనంగా నిలిచింది. నేరుగా మంత్రి నారాయణే..టీడీపీ బీఎల్ఏలతో మంత్రి నారాయణ టెలీ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకున్న సమావేశంలో నెల్లూరు మున్సిపల్ కమిషనర్ ప్రత్యక్షంగా పాల్గొనడమే కాకుండా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసిన మై టీడీపీ యాప్ బాగుందని, దీన్ని వినియోగించుకోవాలని సూచించడంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. అయినా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. నరసరావుపేటలో అధికార టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీ ఓట్లను తొలగించేలా బీఎల్ఓలపై ఒత్తిడి తెస్తున్నారంటూ టీడీపీ బీఎల్ఏపై ఫిర్యాదు చేసినా చర్యలు లేకపోగా, రాజీ చేసుకోవాలని అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం కళ్లు మూసుకొని అధికార పార్టీకి ఏ విధంగా కొమ్ముకాస్తోందో చెప్పడానికి ఈ సంఘటనలు చాలని వైఎస్సార్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. -
అత్యంత లోపభూయిష్టంగా సర్ ప్రక్రియ: లేళ్ల అప్పిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో మరో మూడు రోజుల్లో ప్రత్యేక ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియ ముగుస్తున్నా.. ఇంకా పలు చోట్ల లోపాలు బయట పడుతున్నాయని, మరీ ముఖ్యంగా మై టీడీపీ యాప్లో నమోదు చేసిన తర్వాతే సర్లో వివరాలు డిజిటలైజేషన్ చేస్తున్నారని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. అధికార టీడీపీ సర్ ప్రక్రియను కూడా తమ రాజకీయ లబ్ధికి వాడుకుంటున్నా.. తాము పదే పదే ఫిర్యాదులు చేస్తున్నా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆక్షేపించారు.ఇప్పటికైనా ఈసీ రాజ్యాంగ బద్దంగా సర్ కార్యక్రమాన్ని నిర్వహించాలని, లోపాల్ని వెంటనే సరిద్దడంతో పాటు నెల రోజుల పాటు ఈ కార్యక్రమం గడువు పొడిగించాలని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. ప్రెస్ మీట్లో లేళ్ల అప్పిరెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:లోపభూయిష్టంగా సర్ ప్రక్రియ:రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–సర్) ప్రక్రియ గత నెల 15న ప్రారంభమై ఈనెల 14వ తేదీతో ముగుస్తోంది. ఈ ప్రక్రియ అంతా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీకి సంబంధించి కానీ, ఫారాలు తీసుకోవడంలో కానీ, ఫారాలు పూర్తి చేయడంలో కానీ ఎక్కడ చూసినా కూడా పూర్తి లోపభూయిష్టంగా మారింది. రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు ఉండాలి, దొంగ ఓట్లు తొలగించాలని.. డూప్లికేట్ ఓట్లను తొలగించాలని ఎవరైనా కోరుకుంటారు.అలాగే వైఎస్సార్సీపీ కూడా రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు ఉండాలనే ఆలోచనతో అందులో పాలుపంచుకుంటోంది. కానీ, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఈ కార్యక్రమం ద్వారా కూడా రాజకీయ లబ్ది పొందాలి. రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవాలని, ఇతర పార్టీల ఓట్లు తొలగించాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ సక్రమంగా జరగకపోయినా కూడా 99 శాతం పైచిలుకు పూర్తయినట్లు అధికారులు ఈసీకి లెక్కలు ఇస్తున్నారు. అసలు ఏమిటీ దౌర్భాగ్యం అని అడుగుతున్నాం. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బ్రతికించరా? ప్రజాస్వామ్య విలువలను కాపాడే పరిస్థితి లేదా? ఏ కార్యక్రమాన్ని అయినా కూడా తమకు, తమ పార్టీకి ఉపయోగపడే విధంగా తీసుకుపోవడమేనా? ఇదేనా టీడీపీ, చంద్రబాబు మార్క్ వైఖరి?మై టీడీపీ యాప్ లో నమోదు తర్వాతే ’సర్’ లోకి:ఎన్యుమరేషన్ ఫారాలు పూర్తి చేసిన తర్వాత సహజంగా బీఎల్వోలుగా నియమించిన వారో, లేకపోతే ఏఈఆర్వోలుగా ఉన్నవారో డిజిటలైజేషన్ ప్రక్రియ చేపడతారు. ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో అయినా ఇదే విధానం అమలు చేస్తారు. కానీ ఈ రాష్ట్రంలో డిజిటలైజేషన్ కు ముందే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఓటర్ల ఫారాలని టీడీపీ నాయకులు వాళ్ళ ’మై టీడీపీ’ యాప్లో నమోదు చేసుకుంటున్నారు. ఆ తర్వాత వాటిని ప్రభుత్వ కార్యాలయాలకు పంపిస్తున్నారు.ఏ రాష్ట్రంలో అయినా ఇలాంటి పరిస్ధితి ఉందా? ఎప్పుడైతే టీడీపీ కార్యాలయాల్ని, ఎమ్మెల్యేల కార్యాలయాలని వేదికగా చూసుకొని మై టీడీపీ యాప్ లో నమోదు చేసే కార్యక్రమాన్ని చేపట్టారో అప్పుడే వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేసింది. ఓటరుకు ఉన్న గోప్యత టీడీపీ యాప్ లోకి వెళ్తుందని ఫిర్యాదు చేశాం. ఇవాళ ప్రభుత్వ కార్యాలయాల్లో ఓటర్ల జాబితా ఉంటుందో లేదో అనుమానాలు ఉన్నాయి, కానీ టీడీపీ ఆఫీసుల్లో మాత్రం ఈ రాష్ట్రంలో ఓటర్ల జాబితాలు మొత్తం కూడా దర్శనమిస్తున్నాయి. ప్రతి చోటా అధికారులు బెదిరించే కార్యక్రమం, భయపెట్టే కార్యక్రమం చేస్తున్నారు.ఇవీ అక్రమాలకు నిదర్శనాలు:తంబళ్లపల్లెలో మాజీ ఎమ్మెల్యే పీఏ నాగార్జున ఇలాగే బెదిరిస్తున్న ఆడియో వింటే క్షేత్రస్ధాయిలో పరిస్ధితి అర్థమవుతుంది. ఇదే కాదు జూన్ 22న నెల్లూరులో అక్కడ ఈఆర్ఓ గా ఉన్న మున్సిపల్ కమిషనర్ బీఎల్వోలతో సమావేశం పెట్టి, మంత్రి నారాయణను, మేయర్, డిప్యూటీ మేయర్ ను భాగస్వాముల్ని చేశారు. దీనిపై ఆ తర్వాత రోజే అంటే జూన్ 23న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసి ఫిర్యాదు చేశాం. అయినా చర్యలు లేవు.మరో రోజు నెల్లూరు కమిషనర్ మళ్లీ తిరిగి మంత్రి నారాయణ టీడీపీకి చెందిన బీఎల్వోలతో సమావేశం పెట్టుకుంటే అందులో ఆయన కూడా జాయిన్ అయి మై టిడిపి యాప్ తప్పనిసరిగా వాడుకోవాలని చెప్పారు. మళ్లీ ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేసినా స్పందించలేదు. జూలై 2న నరసరావుపేట 118 పోలింగ్ స్టేషన్ లో ఉన్న బీఎల్వోని అక్కడ ఉన్న టీడీపీకి సంబంధించిన బీఎల్వో బెదిరిస్తే ఆయన పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు.టీడీపీ డ్యాష్ బోర్డులో సర్ వివరాలు:అసలు దురదృష్టం ఏమిటంటే ఒక బీఎల్వోని టీడీపీకి సంబంధించినటు వంటి బీఎల్ఏ బెదిరిస్తే బీఎల్వోకి మద్దతుగా నిలబడాల్సిన అధికారులు ఒత్తిడి తెచ్చి కేసు వెనక్కి తీసుకోమన్నారు. రేపల్లెలోని చెరుకుపల్లి మండలంలోని రాంబోట్లవారిపాలెంలో సేమ్ ఇదే పరిస్ధితి. పూర్తి చేసిన ఎన్యుమరేషన్ ఫారాలన్నీ వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్లి ఇవ్వాలి, వాళ్ళు మై టీడీపీ యాప్లో నమోదు చేసుకున్న తర్వాత అవి తిరిగి అక్కడి నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే పరిస్థితి. అలాగే ఆత్మకూరు నియోజకవర్గం సంఘం మండలం కొరిమేర్ల సచివాలయంలో సాక్షాత్తు వీఆర్వో సమక్షంలో ఇద్దరు టీడీపీ వ్యక్తులు మొత్తం ఫారాలన్నీ మై టీడీపీ యాప్లో నమోదు చేసుకునే కార్యక్రమం చేపట్టారు.ఈ అరాచకం ప్రతీ నియోజకవర్గంలోనూ కొనసాగుతోంది. ప్రతి చోటా టీడీపీ యాప్లో నమోదు చేసిన తర్వాతే ప్రభుత్వ కార్యాలయాలకు వెళుతున్నటువంటి పరిస్థితులు. టీడీపీ నాయకులు ఒక డాష్ బోర్డ్ పెట్టుకుని, అందులో మొత్తం 175 నియోజకవర్గాల ఓటర్ల వివరాలు అప్లోడ్ చేస్తున్నారు. ఇక ఎన్నికల కమిషన్ ఎందుకు, శుభ్రంగా టీడీపీ ఆఫీసులో పెట్టుకుంటే మేము కూడా అక్కడికి వచ్చే మా ఓట్లు కూడా నమోదు చేయించుకుంటాం.ఇదేమైనా మీ ప్రైవేట్ కార్యక్రమమా, లేకపోతే ప్రభుత్వ కార్యక్రమమా ? ఇది రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన కార్యక్రమం, నిష్పక్షపాతంగా జరగాల్సిన కార్యక్రమం, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు ఇవ్వాల్సిన కార్యక్రమం కాదా? దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో కూడా రాజకీయ లబ్ధి పొందేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. అలా ఓ దుష్ట సాంప్రదాయానికి చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.అందుకే ఎన్నికల ప్రధానాధికారిని ప్రత్యేకంగా కోరుతున్నాం. మీకున్న విశేష అధికారాలను బయటికి తీయాలి. ఇంత కీలకమైన కార్యక్రమానికి సంబంధించి మీరు కళ్లు ఉండి చూడలేని విధంగా, చెవులు ఉండి వినలేని విధంగా, నోరు ఉండి మాట్లాడలేని విధంగా ఉంటే, ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ వ్యవస్థలన్నీ నిర్వీర్యం అవుతాయి. దీన్ని కూడా నిర్వీర్యం చేయడానికి ఈ ప్రభుత్వం వెనుకాడని పరిస్థితుల్లో ముందుకు సాగుతోంది.ఇప్పటికైనా ఈసీ జోక్యం చేసుకోవాలి:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీగా కాదు, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పౌరుడిగా ఒక ఓటర్ గా ఎక్కడెక్కడైతే డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే దొంగోట్లు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే చనిపోయిన వాళ్ళు సైతం కూడా ఇప్పుడు ఈ ఓటర్ లిస్ట్ లో బతికి ఉన్నారో, అవన్నీ కూడా తీసేయాలి. గ్రామ పంచాయతీ ఆఫీసులకు వెళ్తే, మున్సిపాలిటీకి వెళితే చనిపోయిన వాళ్ళ లిస్ట్ ఉంటుందే.. అది ఎవరైనా అడగాల్సిన అవసరం ఉందా, ఆ లిస్టులు తీసుకొని డైరెక్ట్ గా తీసివేసే పరిస్థితులు ఉంటాయి. మరో మూడు రోజుల్లో ఈ సర్ ప్రక్రియ పూర్తవుతోంది. తగిన సమయం కూడా లేదు.ఇన్ని లోపాలతో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని కనీసం మరో నెల రోజులు పొడిగించాలని వైఎస్సార్సీపీ కోరుతోంది. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఓట్లు ఉండేలా తీసుకోవాలని మరోసారి ఎన్నికల ప్రధానాధికారిని కలిసి వినతిపత్రం ఇస్తాం. సహజంగా వీకెండ్స్ లోనే ఉద్యోగాలు చేసేవాళ్ళు, బయట ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, వాళ్ళ స్వగ్రామాలకి వస్తుంటే, బీఎల్వోలు మాత్రం టీడీపీ వాళ్లకు ఇచ్చాం, టీడీపీ ఆఫీసులో తీసుకోమని చెప్తున్నారు.అందుకే ఎన్నికల కమిషన్ ఈ లోపాలను సరిదిద్దే కార్యక్రమాన్ని తక్షణం చేపట్టలి. అర్హత కలిగిన వారికి మాత్రమే ఈ రాష్ట్రంలో ఓటు ఉండాలి. హైదరాబాద్లో ఒకచోట, బెంగళూరులో ఒకచోట, లేకపోతే గ్రామాల్లో ఒకచోట, టౌన్ లో ఒకచోట ఓట్లు ఉండటం సరికాదు. ఇలా ఒకే ఓటరుకు వివిధ ప్రాంతాల్లో ఉన్న ఓట్లపైనా ఈ నెల 14 తర్వాత ఎన్నికల ప్రధానాధికారిని కలిసి ఫిర్యాదు చేయబోతున్నట్లు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. -
సిగ్గులేదా.. పోలీస్ అయి ఉండి..? DGPని ఏకిపారేసిన అంబటి
-
కొడాలి నానిపై కూటమి సర్కార్ కక్ష సాధింపులు
సాక్షి, విజయవాడ: మాజీ మంత్రి కొడాలి నానిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తోంది. ఉపా చట్టాన్ని హేళన చేశారంటూ, పవన్ కళ్యాణ్ను విమర్శించారంటూ టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కొడాలి నానిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.మరోవైపు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై మరిన్ని కేసులు పెట్టాలని చంద్రబాబు కేబినెట్ నిర్ణయించింది. సోషల్ మీడియాపై డీజీపీ, ఉన్నతాధికారుల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరిగింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం, టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తూ కేబినెట్ తీర్మానించింది. -
కూటమి పాలనలో ప్రభుత్వ స్కూల్ పని అయిపోయింది
-
పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అంటే ఇదే: అంబటి
సాక్షి, తాడేపల్లి: పోర్టులు, భూములను తమ వారికి కట్టబెట్టటానికే చంద్రబాబు కేబినెట్ సమావేశమంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఐదుగురు మంత్రులు గైర్హాజరయ్యారంటే ఎంత నాన్ సీరియస్గా జరిగిందో అర్థం చేసుకోవచ్చన్నారు. కేబినెట్ సమావేశంలో ప్రజలకు మేలు చేసే అంశాలపై చర్చించటం మానేశారంటూ ఆయన దుయ్యబట్టారు.‘‘కేబినెట్కి డీజీపీ వెళ్లి సోషల్ మీడియా కట్టడిపై మాట్లాడటం ఏంటి?. టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులతో మా పార్టీ నేతలను తిట్టిస్తున్నారు. జుగుప్సాకరంగా పోస్టులు పెట్టిన వారిపై ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేయలేదు. కానీ మావారిపై అక్రమ కేసులు పెట్టి 1,394 మందిని అరెస్టు చేశారు. సోషల్ మీడియా అంటే చంద్రబాబు భయపడిపోతున్నారు. అందుకే టాస్క్ ఫోర్స్ కూడా పెడుతున్నారు. గాదె సాయికృష్ణను దారుణంగా లాకప్ డెత్ చేస్తే ఈ డీజీపీ ఎందుకు మాట్లాడలేదు?’’ అంటూ అంబటి ప్రశ్నించారు.‘‘క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు సైలెంట్గా ఉన్నారు?. ఇలాంటి వాటిపై కేబినెట్లో చర్చించరా?. ఉండవల్లిలో పోలీసు కానిస్టేబుల్ తల పగలకొట్టిన టీడీపీ కార్యకర్తలపై ఎందుకు కేసు పెట్టలేదు?. ఉత్తుత్తి కేబినెట్లు కాకుండా ప్రజలకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ కేబినెట్కి ఎందుకు రావటం లేదు?. ఆ కారణాలు ఏంటో సీఎం, డిప్యూటీ సీఎం సమాధానం చెప్పాలి.’’ అని అంబటి నిలదీశారు.‘‘రావణ్కు అన్ని కేసుల్లోనూ బెయిల్ వస్తోందని ఉపా చట్టం ప్రయోగించారు. రావణ్ టీమ్లోని ఒక మహిళ జగన్ని కలిసి న్యాయ సహాయం కావాలని కోరారు. వైఎస్ జగన్ సరే అన్నారు.. అంతే తప్ప రావణ్కు మాకు ఎలాంటి సంబంధం లేదు. టీడీపీ కార్యకర్తలు అడిగినా న్యాయ సహాయం చేస్తాం. తీవ్ర వాదుల మీద పెట్టాల్సిన చట్టాన్ని అమాయకులపై పెట్టటం ఏంటి?. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అంటే ఇదే’’ అంటూ అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. -
కొడాలి నానిపై కేసు...
-
అసలు నువ్వు... నీ స్థాయికి మించి మాట్లాడుతున్నావ్
-
అమరావతిలో అడుగడుగునా అవినీతి: సాకే శైలజానాథ్
సాక్షి, తాడేపల్లి: అమరావతిలో కూటమి సర్కార్ రాజధాని పేరుతో వేల కోట్లు ప్రజా ధనాన్ని దుబారా చేస్తోందని, ప్రశ్నిస్తే మంత్రి నారాయణ బుకాయిస్తున్నారని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిపడ్డారు. అమరావతిలో పేర్లు మార్చి నిర్మాణాల ఖర్చు పెంచేస్తున్నారని, కాంట్రాక్టర్లకు అడ్డంగా దోచిపెట్టేందుకే నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన ఆక్షేపించారు.ఇప్పటికైనా ప్రభుత్వం జగన్గారు ప్రతిపాదిస్తున్న మావిగన్ రాజధానిపై దృష్టి సారించాలని, తద్వారా అభివృద్ది వికేంద్రీకరణ చేయాలని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్ స్పష్టం చేశారు. ప్రెస్ మీట్లో సాకే శైలజానాథ్ ఇంకా ఏం మాట్లాడారంటే..:అమరావతిపై నారాయణ బుకాయింపులు:మంత్రి నారాయణ అమరావతిగా పిలుస్తున్న 28 గ్రామాల పరిధిలో కడుతున్న కట్టడాలపై విస్మయానికి గురయ్యే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అమరావతి నిర్మాణాల్లో ఎక్కడా లేని విధంగా అవినీతి జరుగుతోందని ప్రజలు బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు కదా, మీ సమాధానం ఏంటని అడిగితే.. నారాయణ మాత్రం తమ చర్యల్ని సమర్ధించుకున్నారు. సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా అమరావతిలో అవినీతి ప్రవాహం జరుగుతోంది.వరద నీళ్లే కాదు, వరద నీళ్ల కంటే మహా జోరుగా అవినీతి ప్రవాహం అక్కడ జరుగుతోందన్న విషయాన్ని ప్రజలు చెప్తుంటే, దాన్ని సమర్థించుకోవడం కోసం నారాయణ నానా పాట్లూ పడ్డారు. మామూలు ఇళ్లకైతే ఒక లెక్క, ఐకానిక్ భవనాలకైతే మరో లెక్క అంటూ చెప్పుకొచ్చారు. ఐకానిక్ బిల్డింగ్ అంటే ఎవరికీ అర్థం కానట్లు మాట్లాడారు. అది చూస్తే మా పిల్లలు కూడా ఇడ్లీ పాత్ర లాగా ఉంటుందని చెప్తున్నారు. అడ్డంగా పెట్టినా, క్రాస్గా పెట్టినా, తలకిందులుగా పెట్టినా అది ఇడ్లీ పాత్రే అవుతుంది. దానికి అయ్యే ఖర్చు ఎలా పెరుగుతుందో చెప్పాల్సిన అవసరం ఉంది.నిర్మాణాల రేట్లు పెంచేసి అడ్డగోలుగా దోపిడీ:మీరు దాదాపు 52,20,496 చదరపు అడుగుల నిర్మాణాలు చేస్తున్నారు. ఇందులో చదరపు అడుగుకు మీరు చెబుతున్న లెక్క దాదాపు రూ.20,427. ఇదేం లెక్క అని అడుగుతున్నాం. ఇదే బిల్డింగ్ కి 2017–18 సంవత్సరాల్లో మీరు టెండర్ పిలిచినప్పుడు, రూ.2271.14 కోట్లతో టెండర్లు ఖరారు చేశారు. వచ్చిన కంపెనీలు ఎన్సిసి, షాపూర్జీ–పల్లోంజీ, ఎల్ అండ్ టీ. అయినా ఈ నిర్మాణాలు చేపట్టకుండా వదిలేసి, ఇప్పుడు మళ్లీ వాళ్లకే ఇచ్చి మొదలు పెట్టించారు. కానీ ఖర్చు మాత్రం రూ.4354.43 కోట్లకు పెంచేశారు. అంటే దాదాపు రూ.2033.29 కోట్ల మేర రేట్లు పెరిగిపోయాయి. ఇది నారాయణకో లేక చంద్రబాబుకో ఆశ్చర్యం కలగకపోవచ్చు, కానీ మాలాంటి వాళ్లకి ఆశ్చర్యం కలుగుతోంది.అందులో ఒకటి, రెండు టెండర్లు అయినా వేరే కంపెనీలకు ఇవ్వలేరా? ప్రపంచ స్థాయి బిడ్డింగ్ ఇచ్చినప్పుడు, మిమ్మల్ని అడిగే పాయింట్ ఒక్కటే. మీరు మీ సొంత భవనాల నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.20 వేలు ఎక్కడైనా ఇచ్చారా నారాయణ గారు అని అడుగుతున్నాం. అలాగే చంద్రబాబు ఇంటికీ దాదాపు చదరపు అడుగుకు రూ.5 వేలు ఖర్చు పెడుతున్నారు. కానీ అమరావతి నిర్మాణాల రేట్లు బొంబాయిలో గాని, బెంగళూరులో కానీ, ఎక్కడ లేవు. వాటి గురించి మాట్లాడితే.. మా వైఎస్సార్సీపీ అమరావతికి వ్యతిరేకం అని ఆడిపోసుకుంటారు. అమరావతి పేరు మీద వృథా, దోపిడి అవుతున్న ప్రజాధనాన్ని, ప్రజల శ్రమను మీరు నాశనం చేస్తున్నారు. దాన్ని మాత్రమే మేము వ్యతిరేకిస్తున్నాం.అమరావతి అని పేరు పెట్టిన మెటీరియల్ ఏమైనా ఆ ఇంద్రుని ఊరి నుంచి తెప్పిస్తున్నారా? ఎందుకంటే చంద్రబాబు మాట్లాడితే చాలు దేవతల రాజధాని అంటుంటాడు. దేవతలు ఏమైనా కంపెనీ పెట్టారా? పైన ఎక్కడో నాకు తెలియదు, కానీ ఇంద్రలోకం నుంచో, ఎక్కడి నుంచో ఆ మెటీరియల్ వస్తోంది. అదన్నా ఎక్కడో చెప్పాలి. అక్కడి నుంచి రవాణా చేయాలి కాబట్టి ఖర్చు పెరిగినట్లుంది.అంతులేని నిర్మాణ వ్యయం:చంద్రబాబు అమరావతిలో దాదాపు రూ.680 కోట్లు రకరకాల రాయితీల రూపంలో ఇస్తున్నారు. నిజానికి అక్కడ ఇప్పటికే ఇసుక ఫ్రీ. జీఎస్టీ లేదు. సీవరేజ్ కూడా కట్టాల్సిన అవసరం లేదు. పన్నులు కట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు. అన్నీ వెనక్కి ఇచ్చేస్తారంట!. ఆ భవనాల కరెంటుకి, ఫైర్కి, లిఫ్ట్కి, ప్లంబింగ్ కి రూ.4354.43 కోట్లు ఖర్చు పెడతామని చెప్తున్నారు. ఇంకా తమాషా, ఘోరం ఏంటంటే ఆ గ్లాస్ ఫేస్డ్ వర్క్ ఏంటో మాకు అర్థం కాదు. అంటే బహుశా అద్దాలు వేస్తారేమో, ఈ అద్దాలకి మీరు రూ.2,31,688 కోట్లు ఖర్చు పెడుతున్నారు.అది రూ.2,540 కోట్ల గ్లాసుల కంటే అద్దాలు వేసే ఖర్చు ఎక్కువ. అక్కడ ఇంకా రోడ్లు, డ్రైనేజ్ లు ఇవన్నీ ఉన్నాయట. అయినా ప్రత్యేకంగా రోడ్లు, కాలవలకు మళ్ళీ రూ.1,052 కోట్లు ఖర్చు చేస్తున్నారు. డిజైన్లకు రూ.401 కోట్లు, బొమ్మలు వేసినోడికి రూ.400 కోట్లు, గ్లాసులు వేసేవాడికి గ్లాస్, అద్దాలకేమో రూ.2,540 కోట్లు. కరెంటుకి , ప్లంబింగ్ లాంటి పనులకేమో దాదాపు రూ.2,316 కోట్ల పైచిలుకు ఖర్చు చేస్తున్నారు. ఇలా మొత్తం నిర్మాణ ఖర్చు రూ.4354 కోట్ల రూపాయలకు చేరింది. అసలు కంటే కొసర ఎక్కువైందని బిల్డింగ్ కి దాదాపు 100 శాతం కంటే ఎక్కువ డబ్బుల్ని మీరు అదనంగా ఖర్చు పెడుతున్నారు.కేంద్రాన్ని మించిన రాష్ట్ర ప్రభుత్వ వ్యయం:కేంద్ర ప్రభుత్వం కూడా బిల్డింగులు కడుతోంది. మీరు వాళ్లను మించి పోతున్నారు. కేంద్రం దాదాపు 54 లక్షల 45 వేల చదరపు అడుగుల నిర్మాణం మొదలు పెడితే, దానికి వాళ్ళు పెడుతున్న ఖర్చు రూ.2,533.99 కోట్లు. 54 లక్షల పైచిలుకు స్క్వేర్ ఫీట్ కి వాళ్ళు ఇచ్చే డబ్బులు రూ.2,534 కోట్లు. వాళ్ళ స్క్వేర్ ఫీట్ కాస్ట్ వచ్చేసి మొత్తం రెండు కలిపేస్తే సాధారణ ఆఫీస్ కి, రెసిడెన్షియల్ అకామిడేషన్ రెండు కలిపితే రూ.4,645. ఇది వాళ్ళ లెక్క, వాళ్ళ డొమైన్ లో నుంచి తీసిన పేపర్ ఇది. మరి మీకెందుకు అదే చదరపు అడుగుకు రూ.20 వేలు అవుతుందో చెప్పాలి.నారాయణ మూడు రిజర్వాయర్లు కడతాం, పది లిఫ్టులు పెడతాం, వరద నీళ్లు వస్తే ఆ నీళ్లన్నీ ఎత్తి మళ్ళా కృష్ణానదిలోకి పోస్తాం అంటారు. మీ అమరావతికి ప్రజల ఆమోదం లేదన్న సంగతి మీకు అర్థమైతే, జగన్గారు చెప్పిన మాటకు మీకు అర్థమవుతుంది. ఈరోజు మావిగన్ కి ప్రజల మద్దతు ఉంది. ప్రజలు దాన్ని అర్థం చేసుకుంటున్నారు. కొత్తగా ఎయిర్ పోర్ట్, రైల్వేస్టేషన్ కడతారట. 28 గ్రామాల రాజధానిలో రైతులు కూడా ఉండటం లేదు, బయటకు వచ్చేస్తున్నారు.మావిగన్ రాజధాని తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం:అభివృద్ధికి పనికొచ్చే గ్రోత్ ఇంజన్ క్యాపిటల్ మావిగన్ ద్వారానే సాధ్యమవుతుంది. మచిలీపట్నం దగ్గర నుంచి గుంటూరు వరకు ఉన్న 110 కిలోమీటర్ల ప్రాంతం. ఒక మూడు ప్రధాన పట్టణాలు, మంచి భూభాగాలు, దాదాపు 60 లక్షల జనాభా. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, ఒక రైల్వే స్టేషన్, ఒక బస్ స్టాండ్ ఉన్నాయి. మీరు సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అని చెప్పి, ఇప్పటికి 60 వేల కోట్లు అప్పులు తెచ్చి నిర్మిస్తున్నారు.అది పూర్తయ్యే సరికి మరో 2 లక్షల కోట్లు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే లక్ష ఎకరాల భూసేకరణలో ఉన్నారు. ఎకరా అభివద్ధికి మీరు చెప్పిన లెక్కే రెండు కోట్లు. లక్ష ఎకరాల అభివృద్ధికి రెండు లక్షల కోట్ల రూపాయలు. ఇవన్నీ ఎవరి డబ్బులు ? ఓ రూ.10 వేల కోట్లు ఖర్చు పెడితే, రాయలసీమలో ఉన్న అన్ని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి అవుతాయి. ఇంకొక 10 వేల కోట్లు ఖర్చు పెడితే ఉత్తరాంధ్రలో ఉన్న అన్ని ప్రాజెక్టులు పూర్తి అవుతాయి. ఆ ఆలోచన రాదా మీకు? సరిగ్గా అక్కడే మీ గురించి అనుమానాలు వస్తున్నాయి.మీరు దానికి ఏ పేరు అయినా పెట్టండి. ఐకాన్ అనండి. గోల్డెన్ ఐకాన్ అనండి. ప్రశ్నిస్తే మాత్రం మీకు కోపాలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా నిర్బంధ అభివృద్ధి కేంద్రీకరణ ఆపండి. దీని వల్ల ఎలాంటి లాభం లేదు. అమరావతి పేరు మీద జరుగుతున్న ప్రహసనం కాంట్రాక్టర్ల కోసమే. ఐదేళ్ల కింద అదే కాంట్రాక్టర్ మళ్ళా అదే కాంట్రాక్టర్. అదనపు ఖర్చు అద్దాల కోసమే. కనుక మసిపూసే మాటలను మానేసి, వాస్తవాల్ని ప్రజల ముందు పెట్టి, ప్రజల రాజధాని కాబోయే మావిగన్ ను ఆలోచించి నిర్మించమని కోరుతున్నామని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ చెప్పారు. -
సౌదీలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
రియాద్: మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 77వ జయంతిని పురస్కరించుకొని సౌదీ అరేబియా సెంట్రల్ కోర్ కమిటీ ఆధ్వర్యంలో రియాద్ నగరంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, ప్రవాసాంధ్రులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సౌదీ అరేబియా సెంట్రల్ కమిటీ కన్వీనర్ రబ్బానీ సయ్యద్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాయని కొనియాడారు. వైఎస్సార్సీపీ ఘన విజయం కోసం కార్యకర్తలు, నాయకులు ఏ విధంగా కలిసికట్టుగా పని చేయాలో దిశా నిర్దేశం చేశారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ‘మావిగన్’ కార్యక్రమం గురించి రబ్బానీ సయ్యద్ ఈ వేదికపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘మావిగన్’కు పూర్తి మద్దతు ప్రకటిస్తూ రియాద్ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు చేసిన కరతాళ ధ్వనులు, ‘జై మావిగన్’ నినాదాలతో ఆడిటోరియం మార్మోగింది.ఈ వేడుకల్లో పార్టీ ముఖ్య నాయకులు సిరుమల సుబ్బారెడ్డి, పట్లోళ్ల శ్రీకాంత్ రెడ్డి, కరీముల్లా బాషా షేక్, వెలంపాటి వేణుగోపాల్ రెడ్డి, గంగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, గొల్ల విజయ్, గానుగపెంట శ్రీకాంత్, సుభాన్ ఖాన్ పఠాన్, నాగినేని ఉదయ్ కృష్ణ చౌదరి, షేక్ షాదక్ వలి, కంది శశిధర్ రెడ్డితో పాటు వందలాది మంది వైఎస్సార్ అభిమానులు, కార్యకర్తలు పాల్గొని ఈ జయంతి వేడుకలను విజయవంతం చేశారు. -
మన ఓట్లను కాపాడుకోవడం అత్యంత కీలకం: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ఎస్ఐఆర్ ప్రక్రియ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ కీలక నేతలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలతో నిర్వహించిన ఈ టెలి కాన్ఫరెన్స్లో ఎస్ఐఆర్ ప్రక్రియ, బీఎల్ఏల బాధ్యతలు, ఓటర్ల అవగాహన, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా పోరాటాల అంశాలపై ఆయన దిశానిర్దేశం చేశారు.ఈ నెల 14వ తేదీతో ఇంటింటి సర్వే ముగియనున్న నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో పార్టీ యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. ముఖ్యంగా అర్బన్ ఏరియాలలో ఎన్యూమరేషన్ ఫామ్స్ పంపిణీ పూర్తి స్థాయిలో జరగలేదని సమాచారం వస్తోందని, రూరల్ ఏరియాలలో కూడా ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ సరిగా జరగని చోట్ల ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రతి బూత్లో బీఎల్ఏలు చురుగ్గా పనిచేసి, ప్రతి ఓటర్కు ఫారం అందిందా లేదా అన్నది కచ్చితంగా పరిశీలించాలని స్పష్టం చేశారు.కొన్ని చోట్ల టీడీపీ నాయకులు అధికారులపై ప్రభావం చూపించి తమకు అనుకూలంగా వ్యవహరించేలా ప్రయత్నాలు చేస్తున్నారనే సమాచారం ఉందని, అలాంటి ప్రయత్నాలను పార్టీ నాయకులు, బీఎల్ఏలు అప్రమత్తంగా గమనించాలని సూచించారు. వైఎస్సార్సీపీ ఇప్పటికే ఎస్ఐఆర్ ప్రక్రియకు మరో నెల గడువు పొడిగించాలని కోరిందని, అయితే ఇప్పటి వరకు దీనిపై సమాధానం రాలేదని తెలిపారు. డిజిటలైజేషన్ ప్రక్రియలో కూడా జాప్యం జరుగుతోందని, ఈ అంశాలన్నింటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు.ఓటరు జాబితాల్లో మన ఓట్లు తొలగించకుండా కాపాడుకోవడం, అదే సమయంలో దొంగ ఓట్లు ఉంటే వాటిని గుర్తించి తొలగించేలా చూడడం బీఎల్ఏల ప్రధాన బాధ్యత అని సజ్జల అన్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు చాలా సందర్భాల్లో 5 వేల నుంచి 10 వేల ఓట్ల తేడాతో నిర్ణయించబడతాయని, అందువల్ల ప్రతి ఓటు విలువైనదని గుర్తుచేశారు. మన ఓట్లను తొలగించేందుకు రకరకాల కుట్రలు జరిగే అవకాశం ఉందని.. ముఖ్యంగా మునిసిపాలిటీలు, అర్బన్ ఏరియాలలో ఓట్లు అత్యంత కీలకమని ఆయన అన్నారు.అర్బన్ ప్రాంతాల్లో బీఎల్ఏలకు అవసరమైన అదనపు సపోర్టింగ్ టీమ్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఇప్పటికే పార్టీ కంట్రోల్ రూమ్స్ అందుబాటులో ఉన్నాయని, ఎక్కడైనా ఎన్యూమరేషన్ ఫామ్స్ అందకపోతే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడంతో పాటు పార్టీ కంట్రోల్ రూమ్స్కు కూడా తెలియజేయాలని చెప్పారు. ఈ విషయంలో మీడియాను కూడా విస్తృతంగా వినియోగించుకోవాలని, ఫామ్స్ అందని ప్రాంతాల సమస్యను వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త ప్రతిరోజూ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి, తన నియోజకవర్గంలోని ప్రతి బూత్ స్థాయి పరిస్థితిపై స్టేటస్ అప్డేట్ తీసుకోవాలని సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశించారు. బీఎల్ఏకు ప్రతి రోజూ కీలకమని, ఈ తుది దశలో ఒక్కరోజు కూడా నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. జిల్లా అధ్యక్షులు, టాస్క్ఫోర్స్ సభ్యులు, పార్లమెంట్ పరిశీలకులు, అసెంబ్లీ పరిశీలకులు, సీనియర్ నాయకులతో సమన్వయం చేసుకుని ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా పర్యవేక్షించాలని చెప్పారు.బీఎల్ఏలు ఓటర్లకు ఎస్ఐఆర్పై పూర్తి అవగాహన కల్పించడంతో పాటు బీఎల్వోలతో సమన్వయం చేసుకోవాలని అన్నారు. పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్పైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎక్కడైనా ఓటర్లకు ఇబ్బంది కలిగేలా మార్పులు జరిగితే వెంటనే గుర్తించి చర్యలు తీసుకునేలా చూడాలని సూచించారు.ఈ టెలి కాన్ఫరెన్స్లో రెండో అంశంగా రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరాన్ని సజ్జల వివరించారు. ప్రతి నియోజకవర్గంలో మీడియాను విస్తృతంగా వినియోగించుకుని వైఎస్సార్సీపీ వాయిస్ ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి తీవ్రంగా దిగజారిపోయిందని, సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపుతూ, రకరకాల కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడితే సహించలేని స్థితిలో టీడీపీ ప్రభుత్వం ఉందని, ఆ ప్రభుత్వ అరాచకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.సాయికృష్ణ, క్రాంతికుమార్ కుటుంబాలను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించిన తర్వాతే ప్రభుత్వంలో కొంత చలనం వచ్చిందన్న సజ్జల.. బాధిత కుటుంబాలకు అండగా నిలవడం వైఎస్సార్సీపీ బాధ్యతగా తీసుకుంటోందని, ప్రజల పక్షాన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.రైతుల సమస్యలపై పార్టీ చేపడుతున్న ఆందోళనలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని ఆయన తెలిపారు. ప్రజా సమస్యలపై కలిసి వచ్చే పార్టీలు, ప్రజాసంఘాలను కలుపుకుని పోరాటాలను మరింత విస్తృతం చేయాలని సూచించారు. రాష్ట్రంలోని పోర్టులు, హార్బర్లను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలపైనా ప్రజల పక్షాన బలమైన పోరాటం చేయాలని అన్నారు.పార్టీలోని అన్ని విభాగాలు సమన్వయంతో ముందుకు సాగాలని, ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ వంటి అంశాలపై మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్దేశం చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో చివరి రోజు వరకు అప్రమత్తంగా ఉండటంతో పాటు, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడే పార్టీగా వైఎస్సార్సీపీ ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు. -
మృత్యుంజయుడు కారె చిన్నాను ఫోన్ లో పరామర్శించిన జగన్
-
‘ప్రశ్నించకపోతే ఏపీని కూడా బాబు అమ్మేస్తారు’
సాక్షి, కాకినాడ జిల్లా: ప్రజల సమస్యలను చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలేసిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏ వర్గాల సమస్యలను పరిష్కరించడం లేదని.. వీటిని కప్పిపుచ్చుకోవడానికి వైఎస్సార్సీపీని దుర్మార్గంగా చూపిండానికి కుట్ర పన్నుతోందని ధ్వజమెత్తారు.‘‘మాటిమాటికి వైఎస్ జగన్, వైఎస్సార్సీపీని దూషిస్తోంది. వైఎస్ జగన్ను దూషించడానికి చంద్రబాబు దిగజారిపోతున్నాడు. 17 ఏళ్ల పాటుగా సీఎంగా పని చేసిన చంద్రబాబుకు ఇది సంస్కారమా?. మీ వ్యవహారంలో తీవ్రమైన ప్రస్టేషన్ ఎందుకు కనిపిస్తోంది. బహిరంగ సభల్లో వైఎస్ జగన్ కుటుంబం కోసం ఎందుకు మాట్లాడుతున్నారు?. వైఎస్సార్సీపీ గొడ్డలి పార్టీ అయితే.. మీ పార్టీ బూడిద పార్టీనా?. రాష్ట్ర వనరులు దోచి.. ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేయకలేక బూడిద చేస్తున్న మీమ్మల్ని బూడిద పార్టీ అనొచ్చా?..సంక్షేమాన్ని, అభివృద్ధిని బూడిద చేశారు. దీనికి డైవర్షన్గా రాముడ్ని, రావణ్ని తీసుకువస్తారు. సంపద సృష్టిస్తానని ఎన్నికలకు ముందు చెప్పారు. కానీ మీ సంపద సృష్టి మీ అనుయాయులకు, కార్పొరేట్ సంస్థలకు సంపద సృష్టిస్తున్నారు. రామాయంపట్నం పోర్ట్ను ప్రైవేటు పరం చేస్తున్నారు. ఐదు వేల కోట్లతో శరవేగంగా జగన్ పనులు పూర్తి చేశారు. మరో ఐదు శాతం పనులు పూర్తి చేయాలి. వైఎస్ జగన్ నిర్మాణం చేసిన పోర్ట్లను కూడా ప్రైవేటు పరం చేస్తున్నారు...ఎవరైనా చంద్రబాబుపై గొంతెత్తి ప్రశ్నిస్తే వారిపై దుర్మార్గమైన కేసులు, వేధింపులకు గురిచేస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు గాలికి కొట్టుకుపోయాయి. సాయికృష్ణ తల్లి బూడిద అడిగినా ఇవ్వరు. తునిలో చిన్నారి అదృశ్యమైనా.. విశాఖలో మత్స్యకారులు గల్లంతైన వారి ఆచూకీ కనిపెట్టలేరు. శాంతిబద్రతలు కుప్పకూలిపోతే... రావణ్ లాంటి యూట్యూబర్లపై ఉపా చట్టాలను పెడుతున్నారు. పెట్టాల్సిన చట్టాలు కాకుండా.. చట్టాలను అతిక్రమించడానికి మేము వ్యతిరేకం. నాలుగు కేసుల్లో రావణ్కు బెయిల్ వస్తే.. ఐదో కేసులో ఉపా చట్టాన్ని పెట్టారు. రావణ్ భావజాలానికి మేము అనుకూలం కాదు. తమ రాజకీయం కోసం రాముడు, రావణ్ను వాడుకుంటున్నారు...కుల ప్రస్తవన లేకుండా చంద్రబాబు రాజకీయం చేయలేకపోతున్నాడు. ఇప్పటికైనా చంద్రబాబు హుందాగా ప్రవర్తించాలని చెబుతున్నాము. ఆడబిడ్డ నిధి ఏమైందంటే చెప్పడు.. కానీ సభల్లో తాను సంక్షేమ పథకాల రథసారధిగా చెబుతారు. రైతుల మీద విపరీతమైన భారాన్ని మోపారు. వైఎస్ జగన్ భూములు రీ సర్వే చేయిస్తే మీ భూములు లాగేసుకుంటారంటూ ఎన్నికలకు ముందు కూటమి నేతలు ప్రచారం చేశారు. ఇప్పుడు రేషన్ కార్డుల మీద మీ ఫోటోలు ఉన్నాయి.. అంటే రేషన్ మీరు లాగేసుకుంటారా?. వైఎస్ జగన్ తీసుకొచ్చిన పట్టాదారు పుస్తకాలను నీతి ఆయోగ్ ప్రశంసించింది...ప్రచారం మీద తప్పా.. ప్రజల అవసరాల మీద దృష్టి పెట్టలేదు. దోచుకోవడం...దాచుకోవడంలో నిమగ్నమయ్యారు. మావిగన్లో అన్నీ ఉన్నాయి. మరింత అభివృద్ధి చేసుకోవచ్చు. ప్రశ్నించకపోతే చివరకు ఏపీని కూడా బాబు అమ్మేస్తారు’’ అంటూ కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
Alగా అంబటి రాంబాబు అని పెట్టండి ఏపీ పోలీస్ తీరుకు స్ట్రాంగ్ కౌంటర్
-
అక్రమ కేసులకు భయపడేది లేదు: అంబటి రాంబాబు
సాక్షి,గుంటూరు: కూటమి ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులకు ఎట్టపరిస్థితుల్లో భయపడేది లేదని వైఎస్సార్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఈ రోజు (గురువారం) గుంటూరులో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. వైఎస్సార్సీపీ నేతలు అమరావతి రైతులను పరామర్శించడానికి వెళితే టీడీపీ నాయకులు తమపై దాడి చేశారని దానిపై పోలీసుల వద్దకు వెళితే కనీసం తమ ఫిర్యాదులను కూడా తీసుకోవడం లేదన్నారు.టీడీపీ నేతలే తమపై దాడిచేసి తిరిగి వారే వైఎస్సార్సీపీ నాయకులపై కేసు పెట్టారన్నారు. పోలీసులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మెుండితోక అశోక్ ఇచ్చిన ఫిర్యాదును ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. టీడీపీ నేతలు కానిస్టేబుల్పై దాడి చేసిన పోలీసులు కేసు నమోదు చేయలేదని అతనిపై దాడి చేసింది ఎవరో అందరికీ తెలుసన్నారు. కూటమి ప్రభుత్వంలో అరాచకం పెరిగి పోయిందని పోలీస్ స్టేషన్లలోనే హత్యలు చేస్తున్నారని అంబటి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకు ఎట్టి పరిస్థితుల్లో భయపడేది లేదని తెలిపారు. -
చంద్రబాబుకు బుద్ధి, జ్ఞానం రెండు లేవు
-
తోపుదుర్తి అరెస్ట్.. రాప్తాడులో హైటెన్షన్..
-
‘ఏపీలో రూల్ ఆఫ్ లా కాదు.. రూల్ ఆఫ్ ఫియర్ నడుస్తోంది’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు పాలనంతా అవినీతి, అక్రమాలేనని మండిపడ్డారు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా కాదు, రూల్ ఆఫ్ ఫియర్ నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి వెళ్లిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే వారిపై ఉపా చట్టాలను ప్రయోగిస్తారా? అని నిలదీశారు. ఇంగిత జ్ఞానం లేని లోకేష్ చేతిలో రాష్ట్రాన్ని పెడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు పాలనలో ప్రజలకు మిగిలింది బాధలు, ఏడుపులే. రైతులు, కార్మికులు, మహిళలు, ఉద్యోగులు సహా అన్ని వర్గాలకూ కష్టాలు తప్పటం లేదు. ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి వెళ్లింది. కూటమి కార్యకర్తలు, నాయకులు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నా కేసులు పెట్టటం లేదు. పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరికీ రక్షణ లేదు. ప్రశ్నించే వారిపై ఉపా చట్టాలను ప్రయోగిస్తారా?. ఇంగిత జ్ఞానం లేని లోకేష్ చేతిలో రాష్ట్రాన్ని పెడతారా?. పోలీసులు లాకప్డెత్లు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది?. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టి కమీషను గుంజుతున్నారు. లక్షల కోట్లు దోచుకుని ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారు.రష్యాలో తప్ప అన్ని దేశాల్లోనూ చంద్రబాబు పెట్టుబడులు పెట్టారు.వైఎస్సార్సీపీ నాయకుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి రక్షణ లేదు. టిప్పర్తో ఢీ కొట్టి చంపాలని చూశారు. పైగా ఆయన మీదే కేసు పెట్టారు. సాయికృష్ణను హతమార్చి బూడిద కూడా ఇవ్వని దారుణం ఏపీలో నెలకొంది. పారిశ్రామికవేత్తలు కూడా రాష్ట్రం నుండి పారిపోయే పరిస్థితి ఏర్పడింది. కడప ఉక్కు ఫ్యాక్టరీని రెండేళ్ల పాటు ఆపారు. వైఎస్ జగన్ తెచ్చిన ప్రాజెక్టులను చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారు. క్రెడిట్ చోరీ తప్ప చంద్రబాబు చేస్తున్నదేమీ లేదు. దావోస్ పర్యటనలకు వెళ్లి ఏ పరిశ్రమను తెచ్చారు?. రాష్ట్రంలో జనం భయం భయంగా బతుకుతున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. -
బాబును నమ్ముకుంటే జనసేన మునిగినట్టే!: కొడాలి నాని
సాక్షి, కృష్ణా: యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్ట్ వ్యవహారంపై మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొడాలి నాని మరోసారి స్పందించారు. ఈ కేసుతో వైఎస్సార్సీపీకి ఎలాంటి సంబంధం లేదని ఉద్ఘాటించిన ఆయన.. టీడీపీ, జనసేనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కమ్మ కులానికి చెందిన రావణ్ను.. ఐడెంటిటీ మార్చి దళితుడిగా.. క్రిస్టియన్గా చూపించేందుకు టీడీపీ మీడియా, సోషల్ మీడియా తీవ్రంగా ప్రయత్నించిందటూ సంచలన వ్యాఖ్యలే చేశారాయన.రావణ్ పేరు రావణ్.. జోసఫ్ కాదు. అతను క్రిస్టియన్ కాదు. కుటుంబ సభ్యుల అభిప్రాయాలను కూడా పట్టించుకోకుండా అతడి ఐడెంటిటీని టీడీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా మార్చేసింది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని దళితుడిగా, క్రిస్టియన్గా చూపించేందుకు టీడీపీ, ఎల్లో మీడియా ప్రయత్నించాయి అని అన్నారు. అరెస్ట్, బెయిల్పై ప్రశ్నలురావణ్ అరెస్టు తర్వాత పవన్ కళ్యాణ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సెక్షన్లు చదివారు. అయితే జనసేన కార్యకర్తలు పెట్టిన కేసుల్లో బెయిల్ రావడానికి ఎవరు సహకరించారో చెప్పాలి. “జగన్ గానీ, మేము గానీ ఎవరికీ ఫోన్ చేసి బెయిల్ ఇప్పించమని చెప్పలేదు. చంద్రబాబు పాత్ర లేకుండా నాలుగు కేసుల్లో బెయిల్ వస్తుందా?” అని ప్రశ్నించారు. తెలుగు దేశం పార్టీ ఇకనైనా స్టోరీలు ఆపాలని.. ఈ బురద మాపై జల్లవద్దని నాని హితవు పలికారు.అతని వీడియోలే అన్నీ చెబుతాయిరావణ్ గత వీడియోలను పరిశీలిస్తే అతను ఎవరికీ అనుకూలంగా ఉన్నారో అర్థమవుతుందని కొడాలి నాని అన్నారు. చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణలపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చిన్న సోషల్ మీడియా పోస్టులకే అరెస్టులు చేసే టీడీపీ ప్రభుత్వం.. రావణ్ విషయంలో ఎందుకు చర్యలు తీసుకోలేదని కొడాలి నాని ప్రశ్నించారు. “మావోయిస్టులకు మద్దతుగా పోస్ట్ పెట్టారని ఏడాది తర్వాత కేసులు పెట్టి అరెస్ట్ చేయడం ఏంటి? ఇంతకాలం గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నారా? టీడీపీ మద్దతు లేకుండా నాలుగు కేసుల్లో బెయిల్ వస్తుందా?” అంటూ పశ్నలు గుప్పించారు.జనసేనపై వ్యాఖ్యలుచంద్రబాబును నమ్ముకుంటే జనసేన మునిగిపోతుందని.. రావణ్ వ్యవహారమే అందుకు ఉదాహరణ అని అన్నారు.“పిఠాపురం పోలీస్ స్టేషన్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట చెల్లడం లేదు. బిగ్బాస్ ఏం చెబితే పోలీసులు అదే చేస్తున్నారు. డిప్యూటీ సీఎం, డమ్మీ సీఎం పరిస్థితి ఇదే. యాక్టింగ్ సీఎం లోకేష్ మాటలే చెల్లుబాటు అవుతాయి” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.మతాల మధ్య చిచ్చు పెట్టొద్దుహిందూ, క్రిస్టియన్ వర్గాలు కలిసిమెలిసి జీవిస్తున్నాయని కొడాలి నాని అన్నారు. ఒకే కుటుంబంలో రెండు మతాలకు చెందిన వారు ఉన్నారని, రాజకీయ ప్రయోజనాల కోసం మతాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేయొద్దని సూచించారు. దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండబోదని చెప్పారు.ఆ మాటకు కట్టుబడి ఉన్నా2029 ఎన్నికల్లో పరుశురాముడి గొడ్డలితో జగన్, చంద్రబాబు ప్రభుత్వాన్ని, టీడీపీని రాజకీయంగా సమాధి చేస్తామని గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నామని కొడాలి నాని అన్నారు. చంద్రబాబు ఇచ్చే కట్టెలు కొట్టడానికి కూడా పనికిరాని తుప్పు గొడ్డలి మాకు అవసరం లేదు అంటూ కొడాలి నాని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. -
గాజులు తొడుక్కున్నాం అనుకున్నావా... చీరేస్తాం..!
-
మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్ అరెస్ట్
-
తోపుదుర్తి హత్యకు శ్రీరామ్ కుట్ర ..!
-
నా కొడకా... బాబు తమ్ముడు అని మాట్లాడితే.. సవాలు విసురుతావా..
-
వైఎస్సార్కు ఘన నివాళి
సాక్షి, కడప: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా బుధవారం వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నివాళులు అర్పించారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతిరెడ్డి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్ సమాధి వద్ద పూలమాలలు ఉంచి మహానేతకు అంజలి ఘటించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం క్రైస్తవ మత పెద్దలు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. సంక్షేమ ప్రదాతగా, అభివృద్ధి విధాతగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సేవలను వైఎస్ కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు స్మరించుకున్నారు. వైఎస్సార్ ఘాట్ వద్దకు మాజీ సీఎం వైఎస్ జగన్ చేరుకున్న వెంటనే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వైఎస్సార్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు వైఎస్సార్ అమర్ రహే అంటూ చేసిన నినాదాలతో ఆ ప్రాంగణం మార్మోగింది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసేందుకు తరలివచ్చిన ప్రజలు.. ఆయనతో కరచాలనానికి పోటీ పడుతున్న దృశ్యం ప్రార్థనల్లో వైఎస్ కుటుంబ సభ్యులు వైఎస్సార్ సమాధి వద్ద నివాళులర్పించిన అనంతరం మాజీ సీఎం వైఎస్ జగన్, తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతిరెడ్డి, అత్తమ్మ డాక్టర్ సుగుణమ్మ, వైఎస్ సోదరుడు వైఎస్ సు«దీకర్రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, పులివెందుల మున్సిపల్ మాజీ చైర్పర్సన్ వైఎస్ ప్రమీలమ్మ, ఇతర కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. వీరితోపాటు రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామి రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల పార్టీ అధ్యక్షులు ఆకేపాటి అమర్నాథరెడ్డి, పోచంరెడ్డి రవీంద్రనాథ్రెడ్డి, బద్వేలు, ఆలూరు ఎమ్మెల్యేలు డాక్టర్ సుధ, విరూపాక్షి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్ బాషా, మాజీ మంత్రులు ఉషశ్రీ చరణ్, కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు డీసీ గోవిందరెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి, రమేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, గడికోట శ్రీకాంత్రెడ్డి, శెట్టిపల్లె రఘురామిరెడ్డి, రెడ్డెప్పగారి రమేష్కుమార్ రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, అత్తార్ చాంద్ బాషా, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్కుమార్ రెడ్డి, కడప, కర్నూలు మాజీ మేయర్లు కె.సురేష్బాబు, బీవై రామయ్య, కమలాపురం, కదిరి పార్టీ ఇన్ఛార్జిలు నరేన్ రామాంజులరెడ్డి, మగ్బూల్ బాషా, పార్టీ రాష్ట్ర నాయకులు రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, రాజోలి వీరారెడ్డి, సాయినాథ్ శర్మ, గోసుల శివభరత్ రెడ్డి, భరత్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేదల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, ఆరోగ్య సేవలు, విద్యావకాశాలు, సాగు నీటి ప్రాజెక్టులు వంటి రంగాల్లో మహానేత డాక్టర్ వైఎస్సార్ చేసిన సేవలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. ప్రజల కోసం ఆలోచించిన నాయకుడిగా, మహానేతగా వైఎస్సార్ ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని కొనియాడారు. మనసున్న, మరపురాని మహానేత వైఎస్సార్సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమపాళ్లలో ముందుకు తీసుకెళ్లి, పరిపాలనలో అందరూ సమానమేనని చాటుతూ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుని, పాలకుడంటే ఇలా ఉండాలని చాటి చెప్పిన మరపురాని మనసున్న మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని ప్రజలు, అభిమానులు, వైఎస్సార్సీపీ శ్రేణులు, వివిధ పార్టీల నేతలు కొనియాడారు. వైఎస్సార్ 77వ జయంతి వేడుకలను బుధవారం దేశవిదేశాల్లో ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు పండుగలా ఘనంగా నిర్వహించి, నివాళులర్పించారు. గ్రామ గ్రామాన, వాడవాడలా, నగరాల్లోనూ కేక్లు కట్ చేసి పేదలకు వస్త్ర, అన్నదానాలు చేశారు. రక్తదాన శిబిరాలు నిర్వహించి మహానేతపై అభిమానాన్ని చాటుకున్నారు. ‘డాక్టర్ వైఎస్సార్ అమర్ రహే, జోహార్ వైఎస్సార్, వైఎస్సార్ ఆశయ సాధనే వైఎస్సార్సీపీ ధ్యేయం’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. మహానేత డాక్టర్ వైఎస్సార్ ప్రవేశ పెట్టిన ఉచిత విద్యుత్, జలయజ్ఞం, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి అనేక పథకాలను ప్రజలు, అభిమానులు గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రగతిలో వైఎస్సార్కు ముందు.. ఆ తర్వాత అనే చరిత్రాత్మక మార్పు వచ్చిందని, నాడు కోట్లాది మందికి వైఎస్సార్ పెద్ద కొడుకులా అండగా నిలిచారని, అందుకే జన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని నేతలు కొనియాడారు. రాజన్న పాదయాత్ర దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చేసేంత గొప్ప స్ఫూర్తినిచ్చిందన్నారు. కాంగ్రెస్ను జాతీయ స్థాయి లో రెండు సార్లు నిలబెట్టింది వైఎస్సార్ అని, ఆయ న బతికుంటే ప్రధాని స్థాయికి ఎదిగేవారన్నారు. బడుగు, బలహీన వర్గాల కోసం పరితపించి సుప రిపాలన అందించిన వైఎస్సార్ను ప్రజలు మరవలేరన్నారు. ప్రజా సమస్యలు వినడం, వాటికి పరిష్కా రం చూపటం వైఎస్సార్ నైజమని ప్రశంసించారు. ఏలూరులో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్న వైఎస్సార్సీపీ శ్రేణులు ఇదీ వైఎస్సార్.. ‘వైఎస్సార్ వ్యక్తిత్వం మహోన్నతమైనది. ఆయన ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి విప్లవాత్మక పథకాలు గతంలో ఎవరూ ఊహించనివి. రైతులకు ఉచిత కరెంటు ఇవ్వడానికి అప్పట్లో కాంగ్రెస్ హైకమాండ్ ఒప్పుకోకపోయినా.. అమలు చేశారు. నాడు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకున్న ఒక చిన్నారి పెద్దయ్యాక సివిల్ సర్వీసెస్కు ఎంపికై వైఎస్ జగన్ను కలవడం వైఎస్సార్ విజన్కి నిదర్శనం.’అని వైఎస్సార్సీపీ నేతలు కొనియాడారు. ప్రకాశం జిల్లా గంగదొనకొండలో వైఎస్సార్ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న మహిళలు పేదల జీవితాల్లో వెలుగు నింపారుగచ్చిబౌలి (హైదరాబాద్): తామంతా బతికి ఉన్నామంటే దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చలవేనని పలువురు వ్యాఖ్యానించారు. ఆయన ఎంతో మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్రెడ్డి పాలనలో వివిధ సంక్షేమ పథకాలతో లబ్ధి పొందిన ఎంతో మంది వైఎస్సార్ చేసిన మేలును గుర్తు చేసుకున్నారు. బుధవారం మాదాపూర్లోని బుట్టా కన్వెన్షన్లో వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి 77వ జయంతిని పురస్కరించుకుని వైఎస్సార్ సంక్షేమ పథకాల లబ్ధిదారులతో ఆతీ్మయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ కళాకారుడు గోరటి వెంకన్న మాట్లాడుతూ వైఎస్సార్ మరణ వార్త విని తమ ఇంట్లో పిల్లలు సహా ఎవరూ అన్నం ముట్టలేదన్నారు. వైఎస్సార్తో మరిచిపోలేని అనుబంధం ఉందని చెప్పారు. ‘పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల..’ అనే పాట ఇచ్చినందుకు వైఎస్సార్ తనను ఎంతో ఆప్యాయంగా పలకరించేవారని గుర్తు చేసుకున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేస్తున్న వర ప్రసాద్రెడ్డి. చిత్రంలో వై.ఈశ్వర ప్రసాద్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ తదితరులు ఎంపీగా అవకాశం ఇస్తానంటే వద్దని చెప్పగా, కళారత్న అవార్డు ఇచ్చి గౌరవించారన్నారు. శాంతా బయోటెక్ చైర్మన్, పద్మభూషణ్ డాక్టర్ వరప్రసాద్రెడ్డి మాట్లాడుతూ.. ‘50 ఏళ్లకు ఓ పుణ్య పురుషుడు రావాలి. వైఎస్సార్ మహారుషి లాంటి మనిíÙ, మహా యోధుడు. వైఎస్సార్ లాంటి వ్యక్తి దేశానికి అవసరం..’ అని అన్నారు. వైఎస్సార్ మాజీ వ్యక్తిగత కార్యదర్శి భాస్కరశర్మ మాట్లాడుతూ.. మాట తప్పని మడమ తిప్పని నాయకుడు వైఎస్తో 17 ఏళ్ల అనుబంధం ఉందని చెప్పారు. వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం అధ్యక్షుడు వై.ఈశ్వర ప్రసాద్రెడ్డి మాట్లాడుతూ.. సమస్యలకు వైఎస్సార్ అక్కడికక్కడే పరిష్కారం చూపించేవారని గుర్తుచేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చక్రపాణిరెడ్డి, హఫీజ్ఖాన్, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధులు జూపూడి ప్రభాకర్, కారుమూరి వెంకట్రెడ్డి, శ్యామలారెడ్డి, వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం ప్రధాన కార్యదర్శి మునిరెడ్డి, కార్యదర్శి సుబ్రహ్మణ్యం, సభ్యులు ఏపీ రెడ్డి, మల్లు సురేందర్రెడ్డి పాల్గొన్నారు.పేదల పెన్నిధి వైఎస్కు ఘన నివాళిసాక్షి, అమరావతి: తెలుగు ప్రజల గుండెల్లో సంక్షేమ రథసారథిగా, నిరుపేదల పెన్నిధిగా చిరస్మరణీయ స్థానం సంపాదించుకున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమాలు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఘనంగా జరిగాయి. పార్టీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు, శాసనమండలి సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, అనుబంధ విభాగాల ప్రతినిధులు పెద్దసంఖ్యలో హాజరై కార్యాలయ ప్రాంగణంలోని వైఎస్సార్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కేక్ కట్ చేసిన అనంతరం, పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని పార్టీ నేతలు ప్రారంభించారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో కేక్ కట్ చేస్తున్న వైఎస్సార్సీపీ నేతలు బాబు పాలనలో కారు చీకట్లోకి రాష్ట్రం ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. దివంగత మహానేత వైఎస్సార్ వ్యక్తిత్వం, సమస్యల పట్ల ఆయన స్పందించే విధానం చిరస్మరణీయమని కొనియాడారు. వైఎస్సార్, చంద్రబాబు ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చినా చంద్రబాబుకు ఎక్కువ అవకాశాలు వచ్చాయని గుర్తు చేశారు. అయినా కేవలం ఐదేళ్లలోనే వైఎస్సార్ చరిత్ర సృష్టిస్తే.. ఎన్ని అవకాశాలొచ్చినా ఏమీ చేయకుండా చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోయారన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం కారుచీకట్లోకి వెళ్లిందని మండిపడ్డారు. 2024లో అడ్డగోలు పొత్తులతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గతం కంటే పదింతలు అబద్ధాలు చెప్పి ఓట్లేసిన ప్రజలను మోసం చేసి పాతాళంలోకి నెట్టేశారని చెప్పారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కాకుండానే ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితి చంద్రబాబు ప్రభుత్వానిదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో దోపిడీ భయంకరంగా సాగుతోందని, ఎవరేం మాట్లాడినా, ఏం రాసినా అక్రమ అరెస్టులు, కేసులు పెడుతూ కారుచీకటి పరిస్ధితులు తెచ్చారని మండిపడ్డారు. ప్రస్తుత పాలకుల వల్ల ప్రజలకు వెలుగు విలువ తెలిసొచ్చిందని, రానున్న రోజుల్లో వైఎస్సార్ స్ఫూర్తితో వైఎస్ జగన్ అడుగుజాడల్లో నడుస్తూ వైఎస్సార్సీపీ ప్రజా ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. మహానేత వైఎస్సార్ ఆశయ సాధనే వైఎస్సార్సీపీ ధ్యేయమని సజ్జల చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, మాజీ మంత్రులు సాకే శైలజానాథ్, జోగి రమేష్, వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు, పార్టీ నేతలు, విద్యార్థి విభాగం నేతలు పాల్గొన్నారు. -
లోకేష్ పర్యటన తర్వాతే.. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి హత్యకు కుట్ర..
-
అఖిలప్రియ సవాల్.. టీడీపీ ఆఫీస్ వద్ద బిజేంద్ర రెడ్డి!
-
శవాలు మాయం.. ఏపీలో మరో వ్యక్తి మిస్సింగ్.. మళ్లీ లాకప్ డెత్..?
-
ఎప్పటికీ చెరిగిపోని YSR గుర్తులు మా శ్రీకాకుళం ప్రజల గుండెల్లో ఉన్నాయి
-
శ్రీకాకుళం జనసేనకు బిగ్ షాక్.. YSRCPలోకి పవన్ వీరాభిమాని
-
టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు గదులు: భూమన
తిరుపతి: టీటీడీ వసతి గదుల వ్యవహారంలో భారీ లోపాలు బయటపడ్డాయని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. టీటీడీ భద్రత, విజిలెన్స్ వ్యవస్థల్లో జవాబుదారీతనం లేకుండా పోయిందని విమర్శించారు. అగోడ (Agoda) యాప్లో టీటీడీ వసతి గదులు విక్రయానికి పెట్టారని ఆరోపించారు. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా గదులను అధిక ధరలకు ఆఫర్ చేస్తున్నారని చెప్పారు. రూ.1,000 నుంచి రూ.1,800 వరకు ఉండే గదులను రూ.18,000 వరకు విక్రయిస్తున్నారని తెలిపారు.‘‘ఆదిత్య బిర్లా, పాంచజన్యం, వికాస్ నిలయం, వకుళమాత గెస్ట్ హౌస్ల పేర్లు అన్లైన్ విక్రయాలు జరుగుతున్నాయి. కొన్ని గదులను రూ.14,500, రూ.18,180, రూ.20,700 ధరలకు ఆఫర్ చేశారు. నో స్మోకింగ్ రూమ్స్ పేరుతో కూడా ఆన్లైన్లో ప్రకటనలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన యాప్లో టీటీడీ వసతులు కనిపించడం ఆందోళనకరం’’ అని తెలిపారు.అగోడ యాప్కు సంబంధించి భూమన వీడియో ఆధారాలను విడుదల చేశారు. టీటీడీ లోపాలను ఎత్తిచూపితే తమపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు. ‘‘ఇలాంటి అంశాలను గుర్తించడంలో టీటీడీ భద్రతా విభాగం విఫలమైంది. నవనీతమ్మ వ్యవహారంపై సీఎం, టీటీడీ చైర్మన్ చేసిన వ్యాఖ్యలు సరికాదు. వృద్ధురాలికి దర్శనం కల్పించడం తప్పు కాదు. పూర్తి వివరాలు తెలుసుకోకుండా అత్యుత్సాహం ప్రదర్శించారు. నవనీతమ్మ పేరుతో రాజకీయ ప్రచారం చేసుకోవాలని చూస్తున్నారు. సీఎం, టీటీడీ చైర్మన్ చేసిన ప్రకటనల్లో భిన్న సమాచారం ఉంది. ఈ వ్యవహారంపై సీసీటీవీ ఫుటేజ్ను బహిర్గతం చేయాలి. ప్రపంచవ్యాప్తంగా భక్తులు నకిలీ యాప్ల ద్వారా మోసపోతుంటే చర్యలు ఎందుకు లేవు? వృద్ధురాలి అంశంపై చూపిన చొరవను నకిలీ యాప్ల నియంత్రణపై చూపాలి. మా హయాంలో 48 నకిలీ వెబ్సైట్లపై ఫిర్యాదు చేసి మూసివేయించాం’’ అని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. -
టెట్లో వీళ్లూ పాస్ కావాలనడం ఎంతవరకు కరెక్టు?: వైఎస్ జగన్
తాడేపల్లి: టెట్ నిబంధనలతో టీచర్లు చాలా ఇబ్బందులు పడుతున్నా చంద్రబాబు పట్టించుకోకపోవడం అన్యాయమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. 2011 ముందు నుంచి టీచర్లుగా ఇప్పటికీ పనిచేస్తున్న వారు కూడా టెట్ పరీక్ష తప్పనిసరిగా పాస్ కావాలన్న నిబంధన పెట్టడంతో దాదాపు లక్షమందికి పైగా టీచర్లు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్లో స్పందిస్తూ.. ‘‘20-25 ఏళ్లకు పైబడి సబ్జెక్టు టీచర్లుగా కొనసాగుతున్న వీళ్లు, ఇప్పుడు అన్ని సబ్జెక్టుల సిలబస్తో ఉన్న టెట్ పరీక్ష పాస్కావాలని, అందులోకూడా గరిష్టంగా 60శాతం మార్కులు రావాలని చెప్పడం ఎంతవరకు సమంజసం? పైగా వీళ్లంతా అప్పట్లో డీఎస్సీ ఎలిజిబిలిటీ టెస్టులో ఉత్తీర్ణులు కాబట్టేకదా ఉద్యోగాలు వచ్చాయి? వారికి ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు అప్పట్లో “టెట్’’ అనే పరీక్షే లేనప్పుడు, ఇప్పుడు వీళ్లుకూడా టెట్ పరీక్షలో పాస్ కావాలని రూల్ పెట్టడం ఎంతవరకు కరెక్టు?’’ అని నిలదీశారు.టీచర్లకు మానసిక ఒత్తిడి టీచర్లందరికీ టెట్ను తప్పనిసరి చేస్తూ జాతీయ విద్యాహక్కు చట్టం ప్రకారం 2011 నుంచి టెట్ను తప్పనిసరి చేస్తే, ఈ చట్టం రాకముందు నుంచే టీచర్ ఉద్యోగాలు చేస్తున్నవారికి “టెట్’’ పరీక్షను ఎందుకు తప్పనిసరి చేస్తున్నారంటూ వాళ్లు చేస్తున్న వాదనలో న్యాయం ఉంది కదా? అని వైఎస్ జగన్ అన్నారు. ‘‘అప్పట్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాస్ అయిన తర్వాతే వారికి ఉద్యోగం ఇవ్వడం జరిగింది కదా? టెట్ పరీక్ష నిబంధన కారణంగా ప్రమోషన్ల సమస్యే కాకుండా, చివరకు ఉద్యోగభద్రత లేకుండా చేస్తున్నారని, మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని టీచర్లంతా వాపోతున్నారు. కానీ, చంద్రబాబు ఈ టీచర్ల ఇబ్బందుల గురించి పట్టించుకోవడంలేదు. చట్టాన్ని సవరించాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపాలన్న ధ్యాసకూడా ఆయనకు లేకుండా పోయింది. టెట్ రాకముందు అంటే 2011కు ముందు సర్వీసులో ఉన్న టీచర్లందరికీ, టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి, టీచర్లకు ఉపశమనం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాను. వారంతా అప్పట్లో కాంపిటేటివ్ పరీక్షలు పాస్ అయిన తర్వాతనే వారికి ఉద్యోగాలు వచ్చాయి అన్నది మరిచిపోకూడదు అనికూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను మరొక్కసారి’’ అని చెప్పారు. .@ncbn గారూ.. టెట్ నిబంధనలతో టీచర్లు చాలా ఇబ్బందులు పడుతున్నా మీరు పట్టించుకోకపోవడం అన్యాయం. 2011 ముందు నుంచి టీచర్లుగా ఇప్పటికీ పనిచేస్తున్న వారు కూడా టెట్ పరీక్ష తప్పనిసరిగా పాస్ కావాలన్న నిబంధన పెట్టడంతో దాదాపు లక్షమందికి పైగా టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. 20-25 ఏళ్లకు…— YS Jagan Mohan Reddy (@ysjagan) July 8, 2026 -
BR నాయుడు బ్రోకర్, ABN RK లోఫర్.. రావణ్ వివాదంపై కొడాలి నాని సంచలన కామెంట్స్
-
ప్రపంచం గర్వించదగ్గ మహానేత వైఎస్సార్: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ నేతలు నివాళులు అర్పించారు. పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రులు జోగి రమేష్, వెలగంల్లి శ్రీనివాస్, శైలజానాథ్, మాజీ ఎంపి నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, ఎమ్మెల్సీ రుహుల్లా తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘‘వైఎస్సార్ తెచ్చిన సంక్షేమ పథకాలు కోట్ల మంది జీవితాల్లో మార్పు తెచ్చాయన్నారు. ఏ పథకం తెచ్చినా ఎంతమందికి మేలు చేకూరుతుందని ఆలోచించేవారు. వీలైనంత ఎక్కువ మందికి మేలు జరగటమే లక్ష్యంగా సంక్షేమ పథకాలు తెచ్చిన ఘనత వైఎస్సార్ది. వైఎస్సార్ పాదయాత్రతో మనిషే మారిపోయారు. అధికారంలో ఉన్న ప్రతిక్షణం జనం గురించే ఆలోచించారు..అధికారం అనేది ఒక సేవ అని ఆలోచించే వారు. తండ్రికి మించిన పట్టుదలతో వైఎస్ జగన్ పని చేస్తున్నారు. ఎన్నో విషమ పరీక్షలు ఎదుర్కొని జనం కోసం జగన్ నిలబడ్డారు. తన తండ్రి కోసం చనిపోయిన వారి కోసం ఓదార్పు యాత్ర చేశారు. ఆ కుటుంబాలకు ఆర్ధికంగానూ అండగా నిలిచారు. ప్రజలను తన కుటుంబ సభ్యులుగా భావించి మేలు చేసిన వ్యక్తి జగన్. చంద్రబాబు పాలనలో ప్రజల జీవితాలు చీకటి మయంగా మారాయి. ఆ చీకటిని చీల్చుకుంటూ మళ్ళీ జగన్ పాలన వస్తుందిరాష్ట్రంలో జరుగుతున్నది దోపిడీ పాలన. పోలీసులను అడ్డగోలుగా వాడుకుని అక్రమ కేసులు పెడుతున్నారు. అమరావతి, అవినీతి అనే పేరు వినిపిస్తే సోషల్ మీడియాలో వీడియోలు కూడా తొలగిస్తున్నారు. ఇంత బరితెగింపును చూసి దేశ ప్రజలు విస్తుపోతున్నారు. ఇలాంటి విషపు పాలనకు ప్రజలు చరమగీతం పాడే టైం దగ్గరలోనే ఉంది’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. -
నీ కొడుకు సింగిల్ సీటు గెలిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా.. చంద్రబాబుకు సవాల్
-
విదేశాల్లో ఘనంగా డాక్టర్ వైఎస్సార్ జయంతి
సాక్షి, అమరావతి/తిరుపతి మంగళం: మహానేత, దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతిని విదేశాల్లో ప్రవాసాంధ్రులు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా ఆధ్వ ర్యంలో జోహన్నెస్బర్గ్లోని మిడ్రాండ్లో జరిగిన కార్యక్రమానికి వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా కన్వీనర్ విక్రమ్ రెడ్డి పెట్లూరు అధ్యక్షత వహించారు. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్ను కట్ చేసి అన్నదానం చేపట్టారు. కెనడాలోని టొరొంటో నగరంలో వైభవంగా వైఎస్సార్ జయంతి వేడుకలు కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా ప్రతినిధులు నరసింహ రెడ్డి కల్లా, సూర్య రామిరెడ్డి, మురళి సోమిశెట్టి, శివ రాజవరపు, బి వెంకట సుబ్బా రెడ్డి , వాసు సింగారెడ్డి , వీరయ్య కట్టెపోగు, ఆంజనేయులు బిక్కా, మోహన్ పోలుబోయెన, అంజలి అవనిగడ్డ, మధుసూదన్ రెడ్డి పల్లె, అంజిరెడ్డి, వెంకట్ రెడ్డి ఎనుముల, శ్రీకృష్ణ రెడ్డి గరిస, కృష్ణమోహన్ రెడ్డి, సుధాకర్ కుప్పిరెడ్డి, కిషోర్ మారంరెడ్డి, హరీష్ గోరంట్ల, హరి ఆత్మకూరి, వెంకట్ మాగంటి, రాజేష్ యార్లగడ్డ , శ్రీమతి కల్పన జోసెఫ్, శివమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు కెనడాలో.. కెనడాలోని టొరంటోలో వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ కమిటీ సభ్యులు కేక్ కట్ చేసి వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు అలూరు సాంబశివరెడ్డి, చల్లా మధుసూదన్ రెడ్డి, కార్తీక్ ఎల్లాప్రగడ, డాక్టర్ జగన్మోహన్ రెడ్డి, డాక్టర్ ప్రదీప్ చింతా, పార్టీ కెనడా కన్వీనర్ వేణు చుక్కలూరు వర్చువల్గా పాల్గొన్నారు. టొరంటోలో జరిగిన కార్యక్రమంలో నరసింహ రెడ్డి గుట్టిరెడ్డి, చెన్న కేశవ, ప్రతాప్ బొల్లారం, ఆరిఫ్, నూర్, శ్రీనివాస్ రెడ్డి మరెక్కగారి, చంద్రహాస్ చల్లా, శాలిని బెక్కం, కృష్ణ రెడ్డి అల్లంపాటి, కృష్ణ చిదిరాల, శ్రీకాంత్ మద్దిరెడ్డి, రమేష్ తుంపర, సుబ్బా రావు, గుణశేఖర్ కొనపల్లి, విష్ణు వంగాల, కల్యాణ్ గుర్రంకొండ, శైలేష్ పాల్యం తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా ఆధ్వర్యంలో జోహన్నెస్బర్గ్లో భారీ కేక్ కట్ చేస్తున్న అభిమానులు ఆస్ట్రేలియాలో.. ఆ్రస్టేలియాలోని బ్రిస్బేన్లో వైఎస్సార్సీపీ స్థానిక నాయకులు, అభిమానులు వైఎస్సార్ చిత్రపటానికి నివాళులు అరి్పంచారు. అనంతరం కేక్ను కట్ చేశారు. ఈ వేడుకల్లో బ్రహ్మరెడ్డి ఎరువూరి, కిషోర్, జస్వంత్ బొమ్మిరెడ్డి, వంశీ చాగంటి, శ్రీనివాసులు రెడ్డి, చిన్నప్ప, శౌర్య పాల్గొన్నారు. అలాగే, కందుల భరత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలోని అన్ని రాష్ట్రాల్లో వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నార్తన్ టెరిటోరీలోని డారి్వన్ నగరంలో కొమ్మిరెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి, శివ హర్షవర్థన్ రెడ్డి వంగ, లక్ష్మణ్ రెడ్డి, రాఘవేంద్ర రావు, శ్యామ్ సుందర్ రెడ్డి, రవితేజ మదినేని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెర్త్లో జరిగిన కార్యక్రమంలో వంశీ కృష్ణా రెడ్డి, యశ్వంత్, సతీష్ త్రినాథ్, వినయ్, శరత్ తదితరులు పాల్గొన్నారు. ఆస్ట్రేలియాలోని డార్విన్ నగరంలో కేక్ కట్ చేస్తున్న వైఎస్సార్ అభిమానులు మెల్బోర్న్లో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఆ్రస్టేలియా కన్వీనర్ భరత్, విక్టోరియా కన్వీనర్ కృష్ణా రెడ్డి, సహ కన్వీనర్ రామాంజి, కోర్ టీమ్ సభ్యులు శిరీష, స్వాతి, యశు, బ్రహ్మ రెడ్డి, పవన్, సురేష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, అబ్దుల్, రవి వర్మ, తేరా జయవర్ధన్ రెడ్డి, శ్రీనాథ్, నితీష్, ప్రణీత్, రోహిత్, అభిష్క్, ఉదయ్, భార్గవ్, యశ్వంత్, దశరథ్ రెడ్డి, పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం గ్లోబల్ కో–ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి, పార్టీ నేతలు నూర్ ఫాతిమా, గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, కారుమూరి వెంకటరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని ప్రసంగించారు.ఆస్ట్రేలియాలోని పెర్త్లో వైఎస్సార్ జయంతి వేడుకలు -
ఆ లాక్కెళ్లడం ఏంటండీ.. అరెస్ట్ప శృంగారపాటి సందీప్ రియాక్షన్
-
నేడు వైఎస్సార్ జయంతి
సాక్షి, అమరావతి: మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంత్యుత్సవం బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి తెలిపారు.పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పార్టీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొంటారని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ జయంత్యుత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు -
విదేశాల్లో ఘనంగా డాక్టర్ వైఎస్సార్ జయంతి
సాక్షి,అమరావతి/తిరుపతి మంగళం: మహానేత, దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతిని విదేశాల్లో ప్రవాసాంధ్రులు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా ఆధ్వ ర్యంలో జోహన్నెస్బర్గ్లోని మిడ్రాండ్లో జరిగిన కార్యక్రమానికి వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా కన్వినర్ విక్రమ్ రెడ్డి పెట్లూరు అధ్యక్షత వహించారు. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్ను కట్ చేసి అన్నదానం చేపట్టారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా ప్రతినిధులు నరసింహ రెడ్డి కల్లా, సూర్య రామిరెడ్డి, మురళి సోమిశెట్టి, శివ రాజవరపు, బి వెంకట సుబ్బా రెడ్డి , వాసు సింగారెడ్డి , వీరయ్య కట్టెపోగు, ఆంజనేయులు బిక్కా, మోహన్ పోలుబోయెన, అంజలి అవనిగడ్డ, మధుసూదన్ రెడ్డి పల్లె, అంజిరెడ్డి, వెంకట్ రెడ్డి ఎనుముల, శ్రీకృష్ణ రెడ్డి గరిస, కృష్ణమోహన్ రెడ్డి, సుధాకర్ కుప్పిరెడ్డి, కిషోర్ మారంరెడ్డి, హరీష్ గోరంట్ల, హరి ఆత్మకూరి, వెంకట్ మాగంటి, రాజేష్ యార్లగడ్డ , శ్రీమతి కల్పన జోసెఫ్, శివమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కెనడాలో.. కెనడాలోని టొరంటోలో వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ కమిటీ సభ్యులు కేక్ కట్ చేసి వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు అలూరు సాంబశివరెడ్డి, చల్లా మధుసూదన్ రెడ్డి, కార్తీక్ ఎల్లాప్రగడ, డాక్టర్ జగన్మోహన్ రెడ్డి, డాక్టర్ ప్రదీప్ చింతా, పార్టీ కెనడా కన్వినర్ వేణు చుక్కలూరు వర్చువల్గా పాల్గొన్నారు. టొరంటోలో జరిగిన కార్యక్రమంలో నరసింహ రెడ్డి గుట్టిరెడ్డి, చెన్న కేశవ, ప్రతాప్ బొల్లారం, ఆరిఫ్, నూర్, శ్రీనివాస్ రెడ్డి మరెక్కగారి, చంద్రహాస్ చల్లా, శాలిని బెక్కం, కృష్ణ రెడ్డి అల్లంపాటి, కృష్ణ చిదిరాల, శ్రీకాంత్ మద్దిరెడ్డి, రమేష్ తుంపర, సుబ్బా రావు, గుణశేఖర్ కొనపల్లి, విష్ణు వంగాల, కల్యాణ్ గుర్రంకొండ, శైలేష్ పాల్యం తదితరులు పాల్గొన్నారు. ఆస్ట్రేలియాలో.. ఆ్రస్టేలియాలోని బ్రిస్బేన్లో వైఎస్సార్సీపీ స్థానిక నాయకులు, అభిమానులు వైఎస్సార్ చిత్రపటానికి నివాళులు అరి్పంచారు. అనంతరం కేక్ను కట్ చేశారు. ఈ వేడుకల్లో బ్రహ్మరెడ్డి ఎరువూరి, కిషోర్, జస్వంత్ బొమ్మిరెడ్డి, వంశీ చాగంటి, శ్రీనివాసులు రెడ్డి, చిన్నప్ప, శౌర్య పాల్గొన్నారు. అలాగే, కందుల భరత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలోని అన్ని రాష్ట్రాల్లో వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నార్తన్ టెరిటోరీలోని డారి్వన్ నగరంలో కొమ్మిరెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి, శివ హర్షవర్థన్ రెడ్డి వంగ, లక్ష్మణ్ రెడ్డి, రాఘవేంద్ర రావు, శ్యామ్ సుందర్ రెడ్డి, రవితేజ మదినేని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు పెర్త్లో జరిగిన కార్యక్రమంలో వంశీ కృష్ణా రెడ్డి, యశ్వంత్, సతీష్, త్రినాథ్, వినయ్, శరత్ తదితరులు పాల్గొన్నారు. మెల్బోర్న్లో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఆ్రస్టేలియా కన్వినర్ భరత్, విక్టోరియా కన్వినర్ కృష్ణా రెడ్డి, సహ కన్వినర్ రామాంజి, కోర్ టీమ్ సభ్యులు శిరీష, స్వాతి, యశు, బ్రహ్మ రెడ్డి, పవన్, సురేష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, అబ్దుల్, రవి వర్మ, తేరా జయవర్ధన్ రెడ్డి, శ్రీనాథ్, నితీష్, ప్రణీత్, రోహిత్, అభిషేక్, ఉదయ్, భార్గవ్, యశ్వంత్, దశరథ్ రెడ్డి, పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం గ్లోబల్ కో–ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి, పార్టీ నేతలు నూర్ ఫాతిమా, గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, కారుమూరి వెంకటరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని ప్రసంగించారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో వైఎస్సార్ జయంతి వేడుకలు -
తెరమీద చంద్రబాబు, పవన్.. తెర వెనుక ఆయన: పేర్ని నాని
బందరు: హోంగార్డుల సమస్యలను పట్టించుకోని కూటమి సర్కారుపై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. బందరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో పేర్ని నాని మాట్లాడారు.‘‘చంద్రబాబు, పవన్ కల్యాణ్ రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ తెరమీద కనిపిస్తారు. తెర వెనుక లోకేశ్ ఉంటారు. హోంగార్డుల జీతం నెలకు రూ.21 వేలు. హోంగార్డులకు రూ.18 వేలు ఉండే జీతాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూ.21 వేలకు పెంచారు. నెలకు రెండు రోజుల సెలవుతో హోంగార్డులకు రూ.21 వేల జీతం ఇచ్చారు. కానిస్టేబుళ్లు నిర్వహించే విధులనే హోంగార్డులు నిర్వహించాలి. హోంగార్డులు ఆత్మాభిమానం చంపుకుని ఉద్యోగం చేస్తున్నారు’’ అని పేర్ని నాని చెప్పారు. -
వైఎస్ జగన్ను కలిసిన ఉపాధ్యాయ సంఘాలు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఇవాళ ఉపాధ్యాయ సంఘం నేతలు కలిశారు. తమ సమస్యలపై వైఎస్ జగన్కు ఉపాధ్యాయులు వినతి పత్రం ఇచ్చారు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నిబంధన సరికాదని వైఎస్ జగన్కు ఉపాధ్యాయులు వివరించారు.బీఈడీతో ఉద్యోగం పొందిన 25 ఏళ్ల తర్వాత మళ్లీ టెట్ రాయాలనడం సరికాదని ఉపాధ్యాయులు అన్నారు. ఈ అంశంపై వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్రంతో మాట్లాడతారని హామీ ఇచ్చిన వైఎస్ జగన్.. సమస్యను కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. -
‘వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే అందరికీ న్యాయం’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇవాళ భాకరాపురం క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ ప్రజాదర్బార్ నిర్వహించారు. ఆయన్ని కలిసేందుకు భారీ ఎత్తున యువత తరలివచ్చారు. క్యాంప్ కార్యాలయం వద్ద బారులు తీరారు.ప్రజల నుంచి వైఎస్ జగన్ వినతులు స్వీకరించారు. సంక్షేమ పథకాలు అందడం లేదని వైఎస్ జగన్కు ప్రజలు ఫిర్యాదు చేశారు. కూటమి పాలనలో పేదలను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చిన వైఎస్ జగన్.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. వైఎస్ జగన్ను కలిసిన ఉపాధ్యాయులువైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఇవాళ ఉపాధ్యాయ సంఘం నేతలు కలిశారు. తమ సమస్యలపై వైఎస్ జగన్కు ఉపాధ్యాయులు వినతి పత్రం ఇచ్చారు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నిబంధన సరికాదని వైఎస్ జగన్కు ఉపాధ్యాయులు వివరించారు. బీఈడీతో ఉద్యోగం పొందిన 25 ఏళ్ల తర్వాత మళ్లీ టెట్ రాయాలనడం సరికాదని ఉపాధ్యాయులు అన్నారు. ఈ అంశంపై వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్రంతో మాట్లాడతారని హామీ ఇచ్చిన వైఎస్ జగన్.. సమస్యను కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.కాగా, రేపు(జులై 8, బుధవారం) ఉదయం వైఎస్ జగన్.. పులివెందుల నుంచి బయలుదేరి ఉదయం 7.30 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని నివాళులర్పిస్తారు. -
"ఉపము"ని ప్రశ్నిస్తే "ఉపా" కేసు... మీలాంటి రాజకీయ హిందువులందరినీ...
-
ఎక్కడికి తీసుకెళ్తున్నారు... YSRCP శృంగరపాటి సందీప్ కుమార్ బలవంతపు అక్రమ అరెస్ట్


