breaking news
YSRCP
-
వైఎస్ జగన్ అనకాపల్లి, విశాఖ జిల్లాల పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం అనకాపల్లి,విశాఖ జిల్లాలలో పర్యటించనున్నారు. ఈ మేరకు వైఎస్ జగన్ జగన్ పర్యటన వివరాలను వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది. ఆ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. వైఎస్ జగన్ రేపు (09.10.2025) ఉదయం 9.20 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు, అక్కడినుంచి అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం భీమబోయినపాలెం (వయా-ఎన్ఏడీ జంక్షన్, వేపకుంట, పెందుర్తి, కొత్తూరు జంక్షన్, తాళ్ళపాలెం జంక్షన్) వెళ్ళి మధ్యలో నిర్మాణం నిలిపివేసిన ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం అక్కడినుంచి బయలుదేరి విశాఖపట్నం కేజీహెచ్ (వయా - తాళ్ళపాలెం జంక్షన్, కొత్తూరు జంక్షన్, పెందుర్తి, వేపకుంట, ఎన్ఏడీ జంక్షన్)కు చేరుకుంటారు. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న గిరిజన విద్యార్ధులను పరామర్శిస్తారు. అనంతరం సాయంత్రం అక్కడి నుంచి తిరుగుపయనమవుతారు. -
‘నకిలీ మద్యం కేసును సీబీఐతో విచారణ జరిపించాలి’
సాక్షి,అమరావతి: టీడీపీ పెద్దల నకిలీ మద్యం సిండికేట్ అమాయకుల ప్రాణాలను హరిస్తూ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తోంది. ప్రాంతాల వారీగా నకిలీ మద్యం ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంది. ఈ నకిలీ మద్యం దందాపై సీబీఐతో విచారణ చేపట్టాలని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి డిమాండ్ చేశారు.2024 ఎన్నికల మందు తంబెళ్లపల్లె టీడీపీ ఇన్చార్జ్ జయచంద్రారెడ్డి భాగస్వామ్యంతో అక్రమ మద్యం వ్యాపారం సాగించారు. కూటమి అధికారంలోకి రావడంతో అధికారమే అండగా రెచ్చిపోయారు. తంబళ్లపల్లె,ఇబ్రహీంపట్నం స్థావరాలుగా నకిలీ మద్యం తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసుకుని పలు ప్రాంతాలకు తరలించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కనుసన్నల్లో విచ్చలవిడిగా కొనసాగుతున్న నకిలీ మద్యం దందాపై ఎంపీ మిథున్రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడారు.టీడీపీ నేతలే నకిలీ మద్యం కేసులో దొరికారు. రాష్ట్రంలో డంపులు డంపులుగా నకిలీ మద్యం సీజ్ అవుతోంది. టీడీపీ నేతలు నకిలీ మద్యాన్ని అనేక చోట్ల తయారు చేస్తున్నారు.. నా నియోజకవర్గ పరిధి లో ఉన్న తంబాళపల్లిలో చిన్న పరిశ్రమనే స్టార్ట్ చేశారు. తంబళ్ళపల్లెలో టీడీపీ తరుపున పోటీ చేసిన వ్యక్తే పట్టుబడ్డాడు. జయచంద్ర రెడ్డి అనే వ్యక్తి టీడీపీ మనిషి. ఇంత నిస్సిగ్గుగా మీ నాయకులే పట్టుబడితే.. మా మీద ఆరోపణలు చేస్తున్నారు.వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళారు. వాళ్ళు మా కోవర్టులు అంటున్నారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ముగ్గురు, నలుగురు ఇప్పుడు కేబినెట్లో ఉన్నారు. కెబినెట్ మంత్రులు కూడా మా కోవర్టులే అవుతారా? దీనిపై నిజనిజాలు ప్రజలకు తెలియాలి. రాష్ట్ర అధికారులతో విచారణ చేస్తే దర్యాప్తు తప్పుదోవ పడుతుంది. అందుకే సీబీఐతోనే నకిలీ లిక్కర్పై విచారణ జరిపించాలి’ అని డిమాండ్ చేశారు. -
ఏపీని చంద్రబాబు మద్యాంధ్రప్రదేశ్గా మార్చారు: కాకాణి పూజిత
సాక్షి, నెల్లూరు జిల్లా: నెల్లూరు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం ముందు వైఎస్సార్సీపీ నిరసనకు దిగింది. మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత ఆధ్వర్వంలో నిరసన చేపట్టారు. రాష్ట్రంలో ఎన్ బ్రాండ్ నకిలీ మద్యం తయారీ, అమ్మకాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం సీసాలతో మహిళలు నిరసన తెలిపారు. ఏపీని చంద్రబాబు మద్యాంధ్రప్రదేశ్గా మార్చారని కాకాణి పూజిత దుయ్యబట్టారు. యూరియా కోసం క్యూలైన్లో నిల్చొవాలి.. కానీ మద్యం మాత్రం ఎక్కడైనా దొరుకుతుందంటూ మండిపడ్డారు.కర్నూలు: ఎక్సైజ్ కార్యాలయం ఎదుట వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కల్తీ మద్యంతో ప్రాణాలు తీస్తున్న కూటమి ప్రభుత్వంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ మద్యాని విక్రయాలను నిరసిస్తూ మద్యం బాటిళ్లను ధ్వంసం చేసి వైఎస్సార్సీపీ మహిళా విభాగం నిరసన వ్యక్తం చేసింది. తక్షణమే కల్తీ లిక్కర్ను అరికట్టాలని.. బెల్టు షాపులు తొలగించాలని మహిళలు డిమాండ్ చేశారు.అనంతపురం: కల్తీ మద్యంపై మహిళలు, యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం ఎక్సైజ్ డీసీ కార్యాలయం ఎదుట వైఎస్సార్సీపీ మహిళా, యువజన విభాగం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మద్యం బాటిళ్లు ధ్వంసం చేసి నిరసన తెలిపారు. కల్తీ మద్యం తయారు చేసే టీడీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కల్తీ మద్యం అరికట్టండి. పేదల ప్రాణాలు కాపాడాలంటూ నినాదాలు చేశారు. -
‘గిరిజన విద్యార్థులు చనిపోతే సీఎం చంద్రబాబు పట్టించుకోరా?’
కేజీహెచ్(విశాఖ): పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం గురుకుల బాలికల పాఠశాలకు చెందిన విద్యార్థులు పచ్చ కామెర్ల బారిన పడితే ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టింకోరా? అని నిలదీశారు వైఎస్సార్సీపీ నేత సీదిరి అప్పలరాజు. ఇందులో ఇద్దురు విద్యార్థినులు చనిపోయినా చంద్రబాబు గానీ, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం కానీ కనీసం పట్టించుకోలేదన్నారు. ఈరోజు(బుధవారం, అక్టోబర్ 8వ తేదీ) విద్యార్థులను పరామర్శించడానికి విశాఖ కేజీహెచ్కు వెళ్లిన సీదిరి అప్పలరాజు.. మీడియాతో మాట్లాడారు. ‘ గిరిజన విద్యార్థులు చనిపోతే సీఎం చంద్రబాబు పట్టించుకోరా?,గిరిజన విద్యార్థుల ఆరోగ్యం ప్రభుత్వానికి పట్టదా?, పవన్కు జలుబు చేస్తే సీఎం చంద్రబాబు పరామర్శిస్తారు. గిరిజన విద్యార్థుల మరణాలు.. ప్రభుత్వ హత్యలే. గతంలె నాడు-నేడు ద్వారా విద్యార్థులకు ఎన్నో సౌకర్యాలు కల్పించాం’ అని సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. కాగా, పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం గురుకుల బాలికల పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థినులు పచ్చకామెర్ల బారిన పడిన విషయం తెలిసిందే. వీరిలో తొమ్మిదో తరగతి విద్యార్థిని తోయిక కల్పన, 10వ తరగతికి చెందిన పువ్వల అంజలి పచ్చకామెర్లతో మృత్యువాత పడ్డారు. మంగళవారం మరో ఏడుగురు విద్యార్థినులు ఆస్పత్రిలో చేరడంతో.. ప్రస్తుతం కేజీహెచ్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 50కి చేరుకుంది. ప్రాథమిక చికిత్స కోసం కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రంలో 15 మంది విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. కేజీహెచ్ ఆస్పత్రి నుంచి రికవరీ అయిన కొంతమందిని డిశ్చార్జ్ చేసినట్లు తెలుస్తోంది. పాఠశాలలో మంచి నీటి వసతులు, మరుగుదొడ్లు, మరియు పోషకాహారం సరిగా లేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. -
వైఎస్ జగన్ను కలిసిన డీఎస్సీ అభ్యర్థులు
తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని డీఎస్సీ అభ్యర్థులు కలిశారు. డీఎస్సీ-2025 ను రద్దు చేసేలే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. రీ నోటిఫికేషన్ ఇచ్చి ఒకే పేపర్తో పరీక్ష నిర్వహించాలని అభ్యర్థులు కోరారు. నచ్చినట్లుగా మార్కులు కలిపే నార్మలైజేషన్ విధానం మోసపూరితంగా ఉందని డీఎస్సీ అభ్యర్థులు అన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 77 రద్దుచేసేలా ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. డిఎస్సీ అభ్యర్థుల విజ్ఞప్తి పట్ల వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు. -
Jogi: సుబ్బారెడ్డి అన్న జగన్ దమ్ము ఏంటో చెప్పిన వాళ్ళిద్దరికీ సన్మానం చేద్దాం
-
మాజీ మంత్రి జోగి రమేష్పై మరో అక్రమ కేసు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: మాజీ మంత్రి జోగి రమేష్పై చంద్రబాబు సర్కార్ మరో అక్రమ కేసు నమోదైంది. టీడీపీ నేతల కల్తీ మద్యాన్ని ప్రశ్నించినందుకు చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం కేసులో ఏ1 టీడీపీ నేత అద్దేపల్లి జనార్ధనరావుకు చెందిన గోడౌన్లో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు నిర్వహించగా.. భారీ కల్తీ మద్యం తయారీ డెన్ బయటపడింది.పచ్చ నేత కల్తీ మద్యం డెన్ను పరిశీలించిన మాజీ మంత్రి జోగి రమేష్.. టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల కల్తీ మద్యాన్ని ప్రశ్నించడంతో ఆయనపై పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారు. తమ విధులకు అడ్డంకి కలిగించడంతో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారంటూ కేసు నమోదు చేశారు. ఇబ్రహీంపట్నం స్టేషన్లో ఎక్సైజ్ ఎస్ఐ పెద్దిరాజు ఫిర్యాదు చేశారు. జోగి రమేష్తో పాటు మరో 25 మందిపై కేసు నమోదైంది. -
KK Raju: వైఎస్ జగన్ ను కలవకూడదనే రూట్ మ్యాప్ మార్చుతున్నారు
-
జగన్ పర్యటనను ఆంక్షలతో అడ్డుకోలేరు: గుడివాడ అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనపై ఆంక్షలు పెట్టడం ఏంటీ? అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘వైఎస్ జగన్ రోడ్డు మార్గాన రావడానికి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. వైఎస్ జగన్ హెలికాఫ్టర్లో వస్తే పరిశీలిస్తామని పోలీసులు చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రతిపాదించిన రూట్ మ్యాప్ కాకుండా ఖాకీలు వేరే రూట్ మ్యాప్ ఇచ్చారు. విశాఖ స్టీల్ప్లాంట్ కార్మికులను కలవకుండా కూటమి కుట్రలు పన్నుతుంది’’ అంటూ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్ జగన్ పర్యటనకు అనేక అడ్డంకులను కూటమి ప్రభుత్వం సృష్టిస్తోంది. వైఎస్ జగన్ పర్యటనపై విశాఖ అనకాపల్లి జిల్లాల పోలీసులకు అనేక సార్లు సమాచారం ఇచ్చాము. జగన్కు భద్రత కల్పించమని అడిగాము. విశాఖ ఎయిర్ పోర్టు మీదగా గాజువాక, కూర్మనపాలెం, అనకాపల్లి మీదగా నర్సీపట్నం వెళ్లేందుకు అనుమతి అడిగాము. రూట్ మార్చి పోలీసుకు రూట్ మ్యాప్ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు జగన్ను కవలకూడదు అని రూట్ మార్చారు.ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ను కాపాడుతామని హామీ ఇచ్చారు. ఎంతోమంది స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాలు కోల్పోయారు. ప్రజల సమస్యలు మాకు ముఖ్యం. కాబట్టి పోలీసులు అనుమతి ఇచ్చిన మార్గంలోనే వైఎస్ జగన్ వెళ్తారు. స్టీల్ ప్లాంట్, బల్క్ డ్రగ్ పార్క్, గోవాడ షుగర్ ఫ్యాక్టరీ, మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చాలా ముఖ్యమైన అంశాలు. వైఎస్ జగన్ పర్యటనకు 18 నిబంధనలతో ఆంక్షలు పెట్టారు. ఎయిర్ పోర్టు, ఎన్ఏడీ, గోపాలపట్నం, పెందుర్తి, అనకాపల్లి మీదగా నర్సీపట్నం మెడికల్ కాలేజీ కి వెళ్తారు. పోలీసుల ఆంక్షలతో జగన్ పర్యటనకు వచ్చే ప్రజలను అడ్డుకోలేరు.చంద్రబాబు పర్యటనలో పుష్కరాల సమయంలో 29 మంది భక్తులు చనిపోయారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో చంద్రబాబు పర్యటనలో ప్రజలు చనిపోయారు. వాటిని పోలీసులు ఎందుకు పోలీసుల లేఖలో ప్రస్తావించలేదు. కరూర్ అంశాన్ని మాత్రమే ఎందుకు ప్రస్తావించారు. చంద్రబాబు ఆదేశాలు మీద పోలీసు అధికారులు సంతకం పెట్టారు. పోలీసులు ఆంక్షలు పెట్టడం సరికాదు. వాటిపై పునరాలోచన చేయాలి’’ అని అమర్నాథ్ కోరారు.‘‘ఏ రోజు మేము జగన్ పర్యటనకు ఎంతమంది జనాలు వస్తారని చెప్పలేదు. పోలీసులు 65,000 మంది ప్రజలు వస్తారని చెప్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు లక్ష మంది వస్తారని చెప్తున్నారు. పల్లా మాటల ద్వారా కూటమి ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది. జగన్ పర్యటనకు ఎన్ని ఆంక్షలు పెడితే అంత పెద్ద ఎత్తున ప్రజలు నుంచి తిరుగుబాటు మొదలవుతుంది. రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ను డైవర్ట్ చేయడం కోసం వైఎస్ జగన్ పర్యటనపై రాద్ధాంతం చేస్తున్నారు...నిన్నటి వరకు జగన్ పర్యటనకు అనుమతి లేదన్నారు. ఈ రోజు రూటు మార్చి పర్యటన చేపట్టాలని పోలీసులు చెప్తున్నారు. లిక్కర్ స్కామ్లో నెలకు 1000 కోట్లు కూటమి నేతలు సంపాదించారు. 15 నెలల్లో 15 వేల కోట్లు అక్రమంగా సంపాదించారు. అక్రమ మైనింగ్లో కూటమి నేతల ప్రమేయం ఉందని టీడీపీ నేతలే చెబుతున్నారు.’’ అని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. -
ఆంధ్రప్రదేశ్కు పట్టిన గ్రహణమేమిటో?
ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది? ఒకపక్క నకిలీ మద్యం.. ఇంకోపక్క కలుషిత నీరు. ప్రజల ఆరోగ్యం గాల్లో దీపం అవుతోంది. ప్రభుత్వానికేమో ఏదీ పట్టదాయె! అధికార పార్టీ తన దందాల్లో బిజీ!. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ములకలచెరువు వద్ద నకిలీ మద్యం ప్లాంట్ను గుర్తించడం తెలుగుదేశం పార్టీ నేతల దుర్మార్గాలకు అద్దం పడుతోంది. అలాగే ప్రభుత్వ నిష్క్రియాపరత్వానికి కూడా. రాష్ట్రంలో అనకాపల్లి, పాలకొల్లు, గూడూరుల్లోనూ నకిలీ మద్యం అమ్ముతున్నట్లు గుర్తించారు. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద కూడా ఒక టీడీపీ నాయకుడి డంప్ ఒకటి బయటపడింది. వీటి పుణ్యమా అని ఏపీలో కల్తీ మద్యం ఏరులైపారుతోందన్నది కళ్ల ముందే కనిపిస్తోంది. ఎన్ని లక్షల మంది అనారోగ్యం పాలయ్యారో తెలియని పరిస్థితి. కల్తీ మద్యం అమ్మకాలకు ఒక నెట్ వర్క్.. తెలుగుదేశం నేతల అండ ఉండవచ్చని తెలుస్తోంది(AP Spurious Liquor Racket). జగన్ టైమ్లో ప్రతి చిన్న విషయాన్నీ భూతద్దంలో పెట్టి నానా యాగీ చేసిన చంద్రబాబు, ఆయన మిత్ర మీడియా ఇప్పుడు నిమ్మకు నీరెత్తితే ఒట్టు. పైగా నిందితులు వైసీపీ వారన్న కలరింగ్ ఇచ్చే ప్రయత్నాలు వెంటనే మొదలుపెట్టింది. తంబళ్లపల్లెలో టీడీపీ పక్షాన పోటీ చేసిన జయచంద్రా రెడ్డి వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడని, ఆయనే టీడీపీలోకి పంపించారని చిత్రమైన ప్రచారం ఆరంభించింది. చంద్రబాబును కాపాడేందుకా? అన్నట్టు నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టవదన్నారని కథనాలు వండి వార్చింది. అన్ని కోణాలలో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని చంద్రబాబు అన్నారట. నిష్పక్షపాతం వరకు ఓకే గాని, అన్ని కోణాల్లో అనడంలోనే మతలబు ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కొందరు మంత్రులకూ సంబంధం ఉన్న ఈ కేసు నిందితులను చంద్రబాబు కాపాడుతున్నారని ఆరోపించారు. పైకి తూతూ మంత్రంగా తంబళ్లపల్లె ఇన్ఛార్జి జయచంద్రా రెడ్డి, సురేంద్ర నాయుడులను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు టీడీపీ ప్రకటించింది. వీరికీ చంద్రబాబు, లోకేశ్లకు ఉన్న దగ్గరి సంబంధాలు, కలిసి దిగిన ఫొటోలిప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. జగన్ సీఎంగా ఉండగా ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించేది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఇదంతా ప్రైవేట్ వ్యక్తుల పరమైంది. ఈ క్రమంలో వేలాది దుకాణాలను దక్కించుకున్న టీడీపీ నేతలు ఇతరులకు దక్కకుండా ఎమ్మెల్యేల చేత భయపెట్టించిన వార్తలూ మనం చూశాం. మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూములు కాస్తా మినీబార్లుగా మారాయి. వీటికి లెక్కకు మిక్కిలి బెల్ట్ షాపులు వెలిశాయి. ఒక్క తంబళ్లపల్లె నియోజకవర్గంలోనే వెయ్యి బెల్ట్ షాపులు ఉండగా..రాష్ట్రం మొత్తమ్మీద వీటి సంఖ్య లక్షకు మించిపోయాయని తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చే మీడియానే అంచనా వేస్తోంది. ఈ బెల్ట్ షాపులతోపాటు అనుమతి కలిగిన మద్యం దుకాణాలకూ కల్తీమద్యం సరఫరా అయి ఉంటుందన్నది కొందరి అనుమానం. ములకల చెరువు నకిలీ మద్యం కేసు నిందితులు కొంతమందికి లైసెన్స్డ్ వైన్ షాపులు కూడా ఉండటం గమనార్హం.అప్పట్లో చంద్రబాబు నాసిరకం మద్యం వల్ల 30 వేల మంది చనిపోయారని నిరాధారంగా ఆరోపిస్తే(Chandrababu AP Spurious Liquor Racket Drama).. ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర టీడీపీ మీడియా చిలువలు వలువలు చేసింది. టీడీపీ నేతలు స్వయంగా విషపూరిత మద్యం సరఫరా వెనుక ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నా పట్టించుకోవడం లేదు. అత్యంత ప్రమాదకరమైన స్పిరిట్కే రంగులు, ఎస్సెన్స్లు కలిపి, గుర్తింపు పొందిన బ్రాండ్ల బాటిళ్లలో నింపి మార్కెట్ లోకి వదలుతున్నట్లు వెల్లడవుతోంది. నాణ్యమైన మద్యం రూ.99 రూపాయలకే ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి మరీ గద్దెనెక్కిన కూటమి నేతలిప్పుడు ఏకంగా విషం ఇస్తున్నారని వీటి బారినపడి ఎన్నివేల మంది అనారోగ్యానికి గురయ్యారో, ఎంతమంది అకాల మృత్యువుకు గురయ్యారో ఎవరూ చెప్పలేకపోతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. కూటమి పాలనలో నకిలీ మద్యం ఒక పరిశ్రమగా(Kutami Prabhutvam Fake Liquor) వర్ధిల్లుతోందని, ప్రజలకు ఉపాధి, మేలు కలిగించే పరిశ్రమలు ఏవీ రావడం లేదని విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో డిస్టిలరీల నుంచి ముడుపులు తీసుకున్నారంటూ ఒక కల్పిత స్కామ్ ను సృష్టించి ఎవరెవరిపైనో దాడులు చేస్తూ, పలువురు ప్రముఖులపై కేసులు పెట్టిన చంద్రబాబు సర్కార్, ఇంత పెద్ద నకిలీ మద్యం స్కామ్ జరిగితే ఆ స్థాయిలో విచారణ చేయించే పరిస్థితి కనబడడం లేదని అంటున్నారు.ములకల చెరువు నకిలీ మద్యం దందా విలువ సుమారు రూ.6,000 కోట్లంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎక్సైజ్ అధికారులకు వెయ్యి లీటర్లకుపైగా స్పిరిట్, వేల బాటిళ్ల నకిలీ మద్యం పట్టుబడడం, జాతీయ రహదారికి కిలోమీటరు దూరంలోనే అన్ని రకాల యంత్ర సామాగ్రీ, హంగులతో ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారంటే.. పై స్థాయి నుంచి గట్టి మద్దతే ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ కేసులో జనార్ధనరావు అనే నిందితుడికి విజయవాడ వద్ద కూడా ఒక బార్ లైసెన్స్ ఉందట. ఈయన తంబళ్లపల్లెకు వెళ్లి ఈ నకిలీ మద్యం ప్లాంట్ పెట్టడానికి ఎవరి అండ ఉందన్నది దర్యాప్తు చేయవలసిన అధికారులు ఆ పని చేస్తారా? లేదా? అన్నదానిపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ములకల చెరువు కేసులో అసలు సూత్రధారులను తప్పించేస్తున్నారన్న అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసులో వెలుగులోకి వచ్చిన డైరీలోని వివరాలు, పేర్లు ఎవరివి? సూత్రధారులు ఎవరు? వారిపై ఎందుకు కేసులు పెట్టలేదు? అన్న అంశాలపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్)ను ఎందుకు నియమించలేదు?.. ఒక వేళ నిజంగానే సిట్ ను ఏర్పాటు చేసినా, వారికి స్వేచ్చ ఉంటుందా?.. మరో వైపు కలుషిత నీరు వల్ల కురుపాం వద్ద గిరిజన విద్యార్థుల ఆశ్రమ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్ధులు మరణించారు. సుమారు వంద మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గుంటూరు సమీపంలోని తురకపాలెం గ్రామంలో 24 మంది అంతుపట్టని వ్యాధితో మృతి చెందారు. దీనికీ కలుషిత నీరే కారణం కావచ్చని భావిస్తున్నారు. మంచినీరు దొరుకుతుందో లేదో కాని, మద్యం విచ్చలవిడిగా పారుతోంది. దానికి తోడు విషపూరితమైన నకిలీ బ్రాండ్లు అడ్డూ, ఆపు లేకుండా అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు . ఫలితంగా అనేక అనర్ధాలు సమాజంలో ఏర్పడుతున్నాయి.అందువల్లే ఏపీకి ఏమైంది? అని ఆందోళన చెందాల్సి వస్తోంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ పోరుబాట... ఉద్యమాన్ని ఉదృతం చేయాలని పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ పిలుపు
-
మద్యం ఆదాయం బాబు మాఫియాకే: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మద్యం సరఫరా, విక్రయాలన్నీ ఒక మాఫియా వ్యవహారంలా సాగుతున్నాయని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికారంలోకి రాగానే ప్రభుత్వ దుకాణాలన్నీ మూసివేసిన సీఎం చంద్రబాబునాయుడు ఆయన మాఫియాకు సంబంధించిన ప్రైవేటు దుకాణాలను తెరపైకి తెచ్చారని ధ్వజమెత్తారు. ఊరూరా 70 వేలకుపైగా బెల్టు షాపులను నెలకొల్పి పోలీసు ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి మరీ మద్యం దుకాణాలకు వేలం పాటలు నిర్వహించారని దుయ్యబట్టారు. వేలం పాటలు పాడి డబ్బులు వసూలు చేసి.. మంత్రులకు ఇంత, ఎమ్మెల్యేకు ఇంత, పోలీసులకు ఇంత, పైన పెద్దబాబుకు, చిన్నబాబుకు ఇంత.. అంటూ మొత్తం డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను వారి నియంత్రణలోకి తీసుకున్నారన్నారు. ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒకటి నకిలీ మద్యాన్ని విక్రయిస్తూ ప్రాణాలను హరిస్తున్నారన్నారు. కుటీర పరిశ్రమలా నకిలీ మద్యం తయారీతో ఒకవైపు భారీగా దోపిడీ చేస్తూ మరోవైపు అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్సైజ్ అధికారులు ర్యాండమ్గా జరిపిన దాడుల్లో నకిలీ మద్యం తయారీ డంపులు భారీగా బహిర్గతమయ్యాయన్నారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి, కూటమి సర్కారు ప్రజా కంటక పాలనపై చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. యథేచ్ఛగా, అంతు లేకుండా సాగుతున్న కల్తీ మద్యం విషయాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని పార్టీ నేతలకు వైఎస్ జగన్ నిర్దేశించారు. కల్తీ మద్యానికి వ్యతిరేకంగా పార్టీ పరంగా పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరించి గవర్నర్కు అందజేస్తామన్నారు. సమావేశంలో జగన్ ఏమన్నారంటే.మద్యం మాఫియా నెట్వర్క్ఇవాళ మద్యం సరఫరా, విక్రయాలన్నీ ఒక మాఫియా వ్యవహారంలా సాగుతోంది. మొత్తం వ్యవస్థను తమ కంట్రోల్లోకి తీసుకున్న తరువాత ఎమ్మార్పీకి మించి మద్యం అమ్ముతున్నారు. వైన్ షాపుల పక్కనే పర్మిట్ రూముల్లో పెగ్గుల రూపంలో ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేటుకు లిక్కర్ అమ్మకాలు సాగిస్తున్నారు. వేలంపాటలో గ్రామాల్లో బెల్ట్ షాపులు పొందిన నిర్వాహకులు ఒక్కో బాటిల్పై రూ.20 నుంచి రూ.30 వరకు ఎక్కువ రేటుకు మద్యం అమ్ముతున్నారు. ఏ స్థాయిలో అవినీతి జరుగుతోందో కళ్ల ముందే కనిపిస్తోంది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం మాఫియా జేబుల్లోకి వెళ్తోంది. మరోవైపు డిస్టిలరీల నుంచి మద్యం సేకరణలో అక్రమాలు చేస్తున్నారు. ప్రముఖ బ్రాండెడ్ డిస్టిలరీల నుంచి కాకుండా బాగా డబ్బులిచ్చే (కమీషన్లు) డిస్టిలరీల నుంచి మద్యం సేకరిస్తున్నారు. వీళ్లకు కావాల్సిన డిస్టిలరీలకు ఇండెంట్లు ప్లేస్ చేసి వాళ్లకు సంబంధించిన సరుకు మాత్రమే అందుబాటులోకి తెస్తున్నారు. ఇవన్నీ వీళ్ల సొంత ఆదాయం పెంచుకునే ఎత్తుగడలు.నకిలీ లిక్కర్ తయారీదారులు, విక్రేతలు అందరూ టీడీపీ వాళ్లేనని వివరిస్తూ నిందితుడు కట్టా సురేంద్రనాయుడు.. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్తో ఉన్న ఫొటోలను చూపిస్తున్న వైఎస్ జగన్ నకిలీ మద్యంతో బరి తెగింపు.. బాబు పరిపాలనలో రాక్షసయుగంబాధ కలిగించే విషయం ఏమిటంటే.. వీళ్ల డబ్బు ఆశ ఏ స్థాయికి వెళ్లిపోయిందంటే.. ప్రజలు ఏం తాగినా పర్వాలేదు... చనిపోయినా పర్వాలేదు.. తమ జేబుల్లోకి డబ్బులు ఇంకా ఎక్కువగా రావాలనే తలంపుతో దారుణంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు పరిపాలనలో రాక్షసయుగం నడుస్తోంది. భయభ్రాంతులకు గురి చేస్తూ పోలీసుల ద్వారా పరిపాలన సాగిస్తున్నారు. నకిలీ మద్యం ఏరులై పారుతోంది. ఆ మాఫియాను కంట్రోల్ చేసే కొందరు కేబినెట్ మంత్రులు, ప్రముఖ రాజకీయ పదవుల్లో ఉన్నవారు, పెద్దబాబు, చినబాబు ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారీ విచ్చలవిడిగా సాగుతోంది. ఏకంగా ఫ్యాక్టరీలు నెలకొల్పి క్వాలిటీ లేని లిక్కర్ తయారు చేసి వారి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా షాపుల్లోకి, బెల్ట్ షాపుల్లోకి నేరుగా పంపిస్తున్నారు.ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒకటి నకిలీ.. పరిశ్రమను స్థాపించి యంత్ర పూజ...మరో విషయం ఏమిటంటే.. ఇవాళ ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒకటి నకిలీ మద్యం బాటిల్. అది తాగి మనుషులు చనిపోతున్నారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జి జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జనార్దన్రావు, సురేంద్రనాయుడు ఈ నకిలీ మద్యం దందా నడుపుతున్నారు. వీళ్లపై పర్యవేక్షణ బాధ్యతలు మంత్రి రాంప్రసాద్రెడ్డికి అప్పగించారు. ములకలచెరువులో ఏకంగా పరిశ్రమను స్థాపించి పెద్ద సంఖ్యలో నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. దానికి సంబంధించిన ట్యాంక్, క్యాన్లు, బాటిళ్లు, మూతలు, బ్రాండెడ్ కంపెనీల పేరుతో నకిలీ లేబుళ్లు అన్నీ అక్కడ ఉన్నాయి. చివరకు దసరాకు అక్కడ యంత్ర పూజ కూడా చేశారు. అంటే అంత పకడ్బందీగా నకిలీ మద్యం తయారు చేస్తున్నారు.అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువులో బయటపడిన నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీలోని యంత్రాలు, మద్యం బాటిళ్ల ఫొటోలు చూపిస్తున్న వైఎస్ జగన్ ఒక్కో ఏరియా పంచుకున్నారు.. ఇబ్రహీంపట్నంలో రెండు భారీ డంప్లుఅధికార పార్టీ అండతో రాష్ట్రవ్యాప్తంగా నకిలీ మద్యం యూనిట్లు నెలకొల్పి ఒక్కొక్కరు ఒక్కో ఏరియా పంచుకున్నారు. ములకలచెరువులో నకిలీ మద్యం తయారు చేస్తున్న జనార్దన్రావు, సురేంద్రనాయుడు.. నారా లోకేశ్, చంద్రబాబుతో కలసి ఫొటోలు కూడా దిగారు. ఇక్కడ తయారైన నకిలీ సరుకు రాయలసీమలో మద్యం షాపులు, బెల్ట్షాపులకు పంపిణీ చేసే బాధ్యతను మంత్రి రాంప్రసాద్రెడ్డి సూçపర్వైజ్ చేస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ సామ్రాజ్యాన్ని విస్తరింపజేసేందుకు ఇబ్రహీంపట్నంలో ఏకంగా రెండు చోట్ల భారీగా నకిలీ మద్యం ఫ్యాక్టరీలు ఏర్పాటు చేశారు. రాయలసీమ నుంచి రవాణా చేస్తే ఖర్చు ఎక్కువ అవుతుందని ఇబ్రహీంపట్నంలోనే యూనిట్ ఏర్పాటు చేశారు. అక్కడ వాళ్లే బాటిళ్లు, లేబుల్స్, మూతలు తయారు చేసుకుంటూ బ్రాండ్లు కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా కార్టన్ బాక్సుల్లో స్పిరిట్ నింపిన డ్రమ్స్, ఖాళీ సీసాలు, బాటిళ్లను చూసి ఎక్సైజ్ అధికారులే విస్తుపోయారట. నర్సీపట్నంకు చెందిన నేత ఉత్తరాంధ్ర బాధ్యతలు చూసుకుంటారు. ఈయన స్పీకర్ అయ్యన్నపాత్రుడికి సన్నిహితుడు. ఏలూరుకు చెందిన వివాదాస్పద ఎమ్మెల్యే బాగా దౌర్జన్యం చేస్తాడని ఆయనకు ఉమ్మడి గోదావరి జిల్లా బాధ్యతలు అప్పగించారు. పాలకొల్లులో మరో పరిశ్రమ.. అక్కడ కూడా మిషన్, క్యాన్లు, బాటిళ్లు, లేబుల్స్ అన్నీ ఏర్పాటు చేశారు. అమలాపురంలో కూడా మిషన్లు, కల్తీ మద్యం, బాటిల్స్, లేబుల్స్, మూతలు, స్పిరిట్ అన్నీ అమర్చుకున్నారు. నెల్లూరులో డిస్ట్రిబ్యూషన్ ఛానల్, అనకాపల్లి జిల్లా పరవాడలో పరిశ్రమ ఏర్పాటు చేశారు. నకిలీ మద్యానికి అమాయకులు బలి..ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరులోని ఓ మద్యం షాపులో లిక్కర్ తాగిన కొద్దిసేపటికే షేక్ చిన్న మస్తాన్ మరణించాడు. జూపూడి వైన్ షాప్లో మద్యం తాగి ఇంటికి వెళ్తూ కిలేశ్వరం గ్రామానికి చెందిన నాగరాజు చనిపోయాడు. అనంతపురం జిల్లా గుంతకల్లులోని వైన్ షాపులో మద్యం సేవిస్తూ బెల్దారీ పెద్దన్న అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. నకిలీ మద్యానికి అమాయకులు బలి అవుతున్నారు (ఆ ఫొటోలను పీపీటీలో చూపారు).అనకాపల్లి జిల్లా పరవాడలో నకిలీ మద్యం తయారీ నిందితుడు రుత్తల రాము శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి సన్నిహితుడని తెలిపే ఫొటో చూపిస్తున్న వైఎస్ జగన్ దాడుల్లో వేలాదిగా నకిలీ బాటిళ్లు స్వాధీనం..రాష్ట్ర ముఖ్యమంత్రి డబ్బుల కోసం ఏ స్థాయిలోకి దిగజారి పోతున్నారంటే.. సొంత ఆదాయాలు పెంచుకునేందుకు రాష్ట్ర ఖజానాను లూటీ చేయడంతో సరిపెట్టుకోకుండా అమాయకుల జీవితాలతో చెల గాటమాడుతున్నారు. ఆయన రాష్ట్రాన్ని ఏ రకంగా లూటీ చేస్తున్నారో ఇవాళ స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా ఇబ్రహీంపట్నంలోని గోడౌన్లలో దాడులు చేసి నకిలీ మద్యం బాటిళ్లు, లేబుల్స్, సిద్ధం చేసిన వివిధ బ్రాండ్ల నకిలీ మద్యం, మిషన్లు, పెద్ద సంఖ్యలో ఖాళీ బాటిల్స్, లేబుల్స్ లేని బాటిల్స్, స్పిరిట్ను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. గోడౌన్లలో నిల్వ ఉంచిన 95 క్యాన్లలో 3,325 లీటర్ల స్పిరిట్ను సీజ్ చేశారు. అందులో ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ 725 బాటిల్స్, క్లాసిక్ బ్లూ 44 బాటిల్స్, కేరళ మాల్ట్ 384 బాటిల్స్, మంజీరా బ్లూ 24 బాటిల్స్.. ఇలా మొత్తం 1,300 బాటిళ్లను ఈ దాడుల్లో స్వాధీనం చేసుకున్నారు. లేబుల్స్ లేని 136 కేసులు, 6,578 బాటిల్స్, ఓఏబీ లేబుల్స్ 6,500, ఖాళీ బాటిల్స్ 22 వేలు, ఖాళీ కార్టూన్లు 6, ఒక మిషన్, రెండు పైపులను సీజ్ చేశారు. ఇవన్నీ చూస్తే ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.నకిలీ మద్యంపై ఆందోళన ఇలా..ప్రజల ప్రాణాలను హరిస్తున్న నకిలీ మద్యంపై పార్టీ పరంగా నిరసనలు తెలియచేయాలి. ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒకటి నకిలీ మద్యం విక్రయిస్తున్నారు. కల్తీ మద్యం వద్దు, మా ప్రాణాలను కాపాడాలని, అయ్యా చంద్రబాబు... మా ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని నియోజకవర్గ కేంద్రంలోని మద్యం దుకాణాల వద్ద ప్లకార్డులతో ఆందోళనలు చేయాలి. ఇందులో మహిళా విభాగాన్ని కూడా భాగస్వామిగా చేయాలి. మద్యం సేవించే వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని, పేదల ప్రాణాలతో ఆటలాడతారా అంటూ కల్తీ మద్యంపై నిరసనలు తెలియచేయాలి. నియోజకవర్గ ఇన్చార్జిల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించాలి.నాడు.. పరిమిత వేళల్లో క్వాలిటీతో విక్రయాలు..మన ప్రభుత్వ హయాంలో క్వాలిటీ లిక్కర్ ప్రఖ్యాతి గాంచిన డిస్టిలరీల నుంచి మాత్రమే ప్రొక్యూర్ జరిగేది. అది కూడా అంతకు ముందు ప్రభుత్వం ఎంపిక చేసిన 20 డిస్టిలరీల నుంచే సేకరించాం. పూర్తి క్వాలిటీ చెక్ తర్వాత, దారి తప్పకుండా నేరుగా ప్రభుత్వ దుకాణాలకు వచ్చేవి. అప్పుడు ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించింది కాబట్టి ఇష్టారీతిన కాకుండా నిర్దిష్ట సమయాల్లో మాత్రమే పరిమితంగా విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకున్నాం. మద్యం షాపులను 2,934కి తగ్గించాం. అక్రమ పర్మిట్ రూములతోపాటు 43 వేల బెల్టుషాప్లను పూర్తిగా రద్దు చేశాం. లాభాపేక్ష లేకుండా ప్రభుత్వమే షాపులు నడిపించడం వల్ల ఎక్కడా అక్రమాలు చోటు చేసుకోలేదు. నాడు సరఫరా చేసిన లిక్కర్ బాటిళ్ల మీద క్యూఆర్ కోడ్ ఉండేది. వాటిని స్కాన్ చేసి అమ్మేవారు. అందువల్ల క్వాలిటీ నూటికి నూరు శాతం ఉండేది. -
పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో అపశ్రుతి
సాక్షి, విజయనగరం: శ్రీపైడి తల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. బొత్స సత్యనారాయణ కుటుంబం కూర్చున్న వేదిక కుంగిపోయింది. ఉద్దేశపూర్వకంగా డీసీసీబీ వేదికను టీడీపీ నేతలు రద్దు చేశారు. 30 ఏళ్లుగా సిరిమానోత్సవం వీక్షిస్తున్న ప్రాంతానికి బొత్స కుటుంబాన్ని టీడీపీ నేతలు అనుమతించలేదు. అర్బన్ బ్యాంక్ ప్రాంగణంలో కూర్చోవాలంటూ ఆదేశించారు. సిరిమాను రథం తిరగకముందే వేదిక కుంగిపోయింది. కుంగిపోయిన వేదిక నుంచే ఉత్సవాన్ని బొత్స కుటుంబం వీక్షించారు. టీడీపీ దిగజారుడు రాజకీయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
‘ఆఫ్రికా వెళ్లి నకిలీ మద్యం తయారీకి ట్రైనింగ్ తీసుకున్నారు’
తాడేపల్లి: డబ్బుకోసం ఏదైనా చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధపడతారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. అందుకు మెడికల్ కాలేజీలను అమ్మకానికి పెట్టడమే ఉదాహరణ అని పేర్ని నాని మండిపడ్డారు. ఈ రోజు(మంగళవారం, అక్టోబర్ 7వ తేదీ) తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన పేర్ని నాని.. చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై ధ్వజమెత్తారు. ‘ ఈ నెల 9న నర్సీపట్నం మెడికల్కాలేజ్ సందర్శనకు వైఎస్ జగన్ వెళ్తారు. మేము ప్రజల నుంచి సంతకాల సేకరణ చేపడతాం. ప్రభుత్వంపై ప్రజాగ్రహం ఏ విధంగా ఉందో గవర్నర్కు చూపిస్తాం. మా హయాంలో మద్యం అమ్మకాలపై కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా అదేడిస్టరీలను కొనసాగించారు. కూటమి ప్రభుత్వంలో నకిలీ మద్యం తయారవుతోంది. ఈ ప్రభుత్వానికి అంతిమ గడియలు వచ్చాయి. ఆఫ్రికా వెళ్లి నకిలీ మద్యం తయారీకి టీడీపీ నేతలు ట్రైనింగ్ తీసుకున్నారు. నకిలీ మద్యం తయారీ వ్యవహారంలో ఎక్సైజ్ శాఖ మంత్రికి ముడుపులు అందుతున్నాయి’ అని మండిపడ్డారు.ఇదీ చదవండి: ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ పోరు.. ఇక రచ్చబండ, ధర్నాలు.. -
ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు: వైఎస్ జగన్ (ఫొటోలు)
-
వైఎస్ జగన్ పర్యటనపై చంద్రబాబు సర్కార్ ఆంక్షలు
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నర్సీపట్నం పర్యటనపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. మళ్లీ తమ కుట్రలకు తెరతీసిన ప్రభుత్వ పెద్దలు.. ఎల్లుండి( గురువారం,అక్టోబర్ 9) నర్సీపట్నం పర్యటనను అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. అనకాపల్లి ఎస్పీ తువీన్ సిన్హాతో చంద్రబాబు సర్కార్ ప్రకటన చేయించారు. గతంలోనూ జగన్ పర్యటనలకు చంద్రబాబు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించింది.ప్రజల్లోకి ఎప్పుడు వెళ్లినా ఏదో సాకు చూపుతూ చంద్రబాబు ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోంది. చివరికి రైతుల సమస్యలపై పోరాడినా ఆంక్షలే.. ఇప్పుడు మెడికల్ కాలేజీ సందర్శనకు వెళ్తున్నా అడ్డంకులే పెడుతోంది. ఎన్ని ఆటంకాలు సృష్టించినా పర్యటన ఆగేది లేదని వైఎస్సార్సీపీ తేల్చి చెప్పింది. విశాఖ ఎయిర్ పోర్టు నుంచి నర్సీపట్నం మెడికల్ కాలేజీకి వెళ్లి తీరుతామని స్పష్టం చేసింది.ఈ నెల 9వ తేదీన నర్సీపట్నం మెడికల్ కాలేజీని వైఎస్ జగన్ సందర్శించనున్నారు. రోడ్డు మార్గం గుండా వెళ్లనున్న వైఎస్ జగన్కు తమ సమస్యలు చెప్పుకునేందుకు బాధితులు సిద్ధమయ్యారు. వైఎస్ జగన్ను కలవడానికి స్టీల్ ప్లాంట్ కార్మికులు బల్క్ డ్రగ్ పార్క్ బాధితులు, గోవర్ షుగర్ ఫ్యాక్టరీ రైతులు సిద్ధమయ్యారు. బాధితులను వైఎస్ జగన్ను కలవనీయకుండా ప్రభుత్వం చేస్తోంది. పోలీస్ ఆంక్షలతో వైఎస్ జగన్ పర్యటనను ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. కూటమి ప్రభుత్వ తీరుపై వైఎస్సార్సీపీ శ్రేణులు మండిపడుతున్నారు. -
చంద్రబాబు ధ్యాసంతా అదే..: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఆయన ఇవాళ(మంగళవారం, అక్టోబర్ 7) తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో రీజినల్ కో-ఆర్డినేటర్లు, జిల్లాల అధ్యక్షులు, పార్లమెంటు పరిశీలకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా రెండేళ్లు కావొస్తోందని.. ఈ ప్రభుత్వం పట్ల ప్రజలకు భ్రమలు తొలగిపోయాయన్నారు.‘‘ఈ ప్రభుత్వం కళ్లార్పకుండా అబద్ధాలు చెప్తోంది. జంకు లేకుండా ప్రజలకు వెన్నుపోటు పొడుస్తోంది. వ్యవస్థలన్నీ నిర్వీర్యం, అరాచకం, అవినీతి కనిపిస్తున్నాయి. సీఎం చంద్రబాబుకు పాలనపై ధ్యాస లేదు. పూర్తిగా పాలన గాడితప్పింది. కేవలం సొంత ఆదాయాలు పెంచుకోవడం మీదే వీళ్ల ధ్యాస. విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయాలు తగ్గుతున్నాయి. చంద్రబాబు, ఆయన కుమారుడు, ఆయన బినామీలు.. వారి జేబుల్లోకి ఆదాయాలు వెళ్తున్నాయి. దోచుకో.. పంచుకో.. తినుకో.. కనిపిస్తోంది’’ అంటూ వైఎస్ జగన్ దుయ్యబట్టారు.‘‘అక్రమాలకు అవకాశం లేకుండా మన హయాంలో లిక్కర్ పాలసీ ఉండేది. క్వాలిటీ విషయంలో ఏరోజు కూడా రాజీ పడలేదు. లిక్కర్ కొనుగోలు ఎంపానెల్ డిస్టలరీస్ నుంచే కొనుగోలు. ప్రతికోటా క్రమం తప్పకుండా క్వాలిటీ చెక్ చేసేవాళ్లు. క్వాలిటీ చెక్ చేసిన తర్వాత మాత్రమే ప్రభుత్వ దుకాణాల్లోకి లిక్కర్. నిర్దిష్టమైన సమయాల్లోనే మాత్రమే లిక్కర్ అమ్మేవాళ్లం. షాపులు తగ్గించి, బెల్టుషాపులు ఎత్తివేశాం. లాభాపేక్ష లేకుండా ప్రభుత్వమే నిర్వహించింది. ఇల్లీగల్ పర్మిట్ రూమ్స్ రద్దు చేశాం. మూడింట ఒక వంతు షాపులు తగ్గించాం. మన హయాంలో ప్రతి బాటిల్పైన క్యూ ఆర్కోడ్ ఉండేది. ప్రతి బాటిల్ అమ్మేటప్పుడు క్యూ ఆర్కోడ్ స్కాన్ చేసి అమ్మేవాళ్లు. నూటికి నూరుశాతం క్వాలిటీతోనే మద్యం అమ్ముడుపోయేది...కాని, రాష్ట్రంలో ఇప్పుడు కల్తీ లిక్కర్ మాఫియా నడుస్తోంది. దీనికోసం ప్రభుత్వ దుకాణాలను మూసేశారు.. చంద్రబాబు, ఆయనకు సంబంధించిన మాఫియాకు ప్రైవేటు దుకాణాలు అప్పగించారు. వేలం పాట నిర్వహించి.. బెల్టుషాపులు వారి మనుషులకే అప్పగించారు. వీళ్లందరికీ మళ్లీ పోలీసుల నుంచి ప్రొటెక్షన్. ఎమ్మెల్యేకు ఇంత, పోలీసులకు ఇంత, పైనున్న పెదబాబుకు ఇంత, చినబాబుకు ఇంత అని పంచుకుంటున్నారు. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను మొత్తం చేతుల్లోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఇల్లీగల్గా ఆదాయాలు పెంచుకోవడానికి తెరలేపారు. వీరికి సంబంధించిన షాపుల నుంచి తమకు కావాల్సిన వారికి మాత్రమే ఆర్డర్లు ఇస్తున్నారు, ఇదోరకం మాఫియా...ఇదికాక మరో రకం మాఫియా నడుపుతున్నారు. ప్రజలు చనిపోయినా పర్వాలేదు, తమ జేబుల్లోకి డబ్బు వస్తే చాలనుకుంటున్నారు. చంద్రబాబు పరిపాలనలో రాక్షస పరిపాలన నడుస్తోంది. ఒక పద్ధతి ప్రకారం కల్తీ మద్యాన్ని పరిశ్రమ మాదిరిగా నడుపుతున్నారు. క్వాలిటీ లేని లిక్కర్ను తయారుచేసి, తన ప్రైవేటు మాఫియా నెట్వర్క్ద్వారా నేరుగా పంపిస్తున్నారు. ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒక బాటిల్ కల్తీ బాటిల్. ఆ కల్తీ మద్యాన్ని తాగి మనుషులు చనిపోతున్న పరిస్థితి. ప్రాంతాల వారీగా కల్తీ దందా నడుపుతున్నారు. కల్తీ మద్యం తాగి అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇబ్రహీపట్నంలో భారీగా దొరికిన మద్యం, దాని తయారీకి సంబంధించిన వస్తువులు మాఫియా తీవ్రతను తెలియజేస్తున్నాయి. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతూ లూటీ చేస్తున్నారు..ప్రభుత్వ స్కూళ్లలో ఐదు లక్షలమంది విద్యార్థులు తగ్గిపోయారు. మన హయాంలో నో వేకెన్సీ బోర్డులు చూశాం. ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కడం చూస్తున్నాం. మన హయాంలో ఐదేళ్లలో ఎప్పుడూ అలాంటివి లేవు. ఎరువుల పంపిణీలో కూడా స్కాం చేశారు. దళారీలతో చేతులు కలిపారు. ప్రజారోగ్య వ్యవస్థను పూర్తిగా దెబ్బతీశారు. పేదలను ఇంకా అన్యాయం చేస్తున్నారు. వారిని మరింత పేదరికంలోని నెడుతున్నారు. భవిష్యత్తులో కూడా ఉచితంగా నాణ్యమైన వైద్యం అందనీయకుండా చేస్తున్నారు. మనం కొత్తగా పెట్టిన కాలేజీలను ఇప్పుడు తన బినామీలకు, తన మనుషులకు తెగనమ్ముతున్నాడు...మనం వచ్చేంతవరకూ రాష్ట్రంలో ఉన్నవి 12 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు మాత్రమే. మనం ఒక విజన్ను ఆవిష్కరించాం. ప్రతి జిల్లాల్లో గవర్నమెంటు కాలేజీ ఉండాలన్న సంకల్పంతో 17 మెడికల్ కాలేజీలు పెట్టాం. ప్రభుత్వం స్కూళ్లు, ఆస్పత్రులు, బస్సులు ఎందుకు నడుపుతుంది?. అలా చేయకపోతే ప్రైవేటు వాళ్లు ప్రజలను దోచుకుంటారు. ఇవి నడపకపోతే ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. ఈ విషయాన్ని ప్రజలకు బాగా అర్థమయ్యేలా చెప్పాలి. మనం ఉన్నప్పుడే 2023-24లోనే కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. మరో రెండు కాలేజీలు క్లాసులకు అందుబాటులోకి తెచ్చాం. తద్వారా 800 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. పులివెందులోల 50 సీట్లు NMC ఇస్తే.. వద్దని చంద్రబాబు లెటర్ రాశాడు. మన హయాంలోనే అవసరమైన నిధులకు ఫైనాన్సియల్ టై అప్ చేశాం. అమరావతికి 50వేల ఎకరాలు సరిపోవని, మరో 50వేల ఎకరాలు సేకరిస్తున్నాడు...మొదటి 50 వేల ఎకరాలకే మౌలిక సదుపాయాలకోసం రూ.1లక్ష కోట్లు ఖర్చు అవుతుందని చంద్రబాబు చెప్పాడు. ఇప్పుడు కేవలం మౌలిక సదుపాయాలకే 2 లక్షల కోట్లు అవుతుందని చెప్తున్నారు. అలాంటి లక్షలమందికి, కోట్ల మందికి వైద్యం అందించి, చిరస్థాయిగా నిలబడే ఆస్తులైన మెడికల్ కాలేజీలను అప్పనంగా అమ్మేస్తున్నారు?. ఐదేళ్లలో రూ.5వేల కోట్లు పెట్టలేరా?. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రజల్లో చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది...అక్టోబరు 9న నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శిస్తాను. అక్టోబరు 10 నుంచి నవంబర్ 22వరకూ రచ్చబండ కార్యక్రమం. మెడికల్ కాలేజీల ప్రైవటీకరణపై కరపత్రాలు పంపిణీ. కోటి సంతకాలను రచ్చబండ కార్యక్రమాల ద్వారా సేకరణ. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కనీసం ప్రతి పంచాయతీ నుంచి 500 మందితో సంతకాల సేకరణ చేస్తాం. ప్రతి నియోజకవర్గ సమన్వయ కర్త ప్రతిరోజూ రెండు గ్రామాల సందర్శన. అలాగే నియోజకవర్గాల్లో రౌండ్ టేబుల్స్ ద్వారా చైతన్యపరిచే కార్యక్రమాలు. అక్టోబరు 28న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహిస్తాం. నియోజకవర్గ స్థాయిలో ఉన్న అధికారికి డిమాండ్ పత్రాల సమర్పణ. జిల్లా కేంద్రాల్లో నవంబర్ 12న ర్యాలీలు. ఒక జిల్లాలో నేనుకూడా పాల్గొంటాను. నవంబర్ 23న నియోజకవర్గ కేంద్రాల నుంచి సేకరించిన సంతకాలు జిల్లా కేంద్రానికి. నవంబర్ 24న సేకరించిన సంతకాలతో కూడిన వాహనాలను జిల్లా కేంద్రంలో జెండా ఊపి విజయవాడకు. సేకరించిన ఈ సంతకాలు గవర్నర్కు అప్పగించే కార్యక్రమం తదుపరి జరుగుతుంది’ అని వైఎస్ జగన్ వివరించారు. -
కూటమి ఉలిక్కిపడేలా.. YSRCP నేతలకు జగన్ కీలక ఆదేశాలు
-
ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ పోరు.. ఇక రచ్చబండ, ధర్నాలు..
సాక్షి, తాడేపల్లి: ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై(Medical Colleges Privatization) ఆందోళనలకు వైఎస్సార్సీపీ(YSRCP) సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఈ నెల 10 నుంచి 22 వరకు రచ్చబండ కార్యక్రమాలను ప్లాన్ చేసింది.ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరుకు వైఎస్సార్సీపీ ముందు సాగనుంది. రచ్చబండ(Rachabanda), కోటి సంతకాల సేకరణ, గవర్నర్ని కలవటం, నియోజకవర్గం, జిల్లా స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో అక్టోబర్ పదో తేదీ నుంచి 22 వరకు రచ్చబండ కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. అన్ని నియోజకవర్గాల్లో 28న నిరసన ర్యాలీలు చేపట్టనుంది. జిల్లా కేంద్రాల్లో నవంబర్ 12న ధర్నాలు చేసేందుకు సిద్ధమైంది. ప్రతీ నియోజకవర్గం నుండి 50వేల సంతకాలు సేకరణ చేయనున్నారు. చివరగా నవంబర్ 26న పార్టీ నేతలు గవర్నర్ని కలిసేలా నిర్ణయం తీసుకున్నారు. -
YSRCP కార్యాలయంలో వాల్మీకి జయంతి కార్యక్రమం
-
ఈసారి జగన్ ప్రభుత్వం నడిచేది... పోతిన మహేష్ గూస్ బంప్స్ స్పీచ్
-
విజయనగరం జిల్లా జమ్ములో కొనసాగుతున్న పచ్చ ఖాకీల దమనకాండ
-
వైఎస్సార్సీపీ నేతలతో ముగిసిన వైఎస్ జగన్ భేటీ
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి నేతృత్వంలో జరిగిన ఆ పార్టీ కీలక భేటీ ముగిసింది. తాడేపల్లిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో జరుగుతున్న ఈ భేటీకి జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో-ఆర్డినేటర్లు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంతో పాటు రాష్ట్రంలో యదేచ్ఛగా నడుస్తున్న నకిలీ మద్యం వ్యవహారంపై వైఎస్ జగన్ ప్రముఖంగా ప్రసంగించినట్లు తెలుస్తోంది. ఈ అంశాలపై ప్రజా పోరాటం చేయాలని కేడర్కు ఆయన పిలుపు ఇచ్చినట్లు సమాచారం. ఈ భేటీకి కీలక నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, కాకాణి గోవర్దన్ రెడ్డి, పేర్ని నాని, భూమన కరుణాకర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. జగన్ హయాంలో మొదలైన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలన్న చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ప్రజా పోరాటానికి పిలుపు ఇచ్చింది. ఈ క్రమంలో 9వ తేదీన అనకాపల్లి జిల్లాలో వైఎస్ జగన్ పర్యటించిన.. మాకవరం మెడికల్ కాలేజీని సందర్శించనున్న సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: బాబు చీటర్.. లోకేష్ లూటర్! -
ఊరిమీదపడి అరాచకం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ప్రశాంతమైన పల్లెలో వారంతా కూలీలు... సన్న చిన్నకారు రైతులు... ఇతర పనులు చేసుకునేవాళ్లు... అర్ధరాత్రి ఆదమరిచి నిద్రిస్తున్నారు... అలాంటి సమయంలో 40 మంది పోలీసులు ఊరిమీద పడ్డారు. ఇళ్లల్లోకి చొరబడ్డారు... దొరికినవారిని దొరికినట్లు జీపుల్లో కుక్కేసి స్టేషన్కు తరలించారు. ఇదంతా విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల మండలం జమ్ములో ఆదివారం జరిగింది. గ్రామంలో శనివారం పండుగ సందర్భంగా చోటుచేసుకున్న చిన్న తగాదాలో అధికార టీడీపీ నాయకుల మాటలు విని పోలీసులు చెలరేగిపోయారు.అసలు ఏం జరిగిందంటే.. జమ్ము గ్రామంలో శనివారం రాత్రి వైఎస్సార్సీపీ, టీడీపీ వారు వేర్వేరుగా దేవీ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. టీడీపీ ఊరేగింపులోని యువకులు వైఎస్సార్సీపీ ఊరేగింపులో అల్లర్లకు దిగారు. పోలీసులు కూడా వారికే మద్దతుగా నిలిచారు. వైఎస్సార్సీపీ యువతపై దాడి చేసి లాఠీలకు పని చెప్పారు. ప్రశాంతంగా ఊరేగింపు చేస్తున్నా ఎందుకు కొడుతున్నారని వైఎస్సార్సీపీ యువత ప్రశ్నించారు.ఈ సమయంలో అదుపుతప్పి ఒకరిద్దరు పోలీసులు కిందపడ్డారు. దీన్నే తీవ్రమైన నేరంగా పరిగణించిన పోలీసులు... ఆదివారం అర్ధరాత్రి జమ్ము గ్రామం మీద పడ్డారు. గర్భిణులని కూడా చూడకుండా కాళ్లతో తన్నారు. పురుషుల్లో దొరికినవారిని దొరికినట్లు కొట్టుకుంటూ జీపుల్లోకి ఎక్కించి విజయనగరం రూరల్ స్టేషన్కు తరలించారు. కాగా, సర్పంచ్ జమ్ము నరసింహమూర్తితో సహా 23 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ముగ్గురు టీడీపీ కార్యకర్తలను తప్పించి 20 మంది వైస్సార్సీపీ కార్యకర్తలను రిమాండ్కు తరలించారు. -
ఉద్యోగులకు ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలు ఏమిటి..? చేస్తున్నది ఏమిటి..?
సాక్షి, అమరావతి: ఎన్నికలకు ముందు ఉద్యోగులకు మీరు ఇచ్చిన హామీలు ఏమిటి? ఇప్పుడు మీరు చేస్తున్నదేమిటి? అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. తీపి తీపి మాటలతో ఉద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూపి... తీరా ఇప్పుడు వారిని మోసం చేస్తారా? రోడ్డు మీద నిలబెడతారా? ఇందుకేనా మీరు అధికారంలోకి వచ్చింది? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.పీఆర్సీ, పెండింగ్ డీఏలు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, మెడికల్ రీయింబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవ్స్ లేదా ఎన్క్యాష్మెంట్ లీవ్ల కింద ఉద్యోగులకు దాదాపు రూ.31 వేల కోట్ల బకాయిలు పెట్టారని ఎత్తిచూపారు. తమకు రావాల్సిన వాటి కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్నా ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వకపోవడంతో వారందరూ నరకయాతన అనుభవిస్తున్నారని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.మీరు పెట్టే బాధలు భరించలేకే ఇప్పుడు ఉద్యోగులంతా రోడ్డు మీదకు వస్తున్నాంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఉద్యోగులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చేసిన మేళ్లను.. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను జత చేస్తూ, చంద్రబాబు చేసిన మోసాలను ప్రశ్నిస్తూ తన ‘ఎక్స్’ ఖాతాలో సోమవారం వైఎస్ జగన్ పోస్టు చేశారు.అందులో ఆయన ఏమన్నారంటే...‘‘చంద్రబాబు గారూ... మంత్రివర్గ సమావేశం జరిగిన ప్రతిసారి, ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీల అమలు గురించి, వారికి చెల్లించాల్సిన బకాయిల గురించి మీ నుంచి ప్రకటన వస్తుందని వారు ఆశగా ఎదురుచూడడం, చివరకు ఉసూరు మనిపించడం మీకు అలవాటుగా మారింది. కేబినెట్ సమావేశాల్లో మీ శ్రద్ధ అంతా భూ పందేరం మీద తప్ప, ప్రజలు, ఉద్యోగస్తుల మీద కాదు. అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా ప్రజలు, ఉద్యోగుల మీద మీకున్నది కపట ప్రేమే. వారిని నమ్మించి వెన్నుపోటు పొడవడం మీకు అలవాటే.మీరు పెట్టే బాధలు భరించలేక ఇప్పుడు వారంతా రోడ్డు మీదకు వస్తున్నారు. చంద్రబాబు గారూ.. మీరు అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు అవుతోంది. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమిటో ఒక్కసారి మీ మేనిఫెస్టో చూడండి. అందులో ఒక్కటైనా నెరవేర్చారా? అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ అన్నారు. మరి ఇచ్చారా? మెరుగైన పీఆర్సీ అంటూ ఊదరగొట్టారు. మరి దాని సంగతి ఏమైంది? మేం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించాం. అంతేకాకుండా మా హయాంలోనే పీఆర్సీ వేసి, దానికి చైర్మన్ను కూడా నియమించాం.మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఐఆర్ ఇవ్వకపోవడం ఒక మోసమైతే, ఉద్యోగులకు జీతాలు పెంచాల్సి వస్తుందని ఉద్దేశపూర్వకంగా పీఆర్సీ చైర్మన్ను వెళ్లగొట్టారు. ఆ తర్వాత కొత్తగా ఎవరినీ నియమించకుండా ఉద్యోగస్తులకు తీరని అన్యాయం చేస్తున్నారు. న్యాయంగా, ధర్మంగా వారికి పెరగాల్సిన జీతాలను కావాలనే ఆపుతున్నారు.ఇచ్చే ఆలోచన మీకు లేదనిపిస్తోంది..ఉద్యోగస్తులకు ఇచ్చే అలవెన్స్ పేమెంట్స్ను పెంచుతామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇప్పుడు దానిగురించి ప్రస్తావించడమే లేదు. ఇప్పటిదాకా ఇవ్వాల్సిన 4 డీఏలు మొత్తం పెండింగ్. దసరా పండుగకు డీఏలు క్లియర్ అవుతాయని ఉద్యోగులంతా ఎంతో ఎదురుచూశారు. ఇప్పుడు దీపావళి పండుగ కూడా వస్తోంది. కానీ, ఇచ్చే ఆలోచన మీకున్నట్టు అనిపించడం లేదు.⇒ సీపీఎస్/జీపీఎస్లను పునఃసమీక్షించి ఆమోదయోగ్య పరిష్కారం అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పారు. కానీ, మీరు అధికారంలోకి వచ్చాక ఒక్కసారైనా దీనిమీద రివ్యూ చేశారా? మా ప్రభుత్వ పాలనలో సీపీఎస్కు గొప్ప ప్రత్యామ్నాయంగా ఉద్యోగుల కోసం జీపీఎస్ తీసుకొచ్చాం. కేంద్ర ప్రభుత్వం సహా పలు రాష్ట్రాలు ఇప్పుడు ఇదే విధానంలో వెళ్తున్నాయి. మీరు... ఓపీఎస్ను తీసుకొస్తామన్నారు. మాకంటే గొప్పగా చేస్తామన్నారు. కానీ, ఏమీ చేయకపోగా, ఉద్యోగస్తులను త్రిశంకు స్వర్గంలోకి నెట్టారు. మిమ్మల్ని నమ్మిన పాపానికి వారు తీవ్రంగా నష్టపోతున్నా, మీలో ఏ మాత్రం చలనం లేదు.ఉద్యోగులు జీతాల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితిప్రతి నెల ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి... ఇప్పుడు ఏ తేదీన జీతాలు, పెన్షన్లు ఇస్తారో తెలియని పరిస్థితి తెచ్చారు. ప్రతి నెల ఉద్యోగులు జీతాల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి. కరోనా వల్ల తలెత్తిన ఆర్థిక సంక్షోభాల సమయంలోనూ మేం ఉద్యోగులకు జీతాలు సకాలంలోనే ఇవ్వగలిగాం. కానీ, ఆ రోజు మాపై మీరు తప్పుడు ప్రచారాలు చేశారు. ఇవాళ కరోనా లాంటి దారుణమైన పరిస్థితులు లేకపోయినా జీతాలు ఇవ్వలేకపోతున్నారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలను వర్తింపజేస్తామని హామీ ఇచ్చి, ఇప్పటికీ అమలు చేయడం లేదు.వాలంటీర్లకు ఎగ్గొట్టారు.. వైద్యాన్ని రోడ్డున పడేశారుమీరు అధికారంలోకి రాగానే వాలంటీర్ల జీతాలను రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చి, కుట్ర పన్ని వారి పొట్టకొట్టి ఇప్పుడు రోడ్డుమీద పడేశారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకూ మేలు చేస్తామని చెప్పి వారినీ ఇప్పుడు రోడ్డు ఎక్కేలా చేశారు. విలేజ్ క్లినిక్లు, పీహెచ్సీలు మొత్తంగా ప్రభుత్వ ఆస్పత్రులన్నింటినీ నిర్వీర్యం చేశారు. జీరో వేకెన్సీతో ప్రజలకు తోడుగా ఉండే వైద్య శాఖను రోడ్డున పడేశారు.⇒ మా ప్రభుత్వ హయాంలో ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీలో పని చేస్తున్న దాదాపు 52 వేల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యులరైజ్ చేశాం. ఇతర శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ను కూడా మొదలుపెట్టాం. అర్హులైన 10,117 మందిని గుర్తించాం. వీరిలో 3,400 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా ఇచ్చాం. మిగిలినవారికి అన్ని ప్రక్రియలు ముగిసినా ఇప్పటివరకు అపాయింట్మెంట్లు ఇవ్వకుండా, వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. మళ్లీ దళారీ వ్యవస్థ... ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కష్టాన్ని దోచుకునే అరాచక విధానాలకు స్వస్తిపలుకుతూ, వారికోసం ఆప్కాస్ను తీసుకొచ్చి దళారీ వ్యవస్థను అంతం చేశాం. దాదాపు లక్షమందికి సకాలానికే ఎలాంటి కత్తిరింపులు లేకుండా జీతాలను క్రమంతప్పకుండా ప్రతి నెల 1వ తారీఖునే ఇచ్చేవాళ్లం. ఇప్పుడు ఆప్కాస్ను రద్దుచేసి మళ్లీ దళారీ వ్యవస్థను తెస్తున్నారు. ఇంతకంటే అన్యాయం ఏముంటుంది? ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారందరికీ మేం అధికారంలోకి వచ్చిన వెంటనే జీతాలు పెంచాం. మేం రాకమునుపు వరకు వీరి జీతాల చెల్లింపుల బిల్లు నెలకు రూ.1,100 కోట్లు అయితే, మేం వచ్చాక రూ.3 వేల కోట్లకు పెంచాం. పేరుకే హెల్త్ కార్డులు... వాటితో ప్రయోజనం లేదుఉద్యోగులకు ఈహెచ్ఎస్ కింద ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకపోవడంతో ఆస్పత్రులన్నీ వైద్యాన్ని నిరాకరిస్తున్నాయి. పేరుకు హెల్త్ కార్డులున్నా వాటి వల్ల ప్రయోజనం లేకుండా పోతోంది. ఈహెచ్ఎస్ కోసం ప్రభుత్వం వాటాగా ఇవ్వాల్సిన దాన్ని ఇవ్వకపోవడమే కాదు, తమ వాటాగా ఉద్యోగులు చెల్లించిన దాన్నికూడా విడుదల చేయడం లేదు. ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? చంద్రబాబు గారూ.. దాదాపు రెండేళ్ల కాలంలో ఉద్యోగులకైనా, ప్రజలకైనా మీరు వెన్నుపోటే పొడిచారు. వారికి ఇచ్చిన హామీలన్నీ మోసాలుగా మారిపోయాయి. అందుకే ప్రతి ఒక్కరూ రోడ్డెక్కుతూ మిమ్మల్ని ఎండగడుతున్నారు’’. -
కల్తీ మద్యం రాకెట్తో ప్రభుత్వ పెద్దలకు లింకులు: జూపూడి
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో బయటపడ్డ కల్తీ మద్యం రాకెట్ లింకులు కూటమి ప్రభుత్వంలోని పెద్దల వరకు ఉన్నాయని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు ఆరోపించారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందే రాష్ట్రంలో కల్తీ మద్యం దందాను సాగించేందుకు తెలుగుదేశం నేతలు ప్లాన్ చేసుకున్నారని, దానికి అనుగుణంగానే ప్రభుత్వం ఏర్పాటు చేయగానే మద్యం పాలసీలో మార్పులు చేశారని అన్నారు.కల్తీ మద్యాన్ని కూటమి నేతల చేతుల్లో ఉండే ప్రైవేటు మద్యం దుకాణాలు, వాటికి అనుబంధంగా ఏర్పాటు చేసే బెల్ట్షాప్ల ద్వారా పెద్ద ఎత్తున చెలామణి చేయాలనే కుట్ర దీని వెనుక దాగి ఉందని అన్నారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మద్యం విక్రయాల్లో ప్రతి మూడు బాటిళ్ళలో ఒకటి కల్తీ మద్యంగా తేలిందంటే, ప్రభుత్వ పెద్దల అండ లేకుండానే ఇంత పెద్ద ఎత్తున ఈ దందా జరుగుతోందా అని ప్రశ్నించారు. ఇంకా ఆయనేమన్నారంటే...రాష్ట్రంలో కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీలనే అధికార తెలుగుదేశం పార్టీ నేతలు నిర్వహిస్తున్నారు. సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబు తన అనుయాయులతో కల్తీ మద్యం తమారు చేయిస్తున్నారనే ఆరోపణలకు ఆయన ప్రజలకు వివరణ ఇవ్వాలి. అన్నమయ్య జిల్లా మొలకలచెరువు సమీపంలో ఏకంగా నకిలీ మద్యం తయారీ పరిశ్రమే వెలుగుచూసింది. ఈ నకిలీ మద్యం మాఫియాను నడిపించేది సాక్షాత్తు అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులేనని బయటపడింది.ఆఫ్రికా నుంచి ఆంధ్రాకు మద్యం మాఫియావిదేశాల నుంచి సంస్థలను ఆహ్వానిస్తున్నాం, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిస్తాం, ఉపాధి కల్పిస్తామని ప్రతిసారీ ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్లు చెబుతుంటారు. వాళ్ళను ఆదర్శంగా తీసుకున్న టీడీపీ నాయకులు ఎన్నికలకు ముందే ఏపీలో కల్తీ మద్యం రాకెట్ను ఆఫ్రికా నుంచి తీసుకురావాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఆఫ్రికాలో మద్యం తయారీ, చెలామణిలో సంపాధించిన అనుభవాన్ని ఏపీలో వినియోగించి, కోట్లు సంపాదించేందుకు వ్యూహం పన్నారు. టీడీపీ పెద్దల ఆశీస్సులతో ఆ పార్టీ నాయకుడు జనార్ధన్ నాయుడు ఇందుకు అంతా రంగం సిద్ధం చేశాడు. ఈ దందాకు అనుగుణంగానే ఏపీలోనూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మద్యం పాలసీ నిబంధలను మార్పు చేసింది.గతంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మద్యం విక్రయాలను ప్రైవేటు వారికి ఇచ్చేందుకు నిర్ణయించారు. లిక్కర్ షాప్లు అన్నీ లాటరీ అంటూ హంగామా చేసి, మొత్తం దుకాణాలను అధికార తెలుగుదేశం వారి చేతుల్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ కూటమి నేతలే మద్యం సిండికేట్లను ఏర్పాటు చేశారు. అనధికారికంగా పర్మిట్ రూంలను నిర్వహించారు. మద్యం దుకాణాలకు అనుబంధంగా ఊరూరా బెల్ట్ షాప్లను ఏర్పాటు చేశారు. ఆ తరువాత తమ కల్తీ లిక్కర్ దందాను ప్రారంభించారు. ఎక్కడికక్కడ కల్తీ మద్యం డెన్లను, జిల్లాల్లో మద్యం గోడౌన్లను ఏర్పాటు చేసుకుని నిత్యం వేల సంఖ్యలో కల్తీ లిక్కర్ బాటిళ్ళను చెలామణి చేయడం ప్రారంభించారు. అక్రమంగా జరుగుతున్న ఈ వ్యాపారం ద్వారా దండుకుంటున్న సొమ్మును వాటాలు వేసుకుని పంచుకుంటున్నారు.ప్రజల ప్రాణాలతో చెలగాటంగత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కల్తీ మద్యం తాగి పెద్ద ఎత్తున మరణాలు జరిగాయంటూ కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు విష ప్రచారం చేశాయి. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో, నేరుగా డిస్టిలరీల నుంచి వచ్చే మద్యాన్ని విక్రయిస్తూ, జవాబుదారీతనంతో విక్రయాలు చేసినా కూడా ఈ తప్పుడు ప్రచారం కొనసాగించారు. వారు చెప్పిన మరణాలు నిజమా అని చూస్తే, ఎక్కడా ఇది వాస్తవం అనేందుకు ఆధారాలు లేవు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికలకు ముందు తాను తక్కువ రేటుకే క్వాలిటీ మద్యం అందిస్తాను అంటూ హామీలు ఇచ్చారు. ఈ రోజు రాష్ట్రంలో ఏకంగా ఫ్యాక్టరీలను పెట్టి తయారు చేస్తున్న కల్తీ మద్యంపై ఆయన ఏం సమాధానం చెబుతారు?ఇతర రాష్ట్రాల నుంచి స్పిరిట్ తీసుకువచ్చి, రంగు కలిపి, నకిలీ మద్యం లేబుళ్ళతో ఏకంగా మద్యం దుకాణాలు, బార్లు, బెల్ట్షాప్లకు పంపిణీ చేస్తున్నారు. రకరకాల కల్తీ మద్యం బ్రాండ్లను తయారు చేసి, అందమైన పేర్లతో చెలామణి చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో ఎక్కడ చూసినా ఈ కల్తీ మద్యం బ్రాండ్లే కనిపిస్తున్నాయి. వీటికి సంబంధించిన ఫోటోలను కూడా మీడియా ముఖంగా ప్రదర్శిస్తున్నాం. 'సుమో, షాట్, బెంగుళూరు బ్రాందీ, ఛాంపియన్, కేరళా మాల్ట్...' ఇలా అనేక రకాల పేర్లతో మార్కెట్లో ఈ కల్తీ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి.ఈ కల్తీ మద్యం రాకెట్ ఎంత వేగంగా విస్తరించిందీ అంటే అన్నమయ్య జిల్లాలో తయారవుతున్న ఈ మద్యంను కోస్తా ప్రాంతంలో కూడా అమ్మేందుకు ఏకంగా ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం గోడవున్లో నిల్వ చేశారు. ఎక్సైజ్ శాఖ అధికారులే ఈ రాకెట్ను పట్టుకున్నారు. పట్టుబడని కల్తీ మద్యం గోడవున్లు ఇంకా ఎన్ని ఉన్నాయో అనే అనుమానం కలుగుతోంది. ప్రమాదకరమైన ఈ కల్తీ మద్యాన్ని తాగేవారు అతి త్వరగా అనారోగ్యంతో మృత్యువాత పడే ప్రమాదం ఉంది. ప్రజలు ఏమైపోయినా ఈ ప్రభుత్వానికి సంబంధం లేదు. కేవలం తన ధనదాహంకు ప్రజల ప్రాణాలనే పణంగా పెడుతున్నారు. -
‘జస్టిస్ బీఆర్ గవాయ్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం’
సాక్షి,తాడేపల్లి: సనాతన ధర్మం ముసుగులో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, నిందితుడిని కఠినంగా శిక్షించి న్యాయ వ్యవస్థపై ప్రజల్లో మరింత నమ్మకం పెరిగేలా చూడాలని శింగనమల నియోజకవర్గ వైయస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి సాకె శైలజానాథ్ డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా దళితులను చిన్నచూపు చూస్తూనే ఉన్నారని, ఉన్నత స్థానంలో ఉంటే ఇప్పటికీ కొందరు చూసి ఓర్చలేకపోతున్నారని అసహనం వ్యక్తం చేశారు. సనాతన ధర్మం ముసుగులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ మీద కోర్టు హాల్లో ఒక లాయర్ షూ విసరడానికి ప్రయత్నించడాన్ని సీరియస్గా తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయాధిపతిగా దేశంలోనే అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి మీద జాత్యహంకారంతో దాడి చేయాలని చూడటం క్షమించరాని తప్పుగా చూడాలన్నారు. దీన్ని దేశప్రజలంతా తీవ్రంగా ఖండించాలని చెప్పారు. ఉన్నత స్థానంలో ఉన్న సుప్రీం చీఫ్ జస్టిస్ మీదనే దాడి చేయడానికి ప్రయత్నించారంటే సామాన్యుడి పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదని మాజీ మంత్రి శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలను తగ్గించి చూపించే ప్రయత్నం చేయడం దేశానికి అంత మంచిది కూడా కాదని ఆయన అభిప్రాయపడ్డారు. భాష, ప్రాంతం, కులం, మతం పేరుతో ఇతరులపై దాడి చేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. -
ఉద్యోగులను నడిరోడ్డుపై నిలబెడతారా బాబూ?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఉద్యోగులను చంద్రబాబు మోసం చేయటంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన హయాంలో అమలు చేసిన కార్యక్రమాలు, చంద్రబాబు మేనిఫెస్టోని చూపుతూ ట్వీట్ చేశారు. ‘‘చంద్రబాబూ.. ఎన్నికలకు ముందు మీరు ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలు ఏమిటి? ఇప్పుడు మీరు చేస్తున్నదేమిటి? తీపి తీపి మాటలతో అరచేతిలో వారికి వైకుంఠం చూపి, తీరా ఇప్పుడు వారిని మోసం చేస్తారా?. నడిరోడ్డుమీద నిలబెడతారా?.. ఇందుకేనా మీరు అధికారంలోకి వచ్చింది?’’ అంటూ వైఎస్ జగన్ నిలదీశారు.‘‘మంత్రివర్గ సమావేశం జరిగిన ప్రతిసారి, ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీల అమలు గురించి, వారికి చెల్లించాల్సిన బకాయిల గురించి మీ నుంచి ప్రకటన వస్తుందని వాళ్లు ఆశగా ఎదురుచూడడం, చివరకు ఉసూరు మనిపించడం మీకు అలవాటుగా మారింది. కేబినెట్ సమావేశాల్లో మీ శ్రద్ధ అంతా భూ పందేరం మీద తప్ప, ప్రజల మీద, ఉద్యోగస్తుల మీద కాదు. అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా ప్రజలమీద, ఉద్యోగస్తుల మీద మీకున్నది కపట ప్రేమే. వారిని నమ్మించి వెన్నుపోటు పొడవటం, మీకు అలవాటే. మీరుపెట్టే బాధలు భరించలేక ఇప్పుడు వారంతా రోడ్డుమీదకు వస్తున్నారు. చంద్రబాబూ.. మీరు అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు అవుతోంది. ఉద్యోగులకు మీరిచ్చిన హామీలు ఏమిటో ఒక్కసారి మీ మేనిఫెస్టో చూడండి. అందులో ఒక్కటైనా నెరవేర్చారా?’’ అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు...అధికారంలోకి వచ్చిన వెంటనే IR అన్నారు. మరి ఇచ్చారా? మెరుగైన PRC అంటూ ఊదరగొట్టారు. మరి PRC సంగతి ఏమైంది?. మేం అధికారంలోకి వచ్చిన వారంరోజుల్లోనే ఉద్యోగులకు IR ప్రకటించాం. అంతేకాకుండా మా హయాంలోనే మేం PRC వేసి, దానికి ఛైర్మన్నుకూడా నియమిస్తే, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, IR ఇవ్వకపోవడం ఒక మోసమైతే, ఉద్యోగులకు జీతాలు పెంచాల్సి వస్తుందని ఉద్దేశ పూర్వకంగా PRC ఛైర్మన్ని వెళ్లగొట్టారు. ఆ తర్వాత కొత్తగా ఎవ్వరినీ నియమించకుండా ఉద్యోగస్తులకు తీరని అన్యాయం చేస్తున్నారు...న్యాయంగా, ధర్మంగా వారికి పెరగాల్సిన జీతాలను కావాలనే ఆపుతున్నారు. ఉద్యోగస్తులకు ఇచ్చే అలవెన్స్ పేమెంట్స్ను పెంచుతామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇప్పుడు దానిగురించి ప్రస్తావించడంలేదు. ఇప్పటిదాకా ఇవ్వాల్సిన 4డీఏలు మొత్తం పెండింగ్. దసరా పండుగకు డీఏలు క్లియర్ అవుతాయని ఉద్యోగస్తులందరూ ఎంతో ఎదురు చూశారు. ఇప్పుడు దీపావళి పండుగ కూడా వస్తోంది. కాని, ఇచ్చే ఆలోచన మీకున్నట్టు అనిపించడం లేదు. CPS/GPSలను పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారం అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పారు. కాని, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారైనా దీనిమీద రివ్యూచేశారా?..మా ప్రభుత్వ హయాంలో CPSకు గొప్ప ప్రత్యామ్నాయంగా ఉద్యోగులకోసం GPS తీసుకు వచ్చాం. ఇప్పుడు అదే విధానంలోకి కేంద్ర ప్రభుత్వం సహా పలు రాష్ట్రాలు వెళ్తున్నాయి. మీరు.. OPSను తీసుకువస్తామన్నారు. మాకంటే గొప్పగా చేస్తామన్నారు. కాని ఏమీ చేయకపోగా, ఉద్యోగస్తులను త్రిశంకు స్వర్గంలోకి నెట్టారు. మిమ్మల్ని నమ్మిన పాపానికి వారు తీవ్రంగా నష్టపోతున్నా, మీలో ఏ మాత్రం చలనం లేదు...ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన PRC బకాయిలు, పెండింగ్ డీఏలు, GPF, APGLI, మెడికల్ రీయింబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవ్స్ లేదా ఎన్క్యాష్ మెంట్ లీవులు… వీటి కింద దాదాపు రూ.31వేల కోట్ల బకాయిలు పెట్టారు. తమకు రావాల్సినవాటికోసం ఉద్యోగస్తులు ఎదురుచూస్తున్నా ఒక్కపైసా కూడా ఇవ్వకపోవడంతో, వారంతా నరకయాతన అనుభవిస్తున్నారు...ప్రతినెలా ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు ఏ తేదీన జీతాలు, పెన్షన్లు ఇస్తారో తెలియడం లేదు. ప్రతినెలా జీతాలకోసం ఎదురుచూడాల్సిన దుస్థితి. కరోనా వల్ల తలెత్తిన ఆర్థిక సంక్షోభాల సమయంలోనూ మేం ఉద్యోగులకు జీతాలు సకాలంలోనే ఇవ్వగలిగాం. ఆరోజు మాపై మీరు తప్పుడు ప్రచారాలు చేశారు. ఇవాళ అలాంటి దారుణమైన పరిస్థితులు లేకపోయినా జీతాలు ఇవ్వలేకపోతున్నారు. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలను వర్తింప చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పటికీదాన్ని అమలు చేయడంలేదు...మీరు అధికారంలోకి రాగానే వాలంటీర్లకు ఇచ్చే జీతాలు రూ.5వేల నుంచి రూ.10వేలకు పెంచుతామంటూ హామీ ఇచ్చి, కుట్రపన్ని, వారి పొట్టకొట్టి, ఇప్పుడు రోడ్డుమీద పడేశారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకూ మేలు చేస్తాం అని, వారినీ ఇప్పుడు రోడ్డు ఎక్కేలా చేశారు. విలేజ్ క్లినిక్కులూ, పీహెచ్సీలు మొత్తంగా ప్రభుత్వ ఆస్పత్రులన్నింటినీ నిర్వీర్యం చేశారు. జీరో వేకెన్సీతో ప్రజలకు తోడుగా ఉండే వైద్య శాఖను రోడ్డున పడేశారు...మా ప్రభుత్వ హయాంలో ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీలో పనిచేస్తున్న దాదాపు 52 వేల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యులరైజ్ చేశాం. ఇతర శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ను కూడా మొదలుపెట్టాం. అర్హులైన 10,117 మందిని గుర్తించాం. వీరిలో 3,400 మందికి అపాయింట్ మెంట్ ఆర్డర్లు కూడా మా హయాంలోనే ఇచ్చాం. మిగిలిన వారికి అన్ని ప్రక్రియలు ముగిసినా కూడా ఇప్పటి వరకు అపాయింట్ మెంట్లు ఇవ్వకుండా, వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు..@ncbn గారూ.. ఎన్నికలకు ముందు మీరు ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలు ఏమిటి? ఇప్పుడు మీరు చేస్తున్నదేమిటి? తీపితీపి మాటలతో అరచేతిలో వారికి వైకుంఠం చూపి, తీరా ఇప్పుడు వారిని మోసం చేస్తారా? నడిరోడ్డుమీద నిలబెడతారా? ఇందుకేనా మీరు అధికారంలోకి వచ్చింది? మంత్రివర్గ సమావేశం జరిగిన ప్రతిసారి,… pic.twitter.com/CFIDuN9w7W— YS Jagan Mohan Reddy (@ysjagan) October 6, 2025..అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కష్టాన్ని దోచుకునే అరాచక విధానాలకు స్వస్తిపలుకుతూ, వారికోసం ఆప్కాస్ను తీసుకు వచ్చి దళారీ వ్యవస్థను అంతం చేశాం. దాదాపు లక్ష మందికి సకాలానికే ఎలాంటి కత్తిరింపులు లేకుండా వారి జీతాలను, క్రమం తప్పకుండా ప్రతినెలా ఒకటోతారీఖునే ఇచ్చేవాళ్లం. ఇప్పుడు ఆప్కాస్ను రద్దుచేసి మళ్లీ దళారీ వ్యవస్థను తీసుకువస్తున్నారు. ఇంతకంటే అన్యాయం ఏముంటుంది? మేం అధికారంలోకి వచ్చిన వెంటనే అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారందరికీ జీతాలు పెంచాం. మేం రాకమునుపు వరకూ, వీరి జీతాల చెల్లింపుల బిల్లు నెలకు రూ.1,100 కోట్లు అయితే, మేం వచ్చిన తర్వాత దాన్ని రూ.3వేల కోట్లకు పెంచాం. ..ఉద్యోగులకు EHS కింద ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకపోవడంతో ఆస్పత్రులన్నీ వైద్యాన్ని నిరాకరిస్తున్నాయి. పేరుకు హెల్త్ కార్డులున్నా దానివల్ల ప్రయోజనం లేకుండా పోతోంది. EHS కోసం ప్రభుత్వం తనవాటాగా ఇవ్వాల్సిన దాన్ని ఇవ్వకపోవడమే కాదు, తమ వాటాగా ఉద్యోగులు చెల్లించిన దాన్నికూడా విడుదలచేయడం లేదు. ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా?. చంద్రబాబుగారూ.. దాదాపు రెండేళ్ల కాలంలో ఉద్యోగులకైనా, ప్రజలకైనా మీరు వెన్నుపోటే పొడిచారు. వారికిచ్చిన హామీలన్నీ మోసాలుగా మారిపోయాయి. అందుకే ప్రతి ఒక్కరూ రోడ్డెక్కుతూ మిమ్మల్ని ఎండగడుతున్నారు’’ అంటూ వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా దుయ్యబట్టారు. -
Tatiparthi: విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ అట్టర్ ఫ్లాప్
-
నకిలీ మద్యానికి కేరాఫ్ అడ్రస్ టీడీపీ: దేవినేని అవినాష్
సాక్షి, విజయవాడ: టీడీపీ నేతలు డబ్బులకు కక్కుర్తి పడి నకిలీ మద్యం తయారు చేసి.. బెల్ట్ షాపుల్లో అమ్మకాలు జరుపుతున్నారంటూ ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నకిలీ మద్యం చిత్తూరు నుంచి విజయవాడ లింక్లు పెరిగిపోయాయి.. ఇప్పుడు అవే బట్టబయలయ్యాయి.‘‘ఎన్నికలకు ముందు 99 రూపాయలు మద్యం అమ్ముతామంటే ఎదో అనుకున్నాం.. ఇలా నకిలీ మద్యం తయారు చేసి అమ్మకాలు చేస్తారు అనుకోలేదు. ఇబ్రహిపట్నంలో ఇప్పుడు నకిలీ మద్యం దొరికింది. టీడీపీకి చెందిన జనార్ధనరావు అనే వ్యక్తికి ఇబ్రహీంపట్నంలో వైన్ షాపు ఉంది. ఇక్కడ నుండే అన్ని బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్నారు. నకిలీ మద్యానికి కేరాఫ్ అడ్రస్ టీడీపీ. ఎంపీ మిథున్ రెడ్డి, ధనుంజయ్రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారు.. మరి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది?. టీడీపీ నాయకుడు జనార్ధన్ రావు వెనుక ఎవరు ఉన్నారో వారి పై చర్యలు తీసుకోవాలి’’ అని దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు. -
Dharmana: మీ గ్రామాల్లో ఉన్న ప్రతి సమస్యను గుర్తించండి.. అప్పుడే మీరు రాజకీయంగా ఎదుగుతారు
-
‘బాబు చీటర్, లోకేష్ లూటర్ అని ప్రజలే మాట్లాడుకుంటున్నారు’
సాక్షి, విశాఖ: చంద్రబాబు(Chandrababu) అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో లేనప్పుడు ఒక మాట మాట్లాడతారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్(Gudiwada Amarnath) మండిపడ్డారు. కానీ, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మాత్రం ఎప్పుడూ ఒకే మాట మాట్లాడుతారని తెలిపారు. విశాఖ స్టీల్ప్లాంట్(Vizag Steel Plant) ప్రైవేటీకరణకు వైఎస్సార్సీపీ ఎప్పుడూ వ్యతిరేకమే అని మరోసారి అమర్నాథ్ క్లారిటీ ఇచ్చారు.ఈనెల తొమ్మిదిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) విశాఖ పర్యటనపై నేడు సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ..‘ఏడు నియోజకవర్గాల మీదుగా వైఎస్ జగన్ రోడ్ షోగా వెళ్ళే అవకాశం ఉంది. స్టీల్ ప్లాంట్, షుగర్ ఫ్యాక్టరీ, బల్క్ డ్రగ్ పార్క్ బాధితులు వైఎస్ జగన్ కలవనున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్సీపీ ఎప్పుడూ వ్యతిరేకమే. కేంద్రం చేస్తున్న ఆలోచనలు తెలిసిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలి.చంద్రబాబులా అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో లేనప్పుడు ఒక మాట జగన్ మాట్లాడరు. కూటమి ప్రభుత్వం వచ్చాక స్టీల్ ప్లాంట్లో దాదాపు పదివేల మంది ఉద్యోగాలు పోయాయి. కూటమి ప్రభుత్వం పేదవారి కడుపు కొడుతోంది. పేదవాడికి ఉచిత వైద్యం అందడం ఈ కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేకనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నారు. చంద్రబాబు చీటర్, లోకేష్(Nara Lokesh) లూటర్ అని జనం మాట్లాడుకుంటున్నారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇది కూడా చదవండి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఎవరికి లాభం? -
విజయనగరం పోలీసుల దాడిలో గాయపడ్డ బాధితుడి మాటలు
-
ఆడవాళ్లు అని చూడకుండా పచ్చ ఖాకీల విధ్వంసం
-
గుర్లలో పోలీసుల దౌర్జన్యం.. అర్ధరాత్రి భయానక అరెస్ట్లు
సాక్షి, విజయనగరం: విజయనగరం జిల్లాలో పోలీసులు దౌర్జన్యం చేశారు. అర్ధరాత్రి గ్రామంలో చొరబడి.. వైఎస్సార్సీపీ కార్యకర్తలను టార్గెట్ చేశారు. జమ్మూ గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలను ఇళ్ల నుంచి లాక్కెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.వివరాల ప్రకారం.. గుర్ల మండలం జమ్మూలో గత రాత్రి దుర్గాదేవి నిమజ్జనంలో చెలరేగిన గొడవలో పోలీసుల లాఠీచార్జ్ చేశారు. దీనికి కొనసాగింపుగా గ్రామంలోకి వచ్చిన పోలీసులు అర్ధరాత్రి దౌర్జన్యం చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను టార్గెట్ చేసి అక్రమ అరెస్టులు చేశారు. అర్ధరాత్రి గ్రామంలోకి చొరబడి భయానక వాతావరణం సృష్టించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను ఇళ్ల నుంచి లాకెళ్లారు. అంతటితో ఆగకుండా.. పోలీసులకు అడ్డుగా వచ్చిన వారికి చితకబాది.. వారిని వాహనాల్లో ఎక్కించారు.ఈ క్రమంలో వారికి ఎందుకు తీసుకు వెళ్తున్నారని కుటుంబ సభ్యులు ప్రశ్నించినా సమాధానం చెప్పలేదు. అంతేకాకుండగా.. ఈ ఘటనను వీడియో రికార్డ్ చేసిన వారి సెల్ ఫోన్లు లాక్కొని వాటిని ధ్వంసం చేశారు. అయితే, ఎవరిని ఎక్కడికి తీసుకు వెళ్లారో తెలియక గ్రామస్తులు, వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అర్ధరాత్రి నుంచి భయానక వాతావరణంలో గ్రామ ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. -
సర్కారు నిర్లక్ష్యం వల్లే గిరిజన బాలికలకు అస్వస్థత
మహారాణిపేట(విశాఖపట్నం): కురుపాం గిరిజన బాలికల పాఠశాల విద్యార్థినులు అస్వస్థతకు గురికావడం, ఇద్దరు బాలికలు చనిపోవడానికి కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, దీనికి సర్కారే బాధ్యత వహించాలని వైఎస్సార్సీపీ నేతలు, మాజీ ఉప ముఖ్యమంత్రులు పాముల పుష్పశ్రీ వాణి, పి.రాజన్నదొర ధ్వజమెత్తారు. ఆదివారం విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న కురుపాం గిరిజన బాలికలను పుష్పశ్రీవాణి, రాజన్నదొర, అరకు ఎంపీ డాక్టర్ తనూజారాణి, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్ రాజు తదితరులు పరామర్శించారు. అనంతరం కేజీహెచ్ వైద్యులతో మాట్లాడి విద్యార్థులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా పుష్పశ్రీ వాణి మాట్లాడుతూ గిరిజన గురుకుల పాఠశాలల నిర్వహణను కూటమి సర్కారు గాలికొదిలేసిందని విమర్శించారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి అసమర్థురాలని ధ్వజమెత్తారు. పాఠశాల హాస్టల్లో కలుషిత నీరు తాగి పచ్చకామెర్ల బారిన పడి అంజలి, కల్పన అనే ఇద్దరు విద్యార్థులు మృతిచెందారని, సుమారు 120 మంది ఆస్పత్రి పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన చిన్నారుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అంజలి మృతికి నాటు వైద్యం కారణమని సర్కారు సాకులు వెతుకుతోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఒక్క గురుకుల పాఠశాలకు కూడా ఈ సర్కారు దోమతెరలు ఇవ్వలేదని మండిపడ్డారు. ఆదివారం తీరుబడిగా స్పందించిన మంత్రి సంధ్యారాణి పాఠశాలల్లో నీరు బాగానే ఉందని చెప్పడం దారుణమని పేర్కొన్నారు. ఇద్దరు చిన్నారులు కలుషిత నీరు వల్లే చనిపోయారని, కల్పన సికిల్ సెల్ అనేమియాతో చనిపోయిందని మంత్రి ప్రకటించడం పచ్చి అబద్ధమని పేర్కొన్నారు. ఎంపీ డాక్టర్ తనూజా రాణి మాట్లాడుతూ కూటమి సర్కారు ఆశ్రమ పాఠశాలల్లో కనీస వసతులు కలి్పంచడం లేదని మండిపడ్డారు. కలుషిత నీరే ఇద్దరు చిన్నారులను బలిగొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతమంది పిల్లలు పచ్చకామెర్ల బారిన పడుతుంటే కూటమి సర్కారు చోద్యం చూస్తోందని ధ్వజమెత్తారు. వైద్యానికి డబ్బులు లేవని ఐటీడీఏ పీఓ చెప్పడం దారుణం మాజీ ఉప ముఖ్యమంత్రి పి.రాజన్నదొర మాట్లాడుతూ గిరిజన పిల్లల వైద్యం కోసం డబ్బులు లేవని ఐటీడీఏ పీఓ చెప్పడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. పేద చిన్నారులకు వైద్యం చేయించలేని మంత్రి, సర్కారు పెద్దలు పదవుల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి సర్కారు నిర్లక్ష్యం వల్లే ఇంతమంది పిల్లలు ఆస్పత్రుల పాలయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చకామెర్లు చిన్న వ్యాధి అని కూటమి ప్రతినిధులు వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న చిన్నారులను, వారి వెంట ఉన్న తల్లిదండ్రులను పట్టించుకునే నాథుడు లేడని, పర్యవేక్షణకు ఒక్క అధికారినీ నియమించలేదని విమర్శించారు. -
KGH: గిరిజన బాలికలకు వైఎస్సార్సీపీ నేతల పరామర్శ
సాక్షి, విశాఖపట్నం: కేజీహెచ్లో గిరిజన బాలికలను వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించారు. పచ్చ కామెర్లకు చికిత్స పొందుతున్న బాలికలను ఆ పార్టీ నేతలు పుష్పశ్రీవాణి, రాజన్నదొర, ఎంపీ తనూజారాణి, మజ్జి శ్రీను పరామర్శించి.. బాలికల తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను వారు కోరారు.ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఇద్దరు బాలికలు చనిపోయారని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. బాలికల అస్వస్థతకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. కురుపాం గిరిజన హాస్టల్లో సమస్యలున్నాయని మేం ముందే చెప్పాం. ఈ నెల 1న బాలికలు అస్వస్థతకు గురైతే 5న మంత్రి వచ్చారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా?’’ అంటూ వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నించారు. -
సంక్షేమం.. అభివృద్ధే వైఎస్సార్సీపీ అజెండా: బొత్స
సాక్షి, విశాఖపట్నం: రాబోయే కాలంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఉద్యమిస్తామని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్సార్సీపీ నేతల విస్తృతస్థాయి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మండలిలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై చర్చించాలని పట్టుబట్టామని.. ప్రజా సంక్షేమమే తమ అజెండా అన్నారు. ప్రజా సంక్షేమంపై తాము రాజీపడేది లేదని స్పష్టం చేశారు.‘‘మెడికల్ కాలేజీల ఏర్పాటు పేదవారి వైద్యానికి సంబంధించినది. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నాం. పేదవాడి ఆరోగ్య విషయంలో రాజీపడం. కూటమి ప్రభుత్వానికి జగన్ ఫోబియా పట్టుకుంది. ఇంకా ఎన్ని రోజులు జగన్ పేరు చెబుతూ బతుకుతారు. కురుపాంలో 39 మంది విద్యార్థులు పచ్చ కామెర్లతో బాధపడుతున్నారు. అందులో ఇద్దరూ మరణించారు. కూటమి ప్రభుత్వానికి పర్యవేక్షణ కొరవడింది...అశోక్ గజపతిరాజు జెనెటిక్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు ఆయనకు అహం ఎక్కువ. సింహాచలంలో ఆరుగురు భక్తులు మరణిస్తే కనీసం అశోక్ గజపతి రాజు పరామర్శించారా? ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేరాలు, హత్యలు హత్యాచారాలు పెరిగిపోయాయి. మా హయాంలో ఎన్ని నేరాలు జరిగాయి, ఏడాదిన్నరగా కూటమి పాలనలో ఎన్ని జరిగాయో లెక్కేసుకోండి’’ అని బొత్స పేర్కొన్నారు. -
చంద్రబాబు పాలనలో ఎప్పుడూ మద్యం స్కామ్లే: సాకే శైలజానాథ్
సాక్షి, అనంతపురం: సీఎం చంద్రబాబు మాట్లాడిన 'దుష్టుల పాలన'కు కూటమి సర్కార్ అద్దం పడుతోందని మాజీ మంత్రి సాకె శైలజానాథ్ మండిపడ్డారు. అనంతపురం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నాణ్యమైన మద్యాన్ని, సరసమైన ధరకే ఇస్తానంటూ బ్రాండ్ అంబాసిడర్గా మాట్లాడిన సీఎం చంద్రబాబు ఇప్పుడు తంబళ్ళపల్లిలో బయటపడ్డ కల్తీ మద్యం తయారీ డెన్పై ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.ఈ మద్యం తయారీదారులు తన సొంతపార్టీ వారే కావడంతో వారిని కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారని, సూత్రదారులను తప్పించేందుకు సిద్దమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ, కల్తీ మద్యంతో జేబులు నింపుకునే వారికి కూటమి ప్రభుత్వ అండదండలు ఉన్నాయని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా బయపడని కల్తీ మద్యం డెన్లు మరిన్ని ఉన్నాయని, మద్యం ముసుగులో దండుకోవడం చంద్రబాబుకు అలవాటేనని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే..చంద్రబాబు ఆటోడ్రైవర్ల సేవ కార్యక్రమంలో మాట్లాడుతూ దుష్టుల పాలనను అంతమొందించాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వానికే దుష్టుల పాలన అనే పదం సరిగ్గా సరిపోతుంది. తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఆనాడే చెప్పారు ఈ రాష్ట్రానికి పట్టిన దుష్టగ్రహం ఎవరో? ఏడాదిన్నర కూటమి పాలనలో సీఎంగా చంద్రబాబు ఎన్ని అబద్దాలు ఆడారో లెక్కలేదు. చెప్పిన అబద్దాన్ని చెప్పకుండా రాజకీయం చేయడంలో చంద్రబాబు దిట్ట. సూపర్ సిక్స్ అనేదే పెద్ద అబద్దం. దాని గురించి ఎవరైనా మాట్లాడితే నాలుక మందం అంటూ మాట్లాడతారు.గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో లిక్కర్ స్కాం జరిగిందంటూ ఒక బేతాళకథను సృష్టించి, రోజుకో మలుపుతిప్పుతూ డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారు. అసలు స్కాం అంటే ఏమిటీ అంటే ప్రభుత్వపరంగా నడుస్తున్న లిక్కర్ దుకాణాలను ప్రైవేటు వారికి అప్పగించి, వేలం పేరుతో తమకు కావాల్సిన వారికి ఆ మద్యం దుకాణాలను కట్టబెట్టి, వాటికి అనుబంధంగా ఊరూరా బెల్ట్షాప్లను ఏర్పాటు చేసుకుని, ఎమ్మార్పీ రేట్లకు మించి ఇష్టం వచ్చిన ధరకు మద్యం అమ్ముకోవడాన్ని లిక్కర్ స్కాం అంటారు. ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నది అక్షరాలా ఈ స్కామే.రాష్ట్రంలో తొంబై తొమ్మిది శాతం మద్యం దుకాణాలు కూటమి నేతల చేతుల్లోనే ఉన్నాయి. ఎవరికైనా వేలంలో వస్తే వారిని బెదరించి మరీ తమ పరం చేసుకున్నారు. దీనిపై విచారణకు సిద్దమా? అధిక ధరలకు, తమకు నచ్చిన బ్రాండ్లను మాత్రమే అమ్ముతూ దాని నుంచి వచ్చిన డబ్బును కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు వాటాలు వేసుకుని పంచుకుంటున్నారు.ప్రభుత్వానికి తెలియకుండానే కల్తీ మద్యం తయారు చేస్తున్నారా?తాజాగా తంబళ్లలపల్లిలో బయటపడ్డ నకిలీ మద్యం డెన్తో సీఎం చంద్రబాబు బండారం బయటపడింది. రోజుకు ఇరవై వేల బాటిళ్ళ నకిలీ మద్యాన్ని తయారు చేసి, పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారంటే, ఇది ఈ ప్రభుత్వానికి తెలియకుండా జరుగుతోందా? స్పిరిట్తో ఒక పరిశ్రమ మాదిరిగా నకిలీ మద్యంను తయారు చేసి చెలామణి చేస్తున్నా ఈ ప్రభుత్వానికి ఎటువంటి సమాచారం లేదా?తెలుగుదేశం నాయకులే ఈ నకిలీ మద్యం డెన్ను ఏర్పాటు చేసి, పెద్ద ఎత్తున మందుబాటు ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటే ఈ ప్రభుత్వం నిద్రపోతోందా? లేక తన పార్టీ వారి నుంచి ఈ అక్రమ దందాలో వాటాలు అందుకుంటోందా? చంద్రబాబే దీనికి సమాధానం చెప్పాలి. తంబళ్ళపల్లిలో బయటపడింది గోరంత మాత్రమే. ఇంకా రాష్ట్రంలో కొండత నకిలీ మద్యం డెన్లు ఉన్నాయి. ఈ రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాల్లో ఉన్న మద్యం నాణ్యతను పరీక్షించాలి.కల్తీ మద్యం మాఫియాకు అండదండలుఏడాదిన్నరగా ఈ రాష్ట్రంలో ఎన్ని చోట్ల నకిలీ మద్యం కర్మాగారాలను ఏర్పాటు చేసి, మార్కెట్లో విక్రయించారో నిజాలు వెల్లడించాలి. ఈ నకిలీ మద్యం డెన్లలో పనిచేసేవారు ఒడిస్సా, తమిళనాడు నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినట్లుగా బయటపడింది. ఈ నకిలీ మద్యం తయారీ మాఫియాలో ఎవరెవరు భాగస్వాములూ ఉన్నారో బయటపెట్టాలి. ఈ వ్యవహారంలో చంద్రబాబుకు సంబంధించిన వారే సూత్రదారులు, పాత్రదారులు. డెన్లో పనిచేసే కొందరు కూలీలను పట్టుకుని, వారినే బాధ్యులుగా చూపి, అసలు మాఫియా ముఠాదారులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈ నకిలీ మద్యం తయారీ కొనసాగుతోంది. ఎన్ని కోట్ల రూపాయలు ఈ దందాతో సంపాధించారో వెల్లడించాలి. ఇప్పుడు కూటమి పాలనలో జరుగుతున్న దానిని లిక్కర్ స్కాం అని కూడా అనలేం, దీనిని స్కాంలకే స్కాం అని పిలవాల్సి ఉంటుంది. నాణ్యమైన మద్యం ఇస్తామంటే దాని అర్థం తమ పార్టీ వారితో కుటీర పరిశ్రమ మాదిరిగా నకిలీ మద్యాన్ని తయారు చేయించి, చెలామణి చేయించడమేనా?. గత ప్రభుత్వంలో బార్లకు ప్రివిలేజ్ చార్జీలను పెంచాలని అధికారులు సిఫారస్ చేస్తే, దానిని హటాత్తుగా రద్దు చేయడం ద్వారా పెద్ద ఎత్తున ముడుగపులు అందుకుని, సీఐడీ విచారణలో ఆధారాలతో సహా దొరికిపోయిన చంద్రబాబు లిక్కర్ స్కాం గురించి మాట్లాడుతున్నాడురాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతోందిఅనంతపురం శిశుసంక్షేమ సంరక్షణ గృహంలో నవజాత శిశువుకు కనీసం పాలు ఇచి, ఆకలి తీర్చే వారు లేక శిశువు చనిపోయిందంటే దానికి ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణం కాదా? ఏడుగుర్రాలపల్లిలో రెండేళ్ళపాటు ఇక దళిత బాలికపై పద్నాలుగు మంది టీడీపీ కార్యకర్తలు దాష్టీకం చేసినా, ఈ ప్రభుత్వం మిన్నకుండిపోయింది. నారా లోకేష్ యువగళంలో ఈ రాష్ట్రంలో పదమూడు లక్షల మంది ఆటోడ్రైవర్లు ఉన్నారు, వారికి వైయస్ జగన్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందంటూ మాట్లాడిన మాటలు మరిచిపోయారా?ఆటోడ్రైవర్ల సేవ పేరుతో కేవలం 2.90 లక్షల మందికి మాత్రమే సాయంను అందించారు. ఎన్నికల ముందు ఒకలా, అధికారంలోకి రాగానే మరొకలా మాట్లాడటమేనా మీ గొప్పతనం? నారా లోకేష్ చెప్పినట్లుగా పదమూడు లక్షల మంది ఆటోడ్రైవర్లకు రూ.15వేల చొప్పున ఇవ్వాలంటే దానికి రూ.2250 కోట్లు అవసరం. కానీ మీరు ఇచ్చింది ఎంత అంటే కేవలం రూ.436 కోట్లు మాత్రమే. ప్రతి పథకంలోనూ ప్రచారం తప్ప, నిజంగా ఆ వర్గాలకు సాయం చేయాలనే చిత్తశుద్ది లేదు. కూటమి ఎన్నికల మేనిఫేస్టోలో లారీ, టిప్పర్ డ్రైవర్లకు కూడా సాయాన్ని ఇస్తామని చెప్పిన మాట వాస్తవం కాదా? ఒక్క పథకాన్ని అయినా ఇచ్చిన హామీ మేరకు అమలు చేయలేని అసమర్థ పాలన చూస్తున్నాం. -
‘భారీ కల్తీ మద్యం డంప్ దొరికితే ఎల్లో మీడియాకు కనిపించడం లేదా?’
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పెద్దలు అక్రమార్జన కోసం చేసే ప్రయత్నాలు వెలుగులోకి వచ్చాయని.. కల్తీ మద్యం పరిశ్రమే బయటపడిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్కుమార్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అధికారంలోకి రావడానికి కూటమి నేతలు చెప్పిందేమిటీ? చేస్తున్నదేమిటీ? అంటూ నిలదీశారు.అక్టోబర్ 3న ములకల చెరువులో భారీ కల్తీ మద్యం డంప్ స్వాధీనం చేసుకున్నారు. భారీ కల్తీ మద్యం డంప్ దొరికితే ఎల్లో మీడియాకు కనిపించడం లేదా.?. గత ప్రభుత్వ హయాంలో రూ.3,500 కోట్ల కుంభకోణం జరిగిదంటూ అనేక మందిని అరెస్ట్ చేశారు. మిథున్ రెడ్డికి బెయిల్ ఇచ్చే సమయంలో కోర్టు వ్యాఖ్యలు గుర్తు చేసుకోండి. అధికార దుర్వినియోగపరుస్తూ తప్పుడు కేసులు పెడుతున్నారు. కూటమి ఆరోపణల్లో నిజముంటే కోర్టులో ఆధారాలు ఎందుకు చూపించలేదు?. మూలకల చెరువులో కల్తీ మద్యం డంప్ దొరికితే కూటమి నేతలు ఎందుకు మాట్లాడటం లేదు?. రోజుకి 30 వేల క్వార్టర్ బాటిళ్లు తయారు చేసే డంప్ దొరికితే ఏం చేస్తున్నారు?’’ అంటూ సతీష్రెడ్డి మండిపడ్డారు. -
‘బాబు అంటనే మోసం.. కబుర్లు తప్ప అభివృద్ధి శూన్యం’
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు అంటనే మోసం అని వైఎస్సార్సీపీ నేత కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు కబుర్లు చెప్పడం తప్ప.. అభివృద్ధి చేయడం చేతకాదని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్సీపీ వ్యతిరేకమని తెలిపారు.ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు అధ్యక్షతన వైఎస్సార్సీపీ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాదరావు, ఎంపీలు గొల్ల బాబురావు, తనూజ రాణి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజక వర్గ సమన్వయ కర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, స్టీల్ ప్లాంటు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపై చర్చ జరిగింది.అనంతరం, ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ కన్నబాబు మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తుంది. వైఎస్ జగన్కు మంచి పేరు వస్తుందని ప్రైవేటుపరం చేస్తున్నారు. చంద్రబాబు అంటేనే ఒక మోసం. చంద్రబాబు కబుర్లు తప్ప ఎటువంటి అభివృద్ధి చేయలేదు. కూటమి పాలనలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుంది. ఈ నెల తొమ్మిదో తేదీన వైఎస్ జగన్ నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శిస్తారు’ అని తెలిపారు.రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు మాట్లాడుతూ..‘స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదు లేదా మూసివేత తప్పదు అని కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ కాపాడుతామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పారు. స్టీల్ ప్లాంట్ను కాపాడే బాధ్యత మాది అని చెప్పారు. ఎన్నికలు తరువాత మాట మార్చారు. చంద్రబాబు ఎప్పుడూ నిజం చెప్పడు. చంద్రబాబు నిజం చెప్పితే ఆయన తల పగిలిపోతుంది. వైఎస్ జగన్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం.మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ..‘ప్రజా సమస్యల మీద పోరాటం చేసేందుకు ఈ సమీక్ష సమావేశం ఎంతగానో ఉపయోగపడుతుంది. 800 కోట్ల కేటాయించి కిడ్నీ హాస్పిటల్ కట్టించారు. ఉత్తరాంధ్రకు చంద్రబాబు ఒక మంచి పని అయినా చేశారా?. వైఎస్ జగన్ చేసిన పనులను తాము చేసినట్లు టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. మూలపేట పోర్టులో 90 శాతం పని వైఎస్ జగన్ హయంలో జరిగింది. చేసింది చెప్పుకోవడంలో మనం వెనుకబడ్డము అని తెలిపారు.బొత్స ఝాన్సీ మాట్లాడుతూ..‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. స్టీల్ ప్లాంట్ కోసం వైఎస్సార్సీపీ ఎన్నో పోరాటాలు చేసింది. కూటమి ప్రభుత్వం 44 విభాగాలను ప్రైవేటీకరణ చేస్తుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే సంహరించుకోవాలి. ప్లాంట్కు సొంతంగా గనులు కేటాయించాలి.. లేదా సెయిల్లో విలీనం చేయాలి. గ్రామాల్లో యూరియా కొరత తీవ్రంగా ఉంది. వైఎస్ జగన్ పాలనలో ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారు. చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపిస్తారు.. కానీ ప్రజలకు ఏమీ చేయరు.ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ..‘ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి ప్రతిపక్ష పార్టీకి మంచి అవకాశం. స్థానిక సమస్యలు మీద నాయకులు పోరాటం చేయాలి. ఉత్తరాంధ్ర నిర్లక్షం చేయబడిన ప్రాంతం. అన్ని వనరులు ఉండి ఉత్తరాంధ్ర అభివృద్ధికి దూరంగా ఉంది. విభజన తర్వాత కేంద్రం ఇచ్చిన 23 సంస్థల్లో ఒకటి కూడా చంద్రబాబు శ్రీకాకుళంలో పెట్టలేదు. వైఎస్ జగన్ సీఎం అయిన వెంటనే ఉద్దానం కిడ్నీ హాస్పిటల్ 800 కోట్లతో ఏర్పాటు చేశారు. మూలపేటలో 3,600 కోట్లతో పోర్ట్ ఏర్పాటు చేశారు. 300 కోట్లతో ఫిషింగ్ హార్బర్స్ ఏర్పాటు చేశారు. దివంగత నేత వైయస్సార్, వైఎస్ జగన్ హయంలో ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందింది. స్టీల్ ప్లాంట్పై మన వైఖరి స్పష్టంగా ఉంది. ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్సీపీ వ్యతిరేకం’ అని స్పష్టం చేశారు. -
రోజుకు 30 వేల బాటిళ్లు.. ములకలచెరువులో చీకటి వ్యాపారం.. పెద్ద తలకాయలు వీళ్లే!
-
నువ్వు టీడీపీలోకి రాకపోతే... నీ మనవడిని చంపేస్తాం
సాక్షి టాస్క్ ఫోర్స్: ‘ఆమెకు చెప్పండి... లక్ష్మీదేవమ్మ టీడీపీలో చేరకపోతే ఆమె మనవడిని చంపేస్తాం...’ అని కర్నూలు జిల్లా కోడుమూరు టీడీపీ ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ డి.విష్ణువర్ధన్రెడ్డి కర్నూలు రూరల్ మండలం నూతనపల్లె వైఎస్సార్సీపీ మహిళా ఎంపీటీసీ లక్ష్మీదేవమ్మను హెచ్చరించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి 40 కార్లలో లక్ష్మీదేవమ్మ ఇంటికి వెళ్లి పట్టపగలు పోలీసుల సమక్షంలోనే ఆమె మనవడు మహేంద్రను కిడ్నాప్ చేశారు.అడ్డొచ్చిన మహిళలపై విచక్షణారహితంగా టీడీపీ మూకలు దాడి చేశారు. ఈ దౌర్జన్యకాండను వీడియోలు తీసినవారి సెల్ఫోన్లు లాక్కుని ధ్వంసం చేశారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఒక ఎమ్మెల్యేనే దగ్గరుండి కిడ్నాప్ చేయించడం, పోలీసులు చేష్టలుడిగి చూడటం రాష్ట్రంలో అరాచక పాలనకు మరో నిదర్శనమని గ్రామస్తులు మండిపడుతున్నారు. గ్రామంపైకి దండయాత్ర టీడీపీ నాయకులు కర్నూలు రూరల్ ఎంపీపీ పదవిపై కన్నేశారు. తమకు బలం లేకపోయినా వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులను భయపెట్టి టీడీపీలో చేర్చుకోవాలని ఎమ్మెల్యే దస్తగిరి, విష్ణువర్ధన్రెడ్డి నిర్ణయించారు. గురువారం వైఎస్సార్సీపీకి చెందిన నూతనపల్లె ఎంపీటీసీ లక్ష్మీదేవమ్మ, నందనపల్లె ఎంపీటీసీ జ్యోతి, రేమట ఎంపీటీసీ సుజాత, దిన్నెదేవరపాడు–1 ఎంపీటీసీ రామనాథ్రెడ్డిలను అభివృద్ధి పనులపై చర్చించాలని పిలిచి వారికి టీడీపీ కండువాలు వేశారు. నూతనపల్లె ఎంపీటీసీ లక్ష్మీదేవి తాను వైఎస్సార్సీపీలోనే కొనసాగుతానని శుక్రవారం ప్రకటించారు.దీనిని జీరి్ణంచుకోలేని టీడీపీ ఎమ్మెల్యే దస్తగిరి, విష్ణువర్ధన్రెడ్డి శనివారం ఉదయం 40 వాహనాలతో నూతనపల్లెపై దండయాత్ర చేశారు. ఊరిలో అడ్డువచ్చిన వారిని కొట్టి ఎంపీటీసీ సభ్యురాలి ఇంటిపై దండెత్తారు. ఆ సమయంలో ఎంపీటీసీ లక్ష్మీదేవమ్మ, ఆమె కుమారుడు కృష్ణ ఇంట్లో లేరు. భయంతో ఆడవాళ్లు తలుపులు వేసుకుని లోపల ఉన్నారు. టీడీపీ మూకలు తలుపులు పగలగొట్టి అడ్డువచ్చిన మహిళలపై విచక్షణారహితంగా దాడి చేసి లక్ష్మీదేవమ్మ మనవడు మహేంద్ర(22)ను లాక్కెళ్లి కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు.లక్ష్మీదేవమ్మ టీడీపీలోకి రాకపోతే మహేంద్రను చంపేస్తామని కుటుంబ సభ్యులను హెచ్చరించారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ మూకలు ఇష్టానుసారంగా కొట్టడం, యువకుడిని కిడ్నాప్ చేయడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు. మరో ఎంపీటీసీ కుటుంబానికీ బెదిరింపులు గురువారం టీడీపీ నేతలు కండువా కప్పిన దిన్నెదేవరపాడు–1 ఎంపీటీసీ రామనాథ్రెడ్డి కూడా శుక్రవారం వైఎస్సార్సీపీలో చేరారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులను కూడా టీడీపీ నాయకులు బెదరించారు. రామనాథ్రెడ్డి టీడీపీలోకి రాకపోతే ఎంతవరకైనా వెళతామని, అంతు చూస్తామని హెచ్చరించారు. ప్రజాస్వామ్యం ఖూనీ: ఎస్వీ మోహన్రెడ్డి నూతనపల్లె ఎంపీటీసీ సభ్యురాలు లక్ష్మీదేవమ్మ, దిన్నెదేవరపాడు–1 ఎంపీటీసీ రామనాథ్రెడ్డి కుటుంబ సభ్యులను టీడీపీ నాయకులు బెదిరించడం, కిడ్నాప్ చేయడంపై వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. టీడీపీ నాయకులు బరితెగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, వారికి పోలీసులు వత్తాసు పలకడం అన్యాయమన్నారు. మహేంద్ర కిడ్నాప్పై వెంటనే కేసు నమోదు చేసి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బలం లేకపోయినా బరితెగింపుకర్నూలు రూరల్ మండలంలో 23 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 12, టీడీపీ 10 స్థానాల్లో విజయం సాధించాయి. ఇండిపెండెంట్ ఒక స్థానంలో గెలుపొందారు. వైఎస్సార్సీపీకి చెందిన జి.సింగవరం ఎంపీటీసీ డి.సవారన్న, పసుపల టీడీపీ ఎంపీటీసీ మురళీకృష్ణ చనిపోయారు. పంచలింగాల ఎంపీటీసీగా ఉన్న బస్తిపాటి నాగరాజు(టీడీపీ) కర్నూలు ఎంపీగా గెలిచారు. ఆర్.కొంతలపాడు ఎంపీటీసీ కె.గిడ్డమ్మ(టీడీపీ) సుంకేసుల సర్పంచ్గా గెలిచారు.దీంతో పంచలింగాల, ఆర్.కొంతలపాడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఇండిపెండెంట్ ఎంపీటీసీ బోయమద్దిలేటి(దిన్నెదేవరపాడు–2)తో కలుపుకొని వైఎస్సార్సీపీకి 12 మంది సభ్యుల బలం ఉంది. టీడీపీ బలం 7కు తగ్గింది. ఎంపీపీగా ఉల్చాల ఎంపీటీసీ వెంకటేశ్వరమ్మ(వైఎస్సార్సీపీ) కొనసాగుతున్నారు. తగిన బలం లేకపోయినా ఎంపీపీ పదవిని పొందాలని టీడీపీ నాయకులు కుట్రలు పన్నారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను బెదిరించి తమ పార్టీలో చేర్చుకునేందుకు బరితెగించారు. -
9న వైఎస్ జగన్ అనకాపల్లి పర్యటన
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 7, 8, 9 తేదీల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు వివరాలను శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది. ఈ నెల 7వ తేదీన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.8వ తేదీన భీమవరం(పెద అమిరం)లో వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు. ఈ నెల 9వ తేదీన అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలంలోని భీమబోయినపాలెంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని సందర్శించనున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ పేరుతో ప్రైవేటుకు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను అడ్డుకోవడంలో భాగంగా భీమబోయినపాలెంలో నిర్మాణం నిలిపివేసిన ప్రభుత్వ వైద్య కళాశాలను మాజీ సీఎం వైఎస్ జగన్ సందర్శిస్తారు. -
7న వైఎస్సార్సీపీ కీలక సమావేశం
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) ఈ నెల 7వ తేదీన ఆ పార్టీ ముఖ్యనేతలతో భేటీ కానున్నారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించనున్న ఈ కీలక భేటీలో రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు హాజరు కానున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రజా పోరాటాలు సహా అనేక అంశాలపై ఈ కీలక భేటీలో చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు.. ఈ నెల 8, 9 వ తేదీల్లో వైఎస్ జగన్ పర్యటనలకు సంబంధించిన అప్డేట్స్ను అందించాయి. ఈ నెల 8వ తేదీన వైఎస్ జగన్ భీమవరంలో పర్యటించనున్నారు(YS Jagan Bhimavaram Tour). మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన జంటను ఆశీర్వదించనున్నారు. అలాగే.. ఈ నెల 9వ తేదీన వైఎస్ జగన్ అనకాపల్లిలో పర్యటించనున్నారు(jagan Anakapalle Tour). నర్సీపట్నం మాకవరపాలెంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఆయన సందర్శించనున్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలని చంద్రబాబు సర్కార్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై ప్రజాగ్రహం వ్యక్తం అవుతున్న తరుణంలో ఇటు వైఎస్ జగన్ పర్యటన రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది. -
ఆటో మీద చలాన్లు ఉంటే డబ్బులు వేయరా?: పేర్ని నాని
సాక్షి, కృష్ణా జిల్లా: ఎన్నికల్లో ఇచ్చిన సూపర్-6 హామీలకు తూట్లు పొడిచారంటూ చంద్రబాబు, పవన్, లోకేష్లపై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. శనివారం ఆయన మచిలిపట్నంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆర్టీసీ డ్రైవర్లకు ఎన్నో హామీలిచ్చారు.. ఇప్పుడు చేతులెత్తేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలప్పుడు రాష్ట్రవాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అన్నారు.. ఇప్పుడు జిల్లా సరిహద్దులు దాటడానికి వీల్లేదంటున్నారు’’ అంటూ చంద్రబాబు సర్కార్పై నిప్పులు చెరిగారు.మహిళలకు ఫ్రీ బస్సు అని చెప్పి చంద్రబాబు మోసం చేశాడంటూ పేర్ని నాని నిలదీశారు. చంద్రబాబు ఆటో డ్రైవర్లకు సాధికారిత సంస్థ ఏర్పాటు చేస్తామన్నారు? ఏమైంది?. ఆటో డ్రైవర్లకు రూ. 10 లక్షల ప్రమాద బీమా చేస్తామన్నారు, చేశారా?. ఆటో డ్రైవర్ల పిల్లల చదువులకు రుణాలు ఇప్పిస్తామన్నారు, ఇచ్చారా?. ఆటో మీద చలాన్లు ఉంటే డబ్బులు వేయరా?’’ అంటూ పేర్ని నాని ప్రశ్నలు గుప్పించారు.చంద్రబాబు, పవన్, లోకేష్ ముగ్గురూ కలిసి మూడు ఖాకీ చొక్కాలేశారు. ఆటో డ్రైవర్ సేవలో పేరుతో డ్రైవర్లకు డబ్బులేశామని చెబుతున్నారు. ఎన్నికల్లో రాష్ట్రమంతా మహిళలకు బస్సు ప్రయాణం ఫ్రీ అన్నారు. ఎవరైనా అడిగితే నా పేరు చెప్పండని చంద్రబాబు చెప్పాడు. ఎవరైనా ప్రశ్నిస్తే తోలు తీస్తామన్నారు. ఏడాదైనా ఫ్రీ బస్సు ఇవ్వకపోవడంతో విమర్శల పాలయ్యారు. వైఎస్ జగన్, ప్రజలు, ప్రతిపక్షాల దెబ్బకు చంద్రబాబు ప్రభుత్వం దిగొచ్చింది. ఫ్రీ బస్సులో జిల్లాల సరిహద్దులు దాటడానికి వీల్లేదని సాక్షాత్తూ మంత్రులే చెప్పారు. తీవ్ర వ్యతిరేకత రావడంతో పల్లె వెలుగులో రాష్ట్రమంతా తిరగొచ్చని ప్రకటించారు. బస్సులను తగ్గించేశారు.చంద్రబాబు దెబ్బకు ఆటోవాళ్లంతా రోడ్డెక్కారు. ఎన్నికల్లో ఊకదంపుడు ప్రసంగం చేసిన చంద్రబాబు, పవన్ను నిలదీశారు. 2,90,669 మంది ఆటో డ్రైవర్లకు 436 కోట్లు వేశామని చంద్రబాబు చెబుతున్నాడు. భూ ప్రపంచం మీద తనే ఆటో డ్రైవర్లను ఆదుకున్నానని బిల్డప్ ఇచ్చాడు. చంద్రబాబు స్పీచ్ దెబ్బకు ఆటో డ్రైవర్లకు చెవుల వెంట రక్తం ఒక్కటే తక్కువ. ఆటో వాళ్ల కోసం యాప్ పెడతా.. కంట్రోల్ రూమ్ పెడతానంటున్నాడు. ఆటో, క్యాబ్, మ్యాక్సి క్యాబ్ డ్రైవర్లకు పండగే పండగ అని చంద్రబాబు చెబుతున్నాడు. చంద్రబాబు తీరు సినిమాలో బ్రహ్మానందం క్యామెడీ సీన్లా ఉంది...వాహనమిత్ర పథకం ప్రారంభించింది వైఎస్ జగన్. పాదయాత్రలో వైఎస్ జగన్ ఆటో డ్రైవర్ల కష్టాలు తెలుసుకున్నారు. మచిలీపట్నంలో ఆటో డ్రైవర్ల సమస్యలు స్వయంగా విన్నారు. తమకు ఏడాదికి పది వేలైనా ఇవ్వమని ఆటో డ్రైవర్లు అడిగారు. సొంతంగా ఆటో కొనుక్కుని నడుపుకుంటున్న వారికి 10 వేలు ఇస్తామని ఏలూరు వేదికగా ప్రకటించారు. జగన్ సీఎం అయిన వెంటనే 2 లక్షల 36 వేల మందికి వాహనమిత్ర ఇచ్చారు. ఎన్నికల సంవత్సరం కూడా వైఎస్ జగన్ 2 లక్షల 75 వేల మందికి వాహన మిత్ర ఇచ్చారు. ఇప్పుడు జగన్ కంటే చంద్రబాబు కేవలం 14 వేల మందికి మాత్రమే అదనంగా ఇచ్చారు. చంద్రబాబు మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్ల కోసం చాలా చెప్పాడు..డ్రైవర్లను ఓనర్లు చేసేస్తామన్నాడు. బ్యాడ్జి కలిగిన ప్రతీ ఆటో, ట్యాక్సి డ్రైవర్లు, హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ, టిప్పర్ డ్రైవర్లకు ఏటా 15 వేలు ఇస్తామని చెప్పారు. మీరు చెప్పినట్లు ప్రతి డ్రైవర్కి రూ.15 వేలు ఇచ్చారా?. ఏ ఒక్క ఆటో డ్రైవర్కైనా 4 లక్షల రుణం ఇప్పించారా? ఆటో డ్రైవర్లకు బీమా కల్పించారా?. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు .. చేశారా?. చలాన్లు ఉంటే డబ్బులు వేయరా?. 15 వేలు ఇవ్వడానికి సవాలక్ష ఆంక్షలు పెడతారా?. 13 లక్షల మంది లైసెన్స్ ఉన్న ఆటో డ్రైవర్లు ఉన్నారని లోకేష్ యువగళంలో చెప్పారు. ఈ రెండేళ్లలో లైసెన్సులున్న వాళ్లు పెరగరా?బ్యాడ్జి కలిగిన ప్రతీ ఒక్కరికీ ఇస్తామన్నారు.. ఇచ్చారా?. ఈ రోజు మోసం.. దగా చేసి పండుగ చేసుకోమంటున్నారు. వైఎస్ జగన్ ఒక్క షరతు కూడా పెట్టకుండా వాహనమిత్ర ఇచ్చారు. 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన మాటను జగన్ నిలబెట్టుకున్నారు. కానీ చంద్రబాబు, పవన్, లోకేష్ మీ మ్యానిఫెస్టోలో ఏం చెప్పారు?. ఇప్పుడు ఏం చేశారు?. ఈ రోజు జరిగింది ఆటో డ్రైవర్ల సేవ కాదు.. దగా. మీ మామ ఎన్టీఆర్కు ఏం చేశారో.. ఆటో డ్రైవర్లకు కూడా అదే చేశారు. ఒక సంవత్సరం ఎగ్గొట్టి.. ఇప్పుడు కబుర్లు చెబుతున్నారు.రోడ్లన్నీ వేసేశామంటున్న చంద్రబాబుకు ఇదే నా సవాల్. ఆటో ఎక్కి రండి.. బందరు వస్తారా..? అవనిగడ్డ వస్తారా?. కైకలూరు వస్తారా?. గుడివాడ వస్తారా?. ఆటోలో రండి గోతులున్న రోడ్లు మీకు చూపిస్తాం. ఆటోలో ప్రయాణించిన మీరు బందరు ఆసుపత్రిలో చేరడం ఖాయం. లోకేష్ సిగ్గు లేకుండా మహిళా ఆటోడ్రైవర్లతో బూతులు మాట్లాడుతున్నాడు. ఈ రోజు ఆటో డ్రైవర్లందరినీ వంచన చేశారు’’ అంటూ పేర్ని నాని దుయ్యబట్టారు. -
టీడీపీ నాయకులే కల్తీ లిక్కర్ డాన్లు: గడికోట శ్రీకాంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీడీపీ నాయకులు కల్తీ మద్యం డాన్లుగా మారి, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని వైఎస్సార్సీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులే పారుతోందని, టీడీపీ నేతలు కల్తీ మద్యం తయారీని పరిశ్రమ స్థాయికి తీసుకువెళ్ళారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కొత్త మద్యం పాలసీ ముసుగులో విచ్చలవిడిగా ప్రైవేటు వ్యక్తులకు మద్యం దుకాణాలు కేటాయించి, గ్రామగ్రామాన బెల్ట్ షాప్లను ఏర్పాటు చేయించి, ఈ కల్తీ మద్యాన్ని వాటి ద్వారా విక్రయిస్తున్నారని ధ్వజమెత్తారు. నాణ్యమైన మద్యం పేరుతో సీఎం చంద్రబాబు చెబుతున్నది ఈ కల్తీ మద్యం గురించేనని, ప్రజల ప్రాణాలను బలిపెట్టి, టీడీపీ నేతలు తమ జేబులు నింపుకుంటున్నారని దుయ్యబట్టారు. ఇంకా ఆయనేమన్నారంటే..డిస్టిలరీల స్థాయిలో కల్తీ మద్యం తయారీ యూనిట్లునాణ్యమైన మద్యం సరఫరా చేస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, లక్షలాది మంది ప్రాణాలను పణంగా పెట్టి తెలుగుదేశం నాయకుల జేబులు నింపడమే ధ్యేయంగా కల్తీ మద్యం తయారీకి సహకారం అందిస్తున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ అండదండలతో టీడీపీ నాయకులే కల్తీ లిక్కర్ తయారు చేసి మందు బాబుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వమే లిక్కర్ అమ్మకాలు జరిపితే దానిపై విషప్రచారం చేసిన చంద్రబాబు, కూటమి ప్రభుత్వం వచ్చాక తిరిగి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడంతో వారు రెచ్చిపోయి కల్తీ లిక్కర్ తయారు చేసి సొమ్ము చేసుకుంటున్నారు.తాజాగా మదనపల్లె సమీపంలోని తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువులో శుక్రవారం కల్తీ మద్యం రాకెట్ వ్యవహారం బయటపడింది. ప్రభుత్వ అనుమతి లేకుండా ఏకంగా ఒక డిస్టిలరీ యూనిట్ స్థాయిలో రోజుకు 15వేల కేసుల కల్తీ లిక్కర్ తయారు చేసి బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్నారు. ఈ కేసులో మండల స్థాయి టీడీపీ నేత కట్టా సురేంద్ర నాయుడుతోపాటు ఎనిమిది మంది కూలీలను ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేశారు.కానీ ఈ కల్తీ మద్యం రాకెట్ వెనుక రింగ్ మాస్టర్, సూత్రధారుల పేర్లపై ఎక్సైజ్ శాఖ అధికారులు స్పందించడం లేదు. అన్నమయ్య జిల్లాకు చెందిన ప్రభుత్వ కీలక నేతను చంద్రబాబు, నారా లోకేష్లే కాపాడుతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేలా ప్రతి రెండు జిల్లాలకు ఒక యూనిట్ నెలకొల్పి లిక్కర్ దందా సాగిస్తున్నారు. తాగడానికి మంచినీళ్లు లేని గ్రామాలున్నాయి కానీ, మద్యం సరఫరా జరగని గ్రామాలు ఏపీలో లేవు. వేళలతో సంబంధం లేకుండా 24 గంటలూ ఇంటికే మద్యం డోర్ డెలివరీ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చిల్లర అంగళ్లలో సైతం మద్యం విక్రయాలు జరుగుతున్నాయంటే పరిస్థితి ఎంత ఘోరంగా తయారైందో చెప్పాల్సిన పనిలేదు.లిక్కర్ స్కాం పేరుతో వైఎస్సార్సీపీపై బురదచల్లారువైయస్సార హయాంలో లిక్కర్ కుంభకోణం జరిగిందని ప్రజలను నమ్మించడానికి చంద్రబాబు చేయని కుటిల ప్రయత్నం లేదు. ఆధారాలు లేకపోయినా వైయస్సార్సీపీ నాయకులను, వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారులను కక్షపూరితంగా అక్రమ కేసుల్లో ఇరికించి అరెస్టులు చేసి వేధించడమే ధ్యేయంగా లిక్కర్ కుంభకోణం సృష్టించారు. మాజీ ఐఏఎస్లు ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డితోపాటు ఎంపీ మిధున్రెడ్డిలను అక్రమంగా అరెస్ట్ చేశారు. తప్పుడు వాంగ్మూలాలు సృష్టించి అరెస్టులు చేసినా ఆ కేసులు కోర్టుల్లో నిలబడలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ వరుసగా చీవాట్లు తింటోంది. కూటమి ప్రభుత్వ మోసాలతో ప్రజలు విసిగిపోయారు. 16 నెలల పాలనలోనే తీవ్రమైన వ్యతిరేకత తెచ్చుకుంది.స్పిరిట్ తో కల్తీ మద్యం తయారీరాష్ట్రంలో కల్తీ మద్యం రాకెట్ దందాను టీడీపీ మద్యం సిండికేట్ వ్యవస్థీకృతం చేసింది. ప్రభుత్వ పెద్దల అండదండలతో జిల్లాలు, రీజియన్ల వారీగా పంచుకుని మరీ కల్తీ మద్యం దందాను సాగిస్తోంది. నాడు కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో స్పిరిట్ను కొనుగోలు చేయడానికి కేంద్రం ఇచ్చిన ఆదేశాలను టీడీపీ మద్యం సిండికేట్ తమ దందాకు అవకాశంగా మలుచుకుంది. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుల్లోని స్పిరిట్ తయారీ పరిశ్రమల నుంచి డిస్టిలరీల పేరిట అవసరానికి మించి ‘ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (వాడుక భాషలో స్పిరిట్ అంటారు)ను అక్రమంగా కొనుగోలు చేస్తోంది. ఆ విధంగా భారీగా కొనుగోలు చేసిన స్పిరిట్తో కల్తీ మద్యం తయారు చేస్తున్నారు.అందుకోసం కల్తీ మద్యం యూనిట్లలో యంత్ర సామగ్రిని తెప్పించి పక్కాగా భారీ ప్లాంట్లనే నెలకొల్పారు. అక్రమంగా సేకరించిన స్పిరిట్ను డైల్యూట్ (పలుచన) చేసి అందులో కారమెల్, కలర్డ్ ఫ్లేవర్లు (రంగు నీళ్లు) కలిపి కల్తీ మద్యం తయారు చేస్తున్నారు. వివిధ ప్రముఖ బ్రాండ్ల పేరిట లేబుళ్లు, బిరడాలు ఇతర ప్రాంతాల్లో తయారు చేయించి తెప్పిస్తున్నారు. ఆ కల్తీ మద్యాన్ని బాట్లింగ్ చేసి బ్రాండెడ్ మద్యంగా మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు.ఆ కల్తీ మద్యాన్ని తాగించడానికి గ్రామాల్లో ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగి బెల్ట్ షాపులు తెరుస్తున్నారు. లిక్కర్ షాపులకు అదనంగా పర్మిట్ రూమ్లు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 3,396 ప్రైవేటు మద్యం దుకాణాలుంటే, వాటికి అనుబంధంగా దాదాపు 75 వేల బెల్ట్ దుకాణాలు నడుస్తున్నాయి. ఆ మద్యం దుకాణాలు, బెల్ట్ షాపుల్లో కల్తీ మద్యాన్ని బ్రాండెడ్ మద్యంగా విక్రయిస్తున్నారు. మద్యం నెట్వర్క్ అంతా టీడీపీ సిండికేట్ గుప్పిట్లో ఉండటంతో ఈ దందా అడ్డూ అదుపు లేకుండా సాగుతోంది.ప్రతి మూడు మద్యం బాటిళ్లలో ఒకటి కల్తీటీడీపీ సిండికేట్ సాగిస్తున్న కల్తీ మద్యం విక్రయాలు చూస్తే ఆశ్చర్యం కలిగిస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024-25లో 4.26 కోట్ల ఐఎంఎల్ మద్యం కేసులు, 3.25 కోట్ల బీరు కేసులు విక్రయించారు. 4.26 కోట్ల ఐంఎఎల్ మద్యం కేసుల్లో 70 శాతం క్వార్టర్ బాటిళ్ల కేసులే ఉన్నాయి. అంటే 2.98 కోట్ల కేసుల్లో క్వార్టర్ బాటిళ్లే విక్రయించారు. ఒక్కో కేసులో 48 క్వార్టర్ బాటిళ్లు ఉంటాయి.ఈ లెక్కన 143 కోట్ల క్వార్టర్ బాటిళ్లు విక్రయించారు. దీన్నిబట్టి మొత్తం క్వార్టర్ బాటిళ్లలో మూడో వంతు కల్తీ మద్యం విక్రయించినట్లు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో అమ్ముడవుతున్న ప్రతి మూడు మద్యం బాటిళ్లలో ఒకటి కల్తీ మద్యమే. ఆ ప్రకారం దాదాపు 48 కోట్ల క్వార్టర్ బాటిళ్ల మేర కల్తీ మద్యాన్ని విక్రయించారు. ఒక్కో క్వార్టర్ బాటిల్ను రూ.110 చొప్పున విక్రయిస్తున్నారు. ఈ లెక్కన ఒక్క ఏడాదిలోనే రూ.5,280 కోట్ల విలువైన కల్తీ మద్యాన్ని తాగించి సొమ్ము చేసుకున్నారు.పవన్ కళ్యాణ్ స్పందించాలిప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో కూటమి పాలనలో యథేచ్ఛగా సాగుతున్న కల్తీ మద్యం విక్రయాలపై స్పందించాలి. టీడీపీ హయాంలో సుగాలి ప్రీతి హత్య జరిగితే వైయస్సార్సీపీ హయాంలో జరిగినట్టు విష ప్రచారం చేసి రాజకీయంగా వాడుకున్నాడు. 34 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారంటూ ఆయన చేసిన ప్రచారం కూడా పచ్చి అబద్ధమని అసెంబ్లీలో కూటమి ప్రభుత్వమే స్పష్టం చేసింది. లేనివాటిని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్.. కళ్ల ముందు కల్తీ మద్యం దందా సాగిస్తూ లక్షల మంది ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు?వైఎస్సార్సీపీ హయాంలో కల్తీ మద్యం విక్రయాలంటూ కూటమి నాయకులు విషం చిమ్మారు. కానీ కల్తీ లిక్కర్ తాగి ఒక్క మరణం కూడా సంభవించలేదని ఎన్సీఆర్బీ రిపోర్టులో స్పష్టం చేసింది. దీనిగురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అక్రమ కేసులు నమోదు చేయడమే కాకుండా సోషల్ మీడియాకి అడ్డుకట్ట వేయాలన్న దుర్భుద్ధితో మంత్రుల కమిటీ వేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బురదజల్లిన కూటమి నాయకులు, ఇప్పుడు వారు అధికారంలోకి రాగానే వైఎస్సార్సీపీ నాయకులు నిజాలు మాట్లాడుతుంటే ఓర్వలేకపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం స్పందించి కల్తీ మద్యం సరఫరా రాకెట్కి అడ్డుకట్ట వేయాలి. ప్రతిపక్షంపై దుష్ప్రచారం చేయడం మాని ప్రజల ప్రాణాలను కాపాడాలి. విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన బెల్ట్ షాపులను తక్షణం మూసేయాలి. -
YSRCP నేత అశోక్ కుమార్ కాన్వాయ్ ను అడ్డుకున్న పోలీసులు
-
‘టీడీపీ నేతలే కల్తీ మద్యం తయారీ చేస్తున్నారు’
తాడేపల్లి : ఏపీలో కూటమి ప్రభుత్వం అండతో యథేచ్ఛగా కత్తీ మద్యం తయారవుతోందని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు విమర్శించారు. టీడీపీ నేతలే కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు( శనివారం, అక్టోబర్ 4వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన టీజేఆర్.. ఈ కల్తీ మద్యానికి సామాన్య ప్రజలు బలి అవుతున్నారని ధ్వజమెత్తారు. ‘ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతల కల్తీ మద్యం వ్యాపారం జోరందుకుంది. చంద్రబాబు సొంత జిల్లా పక్కనే కల్తీ మద్యం తయారవుతోంది. కొన్ని లక్షల లీటర్ల కల్తీ మద్యం తయారీకి కావాల్సిన ముడి పదార్ధాలను కూడా పోలీసులు పట్టుకున్నారు. జగన్ హయాంలో జరగని మద్యం స్కాంని జరిగినట్టు చూపించే ప్రయత్నం చేశారు. కానీ మన కళ్లెదుటే జరుగుతున్న కల్తీ మద్యం గురించి ఎందుకు నోరు మెదపటం లేదు?, ఆర్గనైజ్డ్ స్కాం చేస్తున్నారు. తన తప్పులను కప్పి పుచ్చుకోవటానికి జగన్ చుట్టూ ఉన్న పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టారు. ప్రభుత్వానికి రావాల్సిన మద్యం ఆదాయం అంతా టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయి. చంద్రబాబు చేసే వ్యవస్థీకృత పాపాల్లో ఎల్లోమీడియాకు కూడా భాగస్వామ్యం ఉంది. అందుకే టీడీపీ నేతల కల్తీ మద్యం గురించి వార్తలు కూడా రాయటం లేదు. చంద్రబాబు కల్తీ మద్యం తాగి 80% ఎస్సీ, ఎస్టీ, బీసీలు తీవ్రంగా నష్టపోతున్నారు. నకిలీ, కల్తీ మద్యం రాకూడదనే జగన్ హయాంలో ప్రభుత్వ షాపుల ద్వారా విక్రయాలు చేశారు. మద్యం తాగొద్దని చెప్పాల్సిన ప్రభుత్వ పెద్దలే మద్యం అందిస్తామని చెప్తున్నారు. ఈ మద్యం తాగి ప్రజల ధన, మాన, ప్రాణాలను కోల్పోతున్నారు. ప్రతి మూడు మద్యం బాటిళ్ళలో ఒకటి కల్తీ మద్యమే. సీబిఎన్ సిండికేట్ కల్తీ మద్యాన్ని తయారు చేస్తోంది. అంబేద్కర్ విగ్రహాన్ని తగులపెట్టిన వారిని వెంటనే అరెస్టు చేయాలి’ అని డిమాండ్ చేశారు.ఇది కూడా చదవండి:టీడీపీ నేతలే సూత్రధారులుగా.. నకిలీ మద్యం మాఫియా -
కొమ్మినేని కేసులో సుప్రీం దెబ్బ మర్చిపోయావా చంద్రబాబూ?
సాక్షి,హైదరాబాద్: ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టుల గొంతు నొక్కడమే ధ్యేయంగా ఐటీ చట్టాన్ని సవరించేందుకు కూటమి ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసినా, వారి సిఫార్సులు న్యాయస్థానాల్లో నిలబడవని వైఎస్సార్సీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ, మాజీ అడిషినల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి స్పష్టం చేశారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..కేంద్ర పరిధిలో ఉన్న ఐటీ చట్టానికి మార్పులు చేసే అధికారం రాష్ట్రాలకు ఉండవని తెలిసీ మంత్రులతో కమిటీని ఏర్పాటు చేయడం అవివేకమైన చర్యగా పొన్నవోలు సుధాకర్రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రశ్నించే గొంతులను నొక్కాలని చూస్తున్న ప్రభుత్వ చర్యలు ఎప్పటికీ నెరవేరవని గట్టిగా బదులిచ్చారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిస్ ఇన్ఫర్మేషన్కి చంద్రబాబే బ్రాండ్ అంబాసిడర్ అని, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీని నడుపుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, నాటి బీజేపీ అధ్యక్షురాలు పురంధరీశ్వరి విష ప్రచారం చేశారని, ఒకవేళ కేసులు పెట్టాల్సి వస్తే ముందుగా వారిమీదనే పెట్టాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అక్రమంగా బీఎన్ఎస్ సెక్షన్ 111 ప్రయోగించి వారి జీవితాలను కూటమి ప్రభుత్వం నాశనం చేయాలని చూసిందని, వైఎస్ జగన్ ఆదేశాలతో న్యాయస్థానాల్లో పోరాడుతున్నామని అన్నారు. వైఎస్సార్సీపీ లీగల్ సెల్ కృషి ఫలించి సోషల్ మీడియా కేసుల్లో 111 సెక్షన్ విధించడంపై పలుమార్లు పోలీసులకు కోర్టులు మొట్టికాయలు వేసిన విషయాన్ని పొన్నవోలు సుధాకర్రెడ్డి గుర్తు చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...ప్రశ్నించే గొంతు నొక్కుతున్న నియంత పాలనప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తుంటే కూటమి ప్రభుత్వం ఓర్చుకోలేకపోతుంది. ప్రశ్నిస్తున్న వారి గొంతు నొక్కి నియంత పాలన సాగిస్తున్నారు. ఈ 16 నెలల్లోనే సుమారు 2వేల మంది సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఈ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహిస్తోంది. వారి మీద అక్రమ కేసులు బనాయించి వేధిస్తోంది. ఒక్కొక్కరి మీద రాష్ట్రవ్యాప్తంగా పదుల సంఖ్యలో కేసులు పెడుతున్నారు. ఇదంతా చాలదన్నట్టు సోషల్ మీడియా కట్టడికి మంత్రులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ ప్రభుత్వం మొదటి ప్రపంచయుద్ధంలో హిట్లర్ మాదిరిగా వ్యవహరిస్తోంది. వరుసపెట్టి ఒక్కో వర్గాన్ని ఎలాగైతే అంతం చేశాడో సీఎం చంద్రబాబు సైతం అదేవిధానాలను అవలంభించబోతున్నారు. అందులో భాగంగానే ముందుగా సోషల్ మీడియా యాక్టివిస్టుల అణచివేతకు వ్యూహరచన చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలు ఉద్యమించకపోతే రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఏ వర్గాన్ని ఈ ప్రభుత్వం ఊరికే వదిలిపెట్టదు. అంగన్వాడీలు, టీచర్లు, ఉద్యోగ సంఘాలు, కార్మికులు.. ఆఖరుకి రైతులను కూడా.. ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా సోషల్ మీడియా యాక్టివిస్టులను అక్రమంగా అరెస్టు చేసి తప్పుడు కేసులు పెట్టి వేధింస్తున్నట్టే వారినీ ఇలాగే వేధిస్తారు.బీఎన్ఎస్ 111 సెక్షన్ పై కోర్టు మొట్టికాయలు వేసినా... సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన యాక్టివిస్టుల మీద బీఎన్ఎస్ 111 సెక్షన్, పీడీ యాక్ట్ కింద కేసులు పెడుతున్నారు. ఈ కేసు రుజువైతే వారు జీవితకాలం జైలుకు పోతారని ఈ ప్రభుత్వానికి తెలియదా? మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో వైయస్సార్సీపీ లీగల్ సెల్ పోరాడితే 111 సెక్షన్ ని కోర్టులు స్వ్కాష్ చేశాయి. ప్రభుత్వానికి పలు సందర్భాల్లో మొట్టికాయలు వేసినా పోలీసుల్లో మార్పు రావడం లేదు. 2 వేల మంది మీద కేసులు పెట్టారు. యాక్టివిస్టులను పోలీసులు అక్రమంగా తీసుకెళ్లి దారుణంగా దాడి చేసి కొట్టారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే యథేచ్ఛగా చట్టాలను ఉల్లంఘిస్తున్నారు.టీవీలో హోస్ట్గా ఉన్నందుకే సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు మీద పోలీసులు అక్రమ కేసు బనాయించి వేధిస్తే.. నవ్వినా, మాట్లాడినా కేసులు పెడతారా అంటూ ఈ ప్రభుత్వం, పోలీసుల మీద సుప్రీంకోర్టు మండిపడింది. పాలన సరిగా లేదని సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే వారి మీద అక్రమ కేసులు పెడుతున్న ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ ఇంకా సజీవంగానే ఉందనే విషయాన్ని గుర్తుంచుకుని ప్రవర్తిస్తే మంచిది. రాజ్యాంగ బద్దంగా ఎన్నికైన కూటమి నాయకులు అదే రాజ్యాంగం తమకు వర్తించదు అన్నట్టు నియంతృత్వంగా ప్రవర్తిస్తున్నారు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు ప్రశ్నించడం అనేది ప్రజాస్వామ్యంలో సర్వసాధారణమైన విషయం మర్చిపోతే ఎలా?ఫేక్ ఫ్యాక్టరీని నడిపిస్తుంది చంద్రబాబేఫేక్ ప్రచారం చేయడంలో మొదటి దోషి చంద్రబాబు అయితే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న రెండో ముద్దాయి ఐటీడీపీయే. ఎన్నో ఫేక్ అకౌంట్లతో ప్రతిపక్ష నాయకుడి మీద ఇప్పటికీ బురదజల్లుతూనే ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం మీద విష ప్రచారం చేశారు. అలాంటిది వీళ్లే ఇప్పుడు సోషల్ మీడియాను కట్టడి చేస్తామంటూ చట్ట సవరణకు ముందుకు రావడం హాస్యాస్పదంగా ఉంది. నియంతృత్వ పోకడలు మరింత పెరిగిపోతే ఏపీలోనూ నేపాల్ మాదిరిగా జెన్జీ ఉద్యమం వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పౌరుల హక్కుగా రాజ్యాంగం ఇచ్చిన చట్టాలను అపహాస్యం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ప్రపంచంలో జరిగిన ఎన్నో సంఘటనలు రుజువు చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వానికి అర్థం కావడం లేదు. వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్, ఆయన కుటుంబంతోపాటు పార్టీ నాయకుల మీద సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న విషప్రచారంపై ఆధారాలతో సహా అనేక సందర్భాల్లో డీజీపీ స్థాయి అధికారి నుంచి కింది స్థాయి వరకు ఫిర్యాదులు చేసినా కేసులు నమోదు చేయడం లేదు. అధికార పార్టీ నాయకులకు, కార్యకర్తలకు చట్టాలు వర్తించవా అని ప్రశ్నిస్తున్నా. వైఎస్సార్సీపీ కార్యకర్తలను వేధించడానికి ప్రయత్నిస్తున్న కూటమి ప్రభుత్వం, ఇవే కేసులు అధికార పార్టీ వారికి కూడా వర్తిస్తాయని చెప్పగలరా అని ప్రశ్నిస్తున్నా.మీరు చేసిన తప్పుడు ప్రచారానికి కేసులు పెట్టొద్దా? సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలని సూచించడానికి మంత్రుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ వాస్తవానికి ఫేక్ ఫ్యాక్టరీని నడుపుతున్నది తెలుగుదేశం పార్టీయే. ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇతర టీడీపీ నాయకులు ఎన్నో పచ్చి అబద్ధాలు ప్రచారం చేసి ప్రజల్లో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మీద తీవ్రమైన విషప్రచారం చేశాడు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే వారి మీద చర్యలు తీసుకోవాలనుకుంటే అందులో ప్రథమ ముద్దాయి చంద్రబాబే అవుతాడు. 34 మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారంటూ నాడు పవన్ కళ్యాణ్ విష ప్రచారం చేశాడు. మిస్ ఇన్ఫర్మేషన్కి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబే.వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రం అప్పులపాలైందని, రూ.14 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించాడని, శ్రీలకం చేశాడని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నాటి బీజేపీ అధ్యక్షురాలు పురంధరీశ్వరి పథకం ప్రకారం విషం చిమ్మారు. అమ్మాయిలు అదృశ్యమయ్యారంటూ చేసిన ప్రచారం అబద్ధమేనని ఎన్సీఆర్బీ లెక్కలతో తేలిపోయింది. అంతా ఉత్తుదేనని కేంద్ర మంత్రి పార్లమెంట్లోనూ చెప్పాడు.వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో చేసిన అప్పులు రూ. 3.70 లక్షల కోట్లేనని ఇటీవలే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరుతో ప్రజల్లో భయాందోళనలు కలిగించిన కూటమి నాయకులు, అధికారంలోకి వచ్చాక అదే చట్టాన్ని అమలు చేస్తున్నారు. ఉచితంగా ఇసుక పేరుతో ప్రచారం చేసుకున్నారు. కానీ ఇప్పుడు రెట్టింపు ధర చెల్లించినా రాష్ట్రంలో ఇసుక దొరకని పరిస్థితి నెలకొంది. విశాఖ వేదికగా వేల కోట్ల విలువ చేసే డ్రగ్స్ రాష్ట్రంలోకి వచ్చాయని తప్పుడు ప్రచారం చేశారు. అదంతా అబద్ధమేనని తేలిపోయింది. వీటన్నింటిపైనా తప్పుడు ప్రచారం చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల మీద ఎందుకు కేసులు నమోదు చేయకూడదు?ఐటీ యాక్ట్ కేంద్ర పరిధిలోని అంశం సోషల్ మీడియా ఐటీ యాక్ట్ 2000 పరిధిలోకి వస్తుంది. దీనికి కేంద్రం, రాష్ట్రం, ఉమ్మడిగా మూడు వేర్వేరు చట్టాలున్నాయి. వాటి అధికారం, పరిధులు వేర్వేరుగా ఉంటాయి. ఉమ్మడి చట్టమైనా కేంద్రం తీసుకొచ్చిన చట్టాన్ని అమలు చేయడం మినహా రాష్ట్రం మార్పులు చేయలేదు. తిరగరాయడం సాధ్యం కాదు. ఐటీ యాక్ట్ అనేది రిసిడ్యూరీ లిస్టులో ఉంటుంది. కాబట్టి కేంద్రం మాత్రమే దీనికి చట్టం చేయగలదు. దీనిలో రాష్ట్రం ఏమాత్రం కలగజేసుకోవడం సాధ్యపడదు. అయినా సోషల్ మీడియాను కట్టడి చేసే పేరుతో ప్రత్యేకంగా మంత్రులతో కమిటీని ఏర్పాటు చేయడమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశం పరిధిలో లేదని చంద్రబాబు అనుకుంటున్నారా? మాకొక ప్రత్యేక రాజ్యాంగం ఉందని ఆయన చెప్పదలుచుకున్నారా? అయినా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్లడం చూస్తుంటే వారిది అవివేకం అనుకోవాలో మూర్ఖత్వం అనుకోవాలో అర్థం కావడం లేదు. కోర్టుల ముందు ఇలాంటి చట్టాలు నిలబడవని కూటమి ప్రభుత్వం గుర్తుంచుకోవాలి.సోషల్ మీడియా పోస్టులు, కట్టడికి సంబంధించి నియమ నిబంధనలు రూపొందించి నవంబర్ లోపు కోర్టు ముందు ఉంచాలని మార్చి 25న సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి కొన్ని ఆదేశాలిచ్చింది. ఐటీ యాక్ట్ కేంద్రం పరిధిలో ఉంది కాబట్టే నేరుగా సుప్రీంకోర్టు కేంద్రానికి సూచనలు చేస్తే, అందులో రాష్ట్ర ప్రభుత్వం తగుదునమ్మా అని ఎలా దూరిపోతుంది? రెసిడ్యూరీ లిస్టులో ఉన్న ఐటీ యాక్టుకి పార్లమెంట్లో మాత్రమే చట్టం చేయడానికి వీలుపడుతుందే తప్ప, ఇందులో ఏ రాష్ట్ర అసెంబ్లీలు కలుగజేసుకోలేవు. ఐటీ యాక్టులో ఇప్పటికే చట్టాలున్నప్పుడు వీరు కొత్తగా ఏం తీసుకొస్తారో అర్థం కావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీలో ఏ ఒక్కరూ లా అండ్ జస్టిస్కి సంబంధించిన మంత్రి లేకపోవడం ఇక్కడ మరీ విచిత్రంగా ఉంది. ఐటీ యాక్టుని నిర్దేశించేది గృహ నిర్మాణం, సివిల్ సప్లయిస్, వైద్యారోగ్య శాఖకు చెందిన మంత్రులా అని పొన్నవోలు సుధాకర్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. -
నంద్యాలలో పచ్చమూకల అరాచకం
సాక్షి,నంద్యాల: రాష్ట్రంలో పచ్చమూకల అరాచకాలు కొనసాగుతున్నాయి. తాజాగా, నంద్యాల జిల్లా కలుగోట్లలో మంత్రి బీసీ జనార్ధన్రెడ్డి అనుచరులు రాడ్లతో వైఎస్సార్సీపీ నేతలపై దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. ఈ దాడిలో పలువురు వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని అత్యవసర చికిత్స కోసం కోవలెకుంట్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.రెండురోజుల క్రితం కూడా వైఎస్సార్సీపీ నేత రామసుబ్బారెడ్డిపై అదే వర్గానికి చెందిన వ్యక్తులు దాడి చేసినట్లు సమాచారం. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలు నంద్యాల జిల్లాలో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి.స్థానికంగా ‘పచ్చమూకల అరాచకాలు’అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాంతి భద్రతలు కాపాడేందుకు పోలీసులు రంగంలోకి దిగినప్పటికీ.. రాజకీయంగా ప్రేరితమైన ఈ దాడులు ఆగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. -
‘చంద్రబాబుకు ఎస్సీలంటే మొదట్నుంచీ చిన్నచూపు’
తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఎస్సీలంటే మొదట్నుంచీ చిన్నచూపని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు విమర్శించారు. ఈరోజు(శుక్రవారం, అక్టోబర్ 3వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన కనకారావు. దేవళంపేటలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన టీడీపీ నేత సతీష్ నాయుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ‘దేవళంపేటలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటును మొదట్నుంచీ టీడీపీ నేతలు అడ్డుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు టీడీపీ నేత సతీష్ నాయుడు స్వయంగా విగ్రహానికి నిప్పు పెట్టారు. సతీష్ నాయుడుని వెంటనే అరెస్టు చేయాలి. దేశంలో దసరా ఉత్సవాలు జరుగుతుంటే ఏపీలో దళితులపై దాడులు జరుగుతున్నాయి. చంద్రబాబుకు ఎస్సీలంటే మొదట్నుంచీ చిన్నచూపు. జగన్ అధికారంలోకి వచ్చాక విజయవాడలో భారీ అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పారు. ఆ విగ్రహం దగ్గర లైట్లు కూడా తొలగించారుస్మృతివనంలో పనిచేసే కార్మికులకు 9 నెలలుగా జీతాలు ఇవ్వటం లేదు. పర్చూరు నియోజకవర్గంలో కూడా ఇటీవలే అంబేద్కర్ విగ్రహ ఏర్పాటును అడ్డుకున్నారు. దళితులను పోలీసులతో అరికాళ్ల మీద దాడి చేయించారు. చంద్రబాబు నిరంకుశత్వం ఎంతోకాలం నిలవదు. దళితులే చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చుతారు. దళితుల భూములను కూడా కబ్జా చేసిన నీచ చరిత్ర టీడీపీ నేతలది. పిఠాపురం నియోజకవర్గంలో దళితులను బహిష్కరణ చేశారు. అసలు చంద్రబాబు ప్రభుత్వంలో దళితులు బతికే పరిస్థితి లేదు’ అని ధ్వజమెత్తారు. -
వల్లభనేని వంశీ యాక్టివ్ మోడ్.. గన్నవరంలో అభివృద్ధి జోరుగా!
-
9న అనకాపల్లికి వైఎస్ జగన్
సాక్షి, అనకాపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) ఈ నెల 9వ తేదీన అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. నర్సీపట్నం మెడికల్ కాలేజీ(Narsipatnam Medical College)ని సందర్శించి.. జరిగిన పనులను పరిశీలిస్తారని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వైఎస్ జగన్ హయాంలో చేపట్టిన 17 మెడికల్ కాలేజిల నిర్మాణం ఒక చరిత్ర. కానీ, విద్యా వైద్యాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారు. ఏకంగా అందులో పది మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నారు. తన అనునాయులకు మెడికల్ కాలేజీలను కట్టబెడుతున్నారు. తద్వారా జగన్కు మంచి పేరు రాకుండా అడ్డుకుంటున్నారు. కానీ, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది... చంద్రబాబు ఆరోగ్య శ్రీని నిర్వీర్యం చేశారు. కళ్లుండి కబోదుల్లా టిడిపి నేతలు వ్యవహరిస్తున్నారు. స్పీకర్ అయ్యన్న అవగాహనతో మాట్లాడాలి. ఆయన మెడికల్ కాలేజీని సందర్శిస్తే నిర్మాణం జరిగిందో లేదో తెలుస్తుంది. మెడికల్ కాలేజ్ నిర్మాణం జరగకపోతే ప్రైవేటీకరణ ఎలా చేస్తున్నారు. చంద్రబాబు నిర్ణయాలపై ప్రజలు చీ అంటున్నారు. అయినా ఆయన సిగ్గు తెచ్చుకోవడం లేదు. కేవలం జగన్ మీద కక్ష సాధింపు చర్యతో మెడికల్ కాలేజీలను అమ్మేస్తున్నారు అని అన్నారు. మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ అధికారంలోకి రాకముందు 11 మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో ఉండేవి. వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఒకేసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు. పేదవాడికి ఆధునిక వైద్యం అందించాలనే లక్ష్యంతో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నర్సీపట్నం మెడికల్ కాలేజీను వైఎస్ జగన్ సందర్శిస్తారు. .. పేదవాడికి ఇంగ్లీష్ మీడియం విద్యను చంద్రబాబు దూరం చేశారు. మెడికల్ విద్య చదివే విద్యార్థులకు నేడు మెడికల్ సీట్లును దూరం చేస్తున్నారు. ప్రజలకు ఉపయోగ పడే మెడికల్ కాలేజిల ఐదు వేల కోట్లు ఖర్చు మీద పెట్టలేరా. విద్యా వైద్యంతోపాటు అన్ని రంగాలను చంద్రబాబు ప్రవేటిపరం చేస్తున్నారు. మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది’’ అని అమర్నాథ్ అన్నారు. -
అంబేద్కర్ విగ్రహానికి నిప్పు.. నారాయణ స్వామి సంచలన నిజాలు
-
మహాత్మ గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమం
-
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో దసరా వేడుకలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా దసరా వేడుకలు నిర్వహించారు. అమ్మవారికి వైఎస్సార్సీపీ నేతలు ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ నేతలు హాజరయ్యారు.తెలుగు ప్రజలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘చెడు ఎంత బలంగా ఉన్నా చివరికి మంచి గెలుస్తుందన్నదే విజయదశమి పండుగ సారాంశం. అమ్మవారి ఆశీస్సులతో ఈ విజయ దశమి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, ఐశ్వర్యం, విజయాలు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ అందరికీ దసరా శుభాకాంక్షలు’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. -
YSRCP నాయకుడు రామసుబ్బారెడ్డిపై మంత్రి అనుచరులు రాళ్లతో దాడి
-
వైఎస్సార్సీపీ రీజినల్ కో-ఆర్డినేటర్గా మిథున్రెడ్డి పునర్నియామకం
సాక్షి, అమరావతి: ఉమ్మడి అనంతపురం, నెల్లూరు జిల్లాల వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్గా ఎంపీ పీవీ మిథున్రెడ్డిని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరిగి నియమించారు. టీడీపీ కూటమి ప్రభుత్వ అక్రమ కేసులో మిథున్రెడ్డిని అరెస్టు చేయడంతో ఆయన బాధ్యతలను సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కారుమూరి నాగేశ్వరరావులకు అప్పగించారు. ఇప్పుడు మిథున్రెడ్డి బెయిల్పై విడుదల కావడంతో ఆయా జిల్లాల బాధ్యతలు తిరిగి అప్పగించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.వైఎస్సార్సీపీలో నియామకాలువైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 49 మంది సభ్యులతో సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ)ను, మరో 114 మంది సభ్యులతో స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఎస్ఈసీ)ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. -
వైయస్సార్సీపి కార్యకర్తలపై పోలీసుల అత్యుత్సాహం
ప్రకాశం: ప్రకాశం జిల్లా కొండేపి మండలం పెదకండ్లగుంటలో పోలీసుల అత్యుత్సాహం చూపించారు. మహర్నవమి సంధర్బంగా హైకోర్ట్ ఉత్తర్వులతో గ్రామంలో కోలాటం ఏర్పాటు చేసుకొన్న వైయస్సార్సీపి కార్యకర్తలు. దానికి పోటీగా రికార్డు డ్యాన్స్ కార్యక్రమం ఏర్పాటు చేసిన తెలుగుదేశం కార్యకర్తలు.కోలాటం మైకులు లేకుండా అలంకరణ లేకుండా వెయ్యలంటూ పోలీసుల హుకుం జారీ చేశారు. స్టేజీ తొలగించడానికి పోలీసులు ప్రయత్నం చేశారు. దాంతో పోలీసులను అడ్డుకొన్న వైయస్సార్సీపి కార్యకర్తలు.సంప్రదాయ పద్దతిలో చేస్తున్న కోలాటంను అడ్డుకోని రికార్డు డ్యాన్స్ కి పరిమీషన్ ఇవ్వడం పై గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహిళలు. -
ఆల్మట్టి ఎత్తు పెంచుతుంటే ఎందుకు అడ్డుకోవడం లేదు: గడికోట శ్రీకాంత్రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కర్ణాటక ప్రభుత్వం మరోసారి ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచడానికి సిద్ధమవుతుంటే.. సీఎం చంద్రబాబు కనీసం నోరెత్తకపోవడం దారుణమని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప ఆ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. గతంలో 1995లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే ఇదే ఆల్మెట్టీ ఎత్తు పెంచడంతో రాయలసీమకు అన్యాయం జరగ్గా.. మరలా మరోసారి ఎత్తు పెంచాలన్న నిర్ణయంతో రాయలసీమతో పాటు పల్నాడు, ఒంగోలు వంటి ప్రాంతాలు ఏడారిగా మారడం ఖాయమని హెచ్చరించారు.ఇంత జరుగుతున్నా సీఎం చంద్రబాబు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడంపై తీవ్రంగా ఆక్షేపించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే ప్రజలు, ప్రజా సంఘాలతో కలిసి ఆందోళనచేస్తామని హెచ్చరించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..వ్యవస్థలను నాశనం చేస్తున్న కూటమి ప్రభుత్వంకూటమి ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల్లో రాష్ట్రం పూర్తిగా వెనుకబాటుకు గురవుతుంది. అన్నిరంగాలను ప్రభుత్వం నాశనం చేస్తుంది. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పరిపాలన చేస్తూ భవిష్యత్ తరాలకు, రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నారు. అధికారమే పరమావధిగా అనుభవిస్తూ... ప్రజల రక్షణ, సంక్షేమం, రాష్ట్ర భవిష్యత్తును పూర్తిగా గాలికొదిలేశారు. ఎంతసేపూ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా అక్రమ అరెస్టులు, ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపితే తప్పుడు కేసులు నమోదు చేస్తూ.. రాత్రికి రాత్రే అరెస్టులు చేస్తూ కుటుంబాలను వేధిస్తున్నారు.రౌడీమూకలను ఉపయోగించుకుని బెదిరించడంతో పాటు దాడులు కూడా చేయిస్తున్నారు. వాస్తవాలను ప్రజలకు తెలియకుండా ఈ రకంగా భయాందోళనలకు గురి చేస్తున్నారు. పాలనను పూర్తిగా మర్చిపోయారు. దుర్మార్గంపై ధర్మం గెలుపునకు ప్రతీకకగా దసరా పండగ జరుపుకుంటారు. అదే విధంగా మళ్లీ ప్రజలు రాష్ట్రంలో జరుగుతున్న అధర్మ పాలన, దుష్ట శక్తులకు తగిన గుణపాఠం చెప్పి మంచి రోజులకు నాంది పలకడం ఖాయం.రాయలసీమకు నీటి గండం - చంద్రబాబు ద్రోహంశ్రీశైలం ప్రాజెక్టుపై గాలిమాటలు చెప్పి రాయలసీమను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోంది. తెలుగుగంగ, గాలేరు నగరి ప్రాజెక్టులపై కనీసం ఆలోచన చేయలేదు. రాయలసీమ ప్రజల మనోభావాలను తెలిసిన వ్యక్తిగా దివంగత నేత వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన హయాంలో పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, గండికోట, గాలేరు నగరి ప్రాజెక్టులు పూర్తయ్యాయి. 2004లో అప్పటికే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం ఈ ప్రాజెక్టులు వేటికీ హామీ ఇవ్వలేదు. దీనికి కారణం చంద్రబాబు నాయుడే. ఇది కాకుండా చంద్రబాబు ఆల్మెట్టీ ప్రాజెక్టు రూపంలో మరో తీవ్రమైన ద్రోహం చేశాడు.1995 నాటికి ఆల్మెట్టీ ప్రాజెక్టు కేవలం 53 టీఎంసీలతో ఉండేది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఎన్టీయే ప్రభుత్వం ఏర్పడింది. ఎన్డీయే కూటమికి ఆ రోజుల్లో చంద్రబాబే చైర్మన్ గా ఉండగా.. మన ఎంపీలతోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తున్న పరిస్థితి ఉంది. ఆ రోజు కర్ణాటక దేవేగౌడ నేతృత్వంలోని ప్రభుత్వం ఆల్మెట్టి ఎత్తును 509 అడుగులు నుంచి 524 పెంచే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించకపోవడంతో.. ప్రజలు, ప్రజాసంఘాలు కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం సరైన వాదనలు వినిపించలేకపోవడంతో.. సుప్రీం కోర్టు 519 అడుగులకు అనుమతి ఇచ్చింది. దీంతో ప్రాజెక్టు సామర్ధ్యం 123 టీఎంసీలకు పెరిగింది. ఆ రకంగా చంద్రబాబు హయాంలోనే రాయలసీమకు అన్యాయం జరిగింది.మరలా దురదృష్టం కొద్దీ 2024లో కూడా టీడీపీ ఎంపీలతో కేంద్ర ప్రభుత్వం నడుస్తోంది. ఇలాంటి సమయంలో ఆల్మెట్టీ డ్యామ్ సామర్ధ్యాన్ని పెంచడానికి మరో రూ.70 వేలు కోట్లు ఖర్చు పెట్టడానికి కర్ణాటక ప్రభుత్వం కేబినెట్ ఆమోదం తీసుకుంది. ఆల్మెట్టీ ఎత్తును 524 ఎత్తుకు పెంచబోతున్నారు. ప్రస్తుతం ఉన్న 123 టీఎంసీల నీటి సామర్ధ్యం ఉన్న ప్రాజెక్టును 279 టీఎంసీలకు పెంచబోతున్నారు. 154 టీఎంసీల పెంచబోయే ప్రాజెక్టు పనులకు టెండర్ల ప్రక్రియ కూడా మొదలైంది. అయినా మాట వరసకి కూడా చంద్రబాబు వ్యతిరేకించడం లేదు. మాట్లాడ్డం లేదు. ఇది దుర్మార్గం కాదా ? అన్యాయం కాదా? కేవలం కృష్ణా జలాల మీదే ఆధారపడి ఉన్న రాయలసీమ భవిష్యత్తులో పూర్తిగానూ, నాగార్జున సాగర్ మీద ఆధారపడి ఉన్న పల్నాడు జిల్లా, కృష్ణా జిల్లా, బాపట్ల, ఒంగోలు జిల్లాలు ఎడారి ప్రాంతాలుగా మిగలడం ఖాయం. కంటిన్యూస్ గా కనీసం 6 నెలలు వరద వస్తే తప్ప... నిండే పరిస్థితి లేదు.మరోసారి ఆల్మట్టి రూపంలో అన్యాయంగతంలో ఆల్మట్టి ప్రాజెక్టును 123 టీంఎంసీల నీటి సామర్ధ్యంతో నింపడమే దుర్మార్గం అనుకుంటే... మరలా ఇప్పుడు అదే చంద్రబాబు హయాంలో మరలా 279 టీఎంసీలకు పెంచబోవడం అత్యంత దారుణం. వీటి గురించి పట్టించుకోకుండా బనకచర్ల, సోమశిల అనుసంధానం అని మభ్యపెట్టే మాటలు మాట్లాడుతున్నాడు. నిజానికి ఈ ప్రాజెక్టుల మీద చంద్రబాబుకు కనీస చిత్తశుద్ధి, ఆలోచన లేదు. ఒకవైపు సుప్రీంకోర్టులో కేసు ఉండగా... రూ.83 వేల కోట్లతో బనకచర్ల అని చెబుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో సరైన వాదన వినిపించకుండా... బనకచర్ల క్రాస్ ప్రాజెక్టుకు సరైన ప్రతిపాదనలు కూడా లేకుండా ప్రాజెక్టు కట్టేశామన్నంత బిల్డప్ ఇవ్వడంతో తెలంగాణా ప్రభుత్వం 904 టీఎంసీల కృష్ణా వాటర్ వాడుకునేందుకు జీవో జారీ చేశారు. ఇది ఎలా సాధ్యం?274 టీఎంసీలు ఆల్మెట్టీ ద్వారా కర్ణాటక ప్రభుత్వం, 904 టీఎంసీలు తెలంగాణా ప్రభుత్వం వాడుకుంటే ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర అన్యాయం జరుగుతుంది. దీనిమీద ఎందుకు నోరు మెదపడం లేదు? బనకచర్ల డీపీఆర్ కూడా సిద్ధం చేయకుండానే ప్రాజెక్టు పూర్తి చేసినట్లు ప్రచారం చేస్తుంటే.. తెలంగాణా ప్రభుత్వం తమ పని తాను చేసుకుంటూ పోతుంది. తెలంగాణా, కర్ణాటక రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ఆల్మెట్టీ గురించే మాట్లాడుతుంది. ఇక్కడ అధికార పార్టీలో ఉంటూ చంద్రబాబు ఒక్క మాట కూడా మాట్లాడ్డం లేదు.గతంలో 75 శాతం డిఫెండబులిటీ పేరుతో ఎగువ రాష్ట్రాలకు మేలు చేస్తూ.. దిగువ రాష్ట్రాలకు అన్యాయం జరిగేలా ఓ నిబంధన పెట్టారు. దానిపైన కూడా పోరాటం చేయాలి. మరోవైపు ఎగువ ప్రాంతాల్లో ప్రాజెక్టులు నిర్మించకూడదు.. దిగువ ప్రాంతాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్న వాదన వినిపించడం లేదు. ఆల్మెట్టీ 274 టీఎంసీల సామర్ధ్యంతో విస్తరిస్తే.. జూరాల, నారాయణపూర్ దాటి ఏపీకి ఎప్పుడు నీళ్లొస్తాయి? మరోవైపు జూరాల దగ్గర నెట్టంపాడు, బీమా, కోయిల్ సాగర్ వంటి అనేక ప్రాజెక్టులను తెలంగాణా ప్రభుత్వం లిఫ్ట్ చేస్తోంది. ఈ పరిస్థితుల్లో రాయలసీమ భవిష్యత్తు ఏంటి అన్న దానిపై చంద్రబాబు ప్రభుత్వం కనీసం కనీస చిత్తశుద్ధి కూడా లేకుండా వ్యవహరిస్తోంది.గతంలోరాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించి దాదాపు పూర్తిచేస్తే...దానికి పర్యావరణ అనుమతులు లేవని చెబుతున్నారు. కేంద్రంలో మీ బలంతో ప్రభుత్వం నడుస్తుంటే.. ఎందుకు సాధించలేకపోతున్నారు ? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తో సహా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయడం లేదు ? జీ ఎన్ ఎస్ ఎస్ నుంచి హెచ్ ఎన్ ఎస్ ఎస్ కు కలిపే అద్భుతమైన ప్రాజెక్టును పక్కన పెట్టారు. రాయలసీమ ప్రాజెక్టులపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు, ప్రాజెక్టులపై అవగాహన లేదు కేవలం కల్లిబొల్లి మాటలు చెబుతున్నాడు. దాదాపుగా 17 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసి రాయలసీమ ప్రాంతానికి ఏం చేశావు చంద్రబాబూ?రాయలసీమ అభివృద్ధి వైఎస్సార్ హయాంలోనే..రాయలసీమ ప్రాంతానికి మెడికల్ కాలేజీలు వచ్చాయంటే వైయస్సార్, వైయస్.జగన్ హయాంలో మాత్రమే. పోతిరెడ్డి పాటు కూడా వైయస్సార్ టైంలోనే వచ్చింది. ఎప్పటి నుంచో కలలు కంటున్న నంద్యాల, అన్నమయ్య, తిరుపతి జిల్లాలు ఏర్పాటు చేసిన ఘనత కూడా వైయస్.జగన్ కే దక్కుతుంది. మరోవైపు శ్రీ సిటీని వైఎస్సార్ ఏర్పాటు చేస్తే ఆయన ఆలోచనలకు అనుగుణంగా వైఎస్ జగన్ హయాంలో కొప్పర్తి, ఓర్వకల్లు సెజ్ లు ఏర్పాటు చేశారు. పరిశ్రమలు, ఇరిగేషన్ అభివృద్ధి అంతా రాయలసీమలో వైఎస్సార్, వైఎస్ జగన్ హయాంలో వచ్చినవి మాత్రమే. మీ హయాంలో అభివృద్ధి లేకపోగా.. అన్యాయం జరుగుతుంటే కూడా నోరు విప్పి మాట్లాడకపోవడం దారుణం.ప్రజా ధనంతో విలాసాలుఢిల్లీకు వారానికొకసారి తండ్రీకొడుకులు వెళ్లి షో చేస్తూ.. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారే తప్ప... రాష్ట్ర ప్రజలకు పైసా ఉపయోగం లేకుండా పోయింది. ముఖ్యమంత్రి స్ధాయిలో చంద్రబాబు ఏడాదిన్నరలోనే 71 సార్లు విజయవాడ నుంచి హైదరాబాద్ కు వెళ్తే... 77-80 దఫాలు డిప్యూటీసీఎం, లోకేష్ లు ఇదే మాదిరిగా ప్రత్యేక విమానాలు, ప్రత్యేక హెలీకాప్టర్ లలోనూ చక్కెర్లు కొడుతున్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ రాష్ట్రంలో లేకుండా హైదరాబాద్కే పరిమితం అయ్యారు. కరోనా సమయంలో హైదరాబాద్లో ఇళ్ళకే పరిమితం అయ్యారు. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ.. ప్రజా సేవ గురించి, ప్రజల గురించి మాట్లాడుతున్నారు. అధికారంలో ఉండి విజయవాడలో ఉండి పరిపాలన చేయకుండా 70 దఫాలుకుపైగా హైదరాబాదకు ప్రత్యేక విమానాల్లో షికార్లు చేస్తున్నారు.అన్ని వర్గాల ప్రజలకూ బాబు మొండిచేయి16 నెలల పాలనలో ఇప్పటికే మహిళలకు, రైతులకు, యువతకు, నిరుద్యోగులకు అన్యాయం చేశారు. ఏ పంటకూ రైతులకు గిట్టుబాటు ధర లేకుండా పోయింది. రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా కింద రెండేళ్లకు దాదాపు రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా.. కేవలం రూ.5 వేలు ఇచ్చి అంతా ఇచ్చామని చేతులు దులుపుకున్నారు. పంటకు గిట్టుబాటు ధర ఉండడం లేదు.. వేసుకున్న పంటకు యూరియా కూడా ఇవ్వలేని అసమర్థ స్ధితిలో ఈ ప్రభుత్వం ఉంది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో మూడు విడతలుగా డ్వాక్రా రుణాలు మాఫీ చేశారు.మరో వైపు సున్నావడ్డీకి రుణాలు, చేయూత, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం వల్ల మహిళలకు మేలు జరిగించే కార్యక్రమం చేశారు. ఇవాళ నెలకు రూ.1500 చొప్పున 18 ఏళ్లు దాటిన మహిళలకు ఇస్తామన్నది కూడా ఇవ్వడం లేదు. యువతను సర్వనాశనం చేస్తూ.. గంజాయితో కాలేజీలు, స్కూల్లు విచ్చలవిడిగా తయారైన పరిస్ధితి నెలకొంది. నిరుద్యోగ భృతి లేదు, ఉద్యోగులకిచ్చిన హామీలుపై పట్టించుకున్న దాఖలాలు లేవు. పొలిటికల్ గేమ్ కోసం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా సస్పెండ్ చేస్తూ.. పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తూ దుర్మార్గమైన పాలన చేస్తున్నారు.గతంలో రూ.10 లక్షల కోట్లు అప్పులు అంటూ తప్పుడు ప్రచారం చేశారు. గతంలో వైయస్.జగన్ హాయంలో ఐదేళ్లలో కేవలం రూ.3 లక్షల కోట్లు మాత్రమే అప్పులు చేస్తే... ఏడాదిన్నర కాలంలో రూ.2 లక్షల కోట్లు అప్పు చేసి ప్రజా సంక్షేమం కూడా చేయడం లేదు. చేసిన అప్పు ఏం చేస్తున్నట్టు ? సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా? వివేకానందరెడ్డి హత్యలో మా పార్టీపై నిందలు మోపుతున్నారు. అధికారంలో ఉండి కూడా ఎందుకు మీరు చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఎవరు అడ్డుపడుతున్నారు? కేవలం ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా పెట్టుకుని తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారు. లిక్కర్ కేసుపై నోటికొచ్చినట్లు తప్పుడు ప్రచారం చేశారు. ఎంపీ మిధున్ రెడ్డి కేసులు ఇది చాలా స్పష్టంగా వెల్లడైంది. వైయస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధించడం మినహా మీరు చేసిందేమీ లేదు.రాయలసీమ ప్రాంత వాసులుగా.. ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. వినకపోతే ఆందోళనకు కూడా సిద్ధం. దుర్మార్గంగా వ్యవహరించి రాయలసీమకు అన్యాయం చేయవద్దు. ఆ పరిస్థితి రాకుండా ప్రభుత్వం తక్షణమే ఆల్మెట్టీ టెండర్లు రద్దయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్న తన భాగస్వామ్య ప్రభుత్వాన్ని ఒప్పించాలని గడికోట శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేసారు. భవిష్యత్తులో శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువన మరే ప్రాజెక్టు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని తేల్చి చెప్పారు. రైతుల ప్రయోజనాల కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దేనికైనా సిద్ధంగా ఉందని తేల్చి చెప్పారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సరైన వివరణ ప్రజలు ఇవ్వాలని లేని పక్షంలో ఆల్మెట్టీపై ప్రజా సంఘాలు, తటస్ఠ వ్యక్తులు, రైతులు, రైతు సంఘాలతో కలిసి పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు -
ఎన్సీఆర్బీ డేటా.. ఎల్లో మీడియా వక్రీకరణ: కైలే అనిల్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలపై ఎన్సీఆర్బీ నివేదికలోని వాస్తవాలను కూడా చంద్రబాబు కోసం వక్రీకరించే దుస్థితికి ఎల్లో మీడియా దిగజారిందని, ఆ నివేదికను ఉటంకిస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్పై పచ్చి అబద్దాలను అచ్చేసిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కైలే అనీల్కుమార్ మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయాన్ని పండుగలా జరిపించి, విత్తనం నుంచి విక్రయం వరకు వారికి అండగా నిలబడటం వల్ల గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని అన్నారు.వ్యవసాయం దండగ అని నమ్మే చంద్రబాబు సుదీర్ఘ పాలనలో రైతులకు కష్టాలు, కడగండ్లు, ఆత్మహత్యలు తప్ప మరేమీ దక్కలేదని మండిపడ్డారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులను తక్షణం ఆదుకున్న మానవత్వం వైఎస్ జగన్ది అయితే, వారి కుటుంబాలను గాలికి వదిలేసిన రాక్షసత్వం చంద్రబాబుదేనని దుయ్యబట్టారు. ఇంకా ఆయనేమన్నారంటే..చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలో రాష్ట్రంలో తీవ్ర విధ్వంసం జరుగుతోంది. వ్యవసాయాన్నిలాభసాటిగా మార్చడానికి, రైతులను డిస్ట్రస్ నుంచి తప్పించడానికి వైఎస్ జగన్ ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చారు. వాటన్నింటినీ రద్దు చేసి, మళ్లీ వ్యవసాయంలో సంక్షోభాన్ని తీసుకువచ్చిన చంద్రబాబుని కాపాడేందుకు ఎల్లోమీడియా ఇవాళ ఆయన తరఫున వకాల్తా పుచ్చుకుంది. 2023లో ఎన్సీఆర్బీ డేటాను తీసుకుని, చిలువలు పలవలు చేసి, వక్రీకరించి తప్పడు ప్రచారం చేయడం మొదలు పెట్టింది. రాష్ట్రంలో వైఎస్ జగన్ హయాంలో రైతులు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకున్నారనే అభిప్రాయాన్ని కలిగించడానికి నానా ప్రయత్నాలు చేస్తోంది.ఆత్మహత్య చేసుకున్న రైతులు.. మద్యం తాగి చనిపోయారన్న చంద్రబాబువైఎస్సార్సీపీ హయాంలో రైతుల ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టాయి. 2021లో రాష్ట్రంలో 481 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వారిలో భూయజమానులైన రైతులు 359 మంది ఉండగా, కౌలు రైతులు 122 మంది ఉన్నారు. కాగా 2022లో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు 369 కు తగ్గాయి. వారిలో భూ యజమానులైన రైతులు 309 మంది ఉండగా, కౌలు రైతులు 60 మంది ఉన్నారు. 2021లో 584 మంది వ్యవసాయ కూలీలు ఇతరత్రా కారణాలతో ఆత్మహత్య చేసుకోగా.. 2022లో వ్యవసాయ కూలీల ఆత్మహత్యలు 548కు తగ్గాయి. మొత్తం మీద వ్యవసాయంపై ప్రత్యక్షంగా ఆధారపడేవారు 2021లో 1,065 మంది ఆత్మహత్య చేసుకోగా.. 2022లో అవి 917కు తగ్గాయి.2023లో ఏడాదిలో రైతుల ఆత్మహత్యల సంఖ్య 925. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే.. దీనిపై పెద్ద ఎత్తున విష ప్రచారం చేస్తున్నారు. పోనీ ఆత్మహత్యలు చేసుకున్న రైతుల గురించి చంద్రబాబు ఏరోజైనా పట్టించుకున్నాడా అంటే అదీ లేదు? రైతుల ఆత్మహత్యలను గుర్తించడానికి, వారి కుటుంబాలను కాపాడ్డానికి ఏ రోజు కూడా చంద్రబాబు తన 14 ఏళ్ల పరిపాలనా కాలంలో కాని, ఇవాళ కాని ముందుకు రావడం లేదన్నసంగతి తెలిసిందే. 2014-19 మధ్య రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే, వారంతా వ్యక్తిగత సమస్యలతోనూ, మద్యం తాగి చనిపోయినట్టుగానే చిత్రీకరించే ప్రయత్నం చేశారు.సాక్షాత్తూ రాష్ట్ర అసెంబ్లీలో చంద్రబాబు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. రైతుల పట్ల, వారి కష్టాల పట్ల చంద్రబాబుకు మానవత్వం లేదనే విషయం ప్రతిసారి రుజువు అవుతూనే ఉంది. ఈ సారి కూడా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్న ఒక్క పైసా కూడా సహాయం చేయలేదు. ఆయా కుటుంబాల పట్ల అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తున్నారు.చంద్రబాబు పాలనలో సంక్షోభంలో వ్యవసాయంధాన్యం దగ్గర నుంచి మిర్చి, పొగాకు, మామిడి సహా ప్రస్తుతం ఉల్లి రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారు. వారు పండించిన పంటలకు గిట్టుబాటు ధరల్లేక అప్పులు ఊబిలో కూరుకు పోయారు. రాష్ట్రంలో ఏ రైతుకు కూడా గిట్టుబాటు ధరలు లభించడం లేదు. వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. దీనికి తోడు ఎరువుల కొరత కూడా రైతులను తీవ్రంగా వేధిస్తోంది. గతేడాది పెట్టుబడి సహాయాన్ని ఎగ్గొట్టారు, ఉచిత పంటల బీమా ఎగ్గొట్టారు, ఇ-క్రాప్ విధానాన్ని నిర్వీర్యం చేశారు. ఆర్బీకేలను నీరుగార్చారు. సీఎం యాప్ను తీసేశారు. ఈ పరిస్థితులన్నీ రైతులను తీవ్ర నిరాశాజనక వాతావరణం లోకి నెట్టేశాయి. పరిస్థితులను తట్టుకోలేక వారు బలవ్మనరణాలకు పాల్పడుతుంటే.. కనీసం ఆ కుటుంబాల పట్ల చంద్రబాబు ప్రభుత్వం జాలి కూడా చూపడంలేదు.కానీ వైఎస్ జగన్ రైతులకు ప్రతి చోటా చేదోడు వాదోడుగా నిలిచారు. దేశంలో ఎక్కడా లేని గొప్ప విదానాలు తీసుకువచ్చి రైతుల్ని ఆదుకునే ప్రయత్నాలు చేశారు. వ్యవసాయాన్ని లాభసాటిగా ఉంచడానికి ముఖ్యమంత్రిగా ఆయన అహర్నిశలు పని చేశారు. వైయస్సార్సీపీ పరిపాలనాకాలంలో 1794 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడితే వారందరికీ కూడా పరిహారం చెల్లించారు.ఒక్కో కుటుంబానికి రూ.7 లక్షల ఆర్థిక సహాయం చేశారు. రైతు ఆత్మహత్య చేసుకున్నారన్న సమాచారం తెలియగానే.. వెంటనే జిల్లా కలెక్టర్ను పంపి, ఆ కుటుంబాలకు బాసటగా నిలిచి, 48 గంటల్లోపే ఆ కుటుంబాలకు సహాయం అందించిన ఘటనలు కోకొల్లలు. మరి ఇప్పుడు ఎందుకు ఆ విధానాన్ని తీసేశారు? ఎందుకు రైతులకు తోడుగా నిలబడ్డం లేదు? ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఎందుకు సహాయం చేయడం లేదు? అంతేకాదు 2014-19 మధ్య పునర్విచారణ జరిపి, 474 మందికి ఒక్కొక్కరికి రూ.5 లక్షలు అందేలా చేశారు. చంద్రబాబు చేసిన అన్యాయాన్ని కూడా సరిదిద్దే ప్రయత్నం వైయస్ జగన్మోహన్రెడ్డి హయాంలో జరిగింది. ఇలా దాదాపుగా రూ.117 కోట్లు ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారంగా ఇవ్వడం జరిగింది. ఆ కుటుంబాలను ఆదుకోవడం జరిగింది.ఆత్మహత్య చేసుకున్న కుటుంబాల పట్ల 'బాబు' నిర్లక్ష్యం2014-19 మధ్య ఆత్మహత్య చేసుకున్న రైతులను కాపాడేందుకు చంద్రబాబు ముందుకు రాకపోతే పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయి. అరకొరగా ఆయా కుటుంబాలను గుర్తించి ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారంఅనేవారు. దాంట్లో రూ.1.5 లక్షల్నిఅప్పులకు జమ చేసుకుని, మిగిలిన 3.5 లక్షలు కూడా విత్డ్రా చేసుకునేందుకు వీలు లేకుండా డిపాజిట్ చేసి, దానిపై వచ్చే వడ్డీని మాత్రమే వాడుకునే పరిస్థితి కల్పించేవారు. ఎప్పుడో ఐదేళ్లకో.. పదేళ్లకో ఆ డబ్బును విత్ డ్రా చేసుకునే అవకాశం ఉండేది. ఇది ఏరకంగా బాధిత కుటుంబాలను ఆదుకున్నట్టు అవుతుంది? రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పరిహారాన్ని రూ.5 లక్షలనుంచి రూ.7 లక్షలకు పెంచింది. ఆ మొత్తాన్ని నేరుగా ఆత్మహత్యలకు పాల్బడే రైతు కుటుంబాల ఖాతాలకు జమ చేస్తోంది.వ్యవసాయాధారిత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకునే కౌలు దారులకు రూ.7 లక్షలు పరిహారాన్ని కూడా ఈ ప్రభుత్వం అందించింది. జగన్మోహన్రెడ్డిగారు అత్యంత మానవతావాదిగా వారికి సహాయం చేశారు? ఇప్పుడు చంద్రబాబు రైతుల పట్ల, వారి కుటుంబాల పట్ల అత్యంత అన్యాయంగా వ్యవహరిస్తూ.. వారి ఉసురు పోసుకుంటున్నాడు. ఇప్పుడు జరుగుతున్న రైతుల ఆత్మహత్యలకు చంద్రబాబు పరిపాలనా విధానం ప్రధాన కారణం. వ్యవసాయ రంగంలో ఆయన సృష్టించిన సంక్షోభమే దీనికి కారణం. ధరల స్థిరీకరణ నిధిని ఎత్తివేసి రైతుల ఉసురు పోసుకున్నారు.వైఎస్ జగన్ ఇదే నిధితో దాదాపు రూ.7,800 కోట్లు ఖర్చు చేసి రైతులను ఆదుకున్నారు. మరి రైతు ద్రోహి ఎవరు? ఉచిత పంటల బీమాను జగన్ పెడితే, చంద్రబాబు దాన్ని రద్దు చేశారు. గత ఏడాది అందాల్సిన పంటల బీమా ఇప్పటి వరకూ అందలేదు. ఇన్పుట్ సబ్సిడీ కూడా పూర్తిగా ఇవ్వని పరిస్థితి. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా.. నష్టాల గణనే లేకుండా పోయింది. వందల మంది రైతులు చంద్రబాబు వచ్చిన తర్వాత ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వ్యవసాయ రంగంలో సంక్షోభం మీద వార్తలు ఇవ్వకుండా కేవలం చంద్రబాబును జాకీలు పెట్టి లేపే పనిని ఎల్లో మీడియా మానుకుంటే మంచిది.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తగ్గిన నేరాలుఇక ఎన్సీఆర్బీ డేటా విషయాని కొస్తే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన విప్లవాత్మక సంస్కరణలు, చేపడుతున్న చర్యలు సత్ఫలితాలను ఇచ్చిన విషయం చాలా స్పష్టంగా డేటాలో కనిపించింది. వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్రంలో అన్నిరకాల నేరాలు తగ్గాయని ఎన్ఆర్బీ నివేదిక స్పష్టం చేసింది. నేరాలకు పాల్పడితే నమోదు చేసే ఐపీసీ సెక్షన్ల కేసులు, పౌరులు చట్టబద్ధంగా వ్యవహరించేలా చేసేందుకు నమోదు చేసే నాన్ కాగ్నిజబుల్ కేసులు కూడా తగ్గడం శాంతి భద్రతల నిర్వహణలో ప్రభుత్వ సమర్థతకు నిరద్శనం. 2020లో ఐపీసీ కేసుల 1,88,997 కాగా, 2021లో 1,79,611, 2022లో 1,58,547 మాత్రమే నమోదయ్యాయి, 2023లో 1,53,867 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ప్రతి ఏటా తగ్గుదల చాలా స్పష్టంగా కనిపిస్తోంది.ఇక స్పెషల్ లోకల్ లా కేసులను చూస్తే 2020, 21, 22 సంవత్సరాల్లో క్రమంగా తగ్గుకుంటా వచ్చాయి. 2020లో 49,108, 2021లో 42,588, 2022లో 36,737గా ఉన్నాయి. 2023లో 30,436కు పరిమితం అయ్యాయి. నేరాలకు పాల్పడే వారిని న్యాయస్థానం ద్వారా విచారించి వారికి శిక్షలు పడేలా చేయడంలో వైయస్సార్సీపీ హయాంలో గట్టిగా కృషి జరిగింది. కేంద్ర హోంశాఖ నిర్దేశిచిన ఛార్జిషీటు దాఖలకు పెట్టిన గడువు 60 రోజులు అయితే, నమోదైన కేసుల్లో 91.6 శాతం కేసుల్లో 60 రోజుల్లోనే ఛార్జిషీటు దాఖలు చేసి రాష్ట్రం, దేశంలోనే మూడోస్థానంలో నిలిచింది.శాంతిభద్రతల నిర్వహణ, కేసులు దర్యాప్తు, విచారణ, తర్వాత న్యాయ ప్రక్రియలో వైఎస్ జగన్ ప్రభుత్వం సమర్థతకు నిదర్శనం ఇది. మా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో హత్యలు కూడా గణనీయంగా తగ్గాయి. 2021లో రాష్ట్రంలో 956 మంది హత్యకు గురికాగా... 2022లో హత్యల సంఖ్య 925కు తగ్గింది. 2023లో హత్యలు 922. అంటే హత్యలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. దిశ యాప్, దిశ వ్యవస్థ వంటి విప్లవాత్మక విధానాలతో మహిళల భద్రత కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు మంచి ఫలితాలను ఇచ్చాయి. మహిళల పై వేధింపులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి.ప్రధానంగా అత్యాచారాలు, వరకట్న వేధింపుల కేసులు తగ్గడం వైఎస్ జగన్ ప్రభుత్వ సమర్థతకు అద్దం పడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కనిపించకుండా పోయారంటూ మహిళలు, అమ్మాయిలు, బాలికల విషయంలో నమోదైన కేసుల్లో 85.7 శాతం రికవరీ 2023లో ఉంది. దేశంలో 54 శాతం మాత్రమే. దేశంలోనే రాష్ట్రం పనితీరు బాగున్నట్టుగా నివేదిక పేర్కొంది.ఎన్నికలకు ముందు 39 వేల మంది అమ్మాయిలు మాయం అయిపోయినట్టుగా ఇష్టానుసారం ఆరోపణలు చేశారు. ఇవన్నీ అవాస్తవాలని ఎన్సీఆర్బీ రిపోర్టు కొట్టి పారేసింది. పైగా వైఎస్సార్సీపీ హయాంలో ఫిర్యాదు చేయడానికీ, వాటిపై కేసుల నమోదుకూ, విచారణకూ పగడ్బందీ వ్యవస్థలు ఉండేవి. వీటి నమోదు ద్వారా నంబర్లు పెరుగుతాయని, తద్వారా కేసులు ఎక్కువగా ఉన్నాయనే భావన ఉన్నప్పటికీ, వివిధ సంస్కరణలతో రిపోర్టింగ్ విధానాన్ని బలోపేతం చేశారు. ఇన్ని రకాలుగా ప్రభుత్వం మెరుగ్గా పనిచేసినప్పటికీ వక్రీకరణలతో ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోంది. -
డ్వాక్రా మహిళల పొదుపు సొమ్ముపై చంద్రబాబు కన్ను: రాయన భాగ్యలక్ష్మి
సాక్షి, తాడేపల్లి: డ్వాక్రా మహిళల పొదుపు నిధులపై కూడా చంద్రబాబు సర్కార్ కన్నేయడం దారుణమని విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మహిళలకు గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ ఉచితంగా కళ్యాణమస్తు, షాదీ తోఫా కింద ఇచ్చిన లబ్ధిని నేడు కూటమి ప్రభుత్వం వడ్డీతో కూడిన రుణంగా ఇస్తామనడం దుర్మార్గం కాదా అంటూ మండిపడ్డారు.మహిళల పొదుపు సొమ్మును పథకాల పేరుతో మళ్ళించి, తమ ఘనతగా ఎలా చెప్పుకుంటారని ప్రశ్నించారు. ఒక వైపు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించకుండా, వడ్డీతో కూడిన విద్యాలక్ష్మి రుణాలను ఇస్తామనడం ఈ ప్రభుత్వ దివాలాకోరుతనానికి నిదర్శనమని అన్నారు. వీటిని పథకాలు అని చెప్పుకోవడానికి సీఎం చంద్రబాబు సిగ్గపడాలని, ఇవి మహిళలకు చేస్తున్న ఢోకా కాదా అని నిలదీశారు. ఇంకా ఆమె ఏమన్నారంటే..డ్వాక్రా మహిళలు తాము పొదుపు చేసుకున్న సొమ్మును 'స్త్రీనిధి' సంస్థ ద్వారా దాచుకుంటారు. ఈ స్త్రీనిధి సంస్థ కూడా ఇతర బ్యాంకుల నుంచి ఏడు శాతం కింద డబ్బును వడ్డీకి తీసుకువచ్చి, వాటిని డ్వాక్రా సంఘాలకు రుణంగా ఇస్తుంది. ఇలా డ్వాక్రా సంఘాలకు ఆర్థిక చేయూతను అందించేందుకు, వాటి ఆర్థిక అవసరాలను స్త్రీనిధి సంస్థ సమకూరుస్తుంటుంది. మహిళల పొదుపుసొమ్ము కూడా ఈ స్త్రీనిధి లోనే జమ అవుతూ ఉంటుంది. ఇటువంటి సంస్థ నుంచి కూటమి ప్రభుత్వం త్వరలో అమలు చేస్తామని చెబుతున్న ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి, విద్యాలక్ష్మి పథకాల పేరుతో ఏకంగా రూ.1000 కోట్లు సేకరిస్తోంది.ఈ సేకరించిన డబ్బును కూడా ఆయా పథకాల లబ్ధిదారులకు నాలుగు శాతం వడ్డీతో కూడిన రుణాలుగా ఇస్తామని చెబుతోంది. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం షాదీ తోఫా, కళ్యాణమస్తు పథకాల కోసం అయిదేళ్ల కాలంలో రూ.427 కోట్లు ఖర్చు చేసింది. ఈ సొమ్మును కూడా లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయడం ద్వారా వారికి అండగా నిలిచింది. నేడు చంద్రబాబు ఈ పథకాలకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని వడ్డీతో కూడిన రుణంగా మార్చేయడం అత్యంత దుర్మార్గం.ఇదేనా మహిళలకు ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి? పైగా డ్వాక్రా పొదుపు నిధులతో ఆర్థికంగా పరిపుష్టం అయిన స్త్రీనిధి నుంచి సొమ్మును తీసుకోవడం వల్ల రానున్న రోజుల్లో ఆ సంస్థ పరిస్థితి ప్రమాదంలో పడే అవకాశం ఉంది. చివరికి స్త్రీనిధి మనుగడే ప్రశ్నార్థకం కూడా అవుతుంది. మహిళలకు మంచి చేయాల్సింది పోయి, వారి పొదుపు సొమ్మును కూడా గల్లంతు చేసే పనిలో చంద్రబాబు సర్కార్ తలమునకలు అవుతోంది.గత ప్రభుత్వంలో సున్నా వడ్డీ కింద రూ.4969 కోట్లు లబ్ధి2014-19 మధ్య అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు రూ.25,571 కోట్లు రుణమాఫీ చేస్తానని చెప్పి, దారుణంగా మోసం చేసింది. వైఎస్ జగన్ అధికారం లోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో 3,86,82,882 మంది డ్వాక్రా గ్రూప్ లబ్ధిదారులకు దాదాపు రూ.4,969 కోట్లు సున్నావడ్డీ పథకం కింద లబ్ధి చేకూర్చారు. గత ఏడాది ఏప్రిల్ నెలలో సున్నావడ్డీ కింద వేయాల్సిన సొమ్మును జమ చేసేందుకు సిద్ధమైనా, ఎన్నికల కోడ్ వల్ల నిలిచిపోయింది. ఎన్నికలు అయిపోయిన తరువాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ మొత్తాన్ని డ్వాక్రా గ్రూపులకు జమ చేయాల్సి ఉన్నా, నేటికీ దానిని పట్టించుకున్న పాపాన పోలేదు.ఐదేళ్ల వైఎస్ జగన్ పాలనలో చేయూత, ఆసరా, భరోసా, తోడు ఇలా అనేక పథకాలను మహిళల కోసం అమలు చేశారు. రేషన్ కార్డుల్లోనూ ఇంటి యజమానిగా మహిళల పేరు, పేదలకు ఇచ్చిన ఇళ్ళస్థలాలు కూడా మహిళల పేరు మీదే ఇచ్చారు. నేడు కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు మహిళలను నమ్మించి మోసం చేస్తున్నారు. సున్నావడ్డీ, కళ్యాణమస్తు వంటి పథకాలను ఎగ్గొట్టారు.గత ఎన్నికలకు ముందు కూడా సూపర్ సిక్స్ పేరుతో ఆకర్షణీయమైన పథకాలను ప్రకటించి ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చారు. ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే, అంతమందికీ రూ.18వేలు చొప్పున స్త్రీ నిధి కింద ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇంత వరకు ఈ పథకాన్ని అమలు చేయలేదు. 19-59 ఏళ్ళ వయస్సు ఉన్న మహిళలకు ప్రతినెలా రూ.1500 చొప్పున ఇస్తామని చెప్పారు. దీని ఊసే లేదు. -
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ దసరా శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి పండుగలను పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. లోక కంఠకుడైన మహిషాసురుడిని జగన్మాత సంహరించినందుకు, చెడుపై మంచి, దుష్ట శక్తులపై దైవ శక్తుల విజయానికి ప్రతీకగా జరుపుకునే పండగే విజయదశమి అని ఆయన అన్నారు. చెడు ఎంత దుర్మార్గమైనదైనా, ఎంత శక్తిమంతమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందని పేర్కొన్నారు. అమ్మలగన్నయమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మ అనుగ్రహం కోసం.. నవరాత్రులు అత్యంత భక్తి శ్రద్ధలతో దుర్గామాతను పూజిస్తారని వైఎస్ జగన్ అన్నారు. ఆ జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు సిద్ధించాలని, ఆ కనకదుర్గమ్మవారి దీవెనలు, ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.‘‘చెడు ఎంత బలంగా ఉన్నా చివరికి మంచి గెలుస్తుందన్నదే విజయదశమి పండుగ సారాంశం. అమ్మవారి ఆశీస్సులతో ఈ విజయదశమి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, ఐశ్వర్యం, విజయాలు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ అందరికీ దసరా శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ కూడా చేశారు. చెడు ఎంత బలంగా ఉన్నా చివరికి మంచి గెలుస్తుందన్నదే విజయదశమి పండుగ సారాంశం. అమ్మవారి ఆశీస్సులతో ఈ విజయదశమి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, ఐశ్వర్యం, విజయాలు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ అందరికీ దసరా శుభాకాంక్షలు.#Dussehra— YS Jagan Mohan Reddy (@ysjagan) October 2, 2025 -
తాడేపల్లిలో ఘనంగా ఆయుధ పూజ వైఎస్ జగన్ వాహనాలకు ప్రత్యేక పూజలు
-
KSR Comment: టీడీపీ ఆగడాలకు చెక్! YSRCP కార్యకర్తలకు అండగా రంగంలోకి జగన్..
-
పాకిస్తాన్ పారిపోయిన వదిలే ప్రసక్తే లేదు టీడీపీకి కాసు మహేష్ వార్నింగ్
-
ప్రశ్నిస్తే అక్రమ కేసులు ప్రభుత్వంపై రామ సుబ్బారెడ్డి ఫైర్
-
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. కడపలో వైఎస్సార్ సీపీ భారీ నిరసన
-
మాజీ మంత్రి జోగి రమేష్ పై కేసు నమోదు
-
జైలులో నన్ను టెర్రరిస్టులా ట్రీట్ చేశారు: మిథున్ రెడ్డి
సాక్షి, తిరుపతి: టీడీపీ ప్రభుత్వంలో అక్రమ కేసులతో తాను భయపడే ప్రసక్తే లేదన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి(MP Mithun Reddy). కష్ట కాలంలో తనకు అండగా నిలిచిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్కు(YS Jagan) ధన్యవాదాలు తెలిపారు. జైలులో తనను టెర్రరిస్టు మాదిరిగా ట్రీట్ చేశారు అంటూ సంచలన విషయాలను వెల్లడించారు.వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి తాజాగా తిరుపతిలో(Tirupati) మీడియాతో మాట్లాడుతూ..‘అక్రమ కేసులతో నేను అధైర్యపడను. టీడీపీ ప్రభుత్వం నాపై తప్పుడు కేసులు పెట్టింది. వేధించడానికే నాపై కేసులు పెట్టారు. ఇలా అక్రమ కేసులు పెట్టి సాధించింది ఏంటి?.. పైశాచిక ఆనందం తప్ప మరేమీ లేదు. నన్ను అరెస్ట్ చేసి నా తల్లిదండ్రులను మానసిన వేదనకు గురి చేశారు. 73 రోజులు.. దాదాపు రెండు నెలలు జైల్లో పెట్టారు. గౌరవ కోర్టు నాకు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ ఆర్డర్లో కోర్టు చెప్పినవన్నీ నిజాలే. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా. చివరిగా ఒకటే చెబుతున్నా.. నేను ఎక్కడా వెనక్కి తగ్గేది లేదు. ప్రజలు అందరూ గమనిస్తున్నారు. ప్రభుత్వం చేయాల్సిన పనులు పక్కన పెట్టీ డైవర్షన్ చేస్తున్నారు. నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.ఎప్పుడు తెలుగుదేశం(TDP) పార్టీ అధికారం ఉన్నా.. తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్లు చేస్తున్నారు. 2014-2019 మధ్య కూడా నాపై తప్పుడు కేసులు పెట్టారు. టీడీపీ అధికారంలో ఉన్న ప్రతీసారి.. ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. రకరకాల అక్రమ కేసులు పెట్టి.. డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. నన్ను జైలులో దారుణంగా చూశారు. ఏదో టెర్రరిస్టు మాదిరిగా ట్రీట్ చేశారు. ఎవరితో నన్ను మాట్లాడనివ్వలేదు. సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. విజయవాడ నుంచి మానిటరింగ్ చేశారు, అధికారులు కూడా భయపడే పరిస్థితి ఉండేది. నాతో ఒక్క అధికారి కూడా మాట్లాడలేదు. కోర్టు ఆదేశాలు ఇచ్చేవరకు జైలు అధికారులు వసతులు కల్పించలేదు. నన్ను కలిసే వారిపై కూడా నిఘా పెట్టారు. వ్యక్తికి ఉండాల్సిన ప్రాథమిక హక్కులను కూడా ఉల్లంఘించారు’ అని చెప్పుకొచ్చారు. ఇది కూడా చదవండి: మహిళలకు బాబు మోసం -
ఎల్లో బ్యాచ్ కామెడీ కథలపై వెంకటరెడ్డి సెటైర్లు..
-
పేదల వైద్యాన్ని పెద్దల చేతుల్లో పెడతారా?
సాక్షి నెట్వర్క్: ‘‘ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చదివేవారిలో అధికులు ఆర్థిక స్థోమత లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే. ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లేది కూడా వీరే. అలాంటి వైద్య విద్య, వైద్యాన్ని వారికి దూరం చేసి, ప్రయివేటుకు కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నించడం దారుణం’’ అని వైఎస్సార్సీపీ మండిపడింది. వైద్య కళాశాలల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు మంగళవారం వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ‘సమర భేరి’ పేరిట నిరసనలు నిర్వహించారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు ప్రధాన కూడళ్లలో నల్లబ్యాడ్జీలు ధరించి బైఠాయించారు.చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకాన్ని ఎండగడుతూ... ఇదేం పాలన.. ఇదేం పాలన.. సర్కార్ డౌన్డౌన్ అంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. పార్టీ కార్యాలయాల నుంచి నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు సమరి్పంచారు. సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వ బుద్ధి మారేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో వైఎస్సార్సీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా నాయకులు, ఎస్సీ సెల్ నాయకులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ చంద్రబాబూ... కార్పొరేట్లపై ప్రేమ.. పేదలపై కక్షనా? బడుగు బలహీన వర్గాల పిల్లలకు వైద్య విద్యను అభ్యసించే అర్హత లేదా? అని ప్రశి్నంచారు. వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తే పేదలకు సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘పేదలకు విద్య, వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత. పేదల సంక్షేమమే లక్ష్యంగా, జిల్లాకో మెడికల్ కాలేజీ ఉండాలని, సామాన్యులకూ వైద్య విద్య అందుబాటులోకి రావాలన్న గత ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రానికి 17 వైద్య కళాశాలలను తీసుకొచ్చి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించేలా చూశారు. కూటమి సర్కారు మాత్రం ప్రయివేటుకు కట్టబెట్టి పేదలకు వైద్య విద్యతో పాటు వైద్యాన్ని దూరం చేస్తోంది’’ అని మండిపడ్డారు. మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ఆ«దీనంలోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ‘‘చంద్రబాబూ 15 ఏళ్లు సీఎంగా చేశావ్.. ఒక్క ప్రభుత్వ వైద్య కాలేజీ తేలేకపోయావ్..? అలాంటిది ఐదేళ్లలోనే జగన్ 17 మెడికల్ కాలేజీలను తెచ్చారు. వాటిని నువ్వొచ్చి ప్రయివేటుపరం చేస్తావా?’’ అని నిప్పులు చెరిగారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన తీవ్రం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో కావాల్సిన వారికి కట్టబెట్టాలనేదే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ ఆలోచన అని వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. -
జగన్ హయాంలో.. శాంతిభద్రతలు భేష్
సాక్షి, అమరావతి: శాంతి భద్రతల పరిరక్షణలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా వ్యవహరించిందన్న వాస్తవం మరోసారి నిగ్గు తేలింది. గత ప్రభుత్వంపై నాడు టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా చేసిన దుష్ప్రచారం అంతా రాజకీయ కుట్రేనన్నది స్పష్టమైంది. 2023లో వైఎస్సార్సీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్లో నేరాల రేటు గణనీయంగా తగ్గిందని కేంద్ర ప్రభుత్వ నివేదిక వెల్లడించడం ప్రాధాన్యం సంతరించుకుంది.కేంద్ర హోంశాఖకు చెందిన జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) 2023 నివేదికను మంగళవారం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా నేరాల తీవ్రతను అందులో వెల్లడించింది. 2022తో పోలుస్తూ 2023లో దేశంలో నేరాల తీరు ఎలా ఉందన్నది విశ్లేషించింది. ఆంధ్రప్రదేశ్లో అన్ని రకాల నేరాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమర్థంగా కట్టడి చేసినట్లు ఆ నివేదిక వెల్లడించడం విశేషం.దాడులు, హత్యలు, కిడ్నాప్లు, ఎస్సీ–ఎస్టీలపై నేరాలు, మహిళలు–బాలలపై నేరాలు, సైబర్ నేరాలు, ఆర్థిక నేరాలు.. ఇలా అన్ని రకాల నేరాలు 2022తో పోలిస్తే 2023లో గణనీయంగా తగ్గాయని కేంద్ర ప్రభుత్వ నివేదిక గణాంకాలతో సహా వెల్లడించింది. ⇒ 2022లో ఏపీలో మొత్తంగా 1,95,284 కేసులు నమోదు కాగా.. 2023లో 1,84,293కు తగ్గింది. నేరపూరిత కేసులు నమోదు చేసే ఐపీసీ సెక్షన్ల కింద కేసులు 2022లో 1,58,547 నమోదు కాగా 2023లో ఆ కేసుల సంఖ్య 1,53,867కు తగ్గాయి. స్థానికచట్టాల ఎస్ఎల్ఎల్ కేసులు 2022లో 36,737 నమోదు కాగా.. 2023లో ఆ కేసుల సంఖ్య 30,436కు పరిమితమయ్యాయి. ⇒ దేశంలో 2022లో మొత్తం 58,24,946 నేరాలు చోటు చేసుకున్నాయి. వాటిలో ఐపీసీ సెక్షన్ల కింద నేరాలు 35,61,379 ఉండగా ఎస్ఎల్ఎల్ నేరాలు 22,63,567 ఉన్నాయి. 2023లో దేశంలో మొత్తం నేరాలు 62,41,569కు పెరిగాయి. వాటిలో ఐపీసీ సెక్షన్ల కింద నేరాలు 37,63,102 ఉండగా, ఎస్ఎల్ఎల్ నేరాలు 24,78,467 ఉన్నాయి. 2023లో దేశవ్యాప్తంగా నేరాలు పెరిగినా ఏపీæలో మాత్రం అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం నేరాలను కట్టడి చేసిందని ఎన్సీఆర్బీ నివేదిక తెలిపింది. ⇒ 2024 ఎన్నికల్లో ప్రజలను తప్పుదారి పట్టించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ నాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలన్నీ అసత్య ప్రచారమేని ఆ నివేదిక గణాంకాల సాక్షిగా వెల్లడైంది. ప్రధానంగా 34వేల మంది మహిళలు, బాలికలు కిడ్నాప్ అయ్యారని జనసేన అధ్యక్షుడు, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ గతంలో చేసిన విమర్శలన్నీ పూర్తిగా అవాస్తవమేనని కేంద్ర హోంశాఖ నివేదిక విస్పష్టంగా ప్రకటించింది. నేరాలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుని సత్వరం శిక్షలు పడేలా చేయడంలో కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించిందని నివేదిక వెల్లడించింది. ఎన్సీఆర్బీ నివేదిక–2023లో ఏపీకి సంబంధించి కీలక అంశాలివీతగ్గిన నేరాలు–ఘోరాలు వైఎస్సార్సీపీ హయాంలో 2022లో కంటే 2023లో రాష్ట్రంలో అన్నిరకాల నేరాలు, ఘోరాలు గణనీయంగా తగ్గాయి. ఐపీసీ నేరాలు, నిబంధనలు అతిక్రమించే పౌరులపై స్థానిక చట్టాల కింద నమోదు చేసే (ఎస్ఎల్ఎల్) నేరాలు తగ్గాయి. హింసాత్మక ఘటనలు, హత్యలు, కిడ్నాపులను కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వం కట్టడి చేసింది. ఇక మహిళలు, బాలికలపై నేరాలు తగ్గేలా వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించింది. ఎస్సీ, ఎస్టీల భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిచ్చింది.. అందుకే ఆ వర్గాలపై నేరాలు తగ్గాయి. 2022లో దేశవ్యాప్తంగా ఆర్థిక నేరాలు, సైబర్ నేరాలు పెరిగినా ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం తన సమర్థ పనితీరుతో నేరాలను నియంత్రించడం గమనార్హం. దేశంలో 54 శాతం.. నాడు ఏపీలో 85.7 శాతం 2022లో రాష్ట్రంలో ఆచూకీ దొరకనివారు 621 మంది ఉన్నారు. వారిలో బాలురు 250 మంది కాగా బాలికలు 371 మంది ఉన్నారు. 2023లో మొత్తం 4,433 మంది కనిపించకుండా పోయారని / ఇంటినుంచి అలిగి వెళ్లిపోయారని వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిలో బాలురు 1,196 మంది బాలురు కాగా 3,237మంది బాలికలు ఉన్నారు. మొత్తం మీద 1,446మంది బాలురు, 3,608మంది బాలికలు కనిపించకుండా / ఇంటి నుంచి అలిగి వెళ్లిపోయినట్టు కేసులు నమోదయ్యాయి. కాగా వారిలో 4,331 మందిని పోలీసులు కనిపెట్టి సురక్షితంగా వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.వారిలో బాలురు 1,141 మంది, బాలికలు 3,190 మంది ఉన్నారు. అంటే 85.7 శాతం మందిని 2023లోనే పోలీసులు సురక్షితంగా వారి తల్లిదండ్రులకు అప్పగించారు. (మిగిలిన వారిని 2024లో పోలీసులు వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు). కనిపించకుండాపోయిన బాల, బాలికలను సురక్షితంగా వారి కుటుంబ సభ్యులకు అప్పగించడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అత్యంత సమర్థంగా వ్యవహరించింది.అందుకే ఏకంగా 85.7 శాతం మందిని సురక్షితంగా వారి కుటుంబ సభ్యుల చెంతకు చేర్చింది. దేశం మొత్తం మీద 54 శాతం మందినే సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారని ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది. వైఎస్సార్సీపీ హయాంలో ఏకంగా 85.7 శాతం మంది బాల, బాలికలను సురక్షితంగా వారి తల్లిదండ్రులకు అప్పగించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేవలం ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకే పవన్కళ్యాణ్ 2024 ఎన్నికల ముందు అవాస్తవ ఆరోపణలు చేశారన్నది మరోసారి స్పష్టమైంది.నేర పరిశోధనలో భేష్ నేరాలను కట్టడి చేయడమే కాదు.. నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలోనూ మెరుగైన భూమిక పోషించింది. ఎక్కడైనా నేరం జరిగితే వెంటనే కేసు నమోదు చేసి నిర్ణిత కాలంలో చార్జ్షిట్ దాఖలు చేసేలా చర్యలు చేపట్టింది. కేంద్ర హోంశాఖ నిర్దేశించిన 60 రోజుల గడువులో ఏకంగా 91.6 శాతం కేసుల్లో చార్జ్షీట్లను న్యాయస్థానంలో దాఖలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. నిర్ణిత సమయంలోగా చార్జ్షిట్లు దాఖలు చేయడంలో దేశంలోనే 3వ స్థానంలో నిలిచింది.పవన్ ఆరోపణలు పూర్తి అవాస్తవం.. వైఎస్సార్సీపీ హయాంలో ఆంధ్ర ప్రదేశ్లో 34వేల మందిమహిళలు, బాలికల అపహరణకు గురయ్యారని పవన్కళ్యాణ్ గతంలో చేసిన ఆరోపణలన్నీ పూర్తి అవాస్తవమేని కేంద్ర హోంశాఖ నివేదిక స్పష్టం చేసింది. 2024 ఎన్నికల ముందు తనకు కేంద్ర నిఘా వర్గాలు సమాచారం ఇచ్చాయంటూ పవన్కళ్యాణ్ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారు. కాగా ఆయన చేసిన ఆరోపణలన్నీ పూర్తి అవాస్తవమని కేంద్ర హోంశాఖ విడుదల చేసిన ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది. -
‘ఏపీలో యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన’
తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యథేచ్చగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందన్నారు వైఎస్సార్సీపీ లీగల్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్రెడ్డి. ప్రభుత్వాన్ని కోర్టులు చీవాట్లు పెట్టినా ధోరణిలో మార్పు రావడం లేదన్నారు. ఈరోజు(మంగళవారం, సెప్టెంబర్ 30వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ.. ‘ అధికారం చేతిలో ఉందని తప్పుడు కేసులు పెడితే సహించేది లేదు. కోర్టుల దృష్టికి తీసుకెళ్తాం. పోలీసులు తమ పరిధి దాటి వ్యవహరిస్తే చర్యలు తప్పవు. రూల్స్ని అతిక్రమిస్తే కోర్టులు చూస్తూ ఊరుకోవు. పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. సవీంద్ర కేసులో ఆయన భార్య ఫిర్యాదు చేస్తే కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. కోర్టు ఆదేశాలను కూడా పోలీసులు ఉల్లంఘించారు. అధికార పార్టీ నేతల చేతిల్లో కొందరు పోలీసులు కీలు బొమ్మలా మారారు. అధికారం శాశ్వతం కాదని పోలీసులు గుర్తిస్తే మంచిది. తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పోలీసులే న్యాయ నిర్ణేత లుగా మారి, తీర్పులు ఇవ్వటం మానుకోవాలి’ అని హెచ్చరించారు. -
‘పట్టించుకోని చంద్రబాబు.. అదే జరిగితే రాష్ట్రం ఎడారి కావడం ఖాయం’
తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు సీఎం చంద్రబాబుకు పట్టవని, ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నా నోరు మెదకపోవడమే ఇందుకు నిదర్శమన్నారు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్సీ సతీష్రెడ్డి. ఈ రోజు(మంగళవారం, సెప్టెంబర్ 30వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన.. ‘ఆల్మట్టి ఎత్తు పెరిగితే రాష్ట్రం ఎడారి కావడం ఖాయమన్నారు. ‘సాగునీరు, తాగునీరు దొరకని పరిస్థితి వస్తుంది. రాయసీమలో మరింత దుర్భిక్షం పెరుగుతుంది. -కర్ణాటక పనులకు సిద్ధం అవుతున్నా పట్టించుకోవడం లేదు. పొద్దుట లేచిన దగ్గర నుంచి ప్రచార ఆర్భాటాలే. కేంద్రంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకోవాలి. రాష్ట్రానికి ఆల్మట్టి శాపం చంద్రబాబు అసమర్థత ఫలితమే. చంద్రబాబు వల్ల రాష్ట్రానికి తీరని విఘాతం. ఈ ప్రధాన సమస్యల నుంచి పక్కదోవ పట్టించడానికే డైవర్షన్ పాలిటిక్స్. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో వ్యక్తిత్వ హననాలకు ఆద్యుడు చంద్రబాబే. అసెంబ్లీలో బాలకృష్ణ - చిరంజీవి ఎపిసోడ్కు స్ఫూర్తి చంద్రబాబే. తప్పు జరిగిందని భావిస్తే బాలకృష్ణ ఎందుకు క్షమాపణ చెప్పలేదు. లోకేష్ దీనిపై ఎందుకు స్పందించడం లేదు. బాలకృష్ణది తప్పులేదంటూ ఎల్లో మీడియా ప్రసారాల వెనుక లోకేష్ లేరా?, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యలు వదిలేసింది. అన్నీ వర్గాల ప్రజల్లో అశాంతి నెలకొంది. ాసనసభలో జగన్ను తిట్టడం కోసం తప్ప ప్రజా ప్రయోజనాలపై చర్చ లేదు’ అని మండిపడ్డారు.డిల్లీ పర్యటనల వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమిటి?కర్ణాటకలో ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నా పట్టించుకోవటం లేదు. దీనివల్ల 100 టీఎంసీల కృష్ణా జలాలు నష్టపోవాల్సి వస్తున్నా చీమ కుట్టినట్లైనా లేదు. శ్రీశైలం, నాగార్జున సాగర్ లకు నీళ్ళు ఆగిపోయే పరిస్థితి వస్తుందని తెలిసినా ప్రభుత్వం ఆలోచన చేయటం లేదు..రైతులకు గిట్టుబాటు ధరలు లేక రోడ్లపైనే పారబోస్తున్నారు. దుర్గమ్మ దగ్గర నుంచి శ్రీశైలం వరకు సీప్లేన్ అన్నారు.. ఏమైంది. మీ డిల్లీ పర్యటనల వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమిటి?, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై అసెంబ్లీలో చర్చ జరిపారా?, అసెంబ్లీలో వ్యక్తిగత దూషణలు తప్ప ఇంకా ఏమైనా ఉన్నాయా?, కోడెల ఆత్మహత్యపై నిందారోపణలు చేస్తున్నారు.. ఫర్నిచర్ విషయంలో ఆరోపణల వల్లే మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారు అని అబద్ధాలు చెప్తున్నారు. కోడెల ఆత్మహత్యకు కారణాలు అందరికీ తెలుసు..మాజీ సీఎం క్యాంప్ ఆఫీస్ లో ఉన్న ఫర్నిచర్ హ్యాండ్ ఓవర్ చేసుకోకపోవటంతో మేం కోర్టుకు వెళ్ళాం. అసెంబ్లీ ప్రసారాలు కూడా ఎవరూ వీక్షించటం లేదు. అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన చౌకబారు ఆరోపణలపై చర్యలు ఎందుకు తీసుకోలేదు?, బాలకృష్ణ వ్యాఖ్యలు మీ పార్టీ అంతర్ముఖాన్ని చూపిస్తున్నాయి. సోషల్ మీడియా యాక్టివిస్ట్ లపై అన్యాయంగా కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడితే రాబోయే రోజుల్లో ప్రజా వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది. అధికారం వచ్చే వరకూ మాత్రమే చిరంజీవి దేవుడులిక్కర్ కేసులో బెయిల్ మంజూరు చేసే సమయంలో కోర్టు చేసిన వ్యాఖ్యలు మీకు చెంపపెట్టు. ప్రాజెక్టులపై ఆచరణ సాధ్యం కాని మాటలు చెబుతున్నారు. అధికారం వచ్చే వరకు కాపు కమ్యూనిటీ కోసం చిరంజీవి దేవుడు. ఇప్పుడు బాలకృష్ణ మాటలకు భయపడి పవన్ ఇంటికి వెళ్లారు చంద్రబాబు.మీరు అధికారంలోకి వచ్చారంటే అది పవన్ పుణ్యమే. ప్రతినెల ఒకటవ తేదీన పెన్షన్లు ఇవ్వటానికి వెళ్తున్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఒక్క కొత్త పెన్షన్ అయినా ఇచ్చారా?, ఆల్మట్టి విషయంలో ప్రభుత్వం పట్టించుకోకుంటే మేమే కేంద్రం దృష్టికి తీసుకువెళ్తాం’అని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: అనిత ‘గాలి’ మాటలు.. మళ్లీ రోడ్డెక్కిన మత్స్యకారులు -
మిథున్ రెడ్డి విడుదల రాజోలులో భారీ ర్యాలీ
-
జగన్ మంచితనం గురించి చిరంజీవిని అడగండి.. పవన్ ను ఏకిపారేసిన జోగి రమేష్
-
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. వైఎస్సార్సీపీ నిరసనలు
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయటాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పీపీపీకి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ అజిత్సింగ్ నగర్లో అంబేద్కర్ విగ్రహానికి వైఎస్సార్సీపీ నేతలు వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహన్రావు, ఎమ్మెల్సీ రాహుల్లా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ తదితరులు పాల్గొన్నారు.ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక.. సామాన్య ప్రజలు బతికే పరిస్థితి లేదని మండిపడ్డారు. వైఎస్ జగన్ ఐదేళ్లలో సామాన్యుల పిల్లలు, బడుగు బలహీన వర్గాల పిల్లలు మెడికల్ విద్య చదవాలని కాలేజీలు తీసుకువచ్చారు. ప్రైవేట్ కాలేజీలు ఇచ్చిన ప్యాకేజి తీసుకోవాలని చంద్రబాబు, లోకేష్, పవన్ ప్రైవేట్పరం చేయాలని చూస్తున్నారు. డబ్బు మీద ప్రేమతో సామాన్యుల కలను చిదిమేస్తున్నాడు మెడికల్ కాలేజీల పరిశీలనకు వెళ్తే పోలీసులతో అడ్డుకున్నారు.. కేసులు పెట్టారు. నిర్బంధంతో పోరాటం ఆపలేరు. మెడికల్ కాలేజీల ప్రవేటికరణ ఆపకపోతే పోరాటం తీవ్రతరం చేస్తాం’ అని హెచ్చరించారు.విశాఖ: మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయొద్దంటూ వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో పార్టీ నేతలు ధర్నా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. కుటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. గొల్ల బాబురావు మాట్లాడుతూ.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్వహించలేని దద్దమ్మ ప్రభుత్వం కూటమి సర్కార్ అంటూ మండిపడ్డారు. వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలను తీసుకువస్తే చంద్రబాబు ప్రైవేటుపరం చేస్తున్నారు. విజయవాడ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో చంద్రబాబు పెడుతున్నారు. పేదల పక్షపాతి వైఎస్ జగన్. దళితుల జోలికి వస్తే చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చివేస్తాం’’ అంటూ గొల్ల బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్సార్ జిల్లా: కడప అంబేద్కర్ సర్కిల్ వద్ద వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ నాయకులు ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలోని మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడంపై నిరసన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బద్వేలు ఎమ్మెల్యే దాసరి సుధ, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.అనంతపురం: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై దళిత సంఘాల ఆగ్రహం వ్యక్తం చేశాయి. నగరంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో నిరసనలు నిర్వహించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయవద్దని డిమాండ్ చేస్తూ.. నల్లబ్యాడ్జీలు, బెలూన్లతో నిరసన తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.తిరుపతి: ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట వైఎస్సార్సీపీ నేతలు నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం పేద వర్గాల పిల్లలకు వైద్య విద్యను దూరం చేస్తూ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఉమ్మడి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు రాజేంద్ర మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ప్రైవేట్ మెడికల్ కాలేజీల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని.. పునరాలోచన చేయాలంటూ ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం డిమాండ్ చేశారు.గుంటూరు: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గుంటూరులో వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు గెడ్డేటి సురేంద్ర ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, మంగళగిరి వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి, తాడికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ వనమా బాల వజ్రబాబు, పొన్నూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పాల్గొన్నారు. -
మిథున్ రెడ్డిపై ఆరోపణలకు ఆధారాలు చూపలేదన్న కోర్టు
-
YSRCP ప్రభుత్వ మద్యం విధానం పారదర్శకంగా ఉండటం వల్లే తప్పుడు కేసు
-
రాజమండ్రి సెంట్రల్ జైల్ నుండి ఎంపీ మిథున్రెడ్డి విడుదల..ఏసీబీ కోర్టు బెయిల్ ఇవ్వడంతో రిలీజ్
-
బెడిసి కొడుతున్న బాబు బేతాళ కుట్రలు
సాక్షి, అమరావతి : చంద్రబాబు బేతాళ కుట్రలు ఒక్కొక్కటిగా బెడిసి కొడుతున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై అక్రమ కేసు కుట్ర విచ్చిన్నమవుతోంది. అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపించేందుకు పన్నిన కుతంత్రం క్రమంగా వీగిపోతోంది. ఈ కేసులో అక్రమంగా అరెస్టు చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు ఈ నెల 6న బెయిల్ మంజూరు కాగా... తాజాగా వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో కూడిన సిట్ ద్వారా చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపునకే పాల్పడుతోందన్నది తద్వారా స్పష్టమైంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానం పారదర్శకంగా అమలైందని ఎక్సైజ్ శాఖ నివేదికలే వెల్లడిస్తున్నాయి. అందుకే చంద్రబాబు ప్రభుత్వం సిట్ ద్వారా కుట్రకు తెరతీసింది. ఈ అక్రమ కేసులో లేని ఆధారాలు సృష్టించేందుకు వేధింపులనే అస్త్రంగా చేసుకుంది. సిట్ న్యాయస్థానానికి సమ ర్పించిన చార్జ్షిట్లో పేర్కొన్న వాంగ్మూలాన్ని కూడా వారు బెదిరించి, వేధించి నమోదు చేసినవే కావడం గమనార్హం.బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి అబద్ధపు వాంగ్మూలాన్నే సిట్ ఈ అక్రమ కేసుకు ప్రధాన ఆధారంగా చేసుకుంది. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం నమోదుకు నిరాకరించిన ఆయన సిట్ బెదిరింపులకు వ్యతిరేకంగా మూడుసార్లు హైకోర్టును ఆశ్రయించారు. అయినా సరే ప్రభుత్వం ఆయన్ను వెంటాడి వేధించింది. డెప్యుటేషన్ ముగిసినా రిలీవ్ చేయకుండా అడ్డుకుంది. కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసింది. తుదకు సిట్ చెప్పినట్టుగా ఆయన అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారు. ఆ వెంటనే వాసుదేవరెడ్డిని రిలీవ్ చేసి కేంద్ర సర్విసులకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతినిచి్చంది. అదే రీతిలో బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగులు సత్య ప్రసాద్, అనూషను వేధించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించింది. అబద్ధపు వాంగ్మూలాల కోసం బెదిరింపులు ⇒ ఈ కేసులో వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్, అనూషలను అప్రూవర్లుగా మార్చాలని సిట్ యత్నించడం గమనార్హం. ముందుగా అరెస్టు అయితేనే అప్రూవర్లుగా మారేందుకు పిటిషన్ను పరిశీలిస్తామని న్యాయస్థానం చెప్పడంతో ఆ ముగ్గురూ వెనక్కి తగ్గాల్సి వచి్చంది. ⇒ అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలని సిట్ డిస్టిలరీల ప్రతినిధులను వేధించింది. వృద్ధులని కూడా చూడకుండా విచారణ పేరుతో హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకువచ్చి వేధించడంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దాంతో వారిని హైదరాబాద్లోని వారి నివాసంలోనే విచారించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసుతో ఏమాత్రం సంబంధం లేని రాజ్ కేసిరెడ్డి తండ్రిని బలవంతంగా తీసుకువచ్చి విచారణ పేరుతో వేధించింది. మరో నిందితుడి తండ్రి, రిటైర్డ్ కానిస్టేబుల్ను అక్రమంగా నిర్బంధించి మరీ వేధించడంతో ఆ కుటుంబం హైకోర్టును ఆశ్రయించాల్సి వచి్చంది. ⇒ ఈ కేసులో అరెస్టు అయిన రాజ్ కేసిరెడ్డి, శ్రీధర్రెడ్డి విచారణలో చెప్పని విషయాలు చెప్పినట్టుగా రిమాండ్ నివేదికలో పేర్కొనడం సిట్ కుట్రను బట్టబయలు చేసింది. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి వద్ద గతంలో గన్మెన్గా పని చేసిన గిరి, మదన్ రెడ్డిలను అక్రమంగా నిర్బంధించి అబద్ధపు వాంగ్మూలం కోసం తీవ్ర స్థాయిలో వేధించారు. బెంబేలెత్తిన గిరి.. సిట్ అధికారులు చెప్పినట్టు అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారు. అందుకు సమ్మతించని మదన్ రెడ్డిపై సిట్ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ⇒ రాజ్ కేసిరెడ్డి భార్య భాగస్వామిగా ఉన్న∙ఇంజినీరింగ్ కాలేజీలో రూ.11 కోట్లు స్వా«దీనం చేసుకుని, ఆ డబ్బు కేసిరెడ్డిదేనని సిట్ మరో కట్టు కథ అల్లింది. కాగా, ఆ నగదు తనది కాదని ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయిండంతో సిట్ కుట్ర కథ అడ్డం తిరిగింది. ఆ నోట్ల కట్టలపై ఉన్న బ్యాచ్ నంబర్ల ఆధారంగా ఎప్పుడు ఏ బ్యాంకుల నుంచి విత్డ్రా చేశారో ఆర్బీఐ ద్వారా విచారించాలని ఆయన న్యాయస్థానాన్ని కోరడంతో సిట్ తోక ముడిచింది. అన్నీ అక్రమ అరెస్టులే.. ⇒ ఈ అక్రమ కేసు దర్యాప్తు పేరిట సిట్ బరితెగించి వ్యవహరించింది. అక్రమ అరెస్టులతో వేధింపులకు పాల్పడింది. అప్రూవర్గా మారి తాము చెప్పినట్టు వాంగ్మూలం ఇవ్వాలని రాజ్ కేసిరెడ్డిని వేధించారు. అందుకు ఆయన తిరస్కరించడంతోనే అరెస్టు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంతో ఏమాత్రం సంబంధం లేని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డిలను సిట్ అక్రమంగా అరెస్టు చేసింది. ⇒ అసలు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలతో సంబంధం లేని ప్రపంచ దిగ్గజ సిమెంట్ కంపెనీ వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను అక్రమంగా అరెస్టు చేయడం సిట్ కుట్రకు పరాకాష్ట. సిట్ ఆయనతో బలవంతంగా కొన్ని పత్రాలపై సంతకాలు చేయించింది. ఆయన ఆ విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లడంతో సిట్ కుతంత్రం బెడిసి కొట్టింది. ⇒ మద్యం విధానంతో ఏమాత్రం సంబంధం లేని ఎంపీ మిథున్ రెడ్డిని, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిలను అక్రమంగా అరెస్టు చేసి ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. అబద్ధపు వాంగ్మూలం ఇస్తే నామినేటెడ్ పదవి ఇవ్వడంతోపాటు రూ.2 కోట్లు ఇస్తామని ప్రభుత్వ పెద్దలు సిట్ అధికారుల ద్వారా చెవిరెడ్డి భాస్కర్రెడ్డి స్నేహితుడు వెంకటేశ్నాయుడు దంపతులను ప్రలోభ పెట్టారు. అందుకు వారు తిరస్కరించడంతో ఈ కేసులో వెంకటేశ్నాయుడును కూడా అరెస్టు చేశారు. దు్రష్పచార కుతంత్రం ⇒ అక్రమ కేసులో దర్యాప్తు పేరిట సిట్ కుతంత్రాలు అడ్డూ అదుపు లేకుండా సాగాయి. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలతో ఏమాత్రం సంబంధం లేని వైఎస్ అనిల్ రెడ్డి కార్యాలయాల్లో సిట్ సోదాల పేరుతో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. దీంతో ఆయన కంపెనీల్లో మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతి డైరెక్టర్గా వ్యవహరించారని ఎల్లో మీడియా దు్రష్పచారం చేసింది. వాస్తవానికి వైఎస్ అనిల్ రెడ్డి మాతృమూర్తి వైఎస్ భారతి గతంలో ఆ కంపెనీల్లో డైరెక్టర్గా వ్యవహరించారు. ⇒ హైదరాబాద్కు చెందిన న్యాయవాది, వ్యాపారి నర్రెడ్డి సునీల్ రెడ్డి నివాసాల్లో తనిఖీల పేరిట సిట్ రాద్ధాంతం చేసింది. ఆ సమయంలో ఓ ప్రైవేటు వాహనంలో కొన్ని సందేహాస్పద పత్రాలను ఆయన నివాసంలో చేర్చేందుకు సిట్ యత్నించడం గమనార్హం. ఆ వాహనంలో టీడీపీకి చెందిన ఓ వ్యక్తి ఉండటం ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేసింది. అంటే తనిఖీల పేరుతో తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు సిట్ యత్నించిందన్నది బహిర్గతమైంది. ⇒ సిట్ దాఖలు చేసిన మొదటి చార్జ్షిట్, అనుబంధ చార్జ్షిట్లను పరిశీలించిన న్యాయస్థానమే వాటి చట్టబద్ధతను ప్రశి్నంచడం ప్రాధాన్యం సంతరించుకుంది. న్యాయస్థానం లేవనెత్తిన అభ్యంతరాలపై సిట్ సమాధానం చెప్పలేకపోయింది. అందుకే సీఆర్సీపీ సెక్షన్ 167(2) ప్రకారం ఈ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, రిటైర్డ్ అధికారి కృష్ణమోహన్రెడ్డి, వికాట్ కంపెనీ ఎండీ బాలాజీ గోవిందప్పలకు ఈ నెల 6న, ఎంపీ మిథున్ రెడ్డికి సోమవారం బెయిల్ మంజూరు చేసింది. తద్వారా సిట్ అల్లిన కట్టుకథల కుట్రలు ఒక్కొక్కటిగా వీగిపోతున్నాయని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. నాడు మద్యం విధానం పారదర్శకం⇒ అసలు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంలో ఎలాంటి అక్రమాలు జరగలేదు. ఎలాంటి అవినీతి లేదు కాబట్టే లేని ఆధారాలు సృష్టించేందుకు సిట్ ఇంతగా దిగజారుతోంది. 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం దశల వారీగా మద్య నియంత్రణ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేసింది. ⇒ అంతకు ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో దోపిడీకి పాల్పడ్డ 4,380 ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం రద్దు చేసింది. ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రవేశ పెట్టింది. దుకాణాల వేళలను కుదించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న 4,380 మద్యం దుకాణాలను దశల వారీగా 2,934 దుకాణాలకు తగ్గించింది. ⇒ చంద్రబాబు ప్రభుత్వం అనధికారిక బార్లుగా లైసైన్సులు జారీ చేసిన 4,380 పరి్మట్ రూమ్లను రద్దు చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో కొనసాగిన 43 వేల బెల్ట్ దుకాణాలను తొలగించింది. రాష్ట్రంలోని 20 డిస్టిలరీల్లో 14 డిస్టిలరీలకు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులు జారీ చేసింది. మిగిలిన ఆరు డిస్టిలరీలకు అంతకు ముందు ప్రభుత్వాలు లైసెన్సులు మంజూరు చేశాయి. మొత్తం 20 డిస్టిలరీలను బెవరేజస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్లకు ఎంప్యానల్ చేసింది చంద్రబాబు ప్రభుత్వమే. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక్క మద్యం డిస్టిలరీకి కూడా లైసెన్సులు మంజూరు చేయలేదు. ⇒ ఈ విప్లవాత్మక చర్యలతో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. తద్వారా డిస్టిలరీలకు లాభాలు తగ్గిపోయాయి. అలాంటప్పుడు డిస్టిలరీలు ప్రభుత్వ పెద్దలకు ఎందుకు కమీషన్లు ఇస్తాయి? ఇవ్వనే ఇవ్వవు. కాబట్టే అవినీతి లేని వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసులో సిట్ అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలనే ఆధారంగా చేసుకుంది. ఇప్పుడవన్నీ ఒక్కొక్కటిగా బెడిసి కొడుతున్నాయి. -
మిథున్రెడ్డికి బెయిల్.. నిరూపించే ఆధారాల్లేవ్
కేవలం కేసు తీవ్రత, పరిమాణం మాత్రమే కాక నిందితుని పాత్ర, దర్యాప్తు అధికారులు సేకరించిన ఆధారాలను బట్టే బెయిల్ మంజూరుపై నిర్ణయం ఉంటుంది. ప్రస్తుత కేసులో పిటిషనర్ పాత్రను నిర్ధారించేందుకు సరైన, బలమైన ఆధారాలేవీ లేవు. ఈ కేసులో మిథున్రెడ్డి మాస్టర్ మైండ్ అని, కీలక పాత్ర పోషించారని, ఇందుకు ప్రాసిక్యూషన్.. సహ నిందితుల నేరాంగీకార వాంగ్మూలంపై ఆధార పడుతోంది. కానీ ఆ వాంగ్మూలాలకు ఎలాంటి ఆమోద యోగ్యత లేదు. సహ నిందితుల వాంగ్మూలాలు, కొందరు సాక్షులు ఇచ్చిన 164, 161 స్టేట్మెంట్లు తప్ప ఇతర ఆధారాలను సమర్పించలేదు. ఇవి బెయిల్ నిరాకరించడానికి ఎంత మాత్రం సరిపోవు.నేరపూరిత కుట్ర విషయంలో దర్యాప్తు అధికారులు ప్రాథమిక ఆధారాలను చూపలేకపోయారు. నిందితులు డబ్బు, ముడుపులను దారి మళ్లించడానికి ఒప్పందం చేసుకున్నారనేందుకు ఆధారాలేవీ చూపలేదు. కోర్టు ముందుంచిన ఆధారాలు స్వతంత్రమైనవి కావు. అందువల్ల బెయిల్ను తిరస్కరించలేము. – ఏసీబీ కోర్టుసాక్షి, అమరావతి/గాందీనగర్ (విజయవాడ సెంట్రల్) : మద్యం అక్రమ కేసులో నిందితునిగా ఉన్న రాజంపేట పార్లమెంట్ సభ్యుడు పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డికి విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నేరపూరిత కుట్ర విషయంలో దర్యాప్తు అధికారులు ప్రాథమిక ఆధారాలను చూపలేకపోయారని కోర్టు స్పష్టం చేసింది. నిందితులు డబ్బు, ముడుపులను దారి మళ్లించడానికి ఒప్పందం చేసుకున్నారనేందుకు సైతం ఆధారాలేవీ చూపలేదని పేర్కొంది. కోర్టు ముందుంచిన ఆధారాలు స్వతంత్రమైనవి కావని, అందువల్ల బెయిల్ను తిరస్కరించలేమని తేల్చి చెప్పింది. ఈ కేసులో మిథున్రెడ్డి మాస్టర్ మైండ్ అని, కీలక పాత్ర పోషించారనడానికి కూడా ఎలాంటి ఆధారం చూపలేదని తప్పు పట్టింది. ప్రాసిక్యూషన్.. ఆధారపడుతున్న సహ నిందితుల నేరాంగీకార వాంగ్మూలాలకు ఎలాంటి ఆమోద యోగ్యత లేదని చెప్పింది. 164, 161 స్టేట్మెంట్లు బెయిల్ నిరాకరించడానికి ఎంత మాత్రం సరిపోవని చెబుతూ న్యాయాధికారి పి.భాస్కరరావు బెయిల్ మంజూరు చేశారు. ఈ కేసులో నాల్గవ నిందితునిగా ఉన్న మిథున్రెడ్డిని సిట్ అధికారులు ఈ ఏడాది జూలై 19న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన 72 రోజులుగా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో జుడీషియల్ రిమాండ్లో ఉన్నారు. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఇటీవల ఆయన ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తీర్పులోని ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి. ఆరోపణల ఆధారంగా బెయిల్ హక్కును నిరాకరించలేం ‘కేవలం కేసు తీవ్రత, పరిమాణం మాత్రమే కాక నిందితుని పాత్ర, దర్యాప్తు అధికారులు సేకరించిన ఆధారాలను బట్టే బెయిల్ మంజూరుపై నిర్ణయం ఉంటుంది. ప్రస్తుత కేసులో పిటిషనర్ పాత్రను నిర్ధారించేందుకు సరైన, బలమైన ఆధారాలేవీ లేవు. కేవలం ఆరోపణల ఆధారంగా ఆయన అమూల్యమైన బెయిల్ హక్కును తిరస్కరించలేం. నిందితుడిపై ఆరోపణలు తీవ్రమైన ఆర్థిక నేరాలకు సంబంధించినవన్న కారణంతో మాత్రమే బెయిల్ నిరాకరించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఇందుకు సంబంధించి చట్టాలలో, బెయిల్ సంబంధిత న్యాయ సూత్రాలలో అలాంటి నిషేధం లేదు. మిథున్రెడ్డిపై ఉన్న ప్రధాన ఆరోపణ ఏమిటంటే, ఈ కేసులో ఆయన మాస్టర్ మైండ్ అని, కీలక పాత్ర పోషించారని. ఇందుకు ప్రాసిక్యూషన్ సహ నిందితుల నేరాంగీకార వాంగ్మూలంపై ఆధార పడుతోంది. కానీ ఆ వాంగ్మూలాలకు ఎలాంటి ఆమోద యోగ్యత లేదు. సహ నిందితుల వాంగ్మూలాలు, కొందరు సాక్షులు ఇచ్చిన 161 స్టేట్మెంట్లు తప్ప ఇతర ఆధారాలను సమర్పించలేదు. కోర్టు ముందుంచిన ఆధారాలు స్వతంత్రమైనవి కావు. వాటికి ఎంత విలువ ఉందనే విషయం క్రా‹స్ ఎగ్జామినేషన్ తర్వాతే తెలుస్తుంది’ అని ఏసీబీ కోర్టు తన తీర్పులో పేర్కొంది. ఆరోపణలు నిరాధారం ‘మిథున్రెడ్డి ఈ కేసులో మాస్టర్ మైండ్గా ఉంటూ, ఒక సిండికేట్ ద్వారా ముడుపులు వసూలు చేశారని సిట్ ఆరోపించింది. అలాగే, డీకార్ట్ లాజిస్టిక్స్ నుంచి రూ.5 కోట్లు అందుకున్నారని, అది మద్యం విక్రయాలకు సంబంధించిన మొత్తమని కూడా ఆరోపించింది. అయితే ఆ ఆరోపణలు నిరాధారమైనవి. వాటికి ఎలాంటి ఆధారాలు లేవు. మాస్టర్ మైండ్ అనడంతో పాటు 2019–24 మద్యం విధానం రూపకల్పన, అమలులో కీలక పాత్ర పోషించారన్నది కూడా మిథున్రెడ్డిపై ఉన్న ఆరోపణ. అయితే, ఆయన మద్యం విధానం రూపకల్పన కమిటీలో సభ్యుడు కాదని, ఆయన పార్లమెంట్ సభ్యుడు మాత్రమేనని, రాష్ట్ర వ్యవహారాలు లేదా ఎక్సైజ్ పాలసీతో సంబంధం లేదని ఆయన తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పోలీసులు ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలేవీ మిథున్రెడ్డిపై ప్రాథమికంగా కేసు రుజువు చేసేందుకు సరిపోవు. ఏదేమైనప్పటికీ, నేరం తీవ్రతను మాత్రమే బెయిల్ తిరస్కరణకు ఏకైక కారణంగా పరిగణించబడకూడదు’ అని ఏసీబీ కోర్టు తేల్చి చెప్పింది. రాజకీయ కేసులు ఉండటం ఆశ్చర్యకరం కాదు ‘మిథున్రెడ్డికి నేర చరిత్ర ఉందంటూ సిట్ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏడు కేసులను ప్రస్తావించారు. అయితే, వాటిలో ఐదు కేసులు ఇప్పటికే క్లోజ్ అయ్యాయి. మిగిలిన రెండు కేసులు కూడా రాజకీయ స్వభావం ఉన్నవి. మిథున్రెడ్డికి దీర్ఘకాల రాజకీయ ప్రస్థానం ఉంది. అలాంటప్పుడు రెండు రాజకీయ కేసులు పెండింగ్లో ఉండటం ఆశ్చర్యకరమైన విషయం కాదు. ఎందుకంటే రాజకీయాల్లో ఎల్లప్పుడూ ప్రత్యర్థులు ఉంటారు. అయితే, మిథున్రెడ్డి ఇప్పటి వరకు ఎటువంటి ఆర్థిక లేదా క్రూరమైన నేరాలకు పాల్పడలేదన్నది వాస్తవం. కాబట్టి, ఆయనను బెయిల్పై విడుదల చేయడం వల్ల సమాజానికి ఎలాంటి ముప్పు కలిగించదు’ అంటూ కోర్టు తీర్పు చెప్పింది. నేరపూరిత కుట్ర, డబ్బు మళ్లింపునకు ఆధారాలేవీ? ‘ఇది బెయిల్ దశ మాత్రమే. కాబట్టి కేసు పూర్వాపరాల్లోకి వెళ్లి లోతైన పరిశీలన చేయాల్సిన అవసరం లేదు. కేసు పూర్వాపరాల ఆధారంగా ఈ దశలో ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేసినా కూడా అది విచారణ ఫలితాన్ని ముందే నిర్ణయించినట్లు అవుతుంది. నేరపూరిత కుట్ర విషయంలో దర్యాప్తు అధికారులు ప్రాథమిక ఆధారాలను చూపలేకపోయారు. నిందితులు డబ్బు, ముడుపులను దారి మళ్లించడానికి ఒప్పందం చేసుకున్నారనేందుకు ఆధారాలేవీ చూపలేదు. సిట్ అధికారులు మిథున్రెడ్డి గూగుల్ టేకౌట్స్, సెల్ టవర్ లోకేషన్ డేటాను ఈ కోర్టు ముందుంచారు. అయితే, నెట్వర్క్ రద్దీ, భౌగోళిక అడ్డంకుల కారణంగా వాటిలో తేడాలున్నాయి. అందువల్ల అవి కచ్చితమైనవి గానీ, నిర్ణయాత్మకమైనవి గానీ కావు’ అని కోర్టు స్పష్టం చేసింది. ప్రాసిక్యూషన్ విఫలం ‘డీకార్ట్ నుంచి పీఎల్ఆర్ కంపెనీకి వచ్చిన రూ.5 కోట్ల నగదుతో తనకు ఎలాంటి సంబంధం లేదని మిథున్రెడ్డి చెప్పారు. ఈ కేసులో ఆయనకు ప్రమేయం ఉందని నమ్మేందుకు నగదు, బంగారం, విలాసవంతమైన కార్లు, ఆస్తులు వేటిని కూడా ఆయన నుంచి స్వాదీనం చేసుకోలేదు. ఈ విషయాలన్నింటినీ విచారణ సమయంలో పరిశీలించాల్సి ఉంటుంది. అందువల్ల కొంత మంది సాక్షులు ఇచ్చిన 161 స్టేట్మెంట్లు, సహ నిందితులు ఇచ్చిన 164 స్టేట్మెంట్లు బెయిల్ నిరాకరించడానికి ఎంత మాత్రం సరిపోవు. ఆరోపణలు తీవ్రమైనవి అయినా కూడా, కేసును బట్టి బెయిల్పై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పింది. ప్రధానంగా నిందితుడికి ఆపాదించిన పాత్ర, ప్రాసిక్యూషన్ సేకరించిన ఆధారాలపై బెయిల్ మంజూరు ఆధారపడి ఉంటుంది. కానీ ప్రస్తుత కేసుతో పిటిషనర్కు సంబంధం ఉందని నిరూపించే ప్రాథమిక ఆధారాలను చూపడంలో ప్రాసిక్యూషన్ విఫలమైంది. ఈ కేసు ఆదాయపు పన్ను శాఖ లేదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)æ ఫిర్యాదు ఆధారంగా నమోదు కాలేదు. చిన్నారులపై వేధింపులు, పన్ను ఎగవేత, బ్యాంకు మోసం, కస్టమ్స్ ఉల్లంఘనలు వంటి ఆరోపణలేవీ పిటిషనర్పై లేవు. పిటిషనర్ మనీ లాండరింగ్, ఉపా, జాతీయ భద్రత కేసుల్లో అరెస్ట్ కాలేదు. కాబట్టి బలమైన ఆధారాలు లేకుండా ఆయన్ను నిరవధికంగా కస్టడీలో ఉంచడానికి వీల్లేదు’ అని ఏసీబీ కోర్టు తన తీర్పులో వివరించింది. ఎంపీ మిథున్రెడ్డి విడుదల సాక్షి, రాజమహేంద్రవరం: మద్యం అక్రమ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్ ఇవ్వండంతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజంపేట ఎంపీ పి.వి.మిథున్రెడ్డి సోమవారం సాయంత్రం విడుదలయ్యారు. విజయవాడ ఏసీబీ కోర్టు మంజూరు చేసిన బెయిల్ పత్రాలు సెంట్రల్ జైలు అధికారులకు అందడంతో సాయంత్రం 5.55 గంటలకు ఆయన్ను విడుదల చేశారు. కాగా, బెయిల్పై విడుదలైన మిథున్రెడ్డికి వైఎస్సార్ సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. బెయిల్ పత్రాలు సెంట్రల్ జైల్ అధికారులకు మధ్యాహ్నమే చేరినా, ఆలస్యంగా విడుదల చేయడంపై వైఎస్సార్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బెయిల్పై విడుదలైన అనంతరం నాయకులు, కార్యకర్తలకు అభివాదం చేస్తున్న మిథున్రెడ్డి సాక్ష్యాలను తారుమారు చేసినట్లు ఆరోపణా లేదు ‘మిథున్రెడ్డి బెయిల్పై బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేయడంతో పాటు సాక్ష్యాలను తారుమారు చేస్తారని ప్రాసిక్యూషన్ వాదిస్తోంది. వాస్తవానికి పిటిషనర్ మూడుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై, ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన తండ్రి ప్రస్తుతం ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా ఉన్నారు. తద్వారా సమాజంలో వీరికి గట్టి సంబంధాలున్నాయి. ఈ కేసులో ముందు బెయిల్ నిరాకరించిన తర్వాత మిథున్రెడ్డి స్వచ్ఛందంగా దర్యాప్తు అధికారి ముందు లొంగిపోయారు. మధ్యంతర బెయిల్ మంజూరైనప్పుడు తన పాస్పోర్టును కోర్టుకు అప్పగించారు. 72 రోజుల రిమాండ్ సమయంలో గానీ, మధ్యంతర బెయిల్ కాలంలో గానీ ఆయన సాక్ష్యాలను తారుమారు చేసినట్టు ఎలాంటి ఆరోపణా లేదు. ఈ కేసు ప్రధానంగా డాక్యుమెంటరీ ఆధారాలపైనే ఆధారపడి ఉంది. అవన్నీ ప్రాసిక్యూషన్ సురక్షిత కస్టడీలో ఉన్నాయి. అలాంటప్పుడు సాక్ష్యాలను తారుమారు చేస్తారని, విచారణలో ఆటంకం కలిగించే అవకాశం ఉందనే అనుమానాలతో బెయిల్ నిరాకరించడానికి వీల్లేదు. సాక్ష్యాలను తారుమారు చేసి ఉంటే అందుకు స్పష్టమైన ఆధారాలుంటాయి. సాక్ష్యాల తారుమారుపై అనుమానాలుంటే ఉంటే వాటిని కఠిన షరతుల ద్వారా నిరోధించవచ్చు. పిటిషనర్ సాక్షులను ప్రభావితం చేయడానికి, సాక్ష్యాలను తారుమారు చేయడానికి, విచారణకు ఆటంకం కలిగించడానికి ప్రయత్నిస్తే.. ప్రాసిక్యూషన్ ఎప్పుడైనా కోర్టును ఆశ్రయించి బెయిల్ రద్దు కోరవచ్చు. ప్రజా ప్రయోజనం, నిందితుని వ్యక్తిగత స్వేచ్ఛ రెండింటినీ సమన్వయం చేయాలి. అందువల్ల పిటిషనర్కు కొన్ని షరతులతో బెయిల్ మంజూరు చేస్తున్నాం’ అని ఏసీబీ కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. రూ.2 లక్షలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని.. సోమ, శుక్రవారాల్లో దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని.. తదితర షరతులు విధించింది. కాగా, బెయిల్ పిటిషన్పై మిథున్రెడ్డి తరఫున తప్పెట నాగార్జునరెడ్డి, సిట్ తరఫున స్పెషల్ పీపీ వాదనలు వినిపించారు. -
పోలీసుల గురించి మాట్లాడితే.. దూల తీరుస్తాం..!
ఏలూరు టౌన్: పోలీసులపై విమర్శలు చేస్తే కేసులు పెట్టి.. దూల తీరుస్తామని ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ (ఏఎస్పీ) నక్కా సూర్యచంద్రరావు వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు, కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావును బెదిరించారు. ఏలూరులో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో సూర్యచంద్రరావు చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ నెల 5న కైకలూరు మండలం దానగూడెంలో వినాయక నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనపై పోలీస్ అధికారులు పలువురిపై కేసు నమోదు చేసి అరెస్టులు చేశారు. కాగా, మాజీ ముఖ్యమంత్రి జగన్పై విషం చిమ్మడమే లక్ష్యంగా కైకలూరు ఎమ్మెల్యే కామినేని వివాదాస్పద వ్యాఖ్యలు, దీనిపై బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలను ఈ నెల 26న జరిగిన విలేకరుల సమావేశంలో దూలం నాగేశ్వరరావు ఖండించారు. ఈ క్రమంలో కామినేని ఒత్తిడులకు లొంగకుండా కొందరు పోలీసులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. దళితులపై అన్యాయంగా హత్యాప్రయత్నం చేసిన కేసులో కామినేనికి నచి్చనట్లుగా, ఆయన చెప్పిన విధంగా కేసులు రాయలేదని, అరెస్ట్ చేయలేదని టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణను వీఆర్కు పంపించారని తెలిపారు. ఎమ్మెల్యే మనిషిగా పేరొందిన రూరల్ సీఐ రవికుమార్ దీనంతటకీ కారణమని కూడా విమర్శించారు. తనకు కావాల్సిన రవికుమార్ వంటి వారిని కాపాడుకుంటూ, నిజాయితీగా పనిచేసే కృష్ణ అనే ఇన్స్పెక్టర్ను వీఆర్కు పంపించారని పేర్కొన్నారు. సమయం వస్తుందన్న ఏఎస్పీ.. ఈ అంశాలను తాజాగా ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సూర్యచంద్రరావు ప్రస్తావిస్తూ, ‘నోటి దూలెక్కి మాట్లాడితే, దూల తీర్చేసే సమయం వస్తుంది’ అని పేర్కొన్నారు. పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ సాధారణ బదిలీల్లో భాగంగానే సీఐ కృష్ణను బదిలీ చేశారని చెప్పారు. -
ఏంపీ మిథున్ రెడ్డి విడుదలపై... YSRCP నేతలు రియాక్షన్
-
‘ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను గట్టిగా నిరసించాలి’
తాడేపల్లి : ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను గట్టిగా నిరసించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. రేపటి ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో జరిగే నిరసనలను విజయవంతం చేయాలని ఆయన సూచించారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ ముఖ్య నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి.. టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను గట్టిగా నిరసించాలి. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసనలు చేపట్టాలిపార్టీ కమిటీల నియామకం నవంబర్ 20 నాటికి పూర్తి చేయాలి. పార్టీ సంస్థాగత బలోపేతంపై సీరియస్గా దృష్టిపెట్టాలి. నిబద్దతతో, చురుగ్గా పని చేసే వారికి కమిటీలలో ప్రాధాన్యత ఇవ్వండి. పుంగనూరు, మడకశిర నియోజకవర్గాల తరహాలో కమిటీల నెట్వర్కింగ్ సిస్టమ్ అన్ని నియోజకవర్గాల్లో జరగాలి’ అని పేర్కొన్నారు. -
ఎంపీ మిథున్రెడ్డి విడుదల
సాక్షి, రాజమండ్రి: వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. మద్యం అక్రమ కేసులో మిథున్రెడ్డికి ఏసీబీ కోర్టు సోమవారం (సెప్టెంబర్29న) షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో సోమవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలైన మిథున్రెడ్డికి వైఎస్సార్సీపీ నేతలు, శ్రేణులు భారీ ఎత్తున స్వాగతం పలికాయి అంతకుముందు మిథున్రెడ్డి జైలు నుంచి విడుదలపై ఉత్కంఠ నెలకొంది. మద్యం అక్రమ కేసులో మిథున్రెడ్డికి ఏసీబీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పత్రాలు సెంట్రల్ జైలు అధికారిక ఈమెయిల్కు పంపించింది. అయితే ఎంపీ మిథున్రెడ్డి జైలు నుంచి విడుదలకు సంబంధించిన పత్రాలు రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారిక మెయిల్కు వెళ్లినా.. మెయిల్కు పత్రాలు రాలేదని జైలు అధికారులు తెలిపారు. దీంతో ఎంపీ మిథున్రెడ్డికి బెయిల్ వచ్చినా ఎందుకు విడుదల చేయడం లేదంటూ జైలు అధికారులతో న్యాయవాదులు మాట్లాడారు. మిథున్రెడ్డి విడుదలలో జాప్యంపై వైఎస్సార్సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జైలు అధికారులు ఎంపీ మిథున్రెడ్డిని జైలు నుంచి విడుదల చేశారు. విడుదల అనంతరం మిథున్రెడ్డికి పార్టీ నేతలు,శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. -
Amzath Basha: మీరు కేసులు పెట్టుకుని పోండి.. మేము నోట్ చేసుకుంటూ పోతాం
-
నెల్లూరు టీడీపీ నేతలకు చెప్తున్నా.. ఆనం విజయకుమార్ రెడ్డి వార్నింగ్
-
ప్రశ్నిస్తే అణచివేస్తారా?.. మైలవరం పీఎస్ ముందు వైఎస్సార్సీపీ ధర్నా
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ నేతల కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. అభివృద్ధిపై ప్రశ్నించినందుకు మైలవరం నియోజకవర్గ వైఎస్సార్సీపీ మున్సిపాలిటీ విభాగం అధ్యక్షుడు కోమటి కోటేశ్వరరావును అక్రమంగా అరెస్ట్ చేశారు. టీడీపీ నాయకుల ఫిర్యాదుతో కోటేశ్వరరావును అరెస్ట్ చేసిన పోలీసులు.. మైలవరం పోలీస్స్టేషన్కు తరలించారు.వైఎస్సార్సీపీ నేత అక్రమ అరెస్ట్పై మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. ఆయనతో పాటు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు.. మైలవరం పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. అక్రమంగా అరెస్ట్ చేసిన కోటేశ్వరరావును వెంటనే విడుదల చేయాలంటూ జోగి రమేష్ డిమాండ్ చేశారు. ఆయన్ని మైలవరం సీఐ కార్యాలయం ఎదుట పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పీఎస్ ఎదుట వైఎస్సార్సీపీ శ్రేణులు ధర్నాకు దిగాయి. -
అన్నను మరచిన తమ్ముళ్లు!
అవాకులు చెవాకులు పేలడం.. అభిమానంతో దగ్గరకొచ్చిన వారికి చెంపదెబ్బలు తగిలించడం ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు కొత్తేమీ కాదు కానీ.. అసెంబ్లీ వేదికగా ఆయన సహనటుడు చిరంజీవి, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ పార్టీ అధినేత జగన్పై చేసిన వ్యాఖ్యలు మాత్రం ఆయన వ్యక్తిత్వాన్ని మరోసారి బట్టబయలు చేసింది. కొందరి బలహీనతలు, కొందరి అహంకారం, ఇంకొందరి విచక్షణ, విజ్ఞతలను ప్రజల ముందుంచింది. అంతేకాదు.. తరచూ రాజకీయ విన్యసాలు సాగిస్తూ, ఏది వాస్తవమో, ఏది అబద్దమో తెలియని స్థాయిలో మాట్లాడే నేతలు కొందరి నిజరూపం కూడా వెల్లడించింది.తనను కలిసేందుకు వచ్చిన సినీ పరిశ్రమ వారిని సీఎం హోదాలో జగన్ ఎంత గౌరవంగా చూసింది ప్రపంచానికి తెలిసినట్లయింది. జగన్ విజ్ఞత అందరికి తెలిస్తే, చిరంజీవి కాస్త లేటుగా అయినా స్పందించి తన వ్యక్తిత్వాన్ని కొంతవరకైనా నిలబెట్టుకున్నారనిపిస్తుంది. మొత్తం ఎపిసోడ్లో సోదికి వెళితే ఏదో బయటపడిందన్నట్లుగా సోషల్ మీడియా పుణ్యమా అని అనేక పాత విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయినా బాలకృష్ణ క్షమాపణ చెప్పకపోవడం, సారీ చెప్పాలని కూటమి నేతలు కోరలేకపోవడం గమనించాల్సిన అంశాలే.శాసనసభలో జగన్ను, చిరంజీవిని అవమానిస్తుంటే ప్రేక్షకపాత్ర పోషించిన గౌరవ సభ్యులు, గౌరవ ఉప సభాపతి గురించి ఏమనగలం? బాలకృష్ణ సంస్కార రహితంగా వ్యాఖ్యలు చేసినా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లు నోరు విప్పలేకపోవడంతో వారు బాగా ఎక్స్పోజ్ అయ్యారు. జగన్ను సైకో అనడం ద్వారా బాలకృష్ణ తన పాత చరిత్ర అంతా తవ్వించుకున్నారు. బాలకృష్ణ ఏ రకంగా సైకోనో వివరించే అనేక దృష్టాంతాలు వెల్లడయ్యాయి. అసెంబ్లీ సమావేశాలలో కొందరు టీడీపీ సభ్యులు ప్రజల సమస్యలను ప్రస్తావిస్తే ప్రభుత్వ పరువు తీస్తారా అంటూ వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు నాయుడు తన బావమరిది బాలకృష్ణను మాత్రం ఒక్క మాట అనలేకపోయారు.మెగాస్టార్ చిరంజీవిని అలా అనడం తప్పు అని చంద్రబాబు చెప్పలేకపోయారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిస్థితి మరీ దారుణం. ఆయన మరో సోదరుడు నాగబాబు నోరు పెగలలేదు. జనసేన కేడర్, సామాజిక వర్గం, సాధారణ ప్రజలు బాలకృష్ణ వైఖరిని తీవ్రంగా నిరసించినా పవన్, నాగబాబులు మాత్రం కనీసం కిమ్మనలేకపోయారు. పదవిలో ఉన్న మజా అలాంటిదేమో!బాలకృష్ణ జనసేన కార్యకర్తలను అలగా జనం అన్నారని ఒకసారి వాపోయిన పవన్ ఆ తరువాత ఆయనతోనే చెట్టాపట్టాలేసుకుని తిరగడం అందరూ గమనించే ఉంటారు. లేపాక్షి ఉత్సవాల సందర్భంలో బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి మా బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు అంటూ కామెంట్ చేసినా వీరు ఎవరూ పెద్దగా ఫీల్ అయినట్లు లేదు. నాగబాబు కొంతవరకూ దీటుగా సమాధానం చెప్పినప్పటికీ ఆ తరువాత టీడీపీ పదవుల ఆశతో అన్నీ మరచిపోయారు.చంద్రబాబు స్కిల్ స్కామ్లో అరెస్టైతే రోడ్డుమీద పడి నానా యాగీ చేసిన పవన్ కళ్యాణ్ సొంత అన్నకు అవమానం జరిగితే జ్వరం పేరుతో హైదరాబాద్ వెళ్లి బెడ్పై ఉండిపోయారన్న విమర్శలు వస్తున్నాయి. బాలకృష్ణ మాటలను ఖండిస్తే ఎక్కడ తన ఉప ముఖ్యమంత్రి పదవి పోతుందో అని పవన్ బెంగపట్టినట్టుందని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు ఏమీ చేసినా భరించాల్సిందే అని పవన్ గతంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు.సమస్యంతా బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు అసందర్భ ప్రేలాపనతో మొదలైంది. ఆయన ఏ పార్టీనో ఆయనకే గుర్తుండదు. చంద్రబాబు మెప్పుదల కోసం జగన్పై లేని పోని అభాండాలు మోపి, చిరంజీవి వద్ద మార్కులు కొట్టేయాలనుకుని బోల్తాపడ్డారు. చిరంజీవి తదితర నటులు జగన్ను కలిసినప్పుడు ఏదో అవమానం జరిగిందని అచ్చం టీడీపీ నేత మాదిరి ఒక కల్పిత కథ సృష్టించే యత్నం చేసి దెబ్బతిన్నారు. చివరికి శాసనసభ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తను మాట్లాడిన మాటలను రికార్డుల నుంచి తొలగించాలని ఆయనే స్వయంగా కోరుకున్నారు. అయినా అప్పటికే జరగవలసిన డామేజీ జరిగిపోయింది.ఆ కల్పిత కథలో చిరంజీవిని పొగడడం విని తట్టుకోలేకపోయిన బాలకృష్ణ మైకు అందుకుని సభా మర్యాదలతో సంబంధం లేకుండా నెత్తిపై గాగుల్స్, ఫ్యాంట్ జేబుల్లో రెండు చేతులు పెట్టుకుని మాట్లాడిన తీరు ఆయన అహంకారం బయటపెట్టిందన్న విమర్శ వచ్చింది. ఎందుకంటే బావ ముఖ్యమంత్రి, అల్లుడు మంత్రి, తానేమో ఎన్టీఆర్ కుమారుడిని అన్న గర్వం ఆయనలో ఉందన్న భావన ఏర్పడింది. చిరంజీవిని ఎవడు అనడం, జగన్ ఇంటిలో గట్టిగా మాట్లాడే ధైర్యం చిరంజీవికి లేదన్నట్లుగా మాట్లాడడం అందరిని విస్మయపరిచింది. జగన్ను దూషిస్తున్నప్పుడే స్పీకర్ ఛైర్లోఉన్నవారు వారించగలిగితే ఇది ఆగి ఉండేది. సీఎం బావమరిది కావడంతో అలా చేయలేకపోయారు అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అటు వైఎస్సార్ కాంగ్రెస్, ఇటు చిరంజీవి అభిమానులు బాలకృష్ణపై మండిపడ్డారు. పేర్నినాని వంటివారు అసలు సైకో బాలకృష్ణే అంటూ ఆయనకు ఉన్న మెంటల్ సర్టిఫికెట్ తో సహా పలు అంశాలను గుర్తు చేసి పరువు తీశారు. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పుకోవాలి.అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు బాలకృష్ణ జరిపిన కాల్పుల వల్ల నిర్మాత బెల్లంకొండ సురేష్, జ్యోతిష్కుడు సత్యనారాయణలు తీవ్రంగా గాయపడ్డారు. ఆ కేసులో బాలకృష్ణ జైలుకు వెళ్లకుండా మెంటల్ సర్టిఫికెట్ను తీసుకుని కాపాడినట్లు ప్రముఖ వైద్యులు, దివంగత కాకర్ల సుభ్బారావు చెప్పిన విషయం వీడియోలలో నిక్షిప్తమై ఉంది.ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అయ్యింది. రక్తపు మరకల సాక్ష్యాధారాలు చెరిపి వేశారని అప్పట్లో బాలకృష్ణ భార్య వసుంధరపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఆమె కోర్టులో సరెండరై బెయిల్ కూడా పొందారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్పై అనవసరంగా నోరు పారేసుకునే చంద్రబాబు తన సమీప బంధువు నిజంగా అలా సాక్ష్యాలు చెరిపేసిన విషయాన్ని మాత్రం కప్పిపుచ్చుతూంటారని ఇప్పుడు ప్రజల దృష్టికి వచ్చింది.చట్టపరంగా కాల్పుల కేసులో బాలకృష్ణను జైలులో పెట్టాలి. అలా చేయలేదు. బాలివుడ్ నటుడు సంజయ్ దత్ వద్ద తుపాకులు దొరికితేనే జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అదే బాలకృష్ణ కాల్పులు జరిపితే కూడా జైలుకు వెళ్లలేదని సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వచ్చాయి. ఎన్టీఆర్ కుమారుడు అన్న సానుభూతి, ఆ రోజుల్లో కాంగ్రెస్లో ఉన్న దగ్గుబాటి దంపతులు, తదితరుల విజ్ఞప్తిని గమనంలోకి తీసుకుని వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఈ కేసును తేలికగా వదలి వేసిందని అంటారు. చట్టప్రకారం అలా చేయకూడదు.అయినా చేశారు.ఆ కృతజ్ఞత కూడా బాలకృష్ణకు ఆ తర్వాత కాలంలో లేకపోయింది. సినిమాల పరంగా, ఇతరత్రా సాయం, గౌరవం పొందినప్పటికీ జగన్ను పట్టుకుని బాలకృష్ణ పిచ్చి వ్యాఖ్య చేయడం ప్రజలకు ఆగ్రహం తెప్పించింది. వైఎస్సార్ కాబట్టి రాజకీయంగా ఆలోచించకుండా బాలకృష్ణకు, ఆయన భార్యకు సాయం చేశారని, అదే పరిస్థితి వైఎస్సార్ సన్నిహితులు ఎవరికైనా వచ్చి అప్పుడు చంద్రబాబు సీఎంగా ఉండిఉంటే, రాజకీయంగా ఎంతగా వాడుకునే వారో అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.మెంటల్ సర్టిఫికెట్ ఉన్నా, బాలకృష్ణకు టీడీపీ ఇక్కెట్ ఇవ్వడం, హిందుపూరం ప్రజలు ఎన్నుకోవడం విశేషమే. ఆ తర్వాత కాలంలో ఆయన తన అభిమానులపై దురుసుగా వ్యవహరించిన ఘట్టాలు కూడా ఉన్నాయి. అయినా ఆయనను ఎవరూ మందలించలేదు. ఆయన కూడా తాను తప్పు చేశానని అనుకోవడం లేదు. అమ్మాయిలపై బాలకృష్ణ చేసిన ఒక వ్యాఖ్య తీవ్ర కలకలం రేపింది. ఆ కామెంట్ చేసినప్పుడు అక్కడ ఉన్న సినీ ప్రముఖులు కాని, సభలో పాల్గొన్నవారు ఎవరూ బాలకృష్ణను ఏమీ అనలేదు. పైగా అంతా నవ్వుతూ కూర్చున్నారు. తదనంతర కాలంలో ఆయనకు పద్మభూషణ్ బిరుదు రావడం కూడా మరో విశేషం. ప్రధానమంత్రి మోడీని పట్టుకుని అనుచిత వ్యాఖ్యలు చేసినా బాలకృష్ణకు ఏమీ ఇబ్బంది రాలేదు. పైగా బిరుదు కూడా వచ్చింది. బీజేపీ నేతలు ఇందుకు సిగ్గుపడినట్లు కనిపించలేదు.చంద్రబాబుకేమో తన బావమరిది జోలికి వెళితే ఇంకేమవుతుందో అన్న భయం ఉండవచ్చని, అందుకే ఆయన కూడా దీనిపై స్పందించలేదేమో అని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక చిరంజీవి మూడేళ్లపాటు ఈ అంశంపై మౌనంగా ఉండి తన తమ్ముడికి రాజకీయంగా సాయపడ్డారని, ఇప్పుడు బాలకృష్ణ చేసిన అవమానాన్ని తట్టుకోలేక బయటకు వచ్చారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు, పవన్లు అబద్దపు ప్రచారం చేస్తున్నప్పుడే జగన్ తమను గౌరవంగా చూసుకున్నారని చిరంజీవి చెప్పి ఉంటే ఎంతో మర్యాదగా ఉండేదన్న భావన ఉంది. ఇప్పటికైనా చిరంజీవి స్పందించడం బాగానే ఉంది కాకపోతే సొంత తమ్ముళ్ల నుంచే ఆయనకు మద్దతు కొరవడడం కాస్త అప్రతిష్టే. కొద్ది మంది చిరంజీవి అభిమానులు తమ నిరసన చెప్పారు. మరో ప్రముఖ నటుడు ఆర్.నారాయణ మూర్తి అసెంబ్లీలో జరిగిన ఘట్టాన్ని ఖండిస్తూ సినిమా ప్రముఖులందరిని జగన్ గౌరవంగా చూశారని, చిరంజీవి రాసిన లేఖలో ఉన్న అంశాలు వాస్తవమైనవని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియాలో మాత్రం బాలకృష్ణను ఉతికి ఆరేశారు. పవన్ నుంచి సానుభూతి దక్కకపోయినా, వైసీపీ వారు మాత్రం చిరంజీవికి ఎంతొకొంత మద్దతు ఇచ్చారు. ఈ రకంగా బాలకృష్ణ ఉదంతంలో ఆయనతో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ,నాగబాబుల అసలు రంగు బయటపడినట్లయిందా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
దేవి నవరాత్రులు.. అమ్మవారి సేవలో శ్యామల (ఫొటోలు)
-
హైకోర్టు ఆదేశాలను లెక్క చేయని పచ్చ ఖాకీలు
-
వెంకట్ రెడ్డిని చంపేస్తాం..
-
ఈఆర్సీ నిర్ణయం సర్కారుకు చెంపపెట్టు
నెల్లూరు (స్టోన్హౌస్పేట): ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ) తలంటితే సిగ్గు పడాల్సింది పోయి ట్రూ డౌన్ పేరుతో విద్యుత్ చార్జీలను తగ్గిస్తున్నట్లు ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేసుకోవడం చంద్రబాబు సర్కారు దివాళాకోరుతనానికి నిదర్శనమని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి మండిపడ్డారు. ఈఆర్సీ ఆదేశాలతో వినియోగదారులకు తిరిగి చెల్లించాల్సిన రూ.923.55 కోట్లను తాను ఎంతో ఉదారంగా ఇస్తున్నట్లు చెప్పుకోవడం సిగ్గుగా లేదా? అని ప్రశి్నంచారు.అనుమతి లేకుండా విద్యుత్ చార్జీల భారం మోపిన చంద్రబాబు ప్రభుత్వానికి ఈఆర్సీ నిర్ణయం చెంప పెట్టు లాంటిదన్నారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో ఆదివారం కాకాణి మీడియాతో మాట్లాడారు. విద్యుత్ చార్జీలు ఇంకా తగ్గిస్తానని నమ్మబలికిన చంద్రబాబు ఏడాదిలోనే ప్రజలపై రూ.19 వేల కోట్ల భారాన్ని మోపారని ధ్వజమెత్తారు. ట్రూ డౌన్ చంద్రబాబు ఘనతగా ఎల్లో మీడియా ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అనుమతించిన ధరకు మించి కొనుగోలు 2024–25 సంవత్సరానికి రూ.2,758.76 కోట్లు ట్రూ అప్ చార్జీలకు డిస్కంలు ఈ ఏడాది జూలైలో అనుమతి కోరగా ఏపీఈఆర్సీ రూ.1,863.64 కోట్లకు మాత్రమే అనుమతి ఇచి్చందన్నారు. కూటమి సర్కారు ఏపీఈఆర్సీ అనుమతించిన ధరకు మించి విద్యుత్ కొందన్నారు. ఏపీఈఆర్సీ యూనిట్ రూ.5.27కు కొనమని చెబితే.. ఈపీడీసీఎల్ రూ.5.84 చొప్పున, సీపీడీసీఎల్ రూ.5.86 చొప్పున, ఎస్పీడీసీఎల్ యూనిట్ రూ.5.89 చొప్పున వెచి్చంచి విద్యుత్ కొన్నట్లు వెల్లడించాయన్నారు. విద్యుత్ కొనుగోలు ఖర్చు రూ.34,517 కోట్లకు అనుమతి ఉంటే రూ.45,476 కోట్లు వెచి్చంచామని డిస్కంలు చెప్పాయన్నారు. ప్రసార, పంపిణీ నష్టాలు 10.17 శాతమని డిస్కంలు ప్రతిపాదిస్తే ఈఆర్సీ మాత్రం 9.87 శాతానికే అంగీకరించిందన్నారు. 2024–25కి సంబంధించి ప్రతి నెలా యూనిట్కు 0.40 పైసలు చొప్పున డిస్కమ్లు ఇప్పటికే రూ.2,787.18 కోట్లు వసూలు చేశాయన్నారు. అనుమతించిన మొత్తం పోనూ మిగిలిన రూ.923.55 కోట్లను ఈ ఏడాది నవంబర్ నుంచి ట్రూ డౌన్ చేయాలని ఈఆర్సీ ఆదేశించిందన్నారు. కూటమి సర్కారు 2024 నవంబర్ బిల్లు నుంచే రూ.6,072.86 కోట్ల భారాన్ని ప్రజలపై మోపి వసూలు చేస్తుండగా ఈ ఏడాది జనవరి బిల్లు నుంచి మరో రూ.9,412.50 కోట్ల అదనపు భారం మోపిందన్నారు. -
ఆధునిక తెలుగు కవుల్లో అగ్రగణ్యుడు జాషువా
సాక్షి,అమరావతి: కుల, మత అసమానతల్లేని సమసమాజ నిర్మాణం కోసం కలంతో పోరాటం చేసిన మహాకవి గుర్రం జాషువా అని పలువురు వైఎస్సార్సీపీ నేతలు కొనియాడారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జాషువా జయంతి కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. అనంతరం వారు మాట్లాడుతూ..ఆధునిక తెలుగు కవుల్లో అగ్రగణ్యుడు గుర్రం జాషువా అని అన్నారు. జాషువా భౌతికంగా మనమధ్య లేకపోయినా తన రచనలతో సమాజాన్ని నిత్యం తట్టిలేపుతూనే ఉంటారన్నారు. స్వేచ్ఛ, సమాన త్వం ఉన్నప్పుడు సమాజం పురోభివృద్ధి సాధిస్తుందని జాషువా నమ్మారని, ఆ స్ఫూర్తిని మాజీ సీఎం వైఎస్ జగన్ మరింతగా ముందుకు తీసుకువెళ్లారన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మలసాని మనోహర్రెడ్డి పాల్గొన్నారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన.. షెడ్యూల్డ్ కులాలకు వ్యతిరేకంగా విద్య, వైద్య రంగా ల్లో కూటమి అనుసరిస్తోన్న విధానాలను నిరసిస్తూ ఈ నెల 30న వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో అంబేడ్కర్ విగ్రహాల వద్ద నిరసన తెలపనున్నట్లు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు తెలిపారు. వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కనకారావు మాట్లాడుతూ బలహీ న కులాలను ప్రభుత్వం అణచివేస్తోందన్నారు. -
‘ఇది ప్రభుత్వానికి చెంపపెట్టు.. ఏపీ పోలీసుల పనితీరుకు నిదర్శనం’
తాడేపల్లి : సవీంద్ర కేసులో పోలీసుల వ్యవహార శైలిపై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించడం గొప్ప విషయమన్నారు వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్రెడ్డి. పోలీసుల వైఖరిపై హైకోర్టు సుమోటోగా స్వీకరించి సీబీఐకి అప్పగించడం అనేది మంచి పరిణామన్నారు. ఈ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి చెంప పెట్టు అయితే, పోలీసుల పని తీరుకు నిదర్శనమన్నారు. ఈరోజు(ఆదివారం, సెప్టెంబర్ 28వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన.. వెంటనే హోంమంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ‘రాష్ట్ర ప్రభుత్వం పౌరుల హక్కులను కాలరాస్తోంది. హైకోర్టు ఎన్నిసార్లు హెచ్చరించినా పోలీసుల్లో మార్పు రాలేదు. బాలకృష్ణకు మెంటల్ సర్టిఫికెట్ ఇచ్చామని డాక్టర్ కాకర్ల సుబ్బారావే స్వయంగా చెప్పారు. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేస్తే అక్రమ కేసులు పెడుతున్నారు. జగన్ పర్యటనలను నియంత్రిస్తున్నారు. జగన్ సభలకు వచ్చే వారిని డ్రోన్ కెమెరాలతో గుర్తించి కేసులు పెడుతున్నారు. సాక్షి విలేరకర్లు, యాజమాన్యం మీద తప్పుడు కేసులు పెట్టారు. తప్పుడు కేసుల విషయంలో డీజీపీని కోర్టుకు పిలిపిస్తామని హెచ్చరించినా పోలీసుల్లో మార్పు రాలేదు. తప్పు చేస్తే కేసులు పెట్టాలిగానీ అరెస్టులు చేయటానికే కేసులు పెడుతున్నారు. పోసాని కృష్ణమురళి, తురకా కిషోర్ సహా అనేకమంది మీద పదుల సంఖ్యలో కేసులు పెట్టారు. ఆరేళ్ల క్రితం ఏదో జరిగిందని ఇప్పుడు కేసులు పెడుతున్నారు. సవీంద్ర కేసులో మఫ్టీలో వెళ్ళి అరెస్టు చేయటంపై హైకోర్టు సీరియస్ అయింది. హైకోర్టు ఉద్యోగి జడ్జీలకు ఫైళ్లను తీసుకెళ్తుంటే సీఐ శ్రీనివాస్ దాడి చేశాడు. జడ్జీల ఫైళ్లు ఉన్న వాహనాన్ని కూడా పీఎస్కి తరలించారు. ఏపీలో పోలీసుల పనితీరుకు ఇదే నిదర్శనం. టీడీపీ సోషల్ మీడియా వైఎస్సార్ సీపీ నేతల కుటుంబాలపై పెడుతున్న దారుణమైన పోస్టులు ప్రభుత్వానికి కనపడటం లేదా?, ఐ-టీడీపీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీపై చర్యలు తీసుకోవాలి. వ్యక్తిత్వ హననం చేస్తూ పెట్టిన పోస్టులపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది?, జగన్ ఫోటో వాట్సప్ డీపీ పెట్టుకుంటే కేసులు పెడుతున్నారు. బైకుల మీద జగన్ బొమ్మ కనపడితే సీజ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఎల్లోమీడియా పైత్యం బాగా పెరిగింది. జగన్ రాష్ట్రం కోసం అప్పులు చేస్తే సోమాలియా, శ్రీలంక అవుతోందని రాశారు. అదే చంద్రబాబు అప్పులు చేస్తే రుణ సమీకరణ అంటూ ముద్దుగా రాస్తున్నారు’ అని ధ్వజమెత్తారు.ఇదీ చదవండి:సవీంద్ర అక్రమ అరెస్ట్ కేసు సీబీఐకి అప్పగిస్తూ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు -
సిగ్గుండాలి బాలకృష్ణ.. నిండు సభలోకి మందుతాగి వచ్చి
-
‘సమాధానం చెప్పకుండా ప్రభుత్వ పెద్దలు పారిపోయారు’
తాడేపల్లి : అసెంబ్లీ సమావేశాల నుండి ప్రభుత్వం పారిపోయిందని విమర్శించారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ప్రభుత్వం పారిపోయిందని ఎద్దేవా చేశారు. రైతులు గిట్టుబాటు ధరలు, మెడికల్ కాలేజీల గురించి అడిగితే అసలు ఆ సమస్యలే లేవని వ్యాఖ్యానించారని స్పష్టం చేశారు. ఈ రోజు(ఆదివారం, సెప్టెంబర్ 28వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన.. రైతులు యూరియా కోసం క్యూ కడుతున్న దృశ్యాలు ప్రభుత్వానికి కనపడలేదని విమర్శించారు. ‘ యూరియా వాడితే క్యాన్సర్ వస్తుందని చంద్రబాబు, అచ్చెనాయుడు అంటున్నారు. యూరియా అందించలేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. జగన్ హయాంలో వ్యవసాయం పండుగైతే చంద్రబాబు హయాంలో దండగగా మారిపోయింది. రైతుల బాధలను కూడా అవహేళన చేస్తున్నారు. మెడికల్ కాలేజీలను ప్రయివేటీకరణ చేసి పేదలకు వైద్యం అందకుండా చేస్తున్నారు. ఆరువేల కోట్లు కూడా ఖర్చు చేయలేక ప్రయివేటు వ్యక్తుల చేతిలో పెడతారా?, నిధుల్లేకపోతే విడతల వారీగా నిర్మాణాలు పూర్తి చేయొచ్చుకదా?, అదేమీ లేకుండా తమ వారికి దోచి పెట్టటమే పనిగా పెట్టుకుంటారా?, చంద్రబాబు పాలన అంతా ప్రయివేటీకరణ కోసమే. విద్య, వైద్యం ప్రయివేటు వ్యక్తుల చేతిలో ఉంటే ఇక సామాన్యులు బతికేది ఎలా?, ప్రయివేటీకరణే కరక్టని రోడ్డు మీదకు వచ్చి జనం ముందు చెప్పే ధైర్యం ఉందా?, సూపర్ సిక్స్ మేనిఫెస్టోనే మారిపోయింది. ఎన్నికలకు ముందు ఉన్న మేనిఫెస్టోకి, ఇప్పటి మేనిఫెస్టోకి సంబంధం లేకుండా పోయింది. అప్పుల మీద అధికార పార్టీ నేతలు గాలి మాటలు మాట్లాడారు. బాలకృష్ణ తప్పతాగి అసెంబ్లీకి వచ్చారు. నోటికొచ్చినట్టు మాట్లాడి అసెంబ్లీ పరువు తీశారు. మండలి ఛైర్మన్కి సరైన గౌరవం కూడా ఇవ్వలేదు. దళితుడన్న కారణంతో అగౌరవంగా చూస్తున్నారు. కూటమి ఎమ్మెల్యేలే అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని దూషిస్తున్నారు. నారా లోకేష్ సకల శాఖా మంత్రిగా వ్యవహరిస్తూ మిగతా మంత్రుల నోళ్లు మూయించారు. ప్రజా సమస్యల పరిష్కారం అయ్యే వారకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం’ హెచ్చరించారు. -
స్కిట్ చేశానని కక్షతో.. చేతులు, కాళ్లకు సంకెళ్ళేసి మంచానికి కట్టేసి..!
-
మావెంటే నీ పాలన.. నీవంటే మాకు ఆదరం
విశాఖపట్నం జిల్లా ముఖ్యమంత్రిగా మనవడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన మేలు ఆ అవ్వ మరచిపోలేదు. జగన్ ఫొటో చూడగానే.. గడప దాటకుండా ఇంటికే అందించిన పింఛన్లు, రేషన్ సరకులు, సంక్షేమ పథకాలు ఆమెకు గుర్తొకొచ్చాయి. గుండెల్లో ప్రేమ తన్నుకొచ్చింది. రెండు చేతులు జోడించి అభివాదం చేసింది.జగన్ చిత్ర పటానికి ముద్దులెట్టి మనసులోతుల్లోని అభిమానాన్ని చాటుకుంది.. అవ్వ తాంగుల బుడ్డి. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టులో ఈ దృశ్యం చోటుచేసుకుంది. ‘మాకు అన్ని విధాలుగా మేలు చేశాడు.. నా మనవడు’ అంటూ ఆమె పలికిన మాటలు... పేద జనం గుండెల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన వేసిన ముద్రకు తార్కాణాలు. -
Big Question: లోకేశ్ పోలీసుల అసలు రంగు.. మఫ్టీలో వస్తారు.. మడతేస్తారు
-
బాలకృష్ణపై విమర్శలు.. వైఎస్సార్సీపీ మహిళా నేతపై కేసు
చిలమత్తూరు/నగరంపాలెం (గుంటూరు వెస్ట్): సోషల్ మీడియా యాక్టివిస్ట్లపై కూటమి ప్రభుత్వ వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. న్యాయస్థానాలు ఎంత హెచ్చరించినా ఖాకీలు మాత్రం బేఖాతరు చేస్తున్నారు. తాజాగా, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణను విమర్శించినందుకు వైఎస్సార్సీపీ మహిళా విభాగం శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు నాగమణిపై పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు.సినీనటుడు చిరంజీవితోపాటు మాజీ సీఎం జగన్పై అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుపడుతూ శుక్రవారం నాగమణి సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేశారు. దీనిపై టీడీపీ మహిళా విభాగం నాయకులు హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హిందూపురం ఒకటో పట్టణ పోలీసులు ఆమెపై బీఎన్ఎస్ 196(1),(ఎ), 353(2), 61(2), 351(4), బీఎన్ఎస్, 67 ఐటీఏ 2000–08 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.అలాగే, సీఎంపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒక మెడికల్ రిప్రజెంటేటివ్పై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసినట్లు గుంటూరు సీఐడీ సైబర్ క్రైం ఎస్పీ డాక్టర్ కేవీ శ్రీనివాస్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలానికి చెందిన గడ్డం శివప్రసాద్(మెడికల్ రిప్రజెంటేటివ్) ఫేస్బుక్లో సీఎంపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినట్లు గుంటూరు వికాస్నగర్లోని టీడీపీ నాయకుడు కనపర్తి శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు.సీఐడీ డీజీపీ సూచనల మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. ఈ నెల 26న ధర్మవరం టౌన్లో గడ్డం శివప్రసాద్ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కాగా, దర్యాప్తు చేసి అతడిని సీబీసీఐడీ కోర్టు ముందు హాజరుపరచగా.. కోర్టు శివప్రసాద్ను 35 బీఎన్ఎస్ఎస్ కింద నోటీసులు ఇచ్చి విడుదల చేయాల్సిందిగా ఆదేశించింది. -
గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో.. విద్యార్థుల మరణాలు దారుణం
సాక్షి, అమరావతి: ‘గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురై చనిపోతున్నారు. కొంతమంది ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. ఇది చాలా దారుణం. ఈ ఘటనలపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో తెలియజేయాలి. అంతేకాదు.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా చర్యలు తీసుకోవాలి’.. అని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు ప్రభుత్వాన్ని కోరారు. శనివారం శాసనమండలిలో ప్రత్యేక ప్రస్తావన కింద సభ్యుడు అనంత ఉదయభాస్కర్ ఈ అంశంపై మాట్లాడుతూ.. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని గిరిజన హాస్టళ్లలో గడిచిన ఏడు నెలల్లో నలుగురు విద్యార్థులు మృతిచెందారని సభ దృష్టికి తీసుకొచ్చారు.ఈ దుర్ఘటనలపై రంపచోడవరం ఐటీడీఏ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, బాధ్యులైన వారిని సస్పెండ్చేసి సమగ్ర విచారణ చేపడతామని చెప్పారన్నారు. విచారణ చేపట్టారో లేదో.. బాధ్యులపై చర్యలు తీసుకున్నారో లేదో కూడా చెప్పడంలేదని అన్నారు. ఈ మరణాలకు కారణాలేమిటో తెలియజేయడంతో పాటు విచారణ జరిపితే ఆ నివేదికను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలియజేయాలన్నారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పందిస్తూ.. తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రత్యేక ప్రస్తావన కింద ‘మండలి’లో చివరి రోజైన శనివారం ఇతర సభ్యులు ప్రస్తావించిన అంశాలు..‘నవయుగ’కు గిరిజన భూములెలా ఇస్తారు? గిరిజనుల హక్కులను కాలరాస్తూ వారి భూములను ప్రైవేటు వ్యక్తులకు ఎలా కేటాయిస్తారు? అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం టోకూరు, పెదవడ్డ, బూర్జా ప్రాంతాల్లో హైడ్రో పవర్ ప్రాజెక్టులను నవయుగ అనే ప్రైవేటు సంస్థకు కట్టబెట్టేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం రంగం సిద్ధంచేసింది. ఇందుకోసం జీఓ–51ను జారీచేసింది. ఇది ముమ్మాటికి 1/70 చట్టాన్ని ఉల్లంఘించడమే. తక్షణమే ఆ జీఓ–51ను రద్దుచేయాలి. – కుంభా రవిబాబు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీతక్షణమే జీఓ–5ను రద్దుచేయాలి.. దొమ్మరి కులం పేరును దొమ్మిరి గిరిబలిజగా మారుస్తూ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ జారీచేసిన జీఓ–5ను తక్షణమే రద్దుచేయాలి. దొమ్మరి కుల ప్రస్తావనతో తాము తీవ్ర వివక్షకు గురవుతున్నందున ఆ పేరు పూర్తిగా మాసిపోయేలా తమ సామాజికవర్గానికి కొత్తపేరు పెట్టాలని వారు కోరారు. కానీ, తిరిగి అదే పేరును కొనసాగిస్తూ బ్రాకెట్లో గిరిబలిజగా పేర్కొనడం సరికాదు. తక్షణమే ఈ జీఓను రద్దుచేయాలి. – వంకా రవీంద్రనాథ్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలక్ష మంది రోడ్డెక్కితే పట్టించుకోరా? రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లక్ష మందికి పైగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వలంటీర్ల వ్యవస్థను రద్దుచేసి ఆ పనిభారాన్ని వారిపై మోపారు. తమ డిమాండ్ల సాధన కోసం వారు నిరసనలు, ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం. తక్షణమే సచివాలయ ఉద్యోగులతో చర్చలు జరిపి, ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించాలి. – పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీపోలీసులకు పదోన్నతులు కలి్పంచాలి.. పోలీసు శాఖలో కానిస్టేబుల్ నుంచి ఇన్స్పెక్టర్ స్థాయి వరకు ఏళ్ల తరబడి పదోన్నతులు లేకుండా ఇబ్బందిపడుతున్నారు. చాలామంది ఇన్స్పెక్టర్లు ఒక్క ప్రమోషన్ మాత్రమే తీసుకుని రిటైర్ అవుతున్నారు. తక్షణమే వారికి పదోన్నతులు కల్పించాలి. కేంద్ర ప్రభుత్వ సంస్థల రక్షణకు ఏర్పాటుచేసే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ నియామకాలు ఏపీలోనే చేపడితే కొత్త పోస్టులు, ప్రమోషన్ ఛానల్స్ పెరుగుతాయి. – ఏసురత్నం, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీఎంపీటీసీలు, జెడ్పీటీసీల బకాయిలు చెల్లించాలి.. రాష్ట్రంలో 13 వేల మంది ఎంపీటీసీలకు రూ.100.30 కోట్లు, 660 జెడ్పీటీసీలకు రూ.9.50 కోట్ల మేర గౌరవ వేతన బకాయిలున్నాయి. వాటిని వెంటనే చెల్లించాలి. – బొమ్మి ఇజ్రాయెల్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ విశాఖలో వీధి వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపాలి.. విశాఖపట్నంలో మూడువేలకు పైగా వీధి వ్యాపారుల షాపులను జీవీఎంసీ అధికారులు తొలగించారు. వీరితోపాటు వారి వద్ద పనిచేసే వేలాది మంది రోడ్డునపడ్డారు. సుందరీకరణ, ట్రాఫిక్ పేరిట తొలగించడం సరికాదు. వారికి ప్రత్యామ్నాయం చూపాలి. – సూర్యనారాయణరాజు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ‘హైస్కూల్ ప్లస్’లలో ఖాళీలను భర్తీచేయాలి.. హైస్కూల్ ప్లస్ పాఠశాలల్లో 1,572 పీజీటీ శాంక్షన్ పోస్టులుండగా, 800 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మిగిలిన 772 పోస్టులు కాంట్రాక్టు లెక్చరర్లతో కాకుండా స్కూల్ అసిస్టెంట్లతో భర్తీచేయాలి. – కల్పలతారెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ‘ఒంటిమిట్ట’ పర్యాటక ప్రాజెక్టును పట్టాలెక్కించాలి.. వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలో కోదండ రామాలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా ఒక్క అడుగు కూడా పడలేదు. తక్షణమే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాలి. – రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ -
విజయ్ సభలో తొక్కిసలాటపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
తాడేపల్లి: కోలీవుడ్ ప్రముఖ నటుడు, టీవీకే అధినేత విజయ్ ప్రచార సభలో శనివారం కరూర్లో జరిగిన తొక్కిసలాటలో భారీ ప్రాణనష్టం వాటిల్లడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.ఈ విషాదకర సంఘటనలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని ఆయన అన్నారు. ఊహించలేని దుఃఖంలో మునిగిపోయిన వారి కుటుంబాలకు సంతాపాన్ని తెలిపారు. ఈ విషాద సమయంలో వారికి అండగా ఉంటామని ఆయన అన్నారు. -
మెంటల్ ఫెలో.. చిరంజీవిని వాడు వీడు అంటావా
-
30 చెప్పి 3 చేస్తే సూపర్ హిట్ అవుతుందా?
-
అసెంబ్లీలో వరదరాజులు సుద్దపూస వ్యాఖ్యలు ఏకిపారేసిన రాచమల్లు
-
Dadisetti Raja: బాలకృష్ణ ఒక పిచ్చోడు..
-
‘10 చెప్పి 3 అమలు చేస్తే సూపర్హిట్ అవుతుందా?’
విజయవాడ: శాసనమండలిలో సభ్యుల ప్రశ్నలకు ఎదురుదాడి లేదా తప్పించుకుని తిరిగే తప్పా, ప్రభుత్వం నుంచి బాధ్యతాయుతమైన సమాధానం రాలేదని విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఈరోజు(శనివారం, సెప్టెంబర్ 27వ తేదీ) శాసనమండలి సమావేశాల అనంతరం బొత్స మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ‘ రైతులు ఇబ్బందులు పడుతున్నా యూరియా పై చర్చించడానికి ఒప్పుకోలేదు. మేము ప్రజల తరపున పోరాటం చేస్తూనే ఉన్నాం.. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అన్నారు. 10 చెప్పి 3 అమలు చేస్తే సూపర్ హిట్ అవుతుందా?, కార్మికుల పని గంటలు పెంచే బిల్లు వ్యతిరేకించాం.. ఆ బిల్లులో భాగస్వామ్యం కామని చెప్పాం. క్రిడాల్లో దేశానికి, రాష్టానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన వ్యక్తికి జాబ్ ఇవ్వడానికి బిల్లు పెడితే మేము సమర్ధించాం. కానీ రాజకీయ గొడవలతో చనిపోయిన కుటుంబంలో వ్యక్తికి జాబ్ ఇస్తామని బిల్లు పెడితే వ్యతిరేకించాం. ఈ బిల్లు పాస్ అయితే రాష్ట్రంలో కక్షలు-కార్పణ్యాలు పెరిగిపోతాయి. ప్రభుత్వానికి రాజకీయ ఆలోచన తప్ప ప్రజలు వారి అవసరాలు, రాష్ట్ర అభివృద్ధి లేదు. ఒంటెద్దు పోకడలతో ప్రభుత్వం పోతుంది. చైర్మన్కి జరిగిన అవమానంపై కూడా సభలో చర్చించాం.. ఇక ముందు జరగదని చెప్పారు’ అని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకించడంతో టీడీపీ కార్యక ర్త రామాంజనేయులు ఉద్యోగం బిల్లు ఆమోదం పొందలేదు. దాంతో ఆ బిల్లు ఆమోదం పొందకుండానే శానస మండలి నిరవధిక వాయిదా పడింది. ‘బాలయ్య అంతేసి మాటలన్నా స్పీకర్ పట్టించుకోరా?’ -
ఆ రోజు బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు.. సంచలన నిజాలు బయటపెట్టిన రవీంద్రనాథ్ రెడ్డి
-
పెద్దిరెడ్డి కుటుంబంపై కక్ష తోనే.. గుర్తుపెట్టుకొని అన్ని రోజులు మనవి కావు..
-
జగన్ 18 లక్షల సైన్యం.. ఈసారి అధికారంలోకి YSRCP
-
చంద్రయ్య కొడుక్కి ప్రభుత్వ ఉద్యోగం కోసం బిల్లు!
సాక్షి, అమరావతి: ‘‘జరిగింది రాజకీయ ప్రేరేపితమైన హత్య అని ప్రభుత్వమే అంటోంది.. అలాంటప్పుడు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం ఏముంది?’’ అని శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. టీడీపీ కార్యకర్త తోట చంద్రయ్య కొడుక్కి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం బిల్లును ప్రవేశపెట్టగా.. వైఎస్సార్సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘‘జరిగింది రాజకీయ ప్రేరేపితమైన హత్య అని బిల్లులో చెప్పారు. రాజకీయ ప్రేరేపిత హత్య జరిగిన వారికి ఉద్యోగాలు ఇచ్చి ఏం సందేశం ఇస్తున్నారు?. అదేదో.. దేశానికి పేరు తెచ్చే వారికి ఉద్యోగాలు ఇస్తే బావుంటుంది. కానీ ఇదేం సంప్రదాయం?. మీ పార్టీ పరంగా ఏదైనా సహాయం చేసుకోండి. అంతేగానీ రాజకీయ ప్రేరేపిత హత్య జరిగితే ఎలా ఉద్యోగం ఇస్తారు?. ఇప్పుడు గనుక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే ఫ్యాక్షన్ని ప్రోత్సహించినట్టు అవుద్ది. తప్పుడు ఆలోచనను రేకెత్తించినట్టు అవుతుంది. ఈ బిల్లు ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ బిల్లు పై డివిజన్(ఒక బిల్లును ఆమోదించాలా వద్దా అనే విషయంలో సభ్యుల ఓట్లను స్పష్టంగా లెక్కించమని కోరడం) కోరుతున్నాం’’ అని బొత్స అన్నారు. అయితే.. దీనికి మంత్రి పయ్యావుల నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. రాజకీయ ప్రేరేపిత హత్యలు జరగకూడదనే ఉద్దేశంతోనే చంద్రయ్య కొడుకు వీరాంజనేయులికి ఉద్యోగం(Chandraiah Son Govt Job) ఇస్తున్నామని అన్నారు. ఇలా ఇస్తూ పోతే అరాచకాలు మరింత పెరుగుతాయని బొత్స అనడంతో.. మంత్రులు ఊగిపోయారు. నచ్చకపోతే వాకౌట్ చేసి వెళ్లిపోవాలంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలను ఉద్దేశించి దురుసుగా మాట్లాడారు. దీంతో బొత్స ‘‘మేం ప్రజా సమస్లపై మాట్లాడేందుకు సభకు వచ్చామంటూ’’ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: ఇంత జరిగినా సభాపతి స్పందించరేం? -
‘డిజిటల్ బుక్లో ఫిర్యాదులు, వీడియోలు రికార్డ్ అవుతున్నాయి’
సాక్షి, చిత్తూరు: ఏపీలో చంద్రబాబు అన్యాయ పాలన చేస్తున్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఓట్లను తొలగించడం, వ్యవస్థలను మేనేజ్ చేయడం చంద్రబాబుకు తెలుసు. ప్రతీ వైఎస్సార్సీపీ కార్యకర్త అప్రమత్తంగా ఉండాలి. బూత్ లెవల్లో నిత్యం పరిశీలిస్తూ ఉండాలని సూచించారు.చిత్తూరులో వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన పుంగనూరు నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి, ఆకేపాటి అమరనాథ్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా సజ్జల మాట్లాడుతూ..‘ప్రజలకు సంక్షేమం అందించడమే అజెండాగా వైఎస్ జగన్ పాలన సాగింది. సంస్థాగతంగా పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాం. భవిష్యత్తులో వైఎస్సార్సీపీ స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తుంది. రాబోయే వైఎస్ జగన్ పాలనలో కార్యకర్తలకే ప్రాధాన్యత ఉంటుంది. మీ పాత్ర ప్రత్యక్షంగా ఉంటుంది. జగన్ చేసే యజ్ఞంలో మనం క్రియాశీలక పాత్రదారులం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. కానీ, వైఎస్ జగన్.. ప్రజల సంక్షేమం లక్ష్యంగా పాలన చేశారు. టీడీపీ కమిటీలు దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తాయి. జగనన్న సైనికులు అని గర్వంగా చెప్పుకునే విధంగా మీరు పనిచేస్తున్నారు. ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ మేము ఉన్నాము అని చెప్తున్నారు. ప్రజా శ్రేయస్సు కోసం పాటు పడిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. మనకు 18 లక్షలు మంది క్రియాశీలక సైన్యం ఉంది. ఎల్లో మీడియా, సోషల్ మీడియా గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. మన వాళ్ళు సోషల్ మీడియా ద్వారా వాటిని అడ్డుకుంటున్నారు. వ్యక్తిత్వ హననం, అబద్ధపు ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియాను మన సోషల్ దీటుగా ఎదుర్కొంటోంది. వ్యక్తిగతంగా దాడికి రెడ్ బుక్ ఉపయోగించారు.మనం డిజిటల్ బుక్ను లాంచ్ చేశాం. కార్యకర్తలకు ఎంత ప్రాధాన్యత ఇవ్వబోతున్నాం అనే దానికి ఇది గుర్తు. ఫిర్యాదులు వస్తున్నాయి, వీడియోలు రికార్డు చేస్తున్నాం. డిజిటల్ బుక్ క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా నమోదు చేయవచ్చు. చట్టబద్ధంగా వారిని శిక్షించేందుకు ఇది ఉపయోగ పడుతుంది. ప్రతీ ఒక్కరికి పార్టీ గుర్తింపు కార్డులు అందిస్తాం, టెక్నాలజీ వాడుకుని ముందు వెళ్తున్నాం. అన్యాయమైన పాలన చంద్రబాబు సాగిస్తున్నారు. ఓటర్లను తొలగించడం, వ్యవస్థలను మేనేజ్ చేయడం చంద్రబాబుకు తెలుసు. ప్రతీ కార్యకర్త, నాయకులు అప్రమత్తంగా ఉండాలి, బూత్ లెవల్లో నిత్యం పరిశీలిస్తూ ఉండాలి. నిర్మాణాత్మకమైన పార్టీగా, సంస్థాగతంగా సిద్ధం చేస్తాం. రాబోయే 30 ఏళ్లలో తిరుగులేని శక్తిగా వైఎస్సార్సీపీని బలోపేతం చేస్తున్నాం. ప్రత్యర్థులను వణుకు పుట్టించేలా ఈరోజు పుంగనూరు నియోజకవర్గం సమావేశానికి హాజరయ్యారు. బీటలు వారిన కోటలు టీడీపీ అని వ్యాఖ్యలు చేశారు.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాలు మేరకు గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటు చేశాం. గ్రామ కమిటీలకే పూర్తి బాధ్యత, రాబోయే ఐదేళ్లు వీరికే బాధ్యత అప్పగిస్తామన్నారు.భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ..‘రాష్ట్రంలో అన్ని కమిటీలు నియమించిన మొట్టమొదటి నియోజకవర్గం పుంగనూరు నియోజకవర్గం. రాబోయే జగనన్న ప్రభుత్వంలో కార్యక్తలకే మొదటి ప్రాధాన్యత. జగనన్న మాటగా మీరు గ్రామస్థాయిలో తీసుకు వెళ్లాల్సిన బాధ్యత మీపై ఉంది.ఆకేపాటి అమరనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో జరిగిన పొరపాట్లు ఈసారి జరగనివ్వను. కార్యక్తలకే మొదటి ప్రాధాన్యత అని జగనన్న చెప్పారు. ఈసారి వైఎస్సార్సీపీ కార్యకర్తలకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది అని హామీ ఇచ్చారు. -
దేవాలయం లాంటి అసెంబ్లీ.. అలా మాట్లాడటానికి సిగ్గుండాలి
-
‘మిథున్ రెడ్డి అరెస్టుకు కచ్చితంగా ప్రతీకారం ఉంటుంది’
సాక్షి, తూర్పుగోదావరి: ఏపీలో పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే వైఎస్సార్సీపీ ఎంపీ ఉద్దేశంతోనే మిథున్ రెడ్డి అరెస్ట్ జరిగిందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఏ తప్పు చేయకపోయినా కక్షపూరితంగా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని చెప్పుకొచ్చారు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే ప్రభుత్వం అనుసరిస్తుందని మండిపడ్డారు.రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖత్లో మాజీమంత్రి అమర్నాథ్, విజయనగరం జడ్పీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు, కరణం ధర్మశ్రీ కలిశారు. అనంతరం, మాజీ మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్సార్సీపీ నాయకులపై తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేశారు. తప్పుడు కేసు పెట్టి మిథున్ రెడ్డిని జైల్లో ఉంచారు. పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే మిథున్ రెడ్డి అరెస్ట్ జరిగింది. అయినప్పటికీ ఆయన ధైర్యంగా ఉన్నారు. పార్టీ కోసం అన్ని భరిస్తానని మిథున్ రెడ్డి చెప్పారు. అధికారులు అడిగిన అన్ని రకాల డాక్యుమెంట్లను మిథున్ రెడ్డి అధికారులకు ఇచ్చారు. ఏ తప్పు లేకపోయినా కక్ష పూరితంగా మిథున్ రెడ్డిని అరెస్టు చేశారు. పేర్లు చెప్పిన వారు బయట ఉన్నారు.. ఏ తప్పు చేయని వ్యక్తిని లోపల ఉంచారు. ఎవరో ఇచ్చిన స్టేట్మెంట్పై అరెస్టులు చేయటం కరెక్ట్ కాదు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే ప్రభుత్వం అనుసరిస్తుంది. బాలకృష్ణ మాట్లాడిన మాటలు చూశాం. చిరంజీవి ఇచ్చిన కౌంటర్ చూశాం. రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దీనికోసం మరో డైవర్షన్ అమలు చేస్తున్నారు. పార్టీ నేతలకు ఏ సమస్య వచ్చినా పార్టీ కేడర్ అంతా అండగా ఉంటాం. మిథున్ రెడ్డి అరెస్టుకు కచ్చితంగా ప్రతీకారం ఉంటుంది’ అని హెచ్చరించారు.విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ..‘మిథున్ రెడ్డిని ప్రభుత్వం ఏ రకంగా ఇబ్బందులు పెడుతుందో ప్రజలు గమనిస్తున్నారు. 15 నెలలుగా రాష్ట్రంలో అనేక దారుణాలు చోటుచేసుకున్నాయి. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేక కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. బాలకృష్ణ మాటలు చూస్తే ప్రభుత్వ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి వైఎస్సార్సీపీ నాయకులను ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు’ అని అన్నారు.కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ..‘ఇది కూటమి ప్రభుత్వం కాదు.. కుట్ర ప్రభుత్వం. వైఎస్సార్సీపీలో కీలకంగా ఉన్న నాయకులను టార్గెట్ చేయడం ప్రభుత్వ లక్ష్యం. కూటమి ప్రభుత్వానికి ప్రజలు సమాధానం చెప్పాలని ఎదురుచూస్తున్నారు. తప్పుడు సాక్ష్యాలతో కక్షసాధింపు చేస్తే ఊరుకునేది లేదు. బ్యాలెన్స్ తప్పిన బాలకృష్ణ.. చిరంజీవిపై వ్యాఖ్యలు చేసినా పవన్ కళ్యాణ్ ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం విడ్డూరం. ప్రభుత్వానికి కళ్ళు లేవని మిథున్ రెడ్డి అరెస్టుతో నిరూపితమైంది’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
బాలకృష్ణ వ్యాఖ్యలపై YSRCP భారీ నిరసన
-
కూటమి తీరుపై మండిపడ్డ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
-
మండలిలో సభాపతికి జరిగిన అవమానంపై YSRCP MLCల నిరసన
-
దారిచూపింది గత ప్రభుత్వమే!
గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రారంభించిన వాణిజ్యం – పరిశ్రమల శాఖ (ఆహార శుద్ధి)... ఆ రంగానికీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి కూడా ప్రయో జనకరంగా మారింది. విశాఖపట్టణంలో ఆగస్టు 29న జరిగిన ఒక సదస్సులో ‘ఆహార శుద్ధి రంగంలో లక్ష కోట్ల పెట్టుబడులు’ అంటూ చంద్రబాబు నాయుడు దీన్ని తనదన్నట్టు ‘వోన్’ చేసుకున్నారు.రాష్ట్ర విభజన తర్వాత 2014–2019 మధ్య కాలంలో కేవలం ‘రాష్ట్ర ఆహార శుద్ధి సొసైటీ’ మాత్రమే ఉండేది. దానికి సీఈఓ స్థాయిలో ఒక అధికారి ఉండే వారు. వ్యవసాయ రంగానికి వాణిజ్య పంటల సాగుతో జవజీవాలు ఇవ్వడా నికీ, కార్పొరేట్ సంస్థల పెట్టుబడులు రాష్ట్రానికి తెచ్చి అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా వెనుకబడిన ప్రాంతాల్లో ఆహార పంటల సాగు, ఉత్పత్తుల శుద్ధి, ప్యాకింగ్ వంటి విభాగాల్లో మహిళలకు పెరిగే ఉపాధి వంటి బహుళ ప్రయోజనాలు లక్ష్యంగా ఈ శాఖను గత వైసీపీ ప్రభుత్వం 2020లో ప్రారంభించింది. దీనికున్న విలువను గ్రహించి కూటమి ప్రభుత్వం పరిశ్రమల శాఖ హోదా కల్పిస్తూ జీవో ఇచ్చింది. ఈ శాఖను ప్రారంభించాక, ఎటువంటి ప్రచార పటాటోపాలు లేకుండానే నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి 2023 జులై 26న తన క్యాంప్ ఆఫీస్ నుంచి రూ. 1,719 కోట్ల వ్యయంతో 11 ‘ఫుడ్ ప్రాసెసింగ్’ యూనిట్లను ప్రారంభిస్తూ, ఐదింటికి ‘వర్చువల్’ పద్ధతిలో శంకుస్థాపన చేశారు. వీటి ఉత్పత్తి సామర్థ్యం ఏటా 3.14 లక్షల టన్నులు కాగా, 40,307 మంది రైతులు వీటి ద్వారా ప్రయోజనం పొందు తున్నారు. వీటిని ‘లొకేట్’ చేసిన పద్ధతి మొదటి నుంచి జగన్ ప్రభుత్వ విధానమైన ‘వికేంద్రీకరణ’ సూత్రానికి కట్టుబడి జరిగింది. కూరగాయలు, పండ్లు ‘ప్రాసెసింగ్ కేంద్రాలు అన్నమయ్య, చిత్తూరు జిల్లాలు; చిరు ధాన్యాల ప్రాసెసింగ్ కేంద్రం విజయనగరం జిల్లా ఎస్.కోట; ఉల్లిపాయలు, టమోటా ‘ప్రాసెసింగ్’ కోసం కర్నూలు జిల్లా తడకనపల్లిలను ఎంపిక చేయడం జరిగింది. 2023 అక్టోబర్ 5న తన ఆఫీస్ నుంచి ‘గ్రీన్ ల్యాండ్ సౌత్ లిమిటెడ్’, ‘డీపీ చాక్లెట్ ప్రైవేట్ లిమిటెడ్’, ‘బనానా ప్రాసెసింగ్ క్లస్టర్’... ఇలా మూడు ‘ఫుడ్ ప్రాసెసింగ్’ కంపెనీలు ఒకే రోజు ‘వర్చువల్’గా ప్రారంభించి, మరో 9 పరిశ్ర మలకు శంకుస్థాపన చేశారు. వీటి ద్వారా రూ. 3,008 కోట్లు పెట్టుబడి వస్తే, 70 వేల మందికి ఉద్యోగాలు దొరికాయి. 14 జిల్లాలకు చెందిన 91 వేలమంది రైతులకు ప్రయోజనం కలిగింది. అదే రోజు గంటకు 60 టన్నుల ఆయిల్ పామ్ గెలల నుంచి పామాయిల్ నూనె తీసే ఫ్యాక్టరీ– ‘త్రీ ఎఫ్ ఆయిల్ ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీని తూర్పు గోదావరి జిల్లా అయ్యవరం వద్ద రూ. 250 కోట్లతో ప్రారంబించడానికి ఒప్పందం జరిగింది. 50వేల మంది రైతులకు ప్రయోజనం, 1500 మందికి ఉపాధి కలుగుతోంది. ఇటువంటి ‘ఫుడ్ ప్రాసెసింగ్’ రంగం ఇప్పుడు రైతులకే కాక ఈ ప్రభుత్వానికి కూడా అక్కరకు వచ్చింది.– జాన్సన్ చోరగుడి ‘ అభివృద్ధి – సామాజిక అంశాల వ్యాఖ్యాత -
దళిత చైర్మన్కు అవమానం..తీవ్ర రాజ్యాంగ ఉల్లంఘన
సాక్షి, అమరావతి: శాసన మండలి చైర్మన్ రాజ్యంగబద్ధ పదవి. సభాధ్యక్ష స్థానానికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులతో అధ్యక్షస్థానాన్ని అగౌరవపరుస్తోంది. అడుగడుగునా అవమానాలకు గురిచేస్తోంది. రాజ్యాంగస్థానాన్ని ఓ దళిత సభ్యుడు అధిరోహించారన్న అక్కసుతోనే ఇలా చేస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దళిత వర్గానికి చెందిన చైర్మన్ మోషేన్ రాజుకు జరుగుతున్న వరుస అవమానాలపై శుక్రవారం శాసన మండలి దద్దరిల్లింది. వైఎస్సార్సీపీ సభ్యులు ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. శాసనసభా నాయకుడైన సీఎం చంద్రబాబునాయుడు మండలికి వచ్చి దీనికి సమాధానం చెప్పాలని, చైర్మన్ను బేషరతుగా క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు. మండలిలో ఉన్న మంత్రులు సమాధానం చెప్పకుండా దాటవేయడంతో ప్రతిపక్ష సభ్యులు పెద్దపెట్టున నినాదాలుచేశారు. ఈ అంశంలో ప్రభుత్వ తీరుపై చైర్మన్ మోషేన్రాజు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చైర్మన్కు సంఘీభావంగా వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళనల నేపథ్యంలో మండలిని పలుమార్లు వాయిదా వేసినా సభను కొనసాగించే పరిస్థితి లేకపోవడంతో చేసేది లేక చైర్మన్ శనివారానికి వాయిదా వేయాల్సి వచ్చింది.దళితుడైనందున చైర్మన్ను అవమానిస్తారా?: బొత్స‘‘అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి మండలి చైర్మన్ను ఆహ్వానించకపోవడం అన్యాయం. అసెంబ్లీ ప్రాంగణంలో ఏ కార్యక్రమం జరిగినా అసెంబ్లీ స్పీకర్తో పాటు‡ మండలి చైర్మన్ను ఆహ్వానించాలి. గౌరవించాలి.. కానీ కావాలనే పిలవడం లేదు. ఇలా జరగడం తొలిసారి కాదు.. ఇది చాలా తీవ్రమైన రాజ్యాంగ ఉల్లంఘన. సభా గౌరవానికి సంబంధించిన అంశం. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం’ అంటూ వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘తిరుపతిలో జరిగిన జాతీయ మహిళా ప్రజాప్రతినిధుల సదస్సుకూ చైర్మన్ను ఆహ్వానించలేదు. లోక్సభ స్పీకర్ పాల్గొన్న ఆ కార్యక్రమంలో మా లాంటి వారిని పిలిచారా? లేదా? మా సభ్యులను పిలిచారో లేదా అనేది కాదు.. మండలి చైర్మన్గా మిమ్మల్ని పిలవాలి కదా? ఎందుకు పిలవలేదు? ఇటీవల జరిగిన ప్రజాప్రతిని«ధుల క్రీడా పోటీలకూ చైర్మన్కు పిలుపు లేదు. ప్రభుత్వం తరçఫున అధికారికంగా జరిగే కార్యక్రమాలకు చైర్మన్ను పిలవకుండా పదేపదే అవమానిస్తున్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన వారు సభాధ్యక్ష స్థానంలో కూర్చున్నారనే కదా.. కావాలని అవమానిస్తున్నారు. అసెంబ్లీ, మండలి విప్ల భవనాల ప్రారంభోత్సవంలో అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను పిలిచి మండలి చైర్మన్ను పిలవకపోవడం అన్యాయం. కనీసం శిలాఫలకంపైనా మండలి చైర్మన్ పేరు కూడా వేయలేదు.’’ అంటూ శిలాఫలకం ఫొటో చూపిస్తూ బొత్స తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో మండలి చైర్మన్ను భాగస్వామ్యం చేయకపోవడం చాలా తప్పు అని, దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిందేనని, క్షమాపణ చెప్పాల్సిందేనని నిలదీశారు. ఈ ఘటనలకు ఎవరు బాధ్యత వహిస్తారని, రెండు సభలకు నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు మండలికి రావాలని, వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘ఈ ఆలోచన ఏంటి. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడైనా చూశామా? మనల్ని మనమే కించపరుచుకుంటే.. ఎలా? ఇదేనా సభాధ్యక్షుడికి ప్రభుత్వం ఇచ్చే గౌరవం’’ అంటూ బొత్స అసహనం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ సభ్యుల నినాదాలు చైర్మన్ విచారం వ్యక్తం చేయడంతో ఆయనకు సంఘీభావంగా వైఎస్సార్సీపీ సభ్యులు నినాదాలు చేశారు. షేమ్..షేమ్.. సభానాయకుడు వచ్చి వివరణ ఇవ్వాలి.. బేషరతుగా క్షమాపణ చెప్పాలి అంటూ మండలిని హోరెత్తించారు. ఈ దశలో మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ‘‘చైర్మన్ అంటే మాకు అపారమైన గౌరవం ఉంది. మీరు లేవనెత్తిన అంశం చాలా సున్నితమైనది. ఈ అంశంలోకి కులాలను తీసుకురావడం సరికాదు. ఏం జరిగిందో తెలుసుకుని చక్కదిద్దే యత్నం చేద్దాం. ఎందుకు ఈ పొరపాటు జరిగిందో స్పీకర్, కార్యదర్శితో మాట్లాడి తెలియజేస్తున్నాం. దీనికి కమిటీ ఉంది. ప్రివిలేజ్ కమిటీని అడగండి. మీరు సంబంధం లేని వ్యక్తుల గురించి మాట్లాడడం సరికాదు’’ అంటూ చెప్పుకొచ్చారు. తానిప్పుడే కార్యదర్శితో మాట్లాడానని, విప్ల భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానించని విషయం తనకు తెలియదు కానీ.. తిరుపతి కార్యక్రమానికి మిమ్మల్ని (చైర్మన్ను) పిలిచారని చెప్పారని మంత్రి అచ్చెన్న వ్యాఖ్యానించడంతో చైర్మన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘మంత్రి చెబుతున్న ఈ విషయాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నా.. నాకు ఎలాంటి ఆహ్వానం అందలేదు. ఇది ముమ్మాటికీ సభను తప్పుదోవ పట్టించడమే. ఏం జరిగిందో సభలో పెట్టండి చర్చిద్దాం. వ్యవస్థ గురించి మాట్లాడేందుకు సిద్ధమైతే కావాలంటే వేరొకర్ని చైర్మన్ స్థానంలో కూర్చొబెడదాం’’ అంటూ చైర్మన్ పేర్కొన్నారు. ప్రివిలైజ్ కమిటీలో చర్చిద్దామన్న మంత్రులు..క్షమాపణ చెప్పాల్సిందేనన్న వైఎస్సార్సీపీ సభ్యులుమండలిలో ఏ వ్యవహారాలు జరిగినా ప్రభుత్వానికి, సీఎంకు సంబంధాలు ఉండవు. అసెంబ్లీ, మండలిలో ఏ కార్యక్రమం జరిగినా సీఎంకు సంబంధం ఉండదు. సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేయడం సరికాదు. ఈ అంశాన్ని ప్రివిలైజ్ కమిటీలో పెట్టి మాట్లాడదాం. జరిగిన తప్పు మళ్లీ జరగకుండా చూసుకుందాం’’ అంటూ మంత్రులు అనగానే ప్రతిపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు జరిగిన అవమానాలకు బాధ్యత వహిస్తూ సభానాయకుడు మండలికి వచ్చి చైర్మన్కు క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో చేసేది లేక మండలిని శనివారానికి వాయిదా వేశారు.‘చాలా అవమానకరంగా ఉంది’ : మండలి చైర్మన్ మోషేన్ రాజు‘ఈ స్థానంలో నేను ఉన్నాను కాబట్టి..ఈ అంశంపై నేను చర్చించడం బాగుండదు. కావాలంటే ప్యానల్ స్పీకర్ను కూర్చోబెడతాను. ఇది నాకు చాలా ఎంబరాసింగ్గా ఉంటుంది’ అంటూ చైర్మన్ మోషేన్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. తరచూ ఇలాంటి ఘటనలు జరగడం బాధగా ఉంది’ అంటూ విచారం వ్యక్తం చేశారు. ఆ తర్వాత తిరుపతి కార్యక్రమానికి పిలిచామన్న మంత్రి అచ్చెన్న వ్యాఖ్యలనూ మోషేన్రాజు తీవ్రంగా ఖండించారు. -
‘బాలకృష్ణకు ఎందుకంత అహంభావం?’
అమరావతి : మండలి చైర్మన్ సీటులో దళితుడు కూర్చున్నాడని అవమానించాలని ప్రభుత్వ పెద్దలు చూస్తున్నారని వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికీ ప్రతిపాదించిన హక్కులు అందించాలన్నారు బొత్స. శాసనమండలి వాయిదా పడిన అనంతరం మీడియా పాయింట్ వద్ద బొత్స మాట్లాడారు. అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలు వినడానికి సిగ్గుపడుతున్నామని, చట్ట సభల్లో ఇలా జరగడం దురదృష్టకరమన్నారు. ‘బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు మొత్తం రికార్డుల్లో ఉంది. ఆయన మూమూలుగా ఉన్నాడా?, ఒక మాజీ సీఎంని, చిత్ర పరిశ్రమలో ముఖ్య హీరోని అవమానించడం సరికాదు. సభలో లోకేష్ మమ్మల్ని ఎవరేం పీకుతారు అన్నారు వాళ్ళ వ్యవహారశైలి అలాగే ఉంది. మాజీ ముఖ్యమంత్రి అన్నా గౌరవం లేదు. సినీ పరిశ్రమకు చెందిన మాజీ కేంద్ర మంత్రి అన్న గౌరవం లేదు. బాలకృష్ణ పెద్ద పుడింగి అనుకుంటున్నారు. ఏం చూసి మీ అహంభావం. వాళ్ళ పార్టీ నుంచి ఇంతవరకు వివరణ లేదు. స్పీకర్ చాలా పెద్ద మాటలు మాట్లాడుతాడు.. ఎందుకు స్పందించలేదు. ఒక మాజీ సీఎం, చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తిని అవమానిస్తే పట్టించుకోరా?, మేం కేవలం సభా సంప్రదాయాల గురించి మాట్లాడుతున్నాం. చిరంజీవికి అవమానిస్తే జనసేన ఎందుకు స్పందించలేదనేది మాకు అనవసరం.. వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం’ అని బొత్స పేర్కొన్నారు. -
మండలిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ఆందోళన
విజయవాడ: శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజుకు జరిగిన అవమానంపై సీఎం చంద్రబాబు నాయుడు వివరణ ఇవ్వాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. ప్రధానంగా అసెంబ్లీ భననాల ప్రారంభ కార్యక్రమానికి, తిరుపతిలో జరిగిన మహిళా ఎమ్మెల్యేల సదస్సుకి ఇలా పలు సందర్భాల్లో మండలి చైర్మన్ మోషేన్ రాజును ఆహ్వానించకపోవడాన్ని వైఎస్సార్సీపీ ప్రశ్నించింది. ఈరోజు(శుక్రవారం, సెప్టెంబర్ 26వ తేదీ) మండలి సమావేశాల్లో భాగంగా ఈ విషయాన్ని సభ దృష్టికి తీసుకొచ్చింది వైఎస్సార్సీపీ.దీనికి మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిస్తూ.. మోషేన్ రాజు తిరుపతి సభకు రానన్నారని, అధికారులు ఈ విషయం చెప్పారన్నారు. దీనిపై చైర్మన్ మోషేన్ రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. సభను తప్పుదోవ పట్టించకండి అంటూ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మండలి చైర్మన్పై మంత్రి అచ్చెన్న చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. గతంలో ఓ స్పోర్ట్స్ మీట్ సందర్భంగా కూడా మండలి చైర్మన్ను అవమానించిన సంగతిని బొత్స గుర్తు చేశారు. మండలి చైర్మన్గా ఉన్న వ్యక్తి దళిత వర్గానికి చెందిన వ్యక్తి అని, అలాంటి వ్యక్తిని అవమానించినందుకు ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.దీనిలో భాగంగా మండలిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. మండలి చైర్మన్ను అవమానించినందుకు సీఎం వివరణ ఇచ్చి క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు దీనిపై ఎదో ఒకటి తేల్చండి అని మండలి చైర్మన్ కోరగా, మంత్రులు ఎవరూ నోరు మెదపలేదు. దీంతో వైఎస్సార్సీపీ ఆందోళన చేపట్టింది. దాంతో సభను వాయిదా వేశారు చైర్మన్.విషయంలోకి వెళితే.. నిన్న(గురువారం, సెప్టెంబర్ 25 వతేదీ) అసెంబ్లీలో పలు భవనాలను ప్రభుత్వం ప్రారంభించింది. దీనికి కనీసం మండలి చైర్మన్గా ఉన్న మోషేన్ రాజును ఆహ్వానించలేదు. ఇదే విషయాన్ని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రధానంగా ప్రస్తావించారు. స్పీకర్, మంత్రులు ఉండి కూడా చైర్మన్ను ఆహ్వానించలేదన్నారు. తిరుపతిలో మహిళా ఎమ్మెల్యేల సదస్సు జరిగిందని, దానికి కూడా మండలి చైర్మన్ను ఆహ్వానించలేదని బొత్స పేర్కొన్నారు. తిరుపతిలో జరిగిన సదస్సు మీ పార్టీదా? అంటూ ప్రశ్నించారు బొత్స. మండలి చైర్మన్కు పదే పదే అవమానం జరగడాన్ని ఖండించారు బొత్స. దీనికి మంత్రి లేదా సభా నాయకుడు, ముఖ్యమంత్రి వచ్చి సమాధానం చెప్పారా..? చెప్పాలి’ అంటూ బొత్స డిమాండ్ చేశారు. ప్రభుత్వం అర్హులందరికీ పెన్షన్లు ఇవ్వడం లేదు..ప్రభుత్వం అందరికీ పెన్షన్లు ఇవ్వడం లేదన్నారు బొత్స. స్పౌజ్ పెన్షన్లలో ఎవరో ఒకరు చనిపోతే ఆ తర్వాత వాళ్ళలో ఒకరికి ఇస్తున్నారు తప్ప కొత్తగా ఎవరికీ ఇవ్వటం లేదన్నారు. 16 నెలల నుంచి పెన్షన్ల కోసం ఎంతో మంది చూస్తున్నారని, పెన్షన్లను ప్రభుత్వం తగ్గించుకుంటూ వస్తున్నారు తప్ప కొత్తగా ఎవరికీ ఇవ్వలేదన్నారు. ‘ మా ప్రభుత్వ హయంలో అర్హులందరికీ ఇచ్చాం. విడో పెన్షన్లు ప్రతీ ఏటా రెండు విడతలుగా అర్హులను గుర్తించి ఇచ్చాం. మంత్రులు పూర్తిగా వాస్తవాలు కనుక్కుని చెప్పాలి’ అని బొత్స సూచించారు.ఎవరిది రాజకీయం?.. లోకేష్పై ఏయూ విద్యార్థుల ఆగ్రహం -
చంద్రబాబుకు బాలకృష్ణ తొత్తుగా మారిపోయాడు: వైఎస్సార్సీపీ
అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలపై ఇటు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. మెగా అభిమానులు కూడా బాలయ్యను టార్గెట్ చేసి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. -
‘విశ్వాసం లేని వ్యక్తి బాలకృష్ణ.. ఆయనే పెద్ద సైకో’
సాక్షి, తాడేపల్లి: అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలపై ఇటు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. మెగా అభిమానులు కూడా బాలయ్యను టార్గెట్ చేసి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.విశాఖలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ..‘సంస్కారం లేని వ్యక్తి బాలకృష్ణ. మందు తాగి అసెంబ్లీ వేదికగా మాట్లాడారు. చిరంజీవి తనతో సమానమని బాలకృష్ణ అనుకుంటారు. చిరంజీవి కాలిగోటికి బాలకృష్ణ పనికిరారు. స్వశక్తితో చిరంజీవి హీరోగా ఇండస్ట్రీలో స్థానం సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ మీద చంద్రబాబు చెప్పులు వేయించిన రోజే బాలకృష్ణ చచ్చిపోయారు. బాలకృష్ణను కాల్పుల ఘటనలో కాపాడింది వైఎస్సార్. బాలకృష్ణ సినిమాలకు రేట్లు పెంచమని ఆదేశాలు ఇచ్చింది వైఎస్ జగన్. విశ్వాసం లేని వ్యక్తి బాలకృష్ణ. మెంటల్ సర్టిఫికెట్ ఉన్న వాళ్లకి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వకూడదు. చిరంజీవి ప్రకటన ద్వారా బాలకృష్ణ చెప్పిందంతా అబద్ధమని తేలిపోయింది. చిరంజీవి దంపతులను వైఎస్ జగన్ దంపతులు ఎంతో గౌరవించారు. చిరంజీవిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై జనసేన ఎలా స్పందిస్తుందో చూడాలి అని కామెంట్స్ చేశారు.వైఎస్సార్ జిల్లా...మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ..‘అసెంబ్లీలో బాలకృష్ణ జులాయిగా వ్యవహరించాడు. బాలకృష్ణ ఇంట్లో గన్ ఫైర్ ఘటనలో నిన్ను కాపాడింది వైఎస్సార్ మరిచిపోయావా?. వైఎస్ జగన్ సినీ పరిశ్రమ పట్ల స్పందించిన తీరును స్వయాన చిరంజీవి లేఖ రూపంలో తెలిపారు. నాడు వైఎస్ జగన్ చిరంజీవిని ఎంత ఆప్యాయంగా వ్యవహరించారో అందరికీ తెలుసు. సినీ ఇండస్ట్రీని ఇంటికి పిలిచి వైఎస్ జగన్ సమస్యలను పరిష్కరించారు. అసెంబ్లీ సాక్షిగా వైఎస్ జగన్ని అప్రతిష్ట పాలు చేసేలా కూటమి నాయకులు విమర్శించే పనిగా పెట్టుకున్నారు. బసవతారక క్యాన్సర్ ఆసుపత్రికి కోట్ల రూపాయలు సీఎం సహాయ నిధికి డబ్బులు మంజూరు చేసింది జగన్ అని తెలిపారు.కాకినాడ..వైఎస్సార్సీపీ నాయకురాలు వంగా గీతా మాట్లాడుతూ.. వైఎస్ జగన్పై బాలకృష్ణ, కామినేని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. మాజీ సీఎం పట్ల అసెంబ్లీలో బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం సభను అగౌరపరచడమే. అసెంబ్లీ అనేది ఎంతో పవిత్రమైన స్ధలం. కేవలం 175 మందికి మాత్రమే ఆ పవిత్రమైన స్ధలంలోకి వెళ్ళే అవకాశం వస్తుంది. చంద్రబాబు హయంలో టీడీపీ అధికారంలోకి వచ్చాకా.. ఎన్టీఆర్ పేరును ఒక జిల్లాకైనా పెట్టారా?. వైఎస్ జగన్ మాత్రమే ఎన్టీఆర్ పేరును ఒక జిల్లాకు పెట్టారు. వైఎస్ జగన్కు ప్రజలంటే అభిమానం. చిరంజీవి చాలా సౌమ్యమైన వ్యక్తి. ఎప్పుడు ఒక్క అడుగు తగ్గే ఉంటారు. వైఎస్ జగన్, చిరంజీవి ఎదుట వారిని గౌరవించే వ్యక్తులు. ఎవర్ని తక్కువ చేయాలనుకునే వ్యక్తులు కాదు. అలాంటి ఆ ఇద్దరు వ్యక్తులను చాలా తేలికగా మాట్లాడుతున్నారు. ఇది చాలా తప్పు. ఇక ముందు వైఎస్ జగన్, చిరంజీవిని తక్కువగా చేసి మాట్లాడవద్దు అని హితవు పలికారు.విశాఖ..మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ..‘బాలకృష్ణ పెద్ద సైకో. బాలకృష్ణను మించిన సైకో మరొకరు లేరు. వైఎస్ జగన్కు బాలకృష్ణ క్షమాపణ చెప్పాలి. అసెంబ్లీలో బాలకృష్ణ తాగి మాట్లాడారు. చిరంజీవిని చూసి బాలకృష్ణ ఓర్వలేకపోతున్నారు. చిరంజీవి ఆధ్వర్యంలో సినీ బృందాన్ని వైఎస్ జగన్ ఎంతో ఆప్యాయంగా గౌరవించారు. తాగుబోతు బాలయ్యకు నోరే సరిగా తిరగదు. బాలకృష్ణ నటనకు ఏనాడు అవార్డుల రాలేదు. రికమండేషన్లతో అవార్డులు సాధించిన వ్యక్తి బాలకృష్ణ అని చెప్పారు.వైఎస్సార్ జిల్లా.. నందమూరి బాలకృష్ణపై మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంజాద్ బాషా మాట్లాడుతూ..‘అసెంబ్లీని బాలకృష్ణ అపహాస్యం చేశారు. మందు తాగి వచ్చిన వ్యక్తిలా నందమూరి బాలకృష్ణ ప్రవర్తించాడు. ఆయన వ్యాఖ్యలను వైఎస్సార్ పార్టీ పూర్తి ఖండిస్తుంది. బాలకృష్ణ వ్యాఖ్యలను చిరంజీవి సైతం ఖండించారు. బాలకృష్ణ వ్యాఖ్యలను డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కనీసం ఖండించలేదు’ అని ఘాటు విమర్శలు చేశారు. -
జనసేన బానిసత్వం ఇంకెన్నాళ్లు?: దేవినేని అవినాష్
సాక్షి, విజయవాడ: తాను ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో బసవతారకం ఆస్పత్రికి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఎంతో సహకరించారని, అలాంటి వ్యక్తిపై నోరు పారేసుకుని నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) తప్పు చేశారని వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాష్ అన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ, వైఎస్ జగన్పై చేసిన అనుచిత వ్యాఖ్యపై శుక్రవారం నిరసన చేపట్టారాయన. శుక్రవారం బాడవ పేటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వినతిపత్రం సమర్పణలో దేవినేని అవినాష్(Devineni Avinash) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు మంచి చేసిన వ్యక్తి వైఎస్ జగన్. అలాంటి వ్యక్తిపై అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు(Balayya Comments On YS Jagan) సభ్యసమాజానికి సిగ్గుచేటు. ఎన్టీఆర్, వైఎస్సార్.. ఇద్దరూ మాకు దైవ సమానులే. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులపై కూడా మీకు గౌరవం ఉండేది. కానీ, ఈ వ్యాఖ్యలతో బాలకృష్ణపై ఉన్న గౌరవం పోయింది. గతంలో తాను అధికారంలో ఉండగా చంద్రబాబు ఏ ఒక్క పథకానికైనా ఎన్టీఆర్ పేరు పెట్టారా?. కనీసం అలాంటి ఆలోచనైనా చేశారా?. ఈ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన దమ్ము వైఎస్ జగన్ది. ఆయన అధికారంలో ఉండగా బాలకృష్ణ సినిమాలకే కాదు.. బసవతారకం ఆస్పత్రికి కూడా సహకరించారు. మంచి చేసిన వారిని తూలనాడటం బాలకృష్ణకు అలవాటు. బెజవాడ సాక్షిగా మోదీ తల్లిని తిట్టి మళ్లీ వాటేసుకున్న వ్యక్తి బాలకృష్ణ. అలాంటి వ్యక్తి ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు.. ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం. వైఎస్సార్, జగన్ వల్ల మీ కుటుంబానికి జరిగిన మేలును బాలకృష్ణ ఓసారి గుర్తు చేసుకోవాలి. సభలో లేని.. అసలు సంబంధంలేని చిరంజీవిని కూడా బాలకృష్ణ తూలనాడారు. చిరంజీవిని తులనాడినా(Balayya on Chiru).. జనసేన తరఫు నుంచి కనీసం స్పందన లేదు. సభలో ఉన్న జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఆ వ్యాఖ్యలను ఖండించలేదు. ఎందుకు ఇంకా మీకు ఇంతటి బానిసత్వం?. నిండు సభలో చిరంజీవిని అవమానిస్తే ఏమైపోయారు మీరంతా?. మా నాయకుడు మాకు నేర్పిన సంస్కారంతో తిరిగి ఏమీ అనలేకపోతున్నాం. కూటమి ఎమ్మెల్యేలకు మంచి బుద్ధిని ప్రసాదించాలని అంబేద్కర్ ను కోరుకున్నాం. బాలకృష్ణ తక్షణమే జగన్ మోహన్ రెడ్డికి క్షమాపణ చెప్పాలి అని దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు. ఈ నిరసనల్లో ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ పాటు విజయవాడ డిప్యూటీ మేయర్లు బెల్లందుర్గ , అవుతు శైలజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఇదీ చదవండి: చిరు.. ఎవడు?? -
ఇటు వైఎస్సార్సీపీ.. అటు మెగా ఫ్యాన్స్.. బాలయ్యకు బంతాటే!
సాక్షి, అమరావతి: అగ్రనటుడు చిరంజీవిని అసెంబ్లీ సాక్షిగా టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ అవమానించడంపై మెగా ఫ్యాన్స్ రగిలిపోతున్నారు. అదే సమయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డిను ఉద్దేశించి అనుచితంగా మాట్లాడడంపైనా వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో బాలయ్యను ఇరు వర్గాలు బంతాట ఆడుకుంటున్నాయి.అసెంబ్లీ సమావేశాల సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ రెచ్చిపోయారు. మెగాస్టార్ చిరంజీవిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వాడెవడు అంటూ నోరుపారేసుకున్నారు. అయితే, బాలకృష్ణ మాట్లాడుతున్న సమయంలో సీఎం చంద్రబాబు సహా జనసేన ఎమ్మెల్యేలు కూడా స్పందించకపోవడంపై మెగా అభిమానులు మండిపడుతున్నారు. దీనిపై స్పందించాలంటూ చిరంజీవి అభిమానులు పవన్ కల్యాణ్ను సైతం కోరుతున్నారు. సోషల్మీడియాలో బాలయ్యను ట్రోల్ చేస్తున్నారు.మరోవైపు.. అసెంబ్లీలోనే వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్పై కూడా బాలకృష్ణ అనుచితంగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు.. బాలకృష్ణపై మండిపడుతున్నారు. నోరు అదుపులోకి పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరిస్తున్నారు. బాలకృష్ణ మానసిక స్థితిని పరీక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీకి, సినిమా ఫంక్షన్కు తేడా తెలియకుండా మాట్లాడారు అంటూ ఎద్దేవా చేస్తున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు మీదున్న కోపాన్ని వైఎస్ జగన్ మీద చూపిస్తే ఎలాగంటూ ప్రశ్నించారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన బుద్ధి చెబుతామంటూ హెచ్చరించారు . -
సైకో కాబట్టే నీకు మెంటల్ సర్టిఫికెట్
సాక్షి అమరావతి: ‘నందమూరి బాలకృష్ణా... నువ్వే సైకోవు.. కాబట్టే ఇంటికి వచ్చిన స్నేహితుడిపై కాల్పులు జరిపావు. నువ్వు సైకోవు కాబట్టే నీకు మెంటల్ సర్టీఫికెట్ ఇచ్చారు. మెంటల్ సర్టీఫికెట్ తెచ్చుకుని బయట తిరుగుతున్నావు.’ అని పలువురు వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. వెఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.అదీ జగన్కు.. బాలకృష్ణకు తేడాఅఖండ సినిమా విడుదల సందర్భంగా రాష్ట్రంలో టికెట్ ధరలు పెంచుకోవడానికి అప్పటి నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, ఆ సినిమా నిర్మాత మిర్యాల రవీంద్రారెడ్డి ద్వారా బాలకృష్ణ నాకు ఫోన్ చేశారు. అప్పటి సీఎం వైఎస్ జగన్ను కలుస్తానని, సమయం ఇప్పించాలని కోరారు. ఈ విషయాన్ని వైఎస్ జగన్కు చెబితే బాలకృష్ణ నన్ను కలిస్తే.. ఆయనకే రాజకీయంగా ఇబ్బంది అవుతుందని.. బాలకృష్ణ ఏది అడిగితే అది చేయాలని నన్ను ఆదేశించారు. అదీ వైఎస్ జగన్ సంస్కారం. ఈ రోజు బాలకృష్ణ వ్యాఖ్యలు ఆయన సంస్కారహీనానికి నిదర్శనం. అప్పట్లో సినిమా పరిశ్రమ సమస్యలపై నాటి సీఎం వైఎస్ జగన్తో హీరో చిరంజీవి నేతృత్వంలో సినిమా పెద్దలు సమావేశమయ్యారు. ఆ సమావేశంలో పాల్గొనని బాలకృష్ణ వంటివారు సినిమా పెద్దలను వైఎస్ జగన్ అవమానించినట్లు చిత్రీకరిస్తూ వస్తున్నారు. – పేర్ని నాని, మాజీ మంత్రి బాలకృష్ణా.. నోరు అదుపులో పెట్టుకో.. మాజీ వైఎస్ జగన్మోహన్రెడ్డి గురించి మాట్లాడేటప్పుడు ఎమ్మెల్యే బాలకృష్ణ నోరు అదుపులో పెట్టుకోవాలి. నోటికొచి్చనట్టు మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. సభలో బాలకృష్ణ వ్యవహారశైలి, బయట ఫ్యాన్స్తో ఆయన నడుచుకునే విధానం చూస్తే సైకో ఎవరో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. బాలకృష్ణ మెంటల్ సర్టీఫికెట్తో బయట తిరుగుతున్నాడు. నువ్వు సైకోవు కాబట్టే నీకు మెంటల్ సర్టీఫికెట్ ఇచ్చారు. నువ్వు సైకోవు కాబట్టే ఇంటికి వచ్చిన స్నేహితుడిపై కాల్పులు జరిపావు. – జూపూడి ప్రభాకర్రావు, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిబాలకృష్ణకు బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేయాలి అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం వైఎస్ జగన్పై ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గం. బాలకృష్ణ నిండు సభలో జేబులో చేతులు పెట్టుకుని సభామర్యాదలు పాటించకుండా మాట్లాడుతూ ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? సభలో బాలకృష్ణ ఉపయోగించిన భాష అభ్యంతకరం. ఆయనకు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు చేయాలేమో అనిపించేలా దిగజారి మాట్లాడారు. – మార్గాని భరత్, మాజీ ఎంపీఆయన భాషలోనే బదులిస్తాం ఓజీ సినిమా టికెట్ను రూ.వెయ్యికి పెంచుకునేందుకు సీఎం చంద్రబాబు అవకాశం ఇచ్చారన్న కడుపుమంట బాలకృష్ణకు ఉంటే వెళ్లి చంద్రబాబుతో మాట్లాడుకోవాలి. పవన్కళ్యాణ్ మీద కోపం ఉంటే ఆయనతో తేల్చుకోవాలి. సభలోలేని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి అమర్యాదకరంగా మాట్లాడటం సిగ్గుచేటు. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఆయన వాడిన భాషలోనే మేమూ బదులిస్తాం. – తూమాటి మాధవరావు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ -
ఎమ్మిగనూరులో కూటమికి షాక్
సాక్షి, అమరావతి: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కూటమి పార్టీలకు భారీ షాక్ తగిలింది. బీజేపీ, టీడీపీకి చెందిన ముఖ్య నేతలు వైఎస్సార్సీపీలో చేరారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వారు పార్టీలో చేరారు. వైఎస్సార్సీపీలో చేరినవారిలో కేఆర్ మురహరిరెడ్డి (బీజేపీ ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి), కిరణ్కుమార్ (బీజేపీ ఎమ్మిగనూరు పట్టణ అధ్యక్షుడు), మాల మధుబాబు (టీడీపీ మాజీ కౌన్సిలర్), చేనేత మల్లికార్జున (టీడీపీ ఎమ్మిగనూరు పట్టణ ప్రధాన కార్యదర్శి) ఉన్నారు. వారికి వైఎస్ జగన్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. వైఎస్సార్సీపీలో చేరిన కర్నూలు కాంగ్రెస్, టీడీపీ నాయకులు కర్నూలు నగరానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ నాయకులు కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున కర్నూలు ఎంపీగా పోటీ చేసిన పీజీ రాంపుల్లయ్య యాదవ్ (లక్కీ2)తోపాటు మోనికారెడ్డి (51 డివిజన్ టీడీపీ కార్పొరేటర్), నరసింహులు యాదవ్ (స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్), లోక్నాథ్ యాదవ్ (డీసీసీబీ మాజీ డైరెక్టర్), ప్రదీప్ వెంకటేష్ యాదవ్ (రైల్వే బోర్డ్ మాజీ మెంబర్), షబ్బీర్ అహ్మద్, ఫైరోజ్ (8వ డివిజన్ టీడీపీ నాయకులు)లకు వైఎస్ జగన్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. మాజీ ఎంపీ బుట్టా రేణుక, వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి, కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, కర్నూలు నగర అధ్యక్షుడు అలీఖాన్, పలువురు కర్నూలు జిల్లా నాయకులు పాల్గొన్నారు. -
సాయి భార్గవ్ ను అరెస్ట్ చేసిన సీఐడీ
-
మండలి నుంచి వాకౌట్కి కారణం ఇదే
-
ఇంకా ఆ పీకుడు పనిలోనే ఉన్నాడు సాకే శైలజానాథ్ సంచలన కామెంట్స్
-
అందుకే టీడీపీ, బీజేపీ ని వదిలి YSRCP లో చేరాం
-
సూపర్ సిక్స్ హామీలపై మండలిలో చర్చ
-
‘ చంద్రబాబు ప్రభుత్వంలో విద్య, వైద్యం పూర్తిగా నాశనం’
తాడేపల్లి : ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ ధ్వజమెత్తారు. ఇది నిజంగా కూటమి ప్రభుత్వం సిగ్గు పడాల్సిన అంశమని మండిపడ్డారు. ఈరోజు(గురువారం, సెప్టెంబర్ 25వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన శైలజానాథ్.. ‘చంద్రబాబు ప్రభుత్వంలో విద్య, వైద్య రంగాలు పూర్తిగా నాశనం అయ్యాయి. ఆ రెండు రంగాలనూ తమ గుప్పెట్లో పెట్టుకుని పేదలను పీల్చి పిప్పి చేస్తున్నారు. గిరిజనులకు మెరుగైన వైద్యం కోసం జగన్ పాడేరులో మెడికల్ కాలేజీ పెట్టారు. అలాంటి కాలేజీని కూడా అడవి బిడ్డలకు దూరం చేస్తున్నారు. అదేమని అడిగితే చట్టసభలోనే లోకేష్ పీకుడు భాష మాట్లాడుతున్నారు. ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి మెడికల్ కాలేజీలు వెళ్లిపోతే పేద, మధ్య తరగతి ప్రజలు బతికేది ఎలా?, జగన్ సీఎం అయ్యాక మెడికల్ కాలేజీలను మళ్ళీ ప్రభుత్వపరం చేస్తాం. మంత్రి సత్యకుమార్ అసత్యాలు మాట్లాడుతున్నారు. ఆయన రాష్ట్ర మంత్రిగా కాకుండా బీజేపీ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. లోకేష్ నోరు తెరిస్తే పీకుడు భాష తప్ప మరేమీ మాట్లాడటం లేదు. బూతు మాటలు మానేసి మంచి మాటలు నేర్చుకుంటే మంచిది. చంద్రబాబు తనవారికి మెడికల్ కాలేజీలను దోచి పెడుతున్నారు. దీన్ని రాష్ట్ర ప్రజలు సహించే పరిస్థితి లేదు’ అని స్పష్టం చేశారు. -
జగన్ని అలా అనడం ఆపేవరకు మేమూ తగ్గం
-
టీడీపీ, బీజేపీలకు బిగ్ షాక్.. వైఎస్సార్సీపీలోకి కీలక నేతలు
సాక్షి, తాడేపల్లి: ఏపీలో అధికార కూటమి పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పలువురు బీజేపీ, టీడీపీ కీలక నేతలు వైఎస్సార్సీపీలో చేరారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో వారి పార్టీలో చేరారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలోకి పలువురు నేతలు వచ్చారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు బీజేపీకి చెందిన మురహరిరెడ్డి, కిరణ్ కుమార్.. టీడీపీకి చెందిన మధు, మల్లికార్జున్ వారి పార్టీలను వీడి.. వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్ జగన్ వారికి పార్టీ కండువా కప్పి వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు. కర్నూలు జిల్లాలో కీలక నేతలు వైఎస్సార్సీపీలో చేరడంతో కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగలినట్టు అయ్యింది.వైఎస్సార్సీపీలో చేరిన వారిలో పీజీ రాంపుల్లయ్య యాదవ్ (కర్నూలు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి), మోనికా రెడ్డి (51 డివిజన్ టీడీపీ కార్పొరేటర్), నరసింహులు యాదవ్ (స్టాండింగ్ కమిటీ మాజీ ఛైర్మన్), లోక్నాథ్ యాదవ్ (డీసీసీబీ బ్యాంక్ మాజీ డైరెక్టర్), ప్రదీప్ వెంకటేష్ యాదవ్ (మాజీ రైల్వే బోర్డ్ మెంబర్), షబ్బీర్ అహ్మద్, ఫైరోజ్ (8వ డివిజన్ టీడీపీ నాయకులు), పలువురు బీజేపీ నేతలు ఉన్నారు.ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి, కర్నూలు పార్లమెంట్ వైఎస్సార్సీపీ పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, కర్నూలు సిటీ వైఎస్సార్సీపీ ప్రెసిడెంట్ అహ్మద్ అలీఖాన్, పలువురు కర్నూలు జిల్లా నాయకులు పాల్గొన్నారు. -
‘మాధవీ రెడ్డి.. మీ అవినీతి గురించే టీడీపీలో చర్చ నడుస్తోంది’
సాక్షి, వైఎస్సార్: టీడీపీ ఎమ్మెల్యే మాధవీ రెడ్డి, వైఎస్సార్ జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీనివాసుల రెడ్డిపై మేయర్ సురేష్ బాబు తీవ్ర విమర్శలు చేశారు. కూటమి పాలనలో ఒక్క పనైనా చేశారా?.. అభివృద్ధి గురించి వారు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. టీడీపీ కార్యకర్తలే వారిని చూసి అసహ్యించుకుంటున్నారు అని ఘాటు విమర్శలు చేశారు.కడపలో మేయర్ సురేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ..‘టీడీపీ నాయకుడు శ్రీనివాసులు రెడ్డి అవినీతి భాగవతం గురించి టీడీపీ వారే చర్చించుకుంటున్నారు. బుగ్గవంక పనుల్లో నువ్వెంత దోచుకున్నావో తెలుసు. 30లక్షల పనికి మూడు కోట్లు ఖర్చు చేసి దోచుకున్న మాట వాస్తవమా కాదా?. మీ కార్యకర్తలే నీ అవినీతి బాగోతం గురించి చర్చించుకుంటున్నారు అయినా సిగ్గు లేదా!. ఎమ్మెల్యే మాధవీ రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన మాధవీ రెడ్డి కడపకు ఎంత మేర నిధులు తెచ్చారో చెప్పే దమ్ము, దైర్యం ఉందా?. మా నిధులతో టెంకాయలు కొట్టడానికి సిగ్గుగా అనిపించడం లేదా?. వేల కోట్లతో అభివృద్ధి చేసిన చరిత్ర వైఎస్సార్సీపీది. అవినీతి చేసే మీరా మమ్మల్ని విమర్శించేది. కాలర్ ఎగరేసుకొని ఓట్లు అడగడానికి ప్రజల్లోకి వెళ్తాం.ఎమ్మెల్యే మాధవి రెడ్డికి కుర్చీ ఇచ్చి గౌరవిస్తే ఆమె నియంతలా వ్యవహరించారు. సర్వసభ్య సమావేశంలోనే సాటి మహిళను ఆమె అవమానించారు. కుర్చీ కోసమే ప్రాకులాడుతున్నానని మాట్లాడటానికి సిగ్గు పడాలి. కుర్చీ కోసం ప్రాకులాడేది ఎవరో ప్రజలకు తెలుసు. అభివృద్ధి కోసం కాదు కుర్చీ కోసమే ఎమ్మెల్యే మాధవీ రెడ్డి ఆరాటం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేసిన అజెండాను చించి వేశారు మాధవీ రెడ్డి. ప్రజా సమస్యలపై తీర్మానం చేస్తే కోర్టుకు వెళ్లిన ఎమ్మెల్యే మాధవీ రెడ్డి అభివృద్ధి నిరోధకులు కాదా?. 15వ ఫైనాన్స్ నిధులు కూడా రాకుండా చేసింది మీరు కాదా?. అవినీతి జరిగింది అని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. అలా నిరూపించలేకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటావా?’ అని ప్రశ్నించారు. -
బొత్స సవాల్.. నీళ్లు నమిలిన పయ్యావుల.. వైఎస్సార్సీపీ వాకౌట్
సాక్షి, అమరావతి: ఏపీ శాసనమండలిలో పీఆర్సీ పునర్నిర్మాణం, బకాయిల చెల్లింపుపై చర్చ కూటమి ప్రభుత్వానికి, వైఎస్సార్సీపీకి మధ్య గురువారం మాటల యుద్ధం జరిగింది. సూటిగా సమాధానం చెప్పకుండా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ నీళ్లు నమిలారు. ఒకానొక దశలో సహనం కోల్పోయిన ఆయన రాజకీయ విమర్శలు దిగారు. దీంతో విపక్ష నేత బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) గట్టి కౌంటర్ ఇచ్చారు.పీఆర్సీ పునర్నిర్మాణం, బకాయిల చెల్లింపుపై చర్చలో భాగంగా.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఇజ్రాయేలు, కల్పలత తొలుత మాట్లాడారు. ఉద్యోగులకు 30 వేల కోట్లు ఉన్నాయి. నేటి వరకు పీఆర్సీ చైర్మన్ నియామకం లేదు. పరిశీలిస్తామంటూ మంత్రి దాట వేస్తున్నారు. నమ్మి ఓట్లు వేసిన ఉద్యోగులను ప్రభుత్వం మోసం చేసింది. ప్రతీ పండుగకు ఉద్యోగులకు డీఏ కోసం ఎదురుచూస్తున్నారు.. ..ఈ ప్రభుత్వం ఇప్పటికే నాలుగు డీఏలు పెండింగ్ లో పెట్టింది.. పెన్షనర్స్ ఒక్కొక్కరికీ 15 నుంచి 20 లక్షల బకాయిలు పెట్టారు. గతంలో జగన్ వచ్చిన 27 శాతం ఐఆర్ ఇచ్చారు. ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చించి బకాయిలు చెల్లించాలి. ఇప్పటివరకు ఉద్యోగులకు ప్రభుత్వం ఎంత చెల్లింపులు చేశారో చెప్పాలి అని డిమాండ్ చేశారు. దీనికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్(AP Finance Minister Payyavula Keshav) సమధానమిస్తూ.. గతంలో రివర్స్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వీళ్ళదే(వైస్సార్సీపీ సభ్యులను చూపిస్తూ..). ఉద్యోగులు మాకు కొత్త జీతాలు వద్దు పాత జీతాలే ఇవ్వండని బ్రతిమిలాడుకునే పరిస్థితికి తెచ్చారు. గతంలో ఒక మంత్రి మీకు 15వ తేదీ కల్లా జీతాలు ఇస్తున్నాం కదా అని హేళనగా మాట్లాడారు. ప్రభుత్వ మార్పుకు ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని ఒప్పుకుంటున్నాం. రాష్ట్ర భవిష్యత్తు కోసం మాకు మద్దతు ఇచ్చారు. గత ప్రభుత్వం 21 వేల కోట్ల రూపాయల ఉద్యోగుల సొమ్ము ప్రభుత్వం వాడేసుకుంది. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది వైసీపీ సభ్యుల తీరు. మా ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో చిత్తశుధ్దితోనే ఉంది. పీఆర్సీని కమిషన్ డిసైడ్ చేస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. పయ్యావుల వ్యాఖ్యలకు విపక్షనేత బొత్స సత్యనారాయణ ఘాటు కౌంటర్ ఇచ్చారు. పీఆర్సీ కమిషన్ రద్దు చేశారు. వీళ్లు ఒత్తిడి చేశారో.. వాళ్లు రిజైన్ చేశారో తెలియదు. ఈ ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర గడుస్తోంది. ఉద్యోగుల శ్రేయస్సు కోరే వారై అయితే ఇప్పటికే కమిషన్ వేసేవారు. ఆర్థిక మంత్రి అడిగిన ప్రశ్నకు రాజకీయ కోణంలో సమాధానం చెప్పారు. ప్రభుత్వాలు మారాయి.. అటు ఉన్నవాళ్ళు ఇటు వచ్చారు.. ఇటు ఉన్నవాళ్ళు అటు వెళ్ళారు. గత ప్రభుత్వ హయాంలో 27 శాతం ఫిట్మెంట్ ఇచ్చాం. ఇప్పుడు మీరు ఈ ప్రభుత్వంలో పీఆర్సీ కమిషన్ వేస్తారా.. ఫిట్మెంట్ ఇస్తారా అనేది చెప్పాలి. అప్పులు ఎవరు ఎంత చేశారు అనేది డిబేట్ లో మాట్లాడటానికి సిద్ధం. ఎవరు దేనికి ఎంత ఖర్చు పెట్టారో చర్చిద్దాం. అన్నీ రికార్డు ప్రకారమే మాట్లాడుకుందాం అని సవాల్ విసిరారు. అయితే దీనికి మంత్రి పయ్యావుల నుంచి స్పందన రాలేదు. దీంతో పీఆర్సీ విషయంలో ప్రభుత్వ తీరుకు నిదర్శనగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మండలి నుంచి వాకౌట్ చేశారు.అంతకు ముందు.. రాష్ట్రంలో మహిళలు చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, అలాగే మహిళలు, చిన్నారుల అదృశ్యాలపై చర్చించాలని వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం ఇవ్వగా.. ఛైర్మన్ మోషేన్ రాజు దానిని తిరస్కరించారు.ఇదీ చదవండి: చంద్రబాబూ.. ఖబడ్దార్ -
చంద్రబాబు నీతులు చెబుతుంటే..
చెత్త రాజకీయాలను ఊడ్చేస్తానంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రకటన స్వాగతించదగ్గది. కాకపోతే దీన్ని తన సొంతపార్టీతో మొదలుపెట్టడం అవసరం. క్రిమినల్ కేసులున్న నేతలను పక్కన కూర్చొబెట్టుకుని మరీ నేర చరితులు రాజకీయాల్లో ఉండకూడదని చెప్పగల సమర్థుడు చంద్రబాబు. అందుకే ఆయన చేసే ప్రకటనలకు ఆ పార్టీలోనే విలువ లేకుండా పోతోంది. టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూంటారు. చంద్రబాబు స్వయంగా ఈ మాటలు చెప్పడం ఇంకో విశేషం.... ఇసుక, మద్యం దందాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యేల వసూళ్లకు హద్దూ లేకుండా ఉందని వారికి తానే వార్నింగ్ ఇస్తానంటూ సుమారు 35 మంది ని పిలిచి మాట్లాడానని కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) కొన్నాళ్ల క్రితం వెల్లడించినట్లు ఎల్లో మీడియానే ప్రచారం చేసింది. మరి వీరంతా ఆ చెత్త రాజకీయాలలో భాగమా? కాదా?. రాజకీయ ప్రత్యర్థి వైసీపీ వారిని విమర్శించడానికి ఇలాంటి పడికట్టు పదాలు వాడుతుంటారు. కాని అవి తన పార్టీ వారికే తగులుతున్న విషయాన్ని మర్చిపోతుంటారు. అసలు చెత్త రాజకీయం అంటే ఏమిటి?.. ప్రజలకు మేలు చేయనిది.. సిద్దాంతాలతో నిమిత్తం లేకుండా అవకాశవాద వాదంతో వ్యవహరించేదని కదా చెత్త రాజకీయం(Dirty Politics) అంటే!. అవకాశవాద రాజకీయాలలో చంద్రబాబును మించిన మొనగాడు మరొకరు ఎవరుంటారు? ఎదుటి వారిపై కేసులు ఉన్నాయని అంటారు కాని తన మీద ఉన్న కేసుల గురించి చెప్పరు. మాచర్లలో జరిగిన స్వచ్చాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. సాధారణంగా ముఖ్యమంత్రి వస్తున్నారంటే ఆ పరిసరాలలో పారిశుధ్యం పనులు చేపట్టడం కద్దు. కానీ మాచర్ల పర్యటనలో అలా జరగలేదు. చివరకు చెరువు వద్ద పేరుకుపోయిన చెత్తను పారిశుధ్య కార్మికులతో కలిసి చంద్రబాబు ఊడ్చారట. అధికారుల నిర్లక్ష్యమా? లేక చంద్రబాబు షో ప్రయత్నమా? తెలియదు.చెత్త ఊడ్చడాన్ని తప్పుపట్టనక్కరలేదు కానీ ఆ సందర్భంలోనే నోటికొచ్చిన మాటలు మాట్లాడేశారు(Chandrababu Dirty Politics Comments). మాచర్ల సభలో వేదికపైన ఉన్న కొందరు నాయకులపై క్రిమినల్ కేసులు ఉన్న విషయం అందరికీ తెలుసు. స్థానిక వైసీపీ నేతలు(YSRCP) పలువురిని అక్రమ కేసుల్లో అరెస్టు చేయించారు కూడా. మాజీ మున్సిపల్ చైర్మన్ తురక కిషోర్ పెట్టిన కేసుల తీరుపై హైకోర్టు స్వయంగా మండిపడింది కదా!. టీడీపీలోని రెండు వర్గాలు ఘర్షణ పడి హత్యలు చేసుకుంటే ఆ కేసును మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పెట్టడాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది కదా?. అయినా ఇప్పుడు స్వాతంత్రం వచ్చిందని ఎలా అనగలిగారు? రాయలసీమలో ఆయన ముఠాలు లేకుండా చేశారట!!. టీడీపీలోకి ముఠా నాయకులను ఏరికోరి చేర్చుకున్న విషయం పల్నాడు ప్రాంత ప్రజలకు తెలియకపోవచ్చు. కాని ఆ రాయలసీమ వారికి తెలిదా! కర్నూలు జిల్లాలో ఇద్దరు ఫ్యాక్షనిష్టు రాజకీయ నేతలను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి రాజీ చేసి గొడవలు లేకుండా చూడడానికి ప్రయత్నిస్తే, దానిని చంద్రబాబు ఎంత తీవ్రంగా తప్పుపట్టారో ఇప్పటి తరం వారికి తెలిసి ఉండదు. ఇప్పటికీ టీడీపీలో ఎంతమంది ఫ్యాక్షనిస్టు నేతలు పెత్తనం చేస్తున్నారో, ఎందరు ఎమ్మెల్యేలు అయ్యారో ఆయనకు తెలియదా!. రౌడీయిజం చేస్తే ఊరుకునేది లేదని కూడా చంద్రబాబు అన్నారు. మంచిదే. కానీ ఆయన చెప్పేది వేరు.. చేసేది వేరు అని ఎప్పటి నుంచో ఉన్న అనుభవం. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్లో ఒక రౌడీషీటర్ను పార్టీలో చేర్చుకోవడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విమర్శలు రావడంతో వెనక్కి తగ్గారు. ఇప్పుడు ఆ వెరపు కూడా పోయినట్లు ఉంది. టీడీపీ నేతలు రౌడియిజం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటున్నారు. అంతెందుకు గతంలో వైసీపీలో ఉన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ను రౌడీ అని, పేకాట క్లబ్లు నడుపుతారని, భూ కబ్జాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు, లోకేశ్లు కర్నూలు జిల్లా ఆలూరు వెళ్లి మరీ ఆరోపించి వచ్చారు. సీన్ కట్ చేస్తే ఆయనకు వైసీపీ టిక్కెట్ ఇవ్వకపోతే, చంద్రబాబు అనంతపురం జిల్లా గుంతకల్ టీడీపీ టిక్కెట్ ఇచ్చారు. దీనిని ఏమంటారో?.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని చంద్రబాబు గతంలో ఏమి అన్నారో, అలాగే కోటంరెడ్డి కూడా చంద్రబాబు ను ఏమని విమర్శించారో వారిద్దరు మర్చిపోయి ఉండవచ్చు. ఇప్పుడు కోటంరెడ్డి టీడీపీ పక్షాన ఎమ్మెల్యే ఎలా అయ్యారు? కోటంరెడ్డి ఇప్పుడు దౌర్జన్యాలు చేసే వ్యక్తిగా కాకుండా మంచి వ్యక్తిగా మారిపోయారా?. హత్య కేసులో ఉన్న ఒక రౌడీషీటర్కు పెరోల్ ఇవ్వాలని కోటంరెడ్డి, మరో ఎమ్మెల్యే సునీల్ కుమార్లు లేఖ రాయడం గురించి ఏమంటారు??. మాచర్ల ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యేపై ఎన్ని కేసులు ఉన్నాయి???.. చంద్రబాబు తరచు చంద్రయ్య అనే ఒక చిన్న టీడీపీ నేత హత్య గురించి ప్రచారం చేస్తుంటారు. వ్యక్తిగత గొడవలు జరిగితే దానికి రాజకీయం పులిమి చంద్రబాబు హడావుడి చేశారన్నది అప్పట్లో వచ్చిన విమర్శ. చంద్రయ్య కుమారుడికి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి చంద్రబాబు మరో చెడ్డ సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు తమ సొంత కార్యకర్తలకు ఏదో రకంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించుకోవచ్చని ఈయన చర్య సూచిస్తోంది. దేశం మొత్తం మీద క్రిమినల్ కేసులున్న ఎమ్మెల్యేలలు 45 శాతమైతే.. టీడీపీలో అది 86 శాతం. ఆంధ్రప్రదేశ్లోని 134 మంది టీడీపీ ఎమ్మెల్యేల్లో 115 మందిపై క్రిమినల్ కేసులు, 82 మందిపై తీవ్రమైన అభియోగాలు ఉన్నాయని ఏడీఆర్ నివేదిక చెబుతోంది. ఇది దేశంలోనే ఒక రికార్డు. ఇది చెత్త కిందకు వస్తుందా? ఆణిముత్యం కిందకు వస్తుందా? అన్నదాని గురించి చంద్రబాబు చెప్పి, తదుపరి ఎదుటి వారిపై విమర్శలు చేస్తే బాగుంటుంది. ఇదే సమావేశంలో ఆయన స్త్రీ శక్తి కింద మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం కల్పించామని చెప్పారు. కాని దానివల్ల వచ్చిన బెనిఫిట్ ఏమిటో ఆయనే ఒక సందర్భంలో తెలిపారు. ఒక నెల రోజులలో 5.4 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని, తద్వారా వారికి రూ.200 కోట్లు ఆదా అయ్యాందని తెలిపారు. దాని ప్రకారం ఒక్కో మహిళకు నెలకు 40 రూపాయలు ఆదా అయితే.. అదేదో పెద్ద ఘనతగా చెప్పుకున్నారన్నమాట. అసెంబ్లీలోనేమో అప్పులు చేసి సంక్షేమం అమలు చేయరాదని అంటారు. బయట సభలలో మాత్రం మొత్తం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేసినట్లు బిల్డప్ ఇస్తుంటారు. ఆడబిడ్డ నిధి తదితర అనేక హామీలు పెండింగులో ఉంటే వాటిని ఆయన ప్రస్తావించరు. త్వరలో సంజీవని కార్యక్రమం నిర్వహిస్తామని, ఇళ్ల వద్దకే డాక్టర్లను పంపిస్తామని చంద్రబాబు ప్రకటించడం స్వాగతించదగిందే. కాకపోతే గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం విలేజ్ హెల్త్ క్లినిక్స్ ను ఏర్పాటు చేయడం, ప్రజల వద్దకే డాక్టర్లను పంపించడం, టెలిమెడిసిన్ వంటి పలు స్కీములను అమలు చేసింది. వాటిని ఈ ఏడాదిన్నర కాలం ఆపడం ఎందుకు? దానికి పేరు మార్చి ఇప్పుడు తామే అమలు చేస్తున్నామన్నట్లుగా ప్రచారం చేసుకోవడం ఎందుకు? ప్రజలకు ఈ ఏడాది కాలంలో వైద్య సేవలు సరిగా అందనట్లే కదా! రూ.300 కోట్లు వ్యయం చేసి ఒక రోజు యోగాంధ్ర నిర్వహించి యోగా గేమ్ ఛేంజర్ అన్నట్లుగా గతంలో చెప్పారు. ఇప్పుడేమో సంజీవని గేమ్ ఛేంజర్ అని చెబుతున్నారు. ఆరోగ్య బీమా పేరుతో ఆరోగ్యశ్రీని నీరుకార్చుతున్నారన్న విమర్శల నేపధ్యంలో సంజీవనిని తెరపైకి తెస్తున్నారు. అలాగే మెడికల్ కాలేజీల ప్రైవేటికరణపై వస్తున్న నిరసనలను డైవర్ట్ చేయడానికి ఈ ప్రయత్నాలు జరగుతుండవచ్చు. ముందుగా తమ ప్రభుత్వంలో తీసుకు వస్తున్న విధానాలలోని చెత్తను, అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్న చెత్తను తొలగించాక, ఎదుటి వారి గురించి మాట్లాడితే మంచిదని విశ్లేషకులు, ఇతర రాజకీయ పార్టీల నేతలు చెప్పడం అర్థవంతంగానే ఉంది కదా!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
వైఎస్సార్సీపీ యువనేత దారుణ హత్య!
సాక్షి, పామిడి: వైఎస్సార్సీపీలో చురుగ్గా వ్యవహరిస్తున్న స్థానిక యువనేత బుధవారం రాత్రి అనంతపురం జిల్లాలో దారుణ హత్యకు గురయ్యారు! అనంతపురం జిల్లా పామిడి మండలం కాలాపురం గ్రామ పొలిమేర ప్రాంతంలో రాత్రి ఈ ఘటన జరిగింది. వైఎస్సార్సీపీకి చెందిన యువ నాయకుడు, జీ కొట్టాల గ్రామవాసి దేవన సతీష్రెడ్డి (34) పామిడిలో పని ముగించుకుని రాత్రి తన ద్విచక్రవాహనంలో ఇంటికి తిరిగి వస్తుండగా ఆయన్ను గొంతు కోసి హతమార్చినట్లు భావిస్తున్నారు. బీటెక్ చదివి వ్యవసాయం చేస్తూ.. జీ కొట్టాలకు చెందిన రైతు దేవన కాశీ విశ్వనాథ్రెడ్డికి ముగ్గురు కుమారులు కాగా మృతుడు సతీష్రెడ్డి చిన్న కుమారుడు. బీటెక్ చదివిన ఆయన ఇంటివద్ద వ్యవసాయం చేసుకుంటూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నారు. తన అన్న సుదర్శన్రెడ్డితో కలసి దాదాపు 30 ఎకరాల్లో చీనీతోట, వేరుశెనగ పంటలను సాగు చేస్తున్నారు. స్థానికంగా ఆ కుటుంబానికి మంచి పేరుంది. మృతుడి మరో సోదరుడు వెంకట నరసింహారెడ్డి హైదరాబాద్లో ఉంటున్నారు. వెనుక కూర్చుని గొంతు కోశారా? దేవన సతీష్రెడ్డిది ముమ్మాటికి హత్యేనని పామిడి మండల వైఎస్సార్సీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. ఎవరితోనూ విబేధాలు లేని వ్యక్తిని గొంతు కోసి దారుణంగా చంపడం పట్ల స్థానికంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. సమాచారం తెలిసిన వెంటనే పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘటనా స్థలానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఎవరో ఆయన ద్విచక్రవాహనం వెనుక కూర్చుని గొంతుకోసి హతమార్చి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎడమ వైపుగా వెళ్లాల్సిన వ్యక్తి కుడివైపున రోడ్డుపై హత్యగావించబడి ఉండడం... మృతుడి చెప్పుల్లో ఒకటి నడిరోడ్డుపై, మరొకటి కుడివైపు దూరంగా ద్విచక్రవాహనం దగ్గర ఉండడాన్ని బట్టి ఇది హత్యేనని పేర్కొంటున్నారు. పామిడి ఇన్ఛార్జ్ సీఐ రాజు, డాగ్ స్క్వాడ్ టీమ్తో ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.ఇటీవలే వైఎస్ జగన్ను కలిసి సంతోషంగా.. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఇటీవలే సతీష్రెడ్డిని రూరల్ బూత్ కన్వీనర్ ప్రెసిడెంట్గా నియమించింది. పార్టీ కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా ఉంటూ యువతను చైతన్యం చేస్తున్నారు. మాజీ సీఎం, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఇటీవలే కలిసి ఎంతో సంతోషంగా కనిపించిన సతీష్రెడ్డి దారుణ హత్యకు గురి కావడాన్ని వైఎస్సార్సీపీ శ్రేణులు జీరి్ణంచుకోలేకపోతున్నాయి. -
అడ్డంగా దొరికిన పోలీసులు.. హైకోర్టు ఆగ్రహం..
-
‘పవన్ సీజ్ ద షిప్’ ఏమైంది!?
సాక్షి, అమరావతి: ఉపముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి కాకినాడలో బియ్యం తరలిస్తున్న షిప్ను సీజ్ చేయాలని, సీజ్ ద షిప్ అంటూ గతంలో ఆదేశించారని, ఆ కేసు ఏమైందో ప్రభుత్వం చెప్పాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ డిమాండ్ చేశారు. శాసన మండలిలో బుధవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా రాష్ట్రంలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను నిరోధించేందుకు తీసుకుంటున్న చర్యలు ఏమిటని వైఎస్సార్సీపీ సభ్యులు ప్రశ్నించారు.ఈ సందర్భంగా ఇజ్రాయిల్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో పెరిగిన బియ్యం అక్రమ రవాణాకు నమోదైన కేసులే అద్దంపడుతున్నాయన్నారు. కాకినాడ, విశాఖ పోర్టుల కేంద్రంగా పెద్దఎత్తున బియ్యం విదేశాలకు అక్రమ రవాణా జరుగుతోందన్నారు. మరో ఎమ్మెల్సీ కూడిపూడి సూర్యనారాయణ మాట్లాడుతూ.. పౌర సరఫరాలు, పోలీసు శాఖలోని కొందరు రేషన్ మాఫియాతో చేతులు కలిపారని, కాకినాడ పోర్టులో బియ్యం డంప్ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని ఆరోపించారు. తిరిగి ఈ మాఫియా ద్వారా విదేశాల నుంచి డ్రగ్స్ రాష్ట్రంలోకి వస్తున్నాయన్నారు.అనంతరం.. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను కట్టడి చేసేందుకు ఎండీయూ వాహనాల ద్వారా బియ్యం పంపిణీ విధానాన్ని రద్దుచేశామన్నారు. గతేడాది జూన్ నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు 2,438 కేసులు నమోదుచేసి 5 లక్షల క్వింటాళ్లకు పైగా బియ్యం స్వా«దీనం చేసుకున్నామని చెప్పారు. అనంతరం ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యాటక శాఖకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు పొంతనలేని సమాధానాలు ఇవ్వడం సరికాదన్నారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు మాట్లాడుతూ.. ఉద్యోగాల కల్పన, పరిశ్రమలపై ప్రభుత్వ దాటవేత ధోరణి సరికాదన్నారు. తూమాటి మాధవరావు మాట్లాడుతూ లులుకు ఖరీదైన భూమి ఎలా కేటాయించారని ప్రశ్నించారు. కల్పలతారెడ్డి, చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తిచేసిన మెడికోలను శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని విమర్శించారు. -
ఇప్పటివరకూ ఒక లెక్క.. ఇకనుంచి ఒక లెక్క
-
వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అండగా నిలబడతాం... పార్టీ శ్రేణులకు అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా
-
ఈ సర్కార్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత: వైఎస్ జగన్
ఈ పెద్దమనిషి ఎన్నికలప్పుడు ఏం చెప్పి వచ్చాడు.. వచ్చాక ఏం చేస్తున్నాడు? అప్పట్లో సంపద సృష్టిస్తానని పదే పదే ప్రతి మీటింగ్లో చెప్పారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ మాత్రమే కాదు.. జగన్ చేసినవన్నీ కూడా చేస్తూ.. ఇంకా ఎక్కువే ఇస్తానన్నాడు. ఈ రోజు పరిస్థితి చూస్తే.. సంపద సృష్టించడం అంటే.. కేవలం తనకు, తన మనుషులకే సంపద సృష్టించడం అని తేటతెల్లం అయింది. రాష్ట్రానికి సంపద సృష్టించడం దేవుడెరుగు.. స్కామ్లు చేస్తూ ఉన్న సంపద ఆవిరి చేస్తున్న పరిస్థితి. మన ప్రభుత్వంలో అమలు చేసిన స్కీములన్నింటినీ రద్దు చేశారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లు గాలికెగిరిపోయిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.ప్రభుత్వం అనేది మంచి విద్యా వ్యవస్థను, ప్రతి పేదవాడికి అందుబాటులో మంచి వైద్య వ్యవస్థను ఏర్పాటు చేస్తుందని అనుకుంటాం. రైతుకు అండదండగా ఉంటుందనుకుంటాం. లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఎలాంటి వివక్ష లేకుండా ఉండాలని, అలాంటి పరిస్థితి ప్రభుత్వంలో ఉంటుందని ఎవరైనా ఆశిస్తారు. ఓట్లు వేసినప్పుడు ఎవరైనా ఇవన్నీ కోరుకుంటారు. కానీ ఇప్పుడు విద్య, వైద్యం, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్.. ఇలా ఏది తీసుకున్నా, కనపించేది తిరోగమనమే. – వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. చంద్రబాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ అని ప్రజలకు అర్థమైందన్నారు. సంపద సృష్టించి, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు అమలు చేస్తానని ఎన్నికల్లో చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక స్కామ్లు చేస్తూ, ఉన్న సంపదను ఆవిరిచేస్తూ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను సైతం రద్దు చేశారని మండిపడ్డారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు అమలు చేయకపోయినా, అమలు చేసినట్లు గోబెల్స్ ప్రచారం చేస్తూ విజయోత్సవాలు జరిపిస్తున్నారని దెప్పిపొడిచారు. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతున్న నేపథ్యంలో చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదని, పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని దుయ్య బట్టారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం తన అధ్యక్షతన జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో రీజినల్ కో–ఆర్డినేటర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పీఏసీ మెంబర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర కార్యదర్శులు (కో–ఆర్డినేషన్), రాష్ట్ర కార్యదర్శుల (పార్లమెంటు)ను ఉద్దేశించి వైఎస్ జగన్ మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు, సమకాలీన రాజకీయ అంశాలపై చర్చించి.. భవిష్యత్ కార్యాచరణపై వారికి దిశా నిర్దేశం చేశారు. సజావుగా ఎన్నికలు జరిగితే డిపాజిట్లు కూడా దక్కవని చంద్రబాబుకు తెలుసని.. అందుకే సజావుగా ఎన్నికలు జరపడని.. కాబట్టి మీరందరూ ఇంకా గట్టిగా నిలబడి, పోరాడాల్సిన అవసరం ఉందని పార్టీ నేతలకు మార్గ నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో వ్యతిరేకత ⇒ ఇప్పటికే ఈ ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. ఇది ప్రతి ఇంట్లోనూ, ప్రతి గ్రామంలోనూ కనిపిస్తోంది. సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి, ఉన్న సంపదను ఆవిరి చేస్తున్నారు. ⇒ ఇప్పుడు రాష్ట్రంలో ఎవరిని కదిలించినా ‘ఈ ప్రభుత్వం మాకొద్దు బాబోయ్’ అంటున్నారు. ఇది నిజంగా వాస్తవం. పథకాలు మాయమైపోయాయి ⇒ ఈమధ్య ఈ పెద్ద మనిషి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ అనంతపురంలో విజయోత్సవ సభ పెట్టబోతున్నప్పుడు వాళ్ల పాంప్లెట్ పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. ఎన్నికలప్పుడు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్కు, ఈ అడ్వర్టైజ్మెంట్కు మధ్య స్పష్టమైన తేడా ఉంది. కొన్ని పథకాలను ఎగ్గొట్టేశారు. ఇప్పుడు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంశాలు మారిపోయాయి. ⇒ యువతకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి, ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500, ఏడాదికి రూ.18 వేలు.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్ మొన్నటి అడ్వర్టైజ్మెంట్లో కనిపించలేదు. ⇒ సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అమలు చేసేశామంటూ అడ్వర్టైజ్మెంట్స్లోని అంశాలను మార్చేసి అన్నీ చేసేశాం అంటూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. ఈ స్థాయిలో మోసం చేసే వారు ప్రపంచ చరిత్రలో మరొకరు ఉండరు. ఇంటింటికీ బాండ్లు, సంతకాలతో ప్రతిజ్ఞలు⇒ ఎన్నికలప్పుడు ప్రతి ఇంటికీ బాండ్లు పంపించారు. బాండ్లకు సంబంధించి ప్రతి ఫోన్కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. అందులో మీకు ఆడబిడ్డ నిధి కింద ఇంత, తల్లికి వందనం కింద ఇంత, అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు, యువగళం (నిరుద్యోగ భృతి) కింద నెలకు రూ.3 వేలు, ఏడాదికి రూ.36 వేల చొప్పున.. ఆ కుటుంబానికి ఏటా ఇంత మొత్తం ఇస్తామంటూ బాండ్లు ఇచ్చారు.⇒ ఇంకా ‘చంద్రబాబు నాయుడు అనే నేను అధికారంలోకి వచ్చాక, భవిష్యత్ గ్యారెంటీలోని హామీలను త్రికరణ శుద్ధితో నెరవేరుస్తానని, ఎలాంటి వివక్ష లేకుండా, నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు, మన రాష్ట్ర అభివృద్ధికి పునరంకితమవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. 2024 జూన్ నుంచి ఈ మొత్తం మీ అకౌంట్లో జమ చేయబడుతుంది’.. అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలు, వారి సంతకాలతో కూడిన ప్రతిజ్ఞా పత్రాలు ఇంటింటికీ పంపించారు. వాస్తవంగా ఏం చేశారంటే..⇒ సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లో కొన్నింటిని కొద్దో గొప్పో అమలు చేసినా, వాటిని కూడా అందరికీ ఇవ్వకుండా కొద్ది మందికి మాత్రమే ఇచ్చారు. పీఎం కిసాన్తో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ కింద ఏటా రూ.20 వేలు ఇస్తామని చెప్పి.. ఆ తర్వాత పీఎం కిసాన్తో కలిపే రూ.20 వేలు ఇస్తామన్నారు. మొదటి ఏడాది ఎగ్గొట్టారు. ఆ తర్వాత రెండేళ్లకు కలిపి రూ.40 వేలకు గాను రూ.5 వేలే ఇచ్చారు. ⇒ ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అన్నారు. రెండేళ్లకు కలిపి ఆరు సిలిండర్లకు ఇచ్చింది ఒక్కటే. అది కూడా కొందరికే. రాష్ట్రంలో ఎక్కడికైనా బస్సు ప్రయాణం ఫ్రీ అన్నారు. కానీ అది కొన్ని బస్సులకే పరిమితం చేశారు. మనం ఇచ్చిన అమ్మ ఒడి పేరు మార్చి తల్లికి వందనం అన్నారు. ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అందరికీ రూ.15 వేల చొప్పున ఇస్తామన్నారు. చివరికి 30 లక్షల మంది పిల్లలకు కట్ చేశారు. రూ.15 వేలు ఇస్తానన్నది కాస్తా రూ.13 వేలు చేశారు. అదీ పూర్తిగా ఇవ్వలేదు. కొందరికి రూ.10 వేలు, ఇంకొందరికి రూ.9 వేలు, మరి కొందరికి రూ.8 వేలు మాత్రమే ఇచ్చారు. ఇలా చంద్రబాబు పాలనలో ప్రతి అడుగులోనూ మోసం, అబద్ధమే కనిపిస్తోంది. రైతులకు అంతులేని కష్టాలు⇒ వ్యవసాయానికి సంబంధించి ఏ పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. యూరియా దొరకని దుస్థితి. మార్కెట్లో బ్లాక్ చేసేశారు. రేట్లు పెంచేశారు. దళారీలతో ఈ ప్రభుత్వం చేతులు కలిపినందువల్లే ఈ దుస్థితి. ప్రైవేటుకి కోటా పెంచేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్)కు వచ్చే సరుకును వీళ్ల కార్యకర్తలు ఎత్తడం మొదలుపెట్టారు. ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు. ఈ–క్రాప్ అనేది కనపడకుండా పోయింది. రైతన్నకు ఉచిత పంటల బీమా ఎగిరిపోయిన పరిస్ధితి. కనీసం క్రాప్ ఇన్సూరెన్స్ డబ్బులు కూడా పోయిన సంవత్సరం ఈ ప్రభుత్వం కట్టలేదు. మన ప్రభుత్వ ఐదేళ్లలో ఏనాడన్నా ఇలాంటి పరిస్థితి రైతు చూశాడా? ⇒ మన ప్రభుత్వంలో ప్రతి పంటకు గిట్టుబాటు ధరలు రావడమే కాకుండా, రైతులకు ఆర్బీకేల ద్వారా, ఈ క్రాప్ ద్వారా మద్దతు ధర కన్నా రూపాయి తక్కువ ఇచ్చిన పరిస్థితి ఎక్కడా లేదు. ఇంకా జీఎల్టీ (గన్నీ బ్యాగ్స్, లేబర్, ట్రాన్స్పోర్టేషన్) కింద అదనంగా ఎకరాకు దాదాపు రూ.10 వేలు ఇచ్చిన పరిస్థితులు మన ప్రభుత్వంలో కనిపించాయి.ఈ ధాన్యం ప్రజలు తినరట.. ⇒ రైతులు పండించిన ధాన్యం తినే పరిస్థితుల్లో ప్రజలు లేరని ఈ పెద్దమనిషి చంద్రబాబునాయుడు చెప్తాడు. అందుకే ధాన్యానికి గిట్టుబాటు ధర లేదంటున్నాడు. ఈ ధాన్యమంతా ఇథనాల్ (లిక్కర్లో వినియోగించే) తయారు చేసే దానికి వాడతారంటున్నాడు. అంటే రాబోయే రోజుల్లో కూడా ధాన్యం సేకరణలో నా విధానం ఇదేనని చెబుతున్నట్టేగా? ధాన్యానికి ఇంకెప్పుడూ గిట్టుబాటు ధర రాదు.. పండించడం మానేయండి.. అని చెబుతున్నాడు. ⇒ కందులు, మినుములు, పెసలు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, అరటి, టమాటా, కోకో, చీనీ, మామిడి.. ఇలా ఏ పంటకూ ఈ రోజు గిట్టుబాటు ధర లేదు. కారణం.. దగ్గరుండి ఆర్బీకే వ్యవస్థను, ఈ క్రాప్ను నిర్వీర్యం చేయడమే.⇒ నాడు మన ప్రభుత్వంలో ఎప్పటికప్పుడు జోక్యం చేసుకుంటూ రూ.7,800 కోట్లు ఖర్చు చేసి కొనుగోలులో కాంపిటీషన్ క్రియేట్ చేసి రైతులకు తోడుగా నిలిచాం. అధ్వానంగా విద్యా రంగం ⇒ విద్యా రంగంలో నాడు–నేడు పనులు ఆగిపోయాయి. టోఫెల్ చదువులు గాలికి ఎగిరిపోయాయి. గోరుముద్ద నీరుగారిపోయింది. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్లు ఇచ్చే కార్యక్రమం గాలికి ఎగిరిపోయింది. ఇంగ్లిష్ మీడియం చదువులు పిల్లలకు ఎండమావి అయ్యాయి. ఇవన్నీ పక్కన పెడితే.. పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు ఏ త్రైమాసికం అయిపోతే ఆ త్రైమాసికానికి వెంటనే మన ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చాం. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను మన ప్రభుత్వం గొప్పగా అమలు చేసింది.⇒ 2024 జనవరి–మార్చి త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ ఎన్నికల కోడ్ వల్ల ఆగిపోయింది. ఆ తర్వాత చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అంతే.. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఫినిష్. అప్పటి నుంచి ఈ సెప్టెంబరు వరకు 7 క్వార్టర్స్కు సంబంధించి, ఒక్కో క్వార్టర్కు రూ.700 కోట్లు.. ఇలా మొత్తం రూ.4900 కోట్ల బకాయిలు ఉన్నాయి. కానీ, ఈ పెద్దమనిషి రూ.700 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. ⇒ గత ఏడాది ఏప్రిల్లో ఎన్నికల కోడ్ వల్ల జగనన్న వసతి దీవెన ఆగిపోయింది. వసతి దీవెన కింద ఏటా రూ.1,100 కోట్లు ఇవ్వాలి. గత ఏడాది ఎగ్గొట్టారు. ఈ ఏడాది కూడా ఇవ్వడం లేదు. అలా వసతి దీవెన కింద ఈ ప్రభుత్వం రూ.2,200 కోట్లు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చింది సున్నా. ఈ రోజు పిల్లల చదువులు ఆగిపోతున్న పరిస్థితి. వైద్య రంగం నిర్వీర్యం⇒ ఆరోగ్యశ్రీలో మన ప్రభుత్వంలో రూ.25 లక్షల వరకు ప్రతి పేదవాడు దర్జాగా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి వైద్యం చేయించుకున్నారు. ఆ రోజు 3 వేలకు పైగా ప్రోసిజర్లకు వైద్యం ఉచితంగా అందించాం. ఈ పెద్ద మనిషి ఆరోగ్యశ్రీకి గత 16 నెలలుగా బిల్లులు చెల్లించకుండా బకాయిలు పెట్టారు. ఆరోగ్యశ్రీ నడపాలంటే ప్రతి నెలా రూ.300 కోట్లు అవసరం. ఈ 16 నెలల్లో దాదాపు రూ.4 వేల కోట్లు బకాయి పెట్టారు. దాంతో నెట్వర్క్ ఆస్పత్రులు బోర్డు తిప్పేశాయి. పేదవాడు వైద్యం కోసం ఈరోజు ప్రైవేట్ ఆçస్పత్రులకు వెళ్లలేని పరిస్థితి. ⇒ రోగికి చికిత్స తర్వాత విశ్రాంతి సమయంలో డాక్టర్లు సూచించినంత కాలం రోజుకు రూ.225 లేదా నెలకు రూ.5 వేల చొప్పున ఇచ్చి మన ప్రభుత్వంలో గొప్ప సహాయంగా ఆరోగ్య ఆసరా కార్యక్రమాన్ని అమలు చేశాం. సంవత్సరానికి రూ.450 కోట్లు ఖర్చు అయ్యే ఈ కార్యక్రమానికి ఈ 16 నెలల్లో అయ్యే ఖర్చు దాదాపు రూ.600 కోట్లు ఉంటుంది. కానీ చంద్రబాబు ఈ పథకానికి ఇచ్చింది సున్నా. అమరావతికి రూ.2 లక్షల కోట్లట! ⇒ చంద్రబాబు ప్రాజెక్టు రిపోర్టు ప్రకారమే అమరావతి నిర్మాణానికి రూ.లక్ష కోట్లు కావాలంటున్నాడు. మొదటి దఫా 50 వేల ఎకరాలను డెవలప్ చేయడానికి ఎకరాకు రూ.2 కోట్ల చొప్పున మౌలిక వసతుల కల్పనకు ఖర్చవుతుందంటున్నారు. ఇది రోడ్లు, డ్రైనేజీ, కరెంట్ కోసం మాత్రమే. గత చంద్రబాబు ప్రభుత్వంలో వీటి కోసమే రూ.5 వేల కోట్లు ఖర్చు చేశాడు. ఇంకా రూ.95 వేల కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఖర్చు చేస్తారు? ⇒ ఈ డబ్బంతా ఎక్కడి నుంచి తెస్తారని ప్రజలు ప్రశ్నిస్తుంటే, ఈ పెద్ద మనిషి చంద్రబాబు ఇంకా 50 వేల ఎకరాలు కావాలంటున్నాడు. ఈ 50 వేల ఎకరాలకు మరో లక్ష కోట్లు కావాలని ఎస్టిమేషన్ వేశాడు. మొత్తంగా రూ.2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తావు? రూ.5 వేల కోట్లు ఖర్చు చేయడానికి డబ్బు లేదట! చంద్రబాబూ అసలు నీవు మనిషివేనా? ఇక లా అండ్ ఆర్డర్ గురించి నేను చెప్పాల్సిన పని లేదు. అంతులేని అవినీతి.. యథేచ్ఛగా దోపిడీ⇒ కూటమి పాలనలో అవినీతి లేనిది ఎక్కడో చెప్పాలి. మద్యం, ఇసుక, లాటరైట్, బాక్సైట్, క్వార్ట్›జ్, సిలికా, మట్టి దేన్నీ వదలడం లేదు. ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్లు. కుట్టుమిషన్ల నుంచి మొదలు పెడితే.. ఎకరా భూమి 90 పైసలే. మన ప్రభుత్వంలో రూ.2.40 చొప్పున యూనిట్ విద్యుత్ కొనుగోలు చేస్తే, వీళ్లు అదే యూనిట్ రూ.4.60తో కొనేందుకు ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఏది చూసినా స్కామ్లే. ⇒ మన హయాంలో ప్రభుత్వ ఖజానాకు ఇసుక ద్వారా ఏటా రూ.750 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ రోజు ఖజానాకు రూపాయి కూడా రావడం లేదు. ఇసుక రేటు మాత్రం మన హయాంలో కన్నా డబుల్ అయ్యింది. ఆ ఆదాయం టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్తోంది. జీఎస్టీ ఎందుకు తగ్గుతుందంటే.. రాష్ట్ర ఖజానాకు ఆదాయం తగ్గబట్టే కదా? ⇒ చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన 16 నెలల్లో రూ.2 లక్షల కోట్ల అప్పు చేశారు. ఇది మనం ఐదేళ్లలో చేసిన అప్పుల్లో 57 శాతం. కొత్తగా స్కీమ్లు లేవు, పాత స్కీమ్లన్నీ రద్దు చేశారు. మరి ఈ డబ్బంతా ఎక్కడికి పోతోంది.. ఎవరి జేబుల్లోకి పోతోంది?మెడికల్ కాలేజీల అమ్మకం అత్యంత హేయం⇒ ఈ రోజు చంద్రబాబు మెడికల్ కాలేజీలను అమ్మకానికి పెట్టాడు. బుద్ధి, జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అమ్మాలని ఆలోచన చేస్తాడా? అలాంటి వ్యక్తి ప్రపంచంలో ఎవరూ ఉండరు. ఎక్కడైనా మెడికల్ కాలేజీలు, స్కూళ్లు, ఆస్పత్రులు, ఆర్టీసీ బస్సులను ప్రభుత్వాలే ఎందుకు నడుపుతాయో అందరూ ఆలోచించాలి. గవర్నమెంట్ వాటిని నడపకపోతే నారాయణ, చైతన్య లాంటి స్కూళ్లలో పేదలు తమ పిల్లలను చదివించగలిగే పరిస్థితి ఉండదు. గవర్నమెంట్ ఆస్పత్రులు లేకపోతే పేదలకు ఉచితంగా వైద్యం అందడం సాధ్యమేనా?. గవర్నమెంట్ బస్సులు నడపకపోతే ప్రజలు ప్రైవేటు బస్సుల్లో ప్రయాణించగలరా? అందుకోసమే దేశ వ్యాప్తంగా గవర్నమెంట్ ఆధ్వర్యంలో స్కూళ్లు, ఆసుపత్రులు, బస్సులు నడుపుతున్నారు.⇒ ఆ రోజు రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక గవర్నమెంట్ టీచింగ్ ఆస్పత్రిని తీసుకువచ్చాం. అంటే ప్రతి జిల్లాలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని తీసుకువచ్చాం. ఈ టీచింగ్ ఆస్పత్రుల్లో పనిచేసే ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పీజీ మెడికల్, ఎంబీబీఎస్ విద్యార్థులు, నర్సులు, వివిధ సేవలు చేసే వ్యక్తులు మెడికల్ కాలేజీలో అందుబాటులో ఉంటారు. అంతమంది అందుబాటులో ఉంటారు కాబట్టి పేదవాడికి మెరుగైన వైద్యం అందుతుంది. అలాంటి గొప్ప విప్లవాన్ని మన ప్రభుత్వంలో తీసుకువచ్చాం. ⇒ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉంటాయి. మన పిల్లలు చాలా మంది వైద్య విద్యను అభ్యసించే అవకాశం ఉంటుంది. మిగిలిన వారికి కూడా ప్రైవేట్తో పోలిస్తే తక్కువ రేటుకే సీట్లు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అందుబాటులో ఉంటాయి. ఇది రెండో అడ్వాంటేజ్. ఇలాంటి కార్యక్రమాన్ని.. చంద్రబాబు స్కామ్ల కోసం దుర్వినియోగం చేస్తూ.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు రూ.5 వేల కోట్లు ఖర్చు చేయలేక చేతులెత్తేశాడు. ⇒ రూ.8 వేల కోట్లతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మొదలుపెట్టి మన హయాంలోనే ఐదు మెడికల్ కాలేజీలను పూర్తి చేసి జాతికి అంకితం చేశాం. మరో రెండు కాలేజీలు పులివెందుల, పాడేరు చంద్రబాబు ప్రభుత్వం రాకముందే ప్రారంభోత్సవానికి సిద్ధం చేశాం. వాటికి కూడా అనుమతులు వచ్చాయి. దాదాపుగా 17 కాలేజీలను మనం మొదలుపెట్టి వాటిలో 7 కాలేజీలను పూర్తి చేయగలిగాం. ఇంకో రూ.5 వేల కోట్లు అంటే, ఏడాదికి రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేస్తే ఈ కాలేజీలన్నీ పూర్తి అవుతాయి కదా.. కానీ చంద్రబాబు అందుకు సిద్ధంగా లేరు. -
తాబేదారుల కోసమే మెడికల్ కాలేజీల పీపీపీ: బొత్స
సాక్షి, అమరావతి: ‘‘ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేట్కు అప్పగిస్తే వాళ్లేమైనా ఇంట్లో డబ్బులు తెచ్చి కాలేజీలు, ఆస్పత్రులను నిర్వహిస్తారా? ప్రజారోగ్యాన్ని ప్రైవేటు చేతుల్లో పెట్టడం అంటే పేదలకు ఉచిత వైద్యం అందకుండా చేయడమే’’ అని శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజారోగ్యాన్ని ప్రైవేటుపరం చేస్తే బాధ్యత వహించేది ఎవరు? అని ప్రభుత్వ తీరును సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దల స్వార్థం, వాళ్ల తాబేదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని దుయ్యబట్టారు. దీనిని నిరసిస్తూ వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించారు. ‘వైద్య కళాశాలల విషయంలో ప్రభుత్వ విధానం’పై బుధవారం శాసనమండలిలో జరిగిన స్వల్పకాలిక చర్చలో బొత్స మాట్లాడారు. ‘ప్రపంచంలో ఎక్కడైనా ప్రజారోగ్యం, విద్య ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నాయి. మన దగ్గర ఉన్న డబ్బు, బడ్జెట్తో ప్రజల ఆరోగ్యంతో ముడిపడిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కొలవడం చాలా దురదృష్టకరం. కోవిడ్ లాంటివి వస్తే పీపీపీ మోడ్లో ఉన్న ప్రైవేటు కళాశాలలు చూడవు. ప్రభుత్వ ఆస్పత్రులే దిక్కు. అందుకే విపత్కర పరిస్థితుల్లో ప్రతి జిల్లాలో ప్రభుత్వ కళాశాల ఉంటే, ప్రజలకు మెరుగైన వైద్యం దక్కుతుందని వైఎస్ జగన్ ఆలోచించారు. కానీ, దానిని కూటమి ప్రభుత్వం డబ్బుతో కొలుస్తోంది’’ అని తూర్పారపట్టారు. బాబుది ప్రైవేటు జపమే.. చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా ప్రైవేటీకరణతోనే మొదలుపెడతారని బొత్స దుయ్యబట్టారు. ఆయనకు ప్రభుత్వ సంస్థలంటే చిన్న చూపని చెప్పారు. విద్య, వైద్యం కమర్షియల్ కాదని ప్రజల ఆరోగ్యానికి సంబంధించినవని, వాటిని ప్రైవేటుపరం చేయడం తగదని పేర్కొన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీలోకి తీసుకెళ్తే చంద్రబాబు చరిత్ర హీనుడుగా మిగిలిపోతారని తెలిపారు. ప్రజారోగ్యంపై ఆమాత్రం ఖర్చు పెట్టలేరా? ‘‘ప్రజారోగ్యానికి రూ.10 వేల కోట్లు లేదంటే రూ.20 వేల కోట్లు అవుతాయి. ఆమాత్రం ఖర్చు పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? విద్య, వైద్యంలో మూడో వ్యక్తి ప్రమేయం ఉంటే అనర్థం. పేదలకు నష్టం కలిగే ఈ విధానానికి మా పార్టీ పూర్తిగా వ్యతిరేకం. దీనిపై ఎంతవరకైనా పోరాడతాం. ఏ సంస్థ తీసుకున్నా.. మేం అధికారంలోకి వచ్చాక రద్దు చేసి వెనక్కి తీసుకుంటాం’’ అని బొత్స స్పష్టం చేశారు. వాకౌట్ చేసి శాసన మండలి నుంచి బయటకు వస్తున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు కమర్షియల్.. సంక్షేమం మధ్య పోలికా? ‘‘పీపీపీ మోడ్ అంటే 33 ఏళ్లకు అద్దెకిస్తున్నాం అంటున్నారు. మరో 33 ఏళ్లకు వెసులుబాటు ఇచ్చారు. అంటే, 66 ఏళ్లు ప్రజారోగ్యాన్ని తాకట్టు పెట్టారు. అద్దె ఇంట్లో ఉన్నవాడు ఆ ఇంటిని ఎలా చూస్తాడు..? గంగవరం పోర్టుకు ప్రభుత్వాస్పత్రులకు పోలికా..? అవి కమర్షియల్ ప్రాపర్టీస్.. ఇవి ప్రజల ఆస్పత్రులు. భేషజాలకు పోకుండా.. ప్రజా శ్రేయస్సు, సంక్షేమం దృష్ట్యా మెడికల్ కాలేజీలను ప్రభుత్వ ఆ«దీనంలోనే నడపాలి’’ అని డిమాండ్ చేశారు.సభలో గందరగోళంతొలుత ఆరోగ్య మంత్రి సత్యకుమార్ చర్చను ప్రారంభిస్తూ దేశంలో హైవేలు, విద్యా సంస్థలు పీపీపీ మోడ్లోనే చేస్తున్నారన్నారు. ప్రైవేటీకరణ, పీపీపీకి తేడా తెలియకుండా మెడికల్ కాలేజీలపై వైఎస్సార్సీపీ వాళ్లు దుష్ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ సమయంలో సభ్యులకు పంచిన ప్రకటనలో లేనివారి పేర్లను ప్రస్తావించి ఆరోపణలతో సుదీర్ఘ ఉపన్యాసం చేయడంపై వైఎస్సార్సీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బొత్స స్పందిస్తూ... స్వల్పకాలిక చర్చలో సభ్యులు మాట్లాడాక మంత్రి ఎంతసేపు సమాధానం చెప్పినా తమకు అభ్యంతరం లేదన్నారు. దానికిముందే సుదీర్ఘ ప్రసంగంతో పేర్లు ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నారని, సభకిచి్చన ప్రకటనలో ఆ పేర్లు పెట్టి మాట్లాడాలని సూచించారు. దీంతో టీడీపీ సభ్యులు వెనక్కితగ్గారు.కన్నబిడ్డను పెంచలేమని అమ్ముకుంటారా?‘‘కావాల్సిన అనుమతులన్నీ వచ్చి నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలకు అప్పగించడం అంటే పుట్టిన బిడ్డను పెంచలేమని అమ్ముకోవడమే. ప్రజారోగ్యం బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకోవడమే’’ అని ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు దుయ్యబట్టారు. ‘వైద్య కళాశాలల విషయంలో ప్రభుత్వ విధానం’పై బుధవారం శాసన మండలిలో స్వల్పకాలిక చర్చలో వారు మాట్లాడారు. ‘‘రూ.లక్షల కోట్లతో రాజధాని అమరావతి నిర్మాణానికి సిద్ధమైన ప్రభుత్వం రూ.వేల కోట్ల ప్రజా సంపద అయిన వైద్య కళాశాలలను కాపాడలేదా? ఎవరి స్వార్థం.. ఎవరి జేబులు నింపేందుకు.. ఏ పెత్తందార్లకు దోచిపెట్టేందుకు పీపీపీని తీసుకొస్తున్నారు? నాణ్యమైన విద్య, వైద్యం ప్రజల హక్కు. ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత. దాన్నుంచి తప్పించుకునే ప్రభుత్వాన్ని ఏమనాలి?’’ అంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు దుయ్యబట్టారు. కుంభా రవిబాబు, పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, సిపాయి సుబ్ర మణ్యం, కల్పలత, ఇజ్రాయిల్, సూర్యనారాయణరాజు, మాధవరావు మాట్లాడుతూ మెడి కల్ కాలేజీల ప్రైవేటీకరణ సరికాదని పేర్కొన్నారు. దీనికి డబ్బులు లేవని సాకు చెప్పడం ఏమిటని విమర్శించారు. అమరావతిలో ఒక్క రోడ్డు ఖర్చు సాటి రాదు కదా అని ప్రశ్నించారు. -
కార్యకర్తలకు అండగా నిలబడతాం: వైఎస్ జగన్
రాష్ట్రంలో ఎక్కడ, ఎవరికి ఏ అన్యాయం జరిగినా డిజిటల్ బుక్లో నమోదు చేస్తాం. రెండు రకాలుగా ఈ డిజిటల్ బుక్ పని చేస్తుంది. ఒకటి డిజిటల్ బుక్ పోర్టల్లో ఫిర్యాదు చేయొచ్చు. ఫొటోలు, ఆధారాలు కూడా అప్లోడ్ చేయొచ్చు. రెండోది ఐవీఆర్ఎస్ విధానం. ఫోన్ నంబర్ 040–49171718 ద్వారా కూడా కార్యకర్తలు ఫిర్యాదు చేయొచ్చు. ఇవన్నీ డిజిటల్ బుక్లో రికార్డు అవుతాయి. రేపు మనం అధికారంలోకి రాగానే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని చట్టం ముందు నిలబెడతాం.చంద్రబాబు తన పాలనా వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదు కాబట్టి ప్రతిదీ డైవర్షన్ చేస్తున్నాడు. ఒక ఇష్యూ పెద్దది అవుతుందంటే చాలు.. దాన్ని బ్రేక్ చేయడం, డైవర్ట్ చేయడం.. ఆ టాపిక్ డైవర్ట్ చేసే క్రమంలో గుడులు, బడులు, రకరకాల ఆరోపణలు కనిపిస్తాయి. రకరకాల మనుషులపై బురద జల్లే పరిస్థితులు కనిపిస్తాయి. ఇలాంటి సమయంలో మీరంతా గట్టిగా నిలబడితే ఏ ఎన్నికలు వచ్చినా చంద్రబాబుకు డిపాజిట్లు కూడా రావు.–వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అండగా నిలబడతామని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు డిజిటల్ బుక్ అండగా ఉంటుందని చెప్పారు. డిజిటల్ బుక్లో నమోదు చేసిన అంశాల మీద రేపు మనం అధికారంలోకి వచ్చాక ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేయిస్తామని స్పష్టం చేశారు. ‘అన్యాయం చేసిన వాళ్లు రిటైర్ అయినా.. రాష్ట్రంలో లేకపోయినా.. సప్త సముద్రాల అవతల ఉన్నా అందరినీ పిలిపిస్తాం.. చట్టం ముందు నిలబెడతాం. తప్పు చేసిన వారికి శిక్ష పడేలా, ఈరోజు అన్యాయానికి గురైన వ్యక్తికి సంతోషం కలిగేలా అడుగులు వేస్తాం’ అని హామీ ఇచ్చారు. వాళ్లేదో రెడ్ బుక్ అంటున్నారని.. రేపు డిజిటల్ బుక్ ఎలా ఉంటుందో వాళ్లందరికీ అర్థం కావాలన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన అధ్యక్షతన జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వైఎస్సార్సీపీ డిజిటల్ బుక్ను వైఎస్ జగన్ ఆవిష్కరించారు. వైఎస్సార్సీపీని స్థాపించి 14 ఏళ్లయ్యిందని.. పార్టీ ఇంత బలంగా ఉండటానికి కారణం కార్యకర్తలేనని పునరుద్ఘాటించారు. మొన్న జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఒక్కటే ఒక వైపు.. మిగిలిన పార్టీలన్నీ మరో వైపు ఉన్నా, 40 శాతం ఓట్లతో మనం గట్టిగా నిలబడటానికి కార్యకర్తలే కారణమని స్పష్టం చేశారు. ‘ప్రతి కార్యకర్త డేటా నా దగ్గర ఉంటుంది. రేపు పార్టీ అధికారంలోకి వచ్చాక వాళ్లకు మంచి జరుగుతుంది. వారి ద్వారా ప్రజలకూ మేలు జరుగుతుంది. వారి చేతుల మీదుగానే ప్రజలకు ప్రభుత్వం నుంచి మంచి జరుగుతుంది’ అని తేల్చి చెప్పారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని డిసెంబర్ 15 నాటికి పూర్తి చేయాలని నేతలకు దిశా నిర్దేశం చేశారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..ప్రసంగిస్తున్న పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అనుబంధ విభాగాలు కీలకం ⇒ ఇప్పటికే పార్టీ ఆర్గనైజింగ్ థీమ్, స్ట్రక్చర్ను చూస్తే.. ఈ 16 నెలల్లోనే ఎంతో డెవలప్ చేశాం. రీజినల్ కో ఆర్డినేటర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పీఏసీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ అబ్జర్వర్లు ఉన్నారు. ప్రతి రెండు నియోజకవర్గాలకు పార్టీ రాష్ట్ర కార్యదర్శులను నియమించాం. నియోజకవర్గ ఇన్చార్జులు ఉన్నారు. వీరంతా జిల్లా కమిటీలు, మండల కమిటీలను బలోపేతం చేస్తూ అడుగులు వేస్తున్నారు. ⇒ వీరితో పాటు అనుబంధ విభాగాలు పని చేస్తున్నాయి. ఈ అనుబంధ విభాగాలను జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గాలకు, మండల స్థాయిలో అనుబంధ విభాగాల అధ్యక్షులు, వారికి సంబంధించిన కమిటీలు, గ్రామానికి సంబంధించి విలేజ్ కమిటీలతో పాటు ఏడు అనుబంధ విభాగాలను ఎంపిక చేసి బలోపేతం చేయాలి. వీరంతా కూడా ఎక్స్ అఫిషియో కింద గ్రామ కమిటీలో ఉంటారు.⇒ అలా కమిటీలు వేసుకున్న తర్వాత వాళ్లను మనం సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి. వీరందరికీ ఐడీ కార్డులు ఇచ్చే కార్యక్రమం చేపట్టాలి. ఎప్పుడైతే ఈ ఐడీ కార్డు వాళ్ల జేబుల్లోకి వెళ్తుందో.. వాళ్లందరి డేటా నా వద్ద ఉంటుంది. వాళ్లను సాక్షాత్తు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గుర్తిస్తున్నాడు. ⇒ ఈ రోజు గ్రామ స్థాయిలో పార్టీని లీడ్ చేసే వారిని.. రేపు మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుపెట్టి.. వారి ద్వారా ప్రజలకు మంచి చేసే కార్యక్రమం చేస్తాను. అందరికీ ఒకటే చెబుతున్నా. ముందు మీ నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయి కమిటీలు వేయండి. తర్వాత మండల స్థాయిలో కమిటీలు.. ఆ తర్వాత నియోజకవర్గ స్థాయిలో అనుబంధ కమిటీల అధ్యక్షులను నియమించండి. తర్వాత మండల స్థాయిలో అనుబంధ కమిటీల అధ్యక్షులను నియమించండి. వాళ్లు వాళ్ల కమిటీ సభ్యులను తీసుకుంటారు. వాళ్లను మీ పర్యవేక్షణలో గ్రామాలకు పంపించండి. ప్రతి గ్రామానికీ మీరు కూడా వెళ్లండి. ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ’ గురించి వివరించండి. వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశానికి హాజరైన పార్టీ నేతలు గ్రామ స్థాయిలో కమిటీల ఏర్పాటుకు టార్గెట్⇒ తుది దశలో గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పాటు కావాలి. ఆ గ్రామంలో ఎవరు రైతు అధ్యక్షుడు.. ఎవరు మహిళా అధ్యక్షురాలు.. ఎవరు స్టూడెంట్ విభాగం అధ్యక్షుడు.. ఎవరు సోషల్ మీడియా అధ్యక్షుడు.. ఎవరు బీసీ అధ్యక్షుడు.. ఎవరు ఎస్సీ అధ్యక్షుడు.. అనే పేర్లను ఎంపిక చేయండి. అనుబంధ సంఘాల అధ్యక్షులు వారి కమిటీ సభ్యులను ఎంపిక చేసుకోవాలి.⇒ తర్వాత పేర్లను ఎంట్రీ చేస్తే.. వారంతా మన డేటాలో రిజిస్టర్ అవుతారు. ప్రతి కార్యకర్తను ఆ రకంగా ఎంపవర్ చేయగలగాలి. ఆ స్థాయిలో మీరు బలపడ్డారంటే.. మీరు గ్రామంలోకి వెళ్లగానే యూత్ అధ్యక్షుడి పేరు చెబుతారు. స్టూడెంట్ అధ్యక్షుడి పేరు చెబుతారు.. బీసీ అధ్యక్షుడి పేరు చెబుతారు.. సోషల్ మీడియా అధ్యక్షుడి పేరు చెబుతారు.. ఎస్సీ అధ్యక్షుడి పేరు, రైతు అధ్యక్షుడి పేరు, మహిళా అధ్యక్షురాలి పేరు చెబుతారు. మొత్తంగా గ్రామ పార్టీ అధ్యక్షుడితో కలిపి ఎనిమిది మంది పేర్లు మీరు టక టకా చెప్పగలుగుతారు. ఇలా చెప్పగలిగితే మీరు ఎలక్షన్ ఇంజినీరింగ్ చేసినట్లే. ⇒ రేపు ఏ ఎన్నికలు వచ్చినా ఈ కమిటీలన్నీ చురుగ్గా పని చేస్తాయి. ఒక్క ఫోన్ కాల్తో పార్టీ ఇచ్చే మెసేజ్తో ఏ కార్యక్రమమైనా గ్రామంలో విసృ్త్తతంగా చేపట్టగలుగుతారు. ఆర్గనైజేషన్ అంటే ఇది. ఇప్పటికైనా మీరొక టైం పెట్టుకోండి. డిసెంబర్ 15 కల్లా నాకు వారి పేర్లు ఇవ్వండి. దీనివల్ల మీరే విన్ అవుతారు. గ్రామాల్లోకి వెళ్లగలుగుతారు. ప్రతి గ్రామంలో ఆర్గనైజేషన్ మీ ఆధ్వర్యంలో నిలబడుతుంది. డిజిటల్ బుక్ నమూనా కార్యకర్తలే పార్టీకి బలం⇒ మన పార్టీ ఆవిర్భవించి 14 సంవత్సరాలు అయ్యింది. మనది యంగ్ పార్టీ. ఈ స్థాయిలో ఉన్న పార్టీ దేశంలో ఎక్కడా ఉండకపోవచ్చు. ఈ 14 ఏళ్ల కాలంలో పార్టీని నడిపించింది, పార్టీ ఇంత బలంగా ఉండటానికి కారణం కార్యకర్తలే. ప్రతి కార్యకర్త పార్టీని భుజాన వేసుకోబట్టే మనం బలంగా ఉన్నాం. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా వైఎస్సార్సీపీ ఒక్కటే ఒక వైపు, మిగిలిన అన్ని పార్టీలూ మరో వైపు ఉన్నాయి. అయినా 40 శాతం ఓట్లతో గట్టిగా నిలబడ్డామంటే కార్యకర్తలే కారణం.⇒ ఈ రోజు మీ అందరికీ చెప్పాలనుకున్న విషయం కూడా ఇదే. నేను ఈ గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్తను.. ఈ గ్రామంలో నేను మహిళా విభాగం అధ్యక్షురాలిని.. ఈ గ్రామంలో నేను రైతు విభాగం అధ్యక్షుడిని.. యువత అధ్యక్షుడిని.. సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడిని.. ఈ గ్రామంలో నేను అనుబంధ విభాగం అధ్యక్షుడిని.. అంటూ గ్రామ స్థాయిలో మన పార్టీని ఓన్ చేసుకొని ఆ బాధ్యతలను భుజస్కందాలపై వేసుకొని వాళ్ల కమిటీలు వాళ్లే వేసుకుంటే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కాదు కదా.. వాళ్ల నాయన తలుచుకున్నా కూడా వైఎస్సార్సీపీపై పోటీకి పనికి రాకుండా పోతాడు. అలాంటి గుర్తింపు ఇవ్వాలి. ప్రతి అభ్యర్థీ గెలవాలన్నదే నా తాపత్రయం. ఈసారి కచ్చితంగా గెలవాలి.డిజిటల్ బుక్ ఆవిష్కరణ⇒ రాష్ట్రంలో అన్యాయానికి గురైన మన కార్యకర్తల కోసం మీ సమక్షంలో డిజిటల్ బుక్ను లాంచ్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కడ, ఎవరికి ఏ అన్యాయం జరిగినా ఈ డిజిటల్ బుక్లో నమోదు చేస్తాం. రెండు రకాలుగా ఈ డిజిటల్ బుక్ పని చేస్తుంది. ⇒ ఒకటి డిజిటల్ బుక్ పోర్టల్లో ఫిర్యాదు చేయొచ్చు. అందుకోసం వెబ్సైట్లోకి ఎంటరై మీ ఫోన్ నంబర్ టైప్ చేయగానే ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయగానే లొకేషన్, కెమెరా పర్మిషన్ అడుగుతుంది. పర్మిషన్ ఇవ్వగానే, మీకు జరిగిన అన్యాయాన్ని అడుగుతుంది. ఆధారాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేసేందుకు సౌలభ్యం ఉంటుంది. మీరు ఎంటర్ చేసిన డేటా.. ఆ డిజిటల్ బుక్లో స్టోర్ అవుతుంది. ఇది ఒక పద్ధతి. ⇒ రెండోది ఐవీఆర్ఎస్ విధానం. ఫోన్ నంబర్ 040–49171718 ద్వారా కూడా అన్యాయానికి గురైన వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఈ నంబర్కు ఫోన్ చేసి డిజిటల్ బుక్లో ఫిర్యాదు చేయొచ్చు. మీరు ఫోన్ చేసిన వెంటనే బీప్ సౌండ్ వస్తుంది. ఫోన్ చేసిన వారు తాము ఏ నియోజకవర్గం వారో చెప్పాలి. తర్వాత ఎవరి మీద ఫిర్యాదు చేస్తున్నారో, జరిగిన అన్యాయం ఏమిటో.. వివరాలు చెప్పాలి. ఆ విధంగా ఆ నంబర్కు ఫోన్ చేయగానే దశల వారీగా సమాచారం తీసుకుంటారు.