breaking news
YSRCP
-
విశ్వవ్యాప్తంగా వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకలు
సాక్షి, అమరావతి / నెట్వర్క్ : మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు సంబరాలు విశ్వవ్యాప్తంగా పలుచోట్ల ఘనంగా జరిగాయి. వైఎస్ జగన్ అభిమానులు, వివిధ దేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఎక్కడిక్కడ కేక్లు కట్ చేసి సంబరాలు జరిపారు. అనేకమంది వర్చువల్ విధానంలో సెలబ్రేషన్స్ నిర్వహించగా.. మరికొందరు జూమ్ కాలింగ్ వంటి విధానాల ద్వారా పుట్టిన రోజు వేడుకలతో సందడి చేశారు. పలుచోట్ల వైఎస్ జగన్ పాలనలో ముఖ్యఘట్టాల ప్రత్యేక ఆడియో విజువల్ ప్రదర్శనలు జరిగాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాలు (యూఎస్), అమెరికా ఆగ్నేయ ప్రాంతంలోని నార్త్ కరోలినా, కెనడా, సింగపూర్, ఆస్ట్రేలియా, కువైట్, న్యూజిలాండ్ తదితర దేశాల్లో అభిమానులు కేక్లు కట్చేసి, సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు షేర్ చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు.యూకేలో వేడుకలు వైఎస్సార్సీపీ యునైటెడ్ కింగ్డమ్ (యూకే) కమిటీ, వైఎస్సార్సీపీ మిడిల్స్బరో యూత్ ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్సార్సీపీ జనరల్ సెక్రటరీ(ఎన్ఆర్ఐ అఫైర్స్) డాక్టర్ ప్రదీప్ చింతా, వైఎస్సార్సీపీ యూకే కన్వీనర్ ఓబుల్రెడ్డి పాతకోట ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ డాక్టర్ ప్రదీప్ చింతా మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలను మూడు యూకే నగరాలైన కోవెంట్రీ , మిడిల్స్బరో, షెఫీల్డ్లలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమాలకు యూకే నలుమూలల నుండి జగన్ అభిమానులు హాజరయ్యారు. యూకేలోని ఎన్నారైలు శంతన్రెడ్డి, జానీ, వంశీ, రాజారెడ్డి, అనిల్, ఉదయ్, మధు, మిత్రుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి.ఫీనిక్స్, ఆరిజోనాలో..వైఎస్సార్సీపీ ఫీనిక్స్ ఎన్ఆర్ఐ కమిటీ ఆధ్వర్యంలో ఫీనిక్స్, అరిజోనాలలో మాజీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గ్లోబల్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ ఆలూరు సాంబశివరెడ్డి వర్చువల్గా ప్రారంభించారు. కేక్ కటింగ్ చేసి.. వైఎస్ జగన్ పాలనలో ముఖ్యఘట్టాల ప్రత్యేక ఆడియో విజువల్ విధానంలో ప్రదర్శించారు. కార్యక్రమాల్ని సోమశేఖర్రెడ్డి యర్రాపురెడ్డి, వంశీ ఎరువారం, చెన్నారెడ్డి మద్దూరి, ధీరజ్ పోలా, గురు, లక్ష్మి, శ్రీనివాస్గుప్తా, శ్రీధర్ లక్కిరెడ్డి, రుక్మన్, రమేష్, శ్రీనివాస్ మొల్లాల, అంజిరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, శ్రీనివాస్ మామిడి, విఘ్నేష్, కొండారెడ్డి, జగన్, రోహిత్ చెరుకుమిల్లి, జ్ఞానదీప్, అనుష, భవిష్య పర్యవేక్షించారు.న్యూజిలాండ్లోనూ.. వైఎస్సార్సీపీ న్యూజిలాండ్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. న్యూజిలాండ్లోని ఆక్లాండ్ నగరం ఫిక్లింగ్ కన్వెన్షన్ సెంటర్లో శనివారం రాత్రి జరిగిన వేడుకల్లో వివిధ ప్రాంతాల నుంచి ఎన్నారైలు పెద్దఎత్తున హాజరయ్యారు. కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ జూమ్ కాల్ ద్వారా ఏపీ వైఎస్సార్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్సార్సీపీ న్యూజిలాండ్ కమిటీ సభ్యులు ఆనంద్ ఎద్దుల, సమంత్ డేగపూడి, రమేష్ పానాటి, రాజారెడ్డి, గీతారెడ్డి, విజయ్ అల్లా, బాలశౌర్య, సంకీర్త్రెడ్డి, పార్థ పిల్ల, అమర్ ముదిమి, బాల బీరం, కృష్ణారెడ్డి, రఘునాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.యూరప్ దేశాల్లో సందడినెదర్లాండ్లోని వైఎస్సార్సీపీ యూరప్ యూనిట్ సభ్యులు, జర్మనీ, బెల్జియం, స్విట్జర్లాండ్ దేశాల్లో మాజీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఆదివారం సందడిగా సాగాయి. ఎయిండోవెన్లో వైఎస్సార్సీపీ జాతీయ అధికార ప్రతినిధి, యూరప్ కన్వీనర్ కార్తిక్ యల్లాప్రగడ, యూరప్ కోర్ టీమ్ ప్రతినిధులు సారథిరెడ్డి వంగా, కృష్ణతేజరెడ్డి గడ్డం, శ్రీనివాస్రెడ్డి సానికొమ్ము పాల్గొన్నారు. వేడుకలు నిర్వహించిన ప్రదేశాలన్నీ జైజగన్ నినాదాలతో మార్మోగాయి.సింగపూర్లో జగన్ వైబ్స్ సింగపూర్లో వైఎస్సార్సీపీ సింగపూర్ ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వర్యంలో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలను ఆదివారం నిర్వహించారు. జై జగన్ నినాదాల నడుమ కేక్ కట్ చేశారు. వైఎస్ జగన్ ఆయురారోగ్యాలు, నిండు నూరేళ్లు ఇవ్వాలని, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. కార్యక్రమానికి వైఎస్సార్సీపీ సింగపూర్ ఎన్ఆర్ఐ కన్వీనర్ దువ్వూరు మురళీకృష్ణ నేతృత్వం వహించగా.. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్నారై కో–ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి జూమ్ కాల్ ద్వారా హాజరయ్యారు. సింగపూర్ ఎన్ఆర్ఐ అడ్వైజర్ కొమ్మిరెడ్డి కోటిరెడ్డి, మలేషియా కన్వీనర్ విజయభాస్కర్రెడ్డి, మేడపాటి సందీప్, రామ్రెడ్డి, చంద్ర, సుహాస్, కిరణ్, సుధీర్, భాస్కర్, ప్రసాద్, పవన్, కుమార్, దొర హాజరయ్యారు.ఆస్ట్రేలియాలో..మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు వేడుకలు ఆస్ట్రేలియాలో సందడిగా సాగాయి. ఆస్ట్రేలియా ఎన్ఆర్ఐ వింగ్ ఆర్గనైజర్గా కిరణ్సాయి ప్రసన్ననాయుడు అక్కడి ఎన్ఆర్ఐ సహచరులతో కలిసి వైఎస్ జగన్ జన్మదిన కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.అరబ్ దేశాల్లోనూ సంబరాలుఅరబ్ దేశాలైన ఖతర్, కువైట్లలో ఆదివారం ఘనంగా వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. కేక్లు కట్ చేసి సంబరాలు జరిపారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎన్ఆర్ఐ విభాగం గ్లోబల్ కో–ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. జగనన్న పుట్టినరోజు సందర్భంగా ఖతర్లో రక్తదాన శిబిరం నిర్వహించామన్నారు. రక్తదానం చేసిన అందరికీ జగనన్న సంతకంతో ప్రశంసా పత్రాలను సాంబశివారెడ్డి అందజేశారు. కార్యక్రమంలో గల్ఫ్ కన్వీనర్ బీహెచ్ ఇలియాస్, కో–కన్వీనర్లు, అడ్వైజర్లు హాజరయ్యారు. కువైట్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. శనివారం షర్క్ బెనైదాల్ గార్ పిస్తా హౌస్ పక్కనున్న బ్లూమ్ హోటల్ బేస్మెంట్లో 600 మంది కువైట్ కమిటీ సభ్యుల నడుమ వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ గ్లోబల్ కన్వీనర్ ఎ.సాంబశివారెడ్డి కేక్ కట్చేశారు. వైఎస్ జగన్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో గల్ఫ్, కువైట్ కన్వీనర్లు ఇలియాస్ బి.హెచ్ ముమ్మడి బాలిరెడ్డి, గల్ఫ్ కో–కన్వీనర్ గోవిందు నాగరాజు, కువైట్ కో–కన్వీన్లు రమణ యాదవ్, మర్రి కళ్యాణ్, షా హుస్సేన్, గల్ఫ్ కోర్ కమిటీ సభ్యులు పులపత్తూరు సురేషష్రెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు ఎస్.లక్ష్మీప్రసాద్ యాదవ్, షేక్ రహంతుల్లా, షేక్ అప్సర్ అలీ, షేక్ యాసి, గల్ఫ్ అడ్వైజర్ ఎన్.మహేశ్వర్రెడ్డి, కో–కన్వీనర్ ఎం.చంద్రశేఖర్రెడ్డి, గల్ఫ్ కోర్ కమిటీ సభ్యుడు ఎన్.చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు. -
జగమంతా సంబరం
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు, ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఇచ్ఛాపురం నుంచి హిందూపురం వరకు ప్రతి గ్రామంలోనూ పండుగను తలపించేలా వేడుకలు జరుపుకొన్నారు. కేక్లు కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అన్ని నియోజకవర్గాల్లోనూ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు. పార్టీ జిల్లా, నియోజకవర్గ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాలకు అనూహ్య స్పందన వచ్చింది. యువత, స్థానిక ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేసి వైఎస్ జగన్పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. జిల్లా కేంద్రం నుంచి గ్రామాల వరకు అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. పేదలు, అనాథలకు దుస్తులు పంపిణీ చేశారు. వికలాంగులకు ట్రై సైకిళ్లు అందజేశారు. ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు, ఆహారం, కేక్లు పంచిపెట్టారు. మరోవైపు పలు ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి పేదలకు అవసరమైన పరీక్షలు చేసి మందులు అందించారు. నేత్ర వైద్య శిబిరాలు కూడా నిర్వహించారు. విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. యువతకు షటిల్, క్రికెట్ పోటీలు, రైతులకు ఎడ్ల బండ్ల పోటీలు నిర్వహించారు.ప్రత్యేక పూజలు.. పెద్ద ఎత్తున ర్యాలీలు..వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం ఉదయం నుంచే అభిమానులు, వైఎస్సార్సీపీ నాయకులు రాష్ట్రంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు, హోమాలు జరిపించారు. వైఎస్ జగన్ ఆయురారోగ్యాలతో ఉండాలని, 2029లో మళ్లీ సీఎం కావాలని వేడుకున్నారు. అదేవిధంగా చర్చిలు, మసీదుల్లో కూడా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి వైఎస్ జగన్ చల్లగా ఉండాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా పలు ప్రాంతాల్లో యువత భారీ బైక్ ర్యాలీలు నిర్వహించారు. ‘జై జగనన్న.. రావాలి జగనన్న.. కావాలి జగనన్న..’ అని నినదించారు. గ్రామాల్లో జరిగిన వేడుకల్లో రైతులు, మహిళలు స్వచ్ఛందంగా పాల్గొని వైఎస్ జగన్ పాలనలో తమకు కలిగిన లబ్ధి గురించి వివరించారు. ప్రస్తుతం చంద్రబాబు పాలనలో తాము ఎదుర్కొంటున్న కష్టాలను ఏకరువు పెట్టారు. ఇతర రాష్ట్రాలు.. దేశాల్లోనూ..జగన్ జన్మదిన వేడుకలను దేశ రాజధాని న్యూఢిల్లీతో పాటు తెలంగాణ, తమిళ నాడు, ఒడిశా రాష్ట్రాల్లోనూ అభిమానులు ఘనంగా నిర్వహించారు. అమెరికా, లండన్, సింగపూర్, ఆస్ట్రేలియా, కెనడా, ఇంగ్లండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఖతార్ సహా పలు దేశాల్లోనూ వైఎస్ జగన్ జన్మదిన వేడుకలను అభిమానులు వైభవంగా జరుపుకొన్నారు. గుజరాత్లోని మార్వాడి యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న తెలుగు విద్యార్థులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. సామాజిక మాధ్యమాల్లో జగనిజం వైఎస్ జగన్ పుట్టిన రోజు శుభాకాంక్షల పోస్టులతో సామాజిక మాధ్యమాలు హోరెత్తాయి. ఆదివారం ఆయన పుట్టిన రోజు పురస్కరించుకుని శనివారం నుంచే సోషల్ మీడియాలో ప్రజాభిమానం వెల్లువెత్తింది. ‘హ్యాపీ బర్త్డే వైఎస్ జగన్’ అంటూ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇతర మాధ్యమాల్లో వెల్లువెత్తిన పోస్టులు ట్రెండింగ్లో నిలిచాయి. అధిక వ్యూస్ సంపాదించాయి. ‘ఎక్స్’లో అయితే ‘హ్యాపీ బర్త్ డే వైఎస్ జగన్ హ్యాష్ట్యాగ్’ టాప్ ట్రెండింగ్గా నిలిచింది.మీ ప్రేమ, ఆప్యాయతలకు ఉప్పొంగిపోయా: వైఎస్ జగన్తన పుట్టిన రోజు సందర్భంగా బర్త్డే విషెస్ తెలిపిన అందరికీ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులు చూపిన ప్రేమ, ఆప్యాయతలకు ఉప్పొంగిపోయానని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రజలు, వైఎస్సార్సీపీ కటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ‘మీ అందరి మద్దతే నాకు గొప్ప బలం’ అని ఈ సందర్భంగా వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
జగన్ అంటే జనం.. జనం అంటే జగన్
ఆయన పేరు వింటే సంక్షేమం గుర్తుకొస్తుంది.. ఆయన పేరు వింటే పల్లె గడప పులకరిస్తుంది.. పట్టణ ముంగిట అభివృద్ధి పలకరిస్తుంది.. ఆ పేరు ఎందరికో స్ఫూర్తి.. మరెందరికో ఆ పేరే ఆస్తి.. ఆ పేరే వైఎస్ జగన్. గ్రామ, వార్డు సచివాలయాల సృష్టికర్త అతడే.. అభివృద్ధిని పరుగులు పెట్టించిన ఘనత అతడిదే.. సంక్షేమాన్ని గడపదాకా తీసుకొచ్చిన పేదింటి ముద్దుబిడ్డడతడు.. విద్యార్థులకు ముద్దుల మావయ్య అతడు.. అవ్వాతాతలకు అండగా నిలిచిన మనవడతడు.. అక్కచెల్లెమ్మలు మెచ్చిన నిండు సోదరుడతడే.. రైతన్నలకు ఆత్మబంధువూ అతడే..తెలుగునేల గర్వించదగ్గ నేతల్లో ఒకడు.. ఇలపై అత్యధిక ‘ఫ్యాన్’ ఫాలోయింగ్ కలిగిన లీడర్లలో ఒకడు. ఆయనే వైఎస్ జగన్మోహనుడు.బద్వేలు : వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల హృదయాల్లో చిర స్థాయిగా నిలిచిన నేతగా పేరు గడించారు. రాజకీయాల్లోకొచ్చిన దశాబ్ద కాలంలోనే వందేళ్ల అనుభవం సంపాదించిన నేతగా దేశ రాజకీయాల్లో తనదైన చెరగని ముద్ర వేసుకున్నారు. హస్తిన కోటను ఎదిరించిన వైఎస్ జగన్ రాజకీయ అనుభవం సంపాదించేందుకు నేరుగా ప్రజల వద్దకే తన అడుగుల సవ్వడులను మళ్లించాడు. అదే ప్రజా సంకల్పయాత్ర. 2017లో ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్లో మొదలైన ఈ సంకల్ప యాత్ర 3,648 కిలోమీటర్ల మేర సుదీర్ఘంగా సాగింది. ఈ సంకల్ప యాత్రలోనే రావాలి జగన్.. కావాలి జగన్ అనే నినాదంపురుడు పోసుకుంది. అదే సంకల్ప యాత్రలో తొమ్మిది ప్రజా సంక్షేమ పథకాలైన నవరత్నాలు రూపుదిద్దుకున్నాయి. పడిలేచిన కెరటం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కుమారుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన జగన్ పడిలేచిన కెరటంలా నిలిచాడు. ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టేనాటికే రాజకీయ గాలి చేదుగా ఉంది. నమ్మక ద్రోహుల కాలం నలుమూలలా వ్యాపించి ఉంది. గోతులు తీసే చేతులే కరచాలనం చేస్తున్నాయి. మంచివాశ్లనుకున్న వాల్లంతా మంచిని తుంచి రొట్టె ముక్కలా నమిలి మింగేస్తున్నారు. తండ్రి మరణించిన తరువాత పట్టుమని పదిరోజులు కూడా ఇంటి పట్టున ఉండలేదు. ప్రజల కోసం ప్రయాణం మొదలెట్టాడు. ప్రజల గుండె చప్పుడు వింటూ ముందుకు సాగాడు. సాగుతున్నంత సేపు ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు. ఎదురుదెబ్బలు తిన్నాడు.. అయినా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగాడు.. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించాడు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా .. 2014 నుంచి 2019 దాకా ఐదేళ్లు ప్రతిపక్షనేతగా ప్రజ ల పక్షాన పోరాడిన అనంతరం 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజ యం సాధించి అధికారం చేపట్టారు. ఆ క్షణం నుంచి సంక్షేమాన్ని.. అభివృద్ధిని జోడు గుర్రాల్లా పరుగులు పెట్టించారు. ప్రజా సంకల్ప యాత్రలో చెప్పినట్లుగానే మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్,వ్యవసాయానికి ఉచిత విద్యుత్,108 వాహనాలు తదితర పథకాలను పునర్జీవం చేయడమే గాకుండా మరింత గొప్పగా అమలు చేసి చూపించారు. అంతేనా గ్రామ, వార్డు సచివాలయాలు ప్రవేశపెట్టి రాష్ట్రంలోనే కొత్త పాలనకు నాంది పలికారు. నవరత్నాలతో సంక్షేమాన్ని పేదింటి గడపకే చేరవేశారు. ఇక కోవిడ్ సమయంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ సాహసోపేతమైన చర్యలు తీసుకున్నారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి,కమ్మ,ఆర్యవైశ్య,బ్రాహ్మణ,క్షత్రియ,వెలమలతో పాటు ఇతర ఓబీసీ సామాజిక వర్గాలకు ఈబీసీ నేస్తం కింద అర్హులందరికీ ఆర్థిక సహాయం అందించారు. జగనన్న వసతి దీవెన, అమ్మ ఒడి పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాలో నిధులు జమచేశారు. ఇక కడప గడపలో అనేక పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉపాధిబాట చూపించా రు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద లక్షలాదిమందికి ఆర్థిక సాయం చేసి మనసున్న మారాజుగా నిలిచిపోయారు. నేడు జన్మదిన వేడుకలు..వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆదివారం వైఎస్సార్ సీపీ శ్రేణులు, ఆయన అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్ధమయ్యారు.మళ్లీ జగనన్న పాలనే రావాలి ఈ చిత్రంలో కనిపిస్తున్న మల్లవత్తుల చిన్నచెన్నయ్య కుటుంబ సభ్యులు బద్వేలు పట్టణంలోని భావనారాయణనగర్లో నివసిస్తున్నారు. వీరికి గత 2019–2024 మధ్య కాలంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వివిధ రకాల సంక్షేమ పథకాల ద్వారా దాదాపు రూ.5,73,750లు లబ్ధి చేకూరింది. చిన్నచెన్నయ్యకు చేనేత పెన్షన్ కింద నెలకు రూ.4 వేలు చొప్పున రూ.2.40 లక్షలు, చెన్నయ్య భార్య చెన్నమ్మకు ఆసరా పథకం కింద ఏడాదికి రూ.18,750లు చొప్పున రూ.93,750లు, చెన్నయ్య కుమారుడు చెండ్రాయుడుకు నేతన్న నేస్తం పథకం కింద ఏడాదికి రూ.24 వేలు చొప్పున రూ.1.20 లక్షలు, చెన్నయ్య కోడలు వెంకటసుబ్బమ్మకు సున్నావడ్డీ కింద ఏడాదికి రూ.10 వేలు చొప్పున రూ.50 వేలు, చెన్నయ్య మనవడు చెన్నసాయికి అమ్మఒడి పథకం కింద రూ.70 వేలు అందింది. జగనన్న హయాంలో తమ కుటుంబానికి ఎంతో లబ్ధి చేకూరిందని, మళ్లీ ఆయన పాలనే రావాలని ఈ సందర్భంగా వారు కోరారు. –బద్వేలు అర్బన్ లీడర్ అంటే జగనే ఇంట్లోవాళ్లకు కష్టమొస్తే మనసు పడే బాధేంటో ఆ క్షణం తెలిసింది.. ఆ కష్టకాలంలో ‘నేనున్నానని’ జననేత భరోసా ఇచ్చినప్పుడు ‘లీడర్ అంటే వైఎస్ జగన్లా ఉండాలని’ ఆ రోజే తెలిసింది.. ఆయన మనసెంత గొప్పదో ఆ పూటే తెలిసింది.. ఇదీ ప్రొద్దుటూరుకు చెందిన సయ్యద్ కరీముల్లా కుటుంబ సభ్యుల మనోగతం. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో నివసిస్తున్న సయ్యద్ కరీముల్లాకు 2021లో లివర్ దెబ్బతింది. దీంతో ఆయన అప్పటి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డిని ఆశ్రయించారు. సమస్య తీవ్రతను గుర్తించిన రాచమల్లు సీఎంఓకి ఫోన్ చేశారు. కరీముల్లా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఒక్క రోజులోనే రూ.25లక్షలు (ఎల్ఓసీ) మంజూరు చేయగా ఆపరేషన్ విజయవంతమైంది. ‘మా కష్టాన్ని వినడమే కాదు.. నేనున్నానంటూ ఆదుకున్న మనసున్న లీడర్ వైఎస్ జగన్..’ అని కరీముల్లా సతీమణితోపాటు పిల్లలు కృతజ్ఞతలు తెలిపారు. అంతేనా ‘అల్లా ఉన్కో అచ్ఛా రఖే’ అంటూ చేతులెత్తి దువా చేశారు. – ప్రొద్దుటూరు మా కుటుంబానికి దేవుళ్లు వైఎస్సార్.. వైఎస్ జగన్ మా కుటుంబానికి దేవుళ్లు. 2004లో వైఎస్ సీఎం కాగానే మా నాన్నకి రూ.56వేలు రుణమాఫీ అయింది. దీంతో పాటు అప్పటి వరకూ ఉన్న వ్యవసాయ విద్యుత్ బకాయిలు రూ.6వేలు మాఫీ అయ్యా యి. ఆయన మరణాంతరం ఎలాంటి పథకం మా కుటుంబానికి అందలేదు. 2019లో వైఎస్ జగన్ సీఎం అయ్యాక మా కుటుంబానికి అమ్మఒడితో మొదలుకొని అన్ని పథకాలు వరుసగా వచ్చాయి. పంటల బీమా నష్ట పరిహారం రూ.66వేలు వచ్చింది. దీని తర్వాత ఇన్పుట్ సబ్సిడీ రూ.1.95లక్షలు వచ్చింది, రైతు భరోసా ప్రతి ఏటా పడింది.. నా భార్యకు రూ.50వేలు డ్వాక్రా రుణమాఫీ అయింది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో మా కుటుంబానికి రూ.5లక్షలు పైగా డబ్బులు అందాయి. వైఎస్సార్.. వైఎస్ జగన్ మా పాలిట దైవం. మళ్లీ జగనన్న సీఎం అయితే మా లాంటి ఎన్నో కుటుంబాలకు మేలు జరుగుతుంది. – పెసల కొండారెడ్డి, చియ్యపాడు, చాపాడు మండలంఎప్పటికీ రుణపడి ఉంటా..మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నా పాలిట దేవుడు. 2023లో విజయవాడ నుంచి పోరుమామిళ్లకు వస్తుండగా నా కారుకు యాక్సిడెంట్ అయింది. ఆపరేషన్లకు కోటి రూపాయలు ఖర్చవుతుందని డాక్టర్లు తెలిపారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. స్పందించిన ఆయన ఆస్పత్రిలో ఖర్చయ్యే మొత్తం రూ.70లక్షలు సీఎం సహాయ నిధి నుంచి ఇచ్చి నా ప్రాణాలను కాపాడాడు. జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటా. – డి.సత్యనారాయణరెడ్డి, జెడ్పీటీసీ, కాశినాయన మండలం, వైఎస్సార్ కడప -
తండ్రీ కొడుకులిద్దరిదీ ఓన్లీ పబ్లిసిటీ.. నో యాక్టివిటీ: వైఎస్ అవినాష్రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలో వాటర్ గ్రిడ్ పనులకు మళ్లీ శంకుస్థాపనకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నాడని వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి అన్నారు. ఈ పథకాన్ని వైఎస్ జగన్ సీఎంగా 50 శాతం పనులు పూర్తి చేశారు. అసలు ఆ వాటర్ గ్రిడ్ పథకాన్ని వీళ్లే కనిపెట్టినట్లు, దాన్ని వీళ్లే మంజూరు చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారని చంద్రబాబు ప్రభుత్వంపై అవినాష్రెడ్డి మండిపడ్డారు. పులివెందులలోని వైఎస్సార్ ఆడిటోరియంలో జరిగిన వైఎస్ జగన్ జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. కూటమి సర్కార్ తీరును ఎండగట్టారు.‘‘గూగుల్ డేటా సెంటర్ నుంచి అన్నింటిలో క్రెడిట్ చోరీ కార్యక్రమం పెట్టుకున్నారు. ఆ క్రెడిట్ చోరీలో భాగంగానే పులివెందులలో రూ.450 కోట్లతో జగన్ చేపట్టిన వాటర్ గ్రిడ్కు మళ్లీ శంకుస్థాపన చేస్తారట. ఎవరి హయాంలో ఏం అభివృద్ధి జరిగిందో పులివెందుల ప్రజలందరికీ తెలుసు. గతంలోనూ వైఎస్సార్ పూర్తి చేసిన చిత్రావతి, పైడిపాలెం రిజర్వాయర్లలను చంద్రబాబు క్రెడిట్ చోరీ చేశాడు..ఆనాడు చంద్రబాబు చేసిన ప్రారంభోత్సవాలకు నేనే స్వయంగా వెళ్లి వైఎస్సార్ ఏం చేశాడో చెప్పా.. ప్రజల్లో విపరీతమైన స్పందన వచ్చింది. వీళ్లు ఎన్ని కాకమ్మ కబుర్లు చెప్పినా ప్రజలకు అన్నీ తెలుసు.. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచిత పంటల బీమా ఒక హక్కుగా ప్రతి ఒక్కరికీ వచ్చేది. డిసెంబర్ 15 నాటికి వరి మినహా అన్ని పంటలకు బీమా గడువు పూర్తయ్యింది. ఈ ప్రభుత్వం రైతు బీమా చేసుకునేందుకు ఎటువంటి అవగాహన కార్యక్రమం చేపట్టలేదు...ఫలితంగా రైతులు బీమా ప్రీమియం కట్టుకోలేని పరిస్థితి నెలకొంది. రైతులు ప్రీమియం కట్టుకునేలే జనవరి 15వరకూ గడువును పెంచాలని నా డిమాండ్. ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకు వచ్చి బీమాపై స్పష్టత ఇవ్వాలి. చంద్రబాబు.. అమరావతి, 99 పైసలకే భూముల పందేరంలో బిజీగా ఉన్నాడు. అదేమన్నా అంటే సంపద సృష్టించాను అంటాడు. తండ్రీ కొడుకులిద్దరిదీ ఓన్లీ పబ్లిసిటీ...నో యాక్టివిటీ...విదేశాలకు వెళ్లి ఓ ఫోటో దిగి పచ్చ పత్రికల్లో వేయించుకుని చెమటోడుస్తున్నట్లు కలరింగ్ ఇస్తారు. ఇండిగో సంక్షోభంలో ఇలా క్రెడిట్ చోరీకి పాల్పడాలని అర్నాబ్ గోస్వామి వద్ద అడ్డంగా దొరికారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. వీరికి బుద్దిచెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి’’ అని అవినాష్రెడ్డి హెచ్చరించారు. -
కచ్చితంగా మళ్లీ అధికారంలోకి వస్తాం: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి భారీ కేక్ కట్ చేశారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మేయర్ భాగ్యలక్ష్మి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మురుగుడు హనుమంతరావు, కల్పలతారెడ్డి, దొంతిరెడ్డి వేమారెడ్డి, గౌతమ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఐదు దశాబ్దాల్లో జరగాల్సిన అభివృద్ధిని జగన్ ఐదేళ్లలోనే చేసి చూపించారని.. ఒక ప్రణాళికా బద్దంగా రూపొందిన విధానాలతోనే అది సాధ్యమైందన్నారు. ‘‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల ఆకాంక్ష తెలిసిన నేత జగన్. ప్రజల అభివృద్ధి కోసం పని చేసిన నేత. ప్రతి కుటుంబం తనదిగా భావించి వారి మేలు ఆశించారు. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే జగన్ పోరాటాలు చేస్తున్నారు’’ అని సజ్జల అన్నారు.‘‘2014లో అధికారంలోకి రాలేకపోయాం. నంద్యాల ఉప ఎన్నికలలో చంద్రబాబు చేయాల్సిన కుట్రలన్నీ చేశారు. అన్నీ ఛేదించుకుని 2019లో అధికారంలోకి వచ్చాం. మేనిఫెస్టోని ఖురాన్, బైబిల్, భగవద్గీత గా భావించిన నాయకుడు జగన్. ఐదేళ్ల తర్వాత మేనిస్టోని మళ్ళీ ప్రజల ముందుకు తీసుకెళ్లారు. ఇచ్చిన హామీలన్నీ అమలు వేశామో లేదో చెప్పమనిప్రజల్నే అడిగారు. మళ్ళీ అధికారంలోకి కచ్చితంగా వస్తాం. భారీ సీట్లతో గెలుస్తాం. ప్రజల్లో ఉండే నాయకుడు కాబట్టే జగన్కు ఆదరణ ఉంది’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. -
ఆ ఐదేళ్లు.. చరిత్రలో సువర్ణ అధ్యాయం
వైఎస్ జగన్.. రాజకీయాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన నేత. జన సంక్షేమమే లక్ష్యంగా.. అవినీతి రహిత, నిష్పాక్షికమైన పాలన అందించారాయన. కీలకమైన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులెన్నో తెచ్చారు. మరీ ముఖ్యంగా ప్రభుత్వ సేవలను ప్రతీ ఇంటి గడప దగ్గరకి చేర్చడం.. ఆయన్ని అందరివాడిగా మార్చేసింది. అలా జగన్ హయాంలో అన్ని వర్గాల ప్రజల్లో ఒక భరోసా కనిపించేది..ఇచ్చిన మాటకు కట్టుబడటం.. దానిని నిలబెట్టుకోవడం.. విలువలు, విశ్వసనీయత వైఎస్ జగన్ నైజం. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పాలన చేశారు. వైఎస్ జగన్ పాలనలో సంక్షేమ పథకాల ద్వారా రూ.2.70 లక్షల కోట్లను పేదల ఖాతాల్లో జమ చేశారు. ఓ వైపు భారీ ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే మరోవైపు విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చారు.(డిసెంబర్ 21వ తేదీ) నాడు జననేత జగనన్న పుట్టినరోజు సందర్భంగా ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలూ, సంక్షేమ ఫలాలను అభిమానులు, ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఎటువంటి సంక్షేమం అందక పేద, బడుగు, బలహీన వర్గాల వారు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కూటమి పాలన నుంచి విముక్తి కలిగి మళ్లీ జగనన్న రాజ్యం రావాలంటూ కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు.వ్యవసాయరంగాన్ని పండగ చేశారు..రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. అన్నదాతలకు వైఎస్ జగన్ అండగా నిలిచారు. వ్యవసాయరంగాన్ని పండగ చేసి చూపించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు పెద్దపీట వేశారు. ఐదేళ్లలో రైతుల రైతుల సంక్షేమం కోసం రూ.1,84,567 కోట్లు ఖర్చుచేసింది. రైతు భరోసా పథకంతో పెట్టబడి సాయం అందించి.. అందరికీ అన్నంపెట్టే రైతన్నకు వైఎస్ జగన్ తోడుగా నిలిచారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులపై ఆర్థిక భారం పడనీయకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం అమలు చేసింది. ప్రభుత్వమే ప్రీమియం భారాన్ని భరించింది. వైఎస్సార్ సున్నావడ్డీ రాయితీ, పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్, రైతు భరోసా కేంద్రాలు, ఇన్ ఫుట్ సబ్సిడీ, యంత్ర సేవా కేంద్రాలు, వైఎస్సార్ అగ్రిలాబ్స్, వైఎస్సార్ పశు సంరక్షణ, జగనన్న పాల వెల్లువతో అన్నదాతకు అభయం ఇచ్చారు.ప్రజారోగ్య ముఖచిత్రాన్ని మార్చేశారు..డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా రాష్ట్రంలోని ప్రజారోగ్య ముఖచిత్రాన్నే వైఎస్ జగన్ మార్చేశారు. గ్రామస్థాయికి ప్రభుత్వ వైద్యసేవలను విస్తరించారు. ఆరోగ్యశ్రీని బలోపేతం చేశారు. 108,104 సేవలు, గిరి పుత్రులకు బైక్ అంబులెన్స్లు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష, 17 కొత్త మెడికల్ కాలేజీలు, వైఎస్సార్ కంటి వెలుగు, తల్లీ బిడ్డ ఎక్స్ప్రెస్, డాక్టర్ వైఎస్సార్ టెలీ మెడిసిన్ వంటి విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. కోవిడ్ విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొని దేశానికే ఆదర్శంగా వైఎస్ జగన్ ప్రభుత్వం నిలిచింది. ఉద్దానం కిడ్నీ వ్యాధుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ.. రూ.785 కోట్లతో వైఎస్సార్ సుజల ధార మంచినీటి ప్రాజెక్ట్, పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్-సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్శించారు.చదువుల విప్లవం..విద్యారంగంలో కేవలం సంస్కరణల కోసమే రూ.73 వేల కోట్లు ఖర్చు చేసిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానికే దక్కింది. నాడు-నేడు, ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ క్లాస్ రూమ్ లు, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు, అమ్మ ఒడి, గోరు ముద్ద, విద్యాకానుక, విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన వంటి పథకాలతో విద్యారంగం స్థితిగతులనే వైఎస్ జగన్ మార్చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చాక విద్యా రంగాన్ని అత్యంత ప్రాధాన్యత రంగాల్లో ఒకటిగా గుర్తించింది. ఈ నేపథ్యంలో దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.ముఖ్యంగా ‘ఆర్థిక సమస్యలతో ఏ పేదింటి బిడ్డ చదువు ఆగిపోకూడదు.. వారు బాగా చదవాలి, అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇంగ్లిష్ మీడియంలో చదువుకుని వారంతా ఉన్నతంగా ఎదగాలన్నది వైఎస్ జగన్ ఆకాంక్ష. అంతకు ముందు టీడీపీ ప్రభుత్వంలో సౌకర్యాలకు దూరమై కునారిల్లిన ప్రభుత్వ బడులకు జవసత్వాలు కల్పించి వాటిని కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా పరుగులు పెట్టించారు. వైఎస్ జగన్ ప్రభుత్వ చర్యలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు అంతకుముందెన్నడూ లేని రీతిలో పెరిగాయి. వివిధ రాష్ట్రాలు, దేశాలు, ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంక్లాంటి సంస్థలు ఏపీ విద్యా సంస్కరణలపై ప్రశంసలు కురిపించారు.దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా..వైఎస్సార్సీపీ పాలనలో అక్క చెల్లెమ్మలకు.. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అక్క చెల్లెమ్మలకు డీబీటీ, నాన్ డీబీటీ కింద రూ. 2,83,866 కోట్లు అందించారు. కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరికి వైఎస్ జగన్ ప్రభుత్వం తోడుగా నిలిచింది. మహిళా సాధికారితే లక్ష్యంగా 33.15 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు వైఎస్ జగన్ హయాంలో ప్రతి ఏటా రూ.18,750 చొప్పున 4 విడతల్లో రూ.75 వేలు అందించారు. రూ.19,189 కోట్లు ప్రభుత్వం అందించింది. వైఎస్సార్ కాపునేస్తం ద్వారా అక్కచెల్లెమ్మలకు గత ఐదేళ్ల పాలనలో రూ.2030 కోట్లు లబ్ధి కలిగింది.వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా అగ్రవర్ణాల పేద అక్కచెల్లెమ్మలకు ప్రభుత్వం చేదోడుగా నిలిచింది. ఐదేళ్ల పాలనలో రూ.1.05 లక్షల లబ్దిపొందారు. వైఎస్సార్ చేయూత, ఆసరాతో లక్షలాది మంది మహిళలకు వైఎస్ జగన్ అన్నలా నిలిచారు. ఈ పథకాల ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపారు. చంద్రబాబు హయాంలో కుదేలైన పొదుపు సంఘాలకు తిరిగి జీవం పోశారు. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 16,44,029 మంది మహిళలకు లబ్ధి కలిగింది.అవ్వాతాతల ముఖాల్లో చిరునవ్వు..వైఎస్ జగన్ తాను అధికారంలోకి వచ్చిన వెంటనే అవ్వాతాతల పట్ల మానవత్వాన్ని కనబరుస్తూ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలోనే విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ప్రతి నెలా ఒకటో తేదీన సూర్యోదయానికి ముందే అవ్వా తాతలు, ఒంటరి మహిళలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు.. ఇలాంటి లక్షలాది మందికి వారి ఇంటికే వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపి, వారి జీవితాల్లో వెలుగులు నింపారు.అన్ని వర్గాలకూ..వైఎస్సార్ వాహన మిత్ర, లా నేస్తం.. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా, వైఎస్సార్ మత్స్యకార భరోసా, వైఎస్సార్ నేతన్న నేస్తం, జగనన్న తోడు పథకం.. ఇలా ఎన్నో పథకాలను వైఎస్ జగన్ అమలు చేశారు. సంక్షేమం అంటే మంచి.. వైఎస్ జగన్ పాలనలో అదే జరిగింది. అన్ని వర్గాలకూ పథకాలు అందాయి. సామాజిక న్యాయం, సంక్షేమమే ప్రధాన కర్తవ్యంగా వైఎస్ జగన్ సుపరిపాలన అందించారు.కోవిడ్లోనూ సంక్షేమం..కోవిడ్ సమయంలో సీఎం జగన్ చేపట్టిన చర్యల వల్ల ఇతర రాష్ట్రాలతో పోల్చితే మరణాలు తక్కువ. విపత్కర పరిస్థితులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంది. కోవిడ్తో ఆదాయం అడుగంటినా సామాన్యుల కష్టాలే ఎక్కువని భావించిన వైఎస్ జగన్ 2021లో ఏ ఒక్క పథకాన్ని ఆపకుండా నిరాటంకంగా అమలు చేశారు. సంక్షోభంలో పేదలను గట్టెక్కించారు. ముందుగా ప్రకటించిన సంక్షేమ క్యాలెండర్ను అనుసరిస్తూ మాట ప్రకారం పథకాలను అమలు చేశారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతిలోనూ రైతులతో పాటు అన్ని వర్గాలను ఆదుకున్న ఘనత ఈ ప్రభుత్వానికే దక్కింది. కోవిడ్పై పోరులో సచివాలయ వ్యవస్థ కీలకంగా నిలిచింది. ముందుచూపుతో అందుబాటులోకి తెచ్చిన సచివాలయాల వ్యవస్థ ద్వారా కోవిడ్ మహమ్మారిని వైఎస్ జగన్ ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంది.అభివృద్ధి పరుగులు..'అభివృద్ధి' అంటే ఏమిటో వైఎస్ జగన్ చేసి చూపించారు. అభివృద్ధి పరుగులు తీయించారు. సీఎం అయిన ఆరు నెలల్లోనే గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి 1.34 లక్షల ఉద్యోగాలిచ్చారు. 58 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారు. 2.60 లక్షల మంది వలంటీర్లను నియమించారు. 17 మెడికల్ కాలేజీలు, నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, పేదలందరికీ ఇళ్ల నిర్మాణం చేపట్టారు.వైఎస్ జగన్ హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశంలో రాష్ట్రం ఏటా అగ్రగామిగా నిలిచింది. 59 నెలల్లో రూ.1.02 లక్షల కోట్లు పారిశ్రామిక పెట్టుబడుల రూపంలో రాష్ట్రానికి వచ్చాయి. స్పష్టమైన విధానాలు, ప్రోత్సాహకాలు, పక్కా ప్రణాళికతో వైఎస్ జగన్ ప్రభుత్వంలో రాష్ట్రంలో పెట్టుబడులు వెల్లువెత్తాయి. అనేక పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వేలాది మందికి ఉపాధి లభించింది. కోవిడ్ సృష్టించిన సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక రంగం దెబ్బతిన్న సమయంలోనూ రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం పరిశ్రమలు నిలదొక్కుకొనేలా చర్యలు చేపట్టింది. ప్రోత్సాహకాలతో పారిశ్రామిక రంగాన్ని ఆదుకొంది. -
#HBDYSJagan: సంక్షేమ సారథి.. అభివృద్ధి వారధి
నేడు జనహృదయ నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు. రాష్ట్రవ్యాప్తంగా వాడవాడలా బర్త్డే వేడుకలు నిర్వహించడానికి వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు సిద్ధమయ్యారు. -
జగనన్నకు జేజేలు
సాక్షి, అమరావతి, సాక్షి, నెట్వర్క్: ఈ నెల 21న వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా శనివారం ముందస్తు వేడుకలు నిర్వహించాయి. పలుచోట్ల రక్తదాన, వైద్య శిబిరాలు నిర్వహించి సేవా సందేశాన్ని చాటాయి. అనంతపురంలోని అంబేడ్కర్ నగర్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఎస్కే యూనివర్సిటీలో వైఎస్సార్సీపీ యువజన, విద్యార్థి విభాగాల నేతలు వేడుకలు నిర్వహించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. గాజువాక, పాడేరు, అనకాపల్లిసహా పలు ప్రాంతాల్లో కేక్ కటింగ్తో పాటు చీరల పంపిణీ, రక్తదాన, వైద్య శిబిరాలు నిర్వహించారు. పాడేరులో అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణ మహిళా అధ్యక్షురాలు, మాజీ కౌన్సిలర్ దర్శి విజయశ్రీ ఆధ్వర్యంలో వైఎస్ జగన్ ముందస్తు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా వైఎస్సార్సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి పాల్గొన్నారు. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం ఎంపీపీ దెందుకూరి సీతారామరాజు ఆధ్వర్యంలో వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహíÜ్తలో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. చిత్తూరు జిల్లా నగరి మండలంలోని సుందరమ్మ కండ్రిగ గ్రామంలో చీరలు పంపిణీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. తిరువూరు ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో పలు కళాశాలల విద్యార్థులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలు 200 మందికి పైగా రక్తదానం చేశారు. నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి నల్లగట్ల స్వామిదాసు శిబిరాన్ని ప్రారంభించారు. బెంగళూరు వైఎస్సార్సీపీ ఐటీ విభాగం మెగా క్రికెట్ టోర్నమెంట్ను శనివారం ప్రారంభించింది. బెంగళూరు నగర శివార్లలోని చేతన క్రికెట్ గ్రౌండ్స్లో ప్రారంభమైన ఈ టోర్నమెంట్లో పాల్గొనేందుకు వందలాది మంది తరలివచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్పై రూపొందించిన పాటలకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు ఆడిపాడారు. న్యూజిలాండ్లోని ఆక్లాండ్ నగరం ఫిక్లింగ్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన వైఎస్ జగన్ ముందస్తు జన్మదిన వేడుకల్లో ఆయా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎన్నారైలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జనం ఎల్లప్పుడూ వైఎస్ జగన్ వెంటే..: వైఎస్సార్సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల అధికారంలో ఉన్నా లేకపోయినా జనం ఎప్పుడూ వైఎస్ జగన్ వెంటే ఉంటారని.. ప్రజలకు మేలు చేయాలన్న ఆయన సంకల్పమే ఇందుకు కారణమని వైఎస్సార్సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. కుంచనపల్లిలో శనివారం జరిగిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకల్లో ఆయన పాల్గొని భారీ కేక్ కట్ చేశారు. వైఎస్ జగన్ హయాంలో అమలైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ఫ్లెక్సీల ప్రదర్శనను ఆయన ఈ సందర్భంగా తిలకించారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు దొంతిరెడ్డి వేమారెడ్డి, అన్నాబత్తుని శివకుమార్, అంబటి మురళి తదితర నాయకులు పాల్గొన్నారు. 40 వేల చదరపు అడుగల భారీ ఫ్లెక్సీ రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా వైఎస్సార్సీపీ శ్రేణులు గోదావరి నది మధ్యలోని బ్రిడ్జి లంక వద్ద వినూత్నంగా ముందస్తు వేడుకలు నిర్వహించారు. 40 వేల చదరపు అడుగుల భారీ ఫ్లెక్సీతో పాటు.. బోట్లపై చేరిన అభిమానులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కంటే వినయ్తేజ ఆధ్వర్యంలో చేపట్టగా, జక్కంపూడి రాజా పాల్గొని అభినందించారు. -
రాష్ట్రంలో స్కూళ్ల తలరాత మారింది
అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం గాదెల పంచాయతీ పరిధిలోని తల్లెంవారిపల్లె అటవీ శివారు గ్రామం. 500 ఇళ్లున్న ఈ గ్రామం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చే దాకా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. ప్రభుత్వ భవనం అంటూ ఒక్కటీ ఉండేది కాదు. 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం రాగానే ఆ ఊరు రూపురేఖలు ఒక్కసారిగా మారిపోయాయి. అభివృద్ధి పనులు పరుగులు తీశాయి. గ్రామంలోకి అడుగు పెట్టగానే గ్రామ సచివాలయ భవనం అందంగా కనిపిస్తుంది. దానికి కొంచెం దూరంలో సకల సౌకర్యాలతో నాడు–నేడు కింద కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా హైస్కూల్ ఏర్పాటు అయ్యింది. నగరాలు, పట్టణాల్లో ఉండే స్కూళ్లను మరిపిస్తూ రూపు దిద్దుకున్న ఈ స్కూల్లో ఇప్పుడు తల్లెంవారిపల్లెతో పాటు గాదెల పంచాయతీలోని ఎస్సీ కాలనీ, ఎస్టీ కాలనీ, అరుంధతివాడ, కొత్తపల్లి అరుంధతివాడ, కొత్తపల్లి దళితవాడలతో పాటు జీవీ పురం, నూకనపల్లె, కిష్టంపల్లె గ్రామాల నుంచి పిల్లలు వచ్చి చదువుకుంటున్నారు.పాములేరు వంకపై పాఠశాల రక్షణ గోడ సైతం నిర్మించారు. అన్నదాతలను అన్ని విషయాల్లో చేయి పట్టుకుని నడిపించే రైతు భరోసా కేంద్రం వెలిసింది. చుట్టుపక్క గ్రామాల ప్రజలకు నాణ్యమైన విద్యుత్తు అందించేందుకు విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటైంది. తల్లెంవారిపల్లె–కొత్తపల్లె, జీవీపురం–తల్లెంవారిపల్లె గ్రామాలకు సిమెంట్ రోడ్డు నిర్మించారు. ఇలా తక్కువ సమయంలో గ్రామం అభివృద్ధిపథంలో దూసుకెళ్లింది. ఎంతలో ఎంత మార్పు.. అని గ్రామస్తులు వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనను గుర్తు చేసుకుంటున్నారు. – ఓబులవారిపల్లె -
ఎదురుగాలికి ఎదురొడ్డి నిలిచి...
నేడు ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు. ప్రజా జీవితంలో ఉన్న ఒక నాయకుడి గురించి మాట్లాడుకోవడానికి ఇది సరైన రోజు. తెలుగు ప్రజలను అత్యంత ప్రభావితం చేస్తున్న రాజ కీయ నేత ఆయన. వైఎస్సార్ రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్ అసాధారణ నాయకత్వ లక్ష ణాలు కలిగి, విలువల కోసం తపించే నేతగా తెలుగు ప్రజలను ప్రభావితం చేస్తున్నారు. జగన్ రాజకీయంగా వేసిన తొలి అడుగు నుంచి 2019 ఎన్నికల్లో విజయం సాధించే వరకు ప్రతి అడుగు అనేక ఆటంకా లను అధిగమించింది. 2019 ఎన్నికల్లో విజయం సాధించే వరకు అసలు జగన్ రాజకీయాల్లో నిలబడగలడా అన్న అనుమానం కలిగే విధంగా ప్రతికూల పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఒక వైపు అధికార కాంగ్రెస్, రెండవ వైపు ప్రతిపక్ష తెలుగుదేశం – పేరుకు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నా... జగన్ విషయంలో ఏకమై నాయి. అదెంతగా అంటే అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాసం తీర్మానం పెడితే విపక్ష స్థానంలో ఉన్న తెలుగుదేశం విప్ జారీ చేసి మరీ అధికార పార్టీకి అనుకూలంగా ఓటు వేసింది. ఈ పరిణామం బహుశా భారతదేశ రాజకీయాలలో అరుదైన ఘటన. అప్పుడే రాజకీయ ప్రవేశం చేసిన ‘ప్రజా రాజ్యం’ కూడా జగన్కు వ్యతిరేకంగా అధికార కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యింది. పార్టీగా ముందుకు సాగుతున్న దశలో 16 నెలలు జైలులో ఉండాల్సిన పరిస్థితి మరోవైపు దాపురించింది. ఒక్క రాజశేఖర్ రెడ్డి కుమారుడు అన్న అంశం తప్ప చుట్టూ అన్నీ ప్రతికూల పరిస్థితులే. వైఎస్సార్ సాధించి పెట్టిన వెలకట్టలేని ‘ప్రజాభిమానం’ అన్న ఆయుధాన్ని చేపట్టి ‘ఏమైనా సరే నిల బడాల్సిందే, చావో రేవో తేల్చుకోవాల్సిందే’ అని ఆయన చేసిన సుదీర్ఘ రాజకీయ పోరాటం తిరుగులేని నాయకుడిగా, జనం మెచ్చిన నేతగా ఆయన్ని మార్చింది. నాడు జగన్పై నమోదు అయిన సీబీఐ కేసులను నిశితంగా పరిశీలిస్తే... ఆయన్ని వీలైనన్ని ఎక్కువ రోజులు జైలులో పెడితే పురిటిలోనే పార్టీ మట్టిగొట్టుకు పోతుందన్న వ్యూహం కనిపి స్తుంది. ఈ పరిస్థితుల్లో మరో నాయకుడైతే ఏదో ఒక స్థాయిలో రాజీపడి ఉండేవారు. కానీ జగన్ మొండిగా ప్రజలను నమ్ము కుని ముందుకు సాగారు. అందు వల్లే ఆయన రాజకీయంగా హీరోగా, పోరాట యోధుడిగా మారారు. తొలి ఎన్నికల్లో సంపూర్ణ విజయం దక్కక పోయినా నిలదొక్కుకున్నారు. 2014 నుంచి 2019 ఎన్నికల్లో విజయం సాధించే వరకు పోరాటాలు విస్తృతంగా నిర్వహించారు. ‘ప్రజా సంకల్ప యాత్ర’తో పార్టీని విజయం వైపు నడిపారు. ఎన్నికల హామీల అమలుకు విశ్వసనీయతజగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత తన మ్యానిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించి అమలు చేశారు. అదే సమయంలో రాష్ట్ర విస్తృత ప్రయోజనాల ప్రాతిపదికన పరిపాలనా ప్రాథమ్యా లను నిర్ణయించుకున్నారు. ప్రజల ముంగిటకు పాలన తీసుకు వెళ్లడం కోసం గ్రామ ‘సచివాలయ’ వ్యవస్థను సృష్టించి 1.30 లక్షల శాశ్వత ఉద్యోగులు, 2.7 లక్షల వాలంటీర్లను నియమించారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల్లో సైతం విప్లవం తెచ్చారు. ‘కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, ఆఖరికి రాజకీయాలు చూడం... అర్హత ఉంటే చాలు ప్రతి పేదవాడికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు’ అంటూ అందరినీ ఆదుకున్న చరిత్ర, సమానంగా ఆదరించిన ఘనత జగన్ది. ఎన్నికల్లో ప్రజలకు హామీ ఇచ్చి అధికా రంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీల అమలుకు ఉన్న పరి మితులు చెప్పడం రాజకీయాల్లో సహజం. కానీ జగన్ అందుకు భిన్నంగా తాను ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం ఏకంగా ఓ వ్యవస్థనే సృష్టించారు. ప్రతి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీ లను మరిచిపోవడం సాధారణమైన రోజుల్లో... జగన్ అందుకు భిన్నంగా ‘గడప గడపకూ మీ ప్రభుత్వం’ కార్యక్రమం పేరుతో ఇచ్చిన హామీలను నెరవేర్చిన సంగతిని ప్రజ లకు గుర్తు చేస్తూ... పాలన చేయడం ఒక సాహసం.అభివృద్ధి–దూరదృష్టి మేళవించిన విజనరీ మెజారిటీ ప్రజలకు తమ అవసరాలు తీరడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇంటి వద్దకు తీసుకుపోవడం ఒక గొప్ప ప్రయత్నం. అధికార వికేంద్రీకరణకు మంచి ఉదాహరణ. గ్రామ ‘సచివాలయ వ్యవస్థ’, ‘ఆర్బీకే’, ‘విలేజ్ క్లినిక్లు’, ‘ఫ్యామిలీ డాక్టర్’ వంటి అనేక వ్యవస్థలు గ్రామంలోనే అన్ని అవసరాలూ తీర్చేలా రూపొందాయి. ‘నాడు–నేడు’ పేరుతో ప్రభుత్వ పాఠ శాలలు ఆధునీకరించడం, పట్టణాలకే పరిమితం అయిన ఆంగ్ల బోధనను గ్రామీణ స్థాయికి తీసుకు రావడం ద్వారా... పేద మధ్యతరగతి విద్యార్థులకు కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ను అందించారు. పోర్టులు, షిపింగ్ హార్బర్ల ఏర్పాటు; ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పేరుతో 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ సారథ్యంలో నెలకొల్పడం వంటివి ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి బలమైన పునాదులు వేశాయి. కరోనా సమయంలో జనం అతలాకుతలం అవడానికి ఒక ముఖ్యమైన కారణం ఆధునిక వైద్యం ప్రధాన పట్టణాలకు పరిమితం కావడం. అందుకే ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, దానికి అనుబంధంగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తే ప్రజలకు అందుబాటులో మెరుగైన వైద్య సేవలందించ వచ్చని ఆయన భావించి, వాటి నిర్మాణం చేపట్టారు. మొత్తంగా ఆయన వ్యవహార శైలిని పరిశీలిస్తే... ప్రజలకు ఏదో చేయాలి అన్న తపన, అందుకోసం ఎంత సాహసం చేయడానికైనా వెనుకాడనితనం కనిపిస్తుంది. ఈ వ్యవహార శైలితోనే తన తండ్రి రాజశేఖర్ రెడ్డికి తగ్గ వారసుడిగా తెలుగు ప్రజల మధ్య నిలబడ్డారు. ఆయన జన్మదినం సందర్భంగా హృదయ పూర్వక శుభాకాంక్షలు.మాకిరెడ్డి పురుషోత్తమ్రెడ్డి వ్యాసకర్త రాయలసీమ మేధావుల ఫోరమ్సమన్వయ కర్త -
అనితర సాధ్యుడు
ధరిత్రిలో చరిత్ర సృష్టించేవాళ్ళు కొందరే ఉంటారు. వారి వల్ల కాలానికి ఓ గుర్తింపు వస్తుంది. కాలం కలకాలం వారిని గుర్తుంచుకుంటుంది. సమ కాలీన భారత రాజకీయ చరిత్రలో పదహారేళ్ల క్రితం ఓ ఉత్తుంగ తరంగం ఎగిసింది. హిమాలయ శృంగ సమా నమై నిలిచింది. ఆ తరంగం పేరే వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి. మన మాజీ ముఖ్యమంత్రి. ప్రజలు ముద్దుగా, గౌరవంగా, ఆత్మీయంగా పిలుచుకునేది ‘జగన్’ అని! ఒక ఆశ్చర్యం, ఒక అద్భుతం, ఒక కఠోర శ్రమ, ఒక నిరంతర దీక్ష, ఒక పట్టుదల, ఒక ఆత్మీయం – జగన్. అలజడి, ఆందోళన, తిరుగుబాటు ఆయన తత్త్వం. బడుగు బలహీన వర్గాల ఆత్మబంధువు జగన్. ఓ 36 ఏళ్ల యువకుడు, రాజకీయ పసిబాలుడు సమాజపు అట్టడుగు దేశ రాజకీయ చరిత్రను తిరగరాయడం ఆశ్చర్యం. అది జగన్కే చెల్లింది. 125 సంవత్స రాల కాంగ్రెస్ పార్టీని కదిపి, కుదిపి, ధిక్కరించి, ఛీత్కరించి తన అసామాన్య, అసాధారణ పోరాటంతో ఆ పార్టీ ఊపిరి తీసేసి రాష్ట్రంలో, దేశంలో లేకుండా చేయటం అన్నది మాటలు కాదు. మహామహులకు సాధ్యం కాని పని జగన్మోహన్ రెడ్డి చేయడం జగత్తు చూసి ముక్కున వేలేసుకుంది.ప్రియమైన వారసుడుమహానేత, తెలుగు రాష్ట్ర ప్రజల భాగ్యవిధాత అయిన తండ్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి హఠాత్తుగా అందర్నీ వీడి పోతే... ఆ బాధ భరిస్తూ, ఆ అనంత శోకాన్ని ఎదలో మోస్తూ, తండ్రి ఆశయ సాధన కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం, జనం కోసం నిలబడిన ధీరోదాత్తుడు జగన్. తండ్రి ఆశయం కోసం జీవితాన్ని త్యాగం చేయటానికి ముందుకు వచ్చిన అసలు సిసలు యుద్ధవీరుడు. తండ్రి ఆస్తులకు కాదు, ఆశయాల కోసం నిలబడాలి అని ప్రజల పక్షం వహించి, లోకంలో ఆశయం కోసం ఎలా ఉండాలో పోరాటం చేసి చూపిన యోధుడు.పరిస్థితులు అనుకూలించకపోయినా, ప్రత్యర్థులు ప్రతి క్షణం వెనక్కి లాగుతున్నా, ప్రజల కోసం అడుగులు వేసి కోట్లాది తెలుగు ప్రజల హృదయాలు గెలుచుకున్న వ్యక్తి జగన్. ఆయన పట్ల ప్రజలు అపార అభిమానం, నమ్మకం పెంచుకుంటున్న పరిస్థితిని పసిగట్టి జగన్ను అణిచివేయాలని ఎన్ని కుట్రలు పన్నారో అందరికీ తెలిసిందే.మహానేత మరణాన్ని భరించలేక ఆంధ్ర రాష్ట్రం అల్లాడి పోయింది. దాదాపు 673 మంది ప్రజలు ఆత్మహత్య చేసు కున్నారు. తన తండ్రి కోసం తనువులు వీడిన ఆ కుటుంబాలను పలకరించాలని, పరామర్శించాలని జగన్ సంకల్పించారు. దానికి కాంగ్రెస్ అధిష్ఠానం అంగీకరించలేదు. ఆ యువకుడు కదిలితే అతని వెంట కోట్లాది జనం నడుస్తారని వారికి తెలుసు. అది ఇష్టం లేక ఆ కుటుంబాలను ఒక చోటికి పిలిచి మాట్లాడమని ఆదేశించింది అప్పటి కాంగ్రెస్ అధిష్టానం. చెప్పుడు మాటలకు తలవొగ్గి జగన్మోహన్రెడ్డికి గిరి గీయాలి అని ప్రయత్నించింది సోనియా గాంధీ.బాధిత కుటుంబాలను తన దగ్గరకు పిలిపించుకోవడం న్యాయం కాదనీ, తానే వారి దగ్గరికి వెళ్లి పలకరించడం భార తీయ ధర్మం, సంప్రదాయం అనీ ఆయన చెప్పినా అంగీకరించ లేదు సోనియా గాంధీ. అన్యాయాన్ని, అధర్మాన్ని అంగీకరించి తలవంచడం తెలి యని జగన్, ఆమె మాట కాదన్నాడు. ఆ అభాగ్యుల చెంతకు తనే స్వయంగా వెళ్ళటానికి నిర్ణయించి అడుగు ముందుకు వేశాడు. అది అభిమాన జనప్రవాహంతో ఓదార్పు యాత్రగా మారింది. ఆ యువకుడిని, తమ ప్రియమైన డాక్టర్ వై.ఎస్. రాజ శేఖర రెడ్డి కుమారుడిని చూసేందుకు, ఆయన మాటలు వినేందుకు, ప్రజా సముద్రం కదిలింది. జగన్ మాట్లాడుతూఉంటే, ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటే, ఆదరంగా భుజంమీద చేయి వేస్తూ ఉంటే, చేయి ఊపి దగ్గరికి పిలుస్తూ ఉంటే, ‘నేను ఉన్నాను’ అని నమ్మకం ఇస్తూ ఉంటే, ఆంధ్ర ప్రజలు ఆప్యాయ తతో పొంగిపోయారు. కాపాడే నేత కళ్ళ ముందు కనిపిస్తున్నా డని ఆనందపడ్డారు. అతడే తమ నాయకుడు, పరిపాలకుడు కావాలని నిర్ణయించుకున్నారు. తండ్రికి మారుగా తనయుడు తమ కష్టాలు తీరుస్తాడని త్రికరణ శుద్ధిగా నమ్మారు.అవిశ్రాంత యోధుడుజగన్ పట్ల ప్రజలు చూపుతున్న ఆదరణ చూసి, ప్రత్య ర్థులకు, సోనియా గాంధీకి, చంద్రబాబుకు కన్ను కుట్టింది, వెన్ను జలదరించింది. అతని ముందు నిలబడలేమని అర్థమైంది. ఆనాడు అభిమన్యుడి మీదికి కుట్రతో ఉరికిన కురు మూకల మాదిరి ప్రత్యర్థులు సోనియాగాంధీ, చంద్రబాబు కుయుక్తులు పన్నారు, కుతంత్రాలు చేశారు. ప్రభుత్వంతో ఏమాత్రం సంబంధం లేకున్నా, పరిపాలనలో పాలుపంచు కోకున్నా సీబీఐని ఉసిగొల్పారు. దాని ఫలితం అనేకమైన అబద్ధపు కేసులు పెట్టి, జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేశారు. దాదాపు ఒకటిన్నర సంవత్సరం బెయిలు కూడా రాకుండా అక్రమ నిర్బంధం చేశారు. మానసికంగా కుంగదీయాలని అనేక ప్రయత్నాలు చేశారు.అన్ని రోజుల పాటు జైలులో అనంత ఏకాంతంలో ఉన్నా జగన్ మనోబలం ఏ మాత్రం తగ్గలేదు. ప్రజలకు సేవ చేయా లన్న పట్టుదలలో వెనుకంజ వేయలేదు. తాత నుండి ఆత్మస్థైర్యం, తండ్రి నుండి మనోబలం, తల్లి నుండి సహనం సహజంగా అతనికి అబ్బిన గుణాలు. చెక్కుచెదరని అసాధారణ సాధనతో, మనో నిబ్బరం సడలని బలంతో మళ్లీ ప్రజల మధ్యకు వచ్చాడు. మరొకరైతే చెదిరి బెదిరి విలువలకు తిలోద కాలు ఇచ్చి, కాడె పారేసి కదలి వెళ్లిపోయేవారు. ఎన్ని దాడులు, ఎన్ని విమర్శలు, ఎన్ని అబద్ధాలు, ఎన్ని ప్రచారాలు, ఎంత వైషమ్యం, ఎంత విషం తమ పత్రికల ద్వారా, ఛానళ్ళ ద్వారా నిత్యం ప్రత్యర్థులు ప్రచారం చేస్తూనే ఉన్నారు. అసత్యాన్ని సత్యం అని చెబుతూనే ఉన్నారు. జగన్మోహనుడు ఏ మాత్రం జంక లేదు. ఏ మాత్రం తొణకలేదు. ఒక్కడుగా, ఒకే ఒక్కడుగా జనాన్ని నమ్మి కదన రంగంలోకి కొదమ సింహంలా ఉరికాడు. ఆత్మీయులను ఆదరిస్తూ 2014 ఎన్నికల రంగంలోకి ఏకాకిగా అడుగుపెట్టాడు. ప్రజలలో అదే ఆదరణ, అదే నమ్మకం.అబద్ధం చెప్పలేను, మోసం చేయలేను, అధికారం కోసం నిలబెట్టుకోలేని హామీలు ఇవ్వలేను అని విలువలకై నిలబడ్డాడు. ప్రత్యర్థులు, చంద్రబాబు వరాల వర్షం కురిపించారు. అధికారం వస్తే చాలని అబద్ధాల కుప్పలు ప్రజల ముందు పోశారు. ఆనాడు రైతులకు రుణమాఫీ చేస్తాను అని ఒకే ఒక అబద్ధం జగన్ చెప్పి ఉంటే అధికారం దక్కేది. మోసం చేయను అని నిలబడినందుకు అధికారం కోల్పోవలసి వచ్చింది. అయినా జగన్మోహన్ రెడ్డి ధైర్యం కోల్పోలేదు, ప్రజల పక్షాన నిలబడటం మానలేదు. ఆయనకు కావాల్సింది అధి కారం కాదు, జన క్షేమం. చంద్రబాబు బృందం జగన్ మీద మరింత అసత్య ప్రచారాలు చేస్తూనే ఉంది. అయినా చంద్ర బాబు ప్రభుత్వం మీద జగన్ పోరాటం ఏమాత్రం ఆపలేదు. ప్రతిపక్షంలో ఉండి, ప్రజల పక్షం నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం అవిశ్రాంత యుద్ధం చేస్తూనే ఉన్నారు. తన శాసన సభ్యుల్ని నిస్సిగ్గుగా చంద్రబాబు కొనుగోలు చేస్తున్నా ధైర్యం కోల్పోలేదు. బడుగు, బలహీన వర్గాల కోసం, పేదల కోసం గళం ఎత్తుతూనే ఉన్నాడు.సహృదయ నాయకుడుజనం కోసం జగన్ జరిపిన సుదీర్ఘ పాదయాత్ర మరొక చరిత్ర. తండ్రిలాగే తాను జనం మధ్యకు వెళ్లాలనీ, కష్టజీవుల కన్నీటి కథలు తెలుసుకోవాలనీ, రైతుల గోడు వినాలనీ, నిరుద్యోగుల, ఉద్యోగుల, ఆడపడుచుల బాధలు వినాలనీ, ఓదార్చాలనీ, ధైర్యం చెప్పాలనీ 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేశాడు జగన్. సెక్యూరిటీ వారు వద్దన్నా, ఆత్మీయులు ప్రేమగా వారించినా కాదని ప్రజల కోసం ఎండనకా, వాననకా అడుగులు వేశాడు. కాళ్లు బొబ్బలు ఎక్కాయి, హఠాత్తుగా ఆరోగ్యం సహకరించలేదు, హత్యా ప్రయత్నం జరిగింది, ప్రతీప శక్తులు హేళన చేశాయి. ఏవీ ఆయన లెక్కలోకి తీసుకోలేదు. దీక్ష, పట్టుదల, పేదల పట్ల ప్రేమ, సేవ చేయాలన్న ఆశయం ఆయనను నడిపించాయి. ప్రతిరోజూ ఇరవై వేల మందిని కలుస్తూ, కన్నీళ్లు తుడుస్తూ, ధైర్యం ఇస్తూ కదిలాయి ఆయన పాదాలు. ఆ పాదస్పర్శకు నేలతల్లి పులకించింది. ఆయన మాటల ఓదార్పుకు జనంలో ఆశ చిగురించింది.పేదలు, వృద్ధులు, రోగగ్రస్థులు, ఎందరో ఆయనకు గోడు వినిపించుకున్నారు. పుండ్లతో శరీరం కుళ్ళి రసి కారుతూ దగ్గరకు వెళ్ళటానికి జుగుప్స కలిగించే వారిని సైతం ఆలింగనం చేసుకొని అక్కున చేర్చుకున్న అమృత హృదయం జగన్ మోహన్ రెడ్డి గారిది. ముగ్గుబుట్ట వంటి తలా, ముడ తలు దేరిన దేహం, కాంతి లేని కళ్ళతో దీనంగా, హీనంగా, దైన్యాతిదైన్యంగా ఆదరణ కోసం, ఆత్మీయత కోసం, సహాయం కోసం, సానుభూతి కోసం ఎదురుచూస్తున్న నిర్భాగ్య సోదర సోదరీమణుల్ని ఆప్యాయంగా, ప్రేమగా, అత్యంత సన్నిహి తంగా దగ్గరకు తీసుకున్న మొదటి, ఆఖరి రాజకీయ నాయకుడు నిస్సందేహంగా జగనే! అంతరంగంలో అపారమైన ప్రేమ, దయ, జాలి ఉంటే తప్ప అది సాధ్యపడదు.అపూర్వమైన సంస్కారం ఆయనది. తనకన్నా చిన్నవారిని, నౌకర్లను, డ్రైవర్లను, సెక్యూరిటీ వారిని అందరినీ ‘అన్నా’ అని పిలిచే సహృదయత ఆయనది. ఎదుటివారికి ఆయన ఇచ్చే గౌరవం మరే రాజకీయ నాయకుడూ ఇవ్వడు. పాదయాత్రతో మరింత ఎదిగాడు. ప్రజల మనసులలో నమ్మకం పెంచాడు. వారికి ఏం కావాలో, తనేం చేయాలో నిర్ణయించుకున్నాడు. పెత్తందారుల ప్రభుత్వం కాదు, పేదల ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్నాడు. నిర్ణయించుకుంటే అడుగు వెనక్కి వేయని తత్వం. చేయాలనుకున్నది చేసి తీరే పట్టుదల. కన్నీటి కథలకు, వెతలకు, కరిగిన ఆయన హృదయం తీసుకున్న కఠిన నిర్ణయం పేదల పక్షపాతం.ఒకే ఒక్కడు2019 ఎన్నికలు వచ్చాయి. ఒక్కడే ఒకే దీక్షతో నారాయణ ధనుర్ముక్త బాణంలా జనంలోకి వచ్చాడు. పర్జన్య గర్జన్యం వంటి ఆయన వాక్కు హామీ అందరూ ఆదరించారు. 151 సీట్లతో ఎవరి అండా లేకుండా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. నేను అధికారిని కాను, సేవకుడిని అని ఆ క్షణమే చాటాడు. తను ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలే తన శాసనాలనీ, తన మ్యానిఫెస్టో తన ఖురాను, బైబిలు, భగవద్గీత అనీ, కడుపు నిండని పేద తన దేవుడనీ నమ్మి పరిపాలన సాగించాడు.తను ఇచ్చిన వాగ్దానాలలో దాదాపు అన్నిటినీ నెరవేర్చిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పేదవాడు మూడు పూటలా భోజనం చేయడానికి ఆయన ప్రథమ ప్రాధాన్య మిచ్చాడు. వారి ఇంటి ముంగిటకే తీసుకువెళ్లి రేషన్ అందించాడు. గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి ప్రభు త్వాన్ని వారి ఇంటి పక్కన నిలిపాడు. వాలంటీర్లుగా లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. వారి ద్వారా వృద్ధులు, వికలాంగులు, పేదలు, విధవలకు పెంచిన పెన్షన్లను ఇంటి వద్దకు తీసుకువెళ్లి అందజేశాడు. ఇలా చేసిన మొదటి ముఖ్యమంత్రి జగన్ కావడం మనందరి గర్వకారణం, అదృష్టం. రెండు సంవత్సరాలు కరోనాతో దేశం స్తంభించిపోయింది. ఆర్థికపరంగా అన్ని వ్యవస్థలూ అతలాకుతలమయ్యాయి. కానీ ఆంధ్ర రాష్ట్రంలో జగన్ నాయకత్వంలో ఏ పథకమూ ఆగలేదు. ఏ నిరుపేదా ఆకలితో ఉండలేదు. అనేక పట్టణాలలో అభాగ్యు లకు రెండు పూటలా ఆహార పొట్లాలు అందించాడు. అందరికీ వైద్యం అందింది. ఈనాటి పాలకులు, సనాతన ధర్మ రక్షణ పరులు ఇళ్లల్లో ముడుచుకుని మూలన పడుకుంటే ప్రజలకు చేరువగా జగన్ ఉన్నాడు.ప్రమాదంలో మరణించిన వారికి దేశంలోనే మొదటి సారిగా కోటి రూపాయల ఆర్థిక సహాయం అందించిన మొదటి ముఖ్యమంత్రి జగనే. తండ్రి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత మెరుగుపరిచి మరిన్ని రోగాలకు ఆర్థిక సహాయం అందించి పేదలను ఆదుకున్న ఆరోగ్యదాత జగన్. పేదల కోసం ఇళ్ళ స్థలాలు ఇవ్వడమే కాకుండా, లక్షల ఇళ్లు నిర్మించాడు. పేద విద్యార్థులకు ఆర్థికసహాయం పథకం మరింత మెరుగు పరిచాడు. ప్రతి పేద పిల్లవాడూ చదువుకోవాలనీ, తద్వారా జీవన ప్రమాణం పెంచుకోవాలనీ ప్రభుత్వ పాఠశాలల్ని వేల కోట్లతో ఆధునీకరించాడు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దాడు. ఆంగ్ల మాధ్యమం పాఠశాలల్లో ప్రవేశపెట్టాడు. పిల్లలను స్కూల్కు పంపితే చాలు... ఆ తల్లుల అకౌంట్లలో ఏటా రూ. 15 వేలు వేళకు ఇస్తూ, ‘అమ్మ ఒడి’ అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థులకు ఆధునిక లాప్టాప్లు, ఆరోగ్యకరమైన ఆహారం, యూనిఫాం అందించి, పెను మార్పులు తీసుకురావడానికి కారణమయ్యాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ర్థులను చేర్చడానికి తల్లిదండ్రులు పోటీపడ్డారన్న మాట, కొన్ని పాఠశాలల్లో సీట్లు దొరకని మాట అక్షరాలా నిజం. ప్రజలు కొనియాడిన సత్యం.ధీరోదాత్తుడుదేశం మొత్తం మీద అతి తక్కువ కోవిడ్ మరణాలు జరి గింది మన రాష్ట్రంలోనే అన్నది జగమెరిగిన విషయం. పేద ప్రజల ఆరోగ్యం ప్రభుత్వం చేతిలోనే ఉండాలని 17 మెడికల్ కళాశాలకు శ్రీకారం చుట్టారు. సీట్ల సంఖ్య పెంచాడు. హైందవ ధర్మ ప్రచారానికి, తిరుమల తిరుపతి దేవస్థానాల అభివృద్ధికి అపారమైన కృషి చేసింది జగనే. చంద్రబాబు పాలనలో జరిగిన అవినీతిని, అరాచకాలను నేడు వారు జగన్ ప్రభుత్వం మీద రుద్దుతున్నారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు, అతని కూటమి అనేక అబద్ధాలు ఆడాయి. జగన్ కన్నా ఎక్కువ పథకాలు ఇస్తామనీ, ఉచితాలు అందజేస్తామనీ, అసత్య ప్రచారాలు చేశాయి. ప్రజ లను ఆశపెట్టాయి, భ్రమలు కల్పించాయి. సాధ్యం కాని హామీలు అమలు పరుస్తామని అరచి, మోసం చేసి ప్రజల నోళ్లు కొట్టి అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. నిజానికి జగన్ పథకా లకు పేర్లు మార్చి కొత్త పథకాలుగా ప్రచారం చేసుకున్నారు తప్ప మరేమీ కాదు. కొత్త పథకం ఒక్కటీ లేదు. ఇప్పుడు ఏమీ అమలపరచలేక దీనికి కారణం జగన్ అని ప్రచారం చేసుకుంటున్నాయి. గ్రాఫిక్ మాయాజాలంతో చిటికెల పందిళ్లు వేస్తున్నాయి. మూడు నెలలకే ప్రజలు అసలు నిజం గ్రహించారు. ఓ మహా నాయకుడిని మాయ మాటల వల్ల ఓడించి ఓడిపోయామని బాధపడుతున్నారు. అన్ని వర్గాల వారూ విలపిస్తున్నారు.గతంలో ఓడిపోయిన చంద్రబాబు మూడు సంవత్సరాలు మూలన ముక్కుతూ కూర్చుంటే – ఓటమిని, ప్రజల తీర్పును, హుందాగా స్వీకరించిన జగన్ వెంటనే ప్రజల మధ్యకు వచ్చారు. ప్రజల కలంగా, గళంగా, బలంగా పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వ అసమర్థతను నిలదీస్తున్నారు, ప్రజలను మేల్కొల్పుతున్నారు. ఐదు సంవత్సరాల పాలనలో రెండేళ్లు కరోనాకు పోయినా, అద్భుతాలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రజల హృదయాలలో, పేదల మనసులలో, సుస్థిర స్థానం సంపాదించుకున్న పాలకుడు. నేత అన్న పదానికి అర్థం చెప్పిన ప్రజా సేవకుడు. ఓటమికి కుంగని ధీరోదాత్తుడు. ప్రజా హృదయ గోవర్ధనమెత్తిన గోపాలుడు. వక్రబుద్ధులు, కుట్రలు, కుతంత్రాలు ఎదిరించి జనుల కోసం స్థిరంగా నిలబడిన జననేత, అజేయుడు, అనితర సాధ్యుడు, సున్నిత మనస్కుడు, పేదల పక్షపాతి, ఆరోగ్య విద్యాదాత, ఆపన్నులకు వర ప్రదాత, సహాయానికి సహస్ర హస్తుడు, ఆంధ్రుల ఆరాధ్యుడు, భవిష్యత్ భాగ్యప్రదాత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి. అలాంటి నాయకుడికి, ఆలోచనాపరుడికి అనుచరుడిగా ఉండటం, ఆయనతో కలిసి నడవడం నాకు ఇష్టం, ఆనందం, సంబరం... సమున్నత గర్వం.భూమన కరుణాకర రెడ్డివ్యాసకర్త టీటీడీ మాజీ చైర్మన్ -
YS Jagan Birthday Special: జనం కోసం జగన్.. జగన్ కోసం జనం
హస్తిన దురహంకారం తలవంచమంది. ఆయన ఆత్మాభిమానం అది జరగదంది. ఢిల్లీ గద్దలు అక్రమ కేసుల కుట్రలు పన్నారు. ఆయన ధీరత్వం లొంగేది లేదంది. స్కామ్లు, స్కీమ్ల్లో మునిగిన చంద్ర బాబు సర్కార్.. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసింది. ఆయన ప్రజలకు ధైర్యం చెప్పడానికి అడుగేశారు. అప్పుడు మొదలైంది ప్రజా సంకల్ప యాత్ర. తమ కష్టాలను చెప్పుకుని ఆదుకోమంది అఖిలాంధ్ర జనసందోహం. ఆయన నేనున్నానని అభయం ఇచ్చారు. అప్పుడు పుట్టింది సరికొత్త చరిత్ర. నాడు బాబు కబంధ హస్తాల్లో గాడి తప్పిన పాలన.. బేలగా స్వాగతం పలికింది. ఆయన తొలి సంతకంతోనే సరిచేయడం మొదలుపెట్టారు.అప్పుడు మొదలైంది రాజన్న తనయుడు జగనన్న జన రంజక పాలన. క్షుద్ర రాజకీయాన్నే నమ్ముకున్న కూటమి మళ్లీ గద్దెనెక్కి గంతులేస్తోంది. ఆయన.. దిక్కుతోచని ఐదున్నర కోట్ల మంది ప్రజలకు అండ దండ అయ్యారు. అప్పుడు మొదలైంది మళ్లీ ఆటవిక పాలనపై జగన్ గర్జన. జనగర్జన. వ్యక్తిగా, పార్టీ అధినేతగా, ప్రభుత్వాధినేతగా, జన హృదయ నేతగా... ఆయన ప్రతి మలుపు లోనూ... ప్రతి గెలుపులోనూ, ప్రతి తలంపులోనూ ఉండేది ప్రజలే.వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కడే. తోడేళ్ల గుంపు చేసే వికృత రాజకీయాలను నిప్పులతో కడుగుతోన్న ఒకే ఒక్కడు. దేశంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తి అవతల ఉన్నా.. తలవంచక తెలుగు పౌరుషాన్ని ప్రదర్శించిన ఒకే ఒక్కడు. కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి ప్రజాపాలనకి అర్థం చెప్పిన ఒకే ఒక్కడు. సంక్షేమాన్ని, అభివృద్ధిని పరుగులు పెట్టించి.. అద్భుత పాలనా దక్షత ప్రదర్శించిన ఒకే ఒక్కడు. చంద్రబాబు ఆటవిక పాలనపై సమర గర్జన చేస్తోన్న ఒకే ఒక్కడు. మనిషికి, మంచికి, మాటకి ఏమాత్రం విలువలేని రాజకీయాల్లో.. ఇచ్చిన మాట కోసం ఎందాకైనా వెళ్లే ఒకే ఒక్కడు. దేవుడి ఆశీస్సులు, ప్రజల అండ దండ ఉంటే చాలని నమ్మిన.. మాట తప్పని, మడమ తిప్పని ఒకే ఒక్కడు.వైఎస్ జగన్మోహన్రెడ్డి.. దేశ రాజకీయాల్లో టార్చ్ బేరర్. ప్రజలకిచ్చిన మాట కోసం ఒక్కడే.. ప్రయాణం మొదలు పెట్టాడు. ప్రజలకిచ్చిన మాట కోసం ఒక్కడే.. అలవికాని కష్టాలను అనుభవించాడు. భరించాడు. ప్రజలకిచ్చిన మాట కోసం ఒక్కడే.. అక్రమ కేసుల కుట్రలను ఎదుర్కొన్నాడు. ఎదిరించాడు. మాట తప్పడమే, మాయ చేయడమే పాలిటిక్స్ అయిపోయిన ప్రస్తుత రోజుల్లో... మాట తప్పని రాజకీయాలను దేశానికి పరిచయం చేశాడు. ఆ ఒక్కడే.. వ్యక్తి నుంచి వ్యవస్థగా ఎదిగాడు. ఆ ఒక్కడే వ్యక్తి నుంచి మహా శక్తిగా ఎదిగాడు. ఆ ఒక్కడే...దేశమంతా అబ్బుర పడేలా జనరంజక పాలన చేశాడు. వైఎస్ జగన్కి ఇదంతా ఎలా సాధ్యమైంది? వైఎస్ జగన్.. ఇంతటి ప్రజాకర్షక నాయకుడు ఎలా అయ్యాడు? జగన్మోహన్ రెడ్డి ఇంతటి దార్శనికత కలిగిన పాలకుడుగా ఎలా నిలిచాడు ? ప్రశ్నలు చాలానే ఉన్నాయి. సమాధానం మాత్రం ఒక్కటే. జగన్.. జనమంతా తన వాళ్లు అనుకున్నాడు. జనమంతా.. జగన్ తమ వాడు అనుకున్నారు.మాట తప్పని జగన్కి.. జనమే అండా దండా అయ్యారు. బాగోగులు పట్టించుకునే నాథుడు లేని జనానికి.. అన్నీ జగనే అయ్యాడు. నిజమైన నాయకుడు జనం కోసం ఎంత చేయగలడో జగన్ చేసి చూపించాడు. జగన్ గుండెల్లో జనం. జనం గుండెల్లో జగన్. ఇదంతా అంత తేలిగ్గా జరగలేదు. ఈ క్రమంలో ఎదురైన ఎన్నో కష్టాలను, నష్టాలను ప్రజలకిచ్చిన మాట కోసం చిరునవ్వుతో భరించాడు వైఎస్ జగన్మోహన్రెడ్డి. జగన్ ప్రజలనే నమ్ముకున్నాడు. ఆ జనం నువ్వే మా నమ్మకం అని జగన్ని అక్కున చేర్చుకున్నారు. ఈ అనుబంధానికి 16 ఏళ్లు దాటిపోయాయి.వైఎస్ రాజశేఖర్ రెడ్డి దుర్మరణం. మహానేత ఇకలేడన్న నిజాన్ని దేశం జీర్ణించుకోలేకపోయింది. ప్రతి గుండె తల్లడిల్లిపోయింది. ఆ శోకాన్ని భరించలేని వందల గుండెలు ఆగిపోయాయి. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్రెడ్డి మరణ వార్త విని తట్టుకోలేక గుండెలు ఆగి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నేనున్నానన్న భరోసా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ఆయన తనయుడు, ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి. అంతటి దు:ఖంలోనూ ఆయన ఆలోచనంతా ప్రజలతోనే. నల్లకాలువ సాక్షిగా ఓదార్పు యాత్ర చేస్తున్నట్టు ప్రకటించారు.వైఎస్సార్ మరణంతో తట్టుకోలేక ఆరు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వాళ్ల కుటుంబాలకు ధైర్యం చెప్పడానికి, అంత బాధలోనూ ఓదార్పు యాత్ర ప్రారంభించార వైఎస్. జగన్ ఆ కుటుంబాలకు భరోసా ఇచ్చారు. రెండు విడతల యాత్రకు విశేష స్పందన రావడం పార్టీలో కొందరికి అసూయ కలిగించింది. అంతే..కొన్ని కాంగ్రెస్ కండువాలు కుతంత్రాలకు తెర తీశాయి. హస్తినకి లేనిపోనివి నూరి పోశాయి. ఓదార్పు యాత్రని వెంటనే ఆపేయాలని ఢిల్లీ నుంచి ఆదేశం. మాట ఇచ్చాక వెనక్కి తగ్గితే ఆయన వైఎస్సార్ తనయుడు ఎందుకవుతాడు?. పదవుల కన్నా ప్రజలకు ఇచ్చిన మాటే ముఖ్యం. 10 జనపథ్కు తేల్చి చెప్పేశారు వైఎస్ జగన్మోహన్రెడ్డి.సుఖాలు, హోదాలు, పదవులు. వీటన్నింటన్ని కన్నా.. ఎన్ని కష్టాలొచ్చినా ఇచ్చిన మాట మీద నిలబడాలని తన తండ్రి నేర్పిన పాఠాన్ని గుండెల్లో దాచుకున్న తనయుడు.. ప్రజల కిచ్చిన మాటకే కట్టుబడి ఉండాలని నిర్ణయిం చుకున్నారు. ఓదార్పు యాత్రని యాథావిధిగా కొనసాగించారు. అటు కాంగ్రెస్ పార్టీ కుటుంబాలను చీల్చే రాజకీయాలకు పదును పెట్టింది. అదే సమయంలో జగన్ ఎంపీ పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. అంతే.. కాంగ్రెస్ అధిష్టానం కుట్రలకు తెర తీసింది. చంద్ర బాబుతో కుమ్మకై అక్రమ కేసులు పెట్టించింది. దీంతో తనను నమ్ముకున్న ప్రజల కోసం, తండ్రి లక్ష్య సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు జగన్మోహన్రెడ్డికడప లోక్సభ నుంచి జగన్ వైఎస్సార్సీపీ తరపున అఖండ మెజార్టీతో విజయం సాధించారు. ఇచ్చిన మాట కోసం ఎంత కష్టమైనా భరించడానికి సిద్ధపడిన జగన్మోహన్రెడ్డికి ప్రజలు జేజేలు పలికారు. దీంతో... కాంగ్రెస్ నుంచి వైఎస్సార్సీపీలోకి రావడానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. అయితే.. పదవులకు రాజీనామా చేసిన వాళ్లకు మాత్రమే వైఎస్సార్సీపీలోకి ఆహ్వానిస్తానని తేల్చి చెప్పారు జగన్. రాజకీయాల్లో నైతిక విలువలు కాపాడే బాధ్యత తీసుకున్నారు.18 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ కాంగ్రెస్ పార్టీకి, తమ పదవులకు రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరారు. దీన్ని కాంగ్రెస్ అధిష్టానం సహించలేకపోయింది. అవకాశం కోసం కాచుకుని చూసింది. ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారంలో ఉన్న జగన్ను విచారణకి అని పిల్చి సీబీఐతో అరెస్ట్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. జగన్ని అణగదొక్కితే దారికొస్తారని తప్పుడు లెక్కలేసింది. తలదించేది లేదన్నారు జగన్. ఉప ఎన్నికల్లో 15 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీని భారీ మెజార్టీతో గెలిపించారు ప్రజలు. తామంతా వైఎస్ జగన్ వెనకే ఉన్నామని ఉప ఎన్ని కల సాక్షిగా తేల్చి చెప్పారు.ఈ దేశంలో పొలిటికల్ వ్యాక్యూమ్ ఉన్నప్పుడు.. దాన్ని భర్తీ చేయడానికి పుట్టిన రాజకీయ పార్టీలున్నాయి. పాలకుల మీద ప్రజావ్యతిరేకత పెరిగినప్పుడు.. దాన్ని క్యాష్ చేసుకోవడానికి పుట్టిన రాజకీయ పార్టీలున్నాయి. కులాల కేంద్రంగా పుట్టుకొచ్చిన పార్టీలున్నాయి. ఒక రాజకీయ పార్టీ తన ప్రయోజనాల కోసం సృష్టిస్తే.. ప్యాకేజీ కోసం బానిసిజం ప్రదర్శించే పార్టీలున్నాయి. కానీ.. ఒక్క వైఎస్సార్సీపీ మాత్రమే.. ప్రజలకిచ్చిన మాటని నిలబెట్టుకునే క్రమంలో పుట్టింది. ఇచ్చిన మాటని ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పకూడదన్న చిత్తశుద్ధి నుంచి పుట్టుకొచ్చింది. ఎన్ని సవాళ్లు ఎదురైనా, ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా...మడమ తిప్పకూడదన్న దృఢ నిశ్చయం లోంచి పుట్టుకొచ్చింది. మాట తప్పితే వచ్చే అధికారం వద్దని.. 2014లో ప్రతిపక్షంలోనే కూర్చున్న వైఎఎస్ జగన్.. దేశంలోని రాజకీయ పార్టీలకు కొత్త పాఠాలు నేర్పారు.2014 ఎన్నికలు.. జగన్ని సింగిల్గా ఎదుర్కొనే దమ్ము లేక.. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా జగన్ని ఢీకొట్టే ప్రయత్నం చేశాయి. ప్రజలనే నమ్ముకున్న జగన్ మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగారు. ప్రజలను మోసం చేయడంలో మాస్టర్స్ చేసిన చంద్రబాబు.. 6 వందలకు పైగా అలవి కాని హామీలను ప్రకటించి.. భ్రమలు కలిగించారు. గుజరాత్ అభివృద్ధి నమూనా కేంద్రంగా దేశవ్యాప్తంగా మోదీ మ్యానియా హల్చల్ చేస్తోన్న సమయం అది. రైతు రుణ మాఫీ హామీ ఇస్తే.. అధికారంలోకి రావడం ఖాయమని జగన్తో ఆయన శ్రేయోభిలాషులు చెప్పారు.కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. రైతు రుణమాఫీ చేసే స్థితిలో రాష్ట్ర ఆదాయం ఉండదు. హామీ ఇస్తే అధికారం వస్తుంది. కానీ.. మాట తప్పడం ఎలాగో, ప్రజలను మోసం చేయడం ఎలాగో జగన్కి తెలీదు. అందుకే.. మాట తప్పితే అధికారంలోకి వస్తామని తెలిసినా.. ప్రజలను వంచించి అందుకునే అధికారం వద్దంటూ రైతు రుణ మాఫీ హామీ ఇవ్వలేదు వైఎస్ జగన్. 2014 ఎన్నికల్లో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారానికి దూరమైంది వైఎస్సార్సీపీ. ఒంటరిగా పోటి చేసినా 67 అసెంబ్లీ స్థానాల్లో, 8 లోక్సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. మాట తప్పడం, ప్రజలను మభ్య పెట్టడం ఇష్టం లేక అధికారాన్ని సైతం వదలుకున్న జగన్.. జన హృదయాలను మాత్రం సంపూర్ణంగా గెలుచుకున్నారు. తొలి రోజు నుంచే ప్రతిపక్ష నేతగా ప్రజల పక్షాన పోరాటం మొదలుపెట్టారు వై.ఎస్. జగన్. రైతులను, డ్వాక్రా మహిళ లను రుణాల మాఫీ పేరుతో చంద్రబాబు చేసిన మోసాన్ని నిరసిస్తూ... ప్రజల పక్షాన ఉద్యమించారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఉద్యమబాట పట్టారు. నాటి సీఎం చంద్రబాబు కమీషన్ల కోసం ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టి.. ప్రత్యేక ప్యాకేజీకి జై కొట్టాడు. ఏపీ భవిష్యత్తుని చీకట్లోలోకి నెట్టాడు. దీన్ని నిరసిస్తూ వైఎస్ జగన్ భారీ ఎత్తున ఉద్యమించారు. జగన్ను బలహీనపర్చాలనే కుట్రలో భాగంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు చంద్రబాబు తెరతీశారు. ప్రజాస్వా మ్యాన్ని వెక్కిరిస్తూ.. 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొన్న చంద్రబాబు.. వారిలో కొందరిని క్యాబినెట్లోకి కూడా తీసుకున్నారు. దీంతో అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వై.ఎస్.జగన్.. ప్రజా సంకల్ప పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.స్కామ్లు చేస్తూ లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం దిగమింగడం మీద దృష్టి పెట్టిన చంద్రబాబు...పూర్తిగా ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని గాలికి వదిలేశారు. దీంతో...ప్రజలకు ధైర్యం చెప్పడానికి, వాళ్ల కష్టాలు, సమస్యలు తెలుసు కోవడానికి ప్రజాసంకల్ప పాదయాత్ర మొదలుపెట్టారు తమ కష్టాలు తెలుసుకోవడం కోసం పాదయాత్ర చేస్తోన్న జగన్ని చూసి జనం చలించిపోయారు. జనం కోసం జగన్ కదిలితే.. జగన్ కోసం జనం పోటెత్తారు. తమ కష్టాలను కళ్లారా చూడటానికి, కన్నీళ్లు తుడవడానికి తమ ఊరికొచ్చిన రాజన్న బిడ్డని దీవించడానికి... జనం కెరటాల్లా ఎగసిపడ్డారు. కోట్ల మందికి భరోసా ఇవ్వడానికి ఒక్క జగన్. ఆ ఒక్కడిలో తమ అన్నని, కొడుకుని, మనవడుని, మామయ్యని చూసుకుని మురిసిపోయారు కోట్ల మంది ప్రజలు. రావాలి జగన్. కావాలి జగన్. ఈ పాట తెలుగు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పాట మాత్రమే కాదు. సోషల్ మీడియా లో భాషలకు అతీతంగా, దేశాలకు అతీతంగా నెటిజన్స్ని ఫిదా చేసిన పాట. నిజానికి రావాలి జగన్. కావాలి జగన్ అన్నది ప్రజల గుండెల్లోంచి పుట్టుకొచ్చిన నినాదం. చంద్రబాబు రాక్షస పాలనలో అల్లాడుతోన్న కోట్ల మంది ప్రజల హృదయాంతరాల నుంచి వెల్లువలా ఎగసిపడిన నినాదమే రావాలి జగన్. కావాలి జగన్. తర్వాత కాలంలో ఆ నినాదమే పాటగా మారింది. ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం అయిన వెంటనే...నాటి చంద్రబాబు ప్రభుత్వం విషం కక్కింది. ముద్దుల యాత్ర అంటూ చంద్రబాబు తన వంకర బుద్ధిని ప్రదర్శించారు. స్వచ్ఛంధంగా వచ్చిన జనం కాదన్నారు. తమ పాలనలో జరుగుతోన్న అభివృద్ధిని జగన్ చూడలేకపోతున్నారంటూ పైత్యాన్ని ప్రదర్శించారు. కానీ...వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మాత్రం తన లక్ష్య సాధన దిశగా దూసుకుపోయారు. నాడు జగన్ మనసులో ఉన్నది ఒక్కటే. ప్రజలకు భరోసా ఇవ్వాలి. చంద్రబాబు అవినీతి పాలనలో, దుష్టపాలనలో నలిగిపోతున్న వారికి అండగా నిలవాలి. భవిష్యత్తు మీద వారికి ఆశ పోనివ్వకూడదు. వాళ్ల కోసం ఏం చేయాలో పూర్తిగా తెలుసుకోవాలి. ఆ దిశగానే ప్రజా సంకల్ప యాత్ర కదిలింది. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర 13 జిల్లాల మీదుగా 134 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో 2,516 గ్రామాలను తాకుతూ 341 రోజులపాటు 3,648 కి.మీ. మేర కొనసాగింది. ఇది రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది. దేశవ్యాప్తంగా చరిత్ర సృష్టించింది. 2014 ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి బరిలోకి దిగిన జనసేన...2019 ఎన్నికల్లో టీడీపీని మళ్లీ గెలిపించడం కోసం కొత్త కుట్రలు పన్నింది. చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చే కుతంత్రాలు చేసింది. ఎవరెన్ని వంచనలు చేసినా ఏపీ ప్రజలు మాత్రం తమకు, తమ రాష్ట్రానికి ఎవరు కావాలో ఒక నిర్ణయానికి వచ్చేశారు. 50 శాతానికి పైగా ఓట్లతో 151 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీని గెలిపిం చారు. 22 లోక్సభ స్థానాలిచ్చారు. టీడీపీకి తన చరిత్రలోనే ఎన్నడూ చూడనంత దారుణమైన ఓటమిని రుచి చూపించారు. చంద్రబాబు అడుగులకు మడుగులొత్తే పవన్ కళ్యాణ్ని రెండు చోట్ల చిత్తు చిత్తుగా ఓడించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన క్షణం నుంచి సంక్షేమంలో, అభివృద్ధిలో ఏపీని దేశానికి ఆదర్శంగా నిలపెట్టడం మీద దృష్టి పెట్టారు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి. అప్పటి దాకా జగన్లో ప్రజలు ఆదర్శవంతమైన నాయకుడుని చూశారు. సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించాక ఆయనలో అద్భుతమైన పాలకుడుని, దార్శనికుడుని చూశారు దేశ ప్రజలు. ఐదున్నర కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు ఆలంబనగా నిలిచాడు. కరోనా రక్కసి వణికించినా అదరలేదు. సంస్కరణల పేరుతో తమ నడ్డి విరిచిన పాలకులను చూసి చూసి వేసారిన ప్రజల కోసం... సంక్షేమంలోనే సంస్కరణలు తెచ్చాడు. అభివృద్ధి పేరుతో తమ కళ్లకు గ్రాఫిక్స్ గంతలు కట్టిన పాలకులను చూసి బెంబేలెత్తిన ప్రజలకు.. నిజమైన అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించాడు. పాల కులకు, ప్రజలకు మధ్య ఏర్పడిన దూరాన్ని చెరిపేశాడు. సంక్షేమంలోనూ, అభివృద్ధిలోనూ పరుగులు పెడుతోన్న ఏపీని చూసి దేశమంతా అబ్బురపడి చూసేలా చేశాడు. జనరంజక పాలన అంటే ఎలా ఉంటుందో ఐదున్నర కోట్ల మంది ప్రజలకు అనుభవంలోకి తీసుకొచ్చాడు. 2019 నుంచి 2024 మధ్య వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సాగించిన పాలన...ఏపీకి స్వర్ణయుగం మాత్రమే కాదు. ప్రజల కోసం, భవిష్యత్తు తరాల కోసం, ఏం చేయాలో, ఎలా చేయాలో పాలకులకు పాఠాలు చెప్పింది జగన్ పాలన.దశాబ్దాలుగా విజనరీ ముసుగులో తెలుగు ప్రజలను మోసం చేస్తూ వచ్చిన నయవంచకుడు నారా చంద్రబాబు నాయుడు. అసలు విజన్ అంటే ఏంటో...దార్శనికత అంటే ఏంటో తన పాలనతో చూపిం చారు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించే సమయానికి ఏపీ ఖజానా లో ఉన్న సొమ్ము కేవలం వంద కోట్ల రూపాయలు మాత్రమే. ఐదేళ్ల పాటు స్కామ్ల స్కీమ్లతో లక్షల కోట్ల రూపా యల ప్రజాధనాన్ని దిగమింగిన చంద్రబాబు ఘనకార్యాల ప్రతిఫలం అది. అలాంటి అత్యంత క్లిష్టపరిస్థితుల్లో పాలనా పగ్గాలు చేపట్టిన జగన్ పరిస్థితుల చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తున్న వేళే.. కరోనా దాడి చేసింది.ప్రపంచాన్ని కోవిడ్ మహమ్మారి వణికిస్తున్నపుడు... దేశం యావత్తూ భయాందోళనలు నిండి, ఆసు పత్రులలో బెడ్లు సైతం దొరక్క విలవిలలాడి నప్పుడు... అందరికీ ఒక దిక్సూచిలా కనిపించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. పక్క రాష్ట్రాల నుంచి కోవిడ్ రోగులు సైతం నిబంధనలను గాలికొదిలేసి...మరీ ఏపీకి వచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడకు వస్తే...ఇక భయం లేదని ప్రతి ఒక్కరూ భరోసా ఫీలయ్యారంటే కారణం... జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలే. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థలు... పాలనను ప్రజలు ముగింటకి తీసుకువెళ్లాయి. పూజ్య బాపూజీ కలలు కన్న గ్రామస్వరాజ్యాన్ని వాలంటీర్ వ్యవస్థతో సాకారం చేశారు జగన్.సంక్షేమం మీద దృష్టి పెడితే అభివృద్ధి సాధ్యం కాదు. డవలప్మెంట్ మీద ఫోకస్ పెడితే సంక్షేమ పథకాలు అమలు చేయడం కుదరదు. దశాబ్దాలుగా దేశంలో పాతుకుపోయిన ఇలాంటి సిద్ధాంతాల నడ్డి విరగ్గొట్టిన పాలకుడు జగన్మో హన్ రెడ్డి. సంక్షేమ పథకాలు అనగానే దేశం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ గుర్తుకొచ్చేలా చేశారు జగన్ అభివృద్ధి అనగానే దేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపు తిరిగి చూసేలా చేశారు జగన్. ఐదేళ్ల పాలనలో...జగన్ తీసుకొచ్చిన సంస్కరణల గురించి..., జగన్ ప్రారంభించిన విప్లవాత్మక మార్పుల గురించి..,జగన్ సాధించిన విజయాలు గురించి చెప్పాలంటే రోజులు సరిపోవు. విద్య, వైద్యం, సంక్షేమం, అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి కల్పన, ఉద్యోగాల కల్పన, సామాజిక న్యాయం, ఇలా చెప్పు కుంటూ పోతే ఆ జాబితాకి అంతే ఉండదు. సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రజలు చేరే సమయంలో... లంచాలకు తావు లేకుండా, ప్రజల ఆత్మగౌరవానికి ఇబ్బంది కలగకుండా నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి డీబీటీ ద్వారా రూ.2 లక్షల 70 వేల కోట్లు జమ చేసిన పాలకుడు వైఎస్ జగన్తన పాలనతో జగన్ గ్రామాల స్వరూపాన్నే మార్చేశారు. 31 లక్షల ఇంటి స్థలాలను పంపిణీ చేశారు. 22 లక్షల ఇళ్లు నిర్మించారు. 73 వేల కోట్ల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేశారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టారు. డిజిటల్ క్లాస్రూమ్స్ని తీసుకొచ్చారు. నవరత్నాల నుంచి మొదలు పెడితే... అవినీతికి తావులేని స్వచ్ఛ మైన పారదర్శక పాలన వరకు... జగన్ మోహన్ రెడ్డి పాలన...అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. జగన్ పాలనలో ఆంధ్రప్ర దేశ్ ప్రధాన పారిశ్రామిక గమ్యస్థానంగా మారింది. సంక్షేమాన్ని, అభివృద్ధిని కలిపి పరుగులు పెట్టించడం అంటే ఎలా ఉంటుందో ఇలా చేతల్లో, అంకెల్లో చూపించిన ఏకైక పాలకుడు జగన్మోహన్ రెడ్డి.ఐదేళ్ల పాలనలో ఒక్కో రైతుకు పెట్టుబడి సాయంగా రూ.67,500 అందజేశారు జగన్మోహన్ రెడ్డి. రైతులపై పైసా భారం పడకుండా వైఎస్ జగన్ అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. సున్నా వడ్డీ రాయితీని ప్రతి ఏటా క్రమం తప్పకుండా జమ చేశారు. విత్తు నుంచి విక్రయం వరకు గ్రామస్థాయిలో రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు సచివాలయాలకు అనుబంధంగా ఆర్బీకేలు నెలకొల్పారు. వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా 2019-24 మధ్య ఐదేళ్లలో అన్నదాతలకు ఏకంగా రూ.1 లక్షా 88 వేల 541 కోట్ల మేర ప్రయోజనాన్ని వైఎస్ జగన్ చేకూర్చారు. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.8 వేల కోట్లకుపైగా నిధులతో ఒకేసారి 17 వైద్య కళాశాలలు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 1923లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఆంధ్రా మెడికల్ కాలేజీ ఏర్పాటైంది. అప్పటి నుంచి 2023 వరకు రాష్ట్రంలో పూర్తిగా ప్రభుత్వ రంగంలో ఉన్నవి కేవలం 11 వైద్య కళాశాలలు మాత్రమే. అయితే వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వైఎస్ జగన్ చేపట్టారు. జగన్ పాలనలోనే ఏడు మెడికల్ కాలేజీలు సిద్ధమైయ్యాయి. ఐదు మెడికల్ కాలేజీల్లో తరగతులు కూడా మొదలైయ్యాయి. మరో 10 మెడికల్ కాలేజీల నిర్మాణం చాలా వరకు జగన్ పాలనలోనే పూర్తి అయింది. అలానే...వైజాగ్ని ఐటీ కారిడార్గా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేశారు. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన బీచ్ ఐటీ కాన్సెప్ట్తో...ఇన్ఫోసిస్, టెక్ మహేంద్రా, హెచ్సీఎల్, రాండ్స్టాడ్, అమెజాన్ తదితర ఐటీ, ఐటీ అనుబంధ దిగ్గజర సంస్థలు విశాఖ వైపు అడుగులు వేశాయి. అదానీ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకి పునాదులు జగన్ పాలనలోనే పడ్డాయి. ఉద్యోగ కల్పనలోనూ జగన్ అద్భుతాలు చేశారు. 2014 నుంచి ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో తెలుసా ? కేవలం 34 వేలు మాత్రమే. మరి...వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల తన పాలనలో కల్పించిన ఉద్యోగాలు ఎన్నో తెలు సా ? 6 లక్షల 31 వేల 906. 1956 నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యే వరకు తెలుగు రాష్ట్రాలను 17 మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. ఆ 17 మంది సీఎంలు చేయలేనిది జగన్ చేసి చూపించారు. జగన్ పాలనలో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఏపీలో పేదరికం బాగా తగ్గిందని స్వయంగా నీతి అయోగ్ తన నివేదికలో స్పష్టం చేసింది. కాలం కఠినమైంది. ఐదున్నర కోట్ల మంది ప్రజలకి విషమ పరీక్ష పెట్టింది. 2024లో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే అరాచకత్వానికి సరికొత్త నిర్వచనం చెబుతూ...ఆటవిక పాలన మొదలుపెట్టారు. ప్రజారంజక పాలనకి నిర్వచనం చెబుతూ జగన్ పాలన సాగిస్తే...ప్రజాకంటక పాలనకి సరికొత్త అర్థం చెబుతూ చంద్ర బాబు ప్రభుత్వం రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసింది. అటు అభివృద్ధి లేదు. ఇటు సంక్షేమం లేదు. లక్షల కోట్ల రూపాయల అప్పులు ఏం చేస్తున్నారో తెలీదు. ఎన్నికల హామీల అమలు లేదు. అన్ని వర్గాల ప్రజలు కష్టాలక డలిని ఈదే దుస్థితి ఏర్పడింది. పాలకులే పగ పడితే దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోన్న కోట్ల మంది ప్రజలకు జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారు. నేనున్నాన్న భరోసా అందిస్తున్నారు. ప్రజాకంటక పాలన పై సమరశంఖం పూరించారు. -
ఏపీవ్యాప్తంగా వైఎస్ జగన్ ముందస్తు బర్త్ డే వేడుకలు (ఫొటోలు)
-
ఐక్యరాజ్య సమితి లక్ష్యాలు.. జగనన్న నవరత్నాలు
పేదరికం.. పర్యావరణ కాలుష్యం.. సామాజిక వివక్ష.. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు బోలెడు. ఒక పద్ధతి ప్రకారం ఈ సమస్యలన్నీ సమసిపోయేలా చేసేందుకు ఐక్యరాజ్య సమితి పదేళ్ల క్రితమే కంకణం కట్టుకుంది. ఈ భూమి సుస్థిరాభివృద్ధికి ఆ 17 లక్ష్యాల సాధన అత్యవసరమని నిర్ణయించింది. సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్.. క్లుప్తంగా ఎస్డీజీ గోల్స్ అనే లక్ష్యాలకూ.. 2019-2024 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలకూ అతి దగ్గర సంబంధం ఉంది. ఒక్కో పథకం వెనుక ఏ సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్ (ఎస్డీజీ) లక్ష్య సాధన ఉంది అనేది తెలుసుకుందాంవైఎస్సార్ రైతు భరోసా.. ఈ పథకం ప్రధానంగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి, రైతులకు ఆర్థిక వెన్నుదన్నుగా నిలవడానికి ఉద్దేశించింది. వైఎస్సార్ రైతు భరోసా.. ఈ పథకం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి, రైతులకు భరోసా కల్పించడంపై దృష్టి పెడుతుంది. ఆశల జూదంగా ఉన్న వ్యవసాయాన్ని మళ్లీ గాడిన పెట్టడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం.ఏటా రైతులకు రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందించడం ద్వారా పంటల సాగును సులభతరం చేశారు. గత ఐదేళ్ల కాలంలో సుమారు 50 లక్షల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారని అంచనా. ఐక్య రాజ్య సమితి లక్ష్యాల్లో భాగంగా ఈ పథకం ద్వారా పేదరిక నిర్మూలన (SDG-1), ఆకలి లేని ప్రపంచం (SDG-2) బాధ్యతాయుతమైన ఉత్పత్తి, వినియోగం (SDG-12) వంటి లక్ష్యాలను సాధించడానికి కృషి జరుగుతోంది.వైఎస్సార్ ఆరోగ్యశ్రీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ నాణ్యమైన ఆరోగ్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ఈ పథకం దోహదపడుతోంది. వైద్య సాయం విషయంలో వార్షిక ఆదాయం రూ. 5 లక్షల వరకు ఉన్న కుటుంబాలకు ఏడాదికి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్య ఖర్చులను ప్రభుత్వం భరించింది. గత ఐదేళ్ల కాలంలో సుమారు కోటి నలభై మంది లబ్ధిదారులు ఈ సేవల ద్వారా ప్రయోజనం పొందారు. ఐక్య రాజ్య సమితి లక్ష్యాలలో అందరికీ ఆరోగ్యం, సంక్షేమం (SDG-3)తో పాటు సమాజంలో అసమానతల తొలగింపు (SDG-10) లక్ష్యాలను ఈ పథకం ప్రతిబింబిస్తుంది.నాడు.. నేడు ! ఐక్య రాజ్య సమితి లక్ష్యాలలో భాగంగా నాణ్యమైన విద్య (ఎస్డీజీ-4), మౌలిక వసతులు, సృజనాత్మకత, పరిశ్రమలు (ఎస్డీజీ-9) దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులను సమూలంగా మార్చేసి విద్యార్థులకు అత్యాధునిక తరగతి గదులు, డిజిటల్ బోధన, తాగునీరు తదితర సౌకర్యాల కల్పన లక్షించిన పథకం. మూడు దశల్లో ఆంధ్రప్రదేశ్లోని 45 వేల పాఠశాలల రూపురేఖలు మార్చేసే యత్నం.వైఎస్సార్ పెన్షన్ కానుక.. ఐక్య రాజ్య సమితి లక్ష్యాలలో భాగంగా పేదరిక నిర్మూలన (ఎస్డీజీ-1), అసమానతల తొలగింపు (ఎస్డీజీ-10). రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులతో పాటు అర్హులైన ఇతరులకు నెలనెలా ఆర్థిక సాయం అందించేందుకు ఏర్పాటు చేసిన పథకం. ఐదేళ్ల కాలంలో సుమారు 65 లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. వాలంటీర్ల వ్యవస్థ పుణ్యమా అని బీదాబిక్కీ, వృద్ధుల ఇళ్ల వద్దకే పెన్షన్ సొమ్ము అందింది.జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన.. ఐక్య రాజ్య సమితి లక్ష్యాలలో భాగంగా నాణ్యమైన విద్య (ఎస్డీజీ-4), లింగ సమానత్వం (ఎస్డీజీ-5). విద్యార్థుల ఫీజ్ రీయింబర్స్మెంట్తో పాటు నివాసానికి కూడా ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన పథకం. మగపిల్లలు, ఆడపిల్లలు అన్న తేడాల్లేకుండా అందరికీ ఈ పథకం వర్తింపజేశారు. ఐదేళ్ల కాలంలో సుమారు అరవై ఐదు లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందారు.పేదలందరికీ ఇళ్లు.. జగనన్న కాలనీలు.. ఐక్య రాజ్య సమితి లక్ష్యాలలో భాగంగాసుస్థిర నగరాలు, సమాజాలు (ఎస్డీజీ-11), పేదరిక నిర్మూలన (ఎస్డీజీ-1). ఆంధ్రప్రదేశ్లో సుమారు 30 లక్షల మంది సొంతింటి కలను సాకారం చేసిన పథకం. ఇళ్లస్థలాలు, ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం కూడా అందించడంతో 2019-2024 మధ్యకాలంలో రాష్ట్రవ్యాప్తంగా వేలాది జగనన్న కాలనీలు వెలిశాయి. రైతులకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్తు... ఐక్య రాజ్య సమితి లక్ష్యాలలో భాగంగా చౌక, కాలుష్య రహిత విద్యుత్తు (ఎస్డీజీ-7), గౌరవప్రదమైన పని, ఆర్థికాభివృద్ధి (ఎస్డీజీ-8).కరెంటు కోతలతో వ్యవసాయానికి జరుగుతున్న నష్టానికి చెక్ పెట్టిన పథకం. పగటిపూటే తొమ్మిది గంటలపాటు విద్యుత్తు సరఫరా, అది కూడా ఉచితంగా.. రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షలకు పైగా రైతులు లబ్ధి పొందారు.మహిళా సాధికారత (అమ్మ ఒడి, చేయూత)... ఐక్య రాజ్య సమితి లక్ష్యాలలో భాగంగా లింగ సమానత (ఎస్డీజీ-5), పేదరిక నిర్మూలన (ఎస్డీజీ-1). పేదలు చదువుకునేందుకు అడ్డంకిగా మారిన పేదరికాన్ని తొలగించే లక్ష్యంతో మొదలైన పథకం. బిడ్డలను బడికి పంపే ప్రతి తల్లికి ఏటా రూ. 15,000 ఆర్థిక సాయం. మహిళలు వ్యాపారాలు చేసుకునేందుకు 'చేయూత' పథకం ద్వారా సాయం. 'అమ్మ ఒడి' ద్వారా 45 లక్షల మంది, 'చేయూత' ద్వారా 25 లక్షల మందికి సాయం అందింది. ప్రకృతి విపత్తుల సహాయ నిధి.. ఐక్య రాజ్య సమితి లక్ష్యాలలో భాగంగా వాతావరణ మార్పులపై చర్యలు (ఎస్డీజీ-13), ఆకలి లేని ప్రపంచం (ఎస్డీజీ-2). వరదలు, కరువు కాటకాల వంటి ప్రకృతి విపత్తుల సమయాల్లో రైతులను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన పథకం. ఐదేళ్ల కాలంలో సుమారు పది లక్షల మంది సహాయ, సహకారాలు అందుకున్నారు. -
టీటీడీ ఆస్తులకు రక్షణేది?: భూమన
సాక్షి, తిరుపతి: టీటీడీ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి మండిపడ్డారు. టీటీడీ పవిత్ర స్థలాన్ని 7 స్టార్ హోటళ్లకు ఇవ్వడం సరికాదన్నారు. దేవుడి ఆస్తుల్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని.. ప్రజా సంఘాలు, హిందుత్వ సంఘాలు ఆందోళనలుచేపట్టాలని భూమన పిలుపునిచ్చారు.‘‘ఎర్ర చందనం చెట్లకు కొత్తగా నెంబర్లు వేస్తున్నారు. ఒక్కో చెట్టుకు రెండు నంబర్లు వేస్తూ మోసం చేస్తున్నారు. ఎర్ర చందనం దుంగుల్ని కాపాడతానన్న పవన్ ఎక్కడ?. ఏపీ ప్రజలకు పవన్ క్షమాపణ చెప్పాలి’’ అని భూమన కరుణాకర్రెడ్డి డిమాండ్ చేశారు. -
‘పవన్ తన పార్టీ కార్యకర్తలను టీడీపీకి బానిసలుగా మార్చారు’
సాక్షి, తాడేపల్లి: పవన్ కల్యాణ్ తన పార్టీ కార్యకర్తలను టీడీపీకి బానిసలుగా మార్చారంటూ వైఎస్సార్సీపీ నేత వరికూటి అశోక్బాబు అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పవన్ చర్యలను సొంత సామాజిక వర్గమే అంగీకరించటం లేదని.. డైవర్షన్ రాజకీయాల కోసమే ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అప్రజాస్వామికమన్నారు.‘‘తనను ఎవరూ పట్టించుకోవటం లేదనే అక్కసుతో ఏదేదో మాట్లాడుతున్నారు. తన గ్రాఫ్ పడిపోయిందని చంద్రబాబే స్వయంగా ఒప్పుకున్నారు. దీన్ని డైవర్ట్ చేసేందుకు పవన్ కష్ట పడుతున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదు?. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక జరిగిన అక్రమాలపై విచారణ చేయిస్తానని జగన్ అంటే పవన్కు కోపం ఎందుకు?’’ అంటూ అశోక్బాబు నిలదీశారు.‘‘ప్రభుత్వ స్కూళ్లను కూడా చంద్రబాబు ప్రైవేట్ పరం చేయబోతున్నారు. దీనిపై కూడా పవన్ ఎందుకు మాట్లాడటం లేదు?. అదేమంటే దాడులు చేస్తామంటున్నారు. చెప్పులు చూపిస్తూ పవన్ పచ్చి బూతులు మాట్లాడారు. పోలీసు వ్యవస్థను తమ దుర్మార్గాలకు వాడుకుంటున్నారు. జగన్ హయాంలో దౌర్జన్యం, దుర్మార్గాలు జరగలేదు. కూటమి పాలనలోనే సోషల్ మీడియా యాక్టివిస్టులను సైతం అక్రమంగా అరెస్టు చేసి జైలు పాల్జేశారు...సినిమా పోస్టర్లు ప్రదర్శించినా జైల్లో పెట్టారు. దుర్మార్గపు పాలన అంటే ఇదీ. పవన్ చర్యలను చూసి సొంత సామాజిక వర్గమే మదన పడుతోంది. టీడీపీ వారికి బానిసత్వం చేయించటాన్ని వారు సహించలేక పోతున్నారు. ఇకనైనా పవన్ కళ్యాణ్ పద్దతిగా మాట్లాడితే మంచిది’’ అని అశోక్బాబు హితవు పలికారు. -
హైదరాబాదులో ఘనంగా YSRCP అధినేత YS జగన్ జన్మదిన వేడుకలు
-
క్రైమ్రేట్ గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగింది: వరుదు కళ్యాణి
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా క్రైమ్రేట్ పెరిగిపోయిందని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం(డిసెంబర్ 20) ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మహిళల భద్రతను కూటమి ప్రభుత్వం గాలి గాలికొదిలేసిందన్నారు. సీఎం చంద్రబాబు నివాసం ఉన్న పరిసరాల్లోనే మహిళలపై నేరాలు 11 శాతం పెరిగాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.హోంమంత్రి అనితా నివాసం ఉంటున్న విజయనగరం జిల్లాలో గతంతో పోలిస్తే 19 శాతం నేరాలు మహిళలపై పెరిగాయన్నారు. ఏదైనా ప్రమాదం జరిగి పోలీసులకు ఫోన్ చేస్తే 26 నిమిషాల వరకూ ప్రమాద స్థలానికి చేరుకోవడం లేదని.. అదే వైఎస్ జగన్ హయాంలో రెండు మూడు నిమిషాల్లో మహిళల దగ్గరికి పోలీసులు చేరుకునేవారని తెలిపారు. మహిళలపై హత్యలు, లైంగిక దాడులు అధికంగా జరిగే ప్రాంతాలు అనే అంశంలో చంద్రబాబుకు ప్రపంచంలోని నెంబర్ 1 అవార్డు ఇవ్వాలని కళ్యాణి తెలిపారు. రాష్ట్రంలో యువత మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారని తెలిపారు. అధికారిక లెక్కల ప్రకారం 16 జిల్లాల్లో గంజాయి డ్రగ్స్ మత్తు పదార్థాలు వినియోగం విపరీతంగా పెరిగిందన్నారు. మెుత్తంగా గతంతో పోలిస్తే ప్రస్తుతం క్రైమ్రేట్ 18శాతం పెరిగిందని రాష్ట్రంలో నేరాలు పెరిగాయి అనే దానికి దానికి అసలైన నిదర్శనం హోంమంత్రి అమిత్ షాకు, చంద్రబాబు రాసిన లేఖనే అని వరుదు కళ్యాణి పేర్కొన్నారు. -
గోదావరి నడి మధ్యలో.. జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు
-
జగన్ వ్యక్తిత్వంపై సజ్జల ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, తాడేపల్లి: తన ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రజలకు ఎంత మేలు చేయాలో అంతా చేశారని.. మళ్ళీ అధికారంలోకి రాగానే చేయాల్సిన కార్యక్రమాలకు కూడా ప్లానింగ్ చేసుకున్నారని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం తాడేపల్లి కుంచనపల్లిలో జరిగిన వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న సజ్జల.. భారీ కేక్ కట్ చేసి మీడియాతో మాట్లాడారు. ‘‘అధికారంలో ఉన్నా లేకపోయినా జనం జగన్ వెంటే. ప్రజలకు మేలు చేసేది జగన్ ఒక్కడే. కోట్లాది మంది జగన్పై ఆ నమ్మకం పెట్టుకున్నారు. అందుకే తన ఐదేళ్ల పాలనలో అందరికీ మేలు చేశారు. ఎంతవరకు మేలు చేయాలో అంతవరకు చేశారు. రాజకీయాల్లో ఐదేళ్లు అనేది ఎక్కువేం కాదు. .. ఏదో ఆశించి జగన్ సహాయం చేయరు. తన వలన ఎంత మేరకు మేలు చేయాలా అనే నిత్యం ఆలోచిస్తూ ఉంటారు. ఓదార్పు యాత్ర సమయంలో కూడా ఆయన ఎంతో సహాయం చేశారు. తన తండ్రి కోసం ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సహాయం చేయాలనే లక్ష్యంతో ఆయన యాత్ర చేశారు. .. చాలా గొప్పగా సహాయం చేసినా ఆ విషయం బయటకు చెప్పుకోలేదు. అలాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి జగన్. కరోనా సమయంలో కూడా క్వారంటైన్ సెంటర్ లో మంచి భోజనం పెట్టాలనీ, మంచి వైద్యం చేయించాలని తపన పడ్డారు. ప్రతి ఒక్కరినీ జగన్ తన కుటుంబ సభ్యులుగానే భావిస్తారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి కాలనీలే సృష్టించారు. 17 మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, పోర్టులు, హార్బర్ లు ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టినా పబ్లిసిటీ చేసుకోలేదు.. .. చంద్రబాబు 18 నెలల్లోనే రూ.2.70 లక్షల కోట్లు అప్పు చేశారు. కానీ జనాలకు చంద్రబాబు చేసిన మేలు ఏదీ లేదు. జగన్ మాత్రం తన ఐదేళ్ల పాలనలోనే ఆర్ధికవేత్తలు సైతం ఆశ్చర్యపోయేలా పాలన చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేయాలనేది కూడా ఆయన ఈపాటికే ప్లానింగ్ వేసుకున్నారు’’ అని సజ్జల అన్నారు. -
ఆ నిరసన ప్రజా వ్యతిరేకతకు దర్పణం
సాక్షి, అమరావతి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమానికి ఇచ్చిన పిలుపు ప్రభంజనమైంది. రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరిస్తూ పేదలకు నాణ్యమైన వైద్యాన్ని.. వైద్య విద్యను దూరం చేయడంపై ప్రజలు తిరగబడ్డారు. తనకు కావాల్సిన వారికి సంపద సృష్టించి.. తద్వారా ‘నీకింత–నాకింత’ అంటూ పంచుకుతినే కుట్రతో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ చంద్రబాబు సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని కోటి మందికి పైగా ప్రజలు సంతకాలు చేసి బాబును కడిగి పారేశారు. క్రెడిట్ మరొకరికి దక్కుతుందనే కక్షతో మెడికల్ కాలేజీలను ప్రైవేటు ముసుగులో బినామీలకు కట్టబెట్టే కుట్రను బట్టబయలు చేశారు. సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అన్ని వర్గాలకు చెందిన 1,04,11,136 మంది ప్రజలు సంతకాలు చేయడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దేశ చరిత్రలో ఎన్నడూ ఒక ప్రజా ఉద్యమంలో ప్రజలు స్వచ్ఛందంగా ఈ స్థాయిలో సర్కార్ తీరును వ్యతిరేకిస్తూ సంతకాలు చేసిన దాఖలాలు లేవని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై నిరసనాగ్రహమే కాదు.. చంద్రబాబు సర్కార్పై ప్రజల్లో పెల్లుబుకుతున్న వ్యతిరేకతకు కోటి సంతకాల ప్రజా ఉద్యమం దర్పణం పట్టిందని విశ్లేషిస్తున్నారు. చారిత్రక ఘట్టంగా నిలుస్తూ కోటి సంతకాల ఉద్యమం గ్రాండ్ సక్సెస్ కావడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు నూతనోత్సాహంతో కదం తొక్కుతున్నాయి. కోటి మందిని కదిలించిన ఒక్క పిలుపు» రాష్ట్రంలో 1923 నుంచి 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు.. పద్మావతి అటానమస్ మెడికల్ కాలేజీతో కలిపితే 12 ఉన్నాయి. 2019 నాటికి చంద్రబాబు మూడు సార్లు అంటే 1995–99, 1999–04, 2014–19 మధ్య 14 ఏళ్లు సీఎంగా పాలించినప్పటికీ ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా కట్టలేదు.» వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 13 జిల్లాలను పునర్విభజించి, 26 జిల్లాలుగా ఏర్పాటు చేసింది. ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలతోపాటు నాణ్యమైన వైద్యం అందించడం.. పేదలకు వైద్య విద్యను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఒక్కో కాలేజీకి కనీసం 50 ఎకరాల స్థలం ఉండేలా భూమిని కేటాయించారు. ఒక్కో మెడికల్ కాలేజీ నిర్మాణానికి రూ.500 కోట్లకుపైగా ఖర్చు చేసి, అన్ని రకాల సదుపాయాలు ఉండేలా క్యాంపస్ల అభివృద్ధి పనులు ప్రారంభించారు. వాటిని పూర్తి చేయడానికి అవసరమైన నిధులను నాబార్డు.. కేంద్ర పథకాల నుంచి సమకూర్చారు. » కోవిడ్ మహమ్మారి వంటి సమస్యలు రెండేళ్లపాటు రాష్ట్రాన్ని పీడించినా, ఎన్ని ఇబ్బందులున్నా విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను 2023–24లో ప్రారంభించి, తరగతులు మొదలు పెట్టారు. ఎన్నికలు వచ్చే నాటికి పాడేరు, పులివెందుల కాలేజీలు కూడా తరగతులు ప్రారంభించడానికి సిద్ధమయ్యాయి. » ఎన్నికలు ముగిసిన తర్వాత పాడేరులో అడ్మిషన్లు ముగిసి తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. వైఎస్ జగన్ సర్కార్ సమకూర్చిన నిధులను సద్వినియోగం చేసుకుని.. ఆ ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక ప్రకారం చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపట్టి ఉంటే.. 2024–25 విద్యా సంవత్సరంలో ఆదోని, మదనపల్లి, మార్కాపురం మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చేవి. » ఈ విద్యా సంవత్సరం అంటే 2025–26లో అమలాపురం, బాపట్ల, నర్సీపట్నం, పార్వతీపురం, పాలకొల్లు, పెనుకొండలో కూడా వైద్య కళాశాలలు ప్రారంభం అయ్యేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు 2,360 మాత్రమే ఉండేవి. కొత్త మెడికల్ కాలేజీల ద్వారా అదనంగా మరో 2,550 సీట్లు పెరిగితే.. మొత్తమ్మీద 4,910 సీట్లు అందుబాటులోకి వచ్చేవి.» వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తరగతులు ప్రారంభమైన కొత్త మెడికల్ కాలేజీల్లో అప్పట్లోనే 800 సీట్లు భర్తీ చేశారు. పులివెందుల మెడికల్ కాలేజీలో తరగతులు ప్రారంభించేందుకు చంద్రబాబు సర్కార్ అంగీకరించి ఉంటే మరో 50 సీట్లు వచ్చేవి. కానీ చంద్రబాబు కాలదన్నారు. ఎక్కడ వైఎస్ జగన్కు క్రెడిట్ వస్తుందోనని ఏకంగా ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలను సీఎం చంద్రబాబు ప్రైవేటీకరించడానికి పూనుకున్నారు. దీనిపై ప్రజలు, మేధావులు, ప్రజా సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఏడాదికి రూ.వెయ్యి కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తే ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలన్నీ అందుబాటులోకి వచ్చేవన్న జగన్ వాదనను సమర్థిస్తున్నారు. » ఈ క్రమంలో చంద్రబాబు సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అక్టోబర్ 7న వైఎస్ జగన్ ప్రజా ఉద్యమానికి పిలుపునిస్తూ ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఆ పిలుపు ప్రభంజనంగా మారింది. అక్టోబర్ 9న వైఎస్ జగన్ నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించి సమరభేరి మోగించారు. ప్రజా తిరుగుబాటు » వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపు మేరకు గ్రామాలు, పట్టణాలు, వార్డుల్లోనూ వైఎస్సార్సీపీ నేతలు అక్టోబర్ 10 నుంచి డిసెంబర్ 10 వరకు భారీ ఎత్తున రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించారు. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రోజుకు సగటున రూ.520.94 కోట్లు అప్పు చేస్తూ.. దాన్ని దుబారా చేస్తూ దుర్వినియోగం చేస్తోందని.. ఒక్క రోజు చేసిన అప్పుతో ఒక మెడికల్ కాలేజీని పూర్తి చేయొచ్చని.. పేదలకు నాణ్యమైన వైద్యం, వైద్య విద్య అందకుండా చేయడం, బినామీలకు కట్టబెట్టడం కోసమే మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రైవేటీకరిస్తున్నారని రచ్చబండ కార్యక్రమాల్లో వైఎస్సార్సీపీ నేతలు వివరించారు. » దీనికి అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పత్రాలపై తమ చిరునామా, ఫోన్ నంబర్లు రాసి సంతకాలు చేశారు. నవంబర్ 12న నియోజకవర్గాల కేంద్రాల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ నిర్వహించిన ర్యాలీల్లో అన్ని వర్గాల ప్రజలు కదం తొక్కడంతో ర్యాలీలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. » ఈ నెల 10న రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోనూ ప్రజలు స్వచ్ఛందంగా చేసిన సంతకాల పత్రాలను ప్రదర్శిస్తూ వైఎస్సార్సీపీ నిర్వహించిన ర్యాలీల్లో ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. పోలీసుల ద్వారా ర్యాలీలను అడగడుగునా అడ్డుకోవడానికి చంద్రబాబు చేసిన కుట్రలను జనం పటాపంచలు చేశారు. ఈ నెల 15న జిల్లా కేంద్రాలలో కోటి సంతకాల పత్రాలను ప్రదర్శిస్తూ నిర్వహించిన ర్యాలీల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు వైఎస్సార్సీపీ నేతలతో కలిసి చంద్రబాబు సర్కార్పై రణభేరి మోగించారు. ఆ పత్రాలను వైఎస్సార్సీపీ నేతలతో కలిసి వైఎస్ జగన్ గవర్నర్కు అందజేసిన సందర్భంలోనూ జనం నీరాజనాలు పలికారు. » ఈ ఉద్యమాన్ని ఆసాంతం పరిశీలించిన రాజకీయ విశ్లేషకులు.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపైనే కాదు చంద్రబాబు సర్కార్పై ప్రజల్లో పెల్లుబుకుతున్న వ్యతిరేకతకు ఇది దర్పణం పట్టిందని చెబుతున్నారు. వైఎస్ జగన్ అమలు చేసిన పథకాలను కొనసాగించడంతోపాటు సూపర్ సిక్స్, సూపర్ సెవన్ పథకాలు అమలు చేస్తానంటూ ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. » అధికారంలోకి వచ్చాక వైఎస్ జగన్ అమలు చేసిన పథకాలను చంద్రబాబు సర్కార్ రద్దు చేసింది. సూపర్ సిక్స్, సూపర్ సెవన్ పథకాలను మోసాలుగా మిగిల్చింది. రెడ్ బుక్తో పరిపాలనతో అడుగడుగునా అదుపు తప్పుతోంది. సర్కార్లో అవినీతి తార స్థాయికి చేరింది. దాంతో ప్రజల్లో చంద్రబాబు సర్కార్పై వ్యతిరేకత పెల్లుబుకుతోంది. ఇది కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో ప్రస్ఫుటితమైందని సీనియర్ రాజకీయ నేతలు స్పష్టం చేస్తున్నారు. ప్రజల్లో చంద్రబాబు, టీడీపీ కూటమి సర్కార్ గ్రాఫ్ నానాటికీ పడిపోతుంటే.. వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ గ్రాఫ్ రోజురోజుకూ పెరుగుతోందని.. వైఎస్ జగన్ ఒక్క పిలుపుతో 1,04,11,136 మంది ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేయడమే ఇందుకు తార్కాణమని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. -
దళిత సర్పంచ్పై అధికార జులుం
సాక్షి టాస్క్ ఫోర్స్: తన స్థలంతోపాటు రైతుసేవా కేంద్రం దారిని ఆక్రమంచి టీడీపీ సానుభూతిపరుడు నిర్మించిన ప్రహరీని కూల్చేసిన ఎస్సీ వర్గీయుడైన సర్పంచ్పై కేసుపెట్టి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లిన వైనమిది. బాపట్ల జిల్లా అద్దంకి మండలం చక్రాయపాలెంలో శుక్రవారం జరిగిన ఈ ఘటన అధికారపార్టీ నేతలు, అధికారుల వైఖరికి అద్దం పడుతోంది. బాధిత సర్పంచ్ నగేశ్ తెలిపిన మేరకు.. వైఎస్సార్సీపీ పాలనలో ప్రభుత్వస్థలంలో రైతుభరోసా కేంద్రం నిరి్మంచారు. దానికి దారికోసం సర్పంచ్ నగేశ్ సర్వేనంబరు 127/7 లోని తన స్థలంలో ఐదడుగులు ఇచ్చారు. ఆ పక్కనే నివాసం ఉంటున్న టీడీపీ సానుభూతిపరులు టి.వెంకాయమ్మ, శ్రీనివాసరావు దంపతులు ఇటీవల రైతుసేవా కేంద్రానికి వెళ్లే రహదారిలో కొంత, నగేశ్ పట్టాభూమిలో కొంత ఆక్రమించి ప్రహరీ కట్టేందుకు పిల్లర్లు వేశారు. దీంతో సర్పంచ్ ఆ స్థలాన్ని సర్వేచేయాలంటూ తహసీల్దార్కు వినతిపత్రం ఇచ్చారు. తహసీల్దార్ ఆదేశాలతో సర్వేయర్ వచ్చి స్థలాన్ని సర్వేచేసి టీడీపీ సానుభూతిపరుడు గోడకట్టే ప్రదేశంలో ఆక్రమణ ఉందని నివేదిక ఇచ్చారు. ఈ విషయం చెప్పి సర్పంచ్ హెచ్చరించినా వినకుండా వారు గోడకట్టారు. సర్పంచ్పై దాడిచేసి కులం పేరుతో దూషించారు. ఆ విషయమై సర్పంచ్ రెండురోజుల కిందట ఎస్పీకి, జేసీకి ఫిర్యాదు చేశారు. ఎవరూ స్పందించకపోవడంతో సర్పంచ్ నగేశ్ ఆ అక్రమ గోడను యంత్రంతో కూల్చేశారు. దీంతో తన గోడను సర్పంచ్ కూల్చేశారని శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకుడి ప్రోద్బలంతో శుక్రవారం నగేశ్ స్థలంలో నుంచి విద్యుత్ సిబ్బంది కరెంటు స్తంభాలు వేయసాగారు. వారిని నగేశ్ అడ్డుకున్నారు. వారి సమాచారంతో గ్రామానికి వెళ్లిన సీఐ సుబ్బరాజు గోడ కూల్చినందుకు తీసుకెళ్తున్నానంటూ సర్పంచ్ నగేశ్ను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ విషయమై సీఐ సుబ్బరాజును అడగగా.. ఆక్రమణ విషయమై కోర్టులో తేల్చుకోవాలని, పడేయడం క్రిమినల్ కేసు అవుతుందని చెప్పారు. అందుకే తీసుకొచ్చి 41 నోటీసు ఇచ్చి పంపినట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు స్థలాన్ని కబ్జాచేసి గోడ నిరి్మంచినా పట్టించుకోని అధికారులు.. ఆ గోడ తొలగించారని సర్పంచ్పైనే కేసు పెట్టడం ఏమిటని స్థానికులు చర్చించుకుంటున్నారు. -
‘చంద్రబాబు మార్క్ దోపిడీకి ఇదే నిదర్శనం’
సాక్షి,తాడేపల్లి: చంద్రబాబు మార్క్ దోపిడీకి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణే నిదర్శనమని, కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు ప్రజారోగ్యాన్ని, వైద్య విద్య అభ్యసించాలన్న పేద విద్యార్థుల కలను పణంగా పెడుతున్నాడని మాజీ మంత్రి విడదల రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జరిగితే యూజర్ చార్జీల రూపంలో ప్రజలపై పెనుభారం మోపడం ఖాయమని, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉచితంగా అందిన వైద్య సేవలన్నీ రాబోయే రోజుల్లో డబ్బులు చెల్లించి పొందాల్సిన పరిస్థితి వస్తుందని వివరించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ నిర్వహించిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందని, ఈ ఉద్యమంతో కూటమి నాయకుల్లో వణుకు మొదలైందని చెప్పారు. కాబట్టే దాన్ని తక్కువ చేసి చూపించేలా కూటమి నాయకులతో సంతకాలు చేసిన ప్రజలను సైకోలు అని తిట్టిస్తూ చంద్రబాబు రోజురోజుకీ దిగజారిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే ప్రైవేటీకరణపై విచారణ జరిపి అవినీతికి పాల్పడిన వారిని చట్టం ముందు దోషులుగా నిలబెట్టడం ఖాయమన్నారు.ఆమె ఇంకా ఏమన్నారంటే...మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ నిర్వహించిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమానికి వచ్చిన స్పందన చూసి కూటమి నాయకుల గుండెల్లో వణుకు పుడుతోంది. అందుకే చంద్రబాబు అండ్ కో ప్రజా స్పందనను తక్కువ చేసి చూపించేందుకు ఆపసోపాలు పడుతున్నారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సైతం మెడికల్ కాలేజీల ఆవశ్యకతను నొక్కి వక్కాణిస్తూ చెప్పినా ఈ ప్రభుత్వం తీరులో మార్పు కనిపించడం లేదు. కమీషన్ల పేరుతో దోచుకోవడమే లక్ష్యంగా ప్రైవేటీకరణ ముద్దు- ప్రభుత్వ కాలేజీలు వద్దు అనేలా ముందుకు సాగుతున్నాడు. కోటికిపైగా సంతకాలు చేసిన విద్యార్థులు, యువత, మేథావులను సైకోలు, దొంగలు అని కూటమి పార్టీ నాయకులతో చంద్రబాబు తిట్టిస్తున్నాడు. మెడికల్ కాలేజీలు వద్దని సంతకాలు చేసిన 1,04,11,136 మంది ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నాడు.ప్రజా పాలన పట్ల బాధ్యత మరిచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు చెంప చెళ్లుమనిపించేలా, కూటమి ప్రభుత్వాన్ని బండకేసి బాదినట్టు ప్రజలు సంతకాలు చేశారు. సంతకాల రూపంలో తమ ఆవేదనను వ్యక్తం చేసిన ప్రజాభిప్రాయాన్ని పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. పీపీపీ ముసుగులో జరుగుతున్న ప్రజా దోపిడీని ఆయనకు వివరించారు. గవర్నర్ కూడా ప్రజల ఆవేదనను అర్థం చేసుకున్నారు. పీపీపీ మోడల్లో చంద్రబాబు తీసుకున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం కోట్లాదిమంది ప్రజల ఆరోగ్యానినికి గొడ్డలిపెట్టు లాంటిది. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు ప్రజాభిప్రాయాన్ని గ్రహించి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే దీనిపై న్యాయస్థానాల్లో వైఎస్సార్సీపీ పోరాడుతుందని హెచ్చరిస్తున్నాం. విద్య, వైద్యం ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు. దాన్ని చంద్రబాబు ప్రభుత్వం కాలరాస్తోంది. మాకొద్దు బాబోయే అని కోటి మందికిపైగా సంతకాలు చేసి చెప్పినా, ఇప్పటికీ పీపీపీ గొప్ప అన్నట్టు చంద్రబాబు ప్రచారం చేసుకోవడం నిరంకుశత్వానికి నిదర్శనం.లా అండ్ ఆర్డర్ కూడా ప్రైవేటుపరం చేస్తారా?రాష్ట్రంలో అతి ముఖ్యమైన మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసిన చంద్రబాబు.. శాంతి భద్రతల విభాగాన్ని ప్రైవేటుపరం చేస్తారేమో చెప్పాలి. పీపీపీ మోడల్లో రోడ్లు నిర్మాణం చేసి టోల్ ట్యాక్స్ వసూలు చేసినట్టుగానే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ తర్వాత హెల్త్ ట్యాక్స్ వసూలు చేయకుండా ఉంటారా? అందులో భాగంగానే ప్రభుత్వ వైద్యారోగ్య రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. యూజర్ చార్జీల రూపంలో ప్రజల మీద భారం మోపడానికే చంద్రబాబు ఈ పీపీపీ మోడల్ తీసుకొచ్చి ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అప్పగించేస్తున్నాడు. ఇదే జరిగితే రాబోయే రోజుల్లో పేదవాడికి వైద్యం అందని ద్రాక్షగా మారే ప్రమాదం ఉంది. గత టీడీపీ పాలనలోనూ ప్రైవేటుమయంప్రజల ఆరోగ్య భద్రత విషయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎక్కడా రాజీ పడలేదు. గతంలో రాష్ట్రంలో 260 అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉండగా వాటి నిర్వహణకు ప్రతినెలా రూ. 4.50 లక్షల చొప్పున కేటాయించి చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటుకి అప్పగించింది. అయినా వాటి ద్వారా ప్రజలకు అందిన వైద్య సేవలు ఏమాత్రం ఉండేవి కాదు. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యూహెచ్సీల సంఖ్యను 560కి పెంచడంతోపాటు నాడు- నేడు ద్వారా వాటిని ఆధునికీకరించి ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. 24 బై 7 పనిచేసేలా వైద్యులను అందుబాటులో ఉండటంతోపాటు అన్నిరకాల వైద్యపరికరాలు, మందులను సమకూర్చడం జరిగింది.రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో 10,032 వైయస్సార్ విలేజ్ హెల్త్ క్లీనిక్లను ఏర్పాటు చేశాం. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ద్వారా నేరుగా డాక్టర్నే ప్రజల ఇంటికి పంపించడం కూడా వైఎస్ జగన్ వైద్యారోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల్లో ఒకటి. నాడు మా ప్రభుత్వ హయాంలో ఉచితంగా రక్త పరీక్షలను నిర్వహిస్తే నేడు చంద్రబాబు వాటిని ప్రైవేటుపరం చేశాడు. ఏడాదికి రూ. 1000 కోట్లు చెప్పున రూ. 5 వేల కోట్లు ఖర్చు చేస్తే మెడికల్ కాలేజీల నిర్మాణాలు పూర్తవుతాయని తెలిసినా అందుకు పూనుకోకుండా ప్రైవేటీకరణకే మొగ్గుచూపడానికి ప్రధాన కారణం కూడా కమీషన్ల కోసమే.ఇదేం తెలివితక్కువ విశ్లేషణ చంద్రబాబూ..పీపీపీ మోడల్ ను సమర్థించుకోవడానికి చంద్రబాబు చెబుతున్న మాటలు చూస్తే ఎవరికైనా అనుమానాలు కలగకుండా ఉండవు. ప్రభుత్వ పెత్తనం అని తెలుగులో చెప్పి ప్రైవేట్ మేనేజ్మెంట్ అని ఇంగ్లిష్లో చెబుతున్నాడు. ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చిందని తెలిసినా అడ్డగోలు విశ్లేషణలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. 50 ఎకరాల మెడికల్ కాలేజీల భూములను ఎకరం వంద రూపాయలకు 66 ఏళ్లపాటు లీజుకివ్వడాన్ని ప్రజలెవరూ హర్షించడం లేదు. దీంతోపాటు మెడికల్ కాలేజీల పెత్తనం ప్రైవేటుకిచ్చి నిర్వహణకు అయ్యే ఖర్చును మాత్రం ప్రభుత్వం భరిస్తుందని చెప్పడం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. ఇలా స్కాంల మీద స్కాంలు చేస్తూ వైద్యవిద్యార్థుల ఆశలను, పేద ప్రజల ఆరోగ్యాన్ని అందని ద్రాక్షగా మార్చేస్తున్నాడు. చంద్రబాబు మార్క్ ఆస్తుల దోపిడీకి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణే పెద్ద ఉదాహరణ. ఇవన్నీ చూస్తుంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ముసుగులో వేల కోట్లు చేతులు మారుతున్నాయని ఎవరికైనా స్పష్టంగా అర్థమైపోతుంది.అందుకే మా నాయకులు వైఎస్ జగన్ దీన్ని మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక దీనిపై విచారణ జరిపి అవినీతికి ఎవరు పాల్పడినా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఎవరిని వదిలే ప్రసక్తే ఉండదు. తప్పు చేసిన వారిని చట్టం ముందు దోషులుగా నిలబెట్టి తీరుతామని విడదల రజిని హెచ్చరించారు. -
‘వైఎస్సార్సీపీ సంస్ధాగత నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టాలి’
తాడేపల్లి : 35 రోజుల పాటు వైఎస్సార్సీపీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టాలని పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. ఈరోజు(శుక్రవారం, డిసెంబర్ 19వ తేదీ) ,వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షలు, జిల్లా ప్రధాన కార్యదర్శలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. సంస్థాగత నిర్మాణం, కమిటీల నియామకాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. ‘ రాష్ట్రస్ధాయి నుంచి గ్రామస్ధాయి వరకూ కమిటీలు పూర్తవ్వాలి. అప్పుడు పార్టీకి 16 నుంచి 18 లక్షల సైన్యం రెడీ అవుతుంది. కమిటీల నిర్మాణం పూర్తికాగానే ఐడీ కార్డులు ఇస్తాం. కమిటీలలో అన్ని వర్గాల వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఉత్సాహంగా పనిచేసే వారికి అవకాశం ఇవ్వాలి. కార్యకర్తల కష్టంతోనే కోటి సంతకాల ఉద్యమం సక్సెస్ అయింది’ అని స్పష్టం చేశారు. -
నువ్వు వేస్ట్ అని ప్రజలకు ఎప్పుడో తెలుసు నీకే ఇప్పుడు తెలిసింది
-
‘ఒక్క రోజు అప్పుతో ఒక మెడికల్ కాలేజ్ పూర్తి చేయొచ్చు’
తాడేపల్లి: కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మారుస్తుందని మాజీమంత్రి, వైఎస్సార్సీపీ నేత సీదిరి అప్పలరాజు ద్వజమెత్తారు. కూటమి ప్రభుత్వ కేవలం 18 నెలల కాలంలోనే రూ.2.70లక్షల కోట్ల అప్పులు చేసిందని, సరాసరిన రోజుకు రూ. 550 కోట్లు అప్పు ప్రభుత్వం చేస్తుందని మండిపడ్డారు. ఈరోజు (శుక్రవారం, డిసెంబర్ 19వ తేదీ) ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం చేసే ఒక్క రోజు అప్పుతో ఒక మెడికల్ కాలేజ్ పూర్తి చేయొచ్చన్నారు.ఇటీవల జరిపిన ఒక గంట యోగా కార్యక్రమం కోసం రూ. 330 కోట్లు ఖర్చు చేశారని అన్నారు. అమరావతిలో తాత్కాలిక భవనాల పేరుతో ఇదివరకే రూ.వేల కోట్లు దుబారా చేయగా ఇప్పుడు మళ్లీ వేల కోట్లతో కొత్త నిర్మాణాలు చేపడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల ప్రైవేవేటీకరణను జనం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు.కూటమి ప్రభుత్వం తమను వెన్నుపోటు పొడిచిందని జనమంతా ఆగ్రహంతో ఉన్నారని ఇచ్చిన హామీలు కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని జనానికి అర్థం అయిందని తెలిపారు.అందుకే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైస్సార్సీపీ పార్టీ కోటి సంతకాల కార్యక్రమం చేపడితే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంతాకాలు చేశారని తెలిపారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక పెద్ద స్కాం దాగి ఉందని మాజీ మంత్రి అప్పల్రాజు పేర్కొన్నారు. భూమి ప్రభుత్వానిది ఆదాయం మాత్రం ప్రైవేట్వారికా? అని మాజీ మంత్రి ప్రశ్నించారు. రెండేళ్ల జీతాలు ప్రభుత్వమే చెల్లించాలా ఆ జీతాల సొమ్ముతో మరో రెండు వెద్యకళాశాలలు కట్టవచ్చని తెలిపారు.108, 104లను అనర్హులకు కట్టబెట్టిన వైనంపై విచారణ జరిపిస్తామని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని చూశారని తెలిపారు..అందుకోసమే కరోనా సమయంలోనూ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారన్నారు. కానీ చంద్రబాబు మాత్రం ప్రజలకు వైద్యం అందకుండా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేపడుతున్నారని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఖచ్చితంగా ప్రైవేటీకరణను రద్దు చేసి తీరాతం అని మాజీ మంత్రి సీదిరి అప్పల్రాజు తెేల్చిచేప్పారు. రాష్ట్రంలో చంద్రబాబు రౌడీయిజాన్ని పెంచి పోషిస్తున్నారని విమర్శించారు.. పెద్దపెద్ద పారిశ్రామిక వేత్తలను బెదిరిస్తున్నారని పరిశ్రమలపై దాడులు చేసి మూసివేసేలా చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని పరిస్థితులు చూసి ఎవరూ పెట్టుబడులు పెట్టడానికి ముందుకురావడం లేదని తెలిపారు. సనాతనవాదని అని గొప్పలు చెప్పుకుతిరిగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున గోమాంసం దొరికితే ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. పరకామణి విషయంలో కోర్టు పరిధిలో సెటిల్మెంట్ జరిగితే దాన్ని కూడా రాజకీయం చేయటం ఆయన సంకుచిత బుద్దికి నిదర్శనమని తెలిపారు. -
ఇది అంతం కాదు ఆరంభం.. ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి
-
YSRCP Leaders: కోటి సంతకాల ప్రజా ఉద్యమం సూపర్ సక్సెస్
-
Hari Gopala : అదేమైనా నీ అయ్యా సొమ్మా.. నీ ఇష్టం వచ్చినట్టు పంచడానికి
-
‘చంద్రబాబు సర్కార్ చేతకానితనం ఇది’
సాక్షి, విశాఖపట్నం: ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నాయకుల భూ కబ్జాలతో వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ, అనకాపల్లిలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు భయపడే పరిస్థితి ఉందన్నారు. భూ వివాదాలు, సివిల్ సెటిల్మెంట్లలో ఎమ్మెల్యేలను కట్టడి చేయలేకపోవడం ప్రభుత్వం చేతకానితనం అంటూ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.కలెక్టర్లు, ఎస్పీలకు క్లాస్ పీకడం వల్ల ప్రయోజనం ఉండదు. సామంత రాజుల్లా చెలరేగిపోతున్న ఎమ్మెల్యేలకు క్లాస్ పీకి, యాక్షన్ తీసుకుంటేనే దారికి వస్తారు. ముందు ఎమ్మెల్యేలను కట్టడి చేయడంపై సీఎం, డిప్యూటీ సీఎం దృష్టి సారించాలి’’ అంటూ గుడివాడ అమర్నాథ్ హితవు పలికారు. -
బాబు ఆర్థిక విధ్వంసం.. ఎల్లో మీడియా మాటల్లో!
‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరు నానాటికీ మరింత అధ్వాన్నంగా మారిపోతుంది. తప్పుడు లెక్కలతో తీరని ద్రోహం జరుగుతోంది’.. ఈ మాటలు అంటోంది ప్రతిపక్షాలు కాదు.. కూటమి ప్రభుత్వానికి దన్నుగా నిలిచే ఎల్లోమీడియా!. ఒకపక్కమే సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అప్పులు పుట్టడం లేదని ఒకసారి.. జీఎస్డీపీ బ్రహ్మాండమని ఇంకోసారి చెబుతూంటే.. ఎల్లోమీడియా ఇలా వాస్తవాలు వెల్లడించి పరువు బజారున పడేసింది.అయితే.. ఈ కథనంలో ఎక్కడా చంద్రబాబును తప్పు పట్టలేదు లెండి. తప్పంతా అధికారులదే అన్నట్టుగా ఈ కథనం సాగింది. జీఎస్డీపీ, తలసరి ఆదాయాలు బాగున్నట్లు చూపించి అసలు కష్టాలను దాచేశారని, కాగితాలపై గొప్పలు చెప్పారని వ్యాఖ్యానించింది. దీనివల్ల కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాలో ఏపీకి భారీ కోత పడిందని కూడా పేర్కొంది. రెవెన్యూ గ్రాంట్లలోనూ నష్టమే జరుగుతోందని, కేవలం అప్పుల కోసమే జీఎస్డీపీకి రెక్కలు తొడిగారని కూడా వెల్లడించింది.కొంతకాలంగా ఏపీ ఆర్ధిక పరిస్థితి, దొంగ లెక్కల గురించి ఆర్థిక నిపుణులు, అనుభవజ్ఞులైన జర్నలిస్టులు చెబుతున్నది కూడా అదే. అయితే, అప్పుడు పచ్చ మీడియా చంద్రబాబును వెనకేసుకొచ్చింది. ఇప్పుడు కూడా కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో చంద్రబాబు వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకే ఇలాంటి కథనాలు రాసిందని అంటున్నారు. అందుకే ఇందులో వాస్తవమున్నా నిజాయితీ మాత్రం కనిపించదు. వైఎస్ జగన్ హయాంలో అప్పులే ఆలంబన అని, ఇప్పుడేమో అప్పులతోపాటు ఇమేజీ కోసం ఆరాటం అని ఎల్లో మీడియా వ్యాఖ్యానించింది. అంతే తప్ప జగన్ టైమ్లో రెండేళ్లపాటు కరోనా సంక్షోభంతో వచ్చిన సమస్యలను రాయడానికి వీరికి చేయి రాలేదు. పైగా జగన్ హయాంలో రాష్ట్రం బ్రాండ్ పాతాళానికి చేరిందంటూ తప్పుడు వ్యాఖ్యలతో కథనాన్ని ఆరంభించడమే వీరి కుళ్లుకు దర్పణంగా కనిపిస్తుంది. అప్పుడేమో సంక్షేమమేనట, బటన్ నొక్కడమేనట. ఇప్పుడేమో పరిస్థితి మారిందట. సంక్షేమం, అభివృద్ది కావాలట. పెట్టబడులు రావాలట.ఆ రోజుల్లో టీడీపీ, జనసేన కలిసి ఇచ్చిన సంయుక్త ఎన్నికల ప్రణాళికలో ఇష్టం వచ్చినట్లు హామీలు ఇచ్చారని, అందుకు సుమారు రూ.లక్షన్నర కోట్లు ప్రతి ఏటా ఖర్చు చేయాల్సి ఉంటుందని జగన్ చెబితే ఈ మీడియా అంగీకరించిందా?. లేకపోగా జగన్పై చంద్రబాబు శరాలు సంధించారని గొప్పగా రాసింది. జగన్ టైమ్లో పోర్టులు, మెడికల్ కాలేజీలు కడితే, అవేవీ ఎల్లో మీడియా కళ్లకు కనిపించలేదు. పోనీ చంద్రబాబు టైమ్లో వచ్చిన కొత్త పరిశ్రమలు కనిపించాయా అంటే లేదు. కంపెనీలకు 99 పైసలకే ఎకరాలకు ఎకరాలు ధారాదత్తం చేస్తుంటే, రాష్ట్ర ప్రజల సంపదను కొంతమంది పెట్టుబడిదారులకు కట్టబెడుతుంటే వీరికి తప్పు అనిపించదు. కానీ, జగన్ అలాంటి పనులు చేయకపోయినా ఆయనపై పడి ఏడుస్తుంటుంది. ఈ మీడియా ఇచ్చిన కథనంలో వృద్దిరేటుపై చంద్రబాబు చెబుతున్న విషయాలు రాష్ట్రానికి నష్టం చేస్తున్నాయని తెలిపింది. ఈ లెక్కల వల్ల రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లలో గండి పడుతోందని తెలిపింది. చంద్రబాబేమో తనంత ఘనాపాటి లేడని అనిపించుకోవాలని అతిశయోక్తులతో కూడిన అంకెలతో గారడి చేస్తుంటే, ఆర్థిక శాఖకు చెందినవారో, లేక మంత్రి ఎవరో ఈ విషయాలు చెప్పి కథనం రాయించినట్లు అనిపిస్తుంది.ఈ తప్పుడు లెక్కల వల్ల ఏపీకి కేవలం రూ.7500 కోట్ల మేర మాత్రమే కేంద్రం గ్రాంట్ వచ్చిందని, అదే బీహారుకు రూ.17500 కోట్లు వచ్చిందని వివరించారు. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాలో కూడా ఇలాగే నష్టపోతున్నదట. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెలిగిపోతోందన్న లెక్కలవల్లే ఈ వాటా తగ్గుతోందట. అయితే ఏపీలో జీఎస్టీ వసూళ్లు తగ్గిన అంశాన్ని ఈ మీడియా కప్పిపుచ్చేసింది. జగన్ టైమ్లో జీఎస్డీపీ రూ.14 లక్షల కోట్ల ఉంటే, దానిని ఏడాదికి రెండు లక్షల కోట్ల చొప్పున పెంచేశారని, దీనికి తగినట్లుగానే తలసరి ఆదాయం అంచనాలు కూడా పెంచేశారని ఈ పత్రిక తెలిపింది. అప్పుల కోసం, బ్రాండ్ ఇమేజీ కోసం ఇలా చేస్తున్నారట. దేశంలో జీఎస్డీపీ 8.7 శాతం ఉంటే, ఏపీలో మాత్రం అది 11.28 శాతంగా చూపించడాన్ని ఈ మీడియా తప్పుపట్టింది. దేశ సగటు కన్నా తక్కువగా ఉన్న రాష్ట్రాలకు ఆర్థిక సంఘం నిధులు ఎక్కువగా వస్తాయని, ఏపీలో చాలా ఎక్కువగా చూపినందున తక్కువ నిధులు వస్తాయని ఈ మీడియా వాపోయింది. అలాగే జాతీయ తలసరి ఆదాయం కన్నా ఏపీ తలసరి ఆదాయం ఎక్కువగా ఉందని ప్రభుత్వం గొప్పలు పోయిందట. ఈ పరిస్థితిలో కేంద్రం నుంచి అధిక నిధులు, పన్నులలో ఎక్కువ వాటా ఎలా వస్తుందని అధికారులు అంటున్నారట.చంద్రబాబు ప్రభుత్వ బడ్జెట్ లెక్కల్లోని డొల్లతనం కూడా ఈ పత్రిక బహిర్గతం చేసింది. ఏపీకి పన్నేతర ఆదాయం రూ.19,119 కోట్లుగా అంచనా వేశారని, అవన్ని గాలి మేడలే అని చెబుతూ ఈ పద్దు కింద రూ.ఐదు వేల కోట్లు వస్తే గొప్ప అని స్పష్టం చేసింది. ఇప్పటికి వచ్చింది రూ.3671 కోట్లేనట. రాష్ట్ర పన్ను ఆదాయం కింద రూ.1.09 లక్షల ఆదాయం వస్తుందని అంచనా వేస్తే నవంబర్ నాటికి వచ్చింది రూ.68 వేల కోట్లేనని తేలింది. ఆదాయం పరిస్థితి ఇలా ఉండగా, ప్రభుత్వ ఖర్చులు మాత్రం తడిసి మోపెడవుతున్నాయి. రెవెన్యూలోటు 163 శాతానికి చేరుకుంది. రూ.1.60 లక్షల కోట్లు వ్యయం చేస్తే అందులో కేవలం రూ.17 వేల కోట్లే మూలధన వ్యయంగా ఉంది. ఈ అంకెల విషయంలో ఎక్కడా జగన్ ప్రభుత్వం నాటి లెక్కలతో పోల్చకుండా ఈ ఎల్లో మీడియా జాగ్రత్తపడింది.కేంద్రం నుంచి కూడా అప్పట్లో అధిక నిధులను జగన్ ప్రభుత్వం సాధించింది. ఉదాహరణకు రెవెన్యూ లోటు కిందే సుమారు రూ.పది వేల కోట్లు పొందింది. పోలవరం ప్రాజెక్టుకు రూ.12 వేల కోట్లు రాబట్టుకోగలిగింది. కేంద్రం ప్రతిపాదించిన సంస్కరణలు అమలు చేసి, అదనపు నిధులు సాధించింది. పైగా ఆ రోజుల్లో జీఎస్టీ వసూళ్లలో కూడా దేశంలోనే మొదటి ఐదు స్థానాలలో ఉండేది. అయినా అప్పుడు బ్రాండ్ పాతాళంలో ఉందని తప్పుడు రాతలు రాసిన ఈ ఎల్లో మీడియా ఇప్పుడు ఈ దారుణ పరిస్థితికి ఎన్ని పాతాళాల లోతున కూటమి ప్రభుత్వ ప్రతిష్ట దిగజారిందో మాత్రం చెప్పలేదు.వ్యాపార లావాదేవీలు, ప్రజల కొనుగోలు శక్తి మొదలైనవన్నీ జగన్ టైమ్లో మెరుగ్గా ఉన్న విషయాన్ని ఎల్లో మీడియా కప్పిపుచ్చే యత్నం చేసింది. కేవలం చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎగవేయడానికి వీలుగా గత కొన్నాళ్లుగా కథనాలు ఇస్తున్న ఈ పచ్చ మీడియా అందులో భాగంగానే తాజా కథనమూ ఇచ్చి ఉండవచ్చు. కానీ, ఈ క్రమంలో చంద్రబాబు ప్రభుత్వ ఆర్థిక విధ్వంస పాలనను తనకు తెలియకుండానే ప్రజల ముందు ఉంచింది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
రుషికొండ భవనం.. ఏపీ వైట్ హౌస్
-
వైఎస్సార్సీపీ కోటి సంతకాల కార్యక్రమం సూపర్ సక్సెస్
సాక్షి, తాడేపల్లి: కోటి సంతకాల కార్యక్రమం సూపర్ సక్సెస్ అయ్యింది. చంద్రబాబు నిర్ణయాన్ని జనం తీవ్రంగా తప్పుపట్టారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కాపాడుకునేందుకు వైఎస్ జగన్ పోరాటం చేస్తున్నారు. ప్రజారోగ్యానికి వైఎస్ జగన్ బాసటగా నిలిచారు. ప్రైవేటీకరణ పేరుతో స్కాం చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ జగన్.. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే జైలుకు పంపుతామంటూ హెచ్చరించారు.గవర్నర్ని కలిసి కోటి 4 లక్షల 11,136 సంతకాల ప్రతులు అందజేత చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలని వినతించారు. జగన్ రాకతో విజయవాడ రోడ్లు కిటకిటలాడాయి. అన్ని వర్గాల ప్రజల నుంచి వైఎస్ జగన్ పోరాటానికి మద్దతు లభించింది. కార్యక్రమం సక్సెస్ కావడం పార్టీ కేడర్కు ఫుల్ జోష్ ఇచ్చింది.రాష్ట్ర ప్రజల ఆకాంక్షను గవర్నర్కు నివేదించామని, ఈ పోరాటం ఇంతటితో ఆగదని.. న్యాయ పోరాటం.. ప్రజల్లోకి వెళ్లి పోరాటం కూడా చేస్తామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులతో కూడిన 26 వాహనాలను (గురువారం డిసెంబర్ 18)న లోక్భవన్కు తరలించారు. గవర్నర్ కార్యాలయ అధికారులు కె.రఘు (డిప్యూటీ సెక్రటరీ టు గవర్నర్), ఎన్.వెంకటరామాంజనేయులు (ఏడీసీ) ఆ పత్రాలు పరిశీలించారు. వాటన్నింటినీ వైఎస్ జగన్ తన భేటీలో గవర్నర్కు చూపారు. తాడేపల్లి లోని తన నివాసం నుంచి బయలు దేరిన వైఎస్ జగన్ నేరుగా తొలుత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ స్మృతివనాన్ని సందర్శించి నివాళులర్పించారు. -
జగన్ చరిత్ర సృష్టిస్తే.. నువ్వు చరిత్ర హీనుడిగా మిగిలిపోయావ్
-
ఎంత పెద్ద స్కామ్ అంటే? లైవ్ లో ఆధారాలతో బట్టబయలు చేసిన కారుమూరి
-
రాష్ట్ర చరిత్రలో గొప్ప ఉద్యమం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఒక పెద్ద స్కామ్ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పునరుద్ఘాటించారు. కాలేజీలను ప్రైవేటువారికి ఇప్పించడమే కాకుండా వాటిలో పనిచేసే సిబ్బందికి రెండేళ్లు చంద్రబాబు సర్కారే వేతనాలు ఇస్తుందట..! ఇదో మరో స్కామ్ అని స్పష్టం చేశారు. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమానికి రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభించిందని.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ.. ప్రభుత్వ రంగంలోనే వాటిని నిర్మించి నడపాలని డిమాండ్ చేస్తూ 1,04,11,136 మంది సంతకాలు చేసి ఉద్యమాన్ని విజయవంతం చేశారని వెల్లడించారు. ఈ ప్రజా ఉద్యమానికి వచ్చిన స్పందన చూసైనా చంద్రబాబు సర్కార్ వాస్తవాలు గుర్తించి.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై నిర్ణయం మార్చుకోవాలని హితవు పలికారు. లేదంటే తాము అధికారంలోకి రాగానే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. స్కామ్కు పాల్పడిన వారిని జైళ్లకు పంపుతామని హెచ్చరించారు. తాము అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే వారిపై అన్ని చర్యలు ఉంటాయని తేల్చి చెప్పారు. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన కోటికి పైగా సంతకాలతో కూడిన వాహనాలకు గురువారం ఉదయం వైఎస్ జగన్ జెండా ఊపి లోక్భవన్కు పంపారు. అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లాల అధ్యక్షులు, రీజనల్ కో–ఆర్డినేటర్లు, సీనియర్ నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే..చరిత్రలో నిల్చిపోయే ఘట్టంకోటి సంతకాల సేకరణలో మీ కృషి, మీ అందరినీ అభినందించేందుకు ఎన్ని మాటలు చెప్పినా తక్కువే. ఇక్కడి నుంచి మొదలు పెడితే.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, సీనియర్ నాయకులు, గ్రామస్థాయిలో కార్యకర్తల వరకు అంతా నిబద్ధతతో పని చేశారు.రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచాలని, ఆ నిర్ణయం వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తేవాలనే పట్టుదలతో చేపట్టిన ఇంత గొప్ప ఉద్యమం బహుశా రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ జరిగి ఉండదు. ఇన్ని సంతకాలు సేకరించడం, నిజంగా రాష్ట్ర చరిత్రలో నిల్చిపోయే ఘట్టం. ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నా.స్కామ్ చేసిన వారెవరినీ వదలం..గవర్నర్కు ఈ పత్రాలన్నీ చూపించిన తర్వాత, ఆయనకు చెప్పిన తర్వాత ఈ పత్రాలతో కోర్టు తలుపు కూడా తడతాం. ఆ మేరకు కోర్టులో పిటిషన్ వేస్తాం. మీరెప్పుడు అడిగితే అప్పుడు అఫిడవిట్లు (కోటి సంతకాల పత్రాలు) మీకు చూపించడం కోసం సిద్ధంగా ఉంటామని కోర్టుకు నివేదిస్తాం. కానీ ఇంతటితో చంద్రబాబుకు జ్ఞానోదయం అవుతుందని నేను అనుకోవడం లేదు. గతంలో ఎన్.జనార్ధన్రెడ్డి ప్రైవేట్ మెడికల్ కాలేజీకి అనుమతి ఇవ్వడంతో ఏకంగా ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈయనకు (చంద్రబాబు) సిగ్గు లేదో ఇంకొకటి లేదో! ఎడాపెడా గవర్నమెంట్ ఆస్తుల్ని ఇచ్చేస్తూ స్కాములు చేయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు! మనం ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా చంద్రబాబు వినకుండా దీన్ని ముందుకు తీసుకుని పోతే మాత్రం.. ఈ స్కామ్లో ఉన్న వారంతా మనం అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు నెలలు తిరక్క ముందే జైళ్లలో ఉంటారు. మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ కింద ఇది నిరూపితం అవుతుంది. గవర్నర్తో భేటీ తర్వాత కోర్టుల్లో చేసే యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఈలోపు చంద్రబాబునాయుడు ఇంకా మనసు మార్చుకోకుండా ముందుకు అడుగులు వేస్తే చూస్తూ ఊరుకోం. మళ్లీ నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తాం. మళ్లీ ప్రజల మధ్యన నిల్చుని ఉద్యమాలు చేసే కార్యక్రమం కొనసాగుతుంది. బాబు చేసిన మంచి.. బోడి సున్నా!గవర్నమెంట్ స్కూళ్లు, గవర్నమెంట్ హాస్పిటళ్లు ఎందుకు నడుపుతోంది అని అనుకునే మనిషి బహుశా చంద్రబాబు మినహా ప్రపంచంలో ఎవరూ ఉండరు. నాడు.. మనం ఉన్నాం కాబట్టి ఆర్టీసీ బతికింది. కార్మికులందరినీ గవర్నమెంట్లో విలీనం చేశాం. ఇంతకుముందు ఎన్నికల్లో మనం అధికారంలోకి రాకపోయి ఉంటే, చంద్రబాబునాయుడు వచ్చి ఉంటే ఆర్టీసీని కూడా అమ్మేసుండేవారు. మొన్న ఆశ్చర్యకరంగా ఒకమాట విన్నా.. పోలీస్ శాఖను కూడా ప్రైవేటీకరణ చేసే కార్యక్రమం చేస్తాడట. శాంతి భద్రతల పరిరక్షణ ప్రభుత్వ ఆధ్వర్యంలో లేకపోతే ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. చంద్రబాబు నోటి నుంచి నిన్న (బుధవారం) కలెక్టర్ల సదస్సులో వచ్చిన మాటలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ప్రజల్లో ఆయన గ్రాఫ్ పడిపోతోంది. దానికి కారణం కలెక్టర్ల పనితీరు సరిగా లేదని వారిపై నెపం వేస్తున్నారు. చంద్రబాబు వచ్చిన తర్వాత ఇప్పటికే రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టగా వచ్చే మార్చిలో మూడో బడ్జెట్ పెడుతున్నారు. మరి ప్రజలకు ఏదైనా మంచి జరిగిందా అంటే? బోడి సున్నా కనిపిస్తుంది.అప్పటిదాకా ప్రజలకు అందుబాటులో ఉండే అన్ని స్కీములూ రద్దయిపోయాయి. ఈ కార్యక్రమంలో శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్టీ వివిధ విభాగాలకు చెందిన నేతలు, పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆగే వరకు పోరాటమే: వైఎస్ జగన్
మా హయాంలో ప్రతి చోటా 50 ఎకరాలు ఉండేలా 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టాం. వాటికి నాబార్డ్, ఇతర బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ నిధులు టైఅప్ చేశాం. వాటిలో 7 కాలేజీలు పూర్తి కూడా చేశాం. అవి ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి. వాటి ద్వారా 800మెడికల్ సీట్లు అదనంగా అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన కాలేజీలు పూర్తి చేసేందుకు ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు అవసరం. మరి రూ.2 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఆ మాత్రం నిధులు ఖర్చు చేయలేదా? పోనీ మీరు ఖర్చు చేయలేకపోతే వదిలేయండి.. మేం వచ్చాక వాటిని పూర్తి చేస్తాం. – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్“మా పోరాటం ఇంతటితో ఆగదుగవర్నర్కు కోటి సంతకాలు చూపించాం. రేపు కోర్టులో పిటిషన్ వేస్తాం. అక్కడ కూడా ఈ కోటి సంతకాలు చూపిస్తాం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తాం...“మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణే ఒక స్కామ్ అయితే, ఆ తర్వాత రెండేళ్ల పాటు ఆ కాలేజీల సిబ్బందికి ప్రభుత్వమే జీతాలు ఇవ్వడం మరో స్కామ్. అంటే.. అక్కడున్న భూమి, భవనాలు, పని చేసే వారంతా ప్రభుత్వ ఉద్యోగులు. కానీ, నిర్వహణ మాత్రం ప్రైవేటువారిది.ఖర్చు ప్రభుత్వానిది.. సంపద మాత్రం ప్రైవేటువారికి. ఒక మెడికల్ కాలేజీలో జీతాలు ఏడాదికి కనీసం రూ.60 కోట్లు... రెండేళ్లకు రూ.120 కోట్లు అవుతాయి. ఆ లెక్కన 10 మెడికల్ కాలేజీల సిబ్బందికి రెండేళ్లపాటు జీతంగా కనీసం రూ.1,200 కోట్లు అవుతుంది. ఇలాంటి స్కామ్లు దేశంలో ఎక్కడా ఉండవు...’’“మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో బాబు చేస్తున్న అన్యాయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా రాష్ట్ర ప్రజల ఆకాంక్షను కూడా ఆయనకు తెలియజేశాం. ఈరోజు ఒక చరిత్రాత్మక ఘట్టం. ఏకంగా 1,04,11,136 సంతకాలు సేకరించాం. దేశ చరిత్రలో కూడా ఇలాంటి ఉద్యమం జరిగి ఉండదేమో..’’“నిజానికి ఆ మెడికల్ కాలేజీలన్నీ భవిష్యత్లో రూ.లక్ష కోట్ల విలువైన ఆస్తి అవుతాయి. కొన్ని కోట్ల మందికి ఉచిత వైద్యం అందిస్తూ, వెల కట్టలేని సేవలందిస్తూ కోట్లాది మందిలో వెలుగులు నింపుతాయి..’’“అందరం కలసికట్టుగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుందాం. మనం ఇప్పుడు ఆ పని చేయకపోతే, రేప్పొద్దున వైద్యం కోసం ఒక్కొక్కరు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు చెల్లించాల్సి వస్తుంది’’“మెడికల్ కాలేజీలను కాపాడుకునేందుకు ప్రతి ద్వారం తొక్కుతాం. కోర్టుల ద్వారా వీటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. ఇంకా ఉద్యమం కొనసాగుతుంది. ప్రజలతో కలసి పోరాటం కూడా చేస్తాం. ఇది కచ్చితంగా స్కామే’’రాష్ట్ర ప్రజల ఆకాంక్షను గవర్నర్కు నివేదించామని, ఈ పోరాటం ఇంతటితో ఆగదని.. న్యాయ పోరాటం.. ప్రజల్లోకి వెళ్లి పోరాటం కూడా చేస్తామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులతో కూడిన 26 వాహనాలను లోక్భవన్కు తరలించారు. గవర్నర్ కార్యాలయ అధికారులు కె.రఘు (డిప్యూటీ సెక్రటరీ టు గవర్నర్), ఎన్.వెంకటరామాంజనేయులు (ఏడీసీ) ఆ పత్రాలు పరిశీలించారు.వాటన్నింటినీ వైఎస్ జగన్ తన భేటీలో గవర్నర్కు చూపారు. తాడేపల్లి లోని తన నివాసం నుంచి బయలు దేరిన వైఎస్ జగన్ నేరుగా తొలుత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ స్మృతివనాన్ని సందర్శించి నివాళులర్పించారు.సాక్షి, అమరావతి: ‘‘చంద్రబాబూ..! ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాలను పూర్తి చేయడం మీకు చేతకాకపోతే.. అలా వదిలేయండి. మేం వచ్చాక వాటిని నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. అంతేకానీ వాటిని పూర్తి చేస్తే ఎక్కడ మాకు మంచి పేరు (క్రెడిట్) వస్తుందోననే ఆలోచనతో ప్రైవేటీకరణ చేయడం మంచి పద్ధతి కాదు..’’ అని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు.చంద్రబాబు సర్కారు అసంబద్ధ నిర్ణయం భవిష్యత్తు తరాలకు పెను శాపంగా మారుతుందని హెచ్చరించారు. భూమి.. మెడికల్ కాలేజీ.. ఆస్పత్రి.. అన్నీ ప్రభుత్వానివే.. ఉద్యోగులూ గవర్నమెంట్వారే.. చివరకు జీతాలు ఇచ్చేదీ ప్రభుత్వమే..! ప్రయోజనం పొందేది మాత్రం ప్రైవేట్ వ్యక్తులు..! ఇది స్కామ్ కాకపోతే మరేమిటి? ప్రపంచంలో ఇలా ఎక్కడైనా ఉందా..? ఇది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్..! అని మండిపడ్డారు.కొత్త వైద్య కాలేజీలు, ఆస్పత్రులను కట్టబెట్టడమే కాకుండా ఒక్క జీతాల రూపంలోనే రూ.1,200 కోట్ల ప్రజాధనాన్ని ప్రైవేట్ వ్యక్తులకు చంద్రబాబు దోచి పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం రూ.5 వేల కోట్లతో ప్రభుత్వమే ఆ మెడికల్ కాలేజీలను పూర్తి చేసే వీలున్నా స్కామ్ల కోసం ప్రైవేట్పరం చేస్తున్నారని మండిపడ్డారు.పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజినల్ కో–ఆర్డినేటర్లతో కూడిన 40 మంది నేతల బృందంతో గురువారం లోక్భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్తో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్టీ చేపట్టిన ప్రజా ఉద్యమం, కోటి సంతకాల సేకరణను వివరించారు.మెడికల్ కాలేజీల విషయంలో ఈ ప్రభుత్వం ఎలాగైనా తన నిర్ణయం మార్చుకునేలా చూడాలని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకోవాలని గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అన్ని వివరాలతో ఒక వినతిపత్రం సమరి్పంచారు. గవర్నర్తో సమావేశం ముగిసిన తర్వాత లోక్భవన్ వద్ద వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు.చంద్రబాబు సర్కారు చేస్తున్న అన్యాయాలు, మోసాలు, స్కామ్లను గవర్నర్ దృష్టికి తేవడంతోపాటు రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను ఆయనకు అర్థమయ్యేలా వివరించామని తెలిపారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై గవర్నర్ చాలా బాధపడ్డారని.. సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..ప్రజల మనోభావాలు గవర్నర్కు నివేదించాంమెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో చంద్రబాబు చేస్తున్న అన్యాయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా రాష్ట్ర ప్రజల ఆకాంక్షను కూడా ఆయనకు తెలియజేశాం. ఈరోజు ఒక చరిత్రాత్మక ఘట్టం. ఏకంగా 1,04,11,136 సంతకాలు సేకరించాం. దేశ చరిత్రలో కూడా ఇలాంటి ఉద్యమం జరిగి ఉండదేమో. గత అక్టోబరు 7న ప్రజా ఉద్యమ కార్యాచరణను ప్రకటించాం.అక్టోబరు 10 నుంచి ఈనెల 10 వరకు ప్రతి గ్రామం, పట్టణం, ప్రతి వార్డులో రచ్చబండ కార్యక్రమాల ద్వారా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. వారిని ఉద్యమంలోకి తీసుకువచ్చాం. వాళ్ల సంతకాలు తీసుకున్నాం. నవంబర్ 12న ఒకసారి, మళ్లీ ఈనెల 10న మరోసారి అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహించాం.10న ర్యాలీల తర్వాత కోటి సంతకాల పత్రాలను జిల్లా కేంద్రాలకు తరలించాం. అక్కడ డిసెంబరు 15న ర్యాలీలు నిర్వహించి వాటిని ప్రజలకు చూపాం. ఆ తర్వాత వాటన్నింటినీ పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించి, ఈరోజు (గురువారం) గవర్నర్ గారికి చూపించాం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజల నిరసన, వారి మనోభావాలను గవర్నర్కు వివరించాం. అసంబద్ధంగా ప్రభుత్వ నిర్ణయం..ఈ రోజు మీ అందరి ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నా. మనం తీసుకునే నిర్ణయాలతో భవిష్యత్ తరాలపై ఎలాంటి ప్రభావం పడుతుందన్నది ఆలోచన చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం స్కూల్స్ ఎందుకు నడుపుతుంది? దేశంలో అన్ని చోట్లా స్కూళ్లు, ఆస్పత్రులు, ఆర్టీసీ బస్సులను ప్రభుత్వమే ఎందుకు నడుపుతుందో ఆలోచించారా? రాష్ట్ర ప్రభుత్వం కనుక వీటిని నడపకపోతే.. పేద, మధ్య తరగతి వారు ప్రైవేటు దోపిడీకి గురై, వారు భరించలేని స్థాయికి వెళ్లిపోతాయి. ఆశ్రయించలేక నష్టపోతారు.అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని ఒక బాధ్యతగా భావించి నిర్వహిస్తాయి. అన్నీ ప్రైవేటీకరిస్తూ పోతే దోపిడీకి చెక్ పడదు. ప్రజలు సేవలు పొందాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఇన్పేషంట్గా చేరాలంటే కనీసం రూ.5 వేలు చార్జ్ చేస్తారు. కనీస వసతులతో రూమ్ కావాలంటే రోజుకు రూ.10 వేలు, ఐసీయూలో రోజుకు రూ.30వేల నుంచి రూ.50 వేలు చెల్లించాల్సి ఉంటుంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఈ ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయం.మెడికల్ కాలేజీతో ఉచితంగా అత్యుత్తమ వైద్య సేవలు..మా ప్రభుత్వ హయాంలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా చేయడంతో పాటు ప్రతి జిల్లా కేంద్రంలో కొత్త మెడికల్ కాలేజీకి శ్రీకారం చుట్టాం. మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తే, అక్కడ టీచింగ్ ఆస్పత్రి అందుబాటులోకి వస్తుంది. అప్పుడు ఆ ఆస్పత్రిలో, మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పీజీ స్టూడెంట్స్, మెడికోస్, నర్సింగ్ స్టూడెంట్లు.. అందరూ అందుబాటులో ఉంటారు.దీంతో పేదలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయి. దాని వల్ల చుట్టుపక్కల ఉన్న ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టం వచి్చనట్లు ఛార్జ్ చేయలేవు. మేం నాడు తలపెట్టిన 17 మెడికల్ కాలేజీలన్నీ ప్రారంభమైతే మన పిల్లలకు మరిన్ని మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. దాని వల్ల వైద్య విద్య చదవాలని కోరుకునే పేద విద్యార్థులకు న్యాయం జరుగుతుంది.నిధుల కొరత అబద్ధం..మా హయాంలో ప్రతి చోటా 50 ఎకరాలు ఉండేలా 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టాం. వాటికి నాబార్డ్, ఇతర బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ నిధులు టైఅప్ చేశాం. వాటిలో 7 కాలేజీలు పూర్తి కూడా చేశాం. అవి ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి. వాటి ద్వారా 800 మెడికల్ సీట్లు అదనంగా అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన కాలేజీలు పూర్తి చేసేందుకు ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు అవసరం. మరి రూ.2 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఆ మాత్రం నిధులు ఖర్చు చేయలేదా?పోనీ మీరు ఖర్చు చేయలేకపోతే వదిలేయండి.. మేం వచ్చాక వాటిని పూర్తి చేస్తాం. చంద్రబాబుకు గట్టిగా తగిలేటట్టుగా గవర్నర్గారి దృష్టికి అన్ని విషయాలు తీసుకెళ్లాం. మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తే, మాకు క్రెడిట్ దక్కుతుందన్న అక్కసుతో చంద్రబాబు పేదలకు నష్టం చేస్తున్నారు. మరోవైపు ప్రైవేటీకరణతో స్కామ్లు చేస్తున్నారు. నిజానికి ఆ మెడికల్ కాలేజీలన్నీ భవిష్యత్లో రూ.లక్ష కోట్ల విలువైన ఆస్తి అవుతాయి. కొన్ని కోట్ల మందికి ఉచిత వైద్యం అందిస్తూ, వెల కట్టలేని సేవలందిస్తూ కోట్లాది మందిలో వెలుగులు నింపుతాయి.కలసి కట్టుగా అడ్డుకుందాం..చంద్రబాబు తోలు మందం కాబట్టి ఆయన మారకపోవచ్చు. కాబట్టి అందరూ కలసి రావాలి. అందరం కలసికట్టుగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుందాం. మనం ఇప్పుడు ఆ పని చేయకపోతే, రేప్పొద్దున వైద్యం కోసం ఒక్కొక్కరు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు చెల్లించాల్సి వస్తుంది. గవర్నర్కు గానీ, మనసున్న ఏ వ్యక్తికైనాగానీ చంద్రబాబు చేసేది తప్పు అని అర్థమవుతుంది. ఇదే గవర్నర్ ఇంట్లో పని చేసే వ్యక్తులు మెడికల్ కాలేజీకి వెళ్తే ఉచితంగా వైద్యం అందుతుంది. గవర్నర్ది మంచి మనసు. ఆయన అన్నీ అర్థం చేసుకున్నారు.న్యాయ పోరాటం.. ప్రజా పోరాటం..మెడికల్ కాలేజీలను కాపాడుకునేందుకు ప్రతి ద్వారం తొక్కుతాం. కోర్టుల ద్వారా వీటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. ఇంకా ఉద్యమం కొనసాగుతుంది. ప్రజలతో కలసి వీధి పోరాటం కూడా చేస్తాం. ఇది కచ్చితంగా స్కామ్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణే ఒక స్కామ్ అయితే, ఆ తర్వాత రెండేళ్ల పాటు ఆ కాలేజీల సిబ్బందికి ప్రభుత్వమే జీతాలు ఇవ్వడం మరో స్కామ్.అంటే.. అక్కడున్న భూమి, భవనాలు, పని చేసే వారంతా ప్రభుత్వ ఉద్యోగులు. కానీ, నిర్వహణ మాత్రం ప్రైవేటువారిది. ఖర్చు ప్రభుత్వానిది.. సంపద మాత్రం ప్రైవేటువారికి. ఒక మెడికల్ కాలేజీలో జీతాలు ఏడాదికి కనీసం రూ.60 కోట్లు... రెండేళ్లకు రూ.120 కోట్లు అవుతాయి. ఆ లెక్కన 10 మెడికల్ కాలేజీల సిబ్బందికి రెండేళ్లపాటు జీతంగా కనీసం రూ.1,200 కోట్లు అవుతుంది. అన్నీ ప్రభుత్వానివే.. అప్పగించేది మాత్రం ప్రైవేటు వ్యక్తులకా? ఇలాంటి స్కామ్లు ప్రపంచంలో ఎక్కడా ఉండవు..!పైగా ప్రజలను మోసం చేసేందుకు.. డైవర్షన్ చేసేందుకు.. కళాశాలలన్నీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతూ గవర్నమెంట్ పేరు పెడతాడట! రేప్పొద్దున హెరిటేజ్ కంపెనీ ముందు గవర్నమెంట్ పేరు పెట్టి కింద హెరిటేజ్ అని చిన్నగా పేరు పెడితే ఆ హెరిటేజ్ కంపెనీ ప్రభుత్వానిది అయిపోతుందా? అందరూ ఆలోచన చేయాలి. ప్రజలంటే ఎలా కనిపిస్తున్నారు? మరీ ఇంత దారుణంగా చెవిలో పూలు పెడితే ఎలా?సూపర్ 6 ఒక మోసం.. సూపర్–7 ఒక మోసం.. ఎన్నికలప్పుడు జగన్ ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ ఇస్తూనే, వాటికి అదనంగా సూపర్ సిక్స్, సెవన్ ఇస్తామన్నారు. ఇప్పుడు చూస్తే పలావు పోయింది... బిర్యాని పోయింది!ప్రజలు పూర్తిగా రోడ్డున పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు.. డిసెంబర్ నెల ముగిస్తే 8 క్వార్టర్స్ బకాయిలు ఇవ్వాలి. విద్యాదీవెన లేదు.. వసతి దీవెన లేదు... పిల్లలు చదువులు మానేస్తున్నారు. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోలు (జీఈఆర్) తగ్గాయి. ఆరోగ్యశ్రీ లేదు.. నెట్వర్క్ ఆస్పత్రులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వక పోవడంతో బోర్డులు తిప్పేశారు. మరోవైపు గవర్నమెంట్ ఆస్పత్రులు దారుణంగా ఉన్నాయి.ఒక్కరోజు యోగాకు 330 కోట్లా?- మ్యాట్లు మీరు కొన్నదెంత?.. అమెజాన్లో ఉన్నదెంత?‘‘రుషికొండలో రూ.230... రూ.240 కోట్లతో కట్టిన భవనాలు విశాఖకు మణిహారంగా మారాయి. విశాఖకు ఆ భవనాలు తలమానికంగా ఉన్నాయి. ఈ రోజున వెళ్లి చూస్తే విశాఖపటా్ననికి గొప్ప పర్యాటక ప్రాంతంగా ఉంటుంది. విశాఖకు గవర్నర్ వెళ్లినా, ప్రధాని మోదీ వచ్చినా, రష్యా ప్రెసిడెంట్ పుతిన్ వస్తే ఎక్కడ పెడతారు? బ్రహ్మాండమైన రాజభవనం లాంటి భవనమది.. ఆ భవనంలో వారికి అతిథ్యం ఇవ్వవచ్చు. అదే చంద్రబాబు నాయుడు యోగా కార్యక్రమం కోసం రూ.330 కోట్లు ఖర్చు చేశారు. ఒక్క రోజు కార్యక్రమం కోసం రూ.330 కోట్లు ఆవిరి చేశారు. దాన్నేమంటారు? ఆరోజు యోగా మ్యాట్లకు ఎంత ఖర్చు పెట్టారో చూస్తే మీకే అర్థమవుతుంది. అమెజాన్లోకి వెళ్లి మ్యాట్ల ఖరీదు ఎంతో చూడండి. వీళ్లు ఎంతకు కొనుగోలు చేశారో పరిశీలించండి. వాళ్ల కంటే 50 శాతం తక్కువ ఉండకపోతే నన్ను అడగండి’’ అని ఓ ప్రశ్నకు సమాధానంగా జగన్ పేర్కొన్నారు. -
లోక్ భవన్ కు YS జగన్.. బాబు, పవన్ గుండెల్లో వణుకు
-
YS Jagan: గవర్నర్ తో నేను చెప్పిన విషయాలు ఇవే!
-
చేతకాకపోతే దిగిపో..నేను చూసుకుంటా..!
-
దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద స్కాం: వైఎస్ జగన్
సాక్షి,విజయవాడ: రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దేశంలో అతిపెద్ద స్కాం అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన కోటి సంతకాల సేకరణ ప్రతులను గురువారం విజయవాడలోని లోక్భవన్లో గవర్నర్ అబ్ధుల్ నజీర్కు అందించారు. అనంతరం లోక్భవన్ వద్ద వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో చంద్రబాబు చేస్తున్న అన్యాయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా రాష్ట్ర ప్రజల ఆకాంక్షను కూడా ఆయనకు తెలియజేశాం. ఈరోజు ఒక చారిత్రక ఘట్టం. ఏకంగా 1,04,11,136 సంతకాలు. దేశ చరిత్రలో కూడా ఇలాంటి ఉద్యమం జరిగి ఉండదేమో?. గత అక్టోబరు 7న ప్రజా ఉద్యమ కార్యాచరణ ప్రకటించాం. ఆ తర్వాత అక్టోబరు 10 నుంచి ఈనెల 10 వరకు ప్రతి గ్రామం, పట్టణం, ప్రతి వార్డులో రచ్చబండ కార్యక్రమం ద్వారా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. వారిని ఉద్యమంలోకి తీసుకువచ్చాం. వాళ్ల సంతకాలు తీసుకున్నాం.నవంబర్ 12న ఒకసారి, మళ్లీ ఈనెల 10న మరోసారి అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహించాం. డిసెంబరు 10న ర్యాలీల తర్వాత కోటి సంతకాల పత్రాలను జిల్లా కేంద్రాలకు తరలించాం. అక్కడ డిసెంబరు 15న ర్యాలీలు నిర్వహించి, వాటిని ప్రజలకు చూపాం. ఆ తర్వాత వాటన్నింటినీ పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించి, ఈరోజు (గురువారం) గవర్నర్కి చూపించాం. ఆ విధంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజల నిరసన, వారి మనోభావాలను వివరించాం.అసంబద్ధంగా ప్రభుత్వ నిర్ణయం:ఈరోజు మీ అందరి ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నాను. మనం తీసుకునే నిర్ణయాలు భవిష్యత్ తరాలకు ఎలాంటి ప్రభావం పడుతుందన్నది ఆలోచన చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం స్కూల్స్ ఎందుకు నడుపుతుంది? దేశంలో అన్ని చోట్ల స్కూళ్లు, ఆస్పత్రులు, ఆర్టీసీ బస్సులను ప్రభుత్వమే ఎందుకు నడుపుతుందో ఆలోచించారా? రాష్ట్ర ప్రభుత్వమే వీటిని నడపకపోతే పేద, మధ్య తరగతి వారు ప్రైవేటును ఆశ్రయించలేక నష్టపోతారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని ఒక బాధ్యతగా భావించి నిర్వహిస్తాయి.ఇలా అన్నీ ప్రైవేటీకరిస్తూ పోతే, దోపిడికి చెక్ పడదు. ప్రజా సేవలు పొందాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఇన్పేషెంట్గా చేరాలంటే కనీసం రూ.5 వేలు ఛార్జ్ చేస్తారు. కనీస వసతుల రూమ్ కావాలంటే రోజుకు రూ.10 వేలు, ఐసీయూలో రోజుకు కనీసం రూ.50 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అందుకే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయం.మెడికల్ కాలేజీతో ఫ్రీగా అత్యుత్తమ వైద్య సేవలు: మా ప్రభుత్వ హయాంలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా చేయడంతో పాటు, ప్రతి జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీకి శ్రీకారం చుట్టాం. ఎక్కడైనా మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తే, అక్కడ టీచింగ్ ఆస్పత్రి అందుబాటులోకి వస్తుంది. అప్పుడు ఆ ఆస్పత్రిలో, మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, నర్సులు అందరూ అందుబాటులో ఉంటారు. దీంతో పేదలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయి. దాని వల్ల చుట్టుపక్కల ఉన్న ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టం వచ్చినట్లు ఛార్జ్ చేయలేవు. మేము నాడు తలపెట్టిన 17 మెడికల్ కాలేజీలు ప్రారంభమైతే, మన పిల్లలకు మరిన్ని మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. దాని వల్ల వైద్య విద్య కోరుకునే పేద విద్యార్థులకు న్యాయం జరుగుతుంది.మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ స్కామ్ల మయం:కానీ, ఇప్పుడు చంద్రబాబు ఆ పని చేయకపోగా, కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిçస్తూ, స్కామ్లు చేస్తున్నారు. స్కామ్ల విషయంలో చంద్రబాబు నాలుగు అడుగులు ఎక్కువ వేస్తున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఒక స్కామ్ అయితే, ఆ తర్వాత రెండేళ్ల పాటు, ఆ కాలేజీల సిబ్బందికి ప్రభుత్వం జీతాలు ఇవ్వడం మరో స్కామ్. అంటే అక్కడున్న భూమి, భవనాలు, పని చేసే వారంతా ప్రభుత్వ ఉద్యోగులు. కానీ, నిర్వహణ మాత్రం ప్రైవేటువారిది. అంటే ఖర్చు ప్రభుత్వానిది. సంపద ప్రైవేటువారికి. ఒక మెడికల్ కాలేజీలో జీతాలు ఏడాదికి కనీసం రూ.60 కోట్లు. రెండేళ్లకు రూ.120 కోట్లు. అంటే ఆ లెక్కన 10 మెడికల్ కాలేజీల సిబ్బందికి రెండేళ్లపాటు జీతంగా కనీసం రూ.1200 కోట్లు అవుతుంది. ఇలాంటి స్కామ్లు దేశంలో ఎక్కడా ఉండవు.నిధుల కొరత అనేది అబద్ధం:మా హయంలో ప్రతి చోట 50 ఎకరాలు ఉండేలా 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టాం. వాటికి నాబార్డ్, ఇతర బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ నిధులు టైఅప్ చేశాం. వాటిలో 7 కాలేజీలు పూర్తి చేశాం. అవి ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి. వాటి ద్వారా 800 మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన కాలేజీలు పూర్తి చేసేందుకు ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు అవసరం. రూ.2 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఆ మాత్రం నిధులు ఖర్చు చేయలేదా?.పోనీ మీరు ఖర్చు చేయలేకపోతే వదిలేయండి. మేం వచ్చాక వాటిని పూర్తి చేస్తాం. చంద్రబాబుకు గట్టిగా తగిలేట్టుగా గవర్నర్ దృష్టికి అన్ని విషయాలు తీసుకెళ్లాం. మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తే, మాకు క్రెడిట్ దక్కుతుందన్న అక్కసుతో చంద్రబాబు పేదలకు నష్టం చేస్తున్నారు. మరోవైపు ప్రైవేటీకరణతో స్కామ్లు చేస్తున్నారు. నిజానికి ఆ మెడికల్ కాలేజీలన్నీ భవిష్యత్లో లక్ష కోట్ల ఆస్తి అవుతాయి. ఇంకా కొన్ని కోట్ల మందికి ఉచిత వైద్యం అందిస్తూ, వెల కట్టలేని సేవలందిస్తూ కోట్లాది మందికి వెలుగులు నింపుతాయి.అందుకే మా పోరాటం ఆపబోము:మా ఈ పోరాటం ఇంతటితో ఆగదు. గవర్నర్కి కోటి సంతకాలు చూపించాం. ఇక్కడి నుంచి రేపు కోర్టులో పిటిషన్ వేస్తాం. అక్కడ కూడా ఈ కోటి సంతకాలు చూపిస్తాం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తాం. చంద్రబాబు తోలు మందం కాబట్టి ఆయన మారకపోవచ్చు. కాబట్టి అందరూ కలిసి రావాలి. అందరం కలిసికట్టుగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుందాం. మనం ఇప్పుడు ఆ పని చేయకపోతే, రేపొద్దున వైద్యం కోసం ఒక్కొక్కరు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు చెల్లించాల్సి వస్తుంది. గవర్నర్ కానీ, మనసున్న ఏ వ్యక్తికి కానీ చంద్రబాబు చేసేది తప్పు అని అర్థమవుతుంది. ఇదే గవర్నర్ ఇంట్లో పని చేసే వ్యక్తులు మెడికల్ కాలేజీకి వెళ్తే ఉచితంగా వైద్యం అందుతుంది. గవర్నర్ది మంచి మనసు. ఆయన అన్నీ అర్థం చేసుకున్నారు.ఈ ప్రభుత్వంలో అన్నీ సున్నా:మెడికల్ కాలేజీలను కాపాడుకునేందుకు ప్రతి ద్వారం తొక్కుతాం. కోర్టుల ద్వారా వీటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. ఇంకా ఉద్యమమూ కొనసాగుతుంది. ఎందుకంటే ఇది కచితంగా స్కామ్. అన్నీ ప్రభుత్వానివే. అప్పగించేది మాత్రం ప్రైవేటు వ్యక్తులకా?. ఎన్నికల ముందు ఏం చెప్పారు? బిర్యానీ పెడతామని నమ్మించారు. కానీ, ఈరోజు అవేవీ లేవు. చదువుకుంటున్న పిల్లలకు ఫీజు రీయింబర్స్ లేదు. దాంతో వారు చదువులు మానేస్తున్నారు. ఆరోగ్యశ్రీ లేదు. నెట్వర్క్ ఆస్పత్రులకు బకాయిలు ఇవ్వడం లేదు. విశాఖలో మా హయాంలో రిషికొండపై రూ.230 కోట్లతో బ్రహ్మాండమైన బిల్డింగ్ నిర్మిస్తే, అది ఇప్పుడు నగరానికే తలమానికంగా ఉంది. అయినా దానిపై పిచ్చి విమర్శలు చేస్తున్నారు. విశాఖలో ఒకరోజు నిర్వహించిన యోగా డే కోసం అంత కంటే ఎక్కువే ఖర్చు చేశారు. మ్యాట్లు మొదలు మిగిలిన సామాగ్రి కొనుగోలులోనూ తీవ్ర అవినీతికి పాల్పడ్డారని వైఎస్ జగన్ గుర్తు చేశారు. -
2 నెలలు తిరగకుండానే అందరూ జైళ్లలో ఉంటారు జగన్ మాస్ వార్నింగ్
-
చంద్రబాబు సర్కార్కు వైఎస్ జగన్ అల్టిమేటం
ప్రైవేటీకరణ అనేదే పెద్ద స్కామ్ అని.. అలాంటి స్కామ్ల ఎన్నైనా చేయడానికి చంద్రబాబు నాయుడు ఏనాడూ వెనకడుగు వేయబోరని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ కీలక సమావేశంలో ఆయన కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సాక్షి, తాడేపల్లి: కోటి సంతకాల సేకరణ ఒక చరిత్ర. ఈ సంతకాలను గవర్నర్కు సమర్పించి.. చంద్రబాబు నిర్ణయం పట్ల వ్యక్తమైన ప్రజా వ్యతిరేకతను తెలియజేస్తామని వైఎస్ జగన్ అన్నారు. ‘‘కోటి సంతకాలతో గవర్నర్ను కలుస్తాం. అంతకు ముందు అంబేద్కర్ విగ్రహం వద్దకు ర్యాలీగా వెళ్తాం. అవసరమైతే ఈ పత్రాలతో కోర్టు తలుపులు తడతాం. ఆ మేరకు కోర్టులో పిటిషన్ వేస్తాం. న్యాయస్థానం ఎప్పుడు కోరినా, ఆ పత్రాలు చూపుతాం. అయినా చంద్రబాబులో చలనం రాదు. ఎందుకంటే ఆయన చర్మం మందం. గతంలో ఎన్.జనార్థన్రెడ్డి సీఎంగా ఉండి.. ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత ఆయన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.ఇక్కడ ప్రభుత్వం కట్టిన కాలేజీలను చంద్రబాబు ప్రైవేటుపరం చేయడం ఒక స్కామ్ అయితే.. ఆయా కాలేజీల సిబ్బంది జీతాలు రెండేళ్లు ప్రభుత్వం ఇవ్వడం మరో పెద్ద స్కామ్. ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాక ఇక ప్రభుత్వం జీతాలు చెల్లించడం ఏంటి?. ఒక మెడికల్ కాలేజీ సిబ్బందికి జీతాల కింద నెలకు దాదాపు రూ.6 కోట్లు ఖర్చవుతాయి. అంటే రెండేళ్లకు దాదాపు రూ.140 కోట్లు. పది కాలేజీలకు కలిపి ఏకంగా రూ.1400 కోట్లు. ఇది కదా పెద్ద స్కామ్ అంటే!.కోటి సంతకాల మహోద్యమం చూసైనా చంద్రబాబు సర్కార్ నిర్ణయం మార్చుకోవాలి. లేకుంటే ప్రజా ఉద్యమం కొనసాగిస్తాం. రేపు మనం అధికారంలోకి రాగానే అవన్నీ రద్దు చేస్తాం. ఈ స్కామ్కు పాల్పడిన వారెవ్వరినీ వదిలిపెట్టం. రెండు నెలల్లో వారిని జైల్లో పెడతాం. చంద్రబాబుకు గట్టి గుణపాఠం చెబుతాం’’ అని జగన్ అల్టమేటం జారీ చేశారు. -
‘చంద్రబాబు మాటలు వింటే ఏం అనాలో అర్థం కావడం లేదు’
సాక్షి, తాడేపల్లి: మెడికల్ కాలేజీలను ప్రైవేట్కు కట్టబెట్టడమే పెద్ద స్కాం.. అంటూ చంద్రబాబు సర్కార్ను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. గురువారం ఆయన వైఎస్సార్సీపీ ముఖ్య నేతల సమావేశంలో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. చంద్రబాబు నిర్ణయాన్ని కోటి 4 లక్షల మంది వ్యతిరేకించారని.. ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేశారన్నారు.ఈ సంతకాలు గవర్నర్ను సమర్పిస్తాం.. కోర్టుకు కూడా పంపుతాం. గవర్నర్ దగ్గరకు వెళ్లే ముందు అంబేద్కర్ విగ్రహం వద్ద కోటి సంతకాల ప్రతులను ఉంచుతాం. కోటి సంతకాలు చూడాలంటూ కోర్టులో అఫిడవిట్ వేస్తాం. స్కామ్లు చేయడానికి చంద్రబాబు వెనకడుగు వేయడం లేదు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పెద్ద స్కామ్. ప్రైవేట్ వాళ్లకు మెడికల్ కాలేజీలు అప్పజెప్పడమే కాదు.. వాళ్లకు ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుందట!. ఒక్కో కాలేజీకి రూ.120 కోట్లు ఎదురు ఇస్తున్నారు(జీతాల కింద).. ఇంత కంటే పెద్ద స్కామ్ ఉంటుందా?’’ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.నింద కలెక్టర్లపై మోపుతున్న చంద్రబాబు:కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు మాటలు వింటుంటే.. ఆశ్చర్యం కలుగుతోంది. తన గ్రాఫ్ పడిపోవడానికి కలెక్లర్లు కారణం అంటున్నారు. కలెక్టర్ల గ్రాఫ్ కాదు పడిపోతోంది. చంద్రబాబు గ్రాఫ్ పడిపోతోంది. ఎందుకంటే ఆయన ప్రభుత్వం ప్రజలకు ఒక్కటంటే ఒక్క మంచి పని చేయలేదు. మార్చి వస్తే, మూడో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నాడు. ఇప్పటికే రెండు బడ్జెట్లు పెట్టాడు. కానీ, ప్రజలకు ఒక్కటంటే ఒక్క మేలు లేదు. గత పథకాలన్నీ సున్నా. కొత్తగా ఏదీ లేదు. మన ప్రభుత్వ హయాంలో క్యాలెండర్ ప్రకటించి, అన్ని పథకాలు పక్కాగా అమలు చేశాం. వాటితో పాటు, అంత కంటే ఎక్కువగా అమలు చేస్తానన్న చంద్రబాబు, ఏదీ చేయలేదు. గతంలో అమలు చేసిన అన్ని పథకాలు రద్దు చేశారు. సూపర్సిక్స్, సూపర్ సెవెన్ లేవు. వ్యవస్థలన్నీ కుప్పకూలాయి. ఆరోగ్యశ్రీ లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. పిల్లల చదువులు ఆగిపోతున్నాయి. ఇంకా సూపర్సిక్స్, సూపర్సెవెన్ మోసాలు.విద్య, వైద్యం, రవాణా. ప్రభుత్వ వ్యవస్థలు:అసలు ఎక్కడైనా ప్రభుత్వం స్కూళ్లు, ఆస్పత్రులు ఎందుకు నడుపుతుంది? స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అది ఎందుకు జరుగుతోంది?. ఎందుకంటే, ఒకవేళ ప్రభుత్వమే కనుక.. స్కూళ్లు, ఆస్పత్రులు, బస్సులు (ప్రజా రవాణా వ్యవస్థ) నడపకపోతే.. విద్య, వైద్యం, రవాణా ఎవరికీ అందుబాటులో ఉండవు. ఆయా రంగాల్లో మొత్తం ప్రైవేటు రంగం పెత్తనమే ఉంటుంది.వ్యవస్థలన్నీ తిరోగమనం:కానీ, ఈరోజు అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. అసలు ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రులు ఎందుకు అంటున్నాడు చంద్రబాబు. మనం గత ఎన్నికల్లో గెల్చిపోయి ఉండకపోతే, ఆర్టీసీ కూడా ఉండేది కాదు. అదే చంద్రబాబు వచ్చి ఉంటే, దాన్ని కచ్చితంగా అమ్మేసేవాడు. ఈరోజు అన్ని వ్యవస్థలు తిరోగమనం. గతంలో అమలైన పథకాలన్నీ రద్దు. అన్ని ఘనకార్యాలు చేసిన నీవు (చంద్రబాబు), కలెక్టర్ల సదస్సులో వారి (కలెక్టర్లు) పనితీరు బాగా లేదనడం దారుణం. చంద్రబాబు బుర్ర పని చేయడం లేదు.న్యాయపోరాటం కూడా చేస్తాం:ఆ తర్వాత ఆ పత్రాలు.. కోర్టు ద్వారాలు తడుతాయి. ఆ మేరకు కోర్టులో పిటిషన్ వేస్తాం. వారు ఎప్పుడు కోరినా, ఆ పత్రాలు చూపుతాం. అయినా చంద్రబాబులో చలనం రాదు. ఎందుకంటే ఆయన చర్మం మందం. గతంలో ఎన్.జనార్థన్రెడ్డి సీఎంగా ఉండి, ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అనుమతి ఇస్తే, ఆయన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.2 ఏళ్లు జీతాలు మరో పెద్ద స్కామ్:ఇక్కడ ప్రభుత్వం కట్టిన కాలేజీలు ప్రైవేటుపరం చేయడం ఒక స్కామ్ కాగా.. ఆయా కాలేజీల సిబ్బంది జీతాలు రెండేళ్లు ప్రభుత్వం ఇస్తుందట!. ఇది మరో పెద్ద స్కామ్. ఒక మెడికల్ కాలేజీ సిబ్బందికి జీతాల కింద నెలకు దాదాపు రూ.6 కోట్లు ఖర్చవుతాయి. అంటే రెండేళ్లకు దాదాపు రూ.140 కోట్లు. పది కాలేజీలకు కలిపి ఏకంగా రూ.1400 కోట్లు. ఇది ఒక పెద్ద స్కామ్అధికారంలోకి రాగానే రద్దు చేస్తాం:రేపు మనం అధికారంలోకి రాగానే అవన్నీ రద్దు చేస్తాం. ఈ స్కామ్కు పాల్పడిన వారెవ్వరినీ వదిలిపెట్టం. రెండు నెలల్లో వారిని జైల్లో పెడతాం. అందుకే చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పబోతున్నాం. గవర్నర్ 40 మందికి అనుమతి ఇచ్చారు. లోక్భవన్కు వెళ్లే ముందు అంబేడ్కర్ విగ్రహం వరకు అందరం వెళ్దాం. అక్కణ్నుంచి 40 మందితో కలిసి గవర్నర్ను కలుస్తాం. ఆ తర్వాత కోర్టు తలుపు తడతాం. అయినా చంద్రబాబు నిర్ణయం మార్చుకోకపోతే.. ప్రజా ఉద్యమం కొనసాగిస్తాం’’ అని వైఎస్ జగన్ హెచ్చరించారు. -
Watch Live: YSRCP నేతలతో జగన్ కీలక భేటీ
-
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపుతాం
-
కోటి సంతకాల సేకరణ ప్రతులను గవర్నర్కు అందజేశాం: వైఎస్ జగన్
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ.. -
వైఎస్సార్సీపీ కీలక భేటీ.. సాయంత్రం లోక్ భవన్కు వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ మోహన్రెడ్డి అధ్యక్షతన గురువారం వైఎస్సార్సీపీ కీలక భేటీ జరగనుంది. కోటి సంతకాల ప్రతులను రాష్ట్ర గవర్నర్కు అందజేయనున్న నేపథ్యంలో ఆయన ముందుగా పార్టీ నేతలతో భేటీ నిర్వహించనున్నారు.వైఎస్సార్సీపీ హయాంలో వైఎస్ జగన్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ చొప్పున.. 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్మించాలని ప్రయత్నించారు. పేదలకు, మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వం ద్వారా కార్పొరేట్ వైద్యం అందించడంతో పాటు రాష్ట్రంలో వైద్య విద్యా అవకాశాలను విస్తరించడం ఉద్దేశంతో ఆయన ఈ అడుగు వేశారు.ఇందులో ఏడు పూర్తి కాగా.. వైఎస్సార్సీపీ దిగిపోయేనాటికి మరో పది నిర్మాణంలో ఉన్నాయి. అయితే.. కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వాటిని నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. చివరకు పీపీవీ విధానం పేరిట కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనిని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ పేరిట ప్రజా ఉద్యమానికి పిలుపు ఇచ్చారు వైఎస్ జగన్.అక్టోబర్ నెలలో గ్రామాల స్థాయిలో ‘రచ్చబండ’ పేరిట మొదలైన సంతకాల సేకరణ.. ఇప్పుడు చివరి అంకానికి చేరుకుంది. రెండు నెలల్లో చంద్రబాబు సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మొత్తం కోటి 4 లక్షల 11 వేల 136 మంది సంతకాలు చేశారు. విద్యార్థులు, మేధావులు.. అన్ని వర్గాల ప్రజలూ వైఎస్సార్సీపీ కోటి సంతకాల సేకరణలో పాల్గొనడంతో.. దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.కొసమెరుపు ఏంటంటే.. అలాగే చంద్రబాబు సొంత గ్రామమైన నారావారిపల్లెలోనూ ఆయన నిర్ణయాన్ని తప్పుబడుతూ అక్కడి ప్రజలు సంతకాలు చేయడం..ఇప్పటికే అన్ని జిల్లాల నుండి సంతకాల ప్రతుల బాక్స్లు తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నాయి. గురువారం ఉదయం పత్రాలతో వచ్చిన వాహనాలకు వైఎస్ జగన్ జెండా ఊపి ప్రారంభిస్తారు. అవి అక్కడి నుంచి నేరుగా లోక్భవన్(పూర్వ రాజ్భవన్)కు చేరుకుంటాయి.అనంతరం పార్టీ ముఖ్య నేతలతో వైఎస్ జగన్ సమావేశమై.. ఇప్పటిదాకా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం గురించి చర్చిస్తారు. సాయంత్రం పార్టీ కీలక నేతలతో కలిసి లోక్ భవన్కు వైఎస్ జగన్కు వెళ్తారు. గవర్నర్ అబ్దుల్ నజీర్తో భేటీ అయ్యి.. మెడికల్ కాలేజీల ప్రవేటీకరణపై ప్రజల అభిప్రాయాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్తారు. -
నూతన వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ జగన్
-
పొలంలో ప్రైవేట్ ‘పవర్’!
సాక్షి, అమరావతి: సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) నుంచి అతి తక్కువ ధరకే యూనిట్ కేవలం రూ.2.49కే కొనుగోలుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఒప్పందం కుదుర్చుకుంటే అదేదో నేరం, ఘోరం అన్నట్లు చిత్రీకరించిన చంద్రబాబు ఇప్పుడు అదే సౌర విద్యుత్ కోసం యూనిట్కు ఏకంగా రూ.3.09 ప్రైవేట్ సంస్థలకు చెల్లించేందుకు సిద్ధమయ్యారు. తాను అధికారంలోకి వస్తే విద్యుత్తు చార్జీలను ఇంకా తగ్గిస్తానని ఎన్నికల ముందు నమ్మబలికిన చంద్రబాబు ఇప్పటికే కరెంట్ చార్జీల బాదుడుతో షాకులిస్తుండగా తాజాగా వ్యవసాయానికి సౌర విద్యుత్ పేరుతో ప్రైవేటు సంస్థలకు ప్రజాధనాన్ని దోచి పెట్టేందుకు ఉపక్రమించారు. రైతులకు మేలు చేస్తున్నామనే ముసుగు వేసి, కమీషన్ల కోసం అడ్డగోలుగా విద్యుత్ ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఒకవైపు కేంద్ర పథకాల ద్వారా రాయితీలు పొంది మరోవైపు అన్నదాతలకు ఇవ్వాల్సిన రాయితీని దారి మళ్లించేందుకు ప్రణాళిక రచించారు. ఈ క్రమంలో ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) నుంచి ఆమోదాన్ని సాధించారు. ప్రైవేటు సౌర విద్యుదుత్పత్తి సంస్థలకు డిస్కమ్లు చెల్లించాల్సిన ధరలను నిర్ణయిస్తూ ఏపీఈఆర్సీ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.ఫీడర్లు దగ్గరే ఉన్నా... గ్రిడ్ నుంచే విద్యుత్రాష్ట్రంలో దాదాపు 19 లక్షల వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు ఏటా డిస్కమ్లకు సుమారు రూ.12,500 కోట్లు రాయితీగా అందించాల్సి ఉంది. గత ప్రభుత్వంలో ఉచిత విద్యుత్తు పథకం ఆటంకం లేకుండా ముందుకు సాగింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రైతుల ఉచిత విద్యుత్ను ప్రైవేటు వ్యక్తుల నుంచి అధిక ధరలకు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. అందుకు ‘పీఎం కుసుమ్’ పథకాన్ని అడ్డుపెట్టుకుంది. రాయితీలు వస్తాయని, సరఫరా నష్టాలు తగ్గుతాయంటూ ‘అగ్రికల్చర్ ఫీడర్స్ సోలరైజేషన్’ విధానాన్ని తెరపైకి తెచి్చంది. తద్వారా వ్యవసాయ విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఫీడర్లకు అవసరమైన కరెంట్ను సమీపంలో నెలకొల్పే సోలార్ ప్యానళ్ల ప్రాజెక్టు ద్వారా అందిస్తామని చెబుతోంది. దీనికోసం మూడు డిస్కమ్ల పరిధిలో తొలుత కొన్ని పంపుసెట్లను ఎంపిక చేశారు. కుప్పం రెస్కోతో కలిపి మూడు డిస్కంల పరిధిలో మొత్తం 1,162.8 మెగావాట్ల విద్యుత్ సామర్ధ్యంతో 2,93,587 పంపుసెట్ల సోలరైజేషన్కు ప్రణాళిక సిద్ధమైంది. దీని ప్రకారం 1162.8 మెగావాట్లకు యూనిట్ రూ.3.09 చొప్పున ఏడాదికి రూ.600 కోట్లు ప్రైవేటు సంస్థలకు చెల్లించాల్సి ఉంటుంది. అదే సెకీ నుంచి అయితే యూనిట్ రూ.2.49కే వస్తున్నందున ఆ వ్యయం రూ.482 కోట్లు మాత్రమే అవుతుంది. అంటే ఏటా అదనంగా దాదాపు రూ.116 కోట్లను ప్రైవేటు సంస్థలకు పాతికేళ్ల పాటు దోచిపెట్టనున్నట్లు స్పష్టమవుతోంది.ప్రైవేటు సంస్థల నుంచి టెండర్లు..ప్రైవేటు సంస్థలు సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసి విద్యుత్ను ఉత్పత్తి చేస్తాయని, ఆ విద్యుత్ను డిస్కంలు కొనుగోలు చేస్తాయని, దానికి చెల్లించాల్సిన యూనిట్ ధరలను నిర్ణయించాలంటూ ఏపీఈఆర్సీని డిస్కంలు కోరాయి. ఏపీఈపీడీసీఎల్లో యూనిట్కు రూ.3.18, ఏపీఎస్పీడీసీఎల్లో యూనిట్కు రూ.3.16, ఏపీసీపీడీసీఎల్లో యూనిట్కు రూ.3.19 చొప్పున చెల్లిస్తామని తెలిపాయి. అయితే జీఎస్టీ భారం తగ్గుతున్నందున సోలార్ ప్యానెళ్ల ధరలు కూడా తగ్గాయి. దీంతో ప్రైవేటు సంస్థలకు చెల్లించాల్సిన ధరను కూడా తగ్గించాలని కమిషన్ సూచించింది. ఈ క్రమంలో డిస్కంలు మళ్లీ ప్రతిపాదనలు తయారు చేసి పంపించాయి. వాటి ప్రకారం యూనిట్కు రూ.3.09 చొప్పున ప్రైవేటు సంస్థలకు చెల్లించి సౌర విద్యుత్ను కొనుగోలు చేసేందుకు ఏపీఈఆర్సీ అనుమతినిచ్చింది. మరోవైపు ప్రైవేటు సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానించారు. అయితే టెండర్ దక్కించుకున్న సంస్థలతో ఈ నెలాఖరులోగా విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంటేనే కేంద్ర ప్రభుత్వం పీఎం కుసుమ్ పథకానికి అర్హత పొందినట్లుగా పరిగణిస్తుంది. అప్పుడే రాయితీ వర్తిస్తుంది.యాక్సిస్ నుంచి యూనిట్ రూ.4.60 కి కొనుగోలువ్యవసాయానికి 30 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్ను హక్కుగా అందించాలనే సంకల్పంతో పాటు భవిష్యత్తులో రాష్ట్ర విద్యుత్ అవసరాలకు ఇబ్బందులు తలెత్తకుండా, పవర్ గ్రిడ్ను సమతూకం చేయాలనే లక్ష్యంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సెకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది. అది కూడా రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని అతి తక్కువ ధర యూనిట్ రూ.2.49కే కొనేందుకు పీపీఏ చేసుకుంది. ఇలా తీసుకునే 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్కు పాతికేళ్ల పాటు ఐఎస్టీఎస్ చార్జీల నుంచి మినహాయింపు ఇస్తామంటూ సెకీ స్వయంగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. సెకీ ఒప్పందం వల్ల రాష్ట్రానికి దాదాపు రూ.లక్ష కోట్ల ప్రయోజనం సమకూరుతుంది. ఇంత మంచి ఒప్పందాన్ని చేసుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని అభినందించాల్సింది పోయి కూటమి నేతలు, ఎల్లో మీడియా, టీడీపీ కరపత్రికలు విషం గగ్గాయి.సెకీ విద్యుత్ లాభం కాదంటూ పచ్చి అబద్దాలను ప్రచారం చేశాయి. కానీ తర్వాత యాక్సిస్ ఎనర్జీతో యూనిట్ రూ.4.60 చొప్పున 400 మెగావాట్ల విద్యుత్ కొనేందుకు చంద్రబాబు ప్రభుత్వం పీపీఏ చేసుకుంది. సెకీ ధరతో పోల్చితే యూనిట్కు రూ.2.11 అదనంగా చెల్లిస్తోంది. తద్వారా దాదాపు రూ.11 వేల కోట్ల భారీ కుంభకోణానికి నిస్సిగ్గుగా తెరదీశారు. అది చాదన్నట్టు ఇప్పుడు సౌర విద్యుత్ను యూనిట్కు రూ.3.09 కొంటామంటోంది.‘సెకీ’ విద్యుత్ చౌకగా తీసుకుంటే తప్పన్నారు..గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ను యూనిట్ రూ.2.49కే కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకుంటే ఇదే చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించారు. రూ.లక్ష కోట్ల భారం పడుతుందంటూ పచ్చ పత్రికల్లో పుంఖాను పుంఖాలుగా తప్పుడు వార్తలు రాయించారు. మరి ఇప్పుడు అంతకు మించి అధిక ధర చెల్లించి విద్యుత్ కొనుగోలు చేసేందుకు సిద్ధం కావడం గమనార్హం. నాడు సెకీతో ఒప్పందం పాతికేళ్లుకాగా, ఇప్పుడు ప్రైవేటు సంస్థలతో చేసుకునే ఒప్పందం కూడా అన్నే ఏళ్లు కావడం అనుమానాలు రేకెత్తిస్తోంది. దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్ల నేరుగా డిస్కంలపైనా, పరోక్షంగా ప్రజలపైనా ఆరి్థక భారం పడుతుందని వాదించిన చంద్రబాబు ఇప్పుడెందుకు అదే మార్గంలో నడుస్తున్నారనేదానికి ఆయనే సమాధానం చెప్పాలి. -
మెడి‘కిల్’పై మహోద్యమం.. కోటి గళాల సింహగర్జన
సాక్షి, అమరావతి: కమీషన్ల కక్కుర్తితో పేదలకు నాణ్యమైన వైద్యాన్ని, విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తూ ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ చంద్రబాబు సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ఇచ్చిన పిలుపు ప్రభంజనమైంది. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలు, మేధావులు, ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలు సర్కార్పై కళ్లెర్ర చేశారు. కోటి గళాలతో సింహగర్జన చేశారు.నిరసన జ్వాల ఉవ్వెత్తున ఎగసి పడటంతో కోటి సంతకాల ఉద్యమం ప్రజా మహోద్యమంగా మారింది. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను కలసి కోటి సంతకాల ప్రతులను అందిచనున్నారు. గద్దెనెక్కిన 18 నెలల్లోనే చంద్రబాబు సర్కార్ రూ.2,81,312 కోట్లు అప్పు చేసింది. దీన్ని బట్టి చూస్తే.. నెలకు రూ.15,628.44 కోట్లు.. రోజుకు రూ.520.94 కోట్లు చొప్పున అప్పు చేసింది. అంటే.. ఒక్క రోజులో చేసిన అప్పుతో ఒక మెడికల్ కాలేజీని పూర్తి చేయొచ్చు. కేవలం పది రోజుల్లో చేసిన అప్పుతో మెడికల్ కాలేజీల్లో మిగిలిన పనులను పూర్తి చేయొచ్చు.కానీ.. అందుకు విరుద్ధంగా అధిక వడ్డీలకు అప్పుగా తెచ్చిన నిధులను దుబారా చేస్తూ మెడికల్ కాలేజీల నిర్మాణానికి నిధుల్లేవని సాకు చూపుతూ.. ప్రైవేటీకరణ ముసుగులో వాటిని చంద్రబాబు సర్కార్ బినామీలకు కట్టబెట్టాలన్న కుట్రపై జనం భగ్గుమన్నారు. రాష్ట్రంలో 26 జిల్లాల్లోని 175 నియోజకవర్గాలలో గ్రామాలు.. పట్టణాల్లో వైఎస్సార్సీపీ నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాల్లో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలన్న చంద్రబాబు సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అన్ని వర్గాలకు చెందిన 1,04,11,136 మంది ప్రజలు స్వచ్ఛందగా సంతకాలు చేశారు.ఆ సంతకాల ప్రతులు 26 జిల్లాల నుంచి మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నాయి. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో ఆ సంతకాల ప్రతులను గురువారం గవర్నర్కు అందజేయనున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిలుపుదల చేసి.. వాటిని ప్రభుత్వమే నిర్మించి, నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్కు విజ్ఞప్తి చేయనున్నారు. 14 ఏళ్లలో ఒక్క మెడికల్ కాలేజీ కట్టని చంద్రబాబు రాష్ట్రంలో 1923 నుంచి 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. పద్మావతి అటానమస్ మెడికల్ కాలేజీతో కలిపితే 12 ఉన్నాయి. 2019 నాటికి చంద్రబాబు మూడు సార్లు అంటే 1995–99, 1999–04, 2014–19 మధ్య 14 ఏళ్లు సీఎంగా పాలించారు. ఆ మూడు దఫాల్లో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా కట్టలేదు.కనీసం కొత్తగా ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా చేయలేదు. ఈ క్రమంలో 2019 ఎన్నికల మేనిఫెస్టోలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 13 జిల్లాలను పునర్విభజించి, 26 జిల్లాలుగా ఏర్పాటు చేశారు.ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలతోపాటు నాణ్యమైన వైద్యం అందించడం.. పేదలకు వైద్య విద్యను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఒక్కో కాలేజీకి 50 ఎకరాల కనీస స్థలం ఉండేలా భూమిని కేటాయించారు. ఒక్కో మెడికల్ కాలేజీ నిర్మాణానికి రూ.500 కోట్లకుపైగా ఖర్చు చేసి అన్ని రకాల సదుపాయాలు ఉండేలా క్యాంపస్ల అభివృద్ధి పనులు ప్రారంభించారు.కోవిడ్ మహమ్మారి వంటి సమస్యలు రెండేళ్లపాటు రాష్ట్రాన్ని పీడించినా, ఎన్ని ఇబ్బందులున్నా ఎక్కడా వెనక్కు తగ్గకుండా మెడికల్ కాలేజీలను పూర్తి చేయాలనే ధృడ సంకల్పంతో అడుగులు ముందుకు వేశారు. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను 2023–24లోనే ప్రారంభించి, తరగతులు మొదలుపెట్టారు.గతేడాది ఎన్నికలు వచ్చే నాటికి పాడేరు, పులివెందుల కాలేజీలు కూడా తరగతులు ప్రారంభించడానికి సిద్ధమయ్యాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత పాడేరులో అడ్మిషన్లు ముగిసి తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట పులివెందుల మెడికల్ కాలేజీలో 50 ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించడానికి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) గతేడాది అనుమతులు ఇచ్చింది. కానీ.. ఆ సీట్లు మాకు వద్దంటూ ఎన్ఎంసీకి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. సీఎం చంద్రబాబు కక్ష సాధింపు చర్యలకు ఇది పరాకాష్ట. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి అవసరమైన నిధులను అప్పట్లోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమీకరించింది. ఆ నిధులను సది్వనియోగం చేసుకుని.. వైఎస్సార్సీపీ సర్కార్ రూపొందించిన ప్రణాళిక ప్రకారం చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపట్టి ఉంటే.. 2024–25 విద్యా సంవత్సరంలో ఆదోని, మదనపల్లి, మార్కాపురం మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చేవి.ఈ విద్యా సంవత్సరం అంటే 2025–26లో అమలాపురం, బాపట్ల, నర్సీపట్నం, పార్వతీపురం, పాలకొల్లు, పెనుకొండలో కూడా వైద్య కళాశాలలు ప్రారంభం అయ్యేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు 2,360 మాత్రమే ఉండేవి.కొత్త మెడికల్ కాలేజీల ద్వారా అదనంగా మరో 2,550 సీట్లు పెరిగితే.. మొత్తంమ్మీద 4,910 సీట్లు అందుబాటులోకి వచ్చేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తరగతులు ప్రారంభమైన కొత్త మెడికల్ కాలేజీల్లో అప్పట్లోనే 800 సీట్లు భర్తీ చేశారు. పులివెందుల మెడికల్ కాలేజీలో తరగతులు ప్రారంభించేందుకు చంద్రబాబు సర్కార్ అంగీకరించి ఉంటే మరో 50 సీట్లు వచ్చేవి.ఎక్కడ వైఎస్ జగన్కు క్రెడిట్ వస్తుందోనని ఏకంగా ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలను సీఎం చంద్రబాబు దెబ్బ తీస్తున్నారని మేధావులు, ప్రజా సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఏడాదికి రూ.వెయ్యి కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తే ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలన్నీ అందుబాటులోకి వచ్చేవి.అణచివేసే దుస్సాహసంపై ప్రజాగ్రహం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయంపై ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబుకుతుండటం.. రచ్చబండ కార్యక్రమాల్లో ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేస్తుండటంతో చంద్రబాబు సర్కార్ వెన్నులో వణుకు పుట్టింది. రచ్చబండ కార్యక్రమాలపై పోలీసులను ఉసిగొల్పి ప్రజా ఉద్యమాన్ని అణచివేసే దుస్సాహసంపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది.చంద్రబాబు సర్కార్ ప్రజా వ్యతిరేక చర్యలపై సమర భేరి మోగించింది. నవంబర్ 12న నియోజకవర్గాల కేంద్రాల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ నిర్వహించిన ర్యాలీల్లో అన్ని వర్గాల ప్రజలు కదం తొక్కారు. ఈ నెల 10న ఏపీలోని 175 నియోజకవర్గాల్లోనూ ప్రజలు స్వచ్ఛందంగా చేసిన సంతకాల ప్రతులను ప్రదర్శిస్తూ వైఎస్సార్సీపీ నిర్వహించిన ర్యాలీల్లో ప్రజలు భారీగా పాల్గొన్నారు.పోలీసుల ద్వారా ర్యాలీలను అడగడుగునా అడ్డుకోవడానికి చంద్రబాబు చేసిన కుట్రలను జనం పటాపంచలు చేశారు. ఈ నెల 15న జిల్లా కేంద్రాల్లో కోటి సంతకాల పత్రాలను ప్రదర్శిస్తూ నిర్వహించిన ర్యాలీల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు వైఎస్సార్సీపీ నేతలతో కలిసి బాబు సర్కార్పై రణభేరి మోగించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ కోటి గళాలు సింహగర్జన చేశాయి. మహోద్యమంగా ప్రజా ఉద్యమం కమీషన్ల కక్కుర్తితో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించడాన్ని నిరసిస్తూ అక్టోబర్ 7న వైఎస్ జగన్ ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఉద్యమ కార్యచరణను ప్రకటించారు. అక్టోబర్ 9న నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించి సమరభేరి మోగించారు. అక్టోబర్ 10 నుంచి నవంబర్ ఆఖరు వరకు 175 నియోజకవర్గాల్లో గ్రామాలు, పట్టణాల్లో వైఎస్సార్సీపీ నేతలు విస్తృతంగా రచ్చబండ కార్యక్రమాలను నిర్వహించారు.భవిష్యత్తులో రూ.లక్ష కోట్ల విలువ చేసే మెడికల్ కాలేజీలను బినామీలకు కట్టబెట్టాలన్న చంద్రబాబు కుట్రను.. పేదలకు నాణ్యమైన వైద్యం, వైద్య విద్యను దూరం చేస్తున్న దురాగతాన్ని ప్రజల కళ్లకు కట్టినట్టు వివరించారు. వీటికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. చంద్రబాబు సర్కార్ నిర్ణయాన్ని నిరసిస్తూ.. మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలోనే నిర్మించి, నిర్వహించాలని డిమాండ్ చేస్తూ కోటి మందికి పైగా ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేశారు. -
YSRCPలో నూతన నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. PAC సభ్యులుగా వంగా గీత (పిఠాపురం), షేక్ మహమ్మద్ ఇస్మాయిల్ (కదిరి) నియమితులయ్యారు.కాగా, ఇటీవల పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా పలువురి నియామకం జరిగిన సంగతి తెలిసిందే. షేక్ గౌస్ మొహిద్దిన్ (విజయవాడ వెస్ట్), మీర్ హుస్సేన్ (విజయవాడ ఈస్ట్), కర్నాటి రాంబాబు (విజయవాడ వెస్ట్), మీర్జా సమీర్ అలీ బేగ్ (మార్కాపురం), ఆర్. శ్రీనివాసులురెడ్డి (పలమనేరు), కె.కృష్ణమూర్తిరెడ్డి (పలమనేరు), పోలు సుబ్బారెడ్డి (రాయచోటి), ఉపేంద్ర రెడ్డి (రాయచోటి), డి. ఉదయ్ కుమార్ (మదనపల్లె), వి.చలపతి (కోవూరు), గువ్వల శ్రీకాంత్ రెడ్డి (సింగనమల), డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి (తాడిపత్రి), సుభాష్ చంద్రబోస్ (కర్నూలు), రఘునాథరెడ్డి (జమ్మలమడుగు), ఎస్. ప్రసాద్ రెడ్డి (కమలాపురం), పార్టీ ఎస్ఈసీ సభ్యునిగా ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి (రాయచోటి) నియమితులయ్యారు. -
ఇది పీపీపీ కాదు.. పెద్ద స్కామ్: సజ్జల
సాక్షి, తాడేపల్లి: జిల్లాల నుంచి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న కోటి సంతకాల ప్రతులను బుధవారం.. ఆ పార్టీ పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్య, వైద్యం పూర్తిగా ప్రైవేట్ పరం అయితే ప్రభుత్వం ఉండి ఏం లాభం? అంటూ ప్రశ్నించారు.మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం అతిపెద్ద స్కామ్కు పాల్పడుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ప్రైవేటీకరణ పేరుతో చంద్రబాబు ప్రజల ఉసురు తీస్తున్నారని మండిపడ్డారు. కోటిమందికి పైగా చేసిన సంతకాలే.. ప్రైవేటీకరణ నిర్ణయంపై వెల్లువెత్తిన ప్రజా నిరసనకు నిదర్శనమని, ప్రభుత్వ నిర్ణయంపై ఇది కచ్చితంగా రెఫరెండమే అని ఆయన తేల్చి చెప్పారు. ఏపీని మెడికల్ హబ్ గా మార్చాలని కలగన్నవైఎస్ జగన్ అందులో భాగంగానే 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారని స్పష్టం చేశారు.అయితే అధికారంలోకి రాగానే కాలేజీల నిర్మాణాలను నిలిపివేసిన చంద్రబాబు.. కమిషన్ల కక్కుర్తితోనే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మమ్మాటికీ ముందస్తు కుట్రేనని.. . ప్రజల ప్రాణాలతో చంద్రబాబు చెలగాటమాడుతున్నారని ఆక్షేపించారు. కాలేజీల ప్రైవేటీకరణతో పాటు అప్పనంగా ఆస్తులు అప్పగిస్తున్న చంద్రబాబు.. అదనంగా 2 ఏళ్ల పాటు రూ.1400 కోట్లు జీతాలు ప్రభుత్వం నుంచి చెల్లించాలన్న నిర్ణయం.. మరో భారీ కుంభకోణమని స్పష్టం చేశారు.చంద్రబాబు తీరుకు నిరసనగా రేపు సాయంత్రం(డిసెంబర్ 18, గురువారం) వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం గౌరవ గవర్నర్కు కోటి సంతకాల ప్రతులు సమర్పిస్తారని తెలిపారు. ఇప్పటికైనా చంద్రబాబు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిన ఆయన... లేనిపక్షంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే వీటిపై సమీక్షించి, బాధ్యులను బోనెక్కిస్తామని స్పష్టం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..ఏపీని మెడికల్ హబ్ చేయడమే వైఎస్ జగన్ లక్ష్యం:ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలకు పర్మిషన్ తీసుకుని రావటమే కష్టం, అలాంటి అనుమతులన్నీ వైఎస్ జగన్ సాధించి 17 మెడికల్ కాలేజీలు తెచ్చారు. పేద, మధ్య తరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందాలని కాలేజీలు తెచ్చారు. దేశంలోనే ఉత్తమ మెడికల్ హబ్గా ఏపీని మార్చాలని జగన్ కలలు కన్నారు. ఆ మేరకు కింది స్థాయి నుండి పటిష్ఠం చేసుకుంటూ వచ్చారు.తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే.. ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేసింది. అనంతరం ప్రైవేటీకరణకు సిద్ధమైంది. ప్రైవేటు రంగంలోనే అత్యుత్తమ సేవలందుతాయని తాను నమ్ముతున్న సిధ్దాంతాన్ని అమలు చేయడం ప్రారంభించాడు. తాను అధికారంలో లేనప్పుడు ఎప్పుడూ ప్రైవేటు రంగం గురించి నోరెత్తని చంద్రబాబు.. గెలిచిన తర్వాత ప్రైవేటు రంగంలో మంచి సేవలు అందుతాయని చెప్పడం అలవాటు.ఆర్థిక వనరులు లోటు లేకున్నా ప్రైవేటీకరణ మంత్రం:వైఎస్ జగన్ ప్రభుత్వ వైద్య కళాశాలను పూర్తి చేయకుండానే, కేవలం కాలేజీలని నిర్మించాలని లక్ష్యంగా మాత్రమే చెబితే.. అప్పుడు చంద్రబాబు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం కష్టమని చెప్పడంలో అర్ధముంది. కానీ ఐదు మెడికల్ కాలేజీలను వైఎస్ జగన్ పూర్తి చేసి, ఆ కాలేజీల్లో అడ్మిషన్లు జరిగి, విజయవంతంగా కాలేజీలు నడుస్తున్నాయి. మరో రెండు కాలేజీలు పూర్తయ్యాయి.. మరో మూడు కాలేజీలు నిర్మాణం పూర్తి చేసుకునే దశలో ఉన్నాయి.అంటే మొత్తం 10 కాలేజీలు దాదాపు పూర్తైన దశలో ఎందుకు వాటిని ఆపాల్సి వచ్చింది. మరో కీలకమైన అంశం ఏమిటంటే... కాలేజీల నిర్మాణానికి నిధుల కొరత లేకుండా వివిధ ఆర్ధికసంస్ధలతో వైయస్.జగన్ ప్రభుత్వమే టై అప్ అయింది. నీకు కావాల్సిందల్లా కాలేజీల నిర్మించాలన్న మనసు మాత్రమే. అదే చంద్రబాబుకు లేదు. చంద్రబాబు హెరిటేజ్తో సహా ఎవరైనా ప్రైవేటు రంగంలో ఉచితంగా సేవలు అందిస్తారా? రూపాయి పెట్టుబడి పెట్టి రూ.10, రూ.20, రూ.50 ఎలా సంపాదించాలనే వస్తారు. చంద్రబాబు ఏం చెప్పినా పీపీపీ అనేది ఓ పెద్ద స్కామ్. ఇంకా జనాల చెవిలో పువ్వులు ఎలా పెట్టగలననుకుంటున్నాడో తెలియడం లేదు? మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కోసం వైఎస్ జగన్ అక్టోబరులో పిలుపునిస్తే... ఈ రెండు నెలల్లో వచ్చిన ప్రజాస్పందన చూసిన తర్వాత కూడా రాష్ట్ర ప్రజల అభిప్రాయం చంద్రబాబుకు అర్థం కావడం లేదు. కోటి సంతకాలకు అక్టోబరులో పిలుపునిస్తే.. జనంలో వస్తున్న స్పందన అందరికీ తెలుసు.ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక రిఫరెండంలా.. చరిత్రలో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎప్పూడూ చూడని విధంగా తొలిసారిగా ఇంత పక్కాగా ప్రజాభిప్రాయ సేకరణ జరగలేదు. వైయస్సార్సీపీ ఆధ్యర్యంలో ప్రతిచోటా జనంలోని వెళ్లి సంతకాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పేదలతో పాటు సమసమాజం కావాలనుకునేవాళ్లు, సమాజంలో అసమానతలు తగ్గించాలని కోరుకునేవారు ఇలా అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు.ప్రైవేటీకరణే చంద్రబాబు విజన్:ఇవాల్టికి చంద్రబాబు కొంచెం తగ్గి.. వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వం పేరు పెద్దదిగా ఉంటే.. ప్రైవేటు వాళ్ల పేరు చిన్న అక్షరాల్లో ఉంటుందని చెబుతున్నారు. కాలేజీల భవనాలు, ఆసుపత్రులు, భూమి అంతా ప్రైవేటు వాళ్ల చేతుల్లో పెట్టిన తర్వాత వాళ్లు పేరు పెట్టినా, పెట్టకపోయినా ఏం ప్రయోజనం ఉంటుంది. పైగా వారికి రెండేళ్ల జీతాలు కూడా ప్రభుత్వమే చెల్లించడానికి అంగీకరించడం మరించి ఆశ్చర్యకరం. ఇన్ని ప్రైవేటు వారికి ఇచ్చినప్పుడు... ప్రభుత్వమే ఎందుకు నిర్వహించలేకపోతుంది?మెడిసిన్ చేయాలనుకునే విద్యార్ధులు తొలుత ప్రభుత్వ కాలేజీలనే కోరుకుంటారు. కారణం ఆయా కాలేజీలకు వచ్చే పేషెంట్లు, ఉత్తమ సర్వీసులు, మంచి శిక్షణ అందుతుందన్న ఆలోచనతోనే ఎంచుకుంటారు. మెడికల్ కాలేజీల నిర్వహణ కోసం.. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు పెడితే... మేం అధికారంలోకి వచ్చిన తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అన్నింటినీ రద్దు చేసి ఉచితం చేస్తామని చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చిన వెంటనే అసలు ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్నే నిలిపివేశారు.ప్రైవేటీకరణను అవసరం లేకపోయినా సపోర్టు చేసి నెత్తిన పెట్టుకునే ఆలోచన ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన మొదటి నుంచి ఇదే తీరు. కేవలం కాసుల కోసం కక్కుర్తి పడి ప్రైవేటీకరణ చేయడం ఒక అంశం అయితే... ప్రజల ప్రాణాలకు సంబంధించిన వైద్యరంగంలో ప్రజల ప్రాణాలతో చంద్రబాబు చెలగాటమాడుతున్నాడు. వైయస్.జగన్ విజయవంతంగా మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రారంభిస్తే... దాన్ని కొనసాగించాల్సింది పోయి, ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు 100 శాతం మెడికల్ సేవలు ఉచితం అని చెప్పాడు. ఇవాళ 100 శాతం అవుట్ పేషెంట్ సేవలు ఉచితంగా వస్తాయని, 70 శాతం ఇన్ పేషెంట్ కేటగిరీలో ఉచితం అని చెబుతున్నాడు. ఇవన్నీ ఎవరికి చెబుతున్నావ్ చంద్రబాబూ?జీతాలు చెల్లింపు మరో కుంభకోణం..వైఎస్ జగన్ ఇప్పటికే ప్రభుత్వమే మెడికల్ కాలేజీలను నిర్మించి, విజయవంతంగా నిర్వహించవచ్చని, సామర్థ్యం ఉన్న సిబ్బందిని నియమించవచ్చని నిరూపించిన తర్వాత.. ఇవాళ చంద్రబాబు దాన్నుంచి పక్కకు పోవడం అంటే ఇది పెద్ద కుంభకోణం. రెండో కుంభకోణం.. రెండేళ్ల పాటు ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తామని చెప్పడం. ఒక వైపు మెడికల్ కాలేజీలను నిర్మించడానికి డబ్బుల్లేవు అని చెబుతూ... మెడికల్ కాలేజీలను, ఇన్ ఫ్రా స్ట్రక్చర్, భూమితో సహా ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తూనే.. వారికి రెండేళ్ల జీతాలు కూడా ప్రభుత్వం నుంచి చెల్లించడం అంటే ఒక్కో కాలేజీకి ఏడాదికి రూ.8 కోట్లు చొప్పున 10 మెడికల్ కాలేజీలకు రూ.80 కోట్లు ఖర్చువుతుంది. రెండేళ్లకు రూ.1400 కోట్లు ఇవ్వాలి. ఈ డబ్బులతో కాలేజీలు పూర్తి కావా?ఇవాళ కార్పొరేట్ కాలేజీల్లో వైద్యం ఖర్చు ఎలా కంట్రోల్ చేయగలుగుతారు? ఇవాళ కొత్త ట్రీట్మెంట్ వచ్చిందంటే అది ఎన్ని లక్షలు కట్టమంటే అంతా కట్టాల్సిందే? ఇక్కడ మొదలుపెట్టి ప్రైమరీ హెల్త్ కేర్ను కూడా ప్రైవేటుకు కచ్చితంగా అప్పగిస్తాడు. అంటే మొత్తం వైద్య ఆరోగ్యరంగం పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోతుంది. మన ఆర్దిక వ్యవస్ధలో ప్రైవేటు ఉండడం మన మార్కెట్ ఎకానమీలో భాగం.ప్రజల పట్ల ప్రేమ - పాప భీతి లేని వ్యక్తి చంద్రబాబులాభం లేకుండా ప్రైవేటు వ్యాపారులు రారని తెలిసి, వాళ్లకు లాభాలిచ్చి, నువ్వు వేల కోట్లు కుమ్మిరించి.. ఇక్కడ అవసరమైన రూ.2-3 వేల కోట్లు పెట్టలేదంటే చంద్రబాబు రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నాడు. ఆయన సేవలు చేయనవసరం లేదు, కానీ ద్రోహం చేయడం మహాపాపం. నా వల్ల ఇంత నష్టం జరుగుతుందన్న భయం కానీ పాపభీతి కానీ రెండూ చంద్రబాబుకు లేవు. అందుకే నేటికీ ప్రైవేటీకరణ మంచిదని బుకాయిస్తున్నాడు.రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల వెల్లువఈ నేపధ్యంలోనే ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరనసగా వైఎస్ జగన్ పిలుపు మేరకు అక్టోబర్లో సంతకాల సేకరణ ఉద్యమం మొదలుపెట్టి... రెండు నెలల కాలంలో 1 కోటి సంతకాలను లక్ష్యంగా పెడితే... 1,04,11,136 సంతకాలు వచ్చాయి. ఈ సంతకాలన్నీ ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను మీరు వ్యతిరేకిస్తే... సంతకం చేయమని అడిగితే..రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలు, గ్రామాల్లో చేసినవే. జిల్లాల వారీగా చూస్తే.. శ్రీకాకుళంలో జిల్లాలో 4,02,833, విజయనగరం జిల్లాలో 3,99,908, పార్వతీపురం మన్యం 2,15,500, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1,47,000, విశాఖపట్నం 4,19,200, అనకాపల్లి జిల్లాలో 3,73,000, కాకినాడ జిల్లాలో 4,00,600, బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 4,20,086, తూర్పుగోదావరి జిల్లాలో 4,06,929, పశ్చిమ గోదావరి జిల్లాలో 4,19,650, ఏలూరు జిల్లాలో 3,60,008, కృష్ణా జిల్లాలో 3,77,336, ఎన్టీఆర్ జిల్లాలో 4,31,217, గుంటూరు జిల్లాలో 4,78,059,..పల్నాడు జిల్లాలో 4,31,802, బాపట్ల జిల్లాలో 3,73,199, ప్రకాశం జిల్లాలో 5,26,168, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో 6,30,040, కర్నూలు జిల్లాలో 3,98.277, నంద్యాల జిల్లాలో 4,05,500, అనంతపురం జిల్లాలో 4,55,840, శ్రీసత్యసాయి జిల్లాలో 4,40,358, వైయస్సార్ జిల్లాలో 4,80,101, అన్నమయ్య జిల్లాలో 2,60,500, చిత్తూరు జిల్లాలో 7,22,025 మొత్తం 1 కోటి 3 లక్షల 71వేల 136 సంతకాలు చేరాయి. ఇవి కాకుండా కేంద్ర కార్యాలయానికి చేరిన మరో 40వేలు సంతకాలు కలిపి మొత్తం... 1, 04,11,136 నిఖార్సైన సంతకాలతో ప్రవైటీకరణకు వ్యతిరేకంగా తమ మద్ధతు తెలిపారు.బ్యాలెట్ తీర్పు తరహాలో ప్రజాభిప్రాయం:రాష్ట్రంలో ప్రజాభిప్రాయసేకరణలో ఇంత పక్కాగా బ్యాలెట్ బాక్సులో తీర్పునిచ్చినట్లు.. రాష్ట్ర ప్రజలు తీర్పునిచ్చారు. 1.04 కోట్ల మంది సంతకాలు అంటే అన్ని కుటుంబాలు సంతకాలు చేశారంటే... రాష్ట్రంలో మొత్తం కుటంబాలు 1.60 కోట్లు పైగా ఉంటే... అందులో 1.04 కోట్ల కుటుంబాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు చేశారు.ఇంతమంది సంతకాలు చేసిన తర్వాత చంద్రబాబు పట్టుదలకు పోవాల్సిన అవసరం లేదు. క్రెడిట్ ఆయనే తీసుకుని... మెడికల్ కాలేజీలు పూర్తి చేయాలి. టిడ్కో ఇళ్ల విషయంలో కూడా గతంలో చంద్రబాబు డబ్బులు వసూలు చేసి పూర్తి చేయకుండా వదిలేస్తే.. వైఎస్ జగన్ హయాంలో క్రెడిట్ కూడా క్లెయిమ్ కూడా చేయకుండా.. ఉచితంగా అందించారు. అది వైఎస్ జగన్కు ఉన్న ఆలోచన. రాజకీయం కోసం ప్రజలతో ఆడుకోవడం సరికాదు. వైఎస్ జగన్ హయాంలో కట్టిన ఇళ్లను చంద్రబాబు తన ఖాతాలో చూపించుకున్నాడు. ఏమాత్రం జంకులేకుండా క్లెయిమ్ చేసుకోవడం చంద్రబాబుకు అలవాటు.కాలేజీల నిర్మాణానికి కుంటిసాకులు:ఇవాళ మెడికల్ కాలేజీలను కూడా తానే కట్టానని చంద్రబాబు క్లెయిమ్ చేసుకోవచ్చు.. కానీ ప్రైవేటీకరణ చేసి ప్రజల ఉసురు తీసుకోవద్దు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడవద్దు. వైఎస్ జగన్ ప్రారంభించిన వాటి నిర్మాణం కొనసాగిస్తే సరిపోతుంది. ఈ 18 నెలల కాలంలో చంద్రబాబు చేసిన రూ. 2.60 లక్షల కోట్లకు పైగా అప్పులో .. కొంత మెడికల్ కాలేజీల కోసం వెచ్చిస్తే సరిపోయేది. కానీ కుంటిసాకులు వెదుకుతూ, పార్లమెంటరీ స్థాయీ సంఘం చెప్పిందని తన అనుకూల పత్రికల్లో రాయించుకోవడం మానేసి... చేసి చూపించాలి వైఎస్సార్ ఉచిత కరెంటు ఇవ్వడం అసాధ్యమని అందరూ అన్నారు.. దాన్ని ఆయన చేసి చూపించేసరికి అందరూ దాన్ని అనుసరిస్తున్నారు.నీవు ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం సాధ్యం కాదు అనుకున్నావు.. కానీ వైఎస్ జగన్ వాటిని చేసి చూపిస్తే దాన్ని కొనసాగించ లేకపోవడం దారుణం. భవిష్యత్తు తరాలకు 20, 30 ఏళ్లు గడిచిన తర్వాత... మెడిసిన్లో గొప్ప సిస్టమ్స్ ఉన్నాయని చెప్పుకునే అవకాశాన్ని చేతులారా చంద్రబాబు చంపేస్తున్నాడు. ఇప్పటికైనా చంద్రబాబుకు మంచి బుద్ధి కలిగి ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలను నిర్మించాలని కోరుతున్నాం.ఇదే విషయంపై రేపు సాయంత్రం 4 గంటలకు వైఎస్ జగన్ ఒక ప్రతినిధి బృందంతో... గవర్నర్ని కలిసి వినతి పత్రం ఇవ్వడంతో పాటు, సంతకాల ప్రతులను ఆయనకు సమర్పిస్తామని రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అప్పటికైనా చంద్రబాబు కుట్రపూరితమైన, తన దుర్మార్గమైన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మెడికల్ కాలేజీలను ప్రభుత్వరంగంలోనే ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు.అనంతరం పాత్రికేయుల ప్రశ్నలకు సమాధానమిస్తూ..రోడ్లు పీపీపీ విధానంలో నిర్మిస్తే అవి ప్రభుత్వం వద్దే ఉంటాయి కదా అని ప్రశ్నించగా.. అలా చేయడం వల్ల టోల్ గేట్ల ఖర్చు భారీగా ఉంటుందన్న విషయాన్ని గుర్తు చేశారు. గతంలో ఇవేవీ లేవని.. ప్రైవేటు వ్యక్తులు లాభాపేక్ష లేకుండా ఎందుకు వస్తారని నిలదీశారు. మెడికల్ కాలేజీలు ప్రజారోగ్యానికి సంబంధించిన విషయమని... ఏ దేశమైనా ప్రభుత్వ పరిధిలేకుండా వైద్యాన్ని ప్రైవేటుపరం చేయలేదని గుర్తు చేశారు. కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు.. వాటి ధరలను సమాజం భరించలేదని... అందుకే ప్రభుత్వం వాటిని బేలన్స్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. కోటి సంతకాలు ఎవరు చేశారన్నది.. తెలుగుదేశం పార్టీ నేతలందరికీ తెలుసు. ప్రైవేటీకరణ విషయంలో మారిన చంద్రబాబు మాట తీరే ఇందుకు నిదర్శనం. అయినా మొండిగా ముందుకు వెళ్తూ చంద్రబాబు తన గొయ్యి తానే తవ్వుకుంటున్నాడు.వైఎస్ జగన్ హయాంలో మెడికల్ కాలేజీల నిర్వహణ కోసం సెల్ఫ్ పైనాన్స్ సీట్లు ప్రవేశపెడితే.. ఇదే కూటమి నేతలు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. తాము అధికారంలోకి వస్తే మొత్తం సీట్లు ఉచితంగా భర్తీ చేస్తామని చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా కాలేజీలనే ప్రైవేటీకరణ చేస్తున్నారు. 108 సేవలకు సంబంధించి ప్రతిచోటా మొత్తం ప్రభుత్వం చేయాలనుకోవడం మంచి మార్గం. ఒకవేళ అది కాకపోతే ప్రభుత్వ కంట్రోల్ ఉంచేలా చూడాలి. కానీ కూటమి నేతలు మేం అధికారంలోకి వస్తే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు రద్దు చేసి మొత్తం ఉచితంగా భర్తీ చేస్తామని చెప్పి... ఇవాళ ప్రైవేటీకరణకు వెళ్లడమే మంచిదని వితండవాదం చేయడం దుర్మార్గం.రాజధాని నిర్మాణం కోసం డిజైన్లు, లైటింగ్ వంటి వాటి కోసం కోట్లాది రూపాయులు ఖర్చుపెడుతున్నారు. కానీ మెడికల్ కాలేజీల నిర్మాణానికి వచ్చేసరికి చేయాలన్న ఉద్దేశం లేకపోవడంతోనే ప్రైవేటీకరణ చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయంలో మాత్రం ఇలా చేయడం దుర్మార్గం. ఉచితంగా ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని వైయస్.జగన్ మెడికల్ కాలేజీల నిర్మాణం చేసి చూపించిన తర్వాత కూడా ఇలాంటి వాదన చేయడం అర్ధరహితమని తేల్చి చెప్పారు. -
సీఎం చంద్రబాబు మరో క్రెడిట్ చోరీ
సాక్షి,విజయవాడ: రాష్ట్రంలో సీఎం చంద్రబాబు క్రెడిట్ చోరీని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే గత వైఎస్సార్సీపీ హయాంలో ప్రజలకు అందించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పేర్లను మార్చి తన ఖతాలో వేసుకున్న చంద్రబాబు మరోసారి క్రెడిట్ చోరీకి సిద్ధమయ్యారు. ఇవాళ విజయవాడలో జరిగిన కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అమలులో ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ పేరును మార్చి ఇకపై వాటిని ‘స్వర్ణ గ్రామం’గా మారుస్తున్నట్లు ప్రకటించారు. క్రెడిట్ చోరీకి సిద్ధమయ్యారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన హయాంలో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఈ వ్యవస్థ ద్వారా ప్రజలు తమ గ్రామంలోనే అన్ని ప్రభుత్వ సేవలను పొందే అవకాశం కలిగింది. పలు శాఖల పనులను ఒకే కేంద్రంలో సమీకరించడం వల్ల ప్రజలకు సేవలు మరింత సులభతరం అయ్యాయి. కొత్త పేరుతో కొనసాగింపుఅయితే, ప్రస్తుతం అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం, ఈ వ్యవస్థను కొనసాగిస్తూ..దానికి కొత్త పేరు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ‘స్వర్ణ గ్రామాలు’ అనే పేరుతో క్రెడిట్ చోరీకి పాల్పడ్డారు.చంద్రబాబుపై విమర్శలుచంద్రబాబు నిర్ణయంపై రాష్ట్ర ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. వైఎస్ జగన్ సృష్టించిన వ్యవస్థకు పేరు మార్చి క్రెడిట్ తీసుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు. -
‘కోటి సంతకాలు.. బాబు పతనానికి పునాదులు’
సాక్షి, తాడేపల్లి: కోటి సంతకాలు కాదు.. చంద్రబాబు పతనానికి పునాదులు’’ అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మీద ఉన్న కోపంతో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయటం సరికాదన్నారు. విశాఖ ఉక్కును సైతం ప్రైవేటీకరణ చేస్తారా? అంటూ గోరంట్ల మాధవ్ నిలదీశారు.భూమి, బిల్డింగ్లు అన్నీ ప్రభుత్వమే ఇస్తే నీ బినామీలకు దోచి పెడతారా?. వంద రూపాయలకే ఎకరం భూమి ఇస్తారా?. దీని వెనుక పెద్ద కుంభకోణం ఉంది. కాలేజీలను ప్రైవేట్ వారికి ఇచ్చి జీతాలు మాత్రం ప్రభుత్వమే ఇస్తుందంట.. ఆదాయం మాత్రం ప్రైవేట్ వారే తీసుకుంటారట. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ప్రైవేటీకరణ అంశాన్ని వెనక్కి తీసుకోవాలి’’ అని గోరంట్ల మాధవ్ డిమాండ్ చేశారు. -
‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక భారీ కుంభకోణం’
సాక్షి, తాడేపల్లి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక భారీ కుంభకోణం ఉందని.. పీపీపీ ముసుగులో అడుగడుగునా అడ్డగోలు దోపిడీకి తెర తీశారని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వేర్వేరుగా మీడియాతో మాట్లాడిన అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, పార్టీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్.. చంద్రబాబు విధానాలను నిలదీశారు.కుడిచేత్తో కాలేజీలిచ్చి.. ఎడమ చేత్తో కమీషన్లు: గుడివాడ అమర్నాథ్మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైయస్సార్సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమానికి విశేష స్పందన వచ్చింది. చంద్రబాబు తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అన్ని వర్గాల ప్రజలు ముందుకొచ్చి కోటి సంతకాల ఉద్యమంలో పాల్గొన్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీల పనులు మొదలుపెట్టి, 7 కాలేజీలను పూర్తి చేయడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజారోగ్యాన్ని ఫణంగా పెట్టి 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలని నిర్ణయించడంపై ప్రజలు మండి పడుతున్నారు.కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక భారీ అవినీతి దాగి ఉందన్న వైఎస్సార్సీపీ వాదనను ప్రజలు అర్థం చేసుకున్నారు. గత మా ప్రభుత్వం నిర్మించిన కాలేజీలు, ఆస్పత్రులతో పాటు ఆయా ఆస్పత్రుల పరిధిలో ఉన్న వందల కోట్ల విలువ చేసే భూములను కాజేయాలన్న కుట్రతోనే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.సంపద సృష్టిస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, ఒక వైపు ఏడాదిన్నరలోనే రూ. 2.66 లక్షల కోట్ల అప్పు చేయడమే కాక, మెడికల్ కాలేజీల రూపంలో జగన్ సృష్టించిన వేల కోట్ల విలువైన సంపదను ప్రైవేటుకి అప్పనంగా ధారాదత్తం చేస్తున్నాడు. ఇది చాలదన్నట్టు ఆయా కాలేజీల్లో పనిచేసే స్టాఫ్కి రెండేళ్లపాటు జీతాలు చెల్లించే పేరుతో ప్రజా సంపదను దోచిపెడుతున్నాడు. కుడి చేతితో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుకి రాసిచ్చి, జీతాల రూపంలో ఒక్కో ఏడాది ఇచ్చే దాదాపు రూ.800 కోట్ల సొమ్మును ఎడమ చేత్తో వారి నుంచి లాక్కుంటున్నాడు. తన దోపిడీ కుట్రలను యథేచ్ఛగా అమలు చేయడానికి నిస్సిగ్గుగా పార్లమెంట్ స్థాయీ సంఘం నివేదికను కూడా వక్రీకరించేస్తున్నాడు. కిక్ బ్యాక్ల కోసం తాను ఎంతకైనా దిగజారుతానని చెప్పకనే చెబుతున్నాడు.జీతాల చెల్లింపుల పేరుతో రూ.1400 కోట్లు దోపిడీ: గోరంట్ల మాధవ్పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయాలన్న చంద్రబాబు కుట్రలను రాష్ట్ర యువత, మేథావులు, విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో కూటమి రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం. మళ్లీ అధికారంలోకి రాలేమని గ్రహించే దర్జాగా దోపిడీకి బాటలు వేసుకుంటున్నాడు. రేపు వైయస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడగానే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై లోతైన విచారణ చేసి నిందితులు ఎవరున్నా వదిలి పెట్టబోము. న్యాయస్థానాల్లో నిలబెట్టి కఠినంగా శిక్షించే వరకు వెనకాడబోము.కేవలం దోపిడీ ఆలోచనలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. జగన్గారు నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నాడు. ఇది చాలదన్నట్టు కాలేజీలను దక్కించుకున్న 10 మెడికల్ కళాశాలల ఉద్యోగులకు రెండేళ్లపాటు జీతాలు కూడా ప్రభుత్వమే చెల్లించేలా మరో దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ఖచ్చితంగా ఇదంతా ప్రజల ఆస్తులను అప్పనంగా తన బినామీలకు దోచిపెట్టే కుట్రే. ఒక్కో కాలేజీకి ఏడాదికి రూ.70 కోట్ల చొప్పున రెండేళ్లకు రూ. 140 కోట్లు.. రెండేళ్లలో 10 మెడికల్ కాలేజీలకు దాదాపు రూ.1400 కోట్లు దోచిపెట్టే కుట్రకు తెర లేపారు. కుడిచేత్తో కాలేజీలను, కాలేజీ భూములను వారి చేతిలో పెట్టి.. ఎడమ చేత్తో జీతాల పేరుతో ఇచ్చిన రూ.1400 కోట్ల డబ్బును వారి నుంచి తీసుకునే దోపిడికి స్కెచ్ వేశాడు. ఇందుకు రాబోయే రోజుల్లో చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదు.ప్రైవేటీకరణ వెనుక లక్ష కోట్ల దోపిడీ: :మొండితోక అరుణ్కుమార్మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేరుతో చంద్రబాబు లక్ష కోట్ల దోపిడీకి పాల్పడుతున్నాడు. ప్రజావైద్య రంగాన్ని బలోపేతం చేసి పేదలకు మెరుగైన ఉచిత వైద్యం అందించాలన్న లక్ష్యంతో వైయస్ జగన్ గారు నాడు 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టడంతోపాటు 7 కాలేజీలను పూర్తి చేసి 5 కాలేజీల్లో క్లాసులు కూడా ప్రారంభించారు. అత్యాధునిక వసతులతో ఒక్కో మెడికల్ కాలేజీని 50 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. మెడికల్ కాలేజీల రూపంలో ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల విలువైన సంపద సృష్టిస్తే. ప్రైవేటీకరణ పేరుతో చంద్రబాబు దాన్ని తన బినామీలకు ధారాదత్తం చేసే కుట్రలకు తెరలేపాడు.నాలుగోసారి ముఖ్యమంత్రిగా చేస్తున్న చంద్రబాబు, తన పాలనలో ఒక్క మెడికల్ కాలేజీని కూడా నిర్మించకపోగా.. వైఎస్ జగన్ నిర్మించిన కాలేజీలను 66 ఏళ్లపాటు ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నాడు. మెడికల్ కాలేజీలకున్న 50 ఎకరాలు ప్రభుత్వ భూమి, భవనాలు ప్రభుత్వానివి వాటి విలువ వందల కోట్లలో ఉంటే ఎకరా రూ.100లకు ధారాదత్తం చేశాడు. ఇది కాకుండా రెండేళ్లపాటు జీతాలు చెల్లించే పేరుతో 10 మెడికల్ కాలేజీలకు దాదాపు రూ.1400 కోట్లు ముట్టజెప్పే ప్రయత్నం మొదలుపెట్టాడు. ప్రభుత్వ సంపదపై ప్రైవేటు వ్యక్తులకు పెత్తనం అప్పజెబుతున్నాడు.మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు భారీ స్పందన వచ్చింది. 1.36 కోట్ల మందికిపైగా సంతకాలు చేసి ప్రభుత్వ నిర్ణయాన్ని బాహాటంగానే తప్పుబట్టారు. చంద్రబాబు పుట్టిన నారావారిపల్లెలో కూడా సగం మందికిపైగా ప్రైవేటీకరణను నిరసిస్తూ సంతకాలు చేశారంటే ఏ విధంగా చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుందో అర్థం చేసుకోవచ్చు. మెడికల్ కాలేజీలపై పీపీపీ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు మా పార్టీ వెనక్కి తగ్గబోదు. -
పార్లమెంట్లో కడప- రాయచోటి హైవే టన్నెల్ పనుల ప్రస్తావన
న్యూఢిల్లీ: రాజ్యసభ జీరో అవర్లో ఎంపీ మేడ రఘునాథ్ రెడ్డి కడప–రాయచోటి హైవేపై ప్రతిపాదిత టన్నెల్ నిర్మాణ అంశాన్ని లేవనెత్తారు. ఈ రహదారిలో పొడవైన, ప్రమాదకరమైన ఘాట్ సెక్షన్ ఉండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిలో పలువురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన సభ దృష్టికి తీసుకువచ్చారు.ఈ ప్రమాదకర ఘాట్ సెక్షన్ను బైపాస్ చేయడానికి టన్నెల్ నిర్మాణం చేపట్టాలని స్థానిక ప్రజలు ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారని ఎంపీ తెలిపారు. టన్నెల్ నిర్మాణం పూర్తయితే ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గడమే కాకుండా, ప్రయాణ సమయం, దూరం కూడా తగ్గుతాయని స్పష్టం చేశారు.కడప–రాయచోటి హైవే రాయలసీమ ప్రాంతానికి అత్యంత కీలకమైన రహదారిగా ఉండటమే కాకుండా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసే ప్రధాన మార్గమని మేడ రఘునాథ్ రెడ్డి వివరించారు. ఈ నేపథ్యంలో రోడ్డు రవాణా శాఖ వెంటనే ఈ హైవేపై సర్వే నిర్వహించి, టన్నెల్ నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.ఈ టన్నెల్ నిర్మాణం ద్వారా రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ఊతం లభిస్తుందని, వ్యాపారం, రవాణా, పర్యాటక రంగాలకు కూడా మేలు జరుగుతుందని ఎంపీ పేర్కొన్నారు. ప్రజల ప్రాణాల రక్షణే ప్రధాన లక్ష్యంగా ఈ అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తినట్లు ఆయన స్పష్టం చేశారు. -
460 కోట్ల టీటీడీ స్థలం బాబుపై భూమన సంచలన కామెంట్స్
-
Nagari : అది మా రోజమ్మ గొప్పతనం
-
Bharath : బాబు వెన్నులో వణుకు పుట్టేలా కోటి సంతకాల ప్రజా ఉద్యమం
-
పథకాలనే కాదు జగన్ స్టైల్ ని కూడా కాఫీ.. కారుమూరి వెంకట్ రెడ్డి సెటైర్లే సెటైర్లు
-
ఇది పరకామణి చోరీ కంటే పెద్ద దోపిడి.. చంద్రబాబుపై భూమన ఆగ్రహం
సాక్షి, తిరుపతి: తిరుమల పవిత్రతను కాపాడటంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘోరంగా విఫలం అవుతున్నారని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి అన్నారు. ఇప్పుడు ఏకంగా దేవుడి భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతూ తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారాయన. బుధవారం తన నివాసంలో భూమన మీడియాతో మాట్లాడారు.. .. టీటీడీకి చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నారు. దేవస్థానం భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారు. అలిపిరిలో సమీపంలో అత్యంత విలువైన భూముల్ని ఇచ్చేస్తున్నారు. ఎకరా రూ.26 కోట్ల రూ.52 లక్షల ఖరీదైన భూముల్ని కట్టబెట్టారు. రూ.460 కోట్ల విలువైన భూమిని ఒబెరాయ్కి ఇచ్చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో రూ.3 వేల కోట్ల విలువైన భూమి ఇది. 13వ తేదీన జీవోకూడా కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. 13న జీవో.. 5న రిజిస్ట్రేషన్ చేశారు. మరి ఇంకా స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ సైట్లో ఎందుకు కనిపించడం లేదు?. ఎవరికి మేలు చేయడానికి రూ. 2 కోట్లు బిల్డింగ్ ఫీజుకు సర్దుబాటు చేశారు, రూ. 26 కోట్ల స్టాంప్ డ్యూటీ మాఫీ చేసేశారు. ఆ భూముల్లో భారీగా చందనపు చెట్ల ఉన్నాయి. రిజిస్ట్రేషన్ కాకముందే చెట్లు కొట్టడం ప్రారంభించారు. ఒక బ్రాహ్మణుడు స్వామివారికి ఇచ్చిన భూమిని బాబు పందేర వేస్తున్నారు. తిరుమల పవిత్రతతను కాపాడడంలో చంద్రబాబు విఫలం అయ్యారు. వంద గదుల హోటల్కు భారీ ఎత్తున భూములు కట్టబెడుతున్నారు. ప్రభుత్వం దగ్గరి భూములు ఇవ్వకుండా(రెవెన్యూ ల్యాండ్).. టీటీడీ భూములు ఎలా ఇస్తారు?. గతంలోనూ హోటల్పేరు మార్చి తతంగం అంతా నడిపించింది చంద్రబాబే. దేవుడిని దోపిడీ చేసి ఒబెరాయ్కు ఇప్పుడు భూములు అప్పజెప్తునారు. దేవుడి ఇనాం భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఎలా కట్టబెడతారు?. ఈ నిర్ణయాన్ని చంద్రబాబు ఎలా సమర్థించుకుంటారు. వెంకటేశ్వరస్వామికి చంద్రబాబు చేస్తోంది అన్యాయం కాదా?..’’ అని భూమన మండిపడ్డారు. వంద రూమ్ల ఒబెరాయ్ హోటల్తో 1,500 మందికి ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం ప్రజలకు చెప్తోంది. అదెలా సాధ్యం. ఇది పరకామణి దొంగతనం కంటే అతి పెద్ద దోపిడి. దీని వల్ల టీటీడీకి వచ్చిన లాభం ఏమిటి?. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అనాడు తీసుకు వచ్చిన ఏడు కొండలు పరిధిలోనే ఈ భూములు ఉన్నాయి. ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో ఈ భూమి ఉంది. అలిపిరి వద్ద అనుమతులు లేకుండా అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి?.. స్వామీజీలు ఇప్పటికైనా మౌనం వీడాలి. కూటమి ప్రభుత్వ నిర్ణయంపై పోరాటం చేయాలి. ప్రత్యేక అగ్రిమెంట్ వెనుక పెద్ద ఎత్తున అవినీతి దాగి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఘోరాతి తప్పిదాలు చేశారు. డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించాలి’’ అని భూమన డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: తిరుమలలో మహాపచారం.. మద్యం, బిర్యానీ ప్యాకెట్లు లభ్యం! -
చంద్రబాబు మరో క్రెడిట్ చోరీ
సాక్షి, అమరావతి: క్రెడిట్ చోరీలో ఆరితేరిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన రికార్డులు తానే తిరగరాస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చేసిన పనులను తమ ప్రభుత్వం చేసినవిగా చెప్పుకునేందుకు నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్ ఏర్పాటును ‘గూగుల్’ ముసుగులో తన ఘనతగా చెప్పుకునేందుకు ఆపసోపాలుపడిన చంద్రబాబు అభాసుపాలయ్యారు. ఇప్పుడు తాజాగా రాష్ట్రంలో 6,100 మంది పోలీస్ కానిస్టేబుళ్ల నియామకం కూడా తన ఖాతాలో వేసుకునేందుకు ఆయన హైడ్రామాకు తెరతీశారు. ఎంపికైన పోలీస్ కానిస్టేబుళ్లకు నియామక పత్రాల ప్రదానం పేరిట మంగళవారం ప్రచారార్భాటంతో కనికట్టు చేయడం పోలీసు వర్గాలనే విస్మయపరుస్తోంది. ఈ ప్రక్రియలో అసలు వాస్తవాలివీ.. 2022లోనే నోటిఫికేషన్.. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా తొలుత 2022లో ఎస్సై పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి రాత పరీక్షలూ నిర్వహించి 411 ఉద్యోగాలను భర్తీ చేసింది. అలాగే 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టింది. సివిల్ కానిస్టేబుల్ పోస్టులు 3,580, ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టులు 2,520 మొత్తం 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి 2022, నవంబరులో నోటిఫికేషన్ జారీచేసింది. ఆ పోస్టులకు మొత్తం 5,03,486 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే 2023, జనవరి 22న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. మొత్తం 4,59,182 మంది అభ్యర్థులు హాజరైన ఈ పరీక్ష ఫలితాలను కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే ప్రకటించారు. కోర్టు కేసులతో కానిస్టేబుల్ నోటిఫికేషన్ను అడ్డుకున్న టీడీపీ.. అయితే, ఈ కానిస్టేబుల్ పోస్టుల భర్తీని అప్పట్లో ప్రతిపక్ష టీడీపీ దురుద్దేశంతో అడ్డుకుంది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు రాష్ట్రంలోని నాలుగు కేంద్రాల్లో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం సిద్ధపడింది. కానీ, టీడీపీ నేతలు తమ వర్గీయుల ద్వారా న్యాయస్థానాల్లో 36 పిటిషన్లు వేయించారు. దాదాపు ఏడాదిపాటు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించకుండా అడ్డుకున్నారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఏడాదిన్నరలోనే తమ వర్గీయుల చేత ఆ కేసులన్నీ ఉపసంహరింపజేయడం గమనార్హం. దీంతో రాష్ట్ర పోలీసు నియామక మండలి దేహదారుఢ్య పరీక్షలు, అనంతరం మెయిన్స్ పరీక్షలు నిర్వహించి 5,757 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. చంద్రబాబు హైడ్రామా.. ఇదిలా ఉంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియను ఇప్పుడు తన ఘనతగా ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు చంద్రబాబు హైడ్రామాకు తెరతీశారు. ఎంపికైన కానిస్టేబుళ్లకు నియామక పత్రాల ప్రదానం పేరిట తెగ హడావుడి చేశారు. వాస్తవానికి.. కానిస్టేబుళ్లకు రాష్ట్రంలోని వివిధ ఏపీఎస్పీ బెటాలియన్లలో నియామక పత్రాలు అందించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. కానీ, ఈ పోస్టుల భర్తీ తన ఘనతగా చెప్పుకునేందుకు.. అలాగే, ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు చంద్రబాబు ఓ ఎత్తుగడ వేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన మొత్తం 5757 మంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాల ప్రదానం కార్యాక్రమాన్ని మంగళగిరిలోని పోలీస్ బెటాలియన్లో మంగళవారం నిర్వహించారు. అంతేకాదు.. ఎంపికైన ఒక్కో కానిస్టేబుల్ అభ్యర్థి తనతో కనీసం ముగ్గురు కుటుంబ సభ్యులను తీసుకురావాలని మెలిక పెట్టారు. వీరిని ఆర్టీసీ బస్సుల్లో ప్రభుత్వం తరలించింది. అంతమందితో సమావేశం నిర్వహించి తన సొంత డబ్బా కొట్టుకోవాలన్నది చంద్రబాబు పన్నాగం. అంటే.. శ్రీకాకుళం, అనంతపురం తదితర సుదూర ప్రాంతాల నుంచి ఎంపికైన అభ్యర్థులే కాకుండా వారి కుటుంబ సభ్యులు వ్యయ ప్రయాసలు భరించి మంగళగిరి రావాలని హుకుం జారీచేశారు. నిబంధనలకు విరుద్ధంగా.. అయితే, వీరు ఇంకా విధుల్లో చేరకుండానే నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం వీరికి వారెంట్ జారీచేసి ఆర్టీసీ బస్సుల్లో తీసుకొచ్చింది. ఈ బాధ్యతలను జిల్లాల ఎస్పీలు పర్యవేక్షించారు. నిజానికి.. పోలీసు, రెవెన్యూ తదితర కీలక శాఖలు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి. కానీ, చంద్రబాబు సర్కారు ఈ కార్యక్రమాన్ని ఫక్తు పార్టీ కార్యక్రమంగా మార్చేసింది. పైగా.. ఎంపికైన అభ్యర్థులతో జిల్లాల వారీగా సమావేశాలు కూడా నిర్వహించాలని ఆదేశించింది. దీంతో.. చంద్రబాబు ప్రభుత్వ తీరుపై అటు పోలీసు వర్గాలతోపాటు ఇటు ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థుల కుటుంబాలు తీవ్ర అసహనం వ్యక్తంచేస్తున్నాయి. ఈ నియామక పత్రాల ప్రదానం కార్యక్రమాన్ని కూడా పార్టీ కార్యక్రమంలా చేయడమేంటని వారు దుమ్మెత్తిపోస్తున్నారు. -
‘ ఆ అంశంపై చర్చకు మేము సిద్దం, మీరు సిద్దమా?’
తాడేపల్లి : పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదక మీద కూడా ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. మెడికల్ కాలేజీలను పీపీపీ పద్దతిలో నిర్మాణం చేయమని ఆ కమిటీ చెప్పలేదన్నారు. కానీ స్టాండింగ్ కమిటీ నివేదిక పైనా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తన్నారన్నారు. ఈరోజు(మంగళవారం, డిసెంబర్ 16వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి విడదల రజిని మాట్లాడుతూ.. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఇచ్చిన నివేదిక పై చర్చకు తామె పిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం సిద్ధమా? అని సవాల్ విసిరారు. ‘పేదల ఆరోగ్యంపై చంద్రబాబుకి చిత్తశుద్ధి లేదు. ఎంబీబీఎస్ సీట్లు విషయంలో రాష్ట్రాల వారీగా అసమానతలు ఉన్నాయని స్టాండింగ్ కమిటీ చెప్పింది. కొన్ని రాష్ట్రాల్లో నేషనల్ యావరేజ్ కంటే ఎక్కువ, మరికొన్ని రాష్ట్రాల్లో తక్కువ సీట్లు ఉన్నాయని కమిటీ చెప్పింది. ఇలాంటి అసమానతలు ఉండ కూడదనే వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు. కూటమి ప్రభుత్వంలో పీపీపీ పేరుతో చంద్రబాబు స్కాం కి తెరలేపారు. రాష్ట్రాలు ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉంటే PPP పద్ధతిలో మెడికల్ కాలేజీలు నిర్మాణం చేయమని చెప్పింది. అంతేకాని ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాలలను ఇవ్వమని చెప్పలేదు. చంద్రబాబు ప్రభుత్వానికి సవాల్ చేస్తున్నా. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ppp కి ఇవ్వమని కమిటీ ఎక్కడ చెప్పిందో చూపించాలి. దీనిపై చర్చకు మేము సిద్దం, మీరు సిద్దమా?’ అని సవాల్ చేశారు. -
మా రోజమ్మ గురించి పిచ్చి పిచ్చిగా వాగితే... చక్రపాణి రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్
-
జగన్ ను కలిసిన తరువాత భవానీపురం బాధితుల రియాక్షన్
-
YS Jagan: వీళ్ళే లిటికేషన్ క్రీయేట్ చేసి 150 కోట్ల భూమిని కొట్టేద్దాం అని..
-
బుల్డోజర్లతో మధ్యతరగతి కుటుంబాల్ని విచ్ఛిన్నం చేశారు: వైఎస్ జగన్
సాక్షి, విజయవాడ: న్యాయస్థానంలో ఊరట ఉన్నప్పటికీ.. అధికార దుర్వినియోగంతో కూటమి ప్రభుత్వం 42 కుటుంబాలను అన్యాయంగా రోడ్డున పడేసిందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం భవానీపురం జోజి నగర్లో బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘25 ఏళ్లుగా 42 కుటుంబాలు ఇక్కడే ఇళ్లు కట్టుకుని జీవిస్తున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి కూడా ఉంది. అయినా కూడా వీళ్ల ఇళ్లను ధ్వంసం చేశారు. సుప్రీం కోర్టులో ఈ పిటిషన్ పెండింగ్లో ఉంది. ఈ నెల 31వ తేదీ వరకు సుప్రీం కోర్టు వీళ్లకు ఊరట ఇచ్చింది. పోలీసులు ప్రైవేట్ పార్టీకి మద్దతుగా ఈ కూల్చివేతలు జరిపారు. 200 మంది పోలీసులు ఈ కూల్చివేతలు జరిపారు. ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేసేందుకు ప్రభుత్వ పెద్దల ప్రమేయంతోనే ఈ కూల్చివేతలు జరిగాయి. అధికార దుర్వినియోగం చేస్తూ ఇక్కడి వాళ్లను రోడ్డుపాలు చేశారు’’ అని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. .. 2.17 ఎకరాల ఈ భూమి విలువ రూ.150 కోట్ల దాకా ఉంటుంది. 2016లో ఫేక్ సొసైటీ క్రియేట్ చేశారు. అప్పటి నంచే ఈ భూమిని కాజేసేందుకు స్కెచ్ వేశారు. కూల్చివేతల్లో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, జనసేన కార్పేటర్ సోదరుడి ప్రమేయం కూడా ఉంది. బాధితులు చంద్రబాబును మూడుసార్లు కలిశారు. లోకేష్ను రెండు సార్లు కలిశారు. ఆ ఇద్దరికీ వినతి పత్రాలు ఇచ్చారు. అయినా కూడా కుట్రపూరితంగా.. చంద్రబాబు, లోకేష్, చిన్నిలు బాధితులకు అన్యాయం చేశారు. బుల్డోజర్లతో మధ్యతరగతి కుటుంబాలను విచ్ఛిన్నం చేశారు’’ అని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాట్లకు అన్నిరకాల అనుమతులు కూడా ఉన్నాయి. బ్యాంకుల నుంచి లోన్లు కూడా వచ్చాయి. ఎన్నో ఏళ్లగా ఈఎంఐలు కూడా కడుతున్నారు. అయినా కూడా కుట్ర పన్ని కూల్చివేతలు జరిపారు. స్థలం వేరొకరిదే అయితే రిజిస్ట్రేషన్లు ఎలా చేశారు?. ఇళ్లకు ఎలా అనుమతులు ఇచ్చారు?.. బ్యాంకు లోన్లు ఎలా వచ్చాయి?.. క్రయవిక్రయాలపై పేపర్లలలో కూడా ప్రకటనలు ఇచ్చారు. అలాంటప్పుడు ఆ సమయంలో ఎందుకు అభ్యంతరాలు చెప్పలేదు? అని ప్రశ్నించారాయన. ఈ క్రమంలో ఇళ్ల కూల్చివేతలపై సీబీఐ విచారణ జరిపించాలని.. బాధితులకు ఇళ్ల స్థలాలు ప్రభుత్వమే కేటాయించాలని.. వాళ్ల బ్యాంకు లోన్లు కూడా ప్రభుత్వమే కట్టాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ‘‘బాధితులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. అవసరమైన న్యాయ సహకారం కూడా అందిస్తాం. ఒకవేళ మీరు ఎంక్వైరీ వేయకపోతే.. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పని చేస్తుంది. దోషులుగా మిమ్మల్ని కోర్టు ముందు నిలబెడుతుంది’’ అని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ హెచ్చరించారు. -
విజయ్ దివస్: అమర జవాన్లకు వైఎస్ జగన్ నివాళులు
సాక్షి, తాడేపల్లి: విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. విజయ్దివస్ సందర్భంగా 1971 యుద్ధంలో దేశ విజయం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల వీరత్వానికి, త్యాగానికి గౌరవప్రధమైన నివాళి అర్పిస్తున్నాం. వారి సేవలు ఎప్పటికీ జ్ఞాపకంగా నిలుస్తాయి. రాబోయే తరాలకు వారు శాశ్వత ప్రేరణగా నిలుస్తారు అని ఎక్స్ఖాతాలో ట్వీట్ చేశారాయన.On #VijayDiwas, we remember and pay our respectful homage to the valour and sacrifice of the soldiers who laid down their lives securing victory for the Nation in the 1971 war. Their valiant service to our nation will forever be remembered and will continue to be a beacon of…— YS Jagan Mohan Reddy (@ysjagan) December 16, 2025 -
రాజేష్తో వైఎస్ జగన్ స్పెషల్ సెల్ఫీ
సాక్షి, కృష్ణా జిల్లా: జనాల్లో ఉన్న వైఎస్ జగన్ మోహన్రెడ్డికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రజల ప్రేమను గౌరవంగా తీసుకుని, వారితో దగ్గరగా కలిసిపోవడం ఆయన శైలి. ఆ అభిమానానికి ఆయన ప్రతిస్పందన ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. అలా.. ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్న జగన్ మరోసారి అలాంటి అభిమానాన్ని గౌరవించారు. విజయవాడ జోజి నగర్ బాధితులను స్వయంగా పరామర్శించేందుకు ఈ ఉదయం ఆయన బెంగళూరు నుంచి విజయవాడకు చేరుకున్నారు. ఆ సమయంలో గన్నవరం ఎయిర్పోర్టు వద్ద అభిమానుల కోలాహలం నెలకొంది. అయితే..ఓ అభిమాని ముందస్తుగా వైఎస్ జగన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి ఆయన దృష్టిని ఆకర్షించగలిగారు. దీంతో ఆ అభిమాని దగ్గరకు వెళ్లి వివరాలు ఆరా తీశారు. తనపేరు గోసాల రాజేష్ అని.. కైకలూరు ముదినేపల్లి నుంచి వచ్చానని.. ఆయనతో ఫొటో దిగడమే కోరి అని చెప్పాడా వ్యక్తి. దీంతో.. వైఎస్ జగన్ స్వయంగా సెల్ఫీ తీయడంతో రాజేష్ మురిసిపోయాడు. -
ఆంధ్రప్రదేశ్లో పోటెత్తిన కోటి సంతకాల ర్యాలీ. కోటి మంది చేసిన సంతకాల ప్రతులతో జిల్లా కేంద్రాలలో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీలు
-
అడ్డంకులను అధిగమించి.. అణచివేతను ధిక్కరించి
సాక్షి, అమరావతి : ర్యాలీల్లో పాల్గొనకుండా ఆంక్షలు.. చెక్పోస్టులతో అడ్డగింతలు.. పోలీసులకు ఆదేశాలు.. భగ్నం చేసేందుకు పన్నాగాలు..! ఇదీ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అన్ని వర్గాల ప్రజలు చేసిన కోటి సంతకాలతో సోమవారం వైఎస్సార్సీపీ నాయకత్వం, శ్రేణులు నిర్వహించిన ర్యాలీలను అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం చేసిన కుట్రలు. కానీ, ప్రజలు వీటిన్నిటినీ దాటుకుంటూ ర్యాలీల్లో అశేషంగా పాల్గొన్నారు. కిలోమీటర్ల కొద్దీ దండుకట్టి సర్కారు దుర్మార్గంపై దడపుట్టించారు. నిర్బంధాలను ఛేదిస్తూ, అడ్డంకులను దాటుకుంటూ విజయవంతం చేశారు.వైఎస్సార్సీపీ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభించడంతో పాటు ర్యాలీలకు యువత, ఉద్యోగులు, మేధావులు సహా అన్ని రంగాల నిపుణులు స్వచ్ఛందంగా ముందుకురావడంతో చంద్రబాబు ప్రభుత్వానికి కంటగింపైంది. దీంతో ఎలాగైనా భగ్నం చేయాలని కుట్రలు పన్నింది. శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్సీపీ ర్యాలీలను నిలువరించాలని జిల్లా ఎస్పీ... సీఐ, ఎస్ఐలకు గట్టిగా చెప్పారు. దీంతో పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేశారు. ⇒ ఇచ్ఛాపురంలో జడ్పీ చైర్ పర్సన్ పిరియా విజయ, పలాసలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, మండపామ్ టోల్ గేట్ వద్ద మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, సమన్వయకర్త పేరాడ తిలక్లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టోల్ గేట్ నుంచి నిరసన ర్యాలీ తీశారు. ⇒ వేలాదిమందితో ఆమదాలవలసలో సమన్వయకర్త చింతాడ రవికుమార్ నిర్వహించిన ర్యాలీని పోలీసులు మూడుచోట్ల అడ్డుకున్నారు. ⇒ శ్రీకాకుళం అరసవల్లి జంక్షన్లో నరసన్నపేట నాయకులతో వస్తున్న ధర్మాన కృష్ణ చైతన్యను పోలీసులు అడ్డుకున్నారు.⇒ విజయనగరం జిల్లా కేంద్రంలో ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు నిర్బంధం విధించినా ప్రజలు లెక్కచేయలేదు. ⇒ ఏలూరులో నాలుగు కిలోమీటర్ల మేర ర్యాలీ చేసేందుకు పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు. కానీ, పోలీసులు అనుమతివ్వలేదు. దీంతో దూరాన్ని కుదించారు. ⇒ కర్నూలులో పోలీసులు ఏకంగా నోటీసులు జారీచేసి అడ్డుకోవాలని చూశారు. కానీ, వీటిని లెక్కచేయకుండా ర్యాలీల్లో ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ముక్కోటి గొంతుకలతో వ్యతిరేకించారు. ర్యాలీలతో కదంతొక్కారు. -
అమరజీవి విగ్రహం ఏర్పాటు చేసే స్థోమత ప్రభుత్వానికి లేదా?
సాక్షి, అమరావతి: తెలుగు ప్రజలంతా ఐక్యంగా ఉండాలనే ఆశయంతో ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేసే స్థోమత చంద్రబాబు ప్రభుత్వానికి లేదా అని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ నిలదీశారు. అమరావతి కోసం లక్ష కోట్లు ఖర్చు చేస్తామని చెప్పే చంద్రబాబు, ఏడాదిన్నరలో రూ. 2.66 లక్షల కోట్లు అప్పులు తెచ్చారని.. కానీ పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటుకు మాత్రం ఆర్యవైశ్యుల నుంచి చందాలు వసూలు చేసుకోమని చెప్పడం సిగ్గుచేటని, అమరజీవిని అవమానించడమేనని మండిపడ్డారు.అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు డీపీఆర్ కోసమే రూ.11 కోట్లు ఖర్చు చేసిన చంద్రబాబు ప్రభుత్వానికి పొట్టి శ్రీరాములు విగ్రహం భారమైపోయిందా అని నిలదీశారు. రామోజీ సంస్మరణ సభల కోసం రూ. కోట్లు ఖర్చు చేయడంలో లేని ఇబ్బంది పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటుకు వచ్చిందా అని మండిపడ్డారు.ఈ అనైతిక విధానాలను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖండించారని తెలిపారు. 2019లో వైఎస్ జగన్ సీఎం అయ్యాక రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1న నిర్వహించేలా జీవో ఇచ్చి ఐదేళ్లపాటు కొనసాగిస్తే, కూటమి ప్రభుత్వం ఆపేయడం దారుణమన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ.. తెలుగు ప్రజలంతా కలిసుండాలన్న పొట్టి శ్రీరాములు ఆశయాలను వైఎస్సార్సీపీ హయాంలో మాజీ సీఎం వైఎస్ జగన్ అమలు చేసి చూపించారని తెలిపారు.ఈనాడు పొట్టి శ్రీరాములుని చంద్రబాబు అవమానిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ రుహుల్లా, పార్టీ నాయకులు నారాయణ మూర్తి, పుత్తా శివశంకర్రెడ్డి, కొండా రాజీవ్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. -
బ్యాలెట్ పేపర్లతోనే ప్రజాస్వామ్యం పదిలం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యానికి పునాది అయిన ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. టెక్నాలజీ పేరుతో వస్తున్న ఈవీఎంల కంటే నమ్మకమైన బ్యాలెట్ పేపర్ విధానాన్నే తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాజ్యసభలో సోమవారం ఎన్నికల సంస్కరణలపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.2024లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన అవకతవకలను ఎండగడుతూ, ఎన్నికల సంఘం (ఈసీ) పనితీరుపై ప్రశ్నలవర్షం కురిపించారు. ఎన్నికల సంఘం 2024 మే 25న విడుదల చేసిన ప్రెస్నోట్లో పోలైన ఓట్ల సంఖ్యకు, కౌంటింగ్ తర్వాత ఫాం–20లో చూపించిన ఓట్లకు మధ్య భారీ వ్యత్యాసం ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 25 పార్లమెంటు నియోజకవర్గాల్లోను ఈ తేడాలు స్పష్టంగా కనిపించాయన్నారు. ఈ తప్పులకు బాధ్యులెవరని ప్రశ్నించారు. బాధ్యులపై ఈసీ ఏం చర్యలు తీసుకుందని నిలదీశారు. అసెంబ్లీకి, లోక్సభకు ఓట్లలో తేడా ఎలా? ‘ఒకేసారి జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో.. ఒకే ఓటరు జాబితా, ఒకే పోలింగ్ బూత్ ఉన్నప్పుడు ఫాం–17ఏ (ఓటరు రిజిస్టర్), ఫాం–17సీ (ఓట్ల లెక్క) మధ్య తేడాలు ఎలా వస్తాయి? రాజమహేంద్రవరం, రాయచోటి, యలమంచిలి, కడప, పులివెందుల వంటి అనేక నియోజకవర్గాల్లో ఈ వ్యత్యాసాలు వెలుగుచూశాయి. ఇది కచ్చితంగా ఓట్ల డేటాలో మాయాజాలం లేదా అవకతవకలే. ఎంత ఆధునికమైనా ఈవీఎంలను పూర్తిగా నమ్మలేం. అదే బ్యాలెట్ పేపర్ అయితే పాత పద్ధతే అయినా ప్రజలకు ఒక నమ్మకం ఉంటుంది. ఆడిట్ చేయడానికి వీలులేని ఏ వ్యవస్థా విశ్వసనీయం కాదు.అందుకే రాబోయే అన్ని ఎన్నికల్లోను ఈవీఎంలను రద్దుచేసి, బ్యాలెట్ పేపర్లను తీసుకురావాలి’ అని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల పారదర్శకత కోసం వైఎస్సార్సీపీ తరఫున ఆయన కేంద్రానికి, ఈసీకి పలు సూచనలు చేశారు. ‘పోలింగ్ రోజు సీసీటీవీ ఫుటేజీ, ఫాం–17ఏ, 17సీ వివరాలను పబ్లిక్ డొమైన్లో ఉంచాలి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈవీఎంల వెరిఫికేషన్ను కచ్చితంగా అమలు చేయాలి. వందశాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ లైవ్ స్ట్రీమింగ్ ఉండాలి..’ అని సూచించారు. 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 40 శాతం ఓటింగ్ షేర్ వచ్చిందని చెప్పారు. కానీ జరిగిన అవకతవకలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఈసీ పట్టించుకోలేదని అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
కోటి సంతకాల ఉద్యమం చరిత్రాత్మకం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ప్రారంభించిన కోటి సంతకాల ఉద్యమం అత్యంత విజయమైందని.. చారిత్రాత్మకంగా నిలిచిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన భారీ ర్యాలీలు, అందులో ప్రజల సంతకాల ప్రదర్శన ఇవన్నీ చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనను, విధానాలను ప్రజలు ఎంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారో స్పష్టంగా చాటుతున్నాయన్నారు.ఈ ఉద్యమానికి అండగా నిలిచిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, స్వచ్ఛందంగా సంతకాలు చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ‘సేవ్ మెడికల్ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్’ అనే హ్యాష్ట్యాగ్తో తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ పోస్ట్ చేశారు. అందులో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. పౌరులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు.. ‘‘ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ప్రారంభించిన కోటి సంతకాల ఉద్యమం కేవలం ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం మాత్రమే కాదు. చంద్రబాబునాయుడి ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలు ఇచ్చిన ఘనమైన తీర్పు. ప్రజాప్రయోజనాలను పణంగా పెడుతూ, వారికి ద్రోహం చేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయాలను ఖండిస్తూ, కోటిమందికి పైగా పౌరులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేశారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొని సంతకాలు చేశారు.ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ద్వారా అందుబాటులో ఉన్న వైద్య విద్యను, ప్రజారోగ్య వ్యవస్థను నాశనం చేస్తారనే ప్రజల ఆందోళనే ఈ ఉద్యమానికి ప్రధాన ప్రేరణగా నిలిచింది. సేకరించిన కోటి సంతకాల పత్రాలు ప్రస్తుతం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి చేరుతున్నాయి. అక్కడినుంచి డిసెంబర్ 18న గౌరవ గవర్నర్కు సమర్పిస్తాం. తద్వారా ప్రజల గొంతు రాష్ట్రంలోని అత్యున్నత రాజ్యాంగ అధికారికి చేరి, అనంతరం అది న్యాయస్థానాల తలుపులు తడుతుంది.అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ ఉద్యమానికి అండగా నిలిచిన ప్రతి వైఎస్సార్సీపీ నాయకుడు, కార్యకర్తలు, స్వచ్ఛందంగా సంతకాలు చేసిన ప్రతి పౌరుడికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఉద్యమంలో మీ భాగస్వామ్యం ద్వారా ప్రజల ఆస్తులను ప్రైవేట్కు అప్పగించాలన్న కూటమి ప్రభుత్వ కుట్ర బట్టబయలైంది. ఈ ఉద్యమం ద్వారా చంద్రబాబు పాలనపై ప్రజలు తమ ఆగ్రహాన్ని తెలియజేశారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలలను అమ్మేయాలన్న ఆయన యత్నాన్ని, నిర్ణయాలను, ఆయన పాలనను కోటి మంది ప్రజలు తిరస్కరించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై తీసుకున్న ఈ ప్రజావ్యతిరేక నిర్ణయాన్ని చంద్రబాబు తక్షణమే వెనక్కి తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నా. ప్రజారోగ్య వ్యవస్థను, అందుబాటులో ఉన్న వైద్య విద్యను దోచుకునే ఈ పట్టపగలు దోపిడీకి వెంటనే తెరపడాలి’’. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మహోద్యమం.. పోటెత్తిన కోట్ల గళాలు
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమం మహోద్యమంగా మారి ఉవ్వెత్తున ఎగసిపడింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో చేపట్టిన రచ్చబండ కోటి సంత కాల సేకరణ కార్యక్ర మానికి భారీ స్పందన లభించింది. మారు మూల గిరిజన గూడేల నుంచి జిల్లా కేంద్రాల దాకా సర్వత్రా కోటి సంతకాల సేకరణకు ప్రజా మద్దతు లభించింది. అన్ని వర్గాల ప్రజలు ఇందులో పాల్గొని తమ అభీష్టాన్ని సంతకాల రూపంలో చంద్రబాబు సర్కారుకు చాటి చెప్పారు. జిల్లా కేంద్రాల నుంచి భారీ ర్యాలీల నడుమ వాహనాల్లో సోమవారం తాడేపల్లి లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి సంతకాల ప్రతులను తరలించారు. సాక్షి, అమరావతి, సాక్షి ప్రతినిధి, విజయవాడ, నెట్వర్క్: వైఎస్ జగన్ కృషితో సాకారమైన ప్రభుత్వ వైద్య కళాశాలలను పప్పుబెల్లాల మాదిరిగా చంద్రబాబు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడంపై కోట్ల గొంతులు కన్నెర్ర చేశాయి. పేదలకు చేరువలో ఉచితంగా సూపర్ స్పెషాల్టీ వైద్యం, మన విద్యార్థుల ఎంబీబీఎస్ కలలను చిదిమేశారని ర్యాలీల్లో కదం తొక్కాయి. ప్రభుత్వ భూమి.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు..ప్రభుత్వ ఆస్పత్రులు.. ప్రయోజనం పొందేది మాత్రం ప్రైవేట్ వ్యక్తులా..? అంటూ చంద్రబాబు సర్కారు దుర్మార్గ విధానాలను ఊరూరా ప్రజలు నిలదీశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమం కోటి సంతకాల సేకరణలో శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. విద్యాసంస్థల వద్ద నిర్వహించిన కార్యక్రమంలో సంతకాలు చేసేందుకు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. మారుమూల ప్రాంతాల నుంచి ప్రతి గ్రామంలోనూ విద్యార్థులు, యువత, మహిళలు, మేధావులు, విద్యావేత్తలు, సామాజిక ఉద్యమకారులు ఇందులో పాలు పంచుకుని చంద్రబాబు సర్కారు ప్రజా కంటక విధానాలను తీవ్రంగా నిరసించారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని, లేదంటే ఈ సర్కారుకు బుద్ధి చెప్పేందుకు ఎలాంటి ఉద్యమాలకైనా వెనుకాడబోమని హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వం బరితెగించి వైద్య కళాశాలలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడటమే కాకుండా బోధనాస్పత్రులను సైతం ధారాదత్తం చేయడం దుర్మార్గమని కోట్ల గళాలు మండిపడ్డాయి. ఆయా ఆస్పత్రుల్లో పని చేసే వైద్యులు, సిబ్బంది వేతనాలను సైతం ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లిస్తామని చంద్రబాబు సర్కారు ప్రకటించడం దోపిడీకి పరాకాష్ట అంటూ సర్వత్రా ఆగ్రహం పెల్లుబికింది. రూ.వందల కోట్ల ప్రజాధనాన్ని ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టే నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఊరూరా నినదించారు. రాష్ట్రవ్యాప్తంగా రెండు నెలలకు పైగా సాగిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చంద్రబాబు సర్కారు కక్షపూరిత విధానాలపై పెల్లుబుకుతున్న ప్రజాగ్రహాన్ని చాటి చెబుతోందని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ కృషితో సాకారమైన ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేట్కు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికి పైగా ప్రజల సంతకాలను సేకరించిన విషయం తెలిసిందే. ఇంటింటా, ఊరూరా వైఎస్సార్సీపీ నాయకులు పర్యటించి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ సంతకాల ద్వారా ప్రజల మద్దతు సేకరించారు. ఈ సంతకాల ప్రతులతో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించి వాటిని వాహనాల్లో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. ఎన్టీఆర్, గుంటూరు, ఏలూరు, బాపట్ల తదితర జిల్లాలకు చెందిన కోటి సంతకాల వాహనాలకు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి స్వాగతం పలికారు. పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరిన కోటి ప్రతులను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ నెల 18వతేదీన గవర్నర్ను కలిసి నివేదించి ప్రజా స్పందనను వివరించనున్నారు. కోటి సంతకాల ప్రతుల వాహనాలతో ఎక్కడికక్కడ జరిగిన ర్యాలీల్లో విద్యార్థులు, యువత, మహిళలు, మేధావులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా పాల్గొని చంద్రబాబు సర్కారు నిరంకుశ విధానాలపై కన్నెర్ర చేశారు. పోలీసు ఆంక్షలు, చెక్పోస్టులు, నిర్బంధాలను లెక్కచేయకుండా ర్యాలీలకు పోటెత్తారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే.. మాజీ సీఎం వైఎస్ జగన్ రూ.8,480 కోట్లతో ఒకేసారి ప్రభుత్వ ఆధ్వర్యంలో 17 మెడికల్ కళాశాలకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలోనే ఏడు కాలేజీలు సిద్ధం కాగా, ఐదు కళాశాలల్లో తరగతులు కూడా మొదలయ్యాయని.. పులివెందుల కాలేజీకి ఎంఎన్సీ సీట్లను కేటాయించినా చంద్రబాబు ప్రభుత్వం తమకు వద్దంటూ అడ్డుకోవడం దారుణమని మండిపడ్డారు. సర్వం సిద్ధంగా ఉన్న కాలేజీలను ఈ ప్రభుత్వం ప్రైవేట్కు అప్పనంగా కట్టబెడుతోందని.. అది చాలదన్నట్లుగా నర్సింగ్ కాలేజీలను కూడా నడుపుకోవచ్చని పచ్చజెండా ఊపడంపై సర్వత్రా జనాగ్రహం వ్యక్తమైంది. మెడి‘కిల్’బాబుపై కోటిగళాల గర్జనప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మెడలు వంచైనా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం. గడిచిన 19 నెలల్లో రూ.2.68 లక్షల కోట్లు అప్పుచేసిన చంద్రబాబు, రూ.5వేల కోట్లతో మెడికల్ కాలేజీలు ఎందుకు నిరి్మంచడం లేదు? సంపద సృష్టి ఏమైంది? రైతులకు గిట్టుబాటు ధర ఎందుకు కల్పించడం లేదు? మాజీ సీఎం వైఎస్ జగన్ మాటగా చెబుతున్నా.. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. – బొత్స సత్యనారాయణ, శాసనమండలి విపక్షనేతదోచుకోవడం.. దాచుకోవడమే బాబు నైజం చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు పప్పుబెల్లాల్లా పంచిపెట్టి తద్వారా రూ. వేల కోట్లు దోచుకోవడం, దాచుకోవడమే పనిగా పెట్టుకుంటారు. పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధిని చంద్రబాబు ఏనాడూ ఆకాంక్షించరు. అందుకే మా నాయకుడు వైఎస్ జగన్ పేదల కోసం నిర్మించిన 17 మెడికల్ కళాశాలలను చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు పరం చేసి రూ. వేల కోట్లు దండుకోవాలని చూస్తున్నాడు. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ -
‘ఇది బాబు ప్రజా వ్యతిరేక విధానాలపై ఇచ్చిన ఘనమైన తీర్పు’
తాడేపల్లి : మెడికల్ కాలేజీలప్రైవేటీకరణ అంశానికి సంబంధించి కోటి సంతకాల సేకరణ అనంతరం వాటిని జిల్లా కేంద్రాల నుండి తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి తరలింపులో భాగంగా ఈరోజు(డిసెంబర్చే 15వ తేదీ) చేపట్టిన ర్యాలీలు విజయవంతం కావడంపై పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇది కేవలం ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం మాత్రమే కాదని, చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రజలు ఇచ్చిన ఘనమైన తీర్పు అని అన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు వైఎస్ జగన్ఇది అత్యంత విజయవంతమైన ఉద్యమంప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన ఒక కోటి సంతకాల ఉద్యమం అత్యంత విజయవంతమైనదిగా వైఎస్ జగన్ అభివర్ణించారు. ‘ఇది చరిత్రాత్మకంగా నిలిచిపోతుంది. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన భారీ ర్యాలీలు, అందులో ప్రజల సంతకాల ప్రదర్శన ఇవన్నీ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనను, విధానాలను ప్రజలు ఎంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారో స్పష్టంగా చాటుతున్నాయి. ఇది కేవలం ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం మాత్రమే కాదు. చంద్రబాబు నాయుడు ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలు ఇచ్చిన ఘనమైన తీర్పు. ప్రజాప్రయోజనాలను ఫణంగా పెడుతూ, వారికి ద్రోహం చేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయాలను ఖండిస్తూ, ఒక కోటికి పైగా పౌరులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేశారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొని సంతకాలు చేశారు. ప్రజల ఆందోళనే ఈ ఉద్యమానికి ప్రధాన ప్రేరణప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ద్వారా అందుబాటులో ఉన్న వైద్య విద్యను, ప్రజారోగ్య వ్యవస్థను నాశనం చేస్తారనే ప్రజల ఆందోళనే ఈ ఉద్యమానికి ప్రధాన ప్రేరణగా నిలిచింది. సేకరించిన ఒక కోటి సంతకాల పత్రాలు ప్రస్తుతం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి చేరుతున్నాయి. అక్కడి నుంచి డిసెంబర్ 18న గౌరవ గవర్నర్గారికి అధికారికంగా సమర్పిస్తాం. తద్వారా ప్రజల గొంతు రాష్ట్రంలోని అత్యున్నత రాజ్యాంగాధికారికి చేరి, అనంతరం అది న్యాయస్థానాల తలుపులు తడుతుంది. ఈ ఉద్యమానికి అండగా నిలిచిన ప్రతి వైఎస్సార్సీపీ నాయకుడు, పార్టీ కార్యకర్తలు, అలాగే స్వచ్ఛందంగా సంతకాలు చేసిన ప్రతి పౌరుడికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఉద్యమంలో మీ భాగస్వామ్యం ద్వారా ప్రజా ఆస్తులను ప్రైవేట్కు అప్పగించాలన్న కూటమి ప్రభుత్వ కుట్ర బట్టబయలైంది. ఈ ఉద్యమం ద్వారా చంద్రబాబు నాయుడు పాలనపై ప్రజలు తమ ఆగ్రహాన్ని తెలియజేశారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలలను అమ్మేయాలన్న ఆయన ప్రయత్నాన్ని, ఆయన నిర్ణయాలను, ఆయన పాలనను ఒక కోటి మంది ప్రజలు తిరస్కరించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై తీసుకున్న ఈ ప్రజావ్యతిరేక నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు తక్షణమే వెనక్కి తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాను.. ప్రజారోగ్య వ్యవస్థను, అందుబాటులో ఉన్న వైద్య విద్యను దోచుకునే ఈ పట్టపగలు దోపిడీకి వెంటనే తెరపడాలి’ అని అన్నారు.The one-crore signatures campaign launched by the YSR Congress Party against the privatisation of medical colleges has become a historic and resounding success. The massive rallies with the display of the signatures held in all 26 district headquarters stand as clear proof of how… pic.twitter.com/umPRjU20xa— YS Jagan Mohan Reddy (@ysjagan) December 15, 2025 ఇవీ చదవండి:కోటి సంతకాలు.. కోట్ల గళాలువిజయవాడకు వైఎస్ జగన్ఇదీ కదా ప్రజా ఉద్యమం అంటే.. -
YSRCP Leaders: ఈ జన సునామీని చూశావ్..! దమ్ముంటే ప్రైవేటీకరణ చేసి చూడు
-
ఢిల్లీలో వైఎస్సార్సీపీ ఎంపీల నిరసన
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయొద్దంటూ వైఎస్సార్సీపీ ఎంపీలు ఢిల్లీ వేదికగా నిరసన బాట పట్టారు. ఈరోజు(సోమవారం, డిసెంబర్ 15వ తేదీ) పార్లమంట్ సమావేశాల్లో పాల్గొన్న వైఎస్సార్సీపీ ఎంపీలు.. అనంతరం ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి మకరద్వారం వద్ద ఫ్లకార్డులతో నిరసనకు దిగారు. ఎంపీలు సుబ్బారెడ్డి ,మిథున్ రెడ్డి, గురుమూర్తి, అవినాష్ రెడ్డి, తనుజ రాణి, అయోధ్య రామిరెడ్డిలు ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ‘ ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలి. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసాం. రాష్ట్రంలో కోట్లాది సంతకాలు సేకరించారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో గవర్నర్ను కలిసి కోటి సంతకాలు చేస్తాం. ప్రైవేటీకరణ వెనక్కి తీసుకేనేంతవరకూ పోరాటం కొనసాగిస్తాం’ అని హెచ్చరించారు. ప్రమాదకరస్థాయిలో ఏపీ అప్పులు..ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులు ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతున్నాయని ఎంపీ మిథున్రెడ్డి పేర్కొన్నారు. 18 నెలల్లోనే రూ 2.66 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు. అధిక వడ్డీకి అప్పులు తెచ్చి కుంభకోణానికి పాల్పడుతున్నారు. 9 శాతానికి వడ్డీ తెచ్చి ప్రజలపై భారం వేస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని తాకట్టుపెట్టి అప్పులు తీసుకొస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ నిధి నుంచి డబ్బులు డ్రా చేసే అవకాఃశం ప్రైవేటు వ్యక్తులకు కల్పించడం దారుణమన్నారు. ప్రభుత్వం చేతుల్లోనే వైద్య రంగం ఉండాలని, ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలన్నారు. రూ. 2.66 లక్షల కోట్లు అప్పులు చేసిన ఏపీ ప్రభుత్వం.. వైద్య కళాశాలను కాపాడలేదా? అని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్టాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.ఇవీ చదవండి:కోటి సంతకాలు.. కోట్ల గళాలువిజయవాడకు వైఎస్ జగన్ఇది కదా ప్రజా ఉద్యమం అంటే.. -
‘ప్రజావైద్యం కోసం మా నాయకుడు విశేషంగా పని చేశారు’
తాడేపల్లి :గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రజావైద్యం కోసం విశేషంగా పనిచేసిన నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని మాజీ మంత్రి, పార్టీ నేత అంబటి రాంబాబు స్పష్టం చేశారు. అన్నీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీ లేకుండా భర్తీ చేసిన ఘనత వైఎస్ జగన్దేనన్నారు. మరి నేటి కూటమి ప్రభుత్వం అదే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అమ్మకానికి పెట్టిందని విమర్శించారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జనం ఆగ్రహంతో ఉన్నారనే దానికి ఈరోజు(సోమవారం, డిసంబర్ 15) రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ర్యాలీలే ఉదాహరణ అని మాజీ మంత్రి, అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఇది ప్రభుత్వానికి ఒక హెచ్చరికలాంటిదన్నారు. ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ ప్రజాఉద్యమం చేస్తుందని, గత 18 నెలల కాలంగా వైఎస్సార్సీపీ అనేక ప్రజా ఉద్యమాలు చేస్తుందన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన అంబటి రాంబాబు.. ‘ కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు, రైతాంగ సమస్యలపై నిరంతర పోరాటం చేస్తున్నాం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కమీషన్ల కోసమే పీపీపీ మోడల్లోకి తీసకెళ్లారు. ఇది దుర్మార్గమైన మోడల్.కాలేజీలను అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు..రాష్ట్రంలో కోటి సంతకాలకు మంచి స్పందన లభించింది. నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు.. అక్కడ నుంచి కేంద్ర కార్యాలయం వరకు ప్రజల సంతకాలు వచ్చాయి.. ప్రతీ జిల్లాలో వైఎస్సార్సీపీ నిరసనలకు ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు ఇచ్చారు. జగన్ ప్రజావైద్యం కోసం విశేషంగా పని చేశారు. అన్నీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీ లేకుండా భర్తీ చేశారు. ఇవాళ జీరో వెకెన్సీ సిస్టమ్ లేదు.. మందులు లేవు. జగన్ తెచ్చిన 17 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఈనెల 18న గవర్నర్ ను జగన్ కలుస్తారు. ప్రజాభిప్రాయాన్ని గవర్నర్ కి తెలియజేస్తాం. ప్రైవేట్ వాళ్లకు కాలేజీలను అప్పగించి, సిబ్బందికి మాత్రం ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుందట. దీని వెనుక పెద్ద స్కాం ఉంది. పేదవారి వైద్యాన్ని తాకట్టు పెట్టీ కిక్ బ్యాగ్స్ తీసుకోవాలని చూస్తున్నారు. మా పోరాటం ఆగదు’ అని హెచ్చరించారు. -
Vizag: డాన్సులు, స్టెప్పులతో పోటెత్తిన జనం
-
Rajahmundry: 5000 బైకులతో YSRCP భారీ ర్యాలీ
-
బ్రోకర్లకి,నీ చెంచాల చేతిలో మెడికల్ కాలేజీలు పెడతా అంటే... పేర్ని నాని మాస్ వార్నింగ్
-
150 కార్లతో కోటి సంతకాల ర్యాలీ దద్దరిల్లిన చిత్తూరు
-
Rajya Sabha: ఈవీఎంలను నమ్మలేం: వైవీ సుబ్బారెడ్డి
ఢిల్లీ: రాజ్యసభలో ఎన్నికల సంస్కరణలపై చర్చ జరిగింది. వైఎస్సార్సీపీ తరఫున ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చర్చలో పాల్గొన్నారు. ఏపీ ఎన్నికల అక్రమాలపై ఎన్నికల సంఘం విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అక్రమాలకు బాధ్యులెవరో తేల్చాలన్నారు. ఏపీలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలలో ఓట్లలో అనేక తేడాలు వచ్చాయన్న వైవీ సుబ్బారెడ్డి.. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత ఉండాలన్నారు.సీసీటీవీ ఫుటేజ్ అందుబాటులో ఉంచాలి. ఈవీఎంలను నమ్మలేము. పేపర్ బ్యాలెట్ సిస్టంపైనే అందరికీ నమ్మకం ఉంది. స్వతంత్ర సంస్థ ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణపై స్వేచ్ఛగా, పారదర్శకంగా ఉండాలి’’ అని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. -
‘పేదలకు అండ జగన్.. కార్పొరేట్లకు అండ చంద్రబాబు’
సాక్షి, అమరావతి: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమ ర్యాలీలకు భారీ స్పందన లభించింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ అనంతపురంలో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయం నుంచి బుక్కరాయసముద్రం వైఎస్సార్ విగ్రహం దాకా ఈ ర్యాలీ జరిగింది. కోటి సంతకాల సేకరణ ప్రతులతో జరిగిన ఈ బైక్ ర్యాలీలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, అనంతపురం పార్లమెంటు పరిశీలకులు నరేష్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తదితరులు పాల్గొన్నారు. బైక్ ర్యాలీకి జనం పోటెత్తారు.ప్రకాశం జిల్లా: రాష్ట్రంలోని వెనకబడి ప్రాంతమైన పశ్చిమ ప్రకాశానికి కూటమి ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేసిందని మాజీ ఎమ్మెల్యే వైఎస్సార్సీపీ మార్కాపురం ఇన్చార్జి అన్న రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ మెడికల్ కాలేజీ మంజూరు చేసి, నిర్మాణం చేపడితే కడుపుమంటతో చంద్రబాబు ప్రైవేటీకరణ చేశారన్నారు. మార్కాపురం గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగిరి ప్రాంతాల నుంచి వైద్యం కోసం ప్రజలు నేటికీ సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని, మెడికల్ కాలేజీ, జనరల్ ఆసుపత్రి ప్రభుత్వ నిర్వహణల ఉంటే పేదలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్కాపురం నియోజకవర్గంలో 85 వేల మంది సంతకాలు చేశారని అన్నా రాంబాబు తెలిపారు.నంద్యాల జిల్లా: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమం కోటి సంతకాల కార్యక్రమానికి భారీ స్పందన లభించింది. వైఎస్సార్సీపీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ ర్యాలీలో నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి , కాటసాని రామిరెడ్డి , ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి ,ఇషాక్ భాషా , డాక్టర్ దారా సుధీర్ పాల్గొన్నారుఅన్నమయ్య జిల్లా: జిల్లాలో కోటి సంతకాల సేకరణ సూపర్ సక్సెస్ అయ్యింది. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయచోటిలో నినాదాలు హోరెత్తాయి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలంటూ ప్రజానీకం కదం తొక్కింది. ‘‘పేదలకు అండ వైఎస్ జగన్. కార్పోరేట్లకు అండ చంద్రబాబు. సీఎం డౌన్.. డౌన్’’ అంటూ నినాదాలు చేశారు. చిత్తూరు - కర్నూలు జాతీయ రహదారిలో శివాలయం నుంచి నేతాజీ సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్రెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు రామచంద్రారెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
‘ఇది కదా ప్రజా ఉద్యమం అంటే..!’
చంద్రబాబు సర్కార్ తీసుకున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం.. ప్రజా పోరాటంగా మారిన తీరు యావత్ దేశాన్నే ఆశ్చర్యపరుస్తోంది. వైఎస్సార్సీపీ ఈ ఉద్యమాన్ని “ప్రజా గళం”గా అభివర్ణించడంలో ఎలాంటి అతిశయోక్తి లేదనే చెప్పొచ్చు. అందుకు కారణం.. విద్యార్థులు, యువత, మేధావులు, వైద్య వర్గాలు పెద్ద ఎత్తున పాల్గొనడమే!.. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టాలని వైఎస్ జగన్ మోహన్రెడ్డి సంకల్పించారు. అదే సమయంలో వైద్య విద్య అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నమూ చేశారు. తాను అధికారంలో ఉండగానే మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించారు కూడా. అయితే.. చంద్రబాబు ప్రభుత్వం ఆ క్రెడిట్ను నాశనం చేయాలని బలంగా నిర్ణయించింది. స్వతహాగానే పెత్తందారుల సీఎం అయిన చంద్రబాబు.. పీపీపీ పేరిట లక్షల కోట్ల విలువైన ఆ ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్పరం చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఉద్దేశపూర్వకంగానే నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలను నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. దీంతో ప్రజల నుంచి వ్యతిరేకత మొదలైంది. ఆ వ్యతిరేకతను చూపించైనా ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అడ్డుకోవాలని వైఎస్ జగన్ భావించారు. ఒక పోరాటం చేయాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. ఇందులో భాగంగానే.. కోటి సంతకాల సేకరణ ఉద్యమం “రచ్చబండ” కార్యక్రమం నుంచి మొదలై.. నియోజకవర్గాలు నుంచి ఇవాళ జిల్లా కేంద్రాలు దాటింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కోటికి పైనే సంతకాలు సేకరించి.. వాటిని ప్రత్యేక బాక్సుల్లో భద్రపరిచి తాడేపల్లిలోని ప్రధాన కార్యాలయానికి తరలించింది. వీటిని రాష్ట్ర ప్రథమ పౌరుడు గవర్నర్కు నివేదించి.. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అడ్డుకోవాలన్నదే వైఎస్ జగన్ అభిమతం. రచ్చబండతో షురూ ..అక్టోబర్లో వైఎస్సార్సీపీ “రచ్చబండ” పేరుతో ప్రజల మధ్యకు వెళ్లి సంతకాల సేకరణ ప్రారంభించింది. చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. విద్యార్థులు, యువత, మేధావులు, వైద్య వర్గాలు పెద్ద ఎత్తున పాల్గొని సంతకాలు చేశారు.తుపాను ఆపలేకపోయింది!లక్ష్యం కోటి సంతకాలు. ఆ సమయంలోనే తుపాను, వర్షాలు వచ్చాయి. దీంతో ఈ కార్యక్రమం ప్లాప్ అవుతుందని కూటమి సర్కార్ సంతోషించింది. కానీ, ప్రభుత్వ వ్యతిరేక ప్రజాభిప్రాయం సేకరణ ఏ దశలోనూ ఆగిపోలేదు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనం సంతకాలు చేస్తూనే వచ్చారు. ఆపై ఈ ప్రజా ఉద్యమం నవంబర్కొచ్చేసరికి నియోజకవర్గాల స్థాయికి చేరింది. ప్రతి నియోజకవర్గంలోనూ సంతకాల సేకరణ ఉధృతంగా సాగింది. అటుపై సంతకాల బాక్సులు సేకరించి.. నియోజకవర్గాల నుంచి ర్యాలీగా జిల్లా కేంద్రాలకు తరలించారు. ఆ ర్యాలీలకు అనూహ స్పందన లభించింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టడాన్ని నిరసించాలి అంటూ ఆ ర్యాలీల్లో నినాదాలు చేశారు. డిసెంబర్ మొదటి వారం కల్లా అన్ని నియోజకవర్గాల నుంచి ఆ బాక్సులను భద్రంగా జిల్లా కేంద్రాల్లోని పార్టీ ఆఫీసులకు తరలించారు. అక్కడి నుంచి ఇవాళ ర్యాలీగా తాడేపల్లికి తరలించారు. వైఎస్సార్సీపీ చేపట్టిన ఈ ఉద్యమం.. తమ ఆరోగ్యం, విద్యా హక్కుల పరిరక్షణ కోసమని జనం అర్థం చేసుకున్నారు. అందుకే ఇవాళ్టి(సోమవారం) ర్యాలీలో పార్టీ శ్రేణులకు పోటీగా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ భాగస్వామ్యం వల్లే ఇది ఒక విశాలమైన ఇప్పుడు ప్రజా ఉద్యమంగా నిలిచి దేశం దృష్టిని ఆకర్షించగలిగింది. -
YSRCP Leaders: ప్రతి కుటుంబం చంద్రబాబు నిర్ణయాన్ని ఛీ కొడుతుంది
-
సుప్రీం కోర్టులో కూటమి సర్కార్కు మరో ఎదురు దెబ్బ
సాక్షి, ఢిల్లీ: సుప్రీం కోర్టులో కూటమి ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్త తారక్ ప్రతాప్ రెడ్డికి సోమవారం బెయిల్ మంజూరు చేసింది. తక్షణమే విడుదల చేయాలంటూ జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ అగస్టీన్ జార్జిలతో కూడిన ధర్మాసనం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే అణచివేత ధోరణిని కూటమి ప్రదర్శించడం చూస్తున్నదే. ఈ క్రమంలోనే యూరియా కొరతపై తారక్ ప్రతాప్ రెడ్డి ఓ పోస్ట్ చేశారు. ఈ పరిణామంలో రగిలిపోయిన ప్రభుత్వం పోలీసులను రంగంలోకి దించింది. తారక్ను అక్రమ అరెస్ట్ చేయించింది. తారక్ తరఫున సుప్రీం కోర్టులో సిద్ధార్థ దవే వాదనలు వినిపించారు. ‘‘యూనిఫాంలో కాకుండా మఫ్టీలో వైఎస్ఆర్సిపీ సోషల్ మీడియా కార్యకర్తలను కిడ్నాప్ చేస్తున్నారని.. ప్రభుత్వ దమనకాండపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు అక్రమ అరెస్టులు చేస్తున్నారని’’ వాదించారు. సోషల్ మీడియాను అణగదొక్కేందుకు ఏపీ ప్రభుత్వం ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తుందో కోర్టుకు వివరించారు. ఈ వాదనలతో ఏకీభవించిన ద్విసభ్య ధర్మాసనం.. తారక్కు బెయిల్ మంజూరు చేస్తూ తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. -
కూటమి సర్కార్ విధానాలపై ప్రజాగ్రహం: వేణు
సాక్షి, తూర్పుగోదావరి: ప్రభుత్వం మెడికల్ కళాశాలు ప్రైవేటీకరణ చేయాలనే కూటమి ప్రభుత్వ ఆలోచనలను ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. రాజమండ్రి రూరల్ కోటి సంతకాల ప్రతుల తరలింపు ర్యాలీలో పార్టీ కోఆర్డినేటర్లు జక్కంపూడి రాజా, మార్గాన్ని భరత్, డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి, తలారి వెంకట్రావు, శ్రీనివాస్ నాయుడు, డాక్టర్ గూడూరు శ్రీనివాస్, షర్మిలరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా నాలుగున్నర లక్షల సంతకాల సేకరణ జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వ విధానాలను ప్రజల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పేదవాడికి వైద్యం అందాలంటే వైద్య కళాశాలలు ప్రభుత్వ అధీనంలోనే ఉండాలి. లక్షల కోట్లు అప్పులు చేస్తున్న చంద్రబాబు వైద్య కళాశాలలకు 5000 కోట్లు మంజూరు చేయలేకపోతున్నారు. ఇది ప్రారంభం మాత్రమే... ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్రస్థాయిలో ఉద్యమిస్తాం’’ అని వేణుగోపాలకృష్ణ హెచ్చరించారు. -
‘అయ్యా చంద్రబాబూ.. మీరు చేస్తోంది పెద్ద తప్పయ్యా’
సాక్షి, కృష్ణా: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ తప్పయ్యా.. అంటూ కోటి మందికి పైగా ఏపీ ప్రజలు చంద్రబాబుకి బుద్ధి చెప్పారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అంటున్నారు. మచిలీపట్నంలో సంతకాల ప్రతులను తరలించే కార్యక్రమాన్ని సోమవారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. చంద్రబాబు సర్కార్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజాభిప్రాయాన్ని వైఎస్సార్సీపీ లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. అంతకు మించే అనూహ్య స్పందన లభించింది. ఈ నేపథ్యంలో.. సంతక పత్రాలతో సోమవారం అన్ని జిల్లా కేంద్రాల్లో భారీగా ర్యాలీ నిర్వహించింది. జగన్కు మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారని.. కోటి సంతకాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని వైఎస్సార్సీపీ చెబుతోంది. మచిలీపట్నంలో ప్రతులను తరలించే కార్యక్రమాన్ని మాజీ మంత్రి పేర్ని నాని జెండా ఊపి ప్రారంభించారు. అంతకు ముందు.. వైఎస్సార్సీపీ ఆఫీస్ నుంచి వాహనంలో బాక్సులను స్వయంగా పేర్ని నాని, ఇతర నేతలతో కలిసి ఎక్కించారు. అక్కడి నుంచి కోనేరు సెంటర్ దాకా భారీ ర్యాలీ జరిగింది. -
కొత్త పింఛన్లు ఎప్పుడో?
చంద్రబాబు.. హామీలు ఇవ్వడంలో చూపిన స్పీడు అమలులో కనిపించడం లేదు. ఎన్నికల సమయంలో అర్హులందరికీ కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని చెప్పినా.. 19 నెలలైనా నేటి వరకు ఒక్క పింఛన్ మంజూరు చేయాలేదు. చివరకు దరఖాస్తు ప్రక్రియనూ ప్రారంభించక పోవడంపై అర్హులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో కొత్త పింఛన్ కోసం నిత్యం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కొత్తవి ఇవ్వకపోగా..ఉన్న వాటిని తొలగిస్తుండటంపై లబి్ధదారుల్లో ఆందోళన నెలకొంది.ఆలూరు రూరల్: కొత్త పింఛన్ల మంజూరుకు చంద్రబాబు ప్రభుత్వం ముఖం చాటేస్తోంది. అధికారంలోకి వచ్చి 19 నెలలు గడచినా కనీసం దరఖాస్తులు స్వీకరించడం లేదు. పైగా తాము అధికారంలోకి వస్తే నెల రోజుల్లో వృద్ధులు, దివ్యాంగులు, వితంతవులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ఎన్నికల సమయంలో ఊదరగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త పింఛన్ల మంజూరు చేయకపోగా, ఉన్న పింఛన్లకే ఎసరు పెడుతున్నారు. విచారణ పేరిట పింఛన్లకు క్రమం తప్పకుండా కోతలు పెడుతున్నారు. మరో వైపు నియోజకవర్గంలో కొత్త పింఛన్ల కోసం మండల పరిషత్ కార్యాలయాలు, సచివాలయాల చుట్టూ వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ప్రదక్షిణలు చేస్తున్నా వారి ఆశ నెరవేరడం లేదు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని అ«ధికారులు చెబుతుండటంతో దరఖాస్తుదాలు నిట్టూర్తూ వెనుదిరుగుతున్నారు. బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామన్న హామీని సైతం చంద్రబాబు సర్కారు విస్మరించింది. 2 వేల మందికి పైగా ఎదురుచూపులు.. ఆలూరు నియోజకవర్గంలోని ఆలూరు మండలాల పరిధిలో దాదాపు 2 వేలకు పైగా మంది అర్హులు కొత్త పింఛన్లు కోసం ఎదురుచూస్తున్నారు. పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి కార్యలయాల చుట్టూ, మరి కొందరు టీడీపీ నాయకుల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే వెబ్సైట్ ఓపెన్ కావడం లేదని అధికారులు సమాధానమిస్తున్నారు. వైఎస్సార్ సీపీ పాలనలో సులభంగా.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వలంటీర్ వ్యవస్థ అందుబాటులో ఉండేది. వలంటీర్లు అర్హుల ఇంటికి వెళ్లి వారే దరఖాస్తు చేసి పింఛన్ మంజూరు చేయించే వారు. ఆ సమయంలో ఇది నిరంతరం ప్రక్రియగా కొనసాగింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత నూనత పింఛన్ల కోసం ఎదురుచూపులే మిగిలుతున్నాయి.కొత్త పింఛన్లు మంజూరు చేయాలిగత ప్రభుత్వంలో మాదిరిగానే దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులకు పింఛన్ల మంజూరు ప్రక్రియ కొనసాగించాలి. అధికారం చేపట్టి 19 నెలలు పూర్తవుతున్నా చంద్రబాబు ప్రభుత్వం ఒక్క పింఛన్ మంజూరు చేయకపోవడం దారుణం. మరో పక్క వెరిఫికేషన్ పేరుతో ఉన్న పింఛన్లు తొలగించే కుట్రలు పన్నుతోంది. వికలాంగులు పింఛన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశమివ్వాలి. – రామాంజనేయులు, దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు -
వైఎస్సార్సీపీ పోరుబాట.. ‘కోటి సంతకాల’ ప్రతులతో భారీ ర్యాలీ (ఫొటోలు)
-
‘రెడ్బుక్’ పాలన తప్ప.. ప్రజా పాలన ఏదీ?: ఆర్కే రోజా
సాక్షి, తిరుపతి: చంద్రబాబు ప్రభుత్వం రెడ్బుక్ పాలన తప్ప.. ప్రజా పాలన చేయడం లేదంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ కోటి సంతకాల సేకరణ చేపట్టింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సేకరించిన సంతకాల సేకరణ కరపత్రాలను ఇవాళ భారీ ర్యాలీగా విజయవాడ తరలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్కే రోజా మాట్లాడుతూ.. ప్రజల నుంచి మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణపై నిరసనలు స్వచ్చందంగా మద్దతు తెలిపారని ఆర్కే రోజా అన్నారు.వైఎస్ జగన్.. 17 మెడికల్ కాలేజీలకు అనుమతి తీసుకొచ్చారు. వైఎస్ జగన్ పేరు చెరిపేయాలని చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తుంది. విద్యార్థుల జీవితాలను కూటమి సర్కార్ నాశనం చేస్తుంది. కూటమి పాలనలో వారు చేసిన సర్వేలోనే అందరు మంత్రులకు రెడ్ మార్క్ వచ్చింది. విద్యావ్యవస్థను నారా లోకేష్ నాశనం చేస్తే.. వ్యవసాయాన్ని అచ్చెన్నాయుడు నాశనం చేశారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను చంద్రబాబు విచ్ఛిన్నం చేశారు. -
సీదిరి అప్పలరాజును అడ్డుకున్న పోలీసులు
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల కేంద్రాల్లో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీలు చేపట్టింది. జిల్లా కేంద్రాల్లో కోటి సంతకాల ప్రతులతో వైఎస్సార్సీపీ శ్రేణులు ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. జిల్లా కేంద్రాల నుంచి భారీ ర్యాలీలతో తాడేపల్లికి వైఎస్సార్సీపీ నేతలు తరలివస్తున్నారు. వైఎస్సార్సీపీ ర్యాలీల్లో ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు.పలు చోట్ల కోటి సంతకాల ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అన్యాయంగా అడ్డుకోవడంపై అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగానికి విరుద్ధంగా అడ్డుకుంటున్నారని అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రాల్లో కోటి సంతకాల ప్రతులతో వైఎస్సార్సీపీ ర్యాలీలు చేపట్టింది. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ పూర్తి చేసింది.విజయనగరంలో కోటి సంతకాల ర్యాలీకి అనుమతి నిరాకరణవిజయనగరంలో కోటి సంతకాల ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. పోలీస్ యాక్ట్-1861 సెక్షన్ 30 అమలులో ఉందంటూ విజయనగరం ఇన్చార్జ్ డీఎస్పీగోవిందరావు అనుమతి నిరాకరించారు. వైఎస్సార్ జంక్షన్కు. వైఎస్సార్సీపీ శ్రేణులు, విద్యార్థులు భారీగా చేరుకున్నారుమెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఉద్యమ స్ఫూర్తితో కొనసాగింది. ఇది ఇప్పుడు తుది అంకానికి చేరుకుంది. లక్ష్యానికి మించి సంతకాల సేకరణ కార్యక్రమం కొనసాగింది. దీనికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఈ నెల 10 న అసెంబ్లీ నియోజకవర్గాలలో జరిగిన కార్యక్రమానికి విపరీతమైన స్పందన లభించింది. ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు చేరుకున్న సంతకాలు ఇవాళ (సోమవారం) అక్కడి నుంచి ప్రత్యేక వాహనాలలో తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి పంపనున్నారు. -
ఆయనేమన్నారో.. వీళ్లేం విన్నారో?
ఆంధ్రప్రదేశ్ గురించి దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేసినట్టుగా చెబుతున్న కొన్ని వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇవి ఆయన చేసినవేనా? లేక బీజేపీలోని టీడీపీ విధేయ ఎంపీలెవరైనా కావాలని అలా రాయించారా? 2024 ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి వెళ్లడం మంచిదైందని, ఏపీలో పాలనపై మంచి ఫీడ్బ్యాక్ వస్తోందని మోదీ వ్యాఖ్యానించినట్లు ఎల్లోమీడియాలో వార్తలొచ్చాయి. ఆయన ఏ ఫీడ్బ్యాక్ తీసుకున్నారో? ఏది బాగుందన్నారో? ఎవరకీ తెలియదు.. బహుశా, ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు మాత్రమే అర్థమైఉంటాయి. ఏదో సాధారణంగా అన్నమాటలను చంద్రబాబుకు మరిన్ని భుజకీర్తులు తొడగవచ్చు అని ఈ రెండు పత్రికలు అనుకుని ఉండవచ్చు. ప్రధానమంత్రి కార్యాలయానికి రాష్ట్రాల సమాచారం రాకుండా ఉంటుందా? అలాంటిది ఏపీలో ఏమి జరుగుతుందో తెలియకుండానే గుడ్డిగా ప్రశంసిస్తారా?.. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబును మోదీ ఎలా విమర్శించింది, వారసత్వ రాజకీయాల గురించి ఎలా ధ్వజమెత్తింది, చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై ఎన్ని ఆరోపణలు చేసింది అందరికి తెలిసిన విషయమే కదా!. అలాగే చంద్రబాబు కూడా ప్రధాని అని కూడా చూడకుండా మోదీని దారుణమైన విమర్శలు చేశారు. ఓటమి తర్వాత వ్యూహాత్మకంగా టీడీపీ ఎంపీలను బీజేపీలోకి పంపించి ఆ పార్టీని మేనేజ్ చేసే పని మొదలుపెట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ముందుగా బీజేపీతో జత కట్టించారు. ఒక సందర్భంలో బీజేపీకి టీడీసీ కలవడం ఇష్టం లేదని, తాను తిట్లు తిన్నానని పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించారు కూడా. అప్పట్లో సీబీటీడీ చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి ఇంటిలో సోదాలు జరిపి రూ.2,000 కోట్ల మేరకు జరిగాయని ప్రకటించింది. ఆ తరువాత ఆ కేసు ఏమైందో ఎవరికీ తెలియకుండా పోయింది. 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు మోదీ, అమిత్షాల అపాయింట్మెంట్ కోసం ఢిల్లీలో ఎదురుచూసిన సందర్భాలు కూడా మనం చూశాం. ఆ తరువాత ఏం చేశారో తెలియదు కానీ.. బీజేపీతో పొత్తు అయితే కొదిరింది. ఈ నేపథ్యం మొత్తానఇన పరిగణలోకి తీసుకుంటే.. మోదీ ఇప్పుడు చంద్రబాబుతో పొత్తు మంచిదని అన్నాడంటే నమ్మడం కష్టమే. అది మంచి, చెడు కాదు. అవకాశవాద రాజకీయ పరిణామం అని మోదీకి కూడా తెలిసే ఉంటుంది. ఆ సంగతి పక్కనబెడితే గత పద్దెనిమిది నెలలుగా ఏపీలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అధ్వాన్నపు, అరాచకపు పాలనకు మోదీ సర్టిఫికెట్ ఇచ్చి ఉంటే అంతకన్నా ఘోరం లేదు. ఫీడ్బ్యాక్ అంత బాగుంటే.. ఏపీలో పోలీసు వ్యవస్థ పనితీరుపై కేంద్రం చిట్టచివరి ర్యాంకు ఎలా ఇచ్చింది? రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో ఏపీలో పోలీసు వ్యవస్థను ఇంతగా దిగజార్చిన ప్రభుత్వం ఇంకో చోట ఉండకపోవచ్చు. తమ పార్టీ వ్యతిరేకమని పలుమార్లు ప్రకటించిన మోదీకి ఏపీలో టీడీపీ, జనసేనలు ప్రజాస్వామ్య పార్టీలుగా కనిపిస్తున్నాయా? లోకేశ్ను వారసత్వ రాజకీయాలకు ప్రతినిధిగా గుర్తించే ఆయనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారా? మోదీ సైతం డబుల్ స్టాండర్స్ అనుసరిస్తున్న తీరు బాధ కలిగిస్తుంది. ఏపీ ప్రభుత్వ పనితీరు గురించి చూస్తే ఈ ఏడాదిన్నరలో ఏకంగా రూ.2.60 లక్షల కోట్ల అప్పు చేసి రికార్డు సృష్టించడాన్ని మోదీ సమర్థిస్తారా? ఇదే చంద్రబాబు సమర్థత అని అనుకుంటున్నారా? తెలంగాణ బీజేపీ ఎంపీల పనితీరుపై మోదీ పెదవి విరిచారని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మరీ తక్కువ ఓట్లు ఎందుకు వచ్చాయని అడిగారట. ఏపీలో మాత్రం పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారట.అసలు ఏపీలో బీజేపీ ఉనికి ఉందా? టీడీపీనే మొత్తం డామినేట్ చేస్తోంది కదా? మోదీకి ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే బీజేపీలోని టీడీపీ కోవర్టులు ఎప్పటికప్పుడు చంద్రబాబు తరపున కేంద్రంలోని పెద్దలను మేనేజ్ చేస్తుంటారేమో తెలియదు. తెలంగాణ బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గంటల కొద్ది భేటీ అవడాన్ని తప్పుపట్టారట..బాగానే ఉంది. మరి తెలంగాణ ఉప ఎన్నికలో తన మిత్రపక్షమైన తెలుగుదేశం బీజేపీ అభ్యర్ధికి ఎందుకు మద్దతు ప్రకటించలేదు? పైగా కాంగ్రెస్ కు సపోర్టు చేసినా బీజేపీ కేంద్ర నాయకత్వం ఎందుకు కిమ్మనలేదు? దీనిపై మోదీకి ఎవరూ ఫీడ్ బ్యాక్ ఇవ్వలేదా? చంద్రబాబు ,పవన్ కళ్యాణ్, లోకేశ్ లు ఇక్కడ ఎందుకు ప్రచారం చేయలేదు? ఇదేనా ఎన్డీయే పక్షాల తీరు! ఏపీలో జగన్ను, వైసీపీ సోషల్ మీడియాను ధీటుగా ఎదుర్కోవాలని చెప్పారని కూడా రాయించారు. అంటే వైఎస్సార్సీపీ అంత బలంగా ఉందని మోదీ భావిస్తున్నట్లే కదా! లేదంటే ఒరిజినల్ బీజేపీ వారు కూడా వైఎస్సార్సీపీపై తప్పుడు ఆరోపణలు చేయాలన్న లక్ష్యంతో ఇలా కథ అల్లి ఉండవచ్చన్న సందేహం ఉంది. ఏపీలో టీడీపీ, జనసేనలు సంయుక్తంగా విడుదల చేసిన ఎన్నికల ప్రణాళికను బీజేపీ తనదని చెప్పలేకపోయింది. అయినా ప్రభుత్వంలో చేరిన తర్వాత ఆ హామీలకు బీజేపీ కూడా ఒప్పుకున్నట్లే కదా! వాటి అమలు తీరు తెన్నుల గురించి, ప్రధాని ఫీడ్ బ్యాక్ తెప్పించుకుని ఉంటే బాగుండేది కదా! అప్పుడు వాస్తవాలు తెలిసేవి కదా! ప్రభుత్వంలో అవినీతి బాగా పెరిగిపోయిందని ఎల్లో మీడియానే ఆయా సందర్భాలలో కథనాలు ఇచ్చింది.అంతదాకా ఎందుకు మోదీ వ్యాఖ్యల కథనం వచ్చిన రోజునే పరిశీలిస్తే వివిధ పత్రికలలో వచ్చిన వార్తల సారాంశం కనుక ప్రధాని దృష్టికి వెళితే ఏపీలో కూటమి ఎంత అధ్వాన్నంగా ఉన్నది తెలుసుకోవడం కష్టం కాదు.ఎపి ప్రభుత్వం విద్యార్ధులకు ఇచ్చిన బాగ్ లు రెండు నెలల్లోనే చిరిగిపోయాయి. రెవెన్యూ శాఖలో గందరగోళంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని స్వయంగా చంద్రబాబే వ్యాఖ్యానించారు. ఇక చంద్రబాబు తనపై ఉన్న పలు అవినీతి కేసులను, మాఫీ చేయించుకుంటున్న తీరు అందరిని విస్తుపోయేలా చేస్తోంది. తాజాగా ఫైబర్ నెట్ అవినీతి కేసును కూడా సిఐడి ని ప్రభావితం చేసి మూసివేయించుకున్నారు. ఇది ఏ మేర నైతికతో ప్రధాని చెప్పగలరా? మిత్రపక్షం కాకుండా ఉంటే టీడీపీపైన, చంద్రబాబుపైన మోదీ తదితర బీజేపీ నేతలు ఎంతగా విరుచుకుపడేవారో! చంద్రబాబు తన టూర్ లకు వాడే హెలికాఫ్టర్, విమానం అద్దె ఛార్జీల చెల్లింపునకు నలభైకోట్లకు పైగా ఇప్పటికే ఖర్చు చేశారట. నెల్లూరులో వైఎస్సార్ కాంగ్రెస్ లో తిరిగి చేరిన కార్పొరేటర్ ను పోలీసులే కిడ్పాన్ చేశారని వార్తలు వచ్చాయి. విజయవాడలో సుప్రీంకోర్టు తీర్పుతో నిమిత్తం లేకుండానే పోలీసుల సమక్షంలో 42 ఇళ్లు కూల్చిన దారుణ ఘటన జరిగింది. ఆ బాధితులు మాజీ సీఎం జగన్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అమరావతిలో రాజధాని అభివృద్ది సంస్థే చెరువులను చెరబట్టి రైతులకు వాటిలో ప్లాట్లు ఇస్తోందన్న స్టోరీ వచ్చింది.దీనిపై రైతులు మండిపడుతున్నారు. మాచర్లలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై అక్రమ కేసు పెట్టిన నేపథ్యంలో సుప్రీం కోర్టు సూచన మేరకు వారు లొంగిపోవడానికి కోర్టుకు వెళుతుంటే పోలీసులు ఎంత నిర్భంధ కాండ అమలు చేశారో ఆశ్చర్యంగా ఉంటుంది. ఏపీలో గంజాయి వ్యాసారం సాగుతున్న తీరు అందరిని కలవర పరుస్తోంది.కుల వివాదంగా మారిన ఒక హత్య కేసులో భారీ పరిహారం ప్రకటించిన కూటమి ప్రభుత్వం, నెల్లూరులో గంజాయి వ్యతిరేక ఉద్యమకారుడు హత్యకు గురైతే కనీసం పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. రాష్ట్రం గంజాయి హబ్గా మారుతోందనడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం అవసరమా? ఒకవైపు పోలీసుల దౌర్జన్యాలు, మరో వైపు టీడీపీ నేతల దాష్టికాలతో ఏపీ అంతటా అరాచకం ప్రబలుతుంటే మోదీకి ఈ పాలన ఎలా బాగుందో, ఆయనకు ఎవరు ఫీడ్బ్యాక్ ఇచ్చారో తెలియదు. కేంద్రం నుంచి మోంథా తుపాను సహాయనిధిగా రూ.544 కోట్ల వస్తే ఒక్క రూపాయి కూడా రైతులకు ఇవ్వలేదని సోషల్ మీడియాలో కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బేతంచర్లలో ఒక లిక్కర్ షాపు యజమాని ఎక్సైజ్ అధికారులు అడిగినంత మామూళ్లు ఇవ్వలేక ఏకంగా షాపునే మూసుకుంటున్నట్లు వెల్లడించారు. ఎల్లో మీడియాలో కూడా కొన్ని కథనాలు వచ్చాయి. రవాణా మంత్రి రామ ప్రసాదరెడ్డి పేషీ లో అవినీతి గురించి ఎల్లోమీడియాకు చెందిన ఒక పత్రిక వార్త ఇచ్చింది.రాష్ట్రంలో ప్రతినెల మొదటి తేదీన అందరికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. రెవెన్యూ లోటు నిపుణులను భయపెడుతోంది. విశాఖ వంటి ప్రతిష్టాత్మక నగరంలో 99 పైసలకే కొన్ని పరిశ్రమలకు భూములు ఇవ్వడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. లూలూ గ్రూప్కు విజయవాడలో వందల కోట్ల విలువైన ఆర్టీసీ భూమిని కట్టబెట్టడంపై జనం మండిపడుతున్నారు.ఇలా ఏ రంగం గురించి చూసినా పరిస్థితి అగమ్యగోచరంగానే ఉంది. వీటిని కవర్ చేయడానికి మత రాజకీయాలు చేయడానికి పవన్ కళ్యాణ్ ను టీడీపీ ఆపరేట్ చేస్తోందన్న అభిప్రాయం ఉంది. వైఎస్సార్సీపీని బదనాం చేయాలన్న దురుద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అప్రతిష్టపాలు చేయడానికి టీడీపీ, జనసేనలు వెనుకాడడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మోదీకి ఏపీ ప్రజలపై ఏ మాత్రం అభిమానం ఉన్నా, వాస్తవికమైన ప్రజాభిప్రాయాన్ని సేకరించి తదనుగుణంగా చంద్రబాబు సర్కార్ కు సరైన సలహాలు ఇవ్వగలిగితే అంతా సంతోషిస్తారు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
డబ్బా కొట్టుకొనే డబ్బా రాయుళ్లు.. అఖండ2 పై సెటైర్లు
-
బాబు కుట్రలపై జన'కోటి' గర్జన
సాక్షి ప్రతినిధి, కడప: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రజలు నీరాజనం పలికారు. ఊరు–వాడ ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కని్పంచింది. జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాలల్లో మారుమూల గ్రామాలకు సైతం ఆ పార్టీ శ్రేణులు వెళ్లి నిరసన గళాన్ని కలం ద్వారా వ్యక్త పర్చేలా వ్యవహరించారు. ప్రజావ్యతిరేక విధానాలపై వైఎస్సార్సీపీ ఉద్యమాన్ని గ్రామ స్థాయిలో రగిల్చింది. సంతకాల పత్రులను వాహనాల్లో ఎక్కించి పార్టీ శ్రేణులు జిల్లా కార్యాలయానికి చేరవేశారు. అన్ని నియోజవకర్గాలకు చెందిన 4,80,101 మంది ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా సంతకాలు చేసిన ప్రతులతో సోమవారం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీకి సన్నాహాలు చేశారు. మెడికల్ కళాశాలలు ప్రైవేట్పరమైతే పేదలకు వైద్య విద్య కలగానే మిగిలిపోతుందనే ఆవేదనే కోటి సంతకాల్లో భాగస్వామ్యం అయ్యేలా చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. పేదలు వైద్య విద్యకు దూరం కాకుడదనిమెడికల్ కళాశాలలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడం వల్ల పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్యపై ఆశలు గల్లంతవుతాయనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోటి సంతకాల సేకరణకు పిలుపునిచ్చారు. ఆమేరకు జిల్లాలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉధృతంగా సాగింది. జిల్లా వ్యాప్తంగా 4,80,101 మంది నుంచి సంతకాలు సేకరించారు. పులివెందులలో అన్ని వసతులతో రాజసం ఉట్టి పడుతున్న ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేట్ పరం కానుందని ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే జిల్లాలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా భారీ స్పందన లభించినట్లు పరిశీలకులు వెల్లడిస్తున్నారు. కాగా సంతకాలు చేసిన ఆ ప్రతులతో నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు చేపట్టి, జిల్లా కేంద్రంలోని వైఎస్సార్సీపీ కార్యాలయానికి ఇదివరకే చేర్చారు. పార్టీ అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డికి అందజేశారు. ర్యాలీకి ఏర్పాట్లు పూర్తి ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల నిరసన కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలో సోమవారం భారీ ర్యాలీకి ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరానున్నట్లు తెలుస్తోంది. ఉదయం 10గంటలకు వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా ప్రారంభమై కోటిరెడ్డి సర్కిల్ మీదుగా ఎనీ్టఆర్ సర్కిల్, సెవెన్ రోడ్స్ సర్కిల్ మీదుగా హెడ్ పోస్టాఫీసు చేరుకొని అక్కడున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నివాళులు అరి్పంచి, జిల్లా కేంద్రం నుంచి సంతకాల ప్రతులను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపనున్నారు. ఈకార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు భారీ స్థాయిలో పాల్గొననున్నారు. వైద్య విద్యపై నీచరాజకీయం వైఎస్సార్సీపీ పాలనలో పేదలకు మెరుగైన ఉచిత వైద్యం, పేద విద్యార్థుల ఉ న్నతికి ఉచిత వైద్య విద్యను అందించాలనే సంకల్పంతో అప్పటి సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలను స్థాపించారు. అవి పూర్తి అయితే ఉచిత వైద్య విద్య అందుబాటులోకి వస్తుంది. తద్వారా వైఎస్ జగన్కు మంచి పేరు వస్తుందనే దురాలోచనతో వైద్య విద్యపై సీఎం చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తూ, ప్రజాద్రోహిగా నిలిచారు. – పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు -
కోటి సంతకాలు.. కోట్ల గళాలు
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజాగ్రహం.. వైఎస్సార్సీపీ పోరాటం.. తుది అంకానికి చేరుకున్నాయి.. -
వల్లభనేని వంశీని కలిశారనే కోపంతో..
సాక్షి, కృష్ణా జిల్లా: గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ గుండాలు రెచ్చిపోయారు. మర్లపాలెం గ్రామంలో ఇద్దరు వ్యక్తులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కలిశారని.. స్థానికంగా అధికార పార్టీ కొనసాగిస్తున్న అరాచకాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారనే కోపంతోనే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఆదివారం మధ్యాహ్నాం మర్లపాలెంలో వల్లభనేని వంశీ పర్యటించి.. ఓ కుటుంబాన్ని పరామర్శించారు. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన కంభంపాటి శ్రీధర్,కంభంపాటి రామ్మోహనరావు వంశీని కలిసి ఫొటోలు దిగారు. స్థానికంగా కొనసాగుతున్న ప్రతీకార రాజకీయాల గురించి ఆయనకు వివరించారు. ఈ విషయం తెలిసిన టీడీపీ మూక రెచ్చిపోయింది.ఆ ఫొటోల ఆధారంగా ఇద్దరిని గుర్తించింది. వంశీనే కలుస్తారా? అంటూ.. ఇరువురిపై మూక దాడికి పాల్పడ్డారు. తల, చేతులకు తీవ్ర గాయాలు కావడంతో శ్రీధర్, రామ్మోహనరావులను స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలిసి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వల్లభనేని వంశీ.. హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. దాడి వివరాలు అడిగి తెలుసుకున్న ఆయన.. అధైర్యపడొద్దని, అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. -
వాళ్ల మొహం కూడా చూడం.. ఊళ్లోనే ఉండం!
వేంపల్లె: వైఎస్సార్సీపీకి ప్రజా మద్దతు మరోసారి స్పష్టమైంది. మూడు కుటుంబాలను పార్టీలో చేర్చుకునేందుకు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్రెడ్డి (బీటెక్ రవి)తో పాటు టీడీపీ నాయకులు గ్రామంలోకి అడుగుపెట్టగానే, ప్రజాస్వామ్య స్ఫూర్తితో గ్రామస్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేసి.. ఆ గ్రామాన్నే వదిలివెళ్లిన ఘటన వైఎస్సార్జిల్లా వేంపల్లె మండలం అమ్మగారిపల్లెలో చోటుచేసుకుంది. నిరసనను అణచివేయడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోగా, ఈ చర్యలు స్థానికులను మరింత ఆగ్రహానికి గురిచేశాయి. దేశం కుతంత్రాలకు సమాధానం గత కొన్నేళ్లుగా వైఎస్సార్సీపీలో కొనసాగుతున్న గ్రామస్తులను రాజకీయంగా చీల్చే ప్రయత్నంలో భాగంగా ప్రలోభాలకు తెరలేపుతూ అడ్వకేట్ వెన్నపూస ఈశ్వర్రెడ్డితో పాటు మరో రెండు కుటుంబాలను టీడీపీలోకి చేర్చుకునేందుకు బీటెక్ రవి తదితర టీడీపీ నాయకులు గ్రామానికి వచ్చారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసే విందులో గ్రామంలోని ప్రజలంతా పాల్గొనాలని తీవ్ర ఒత్తిడి తెచ్చారు. పోలీసులనూ ఇందుకు వినియోగించుకున్నారు. ఈ రాజకీయ కుతంత్రాలకు గ్రామస్తులు గట్టి సమాధానం చెప్పారు. టీడీపీ నాయకుల ముఖాలను కూడా చూడకూడదన్న సంకల్పంతో గ్రామస్తులంతా స్వచ్ఛందంగా ఇళ్లకు తాళాలు వేసి ఊరును ఖాళీ చేశారు. గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో పెండ్లిమర్రి మండలం నందిమండలం గ్రామ సమీపంలోని కొండ గంగమ్మ వద్ద వైఎస్సార్సీపీకి సంఘీభావంగా ప్రత్యేక విందు ఏర్పాటు చేసుకున్నారు. గ్రామం వదిలి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లకూడదని పోలీసులు అంతక్రితం గ్రామస్తులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అనుమతి లేదంటూ విందును అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా గ్రామస్తులు లెక్కచేయలేదు. ఈ ఘటనతో టీడీపీ నాయకులకు తీవ్ర అవమానం ఎదురైంది. గ్రామంలో ఒక్కరూ లేకపోవడంతో బీటెక్ రవిసహా ఇతర అధికార పార్టీ నాయకులు కంగుతిన్నారు. ఇదిలావుండగా టీడీపీ నాయకులు, పోలీసులు ఎంత ఒత్తిడి తెచ్చినా, ఎంత ఇబ్బందులకు గురిచేసినా వైఎస్సార్సీపీలోనే ఉంటామని, వైఎస్ కుటుంబం వెంటే నడుస్తామని గ్రామస్తులు తేల్చిచెప్పారు.పోలీసులను అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడుతున్నారు పోలీసులను అడ్డుపెట్టుకొని టీడీపీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ బలహీనపడుతోందనడానికి అమ్మగారిపల్లె ఘటనే రుజువు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని మాజీ సీఎం వైఎస్ జగన్ కోరుకుంటున్నారు. వైఎస్సార్సీపీని ఎదుర్కోలేక టీడీపీ నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. – ఎస్వీ సతీష్కుమార్రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్సీపీ -
పీపీపీకి వ్యతిరేకంగా ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం: టీజేఆర్
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న సీఎం చంద్రబాబు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేవరకు.. వైఎస్సార్సీపీ పోరాటం ఆగదని ఆ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదలకు ఉచిత వైద్యం, వైద్య విద్య అందించాలన్న లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రారంభించిన మెడికల్ కాలేజీలకు ప్రైవేటీకరణ చేయడం ద్వారా పేదలకు వైద్య విద్యను దూరం చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.చంద్రబాబు నిర్ణయం వల్ల 2450 మెడికల్ సీట్లు పేదలు దూరమవుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యవస్థలను చంద్రబాబు తన జేబు సంస్థల్లా మార్చుకున్నారన్న ఆక్షేపించారు. మరోవైపు కేంద్ర స్థాయీ సంఘం పేరుతో పచ్చి అబద్ధాలు రాస్తున్న ఈనాడు.. పీపీపీ విధానమే ముద్దు అంటూ బాబుకి కొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ప్రారంభించిన 17 మెడికల్ కాలేజీలను పూర్తి చేయడం ద్వారా.. ఆ ఘనత మీ ఖాతాలోనే వేసుకొవాలని చంద్రబాబుకు సూచించారు. అంతే తప్ప ప్రైవేటీకరణ పేరుతో పేదల నోట్లో మట్టికొట్టవద్దని విజ్ఞప్తి చేశారు.ప్రైవేటీకరణ కూటమి విధానమైతే.. అందుకు వైఎస్సార్సీపీ పూర్తి విరుద్ధమన్న సుధాకర్ బాబు దీనిపై రాజీనామా చేసి ప్రజల రెఫరెండంకు సిద్ధమా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ హయాంలో కాలేజీల నిర్వహణ కోసం సెల్ఫ్ పైనాన్స్ సీట్లు ఏర్పాటు చేస్తే.. మెడికల్ సీట్లు అమ్ముకుంటున్నారని గగ్గోలు పెట్టిన చంద్రబాబు, అధికారంలోకి వస్తే 100 రోజుల్లో సెల్ఫ్ పైనాన్స్ రద్దు చేస్తామని బీరాలు పలికి.. ఇవాళ పూర్తిగా కాలేజీలనే ప్రైవేటు పరం చేయడంపై ధ్వజమెత్తారు.మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను రాజకీయంగా కాక సామాజిక కోణంలో చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాదని పేద బిడ్డల చదువుల మీద ఉక్కుపాదం మోపాలని చూస్తే.. అప్పుడు కోటి కాస్తా పదికోట్ల సంతకాలవుతాయని తేల్చి చెప్పారు. పీపీపీకి వ్యతిరేకంగా ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమన్న సుధాకర్ బాబు, మా తలలు పగిలినా వైఎస్ జగన్ నేతృత్వంలో పోరాటం ఖాయమని హెచ్చరించారు. 15వ తేదీన జిల్లాల నుంచి కోటి సంతకాలు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి రాగా.. 18న జగన్ నాయకత్వంలో గవర్నర్ దగ్గరకు వెళ్తాయన్న ఆయన... ఈలోపు చంద్రబాబు తన మనసు మార్చుకోవాలని సూచించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..చంద్రబాబు జేబు సంస్థల్లా వ్యవస్థలుఈ రాష్ట్రంలో వ్యవస్థలను మేనేజ్ చేయబడుతున్నాయని.. చంద్రబాబునాయుడికి జేబు సంస్థలుగా మారిపోతున్నాయని, ఆయన మాఫియా డాన్లా మారిపోయాడని వైఎస్సార్సీపీ భావిస్తోంది. అదే విషయాన్ని ప్రజలకు చెప్పాం. ఇవాళ ఆది మరోసారి సుస్పష్టం అయింది. మెడికల్ కాలేజీలను ప్రభుత్వం నిర్వహించాల్సిన అవసరం లేదని, ప్రైవేటు వ్యక్తులకు అప్పగించవచ్చని, వారి చేతుల్లో ఉంటేనే నాణ్యమైన వైద్యం అందుతుందని.. కేంద్ర ప్రభుత్వం భావించినట్లుగా, కేంద్ర ప్రభుత్వ స్థాయీ సంఘం సిఫార్సు చేసినట్లుగా.. ఈనాడు దినపత్రికలో పతాక శీర్షికలో బ్యానర్ ఐటం రాశారు.ఇవాళ ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలందరూ పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ షిప్ (పీపీపీ) వద్దు, ప్రభుత్వ విధానమే ముద్దు అనే నినాదాన్ని ఎత్తుకుంది. కానీ చంద్రబాబు అనుకూలమైన జేబు సంస్థ అయిన ఈనాడు మాత్రం పీపీపీ విధానమే ముద్దు అని రాసింది. చంద్రబాబుకి డబ్బు కొట్టడంలో ర్యాంకింగ్ ఇవ్వాల్సి వస్తే ఈనాడు మొదటి స్థానంలో ఉంటుంది. చంద్రబాబు ఏం చేసినా రైట్, ఆయన ఏం మాట్లాడినా అదే కరెక్ట్ అని రాస్తుంది. ఇంతమంది ప్రజలు వద్దు అంటే.. కాదు అదే ముద్దు అంటూ ఈనాడు రాయడాన్ని వైఎస్సార్సీపీ ఖండిస్తోంది.మీరు ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తూ.. చంద్రబాబు జేబు సంస్థలా వ్యవహరిస్తున్నారు కాబట్టే.. మీరు చంద్రబాబుకి బాకా ఊదుతున్నారు కాబట్టే మిమ్మల్ని ఎల్లో మీడియా అని వ్యవహరిస్తున్నాం. చంద్రబాబుకి, మీకు ఆర్థికపరమైన, వ్యాపారపరమైన లావాదేవీలున్నాయి. అందుకు నిదర్శనమే ఇవాళ మీరు రాసిన వార్తలు.మెడికల కాలేజీలపై చర్చకు సిద్ధమా?1923 నుంచి 2019 వరకు స్వతంత్ర భారతదేశంలో ఏపీలో 12 మెడికల్ కాలేజీలుంటే.. ఇవాళ అవి 29కు చేరాయి. ఒక్క వైఎస్ జగన్ హయాంలోనే 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేస్తే.. మీరు బాకా ఊదే చంద్రబాబు నాయుడుకి ఒక్క రోజైనా ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలన్న స్పృహ వచ్చిందా? వైఎస్ జగన్ విధానాలకు, చంద్రబాబు నాయుడు విధానాలకు ఇద్దరి సిద్ధాంతాలు, సంస్కరణలపై ఒక రోజంతా చర్చ నిర్వహిద్దాం. మీకు నచ్చిన టెలివిజన్ చానెల్స్ అధినేతలంతా విజయవాడ తీసుకురండి. వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధులంతా వస్తాం. చంద్రబాబునాయుడు సిధ్ధాంతమేంటో, ఆయన సిద్ధాంతం పునాదులేంటో చర్చిద్దాం.బలహీనమైన రాజకీయ పునాదులతో ఉన్న చంద్రబాబు... భయం, అభద్రతా భావంతో తనను కానీ పార్టీని ఓన్ చేసుకునే విధానంలో.. వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. అందరికీ తాయిలాలు పంచుకుంటూ వచ్చాడు. తాను దోచుకున్న డబ్బులనే మీ అందరికీ పంచుకుంటూ వచ్చాడన్నదే ప్రధానమైన అంశం. ఈ అంశాన్ని నిరూపించడానికి.. మీరు కట్టిన రామోజీ ఫిల్మ్ సిటీ అయినా, రామోజీ రావు చనిపోతే రూ.5 కోట్ల ప్రజాధనాన్ని ఆయన సంస్మరణ సభ నిర్వహించడం కోసం ఖర్చు చేయడాన్ని ఆధారాలతో సహా ఈనాడు చంద్రబాబు జేబు సంస్థ అనడానికి నిదర్శనం.పీపీపీ- దెబ్బతిన్న మెడికల్ కాలేజీల నిర్మాణ స్ఫూర్తిపీపీపీ విధానం వల్ల 17 మెడికల్ కాలేజీల నిర్మాణ స్ఫూర్తి దెబ్బతింటుంది. ప్రజారోగ్యం కొరకు వైఎస్ జగన్ సామాజిక స్పృహతో రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో ఈ 17 మెడికల్ కాలేజీలను స్థాపించి.. వందలాది ఎకరాలను ఈ కాలేజీల పరిధిలోకి తీసుకొచ్చాడు. ప్రపంచంలోనే అత్యున్నత వైద్యం అందించాలని ఆశించాడు. అందులో 7 కాలేజీల నిర్మాణం పూర్తైంది. 2023-24 విద్యాసంవత్సం నాటికి 5 కాలేజీల్లో అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయి. మిగిలిన కాలేజీలను పూర్త చేయడానికి ప్రభుత్వం దగ్గర నిధులు లేవా? గత ప్రభుత్వంలోనే ఏ పైనానా పూర్తి కాకుండా నిల్చిపోతే... ఏ ప్రజాపరిపాలకుడైనా దాన్ని పూర్తి చేసి ఆ ఘనత తన ఖాతాలో వేసుకుంటాడని భావిస్తాం.ఈ 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి.. వీటిని నేనే కట్టానని చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటాడని భావించాం. కానీ చంద్రబాబు నికృష్టరాజకీయాలకు, నిరంకుశరాజకీయాలకు తెరలేపాడు.ఏ మాత్రం జాలి, దయ, దాక్షిణ్యం లేకుండా ప్రవర్తించాడు. ఈ 17 మెడికల్ కాలేజీలు ప్రారంభమైతే.. వందలాది ఉచిత మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఉచితంగా వైద్య సేవలు లభిస్తాయి. ఉచిత వైద్య సేవలు ఆశించిన పేదలు, ఆ కాలేజీలదగ్గరకు వచ్చి వైద్యం ఆశించిన వారందరికీ సంపూర్ణ న్యాయం జరుగుతుంది. కానీ ఈ రాష్ట్రంలో ఉచిత విద్య, ఉచిత వైద్యం అందని ద్రాక్షగా మారింది.పీపీపీపై నిస్సిగ్గుగా అనుకూల ప్రచారంఇప్పటికే చంద్రబాబు ఆరోగ్యశ్రీని అటకెక్కించాడు. 108 నాశనం చేశాడు. 104 అయితే అస్సలు కనబడ్డం లేదు. ఆ రోజు 104 అడ్రస్ లేకుండా పోయింది. వైఎస్సార్ తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ, 108, 104 లాంటి చారిత్రాత్మక పథకాలు మచ్చుకైనా రాష్ట్రంలో కనిపించడం లేదు. ఈ దఫా చంద్రబాబు బరితెగించాడు. ఈ రాష్ట్రంలో 85 శాతం మంది ప్రజలకు ప్రభుత్వం ఏ పథకం ఇచ్చినా తీసుకుందామనుకుని ఆశపడ్డ వాళ్ల నోట్లో మట్టికొట్టాడు. పైగా వాళ్ల పత్రికతో బాకాలు ఊదించుకుంటూ.. పీపీపీ విధానమే బాగుంటుందని, ఇదే సరైన నిర్ణయమని నిస్సిగ్గుగా ప్రచారం చేయించుకుంటున్నాడు.పీపీపీ విధానంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడానికి వైఎస్సార్సీపీ బద్ద విరుద్దం. మీరు, ఈనాడుతో పాటు మీ అనుకూల పత్రికలు పీపీపీ విధానానికి సానుకూలం. తక్షణమే చంద్రబాబును రాజీనామా చేయమనండి. లోకేష్, పవన్ కళ్యాణ్లను కూడా రాజీనామా చేయమనండి. మా 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తాం. ప్రజలను రిఫరెండెం కోరుదాం. ప్రజలకు ఏది అవసరమో వారి ముందుకే వెళ్దాం.స్థాయీ సంఘం పేరుతో అబద్దాలుకేంద్ర ప్రభుత్వ స్థాయీ సంఘం పీపీపీ విధానం సిఫార్సు చేసినట్లు అబద్ధాలు చెబుతున్నారు. స్థాయి సంఘం పన్ను రాయితీలు ఇమ్మని, స్కాలర్ షిప్పులు ఇమ్మని చెప్పింది. సీట్లు పెంచాల్సిన ఆవశ్యకత గురించి ఆలోచించమని చెప్పిందే తప్ప.. పీపీపీ విధానం బ్రహ్మాండంగా ఉంది. మీరు ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయండని కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు. ఆ రోజు వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రారంభించినప్పుడు ఆయా కాలేజీల నిర్వహణకు వీలుగా కన్వీనర్ కోటాతో పాటు సెల్ఫ్ పైనాన్స్ సీట్లను పెట్టాలని ఆలోచన చేస్తే.. వైఎస్ జగన్ మెడికల్ సీట్లను అమ్ముకుంటున్నాడు.వైఎస్ జగన్ ప్రభుత్వ విధానం తప్పు అని.. ఈ పార్టీలు, పత్రికలే దుమ్మెత్తి పోశాయి. ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తూ.. వార్తలు రాశాయి. అక్కడితే ఆగకుండా మేం ఆధికారంలోకి వస్తే.. 100 రోజుల్లో సెల్ఫ్ పైనాన్స్ విధానాన్ని రద్దు చేసి, పూర్తిగా కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తామని చెప్పిన ఈ పెద్ద మనుషులు.. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోయారు. పీపీపీ పేరుతో పూర్తిగా ప్రభుత్వ సంపదను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పంపించే పనిలో పడ్డారు.పైగా ఆ పీపీపీ విధానంలో కూడా ఉచితాలు ఉంటాయని.. పచ్చి అబద్దాలు చెబుతూ ఇంకా ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓపీ సేవలు ఉచితమని చెబుతున్నారు. ఓపీలో ఏం సేవలు అందుతాయి. వీళ్లు చెబుతున్న ఉచితం.. జ్వరం, పన్నో, కన్నూ, కడుపో నొప్పి వస్తే.. ఓపీ ఫ్రీ. అలా కాకుండా కాళ్లూ చేతులు విరిగితేనో, ఇంకేవైనా జబ్బులు వస్తేనో ప్రైవేటు ఆసుపత్రుల్లో వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఆ ఫీజులు పేదలు కట్టుకోలేదు.చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్, లోకేష్లకు ఆ విషయం అర్థం కాదు. మేం భారీ ఫీజులు కట్టి ఆ వైద్యాన్ని పొందలేరని.. ప్రభుత్వం వైపు చూసే ఆనాథల కోసమే ఈ కళాశాలలు వస్తే.. దాన్ని కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కింది. పైగా ప్రైవేటీకరణ చేసిన ఆసుపత్రుల్లో 50 శాతం బెడ్స్ పేదలకు ఉచితంగా ఇస్తామని చెబుతున్నారు. ఇది నమ్మవచ్చా? ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత వాటిపై ప్రభుత్వ ఆజమాయిషీ ఉంటుందా? ఇవాళ కడుతున్న మెడికల్ కాలేజీలో 100 పడకలు ఉంటే.. రిజర్వేషన్ ప్రకారం 70 పేదలకు, మిగిలినవి ఇతరులకు పెట్టగలిగే అవకాశం ఉంటుందా? మరి అలాంటప్పుడు ఈ రకమైన అబద్ధాలు ఎలా చెబుతారు?కాలేజీలు ప్రైవేటీకరణ - జీతాలు ప్రభుత్వ ఖజానాప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడమే ఒక పెద్ద స్కామ్ అయితే.. వారికి ప్రభుత్వం మరొక పెద్ద బొనాంజా ప్రకటిస్తుంది. ప్రైవేటు వ్యక్తుల చేతులకు ఆసుపత్రులు ఇచ్చి.. అక్కడ సిబ్బందికి ప్రభుత్వమే జీతాలు చెల్లించే విధంగా ఒప్పందాలు ఎలా జరుగుతున్నాయి? ఈ రాష్ట్రంలో ప్రజలు ఉన్నారు. మీ అరాచాకాలను గమనిస్తున్నారన్న స్పృహ కూడా ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. ఎక్కడైనా ఈ సహేతుకమైన చర్చలో.. రూ.140 కోట్లు ప్రవైటు వ్యక్తుల చేతులకి ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టాలని చూడ్డం ఎంతవరకు సహేతుకం? పైగా ఆరోగ్యశాఖ మంత్రి సత్యప్రసాద్ అవును నిజమే ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుందని చెబుతున్నాడు. ఈయనా మంత్రి? అసలు అవగాహన ఉండే మాట్లాడుతున్నాడా? కేంద్ర ప్రభుత్వం ఆయా మెడికల్ కాలేజీల్లో సీట్ల కేటాయింపు అంటోంది.పీజీ మెడికల్ సీట్లకు ఒక్కోదానికి రూ.29 లక్షలు వసూలు చేసే విధంగా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ స్కెచ్ వేశారు. ఆ రోజు వైయస్.జగన్ ప్రభుత్వంలో ఆయా కాలేజీల నిర్వహణకు.. స్వతంత్రంగా భరించే విధంగా... కన్వీనర్ కోటా కాకుండా కొన్ని సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో భర్తీ చేయాలని నిర్ణయించారు. దాన్ని విమర్శించి.. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రద్దు చేస్తామని చెప్పారు. తీరా ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉచిత సీటు వస్తే రూ.30వేలు ఫీజు, సెల్ఫ్ ఫైనాన్స్ అయితే రూ.9 లక్షలు, ఎన్నారై కోటా అయితే రూ.29 లక్షలు రేటు ఫిక్స్ చేశారు. ఆ రోజు మీరు చెప్పినట్లు కన్వీనర్ కోటాలోనే పూర్తిగా సీట్లు ఉంచినట్లైతే... ఇవాళ మీరు చెప్పినట్లు రూ.9, రూ.29 లక్షలు ఫీజులు ఎందుకు వసూలు చేస్తున్నారు?5 కొత్త మెడికల్ కాలేజీల్లో 2025-26 విద్యాసంవత్సరంలో నాలుగు పీజీ కోర్సులలో 60 సీట్లను జాతీయ వైద్య కమిషన్ మంజూరు చేసింది. ఈ 60 సీట్లను మంజూరు చేసిన సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి, వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ కు ఉందా? తొలివిడత 4 కాలేజీల్లో 50 శాతమే కన్వీనర్ కోటా, పీపీపీ పేరుతో ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల మెడికల్ కాలేజీలను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తూ.. వాటిలో 50 శాతం సీట్ల మాత్రమే ప్రభుత్వ కోటాలో ఉంచుతున్నారు. ఇంతకంటే ద్రోహం ఉంటుందా? ఈ ఒక్క చర్య ద్వారానే ప్రభుత్వ విధానం, చిత్తశుద్ధి తేటతెల్లమైందిమెడికల్ కాలేజీల భూములు కౌరుచౌకగా అప్పగింత..మరోవైపు ఆయా ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు వైయస్.జగన్ ప్రభుత్వం 50 ఎకరాల స్ధలం కేటాయిస్తే.. వందలదాలి కోట్ల ఖరీదు చేసే ఆ భూములను ప్రభుత్వం.. రూ.100 కే ప్రైవేటు వ్యక్తులకు దశలవారీగా ధారాధత్తం చేస్తోంది. 33 ఏళ్ల లీజు పేరుతో కేవలం రూ100 కే అప్పగిస్తోంది. ఇది ప్రజల ఆస్తిని ప్రైవేటు పరం చేయడమే. పీపీపీ విధానంలో ప్రైవేటు పరం చేస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై కన్నేసిన చంద్రబాబు ప్రభుత్వం.. ఒక్కా కాలేజీకి 257.50 ఎకరాల భూమిని కేటాయిస్తే అది ఇవాళ 191.71 ఎకరాలకే వచ్చింది. ఈ మధ్యలో భూమి సుమారు 50-60 ఎకరాలు మాయమైపోయింది. ఇది ఘోరమైన, బాధాకరమైన విషయం.ప్రైవేట్ వ్యక్తుల చేతులకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అప్పగించడం వల్ల.. తొలి ఏడాది ఇప్పటికే 700 సీట్లు కోల్పోయాం. రెండో సంవత్సరంలో 1750 కలిపి మొత్తం 2450 సీట్లను కోల్పోయాం. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి చేతులు జోడించి వినమ్రంగా వేడుకుంటున్నాను. దయచేసి ప్రైవేటు జపం ఆపేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రైవేటీకరణ వల్ల 2450 సీట్లలో మన ఆంధ్రరాష్ట్రంలో పేద విద్యార్ధులు వైద్య విద్యను అభ్యసించే అవకాశం కోల్పోయారు.మనస్సుతో చూడండి. ఆ గొప్ప మాకు వద్దు. ఆ 17 కళాశాలల క్రెడిట్ మీరే తీసుకుని, మీరే ప్రారంభించండి. రూ.1000 కోట్లు కేటాయించి మన బిడ్డల భవిష్యత్తు కోసం ఆ మెడికల్ కాలేజీల నిర్మాణం చేయండి. 2450 సీట్లు కోల్పోయిన వారందరూ ఈ రాష్ట్రంలో అన్ని కులాలకు చెందిన పేదలే ఉంటారు. దయచేసి ప్రైవేటీకరణను ఆపి, ఆ కాలేజీలను ప్రభుత్వ రంగంలో ఉంచండి. ప్రైవేటీకరణ అంశాన్ని రాజకీయ కోణంలో కాకుండా, సామాజిక కోణంలో చూడాల్సిన ఆవశ్యకత ఉంది.కోటి సంతకాలు పది కోట్లవడం ఖాయంరాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ళ పట్టాలివ్వాలని వైఎస్ జగన్ భావిస్తే.. అక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీలు వస్తే రాజధాని ప్రాంతంలో డెమొగ్రాఫికల్ ఇంబేలన్స్ వస్తుందన్న మహా ఘనుడివి.. అదే విషయాన్ని కోర్టుకు చెప్పిన ఘనుడివి నువ్వు చంద్రబాబూ. అలాంటి నువ్వు మా బిడ్డల చదువులు మీద ఉక్కుపాదం మోపుతుంటే.. ఈ కోటి సంతకాలు పదికోట్లవుతాయి. ఎలాంటి త్యాగాల చేసైనా.. ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలో ఉంచేందుకు పోరాటం చేస్తాం. వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్సీపీ శ్రేణులు కదం తొక్కడం ఖాయం.15వ తేదీనాటికి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల కోటి సంతకాలు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి వస్తాయి. 18వ తేదీన ఈ సంతకాలన్నీ గవర్నర్కి చేరుతాయి. ఈ లోగా నీ నిర్ణయం మార్చుకో చంద్రబాబూ?. కేసులు పెట్టి, తలలు పగలగొట్టి మమ్నల్ని భయపట్టాలని చూసే మీ ప్రయత్నాలు మమ్నల్ని ఆపలేవు. ప్రజా సమస్యల పోరాటంలో వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్సార్సీపీ శ్రేణులు అలు పెరగని పోరాటం చేయడం తథ్యమని తేల్చి చెప్పారు. కార్పొరేట్ శక్తులను పెంచిపోషించడమే మీ సిద్ధాంతం అయితే.. పేదవాడికి ఉచిత విద్య, వైద్యం అందించడం, ఇళ్ల పట్టా ఇవ్వడం, వారికి కడుపు నిండా అన్నం పెట్టడమే వైఎస్ జగన్ సిద్ధాంతమని.. మీ సిద్ధాంతాలకు, మా సిద్ధాంతాలకూ జరుగుతున్న పోరాటంలో మేం ఏ పోరాటానికైనా, త్యాగాలకైనా సిద్ధమేనని సుధాకర్ బాబు హెచ్చరించారు. -
ప్రైవేటు వ్యక్తులకు లాభాలు, పేదలపై భారమా?: సీదిరి
సాక్షి, శ్రీకాకుళం: పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణమే మేలంటూ ఎల్లోమీడియా రాతలు రాయడం అన్యాయం, దుర్మార్గమని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ డాక్టర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆక్షేపించారు. ‘‘గతంలో విశాఖపట్నం తూర్పు తీరంలో ఉండటం వల్ల తీవ్రవాద దాడులకు టార్గెట్, విదేశీ దాడులకు సాఫ్ట్ టార్గెట్ అని రాశారని, విశాఖ భూకంపాల జోన్లో ఉంది. హైరిస్క్ ఏరియా అని రాశారని, గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్ర మట్టాలు పెరిగిపోయి విశాఖ మునిగిపోతుంది, కాబట్టి రాజధానిగా చేయొద్దంటూ రాతలు రాశారని గుర్తు చేశారు.‘‘ఇప్పుడు విశాఖపట్నం అద్బుతం, ఇక్కడే సూర్యుడు ఉదయిస్తున్నాడు, బంగారం పండుతుంది, సిలికాన్ లభిస్తుంది, కాబట్టి ఇక్కడే పెట్టుబడులు పెట్టండి, చంద్రబాబు విజన్ వల్లే విశాఖ ఇలా మారిపోతుందని రాస్తున్నారు’’ అంటూ సీదిరి అప్పలరాజు దుయ్యబట్టారు. ప్రెస్మీట్లో ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..ఆ సంఘం సిఫార్సులంటూ పిచ్చిరాతలు:పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే పేదలకు మేలు జరుగుతుందని చంద్రబాబు ఏడాదిగా చెబుతున్నారు. ప్రైవేటు గుత్తాధిపత్యం ఎక్కువైతే ఏం జరుగుతుందో ఇండిగో వ్యవహారంలో చూశాం. మన ఎంపీ కేంద్రమంత్రిగా ఉండి ఏం చేశారో చూశాం. ప్రభుత్వ ఆస్పత్రులు, కాలేజీలు లేకపోతే మన పరిస్ధితి ఏంటో అంతా అలోచించాలి. వైద్య వ్యవస్థలు ప్రైవేటు చేతుల్లో ఉంటే కరోనా లాంటి విపత్తుల్లో ఏం జరిగి ఉండేదో ఆలోచించాలి.ఇప్పుడు పార్లమెంటరీ స్దాయీ సంఘం పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసిందంటూ పిచ్చి రాతలు రాస్తున్నారు. నిజానికి కమిటీ ఏం చెప్పిందన్నది చూస్తే.. మెడికల్ కాలేజీల నిర్వహణకు ఎవరైనా ముందుకొస్తే రాయితీలు ఇవ్వాలని, అర్హులైన విద్యార్ధులుంటే స్కాలర్ షిప్పులు ఇవ్వాలని, వైద్య విద్యలో సీట్లు పెంచడం తప్పనిసరి అని పార్లమెంటరీ స్థాయీ సంఘం చెప్పింది. వైద్య విద్య, సామాగ్రి ఖర్చు పెరిగిపోతున్న తరుణంలో పీపీపీ విధానంలో నిర్వహించే అంశం గురించి ఆలోచించాలని మాత్రమే సిఫార్సు చేసింది.అంతే తప్ప ఉన్నవాటిని పీపీపీ విధానంలో చేపట్టాలని ఎక్కడా చెప్పలేదు. అదే వాస్తవమైతే ఎయిమ్స్, జిప్ మర్, ఐఐటీ వంటి సంస్థలు కూడా పీపీపీ విధానంలో పెట్టుకోవాలి కదా?. ప్రైవేటువాళ్లు ముందుకొస్తే పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు చేపట్టాలని మాత్రమే పార్లమెంటరీ స్థాయీ సంఘం చెప్తే ఉన్న కాలేజీల్ని ప్రైవేటు చేతుల్లో పెడుతున్నారు.ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ ఆస్పత్రులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడం స్కాం, నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం, వెన్నుపోటే కాదు పేదల కలకల్ని తుంచేయడమే అవుతుంది. దీనికి తోడు ప్రైవేటు ఆస్పత్రుల్లో జీతాలు కూడా ప్రభుత్వమే రెండేళ్ల పాటు ఇస్తుందంటున్నారు. ఇలాంటి ఆఫర్లు ఎక్కడైనా విన్నామా ? భూములు, భవనాలు, ఆస్పత్రులు, మౌలిక సదుపాయాలు, జీతాలు ప్రభుత్వం ఇస్తుంటే లాభాలు ప్రైవేటుకు ఇచ్చి, భారం పేదలపై వేస్తారా? ఇదీ చంద్రబాబు చెప్తున్న పీపీపీ మోడల్. మొన్నటివరకూ పీపీపీ మోడ్ లో ఏర్పాటు చేసినా ప్రభుత్వం నిర్వహణ చూస్తుందన్నారు. అంటే జీతాలు ప్రభుత్వం ఇచ్చి లాభాలు ప్రైవేటు వ్యక్తులకు వెళ్లడమా ?, ఇది కొత్త మౌలిక సదుపాయాల కల్పన కాదు, ఉన్న వాటినే ప్రైవేటు చేతుల్లో పెట్టడం. మెడికల్ కాలేజీలు కొత్త వారు ఏర్పాటు చేస్తామంటే వారికి రాయితీలతో అవకాశం ఇవ్వండి. అంతే తప్ప మనం డబ్బులు పెట్టి, భూసేకరణ చేసి, భవనాలు కట్టి ప్రైవేటుకు లాభాలు ఇస్తారా ? ఇది మంచి విధానం అంటూ ఆస్థాన కరపత్రికలతో పొగడ్తలా ?జగన్కి పేరు వస్తుందనే ఇదంతా..:మొన్నే రెండు వారాల క్రితం అమరావతి కోసం రూ.7500 కోట్లు అప్పు చేశారు. నిన్న దాన్ని క్యాబినెట్లో ఆమోదించారు. 2027లో రానున్న గోదావరి పుష్కరాలకు రూ.5 వేల కోట్లు కేటాయిస్తున్నారు. కలల రాజధానిలో కి.మీ రోడ్డు వేసేందుకు రూ.180 కోట్లకు టెండర్ ఇచ్చారు. అలా మూడు కి.మీ రోడ్డు కోసం రూ.540 కోట్లకు టెండర్ ఇచ్చారు. రెండు, మూడు కిలోమీటర్ల రోడ్డు ఖర్చుతో ఒక మెడికల్ కాలేజీ పూర్తయిపోతుంది. కానీ మెడికల్ కాలేజీలు పెట్టడానికి డబ్బులు లేవంటున్నారు.పీపీపీ పేరుతో మెడికల్ కాలేజీలు దోచి పెడుతున్నారు:అసలు మెడికల్ కాలేజీలకు కొత్తగా డబ్బు తీసుకు రావాల్సిన అవసరం లేదు. వైఎస్ జగన్ హయాంలోనే నాబార్డ్ వంటి ఆర్థిక సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. నాబార్డ్ను సంప్రదిస్తే మెడికల్ కాలేజీలకు నిధులు దొరుకుతాయి. కొత్తగా అప్పులు చేయాల్సిన అవసరమే లేదు. కేవలం వైఎస్ జగన్కు పేరు వస్తుందనే దుగ్ద తప్ప ఇందులో మరొకటి లేదు. అందుకే వాటిని ప్రైవేటు వ్యక్తులకు, బినామీలకు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్క మెడికల్ కాలేజీలో ఉద్యోగుల నెల జీతాలకు రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. అలా ఏడాదికి రూ.60 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు అవుతుంది. 10 మెడికల్ కాలేజీలకు ఇలా ఇస్తే రూ.700 కోట్లు అవుతుంది. రెండేళ్లు ఇలా ఇస్తారా?. ఇది ఎంత వరకు సబబు?ఇంకా 10 మెడికల్ కాలేజీలకు సుమారు 257 ఎకరాలు సేకరించాం. ఒక్కో కాలేజీకి 50 ఎకరాల చొప్పున దోచి పెడుతున్నారు. కేంద్రం ఇచ్చిన పీజీ సీట్లు కూడా సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల కింద ప్రైవేటుకు ఇచ్చేశారు. ఎన్నారై సీటు ఫీజు రూ.29 లక్షలని జీవో కూడా ఇచ్చారు. మేనేజ్ మెంట్ కోటా సీటు రూ.9 లక్షలని ఇచ్చారు.రికార్డుస్థాయిలో అప్పు:అసలు ఈ ప్రభుత్వం ఎటు పోతోంది? డబ్బుల్లేవంటూనే 18 నెలల్లోనే రూ.2.66 లక్షల కోట్లు అప్పు చేశారు. రాష్ట్రానికి భారీ అప్పులు తెచ్చుకుంటూ మరోవైపు జగన్ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని చెప్పుకుంటున్నారు. అన్ని రంగాల్లోనూ రాష్ట్రాన్ని అధఃపాతాళానికి తీసుకెళ్తున్నారు.కోటి సంతకాలు గవర్నర్కి సమర్పణ:10 కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చర్యలపై ప్రజా ఉద్యమం చేపట్టిన వైయస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కొనసాగించింది. దానికి అన్ని చోట్ల, అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభించింది. ఆ కోటి సంతకాల పత్రాలు ఇప్పటికే జిల్లా కేంద్రాలకు చేరుకోగా, సోమవారం (డిసెంబరు 15వ తేదీ) అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నాం. అక్కణ్నుంచి అవి విజయవాడ చేరుకుంటాయి. ఆ పత్రాలను ఈనెల 18న గవర్నర్కి సమర్పిస్తాం. ఆ మేరకు ఆరోజు సా.4 గం.కు, మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్నజీర్తో భేటీ కానున్నారని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు వివరించారు. -
జగనన్న 2.0 పాలనలో ప్రతి కార్యకర్తకు గుర్తింపు
పులివెందుల: మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డు గంటమస్తాన్ వీధిలో అనుబంధ విభాగాల కోర్ కమిటీ సమావేశాన్ని వైఎస్సార్సీపీ వార్డు నాయకులు బండల మురళి, చంద్రమౌళిల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ ఇన్చార్జి వైఎస్ మనోహర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మాజీ చైర్మన్లు చిన్నప్ప, రసూల్, పట్టణ అధ్యక్షుడు హాలు గంగాధరరెడ్డి, పట్టణ ఉపాధ్యక్షుడు పార్నపల్లె కిశోర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగనన్న పాలనలో ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందన్నారు. వైఎస్సార్సీపీ పట్టణ అనుబంధాల కోర్ కమిటీ సమావేశాలు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిల ఆదేశాల మేరకు ఈ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. త్వరలో జరిగే ఎన్నికలలో గెలుపే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. ప్రతి నాయకులు, కార్యకర్త సైనికుల్లా పనిచేస్తేనే కూటమి నాయకుల కుట్రలను తిప్పి కొట్టవచ్చునన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను వార్డులోని ప్రజలకు వివరించాలన్నారు. 2.0 జగనన్న పాలనలో కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు. అలాగే పదవులు కూడా ఉంటాయన్నారు. కార్యక్రమంలో కమిటీలను నిర్వహించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు సోపాల వీరా, కనక, సంపత్, దశరథరామిరెడ్డి, రత్న, కిశోర్, మాబ్జాన్, బాషా, వినోద్, రమేష్, బాబు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. వేముల : గొందిపల్లె సమావేశంలో మాట్లాడుతున్న మండల ఇన్చార్జి నాగేళ్ల సాంబశివారెడ్డి , పెద్దముడియం : బీటిపాడులో ప్రసంగిస్తున్న ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పులివెందుల రూరల్ : గ్రామస్థాయి కమిటీలతో వైఎస్సార్సీపీ బలోపేతమవుతుందని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ భాస్కర్రెడ్డి, మార్కెట్ యార్డు మాజీ వైస్ చైర్మన్ సర్వోత్తమరెడ్డి, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు బలరామిరెడ్డిలు పేర్కొన్నారు. శనివారం పులివెందుల మండలం ఎర్రబల్లె పంచాయతీలోని కొత్తపల్లె గ్రామంలో గ్రామ కమిటీలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు బాల గంగిరెడ్డి, భాస్కర్రెడ్డి, రామమల్లేశ్వరరెడ్డి, ఉమేష్రెడ్డి, బాల ఓబుళరెడ్డి, గంగిరెడ్డి, చిన్న, మస్తాన్, ఎంపీటీసీ గంగన్న, రవీంద్రారెడ్డి, గుండాలయ్య, చంద్రమోహన్రెడ్డి, రామకృష్ణ, సూర్యుడు, రామచంద్ర, మనోహర్, వేణుగోపాల్ యాదవ్, రమేష్, అర్జున్, కృష్ణయ్య, రఫి, రజాక్, కొత్తపల్లె గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు. లింగాలలో.. లింగాల : ప్రస్తుతం మండలంలోని అన్ని గ్రామాల్లో వైఎస్సార్సీపీ గ్రామ, వార్డు కమిటీల నియామకం జరుగుతోంది. కమిటీలు వైఎస్సార్సీపీ బలోపేతానికి కృషి చేయాలని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బాబురెడ్డి అన్నారు. శనివారం మండలంలోని బోనాల గ్రామంలో గ్రామ కమిటీల ఏర్పాటుపై వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. 2029లో వైఎస్ జగన్మోహన్రెడ్డిని మళ్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు కమిటీలు అహరి్నశలు పనిచేయాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రైతు విభాగపు నియోజకవర్గ కన్వీనర్ సారెడ్డి చంద్రశేఖరరెడ్డి, అబ్జర్వర్ పి.శ్రీనివాసులరెడ్డి, ఐటీ వింగ్ సుదర్శన్రెడ్డి, సోషల్ మీడియా సుమంత్రెడ్డి, జగన్మోహన్రెడ్డి, బోనాల గ్రామ నాయకులు, సర్పంచ్ రాము కార్యకర్తలు పాల్గొన్నారు. వేములలో.. వేముల : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ పటిష్టతకు సంస్థాగత కమిటీలతో గ్రామస్థాయి నుంచే శ్రీకారం చుట్టారని ఆ పార్టీ మండల ఇన్చార్జి నాగేళ్ల సాంబశివారెడ్డి, జెడ్పీటీసీ కె.వెంకటబయపురెడ్డిలు పేర్కొన్నారు. మండలంలోని గొందిపల్లె గ్రామంలో శనివారం సంస్థాగత కమిటీల ఏర్పాటుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో ఏర్పాటు చేసే సంస్థాగత కమిటీలే పారీ్టకి పట్టుకొమ్మలన్నారు. గ్రామాల్లో ఏర్పాటయ్యే ఈ కమిటీలు ప్రతి మూడు నెలలకొకసారి సమావేశమై గ్రామ సమస్యలతోపాటు పార్టీ పటిష్టతపై చర్చించుకోవాలన్నారు. రాబోవు కాలంలో స్థానిక సంస్థలు, సాధారణ ఎన్నికలలో సంస్థాగత కమిటీలు క్రియాశీలకంగా పనిచేయాల్సి ఉంటుందన్నారు. జగన్ 2.0 పాలనలో కమిటీలకు అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మరకా శివకృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు చల్లా వెంకటనారాయణ, గంగిరెడ్డి, చంద్ర ఓబుళరెడ్డి, రాఘవరెడ్డి, ఆనంద్రెడ్డి, నాగేంద్రారెడ్డి, విజయభాస్కర్రెడ్డి, రామ్మోహన్రెడ్డి, ప్రకాష్రెడ్డ, శేషారెడ్డి, దేవేంద్రారెడ్డి, రామాంజనేయులు, ముసలయ్య, కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు. సింహాద్రిపురంలో.. సింహాద్రిపురం : మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిల ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి పర్యవేక్షణలో శనివారం సింహాద్రిపురం మండలం సుంకేసుల, బి.చెర్లోపల్లె, లోమడ గ్రామాల్లో వైఎస్సార్సీపీ సంస్థాగత కమిటీ సమావేశాలు నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అబ్జర్వర్లు, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ రామ్మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు బ్రహ్మానందరెడ్డి, నీలవర్థన్రెడ్డి, కె.భాస్కర్రెడ్డి, ద్వారకనాథరెడ్డి, ప్రసాద్రెడ్డి, లోమడ వైఎస్సార్సీపీ నాయకులు పవన్ చంద్రారెడ్డి, హృషికేశవరెడ్డి, జనార్థన్రెడ్డి, బషీర్, జయచంద్రారెడ్డి, దేవపుత్రారెడ్డి, రవిరెడ్డి, మల్లికార్జునరెడ్డి, రాజబాబు, వి.రాజా, వీరప్రసాద్, ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు నాగరాజు, భరత్రెడ్డి, శ్రీకాంత్, నారాయణరెడ్డి, జగదీశ్వరరెడ్డి, భార్గవ్రెడ్డి, అనిల్కుమార్రెడ్డి, రామకోటిరెడ్డి, సోమశేఖరరెడ్డి, చంద్రమౌళి, వివేకానందరెడ్డి, పరమేశ్వరరెడ్డి, మోహన్రెడ్డి, పార్థసారథిరెడ్డి, వెంకటనారాయణరెడ్డి, సురేష్, షబ్బీర్, మనోహర్రెడ్డి, కృపాకర్రెడ్డి, శాలివాహనరెడ్డి, శంకర్రెడ్డి, శివారెడ్డి, శివానందరెడ్డి, రాజశేఖరరెడ్డి, హాజివలి, గోవర్థన్రెడ్డి, తిరుమన్రెడ్డి, చంద్రహాసరెడ్డి, ఆయా గ్రామాల వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జమ్మలమడుగులో.. జమ్మలమడుగు : గ్రామ కమిటీలే పారీ్టకి బలమని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు. శనివారం పెద్దముడియం మండలంలోని బీటిపాడు, పాపాయపల్లె గ్రామాల్లో గ్రామ కమిటీల ఎంపిక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పనిచేసిన ప్రతి కార్యకర్తకు రాబోయే రోజుల్లో మంచి జరుగుతుందన్నారు. ఇప్పటికే గ్రామాల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమాన్ని గ్రామ స్థాయి ప్రజలనుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. పారీ్టలతో సంబంధం లేకుండా సంతకాలు చేశారన్నారు. కార్యక్రమంలో మండల పరిశీలకుడు జగదీశ్వరరెడ్డి, మండల కన్వీనర్ విష్ణువర్థన్రెడ్డి, గ్రామ సర్పంచ్ లక్షుమయ్య, రామలింగేశ్వరరెడ్డి, చౌడయ్య, వెంకటరామిరెడ్డి, గిరీష్రెడ్డి, విశ్నాథ్రెడ్డి, పాపాయపల్లె వెంకటసుబ్బారెడ్డి, చిట్టేపు విశ్వనాథ్రెడ్డి, రెండు గ్రామాల నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు. వీరపునాయునిపల్లెలో వీరపునాయునిపల్లె: మండలంలోని ఇందుకూరు గ్రామంలో గ్రామ కమిటీ అనుబంద విబాగాల కమిటీలు సర్పంచు వెంకటేసు ఆద్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల కన్వీనర్ రఘునాధరెడ్డి, స్థానిక నాయకులు గోపాల్రెడ్డి, రమేష్రెడ్డి, నందకుమార్రెడ్డి, రాంబాబు. జగన్, వీరపునాయునిపల్లె ఎంపీటీసి రాఘవ యాదవ్, వెంకటరామిరెడ్డి, గంగిరెడ్డి, శ్రీనివాసుల్రెడ్డి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. మైలవరంలో.. మైలవరం : వైఎస్సార్సీపీని బలోపేతం చేయడంతోపాటు రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జెండాలను గ్రామాలలో ఎగరడంతోపాటు మరోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డిని చేసుకుందామని స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు పొన్నపురెడ్డి గిరిధర్రెడ్డి అన్నారు. శనివారం పెద్దకొమెర్ల, కర్మలవారిపల్లె గ్రామ పరిధిలో ఉన్న గ్రామాల కార్యకర్తలతో ఆయన గ్రామ సభను నిర్వహించి మాట్లాడారు. గ్రామాలలో వైఎస్సార్సీపీ మరింత బలం పెరగాలన్నారు. అందుకోసం ప్రతికార్యకర్త మన ప్రభుత్వంలో చేసిన పనిని, ఇప్పటి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎంత వరకు అమలు చేశారు, అమలు కాని హామీల గురించి వివరించాలన్నారు. కష్టపడిన ప్రతికార్యకర్తకు రాబోయే రోజుల్లో మంచిగుర్తింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ ధన్నవాడ మహేశ్వరరెడ్డి, జడ్పీటీసీ మహాలక్ష్మీ, జిల్లా ప్రధాన కార్యదర్శి కొమెర్ల మోహన్రెడ్డి, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ శివగుర్విరెడ్డి, రామాంజనేయుల యాదవ్, వెంకటరెడ్డి, వెంకట్రామిరెడ్డి గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వేంపల్లెలో.. వేంపల్లె : మండలంలోని గిడ్డంగివారిపల్లె, బక్కన్నగారిపల్లె, వేంపల్లె 5వ ఎంపీటీసీ పరిధిలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ చంద్ర ఓబుళరెడ్డి, జెడ్పీటీసీ రవికుమార్రెడ్డిల ఆధ్వర్యంలో వార్డు, గ్రామ కమిటీ నియామక కోసం రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్సీపీలో గ్రామ కమిటీలదే కీలకపాత్ర అని తెలిపారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు మునీర్బాషా, రవిశంకర్గౌడ్, వైఎస్సార్సీపీ నాయకులు సింగారెడ్డి రామచంద్రారెడ్డి, మణిగోపాల్రెడ్డి, కటిక చంద్రశేఖర్, బాబా షరీఫ్, నిస్సార్ బాషా, ఎంపీటీసీ ఎం.హెచ్.హబీబుల్లా, బండల షుకూర్, బీఎస్ షేక్షావలి, సురేంద్ర, ముత్యాల రమేష్బాబు, మల్లయ్య, పద్మనాభరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
గిరిజన మహిళా మేయర్పై బాబు సర్కారు కుట్ర
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: దశాబ్దాల తర్వాత గిరిజన మహిళకు దక్కిన రాజ్యాధికారాన్ని చంద్రబాబు చిదిమేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు నగరపాలక సంస్థలో అత్యున్నత పదవి అయిన మేయర్గా ఓ గిరిజన మహిళకు అవకాశం కల్పించారు. ఇప్పుడు చంద్రబాబు సర్కారు నేతలు అనేకానేక కుట్రలకు పాల్పడి, మేయర్ను, ఆమె కుటుంబ సభ్యులను, కార్పొరేటర్లను పైశాచికంగా వేధించి, చివరకు ఆ పదవి నుంచి గిరిజన మహిళా మేయర్ను తప్పించారు. ఇందుకోసం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి చేసిన వికృత రాజకీయం రాష్ట్రాన్ని నివ్వెరపరిచింది. నాలుగేళ్ల క్రితం జరిగిన నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం 54 డివిజన్లలో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. టీడీపీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గిరిజన మహిళ అయిన పోట్లూరు స్రవంతిని అత్యున్నతమైన మేయర్ పీఠంపై కూర్చోబెట్టారు. నెల్లూరు నగర పాలక సంస్థను అభివృద్ధి పథంలో నడిపించారు. అవినీతి, అక్రమాలకు తావులేకుండా పాలన సాగించారు. బాబు ప్రభుత్వం రాగానే కుట్ర చంద్రబాబు ప్రభుత్వం రాగానే మేయర్ పదవిని చేతిలోకి తీసుకొని, దోపిడీ చేయాలని మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కుట్ర పన్నారు. నగర మేయర్ను అధికార పార్టీలోకి తీసుకోవాలని ప్రయతి్నంచారు. అధికార పార్టీలోకి రాలేదన్న కారణంతో పాటు తాము చెప్పిన చోట సంతకాలు చేయలేదన్న అక్కసుతో మేయర్ కుటుంబాన్ని అష్టకష్టాలు పెట్టారు. రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం పూర్తి కాలం పదవిలో కొనసాగనీయకుండానే ఆమెను పదవి నుంచి దింపేసి, మంత్రి నారాయణకు అనుకూలుడైన కార్పొరేటర్కు ఆ పదవి కట్టబెట్టేందుకు కుట్రలకు తెగబడ్డారు. ఇందుకోసం రూ.10 కోట్లు ఖర్చు చేయడానికి కూడా వెనుకాడలేదు. మేయర్ పీఠంపై డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ను కూర్చోబెట్టేందుకు కార్పొరేటర్లకు తాయిలాలు ఎరవేశారు. కార్పొరేటర్లు లొంగకపోవడంతో వేధింపులు, అరాచకాలకు తెరతీశారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై అక్రమ కేసులు, వ్యాపారాలను టార్గెట్ చేస్తూ బెదిరించి 40 మందికి పైగా కార్పొరేటర్లను టీడీపీలో చేర్చుకున్నారు. మేయర్ కుటుంబాన్ని కూడా టార్గెట్ చేయడంతో వైఎస్సార్సీపీకి రాజీనామా చేసి తటస్థంగా ఉండాల్సి వచ్చింది. అధికార పార్టీ చెప్పిన విధంగా ఉండాలని రాయబేరాలు చేసినా మేయర్ ససేమీరా అనడంతో మంత్రి, ఎమ్మెల్యే ఆమె కుటుంబాన్ని టార్గెట్ చేశారు. 18 నెలలుగా ఆమెను, ఆమె కుటుంబాన్ని రౌడీమూకలతో బెదిరించారు. కార్పొరేషన్ పరిధిలో భవనాల మార్టిగేజ్ విషయంలో ఫోర్జరీ సంతకాలు చేశారని, కార్పొరేషన్ ఉద్యోగులపై దౌర్జన్యాలు చేశారంటూ పలు అక్రమ కేసులతో మేయర్ భర్త జయవర్దన్ను జైలుపాలు చేశారు. మేయర్ను సోషల్ మీడియాలో మానసికంగా వేధించారు. కార్పొరేషన్లో మేయర్కు దక్కాల్సిన కనీస సౌకర్యాలు కూడా లేకుండా చేశారు. అడుగడుగునా అవమానాలకు గురి చేశారు. మేయర్ అన్నింటినీ భరిస్తూ వచ్చారు. చివరకు ఆమెపై అవిశ్వాసం పెట్టడానికి నిర్ణయించారు. అవిశ్వాసానికి సహకరించాలని కార్పొరేటర్లపైనా వేధింపులు, బెదిరింపులు మితిమీరాయి. తమకు మద్దతు పలకని కార్పొరేటర్లను పోలీసులతో కిడ్నాప్ చేయించి క్యాంపు రాజకీయాలకు దిగారు. కార్పొరేటర్లకు తాయిలాలు ప్రకటించి తమ గెలుపు ఖాయమని ధీమాగా ఉన్న తరుణంలో మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్ టీడీపీలోకి ఫిరాయించిన ఐదుగురు కార్పొరేటర్లను తిరిగి వైఎస్సార్సీపీలో చేర్పించి, ఝలక్ ఇచ్చారు. ఈ పరిణామాలతో టీడీపీ గంగవెర్రులెత్తిపోయింది. క్యాంపు రాజకీయాలకు తెరతీసింది. ఒక్కో కార్పొరేటర్కు రూ.40 లక్షలు ఇచ్చి క్యాంపులకు తరలించారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను సైతం తాయిలాలతో పాటు అక్రమ కేసులతో బెదిరించి టీడీపీ కండువా కప్పారు. వైఎస్సార్సీపీ మహిళా కార్పొరేటర్లను కూడా అసభ్య పదజాలాలతో బెదిరించారు. వారి కుటుంబాలను సైతం టార్గెట్ చేశారు. దీంతో మేయర్ స్రవంతి తన వల్ల మహిళా కార్పొరేటర్లు పడుతున్న బాధకు చలించి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. -
15న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలను విజయవంతం చేయాలి: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ఈ నెల 15న జిల్లా కేంద్రాల్లో జరిగే ర్యాలీలను విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన ఆ పార్టీ అధికార ప్రతినిధులు, రాష్ట్ర కార్యదర్శులు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికారిక ప్రతినిధులు, జిల్లా అనుబంధ విభాగ అధ్యక్షులు, అసెంబ్లీ అనుబంధ విభాగ అధ్యక్షులు. జనరల్ కార్పొరేషన్ చైర్పర్సన్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమ స్ఫూర్తితో కొనసాగిందన్నారు. ఇది ఇప్పుడు తుది అంకానికి చేరుకుందని.. లక్ష్యానికి మించి సంతకాల సేకరణ కార్యక్రమం కొనసాగిందని సజ్జల వివరించారు.‘‘గ్రామాలు, వార్డుల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ ప్రజల మద్దతు కూడగట్టాం. ఇప్పటికే సంతకాలు చేసిన పత్రాలను నియోజకవర్గ కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు తరలించారు. ఈ మహాయజ్జంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలను వైఎస్ జగన్ ప్రత్యేకంగా అభినందించారు...వైద్య విద్యను అభ్యసించి, ప్రజలకు వైద్య సేవలు అందించాలనుకుంటున్న పేద విద్యార్థుల స్వప్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమాధి చేస్తోంది. ఈ దిశగా ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించేందుకు చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయంపై వైఎస్ జగన్ ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఆయన రూపొందించిన ఉద్యమాలకు ప్రజల నుంచి, పార్టీ శ్రేణుల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. ఇప్పటికే చలో మెడికల్ కాలేజీ ఉద్యమాన్ని నిర్వహించగా, దీనికి కొనసాగింపుగా నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది...గ్రామగ్రామాన, పట్టణాల్లోని డివిజన్లలోనూ కొద్ది రోజులుగా రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వలన కలిగే నష్టాలను ప్రజలకు వివరిస్తూ సంతకాలు సేకరించారు. ఇందులో భాగంగా కోటి సంతకాల సేకరణను ఉద్యమ స్ఫూర్తితో నిర్వహించారు. దీనికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. సంతకాల సేకరణలో వివిధ గ్రామాల నేతలు ఒకరితో మరొకరు పోటీ పడ్డారు. అందుకే ఒక్కో నియోజకవర్గంలో 50 వేల నుంచి 60 వేల సంతకాల సేకరించాలనేది పెద్ద లక్ష్యంగా కాకుండా అంతకుమించి సేకరించగలిగాం...పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా పార్టీలో అన్ని స్థాయిల నేతలతో పాటు అనుబంధ విభాగాల ప్రతినిధులు కూడా ఎక్కడికక్కడ రెట్టించిన ఉత్సాహంతో సంతకాల సేకరణ ముమ్మరంగా చేశారు. పట్టణాలు, నగరాల్లో అయితే డివిజన్లను క్లస్టర్లుగా విభజించి, పార్టీ నేతలంతా బాధ్యతలు పంచుకుని మరీ సంతకాల సేకరణ చేశారు. మీ అందరి కష్టం, శ్రమను వైఎస్ జగన్ ప్రత్యేకంగా అభినందించారు.ఇక కోటి సంతకాల కార్యక్రమం తుది దశకు చేరుకుంది. పార్టీ నాయకత్వమంతా కూడా ఈ నాలుగు రోజుల పాటు మీ ఫోకస్ అంతా దీనిపైనే ఉండాలి. ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలి. 15న జిల్లా కేంద్రం నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపే రోజు ర్యాలీలతో జిల్లా కేంద్రాలు హోరెత్తాలి. అనంతరం అక్కడి నుంచి కోటి సంతకాలు ఉన్న ప్రత్యేక వాహనాలను పార్టీ నాయకులు జెండా ఊపి ప్రారంభించాలి. 18 సాయంత్రం 4 గంటలకు గవర్నర్ను వైఎస్ జగన్, ముఖ్యమైన నాయకులు కలిసి అందజేస్తారు. ప్రతి ఒక్కరూ సొంత కార్యక్రమంలా భావించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా చర్చించుకునేంత స్ధాయిలో విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.టెలి కాన్ఫరెన్స్ చివరిలో పార్టీ సెంట్రల్ ఆఫీస్ ఇంఛార్జ్ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా వైఎస్సార్సీపీ అలుపెరుగని పోరాటాలు చేస్తోందన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైయస్ఆర్సీపీని లేకుండా చేయాలన్న కూటమి కుట్రలను అధిగమిస్తూ యువత, ఉద్యోగులు, మహిళలు, కార్మికుల పక్షాన పోరాడుతున్నాం. వ్యవసాయం, విద్య, వైద్యం, వ్యాపారం.. ఏ వర్గానికి ఆపదొచ్చిన వారి పక్షాన నిలబడి వైఎస్సార్సీపీ గళమెత్తుతోంది. ఆయా వర్గాల సమస్యలను పరిష్కరించే దిశగా ఏడాదిన్నరగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై నినదిస్తూనే ఉన్నాం.అందులో భాగంగానే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణతో వైఎస్సార్సీపీ ఒక పెద్ద ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించింది. చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కాపాడుకునేందుకు వైఎస్సార్సీపీ తలపెట్టిన ఉద్యమానికి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి పెద్ద ఎత్తున మద్దతు పలికారు. చంద్రబాబు తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోటి మందికి పైగా ప్రజలు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే సంతకాలు చేశారు. ఇకనైనా చంద్రబాబు తన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలి. -
ఆరు నూరు కాదు.. నూరు ఆరు కాదు.. పెమ్మసానికి అంబటి దిమ్మతిరిగే కౌంటర్
-
చంద్రబాబు చేసిన అప్పులు ఏమవుతున్నాయి?: కన్నబాబు
సాక్షి, కాకినాడ జిల్లా: రాష్ట్రాన్ని కూటమి సర్కార్ అప్పులకుప్పగా మార్చిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర అప్పులపై ప్రజలకు చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్ర అప్పులపై టీడీపీ నేతలు దుర్మార్గంగా ప్రచారం చేశారన్నారు.‘‘ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు అప్పులు చేస్తున్నారు. టీడీపీ నేతలకు వైఎస్ జగన్ సీఎంగా ఉంటే ఒక రాజ్యాంగం.. చంద్రబాబు సీఎంగా ఉంటే మరో రాజ్యాంగం ఉంటుందా?’’ అంటూ కన్నబాబు ప్రశ్నించారు. వైఎస్ జగన్ చేసిన అప్పులపై రాష్ట్రం శ్రీలంక అవుతోందని గ్లోబెల్ ప్రచారం చేశారు. చంద్రబాబు ఈ 18 నెలల కాలంలో రూ.2,66,175 కోట్లు అప్పు చేశారు. జగన్ అప్పు చేస్తే శాపం అని.. చంద్రబాబు చేస్తే వరం అని సొంత మీడియా బాకా కొట్టుకుంటుంది...కోవిడ్ వంటి కష్టకాలంలో వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు ఆపలేదు. చెప్పిన అబద్దం చెప్పకుండా వైఎస్ జగన్పై పచ్చి అబద్దాలను ప్రజల చెవుల్లోకి ఎక్కించారు. చంద్రబాబు తెచ్చిన అప్పులు ప్రజల సొమ్ముల్లో వేశారా అంటే? అదీ లేదు. రూ.5,400 కోట్లు ఎక్సైజ్ భవిష్యత్తు ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చారు. ఏపీ బేవరేజ్ ద్వారా అప్పు తీసుకురావాలని వైఎస్ జగన్ భావిస్తే.. కేంద్రానికి లేఖ రాసి, కోర్టులో కేసులు వేశారు. వైఎస్ జగన్ చేసిన అప్పులు రాజ్యంగ విరుద్దం అన్నారు. ఇప్పుడు అవే అప్పులు మీరు చేస్తుంటే రాజ్యాంగం ఏమైనా మారిందా?..చంద్రబాబు చేసే అప్పులకు ఏపీ సౌత్ సూడాన్లా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ 18 నెలల కాలంలొ చంద్రబాబు చేసిన అప్పు.. వైఎస్ జగన్ చేసిన అప్పుకంటే 80 శాతం ఎక్కువ. చంద్రబాబు చేసిన అప్పులు ఏమవుతున్నాయి?. చంద్రబాబు చేసిన అప్పులు సంపద సృష్టి ఎలా అయ్యింది?. చంద్రబాబు లేకపోతే రాష్ట్రం అదోగతి అయిపోతుందని ఒక కుట్రపూరిత ప్రచారం జరుగుతుంది. పరిమితికి మించి అప్పులు చేయమని చంద్రబాబుకు ఏ చట్టం చెప్పింది. అమరావతి కోసం మరో 7,8 వేల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. మీరు చేస్తున్న అన్యాయాలపై ఎవరైనా ప్రశ్నిస్తే.. రెడ్ బుక్ ద్వారా కేసులు పెడతారు. రోడ్డు మీద గోతులు పూడ్చడం లేదు కానీ.. గ్రోత్ ఇంజన్లు, గ్రోత్ కారిడార్ల కోసం మాట్లాడుతున్నారు’’ అంటూ కురసాల కన్నబాబు దుయ్యబట్టారు. -
‘టీడీపీకి బలముంటే మా కార్పొరేటర్లను కిడ్నాప్ చేయటం ఎందుకు?’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు రాజకీయాలన్నీ హోటల్స్లో రహస్యంగా జరుగుతాయని.. పైరవీలు, ప్రలోభాలన్నీ అక్కడే చేయిస్తుంటారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నెల్లూరు కార్పొరేషన్ వ్యవహారాన్ని కూడా పాండిచ్చేరిలో హోటల్కు చేర్చారన్నారు. నెల్లూరు 54 డివిజన్లలో మొత్తం వైఎస్సార్సీపీనే గెలుపొందిందని.. అలాంటి చోట ఏమాత్రం బలం లేకున్నా ఎలా గెలవాలని చూస్తున్నారు?’’ అంటూ నాగార్జున యాదవ్ ప్రశ్నించారు.‘‘మా పార్టీ బీఫామ్ మీద గెలిచిన వారిని టీడీపీ వైపు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని బెదిరింపులకు దిగారు. రాజ్యాంగబద్దంగా అవిశ్వాస తీర్మానం మీద ఎన్నిక జరిగితే వైఎస్సార్సీపీనే గెలుస్తుంది. కిడ్నాప్లు చేయటానికి ఖాకీలను వాడుకుంటున్నారు. పోలీసులు ఖాకీ క్యాబ్ సర్వీసులుగా మారారు. కొందరు పోలీసులు బిఎన్ఎస్ చట్టాలు అంటే 'బాబు అన్యాయ సంహిత' చట్టాలుగా మార్చారు’’ అంటూ నాగార్జున యాదవ్ దుయ్యబట్టారు.‘‘టీడీపీకి బలం ఉంటే మా కార్పొరేటర్లను కిడ్నాప్ చేయటం ఎందుకు?. అవిశ్వాస తీర్మానంలో టీడీపీ నైతికంగా ఆల్రెడీ ఓడిపోయింది. అధికార బలం ఎల్లవేళలా పని చేయదు. చంద్రబాబు అనైతిక రాజకీయాలకు ప్రజలు చెక్ పెట్టే రోజు వస్తుంది’’ అని నాగార్జున యాదవ్ పేర్కొన్నారు. -
ప్రజా పాలన ఎలా చేయాలో చంద్రబాబు తెలుసుకోవాలి
సాక్షి, ఏలూరు: వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, కార్పొరేటర్లు పాల్గొన్నారు. దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ జరిగింది. అక్టోబర్ 10వ తేదీ నుండి ప్రతి నియోజకవర్గంలో ఉద్యమంలా సాగిన ఈ కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 4 లక్షల 25 వేల సంతకాలు సేకరించగా, రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాలు దాటాయి. ఈ నెల 15వ తేదీన కోటి సంతకాల ప్రతులను పార్టీ నాయకులు, అభిమానులతో కలిసి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపనున్నాము. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లాలోని ప్రతీ వైసీపీ నాయకులు, ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రజా నిర్ణయానికి వ్యతిరేకంగా టీడీపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకుంది. మరో 6 కోట్లు ఖర్చు చేస్తే మిగిలిన మెడికల్ కాలేజీలు పూర్తవుతాయి. 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకోవడం కాదు, ప్రజా పాలన ఎలా చేయాలో చంద్రబాబు తెలుసుకోవాలి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కరోనా కష్టకాలం వచ్చినా సంక్షేమ పథకాలు మాత్రం ఆగలేదు. తూర్పు నియోజకవర్గంలో 600 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయి. మళ్ళీ ఎన్నికలు ఎప్పుడూ వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రజా ప్రభుత్వాన్ని గెలిపించుకోడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ నెల 18వ తేదీన రాష్ట్ర గవర్నర్కు కోటి సంతకాలను మాజీ సీఎం వైఎస్ జగన్ అందజేయనున్నారని అవినాష్ వెల్లడించారు. -
రెడ్జోన్లో కూటమి 80 శాతం ఎమ్మెల్యేలు: ధర్మాన
సాక్షి, శ్రీకాకుళం: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు చేసిందేమీలేదన్నారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. బాబు పేదల భూములు లాక్కుని ధనవంతులకు ఇచ్చారని ఆరోపించారు. బ్రిటీష్ పాలన తర్వాత వైఎస్ జగన్ మళ్లీ భూముల రీసర్వే చేపట్టారని ధర్మాన చెప్పుకొచ్చారు.మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘రెవెన్యూ డిపార్ట్మెంట్పై సమీక్ష చేయడానికి సీఎం చంద్రబాబుకు ఏడాది కాలం పట్టింది. సంస్కరణలు తెచ్చాం అని చంద్రబాబు అంటున్నారు. 2019లో జగన్ వచ్చే వరకు పేదల భూములకు ఎవరూ ఎలాంటి సంస్కరణలు తేలేదు. ఏది ఎవరి భూమి అనేది గుర్తించలేని పరిస్థితి. దశాబ్దాల తరబడి ఉన్న భూములను కారు చౌకగా అమ్మేసిన పరిస్థితి ఉండేది. 2019లో వచ్చిన జగన్ ప్రభుత్వం పెద్ద ఎత్తున రెవెన్యూ సంస్కరణలు తెచ్చింది. 2012కి ముందు ఉన్నవారికి చుక్కల భూమి పట్టాలు ఇవ్వటం జరిగింది. దీని వల్ల పేదలకు భూ హక్కులు వచ్చాయి. లాభం చేకూరింది. బ్యాంకు లోన్లు వచ్చాయి. ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది.1952 తర్వాత మళ్ళీ 2019లో జగన్ భూ సంస్కరణలు తెచ్చారు. భూ సంస్కరణల కోసం తమిళనాడు,కర్ణాటక వెళ్ళి స్టడీ చేశాం. ఏడాదిన్నర అయింది. దాన్ని మీరు ఆపారు. జగన్ తప్ప భూముల విషయంలో బీదలకు అనుకూలంగా చంద్రబాబు ఒక్క నిర్ణయం అయిన చేయగలిగారా?. చంద్రబాబు ఇతరుల వద్ద భూములు లాక్కొని ధనవంతులకు ఇచ్చారు. వైఎస్ జగన్ తెచ్చిన సంస్కరణలు అన్ని పేదలకు మేలు చేశాయి. వాటిని మభ్యపెట్టి ఎన్నికల్లో మీరు లబ్ధి పొందారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు భూములు అన్ని 22Aలో పెట్టి గందరగోళానికి గురి చేశారు. మేము వాటిని సరిచేద్దాం అంటే కేసులు పెట్టి అధికారులను ఎంత భయపెట్టారు. ఎంఆర్వో కార్యాలయాలు ఎమ్మెల్యేల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. 80 శాతం ఎమ్మెల్యేలు రెడ్ జోన్లోకి వెళ్ళిపోయారు. నాలుగోసారి సీఎం అయిన చంద్రబాబు ప్రజలకు ఏం మేలు చేస్తున్నారు. సంస్కరణలు మీరు చేయలేరు. చేసిన సంస్కరణలను తప్పుడు మార్గంలో భూతద్దంలో చూపిస్తున్నారు అని మండిపడ్డారు. -
ఇదిగో మీ 2,270 రూపాయల బ్యాగ్.. కమిషన్ కి కక్కుర్తి పడితే ఇలానే ఉంటుంది
-
ఒక్కో కార్పొరేటర్కు రూ.40 లక్షలు..?
మేయర్ స్రవంతిపై పెట్టిన అవిశ్వాసం రసకందాయంలో పడింది. అధికార, అర్థబలముంది.. ఇక తమకు తిరుగులేదని నిన్నటి వరకు బీరాలు పలికిన టీడీపీకి ఐదుగురు కార్పొరేటర్లు ఝలక్ ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వారు చేరడంలో సైకిల్ పార్టీకి మైండ్ బ్లాకైంది. ఉన్న వారు చేజారిపోతారనే ఆందోళనతో కలవరపాటుకు గురై క్యాంప్ రాజకీయాలను స్టార్ట్ చేసింది. తాయిలాలతో పాటు విందు, వినోదాలనూ ఏర్పాటు చేశారనే టాక్ సింహపురిలో గుప్పుమంటోంది. మొత్తమ్మీద నో కాన్ఫడెన్స్ మోషన్ ప్రక్రియ టీడీపీ కాన్ఫడెన్స్ ను దెబ్బతిస్తోంది.సాక్షి పొలిటికల్ టాస్్కఫోర్స్: అవిశ్వాసం.. ఈ పదం వింటే సింహపురిలో టీడీపీ నేతలు వణికిపోతున్నారు. మేయర్పై ఈ నెల 18న జరగనున్న ఈ ప్రక్రియలో విజయం నల్లేరుపై నడక అని నిన్నామొన్నటి వరకు అంతా భావించారు. అయితే సీన్ కట్ చేస్తే పరిణామాలు గురువారం అత్యంత వేగంగా మారిపోయాయి. ఆ పార్టీలో ఇమడలేక.. అవమానాలను తట్టుకోలేక ఐదుగురు గుడ్బై చెప్పి మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ పరిణామంతో మంత్రి నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. దీంతో తమ కుట్రలకు తెరలేపి తాడేపల్లిలో ఒక కార్పొరేటర్తో పాటు మరొకరి కుమారుడ్ని కిడ్నాప్ చేయించారు. ఆపై వారిని బెదిరించి టీడీపీ కండువాలు కప్పి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. మరోవైపు గతంలో ఎన్నడూ లేని విధంగా క్యాంప్ రాజకీయాలకు తెరలేపారు. నాడు విస్మరణ.. నేడు ప్రాధేయపడుతూ.. వాస్తవానికి నాలుగేళ్ల క్రితం జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 54 డివిజన్లకు గానూ అన్నింటినీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే గతేడాదిలో కొలువుదీరిన టీడీపీ సర్కార్.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పోకడను అవలంబించింది. ఈ క్రమంలో 40 మంది కార్పొరేటర్లను ప్రలోభాలను గురిచేసి తమ పంచన చేర్చుకుంది. ఈ తరుణంలో సైకిలెక్కిన వారిని నిన్నామొన్నటి వరకు చీపురుపుల్లల్లా మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి తీసేశారు. అయితే ఇప్పుడు వారు అవసరం కావడంతో బుజ్జగింపుల పర్వానికి తెరలేపారు. ఇదే అదునుగా కొందరు రేటును ఫిక్స్ చేసి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. అనిల్ రంగప్రవేశంతో సీన్ రివర్స్ వాస్తవానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మేయర్ స్రవంతి రాజీనామా చేసి తటస్థంగా ఉన్నారు. దీంతో అవిశ్వాసానికి ఆ పార్టీ దూరంగా ఉండింది. ఈ తరుణంలో టీడీపీ వ్యవహార శైలికి అడ్డుకట్టేయాలని భావించిన మాజీ మంత్రి అనిల్కుమార్యాదవ్ రంగంలోకి దిగారు. కార్పొరేటర్లను తిరిగి పార్టీలో చేరి్పంచడంతో నివ్వెరపోవడం నెల్లూరు సిటీ, రూరల్ ఎమ్మెల్యేల వంతైంది. దీంతో మరికొందరు చేజారి పోకుండా క్యాంపులకు తరలించారు. క్యాషే.. క్యాషునిన్నామొన్నటి వరకు కార్పొరేటర్లను లెక్కచేయలేదు. ఈ తరుణంలో అనిల్ రంగప్రవేశంతో వీరికి డిమాండ్ అమాంతం పెరిగింది. మంత్రి, ఎమ్మెల్యే రంగంలోకి దిగి.. కండువాలు మార్చకండంటూ ప్రాధేయపడటాన్ని ప్రారంభించారు. తాయిలాలనూ ఎరేశారు. ఒక్కో కార్పొరేటర్కు రూ.25 లక్షల వరకు ఆఫర్ ఇచ్చి క్యాంపునకు తరలించే వాహనమెక్కించారు. సందట్లో సడేమియాగా నెల్లూరు సిటీకి చెందిన ఒకరు రూ.40 లక్షలను డిమాండ్ చేశారనే చర్చ స్టార్టయింది. కొసమెరుపేమిటంటే ఈ మొత్తాన్ని ముందే ఇస్తేనే వాహనమెక్కుతానని స్పష్టం చేయడంతో ఆయన అడిగినంత మేర సమర్పించారనే టాక్ నడుస్తోంది. దీంతో ఆయన క్యాంపునకు సై అన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదిఏమైనా కార్పొరేటర్ల గొంతెమ్మ కోర్కెలు తీర్చలేక నారాయణ, కోటంరెడ్డి సతమతమవుతున్నారని పలువురు నవ్వుకుంటున్నారు. -
కార్పొరేటర్లను కిడ్నాప్ చేసిన పచ్చ పోలీసులు..!
-
టీడీపీ నేతల అరాచకం.. నెల్లూరులో కార్పొరేటర్ తండ్రి కిడ్నాప్
చిల్లకూరు: నెల్లూరు జిల్లాలో అధికార టీడీపీ నేతల అరాచకం, దౌర్జన్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. సొంత గూటికి వెళ్లారన్న అక్కసుతో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు బెదిరింపులు మితిమీరాయి. టీడీపీలోనే కొనసాగాలంటూ తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు. నెల్లూరు కార్పొరేషన్ 34వ వార్డు కార్పొరేటర్ ఫమీదా గురువారం వైఎస్ జగన్ చేతుల మీదుగా వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్న నేపథ్యంలో కొందరు ఆమె తండ్రి సయ్యద్ నజీర్ను కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. తిరుపతి జిల్లా వాకాడు బీసీ కాలనీకి చెందిన సయ్యద్ నజీర్ వైఎస్సార్సీపీలో చురుగ్గా వ్యవహరించడంతో పాటు బతుకుదెరువు కోసం పొట్టేళ్ల వ్యాపారం చేస్తున్నాడు. కుమారుడు బెంగళూరులో ఉండగా, కుమార్తె ఫమీదాకు పెళ్లి చేసి నెల్లూరు పంపారు. అక్కడ ఆమె వైఎస్సార్సీపీ కార్పొరేటర్గా విజయం సాధించింది. చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత అక్కడి నాయకుల ఒత్తిడితో ఆమె పార్టీ మారారు. అయితే ఆ పార్టీలో ఇమడలేక రెండు రోజుల క్రితం ఆమె వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. దీంతో అధికార పార్టీ నాయకులు ఆమెను ఒత్తిడికి గురిచేసే క్రమంలో గురువారం సాయంత్రం మసీద్ నుంచి ఆమె తండ్రి ఇంటికి తిరిగి వస్తుండగా బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. కారులో నలుగురు వచ్చారని, వారిలో ఒకరు పోలీసు దుస్తుల్లో ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. అంతకు ముందు వారు నజీర్ అనే టీ కొట్టు వ్యక్తిని పట్టుకుని కారులో ఎక్కించుకొని కొన్ని వివరాలు అడిగారు. తాను మీరనుకుంటున్న నజీర్ను కాదని చెప్పడంతో అతడ్ని వదిలేసి.. ఫమీదా తండ్రి నజీర్ ఎక్కడున్నాడో కనుక్కుని బలవంతంగా తీసుకెళ్లారు. చీకటి పడినప్పటికీ నజీర్ ఇంటికి రాక పోవడంతో కుటుంబ సభ్యులు పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డికి సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన శుక్రవారం వాకాడుకు చేరుకుని అన్ని రకాలుగా విచారించాక, నజీర్ కిడ్నాప్నకు గురయ్యారని సీఐ హుస్సేన్బాషాకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం రాత్రి వరకు ఆయన ఆచూకీ తెలియలేదు. -
ఖాకీలా.. కిడ్నాపర్లా!
సాక్షి టాస్క్ఫోర్స్: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఖాకీలు అధికారిక కిరాయి గూండాల్లా, కిడ్నాపర్లుగా వ్యవహరిస్తున్నారు. ఖాకీ చొక్కాలు వదిలేసి పసుపు చొక్కాలు తొడిగేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల ఆదేశాలనే చట్టాలుగా మార్చేసి నెల్లూరు నవాబుపేట పోలీసులు రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ బీఫారంపై గెలిచిన కార్పొరేటర్లను టీడీపీ అధికారంలోకి రావడంతో బెదిరించి పచ్చ కండువా కప్పారు.అయితే ఆ పార్టీలో ఇమడలేక.. అధికార పార్టీని ఎదురించి తిరిగి సొంత గూటికి చేరేందుకు సిద్ధపడిన కార్పొరేటర్లపై మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ పోలీసులను పురమాయించి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఆ కార్పొరేటర్లు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో తిరిగి సొంత గూటికి చేరుతున్నారనే సమాచారంతో మంత్రి, ఎమ్మెల్యే ఆదేశాలతో ఖాకీలు నెల్లూరు నుంచి తాడేపల్లికి చేరుకున్నారు.వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయం నుంచి వారు బయటకు రాగానే కిరాయి కిడ్నాపర్ల మాదిరిగా ప్రైవేట్ వాహనాలను అడ్డుపెట్టి, బలవంతంగా వారి వాహనంలో ఎక్కించుకుని వెళ్లారు. వారి వద్ద ఉన్న ఫోన్లను లాక్కొని, ఎక్కడికి తీసుకెళ్తున్నారో వారి కుటుంబ సభ్యులకు సైతం సమాచారం అందకుండా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని పోలీస్స్టేషన్లు తిప్పుతూ చిత్ర హింసలకు గురిచేశారు. చివరకు తాము టీడీపీలోనే కొనసాగుతున్నామంటూ వీడియోలు రిలీజ్ చేయించి, వారిని టీడీపీ నేతలకు అప్పగించి వచ్చారు. కేసుల పేరుతో అదుపులోకి..నెల్లూరు పోలీసుల ముందు ప్రొఫెషనల్ కిడ్నాపర్లు, గూండాలు కూడా దిగదుడుపేనని ఈ ఘటన రుజువు చేస్తోంది. అధికార పార్టీ నేతలు చెబితే పోలీసులు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష పార్టీ నేతలను హింసించడంలో కిరాయి గూండాల్లా వ్యవహరిస్తున్నారు. ఎంపీపీలు, మున్సిపాలిటీ చైర్మన్లు, కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులను బెదిరించి, అధికార పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఓట్లు వేయించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలో మాట వినని వారిని కేసుల పేరుతో అదుపులోకి తీసుకోవడం.. గంజాయి కేసులు, నకిలీ మద్యం కేసులు పెడతామని బెదిరింపులకు గురిచేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.తాడేపల్లి నుంచి అదృశ్యంనెల్లూరు కార్పొరేషన్లోని మొత్తం 54 డివిజన్లలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. టీడీపీ ఒక్క డివిజన్లో కూడా గెలవలేదు. అయితే టీడీపీ అధికారంలోకి రాగానే కార్పొరేటర్లను భయపెట్టి, ప్రలోభాలకు గురిచేసి పచ్చ కండువాలు కప్పారు. అయినప్పటికీ వారు సాంకేతికంగా వైఎస్సార్సీపీ కార్పొరేటర్లుగానే చెలామణి అవుతున్నారు. ఈ క్రమంలో నెల్లూరు నగర మేయర్ పోట్లూరి స్రవంతిపై టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమైంది. దీంతో వైఎస్సార్సీపీ బీఫారంతో గెలిచి టీడీపీలోకి జంప్ అయిన ఐదుగురు కార్పొరేటర్లు తాడేపల్లిలోని మాజీ సీఎం వైఎస్ జగన్మెహన్రెడ్డి సమక్షంలో తిరిగి గురువారం వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు.దీంతో మంత్రి నారాయణ ఆదేశాలతో నెల్లూరు నవాబుపేట పోలీసులు తాడేపల్లిలో వైఎస్ జగన్మెహన్రెడ్డి క్యాంప్ కార్యాలయం సమీపంలో మాటు వేసి.. నెల్లూరు 5వ డివిజన్ కార్పొరేటర్ ఓబిలి రవిచంద్ర, 6వ డివిజన్ కార్పొరేటర్ మస్తానమ్మ కుమారుడు శ్రీధర్ను అదుపులోకి తీసుకుని ప్రత్యేక వాహనంలో అదృశ్యమయ్యారు. రాత్రంతా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తిప్పుతూ వారిని మంత్రి నారాయణ అనుచరులు, వేమిరెడ్డి సోదరులకు అప్పగించారు. తద్వారా టీడీపీ నిర్వహిస్తున్న కార్పొరేటర్ల క్యాంప్లోకి తరలించే వరకు కీలక పాత్ర పోషించారు.కేసులు.. అరెస్ట్ అన్నారు.. తీరా టీడీపీ క్యాంప్నకు చేర్చారువైఎస్సార్సీపీకి చెందిన గిరిజన కార్పొరేటర్ రవిచంద్రతోపాటు మరో కార్పొరేటర్ తనయుడు శ్రీధర్ను అదుపులోకి తీసుకున్నది వాస్తమేనని నవాబుపేట పోలీసులు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి సమక్షంలో ఒప్పుకున్నారు. అదుపులో ఉన్న ఆ ఇద్దరిని చూపించాలని గురువారం రాత్రి పోలీస్స్టేషన్కు ఆ ఇద్దరు నేతలు చేరుకుని పోలీసులను ప్రశ్నించడంతో వారిపై కేసులు ఉన్నాయని, అరెస్ట్ చేశామని, శుక్రవారం కోర్టుకు హాజరు పరుస్తామని చెప్పారు. కానీ తెల్లారే సరికి పోలీసులు రూటు మార్చి, నోటీసు ఇచ్చి పంపేశామంటూ చెబుతున్నారు.నోటీసులు ఇచ్చే కేసులో వారిని తాడేపల్లికి వెళ్లి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని, గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం తెల్లారే వరకు రహస్యంగా ఉంచడం ఏమిటని, వారిని టీడీపీ క్యాంప్నకు అప్పగించడం ఏమిటని వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు నిలదీస్తున్నారు. కాగా, పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆ ఇద్దరిపై థర్డ్ డిగ్రీ ఉపయోగించినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.అధికార పార్టీ నేతల క్యాంప్లోకి వెళ్లాలని తీవ్రంగా ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఓ కార్పొరేటర్ తనయుడు తన కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడుతూ పోలీసులతోపాటు అధికార పార్టీ నాయకులు కూడా తనపై చేయి చేసున్నారని.. మంత్రి నారాయణ, మరికొందరు పచ్చి బూతులు తిట్టారని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. పోలీసుల తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. -
కోటి సంతకాల ఉద్యమానికి అనూహ్య స్పందన
సాక్షి, అమరావతి: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమానికి అన్ని నియోజకవర్గాల్లో ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని ఆ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. నియోజక వర్గాల్లో సేకరించిన సంతకాలను ఈ నెల 10న జిల్లా పార్టీ కార్యాలయాలకు తరలించే ప్రక్రియతో ప్రజల మనోగతం మరోసారి స్పష్టమైందన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులతో శుక్రవారం ఆయన జూమ్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు.ఎమ్మెల్యే/కో–ఆర్డినేటర్లు, పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్లు, సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్లు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్లు, పార్లమెంట్ పరిశీలకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు (కో ఆర్డినేషన్), ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యదర్శులు (పార్లమెంట్), జెడ్పీ చైర్పర్సన్లు, మేయర్లు, రాష్ట్ర అనుబంధ విభాగ అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, మండల పార్టీ అధ్యక్షులు, జెడ్పీ వైస్చైర్మన్లు , జెడ్పీటీసీలు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లతోపాటు కౌన్సిలర్లు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ... ఈ నెల 15న జిల్లా స్థాయిలో నిర్వహించే ర్యాలీలతో రాష్ట్రం హోరెత్తాలని, తద్వారా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరోసారి గళం విప్పాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అన్ని వర్గాలకు భాగస్వామ్యం కలి్పంచాలన్నారు. చరిత్రలో నిలిచిపోయేలా సంతకాల సేకరణ చేపట్టిన పార్టీ శ్రేణులను పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రత్యేకంగా అభినందించారని చెప్పారు. చంద్రబాబు అప్రజాస్వామిక నిర్ణయాలకు ఇంతకుమించిన రెఫరెండం అక్కర్లేదన్నారు. ఈ నెల 18వ తేదీ సాయంత్రం వైఎస్ జగన్.. పార్టీ ముఖ్య నేతలతో కలిసి గవర్నర్కు సంతకాలను అందజేస్తారని వివరించారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకునేలా మన పార్టీ ఒత్తిడి ఉండాలన్నారు. -
నీ గురించి మా ఊర్లో గొర్రెలు కాసేవాడైన... వాళ్ళ నాన్న గురుంచి పవన్ వ్యాఖ్యలపై సతీష్ రెడ్డి నాన్ స్టాప్ సెటైర్స్
-
Ravi Chandra: విద్యార్థుల సమస్యలపై ప్రశ్నిస్తే.. కేసులు పెడతారా?
-
Rachamallu : రాసిపెట్టుకోండి..! జరగబోయేది ఇదే
-
చంద్రబాబూ.. దమ్ముంటే నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకో: మనోహర్రెడ్డి
సాక్షి, తాడేపల్లి: మొలకలు చెరువు, ఇబ్రహీంపట్నంలో బయటపడ్డ కల్తీ మద్యం కుంభకోణం ఈ దేశంలోనే పెద్దదని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్రెడ్డి అన్నారు. మొలకలచెరువు ఎక్సైజ్ పోలీసు స్టేషన్కి మూడు కిలోమీటర్ల దూరంలోనే కల్తీ మద్యం తయారీ చేశారని.. స్థానిక జనం కనిపెట్టి పోలీసులకు చెప్తే తప్ప పోలీసులు స్పందించలేదని మనోహర్రెడ్డి మండిపడ్డారు.‘‘కూటమి అధికారంలోకి రాగానే ప్రైవేట్కు మద్యం దుకాణాలు కట్టబెట్టి.. ఇష్టానుసారంగా వ్యాపారాలు చేస్తున్నారు. టీడీపీ అధినాయకత్వంతో కుమ్మక్కై అక్రమ మద్యం కుటీరాలు ఏర్పాటు చేశారు. 3వ తేదీన కుంభకోణం బయటపడితే 10న అద్దేపల్లి జనార్ధన్ను అరెస్ట్ చేశారు. ఆ తరువాత కూటమి నేతలకు భయం పుట్టింది. అందుకే ఇష్యూని డైవర్ట్ చేయటానికి ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే జోగి రమేష్ని అరెస్ట్ చేశారు. జయచంద్రారెడ్డికి తాము సన్నిహితులమని నేరస్తులు చెప్పారు. తంబళ్లపల్లిలో డంప్ని కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. జోగి రమేష్కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా దుష్ప్రచారం చేశారు...ఐవీఆర్ఎస్ కాల్స్తో విష ప్రచారం చేశారు. జయచంద్రారెడ్డి చెప్పినట్లు అంత చేశామని నిందితులే చెప్పారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎక్కడెక్కడ కల్తీ మద్యం తయారు అయ్యిందో? ఎవరెవరు ఉన్నారో? ఎక్కడెక్కడ సరఫరా చేశారో? విచారణ జరపాలి. కానీ కేసు విచారణ అలా ఎందుకు జరగటం లేదు?. జయచంద్రారెడ్డిని రాష్ట్రానికి రప్పించి కేసును పక్కన పెట్టాలని చూస్తున్నారు. తప్పుడు లెక్కలు చెపుతూ ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోంది...ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు ఉన్నాయి. కానీ 1600 అని లెక్కలు చెపుతున్నారు. 2014-19 మధ్య జరిగిన మద్యం కుంభకోణంపై విచారణ చేయించి.. ఛార్జ్షీట్లు వేస్తే.. సిగ్గు లేకుండా విత్ డ్రా చేస్తున్నారు. అధికారులను బెదిరిస్తున్నారు. నేను నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు విచారణను ఎందుకు ఎదుర్కోరు?. నిసిగ్గుగా కేసులు విత్ డ్రా చేయించునే చంద్రబాబు లాంటి వ్యక్తి ప్రపంచంలో ఉండరు. ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు పెడతారు...టీడీపీ వాళ్ళను ఎలా రక్షించుకోవాలనే మాత్రమే పని చూస్తున్నారు. వ్యవస్థలను దిగజార్చటంపై చంద్రబాబు సమాధానం చెప్పాలి. చంద్రబాబుకు వ్యవస్థలపై నమ్మకం ఉంటే.. మద్యం కుంభకోణంపై స్వతంత్ర ఆడిట్ చేయించండి. ఏ బెల్ట్ షాప్కు ఏ స్పిరిట్ లిక్కర్ వెళ్లిందో తేల్చాలి. చంద్రబాబుకు దమ్ముంటే కేసును ఎదుర్కోని నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి. జయచంద్రారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలి. దర్యాప్తును నిష్పక్షపాతంగా పూర్తి చేయాలి’’ అని మనోహర్రెడ్డి డిమాండ్ చేశారు. -
‘చంద్రబాబు ప్రభుత్వంలో మాటలు తప్ప.. చేతలు లేవు’
సాక్షి, తాడేపల్లి: కూటమి పాలనలో విద్యారంగం సర్వనాశనం అయ్యిందని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సరైన స్కూల్ బ్యాగులు అందించటం చేతగాని మంత్రి నారా లోకేష్ అంటూ దుయ్యబట్టారు. విద్యార్థులకు సరైన బ్యాగులు, బూట్లు ఇవ్వటం చేతగాని వ్యక్తి లోకేష్. తన పదవికి రాజీనామా చేయాలంటూ రవిచంద్ర డిమాండ్ చేశారు.‘‘పాఠశాలల్లో జరుగుతున్న అవినీతిని అరికట్టాలి. మూడు దశల్లో తనిఖీలు చేసి బ్యాగులు ఇచ్చామన్న లోకేష్ ఒకసారి ఆ బ్యాగులను చూసి మాట్లాడాలి. కూటమి ప్రభుత్వంలో మాటలు తప్ప చేతలు లేవు. కమీషన్ల కోసం కక్కుర్తి పడి నాసిరకం బ్యాగులు అందించారు. నారా లోకేష్ చెప్పిన మాటలకు, విద్యార్థులకు ఇచ్చిన బ్యాగులకు చాలా తేడా ఉంది. రూ.953 కోట్లు ఖర్చు చేశామనే పేరుతో పెద్ద ఎత్తున అవినీతి చేశారు. జగన్ హయాంలో అత్యంత నాణ్యమైన బ్యాగులు అందించారు. జగన్ హయాంలో ఇచ్చిన బ్యాగులనే ఇప్పటికే విద్యార్థులు వాడుతున్నారు. మూడు దశల్లో తనిఖీ చేశామని చెప్పిన లోకేష్ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? అంటూ రవిచంద్ర ప్రశ్నించారు.‘‘ఒక్కో బ్యాగు మీద రూ.2,270లు ఖర్చు చేసి ఇలాంటి నాసిరకం అందిస్తారా?. పిల్లలకు సరైన బూట్లు కూడా అందించలేని ప్రభుత్వం ఇది. నాడు-నేడు కింద జగన్ స్కూళ్లు బాగు చేశారు. ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెట్టారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక విద్యారంగాన్ని ధ్వంసం చేశారు. సరైన బ్యాగులనే పంపిణీ చేయలేని చేతగాని మంత్రి లోకేష్’’ అంటూ రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
తిరుపతి: వైఎస్సార్సీపీ కార్యకర్త కిడ్నాప్
సాక్షి, తిరుపతి: తిరుపతి జిల్లా వాకాడులో వైఎస్సార్సీపీ కార్యకర్త ఎస్కే నజీర్ బాషా కిడ్నాప్కు గురయ్యారు. ఆయన్ని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. నజీర్ బాషా నెల్లూరు 34 వార్డు కార్పొరేటర్ ఫమిదా తండ్రి.నిన్న వైఎస్ జగన్ సమక్షంలో కార్పొరేటర్ ఫమిదా వైఎస్సార్సీపీలో చేరారు. నిన్న రాత్రి(డిసెంబర్ 12, గురువారం) పథకం ప్రకారమే నజీర్ బాషాను కిడ్నాప్ చేసినట్టు సమాచారం. వాకాడు పోలీసులకు నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ఫిర్యాదు చేశారు. -
దెబ్బకు జ్వరం పుట్టించాం అధికారం ఉండి క్యాంపు రాజకీయాలు అనిల్ కుమార్ యాదవ్ ఫైర్
-
‘కేసులను ఎదుర్కోలేని పిరికిపంద చంద్రబాబు’
సాక్షి, తాడేపల్లి: కేసులను ఎదుర్కోలేని పిరికిపంద చంద్రబాబు అంటూ వైఎస్సార్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్రెడ్డి మండిపడ్డారు. అధికారులను బెదిరించి తన మీద కేసులను క్లోజ్ చేయించుకుంటున్నారంటూ దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసులు క్లోజ్పై తాము న్యాయ పోరాటం చేస్తామన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తన మీద ఉన్న కేసులను క్లోజ్ చేసుకోవటం సరికాదని గౌతమ్రెడ్డి అన్నారు.‘‘చంద్రబాబు వ్యవహారం దొంగే.. దొంగా దొంగా అన్నట్టుగా ఉంది. సుప్రీంకోర్టు డైరెక్షన్ను కూడా ఉల్లంఘించారు. ఫైబర్ నెట్ కేసును ఇప్పుడు క్లోజ్ చేయించుకున్నారు. సీఐడీ చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతోంది. అవినీతి చేసినట్టు ఆధారాలు ఉన్నా సీఐడీ ఎందుకు కేసును వదిలేసింది?. జగన్ హయాంలో పూర్తయిన కేసులను కూడా రీఓపెన్ చేశారు. చంద్రబాబే స్వయంగా సంతకాలు చేసి దొరికిన కేసులను మాత్రం క్లోజ్ చేశారు’’ అంటూ గౌతమ్రెడ్డి నిలదీశారు.‘‘ఫైబర్ నెట్లో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు. వేమూరి హరిప్రసాద్ కోసం చంద్రబాబు నిబంధనలను తుంగలో తొక్కారు. వందల కోట్లు కైంకర్యం చేయటానికి చంద్రబాబు నాటకాలు ఆడారు. చంద్రబాబు నేరాల మీద నేరాలు చేశారు. ఆర్థిక అరాచకం చేసిన చంద్రబాబు తన మీద ఉన్న కేసులను ఎలా క్లోజ్ చేస్తారు?. దీనిపై మేము ప్రొటెక్షన్ పిటిషన్ని హైకోర్టులో వేస్తాం. బ్లాక్ లిస్టులో ఉన్న మనిషిని పిలిచి అందలం ఎక్కించారా లేదా?’’ అంటూ గౌతమ్రెడ్డి ధ్వజమెత్తారు.ఈవీఎంల విషయంలో వేమూరి హరిప్రసాద్కు కోర్టు శిక్ష వేసింది. అలాంటి వ్యక్తిని ఫైబర్ నెట్లోకి ఎలా తెచ్చారు?. 105 రకాల నాసిరకం వస్తువులు కొని అవినీతికి పాల్పడ్డారా? లేదా?. వేమూరి హరిప్రసాద్ని డైరెక్టర్గా తీసుకోవాలని సీఎంవో నుండి లెటర్ ఇవ్వలేదా?. రూ.114 కోట్ల విలువైన అవకతవకలు ఫైబర్ నెట్లో జరిగాయా? లేదా?. ఇలాంటి విషయాలపై విచారణ జరుగుతుండగా కేసును ఎందుకు క్లోజ్ చేశారు?. కేసులను ఎదుర్కోవడం చేతకాని పిరికిపంద చంద్రబాబు. ఈ కేసులను క్లోజ్ చేయటానికి హైకోర్టు, సుప్రీంకోర్టు అంగీకరించవు. దీనిపై మరింతగా న్యాయ పోరాటం చేస్తాం’’ అని గౌతమ్రెడ్డి పేర్కొన్నారు. -
‘అధికారంలో ఉండి క్యాంపు పాలిటిక్స్.. టీడీపీ నైతికంగా ఓడినట్టే’
సాక్షి, నెల్లూరు: నెల్లూరులో పోలీసులు నిఘా, భద్రతను పక్కన పెట్టి కార్పొరేటర్లకు డెలివరీ బాయ్ పనులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ అరాచక పాలన తారాస్థాయికి చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘నెల్లూరు నగరంలో వైఎస్సార్సీపీ బలంగా ఉంది. టీడీపీ నైతికంగా ఓడిపోయింది. పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. గంజాయి బ్యాచ్, రౌడీయిజం పెరిగిపోయింది. నెల్లూరు సిటీ ఐదో డివిజన్ కార్పొరేటర్ రవిచంద్రను కిడ్నాప్ చేశారు. మా కార్పొరేటర్లను తీసుకుంటే మాకు నష్టమేమీ లేదు. మంత్రి నారాయణ దిగజారి రాజకీయాలు చేస్తున్నారు. నెల్లూరులో దళారి వ్యవస్థ నడుస్తోంది.మా పార్టీకి సంబంధం లేని మేయర్పై అవిశ్వాసం పెట్టి వైఎస్సార్సీపీపై ట్రోల్స్ చేయడం విడ్డూరం ఉంది. కార్పొరేషన్ విషయంలో ఒకసారి వాస్తవాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. కార్పొరేషన్లో ఉన్న 54 మంది కార్పొరేటర్స్ వైఎస్సార్సీపీ బీఫాంతో గెలిచిన వారే. నయానో, భయానో వారిని ప్రలోభ పెట్టి టీడీపీలోకి లాక్కున్నారు. ప్రస్తుతం మాకు వున్న కార్పొరేటర్స్ పదకొండు మంది ఉన్నారు. నిన్న ఐదుగురు జగనన్న హయాంలో మా పార్టీలో చేరారు. అలా చేరిన కార్పొరేటర్ ఒక్కరిని అరెస్ట్ పేరుతో డ్రామా క్రియేట్ చేశారు. నెల్లూరులో పోలీసులు నిఘా, భద్రతను పక్కన పెట్టి కార్పొరేటర్లకు డెలివరీ బాయ్ పనులు చేస్తున్నారు. మాకు సంఖ్య బలం లేదు, మేయర్ మా పార్టీ కాదు. ఐదు మంది మా వైపు వచ్చేసరికి భయపడ్డారు. నేడు టీడీపీ అధికారంలో ఉండి, సంఖ్య బలం ఉన్నా కూడా క్యాంపు రాజకీయాలు చేస్తున్నారు. మాకు భయపడి కార్పొరేటర్లను క్యాంపునకు తరలించినప్పుడే మేము నైతికంగా గెలిచాం’ అని వ్యాఖ్యలు చేశారు. -
ఏ స్టేషన్ లో అక్రమ కేసులు పెట్టారో అదే స్టేషన్ లో... పోలీసులకు వార్నింగ్
-
సీపీ బ్రౌన్ వర్థంతి.. వైఎస్ జగన్ నివాళులు
సాక్షి, తాడేపల్లి: నేడు సీపీ బ్రౌన్ వర్ధంతి. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. సీపీ బ్రౌన్కు నివాళులు అర్పించారు. తాజాగా వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘భాషాభిమానానికి భౌతిక హద్దులు లేవని.. తన మాతృ భాష కంటే మన తెలుగును ఎక్కువగా ప్రేమించి భాషకు నూతన జీవం పోసిన అక్షర యోగి సీపీ బ్రౌన్. వేమన శతకాలు, పోతన భాగవతం, పలు పాత కావ్యాలు కాలగర్భంలో.. కలిసిపోతున్న సమయంలో తన సొంత డబ్బుతో వందలాది తెలుగు గ్రంథాలను ముద్రించి మనకు అందించిన మహనీయుడు’ అని ప్రశంసలు కురిపిస్తూ పోస్టు చేశారు. భాషాభిమానానికి భౌతిక హద్దులు లేవని, తన మాతృ భాషకంటే మన తెలుగును ఎక్కువగా ప్రేమించి భాషకు నూతన జీవం పోసిన అక్షర యోగి సీపీ బ్రౌన్ గారు. వేమన శతకాలు, పోతన భాగవతం, పలు పాత కావ్యాలు కాలగర్భంలో కలిసిపోతున్న సమయంలో తన సొంత డబ్బుతో వందలాది తెలుగు గ్రంథాలను ముద్రించి మనకు అందించిన… pic.twitter.com/uwUwlZQfzm— YS Jagan Mohan Reddy (@ysjagan) December 12, 2025 -
సింగపూర్, జపాన్, జర్మనీ ఎక్కడ.. అమరావతిని చూస్తే రక్తం మరిగిపోతుంది
-
ఒరేయ్ పనికిమాలిన వెధవ.. YSRCP వదిలి టీడీపీలోకి వెళ్లిన MPTC లకు చెప్తున్నా
-
కార్పొరేటర్ రవిచందర్ కిడ్నాప్.. YSRCP ఆందోళన
-
మాధవి రెడ్డికి చెంపపెట్టు.. టీడీపీకి ఎదురుదెబ్బ
-
స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్రంలోని పలు స్థానిక సంస్థలకు జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవాను చాటింది. అధికార తెలుగుదేశం పార్టీ కూటమి కుయుక్తులు బెడిసికొట్టాయి. గురువారం జరిగిన ఉప ఎన్నికల్లో కడప మేయర్తో పాటు 4 ఎంపీపీ స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. అలాగే రెండు మండలాల్లో ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రెండింటినీ వైఎస్సార్సీపీ గెల్చుకోవడం విశేషం. బాపట్ల జిల్లా వేమూరు, నంద్యాల జిల్లా దొర్నిపాడు, విజయనగరం జిల్లా మెరకముడియం, బొందపల్లి కోఆప్షన్ స్థానాలను వైఎస్సార్సీపీ గెల్చుకుంది. వరదాయపాలెం ఎంపీపీ ఎన్నిక కోర్టు స్టే కారణంగా వాయిదా పడింది. టీడీపీ కేవలం కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ పదవితో సరిపెట్టుకుంది. కడపలో మరోమారు సత్తా చాటుకున్న వైఎస్సార్సీపీ కడప నగరపాలక సంస్థ మేయర్ను అనైతికంగా తొలగించిన చంద్రబాబు కూటమి సర్కారు.. మేయర్ పదవిని చేజిక్కించుకొనేందుకు నానా కుట్రలు పన్నింది. తెలుగుదేశం పార్టీ కుయుక్తులను వైఎస్సార్సీపీ తిప్పి కొట్టడంతో ఆ పదవి మరోమారు వైఎస్సార్సీపీ సొంతమైంది. కడప మేయర్గా 47వ డివిజన్ వైఎస్సార్సీపీ కార్పొరేటర్ పాకా సురేష్ గురువారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కూటమి అధికారంలోకి వచ్చాక అధికార బలంతో, చట్టంలో ఉన్న లొసుగులను ఆసరా చేసుకొని కడప మేయర్గా ఉన్న సురేష్బాబును పదవి నుంచి తప్పించింది. దీంతో గురువారం ఎన్నిక జరిగింది. కడప కార్పొరేషన్లో 50 మంది కార్పొరేటర్లు ఉండగా, ఇద్దరు మృతి చెందారు. కడప మేయర్ పాకా సురేష్ టీడీపీకి ఒకే కార్పొరేటర్ ఉన్నారు. మిగతా 47 మందిలో 8 మందిని టీడీపీ ప్రలోభాలకు గురి చేసి పార్టీలో చేర్చుకుంది. మిగతా 39 మంది కార్పొరేటర్లు వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, మాజీ మంత్రి అంజద్ బాషా, మాజీ మేయర్ సురేష్బాబు కార్పొరేటర్లతో సమాలోచలు జరిపి, పాకా సురేష్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. మెజార్టీ కార్పొరేటర్ల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొని ఏకాభిప్రాయంతో వైఎస్సార్సీపీ మేయర్ అభ్యర్థిగా పాకా సురేష్ను ఎంపిక చేశారు. వైఎస్సార్సీపీకి చెందిన 39 మంది సభ్యులు పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. అంతా ఏకాభిప్రాయంతో ఉండటంతో టీడీపీ తోక ముడిచింది. డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి మేయర్గా పాకా సురేష్ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించగా, కార్పొరేటర్ షఫీ బలపర్చారు. దీంతో సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పీవో అదితిసింగ్ ప్రకటించారు. అనంతరం మేయర్ పాకా సురేష్ చేత కమిషనర్ మనోజ్రెడ్డి ప్రమాణం చేయించారు. ఏకగ్రీవంగా ఎంపీపీలు వైఎస్సార్ కడప జిల్లా ముద్దనూరు మండల ప్రజాపరిషత్ అ«ధ్యక్షురాలిగా వైఎస్సార్సీపీ అభ్యర్థి వెన్నపూస పుష్పలత ఏకగ్రీవంగా ఎన్నుకయ్యారు. అలాగే అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె ఎంపీపీగా కోసువారిపల్లె వైఎస్సార్సీపీ ఎంపీటీసీ చిటికి శ్యామలమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం ఆంబాకం ఎంపీటీసీ సెగ్మెంట్ నుంచి వైస్ ఎంపీపీగా వైఎస్సార్సీపీకి చెందిన శరవణ ఎన్నికయ్యారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం ఎంపీపీ అధ్యక్షురాలిగా వైఎస్సార్సీపీకి అభ్యర్థి, బీసీ సామాజికవర్గానికి చెందిన జిత్తుక వెంకటలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట ఎంపీపీగా వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీటీసీ గద్దల మల్లయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నిండ్ర, విజయపురంలో దౌర్జన్యమే గెలిచింది చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో జరిగిన రెండు ఎంపీపీ ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యంగా వ్యవహరించింది. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో మొత్తం 16 ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ గెల్చుకుంది. ఎంపీపీ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వ్ అయ్యింది. ఏర్పేడు ఎంపీపీ గీత రాజీనామా, ముసలిపేడు ఎంపీటీసీ రమణమ్మ మృతితో 14 మంది వైఎస్సార్సీపీ సభ్యులున్నారు. వీరిలో పంగూరు ఎంపీటీసీ పి.ఆదిలక్ష్మి ఒక్కరే ఎస్టీ మహిళ కావడంతో ఆమెకే పదవి దక్కాలి. అయితే, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సు«దీర్రెడ్డి వైఎస్సార్సీపీకి చెందిన 9 మంది ఎంపీటీసీలను ప్రలోభాలకు, బెదిరింపులకు గురిచేసి ప్రత్యేక శిబిరంలో దాచారు. గురువారం ఉదయం 11 గంటలకు వారిని ఎంపీడీవో కార్యాలయానికి తీసుకొచ్చారు. వారు టీడీపీ కండువాలతో ఎన్నికలో పాల్గొన్నారు. పంగూరు ఎంపీటీసీ పి.ఆదిలక్ష్మిని స్వతంత్ర అభ్యర్థిగా పోటీలోకి దింపారు. దీంతో మిగిలిన 5 మంది వైఎస్సార్సీపీ సభ్యులు ప్రజాసామ్యాన్ని ఖూనీ చేశారంటూ ఎన్నిక ప్రక్రియను బహిష్కరించారు. మొత్తంగా స్వతంత్ర అభ్యర్థి పి.ఆదిలక్ష్మి ఎన్నికైనట్టు అధికారులు ప్రకటించారు. ఆ వెంటనే ఆమెకు ఎమ్మెల్యే సు«దీర్ రెడ్డి టీడీపీ కండువా కప్పడం గమనార్హం. చిత్తూరు జిల్లాలో.. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని విజయపురం, నిండ్ర మండలాల ఎంపీపీ ఎన్నికలు పూర్తిగా అధికారబలంతోనే సాగాయి. రెండు మండలాల్లోను 8 ఎంపీటీసీ స్థానాలు చొప్పున ఉన్నాయి. ఎంపీపీగా గెలవాలంటే ఐదుగురి మద్దతు అవసరమౌతుంది. అధికార పార్టీ అంగబలం, అధికార బలం, దౌర్జన్యం ప్రదర్శించినా రెండు మండలాల్లోనూ నాలుగు ఓట్లు మాత్రమే సంపాదించగలిగింది. దీంతో అధికారులు లాటరీ పద్ధతి నిర్వహించారు. విజయపురంలో వైఎస్సార్సీపీ తరఫున మంజు బాలాజి, టీడీపీ తరఫున లక్ష్మీపతిరాజు పోటీచేశారు. నిండ్రలో వైఎస్సార్సీపీ తరఫున విజేష్, టీడీపీ మద్దతుతో ఇండిపెండెడెంట్ అభ్యర్థి భాస్కర్రెడ్డి పోటీ పడ్డారు. అధికారుల చేతివాటంతో లాటరీలో విజయపురంలో టీడీపీ అభ్యర్థి లక్ష్మీపతిరాజు, నిండ్రలో ఇండిపెండెంట్ అభ్యర్థి భాస్కర్రెడ్డి ఎంపీపీలుగా ఎంపికయ్యారు. నా పేరే వచ్చింది ఎన్నికల అనంతరం విజయపురంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి మంజు బాలాజి మీడియాతో మాట్లాడుతూ.. అధికారులు పూర్తిగా పక్షపాత ధోరణిలో వ్యవహరించారని, డిప్లో తన పేరే వచ్చిందని, అధికారులు మాత్రం లక్ష్మీపతిరాజు గెలిచినట్లు చెప్పి వెళ్లిపోయారని తెలిపారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని, కోర్టుకు వెళతానని తెలిపారు. నిండ్ర, విజయపురంలో అధికారుల దుర్మార్గంపై కలెక్టర్కు ఫిర్యాదు నిండ్ర, విజయపురం ఎంపీపీ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారులు (ఆర్వోలు) కూటమి నేతల ఒత్తిళ్లతో నిబంధనలకు విరుద్ధంగా, ఏకపక్షంగా వ్యవహరించారని ఆయా మండలాల వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు కలెక్టర్ సుమిత్ కుమార్ గాం«దీకి గురువారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఒకరు గెలిస్తే ఆర్వోలు మరొకరు గెలిచినట్లు ప్రకటించారన్నారు. ఎన్నికల నిబంధనలను ఏమాత్రం పాటించలేదన్నారు. ఎమ్మెల్యే పీఏలు ఎన్నికల కేంద్రాల్లోకి ప్రవేశించారని, అభ్యర్థులను, ఎంపీటీసీలను మాత్రం లోనికి అనుమతించలేదని ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో పిల్లల చేత లాటరీ తీయించకూడదని, అయినా ఓ చిన్న పాపకు ముందుగా గుర్తులు చెప్పించి లాటరీ తీయించారని తెలిపారు. బహిరంగంగా నిర్వహించాల్సిన లాటరీ ప్రక్రియను గుట్టుగా చేశారని చెప్పారు. మరొక ఆర్వో ఒకే వ్యక్తి పేరును ఐదు చొప్పున రాసి లాటరీ తీశారని తెలిపారు. ఆర్వోలతో కలెక్టర్ ఫోన్లో మాట్లాడి, ఎంపీపీ ఎన్నికల వీడియోలను శుక్రవారం మధ్యాహ్నం లోగా పంపాలని ఆదేశించారు. బెదిరింపులకు బెదరని కళ్యాణదుర్గం కౌన్సిలర్లు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అధికార టీడీపీ నేతల బెదిరింపులకు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు బెదరలేదు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులుండగా 11 మంది వైఎస్సార్సీపీ, 11 మంది టీడీపీ సభ్యులు ఉన్నారు. వైఎస్సార్సీపీకి చెందిన ఆరుగురిని ఐదుగురిని టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రలోభాలకు గురి చేసి ఆ పార్టీలోకి చేర్చుకున్నారు. మిగిలిన వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ఎమ్మెల్యే బెదిరింపులు, ప్రలోభాలకు గురిచేశారు. ఆస్తులున్నాయి జాగ్రత్త అంటూ ఫోన్లు చేసి భయపెట్టారు. అయినా వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు వెనక్కి తగ్గలేదు. చివరకు కూటమి ఎమ్మెల్యే, ఎంపీ ఎక్స్అఫీషియో సభ్యుల హోదాలో ఓట్లు వేయడంతో టీడీపీ గట్టెక్కింది. దొడ్డిదారిలో రామగిరి ఎంపీపీ స్థానం కైవసం శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో చంద్రబాబు కూటమి ప్రజాస్వామ్యాన్ని మంటగలిపింది. గురువారం జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత కుంటిమద్ది వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యురాలు సాయిలీలను బెదిరింపులకు గురిచేసి, బలవంతంగా టీడీపీలోకి చేర్చుకుని.. ఆమెకే ఎంపీపీ పదవి అప్పగించారు. ఈ ఎన్నికల్లో 9 మంది సభ్యులకు గాను నలుగురే హాజరయ్యారు. మూడింట రెండు వంతుల మంది సభ్యులు ఉంటేనే ఎన్నిక నిర్వహించాలనే నిబంధనలను అధికారులు తుంగలో తొక్కారు. వచి్చన వారిలో పోటీ చేసిన అభ్యర్థికి మద్దతు ఇస్తే ఎన్నిక పూర్తవుతుందనే సరికొత్త నిబంధన తెచి్చ, ఎంపీపీ స్థానాన్ని టీడీపీ గెలుపొందింది. పోలీసుల అండతో మాచవరం ఎంపీపీ కైవసం పల్నాడు జిల్లా మాచవరం ఎంపీపీని కూడా టీడీపీ దౌర్జన్యంగా గెల్చుకుంది. టీడీపీకి తగిన బలం లేకపోయినా, పోలీసులతో వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యులను బెదిరించారు. వాస్తవంగా 15 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీకి ఉన్న బలం నాలుగే. దీంతో గత రెండు రోజులుగా వైఎస్సార్సీపీ ఎంపీటీసీల బంధువులను పోలీసులు స్టేషన్లకు పిలిపించి సభ్యుల వివరాలు తెలపాలని ఒత్తిడి తెచ్చారు. చెన్నాయపాలెం ఎంపీటీసీ లక్ష్మిబాయి బంధువు బాలు నాయక్ను దాచేపల్లి సీఐ భాస్కరరావు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి బెదిరించినట్లు బంధువులు ఆరోపించారు. దీంతో బాలు నాయక్ తన బంధువైన ఎంపీటీసీ లక్ష్మీబాయి మద్దతు టీడీపీకి ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. పిల్లుట్ల –1 ఎంపీటీసీ మంగమ్మ బాయినీ అలాగే బెదిరించి తమ వైపు తిప్పుకున్నారు. మరికొందరిని కూడా బెదిరింపులకు గురి చేసి, టీడీపీ అభ్యర్థి కొక్కెర అంజమ్మను గెలిపించుకున్నారు. -
జోజినగర్ బాధితులకు వైఎస్సార్సీపీ అండ
సాక్షి, అమరావతి: విజయవాడలోని జోజినగర్లో 42 ప్లాట్ల కూల్చివేత బాధితులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, అవసరమైన న్యాయ సహాయం అందిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. కూల్చివేతకు గురైన 42 ప్లాట్లకు సంబంధించిన బాధితులు గురువారం మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ కష్టార్జితాన్ని నేలపాలు చేశారని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు.పక్కా రిజి్రస్టేషన్ డాక్యుమెంట్లతో కొనుగోలు చేసి, బ్యాంకుల ద్వారా రుణం తీసుకుని 25 ఏళ్ల క్రితం భవనాలు నిరి్మంచుకుంటే నిర్ధాక్షిణ్యంగా పడగొట్టి రోడ్డుపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాట్ రిజి్రస్టేషన్, ఇంటి పన్ను, కరెంట్ బిల్లుల రశీదులను చూపించారు. డిసెంబర్ 31 వరకు తమ ఇళ్ల జోలికి వెళ్లొద్దని సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నా అధికారులు పట్టించుకోకుండా డిసెంబర్ 3వ తేదీ వేకువజామున వందల సంఖ్యలో పోలీసులొచ్చి తమ ఇళ్లను నేలమట్టం చేసి వెళ్లిపోయారని బాధితులు వాపోయారు.అధికార టీడీపీ, జనసేన నాయకులను కలిసినా తమ గోడు వినిపించుకోలేదని, ఇళ్లు కూల్చివేస్తే ఎంపీ, ఎమ్మెల్యే కనీసం పరామర్శకు కూడా రాలేదని కన్నీరుమున్నీరయ్యారు. మీరే న్యాయం చేయాలని వేడుకున్నారు. దీనిపై వైఎస్ జగన్ స్పందిస్తూ.. బాధితులకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని, న్యాయ సహాయం అందిస్తుందని ధైర్యంచెప్పారు. వచ్చేవారం తాను వచ్చి కూల్చి వేసిన ప్రాంతాన్ని పరిశీలిస్తానని భరోసా ఇచ్చారు. పేదోళ్లంటే ఈ ప్రభుత్వానికి కడుపు మంట చంద్రబాబు ప్రభుత్వం పేదల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. వైఎస్ జగన్ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సామా న్లు బయటకు తీసుకొచ్చే సమయమూ ఇవ్వకుండా నేలమట్టం చేశారని ధ్వజమెత్తారు. 25 ఏళ్లుగా ఆస్తి పన్ను, కరెంట్ బిల్లు చెల్లిస్తున్నా ఏమాత్రం కనికరం చూపలేదన్నారు. ఎక్కువగా మాట్లాడితే మా ఇళ్లను నేలమట్టం చేసినట్లు మమ్మల్ని కూడా నేలమట్టం చేస్తామని టీడీపీ నేత సురక శ్రీనివాసరావు బెదిరించారని బాధితురాలు అరుణ వాపోయారు.ఇళ్లు కూల్చేయడంతో చెట్టు కింద ఉంటున్నామని బాధితురాలు తంగా సుబ్బులు ఆవేదన వ్యక్తం చేశారు. బంగారం కుదువ పెట్టి, పైసాపైసా కూడబెట్టి ఇళ్లు కట్టుకున్నామని చెప్పా రు. శ్రీ లక్ష్మీ రామ కో–ఆపరేటివ్ సొసైటీ వాళ్లే ఇదంతా చేశారని విజయలక్ష్మి అనే బాధితురాలు మండిపడ్డారు. వైఎస్ జగన్ భరోసాతో ధైర్య మొచ్చిందని బాధితులు లలిత కుమారి, లక్ష్మణ్ తదితరులు అన్నారు. -
లొంగిపోవడానికి వస్తే అరాచకం!
మాచర్ల/మాచర్ల రూరల్/నరసరావుపేట రూరల్/బాపట్ల : చంద్రబాబు ప్రభుత్వం అక్రమంగా నమోదు చేసిన కేసులో సుప్రీంకోర్టు సూచన మేరకు పిన్నెల్లి సోదరులు పల్నాడు జిల్లా మాచర్ల కోర్టులో లొంగిపోవడానికి వచ్చిన సందర్భంగా ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు పోలీసులు ప్రజాస్వామ్యాన్ని మంటగలిపే రీతిలో వ్యవహరించారు. మాచర్ల ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా అడుగడుగునా తనిఖీలు చేస్తూ షాపులు.. దుకాణాలను బంద్ చేయించారు. సంఘీభావం తెలపడానికి వచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులను బలవంతంగా అడ్డుకున్నారు. జిల్లా వ్యాప్తంగా, మాచర్లలో వైఎస్సార్సీపీకి చెందిన పలువురు పార్టీ నేతలను గృహ నిర్బంధం చేశారు. పలువురిని హెచ్చరిస్తూ నోటీసులు ఇచ్చారు. కోర్టు వద్ద స్వయంగా జిల్లా ఎస్పీ బందోబస్తు పర్యవేక్షించారు. తుదకు పిన్నెల్లి కుటుంబ సభ్యులను, బంధువులను కూడా వారి ఇంట్లోకి అనుమతించక పోవడం ప్రభుత్వ అరాచకానికి అద్దం పడుతోంది. మాచర్ల నియోజకవర్గంలో మే 24వ తేదీన వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నాయకులు బోదిలవీడు వద్ద జవిశెట్టి వెంకటేశ్వర్లు, (అలియాస్ మొద్దయ్య) కోటేశ్వరరావులను తెలుగుదేశం పార్టీ వారే హత్య చేశారని అప్పటి ఎస్పీనే స్పష్టం చేశారు. అయినప్పటికీ ఈ ఘటనలో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలపై అక్రమ కేసు బనాయించారు. ఈ హత్య కేసులో తమకు ఏమీ సంబంధం లేదని పీఆర్కే సోదరులు హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించి, బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. సుప్రీంకోర్టు కొన్ని రోజుల పాటు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది. అనంతరం బెయిల్ రద్దు చేస్తూ లొంగిపోవాలని చెప్పింది. ఈ క్రమంలో గురువారం ఉదయం పీఆర్కే సోదరులు తమ లాయర్లతో కలిసి మాచర్ల కోర్టుకు హాజరయ్యారు. జూనియర్ సివిల్ జడ్జి, కోర్టు అడిíÙనల్ జడ్జి ప్రశాంత్ వారికి ఈ నెల 24 వరకు రిమాండ్ విధించగా వైద్య పరీక్షలు చేయించి నెల్లూరు జైలుకు తరలించారు. గృహ నిర్బంధాలు.. బెదిరింపులు పిన్నెల్లి సోదరులకు సంఘీభావం తెలిపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పిన్నెల్లి నివాసం వద్దకు బయలుదేరగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. మాచర్ల పట్టణానికి నలువైపులా కంచె, బారికేడ్లను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తూ ఐడి కార్డు ఉంటేనే పట్టణంలోనికి అనుమతించారు. రాయవరం జంక్షన్, రచ్చమల్లపాడు, కొత్తపల్లి, గుంటూరు, నర్సరావుపేట రోడ్లు, జమ్మలమడక రహదార్లలో తనిఖీలు చేశారు. కోర్టు వద్ద స్వయంగా జిల్లా ఎస్పీ బందోబస్తు పర్యవేక్షించారు. పీఆర్కేను చూసేందుకు వారి సోదరి, పెద్దమ్మ, బంధువులు వచ్చినా అనుమతించ లేదు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరే శ్యామల, పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్ధారెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. శ్యామల భర్త నర్సారెడ్డిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్లో ఉంచారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, సత్తెనపల్లి సమన్వయకర్త డాక్టర్ గజ్జల సు«దీర్ భార్గవ్రెడ్డిలను అడ్డగించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో బ్లడ్ బుక్ను నడుపుతున్నారని మండిపడ్డారు. నీచ రాజకీయాలకు త్వరలోనే ప్రజలు చరమగీతం పాడతారని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి, మాజీ మంత్రి విడదల రజిని, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి, వైఎస్సార్పీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్లు నరసరావుపేటలో మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని ప్రభుత్వం పోలీసుల ద్వారా అడ్డుకుంటోందని ధ్వజమెత్తారు. బాపట్ల జిల్లాలో పార్టీ నేతలు వరికూటి అశోక్ బాబు, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, డాక్టర్ అశోక్ కుమార్, ఈవూరి గణేశ్, గాదె మధుసూదన్రెడ్డి తదితరులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రజాస్వామ్యం ఖూనీ న్యాయస్థానంపై గౌరవంతో, న్యాయంపై నమ్మకంతో వారి ఆదేశాల మేరకు కోర్టులో హాజరవుతున్నాం. ఈ సందర్భంగా మాకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్న ప్రజలను, నాయకులను, కార్యకర్తలను అడుగడుగునా అడ్డుకోవటం దారుణం. నేతల అక్రమ నిర్బంధాలేంటి? రోడ్లపై అడ్డగింతలేంటి? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి చర్యలు మంచివి కావు. – పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
YSRCPలో నూతన నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా పలువురి నియామకం జరిగింది.షేక్ గౌస్ మొహిద్దిన్ (విజయవాడ వెస్ట్), మీర్ హుస్సేన్ (విజయవాడ ఈస్ట్), కర్నాటి రాంబాబు (విజయవాడ వెస్ట్), మీర్జా సమీర్ అలీ బేగ్ (మార్కాపురం), ఆర్. శ్రీనివాసులురెడ్డి (పలమనేరు), కె.కృష్ణమూర్తిరెడ్డి (పలమనేరు), పోలు సుబ్బారెడ్డి (రాయచోటి), ఉపేంద్ర రెడ్డి (రాయచోటి), డి. ఉదయ్ కుమార్ (మదనపల్లె), వి.చలపతి (కోవూరు), గువ్వల శ్రీకాంత్ రెడ్డి (సింగనమల), డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి (తాడిపత్రి), సుభాష్ చంద్రబోస్ (కర్నూలు), రఘునాథరెడ్డి (జమ్మలమడుగు), ఎస్. ప్రసాద్ రెడ్డి (కమలాపురం), పార్టీ ఎస్ఈసీ సభ్యునిగా ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి (రాయచోటి) నియమితులయ్యారు. -
నెల్లూరు వైఎస్సార్సీపీ కార్పొరేటర్ కిడ్నాప్
సాక్షి, నెల్లూరు: పార్టీ మారిన గంటల వ్యవధిలోనే.. కార్పొరేటర్ కిడ్నాప్ కావడం నెల్లూరులో కలకలం రేపుతోంది. సిటీ 5వ డివిజన్ కార్పొరేటర్ ఓబుల రవిచంద్ర మరో నలుగురితో కలిసి గురువారం వైఎస్సార్సీపీలో చేరారు. తాడేపల్లిలో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆయనకు కండువా కప్పారు. అయితే.. నెల్లూరకు తిరిగి వస్తున్న ఆయన్ని పోలీసులమని చెప్పి కొందరు తీసుకెళ్లారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన రవిచంద్ర ఆచూకీ కోసం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయాలనే యోచనలో ఉన్నారు. మరోపక్క.. నెల్లూరులో బలం ఉన్నా టీడీపీ బరి తెగించిందనే విమర్శ బలంగా వినిపిస్తోంది. మేయర్పై అవిశ్వాసం వేళ.. నెల్లూరులో టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. ఐదుగురు కార్పొరేటర్లు టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. మద్దినేని మస్తానమ్మ (నెల్లూరు సిటీ 6వ డివిజన్ కార్పొరేటర్), ఓబుల రవిచంద్ర (నెల్లూరు సిటీ 5వ డివిజన్ కార్పొరేటర్), కాయల సాహితి (నెల్లూరు సిటీ 51వ డివిజన్ కార్పొరేటర్), వేనాటి శ్రీకాంత్ రెడ్డి (నెల్లూరు సిటీ 16వ డివిజన్ కార్పొరేటర్), షేక్ ఫమిదా (నెల్లూరు రూరల్ 34వ డివిజన్ కార్పొరేటర్)లను మాజీ మంత్రి అనిల్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ దగ్గరుండి వైఎస్ జగన్ను కలిపించి.. పార్టీలో చేర్పించారు. అయితే మరింత మంది కార్పొరేటర్లు పార్టీ మారే భయంతో ఉన్న టీడీపీ.. ఇలా కిడ్నాప్ల పర్వానికి దిగిందని స్పష్టమవుతోంది. -
ఏపీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయి: వైవీ
ఢిల్లీ: ఓటర్ల విశ్వసనీయతను దెబ్బతీసేలా ఈసీ వ్యవహరించొద్దని.. ఎన్నికల సంఘం పారదర్శకంగా, స్వతంత్రంగా వ్యవహరించాలని వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రాజ్యసభలో ఎన్నికల సంస్కరణలపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యానికి కస్టోడియన్లా ఉండాలన్నారు. ఏపీ ఎన్నికల అవకతవకలపై వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతుండగా టీడీపీ ఎంపీలు అడ్డుతగిలారు.ఏపీ ఎన్నికలలో అవకతవకలు జరిగాయని.. హడావుడిగా ఎస్ఐఆర్ నిర్వహించడం వల్ల అనేక అనుమానాలు వస్తున్నాయని వైవీ అన్నారు. పని భారంతో బీఎల్వోలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పౌరులకు ఎస్ఐఆర్ పైన తగిన సమాచారం ఇవ్వలేదు. నిజమైన ఓటర్లను తొలగిస్తున్నారు. ఏపీలో 2024 ఎన్నికల కౌంటింగ్లో అనేక లోపాలు బయటపడ్డాయి’’ అని వైవీ సుబ్బారెడ్డి వివరించారు.‘‘మైదుకూరు నియోజకవర్గంలో ఓటర్ల జాబితాను మించి ఓట్లు రికార్డు అయ్యాయి. ఫామ్ 20లో మాత్రం జీరో ఓట్స్ రికార్డ్ చేశారు. హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఇదే తరహాలో జరిగింది. మా పార్టీకి పార్లమెంట్ ఎన్నికలకు 472 ఓట్లు వస్తే, అసెంబ్లీ ఎన్నికలకు 1 ఓటు మాత్రమే వచ్చింది. సాంకేతికతను ఉపయోగించి అనేక అక్రమాలకు పాల్పడ్డారు. పోలింగ్ స్టేషన్లలో సీసీ ఫుటేజ్ను కూడా ఇవ్వడం లేదు. సాయంత్రం 6 తర్వాత పోలింగ్ శాతం ఆకస్మాత్తుగా పెరగడం దేనికి సంకేతం’’ అంటూ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. -
‘కూటమి నేతలు తప్పు చేసి.. వైఎస్సార్సీపీపై బురదజల్లుతారా?’
సాక్షి, తిరుపతి: కూటమి వచ్చాక తిరుమలలో అనేక ఘోరాలు జరిగాయని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఒక ప్రణాళిక ప్రకారం వైఎస్ జగన్పై కూటమి దాడి చేస్తోందన్నారు. సీఎం చంద్రబాబు వైఖరితోనే తిరుమలలో అపచారాలు జరుగుతున్నాయని.. కూటమి నేతలు తప్పు చేసి వైఎస్సార్సీపీపై బురదజల్లుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘వైఎస్ జగన్ను దెబ్బతీయడానికి తిరుమలను చంద్రబాబు వాడుకుంటున్నారు. ఎన్నికల ముందు, తరువాత తిరుమల చూట్టు రాజకీయాలు చేస్తున్నారు. లడ్డూ, పరకామణి, పట్టు వస్త్రాలు అవినీతి అంటూ జగన్ను టార్గెట్ చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. రాజకీయంగా దెబ్బ తీయడానికి స్వామివారి కూటమి నేతలు వాడుకుంటున్నారు...పదిరోజుల వైకుంఠ ఏకాదశి వద్దని చంద్రబాబు చెప్పాడు. ఇప్పుడు మళ్లీ అదే కొనసాగిస్తున్నారు. తొక్కిసలాట ఘటన జరిగినప్పుడు దీనికి కారణం వైఎస్సార్సీపీనే.. పదిరోజుల దర్శనం తప్పు అంటూ ప్రచారం చేశారు. లడ్డూ కేసులో ఇప్పటి వరకు రాజకీయపరమైన అరెస్టు ఒక్కటి జరగలేదు. కాని సుబ్బారెడ్డి చేశాడని అసత్య ప్రచారం చేశారు...సింహాచలం ఆలయంలో దొంగతనం చేస్తే స్టేషను బెయిల్ ఇచ్చి వదిలేశారు. 2015 నుంచి 2025 వరకు పట్టు వస్త్రాల స్కాం జరిగితే.. వైఎస్సార్సీపీ హయాంలో జరిగిందంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతను దెబ్బతీస్తున్నాడు. రోజుకో మాట మాట్లాడటంలో పవన్ దిట్టా. బీఆర్ నాయుడు చైర్మన్ అయ్యాక ఎప్పుడూ జరగని అపచారాలు తిరుమలలో జరిగాయి’’ అని భూమన ధ్వజమెత్తారు. -
జైల్లో పెట్టుకుంటూ పోతే భయపడే ప్రసక్తే లేదు: YSRCP నేతలు
-
ముద్దనూరు MPP .. YSRCP కైవసం
-
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై అన్యాయంగా కేసులు పెట్టారు
-
భవానీపురం బాధితుల కంటతడి.. వైఎస్ జగన్ భరోసా
సాక్షి, తాడేపల్లి: అన్యాయంగా తమ ఇళ్లు కూల్చేశారని.. తాము ఇప్పుడు రోడ్డున పడ్డామని భవానీపురం బాధిత కుటుంబాలు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేశాయి. గురువారం పలువురు బాధితులు తాడేపల్లిలో జగన్ను కలిసి జరిగిన పరిణామాలను వివరించాయి. ఈ నెల 3వ తేదీన విజయవాడ భవానీపురం జోజినగర్లో 42 ఇళ్లను కూల్చేశారు అధికారులు. ఆ సమయంలో కూల్చివేతలు అన్యాయమంటూ అడ్డుకునే ప్రయత్నం చేయగా.. కోర్టు ఆదేశాలున్నాయని చెబుతూ బలవంతంగా వాళ్లను పక్కకు లాగిపడేసి కూల్చివేతలు జరిపారు. అయితే.. తమ ఇళ్ల కూల్చడంపై ఇవాళ జగన్ వద్ద బాధిత కుటుంబాలు ఆవేదిన వ్యక్తం చేశాయి. పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో కొనుగోలు చేసి బ్యాంకుల ద్వారా రుణం తీసుకుని భవనాలు నిర్మించుకుంటే నిర్ధాక్షణ్యంగా పడగొట్టి రోడ్డుపాలు చేశారని పలువురు కంటతడి పెట్టారు. పాతికేళ్లుగా ఏళ్లుగా నివాసముంటున్న తమను వెళ్లగొట్టారని పలువురు జగన్ దృష్టికి తీసుకెళ్లారు. అధైర్యపడొద్దని.. అండగా ఉంటానని.. అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని వైఎస్ జగన్ ఈ సందర్భంగా బాధితులకు భరోసా ఇచ్చారు. ‘‘విజయవాడలో అత్యంత దుర్మార్గంగా 42 ఇళ్లను కూల్చారు. బాధితులంతా రోడ్ల మీద ఉన్నారు. ప్రభుత్వ పెద్దలందరినీ బాధితులు కలిశారు. అయినప్పటికీ వారికి కనీస భరోసా కూడా లభించలేదు. కార్పొరేషన్ మీటింగ్ లో దీనిపై నిలదీస్తే ప్రభుత్వం స్పందించలేదు. బాధితులంతా ఇప్పుడు వైఎస్ జగన్ని కలిశారు. ఆయన వాళ్ల బాధలు విని సానుకూలంగా స్పందించారు. కావాల్సిన న్యాయ సహాయం అందిస్తామన్నారు’’ అని విజయవాడ వెస్ట్ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. -
‘పోలీసులను అడ్డుపెట్టుకుని మా నేతలను నిర్బంధించారు’
నరసరావుపేట: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియంతలా పాలన చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని తమ నేతలను నిర్భందిస్తున్నారన్నారు. పిన్నెళ్లి రామకృష్ణారెడ్డికి సంఘీభావం తెలిపేందుకు వెళ్తుంటే అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. జంట హత్యల కేసులో పిన్నెళ్లిని ఇరికించాలనే ప్రయత్నం చేస్తున్నారన్నారు. జంట హత్యల కేసులో టీడీపీ నేతలు ఉన్నారని ఎస్పీనే చెప్పారనే సంగతిని మాజీ మంత్రి విడదల రజిని గుర్తు చేశారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టేది లేదు.. ప్రతి ఒక్కరి సంగతి తేల్చుతామని హెచ్చరించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పిన్నెల్లిని కలవడానికి అనుమతి లేదంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. పోలీసులు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పార్టీ నేతలను హౌస్ అరెస్ట్లు చేస్తున్నారు. గుంటూరులో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని హౌస్ చేయడంతో పాటుగా మాచర్లకు ఎవరూ రాకుండా ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేశారు.కాగా, కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి నేడు మాచర్ల జూనియర్ అదనపు సివిల్ జడ్జి కోర్టులో లొంగిపోనున్నారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నాయకులు, సోదరులైన జవ్విశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావులు మే 24న హత్యకు గురయ్యారు. ఈ కేసులో అక్రమంగా పిన్నెల్లి సోదరులను ఇరికించడంతో కోర్టులో లొంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ..‘తెలుగుదేశం నాయకులు ఆధిపత్య పోరులో ఇద్దరిని మర్డర్ చేస్తే మాపైన అక్రమంగా కేసు పెట్టారు. ఈరోజు కోర్టులో మేము సరెండర్ అవుతాము. మా ఇంటికి ఎవరిని రానివ్వకుండా పోలీసులు చుట్టూ బారికేడ్లు పెట్టారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. కనీసం మా బంధువులను కూడా మా ఇంటికి పంపకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. మేము పోలీసులకు సహకరిస్తున్నాం. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలను మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్టు చేయటం దారుణం’ అని అన్నారు.మరోవైపు.. మీడియాపైన కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఇంటికి మీడియా వెళ్ళకుండా పోలీసులు అడ్డుకున్నారు. మీడియా ఆయన ఇంటికి వెళ్లడానికి వీల్లేదని పోలీసులు తెలిపారు. కాగా, ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు. అడుగడుగునా చెక్పోస్టులు పెట్టి ప్రతీ వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. మాచర్లకు బయట వ్యక్తులను ఎవరిని రానివ్వకుండా పంపించి వేస్తున్నారు. గురజాల సబ్ డివిజన్లో 144 సెక్షన్తో పాటు పోలీస్ యాక్ట్-30ని పోలీసులు అమలు చేస్తున్నారు. -
టీడీపీకి షాక్.. కడప మేయర్గా వైఎస్సార్సీపీ అభ్యర్థి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కడప కార్పొరేషన్ పాలకమండలి మేయర్గా పాకా సురేష్ ఎన్నికయ్యారు. సభ్యులంతా పాకా సురేష్ను మేయర్గా ఎన్నుకున్నారు. ఈ క్రమంలో పూర్తి స్థాయి మెజార్టీతో సురేష్ ఎన్నికయ్యారు. టీడీపీ ఎత్తులను పసిగట్టిన వైఎస్సార్సీపీ కార్పొరేషన్ పాలకమండలి చేజారకుండా జాగ్రత్తలు తీసుకుని సక్సెస్ అయ్యింది. ఇక, కడప మేయర్ అభ్యర్థిగా సీనియర్ కార్పొరేటర్ పాకా సురేష్ను వైఎస్సార్సీపీ ప్రకటించిన విషయం తెలిసిందే. కార్పొరేటర్ల మధ్య ఏకాభిప్రాయం కోసం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించి తుది నిర్ణయం తీసుకుంది. మేయర్ ఎన్నికతో కార్పొరేటర్ల మధ్య చీలికలు కోసం యత్నంచిన తెలుగుదేశం పార్టీకి శృంగభంగం తప్పలేదు. కాగా, కడప కార్పొరేషన్ పాలకమండలిలో 50 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వారిలో ఇరువురు కార్పొరేటర్లు బోలా పద్మావతి (22వ డివిజన్), ఆనంద్ (48వ డివిజన్) మృతి చెందారు. ఒకే ఒక్క కార్పొరేటర్ మాత్రమే జి ఉమాదేవి (49వ డివిజన్) తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందారు. 47 మందిలో 8 మంది కార్పొరేటర్లు వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించి తెలుగుదేశం పార్టీలో చేరారు. 39 మంది కార్పొరేటర్లు వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. కాగా, మేయర్ ఎన్నిక అనివార్యమైతే కార్పొరేటర్లు మధ్య అసంతృప్తులు తలెత్తితే కొందరినైనా తెలుగుదేశం పారీ్టలోకి తీసుకుని ఆనందించాలనే ఎత్తుగడలను టీడీపీ వేసింది.వారి అంచనాలకు అనుగుణంగానే మేయర్ పదవి కోసం వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు పాకా సురేష్, మాధవం మల్లికార్జున, సమ్మెట వాణీలు ఆశించారు. ఎలాగైనా పోటీ అనివార్యం అవుతోంది, ఒక వర్గమైన టీడీపీని ఆశ్రయం పొందుతుందని శతవిధాలుగా అధికార పార్టీ నేతలు ఆశించారు. టీడీపీ దురుద్ధేశ్యాన్ని పసిగట్టిన వైఎస్సార్సీపీ, కార్పొరేటర్లు మధ్య ఏకాభిప్రాయం కోసం ప్రయత్నించి సఫలీకృతులయ్యారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి ఎస్బి అంజాద్బాషా, మాజీ మేయర్ కె సురేష్బాబు, ఆర్టీసీ మాజీ చైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డిలు బుధవారం సాయంత్రం సమాలోచనలు చేశారు. అనంతరం కార్పొరేటర్లు అభిప్రాయాన్ని కోరి తుది నిర్ణయాన్ని ప్రకటించారు. మెజార్టీ కార్పొరేటర్ల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని 47వ డివిజన్ కార్పొరేటర్ పాకా సురేష్ను మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు. టీడీపీకి శృంగ భంగం... కడప మేయర్గా ఉన్న సురేష్బాబును అధికార బలంతో తెలుగుదేశం పార్టీ పదవీచ్యుతుడిని చేసింది. చట్టంలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకొని దొంగ దెబ్బ తీశారు. స్వయంగా ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫిర్యాదు చేశారు. ఆమేరకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ప్రధాన పాత్ర పోషించారు. కాగా, మేయర్ ఎన్నిక అనివార్యమైతే, వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు మధ్య చీలికలు వస్తాయి, తద్వారా లబ్దిపొందాలని భావించిన టీడీపీ నేతలకు శృంగభంగం తప్పలేదు. అనేక డివిజన్లల్లో చెప్పుకునే నాయకుడు లేకపోవడంతో వైఎస్సార్సీపీలో చీలికలు ఆశించారు. కానీ, అవేవీ సఫలం కాకపోవడంతో అధికార కూటమి సర్కార్కు ఎదురుదెబ్బ తగిలింది. -
ముద్దనూరు ఎంపీపీ వైఎస్సార్సీపీ కైవసం
వైఎస్సార్జిల్లా: జిల్లాలోని ముద్దనూరు ఎంపీపీ పదవిని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ముద్దనూరు ఎంపీపీగా కొర్రపాడు ఎంపీటీసీ వెన్నపూస పుష్పలత ఎన్నికయ్యారు. ముద్దనూరు మండల స్థానానికి జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా మొత్తం 10 స్థానాలున్నాయి. ఇందులో వైఎస్సార్సీపీకి 6గురు వైఎస్సార్సీపీ మద్దతుదారులు ఉన్నారు. దాంతో వైఎస్సార్సీపీ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. కూటమి నేతలు ప్రలోభాలకు దిగినప్పటికీ వైఎస్సార్సీపీ తమ సభ్యులకు విప్ జారీ చేయడంతో ఊహించినట్లే ఈ స్థానాన్ని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ఈ ఎన్నికకు సంబంధించి పలువురి సభ్యులపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రభావం ఉందని ఆరోపేణలు వచ్చాయి. ఈ క్రమంలోనే జిల్లా ఎస్పీకి భద్రత కల్పించాలని వైఎస్సార్సీపీ విజ్ఞప్తి చేసింది. బీజేపీ అనుచరులు తమ సభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వైఎస్సార్సీపీ తమ ఫిర్యాదులో పేర్కొంది. అయితే వైఎస్సార్సీపీ సభ్యులు కుట్రలు, కుతంత్రాలు, ప్రలోభాలకు గురి కాకుండా ఓటేయడంతో వైఎస్సార్సీపీనే ఈ స్థానాన్ని దక్కించుకుంది. విస్సన్నపేట ఎంపీపీ పదవి వైఎస్సార్సీపీదేఎన్టీఆర్ జిల్లాలోని విస్సన్నపేట ఎంపీపీ పదవిని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. విస్సన్నపేట ఎంపీపీగా గద్దల మల్లయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
వైద్యం ప్రైవేటీకరణపై ‘కోటి’ గళాలు!
చంద్రబాబు పాలనపై ప్రతిఘటన యుద్ధం మొదలైంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమం కలం కలం కలిసి కోటి గళాల స్వరంగా మారింది. వైద్యం ప్రైవేటీకరణపై కోటి గళాలు ఏకమై చంద్రబాబు పాలనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఊరూ వాడా ఏకమై కదులుతుంది. ఏపీలో వైఎస్సార్సీపీ తలపెట్టిన కోటి సంతకాల ఉద్యమం కేవలం ఒక నిరసన మాత్రమే కాదు, అది ప్రజల సమిష్టి ప్రతిఘటన. చంద్రబాబు పాలనపై రణభేరీ అంటే సరిగ్గా సరిపోతుందేమో. కలం కలం కలిసి.. ప్రజా గళంగా మారి..ఏపీలో వైఎస్ జగన్మోహన్రెడ్డి తెచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలనే చంద్రబాబు సర్కారు అనాలోచిత నిర్ణయం అనంతరం వైఎస్సార్సీపీ కోటి సంకతాల సేకరణకు పిలుపునిచ్చింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఈ పిలుపు ఇచ్చింది మొదలుకొని ప్రజా సమర సంతకం ఒక్కొక్కటిగా ఊపిరి పోసుకుంది. అది కోటికి పైగా సంతకాల సేకరణతో నిలువెత్తు ప్రజా ఉద్యమంగా మారిపోయింది. ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేసి మెడికల్ కాలేజీలను ప్రేవేటుపరం కాకుండా చూడాలని తమ సంతకంతోనే సమాదానం చెప్పారు.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపుతారా.. లేదా అని ప్రశ్నించడమే కాదు.. కచ్చితంగా ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. లక్ష్యం.. కోటి సంతకాలు.. కానీ..వైఎస్సార్సీపీ నిర్దేశించుకున్న లక్ష్యం కోటి సంతకాలు. కానీ ఆ ప్రజా ఉద్యమానికి అనూహ్య స్పందన వచ్చింది. కోటి సంతకాలతో లక్ష్యం పూర్తయినా, జనం నుంచి స్పందన వస్తూనే ఉంది. ఇప్పుడు ఆ కోటి సంతకాల సంఖ్య దాటిపోయింది. దీనికి ప్రజలు విస్తృతంగా మద్దతు తెలపడంతో కోటి సంతకాల సేకరణ కాస్తా కోట్లాడి గళాల నిరసనగా రూపాంతరం చెందింది. కార్పొరేట్ ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. ఈ కార్పొరేట్ చర్యను వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రజా స్వరం.. సంతకాల రూపంలో ఉద్యమించింది. ప్రతిఘటనగా మారి..వైఎస్ జగన్ తన హయాంలో ప్రారంభించిన 17 మెడికల్ కాలేజీలలో 7 పూర్తయ్యాయి, 5లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి.- ఇప్పుడు వాటిని పీపీపీ మోడల్ పేరుతో ప్రైవేటీకరించడానికి చంద్రబాబు ప్రభుత్వం చూస్తుంది. వైద్య విద్యను అత్యంత కాస్ట్లీగా మార్చాలనే చంద్రబాబు ప్రయత్నాన్నిప్రజా ఉద్యమంతోనే తిప్పికొట్టాలని వైఎస్సార్సీపీ భావించింది. ఆ క్రమంలోనే కోటి సంతకాల సేకరణకు పూనుకుంది. ఇది అత్యంత విజయవంతమై జనసంద్రంగా మారింది. అయితే ఈ అంశంపై 18వ తేదీన గవర్నర్ను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కలిసి వినతి పత్రం అందజేయనున్నారు. ప్రజల స్పందనను గవర్నర్ ముందుకే తీసుకుపోనున్నారు వైఎస్ జగన్. ర్యాలీలు, సమావేశాలు..కోటి సంతకాల సేకరణ అనంతరం గ ప్రజా ఉద్యమం పత్రాలను జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయాలకు తరలిస్తున్నారు. నిన్న(బుధవారం, డిసెంబర్ 10వతేదీన) ఈ కార్యక్రమం రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో విజయవంతంగా జరిగింది. సుమారు అన్ని జిల్లా పార్టీ కేంద్రాలయాకు ఈ ప్రతులు చేరిపోయాయి. 15వ తేదీన విజయవాడకు వీటిని తరలించనున్నారు. ఆపై 18వ తేదీన గవర్నర్ను వైఎస్ జగన్ కలవనున్నారు. మొత్తంగా, "కోటి సంతకాల ఉద్యమం" ఆంధ్రప్రదేశ్లో ప్రజల ఆగ్రహాన్ని ప్రతిబింబిస్తూ, బాబు పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజా ప్రతిఘటనగా మారింది. బాబు పాలనపై వ్యతిరేకతను బహిర్గతం చేస్తూ, ఈ ఉద్యమాన్ని ప్రజా శక్తి ప్రదర్శనగా మలచింది. గవర్నర్కు సంతకాలు సమర్పించిన తర్వాత, ఈ ఉద్యమం రాజకీయ చర్చలకు కేంద్రబిందువుగా మారే అవకాశం ఉంది. -
వీఎంసీ కౌన్సిల్లో ‘మంటలు’!
పటమట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాలపై సవతి ప్రేమ చూపుతోందని, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిర్మించిన 17 మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయటాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు వీఎంసీ కౌన్సిల్లో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని తట్టుకోలేని టీడీపీ సభ్యులు కౌన్సిల్ సాక్షిగా డెప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి నుంచి మైకు లాక్కొని, దాడికి పాల్పడ్డారు. సభ ఆద్యంతం టీడీపీ కార్పొరేటర్ల తీరుతో రసాభాసాగా మారింది. విజయవాడ నగర పాలక సంస్థ సాధారణ సర్వసభ్య సమావేశం గురువారం వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షతన జరిగింది. బాధితులకు న్యాయం చేయాలి.. పశి్చమ నియోజకవర్గంలోని 45వ డివిజన్లో 42 ఇళ్లను రాష్ట్రప్రభుత్వం తొలగించి ఆ కుటుంబాలను రోడ్డుపాలు చేసిందని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు ధ్వజమెత్తారు. వారికి న్యాయం చేయాలని 179వ అంశంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. టీడీపీ కార్పొరేటర్లు యథాప్రకారం సభ జరగకుండా నినాదాలు చేస్తూ హడావుడి చేశారు. ఓ క్రమంలో కౌన్సిల్ కంట్రోల్ రూంలో మైక్లను ఆపేయాలని గట్టిగా కేకలు వేస్తూ సిబ్బందిని, సభ సాక్షిగా బెదిరింపులకు గురి చేశారు. అక్కడ ఇళ్లు నిర్మించిన వారందరూ వీఎంసీ నుంచి ఇంటి నిర్మాణ ప్లాన్ను పొందారని, వారికి వీఎంసీ రెవెన్యూ విభాగం నుంచి పన్నులు కూడా వేశారని, తాగునీరు, డ్రెయినేజీ సదుపాయాలు కూడా కల్పించి ఇప్పుడు అర్ధాంతరంగా ఇళ్లను కూల్చివేసి తమకేమీ తెలీదని స్థానిక ఎమ్మెల్యే మాట్లాడటం విడ్డూరంగా ఉందని వైఎస్సార్ సీపీ సభ్యులు విమర్శించారు. సుప్రీంకోర్టు కూడా ఈ నెల 31వ వరకు గడువు విధించినప్పటికీ అంత తొందరగా ఇళ్లను తొలగించటం వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. పభుత్వం బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ తీర్మానం చేశారు. కమిషనర్కు నోటీసు.. 27వ డివిజన్లో వీఎంసీ సాధారణ నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాలుకు స్వాతంత్య్ర సమరయోధురాలు చిట్యాల(చాకలి) ఐలమ్మ పేరు పెడుతూ గతంలో కౌన్సిల్ తీర్మానం చేసింది. అయితే ఆ పేరు తొలగించారు. దీంతో స్థానిక కార్పొరేటర్ కొండాయిగుంట మల్లీశ్వరి మళ్లీ అదే పేరు పెడుతూ బోర్డు పెట్టాలని ప్రతిపాదించగా.. టీడీపీ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. దీనిపై కమిషనర్ను వివరణ కోరగా ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టామని, ప్రభుత్వ ఆదేశాల మేరకు వీఎంసీనే బోర్డు తొలగించిందని అన్నారు. కౌన్సిల్ను, కౌన్సిల్ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అవమానిస్తోందని, దీనిపై కమిషనర్కు సభా ఉల్లంఘనల కింద వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు డీసెంట్ నోట్ ఇచ్చారు. ఆ సమయంలో కూడా టీడీపీ కార్పొరేటర్లు లేచి సభలో పెద్దపెద్దగా నినాదాలు చేస్తూ గందరగోళ వాతావరణాన్ని సృష్టించారు. చంద్రబాబు ప్రభుత్వానికి బీసీలన్నా, పేదలన్నా, మధ్య తరగతన్నా గిట్టదని, ఈ క్రమంలోనే నగరాభివృద్ధిని, వీఎంసీ కౌన్సిల్ మర్యాదను ఖాతరు చేయటంలేదని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు ఆరోపించారు. స్పందించిన కమిషనర్ శుక్రవారం ఉదయం నాటికి కమ్యునిటీ హాలుకు చిట్యాల(చాకలి) ఐలమ్మ బోర్డు పెడతామని ప్రకటించారు. తీర్మాన పత్రాల చించివేత.. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ రద్దు తీర్మానాన్ని అడిషనల్ కౌన్సిల్ అజెండా సెక్షన్ 88కే ప్రకారం సభ్యులు సభ మధ్యలో అజెండాలోని 178 అంశంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మెజారిటీ సభ్యుల ఆమోదంతో ప్రవేశపెట్టారు. దీన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ కార్పొరేటర్లు సభలో గందరగోళాన్ని సృష్టించేందుకు యతి్నంచారు. తీర్మాన పత్రాలను చించివేశారు. ఈ సమయంలో మాట్లాడుతున్న డెప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి నుంచి మైక్ లాక్కొనేందుకు యతి్నంచారు. టీడీపీ కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్ డైరెక్షన్లో ఇతర టీడీపీ కార్పొరేటర్లు రెచ్చిపోయారు. ఆయన చేసిన సైగలతో టీడీపీ కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి ఓ అడుగు ముందుకేసి, డెప్యూటీ మేయర్పై దాడి చేసే యత్నం చేశారు. డెప్యూటీ మేయర్ అదే స్థాయిలో ప్రతిఘటించారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు సైతం ఆమె అండగా నిలబడ్డారు. ఈ క్రమంలో టీడీపీ కార్పొరేటర్లు పలుమార్లు అదుపుతప్పి మేయర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. వెంటనే మార్షల్స్ కల్పించుకుని పోడియం వద్దకు వచ్చిన వారిని అక్కడి నుంచి పంపేశారు. -
‘వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను పోలీసులు కిడ్నాప్ చేశారు’
మాచవరం: మాచవరం ఎంపీపీ ఎన్నికకు సంబంధించి టీడీపీకి బలం లేకపోయినా కుట్రలు చేస్తుందని వైఎస్సార్సీపీ నేత కాసు మహేష్రడ్డి ధ్వజమెత్తారు. మాచవరంలో వైఎస్సార్సీపీకే బలం ఉందని, అందుకే టీడీపీ కుట్రలకు పాల్పడుతుందన్నారు. మాచవరం ఎంపీపీ ఎన్నికకు సంబంధించి వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను కిడ్నాప్ చేశారన్నారు. ఈ కిడ్నాప్ వెనుక పోలీసుల హస్తం ఉందని కాసు మహేష్రెడ్డి విమర్శించారు. దాచేపల్లి సీఐ భాస్కర్.. వైఎస్సార్సీపీ ఎంపీటీలసీలను కిడ్నాప్ చేశారన్నారు. కిడ్నాప్ చేసి బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. పార్టీ మారకపోతే గంజాయి కేసు బనాయిస్తామని సీఐ బెదిరింపు చర్యలకు దిగారని కాసు మహేష్రెడ్డి విమర్శించారు. కాగా, మాచవరం మండల పరిషత్ అధ్యక్ష ఎన్నిక ఈరోజు(గురువారం, డిసంబర్ 11వ తేదీ జరుగనుంది. ఇటీవల మండల పరిషత్ అధ్యక్షురాలు దారం అమ్ములమ్మ మరణించడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం ఇక్కడ వైఎస్సార్సీపీకే స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ, పోటికి దిగిన టీడీపీ వివాదాలు స్పష్టిస్తోంది. మాచవరం మండలంలె 15 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, ఇందులో 13 స్థానాల్లో 13 మంది వైఎస్సార్సీపీ సభ్యులుండగా, కేవలం ఇద్దరు మాత్రమే టీడీపీ సభ్యులు ఉన్నారు. అయితే పోలీసుల సాయంతో ఎంపీపీని గెలుచుకోవాలని టీడీపీ కుట్రలు చేస్తుందని వైఎస్సార్సీపీ విమర్శిస్తోంది. అందుకే పోటీకి దిగి అనైతిక చర్యలకు పాల్పడుతుందని మండిపడుతోంది. కుట్రలు , కుతంత్రాలు చేస్తూ ఎన్నిక జరగ్గకుండా ప్రయత్నాలు చేస్తోందని వైఎస్సార్సీపీ నేత కాసు మహేష్రెడ్డి విమర్శిస్తున్నారు. ఆ క్రమంలోనే వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను కిడ్నాప్ చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. -
కడప మేయర్ అభ్యర్థిగా పాకా సురేష్!
సాక్షి ప్రతినిధి, కడప: కడప కార్పొరేషన్ పాలకమండలి మేయర్ అభ్యర్థిగా సీనియర్ కార్పొరేటర్ పాకా సురేష్ను వైఎస్సార్సీపీ ప్రకటించింది. కార్పొరేటర్ల మధ్య ఏకాభిప్రాయం కోసం ఆపార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించి తుది నిర్ణయం తీసుకుంది. మేయర్ ఎన్నికతో కార్పొరేటర్ల మధ్య చీలికలు కోసం యత్నంచిన తెలుగుదేశం పార్టీకి శృంగభంగం తప్పలేదు. టీడీపీ ఎత్తులను పసిగట్టిన వైఎస్సార్సీపీ కార్పొరేషన్ పాలకమండలి చేజారకుండా జాగ్రత్తలు తీసుకుని సక్సెస్ అయ్యింది. కడప కార్పొరేషన్ పాలకమండలిలో 50 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వారిలో ఇరువురు కార్పొరేటర్లు బోలా పద్మావతి (22వ డివిజన్), ఆనంద్ (48వ డివిజన్) మృతి చెందారు. ఒకే ఒక్క కార్పొరేటర్ మాత్రమే జి ఉమాదేవి (49వ డివిజన్) తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందారు. 47 మందిలో 8 మంది కార్పొరేటర్లు వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించి తెలుగుదేశం పారీ్టలో చేరారు. 39 మంది కార్పొరేటర్లు వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. కాగా, మేయర్ ఎన్నిక అనివార్యమైతే కార్పొరేటర్లు మధ్య అసంతృప్తులు తలెత్తితే కొందరినైనా తెలుగుదేశం పారీ్టలోకి తీసుకుని ఆనందించాలనే ఎత్తుగడలను టీడీపీ వేసింది. వారి అంచనాలకు అనుగుణంగానే మేయర్ పదవి కోసం వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు పాకా సురేష్, మాధవం మల్లికార్జున, సమ్మెట వాణీలు ఆశించారు. ఎలాగైనా పోటీ అనివార్యం అవుతోంది, ఒక వర్గమైన టీడీపీని ఆశ్రయం పొందుతుందని శతవిధాలుగా అధికార పార్టీ నేతలు ఆశించారు. టీడీపీ దురుద్ధేశ్యాన్ని పసిగట్టిన వైఎస్సార్సీపీ, కార్పొరేటర్లు మధ్య ఏకాభిప్రాయం కోసం ప్రయతి్నంచి సఫలీకృతులయ్యారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి ఎస్బి అంజాద్బాషా, మాజీ మేయర్ కె సురేష్బాబు, ఆర్టీసీ మాజీ చైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డిలు బుధవారం సాయంత్రం సమాలోచనలు చేశారు. అనంతరం కార్పొరేటర్లు అభిప్రాయాన్ని కోరి తుది నిర్ణయాన్ని ప్రకటించారు. మెజార్టీ కార్పొరేటర్ల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని 47వ డివిజన్ కార్పొరేటర్ పాకా సురేష్ను మేయర్ అభ్యరి్థగా ప్రకటించారు. టీడీపీకి శృంగ భంగం... కడప మేయర్గా ఉన్న సురేష్బాబును అధికార బలంతో తెలుగుదేశం పార్టీ పదవీచ్యుతుడిని చేసింది. చట్టంలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకొని దొంగ దెబ్బ తీశారు. స్వయంగా ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫిర్యాదు చేశారు. ఆమేరకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ప్రధాన పాత్ర పోషించారు. కాగా, మేయర్ ఎన్నిక అనివార్యమైతే, వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు మధ్య చీలికలు వస్తాయి, తద్వారా లబి్ధపొందాలని భావించిన టీడీపీ నేతలకు శృంగభంగం తప్పలేదు. అనేక డివిజన్లల్లో చెప్పుకునే నాయకుడు లేకపోవడంతో వైఎస్సార్సీపీలో చీలికలు ఆశించారు. వైఎస్సార్సీపీ కార్పోరేటర్లు మధ్య ఏకాభిప్రాయం కోసం ఆ పార్టీ నేతలు కసరత్తు చేసి సఫలీకృతులు కావడంతో మేయర్ ఎన్నిక గురువారం నాడు లాంఛనంగా పూర్తి కానుంది. బలం లేని కారణంగా మేయర్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఇదివరకే ప్రకటించారు. వైఎస్సార్సీపీ అభ్యరి్థగా పాకా సురేష్ నామినేషన్ దాఖలు చేయనున్న నేపధ్యంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.పాకా సురేను గొప్ప ఆధిక్యతతో గెలిపించాలి కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి పాకా సురేష్ కుమార్ను కార్పొరేటర్లు అందరూ గొప్ప అధిక్యతతో గెలిపించాలని కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం కడపలోని తన నివా సంలో మేయర్ ఎంపికపై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాష, అన్నమయ్య జిల్లా పరిశీలకులు కె. సురేష్ బాబు, కార్పొరేటర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మేయర్ ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఎవరిని మేయర్గా నిలబెట్టాలన్న అంశంపై అందరితో సమాలోచనలు చేసి అభిప్రాయాలు తీసుకున్నామన్నారు. మెజార్టీ కార్పొరేటర్ల అభిప్రాయం ప్రకారం పాకా సురేష్ను వైఎస్సార్సీపీ తరుపున మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేశామన్నారు. కొర్రపాడు ఎంపీటీసీ పుష్పలతకు ఎంపీపీగా అవకాశం .. ముద్దనూరు మండల పరిషత్ అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేయాలన్న విషయమై ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే డా. సు«దీర్రెడ్డిలతో సమాలోచనలు చేశామని ఎంపీ తెలిపారు. ఎంపీపీగా కొర్రపాడు ఎంపీటీసీ పుష్పలతను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఏకాభిప్రాయంతో మేయర్ అభ్యర్థి ఎంపిక: రవీంద్రనాథ్రెడ్డి ఏకాభిప్రాయంతో కడప మేయర్ అభ్యర్థి ఎంపిక చేశామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి తెలిపారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లలో ముగ్గు్గరు మేయర్ పదవి ఆశించారని, అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత పాకా సురేష్ను ఏక గ్రీవంగా ఎంపిక చేశామన్నారు. వైఎస్సార్సీపీలో చీలిక తేవాలని టీడీపీ పాచిక వేసిందని, కార్పొరేటర్ల ఐక్యత ముందు అది పారలేదని తెలిపారు. పార్టీ అధినేత వైఎస్ జగన్, పార్టీ నేతలు, కార్పొరేటర్లకు కృతజ్ఞతలు: పాకా సురేష్ తనను మేయర్ అభ్యరి్థగా ఎంపిక చేసిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి పాకా సురేష్ కృతజ్ఞతలు తెలిపారు. మేయర్ ఎన్నిక అనివార్యంగా మారిందని, ఈ నేపథ్యంలో నా అభ్యర్థిత్వాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాష, అన్నమయ్య జిల్లా పరిశీలకులు కె. సురేష్ బాబు, కార్పొరేటర్లకు ధన్యవాదాలు తెలిపారు. తనను మేయర్గా గెలిపించాలని కార్పొ రేటర్లను కోరుతున్నానని తెలిపారు.


