breaking news
YSRCP
-
ఆస్ట్రేలియా YSRCP NRIలపై లక్ష్మీపార్వతి ప్రశంసలు
-
హిందూపురంలో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు
సాక్షి, శ్రీ సత్యసాయి: హిందూపురంలో అధికార తెలుగు దేశం పార్టీ గూండాలు రెచ్చిపోయారు. శనివారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కార్యాలయం అద్దాలు, ఫర్నీఛర్, అక్కడే ఉన్న ఓ వాహనం ధ్వంసం అయ్యాయి. టీడీపీ రౌడీలను అడ్డుకునేందుకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు ప్రయత్నించగా.. వాళ్లపైనా దాడి జరిగింది. ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. ఈ దాడిని వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేస్తోంది. -
హైదరాబాద్ బిర్యానీ పై బాబు కామెంట్స్ జక్కంపూడి విజయలక్ష్మి సెటైర్లు
-
ఫోన్ పట్టుకుని తెగ షూట్ చేస్తున్నాడు.. పవన్ పై తాటిపర్తి చంద్రశేఖర్ సెటైర్లు
-
ఆస్ట్రేలియా ఎన్నారైల మద్దతు చిరస్మరణీయం:లక్ష్మీపార్వతి
సిడ్నీ: వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలుస్తున్న ఆస్ట్రేలియా ఎన్నారై వైఎస్సార్సీపీ కార్యకర్తలకు పార్టీ సీనియర్ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి అభినందనలు,కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటనలో ఉన్న ఆమె పార్టీ నాయకుడు చింతల చెరువు సూర్యనారాయణ రెడ్డి ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘పార్టీ కష్టకాలంలో ఉన్న వైఎస్ జగన్పై మీరు చూపిన ఆధారాభిమానానికి పార్టీ ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటుంది. మీ మద్దతు చిరస్మరణీయంగా నిలుస్తుంది’అని పేర్కొన్నారు. ‘మీ సహాయ సహకారాలు ఇదే విధంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను. రేపు రాబోయే జగనన్న ప్రభుత్వంలో కార్యకర్తలకు అన్ని విధాలుగా భరోసా ఉంటుంది. పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎన్నారైలు మాట్లాడుతూ వైఎస్ జగన్ పరిపాలన హయాంలో ప్రజలకు ఎంతో మేలు జరిగిందని గుర్తు చేసుకున్నారు. తమలో చాలామంది మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల వల్ల విదేశాల్లో స్థిరపడ్డామని తెలిపారు. ఆ రుణం తీర్చుకునేందుకు మేము ఎల్లప్పుడూ వైఎస్ జగన్కు మద్దతుగా ఉంటాం’అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చింతల చెరువు సూర్యనారాయణ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, వీరం రెడ్డి, గజ్జల చంద్ర ఓబుల రెడ్డి, కోట శ్రీనివాస్ రెడ్డి, దూడల కిరణ్ రెడ్డి, నరెడ్డి ఉమా శంకర్, కృష్ణ చైతన్య కామరాజు, నల్ల జగదీశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ మాజీమంత్రి యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు
సాక్షి,అమరావతి: టీడీపీ మాజీమంత్రి యనలమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నేను రోజూ సాక్షిపేపర్ చదువుతా.. సాక్షి టీవీ చూస్తా. ప్రతిపక్షం ఊదితే మనం ఎగిరిపోతాం. మెడికల్ కాలేజీల నిరసన ర్యాలీతో.. ప్రతిపక్షంలో కసి పెరిగింది. ప్రజలు గ్రామాల నుంచి భారీగా తరలివచ్చారు’ అని గుర్తు చేశారు. -
రైల్వే ట్రాక్పై టీటీడీ మాజీ ఏవీఎస్వో మృతదేహం
సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఏవీఎస్వో సతీష్ అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే ట్రాక్పై విగతజీవిగా పడి కనిపించారు. పరకామణి కేసులో విదేశీ డాలర్లను దొంగతనం చేసిన రవికుమార్పై అప్పట్లో ఏవీఎస్వో సతీశ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసును గతంలో విచారించిన సతీష్ను.. ఆపై నిందితుడిగా సిట్ పేర్కొంది. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం గుంతకల్ రైల్వే ఆర్ఐగా పని చేస్తున్న ఆయన్ని ఈ నెల 6వ తేదీన సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ బృందం విచారణ జరిపింది. అయితే.. మరోసారి విచారణకు రావాలంటూ అధికారులు ఆయనకు నోటీసులు పంపించారు. దీంతో వేధింపులు భరించలేకే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.సతీష్ను వేధించారు: వైఎస్సార్సీపీసతీష్ కుమార్ మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని అంటున్నారు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్. ‘‘పరకామణి కేసులో రవికుమార్ ని పట్టుకున్నదే సతీష్ కుమార్. అలాంటి వ్యక్తి చనిపోవడం అనుమానాస్పదంగా ఉంది. సతీష్ మృతిపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరపించాలి. వాస్తవాలు ఏంటో బయటి ప్రపంచానికి తెలియచేయాలి. సతీష్ను వేధించారు. భూమన కరుణాకరరెడ్డిని ఆ కేసులో లాగాలని సతీష్ పై ఒత్తిడి చేశారు. వెంకటేశ్వరస్వామిని రాజకీయాలలో కి లాగటం బాధాకరం. ఈ కేసులో ఏ స్థాయిలో ఒత్తిడి ఉంటే సతీష్ ఆత్మహత్య చేసుకున్మాడో అర్థం చేసుకోవచ్చు. తనపై తీవ్రస్థాయిలో ఒత్తిడి ఉందని సతీష్ కుమార్ తన ఫ్రెండ్స్ దగ్గర చాలా సార్లు చెప్పారు. నాలుగు రోజుల సతీష్ విచారణ లో ఏం జరిగిందో బయట పెట్టాలి. వ్యవస్థలు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి’’ అని శైలజానాథ్ డిమాండ్ చేశారు. -
క్రెడిట్ చోరీలో మీకు మీరే సాటి
సాక్షి, అమరావతి : వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాల్లో.. అప్పట్లోనే మంజూరై నిర్మాణంలో ఉన్న ఇళ్లను పట్టుకుని ‘ఈ ఇళ్లన్నీ మేమే కట్టేశాం’ అంటూ మీరు చేస్తున్న క్రెడిట్ చోరీ స్కీం హేయంగా ఉందని సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతరుల కష్టాన్ని తన గొప్పతనంగా చెప్పుకునేవాడు నాయకుడు కాదని.. నాటకాల రాయుడు అని అంటారని చురకలు వేశారు. ఒకరి కష్టాన్ని కొట్టేయడంలో, ఒకరి ఐడియాను తనదిగా చెప్పుకోవడంలో.. ఆ పేదల ఇళ్ల స్థలాలను సైతం లాక్కునే ప్రయత్నం చేయడంలో.. అసలు ఆ క్రెడిట్ చోరీలో మీకు మీరే సాటి అంటూ సీఎం చంద్రబాబుపై వ్యంగ్యోక్తులు విసిరారు. ఈ మేరకు గురువారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో క్రెడిట్ చోర్ బాబు హ్యాష్ట్యాగ్తో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే..» చంద్రబాబు గారూ.. మీ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో విజయవంతంగా నడుస్తున్న ‘‘క్రెడిట్ చోరీ స్కీం’’ చాలా బాగుంది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఈ 18 నెలల కాలంలో ఒక్క గజం స్థలం కూడా సేకరించలేదు. ఒక్కరికి ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వలేదు. దీనికోసం ఒక్కపైసా కూడా ఖర్చు చేయలేదు. ఒక్కరికి ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదు. గత ప్రభుత్వం.. అంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటి స్థలాల్లోనే, వైఎస్సార్సీపీ గతంలో శాంక్షన్ చేయించిన ఇళ్లను, మా ప్రభుత్వ హయాంలోనే నిర్మాణంలో ఉన్న వాటిని పట్టుకుని ‘‘ఇళ్లన్నీ మేమే కట్టేశాం’’ అంటున్నారు. కళ్లార్పకుండా, ఏ మాత్రం సిగ్గు పడకుండా పచ్చి అబద్ధాలను బల్లగుద్ది మరీ చెబుతూ ఆ క్రెడిట్ మాదేనంటూ మీరు చేస్తున్న క్రెడిట్ చోరీ స్కీం హేయంగా ఉంది. ఇతరుల కష్టాన్ని తన గొప్పతనంగా చెప్పుకునేవాడు నాయకుడు కాదు.. నాటకాల రాయుడు అంటారు.» మీరు ప్రారంభించామని చెప్పుకుంటున్న 3,00,092 ఇళ్లల్లో ఒక్క ఇంటి పట్టా కూడా మీరు ఇవ్వలేదు. ఒక్క ఇల్లు కూడా మీరు మంజూరు చేయించ లేదు. ఆ 3,00,092 ఇళ్లలో 1,40,010 ఇళ్లు మా హయాంలోనే పూర్తయ్యే దశలో ఉన్నవే. మరో 87,380 ఇళ్లు శ్లాబ్ లెవల్ వరకు మా హయాంలోనే కట్టించినవే. శ్లాబ్ కంటే కింద స్థాయిలో మరో 66,845 ఇళ్లు మా హయాంలో నిర్మాణంలో ఉన్నవే. » ఇవికాక 2023 అక్టోబర్ 12న ఒకేసారి 7,43,396 ఇళ్లల్లో ఒకే రోజు గృహ ప్రవేశాలతో మా ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. ఇన్ని వాస్తవాలు కళ్ల ముందే ఉన్నా అసలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏమీ చేయనట్టుగా, మీరే అన్నీ చేసినట్టుగా పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్న మీ స్కీం చాలా హేయం! మా హయాంలో 71,800 ఎకరాల్లో 31.19 లక్షల ఇళ్ల పట్టాలను అక్కచెల్లెమ్మలకు ఉచితంగా ఇచ్చి, వారి పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయించాం. 21.75 లక్షల ఇళ్లను శాంక్షన్ చేయించి, కోవిడ్ లాంటి మహమ్మారి ద్వారా తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కొంటూ 9 లక్షలకుపైగా ఇళ్లను మా హయాంలోనే పూర్తి చేశాం. » అయినా అన్నీ మీరే చేశారన్నట్టుగా మీరు చెప్పడమే కాకుండా, మీ ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయించుకుని, ఆ క్రెడిట్ను కొట్టేయాలనుకుంటున్న మీ స్కీం చాలా హేయం చంద్రబాబు గారూ! మేము 31.19 లక్షల ఇళ్ల పట్టాలను ఇచ్చి, అందులో 21.75 లక్షల ఇళ్లు శాంక్షన్ చేయించి కట్టడం మొదలుపెట్టాం.మిగిలిన ఆ 10 లక్షల ఇళ్ల స్థలాల్లో పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చే కార్యక్రమానికి పూనుకోకుండా, ఆ ఖాళీ స్థలాలను లాక్కునే కార్యక్రమం చేస్తున్న మీరు సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి, నిస్సిగ్గుగా క్రెడిట్ చోరీకి పాల్పడ్డం అత్యంత హేయం! ఒకరి కష్టాన్ని కొట్టేయడంలో, ఒకరి ఐడియాను మీదిగా చెప్పుకోవడంలో, ఆ పేదల ఇళ్ల స్థలాలను సైతం లాక్కునే ప్రయత్నం చేయడంలో.. అసలు ఆ క్రెడిట్ చోరీలో మీకు మీరే సాటి. -
ప్రజల కోసం మాట్లాడడమే నేరమా? : మాజీ మంత్రి అప్పలరాజు
శ్రీకాకుళం: నకిలీ మద్యం వ్యాపారాలపై ప్రజా ప్రయోజనాల కోసం నిరసన ర్యాలీ నిర్వహించినందుకు తనపై కేసు నమోదు చేశారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు వ్యాఖ్యానించారు. ప్రజల కోసం మేము ర్యాలీ చేశాం. కానీ ఆ ర్యాలీని పోలీసు విధులకు ఆటంకం కలిగించామంటూ మాపై కేసు పెట్టడం విచారకరం అని అప్పలరాజు అన్నారు.గత 16 నెలల్లో తనపై 10 కేసులు నమోదు చేశారు. ఇది రాజకీయ కక్షతో చేస్తున్న చర్య. విద్యుత్ చార్జీలు పెంచారని ప్రజల తరపున నేను నిరసన చేపట్టాను. దానిపైనా మరో కేసు పెట్టారు అని తన ఆవేదన వ్యక్తం చేశారు.తాను వైద్య వృత్తి నుంచి వచ్చి నిస్వార్థంగా రాజకీయాలు చేస్తున్నానని, కానీ కూటమి ప్రభుత్వం తనలాంటి వారిపై తప్పుడు కేసులు మోపుతోందని ఆయన అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ ప్రతిపక్ష నాయకులపై ఇలాంటి కేసులు పెట్టలేదు. ప్రజల సమస్యలపై మేము గళం విప్పితే దాన్ని అణచివేయాలనే ప్రయత్నం జరుగుతోంది అని అప్పలరాజు తీవ్రంగా విమర్శించారు.ప్రజా సమస్యలపై పోరాడినందుకు శిక్షించాలన్న తీరుతో వ్యవహరించడం ప్రజాస్వామ్యానికే మచ్చ అని ఆయన పేర్కొన్నారు. “ప్రజల కోసం మాట్లాడడమే నేరమా?” అని అప్పలరాజు ప్రశ్నించారు. -
తిరుపతిలో ప్రజా ఉద్యమం చూసి బిత్తరపోయిన పోలీసులు
-
పవన్ కళ్యాణ్పై YSRCP సీరియస్
సాక్షి, తాడేపల్లి: పవన్ కళ్యాణ్పై వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పదేపదే పాచిపోయిన ఆరోపణలు చేయటం ఏంటని ప్రశ్నించింది. తమ పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై భూకబ్జా ఆరోపణలు చేసిన వపన్ కళ్యాణ్పై మండిపడింది. పాత ఆరోపణలకు సినిమా రంగు పూసి కొత్తగా ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ నిప్పులు చెరిగింది.‘‘డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే పవన్ కళ్యాణ్ మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతోంది. వారి చేతిలో అధికారం ఉంది. ఫైళ్లన్నీ వారి దగ్గరే ఉన్నాయి. ఇప్పటికీ ఒక్క ఆరోపణను కూడా రుజువు చేయలేకపోయారు. పాచిపోయిన పాత ఆరోపణలకు సినిమా రంగు తొడిగి కొత్తగా ప్రచారం చేస్తే అబద్ధాలు నిజాలు అవుతాయా?..సర్వే సెటిల్ మెంట్ డైరెక్టర్ 1981లో ఇచ్చిన తీర్పులోని అంశాలను కూడా పవన్కళ్యాణ్ కాదనగలరా?. పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు కొనుగోలు చేసిన 75.74 ఎకరాలకు 1966లోనే రైత్వారీ పట్టాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా?. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బురదచల్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అధికారులతో ఎన్నో కమిటీలు వేసి, విచారణలమీద విచారణలు చేశారు. కానీ ఆరోపణలను రుజువు చేయలేకపోయారు...ఇన్నిరోజుల్లో ఒక్క ఆధారాన్నీ చూపలేకపోయారు. నేపాల్కు ఎర్రచందనం అంటూ ఇదే వపన్కళ్యాణ్ అర్థంలేని విమర్శలు చేశారు. నిరూపించాలని మిథున్రెడ్డి సవాల్ విసిరితే ఇప్పటికీ దానిపై నోరు మెదపలేదు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక, తుపాను నష్టపరిహారం అందించలేక ఇంకా అనేక సమస్యలను పరిష్కరించలేక డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు’’ అంటూ వైఎస్సార్సీపీ దుయ్యబట్టింది. 🚨 Dare to answer these questions, @PawanKalyan ?డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే పవన్ కళ్యాణ్ మా పార్టీ సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై భూ కబ్జా అంటూ నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతోంది. వారి చేతిలో అధికారం ఉంది, ఫైళ్లన్నీ… https://t.co/vyPJQ0kSWp— YSR Congress Party (@YSRCParty) November 13, 2025 -
ఆస్ట్రేలియాలో లక్ష్మీపార్వతికి వైఎస్సార్సీపీ శ్రేణుల ఘనస్వాగతం
ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతికి అక్కడ వైఎస్సార్సీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. లక్ష్మీపార్వతికి నాయకులు చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి ,గజ్జల చంద్ర ఓబుల రెడ్డి,వీరం రెడ్డి శ్రీధర్ రెడ్డి ,దూడల కిరణ్ రెడ్డి, కామరాజు కృష్ణ చైతన్య ,కోటా శ్రీనివాసరెడ్డి, దుగ్గింపుడి కిరణ్ రెడ్డి, సిద్ధన సురేష్ రెడ్డి తదితరులు ఘనస్వాగతం పలికారు. ప్రస్తుతం బ్రిస్బేన్లో ఉన్న లక్ష్మీపార్వతి.. వారం రోజుల పాటు ఆస్ట్రేలియాలోనే ఉంటారు. అక్కడ వివిధ నగరాల్లో జరిగే ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమాకు ఆమె హాజరుకానున్నారు. -
పవన్ కళ్యాణ్కు ఎంపీ మిథున్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, అమరావతి: పవన్ కళ్యాణ్కు వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మంగళంపేట భూములపై చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు. నిరూపించలేకపోతే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళంపేట అటవీ భూముల ఆక్రమణదారులు ఎవరు? అంటూ పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్పై స్పందించిన మిథున్.. ఆ ఆరోపణలను నిరూపించాలని పవన్కు రీట్వీట్ చేస్తూ సవాల్ విసిరారు.ఆ భూములను తాము 2000 సంవత్సరంలోనే చట్టబద్దంగా కొనుగోలు చేశామని వెల్లడించారు. దానికి సంబంధించిన రికార్డులన్నీ ఉన్నాయనీ, వాటిని ఆన్ లైన్ లో చెక్ చేసుకోవచ్చంటూ మిథున్రెడ్డి సవాల్ విసిరారు. ముందుగా వాటిని పరిశీలించి, ఆ తర్వాతే మాట్లాడాలని పవన్కు ఆయన హితవు పలికారు. గతంలో కూడా ఎర్ర చందనం విషయంలోనూ పవన్ ఇలాగే ఆరోపణలు చేసి పారిపోయారని మిథున్ గుర్తు చేశారు. తమపై ద్వేషంతోనే పవన్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. Mr @PawanKalyan you are good at shooting and scooting. You have done that in the past (remember red sanders remarks made by you) and ran away after I demanded you to prove the allegations. What you have shot from your helicopter is our legitimate land, we bought it in 2000.— Mithunreddy (@MithunReddyYSRC) November 13, 2025 -
క్రెడిట్ చోరీలో అడ్డంగా దొరికిన నారా లోకేష్
సాక్షి, విజయవాడ: క్రెడిట్ చోరీలో నారా లోకేష్ అడ్డంగా దొరికిపోయారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే రెన్యూ (Renew) పెట్టుబడులకు ఒప్పందం జరిగింది. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో సైతం రెన్యూతో ఒప్పందాలు కుదుర్చుకుంది. పెట్టుబడుల ఒప్పందంలో భాగంగా రెన్యూ పవర్ ప్రాజెక్టులకు వైఎస్ జగన్ హయాంలోనే అనంతపురం, శ్రీ సత్య సాయి జిల్లాల్లో భూ కేటాయింపులూ జరిగాయి. 600 మెగా వాట్లు, 300 మెగా వాట్లు సామర్థ్యం గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు మంజూరయ్యాయి. అయితే విచిత్రంగా అదే రెన్యూ కంపెనీతో వైజాగ్ గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్లో కూటమి ప్రభుత్వ ఒప్పందం కుదుర్చుకుంది. రెన్యూ సంస్థను గత 5 ఏళ్లలో రాష్ట్రం నుండి పంపేసారంటూ నారా లోకేష్ పచ్చి అబద్ధాలు ఆడారువై ఎస్ జగన్ తెచ్చిన కంపెనీతో మళ్ళీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుటుంటుంది. ఇప్పటికే వైఎస్ జగన్ తన పాలనలో అందించిన అనేక సంక్షేమ పథకాలు,రాష్ట్రానికి తెచ్చిన పెట్టుబడులను చంద్రబాబు తన ఖాతాలో వేసుకొని క్రెడిట్ చోరీకి పాల్పడగా.. తాజాగా లోకేష్ సైతం రెన్యూతో ఒప్పందం కుదర్చుకుని క్రెడిట్ చోరీకి పాల్పడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2023 జూన్ 20న రెన్యూ ప్రోజెక్టుకి అనుమతులు ఇస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం జిఓ 15 జారీ చేసింది. 2024 ఫిబ్రవరి5 న రెన్యూకి రెండో ప్రాజెక్ట్ మంజూరు చేస్తున్నట్లు జారీ చేసిన జీవోల్లో పేర్కొంది. గత ప్రభుత్వంలో రెన్యూ పెట్టుబడుల ఒప్పందాలు, జీవోలపై ఇప్పటి సిఎస్,ఎనర్జీ సెక్రటరీగా కూడా ఉన్న విజయానంద్ సంతకాలు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రెన్యూతో ఒప్పందాలు కుదుర్చుకోవడం, వాటికి గురించి ట్వీట్ చేసి నారా లోకేష్ అభాసుపాలయ్యారు. -
అంబటి రాంబాబుపై కూటమి సర్కార్ కక్ష సాధింపు
సాక్షి, గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. అంబటి రాంబాబుపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా అంబటి రాంబాబు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని పట్టాభిపురం సీఐ అడ్డుకున్నారు. దీంతో పట్టాభిపురం సిఐకి, అంబటి రాంబాబుకి మధ్య వాగ్వాదం జరిగింది.అంబటి రాంబాబుపై పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు దౌర్జన్యం చేశారు. తమ విధులకు ఆటంకం కలిగించారంటూ అంబటి రాంబాబుపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ పిలుపు మేరకు బుధవారం(నవంబర్ 12) భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.స్వామి థియేటర్ నుంచి ర్యాలీగా బయలుదేరిన పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలను కంకరగుంట ఫ్లైఓవర్ మీదకు రానీయకుండా పోలీసులు బారికేడ్లు పెట్టారు. దీంతో బారికేడ్లను నెట్టుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయతి్నంచిన నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు తీరుపై అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ, అంబటికి వేలు చూపిస్తూ బెదిరింపులకు దిగారు. పోలీసుల అవరోధాలను అధిగమించిన నాయకులు, కార్యకర్తలు బారికేడ్లు తోసుకుని ముందుకు వెళ్లారు. మంత్రి లోకేష్ ప్రోద్భలంతో సీఐ తనను టార్గెట్ చేశారని రాంబాబు మండిపడ్డారు. -
Vijayawada: ఇప్పటికైనా బుద్ది తెచ్చుకుని ఈ ప్రజా ఉద్యమంతో కళ్ళు తెరవండి
-
చంద్రబాబు క్రెడిట్ చోరీపై వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబూ.. మీ కథ, స్క్రీన్, ప్లే, దర్శకత్వంలో విజయవంతంగా నడుస్తున్న “క్రెడిట్ చోరీ స్కీం’ చాలా బాగుందంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చురకలు అంటించారు. క్రెడిట్ చోర్ చంద్రబాబు అనే హ్యాష్ ట్యాగ్తో వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.‘‘పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఈ 18 నెలల కాలంలో ఒక్క గజం స్థలం కూడా సేకరించకుండా.. ఒక్కరికి ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వకుండా.. దీనికోసం ఒక్కపైసా కూడా ఖర్చుచేయకుండా.. ఒక్కరికి ఒక్క ఇల్లుకూడా మంజూరు చేయకుండా.. గత ప్రభుత్వం అంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటి స్థలాల్లోనే, వైఎస్సార్సీపీ గతంలో శాంక్షన్ చేయించిన ఇళ్లను మా ప్రభుత్వ హయాంలోనే నిర్మాణంలో ఉన్నవాటిని పట్టుకుని “ఇళ్లన్నీ మేమే కట్టేశాం” అంటూ పచ్చి అబద్ధాలను కళ్లార్పకుండా, ఏ మాత్రం సిగ్గుపడకుండా, బల్లగుద్దీ మరీ చెప్తూ… ఆ క్రెడిట్ మీదేనంటూ మీరు చేస్తున్న క్రెడిట్ చోరీ స్కీం హేయంగా ఉంది. ఇతరుల కష్టాన్ని తన గొప్పతనంగా చెప్పుకునేవాడు నాయకుడు కాదు.. నాటకాల రాయుడు అంటారు’’ ఎక్స్ వేదికగా దుయ్యబట్టారు.‘‘మీరు ప్రారంభించామని చెప్పుకుంటున్న 3,00,092 ఇళ్లలో ఒక్క ఇంటిపట్టా కూడా మీరు ఇవ్వలేదు. ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయించ లేదు. ఆ 3,00,092 ఇళ్లలో 1,40,010 ఇళ్లు మా హయాంలోనే పూర్తయ్యే దశలో ఉన్నవే. మరో 87,380 ఇళ్లు శ్లాబ్ లెవల్ వరకూ మా హయాంలోనే కట్టించినవే. శ్లాబ్ కంటే కింద స్థాయిలో మరో 66,845 ఇళ్లు మా హయాంలో నిర్మాణంలోఉన్నవే. ఇవికాక అక్టోబరు 12, 2023న ఒకేసారి 7,43,396 ఇళ్లలో ఒకేరోజు గృహప్రవేశాలతో మా ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. ఇన్ని వాస్తవాలు కళ్ళముందే ఉన్నా… అసలు వైయస్సార్సీపీ ప్రభుత్వం ఏమీ చేయనట్టుగా, మీరే అన్నీ చేసినట్టుగా పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్న మీ స్కీం చాలా హేయం!చంద్రబాబుగారూ… మీ కథ, స్క్రీన్, ప్లే, దర్శకత్వంలో విజయవంతంగా నడుస్తున్న “క్రెడిట్ చోరీ స్కీం’’ చాలా బాగుంది.పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వడానికి ఈ 18 నెలల కాలంలో ఒక్క గజం స్థలం కూడా సేకరించకుండా..ఒక్కరికి ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వకుండా…దీనికోసం ఒక్కపైసా కూడా ఖర్చుచేయకుండా……— YS Jagan Mohan Reddy (@ysjagan) November 13, 2025..మా హయాంలో 71.8 వేల ఎకరాల్లో 31.19 లక్షల ఇళ్ల పట్టాలను అక్కచెల్లెమ్మలకు ఇచ్చి, వారి పేరుమీదే రిజిస్ట్రేషన్ చేయించాం. 21.75 లక్షల ఇళ్లను శాంక్షన్ చేయించి…కోవిడ్లాంటి మహమ్మారి ద్వారా తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కొంటూ 9 లక్షలకుపైగా ఇళ్లను మా హయాంలోనే పూర్తిచేసినా, అన్నీ మీరే చేశారన్నట్టుగా మీరు చెప్పడమే కాకుండా, మీ ఎల్లోమీడియా ద్వారా ప్రచారం చేయించుకుని, ఆ క్రెడిట్ కొట్టేయాలనుకుంటున్న మీ స్కీం చాలా హేయం..చంద్రబాబూ.. మేము 31.9 ఇళ్ల పట్టాలను ఇచ్చి, అందులో 21.75లక్షల ఇళ్లు శాంక్షన్ చేయించి కట్టడం మొదలుపెట్టాం. మిగిలిన ఆ 10 లక్షల ఇళ్ల స్థలాల్లో పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చే కార్యక్రమానికి పూనుకోకుండా, ఆ ఖాళీ స్థలాలను లాక్కునే కార్యక్రమం చేస్తున్న మీరు సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి, నిస్సిగ్గుగా క్రెడిట్ చోరీకి పాల్పడ్డం అత్యంత హేయం!. ఒకరి కష్టాన్ని కొట్టేయడంలో, ఒకరి ఐడియాను మీదిగా చెప్పుకోవడంలో, ఆ పేదల ఇళ్లస్థలాలను సైతం లాక్కునే ప్రయత్నం చేయడం, అసలు ఆ క్రెడిట్ చోరీలో మీకు మీరే సాటి’’ అంటూ వైఎస్ జగన్ నిలదీశారు. -
ప్రజా ఉద్యమ ర్యాలీ.. Grand Success.. దద్దరిల్లిన AP
-
కోటి గళాల గర్జన.. గ్రాండ్ సక్సెస్
-
కట్టించింది జగన్.. క్రెడిట్ కొట్టేస్తున్నది బాబు
అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం దేవగుడిపల్లెకు చెందిన ఎస్.ముంతాజ్బేగం, ఎం.హేమలతకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2022లో పక్కా ఇళ్లు మంజూరు చేయగా వారు పూర్తిచేశారు. గోడలపైనా ఇదే రాశారు. ఈ వివరాలు గృహనిర్మాణశాఖ లెక్కల్లోనే స్పష్టంగా ఉన్నాయి. కానీ, వీటిలో గృహ ప్రవేశాలంటూ బుధవారం సీఎం చంద్రబాబు ఆర్భాటం చేశారు. ముంతాజ్బేగంకు దేవగుడిపల్లెలో సొంత స్థలం ఉండగా పక్కా ఇంటికి 2022 మే 9న ఆమోదం వచ్చింది. ముంతాజ్బేగం పేరిట తహసీల్దార్ 2023 జూలై 6న పొసెషన్ సర్టిఫికెట్ ఇచ్చారు. 2022 ఏప్రిల్– 2023 జూన్ 4 వరకు మూడు బిల్లులు నా బ్యాంకు ఖాతాలో జమయ్యాయి. రోజుకు రూ.200 లెక్కన 90 రోజుల ఉపాధి హామీ పథకం బిల్లు వచ్చింది. కేవలం రంగులు వేయించి బుధవారం గృహ ప్రవేశం చేయించారు. » హేమలతకూ సొంత స్థలం ఉండగా 2022 జూలై 9న పక్కా గృహం మంజూరైంది. 2024 మార్చికి పూర్తి చేశారు. ఈ బిల్లు బ్యాంకు ఖాతాలో జమ అయ్యింది. ఉపాధి హామీ బిల్లు కూడా అందింది. ఇప్పుడు చంద్రబాబు సర్కారురంగులు వేసింది. ఇంటి స్థలం ధ్రువీకరణ పత్రం, ఇంటి మంజూరు పత్రం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే జారీ అయ్యాయని వాటిని గృహ నిర్మాణ శాఖ అధికారులు తీసుకున్నారని హేమలత చెప్పడం గమనార్హం.అద్దె బాధల నుంచి విముక్తినా పేరు ఫాతిమా. ఇదిగో ఇది నాకు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వచ్చిన ఇంటి పట్టా. వ్యవసాయ కూలిగా జీవనం సాగించే నేను వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే పక్కా ఇంటి కోసం గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నా. వెంటనే స్థలం, ఇంటి పట్టా ఇచ్చారు. రూ.1.80 లక్షల సాయం చేశారు. నెలనెల అద్దె కట్టడానికి ఇబ్బంది పడేవాళ్లం. జగనన్న పుణ్యాన సొంతింటి కల నెరవేరింది.గత ప్రభుత్వంలోనే సొంతింటి సంబరంనలుగురు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్న నన్ను భర్త కొన్నేళ్ల క్రితమే వదిలిపెట్టి వెళ్లిపోయాడు. 30 ఏళ్లు కళ్యాణదుర్గంలోని బాడుగ ఇంట్లో ఉన్నాం. నెలకు రూ.4 వేల వరకు అద్దె కట్టేదాన్ని. గాజులు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న పుణ్యమా అని కళ్యాణదుర్గం మున్సిపాలిటీ కురాకుల తోట జగనన్న కాలనీలో ఇల్లు వచ్చింది. మొత్తం బిల్లు రూ.1.80 లక్షలు మంజూరైంది. ఇప్పుడు సొంతిట్లోసంతోషంగా ఉంటున్నాం. –నబియా భాను, జగనన్న కాలనీ, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంగత ప్రభుత్వంలోనే... అద్దె ఇంటి నుంచి సొంత గూటికిమేం చాలాకాలం పాటు అద్దె ఇళ్లలో ఉన్నాం. జగనన్న ప్రభుత్వంలో మమ్మల్ని లబ్ధిదారులుగా గుర్తించి ఇంటి పట్టా ఇచ్చారు. ఆలస్యం లేకుండా బిల్లులు చెల్లించారు. ప్రస్తుతం ఆ ఇంట్లోనే ఉంటున్నాం. 2022లో గృహ ప్రవేశం చేసి ఇందులోనే నివసిస్తున్నాం. ఇంత సాయం అందించిన జగనన్న మా పాలిట దేవుడు. –షేక్ నాగూర్ బి, గుంటూరు జిల్లా దుగ్గిరాల జగనన్న కాలనీ సొంతింటి కల నెరవేర్చింది జగనన్నమాకు 2.50 సెంట్ల స్థలం ఉంది. కానీ, పక్కా ఇల్లు నిర్మించుకునేందుకు తగినన్ని డబ్బులు లేవు. చాలాకాలం పాటు అద్దె ఇళ్లలో ఉన్నాం. జగనన్న ప్రభుత్వం రాగానే భరోసా కల్పించారు. రెండు విడతలుగా బిల్లులు నా బ్యాంక్ అకౌంట్లో వేశారు. నిర్మాణం పూర్తి చేసి 2023లోనే గృహప్రవేశం చేశాం.– నల్లమోతు రాణి, నెక్కలం గొల్లగూడెం, ఆగిరిపల్లి మండలం, ఏలూరు జిల్లాజగనన్న హయాంలోనే మాకు ఇల్లునా భర్త, నేను వ్యవసాయ కూలీలం. మాకు ఇద్దరు పిల్లలు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాటి సీఎం వైఎస్ జగన్ స్ధలంతో పాటు ఇల్లు మంజూరు చేశారు. ఇంటి పట్టా, నిర్మాణానికి డబ్బులు కూడా ఇచ్చారు. సకాలంలో బిల్లులు రావడంతో కొంత నా డబ్బులు వేసుకుని ఇల్లు పూర్తి చేశా. ఇప్పుడు అందులోనే ఉంటున్నాం. చాలా ఆనందంగా ఉంది. జగనన్నకు మా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. –సంగం త్రివేణి, గండేపల్లి గ్రామం, కంచికచర్ల మండలం, ఎన్టీఆర్ జిల్లా15 ఏళ్ల నిరీక్షణ... వైఎస్సార్సీపీ హయాంలో సాకారంసొంతిల్లు లేక చాలా ఇబ్బందిపడ్డాం. 15 ఏళ్ల పాటు అద్దె ఇళ్లలోనే ఉన్నాం. చిన్న గుడిసె, బడితెల గోడల ఇంట్లో మరికొన్నేళ్లు ఉన్నాం. ఆ సమయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం మా స్వగ్రామం మెళియాపుట్టిలోనే జగనన్న కాలనీలో స్థలం ఇచ్చి ఇల్లు మంజూరు చేసింది. నిర్మాణం పూర్తి చేశాం. త్వరలోనే గృహప్రవేశం చేస్తాం. సొంతిల్లు అనే ఆలోచనే సంతోషంగా ఉంది. దీన్ని సాకారం చేసింది వైఎస్ జగన్. – రిన్న మహంతి, మెళియాపుట్టి గ్రామం, పాతపట్నం నియోజకవర్గం, శ్రీకాకుళం జిల్లాఅన్నీ అప్పుడే మంజూరు...జగనన్న ప్రభుత్వంలోనే మాకు పక్కాగృహం మంజూరైంది. స్థలానికి పొసెషన్ సర్టిఫికెట్ ఇచ్చారు. బిల్లులన్నీ కూడా సకాలంలో చెల్లించారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్నాం. మొత్తం రూ.1.80 లక్షల బిల్లు ఇచ్చేశారు.–సుజాత, బుచ్చయ్యగారిపల్లి, బుక్కపట్నం మండలం, శ్రీసత్యసాయి జిల్లా -
జగన్ ప్రభుత్వం కట్టిన ఇళ్లకు బాబు ‘కలరింగ్’
నాడు‘‘సెంటు స్థలం ఇస్తారంట..! ఆ సెంటు స్థలం ఎందుకు పనికొస్తుంది...? ఒక్కదానికి సరిపోతుంది. చనిపోయిన తర్వాత పూడ్చడానికి సెంటు స్థలం పనికొస్తుంది. అంతకుమించి ఇళ్లు కట్టడానికి పనికిరాదు. – వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలపై చంద్రబాబునేడుఅన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం దేవగుడిపల్లెకి చెందిన ఎస్.అల్తాబ్బేగమ్ వ్యవసాయ కూలీ. ఈమె పేరిట గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నవ రత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద పక్కా గృహం మంజూరు చేశారు. 2022 ఏప్రిల్లో నిర్మాణం ప్రారంభించారు. నాటి ప్రభుత్వం రూ.1.80 లక్షలు మంజూరు చేసింది. ఉచితంగా ఇసుక, సబ్సిడీపై రూ.32 వేల విలువైన సిమెంటు, ఐరన్, ఇతర నిర్మాణ సామగ్రి సమకూర్చింది.వైఎస్ జగన్ ప్రభుత్వం ఇంత సాయం చేస్తే, కేవలం తాళంచెవి చేతిలో పెట్టి చంద్రబాబు క్రెడిట్ కొట్టేసేందుకు పాకులాడుతున్నారు. అల్తాబ్బేగమ్ మాత్రమే కాదు, బుధవారం సీఎం నుంచి తాళాలు అందుకున్న దేవగుడిపల్లెకు చెందిన తలారి రమాదేవి, చిన్ని, తిరుపతి మల్లక్కలకూ 2021–22లో వైఎస్ జగన్ ప్రభుత్వమే ఇళ్లు మంజూరు చేసింది. ఇలా పేదలందరికీ ఇళ్ల పథకం కింద వైఎస్ జగన్ ప్రభుత్వం కట్టిన ఇళ్లను చంద్రబాబు తన ఖాతాలో వేసుకుని క్రెడిట్ కొట్టేసే కుతంత్రానికి తెరలేపారు. శవాలు పూడ్చడానికి కూడా పనికి రావని గేలి చేసిన పెద్దమనిషి ఇప్పుడు అవే స్థలాల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను తన ఖాతాలో వేసుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు.సాక్షి, అమరావతి: ఏడాదిన్నర పాలనలో పేదలకు గజం స్థలమైనా పంచిన దాఖలాల్లేవు.. పట్టుమని పది ఇళ్ల నిర్మాణాలకు అనుమతులిచ్చిన పాపాన పోలేదు... కానీ, తమ ప్రభుత్వం 3 లక్షల ఇళ్లు నిర్మించేసిందని సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా ప్రకటించుకుంటున్నారు. అన్నింటిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన పనులను తామే చేసినట్లు క్రెడిట్ కొట్టేస్తున్న సీఎం చంద్రబాబు... ఇప్పుడు పేదలకు ఇళ్లు కట్టించేశామంటూ నిస్సిగ్గుగా డప్పు కొట్టుకుంటున్నారు. ఈ మేరకు ఎల్లో మీడియాలో ప్రకటనలతో ఆర్భాటం చేశారు. ఇదంతా చూసి ప్రజలు అవాక్కవుతున్నారు. చంద్రబాబు మూడు లక్షల ఇళ్ల కథ కమామిషు ఏమిటి? అని చూస్తే అసలు విషయం బయటపడుతోంది. పాలనలో విఫలమైన బాబు పేదలకు తాను చేయని మేలును చేసినట్టు మభ్యపెడుతున్న కుతంత్రం బయటపడుతోంది.గత ప్రభుత్వంలో నిర్మించిన ఇళ్లేరాష్ట్రంలో పేదలందరికీ పక్కా ఇల్లు ఉండాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రభుత్వం నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు పథకం అమలు చేసింది. వైఎస్ జగన్ సీఎంగా ఉండగా 71.8 వేల ఎకరాల్లో 31.19 లక్షల ఇళ్ల స్థలాలను ఉచితంగా మహిళల పేరిట ఉచితంగా పంచిపెట్టారు. వీటి మార్కెట్ విలువ రూ.1.15 లక్షల కోట్ల పైమాటే. పెద్దఎత్తున పట్టాలు మంజూరు చేయడం ద్వారా 17 వేలకు పైగా వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో కొత్త ఊళ్లనే వైఎస్ జగన్ ఏర్పాటు చేశారు. అంతేకాక జగనన్న కాలనీల్లో 19 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణానికి అనుమతులిచ్చారు. వీటికి ఏపీ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీ టిడ్కో) ఇళ్లు 2.62 లక్షలు అదనం. ఎన్నికలు ముగిసేనాటికి 9 లక్షలపైగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేసింది. సాధారణ ఇళ్లలో 8 లక్షలకు పైగా వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో 1.28 లక్షలు శ్లాబ్ పూర్తయిన, 99 వేల ఇళ్లు శ్లాబ్ దశలో ఉన్నాయి. చాలావరకు తుది దశ నిర్మాణాలు కూడా పూర్తయినా ఎన్నికల కోడ్ నేపథ్యంలో స్టేజ్ అప్డేట్ చేయని పరిస్థితి. ఇలాంటి ఇళ్లకు స్టేజ్ అప్డేట్ చేసి తామే నిర్మించినట్టు బాబు సర్కార్ ప్రచారం చేసుకుంటోంది. బుధవారం చంద్రబాబు దేవగుడిపల్లెలో పంపిణీ చేసిన ఇళ్లు సైతం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంజూరు చేసి నిర్మించినవే. అక్కడి రాజీవ్ కాలనీలో ఇళ్లు లేని పేదలకు 40 ఇళ్లను గత ప్రభుత్వం ఇచ్చింది. 30 మంది లబ్ధిదారులు నిర్మాణం మొదలుపెట్టగా, ఎన్నికలు ముగిసేనాటికే కొన్ని పూర్తయ్యాయి. మిగిలినవి దాదాపు నిర్మాణం పూర్తిచేసుకున్న దశలో ఉన్నాయి. ఇలా గత ప్రభుత్వంలో మంజూరు చేసి, నిర్మించిన ఇళ్ల తాళాలను సీఎం, మంత్రులు లబ్ధిదారుల చేతుల్లో పెట్టడం గమనార్హం.పూర్తి అండగా వైఎస్ జగన్2019–24 మధ్య సొంతింటి కల సాకారం చేస్తూ పేదలకు నాటి సీఎం జగన్ పూర్తి అండగా నిలిచారు. 31 లక్షల మందిపైగా పేద అక్కచెల్లెమ్మల పేరిట రూ.76 వేల కోట్లకుపైగా మార్కెట్ విలువ చేసే స్థలాలను పంపిణీ చేశారు. ఇంటి నిర్మాణానికి యూనిట్కు రూ.1.80 లక్షలు బిల్లు మంజూరు చేయడంతో పాటు, స్వయం సహాయక బృందాల ద్వారా లబ్ధిదారులైన మహిళలకు పావలా వడ్డీకి రూ.35 వేలు రుణం అందించారు. ఉచితంగా ఇసుక పంపిణీ ద్వారా రూ.15 వేలు, స్టీల్, సిమెంట్, ఇలా 12 రకాల నిర్మాణ సామగ్రిని సబ్సిడీపై ఇస్తూ మరో రూ.40 వేలు చొప్పున మొత్తంగా రూ.2.70 లక్షల ప్రయోజనం చేకూర్చారు. ఇక కాలనీల్లో నీరు కరెంట్, విద్యుత్, ఇంకుడు గుంతలు, ఇతర సదుపాయాలకు రూ.355 కోట్ల దాక ఖర్చు చేశారు. ఐదేళ్లలో ఇళ్ల పట్టాలకు భూ సేకరణ, లేఅవుట్ల అభివద్ధి, ఇళ్లకు బిల్లు చెల్లింపులు, ఇతర రూపాల్లో దాదాపు రూ.35,300 కోట్లు వెచ్చించారు. మొత్తంగా పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇంటి స్థలం, ఇంటితో కలిపి కనీసం రూ. 6 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు విలువైన స్థిరాస్తిని మహిళలకు అందిస్తూ లక్షాధికారులుగా తీర్చిదిద్దారు. రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల సంపద సృష్టికి పాటుపడ్డారు.బాబు పాలనలో గజం స్థలమైనా మిథ్య!17 నెలల పాలనలో పేదలకు గజం స్థలం ఇవ్వకపోగా గత ప్రభుత్వంలో ఇచ్చినవీ రద్దు చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం పూనుకుంటోంది. వైఎస్ జగన్ హయాంలో ఉచితంగా స్థలం ఇచ్చి, ఇళ్లు మంజూరు చేసినప్పటికీ పరిస్థితులు అనుకూలించక కొందరు నిర్మాణాలు వాయిదా వేసుకున్నారు. ఈ తరహా స్థలాలను రద్దు చేయాలని కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు ప్రకటించారు. పేదల నుంచి స్థలాలు లాగేసుకుని పారిశ్రామికవేత్తలకు పంచిపెట్టాలని ఆదేశించారు. ఇదంతా పేదలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమరావతిలో 50 వేలమంది పేద మహిళలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేపట్టగా చంద్రబాబు అడ్డుపడ్డారు. పేదలకు స్థలాలిస్తే సామాజిక అసమతుల్యత వస్తుందని కోర్టు స్టే తెచ్చారు. గద్దెనెక్కిన వెంటనే ఆ పట్టాలను రద్దు చేశారు. సాయం పెంపులోనూ మొండిచేయిపట్టణాల్లో రెండు, గ్రామాల్లో మూడు సెంట్లు చొప్పున పేదలకు స్థలాలు పంపిణీ చేస్తామని టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటించారు. కానీ, గజం కూడా ఇచ్చింది లేదు. 2019లో వైఎస్సార్సీపీ సర్కారు వచ్చాక 6 నెలల్లోనే కోవిడ్ వ్యాప్తి మొదలైంది. ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. ఈ పరిస్థితులను అధిగమించి 2020 డిసెంబరు 25న వైఎస్ జగన్ 31 లక్షల మందిపైగా మహిళలకు ఇళ్ల పట్టాలిచ్చి చరిత్ర సష్టించారు. కాగా, ఈ స్థలాలు శవాలు పూడ్చడానికి తప్ప దేనికీ పనికిరాదని పేదల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారు. నాడు శ్మశానాలతో పోల్చిన స్థలాల్లోని ఇళ్లనే నేడు తన ఖాతాలో వేసుకోవడానికి తాపత్రయపడుతున్నారు.చంద్రబాబు కనీసం ఇళ్ల పట్టాల పంపిణీలో విఫలమయ్యారు. పేదలకు ఎన్నికల ముందు హామీలిచ్చి మోసం చేయడమే కాక సీఎం హోదాలోనూ దగా చేశారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక గృహ నిర్మాణ శాఖపై తొలి సమీక్షలోనే పేదల ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలిస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. అదనపు సాయం వస్తుందని లబ్ధిదారులు ఆశపడ్డారు. కొద్ది రోజులకే ఆ సాయం ఊసే లేకుండా చేసేశారు.1,43,600 మంది నిరుపేదలకు ఉచితంగానే టిడ్కో ఇళ్లుమిగిలినవారికి లబ్ధిదారుల వాటా 50 శాతం తగ్గింపులక్షమంది లబ్ధిదారులకు ప్లాట్లు అప్పగింత2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వం పట్టణ పేదలకు నాణ్యమైన ఇళ్లు కట్టించి ఇస్తామని, ఏపీ టిడ్కో ఏర్పాటు చేసి హంగామా చేసింది. తక్కువ ధరకే ఇల్లు వస్తుందన్న ఆశపడగా కఠిన నిబంధనలు పెట్టింది. కొన్నిచోట్ల పునాదులతో వదిలేయగా, చాలాచోట్ల స్థలాల సేకరణే చేయలేదు. 2019లో ఎన్నికలకు ముందు హడావుడిగా నెల్లూరు, రెండు–మూడు ప్రాంతాల్లో అసంపూర్తిగా ఉన్న ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించింది. కానీ, వైఎస్ జగన్ సీఎం కాగానే వైఎస్సార్సీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల కోసం గత టీడీపీ ప్రభుత్వం పెట్టిన కఠిన నిబంధనలను సడలించారు. 88 పట్టణ స్థానిక సంస్థల (యూఎల్బీ) పరిధిలో, 163 ప్రాంతాల్లో జీ+3 విధానంలో 2,62,212 టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. గత టీడీపీ ప్రభుత్వం నిర్ణయించిన యూనిట్ ధరలను పక్కనబెట్టి, 1,43,600 మంది నిరుపేదలకు ఉచితంగానే ప్లాట్లు కేటాయించారు. 2024 ఎన్నికల నాటికి రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఇళ్లను లబ్ధిదారులకు అందించగా, మరో 77 వేల ఇళ్లను 90 శాతంపైగా వైఎస్ జగన్ ప్రభుత్వం పూర్తి చేసింది.300 చదరపు అడుగుల విస్తీర్ణంలో 1,43,600 ఇళ్లను ఉచితంగా ఇవ్వగా రూ.10,339 కోట్ల మేర లబ్ధి చేకూరింది. వీరి నుంచి గత టీడీపీ సర్కారు లబ్ధిదారుల వాటాగా వసూలు చేసిన రూ.500 కోట్లను తిరిగి చెల్లింపు ప్రారంభించి రూ.250 కోట్లను వెనక్కిచ్చింది. 365, 430 చదరపు అడుగుల ఇళ్లకు గత టీడీపీ ప్రభుత్వం రూ.50 వేలు, రూ.లక్ష చెల్లించాలని నిబంధన పెట్టింది. వైఎస్సార్సీపీ సర్కారు దీన్ని 50 శాతం తగ్గించింది. ఈ రెండు యూనిట్లకు గాను 1,18,616 మంది పేదలపై రూ.482 కోట్ల భారం తగ్గింది. పైగా లబ్ధిదారులకు ఇళ్లను ఉచితంగానే రిజిస్ట్రేషన్ చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం 1,77,546 ఇళ్లు పూర్తి చేసిందని అసెంబ్లీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సైతం ప్రకటించడం గమనార్హం. -
కట్టలు తెగిన ప్రజాగ్రహం
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో పేదలకు నాణ్యమైన వైద్యం, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందకుండా చేస్తూ.. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తున్న చంద్రబాబు సర్కారుపై విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు, ప్రజా సంఘాల నేతలు, సామాజిక కార్యకర్తలు తిరగబడ్డారు. రూ.లక్షల కోట్ల ప్రజల ఆస్తులను బినామీలకు కట్టబెట్టి, నీకింత నాకింత అంటూ పంచుకుతినేందుకు కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తుండటంపై కళ్లెర్ర చేశారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ప్రజా ఉద్యమంలో కదం తొక్కేందుకు ప్రభంజనంలా జనం కదలివచ్చారు. ర్యాలీలకు అనుమతి లేదు.. పాల్గొంటే అక్రమ కేసులు పెడతాం.. అంటూ పోలీసుల నోటీసులు, బెదిరింపులను ఏమాత్రం ఖాతరు చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బుధవారం వైఎస్సార్సీపీ నిర్వహించిన నిరసన ర్యాలీల్లో కదంతొక్కారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి దాకా రూ.2.50 లక్షల కోట్లు అప్పు చేశారని, అందులో రూ.5 వేల కోట్లు మెడికల్ కాలేజీల పనులు పూర్తి చేయడానికి ఖర్చు చేయలేరా.. అంటూ ర్యాలీల్లో దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని దూరం చేస్తారా.. పేద విద్యార్థులకు వైద్య విద్యను అందకుండా చేస్తారా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని ప్రభుత్వ రంగంలోనే నిర్మించాలంటూ డిమాండ్ చేశారు. ఒకవేళ కాదూ కూడదని ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కొనసాగిస్తే వైఎస్సార్సీపీతో కలిసి మహోద్యమాన్ని నిరి్మస్తామంటూ కోటి గళాలు రణ నినాదాలు చేయడంతో దిక్కులు పిక్కటిల్లాయి. మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలోనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ నేతలతో కలిసి అధికారులకు డిమాండ్ పత్రాలను అందజేశారు. ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకతకు ఈ నిరసన ర్యాలీలు మరోసారి అద్దం పట్టాయని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఉద్యమంలో భాగంగా చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రతి నియోజకవర్గం నుంచి 50 వేల సంతకాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నా, అంతకు మించి సంతకాలు చేస్తున్నారు. పదండి ముందుకు.. పదండి తోసుకు! అడ్డంకులను అధిగమించి..సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు పోలీసులు ఎక్కడికక్కడ ర్యాలీలను నిలువరించడానికి విఫలయత్నం చేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో బైకు ర్యాలీ నిర్వహిస్తుండగా పోలీసులు అడ్డుకుని, బైక్ల తాళాలు లాక్కునే ప్రయత్నం చేయగా యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెనక్కు తగ్గారు. గుంటూరులో పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు బెదిరింపు ధోరణితో వ్యవహరించడంపై నిరసన వ్యక్తమైంది. నెల్లూరులో మెడికల్ విద్యార్థులు ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఫ్లకార్డులు మెడలో వేసుకుని మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. ఒంగోలులో నిరసన ర్యాలీని పోలీసులు అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారు. టూ టౌన్ సీఐ మేడా శ్రీనివాసరావు తన సిబ్బంది ద్వారా చాలా సేపు నిలువరించారు. చివరకు ప్రజలు తోసుకొని ముందుకు సాగారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో వినతిపత్రం తీసుకునేందుకు అధికారులు, కార్యాలయ సిబ్బంది అందుబాటులో లేకుండా పోవడంతో అక్కడి తలుపునకు అంటించారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీంతో పార్టీ శ్రేణులు, ప్రజలు నిరసన ర్యాలీ నిర్వహించారు. విశాఖ జిల్లా భీమిలిలో ప్రజలు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల భారీ బైక్ ర్యాలీ మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గమైన టెక్కలిలో ప్రజలను నియంత్రించడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో గరివిడి ఆర్వోబీ వద్ద పోలీసులు ర్యాలీని అడ్డుకోగా గంటపాటు వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. దీంతో పర్ల గ్రామానికి చెందిన సిరియాల పాపినాయుడు కిందపడి పోవడంతో కాలు విరిగింది. ఆయన్ను ఆస్పత్రికి తరలించి ర్యాలీ కొనసాగించారు. ఆయన వైద్య ఖర్చును వైఎస్సార్సీపీ భరిస్తుందని నేతలు తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎల్లవరం నుంచి రంపచోడవరం వరకు 35 కిలోమీటర్ల మేర బైకులు, కార్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ర్యాలీ నిర్వహించడానికి వీల్లేదంటూ ఆంక్షలు విధించారు. అయినా యాడికిలో ర్యాలీ కొనసాగింది. కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ ఆర్డీవో కార్యాలయంలో డిమాండ్ పత్రం అందచేశారు. -
నిరసన ర్యాలీల సక్సెస్పై వైఎస్ జగన్ హర్షం
సాక్షి,తాడేపల్లి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై సీఎం చంద్రబాబు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, కక్షపూరిత వైఖరి, ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ ‘వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమం’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ నిరసనలు చేపట్టింది. నిరసన ర్యాలీల సక్సెస్పై వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు.‘‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై చంద్రబాబు తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అయింది. 175 నియోజకవర్గాలలోనూ భారీగా నిరసన ర్యాలీలు జరిగాయి. ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతకు ఇది నిదర్శనం. ప్రజారోగ్యం, వైద్య విద్య విషయంలో ఇతర పార్టీల ప్రతినిధులు కూడా కలిసి రావటం సంతోషకరం. ప్రజల సంక్షేమమే ముఖ్యం అని వీరంతా అనుకోవటం మంచి పరిణామం. పోలీసులు ఈ ర్యాలీలను అడ్డుకునే ప్రయత్నం చేసినా ఎవరూ వెనక్కు తగ్గలేదు. కేసుల భయం కూడా లేకుండా ఎంతో ధైర్యంగా అందరూ తమ నిరసనను వ్యక్తం చేశారు...ప్రజల గొంతును బలవంతంగా అణచివేయలేరని వీరంతా నిరూపించారు. చంద్రబాబూ.. ఈ బలమైన ప్రజాభిప్రాయాన్ని గౌరవించండి. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే మీ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోండి. ఇవ్వాల్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ నా కృతజ్ఞతలు’అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమం..కోటి గొంతుకలతో సింహగర్జన (ఫొటోలు)
-
కేతిరెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం భారీ ర్యాలీ
-
Vidadala Rajini: రాసిపెట్టుకోండి.. జగనన్న ఒకసారి చెప్పాడంటే
-
వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం ర్యాలీ
-
అడ్డుకున్న పోలీసులు.. తిప్పికొట్టిన YSRCP నేతలు
-
YSRCP Praja Udyamam: అంబటి ఉగ్రరూపం..
-
మచిలీపట్నం ప్రజా ఉద్యమంలో దుమ్మురేపుతున్న పేర్ని నాని, కిట్టు
-
బాబుకు పోయే కాలం దగ్గరకు వచ్చింది! మిగిలింది 3 సంవత్సరాలే
-
గుంటూరులో ఉద్రికత్త.. అంబటితో సీఐ ఓవరాక్షన్
సాక్షి, గుంటూరు: ఏపీలో ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న ర్యాలీల్లో అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు కదిలారు. వైఎస్సార్సీపీ ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు.. అడ్డంకులను సృష్టించారు. ఈ క్రమంలో గుంటూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పోలీసులు వాగ్వాదానికి దిగారు.వివరాల ప్రకారం.. మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరులోని తన నివాసం నుంచి ర్యాలీగా ముందుకు సాగారు. వైఎస్సార్సీపీ ర్యాలీ.. స్వామి థియేటర్ వద్ద రాగానే పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. బారికేడ్లు పెట్టి ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో, మాజీ మంత్రి అంబటి రాంబాబు, పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ క్రమంలో పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు ఓవరాక్షన్కు దిగారు. అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంబటి రాంబాబుకు వేలు చూపిస్తూ సీఐ గంగా వెంకటేశ్వర్లు దుర్భాషలాడుతూ దౌర్జన్యానికి దిగారు. దీంతో, సీఐపై అంబటి రాంబాబు మండిపడ్డారు. అక్కడే ఉన్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసుల వైఖరి నిరసిస్తూ ఆందోళనకు దిగారు. ఇక, గతంలోనూ అంబటి రాంబాబు పట్ల పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు దురుసుగా ప్రవర్తించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ..‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 175 నియోజకవర్గాలలో ర్యాలీలు నిర్వహించాం. రెవెన్యూ అధికారులకు మెమోరాండం అందించాం. 17మెడికల్ కాలేజీల నిర్మాణం మొదలుపెట్టామని చెప్పాం. ఐదు కాలేజీల నిర్మాణం పూర్తయ్యింది. మిగతా కాలేజీలను పీపీపీ పద్దతిలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం మొదలుపెట్టారు. ప్రైవేటు కాలేజీలు భారీస్థాయిలో ఫీజులు వసూలు చేస్తున్నాయి. పేదలకు అన్యాయం చేసే పీపీపీ పద్దతిని వద్దని చంద్రబాబుకు సూచిస్తున్నాం. పీపీపీ పద్దతిపై కొన్ని రాష్ట్రాలలో ప్రజలు వ్యతిరేకించడంతో ప్రభుత్వాలు వెనక్కితగ్గాయి.గుంటూరు లో అంబటి రాంబాబు ఆధ్వర్యంలో YSRCP ప్రజా ఉద్యమం🔥🔥అడ్డుకుంటున్న పోలీసులు #OneCroreSignatures#StopPrivatization#SaveMedicalCollegesInAP#YSRCPForMedicalStudents pic.twitter.com/MtDOBCRkH0— Rahul (@2024YCP) November 12, 2025 పీపీపీ పద్దతి వద్దంటూ కోటి సంతకాలు సేకరించాం. చంద్రబాబు, కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను బడా బాబులకు అప్పగించి లోకేష్ జేబులు నింపుతున్నారని మేం ఆరోపిస్తున్నాం. మేం ర్యాలీ చేస్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారు. మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారు. బారికేడ్లు పెట్టి అడ్డుకోవాలని చూస్తున్నారు. మెమోరాండం ఇవ్వకుండా ఆపగలిగారా?. పోలీసులు పద్దతి మార్చుకోవాలని చెబుతున్నాం. లోకేష్ మెప్పుకోసం కొందరు పోలీసులు ప్రవర్తిస్తున్నారు. పోలీసుల భాష మాట్లాడుతున్నారు.. మాకు రాదా పోలీసు భాష. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆగే వరకూ ఉద్యమం ఆగదు. పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు లోకేష్ బంధువు. ఎక్కడా ఆపని పోలీసులు ఇక్కడ ఎందుకు ఆపుతున్నారు. మేం తగ్గేది లేదు.. చిత్తశుద్దితో పనిచేస్తున్నాం. పోలీసులతో అణిచిపెట్టాలని చూస్తున్నారు.. లోపల వేయాలని చూస్తున్నారు. మేం దేనికైనా సిద్దం’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
బారికేడ్లు బద్దలు కొడుతూ.. పోలీసులపై అంబటి ఉగ్రరూపం
-
బాబు అవినీతికి నిదర్శనం..! వైఎస్ఆర్ సీపీ ర్యాలీలకు వేలల్లో తరలివస్తున్న జనం
-
YSRCP ప్రజా ఉద్యమం
-
తాడిపత్రిలో టెన్షన్.. పోలీసుల హైడ్రామా!
సాక్షి, అనంతపురం: ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్సీపీ ర్యాలీల నేపథ్యంలో తాడిపత్రిలో హైడ్రామా నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనకు పోటీగా టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి మరో కార్యక్రమం ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పెద్దారెడ్డిని అడ్డుకునేందుకు భారీ సంఖ్యలో పోలీసులు ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు.వివరాల ప్రకారం.. తాడిపత్రిలో అధికార టీడీపీ నేతలు రెచ్చగొట్టే చర్యలకు దిగారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్సీపీ ర్యాలీల సమయంలోనే పోటీగా టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి మరో కార్యక్రమానికి తెర లేపారు. అభివృద్ధి కార్యక్రమాల పేరిట జేసీ వర్గీయుల హడావిడి చేస్తున్నారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. వైఎస్సార్సీపీ కార్యక్రమం కేంద్రాన్ని మార్చుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో పోలీసుల సూచనతో వైఎస్సార్సీపీ పెద్దారెడ్డి.. యాడికి మండల కేంద్రానికి ర్యాలీ కార్యక్రమానికి మార్చారు. దీంతో, యాడికి మండల కేంద్రంలో ర్యాలీకి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ తాజాగా టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి.. వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేసి కక్ష సాధింపు చర్యలకు దిగారు. యాడికిలో వైఎస్సార్సీపీ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని జేసీ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామునే పెద్దారెడ్డి ఇంటి వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. తాడిపత్రిలోని ఇంటి వద్దే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, పెద్దారెడ్డి, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. తనను ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను పెద్దారెడ్డి ప్రశ్నించారు. ఈ సందర్బంగా పెద్దారెడ్డి మాట్లాడుతూ.. నా కార్యక్రమాలకు సంబంధించి పోలీసులకు ముందే సమాచారం ఇచ్చాను. నా కార్యక్రమాలకు అనుమతి ఇవ్వాలని ముందే పోలీసులు విజ్ఞప్తి చేశాను. రాత్రి నా కార్యక్రమాలకు అనుమతి ఇచ్చి ఇప్పుడు అడ్డుకోవడం ఏంటి?. చంద్రబాబు, జేసీ మెప్పు కోసం పోలీసులు పనిచేస్తున్నారు అని ఘాటు విమర్శలు చేశారు. ప్రశ్నిస్తే వైఎస్సార్సీపీ శ్రేణులపై తప్పుడు కేసులు పెడుతున్నారు. తాడిపత్రి పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేను ర్యాలీ చేస్తే అభ్యంతరం ఎందుకు?. నన్ను చూసి జేసీ ప్రభాకర్ రెడ్డి భయపడుతున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిని దూషించారు. అయినప్పటికీ పోలీసులు కఠిన చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గం. జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే జేసీ అస్మిత్ గ్యాంగ్ స్టర్లా వ్యవహరిస్తున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా జేసీ ప్రభాకర్ రెడ్డి అరాచకాలపై పోరాటం కొనసాగిస్తా’ అని వ్యాఖ్యలు చేశారు. -
YSRCP సమర శంఖం
-
కూటమికి వణుకే.. వైఎస్సార్సీపీ శ్రేణుల భారీ ర్యాలీ
చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, కక్షపూరిత వైఖరి, ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న ర్యాలీల్లో కదం తొక్కేందుకు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా సిద్ధమయ్యారు. ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు, ప్రజాసంఘాలు, సామాజికవేత్తలు కోటి గొంతుకలతో సింహగర్జన చేయనున్నారు. -
ఇన్ని అరాచకాలు జరుగుతుంటే ఎక్కడ నిద్రపోతున్నావ్ పవన్..
-
‘కాశీబుగ్గ’ బాధితులకు వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం
శ్రీకాకుళం: కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం అందజేస్తోంది. సోమవారం పలు కుటుంబాలకు రూ.రెండు లక్షల చొప్పున చెక్లను అందించగా, మంగళవారం కూడా పలువురు మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు.సోంపేట మండలం బెంకిలి గ్రామానికి చెందిన నిఖిల్ కుటుంబ సభ్యులకు, వజ్రపుకొత్తూరు మండలం దుక్కవానిపేటలో మురిపింటి నీలమ్మ కుటుంబ సభ్యులకు, కాశీబుగ్గ మున్సిపాలిటీకి చెందిన డొక్కరి అమ్ముడమ్మ కుటుంబ సభ్యులకు, అలాగే మందస మండలం మందస గ్రామానికి చెందిన బోర బృందావతి, బెల్లు పట్టియా గ్రామానికి చెందిన దువ్వ రాజేశ్వరి కుటుంబ సభ్యులకు చెక్కులను అందించారు. ఈ కార్యక్రమాల్లో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్సీ నర్తు రామారావు తదితరులు పాల్గొన్నారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై.. కోటి గళాల గర్జన
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, కక్షపూరిత వైఖరి, ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న ర్యాలీల్లో కదం తొక్కేందుకు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా సిద్ధమయ్యారు. ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు, ప్రజాసంఘాలు, సామాజికవేత్తలు కోటి గొంతుకలతో సింహగర్జన చేయనున్నారు. ప్రభుత్వ రంగంలోనే కొత్త మెడికల్ కాలేజీలు నిర్వహించాలనే డిమాండ్తో చంద్రబాబు సర్కార్పై సమరభేరి మోగించనున్నారు. వైఎస్సార్సీపీ నేతలు గత నెల రోజులుగా ఊరూరా రచ్చబండ నిర్వహిస్తూ.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల పేద, మధ్య తరగతి రోగులు, విద్యార్థులకు కలిగే నష్టాలు, ప్రైవేటీకరణ ముసుగులో చంద్రబాబు సర్కారు అవినీతిని ప్రజలకు లోతుగా వివరించారు. చంద్రబాబు సర్కారు అధికారంలోకి రాగానే ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేస్తూ ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయడం.. నెట్వర్క్ ఆస్పత్రులకు బకాయిలు చెల్లించకపోవడంతో రోగులకు సేవలు నిలిచిపోవడం.. ఆరోగ్యశ్రీ, ఆసరా కింద ఏకంగా రూ.4 వేల కోట్లకు పైగా బకాయిలు పెట్టడం.. చరిత్రలో తొలిసారి ప్రైవేట్ డాక్టర్లు రోడ్డెక్కి ఆందోళనకు దిగడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రభుత్వ రంగంలో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో పేదలకు చేరువలో నాణ్యమైన వైద్యంతోపాటు మన విద్యార్థులకు కన్వీనర్ కోటాలో సగం మెడికల్ సీట్లు ఉచితంగా, మిగిలినవి కూడా ప్రైవేట్ కాలేజీలతో పోలిస్తే అతి తక్కువ ఫీజులతో అందుబాటులోకి వచ్చే అవకాశాన్ని చంద్రబాబు సర్కారు కాలదన్నుకోవడంపై మండిపడుతున్నారు. కొత్త మెడికల్ కాలేజీలపై చంద్రబాబు సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో సంతకాలు చేసేందుకు అన్ని వర్గాల ప్రజలు పోటీపడుతున్నారు. కోటి సంతకాల సేకరణ మహోద్యమంగా రూపాంతరం చెందుతుండటం చంద్రబాబు సర్కార్కు వణుకు పుట్టిస్తోంది. నేడు వైఎస్సార్సీపీ నిర్వహించే ర్యాలీలలో అన్ని వర్గాల ప్రజలు భారీ ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమరభేరి మోగించనున్నారని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం అందుకున్న ప్రభుత్వ పెద్దలు యధావిధిగా అధికార దుర్వినియోగానికి తెరతీశారు. నిరసన ర్యాలీల్లో పాల్గొనకూడదని.. కేసులు పెడతామంటూ వైఎస్సార్సీపీ నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు. పోలీసుల నోటీసులు.. బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదని.. నిరసన ర్యాలీల్లో విద్యార్థులు, తల్లితండ్రులు, మేధావులు, ప్రజాసంఘాలతో కలిసి కదంతొక్కి, గళం విప్పుతామని వైఎస్సార్సీపీ నేతలు తేల్చి చెబుతున్నారు. 14 ఏళ్లలో ఒక్క మెడికల్ కాలేజీ కట్టని చంద్రబాబు.. రాష్ట్రంలో 1923 నుంచి 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. పద్మావతి అటానమస్ మెడికల్ కాలేజీతో కలిపితే 12 ఉన్నాయి. 2019 నాటికి చంద్రబాబు మూడుసార్లు అంటే 1995–99, 1999–2004, 2014–19 మధ్య 14 ఏళ్లు సీఎంగా పాలించారు. ఆయన హయాంలో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా కట్టలేదు. కనీసం కొత్తగా ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా చేయలేదు. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాలను పునర్విభజించి 26 జిల్లాలుగా ఏర్పాటు చేశారు. ప్రజలకు చేరువలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించడంతోపాటు మన విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఒక్కో కాలేజీకి కనీసం 50 ఎకరాల స్థలం ఉండేలా భూమిని కేటాయించారు. ఒక్కో మెడికల్ కాలేజీ నిర్మాణానికి రూ.500 కోట్లకుపైగా కేటాయించి అన్ని రకాల సదుపాయాలు ఉండేలా క్యాంపస్ల అభివృద్ధి పనులు ప్రారంభించారు. కోవిడ్ రెండేళ్లపాటు రాష్ట్రాన్ని పీడించినా, ఎన్ని ఇబ్బందులున్నా ఎక్కడా వెనక్కి తగ్గకుండా మెడికల్ కాలేజీలను పూర్తి చేయాలనే ధృఢ సంకల్పంతో అడుగులు ముందుకు వేశారు. విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను 2023–24లోనే ప్రారంభించి తరగతులు కూడా మొదలుపెట్టారు. ఎన్నికల నాటికి పాడేరు, పులివెందుల కాలేజీలు కూడా సిద్ధమయ్యాయి. ఎన్నికల తర్వాత పాడేరులో అడ్మిషన్లు ముగిసి తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. కక్షసాధింపు చర్యలకు పరాకాష్ట.. గత ఏడాది అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కొత్త మెడికల్ కాలేజీలను తన అనుయాయులకు కట్టబెట్టాలని నిర్ణయించారు. పులివెందుల మెడికల్ కాలేజీలో 50 ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించడానికి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) గతేడాది అనుమతులు ఇచ్చింది. కానీ.. ఆ సీట్లు మాకు వద్దంటూ ఎన్ఎంసీకి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. సీఎం చంద్రబాబు కక్ష సాధింపు చర్యలకు ఇది పరాకాష్ట. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి అవసరమైన నిధులను అప్పట్లోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమీకరించింది. ఆ నిధులను సది్వనియోగం చేసుకుని.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక ప్రకారం చంద్రబాబు సర్కారు చర్యలు చేపట్టి ఉంటే.. 2024–25 విద్యా సంవత్సరంలో ఆదోని, మదనపల్లి, మార్కాపురం మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చేవి. ఈ విద్యా సంవత్సరం అంటే 2025–26లో అమలాపురం, బాపట్ల, నర్సీపట్నం, పార్వతీపురం, పాలకొల్లు, పెనుకొండ కూడా ప్రారంభం అయ్యేవి.బుధవారం ర్యాలీ నిర్వహించకూడదంటూ నర్సీపట్నంలో మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్కు నోటీసు ఇస్తున్న పోలీసు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు 2,360 మాత్రమే ఉండేవి. కొత్త మెడికల్ కాలేజీల ద్వారా అదనంగా మరో 2,550 సీట్లు పెరిగి.. మొత్తమ్మీద 4,910 సీట్లు అందుబాటులోకి వచ్చేవి. ఎక్కడ వైఎస్ జగన్కు క్రెడిట్ వస్తుందోనని ఏకంగా ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలను సీఎం చంద్రబాబు దెబ్బతీస్తున్నారని మేధావులు, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. 17 నెలల్లో రూ.2.36 లక్షల కోట్ల అప్పు.. మెడికల్ కాలేజీలకు మాత్రం డబ్బుల్లేవట.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 17 నెలల్లోనే రూ.2.36 లక్షల కోట్లు అప్పులు చేసింది. మిగిలిన కొత్త మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు వ్యయం చేస్తే చాలు! ఆ రూ.5 వేల కోట్లను సైతం నాబార్డు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, వివిధ రూపాల్లో సమీకరించేందుకు అప్పట్లోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ నిధులతో మిగిలిన ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలను పూర్తి చేయవచ్చు. అయితే కొత్త మెడికల్ కాలేజీలను పప్పు బెల్లాలకు బినామీలు, అస్మదీయులకు కట్టబెట్టేందుకు చంద్రబాబు సర్కారు పీపీపీ కుట్ర పన్నింది. ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన వైఎస్ జగన్రూ.లక్ష కోట్ల విలువైన సంపద లాంటి కొత్త మెడికల్ కాలేజీలను బినామీలకు కట్టబెట్టేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమవడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ సమరభేరి మోగించారు. ఉద్యమ కార్యచరణ ప్రకటించారు. ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఊరూరా రచ్చబండ నిర్వహించి.. కోటి మంది ప్రజలతో సంతకాలు సేకరించాలని, వాటిని గవర్నర్కు అందజేద్దామని పిలుపునిచ్చారు. గత నెల 10న రచ్చబండ కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ ప్రారంభించింది. ఊరూవాడా రచ్చబండ నిర్వహిస్తూ చంద్రబాబు సర్కార్ నిర్వాకాలను వైఎస్సార్సీపీ నేతలు ప్రజలకు వివరిస్తున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ.. వాటిని ప్రభుత్వ రంగంలోనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో సంతకాలు చేసేందుకు అన్ని వర్గాల ప్రజలూ పెద్ద ఎత్తున వస్తున్నారు. కోటి సంతకాల సేకరణ మహోద్యమంగా మారింది. వైఎస్ జగన్ ప్రకటించిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా 175 నియోజకవర్గాల్లో బుధవారం వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీలు నిర్వహిస్తోంది. కుప్పంలో ర్యాలీకి అనుమతి లేదుసాక్షి ప్రతినిధి, తిరుపతి: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బుధవారం వైఎస్సార్సీపీ చేపట్టనున్న నిరసన ర్యాలీకి చిత్తూరు జిల్లా కుప్పంలో పోలీసులు అనుమతి ఇవ్వలేదు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపు మేరకు తిరుపతి, చిత్తూరు జిల్లాల వ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపట్టనున్నారు. ఇందుకు అనుమతులు కోరుతూ ఆయా నియోజకవర్గ సమన్వయకర్తలు పోలీసులకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో నిరసన ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అదేవిధంగా మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న గంగాధర నెల్లూరులో కేవలం 20 మందితో ర్యాలీ నిర్వహించుకోవాలని పోలీసులు హుకుం జారీ చేశారు. -
Bandi Punyaseela: ఇన్ని అరాచకాలు జరుగుతుంటే ఎక్కడ నిద్రపోతున్నావ్..
-
మౌలానా అబుల్ కలాం ఆజాద్ కు వైఎస్ జగన్ నివాళి
-
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం బాబు Vs జగన్ మధ్య తేడా ఇదే..
-
YSRCP నేత ఓబుల్ రెడ్డిపై హత్యాయత్నం
-
YSRCP Leaders: బాబు అరాచక పాలన ఎలా ఉందంటే.... ప్రశ్నిస్తే తప్పుడు కేసులతో..
-
జోగి రమేష్, భాస్కర్ రెడ్డి తో ములాఖత్
-
అందెశ్రీ మరణంపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
సాక్షి,అమరావతి: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ మరణం తెలుగు సాహిత్యానికి తీరని లోటని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అందెశ్రీ మరణంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది విషాదకరమైన విషయం అన్న ఆయన, తెలంగాణ మాండలిక సాహిత్యంలో అందెశ్రీ తన ప్రత్యేకత చాటారని అన్నారు. అతి సామాన్య కుటుంబంలో జన్మించి, గొర్రెల కాపరిగా జీవన ప్రస్థానాన్ని ప్రారంభించి, భవన నిర్మాణ కార్మికుడిగా కూడా పని చేసిన అందెశ్రీ ఎలాంటి పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారని కొనియాడారు. అందెశ్రీ మరణం తెలుగు సాహిత్యానికి తీరని లోటు అని అభివర్ణించిన వైఎస్ జగన్ అందెశ్రీ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. -
YSRCP Leaders: ప్రశ్నించే వ్యక్తులపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోంది
-
‘దేవుడితో రాజకీయాలు వాళ్లకు బాగా అలవాటే!’
సాక్షి, గుంటూరు: దేవుడితో రాజకీయాలు చేయడం చంద్రబాబు అండ్ కోకు చాలా సర్వసాధారణమైన విషయమని మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. తిరుమల అన్నప్రసాదంపై తాను చేసిన కామెంట్లను ఎల్లో మీడియా ప్రచురించడంపై ఆయన తాజాగా స్పందించారు. గుంటూరు జిల్లా కోర్టు వద్ద కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజ్ లను ప్రైవేటీకరణ చేయటాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ.. తిరుమలలో 1985 నుంచి ఉచిత భోజనం పెడుతున్నారు. ఉచిత భోజనం కోసం భక్తులు రూ. 27 వేల కోట్లు చందాలు ఇచ్చారు. కొండపైన దాదాపు 40 సంవత్సరాలు నుంచి భక్తులకు ఉచితంగా అన్న ప్రసాదం అందిస్తున్నారు. నేను ఇప్పుడు వెళ్లి భోజనం చేశాను కాబట్టి భోజనం బాగుందని చెప్పాను. కానీ ఎల్లో మీడియా బీఆర్ నాయుడు ఏదో గొప్పగా పని చేశాడని వాళ్ళ ఛానల్ లో వేసుకుంటున్నారు.బీఆర్ నాయుడు ఏమన్నా భక్తుడా...?టీవీ5 బీఆర్ నాయుడు ఓ బ్రోకర్. దేవుడితో రాజకీయాలు చేయటం వాళ్లకు బాగా అలవాటు. అందుకే చంద్రబాబు నాయుడు లడ్డు ప్రసాదంతో రాజకీయం చేశాడు. ఇప్పుడు నా వ్యాఖ్యలతో బీఆర్ నాయుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు దేవుడితో రాజకీయాలు చేస్తాడు కాబట్టి ఒకసారి అలిపిరిలో ల్యాండ్ మైన్ పేలింది అని అంబటి అన్నారు... వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి పేదలకు వైద్యం అందించడంతో పాటు పేద విద్యార్థులు డాక్టర్లు కావాలని భావించారు. కానీ చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీ లతో వ్యాపారం చేయాలని భావిస్తున్నారు. మెడికల్ కాలేజీలు అమ్మేసి లోకేష్ జేబులు నింపాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు అని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
100 సంవత్సరాల చరిత్ర తిరగరాసిన ఘనత వైఎస్ జగన్ దే..
-
పవన్ పబ్లిసిటీ డ్రామాపై నాన్ స్టాప్ సెటైర్లు
-
జోరుగా రచ్చబండ.. కోటి సంతకాల సేకరణ
-
ఆంధ్రప్రదేశ్ లో అప్రకటిత ఎమర్జెన్సీ
-
నోరెత్తితే నోటీస్ పంపించడమే కూటమి పాలన: శైలజానాథ్
సాక్షి, అనంతపురం: నోరెత్తితో నోటీస్ పంపడం, ప్రశ్నిస్తే జైల్లో పెట్టడం, నచ్చకపోతే పోలీసులతో కొట్టించడం.. పోలీసులను అడ్డం పెట్టుకుని కూటమి నాయకులు రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి సాకె శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నో అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏడాదిన్నరలోనే పూర్తిగా విఫలమైందన్నారు.ఈ ప్రభుత్వం ఐదేళ్ల పాటు కొనసాగడం కష్టమనే నిర్ణయానికి ప్రజలు వచ్చేశారని.. కానీ 15 ఏళ్ల పాటు మేమే అధికారంలో ఉంటామని చెప్పుకునే చంద్రబాబు, పవన్.. పదే పదే ప్రజలను మోసం చేయడం సాధ్యం కాదనే విషయాన్ని వారు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో సంపద ఆవిరైపోయిందని, ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిందని కాగ్ చెప్పిన మాటలనే ఏడాదిగా వైయస్సార్సీపీ చెబుతూ వస్తోందన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయకుండా నెలనెలా రూ. 10 వేల కోట్లు అప్పులు చేస్తున్నారని, ఆ డబ్బంతా ఏమైందో చెప్పాలని సాకె శైలజానాథ్ డిమాండ్ చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగడం కష్టమే:గొప్పగా ఉన్నామని, అద్భుతంగా పాలన చేస్తున్నామని చంద్రబాబు ఎన్ని గొప్పలు చెప్పుకుంటున్నా కూటమి ప్రభుత్వ లోపాలు, పాలనా వైఫల్యాలు నిత్యం బయటపడుతూనే ఉన్నాయి. వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ని రాష్ట్ర ప్రజలు నమ్మడం లేదు. ఏడాదిన్నర పాలన చూసిన తర్వాత ఈ ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగడం కష్టమనే నిర్ణయానికి ప్రజలు వచ్చేశారు.అందుకే మరో పదిహేనేళ్లు మేమే అధికారంలో ఉంటామని చంద్రబాబు పవన్ కళ్యాణ్ లు ప్రచారం చేసుకుని ఆత్మ సంతృప్తి పొందుతున్నారు. ప్రభుత్వంపై నున్న వ్యతిరేకత కప్పిపుచ్చుకునేందుకు కూటమి నాయకులు చేయని ప్రయత్నం, తొక్కని అడ్డదారులు లేవు. పోలీస్ వ్యవస్థను విచ్చలవిడిగా వాడుకుని ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేవారిని, అన్యాయాలను ప్రశ్నించే వారి మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు.కాదేదీ కేసుకు అనర్హం అన్నట్టుంది:కాదేదీ కేసులకు అనర్హం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కర్నూలు బస్సు ప్రమాదానికి వేళాపాలా లేకుండా నడుస్తున్న బెల్ట్ షాపులు, వాటిలో ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్న నకిలీ మద్యమే కారణమై ఉండొచ్చన్న అనుమానం ప్రజల్లో ఉంది. దానిపై ప్రభుత్వం విచారణ జరిపి నిజానిజాలు నిగ్గుతేల్చాలని డిమాండ్ చేస్తే 27 మందిపై అక్రమ కేసులు పెట్టారు. ఇదే కేసులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీడియా వ్యవహారాలు చూసే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి కూడా నోటీసులిచ్చారు. నోరెత్తితే నోటీస్ పంపిస్తాం అన్నట్టుగా కూటమి పాలన సాగుతోంది.తండ్రి అంత్యక్రియలకు వచ్చిన ఎన్నారై భాస్కర్ రెడ్డిని పోలీసులే అత్యంత పాశవికంగా కొట్టడమే కాకుండా అతడిపైనా కేసులు పెట్టారు. నకిలీ మద్యం గురించి ప్రశ్నిస్తుంటే కొంతమంది పోలీసులు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారో అర్థం కావడం లేదు? నకిలీ మద్యం వ్యవహారంలో కీలక సూత్రధారులంతా టీడీపీ నాయకులేనని తేలిన తర్వాత కూడా ఇప్పటివరకు ఏ ఒక్కర్నీ అరెస్ట్ చేసిన పాపానపోలేదు. అద్దేపల్లి జనార్దన్ రావును మేనేజ్ చేసి ఆఫ్రికా నుంచి పిలిపించి జైలుకు పంపారు. ఆయన నుంచి తప్పుడు వాంగ్మూలం తీసుకుని మాజీ మంత్రి జోగి రమేశ్ను అరెస్ట్ చేశారు.ప్రభుత్వానికి ఏ కష్టం వచ్చినా, టీడీపీ నాయకులు ఏ కేసులో ఇరుక్కున్నా దాన్ని డైవర్ట్ చేయడానికి వైయస్సార్సీపీ నాయకుల మీద తప్పుడు కేసులు బనాయించి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. నకిలీ మద్యం కేసులో జోగి రమేశ్ సీబీఐ విచారణకి డిమాండ్ చేస్తే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? నకిలీ మద్యం తయారీలో తన పాత్ర లేదని కనకదుర్గమ్మ సన్నిధిలో ప్రమాణం చేసినా, సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించినా మరుసటి రోజునే జోగి రమేశ్ను అరెస్ట్ చేశారంటే నిజాలు బయటకు రావడం ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదని అర్థమైపోయింది. సీబీఐ విచారణలో నిజాలు బయటకొస్తే తెలుగుదేశం నాయకులు జైలుకెళ్లాల్సి ఉంటుందని, తీగలాగితే పెద్ద తలకాయల గుట్టు బయటకొస్తుందని భయపడిపోతున్నారు. అందుకే చంద్రబాబు తన ఆదేశాల ప్రకారం నడిచే సిట్ పేరుతో కేసును నీరుగార్చేస్తున్నాడు.గాడితప్పిన శాంతిభద్రతలు:మొంథా తుపాన్తో పంటలు తీవ్రంగా నష్టపోయి రైతులు అల్లాడుతుంటే చంద్రబాబు లండన్ వెళ్లిపోయాడు. మంత్రి నారా లోకేశ్ క్రికెట్ చూడటానికి ముంబై వెళ్లిపోయాడు. దీనిపైనా ప్రశ్నించకూడదు. సోషల్ మీడియాలో ప్రశ్నించిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెడుతుంటే కోర్టులు పోలీసులకు మొట్టికాయలు వేస్తుండటంతో చివరికి పోలీసులు దిగజారిపోయి గంజాయి కేసులు పెడుతున్నారు.బాధితులకు అండగా నిలబడాల్సిన పోలీసులే బాధితులను వేధింపులకు గురిచేస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా గాడితప్పాయి. మహిళలకు, చిన్నారులకు రక్షణ లేదు. దోపిడీలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు ఎక్కువైపోయాయి. కానీ నేరస్తులకు శిక్షలు పడటం లేదు. ఏడుగుర్రాలపల్లెలో 14 ఏళ్ల బాలికపై ఏడాదిపాటు 16 మంది అత్యాచారం చేస్తే చర్యలుండవు. బాధితుల తరఫున ప్రశ్నిస్తే వైయస్సార్సీపీ నాయకుల మీద తప్పుడు కేసులు మాత్రం పెడుతున్నారు.అప్పులు తెచ్చుకోవడమే సంపద సృష్టి అన్నట్టుంది:రాష్ట్రంలో చంద్రబాబు నియంత పాలన సాగిస్తున్నాడు. అడుగడుగునా మోసం, అబద్ధాలు,అప్పులు తప్ప ఏడాదిన్నర పాలన చూస్తే అభివృద్ది ఆనవాళ్లు ఎక్కడా కనిపించడం లేదు. సంపద సృష్టిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనో రూ.2.27 లక్షల కోట్లు అప్పులు చేశారు. ఆరు నెలల్లో రూ.4570 కోట్లు బడ్జెట్ వ్యయం తక్కువ చేశారు. ప్రభుత్వ ఆదాయం 8.4 శాతం తగ్గిపోయింది. గతేడాదితో పోల్చితే రూ. 7900 కోట్ల ఆదాయం తగ్గింది. అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం 5.5 శాతం తగ్గిపోయింది. జీఎస్టీ ఆదాయం పడిపోయింది.అప్పులు తెచ్చుకోవడమే సంపద సృష్టి అన్నట్టుగా ఉంది. రాష్ట్ర ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది. ప్రజల వద్ద ఉన్న సంపద ఆవిరైపోయింది. చంద్రబాబు ఎప్పుడొచ్చినా ప్రజల ఆస్తులు తగ్గిపోతాయి. రాష్ట్రం అప్పులు పెరిగిపోతాయి. సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. అప్పులు తెచ్చుకోవడం ఆపడం లేదు. అయినా నెలనెలా తెస్తున్న రూ.10 వేల కోట్ల అప్పులు ఏమైపోతున్నాయో తెలియడం లేదు. ఏపీ అప్పులపై వాస్తవాలు చెప్పిన కాగ్ పైన కూడా చంద్రబాబు కేసు పెడతారా?వైఎస్ జగన్ తీసుకొచ్చిన అదానీ డేటా సెంటర్కి పేరు మార్చి గూగుల్ సెంటర్ పేరుతో తండ్రీ కొడుకులు మార్కెటింగ్ చేసుకున్నారు. 25 వేల ఉద్యోగాలిచ్చేలా అదానీతో నాడు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఒప్పందం చేసుకుంటే, గూగుల్ డేటా సెంటర్తో వచ్చే ప్రత్యక్ష ఉద్యోగాల గురించి మాత్రం వాస్తవాలు చెప్పలేకపోతున్నాడు. ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం చేసే దుర్మార్గ ఆలోచన చేశాడు చంద్రబాబు. పదే పదే ప్రజలను మోసం చేయడం సాధ్యంకాదని ఇప్పటికైనా గుర్తుంచుకుంటే మంచిది. రాజ్యాంగబద్దంగా పాలన సాగించాలి. లేదంటే భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరిస్తున్నా.. -
‘చంద్రబాబు సర్కార్కు గుణపాఠం చెబుదాం’
సాక్షి,తాడేపల్లి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో 12న జరిగే ర్యాలీలను సూపర్ సక్సెస్ చేద్దాం. వైద్య వ్యవస్ధను నిర్వీర్యం చేసిన కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెబుదాం. ప్రజా స్పందనను బలంగా వినిపిద్దాం’అంటూ పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ సీఈసీ, ఎస్ఈసీ సభ్యులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్స్, మండల పార్టీ అధ్యక్షులు, జెడ్పీ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు, జెడ్పీటీసీలు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, మునిసిపల్ ఛైర్పర్సన్లు, వైస్ ఛైర్పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలతో సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ నెల 12న ర్యాలీలు జరుగనున్నాయి, కోటి సంతకాల సేకరణ కోసం క్షేత్రస్ధాయిలో మీరంతా ఉన్నారు, ఇదంతా కూడా ఒక ప్రజా ఉద్యమంగా కొనసాగుతోంది. మీ అందరి భాగస్వామ్యం వల్ల కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం విజయవంతం అవుతుంది. మనం తీసుకుంటున్న ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించేలా 12న జరిగే ర్యాలీలు ఉండాలి. వైద్యవ్యవస్ధను జగన్ ప్రజలకు చక్కటి గొడుగులా తయారుచేస్తే చంద్రబాబు దానిని నిర్వీర్యం చేశారు. మనం చేసే ఆందోళనలు, ర్యాలీలు జాతీయస్ధాయిలో చర్చ జరిగేలా ఉండాలి. అప్పుడే చంద్రబాబు ప్రభుత్వం దిగివస్తుంది. కలిసి వచ్చే పార్టీలందరినీ కలుపుకుపోదాం. కులసంఘాలు, స్వఛ్చంద సంస్ధలు, ట్రేడ్ యూనియన్లు ఇలా అందరినీ కలుపుకుందాం. అప్పుడే సూపర్ సక్సెస్ అవుతుంది. ఇందుకు అవసరమైన కసరత్తు పూర్తిచేయాలి. ఏ మాత్రం ఏమరుపాటు వద్దు, అందరూ ఈ కార్యక్రమాన్ని పర్సనల్గా తీసుకుని సక్సెస్ చేయాలి. సోషల్ మీడియా, డిజిటల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకుందాం. మీ పరిధిలో ఉన్న వారందరినీ ఒక్క తాటిపైకి తీసుకొచ్చి ర్యాలీలు సక్సెస్ చేయాలి. మీరంతా ఓనర్ షిప్ తీసుకుని లీడర్లుగా నిరూపించుకునే అవకాశం ఇది. స్ధానిక సంస్ధల ఎన్నికలు ఎప్పుడొచ్చినా మీరంతా సిద్దంగా ఉండాలి, దీనిపై కూడా సీరియస్గా దృష్టిపెట్టాలి. క్షేత్రస్ధాయి నుంచి పార్టీ కమిటీలు, అనుబంధ విభాగాల కమిటీల నియామకంపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఈ కమిటీలన్నీ పూర్తయితే దాదాపు 13 లక్షల మంది సైన్యం సిద్దమవుతుంది. ఇదంతా పారదర్శకంగా డిజిటలైజేపన్ చేయాలి. పరిశీలకుల సహాకారం తీసుకుని పక్కాగా చేయండి. కేంద్ర కార్యాలయం నుంచి అవసరమైన సహకారం ఉంటుంది. అన్ని నియోజకవర్గాల్లో డిజిటల్ మేనేజర్లను కూడా నియమించడం జరిగింది. కమిటీల ఏర్పాటు పకడ్భందీగా చేయాలి, డేటా అంతా కూడా డిజిటలైజ్ చేయాలి. ప్రతి ఇంట్లో మన పార్టీ ఉంటుంది, నిత్యం ప్రజా సమస్యలపై మనం చేస్తున్న పోరాటాలకు అనూహ్యమైన మద్దతు లభిస్తోంది. ప్రజల్లో మన పార్టీకి ఉన్న ఇమేజ్ బాగా పెరుగుతుంది. దీనిని ఇంకా మరింతగా పెంచుకుందాం. కూటమి ప్రభుత్వ అరాచకాలను ధీటుగా ఎదుర్కొందాం’అని సూచించారు. -
నేను అండగా ఉంటా బాధపడొద్దు.. కార్యకర్తల కుటుంబాలకు కొడాలి నాని భరోసా
-
కూకట్ పల్లిలో YSRCP నేతల కోటిసంతకాల సేకరణ
-
అనంతలో టీడీపీ బీభత్సం.. YSRCP కార్యకర్తలపై కర్రలతో దాడి
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వైఎస్సార్సీపీ నేతలు
-
జోగి రమేష్ త్వరలోనే కడిగిన ముత్యంలా బయటకు వస్తారు
-
ఏపీ వైఎస్సార్టీఏ నూతన కార్యవర్గం ఎన్నిక
సాక్షి, అమరావతి: సమైక్యంగా ఉంటూ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పాటుపడాలని ఏపీ వైఎస్సార్టీఏ నూతన కార్యవర్గానికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా, మండల స్థాయి కమిటీల నియామకం త్వరితగతిన పూర్తిచేసి సంఘాన్ని బలోపేతం చేయాలని సూచించారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘం ఏపీ వైఎస్సార్టీఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశం శనివారం తాడేపల్లిలో జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్రం అంతటి నుంచి వచ్చిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల పొట్టగొడుతూ వారి సంపదను స్వాహా చేస్తున్న కూటమి ప్రభుత్వం వారిని ఉద్ధరించినట్లుగా ప్రచారం చేసుకుంటోందని మండిపడ్డారు. దీపావళికి ముందు ఇచ్చిన పెండింగ్ డీఏ కూడా మోసమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నాలుగు పెండింగ్ డీఏల్లో ఒకే ఒక్కటి ఇచ్చి, ఆ ఎరియర్స్ను కూడా రిటైర్మెంట్ సమయంలో ఇస్తామంటూ దెబ్బకొట్టారు. పీఆర్సీ, ఐఆర్, రూ.34 వేల కోట్ల బకాయిల గురించి ప్రస్తావనే లేదు. దీంతోనే ఉద్యోగుల సమస్యల పట్ల కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని తెలిసిపోయింది’’ అని ధ్వజమెత్తారు. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎం.రామచంద్రారెడ్డి మాట్లాడుతూ... వైఎస్ జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్లలో ఆర్నెల్లకు ఒక డీఏ చొప్పున 10 డీఏలు ఇవ్వడంతో పాటు గత చంద్రబాబు ప్రభుత్వం పెండింగ్ పెట్టిన డీఏ కూడా ఇచ్చారని అన్నారు. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఛైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి నప్పటి నుంచి వైఎస్ జగన్ ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.22 వేల కోట్లు ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలున్నాయని చంద్రబాబు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారని పేర్కొన్నారు. వాటిని దఫదఫాలుగా చెల్లిస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఉద్యోగుల ఓట్లు పొందిన చంద్రబాబు, గెలిచాక ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. బకాయిలు చెల్లిస్తానని చెప్పి.. వాటిని మరో రూ.12 వేల కోట్లు పెంచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని... ఇది మోసం కాదా? అని నిలదీశారు. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను 2027–28లో 12 వాయిదాల్లో ఇస్తానని చెప్పడం వేధించడమేనని అన్నారు. ఏపీ వైఎస్సార్టీఏ నూతన రాష్ట్ర కార్యవర్గం ఏపీ వైఎస్సార్టీఏ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఒంగోలుకు చెందిన కేశవరపు జాలిరెడ్డిని సభ్యులు ఎన్నుకున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జంషీద్ (శ్రీ సత్యసాయి జిల్లా), రాష్ట్ర కోశాధికారిగా ప్రేమ్సాగర్ (గుంటూరు)ను ఎన్నుకున్నారు. -
తవ్వినకొద్దీ.. కట్టుకథలే..!
వెలిగొండ ప్రాజెక్టుపై టీడీపీ కూటమి ప్రభుత్వం ఎప్పటిలాగే సవతి ప్రేమ ఒలకబోస్తోంది. సీఎం చంద్రబాబు నుంచి ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆర్భాటపు ప్రకటనలతో ప్రజలను మభ్యపెడుతున్నారు. ప్రాజెక్టు పూర్తికి, నిర్వాసితుల పునరావాసానికి దాదాపు రూ.2000 కోట్లు అవసరమంటూ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఏడాదిన్నర కాలంలో అత్తెసరు నిధులు విడుదల చేసి పనులు వేగంగా జరుగుతున్నాయంటూ మంత్రి నిమ్మల రామానాయుడు అసత్య ప్రకటనలు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముచ్చటగా మూడోసారి వచ్చిన మంత్రి.. ప్రాజెక్టుకు ఎంత నిధులిచ్చారు..జరిగిన పని గురించి చెప్పకుండా వచ్చే ఏడాదిలో నీళ్లిచ్చేస్తామంటూ ఎప్పటిలాగే గొప్పలు చెప్పుకుని వెళ్లిపోయారని పశ్చిమ ప్రకాశం వాసులు మండిపడుతున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: మూడు జిల్లాల వరప్రదాయని వెలిగొండ ప్రాజెక్టు పనులను వెంటనే పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతూనే ఉన్నారు. 1997లో వెలిగొండ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేసిన ఆయన.. సర్వే పేరుతో ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించకుండా తన నైజాన్ని ప్రదర్శించిన విషయాన్ని నేటికీ ప్రకాశం జిల్లా ప్రజలు మర్చిపోలేదు. 2014 నుంచి 2019 వరకు ఐదేళ్ల పాలనలో ఐదు సార్లు జిల్లాకు వచ్చారు. వచ్చినప్పుడల్లా ‘త్వరలో వెలిగొండను ప్రారంభించి పశ్చిమ ప్రకాశాన్ని సస్యశ్యామలం చేస్తా’ అంటూ హామీలు గుప్పిస్తూ కాలం గడిపేశారు. 2018 జూన్ నెలలో జిల్లాకు వచ్చిన చంద్రబాబు.. 2019 సంక్రాంతికల్లా వెలిగొండను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తానని ప్రకటించారు. అధికారం పోయిన తర్వాత జిల్లాకు వచ్చి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు చేయడంపై పశ్చిమ ప్రకాశం ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. తన హయాంలో వెలిగొండ ప్రాజెక్టును గాలికొదిలేసి వైఎస్సార్ సీపీ హయాంలో వెలిగొండ పనులు వేగంగా జరుగుతుంటే విమర్శలు చేయటమే పనిగా పెట్టుకోవటాన్ని ప్రజలు విమర్శించారు. ఈ నేపథ్యంలో 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రెండు సార్లు ప్రవేశపెట్టిన బడ్జెట్లో అత్తెసరు నిధులను వెలిగొండ ప్రాజెక్టుకు కేటాయించింది. ఈ నిధులతో పనులు జోరుగా జరుగుతున్నాయంటూ రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి నిమ్మల రామానాయుడు కూడా సీఎం చంద్రబాబు మాదిరిగానే మాట్లాడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముచ్చటగా మూడోసారి... వెలిగొండ ప్రాజెక్టు సందర్శనకు ఇప్పటికే రెండు సార్లు వచ్చిన నిమ్మల ఇటీవల దోర్నాల వచ్చి వెలిగొండ ప్రాజెక్టు టన్నెళ్ల వద్దకు వెళ్లి పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై, సాక్షి దినపత్రికపై విరుచుకుపడ్డారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా ఖర్చుచేయలేదని నోటికొచ్చినట్లు అబద్ధాలు చెప్పారు. మూడు సార్లు వచ్చి ఏం సాధించారంటే.. ప్రొటోకాల్ ఖర్చులు తప్ప ఏమీ లేదనే చెప్పాలని రైతులు మండిపడుతున్నారు. 2014–19 వరకు 2 టన్నెల్స్ కలిపి 4 కిలోమీటర్లలోపే... చంద్రబాబు మూడోసారి సీఎంగా ఉన్న 2014–19 మధ్యలో వెలిగొండకు గ్రహణం పట్టింది. ప్రాజెక్టుకు ప్రధానమైన రెండు టన్నెళ్లు కలుపుకుని కేవలం 4 కిలోమీటర్లు మాత్రమే పనులు జరిగాయి. ఆ పనులను సైతం తన బినామీ అయిన సీఎం రమేష్కు నామినేషన్ మీద అప్పగించి వందల కోట్ల రూపాయలు దోచుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. జలయజ్జంలో 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వెలిగొండ ప్రాజెక్టుకు రూ.8 వేల కోట్లకుపైగా నిధులు కేటాయించి పనులు ప్రారంభించారు. ఆయన అకాల మరణం తర్వాత పనులు మందగించాయి. చంద్రబాబు నిధులివ్వకుండా ప్రాజెక్టును చిన్నచూపు చూసి ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల ప్రజలనూ నిలువునా మోసం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రెండు టన్నెళ్లు పూర్తి... వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ పొడవు 18.80 కిలోమీటర్లు. రెండో టన్నెల్ పొడవు 18.78 కిలోమీటర్లు. ఈ రెండు టన్నెళ్లకు సంబంధించిన పురోగతిని పరిశీలిస్తే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్టును ఉరుకులు, పరుగులు పెట్టించారు. ఆయన హయాంలో మొదటి టన్నెల్కు సంబంధించి 11.58 కి.మీ పనులు పూర్తి చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రెండు టన్నెళ్లకు సంబంధించి కేవలం 4 కిలోమీటర్లు మాత్రమే పూర్తిచేశారు. అనంతరం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటైన రెండేళ్లలోనే 5.22 కిలోమీటర్ల మేర మొదటి టన్నెల్ తవ్వి పనులు పూర్తి చేశారు. అలాగే రెండో టన్నెల్ను కూడా 10.04 కిలోమీటర్లు తవ్వకాలు పూర్తి చేశారు. వెలిగొండ ప్రాజెక్టు కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం దాదాపు రూ.3 వేల కోట్లకుపైగా ఖర్చు చేసింది. రెండు టన్నెళ్లు పూర్తయిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు.పునరావాస కేంద్రాల్లో మౌలిక వసతులు...వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టిన వెంటనే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. ఒక వైపు ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టిస్తూనే మరోవైపు నిర్వాసితులకు అండగా నిలిచారు. మార్కాపురం మండలం గొట్టిపడియ, అక్కచెరువు తండా నిర్వాసితులకు మార్కాపురం మండలం కుంట వద్ద, పెద్దారవీడు మండలం సుంకేశుల, కలనూతల, చింతలముడిపి గ్రామాల వారికి గోగులదిన్నె వద్ద, సుంకేశులలోని ఎస్సీలకు తోకపల్లి వద్ద కలనూతలలో, కొంతమంది నిర్వాసితులకు ఇడుపూరు వద్ద కాలనీలు ఏర్పాటు చేశారు. అలాగే సిమెంటు రోడ్లు, వాటర్ ట్యాంకులు, కమ్యూనిటీ హాలు, పాఠశాలలు నిర్మించారు. చంద్రబాబు హయాంలో పునరావాసానికి రూ. 1.80 లక్షలు ప్రకటిస్తే.. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే రూ.12.50 లక్షలకు పెంచారు. అందుకోసం రూ.1400 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. 2024లో సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వీటిని పట్టించుకోకపోవడంతో చిల్లచెట్లు, పిచ్చికంపతో నిండిపోయి అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారాయి. దీంతో నిర్వాసితుల్లో నిరాశ, నిస్పృహలు ఏర్పడ్డాయి. ప్రాజెక్టు పరిధిలో 11 గ్రామాల ప్రజలు ప్రస్తుతానికి సొంతూళ్లలోనే ఉంటున్నారు. మొత్తం 7,270 కుటుంబాలు ఉన్నాయి. పునరావాస ప్రక్రియ పూర్తికాకపోవడంతో శిథిలావస్థకు చేదుకున్న గృహాల్లోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు వీరి కష్టాలను గాలికొదిలేసి ఆర్భాటపు ప్రకటనలతో కాలక్షేపం చేస్తున్నారని పశి్చమ ప్రకాశం వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
రైతులంటే చంద్రబాబుకు చిన్నచూపు: కైలే
సాక్షి, తాడేపల్లి: రైతులంటే చంద్రబాబుకు చిన్నచూపు.. విపత్తులో నష్ట పోయిన రైతులను ఆదుకునే పరిస్థితి కూడా లేదంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తుపానును కూడా పబ్లిసిటీ కోసం వాడుకున్న వ్యక్తి చంద్రబాబు.. నష్టపోయిన రైతులను మాత్రం కనీసంగా కూడా పట్టించుకోలేదంటూ ఆయన నిలదీశారు.‘‘పంట నష్టం అంచనాలలో కూడా రైతులను దగా చేస్తున్నారు. నష్టపరిహారం తీసుకుంటే ధాన్యం కొనేదిలేదని రైతులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. రైతులను బ్లాక్ మెయిల్ చేస్తున్న ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నాం. ఒకే ఒక్క రోజులో పంట నష్టం అంచనాలను ఎలా వేస్తారు?. నష్టపరిహారం తీసుకుంటే ధాన్యం కొనేదిలేదని రైతులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రైతులు ధైర్యంగా ఉండేవారు. ఏ విపత్తు వచ్చినా అందుకునేందుకు జగన్ ఉన్నాడనే ధైర్యం ఉండేది. కానీ చంద్రబాబు మాత్రం ధాన్యం పండించడం అనవసరమని మాట్లాడారు. కౌలు రైతులను పట్టించుకునే పరిస్థితి అసలే లేదు. ఈ ప్రభుత్వంలో అసలు యూరియా కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది...పంట నష్టం జరిగితే ఆ వివరాలు తెలుసుకునే పరిస్థితి కూడా ప్రభుత్వంలో లేదు. అసలు ఈ ప్రభుత్వానికి రైతు అంటే చిన్నచూపు. పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందించాల్సిందే. అంచనాల విషయంలో కూడా రాజకీయాలు చేస్తే సహించం. వెంటనే ఉచిత పంటల బీమా సౌకర్యం కల్పించాలి. రబీ సీజన్కు అవసరమైన విత్తనాలు, పెట్టుబడి సాయాన్ని అందించాలి. జగన్ని చూసేందుకు వెళ్లిన మహిళలపై పోలీసులు లాఠీ ఛార్జి చేశారు...ఇదేమని ప్రశ్నిస్తే సీఐ నన్ను దుర్భాషలాడారు. పైగా కేసు నమోదు చేశారు. పోలీసులంటే గౌరవం ఉంది. కానీ అన్యాయంగా కేసులు పెట్టటం బాగోలేదు. దీనిపై మాట్లాడటానికి ఎస్పీకి కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. మా మీద కేసులు పెట్టటం కాదు, గ్రామాల్లో ఉన్న బెల్టు షాపులు అరిట్టండి. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిని అడ్డుకోండి. పేకాట క్లబ్బులు, రేషన్ మాఫియాని అరికడితే సంతోషిస్తాం’’ అని కైలే అనిల్కుమార్ పేర్కొన్నారు. -
ముగిసిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు విచారణ
సాక్షి, శ్రీకాకుళం: వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు విచారణ ముగిసింది. సుమారు ఏడు గంటల పాటు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో సీదిరి అప్పలరాజును పోలీసులు విచారించారు. చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగింది. కూటమి ప్రభుత్వ తప్పిదాలపై గతంలో సీదిరి అప్పలరాజు మీడియాతో మాట్లాడారు. కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అప్పలరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఏడాది క్రితం కేసు నమోదు చేసి విచారణ కోసం తాజాగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం నాలుగు గంటల మధ్యలో కాశీబుగ్గ పోలీస్ స్టేషన్కు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చారు. 352,353(D)(b),351(2),353(2) BNS కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. పోలీసుల నోటీసులకు స్పందిస్తూ కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో విచారణకు అప్పలరాజు హాజరయ్యారు. -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో భక్త కనకదాసు జయంతి వేడుకలు
సాక్షి, తాడేపల్లి: సాహిత్యంతో సామాజిక విప్లవం సాధించవచ్చని నిరూపించిన మహానుభావుడు భక్త కనకదాసు అని కురుబ సంఘం నాయకులు కీర్తించారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో భక్త కనకదాసు 538వ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయ ఇన్చార్జి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీ కురుబ కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం రామకృష్ణతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి వచ్చిన కురుబ నాయకులు పాల్గొన్నారు.భక్త కనకదాసు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం పుష్పాంజలి ఘటించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఆదేశాలతో భక్త కనకదాసు జయంతి వేడుకలను పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కార్యాలయాల్లో నిర్వహిస్తున్నందుకు వారు ధన్యవాదాలు తెలియజేశారు.భక్త కనకదాసు స్ఫూర్తితోనే మాజీ సీఎం వైయస్ జగన్ సామాజిక అంతరాలు తొలగించేలా పాలన అందించారని కొనియాడారు. వెనుకబడిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు రాజకీయ పదవులు ఇచ్చి ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక భక్త కనకదాసు విగ్రహంతో పాటు ఆయన పేరుతో సామాజిక భవనం ఏర్పాటు చేయాలని కురుబ సోదరులు కోరగా ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ దృష్టికి తప్పకుండా తీసుకెళ్తానని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి వారికి హామీ ఇచ్చారు. గడ్డం రామకృష్ణ మాట్లాడుతూ.. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ఆదేశాలతో భక్త కనకదాసు 538వ జయంతి వేడుకలు పార్టీ కేంద్ర కార్యాలయంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కార్యాలయాల్లో నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉంది. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ భక్త కనకదాసు జయంతి వేడుకలు నిర్వహించబోతున్నాం. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ.. ప్రముఖ రచయిత, కవి, ఆధ్యాత్మిక వేత్త భక్త కనకదాసు కుల దురహంకారంపై సాహిత్యమనే ఆయుధంతో పోరాడి సామాజిక విప్లవం తీసుకొచ్చారు. భక్త కనకదాసు స్ఫూర్తితోనే మాజీ సీఎం వైయస్ జగన్ సైతం కులదురహంకారంపై పోరాడి తన పాలన ద్వారా వెనుకబడిన వర్గాలకు అండగా నిలిచారు. కులాల మధ్య అంతరాలు తొలగించడానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలను రాజకీయంగా ప్రోత్సహించారు. పార్టీ, ప్రభుత్వంలో ఉన్నత పదవులు కల్పించి ముందుకు నడిపించారు.ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. సాహిత్యంతో సామాజిక విప్లవం సాధించవచ్చని నిరూపించిన మహానుభావుడు శ్రీ భక్త కనకదాసు. కురుబ గౌడ దాస సమాజానికి ఆరాధ్య ధైవంగా నిలిచారు. పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ ఆదేశాలతో శ్రీకృష్ణ భగవానుడికి గొప్ప భక్తుడైన శ్రీ భక్త కనకదాసు జయంతి వేడుకలను పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించడం జరుగుతోంది. రానున్న రోజుల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక భక్త కనకదాసు విగ్రహం ఏర్పాటుతో పాటు భవన నిర్మాణం చేయాలని కురుబ సోదరులు కోరుతున్నారు. ఈ విషయాన్ని ఖచ్చితంగా పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ దృష్టికి తీసుకెళతానని హామీ ఇస్తున్నాను. భక్త కనకదాసు స్ఫూర్తితో మాజీ సీఎం వైయస్ జగన్ తన ఐదేళ్ల పాలనలో వెనుకబడిన వర్గాల ఉన్నతికి ఎంతగానో కృషిచేశారు. రాజకీయంగా అవకాశాలు కల్పించి అండగా నిలిచారు. రానున్న రోజుల్లోనూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తోందని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి స్పష్టం చేశారు. -
లోకేష్.. ఎంత మందిని జైలులో పెడతావు?: అంబటి
సాక్షి, తిరుపతి: మంత్రి నారా లోకేష్కు కక్ష సాధింపు చర్యలు తప్ప రాష్ట్ర అభివృద్ధి తెలియదని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అధికారం శాశ్వతం కాదు.. ఆలోచనతో నిర్ణయాలు తీసుకోవాలి. మీ నాన్నను జైల్లో పెట్టారని నీకు కనిపించిన వాళ్లందరినీ జైల్లో పెడతావా? అని ప్రశ్నించారు.మాజీ మంత్రి అంబటి రాంబాబు తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..‘మంత్రి నారా లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగానికి వైఎస్సార్సీపీలో ఏ ఒక్కరూ భయపడరు. మా పార్టీ నాయకులపైన అన్యాయంగా, అక్రమంగా తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు. అధికారం ఉంది కదా అని తప్పుడు కేసులు పెడతామని చూస్తే దీని ప్రతిఫలం ఖచ్చితంగా అనుభవించక తప్పదు. అధికారం శాశ్వతం కాదు. అధికార మదంతో లోకేష్ ఉన్నాడు. తన తల్లిని అంబటి రాంబాబు అవమానించాడు అంటూ లోకేష్ అబద్ధపు ప్రచారం చేస్తున్నాడు. విచారించుకోండి నేను ఏరోజు ఆయన తల్లిని అవమానించలేదు. మీ నాన్నను జైల్లో పెట్టారని నీకు కనిపించిన వాళ్లందరినీ జైల్లో పెడతావా?. ఎంత మందిని జైలులో పెడతారు?. జైల్లో పెడితే బయటకు రామా.. మీరు ఏమైనా చంపేస్తారా. జైల్లో నుంచి మీ నాన్న చంద్రబాబు బయటకు రాలేదా?. ఏడాదిన్నర కాలంలోనే కూటమి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత మొదలైంది. అన్నీ ప్రజలే చూస్తున్నారు. రాబోయే మూడేళ్లలో మేమంతా ఎలా బలపడతామో మీరే ఊహించుకోండి. కూటమి ప్రభుత్వానికి ఓట్లు ఎందుకు వేశామా అని ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారు. ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం అమలు చేయడం లేదని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. వైఎస్ జగన్ పర్యటనకు లక్షలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ఆయన్ను ఓడించాము అనే బాధతో ప్రజలు ఆయన పర్యటనకు తరలి వస్తున్నారు.మీ రెడ్బుక్ బంగాళాఖాతంలో మునగడం ఖాయం. పవన్ కళ్యాణ్.. మీరు 15 ఏళ్లు కాదు జీవితాంతం కలిసే ఉండండి మాకేం నష్టం లేదు. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రస్థాయిలో పెరిగింది మీరు కలిసి ఉంటేనే మాకు కలదు సుఖం. మేము బలపడతాం. అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ.. చిరంజీవిని అవమానిస్తే పవన్ కళ్యాణ్ నోరు మెదపలేదు. మీరు పోరాట యోధులు అన్నారు. అన్యాయం జరిగితే సహించరు అన్నారు ఇదేనా?. నువ్వు చెప్తే నమ్మి కాపులందరూ చంద్రబాబుకు ఓటు వేశారు. మీ పోరాట పటిమని గంగలో ముంచేయండి’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
‘ఇమామ్ ప్రస్థానం’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సజ్జల
సాక్షి, తిరుపతి: ‘ఇమామ్ ప్రస్థానం’ పుస్తకాన్ని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి శనివారం ఆవిష్కరించారు. పద్మావతి పురంలోని పార్టీ కార్యాలయంలో పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి, చిత్తూరు జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, ఆర్.కే.రోజా, మాజీ డిప్యూటి సీఎం నారాయణ స్వామి, ఎంపీ గురుమూర్తి, మేయర్ డాక్టర్ శిరీష, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యము, రాయలసీమ మేధావులు ఫోరం కన్వీనర్ పురుషోత్తం రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. ‘‘కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు మాటల్లో చెప్తే.. చేతల్లో చూపించిన నాయకుడు వైఎస్సార్. ‘వైఎస్సార్ బాటలో జగన్ నడుస్తున్నారు. రూ.16 వేల కోట్లు ఖర్చు చేసి నాడు-నేడుతో వైఎస్ జగన్.. స్కూళ్ల రూపురేఖలు మర్చారు. వైఎస్ జగన్ ఒక సంఘ సంస్కర్తగా అడుగులేశారు. ఇమామ్ ఆశీస్సులు వైఎస్ జగన్కు ఉండాలి..ఇమామ్ 77 ఏళ్ల వయసులో నవ యువకుడిగా ఉత్సాహంగా కొత్త ఆలోచనతో ఉన్నారు. ఏ కల్మషం లేని వ్యక్తి ఇమామ్.. ఆయన దారిలో పయనించాలి. రాయలసీమ స్ఫూర్తి, కమ్యూనిస్ట్ భావజాలంతో ముందుకు నడిచారు.’’ అని సజ్జల పేర్కొన్నారు.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఐదేళ్లలో వైఎస్ జగన్ ఎన్నో సంస్కరణలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ద్వారా మొదటి బ్యాచ్ పూర్తి అయ్యేది. ఏ సీఎం కూడా చేయని విధంగా దేశంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకు వచ్చింది ఒక్క వైఎస్ జగన్ మాత్రమే. ప్రజలకు గుర్తుండి పోయేలా వైఎస్ జగన్ సంక్షేమ కార్యక్రమాలు చేశారు.ఆర్కే రోజా మాట్లాడుతూ.. ఇమామ్ కదలిక ద్వారా ఎన్నో సమాజంలో ఎన్నో సంస్కరణలకు కారణం అయ్యారు. రాయలసీమ అభివృద్ధి కోసం ఇమామ్ పనిచేశారు.. కృషి చేశారు. భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ.. ఇమామ్తో సుదీర్ఘ పరిచయం.. 21 నెలలు జైల్లో గడిపిన క్షణాలు గుర్తున్నాయి. రాజకీయం అంటే ఇతరులతో సంఘర్షణ కాదు.. ఆత్మీయతో మెలగటం -
పక్కా స్కెచ్.. కొండారెడ్డిపై కూటమి కుట్ర
-
లింగాల పీఎస్ ముందు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ధర్నా
సాక్షి, వైఎస్సార్ జిల్లా: లింగాల పోలీస్ స్టేషన్ ముందు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ధర్నాకు దిగారు. వారం రోజులుగా రైతుల మోటార్ల వైర్లు అపహరణకు గురవుతున్నాయి. గత రాత్రి 25 మంది రైతుల కేబుల్ వైర్లు చోరీ అయ్యాయి. రైతులకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ ముందు రైతులతో కలిసి వైఎస్ అవినాష్రెడ్డి ఆందోళన చేపట్టారు.రైతులకు లక్షలాది రూపాయల నష్టం జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు. వెంటనే నిందితులను పట్టుకుని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ అవినాష్రెడ్డి ధర్నాకు దిగారు. -
బాబు ‘విజన్’ డ్రామా.. ‘ఎల్లో’ ఎలివేషన్!
‘ఊరు మారినా ఉనికి మారునా’ అని ఓ సినీకవి అన్నాడు కానీ.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దీన్ని.. ‘పేరు మారినా ఖ్యాతి పోవునా’ అని పాడుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను, ప్రజాసేవకు ఏర్పాటు చేసిన విస్తృత వ్యవస్థల పేర్లు మార్చి సంబరపడుతోంది టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం. ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందన్న భయంతో వాటిని కొనసాగిస్తున్నప్పటికీ ఎక్కడ జగన్ పేరు జన హృదయాల్లో నిలిచిపోతుందో అన్న భయంతో పథకాల పేర్లు మార్చేసి కూటమి ప్రభుత్వం ఆత్మ వంచన చేసుకుంటోంది.తాజాగా గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను విజన్ యూనిట్లుగా మార్చాలని చంద్రబాబు ప్రతిపాదించారు. ముందుగా స్వర్ణాంధ్ర కేంద్రాలుగా నామకరణం చేయాలని అనుకున్నప్పటికీ ఎందువల్లో విజన్ యూనిట్ పేరుకు పరిమితమయ్యారు. ప్రతి నియోజకవర్గానికి విజన్ ప్లాన్ రూపొందిస్తామని, సచివాలయాలు విజన్ యూనిట్లుగా పని చేయాలని చంద్రబాబు అధికారుల సమావేశంలో తెలిపారు. ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరిగే బాధ తప్పించాలని కూడా ఆయన అన్నారు. విజన్ పేరుతో ప్రజలను భ్రమల్లో ఉంచడం చంద్రబాబుకు కొత్తేమీ కాదు. ఒకప్పుడు విజన్ 2020. ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి ఒకటి. అంతే తేడా!ఈ మధ్య ఒక రోజు మంత్రి లోకేశ్ టీడీపీ ప్రధాన కార్యాలయానికి వెళితే అక్కడ నాలుగువేల మంది క్యూ కనిపించిందట. కొన్ని గంటల వ్యవధిలోనే లోకేశ్ వారి నుంచి వినతిపత్రాలు తీసుకున్నారట. ప్రభుత్వం ప్రజల వద్దకు వెళుతుంటే, వారి సమస్యలు తీరుతుంటే ఈ స్థాయిలో జనం పార్టీ ఆఫీస్కు వెళ్లి వినతులు సమర్పించుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది?. ఎల్లో మీడియా లోకేశ్కు ఎలివేషన్ ఇచ్చే క్రమంలో ఈ వార్తను రాసింది. కానీ, అది తిరగబడినట్లు వ్యంగ్యంగా వ్యాఖ్యలు వచ్చాయి. నిజానికి గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ సేవలు ప్రజల ఇళ్ల వద్ద అందించడం కోసం వలంటీర్ల వ్యవస్థను తెచ్చారు. ఈ వ్యవస్థ పనితీరుపై సర్వత్రా ప్రశంసలూ వ్యక్తమయ్యాయి. కానీ, చంద్రబాబు, పవన్కళ్యాణ్లు ఆది నుంచి ఈ వ్యవస్థలకు వ్యతిరేకంగానే మాట్లాడారు. వలంటీర్లను మూటలు మోసేవారని, మగవారు ఇళ్లల్లో లేనప్పుడు తలుపులు కొట్టే వారని చంద్రబాబు నానా మాటలూ అన్నారు. పవన్ కూడా వలంటీర్లను మహిళలను కిడ్నాప్ చేసే వారితో పోల్చడం తెలిసిందే.అయితే.. ప్రజల్లో వలంటీర్ వ్యవస్థపై ఉన్న భరోసా, నమ్మకాలను గమనించిన తరువాత ఎన్నికల సమయంలో తామూ ఈ వ్యవస్థలను కొనసాగిస్తామని నమ్మబలికారు. అంతటితో ఆగకుండా.. వలంటీర్ల గౌరవ వేతనాలను రెట్టింపు చేస్తామని హామీలు గుప్పించారు కానీ అధికారం వచ్చిన తరువాత మాత్రం తూచ్ అనేశారు! రైతు భరోసా కేంద్రాల పేర్లను కూడా రైతు సేవా కేంద్రాలుగా మార్చిన విషయం తెలిసిందే. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థపై గతంలో తీవ్ర ఆక్షేపణలు వ్యక్తం చేశారు. అంతమంది ఉద్యోగుల నియామకం ఏమిటని ధ్వజమెత్తారు. కానీ, ఇవి ప్రజా సేవలకు అత్యంత కీలకంగా మారిపోవడం, రాష్ట్ర ప్రభుత్వానికి సచివాలయం మాదిరిగా గ్రామాలకు, వార్డులకు ఇవి అని ప్రజలు గుర్తించారు.సచివాలయాలన్నిటికి జగన్ శాశ్వత భవనాలు ఏర్పాటు చేశారు. వివిధ శాఖలకు చెందిన సుమారు 1.30 లక్షల మంది ఉద్యోగులను ఏకకాలంలో నియమించి రికార్డు సృష్టించారు. తుపాన్ల వంటి విపత్కర పరిస్థితుల్లో ఈ వ్యవస్థలు సహాయ కార్యక్రమాల అమల్లో చురుకుగా పాల్గొని ప్రజల ప్రశంసలు పొందాయి కూడా. ఈ నేపథ్యంలో వీటిని ఎత్తి వేయలేమన్న అభిప్రాయానికి వచ్చిన చంద్రబాబు సర్కార్ క్రెడిట్ జగన్కు దక్కరాదన్న అక్కసుతో కొత్త పేరు పెట్టే ప్రయత్నం చేస్తోంది. తద్వారా క్రెడిట్ చోరీకి సిద్ధమవుతున్నారన్నమాట. అయితే ఈ విజన్ యూనిట్లకు వేరే బాధ్యతలు అప్పగిస్తారో, లేక జగన్ టైమ్లో మాదిరి సేవలు అందించేలా చూస్తారో చెప్పలేం.స్కీముల కాపీలో టీడీపీకు ఘనమైన ట్రాక్ రికార్డే ఉంది. 2019 ఎన్నికల సమయంలో జగన్ రైతు భరోసా పథకం కింద ఏడాదికి రూ.13,500 ఇస్తామని ప్రకటించి విజయవంతంగా అమలు చేయగా చంద్రబాబు అండ్ కో 2024లో దీన్నే ‘అన్నదాతా సుఖీభవ’ అని నామకరణం చేసింది. ఎక్కువ మొత్తానికి హామీ ఇచ్చినా అధికారంలోకి వచ్చిన తరువాత ఎగవేశారన్నది వేరే సంగతి. ఇంటికో విద్యార్థికి రూ.15 వేల ఆర్థిక సాయాన్ని జగన్ ‘అమ్మ ఒడి’ ద్వారా అందిస్తే.. ఇంట్లో ఉన్న విద్యార్థులందరికీ ‘తల్లికి వందనం’ పేరుతో తామూ ఇస్తామని కూటమి ప్రకటించింది. తొలి ఏడాది ఎగవేసి రెండో ఏట అరకొరగా అమలు చేసి మమ అనిపించింది. అలాగే జగన్ రికార్డు స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన జగనన్న కాలనీల (31 లక్షల పేదలకు ఇళ్లస్థలాలివ్వడమే కాకుండా.. నిర్మాణమూ చేపట్టిన భారీ కార్యక్రమం) పేరును కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ నగర్లుగా మార్చింది. ‘జగనన్న గోరుముద్ద’ కాస్తా ఇప్పుడు మధ్యాహ్న భోజనమైంది. విద్యా కానుక విద్యార్థి మిత్రగా మారితే పాఠశాలల రూపురేఖలను సమూలంగా మార్చేసేందుకు జగన్ చేపట్టిన ‘నాడు-నేడు’ ఇప్పుడు ఏస్థితిలో ఉందో ఎవరికీ తెలియదు. పేరును మాత్రం ‘మనబడి -మన భవిష్యత్తు’ అని పెట్టేశారు. వాహనమిత్రను ‘ఆటో డ్రైవర్ల సేవలో’ అని, ‘మత్యకార భరోసా’ని ‘మత్స్యకారుల సేవలో’ అని మార్చేశారు.మహిళల భద్రత కోసం జగన్ ప్రభుత్వం దిశ యాప్ను తీసుకువస్తే దానిని శక్తి యాప్గా మార్చారు. వైఎస్ఆర్ పేరుతో ఉన్న ఆరోగ్యశ్రీ స్కీమ్ను ఎన్టీఆర్ వైద్యసేవగా ఛేంజ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక, తెలంగాణలలో అమలు చేసిన మహిళల ఉచిత బస్ స్కీమ్ను కూటమి తన ఎన్నికల ప్రణాళికలో చేర్చింది. ఆడబిడ్డ నిధి కూడా కాపీ స్కీమే. అయినా అది కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో మాదిరే ఏపీలో కూడా చంద్రబాబు సర్కార్ అమలు చేయలేకపోయింది. చంద్రబాబు తన ఇన్నేళ్ల పదవీ కాలంలో ఎందుకు ఇలాంటివి తీసుకు రాలేకపోయారంటే సమాధానం ఉండదు. ఒకప్పుడు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని వైఎస్ రాజశేఖరరెడ్డి హామీ ఇస్తే, అలా చేస్తే కరెంట్ తీగలపై బట్టలు ఆరవేసుకోవల్సిందేనని చంద్రబాబు అనేవారు. తదుపరి ప్రభుత్వంలోకి వచ్చిన వైఎస్ఆర్ ఉచిత విద్యుత్తును అమలు చేసి చూపించారు. దాంతో అదంతా తమ సంస్కరణల వల్లే సాధ్యమైందని చంద్రబాబు ప్రచారం చేసుకున్నారు.గత ప్రభుత్వం చేపట్టిన రీసర్వేని తీవ్రంగా వ్యతిరేకించిన కూటమి నేతలు, తమ ప్రభుత్వంలో దానినే కొనసాగిస్తుండడం విశేషం. జగన్ తెచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తామే తెచ్చామన్నట్లుగా పిక్చర్ ఇవ్వడం, వాటిని ప్రైవేటు వారికి అప్పగించడం ద్వారా జగన్కు క్రెడిట్ రాకుండా చేయాలని చూడడం, విశాఖలో అదాని డేటా సెంటర్ కు జగన్ అంకురార్పణ చేస్తే, దానిని మర్చిపోవడం కోసం వ్యూహం అమలు చేయడం వంటివి కూడా చెప్పుకోదగినవే. ఏది ఏమైనా చంద్రబాబు తనకు ఇష్టం లేకపోయినా, సచివాలయాలను కొనసాగిస్తుండడం ద్వారా జగన్ తెచ్చింది మంచి వ్యవస్థ అని, జగన్కే విజన్ ఉందని ఒప్పుకున్నట్టు అయ్యింది. వారు భావిస్తున్నట్లుగా సచివాలయాల పేరు మార్చినా, జగన్ ప్రభుత్వం నిర్మించిన భవనాలు జనానికి కనిపించవా? జగన్ పేరు గుర్తుకు రాకుండా ఉంటుందా?.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
తాత్కాలిక శు‘భ్రమేనా’..!
సాక్షి, అమరావతి: విజయవాడ సామాజిక న్యాయ మహాశిల్పం అంబేడ్కర్ ప్రాంగణంలో సర్కారు పారిశుద్ధ్య పనులు చేపట్టింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్మించిన మహాశయుని మహాశిల్పంపై చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఆది నుంచి వివక్ష, నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. దీంతో ‘‘అంబేడ్కర్పైనా కూటమి కక్ష!’ శీర్షికన సాక్షి కథనం ప్రచురించడంతో సర్కారు తీరుపై దళిత, గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో ఎట్టకేలకు దిగొచ్చిన సర్కారు శుక్రవారం ప్రాంగణంలో హడావుడిగా పారిశుద్ధ్య పనులు చేపట్టింది. వాటర్ ఫౌంటెయిన్లలో పేరుకుపోయిన పసరు నీటిని తొలగించింది. వాటిని మళ్లీ మంచినీటితో నింపాల్సి ఉంది. ప్రాంగణం మొత్తం పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి, శుభ్రంచేయించింది. ఈ చర్యలపై దళిత, గిరిజన సంఘాలు గళమెత్తాయి. కేవలం తాత్కాలిక కంటితుడుపు చర్యలతో సరిపెట్టకుండా స్ఫూర్తిదాయకమైన ప్రాంగణాన్ని మరింత అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. దీనిని ప్రైవేట్పరం చేయకుండా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరుతున్నాయి. సామాజిక న్యాయ మహాశిల్పం పరిరక్షణకు, అభివృద్ధికి కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈ నెల 26న రాజ్యాంగ దినోత్సవం రోజున ‘చలో అంబేడ్కర్ విగ్రహం’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నద్ధమయ్యాయి. పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విజయవాడ నడిబొడ్డున నిర్మించిన సామాజిక న్యాయ మహాశిల్పంపై కూటమి సర్కారు దృష్టిపెట్టాలి. ఈ ప్రాంగణాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి. – అండ్ర మాల్యాద్రి, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రజా సంఘాలపై టీడీపీ బురదజల్లడం సరికాదు సామాజిక న్యాయ మహాశిల్పం పట్ల కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతున్న ప్రజా సంఘాలు, అంబేడ్కరిస్టులపై టీడీపీలోని కొందరు ఎస్సీ నాయకులు బురదచల్లే తీరు సరికాదు. అభివృద్ధికి చర్యలు చేపట్టాలి. – శ్వేతా బుడమూరి, సమతా సైనిక దళ్ మహిళా అధ్యక్షులు -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. బాబు సర్కార్ దిగిరావాల్సిందే: సజ్జల
సాక్షి, తాడేపల్లి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పోరాటం చేయాలని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన పార్టీ ముఖ్య నేతలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్లు హాజరయ్యారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. రచ్చబండ కార్యక్రమాలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందన్నారు. ఈ నెల 12న అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే ర్యాలీలను విజయవంతం చేయాలన్నారు. కలిసి వచ్చే పార్టీలను కలుపుకుని ముందుకు పోవాలని.. పార్టీ కమిటీలు, డేటా డిజిటలైజేషన్పై ప్రతి ఒక్కరూ సీరియస్గా దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.‘‘పార్టీ కార్యక్రమాలను సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మెడికల్ కాలేజీలపై ప్రభుత్వం దిగివచ్చే వరకూ పోరాటం ఆగదు. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి అంతా పకడ్బందీగా సిద్ధమవ్వాలి. ప్రజలకు మరింత చేరువయ్యేలా గొంతెత్తి నినదించాలి. ప్రతి ఒక్కరూ మొక్కుబడిగా కాకుండా చిత్తశుద్ధితో పనిచేయాలి’’ అని సజ్జల పేర్కొన్నారు.సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏమన్నారంటే..‘‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నియోజకవర్గాల్లో ఈ నెల 12న ర్యాలీలు జరుగుతాయి. ఇందుకు రాష్ట్ర స్థాయిలో పోస్టర్ రిలీజ్ కార్యక్రమం జరిగింది. దీనిపై రేపు అన్ని జిల్లాలలో జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎల్లుండి నియోజకవర్గ కేంద్రాల్లో అసెంబ్లీ ఇంఛార్జ్లు, ఆ తర్వాత మండల స్ధాయిలో పోస్టర్ రిలీజ్ కార్యక్రమాలు నిర్వహించాలి. పోస్టర్ రిలీజ్ తర్వాత ప్రెస్ మీట్లు నిర్వహించి మీడియాకు మన ఉద్దేశాన్ని వివరించాలి. కోటి సంతకాలు-రచ్చబండ కార్యక్రమంకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది...వైఎస్ జగన్ అభిప్రాయంతో ప్రజలు ఏకీభవిస్తున్నారు. పార్టీ అనుబంధ విభాగాలు కూడా ఇందులో తమ వంతుగా వివిధ వర్గాల ప్రజలను కలిసి ప్రజా స్పందనను సంతకాల రూపంలో విస్తృతంగా నమోదు చేస్తున్నారు. వచ్చే వారంలో కోటి సంతకాల సేకరణపై రివ్యూ చేద్దాం. ప్రభుత్వం దిగివచ్చే వరకూ మన పోరాటం ఆగదు. మనతో కలిసివచ్చే పార్టీలను ఆహ్వనిద్దాం. వివిధ కుల సంఘాలు, సివిల్ సొసైటీలను భాగస్వామ్యం చేద్దాం. మరింత ఫోకస్డ్గా పనిచేద్దాం...పార్టీ కమిటీల ఏర్పాటు, డేటా డిజిటలైజేషన్పై కూడా నాయకులు సీరియస్గా దృష్టిపెట్టాలి. వైఎస్ జగన్ వీటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇంటెన్సివ్ డ్రైవ్ లాగా చేయాలి. మనం ముందుగా అనుకున్న డెడ్ లైన్కల్లా అన్ని స్థాయిలలో కమిటీల నియామకాలు పూర్తవ్వాలి. సెంట్రల్ ఆఫీస్ నుంచి ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం తక్షణమే ఫోకస్డ్గా పని చేయాలి. మండల, గ్రామ స్థాయి కమిటీలు నిర్ణీత టైంలైన్లోపు పూర్తి చేయాలి. డేటా ప్రొఫైలింగ్ అనేది పక్కాగా జరగాలి. అందుకు అవసరమైన సాఫ్ట్వేర్ ఇప్పటికే రూపొందించాం...పార్టీ కార్యక్రమాలను సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళదాం. నియోజకవర్గ డిజిటల్ మేనేజర్లతో సమన్వయం చేసుకోవాలి. ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగే సమయంలో మనం జాగ్రత్తగా పరిశీలించాలి, అలెర్ట్గా ఉండాలి. అందుకు అవసరమైన బూత్ లెవల్ ఏజెంట్లను సిద్ధం చేసుకుందాం. స్థానిక సంస్ధల ఎన్నికలు జరిగే నాటికి మనం అంతా పకడ్బందీగా సిద్ధమవ్వాలి. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు మనం వారి తరుపున గొంతెత్తి నినదిస్తున్నాం. డిజిటల్ మీడియా వేదికగా మన వాణిని వినిపిద్దాం. ప్రతిఒక్కరూ మొక్కుబడిగా కాకుండా చిత్తశుద్ధితో పనిచేయాలి. కమిటీల నిర్మాణానికి అవసరమైన పరిశీలకులను అవసరమైతే తక్షణం నియమించాలి. కమిటీల ఏర్పాటు ఎంత ముఖ్యమో ఆ తర్వాత ఆ కమిటీలు అంతే ఉత్సాహంగా పనిచేయాలని వైఎస్ జగన్ సూచించారు’’ అని సజ్జల వివరించారు. -
గొల్లపల్లిని ఫోన్లో పరామర్శించిన వైఎస్ జగన్
సాక్షి, కోనసీమ జిల్లా: అస్వస్థతకు గురైన వైఎస్సార్సీపీ రాజోలు కో ఆర్డినేటర్, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావును ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. గొల్లపల్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గొల్లపల్లి కుమారుడు శ్రీధర్కు ధైర్యం చెప్పారు.గొల్లపల్లి సూర్యారావు (నవంబర్ 5, బుధవారం) గుండెపోటుకు గురయ్యారు. ఆయనను వెంటనే అమలాపురం కిమ్స్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు. రాజోలు మండలం శివకోడులో గురువారం జరిగే రచ్చబండ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించడానికి ఆయన బుధవారం వెళ్లారు. పార్టీ నాయకుడు ఇంటిలో మెట్లు ఎక్కి వెళుతుండగా అకస్మాత్తుగా గుండె నొప్పి వచ్చింది. వెంటనే పార్టీ నాయకులు స్థానిక ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు.ఈసీజీలో తేడా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం అమలాపురం కిమ్స్ హాస్పిటల్లో చేర్పించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ అమలాపురం కో ఆర్డినేటర్ డాక్టర్ శ్రీకాంత్.. కిమ్స్ వైద్యులతో మాట్లాడారు. కిమ్స్ గుండె వైద్యుడు అభిషేక్ వర్మ ఆధ్వర్యంలో వైద్య నిపుణుల బృందం గొల్లపల్లి గుండెలోని క్లాట్స్ తొలగించి రెండు స్టంట్లు వేశారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. సూర్యారావు ఆరోగ్యం మెరుగ్గా ఉందని, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందవద్దని డాక్టర్ శ్రీకాంత్ సూచించారు. కిమ్స్ చైర్మన్ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు) పర్యవేక్షణలో సూర్యారావుకు వైద్యులు సేవలు అందిస్తున్నారు. -
‘కర్నూలు బస్సు దగ్దానికి మద్యమే కారణం’
తాడేపల్లి : కర్నూలు బస్సు దగ్దానికి మద్యమే కారణమన్న సంగతి అందరికీ తెలుసని, కానీ అదే విషయాన్ని సోషల్ మీడియాలో ఎట్టిన వారిపై కూటమి ప్రభుత్వం కేసులు పెడుతుందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుదాకర్బాబు విమర్శించారు. ఇప్పుడు ఏకంగా వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలోకి పోలీసులు వచ్చారని, తమ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీహరి నోటీసులు ఇచ్చారన్నారు. ఈరోజు(శుక్రవారం, నవంబర్ 7వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన సుధాకర్ బాబు.. ‘ప్రజలు, ప్రతిపక్షం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని ప్రభుత్వం నోటీసులతో భయపెట్టాలని చూస్తోంది. ఇలాంటి నోటీసులు, కేసులకు మేము భయపడము, కర్నూలు బస్సు దగ్దానికి కారణమైన బైకర్లు మద్యం ఎక్కడ తాగారో ప్రభుత్వం ఎందుకు చెప్పటం లేదు?, మృతుని శరీరంలో ఎంత ఆల్కాహాల్ ఉందో రిపోర్టుని ఎందుకు బయట పెట్టలేదు?, రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం, డ్రగ్స్ దొరుకుతోంది, విశాఖలో దొరికిన డ్రగ్స్ వివరాలు హోంమంత్రి ఎందుకు బయట పెట్టటం లేదు?, ఎవరి ప్రభుత్వ హయాంలో డ్రగ్స్ దొరికాయో శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా?, దక్షిణాఫ్రికాకు చెందిన థామస్ అనే వ్యక్తి పుస్తకం మధ్యలో డ్రగ్్ పెట్టుకుని వచ్చాడు. ఆయన అక్షయ కుమార్ అనే వ్యక్తికి ఇస్తుండగా ఈగల్ టీమ్ పట్టుకుంది. అదే రోజు ఐదుగురిని అరెస్టు చేశారు. అందులో కూటమి ఎమ్మెల్యేల కుమారులు ముగ్గురు ఉన్నారు. ఈ విషయం తెలియగానే ముగ్గురిని ఎందుకు వదిలేశారు?, హోంమంత్రి అనిత ఈ విషయాలపై ఎందుకు మాట్లాడటం లేదు?, వారిని వదిలేసేంత వరకు కూటమి ఎమ్మెల్యేలు సీపీ ఆఫీసులో కూర్చోలేదా?., ఈ విషయాలు బయటకు రాకుండా ఉండేందుకు మాపార్టీ కార్యకర్త కొండారెడ్డి పై కేసు పెట్టారు. కొండారెడ్డిని అరెస్టు చేసిందెక్కడ? అతను నివసించేది ఎక్కడ?, సీసీ కెమెరాలో పోలీసుల వైఖరి తేలిపోయింది. ఇలాంటి అకృత్యాలకు చెక్ పడే సమయం దగ్గర్లోనే ఉంది’ అని ధ్వజమెత్తారు. -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి కర్నూలు పోలీసులు
సాక్షి, తాడేపల్లి: కర్నూలు బస్సు ప్రమాదం అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై వైఎస్సార్సీపీని టార్గెట్ చేసింది కూటమి ప్రభుత్వం. దీనిలో భాగంగా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి సైతం పోలీసులు వచ్చారు. కర్నూలు బస్సు ప్రమాదానికి మద్యం కారణమనే విషయం అందరికీ తెలిసినా.. దీనిపై పోస్టులు పెట్టిన వారిపై ఇప్పటివరకూ కేసులు పెట్టిన పోలీసులు.. ఇప్పుడు వైఎస్సార్సీపీ కార్యాలయంలోకి అడుగుపెట్టారు. ఏదో రకంగా వైఎస్సార్సీపీని వేధించాలనే లక్ష్యంతో కూటమి కనుసన్నల్లో పని చేస్తున్న పోలీసులు.. ఇవాళ(శుక్రవారం, నవంబర్ ) వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చి నోటీసులు ఇచ్చారు.కర్నూలు బస్సు దగ్ధం కేసులో నోటీసులు జారీ చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి (మీడియా) పూడి శ్రీహరికి నోటీసులు ఇచ్చిన పోలీసులు.. బస్సు దగ్దానికి మద్యమే కారణమని ప్రచారం చేశారంటూ నోటీసులు ఇచ్చారు. ప్రచారం వెనుక వైఎస్సార్సీపీ ఉందంటూ కేసు పెట్టారు. ఇప్పటికే 27 మందిపై కేసులు నమోదు చేశారు. తాజాగా పూడి శ్రీహరిని కూడా ఈ కేసులో కర్నూలు ఖాకీలు చేర్చారు. బాబు సర్కార్.. నోటీసులతో భయపెట్టాలని చూస్తోంది: టీజేఆర్పోలీసుల నోటీసులపై వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు స్పందిస్తూ.. ‘‘కర్నూలు బస్సు దగ్దానికి మద్యమే కారణం.. ఆ విషయం అందరికీ తెలుసు. కానీ అదే విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టిన వారిపై కేసులు పెట్టారు. ఇప్పుడు ఏకంగా మా పార్టీ కేంద్ర కార్యాలయానికే పోలీసులు వచ్చారు. మా పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీహరికి నోటీసులు ఇచ్చారు. ప్రజలు, ప్రతిపక్షం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని ప్రభుత్వం నోటీసులతో భయపెట్టాలని చూస్తోంది’’ అంటూ ఆయన మండిపడ్డారు.ఇలాంటి నోటీసులు, కేసులకు మేము భయపడము. కర్నూలు బస్సు దగ్దానికి కారణమైన బైకర్లు మద్యం ఎక్కడ తాగారో ప్రభుత్వం ఎందుకు చెప్పటం లేదు?. మృతుని శరీరంలో ఎంత ఆల్కాహాల్ ఉందో రిపోర్టుని ఎందుకు బయట పెట్టలేదు?. రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం, డ్రగ్స్ దొరుకుతోంది. విశాఖలో దొరికిన డ్రగ్స్ వివరాలు హోంమంత్రి ఎందుకు బయట పెట్టటం లేదు?. ఎవరి ప్రభుత్వ హయాంలో డ్రగ్స్ దొరికాయో శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా?’’ అంటూ టీజేఆర్ ప్రశ్నించారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ‘వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమం’
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈనెల 12న ‘వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమం’ పేరుతో 175 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్టు పార్టీ నాయకులు వెల్లడించారు. అనంతరం అధికారులకు వినతిపత్రాలు అందజేయడం జరుగుతుందని వివరించారు.ఇందుకు సంబంధించి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమం’ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేదాకా వైఎస్సార్సీపీ పోరాడుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..అందరికీ నాణ్యమైన ఉచిత వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యతగా భావించిన నాటి సీఎం వైఎస్ జగన్, రాష్ట్ర వ్యాప్తంగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టడమే కాకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి 7 కాలేజీలను పూర్తి చేశారు. మిగిలిన కాలేజీల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల నిర్మాణాలకు నిధుల కొరత లేకుండా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్తో టైఅప్ చేయడం జరిగింది.కానీ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీ నిర్మాణాలను పూర్తిచేయకపోగా సేఫ్ క్లోజర్ పేరుతో పూర్తిగా పక్కన పెట్టేశారు. అంతే కాకుండా 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయాలని నిర్ణయించి డాక్టర్లు కావాలని కలలు కనే పేద విద్యార్థుల ఆశలకు చంద్రబాబు గండి కొట్టారు. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల పరిధిలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ కార్యక్రమంలో భాగంగా ఈనెల 12న 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ర్యాలీలకు వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది.పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర, ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, లీగల్ సెల్ అధ్యక్షుడు మలసాని మనోహర్రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, నారాయణమూర్తి, ఇతర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
జగన్ ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ అమలు చేయాల్సిందే
-
మన ఖాతాలో వేసేద్దాం..
సాక్షి, అమరావతి: ఏమార్చి.. పేరు మార్చి.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. అమ్మ ఒడి నుంచి గూగుల్ డేటా సెంటర్ వరకూ అదే తీరు. తాజాగా గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను విజన్ యూనిట్లుగా పేరు మార్చి.. వాటిని తానే ప్రారంభించినట్లుగా గొప్పలు చెప్పుకోవడానికి సిద్ధమయ్యారు. ఎన్నికల్లో సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ సహా ఇచ్చిన 143 హామీల అమల్లో ఘోరంగా విఫలమైన చంద్రబాబు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్ అమలు చేసిన పథకాలు, ప్రారంభించిన వ్యవస్థల పేర్లు మార్చి.. వాటిని తానే ప్రారంభించినట్లు గొప్పులు చెప్పుకోవడానికి తహతహలాడుతున్నారంటూ రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలను అందించాలనే లక్ష్యంతో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు 2019 అక్టోబర్ 2న నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిదే. దేశ చరిత్రలో గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు. ఒకే నోటిపికేషన్తో 1.34 లక్షల మంది శాశ్వత ఉద్యోగులను నియమించారు. అంతకు ముందే అంటే 2019 ఆగస్టు 15న వలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఒకేసారి 2.66 లక్షల మంది వలంటీర్లను నియమించారు. గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ ద్వారా నాలుగున్నరేళ్లలో ప్రజల ఇంటి గుమ్మం వద్దకే 12 కోట్ల ప్రభుత్వ సేవలను అందించారు. సచివాలయ వ్యవస్థపై దేశ వ్యాప్త ప్రశంసలుకరోనా మహమ్మారి ప్రబలిన సమయంలో రాష్ట్రంలో ప్రజలకు గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్లు అందించిన సేవలపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. సచివాలయ వ్యవస్థ పనితీరును కేంద్రం, పలు రాష్ట్రాల అధికారుల బృందాలు పరిశీలించాయి. ఈ నేపథ్యంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు.. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను నీరుగార్చడానికి కుట్ర పన్నారు. ఈ క్రమంలోనే విత్తనం నుంచి విక్రయం వరకూ రైతులకు చేదోడువాదోడుగా నిలిచే రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారు. వాటి పేరును రైతు సేవా కేంద్రాలుగా మార్చి దిష్టిబొమ్మల్లా తయారు చేశారు. వలంటీర్లకు గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.పది వేలకు పెంచుతామని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక ఏకంగా వలంటీర్లను తొలగించి వెన్నుపోటు పొడిచారు. గ్రామ, వార్డు సచివాలయాలను అనవసరంగా ఏర్పాటు చేశారని.. వాటిలో నియమించిన ఉద్యోగుల వేతనాల భారం పెరిగి పోయిందని అక్కసు వెళ్లగక్కారు. ఆ తర్వాత మోంథా తుపానును గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా సమర్థవంతంగా ఎదుర్కొన్నామని ప్రశంసిస్తూ.. ఇప్పుడు ఆ వ్యవస్థను తానే ప్రారంభించినట్లుగా గొప్పలు చెప్పుకోవడానికి వాటి పేర్లను విజన్ యూనిట్లుగా మార్చుతామని ప్రకటించారు.‘అమ్మ ఒడి’ విషయంలోనూ అంతే.. » తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించే సమయంలో అది మంత్రి నారా లోకేశ్ ఆలోచన నుంచి పుట్టిందంటూ గొప్పలు పోయారు. వాస్తవానికి వైఎస్ జగన్ అమలు చేసిన అమ్మ ఒడి పథకానికే పేరు మార్చి అమలు చేస్తున్నారని విద్యార్థులు, తల్లితండ్రులే ఎలుగెత్తిచాటారు. » వైఎస్ జగన్ అమలు చేస్తున్న పథకాలను రద్దు చేయం అని, వాటిని అంతకంటే గొప్పుగా అమలు చేస్తామని.. అదనంగా సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పథకాలను కూడా అమలు చేస్తామంటూ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఊదరగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక జగన్ అమలు చేసిన పథకాల పేర్లు మార్చారు. మరి కొన్ని రద్దు చేశారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పథకాలను గాలికొదిలేశారు.» వైఎస్సార్సీపీ ప్రభుత్వ కృషి వల్ల విశాఖపట్నంలో గూగుల్తో కలిసి డేటా సెంటర్ ఏర్పాటుకు అదానీ సంస్థ నడుం బిగించింది. ఇప్పుడు ఆ డేటా సెంటర్ తన వల్లే విశాఖకు వచ్చి ందంటూ సీఎం చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడ్డారు. » వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రారంభించి, ఏడు కాలేజీలను అప్పట్లోనే పూర్తి చేశారు. తరగతులు కూడా ప్రాంభమయ్యాయి. కానీ.. సీఎం చంద్రబాబు మాత్రం ఆ మెడికల్ కాలేజీలను ప్రైవేటువారికి అప్పగిస్తూ అదే తన ఘనతగా చెప్పుకుంటుండటం కొసమెరుపు. -
యువతే లీడర్: వైఎస్ జగన్
ఇది సోషల్ మీడియా యుగం.. ఈ యుగంలో డ్రైవ్ చేసేది యువతే.. యువత చేతుల్లోనే భవిష్యత్ ఉంది.. వారెలా డిసైడ్ చేస్తే, ఆ గవర్నమెంట్ వస్తుంది.. ఆ ప్రభుత్వం.. మీరు సిట్ అంటే సిట్! స్టాండ్ అంటే స్టాండ్! దటీజ్ ద పవర్ ఆఫ్ యంగ్స్టర్స్. గత 18 నెలలుగా అంతా తిరోగమనం. స్కూళ్ల దగ్గరి నుంచి మొదలు పెడితే.. నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం ఆగిపోయాయి. టోఫెల్ క్లాస్లు ఎత్తివేశారు. సబ్జెక్టు టీచర్ కాన్సెప్టు గాలికి ఎగిరిపోయింది. 8వ తరగతి నుంచి పిల్లలకు ట్యాబ్లు ఆపేశారు. గోరుముద్ద కింద నాసిరకం ఆహారం పెడుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన రెండింటికి కలిపి చంద్రబాబు దాదాపు రూ.6,400 కోట్లు బకాయి పెట్టారు. దీంతో పిల్లలు చదువులు మానేస్తున్నారు. సర్టిఫికెట్లు రాని పరిస్థితి. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులు చేస్తున్న పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తోంది. – వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘భావితరానికి మీరే దిక్సూచి.. రాజకీయాల్లో విద్యార్థులు, యువత తులసి మొక్కల్లా ఉన్నతంగా ఎదగాలి..’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. సోషల్ మీడియా యుగంలో డ్రైవ్ చేసేది యువతేనని, వారి చేతుల్లోనే భవిష్యత్ ఉందన్నారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విద్యార్థి విభాగం సమావేశం జరిగింది. విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులతో సమావేశమైన వైఎస్ జగన్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు.. జరుగుతున్న పరిణామాలపై చర్చించి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలోవైఎస్ జగన్ ఏమన్నారంటే.. తులసి మొక్కల్లా ఎదగాలి.. ఒక నాయకుడి గొప్పతనానికి యువత, విద్యార్థి దశ నుంచే బీజం పడుతుంది. మీరంతా జనరేషన్–జీ లో ఉన్నారు. భావి తరానికి దిక్సూచీ కాబోతున్నారు. బహుశా ఒకటి, రెండు టరమ్స్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేస్తారు. మీరు రాజకీయాల్లో తులసి మొక్కల్లా ఎదగాలి. మీరంతా సోషల్ మీడియాను అత్యధికంగా అనుసరించేవారు, దాన్ని నడిపించేవారు, 90 కి.మీ. వేగంతో ప్రయాణించే మనసు ఉన్నవారే! రాజకీయాలు ఎలా ఉండాలంటే.. ఫలానా వ్యక్తి మా నాయకుడు అని కాలర్ ఎగరేసుకుని చెప్పేలా, యువతరం మనవైపు చూసేలా ఉండాలి. మనలో ఆ క్యారెక్టర్, గుణాలు కనిపించినప్పుడే ఆ పరిస్థితులు వస్తాయి. రాష్ట్రంలో ఈరోజు ఏం జరుగుతోందో అందరం చూస్తున్నాం. సరైన విత్తనం వేయకపోతే పరిస్థితి మారదు.. విద్యార్థులు, యువత గట్టిగా అడుగులు ముందుకు వేస్తే.. దేశాలలో ప్రభుత్వాలు కూడా మారిపోతున్నాయి. రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారడం పాత కథ అయితే.. బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో కొత్త ప్రభుత్వాలు వచ్చే కార్యక్రమాలు జరిగాయి. అంత శక్తిసామర్థ్యాలు ఉన్నవారు యువకులు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే.. మన రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి.. ఏం జరుగుతోంది..? అనేది మనమంతా చూడాల్సి ఉంది. రాష్ట్రం బాగుండాలని అంతా ఆరాట పడుతున్నాం కాబట్టి ఇక్కడి రాజకీయ పరిణామాలను గమనించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఒక యువకుడు గొప్పగా ఎదిగి భావి ప్రపంచంతో పోటీ పడి ఉద్యోగాన్ని అవలీలగా సంపాదించుకునే పరిస్థితి ఉందా? మీ మనస్సాక్షినే అడగండి. ఏదైనా రాత్రికి రాత్రే జరగదు. ఒక నాయకుడు ప్రణాళికాబద్ధంగా ఒక అడుగు వేస్తే.. ఆ విత్తనం చెట్టుగా కావడానికి, విజన్ ట్రాన్స్లేట్ కావడానికి కనీసం 10 నుంచి 15 ఏళ్లు పడుతుంది. అదే ఈరోజు సరైన విత్తనం వేయకపోతే ఎన్నేళ్లు గడిచినా పరిస్థితి మారదు. 10, 15 ఏళ్ల తర్వాత కూడా మన బతుకులు మారవు. ఇదే మాదిరిగా ఉంటాం. మనం లీడర్లుగా కాబోతున్నప్పుడు.. అలాంటి మంచి విత్తనాలు వేసే ఆలోచన మన మనసులో మెదలాలి. మనం చేసే పని వల్ల భవిష్యత్ తరాలు మారాలి. మరి విద్యా వ్యవస్థ మన ప్రభుత్వ హయాంలో ఎలా ఉండేది? గత 18 నెలలుగా ఎలాంటి అడుగులు పడుతున్నాయి? అనే తేడాను గమనించాల్సిన అవసరం చాలా ఉంది. సమావేశానికి హాజరైన వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు ప్రసంగిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి మన హయాంలోనే ఆ అడుగులు.. యువకులుగా మన పాత్ర కీలకమన్నది గుర్తు పెట్టుకోవాలి. మనం మార్చకపోతే ఈ వ్యవస్థ మారదు. మనం మార్చడానికి అడుగులు ముందుకు వేస్తేనే ఈ వ్యవస్థ మారుతుంది. మనం చూసీచూడనట్లు వదిలేశామంటే ఈ వ్యవస్థ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. ఆ దిశగా మొట్టమొదటి సారిగా అడుగులు పడింది మన హయాంలోనే అని గర్వంగా చెప్పగలను. విద్యార్థుల భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దేలా విద్యా రంగంలో మనం చాలా మార్పులు చేశాం. కేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేదాకా ఆ పిల్లాడికి ఎలాంటి చదువులు ఉండాలి? వారు భావితరంతో పోటీపడి నిలబడటమే కాకుండా విజయం సాధించాలనే ఆలోచన చేసింది ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాత్రమే. ఆ ఆలోచన చేయగలిగిన వాడే.. లీడర్ విద్యార్థులకు ఓటుహక్కు ఉండదు కాబట్టి ఏ రాజకీయ నాయకుడూ వారి గురించి ఆలోచన చేయడు. కానీ వారే రేప్పొద్దున భవిష్యత్తు అని ఆలోచన చేయగలిన వారు మాత్రమే రాజకీయ నాయకుడు కాదు.. లీడర్ అవుతారు. అలాంటి అడుగులు పడింది వైఎస్సార్సీపీ హయాంలోనే అని గొప్పగా చెప్పగలుగుతా. మొట్టమొదట అడుగులు.. ఇంగ్లిష్ మీడియం వైపు పడ్డాయి. ఎవరైనా నారాయణ.. శ్రీచైతన్య.. వంటి ప్రైవేట్ స్కూళ్లకు ఎందుకు వెళ్లాలి? మన గవర్నమెంట్ స్కూళ్లు ఎందుకు అలా లేవు? అవి ప్రైవేట్ స్కూళ్లతో పోటీపడే పరిస్థితి ఎందుకు లేదు? ప్రైవేట్ స్కూళ్లే.. గవర్నమెంట్ స్కూళ్లతో పోటీపడే పరిస్థితిని తీసుకొచ్చినప్పుడు పేదవాడి జీవితం బాగు పడుతుందని భావించి మొట్టమొదటి విత్తనం అక్కడ నుంచి పడింది. అందులో భాగంగా వేగంగా అడుగులు వేస్తూ గవర్నమెంట్ స్కూళ్లలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. తొలిసారిగా గవర్నమెంట్ స్కూళ్లలో తప్పనిసరి ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చాం. ఇంగ్లిష్ మీడియం స్కూళ్లుగా మార్చాం. 3వ తరగతి నుంచే ఒక పీరియడ్గా టోఫెల్, సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. ప్రతి పిల్లవాడి చేతికి పుస్తకాలతోపాటు తెలుగు–ఇంగ్లిష్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కూడా ఇచ్చాం. 8వ తరగతి నుంచి ప్రతి పిల్లాడి చేతిలో ట్యాబులు పెట్టి ప్రైవేట్ స్కూళ్ల కంటే గొప్పగా అడుగులు వేయించాం. ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈనే కాదు.. ఏకంగా ఐబీని కూడా తీసుకొచ్చి మన గవర్నమెంట్ స్కూళ్లలో పిల్లలకు పరిచయం చేశాం. జెనీవా నుంచి ఐబీ టీమ్ వచ్చి మన ప్రభుత్వంతో కలసి పని చేసింది. 2025లో ఫస్ట్ క్లాస్.. 2026లో సెకండ్ క్లాస్.. 2027లో థర్డ్ క్లాస్.. ఇలా 2035 నాటికి మన పిల్లలు టెన్త్ క్లాస్ పరీక్షలు ఐబీలో రాసే విధంగా జెనీవా నుంచి వచ్చిన ఐబీ బృందం మన ప్రభుత్వంతో కలసి పని చేసింది. ఎందుకివన్నీ జరిగాయంటే.. ఆ స్థాయి విద్యను మన పిల్లలకు ఇవ్వగలిగితే ఆంధ్రా కాదు.. ప్రపంచంతోనే పోటీ పడగలుగుతారు. ప్రపంచంతోనే పోటీ పడుతున్నప్పుడు.. మన పిల్లల చదువులు అక్కడి నుంచి మొదలవుతున్నాయా? లేదా? అనేది అత్యంత ముఖ్యమైన విషయం. అందుకే విద్యా వ్యవస్థను మార్చుకుంటూ వచ్చాం. ఉన్నత విద్యలో విప్లవం.. ప్రభుత్వ స్కూళ్లలో నాడు–నేడుతో శ్రీకారం చుట్టి.. అమ్మ ఒడితో పిల్లలను బడికి పంపేలా తల్లులను ప్రోత్సహించాం. 75 శాతం హాజరు తప్పనిసరి చేశాం. గోరుముద్ద ద్వారా రోజుకో మెనూతో పిల్లలకు నాణ్యమైన, రుచికరమైన పౌష్టికాహారాన్ని అందించాం. ఈ మార్పులను ఉన్నత విద్య వరకు తీసుకెళ్లాం. తొలిసారిగా ఉన్నత విద్యలో జాబ్ ఓరియెంటెడ్ కరికులమ్ తీసుకొచ్చింది వైఎస్సార్సీపీ హయాంలోనే. మన చదువుల్లో లేనిది ఏమిటి? బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నది ఏమిటి? అని మొట్టమొదటిసారిగా బేరీజు వేశాం. అక్కడున్న కోర్సులు ఇక్కడ ఎందుకు లేవు? డిగ్రీ అనేది ఇక్కడ నామ్కేవాస్తే చదువుగా ఎందుకు ఉంది? అక్కడి డిగ్రీకి విలువ ఎందుకు ఉంది? అనే విషయంపై అసెస్ చేసి ఎడెక్స్ను తీసుకొచ్చాం. ప్రముఖ ‘ఐవీ లీగ్’ కాలేజీలు, స్టాన్ఫర్డ్, ఎంఐటీ లాంటి పెద్ద యూనివర్సీటీల డిగ్రీలను మన కోర్సులో భాగం చేస్తూ.. సర్టిఫికెట్లు కూడా వారి దగ్గరి నుంచే వచ్చే విధంగా.. క్రెడిట్లు కూడా వారే ఇచ్చేలా భాగస్వాములను చేస్తూ ఎడెక్స్ ద్వారా మన డిగ్రీలను ఆన్లైన్ కరికులమ్లో భాగం చేశాం. డిగ్రీలో నాణ్యతను పెంపొందిస్తూ తొలిసారి తప్పనిసరి అప్రెంటిస్ విధానం తీసుకొచ్చాం. విద్యాదీవెన, వసతి దీవెనకు రూ.16,800 కోట్లు ఇచ్చాం.. కాలేజీల్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ను మెరుగుపరుస్తూ ‘నాక్’ (నేషనల్ ఎస్సెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్) రిజి్రస్టేషన్ చేయించాం. మనం అధికారంలోకి రాకముందు 2019 నాటికి కేవలం 257 కాలేజీలకు నాక్ రిజి్రస్టేషన్ ఉంటే 2024 ఫిబ్రవరి నాటికి వాటి సంఖ్య 437కి తీసుకెళ్లాం. అంతేకాకుండా పిల్లల చదువుల కోసం ఏ తల్లిదండ్రులూ ఇబ్బంది పడకూడదని, అప్పులపాలు కాకూడదని తాపత్రయపడుతూ మొట్టమొదటిసారిగా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విద్యాదీవెన పథకాన్ని తీసుకొచ్చాం. ఆ ఒక్క పథకం కిందనే రూ.12,609 కోట్లు ఖర్చు చేశాం. ప్రతి త్రైమాసికం అయిపోగానే దానికి సంబంధించిన ఫీజులు క్రమం తప్పకుండా పిల్లల తల్లుల ఖాతాల్లో వేశాం. హాస్టల్ ఖర్చుల కింద వసతి దీవెన ద్వారా క్రమం తప్పకుండా ఇచ్చాం. డిగ్రీ పిల్లలకు ఏటా రూ.20 వేలు రెండు విడతల్లో ఇచ్చాం. ఏటా రూ.1,100 కోట్లు ఏప్రిల్లో ఇచ్చేలా అడుగులు పడ్డాయి. ఒక్క వసతి దీవెన కింద మొత్తం రూ.4,275 కోట్లు ఇచ్చాం. ఇలా పిల్లలు గొప్ప చదువులు చదవాలని భావిస్తూ ఉన్నత విద్యా రంగంలో విద్యాదీవెన, వసతి దీవెన కింద రెండు పథకాల కోసం ఏకంగా రూ.16,800 కోట్లు ఖర్చు చేసింది ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. దీనివల్ల పేద, మధ్య విద్యార్థులు ఎవరూ ఫీజులు కట్టలేక చదువులు మానేయాల్సిన పరిస్థితులు రాకుండా అడుగులు పడ్డాయి. 12న నియోజకవర్గాల్లో ర్యాలీలను విజయవంతం చేయాలిచంద్రబాబు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మెడికల్ కాలేజీలను కాపాడుకునేందుకు పార్టీ కార్యాచరణ చేపట్టింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ఉద్యమంలా సాగుతోంది. ప్రతి గ్రామంలో రచ్చబండ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరు అన్నింటిలో ఇన్వాల్వ్ కావాలి. తటస్థులను కూడా కూడగట్టి నడవాలి. ఈనెల 12న నియోజకవర్గాల్లో ర్యాలీలను విజయవంతం చేయాలి. సీఎం చంద్రబాబు షాక్ తిని ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే స్థాయిలో నిర్వహించాలి. డిసెంబరులో ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఆందోళన చేపట్టి చంద్రబాబు ప్రభుత్వం మెడలు వంచుదాం. పార్టీ పరంగా అన్ని కమిటీల నిర్మాణం జరుగుతోంది. గ్రామస్థాయిలో కమిటీలు ఏర్పాటు అవుతున్నాయి. గ్రామస్థాయిలో విద్యార్థి, యువజన అనుబంధ విభాగం కూడా రావాలి. చైతన్యం అక్కణ్నుంచే మొదలు కావాలి. 18 నెలలుగా అంతా తిరోగమనం..ఈ రోజు ఏం జరుగుతోంది? గత 18 నెలలుగా అంతా తిరోగమనం. స్కూళ్ల దగ్గరి నుంచి మొదలు పెడితే.. నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం ఆగిపోయింది. టోఫెల్ క్లాస్లు ఎత్తివేశారు. సబ్జెక్టు టీచర్ కాన్సెప్టు గాలికి ఎగిరిపోయింది. 8వ తరగతి నుంచి పిల్లలకు ట్యాబ్లు ఆపేశారు. గోరుముద్ద కింద నాసిరకం ఆహారం పెడుతున్నారు. ఉన్నత విద్యా రంగం పరిస్థితి చూస్తే.. పిల్లలు బాగా చదివితే వాళ్లెక్కడ గొప్పవారు అవుతారనే బాధ చంద్రబాబులో ఎక్కువగా కనిపిస్తోంది. ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి సెపె్టంబరు చివరి వరకు ఏడు త్రైమాసికాల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలే! గత ఏడాది జనవరి నుంచి మార్చి వరకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ ఏప్రిల్లో వెరిఫై చేసి మే నెలలో డబ్బులు ఇవ్వాల్సి ఉంటే చంద్రబాబు ఎన్నికల సంఘానికి లేఖ రాసి దాన్ని ఆపించాడు. ఎన్నికల తరువాతైనా చంద్రబాబు ఇవ్వాలి కదా? అక్కడి నుంచి ఫీజులకు బ్రేక్ పడింది. ఇప్పటికి ఏడు త్రైమాసికాలు. డిసెంబరుతో మరో త్రైమాసికం జోడవుతుంది. ఒక్కో త్రైమాసికానికి రూ.650 కోట్ల నుంచి రూ.700 కోట్లు. ఏకంగా దాదాపు రూ.4,900 కోట్లు పెండింగ్లో ఉంటే ఈ ప్రభుత్వం ఇచ్చింది కేవలం రూ.700 కోట్లు మాత్రమే. అంటే రూ.4,200 కోట్లు బకాయి పెట్టారు. ఈ డిసెంబరు వస్తే మరో రూ.700 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. వసతి దీవెన కింద ఏటా రూ.1,100 కోట్లు ఇవ్వాలి. రెండేళ్లలో రూ.2,200 కోట్లు బకాయి పెట్టారు. రెండింటికి కలిపి చంద్రబాబు దాదాపు రూ.6,400 కోట్లు బకాయి పెట్టారు. దీంతో పిల్లలు చదువులు మానేస్తున్నారు. సర్టిఫికెట్లు రాని పరిస్థితి. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులు చేస్తున్న పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకు తోడుగా వైఎస్సార్సీపీ నాయకత్వం తీసుకోకపోతే చదువులు మానేస్తారు. ఒక చిన్న ఉదాహరణ చెబుతా.. జీఈఆర్ (గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో) అంటే . మీ అందరికీ తెలుసు. ఇంటర్ తర్వాత ఉన్నత విద్యలో ఎంతమంది చేరుతున్నారని చూస్తే.. మన ప్రభుత్వం రాక ముందు 2018–19లో జీఈఆర్ 27.86 శాతం ఉంటే, మన ప్రభుత్వం వచ్చాక 2023–24 నాటికి జీఈఆర్ 37 శాతానికి పెరిగింది. అది ఇప్పుడు మళ్లీ రివర్స్ అయింది. ఫీజులు కట్టలేక పిల్లలు వెనక్కి తగ్గుతున్నారు. చదువులు ఇంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి. మరోవైపు ఉద్యోగాలు, పిల్లల భవిష్యత్ చూస్తే ఆందోళనకరం. స్వయం ఉపాధికి ప్రోత్సాహం..నిజంగా మెరుగైన ఉద్యోగాలు సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్లో (స్వయం ఉపాధి రంగం) వస్తాయి. అది ఒక విప్లవం. ఆ దిశగానే ఆసరా, సున్నా వడ్డీకే రుణాలు, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం అమలు చేశాం. అక్కచెల్లెమ్మలు తమ కాళ్ల మీద నిలబడేలా ఐటీసీ, పీ అండ్ జీ, రిలయన్స్, అమూల్ లాంటి సంస్థలతో టై అప్ చేశాం. చేయూత ద్వారా దాదాపు 26 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు.. ఆసరా, సున్నా వడ్డీ ద్వారా దాదాపు కోటి మందికిపైగా మేలు జరిగింది. నేతన్న నేస్తం, వాహనమిత్ర, తోడు, చేదోడు ద్వారా లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. వ్యవసాయం దండగ కాదు.. పండగరాష్ట్రంలో దాదాపు 62 శాతం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. చంద్రబాబు నోటి నుంచి వ్యవసాయం దండగ అనే మాటలు వస్తే.. మేం పండగ అని చేసి చూపాం. విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్న ప్రతి అడుగులో చేయి పట్టుకుని నడిపించాం. రైతులకు ఏ విపత్తు, ఆపద వచ్చినా వెంటనే ఆదుకున్నాం. గతంలో రాష్ట్రంలో 6 పోర్టులు మాత్రమే ఉంటే, కోవిడ్ ఉన్నప్పటికీ మన హయాంలో మరో 4 కొత్త పోర్టులకు శ్రీకారం చుట్టాం. అందులో మూడు ప్రభుత్వ రంగంలోనివే. మూలపేట, రామాయపట్నం, మచిలీపట్నం పోర్టుల పనులు చాలా వేగంగా జరిగాయి. సగానికి పైగా పనులు పూర్తయ్యాయి. ఒక్క కాకినాడ పోర్టు మాత్రం ప్రైవేటు రంగంలో అభివృద్ధి జరుగుతోంది. ఇంకా 10 ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల పనులు చురుగ్గా కొనసాగాయి. నాడే అదానీ డేటా సెంటర్..మన హయాంలోనే అదానీ డేటా సెంటర్ ప్రాసెస్ జరిగింది. అసలు డేటా రావాలంటే కేబుల్ కావాలి కదా? సింగపూర్ నుంచి సముద్రంలో కేబుల్ ఏర్పాటు ప్రక్రియకు నాడే శ్రీకారం చుట్టడం జరిగింది. సింగపూర్ ప్రభుత్వానికి వైఎస్సార్సీపీ హయాంలోనే లేఖ కూడా రాశాం. అవన్నీ జరిగాయి, మనం చేశాం కాబట్టే ఇప్పుడు డేటా సెంటర్ వస్తోంది. విశాఖ అభివృద్ధికి అడుగులు వేశాం కాబట్టే గూగుల్ వస్తోంది. భోగాపురం ఎయిర్పోర్టు భూసేకరణ చేసి, వేగంగా అన్ని అనుమతులు పొంది, పనులు కూడా చేశాం. అందుకోసం దాదాపు రూ.900 కోట్లు ఖర్చు చేశాం. అవన్నీ మనం చేశాం కాబట్టి పురోగతి కనిపిస్తోంది. అలా మంచి విత్తనాలు నాటాం. విత్తనం వేయకపోతే చెట్టు ఎక్కడి నుంచి వస్తుంది? మేం ఎన్ని ఉద్యోగాలిచ్చామో మీ లెక్కలే చెబుతున్నాయి..వైఎస్సార్సీపీ హయాంలో ఒక్క ప్రభుత్వ రంగంలోనే దాదాపు 6.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. ప్రభుత్వ రంగంలో శాశ్వత ఉద్యోగాలు 2,13,662 ఇచ్చాం. గ్రామ, వార్డు సచివాలయాల్లో మన కళ్లెదుటే కనిపిస్తారు. వాటిలో దాదాపు 1.26 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశాం. వైద్య ఆరోగ్య రంగంలో జీరో వేకెన్సీ పాలసీ తీసుకొచ్చాం. ఆస్పత్రుల్లో స్పెషలిస్టుల కొరత లేకుండా చేశాం. దేశంలో 61 శాతం స్పెషలిస్టు వైద్య నిపుణుల కొరత ఉంటే, మన హయాంలో ఏపీలో అది కేవలం 4 శాతం మాత్రమే ఉంది. అలా 17 వేల మందిని నియమించాం. పాఠశాల విద్యలో 10,300 పోస్టులు భర్తీ చేశాం. టీచర్ పోస్టులు ఇచ్చాం. డీఎస్సీ సమస్యలన్నీ పరిష్కరించి ఉద్యోగాలు ఇచ్చాం. ఇవి కాకుండా 2.66 లక్షల మంది వలంటీర్లు. ఆప్కాస్లో మరో లక్ష మంది, 18 వేల మంది బెవరేజెస్ కార్పొరేషన్లో, రేషన్ డోర్ డెలివరీ వాహనాల్లో 20 వేల ఉద్యోగాలు కల్పించాం. ఇవి కాకుండా ఎంఎస్ఎంఈలు 4.78 లక్షల యూనిట్లు గ్రౌండ్ చేయడం ద్వారా దాదాపు 33 లక్షల ఉద్యోగాలను సృష్టించగలిగాం. మన హయాంలో వాటికి క్రమం తప్పకుండా రాయితీలు ఇచ్చి భరోసా కల్పించి నిలబెట్టాం. ఉద్యోగ, ఉపాధి కల్పనలో ఎంఎస్ఎంఈలది చాలా కీలక పాత్ర. వీటిలో పెట్టుబడి తక్కువే అయినా ఉద్యోగాలు ఎక్కువ. అదే పెద్ద పెద్ద కంపెనీల్లో పెట్టుబడి ఎక్కువ.. ఉద్యోగాలు తక్కువ. ఇంకా లార్జ్ అండ్ మెగా రంగంలో మరో లక్ష ఉద్యోగాల కల్పన. అన్నీ కలిపితే.. 40,13,552 ఉద్యోగాలు ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సృష్టించగలిగాం. ఇవి మనం చెప్పే లెక్కలు కాదు. వాళ్లు తయారు చేసుకున్న సామాజిక సర్వే నివేదికలో చూపించిన లెక్కలే ఇవన్నీ! మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దారుణం..చంద్రబాబు చేస్తున్న మరో దారుణమైన పని.. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ. ఆయన మంచి చేయకపోగా చెడు చేస్తున్నారు. స్కూళ్లు, ఆస్పత్రులు, ఆర్టీసీ బస్సులను గవర్నమెంట్ ఎందుకు నడుపుతుందో ఆలోచన చేశారా? ప్రభుత్వం వాటిని నిర్వహించకుంటే ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పేదలు దోపిడీకి గురవుతారు. దీనికి చెక్ పడాలంటే ప్రభుత్వమే వాటిని నిర్వహించాలి. 1923 నుంచి 2019 వరకు రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలోని మెడికల్ కాలేజీలు కేవలం 12 మాత్రమే. వాటిలో ఒక్కటి కూడా చంద్రబాబు కట్టలేదు. మన ప్రభుత్వ హయాంలో కోవిడ్ ఉన్నప్పటికీ, ఏకంగా 17 మెడికల్ కాలేజీల పనులు మొదలుపెట్టాం. ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి చేశాం. ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటైతే స్థానికంగా సూపర్ స్పెషాలిటీ సేవలు టీచింగ్ ఆస్పత్రి మాదిరిగా అందుబాటులోకి వస్తుంది. ఆ స్థాయిలో వైద్య సేవలందుతాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు, స్టూడెంట్లు, మెడికోస్, నర్సింగ్ విద్యార్థులు వీరంతా అక్కడే పని చేస్తారు. పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం చేరువలో అందుబాటులోకి వస్తుంది. ఎప్పుడైతే అవన్నీ అందుబాటులోకి వస్తాయో ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ ఆగిపోతుంది. 50 కి.మీ. లోపే పేదలకు అత్యాధునిక వైద్యం ఉచితంగా అందుతున్నప్పుడు ప్రైవేట్ ఆస్పత్రులకు రూ.లక్షలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. పేదలకు, మధ్య తరగతికి ఒకవైపు మంచి చేస్తూ మరోవైపు ఆ 17 మెడికల్ కాలేజీల ద్వారా 2,550 మెడికల్ సీట్లు అదనంగా అందుబాటులోకి వస్తాయి. సగం సీట్లు ఫ్రీగా పిల్లలకు దక్కుతాయి. మిగిలిన సీట్లు కూడా ప్రైవేటు మెడికల్ కాలేజీల కంటే తక్కువ ఫీజుకే అందుబాటులోకి వస్తాయి. మన పిల్లలు ఇక్కడే డాక్టర్లుగా మారి మన ప్రాంతంలోనే సేవలు కూడా అందిస్తారు. మనం చేపట్టిన మెడికల్ కాలేజీల్లో మన హయాంలోనే 7 కాలేజీలు పూర్తయ్యాయి. 5 కాలేజీల్లో తరగతులు కూడా మొదలై మూడు బ్యాచ్లు జరిగాయి. పాడేరు మెడికల్ కాలేజీలో గత ఏడాది క్లాస్లు ప్రారంభమయ్యాయి. గత ఏడాది పులివెందుల మెడికల్ కాలేజీకి 50 సీట్లు ఇస్తామంటే వద్దని అడ్డుపడి చంద్రబాబు లేఖ రాశారు. కొత్త మెడికల్ కాలేజీల కోసం రూ.3,000 కోట్లు ఖర్చు చేశాం. మిగిలిన 10 కాలేజీలకు మరో రూ.5 వేల కోట్లు అవసరం. అది కూడా ఐదేళ్లలో ఖర్చు చేస్తే చాలు. అంటే ఏటా రూ.1,000 కోట్లు మాత్రమే వెచ్చించాలి. కానీ ఆ మనిíÙకి మనసు రాదు.. అది కూడా ఖర్చు చేయకుండా ఏకంగా వాటిని అమ్మేస్తున్నాడు. రాష్ట్ర బడ్జెట్ చూస్తే రూ.2.50 లక్షల కోట్లు. మెడికల్ కాలేజీలకు కావాల్సింది ఏటా కేవలం రూ.1000 కోట్లు. ఆయన పెట్టపోతే పోయే..! మేం వచ్చిన తరువాత చేసుకుంటాం. కానీ ఇలా స్కామ్లు చేస్తూ అమ్మడం ఏమిటి? ఈ స్థాయికి దిగజారిపోయిన వ్యక్తిని నిలదీయడం యువత నుంచే మొదలు కావాలి!! ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎ.రవిచంద్ర, తోట రాంజీ, శ్రీవాత్సవ, చెవిరెడ్డి హర్షిత్, ప్రణయ్రెడ్డి, వైస్ ప్రెసిడెంట్స్ ఓబుల్రెడ్డి, నీలి ఆనంద్, నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏపీలో గ్రామ సచివాలయాల పేరు మార్పు
సాక్షి, విజయవాడ: గ్రామ సచివాలయాల పేరు మార్పుకు చంద్రబాబు సర్కార్ సిద్ధమవుతోంది. క్రెడిట్ చోరీ కోసం ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైఎస్ జగన్ ఆవిష్కరించిన వ్యవస్థ పేరు మార్చాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంత్రులు, అధికారుల సమీక్షలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. విజన్ యూనిట్గా మారుస్తున్నట్టు చంద్రబాబు వెల్లడించారు.వైఎస్ జగన్ విజన్ని తన విజన్గా పేరు మార్పు చేయడానికి చంద్రబాబు నిర్ణయించారు. గ్రామ సచివాలయాలతో ప్రజల వద్దకు పాలన తెచ్చిన వైఎస్ జగన్.. దేశంలో ఎక్కడాలేని అద్భుత వ్యవస్థను తీసుకువచ్చారు. పారదర్శకమైన పాలన అందించేందుకు సచివాలయ వ్యవస్థను తెచ్చారు.లక్షా 30 వేల శాశ్వత ఉద్యోగులను వైఎస్ జగన్ నియమించారు. సచివాలయ వ్యవస్థతో ప్రజల్లో వైఎస్ జగన్ చెరగని ముద్ర వేశారు. వైఎస్ జగన్ తెచ్చిన వ్యవస్థకి చంద్రబాబు.. పేరు మార్పుకు నిర్ణయించారు. వైఎస్ జగన్ క్రెడిట్ని చోరీ కోసం సీఎం చంద్రబాబు తంటాలు పడుతున్నారు.ఇదీ చదవండి: చంద్రబాబు మంచి చేయకపోగా.. చెడు చేస్తున్నారు: వైఎస్ జగన్ -
YSRCP విద్యార్ధి విభాగం లీడర్లతో వైఎస్ జగన్ సమావేశం
-
చంద్రబాబు మంచి చేయకపోగా.. చెడు చేస్తున్నారు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: గూగుల్ విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీ చేశాడని ఆరోపించారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. మెడికల్ కాలేజీల విషయంలో చంద్రబాబు మంచి చేయకపోగా.. చెడు చేస్తున్నారని అన్నారు. అలాగే, సమాజంలో విద్యార్థుల పాత్ర అత్యంత కీలకమని గుర్తు చేశారు. రాజకీయాల్లో తులసి మొక్కల్లా ఎదగాలని సూచించారు.వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గురువారం పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలపై వైఎస్ జగన్ చర్చించారు. అనంతరం వారితో వైఎస్ జగన్ మాట్లాడుతూ..‘కల్మషం లేని రాజకీయ వ్యవస్థ మీ దగ్గర నుంచే ప్రారంభం అవుతుంది. మంచి రాజకీయాలకు బీజం విద్యార్థి దశలోనే పడుతుంది. మీరంతా జెన్ -Z తరంలో ఉన్నారు. భావి తరానికి మీరంతా దిక్సూచీ. రాజకీయాల్లో తులసి మొక్కల్లా ఎదగాలి. పలానా వాడు మన రాజకీయ నాయకుడు అని కాలర్ ఎగరేసేకునేలా మనం ఉండాలి. మనలో ఆ గుణాలను, వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలి. ఈ రాష్ట్రం మనది కాబట్టి.. ఈ రాష్ట్రం బాగుండాలని మనమంతా కోరుకుంటున్నాం. ఉద్యోగాలు సంపాదించుకునే పరిస్థితిలోకి ప్రతి విద్యార్థీ వెళ్లాల్సిన అవసరం ఉంది.కాని, ఆ పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా?.ప్రపంచంతో పోటీ పడాలి.. ఒక్క రాత్రిలోనే ఇవన్నీ జరగవు. ప్రణాళికాబద్ధంగా అడుగులు వేయాలి. ఒక నాయకుడు తన విజన్లో భాగంగా ఒక అడుగు వేస్తే, అవి ఫలితాలు ఇవ్వడానికి 10-15 సంవత్సరాలు పడుతుంది. అలాంటి ఆలోచనలు మనం చేయాలి. అది రియాల్టీలోకి వచ్చినప్పుడు భవిష్యత్తు తరాలు మారుతాయి. సమాజంలో విద్యార్థులుగా మీ పాత్ర అత్యంత కీలకం. మన ప్రభుత్వ హయాంలో విద్యావ్యవస్థలో గొప్ప మార్పులు తీసుకు వచ్చాం.కేజీ నుంచి పీజీ వరకూ మంచి చదువులు ఉండాలని భావించాం. పోటీ ప్రపంచంలో విజయాలు సాధించేలా మన ప్రభుత్వంలో ఆలోచనలు చేశాం.స్కూలుకు వెళ్లే పిల్లలకు ఓట్లు లేవని, ఏ రాజకీయ పార్టీ కూడా వారి గురించి పట్టించుకోదు. కాని, రేపు భవిష్యత్తును నిర్దేశించేది వాళ్లే. అందుకని స్కూళ్ల నుంచే మనం విప్లవాత్మక చర్యలు తీసుకు వచ్చాం. ప్రైవేటు స్కూల్స్తో పోటీపడేలా ప్రభుత్వ స్కూల్లను తీర్చిదిద్దాం. సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకూ ప్రయాణం ప్రారంభించాం. ఆ స్థాయి విద్యను మన పిల్లలకు మనం ఇవ్వాలి.6,200 కోట్లు బకాయిలు.. మనకు పోటీ ఇతర రాష్ట్రాలతో కాదు, మన పోటీ ప్రపంచంతోనే. ఎడెక్స్తో ఉచితంగా ఆన్లైన్ కోర్సులు ఇప్పించాం. ప్రపంచంలో అత్యుత్తమ యూనివర్శిటీలకు చెందిన కోర్సులు అందుబాటులోకి ఇచ్చాం. ఆయా యూనివర్శిటీలు సర్టిఫికెట్లు ఇచ్చేలా చేశాం. డిగ్రీల్లో కొత్త కోర్సులు తీసుకు వచ్చాం. మనం రాక ముందు 257 కాలేజీలకు మాత్రమే నాక్ రిజిస్ట్రేషన్ ఉంటే 2024 నాటికి 432కి పెరిగాయి. పూర్తి ఫీజు రియింబర్స్మెంట్ తీసుకు వచ్చాంది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. కేవలం విద్యాదీవెన అనే ఒకే ఒక పథకం కింద రూ.12,609 కోట్లు ఇచ్చాం. వసతి దీవెన కింద ప్రతి విద్యార్థికీ ఏడాదికి రూ.20వేలు ఇచ్చాం. చదువుల కోసం అప్పులు పాలు కాకుండా చూశాం. కాని, ఇవాళ అన్నింటినీ ధ్వంసం చేస్తున్నారు. పిల్లలు చదవకూడదు అనే ఉద్దేశంతో చంద్రబాబు పనిచేస్తున్నారు. ఏడు త్రైమాసికాల నుంచి ఫీజు రియింబర్స్మెంట్ పెండింగ్లో పెట్టారు. ఫీజు రియిబంర్స్మెంట్లో రూ.4,200 కోట్లు పెండింగ్ ఉంది. వసతి దీవెన కింద రూ.2,200 కోట్లు పెండింగ్. మొత్తంగా రూ.6,200 కోట్లు బకాయి పెట్టారు. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాయకత్వం తీసుకోవాలి.1.2 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం.. మన ప్రభుత్వ హయాంలో అక్షరాల ప్రభుత్వ రంగంలోనే 6.3 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగాం. గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.2 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. 52 వేల మందిని ఆర్టీసీలో రెగ్యులరైజ్ చేశాం. హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్లో కూడా భారీగా ఉద్యోగాలు ఇచ్చాం. ఇప్పుడు ఉద్యోగాలను కోత కోస్తున్నారు. ఎంఎస్ఎంఈ సెక్టార్లో 4.7లక్షల యూనిట్ల ద్వారా 33లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం తోడుగా ఉందనే భావన ఎంఎస్ఎంఈలకు ఉండేది. క్రమం తప్పకుండా వారికి ప్రోత్సాహకాలు అందేవి. అందుకనే పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వచ్చాయి.చంద్రబాబు చేసిందేంటి?. గూగుల్ విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీ చేశాడు. అసలు చంద్రబాబు చేసింది ఏముంది?. సింగపూర్ నుంచి కేబుల్ తీసుకురావడానికి అంకురార్పణ చేసింది వైఎస్సార్సీపీ. అదానీ-గూగుల్కు 2022లో నోయిడా డేటా సెంటర్ అగ్రిమెంట్ ఉంది. మనం ఇక్కడ కూడా భూములు ఇచ్చాం, అన్ని ఏర్పాట్లూ జరిగాయి. ఆరోజు అడుగులు వేశాం కాబట్టి ఇప్పుడు గూగుల్ వస్తోంది. మూలపేట ప్రారంభించి మనం కట్టుకుంటూ వెళ్లాం కాబట్టి ఇప్పుడు మూలపేట పోర్టు జరుగుతోంది. భోగాపురం ఎయిర్పోర్టుకు అన్ని అనుమతులు తీసుకొచ్చి మనం శరవేగంగా నిర్మాణాలు చేశాం.మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చంద్రబాబు చేస్తున్న అత్యంత దరిద్రపు పని. మంచి చేయకపోగా, చెడు చేస్తున్నాడు. 2019 వరకూ ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 12. అప్పటికి చంద్రబాబు ఒక్కటి కూడా తేలేదు. ఐదేళ్లలో కోవిడ్ రెండేళ్లు తీసేస్తే, మూడేళ్లలో 17 మెడికల్ కాలేజీలు తీసుకు వచ్చాం. ప్రతి జిల్లాకో గవర్నమెంటు మెడికల్ కాలేజీ తీసుకు వచ్చాం. 17 కొత్త మెడికల్ కాలేజీల వల్ల 2,550 సీట్లు అందుబాటులోకి వస్తాయి. సగం సీట్లు ఉచితం, మిగిలిన సీట్లు తక్కువ రేటుకే అందుబాటులోకి వస్తాయి. మన పిల్లలు ఇక్కడే డాక్టర్లు అయ్యే అవకాశం ఉంటుంది. మెడికల్ కాలేజీలు సీట్లు ప్రారంభం అయ్యాయి. పాడేరు కూడా ఎన్నికల తర్వాత ప్రారంభం అయ్యింది. 800 సీట్లు అందుబాటులోకి వచ్చాయి.సీట్లు వద్దని లేఖ రాసిన వ్యక్తి చంద్రబాబు.. పులివెందుల కాలేజీకి 50 సీట్లు కేంద్రం ఇస్తే.. వద్దంటూ చంద్రబాబు లెటర్ రాశాడు. మిగిలిన 10 కాలేజీలకు రూ.5వేల కోట్లు పెడితే చాలు. ఏడాదికి రూ.వేయి కోట్లు పెట్టినా చాలు. కాని, చంద్రబాబుకు మనసు రాదు. ఆయన పెట్టకపోయినా పర్వాలేదు, అలా వదిలేస్తే మేం వచ్చాక కట్టుకుంటాం. స్కాములు చేస్తూ అమ్మేస్తున్నాడు. ఇలాంటి వాటిపై ప్రశ్నలు వేసి, నిలదీసే బాధ్యత మీది. రాష్ట్రంలో కోటి సంతకాల కార్యక్రమం జరుగుతోంది. మీరంతా చురుగ్గా పాల్గొనాలి. గ్రామస్థాయిలో కూడా విద్యార్థి విభాగం, యూత్ విభాగం రావాలి. మీ చేతుల్లోనే భవిష్యత్తు ఉంది. మీరు ఎవర్ని డిసైడ్ చేస్తే.. ఆ ప్రభుత్వం వస్తుంది. విద్యార్థి, యువకులకు ఉన్న శక్తి అది. తటస్థులను, భావసారూప్యత ఉన్న వ్యక్తులను కూడా కలుపుకోవాలి. అసెంబ్లీ కేంద్రాల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీలు 11 నుంచి 12వ తేదీకి మార్పు జరిగింది. డిసెంబర్లో ఫీజు రియింబర్స్మెంట్పై ఆందోళనలు ఉంటాయి. అంతవరకూ చంద్రబాబుకు సమయం ఇద్దాం అని సూచించారు. -
ఆదినారాయణ రెడ్డికి రాచమల్లు దిమ్మతిరిగే కౌంటర్
-
‘2027లో వైఎస్ జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర’
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించబడిందని పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు. ప్రజా సంకల్ప పాదయాత్ర మొదలు పెట్టి ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కార్యాలయ ఇన్చార్జి లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైఎస్ జగన్ 341 రోజులపాటు 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి.. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాలగుండా 134 నియోజకవర్గాల్లో అన్నివర్గాలకు చెందిన లక్షలాది మందిని పలకరించారని చెప్పారు. పాదయాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో తనకు ఎదురైన అనుభవాలను, ప్రజల ఆకాంక్షలను వివరిస్తూ వాటికి తాను ఏం చేయబోతున్నానో వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు వివరించడమే కాకుండా అధికారంలోకి రావడంతోనే ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి ప్రజా పాలన అంటే ఇలా ఉండాలి అనే విధంగా ట్రెండ్ సెట్ చేశారని పార్టీ నాయకులు తెలియజేశారు.సమాజంలో ఉన్న ఆర్థిక, సామాజిక అసనమానతలు తొలగించేలా నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందించడమే మార్గంగా భావించి ఆ రంగాల్లో వినూత్న మార్పులు తీసుకొస్తే.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వాటిని పూర్తిగా సర్వనాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దురహంకార, ప్రజా వ్యతిరేక అవినీతి పాలనకు వ్యతిరేకంగా 2027నుంచి వైఎస్ జగన్ మరోసారి పాదయాత్ర చేస్తారని మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు పేర్ని నాని, సాకె శైలజానాథ్, మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, టీజేఆర్ సుధాకర్ బాబు, ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్కుమార్, మురుగుడు హనుమంతరావు, వరుదు కళ్యాణి, రుహుల్లా, వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.పాదయాత్ర సాహసోపేత నిర్ణయం: మాజీ మంత్రి మేరుగు నాగార్జున దేశ రాజకీయ చరిత్రలో ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించబడిన రోజు ఇది. వైయస్ జగన్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం రాష్ట్ర చరిత్రను మార్చేసింది. తన పాదయాత్ర ద్వారా అడుగడుగునా అన్ని వర్గాల వారిని కలిసి ఆప్యాయంగా పలకరిస్తూ నేనున్నానని హామీ ఇచ్చారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ తన ఐదేళ్ల పాలనలో అమలు చేసి పాలనలోనూ దిక్సూచిగా నిలిచారు.మళ్లీ జగన్ ప్రజా పాలన వస్తుంది: మాజీ మంత్రి సాకె శైలజానాథ్ ప్రజాసంకల్ప పాదయాత్ర ద్వారా రాష్ట్ర ప్రజల కష్టాలను, ఆకాంక్షలను దగ్గర్నుంచి చూసిన పార్టీ అర్టీ అధ్యక్షులు వైయస్ జగన్, వాటికి పరిష్కారాలను వెతుకుతూ ఆసాంతం ముందుకుసాగారు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను అమలు చేసి చూపించారు. కానీ నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడమే లక్ష్యంగా హామీలు గుప్పించి తీరా అధికారంలోకి వచ్చాక ఓటేసిన ప్రజలకు వెన్నుపోటు పొడిచింది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే వైయస్సార్సీపీ నాయకులను అక్రమ కేసులతో వేధిస్తున్నారు. రాబోయే రోజుల్లో వైయస్ జగన్ నేతృత్వంలోని ప్రజా పాలన వస్తుందని గట్టిగా విశ్వసిస్తున్నా. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు: మాజీ మంత్రి పేర్ని నాని దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వైఎస్ జగన్, నిరంతరం ప్రజా శ్రేయస్సు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యంగా ముందుకుసాగారు. ఈ క్రమంలో ఎన్నో ఒడిదుడుకులు, వేధింపులు, కేసులు, ఒత్తిళ్లు ఎదురైనా ఏనాడూ వెనకడుగు వేయలేదు. ప్రజా సంకల్ప పాదయాత్ర ద్వారా ప్రజల ఆకాంక్షలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారం కోసం కృషి చేశారు. తన 3,648 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా 2,516 గ్రామాల ప్రజలను పలకరించి వారి ఆకాంక్షలను స్వయంగా తెలుసుకున్నారు. ఆప్యాయమైన తన పలకరింపు, చిరునవ్వుతో ప్రతి గుండెను తాకారు.చిన్నారులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, ఉద్యోగులు, రైతులు, ఆటో డ్రైవర్లు, లాయర్లు, వృత్తి పనులు చేసుకునే కార్మికులు, కౌలు రైతులు.. ఇలా అన్ని వర్గాలను పలకరించి అక్కున చేర్చుకున్నారు. వారి కష్టాలను విని తానొస్తే ఏం చేయబోయేది వివరించారు. 124 బహిరంగ సభల ద్వారా పాదయాత్రలో తాను చూసిన అంశాలను, తన అనుభవాలను వివరించడంతోపాటు ప్రజాభిలాషకు అనుగుణంగా అధికారంలోకి వస్తే ఏం చేయబోయేది కూడా ఎప్పటికప్పుడు స్పష్టంగా చెబుతూ వచ్చారు. 55 ఆత్మీయ సమ్మేళనాల ద్వారా కుల వృత్తులను బతికించడానికి ఏం చేయాలనే దానిపై కుల సంఘాలతో చర్చించి వారి అభిప్రాయాలు తీసుకున్నారు.వైద్య విప్లవం తెచ్చిన ఘనత జగన్దే..సింగిల్గా పోటీ చేసి 151 స్థానాల్లో భారీ విజయం నమోదు చేయడమే కాకుండా ఇచ్చిన హామీలను అమలు చేసి చూపించారు. ప్రజా ప్రభుత్వం ఎలా ఉంటుందో తన పాలన ద్వారా చూపించారు. సమాజంలో వెనుకబాటుకు కారణం నిరక్ష్యరాస్యత అని గ్రహించి రాష్ట్రంలో విద్యావిప్లవం తీసుకొచ్చారు. ఖరీదైన కార్పొరేట్ వైద్యం చేయించుకునే క్రమంలో అప్పులపాలై కుటుంబాలు చితికిపోవడమో లేదా వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు మార్చాలని వైద్య విప్లవం తీసుకొచ్చారు. విద్య, వైద్య రంగాల్లో నాడు-నేడు కార్యక్రమం చేపట్టి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. పేదవాడికి వైద్యం మరింత చేరువ చేయాలని తపించి తన ఐదేళ్ల పాలనలో 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించి 7 కాలేజీలను పూర్తి చేసిన ఘనత జగన్కే దక్కుతుంది.ఢిల్లీలో నాటి కేజ్రీవాల్ ప్రభుత్వం 800 స్కూల్స్ను పదేళ్లలో మార్చి చూపిస్తే, వైఎస్ జగన్ హయాంలో (కరోనాతో రెండేళ్లు పోయినా) మూడేళ్లలో 16 వేల పాఠశాలలను కార్పొరేట్కి దీటుగా తీర్చిదిద్దారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ బడుల్లో సీట్ల కోసం రికమండేషన్ చేయాల్సిందిగా విద్యార్థుల తల్లిదండ్రులు ఎమ్మెల్యేలను కోరారంటే ఎంతగొప్పగా తీర్చిదిద్దారో అర్థం చేసుకోవచ్చు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ బడులను నాశనం చేశారు. ఇంగ్లిష్ మీడియం రద్దు చేశారు. వైఎస్ జగన్ నిర్మించిన మెడికల్ కాలేజీలను చంద్రబాబు ధన దాహంతో ప్రైవేటుపరం చేస్తున్నాడు. వైద్య విద్య చదవాలన్న పేదవిద్యార్థుల ఆశలకు గండి కొట్టాడు. చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది. పెత్తందారీ విధానాలతో పేదలకు విద్య, వైద్యం దూరం చేస్తున్నారు. ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నందుకు రాష్ట్ర ప్రజలంతా పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు.ప్రజలను బలితీసుకుంటున్నది చంద్రబాబే..మోంథా తుపాన్తో దెబ్బతిన్న పొలాలను పరిశీలించి ప్రభుత్వాన్ని నిలదీసి రైతులకు అండగా నిలబడాలని వైఎస్ జగన్ కృష్ణా జిల్లా పర్యటనకు వెళితే.. ఎవర్నీ చంపకుండా రావాలంటూ నారా లోకేశ్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. సభలు, పబ్లిసిటీ స్టంట్ల ద్వార అమాయకుల ప్రాణాలను బలి పెట్టే లక్షణం చంద్రబాబుదని మర్చిపోయినట్టున్నాడు. ఎన్నిలకు ముందు చంద్రబాబు నిర్వహించిన కందుకూరు సభలో ఏడుగురు, గుంటూరు సభలో ముగ్గుర్ని పొట్టనపెట్టుకున్నాడు. గుంటూరులో చీరల పంపిణీ పేరుతో పేదలను బలితీసుకున్నాడు.కూటమి ప్రభుత్వం వచ్చాక ఆలయాల్లో తొక్కిసలాటలు జరిగి దేవుడ్ని చూడ్డానికి వచ్చిన భక్తులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సింహాచలం గుడిలో గోడ కూలి ఏడుగురు, తిరుపతిలో 9 మంది చనిపోయారు. ఏకాదశి రోజున కాశీబుగ్గ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో దర్శనం కోసం వెళ్లిన భక్తులు తొక్కిసలాట జరిగి 9 మంది చనిపోయారు. దీన్ని ప్రైవేటు ఆలయం అని చెప్పి తప్పించుకోవడం సిగ్గుచేటు. శాంతిభద్రతల శాఖను నిర్వహించే చంద్రబాబు కనీస బాధ్యత తీసుకోలేదు. చేతకానివారు, అవినీతిపరులు, తప్పుడు ఆలోచనలు ఉన్నవారు అధికారంలో ఉంటే ప్రజలకు శాపాలుగా మారతాయని చెప్పడానికి ఈ వరుస దుర్ఘటనలే ఉదాహరణలు.వైఎస్ జగన్ ఉద్దేశించి మాట్లాడుతున్న నారా లోకేశ్.. మోంథా తుపాన్తో రైతులు నష్టపోయి కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఆయన మాత్రం ముంబైలో కుటుంబంతో కలిసి క్రికెట్ మ్యాచ్ ఎంజాయ్ చేశాడు. నేనే గెలిపించానని ప్రచారం చేసుకుంటున్నారు. రైతులు అల్లాడిపోతుంటే అమిత్షా కొడుకుతో ఫొటోలు తీసుకుని ప్రచారం చేసుకోవడం గొప్ప అనుకోవడం వారి దిగజారుడుతనానికి నిదర్శనం. ఈరోజు 8 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రజా సంకల్ప యాత్ర స్ఫూర్తితోనే రాబోయే రోజుల్లో 2027 నుంచి మళ్లీ మరోసారి ప్రజా సంకల్పయాత్ర ప్రారంభం అవుతుంది. మళ్లీ ప్రజలందర్నీ నేరుగా పలకరించి అక్కున చేర్చుకుంటారు. -
YSRCP నేత పూనూరు గౌతమ్ రెడ్డిపై హత్యాయత్నం
-
ప్రజా సంకల్పం.. జగన్ పాదయాత్రకు 8 ఏళ్లు పూర్తి
-
వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభమై నేటికి ఎనిమిదేళ్లు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభమై నేటికి ఎనిమిదేళ్లు అయ్యింది. ప్రజా సంకల్ప యాత్ర పేరుతో 341 రోజులు వైఎస్ జగన్ పాదయాత్ర చేశారు. వైఎస్ జగన్ తన పాదయాత్రలో కోట్లాది మందిని కలిసి స్వయంగా వారి బాధలను విన్నారు. నేను ఉన్నాను, నేను విన్నాను.. అంటూ భరోసా ఇచ్చారు.నాడు వైఎస్ జగన్ పాదయాత్ర 13 జిల్లాల్లో 134 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా సాగింది. 231 మండలాలు, 2516 గ్రామాల మీదుగా వైఎస్ జగన్ ప్రయాణం చేశారు. రాష్ట్రంలో మొత్తం 3,648 కిలోమీటర్లు పాదయాత్ర సాగింది. వైఎస్ జగన్ పాదయాత్ర రాష్ట్ర చరిత్రని మార్చేసింది. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ భారీ విజయం సాధించారు. 151 అసెంబ్లీ నియోజకవర్గాలు, 22 పార్లమెంటు నియోజకవర్గాలలో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది.ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ నేతలు నివాళులు అర్పించారు. ఇదే సమయంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, రఫుల్లా, వరుదు కళ్యాణి, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, టీజేఆర్ సుధాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. LIVE: వైయస్ జగన్ గారి ప్రజాసంకల్పం పాదయాత్రకి నేటితో 8 ఏళ్లు.. పార్టీ కేంద్ర కార్యాలయంలో కేక్ కటింగ్ https://t.co/Q4Bl6pxlp3— YSR Congress Party (@YSRCParty) November 6, 2025 -
YSRCP మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు గుండెపోటు
-
నేడు YSRCP విద్యార్ధి విభాగం నేతలతో YS జగన్ భేటీ
-
వైఎస్సార్సీపీ నేత గొల్లపల్లి సూర్యారావుకు గుండెపోటు
సాక్షి, కోనసీమ జిల్లా: మాజీ మంత్రి, రాజోలు వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ గొల్లపల్లి సూర్యారావు గుండెపోటుకు గురయ్యారు. ఆయాన్ని అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. స్టంట్ వేసిన వైద్యులు.. గొల్లపల్లి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. రాజోలులో పార్టీ కార్యక్రమాలకు వెళ్తుండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన అమలాపురం కిమ్స్కు తరలించి ఆయనకు వైద్యం అందించారు. -
గవర్నర్ అబ్దుల్ నజీర్కు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: గవర్నర్ అబ్దుల్ నజీర్కు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ఆయనకు కర్నాటక లా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించటంపై హర్షం వ్యక్తం చేశారు. న్యాయమూర్తిగా ఎన్నో కీలక తీర్పులు ఇచ్చిన అబ్దుల్ నజీర్.. నేడు గవర్నర్గా కూడా రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడంలో ముందున్నారని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.‘‘చట్టం, న్యాయ పరిరక్షణకు విశేష కృషి చేసిన ఆయనకు కర్ణాటక స్టేట్ లా యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించడం రాష్ట్రానికి గర్వకారణం. ఇది వారి అంకితభావానికి లభించిన గుర్తింపు. ఈ సందర్భంగా గవర్నర్ నజీర్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను’’ అని ఎక్స్లో వైఎస్ జగన్ పోస్ట్ చేశారు.న్యాయమూర్తిగా ఎన్నో కీలక తీర్పులు ఇచ్చిన అబ్దుల్ నజీర్ గారు, నేడు గవర్నర్గా కూడా రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడంలో ముందున్నారు. చట్టం, న్యాయ పరిరక్షణకు విశేష కృషి చేసిన ఆయనకు కర్ణాటక స్టేట్ లా యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ (Honorary Doctor of Laws) ప్రకటించడం రాష్ట్రానికి… pic.twitter.com/BDwSNSHr50— YS Jagan Mohan Reddy (@ysjagan) November 5, 2025 -
Satish Kumar: భారతమ్మ గొప్పతనం ఏంటో చూపిస్తా? ఆదినారాయణ రెడ్డికి గూబపగిలేలా కౌంటర్
-
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ నేతల బరితెగింపు
-
ఆదుకోవాల్సింది పోయి.. వీళ్లా ప్రభుత్వాన్ని నడిపేదీ?: సతీష్రెడ్డి
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వం ప్రచార ఆర్భాటమే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్రెడ్డి మండిపడ్డారు. లోకేష్ 4 గంటల్లో 4వేల దరఖాస్తులు తీసుకున్నారని ఎల్లోమీడియా రాసింది. పబ్లిసిటీ కోసం తప్ప ప్రజలు నమ్ముతారో లేదో తెలుసుకోరా? అని దుయ్యబట్టారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పెన్షన్ల విషయంలోనూ దారుణంగా మోసం చేశారు. 5 లక్షల మంది పెన్షన్ దారులను తగ్గించారు. కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇప్పటికీ ఇవ్వలేదు’’ అంటూ నిలదీశారు.‘‘రైతులపై తుపాను దెబ్బ కొడితే వారిని ఆదుకోవాల్సిందిపోయి గాలికి వదిలేశారు. చంద్రబాబు లండన్, లోకేష్ క్రికెట్ చూడటానికి వెళ్లారు. వీళ్లా ప్రభుత్వాన్ని నడిపేదీ?. గూగుల్ సెంటర్ వల్ల లక్షా 80 ఉద్యోగాలు వస్తాయని పబ్లిసిటీ ఇస్తున్నారు. నిజానికి పదివేల ఉద్యోగాలైనా తెప్పించగలరా?. ఆరోగ్యశ్రీ లేక జనం అల్లాడిపోతుంటే పట్టించుకోరా?. ఏ ఆస్పత్రిలోనూ ఆరోగ్యశ్రీ అమలు కావటం లేదు. రాష్ట్రంలో రైతులు బతకటమే కష్టం అన్నట్టుగా మారింది. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు టమోట, మామిడి, ఉల్లి పంటలను రోడ్డు మీద కాలువల్లో పడేసే దుస్థితి నెలకొంది...అన్ని వర్గాల ప్రజలు అసహనంతో ఉన్నారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. సమస్యలతో జనం ఉంటే చంద్రబాబు లండన్లో విహరిస్తారా?. లులూ మాల్ పేరుతో వందల కోట్ల విలువైన భూమిని ధారాదత్తం చేస్తారా?. అందులో పెద్ద స్కాం ఉందన్న సంగతి సాధారణ ప్రజలకు కూడా తెలుసు. వైఎస్ జగన్ 18 సార్లు ప్రెస్మీట్ పెట్టి ప్రశ్నిస్తే ఒక్క దానికీ సమాధానం చెప్పలేదు. ఆదినారాయణరెడ్డికి దమ్ముంటే పోలీసులు లేకుండా ఒక్క జడ్పీటీసీ అయినా గెలవగలరా?. జగన్ సీటు ఇస్తే గెలిచి తర్వాత పార్టీ మారిన వ్యక్తి జగన్. అలాంటి వ్యక్తి ఇప్పుడు జగన్పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా?..పోలీసులను అడ్డం పెట్టుకుని జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలిచి వీరుడిలాగ మాట్లాడతావా?. పోలీసులు లేకుండా ఒక్క సీటైనా గెలవగలరా?. అధికారం ఉందని నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదు. మహిళా క్రికెటర్ శ్రీచరణికి ప్రభుత్వం ఎందుకు న్యాయం చేయలేదు?. మిగతా అన్ని రాష్ట్రాల క్రికెటర్లకు ఆయా ప్రభుత్వాలు కోటి చొప్పున పారితోషికం ఇచ్చాయి. ముంబాయి వెళ్లి క్రికెట్ చూసిన లోకేష్ ఎందుకు శ్రీచరణికి ప్రోత్సాహకాలు ఇవ్వలేదు?. నకిలీ మద్యాన్ని బయట పెట్టారనే జోగి రమేష్ ని అరెస్టు చేశారు. బెల్టు షాపులోని మద్యనే బస్సు ప్రమాదానికి కారణమన్నందుకు మా పార్టీ నేత శ్యామలాకు నోటీసులు ఇచ్చారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఏ గ్రామానికి వచ్చినా బెల్టుషాపును చూపిస్తా’’ అంటూ సతీష్రెడ్డి సవాల్ విసిరారు. -
వైఎస్ఆర్ సీపీ నేత కైలే అనిల్ కుమార్ పై కేసు
-
వైఎస్ జగన్ పర్యటన సక్సెస్.. పోలీసుల ఓవరాక్షన్!
సాక్షి, కృష్ణా: కృష్ణా జిల్లాలో మోంథా తుపాను బాధిత రైతులను పరామర్శించి, వారి పంట పొలాల పరిశీలనకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ చేపట్టిన కార్యకమ్రం దిగ్విజయమైంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు దిగింది. పర్యటనకు వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారు.మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్పై పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ అక్రమ కేసు పెట్టారు. అంతేకాకుండా డ్రోన్ వీడియోల ఆధారంగా మరికొందరిపైన కూడా కేసులు పెడతామని పోలీసులు చెప్పడం గమనార్హం. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు.ఇక, అంతకుముందు.. వైఎస్ జగన్ పర్యటనను విఫలం చేయడమే లక్ష్యంగా ముందుగానే వైఎస్సార్సీపీ నియోజకవర్గాల ఇంచార్జిలు, ముఖ్య నాయకులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మాజీ ఎమ్మెల్యేలు, మండల, గ్రామ నాయకులను బెదిరించింది. తద్వారా జన సమీకరణ జరగకుండా అడ్డుకోవాలని ఎత్తు వేశారు. అయితే, ఇవేవీ ఫలించలేదు. పైగా ప్రజలు భారీగా, స్వచ్ఛందంగా తరలి వస్తుండడంతో ఇక ఓవర్ యాక్షన్కు దిగారు.జగన్ వస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు గోపువానిపాలెం అడ్డ రోడ్డుకు చేరుకోగా పోలీసులు బారికేడ్లు, రోప్లతో అడ్డగించారు. రోడ్డు మార్జిన్లో నిల్చుని ఉన్నా చెదరగొట్టారు. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ సంగతి తెలిసిన పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ అక్కడకు వచ్చి ఎందుకు ఇన్ని ఆంక్షలు విధిస్తున్నారు? అంటూ ప్రశ్నించారు. అయితే, సమాధానం ఇవ్వకుండా వైఎస్సార్సీపీ శ్రేణులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. దీంతో కైలే అనిల్, వైఎస్సార్సీపీ శ్రేణులు పమిడిముక్కల సీఐ తీరుపై మండిపడ్డారు. అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించడం సరికాదని హెచ్చరించారు.అడ్డుకున్న పోలీసులు.. తుపాను కారణంగా నీట మునిగిన పంట పొలాలకు ఎవరూ వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. కేసులు నమోదు చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. వేమూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జి వరికోటి అశోక్బాబును అదుపులోకి తీసుకుని, ఆయనవెంట వచ్చిన వాహనాలతో పాటు స్టేషన్కు తరలించారు. సీతారామపురంలో ఎన్టీఆర్ విగ్రహం ఎదుట టీడీపీ జెండాలతో ఆ పార్టీ కార్యకర్తలు కవ్వించారు. అయినా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలతో పాటు ప్రతిఒక్కరూ అత్యంత సంయమనం పాటించారు. -
'దయలేని బాబు' దగా పాలన
తుపాన్తో నష్టపోయిన రైతులను ఉదారంగా ఆదుకోవాల్సింది పోయి.. ఎలా పరిహారం ఎగ్గొడదామా అని ఆలోచనలు చేస్తుండటం దుర్మార్గం. ఎన్యుమరేషన్ అక్టోబర్ 31వ తేదీ నాటికి పూర్తి కావాలని చెబుతూ ఒక్క రోజు ముందు 30న ప్రొసీడింగ్స్ ఇవ్వడాన్ని ఏమంటారు? ఒక్క రోజులో ఎన్యుమరేషన్ అనేది ఎలా సాధ్యం? పంట నష్ట పరిహారం జాబితాలో పేరుంటే ధాన్యం కొనుగోలు చేయం అని చెప్పడం దారుణం. ఇలా రైతులను బ్లాక్ మెయిల్ చేస్తూ.. బెదిరిస్తూ.. పైకి మాత్రం రైతులను ఉద్దరిస్తున్నట్లు బిల్డప్లా?తుపాను కారణంగా వరి కంకుల సుంకు (పుప్పొడి) రాలిపోయిందా? లేదా? అన్నది పరిశీలించడం ఎన్యుమరేషన్ ప్రక్రియలో కీలకం. ఎన్యుమరేషన్ చేసే అధికారులు పంట పొలాల వద్దకు వచ్చి స్వయంగా చూసే పరిస్థితే లేదు. సుంకు రాలిపోతే పాలు పోసుకునే పరిస్థితి ఉండదు. జర్మినేషన్ ప్రాసెస్ ఆగిపోతుంది. తద్వారా తాలు గింజలు ఏర్పడతాయి. ఈ వాస్తవాలు పరిశీలించేందుకు పొలాల వద్దకు వెళ్లకుండానే ఎన్యుమరేషన్ అయిపోయిందంటున్నారు. ఇది ఎంత వరకు న్యాయం? ఇదేనా రైతులకు మేలు చేసే మీ విధానం? – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కృష్ణా జిల్లా ఆకుమర్రు లాకు నుంచి సాక్షి ప్రతినిధి: ‘రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందో లేదో అర్థం కాని పరిస్థితి నెలకొంది. తుపాను దెబ్బకు పంటలు తీవ్రంగా దెబ్బతిని రైతులు గగ్గోలు పెడుతుంటే చంద్రబాబు కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. చంద్రబాబు దృష్టిలో వ్యవసాయం అనేదే దండగ.. రైతు అనే వాడు వేస్ట్.. అందుకే ఆయన హయాంలో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. వ్యవసాయం, రైతుల విషయంలో చంద్రబాబు మైండ్సెట్ మార్చుకోవాలి.. రైతులు రాష్ట్రానికి వెన్నెముక అని గుర్తించాలి. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వ తీరు మారకపోతే బాధితుల తరఫున వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది’ అని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గట్టిగా హెచ్చరించారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని మండిపడ్డారు. మంగళవారం ఆయన కృష్ణా జిల్లాలో మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. దెబ్బతిన్న పంట పొలాలను స్వయంగా పరిశీలించారు. పంట పొలాల్లో దిగి.. బాధిత రైతులతో మమేమకవుతూ జరిగిన పంట నష్టం గురించి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితుల పక్షాన తానున్నానంటూ రైతులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా గూడూరు మండలం ఆకుమర్రు లాకు వద్ద బాధిత రైతులతో కలిసి మీడియాతో మాట్లాడారు. రైతులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుందని, రైతు కన్నీరు పెడితే ఏ ప్రభుత్వానికైనా అరిష్టం అని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో లేదో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. ‘మోంథా తుపాను వల్ల నష్టపోయిన రైతులకు అండగా నిలవాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లండన్ పోతాడు.. ఆయన కొడుకు ఆ్రస్టేలియా నుంచి వచ్చి క్రికెట్ మ్యాచ్ చూడటానికి ముంబై పోతాడు.. రైతుల విషయంలో ఈ ప్రభుత్వానికి ఏపాటి చిత్తశుద్ధి ఉందో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉండదు’ అని ఎత్తిచూపారు. పంటలు దెబ్బ తిన్న ప్రతీ రైతుకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని, పంటల బీమా పరిహారం కూడా ఇవ్వాలని, ప్రస్తుత రబీ సీజన్ నుంచైనా ఉచిత పంటల బీమాను వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. గత 18 నెలల్లో సంభవించిన విపత్తుల వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వ లెక్కల ప్రకారమే రూ.600 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలన్నారు. లేదంటే రైతుల పక్షాన ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. కృష్ణాజిల్లా నిడుమోలు వద్ద భారీగా తరలివచ్చిన రైతులు, ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులకు అభివాదం చేస్తున్న వైఎస్ జగన్ 18 నెలల్లో ఒక్క రైతుకైనా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారా? ⇒ రైతు పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఒకసారి మారుమూల ప్రాంతాలకు వెళ్లాలి. క్షేత్ర స్థాయిలో తిరిగితేనే వాస్తవ పరిస్థితి అర్థమవుతుంది. ఈ ప్రభుత్వం రైతుల విషయంలో ఎంత నిర్దాక్షిణ్యంగా, ఎంత నిర్దయగా వ్యవహరిస్తుందో చెప్పడానికి శతకోటి ఉదాహరణలు ఉన్నాయి. మోంథా తుపాను దాదాపు 25 జిల్లాలపై ప్రభావం చూపింది. ⇒ అటు గోదావరి జిల్లాల నుంచి శ్రీకాకుళం వరకు, ఇటు కృష్ణా నుంచి కర్నూలు వరకు దాని ప్రభావం కన్పించింది. దాదాపుగా 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. నిజంగా ఎప్పుడూ ఊహించని విధంగా పంటలు నష్టపోయిన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వరి పంటకే ఎక్కువగా 11 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లింది. పత్తి, మొక్కజొన్న, అరటి, బొప్పాయి పంటలు మరో నాలుగు లక్షల ఎకరాల్లో దెబ్బతిన్నాయి. ⇒ వరి పంట గింజలు పాలు పోసుకున్న దశలో తుపాను విరుచుకుపడింది. తీవ్రమైన గాలులు, వర్షాల వల్ల పంట పూర్తిగా దెబ్బతింది. చంద్రబాబు 18 నెలల పాలనలో దాదాపు 16 సార్లు తుపానులు, వరదలు, అకాల వర్షాలు, కరువు వంటి వైపరీత్యాల వల్ల రైతులు ఇబ్బంది పడ్డారు. ఈ 18 నెలల్లో ఏ రైతుకైనా ఒక్క సారైనా ఒక్క రూపాయి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారా? ఏ రైతుకైనా ఒక్కసారైనా పంటల బీమా పరిహారం (ఇన్సూ్యరెన్స్) ఇచ్చారా? అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు రూ.20 వేలు పెట్టుబడి సాయం ఇస్తా అని హామీ ఇచ్చి.. రెండేళ్లకు రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా రూ.ఐదు వేలతో సరిపెట్టారు. ⇒ ఇన్పుట్ సబ్సిడీ రూపాయి రాలేదు. ఇన్సూరెన్స్ రాలేదు. చివరికి ఎరువులు బ్లాకులో కొనుక్కోవాల్సిన పరిస్థితుల్లోకి రైతులు వెళ్లిపోయారు. రూ.266కు దొరకాల్సిన యూరియా కట్టను ఏకంగా రూ.500, రూ.600 చొప్పున బ్లాకులో కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అవసరాన్ని బట్టి బ్లాకులో విచ్చలవిడిగా అమ్ముతున్నారు. ఇలా కష్టాల సాగు చేసిన రైతులు తాము పండించిన పంటను అమ్ముదామంటే ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి. కనీసం మద్దతు ధరకు కూడా కొనే పరిస్థితి లేకుండా పోయింది. గతేడాది ధాన్యం 75 కేజీల బస్తాకు మద్దతు ధర ప్రకారం రూ.1,750 రావాల్సి ఉండగా, రైతుల చేతికొచ్చింది మాత్రం కేవలం రూ.1,350 మాత్రమే. చంద్రబాబు హయాంలో ప్రతి అడుగులోనూ రైతు నష్టపోతూనే ఉన్నాడు. నాడు ప్రతి రైతుకు భరోసా ⇒ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదన్న ఆలోచనతో వారిపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని ఐదేళ్ల పాటు అమలు చేసి అండగా నిలిచింది. మూడున్నర ఎకరాలున్న రైతులు సైతం దాదాపు రూ.70 వేలు, రూ.66 వేలు చొప్పున గతంలో బీమా పరిహారం డబ్బులు అందుకున్న పరిస్థితులను ఇక్కడి రైతులు గుర్తు చేసుకుంటున్నారు. ⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్కరోజు ఏ రైతు ఇబ్బంది పడిన దాఖలాలు లేవు. విపత్తుల వేళ పంట నష్టం జరిగితే ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందని ఏ రోజు ఏ రైతు ఆ ఐదేళ్లలో అధైర్య పడలేదు. కారణం.. పంట నష్టం జరిగితే జగనన్న ఉన్నాడు.. పైసా భారం పడకుండా తమ పంటకు బీమా చేయించాడని, తమకు డబ్బులొస్తాయని ధైర్యంగా ఉండేవారు. ప్రతి రైతుకు భరోసా ఉండేది. ⇒ ఏదైనా విపత్తు వేళ పంటలకు నష్టం వాటిల్లితే సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు ఇస్తాడనే ధైర్యం ఉండేది. ఆ డబ్బులతో మరుసటి సీజన్లో పెట్టుబడి పెట్టుకోవచ్చనే ధైర్యం ఉండేది. సీజన్ మొదలయ్యే సరికే ప్రతి రైతుకు ఓ భరోసా ఉండేది. వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున ఇస్తారన్న నమ్మకం ఉండేది. ⇒ ఆర్బీకే వ్యవస్థ అనేది రైతులను చేయి పట్టి నడిపించే వ్యవస్థగా ఉండేది. ప్రతీ రైతు వేసిన పంటకు ఈ–క్రాప్ జరిగేది. ఆర్బీకే పరిధిలోనే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్.. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ రైతులకు అందుబాటులో ఉండే వారు. సచివాలయాలతో అనుసంధానం చేసి వలంటీర్లతో కలిసి రైతులను చేయిపట్టి నడిపించేవారు. ప్రతి రైతును.. అతను సాగు చేసిన పొలంలో నిలబెట్టి జియో ట్యాగ్ చేసి ఈ–క్రాప్ బుకింగ్ చేసే వారు. తద్వారా పంటకు ఎప్పుడు, ఏ ఇబ్బంది వచ్చినా రైతుకు ప్రభుత్వం తోడుగా నిలబడేది. ధరలు పతనమైన ప్రతిసారి ప్రభుత్వ జోక్యం ⇒ ఆర్బీకే పరిధిలో ఏ రైతుకైనా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉండేది కాదు. ఆర్బీకే పరిధిలో ఏ పంటను ఏ రేటుకు కొనుగోలు చేసేది రైతులకు తెలియజేసేవాళ్లం. ఆ రేట్ల కంటే తక్కువగా పడిపోతే ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. మద్దతు ధరల వివరాలు ఆర్బీకేలో ప్రదర్శించేవాళ్లం.⇒ ఎక్కడ ఏ పంట రేటు తగ్గినా వెంటనే ఆర్బీకే అసిస్టెంట్ నుంచి ఎలెర్ట్ వచ్చేది. మార్క్ఫెడ్కు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో ఉన్న జేసీలు వెంటనే మార్కెట్లో జోక్యం చేసుకునే వారు. ధరలు పడిపోయిన పంటలను కొనుగోలు చేసి, మార్కెట్లో పోటీని తీసుకొచ్చి «రైతుకు తోడుగా నిలబడేవారు. ఇందుకోసం కంటిన్యూస్ మానిటరింగ్ అండ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొడ్యూస్ (సీఎం యాప్) అనే యాప్ ఆర్బీకే అసిస్టెంట్ చేతిలో ఉండేది. ⇒ ఈ యాప్ ద్వారా గ్రామ స్థాయిలో ధరలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ప్రతి రైతుకు బాసటగా నిలిచే వారు. ఇలా ఐదేళ్లలో ధర లేని సమయంలో రూ.7,800 కోట్లు ఖర్చు చేసి కనీస మద్దతు ధరలకు ఆయా పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచాం. ఇందుకోసం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశాం. ⇒ అప్పట్లో రైతులు సాగు చేసిన ప్రతి పంటను ఈ–క్రాప్లో నమోదు చేసేవాళ్లం. తద్వారా రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా అమలు చేశాం. దాదాపు 85 లక్షల మంది రైతుల తరఫున ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి ఉచితంగా పంటల బీమా అమలు చేశాం. 54.55 లక్షల మంది రైతులకు ఇన్సూరెన్స్ కింద రూ.7,800 కోట్లు జమ చేశాం. ⇒ ప్రస్తుతం చంద్రబాబు హయాంలో కేవలం 19 లక్షల మంది మాత్రమే ఇన్సూరెన్స్ చేయించుకున్నారు. అది కూడా బ్యాంక్ రుణాలు తీసుకున్న వారు. మరి ప్రీమియం చెల్లించని మిగిలిన రైతుల పరిస్థితి ఏమిటి? ఈ విపత్కర పరిస్థితుల్లో వారికి పంటల బీమా పరిహారం అందకుండా చేయడం దుర్మార్గం కాదా?ఇదేం విడ్డూరం.. ఒక్క రోజు ముందు ప్రొసీడింగ్సా!?⇒ తుపాన్తో నష్టపోయిన రైతులు ఆశ్చర్యం కలిగించే విషయాలు చెబుతున్నారు. మీ పొలంలో ఎన్యుమరేషన్ చేయడానికి ఎవరైనా వచ్చారా? అని అడిగితే.. ఈ పొలంలోకే కాదు రాష్ట్రంలో దెబ్బతిన్న ఏ పొలంలోకి, ఏ రైతు దగ్గరకు ఎన్యుమరేషన్ చేసేందుకు ఎవరూ రాలేదన్న మాట విని్పస్తోంది. కృష్ణా జిల్లా కలెక్టర్ అక్టోబర్ 30వ తేదీన ప్రొసీడింగ్స్ (ఉత్తర్వులు చూపిస్తూ) ఇచ్చారు.⇒ ఎన్యుమరేషన్ ఆఫ్ క్రాప్ డామేజ్, సోషల్ ఆడిట్ 31వ తేదీ కల్లా పూర్తి చేయాలని అందులో పేర్కొన్నారు. ఒక్క రోజులో ఎన్యుమరేషన్ (పంట నష్టం మదింపు), సోషల్ ఆడిట్ అయిపోవాలట! ఎలా సాధ్యమో మీరే చెప్పండి. పైగా ఈ గడువులోగా చేయకపోతే యాక్షన్ తీసుకుంటామని ఇదే ప్రొసీడింగ్స్లో స్పష్టం చేశారు. క్రాప్ డామేజ్, ఎన్యుమరేషన్, సోషల్ ఆడిట్, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం అంతా పూర్తి చేసి తుది జాబితాలను 1వ తేదీకల్లా వ్యవసాయ శాఖ డైరెక్టరేట్కు పంపాలని పేర్కొన్నారు.⇒ ఈ ఆదేశాలు చూస్తుంటే ఎంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారో తెలుస్తోంది. ఎన్యుమరేషన్ అనేది ఎవరూ పంట పొలాల వద్దకు వచ్చి చేసే పరిస్థితి లేదు. గాలులు, తుపాను వల్ల ధాన్యం సుంకు విరిగిపోయింది. ఎన్యుమరేషన్ చేసేటప్పుడు ఏ అధికారి అయినా సరే పొలంలో అడుగుపెట్టాలి. వరి కంకులను చూడాలి. సుంకు (పుప్పొడి) రాలిపోయిందా? లేదా? అన్నది పరిశీలించాలి. ఎన్యుమరేషన్ ప్రక్రియలో ఈ విషయాన్ని స్పష్టంగా రాయాలి. సుంకు రాలిపోతే పాలు పోసుకునే పరిస్థితి ఉండదు. జర్మినేషన్ ప్రాసెస్ ఆగిపోతుంది. తద్వారా తాలు గింజలు ఏర్పడతాయి. ఈ వాస్తవాలు పరిశీలించేందుకు పొలాల వద్దకు వెళ్లకుండానే ఎన్యుమరేషన్ అయిపోయిందంటున్నారు. ఇది ఎంత వరకు న్యాయం? ఇదేనా రైతులకు మేలు చేసే విధానం?ధాన్యం కొనబోమని బ్లాక్ మెయిల్ చేస్తారా?⇒ ఎన్యుమరేషన్ కోసం ఎందుకు పొలం వద్దకు రాలేదని ఏ రైతు అయినా అడిగితేæ వారిని వెటకారం చేసి మాట్లాడుతున్నారు. పైగా ప్రతి రైతుకు వ్యవసాయ శాఖాధికారి నుంచి తాము చెప్పిన పత్రాలు (ఆధార్, 1బి జిరాక్స్, కౌలు గుర్తింపు కార్డు, బ్యాంకు పాస్ పుస్తకం) సమరి్పంచిన వారి పొలాల్లో మాత్రమే పంట నష్టం పరిశీలించి జాబితాలో పెడతామని మెసేజ్లు పంపిస్తున్నారు. ఆర్బీకేల ద్వారా కూడా చెప్పిస్తున్నారు. అదీ అక్టోబర్ 31వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోగా తీసుకొస్తేనే స్వీకరిస్తామని, లేదంటే ఆ పత్రాలు స్వీకరించం అని తెగేసి చెబుతున్నారు. ⇒ మరొక వైపు ‘దయచేసి రైతులు గమనించగలరు. ఇప్పుడు పంట నష్టం చేయించుకున్న రైతుల నుంచి రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయబడదు’ అని నిర్దయగా మెసేజ్లు పంపిస్తున్నారు. ఇన్పుట్ సబ్సిడీ కోసం ఎవరైనా అడిగితే వాళ్ల ధాన్యం కొనుగోలు చేయరట! అంటే బ్లాక్ మెయిల్ చేస్తున్నారా?⇒ ఎక్కడైనా తుపాను వచ్చినపుడు ప్రభుత్వం మానవత్వం ప్రదర్శించాలి. నష్టపోయిన రైతులను ఉదారంగా ఆదుకునేందుకు ముందుకు రావాలి. పంట నష్టపరిహారం (ఇన్పుట్ సబ్సిడీ), పంటల బీమా పరిహారం (ఇన్సూ్యరెన్స్) వచ్చేలా చేయాలి. అంతే కాకుండా వారి పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేసే కార్యక్రమం చేపట్టాలి. అది ఇస్తే ఇది ఇవ్వం.. ఇది ఇస్తే ఆది ఇవ్వం.. అని చెబుతూ రైతులను బెదిరించడం దారుణం. దీన్నిబట్టి ఈ ప్రభుత్వం రైతుల పట్ల ఎంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుందో అర్థమవుతోంది.మా హయాంలో కచ్చితమైన చర్యలు⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి తుపానులు వచ్చే ముందు జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించే వాళ్లం. వలంటీర్లు, సచివాలయ సిబ్బందితో జిల్లా యంత్రాంగం కలిసి పనిచేసేది. కొత్త జిల్లాల ఏర్పాటుతో కలెక్టర్ల పరిధి తగ్గించాం. తక్కువ నియోజకవర్గాలకు ఎక్కువ మంది కలెక్టర్లు, జేసీలు వచ్చారు. ఇలాంటి విపత్తుల వేళ ప్రాణ నష్టం జరగకుండా కచ్చితమైన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసే వాళ్లం. కలెక్టర్ల చేతుల్లో కావాల్సినంత డబ్బులు పెట్టేవాళ్లం. ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా దగ్గరుండి చూసుకోమని చెప్పేవాళ్లం.⇒ వారం.. పది రోజుల టైం ఇస్తున్నాం.. ఎన్యుమరేషన్ పక్కాగా, పారదర్శకంగా చేయాలని చెప్పేవాళ్లం. తర్వాత ముఖ్యమంత్రి హోదాలో నేను ఏదో ఒక ప్రాంతానికి వెళ్లినప్పుడు కలెక్టర్ పనితీరు ఏలా ఉంది.. పంట నష్టం కోసం ఎన్యుమరేషన్ ఎలా జరిగింది.. అన్ని సదుపాయాలు మీకు కల్పించారా.. లేదా.. వంటి వివరాలు ప్రజలను అడిగి తెలుసుకునేవాణ్ని. ఏ ఒక్కరైనా అధికారులు బాగా చేయలేదని చెబితే ఉద్యోగం పీకేస్తామని గట్టిగా చెప్పే వాళ్లం. అందువల్ల అధికారుల్లో ఒక భయం ఉండేది. ఆకుమర్రు లాకు వద్ద పొలంలోకి వెళ్లి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటున్న వైఎస్ జగన్ ఈ–క్రాప్ను గాలికొదిలేశారు..⇒ ఏదైనా విపత్తు సంభవించినప్పుడు ఈ క్రాప్ అనేది రైతులకు శ్రీరామ రక్షగా నిలబడుతుంది. అలాంటిది ఈ ప్రభుత్వ హయాంలో ఈ–క్రాప్ తెరమరుగైపోయింది. పంట పొలంలో రైతులను నిలబెట్టి, జియో ట్యాగ్ చేసి, వారి ఫొటోతీసిసి అప్లోడ్ చేసే పరిస్థితి ఉండేది. ఈ రోజు ఈ–క్రాప్ నిర్వచనం మార్చేశారు. ఈ–క్రాప్ చేశామంటే చేశామన్నట్టుగా ఉంది. టీడీపీ వాళ్లయితే ఉన్న భూమి కంటే ఎక్కువగా సాగు చేసినట్టు చూపిస్తున్నారు.⇒ ఇందుకు బాపట్ల జిల్లాయే ఉదాహరణ. ఈ జిల్లాలోని పర్చురులో 112 శాతం, జే.పంగలూరులో 114 శాతం.. బల్లికురవలో 115 శాతం.. వేటపాలంలో 117 శాతం.. చీరాలలో 122 శాతం.. చినగంజాంలో 128 శాతం చొప్పున ఈ–క్రాప్ నమోదైనట్టుగా చూపించారు. అంటే ఉన్న భూమి కన్నా సాగైన భూమి ఎక్కువగా ఉందా? ఉన్నభూమి 100 శాతమైతే 128 శాతం విస్తీర్ణంలో సాగైనట్టు చూపిస్తున్నారు. అదెలా సాధ్యం! ఈ–క్రాప్ను ఏ విధంగా నీరుగారుస్తున్నారో ఇంతకంటే ఉదాహరణలు కావాలా?⇒ ఇలాంటి విపత్తుల వేళ కలెక్టర్లతో పాటు ఎమ్మెల్యేలు ప్రభావిత ప్రాంతాల్లో తిరిగే వారు. వారం, పది రోజుల తర్వాత నేను వెళ్లే వాడిని. పరిస్థితిని అంచనా వేసే వాళ్లం. ముఖ్యమంత్రి వస్తాడేమో అనే భయంతో ఎలాంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వకుండా కలెక్టర్లు పనిచేసే వారు. ఈ రోజు ప్రభుత్వ పనితీరు చూస్తుంటే.. ప్రభుత్వం ఉందో లేదో కూడా అర్థం కాని పరిస్థితి. ⇒ రైతుకు నష్టం వచ్చినా, కష్టం వచ్చినా పట్టించుకునే పరిస్థితి కన్పించడం లేదు. ఇంతటి విపత్కర పరిస్థితులు జరిగినప్పుడు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే.. ఒకరోజు చాపర్లో అలా అలా తిరుగుతాడు. మరుసటి రోజు లండన్ పోతాడు. ఆయన కొడుకు ఆ్రస్టేలియా నుంచి వస్తాడు.. మరుసటి రోజు ముంబైలో క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి పోతాడు. ఇక్కడ రైతుల పరిస్థితి ఏడవ లేక.. కడుపులో బాధ తట్టుకోలేక కొట్టుమిట్టాడుతున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణం. ఏ ఒక్క కౌలు రైతుకు కౌలు కార్డులు ఇవ్వడం లేదు. ఇస్తే వాళ్లకు పరిహారం ఇవ్వాల్సి వస్తుందనే దురాలోచనతో ఉన్నారు.ఎందుకు లెక్కలు తక్కువ చేసి చూపిస్తున్నారు?⇒ ఎన్యుమరేషన్ లెక్కలు ఎందుకు తక్కువ చేసి చూపిస్తున్నారు? తుపాను వల్ల దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, ఇంత పంట నష్టం ఎప్పుడు జరగలేదని మీ ఎల్లో మీడియాలో, మీ గెజిట్ పేపర్ ఈనాడులోనే తొలుత రాశారు. ఇప్పుడు ఎందుకు తగ్గించి రాస్తున్నారు? ఎన్యుమరేషన్ చేసేందుకు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు? ఎందుకు రైతులకు తోడుగా నిలబడలేకపోతున్నారు? పైగా ఎన్యుమరేషన్ చేస్తే మీ పంటను కొనుగోలు చేయం అని ఎందుకు భయపెట్టిస్తున్నారు? రైతుకు మంచి చేయాల్సిన ప్రభుత్వం ఎందుకు నష్టం చేసే కార్యక్రమాలు చేస్తోంది?⇒ మీ తప్పిదం వల్ల రైతులకు పంటల బీమా పరిహారం (ఇన్సూరెన్స్) డబ్బులు రావడం లేదు. ఇన్సూరెన్స్ డబ్బులు కట్టి ఉండి ఉంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మాదిరిగా నష్టపోయిన ప్రతి రైతుకు కనీసం రూ.25 వేలకు పైగా పరిహారం వచ్చేది. మీ తప్పిదం వల్ల వారికి ఈ పరిహారం అందకుండా పోయింది. ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తివేయడం వల్ల నష్టం జరిగింది. కాబట్టి ఇన్పుట్ సబ్సిడీతో పాటు ఇన్సూరెన్స్ డబ్బులు కూడా వచ్చేలా చేయాల్సిన బాధ్యత మీదే. అలా చేయాలని రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. 18 నెలల్లో 16 సార్లు రైతులు నష్టపోయారు. మీరు తగ్గించి, కోతలేసి వేసిన లెక్కల ప్రకారమే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రూ.600 కోట్లు ఇవ్వాలి. ఆ బకాయిలు కూడా వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. రబీ సీజన్ నుంచి ఉచిత పంటల బీమా పథకాన్ని వర్తింపచేయాలని కోరుతున్నా. -
అడుగుకో ఆంక్ష... రోడ్డుకో బారికేడ్!
గుడివాడ రూరల్: నాయకులకు నోటీసులు... కార్యకర్తలపై ఆంక్షలు... ప్రజలకు అడ్డంకులు... మొత్తంగా పర్యటనను విఫలం చేయడానికి కుయుక్తులు..! కానీ, అశేష జనం ముందు... వారి అభిమానం ముందు ఇవేమీ నిలవలేదు...! పోలీసులను అడ్డు పెట్టుకుని ప్రభుత్వం పన్నిన పన్నాగాలు విఫలమయ్యాయి. కృష్ణా జిల్లాలో మోంథా తుపాను బాధిత రైతులను పరామర్శించి, వారి పంట పొలాల పరిశీలనకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ చేపట్టిన కార్యకమ్రం దిగ్విజయమైంది. జగన్ పర్యటనను విఫలం చేయడమే లక్ష్యంగా ముందుగానే వైఎస్సార్సీపీ నియోజకవర్గాల ఇంచార్జిలు, ముఖ్య నాయకులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మాజీ ఎమ్మెల్యేలు, మండల, గ్రామ నాయకులను బెదిరించింది. తద్వారా జన సమీకరణ జరగకుండా అడ్డుకోవాలని ఎత్తు వేశారు. అయితే, ఇవేవీ ఫలించలేదు. పైగా ప్రజలు భారీగా, స్వచ్ఛందంగా తరలి వస్తుండడంతో ఇక ఓవర్ యాక్షన్కు దిగారు. దీనికి గోపువానిపాలెం ఘటన సరైన ఉదాహరణ. జగన్ వస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు గోపువానిపాలెం అడ్డ రోడ్డుకు చేరుకోగా పోలీసులు బారికేడ్లు, రోప్లతో అడ్డగించారు. రోడ్డు మార్జిన్లో నిల్చుని ఉన్నా చెదరగొట్టారు. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ సంగతి తెలిసిన పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ అక్కడకు వచ్చి ఎందుకు ఇన్ని ఆంక్షలు విధిస్తున్నారు? అంటూ ప్రశ్నించారు. అయితే, సమాధానం ఇవ్వకుండా వైఎస్సార్సీపీ శ్రేణులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. దీంతో కైలే అనిల్, ౖవైఎస్సార్సీపీ శ్రేణులు పమిడిముక్కల సీఐ తీరుపై మండిపడ్డారు. అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించడం సరికాదని హెచ్చరించారు. దారులు మూసి.. చెక్పోస్టులు పెట్టి... వైఎస్ జగన్ను చూసేందుకు అభిమానులు కార్లు, బైక్లు, ట్రాక్టర్లతో పాటు కాలినడకన తండోపతండాలుగా తరలిరావడంతో కూటమి ప్రభుత్వం పోలీసులను ఉసిగొలిపింది. వందలమందిని మోహరించి బారికేడ్లు, తాళ్లతో చెక్పోస్టులు పెట్టి అడ్డంకులు సృష్టించింది. వైఎస్ జగన్ పర్యటించే గ్రామాలకు ఉన్న అన్ని దారులను మూసివేయించింది. రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్ఎన్ గొల్లపాలెంలో మాత్రమే పర్యటించాలంటూ వైఎస్ జగన్కు సైతం షరతులు విధించింది. 500 మంది, 10 వాహనాలకు మాత్రమే అనుమతి అంటూ అధికార దర్పం చూపించింది. ప్రధాన కూడళ్లు జనసంద్రం... పోలీసుల అవాక్కు రైతులు వైఎస్ జగన్ను కలవకుండా భారీగా బలగాలను మోహరించినా, రోప్ పార్టీలతో అడ్డుకునే ప్రయత్నం చేసినా, ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదంటూ ఎక్కడికక్కడ నిలిపివేసినా ప్రధాన కూడళ్లు జనసంద్రంగా మారడం చూసి పోలీసులు అవాక్కయ్యారు. మరోవైపు కూటమి పాలనలో తమకు జరుగుతున్న అన్యాయాలు, ఎదురవుతున్న నిర్లక్ష్యంపై రైతులు, ప్రజలు జగన్కు వినతిపత్రాలు ఇచ్చారు. కాగా, రైతులు, ప్రజలు, అభిమానులు పోటెత్తడంతో వైఎస్ జగన్ పర్యటన ఉదయం 9.45 కు మొదలై సాయంత్రం 5 గంటల వరకు సాగింది. మచిలీపట్నం, గూడూరుల్లోనూ... మచిలీపట్నంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద నాయకులు, కార్యకర్తలు వైఎస్ జగన్ రాక కోసం వేచి ఉండగా బందరు డీఎస్పీ చప్పిడి రాజా ఇంతమంది ఇక్కడ ఉండొద్దంటూ చెదరగొట్టారు. బైక్లపై ర్యాలీగా కార్యకర్తలు, అభిమానులు వచ్చే క్రమంలో తాళాలు లాక్కునేందుకు ప్రయతి్నంచారు. మధ్యాహ్నం బ్రిడ్జి నీడ కింద ఉండగా ఇక్కడ ఉండొద్దని ఇనగుదురు సీఐ అత్యుత్సాహం ప్రదర్శించారు. వాహనాల పెగ్గులు తీసేయమని సిబ్బందికి హుకుం జారీ చేశారు. దీంతో పోలీసుల అత్యుత్సాహంపై మచిలీపట్నం వైఎస్సార్సీపీ నేత పేర్ని కిట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు, అభిమానులు మచిలీపట్నం వైపు వెళ్లకుండా చెక్పోస్టు ఏర్పాటు చేసి దారి మళ్లించారు. డ్రోన్ కెమెరాలతో వీడియోలు తీస్తూ పోలీసులు బెదిరింపులకు పాల్పడ్డారు. అంతకుముందు తాడిగడపలోనూ రైతులు, కార్యకర్తలను అడ్డుకున్నారు. ద్విచక్ర వాహనాలపై వస్తున్న యువతను ఆపి తాళాలు లాక్కున్నారు. మచిలీపట్నం, సుల్తాన్నగర్, ఎస్ఎన్ గొల్లపాలెంలో బారికేడ్లు పెట్టి ప్రజలను వెళ్లనివ్వలేదు. దీంతో రైతులు పొలాల నుంచి నడుచుకుంటూ జగన్ వద్దకు చేరుకున్నారు. గండిగుంట, నెప్పల్లి సెంటర్లో పోలీసులు ఆటంకాలు కల్పించారు. జగన్ కాన్వాయ్తో పాటు వస్తున్న వాహనాలను నిలిపివేశారు. పామర్రు, బల్లిపర్రుకు భారీగా చేరుకున్న రైతులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలను పోలీసులు ఆపేశారు. మచిలీపట్నం–విజయవాడ జాతీయ రహదారి నుంచి రామరాజుపాలెం వైపు ఎవరినీ రానివ్వకుండా అడ్డరోడ్డ వద్ద బారికేడ్లను పెట్టారు. పెడన నియోజకవర్గం గూడూరు మండలం రామరాజుపాలెం అడ్డరోడ్డు నుంచి గ్రామంలోకి ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు పెట్టారు. బందరు వైపు నుంచి సీతారామపురం గ్రామానికి వెళ్లే రోడ్డుపై బారికేడ్లతో ఓవర్యాక్షన్ చేశారు. కనీసం బైక్లనూ అనుమతించలేదు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. తుపాను కారణంగా నీట మునిగిన పంట పొలాలకు ఎవరూ వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. కేసులు నమోదు చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. వేమూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జి వరికోటి అశోక్బాబును అదుపులోకి తీసుకుని, ఆయనవెంట వచ్చిన వాహనాలతో పాటు స్టేషన్కు తరలించారు. సీతారామపురంలో ఎన్టీఆర్ విగ్రహం ఎదుట టీడీపీ జెండాలతో ఆ పార్టీ కార్యకర్తలు కవ్వించారు. అయినా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలతో పాటు ప్రతిఒక్కరూ అత్యంత సంయమనం పాటించారు. -
బాబు బూటకపు హామీలు.. రైతులను నట్టేట ముంచుతున్నారు
-
వైఎస్ జగన్ నుంచి జనాన్ని దూరం చేయలేరు: పేర్ని నాని
సాక్షి, విజయవాడ: వైఎస్ జగన్ నుంచి జనాన్ని దూరం చేయలేరని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా జనాన్ని ఆపలేరన్నారు. రైతులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడున్నారు?’’ అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. వైఎస్ జగన్ను పోలీసులు, ఆంక్షలు, నిర్బంధాలతో అడ్డుకోలేరు. చంద్రబాబు లాగా జనాల్ని పోగేసుకుని డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్ని నాని అన్నారు.‘‘వైఎస్ జగన్పై జనంలో విపరీతమైన ప్రేమ, అభిమానాలు ఉన్నాయి. ప్రతి కుటుంబంలో సభ్యుల్లాగా వైఎస్ జగన్ను ఓన్ చేసుకున్నారు. ఆంక్షలు నిర్బంధాల నడుమ పోలీసుల నోటీసులు ఇచ్చి కట్టడి చేసి జగన్ దగ్గరికి జనాలను రాకుండా ఆపలేరు. కృష్ణాజిల్లాలో ఒక్క మంత్రిగాని, వ్యవసాయ శాఖ మంత్రి గాని.. జిల్లా మంత్రిగాని ఒక్క ఎమ్మెల్యే గాని... రైతులకు జరిగిన నష్టాన్ని పొలంలోకి వచ్చి చూడలేదు. ఎల్లో మీడియాలో రావడానికి పొలంలో ఫోటోలకు పోజులు మాత్రమే ఇస్తారు. రైతు కష్టాన్ని పొలంలోకి వచ్చి విన్నవాడు ఎవరూ లేరు. వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడ నిద్రపోతున్నాడో తెలియదు’’ అంటూ పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్కు అడుగడుగునా ఘన స్వాగతం (ఫొటోలు)
-
రైతులకు అన్యాయం జరిగితే మరో పోరాటానికి సిద్ధం: వైఎస్ జగన్
కృష్ణా జిల్లా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. దారిపొడవునా ఆయనకు రైతులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. పెనమలూరు, పెడన, పామర్రు, మచిలీపట్నం నియోజకవర్గాల్లో వైఎస్ జగన్ పర్యటనలో భాగంగా మోంథా తుపానుతో నష్టపోయిన పంట పొలాలు పరిశీలించారు. బాధిత రైతులను పరామర్శించారు.04-11-20254: 30 PMఅనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ..విపత్తులు వస్తే రైతులను పట్టించుకోరా?ఏపీలో రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉందివిపత్తులు వచ్చినా రైతులను పట్టించుకోని పరిస్థితి మోంథా తపానుతో అత్యధికంగా వరిపంట నష్టం జరిగిందిగింజలు పాలు పోసుకునే సమయంలో దెబ్బతింది4 లక్షల ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న , అరటి, బొప్పాయి పంటలు దెబ్బతిన్నాయికూటమి పాలనలో రైతుల పంటలకు ఇన్సూరెన్స్ లేదు18 నెలల కూటమి పాలనలో 16 విపత్తుల వచ్చాయిఅన్నదాత సుఖీభవ పేరతో రైతులను మోసం చేశారురూ. 40 వేలు ఇవ్వాల్సింది కేవలం రూ. 5 వేలు మాత్రమే ఇచ్చారుమా హయాంలో రైతులకు భరోసా ఉండేదిజగనన్న ఉన్నాడనే భరోసా రైతులకు ఉండేదిప్రతీ రైతును ఆర్బీకేలు చేయిపట్టుకొని నడిపించాయిప్రతీ ఆర్బీకేలో అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ఉండేవాడుమా హయాంలో ఈ-క్రాప్ నమోదు చేసేవాళ్లంఈ క్రాప్తో ప్రతిరైతుకు న్యాయం జరిగేదిపంట కొనుగోలుకు కాంపిటేషన్ క్రియేట్ చేశాంరూ. 7,800 కోట్లతో పంటలకు గిట్టబాటు ధర ఉండేలా చేశాంరూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం85 లక్షల మంది రైతులకు మేం ప్రీమియం చెల్లించాంఇప్పుడు 19 లక్షల మంది రైతులకు మాత్రమే బీమా ఉంది ఉచిత పంటల బీమా తీసేయడం దారుణం కాదాఏ రైతు దగ్గరకు ఎన్యుమరేషన్ కోసం అధికారులు రాలేదుఒక్క రోజులోనే ఎన్యమురేషన్, ఆడిట్ అయిపోయిందిచంద్రబాబు తప్పిదం వల్లే..చంద్రబాబూ.. నీ తప్పిదం వల్లే రైతులకు ఉచిత పంట బీమా లేకుండా పోయిందిరైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద బకాయిలు పెట్టారుఆ బకాయిలను వెంటనే రైతులకు ఇవ్వాలని చంద్రబాబు నాయుడ్ని డిమాండ్ చేస్తున్నాంఏ రాష్ట్రంలో అయినా రైతు కన్నీర పెడితే మంచిది కాదురైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోంరైతులకు అన్యాయం జరిగితే వైఎస్సార్సీపీ తరుఫున పోరాటానికి సిద్ధమని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాకృష్ణా జిల్లా :మోంథా తుఫానుకు కారణంగా నేలకొరిగిన వరి పంటను పరిశీలించి రైతులతో మాట్లాడిన వైఎస్ జగన్పంట పొలాలను వైఎస్ జగన్ పరిశీలన బాధిత రైతులకు వైఎస్ జగన్ ఓదార్పుతుపాను దెబ్బకు తడిసిన కంకులను వైఎస్ జగన్కు చూపించిన రైతులు పంట నష్టం అంచనా వేయలేదంటూ రైతుల ఆవేదన 18నెలల కాలంలో ఇన్పుట్ సబ్సీడీ రాలేదన్న రైతులు రామరాజుపాలెం చేరుకున్న వైఎస్ జగన్ పంటపొలాలను పరిశీలించనున్న వైఎస్ జగన్పంటపొలాలను సందర్శించే చోట పోలీసుల పేరుతో వెలిసిన ఫ్లెక్సీలుజనం వెనక్కి వెళ్లిపోవాలంటూ హుకుంజగన్తో పాటు వస్తున్న వాహనాలను నిలిపేసిన పోలీసులుచెక్ పోస్టు పెట్టి బైకులు, కార్లు నిలిపివేతరైతులను కూడా తరిమేస్తున్న పోలీసులు మూడున్నర గంటలు ఆలస్యంగా జగన్ పర్యటనకృష్ణా జిల్లా గూడూరు చేరుకున్న వైఎస్ జగన్గూడూరుకు ఉదయం 11:30 గంటలకు రావాల్సి ఉన్నా మూడున్నర గంటలు ఆలస్యంవిజయవాడ నుండే రోడ్డు పొడవునా జగన్ స్వాగతం పలుకుతున్న రైతులు, మహిళలు, కార్యకర్తలుదారి మధ్యలో ప్రతిచోటా జగన్కు ఘన స్వాగతందారి పొడవునా జగన్కు తమ కష్టాలు చెప్తున్న రైతులుతుపాను దెబ్బకు తడిచిన వరి కంకులు, కుళ్లిపోయిన పసుపు, అరటి పిలకలను జగన్కు చూపిస్తూ భోరుమన్న రైతులుబాధిత రైతులను ఓదార్చిన జగన్గూడూరు చేరుకున్న వైఎస్ జగన్కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలోకి ఎంటరైన వైఎస్ జగన్గూడురు చేరుకున్న వైఎస్ జగన్వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలికిన మహిళలు,రైతులుదారి పొడవునా వైఎస్ జగన్కు అపూర్వ స్వాగతంరోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన మహిళలు, రైతులుతరకటూరు చేరుకున్న వైఎస్ జగన్పెడన నియోజకవర్గంలోకి ఎంటరైన వైఎస్ జగన్తరకటూరు చేరుకున్న జగన్నిడమోలులో వైఎస్ జగన్నిడుమోలు చేరుకున్న వైఎస్ జగన్రోడ్డుకు ఇరువైపులా భారీగా నిల్చున్న రైతులుఎండ తీవ్రతలోనూ జగన్ కోసం వేచి ఉన్న రైతులుకృష్ణా జిల్లాలో వైఎస్ జగన్కు అడుగడుగునా అపూర్వ స్వాగతంవైఎస్ జగన్ కోసం దారి పొడవునా ఎదురు చూస్తున్న అభిమానులుఈడుపుగల్లులో వైఎస్ జగన్ను కలిసిన మహిళా రైతులునష్టపోయినవ అరటి, వరి పంటను వైఎస్ జగన్ చూపించిన రైతులువరి కంకులను పరిశీలించిన వైఎస్ జగన్మచిలీపట్నంలో పోలీసుల ఆంక్షలుమచిలీపట్నం, సుల్తాన్నగర్, ఎస్ఎన్ గొల్లపాలెంలో బారికేడ్లు పెట్టిన పోలీసులుబారికేడ్లు పెట్టడంతో పొలాల మధ్య నుంచి వస్తున్న రైతులుపామర్రు: 14వ మైలురాయి వద్దకు చేరుకున్న వైఎస్ జగన్వైఎస్ జగన్కు స్వాగతం పలికిన రైతులు, మహిళలుదారిపొడవునా వైఎస్ జగన్కు ఘన స్వాగతంపామర్రు నియోజకవర్గంలో ప్రవేశించిన వైఎస్ జగన్గోపువానిపాలెం చేరుకున్న వైఎస్ జగన్గజమాలలతో జగన్కు స్వాగతం పలికిన కార్యకర్తలుభారీగా తరలివచ్చిన మహిళలు, వృద్ధులుదారి పొడవునా వైఎస్ జగన్కు ఘన స్వాగతంమచిలీపట్నంలో పోలీసుల ఓవరాక్షన్రైతులు, వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులుపోలీసుల తీరుపై పేర్ని కిట్టు ఆగ్రహంగండిగుంట చేరుకున్న వైఎస్ జగన్పూలు చల్లుతూ ఘనస్వాగతం పలికిన మహిళలుఆకునూరు సెంటర్ కి చేరుకున్న వైఎస్ జగన్జగన్ని కలిసి తమ కష్టాలు చెప్పుకున్న కల్లుగీత కార్మికులునెప్పల్లి సెంటర్లో పోలీసుల ఆటంకాలుజగన్తో వస్తున్న వాహనాలను నిలిపేస్తున్న పోలీసులుచెక్పోస్టు ఏర్పాటు చేసి వాహనాల దారి మళ్లింపుజగన్ కాన్వాయ్ తప్ప మిగతా వాహనాలను దారి మళ్లిస్తున్న పోలీసులునెప్పల్లి సెంటర్కు చేరుకున్న వైఎస్ జగన్వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలికిన రైతులు, మహిళలుదారిపొడవునా వైఎస్ జగన్కు ఘన స్వాగతంగోసాల సెంటర్లో జగన్ని కలిసిన మహిళా రైతులుతుపానుతో నష్టపోయిన అరటి, వరి పంటను జగన్ జగన్ కు చూపించిన రైతులుతమకు జరిగిన నష్టంపై జగన్కు వినతి పత్రాలు సమర్పించిన అన్నదాతలుఈడుపుగల్లులో జగన్ని కలిసిన మహిళా రైతులుతుపానుతో నష్టపోయిన అరటి, వరి పంటను జగన్ జగన్ కు చూపించిన రైతులుకంకిపాడు మండలం, నెప్పల్లి సెంటర్లో పోలీసుల ఆంక్షలువాహనాలు మచిలీపట్నం వైపు వెళ్లకుండా బారికేడ్లుడ్రోన్ కెమెరాలతో వీడియోలు తీస్తూ పోలీసులు బెదిరింపులుతాడిగడపలోనూ రైతులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారుబైక్ల తాళాలు లాక్కొని జగన్ను చూసేందుకు వెళ్లకుండా ఆంక్షలు వైఎస్ జగన్ నుంచి జనాన్ని దూరం చేయలేరు: పేర్ని నానిఎన్ని ఆంక్షలు పెట్టినా జనాన్ని ఆపలేరురైతులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదువ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడున్నారు?పెనమలూరు సెంటర్కి చేరుకున్న వైఎస్ జగన్భారీ బైకు ర్యాలీతో స్వాగతం పలికిన యూత్తాడిగడపలో పోలీసుల అత్యుత్సాహంబైక్లపై వస్తున్న యువతను అడ్డుకుంటున్న పోలీసులువైఎస్ జగన్తో పాటు వెళ్లకుండా అడ్డంకులుజగన్ను రైతులు కలవకుండా భారీగా పోలీసుల మోహరింపురోప్ పార్టీలతో అడ్డుకుంటున్న పోలీసులుపామర్రు: బల్లిపర్రుకు భారీగా చేరుకుంటున్న రైతులురైతులను, వైఎస్సార్సీపీ కార్యకర్తలను అడ్డుకుంటునన్న పోలీసులుకైలే అనిల్కుమార్తో పమిడిముక్కల సీఐ వాగ్వాదంరోడ్డు మీద ఉండొద్దంటూ పోలీసుల ఆంక్షలువిజయవాడ పడమట చేరుకున్న వైఎస్ జగన్గుమ్మడి కాయలతో దిష్టి తీస్తున్న మహిళలుభారీగా తరలి వచ్చిన కార్యకర్తలుపూలు చల్లుతూ ఘన స్వాగతంకృష్ణా జిల్లా పర్యటనకు బయల్దేరిన వైఎస్ జగన్తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న వైఎస్ జగన్పెనమలూరు, పెడన, పామర్రు, మచిలీపట్నం నియోజకవర్గాల్లో పర్యటించనున్న వైఎస్ జగన్మోంథా తుపానుతో నష్టపోయిన పంట పొలాలు పరిశీలనబాధిత రైతులను పరామర్శించనున్న వైఎస్ జగన్వైఎస్ జగన్ను కలవకుండా రైతులపై ఆంక్షలుజనాన్ని రాకుండా అడ్డుకోవడానికి వందల మంది పోలీసులు మోహరింపువైఎస్ జగన్ పర్యటించే గ్రామాలను బ్లాక్ చేసిన పోలీసులునేడు కృష్ణా జిల్లాలో మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న వైఎస్ జగన్తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించి.. రైతులతో మాట్లాడనున్న వైఎస్ జగన్రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్.ఎన్ గొల్లపాలెంలో మాత్రమే పర్యటించాలంటూ షరతులుకేవలం 500 మంది, 10 వాహనాలకు మాత్రమే అనుమతి అంటూ ఆంక్షలుద్విచక్ర వాహనాలకు ఎలాంటి అనుమతి లేదంటూ ఆంక్షలువైఎస్ జగన్ పర్యటనకు రావొద్దంటూ వైఎస్సార్సీపీ నాయకులకు నోటీసులుమాజీ ఎమ్మెల్యే లు, మండల, గ్రామ నాయకులకు నోటీసులతో బెదిరింపులు -
టీడీపీ మద్యం దందా మరోసారి బట్టబయలు
రాజమహేంద్రవరం సిటీ: రాజమహేంద్రవరం సిటీ టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడి ఆడియో టేపుతో రాష్ట్రంలో టీడీపీ నేతల మద్యం దందా మరోసారి బట్టబయలైందని రాజమండ్రి మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అనుచరుడు మద్యం సిండికేట్ వ్యవహారంలో ఆడియోతో రెడ్ హ్యాండెడ్గా దొరికాడని తెలిపారు. భరత్రామ్ సోమవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఒక్కో షాపునకు రూ.1.40 లక్షల చొప్పున ఎమ్మెల్యేకి మామూలివ్వాలంటూ టీడీపీ నాయకుడు, మాజీ కార్పొరేటర్ కిలపర్తి శ్రీనివాస్ ఫోనులో మాట్లాడిన సంభాషణ బయటకు వచ్చేసిందన్నారు. కిలపర్తి శ్రీనివాస్ టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు అత్యంత సన్నిహితుడని తెలిపారు.టీడీపీ నేతల మద్యం దందాకు సంబంధించి బయటకు వచ్చిన రెండో ఆడియో ఇది అని తెలిపారు. ఎమ్మెల్యేకు మామూళ్ల అమౌంట్ సెట్ చేసినట్లు ఆ ఆడియోలో స్పష్టంగా చెప్పారని అన్నారు. కొద్ది రోజుల క్రితం రాజమండ్రికే చెందిన మరో టీడీపీ నేత మజ్జి రాంబాబు ఎవరికెంత ముట్టజెప్పాలో మద్యం షాపుల యజమానులకు చెప్పిన ఆడియో బయటకు వచ్చిందన్నారు. ఇలా టీడీపీ ప్రజాప్రతినిధులు అనుచరుల ద్వారా ఏమాత్రం సిగ్గు లేకుండా, విచ్చలవిడిగా మద్యం దందా సాగిస్తున్నారని తెలిపారు.కిలపర్తి శ్రీను ఆడియో ఏఐ సృష్టి అంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై నెపం నెట్టేస్తున్నారని, కూటమి నేతల మద్యం దందా ప్రజలందరికీ తెలిసిందేనని, వీటిని ప్రజలు నమ్మే స్థితిలో లేరని, వారు ఎంత తప్పించుకోవాలని ప్రయత్నించినా కుదరదని స్పష్టం చేశారు. టీడీపీ నేతలే మద్యం దందా నడుపుతున్నారని. నకిలీ మద్యం తయారు చేస్తున్నారని స్పష్టం చేశారు. మద్యం వ్యవహారంలో అనుచరులతో నేరుగా దొరికినా సిటీ ఎమ్మెల్యేను ప్రభుత్వం ఎందుకు ఎమ్మెల్యే పదవి నుంచి తప్పించదని ప్రశి్నంచారు. చంద్రబాబుకు, లోకేశ్కు చిత్తశుద్ధి ఉంటే వాసును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని భరత్రామ్ డిమాండ్ చేశారు.భక్తులకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం వెంటనే దిగిపోవాలిరాష్ట్రంలో భక్తులకు రక్షణ కల్పించలేని కూటమి ప్రభుత్వం తక్షణమే దిగిపోవాలని భరత్రామ్ డిమాండ్ చేశారు. ఆలయాల్లో భక్తులు మృత్యువాత పడుతున్నా రక్షణ కల్పించలేని ప్రభుత్వం దేనికుందో అర్థం కావడం లేదని మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ ఆలయంలో 9 మంది భక్తుల మరణానికి ప్రభుత్వమే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి, సింహాచలం చందనోత్సవం నాడు కూడా భక్తులు చనిపోయారని, ఈ ఘటనలన్నింటికీ చంద్రబాబు కూటమి ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అన్నారు.గత గోదావరి పుష్కరాల్లో రాజమహేంద్రవరంలో 29 మంది చనిపోవడానికి కూడా చంద్రబాబే కారణమని చెప్పారు. ఆయన ప్రచార పిచ్చికి 29 మందిని బలి తీసుకున్నారని తెలిపారు. కాశీబుగ్గ ఆలయ నిర్మాణదారుపై కేసు పెట్టారని, గతంలో తిరుపతిలో జరిగిన దుర్ఘటనలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై ఎందుకు కేసు పెట్టలేదని నిలదీశారు. సింహాచలం ఘటనలో ఆ క్షేత్ర వంశపారంపర్య ధర్మకర్త అశోక్ గజపతిరాజుపై ఎందుకు కేసు పెట్టలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం, నిజస్వరూపం ప్రజలకు తెలిసిపోతుందనే ఉద్దేశంతో, వారి దృష్టి మళ్లించేందుకే వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ను కూటమి పెద్దలు అరెస్టు చేశారన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి అసలు ప్రభుత్వం వద్ద ఉన్న సాక్ష్యమేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. -
అమెరికాలో కూతురి పెళ్లి.. అంబటి రాంబాబు స్పందన
-
చేవెళ్ల ఘటన అత్యంత విషాదకరం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: తెలంగాణలోని చేవెళ్ల దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాజాగా ప్రమాదంపై వైఎస్ జగన్ స్పందించారు. రోడ్డు ప్రమాద ఘటన అత్యంత విషాదకరం, బాధాకరమని.. తీవ్రంగా కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. -
విజయవాడ సబ్ జైలుకు జోగి రమేష్
-
మహిళల క్రికెట్ జట్టుకు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: వరల్డ్ కప్లో మహిళా క్రికెట్ టీమ్ విజయం సాధించటంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. ఈ అద్భుతమైన విజయం భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాధ్యాయంగా నిలిచిపోతుందన్నారు. కడప అమ్మాయి శ్రీచరణి ఛాంపియన్ జట్టులో భాగం కావడం విశేషం అని అన్నారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. టీంవర్క్, వారి ఆత్మవిశ్వాసం దేశాన్ని గర్వపడేలా చేసింది. వరల్డ్కప్ను అందుకుంది. కడప అమ్మాయి శ్రీచరణి ఛాంపియన్ జట్టులో భాగం కావడం విశేషం. ఈ అద్భుతమైన విజయం భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాధ్యాయం. ఈ గెలుపు ప్రతి భారతీయుడు పెద్ద కలలు కనడానికి ఒక ప్రేరణ’ అని అభినందనలు తెలిపారు. The Indian women’s cricket team has scripted history at the DY Patil Stadium in Navi Mumbai, winning the World Cup after a thrilling match.The teamwork, confidence, and passion they have shown made the entire nation proud.It's great to see that a Kadapa girl, Sricharani, is… pic.twitter.com/Cw1tdFdvB4— YS Jagan Mohan Reddy (@ysjagan) November 3, 2025 -
ఒక్క ఆధారం ఉంటే ఒట్టు!
సాక్షి, అమరావతి: జోగి రమేష్కు వ్యతిరేకంగా సిట్ అధికారులు ఒక్కటంటే ఒక్క ఆధారాన్ని కూడా రిమాండ్ నివేదికలో చూపించలేక పోయారు. వారు బెదిరించి జనార్దనరావుతో నమోదు చేయించిన అబద్దపు వాంగ్మూలం ఆధారంగానే న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు. జోగి రమేష్, జనార్దనరావు మధ్య.. జోగి రమేష్, జయచంద్రారెడ్డిలమధ్య వ్యాపార లావాదేవీలు, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఒక్క ఆధారం కూడా చూపలేదు. అదే సమయంలో జయచంద్రారెడ్డి, జనార్దనరావు మధ్య వ్యాపార సంబంధాలు ఉన్న విషయాన్ని ప్రస్తావించారు.జయచంద్రారెడ్డికి టీడీపీ అధిష్టానానికి మధ్య రాజకీయ బంధం, అనుబంధం ఉందని సిట్ అధికారులు పేర్కొన్నారు. మరి నకిలీ మద్యం మాఫియాలో పాత్రధారి అయిన జయచంద్రారెడ్డి వెనక సూత్రదారులుగా ఉన్న టీడీపీ పెద్దలపై విచారణ ఎందుకు చేపట్టలేదో సిట్ అధికారులకే తెలియాలి. ఈ రిమాండ్ నివేదికలో జోగి రమేష్ వాంగ్మూలం ఇచ్చినట్టు, ఆయన సంతకం చేసినట్టు సిట్ ప్రస్తావించక పోవడం గమనార్హం. అంటే సిట్ అధికారుల నిరాధార ప్రశ్నలతో కూడిన కుట్రను విచారణ సందర్భంగా ఆయన తిప్పికొట్టినట్టు స్పష్టమవుతుంది. అంతా కట్టుకథ అని తెలుస్తోంది.కాగా, జోగి రమేష్æ ఏ–18, జోగి రాము ఏ–19గా చూపించారు. ఈ కేసులో మరో నలుగురిని ఏ–20గా మనోజ్ కొఠారి, ఏ–21గా సుదర్శన్, ఏ–22గా సింథిల్, ఏ–23గా ప్రసాద్ను తాజాగా చేర్చారు. ఇప్పటి వరకు మొత్తం 23 మందిపై కేసు నమోదైంది. టీడీపీ పెద్దలే కర్త, కర్మ, క్రియగా సాగిన నకిలీ మద్యం మాఫియా కేసును పక్కదారి పట్టిస్తూ సిట్ అధికారులు రిమాండ్ రిపోర్టును రూపొందించడం విస్మయ పరుస్తోంది. ఆదివారం అర్ధరాత్రి విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో జోగి రమేష్ను హాజరు పరిచిన నేపథ్యంలో సమర్పించిన రిమాండ్ నివేదిక ప్రభుత్వ కుట్రను స్పష్టం చేసింది. కేసులో వాదనలు అర్ధరాత్రి 1.30 గంటల వరకు కొనసాగుతూనే ఉన్నాయి.⇒ జయచంద్రారెడ్డి 2024 ఎన్నికల్లో తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి. ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది టీడీపీయే. ఆయనకు మద్యం దుకాణాలు మంజూరైంది టీడీపీ ప్రభుత్వ హయాంలోనే. ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం తయారుచేసి విక్రయించిందీ ఆ మద్యం దుకాణాల ద్వారానే. అంటే ఆయన రాజకీయ జీవితం, వ్యాపార వ్యవహారాలన్నీ టీడీపీతోనే ముడిపడ్డాయి. ఈ విషయాలన్నింటినీ సిట్ రిమాండ్ నివేదిలో పేర్కొంది. కానీ టీడీపీ నేత జయచంద్రారెడ్డి, ఆయన సన్నిహితుడు అద్దేపల్లి జనార్దనరావు ఈ నకిలీ మద్యం దందా అంతా వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ చెబితే చేశారట! వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా న్యాయస్థానాన్ని బురిడీ కొట్టించేందుకు ప్రభుత్వం ఇలా బరితెగించి సిట్తో కుతంత్రాలు చేయించింది. ⇒ ఈ కేసులో ఏ1గా అద్దేపల్లి జనార్దనరావును కేంద్రబిందువుగా చేసుకుని సిట్.. జోగి రమేష్కు వ్యతిరేకంగా కుట్ర పన్నిందని స్పష్టమవుతోంది. టీడీపీ తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్చార్జి జయచంద్రారెడ్డి, జనార్దనరావు వ్యాపార భాగస్వాములు, సన్నిహితులని సిట్ చెబుతోంది. కానీ జనార్దనరావు.. జోగి రమేష్కు సన్నిహితుడని నమ్మించేందుకు సిట్ కట్టుకథలు అల్లింది. ⇒ జోగి రమేష్ చెబితేనే జనార్దనరావు నకిలీ మద్యం తయారీకి సిద్ధపడ్డారని సిట్ చెప్పడం విడ్డూరంగా ఉంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ చెబితే ఆయన ఎందుకు చేస్తారనే కనీస అవగాహన ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది. వారిద్దరూ (జనార్దనరావు, జయచంద్రారెడ్డి) ఎన్నో ఏళ్లుగా ఆఫ్రికాలో ఇదే తరహా నకిలీ మద్యం వ్యాపారం నిర్వహించారని అదే నివేదికలో సిట్ పేర్కొంది. అటువంటి చరిత్ర ఉన్న జయచంద్రారెడ్డికి టీడీపీ ఎందుకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందన్న విషయాన్ని సిట్ అధికారులు ఉద్దేశ పూర్వకంగానే పట్టించుకోలేదు. ఎందుకంటే రాష్ట్రంలో నకిలీ మద్యం దందాకు పాల్పడాలనే కుట్రతోనే ఆయనకు టీడీపీ టికెట్ ఇచ్చింది. అందుకే ఆ అంశాన్ని సిట్ రిమాండ్ రిపోర్ట్లో పొందుపర్చలేదు.నేను ఏ తప్పూ చేయలేదున్యాయమూర్తి ఎదుట జోగి రమేష్తాను ఏ తప్పు చేయలేదని, నకిలీ మద్యం వ్యవహారంతో తనకు ఏమాత్రం సంబంధం లేదని జోగి రమేష్ న్యాయమూర్తి ఎదుట స్పష్టం చేశారు. పాత విషయాలను దృష్టిలో పెట్టుకుని తనపై కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని వాపోయారు. సీఎం చంద్రబాబు తనను ఈ కేసులో అక్రమంగా ఇరికించారని ఆవేదన వ్యక్తంచేశారు. కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటలో తొమ్మిది మంది భక్తులు చనిపోవడం, తుపాను సహాయక చర్యల్లో ప్రభుత్వం వైఫల్యం చెందడంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు తనను అరెస్టు చేశారని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో ఏం జరుగుతోందో ప్రజలు గమనిస్తున్నారని, పైన దేవుడు కూడా చూస్తున్నాడన్నారు. -
జోగి రమేష్ అరెస్టు ముమ్మాటికీ అక్రమమే
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి జోగి రమేష్ అక్రమ అరెస్టును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో అడ్డంగా మీరు దొరికిపోయి.. దాని నుంచి తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ తమ పార్టీకి చెందిన బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ను అన్యాయంగా అరెస్టు చేశారంటూ సీఎం చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జోగి రమేష్ అరెస్టు ముమ్మాటికీ అక్రమమేనని స్పష్టం చేశారు. బాబు డైవర్షన్ పాలిటిక్స్ హ్యాష్ ట్యాగ్తో ఆదివారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ⇒ ‘చంద్రబాబు గారూ.. మీ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో అడ్డంగా మీరు దొరికిపోయి, దీని నుంచి తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ను అన్యాయంగా అరెస్టు చేశారు. ముమ్మాటికీ ఇది అక్రమ అరెస్టు. జోగి రమేష్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. ⇒ గత 18 నెలలుగా ప్రభుత్వం మీది.. పాలన మీది. పట్టుబడ్డ నకిలీ మద్యం మీ హయాంలోనిది. పట్టుబడ్డ వారిలో మీ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి మొదలు.. మీతోనూ, మీ కొడుకుతోనూ, మీ మంత్రులతోనూ, మీ ఎమ్మెల్యేలతోనూ అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నవారే. ⇒ మీరు తయారు చేసిన మీ నకిలీ మద్యాన్ని అమ్మేది మీరు తీసుకు వచ్చిన మీ ప్రైవేటు లిక్కర్ షాపుల్లో.. మీ కార్యకర్తలు, నాయకులు నడిపే బెల్టు షాపులు, పరి్మట్ రూముల్లోనే. మరి తయారీ మీది, చేసిన వారు మీ వారు, అమ్మేదీ మీ వారే.. కానీ బురదజల్లేది, అక్రమ అరెస్టులు చేసేది మాత్రం మావాళ్లని. ⇒ నిన్న కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటకు కారణమైన ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి, మోంథా తుపాను కారణంగా కుదేలైన రైతుల గోడును పక్కదోవ పట్టించడానికి ఈ అక్రమ అరెస్టుకు పాల్పడి, దుర్మార్గానికి ఒడిగట్టారు. నకిలీ మద్యం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలంటూ జోగి రమేష్ హైకోర్టులో పిటిషన్ వేసిన మరుసటి రోజే అరెస్టుకు దిగారంటే మీరు ఎంతగా భయపడుతున్నారో అర్థం అవుతోంది చంద్రబాబు గారూ.. నకిలీ మద్యం వ్యవహారంలో మీ ప్రమేయం, మీ మనుషుల ప్రమేయం లేకపోతే సీబీఐ చేత విచారణకు భయమెందుకు చంద్రబాబు గారూ? ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? మీ జేబులో ఉన్న సిట్ మీరు ఏం చెబితే అది చేస్తుంది. మీరు సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్. మీ మాఫియా వ్యవహారాల మీద మీరే విచారణ చేయించడం హాస్యాస్పదం కాదా? ఇలాంటి రాక్షస పాలనలో మీ నుంచి ఏమి ఆశించగలం!?. -
జోగి రమేష్ అక్రమ అరెస్ట్
సాక్షి ప్రతినిధి, విజయవాడ: నకిలీ మద్యం కేసులో వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో ఆదివారం ఉదయం అక్రమంగా అరెస్టు చేసింది. నకిలీ మద్యం తయారీ, సరఫరా, విక్రయాలు అన్నీ అధికార టీడీపీ నేతల కనుసన్నల్లోనే సాగినట్లు బట్టబయలైనా, డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా అద్దేపల్లె జనార్దనరావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా జోగి రమేష్ను ఈ కేసులో అక్రమంగా ఇరికించారు. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ , ఆయన సోదరుడు జోగి రాము నివాసాల వద్దకు ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు సిట్, ఎక్సైజ్, పోలీస్ శాఖల అధికారులు చేరుకున్నారు.జోగి రమేష్ ఇంట్లో ఉండటంతో తలుపులు తోసుకొని లోపలికి ప్రవేశించే యత్నం చేశారు. మూడున్నర గంటలపాటు హడావుడి చేశారు. ఉదయం 8గంటలకు జోగి రమేష్ బయటకు రాగానే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన్ను పోలీస్ వ్యాన్లో బలవంతంగా ఎక్కించి, విజయవాడ గురునానక్ కాలనీలో ఉన్న తూర్పు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. జోగి రమేష్ సోదరుడు రాము, జోగి రమేష్ వ్యక్తిగత కార్యదర్శి ఆరేపల్లి రామును కూడా అరెస్టు చేసి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. రమేష్ ను అరెస్ట్ చేయొద్దని ఆందోళన జోగి రమేష్ ఇంటికి పోలీసులు వచ్చిన విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. జోగి రమేష్ ను అక్రమంగా అరెస్ట్ చేస్తుండటాన్ని నిరసిస్తూ ప్రధాన గేటు ముందు బైఠాయించారు. సీఎం చంద్రబాబు డౌన్ డౌన్.. నారా వారి సారా రాజ్యం నశించాలి.. అంటూ నినాదాలు చేశారు. ఈ దశలో పోలీసులు, నాయకుల మధ్య తీవ్ర∙వాగ్వాదం జరిగింది. ఎక్సైజ్ కార్యాలయం వద్ద నిరసన జోగి రమేష్ను అరెస్ట్ చేసి విజయవాడలోని తూర్పు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కు తరలించారని తెలియడంతో పెద్ద సంఖ్యలో వైఎస్సార్సీపీ శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి. ఆయన అక్రమ ఆరెస్టును నిరసిస్తూ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. కృష్ణా, ఎన్టీఆర్, జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షులు పేర్ని నాని, దేవినేని అవినాష్, ఎమ్మెల్సీలు తలశిల రఘరాం, లేళ్ల అప్పిరెడ్డి, రుహూల్లా, నియోజకవర్గ ఇన్చార్జులు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, కైలే అనిల్కుమార్, ఉప్పాల రాము, తన్నీరు నాగేశ్వరరావు, దేవభక్తుని చక్రవర్తి, పార్టీ నేతలు నాగార్జున, తిరుపతిరావు, రవిచంద్ర, అవుతు శ్రీనివాసరెడ్డి, పోతిన మహేష్ , జెడ్పీ వైస్ చైర్మన్ జి.శ్రీదేవి, కొండపల్లి మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ జి.శ్రీనివాస్ తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు. కాగా, రాత్రి జోగి రమేష్ను వైద్య పరీక్షల నిమిత్తం ఎక్సైజ్ పోలీసులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. రాత్రి పొద్దుపోయే వరకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఎక్సైజ్ కార్యాలయం వద్దే ఉన్నారు. చంద్రబాబు పిచ్చకి పరాకాష్ట – జోగి రమేష్ , మాజీ మంత్రి చంద్రబాబునాయుడు నా మీద కక్ష కట్టాడని 20 రోజులుగా చెబుతున్నాను. అందులో భాగమే ఈ అక్రమ అరెస్టు. ఇది దుర్మార్గమైన చర్య. నా భార్య, బిడ్డల సాక్షిగా ప్రమాణం చేసి చెప్పాను.. కనకదుర్గమ్మ వారి దగ్గరకు తీసుకువెళ్లాను.. ప్రమాణం చేసి చెప్పాను. అయినా చంద్రబాబునాయుడు రాక్షస ఆనందం తీరలేదు. చంద్రబాబు దుర్మార్గానికి, పిచ్చికి ఇది పరాకాష్ట. కాశీబుగ్గలో తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది మృతి చెందిన సంఘటనను డైవర్షన్ చేసేందుకు కుట్ర పన్నారు. నన్ను అక్రమంగా అరెస్టు చేసిన చంద్రబాబునాయుడు, లోకేశ్.. ఖబడ్దార్.. మీకు భార్య, పిల్లలు ఉన్నారు. మీకు కుటుంబం ఉంది. నన్ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ప్రజలంతా గమనిస్తున్నారు. జోగి సోదరుల ఇళ్లల్లో క్లూస్ టీమ్ తనిఖీ జోగి రమేష్ , జోగి రాముల అరెస్ట్ అనంతరం వారి నివాసాల్లో సిట్ సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో సిట్, ఎక్సైజ్, పోలీస్, క్లూస్ టీమ్ బృందాల్లోని సభ్యులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. సీసీ టీవీ పుటేజీలు, హార్డ్ డిస్్కలు, సెల్ఫోన్లు, కంప్యూటర్లు పరిశీలించారు. పలు ఎల్రక్టానిక్స్ వస్తువులను రెండు బాక్సుల్లో ప్యాక్ చేసి వారితోపాటు తీసుకెళ్లారు. బీసీల ఎదుగుదల ఓర్చుకోలేకే అక్రమ అరెస్టుజోగి రమేష్ సతీమణి శకుంతలమ్మ ఆవేదన సాక్షి ప్రతినిధి, విజయవాడ: ‘బీసీ సామాజికవర్గానికి చెందిన వాళ్లం కాబట్టి మా రాజకీయ ఎదుగుదలను చూసి తట్టుకోలేక చంద్రబాబునాయుడు, లోకేశ్ మాపై కక్షగట్టారు. ఒక బీసీ నాయకుడు నా ఇంటి దగ్గరకు రావడమేంటని కక్ష పెంచుకొని నా భర్త జోగి రమేష్ను అణిచివేయాలని చూస్తున్నారు’ అని ఆయన సతీమణి జోగి శకుంతలమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. జోగి రమేష్ అరెస్టు అనంతరం ఆమె తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. గతంలో తన కొడుకు జోగి రాజీవ్ను, ఇప్పుడు తన భర్త జోగి రమేష్ను అక్రమంగా అరెస్ట్ చేయడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తంచేశారు.గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అయ్యన్నపాత్రుడు చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పించేందుకే తన భర్త.. చంద్రబాబు ఇంటి దగ్గరకు వెళ్లారన్నారు. ఆ సమయంలో టీడీపీ నాయకులే తన భర్త కారుపై దాడి చేశారని గుర్తు చేశారు. కానీ ఆ సంఘటనను చంద్రబాబు ఇంటి మీద దాడిగా చిత్రీకరించారని ఆమె వాపోయారు. అది మనసులో పెట్టుకొని చంద్రబాబు నాయుడు, లోకేశ్లు పరిపాలన గాలికొదిలేసి తమ కుటుంబం మీద కక్ష సాధింపు చర్యలకు దిగారన్నారు. చంద్రబాబు నాయుడుకు మనస్సాక్షి అనేది ఉంటే కొంచెం అయినా ఆలోచించాలని హితవు పలికారు. ప్రభుత్వ వైఫల్యాలను నిరంతరం ప్రశ్నిస్తున్నందుకే తన భర్తను అణిచివేసేందుకు పూనుకున్నారని ఆమె మండిపడ్డారు. హక్కులను కాలరాస్తూ... రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ పోలీసులు తమ ఇంటి వద్ద ప్రవర్తించిన తీరు భయాందోళన కలిగించిందని జోగి శకుంతలమ్మ చెప్పారు. నిద్రపోతున్న సమయంలో ఇంటి మీదకు వచ్చి.. డోర్లు కొట్టి.. భయానక వాతావరణాన్ని సృష్టించారని ఆందోళన వ్యక్తంచేశారు. డోర్లు తెరవకపోతే పగలకొడతాం అని వాచ్మెన్ను బెదిరించారన్నారు. తాను నిర్దోషి అని తన భర్త కనకదుర్గమ్మ అమ్మవారి దగ్గర కుటుంబ సభ్యులందరి సమక్షంలో ప్రమాణం చేశారని గుర్తు చేశారు.తన భర్త మీద ఎవరైతే నకిలీ మద్యం కేసులో అసత్య ఆరోపణలు చేస్తున్నారో వారంతా ఆయన తప్పు చేశాడని ప్రమాణం చేసి చిత్తశుద్ధి చాటుకోవాలని ఆమె సవాల్ విసిరారు. తప్పు చేసి ఉంటే ఎటువంటి శిక్షకైనా సిద్ధంగా ఉంటామన్నారు. కానీ, ఏ తప్పు చేయకుండా తమ కుటుంబ సభ్యులను ఈ రకంగా హింస పెట్టడాన్ని చంద్రబాబు విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. దేవుడు అన్నీ చూస్తున్నాడని, తన భర్త జోగి రమేష్ , మరిది జోగి రాము కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఆమె ధీమా వ్యక్తంచేశారు. -
అవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే!
టెక్కలి: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీవెంకటేశ్వర ఆలయంలో ప్రభుత్వ వైఫల్యంతోనే భక్తుల తొక్కిసలాట జరిగి భక్తులు మరణించారని.. అవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని శాసనమండలి లో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణతోపాటు వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కో–ఆర్డినేటర్ కన్నబాబు, పార్లమెంట్ పరిశీలకుడు కుంభా రవిబాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాసు, పార్లమెంట్ సమన్వయకర్త తమ్మినేని సీతారాం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో సనాతన ధర్మ పరిరక్షణ చేస్తున్నామంటూ సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రచారాలకు.. రాష్ట్రంలో దేవాలయాల్లో వరుసగా జరుగుతున్న దుర్ఘటనలకు ఎలాంటి పొంతన కనిపించడంలేదని వారు ఆరోపించారు. భక్తుల తొక్కిసలాట సంఘటనపై ఆదివారం మాజీమంత్రి సీదిరి అప్పలరాజు నేతృత్వంలో వైఎస్సార్సీపీ నాయకులంతా సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వీరితో పాటు జెడ్పీ చైర్మన్లు మజ్జి శ్రీనివాస్, పిరియా విజయ, ఎమ్మెల్సీలు నర్తు రామారావు, పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యేలు గొర్లె కిరణ్, కొర్ల భారతి, విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు కిల్లి సత్యనారాయణ, ఇతర అనుబంధ విభాగాల నేతలు పాల్గొన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి..కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన సంఘటనపై ఎవరు బాధ్యత వహిస్తారో స్పష్టంచేయాలి. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన చేస్తున్నారు. అందుకే దేవుడికి కోపం వస్తోంది. ప్రభుత్వ వైఫల్యంతో ఈ ఘోరం జరిగింది. ఘటనను పక్కదారి పట్టించేందుకు ప్రైవేట్ ఆలయం అంటూ తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పునైనా పరిహారం అందజేయాలి. కాశీబుగ్గ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. ఓ ప్రధాన పత్రికలో పోలీసుల వైఫల్యం అంటూ రాశారు. పెద్ద ఎత్తున భక్తులు వస్తారని ముందస్తుగా సమాచారం ఉన్నా ఎందుకు బందోబస్తును ఏర్పాటు చేయలేదు – బొత్స సత్యనారాయణ, శాసనమండలి ప్రతిపక్ష నేత రూల్బుక్పై శ్రద్ధ లేదా?దేవాలయాల పరిరక్షణ గాలికొదిలేశారు. రెడ్బుక్ రాజ్యాంగం తప్ప రూల్బుక్పై టీడీపీ కూటమి ప్రభుత్వం దృష్టిసారించడంలేదు. నిర్లక్ష్యం, వైఫల్యాలతో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యంతో జరిగిన సంఘటనలో ఆలయ ధర్మకర్తపై కేసులు పెట్టేందుకు ప్రయత్నించడం ప్రభుత్వ చేతకానితనం. చంద్రబాబు తుపాను కట్టడి చర్యలు ఏమయ్యాయి? సనాతన ధర్మ పరిరక్షణ చేతకాకపోతే తప్పుకోవాలి. కల్తీ మద్యం వ్యవహారంలో జయచంద్రారెడ్డి, జనార్ధన్ను ఎందుకు అరెస్టుచేయడంలేదు. వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్పై ఎలాగోలా కేసు కట్టాలనే తాపత్రయం కనిపిస్తోంది. కేవలం ఆలయం సంఘటనను డైవర్ట్ చేయడానికే అరెస్టులు చేస్తున్నారు. – కురసాల కన్నబాబు, వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కో ఆర్డినేటర్ భక్తులకు భద్రత కల్పించలేకపోతున్నారు..కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంతో పాటు జంట పట్టణాల్లో పోలీసుల మోహరింపు, కట్టడి చర్యలు చూస్తుంటే ఇదే శ్రద్ధ ముందే తీసుకుని ఉంటే ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదనిపిస్తోంది. గతంలో తిరుపతి, సింహాచలంలో జరిగిన సంఘటనల్లో ఎంతమందిపై చర్యలు తీసుకున్నారో చెప్పాలి. ఇలాంటి విఫల ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదు. – ధర్మాన కృష్ణదాసు, వైఎస్సార్సీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు పాలన గాలికొదిలేశారు..రాష్ట్రంలో ప్రజల ప్రాణాలు, పాలన గాలికొదిలేశారనడానికి కాశీబుగ్గ తొక్కిసలాటే ఉదాహరణ. తిరుపతి సంఘటనలో కూటమి ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టలేదు. కనీసం సింహాచలం సంఘటనతో కూడా చలనం కలగలేదు. గతంలో చంద్రబాబు ఓవరాక్షన్తో పుష్కరాల్లో ఎంతోమంది చనిపోయారు. ఇప్పుడు కాశీబుగ్గలో ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వం యంత్రాంగం నిర్లక్ష్యం కనిపిస్తోంది. – తమ్మినేని సీతారాం, వైఎస్సార్సీపీ పార్లమెంట్ సమన్వయకర్తఎందరిపై కేసు కట్టారు?కాశీబుగ్గలో జరిగిన సంఘటనలో ప్రభుత్వం తప్పించుకునే ధోరణి కనిపిస్తోంది. ఆలయ ధర్మకర్త పండాను అరెస్టుచేయాలని చూస్తున్నారు. అయితే, గతంలో తిరుపతి, సింహాచలంలో జరిగిన సంఘటనల్లో అక్కడ ధర్మకర్తల్లో ఎంతమందిని అరెస్టుచేశారో చెప్పాలి. – సీదిరి అప్పలరాజు, మాజీమంత్రి -
కాశీబుగ్గ ఆలయ ఘటనపై... న్యాయ విచారణ జరిపించాలి
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వరసామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది భక్తులు చనిపోవడం దురదృష్టకరం. మృతిచెందిన వారికి వైఎస్సార్సీపీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఈ ఘటనలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం. అదే సమయంలో ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి. అప్పుడే వాస్తవాలు బయటకొస్తాయి’ అని వైఎస్సార్సీపీ పేర్కొంది. కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం జరిగిన తొక్కిసలాటలో మరణించినవారికి సంతాపం తెలియజేస్తూ ఆదివారం సాయంత్రం వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీలు నిర్వహించింది. ‘ఏదైనా దుర్ఘటన జరిగిన తర్వాత సానుభూతి తెలియజేయడం, లేదంటే ఖండించడం చంద్రబాబు ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలల కాలంలో ఇది మూడో దుర్ఘటన. తిరుపతి, సింహాచలం, ఇప్పుడు కాశీబుగ్గతో కలిసి మూడు ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలి.’ అని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. దుర్ఘటనలు జరగకుండా ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? ‘తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు, సింహాచలం ఘటనలో ఏడుగురు భక్తులు చనిపోయారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? అదే విషయాన్ని మేం ప్రశ్నిస్తే.. రాజకీయం చేస్తున్నామంటూ మా మీద బురదజల్లేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కాశీబుగ్గ దేవాలయం ఏప్రిల్లో ప్రారంభమైంది. అప్పటి నుంచి భక్తులు దర్శనానికి వస్తున్నారు. ప్రతి శనివారం 1,500 నుంచి 2,000 మంది భక్తులు వస్తున్నారు. కార్తీక ఏకాదశి కాబట్టి నిన్న(శనివారం) భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం అంచనా వేయాల్సిన అవసరం ఉంది. కానీ, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆలయ నిర్వాహకులు ముందస్తు సమాచారం ఇవ్వలేదని బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. ఆలయ నిర్వాహకుడు మాత్రం ముందురోజే పోలీసులకు సమాచారం ఇచ్చామని చెబుతున్నారు. అయినా ప్రభుత్వ యంత్రాంగం సక్రమంగా స్పందించలేదు. ఈ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం నడుస్తుందా? భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో స్పష్టం చేయాలి. ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాల వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. కాశీబుగ్గ ఘటనకు ముఖ్యమంతి, మంత్రులు, అధికారులు... ఎవరు బాధ్యత వహిస్తారు’ అని వైఎస్సార్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. -
ప్రైవేటు పేరుతో పలాయనం
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది అమాయక భక్తులు ప్రాణాలు కోల్పోతే కూటమి ప్రభుత్వం ‘అది ప్రైవేట్ గుడి’ అంటూ తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంటే.. అలాంటి ప్రైవేట్ ఆలయాల్లో సైతం గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం భక్తుల భద్రతకు పట్టిష్ట చర్యలు చేపట్టిందని దేవదాయ శాఖ వర్గాల్లో చర్చ సాగుతోంది. కేవలం పది నెలల వ్యవధిలో తిరుపతి.. సింహాచలం.. వరుస దుర్ఘటనల అనంతరం తాజాగా కాశీబుగ్గ విషాదం. ఈ ఘటనల్లో పదుల సంఖ్యలో భక్తులు ప్రాణాలు కోల్పోయినప్పటికీ, భద్రతా చర్యల విషయంలో తన వైఫల్యాన్ని పూర్తిగా కప్పిపుచ్చుకోవడానికి కూటమి ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తుండడం పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యంతోనే తిరుపతి తొక్కిసలాటప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక క్షేత్రంగా పేరున్న తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది జనవరి 8న వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్ల జారీ సందర్భంగా తిరుపతిలో క్యూలైన్లో తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రభుత్వ వైఫల్యమే దీనికి కారణం. ముక్కోటి రోజు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారని తెలిసి అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడంలో సర్కారు లోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. సింహాచలం దుర్ఘటనపై ‘సమగ్ర నివేదిక’ ఊసేలేదుసింహాచలం శ్రీవరహ లక్ష్మీనరసింహ ఆలయంలో చందనోత్సవం సందర్భంగా 2025 ఏప్రిల్ 30న మెట్ల మార్గంలో క్యూలైన్లో వెళుతున్న భక్తులపై గోడ కూలి ఏడుగురు మృతి చెందిన దుర్ఘటనకు సంబంధించి బాధ్యులపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదన్న విమర్శలున్నాయి. తిరుపతి ఘటన తర్వాత కేవలం నాలుగు నెలల వ్యవధిలో చోటుచేసుకున్న ఈ ఘటనకు ప్రభుత్వం ఏ మాత్రం బాధ్యత తీసుకోలేదు. దుర్ఘటన జరిగిన రోజున ప్రభుత్వం ముగ్గురు అధికారులతో ఒక కమిటీని నియమించి, 72 గంటల్లో ప్రాథమిక నివేదిక, 30 రోజుల్లో తుది నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. 72 గంటల్లో కమిటీ అందజేసిన ప్రాథమిక నివేదిక మేరకు ప్రభుత్వం ‘తూ తూ మంత్రం చర్యలతో’ సరిపెట్టిందని విమర్శలు అప్పుడే వెల్లువెత్తాయి. ఇక ఇప్పటికి ఆరు నెలలు గడిచినప్పటికీ, దుర్ఘటనపై 30 రోజుల్లో సమర్పించాల్సిన సమగ్ర నివేదిక అంశం ఊసే లేకుండా పోయిందని దేవదాయ శాఖలో చర్చ జరుగుతోంది. ముందు ఎక్కడాలేని హడావుడి.. ఆపై గప్చుప్!సింహాచలం చందనోత్సవం కార్యక్రమాల పర్యవేక్షణ విషయంలో ప్రభుత్వం ముందస్తుగా చేసిన హడావుడి గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నలుగురు మంత్రుల కమిటీ రెండు నెలల పాటు వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహించి.. గతంలో ఎప్పుడూలేని తీరుగా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తామే ప్రతి పనిని క్షుణంగా పరిశీలించామని ప్రకటించింది. దుర్ఘటనకు 15 రోజుల ముందు ఏప్రిల్ 16వ తేదీన దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, హోంమంత్రి అనిత, రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, విశాఖ ఇన్చార్జి డోలా బాల వీరాంజనేయలు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చందనోత్సవ కార్యక్రమాల నిర్వహణకు చర్యలు తీసుకున్నట్టు ప్రకటించారు. ఏప్రిల్ 30న దుర్ఘటన జరిగిన తర్వాత మంత్రుల కమిటీ సభ్యులెవరూ బాధ్యత తీసుకోకపోవడం ఒక ఎత్తయితే, ప్రభుత్వ పెద్దలు సైతం తమ మంత్రివర్గ సహచరులను ఈ ఘటనలో బాధ్యులు చేయకపోవడంపై అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ సాగింది. విచారణ కమిటీ ఏర్పాటు చేయడం, ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లుగా కమిటీ 72 గంటల్లో నివేదిక ఇవ్వడం, దాని ఆధారంగా చిరు ఉద్యోగుల మీద చర్యలు తీసుకోవడం.. అంతా స్క్రిప్ట్ ప్రకారమే జరిగిపోయాయన్న విమర్శలు వచ్చాయి.ప్రైవేటు దేవాలయాలపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధఅప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దేవదాయ శాఖ అధికారులతో 2021 సెప్టెంబరు 27వ తేదీన నిర్వహించిన సమీక్ష సమావేశంలో దేవదాయ శాఖ వద్ద నమోదు కాకుండా కొంత మంది (ప్రైవేట్) ట్రస్టీల ఆధ్వర్యంలో నిర్వహించే ఆలయాల్లో భద్రతకు పలు ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని ప్రస్తుతం అధికార వర్గాలు చర్చించుకుంటున్నాయి. దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాలతో పాటే ప్రైవేట్ ట్రస్టీల ఆధ్వర్యంలో నడిచే గుళ్లలో భద్రతకు సంబంధించి ఆయా యాజమాన్యాలకు అప్పటి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. సంబంధిత ఆలయాల్లో కూడా దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాల మాదిరే సీసీ కెమెరాలు ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ఆయా ప్రైవేట్ ట్రస్టీలకు దేవదాయశాఖ నోటీసులు జారీ చేయాలని అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి స్వయంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి అప్పటి సీఎం అధ్యక్షతన జరిగిన దేవదాయ శాఖ సమీక్ష వివరాలను 2021 అక్టోబరు 8 మినిట్ రూపంలో అప్పటి దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్ రాష్ట్ర స్థాయిలో హోం శాఖతో పాటు రెవెన్యూ, ఇతర శాఖాధిపతులకు సైతం మెమో ద్వారా తెలియజేశారు. అప్పటి సీఎం జగన్ మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దేవదాయ శాఖ పరిధిలో ఉన్న పలు ఆలయాలతోపాటు పలు ప్రైవేట్ ట్రస్టీల ఆధ్వర్యంలో నడిచే దాదాపు 9,500 ఆలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు హోం, రెవెన్యూ శాఖలు చర్యలు ప్రారంభించినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. జగన్ ప్రభుత్వం పట్టిష్ట భద్రత చర్యలను కూటమి సర్కార్ నిర్లక్ష్యం చేసిందని ఆయా వర్గాలు భావిస్తున్నాయి. -
కర్షకుడిపై బాబు సర్కారు కర్కశం
ఏ పల్లెకెళ్లినా ఒకటే దృశ్యాలు.. ఏ రైతును కదిలించినా ఒకటే వేదన. వరి మొదలుకొని పత్తి వరకు..అరటి మొదలు బొప్పాయి వరకు ఏ పంట చూసినా మొలలోతు ముంపులో నానుతున్నాయి. వరికంకులు నేలనంటి కుళ్లిపోతున్నాయి. వరిచేలు జీవం లేని పచ్చిక బయళ్లు మాదిరిగా తయారయ్యాయి. పత్తి, మొక్కజొన్న, లంక గ్రామాల్లో సాగుచేసిన అరటి, బొప్పాయి, పసుపు తోటలు నేలకూలి రైతుల ఆశలను చిదిమేశాయి. రైతులు ఇంత కష్టంలో ఉంటే ఆదుకోవాల్సిన కూటమి సర్కారు వారిపై కనికరం, కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తోంది. కర్కశంగా వారిని గాలికొదిలేసింది. పంట నష్టనమోదు మొక్కుబడిగా చేస్తోంది. ఇన్పుట్ సబ్సిడీ మంజూరును అటకెక్కించింది. ధాన్యం కొనుగోలుపై డ్రామాలు ఆడుతోంది. ఇప్పటికే ఉచిత పంటల బీమాకు ఎగనామం పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని ప్రతి రైతుకూ రూ.40వేలు చొప్పున ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.ఐదువేలు ఇచ్చి చేతులు దులుపుకుంది. తుపాను మిగిల్చిన తీరని నష్టంతో రైతులు తీవ్ర వేదనతో ఉంటే సీఎం చంద్రబాబు సతీమణితో కలిసి లండన్ టూర్కు వెళ్లడం, ఆయన తనయుడు నారా లోకేశ్ సతీమణితో కలిసి క్రికెట్ మ్యాచ్కంటూ ముంబై వెళ్లడంపై రాష్ట్ర రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. కనీస కనికరం, బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న కూటమి దుష్టపాలనపై ధ్వజమెత్తుతోంది.ఈయన పేరు వళ్లుం మురళీకృష్ణ. ఊరు ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కాగుపూడి. ఈయనకు సొంతంగా రెండెకరాలుండగా, కౌలుకు మరో 8 ఎకరాలు తీసుకొని ఖరీఫ్లో స్వర్ణ రకం వరి సాగు చేశారు. ఎకరాకు రూ.40వేల వరకు పెట్టుబడి పెట్టారు. కౌలుతో కలుపుకుంటే ఎకరాకు రూ.60వేలకుపైగా ఖర్చయింది. ఆరుగాలం కంటిపాపలా సాకిన పంట ఏపుగా పెరిగింది. ఎకరాకు 40 బస్తాలు వస్తాయని ఆశపడ్డారు. కానీ మోంథా తుపాను అతని ఆశలను అంతమొందించింది. పంటను పూర్తిగా దెబ్బతీసింది. ఇప్పుడు రెల్లుపురుగు పంటను తినేస్తుంది. ఎకరాకు 25 బస్తాలకు మించి వచ్చే పరిస్థితి లేదు. దీనిని కోయడానికి ఎకరాకు రూ.15వేలు పెట్టుబడి పెట్టాలి. వచ్చినదంతా కౌలుకే పోతోంది. పెట్టుబడి కూడా రాకపోగా ఇంకా ఎకరాకు రూ.15వేల నుంచి రూ.20వేల వరకు నష్టం మిగులుతుందని మురళీ కృష్ణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి పరిహారం వస్తుందో రాదో అనే అయోమయం నెలకొందని, బీమా కూడా చేయించుకోలేదని, పది ఎకరాలకు కలిపి తీవ్ర నష్టం వాటిల్లుతుందని కన్నీటిపర్యంతం అవుతున్నారు. ఈయన పేరు యార్లపాటి సత్తిపండు.. ఏలూరు జిల్లా ఉంగుటూరుకు చెందిన ఈ రైతు ఆరెకరాల 75 సెంట్లు కౌలుకు తీసుకొని పీఎల్ రకం వరి సాగు చేశారు. ఎకరాకు రూ.30వేలు పెట్టుబడి పెట్టారు. ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, ధాన్యం షావుకారుల నుంచి నూటికి రూ.2, రూ.3 వడ్డీకి అప్పులు చేసి పెట్టుబడి పెట్టారు. సర్కారు కౌలు కార్డు ఇవ్వలేదు.. పెట్టుబడి సాయం రాలేదు. తుపాను వల్ల కురిసిన వర్షంతో ధాన్యం గింజలు పొల్లు కింద రాలి పోతున్నాయి. ఊకైపోతున్నాయి. 25 బస్తాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎకరాకు 16 బస్తాలు కౌలుకు ఇవ్వాలి. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేటట్టు లేదు. దీంతో సత్తిపాండు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. (పంపాన వరప్రసాదరావు) ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల నుంచి సాక్షి ప్రతినిధి : ఇప్పటికే ఏడాదిన్నరగా వరుస విపత్తులతో అల్లాడుతున్న రైతులపై ఇప్పుడు మోంథా తుపాను విరుచుకుపడి పంటలను పూర్తిగా తుడిచిపెట్టేసింది. వరి రైతుకు తీరని నష్టం మిగిల్చింది. ఎకరాకు 25 బస్తాలూ రాని దుస్థితి నెలకొంది. ఇప్పటికే భారీగా పెట్టిన పెట్టుబడులూ రాకపోగా, ఇప్పుడు తడిచిన పంట కోతకు మరింత చేతి చమురు వదిలించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. దాదాపు అన్ని పంటలదీ ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఫలసాయంపై రైతులు ఆశలు వదిలేసుకున్నారు. ప్రభుత్వ సాయమైనా వస్తుందేమోనని ఎదురు చూస్తున్నా.. ఆ దాఖలాలు కానరావడం లేదు. సర్కారు వారిపై కనీస కనికరం చూపడం లేదు. బాధ్యత లేకుండా కర్కశంగా వ్యవహరిస్తోంది. ఫలితంగా ప్రకృతి ప్రకోపానికి బలైన రైతులు తమ ఇబ్బందులను ఏకరువు పెడుతూ కన్నీటి పర్యంతమవుతున్నారు. కృష్ణ, ఎన్టీఆర్, ఏలూరు, ఉభయ గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ ఏ జిల్లాకు వెళ్లినా క్షేత్రస్థాయిలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కర్షకుల కన్నీటి గాధలు గుండెలను పిండేస్తున్నాయి. అన్నదాతల దీనస్థితిని కళ్లకు కట్టే ప్రయత్నమే ఈ సాక్షి గ్రౌండ్ రిపోర్ట్.. కౌలురైతులకు కోలుకోలేని దెబ్బ గోదావరి, కృష్ణా డెల్టాలో వ్యవసాయం చేసే రైతుల్లో కౌలురైతులే అధికం. వరితో సహా ప్రధాన పంటలు సాగు చేసే రైతుల్లో నూటికి 70–80 శాతం మంది వారే. మోంథా తుపాను ప్రభావానికి వారికి అపార నష్టం వాటిల్లింది. కళ్లెదుటే పంట కుళ్లిపోతుంటే వారంతా కన్నీరు మున్నీరవుతున్నారు. గడిచిన ఏడాదిగా కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైన కౌలు రైతులు తాజాగా తుపాను ప్రభావంతో కోలుకోలేని విధంగా నష్టపోయారు. వరి కౌలు రైతులు ఎకరాకు 16–20 బస్తాలు భూ యజమానికి ఇచ్చు కోవాల్సిందే. ఇతర వాణిజ్య పంటలకైతే ఎకరాకు ఏడాదికి రూ.40వేలు కిస్తీ కట్టాల్సిందే. ఏడాదిన్నరగా కౌలు కార్డుల్లేక.. పెట్టుబడి సాయం అందక, బ్యాంకుల నుంచి పంట రుణాలకు నోచుకోక అప్పుల సాగు చేస్తున్న వీరంతా వరుస విపత్తులతో కకావికలమవుతున్నారు. ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, ధాన్యం షావుకారుల వద్ద రూ.2, రూ.3 వడ్డీలకు అప్పులు చేసి కష్టాల ఊబిలో కూరుకుపోయారు. ప్రతి కౌలు రైతుకూ రూ.3లక్షల నుంచి రూ.ఐదు లక్షల వరకు అప్పులు ఉన్నట్టు చెబుతున్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఎకరాకు 40 బస్తాలకు పైగా దిగుబడి వస్తుందని ఆశపడ్డారు. ఇప్పటికే ఎకరాకు సగటున రూ.35 వేల నుంచి 40వేల వరకు పెట్టుబడి పెట్టేశారు. ఇప్పుడు అదంతా బూడిదలో పోసిన పన్నీరైందని కుమిలిపోతున్నారు. కిస్తీకి కూడా సరిపోయే పరిస్థితి లేదు.. వరిని యంత్రాలతో కోస్తే కానీ ఉన్న కొద్దిపాటి పంట చేతికొచ్చే పరిస్థితిలేదు. అయితే యంత్రాలతో ఎకరా కోతకు నాలుగైదు గంటలు పడుతుందని, గంటకు రూ.3 వేల నుంచి రూ.4వేలు యంత్రాల నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. దీనికి ఎంత చూసుకున్నా.. ఎకరాకు రూ.15వేలు అదనంగా ఖర్చయ్యేలా ఉందని ఆవేదన చెందుతున్నారు. ఇంతా కష్టపడి తీరా కోసి ఆరబెట్టినా 20–25 బస్తాలకు మించి వచ్చే పరిస్థితి లేదు. దాంట్లో 17 బస్తాలు కౌలుగా భూ యజమానికే ఇవ్వాలి. ఇక మాకు మిగిలేది ఏమిటంటూ కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటంతా తడిసి ముద్దవడంతో అధిక తేమశాతంతోపాటు రంగుమారే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల వరి గింజలకు మొలకలొచ్చేశాయి. మరొక వైపు రెల్ల పురుగు నేలనంటిన దుబ్బులును కొరికేస్తోంది. వడ్లు నేలరాలిపోయి ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. ఇన్ని కష్టాలు పడి ఒబ్బిడి చేసినా మద్దతు ధర మాట దేవుడెరుగు కొనేవారుండరన్న ఆందోళన రైతుల్లో సర్వత్రా నెలకొంది. అరటి, బొప్పాయి, మొక్కజొన్న, పసుపు రైతులైతే తమకు పెట్టుబడి కాదు కదా.. కనీసం భూ యజమానికి కీస్తీకిచ్చేందుకు కూడా మిగలదని లబోదిబోమంటున్నారు.అన్నదాతల్లో కట్టలు తెంచుకుంటున్న ఆగ్రహంతుపాను వేళ ప్రభుత్వం ఇంతలా నిర్లక్ష్యం ప్రదర్శించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందెన్నడూ ఇలాంటి దుస్థితి చూడలేదని, కనీసం పంట నష్టం అంచనాల కోసం తమ పొలాల వైపునకు అధికారులు రావడం లేదని, రైతు సేవా కేంద్రాలకు వెళ్తే రాస్తాంలే అంటూ సమాధానాలు చెబుతున్నారని దువ్వకు చెందిన అప్పారావు అనే కౌలు రైతు సాక్షి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. తుపాను దెబ్బకు తాము పెట్టుబడిని సైతం కోల్పోతున్నామని వరి రైతులు, తాము లక్ష నుంచి లక్షన్నర వరకు నష్టపోతున్నామని అరటి తదితర వాణిజ్య పంటల రైతులు చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఆదుకోక పోతే తమకు అ«ధోగతే అని, వ్యవసాయం మానుకోవడం తప్ప వేరే గత్యంతరం లేదని స్పష్టం చేస్తున్నారు.వైఎస్ జగన్ హయాంలో నాడు అడుగడుగునా అండగా..గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రకృతి విపత్తు సంభవిస్తే ప్రభుత్వం అడుగడుగునా అండగా నిలిచింది. 2023 డిసెంబర్లో సంభవించిన మిచాంగ్ తుపాను సమయంలో ఇదేరీతిలో పంటలు ముంపునకు గురైన వేళ రైతు భరోసా కేంద్రాల(ఆర్బీకే) సిబ్బంది రైతులతో కలిసి పంట చేలల్లోకి దిగి నష్ట నివారణ చర్యలు చేపట్టడంతోపాటు నష్ట పరిహార నమోదు ప్రక్రియ వేగంగా చేపట్టారు. ముంపునకు గురైన పంటలను ఎలా రక్షించుకోవాలో సూచనలు, సలహాలు అందించారు. అప్పటి వైఎస్ జగన్ సర్కారు పంట నష్టపరిహారం, ఇన్పుట్ సబ్సిడీ వేగంగా చెల్లించడంతోపాటు ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసింది. ఆఖరికి తడిచిన, రంగు మారిన ధాన్యాన్నీ గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేసింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మచ్చుకైనా కనిపించడం లేదు. అధికారులెవరూ పొలాలవైపు కన్నెత్తి చూడడం లేదు. కిందిస్థాయి సిబ్బంది తూతూమంత్రంగా పంటనష్ట అంచనాలను ప్రాథమికంగా నమోదు చేస్తున్నారు. ఇన్పుట్ సబ్సిడీకి మంగళం పాడేందుకు సర్కారు కుటిలయత్నం చేస్తోంది. ధాన్యం కొనుగోలుకూ డ్రామాలు ఆడుతోంది.ఇంకా నీటి ముంపులోనే లక్షలాది ఎకరాలు తుపాను తీరం దాటి నాలుగు రోజులు గడిచినా లక్షలాది ఎకరాలు ఇంకా ముంపునీటిలోనే ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు, గుమ్మడిదుర్రు, అనిగండ్ల పాడు, మాగొల్లు, విజయవాడ రూరల్, ఎన్టీఆర్ జిల్లా ఏటూరు, తోటరావుల పాడు, చింతలపాడు, ఏలూరు జిల్లా ఉంగుటూరు, పశ్చిమగోదావరి జిల్లా దువ్వ, జగన్నాధపురం, మిలట్రీ మాధవరం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పెనికేరు,, ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి, అంబాజీపేట మండలం గంగలకుర్రు, కాకినాడ జిల్లా కరప, వేళంగి తదితర గ్రామాల్లో పంట చేలు నేటికీ ముంపునీటిలోనే ఉన్నాయి. రావులపాలెం మండలం ఈతకోట, పి. గన్నవరం, మామిడి కుదురు మండలాల్లో పలు గ్రామాల్లో నేలకొరిగిన అరటితోటలు సైతం ముంపునీటిలో ఉన్నాయి. రైతాంగ కష్టాలు వదిలి షికార్లు దుర్మార్గం మోంథా తుపాను వల్ల వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఉచిత పంటల బీమా ఎత్తేయడంతో కర్షకులు తీవ్రంగా దెబ్బతిన్నారు. ఇన్పుట్ సబ్సిడీ సర్కారు ఇవ్వాల్సి ఉన్నా.. ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. రైతులు ఇంత కష్టంలో ఉంటే ఇప్పుడు సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు ఇతర ప్రాంతాలకు షికార్లకు వెళ్లడం దుర్మార్గం. – వి.కృష్ణయ్య, అధ్యక్షుడు, ఏపీ రైతు సంఘం ఇదేనా పాలకుల చిత్తశుద్ధి? మోంథా తుపాను దెబ్బకు లక్షలాది ఎకరాల్లో పంటలకు అపార నష్టం వాటిల్లింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అన్నదాతలకు అండగా నిలవాల్సింది పోయి కూటమి నేతలు రాష్ట్రాన్ని వదిలి షికార్లు చేస్తుండడం ఎంతవరకు సమంజసం. ఇదేనా పాలకుల చిత్తశుద్ధి? – ఎం.హరిబాబు, ప్రధాన కార్యదర్శి ఏపీ కౌలురైతుల సంఘం రైతులు పుట్టెడు కష్టాల్లో ఉంటే పాలకుల టూర్లు తుపాను బారిన పడి తీవ్రంగా నష్టపోయి రైతులు పుట్టెడు కష్టాల్లో ఉంటే వారిని ఆదుకోవాల్సింది పోయి సీఎం టూర్లు చేయడం ఏమిటి? తుపాను నష్టాన్ని తక్కువగా చూపేందుకు సర్కారు యత్నిస్తోంది. వైఎస్సార్ కడప జిల్లా సి. కె. దిన్నె మండలం కోలుములపల్లి తదితర గ్రామాలలో తుపాను, దానికంటే ముందు కురిసిన అధిక వర్షాలతో దెబ్బతిన్న చామంతి పూల తోటలను ఏ అధికారీ పరిశీలించలేదు. ఇదే జిల్లాలో పోరుమామిళ్ల, బద్వేలు రూరల్, కాజీపేట, మైదుకూరు, బి. మఠం మండలాలలో జరిగిన పంట నష్టం గురించి అధికారులు చూసిన పాపాన పోలేదు. ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు. – జీఎస్ ప్రభాకరరావు, ప్రధాన కార్యదర్శి ఏపీ రైతు సంఘం ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాలి రైతులను కూటమి ప్రభుత్వ పెద్దలు గాలికొదిలారు. రాష్ట్రంలో ఈ–పంట నమోదు పూర్తిస్థాయిలో జరగలేదు. పంటనష్ట నమోదు మొక్కుబడిగా సాగుతోంది. ఇన్పుట్ సబ్సిడీ అందని ద్రాక్షగా ఉంది. దెబ్బతిన్న పంటలను గిట్టుబాటు ధరకు సర్కారే కొనాలి. గత ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాలి. – పి.జమలయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ, కౌలురైతుల సంఘం 25 బస్తాలు కూడా వచ్చేటట్టు లేదు మాకు కాగుపాడు ఆయకట్టులో రెండున్నర ఎకరాల పొలం ఉంది. సొంతంగానే సాగు చేస్తున్నాం., మరో 15 రోజుల్లో కోతకోసే వాళ్లం. ఇంతలోనే మోంథా తుపాను ముంచేసింది. వంద బస్తాలు అవ్వాల్సింది. ఎకరాకు 25 బస్తాలకు మించి పంట దిగుబడి వచ్చేటట్టు లేదు. – గండికోట నాగయ్య, కాగుపాడు, ఏలూరు జిల్లా పెట్టుబడి కూడా రాని దుస్థితి పెట్టుబడి వస్తాదో రాదో అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఎకరంన్నరలో స్వర్ణ సాగు చేశా. మంచి దిగుబడి వస్తుందని ఆశగా ఎదురు చూశాం. మోంథా తుపాను మా ఆశలను నాశనం చేసింది. ఎకరాకు 20 బస్తాల దిగుబడి కూడా వచ్చేటట్టు లేదు. కనీసం పెట్టుబడి కూడా మిగలదు. ఏం చేయాలో పాలుపోవడం లేదు. – దొడ్డి మోహనరావు, కౌలురైతు, యర్రమళ్ల, ఏలూరు జిల్లా -
కూటమి నేతల వేధింపులు భరించలేక చచ్చిపోతున్నా
బైరెడ్డిపల్లె: ‘నేను తెలుగుదేశం పార్టీకి ఓటేశా.. వైఎస్సార్సీపీ నాయకుల జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ ఇస్తే తిన్నా... అదేమన్నా తప్పా..? ఇంతమాత్రానికే నాపై అధికార కూటమి నేతలు కక్ష సాధింపులకు పాల్పడతారా? అయ్యా... ఇక నేను భరించలేను. చచ్చిపోతున్నా...’ అంటూ చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లె మండలంలోని పాతపేటకు చెందిన శ్రీనివాసులు(42) సెల్ఫీ వీడియోలో తన ఆవేదనను వివరిస్తూ పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. స్థానికుల కథనం మేరకు... పాతపేట గ్రామానికి చెందిన శ్రీనివాసులుకు, అతని సోదరుడికి మధ్య రెండు రోజుల క్రితం ఘర్షణ జరిగింది. అయితే శ్రీనివాసులును పోలీస్ స్టేషన్కు పిలిపించి చిత్రహింసలకు గురిచేస్తున్నారు. గతంలో వైఎస్సార్సీపీ నేతల జన్మదిన వేడుకల్లో పాల్గొనడం వల్లే కూటమి నేతలు కక్ష కట్టి పోలీస్స్టేషన్కు పిలిపిస్తున్నారని గ్రామస్తులు శ్రీనివాసులుకు చెప్పారు. దీంతో మనస్తాపం చెందిన శ్రీనివాసులు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లి సెల్ఫీ వీడియోలో తన ఆవేదనను తెలియజేస్తూ పురుగులమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కొందరు కూటమి నేతల వల్లే తాను చనిపోతున్నానని వెల్లడించాడు. ఆ వీడియోను గ్రామస్తులకు షేర్ చేయడంతో అటవీ ప్రాంతానికి వెళ్లి అపస్మారక స్థితిలో ఉన్న శ్రీనివాసులును తొలుత బైరెడ్డిపల్లె పీహెచ్సీకి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ఏమార్చే తంత్రం.. పక్కా కుతంత్రం
సాక్షి, అమరావతి: పంచ పాండవులు ఎంత మంది అని అడిగితే... మంచం కోళ్లలా ముగ్గురు ఉంటారని రెండు వేళ్లు చూపించాడట వెనకటికి ఒకరు. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వ తీరు కూడా అంత అధ్వానంగా, అస్తవ్యస్థంగా తయారైంది. ఎన్నికల మేనిఫెస్టో ఎందుకు అమలు చేయడం లేదని ప్రజలు నిలదీస్తుంటే.. ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలను ప్రశ్నిస్తుంటే వాటికి సమాధానం దాటవేసేందుకు ఎప్పటికప్పుడు డైవర్షన్ కుతంత్రాలు పన్నుతోంది. ఇందులో భాగంగానే తాజాగా వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్ట్ అని స్పష్టమవుతోంది. ఏమాత్రం సంబంధం లేని విషయాలను సృష్టించి, ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోందనేందుకు నకిలీ మద్యం రాకెట్లో జోగి రమేశ్ను ఇరికించడమే నిదర్శనం. 2024లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ కూటమి ప్రభుత్వం శకుని తరహాలో కుయుక్తి పాచికలను మళ్లీ మళ్లీ విసురుతోంది. తాను ఏం చెప్పినా భుజానికెత్తుకునే ఎల్లో మీడియా ఉండటంతో చంద్రబాబు తన కుట్రలకు మరింత పదును పెడుతున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది భక్తులు దుర్మరణం చెందడంతో ప్రభుత్వంపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. మోంథా తుపానుతో దెబ్బతిన్న రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటంతో రైతులు తీవ్ర స్థాయిలో ఆందోళనకు ఉద్యుక్తులవుతున్నారు. తమ చేతగానితనం మరోసారి బట్టబయలు కాగానే చంద్రబాబులోని డైవర్షన్ చంద్రముఖి వెంటనే నిద్ర లేచింది. ఫలితంగా కరకట్ట ప్యాలస్ డైరెక్షన్లో టీడీపీ వీర విధేయ పోలీసులతో కూడిన సిట్ తక్షణం రంగంలోకి దిగింది. జోగి రమేశ్ అరెస్ట్.. ఎల్లో మీడియాలో భారీగా కవరేజీ.. ప్రజల దృష్టి అటువైపు మళ్లించే పన్నాగం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ వైఫల్యంతోనే భక్తుల దుర్మరణం టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలే సూత్రధారులు, టీడీపీ నేతలే పాత్రధారులుగా సాగుతున్న నకిలీ మద్యం దందా కేసును ఉద్దేశ పూర్వకంగా పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం బరితెగించింది. అందుకు ఎంచుకున్న సమయం కూడా ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేస్తోంది. ప్రభుత్వ వైఫల్యంతోనే కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొమ్మిది మంది భక్తుల దుర్మరణం రాష్ట్రాన్నే కాదు యావత్ దేశాన్ని తీవ్రంగా కలచి వేసింది. ఎంతో ప్రాశస్య్తమైన కార్తీక ఏకాదశి అదీ శనివారం రోజున వచ్చిందనే కనీస స్పృహ కూడా ప్రభుత్వానికి లేకపోవడం విడ్డూరంగా ఉంది. ఉత్తరాంధ్రలో చిన్న తిరుపతిగా గుర్తింపు పొందిన కాశీబుగ్గు వేంకటేశ్వర స్వామి ఆలయానికి వేలాదిగా భక్తులు తరలి వస్తారన్నది అందరికీ తెలిసినా సరే ప్రభుత్వం ఏమాత్రం పట్టనట్టు వ్యవహరించింది. ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయక పోవడం వల్లే ఆలయంలో శనివారం తీవ్ర తొక్కిసలాట సంభవించి భక్తులు మృత్యువాత పడ్డారు. హృదయ విదారకంగా ఉన్న ఆ దృశ్యాలు మీడియా, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వ వైఫల్యం బట్టబయలైంది. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తుల దుర్మరణం.. సింహాచలంలో చందనోత్సవం రోజున గోడ కూలి ఏడుగురు బలి.. తాజాగా కాశీబుగ్గ దుర్ఘటనలు ప్రభుత్వ చేతగానితనాన్ని ఎత్తిచూపాయి. హిందూ పండుగలకు కనీస స్థాయిలో ఏర్పాట్లు చేయలేకపోతున్న చంద్రబాబు ప్రభుత్వ అసమర్థ, నిర్లక్ష్య వైఖరిపై యావత్ భక్తకోటి మండిపడుతోంది. భక్తుల ప్రశ్నలకు ప్రభుత్వం శనివారం రాత్రి వరకు సరైన సమాధానం చెప్పలేకపోయింది. ఫలితంగానే డైవర్షన్ పాలిటిక్స్. తుపాను బాధిత రైతులను పట్టించుకోని ప్రభుత్వం మోంథా తుపాను దెబ్బకు రాష్ట్రంలో రైతులు కుదేలయ్యా రు. 15 లక్షల ఎకరాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నా, ప్రభుత్వ పెద్దలకు చీమ కుట్టినట్టు కూడా లేదు. కనీసం పంటల నష్టాన్ని అంచనా వేయకుండా తుపాన్ను జయించామని బాకాలు ఊదుతుండటం విస్మయానికి గురి చేస్తోంది. క్షేత్ర స్థాయిలో రైతులను పట్టించుకున్న నాథుడే లేకుండా పోయారు. దెబ్బతిన్న పంటలను కొనేందుకు ప్రభుత్వమే ఆంక్షలు విధిస్తుండటం విడ్డూరంగా ఉంది. ఇన్పుట్ సబ్సిడీ కావాలా.. ధాన్యం కొనాలా.. ఏదో ఒకటే తేల్చుకోవాలని షరతు విధిస్తుండటం ప్రభుత్వ దుర్మార్గానికి తార్కాణం. కనీసం సంచులు కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారు. ప్రభుత్వ తీరుపై తుపాను బాధిత ప్రాంతాల్లో రైతులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై ఆందోళనకు సిద్ధపడుతున్నారు. చంద్రబాబు లండన్ షికారు.. చినబాబు క్రికెట్ జోరు ఓ వైపు భక్తుల దుర్మరణం.. మరోవైపు తుపానుతో తీవ్రంగా నష్టపోయిన రైతుల ఆవేదన యావత్ రాష్ట్రాన్ని తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నాయి. కానీ ధృతరాష్ట్ర పాలన సాగిస్తున్న చంద్రబాబు, లోకేశ్ మాత్రం ఇవేవీ పట్టించుకుండా ఉడాయించారు. చంద్రబాబు లండన్ పర్యటనకు వెళ్లిపోయారు. ఆయన లండన్ పర్యటన ఎందుకు? అనే విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. వ్యక్తిగత పర్యటనా.. లేక అధికారిక పర్యటనా అన్నది స్పష్టం చేయలేదు. చంద్రబాబు వ్యక్తిగతంగానే లండన్ పర్యటనను ఆస్వాదిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు అనధికారికంగా వెల్లడించాయి. ఇక చినబాబు లోకేశ్ తీరు మరింత విస్మయానికి గురి చేసింది. ఆయన ముంబయిలో క్రికెట్ మ్యాచ్ వీక్షించేందుకు వెళ్లిపోయారు. దుర్మరణం చెందిన భక్తుల కుటుంబాల ఆవేదననుగానీ, తీవ్రంగా నష్టపోయిన రైతుల బాధను గానీ తండ్రీ కొడుకులు ఏమాత్రం పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎక్కడ ఉన్నారన్నది పత్తా లేదు. అదీ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రస్తుత పరిస్థితి. అందుకే డైవర్షన్ డ్రామా.. జోగి రమేశ్ అక్రమ అరెస్టు కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతుండటంతో చంద్రబాబు బేంబేలెత్తారు. వెంటనే తనదైన శైలిలో డైవర్షన్ డ్రామాకు తెరతీశారు. శనివారం రాత్రి కూటమి ప్రభుత్వ పెద్దలు తమ పన్నాగానికి పదును పెట్టారు. నకిలీ మద్యం కేసులో వైఎస్సార్సీపీ నేత జోగి రమేశ్ను అక్రమ అరెస్టు చేయాలని సిట్ అధికారులను ఆదేశించారు. దాంతో మీడియా, ప్రజల దృష్టి అంతా ఆ వ్యవహారం వైపు మళ్లించాలన్నది ఎత్తుగడ. ప్రభుత్వ పెద్దల కుట్రకు టీడీపీ వీర విధేయ పోలీసులు వత్తాసు పలికారు. ఆదివారం తెల్లవారుజామునే విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ నివాసానికి పోలీసులు భారీగా చేరుకున్నారు. ఆయన్ని బలవంతంగా అరెస్టు చేశారు. నకిలీ మద్యం వ్యవహారంతో తనకేం సంబంధమని ఆయన అడిగిన ప్రశ్నలకు పోలీసులు కనీస సమాధానం కూడా చెప్పలేకపోవడం గమనార్హం. కేవలం కాశీబుగ్గ ఆలయ దుర్ఘటనలో ప్రభుత్వ వైఫల్యం నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ హైడ్రామా నడిపించారన్నది సుస్పష్టం. మళ్లీ మళ్లీ అదే డైవర్షన్ కుతంత్రం 2024లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు ప్రభుత్వం ఇదే తరహాలో డైవర్షన్ డ్రామాలతోనే ప్రజల్ని మభ్యపెడుతోంది. ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయాలని ఎవరు డిమాండ్ చేసినా.. పరిపాలనలో ప్రభుత్వ వైఫల్యం ఎప్పుడు బయటపడినా.. రెడ్బుక్ అరాచకాలపై ప్రజాగ్రహం వెల్లువెత్తిన ప్రతిసారి.. ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయ, పునరావాస చర్యలు చేపట్టడంలో ప్రభుత్వ చేతగానితనం బటయపడగానే.. ఇలా కూటమి ప్రభుత్వ ప్రతి వైఫల్యంలోనూ వెంటనే ప్రజల దృష్టి మళ్లించేందుకు కూటమి ప్రభుత్వం కొత్త కుట్రలకు తెరతీస్తునే ఉంది. -
కాశీబుగ్గ ఘటన.. జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్సీపీ కొవ్వొత్తుల ర్యాలీ
-
అన్ని జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్సీపీ క్యాండిల్ ర్యాలీ
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామ ఆలయంలో శనివారం ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన భక్తుల ఆత్మకు శాంతి చేకూరాలని వైఎస్సార్సీపీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించింది. ఈ మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు పాల్గొని మృతి చెందిన భక్తులకు సంతాపం ప్రకటిస్తూ క్యాండిల్ ర్యాలీ చేపట్టారు.అనకాపల్లిలో వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా:కాశీబుగ్గ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని పుట్టపర్తిలో వైఎస్సార్సీపీ నేతల కొవ్వొత్తుల ర్యాలీ. బాబు పాలనలో భక్తుల భద్రత కరువైందని ఆగ్రహం.తూర్పుగోదావరి జిల్లా.కాశిబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి రోజు మృతి చెందిన భక్తులకు సంతాపం ప్రకటిస్తూ వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీరాజమండ్రి కోటిపల్లి బస్టాండ్ వద్ద నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ , మాజీ ఎమ్మెల్యే వెంకట్రావు, రౌతు సూర్యప్రకాశరావు, డాక్టర్ గూడూరి శ్రీనివాస్కర్నూలు జిల్లా: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో మరణించిన తొమ్మిది మంది ఆత్మలకు శాంతి చేకూరాలంటూ 33వ వార్డులో కొవ్వొత్తులతో నిరసన తెలిపిన నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి , వైఎస్సార్సీపీ నాయకులు , కార్యకర్తలు , మహిళలు కాశీబుగ్గ లో జరిగిన ప్రమాద ఘటన అయ్యప్పస్వామి భక్తులతో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే విరుపాక్షి అదోని భిమాస్ సర్కిల్ లో బాబు పాలనలో భక్తులకు భద్రత కరువు అని వైఎస్ఆర్సిపి నాయకులు క్యాండిల్ లతో నిరసన..కాశిబుగ్గ లో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని క్యాండిల్ వెలిగించి మౌనం పాటించిన వైఎస్ఆర్సిపి నాయకులు..అనంతపురం: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి ఆత్మ కు శాంతి కలగాలని కోరుతూ అనంతపురం టవర్ క్లాక్ వద్ద క్యాండిల్ ప్రదర్శన చేపట్టిన వైఎస్సార్సీపీ నేతలు. పాల్గొన్న మేయర్ మహమ్మద్ వాసీంకాకినాడ జిల్లాకాశిబుగ్గ తొక్కిసలాటలో మృతి చెందిన భక్తుల ఆత్మకు శాంతి చేకురాలని జగ్గంపేటలో వైఎస్సార్సీపీ క్యాండిల్ ర్యాలీ.కాశిబుగ్గ తొక్కిసలాటలో మృతి చెందిన భక్తుల ఆత్మకు శాంతి చేకురాలని తుని లో వైఎస్సార్సీపీ క్యాండిల్ ర్యాలీ.పశ్చిమగోదావరి జిల్లా:భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్లో వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ చినిమిల్లి వెంకట రాయుడు ఆధ్వర్యంలో కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మృతి చెందిన భక్తులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన శ్రీకాకుళం :కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని ఆంకాక్షిస్తూ క్యాండిల్స్తో నిరసనహాజరైన మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్, వైఎస్సార్సీపీ నేతలువిశాఖ: కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని వైఎస్ఆర్సిపి నేతలు క్యాండిల్ ర్యాలీ.జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ఆర్టిసి కాంప్లెక్స్ వరకు ర్యాలీ.భక్తుల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించిన వైఎస్ఆర్ సీపీ నేతలు. -
తాడిపత్రిలో రెచ్చిపోయిన జేసీ వర్గీయులు
అనంతపురం: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన ‘కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమాన్ని టీడీపీ జీర్ణించుకోలేకపోతోంది. ఈరోజు(ఆదివారం, నవంబర్ 2వ తేదీ) తాడిపత్రిలో చేపట్టిన ‘కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని ఇక్కడ చేయొద్దంటూ టీడీపీకి చెందిన జేసీ వర్గీయులు రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులకు సైతం దిగారు. జేసీ వర్గీయులు చేసిన దాడిలో వైఎస్సార్సీపీకి చెందిన రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. కాగా, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రయివేట్ పరం చేస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవోలకు నిరసనగా ఆ ఉత్తర్వులను వెనువెంటనే రద్దు చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వమే మెడికల్ కాలేజీల నిర్మాణం,నిర్వహణ చేపట్టాలని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టింది. దీనిలో భాగంగా తాడిపత్రిలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని జేసీ వర్గీయులు అడ్డుకోవడమే కాకుండా దాడులకు దిగారు. ఇక్కడకు ఎవరూ రావొద్దంటూ నిరంకుశ పాలనను గుర్తు చేసిన జేసీ వర్గీయులు.. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారు. -
కాశీబుగ్గ తొక్కిసలాట ప్రమాదం.. బాధితులను పరామర్శించిన వైఎస్ఆర్ సీపీ నేతలు
-
ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా?: బొత్స
సాక్షి, శ్రీకాకుళం: కాశీబుగ్గలో తొక్కిసలాట దురదృష్టకరమని.. మా పార్టీ తరఫున బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని.. మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. కాశీబుగ్గ ప్రమాద బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం వచ్చాక 17 నెలల్లో తొక్కిసలాట జరగడం ఇది మూడోసారి.. ప్రతీ శనివారం కాశీబుగ్గ ఆలయానికి వేలాదిగా భక్తులు వస్తారు. అంచనా వేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది’’ అని బొత్స నిలదీశారు.‘‘చంద్రబాబు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. ఘటనకు ముందురోజే సమాచారం ఇచ్చానని ఆలయ ధర్మకర్త చెప్పారు. కాశీబుగ్గలో స్థానిక పోలీసులు ఏం చేస్తున్నారు?.కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిగి.. ప్రభుత్వ నిర్లక్ష్యం బయటపడాలి. తిరుపతి, సింహాచలం ఘటనల్లో ఎవరి మీద చర్యలు తీసుకున్నారు?. పోలీసులు లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా..?. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? లేదా?’’ అంటూ బొత్స ప్రశ్నించారు.సనాతన ధర్మం అని పెద్ద పెద్ద మాటలు చెప్తారు. బయటకు చెప్పే మాటలు వేరు.. చేష్టలు వేరు.. దేవుడికి కూడా కోపం ఉంది. అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. సమగ్ర విచారణ జరపాలి. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరక్కుండా చూడాలి. ప్రభుత్వ పెద్దలు ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలి. సిట్టింగ్ లేదా రిటైర్డ్ జడ్జితో విచారణ జరపాలి. అప్పుడే వాస్తవాలు బయటకు వస్తాయి. నిమిత్తమాత్రులం అంటే కుదరదు.. ప్రజలకు సమాధానం చెప్పాలి. నష్ట పరిహారం రూ. 25 లక్షలు ఇవ్వాలి’’ అని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలి: సీదిరిసీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కాశీబుగ్గ తొక్కిసలాట జరిగింది. మహిళలే అధికంగా చనిపోయారు. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు బాధితులకు ప్రాథమిక వైద్య సహాయం అందించాం.. ఈరోజు వైఎస్సార్సీపీ నేతలు అందరం కలిసి బాధితులను పరామర్శించాం. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాం.. రెడ్ బుక్ తప్ప... రూల్ బుక్ ఉందా..?: కన్నబాబుకురసాల కన్నబాబు మాట్లాడుతూ.. కాశీబుగ్గ ఘటన కలిచివేసింది.. క్షతగాత్రులంతా నిరుపేదలు. నిమితమాత్రులమంటూ బాబు వైరాగ్యం ప్రదర్శిస్తున్నాడు. ప్రైవేట్ ఆలయం అని మాట్లాడుతున్నారు. ఆసుపత్రులను ప్రైవేటుకు ఇచ్చినట్టు.. ఆలయాలను కూడా ప్రైవేటుకు ఇస్తున్నామని చెప్పండి. సినిమా హీరోయిన్ వస్తే రోప్ పార్టీ వేసి భద్రత ఇచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు భద్రత ఇవ్వలేదు. ఆలయాల్లో భద్రత కోసం ప్రభుత్వం దగ్గర ప్రణాళిక ఉందా.? రెడ్ బుక్ తప్ప... రూల్ బుక్ ఉందా..?. ఇది ప్రైవేట్ ఆలయం అంటున్నారు.. తిరుపతి, సింహాచలంలో జరిగిన ఘటన మాటెంటి..? కాశీబుగ్గలో జరిగింది ప్రైవేట్ ఘటన కాదు.. ప్రభుత్వం బాధ్యత వహించాలి. కష్టం అంటే జగన్ ముందుంటారు. -
లోకేష్ కుట్రే.. పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారు: జోగి శకుంతల
సాక్షి, విజయవాడ: ఏపీలో నకిలీ మద్యం వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ పాత్ర ఏమీ లేదన్నారు ఆయన సతీమణి శకుంతల. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కావాలనే జోగి రమేష్ను అరెస్ట్ చేశారని ఆరోపించారు. దుర్గమ్మ సాక్షిగా ఏ తప్పు చేయలేదని ప్రమాణం చేసినా దౌర్జన్యంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు.మాజీ మంత్రి జోగి రమేష్ సతీమణి శకుంతల సాక్షితో మాట్లాడుతూ..‘చంద్రబాబు ఇంటికి వెళ్లినప్పటి నుంచి ఆయన, నారా లోకేష్ కక్ష పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్ష సాధిస్తున్నారు. గతంలో అగ్రిగోల్డ్ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారు నకిలీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్ పాత్ర ఏమీ లేదు. కావాలనే ఈ కేసులో పోలీసులు ఇరికించారు. దుర్గమ్మ సాక్షిగా ఏ తప్పు చేయలేదని ప్రమాణం చేశాం. ఇవాళ ఉదయాన్నే మా ఇంటిని వచ్చిన పోలీసులు.. తలుపులు మూసేసి దౌర్జన్యంగా వ్యవహరించారు. పైన దేవుడు ఉన్నాడు.. అందరికీ కుటుంబాలు ఉన్నాయి. దేవుడు అన్నీ చూసుకుంటాడు. మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం అంటూ వ్యాఖ్యలు చేశారు.మరోవైపు.. జోగి రమేష్ కుమారుడు రాజీవ్ మాట్లాడుతూ..‘పోలీసులు ముందస్తు నోటీసులు ఇవ్వలేదు. మా నాన్నను అక్రమంగా అరెస్ట్ చేశారు. చంద్రబాబుకు డైవర్షన్ పాలిటిక్స్ వెన్నతో పెట్టిన విద్య. నకిలీ మద్యం కేసుపై సీబీఐ విచారణ జరపాలి. మా నాన్నకు లై డిటెక్టర్ టెస్ట్ చేయాలి’ అని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ సహా ఆయన సోదరుడు జోగి రాము, ఆయన సహచరుడు రామును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. -
చంద్రబాబు.. అంత భయమెందుకు?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ను వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టిమళ్లించడానికి, నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ జోగి రమేష్ను అన్యాయంగా అరెస్టు చేశారని ఆరోపించారు. నకిలీ మద్యం కేసులో టీడీపీ మనుషుల ప్రమేయం లేకపోతే సీబీఐ చేత విచారణకు భయమెందుకు చంద్రబాబు అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘మీ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో అడ్డంగా మీరు దొరికిపోయి, దీని నుంచి తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగిరమేష్ను అన్యాయంగా అరెస్టు చేశారు. ముమ్మాటికీ ఇది అక్రమ అరెస్టు. జోగిరమేష్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను.గత 18 నెలలుగా ప్రభుత్వం మీది.. పాలన మీది. పట్టుబడ్డ నకిలీ మద్యం మీ హయాంలోనిది. పట్టుబడ్డవారిలో మీ పార్టీనుంచి ఎన్నికల్లో పోటీచేసిన ఎమ్మెల్యే అభ్యర్థి మొదలు, మీతోనూ, మీ కొడుకుతోనూ, మీ మంత్రులతోనూ, మీ ఎమ్మెల్యేలతోనూ, అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నవారే. మీరు తయారు చేసిన మీ నకిలీ మద్యాన్ని అంతా అమ్మేది, మీరు తీసుకు వచ్చిన మీ ప్రైవేటు లిక్కర్ షాపుల్లోనే, మీ కార్యకర్తలు, నాయకులు నడిపే బెల్టుషాపుల్లోనే, పర్మిట్ రూముల్లోనే. మరి తయారీ మీది, చేసిన వారు మీవారు, అమ్మేదీ మీరే, కాని బురదజల్లేది, అక్రమ అరెస్టులు చేసేది మాత్రం మావాళ్లని..@ncbn గారూ.. మీ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో అడ్డంగా మీరు దొరికిపోయి, దీని నుంచి తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగిరమేష్ను అన్యాయంగా అరెస్టు చేశారు. ముమ్మాటికీ ఇది అక్రమ అరెస్టు. జోగిరమేష్… pic.twitter.com/ros9R1o0xY— YS Jagan Mohan Reddy (@ysjagan) November 2, 2025నిన్న కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటకు కారణమైన ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టిమళ్లించడానికి, మోంథా తుపాను కారణంగా కుదేలైన రైతు గోడును పక్కదోవపట్టించడానికి ఈ అక్రమ అరెస్టుకు పాల్పడి, దుర్మార్గానికి ఒడిగట్టారు. నకిలీ మద్యం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలంటూ జోగి రమేష్ హైకోర్టులో పిటిషన్ వేసిన మరుసటిరోజే అరెస్టుకు దిగారంటే చంద్రబాబుగారు.. మీరు ఎంతగా భయపడుతున్నారో అర్థం అవుతోంది. నకిలీ మద్యం వ్యవహారంలో మీ ప్రమేయం, మీ మనుషుల ప్రమేయం లేకపోతే సీబీఐ చేత విచారణకు భయమెందుకు చంద్రబాబుగారూ? ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? మీ జేబులో ఉన్న సిట్ మీరు ఏం చెప్తే అది చేస్తుంది. మీరు సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్. మీ మాఫియా వ్యవహారాల మీద మీరే విచారణ చేయించడం హాస్యాస్పదం కాదా? ఇలాంటి రాక్షస పాలనలో మీ నుంచి ఏమి ఆశించగలం’ అని విమర్శలు చేశారు. -
కాశీబుగ్గ ఘటన డైవర్షన్ కోసమే జోగి రమేష్ అక్రమ అరెస్ట్..
-
కాశీబుగ్గ ప్రమాద బాధితులను పరామర్శించిన వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, తాడేపల్లి: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో YSRCP బృందం పర్యటించింది. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో సంఘటన స్థలాన్ని పార్టీ బృందం పరిశీలించింది.ముందుగా.. తొక్కిసలాట బాధితులను పార్టీ నేతలు పరామర్శించారు. బాధితులకు అందిస్తున్న వైద్యంపై వైఎస్సార్సీపీ నేతలు ఆరా తీశారు. వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందంలో శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యన్నారాయణ, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త కురసాల కన్నబాబు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు సహా పలు నియోజకవర్గాల కో–ఆర్డినేటర్లు, నాయకులు ఉన్నారు.కాశీబుగ్గలో తొక్కిసలాట దురదృష్టం: బొత్స సత్యనారాయణ కాశీబుగ్గలో తొక్కిసలాట దురదృష్టం. మా పార్టీ తరఫున బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఈ ప్రభుత్వం వచ్చాక 17 నెలల్లో తొక్కిసలాట జరగడం ఇది మూడోసారి. ప్రతీ శనివారం కాశీబుగ్గ ఆలయానికి వేలాదిగా భక్తులు వస్తారు. అంచనా వెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. చంద్రబాబు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. ఘటనకు ముందురోజే సమాచారం ఇచ్చానని ఆలయ ధర్మకర్త చెప్పారు. కాశీబుగ్గలో స్థానిక పోలీసులు ఏం చేస్తున్నారు.కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిగి.. ప్రభుత్వ నిర్లక్ష్యం బయటపడాలి. తిరుపతి, సింహాచలం ఘటనల్లో ఎవరి మీద చర్యలు తీసుకున్నారు. పోలీసులు లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా..?. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా..? లేదా..?. సనాతన ధర్మం అని పెద్ద పెద్ద మాటలు చెప్తారు. బయటకు చెప్పే మాటలు వేరు.. చేష్టలు వేరు.. దేవుడికి కూడా కోపం ఉంది అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. సమగ్ర విచారణ జరపాలి. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరక్కుండా చూడాలి. ప్రభుత్వ పెద్దలు ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలి. సిట్టింగ్ లేదా రిటైర్డ్ జడ్జితో విచారణ జరపాలి. అప్పుడే వాస్తవాలు బయటకు వస్తాయి. నిమిత్తమాతృలం అంటే కుదరదు. ప్రజలకు సమాధానం చెప్పాలి. నష్ట పరిహారం రూ. 25 లక్షలు డిమాండ్ చేస్తున్నాం’’ అని బొత్స పేర్కొన్నారు. -
‘చంద్రబాబు సర్కార్ మరో డైవర్షన్ డ్రామా’
సాక్షి, విజయవాడ: మాజీ మంత్రి జోగి రమేష్ అక్రమ అరెస్ట్ను వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మేరుగు నాగార్జున, పేర్ని వెంకట్రామయ్య (నాని), అంబటి రాంబాబు, కురసాల కన్నబాబు, గడికోట శ్రీకాంత్రెడ్డి, మార్గాని భరత్, టీజేఆర్ సుధాకర్బాబు సంయుక్త ప్రకటన విడుదల చేశారు‘‘మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ పూర్తిగా అక్రమం. ఇది కేవలం కక్ష సాధింపు చర్య. కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ను దురుద్దేశంతోనే ఇరికించారు. కస్టడీలో ఉన్న కేసులో ఏ–1 నిందితుడు జనార్థన్రావు ద్వారా జోగి రమేష్ పేరు చెప్పించారు. దానిపై జోగి రమేష్ చేసిన సవాల్, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ సాక్షిగా ఆయన చేసిప ప్రమాణంపై ఇప్పటి వరకు టీడీపీ నేతలు స్పందించలేదు. జోగి రమేష్ కుటుంబాన్ని ఇంకా వెఎస్సార్సీపీని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యం. అందుకే రాజకీయ దురుద్దేశంతో తప్పుడు విచారణలు, అక్రమ అరెస్ట్లు’’ అంటూ వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘లేని లిక్కర్ స్కామ్లు సృష్టించారు. కల్తీ మద్యం తయారుచేస్తూ టీడీపీ నాయకులు అడ్డంగా దొరికిపోవడంతో, ఆ బురదను వైఎస్సార్సీపీకి అంటించే కుట్ర చేస్తున్నారు. కల్తీ మద్యం కేసులో సీబీఐ దర్యాప్తు జోగి రమేష్ కోరారు. దానిపై హైకోర్టులో పిటిషన్ వేశారు. అది విచారణకు రాకముందే జోగి రమేష్ను అక్రమంగా అరెస్టు చేశారు. కాశిబుగ్గ శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో తొక్కిసలాట.. పలువురి దుర్మరణం. మోంథా తుపాన్ సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వ వైఫల్యం. రెండింటి నుంచి డైవర్షన్ కోసమే జోగి రమేష్ అరెస్ట్. కల్తీ మద్యం కేసులో పక్కా ఆధారాలున్నా, కొందరు టీడీపీ నాయకులు అరెస్ట్ లేదు. కేవలం కక్ష సాధింపు కోసమే జోగి రమేష్ను ఇరికించి అరెస్టు చేశారు. ప్రభుత్వ దమనకాండను ప్రజాక్షేత్రంలో ఎండగడతాం’’ అని వైఎస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు. -
వైఎస్ఆర్ సీపీ నేత జోగి రమేష్ అక్రమ అరెస్ట్
-
మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్
జోగి రమేష్ అరెస్ట్ అప్డేట్స్.. 6వ అడిషనల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో జోగి రమేష్ను హాజరు పరిచిన ఎక్సైజ్ పోలీసులుజీజీహెచ్ ఆసుపత్రిలో జోగి రమేష్, రాముకు వైద్య పరీక్షలు పూర్తి, ఆసుపత్రి నుంచి కోర్టుకు తరలింపుఆసుపత్రి వద్ద కన్నీటి పర్యంతమైన జోగి రమేష్ సతీమణి శకుంతలాదేవివైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్న పోలీసులుజీజీహెచ్ ఆసుపత్రికి భారీగా తరలివచ్చిన వైఎస్ఆర్సిపి కార్యకర్తలు, నాయకులుపోలీసులు, ప్రభుత్వ తీరుపై వైసీపీ కార్యకర్తలు ఫైర్జోగి రమేష్కు అనుకూలంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలువైఎస్ఆర్సిపి కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులుకాసేపట్లో జోగి రమేష్కు వైద్య పరీక్షలుజీజీహెచ్లో జోగి రమేష్, జోగి రాములకు వైద్య పరీక్షలుజోగి రమేష్ ఇంట్లో ముగిసిన సోదాలు..ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంట్లో ముగిసిన APFSL EVIDENCE RESPONSE TEAM సోదాలుసీసీ కెమెరాలు , ల్యాప్ టాప్లు పరిశీలించిన ఫోరెన్సిక్ టీమ్రెండు గంటలకు పైగా కొనసాగిన తనిఖీలుజోగి రమేష్ మొబైల్స్, ఆయన సతీమణి ఫోన్, ఇద్దరు కుమారులకు చెందిన ల్యాప్ ట్యాప్లు, సీసీకెమెరా ఫుటేజ్ హార్డ్ డిస్క్ స్వాధీనంజోగి రమేష్ ఇంట్లో తనిఖీల అనంతరం జోగి రమేష్ సోదరుడు రాము ఇంటికి వెళ్లిన తనిఖీల బృందంజోగి రమేష్ సహా మరో ఇద్దరు అరెస్ట్..విజయవాడ..మాజీ మంత్రి జోగి రమేష్ సహా మరో ఇద్దరిని అక్రమ అరెస్ట్ చేసిన ఎక్సైజ్ అధికారులు.జోగి రమేష్తో పాటు అతని సోదరుడు జోగి రాము అక్రమ అరెస్ట్జోగి రమేష్ ప్రధాన అనుచరుడు అరేపల్లి రాము అరెస్ట్భవానిపురం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్న అధికారులుమాజీ మంత్రి జోగి రమేష్ కామెంట్స్..చంద్రబాబు రాక్షసానందం పొందడానికే నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు.తప్పు చేయలేదని నా భార్య, పిల్లల మీద ప్రమాణం చేశాను.అయినా నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు.కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనను డైవర్ట్ చేసేందుకు కుట్ర ఇది.అందుకే నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు. ఎక్సైజ్ కార్యాలయానికి జోగి రమేష్ తరలింపు..మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్నకిలీ మద్యం కేసులో అరెస్ట్ చేసిన సిట్ అధికారులుజోగి రమేష్కు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసిన సిట్విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయానికి తరలింపుజోగి రమేష్ సోదరుడు రామును సైతం అరెస్ట్ చేసిన పోలీసులు. తనను అక్రమంగా అరెస్ట్ చేశారని జోగి రమేష్ ఆగ్రహం.జోగి రమేష్ అరెస్ట్పై వైఎస్సార్సీపీ నేతల ఆందోళనప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని నిరసనజోగి రమేష్ అరెస్ట్..మాజీ మంత్రి జోగి రమేష్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. జోగి రమేష్కు నోటీసులు ఇచ్చిన పోలీసులు.మాజీ మంత్రి జోగి రమేష్ వ్యక్తిగత కార్యదర్శి ఆరేపల్లి రామును అదుపులోకి తీసుకున్న పోలీసులుఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ సోదరుడు జోగి రాము ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు. జోగి రమేష్ అరెస్ట్ను నిరసిస్తూ వైఎస్సార్సీపీ కార్యకర్తల ఆందోళన. జోగి రమేష్ కుమారుడు రాజీవ్ కామెంట్స్..పోలీసులు ముందస్తు నోటీసులు ఇవ్వలేదు.మా నాన్నను అక్రమంగా అరెస్ట్ చేశారు.చంద్రబాబుకు డైవర్షన్ పాలిటిక్స్ వెన్నతో పెట్టిన విద్య.నకిలీ మద్యం కేసుపై సీబీఐ విచారణ జరపాలి.మా నాన్నకు లై డిటెక్టర్ టెస్ట్ చేయాలి. 👉మాజీ మంత్రి జోగి రమేష్పై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగింది. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ను ఇరికించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా జోగి రమేష్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటి వద్దకు తెల్లవారుజామునే భారీగా పోలీసులు చేరుకున్నారు. ఈ క్రమంలో జోగి రమేష్ ఇంటి వద్దకు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. 👉మాజీ మంత్రి జోగి రమేష్పై కూటమి ప్రభుత్వం ఓవరాక్షన్కు దిగింది. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ను ఇరికించే కుట్రకు తెరలేపింది. ఏ1 జనార్థనరావు స్టేట్మెంట్ ఆధారంగా ఆయనను ఇరికించేందుకు ప్లాన్ చేశారు. నకిలీ మద్యం మాఫియా నడిపిన టీడీపీ నేతలను పోలీసులు ఇప్పటి వరకు అరెస్ట్ చేయకుండా వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేశారు. ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం డంప్ కేసులో జోగి రమేష్పై అక్రమ కేసు పెట్టింది.👉అయితే, ఇప్పటికే నకిలీ మద్యం విషయంలో సీబీఐ విచారణ జరపాలని జోగి రమేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ వేసిన వెంటనే జోగి రమేష్ ఇంటికి భారీగా పోలీసులు చేరుకోవడం విశేషం. కాగా, ఏ1 జనార్థనరావు రిమాండ్ రిపోర్టులో జోగి రమేష్ ప్రస్తావన లేకపోవడం ఈ కేసులో కీలక పరిణామం. జనార్థనరావు జైలుకి వెళ్లాక కుట్ర పూరితంగా ఓ వీడియో విడుదల చేశారు. పోలీసుల అదుపులో ఉన్నప్పుడు వీడియో రికార్డింగ్ చేసి ఎల్లో మీడియా, టీడీపీ ఆఫీస్ ద్వారా వీడియోను బయటకు వదిలారు.👉కాగా, నకిలీ లిక్కర్ డాన్ జనార్థనరావు టీడీపీలో క్రియాశీలకంగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. జనార్థనరావుతో టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ఆయన బావమరిదికి సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో టీడీపీ ఎమ్మెల్యే వసంతను జనార్థనరావు కలిశారు. జనార్థనరావు సమక్షంలోనే తంబళ్లపల్లె జయచంద్రారెడ్డికి చంద్రబాబు బీఫామ్ కూడా ఇచ్చారు. చంద్రబాబుతో ఏ1 జనార్థనరావు దిగిన ఫొటోలు సైతం బయటకు వచ్చాయి. కాగా, నకిలీ మద్యం కేసులో టీడీపీ నేతలను తప్పించి కూటమి సర్కార్ వైఎస్సార్సీపీ నేతలపైకి కేసు డైవర్షన్ చేసింది. సీఎం చంద్రబాబు ప్రెస్మీట్ పెట్టిన తర్వాత జోగి రమేష్ పేరు తెరపైకి తెచ్చారు. సిట్ వేసిన వెంటనే జనార్థనరావు వీడియోను విడుదల చేశారు. ఎల్లో స్క్రిప్ట్ ప్రకారం నకిలీ లిక్కర్ విచారణ కట్టుకథను అమలు చేస్తున్నారు. ఇక, మద్యం ఫ్యాక్టరీ పెట్టిన టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డిని, ఆయన బావ మరది గిరిధర్ రెడ్డిని సైతం పోలీసులు అరెస్ట్ చేయకపోవడం గమనార్హం. -
కాశీబుగ్గ తొక్కిసలాట.. పలాస ఆసుపత్రి దగ్గర ఉద్రిక్తత
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: పలాస ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన వారికి పలాస ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి, ధర్మాన ప్రసాదరావును ఆసుపత్రి గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. బాధితులను పరామర్శించేందుకు పోలీసులు నిరాకరించారు.ఆసుపత్రి ప్రాంగణం ఖాళీ చేయాలని ఆదేశించిన పోలీసులు.. వైఎస్సార్సీపీ శ్రేణులను బయటకు పంపించివేశారు. పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పలాస ఆసుపత్రి వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులు, సీదిరి అప్పలరాజు బైఠాయించారు.కాశీబుగ్గ ఆలయం తొక్కిసలాటలో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోందని ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. ‘‘25 వేల మందికి పైగా భక్తులు వస్తే ఇద్దరు కానిస్టేబుళ్లు వెళ్లారు. దేవాలయం ప్రైవేటా? ప్రభుత్వానిదా అన్నది ప్రశ్నకాదు. ప్రజల ప్రాణాలు కాపాడటమే ప్రధానం’’ అని ధర్మాన పేర్కొన్నారు. -
కాశీబుగ్గ తొక్కిసలాట బాబు సర్కార్ వైఫల్యమే: వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ: కాశీబుగ్గ ఘటన ప్రభుత్వ వైఫల్యమేనని.. భక్తుల మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై ఆయన స్పందిస్తూ.. చంద్రబాబు హిందూ ధర్మ వ్యతిరేకి.. ఆయన పాలనలోనే వరుసగా ఆలయాల్లో అపచారాలు జరుగుతున్నాయంటూ మండిపడ్డారు.‘‘కాశీబుగ్గ ఘటన నుంచి ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రైవేట్ ఆలయం అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అనిత, ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడటం సిగ్గుచేటు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆలయాల్లో ఎప్పుడూ లేని అపచారాలు జరుగుతున్నాయి. తిరుపతిలో ముక్కోటి ఏకాదశి రోజు ఆరుగురు చనిపోయారు. సింహాచలంలో ఏడుగురు చనిపోయారు. చంద్రబాబుకు హిందూ ఆలయాల మీద ఏనాడూ ప్రేమ లేదు. తన పబ్లిసిటీ కోసం తప్ప ఆలయాల కోసం చంద్రబాబు ఏమీ చేయలేదు. గోదావరి పుష్కరాలలో 29 మంది మృతికి కారణమయ్యారు. ఆలయాల్లో భక్తులకు సౌకర్యాలు కల్పించాలన్న ఆలోచనే వారికి లేదు...చంద్రబాబు, పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత, ఆనం రామనారాయణరెడ్డి తమకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడతున్నారు. కార్తీకమాసంలో ఆలయాలకు భక్తులు వెళ్తారన్న సంగతి తెలీదా?. ఆలయాలు నిర్మించటం తప్పు అని చంద్రబాబు అనటం సిగ్గుచేటు. ఏ ఆలయానికి ఎంతమంది భక్తులు వస్తారో అంచనా వేయలేరా?. ఇంటిలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోంది?. మా పార్టీ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేయటానికే పోలీసులను వాడుకుంటారా?. ప్రైవేటు వ్యక్తులు ఆలయాలు కట్టటం తప్పా?..విజయవాడలో ప్రయివేటు వ్యక్తుల ఉత్సవాలకు పోలీసుల బందోబస్తు నిర్వహిస్తారా?. అదే ఆలయాల దగ్గర మాత్రం బందోబస్తు ఏర్పాటు చేయరా?. మా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు చాలామంది భక్తులను కాపాడారు. సీపీఆర్ చేసి రక్షించారు. హోంమంత్రి అనితకు పోలీసు వ్యవస్థ మీద ఏమాత్రం పట్టు లేదు. ఆమె ఎంతసేపటికీ మా పార్టీ వారిపై దూషణలు చేయటానికే పరిమితం అయ్యారు. గోశాలలో ఆవులు చనిపోతున్నా పట్టించుకోవటం లేదు...చంద్రబాబు బూట్లు వేసుకుని పూజలు చేస్తారు. ఇదేనా ఆయనకు హిందూ ధర్మం మీద ఉన్న భక్తి?. చంద్రబాబు విజయవాడలో ఆలయాలను కూల్చి మున్సిపాలిటీ చెత్తలారీలో విగ్రహాలను తీసుకెళ్లారు. కాశీబుగ్గ ఘటన ప్రభుత్వ వైఫల్యమే. ఇంత జరుగుతుంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ సినిమా షూటింగ్ లో ఉన్నారు?. జరిగిన తప్పుపై ఎందుకు మాట్లాడటం లేదు?. ఆలయాలపై రాజకీయ కుట్రలు మానుకోవాలి. తిరుమల లడ్డూపై కూడా రాజకీయం చేసిన చరిత్ర టీడీపీది’’ అంటూ వెల్లంపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు. -
కాశీబుగ్గ ఘటన: వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, గుంటూరు: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయ తొక్కిసలాట ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక కార్యక్రమాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు పాల్గొనాలని పిలుపు ఇచ్చారు. మీడియాలో సమాచారం మేరకు 10 మంది మరణించారని తెలుస్తోంది. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలి. వైఎస్సార్సీపీ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొనాలి.... తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మరణించారు. అలాగే సింహాచలంలోనూ దుర్ఘటన జరిగి ఏడుగురు మరణించారు. ఇప్పుడు కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఘటన వల్ల ఇప్పటిదాకా 10 మంది మరణించారని తెలుస్తోంది. ఈ 18 నెలలకాలంలో ఇలాంటి వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవడం లేదని అర్థం అవుతోంది. ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరిస్తూ భక్తుల ప్రాణాలు బలి తీసుకుంటోంది. చంద్రబాబు అసమర్థ పాలనకు నిదర్శనం ఇది. ఇకనైనా కళ్లు తెరిచి తప్పులను సరిదిద్దుకోవాలి అని జగన్ పేర్కొన్నారు. -
కాశీబుగ్గ క్షతగాత్రులకు సీదిరి వైద్యం
సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళంలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదం నేపథ్యంలో ఘటన స్థలానికి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు చేరుకున్నారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు వైద్య సాయం అందిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే వైఎస్సార్సీపీ బృందం చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొంది.ఈ సందర్బంగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఓ ప్రకటనలో..‘కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం ఎంతో విచారకరం. ఈ దుర్ఘటన తీవ్రంగా బాధించింది. మృతుల కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. భక్తుల ప్రాణనష్టానికి కారణమైన పరిస్థితులపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ తొక్కిసలాట’ అని తెలిపారు. మరోవైపు, ఈ ఘటనపై మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పందిస్తూ..‘కాశీబుగ్గ తొక్కిసలాటలో అమాయకులైన భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దైవ దర్శనానికి ఇంత పెద్ద సంఖ్యలో వస్తున్నారని తెలియదా?. ప్రతీ ఏటా ఈరోజున ఎక్కువ సంఖ్యలో వస్తారు కదా?. ముందస్తు సమాచారం ఉన్నా పోలీసులు ఎందుకు భద్రత ఇవ్వలేదు?. ఇది పూర్తిగా పాలనా వైఫల్యమే. ఈ దుర్ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. గత అనుభవాల నుంచి ప్రభుత్వం పాఠాలు నేర్చుకోలేదు’ అని విమర్శలు చేశారు. -
ప్రైవేట్ పరం చేస్తే... కమీషన్లు వస్తాయని మంత్రి సవితకు ఉషశ్రీ చరణ్ కౌంటర్
-
మంత్రి అచ్చెన్నాయుడుకు కాకాణి సవాల్
సాక్షి, నెల్లూరు: మంత్రి అచ్చెన్నాయుడుకు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అని సవాల్ చేశారు. అలాగే, రైతుల సమస్యలపై చర్చించేందుకు చంద్రబాబు, అచ్చెన్నాయుడు సిద్ధమా? అని ప్రశ్నించారు.మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్సార్సీపీ హయాంలో ఆర్బీకే వ్యవస్థ ద్వారా రైతులకు వైఎస్ జగన్ అండగా నిలిచారు. వైఎస్ జగన్ తెచ్చిన వ్యవస్థలను చంద్రబాబు కుట్రపూరితంగా నిర్వీర్యం చేశారు. చంద్రబాబు మాటలను నమ్మ ప్రజలు, రైతులు మోసపోయారు. కూటమి నేతల తీరు చూసి ప్రజలు ఛీకొడుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధం. అసెంబ్లీ సాక్షిగా కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులే విమర్శలు చేసుకుంటున్నారు. రైతులు సమస్యలపై చర్చించేందుకు చంద్రబాబు, అచ్చెన్నాయుడు సిద్ధమా? అని సవాల్ విసిరారు.కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. ఏపీలోని బెల్టు షాపుల్లో 90 శాతం నకిలీ మద్యమే. నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలు పోతున్నాయి. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో బెల్టు షాపులను ఎత్తేశాం. ప్రజల ప్రాణాలంటే చంద్రబాబుకు లెక్కలేదు. మద్యం బాటిళ్లపై క్యూఆర్ కోడ్ ఎక్కడుంది?. ఎక్సైజ్ అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదు. ప్రజల ఆరోగ్యంతో సంబంధం లేకుండా దోచుకుంటున్నారు’ అని ఘాటు విమర్శలు చేశారు. -
బాబుది చారిత్రక తప్పిదం: వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అదే సమయంలో కూటమి ప్రభుత్వం అధికారికంగా వేడుకలు నిర్వహించకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.‘‘పొట్టి శ్రీరాములుగారి అహింసా దీక్షతో, ప్రాణత్యాగంతో తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. తెలుగువారి ఆత్మగౌరవంకోసం అలుపెరగని పోరాటం చేశారాయన. పొట్టి శ్రీరాములుగారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ, ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. .. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని జరపకుండా చంద్రబాబుగారి ప్రభుత్వం చారిత్రక తప్పిదాలకు పాల్పడుతూనే ఉంది. పొట్టి శ్రీరాములుగారి త్యాగాన్ని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని అవమానపరచడమే. రాష్ట్ర అవతరణ దినోత్సవం రాజకీయాలకు అతీతంగా జరగాలి’’ అని ఎక్స్ ఖాతాలో కోరారాయన. పొట్టి శ్రీరాములుగారి అహింసా దీక్షతో, ప్రాణత్యాగంతో తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. తెలుగువారి ఆత్మగౌరవంకోసం అలుపెరగని పోరాటం చేశారాయన. పొట్టి శ్రీరాములుగారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ, ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్…— YS Jagan Mohan Reddy (@ysjagan) November 1, 2025 భాషా ప్రతిపాదికన.. 1956లో నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. అప్పటి నుంచి 58 ఏళ్లపాటు ఆ తేదీనే అవతరణ దినోత్సవంగా నిర్వహిస్తూ వచ్చాయి ప్రభుత్వాలు. 2014, జూన్ 2వ తేదీన తెలుగు రాష్ట్రాలు విడిపోయాయి. వైఎస్సార్సీపీ హయాంలోనూ ఆ వేడుకలు జరిగాయి. అయితే 2024లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా జరపడం లేదు. అందువల్ల కూటమి ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో.. శనివారం తాడేపల్లిలోని YSRCP కేంద్ర కార్యాలయంలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా జరిగింది. పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాలలు వేసి పార్టీ నేతలు నివాళులర్పించారు. ప్రభుత్వం వేడుకలను నిర్వహించకపోవడాన్ని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగ ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అలాంటిది ఆయన త్యాగానికి చంద్రబాబు విలువ లేకుండా చేశారు. ప్రభుత్వం తరపున పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయలేదు. రాష్ట్రంలో ఆర్యవైశ్యలే చందాలు వసూలు చేసుకుని పొట్టి శ్రీరాములు విగ్రహం పెట్టుకోమని లోకేష్ సూచించారు. అందుకే మండలాలు, జిల్లాల వారీగా టార్గెట్ పెట్టి చందాలు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం పొట్టి శ్రీరాములు విగ్రహం పెట్టలేని స్థితిలో ఉందా?. ఎన్టీఆర్ విగ్రహానికి వందల కోట్లు ఖర్చు పెడతారుగానీ.. పొట్టి శ్రీరాములుని మాత్రం విస్మరిస్తారా?. ఇది సరైన నిర్ణయం కాదు. ప్రభుత్వమే పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. వైశ్యుల దగ్గర చందాలు వసూలు చేస్తామంటే సహించం’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మారాల్సింది బాలయ్య ఫోకస్!
అధికార పార్టీ అండదండలతో జిల్లాలో కొందరు కల్లు వ్యాపారులు పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వారి ఆగడాలను అడ్డుకోవాల్సిన అధికారులు వంతపాడుతున్నారు. పైగా కళ్ల ముందు కల్తీ బాధితులు కనిపిస్తున్నా.. మా కళ్లకు అలాంటివేం కనిపించడం లేదంటూ నిర్లక్ష్యంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. స్వయంగా సీఎం బావమరిది నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కనిపిస్తున్న పరిస్థితులు ఇవి. కల్తీ కల్లుతో హిందూపురం, పరిగి మండలాలకు చెందిన పేదలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. మతిస్థిమితం కోల్పోయి వింతగా ప్రవరిస్తుండటంతో ఆస్పత్రులకు తరలిస్తున్నారు. రెండురోజుల క్రితం చౌళూరులో కల్లుతాగిన 13 మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. స్థానికంగా వైద్యం అందించినా పరిస్థితి మెరుగుపడకపోవడంతో బంధువులు వారిని పొరుగున్న ఉన్న కర్ణాటక ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. బాలయ్య ఫోకస్ మారాలిహిందూపురంలో ఇప్పటిదాకా ఏ ఇష్యూపైనా ఎమ్మెల్యే బాలకృష్ణ నేరుగా స్పందించింది లేదు. ఇప్పుడు అధికార పార్టీ నేతల ఆధర్వ్యంలో జరుగుతున్న కల్తీ కల్లు వ్యవహారంపైనా ఆయన స్పందిస్తారన్న ఆశలేదని స్థానికులు అంటున్నారు. అయితే ఈ వ్యవహారంపై స్పందిస్తూ ఆస్ట్రేలియా ఎన్నారై, వైఎస్సార్సీపీ సీనియర్ నేత సూర్య నారాయణ రెడ్డి బాలయ్యపై మండిపడ్డారు. ఏపీలో ప్రతీది కల్తీమయం అవుతోందని.. రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులను కల్తీ కల్లు కాటేయడం బాధాకరమని అన్నారాయన. ఎప్పుడో ఒకసారి అసెంబ్లీకి వెళ్లి వైఎస్ జగన్ మీదనో, చిరంజీవి మీదనో నోటి దురద తీర్చుకోవడం తప్పించి నియోజకవర్గానికి చేసిందేమీ లేదని అన్నారు. ఆయన నియోజకవర్గంలో పేదలు కల్తీ కల్లు బారిన పడడం.. అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండడం బాధాకరమని అన్నారు. బాలయ్య తన నటనను సినిమాల వరకే పరిమితం చేయాలని.. పేదవాళ్ల జీవితాలతో ఆడుకోవద్దని.. ఇకనైనా ఫోకస్ హిందూపురం మీద పెడితే బాగుంటుందని సూర్య నారాయణ రెడ్డి హితవు పలికారు.జోరుగా.. హిందూపురం పెనుకొండ, మడకశిర నియోజకవర్గాల పరిధిలోని పలు గ్రామాల్లో రసాయనాలు కలిపిన కల్లు విక్రయాలు జరుగుతున్నాయి. చౌళూరుకు సరిహద్దున ఉన్న కర్ణాటక గ్రామాల నుంచి సైతం వస్తున్నారు. ఈ వ్యవహారంలో ఎక్సైజ్ అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈత వనాల నుంచి అరకొరగా వచ్చే కల్లును సేకరించి అందులో డైజోఫాం, హెచ్ తదితర రసాయనాలతోపాటు తీపి కోసం(డబుల్ డెక్కర్) చాకరిన్, చక్కెర, తెలుపు కోసం మైదా కలిపి పేద ప్రజలకు విక్రయిస్తున్నారని తెలుస్తోంది. పుట్టపర్తి ప్రాంతంలో ఉన్న ఓ అధికారి కల్లు దుకాణాల నిర్వహణలో చక్రం తిప్పుతున్నారు. హిందూపురం పరిధిలోని ఓ అధికారి నెలనెలా సొసైటీల నుంచి వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. హిందూపురానికి చెందిన ఓ వ్యాపారి కొన్నేళ్లుగా గీత సొసైటీలను తన ఆధీనంలోకి తీసుకున్నారు. హైదరాబాద్, మహారాష్ట్ర నుంచి డైజోఫాం, హెచ్ను గుట్టుచట్టుప్పుడు కాకుండా దిగుమతి చేసుకుని తన ఫాంహౌస్లో ఈత కల్లులో కలిపిస్తున్నారు. ఈ ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. -
మిథున్ రెడ్డికి ఐరాసలో అరుదైన గౌరవం
-
పీకలు కోసేస్తాం.. లోకేష్ అనుచరుల బెదిరింపులు
-
ఐరాసలో మిథున్రెడ్డి
సాక్షి, ఢిల్లీ: వైఎస్సార్సీపీ లోక్సభ పక్షనేత, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి అరుదైన అవకాశం లభించింది. ఐక్యరాజ్యసమితి 80వ సర్వసభ్య సమావేశంలో భారత్ తరఫున ఆయన తాజాగా ప్రసంగించారు(Mithun Reddy UN Speech). న్యూయార్క్లోని భారత రాయబార కార్యాలయం ఇందుకు సంబంధించిన ప్రసంగాన్ని పోస్ట్ చేసింది.అంతర్జాతీయ లా కమిషన్ ఆరవ కమిటీ పని నివేదికపై ఆయన భారత ప్రతినిధిగా మాట్లాడారు. పైరసీ, సాయిధ దోపిడి నిరోధానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అలాగే.. ప్రభుత్వ అధికారుల ఇమ్యూనిటీ ముసాయిదా నిబంధనలపై భారత్ అభ్యంతరాలను మిథున్రెడ్డి తెలియజేశారు. ఆయన ప్రసంగం.. ‘‘పరస్పర సంప్రదింపులు, చర్చల ద్వారానే వివాదాలకు పరిష్కారం దొరుకుతుందని భారత్ విశ్వసిస్తోంది. ఐక్యరాజ్యసమితిలో భారత్ వ్యవస్థాపక సభ్య దేశం. ఐక్యరాజ్యసమితి విధివిధానాలకు మా దేశం కట్టుబడి ఉంది. వర్తకం, పెట్టుబడులలో తలెత్తే వివాదాల పరిష్కారాలకు ఐక్యరాజ్యసమితి విధానాలకు అనుగుణంగా పనిచేస్తోంది. ఆర్బిట్రేషన్, ప్రత్యామ్నాయ పరిష్కార విధానాల ద్వారా సమస్యలను పరిష్కరిద్దాం#IndiaAtUNHon’ble MP @MithunReddyYSRC delivered 🇮🇳’s statement on Report of the work of International Law Commission in the Sixth Committee. He highlighted India’s reservations on draft provision concerning Immunity of State Officials. Underscored the use of new… pic.twitter.com/urrgNyM2pM— India at UN, NY (@IndiaUNNewYork) October 31, 2025.. అంతర్జాతీయ సంస్థలు, ప్రభుత్వాల మధ్య వివాదాలను కూడా ఇలాంటి పద్ధతుల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవచ్చు. వ్యక్తిగత మానవ హక్కులు, న్యాయ సౌలభ్యం, అంతర్జాతీయ సంస్థల స్వతంత్ర పని విధానాల మధ్య సమతుల్యత అవసరం. అంతర్జాతీయ సంస్థల మధ్య వివాదాల పరిష్కార సమయంలో దౌత్యపరమైన రక్షణలు అవసరం. అలాగే.. .. పైరసీ, ఆయుధాల దోపిడి నిరోధానికి సమగ్రమైన లీగల్ ఫ్రేమ్ వర్క్ అవసరం ఉంది. అంతర్జాతీయ చట్టాలను, ఒప్పందాలను సమగ్రంగా తయారు చేయాలి. కొత్త టెక్నాలజీలను ఉపయోగించడం ద్వారా వీటిని నిరోధించాలి. ఆయుధాల దోపిడీ నిరోధానికి సముద్ర చట్టాలను పరిగణలోకి తీసుకోవాలి. అంతర్జాతీయ చట్టాలను పరిగణలోకి తీసుకొని సముద్రంలో జరిగే ఆయుధాల దోపిడి నివారించాలి.. స్టేట్స్ సక్సేషన్ విషయంలో పారదర్శక విధానాలు అవసరం. ఈ అంశంలో భీమల్ , పటేల్ నేతృత్వంలో వర్కింగ్ గ్రూప్ ఏర్పాటును భారత్ స్వాగతిస్తోంది. జఠినమైన ఈ అంశంలో స్పష్టమైన పాలనాపరమైన విధివిధానాలు అవసరం’’ అని మిథున్రెడ్డి అన్నారు. -
బాబు మామూలోడు కాదు.. తుఫాన్ ను ఏపీకి తప్పించి.. తెలంగాణకు మళ్లించిన ధీరుడు..!
-
కల్తీ నెయ్యి కేసుతో చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ షురూ
సాక్షి,తాడేపల్లి: తుఫాన్లో నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవడంలో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం తిరుమల కల్తీ లడ్డు పేరుతో మరోసారి డైవర్షన్ రాజకీయాలకు తెరలేపిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... దేవుడి పేరుతో టీడీపీ నేతలు చేస్తున్న రాజకీయ కక్ష సాధింపు చర్యలను ఆ దేవుడు, ప్రజలు కూడా క్షమించరని హెచ్చరించారు. లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు ఆసత్య ఆరోపణలపై సమగ్రమైన విచారణ జరిపించాలని టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దేశ సర్వోన్నత న్యాయస్ధాన్ని ఆశ్రయిస్తే... సుప్రీం కోర్టు అడిగిన ప్రశ్నలను ఇప్పటికీ చంద్రబాబు బదులివ్వలేదని అంబటి స్పష్టం చేశారు. కేవలం వైఎస్సార్ర్సీపీ నేతలపై కక్ష సాధింపు కోసం దేవుడిని కూడా వాడుకోవడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు.. పర్చేజింగ్ కమిటీలో ఉన్న కొలుసు పార్ధసారధి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిలు సభ్యులుగా ఉన్నా.. ఎల్లో మీడియా వారి పేర్లు ఎందుకు ప్రస్తావించడం లేదని నిలదీశారు. దేవుడ్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న నీచమైన, కక్ష రాజకీయాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్..గడిచిన రెండు, మూడు రోజులుగా తుపాన్ ప్రభావంతో పంటలు దెబ్బతిని రాష్ట్రంలో రైతులు తీవ్ర వేదనలో ఉన్నారు. మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసి, దానిలో కిక్ బ్యాగ్స్ ద్వారా కోట్లాది రూపాయలు ఆర్జించాలని తండ్రీకొడుకులు వేదన రాష్ట్రంలో ఉంటే... వీటిని ఏదో ఒక విధంగా చంద్రబాబు డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. అందులో భాగమే చిన్నప్పన్న అరెస్టు. ఈ అరెస్టు ద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యులైన వైవీ సుబ్బారెడ్డి మీద బురజ జల్లే కార్యక్రమం ఉధృతం చేస్తున్నారు. సిట్ను నడిపిస్తున్న ఎల్లో మీడియాలో కధనాలు చూస్తే... సుబ్బారెడ్డి గారెపై బురద జల్లే ప్రయత్నం జరుగుతోంది. చంద్రబాబు చేష్టల వల్ల ప్రపంచవ్యాప్తంగా హిందూవులు తీవ్రంగా బాధపడుతున్నారు.సుప్రీం ప్రశ్నలకూ బదులివ్వని చంద్రబాబు..చంద్రబాబు తిరుపతి లడ్డూలో పంది, పశు కొవ్వు కలిసిన నెయ్యితో తయారు చేశారన్న అసత్యమైన ఆరోపణ చేశారు. అది కోట్లాది మంది భక్తులు తిన్నారని కూడా చెప్పాడు. ఇది ఆధారాల్లేని అపవాదు. దీని మీద వైయస్సార్సీపీ పార్లమెంటరీ నాయకుడు వై వీ సుబ్బారెడ్డి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు అనేకమైన కీలక వ్యాఖ్యలు చేసింది. ఆధారాలు లేకుండా లడ్డూ ప్రసాదం కల్తీ అయిందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా చెబుతారు అని అడిగింది. అంతే కాకుండా లడ్డూ తయారీలో వాడిన నెయ్యి కల్తీ అయిందా ? లేదా? తేల్చండి అని కూడా చెప్పింది. మరోవైపు అప్పటి ఈవో శ్యామలరావు మాట్లాడుతూ నెయ్యిని ఎన్ డీ బీ ల్యాబ్ కు పంపించాం. వారు వనస్పతిలాంటిది కలిసిందని సర్టిఫై చేస్తూ... కింద ఇది కొన్ని సందర్భాలలో అవాస్తవం కూడా కావచ్చు. పశువులు తినే మేత, టైమింగ్స్ మీద ఆధారపడి ఉంటుంది.. అని రాసిన డిస్ క్లైమర్ కూడా మీడియాకు చదివి వినిపించారు. ఆ నెయ్యిని వాడలేదు, వెనక్కి తిరిగి పంపించామని చెప్పారు. చంద్రబాబు గారు మాత్రం కేవలం రాజకీయ దురద్దేశ్యంతో ఆ నెయ్యి వాడారని... కల్తీ జరిగిందని చెప్పారు. ఈవో ఒక మాట, చంద్రబాబు మరో మాట ఎలా చెబుతారు? ఎన్ డీ బీ ల్యాబ్ ఒక్కటే ఉందా? సెకెండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని కూడా సుప్రీం కోర్టు ప్రశ్నించింది. మొత్తంగా నెయ్యిలో కల్తీ కలిసిందా ? లేదా? అన్నది తేల్చండి అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కానీ చంద్రబాబు మాత్రం బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. అందులో భాగంగానే సుబ్బారెడ్డి గారి దగ్గర 8 సంవత్సరాలు క్రితం పీఏ గా పనిచేసిన చిన్నప్పన్నను ఈ ఏడాది మే 31న విచారణకు రమ్మని నోటీసులు ఇచ్చారు. జూన్ 6న సిట్ ఎదుట చిన్నప్ప హాజరైతే...విచారణ అనంతరం ఆయన ఒక వీడియో విడుదల చేసి.. విచారణ పేరుతో సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిల పేరు చెప్పమని సిట్ అధికారులు నన్ను బలవంతం చేశారు, నేను చెప్పలేదు స్పష్టం చేశారు. 8 సంవత్సరాల క్రితం పనిచేసిన చిన్నప్పన్నను ఆ రోజు అరెస్టు చేయకుండా 4 నెలల తర్వాత అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. సుబ్బారెడ్డి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాను.దేవుడి పేరుతో వైఎస్సార్సీపీ నేతలపై రాజకీయ కక్ష సాధింపునేను ఇవాళ చంద్రబాబు, సిట్ అధికారులు, ఎల్లో మీడియాను ప్రశ్నిస్తున్నాను. చిన్నప్పన్న కేవలం సుబ్బారెడ్డి గారి దగ్గర మాత్రమే పనిచేయలేదు.. ఆయన అధికార పార్టీ ఎంపీగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డి దగ్గర కూడా పీఏగా పనిచేశారు. వారి గురించి సిట్, ఎల్లో మీడియా ఎందుకు మాట్లాడ్డం లేదు. అంటే వాళ్లు ఇప్పుడు అధికార తెలుగుదేశం పార్టీలో చేరి పదవుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ల గురించి రాయడం లేదా? అంటే మీ టార్గెట్ కేవలం వైయస్.జగన్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులేనా? కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని అడ్డం పెట్టుకుని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద రాజకీయ కక్ష సాధిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు టీటీడీ పర్చేజింగ్ కమిటీలో కొలుసు పార్ధసారధి, ప్రశాంత్ రెడ్డి ఇద్దరూ సభ్యులే. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లు వారి ప్రస్తావన ఎందుకు తేవడం లేదు? చిన్నప్పన్న వాళ్ల దగ్గర కూడా పనిచేసినా సుబ్బారెడ్డి పేరే వస్తుంది. సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు పర్చేజింగ్ కమిటీలో న్న వ్యక్తులు ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారు కాబట్టి... వారిని విచారణ కూడా చేయాల్సిన అవసరం లేదన్నట్టు దుర్మార్గమైన పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు. ఇది ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కిలో రూ.320కు ఆవునెయ్యి కొంటున్నారు. కల్తీ కాకపోతే అంత తక్కువ ధరకు వస్తుందా? స్వచ్చమైన నెయ్యి అయితే రూ.3వేలు అవుతుందని కూడా ప్రచారం చేశారు. ఈనాడు అయితే స్వచ్ఛమైన నెయ్యి కేజీ రూ.1000 నుంచి రూ.1600 ఖరీదు చేస్తుంది. రూ.320 కు కొన్నారంటే అది కల్తీ నెయ్యి తేల్చిపారేశారు. నేను టీటీడీ బోర్డును ప్రశ్నిస్తున్నాను.. ఇప్పుడు కేజీ నెయ్యి రూ.3వేలకు కొంటున్నారా? రూ.1600 కు కొంటున్నారా? కనీసం రూ.1000కు కొంటున్నారా? రూ.320 కంటే ఎక్కువ, రూ.1000 కన్నా తక్కువకు కొంటున్నారు. మీరు చెప్పిన వాదన ప్రకారం ఇది స్వచ్ఛమైన నెయ్యి అని నమ్మమంటారా? సమాధానం చెప్పాలి.మీ కక్ష రాజకీయాలను ఎదుర్కోవడానికి మేం సిద్ధం..2014-19 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీటీడీ కేజీ నెయ్యి రూ.276లకే కొనుగోలు చేసింది. అది మాత్రం స్వచ్చమైన నెయ్యి. ఆయన దిగిపోగానే రూ.320 కి కేజీ నెయ్యి కొంటే అది కల్తీ నెయ్యి, అందులో జంతుకొవ్వు కలిసిందంటూ అపవిత్రమైన మాటలు మాట్లాడిన చంద్రబాబు భ్రష్టు పట్టించారు. సుప్రీం కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. సుప్రీం కోర్టు అడిగిన స్పష్టమైన ప్రశ్నలకు చంద్రబాబు ఈ రోజు వరకూ సమాధానం చెప్పలేని స్ధితిలో ఉన్నారు. కేవలం శ్రీవేంకటేశ్వరస్వామిని అడ్డం పెట్టుకుని వైయస్సార్సీపీ మీద రాజకీయ కక్ష సాధించాలని చంద్రబాబునాయుడు దుర్మార్గమైన పాప కార్యం చేస్తున్నారు. పీఏ చిన్నప్పన్న దగ్గర ఒక్క రూపాయి పట్టుకున్నది లేదు. కానీ బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. దేవుడ్ని అడ్డం పెట్టుకుని మీరు చేసే నీచమైన, కక్ష రాజకీయాలను ఎదుర్కోవడానికి మేం ప్రతిక్షణం సిద్ధంగా ఉన్నాము.కల్తీ లిక్కర్ కేసులో నిందితులైన మీ పార్టీ నేతలు ఎక్కడ ?మా పార్టీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ మీద కక్ష సాధింపు మొదలుపెట్టారు. చాలా రకాలుగా అరెస్టు చేయాలని ప్రయత్నాలు చేసి .. కల్తీ మద్యం కేసులో అరెస్టు చేయాలని చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారెకి చెందిన ప్రైవేటు వ్యాపారులే కల్తీ లిక్కర్ వ్యాపారం చేస్తున్నారు. కల్తీమద్యం తయారీలో అతిపెద్ద నిందితుడు, ఆ పార్టీ తంబళ్లపల్లె నియోజకవర్గం సమన్వయకర్త జయచంద్రారెడ్డి మాత్రం పోలీసులుకు దొరకడు. ఆయన బావమరిది గిరిచంద్రారెడ్డి, పీఏ రాజేష్ లు కూడా దొరకరు. ఎందుకంటే వాళ్లు దొరికితే వాస్తవాలన్నీ బయటపడతాయి. దాన్ని కూడా వైయస్సార్సీపీ నేతల మీద కక్ష సాధింపు చర్యలకు వాడుకుంటున్నారు. గతంలో చంద్రబాబు ఇంటి వద్దకు ప్రశ్నించడానికి వెళ్లాడని జోగి రమేష్ పై కక్ష కట్టి.... బెయిల్ రాకుండా నెలల తరబడి జైల్లో పెట్టాలని చూస్తున్నారు.కేవలం వైఎస్సార్సీపీ నాయకులను వేధించడమే లక్ష్యంగా ప్రభుత్వం, వారి ఆధ్వర్యంలోని సిట్ పనిచేస్తోంది. మీ కక్ష సాధింపు చర్యలకు చివరకు దైవాన్ని కూడా అడ్డం పెట్టుకోవడం అత్యంత దుర్మార్గమని అంబటి ఆక్షేపించారు. ఇప్పటికైనా ఇలాంటి కార్యక్రమాలను ఆపకపోతే ఆ దేవ దేవుడి మిమ్మల్ని క్షమించడని, జరుగుతున్నదాన్ని గమనిస్తున్న ప్రజలు కూడా మిమ్నల్ని క్షమించరు అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని చంద్రబాబును హెచ్చరించారు. -
వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన పెర్ని కిట్టు
-
Kakani: నీకెందుకు అంత తొందర.. ఎగిరెగిరి పడకు రా.. చంద్రబాబుపై కాకాణి అదిరిపోయే సెటైర్లు
-
‘చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు మానుకో’
సాక్షి,అమరావతి: చంద్రబాబు,నారా లోకేష్ను ప్రశ్నిస్తే తనపై దుష్ప్రచారం చేశారని మాజీ మంత్రి జోగి రమేష్ ధ్వజమెత్తారు. కూటమి సర్కార్ తనని ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. శుక్రవారం (అక్టోబర్31) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం ఫ్యాక్టరీని బాహ్య ప్రపంచానికి చూపించాను.చంద్రబాబు,నారా లోకేష్ను ప్రశ్నిస్తే తనపై దుష్ప్రచారం చేశారు. కల్తీ మద్యం కేసులో సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశాను. నార్కో ఆనాలసిస్ టెస్ట్కు సిద్ధమే. నేను ఏ తప్పు చేయలేదని దుర్గమ్మ సాక్షిగా కుటుంబసభ్యులతో కలిసి ప్రమాణం చేశా. బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి చట్టాన్ని, వ్యవస్థల్ని చేతుల్లోకి తీసుకుంటారా? గన్నవరం ఎయిర్పోర్టులో జనార్ధన్ రావుకు రెడ్కార్పెట్ వేసి స్వాగతం పలికారు. రిమాండ్లో ఉన్న జనార్ధన్రావు వీడియోని ఎవరు విడుదల చేశారని ప్రశ్నించారు. -
ఎంఎస్రాజు వ్యాఖ్యలపై పవన్ ఎందుకు స్పందించడం లేదు?: మల్లాది విష్ణు
సాక్షి, తాడేపల్లి: భగవద్గీతను కించపరిచిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. ఆయన్ను వెంటనే టీటీడీ పాలకమండలి సభ్యునిగా తొలగించాలన్నారు. హిందూ ధర్మాన్ని వ్యతిరేకించే ఇలాంటి వారికి టీటీడీలో సభ్యునిగా కొనసాగిస్తారా?. టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చటం సిగ్గుచేటు. ప్రపంచానికే మార్గదర్శకంగా ఉన్న భగవద్గీతను టీడీపీ ఎమ్మెల్యే రాజు కించపరచటం దారుణం’’ అంటూ మల్లాది విష్ణు మండిపడ్డారు.అలాంటి వ్యక్తిని టీటీడీ సభ్యునిగా నియమించటాన్ని ఏం అనాలి?. టీటీడీ చరిత్రలో ఇలాంటి సభ్యుడిని ఎప్పుడూ చూడలేదు. ఇంత జరుగుతున్నా సనాతని అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదు?. టీటీడీ గోశాలను ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టాలని నిర్ణయించటం దారుణం. ఇదేనా టీటీడీ గోసంరక్షణ?. చంద్రబాబుది హిందూ వ్యతిరేక ప్రభుత్వం. హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన ప్రభుత్వ పెద్దలు ఎమ్మెల్యే రాజుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో వరుసగా అపచారాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ బీజేపీ కూడా ఎందుకు మాట్లాడటం లేదు?’’ అంటూ మల్లాది విష్ణు ప్రశ్నించారు. -
కష్టాల్లో ఉన్న రైతులను బెదిరిస్తున్నారు.. ఇదెక్కడి ప్రభుత్వం
-
సీతక్కా.. టీ కావాలా? కాఫీ కావాలా?
-
రైతుకు భరోసా ఏదీ?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు సారథ్యంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుకు భరోసా లేకుండా చేశారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మోంథా తుపాను బీభత్సం సృష్టించిందని... 15 లక్షల ఎకరాల్లో పంటలపై తీవ్ర ప్రభావం చూపిందని అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఉచిత పంటల బీమా పక్కాగా అమలయ్యేదని, రైతుల తరఫున బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించేదని, విపత్తుల కారణంగా పంట నష్టపోతే రైతులకు బీమా పరిహారం దక్కేదని గుర్తుచేశారు. కానీ, కూటమి ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేసిందని, ఇప్పుడు బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న రైతులకు మాత్రమే పంటల బీమా సదుపాయం ఉందని, మరి మిగిలిన రైతుల పరిస్థితి ఏం కావాలి? అంటూ సీఎం చంద్రబాబును నిలదీశారు. బాబు సృష్టించిన మరో విపత్తు ఇది అంటూ మండిపడ్డారు. మోంథా తుపాను నేపథ్యంలో గురువారం వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులతో పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను కారణంగా సంభవించిన నష్టం, తర్వాత ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులపై సమీక్షించారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులపై పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో ఆరా తీశారు. తుపాను సమయంలో పార్టీ శ్రేణులు ప్రజలకు అండగా నిలవడాన్ని ప్రశంసించారు. పంట నష్టం అంచనాల్లో ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా చూడాలని, ప్రభుత్వం ఏ తప్పిదానికి ప్రయత్నించినా గట్టిగా ప్రశ్నించాలని, ఆ తప్పిదాన్ని సవరించుకునేలా చొరవ చూపాలని ఆదేశించారు. బాధితులకు ప్రభుత్వం నుంచి తగిన సాయం అందేలా ఒత్తిడి తీసుకురావడంపై నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. వీడియో కాన్ఫరెన్స్లో వైఎస్ జగన్ ఏం మాట్లాడారంటే... తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహిస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మీ అందరికీ అభినందనలు మోంథా తుపాను వచ్చినప్పటి నుంచి, ప్రజలతో మమేకమవుతూ మీమీ ప్రాంతాల్లో అసెంబ్లీ కో–ఆర్డినేటర్లు చురుగ్గా పాలుపంచుకుంటున్నారు. పార్టీ పిలుపు మేరకు మీరంతా చాలా చక్కగా, చురుగ్గా పనిచేస్తున్నారు. రైతులు, ప్రజలకు తోడుగా ఈ తుపానులో నిలిచారు. అందుకు మీ అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. రైతులకు తోడుగా నిలవాలి మోంథా తుపాను బీభత్సం ఎక్కువే ఉంది. తీవ్రత తగ్గినా, రైతులపై చాలా ప్రభావం చూపింది. పంటలకు చాలా నష్టం జరిగింది. పొట్ట దశకొచ్చిన పంటలు భారీ వర్షాలకు నేలకొరిగాయి. దీంతో దిగుబడి దారుణంగా పడిపోయే పరిస్థితి ఏర్పడింది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు, అక్కడినుంచి రాయలసీమలోని కర్నూలు, కడప, అన్నమయ్య, ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో కూడా మోంథా ప్రభావం ఉంది. 25 జిల్లాలు, 396 మండలాలు, 3,320 గ్రామాల పరిధిలో ప్రభావం కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు తోడుగా నిలవాల్సి ఉంది. దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంటలపై మోంథా ప్రభావం చూపింది. ఇందులో 11 లక్షల ఎకరాల్లో వరి పంట ఉంది. 1.15 లక్షల ఎకరాల పత్తి, 1.15 లక్షల ఎకరాల వేరుశనగ, 2 లక్షల ఎకరాల మొక్కజొన్న, మరో 2 లక్షల ఎకరాల ఉద్యాన పంటల మీద మోంథా తుపాను ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో పంట నష్టం అంచనాల్లో రైతులకు తోడుగా నిలవాలి. పార్టీ నాయకులంతా రైతులకు అండగా ఉంటూ పనిచేయాలి. జిల్లాల నుంచి వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న వైఎస్సార్సీపీ నేతలు ఇది ‘మ్యాన్ మేడ్ కెలామిటీ’ చంద్రబాబు హయాంలో నష్టపోయిన రైతుల పరిస్థితి చూడాల్సి ఉంది. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా ఈ–క్రాప్ వ్యవస్థ పక్కాగా ఉండేది. రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) సమర్థంగా పనిచేసేవి. వాటిలో అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ ఉండి సేవలందించేవారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు కలిసి పనిచేయడం వల్ల ప్రతి రైతుకు భరోసా దక్కేది. నాడు దాదాపు 85 లక్షల మంది రైతులకు దాదాపు 70 లక్షల ఎకరాల్లో ఉచిత పంటల బీమా అమలు చేశాం. కానీ, ఈ రోజు కేవలం 19 లక్షల ఎకరాలకు మాత్రమే, 19 లక్షల మంది రైతులకు మాత్రమే పంటల బీమా ఉంది. ఎవరైతే బ్యాంకులో రుణం తీసుకున్నారో వారికే పంటల బీమా సదుపాయం ఉంది. బ్యాంకర్లు రుణాలిచ్చినప్పుడు, ఇన్సూ్యరెన్స్ కట్టించారు కాబట్టి, కేవలం 19 లక్షల రైతులకు మాత్రమే బీమా ఉంది. మరి మిగిలిన రైతుల పరిస్థితి ఏం కావాలి? నాటి 85 లక్షల మంది రైతులు, 70 లక్షల ఎకరాలకు ఉచిత బీమా ఎక్కడ...? ఇప్పుడు కేవలం 19 లక్షల మంది రైతులకు, 19 లక్షల ఎకరాలకు మాత్రమే బీమా ఎక్కడ...? దీంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. గత ఏడాది ఖరీఫ్, రబీతో పాటు, ఈ ఏడాది కూడా ఏ సీజన్లోనూ ఏ పంటకూ ప్రభుత్వం బీమా ప్రీమియం కట్టలేదు. కాబట్టి ఇది కచ్చితంగా మ్యాన్ మేడ్ కెలామిటీ (మానవ తప్పిదం కారణంగా సంభవించిన విపత్తు). కాబట్టి మనం పార్టీపరంగా రైతులకు అండగా నిలవాలి. ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ జీరో ఈ ప్రభుత్వంలో ఇన్పుట్ సబ్సిడీ కూడా లేదు. గత ఏడాది జూన్లో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ 16 నెలల్లో 16 సార్లు తీవ్ర విపత్తులు, తుపాన్లు ఉత్పన్నమయ్యాయి. వీటికి అదనంగా మోంథా తుపాను తోడైంది. దీంతో రైతుల నడ్డి విరిగింది. తుపాను వల్ల 8 మంది చనిపోతే చంద్రబాబు క్రెడిట్ తీసుకోవడం ఏంటి? ఏ ఒక్క మనిషి కూడా చనిపోకుండా ఉంటే క్రెడిట్ తీసుకున్నా అర్థం ఉంటుంది. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో అన్ని ప్రకృతి విపత్తుల్లో 16 మంది మాత్రమే చనిపోయారు. ఇక కూటమి పాలనలో ఎంతమంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందింది? ఎంతమంది రైతులకు ప్రభుత్వం తోడుగా నిలిచింది అని చూస్తే ఈ ప్రభుత్వం తరఫున అందిన సాయం గుండుసున్నా. చివరకు ఈ–క్రాప్ కూడా చేయకుండా రైతులను నిర్లక్ష్యం చేశారు. అయినా వారి లెక్కల ప్రకారం దాదాపు 5.5 లక్షల మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రూపేణా దాదాపు రూ.600 కోట్లు సబ్సిడీ ఇవ్వాలి. అదికూడా ఇవ్వకుండా ఎగ్గొట్టారు. మిర్చి క్వింటాల్ రూ.11,781కు కొంటామన్నారు. కానీ, ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. పొగాకు కొనుగోలు చేస్తామన్నారు. కానీ, ఎక్కడా ఆ పని చేయలేదు. మామిడి కిలో రూ.12కు కొంటామన్నారు. ఒక్క రైతుకూ మేలు చేయలేదు. ఉల్లి క్వింటాల్కు రూ.1,200కు కొంటామన్నారు. కానీ, అక్కడా చేతులెత్తేశారు. ఆ తర్వాత హెక్టారుకు రూ.50 వేల చొప్పున పరిహారం ఇస్తామని చెప్పి, అది కూడా ఇవ్వకుండా మోసం చేశారు. రైతుల కష్టాలకు చంద్రబాబు బాధ్యుడు రాష్ట్రంలో ఈ–క్రాప్ లేదు. దాన్ని నీరుగార్చారు. ఆర్బీకేలను నిరీ్వర్యం చేశారు. ఉచిత పంటల బీమా ఎత్తేశారు. ఇన్పుట్ సబ్సిడీ లేదు. దీంతో రైతులు చాలా నష్టపోయారు. ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు. అందుకే ఇదంతా మ్యాన్ మేడ్ కెలామిటీ. అదే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 54.55 లక్షల రైతులకు తోడుగా నిలుస్తూ రూ.7,802 కోట్లతో ఉచిత పంటల బీమా పరిహారం ఇప్పించాం. ప్రతి ఎకరాకు ఈ–క్రాప్ చేసి, నాడు ప్రభుత్వమే బీమా ప్రీమియం కట్టింది. రైతులపై ఎలాంటి భారం వేయలేదు. కానీ, ఈ ప్రభుత్వంలో అన్నీ మానవ తప్పిదాలే. అవన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు తుపాను రూపంలోనూ చాలా నష్టం వస్తోంది. అన్నదాత సుఖీభవ కింద రెండేళ్లకు కలిపి రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.5 వేలు మాత్రమే ఇచ్చి, చంద్రబాబు మోసం చేశాడు. అందుకే ఈ రోజు రైతులకు జరుగుతున్న నష్టం, వారి కష్టాలకు చంద్రబాబు బాధ్యుడు. ఆయన తప్పిదాల వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. నష్టం అంచనా పక్కాగా జరిగేలా చూడాలి ఇప్పుడు రైతులకు మనం తోడుగా నిలవాలి. పంట నష్టం అంచనాలో అండగా ఉండాలి. నష్టం అంచనా పక్కాగా జరిగేలా చూడాలి. ఏ ఒక్క రైతుకూ నష్టం కలగకుండా, వారి తరపున నిలవాలి. మాట్లాడాలి. ప్రజలు కానీ, రైతులు కానీ, పారీ్టకి సంబంధించినవారు కానీ.. ఎవరు కూడా ఎక్కడా మిస్ కాకుండా, ప్రభుత్వం కావాలని తప్పు చేయాలని చూస్తే, వాటిని గట్టిగా ప్రశ్నించాలి. రైతులకు మంచి జరిగేలా చూడాలి. నష్టం అంచనాలో ఎక్కడా, ఏ లోపం లేకుండా పూర్తి చొరవ చూపాలి. ఈ వీడియో కాన్ఫరెన్స్లో పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు కురసాల కన్నబాబు, వైవీ సుబ్బారెడ్డి, కారుమూరి వెంకటనాగేశ్వరరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు, పార్టీ జిల్లాల అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్, మజ్జి శ్రీనివాసరావు (చిన్నశీను), శతృచర్ల పరీక్షిత్రాజు, మత్స్యరాస విశ్వేశ్వరరాజు, కేకే రాజు, గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజా, చిర్ల జగ్గిరెడ్డి, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ముదునూరి ప్రసాదరాజు, దూలం నాగేశ్వరరావు, పేర్ని నాని, దేవినేని అవినాష్, అంబటి రాంబాబు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, మేరుగు నాగార్జున, బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, కాకాణి గోవర్థన్రెడ్డి, ఎస్వీ మోహన్రెడ్డి, కాటసాని రాంభూపాల్రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, కేవీ ఉషశ్రీ చరణ్, పోచిమరెడ్డి రవీంద్రనాథ్రెడ్డి, ఆకెపాటి అమర్నాథ్రెడ్డి, భూమన కరుణాకర్రెడ్డి పాల్గొన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మొండితోక అరుణ్కుమార్, మాజీ ఎమ్మెల్యేలు టీజేఆర్ సుధాకర్బాబు, అబ్బయ్యచౌదరి, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్రావు, పార్టీ ప్రధాన కార్యదర్శి సతీష్కుమార్రెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇంచార్జి చుండూరి రవి, పార్టీ నాయకులు ఆలూరు సాంబశివారెడ్డి, కడప మాజీ మేయర్ సురేష్, చల్లా మధుసూదన్ రెడ్డి తదితరులు కాన్ఫరెన్స్కు హాజరయ్యారు.ఉద్యమంలా కోటి సంతకాల సేకరణ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం కొనసాగుతోంది. అందులో భాగంగా కోటి సంతకాల సేకరణ చేస్తున్నాం. ఈ కార్యక్రమం కింద నియోజకవర్గాల్లో నవంబరు 11న ర్యాలీలు నిర్వహించాలి. వాస్తవానికి ఈ కార్యక్రమాన్ని అక్టోబరు 28నే అనుకున్నా, మోంథా తుపాను కారణంగా వాయిదా వేయడం జరిగింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో పేద విద్యార్థులకు వైద్య విద్య చేరువ అవుతుంది. మరోవైపు ఆ ప్రాంతంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు వస్తాయి. తద్వారా ప్రజలకు మంచి వైద్య సేవలు అందుతాయి. -
భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి: శైలజానాథ్


