breaking news
YSRCP
-
JC ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్ తాడిపత్రిలో YSRCP భారీ నిరసన
-
టీడీపీ గేమ్లో పవన్ ‘ఫ్రంట్ ఫుట్’ బ్యాట్స్మెనా?
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒకరకంగా అదృష్టవంతుడు అని చెప్పాలి. ఆయన ఏమి మాట్లాడినా దానిని సినిమా డైలాగు అనుకుని చప్పట్లు కొట్టే అమాయక అభిమానులు ఉండడం ఆయన అదృష్టం అవుతుందేమో!. గత పది, పన్నెండేళ్లలో ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా పరస్పర విరుద్దమైన ప్రసంగాలు చేశారో లెక్కవేయడం కష్టమే కావచ్చు. అధికారంలోకి రావడానికి ఎన్ని తంటాలైనా పడి ఉండవచ్చు. ఒకసారి పవర్ చేతికి వచ్చాక బాధ్యతాయుతంగా ఉండకపోతే అది సమాజానికి నష్టం చేస్తుంది.గత కొద్ది రోజులుగా ఆయన చేస్తున్న ప్రకటనలు సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలకు గురి అవుతున్నాయి. డైవర్షన్ రాజకీయాలు చేసి టీడీపీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాజకీయ లబ్ది చేకూర్చాలన్న తాపత్రయంతో పవన్ కళ్యాణ్ తన ప్రతిష్టను తానే కోల్పోతున్నారు. పవన్ కళ్యాణ్ ఉపన్యాసాలు గందరగోళంగా ఉండడం ఒక స్పెషాలిటీగా కనిపిస్తుంది. కాకినాడలో కొద్ది రోజుల క్రితం ఆయన చెప్పిన మాటలు కొన్నిటిని చూడండి. వైఎస్సార్సీపీ గూండాలను తొక్కి నారతీస్తా.. అధికారంలో లేకున్నా క్రిమినల్స్లా ఆ పార్టీ బెదిరింపులకు పాల్పడుతోందని పవన్ కళ్యాణ్ ఆరోపణ చేయడం అంటే ఇటీవలికాలంలో రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను, లాకప్ డెత్ ఘటనలపై వస్తున్న విమర్శలను కప్పిపుచ్చడానికి చేస్తున్న యత్నంగా కనిపించదా!మంత్రి లోకేష్ ఒకవైపు రెడ్ బుక్ అంటూ అరాచకపు రాజకీయాలు చేస్తుంటే, తాను ఎక్కడ వెనుకబడిపోతానో అన్నట్లుగా పవన్ కళ్యాణ్ తొక్కినారతీసే రాజ్యాంగాన్ని అమలు చేస్తానని అంటున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్కు ఆ శక్తి ఉంటే ఎవరిని తొక్కి నారతీయాలి? ముందుగా టీడీపీ, జనసేనలలో ఉన్న ఆ గూండా శక్తులను గుర్తించి వారి నార తీసి తదుపరి ఇతర పార్టీలవారి వద్దకు వస్తే బాగుండేది కదా! కొద్ది రోజుల క్రితం దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అదే పార్టీకి చెందిన మరో నేత ఇంటిని కూల్చడానికి వెళ్లారు. ఆయనను ఏమి చేయాలో పవన్ చెప్పాలి కదా! గతంలో ఇదే చింతమనేనిని పవన్ తీవ్రంగా విమర్శించారు. తదుపరి పొత్తు కుదిరాక ఆయనకోసం ప్రచారం చేశారే!శ్రీకాళహస్తిలో జనసేన మహిళా నేత ప్రైవేటు వీడియోలను తీసిన టీడీపీ ఎమ్మెల్యే అనుచరులపై కనీసం కేసు అయినా పెట్టించారా? వేమూరు నియోజకవర్గంలో కొందరు జనసేన కార్యకర్తలపై టీడీపీ వారు పోలీసుల సమక్షంలోనే దాడి చేశారు కదా! ఒక యువతిని మోసం చేసి అత్యాచారం చేశారన్న అభియోగం ఎదుర్కోవడమే కాకుండా అసెంబ్లీ నుంచే వీడియోకాల్తో అభ్యంతరకరంగా వ్యవహరించిన ఒక జనసేన ఎమ్మెల్యేపై చర్య తీసుకోవడం సంగతి అలా ఉంచి, డిల్లీ మీటింగ్లో పక్కన కూర్చోబెట్టుకోవడాన్ని ఏమనుకోవాలి! మరికొందరు జనసేన ఎమ్మెల్యేలు చేసిన దౌర్జన్యాల మాటేమిటి? రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక మాఫియాలను నడుపుతున్నారన్న కూటమి ఎమ్మెల్యేలను కనీసం మాట మాత్రంగానైనా హెచ్చరించలేకపోతున్నారే.ఇక వైఎస్సార్సీపీ మద్దతుదారులను అణచివేయడానికి పోలీసు యంత్రాంగం రకరకాల అక్రమ కేసులు పెడుతోంది. అది చాలదన్నట్లుగా పవన్ కళ్యాణ్ ఇష్టారీతిన మాట్లాడుతున్నారన్న విమర్శను ఎదుర్కుంటున్నారు. జనసేన మద్దతుదారు కుటుంబానికి చెందిన సాయికృష్ణ అనే రౌడీషీటర్ను పోలీసులే హింసించి చంపేశారని ఆరోపణలు వచ్చాయి. అది చట్ట విరుద్దమైన చర్యగా చెప్పవలసిన ఉప ముఖ్యమంత్రి, అదేమీ తప్పుకానట్లుగా మాట్లాడడం ఏపాటి రాజధర్మం అవుతుంది. మరో వైపు అదే రౌడీషీటర్ కుటుంబం వద్దకు జనసేన బృందం ఎందుకు వెళ్లింది? ఏభై లక్షల రూపాయలు ఇచ్చేలా ఒప్పందం అవ్వాలని మరో జనసేన నేత ఎందుకు రాయబారం చేశారు. అన్నిటికి మించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ రౌడీషీటర్ కుటుంబాన్ని ఎందుకు పిలిపించుకుని వారిని ఓదార్చి పంపించారు.ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయి కూటమి ప్రభుత్వానికి తీరని నష్టం చేయడంతో వెంటనే పవన్ కళ్యాణ్ రంగంలో దిగి, డైవర్షన్ రాజకీయాలలో భాగంగా ప్రకటనలు చేయడం వల్ల ఆయనకే నష్టం జరిగింది కదా! క్రిమినల్ కేసులు ఉండడమే వైఎస్సార్సీపీ బలం అంటూ మాట్లాడి సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లయిందన్న అభిప్రాయం ఏర్పడింది. ఎందుకంటే చంద్రబాబు, లోకేష్లతో పాటు పవన్పై కూడా పలు క్రిమినల్ కేసులు ఉన్న విషయాన్ని వైఎస్సార్సీపీ నేతలు బయటపెట్టారు.వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పటంలో కారుమీద ఎక్కి కూర్చుని హడావుడి చేయడం ఏ రకమైన చర్య అవుతుంది? స్కిల్ స్కామ్లో చంద్రబాబు అరెస్టు అయితే, నడిరోడ్డుపై పవన్ కళ్యాణ్ పడుకోవడం చట్టసమ్మతమేనా? విశాఖ ఎయిర్ పోర్టులో మంత్రి రోజాపై జనసేన కార్యకర్తలు కొందరు దాడి చేసినప్పుడు వాటిని సమర్థించినట్లు వ్యవహరించారే! తనపై హోం మంత్రి అనిత చేసిన ఒక వ్యాఖ్యకు బదులుగా మాజీ మంత్రి అమర్నాథ్ చేసిన విమర్శను పవన్ తప్పుపట్టారు. అది మహిళలను అగౌరవపరిచినట్లు చిత్రీకరించారు. అందుకు ప్రతిగా పవన్ కళ్యాణ్తో సహా కూటమి ప్రముఖులు చేసిన పలు అభ్యంతర వ్యాఖ్యలను వైఎస్సార్సీపీ నేతలు పేర్నినాని వంటివారు గుర్తు చేశారు.మంత్రిగా ఉన్న సమయంలో ప్రముఖ నటి రోజాపై నీచమైన ఆరోపణలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తిని పవన్ అభినందించింది నిజమా? కాదా? ఆ మాట చెప్పింది బండారే కదా! ఇక సుగాలి ప్రీతి అంశంలో మరింతగా పవన్ పరువు పోగొట్టుకున్నారు. జై భీమ్ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ ఆధారసహింతంగా పవన్ చెప్పినవన్నీ అబద్ధాలేనని తెలియచేశారే. సుగాలి ప్రీతి తల్లి పార్వతి సైతం అదే విషయం తేటతెల్లం చేశారే. తనకు కులం ఆపాదించవద్దని పవన్ కళ్యాణ్ తాజాగా కోరుతున్నారు. మంచిదే. ఆయన మొదటి నుంచి ఇదే ఉద్దేశంతో వ్యవహరించి ఉంటే అంతా అభినందించాలి. కాని కాపులంతా తనకు మద్దతు ఇవ్వాలని ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ కోరిన సంగతి అసత్యమా? ఇప్పుడు అందుకు విరుద్దంగా కులం గురించి మాట్లాడడం దరిద్రం అని, తాను దేశభక్తుడినని సర్టిఫికెట్ ఇచ్చుకుంటే రాజకీయాలలో కుదురుతుందా? మొత్తం ఎన్నికల మానిఫెస్టో సంగతెలా ఉన్నా, కనీసం కాపులకు ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయవలసిన బాధ్యత ఆయనపై లేదా? తాను హోం మంత్రిని కాకపోవడం అది క్రిమినల్స్ అదృష్టం అని అనడం ద్వారా ప్రస్తుత హోం మంత్రి అనితను అగౌరపరిచినట్లు కాదా? అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.నిజానికి లా అండ్ ఆర్డర్ శాఖ ముఖ్యమంత్రి చేతిలో ఉంటుంది. ఆ సంగతి ఆయనకు తెలియదా! అన్నిటికి మించి పవన్ కళ్యాణ్ను టీడీపీ బాగానే వాడేసుకుంటోందన్న భావన వ్యక్తం అవుతోంది. అందులో భాగంగానే వైఎస్సార్సీపీపై పవన్ చేసే దూషణలకు టీడీపీ మీడియా అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది తెలుస్తూనే ఉంది కదా! చేసింది. సాయికృష్ణ కేసులో చంద్రబాబు సేఫ్ గేమ్ ఆడాలని యత్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం అనవసర వ్యాఖ్యలు చేసి అప్రతిష్టపాలు అవుతుండడమే అందులో ఉన్న మర్మం అన్న విషయం అర్థం అవుతూనే ఉంది కదా! టీడీపీకి, ఎల్లో మీడియాకు అదే కదా కావల్సింది!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
సీఐ నాగరాజు వెనుక సీపీ రాజశేఖర్..! సాయికృష్ణ శవాన్ని ఇద్దరూ కలిసే మాయం..!
-
అభిమాన జడి.. గుండెల్లో గుడి
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ కడప జిల్లా భూమయ్యగారిపల్లెలో అభిమాన జనం పోటెత్తారు. తమ ఇష్ట దైవం గట్టు శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ప్రారంబోత్సవంలో అభిమాన నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొంటున్నారనే విషయం తెలుసుకొని ప్రజలు భారీగా తరలివచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం పులివెందుల పర్యటనలో భాగంగా వేముల మండలంలోని భూమయ్యగారిపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన గట్టు శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రారంబోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న వైఎస్ జగన్కు అర్చకులు వేద మంత్రాల మధ్య పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన జలాభిషేకం, కలశ స్థాపన, సుదర్శన హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. రాష్ట్ర ప్రజలందరికీ నరసింహ స్వామి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామి వారిని ప్రార్థించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులను, గ్రామస్తులను ఆప్యాయంగా పలకరించారు. అంతకు ముందు వేముల జెడ్పీటీసీ సభ్యుడు బయపురెడ్డి నేతృత్వంలో గ్రామస్తులు వైఎస్ జగన్కు భారీ గజ మాలతో ఘన స్వాగతం పలికారు. గట్టు శ్రీలక్ష్మీనరసింహ స్వామికి భక్తిశ్రద్ధలతో అభిషేకం చేస్తున్న వైఎస్ జగన్ అనంతరం వైఎస్ జగన్ గ్రామంలో ఇటీవల మృతి చెందిన పార్టీ నేత ఓబుళరెడ్డి శ్రీరామిరెడ్డి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. శ్రీరామిరెడ్డి కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆ తర్వాత ఇదే గ్రామంలోని జెడ్పీటీసీ సభ్యుడు బయపురెడ్డి ఇంటికి వెళ్లి.. కాసేపు గడిపి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. ప్రజలతో మమేకం భూమయ్యగారి పల్లెలో 92 ఏళ్ల వృద్ధురాలు అన్నపూర్ణమ్మ వైఎస్ జగన్ వద్దకు వచ్చి బుగ్గలు తడిమి, తలపై చేతులు వేసి ఎంతో అప్యాయంగా ఆదరించింది. మరో వృద్ధురాలు తోటలో కోసుకొచ్చిన మల్లెపూలను వైఎస్ జగన్ చేతుల్లో పోసింది. అవే మల్లెపూలు తిరిగి ఆయన ఆమె వడిలో వేశారు. వైఎస్ జగన్ పట్ల వృద్ధులకు ఉన్న ప్రేమ, ఆప్యాయతలకు ఈ ఘటనలు నిదర్శనంగా నిలిచాయి. అనంతరం వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి మనవరాలు.. పల్లవి, నరేష్ దంపతుల కుమార్తెకు ‘దైవిక’గా నామకరణం చేశారు. అంబకపల్లెకు చెందిన భాస్కరరెడ్డి, భార్గవి దంపతుల కుమారుడు జగన్మోహన్రెడ్డి చేయి పట్టుకొని పలక (స్లేట్)పై అక్షరాలు రాయించారు. పెండ్లిమర్రి మండలం పాతసంగటిపల్లె గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు నాగమల్లేశ్వరరెడ్డి అనారోగ్యం గురించి తెలుసుకున్న వైఎస్ జగన్.. ఆయన్ను ఫోన్లో పరామర్శించారు. భూమయ్యగారిపల్లె నుంచి పులివెందులకు తిరుగు ప్రయాణంలో తన కాన్వాయ్ వెనుక అంబులెన్సు వస్తుండటాన్ని గమనించి.. వెంటనే తన వాహన శ్రేణిని రోడ్డు పక్కన ఆపించి, అంబులెన్స్కు దారిచ్చారు. పులివెందుల అభివృద్ధిలో మరో ముందడుగు పులివెందుల పట్టణం 31వ వార్డులోని వైఎస్సార్ కాలనీలో నిర్మించిన సిమెంట్ రోడ్లను బుధవారం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా యర్రగుడిపల్లె వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాలను పులివెందుల మున్సిపల్ ఇన్చార్జి వైఎస్ మనోహర్రెడ్డి, చవ్వా దుష్యంత్రెడ్డిలతో కలిసి ఆవిష్కరించారు. ధైర్యంగా ఉండండి బుధవారం వైఎస్ జగన్ను వివిధ ప్రాంతాలకు చెందిన వైఎస్సార్సీపీ నేతలు, చంద్రబాబు కూటమి ప్రభుత్వ బాధితులు, ప్రజలు కలిశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ అందరికీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. పార్టీ కోసం రాబోయే మూడేళ్లు విశేషంగా కృషి చేయాలని సూచించారు. ఎవరూ అ«ధైర్య పడకుండా కార్యకర్తలకు అండగా ఉంటూ రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలన్నారు. వచ్చేది మన ప్రభుత్వమే అని ధైర్యం చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో వైఎస్ జగన్ వెంట కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, జడ్పీ చైర్మన్ ముత్యాల రామగోవిందురెడ్డి, అనంతపురం జెడ్పీ చైర్మన్ గిరిజమ్మ, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, మాజీ మేయర్ సురేష్బాబు, పులివెందుల పట్టణ ఇన్చార్జి చవ్వా దుష్యంత్రెడ్డి, కదిరి ఇన్చార్జి మక్బుల్బాషా, మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్బాషా, పార్టీ నేతలు రాజోలి వీరారెడ్డి, వేల్పుల రాము, సాంబశివారెడ్డి తదితరులు ఉన్నారు. -
దిశ మీటింగ్లో పోలీసులపై ఎంపీ పుట్టా మహేశ్ అసహనం
ఏలూరు జిల్లా: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై దిశ మీటింగ్లో ఎంపీ పుట్టా మహేశ్ పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో ఎక్కువ మొత్తంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదుచేసి, భారీగా చలాన్లు వేస్తున్నారంటూ ఎస్పీని ప్రశ్నించారు. ముఖ్యంగా జంగారెడ్డిగూడెం, పోలవరం ప్రాంతాలలో ఈ కేసులు నమోదు చేస్తున్నారని తెలిపారు.డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతున్నాయని పుట్టా మహేశ్ చెప్పారు. తనకు రోజూ వచ్చే కాల్స్లో 30 కాల్స్ ఇవేనని వాపోయారు. పల్లెల్లో కార్యకర్తలు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కేసుల కారణంగా మండల స్థాయి నాయకులకు విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, పల్లెల్లో ప్రజలకు డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా ప్రాణాలు పోతాయని అవగాహన ప్రోగ్రాం చేద్దామని ఎంపీతో ఎస్పీ తెలిపారు. -
మీ రాజకీయాల కోసం ముద్రగడను కించపర్చొద్దు: వైఎస్సార్సీపీ
సాక్షి, కాకినాడ: ముద్రగడ పద్మనాభం అనారోగ్యంతో బాధపడుతుంటే, కూటమి సర్కార్ ఆయన్ను, ఆయన కుటుంబ సభ్యుల్ని మానసికంగా క్షోభపెట్టేలా వ్యవహరించడం దారుణమని వైఎస్సార్సీపీ కాపు సామాజిక వర్గ నేతలు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా, మాజీ ఎంపీలు వంగా గీత, తోటనర్సింహం, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మండిపడ్డారు.ముద్రగడ ఆరోగ్యంపై వైఎస్ జగన్ రోజూ ఆరా తీస్తున్నారని, కానీ కూటమి నేతలు మాత్రం మీడియాలో దుష్ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పాలనలో విఫలమైన చంద్రబాబు కుల రాజకీయాలతో దాన్ని డైవర్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు ఆక్షేపించారు.ముద్రగడపై ట్రోల్స్ సరికాదు: ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుముద్రగడ పద్మనాభం ఆరోగ్యంగా ఉండాలని, త్వరగా కోలుకుని ఇంటికి రావాలని అందరూ కోరుకోవాలి. రాష్ట్రంలో కాపు సామాజికవర్గంలో వంగవీటి మోహన రంగా తర్వాత ముఖ్యమంత్రి అయ్యే నాయకుడిగా ముద్రగడ పద్మనాభం ఉండే వారు. ఆయన ఎక్కడా అవినీతి మరకలు అంటని వ్యక్తి. అలాంటి వ్యక్తిపై ట్రోల్స్ చేయడం ఎంతవరకూ ధర్మం అన్నది ఆలోచించాలి. మేం అంతా ఆయన్ను పరామర్శించడానికి వెళ్లాలని భావించినా ఆస్పత్రిలో హడావిడి ఎందుకని రావొద్దని సూచించారు.చంద్రబాబు గతంలో ఎమ్మెల్యేగా ఉండగానే ముద్రగడ పద్మనాభం మంత్రిగా ఉన్నారు. అలాంటి వ్యక్తిని కించపర్చేలా మాట్లాడటం సరికాదు. రాష్ట్రంలో కాపు సామాజిక వర్గమే కాదు అన్ని వర్గాల్లోనూ ముద్రగడకు అభిమానులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గురించి మా నాయకులు ఎవరూ వ్యక్తిగతంగా మాట్లాడలేదు. ఈ ప్రభుత్వంలో జరుగుతున్న తప్పిదాలపైనే మాట్లాడాం. మేం కులాల గురించి ఎక్కడా మాట్లాడలేదు. రాజకీయంగా కాపులకు మేలు చేయడానికి మా ప్రయత్నం చేస్తున్నాంజఇతర రాజకీయ పార్టీల్లో ఉన్న కాపు నాయకులు కూడా వారి ప్రయత్నం చేయాలి. అంతే తప్ప కులాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టే ప్రయత్నం జనసేన తప్ప ఎవరూ చేయలేదు. కులాల గురించి మాట్లాడొద్దంటూనే చంద్రబాబు విజయవాడలో లాకప్ డెత్పై స్పందిస్తూ సీఐ కాపు, హతుడు కాపు అంటున్నారు. మీ స్థాయికి ఇది తగునా చెప్పండి. మీరు కులాల గురించి మాట్లాడుతూ మేం మాట్లాడుతున్నామని ఎదురుదాడి చేస్తున్నారు. ఇవన్నీ ప్రజలు గమనించాలని కోరుతున్నాం.ముద్రగడ సాయం తీసుకునే వ్యక్తి కాదు: కురసాల కన్నబాబువైఎస్సార్సీపీలో కాపు నాయకుల్ని తన ఇంటికి రమ్మని.. తాజా పరిణామాలపై మాట్లాడుకుందామని తోట త్రిమూర్తులు తన ఇంటికి పిలిస్తే చంద్రబాబు దీనిపై అందరినీ రెచ్చగొట్టారు. చనిపోయిన వారికి కులాలు ఆపాదిస్తారా అని ఇవాళ మళ్లీ అదే చంద్రబాబు అడుగుతున్నారు. కులాన్ని నరనరానా జీర్ణించుకుని మాట్లాడుతోంది ఎవరు? ఇవాళ చంద్రబాబు ఓపెన్ చేసిన బంగారు గనికీ, కులానికీ సంబంధం ఉందా? పవన్ కళ్యాణ్ను ఖబర్దార్ అని మేం అన్నామా? రౌడీలకు కులాలు ఉంటాయా అని మీరే ప్రశ్నిస్తున్నారు. కానీ ఇవాళ మళ్లీ కాపు కులం అని ప్రస్తావిస్తూ మిమ్మల్ని ఖబర్దార్ అంటున్నారు.సాయికృష్ణ హత్యను మేం శాంతిభద్రతల సమస్యగానే చూస్తున్నాం. సిట్ కోర్టుకు ఇచ్చిన నివేదికలో సాయికృష్ణది కస్టడియల్ డెత్ అని చెప్పింది. తీసుకొచ్చి కొట్టడం, చంపడం, తల్లి అడిగినా స్పందించినా స్పందించకపోవడం, సీసీ ఫుటేడ్ ఇవ్వకపోవడం ఇలా అన్నీ నేరాలే చేశారు. టాస్క్ ఫోర్స్ పట్టుకొస్తే, పోలీసులు చంపేసి బూడిద చేసేశారు. ఈ ఘటనను మేం కాపుల కోణంలో చూడటం లేదు శాంతిభద్రతల కోణంలోనే చూస్తున్నాం.కాకినాడ రూరల్తో మొదలుపెట్టి రాష్ట్రమంతా పోలీసులు తమకు ఓ ప్రత్యేక రాజ్యాంగం ఉన్నట్లు ప్రవర్తిస్తున్నారు. అక్రమంగా నిర్బంధాలు చేయడం, పచ్చిబూతులు తిట్టడం చేస్తున్నారు. పోలీసులు వైఖరి మార్చుకోకపోతే ప్రతిఘటన తప్పదు. ఇది చంద్రబాబు తప్పు అయితే మేం పవన్ కళ్యాణ్ ను ఎందుకు అడుగుతాం? నాలుగైదు రోజులుగా సాయికృష్ణను చంపిన నాగరాజుకు పూలదండలు వేసి హీరోలా కీర్తిస్తూ ప్రదర్శనలు చేస్తున్నారు.ఇదేమైనా సినిమానా? మా ప్రభుత్వంలో కాళహస్తిలో ఓ కార్యకర్తను పోలీసు కొడితే నానా హంగామా చేశారు. ఇప్పుడు కాల్చి బూడిద చేసేస్తే మేం ప్రశ్నించకూడదా? ఇది కాపుల తగువు కాదు చంద్రబాబు తగువే. దీనికి కారణం ఆయన రెడ్ బుక్కే. ఈ ఘటనను కాపులపై రుద్దేసి తప్పించుకుందామనుకుంటున్నారు. కాపుల స్వాభిమానాన్ని దెబ్బతీయొద్దు. జీవితకాలం ఓ లక్ష్యంతో పనిచేసిన ముద్రగడ పద్మనాభం వంటి వ్యక్తిని ఎలా కించపరుస్తారు ? గతంలో అనారోగ్యానికి గురైతే ముద్రగడకు జగన్మోహన్ రెడ్డి ఎయిర్ అంబులెన్స్ పంపుతామంటే ఆయన ఒప్పుకోలేదు.డైవర్షన్ కోసమే చంద్రబాబు కుల ప్రస్తావనలు: దాడిశెట్టి రాజారాష్ట్ర పాలనపై చంద్రబాబు పట్టు కోల్పోయారు. ప్రజల్ని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు కులాల ప్రస్తావన తెస్తున్నారు. పవన్ కళ్యాణ్ ను ఏదో అన్నామని పదే పదే ప్రస్తావన తెస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ను మేం ఏమీ అనలేదు. ముద్రగడ పద్మనాభం వంటి మీ పాత రాజకీయ సహచరుడు వెంటిలేటర్పై ఉంటే మీరు కుటుంబాన్ని వీధిలోకి లాగడం ధర్మంగా ఉందా? గతంలో ఏ ప్రభుత్వాలు ఉన్నా వాటిలో చలనం తీసుకొచ్చింది ముద్రగడ పద్మనాభం ఉద్యమాలు, నిరసనలే. ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సంయమనం పాటించండి. ఆయన ఎవరూ సాయం చేస్తానన్నా తీసుకునే వ్యక్తి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు గుడి ప్రతిష్టకు వెళ్తే ఆయన గురించి చంద్రబాబు అసహ్యంగా మాట్లాడుతున్నారు. ఇంతకన్నా పెద్ద సమస్య వస్తే మరోసారి తిరుపతి లడ్డూ ప్రస్తావన కూడా తెస్తారు.కాపులు పరస్పరం కొట్టుకోవాలా ?: తోట నర్సింహంచంద్రబాబు రాష్ట్రంలో అనేక రాజకీయాలతో పాటు కుల ప్రస్తావనలు కూడా తెచ్చే దౌర్బాగ్య స్థితికి చేరారు. మాలో ఎవరికీ అలాంటి ఉద్దేశాలు లేవు. అందరూ ఐకమత్యంగా ఉండాలి. కాపు సామాజిక వర్గాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అడిగేందుకు తోట త్రిమూర్తులు తన ఇంట్లో సమావేశం పెడితే దానికి పెడార్ధాలు తీస్తున్నారు. గతంలో ఇతర సామాజిక వర్గాలతో పాటు కాపులకు కూడా ఎన్నో పథకాలు తెచ్చి మేలు చేశారు.ఇప్పుడు వాటిని ఆపేస్తున్నారనే దానిపైనే మా అభ్యంతరాలు. చంద్రబాబు ఇవాళ సీఐని ఓ ఉద్యోగిగా కాకుండా కాపు అని ప్రస్తావించడం దారుణం. అంటే కాపులు తమలో తాము కొట్టుకోవాలనే ఉద్దేశం ఉన్నట్లుంది. ముఖ్యమంత్రి స్ధాయిలో ఉండి పవన్ కళ్యాణ్ను ఏమైనా అంటే ఖబడ్డార్ అని చెప్పడం దారుణం. అంటే పవన్ కళ్యాణ్ను ఏదో ఒకటి అనాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. గతంలో చంద్రబాబు వైఎస్సార్సీపీ వ్యక్తులు వస్తే ఏ పనీ చేయొద్దంటూ కార్యకర్తలకు, అధికారులకు చెప్పాలంటే అంత కన్నా దారుణం దేశంలో ఎక్కడా ఉండదు. అలా మాట్లాడిన వ్యక్తి మళ్లీ ఇవాళ కాపుల గురించి మాట్లాడుతున్నారు.పద్దతి మార్చుకోండి: జక్కంపూడి రాజారాష్ట్రంలో క్యారెక్టర్ లేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ముందుగా చెప్పుకోవాల్సిన పేరు చంద్రబాబు. రాజకీయాల కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి ఆయన. గతంలో ఎన్టీఆర్కూ, ఆయన పిల్లలకూ చిచ్చుపెట్టి ఆయన్ను మానసికంగా వేధించి చంపేశారు. వైఎస్ జగన్ ఇంట్లో కూడా తగవులు పెట్టేందుకు ప్రయత్నాలు చేశారు. ఇవాళ ముద్రగడ పద్మనాభం ఇంట్లోనూ అదే పని చేస్తున్నారు. పద్మనాభం మీద కూతురితో రోజూ ఏదో ఒక ఆరోపణ చేయిస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నారు.ముద్రగడ దగ్గర డబ్బుల్లేవని, వైద్యం చేయించుకునే పరిస్ధితి లేదని.. వైఎస్ జగన్కు ఫోన్ చేస్తే స్పందించడం లేదని తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారు. ముద్రగడ అందరికీ పెట్టే వ్యక్తే కానీ, తీసుకునే వ్యక్తి కాదు. ఎవరైనా ఏదైనా ఇస్తామన్నా తీసుకోరు. పద్మనాభం ఇంటికెళ్తే పొట్టపగిలిపోయేలా వేల మందికి సంవత్సరాల తరబడి తినిపించిన వ్యక్తి. ఆస్తులు అమ్ముకున్నాడు కానీ ప్రభుత్వాల సాయం తీసుకోలేదు.మా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గారికి ఆరోగ్యం బాగోలేకపోతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం నుంచి 50 లక్షలు ఇచ్చి విదేశాలకు పంపి వైద్యసాయం అందించారు. పద్మనాభం కూడా ఎయిర్ అంబులెన్స్ ఇస్తామంటే వద్దని చెప్పానని గతంలో స్వయంగా లేఖలో చెప్పారు. పద్మనాభం కోలుకుని క్షేమంగా తిరిగి రావాలని వైఎస్సార్సీపీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. చంద్రబాబు మాత్రం కడుపు మంటతో ఆయన ఇంటిపైకి గతంలో పోలీసుల్ని పంపారు. ఇకనైనా చంద్రబాబుతో పాటు కూటమి నాయకులు తమ పద్దతి మార్చుకోండి.చంద్రబాబువి దిగజారుడు వ్యాఖ్యలు: వంగా గీతముద్రగడ పద్మనాభం సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని తిరిగి రావాలని మేం కోరుకుంటున్నాం. కొన్ని మీడియా ఛానళ్లు రెండు, మూడు రోజులుగా ఓ ఉద్యమ కారుడి గురించి, వాటి కుటుంబాన్ని మానసికంగా వేధించేలా కథనాలు ప్రసారం చేస్తూ చర్చలు పెడుతున్నాయి. పెద్ద ఆస్పత్రిలో ఎవరూ పట్టించుకోకపోతే చిన్న ఆస్పత్రికి తరలించామని చెప్తున్నారు. ప్రధాని మోదీ స్వయంగా ఓపెన్ చేసిన ఆస్పత్రి చిన్న క్లినిక్ అని ఎలా అంటారు. ఇంతకీ మీరంతా ఏం ఆశిస్తున్నారు? అంబేద్కర్ ఆశయాలకు భిన్నంగా విడదీయండి. ముక్కలు చేయండి అని చెప్తున్నట్లుంది. శాంతి భద్రతలు కాపాడాల్సిన వ్యక్తి, ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి కులాల గురించి మాట్లాడి తనను తాను దిగజార్చుకుంటున్నారు. వైఎస్ జగన్ను అవమానించే క్రమంలో మొత్తం కాపు జాతిని అవమానించాలనుకుంటున్నారు. కాపు జాతిలో పుట్టిన మాకు అందరూ సమానమే. అన్ని కుటుంబాలు మిమ్మల్ని ఆదరించాయి. కులాల రహితంగా మేం కూడా సేవలందించాం. దయచేసి ఎవరి మెప్పు కోసమో కాపు జాతిని తిట్టకండి. వైఎస్ జగన్ ముద్రగడ పద్మనాభం గారిని ఎంత గౌరవంగా చూస్తారో అందరికీ తెలుసు. ప్రతీ రోజూ ఆయన ఆరోగ్యంపై పర్యవేక్షణ చేస్తున్నారు. -
కాన్వాయ్ ఆపేసి.. అంబులెన్స్కి దారిచ్చి..
సాక్షి, వైఎస్సార్ జిల్లా: అంబులెన్స్కు దారిచ్చి.. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన మానవత్వాన్ని చాటుకున్నారు. భూమయ్యగారిపల్లె నుంచి పులివెందుల మార్గమధ్యలో ఘటన జరిగింది. అభిమానులతో మాట్లాడుతున్న సందర్భంలో 108 సైరన్ విన్న వైఎస్ జగన్.. వెంటనే తన కాన్వాయ్ని పక్కకు ఆపి అంబులెన్స్కు దారిచ్చారు. వైఎస్ జగన్ ఆదేశాలతో ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, అభిమానులు రోడ్డు క్లియర్ చేశారు.పులివెందుల పర్యటనలో వైఎస్ జగన్కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా అభిమానులు ఘన స్వాగతం పలికారు. షెడ్యూల్ కంటే ఆలస్యంగా వైఎస్ జగన్ పర్యటన సాగింది. ఉదయం 9 గంటలకు భూమయ్యగారిపల్లె లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ కలశ స్థాపనలో ఆయన పాల్గొన్నారు. అనంతరం భూమయ్యగారిపల్లెలో ఇటీవల మృతిచెందిన మాజీ సర్పంచ్ ఓబులరెడ్డి శ్రీరామిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.వైఎస్ జగన్తో సెల్ఫీల కోసం అభిమానులు ఉర్రూతలూగారు. ప్రతి ఒక్కరి వద్ద ఆగి సెల్ఫీలు తీసుకున్న వైఎస్ జగన్.. పేరుపేరునా పలకరించారు. 12 గంటలకు పులివెందుల చేరుకోవాల్సిన వైఎస్ జగన్ సాయంత్రం 4.30 గంటలకు చేరుకున్నారు. బాకరాపేటలో ఓ చిన్నారికి ఓనమాలు దిద్దించిన వైఎస్ జగన్ అక్షరాభ్యాసం చేయించారు. -
జేసీ అనుచరుల కంటే పోలీసులే నీచంగా ప్రవర్తిస్తున్నారు
-
CI నాగరాజు ఫోన్ ఎక్కడ..? శవాన్ని ఇద్దరూ కలిసే మాయం..!
-
నీకెందుకు తల్లి మేకప్ మేకప్ అంటే నీకు ప్యాకప్ ఖాయం
-
యర్రగుడిపల్లెలో సీసీ రోడ్లను ప్రారంభించిన వైఎస్ జగన్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందుల మున్సిపాలిటీ యర్రగుడిపల్లెలో సీసీ రోడ్లను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నిధులు రూ.1.5 కోట్లతో 3 సీసీ రోడ్ల నిర్మాణం జరిగింది.కాగా, ఈ పర్యటనలో భాగంగా అంతకుముందు వైఎస్ జగన్.. వేముల మండలంలోని భూమయ్యగారిపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన గట్టు శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. గట్టు శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరుకోగానే అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం.. ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. కలశ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే, ఆలయంలో స్వామివారికి నిర్వహిస్తున్న సుదర్శన హోమంలోనూ పాల్గొన్నారు. -
ఓబుల్ రెడ్డి శ్రీరామిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన YS జగన్
-
గట్టు శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవంలో వైఎస్ జగన్
-
జేసీ ఏది చెప్తే అదే చేస్తారా ? తాడిపత్రి పోలీసులపై అనంత వెంకటరామిరెడ్డి ఫైర్
-
‘సాయికృష్ణ కేసులో వాస్తవాలు బయటకు రావాలి’
సాక్షి, తాడేపల్లి: సాయికృష్ణపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని.. అతన్ని పోలీసులు ఇబ్బంది పెట్టటానికి వేరే కారణాలు ఉన్నాయని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అవన్నీ వెలుగులోకి రావాలంటే సీబిఐతోనే విచారించాలని డిమాండ్ చేశారు.‘‘సాయికృష్ణపై అత్యాచారం కేసు అబద్ధం. తన మరదలు, సాయికృష్ణ ప్రేమించుకున్నారు. ఇరువైపులా కుటుంబాల్లో ఒప్పుకోకపోవటంతో పెళ్లి చేయలేదు. ఈ విషయంలో ఆ అమ్మాయిని బెదిరించి.. సాయికృష్ణపై అక్రమంగా కేసు పెట్టించారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే సాయికృష్ణపై పోక్సో కేసు పెట్టారు. అది అబద్ధపు కేసని ఆ అమ్మాయే కోర్టులో చెప్పింది’’ అని వంగవీటి నరేంద్ర పేర్కొన్నారు.‘‘అసలు సాయికృష్ణ మీద పోలీసులు ఇంత కక్ష కట్టాల్సిన అవసరం ఏంటి?. సాయికృష్ణను టాస్క్ ఫోర్స్ వాళ్లు తీసుకువచ్చి విచారించాల్సినంత కేసు ఏం ఉంది?. అతన్ని పోలీసు శాఖ ఎందుకు వాడుకుందో తెలియాలి. సీపీ, డీజీపీ, హోంమంత్రి నోరు తెరిచి వాస్తవాలను వెల్లడించాలి. సాయికృష్ణను లాకప్ డెత్ చేశారంటే వాళ్లు ఎంతపెద్ద క్రిమినల్స్?. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వెంకట్, రాజులను బెదిరించి సీసీ కెమెరా పుటేజీని డిలీట్ చేయించారు. సాయికృష్ణ కేసులో వాస్తవాలన్నీ బయటకు రావాలంటే సీబీఐతోనే విచారించాలి’’ అని వంగవీటి నరేంద్ర డిమాండ్ చేశారు. -
కూటమి ప్రభుత్వ డొల్లతనానికి ఈ చిత్రమే నిదర్శనం!
ఈ చిత్రం చూశారా... తలపై పుస్తకాలు, చేతిలో క్యారేజీ పట్టుకుని వెళ్తున్నది పార్వతీపురం మండలం గోచక్క ప్రాథమిక పాటశాల విద్యార్థిని. ఈ ఏడాది విద్యామిత్ర కిట్టు అందజేయకపోవడంతో బడికి పుస్తకాలు తీసుకెళ్లేందుకు బ్యాగు కరువైంది. తలపై పుస్తకాలు పడిపోకుండా ఓ చేత్తో అదిమిపట్టుకుని చిన్నారి వేస్తున్న అడుగులు కూటమి పాలకుల హామీలను వెక్కిరిస్తున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కంటే విద్యారంగాన్ని మరింత ఉజ్వలంగా తీర్చిదిద్దుతామని ప్రగల్భాలు పలుకుతున్న చంద్రబాబు ప్రభుత్వ డొల్లతనానికి ఈ చిత్రం సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. అక్షరాలతో పేదకుటుంబాల చిన్నారుల భవితను మార్చేందుకు కృషిచేయాల్సిన సర్కారు.. పుస్తకాల బరువును పిల్లలకు శిక్షలా మార్చడం పాలనా వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. – పార్వతీపురం రూరల్ -
కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో శాంతి భద్రతలను పోలీసులు గాలికొదిలేశారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేయాలంటే జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమతి కావాలా? అని ప్రశ్నించారు. తాడిపత్రి పోలీసు అధికారులు ఖాకీ చొక్కా తీసేసి.. టీడీపీ కండువాలు వేసుకుంటే మంచిది అంటూ ఘాటు విమర్శలు చేశారు.మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి డైరెక్షన్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. విచ్చలవిడిగా గంజాయి, ఛైన్ స్నాచింగ్స్ కొనసాగుతున్నాయి. అయినప్పటికీ పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇచ్చే లంచాలకు పోలీసు అధికారులు అలవాటు పడ్డారు. అందుకే తాడిపత్రిలో శాంతి భద్రతలను పోలీసులు గాలికొదిలేశారు. పోలీసు అధికారులు జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగడాలను చూసిచూడనట్లు వదిలేస్తున్నారు.పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేయాలంటే జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమతి కావాలా?. నేరాలకు పాల్పడటం. కౌంటర్ కేసులు పెట్టడం. జేసీ ప్రభాకర్ రెడ్డికి అలవాటుగా మారింది. తాడిపత్రి పోలీసు అధికారులు ఖాకీ చొక్కా తీసేసి.. టీడీపీ కండువాలు వేసుకుంటే మంచిది. జేసీ దౌర్జన్యాలను చట్టబద్ధంగా ఎదుర్కొంటాం. ఈనెల 26వ తేదీన జరిగే సామూహిక దీక్ష విజయవంతం చేయండి’ అని పిలుపునిచ్చారు. -
కేశవరెడ్డిని ఆస్పత్రిలోనే అంతమొందించే.. జేసీ వర్గం యత్నమా..?
-
వచ్చే నెలలో పాదయాత్ర చేస్తున్నా: అంబటి
సాక్షి, గుంటూరు: ఏపీలో పోలీసు వ్యవస్థ చంద్రబాబు జేబు సంస్థగా మారిందని సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సాయికృష్ణ కేసులో సాక్ష్యాలను మాయం చేశారు. ఏ తప్పు చేయకపోయినా తనను అరెస్ట్ చేశారంటూ మండిపడ్డారు. 18 రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉంచారు. వచ్చే నెల 29న వినతి పాదయాత్ర చేస్తా అని అంబటి ప్రకటించారు.మాజీ మంత్రి అంబటి రాంబాబు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఒత్తిడితోనే నాపై కేసులు నమోదు చేశారు. నా ఇంటిపై దాడి చేయడమే కాకుండా నాపై అక్రమంగా రెండు కేసులు పెట్టారు. నన్ను జైలులో ఉంచారు. రెండు కేసుల్లో ఏడేళ్ళ లోపు శిక్ష పడే సెక్షన్లే పెట్టారు. ఈ కేసులో ఇద్దరు సీఐలు, ఒక ఎస్ఐకి హైకోర్టు.. కోర్టు ధిక్కరణ కింద నోటీసులు ఇచ్చింది. వంశీధర్ అనే సీఐ, మధు అనే ఎస్ఐ ఇల్లీగల్గా నన్ను లోపలేశారు. పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లుకి హైకోర్టు నోటీస్ ఇచ్చింది. ఈ ముగ్గురు పోలీసులను కేంద్ర మంత్రి పెమ్మసాని పురిగొల్పి నన్ను అరెస్ట్ చేయించారు. డీజీపీ, ఐజీ, ఎస్పీ, డిఎస్పీలకు చెబుతున్నాను. నా ఇంటిపై దాడి చేసిన వాళ్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. అందుకే వచ్చే నెల 29వ తేదీన వినతి పాదయాత్ర చేస్తున్నాను.పోలీస్ వ్యవస్థ చంద్రబాబు జేబు సంస్థగా కొనసాగుతుంది. సాయికృష్ణ అంశంపై మేము పోరాడటానికి కారణం వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయనే. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఏడాది సీసీటీవీ ఫుటేజ్ మాయం చేశారు. ఏడాది నుండి పీఎస్లో నేరాలు జరుగుతున్నాయి. ఐజీ రవి ప్రకాష్ ఆధ్వర్యంలోనే సాక్ష్యాధారాలు మాయం చేశారు. సీఐ నాగరాజుతో బేరసారలాడారు. ఏ పోలీస్ పేరు చెప్పవద్దని సీఐ నాగరాజును బతిమలాడారు. ఏ తప్పు చేయకపోయినా నన్ను అరెస్టు చేసి జైలులో వేశారు. కానీ, సీఐ నాగరాజును లాకప్లో ఎందుకు వేయలేదు?. పోలీసులు ప్రజలను కాపాడలేరు. సీఎం, హోంమంత్రి విఫలమయ్యారు. పవన్ కల్యాణ్.. నాగరాజును జిందాబాద్ అంటారేంటి?. ఆయనకు సిగ్గు అనిపించడం లేదా?. పవన్ కల్యాణ్ ఆత్మవిమర్శ చేసుకోవాలి. హోంమంత్రి రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
లక్ష్మీనరసింహుడి సేవలో వైఎస్ జగన్
సాక్షి, పులివెందుల: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా వైఎస్ జగన్.. వేముల మండలంలోని భూమయ్యగారిపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన గట్టు శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. గట్టు శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరుకోగానే అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం, ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. కలశ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే, ఆలయంలో స్వామివారికి నిర్వహిస్తున్న సుదర్శన హోమంలోనూ పాల్గొన్నారు.👉 ఆలయ కార్యక్రమం అనంతరం సమీపంలోని బండలాగుడు మైదానానికి చేరుకుని రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులను, నిర్వాహకులను అభినందించనున్నారు. అనంతరం వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు ఓబుళరెడ్డి శ్రీరామిరెడ్డి నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. -
జగన్ ను కలిసేందుకు.. పోటెత్తిన ప్రజలు
-
ఈ కేసులో ఆఖరిగా వచ్చే తీర్పు ఇదే.. వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్
-
ఓటర్ల సవరణలో టీడీపీ జోక్యంపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సర్వేలో టీడీపీకి చెందిన మంత్రులు, రాజకీయ నాయకులు జోక్యం చేసుకుంటున్నారని వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మంగళవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. జూన్ 22న నెల్లూరు నగరంలో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు మేయర్ దేవరకొండ సుజాత, డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్తో పాటు మున్సిపల్ కమిషనర్, అడిషనల్ కమిషనర్ల సమక్షంలో ఓటర్ల సవరణ ప్రక్రియపై సమీక్షా సమావేశం నిర్వహించిన విషయాన్ని ఆధారాలతో సహా ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లారు. అధికారిక సమావేశానికి పెద్దసంఖ్యలో బూత్ స్థాయి అధికారులు (బీఎల్వోలు) హాజరుకావడంపై ఎమ్మెల్సీ అప్పిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్–324 ప్రకారం ఎన్నికల సంఘం పూర్తి స్వతంత్రంగా, రాజకీయ ప్రభావం లేకుండా పనిచేయాలని లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదులో గుర్తు చేశారు. ఓటర్ల జాబితా తయారీ, సవరణ అనేది కేవలం ఎన్నికల సంఘం పర్యవేక్షణలోనే జరగాల్సిన చట్టబద్ధమైన ప్రక్రియ అని, ఇందులో అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఓటర్లలో, రాజకీయ పార్టీలలో తీవ్ర అనుమానాలకు తావిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరులో జరిగిన సమీక్షా సమావేశంపై తక్షణమే విచారణ జరిపించాలని, నిబంధనలను ఉల్లంఘించి, రాజకీయ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. విచారణ ముగిసేవరకు సదరు సమావేశానికి సహకరించిన అధికారులందరినీ తక్షణమే ఎన్నికల విధుల నుండి తొలగించాలని కోరారు. భవిష్యత్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎన్నికల సవరణ ప్రక్రియల్లో, సమీక్షల్లో పాల్గొనకుండా తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. -
రాజధాని రైతు హక్కుల కోసం పోరాటం
సాక్షి,అమరావతి: రాజధాని ప్రాంతానికి భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం దామాషా ప్రకారం అభివృద్ధి చేసిన ప్లాట్లను కేటాయించాల్సి ఉందని వైఎస్సార్సీపీ సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ సమావేశం అభిప్రాయపడింది. రైతులకు న్యాయం జరిగేలా ఇప్పటికే అమల్లో ఉన్న నిబంధనలు, ఒప్పందాల ప్రకారమే ప్లాట్ల కేటాయింపు జరగాలని డిమాండ్ చేశారు. రైతుల హక్కులను దెబ్బతీసేలా ఎటువంటి నిర్ణయాలూ తీసుకోవద్దని హెచ్చరించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. రాజధాని ప్రాంత రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, రైతుల హక్కుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. సమావేశంలో పాల్గొన్న కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతుల హక్కులు, ప్రయోజనాలు పూర్తిగా పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. రైతులు ఎంతో నమ్మకంతో తమ భూములను అప్పగించారని, వారికి ఇచ్చిన హామీలను అమలు చేయడం ప్రభుత్వ కర్తవ్యమని పేర్కొన్నారు. రాజధాని కోసం ఇప్పటికే భూములు ఇచ్చిన రైతుల నుంచి మరోసారి భూ సమీకరణ పేరుతో బలవంతంగా భూములు తీసుకోవడం అన్యాయమని సమావేశం స్పష్టం చేసింది. ఒకసారి భూములు సమీకరించిన తర్వాత మళ్లీ రైతులపై అదనపు భారం మోపడం సరికాదని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా జరిగే ఎటువంటి చర్యలనైనా వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. రాజధాని ప్రాంతంలో అదనపు భూ సమీకరణకు సంబంధించిన అంశంపై ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించామని కమిటీ సభ్యులు గుర్తు చేశారు. కోర్టులో విచారణలో ఉన్న అంశాల విషయంలో ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలని సూచించారు. న్యాయ ప్రక్రియను గౌరవిస్తూ రైతుల హక్కులను కాపాడాలని కోరారు. నిడమర్రు, పెనుమాక గ్రామాల్లో లీగల్ టీం పర్యటన.. రాజధాని ప్రాంత రైతులపై ఒత్తిళ్లు, బెదిరింపులు, భయాందోళనలు సృష్టించే విధానాలను ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని సమావేశంలో కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. రైతులతో చర్చలు జరపకుండా, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ముందుకు వెళ్లడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.రైతుల ఆందోళనలను అర్థం చేసుకుని వారి సమస్యలకు పరిష్కారం చూపాలని సూచించారు. రైతుల అభ్యర్థన మేరకు సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీకి చెందిన లీగల్ టీం నిడమర్రు, పెనుమాక గ్రామాల్లో పర్యటించిన విషయాన్ని సమావేశంలో ప్రస్తావించారు. ఆ గ్రామాల రైతులను ప్రత్యక్షంగా కలిసి వారి అభిప్రాయాలు, సమస్యలు, ఆందోళనలను తెలుసుకున్నట్లు తెలిపారు. రైతులు వ్యక్తం చేసిన అంశాలపై సమగ్ర నివేదికను సిద్ధం చేసి తదుపరి కార్యాచరణను రూపొందించాలని నిర్ణయించారు. న్యాయ, రాజకీయ, ప్రజా పోరాటాలు చేపట్టాలని నిర్ణయం రాజధాని ప్రాంత రైతుల సమస్యలపై మరింత విస్తృత చర్చ జరిపేందుకు ఈ నెలలోనే మరోసారి సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. రైతుల అభిప్రాయాలను సేకరించి, వారి హక్కుల పరిరక్షణ కోసం అవసరమైన న్యాయ, రాజకీయ, ప్రజా పోరాట కార్యక్రమాలను చేపట్టాలని సమావేశం నిర్ణయించింది. రాజధాని ప్రాంత రైతుల హక్కులను కాపాడడం కోసం వైఎస్సార్సీపీ అన్ని విధాలా అండగా ఉంటుందని, రైతులకు అన్యాయం జరిగే ప్రతి అంశంపై పోరాటం కొనసాగిస్తామని సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ స్పష్టం చేసింది. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ సభ్యులు అంబటి రాంబాబు, లేళ్ళ అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, నందిగం సురేష్, దేవినేని అవినాష్, దొంతిరెడ్డి వేమారెడ్డి, వనమా బాల వజ్రబాబు, మలసాని మనోహర్ రెడ్డి, కొమ్మసాని శ్రీనివాస రెడ్డి, పలువురు రైతులు పాల్గొన్నారు. -
`పద్మ` పురస్కారాలు అందుకున్న తెలుగువారికి వైఎస్ జగన్ అభినందనలు
తాడేపల్లి: `పద్మ` పురస్కారాలు అందుకున్న తెలుగు వారికి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. వారు సాధించిన విజయాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఎక్స్లో వైఎస్ జగన్ పోస్ట్ చేశారు.‘‘వైద్య రంగంలో విశిష్ట సేవలకుగాను డా.నోరి దత్తాత్రేయుడికి పద్మభూషణ్ పురస్కారం, వివిధ రంగాల్లో విశేష సేవలందించిన మరికొందరు తెలుగువారికి పద్మశ్రీ పురస్కారాలు లభించడం తెలుగు జాతికి గర్వకారణం. వీరందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వీరు సాధించిన విజయాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.కాగా, రాష్ట్రపతి భవన్లో మంగళవారం రెండో విడత పద్మ పురస్కారాల ప్రదానోత్సవాన్ని నిర్వహించారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 65 మందికి రాష్ట్రపతి పద్మ అవార్డులు అందజేశారు. -
ప్రజలతో మమేకమైన వైఎస్ జగన్ (ఫొటోలు)
-
తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత
అనంతపురం: తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు వైఎస్సార్సీపీ నేత గంగులకుంట కేశవరెడ్డిపై హత్యాయత్నానికి తెగబడ్డారు. తాడిపత్రి పోలీస్ స్టేషన్ సమీపంలో కేశవరెడ్డి టీ తాగుతుండగా, జేసీ అనుచరులు ఒక్కసారిగా ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కేశవరెడ్డిని పార్టీ శ్రేణులు వెంటనే తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేశవరెడ్డిపై మరోసారి దాడి చేసేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించాయి. ఈ క్రమంలో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిపై జేసీ వర్గీయులు విచ్చలవిడిగా రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ ఉద్రిక్త పరిస్థితులు కళ్లముందే జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడంపై స్థానికంగా, వైఎస్సార్సీపీ శ్రేణుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
రానున్న రెండు నెలలూ అత్యంత కీలకం: సజ్జల
తాడేపల్లి : SIR( స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)పై అందరూ అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి స్పష్టం చేశారు. గత రెండు నెలలుగా పార్టీ యంత్రాంగమంతా దీనిపైనే పనిచేస్తోందని, పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరుల ఓట్లు పోకుండా కాపాడుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈరోజు(మంగళవారం) వైఎస్సార్సీపీ నేతలతో సజ్జల టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. SIR, సోషల్ మీడియా బలోపేతం, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘SIR పై అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇది అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా గుర్తించాలి. గత రెండు నెలలుగా పార్టీ యంత్రాంగమంతా దీనిపైనే పనిచేస్తోంది. రానున్న రెండు నెలలూ అత్యంత కీలకం. అధికార పార్టీ నేతలు అడ్డదారుల్లో ఓట్ల తొలగింపునకు ప్రయత్నిస్తున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ఇందులో బూత్ లెవల్ ఏజెంట్లదే కీలక పాత్ర. ఎన్యూమరేషన్ ఫారాలు ప్రతి అర్హుడికి అందించి, వాటిని సేకరించి సరైన మ్యాపింగ్ చేయాలి. బీఎల్వోలతో సమన్వయం చేసుకోవాలి. బీఎల్వో ఏదైనా దరఖాస్తును తిరస్కరిస్తే, పరిష్కారం కోసం పైస్థాయికి సమాచారం అందించాలి. సోషల్ మీడియాలో పార్టీ వాణి మరింత బలంగా వినిపించాలి. పార్టీ నెట్వర్క్ను విస్తృతంగా పెంచుకోవడంతో పాటు, ప్రజలకు వాస్తవాలను చేరవేయాలి. టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కోవాలి. పార్టీ సభ్యత్వ నమోదు, ఐడీ కార్డుల వెరిఫికేషన్లో జాప్యం లేకుండా చూసుకోవాలి’ అని పేర్కొన్నారు. -
రోడ్డుపై కాన్వాయ్ ఆపి.. మానవత్వం చాటుకున్న వైఎస్ జగన్
-
సాక్ష్యాలు మాయం చేసి అరెస్ట్ చేశావ్... గుట్టు విప్పిన అంబటి
-
జగన్ గురించి ఇంకోసారి పిచ్చిగా వాగితే.. నీ ఇంటికొచ్చి మాస్ వార్నింగ్
-
నువ్వు డిప్యూటీ సీఎం అవ్వడం మా కర్మ... పవన్ పై విరుచుకుపడ్డ పుణ్యశీల
-
కాపులను ఉద్ధరించేందుకు జనసేన పెట్టలేదు
గుంటూరు ఎడ్యుకేషన్: ‘కాపులను ఉద్ధరించేందుకు పవన్కళ్యాణ్.. జనసేన పార్టీని పెట్టలేదు. రాష్ట్రంలో రోజూ ఎంతో మంది చస్తూ ఉంటారు. అందుకని రోడ్డెక్కాలా?’ అని జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. సోమవారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు.వైఎస్సార్సీపీలోని కాపు నేతలను తాము కాపు సామాజికవర్గం నుంచి బహిష్కరిస్తున్నామన్నారు. కాపులతో వారికి సంబంధం లేదన్నారు. గత ప్రభుత్వంలో కాపులకు ఏం చేశారో చెప్పాలని వైఎస్సార్సీపీ నేతలను ప్రశి్నంచారు. కాగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కాపులకు చేకూర్చిన సంక్షేమం, విడుదల చేసిన నిధుల వివరాలను ఆ పార్టీ కాపు సామాజిక నేతలు ప్రకటించారు కదా.. మరి కూటమి ప్రభుత్వం వచ్చాక ఏం చేశారో చెప్పాలని విలేకరులు వెంకటేశ్వరరావును ప్రశి్నంచారు. ఆయన స్పందిస్తూ.. ఒక్క కాపులకే మేలు చేయడం తమ ప్రభుత్వ లక్ష్యం కాదన్నారు. -
పదవికి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా నీపై పోటీ చేస్తా...
-
CCTV ఫుటేజ్ మాయం చేసింది CI నాగరాజు కాదు అంబటి సంచలన నిజాలు
-
నేడు పులివెందులకు వైఎస్ జగన్
పులివెందుల : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 23వ తేదీనుంచి మూడు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా మంగళవారం మధ్యాహ్నం 3గంటలకు బెంగుళూరు ఎయిర్డ్రోం నుంచి హెలీకాప్టర్ ద్వారా బయలుదేరి 3.30గంటలకు పులివెందులలోని భాకరాపురం హెలీప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 4గంటలకు పులివెందులలోని తన క్యాంపు ఆఫీస్కు చేరుకుంటారు. అనంతరం రాత్రి 7గంటల వరకు క్యాంపు ఆఫీస్లో ప్రజలతో మమేకమవుతారు. 24వ తేదీ బుధవారం ఉదయం 9.00గంటలకు పులి వెందులలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన వేము ల మండలం భూమయ్యగారిపల్లె గ్రామంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బయలుదేరుతారు. 10 గంటలకు ఆలయానికి చేరుకుని శ్రీలక్ష్మీనరసింహస్వామి విగ్రహ ప్రతిష్ట వేడుకలో పాల్గొననున్నారు. అనంతరం అక్కడి నుంచి పులివెందుల భాకరాపురంలోని తన క్యాంపు ఆఫీస్కు బయలుదేరుతారు. మధ్యా హ్నం 1గంట నుంచి రాత్రి 7గంటల వరకు తన క్యాంప్ ఆఫీస్లో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. 25వ తేదీ ఉదయం 8.10గంటలకు బెంగళూరుకు తిరుగుపయనమవుతారు. -
డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపండి
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన మెగా డీఎస్సీ ప్రక్రియలో భారీస్థాయిలో అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని.. మొత్తం వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో విచారణ జరిపించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ను వైఎస్సార్సీపీ కోరింది. చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రక్రియను పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసం మలిచిందని ఆ పార్టీ అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజారాణి ఆరోపించారు. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో పక్కా ప్రణాళికతో రూపొందించిన భారీ కుంభకోణమని.. అందుకే సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆమె కోరారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి వినపతిపత్రం అందచేశారు. అందులోని ముఖ్యాంశాలు.. పోస్టుల భర్తీలో పారదర్శకతకు పాతర 16వేల పోస్టుల భర్తీ కోసం జరిపిన డీఎస్సీ పరీక్షలో పారదర్శకతను కాపాడే అన్ని చర్యలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తొలగించింది. గతంలో ప్రశ్నపత్రాల తయారీ బాధ్యత ఎస్సీఈఆర్టీకీ, పరీక్షల నిర్వహణ బాధ్యత డీఎస్సీ కన్వినర్కు ఉండేది. అయితే, ఈసారి రెండు బాధ్యతలను కూడా ఎస్సీఈఆర్టీ డైరెక్టర్కే అప్పగించడం ద్వారా అక్రమాలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అలాగే, ప్రశ్నపత్రాల అప్లోడ్ తదితర బాధ్యతలను అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అప్పగించారు. ప్రశ్నపత్రాల తయారీలో పాల్గొన్న ఓ అవుట్సోర్సింగ్ ఉద్యోగి అదే డీఎస్సీలో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించడం పేపర్ లీక్కు ప్రత్యక్ష నిదర్శనం. అయితే, మెరిట్ జాబితా నుంచి అతని పేరు తొలగించారు. ఫలితాల ప్రకటనలోనూ గందరగోళం ఇక ఫలితాల ప్రకటనలో కూడా ప్రభుత్వం పారదర్శకత పాటించలేదు. గతంలో కలెక్టరేట్ నోటీసుబోర్డులపై మెరిట్ లిస్టులు, మెరిట్–కమ్–రోస్టర్ జాబితాలు ప్రదర్శించేవారు. ఈసారి ఆన్లైన్కు పరిమితం చేయడంతో అభ్యర్థులు ఇబ్బందిపడ్డారు. నిబంధనల ప్రకారం మెరిట్, రిజర్వేషన్లు, కటాఫ్ మార్కుల ఆధారంగా ఎంపిక పూర్తయిన తర్వాతే ధృవపత్రాల పరిశీలన జరగాలి. కానీ, ధ్రువపత్రాల పరిశీలన అనంతరం కూడా పలువురు అభ్యర్థులను తప్పించారు. స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు గతంలో స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు కూడా తప్పనిసరిగా డీఎస్సీ పరీక్ష రాయాల్సి ఉండేది. అయితే, కొత్త జీఓల ద్వారా వారిని పరీక్ష నుంచి మినహాయించారు. నియామకాలు పూర్తయ్యాక మళ్లీ పాత విధానాన్నే పునరుద్ధరిస్తూ ప్రభుత్వం కొత్త జీఓలు జారీచేసింది. మరోవైపు.. టీచర్ పోస్టుల కోసం బేరసారాలు జరిగినట్లు ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. ఫోన్ నంబర్లు తెలిసినా అసలు నిందితుల పేర్లు ఎఫ్ఐఆర్లో నమోదుచేయకుండా దర్యాప్తును బలహీనపరిచారు. ఈ డీఎస్సీ కుంభకోణం పశ్చిమ బెంగాల్ టీచర్ రిక్రూట్మెంట్ స్కాం కంటే తీవ్రమైనది. అందువల్ల సీబీఐ వంటి స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించి లక్షలాది మంది నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలి. -
ఆర్టీసీ ప్రైవేటీకరణ కుట్రలను విరమించుకోవాలి
సాక్షి, విశాఖపట్నం: ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం విశాఖ కలెక్టరేట్ వద్ద వైఎస్సార్ ట్రేడ్ యూనియన్న్నేతలు పీవీ సురేష్ , రాయపురెడ్డి అనిల్కుమార్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు, కార్మిక నేతలు నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ను కలిసి వినతిపత్రమిచ్చారు.అనంతరం వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు తిప్పల దేవన్ రెడ్డి, మొల్లి అప్పారావు, పలువురు ట్రేడ్ యూనియన్, కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ..విద్య, వైద్యం, ప్రజా రవాణా వంటి కీలక రంగాలు ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు బలోపేతం అయితేనే పేద, మధ్యతరగతి ప్రజలకు ఊరటగా నిలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు జాన్వెస్లీ, రవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రేపు పులివెందులకు వైఎస్ జగన్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. రేపు(మంగళవారం) సాయంత్రం పులివెందులకు వెళ్లనున్నారు. మూడు రోజులు పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ పులివెందులలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం, ఈనెల 25వ తేదీ ఉదయం పులివెందుల నుంచి వైఎస్ జగన్ తిరుగు ప్రయాణం కానున్నారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు పులివెందులలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మంగళవారం(రేపు) సాయంత్రం పులివెందులకు చేరుకోనున్న వైఎస్ జగన్.. క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలతో సమావేశం కానున్నారు. అనంతరం ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు.అలాగే, 24వ తేదీన వేముల మండలం భూమయ్యగారిపల్లిలోని లక్ష్మీనరసింహ స్వామి దేవాలయాన్ని సందర్శించనున్నారు. ఈ ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం కోటిన్నర రూపాయలకు పైగా నిధులు మంజూరు చేసింది. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వైఎస్ జగన్ తిరిగి పులివెందుల క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం నుంచి ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు, పార్టీ శ్రేణులతో ఆయన మాట్లాడతారు. 25వ తేదీ ఉదయం పులివెందుల నుంచి వైఎస్ జగన్ తిరుగు ప్రయాణం కానున్నారు. -
సోదరుడు విజయ్కి జన్మదిన శుభాకాంక్షలు: వైఎస్ జగన్
టీవీకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విజయ్ను సోదరుడిగా సంభోదిస్తూ.. మంచి ఆరోగ్యం, సుఖసంతోషాలతో పాటు చేపట్టే ప్రతి కార్యంలో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ జన్మదినాన్ని పురస్కరించుకుని వైఎస్ జగన్ ఓ ట్వీట్ చేశారు. "సోదరుడు, తమిళనాడు గౌరవ ముఖ్యమంత్రి విజయ్కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని, మీ అన్ని ప్రయత్నాల్లో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను" అని జగన్ పేర్కొన్నారు. రాజకీయ, ప్రజాసేవా రంగాల్లో విజయ్ మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించిన వైఎస్ జగన్, ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.Heartiest birthday wishes to Brother Vijay, the Hon’ble Chief Minister of Tamil Nadu. May you be blessed with good health and success in all your endeavors.@TVKVijayHQ— YS Jagan Mohan Reddy (@ysjagan) June 22, 2026తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ జగన్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే విజయ్కు అగ్రనటుడిగా, ప్రస్తుతం రాజకీయ నేతగా కూడా విశేష ఆదరణ ఉంది. వీళ్లిద్దరూ ఆ మధ్య ఓ వివాహ వేడుకలో కలిసి సందడి చేశారు. అలాగే.. తమిళనాడు ఎన్నికల ప్రచారంలోనూ విజయ్ వైఎస్ జగన్ ఫొటోను ప్రదర్శించడమూ విపరీతంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో జగన్ చేసిన బర్త్డే ట్వీట్కు అటు విజయ్ అభిమానులు, ఇటు వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున స్పందిస్తూ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. ఇద్దరు నేతల అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులను షేర్ చేస్తూ ఈ సందేశాన్ని వైరల్ చేస్తున్నారు.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కాపులకు బాబు ద్రోహం..!
సాక్షి, అమలాపురం/రామచంద్రపురం: రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా క్షీణించాయని.. కాపుల సంక్షేమాన్ని చంద్రబాబు సర్కారు గాలికి వదిలేసిందని వైఎస్సార్సీపీ కాపు నేతలు, కాపు సామాజిక వర్గ ప్రతినిధులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాపులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని.. కాపులకు ఇవ్వాల్సిన నిధులను బకాయిలతో సహా చెల్లించాలని.. కాపు కార్పొరేషన్కు చంద్రబాబు బకాయి పెట్టిన రూ.9,000 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాపు కార్పొరేషన్కు రూ.3 వేల కోట్లు ఇస్తామని హామీలిచ్చిన చంద్రబాబు రెండేళ్లలో మూడు రూపాయిలు కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ‘కాపు నేస్తం’ సహా ఎన్నో పథకాలను ఇచ్చారని.. ఇళ్ల స్థలాలు, అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా కాపు మహిళలు, విద్యార్థులకు మేలు జరిగిందని.. కొత్తవి ఇవ్వకపోగా ఉన్న పథకాలను కూడా చంద్రబాబు తీసేస్తామంటే ఊరుకోబోమని స్పష్టం చేశారు. చంద్రబాబుకు ఎన్నికలప్పుడే కాపులు గుర్తుకొస్తారా? అని మండిపడ్డారు. కాపు యువకుడు సాయికృష్ణ రౌడీ అయితే అతడి కుటుంబాన్ని చంద్రబాబు ఎందుకు కలిశారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. ఆదివారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం పరిధిలోని వెంకటాయపాలెంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కాపు ముఖ్య నేతల ఆత్మీయ కలయిక సమావేశం జరిగింది. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో రాష్ట్రంలో టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక కాపులపై జరుగుతున్న దాడులు, అణచివేత చర్యలు, సంక్షేమ పథకాల నిలిపివేతతో కాపులకు జరుగుతున్న అన్యాయాలపై సుదీర్ఘంగా చర్చించారు. ‘కూటమి ప్రభుత్వంలో కాపులకు గౌరవం దక్కడం లేదు.. కాపు కులంలో ఉన్నవారంతా రౌడీలా? అధికార పార్టీ నేతలు ఎంతోమంది అరాచకాలు చేస్తుంటే పవన్కు కనపడటం లేదా? సాయికృష్ణ కేసులో పోలీసులను సస్పెండ్ చేయడంతో సరిపెడతారా? అయినా కేసులు ఉంటే మనుషులను చంపేస్తారా? అధికారం ఉందని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కుదరదు..’ అని హెచ్చరించారు. డిప్యూటీ సీఎం పవన్ నోటికి, భాషకు.. హద్దు, ఆనకట్ట లేకుండా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. ఎన్నికల సమయంలో ఇదే పవన్ కళ్యాణ్ కులం చూపించి ఓట్లు అడగలేదా? ఇప్పుడు అదే కులంలో ఓ మనిషిని చంపేస్తే ప్రశ్నించాల్సిన బాధ్యత ఆయనకు లేదా? అని నిలదీశారు. ఈ ప్రభుత్వం, పోలీసుల బాధితులకు అండగా ఉంటామని ప్రకటించారు. చంద్రబాబు సర్కారు అరాచకాలను కలసికట్టుగా ఎదుర్కొంటామని.. కాపు, బలిజ, ఒంటరి, తెలగ, తూర్పు కాపుల్లో ఎవరికి ఏ అన్యాయం జరిగినా తామున్నామనే ధైర్యం కల్పిస్తామని చెప్పారు. ఇది మరే కులాలకూ వ్యతిరేకం కాదని, కాపులతో పాటు మిగిలిన కులాలను కూడా కూడగట్టి వెళ్తామని, కాపులతో ఉంటే తమకు ఓ భరోసా ఉందనే నమ్మకాన్ని వారిలో కలిగిస్తామని తెలిపారు. వైఎస్సార్సీపీ హయాంలో అమలు చేసిన నవరత్న పథకాలతో కాపు సామాజిక వర్గానికి అత్యధికంగా మేలు జరిగిందని సమావేశంలో చర్చ జరిగింది. ముఖ్యంగా కాపు మహిళలు, విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరిందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన, విదేశీ విద్య పథకం ద్వారా కాపు విద్యార్థులకు మేలు జరిగిందని.. కాపు నేస్తం కింద ఏటా రూ.15 వేలు ఇచ్చి కాపు మహిళల అభ్యున్నతికి మాజీ సీఎం వైఎస్ జగన్ చేయూత అందించారని గుర్తు చేశారు. కాపు కార్పొరేషన్ను ఏర్పాటు చేయడంతోపాటు రూ.వేల కోట్ల నిధులిచ్చి కాపులకు ఆసరాగా నిలిచారని పేర్కొన్నారు. సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, తోట నరసింహం, గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజా, పేర్ని నాని, ఎమ్మెల్సీ విక్రాంత్, మాజీ ఎంపీ వంగా గీత, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, రెడ్డి శాంతి, జ్యోతుల చంటిబాబు, కరణం ధర్మశ్రీ, రౌతు సూర్యప్రకాశరావు, జి.శ్రీనివాస్ నాయుడు, దూలం నాగేశ్వరరావు, వివిధ నియోజకవర్గాల పార్టీ కో ఆర్డినేటర్లు దవులూరి దొరబాబు, చిన్న, మల్లి వెంకట్రాజు, పేర్ని కిట్టు, సింహాద్రి రమేష్, అంబటి మురళి, జె.గురునాథరావు, చిన్న శీను, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రామారావు, జక్కంపూడి విజయలక్ష్మి, కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ అడపా శేషు తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ ఆ వివరాలను మీడియాకు తెలియచేశారు. సమావేశంలో చేసిన తీర్మానాలను మాజీ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు.మీడియా సమావేశంలో మాట్లాడుతున్న బొత్స సత్యనారాయణ. పక్కన కాపు ముఖ్య నాయకులు ఎవరికి అన్యాయం జరిగినా అండగా ఉంటాం‘రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ కాపు సామాజిక వర్గానికి చెందిన ఎవరికి అన్యాయం జరిగినా అండగా ఉంటాం. నష్టపోయిన వారింటికి వెళ్తాం. అక్కడే కూర్చుంటాం. వారికి ధైర్యాన్ని, మనోస్థైర్యాన్ని కల్పిస్తాం. ఆర్థికంగా చేయూతనిస్తాం. కూటమి ప్రభుత్వం ఎటువంటి ఆపద కల్పించినా కలసికట్టుగా ఎదుర్కొంటాం..’ అని కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు, కాపు ప్రజాప్రతినిధులు ప్రకటించారు. ఎనిమిది మంది మాజీ మంత్రులతో పాటు ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలు, వైఎస్సార్సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్లు, రాష్ట్ర, జిల్లా అనుబంధ కమిటీల ప్రతినిధులు ఈ సదస్సులో తమ గళాన్ని వినిపించారు. ‘నా కుమారుడి శవాన్ని ఇవ్వకున్నా.. కనీసం బూడిదైనా ఇవ్వాలి..’ అంటూ కాపు యువకుడు సాయికృష్ణ కన్నతల్లి కన్నీళ్లతో వేడుకుంటున్న హృదయ విదారక ఘటనలు కూటమి పాలనలోనే కనిపిస్తున్నాయని మండిపడ్డారు.ఎన్నికల్లో కులం చూపించి ఓట్లేయమనలేదా?: బొత్సరానున్న రోజుల్లో తిరుపతి, విశాఖపట్నంలో కూడా ప్రాంతీయ సమావేశాలు నిర్వహిస్తామని బొత్స సత్యన్నారాయణ తెలిపారు. అవసరమైతే ప్రతి జిల్లాలోనూ, అన్ని ప్రాంతాల్లోనూ సమావేశాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. విజయవాడలో కాపు యువకుడు గాదె సాయికృష్ణను చంపి శవం కూడా కనిపించకుండా ఏవిధంగా మాయం చేశారో చూశామన్నారు. దీనిపై సిట్ వేయడాన్ని ఆయన తప్పుబట్టారు. సిట్పై తమకు నమ్మకం లేదన్నారు. ‘క్రిమినల్ కేసులుంటే చంపేస్తారా? అలాగని చట్టంలో, రాజ్యాంగంలో ఉందా? అలా అయితే కమిషన్ ఎందుకు వేశారు?’ అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా కాపులకున్న అంగబలం, ఆర్థిక బలంతో అవసరమైతే సాయికృష్ణ కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. వైఎస్సార్సీపీ నాయకులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రౌడీలతో పోల్చడంపై బొత్స తీవ్రంగా మండిపడ్డారు. అధికారం ఉందని నోటికొచ్చినట్టు మాట్లాడకూడదని హితవు పలికారు. ‘ఎన్నికల సమయంలో ఇదే పవన్ కళ్యాణ్ కులం చూపించి ఓట్లు వేయమంటారా? ఇప్పుడు అదే కులంలో మనిషిని చంపేస్తే ఆయనకు అడగాల్సిన బాధ్యత లేదా?’ అని ప్రశ్నించారు. ‘కాపులకు న్యాయం జరుగుతుందని రెండేళ్లు ఎదురు చూశాం. అయినా అన్యాయమే జరిగింది’ అని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ హయాంలో కాపు నేస్తం సహా ఎన్నో పథకాలను ఇచ్చారని, ఇప్పుడు గతంలో ఉన్న పథకాలను సైతం తీసేస్తామంటే ఒప్పుకోబోమన్నారు.ఇవీ తీర్మానాలు..⇒ రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా క్షీణించాయి. బాబు సర్కారు అరాచకాలను ఖండిస్తున్నాం. సాయికృష్ణను పోలీసులే చంపేశారు. క్రాంతికుమార్ ఆత్మహత్యకు కూడా పోలీసులే కారణం. వీరి మరణాలపై సీబీఐతో విచారణ చేయాలి.⇒ కాపు, బలిజ, ఒంటరి, మున్నూరు కాపులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలి.⇒ కాపులపై దాడులను అరికట్టి భరోసా కల్పించేందుకు మూడు ప్రాంతాల్లో కమిటీల ఏర్పాటుకు నిర్ణయం.⇒ కాపు కార్పొరేషన్ నిధులు వెంటనే విడుదల చేయాలి.⇒ మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలి. సంపూర్ణ ఆరోగ్యంతో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి.⇒ వైఎస్సార్సీపీ హయాంలో కాపు నేస్తం పథకం కింద మహిళలకు రూ.2 వేల కోట్ల సాయం అందించారు. ఈ ప్రభుత్వం మహిళలకు రూ.9 వేల కోట్ల బాకీలు చెల్లించాలి.రూ.3,000 కోట్లన్నారు.. రూ.3 కూడా ఇవ్వలేదుకాపుల సంక్షేమానికి వైఎస్సార్ సీపీ కంటే అధికంగా కట్టుబడి ఉంటామని, రూ.3 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కనీసం రూ.3 కూడా కేటాయించలేదని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ఆదివారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వెంకటాయపాలెంలో కాపునేతల ఆత్మీయ సమావేశానికి పేర్ని నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు 100 మంది గన్మెన్లను ఇచ్చి ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రభుత్వ సొమ్ముతో ఫ్లైట్లు సమకూర్చితే కాపులకు న్యాయం జరిగినట్లా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్న కాపుల్లో అత్యధికులు చిరు వ్యాపారాలు, ఉద్యోగాలు, కూలీ పనులు చేసుకుంటూ జీవితాలు గడుపుతున్నారన్నారు. వారి జీవితాలు చదువు ద్వారా మాత్రమే మారతాయని, కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఎగ్గొట్టి వారందరికీ అన్యాయం చేస్తోందన్నారు. చంద్రబాబుకు ఊడిగం చేస్తూ, ఆయనకు అనుకూలంగా నోటికి హద్దు లేకుండా మాట్లాడే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోవడం అనవసరమనే స్థాయి కల్పించుకున్నారని వ్యాఖ్యానించారు. రౌడీలను ప్రోత్సహిస్తారా..? అంటూ పవన్ కళ్యాణ్ ఒక రకం నాటకం ఆడితే.. పరామర్శ పేరుతో సీఎం చంద్రబాబు మరో నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. ఈ దాగుడు మూతలు, డ్రామాలను కాపులతో పాటు రాష్ట్ర ప్రజలంద రూ గమనిస్తూనే ఉన్నారన్నారు. తమను రెడ్డి కాపులుగా సంబోధిస్తున్న పవన్ కళ్యాణ్.. కమ్మ కాపు అవుతాడా? అని ప్రశ్నించారు. కాపులు కాపులేనని, కులం కార్డు వాడుతూ చంద్రబాబుకు ఊడిగం చేయడాన్ని సహించబోరని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వంలో వేధింపులకు గురవుతున్న కాపులతో పాటు తమ గొంతు వినిపించలేని ఇతర కులాలకు కూడా అండగా ఉండాలని, అందుకోసం టాస్క్ఫోర్స్లు, క్రౌడ్ ఫండింగ్తో ఆదుకోవాలని సమావేశంలో తీర్మానం చేసినట్లు నాని వివరించారు.అలాగైతే కులాల వారీగా కార్పొరేషన్లు ఎందుకు?: తోట త్రిమూర్తులుకాపు సామాజిక వర్గాన్ని సంఘటితం చేసేందుకు ఈ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చెప్పారు. ఇది మరే కులానికీ వ్యతిరేకం కాదని, అందరూ కలసి ఉండాలని, అభివృద్ధి చెందాలనే కోరుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో కుల జాడ్యం పోవాలంటూ కొంతమంది మాట్లాడుతున్నారని, అయితే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు లాంటి పదవులన్నీ కులాల వారీగానే కేటాయిస్తున్నారని గుర్తు చేశారు. కులాలు అవసరం లేదన్నప్పుడు.. కులాల వారీగా కార్పొరేషన్లు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని ప్రశ్నించారు.‘కాపు నేస్తం’.. వైఎస్ జగన్నవరత్నాల పథకాలతో కాపులకు రూ.39,317.80 కోట్ల సాయంకాపు కార్పొరేషన్కు టీడీపీ హయాంలో పెట్టిన బకాయిలు సైతం చెల్లించింది జగనేచంద్రబాబు మాదిరిగా తాను మాయమాటలతో మభ్యపెట్టలేనని ముందునుంచీ చెప్పిన వైఎస్ జగన్ 2019–2024 మధ్య ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో నిజమైన కాపు నేస్తంగా నిలిచారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ నవరత్నాలతోపాటు ప్రత్యేకంగా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి కాపుల సంక్షేమానికి బాటలు వేశారు. కాపు నేస్తం, చేయూత, ఆసరా, అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, వాహనమిత్ర లాంటి అనేక సంక్షేమ పథకాల ద్వారా కాపులకు తోడ్పాటు అందించి వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేశారు. పార్టీ, ప్రాంతం లాంటివి చూడకుండా, దళారుల ప్రమేయం లేకుండా కాపులకు నవరత్నాల (డీబీటీ, నాన్ డీబీటీ) పథకాల ద్వారా రూ.39,317.80 కోట్లను అందించి వైఎస్ జగన్ రికార్డు సృష్టించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం కాపు కార్పొరేషన్కు రూ.500 కోట్లు, 307 మంది విద్యార్థులకు రూ.20.97 కోట్లు, నైపుణ్య శిక్షణకు రూ.8.83 కోట్లు ఇవ్వకుండా బకాయి పెట్టగా.. వైఎస్ జగన్ వాటిని చెల్లించడమే కాకుండా కాపుల సంక్షేమానికి ఇతోధికంగా నిధులు విడుదల చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం 5 కాపు భవనాలకు రూ.వంద కోట్లు నిధులు విడుదల చేయడమే కాకుండా 4 కాపు భవనాలు ప్రారంభించింది. -
బాబు ప్రేమ బూటకం.. మోసం నిజం!
సాక్షి, అమరావతి: అన్నదాతలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సీఎం చంద్రబాబు దారుణంగా వంచిస్తున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. ఎన్నికల ముందు హామీలిస్తూ చంద్రబాబు చెప్పిన మాటల వీడియో క్లిప్ను జత చేస్తూ.. చంద్రబాబు చేసిన మోసాలను తూర్పారబడుతూ ‘రైతులపై చంద్రబాబు ప్రేమ బూటకం – మోసం నిజం..’ అంటూ ఆదివారం తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ పోస్టు చేశారు.పీఎం కిసాన్తో కాకుండా మూడేళ్లలో టీడీపీ కూటమి సర్కార్ ఒక్కో రైతు కుటుంబానికి రూ.60 వేలు ఇవ్వాల్సి ఉండగా ఇచ్చింది కేవలం రూ.19 వేలేనని స్పష్టం చేశారు. టీడీపీ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడం.. ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కకున్నా చీమ కుట్టినట్టైనా లేదా? అంటూ నిలదీశారు. మీరు రైతులకు ఇచ్చింది.. వాగ్దానాల మోసం, బకాయిల భారం, నిరాశ మాత్రమేనంటూ సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపడ్డారు. ‘ఎక్స్’లో వైఎస్ జగన్ ఏమని పోస్టు చేశారంటే..రైతులపై చంద్రబాబు ప్రేమ బూటకం - మోసం నిజం!@ncbn గారు రైతులను మోసం చేయడంలో మీ రికార్డులను మీరే బద్దలు కొడుతున్నారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అయినా, మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన 143 హామీలు అయినా, అన్నీ మోసాలే. •మా ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఐదేళ్లపాటు 53.58 లక్షల రైతు… pic.twitter.com/0y5C93csiF— YS Jagan Mohan Reddy (@ysjagan) June 21, 2026⇒ చంద్రబాబు గారు.. రైతులను మోసం చేయడంలో మీ రికార్డులను మీరే బద్ధలు కొడుతున్నారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అయినా.. మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన 143 హామీలైనా అన్నీ మోసాలే. మా ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఐదేళ్లపాటు 53.58 లక్షల రైతు కుటుంబాలకు క్రమం తప్పకుండా రైతు భరోసా అందించింది. ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నా, కరోనా వచ్చినా ఒక్క సంవత్సరం కూడా మాట తప్పలేదు. పైగా మేం మేనిఫెస్టోలో చెప్పినదానికన్నా మిన్నగా చేశాం. ఎన్నికల ముందు రాజమహేంద్రవరం వేదికగా పీఎం–కిసాన్కు అదనంగా ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ.20,000 చొప్పున ఇస్తానని ఘనంగా ప్రకటించారు. ఇప్పుడు అదే రైతులను మోసం చేసి మళ్లీ రైతు ప్రేమికుడిలా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఈ పోస్టుకు మీరు మాట్లాడిన మాటలు జత చేస్తున్నా.⇒ 2024–25లో పీఎం–కిసాన్కు అదనంగా మీరు ఇస్తానన్నది, ఇవ్వకుండా ఎగరగొట్టింది రూ.20,000. రైతులకు ఇచ్చింది – సున్నా. 2025–26లో ఇవ్వాల్సింది రూ.20,000. ఇచ్చింది కేవలం రూ.14,000 మాత్రమే. 2026–27లో ఇవ్వాల్సింది రూ.26,000. ఇప్పటివరకు ఇచ్చింది – కేవలం రూ.5,000. అంటే మూడేళ్లలో ఒక్కో రైతు కుటుంబానికి మీరు ఇచ్చిన హామీ ప్రకారం పీఎం–కిసాన్ కాకుండా రూ.60,000 ఇవ్వాల్సి ఉండగా ఇచ్చింది కేవలం రూ.19,000. పైగా మీరు పథకం నుంచి 7 లక్షల మందిని నిర్దాక్షిణ్యంగా తొలగించారు. మా హయాంలో 53.58 లక్షలమంది రైతు కుటుంబాలకు పెట్టుబడి సహాయం అందితే, మీరు దాన్ని 46.85 లక్షల మందికి కుదించారు. కౌలు రైతులకు, ఆర్వోఎఫ్ఆర్ పట్టాలున్న గిరిజనులకూ మొండిచేయి చూపారు.⇒ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. ధరల స్థిరీకరణ నిధికి ఎగనామం పెట్టారు. ఐదేళ్లలో మేం ధరల స్థిరీకరణ కింద రూ.7,800 కోట్లు ఖర్చు చేసి రైతులకు గిట్టుబాటు ధరలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచాం. ఈ రెండేళ్లలో మీ హయాంలో వరి, మొక్కజొన్న, అరటి, కొబ్బరి, పత్తి, మినుములు, పెసలు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, టమోటా, కోకో, చీనీ, మామిడి.. ఇలా పంటల ధరలు పడిపోయినా మీకు పట్టనట్టే వ్యవహరించారు.⇒ ఉచిత పంటల బీమాను రద్దు చేశారు. రైతులే ఇప్పుడు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టుకోవాల్సిన పరిస్థితి. రైతులు కష్టనష్టాలు భరించి ఇన్సూరెన్స్ కట్టినా మీరు ప్రభుత్వం నుంచి కట్టాల్సిన ప్రీమియం కూడా కట్టకపోవడంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది. మా హయాంలో రూ.7,802కోట్లు పంటల బీమా కింద ఇచ్చాం. అది కూడా రైతులు ఒక్క రూపాయి కూడా కట్టకుండానే. ఏ సీజన్లో నష్టం జరిగితే అదే సీజన్లో ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీని మీరు ఆపేశారు. ఇప్పటికి 8 నెలలు దాటుతున్నా మోంథా తుపాను బాధిత రైతులకు ఒక్కపైసా ఇన్పుట్ సబ్సిడీ అందలేదు. రైతులకు అందే సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశారు. ఉద్దేశ పూర్వకంగా ఆర్బీకేలను, ఈ–క్రాప్ను, టెస్టింగ్ ల్యాబ్లను నాశనం చేశారు.⇒ ఆక్వా రైతులను నట్టేట ముంచారు. ముఖ్యమంత్రి ఛైర్మన్గా ఉన్న ‘అప్సడా’ అనుమతి లేకుండానే ఫిబ్రవరిలో కిలో ఆక్వా ఫీడ్కు రూ.4 పెంచారు. జూన్లో మరో రూ.10– రూ.12 పెంచారు. కిలోకు ఏకంగా రూ.14– రూ.16 చొప్పున పెంచుకుంటూ పోయారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత టన్ను రొయ్యల మేత ధర రూ.72 వేల నుంచి రూ.1.08 లక్షలకు అమాంతంగా పెంచేస్తే, మరోవైపు 100 కౌంట్ రొయ్యల ధర రూ.225కు పడిపోయిన పరిస్థితి. ధరలు తగ్గించాలని, లేదంటే రైతులతో కలిసి ఆందోళన చేస్తామంటూ మేం ఇచ్చిన అల్టీమేటంతో మళ్లీ కిలోకు రూ.4లు తగ్గిస్తామని ప్రకటించి, తీరా చూస్తే తగ్గించింది కేవలం రూ.2 మాత్రమే. ఇక మీరు రైతులకు చేసిందేమిటి? మోసం తప్ప! ఆక్వా రైతులకు మేం అమలు చేసిన కరెంటు సబ్సిడీని పవర్ ఫ్యాక్టర్ పేరుతో ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ⇒ మామిడి రైతుల పరిస్థితీ అంతే. గత ఏడాది కిలోకు రూ.12 చొప్పున రైతులకు ఇస్తామని ప్రకటించి ఇవ్వాళ్టికీ రూ.380 కోట్లు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. మళ్లీ ఈ ఏడాది ధరల సంక్షోభం వచ్చింది. కిలోకు రూ.4 ఇస్తామంటూ మళ్లీ రైతులను మోసం చేయాలని చూస్తున్నారు. ఇంతకన్నా నిస్సిగ్గుతనం ఏముంటుంది? పొగాకు ధర కుప్పకూలిపోయినా మీకు చీమకుట్టినట్టైనా లేదు. సీఎం.. సరాసరి ధర కిలోకు రూ.200 ప్రకటిస్తే, ఆ మరుసటి రోజు రూ.182లకు పడిపోయింది. ట్రాక్టర్లతో రైతులు చేసిన ఆందోళన మీ కళ్లకు కనిపించడంలేదా? ౖఇక మీరు రైతుల కోసం ఏం చేసినట్టు చంద్రబాబు గారూ? మీరు రైతులకు ఇచ్చింది వాగ్దానాల మోసం, బకాయిల భారం, నిరాశ మాత్రమే!ఎన్నికల ముందు ప్రతి రైతుకు రూ.20 వేలు ఇస్తానని చంద్రబాబు చెబుతున్న వీడియో కోసం క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి... -
క్రాంతికుమార్ది ప్రభుత్వ హత్యే
లబ్బీపేట/కృష్ణలంక(విజయవాడతూర్పు): పోలీసుల వేధింపుల వల్లే పేరుపోగు క్రాంతికుమార్ బలవన్మరణానికి పాల్పడ్డాడని, ఇది కచ్చితంగా ప్రభుత్వ హత్యేనని వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరుపోగు క్రాంతికుమార్ మరణంపై సీబీఐ విచారణ జరిపి అందుకు కారకులైన పోలీసులందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపుల వల్ల గతనెల 21న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న పేరుపోగు క్రాంతికుమార్ కుటుంబాన్ని వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాశ్ ఆధ్వర్యంలో పార్టీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పూనూరి గౌతమ్ రెడ్డి, విజయవాడ మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మీ, పార్టీ అధికార ప్రతినిధి షేక్ ఆసిఫ్, పార్టీ గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన మహేష్, సోషల్ మీడియా స్టేట్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజిరెడ్డి తదితరులు ఆదివారం పరామర్శించారు.అనంతరం వారు మాట్లాడుతూ రాజకీయ కక్ష సాధింపులకు పోలీసులను వాడుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం తీరు వల్లే రక్షకభటులు భక్షక భటులుగా మారుతున్నారని, ప్రజలు, సామాన్యులపై ప్రతాపం చూపుతున్నారని విమర్శించారు. ఇప్పటికే పోలీసు వేధింపులకు రాష్ట్రంలో 12 మంది చనిపోయారని మండిపడ్డారు. ట్యాక్సీ నడుపుకుంటూ బతుకుబండి లాగుతున్న క్రాంతిని ఇన్ఫార్మర్గా మారాలని సీఐ నాగరాజు వేధించారని, లేదంటే గంజాయి కేసు పెడతానని బెదిరించారని, ఈ వేధింపులకు భయపడే క్రాంతి ఆత్మహత్య చేసుకున్నాడని ధ్వజమెత్తారు.క్రాంతి బలవన్మరణానికి సీఐతోపాటు విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు, డీజీపీ, సీఎం, హోంమంత్రి బాధ్యత వహించాలని, క్రాంతి ముగ్గురు పిల్లల బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని, సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత తక్షణం ఆ కుటుంబాన్ని పరామర్శించి క్షమాపణ చెప్పి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం క్రాంతి కుటుంబం పనిచేసిందని, దానికి కానుకగా అతని శవాన్ని ప్రభుత్వం ఇచ్చిందని మండిపడ్డారు. బాధిత కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించకపోతే సాయికృష్ణ, క్రాంతి కుమార్ మరణాలు వెలుగులోకి వచ్చేవి కావని, ఈ రెండు ఘటనలపై సీబీఐ విచారణ జరిపించాలని పేర్కొన్నారు. సాయికృష్ణ, క్రాంతి మరణాలపై పవన్కళ్యాణ్ స్పందించాలని డిమాండ్ చేశారు. -
డీఎస్సీపై ప్రశ్నిస్తున్నందుకు పర్వతరెడ్డి విద్యాసంస్థలపై దాడులు
సాక్షి, అమరావతి: డీఎస్సీ నిర్వహణలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డికి చెందిన విద్యా సంస్థలపై ప్రభుత్వం దాడులు చేయిస్తోందని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. డీఎస్సీలో అక్రమాలతోపాటు, కల్తీ నెయ్యి ముసుగులో జరుగుతున్న హెరిటేజ్ దోపిడీని ప్రశ్నించినందుకు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు చేసిన ద్రోహా న్ని ఎండగడుతూ శాసనమండలిలో, ప్రెస్మీట్లలో చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసినందుకు చంద్రబాబు ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు ఒడిగడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో అప్పిరెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ... ‘ప్రశ్నించే గొంతును నొక్కడమే ధ్యేయంగా ప్రభుత్వ పెద్దలు కుట్ర పన్నారు. ఆయనను రాజకీయంగా ఎదుర్కోలేక ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 16 వేల మందికి పైగా విద్యార్థులు, 500 మంది టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్తో దాదాపు రెండు దశాబ్దాలుగా నడుస్తున్న సంస్థపై దాడులు చేసి రాజకీయ కక్షసాధింపులకు దిగడం హేయం. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తే ఆయన వ్యాపారాలపై దాడులు చేస్తారా? ఇదే సంప్రదాయాన్ని రాబోయే వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొనసాగిస్తే చూడాలని అనుకుంటున్నారా?’ అని నిలదీశారు. డీఎస్సీలో ఏ తప్పూ జరగలేదని భావిస్తే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించవచ్చు కదా అంటూ విద్యాశాఖ మంత్రి లోకేశ్కు అప్పిరెడ్డి సవాలు విసిరారు. నేడు నెల్లూరుకు వైఎస్సార్సీపీ నాయకుల బృందం ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, ఈ నెల 22న (సోమవారం) వైఎస్సార్సీపీ నాయకులు నెల్లూరు వెళ్లి ఆయనను కలిసి భరోసా ఇస్తారని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. -
రాజకీయ కక్షతోనే నన్ను జైలుకు పంపారు: బొల్లా బ్రహ్మనాయుడు
సాక్షి, పల్నాడు జిల్లా: తాను ఏ తప్పు చేయలేదని.. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అక్రమంగా అరెస్టు చేయించి జైలుకు పంపించారని వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు స్పష్టం చేశారు. ఇటీవల బెయిల్పై విడుదలైన ఆయనను నరసరావుపేటలోని స్వగృహంలో మాజీ మంత్రి విడదల రజిని, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, పార్టీ నేత గజ్జల సుధీర్ భార్గవ్రెడ్డిలు బ్రహ్మనాయుడిని పరామర్శించారు.అనంతరం మీడియాతో మాట్లాడిన బొల్లా బ్రహ్మానాయుడు.. తనపై నమోదైన కేసు పూర్తిగా రాజకీయ కుట్రలో భాగమేనని, ఎలాంటి ఫిర్యాదులు లేకుండానే అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో అరెస్టు చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. నిజాయితీగా వ్యాపారం చేస్తూ కోట్ల రూపాయల పన్నులు చెల్లిస్తున్న తనను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రెస్మీట్లో బ్రహ్మనాయుడు ఏమన్నారంటే..నేను తప్పు చేశానని ఎవరైనా ఫిర్యాదు చేశారా?నాపై నమోదైన కేసు పూర్తిగా రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగమే. నాకు సంబంధం లేని భూముల వ్యవహారంలో అక్రమంగా కేసు బనాయించి అరెస్టు చేశారు. నేను తప్పు చేశానని ఎవరైనా ఫిర్యాదు చేశారా? నాపై పోలీస్ స్టేషన్లో ఎలాంటి కంప్లైంట్ నమోదైంది? ఎలాంటి ఫిర్యాదులు లేకపోయినా కూటమి ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో నన్ను తెలంగాణలో అరెస్టు చేయించారు. నా అరెస్టుకు ఐదు రోజుల ముందే నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నన్ను అరెస్టు చేయిస్తానని బహిరంగంగా చెప్పారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ వ్యవహారం జరిగింది. వాస్తవాలు ఎప్పటికైనా వెలుగులోకి వస్తాయి.ఢిల్లీలోని ఏ గెస్ట్హౌస్కు వెళ్లినా కృష్ణదేవరాయులు చరిత్ర చెబుతారుఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తనను తాను చాలా నిజాయితీ పరుడిగా, నిబద్ధత ఉన్న నాయకుడిగా చెప్పుకుంటున్నారు. కానీ నా నిజాయితీ గురించి వినుకొండ ప్రజలను అడిగితే చెబుతారు. ఎంపీ గురించి తెలుసుకోవాలంటే ఢిల్లీలోని ఏ గెస్ట్హౌస్కు వెళ్లినా ఆయన చరిత్ర గురించి వినిపిస్తారు. నేను మీ కంటే ఆస్తిపరంగా చాలా చిన్నవాడిని.మీ నాన్న నిర్వహిస్తున్న విజ్ఞాన్ విద్యాసంస్థల్లో ఎంత ప్రభుత్వ భూమి ఉందో ఒకసారి సర్వే చేయించి మీ నిజాయితీని నిరూపించుకోండి. వైయస్ఆర్సీపీ తరఫున ఎంపీగా గెలిచి పదవిని అనుభవించి, ఆ తర్వాత టీడీపీలో చేరి మళ్లీ ఎంపీగా ఎన్నికయ్యారు. పార్టీ అవకాశాలను ఉపయోగించుకుని వదిలేసింది మీరే. మీలాగా నేను నేరస్తుడిని కాదు. మీ కుటుంబానికి ఇంత ఆస్తి ఉంటే ప్రజలకు మీరు ఎంత పన్నులు చెల్లిస్తున్నారో చెప్పండి. మీరు ఎంత జీఎస్టీ కట్టారో చూపించగలరా? నేను కోట్ల రూపాయల జీఎస్టీ, ఆదాయపు పన్నులు చెల్లిస్తున్నాను. అయినా ప్రభుత్వ ఆస్తులను మింగేశానంటూ నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఎమ్మెల్యే జీవీ అంజనేయులు తరచూ కంపెనీల పేర్లు మారుస్తుంటారు. బయో ఫర్టిలైజర్స్ సంస్థ ఎంపీ, ఎమ్మెల్యేల కనుసన్నల్లో నడుస్తూ ప్రభుత్వ సబ్సిడీలు పొందుతోంది. పేద విద్యార్థులు ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు పడుతుంటే సర్టిఫికెట్లు ఇవ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ట్రస్టులు, సొసైటీల పేరుతో పన్ను మినహాయింపులు పొందుతున్నారు.మీ నాన్న బడిపంతులు కదా ..ఇన్ని ఆస్తులు ఎక్కడివి?హైదరాబాద్, విశాఖలో ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టింది లావు కృష్ణదేవరాయులు కుటుంబమేనని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. తప్పులు చేస్తున్నది మీరు, ఆరోపణలు ఎదుర్కొంటున్నది మీరు. మరో ప్రభుత్వం వస్తే మరో పార్టీలో చేరేది కూడా మీరే. మీ బెదిరింపులకు నేను భయపడను. 70 ఏళ్ల వయసులో నా అంతు చూస్తామంటున్నారు. సమయం వచ్చినప్పుడు ఎవరి అంతు ఎవరు చూస్తారో దేవుడే నిర్ణయిస్తాడు.నేను చదువుకోలేదు, రైతును. కానీ ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా పనిచేశాను. వైఎస్ జగన్ నాకు అవకాశం ఇచ్చారు. రెండుసార్లు ఓడిపోయినా ఒకసారి గెలిచి వినుకొండకు సేవ చేశాను. నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఎంపీ ఎప్పుడు పిలిచినా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాను. నన్ను ఏమీ చేయలేరు. చివరకు నిజమే గెలుస్తుంది.అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలునాకు అండగా నిలిచిన పార్టీ అధినేత వైఎస్ జగన్కి, మా పార్టీ నాయకులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, విడదల రజిని, నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వైఎస్ జగన్ చెప్పిందే చేస్తారు.. చేసిందే చెబుతారు. చంద్రబాబు లాగా అబద్ధాలు చెప్పరు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత చంద్రబాబు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజలపై ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఇవాళ పేదవాడు ఆస్పత్రికి వెళ్తే ఆరోగ్యశ్రీ లేదు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. రాష్ట్రంలో లాకప్ డెత్లు కనిపిస్తున్నాయి. ప్రజల సమస్యలను గాలికి వదిలేసి రెడ్బుక్ రాజ్యాంగంతో పాలన చేస్తున్నారు. కక్షసాధింపు చర్యలు ఆపి, ప్రజలకు మంచి చేసే పాలన అందించాలి అని బొల్లా బ్రహ్మనాయుడు పేర్కొన్నారు.జైలుకు పంపడం దారుణం: విడదల రజినిమాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై అక్రమంగా కేసు బనాయించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా రాజకీయ కక్షతో 74 ఏళ్ల వయసులో ఆయనను జైలుకు పంపడం దారుణం. గండికోట భూముల వ్యవహారంలో బొల్లా బ్రహ్మనాయుడు బాధితుడే. కానీ ఆయననే నిందితుడిగా చూపించి వేధింపులకు గురిచేశారు. రాష్ట్రంలో రెడ్బుక్ పాలన పరాకాష్టకు చేరుకుంది. చట్టాలను పక్కనపెట్టి రాజకీయ ప్రత్యర్థులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ప్రజా సమస్యలను వదిలేసి వైఎస్సార్సీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం కూటమి ప్రభుత్వ విధానంగా మారింది.బ్రహ్మనాయుడికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది: గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డిమాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై పూర్తిగా అక్రమంగా కేసు బనాయించారు. ఆయనకు ఆ భూముల కేసులతో ఎలాంటి సంబంధం లేదు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే ఆయనను లక్ష్యంగా చేసుకుని కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేశారు. ప్రజలకు సేవ చేసిన ఒక సీనియర్ నాయకుడిని నేరస్తుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవాలు బయటకు వస్తే ఈ కేసుల్లో నిజాలు ఏంటో ప్రజలకు అర్థమవుతుంది. చట్టాన్ని రాజకీయ ఆయుధంగా మార్చి ప్రత్యర్థులను అణగదొక్కడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇలాంటి అక్రమ కేసులు, వేధింపులకు వైయస్ఆర్సీపీ భయపడదు. బొల్లా బ్రహ్మనాయుడికి న్యాయం జరిగే వరకు పార్టీ అండగా నిలుస్తుంది.గండికోట భూములు కేసులో బ్రహ్మనాయుడే బాధితుడు: గజ్జల సుధీర్ భార్గవ్రెడ్డిబొల్లా బ్రహ్మనాయుడు నిజాయితీ గల పెద్దమనిషి. ప్రజల మధ్య మంచి పేరు సంపాదించుకున్న నాయకుడిని రాజకీయ కక్షతో వేధించడం బాధాకరం. 74 ఏళ్ల వయసులో ఆయనపై కక్ష కట్టి జైలుకు పంపడం కూటమి ప్రభుత్వ ప్రతీకార రాజకీయాలకు నిదర్శనం. గండికోట భూముల కేసులో బొల్లా బ్రహ్మనాయుడు బాధితుడు కాగా, ఆయననే నిందితుడిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. నిజాలను పక్కనపెట్టి రాజకీయ వేధింపులకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇలాంటి అక్రమ కేసులు, రాజకీయ వేధింపులతో వైయస్ఆర్సీపీ నాయకులను భయపెట్టలేరు. వాస్తవాలు త్వరలోనే ప్రజల ముందుకు వస్తాయి" అని వైఎస్సార్సీపీ నాయకులు స్పష్టం చేశారు. -
టీడీపీ నేతల అక్రమ తవ్వకాలు.. అడ్డుకున్న జోగి రమేష్
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు మండలం చేగిరెడ్డిపాడులో టీడీపీ నేతల అక్రమ గ్రావెల్ తవ్వకాలను మాజీ మంత్రి జోగి రమేష్, వైఎస్సార్సీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. గ్రావెల్ తరలిస్తున్న లారీలు, జేసీబీలను జోగి రమేష్ అడ్డుకున్నారు. జోగి రమేష్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా అధికారులు, జి.కొండూరు ఎస్ఐ సతీష్ స్పందించలేదు. జాయింట్ కలెక్టర్ ఇలక్కియాకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసిన జోగి రమేష్.. జాయింట్ కలెక్టర్తో పాటు ఏసీపీ ప్రసాదరావుకు కూడా ఫోన్ చేశారు.జోగి రమేష్తో ఫోన్లో ఏసీపీ వాగ్వాదానికి దిగారు. టీడీపీ నేతల గ్రావెల్ దోపిడీపై జోగి రమేష్ మండిపడ్డారు. మామిడి తోటలను నాశనం చేస్తూ అటవీ భూములను దోచుకుంటున్నారని.. పచ్చని ప్రకృతిని, పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పావలా ప్రసాద్ ఆధ్వర్యంలోనే గ్రావెల్ దోపిడీ జరుగుతోంది. వాటా లేకుండా, వసంత కృష్ణ ప్రసాద్కి తెలియకుండా ఇంత జరుగుతుందా?’’ అంటూ ఆయన ప్రశ్నించారు.కొత్తూరు వద్ద పర్మిషన్ తీసుకుని శేగిరెడ్డిపాడు నుంచి గ్రావెల్ను అక్రమంగా తరలిస్తున్నారు. ఇప్పటికైనా డిప్యూటీ సీఎం పవన్ స్పందించాలి. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ దోపిడీపై చర్యలు తీసుకోవాలి. మైలవరం నియోజకవర్గంలోని సహజ సంపదను ఎమ్మెల్యే, ఆయన బావమరిది కలిసి దోచుకుంటున్నారు. ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోకపోతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్కి కూడా భాగం ఉందని ప్రజలు భావిస్తారు’’ అంటూ జోగి రమేష్ ధ్వజమెత్తారు. -
‘రైతులపై బాబు ప్రేమ బూటకం- మోసం.. నిజం’
సాక్షి, తాడేపల్లి: రైతులను మోసం చేస్తున్న చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులపై చంద్రబాబు ప్రేమ బూటకం-మోసం నిజం అంటూ ట్వీట్ చేశారు. ‘‘చంద్రబాబూ.. రైతులను మోసం చేయడంలో మీ రికార్డులను మీరే బద్దలు కొడుతున్నారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అయినా, మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన 143 హామీలు అయినా, అన్నీ మోసాలే’’ అంటూ ఎక్స్ వేదికగా నిలదీశారు.‘‘మా ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఐదేళ్ల పాటు 53.58 లక్షల రైతు కుటుంబాలకు క్రమం తప్పకుండా రైతు భరోసా అందించింది. ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నా, కరోనా వచ్చినా, ఒక్క సంవత్సరం కూడా తప్పలేదు. పైగా మేము మేనిఫెస్టోలో చెప్పినదానికన్నా మిన్నగా చేశాం. ఎన్నికల ముందు రాజమండ్రి వేదికగా నిలబడి, పీఎం-కిసాన్కు అదనంగా ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ.20,000 ఇస్తానని ఘనంగా ప్రకటించారు. ఇప్పుడు అదే రైతులను మోసం చేసి, మళ్లీ రైతు ప్రేమికుడిలా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఈ ట్వీట్కు మీరు మాట్లాడిన మాటలు జతచేస్తున్నాను...2024-25లో పీఎం-కిసాన్కు అదనంగా మీరు ఇస్తానన్నది ఇవ్వకుండా ఎగరగొట్టింది రూ.20,000. రైతులకు ఇచ్చింది.. సున్నా. 2025-26లో ఇవ్వాల్సింది రూ.20,000. ఇచ్చింది కేవలం రూ.14,000 మాత్రమే. 2026-27లో ఇవ్వాల్సింది రూ.26,000. ఇప్పటివరకు ఇచ్చింది.. కేవలం రూ.5,000. అంటే మూడేళ్లలో ఒక్కో రైతు కుటుంబానికి మీరు ఇచ్చిన హామీ ప్రకారం పీఎం-కిసాన్ కాకుండా రూ.60,000 ఇవ్వాల్సి ఉండగా, ఇచ్చింది కేవలం రూ.19,000...పైగా మీరు పథకం నుంచి 7 లక్షల మందిని నిర్దాక్షిణ్యంగా తొలగించారు. మా హయాంలో 53.58 లక్షలమంది రైతు కుటుంబాలకు పెట్టుబడి సహాయం అందితే, మీరు దాన్ని 46.85లక్షల మందికి కుదించారు. కౌలు రైతులకు, ఆర్వోఎఫ్ఆర్ పట్టాలున్న గిరిజనులకూ మొండిచేయి చూపారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. ధరల స్థిరీకరణ నిధికి ఎగనామం పెట్టారు. ఐదేళ్లలో ధరల స్థిరీకరణ కింద రూ.7,800 కోట్లు ఖర్చు చేసి, రైతులకు గిట్టుబాటు ధరలకు కేరాఫ్ అడ్రస్గా మేం నిలిచాం. ఈ రెండేళ్లలో మీ హయాంలో వరి, మొక్కజొన్న, అరటి, కొబ్బరి, పత్తి, మినుములు, పెసలు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, టమోటా, కోకో, చీనీ, మామిడి ఇలా పంటల ధరలు పడిపోయినా మీకు పట్టనట్టే వ్యవహరించారు.రైతులపై చంద్రబాబు ప్రేమ బూటకం - మోసం నిజం!@ncbn గారు రైతులను మోసం చేయడంలో మీ రికార్డులను మీరే బద్దలు కొడుతున్నారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అయినా, మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన 143 హామీలు అయినా, అన్నీ మోసాలే. •మా ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఐదేళ్లపాటు 53.58 లక్షల రైతు… pic.twitter.com/0y5C93csiF— YS Jagan Mohan Reddy (@ysjagan) June 21, 2026..ఉచిత పంటల బీమాను రద్దుచేశారు. రైతులే ఇప్పుడు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టుకోవాల్సిన పరిస్థితి. రైతులు కష్ట, నష్టాలు భరించి ఇన్సూరెన్స్ కట్టినా, మీరు ప్రభుత్వం నుంచి కట్టాల్సిన ప్రీమియంకూడా కట్టకపోవడంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది. కాని, మా హయాంలో రూ.7,802కోట్లు పంటల బీమా కింద ఇచ్చాం, రైతులు ఒక్క రూపాయి కూడా కట్టకుండానే. ..ఏ సీజన్లో నష్టం జరిగితే అదే సీజన్లో ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ ఆపేశారు. ఇప్పటికి 8 నెలలు దాటుతున్నా మోంథా తుపాను బాధిత రైతులకు ఇప్పటికీ ఒక్కపైసా ఇన్పుట్ సబ్సిడీ అందలేదు. రైతులకు అందే సున్నా వడ్డీ పథకాన్ని రద్దుచేశారు. ఉద్దేశ పూర్వకంగా ఆర్బీకేలను, ఈ-క్రాప్ను, టెస్టింగ్ ల్యాబులను నాశనం చేశారు...ఆక్వారైతులను నట్టేట ముంచారు. ముఖ్యమంత్రి ఛైర్మన్గా ఉన్న అప్సడా అనుమతి లేకుండానే ఫిబ్రవరిలో కిలో ఆక్వాఫీడ్కు రూ.4లు పెంచారు, జూన్లో మరో రూ.10- రూ.12లు పెంచారు. కిలోకు ఏకంగా రూ.14- రూ.16లు చొప్పున పెంచుకుంటూ పోయారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత టన్ను రొయ్యలమేత ధర రూ.72వేల నుంచి రూ.1.08లక్షలకు అమాంతంగా పెంచేస్తే, మరోవైపు 100 కౌంట్ రొయ్యల ధర రూ.225కు పడిపోయిన పరిస్థితి...ధరలు తగ్గించాలని, లేదంటే రైతులతో కలిసి ఆందోళన చేస్తామంటూ మేం ఇచ్చిన అల్టిమేటంతో మళ్లీ కిలోకు రూ.4లు తగ్గిస్తామని ప్రకటించి, తీరాచూస్తే తగ్గించింది కేవలం రూ.2లు మాత్రమే. ఇక మీరు రైతులకు చేసిందేమిటి? మోసం తప్ప? పవర్ ఫ్యాక్టర్ పేరుతో ఆక్వారైతులకు మేం అమలు చేసిన కరెంటు సబ్సిడీ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు...మామిడి రైతుల పరిస్థితీ అంతే. గత ఏడాది కిలోకు రూ.12లు చొప్పున రైతులకు ఇస్తామని ప్రకటించి, ఇవ్వాళ్టికీ రూ.380కోట్లు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. మళ్లీ ఈ ఏడాది ధరల సంక్షోభం వచ్చింది. కిలోకు రూ.4లు ఇస్తామంటూ మళ్లీ రైతులను మోసం చేయాలని చూస్తున్నారు. ఇంతకన్నా నిస్సిగ్గుతనం ఏముంటుంది?. పొగాకు ధర కుప్పకూలిపోయినా మీకు చీమకుట్టినట్టైనా లేదు. సీఎం సరాసరి ధర కిలోకు రూ.200 ప్రకటిస్తే, ఆ మరుసటి రోజు ఆ ధర రూ.182లకు పడిపోయింది. ట్రాక్టర్లతో రైతులు చేసిన ఆందోళన మీ కళ్లకు కనిపించడంలేదా?. ఇక మీరు రైతులకోసం ఏంచేసినట్టు చంద్రబాబూ మీరు రైతులకు ఇచ్చింది వాగ్దానాల మోసం, బకాయిల భారం, నిరాశ మాత్రమే’’ అంటూ వైఎస్ జగన్ దుయ్యబట్టారు. -
పోలీసులు నన్ను తీవ్రంగా వేధిస్తున్నారు
-
ఇష్టారీతిన వ్యవహరిస్తే ఊరుకునేది లేదు: బొత్స
బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టారీతిన వ్యవహరిస్తే ఊరుకునేది లేదని శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వెంకటాయ పాలెంలో ఆదివారం వైఎస్సార్సీపీ కాపు నేతల ఆత్మీయ సమావేశం జరిగింది. ఇందులో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... విశాఖ, తిరుపతిలో సమావేశాలు ఏర్పాటు చేస్తామని, ఇటువంటి కార్యక్రమాలు అవసరమని తెలిపారు. నేటి సమావేశం తమ బాధలు పంచుకోవడానికి, ఒకరికి ఒకరు అండగా ఉండేందుకేనని చెప్పారు.‘‘ఎక్కడ సమస్య వస్తే నాయకులమంతా అక్కడికి వెళ్తాం. చట్టానికి మేం వ్యతిరేకం కాదు. మేమంతా చట్టాన్ని గౌరవిస్తాం. రాజకీయాల్లో రివేంజ్ నిర్ణయాలు పనికిరావు. ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చే హక్కుల్ని కోరుతున్నాం. కాపులకు 3.000 కోట్ల రూపాయలు ఇస్తామన్నారు. ఒక కోటి రూపాయలు కూడా ఇవ్వలేదు. గతంలో కాపునేస్తం ఇచ్చాం.. ప్రజల అవసరాలు పెరుగుతున్న కొద్దీ ప్రభుత్వాలు సహకారం అందించాలి. ఉన్న వాటిని తీసేస్తే ఊరుకునేది లేదు. రానున్న రెండు-మూడేళ్లలో కాపు జాతికి గౌరవం పెరిగేటట్టు ప్రయత్నించాలి. ఇది పార్టీలకు పరిమితం కాదు. రాజకీయ పార్టీలో గౌరవం కోరుకుంటాం. కూటమి పార్టీలో కాపులకు అది దక్కటం లేదు. కులంలో ఉన్న వారంతా విద్రోహులు, సంఘ వ్యతిరేక శక్తులు అని మాట్లాడటం సరికాదు.. ఇంకోసారి మాట్లాడితే ఊరుకునేది లేదు. ముద్రగడ కూడా సమావేశానికి హాజరు రావాల్సి ఉంది. ఆరోగ్యం బాగాలేక రాలేదు. సమావేశంలో చర్చించిన ప్రతి అంశాన్ని తీర్మానంగా రూపొందించాం. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఎవరు ముందుకు వచ్చినా అందరూ కలిసి అక్కడ వెళ్లి సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. ఈ సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరు 50 వేల రూపాయలు చొప్పున వేసుకుని సాయి కృష్ణ కుటుంబానికి అందించాలి. రాజకీయం కాదు ఒక కుటుంబానికి అందించే సాయం. ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. ఇప్పటివరకు చంపిన వ్యక్తి ఎవరో కూడా తెలియదు. ఇదే వేరే కులంలో జరిగితే ఊరుకుంటారా. ఈ సమావేశం కాపు నాయకులందరికీ ఒక సందేశం ఇస్తుంది. మేము మీకు అండగా ఉంటాము అని కాపులందరికీ భరోసా కల్పిస్తుంది’’ అని బొత్స తెలిపారు. సమావేశంపై ఆరోపణలుసమావేశంలో రూపొందించిన తీర్మానాలను సభకు కురసాల కన్నబాబు వివరించారు. ముద్రగడ తిరిగి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని అన్నారు. ఈ సమావేశం గురించి సమాచారం బయటకు వచ్చిన వెంటనే కాపులను చీల్చేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ కొందరు ఆరోపణ చేసేశారు. ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ‘‘నాకు మహిళల పట్ల గౌరవం ఉంది. ఒక వ్యక్తికి సంబంధించిన విషయంలో మాత్రమే మాట్లాడాను. మహిళలందరినీ ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదు. ఎక్కువగా కుల ప్రస్తావన చేసింది పవనే’’ అని తెలిపారు. -
న్యాయం చేయలేనప్పుడు నీకెందుకు ఆ పార్టీ..? మూసేసుకో..
-
చంద్రబాబు, పవన్ సమాధానం చెప్పాలి: దేవినేని అవినాశ్
విజయవాడ: క్రాంతి కుమార్ కుటుంబాన్ని వైసీపీ నేతల బృందం పరామర్శించింది. కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపులు తాళలేక క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. క్రాంతికుమార్ తండ్రి వెంకటేశ్వరరావును దేవినేని అవినాశ్, రాయన భాగ్యలక్ష్మి, పూనూరు గౌతమ్ రెడ్డి, పోతిన మహేశ్,షేక్ ఆసిఫ్ పరామర్శించి అనంతరం మీడియాతో మాట్లాడారు.నెలరోజుల క్రితం ఇదే రోజు క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని దేవినేని అవినాశ్ చెప్పారు. ‘‘పోలీసుల వేధింపుల కారణంగానే క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. సాయికృష్ణ, క్రాంతి కుమార్ మరణాలు ప్రభుత్వ హత్యలే. 8 ఏళ్ల క్రితం క్రాంతి కుమార్ పై కేసులున్నాయి. ఇప్పుడు క్రాంతి కుమార్ పై ఎలాంటి కేసులు లేవు. తండ్రి కొనిచ్చిన కారును నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తమ దందాల కోసం, గంజాయి అమ్మకాల కోసం పోలీసులు వేధిస్తున్నారు. క్రాంతి కుమార్ మృతికి చంద్రబాబు, పవన్ సమాధానం చెప్పాలి. 2024 ఎన్నికల్లో క్రాంతి కుమార్ కుటుంబం కూటమి కోసం పనిచేశారు. సాయికృష్ణ, క్రాంతి కుమార్ కుటుంబాన్ని ఇప్పటి వరకూ సీపీ పరామర్శించలేదు. డీజీపీ, సీపీ బయటికి రావాలి. బాధితుల కుటుంబాలకు క్షమాపణ చెప్పాలి. క్రాంతి కుమార్ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలి. క్రాంతి కుమార్ ను కులం పేరుతో పోలీసులు దూషించారు. డీజీపీ నుంచి కింది స్థాయి అధికారుల వరకూ అందరిపై కేసులు నమోదు చేయాలి. కూటమి అధికారంలోకి వచ్చాక పోలీసులే గంజాయి అమ్ముతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించకపోతే సాయికృష్ణ, క్రాంతి కుమార్ మరణాలు బయటికి వచ్చేవా? జగన్ కలిశాకే సాయికృష్ణ విషయంలో ప్రభుత్వం కేసు నమోదు చేసింది. సాయికృష్ణ,క్రాంతి కుమార్ కేసులో సీబీఐ విచారణ జరిపించాలి. క్రాంతి కుమార్ కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుంది’’ అని తెలిపారు.ఇంకెప్పుడు ఆగుతాయి?మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ... క్రాంతి కుమార్ ఆత్మహత్య చాలా బాధాకరమని అన్నారు. ప్రభుత్వ హత్యలు ఇంకెప్పుడు ఆగుతాయని నిలదీశారు. సాయికృష్ణ, క్రాంతి కుమార్ చనిపోయినా చంద్రబాబు, పవన్, హోంమంత్రి నోరుమెదపడం లేదని విమర్శించారు. చంపేసి సెటిల్మెంట్ చేసుకోవాలని చూడటం దుర్మార్గమని చెప్పారు. క్రాంతి కుమార్ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని, లేదంటే వైసీపీ తరఫున ఉద్యమం చేస్తామని తెలిపారు.వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. విజయవాడలో పోలీసులంటేనే భయపడేలా చేస్తున్నారని చెప్పారు. క్రాంతి కుమార్ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారని వైసీపీ నేత షేక్ ఆసిఫ్ చెప్పారు. క్రాంతి కుమార్,సాయికృష్ణవి ప్రభుత్వ హత్యలేనని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బాధ్యుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.వైసీపీ నేత పోతిన మహేశ్ మాట్లాడుతూ.. పోలీసుల వేధింపుల వల్లే క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. కూటమి అధికారంలోకి రావాలని జనసేన పార్టీ కార్యకర్తలు, క్రాంతి కుమార్ కుటుంబం పనిచేసిందని అన్నారు. కూటమి నిజస్వరూపాన్ని ఇప్పటికైనా ప్రజలు తెలుసుకోవాలని చెప్పారు. -
‘బాబుకు బీపీ డౌన్ కాగానే.. పవన్కు బీపీ పెరుగుతోంది’
సాక్షి, తాడేపల్లి: పవన్ కళ్యాణ్కి మతి భ్రమించిందని.. అందుకే నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. ఆదివారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబుకు బీపీ డౌన్ కాగానే, పవన్ కళ్యాణ్కి బీపీ పెరుగుతోందన్నారు.‘‘పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో మాట్లాడటం లేదు. వైఎస్సార్సీపీ నేతలను గూండాలతో పోల్చటం సిగ్గుచేటు. మమ్మల్ని తొక్కి నార తీస్తా అనటం ఏంటి?. ప్లేస్, టైం చెబితే మేమే వస్తాం.. నార తీయండి చూస్తాం. సాయికృష్ణను చిత్రహింసలకు గురి చేస్తున్నారనంటూ అతని తల్లి చేసిన రోదనలు వినపడలేదా పవన్?’’ అంటూ టీజేఆర్ నిలదీశారు.‘‘తన బిడ్డను చంపేశారని, కనీసం బూడిదనైనా ఇప్పించమని అడిగారు. ఆ తల్లికి మద్దతుగా వైఎస్ జగన్ నిలబడ్డారు. పవన్ కళ్యాణ్ కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయంగా ఎదిగారు. ఇప్పుడు సాయికృష్ణ తల్లిని ఓదార్చితే కుల రాజకీయం అంటూ విమర్శిస్తున్నారు. సాయికృష్ణ నేరగాడనైతే మరి అతని కుటుంబాన్ని చంద్రబాబు ఎందుకు పిలిపించారు?. జనసేన నేత ఉదయభాను.. సాయికృష్ణ ఇంటికి ఎందుకు పంపించావ్ పవన్?. అంతకంటే ముందు తూర్పు నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్ను పంపలేదా?. కేసును రాజీ చేసుకోవాలని కోరలేదా?’’ అంటూ టీజేఆర్ ప్రశ్నించారు.‘‘సాయికృష్ణ నేరస్తుడైతే మాత్రం పోలీసులతో చంపేస్తారా?. మరి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంగతేంటి?. ఇళ్లపైకి వెళ్లి దాడులు చేస్తున్న చింతమనేనిపై ఏం చర్యలు తీసుకున్నారు?. కనీసం కేసు కూడా పెట్టలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇదికాదా పవన్?. కాపులంతా తనకు మద్దతుగా నిలబడితే సీఎం అవుతానని పవన్ చెప్పలేదా?. మరి తన సినిమాలను కూడా కాపులు మాత్రమే చూడాలని ఎందుకు చెప్పలేదు?. రాజకీయాలకు మాత్రం కులం కావాలా?..కుల రాజకీయాలు చేస్తూ ఇతరులను విమర్శించటం ఎందుకు?. ఆత్మహత్య చేసుకున్న క్రాంతికుమార్ కుటుంబానికి పవన్ ఎందుకు సానుభూతి చెప్పలేదు?. దళితుడైన క్రాంతికుమార్ పవన్కు కనపడలేదా?. హోంమంత్రి పదవి మీద పవన్కు మనసు పడింది. అందుకే పదేపదే నేను హోంమంత్రినైతే.. అంటున్నారు. దళితురాలు అనిత హోంమంత్రిగా పనికి రాదని పవన్ చెప్తున్నారు. ముందుగా సాయికృష్ణ కుటుంబానికి న్యాయం చేయండి. అతని మిస్సింగ్ వెనుకున్న పోలీసు పెద్దల పాత్రను బయట పెట్టండి’’ అని టీజేఆర్ సుధాకర్ బాబు హితవు పలికారు. -
నువ్వు మనిషివా పవన్ కళ్యాణ్.. బానిసగాడివి.. నువ్వు కూడా మాట్లాడుతున్నావా..
-
వైఎస్సార్సీపీ BLAపై టీడీపీ నేతల దాడి
సాక్షి, నంద్యాల: డోన్ మండలం కన్నప్పకుంట గ్రామంలో ఆదివారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైఎస్సార్సీపీ బీఎల్ఏపై టీడీపీ నేతలు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఎస్ఐఆర్ సర్వేలో TDP ఫీల్డ్ అసిస్టెంట్ పాల్గొన్నారని వైఎస్సార్సీపీ బీఎల్ఏ భరత్ ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహం చెందిన మధుసూదన్ రెడ్డి అనే టీడీపీ కార్యకర్త భరత్పై విచక్షణ రహితంగా దాడి చేశాడు. అడ్డుకున్న సోదరుడిపైనా దాడికి తెగబడ్డాడు. దీంతో వారిరువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
నీ చేతకానితనం వల్లే..! అనిత పై శేఖర్ రెడ్డి సీరియస్
-
సాయి కృష్ణ ను ఎందుకు.. ఎవరు చంపారంటే? వెంకట్ రెడ్డి సంచలన నిజాలు
-
మనసు ప్రశాంతతకు అద్భుతమైన మార్గం యోగా: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా.. ‘మన శరీరానికి ఆరోగ్యాన్ని, మనసుకు ప్రశాంతతను అందించే అద్భుతమైన మార్గం యోగా. ప్రతి ఒక్కరూ యోగాను ఆచరించి ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు’ అని పోస్టు చేశారు. మన శరీరానికి ఆరోగ్యాన్ని, మనసుకు ప్రశాంతతను అందించే అద్భుతమైన మార్గం యోగా. ప్రతి ఒక్కరూ యోగాను ఆచరించి ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు.#InternationalYogaDay— YS Jagan Mohan Reddy (@ysjagan) June 21, 2026 -
ఎస్ఐఆర్ ప్రక్రియ అక్రమాలు, లోపాలమయం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–ఎస్ఐఆర్) కార్యక్రమం అమలులో పలు అక్రమాలు, లోపాలు, ఆచరణాత్మక ఇబ్బందులు చోటుచేసుకుంటున్నాయని వైఎస్సార్సీపీ ఆందోళన వ్యక్తంచేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ)కి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి శనివారం లేఖ రాశారు. ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించాల్సిన సమయంలో క్షేత్రస్థాయిలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్ఓలు) ఎస్ఐఆర్ విధులతో పాటు ఇతర శాఖాపరమైన పనులు కూడా నిర్వహించాల్సి రావడంవల్ల కార్యక్రమం ప్రభావితమవుతోందన్నారు. ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేసినప్పటికీ వాటి సేకరణ, ధృవీకరణ ప్రక్రియలో ఏకరీతి లేకపోవడంవల్ల గందరగోళం నెలకొంటోందని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో రెండు ఫారాలు ఇస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో ఒక్కటి మాత్రమే అందజేస్తున్నారని తెలిపారు. ఎస్ఐఆర్పై ప్రజలకు సరైన అవగాహన కల్పించడంలో ఎన్నికల యంత్రాంగం విఫలమైందని, రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలను కూడా అవగాహన కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలని సూచించారు.ఓటరు జాబితాలను అన్ని పార్టీలకు అందుబాటులో ఉంచాలి..కొన్ని ప్రాంతాల్లో అధికార పార్టీకి చెందిన బూత్ లెవల్ ఏజెంట్లు పెద్ద ఎత్తున ఎన్యుమరేషన్ ఫారాలు సేకరించి పంపిణీ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని, అలాగే రాజకీయ నాయకులు బీఎల్ఓలతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారన్న సమాచారం అందుతోందని లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. ఈ పరిణామాలు ఎన్నికల ప్రక్రియ నిష్పాక్షికతను దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. బీఎల్ఓలు నిర్దేశిత మొబైల్ యాప్ ద్వారా ఓటర్ల ఫొటోలు సేకరించాల్సి ఉన్నప్పటికీ, అనేక ప్రాంతాల్లో ఆ ప్రక్రియ సక్రమంగా అమలుకావడంలేదన్నారు.అలాగే, 2026 తాజా ఓటరు జాబితాలను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు, వారి బీఎల్ఏలకు అందించకపోవడంవల్ల ఓటరు జాబితాల పరిశీలన, సవరణ ప్రక్రియలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అప్పిరెడ్డి తన లేఖలో వివరించారు. ఏజెన్సీ, గిరిజన ప్రాంతాల్లో ‘నెట్వర్క్’ సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ఈ సమస్యలన్నింటినీ వెంటనే సరిదిద్ది, ఓటరు జాబితాల సవరణ కార్యక్రమాన్ని పారదర్శకత, నిష్పాక్షికతతో నిర్వహించాలని లేళ్ల అప్పిరెడ్డి ప్రధాన ఎన్నికల అధికారిని కోరారు. -
క్రాంతికుమార్ మృతిపై సీబీఐ విచారణ జరపాలి
లబ్బీపేట/కృష్ణలంక (విజయవాడ తూర్పు): దళిత యువకుడు పేరుపోగు క్రాంతికుమార్ మృతిపై సీబీఐ విచారణకు ఆదేశించడంతోపాటు, అతని కుటుంబాన్ని చంద్రబాబు పరామర్శించాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. క్రాంతికుమార్ మృతితో దిక్కులేకుండా పోయిన ఆయన బిడ్డలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. రెడ్బుక్ రాజ్యాంగం వల్లే రాష్ట్రంలో పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని రెచ్చి పోతున్నారని, బాధిత కుటుంబాలకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, హోంమంత్రి అనిత క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలను కాపాడాల్సిన పోలీసులే రెచ్చిపోయి హింసిస్తుంటే, సామాన్యులు తమ కష్టాలను ఎవరితో చెప్పుకోవాలని ప్రశ్నించారు. విజయవాడ కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపులకు తాళలేకపోతున్నానంటూ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిన పేరుపోగు క్రాంతికుమార్ కుటుంబాన్ని శనివారం వైఎస్సార్సీపీ నాయకుల బృందం పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చింది. రాష్ట్రంలో కృష్ణలంక లాంటి పోలీస్ స్టేషన్లు ఎన్నో ఉన్నాయని, ఇప్పటికైనా వేధింపులు, దాడులకు ఫుల్స్టాప్ పెట్టాలని నాయకులు డిమాండ్ చేశారు.ఒక దళిత మహిళ అయ్యుండి బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి హోంమంత్రి అనితకి తీరికలేదా అని నాయకులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలకు క్రాంతికుమార్ తండ్రి, ఏపీ ఎమ్మార్ఫీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు ఘటన పూర్వాపరాలను వివరించారు. పోలీసుల వేధింపుల వల్ల తన కొడుకు ప్రాణాలొదిలాడని ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగ కులంలో పుట్టడమే తప్పయిపోయిందని తన కొడుకు చాలా ఆవేదన చెందాడని కంటతడిపెట్టారు. ప్రజాఉద్యమాల్లో క్రియాశీలకంగా ఉన్న తన కొడుక్కే ఇలా జరిగిందంటే ఇక నోరులేని సామాన్యుల పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. సీఐ నాగరాజు వంటివారు పోలీసు వ్యవస్థకే మాయని మచ్చని విమర్శించారు. ఘటనపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. దళితులకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలివైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు క్రాంతికుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించామని చెప్పారు. దళిత యువకులపై పోలీసులు దాడులు చేస్తున్నారని, వారిపై అక్రమంగా గంజాయి కేసులు నమోదు చేసి రౌడీషీట్లు తెరిచి వేధిస్తున్నారని విమర్శించారు. బూట్ పాలిష్ చేయాలంటూ క్రాంతిని వేధించిన సీఐ నాగరాజు వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘చర్మం వలచడం కూడా దళితుల వృత్తే అనే విషయం గుర్తుంచుకోవాలి’’ అని పోలీసులను హెచ్చరించారు. చంద్రబాబు పాలనలో దళితులపై దాడులు, దాష్టీకాలు పెరిగిపోయాయని, వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని, దళితులకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సర్కారు సాగిస్తున్న మారణకాండకు కృష్ణలంక పరిధిలో జరిగిన సాయికృష్ణ, క్రాంతికుమార్ మరణాలే సాక్ష్యమని స్పష్టం చేశారు. హోం మంత్రి అనిత తక్షణమే స్పందించి క్రాంతి కుమార్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇది మంచి ప్రభుత్వం కాదని, మేకప్, లాకప్ ప్రభుత్వమని విమర్శించారు. -
హలో ఇండియా.. ఆంధ్రప్రదేశ్లో భీతావహ పాలన
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో చట్టబద్ధ పాలన స్థానంలో భీతావహ పాలన నడుస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఇప్పుడు తాము అత్యంత భయపడేది పోలీసులకేనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ రెడ్బుక్ పాలన సృష్టిస్తున్న భీతావహ ఘటనలను దేశం దృష్టికి తీసుకొస్తూ శనివారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు.గాదె సాయికృష్ణ లాకప్లో అదృశ్యం, కనుమరుగు, రహస్యంగా దహనం.. పోలీసుల వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ బలవన్మరణానికి పాల్పడిన క్రాంతికుమార్ సెల్ఫీ వీడియో, శ్రీకాకుళం జిల్లాలో పోలీసుల వేధింపుల వల్ల ప్రాణాలు తీసుకున్న కళావతి, కర్నూలు జిల్లాలో విచారణ పేరుతో పోలీసుల చిత్రహింసల కారణంగా దళిత మహిళ గంగమ్మ మరణించిందనే ఆరోపణలు, ఆమె మృతదేహాన్ని రహస్యంగా ఖననం చేశారని కుటుంబ సభ్యులు చెబుతూ న్యాయ విచారణ కోరడాన్ని ఆ పోస్టులో వైఎస్ జగన్ ప్రస్తావించారు. ‘ఏపీలో పోలీసులు భారత రాజ్యాంగం ప్రకారమా పని చేస్తున్నారా? లేక చంద్రబాబు రెడ్బుక్ ప్రకారం పని చేస్తున్నారా?’ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని దేశం దృష్టికి తీసుకొస్తూ వైఎస్ జగన్ చేసిన పోస్టు సంచలం సృష్టిస్తోంది. వైఎస్ జగన్ ఏమని పోస్టు చేశారంటే.. హలో ఇండియా! చట్టబద్ధ పాలన స్థానంలో భీతావహ పాలన నడుస్తోందిఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఇప్పుడు అత్యంత భయపడేది పోలీసులకేనా? గాదె సాయికృష్ణ లాకప్ డెత్ (కస్టోడియల్ డెత్), అతని మృతదేహాన్ని పోలీసులు రహస్యంగా దహనం చేశారన్న ఆరోపణలు.. పోలీసుల వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ బలవన్మరణానికి పాల్పడిన క్రాంతి కుమార్ సెల్ఫీ వీడియో.. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న ఇలాంటి ఘటనలు కేవలం విషాద ఘటనలు మాత్రమే కావు. ఇవన్నీ చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘రెడ్బుక్ పాలన’ పెంచి పోషిస్తున్న ప్రమాదకర సంస్కృతికి ఫలితాలు. ఆంధ్రప్రదేశ్లో పోలీసులు భారత రాజ్యాంగం ప్రకారం పని చేస్తున్నారా? లేక చంద్రబాబు రెడ్బుక్ ప్రకారం పని చేస్తున్నారా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. న్యాయం స్థానంలో భయం, చట్టపాలన స్థానంలో అధికార దుర్వినియోగం పోలీసు వ్యవస్థకు నిర్వచనంగా మారుతోంది.ఇంత భయంకరమైన పరిస్థితి ఎప్పుడైనా చూశామా?రెడ్బుక్ రాజ్యాంగం ప్రకారం పాలిస్తామని ప్రకటించిన నాడే వైఎస్సార్సీపీ ఒక హెచ్చరిక చేసింది. రాజకీయ కక్ష సాధింపుల కోసం పోలీసు వ్యవస్థను ఉపయోగిస్తే.. పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారని, వ్యవస్థలు కలుషితమవుతాయని.. రాజ్యాంగ పరిరక్షణ, చట్టాలు, నిబంధనలను మీరి, వాటికి అతీతంగా వ్యవహరించే పరిస్థితి వస్తుందని వైఎస్సార్సీపీ హెచ్చరించింది. ఆ హెచ్చరిక ఈ రోజు చేదు నిజంగా మారింది. రెడ్బుక్ రాజ్యాంగ పాలనలో మొదట రాజకీయ ప్రత్యర్థులు లక్ష్యంగా మారారు.తర్వాత సోషల్ మీడియా కార్యకర్తలు.. ఆ తర్వాత జర్నలిస్టులు, మేధావులు లక్ష్యంగా మారారు. రాజకీయ వేధింపులతో ప్రారంభమైన ఈ ధోరణి.. ఇప్పుడు అదుపు తప్పిన పోలీసింగ్గా మారింది. దీనివల్ల సాధారణ ప్రజలు కూడా పోలీసుల వేధింపులకు, బెదిరింపులకు, అధికార దుర్వినియోగానికి బాధితులుగా మారుతున్నారు. సాయికృష్ణ ఘటన ఆంధ్రప్రదేశ్ను కుదిపేసింది. తన కుమారుడి ఆచూకీ కోసం, కనీసం అతని అస్థికలైనా తనకు అప్పగించాలని ఒక తల్లి ఈ రోజు అధికారులను వేడుకుంటోంది. రాష్ట్ర చరిత్రలో ఇంత భయంకరమైన పరిస్థితి ఎప్పుడైనా చూశామా? క్రాంతికుమార్ ఘటన కూడా అంతే ఆందోళనకరం. ఆత్మహత్యకు పాల్పడే ముందు అతను పోలీసులు వేధిస్తున్నారని బహిరంగంగా ఆరోపిస్తూ, సంబంధిత అధికారుల పేర్లు కూడా ప్రస్తావించాడు.తునిలో తిరుపతమ్మ పోలీసుల వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసిన అనంతరం ఆత్మహత్య చేసుకుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కళావతి పోలీసుల వేధింపుల కారణంగా ప్రాణాలు తీసుకుంది. కర్నూలు జిల్లాలో దళిత మహిళ గంగమ్మ విచారణ పేరుతో జరిగిన పోలీసు చిత్రహింసల కారణంగా మరణించిందని ఆరోపణలు వచ్చాయి. ఆమె మృతదేహాన్ని రహస్యంగా ఖననం చేశారని కుటుంబ సభ్యులు చెబుతూ న్యాయ విచారణ కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నప్పుడు అవి యాదృచ్ఛికంగా జరుగుతున్నవి కావు.. వ్యవస్థలో లోతుగా పాతుకుపోయిన ఒక ప్రమాదకర ధోరణిని ప్రతిబింబిస్తున్నాయి.సీఎం, హోం మంత్రి, డీజీపీ వైఖరే కారణంఅదే సమయంలో పోలీసుల దాష్టీకాలు సాధారణం అయిపోయాయి. కోడి కోశారన్న, మేక కోశారన్న చిన్న చిన్న ఆరోపణలకే ప్రతిపక్ష కార్యకర్తలను వీధుల్లో ఊరేగించి అవమానిస్తున్నారు. మోరల్ పోలీసింగ్ పేరుతో కొందరు అధికారులు కోర్టులు, న్యాయమూర్తులు, జడ్జిలు పాత్రలన్నీ తామే పోషిస్తున్నారు. మరోవైపు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదులు చేస్తే వాటిని పట్టించుకోవడం లేదు. కేసులు నమోదు చేయడం లేదు. ఈ బరితెగించిన ద్వంద్వ వైఖరి, పోలీసు శాఖపై ప్రజల విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బ తీసింది.ఈ పరిస్థితికి రాష్ట్ర డీజీపీ, హోంమంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాన కారణం. దిగజారిన ఈ పరిస్థితుల వల్ల ఉత్పన్నమవుతున్న పర్యవసానాల బాధ్యతల నుంచి వారు తప్పించుకోలేరు. ఆంధ్రప్రదేశ్కు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రకారం పాలన కావాలి గానీ.. రెడ్బుక్ పాలన కాదు. పోలీసులు ఉన్నది ప్రజల హక్కులను పరిరక్షించడానికి, చట్టాన్ని అమలు చేయడానికి, న్యాయం అందించడానికే గానీ రాజకీయ కక్ష సాధించే పనిముట్లుగా మారడానికి కాదు. న్యాయం కనుమరుగై భయం రాజ్యమేలితే.. చట్టం స్థానంలో అధికార దుర్వినియోగం నడిస్తే.. చివరకు ప్రజాస్వామ్యమే బలవుతుంది’ అని పేర్కొన్నారు. -
భయపెట్టే పాలనకు ముగింపు పలకాలి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ‘‘హలో ఇండియా.. చట్టపాలనను ‘భయపాలన’ భర్తీ చేస్తోంది’’ అంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలోని కూటమి పాలనపై మండిపడుతూ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఇప్పుడు పోలీసులకే ఎక్కువగా భయపడే పరిస్థితి వచ్చిందా అని ప్రశ్నించారు. ఏపీలో భయపెట్టే పాలనకు ముగింపు పలకాలన్నారు.‘‘కస్టడీలో మరణించిన గాదె సాయికృష్ణ మృతదేహాన్ని పోలీసులు రహస్యంగా దహనం చేశారన్న ఆరోపణలు కావచ్చు.. పోలీసుల వేధింపులు భరించలేక సెల్ఫీ వీడియోలో ఆరోపణలు చేసి క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకోవడం కావచ్చు.. ఆంధ్రప్రదేశ్లో చోటుచేసుకున్న ఇలాంటి వరుస ఘటనలు ఒక్కో విషాద సంఘటన మాత్రమే కాదు.. టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న రెడ్ బుక్ పాలన పెంచిపోషించిన ప్రమాదకర సంస్కృతికి ఇవి ఫలితాలు.ఈ రోజు ప్రజలు ఒక ప్రశ్న అడుగుతున్నారు. పోలీసులు భారత రాజ్యాంగం ప్రకారం పనిచేస్తున్నారా? లేక చంద్రబాబు నాయుడి రెడ్ బుక్ ప్రకారమా? న్యాయం కాదు.. భయమే పోలీసింగ్కు చిహ్నంగా మారుతోంది.రెడ్ బుక్ ప్రకటించిన రోజు నుంచే, పోలీసుల ద్వారా రాజకీయ కక్షసాధింపును ప్రోత్సహిస్తే, పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే పరిస్థితి వస్తుందని, సంస్థలు కలుషితం అవుతాయని, పోలీసు వ్యవస్థలోని కొన్ని వర్గాలు చట్టాలు, నిబంధనలు, రాజ్యాంగ పరిరక్షణలను దాటి వ్యవహరించే ధైర్యం తెచ్చుకుంటాయని వైఎస్సార్సీపీ హెచ్చరించింది.ఆ హెచ్చరిక ఇప్పుడు బాధాకరమైన నిజంగా మారింది. మొదట రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకున్నారు. ఆ తర్వాత సోషల్ మీడియా కార్యకర్తలు లక్ష్యంగా మారారు. తర్వాత జర్నలిస్టులు, మేధావులు, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన వారు లక్ష్యంగా మారారు’’ అని తెలిపారు.ఈ ధోరణి మరో రూపు తీసుకుంది.. రాజకీయ వేధింపులతో మొదలైన ఈ ధోరణి ఇప్పుడు అదుపు లేని పోలీసింగ్గా మారిందని వైఎస్ జగన్ చెప్పారు. ‘‘సాధారణ ప్రజలు కూడా బెదిరింపులు, వేధింపులు, అధికార దుర్వినియోగానికి బలవుతున్నారు. సాయికృష్ణ ఘటన ఆంధ్రప్రదేశ్ మనస్సాక్షిని కదిలించింది. తన కుమారుడి మృతదేహాన్ని ఇవ్వలేకపోతే కనీసం అతని చితాభస్మమైనా ఇవ్వాలని ఒక తల్లి ఇంకా వేడుకుంటోంది.రాష్ట్ర చరిత్రలో ఇంత భయానక పరిస్థితి ఎప్పుడైనా చోటుచేసుకుందా? క్రాంతి కుమార్ ఘటన కూడా అంతే కలచివేస్తోంది. ఆత్మహత్యకు ముందు ఆయన సెల్ఫీ వీడియోలో పోలీసుల వేధింపులపై బహిరంగంగా ఆరోపణలు చేశారు. సంబంధిత అధికారుల పేర్లను కూడా ప్రస్తావించారు.తునిలో తిరుపతమ్మ పోలీసుల వేధింపులపై సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కలావతి కూడా పోలీసుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. కర్నూలు జిల్లాలో దళిత మహిళ గంగమ్మను విచారణ సమయంలో పోలీసులు హింసించడంతో ఆమె మరణించిందన్న ఆరోపణలు వచ్చాయి. తర్వాత ఆమెను రహస్యంగా ఖననం చేశారని, ఘటనపై న్యాయ విచారణ జరపాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు’’ అని అన్నారు.మళ్లీ మళ్లీ జరిగితే అవి యాదృచ్ఛికాలు కాదు ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరిగితే అవి యాదృచ్ఛికాలు కాదని, ఆందోళన కలిగించే ధోరణికి అవి నిదర్శనంగా మారతాయని వైఎస్ జగన్ చెప్పారు. ‘‘ఇదే సమయంలో పోలీసులు అతిగా వ్యవహరించడం నిత్యకృత్యంగా మారింది. కోడి లేదా మేకను కోశారన్న చిన్న ఆరోపణలకే ప్రతిపక్ష కార్యకర్తలను ప్రజల ఎదుట అవమానించి రోడ్లపై ఊరేగిస్తున్నారు. నైతిక పోలీసింగ్ పేరుతో అధికారులు న్యాయమూర్తి, తీర్పు చెప్పేవారు, శిక్ష అమలు చేసేవారు అన్నీ తామేనన్నట్లు వ్యవహరిస్తున్నారు. అయితే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఫిర్యాదులు ఇచ్చినా పోలీసులు కేసులు నమోదు చేయడం లేదు. లేక నిర్లక్ష్యంగా పక్కన పెడుతున్నారు.ఈ స్పష్టమైన ద్వంద్వ వైఖరి పోలీసు శాఖపై ప్రజల విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. జవాబుదారీతనం లేకుండాపోయింది. రాష్ట్ర డీజీపీ, హోంమంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి బాధ్యత వహించకుండా తప్పించుకోలేరు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం పాలన జరిగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావాలి. రెడ్ బుక్ పాలన కాదు. పోలీసుల బాధ్యత ప్రజల హక్కులను కాపాడటం, చట్టాన్ని అమలు చేయటం, న్యాయం నిలబెట్టటం. రాజకీయ కక్షసాధింపునకు సాధనాలుగా మారటం కాదు. భయం న్యాయాన్ని భర్తీ చేస్తే, అధికారం చట్టాన్ని భర్తీ చేస్తే, ప్రజాస్వామ్యమే బలైపోతుంది’’ అని వైఎస్ జగన్ మండిపడ్డారు. 𝐇𝐞𝐥𝐥𝐨 𝐈𝐧𝐝𝐢𝐚 !!! 𝐓𝐡𝐞 𝐫𝐮𝐥𝐞 𝐨𝐟 𝐟𝐞𝐚𝐫 𝐢𝐬 𝐫𝐞𝐩𝐥𝐚𝐜𝐢𝐧𝐠 𝐭𝐡𝐞 𝐫𝐮𝐥𝐞 𝐨𝐟 𝐥𝐚𝐰.Has Andhra Pradesh reached a point where people fear the police most?Be it custodial death of Gade Sai Krishna, whose body was allegedly cremated secretly by the…— YS Jagan Mohan Reddy (@ysjagan) June 20, 2026 -
గుంటూరులో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ
సాక్షి, గుంటూరు: నగరంలో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. సాయికృష్ణ, క్రాంతికుమార్ మరణాలపై సీబిఐ విచారణ జరపాలని డిమాండ్ వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. కొరిటపాడు లైబ్రరీ సెంటర్ నుండి లాడ్జి సెంటర్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘‘క్రాంతికుమార్ మరణ వాంగ్మూలం ఇచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. సాయికృష్ణ పోలీసు దెబ్బలకు తట్టుకోలేక చనిపోయారు. రక్షించాల్సిన పోలీసులే హతమార్చుతున్నారు. చంద్రబాబు.. సాయికృష్ణ కుటుంబానికి అండగా ఉంటాడట. 49 రోజుల క్రితం సంఘటన జరిగితే ఇప్పటిదాకా ఎందుకు పట్టించుకోలేదు?. హెబియస్ కార్పస్ పిటిషన్ వేయటం, వైఎస్ జగన్ వారి ఇంటికి వెళ్లేదాకా ప్రభుత్వం పట్టించుకోదా?’’ అంటూ ఆయన ప్రశ్నించారు.‘‘పోలీసులు నమోదు చేసున కేసు కోర్టులో నిలబడదు. లోపభూయిష్టమైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గత నెల 28న విజయలక్ష్మి ఒక ఫిర్యాదు చేశారు. అదే ఫస్ట్ ఇన్ఫర్మేషన్. కానీ దాన్ని కాదని మొన్న హడావుడిగా ఎఫ్ఐఆర్ ఎలా నమోదు చేస్తారు?. సీఐ నాగరాజును బలి చేయటానికి హడావుడిగా కేసు నమోదు చేశారు. జడా శ్రవణ్ కుమార్ చాలా స్పష్టంగా సాయికృష్ణ కేసు వివరించారు. సాయికృష్ణ హత్య సీపీ, డీజీపీకి తెలియకుండానే జరిగిందా?..క్రాంతికుమార్ ఆత్మహత్య కేసు కూడా నిలపడకుండా చేస్తున్నారు. ఈ రెండు కేసుల్లో పెద్దపెద్ద వారి ప్రమేయం ఉంది. 29న కోర్టులో సాయికృష్ణను హాజరు పరుస్తారా?. కనీసం బూడిద కూడా దొరక్కుండా చేశారు. నేరాంగీకారం జరిగితే తప్ప ఇది మర్డర్ కేసుగా నిలబడదు. కాపులను చంపి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారా?. కాపులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?’’ అంటూ అంబటి రాంబాబు నిలదీశారు.‘‘పోలీసు స్టేషన్కు వెళ్లాలంటేనే జనం భయపడే పరిస్థితి ఏర్పడింది. సాయికృష్ణ వ్యవహారం వెనుక ఉన్న బడా బాబులు బయటకు రావాలి. సీఐ నాగరాజు పాత్ర ఒక్కటే సాయికృష్ణ కేసులో లేదు. సీబిఐ విచారణలో మాత్రమే వాస్తవాలు బయటకు వస్తాయి. రాజమండ్రి ఎస్పీ విచారణలో వాస్తవాలు వెల్లడవ్వవు’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు. -
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వైఎస్సార్సీపీ లేఖ
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమం అమలులో పలు అక్రమాలు, లోపాలు, ఆచరణాత్మక ఇబ్బందులు చోటుచేసుకుంటున్నాయని వైఎస్సార్సీపీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో)కి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి లేఖ రాశారు.ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించాల్సిన సమయంలో క్షేత్రస్థాయిలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్వోలు) ఎస్ఐఆర్ విధులతో పాటు ఇతర శాఖాపరమైన పనులు కూడా నిర్వహించాల్సి రావడం వల్ల కార్యక్రమం ప్రభావితమవుతోందన్నారు. ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేసినప్పటికీ, వాటి సేకరణ, ధృవీకరణ ప్రక్రియలో ఏకరీతి లేకపోవడం వల్ల గందరగోళం నెలకొంటోందని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో రెండు ఫారాలు ఇస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో ఒక్క ఫారం మాత్రమే అందజేస్తున్నారని పేర్కొన్నారు. ఎస్ఐఆర్పై ప్రజలకు సరైన అవగాహన కల్పించడంలో ఎన్నికల యంత్రాంగం విఫలమైందని, రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలను కూడా అవగాహన కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలని సూచించారు.కొన్ని ప్రాంతాల్లో అధికార పార్టీకి చెందిన బూత్ లెవల్ ఏజెంట్లు పెద్ద ఎత్తున ఎన్యుమరేషన్ ఫారాలు సేకరించి పంపిణీ చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయని, అలాగే రాజకీయ నాయకులు బీఎల్వోలతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారన్న సమాచారం అందుతోందని తెలిపారు. ఇటువంటి పరిణామాలు ఎన్నికల ప్రక్రియ నిష్పాక్షికతను దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బీఎల్వోలు నిర్దేశిత మొబైల్ యాప్ ద్వారా ఓటర్ల ఫోటోలు సేకరించాల్సి ఉన్నప్పటికీ, అనేక ప్రాంతాల్లో ఆ ప్రక్రియ సక్రమంగా అమలు కావడం లేదని పేర్కొన్నారు.అలాగే 2026 తాజా ఓటరు జాబితాలను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు, వారి బీఎల్ఏలకు అందించకపోవడం వల్ల ఓటరు జాబితాల పరిశీలన, సవరణ ప్రక్రియలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఏజెన్సీ, గిరిజన ప్రాంతాల్లో ఇంటర్నెట్, మొబైల్ నెట్వర్క్ సదుపాయాలు సరిగా లేకపోవడంతో ఎస్ఐఆర్ కార్యక్రమం నిర్వహణలో తీవ్ర సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. అలాంటి ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.ఎస్ఐఆర్ ప్రక్రియలో ఉన్న లోపాలను వెంటనే సరిదిద్ది, ఓటరు జాబితాల సవరణ కార్యక్రమాన్ని పూర్తిస్థాయి పారదర్శకత, నిష్పాక్షికతతో నిర్వహించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని లేళ్ల అప్పిరెడ్డి ప్రధాన ఎన్నికల అధికారిని కోరారు. అలాగే తాజా ఓటరు జాబితాలను అన్ని రాజకీయ పార్టీలకు అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. -
లావు, ఆంజనేయులకు బొల్లా బ్రహ్మనాయుడు సవాల్
సాక్షి, పల్నాడు జిల్లా: ఎవరు భూ కబ్జాలు చేశారో తేల్చుకుందాం రండి అంటూ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ఆంజనేయులకు బొల్లా బ్రహ్మనాయుడు సవాల్ విసిరారు. నేను బహిరంగ చర్చకు సిద్ధం.. మీరు సిద్ధమైతే టైము ప్లేసు డిసైడ్ చేయండి. మీకు తోడు లోకేషన్ తెచ్చుకున్న నేను సిద్ధం. నాకు, గండిపేట భూముల కేసుకు ఎలాంటి సంబంధం లేదు’’ అని బొల్లా స్పష్టం చేశారు. నన్ను అక్రమంగా కేసులో ఇరికించారు. నేను అరెస్టు అయ్యే ఐదు రోజులు ముందు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నన్ను అరెస్టు చేయిస్తామని చెప్పారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు వైఎస్సార్సీపీ రాజకీయ బిక్ష పెట్టింది. ఓట్లేసి లావు శ్రీకృష్ణదేవరాయల్ని గెలిపించిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను ఆయన మోసం చేశారు. కార్యకర్తలను మోసం చేశాడు కాబట్టి ఆయనకు టికెట్ ఇవ్వలేదు.‘‘లావు శ్రీకృష్ణదేవరాయలు లాగా పదవుల కోసం పార్టీ మారే వ్యక్తిని నేను కాదు. నా గొంతులో ప్రాణం ఉన్నంతవరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతా. ఢిల్లీలో లావు శ్రీకృష్ణదేవరాయలకు బినామీ పేర్లతో ఎన్ని మద్యం షాపులు ఉన్నాయో అందరికీ తెలుసు. మద్యం షాపులు తీసుకొండంటూ పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలు లావు శ్రీకృష్ణదేవరాయలు బతిమిలాడాడు. లావు శ్రీకృష్ణదేవరాయలు కబంధహస్తాల్లో చిక్కుకుంటే ఏమవుతుందో మాకు తెలుసు..వినుకొండ వస్తే బొల్లా బ్రహ్మనాయుడు నిజాయితీ తెలుస్తుంది ఢిల్లీ వెళ్తే లావు శ్రీకృష్ణదేవరాయల లిక్కర్ బాగోతం తెలుస్తుంది. లావు శ్రీకృష్ణదేవరాయలు గాని ఆయన తండ్రి గాని ఒక్క విద్యార్థికై ఎప్పుడైనా రాతి రాయితీ ఇచ్చి చదివించారా?. వైఎస్సార్సీపీలో ఉండి లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశానికి కోవర్టుగా పనిచేశారు. వెన్నుపోటు పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజల సిద్ధంగా ఉన్నారు.’’ అని బొల్లా బ్రహ్మనాయుడు వ్యాఖ్యానించారు. -
నేను స్టేషన్ కి రాను.. వస్తే మీ బండారం బయటపెడతా!
-
‘‘సాయికృష్ణ బతికున్నాడా? చనిపోయాడా? అనేది చెప్పాలి’’
తాడేపల్లి: ‘‘సాయికృష్ణ బతికున్నాడా? చనిపోయాడా? అనేది చెప్పాలి’’ అని మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్ చేశారు. శనివారం తాడేపల్లిలో పేర్ని నాని మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సాయికృష్ణ అదృశ్యంపై తల్లి ఫిర్యాదు చేస్తే ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. 40 రోజుల తర్వాత చంద్రబాబు ఈ ఘటనపై స్పందించారని తెలిపారు.మరోవైపు, క్రాంతికుమార్ గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడని, అతని కేసులో అనేక అనుమానాలు ఉన్నాయని పేర్ని నాని చెప్పారు. ‘‘సాయికృష్ణ కేసును నీరుగార్చాలని చూస్తున్నారు. సాయికృష్ణ కేసు చంద్రబాబు పీకల మీదకు రావడంతో అతని తల్లిని పిలిపించుకుని మాట్లాడారు. మరి క్రాంతికుమార్ కుటుంబాన్ని ఎందుకు పిలిపించలేదు? ఎస్సీ కులస్తుడైన క్రాంతికుమార్ కుటుంబానికి ఓదార్పు అవసరం లేదా?’’ అని నిలదీశారు.కేసు రీఓపెన్ ఎందుకు చేయలేదు? క్రాంతికుమార్ వీడియో బయటకు వచ్చాక కేసు రీఓపెన్ ఎందుకు చేయలేదని పేర్ని నాని ప్రశ్నించారు. ‘‘సాయికృష్ణ మిస్సింగ్ పై 40 రోజుల క్రితమే న్యాయవాది కనకదుర్గ ఫిర్యాదు చేసినా సీపీ ఎందుకు స్పందించలేదు? సీపీ రాజశేఖర్ ఆధ్వర్యంలోనే టాస్క్ఫోర్స్ పని చేస్తుంది. అలాంటి టాస్క్ఫోర్స్ అధికారులే వెళ్లి సాయికృష్ణను పట్టుకువచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఎందుకు బయట పెట్టటం లేదు? సీఐ నాగరాజు క్రైం విచారణలో ఆరితేరిన అధికారి. అలాంటి వ్యక్తి సాయికృష్ణను కృష్ణలంక శ్మశాన వాటికలోనే ఎందుకు దహనం చేయిస్తారు? విచారణ అధికారులు కేవలం అదే శ్మశాన వాటికకే ఎలా వెళ్లారు? అక్కడ ఏమైనా అధారాలు దొరికాయా? సీపీ రాజశేఖర్ బాబుకు తెలియకుండానే ఇదంతా జరిగిందా? విచారణాధికారి డీఎన్ కిషోర్ తన పైస్థాయి అధికారులను విచారించగలరా? సీఐ నాగరాజుపై కేసు నమోదు చేసి 48 గంటలయినా అతన్ని ఎందుకు అరెస్టు చేయలేదు?సాయికృష్ణ కేసులో ప్రజల్లో ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముద్దాయిగా ఉన్న సీఐ నాగరాజును ఎందుకు విచారించరు? కేసులో సీపీ పాత్ర ఉందని అందరిలోనూ అనుమానాలు ఉన్నాయి. విజయవాడ సీపీ నాయకత్వంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. సీపీ చేతుల్లో ఉన్న టాస్క్ఫోర్స్ అధికారులను ఎలా విచారణ చేస్తారు?’’ అని ప్రశ్నించారు. -
‘టీడీపీ ఆఫీసులోనే స్క్రిప్ట్ రెడీ అవుతోంది’
సాక్షి, తాడేపల్లి: కారుమూరి కుటుంబాన్ని వేధించటానికే అక్రమ కేసులు పెడుతున్నారంటూ చంద్రబాబు సర్కార్పై వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. లేని మద్యం స్కాంలో కారుమూరి సునీల్ని అక్రమంగా అరెస్టు చేశారంటూ ధ్వజమెత్తారు. ‘‘బీసీల అణచివేతకే సునీల్ అరెస్టు. అసలు మద్యం రవాణాలో అక్రమాలు జరిగాయని ఏ అధికారైనా చెప్పారా?’’ అంటూ నాగార్జున యాదవ్ ప్రశ్నించారు.కాగ్ లాంటి సంస్థలు ఏమైనా అభ్యంతరం తెలిపాయా?. శాఖాపరమైన విచారణ ఏమైనా జరిగిందా?. అవేమీ లేకుండానే విజిలెన్స్ విచారణకు ఎలా ఆదేశించారు?. సాయిశ్రీనివాస్ అనే టీడీపీ కార్యకర్త ఫిర్యాదు చేయగానే గంటలోనే విజిలెన్స్ విచారణకు ఆదేశించటం దుర్మార్గం. దమ్ముంటే నారా లోకేషే ఫిర్యాదు చేయొచ్చుగా?. నారా లోకేష్ ఆధ్వర్యంలోనే ఈ మొత్తం ఎపిసోడ్ జరుగుతుంది. ఫిర్యాదు, విచారణ ఎలా జరగాలో టీడీపీ ఆఫీసులోనే స్క్రిప్టు రెడీ అవుతోంది’’ అని నాగార్జున యాదవ్ పేర్కొన్నారు.‘‘వైఎస్ జగన్ హయాంలో పారదర్శకంగానే రవాణా టెండర్లు జరిగాయి. తక్కువ ప్రైస్ చూపిన వారికే టెండర్లు దక్కాయి. అందులో నేరం ఏం ఉంది?. కేవలం కారుమూరి కుటుంబాన్ని వేధించటానికే అక్రమ కేసు పెట్టారు. అక్రమ కేసులకు సోషల్ మీడియా కార్యకర్తలే భయపడలేదు. ఇక పార్టీ నాయకులు, కార్యకర్తలు భయపడతారా?’’ అంటూ నాగార్జున యాదవ్ వ్యాఖ్యానించారు. -
వినుకొండలో ఉద్రిక్తత.. బ్రహ్మనాయుడుని అడ్డుకున్న ఖాకీలు
-
రిలీజ్ తరువాత బొల్లా బ్రహ్మనాయుడు షాకింగ్ కామెంట్స్
-
రూ.40 లక్షలు ఇప్పిస్తా, రాజీ చేసుకోండి అంటూ జనసేన నేతలు బెదిరించారు
-
హోటల్లో రెండు రోజులు చిత్రహింసలు పెట్టి CIకి అప్పగించారు..! అంబటి షాకింగ్ కామెంట్స్
-
‘సాయికృష్ణ కేసును చంద్రబాబు తొక్కేద్దామనుకున్నారు’
సాక్షి, తాడేపల్లి: సాయికృష్ణ, క్రాంతికుమార్ మరణాలపై సీబీఐతో విచారణ జరపాలని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పోలీసుల దుర్మార్గాలపై తమ పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. సాయికృష్ణ ఇంటికి వైఎస్ జగన్ వెళ్లే వరకు ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు అంటూ ప్రశ్నించారు.‘‘గత నెల 28నే అడ్వకేట్ కనకదుర్గ ఫిర్యాదు చేశారు. అయినా సరే పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదు?. వైఎస్ జగన్ వెళ్తేగానీ సీఐ మీద కేసు నమోదు చేయరా?. లాకప్ డెత్ జరిగినట్టు ప్రభుత్వం అంగీకరించింది. సాయికృష్ణ పిన్ని కనకదుర్గ హైకోర్టులో పిల్ వేశారు. ఇక్కడ్నుంచే అసలు కథ ప్రారంభమైంది. సీఐ నాగరాజు మీద కేసు నమోదు చేసి సస్పెండ్ చేస్తే సరిపోదు. పేరిపోగు క్రాంతికుమార్ కూడా సీఐ టార్చర్ వలనే ఆత్మహత్య చేసుకున్నాడు. సాయికృష్ణ, క్రాంతికుమార్ మరణాల వెనుక సీఐతోపాటు చాలామంది అధికారులు ఉన్నారు. వారందరిపై కూడా చర్యలు తీసుకోవాలి’’ అని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.‘‘సాయికృష్ణ చనిపోయిన ఫోటో, కాళ్ల మీద గాయాలు ఉన్న ఫోటోలు ఫేక్ అంటూ ప్రచారం చేస్తున్నారు. జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి అవన్నీ ఫేక్ ఫోటోలు అంటున్నారు. అవి ఫేక్ ఫోటోలు అయితే సాయికృష్ణను చూపించండి. నేను చూపినవి ఫేక్ ఫోటోలైతే నా మీద కేసు పెట్టుకోవచ్చు. తాము జనసేన పార్టీ అని సాయికృష్ణ కుటుంబ సభ్యులే చెప్పారు. అలాంటి కార్యకర్త ఇంటికెళ్లి కనీసం పరామర్శించలేదు. పైగా రాజీ చేయాలని చూడటం సిగ్గుచేటు. ఆ తల్లి అడిగిన సాయికృష్ణ భస్మం అయినా ఇవ్వండి. జనసేన నాయకులుగా ఉండి ఏం ప్రయోజనం?’’ అంటూ అంబటి దుయ్యబట్టారు.‘‘మీకు చేతగాని పని మేము చేస్తే బురద జల్లుతారా?. సాయికృష్ణ కేసులో మిగిలిన పాత్రధారులంతా బయటకు రావాలి. పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబానికి కూడా న్యాయం చేయాలి. సాయికృష్ణ, క్రాంతి కుమార్ మరణాలపై సీబీఐ విచారణ చేయాలి. చంద్రబాబు.. సాయికృష్ణ కుటుంబాన్ని మాయ చేసి ఉండొచ్చు. కానీ పోలీసు వ్యవస్థ పనితీరు, ప్రభుత్వ పోకడలపై మా పోరాటం ఆగదు’’ అంటూ అంబటి రాంబాబు హెచ్చరించారు. -
‘ఫిర్యాదు చేసినప్పుడే సీపీ, డీజీపీ ఎందుకు స్పందించలేదు?’
సాక్షి, కాకినాడ జిల్లా: వైఎస్సార్సీపీతో పాటు ప్రశ్నించిన వారిని టార్గెట్ చేయడమే మీ పనా? అంటూ కూటమి సర్కార్పై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసుల భాష సంస్కార హీనంగా ఉందన్నారు. రాజకీయ నాయకుల చెప్పుచేతల్లోకి వెళ్ళిపోయామని పోలీస్ అధికారులే చెబుతున్న పరిస్ధితి నెలకొందని ఆయన ధ్వజమెత్తారు.‘‘సాయికృష్ణ తల్లిదండ్రులు సీపీకి ఫిర్యాదు చేసినప్పుడు ఎందుకు స్పందించలేదు?. సాయికృష్ణ లాకప్ డెత్పై సీఎం, హోం మంత్రి ఎందుకు స్పందించలేదు?. వైఎస్ జగన్ బాధిత కుటుంబం దగ్గరకు వెళ్తే తెల్లారేలోపు ఎఫ్ఐఆర్ వేశారు. మేకప్ కోసం మాజీ మంత్రి అమర్నాథ్కు నోటీసు ఇచ్చిన హోంమంత్రి.. సాయికృష్ణ లాకప్ డెత్ మీద డీజీపీ,సీపీకి ఎందుకు నోటీసు ఇవ్వలేదు’’ అంటూ కన్నబాబు ప్రశ్నించారు.‘‘ఆక్వా రంగంలో ఒక మాఫియా తయారైంది. ఫీడ్, సీడ్, ఎగుమతుల్లో మాఫియా. రైతు పరిస్ధితి చాలా దయనీయంగా ఉంది. వైఎస్ జగన్ రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం.. అన్నదాత సుఖీభవ మొదటి సంవత్సరం ఎగొట్టింది. రెండో ఏడాది 7 లక్షల మందికి కోత విధించారు. ఒక్క కౌలు రైతుకు కూడా పెట్టుబడి సాయం అందలేదు. మోంథా తుపాను బాధితులకు ఇవాళ్టీకి సాయం అందించలేదు...రైతులకు సున్నా వడ్డీ ఏదీ?. 393 మంది రైతులు ఒక ఏడాదిలో చనిపోయారని ప్రభుత్వం చెబుతోంది. ఉచిత పంటల బీమా పథకం ఎత్తేశారు. పొగాకు రైతులు ఇవాళ ఒంగోలులో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేస్తున్నారు. రైతులకు కార్డు ఇచ్చి.. యూరియా, ఎరువులకు కోత పెట్టారు. కౌలు రైతులు, గిరిజన రైతులు, దేవాదాయ శాఖ రైతులకు కార్డులు లేవు. వైఎస్ జగన్ తీసుకు వచ్చిన కౌలు గుర్తింపు కార్డులను చంద్రబాబు తుంగలోకి తొక్కేశారు. ఎరువులు కావాలంటే.. రూ.15-20 వేలు పెట్టి రైతులు స్మార్ట్ ఫోన్ కొనాలి. రైతును రోడ్డున పడేశారు. ఎరువు కావాలన్న.. విత్తనం కావాలన్న ఎవర్నికలవాలో తెలియదు. రైతులకు ఏం కావాలో తెలుసుకోకుండా.. మేకప్లపై డిస్కషన్లు పెడుతున్నారు’’ అంటూ కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సాయికృష్ణ, క్రాంతి కుమార్ కేసులు.. NHRCకి వైఎస్సార్సీపీ ఎంపీల ఫిర్యాదు
సాక్షి,న్యూఢిల్లీ: విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీఐ నాగరాజు వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న క్రాంతికుమార్, అలాగే లాకప్ డెత్కు (అదృశ్యం) గురైన గాదె సాయికృష్ణ కేసుల్లో బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఎంపీలు జాతీయ మానవ హక్కుల సంఘం (NHRC) ఛైర్మన్ను కలిశారు. ఈ రెండు ఘటనలపై తక్షణమే దర్యాప్తు జరిపించాలని వైఎస్సార్సీపీ ఎంపీలు మద్దిల తనూజరాణి, డాక్టర్ గురుమూర్తి విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా సాయికృష్ణ లాకప్డెత్, క్రాంతి కుమార్ ఆత్మహత్యల వెనుక ఉన్న నిజాలను బయటకు తీసి, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఎన్హెచ్ఆర్సీ ఛైర్మన్కు సమర్పించిన వినతి పత్రంలో కోరారు. -
వాడు రాజకీయాల కోసం తల్లిని కూడా బలి చేస్తాడు..
-
వైఎస్సార్సీపీ పిటిషన్పై స్పందించిన హైకోర్టు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ఫేస్బుక్ ఖాతాను చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగా బ్లాక్ చేయించడంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు మెటా సంస్థను ఆదేశించింది. వారికి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని వారిని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, జస్టిస్ రఘునందన్రావు ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.తమ పార్టీ అధికార ఫేస్బుక్ అకౌంట్ను బ్లాక్ చేయడాన్ని సవాలు చేస్తూ వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై గురువారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సుబ్రమణ్య శ్రీరామ్ వాదనలు వినిపించారు. వైఎస్సార్సీపీ ఫేస్బుక్ అకౌంట్ను ఏకపక్షంగా బ్లాక్ చేశారని తెలిపారు. ఎవరు ఆదేశిస్తే బ్లాక్ చేశారో చెప్పడం లేదన్నారు. ఎలాంటి నోటీసు కూడా ఇవ్వలేదని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో మెటా ఏకపక్షంగా వ్యవహరించిందని ఆయన వివరించారు. ఐటీ చట్ట నిబంధనలను కాలరాసిందని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేస్తూ, తదుపరి విచారణను ఆగస్ట్ 13కు వాయిదా వేసింది. -
డీఎస్సీ, అమరావతిపై సీబీఐ దర్యాప్తు జరగాలి: సుబ్బారెడ్డి
సాక్షి, ఢిల్లీ: ఏపీలో జరిగిన డీఎస్సీ నియామకాల్లో భారీగా అవకతవకలు జరిగాయన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. కూటమి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు అవినీతిమయం అయిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీలో పనిచేసే వారికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. డీఎస్సీపై సీబీఐ విచారణ జరగాల్సిందే. అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందోని ఆరోపించారు.వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘డీఎస్సీ నియామకాల్లో అర్హులకు ఉద్యోగాలు అందలేదు. అర్హులైన నిరుద్యోగులకు అవకాశాలు దక్కలేదు. డీఎస్సీ పేపర్ లీక్ జరిగింది. దీనిపై సీబీఐ విచారణ జరగాలి. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. స్పోర్ట్స్ కోటా పేరుతో అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారు. అన్ని వ్యవస్థలు అవినీతిమయం అయిపోయాయి. డీఎస్సీ పేపర్ను రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలకు అమ్ముకున్నారు. టీడీపీలో పనిచేసే వారికి ఉద్యోగులు ఇచ్చారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్లో టీడీపీ సానుభూతిపరులకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. వేలాది మంది మెరిట్ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది. టీడీపీ స్వప్రయోజనాలు కాపాడే రియల్ ఎస్టేట్ సంస్థలకు కేటాయిస్తున్నారు. భూముల కేటాయింపులపై కూడా సమగ్ర దర్యాప్తు జరగాలి. రెండు లక్షల కోట్ల రూపాయల ఖర్చు పెడుతున్నారు. ఒక్క చదరపు అడుగుకు 20,500 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు 5000 రూపాయల లోపే చదరపు అడుగుకు నిర్మాణం ఖర్చు పెడుతున్నారు. ఇదే అమరావతిలో జరుగుతున్న లూటికి నిదర్శనం. ఎన్హెచ్ఏ జాతీయ రహదారుల నిర్మాణానికి కిలోమీటర్కు 20 కోట్ల రూపాయల ఖర్చు పెడుతున్నారు. అదే అమరావతిలో 58 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఇండియాలోని ప్రధాన నగరాల్లో కూడా నిర్మాణపు ఖర్చులు ఈ స్థాయిలో లేవు. ఈ అంశాలపైన సమగ్రమైన సీబీఐ దర్యాప్తు జరగాలి. ఏపీలో దారుణమైన పాలనను కేంద్ర ప్రభుత్వం పెద్దల దృష్టికి తీసుకెళ్తాం’ అని తెలిపారు. అనంతరం, గాదె సాయికృష్ణ కేసు విషయమై వైవీ సుబ్బారెడ్డి స్పందిస్తూ.. రాష్ట్రంలో పైశాచిక పాలన జరుగుతోంది. సీఐని సస్పెండ్ చేస్తే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? అని ప్రశ్నించారు. ఆ తల్లికి ప్రభుత్వ సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు.వైఎస్సార్సీపీ లోక్సభ పక్షనేత మిథున్ రెడ్డి మాట్లాడుతూ..‘తమిళనాడులో లాకప్ డెత్ జరిగితే పోలీసులకు జీవిత శిక్ష విధించారు. ప్రాణాలు తీసే హక్కు పోలీసులకు ఎవరు ఇచ్చారు?. తమిళనాడు కంటే ఘోరమైన ఘటన ఇది. ఎవరికి అన్యాయం జరిగిన వారి పక్షాన వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది అని స్పష్టం చేశారు. -
నా కొడుకు ఇక లేడయ్యా..
సాక్షి, అమరావతి: పోలీసులు మా అబ్బాయిని కొడుతుంటే ఆ అరుపులు వినిపించాయి. ఏడెనిమిది మంది కొట్టి.. చంపేసేంతటి తప్పు ఏంచేశాడయ్యా.. పోలీసులు అన్యాయంగా మా పిల్లాడిని పొట్టన పెట్టుకున్నారయ్యా..’ అంటూ లాకప్డెత్ అయిన సాయికృష్ణ తల్లి కన్నీటి పర్యంతమైంది. గురువారం సాయంత్రం సాయికృష్ణ తల్లిని, కుటుంబ సభ్యులను విజయవాడ కృష్ణలంకలోని వారి నివాసంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి కన్నీరు మున్నీరు అవుతూ, బొంగురు పోయిన కంఠంతో, తన కొడుకును ఏవిధంగా పోలీసులు కొట్టి చంపారో పూసగుచ్చినట్లు వివరించారు.ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. ‘కృష్ణలంక పోలీసులు మార్కాపురం నుంచి మే 9న సాయికృష్ణను తీసుకొచ్చారు. అక్కడ స్టేషన్లో ఉంచారని కొంత మంది కుర్రాళ్లు చెబితే అక్కడి వెళ్లి, మా కొడును చూపండయ్యా అని వేడుకున్నాను. అక్కడ కానిస్టేబుల్ ఓ సమాధానం, ఎస్సై మరో సమాధానం ఇచ్చారు. పైన ఉన్నాడని, రేపు ఇంటికి పంపుతామని చెప్పారు. ఆ తర్వాత పలుమార్లు ఎండలో స్టేషన్ చుట్టూ తిరిగాను. స్టేషన్కు వెళ్లినప్పుడు అక్కడ ఉన్న యువకులు సైగలు చేశారు. కానీ నాకు సరిగా కనిపించలేదు. మా అబ్బాయి అరుపులు వినిపించాయి.పైకి వెళ్లబోతే పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ లాకప్లో ఉన్న వారు మావాడిని ఏవిధంగా కొట్టింది చెప్పారు. కాళ్ల గోళ్లు పీకేసి, ఆర్ఎంపీ డాక్టర్తో కట్టు కట్టించారని, కాళ్లకు ఇంజక్షన్లు వేయడంతో కాళ్లు పని చేయకుండా పోయాయని తెలిపారు. మెడలు విరిచారని చెప్పారు. అమ్మను చూపించండని వేడుకొంటున్నా కనికరించకుండా బలవంతంగా ఇద్దరు కానిస్టేబుళ్లు పిల్లాడిని ఈడ్చుకొని వెళ్లి రూంలో పడేశారు. ఆ తర్వాత సాయికృష్ణ గురించి అడిగితే పోలీసులు సమాధానం చెప్పలేదు. చివరకు డౌట్ వచ్చి డీజీపీకి ఫిర్యాదు చేశాం.ఆ ఫిర్యాదు సీపీ వద్దకు వచ్చింది. అప్పుడు పోలీసులు వచ్చి అయిందేదో అయ్యింది.. రాజీ చేసుకుందామని దూతలను పంపారు. ఆ దూత తూర్పు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి అమ్మిశెట్టి వాసు. దీంతో మాకు పూర్తి డౌట్ వచ్చింది. జూన్ 2వ తేదిన హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశాం. నాకు ఏమీ వద్దయ్యా.. నా కొడుకును చంపిన వారందరినీ శిక్షించాలి. ఒక్కగానొక్క కొడుకును ఏడెనిమిది మంది కొట్టి చంపేంత తప్పు ఏమి చేశాడు? శవం లేకపోతే కనీసం బూడిదైనా ఇప్పించండని అడిగినా పట్టించుకోలేదు. సీఐ నాగరాజు మా కుమారుడిని చంపేస్తానని ముందే చెప్పాడు. అన్నంత పనీ చేశాడు. ఫొటో చేయించి దండేసుకో అని హేళనగా మాట్లాడాడు’ అని కన్నీటి పర్యంతమయ్యారు. తాము అన్ని విధాల అండగా ఉంటామని ఆ కుటుంబానికి వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ఇంకా చాలా మంది ఉన్నారు.. ఈ ఘటన గురించి సాయికృష్ణ మేనమామలు ముళ్లపూడి నవరంగ్, నాగేశ్వరరావు, సోదరి విజయలక్ష్మి, న్యాయవాది అయిన పినతల్లి కనకదుర్గ జగన్కు వివరించారు. ‘సాయికృష్ణ లాంటి వారు సీఐ నాగరాజు చేతిలో దెబ్బతిని చాలా మంది చనిపోయారు. ఆయన పోలీసు స్టేషన్కు రమ్మన్నారంటే చాలు ఈ ప్రాంతంలో యువకులు హడలి పోతున్నారు. ఆయనకొట్టే కొట్టుడును తటుకోలేక పారిపోతున్నారు. మా అబ్బాయి కూడా చాలా రోజులుగా ఇక్కడ లేడు. గిగ్ వర్కర్గా జొమాటోలో పని చేస్తున్నాడు. అలాంటి వాడిని ఇక్కడికి తెచ్చి చంపేశారు.ఇదంతా పోలీసు ఉన్నతాధికారులకు తెలిసే జరిగింది’ అని చెప్పారు. ఈ సందర్భంగా సాయికృష్ణ మేనమామ నవరంగ్ మే 21న సీఐ నాగరాజు వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకున్న క్రాంతి కుమార్ వీడియోను చూపించారు. దీంతో పాటు సాయికృష్ణను కొడుతుంటే చూసిన ఓ అబ్బాయి సెల్ఫీ వీడియోను జగన్కు చూపించారు.ఆ వీడియోలో ఏముంది అంటే.. నాకళ్లారా చూశా.. లాకప్లోనే ఉన్నాడు: ప్రత్యక్ష సాక్షి మహంకాళి చందు‘నా పేరు మహంకాళి చందు అలియాస్ పూరి.. గాదె సాయికృష్ణ అలియాస్ పిల్ల సాయి అనే వ్యక్తిని కృష్ణలంక పోలీసులు స్టేషన్కు తీసుకొచ్చినప్పుడు అదే రోజు నేను స్టేషన్లో ఉన్నా. ఆ రోజు ఏం చేశారో నాకు తెలుసు. ఒక తల్లికి జరిగిన నష్టం.. మరో తల్లికి కలిగిన కష్టం ఇంకెవరికీ జరగకూడదనే ఆరోజు ఏం జరిగిందో చెబుతున్నా.. ఈ వీడియో తీస్తున్నందుకు నాకు భయం వేస్తోంది. కానీ ధైర్యం చేసి చెబుతున్నా.. నేను లాకప్లో ఉండగా అతన్ని తెచ్చి చిత్రహింసలు పెట్టారు. అది నేను చూశాను. దాని గురించి బయటకు వచ్చి చెబుదామనుకున్నా చాలాసార్లు.. నాకు జరిగింది జువైనల్ కోర్టు దగ్గరకు వెళ్లి లాయర్లకు చెబితే పోలీసులకే సపోర్టు చేశారు.అందుకే ఎవరికీ చెప్పలేదు. అన్యాయంగా చంపేసి నీ కొడుకును చంపేశామని చెప్పడం న్యాయం కాదు. పైగా సాయి గురించి జనాలకు చెడ్డగా చెబుతున్నారు.. అతను అమ్మాయిలను ఏడిపించాడని ప్రచారం చేస్తున్నారు. మరి ఏ అమ్మాయి అయినా ఫిర్యాదు చేసిందా? పోలీసుల థర్డ్ డిగ్రీ ఎలా ఉంటుందంటే.. శరీరంపై కొన్ని చోట్ల కరెంట్ షాక్ ఇస్తారు. దాని గురించి కోర్టులో చెప్పకూడదని బెదిరిస్తారు. ఏది ఏమైనా చంపే హక్కు వారికి లేదు. తప్పు చేసిన వాడిని జైల్లో పెట్టాలి. అంతే. ఏ శిక్ష వేయాలో కోర్టు నిర్ణయిస్తుంది. బాబురావు, నాని ఆ రోజు సాయిని పట్టుకుని కొడుతున్నారు.సీలింగ్ తెగిపోయిందని చెబుతున్నా సీఐ వినలేదు. ఆ తర్వాత ఆ రోజు నన్ను, మిగతా వాళ్లను స్టేషన్ నుంచి బయటకు పంపారు. సీఐ నాగరాజు చాలా చేశారు. బయటకు రాలేదు. ఒక తల్లిగా ఆమె ఎంత బాధ పడుతుందో అందరూ చూస్తున్నాం. బాబురావు మనుషులను ఎంత దారుణంగా కొడతాడో చాలా మంది దగ్గర వీడియోలు ఉన్నాయి. నాకు ఒక అవకాశం ఇస్తే మీడియా ముందుకు వస్తా.. చాలా మంది నిన్ను చంపుతారు.. వీడియో చేయొద్దు అని నాకు చెబుతున్నారు.. ఏం జరిగినా నష్టం లేదు. నా తల్లికి కూడా ఇదే జరుగుద్ది.ఏపీలో న్యాయం బతకాలి’ అని మహంకాళి ఆ వీడియోలో చెప్పాడు. కాగా, సాయికృష్ణ కుటుంబ పరామర్శలో జగన్ వెంట వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, వెలంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, ఎమ్మెల్సీలు తలశిల రఘరాం, లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కైలే అనిల్కుమార్, సింహాద్రి రమేష్, పార్టీ నేతలు వంగవీటి నరేంద్ర, రామిరెడ్డి, కొండారెడ్డి, దొడ్డా అంజిరెడ్డి, ఆళ్ల చెల్లారావు, పుప్పాలకుమారి, అవుతు శైలజారెడ్డి తదితరులు ఉన్నారు. -
సీబీఐ దర్యాప్తు జరగాలి
సాక్షి, అమరావతి: విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో లాకప్డెత్కు గురైన గిగ్ వర్కర్ సాయికృష్ణ కేసులో సీబీఐ దర్యాప్తు జరగాలని, అందుకు బాధ్యులైన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కేసులో విజయవాడ కమిషనర్తో పాటు, రాష్ట్ర డీజీపీకి కూడా ప్రమేయం ఉందన్నారు. కేవలం కంటి తుడుపుగా సీఐని సస్పెండ్ చేశారని, విజయవాడ సీపీ, డీజీపీతో సహా బాధ్యులందరిపై మర్డర్ కేసు పెట్టి శిక్షించాలని తేల్చి చెప్పారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో లాకప్డెత్కు గురైన గాదె సాయికృష్ణ తల్లి, కుటుంబ సభ్యులను గురువారం ఆయన పరామర్శించారు. కృష్ణలంకలో ఉంటున్న వారి ఇంటికి వెళ్లి జరిగిన దారుణం గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన అక్కడే మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే..గాదె సాయికృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రతి ఒక్కరూ ఆలోచించాలివిజయవాడ నడిబొడ్డున, అంటే రాష్ట్రానికి రాజధాని ప్రాంతం. ఇక్కడి నుంచి కూతవేటు దూరంలోనే ముఖ్యమంత్రి నివాసం. ఇక్కడి నుంచి కూతవేటు దూరంలోనే డీజీపీ కార్యాలయం. విజయవాడలోనే కమిషనరేట్ కూడా ఉంది. ఇక్కడే ఏసీపీ పరిధి. ఇదే పరిధిలోనే కృష్ణలంక పోలీసు స్టేషన్ ఉంది. ఇదే పోలీసు స్టేషన్ పరిధిలోనే ఈ తల్లి (జగన్ పక్కనే ఉన్న సాయికృష్ణ తల్లి) ఎంత దారుణంగా ఈ ఘటన జరిగిందో చెబుతూ రోదిస్తున్న దృశ్యం కనిపిస్తోంది. ప్రతి ఒక్కరినీ ఒకటే ఆలోచన చేయమని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు దగ్గరుండి ప్రోత్సహిస్తున్న కొంత మంది పోలీసులు, వీరు చేసే పనుల వల్ల ఈ రాష్ట్రంలో ఏదైనా అన్యాయం జరిగితే పోలీసు స్టేషన్కు వెళ్లడానికి భయపడే పరిస్ధితి నెలకొంది. అలా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతోంది. అందరూ కూడబలుక్కుని ఒకరినొకరు ఎలా వెనకేసుకు వస్తున్నారో చెప్పడానికి ఇదే నిదర్శనం. ‘పోలీసులు చెబుతున్నట్లు నా కొడుకు దోపిడీలు, దొంగతనాలు చేసి కోట్లు గడిస్తే, ఒక గిగ్ వర్కర్గా ఎందుకు పని చేస్తాడు బాబూ..’ అని ఆ తల్లి తన గోడు వెళ్లబోసుకుంది. ఆ కుటుంబం పరిస్థితి అంత దారుణంగా ఉంది.‘నీ కొడుకు ఫొటోకు దండ వేసుకో’ అన్న పోలీసులు ఆ రోజు (మే 9) నుంచే సాయికృష్ణ తల్లి పోలీసుస్టేషన్ చుట్టూ తిరిగితే, ‘నీ కొడుకు ఫొటోకు దండ వేసుకో..’ అంటూ ఈ తల్లిని సీఐ హేళనగా మాట్లాడారు. ఆ రోజు నుంచి ప్రతి రోజూ ఆ స్టేషన్లో జరుగుతున్న విషయాల మీద మిగతా వాళ్లు సమాచారం ఇస్తుంటే, తన కుమారుడిని పోలీసులు చిత్రహింసలు పెడుతున్నారని ఆ తల్లికి అర్థమైంది. దీంతో ప్రతి రోజూ అదే పోలీసు స్టేషన్కు వెళ్లి నా కొడుకును నాకు చూపించమని బాధ పడిన పరిస్థితులు మన కళ్లెదుటే కనిపిస్తున్నాయి. ఈ ఘటన మీద ఈ తల్లితో పాటు చిన్నమ్మ అయిన లాయర్ డీజీపీ ఆఫీసుకు వెళ్లి రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఏమైంది? చివరికి చెత్త బుట్టలోకి వెళ్లింది. డీజీపీ ఫిర్యాదును సీపీకి పంపించడం, సీపీ యాక్షన్ తీసుకోకుండా మిగతా వాళ్లను పిలిపించి బేరం పెట్టించే కార్యక్రమం చేశారు.హైకోర్టును ఆశ్రయించాక ఒప్పుకున్నారుతన కుమారుడికి ఏదో జరిగిందని ఆ తల్లికి అర్థమై.. తన కొడుకు కనిపించడం లేదు, వీళ్లు ఏదో చేశారని జూన్ 2న హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసింది. అప్పుడు కోర్టు జోక్యం చేసుకోవడంతో పాటు, మన లాంటి వాళ్లంతా ఆ తల్లికి అండగా నిలబడితే గత్యంతరం లేక ఈ రోజు సీఐపై చర్యలు తీసుకున్నారు. చంపేశాడనే కదా సీఐని సస్పెండ్ చేసింది! అంటే ఒకే పోలీసు స్టేషన్లోనే, ఆ సీఐని కాపాడుతూ ఏసీపీ, ఏసీపీని కాపాడుతూ కమిషనర్, కమిషనర్ను కాపాడుతూ డీజీపీ.. ఇలా అందరికీ తెలిసి ఆ స్టేషన్లో జరిగింది ఒక హత్య మాత్రమే కాదు. పోలీసు స్టేషన్లలో ఇలా కొడుతూ ఒకరి చావుకు కారణమైతే, ఇంకొకరు ఆత్మహత్య చేసుకుంటూ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. నేను ఒకటే చెబుతున్నా. సస్పెన్షన్ అంటే ఏంటి? టెంపరరీగా ఒక పోలీసు అధికారిని డ్యూటీ నుంచి తప్పించడం. అంటే.. గోళ్లు పీకి, చిత్ర హింసలు చేసి హత్య చేస్తే ఆ వ్యక్తిని తాత్కాలికంగా విధుల నుంచి తప్పించారు. ఇదా చేయాల్సింది? అది కూడా ఇంత పెద్ద ఇష్యూ జరిగి బయటికి వస్తే ఆ సస్పెన్షన్ చేశారు. ఇది బయటికి రాకపోయుంటే ఆ ఆలోచన కూడా వచ్చేది కాదు.కృష్ణలంకలో జనానికి అభివాదం చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి తప్పు చేస్తే కోర్టు శిక్షిస్తుంది కదా..ఇంత పెద్ద హేయమైన కార్యక్రమం జరిగిందంటే..ఆ సీఐని, బాధ్యుడైన కమిషనర్ను, డీజీపీని మర్డర్ కేసు పెట్టి ఛార్జ్ చేయాల్సింది పోయి కేవలం సీఐని సస్పెన్షన్ మాత్రమే చేశారు. అంటే అందరూ పకడ్బందీగా, కలిసికట్టుగా నేరం చేసి.. తూతూ మంత్రంగా, కంటితుడుపు చర్యగా, టెంపరరీగా ఓ అధికారిని తప్పించారు. ఇదా మనం ఈ రాష్ట్రంలో చూడాల్సింది? ఆ పిల్లాడి వయసు 23 ఏళ్లు. అంటే వీళ్లంతా చిన్న పిల్లలే. తెలిసో తెలియకో తప్పు చేసి ఉండొచ్చు. కోర్టు ఈ పిల్లాడిని ప్రొడ్యూస్ చేయమని సమన్ జారీ చేసింది. పోలీసులు చేయాల్సింది ఏంటి? ఆ పిల్లాడిని కోర్టుకు సబ్మిట్ చేయాలి. ఆ పిల్లాడు తప్పు చేశాడా, లేదా అన్నది విచారణ చేసి కోర్టు నిర్ధారిస్తుంది. ఆ తర్వాత తప్పు జరిగిందని తేలితే కోర్టు శిక్ష వేస్తుంది. కానీ ఇక్కడ కోర్టు పాత్ర లేదు. వీళ్లే తమ చేతుల్లోకి తీసుకుని ఏకంగా ఇద్దరు పిల్లలు ఒకే నెలలో చనిపోవడానికి కారణమయ్యారు.సీఐ మాత్రమే బాధ్యుడు కాదుసీఐ, ఏసీపీ, కమిషనర్ దగ్గరి నుంచి డీజీపీ దాకా ఇలాంటి వ్యక్తులకు ముఖ్యమంత్రి దగ్గరుండి కంటి తుడుపు చర్యలు చేపట్టి, కేవలం సస్పెన్షన్తో సరిపెడితే వీటికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది? ఫుల్ స్టాప్ పడాలంటే దీని మీద సీబీఐ దర్యాప్తు జరగాలి. ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారనేది బయటికి రావాలి. ఆ పోలీసుల మీద యాక్షన్ తీసుకోవడంలో ఎందుకు డిలే జరిగింది? సస్పెన్షన్ మాత్రమే చేసి టెంపరరీగా సీఐని ఉద్యోగం నుంచి పక్కన బెట్టారంటే ఇదంతా ఒక పద్ధతి ప్రకారం చేసినట్లు స్పష్టమవుతోంది. ఈ క్రైమ్లో సీఐ ఒక్కడే కాదు.. ఏసీపీ, సీపీ, డీజీపీ ఇన్వాల్స్ అయి ఉన్నారు. అందుకే సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేస్తున్నాం. న్యాయ పోరాటంలో ఈ తల్లికి, చనిపోయిన మరో పిల్లాడి కుటుంబానికి వైఎస్సాసీపీ సంపూర్ణంగా అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం.మే నెలలోనే రెండు ఘటనలుమే నెలలో సాయికృష్ణది ఓ ఘటన అయితే, క్రాంతికుమార్ అనే మరో యువకుడిది ఆత్మహత్య ఘటన. పలానా పోలీసు స్టేషన్ పరిధిలో పలానా సీఐ రోజూ నన్ను కొడుతున్నాడు.. నేను తట్టుకోలేకపోతున్నాను.. నా చావుకు కారణం ఆ సీఐ.. అని మరణ వాంగ్మూలం ఇస్తూ ఆత్మహత్య చేసుకున్నాడు. (కృష్ణలంక సీఐ వేధిస్తున్నాడని, తన చావుకు సీఐ కారణమని మరణ వాంగ్మూలం ఇస్తూ క్రాంతికుమార్ విడుదల చేసిన సెల్ఫీ వీడియోను మీడియా ఎదుట జగన్ ప్రదర్శించారు).సీబీఐ దర్యాప్తు జరగాల్సిందేమే 9వ తేదీ నుంచి రెండు మర్డర్ ఘటనలు జరిగితే ఇప్పుడు జూన్లో బయటికి వచ్చిన తర్వాత కంటి తుడుపు చర్యగా అరెస్టులు కూడా చేయకుండా సస్పెన్షన్లు చేస్తున్నారు. ఏ విధంగా వీళ్లంతా నేరాన్ని బయటికి రాకుండా చేస్తున్నారో అర్థం అవుతోంది. ఈ తల్లి దగ్గరకు పంచాయతీలు చేసి, సర్దుబాట్లు చేసుకునేందుకు బేరసారాలు చేస్తూ.. తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన ఇన్ఛార్జ్లు వచ్చి మాట్లాడుతున్నారంటే రాష్ట్రంలో ఎలాంటి దారుణమైన పరిస్ధితులు ఉన్నాయో గమనించాలి. కమిషనర్, డీజీపీ వంటి వంటి వ్యక్తులు పూర్తిగా ఇన్వాల్స్ అయ్యి.. నేరం చేయించారని కనిపిస్తున్నా, ఓ ఎస్పీ స్థాయి అధికారికి వీళ్లు దర్యాప్తు చేయడానికి బాధ్యత అప్పగించారట! అంటే వీళ్లు లా అండ్ ఆర్డర్తో, ప్రజల ప్రాణాలతో ఏ విధంగా చెలగాటం ఆడుతున్నారనే దానికి ఇది ఇంకొక నిదర్శనం. అందుకే సీఐ మొదలు ఏసీపీ, కమిషనర్, డీజీపీ, హోంమంత్రి, ముఖ్యమంత్రి వరకూ అందరూ నిర్లక్ష్యపు వైఖరితో ఉన్నారు కాబట్టి సీబీఐ దర్యాప్తు జరగాల్సిందే. దోషులు ఎవరో తెలిసి కూడా ఎలా కాపాడుతున్నారు.. ఎందుకు ఇలాంటి లాకప్ డెత్లు జరుగుతున్నాయో తెలియాలంటే సీబీఐ విచారించాల్సిందే అని డిమాండ్ చేస్తున్నాం’ అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. -
‘రెడ్బుక్ రాజ్యాంగం నిజ స్వరూపం బయటపడింది’
సాక్షి, కాకినాడ జిల్లా: రెడ్ బుక్ రాజ్యాంగం నిజ స్వరూపం బయటపడిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులను విచ్చలవిడిగా చేతిలో అస్త్రంలా టీడీపీ వాడుకొంటోంది. విజయవాడ లాకప్ డెత్ ఘటన.. చట్టాలు, మానవ హక్కులు లేవని చెప్పింది. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ మాట్లాడితే కులం రంగు పులుముతున్నారని ఆయన మండిపడ్డారు.‘‘లాకప్ డెత్ మానవ హక్కులకు సంబంధించిన విషయం. దీంట్లో కులాల్ని, మతాలను తీసుకువచ్చి ఇష్యూను డైవర్ట్ చేస్తున్నారు. చంద్రబాబుకు మద్దతుగా సొంత మీడియా రంగంలోకి వచ్చేసింది. లాకప్ డెత్ ఇష్యూలో పవన్ కళ్యాణ్ను ఇరికించాలని వైఎస్ జగన్ మాకు ఆదేశించినట్లు.. దానికి పర్యవేక్షణ బాధ్యత నాకు ఇచ్చినట్లుగా ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది. పవన్ను ఇరికించాలని వైఎస్ జగన్ ఎందుకు అంటారు?. వైఎస్సార్సీపీకి ఏం సంబంధం?’’ అంటూ కన్నబాబు ప్రశ్నించారు.రాష్ట్రంలో శాంతి భద్రతలు చూసే హోం మంత్రి, ముఖ్యమంత్రి లాకప్ డెత్ ఘటనకు బాధ్యులు. వీరితో పాటుగా డీజీపీ, సీపీ, ఏసీపీ, సీఐ, ఇతర స్టాప్ బాధ్యులు. చంపేసి బూడిద చేయడం పోలీసుల పరాకాష్ట. లాకప్ డెత్పై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్ జగన్ డిమాండ్ను ఆమోదించాలి. పోలీసులు అధికార పార్టీ కార్యకర్తల్లా పని చేస్తున్నారన్న వాస్తవం లాకప్ డెత్ కళ్లకు కట్టినట్లుగా చెప్పింది. చట్టాన్ని అమలు చేయాలనే గౌరవం, భయం పోలీసులకు పోయింది’’ అని కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. -
నా పాదయాత్ర ఎప్పుడంటే...
-
జగన్ 2.0 చీకటిపై దండయాత్ర..
-
సాయి కృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన YSRCP నేతలు
-
‘వారికి తెలియకుండానే సీఐ ఇదంతా చేశారా?’
సాక్షి, విజయవాడ: గాదె సాయికృష్ణ దుర్ఘటన జరిగి చాలా రోజులైందని.. వెలుగులోకి రావడానికి చాలా రోజులు పట్టిందంటే వ్యవస్థలు ఎంత దారుణంగా ఉన్నాయో తెలుస్తోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఇవాళ(గురువారం) కృష్ణలంకలోని గాదె సాయికృష్ణ కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, వంగవీటి నరేంద్ర పరామర్శించారు.ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘‘గాదె సాయికృష్ణను మే 9వ తేదీన తీసుకొచ్చారు. మే 9వ తేదీ నుంచి సాయికృష్ణను కోసం తల్లి విజయలక్ష్మి తీవ్రంగా ప్రయత్నించారు. విజయలక్ష్మి చెల్లి దుర్గ డీజీపీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. హ్యూమన్ రైట్స్ వద్దకు వెళితే అడ్డుపడ్డారు. హెబియస్ కార్పస్ వేయకుండా చాలా ఇబ్బందులు పెట్టారు. జూన్ 15వ తేదీన కోర్టు ఆర్డర్ వచ్చాక మా దృష్టికి తెలిసింది. సాయికృష్ణ కుటుంబం మాకు బాగా తెలిసిన వారే..సాయికృష్ణ పై ఓ వర్గం మీడియా దుర్మార్గంగా ప్రచారం చేస్తోంది. కేసులున్నంత మాత్రాన చంపేస్తారా?. కసబ్ను కూడా విచారించాకే శిక్ష విధించారు. సాయికృష్ణ డెడ్బాడీ లేకుండా చేశారు. కనీసం బూడిదైనా ఇవ్వండని సాయికృష్ణ తల్లి వేడుకుంటోంది. సాయికృష్ణ కుటుంబం మా పార్టీ కాదు. అయినా మానవత్వంతో ఆ కుటుంబానికి అండగా ఉంటాం. మేం రాజకీయాలు చేయాలంటే చాలా అంశాలున్నాయి..సాయికృష్ణ అంశాన్ని రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకు లేదు. సాయికృష్ణ లాకప్ డెత్పై సీబీఐ విచారణ జరిపించాల్సిందే. బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందే. పార్టీలకు అతీతంగా అందరూ సాయికృష్ణ కుటుంబం కోసం కలిసిరావాలి. పోలీసుల దుర్మార్గపు చర్యలను నిలదీద్దాం. మేం ఆ కుటుంబానికి అండగా ఉంటాం. నేను విడుదల చేసిన ఫోటోలు సాయికృష్ణవి కాకపోతే అతన్ని తీసుకురండి. మానవసమాజం తలదించుకునే ఘటన ఇది.ఇలాంటి ఘటనలను పౌరసమాజం కచ్చితంగా స్పందించాలి. పోలీస్ కమిషనర్, డీజీపీ, హోంమంత్రి, ప్రభుత్వానికి తెలియకుండానే సీఐ ఇదంతా చేశారా?. అందరికీ తెలిసే సాయికృష్ణ మృతదేహాన్ని దహనం చేశారు. ఈ ప్రభుత్వానికి దమ్ముంటే సీబీఐ విచారణ చేయించాలి. పోలీసు విచారణతో న్యాయం జరగదు. సీబిఐ విచారణతోనే న్యాయం జరుగుతుంది. సాయికృష్ణను చంపి బూడిద చేసినట్లే కేసును కూడా బూడిద చేయాలని చూస్తున్నారు. కేంద్రం స్థాయిలో ఈ అంశాన్ని తీసుకువెళతాం. సీఐ నాగరాజును సస్పెండ్ చేయడంతోనే నేరం సగం అంగీకరించారు’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు. -
జగన్ కన్నా ఎక్కువ ఇస్తామన్నారు.. ఏమైంది
-
ఏపీలో చాలా దారుణమైన పరిస్థితులు: వైఎస్ జగన్
తాడేపల్లి: రాష్ట్రంలో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. రంపచోడవరం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో గురువారం వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ... ఇప్పటికే రెండేళ్లు అయిపోయిందని, చంద్రబాబు విధ్వంసకర పాలనపై ప్రతి ఇంట్లోనూ చర్చ జరుగుతోందని తెలిపారు. ‘‘వైఎస్ జగన్ పాలనతో ప్రజలు పోల్చిచూస్తూ చర్చించుకుంటున్నారు. ఐదేళ్ల పాలనలో ఎప్పుడూ లేని విధంగా మంచి పాలన ఇవ్వగలిగామని గర్వంగా చెప్పగలం.మేనిఫెస్టోకు విలువలేని రోజులను చూశాం. ఎన్నికలు అయిన తర్వాత చెత్తబుట్టలో పడేసేవాళ్లు. అలాంటి మేనిఫోస్టోకు విలువను తీసుకు వచ్చాం. 99శాతం హామీలను అమలు చేసిన ఏకైక పార్టీ వైఎస్సార్సీపీనే. క్యాలెండర్ పెట్టుకుని మరీ మనం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం. పరిపాలనలో అనేక మార్పులు తీసుకువచ్చాం’’ అని చెప్పారు. మనం రాకముందు ఎలా ఉండేవి? గత వైఎస్సార్సీపీ పాలనను వైఎస్ జగన్ గుర్తుచేశారు. ‘‘మనం రాకముందు స్కూళ్లు, ఆసుపత్రులు ఎలా ఉండేవి? మన పరిపాలనలో ఎలా మార్పులు చేశామో ప్రజలు చూశారు. రైతులను ఎలా ఆదుకున్నామో కూడా మీరు చూశారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు, పథకాలు అందలేని పరిస్థితిని మనం చూశాం. ఏ పనికావాలన్నా లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితులు చూశాం. వాటన్నింటినీకూడా మనం మార్చాం. విద్య, వ్యవసాయం, వైద్య రంగాల్లో గొప్ప గొప్ప మార్పులు తీసుకు వచ్చాం. గిరిజన ప్రాంతాల్లో గొప్ప అభివృద్ధి చేశాం. 3 లక్షలకు పైగా ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు గిరిజన కుటుంబాలకు ఇచ్చాం. రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తెస్తే పాడేరులో, పార్వతీపురంలో, ఏజెన్సీ ప్రాంతానికి ముఖద్వారమైన నర్సీపట్నంలో మూడు తెచ్చాం. కురుపాలంలో ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజీ, సాలూరులో ట్రైబల్ యూనివర్శిటీ తెచ్చాం. ఇది కేవలం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది. ఐటీడీఏ పరిధుల్లో 5 మల్టీస్పెషాల్టీఆస్పత్రులు తెచ్చాం. మన ప్రభుత్వంలో వేగంగా పనులు జరిగాయి. ఒక తపన, తాపత్రయంతో ఈ పనులు చేశాం. ప్రజల జీవితాల్లో మార్పులు రావాలని చూశాం. నా మరణం తర్వాత కూడా ప్రతి ఇంట్లో నా ఫొటో ఉండాలని పనిచేశాం. ఈ రెండేళ్ల పాలనలో చంద్రబాబు పాలనలో అన్నీ విధ్వంసమే. జగన్ ఇచ్చేవేకావు.. జగన్కన్నా ఎక్కువ ఇస్తామన్నారు. ప్రతి ఇంటికీ బాండ్లు పంచారు. ఏ కుటుంబానికి ఎంత వస్తుందోనని లెక్కలువేసి మరీ చెప్పారు. ఎన్నికలు అయిన తర్వాత మోసం చేశారు’’ అని చెప్పారు.చంద్రబాబు పాలనకు త్వరలోనే ముగింపుమరో ఏడాదిన్నరలో తన పాదయాత్ర కూడా ప్రారంభమవుతుందని వైఎస్ జగన్ అన్నారు. ‘‘చంద్రబాబు దుర్మార్గమైన పాలనకు త్వరలోనే ముగింపు పడుతుంది. రాష్ట్రంలో అన్యాయమైన పాలన చూస్తున్నాం. ప్రశ్నించే వారిపై దొంగకేసులు పెడుతున్నారు. రెడ్బుక్ రాజ్యాంగం వెర్రితలలు వేస్తోంది. చీకటి కొంతకాలమే ఉంటుంది, వెలుగురాకతప్పదు. ప్రజల తరఫున పార్టీ నాయకులు గట్టిగా నిలబడాలి. బాధితులకు అండగా నిలవాలి. పార్టీ నాయకులు ఈ బాధ్యతను విస్మరించవద్దు. జగన్ 2.Oలో కార్యకర్తలను బాగా చూసుకుంటాను. ప్రతి సంక్షేమ కార్యక్రమం కార్యకర్తల చేతులమీదుగా ప్రజలకు అందుతుంది. పేదవాడికి మీరంతా తోడుగా ఉండాలి. పేదవాడికి మాత్రం తోడుగా ఉండాలనే మిమ్మల్ని కోరుతున్నాను.చంద్రబాబు పాలనలో మొదటి ఏడాది అమ్మ ఒడి ఎగరగొట్టారు. రెండో ఏడాది కొంతమందికి రూ.9వేలు, రూ.10వేలు, రూ.13వేలు చొప్పున ఇచ్చారు. పీఎంకిసాన్ కాక రైతులకు అన్నదాత సుఖీభవ కింద రెండేళ్లలో రూ.4౦ వేలు ఇవ్వాలి. రెండేళ్లకు కలిపి ఇచ్చింది రూ.14వేలు. బాకీ రూ.26 వేలు. ఆరు గ్యాస్ సిలెండర్లు ఇవ్వాలి. రెండు ఇచ్చామంటున్నారు, అదికూడా అందరికీ అందలేదు’’ అని అన్నారు. కాగా, పోలవరం ముంపు ప్రాంతాల్లో పరిహారం చెల్లింపుల్లో వివక్ష కొనసాగుతోందని సమావేశంలో ప్రస్తావించగా, దీనిపై పార్టీ తరపున పోరాడుతామని వైఎస్ జగన్ చెప్పారు. నిర్వాసితులు తమ పార్టీలో చేరితేనే, పరిహారం ఇస్తామని చెబుతున్నారని, ఇది ఏ మాత్రం సరికాదని స్పష్టం చేశారు. వీటన్నింటిపై పోరాటం కొనసాగిస్తామని, అయినా న్యాయం జరగకపోతే, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేద్దామని వివరించారు. -
తాగు.. ఊగు... ఇదే బాబు గారి గ్రేట్ విజన్!
-
సీఐకి డైరెక్షన్ ఇచ్చిన కూటమి నాయకుడు..!? హత్య వెనుక ప్రభుత్వ హస్తం..?
-
‘సాయికృష్ణ ఘటన సీపీకి తెలిసే జరిగింది’
సాక్షి, తాడేపల్లి: ఏపీలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా నాశనమైందని వైఎస్సార్సీపీ నాయకులు దేవినేని అవినాష్ ఆరోపించారు. సీపీగా రాజశేఖర్ బాబు వచ్చాక విజయవాడ గాడి తప్పిందని సంచలన ఆరోపణలు చేశారు. దేశ చరిత్రలో ఎక్కడా జరగని ఘోరం విజయవాడలో జరిగింది. పోలీసులే యువకుడిని కొట్టి చంపేసి, కాల్చి బూడిద చేశారు అంటూ వ్యాఖ్యలు చేశారు.గాదె సాయికృష్ణ ఘటనపై దేవినేని అవినాష్ స్పందిస్తూ..‘విజయవాడ నగరంలో పోలీసులు రెడ్బుక్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నారు. రెండేళ్లుగా గంజాయి విక్రయాలు, సెటిల్మెంట్స్ విపరీతంగా పెరిగిపోయాయి. నగరంలో లా అండ్ ఆర్డర్ని సీపీ రాజశేఖర్ బాబు గాలికి వదిలేశారు. దర్జాగా గంజాయి స్మగ్లింగ్ జరుగుతుంటే సీపీ పట్టించుకోవడం లేదు. రౌడీ షీటర్స్ నడిరోడ్డుపై ప్రజల్ని ఇబ్బంది పెడుతూ దర్జాగా తిరుగుతున్నారు. పేకాట క్లబ్లు విచ్చలవిడిగా నడుస్తున్నా సీపీ పట్టించుకోరు.సాయికృష్ణ ఘటన సీపీకి తెలిసే జరిగింది. సీపీ బాధ్యత వహించాలి సమాధానం చెప్పాలి. సీపీ ఎందుకు మాట్లాడటం లేదు?. వైఎస్సార్సీపీ నేతల్ని వేధించడంలో సీపీ రాజశేఖర్ బిజీగా ఉన్నారు. చంద్రబాబు, లోకేష్ కళ్లలో ఆనందం చూడటానికే సీపీ పని చేస్తున్నాడు. సీఎం, డిప్యూటీ సీఎం సమావేశమై బాధిత కుటుంబానికి ఏం న్యాయం చేశారు?. మీ పార్టీల జెండాలు పట్టుకుని ఎన్నికల్లో తిరిగిన కుటుంబానికి మీరు ఇచ్చిన భరోసా ఏది?. సాయికృష్ణను కొట్టి చంపేసి కాల్చి బూడిద చేశారు. ఇదే నిజం. బాధిత కుటుంబానికి అండగా ఉండాల్సిన స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కనీసం పరామర్శించలేదు. జనసేన ఇంచార్జ్ అమ్మిశెట్టి వాసు ఏకంగా డబ్బులిస్తామని సెటిల్మెంట్ చేస్తున్నాడు’ అంటూ విమర్శలు గుప్పించారు. -
మామిడి పంటకు గిట్టుబాటు ధర.. వైఎస్సార్సీపీ నిరసనలు
సాక్షి, చిత్తూరు: చిత్తూరులో మామిడి రైతులకు మద్దతుగా వైఎస్సార్సీపీ సంఘీభావం తెలిపింది. మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ మామిడి రైతులతో కలిసి పార్టీ నేతలు ఆందోళనకు పిలుపునిచ్చారు. జీడి నెల్లూరు జైన్ ఫ్యాక్టరీ ఎదుట వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఆధ్వర్యంలో నిరసన కొనసాగుతోంది. ఈ సందర్భంగా భారీ ఎత్తున మామిడి రైతులు నిరసనల్లో పాల్గొన్నారు. మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.కాగా, గత ఏడాది మామిడి పంటకు కిలో 12 రూపాయలు గిట్టుబాటు ధరను ప్రభుత్వం కల్పించింది. ఈ ఏడాది మామిడి పంటను తక్కువ ధరకే కిలో 4 నుంచి 5 రూపాయలకు మించి జ్యూస్ ఫ్యాక్టరీలు కొనుగోలు చేయడం లేదు. జ్యూస్ ఫ్యాక్టరీల యజమాన్యాలు సిండికేట్గా మారి మామిడి రైతులను నిలువు దోపిడి చేస్తున్నాయని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తోతాపురి మామిడి పంటకు కిలో 15-20 రూపాయలు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.ఇదిలా ఉండగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మామిడి రైతులకు మద్దతుగా నిలవడంతో ముందుగా మామిడి లోడు ట్రాక్టర్లను పోలీసులు లోపలికి పంపించారు. జైన్ ఫ్యాక్టరీ ఎదుట భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. ఇక, మూడు నుంచి నాలుగు రోజుల పాటు మామిడి రైతులు అక్కడే పడిగాపులు కాస్తున్నారు. -
ఓరేయ్ కుక్క.. కిరాక్ RP పై ధ్వజమెత్తిన మహిళలు
-
రంపచోడవరం కేడర్తో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. రంపచోడవరం నియోజకవర్గ కేడర్తో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి నియోజకవర్గానికి చెందిన స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరుగుతోంది. -
YSRCP ఆఫీస్ లో బాత్ రూమ్ లు కడుగుతూ విన్నావా..!?
-
సీబీఐ విచారణ జరిపించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: విజయవాడ కృష్ణలంకలో గాదె సాయికృష్ణ లాకప్ డెత్ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. గుంటూరులో బుధవారం వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర, గాదె సాయికృష్ణ మేనమామ నవరంగ్తో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. విజయవాడలో జరిగిన లాకప్డెత్ ఘటన, పోలీసులు వ్యవహరించిన తీరు దేశంలోనే అత్యంత దుర్మార్గపూరితమని మండిపడ్డారు.ఎక్కడైనా లాకప్డెత్ జరిగితే కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగిస్తారని, సాయికృష్ణ మృతదేహాన్ని పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా కాల్చి వేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. 23 ఏళ్ల యువకుడు సాయికృష్ణను అరెస్టు చేసిన కృష్ణలంక సీఐ.. చిత్రహింసలకు గురి చేయడం వల్లే అతను మృతి చెందాడని, ఆధారాలు లేకుండా చేసేందుకు శవాన్ని శ్మశానంలో దహనం చేశారని ఆరోపించారు. శాంతి భద్రతలను కాపాడి ప్రజలకు అండగా ఉండాల్సిన పోలీసులు చేయాల్సిన పనేనా ఇది అని ప్రశ్నించారు. తల్లడిల్లిన కన్నపేగు గాదె సాయికృష్ణ కన్నతల్లి మాట్లాడిన తీరు వర్ణనాతీతమని, తన కొడుకును చంపేసి ఉంటే శవాన్ని అప్పగించాలని, బూడిద చేసి ఉంటే కనీసం చితాభస్మాన్ని అయినా అప్పగించాలని వేడుకున్న తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోందని అంబటి చెప్పారు. పోలీసులు ఏ ధైర్యంతో ఈ విధంగా సాయికృష్ణను చిత్రహింసలకు గురి చేసి చంపేశారని ప్రశ్మీంచారు. అతను రౌడీషీటర్ అని ఆరోపిస్తున్న పోలీసులు అతనిపై ఎన్నో కేసులు పెండింగ్లో ఉన్నట్లు చెబుతున్నారని, రౌడీషీటర్ అయితే చంపేస్తారా అని నిలదీశారు. సాయికృష్ణ తండ్రి, ఆయన అన్నదమ్ములది ఉమ్మడి కుటుంబమని, జనసేన పార్టీలో క్రియశీలకంగా కొనసాగుతున్నారని చెప్పారు.సాయికృష్ణను అరెస్టు చేసి, విజయవాడలో నడిరోడ్డుపై నడిపించిన ఘటనను ప్రజలంతా కళ్లారా చూశారని, హైకోర్టులో పోలీసుల తీరుకు వ్యతిరేకంగా హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఈనెల 29లోగా సాయికృష్ణను కోర్టు ఎదుట హాజరు పర్చాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారని చెప్పారు. హైకోర్టు జోక్యంతో పోలీసులు పాల్పడిన నేరం, పాశవికంగా చేసిన హత్య ఉదంతం వెలుగులోకి వస్తాయన్నారు. లాకప్డెత్కు పాల్పడిన సీఐపై మాత్రమే చర్య సరిపోదని, బాధ్యులైన పోలీసులందరిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.ఈ ఘటనపై సీబీఐ, సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తే నిజా నిజాలు వెలుగు చూస్తాయన్నారు. సాయికృష్ణ కుటుంబానికి, అతని తల్లి విజయలక్ష్మీ కి అండగా నిలిచి, న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని చెప్పారు. డబ్బులు ఇస్తాం కేసు వెనక్కు తీసుకోవాలని పోలీసులు, వారి వెనుక ఉన్న టీడీపీ, జనసేన నేతలు సాయికృష్ణ కుటుంబంపై ఒత్తిడి తెస్తున్నారని, డబ్బులు ఇచ్చి హత్యా నేరాన్ని కడిగేసుకుంటారా అని నిలదీశారు.ఈ విషయంలో సరైన యాక్షన్ లేకపోతే ప్రజల రియాక్షన్ చూస్తారని హెచ్చరించారు. కాపు యువకుడిని చంపేసి, శవం కాల్చేసి మాయం చేయడమే కాకుండా.. అదే కాపు యువకుడి కుటుంబానికి డబ్బులిచ్చి రాజీ చేయడం కోసం మళ్లీ కాపు నేతను మధ్యవర్తిత్వం పంపడం దారుణమని కాపులంతా మండిపడుతున్నారని చెప్పారు. జనసేన కుటుంబ సభ్యుడికి అన్యాయం జరిగితే ఆ పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. మానవత్వంతో స్పందించాలి వంగవీటి నరేంద్ర మాట్లాడుతూ.. గాదె కుటుంబానికి వంగవీటి కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పారు. గాదె సాయికృష్ణ నిందితుడని, అతడిని కోర్టు.. నేరస్తుడిగా తీర్పు చెప్పలేదన్నారు. జరిగిన ఘటనపై న్యాయం కోసం గళం విప్పిన అంబటి ప్రవేశంతో వైఎస్సార్సీపీ ముద్ర వేశారని, రాష్ట్రంలో కూటమి పాలన నరరూప రాక్షస పాలనను తలపిస్తోందన్నారు. లాకప్డెత్ ఘటనపై ప్రశ్మీస్తే, హోం మంత్రి ఈ విషయాన్ని డైవర్ట్ చేసి సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఒక తల్లి వేదనను రాజకీయ పార్టీలకు అంటగట్టడం దారుణం సాయికృష్ణ మేనమామ నవరంగ్ మాట్లాడుతూ.. కొడుకును పోగొట్టుకున్న సాయికృష్ణ తల్లి ఆర్తనాదంపై అధికార పక్షం స్పందించ లేదని, పైగా దీనిని రాజకీయ పార్టీలకు అంటగట్టడం దారుణమన్నారు. కృష్ణలంక పోలీసులు మార్కాపురం నుంచి గాదె సాయికృష్ణను తీసుకొచి్చ, దారుణంగా హింసించి చంపారని, అతడి తల్లి కన్నీటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తాము తొలి నుంచి వంగవీటి రంగా మద్దతుదారులుగా ఉన్నామని, వారి కుటుంబంతో తమకు ఏళ్ల తరబడి సత్సంబంధాలు ఉన్నాయని చెప్పారు. విజయవాడలోని రాజకీయ నేతలతో తమకు కుటుంబ బాంధవ్యాలు ఉన్నాయని అన్నారు. కాపు యువకుడిని పోలీసులు ఇంత దారుణంగా చంపేసి, మృతదేహాన్ని కనిపించకుండా తగులబెట్టిన ఘటనపై కాపు సామాజికవర్గ నేతలు మౌనంగా ఉండటం తగదన్నారు. -
నేడు గవర్నర్ను కలవనున్న వైఎస్సార్సీపీ బృందం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ నేతల బృందం గురువారం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను కలవనుంది.మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో పలువురు నేతలు సాయంత్రం 5 గంటలకు గవర్నర్ను కలిసి డీఎస్సీ స్కామ్ సహా కీలక అంశాలను వివరించనున్నారు. -
మృతుల కుటుంబాలకు వైఎస్ జగన్ భరోసా
అరకులోయ టౌన్ (పాడేరు రూరల్): విషాదంలో ఉన్న కుటుంబాలకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలిచారు. అనంతగిరి మండలం వాలసి పంచాయతీ జాంబవలస పరిధిలోని మూలంగుమ్మి జలపాతంలో జరిగిన దుర్ఘటనలో త్రిష, రత్నకుమారి, పవిత్ర అనే విద్యార్థినులు రెండు నెలల క్రితం దుర్మరణం పాలయ్యారు. ఈ విషాద ఘటనను బుధవారం అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. బాధిత కుటుంబాల దీనావస్థను తెలుసుకున్న ఆయన మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని ఆదేశించినట్టు ఎమ్మెల్యే తెలిపారు. అంతకుముందు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తన సొంత నిధుల నుంచి రూ.30 వేల చొప్పున ఆర్థిక సాయం అందించి ఆదుకున్నారు. ప్రజా సమస్య లపై వైఎస్ జగన్ చూపే చొరవ, ఆయనలోని మానవీయ కోణాన్ని ఈ ఘటన మరోసారి నిరూ పించిందని బాధిత కుటుంబాలు కొనియాడాయి. -
సర్ ప్రక్రియలోకి టీడీపీ వైరస్లా చొరబడింది
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ కార్యక్రమం (ఎస్ఐఆర్) లోపభూయిష్టంగా మారిందని, మై టీడీపీ యాప్ ద్వారా ఓట్ల చోరీకి అధికార పార్టీ మరోసారి ప్రయత్నిస్తోందని, సర్ ప్రక్రియలోకి టీడీపీ వైరస్లా చొరబడిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిపడ్డారు. ఆయన బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. మై టీడీపీ యాప్లో ఎన్నికల కమిషన్ ప్రచురించిన దానికంటే స్పష్టంగా ఓటర్ల వివరాలు ఉన్నాయని అన్నారు.బీఎల్వో ప్రక్రియ పూర్తయిన తర్వాత వివరాలు ఫొటో తీసుకుని టీడీపీ కేంద్ర కార్యాలయానికి పంపిస్తున్నారని తెలిపారు. భారీ ఎత్తున దళితులు, మైనార్టీలు, పేదల ఓట్లు తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈసీ వెంటనే అక్రమాలను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో టీడీపీ నేతల కన్నుసన్నల్లో సాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను తాము అడ్డుకుని ప్రశ్నిస్తే పొరబాటు జరిగిందని చెప్తున్నారని తెలిపారు. ఇటీవల పశ్చిమ బెంగాల్, తమిళనాడు తరహాలోనే ఏపీలోనూ ఓట్ల తొలగింపునకు కుట్ర జరుగుతోందని చెప్పారు.అనంతపురంలో టీడీపీ ప్రణాళికాబద్ధమైన కుట్రఅనంతపురం జిల్లాలోని రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో 20కి పైగా బూత్లను పరిశీలించగా.. చంద్రబాబు, ఆయన పార్టీ నేతల ఆదేశాలతో అధికారులు ముసుగులు తీసేసి మరీ ప్రత్యక్షంగా బరి తెగిస్తున్న విషయం వెల్లడైందన్నారు. టీడీపీ యాప్ ప్రభుత్వ అధికారులు పెట్టిన గ్రూప్స్లో వచ్చిందని, దానిని ప్రశ్నిస్తే పొరబాటున పెట్టామని చెప్పి తీసేశారని అన్నారు. బుధవారం శింగనమలలోని ఓ బూత్లో నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పంచాయతీ కార్యదర్శి సీట్లో కూర్చుని ఎస్ఐఆర్ ప్రక్రియలో దూరాడని, తాము అడ్డుకుంటే పొరపాటు అంటున్నారన్నారు. ఇది పొరబాటు కాదని, టీడీపీ ప్రణాళికాబద్ధమైన కుట్ర అని చెప్పారు. అక్కడికక్కడే ఫొటోలు తీయడం, కులం, మతం రాసుకుని వెళ్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు. ఓటరుకు సంబంధించిన ప్రతి విషయం గోప్యంగా ఉండాలన్న విషయం తెలియదా అని అన్నారు. అధికారుల్ని బెదిరించి, ఎన్యుమరేషన్ ఫారంలు తీసుకుంటుంటే పోలీసులు ఏం చేస్తున్నారన్నారు, ఎస్ఐఆర్ ఫారం నింపి ఇస్తే అది కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్తుందా లేదా టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్తుందా అని జనానికి అనుమానాలు వస్తున్నాయన్నారు. ఎన్నికల సంఘం నుంచి మా ఫిర్యాదుపై తగిన సమాధానం రాకపోతే వైఎస్సార్సీపీ పోరాటాలకు సిద్ధంగా ఉందని చెప్పారు. -
తప్పుల తడకగా ఓటరు జాబితా
కడప కార్పొరేషన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ముసుగులో వైఎస్సార్సీపీ ఓట్లను గంపగుత్తగా తొలగించేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలకు తెరలేపిందని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం కడపలో విలేకరుల సమావేశంలో వారు ఎన్నికల కమిషన్ ఆన్లైన్లో ఉంచిన ఓటరు జాబితాలోని ఘోరాలను సాక్ష్యాధారాలతో సహా ఎండగట్టారు. తప్పులను సవరించకపోతే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. అధికారులు అధికార పార్టీ తొత్తులుగా మారకుండా, పారదర్శకమైన ఓటరు జాబితాను తయారు చేయాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ మేయర్ పాకా సురేష్, జిల్లా అధికార ప్రతినిధి జయచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.నా డోర్ నంబరే లేదు: అంజద్ బాషాకడపలోని ఎస్ఎఫ్ఎస్ వీధిలో ఉన్న డోర్ నంబర్ 19/420 ఇంటిలో నేను 60 ఏళ్లుగా ఉంటున్నాను. నేను పుట్టింది, పెరిగింది, చదివింది ఇక్కడే. 30 ఏళ్లుగా ఇదే చిరునామాపై ఓటు హక్కు వినియోగించుకుంటున్నాను. 2005లో కార్పొరేటర్గా, 2014, 2019లో రెండు సార్లు శాసన సభ్యుడిగా గెలిచి డిప్యూటీ సీఎంగా సేవలు అందించాను. అలాంటి నా డోర్ నంబరే ఓటరు లిస్టులో లేదు. జాబితాలో 19/417 నుంచి 19/425 వరకు అసలు డోర్ నంబర్లే గల్లంతు చేశారు. మా లాంటి ప్రజాప్రతినిధుల ఇళ్లను, ఓట్లనే మాయం చేస్తే ఇక సామాన్య ఓటరు పరిస్థితేమిటి? ఒక్కో పోలింగ్ బూత్లో కనీసం 50 ప్రతిపక్ష ఓట్లను తగ్గించాలనే దుర్బుద్ధితోనే ఈ అస్తవ్యస్త జాబితాను తెచ్చారు. బీఎల్ఓలు దరఖాస్తు ఫారాలు ఇళ్ల వద్ద పడేసి వెళ్తున్నారే తప్ప వాటిని ఎలా నింపాలో ప్రజలకు చెప్పడంలేదు. తక్షణమే ఈ తప్పుల తడక జాబితాను సవరించకపోతే న్యాయపోరాటం చేస్తాం.2002లో ఎమ్మెల్యేగా ఉన్నా ప్రస్తుత ఓటరు జాబితాలో నా పేరు లేదు: శెట్టిపల్లె రఘురామిరెడ్డి2002లో నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. అయినా ప్రస్తుత ఓటరు జాబితాలో నా పేరే లేకపోవడం ఆశ్చర్యకరం. నా స్వగ్రామమైన చాపాడు మండలం నక్కలదిన్నెలో 2002 ఓటరు లిస్టు ప్రకారం 1142 ఓట్లు ఉన్నట్లు రికార్డుల్లో చూపుతున్నారు. కానీ, ఆ జాబితాలో నా పేరు, నా కుటుంబ సభ్యుల పేర్లుగానీ, కనీసం మా గ్రామస్తుల పేర్లుగానీ ఎక్కడా లేవు. నక్కలదిన్నె లిస్టులో రాజుపాలెం గ్రామానికి చెందిన వారి పేర్లను చొప్పించి తారుమారు చేశారు.వైఎస్సార్సీపీకి మెజార్టీ వచ్చిన పోలింగ్ బూత్లను టార్గెట్ చేసి ఓటర్లను తగ్గించడమే వీరి లక్ష్యం. నక్కలదిన్నె గ్రామంలో 2014లో 6,200 ఓట్లు, 2019 నాటికి 8,400 ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లన్నింటినీ అక్రమంగా ఏరివేసేందుకు టీడీపీ కుట్ర చేస్తోంది. అధికారులకు ఈ తప్పులు చూపిస్తున్నా పట్టించుకోవడం లేదు. దేశీ మద్యం విక్రయాలకు అనుమతి లేదు. » ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మద్యం విక్రయాలు ఉంటాయి. » విశాఖపట్నం, సూర్యలంక బీచ్ల్లో ఏర్పాటు చేసే బీచ్ బార్లకు మూడేళ్ల కాలపరిమితితో లైసెన్స్ మంజూరు చేస్తారు. ఈ ఏడాది సెపె్టంబరు 1 నుంచి 2029 ఆగస్టు 31 వరకు లైసెన్స్ గడువుగా నిర్ణయించారు. » లైసెన్స్ కోసం దరఖాస్తు చేసే వారు రూ.2 లక్షల నాన్ రిఫండబుల్ ఫీజుతోపాటు రూ.10వేలు దరఖాస్తు రుసుం చెల్లించాలి. వార్షిక రీటైల్ ట్యాక్స్(ఆర్ఈటీ) మొదటి ఏడాది రూ.7.50లక్షలు చెల్లించాలి. ఆర్ఈటీ ఏటా 10శాతం పెంచుతారు. -
చీకటి ఎల్లకాలమూ ఉండదు!
అబద్ధాన్ని బిగ్గరగా, పదేపదే చెబితే, అదే నిజమని ప్రజలు నమ్ముతారనే జోసెఫ్ గోబెల్స్ (హిట్లర్ అనుచరుడు) సిద్ధాంతం మీద నమ్మకం ఉన్న వ్యక్తి చంద్రబాబు. ప్రజలకు ఏదీ గుర్తుండదని ఆయన నమ్మకం. అందుకే రెండేళ్లుగా ఆంధ్ర ప్రదేశ్కు గ్రహణం పట్టినా, పండు వెన్నెల కురుస్తోంది, సంబరాలు చేసుకోమంటు న్నాడు. కానీ జనం జగన్ పాలనను గుర్తు చేసుకుంటున్నారు. సంక్షేమమే ఆయన అజెండా, విశ్వసనీయత వైసీపీ జెండా. దీనికి నిదర్శనం ఆయన చేసిన అభివృద్ధి. సంఖ్య లెప్పుడూ అబద్ధం చెప్పవు. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా రెండు రెళ్లు నాలుగే. ఆయన హయాంలో నేరుగా నగదు లబ్ధి పొందినవారి సంఖ్య 8,70,06,898. 2 లక్షల 73 వేల 756 కోట్ల రూపాయల నగదు నేరుగా అకౌంట్లలోకి చేరింది. నాన్ డీబీటీ ద్వారా 1,84,604 కోట్ల రూపాయిలు అందింది. మొత్తం ఐదేళ్లలో ప్రజలకు అందిన లబ్ధి 4 లక్షల 58 వేల 360 కోట్లు.అంకెలు చెప్పే నిజాలుమరి చంద్రబాబు సూపర్ బుస్సు హామీల గురించి మాట్లాడు కుందాం. ఎన్నికల ప్రచారంలో బాబు ష్యూరిటీ – భవిష్యత్కు గ్యారెంటీ అని బాండ్లు కూడా ఇచ్చారు. జూన్ 2024 నుంచి ప్రారంభం అన్నారు. 2026 కూడా వచ్చింది. ఇచ్చారా? చంద్ర బాబులో ఒక గజిని, అపరిచితుడు ఉంటారు. చంద్రబాబు కంటే గారడీ మనిషి మేలు. కనీసం గాల్లోంచి పావురమైనా తీస్తాడు. అదే బాబు అయితే పావురాన్ని ఊహించుకోమంటారు. బాబు సూపర్ ట్రిక్స్ గురించి చెప్పాలంటే: 1. ఆడబిడ్డ నిధి– ఆడపడుచుల్ని ఆదరించి గౌరవించడం తెలుగువారి సంస్కృతి. ఈ పథకానికి అతీగతీ లేదు. రెండేళ్లకు గానూ, ఆడబిడ్డలు ఒక్కొక్కరికి 36 వేలు బాకీ. 2. నిరుద్యోగ భృతి– నిరుద్యోగులకు నిండా మోసం. ఒక్కొక్క రికీ రూ.72 వేలు బాకీ. 3. యాభై ఏళ్లకే పెన్షన్– బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు ఎన్నేళ్లు ఎదురు చూసినా టెన్షనే.4. తల్లికి వందనం– ఫస్ట్ ఇయర్ మోసం. సెకండ్ ఇయర్ 20 లక్షల మంది కోత. 5. ఉచిత బస్సు– ఐదు సర్వీసులకే పరిమితం. 6. దీపం– ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, సగం పథకం గ్యాసే. 7. అన్నదాత సుఖీభవ – రైతుకు దుఃఖీభవ అయ్యింది. ఇచ్చింది రూ. 14 వేలు. బాకీ రూ. 26 వేలు.రెండేళ్లలో అన్ని రంగాలను నాశనం చేశారు. విద్యా వ్యవస్థను బాగు చేశామని ఆ శాఖ మంత్రి నారా లోకేశ్ చెబుతున్నారు. తండ్రికి తగ్గ తనయుడు. జగన్ హయాంలో ‘నాడు–నేడు’ కింద వేల స్కూళ్లు బాగుపడ్డాయి. పనులు పూర్తయ్యే స్థితిలో ఉన్న 22 వేల స్కూళ్లను గాలికి వదిలేశారు. ‘తల్లికి వందనం’ కింద రూ. 13 వేల కోట్లకు పైగా ఇవ్వాల్సి ఉండగా ఇచ్చింది రూ. 8,389 కోట్లు. విద్యా దీవెన, వసతి దీవెనలను నిర్వీర్యం చేశారు. ‘గోరుముద్ద’ను ఘోరం చేసి పిల్లల్ని ఆస్పత్రులపాలు చే శారు. విద్యను వ్యాపారంగా మార్చిన వాళ్లని మంత్రులుగా పెట్టుకున్న తర్వాత ప్రభుత్వ స్కూళ్లు బతుకుతాయా? రెండేళ్లలో వైద్యం రోగగ్రస్థమైంది. ఆరోగ్యశ్రీకి రూ. 3,746 కోట్ల బకాయి పెట్టి పేద ప్రజల్ని అన్యాయం చేశారు. ఆరోగ్య ఆసరా పథకాన్ని రద్దు చేశారు. జగన్ హయాంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు చేస్తే, అందులో 11 కాలేజీలను ప్రైవేట్కు అమ్మేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 562 మందులు లభ్యమైతే, ఇప్పుడు ఒక్క మందు బిళ్ల కూడా దొరకని స్థితి. పల్లె ప్రజల కోసం ‘ఫ్యామిలీ డాక్టర్’ను ప్రవేశ పెడితే అది అందకుండా చేశారు. ఒక జాతి బలంగా ఉండాలంటే విద్య, వైద్యం పటిష్ఠంగా ఉండాలి. కానీ కూటమి ప్రభుత్వం ఆ రెండింటినీ ప్రైవేట్కు అమ్మేస్తోంది. ఏ వర్గం బాగుపడిందని!ఎన్టీఆర్ మహానటుడు. ఆయనకి తెలియకుండానే మహా నటుణ్ణి అల్లుడిగా తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ తెరమీద నటిస్తే, చంద్ర బాబు ఎడతెరపి లేకుండా నటిస్తారు. దీనికి ఉదాహరణ వ్యవ సాయం దండగ అని ఒకప్పుడు చెప్పిన బాబు, ఎన్నికలకు ముందు రైతన్నలపై అంతులేని ప్రేమ కురిపించారు. కేంద్రంతో సంబంధం లేకుండా 20 వేలు ఇస్తానని, రెండేళ్లకు 26 వేలు నామం పెట్టారు. ఉచిత బీమా పథకం పోయింది. 1,100 కోట్లు ఇన్ ఫుట్ సబ్సిడీ పాయె. రైతు భరోసా కేంద్రాలు నాశనం. యూరియా కోసం రెతులు కొట్టుకున్నారు. పొగాకు, పత్తి, అరటి, మామిడి ఇలా ప్రతి రైతూ రోడ్డెక్కారు. ఎక్కడ చూసినా దళారులే. ఈ–క్రాప్ వ్యవస్థ నిర్వీర్యం. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 393 మంది రైతులు, 2,472 మంది రైతు కూలీలు ఆత్మహత్య చేసుకున్నారు. మహిళలకు చంద్రబాబు ప్రభుత్వం చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు. ‘ఆసరా’, ‘చేయూత’, ‘కాపు నేస్తం’, ‘ఈబీసీ నేస్తం’ పథకాలు నిలిపివేశారు. ‘దిశ’ కార్యక్రమాన్ని రద్దు చేశారు. పేదలకు ఇచ్చే ‘వైఎస్సార్ పెళ్లి కానుక’ ఆగిపోయింది. ఐదేళ్లలో జగన్ 31.19 లక్షల ఇళ్ల పట్టాలు అక్కచెల్లెమ్మలకు ఇచ్చారు. యువకులకు జాబ్ క్యాలెండర్ గాలికి పోయింది. డీఎస్సీలో అవకతవకలు జరిగాయి. వాలంటీర్లు మునిగిపోయారు. రేషన్ వాహనాల రద్దుతో 18 వేల మంది రోడ్డున పడ్డారు. చివరికి ఉద్యోగుల్ని కూడా మోసం చేశారు. ఒక రూపాయి ఐఆర్ కూడా ఇవ్వలేదు. ఐదు డీఏలు పెండింగ్. జీపీఎస్, ఓపీఎస్ ఔట్. పీఆర్సీ అడ్రస్ లేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 35 వేల కోట్లు బాకీ. కూటమి ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క వర్గం ప్రశాంతంగా లేదు. ప్రశ్నిస్తే అరెస్ట్లు చేస్తారు. రెడ్బుక్ అంటారు. వైఎస్సార్సీపీ నాయకులు, జర్నలిస్టులు, సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరూ మినహాయింపు కాదు. దళితులకు రక్షణ లేదు. మహిళలు, చిన్నారు లకు రక్షణ లేదు. అయినా తమ ప్రభుత్వం అద్భుతాలు చేసిందని చెప్పుకుంటున్నారు. జనం రెండేళ్లు సంబరాలు చేసుకోవాలని అంటున్నారు.ఏం సాధించారని!జగన్ మళ్లీ వస్తారని వాళ్లకు తెలుసు. అందుకే భయం. జగన్నామ స్మరణ. జనాన్ని తప్పుదారి పట్టించడానికి మా పార్టీని గొడ్డలి పార్టీగా పిలుస్తున్నారు. గొడ్డలి ముద్రతో జనంలో భయం పుట్టించాలని వాళ్ళ ప్రయత్నం. వేళ్లు కుళ్లి పోయిన తెలుగుదేశం పార్టీ వృక్షాన్ని కూల్చాలంటే గొడ్డలి చాలా అవసరం. గొడ్డలి అంటే వాళ్ళకు భయం. కానీ చెడుని కూల్చే ఆయుధం మాకు. రెండేళ్లలో మీరు సాధించిన అభివృద్ధి 3.48 లక్షల కోట్ల అప్పు. ఇక మీ ఎమ్మెల్యేలు సరిహద్దులు నిర్ణయించి కప్పం వసూళ్లు చేస్తు న్నారు. కాంట్రాక్ట్ పనుల కోసం కొట్టుకుంటున్నారు. లిక్కర్ సిండి కేట్ నడిపిస్తున్నారు. చివరికి చికెన్ షాపుల వద్ద కూడా వసూళ్లు చేస్తున్నారు. సంపద సృష్టిస్తానని చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. తీరా చూస్తే రాష్ట్రానికి సంపదే లేకుండా చేశారు. పిల్లల్ని కనండి, వాళ్లే మన సంపద అని చిట్కాలు చెబుతున్నారు. టీడీపీ అంటే ఎన్టీఆర్ హయాంలో తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీ లేదా తెలివిగా దోచుకునే పార్టీ. చీకటి ఎల్లకాలం ఉండదు. తమసోమా జ్యోతిర్గమయ.భూమన కరుణాకర రెడ్డివ్యాసకర్త తిరుపతి మాజీ శాసనసభ్యులు -
సమాధానం చెప్పలేక ఉత్తర కుమార సవాళ్లా?
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ 2025 స్కామ్పై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో చర్చకు తాను సిద్ధమని.. సమయం, తేదీ, వేదిక లోకేష్ చెప్పినా సరే.. లేదా తనను చెప్పమన్నా రెడీ అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రతి సవాల్ విసిరారు. దీనిపై లోకేష్ సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని.. ఈలోగా డీఎస్సీ స్కామ్పై మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రజల ఎదుట ఉంచిన అంశాలను మరోసారి గుర్తు చేస్తున్నామని.. ముందు వాటికి జవాబు చెప్పాలని సూచించారు. ‘లోకేశ్..! సరుకు లేక సవాళ్లు విసరడం ఏమిటి? వైఎస్ జగన్ ప్రెస్మీట్ విన్నావా అసలు? నువ్వుగానీ, మీ నాన్న గానీ వాటికి సమాధానం చెప్పాలని అడిగారు. వినలేదా? లేక విని కూడా వినపడనట్లు నటిస్తున్నారా? అని ఈ రాష్ట్రంలో యువత అడుగుతోంది.. తల్లిదండ్రులు అడుగుతున్నారు.. ప్రజలు అడుగుతున్నారు.. జగన్ ప్రశ్నలకు జవాబు చెబుతారని అంతా ఎదురు చూస్తున్నారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్న ప్రతి నిరుద్యోగి నీ నుంచి సమాధానం ఆశిస్తున్నారు. వైఎస్ జగన్ సూటిగా, స్పెసిఫిక్గా ప్రశ్నలు అడిగారు. వాటికి నేరుగా జవాబు చెప్పే ధైర్యం లేక 200 మీటర్ల దూరంలో నీ ఇల్లు ఉంది అని సవాల్ విసురుతావా? మీ నాన్న సవాల్ విసిరితే ఏదైనా అర్ధం ఉంటుంది. మెగా డీఎస్సీ స్కామ్పై అడిగిన ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పడం లేదు? దీన్ని బట్టి తప్పు జరిగిందని అర్థమవుతోంది. అది నీకు కూడా తెలుసు. దాన్ని డైవర్ట్ చేయటానికే సవాల్ అంటూ కొత్త నాటకానికి తెర తీశారు. అయినా నువ్వు అడుగుతున్నావ్ కాబట్టి.. ఆ దగా పడ్డ డీఎస్సీ అభ్యర్థులతోనే కలసి వస్తా. వాటికి సమాధానం చెప్పు.. మనిద్దరం మంత్రులుగా చేశాం కాబట్టి సమ ఉజ్జీలం.. నీ స్థాయికి నేను చాలు.. అయినా నీకు కొంచెం జ్ఞాపక శక్తి తక్కువ అనుకుంటా. అందుకే ఆ ప్రశ్నలన్నీ మళ్లీ నిన్ను అడుగుతున్నా. నీకు గుర్తుండేలా ఈసారి అన్ని పత్రికల్లో ఫాంట్ సైజ్ కొంచెం పెద్దగా పెట్టి ప్రచురించమని కోరుతున్నా. పార్టిసిపెంట్కు ఉద్యోగం ఇచ్చేసి.. గోల్డ్మెడల్ సాధించిన వారికి పోస్టు ఎందుకు ఇవ్వరని గోల్డ్మెడల్ విజేత, డీఎస్సీ అభ్యర్థి దుర్గయ్య అడిగిన ప్రశ్నకు నీ దగ్గర జవాబేది లోకేశ్? ముందు దుర్గయ్య ప్రశ్నకు జవాబు చెప్పు. తరువాత నేను వస్తా.. ’అని పేర్ని నాని సూచించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. డీఎస్సీ స్కామ్పై చర్చ విషయంలో లోకేష్ చేస్తున్న సవాళ్లు ఉత్తర కుమార ప్రగల్భాలు లాంటివని వ్యాఖ్యానించారు. డీఎస్సీ స్కామ్ను బయటపెట్టి చాలా రోజులు అయ్యిందని, స్కామ్ జరిగిన తీరును ఆధారాలతో సహా బయటపెట్టామని, ప్రతి అంశాన్ని పూర్తి సాక్ష్యాధారాలతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమగ్రంగా ప్రజల ముందు పెట్టారని గుర్తు చేశారు. సీబీఐ విచారణ కోరే ధైర్యం వారికి లేదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కలిసి లక్షలాది మంది నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటమాడారన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత వివాదాస్పదమైన, అవినీతిమయమైన నియామక ప్రక్రియను ఎన్నడూ చూడలేదన్నారు. 16 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం చేపట్టిన మెగా డీఎస్సీ ప్రక్రియలో పారదర్శకతకు రక్షణగా ఉన్న ప్రతి వ్యవస్థను నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. ఈ ప్రశ్నలకు జవాబేది లోకేశ్..?1. అత్యంత రహస్యంగా ఉండాల్సిన ప్రశ్నాపత్రాల తయారీ, అప్లోడ్ ప్రక్రియలను ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎందుకు అప్పగించారు? ఎస్సీఈఆర్టీలో పనిచేసిన ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగి (నవీన్) ఈ పరీక్షల ప్రక్రియలో పాల్గొనలేదా? అదే వ్యక్తికి మెగా డీఎస్సీలో మొదటి ర్యాంకు, తెలుగు టీజీటీ పరీక్షలో జోనల్లో ఆరో ర్యాంకు రాలేదా? మరి మొదటి ర్యాంకు వచ్చిన నవీన్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? లాగిన్ ఐడీ ఎందుకు బ్లాక్ చేశారు? డేటా ఎందుకు తొలగించారు? అతడి వివరాలను మెరిట్ జాబితా నుంచి ఎందుకు తొలగించారు? సర్టిఫికెట్ వెరిఫికేషన్కు ఎందుకు పిలవలేదు? అంటే పేపర్ లీకేజీ జరిగిందని మీరు ఒప్పుకున్నట్లే కదా? వెరిఫికేషన్కు రాలేదు కాబట్టే ఉద్యోగం ఇవ్వలేదని ఎలా సమర్థించుకుంటారు? అదే నిజమైతే అతడు ఎందుకు హైకోర్టుకు వెళ్లాడు?2. ఈ కుంభకోణంలో అత్యంత కీలకమైన అంశం స్పోర్ట్స్ కోటా. 2012లో జారీ చేసిన జీఓ నెం.74 ప్రకారం స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు కూడా సంబంధిత ఎలిజిబిలిటీ పరీక్షలో తప్పకుండా అర్హత సాధించాలి. కానీ జీవో నెం:4, జీఓ నెం:47 ద్వారా ఆ నిబంధనను ఎందుకు మార్చేశారు? దీనికి వెనుక ఉన్న మతలబు ఏమిటి? అసలు డీఎస్సీ పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు టీచర్ పోస్టులు ఎలా ఇస్తారు? చరిత్రలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? పోనీ మీరు చేసింది కరెక్టే అనుకుంటే మళ్లీ ఈ నిబంధనను ఎత్తివేస్తూ జీవో నెం:23, జీఓ నెం:25, జీఓ నెం:56 ఎందుకు ఇచ్చారు? అంటే మీ వాళ్లకోసం గేట్లు ఎత్తారు. మీ వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వడం పూర్తికాగానే మళ్లీ గేట్లు మూసేశారు. ఇది స్కామ్ కాదా?3. సాఫ్ట్ బాల్ అసోసియేషన్కు అధ్యక్షుడు మీ టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ కాదా? జూడో అసోసియేషన్కు మీ ఎంపీ, లోకేశ్ తోడల్లుడు భరత్ గౌరవ అధ్యక్షుడు కాదా? స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల సర్టిఫికెట్లు ఇచ్చిందీ ఆ అసోసియేషన్లే.. అలాగే ధృవీకరించిందీ వాళ్లే కదా? అవునా? కాదా?4. క్రీడాకారులకే ఇవ్వాలనుకున్నప్పుడు జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన వారికి టీచర్ పోస్టులు ఎందుకు ఇవ్వలేదు? ప్రతిభ ఉన్న క్రీడాకారులకు కాకుండా కేవలం పార్టిసిపెంట్ సర్టిఫికెట్లు ఉన్న వారికి ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా?5. మెరిట్, ర్యాంకులు, రిజర్వేషన్లు ఆధారంగా ఎవరు, ఏ కోటా కిందకు వస్తారు? వారి ర్యాంకులు ఏమిటి? అనే విషయాలన్నీ మీకు ముందుగానే తెలుసు కాబట్టి అన్నీ పరిశీలించాకే రూల్ నంబర్ 20 ప్రకారం వెరిఫికేషన్కు 1 : 1 పద్ధతిలో పిలిచారు. వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్.. ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఉమెన్, స్పోర్ట్స్, ఎక్స్సర్వీస్ మెన్, జోన్.. ఇలా వివిధ కేటగిరీల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో ముందుగానే మీకు తెలుసు. కానీ సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసిన తరువాత, అన్నీ సక్రమంగా ఉన్నాయని తేలాక కూడా అర్హులకు ఉద్యోగాలు ఇవ్వలేదంటే దాని అర్థం ఏమిటి? ఎవరి కోసం వీరిని డ్రాప్ చేశారు? ఎవరి కోసం ఆ సర్దుబాటు? ఇది దగా.. మోసం.. స్కామ్ కాదా?6. టీచర్ల పోస్టులు రూ.15 – 20 లక్షలకు అమ్ముకుంటూ బేరసారాలు జరిగిన ఓ వీడియో బయటకు వచ్చింది. దానికి సమాధానం ఏది? పోలీసులు నామమాత్రపు కేసు నమోదు చేసి, స్టేషన్ బెయిల్ ఇచ్చి ఎందుకు చేతులు దులుపుకొన్నారు? ఫోన్ నంబర్ తెలిసినా, సంబంధిత వ్యక్తి పేరు ప్రస్తావించకుండా విచారణను ఎందుకు నీరుగార్చారు?7. డీఎస్సీ ప్రశ్నాపత్రాల తయారీ బాధ్యత ఎస్సీఈఆర్టీకి, పరీక్షల నిర్వహణ బాధ్యత డీఎస్సీ కన్వీనర్కు అప్పగించేవారు. గోప్యత, పారదర్శకత కోసం వేర్వేరు వ్యక్తులకు అప్పగించేవారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసింది. డీఎస్సీ కన్వీనర్ను పక్కన పెట్టి ప్రశ్నాపత్రాల తయారీతో పాటు పరీక్షల నిర్వహణ అనే రెండు కీలక బాధ్యతలను ఎస్సీఈఆర్టీ డైరెక్టర్కే అప్పగించారు. దీనిపై సమాధానం ఏది?8. డీఎస్సీల చరిత్ర చూస్తే.. కలెక్టరేట్ వద్ద నోటీస్ బోర్డులపై మెరిట్ లిస్టులు, మెరిట్–కమ్–రోస్టర్ జాబితాలు ప్రదర్శించేవారు. ఈసారి ఆ పద్ధతిని రద్దు చేసి కేవలం ఆన్లైన్ ప్రదర్శనకే ఎందుకు పరిమితం చేశారు? అందులో కూడా మార్పులు చేర్పులు ఎందుకు చేశారు?9. పీఈటీ ఉపాధ్యాయులకు డీఎస్సీ పరీక్షతోపాటు సంబంధిత డిగ్రీ నుంచి కూడా ఎందుకు వెసులుబాటు ఇచ్చారు? ఎప్పుడూ లేని విధంగా ఐదేళ్లపాటు వెసులుబాటు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది?10. లక్షలాది మంది నిరుద్యోగ యువత ఆశలను, జీవితాలను ప్రభుత్వం అత్యంత దారుణంగా, అమానుషంగా తాకట్టు పెట్టిన మాట వాస్తవం కాదా? ఈ కుంభకోణం లోతుగా పాతుకుపోయిన అవినీతి వ్యవహార మే కదా? మరి దీనికి బాధ్యత ఎవరిది? రాష్ట్రంలోని దర్యాప్తు సంస్థలు మీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న నేపథ్యంలో నిజాలు బయటకు వస్తాయా? ఆ నిజాలన్నీ వెలికి తీయాలంటే సీబీఐతో విచారణ జరిపించాల్సిన అవసరం లేదా? డీఎస్సీ 2025లో టీజీటీ (తెలుగు) జోన్–2లో తనకు 6వ ర్యాంకు వచ్చినట్లు హైకోర్టుకు తెలిపిన నవీన్ -
‘డీఎస్సీలో అక్రమాలపై చర్చకు సిద్ధం.. మీరు సిద్ధమా?’
సాక్షి, తాడేపల్లి: తాత పెట్టిన పార్టీ, తండ్రి ద్వారా సంక్రమించిన అధికారంతో నారా లోకేష్ విర్రవీగి ప్రవర్తిస్తున్నాడని, డీఎస్సీ అవకతవకలపై చర్చను పక్కదారి పట్టించడానికే ఆయన సవాల్ చేసి పారిపోయాడని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ డీఎస్సీ–2025 పై లోకేష్ సవాల్ని వైఎస్సార్సీపీ స్వీకరిస్తుందని.. బహిరంగ చర్చకు ఎక్కడికి రమ్మన్నా తాము సిద్ధంగా ఉన్నామని, మా వెంట దగా పడ్డ అభ్యర్థులను కూడా తీసుకొస్తామని చెప్పారు.డీఎస్సీ నిర్వహణలో జరిగిన అక్రమాలను వైఎస్ జగన్ ఆధారాలతో సహా బయట పెడితే ఇంతవరకు నారా లోకేష్ ఎందుకు సమాధానం చెప్పలేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వానికి దమ్ముంటే డీఎస్సీలో అక్రమాలు జరగలేదని వారికి చెప్పి నమ్మించాలని సవాల్ చేశారు. డీఎస్సీలో అక్రమాలు జరగలేదనేది నిజమైతే సీబీఐ దర్యాప్తుకు ఆదేశించవచ్చు కదా అని ప్రశ్నించారు.కాపు యువకుడు గాదె సాయికృష్ణను విజయవాడ నడిబొడ్డున కృష్ణలంక పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ చేసి చంపేస్తే దానికి సమాధానం చెప్పకుండా ప్రభుత్వం, ఎల్లో మీడియా హోంమంత్రి మేకప్ గురించి మాట్లాడుతోందని విమర్శించారు. హోంమంత్రి మేకప్కి ఉన్న విలువ బిడ్డను కోల్పోయిన తల్లి కడుపుకోతకు లేదా అని కురసాల కన్నబాబు ప్రశ్నించారు. గురువారం (18వ తేదీ) శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ నేతృత్వంలో వైఎస్సార్సీపీ నాయకులు గవర్నర్ని కలిసి డీఎస్సీ నిర్వహణలో అవకతవకలపై విచారణకు ఆదేశించాలని కోరబోతున్నట్టు చెప్పారు. ప్రెస్మీట్లో ఆయన ఇంకా ఏమన్నారంటే..:దమ్ముంటే డీఎస్సీ నిర్వహణపై మాట్లాడు లోకేష్:డీఎస్సీ–2025 నిర్వహణపై ప్రజల్లో ఉన్న అనుమానాలను లేవనెత్తుతూ వైఎస్ జగన్ చాలా ప్రశ్నలు సంధిస్తే దానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇంతవరకు కనీసం సమాధానం చెప్పిన పాపానపోకుండా సవాల్ విసిరి పారిపోయాడు. ప్లేస్ ఆయన చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, డీఎస్సీ పై బహిరంగ చర్చకు మేం సిద్ధమే. మాతోపాటు దగా పడ్డ అభ్యర్థులను కూడా తీసుకొస్తాం. అధికారం ఉంది కదా అని విర్రవీగిపోతే సరికాదు. డీఎస్సీ నిర్వహణలో తప్పే జరగలేదనుకుంటే మేం అడిగినట్టు సీబీఐ విచారణ కోరాలి.సీబీఐ అంటే చంద్రబాబు ఎంక్వయిరీ అని మాత్రం అనుకోవద్దు. తాత పెట్టిన పార్టీ, తండ్రి ద్వారా సంక్రమించిన అధికారంతో విర్రవీగిపోతూ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. కవ్వింపు చర్యలతో అసలు విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నమే 200 మీటర్ల దూరంలో ఉన్నానని నారా లోకేష్ ఛాలెంజ్. స్పోర్ట్స్ కోటాలో అడ్డదారిలో ఉద్యోగాలిచ్చిందే కాకుండా ఎన్ని జన్మలెత్తినా మీరు డీఎస్సీ నిర్వహించలేరని వాగడం సిగ్గుమాలినతనం తప్ప మరోటి కాదు.సొంత ఛానెళ్లలో తొడలు కొట్టడం, భజన చేయంచుకోవడం కాదు:పరీక్ష నిర్వహణలో ఉద్దేశపూర్వకంగానే కాంప్రమైజ్ అయ్యారని పలు విధాలుగా ఆధారాలతో వైఎస్ జగన్ నిరూపించారు. పరీక్ష నిర్వహణ దగ్గర నుంచి ఫలితాలు వెల్లడించే వరకు పారదర్శకత లేదని జీవొలతో సహా నిరూపించారు. 1:1 రేషియోలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి పిలిచి సెలెక్ట్ అయ్యారని పంపిన వారికి ఉద్యోగం ఇవ్వలేదు. పరీక్ష కూడా రాయకుండా డిగ్రీ ఉత్తీర్ణత కావాల్సిన అవసరమే లేకుండా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలిచ్చారని తేలింది.ఇవన్నీ కాదని నిరూపించండి చూద్దాం. ఇంతపెద్ద స్కామ్ జరిగిందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే ఎందుకు సమాధానం చెప్పడం లేదు? కొంతమంది అధికారులను పంపించి మాట్లాడించడమే తప్ప, విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎందుకు భయపడిపోతున్నాడు? టీచర్ పోస్టులు వచ్చిన వారిని భయపెట్టి పిలిచి, టీడీపీ నాయకుల సమక్షంలో వైఎస్ జగన్ని తిట్టించడం కాదు. దమ్ముంటే, మెరిట్ ఉన్నా ఉద్యోగం రాలేదని కోర్టులు చుట్టూ, మీ చుట్టూ తిరుగుతున్న అభ్యర్థులతో మీటింగ్ పెట్టండి. వారడిగే ప్రశ్నలకు సమాధానం ఎందుకు చెప్పడం లేదు. తప్పు జరగలేదని వారిని ఒప్పించండి. సొంత ఛానెల్లో తొడలు కొట్టించుకోవడం కాదు.. ప్రజలు రాళ్లతో కొట్టే పరిస్థితులు తెచ్చుకోవద్దు.లోకేష్ని మందలించే ధైర్యం చంద్రబాబుకే లేదు:బెంగళూరులో కాపురం ఉంటాడని జగన్ని విమర్శించడం కాదు.. నారా లోకేష్ ఎక్కడ కాపురం ఉంటున్నాడు. వీకెండ్ వస్తే ఎక్కడుంటున్నాడు. తెలంగాణలో ఆధార్ కార్డు పెట్టుకుని ఆంధ్రాలో రాజకీయాలు చేస్తే ఎలా? 2019–24 ఎప్పుడైనా లోకేష్ ఆంధ్రాలో ఉన్నాడా? ప్రతిపక్ష నాయకుడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే బాధ్యత చంద్రబాబుకి లేదా? లేక ఆయన్ను నోరెత్తనీయకుండా లోకేష్ అడ్డుకుంటున్నాడా? డీఎస్సీ నిర్వహణలో అవకతవకలు జరిగిన ఈ సందర్భంలో ఒకవేళ నారా లోకేష్ స్థానంలో విద్యాశాఖ మంత్రిగా మరెవరైనా ఉండుంటే.. వారిపై చంద్రబాబు సీరియస్ అని ఎల్లో మీడియాలో హెడ్లైన్స్ వచ్చి ఉండేవి.విద్యాశాఖ మంత్రిని త్వరలోనే మార్చేస్తున్నారని బ్రేకింగ్లు వేసేవాళ్లు. కానీ లోకేష్ని పిలిచి మందలించే ధైర్యం చంద్రబాబుకి కూడా లేదని టీడీపీ నాయకులే చెబుతున్నారు. డీఎస్సీపై చర్చకు ఏ ఛానెల్కి రమ్మన్నా వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో డీఎస్సీ అక్రమాలను నిగ్గుతేల్చకుండా వదిలిపెట్టం. వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ గా వైఎస్సార్సీపీ పోరాడుతూనే ఉంటుంది. ఎవరి బెదిరింపులకు, కేసులకు భయపడటం అనేది జరగదు.గవర్నర్కి ఫిర్యాదు చేస్తాం:శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ నేతృత్వంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు గురువారం (18వ తేదీ) గవర్నర్ని కలిసి డీఎస్సీ నిర్వహణపై విచారణకు ఆదేశించాలని కోరబోతున్నారు. కాపు యువకుడు సాయికృష్ణను పోలీసులు అన్యాయంగా లాకప్లో చంపేశారని లాకప్ డెత్ గురించి రాష్ట్రమంతా చర్చిస్తుంటే దాన్ని పక్కనపెట్టి ప్రభుత్వం, ఎల్లో మీడియా మేకప్ మీద చర్చిస్తోంది.రాజధానిలో శాంతిభద్రతలు గాడితప్పి ప్రశ్నార్థకంగా మారితే దానికి సమాధానం చెప్పకుండా మేకప్ పేరుతో డైవర్షన్ రాజకీయాలు చేయడం కూటమి ప్రభుత్వానికే చెల్లింది. తన బిడ్డ కోసం తల్లి కన్నీరుమున్నీరుగా రోదిస్తుంటే దాన్ని పక్కనపెట్టి మేకప్ ఉద్యమం చేపట్టారు. హోంమంత్రి, డీజీపీ, సిటీ కమిషనర్ ఎక్కడున్నారు?. అసలు లాకప్ డెత్ జరగలేదని చెప్పై ధైర్యం కూడా ప్రభుత్వానికి లేదా? మహిళల గురించి లోకేష్ ఎంత నీచంగా మాట్లాడిన మాటలన్నీ తీస్తే ఆయన తల ఎక్కడ పెట్టుకుంటాడు?ఇలాంటి వ్యక్తి నీతులు చెబితే రాష్ట్ర ప్రజలు వినాలా? సాయికృష్ణ తల్లి కూడా మహిళ కాదా? ఎల్లో మీడియా హోంమంత్రి మేకప్కి ఇచ్చిన విలువ సాయికృష్ణ తల్లి కడుపుకోతకు ఇవ్వలేదా? సాయికృష్ణ ఆచూకీ గురించి తల్లి రోదిస్తుంటే రౌడీ షీటర్ అని ప్రచారం చేస్తున్నారు. రౌడీ షీటర్ అయితే చంపేసే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు నిలదీశారు. -
రేపు రంపచోడవరం నియోజకవర్గ కేడర్తో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, తాడేపల్లి: రంపచోడవరం నియోజకవర్గ కేడర్తో రేపు(జూన్ 18, గురువారం) వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ కానున్నారు. స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్నారు. ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. -
సాయి కృష్ణ ది హత్యే, హోం మంత్రిగా వెంటనే రాజీనామా చేయాలి
-
పాయకరావుపేట పాపమ్మ.. నోరు జాగ్రత్త..! ఏం మాట్లాడుతున్నావ్
-
‘సర్’ పేరుతో భారీ ఎత్తున ఓట్లు తొలగించే కుట్ర’
సాక్షి,తాడేపల్లి: రాష్ట్రంలో ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ లోపభూయిష్టంగా మారిందని, మై టీడీపీ యాప్ ద్వారా ఓట్ల చోరీకి అధికార పార్టీ మరోసారి ప్రయత్నిస్తోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిపడ్డారు. శింగనమల నియోజకవర్గంలో టీడీపీ నేతల కన్నుసన్నల్లో సాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను తాము అడ్డుకుని ప్రశ్నిస్తే పొరబాటు జరిగిందని చెప్తున్నారని శైలజానాథ్ తెలిపారు.రాష్ట్రంలో ఎస్ఐఆర్ను అడ్డుపెట్టుకుని భారీ ఎత్తున దళితులు, మైనార్టీలు, పేదల ఓట్లు తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ఈసీ వెంటనే జోక్యం చేసుకుని అక్రమాలను అడ్డుకోవాలని సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో సాకే శైలజానాథ్ ఇంకేమన్నారంటే..ఎస్ఐర్ పేరుతో భారీగా ఓట్లు తొలగించే కుట్రఎస్ఐర్ పేరు మీద ఓట్ల సవరణ కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతోంది. దీన్ని పారదర్శకంగా, ప్రజాస్వామ్య బద్దంగా దీన్ని చేపట్టాలని ముందు నుంచీ కోరుతున్నాం. మా పార్టీ గతంలో ఎన్నోసార్లు అనేక వేదికలపై ఈ డిమాండ్ చేసింది. 16వ తేదీన ఎస్ఐఆర్ ప్రక్రియపై మాకు ఉన్న అనుమానాలు, మై టీడీపీ యాప్ ద్వారా ఓటర్ల డేటా చోరీపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని ఫిర్యాదు చేశాం. దీనిపై మా నాయకులు సచివాలయంలో మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్లు ఎవరికి మేలు చేయానుకుంటున్నాయి?చంద్రబాబు ఎలాగో తనకు తాను తప్ప ఎవరికీ మేలు చేయడు. గతంలో సేవామిత్ర పేరు పెట్టి దాదాపు వైఎస్సార్సీపీకి చెందిన 30 లక్షల ఓట్ల గల్లంతు చేసేందుకు ప్రయత్నించారు. దీనిపై న్యాయస్థానాల్ని ఆశ్రయించి వాటిని కాపాడుకున్నాం. కాబట్టి ఎన్టీయే నుంచి, టీడీపీ నుంచి పారదర్శకత ఊహించలేం. పశ్చిమబెంగాల్, తమిళనాడు ఎన్నికల్ని చూసిన తర్వాత, బీహార్లో మేం బతికే ఉన్నాం అని సుప్రీంకోర్టుకు ఓటర్లు చెప్పుకున్న తర్వాత కూడా న్యాయం జరగలేదు.ఆయా రాష్ట్రాల్లో ఫలితాలు ఎలా వచ్చాయో చూశాం. వీటిని అనూహ్యం అనుకోవడానికి కూడా వీల్లేదు. ఏపీలోనూ అదే తంతు కొనసాగుతుందని చెప్పడానికి మేం వెనుకాడట్లేదు. ఎస్ఐర్ ప్రక్రియలో వైరస్ తరహాలో టీడీపీ చొరబడింది. మై టీడీపీ యాప్ పెట్టుకుని కుట్రకు తెరలేపింది. ఈ యాప్లో ఎన్నికల కమిషన్ ప్రచురించిన దాని కంటే స్పష్టంగా ఓటర్ల వివరాలు ఉన్నాయి. బీఎల్వో ప్రక్రియ పూర్తయిన తర్వాత వివరాలు ఫొటో తీసుకుని టీడీపీ కేంద్ర కార్యాలయానికి పంపిస్తున్నారు.అనంతపురంలో టీడీపీ కన్నుసన్నల్లో ఎస్ఐఆర్అనంతపురం జిల్లాలోని రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో 20కి పైగా బూత్లను మేం పరిశీలించాం. చంద్రబాబు, ఆయన పార్టీ నేతల ఆదేశాలతో అధికారులు ముసుగులు తీసేసి మరీ ప్రత్యక్షంగా బరి తెగిస్తున్నారు. టీడీపీ యాప్ ప్రభుత్వ అధికారులు పెట్టిన గ్రూప్స్లో వచ్చింది. ప్రశ్నిస్తే పొరబాటున పెట్టామని చెప్పి తీసేశారు. టార్గెట్గా ఓట్లను తొలగిస్తున్నారు. ముఖ్యంగా దళితులు, మైనార్టీలు, అన్ని కులాల్లో పేదల ఓట్లు తొలగించే కార్యక్రమం జరుగుతోంది. దీనికి పరాకాష్టగా ఇవాళ శింగనమలలోని ఓ బూత్లో నాయీ బ్రహ్మణ కార్పోరేషన్ డైరెక్టర్ పంచాయతీ కార్యదర్శి సీట్లో కూర్చుని ఎస్ఐర్ ప్రక్రియలో దూరాడు.పంచాయతీ కార్యదర్శి నిలబడి సమాధానం చెప్తున్నారు. మేం అడ్డుకుంటే పొరబాటు అంటున్నారు. ఇది పొరబాటు కాదు, టీడీపీ ప్రణాళికాబద్ధమైన కుట్ర. దళితులు, మైనార్టీలు, పేదల హక్కుల్ని హరించే కుట్ర ఇది. గతంలోనే ఇది నిరూపితమైంది. ఎన్నికల కమిషన్ అధికారులు ప్రజల ఓట్లను న్యాయంగా కాపాడుతున్నారా లేదా అని అడుగుతున్నాం. అక్కడికక్కడే ఫొటోలు తీయడం, కులం, మతం రాసుకుని వెళ్తుంటే మీరు ఏం చేస్తున్నారు. ఒకాయన ఇందులో ఏం తప్పుందని అడుగుతున్నారు. ఓటరుకు సంబంధించిన ప్రతీ విషయం గోప్యంగా ఉండాలన్న విషయం మీకు తెలియదా? ప్రజల ఓట్లు లేకుండా చేయడానికి భారీ కుట్ర జరుగుతుందని దీన్ని బట్టి అర్థమవుతోంది.ఈసీ పారదర్శకంగా ఎస్ఐఆర్ నిర్వహించాలిశింగనమల నియోజకవర్గ కేంద్రంలోనే ఇలా జరుగుతోందంటే ఇక మారుమూల ప్రాంతాల్లో ఏం జరుగుతోందో ఊహించుకోవచ్చు. మీ సీఐలు ఉన్నా ఇలాఖాలో అధికారుల్ని బెదిరించి, ఎన్యుమరేషన్ ఫామ్లు తీసుకుంటుంటే పోలీసులు ఏం చేస్తున్నారు. ఇది వదిలేసి, బుక్క రాయసముద్రంలో ఏటీఎం ఎత్తుకుపోతే అది పెద్ద విషయమని పోలీసులంతా అక్కడికి వెళ్లిపోయారు. ప్రజాస్వామ్యంలో ఓటర్ల హక్కు ముఖ్యం కాదా? ఎస్ఐర్ ఫారం నింపి ఇస్తే అది కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్తుందా లేదా టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్తుందా అని జనానికి అనుమానాలు వస్తున్నాయి.క్షేత్రస్దాయిలో టీడీపీ కార్యకర్తలు, నాయకుల తీరు చూస్తుంటే ఇది అర్థమవుతోంది. సర్ ప్రక్రియ కట్టుదిట్టంగా జరగాలి. ఎన్నికల సంఘం నుంచి మా ఫిర్యాదుపై తగిన సమాధానం రాకపోతే ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు వైఎస్సార్సీపీ భారీ పోరాటాలకు సిద్ధంగా ఉంది. కులం, మతం, పార్టీ, ప్రాంతం, అధికారం పేరు చెప్పి ఓటర్లను మోసం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దయచేసి ఎన్నికల కమిషన్ అధికార పార్టీ ప్రభావానికి లోనుకాకుండా ఎస్ఐర్ ప్రక్రియను నిర్వహించాలి. ఈ ప్రక్రియలో తప్పిదాలు జరిగితే అంతిమంగా మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని సాకే శైలజానాథ్ హెచ్చరించారు. -
ఎమ్మెల్యే చింతమనేనికి సేమ్ ట్రీట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు?
తాడేపల్లి: ఏపీ హోంమంత్రి అనితకు మేకప్ మీద ఉన్న ప్రేమ మనుషుల ప్రాణాల మీద లేదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల అన్నారు. జ్ఞానేశ్వరి, సాయికృష్ణ కేసులపై హోంమంత్రి ఎందుకు మాట్లాడబోరని నిలదీశారు. సాయికృష్ణ మీద కేసులుంటే అతన్ని లాకప్ డెత్ చేస్తారా అని ప్రశ్నించారు. మరి ఇంకా ఎక్కువ కేసులున్న టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు కూడా అదే ట్రీట్మెంట్ ఎందుకు ఇవ్వలేదని అడిగారు.తాడేపల్లిలో బుధవారం ఆరె శ్యామల మీడియాతో మాట్లాడుతూ.. ‘‘హోంమంత్రి అనిత మహిళల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. అనిత అధికార మదంతో ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల గురించి అనిత అత్యంత నీచంగా మాట్లాడారు. మేము ఏదైనా మాట్లాడితే మహిళకు అవమానం అంటూ రచ్చ చేస్తారు. ఇదేనా మీ ఎల్లోమీడియా, ఐ-టీడీపీ చేసే నీచ రాజకీయం? రాష్ట్రంలో రాజకీయ సంభాషణను మార్చేసింది టీడీపీనే. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలపై హోంమంత్రి ఎందుకు మాట్లాడటం లేదు? హోంమంత్రి బాధ్యత మహిళలకు రక్షణ కల్పించటం. అది వదిలేసి నోటికి వచ్చినట్టు మాట్లాడితే జనమే తగిన బుద్ది చెబుతారు. కాకినాడలో చిన్నారి మిస్సింగ్ ఐతే హోంమంత్రి మాట్లాడరు’’ అని విమర్శలు గుప్పించారు. -
అందుకే అనిత ఇష్టానుసారం మాట్లాడుతున్నారు: పేర్ని నాని
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్లో పోలీసుల వైఖరి దారుణంగా ఉందని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. విజయవాడ సీపీ విజయవాడలో శాంతిభద్రతలను గాలికి వదిలేశారని చెప్పారు. కృష్ణలంక పీఎస్ లో జరిగిన దారుణంపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. గాదె సాయికృష్ణ కేసును సీబీఐతో విచారించాలని డిమాండ్ చేశారు. లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని అన్నారు.తాడేపల్లిలో పేర్ని నాని మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. అనిత మేకప్ గురించి మాత్రమే మాట్లాడితే ఆంధ్రప్రదేశ్లోని మొత్తం స్త్రీ సమాజం మాట్లాడినట్లేనని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అమర్ ఏదో అన్నారని, విపరీతమైన మాటలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు, లోకేశ్ ఆదేశాలతో ఇదంతా జరుగుతుంది. పవన్ దీనిమీద ట్వీట్ చేస్తారు. కట్టు, బొట్టు అంటూ ఏదేదో చెప్పారు. అనిత నోరు పారేసుకోబట్టి అమర్ మాట్లాడారు. ఆమె కూడా సంప్రదాయబద్ధంగా ఉండాలి కదా. రాజకీయాల్లో కొంతమందికి కొన్ని బలహీనతలు ఉంటాయి. కొందరికి లూజ్ మోషన్ లాగా మాటలు విపరీతంగా వస్తాయి. సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడుతారు..సమాజం నుంచి మర్యాద, మన్నన, గౌరవం కోరుకుంటారు. సమాజం మీదకు రాళ్లు వేస్తే అవే తిరిగి వస్తాయని లోకేశ్, పవన్ గుర్తుంచుకోవాలి. మీ చుట్టూ దిగజారిన మనుషులు ఉన్నారు. హోంమంత్రి ఎప్పుడైనా బాధ్యతగా మాట్లాడారా. నాలుకకు హద్దు ఉండాలి.. సభ్యతగా విమర్శించండి. పవన్, లోకేశ్ సూక్తులు చెబుతున్నారు. టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు హోదాలో అనిత స్పీచ్లు విన్నారా?విన్నవాళ్లు ఆమె మాటలను ఏమనాలి? ఆమె భాషను సరిదిద్దే ప్రయత్నం చేశారా? జగన్ ను తిట్టడం కోసమే వాడుకుంటున్నారు. ఆమెతో అలా మాట్లాడించి నజరానాగా హోంమంత్రి పదవిని ఆమెకు ఇచ్చారు. కొన్ని మాటలు ఎవరు మాట్లాడినా నీచం కాదా. గతంలో బండారు సత్యనారాయణ అనే వ్యక్తి మాజీమంత్రి రోజాను ఎలా మాట్లాడారో అందరూ చూశారు. అసహ్యంగా, జుగుప్సాకరంగా మాట్లాడితే చంద్రబాబు, లోకేశ్, పవన్ ఏం చేశారు?’’ అని ప్రశ్నించారు.రోజా గురించి నీచంగా మాట్లాడారు..రోజాను నీచంగా తిట్టిన బండారు సత్యనారాయణను పవన్ బాగా చేశావని మెచ్చుకున్నారని పేర్ని నాని అన్నారు. ‘‘గతంలో పవన్ కూడా రోజాపై దారుణమైన మాటలు మాట్లాడారు. మంత్రితో పాటు ఆయనకు ఇప్పుడే సంస్కారం వచ్చిందా? గతంలో మా పార్టీ నేతలను ఏదో చేస్తామని మాట్లాడారు.. ఏం చేశారు అని అడుగుతున్నా. సుగాలి ప్రీతి కోసం పార్టీ పెట్టా అని చెప్పారు. హోంమంత్రి అనితను కూడా అమాయకురాలిని చేసి వాడుకుంటున్నారు. లోకేశ్ గతంలో మా నాయకుడు జగన్ గురించి.. ఆయన భార్యాపిల్లల గురించి మాట్లాడుతారు. మీ అమ్మగారు ఒక్కరే స్త్రీ నా? మీరు సంస్కారం గురించి మాట్లాడుతారు. అమర్ మాటల్లో తప్పేముంది.. అందులో అసభ్యత ఏముంది. లోకేశ్ నోరు ఉంది కదా అని అధికార మదంతో మాట్లాడితే వైసీపీ వాళ్లు కూడా అలాగే మాట్లాడుతారు. మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి కుటుంబం గురించి అలా మాట్లాడవచ్చా. ఎర్ర బుక్కు పేరుతో రాష్ట్రాన్ని దిగజార్చారు. అమర్ అనే వ్యక్తిని చిన్న వయస్సులోనే తండ్రి చనిపోతే తల్లిచాటున పెరిగారు. ఆయన ఎందుకు అలా మాట్లాడుతారు? అమర్ పై 10, 15 కేసులు పెట్టి తిప్పాలని చూస్తున్నారని మాకు సమాచారం ఉంది. మీ తప్పుడు కేసులు, అరెస్టులు అతని రోమాన్ని కూడా కదల్చలేరు’’ అని విమర్శించారు. -
నారా లోకేష్కు వైఎస్సార్సీపీ మహిళా నేతల సవాల్
సాక్షి, తాడేపల్లి: మంత్రి నారా లోకేష్కు వైఎస్సార్సీపీ మహిళా నేతలు సవాల్ విసిరారు. డీఎస్సీలో అక్రమాలపై చర్చించేందుకు తాము సిద్ధమంటూ ప్రకటించారు. తాడేపల్లి భరతమాత విగ్రహం వద్దకు చేరుకున్న మహిళా నేతలు లక్ష్మీ పార్వతి, శ్యామల, నాగమల్లేశ్వరి, జమ్మలమడక నాగమణి, మంజరీచౌదరి.. లోకేష్ స్థాయికి వైఎస్ జగన్ అవసరం లేదని.. దమ్ముంటే తమతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. లోకేష్తో చర్చకు భరతమాత విగ్రహం దగ్గరే వేచి ఉంటామని మహిళా నేతలు తెలిపారు. -
ఉత్తరాంద్ర సంప్రదాయాన్ని అనిత కాలరాస్తున్నారు: అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: మాజీ మంత్రి గుడివాడ్ అమర్నాథ్ తానెప్పుడూ మహిళల గురించి అవమాన కరంగా మాట్లాడలేదని, మా మీద, మా నేత మీద మాట్లాడిన మాటలకు ఖండించానని విశాఖపట్నంలో అన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు ఇలా మాట్లాడవచ్చా అని ప్రశ్నించారు. ఉత్తరాంద్ర సంప్రదాయాన్ని మంత్రి అనిత కాలరాస్తున్నారని అమర్నాథ్ అన్నారు. టీడీపీ ప్రచారం చేస్తున్నట్లు మహిళలను కించపరిచే విధంగా మాట్లాడలేదు. నేను మాట్లాడిన మూడు రోజులు తర్వాత రాజకీయం చేస్తున్నారు. మా సోషల్ మీడియా దేవుళ్ళు వలన గతంలో టీడీపీ నేతలు మాట్లాడిన వీడియోలు మళ్ళీ బయటకు వచ్చాయి. మహిళలు అంటే గౌరవం నాకు ఉందని అమర్నాథ్ పేర్కొన్నారు. నాపై, మా నాయకుడు పై విమర్శలు చేసిన వారి గురించే విమర్శలు చేశాను. నా మాటలకు నేను కట్టుబడి ఉన్నాను. నా పై విమర్శలు చేసిన వారిపై తప్పితే యావత్ మహిళలు కోసం నేను మాట్లాడలేదు. రాజకీయ లబ్ధి కోసం ఫేక్ ప్రచారం చేస్తున్నారు. మూడు తరాల రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం నుంచి నేను వచ్చాను. వాడు వీడు అంటూ ఒక బాధ్యతయుతమైన పదవిలో ఉన్న ఆమె మాట్లాడవచ్చా. మాజీ సీఎం తల్లి విజయమ్మ, భార్య భారతమ్మ గురించి దారుణంగా మాట్లాడింది. విజయమ్మ భారతమ్మ పై చేసిన విమర్శలు టీడీపీ నేతలకు కనిపించలేదా. వైఎస్ జగన్ ను నత్తి పకోడీ అంటూ మాట్లాడింది. మేము తగిన సమాధానం చెప్పకపోతే ఆమె మరింత పెట్రేగి పోతారు. ఉత్తరాంధ్ర సాంప్రదాయాన్ని కాపాడే ప్రయత్నం చేశాని ఆయన అన్నారు. మా నాన్న మరణం తరువాత నన్ను, నా అక్కను నా తల్లి పెంచింది. నాకు ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. నేను చిన్నప్పటి నుంచి ఆడవాళ్ళ మధ్య పెరిగిన వాడిని. నన్ను చిన్నతనం నుంచి తీర్చి దిద్దింది మహిళలు. నా గురించి మా పార్టీ మహిళలను అడుగు చెపుతారు. నీ లాంటి వాళ్ళకు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదు. గతంలో చంద్రబాబు,అనితా, చింతమనేని, బాలకృష్ణ, బండారు సత్యనారాయణ, గాలి భాను ప్రకాష్ మహిళలు గురించి ఎలా మాట్లాడారో తెలియదా.. అనిత ఏది పడితే అది మాట్లాడుతాను అంటే కుదరదు.. రాష్ట్రంలో కాదు దేశ అంతర్జాతీయ స్థాయిలో పిర్యాదు ఇచ్చుకొండి.. మళ్ళీ ఇంకోసారి రిపీట్ అయితే మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది. తగ్గేదిలేదు.. ఒక యువకుడిని కాల్చి చంపారు.. దాని గురించి సమాధానం లేదని అమర్నాథ్ ప్రశ్నించారు. -
నడిరోడ్డుపై ఉరితీయాలి..! ఛీ... గెలవడం కోసం ఇంత దిగజారుతావా..?
-
‘సర్’పై అత్యంత అప్రమత్తంగా ఉండాలి.. వైఎస్సార్సీపీ నేతలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశం
-
ఫేస్బుక్ పేజీని బ్లాక్ చేయడంపై వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధికారిక ఫేస్బుక్ పేజీని అందుబాటులో లేకుండా చేసిన చంద్రబాబు ప్రభుత్వ దుశ్చర్యపై ఆ పార్టీ న్యాయ పోరాటానికి దిగింది. వైఎస్సార్సీపీ ఫేస్బుక్ పేజీని భారతదేశంలో నిలిపివేయడానికి ఏ ప్రభుత్వ అధికారి ఉత్తర్వులిచ్చారు?, ఏ నిర్దిష్ట కంటెంట్ ఆధారంగా ఈ చర్య తీసుకున్నారు?అనే పూర్తి వివరాలను, నోటీసుల అసలు ప్రతులను వెంటనే తమకు అందజేసేలా మెటాను ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఐటీ చట్టంలోని సెక్షన్ 79(3)(బీ) కింద ఏదైనా ఖాతాదారుడి కంటెంట్ను తొలగించినప్పుడు, ప్రభుత్వ నోటీసు నకలును సదరు ఖాతాదారుడికి అందించాల్సిన బాధ్యత సంబంధిత సోషల్ మీడియా సంస్థ అయిన మెటాపై ఉందన్నారు. వైఎస్సార్సీపీ ఫేస్బుక్ పేజీని బ్లాక్ చేసే విషయంలో మెటా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని తెలిపారు. ఫేస్బుక్ పేజీని బ్లాక్ చేయడానికి గల కారణాలను తెలియజేయకపోవడం, అందుకు సంబంధించిన నోటీసు కాపీని ఇవ్వకపోవడం చట్టవిరుద్ధం, ఏకపక్షం, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని ఆయన హైకోర్టును అభ్యరి్థంచారు. ఈ వ్యాజ్యం తేలేంతవరకు, సదరు బ్లాకింగ్కు దారితీసిన ప్రభుత్వ నోటీసులు, కమ్యూనికేషన్ల కాపీలను తక్షణమే పిటిషనర్లకు సమర్పించేలా మెటా సంస్థను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టును కోరారు. ‘మెటా అధికార పార్టీకి సహకరిస్తోంది’ ‘శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ప్రభుత్వ నోటీసులను సాకుగా చూపి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు తమ ఇష్టానుసారంగా వ్యవహరించకూడదని సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పునిచ్చింది. ఈ బ్లాకింగ్ ప్రభుత్వ ‘సహయోగ్ పోర్టల్’ ద్వారా జరిగిందని భావిస్తున్నారు. అయితే, నోటీసు ఇచ్చిన సంస్థ అసలు చట్టబద్ధంగా నోటిఫై చేయబడిన సంస్థేనా కాదా అనే వివరాలు దాచారు. ఐటీ బ్లాకింగ్ రూల్స్–2009లోని రూల్ 16 ప్రకారం కొన్ని విషయాలు రహస్యంగా ఉంచవచ్చు. కానీ అది సెక్షన్ 69ఏ కింద చేసే బ్లాకింగ్కు మాత్రమే వర్తిస్తుంది. సెక్షన్ 79(3)(బీ) కింద మెటా తీసుకునే చర్యలకు ఈ రహస్య నిబంధన వర్తించదు. తటస్థ వేదికగా ఉండాల్సిన మెటా, అధికార పక్షం చెప్పినట్లు వింటూ ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కడానికి సహకరిస్తోంది. తద్వారా అది తన తటస్థతను కోల్పోయింది’ అని వివరించారు. ఈ వ్యాజ్యంలో కేంద్ర ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి, కేంద్ర ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ డిజిగ్నేటెడ్ ఆఫీసర్, మెటా ప్లాట్ఫామ్ ఇంక్, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. ‘మా భావ ప్రకటన స్వేచ్ఛ హరించడమే’ ‘2026 జూన్ 9న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ఫేస్బుక్ పేజీని భారతదేశంలో ఎవరికీ కనిపించకుండా మెటా సంస్థ నిలిపివేసింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 79(3)(బీ) కింద భారత ప్రభుత్వం, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల నుంచి వచ్చిన నోటీసు ఆధారంగా ఈ పేజీని నిలిపివేసినట్టు మెటా పేర్కొంది. అయితే, ఏ అధికారి లేదా ఏ శాఖ నోటీసు ఇచ్చిందో మెటా స్పష్టం చేయలేదు. ఎటువంటి ముందస్తు నోటీసు లేదా సంజాయిషీ ఇచ్చుకునే అవకాశం ఇవ్వకుండా రాత్రికి రాత్రే ఫేస్బుక్ పేజీని బ్లాక్ చేశారు. రాజకీయ పార్టీగా ప్రజలతో, లక్షలాది మంది ఫాలోవర్లతో కమ్యూనికేట్ చేయడం మా పార్టీ ప్రాథమిక హక్కు. మా పార్టీ అధికారిక ఫేస్బుక్ పేజీని బ్లాక్ చేయడం రాజ్యాంగం మాకు ప్రసాదించిన భావప్రకటన స్వేచ్ఛను హరించడమే. ఏదైనా నిర్దిష్ట పోస్ట్, వీడియో లేదా ఇమేజ్ చట్టవిరుద్ధంగా ఉంటే దాన్ని తొలగించవచ్చు. కానీ, కేవలం ఒక అస్పష్టమైన నోటీసుతో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన మొత్తం ఫేస్బుక్ పేజీని బ్లాక్ చేయడం చట్టపరిధిని మించిన చర్య’ అని అప్పిరెడ్డి తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. -
ఫీడ్ ధరలు తగ్గించాల్సిందే.. ‘ఆక్వా’పై అల్టిమేటం
సాక్షి, అమరావతి: దారుణంగా పెంచిన ఆక్వా ఫీడ్ ధరలను ఈ నెలాఖరులోగా తగ్గించాలని.. లేని పక్షంలో వచ్చే నెల 1 లేదా 2వతేదీన రైతులతో కలిసి ఆందోళన నిర్వహిస్తామని చంద్రబాబు సర్కార్కు మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అ«ధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అల్టిమేటం జారీ చేశారు. 2019–24 మధ్య ఆక్వా రంగానికి తమ ప్రభుత్వం పూర్తి అండగా నిలిచిందని గుర్తు చేశారు. ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూ.1.50కే ఇస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నామని, 57 నెలల్లో ఆక్వా విద్యుత్ సబ్సిడీ కింద రూ.3,306 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. అదే యూనిట్ విద్యుత్కు 2014–19 మధ్య రూ.3.85 చొప్పున వసూలు చేసిన చంద్రబాబు.. 2019 ఎన్నికలకు ఆర్నెల్ల ముందు ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూ.2కే అంటూ జీవోతో సరిపుచ్చి అమలు చేయలేదని ధ్వజమెత్తారు. జోన్ లోపల రైతులకు సబ్సిడీ కత్తిరింపులపై బెదిరిస్తున్నారని.. ఆ దిశగా వారం క్రితం జీవో ఆర్టీ 169 జారీ చేశారని.. క్లాజ్ నెం 4లో పవర్ ఫ్యాక్టర్ (పీఎఫ్) నిర్వహణపై రూల్ పెట్టారని దుయ్యబట్టారు. ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ కట్ చేసే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. తాము అప్పుడైనా, ఇప్పుడైనా.. ఎప్పుడూ ఆక్వా రంగానికి పూర్తి అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఆక్వా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఆక్వా రైతులతో పాటు ఏపీ ప్రాన్ ఫెడరేషన్ ప్రతినిధులు మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ను కలిసి తమ గోడు చెప్పుకున్నారు. వారి సమస్యలను సావధానంగా విన్న వైఎస్ జగన్.. ఆక్వా రైతులకు పూర్తి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే..తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆక్వా రైతులతో మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 35 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు.. ఫిషరీస్ అసిస్టెంట్లు.. అప్సడా ఈరోజు అత్యంత దారుణ స్థితిలో రైతులు, ఆక్వా రైతులు ఉన్నారు. చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. మన హయాంలో రైతులు, ఆక్వా రైతుల సంతోషం కోసం చాలా ఆలోచన చేశాం. అందుకే గతంలో ఏనాడూ చూడని మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రతి అడుగులో రైతుల చేయి పట్టుకుని నడిపించాం. 10 వేలకు పైగా ఆర్బీకేలు ఏర్పాటు చేశాం. వాటిలో 782 మంది ఫిషరీస్ అసిస్టెంట్స్ను నియమించాం. ఆక్వా సాగులో నాణ్యతతో కూడిన సీడ్, ఫీడ్ టెస్టింగ్ కోసం 35 ఆక్వా సాగు ప్రాంతాల్లో 35 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు, 782 మంది ఫిషరీస్ అసిస్టెంట్లు, వీటికి తోడు అప్సడా ఏర్పాటు చేశాం. సీఎం దానికి ఛైర్మన్గా ఉంటూ ఎక్కడా సిండికేట్ ఏర్పాటు కాకుండా, రైతులకు ద్రోహం జరగకుండా చూశాం. రూ.1.50కే యూనిట్ విద్యుత్..యూనిట్ విద్యుత్ రూ.1.50కే ఇచ్చి ఆక్వా రంగాన్ని ఆదుకున్నాం. అందుకోసం రూ.3,306 కోట్లు ఖర్చు చేశాం. మనం ఆ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టాక.. చంద్రబాబు యూనిట్ విద్యుత్ రూ.3.85 నుంచి రూ.2కి తగ్గిస్తానని ఆదేశాలు జారీ చేసినా అమలు మాత్రం చేయలేదు. అక్కడా విద్యుత్ సబ్సిడీ రూ.340 కోట్లు ఎగ్గొట్టాడు.అవార్డులు, భారీగా ఎగుమతులు.. రూ.వంద కోట్లతో ఆక్వా వర్సిటీ..మన హయాంలో ఆక్వా రంగానికి అన్ని విధాలుగా తోడుగా నిలవడం ద్వారా ఆక్వా సాగు ఒక పండగలా సాగింది. దీంతో డొమెస్టిక్ ఫిష్ మార్కెటింగ్లో స్కోచ్ అవార్డుతో పాటు 2021–22, 2023–24 సంవత్సరాలకు రాష్ట్రానికి బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డులు కూడా దక్కాయి. నాడు ఆక్వా ఉత్పత్తులు కూడా గణనీయంగా పెరిగాయి. అంతకు ముందు 2018–19లో 38 లక్షల టన్నులు ఉన్న రొయ్యలు, మత్స్య ఉత్పత్తులు 2022–23 నాటికి ఏకంగా 51 లక్షల టన్నులకు పెరిగాయి. మంచినీటి రొయ్యలు 4.55 లక్షల టన్నుల నుంచి 9.56 లక్షల టన్నులకు.. ఉప్పునీటి రొయ్యలు 5.28 లక్షల టన్నుల నుంచి 7.15 లక్షల టన్నులకు పెరిగాయి. అలా ఆ ఐదేళ్లలో సముద్ర, మంచినీటి, ఉప్పునీటి రొయ్యల ఉత్పత్తి 11 లక్షల టన్నుల నుంచి 18.50 లక్షల టన్నులకు పెరిగింది. అంతకు ముందు చంద్రబాబు హయాంలో 2018–19లో రూ.13,855 కోట్ల విలువైన 2.61 లక్షల టన్నుల ఆక్వా ఎగుమతులు జరిగితే.. 2022–23లో రూ.19,847 కోట్ల విలువైన 3.28 లక్షల టన్నుల ఆక్వా ఎగుమతులు జరిగాయి. మన ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఇవన్నీ జరిగాయి. అందుకే ఆక్వా వర్సిటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టాం. రూ.100 కోట్లు కేటాయించి భవనాల నిర్మాణం మొదలుపెట్టాం. తాత్కాలిక భవనాల్లో క్లాస్లు కూడా మొదలు పెట్టించాం. దాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం పూర్తిగా వదిలేసింది.నెలాఖరులోగా ధరలు తగ్గించాల్సిందేఫిబ్రవరి నుంచి జూన్ నాటికి కిలో ఫీడ్ దాదాపు రూ.16 వరకు పెరిగింది. ప్రభుత్వం ఈ నెలాఖరు నాటికల్లా ధరలు తగ్గించాలి. లేని పక్షంలో జూలై 1 లేదా 2న ఆక్వా రైతులతో కలిసి ఆందోళన చేస్తాం. రాష్ట్రమంతా చూసేలా సమస్యను ఎలుగెత్తి చాటుదాం. అప్పటిలోగా ఫీడ్ రేట్లు తగ్గిస్తారేమో చూద్దాం. అప్పటి వరకు వారికి టైమ్ ఇచ్చినట్లు కూడా ఉంటుంది. రేట్లు తగ్గించకపోతే ఆరోజు ఆక్వా రైతుల సమస్యలు యావత్ దేశం దృష్టికి తీసుకెళ్లేలా ప్రయత్నిద్దాం. తీవ్ర కష్టాల్లో ఉన్న ఆక్వా రైతులు క్రాప్ హాలీడే కూడా ప్రకటించుకోలేని పరిస్థితి. అలా చేస్తే ఆక్వా సాగులో ఉపయోగించే పరికరాలు, ఉపకరణాలు తుప్పు పట్టి పోతాయి. చెరువులు తవ్వారు కాబట్టి ఆ భూములు ఎందుకూ పనికిరావు. 3 సార్లు ఉపసంహరించేలా చర్యలు..నాడు ‘అప్సడా’ ద్వారా సిండికేట్ ఆట కట్టించడమే కాకుండా ఫీడ్ కంపెనీలు ధరలు పెంచితే మూడుసార్లు ఉపసంహరించేలా చర్యలు తీసుకున్నాం. థాయ్లాండ్కు చెందిన సీపీఎఫ్ కంపెనీ ఒకేసారి కిలోకు రూ.6.8 పెంచడానికి సిద్ధపడితే ఆక్వా రైతులు మన ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే వారిని పిలిపించి ధరల పెంపును విత్డ్రా చేసుకోవాలని, లేకపోతే ఫీడ్ యాక్ట్ ప్రయోగిస్తామని నోటీస్ ఇవ్వడంతో దారికొచ్చారు. ఆ విధంగా ఆక్వా రైతుల కోసం చిత్తశుద్ధితో పని చేశాం. ఇప్పుడు ఆక్వా సీడ్, ఫీడ్, ప్రాసెసింగ్ యూనిట్లన్నీ ఒకే వర్గం వారి చేతుల్లో ఉన్నాయి. వారంతా ఆయనకు సన్నిహితులు. అందుకే వారిపై ఎలాంటి చర్యలు లేవు. రొయ్యల ధరలపై నిరంతర సమీక్షనాడు ప్రతి 15 రోజులకు ఒకసారి అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యల ధరల హెచ్చు తగ్గులను ‘అప్సడా’ ద్వారా సమీక్షిస్తూ ప్రతి రైతుకూ ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర దక్కేలా చేశాం. 100 కౌంట్ రొయ్యలు రూ.245 చొప్పున, 30 కౌంట్ రొయ్యలు రూ.470 చొప్పున కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాం. ఇప్పుడు రొయ్యల ఉత్పత్తి వ్యయం పెరిగింది. కానీ రొయ్యల ధరలు పెరగకపోగా తగ్గాయి. దీంతో ఆక్వా రైతులు నష్టాల పాలవుతున్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం వైఎస్సార్సీపీ కో–ఆర్డినేటర్ వడ్డి ర«ఘురాంనాయుడు, పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజుతో పాటు ఏపీ ప్రాన్ ఫెడరేషన్ ప్రతినిధులు ఐపీఆర్ మోహన్రాజు, దుగ్గినేని గోపీనాథ్, జి.రాజ్కుమార్, నడింపల్లి సూర్యనారాయణరాజు, ఆర్.వెంకటరాజు, జి.ధర్మరాజు, కె.శ్రీనాథ్రెడ్డి, మేకా వెంకటేశ్వరరావు, కె.సుబ్బారెడ్డి, రమేష్రెడ్డి, సీహెచ్ కుమార దత్తాత్రేయవర్మ, జి.నారాయణమూర్తి, కె.నరసింహారావు, గుంటూరి పెద్దిరాజు, ఎ.చల్లారావు, బొక్కా రాధాకృష్ణతో పాటు వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఆక్వా రైతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.మరి ఇది.. సీబీఎన్ ట్యాక్సా? లోకేశ్ ట్యాక్సా?నాడు ఆక్వా ఫీడ్ కొంచెం పెరిగితే అది జగన్ ట్యాక్స్ అని దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు చాలా దారుణంగా రేట్లు పెంచారు. మరి ఇది ఏ ట్యాక్స్? ఎవరికి పోతోంది? ఈరోజు మీరు (ఆక్వా రైతులు) నన్ను కలుస్తున్నారని తెలియడంతో ఆక్వా సీడ్, ఫీడ్ ఉత్పత్తిదారులు తాము ధర ఎందుకు పెంచాల్సి వచ్చిందో చెబుతూ పేపర్లో ప్రకటనలు ఇచ్చారు. ఇప్పుడు అంతా సిండికేట్గా మారారు. అంతా కూడబలుక్కుని ఇష్టానుసారం రేట్లు పెంచారు. చేపలవేట నిషేధ సమయంలో ధరలు సమీక్షిస్తున్నారు. ఆ సాకు చూపి ఫీడ్ రేటు పెంచుతున్నారు. అది సరైన విధానం కాదు. ఫిషరీ సంపద ఎక్కువగా ఉన్నప్పుడు సమీక్షించి నిర్ణయం తీసుకోవాలి. ఆక్వా ఫీడ్, సీడ్ రంగంలో సహకార వ్యవస్థ వస్తే ఇలా సిండికేట్గా మారడం, దోపిడీ చేయడం సాధ్యం కాదు. మనం డెయిరీ రంగంలో అమూల్ను తీసుకురావడం వల్ల పాడి రైతులకు ఎంతో మేలు జరిగింది. అంతకు ముందు ప్రభుత్వంలో సిండికేట్ కావడం వల్ల ఆక్వా రైతుల పరిస్థితి దారుణంగా మారింది. మన ప్రభుత్వం రాగానే ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూ.1.50కే సరఫరా చేయడంతో పాటు వారికి తోడుగా నిలిచేలా ప్రత్యేకంగా ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా సాగు అభివృద్ధి సంస్థ’ (అప్సడా) ఏర్పాటు చేశాం. ఏపీ ఫిష్ ఫీడ్ (క్వాలిటీ కంట్రోల్) యాక్ట్–2020 అమలు చేసి ఆక్వా కంపెనీలు రైతులకు జవాబుదారీగా ఉండేలా చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు ‘అప్సడా’ను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. దీంతో అప్సడా ఆమోదం, అనుమతి లేకుండా ఫీడ్ ధరలు దారుణంగా పెంచారు. వనామీ ఫీడ్పై కేజీకి రూ.10, టైగర్పై కేజీకి రూ.12 చొప్పున పెంచారు. మరి ఇప్పుడు ఏ ట్యాక్స్ పడింది? సీబీఎన్ ట్యాక్సా? లోకేశ్ట్యాక్సా? వెంటనే పెంచిన ఆక్వా ఫీడ్ ధరలు తగ్గించాలి.బాబు బంధువులే ఉత్పత్తిదారులుటీడీపీ కూటమి ప్రభుత్వం ఆక్వా రంగానికి శాపంలా మారింది. పీఎఫ్ ఫ్యాక్టర్తో ఆక్వాకు విద్యుత్ సబ్సిడీ ఎత్తివేసే కుట్ర జరుగుతోంది. గతంలో ఆక్వాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ, సహకారాలు అందలేదు. మీరు (వైఎస్ జగన్) వచ్చాకే విద్యుత్ సబ్సిడీతో పాటు అప్సడా ఏర్పాటు ద్వారా ఆక్వా రంగాన్ని నిలబెట్టారు. ఇప్పుడు ఆక్వా రంగం పూర్తిగా సంక్షోభంలో ఉంది. చంద్రబాబు బంధువులే ఆక్వా సీడ్, ఫీడ్ ఉత్పత్తిదారులు. అందుకే ఒక్కరు కూడా నోరు మెదపడం లేదు. – ముదునూరి ప్రసాదరాజు, వైఎస్సార్ సీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడుజీవామృతంలా అప్సడా ఏర్పాటుఆక్వా రైతులకు జీవామృతంలా వైఎస్ జగన్ ‘అప్సడా’ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు అప్సడాను బైపాస్ చేసి ఫీడ్ రేట్లు పెంచుతున్నారు. వేట నిషేధ సమయంలో ఫిష్ మీల్ రేట్లు పెరుగుతాయి. దాన్ని బూచిగా చూపించి రేట్లు పెంచుతున్నారు. ఫీడ్ కంపెనీలకు సపోర్టు వ్యవస్థ ఉన్నప్పటికీ రైతులను దోచుకు తింటున్నారు. తద్వారా రైతులు రూ.10 వేల కోట్లు నష్టపోతున్నారు. రైతులను దోచుకునే విధానాలకు ముగింపు పలకాలి. కోవిడ్ సమయంలోనూ వైఎస్ జగన్ ప్రభుత్వం అత్యంత సమర్థంగా వ్యవహరించింది. లోకల్ మార్కెట్ పెంచడానికి ఫిష్ ఆంధ్రా కార్యక్రమం చాలా ఉపయోగపడింది. – ఐపీఆర్ మోహన్రాజు, భీమవరంఫిబ్రవరి నుంచి రెండుసార్లు పెంచారుఆక్వా ఫీడ్ ధర ఫిబ్రవరిలో టన్నుకు రూ.4 వేలు పెంచారు. మళ్లీ ఈనెల 13న రూ.10 వేల నుంచి రూ.12 వేలకు పెంచారు. వంద కౌంట్ రొయ్యలకు పెట్టుబడి ఖర్చు రూ.275 అయ్యింది. నెల క్రితం వరకూ రూ.250కు కొనుగోలు చేశారు. ఫీడ్ ధరలకు వ్యతిరేకంగా పోరాటం చేయడంతో ఇప్పుడు రూ.225కు తగ్గించేశారు. నాడు వైఎస్ జగన్ రాకముందు రైతులు తీవ్రంగా నష్టపోయారు. నాడు కరెంట్ సబ్సిడీ రూపాయిన్నరకు ఇవ్వడంతో రైతులు పండుగ చేసుకున్నారు. – జి.శ్రీనాథ్రెడ్డి, నెల్లూరు జిల్లాకోవిడ్లోనూ సరుకు అమ్ముకున్నాంవైఎస్ జగన్ ఆక్వా రైతులకు అప్సడా ద్వారా రక్షణ కవచం ఏర్పాటు చేశారు. కోవిడ్ సమయంలో మా పంట ఎవరూ కొనకపోతే జగన్ ప్రభుత్వం దగ్గరుండి కొనుగోలు చేయించింది. ప్రాసెసింగ్ ప్లాంట్ల సిండికేట్ ఆగిపోయింది. సీడ్ కారణంగా రైతులు నష్టపోతే సంబంధిత కంపెనీలను పిలిపించి మళ్లీ సీడ్ ఉచితంగా ఇప్పించారు. అంతర్జాతీయ కంపెనీ సీపీఎఫ్ ఛైర్మన్నే రాష్ట్రానికి రప్పించి ఫీడ్ ధరలు తగ్గించారు. ఫిబ్రవరిలో అప్సడా అనుమతి లేకుండా కంపెనీలు సిండికేట్ అయ్యి ఫీడ్ రేట్లు పెంచాయి. మళ్లీ మే 11న ఫీడ్ ధరలు పెంచారు. రైతుల అభ్యంతరాలను పట్టించుకోలేదు. వైఎస్ జగన్ తెచ్చిన చట్టాన్ని గట్టిగా అమలు చేయాలి. పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలి. మేం ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదు. ఉన్నది ఉన్నట్లు చెబుతున్నాం. – దుగ్గినేని గోపినాథ్, ప్రకాశం జిల్లాసబ్సిడీని దూరం చేసే కుట్ర..ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన జీవో నంబర్ 169 కాలమ్ నెం:4లో పవర్ ఫ్యాక్టర్ (పీఎఫ్) గురించి ఉంది. పవర్ ఫ్యాక్టర్ పేరుతో రైతులకు సబ్సిడీని దూరం చేసే కుట్ర చేస్తున్నారు. నిర్దేశించిన పీఎఫ్ రావాలంటే కెపాసిటర్లు పెట్టుకోవాలి. అవి ఏర్పాటు చేసుకోవాలంటే ఎకరాకు రూ.లక్షన్నర ఖర్చు అవుతుంది. ఎకరా లీజు రూ.లక్ష నుంచి లక్షన్నర అవుతుంది. సీడ్ రూ.యాభై వేలు అవుతుంది. రెండు టన్నుల మేత అవసరం. మొత్తానికి ఎకరా సాగుకు రూ.5 లక్షలు అవుతుంది. రైతులపై విపరీతమైన భారం పడుతోంది. – సీహెచ్ కుమారదత్తాత్రేయ వర్మ, పాలకొల్లుసొంత మనుషుల కంపెనీలకు వత్తాసుడాలర్ విలువ రూ.90 అయినా ఆక్వా రైతుకు రేటు రూ.240 దాటడం లేదు. డాలర్ విలువ రూ.40 ఉన్నప్పుడు వనామీ రేటు రూ.300 పలికేది. కరెంట్ సబ్సిడీ బూచిగా చూపించి ఫీడ్ రేట్లు పెంచుతున్నారు. సొంత మనుషుల కంపెనీలకు వత్తాసు పలుకుతున్నారు. ఫీడ్ రేట్లు పెంచుకోవడానికి వారికి అనుమతి ఇస్తున్నారు. – ప్రసాదరాజు, పశ్చిమ గోదావరి జిల్లాథాయ్లాండ్ విధానాలు అనుకూలం థాయిలాండ్లో ఆక్వా సాగు బాగుంది. అక్కడి విధానాలు రైతులకు అనుకూలంగా ఉన్నాయి. వాటిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి, మన రాష్ట్రంలోనూ అమలు చేస్తే రైతులకు మేలు జరుగుతుంది. – రాజ్కుమార్ప్రభుత్వం నిద్రపోతోంది..ఆక్వా కంపెనీలు ముంబై మాఫియాలా నడుస్తున్నాయి. సీజన్ చూసి రేట్లు తగ్గించేస్తున్నారు. ప్రభుత్వం నిద్రపోతోంది. ఆర్నెల్ల క్రితం ముడిసరుకు రేట్లు తగ్గినప్పుడు కిలోకు రూ.4 తగ్గించామని చెబుతున్నారు. కాని దాన్ని డీలర్ కమీషన్ తగ్గించినట్టు చూపించారు. క్రాప్ హాలిడే ఇస్తే మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా తుప్పుపట్టిపోతుంది. – పెద్దిరాజు, పశ్చిమ గోదావరి జిల్లాఆక్వాకు జగన్ తోడుగా నిలబడాలిగత ప్రభుత్వంలో రైతులకు తోడుగా నిలబడ్డారు. ఇప్పుడు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫీడ్, సీడ్ ఇచ్చేవి అవే కంపెనీలు. ప్రాసెసింగ్ ప్లాంట్లూ వారివే. పంట వేసినప్పుడు మంచి రేటు ఆశ చూపిస్తున్నారు. తీరా పంట చేతికి వచ్చే సరికి రేట్లు దించేస్తున్నారు. నర్సాపురంలో మీరు ఫిషరీస్ యూనివర్శిటీ మంజూరుచేశారు. ఇప్పుడు పనులు ముందుకు పోవడంలేదు. ఆక్వాకు జగన్ మరింత తోడుగా నిలబడాలి. – జి.నారాయణమూర్తి, మొగల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లామిమ్మల్ని ఓడించినందుకు ఇలా..ఆక్వా రైతులు దీన పరిస్థితుల్లో ఉన్నారు. మిమ్మల్ని ఓడించినందుకు మాకు ఇది శాపంలా తగిలింది. ఆక్వా రైతులకు మీరు అండగా నిలబడ్డారు. బలమైన వ్యవస్థలు ఏర్పాటు చేసి రైతుకు మద్దతుగా నిలబడ్డారు. ఇప్పుడు ఒకే సామాజిక వర్గానికి చెందినవారివే ఫీడ్, సీడ్. ఆక్వాపై ఆధారపడ్డ వారి జీవితాలు అతలాకుతలం అయిపోతున్నాయి. – జయకృష్ణంరాజు, ఉండిఆక్వా సంక్షోభంతో ఉపాధికి గండిఆక్వా సాగు సంక్షోభంలో ఉంటే ఉపాధి తగ్గిపోతుంది. ప్రభుత్వానికి రెవిన్యూ తగ్గిపోతుంది. కరెంటు సబ్సిడీని పీఎఫ్కి లింకు చేయడం అన్యాయం. కరోనా సమయంలో కూడా గత ప్రభుత్వం రైతులకు అండగా నిలబడింది. కనీస మద్దతు ధర నిర్ణయించి కొనుగోలు చేశారు. ఆ రోజు జగన్ చర్యలు తీసుకోకుంటే ఆక్వా రంగం కుదేలయ్యేది. – ధర్మరాజుజగన్ గళం విప్పితే.. పరిష్కారంనాణ్యమైన సీడ్ ఇవ్వడం లేదు. జగన్ గళం విప్పితే రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈరోజు మేం ఇక్కడ మీటింగ్కు వస్తుంటే అక్కడ వేరే పార్టీ వాళ్లు ఆందోళనకు దిగారు. – నానిరాజు, అమలాపురంఫీడ్ కంపెనీలపై తిరగబడతాంఫీడ్ కంపెనీల మీద తిరగబడడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఒక్క మాట చెబితే చాలు. మేం ధైర్యంగా పోరాడగలం. ఫీడ్, సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లన్నీ ఒకే వర్గం వారి చేతుల్లో ఉన్నాయి. దీంతో మాకు చాలా అన్యాయం జరుగుతోంది. – అండ్రాజు చల్లారావు, ఆప్కాబ్ మాజీ ఛైర్మన్ఆర్బీకేల ద్వారా పంపిణీవైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉచితంగా సర్టిఫికేషన్ చేసేవాళ్లు. ఇవాళ అందుకోసం ఎకరాకు రూ.5 వేలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. అప్పట్లో భూసార పరీక్షలు జరిగాయి. ఇప్పుడు జరగడం లేదు. రైతు భరోసా కేంద్రాల ద్వారా అప్పుడు ఫీడ్ పంపిణీ జరగేది. ఇప్పుడు జరగడం లేదు. చిన్న, సన్నకారు రైతులు రోజువారీ కూలీలుగా మారిపోతున్నారు. – నరసింహారావు, ఆక్వా రైతు -
ఓట్లు తొలగించేందుకు చంద్రబాబు కుట్ర
సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(సర్)పై నియోజకవర్గాల్లోని కో–ఆర్డినేటర్లు, రీజనల్ ఇన్ఛార్జిలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. సర్ ప్రక్రియ జరుగుతున్న తీరుపై ప్రతిరోజూ సమీక్ష చేయాలని, ఎక్కడైనా తప్పులు జరుగుతున్నాయని తెలిసిన వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకురావాలని చెప్పారు. వచ్చే నాలుగు వారాలు అత్యంత కీలకమని, సర్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వద్దని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ నాయకులతో సమావేశమయ్యారు. సర్ ప్రక్రియపై చర్చిస్తూ.. ఈ ప్రక్రియలో ఒక్కసారి ఓటు తొలగించిన తర్వాత, దాన్ని తిరిగి చేర్పించాలంటే అత్యంత కష్టమవుతుందన్నారు. ప్రతి నియోజకవర్గ సమన్వయకర్త దీన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు, తన అధికార దుర్వినియోగంతో ఏదో రకంగా వైఎస్సార్సీపీకి చెందిన ఓట్లను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, బూత్కు కనీసంగా 50 ఓట్లు తొలగించాలని చూస్తున్నారని ఎత్తిచూపారు. గిమ్మిక్కులతో ఓట్లు తొలగించే తప్పుడు పనుల్లో చంద్రబాబు ఆరితేరిన వ్యక్తి అని, వైఎస్సార్సీపీ కో–ఆర్డినేటర్లు, బూత్ లెవల్ ఏజెంట్లు దీన్ని అడ్డుకోవాలని, ప్రతి ఓటునూ కాపాడుకోవాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న సర్ ప్రక్రియపై ప్రతి అంశంలోనూ అప్రమత్తత, నిరంతర సమీక్షలు నిర్వహించాలని పార్టీ నేతలను ఆదేశించారు. -
‘అసలు సమస్యలు పక్కనపెట్టి ‘కూటమి’ డైవర్షన్ డ్రామా’
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో మహిళల భద్రత, చిన్నారుల అదృశ్య ఘటనలు, శాంతిభద్రతల సమస్యలు, పెరుగుతున్న అప్పులు, సంక్షేమ పథకాల అమలులో వైఫల్యాలు వంటి అసలు సమస్యలపై సమాధానం చెప్పలేక కూటమి ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వీరశేఖర్రెడ్డి మండిపడ్డారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తూ కొత్త వివాదాలకు తెరలేపారని ఆక్షేపించారు.రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న అసలు సమస్యలపై చర్చ జరగకుండా దృష్టి మళ్లించడమే ఈ రాజకీయ రచ్చ వెనుక ఉద్దేశమని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ప్రెస్మీట్లో వీరశేఖర్రెడ్డి ఏమన్నారంటే..అప్పుల్లో చంద్రబాబు గిన్నిస్ రికార్డుఎన్నికలకు ముందు వైఎస్ జగన్ ప్రభుత్వంపై రాష్ట్రం రూ.12 లక్షల కోట్లు, రూ.14 లక్షల కోట్లు అప్పుల్లో ఉందంటూ కూటమి నేతలు దుష్ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లలోనే రూ.3.50 లక్షల కోట్ల అప్పులు చేశారు. కేవలం జూన్ నెల తొలి 15 రోజుల్లోనే రూ.9 వేల కోట్లు అప్పు చేసిన చరిత్ర చంద్రబాబు ప్రభుత్వానిది. మరోవైపు కోవిడ్ వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ వైయస్ జగన్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకెళ్లి, గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, మెడికల్ కాలేజీలు, పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేయడంతో పాటు లక్షలాది మందికి ఉపాధి, ఉద్యోగాలు కల్పించింది.ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సూడాన్, సోమాలియా వంటి నిరుపేద దేశాల కంటే దారుణంగా తయారైంది. ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తోంది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించక విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తోంది. కాలేజీ యాజమాన్యాలు ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయి. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో నెట్వర్క్ ఆసుపత్రుల్లో పేదలకు వైద్యం అందడం లేదు. చేయూత, చేదోడు వంటి సంక్షేమ పథకాలు అటకెక్కాయి. రైతులకు మద్దతు ధర లేదు.. రైతు భరోసా లేదు.రాష్ట్ర ఆదాయం ఆవిరివైఎస్ జగన్ పాలనలో రాష్ట్రంలో తలసరి ఆదాయం, జీఎస్డీపీ, జీఎస్టీఎన్ వసూళ్లు, పారిశ్రామిక వృద్ధి, వ్యవసాయ వృద్ధి, సేవారంగ వృద్ధి గణనీయంగా పెరిగాయి. కానీ నేడు ఆ ప్రగతి కనిపించడం లేదు. సంపద సృష్టిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, రాష్ట్ర సంపదనే ఆవిరి చేస్తున్నారు. క్వార్ట్జ్, మట్టి, ఇసుక, మద్యం, సిలికా, భూములు అన్నింటినీ టీడీపీ నేతలు దోచుకుంటున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఇసుక ద్వారా ఏటా రూ.750 కోట్ల ఆదాయం రాష్ట్ర ఖజానాకు వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాలు దారి మళ్లిపోవడంతో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడింది.మద్యం ఏరులై పారుతున్నా రాష్ట్ర ఖజానాకు ఆదాయం రావడం లేదు. అమరావతి పేరుతో అంచనాలు పెంచి దోపిడీ చేస్తున్నారు. కూటమి పాలనలోనే రాష్ట్రం దివాళా దిశగా వెళ్తోందని కాగ్ లెక్కలే చెబుతున్నాయి. సంక్షేమ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. ఈ వైఫల్యాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు. వైఎస్సార్సీపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలను బ్యాన్ చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకూడదన్న నిరంకుశ ధోరణితో పాలన సాగుతోంది.గాడితప్పిన శాంతి భద్రతలురాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో హోంమంత్రి అనిత అసెంబ్లీలో ఇచ్చిన సమాధానమే చెబుతోంది. గంటకు ముగ్గురు మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆమె స్వయంగా వెల్లడించారు. ముచ్చుమర్రిలో అదృశ్యమైన బాలిక ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి కోసం తల్లిదండ్రులు వారం రోజులుగా గగ్గోలు పెడుతున్నారు. విజయవాడలో సాయికృష్ణ ఘటనపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. రాప్తాడులో మైనర్ బాలికపై అత్యాచారం, గుంటూరులో టీడీపీ నేతల ఆగడాలు, మహిళలపై వేధింపుల ఘటనలపై మౌనం పాటిస్తున్న ప్రభుత్వం.. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలను మాత్రం రాష్ట్ర సమస్యగా చిత్రీకరిస్తోంది.'మేకప్' వ్యాఖ్యలే పెద్ద సమస్యా?రాష్ట్రంలో మహిళలు, చిన్నారులు, బడుగు బలహీన వర్గాల భద్రత కంటే హోంమంత్రిపై చేసిన 'మేకప్' వ్యాఖ్యలే పెద్ద సమస్యగా చూపించడం దురదృష్టకరం. టీడీపీ, జనసేన నేతలు గతంలో వైఎస్సార్సీపీ మహిళా నేతలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను మరిచి ఇప్పుడు నీతులు చెబుతున్నారు. అసలు సమస్యలపై సమాధానం చెప్పకుండా డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారు. నా కూతురు ఎక్కడ? నా కొడుకు ఎక్కడ? అని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. ప్రజల సమస్యలను పక్కనపెట్టి రాజకీయ రచ్చ చేయడం మానుకోవాలి. ఈ కీచక పాలనను ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో ప్రజలే తగిన తీర్పు ఇస్తారు అని వీరశేఖర్రెడ్డి హెచ్చరించారు. -
‘శాంతి భద్రతల వైఫల్యంపై హోం మంత్రి పచ్చి అబద్ధాలు’
సాక్షి, విశాఖపట్నం: కూటమి పాలనలో పోలీస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి, ఖాకీ దుస్తులను ఎల్లో యూనిఫామ్గా మార్చేశారని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విశాఖపట్నంలోని ఆ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో నిత్యం 70 మంది మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా.. క్రైమ్ రేట్ తగ్గిందంటూ హోంమంత్రి అనిత అధికారుల సమక్షంలో పచ్చి అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటన్నారు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని తేల్చి చెప్పారు. చట్టాల అమల్లో ఏపీ దేశంలోనే 36వ స్థానానికి పడిపోయిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేత చీవాట్లు తిన్న మాట వాస్తవం కాదా అని నిలదీశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్పై వ్యక్తిగత విమర్శలకు దిగుతూ హోంమంత్రి తన సంస్కారహీన భాషను ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.ఇప్పటికైనా తిట్ల పురాణం మానేసి.. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, లైంగిక వేధింపుల నిందితుడు ఆదిమూలం, గర్భస్రావానికి కారణమైన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్లను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే..రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను చంద్రబాబు పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఏ రాష్ట్రంలోనైనా అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయడం పోలీసుల విధి. కానీ ఏపీలో మాత్రం కూటమి ప్రభుత్వ 'రెడ్ బుక్ రాజ్యాంగాన్ని' అమలు చేయడానికి పోలీసులను వాడుకుంటున్నారు. పోలీసుల ఖాకీ దుస్తులను 'ఎల్లో యూనిఫామ్'గా మార్చిన ఘనత చంద్రబాబుదే. ఐపీఎస్ (IPS) కాస్తా కూటమి పాలనలో 'ఇండియన్ పొలిటికల్ పనిష్మెంట్ సర్వీస్' గా.. ఏపీపీఎస్ (APPS) కాస్తా 'ఏపీ పొలిటికల్ రివేంజ్ సర్వీస్' గా మారిపోయాయి.దేశవ్యాప్తంగా కేంద్రం తెచ్చిన 'బీఎన్ఎస్' చట్టాలను ప్రజల కోసం వాడుతుంటే, ఏపీలో మాత్రం వాటిని నిర్వీర్యం చేసి 'బాబు రాజకీయ న్యాయసంహిత చట్టాలు' గా మార్చివేశారు. పోలీసు బెల్టుపై ఉండే మూడు సింహాలు న్యాయం, చట్టం, నీతికి ప్రతీకలు. కానీ నేడు ఆ మూడు సింహాలను మూడు కూటమి పార్టీలకు తొత్తులుగా, కీలుబొమ్మలుగా మార్చేశారు.కూటమి ఎమ్మెల్యేల అరాచకాలు.. పోలీసుల పక్షపాతంసాక్షాత్తూ పోలీసుల సమక్షంలోనే ప్రతిపక్ష నేతలు, న్యాయవాదులపై దాడులు జరుగుతున్నా హోం శాఖ చేష్టలుడిగి చూస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏలూరు నడిబొడ్డున పోలీసుల ముందే టీడీపీ లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ ఇంటిపై జేసీబీతో హత్యాయత్నానికి దిగితే.. దౌర్జన్యకారుడిని వదిలేసి బాధితుడిపైనే పోలీసులు కేసులు పెట్టడం దుర్మార్గం. గతంలో ఎమ్మెల్యే గల్లా మాధవి .. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై పోలీసుల ముందే దాడి చేసి, ఆస్తులు తగలబెడితే.. తిరిగి అంబటి రాంబాబుపైనే కేసులు పెట్టారు తప్ప ఎమ్మెల్యే దంపతులపై చర్యలు లేవు.మరో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులపై పోలీసుల సమక్షంలోనే పెట్రోల్ బాంబులతో దాడి చేసి ఇల్లు తగలబెట్టారు. ఈ చర్యలు చూస్తుంటే పోలీసులు అరాచక శక్తులకు అండగా ఉంటున్నారనేది స్పష్టమవుతోంది. ఎన్నికల్లో పోలీసులకు డీఏ, వీక్లీ ఆఫ్, ఐఆర్, పీఆర్సీ, సరండర్ లీవ్స్ ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ ఎగ్గొట్టి పోలీసులకే వెన్నుపోటు పొడిచారు.కేంద్ర హోంమంత్రి చీవాట్లు.. దేశంలోనే ఏపీ పోలీస్ ఆఖరి ర్యాంక్హోంమంత్రి అనిత, రాష్ట్ర పోలీస్ శాఖ పనితీరు వైఫల్యాలు జాతీయ స్థాయిలో బయటపడ్డాయి. ఏపీ పోలీసు వ్యవస్థ పనితీరుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చీవాట్లు పెట్టిన మాట వాస్తవం కాదా? దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ కాల్ సెంటర్ (112) రెస్పాండ్ టైమ్ 18 నిమిషాలు ఉంటే, ఏపీలో అది 26 నిమిషాలు ఎందుకుంది? ప్రజలు రక్షించమని ఫోన్ చేస్తే 26 నిమిషాల దాకా పట్టించుకోని వ్యవస్థను పెట్టుకుని హోంమంత్రి అవార్డులు వచ్చాయని ఎలా చెప్పుకుంటారు? కొత్త చట్టాలైన బీఎన్ఎస్, బీఎన్ఎస్ఎస్ అమల్లో దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఏపీకి 36వ (చిట్టచివరి) ర్యాంకు వచ్చింది. ఇది కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటు.ప్రభుత్వ సర్వేలోనే అట్టడుగు:కూటమి ప్రభుత్వం స్వయంగా చేసిన ఐవీఆర్ఎస్ (IVRS) సర్వేలోనే రాష్ట్రంలోని 21 జిల్లాల్లో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని, ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తేలింది. అందుకే ఈ రాష్ట్రంలో 'HM' అంటే హోం మంత్రి కాదు.. 'హెరాస్ మెంట్ మంత్రి' (Harassment Minister) లేదా హెడ్ స్ట్రాంగ్ మంత్రి' అని పిలుస్తున్నారు.ఉమ్మడి విశాఖ జిల్లాలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే.. దానికి సమాధానం చెప్పలేక హోంమంత్రి అనిత వ్యక్తిగత విమర్శలకు దిగడం దారుణమన్నారు. ఒక మాజీ మంత్రిని పట్టుకుని ‘వాడు, వీడు, ఎవడు వీడు’ అంటూ నోటికొచ్చినట్లు అసభ్య పదజాలంతో తూలనాడటం ఆమె సంస్కారహీనతకు నిదర్శనమన్నారు. "గతంలో ఉపాధ్యాయురాలిగా ఉన్న అనిత గారు.. ఆరోజు పిల్లలకు నేర్పించిన సంస్కారం ఇదేనా?"గతంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ని ఏకవచనంతో పిలవడం, టీడీపీ ఆఫీసు వేదికగా గౌరవనీయులైన వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతమ్మలపై అత్యంత హేయమైన పదజాలం వాడటం అనితకే చెల్లింది. మేము కూడా అదే భాషలో మాట్లాడగలం, కానీ వైఎస్సార్సీపీ సంస్కారం తమకు అడ్డువస్తోంది. ఎవరినైనా నోటికొచ్చినట్లు తిట్టి.. ఎవరైనా తిరిగి ప్రశ్నిస్తే 'మహిళా ట్యాగ్'ను తెరపైకి తెచ్చి రాజకీయం చేయడం అనితకు అలవాటుగా మారింది, ఆమె ప్రవర్తన చూసి టీడీపీలోని మహిళలే అసహ్యించుకుంటున్నారు.రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవు..మహిళా హోంమంత్రిగా ఉండి కూడా రాష్ట్రంలో మహిళల రక్షణను పూర్తిగా గాలికొదిలేశారు. రాష్ట్రంలో రోజుకు కనీసం 70 మంది మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ముగ్గురు-నలుగురు మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. హోంమంత్రి పక్క నియోజకవర్గంలో 10 రోజుల క్రితం చిన్నపాప కనిపించకుండా పోతే ఆ తల్లి బాధను పట్టించుకున్న నాథుడే లేడు. ఎలమంచిలి రాంబల్లిలో మైనర్ బాలిక గొంతు కోసి చంపేస్తే ఆ కుటుంబానికి బాధ్యత గల హోంమంత్రి ఎందుకు ధైర్యం చెప్పలేదు? కాపు యువకుడిని లాకప్ డెత్ చేస్తే సదరు సీఐ, పోలీసులపై ఏం చర్యలు తీసుకున్నారు? గంజాయిని నిర్మూలించామని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. గంజాయి డాన్ సోహైల్ పోలీసుల నుంచే తప్పించుకున్నాడు. నిందితుడి గురించి మీడియా అడిగితే హోంమంత్రి తెల్లమొహం వేసుకుని అధికారుల వైపు చూడటం ఆమె అసమర్థతకు నిదర్శనం.పవన్ కళ్యాణ్, టీడీపీ నేతలకు సూటి ప్రశ్నలుహోంమంత్రికి మద్దతుగా మాట్లాడుతున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మాజీ మంత్రి పీతల సుజాత, ఎంపీ బైరెడ్డి శబరిలను సూటిగా ప్రశ్నిస్తున్నాం. హోంమంత్రి అనిత అత్యంత అసభ్యంగా, రెచ్చిపోయి ప్రతిపక్షాల మీద దిగజారుడు వ్యాఖ్యలు చేసినప్పుడు మీరు ఆమెకు ఎందుకు గడ్డిపెట్టలేదు? ఒక ముఖ్యమంత్రి తల్లిని, భార్యని అత్యంత నీచమైన పదజాలం వాడినప్పుడు ఆమెతో ఎందుకు క్షమాపణ చెప్పించలేదు? ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని అడుగుతున్నారు? మీరు తప్పు చేసి మా పార్టీ మీద తిరిగి నిందలు వేయడం ఎంతవరకు సమంజసం? ప్రజలు ఇవన్నీ గమనించరు అని మీరు అనుకుంటున్నారా? మీ పార్టీ నేత బండారు సత్యనారాయణ మాజీ మంత్రి రోజాపై అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడారు. ఆ రోజు మీరు ఎందుకు స్పందించలేదు. మీకు బాధ్యత లేదా? ఇక డిప్యూటీ సీఎం ట్వీట్ చేస్తూ హోంమంత్రి గారి మీద వ్యాఖ్యలపై స్పందించారు. సభ్యత, సంస్కారం గురించి మాట్లాడుతున్న మీరు మీ తల్లిని తిట్టిని టీడీపీ నేతలకు సభ్యత, సంస్కారం నేర్పించరా?ఆ రోజు బండారు సత్యనారాయణ మాజీ మంత్రి రోజాపై అసభ్య వ్యాఖ్యలు చేసి పవన్ కళ్యాణ్ను హోటల్లో కలిస్తే.. పవన్ తనను అభినందించారని బండారు స్వయంగా చెప్పుకున్నారు. తోటి కళాకారిణిపై అంత అసహ్యంగా మాట్లాడితే మెచ్చుకోవడం పవన్ కళ్యాణ్ సంస్కారమా? ప్రతిపక్ష మహిళలపై దాడులు జరిగినప్పుడు మీ సంస్కారం ఎక్కడికి పోయింది. ఒక మహిళకు నలుగురైదుగురు సార్లు అబార్షన్ చేయించిన మీ కూటమి ఎమ్మెల్యేపై కనీస చర్యలు ఎందుకు తీసుకోలేదు? సోషల్ మీడియాలో మహిళలను అసభ్యంగా తిడుతూ పోస్టులు పెట్టే సంస్థ 'ఐటీడీపీ' (iTDP) మీ ఆఫీస్ నుంచే నడుస్తోంది కదా.. దానికి సభ్యత నేర్పరా?సీఎం బావమరిది, ఎమ్మెల్యే బాలకృష్ణ "ఆడది కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలి" అని అసహ్యంగా మాట్లాడితే.. చంద్రబాబు నాయుడు "కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా" అని ఆడబిడ్డ పుట్టుకను అవమానిస్తే.. వారికి పవన్ కళ్యాణ్ సభ్యత, సంస్కారం నేర్పించరా? కూటమిలోని మహిళలకు ఒక న్యాయం, ఎదుటి పార్టీ మహిళలకు మరొక న్యాయమా? ఒక్క మాట పొరపాటుగా మాట్లాడితే మా సీఎం మందలిస్తారని హోంమంత్రి చెబుతున్నారు... మరి విజయమ్మ, భారతమ్మలను దూషించినప్పుడు చంద్రబాబు ఎందుకు మందలించలేదు?.లీగల్ సెల్ నేత ఇంటిపై జేసీబీతో దాడి చేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను తక్షణమే అరెస్ట్ చేయాలి. కాపు యువకుడిని లాకప్ డెత్ చేసిన పోలీస్ అధికారి (CI)ని వెంటనే అరెస్ట్ చేయాలి. మహిళలను లైంగికంగా వేధించిన కూటమి నేత ఆదిమూలం, మహిళను వేధించి గర్భస్రావం చేయించిన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్లను వెంటనే జైలుకు పంపాలి. మహిళా వీఆర్వోను వేధించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, మహిళను వేధించిన సంధ్యారాణి పీఏలను తక్షణమే అరెస్ట్ చేయాలి.హోంమంత్రి అనిత ఇప్పటికైనా తిట్ల పురాణం మానేసి శాంతిభద్రతల అమలుపై, మహిళా రక్షణపై దృష్టి పెట్టాలని సూచించారు. లేనిపక్షంలో పాలనలో విఫలమైన అసమర్థ ముఖ్యమంత్రిగా చంద్రబాబు, విఫల హోంమంత్రిగా అనిత చరిత్రలో మిగిలిపోతారని, ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి హెచ్చరించారు. -
‘ప్రజల ప్రాణాలంటే బాబు సర్కార్కు లెక్కే లేదు’
సాక్షి, తాడేపల్లి: రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనలో 16 మంది మృతి చెందిన నేపథ్యంలో ప్రభుత్వం తీరుపై మాజీ ఎంపీ మార్గాని భరత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బాధిత కుటుంబాలతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన.. ఘటనపై ప్రభుత్వ స్పందన తీరును తీవ్రంగా తప్పుబట్టారు. కల్తీ పాల ఘటనపై ఇప్పటివరకు పూర్తి నివేదిక ఇవ్వలేదని, ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని మార్గాని భరత్ విమర్శించారు. ప్రజల ప్రాణాలపై ప్రభుత్వానికి బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు.బాధిత కుటుంబాలను పరామర్శించే తీరిక లేదా?రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి 16 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఇప్పటివరకు సీఎం చంద్రబాబు సహా రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలను పరామర్శించలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆరోగ్య శాఖ మంత్రి కూడా బాధితులను కలవలేదు. ఇదే ఘటనలో చికిత్స పొందుతున్న చిన్నారి రుహానియా పూర్తిగా కోలుకోలేదు. మొదట పెద్ద పెద్ద హామీలు ఇచ్చిన అధికారులు తర్వాత డిశ్చార్జ్ చేయాలని ఒత్తిడి చేయడం దురదృష్టకరం. బాధిత కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ప్రభుత్వం నుంచి సరైన సహాయం అందలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్రంలో అనేక ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కల్తీ పాల ఘటనపై ఇప్పటికీ పూర్తి నివేదిక కూడా ఇవ్వలేదు.ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలిమీకు ప్రజల ప్రాణాలంటే లెక్క లేదా చంద్రబాబు? గతంలో గోదావరి పుష్కరాల సమయంలో 26 మంది చనిపోతే అది భక్తుల అత్యుత్సాహం వల్లే అని నివేదికలు ఇచ్చారు. ప్రభుత్వ వైఫల్యాన్ని తప్పించుకోవడానికి ప్రజలపై నెపం మోపారు. మిల్క్ ప్రొక్యూర్మెంట్ యాక్ట్లో పిరియాడిక్ చెకప్ జరగాలని వైయస్ జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసినా ఈ ప్రభుత్వం అమలు చేయలేదు. కల్తీ పాల ఘటనలో బాధిత కుటుంబాలకు ఇచ్చిన రూ.10 లక్షల పరిహారం తక్కువ, వెంటనే దాన్ని రూ.20 లక్షలకు పెంచాలి. భవిష్యత్తులో చికిత్స ఖర్చులు పూర్తిగా ప్రభుత్వమే భరించాలి. ఈ ఘటనలో బాధితులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం” అని మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు.ఎవరూ పట్టించుకోవడం లేదు: రితిక్ తండ్రి లవ్రాజుకల్తీ పాలు తాగి మా బాబు రితిక్ అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆసుపత్రిలో చేర్పించాం. మొదటి మూడు రోజులు కలెక్టర్, అధికారులు వచ్చి వెళ్లారు. ఆ తర్వాత మా బాబును ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. మాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పించమని స్థానిక ఎమ్మెల్యేను కలిస్తే కలెక్టర్ను కలవమన్నారు. ఎవరూ మాకు న్యాయం చేయలేదు. ఎవరూ పట్టించుకోలేదు.ప్రభుత్వం హామీ నిలబెట్టుకోవాలి: రుహానియా తండ్రి రాకేష్ఫిబ్రవరి 16వ తేదీన మా పాప కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురైంది. 17వ తేదీన ఆసుపత్రిలో చేర్పించాం. రెండు ఆసుపత్రుల్లో కలిపి మాకు రూ.3.50 లక్షల వరకు ఖర్చు అయింది. తర్వాత రాజమండ్రి రెయిన్బో చిల్డ్రన్స్ ఆసుపత్రిలో చేర్పించాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు చికిత్స జరుగుతోంది. మా పాప కిడ్నీ ట్యూబ్స్ ఇంకా పూర్తిగా రికవరీ కాలేదు. కానీ పాపను డిశ్చార్జ్ చేయాలని అధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్లు డాక్టర్లు చెబుతున్నారు. అధికారులను కలిస్తే ఎవరూ పట్టించుకోవడం లేదు. నాలుగు నెలలుగా డాక్టర్లు కృషి చేసి మా పాపను బతికించారు. ప్రభుత్వం మొదట ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. లిఖితపూర్వకంగా భరోసా ఇవ్వాలి. ఇవాళ మాజీ ఎంపీ మార్గాని భరత్ ద్వారా వైఎస్ జగన్ను కలిశాం. ఆయన మాకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు” అని రాకేష్ తెలిపారు. -
వైఎస్ జగన్ను కలిసిన రాజమండ్రి కల్తీ పాల బాధితులు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజమండ్రి కల్తీ పాల బాధితులు ఇవాళ(మంగళవారం) కలిశారు. గత ఫిబ్రవరిలో కల్తీ పాలు తాగి తమ పిల్లలు అనారోగ్యానికి గురైన విషయాన్ని వైఎస్ జగన్కు తల్లిదండ్రులు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయమూ అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి మూడు రోజులు హడావుడి చేసి ఆపై పట్టించుకోవటం లేదని ఫిర్యాదు చేశారు. బాధితులకు అండగా నిలుస్తామని వైఎస్ జగన్ తెలిపారు. -
‘సర్’పై అత్యంత అప్రమత్తంగా ఉండాలి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: పార్టీ సీనియర్ నాయకులతో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు. ‘సర్’ జరుగుతున్న తీరు, అక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. సర్పై అత్యంత అప్రమత్తంగా ఉండాలని.. ఈ నాలుగు వారాలు అత్యంత కీలకమన్నారు. నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు రోజూ సమీక్ష చేయాలన్న వైఎస్ జగన్.. ఏదో రకంగా వైఎస్సార్సీపీ ఓట్లు తొలగించేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారన్నారు.‘‘అధికార దుర్వినియోగంతో ఓట్లు తీసివేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి బూత్కు 50 వైయస్సార్సీపీ ఓట్లు తీసేయాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు దీన్ని అడ్డుకోవాలి. ప్రతి ఓటునూ కాపాడుకోవాలి. ‘సర్’పై నియోజకవర్గాల్లోని కో-ఆర్డినేటర్లు, రీజనల్ ఇన్ఛార్జిలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ‘సర్’ ప్రక్రియ జరుగుతున్న తీరుపై ప్రతిరోజూ సమీక్ష చేయాలి. ఎక్కడైనా తప్పులు జరుగుతున్నాయని తెలిస్తే వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయలి..అప్పటికీ సమస్య పరిష్కారంకాకపోతే వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకు రావాలి. సర్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వద్దు. సర్ ప్రక్రియలో ఒక్కసారి ఓటు తొలగించిన తర్వాత దాన్ని తిరిగి చేర్పించాలంటే అత్యంత కష్టమవుతుంది. ప్రతి నియోకవర్గ సమన్వయకర్త దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. గిమ్మిక్కులతో ఓట్లు తొలగించే తప్పుడు పనుల్లో చంద్రబాబు ఆరితేరిన వ్యక్తి. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ‘సర్’ ప్రక్రియపై ప్రతి అంశంలోనూ అప్రమత్తత అవసరం. నిరంతరం సమీక్షలు నిర్వహించాలి’’ అని వైఎస్ జగన్ సూచించారు. -
పవన్ కల్యాణ్ ఎందుకు సైలెంట్ అయ్యారు?: గడికోట శ్రీకాంత్ రెడ్డి
తాడేపల్లి: కూటమి ప్రభుత్వం ఈ రెండేళ్లలో సాధించింది ఏమీ లేదని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు.‘‘రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు. ఎమ్మెల్యేలే జనం ఇళ్లపైకి వెళ్లి దాడులు చేస్తున్నారు. ప్రజలను కాపాడాల్సిన పోలీసులు ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. అధికార పార్టీ నేతల చెప్పుచేతుల్లో పోలీసులు పని చేయటం సిగ్గుచేటు. ఎమ్మెల్యే చింతలపూడి ప్రభాకర్ రౌడీయిజం చేయటం దుర్మార్గం. ఇలాంటివి జరుగుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు? పైగా బాధితుడి మీదే కేసు పెడతారా? ప్రశ్నిస్తాననే పవన్ కల్యాణ్ ఎందుకు సైలెంట్ అయ్యారు? రాష్ట్రంలో దారుణాలు జరుగుతుంటే ఢిల్లీ వెళ్లి మీటింగులు పెట్టటం సిగ్గుచేటు. రేవంత్ రెడ్డి మంచోడట, కాంగ్రెస్ అంతుచూస్తాడట. లాలూచీలకు అలవాటు పడిన పవన్ ఇంతకంటే ఇంకేం మాట్లాడుతారు? విజయవాడకు చెందిన సాయికృష్ణను పోలీసులు లాకప్ లో చంపేశారు. అతన్ని వెతుకుతున్నామంటూ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు. వ్యవస్థలను ఇంతగా దిగజార్చుతారా? హోంమంత్రి అనిత ఒక మహిళ అయి ఉండి మహిళలకు రక్షణ కల్పించలేరా? పసిపిల్లలు తప్పి పోయినా తెలుసుకునే పరిస్థితి లేదు. నియంత దేశాల్లో కూడా ఇలాంటి పోకడలు లేవు’’ అని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. -
చంద్రబాబు సర్కార్ గుట్టు రట్టు..
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయిన సందర్భంగా తిరుపతిలో జరిగిన విజయోత్సవ సభలో ప్రసంగించిన నేతలలో ఏదో తెలియని భయం వెన్నాడుతున్నట్లు అనిపిస్తే, వెన్నుపోటుకు రెండేళ్లు అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించిన నిరసనలలో ఉత్సాహం, తెగింపు కనిపిస్తాయి. కూటమి నేతలు తమ ప్రసంగాలలో సాధించిన విజయాల గురించికన్నా మాజీ సీఎం జగన్ను దూషించడానికి, ద్వేషించడానికే ప్రాధాన్యం ఇచ్చారు.గత ప్రభుత్వం విధ్వంసం చేసిందంటూ ఒక పడికట్టు పదాన్ని పదే, పదే చెప్పి జనాన్ని నమ్మించడానికి యత్నం చేశారే తప్ప, ఏ రకమైన విధ్వంసమో వివరించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా విఫలం అయ్యారు. అదేమంటే ప్రజావేదికను గత ప్రభుత్వం కూల్చడాన్ని ఆయన ఉదహరించారు. ఇది పాడిందే పాడరా అన్న చందంగా ఉంది తప్ప ఒక పాలకుడు చెప్పదగిన మాటగా కనిపించదు.నదీ గర్భంలో ప్రభుత్వమే అక్రమ నిర్మాణం చేపడితే అది సరైన విధానం కాదని ప్రజావేదిక పేరుతో ఉన్న ఒక షెడ్ను గత ప్రభుత్వం కూల్చింది. ఆ మాటకు వస్తే కృష్ణానది తీరాన అక్రమం నిర్మించిన భవనాలలో చంద్రబాబు, కీలక మంత్రి లోకేష్లతో పాటు పలువురు పలుకుబడి కలిగినవారు నివసించడం ఏ రకంగా చట్టబద్దమో ఇన్నేళ్లలో వివరించలేకపోయారు.అమరావతి గ్రామాలలో పర్యావరణాన్ని విధ్వంసం చేస్తూ చంద్రబాబు ఎదురు జగన్పై ఆరోపణలు చేయడం అర్ధరహితంగా కనిపిస్తుంది. ఒకవైపు చంద్రబాబు ప్రభుత్వం అక్రమ నిర్మాణాలు అంటూ రాజమండ్రి, యలమంచిలి మొదలైన చోట్ల పేదల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చి వేసింది. కాని ఉండవల్లిలో కరకట్ట అక్రమ కట్టడంలో ఆయన ఎలా నివసిస్తున్నారో అర్థం కాదు. చంద్రబాబు మాట్లాడిన విషయాలలో ఎన్ని అసత్యాలు ఉన్నాయో చూడండి. విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగులు వేస్తున్నట్లు చంద్రబాబు స్పీచ్కి ఎల్లో మీడియా హెడింగ్ పెట్టింది.అందులో నిజం ఉంటే సంతోషించవచ్చు. కాని ఏది విధ్వంసం, ఏది వికాసం అన్నదానిపై ముందుగా చంద్రబాబు క్లారిటీ తెచ్చుకోవాలి. ప్రభుత్వ రంగంలో 17 మెడికల్ కాలేజీలు తేవడం, నాలుగు ఓడరేవులు నిర్మించడం, ఉద్దానంలో కిడ్నీ ఆస్పత్రిని నిర్మించడం, గ్రామ, గ్రామాన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య కేంద్రం వంటివి నిర్మించడం విధ్వంసం ఎలా అవుతుంది? మెడికల్ కాలేజీలను, పోర్టులను, ఆర్టీసీ బస్టాండ్లను, ఏవి వీలైతే వాటన్నిటిని ప్రైవేటువారికి అప్పగించడాన్ని కదా విధ్వంసం అనాల్సింది. ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయయడాన్ని మాట నిలబెట్టుకున్నట్లని అంటారు. అది 95 శాతం వైఎస్ జగన్ చేసి చూపించారు.మరి చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కలిసి ఇచ్చిన హామీలను ఏ మేరకు నిలబెట్టుకున్నారు? ఒక్కటి, అరా తప్ప, ఏదైనా స్కీమ్ ను నిక్కచ్చిగా అమలు చేశామని చెప్పే పరిస్థితి లేదు. అన్ని చేసేశామని బుకాయించడంలోనే వీరి బలహీనత కనిపిస్తుంది. జగన్ యువత భవిష్యత్తును దెబ్బతీశారట. ఆయన టైమ్లో లక్షన్నర ఉద్యోగాలు ఏకకాలంలో ఇస్తే అది భవిష్యతుత్తు ఇచ్చినట్లు కాదన్నది చంద్రబాబు అభిప్రాయమా? కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? మెగా డీఎస్సీ అంటూ హడావుడి చేశారు కాని, అందులో జరిగిన అక్రమాలపై జగన్ వీటిపై సంధిస్తున్న ప్రశ్నలకు జవాబు ఇవ్వలేక ఎదురుదాడి చేస్తున్నారు.తనకు నోటీసులు ఇవ్వకుండా 53 రోజులు జైలులో ఉంచారని ఆయన అన్నారు. స్కిల్ స్కామ్పై కోర్టులో విచారణ జరగకుండా ఇప్పుడు ఎందుకు మిస్టేక్ ఆఫ్ ప్యాక్ట్ పేరుతో కేసును ఎలా ఉపసంహరించుకుంది కూడా చెబితే బాగుండేది కదా! అమరావతిని పరుగులు పెట్టిస్తున్నామని చెప్పిన చంద్రబాబు దాదాపు ఏభై వేల కోట్ల అప్పు తీసుకువచ్చి ఒకేచోట ఖర్చుచయడాన్ని, కేంద్ర ప్రభుత్వం చదరపు అడుగుకు ఆరువేల లోపు ఖర్చు చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం 17 వేల నుంచి ఇరవై వేల వరకు వ్యయం చేయడం వల్ల నిధులు దుర్వినియోగం అవుతున్నాయా?లేదా? అన్నది చేస్తున్నది వివరించాలి కదా!ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు 1500 రూపాయలు ఇస్తామన్న హామీపై నిధులు లేవని చేతులు ఎత్తివేయడం సరైనదేనా? సంపద సృస్టించడం తెలుసునని ఎన్నికల ముందు కొట్టిన గప్పాలన్నీ అబద్దాలనేనని ఒప్పుకుంటారా? ఈ స్కీమ్ను అమలు చేయలేదన్న నిజాన్ని ఎంతో కొంత ఒప్పుకున్నందుకు సంతోషించాలి. మామూలుగా అయితే సూపర్ సిక్స్ అన్నీ చేసేశాం అంటూ చెబుతుండడం అసత్యమేనని అంగీకరించారన్నమాట. టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని అని అన్నారు. మరి వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన రీసర్వేని ఎందుకు కొనసాగిస్తున్నారు?ఇరాన్ యుద్దంతో మామిడి, అరటి తదితర పండ్ల ధరలు పడిపోయాయని, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని అన్నారు. గతంలో కరోనా వచ్చినప్పుడు జగన్ ఈ రైతులను ఎలా ఆదుకుంది తెలియదా? అయినా తాను ఉంటే కరోనా వచ్చేదా తమ్ముళ్లు అంటూ స్పీచ్లు ఇచ్చింది చంద్రబాబే కదా! మరి ఇప్పుడు యుద్దం వస్తే రైతులను ఎలా ఆదుకోవాలో తెలియకపోతే ఆయన సీనియారిటీ ఏమైనట్లు? పెట్రోల్, డీజిల్పై పన్నులు తగ్గిస్తామని చెప్పిన కబుర్లు అన్నీ అబద్దాలేనని ఒప్పుకుంటున్నారా? గత ప్రభుత్వంలో పది లక్షల కోట్ల అప్పు జరిగిందని చెప్పడం అబద్దమా? నిజమా? అన్నది చంద్రబాబుకు తెలియదా?వైఎస్ జగన్ టైమ్లో కరోనా ఉన్నప్పటికీ మూడున్నర లక్షల కోట్ల అప్పు చేస్తే, ఈ రెండేళ్లలోనే మూడున్నర లక్షల కోట్ల అప్పు ఎలా చేశారో చంద్రబాబు చెప్పాలి కదా!ఎంతసేపు బురద వేయడమేనా? వైఎస్సార్సీపీని గొడ్డలి పార్టీ అంటూ చంద్రబాబు, లోకేష్లు వ్యాఖ్యానించడంపై సజ్జల, కొడాలి నాని ఇచ్చిన కౌంటర్కు వీరు సమాధానం ఇవ్వలేకపోయారు. తమది పరశురాముడి గొడ్డలి అని, అవినీతి కూటమి ప్రభుత్వాన్ని గొడ్డలి కూకటి వేళ్లతో పెకలిస్తుందని వారు ధైర్యంగా చెప్పారు.టీడీపీ వెన్నుపోటు పార్టీ అన్న విమర్శను చంద్రబాబు, లోకేష్ లు తిప్పికొట్టలేకపోయారు. తమది వెన్నుపోటు పార్టీ అని చెప్పలేరు. అలాగని వెన్నుపోటు పొడవలేదని వాదించలేని నిస్సహాయ స్థితి కనిపిస్తుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన వంతు అబద్దాలతో పాటు కులం, మతం వద్దని, భారతీయత ముఖ్యమంటూ నీతులు చెప్పే యత్నం చేశారు. కాని ఏపీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఎంతగా కుల, మత, విద్వేషాలు రేకెత్తించింది ప్రజలకు తెలియదా! లోకేష్ తన స్పీచ్లో జగన్పై అమర్యాదకర వ్యాఖ్యలు చేసి సెల్ఫ్ గోల్ వేసుకున్నారన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేశారు.ఎందుకంటే గతంలో నార్నె శ్రీనివాసరావు, కోలా కృష్ణమోహన్లు ఆయనపై చేసిన ఆరోపణల వ్యాఖ్యల వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. వైఎస్ జగన్పై అనవసర వ్యాఖ్యలు చేసి.. ఈ సమస్య తెచ్చుకోవడం లోకేష్కు ప్రయోజనమా? అవి ప్రచారంలోకి రావడం లోకేష్ కు ప్రతిష్ట అవుతుందా? కాదా? అన్నది ఆయనే ఆలోచించుకోవాలి. విమర్శలలో హుందాతనం ఉండాలి. సంస్కారయుతంగా ఉండాలి. కాని చంద్రబాబు మాదిరి ఏదిపడితే అది మాట్లాడితే సరిపోతుందని అనుకుంటే లోకేష్ పొరబడుతున్నట్లే. కాలం మారిందన్న సంగతి గుర్తించకపోతే ఆయనకే నష్టం.రెడ్బుక్ గురించి ప్రస్తావించి ఏపీలో ఎంత అరాచక పాలన సాగుతోందో లోకేష్ గుర్తు చేసినట్లయింది. కాగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలో ధైర్యంగా ప్రభుత్వం అణచివేత చర్యలను ఎదుర్కుంటూ నిరసనలు తెలిపారు. వెన్నుపోటుకు రెండేళ్లు అంటూ నినదించడానికి ఎక్కడా వెనుకాడలేదు. కూటమి సభలో జనం చాలావరకు మొక్కుబడిగా ఉన్నట్లు కనిపిస్తే, వైఎస్సార్సీపీ క్యాడర్ హోరెత్తించినట్లు అనిపిస్తుంది. కూటమి ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను ప్రస్తావించి వాటిని అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడుస్తోందని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. రెండేళ్లుగా పచ్చి అబద్ధాల ప్రచారం, మోసం, కక్ష సాధింపులు, వివక్ష, అరాచకాలు, రెడ్బుక్ పాలన సాగుతోందని ఆయన ఆరోపించారు.వైఎస్ జగన్కు, చంద్రబాబుకు ఉన్న ఒక తేడా స్పష్టంగా కనిపించింది. వైఎస్ జగన్ తన మానిఫెస్టోని సచివాలయంలో తన ఎదుట పెట్టుకున్నారు. అధికారులకు ఇచ్చి అమలు చేయాలని ఆదేశించారు. చంద్రబాబేమో ఆ మానిఫెస్టోని, ఎన్నికలలో ఇచ్చిన బాండ్ల గురించి ఎన్నడూ ప్రస్తావించినట్లు కనబడదు. తిరుపతి సభకు హెలికాఫ్టర్ లో వస్తూ చదువుకున్నారట! ఎన్ని అబద్ధపు వాగ్దానాలు ప్రకటించి, ప్రజలను మభ్య చేసింది గుర్తు చేసుకుని నవ్వుకుని ఉండాలి. గత ఎన్నికలలో ప్రజలు విజ్ఞత ప్రదర్శించారని ఆయన అన్నారు కానీ.. ఏభై లక్షల మాయ ఓట్లు పోలైన సంగతిని పదే, పదే చెబుతున్న ప్రముఖ మేధావి, చంద్రబాబు వద్ద సలహాదారుగా గతంలో పనిచేసిన పరకాల ప్రభాకర్ ఆరోపిస్తున్న అంశంపై మాత్రం నోరు మెదపలేకపోతున్నారు.ఈ నేపథ్యంలోనే కూటమిలో విజయోత్సవ సంరంభం పెద్దగా కనిపించలేదు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వైఎస్సార్సీపీ ప్రజలలో దూసుకువెళ్లడానికి వెన్నుపోటుకు రెండేళ్ల నిరసనను వాడుకుందని చెప్పాలి. ప్రజలలో ఏర్పడుతున్న అసంతృప్తిని ఎలా తగ్గించాలో తెలియక కూటమి తికమక పడుతుంటే, జనం తమవైపు చూస్తున్నారన్న ఉత్సాహం వైఎస్సార్సీపీలో తొణికిసలాడుతోంది.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
కాలం మారింది.. మీకు మిగిలింది మూడేళ్లే జనం మనసులో జగన్
-
ఫేస్ బుక్ అకౌంట్ బ్లాక్ చేసింది వాళ్లే ఇదిగో ప్రూఫ్స్ ...?
-
టీచర్ గా ఉన్నప్పుడు కూడా చెప్పుతో కొట్టావట... అనితను ఏకిపారేసిన నాగమల్లేశ్వరి
-
వైఎస్సార్ సీపీ ఓట్ల తొలగింపే లక్ష్యంగా ‘సర్’ పేరుతో టీడీపీ యాప్
-
రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ పూర్తి చేయాలి
సాక్షి, అమరావతి: గ్రేటర్ రాయలసీమ ప్రజల నీటి అవసరాలు గుర్తించి ఇప్పటికైనా రాయలసీమ లిప్టు ఇరిగేషన్ ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని వైఎస్సార్సీపీ రాయలసీమ నాయకులు డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం పార్టీ రాయలసీమ లిఫ్ట్ సాధన కమిటీ సమావేశం నిర్వహించారు. కమిటీ కన్వీ నర్ సాకే శైలజానాథ్, సభ్యులైన పార్టీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, కందుల నాగార్జునరెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎస్వీ మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం వివరాలను శైలజానాథ్ మీడియాకు వెల్లడించారు. సీమ ప్రాజెక్టులపై చంద్రబాబు తీవ్ర నిర్లక్ష్యం ‘‘రూ.1000 కోట్లు ఖర్చు చేస్తే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తవుతుందని తెలిసినా, సీఎం చంద్రబాబు స్వార్థంతో ఆ ప్రాజెక్టును పక్కన పెట్టడం హేయం. అమరావతి కోసం రాయలసీమ భవిష్యత్తును చంద్రబాబు ప్రశ్నార్థకం చేస్తున్నారు. సీఎం నిర్లక్ష్యం కారణంగా తెలంగాణ, కర్ణాటకలో అక్రమ ప్రాజెక్టులు నిరి్మస్తూ కృష్ణా నీటిని తరలించుకుపోతున్నారు. మాయమాటలతో గ్రేటర్ రాయలసీమ ప్రజలను వంచనకు గురి చేస్తున్నారు. ఎగువ రాష్ట్రాల్లో కృష్ణా నదిపై అక్రమ ప్రాజెక్టుల వల్ల రాయలసీమ ఎడారిగా మారుతుందని గగ్గోలు పెడుతున్నా పట్టించుకోవడం లేదు. తెలంగాణలో అక్రమ ప్రాజెక్టుల ద్వారా రోజూ 7 టీఎంసీల నీటిని తరలిస్తున్నారు. కర్ణాటకలో అప్పర్ భద్ర, ఆల్మట్టి ప్రాజెక్టులు పూర్తయితే కనీసం 130 టీఎంసీల నీరు ఆగిపోయే ప్రమాదం ఉంది.ఈ పరిస్థితుల్లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేస్తే రాయలసీమ నీటి ఇబ్బందులకు పరిష్కారం చూపినట్టవుతుందని ఎన్నోసార్లు ప్రభుత్వానికి విన్నవించాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే దాదాపు రూ.1000 కోట్లతో 90 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు పూర్తి చేయాలని గ్రేటర్ రాయలసీమ పరిధిలోని ఆరు జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి ప్రభుత్వానికి వివరించాం. కానీ వైఎస్ జగన్కు మంచి పేరొస్తుందనే అక్కసుతో రెండేళ్లుగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పక్కన పెట్టేశారు.బనకచర్ల ప్రాజెక్టు పేరుతో గాల్లో లెక్కలు చెప్పి కాలయాపన చేస్తున్నారు. అమరావతి నిర్మాణం పేరుతో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజల ప్రయోజనాలను చంద్రబాబు పణంగా పెడుతున్నాడు. గ్రేటర్ రాయలసీమలోని పెండింగ్ ప్రాజెక్టులను దశలవారీగా పూర్తి చేయాలనే డిమాండ్తో ముందుకెళ్లాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. అందులో భాగంగా మొదటి విడతలో అనంతపురం, నెల్లూరులోని ప్రాజెక్టులను సందర్శిస్తాం’’ అని శైలజానాథ్ తెలిపారు. రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ‘‘రాయలసీమ రైతులకు చంద్రబాబు నుంచి భరోసా లభించడం లేదు. హార్టికల్చర్ హబ్గా ఉన్న ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఏర్పడింది. నీళ్లు లేక చీనీ తోటలు ఎండిపోతున్నాయి. రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా తిరుపతిలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన సభలో వైఎస్ జగన్ని తిట్టడం తప్పితే, రెండేళ్లలో ఏం సాధించారో చెప్పుకోలేకపోయారు.దుబారా ఖర్చులను తగ్గించాలని పిలుపునిస్తూ ఆర్భాటపు సభలతో, జగన్ని దూషించడానికి పదుల కోట్లు ఖర్చు చేయడం అవసరమా?. రెండేళ్ల తర్వాత ఆడబిడ్డ నిధి పథకానికి పంగనామాలు పెట్టేశారు. చంద్రబాబు మొదటి సంతకం చేసిన డీఎస్సీ కూడా సరిగ్గా నిర్వహించలేకపోయారు. స్పోర్ట్స్ కోటా పేరుతో జరిగిన నియామకాల్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని రుజువైంది. కానీ ఇంతవరకు విద్యాశాఖ మంత్రి లోకేశ్ స్పందించలేదు. కనీసం ఒక్క కొత్త పింఛన్ ఇచి్చన పాపాన పోలేదు. ఓటేసిన ప్రజల నమ్మకానికి చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు’ అని శైలజానాథ్ ధ్వజమెత్తారు. -
సీఐ, టీడీపీ నేత వేధింపులు తాళలేక దళిత నేత ఆత్మహత్యాయత్నం
సాక్షి, నరసరావుపేట: టీడీపీ నేతలతో కలిసి పోలీసులు సివిల్ పంచాయితీల పేరిట డబ్బుల కోసం వేధిస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో దళిత నాయకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పల్నాడు జిల్లాలో సోమవారం జరిగింది. తనపై సీఐ వెంకట్రావు, స్థానిక టీడీపీ నేత నల్లాటి సుబ్బారావు అక్రమ కేసులు బనాయించి డబ్బుల కోసం చిత్రహింసలు పెడుతున్నారని ఆవేదన చెందిన పిడుగురాళ్లకు చెందిన వైఎస్సార్సీపీ దళిత నేత, 22వ వార్డు మాజీ కౌన్సిలర్ జడ సురేంద్ర సోమవారం నిద్రమాత్రలు మింగాడు.అపస్మారక స్థితిలో వెళ్లిన ఆయనను కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా బాధితుడిని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పరామర్శించారు. పల్నాడు జిల్లా ఎస్పీని కలిసి సీఐపై ఫిర్యాదు చేశారు. సెల్ఫీ వీడియోలో బాధితుడి ఆవేదన.. ఆత్మహత్యాయత్నం చేసుకునే ముందు సురేంద్ర ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అందులో తాను గతంలో ఓ రెస్టారెంట్ను ఒప్పందం ప్రకారం డబ్బులిచ్చి కొనుగోలు చేశానని, టీడీపీ అధికారంలోకి రాగానే ఆ డబ్బులు చెల్లించలేదంటూ స్థానిక టీడీపీ నేత నల్లాటి సుబ్బారావు, సీఐ వెంకట్రావుతో కలసి వేధించడం మొదలు పెట్టారని వాపోయాడు. పిడుగురాళ్ల పోలీసుస్టేషన్లో అక్రమంగా నిర్బంధించి రూ.30 లక్షల దాకా బలవంతంగా వసూలు చేశారని, ఆపై ఖాళీ చెక్కులు, ఆస్తి పత్రాలపై సంతకాలు పెట్టాలని బెదిరించారని చెప్పాడు.ఇటీవల సుబ్బారావు, సీఐ వెంకట్రావు డబ్బులు కట్టాలని మళ్లీ వేధిస్తున్నారని, ఆదివారం స్టేషన్కు పిలిపించి కులం పేరుతో దూషించి, గంజాయి కేసు పెడతానంటూ సీఐ బెదిరించారన్నాడు. స్టేషన్లో స్పృహ తప్పిపడిపోయిన తనకు చికిత్స చేయించి ఇంటికి పంపించేశారని, వీరి వేధింపులు తాళలేక నిద్రమాత్రలు మింగుతున్నానని చెప్పాడు. కాగా, తన భర్తను రెండేళ్లుగా సీఐ, సుబ్బారావు వేధిస్తున్నారంటూ బాధితుడి భార్య ఆవేదన వ్యక్తం చేసింది. వేధింపులు ఆపకపోతే పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించింది. -
‘సర్’లో టీడీపీ చొరబాటు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో అత్యంత పారదర్శకంగా జరగాల్సిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలోకి అధికార తెలుగుదేశం పార్టీ అక్రమంగా చొరబడింది. ప్రజాస్వామ్య వ్యవస్థలను అపహాస్యం చేస్తూ.. టీడీపీ కేంద్ర కార్యాలయం స్థావరంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అడ్డదారులు తొక్కుతోంది. రాజకీయ ప్రత్యర్థి వైఎస్సార్ సీపీ ఓట్లను పెద్ద ఎత్తున తొలగించడమే లక్ష్యంగా ‘సర్’ పేరుతో టీడీపీ ఏకంగా ఒక యాప్ను రూపొందించింది. ఓటర్ల కులం ఏమిటి? ఏ రాజకీయ పార్టీ సానుభూతిపరుడు? అనే వ్యక్తిగత వివరాలను టీడీపీ బూత్ లెవల్ ఏజెంట్ల ద్వారా సేకరించి గోప్యతకు తూట్లు పొడుస్తూ ప్రత్యేక యాప్లో నిక్షిప్తం చేస్తోంది. టీడీపీకి చెందిన ప్రతీ బీఎల్ఏ కనీసం 50 ఓట్లను తొలగించాలని, ఇందుకోసం ఫారం–7 వాడాలని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో పెద్ద ఎత్తున ఓటర్లు గల్లంతయ్యే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నికల అధికారుల వద్ద మాత్రమే ఉండాల్సిన ఓటర్ల జాబితా కలర్ జిరాక్స్లు, సాఫ్ట్ కాపీలు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ బీఎల్ఏల వాట్సాప్లో ప్రత్యక్షం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఓటర్ల జాబితాతో కూడిన ఫిజికల్ కాపీల కలర్ ప్రింటవుట్లతో టీడీపీ బీఎల్ఏలు ప్రతి ఇంటినీ జల్లెడ పడుతూ వ్యక్తిగత వివరాలను గుచ్చి గుచ్చి ఆరా తీస్తున్నారు. వైఎస్సార్సీపీకి చెందిన బీఎల్వోలకు బ్లాక్ అండ్ వైట్ లిస్ట్ మాత్రమే ఇవ్వడం.. టీడీపీ ఏజెంట్లకు మాత్రం కలర్ ఫోటోలతో కూడిన ఓటర్ల జాబితాను అందచేయడం అధికార దుర్వినియోగం కాక మరేమిటని రాజకీయ పరిశీలకులు, ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించాల్సిన ప్రక్రియలో అధికార పార్టీ తలదూర్చడం ఏమిటని నిలదీస్తున్నారు.టీడీపీ కార్యాలయంలో బీఎల్ఏలకు ప్రత్యేక శిక్షణప్రత్యేకంగా సిద్ధంచేసుకున్న యాప్ ద్వారా ప్రత్యర్థి పార్టీ ఓట్లను గుర్తించి వాటిని తొలగించే విధంగా పథకం టీడీపీ కేంద్ర కార్యాలయం పక్కా పథకాన్ని రచించింది. ‘సర్’లో భాగంగా సోమవారం నుంచి వచ్చేనెల 14వతేదీ వరకు జరిగే ఇంటింటి సర్వేలో పాల్గొనేందుకు అధికారులతో పాటు రాజకీయ పార్టీలకు చెందిన బూత్ లెవెల్ ఏజెంట్ల (బీఎల్ఏ)ను ఎన్నికల సంఘం అనుమతిస్తోంది. దీన్ని అదునుగా తీసుకుని వైఎస్సార్ సీపీ ఓట్లను తొలగించేందుకు ‘మై టీడీపీ పాస్పోర్టు’లో సర్ పేరుతో టీడీపీ ఒక యాప్ను రూపొందించింది. ఎన్నికల సంఘం వద్ద గోప్యంగా ఉంచాల్సిన ఓటర్ల జాబితా, కలర్ ఫోటోలతో కూడిన మాస్టర్ డేటాను సేకరించి టీడీపీ అధికార దుర్వినియోగానికి తెగబడింది. ఈ మాస్టర్ డేటాను బూత్లవారీగా ఓటర్ల కలర్ ఫోటోలతో యాప్లో అప్లోడ్ చేసి టీడీపీ బూత్ ఏజెంట్లకు అందచేసింది. అధికారులతో పాటు ఇంటింటి సర్వేలో పాల్గొన్న సమయంలో టీడీపీ ఏజెంట్లు ఈ డేటా ఆధారంగా ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఓటరు బూత్ నంబర్, ఓటరు ఐడీతో పాటు మొబైల్ నంబర్, ఓటరు కులం, ఏ పార్టీ సానుభూతిపరుడనే వివరాలను ఇంటింటి సర్వే సమయంలో టీడీపీ బీఎల్ఏలు సేకరిస్తున్నారు. ఆ వివరాలన్నీ ఎప్పటికప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరవేసేలా బీఎల్ఏలకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చినట్లు సమాచారం.టీడీపీ రూపొందించిన యాప్లో ‘సర్’ విభాగం ఒక్కో టీడీపీ బీఎల్ఏ పరిధిలో 50 ఓట్ల తొలగింపే టార్గెట్ఇంటింటి సర్వేలో ఎవరైనా ఓటరు వైఎస్సార్సీపీ మద్దతుదారుడని తేలితే వారి ఓట్లను తొలగించేందుకు కుట్రకు తెరతీశారు.ప్రతీ బీఎల్ఏ కనీసం 50 ఓట్లను తొలగించడంతో పాటు టీడీపీకి చెందిన ఓట్లను చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఫారం–7 ఉపయోగించాల్సిందిగా ఆదేశించారు. ఒక్కో బీఎల్ఏ 50 వరకు ఫారం –7 దరఖాస్తులను బల్క్గా సమర్పించేందుకు అనుమతిస్తుండటంతో దీన్ని ఆసరాగా చేసుకుని వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించే విధంగా వారికి టీడీపీ శిక్షణ ఇచ్చింది. దీనికి సహకరించే విధంగా ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి బీఎల్వోలను లోబర్చుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.నాడు ‘సేవామిత్ర’ పేరుతో ఇదే రీతిలో.. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా 2019లో తెలుగుదేశం పార్టీ ఇదే విధానాన్ని అనుసరించడం ద్వారా వైఎస్సార్ సీపీకి చెందిన 39 లక్షల ఓట్లను తొలగించింది. ఈవీఎంలను అపహరించిన వేమూరి హరిప్రసాద్తో పాటు లోకేశ్ సన్నిహితుడు కిలారు రాజేశ్ కలిసి 3.50 కోట్ల మంది ఓటర్ల మాస్టర్ డేటా జాబితాను దొంగిలించి ఈ మొత్తం డేటాను టీడీపీకి ‘సేవామిత్ర’ యాప్లో నిక్షిప్తం చేసినట్లు బహిర్గతమైంది. ఈ మాస్టర్ డేటాలోని ఓటర్ల వివరాలను ఒక్కో సేవా మిత్రకు, పార్టీ బూత్ కన్వీనర్కు సేవా మిత్ర యాప్లో అందుబాటులో ఉంచారు. వాటి ద్వారా ఓటర్ ఏ కులానికి చెందిన వారు? ఏ పార్టీ సానుభూతిపరుడు? ఓటరు ఏ ఊరిలో ఉంటున్నారు? అనే వివరాలను సేకరించి ఐటీ గ్రిడ్కు పంపించారు. ఈ సమాచారం ఆధారంగా ఆన్లైన్లో ఫారం 7 దాఖలు చేయడం ద్వారా వైఎస్సార్ సీపీ ఓట్లను తొలగించారు. ఈ కుట్రపై అప్పట్లో వైఎస్సార్ సీపీ ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించి తొలగించిన ఓట్లను తిరిగి చేర్చే విధంగా పోరాడింది. ‘సర్’లో కూడా అదే రీతిలో ఓట్లను తొలగించడానికి టీడీపీ కుట్రలు చేస్తున్నట్లు వైఎస్సార్ సీపీ ప్రతినిధులు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్కు ఫిర్యాదు చేశారు. -
‘సర్’లో టీడీపీ అక్రమాలపై ఎస్ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియలో టీడీపీ సాగిస్తున్న అక్రమ కార్యకలాపాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, ఉద్యోగులు, పెన్షనర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్రెడ్డి, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణమూర్తి తదితరులు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని సోమవారం సచివాలయంలో కలిశారు. ‘సర్’ ప్రక్రియ సందర్భంగా ‘మై టీడీపీ యాప్’ ద్వారా ఓటర్ల కులం, ఏ రాజకీయ పార్టీ సానుభూతిపరుడు? అనే వ్యక్తిగత వివరాలను అధికార టీడీపీ సేకరించడంపై ఫిర్యాదు చేశారు.అనంతరం వారంతా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ఉన్న సచివాలయం ఐదో బ్లాక్ వద్ద మీడియాతో మాట్లాడేందుకు సిద్ధం కాగా, సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎదురుగా మరో బ్లాక్ ఎదుట మాట్లాడేందుకు వెళ్తుండగా అడ్డుకోవడం, సచివాలయ ఆవరణలో మాట్లాడకుండా నిరోధించటాన్ని వైఎస్సార్ ఎమ్మెల్సీలు తీవ్రంగా ఆక్షేపించారు. సచివాలయం బయట మాట్లాడాలని సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు చెప్పడంపై మండిపడ్డారు.రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన తర్వాత ప్రతిపక్షంగా తాము ఏం చెప్పామో వివరాలు వెల్లడించకూడదా? అంటూ నిలదీశారు. తాము ఎమ్మెల్సీలమని, సచివాలయంలో ఎమ్మెల్సీలను మీడియాతో మాట్లాడనివ్వకుండా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని సచివాలయం ఐదో బ్లాక్ ముందు మెట్లపై బైఠాయించారు. ప్రభుత్వ తీరును ఖండిస్తూ నిరసన తెలిపారు. మైక్లు లేకుండానే వైఎస్సార్సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. ‘సర్’ తొలిరోజే డేటా చోరీ..⇒ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా ⇒ ‘మై టీడీపీ’ యాప్ ద్వారా వ్యక్తిగత వివరాల సేకరణ ⇒ సీఈవోను కలిసి అక్రమాలపై ఫిర్యాదు చేశాంరాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజే టీడీపీ నిస్సిగ్గుగా యాప్ ద్వారా ఓటర్ల డేటా చోరీకి తెర తీసిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. సహచర ఎమ్మెల్సీ రుహుల్లా, పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, ఉద్యోగులు, పెన్షనర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణమూర్తితో కలిసి సోమవారం వెలగపూడిలోని సచివాలయంలో ఎన్నికల ప్రధానాధికారి వివేక్యాదవ్ని కలిసి సర్ ప్రక్రియ సందర్భంగా టీడీపీ చేస్తున్న అక్రమాలు, ఓటర్ల డేటా గోప్యతలో లోపాలపై ఫిర్యాదు చేశారు.అనంతరం అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘గోప్యంగా ఉండాల్సిన ఓటర్ల వ్యక్తిగత వివరాలను టీడీపీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని యాప్ ద్వారా సేకరిస్తున్నట్లు ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశాం. ‘మై టీడీపీ’ యాప్ ద్వారా ఒక్కో ఓటరును మీరు ఏ రాజకీయ పార్టీ? ఏ కులం? అని అడుగుతూ ఓటర్ల వివరాలను యాప్లో నమోదు చేసుకుంటున్నారు. ఇలాంటి అంశాలపై గోప్యత పాటించాలని రాజ్యాంగం చెబుతోంది. కానీ ఎక్కడా అది కనిపించడం లేదు. గోప్యంగా ఉండాల్సిన సమాచారం సేకరించి ప్రత్యర్థుల ఓట్లు తొలగించేందుకు ప్రయతి్నస్తున్నారు.ఎన్నికల కమిషన్, అధికారుల వద్ద మాత్రమే ఉండాల్సిన ఓటర్ల కలర్ ఫొటోలతో కూడిన జాబితాలు టీడీపీకి చెందిన బీఎల్ఏల చేతుల్లో కనిపిస్తున్నాయి. మాకు కూడా అలాంటి జాబితాలు ఇవ్వాలని అడిగాం. యాప్ లను అనుమతించే అవకాశం ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా యాప్లను వినియోగించుకుంటుందని చెప్పాం. మ్యాపింగ్ కాని ఓటర్లను నమోదు చేసే ప్రక్రియలో డాక్యుమెంట్లు ఇస్తే తీసుకోవాలి.కానీ చాలాచోట్ల బీఎల్వోలు మాత్రం ఓటర్ల లిస్ట్ ప్రచురణ అయిన తర్వాత తీసుకుంటారని చెబుతున్నారు. అది సరికాదు. ఇప్పుడే డాక్యుమెంట్స్ ఇస్తే తీసుకోవాలి. అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వాలని కోరాం. బీఎల్వోకు రాజకీయ పార్టీలు ఐడీ కార్డులు ఇస్తే వాటిని ఈసీ అధికారులు ధృవీకరించాలని కోరాం. ఏ నియోజకవర్గంలో ఎంతమంది ఓటర్లను నమోదు చేశారు? ఎన్ని ఓట్లు మ్యాప్ చేశారు? ఎన్ని కాలేదు? అనే వివరాలు ఆన్లైన్లో పెట్టాలని సీఈవోను కోరాం. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు’ అని అప్పిరెడ్డి తెలిపారు. ఎమ్మెల్సీలకు గొంతెత్తి మాట్లాడే అవకాశం లేదా..? రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని తరహాలో కూటమి ప్రభుత్వం ప్రజల గొంతులను నొక్కేందుకు యత్నిస్తోందని ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, నేతలు దుయ్యబట్టారు. ‘ఈ ప్రభుత్వం ఏ దిశగా పాలన చేయాలని ఆలోచిస్తోందో అర్థం కావడం లేదు. ఎమ్మెల్సీలుగా మాకు గొంతెత్తి మాట్లాడేందుకు మాకు అవకాశం లేదా? నియంత రాజ్యంలా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి. అధికారులను అడ్డుపెట్టుకుని మా గొంతు నొక్కాలని చూస్తోంది. ఎవరినీ అభిప్రాయాలు, సమస్యలు చెప్పుకోనివ్వడం లేదు. అంతా రెడ్ బుక్ రాజ్యాంగమే. ఎన్ని నిర్భంధాలు పెట్టినా మేం ప్రజల గొంతుకగా మాట్లాడుతూనే ఉంటాం. ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసన తెలియజేస్తాం’ అని అప్పిరెడ్డి స్పష్టం చేశారు. -
YSRCP నేతలు మీడియాతో మాట్లాడద్దు..! కూటమి వింత ఆంక్షలు
-
ఏకంగా ఎమ్మెల్యేలే ఇళ్ల మీదకు వెళ్లి దాడులు చేస్తున్నారు: అంబటి
తాడేపల్లి: ఏపీలో జంగిల్ రాజ్ పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ఏ నియంత పాలన కూడా ఇంతకంటే దారుణంగా లేదని చెప్పారు. ఎమ్మెల్యేలు రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా మారిపోయారని అన్నారు. సెటిల్మెంట్లు, మద్యం, ఇసుక.. అన్ని రకాల అక్రమాలు చేస్తున్నారని తెలిపారు.‘‘రెడ్ బుక్ చేతిలో పెట్టుకుని హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. ఏకంగా ఎమ్మెల్యేలే ఇళ్ల మీదకు వెళ్లి దాడులు చేస్తున్నారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నేరుగా తమ నాయకుడి ఇంటిమీదకే వెళ్లి దాడి చేశాడు. విచిత్రం ఏంటంటే దాడి చేసిన ఎమ్మెల్యేని వదిలేసి, దాడికి గురైన ఈడ్పుగంటి శ్రీనివాసరావు మీద కేసు పెట్టారు’’ అని చెప్పారు.అతని మీద 94 కేసులు మందేసి, చిందేసిన ఎమ్మెల్యే చింతమనేనికి పోలీసులు మద్దతు ఇవ్వటం ఏంటని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ‘‘దీన్ని జంగిల్ రాజ్ అనరా? చికెన్ మీద కూడా ట్యాక్సులు వేసి దోచుకునే దుస్థితికి టీడీపీ ఎమ్మెల్యేలు చేరారు. మా ఇంటి మీద దాడి చేసిన వారిని వదిలేసి నాపై కేసు పెట్టారు. రాష్ట్రంలో పోలీసుల పనితీరు ఇలా ఉంది. చింతమనేనిని అచ్చోసిన ఆంబోతులాగా రాష్ట్రం మీద వదిలేశారు. ఇప్పటికే అతని మీద 94 కేసులు ఉన్నాయి. అయినప్పటికీ చంద్రబాబు అతనిపై ఎలాంటి చర్యలూ తీసుకోవటం లేదు? దీనికి కూటమి నేతలు సిగ్గుతో తల దించుకోవాలి. తమ దోపిడీకి ఎవరు అడ్డొస్తే వారిపై దాడి చేస్తున్నారు. లాకప్ డెత్ లు గతంలో విన్నాం. ఇప్పుడు ఆ శవాలను కూడా పోలీసులు దహనం చేసే పరిస్థితికి వచ్చింది. పోలీసులే రౌడీలుగా మారతారా? అసలు ఏపీని ఎక్కడకు తీసుకెళ్తున్నారు? హోంమంత్రి ఏం సమాధానం చెప్తారు? లింగమనేని రమేష్ ఫ్లైట్ టిక్కెట్లు కొనటంతో జనసేన నేతలంతా ఢిల్లీ వెళ్లారు. అక్కడకు వెళ్లి తెలంగాణ గురించి మాట్లాడటం ఏంటో? ఏపీలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే పవన్ ఢిల్లీలో మీటింగులు ఎందుకు? పవన్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశం హాస్యాస్పదం. రిలీజ్ అయిన సినిమాని రీరిలీజ్ చేసినట్టుగా ఉంది. ఆల్రెడీ తెలంగాణలో పోటీ చేశారు కదా? ఇంకా జాతీయ రాజకీయాలు అంటుంటే నాకే సిగ్గుగా ఉంది. రాష్ట్రం కోసం త్యాగం చేశానంటున్న పవన్ రానున్న రోజుల్లో జనసేనని టీడీపీకి త్యాగం చేస్తారేమో?’’ అని నిలదీశారు. -
కడుపుకి అన్నమే కదా తింటున్నావ్..యాదవులపై దాడి నాగార్జున యాదవ్ వార్నింగ్
-
‘చంద్రబాబు చర్యలతో రాయలసీమ ఎడారిగా మారుతోంది’
తాడేపల్లి : రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్టులను నిలిపివేసి ఆ ప్రాంతంపై కక్ష సాధింపు చర్యలు దిగారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత శైలజానాథ్ ధ్వజమెత్తారు. చంద్రబాబు చర్యలతో రాయలసీమ ఎడారిగా మారుతోందని ధ్వజమెత్తారు. దీనిపై పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు శైలజానాథ్. ఈరోజు(సోమవారం, జూన్ 15వ తేదీ) రాయలసీమ లిఫ్టు నిలిపివేతపై తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ ప్రాంతానికి సంబంధించిన పార్టీ నేతలు సమావేశమయ్యారు. దీనికి సాకే శైలజానాథ్, సజ్జల రామకృష్ణారెడ్డి, ఎస్వీ మోహనరెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, నాగార్జున రెడ్డి, కాకాని గోవర్ధన రెడ్డి తదితరులు హాజరయ్యారు. త్వరలో నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీనిపై శైలజానాథ్ మాట్లాడుతూ.. ‘ చంద్రబాబు చర్యలతో రాయలసీమ ఎడారిగా మారుతోంది. రాయలసీమ ప్రాజెక్టులను నిలిపేసి ఆ ప్రాంతంపై కక్ష సాధింపునకు దిగారు. దీనిపై రాయలసీమ ప్రాంతంలో ఉద్యమాలు చేస్తాం. తొలుత అనంతపురం, నెల్లూరు జిల్లాలో తొలుత పర్యటిస్తాం. ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం ఒత్తిడి చేస్తాం. మా రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేయాలి. కృష్ణా, తుంగభద్ర మీద ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టులు కడుతుంటే చంద్రబాబు చోద్యం చూస్తున్నారు. ఫలితంగా రాయలసీమ ఎడారిగా మారుతోంది. చంద్రబాబు తక్షణం స్పందించాలి.వైఎస్ జగన్ రాయలసీమ లిఫ్టును ఏర్పాటు చేస్తే చంద్రబాబు దాన్ని ఆపేశారు. రేవంత్ రాజకీయ ప్రయోజనాల కోసం రాయలసీమను పనంగా పెట్టారు. ఏపీ హక్కులను కాలరాశారు. అదేమంటే బనకచర్ల ప్రాజెక్టు పేరు చెప్తున్నారు. తక్కువ ఖర్చుతో త్వరగా పూర్తయ్యే రాయలసీమ లిఫ్టును పూర్తి చేయకుండా బనకచర్ల అంటారెందుకు?, రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుక పడిన ప్రాంతాల కన్నీటితో రాజధానిని కడతారా?, రాజధానిలో జరుగుతున్న అవినీతికి అడ్డూ అదుపు లేదు. కేంద్ర ప్రభుత్వ భవనాలకంటే నాలుగు రెట్లు అధికంగా ఖర్చు చేయటం వెనుక భారీ అవినీతి ఉంది. అమరావతిలో పెట్టే ఖర్చులో పది శాతం పెట్టినా మావిగన్, రాయలసీమ ప్రాజెక్టులు పూర్తవుతాయి. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి అనేదే లేదు’ అని ధ్వజమెత్తారు. -
ఇంద్ర+వెంకీ సినిమా లో సీన్స్ లా లోకేష్ పై వెంకట్ రెడ్డి సెటైర్లు
-
అంత భయం ఎందుకు.. YSRCP పేస్ బుక్ బ్లాక్ చంద్రబాబుకు శేఖర్ రెడ్డి కౌంటర్
-
ఏపీ సచివాలయంలో వింత ఆంక్షలు
సాక్షి,విజయవాడ: ఏపీ సచివాలయంలో వింత ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. సచివాలయంలో వైఎస్సార్సీపీ నేతలు మీడియాతో మాట్లాడకూడదని ఆంక్షలు విధించడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ ఆంక్షలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.సోమవారం (జూన్ 15) ఎస్ఐఆర్లో పలు సమస్యలపై వైఎస్సార్సీపీ నేతలు ఎమ్మెల్సీ లు అప్పిరెడ్డి, రాహుల్లాలు, లీగల్ సెల్ మనోహర్ సహా పార్టీ నేతలు ఎన్నికల కమిషన్ సీఈవోకి వినతిపత్రం ఇచ్చేందుకు సచివాలయానికి వచ్చారు. ఎన్నికల కమిషన్ సీఈవోకి లేఖ ఇచ్చారు.అనంతరం లేఖపై మీడియాతో మాట్లాడేందుకు వైఎస్సార్సీపీ నేతలు ప్రయత్నం చేశారు. అయితే, సెక్రటరియేట్లో మీడియాతో మాట్లాడడంపై ఆంక్షలు అమలులో ఉన్నాయంటూ వారిని పోలీసులు అధికారులు అడ్డుకున్నారు. ఆ ఆంక్షలపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈసీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. -
మీరు చేసే పని.. జగన్ చేస్తే తట్టుకోగలరా..
-
మా అమర్నాథ్ జోలికొస్తే.. నాలుక చీరేస్తాం..! వంగలపూడి అనితపై YSRCP నేతలు ఫైర్
-
సిగ్గులేదా చంద్రబాబు.. ఇంకెంతకాలం దాచుకుంటావ్...!
-
ఇది భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధికారిక ఫేస్బుక్ పేజీని అందుబాటులో లేకుండా చేసిన చంద్రబాబు ప్రభుత్వ దుశ్చర్యపై ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వైఎస్సార్సీపీపై మాత్రమే జరిగిన దాడి కాదని.. ప్రజాస్వామ్యం, భావ ప్రకటనా స్వేచ్ఛపై జరిగిన దాడి అని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య ప్రయోజనాల దృష్ట్యా రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టేందుకు తక్షణమే వైఎస్సార్సీపీ అధికారిక ఫేస్బుక్ పేజీని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేదంటే న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. సేవ్ డెమొక్రసీ, సేవ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ హ్యాష్ ట్యాగ్తో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా, కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, పీఎంవో, కేంద్ర ప్రసార, సమాచార శాఖ, మెటా, ఫేస్బుక్ను ట్యాగ్ చేస్తూ ఆదివారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ⇒ ‘చంద్రబాబు ప్రభుత్వం ప్రజల, ప్రతిపక్షాల గొంతులను నులిమేయడం కొనసాగిస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో మా అధికారిక ఇన్స్ట్రాగామ్ హ్యాండిల్ను తొలగించింది. ఇప్పుడు దేశంలో వైఎస్సార్సీపీ అధికారిక ఫేస్బుక్ పేజీని అందుబాటులో లేకుండా చేశారు. ⇒ ఇది కేవలం వైఎస్సార్సీపీపై దాడి మాత్రమే కాదు.. ప్రజాస్వామ్య విలువలు, భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడి. మేము కేవలం వాస్తవాలను వెల్లడిస్తాం. ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతి, అవకతవకలను సాక్ష్యాధారాలతో బయట పెడతాం. ప్రజా సమస్యలపై జనం గొంతుకను వినిపిస్తాం. దీంతో ప్రతిపక్ష పార్టీ అధికారిక హ్యాండిళ్లను.. తద్వారా నిజం మాట్లాడే ప్రతిపక్ష గొంతులను నొక్కేయడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం ఒక ప్రమాదకరమైన సంప్రదాయాన్ని నెలకొల్పుతోంది. ఇది అత్యంత అప్రజాస్వామికం. ⇒ రాజధాని అమరావతి నిర్మాణ పనులకు సంబంధించిన అధిక వ్యయాలు, డీఎస్సీ నియామక ప్రక్రియలో అవకతవకలు, టీటీడీ నెయ్యి టెండర్లలో అక్రమాలు, విచ్చలవిడిగా పెరిగిపోయిన అవినీతిని సరైన ఆధారాలతో బట్టబయలు చేస్తున్న వారిపై.. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం నుంచి.. ఆ విమర్శనాత్మక సమాచారాన్ని ఆన్లైన్లో ప్రజలు చూడకుండా నిరోధించడం వరకు ఒక ఆందోళనకరమైన ధోరణి కనిపిస్తోంది. ⇒ ఈ అన్యాయమైన చర్యలపై మేము న్యాయ పోరాటం చేస్తాం. ఈ దుశ్చర్యలను చట్టపరంగా.. రాజ్యాంగ పరమైన మార్గాల ద్వారా సవాల్ చేస్తాం. బెదిరింపులు, సెన్సార్íÙప్, సంస్థల దురి్వనియోగం వంటివేవీ ప్రజల గొంతును అణచి వేయలేవు. అధికారంలో ఉన్న వారిని జవాబుదారీగా నిలబెట్టడంలో.. వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ అనే ప్రాథమిక హక్కును పరిరక్షించడంలో మా నిబద్ధత కొనసాగుతుంది. ⇒ ప్రజాస్వామ్య ప్రయోజనాల దృష్ట్యా రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టేందుకు మా అధికారిక ఫేస్బుక్ పేజీని తక్షణమే పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటే న్యాయ పోరాటం చేస్తాం’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
ఆర్యవైశ్యుల పాలిట ద్రోహి చంద్రబాబు
సాక్షి, అమరావతి: ఆర్యవైశ్యుల పాలిట ద్రోహిగా సీఎం చంద్రబాబు మిగిలిపోయారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఇందులో వెలంపల్లి మాట్లాడుతూ.. ఆర్యవైశ్యుల ఆత్మగౌరవం, సంక్షేమం కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విశేషంగా కృషి చేసిందని, చంద్రబాబు పాలనలో తమ సామాజికవర్గం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభ సమయంలో డీబీటీ పథకాల ద్వారా ప్రజల కొనుగోలు శక్తిని పెంచి వ్యాపారులకు వైఎస్ జగన్ ఊతమిచ్చారని చెప్పారు. ఈబీసీ నేస్తం, అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంట్, విదేశీ విద్య వంటి పథకాల ద్వారా అగ్రవర్ణ పేదలకు పెద్ద ఎత్తున మేలు జరిగిందని వివరించారు. తద్వారా వ్యాపారాలు బాగా జరిగాయని చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఈ పథకాలన్నీ నిలిచిపోయాయని, మహిళలకు హామీ ఇచ్చిన ఆడబిడ్డ నిధి అమలు కాకపోవడంతో పాటు తల్లికి వందనం వంటి పథకాలూ నిర్వీర్యమయ్యాయన్నారు. దీంతో ఆర్యవైశ్యుల వ్యాపారాలు దెబ్బతిన్నాయని అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎండోమెంట్ పరిధిలోని ఆర్యౖవెశ్య సత్రాలు, ట్రస్టులను వారే నిర్వహించుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. విజయవాడలో ఆర్యవైశ్య భవనం నిర్మాణం, కర్నూలులో పేద ఆర్యవైశ్య విద్యార్థుల హాస్టల్ భవనం కోసం నిధులు మంజూరు, పెనుగొండలో వాసవీ మాత ఆలయాభివృద్ధికి రూ.1.50 కోట్లు కేటాయించడం వంటి అనేక చర్యల ద్వారా ఆర్యవైశ్యుల సంక్షేమం, అభివృద్ధి కోసం వైఎస్ జగన్ చేసినంతగా మరే నాయకుడు చేయలేదని వివరించారు. వైఎస్సార్సీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ మాట్లాడుతూ.. ‘ఆర్యవైశ్యుల ఆత్మగౌరవ పరిరక్షణకు వైఎస్ జగన్ విశేష కృషి చేశారు. చింతామణి నాటకాన్ని నిషేధించి ఆ వర్గం మనోభావాలను గౌరవించిన ఘనత ఆయనకే దక్కుతుంది. చింతామణి నాటకాన్ని నిషేధిస్తూ జారీ చేసిన జీవోను వ్యతిరేకిస్తూ రఘురామకృష్ణరాజు మాట్లాడితే.. ఆయన్ను చంద్రబాబు అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ని చేశారు. ఆర్యవైశ్యులకు మంచి రోజులు త్వరలోనే వస్తాయి’ అని చెప్పారు.వైఎస్సార్సీపీ సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘ఆర్యవైశ్యులకు వైఎస్సార్సీపీ జెండా అండగా నిలిచింది. చంద్రబాబు కూటమి ప్రభుత్వంఅన్ని వర్గాలపై వేధింపులే లక్ష్యంగా పనిచేస్తోంది. వైఎస్ జగన్ హయాంలో కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా అందరికీ సమాన న్యాయం జరిగింది. ప్రస్తుత పరిస్థితులు శాశ్వతం కావు. ప్రజలకు మళ్లీ మంచి రోజులు వస్తాయి. ఆర్యవైశ్యులు శాంతియుత వాతావరణాన్ని కోరుకునే వర్గం. తమ కష్టంతో ఎదిగే వారికి ప్రభుత్వం భద్రత, ప్రశాంతత కల్పించాలి. వారి సమస్యల పరిష్కారానికి వైఎస్సార్సీపీ అధికారంలోకి వచి్చన తర్వాత కృషి చేస్తుంది’ అని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్సార్సీపీ ఆర్యవైశ్య విభాగం నాయకులు గుబ్బా చంద్రశేఖర్, రేబాల శ్రీను, మిట్టా కరుణాకర్, మారుతీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఇది ప్రజాస్వామ్య విలువలు, భావప్రకటనా స్వేచ్ఛపై దాడి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు నాయుడి తీరుపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజల, ప్రతిపక్ష నేతల గళాన్ని నులిమేస్తోందని, ఈ ఏడాది ఆరంభంలో తమ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాను తొలగించారని, ఇప్పుడు అధికారిక వైఎస్సార్సీపీ ఫేస్బుక్ పేజీని భారత్లో అందుబాటులో లేకుండా చేశారన్నారు. ఇది ప్రజాస్వామ్య విలువలపై, భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడి అంటూ వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.‘‘ఇది కేవలం వైఎస్సార్సీపీపై దాడి మాత్రమే కాదు. ప్రజాస్వామ్య విలువలపై, భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడి. మేము వాస్తవాలను మాత్రమే బయటపెడతాం, ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతి పద్ధతులను బహిర్గతం చేస్తాం. ప్రజలను ప్రభావితం చేసే అంశాలను వెలుగులోకి తీసుకొస్తాం. నిజం మాట్లాడినందుకు ప్రతిపక్ష పార్టీ అధికారిక ఖాతాలను, తద్వారా ప్రతిపక్ష స్వరాలను అణచివేయడం ప్రమాదకర ధోరణికి నాంది. ఇది అత్యంత ప్రజాస్వామ్య విరుద్ధ చర్య.అమరావతి రాజధాని అభివృద్ధికి సంబంధించిన అధిక వ్యయాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేయడం, డీఎస్సీ ప్రక్రియలో అక్రమాలు, టీటీడీ నెయ్యి టెండర్లు, ప్రజా ప్రాధాన్య అంశాల్లో భారీ అవినీతికి సంబంధించిన తగిన ఆధారాలను వెలుగులోకి తీసుకువస్తున్నాం. ఇటువంటి వంటి విషయాల నుంచి.. విమర్శనాత్మక సమాచారాన్ని ప్రజలు చూడకుండా నిరోధించడం వరకు ఆందోళనకర ధోరణి కనిపిస్తోంది.ఈ అన్యాయపూరిత చర్యలను ప్రతి చట్టబద్ధ, రాజ్యాంగబద్ధ మార్గంలో సవాలు చేస్తాం. బెదిరింపులు, సెన్సార్ చర్యలు, సంస్థల దుర్వినియోగం వంటివి ప్రజల గళాన్ని అణచివేయలేవు. అధికారంలో ఉన్నవారిని జవాబుదారీగా నిలబెట్టడంలో, వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ అనే మౌలిక హక్కును పరిరక్షించడంలో మా నిబద్ధత కొనసాగుతుంది. ప్రజాస్వామ్య ప్రయోజనాల దృష్ట్యా, రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టే క్రమంలో మా అధికారిక పేజీని వెంటనే పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే న్యాయపోరాటం చేస్తాం’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. The @ncbn government continues to suppress the voices of the people and the opposition. After the takedown of our official Instagram handle earlier this year, the official YSRCP Facebook page has now been made inaccessible in India.This is not just an attack on YSRCP; it is an… pic.twitter.com/rJHq8BZ2pm— YS Jagan Mohan Reddy (@ysjagan) June 14, 2026 -
మళ్లీ మంచి రోజులు వస్తాయి: సజ్జల
సాక్షి, తాడేపల్లి: మళ్లీ మంచి రోజులు వస్తాయని.. త్వరలోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్య వైశ్యులు అత్యంత సున్నిత మనస్కులు.. ఘర్షణ లేని వాతావరణం కోరుకునేవారిలో ఆర్యవైశ్యులు ముందుంటారన్నారు. సమావేశంలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఆర్య వైశ్య సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.‘‘ఇప్పుడు ఏపీలో ప్రశాంత వాతావరణం లేనే లేదు. కూటమి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం అడ్రస్ లేకుండా పోయింది. రాష్ట్రంలో ఉన్నదంతా అరాచకమే. తమ పార్టీ కాని వారందరినీ వేధించి.. వైఎస్సార్సీపీ ముద్ర వేస్తున్నారు. ప్రజల పక్షాన బలంగా ప్రశ్నించేది వైఎస్సార్సీపీ మాత్రమే. వైఎస్సార్సీపీ 10 వేల మంది ఆర్యవైశ్యులు ఉన్నారు. మహిళలు కూడా రాజకీయంగా బయటికి వస్తున్నారు. వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడ్డ వారికి కూడా వైఎస్ జగన్ అండగా నిలిచారు’’ అని సజ్జల పేర్కొన్నారు.‘‘ఒకప్పుడు ప్రభుత్వ బడులకు వెళ్లడం నామోషీగా భావించేవారు. ప్రభుత్వ బడులకు వెళ్లడం గొప్పగా భావించేలా చేసిన ఘనత జగన్కు దక్కింది. స్కూల్ బ్యాగ్ నుంచి ప్రతి అంశంలోనూ జగన్ కేర్ తీసుకున్నారు. ఈ ప్రభుత్వంలో అకడమిక్ ప్రారంభమైనప్పటికీ స్కూల్ బుక్స్, బ్యాగ్ల ఊసే లేదు. రాష్ట్ర ప్రజలపై ఎలాంటి భారం పడకూడదని వైఎస్ జగన్ చూశారు. చంద్రబాబు అమరావతి పేరుతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నాడు’’ అంటూ సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు.సొమ్ము ఆర్యవైశ్యులది.. సోకు మాత్రం చంద్రబాబు, పవన్దిమాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘వాసవీమాత ఆలయాల్లో ప్రభుత్వ జోక్యం ఉండొద్దని జీవో తెచ్చిన ఘనత వైఎస్సార్ , రోశయ్యలదే. ఆర్యవైశ్యులకు సంబంధించి కొన్ని ట్రస్ట్లు ఉన్నాయి. ప్రభుత్వ కబంధ హస్తాల్లో ఉన్న ఆర్యవైశ్యుల ట్రస్ట్లపై వైఎస్ జగన్ ఆర్యవైశ్యులకే హక్కులు కల్పించారు. ఎండోమెంట్ పరిధి నుంచి తప్పించి దుర్వినియోగం కాకుండా జీవో ఇచ్చారు. వైఎస్ జగన్ చేసినంత మేలు ఆర్యవైశ్యులకు మరెవరూ చేయలేదు. ఎండోమెంట్ పరిధిలో ఉన్న ఆర్య వైశ్యుల ట్రస్ట్లపై ఆర్య వైశ్యులకే వైఎస్ జగన్ హక్కులు కల్పించారు...గతంలో రాష్ట్రంలో ఉన్న ఆర్య వైశ్యులంతా ఆలయాల్లో దర్శనాలకు వెళ్లేవారు. కూటమి ప్రభుత్వంలో ఆలయాల్లో ఆర్య వైశ్యులకు అవకాశం లేకుండా చేశారు. అమరావతిలో వృధాగా పడి ఉన్న స్థలంలో పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేశారు. విగ్రహం ఏర్పాటు చేసిన స్థలంపై ఆర్యవైశ్యులకు ఎలాంటి హక్కు లేదంటున్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహం పెట్టడానికి డబ్బులిచ్చింది ఆర్య వైశ్య సంఘం. సొమ్ము ఆర్యవైశ్యులది సోకు మాత్రం చంద్రబాబు, పవన్ది’’ అంటూ వెలంపల్లి దుయ్యబట్టారు. -
ఇల్లీగల్ కేసుపై కేశినేని నాని రియాక్షన్
-
మీడియా ముందే పోలీసుల ఓవరాక్షన్
-
అంతన్నాడు ఇంతన్నాడే చంద్రబాబు.. బాబు పై అద్భుతమైన పాటపాడిన మహిళలు
-
YSRCP ZPTC భర్త పై కత్తితో దాడి
-
లోకేష్ లో L అంటే అదేనా..?
-
ప్రమాదం వెనుక నిజం.. మీ ఇంట్లో వాళ్లు చనిపోలేదు కదా లోకేష్.. పవన్ కామెంట్స్ వైరల్
-
రెండేళ్లు చేతకాలేదు.. ఇంకో మూడేళ్లు పరిపాలిస్తావా..?


