YSRCP
-
మంత్రి కొల్లు రవీంద్రకు పేర్ని నాని సవాల్
సాక్షి, కృష్ణా జిల్లా: ‘‘నేను బియ్యం దొంగతనం చేశానని ఆరోపిస్తున్నారు. మీకు దమ్ముంటే విచారణ జరిపి నన్ను లోపల వేయండి’’ అంటూ మంత్రి కొల్లు రవీంద్రకు మాజీ మంత్రి పేర్ని నాని సవాల్ విసిరారు. 2029 కల్లా చంద్రబాబు సర్కార్ పతనమవ్వడం ఖాయమని.. ఈ లోపు మీకు దమ్ముంటే తనను లోపల వేయండి అంటూ ఆయన వ్యాఖ్యానించారు.మచిలీపట్నం నియోజకవర్గం ఎన్నికల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (SIR)పై ఇవాళ(గురువారం) అవగాహన, శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. మచిలీపట్నం వైఎస్సార్సీపీ ఇంఛార్జి పేర్న కిట్టు, మాజీ మంత్రి పేర్ని నాని, వరికూటి అశోక్ బాబు, బూత్ లెవెల్ ఏజెంట్లు(బీఎల్ఏలు), నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి బూత్ కమిటీ అధ్యక్షులు, సభ్యులు హాజరయ్యారు.ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ.. చంద్రబాబు, హోంమంత్రి అనితపై మండిపడ్డారు. స్పోర్ట్స్ కోటాను 3 శాతానికి పెంచుతూ జీవో ఇచ్చినప్పుడు మీకు జ్ఞానం లేదా?. 382 మందిని స్పోర్ట్స్ కోటాలో తీసుకున్నామని ఇప్పుడు చెబుతున్నారు. నిన్నటి వరకూ 3 శాతం అన్నారు.. ఇప్పుడు 382 మంది అంటున్నారు. ఎంతమందిని స్పోర్ట్స్ కోటాలో తీసుకున్నారో కూడా చెప్పరా?’’ అంటూ పేర్ని నాని దుయ్యబట్టారు.‘‘జీవోను మార్చి 29 ఆటలను 67 ఆటలకు పెంచేశారు. 40వ ఆట కింద పేక ముక్కలతో ఆడే బ్రిడ్జ్ ఆటను పెట్టారు. ఏ ఆటకు ఎవర్ని తీసుకున్నారో 9 నెలలు నుంచి చెప్పడం లేదు. మేం నిరసనలు చేశాం కాబట్టి ఇప్పుడు డేటా బయటపెడుతున్నారు. పేకాట ఆడేవాళ్లను తీసుకోవడం లేదని ఇప్పుడు చెబుతున్నారు. ఐఏఎస్ సంతకం లేకుండా స్పోర్ట్స్ కోటా లిస్ట్ ఎలా పెట్టారు?. ప్రజల అదృష్టం బాగుండి పేకాట నుంచి టీచర్లను తీసుకోలేదు. బ్యాగులు, సర్టిఫికెట్లు తెస్తే ఆ ఉద్యోగం కూడా ఇచ్చేవాళ్లు. ఆటలు కేంద్రం పెట్టిందని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దొంగతనం రుజువయ్యాక చంద్రబాబు, అనిత మాట్లాడుతున్నారు..డీఎస్సీ అక్రమాల పై విద్యాశాఖ మంత్రి లోకేష్ నోరు విప్పడు. లోకేష్ ఏజెంట్ల కింద సీఎం, హోంమంత్రి మాత్రం మాట్లాడేందుకు వస్తారు. ఆడపిల్లలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే హోంమంత్రి మాట్లాడరు. విద్యాశాఖలో తప్పు జరిగిందని మేం అనగానే హోం మంత్రి తెరమీదకు వచ్చేశారు. డీఎస్సీలో మీరు చేసిన పాపాలు మీకు తగలకుండా ఉంటాయా?. చంద్రబాబు గొప్పలు రాష్ట్రానికి అప్పులు’’ అంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు. -
నిన్ను నీ కొడుకుని తగలపెట్టాలి అంబటి ఫైర్
-
రెండేళ్ల రాక్షస పాలనపై కదం తొక్కిన వైఎస్సార్సీపీ
-
కోట ఎంపీపీ ఉప ఎన్నికలో టీడీపీ బరితెగింపు
సాక్షి, నెల్లూరు: నెల్లూరులోని కోట మండల ఎంపీపీ ఉపఎన్నికలో టీడీపీ బరితెగింపు రాజకీయాలకు తెరలేపింది. వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను బెదిరించి కౌన్సిల్ హాల్లో బలవంతంగా పార్టీలోకి లాక్కుంది. ఈ క్రమంలో పచ్చ పార్టీ బెదిరింపులపై మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అప్రజాసామ్య ఎన్నికను వైఎస్సార్సీపీ బాయ్కాట్ చేసింది.అనంతరం మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ..‘కోట ఎంపీపీ ఉప ఎన్నికలో టీడీపీ దిగజారుడు రాజకీయం చేసింది. వైఎస్సార్సీపీ బీఫామ్తో గెలిచింది 14 మంది, టీడీపీ తరఫున గెలిచింది నలుగురు. మా పార్టీ ఎంపీటీసీలను భయబ్రాంతులకు గురిచేసి టీడీపీ కండువా కప్పి తీసుకొని వస్తారా?. వెన్నుపోటు రాజకీయాలు చేయడం టీడీపీకి మొదటి నుండి అలవాటే. పార్టీకి నమ్మక ద్రోహం చేసిన, పార్టీ ఫిరాయించిన ఎంపీటీసీలకు భవిష్యత్తులో బుద్ధి చెబుతాం. పార్టీ కోసం నిలబడ్డ ఎంపీటీసీలకు అండగా ఉంటాం.చంద్రబాబు నీచ రాజకీయాలు మరొకసారి కోటలో బయటపడ్డాయి. నాలుగు నెలల ఎంపీపీ పదవి కోసం రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు. నేరుగా ప్రజల మద్దతుతో గెలిచే ధైర్యం లేక అడ్డదారులు తొక్కారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు భవిష్యత్తులో గట్టి గుణపాఠం చెప్పే సమయం వస్తుంది అని హెచ్చరించారు. -
పవన్ స్క్రిప్ట్లో మిస్సయిన మెయిన్ మెసేజ్!
జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సడన్ గా హైదరాబాద్ లో తెలంగాణ రాజకీయ పార్టీలపైన లొల్లికి దిగడంలో వ్యూహం ఏమైనా ఉందా? లేక కాకతాళీయంగా జరిగిందా? ఆయన సభకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించకపోవడం, తదుపరి హైకోర్టులో కూడా చుక్కెదురవడంతో మీడియా మీట్ పెట్టి దాదాపు గంటసేపు తన భావజాలాన్ని ప్రదర్శించారు. అప్పుడప్పుడు ఆయనలో కనిపించే సినిమాటిక్ హాహా భావాలు, గొంతెత్తి అరవడం వంటివి ఆయన అభిమానులకు సంతోషం కలిగించవచ్చు. కాని అసలు ఆయన ఈ మీడియా సమావేశం ఎందుకు పెట్టారు? ఏమి మాట్లాడాలని అనుకన్నారు? ఏమి మాట్లాడారు? ఒకదానికి ఒకటి పొంతన లేకుండా మాట్లాడడం, పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చేయడం వంటివి యథాప్రకారం జరిగాయనిపిస్తుంది.ఆయన ఏమి చెప్పారో పూర్తిగా అర్థం చేసుకోగలిగితే మెచ్చుకోవాల్సిందే. గందరగోళంగా సాగిన ఆయన ప్రసంగంలో కొన్ని అంశాలు అందరి దృష్టిని బాగా ఆకర్షించాయని చెప్పాలి. ఆంధ్రలోనే తనకుదిక్కు లేదని, ఇక తెలంగాణలో సీఎం అవుతానా అని ఆయన అన్న వీడియో విపరీతంగా వైరల్ అయింది. ఆంధ్రలో దిక్కులేదని అనడం ఏమిటి? అంటే తాను సీఎం కాలేనని మరోసారి స్పష్టం చేశారని అనుకోవాలా? తెలంగాణలో తానేమి చేయగలనన్నదానికి కట్టుబడి ఉన్నారా! అంటే లేదు. ఈరోజు చెబుతున్నా.. తెలంగాణలో జనసేన పోటీచేస్తుంది అని పవన్ చెప్పారు. తెలంగాణలో బలం లేదని తెలిసి కూడా ఎందుకు పోటీచేస్తున్నారంటే అందులో ఏదో మతలబు ఉండి ఉండాలి.ఇదేదో మొదటిసారి ఎన్నికల బరిలో ఉన్నట్లు పిక్చర్ ఇచ్చినట్లు అనిపిస్తుంది. కానీ తెలంగాణలో 2023లో జరిగిన శాసనసభ ఎన్నికలలో బీజేపీతో కలిసి జనసేన పోటీచేసింది. ఏడుచోట్ల పోటీచేస్తే ఆరుచోట్ల డిపాజిట్లు రాలేదు. కొద్ది నెలల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికలలో వేళ్లమీద లెక్కించదగిన వార్డులలో గెలిచారట. అది గొప్ప విషయంగా ఆయన భావిస్తున్నట్లు ఉంది. తెలంగాణకు వస్తే తిరగనివ్వమని బెదిరిస్తారా? ఇది మీ అయ్య జాగీరా అని ఆయన ప్రశ్నించారు. దానికి జవాబుగా మంత్రి పొన్నం ప్రభాకర్ అవును.. ఇది మా అయ్య జాగీరే.. తెలంగాణ ప్రజల జాగీరే అంటూ ఘాటుగా బదులిచ్చారు. నిజానికి పవన్ ను ఎవరూ ఇక్కడ తిరగనివ్వబోమని అనలేదు. అన్నా దానిని ఎవరూ అంగీకరించజాలరు. కాని తెలంగాణవారిపై ఏపీ పోలీసులతో దాడులు చేయిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.ఇదంతా డైవర్షన్ రాజకీయమా? అనే చర్చ జరుగుతోంది. తన పదెకరాల పొలం కోడి చెరువులో ఉందన్న ఆరోపణపై ఆయన నేరుగా స్పందించి, అందులో తప్పు జరిగిందా? లేదా? తాను తెలిసి కొన్నారా? తెలియక కొన్నారా? కొందరు జర్నలిస్టులు ఆరోపిస్తున్నట్లుగా నిషేధిత జాబితా నుంచి ఆ ప్రదేశాన్ని తొలగించడం నిజమా? కాదా? పదెకరాల భూమిని ఒకేసారి కాకుండా మూడు ఎకరాల చొప్పున విడతలవారీగా మ్యుటేషన్ చేయించుకోవడంలో ఉన్న రహస్యం ఏమిటి. అక్కడ బోర్ వేయడం కాని, పెన్సింగ్ ఏర్పాటు చేయడంపై కాని పవన్ కళ్యాణ్ వివరించి, జర్నలిస్టుల వాదన అసంబద్ధమని రుజువు చేసి ఉంటే ఆయనకు మంచి పేరు వచ్చేది. అలాకాకుండా తన భూమి చెరువులో ఉందని తేలితే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చని ఆయన అన్నారు. ఇది కొంత నయమే అయినప్పటికీ, ఈ సందర్భంలోనే ముఖ్యమంత్రి రేవంత్ ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు గమనించదగ్గవిగా ఉన్నాయి.రేవంత్ అంటే తనకు ఇష్టం అని, గౌరవం అని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఏమి ఉంది? మర్యాద ఇవ్వడం తప్పుకాదు. కోడి చెరువు ప్రస్తావన సమయంలోనే ఈ మాటలు అనేసరికి, ఇదేదో మాచ్ ఫిక్సింగేమో అన్న సందేహానికి ఆస్కారం ఇచ్చారు. రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా టీడీపీతో పరోక్ష స్నేహం చేస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. మామూలుగా అయితే చెరువుల కబ్జా ఆరోపణలు రాగానే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా పలుమార్లు వాయువేగంతో స్పందించి, కొన్నిచోట్ల భవనాలను కూల్చివేసింది. పేద, మద్య తరగతి ప్రజలు పలువురు దీనితో రోడ్డున పడే పరిస్తితి ఏర్పడింది. పవన్ కళ్యాణ్ కు చెందిన భూమి విషయంపై వారం రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా, ప్రభుత్వం అందులోని నిజానిజాలను ఎందుకు తేల్చలేదో తెలియదు. ఈ విషయంలో తప్పు జరగలేదని ప్రభుత్వ పరిశీలనలో వెల్లడైతే పవన్ కళ్యాణ్ కే మంచిది కదా!గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో జనసేన పోటీచేస్తున్నట్లే పవన్ చెప్పకనే చెప్పారు. తప్పు లేదు. ఎవరూ అభ్యంతరం చెప్పరు. అది ప్రజాస్వామ్య హక్కు. అయితే టీడీపీ, బీజేపీతో కలిసి పోటీచేస్తారా? లేదా? అన్నది చెప్పలేదు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడానికేనని బీఆర్ఎస్ అనుమానిస్తోంది. కాగా ఇదంతా బీజేపీ గేమ్ అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇక్కడ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. టీడీపీ అదినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ తో రహస్య రాజకీయ సంబంధాలు కొనసాగిస్తున్నది అందరికి తెలిసిందే. గత శాసనసభ ఎన్నికలలో కాని, జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలో కాని, ఎన్.టి.ఆర్.విగ్రహావిష్కరణ సభలో కాని ఇవన్ని ఓపెన్ గానే కనిపించాయి.చంద్రబాబును కాదని పవన్ కళ్యాణ్ తెలంగాణలో సొంత రాజకీయం చేస్తారని ఎవరూ అనుకోవడం లేదు. బహుశా ఆయనకు చెప్పే పవన్ ఇక్కడ ఈ మీడియా మీట్ పెట్టి ఉండవచ్చన్న అభిప్రాయం పలువురిలో ఉంది. ఒకవేళ చంద్రబాబు హైదరాబాద్ ఎన్నికలలో బీజేపీకి మద్దతు ప్రకటించాల్సి వస్తే, అప్పుడు రేవంత్ రెడ్డి ఇరుకున పడతారు. తెలంగాణలో టీడీపీ బలపడేందుకు పని చేస్తామని వర్కింగ్ అధ్యక్షుడు లోకేష్ చెప్పడం కూడా గమనించదగిందే. వీరు కాంగ్రెస్ కు మేలు చేయడానికి వ్యూహ రచన చేస్తున్నారా? లేక ప్రధాని మోడీ ఆశించినట్లు బీజేపీకి ఉపయోగపడాలని అనుకుంటున్నారా? అన్నది తేలవలసి ఉంటుంది. ఈ ప్రక్రియ ఎలా జరిగినా బీఆర్ఎస్ ను దెబ్బగొట్టే వ్యూహమే ఉండవచ్చన్నది పలువురి భావనగా ఉంది.ప్రస్తుత పరిస్థితిలో హైదరాబాద్ లోనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల వ్యక్తిగత ప్రయోజనాలు అధికంగా ఇమిడి ఉన్నందున కాంగ్రెస్ కు నష్టం చేసే పని చేయకపోవచ్చు. ఫ్రొఫెసర్ నాగేశ్వర్ అంశాన్ని కూడా పరోక్షంగా పవన్ మాట్లాడారు కాని, అదేమి అర్దవంతంగా లేదని చెప్పాలి. తానేమో అనేక అంశాలను ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడతారు. నాగేశ్వర్ రాజకీయ వ్యాఖ్యలపై జనసేన వారితో కేసులు పెట్టించడం పవన్ పై తెలంగాణలో తీవ్ర వ్యతిరేకత పెంచింది. ఈ నేపథ్యంలో దానిపై వివరణ ఇవ్వడానికి యత్నించినట్లు ఉంది. తానెప్పుడూ కేసీఆర్ ను ఏమీ అనలేదని ఆయన చెప్పడంపై కూడా విమర్శలు వచ్చాయి. గతంలో కేసీఆర్ ను ఉద్దేశించి తాట తీస్తానని పవన్ అనడం, అందుకు ప్రతిగా కేసీఆర్ మరింత ఘాటుగా వ్యాఖ్యానించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.ప్రాంతీయ వాదం ఉగ్రవాదం కంటే ప్రమాదం అని పవన్ అన్నారు. ఆయనది ప్రాంతీయ పార్టీనా? కాదా? అన్నది చెప్పాలి. అసలు ప్రాంతీయ వాదంతోనే పుట్టిన తెలుగుదేశం పార్టీతో ఆయన పొత్తు ఎలా పెట్టుకున్నారు? తెలంగాణ రాష్ట్ర సాధనకు టీఆర్ఎస్ ఏర్పడింది. ఆ తర్వాత బీఆర్ఎస్ గా మారింది. దీనిని ఎలా చూస్తారు? బీజేపీ, కాంగ్రెస్ లు ప్రాంతీయ పార్టీలతో దేశవ్యాప్తంగా పొత్తు పెట్టుకుంటున్నాయే. ప్రాంతీయ, కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టడంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సిద్దహస్తులే అన్న విమర్శలు ఉన్నాయి.తెలంగాణ ఏర్పాటు చేసినప్పుడు 11 రోజులు నిరశన దీక్ష చేశానని ఆయనే ఒకసారి అంటారు. మరోసారి తాము తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాదని చెబుతారు. తెలంగాణవారి దిష్టి తగిలి కోనసీమలో కొబ్బరి చెట్లు దగ్ధం అయ్యాయని కొంతకాలం క్రితం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్య ఇప్పటికీ తెలంగాణవాదుల గుండెల్లో గుచ్చుకుంటూనే ఉంటుంది. గద్దర్ కు వెన్నులో బులెట్ దిగినప్పుడు ఆయన అడిగితే కారు కొని ఇచ్చానని చెబుతారు.. కాని గద్దర్ పై టీడీపీ ప్రభుత్వ టైమ్ లోనే కాల్పులు జరిగిన సంగతిని విస్మరిస్తారు. కొండగట్టుకు 30 కోట్ల డబ్బు ఇచ్చానని అంటారు. అది టీడీపీ డబ్బు కదా! అందులో తెలంగాణ భక్తుల సొమ్ముకూడా ఉంటుంది కదా అని తెలంగాణ వాదుల వ్యాఖ్య. వంగవీటి రంగాను కాపాడుకోలేకపోయారని కాపునేతలను విమర్శిస్తారు. రంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే హత్యకు గురయ్యారు. టీడీపీ నేతలే ఈ హత్య చేశారని అంతా చెబుతారు. అయినా అదే టీడీపీతో ఆయన పొత్తు పెట్టుకుంటారు.ఇలా పరస్పర విరుద్ధమైన రీతిలో ఏపీలో అనేక మార్లు వ్యవహరించినట్లుగానే తెలంగాణలో కూడా గందరగోళంగా మాట్లాడినట్లు అనిపిస్తుంది. తద్వారా ఇక్కడ రాజకీయాన్ని కలగాపులగం చేయడం లక్ష్యంగా పవన్ పని చేయడం ఆరంభించారా? అన్న సందేహం వస్తుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
పవన్ గాలి తుస్..! డిప్యూటీ సీఎంపై మల్లాది విమర్శలు
-
వెన్నుపోటుకు రెండేళ్లు.. నంద్యాలలో పోలీసుల ఓవరాక్షన్
వైఎస్సార్సీపీ నిరసనలు అప్డేట్స్.. నేటి నుంచి వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్త నిరసనలు చేపట్టింది. చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో నిరసనలు కొనసాగనున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఇచ్చిన హామీలు అమలు చేయకపోవటంపై వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే హామీల అమలుకు నిరసనలు చేపట్టనుంది. నేడు మండల కేంద్రాల్లో టీడీపీ మేనిఫెస్టో, చంద్రబాబు, పవన్ కల్యాణ్ సంతకాలతో ఇచ్చిన బాండ్లు దగ్ధం చేశారు. అలాగే, ఈ నెల 8 లేదా 9 తేదీల్లో టౌన్ హాల్ సదస్సులు జరగనున్నాయి. ఈ నెల 12న నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు కొనసాగుతాయి. వాల్పేపర్లు దగ్ధంవిశాఖలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో హోరెత్తిన నిరసనలు చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో ఆందోళనలువిశాఖ వెంకోజిపాలెం జంక్షన్, డైమండ్ పార్క్ జంక్షన్, కంచరపాలెంలో వాల్పేపర్లు దగ్ధం నంద్యాల జిల్లా..బేతంచర్ల నగరపంచాయతీలో వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం చేపట్టిన మాజీ మంత్రి బుగ్గనబుగ్గన కామెంట్స్..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చలేకపోయాడు.అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు.కరోనా సమయంలో కూటమి నాయకులు బయటకు రాకుండా బాదుడే బాదుడు అని ఇప్పుడు తీపి లడ్డూలు ఇస్తున్నారా?ఇంటింటికి తిరిగి అక్క, వదిన, బావ అని వరసలు కలిపి సూపర్ సిక్స్ పథకాలు అని నట్టేట ముంచారు.రెండేళ్లు గడిచినప్పటికీ కొత్త పెన్షన్లు ఇవ్వలేదు.కూటమి నాయకులు కరెంట్ లేని సమయంలో బయటకు వెళితే ప్రజలు దుప్పటి కప్పి కొట్టే పరిస్థితి ఉంది.వైఎస్ జగన్ అబద్ధాలు చెప్పలేకపోయారు.ప్రజలు అబద్ధాలు నమ్మి మోసపోయారు. విజయవాడ..మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కామెంట్స్..చంద్రబాబు అంటేనే మోసం.. మోసం అంటేనే చంద్రబాబుకూటమి ప్రభుత్వం మహిళలను ఘోరంగా వంచించింది ఎన్నికలకు ముందు ప్రజలకు అనేక అబద్ధపు హామీలను ఇచ్చారుజగన్ కంటే ఎక్కువ పథకాలు అందిస్తామని నమ్మించారుఅధికారంలోకి వచ్చాక ప్రజలకు వెన్నుపోటు పొడిచారుకూటమి ప్రభుత్వం మహిళలకు పూర్తిగా మోసం చేసిందిఆంధ్రాలోనే ఏం పీకలేను అన్న పవన్ కళ్యాణ్ లాంటి డిప్యూటీ సీఎం మనకు అవసరమా?మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి కామెంట్స్..కూటమి ప్రభుత్వం మహిళలను నమ్మించి మోసం చేసిందిఆడబిడ్డ నిధి పథకం ఊసే లేదుమూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీని అరకొరగా మార్చేశారుమహిళలకు ఉచిత బస్సు అని చెప్పి వంచించారునిరుద్యోగ భృతి కల్పిస్తామని యువతను మోసం చేశారు50 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పెన్షన్లు ఇస్తామన్న హామీని గాలికొదిలేశారుఈ దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడాలిచిత్తూరు జిల్లా..నగరి క్లాక్ టవర్ సర్కిల్లో టీడీపీ పోసర్ట్, మేనిఫెస్టోను తగలబెట్టి నిరసన చేపట్టిన మాజీ మంత్రి రోజానగరిలో పెద్ద ఎత్తున నిరసనల్లో పాల్గొన్న పార్టీ నాయకులు. కార్యకర్తలుమాజీ మంత్రి రోజా కామెంట్స్చంద్రబాబు వెన్నుపోటు పాలనలో ప్రజలకు వెన్నుపోటు పొడిచారుసంక్షేమ పాలన అందిస్తామని చెప్పి సంక్షోభ పాలన చేస్తున్నారురాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చేశాడు సీఎం చంద్రబాబుచేసిన అప్పులు మూడున్నర లక్షల కోట్లు ఏమయ్యాయి?.సూపర్ సిక్స్ పథకం సూపర్ హిట్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారుసూపర్ సిక్స్లో ఏ ఒక్క హామీ అమలు చేయలేదు30 లక్షలు మంది తల్లులకు అమ్మఒడి దూరం చేశారుసంక్షేమ పథకాలు లేవు, ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారుప్రజలు అందరూ కలిసి చంద్రబాబుకు స్థానిక సంస్థలు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారుఎన్టీఆర్ జిల్లా..ఇబ్రహీంపట్నంలో చంద్రబాబు వెన్నుపోటు రెండేళ్లు కార్యక్రమంఇబ్రహీంపట్నంలో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమైన జోగి రమేష్జోగి రమేష్ కామెంట్స్..చంద్రబాబు నాయుడు వెన్నుపోటుకు రెండేళ్లు కాదు 30 ఏళ్లు.1996లో ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడవడంతో మొదలైన ప్రస్థానం నేటికీ కొనసాగుతోంది.ఇచ్చిన హామీలను మరచి అన్ని వర్గాల ప్రజలను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడుకూటమి పాలనలో ఏ ఒక్క పంటకు దక్కని గిట్టుబాటు ధరలుసూపర్ సిక్స్ పథకాలు అమలు అంటూ ఎన్నికల హామీలలో చెప్పిన చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసం చేశారుచంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాలను రాష్ట్ర ప్రజలు గమనించాలివైఎస్ జగన్ను తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.గుంటూరు..మాజీ మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్....కూటమి నేతలు ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చి వాటిని అమలు చేయలేదుఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇవ్వడంఅధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా ఉండటం చంద్రబాబుకు అలవాటేఅందుకే ఇవాళ వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమం చేపట్టాం.మేము గుజ్జనగుంటలో కార్యక్రమం నిర్వహించాలని ముందే నిర్ణయించుకున్నాం.టీడీపీ నాయకులు అక్కడ మా పార్టీ నాయకుల్ని కార్యకర్తలు రెచ్చగొట్టేలా బ్యానర్లు ఏర్పాటు చేశారువైఎస్ జగన్ దిష్టిబొమ్మను పోలీసులు దగ్గర ఉండి దగ్ధం చేయించారుటీడీపీ నాయకులు దగ్ధం చేయాల్సింది జగన్ దిష్టి బొమ్మను కాదు చంద్రబాబు దిష్టి బొమ్మని.ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు చంద్రబాబు దిష్టి బొమ్మను దగ్ధం చేయాలిమా ఇంటి పైన దాడి చేసిన వారంతా ఇవాళ నిరసన పేరుతో గుజ్జునుకుంట దగ్గర హడావిడి చేశారుప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు మంచివి కాదువిజయవాడ..ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ కామెంట్స్..చంద్రబాబు ప్రజలకు పొడిచిన వెన్నుపోటుకు నిరసన తెలుపుతున్నాం..నిరసనలో భాగంగా టీడీపీ మేనిఫెస్టో, బాండ్లు తగలబెడుతున్నాం.మహిళా లోకం మా కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారుజగన్ హయంలో ఆసరా, చేయూత, ఇంటి స్థలం వంటివి అందించారుకూటమి 50ఏళ్లకు పెన్షన్, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి అన్నారు..చదువుకున్న పిల్లలకు కనీసం సౌకర్యాలు కల్పించడం లేదు.ఏ ఒక్క పథకం అమలు చేయలేదుమ్యానిఫెస్టోని ఏవిధంగా తగలబెట్టారో అదే విధంగా చంద్రబాబును మంటల్లో వేస్తారు .జగన్ రిటైనింగ్ వాల్ నిర్మించారు.. ఇళ్ల పట్టాలు ఇచ్చారు..చంద్రబాబు పాలనలో సంతోషంగా ఉన్నది చంద్రబాబు, పవన్, లోకేష్ మాత్రమే.ప్రజానీకం డబ్బులతో మంత్రులు సింగపూర్లో జల్సాలు చేస్తున్నారుజగన్ను చూసి కూటమి నేతలు పరిపాలన నేర్చుకోవాలి.చంద్రబాబు కరెంట్, పెట్రోల్, కూరగాయలు వంటి రేట్లు పెంచారు8వ తేదీన టౌన్ హాల్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం..12వ తేదీన జిల్లాలో భారీ ర్యాలీ నిర్వహిస్తాం..చంద్రబాబుకు బుద్ది వచ్చే విధంగా పోరాటం చేస్తాం. నంద్యాల..నంద్యాలలో శిల్పా చక్రపాణి రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.శిల్పా చక్రపాణి రెడ్డి కామెంట్స్..వెన్నుపోటుకు రెండేళ్ల కార్యక్రమం చెయ్యడానికి వెళ్తుంటే అడ్డుకోవడం సరైనది కాదు టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి సవాల్ విసిరిన శిల్ప చక్రపాణి రెడ్డిప్రజల అధికారం ఇస్తే రెండేళ్లలో ఏం చేశావు ప్రజలకు చెప్పుఅధికారం ఇస్తే నియోజకవర్గంలో నువ్వు చేయని అరాచకాలు లేవుకూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ అట్టర్ ప్లాప్ కావడంతో ప్రజలు తిరస్కరించే పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందిశ్రీశైలం నియోజకవర్గంలో నిన్ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరురాష్ట్రంలో ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వని దుర్మార్గమైన పరిస్థితి కూటమి ప్రభుత్వంలో ఏర్పడిందిసూపర్ సిక్స్ పథకాల్లో ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు మేలు జరగలేదుప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చమని అడిగితే దాడులు దౌర్జన్యాలు దుర్భాష లాడటం పరిపాటిగా మారిందిఇలాంటివి చేసి భయపెట్టాలని చూస్తే భయపడే పరిస్థితుల్లో లేము.అవసరమైతే ఎదురు దాడి చేయడానికి కూడా వెనకాడం.టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి హెచ్చరిక. అనంతపురం..వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు రెండేళ్లుహామీల అమలులో టీడీపీ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలంనిరసనగా అనంతపురం నగరంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ఆందోళనవైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో నిరసనచంద్రబాబు హామీలపై ప్లకార్డుల ప్రదర్శననల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలువైఎస్సార్ జిల్లా..పులివెందులలో వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో నిరసనటీడీపీ సూపర్ సిక్స్ హామీలు, మేనిఫెస్టో ప్రతులను దగ్ధం చేసిన వైఎస్సార్సీపీ శ్రేణులుకార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ మనోహర్ రెడ్డి, వైఎస్ మధు రెడ్డి, ఇతర నాయకులుప్రొద్దుటూరులో వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో నిరసనమాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి, పార్టీ నేతల నిరసనలు. విజయవాడ..విజయవాడ తూర్పు నియోజకవర్గం రాణిగారి తోటలో వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంసూపర్ సిక్స్ హామీలు, మేనిఫెస్టోను అమలు చేయని కూటమి ప్రభుత్వంఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో ర్యాలీకార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నేతలు, కార్యకర్తలు. నంద్యాల జిల్లా..ఆత్మకూరు పట్టణంలో కొనసాగుతున్న ఉద్రిక్తత.వైఎస్సార్సీపీ ఆఫీసుతో పాటు పట్టణంలో భారీగా మోహరించిన పోలీసులు.చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్ల కార్యక్రమం నేపథ్యంలో పోలీసులు అలర్ట్.నంద్యాల నుంచి ఆత్మకూరు వస్తున్న శిల్పా చక్రపాణి రెడ్డిని నంద్యాలలో హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.శాంతి భద్రతల దృష్ట్యా ఆత్మకూరులో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని పార్టీ నాయకులకు నోటీసులుసవాళ్లు ప్రతి సవాళ్ల నేపధ్యంలో ఆత్మకూరు పట్టణంలో ఉద్రిక్తతఅవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా బందోబస్తు. -
మా భవిష్యత్తు మట్టి కొట్టుకుపోయింది.. మెరిట్తో సర్కారు ‘ఆటలు’!
సాక్షి, అమరావతి: ‘‘మంత్రి నిర్వాకంతో మా భవిష్యత్తు మట్టి కొట్టుకుపోయింది. తమ వారికి ఉద్యోగాలు ఇవ్వడం కోసం ఇష్టానుసారంగా నియమాలు మార్చారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టుల భర్తీలో అంతులేని అక్రమాలు చేశారు..! ఎన్నిసార్లు లోకేశ్ను కలవాలని ప్రయత్నించినా ఇంటి దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు..! 1998, 2008 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేసినట్లు మాకు న్యాయం చేయండి...! మెగా డీఎస్సీ మెరిట్ లిస్టులో నా పేరొచ్చింది. 1:1 రేషియోలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా పూర్తయింది. తీరా సెలక్షన్ లిస్టులో నా పేరు లేదు. కారణం అడిగితే.. ఆ పోస్టు స్పోర్ట్స్ కేటగిరీలో ఇచ్చామని.. హారిజాంటల్ రిజర్వేషన్ వల్ల పోస్టు మిస్సయ్యిందని చాలా తేలిగ్గా సమాధానం చెబుతున్నారు. వెరిఫికేషన్కి వచ్చినంత మాత్రాన జాబ్ ఇస్తామన్నట్లు కాదని అంటున్నారు..! కోర్టు ఆర్డర్ కాపీ పట్టుకుని తిరుగుతున్నా లెక్క చేయడం లేదు..! నేషనల్ గేమ్స్లో బంగారు పతకం సాధించినా నాకు పోస్టు ఇవ్వలేదు.. రజతం, కాంస్య పతకం ఉన్నవారికి మాత్రం ఉద్యోగాలిచ్చారు.. సర్టిఫికెట్లు పరిశీలించకుండా పోస్టులు ఇచ్చేశారు...! అసలు ఏ పరీక్షా రాయని వారికి స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగం ఇచ్చి మెరిట్లో ఉన్న మాకు అన్యాయం చేశారు..! మెరిట్ లిస్టులో వచ్చిన వారికి రిజర్వేషన్ కేటగిరీలో ఉద్యోగం ఇవ్వడంతో నాకు రావాల్సిన ఉద్యోగం రాకుండా పోయింది...! కటాఫ్ మార్కులు ప్రకటించకపోవడం వల్ల చాలా గందరగోళంగా ఉంది...! ఉన్నది 3 పోస్టులు... ముగ్గురమే ఉన్నాం... కానీ ఫైనల్ జాబితాలో నా పేరు లేదు. కారణం అడిగితే స్పోర్ట్స్ కోటాలో ఆ జాబ్ ఇవ్వాల్సి వచ్చిందని చెబుతున్నారు..! నిబంధనలకు విరుద్ధంగా టీచర్ పోస్టులను భర్తీ చేశారని మా బాధ ఎవరికి చెప్పుకున్నా పట్టించుకోవడం లేదు..! ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగదు.. మాకు మీరు మాత్రమే న్యాయం చేయగలరు..!!’’ ఇదీ మెగా డీఎస్సీ 2025 వేలాది మంది బాధిత అభ్యర్థుల ఆక్రందన!! మెరిట్లో ఉండి అన్యాయానికి గురైన అభ్యర్థులు బుధవారం పెద్ద ఎత్తున తరలివచ్చి తాడేపల్లిలో మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి తమ గోడు చెప్పుకున్నారు. డీఎస్సీ నిర్వహణ, టీచర్ పోస్టుల ఎంపికలో జరిగిన అనేక అక్రమాలను ఆయనకు వివరించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వారంతా కలిసి మీడియాతో మాట్లాడారు.తమకు జరిగిన అన్యాయాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డికి వివరిస్తున్న డీఎస్సీ–2025 బాధిత అభ్యర్థులు నేషనల్ గేమ్స్లో గోల్డ్ మెడల్ను పక్కనబెట్టారు నేను నేషనల్ గేమ్స్లో బంగారు పతకం విజేతను. మా జిల్లా నుంచి 6 పోస్టులు ఉంటే రజతం, కాంస్య పతక విజేతలకు ఉద్యోగాలు ఇచ్చి నాకు బంగారు పతకం ఉన్నా ఉద్యోగం ఇవ్వకుండా అన్యాయం చేశారు. దీనిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. – అనిగి దుర్గయ్య, పోలవరం మండలం, ఏలూరు జిల్లా లోకేశ్ వద్దకు వెళితే.. మెగా డీఎస్సీలో ర్యాంక్ తెచ్చుకుని సర్టిఫికెట్ల పరిశీలనకు కూడా హాజరయ్యా. ఎస్జీటీ ఉర్దూ మీడియంలో పరీక్ష రాసింది నలుగురం మాత్రమే. అందులో ముగ్గురిని సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారు. ఎస్టీ వర్గానికి చెందిన నా పేరు తుది జాబితాలో లేదు. రోస్టర్ నంబర్లు అటూ ఇటూ చేసి నన్ను కాదని ఒక మహిళకు ఇచ్చారు. క్యారీ ఫార్వర్డ్ పోస్టు కాబట్టి నాకు కచ్చితంగా రావాలి. నాకు జాబ్ ఎందుకు రాలేదో వివరాలు చెప్పమని అప్లికేషన్ రాసిస్తే పక్కన పడేశారు. దానిపై స్టాంప్ వేసి ఇస్తే కోర్టుకు వెళ్తారని, అందుకే ఆ పని చేయబోమని అధికారులు చెప్పారు. మంత్రి నారా లోకేశ్ను కలవడానికి ఛాంబర్కు వెళ్తే అనుమతి లేదంటూ ఓఎస్డీ నా అప్లికేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ శాఖకు పంపించారు. చివరకు ఎస్టీ కమిషన్ను ఆశ్రయించినా ప్రయోజనం లేకపోయింది.– ఎం.జగదీష్ నాయక్, వైఎస్సార్ కడప జిల్లాఇష్టారీతిన నియమాలు మార్చారు నేను ఉర్దూ మీడియంలో చదువుకున్నా. పదో తరగతి వరకు ఫస్ట్ లాంగ్వేజ్ ఉర్దూ కాగా సెకండ్ లాంగ్వేజ్ తెలుగు. ఇంటర్ నుంచి ఇంగ్లిష్ మీడియం. సర్టిఫికెట్ వెరిఫికేషన్ సందర్భంగా ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఉండాలన్నారు. ఈ డీఎస్సీలో గతంలో లేని విధంగా నియమాలు మార్చారు. – ఎండీ షాబుద్దీన్, విశాఖ జిల్లాచాలా అన్యాయం.. నేను ఎస్సీని. సర్టిఫికెట్ వెరిఫికేషన్ చక్కగా జరిగింది. నాకు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత డీఈవో ఆఫీస్ నుంచి ఫోన్ చేసి మళ్లీ కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ అడిగితే పంపా. మాకు 3 పోస్టులు ఉన్నాయి. మేము ముగ్గురమే ఉన్నాం. కానీ ఫైనల్ జాబితాలో మాత్రం నా పేరు లేదు. కారణం అడిగితే స్పోర్ట్స్ కోటాలో ఆ జాబ్ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు. నాకు చాలా అన్యాయం జరిగింది. – ఇందిర, కృష్ణా జిల్లాఅన్నీ బాగున్నా జాబ్ రాలేదు.. నేను కరాటే బ్లాక్బెల్ట్ ఛాంపియన్ను. మా ఊరిలో 37 మంది డీఎస్సీ రాస్తే నేను ఒక్కదాన్నే పాస్ అయ్యా. నేను ఓపెన్ కేటగిరీలో ఉన్నా రిజర్వేషన్ కేటగిరీలో పిలిచారు. నా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ బాగా జరిగింది. కానీ ఉద్యోగం మాత్రం రాలేదు. కారణం అడిగితే అప్పటికే అన్ని పోస్టులు భర్తీ అయ్యాయని చెప్పారు. గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయింది. నాది బీసీ–డీ అయితే నన్ను ‘బీసీ–సి’గా చూపారు. కోర్టుకు వెళ్లినా ఎలాంటి విచారణ జరిపించడం లేదు. మరి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఎందుకు చేశారంటే సమాధానం చెప్పలేదు. – నాగలక్ష్మి, గుంటూరు జిల్లాఇవన్నీ చంద్రబాబుకు తెలియదా? బీసీ–ఈ వర్గానికి చెందిన నేను సెకండ్ ప్లేస్లో ఉన్నా. ఎస్ఏ పోస్టు సర్టిఫికెట్ల పరిశీలనకు వెళ్లా. అధికారులు కంగ్రాట్స్ కూడా చెప్పారు. కానీ సెలక్షన్ లిస్టులో నా పేరు లేదు. కారణాలు చెప్పలేదు. ఎన్నిసార్లు లోకేశ్ను కలవాలని ప్రయత్నించినా ఇంటి దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు. 1:1 నిష్పత్తిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు పిల్చినప్పుడు ఉద్యోగం రావాలి కదా? ఇవన్నీ చంద్రబాబుకు తెలియదా? వెరిఫికేషన్ చేసినంత మాత్రాన జాబ్ ఇవ్వాలా? అని మాట్లాడారు. మెగా డీఎస్సీలో జరిగిన అన్యాయానికి న్యాయం చేయగలిగేది మీరు ఒక్కరు మాత్రమే. మీపై ఎంతో విశ్వాసం ఉంది. – షర్మిల, మదనపల్లె. అన్నమయ్య జిల్లాజీవో 77 ప్రకారం ఓపెన్ కేటగిరీలో మెరిట్ ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేయాలి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు రిజర్వేషన్ ప్రకారం పోస్టులు భర్తీ చేయాలి. హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం మహిళలు, పీహెచ్సీ, ఎక్స్సర్వీస్మెన్, స్పోర్ట్స్కోటా పోస్టులు భర్తీ చేయాలి. అయితే ప్రభుత్వం అలా చేయలేదు స్పోర్ట్స్ కోటాలో ఇచ్చారట.. నాకు డీఎస్సీలో 75 మార్కులు వచ్చాయి. తొలి జాబితాలోనే నా పేరు వచ్చింది. సర్టిఫికెట్ల పరిశీలన కూడా బాగా జరిగింది. కానీ ఉద్యోగం రాలేదు. ఎందుకు అని అడిగితే.. మీ కులంలో స్పోర్ట్స్ కోటాలో ఇంకొకరికి ఇవ్వాల్సి వచ్చిందన్నారు. మరి ముందే అతడు ఉన్నాడని తెలిసీ నన్ను ఎందుకు పిలిచారు? 1998, 2008 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేసినట్లు ఇప్పుడు కూడా న్యాయం చేయండి. – బాలకృష్ణ, కాకినాడ, జిల్లాఅవకాశం ఉన్నా పోస్టు ఇవ్వలేదు డీఎస్సీ మెరిట్లో నాకంటే ముందు ఒక అమ్మాయి ఉంది. ఆమె కానిస్టేబుల్. ఆమెది ఫేక్ సర్టిఫికెట్. మేం ఫిర్యాదు చేస్తే ఆమెను క్యాన్సిల్ చేశారు. ఆ తర్వాత నేను ఉన్నా నాకు అవకాశం ఇవ్వలేదు. విజయనగరానికి చెందిన అమ్మాయికి జాబ్ ఇచ్చారు. ఒక పోస్టు క్యాన్సిల్ అయితే తర్వాత అభ్యర్థికి ఇవ్వబోమని, దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తామని చెప్పారు. – దుర్గామల్లిక, అమలాపురం, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లామా గోడు చెబుతుంటే ‘ఫేక్’ అంటున్నారు.. మాది పేద మత్స్యకార కుటుంబం. కోచింగ్కు వెళ్లలేదు. కష్టపడి చదివా. ఫిజికల్ సైన్స్ బీసీ–సీలో నాది మూడో ర్యాంక్. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పూర్తయింది. ఓవరాల్ మెరిట్లో నాది 53వ ర్యాంక్. 10వ ర్యాంక్ వచ్చిన అభ్యర్థికి ఓపెన్లో కాకుండా బీసీ–సీ కేటగిరీలో పోస్టు ఇచ్చారు. అతడిని ఓపెన్లో పంపించి ఉంటే నాకు మా కేటగిరీలో జాబ్ వచ్చి ఉండేది. నాకు జాబ్ ఎందుకు రాలేదని అధికారులను అడిగితే ఒక అమ్మాయి స్పోర్ట్స్ సర్టిఫికెట్తో వచ్చిందని చెప్పారు. మా గోడు ‘సాక్షి’లో ప్రచురిస్తే మమ్మల్ని ఫేక్ అని ప్రచారం చేస్తున్నారు. – శ్రావణ్కుమార్, రాంబిల్లి మండలం, అనకాపల్లి జిల్లాతీరని అన్యాయం.. నాది బీసీ–ఏ. ఇందులో ఒకటే పోస్టు ఉంది. నేను ఒక్కదాన్నే ఉన్నా. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయినా చివరకు ఉద్యోగం రాలేదు. మహిళా రిజర్వేషన్లో ఒక పోస్టు ఉంది. అక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నా. ఫిజికల్ సైన్స్లో మాకు అర్హత ఉంది. ఎమ్మెస్సీ చదివా. నాకు స్పోర్ట్ సర్టిఫికెట్ ఉన్నా జనరల్ కేటగిరీలో దరఖాస్తు చేశా. కానీ నాకు తీరని అన్యాయం చేశారు. – లక్ష్మీపార్వతి, వైఎస్సార్ కడప జిల్లా మెరిట్లో ఉన్నా అన్యాయం.. నాది జనరల్ కేటగిరిలో 76వ ర్యాంక్. ఓహెచ్లో ఫస్ట్ ర్యాంక్. జిల్లాలో ఫస్ట్ వచ్చా. కానీ నాకు మొదటి విడతలో కాకుండా రెండో దశలో కాల్ లెటర్ పంపారు. మెడికల్ టెస్టు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా జరిగింది. కానీ జాబ్ రాలేదు. రోస్టర్లో మరొకరు ముందు ఉన్నారని చెప్పారు. 137వ ర్యాంక్ వచ్చిన ఆమెకు జాబ్ ఇచ్చారు. మెరిట్లో ఉన్నా నాకు ఇవ్వకుండా అన్యాయం చేశారు. – నరసింహారావు, ప్రకాశం జిల్లాఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిటోరియస్ క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 3 శాతం హారిజాంటల్ రిజర్వేషన్ కల్పిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 4 ఈ ప్రభుత్వంలో న్యాయం జరగదు నేను ఎస్ఏ సోషల్లో డీఎస్సీ రాశా. మా బీసీ–డీ కేటగిరీలో 7 పోస్టులు ఉంటే 5 పోస్టులు జనరల్లో మిగిలిన రెండు మా కేటగిరీలో ఉన్నాయి. నన్ను సర్టిఫికెట్ పరిశీలనకు పిలిచినా జాబ్ ఇవ్వలేదు. నా పోస్టు హారిజాంటల్ రిజర్వేషన్లో మరొకరికి ఇవ్వాల్సి వచ్చిందన్నారు. డీఈవో ఆఫీస్లో అడిగితే తమకేమీ తెలియదని విజయవాడ వెళ్లమన్నారు. అక్కడకు వెళ్తే తమకు సంబంధం లేదంటున్నారు. ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగదు. మాకు మీరు మాత్రమే న్యాయం చేయగలరు. – ఏకాంబరం, మాదిరెడ్డిపల్లి, చిత్తూరు జిల్లా జీరో ర్యాంకు వారికి ఉద్యోగం ఇచ్చారు నా సర్టిఫికెట్ వెరిఫికేషన్ బాగా జరిగింది. నాది బీసీ–బీలో మూడో పోస్టు. కానీ జాబ్ రాలేదు. నాకు ఇవ్వకుండా స్పోర్ట్స్ కేటగిరీలో ఇచ్చామని చెప్పారు. నాపేరు రిజెక్ట్ లిస్ట్లో కూడా లేదు. అదేమని అడిగితే సమాధానం చెప్పడం లేదు. నాకు అన్యాయం చేసి జీరో ర్యాంక్ ఉన్న వ్యక్తికి స్పోర్ట్స్ కోటా కింద జాబ్ ఇచ్చారు. – రాణి, కృష్ణా జిల్లాడిగ్రీ లేకున్నా పోస్టు ఇచ్చారు మాకు (మహిళలకు) ఓపెన్ కేటగిరీలో 30 పోస్టులు ఉన్నాయి. స్పోర్ట్స్ కోటా కింద అందులోకి ఒకరిని తీసుకొచ్చి ఉద్యోగం ఇచ్చారు. ఆ తర్వాత ఆమెకు డిగ్రీ లేదు కాబట్టి అది పూర్తి చేసుకోవడానికి మూడేళ్ల సమయం ఇచ్చారు. అంటే.. అర్హత లేకున్నా ఉద్యోగం ఇచ్చి, ఆ తర్వాత చదువుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఆమెది ఓసీ. ఆమెను తీసుకొచ్చి మా కేటగిరీలో వేశారు. దాంతో నా ఛాన్స్ పోయింది. – వీరవేణి, తూర్పు గోదావరి జిల్లా కోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదు నాకు అన్ని అర్హతలు ఉన్నాయి. నాకంటే ముందు ఒకరికి ఉద్యోగం ఇచ్చారు. అతడిది ఫేక్ సర్టిఫికెట్ అని తేలడంతో పోస్టింగ్ ఆపారు. జాబితాలో ఆ తర్వాత ఉన్న నాకు ఉద్యోగం ఇవ్వకుండా క్యారీ ఫార్వర్డ్ చేశామని చెప్పారు. ఇక్కడ అన్ని అర్హతలున్న నేను ఉన్నా, నాకు జాబ్ ఇవ్వాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదు. – సతీష్, పశ్చిమ గోదావరి జిల్లాఅన్నీ సరిగా ఉన్నా ఉద్యోగం ఇవ్వలేదు ఎస్సీ వర్గానికి చెందిన నాకన్నా తక్కువ మార్కులు వచ్చిన ముగ్గురిని ఓపెన్లో చూపారు. గ్రీవెన్స్ సెల్లో దరఖాస్తు చేస్తే నావన్నీ కరెక్టుగా ఉన్నాయని, జాబ్ ఎక్కడివ్వాలో తెలియడం లేదని సమాధానం చెప్పారు. ఆశ్చర్యం ఏమిటంటే నాకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారిని మా కేటగిరీలో చూపారు. నాకంటే తక్కువ మార్కులు వచ్చిన ముగ్గురిని ఓపెన్లో చూపారు. ఎవరిని కలిసినా చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. – కె.శరత్బాబు, కాకినాడ, తూ.గో జిల్లా స్పోర్ట్స్ కోటాలో ఆయా శాఖలు నిర్వహించే అర్హత పరీక్షల్లో కచ్చితంగా ఉత్తీర్ణత సాధించాలని సవరించిన జీవో వైకల్యం సర్టిఫికెట్ ‘రిజెక్ట్’.. గెరివి అంజనప్పకు ఒక కన్ను పూర్తిగా లేదు. మరో కంటికి రక్త సరఫరా లేదు. ఆయనకు కంటి చూపు లేదని ధ్రువీకరిస్తూ మెడికల్ బోర్డు (అనంతపురం జీజీహెచ్) 40 శాతం వైకల్యంతో సర్టిఫికెట్ ఇచ్చినా పట్టించుకోకుండా రిజెక్ట్ చేశారు. విజయవాడ వచ్చి కమిషనరేట్లో కలిసినా తామేమీ చేయలేమంటున్నారు. – హెచ్.వసంత్కుమార్, అనంతపురం జిల్లా (అభ్యర్థి గెరివి అంజనప్ప తరపున మాట్లాడారు)ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది... నిబంధనలకు విరుద్ధంగా అడుగడుగునా అవినీతి, అక్రమాలతో డీఎస్సీ –2025 ద్వారా టీచర్ పోస్టులను భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది. 1 : 1 పద్ధతిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి హాజరై ఉద్యోగం వస్తుందన్న భరోసాతో ఇంటికెళ్లిన వారి ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. స్పోర్ట్స్ కేటగిరీ పేరుతో అర్హులైన అభ్యర్థుల పొట్టగొట్టారు. అర్హులకు అన్యాయం చేసి పోస్టులను అమ్ముకోవడంపై సీబీఐతో విచారించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. – ఎ.రవిచంద్ర, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ -
రాజధాని రైతులు, డీఎస్సీ అభ్యర్థుల కోసం ప్రత్యేక కమిటీల ఏర్పాటు
తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. రాజధాని రైతులు, డీఎస్సీ అభ్యర్థుల కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. బాధితుల సమస్యలు తెలుసుకుని, న్యాయపోరాటం చేసేందుకు ఈ కమిటీలు పనిచేస్తాయి.ఏ కమిటీల్లో ఎవరు?సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ: పేర్ని నాని, అంబటి రాంబాబు, దేవినేని అవినాశ్, లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎంపీ నందిగం సురేశ్, మంగళగిరి ఇన్చార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి, వనమా బాలవజ్రబాబు సీఆర్డీఏ లీగల్ సెల్ కమిటీ: పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఎం.మనోహర్ రెడ్డి, జల్లా సుదర్శనరెడ్డి, కె.శ్రీనివాస్డీఎస్సీ పోరాట కమిటీ: ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, టి.కల్పలత, పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్రడీఎస్సీ లీగల్ సెల్ కమిటీ: పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఎం.మనోహర్ రెడ్డి, జల్లా సుదర్శన్ రెడ్డి, జీవీఎస్ కిశోర్ -
మెగా డీఎస్సీ ఒక ‘మెగా స్కామ్’: సాకే శైలజానాథ్
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వ బ్రాండ్ పాలనలో అన్యాయాలు, అక్రమాలు రాజ్యమేలుతున్నాయని.. మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి సాకే శైలజానాధ్ మాట్లాడారు.రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి వచ్చిన డీఎస్సీ బాధితులు మాజీ సీఎం వైఎస్ జగన్ని కలిసి తమ ఆవేదనను పంచుకున్నారని తెలిపారు. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత పూర్తిగా లోపించిందని, దీనిపై తక్షణమే కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) చేత విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే..మెగా డీఎస్సీ పేరుతో భారీ కుంభకోణం:రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీ నియామకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు, అన్యాయాలు జరిగాయి. పారదర్శకత లేని వన్ ఈస్ట్ వన్ (1:1) విధానంలో.. పరీక్ష మెరిట్ లిస్ట్ ప్రకటించకుండానే నేరుగా 1:1 నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలవడం వెనుక పెద్ద మతలబు ఉంది. వెరిఫికేషన్ పూర్తయ్యాక కొందరి పేర్లు సెలక్షన్ లిస్ట్లో కానీ, రిజెక్షన్ లిస్ట్లో కానీ లేకుండా మాయం చేశారు.స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు:పరీక్ష లేకుండా స్పోర్ట్స్ కోటా పోస్టులు భర్తీ చేస్తామని మొదట చెప్పి, ఆ తర్వాత పరీక్ష పెట్టాలంటూ జీవోలు మార్పు చేశారు. మన్యం జిల్లాకు చెందిన ఒక నేషనల్ గోల్డ్ మెడలిస్ట్కు ఉద్యోగం రాలేదు.. అసలు పరీక్షే రాయనటువంటి అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారు. బ్రిడ్జ్ గేమ్స్ ఆడిన వారికి స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలిచ్చి.. వారు స్కూళ్లలో మ్యాథ్స్, సైన్స్ ఎలా బోధిస్తారని ప్రశ్నించారు.రూల్ ఆఫ్ రిజర్వేషన్కు పాతర: ఓపెన్ కాంపిటేషన్ మార్కులు సాధించిన రిజర్వేషన్ అభ్యర్థులను జనరల్ కోటాలో భర్తీ చేయకుండా, రిజర్వేషన్ కేటగిరీ కింద చూపడం దళిత, బహుజన, మైనారిటీ వర్గాలకు చేస్తున్న ద్రోహమే. డీఎస్సీ నియామకాల వెనుక పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని వార్తలు వస్తున్నందున, రాష్ట్ర ప్రభుత్వ సిట్ (SIT)ల మీద నమ్మకం లేదు, తక్షణమే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సీబీఐ చేత నిష్పాక్షపాత విచారణ జరిపించాలి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎలాంటి అల్లర్లు, ఆందోళనలు లేకుండా 1.30 లక్షల మందికి పైగా సచివాలయ ఉద్యోగాలను అత్యంత పారదర్శకంగా భర్తీ చేశాం.సూపర్ సిక్స్ మోసం:ఎన్నికల హామీలైన 'సూపర్ సిక్స్'లో ఒక్కటీ అమలు చేయకుండానే, హఠాత్తుగా 'సూపర్ సిక్స్ సూపర్ హిట్' అని ప్రకటించుకోవడం హాస్యాస్పదం. దీనిపై ప్రశ్నిస్తే ప్రజలను బెదిరిస్తున్నారు.విద్యార్థులపై నిర్లక్ష్యం:జూన్ నెలలో పాఠశాలలు ప్రారంభం కానున్నప్పటికీ.. విద్యార్థులకు ఇంతవరకు పుస్తకాలు, యూనిఫామ్లు, బెల్టులు, బ్యాగులు, షూస్ అందించని దద్దమ్మ ప్రభుత్వం ఇది. 'బాబు వస్తే జాబు వస్తుంది' అని గోడల మీద రాసుకున్నారని, మరి 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే వైఎస్ జగన్కు సన్నిహితంగా ఉన్న కేఎన్నార్ లాంటి వారిపై అక్రమ కేసులు పెడుతూ వేధిస్తున్నారు.గతంలో చంద్రబాబు పీఏ శ్రీనివాస్ రూ. 2 వేల కోట్ల ఐటీ నోటీసుల వ్యవహారంలో అమెరికా పారిపోయి, మళ్లీ బాబు అధికారంలోకి వచ్చాకే తిరిగి వచ్చాడు. మరోవైపు ఉచిత ఇసుక లేదు.. లిక్కర్ దోపిడీ, విద్యుత్ కొనుగోళ్లలో భారీ స్కామ్ ఇ లా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన అన్ని రంగాల్లోనూ దోపిడీ పర్వంగా మారింది.రాష్ట్రంలో 'ఉచిత ఇసుక' అనేది కేవలం బోర్డులకే పరిమితమైంది. ఎక్కడా ఉచితంగా దొరకడం లేదు. ఎలాంటి బిల్లులు లేకుండా ప్రతి దశలోనూ భారీగా కలెక్షన్లు చేసుకుంటున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలసీ వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ. 750 కోట్లు ఆదాయం వచ్చేది, ఇప్పుడు అటు ప్రభుత్వానికి రాబడి లేకుండా, ఇటు ప్రజలకు ఇసుక దక్కకుండా చేస్తున్నారు.బెల్ట్ షాపుల విజృంభణ:బెల్ట్ షాపులు లేకుండా చేస్తామన్న హామీని తుంగలో తొక్కారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు దర్శనమిస్తున్నాయి. మద్యం సీసాపై రూ.20 నుంచి రూ.30 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రూ.3.49లకే విద్యుత్ కొనుగోలు చేస్తే గగ్గోలు పెట్టిన చంద్రబాబు.. నేడు తన హయాంలో ఏకంగా రూ. 4.65 ల అధిక ధరలకు కరెంట్ కొనుగోలు చేస్తూ పెద్ద స్కామ్కు తెరలేపారు.రూ. 5 వేల కోట్ల భూముల బంధుప్రీతి – అమరావతిపై ప్రశ్నలుచంద్రబాబు నాయుడు తన కుమారుడి తోడల్లుడు, ఎంపీ భరత్కు చెందిన విద్యాసంస్థలకు ఏకంగా రూ. 5 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అప్పనంగా కట్టబెట్టారని శైలజానాధ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే 'సత్వా' వంటి రియల్ ఎస్టేట్ కంపెనీలకు కేవలం 99 పైసలకే భూములను ధారాదత్తం చేశారు. అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజధాని కాదు, అది కేవలం దేవతల రాజధానిగా మిగిలింది. అత్యంత క్లిష్ట పరిస్థితులున్న ప్రాంతాల్లో కూడా చదరపు అడుగు రూ. 18 వేలు, రూ. 19 వేలకు కడుతున్నారు, కోట్లాది రూపాయల ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారు."కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న ఇసుక, లిక్కర్, భూముల పందేరం మరియు అవినీతిపై చర్చకు మేము సిద్ధం.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు వారి కూటమి నాయకులు సిద్ధమా?" అని మాజీ మంత్రి సాకే శైలజానాధ్ సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, కేవలం బంధుప్రీతి, అవినీతి, దోపిడీలకే పరిమితమైందని సాకే శైలజానాధ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మెగా డియస్సీ పేరుతో నిరుద్యోగ పేద కుటుంబాల ఆశలను అడియాసలు చేయడం దుర్మార్గమన్నారు. బాధితులు ఇప్పటికే కోర్టులను ఆశ్రయించారని, ప్రభుత్వం ఇప్పటికైనా తన తప్పులను ఒప్పుకుని విద్యాశాఖ కార్యదర్శికి తగిన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
వైఎస్సార్సీపీ ఓట్లు తొలగించేందుకు కుట్ర: ఆర్కే రోజా
సాక్షి, తిరుపతి: ‘సర్’ ప్రభావంతోనే వెస్ట్ బెంగాల్, తమిళనాడు రాష్ట్రంలో సీఎంలుగా ఉన్న మమత బెనర్జీ, స్టాలిన్లు ఓడిపోయారని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ఓట్లు తొలగించేందుకు కుట్ర జరుగుతోందని.. బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రెండేళ్లలో కూటమి ప్రభుత్వం చేసింది శూన్యమన్న రోజా.. సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చేశామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.‘‘రాష్ట్రంలో జగనన్న పాలన దూరం చేసుకున్నందుకు ప్రజలు బాధపడుతున్నారు. సంక్షేమ పథకాలు ఇవాళ రాష్ట్రంలో అందడం లేదు. రెండేళ్లలో ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలేదు. 30 లక్షలు తల్లులకు అమ్మఒడి దూరం చేశారు. డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ రంగాకు టీ ఇచ్చాను.. గద్దర్కు కారు కొనిచ్చా అని చెప్పుకుంటున్నాడు...మంత్రి నారా లోకేష్ లీకేజీ స్టార్ అయ్యారు. వైఎస్సార్సీపీ నేతలను జైల్లో పెట్టీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు. సుగాలి ప్రీతి తల్లి కన్నీళ్లు తుడవటానికి రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈరోజు కనీసం పట్టించుకోలేదు’’ అని ఆర్కే రోజా ధ్వజమెత్తారు. -
ఆత్మకూరులో బరితెగించిన పచ్చమూకలు
సాక్షి, నంద్యాల జిల్లా: ఆత్మకూరులో టీడీపీ కార్యకర్తలు బరితెగించారు. ఆత్మకూరు పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంపై పచ్చ మూకలు దాడికి యత్నించాయి. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి అరాచకాలను వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ప్రశ్నించారు. దీంతో వైఎస్సార్సీపీ కార్యాలయంపై చొచ్చుకొచ్చిన టీడీపీ గూండాలు శిల్పా చక్రపాణిరెడ్డి ఇంటిపై రాళ్లు రువ్వారు.పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో ప్రత్యేక పోలీసు బలగాలు భారీగా చేరుకున్నాయి. చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై వైఎస్సార్సీపీ పోరు బాట పట్టిన సంగతి తెలిసిందే. రేపు(గురువారం) జరగబోయే కార్యక్రమాన్ని అడ్డుకునే కుట్రలో భాగంగా పార్టీ కార్యాలయంపై టీడీపీ గూండాలు దాడికి యత్నించారు. -
సుగాలి ప్రీతీ చావును వాడుకొని, రోజా స్టాంగ్ రియాక్షన్
-
గత ఎన్నికల కోసం పరకాల ప్రభాకర్ చెప్పింది నిజమే..! వల్లభనేని వంశీ షాకింగ్ కామెంట్స్
-
ఆ దరిద్రుడితో.... నీ ఏజ్ ఏంటి ఆ ఫోటో ఏంటి.. నాని సెటైర్లు
-
జగన్.. జగన్.. అని గొంతు చించుకున్నాడు... తెలంగాణలో మీటింగ్ పెడతాడట
-
‘అందుకే తెలంగాణలో పవన్ కొత్త డ్రామా’
సాక్షి, కృష్ణా జిల్లా: మోదీ, చంద్రబాబు, పవన్ తలకిందులుగా తపస్సు చేసినా నిఖార్సైన వైఎస్సార్సీపీ ఓట్లు తొలగించలేరని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మన ఓట్లు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. జూన్ 15 నుంచి బీఎల్వోలు వారి వెంట పెట్టుకుని బీఎల్ఏలను తీసుకువెళ్లాలి’’ అని సూచించారు.‘‘వైఎస్ జగన్ తనను నమ్ముకున్నోడిని మోసం చేయడు. నమ్మినోడిని దెబ్బకొట్టడు. రాబోయే స్థానిక ఎన్నికలే చాలా కీలకం. చంద్రబాబు రోజూ జగన్ను గొడ్డలి పార్టీ అని మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్ నిజంగా గొడ్డలిపట్టుపకుని తిరిగి ఉంటే.. ఎర్రబుక్కు పట్టుకుని తిరిగే చంద్రబాబు, లోకేష్ ఇప్పటి వరకూ ఏం చేశారు?. ప్రజలను ఏమార్చడానికే చంద్రబాబు పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడు’’ అంటూ పేర్ని నాని దుయ్యబట్టారు.‘‘ఆంధ్రాలో మీటింగ్ పెట్టలేడు.. కానీ పవన్ తెలంగాణలో మీటింగ్ పెడతాడట. సూపర్ సిక్స్పై తెలంగాణలో ప్రశ్నిస్తాడట. తల్లికి కూడు పెట్టలేనోడు పినతల్లికి పట్టు చీరపెడతాడట. ఇక్కడ నీ తమ్ముడు లోకేష్ ఉద్యోగాల పేరుతో దోచేస్తున్నాడు. ఆయన్ని ప్రశ్నించలేవు కానీ తెలంగాణలో ప్రశ్నిస్తాడట’’ అంటూ పవన్ కల్యాణ్కు పేర్నినాని కౌంటర్ ఇచ్చారు.‘‘నెమ్మదిగా పవన్ పక్కన ఉన్న కాపులంతా జారిపోతున్నారు. మరో 15 ఏళ్లు పల్లకి మోయాల్సిందేనని అంటున్నాడు. ఇక్కడ అందరూ జారిపోతున్నారని తెలంగాణలో కొత్త డ్రామా మొదలుపెట్టాడు. మొన్న ఎన్నికల్లో కమ్మ, కాపులు చించుకుని మరీ పనిచేశారు. ఇప్పుడు కమ్మ, కాపులకు మత్తు దిగిపోతుంది. పాలనను గాలికి వదిలేసిన ప్రభుత్వం ఇది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో? దోచుకుంటున్నారో ఎవరికీ పట్టదు...తిరుపతి లెటర్ కూడా 30 వేలకు ఎమ్మెల్యేలు అమ్ముకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లకే దివాలా తీసింది. ఏ కులాన్ని శత్రువుగా చూడకండి. మన పై దాడి చేసినోడు.. మనల్ని హింసించినోడిని గుర్తు పెట్టుకోండి. పవన్ కళ్యాణ్ చెప్పేవన్నీ సొల్లు కబుర్లే. వైఎస్సార్ని ఎదిరించా తుపాకీ సరెండర్ చేశానని చెబుతున్నాడు. నీ వల్ల ప్రమాదం ఉందని మీ అమ్మాయి పోలీసులకు చెబితేనే తుపాకీ సరెండర్ చేశావు. ఆ విషయం నీకు గుర్తులేదా?మతిమరపు ఏమైనా ఉందా పవన్?...ఏపీలో పర్మిషన్ ఇవ్వకపోతే జగన్ నువ్వెవరివి అని ఊగిపోయావ్. మరి తెలంగాణలో రేవంత్రెడ్డిని ఎందుకు నిలదీయలేకపోయావ్. ఇక్కడ ఆస్తులు లేవు కాబట్టి జగన్పై గొంతుచించుకున్నావ్. మన ఆస్తులన్నీ తెలంగాణలో ఉన్నాయ్ కాబట్టి రేవంత్ రెడ్డి పై నోరు పెగలడం లేదు. ఇప్పటికైనా వాటాలు తీసుకోవడం ఆపేసి నిజాయితీగా ప్రశ్నించడం మొదలు పెట్టు పవన్. అమరావతిలో అద్దాలు పెట్టడానికి 2500 కోట్లు ఏంటి?. అమరావతిలో రైతులు ఏడుస్తున్నారు. వేల టిప్పర్ల మట్టి అమ్ముకుతింటున్నారు. అమరావతి అవినీతి పై ప్రశ్నించవా పవన్...నువ్వు చేతకానోడివి కాబట్టే నీపైన పెమ్మసానిని తెచ్చి పెట్టారు. నీకు, చంద్రబాబుకి రాజధానిలో మంచి ప్లేస్లో ప్లాట్లు కావాలా?. రైతులకేమో చెరువుల్లో ప్లాట్లు ఇస్తారా?. వంశీ కుటుంబాన్ని నీచులతో చంద్రబాబు యూట్యూబుల్లో తిట్టిస్తున్నాడు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదని వంశీ తన మాటలను వెనక్కి తీసుకున్నారు. అయినా వదిలిపెట్టకుండా వంశీని వేధిస్తున్నారు. ఎమ్మెల్యేలు మైన్.. వైన్లో మునిగిపోయారు’’ అంటూ పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
తిరుమల : అలిపిరి వద్ద పోలీసుల ఓవరాక్షన్.. వైఎస్సార్సీపీ నేతలతో అనుచిత ప్రవర్తన (ఫొటోలు)
-
వైఎస్ జగన్ను కలిసిన డీఎస్సీ అభ్యర్థులు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ను తాజాగా డీఎస్సీ అభ్యర్థులు కలిశారు. ఈ సందర్భంగా డీఎస్సీలో జరిగిన అక్రమాలు, అవినీతిని అభ్యర్థులు.. వైఎస్ జగన్కు వివరించారు. టీడీపీ నేతలు స్పోర్ట్స్ కోటాలో పోస్టులు అమ్ముకున్నట్టు తెలిపారు. కోట్లాది రూపాయలు చేతులు మారినట్టు చెప్పుకొచ్చారు. నిజమైన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం ఆవేదన వ్యక్తం చేశారు. -
తిరుమల అలిపిరి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, తిరుమల: తిరుమలలోని అలిపిరి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అలిపిరి వద్ద వీధి వ్యాపారులకు మద్దతుగా ర్యాలీగా బయలుదేరిన వైఎస్సార్సీపీ నాయకులు భూమన అభినయ్ రెడ్డి సహా పలువురు నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం, భూమన అభినయ్ రెడ్డితో పాటుగా నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో, ఎస్సీ యూనివర్సిటీ పోలీసు స్టేషన్కు అభినయ రెడ్డిని పోలీసులు తరలించారు. ఈ క్రమంలో చిరు వ్యాపారులు, వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు ఈడ్చుకెళ్లారు.మరోవైపు.. చిరు వ్యాపారులకు న్యాయం చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. అంతకుముందు అలిపిరి-జూపార్క్ రోడ్లో వీధి వ్యాపారులకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భూమన అభినయ్ రెడ్డి సంఘీభావం తెలిపారు. కూటమి నేతలు సూచనతో బలవంతంగా చిరు వ్యాపారుల తోపుడు బండ్లు తొలగింపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.కూటమి నేతల అప్రజాస్వామ్య చర్యలపై భూమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో అలిపిరి జూపార్క్ రోడ్ వ్యాపారులకు మద్దతుగా క్షేత్ర స్థాయిలో పార్టీ నేతలు పర్యటన చేపట్టారు. ఈ సందర్బంగా పార్టీ నాయకులు, కార్యకర్తల పర్యటనను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీస్ 30 యాక్ట్ పేరుతో అడ్డుకునేందుకు నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ అలిపిరి వద్ద తోపుడు బండ్లు వ్యాపారులకు వైఎస్సార్సీపీ మద్దతుగా నిలిచింది. -
'బాబు'ది నో ఆన్సర్.. ఓన్లీ డైవర్షన్!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయాలలో ఒక కొత్త ట్రెండ్ సృష్టించారు. తన రాజకీయ ప్రత్యర్ధులపై తోచిన ఆరోపణ చేయడం, వీలైనంత బురద చల్లడం, తనపై వచ్చే విమర్శలకు సమాధానం చెప్పకుండా డైవర్షన్ రాజకీయాలు చేయడం ఒక విధానంగా మార్చుకున్నారు. అబద్ధాలకు ఆకాశమే హద్దుగా పెట్టుకున్నారు. అదే బాటలో ఆయన కుమారుడు, కీలక మంత్రి లోకేష్ నడుస్తున్నారు. వీరి బాటే బాగుందనుకుని జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు దానినే అనుసరిస్తున్నారు. అందువల్లే ఏపీలో ప్రభుత్వం అంతా అస్తవ్యస్తంగా మారిందన్న అభిప్రాయం కలుగుతుంది.కొద్ది రోజుల క్రితం కాగ్ నివేదిక ఆధారంగా వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్దిష్ట విమర్శలు చేశారు. పలు ప్రశ్నలు సంధించారు. ఏపీ ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోతోందని, దానికి చంద్రబాబు ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలు, అవినీతి కారణమని ఆయన ఆరోపించారు. ఏపీలో ఇప్పుడు జరుగుతున్నది ఆర్ధిక విధ్వంసమని ఆయన అభిప్రాయపడ్డారు. అప్పులు పెరిగిపోయి, ఆదాయం తగ్గిపోయిన నేపథ్యాన్ని జగన్ ప్రశ్నించారు. దీనిపై చంద్రబాబు లేదా, ఆర్దిక మంత్రి కేశవ్ లేదా కీలక మంత్రి లోకేష్ వంటివారు ఏ మాత్రం స్పందించలేకపోయారు.రెండేళ్లలోనే మూడున్నర లక్షల కోట్లకు పైగా అప్పు చేసి దేశంలోనే చంద్రబాబు ప్రభుత్వం ఒక రికార్డు సృష్టించిందన్న అంశంపై వీరెవ్వరూ ఎందుకు నోరు మెదపలేకపోతున్నారు. నిత్యం జగన్ గత ప్రభుత్వంపై ఏవేవో ఆరోపణలు చేస్తుంటారు. అసలు విషయాలు మాట్లాడకుండా అసత్యాలు వల్లెవేస్తుంటారు. దానికి బదులు ఇస్తే మొత్తం సమస్యను అటువైపు మళ్లించడం ద్వారా తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు. చిత్రమేమిటంటే ఏపీ ఖనిజాభివృద్ది సంస్థ ద్వారా తొమ్మిదివేల కోట్ల రూపాయల అప్పు చేసి, దానిని రికార్డులలో ఆదాయంగా చూపించారట. ఇది వినడానికే గమ్మత్తుగా ఉంది కదా! మనం ఎవరమైనా బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటే అది ఆదాయంగా భావించి ఖర్చు చేస్తామా? అవసరాలకు వాడుకుని, తద్వారా ఏదైనా సంపాదిస్తే, ఆ తర్వాత ఆ రుణ వాయిదా చెల్లించాక మిగిలితే దానిని ఆదాయంగా చూపిస్తాం. కాని ఇంత పెద్ద ప్రభుత్వం అప్పులనే ఆదాయం చూపడం ప్రజలను మోసం చేయడం అవుతుందా? అవ్వదా ? అన్న ప్రశ్న వస్తుంది.మరో వైపు సొంత పన్నుల రాబడిలో 3.22 శాతం క్షీణించిందని లెక్కలు చెబుతున్నాయి. అయినా 10.75 శాతం వృద్ధిరేటు చూపడాన్ని జగన్ తప్పుపట్టారు. లిక్కర్ షాపులు ఇబ్బడిముబ్బడిగా ఉన్నాయి. వేలాది బెల్ట్ షాపులకు కొరత లేదు. అయినా మద్యం ద్వారా వచ్చే ఆదాయం 8.2శాతం తగ్గిందట. అంటే మద్యంలో భారీ స్కామ్ జరుగుతున్నట్లే కదా అని ఆయన అభిప్రాయపడ్డారు. రెండేళ్లలో మూల ధన వ్యయం కేవలం 7.31 శాతంగానే ఉండడం ఆందోళన కలిగించే అంశమే. ద్రవ్యలోటు రెండేళ్లలో 32 శాతంపైకి చేరుకుందని కాగ్ పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. సాధారణంగా అయితే ఆర్ధిక మంత్రి, లేదా ఆ శాఖ అధికారులు దీనిపై వివరణ ఇస్తారు. కాని వారు కూడా ఎవరూ మాట్లాడడం లేదు.ఈ పరిస్థితి ఇలా ఉంటే జగన్ ప్రభుత్వంలో విధ్వంసం అంటూ పడికట్టు పదాలతో డైలాగులు ప్రచారం చేస్తుంటారు. జగన్ 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలో తీసుకువస్తే వాటిని ప్రైవేటువారికి అప్పగించాలని ప్రయత్నిస్తున్నారు. జగన్ నాలుగు ఓడరేవులను నిర్మించే పని చేపడితే వాటిని కూడా ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నారన్న వార్తలు వచ్చాయి. ఇక తాజాగా ఆర్టీసీని కూడా ప్రైవేటు పరం చేయవలసిందేనని ఆ సంస్థ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ ప్రకటించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బహుశా చంద్రబాబు సూచన మేరకే కొనకళ్ల ఆ ప్రకటన చేసి ఉండవచ్చు. తద్వారా జనంలో తీవ్రమైన వ్యతిరేకత వస్తే ఆయన ఖాతాలో వేయాలన్నది ప్రభుత్వ వ్యూహం కావచ్చు.పైగా మహిళలకు ఉచిత బస్ స్కీమ్ వల్ల ఆర్టీసీ నష్టపోతోందని, అందువల్ల ప్రైవేటీకరణ చేయాల్సి వస్తోందని అంటున్నారంటే ఏమనుకోవాలి. ఆ వాగ్దానం చేయాలని ఎవరైనా కోరారా? అట్టహాసంగా ఆ స్కీమ్ ను ఆరంభించినప్పుడు వారికి దీనివల్ల ఆర్టీసీకి నష్టం వస్తుందని తెలియదా? దానిని రాష్ట్ర ప్రభుత్వం భరించాలి కదా! అలాకాకుండా ఆర్టీసీని గాలికి వదలివేస్తారా? ఇప్పుడు ఎలక్ట్రికల్ వాహనాలు కొనాలంటే అన్నివేల కోట్ల డబ్బు ఎక్కడ ఉందని ఆర్టీసీ చైర్మన్ అమాయకంగా జనాన్ని ప్రశ్నిస్తున్నారు.ఈ మధ్యనే సంస్కరణ యోధుడు అన్న అవార్డును అందుకున్న చంద్రబాబునాయుడు వీటికి జవాబు ఇవ్వవలసిన పని లేదా?2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయేనాటికి ఆర్టీసీ 6300 కోట్ల అప్పుల్లో ఉంటే, ఉద్యోగులకు 3200 కోట్ల బకాయి ఉంటే, దానిని జగన్ టైమ్ లో రెండువేల కోట్లకు తగ్గించామని మాజీ మంత్రి పేర్ని నాని చెప్పారు. తమకు సంపద సృష్టించడం తెలుసునని ఎన్నికలకు ముందు ఊదరగొట్టిన చంద్రబాబు ఇప్పుడు ప్రజలకు కాకుండా ప్రైవేటువారికి సంపద సమకూర్చే పనిలో ఉన్నారని వైసీపీ మండిపడుతోంది. కొత్తగా తీసుకునే ఈ బస్ లన్నిటిని ప్రైవేటువారికే అప్పగిస్తే, అప్పుడు ప్రభుత్వానికి పెట్టుబడి పెట్టవలసిన అవసరం ఉండదన్నది ప్రభుత్వ భావన కావచ్చు. కాని దానివల్ల మొత్తం ఆర్టీసీ మనుగడే కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అంతేకాక ఉచిత బస్ స్కీమ్ కు కూడా మంగళం పాడతారా? అన్న సందేహాన్ని తీర్చవలసి ఉంటుంది.ఒకవైపు రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయని ప్రచారం చేసుకోవడానికి ఎవరికి పడితే వారికి రూపాయికి, అర్ధ రూపాయికి భారీగా భూములు కట్టబెడుతున్నారు. వాటి ద్వారా వచ్చే ఉద్యోగాలు అంతంత మాత్రంగానే కనిపిస్తాయి. అదే టైమ్ లో ప్రభుత్వం ఆ కంపెనీలకు ఎదురు వేల కోట్ల రాయితీలు ఇస్తున్న తీరు గమనిస్తే, వచ్చే ఒకటి, రెండు దశాబ్ధాలలో ఏపీ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఏమీ ఉండకపోవచ్చని ఒక ఆర్థిక విశ్లేషకుడు వ్యాఖ్యానించారు.పెట్రోల్, డీజిల్ పై ఉన్న పన్నులను తగ్గిస్తామని ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు. కేంద్రం చమురు ధరలు పెంచినా, గతంలో తామే అమరావతి పేరుతో నాలుగు రూపాయల సెస్ వేసినా, ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రబుత్వం ఒక రూపాయి సెస్ వేస్తే, మొత్తం అంతటిని జగన్ ప్రభుత్వానికి రుద్ది ప్రచారం చేసేవారు. ఇప్పుడేమో పొదుపు అంటూ ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తున్నారు. అదే టైమ్ లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లు మాత్రం ప్రత్యేక విమానాలలో తిరగడం మానుకోరట. నిత్యం ఏదో చోటకు విమానాలలో, హెలికాఫ్టర్ లలో వెళ్లి సభలుపెట్టడం ఆపుతారా? లేదా? అన్నది తెలియదు. అమరావతి పేరుతో జరుగుతున్న దుబారాను అరికట్టడం లేదు. మరి వీటన్నిటిని ఏపీ అభివృద్ధిగా చూడాలా? లేక విధ్వంసంగా చూడాలా?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
అధికారం కోసం అడ్డమైన హామీలు.. పాలనలో ప్రజలకు వెన్నుపోటు
-
మా భూములివ్వం.. బాబు ప్రభుత్వం మమ్మల్ని వేధిస్తోంది
సాక్షి, అమరావతి: రాజధాని పేరుతో ఇప్పటికే 50 వేల ఎకరాలు తీసుకున్న చంద్రబాబు సర్కారు.. మరో 50 వేల ఎకరాలు కావాలంటూ తమను వేధిస్తోందని, మూడు పంటలు పండే పచ్చటి భూములను ఇచ్చేదే లేదని ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, ఎర్రపాలెం, కురగల్లు గ్రామాల రైతులు స్పష్టం చేశారు. తమ ప్రమేయం లేకుండానే లే అవుట్లు, ప్లాట్లు వేస్తోందని.. రిజిస్ట్రేషన్లు సైతం చేసేస్తోందని మండిపడ్డారు. తరతరాలుగా భూమిని నమ్ముకుని బతుకుతున్న తమకు భవిష్యత్తు లేకుండా చేస్తోందని నిప్పులు చెరిగారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తమ గోడు ఏమాత్రం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిలో ఏం చేయాలో దిక్కుతోచక వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి తమ కష్టాన్ని వివరించామని తెలిపారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మంగళగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి నేతృత్వంలో ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, ఎర్రపాలెం, కురగల్లు గ్రామాలకు చెందిన రైతులు వైఎస్ జగన్ను కలిసి తమ కష్టాలను వివరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు ఒప్పందం ప్రకారం డెవలప్ చేసిన ప్లాట్లు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని చెప్పారు. భూములు ఇవ్వడానికి నిరాకరించిన రైతుల పట్ల మరింత దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. రెండో విడత భూసేకరణ పేరుతో రైతులను భయపెడుతున్నారని, ఉన్న అరెకరం పొలం ఇచ్చి తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భూములు ఇవ్వడానికి నిరాకరించిన రైతుల పట్ల నిర్దయగా వ్యవహరిస్తుండటం దుర్మార్గమన్నారు. పెనుమాకలో మినీ రిజర్వాయర్ పేరుతో పనులు మొదలుపెట్టిన ప్రభుత్వం.. రైతుల పొలాలను అడ్డగోలుగా తవ్వేసిందని చెప్పారు. పక్కనే భూ సేకరణకు భూములివ్వని రైతుల పొలాలను 20 అడుగుల లోతు వరకు చెరువుల్లా తవ్వేసి.. వ్యవసాయానికి పనికి రాకుండా చేశారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన వర్షంతో ఆ పొలాలన్నీ చెరువుల్లా మారిపోయాయని చెప్పారు. తామంతా (రైతులు) ఆవేదనతో అల్లాడిపోతుంటే కూటమి నాయకులు మాత్రం పొలాల్లో తవ్వేసిన మట్టి, ఇసుక అమ్ముకుని జేబులు నింపుకుంటున్నారని చెప్పారు. ఇప్పటికే రాజధాని కోసం ఇళ్లు, పొలాలను ఇచ్చేసిన రైతులకు ప్రభుత్వం వాగుల్లో ప్లాట్లు కేటాయించడం అత్యంత దారుణమని మండిపడ్డారు.ఎంత మంది రైతులను చంపేద్దామనుకున్నారు?రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు ఒప్పందం ప్రకారం డెవలప్ చేసిన ప్లాట్లు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది. భూములు ఇవ్వడానికి నిరాకరించిన రైతుల పట్ల మరింత దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. ఉన్న అరెకరం పొలం ఇచ్చి కుటుంబాలను ఎలా పోషించుకోవాలన్న రైతుల ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు. అనుమతి లేకుండా రైతుల పొలాలను అడ్డగోలుగా తవ్వేయడం దుర్మార్గం కాదా? భూసేకరణకు భూములివ్వని రైతుల పొలాల్లో 20 అడుగుల లోతున చెరువుల్లా తవ్వేశారు. ఇటీవల కురిసిన వర్షంతో ఆ పొలాలన్నీ చెరువుల్లా మారాయి. డ్రెడ్జింగ్ చేసి ఇసుకను పక్కనే కుప్పలుగా పోశారు. రైతులు ఆవేదనతో అల్లాడిపోతుంటే కూటమి నాయకులు మాత్రం రైతుల పొలాల్లో మట్టి, ఇసుక అమ్ముకుని జేబులు నింపుకుంటున్నారు. మంచి ప్లాట్లు నేతలు తీసుకుని, రైతులకు వాగుల్లో ప్లాట్లు కేటాయించడం చూసి ఎంతో మంది బోరున విలపిస్తున్నారు. ఇలా అధికారులకు తన గోడు చెప్పుకుంటూనే ఓ రైతు గుండె పగిలి చనిపోయాడు. ఇప్పుడు రైతుల పొలాలను తవ్వేసి, ఇంకెంత మంది రైతులను ఇలా చంపేద్దామనుకుంటున్నారు? కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్ల కోసం రైతుల జీవితాలను మట్టిపాలు చేయాలనుకోవడం చాలా తప్పు. బలవంతపు భూసేకరణ పేరుతో రైతులను వేధించడం ఇకనైనా ఆపాలి. – దొంతిరెడ్డి వేమారెడ్డి, వైఎస్సార్సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్తవైఎస్ జగన్ హామీతో ధైర్యం వచ్చిందిచంద్రబాబు ప్రభుత్వ తీరుతో తామంతా నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నామని, ఈ ప్రభుత్వం తమ పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేస్తోందని రాజధాని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ బాధలను సీఆర్డీఏ కమిషనర్, మంత్రి లోకేశ్.. ఉండవల్లిలోనే ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం వినలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నామని తెలిపారు. ఉన్న అరకొర భూములు ప్రభుత్వానికి ఇచ్చేస్తే తరతరాలుగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న తమ కుటుంబాల భవిష్యత్తు అంధకారం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశామన్నారు. తమ బాధలను సావధానంగా విన్న వైఎస్ జగన్.. అండగా ఉంటామని తమకు హామీ ఇచ్చినట్టు రైతులు తెలిపారు. ఈ అన్యాయంపై రైతుల పక్షాన నిలబడి న్యాయస్థానాల్లో పోరాడతామని హామీ ఇచ్చారన్నారు. జగన్ హామీతో తమకు ధైర్యం కలుగుతోందన్నారు. ప్రభుత్వమే దగ్గరుండి రైతుల పొలాలను తవ్వేయడం, భూములు ఇవ్వని రైతుల పొలాల్లో వారి అనుమతి లేకుండా లే అవుట్లు వేసి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని తెలుసుకుని వైఎస్ జగన్ మండిపడ్డారని తెలిపారు.చంద్రబాబు, లోకేశ్ మా గోడు వినలేదునాకు ఉన్నదే కొంచెం భూమి. అందులో కొంత కృష్ణా నదిలో కొట్టుకుపోయింది. మిగిలింది సీడ్ యాక్సిస్ రోడ్ అంటున్నారు. దాని పక్కనే బఫర్ జోన్ అంటున్నారు. ల్యాండ్ పూలింగ్కి ఇవ్వని భూమిలో కూడా లేఅవుట్ వేశారు. నాకు భూమి మిగిలే పరిస్థితి కనిపించడం లేదు. సీఆర్డీఏ కమిషనర్ మా మొర ఆలకించడం లేదు. మా ఎమ్మెల్యే లోకేశ్ మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోనే ఉంటారు. మా రైతులను పిలిచి మా గోడు వినాలి. పచ్చని పంటలు పండే భూములు ఇవ్వడానికి మేం సిద్ధంగా లేము. ప్రభుత్వం స్పందించక పోవడంతో న్యాయం చేయాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిశాం. వైఎస్సార్సీపీ లీగల్గా అండగా ఉంటుందని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. – శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి రైతుభూములివ్వడం ఇష్టం లేదుతరతరాలుగా మేము అనుభవిస్తున్న భూమిని ల్యాండ్ పూలింగ్కు ఇవ్వడానికి నేను సిద్ధంగా లేను. 12 ఏళ్లుగా ఇదే మాట మీదే ఉన్నా. ఈ భూమిని నమ్ముకునే నా కుటుంబాన్ని పోషించుకుంటున్నా. పిల్లలను చదివించుకుంటున్నా. అన్నం పెట్టే పొలాన్ని ఇవ్వడం మాకిష్టం లేదు. – శంకర్రావు, ఎర్రపాలెం రైతుప్రభుత్వం తీరుతో నిద్ర కరువు చంద్రబాబు నాయుడి ప్రభుత్వం కారణంగా మేం రోజూ నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తోంది. ల్యాండ్ పూలింగ్కు భూములు ఇవ్వడం ఇష్టం లేదని మొత్తుకుంటున్నా నోటీసులు, నోటిఫికేషన్ల పేరుతో మమ్మల్ని అధికారులు వేధిస్తున్నారు. వైఎస్ జగన్ హామీతో మాకు ధైర్యమొచ్చింది. – అశోక్ రెడ్డి, ఉండవల్లి రైతుమా పొలాన్ని పనికి రాకుండా చేశారుమా గ్రామ రైతులు ఏడాదంతా పూల తోటలు సాగు చేస్తారు. ఎకరం పొలంలో ఏడాదికి రూ.3–4 లక్షలు సంపాదిస్తాం. రెండెకరాలున్న రైతులు ఏ ఆర్థిక ఇబ్బందులు లేకుండా తరతరాలుగా బతుకుతున్నారు. మొదటి విడత భూసేకరణకు పోను మా గ్రామంలో 450 ఎకరాల భూమి మాత్రమే మిగిలి ఉంది. మా సమ్మతి లేకుండానే ఆ భూముల్లో కూడా ప్లాట్లు వేసి రిజిస్ట్రేషన్లు చేశారు. ప్రభుత్వమే చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. మా పొలాల చుట్టూ మెరక తోలేస్తున్నారు. వర్షాలు కురిస్తే నీరు నిలబడిపోయి ఆ పొలం వ్యవసాయానికి పనికి రాకుండా పోతుంది. ఇలాగైతే మేం ఏం తిని బతకాలి? – శివరామ్, రైతు, నిడమర్రు -
వైఎస్ జగన్కు వైద్యుల ఫిర్యాదు
సాక్షి,తాడేపల్లి: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ నిలిచిపోయి పేదలు నాణ్యమైన వైద్యానికి దూరమయ్యారంటూ డాక్టర్లు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంగళవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి గుంటురూ జిల్లా డాక్టర్లు వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆరోగ్రశ్రీ నిర్వీర్యం కావటంపై ఆందోళన వ్యక్తం చేశారు. వేలాది మంది పేద రోగులు చికిత్సకు నోచుకోలేకపోతున్నారన్న డాక్టర్లు..ఆసుపత్రులకు మంజూరు చేసే ఎల్వోసీలు కూడా పారదర్శకంగా లేవన్నారు. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న ఆసుపత్రులకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఫిర్యాదు చేశారు. కమీషన్ల కోసం సీఎంఆర్ఎఫ్ ద్వారా నిధులు కేటాయిస్తున్నారని వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు.అనంతరం, వైఎస్ జగన్ మాట్లాడుతూ.. పేదవాడికి కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలన్న లక్ష్యంతో వైఎస్సార్ ఆరోగ్యశ్రీని తెచ్చారు. అలాంటి పథకాన్ని నిర్వీర్యం చేయడం బాధాకరం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించాం. మరిన్ని వ్యాధులను చేర్చడంతో పాటు చికిత్స అనంతరం విశ్రాంతి కాలానికి ఆర్థిక సహాయం అందించాం. రోగులకు మెరుగైన సేవలు అందించేలా అనేక సంస్కరణలు చేపట్టాం. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేశాం. కొత్త మెడికల్ కాలేజీలు, గ్రామ స్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ విధానం, నాడు-నేడు ద్వారా ఆసుపత్రుల అభివృద్ధి వంటి కార్యక్రమాలు చేపట్టాం. వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం. కానీ చంద్రబాబు సర్కార్ వాటిని నిర్వీర్యం చేయటం బాధాకరం. బాధితులకు అండగా నిలుద్దాం’అని పిలుపునిచ్చారు. -
అన్యాయంగా, బలవంతగా తీసుకున్న, మీ భూమిని వెనక్కి ఇచ్చే బాధ్యత నాది
-
ఫైనల్ గా చెప్పేది ఒక్కటే.. మావిగన్ బెస్ట్.. అమరావతి రైతులతో జగన్
-
జగన్ ఇచ్చిన ఇళ్ల స్థలాలను జిందాల్ సంస్థకు..!
-
పనికొచ్చే పనులే ప్రజలకు అవసరం పెన్షన్ల సమస్యలపై రాచమల్లు ఫైర్
-
అధైర్యపడొద్దు.. అండగా ఉంటా: అమరావతి రైతులతో వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: అమరావతి ప్రాంత రైతులకు అండగా ఉంటామని, కూటమి ప్రభుత్వ ఆగడాలను అడ్డుకుంటామని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. భూములు ఇవ్వని రైతుల్ని కూటమి ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు గురి చేస్తోందంటూ అమరావతి రైతులు మంగళవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్రం కార్యాలయంలో వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో వైఎస్ జగన్.. అమరావతి రైతులకు ధైర్యం ఛెప్పారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ప్రభుత్వం దౌర్జన్యం చేస్తోంది..: రైతులుఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. భూములు ఇవ్వని వారిని ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బందిపెడుతోంది. భూ సేకరణకు నోటిఫికేషన్లు ఇచ్చి దౌర్జన్యం చేస్తోంది. భూములు ఇవ్వని రైతుల పొలాల్లో దారుణాలకు పాల్పడుతున్నారు. డెవలప్మెంట్ పనులు పేరు చెప్పి మా పొలాలను ధ్వంసం చేస్తోంది. దేవాలయ భూముల్లో ఇప్పుడు ప్లాట్లు ఇస్తామంటున్నారు. దేవాలయ భూములను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దేవాలయ భూముల రక్షణ విషయంలో మీరు తోడుగా ఉండాలి. ఇప్పుడు కడుతున్న స్టీల్ బ్రిడ్జి పూర్తిగా కుంగిపోయింది. ఈ గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ అవసరమే లేదు.కరకట్ట రోడ్డు విస్తరించుకుంటే సరిపోతుంది.దీనివల్ల ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుంది, రైతులకు ఇబ్బంది లేకుండా పోతుంది. ఉండవల్లికి సంబంధించి ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరుగలేదు.బలవంతంగా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు.మా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై గట్టిగా గళం వినిపించాలి’ అని కోరారు.రైతుల్ని బలవంత పెట్టడం సరికాదు: వైఎస్ జగన్అనంతరం, వైఎస్ జగన్ మాట్లాడుతూ..‘రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా ముందుకు వెళ్తాం. రైతులను బలవంతం పెట్టడం మంచిదికాదు. రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తారు. రైతులకు సంతోష పెట్టేలా ఏదైనా జరగాలి. వారిని కష్ట పెట్టేలా చేయకూడదు. మొదటి తీసుకున్న 50వేల ఎకరాలకే దిక్కులేదు. ఇప్పుడు మళ్లీ 50వేల ఎకరాలు అంటున్నారు. అందుకే ప్రత్యామ్నాయంగా మావిగన్ను సూచించాం. విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఉంది. అది ఉండి కూడా మరొక ఎయిర్పోర్టు అంటున్నారు. ఇప్పుడ అక్కడ పనులు కూడా జరుగుతున్నాయి. వచ్చే కొద్ది నెలల్లో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి.మచిలీపట్నంలో పోర్టు కూడా వచ్చింది. మన హయాంలో మొదలుపెట్టాం, నిధుల కొరతలేకుండా చూశాం. జాతీయ రహదారులు ఉన్నాయి, రైల్వే స్టేషన్లు ఉన్నాయి.కాని ఇవేమీ చంద్రబాబుకు పట్టదు. భవిష్యత్తులో కూడా రాజధాని అనేది లేకుండా చేస్తున్నారు.కనీస మౌలిక సదుపాయాల కల్పనకే ఎకరాకు రూ.2 కోట్లు ఖర్చు చేయాలి. జీవితమంతా రోడ్లు వేయడానికి, జీవితమంతా డ్రైనేజీ తవ్వడానికి, జీవితమంతా నీళ్లు ఇవ్వడానికి, జీవితమంతా కరెంటు ఇవ్వడానికే ఖర్చుపెట్టాలి.దాదాపు రెండు లక్షల కోట్లు దీనికోసమే ఖర్చు చేయాలి.రాజధానిలో భారీగా అవినీతి జరుగుతోంది. ఏది చూసినా స్కామే కనిపిస్తోంది. రాజధాని పేరుతో స్కాములు మీద స్కాములు చేస్తున్నారు. మావిగన్ను గ్రోత్ కారిడర్గా ప్రకటిస్తే చాలు వెంటనే అభివృద్ధి. 110 కి.మీ. అటు ఇటూ గ్రోత్ కారిడర్కు అటు ఇటూ.. ఈ డబ్బు పెడితే మొత్తం కారిడర్ అభివృద్ధి చెందుతుంది’ అని వ్యాఖ్యానించారు. -
గుర్తు పెట్టుకో లోకేష్.. అవినీతి మొత్తం కక్కిస్తాం..!
-
మంగళగిరిలో YSRCPలోకి 30 కుటుంబాల చేరిక
-
లోకేష్ కు బిగ్ షాక్..మంగళగిరిలో YSRCPలోకి 30 కుటుంబాల చేరిక
-
ఎందుకు చెప్తున్నా అంటే.... SIR అంటే ఏంటి..? క్లుప్తంగా వివరించిన పేర్ని నాని
-
పనికిమాలిన వెధవలు కూడా మాట్లాడుతున్నారు... అధికారం మారితే మీ బతుకులేంటో ఆలోచించుకోండి
-
చంద్రబాబు సర్కారుపై సమరభేరి. డీఎస్సీ అక్రమాలపై కదంతొక్కిన యువతరం. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి
-
చంద్రబాబు సర్కారుపై 'సమరభేరి'
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై సమరభేరి మోగింది. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సోమవారం యువతరం కదంతొక్కింది. చంద్రబాబు సర్కారుపై గళమెత్తి గర్జించింది. వినూత్న నిరసనలు, ప్రదర్శనలతో రణన్నినాదమై రగిలింది. డీఎస్సీ పేపర్ లీక్, అడుగడుగునా చోటుచేసుకున్న అవకతవకలు స్పోర్ట్స్ కోటా పోస్టుల అమ్మకంపై దుమ్మెత్తిపోసింది. మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. తక్షణం అర్హులకు న్యాయం చేయాలని, లేకుంటే మెగా డీఎస్సీ పేరుతో దగా చేసిన చంద్రబాబు సర్కారుకు ఘోరీ ఖాయమని ధ్వజమెత్తింది. ప్రతిభకు పాతరేయడం, రిజర్వేషన్లకు గండికొట్టడంపై భగ్గుమంది. కాసులిచ్చిన వారికే పోస్టులు దక్కడంపై మండిపడింది. తక్షణం సీబీఐ విచారణ జరపాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని నినదించింది. ఈ సందర్భంగా విద్యార్థి, యువజన సంఘాల నేతలు, వైఎస్సార్ సీపీ నాయకులు కలెక్టర్లు, ఆర్డీవోలకు వినతిపత్రాలు సమర్పించారు. సీఎం చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపట్టారని గుర్తుచేశారు. ముందే మెరిట్ లిస్టు ప్రకటించి అర్హులకు వైఎస్ జగన్ ఉద్యోగాలిచ్చారని ప్రశంసించారు. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అనకాపల్లిలో మానవహారం చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ, కృష్ణాజిల్లా మచిలీపట్నంలోనూ యువత ఆందోళన చేశారు. కలెక్టర్లకు వినతిపత్రాలిచ్చారు. బందరులో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. గుంటూరు, పల్నాడు జిల్లా నరసరావుపేట, బాపట్లలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో యువత కదంతొక్కారు. కలెక్టరేట్ల వద్ద దర్నాలు నిర్వహించారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు. ప్రకాశం జిల్లాల్లోనూ ఆందోళనలు జరిగాయి. నెల్లూరులో పోలీసులు కలెక్టరేట్కు తాళాలు వేశారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోనూ యువకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోనూ యువకులు ర్యాలీలు నిర్వహించారు. పోలీసులు అడ్డుకోవడంతో వైఎస్సార్సీపీ నేతలు రోడ్డుపై బైఠాయించారు. నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ ఆందోళనలు సాగాయి. చిత్తూరు కలెక్టరేట్ వద్ద యువకులు మెడకు ఉరితాళ్లు బిగించుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లా కలెక్టరేట్లను యువకులు ముట్టడించారు. వైఎస్సార్ కడప జిల్లాలో యువత బైక్ ర్యాలీలు నిర్వహించారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లా కలెక్టరేట్ల వద్ద కూడా యువత కదంతొక్కింది. డీఎస్సీ అక్రమాల బాధ్యుల్ని శిక్షించాల్సిందే: జక్కంపూడి రాజాసాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకొంటున్న మెగా డీఎస్సీ అడుగడుగునా అక్రమాలు, అవకతవకలతో దగా డీఎస్సీగా మారిందని వైఎస్సార్సీపీ ధ్వజమెత్తింది. డీఎస్సీ పరీక్షల నిర్వహణ, ఫలితాల్లో జరిగిన భారీ కుంభకోణానికి పూర్తి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేశ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. డీఎస్సీ బాధితులకు న్యాయం చేయాలంటూ వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు భారీ నిరసన ప్రదర్శనలు చేశారు. ఈ సందర్భంగా విశాఖ కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా చేసి, అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం విశాఖ మద్దిలపాలెంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన అత్యంత పారదర్శకమైన డీఎస్సీ నోటిఫికేషన్ను అడ్డగోలుగా రద్దుచేసి, ధనార్జనే ధ్యేయంగా చంద్రబాబు ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ ఇచ్చిందని విమర్శించారు. ‘అర్హులకు కాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో బేరాలు కుదుర్చుకున్న వారికే కాల్ లెటర్లు ఇచ్చారు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత స్పోర్ట్స్ కోటా జీవోలను ఇష్టారాజ్యంగా మార్చి తాడాట, బొంగరం ఆటలు ఆడేవారికి ఉద్యోగాలిచ్చి అర్హులైన ప్రతిభావంతులను ముంచేశారు. లోకేశ్ను వెంటనే కేబినెట్ నుంచి తప్పించి, ఈ వ్యవహారంలో ఆయన్ని ఏ–1గా చేర్చి అరెస్టు చేయాలి’ అని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు మాట్లాడుతూ డీఎస్సీ కుంభకోణంపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోతే తమ పార్టీ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. -
సిగ్గుండాలి లోకేష్..! పోస్టుకో రేటు చొప్పున అమ్ముకుంటావా..
-
హైబ్రిడ్ మహానాడు VS లోగ్రేడ్ దగానాడు CM చంద్రబాబు కాదు.. కళ్యాణి సెటైర్లు
-
మరి ఇంత బరితెగించాలా..! చంద్రబాబుకు సజ్జల స్ట్రాంగ్ వార్నింగ్
-
డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసనలు(ఫొటోలు)
-
నారా లోకేశ్కు తప్ప ఈ విషయం ఎవరికీ తెలియదు: పేర్ని నాని
విజయవాడ: కూటమి సర్కారు తీరుపై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. విద్యాశాఖలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన నోటిఫికేషన్లో మరిన్ని పోస్టులు కలిపి మెగా డీఎస్సీ ఇచ్చారని తెలిపారు. పేర్ని నాని విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మెగా డీఎస్సీలో తప్పులే కనిపిస్తున్నాయి. ప్రభుత్వంలో అన్ని పారదర్శకం అని చెబుతారు.. కానీ అన్నీ గుట్టుగానే జరుగుతున్నాయి. కలెక్టర్ కార్యాలయంలో పేర్లు, ర్యాంకులతో లిస్టులు పెట్టాలి. కలెక్టర్ కార్యాలయంలో మెరిట్ లిస్ట్ లు పెట్టాలి. ఆన్లైన్లో చూసిన ప్రతిసారి లిస్టులు మారిపోతున్నాయి. చదువు రానివాడు చూసినా అర్ధమయ్యే రితీలో ఆన్ లైన్లో ఉండాలి. గుడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని చట్టం ఎంత కష్టంగా ఉంటుందో డీఎస్సీ కూడా అలాగే ఉంది.నారా లోకేశ్కి తప్ప డీఎస్సీ గురించి ఎవరికీ తెలియదు. స్పోర్ట్స్ కోటా తనకు తెలియదని విద్యాశాఖ కార్యదర్శి చెబుతాడు. సమాచార శాఖ హక్కు చట్టం ప్రకారం స్పార్ట్స్ కోటాలో కొన్ని ప్రశ్నలు అడిగాం. మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో రిక్యూట్ మెంట్ కింద ఎంతమందిని తీశారు? ఎంత పర్సెంట్ కి ఎన్ని పోస్టులు తీశారు? ఏ జీవో, ఏ సర్క్యూలర్ కింద పోస్టులు తీశారు? 16 వేల పోస్టుల్లో ఎన్ని పోస్టులు తీసుకున్నారు? జిల్లాలో ఏ కేటగిరీ కింద పోస్టులు తీసుకున్నారు. అర్హతకి ఆధారాలు ఏంటీ? సెలక్షన్ ప్రోసిజర్ ఎంటీ? జిల్లా మెరిట్ లిస్ట్, పైనల్ లిస్ట్ కావాలి. స్పోర్ట్స్ కేటగిరీలో వివరాలు అడుగుతున్నాం. స్పోర్ట్స్ కోటాలో ఏ కేటగిరి కింద సెలక్షన్ ఆధారాలు అడిగాం? సెలక్షన్ కమిటీ వివరాలు అడిగాం. స్పోర్ట్ కోటా కింద ఎంతమందిని రిజెక్ట్ చేశారు? ఎందుకు రిజెక్ట్ చేశారు? వంటివి అడిగాం. అభ్యర్థనలు ఏంటీ? అనే కూడా వివరాలు అడిగాం.. డీఎస్సీలో రిక్యూట్ మెంట్ చేయడానికి ప్రభుత్వ అనుమతులు, ఇతర వివరాలు అడిగాం. సందేహాలు వచ్చినప్పుడు, అనుమానాలు వచ్చినప్పుడు తీర్చాల్సిన బాద్యత ప్రభుత్వానిది. టెట్ పేపర్ ఎవరు తయారు చేశారు? ఏ ప్రాతిపదికనా వాళ్లను నియమించారు? వాళ్ల సహయకులు ఎవరు అనేది అడిగాం? పైనల్ లిస్ట్ తయారు చేసిన దాంట్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొన్నారా? వాళ్ల పేర్లు ఇవ్వాలని అడిగాం. 16 అంశాల మీద ఆర్టీఐ వేశాం. చంద్రబాబు, లోకేశ్ ఎక్స్ (ట్విట్టర్)లో రెచ్చిపోవడం, సొల్లు కబుర్లు చెప్పడం కాదు. పాత స్పోర్ట్ కోటా జీవో మార్పు చేసి 29 నుండి 67గా ఎందుకు మార్పు చేశారు? రెండు శాతం నుండి 3శాతం వరకు ఎందుకు పెంచారు?పరీక్ష పూర్తి అయిన తరువాత ఎందుకు జీవో మార్పు చేశారు. యువగళంలో పాల్గొని, లోకేశ్తో నడిచిన వాళ్లకు హెరిటెజ్ లో ఉద్యోగాలు ఇచ్చినట్లే ఉద్యోగాలు ఇచ్చేశారు. దొడ్డి దారిన స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చేశారు. నిజం నిలకడగానే తెలుస్తుంది.. డీఎస్సీలో తప్పుడు ఇప్పుడు బయటపడ్డాయి. చంద్రబాబుకు, లోకేశ్కు దమ్ములేదు. మమ్మల్ని తిట్టే టీచర్లు ప్రెస్ మీట్ పెట్టి స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ బయటపెట్టండి. విద్యాశాఖ మంత్రి శాఖను పక్కన పెట్టి.. తప్పుడు పనులకు ప్రయారిటీ ఇస్తున్నారు. కూటమి నేతల పాపాల చిట్టా.. చాలా పెద్దగా ఉంది. తెలంగాణలో కూకట్పల్లి సీటు హరికృష్ణ కూతురుకు ఇచ్చే బదులు రాజ్యసభ సీటు ఇవ్వండి. డబ్బున్న వాళ్లకే ఇస్తారా? డబ్బులేని నందమూరి ప్యామిలీని వాడుకొని వదిలేస్తారా?’’ అని నిలదీశారు. -
‘హెరిటేజ్ పాలు అమ్మినట్లు డీఎస్సీ ఉద్యోగాలు అమ్మకం’
విశాఖ: ఏపీ ఎన్నికల సమయంలో బాబు వస్తే జాబ్ వస్తుందనే మోసపూరిత హామీలతో ఓట్లు దండుకున్నారని వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శించారు. కూటమి ప్రభుత్వం.. మెగా డీఎస్సీ పేరిట దగా డీఎస్సీ నిర్వహించిందని ధ్వజమెత్తారు. హెరిటేజ్ పాలు అమ్ముకున్నట్లు డీఎస్సీ ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆయన మండిపడ్డారు. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆటలాడిందని, దీనికి బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ‘లక్షలు ఖర్చుచేసి రోజు 20 గంటలు చదువుకున్న నిరుద్యోగులకు అన్యాయం చేశారు. రాష్ట్రంలో లోకేష్ చేయని దోపిడి అవినీతి అంటూ ఏది లేదు. హెరిటేజ్లో పాలు అమ్ముకునట్లు డీఎస్సీ ఉద్యోగాలు అమ్ముకున్నారు. నిరుద్యోగుల కన్నీళ్లు మీకు కనిపించడం లేదా?, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి డీఎస్సీ ఉద్యోగాలకు వేలం పాట పెట్టారు. లోకేష్ను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలి. ఈ మోసంలో లోకేష్ను ఏ-1గా అరెస్ట్ చేయాలి. సీబీఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. వైఎస్సార్సీపీ ధర్నాల్లో వేలాది మంది డీఎస్సీ బాధితులు హాజరయ్యారు. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం’ అని హెచ్చరించారు. దీనిపై పవన్ కళ్యాణ్కు నిజాయితీ ఉంటే వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ ఉద్యోగాల భర్తీ.. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచే..డీఎస్సీ ఉద్యోగాల భర్తీ కార్యక్రమం . ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచే జరిగిందన్నారు. ఒక్కొక్క పోస్ట్ను రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకూ అమ్ముకున్నారన్నారు. డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ‘లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలి. చంద్రబాబు సిగ్గు లేకుండా అబద్ధాలు మాట్లాడుతున్నారు. సచివాలయ ఉద్యోగాల భర్తీని పారదర్శకంగా వైఎస్ జగన్ నియమించారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు లోకేష్ జిల్లాకు లక్ష ఉద్యోగాలు చొప్పున ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్లు పాటించడం లేదు’ అని స్పష్టం చేశారు. -
రేయ్ మాలోకం... వైఎస్సార్ విగ్రహం జోలికి వస్తే ఖబడ్డార్!
-
రజిని అక్క మీద ఎన్ని ట్రోల్స్ చేశారు.. నేనైతే ఏం చేసేదాన్ని అంటే..
-
‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’.. వైఎస్సార్సీపీ పోస్టర్ ఆవిష్కరణ
సాక్షి,తాడేపల్లి: రాష్ట్రంలో రెండేళ్లుగా జరుగుతున్న దుర్మార్గ, రాక్షస, అరాచక, మాఫియా, వెన్నుపోటు పాలనతో ప్రజలు విసిగిపోయారని, అయినా ప్రభుత్వం నిస్సిగ్గుగా అబద్ధాలతో డైవర్షన్ రాజకీయాలకు దిగుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ పార్టీ నేతలతో కలిసి ‘వెన్నుపోటుకు రెండేళ్లు’పేరుతో పోస్టర్, బుక్ లెట్ను సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు.అనంతరం చంద్రబాబు మోసాల పాలనకు వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు చేపడుతున్న నిరసన కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమాలకు ప్రజలు, మేథావులు, ఆలోచనాపరులు విరివిగా హాజరై చంద్రబాబు మోసాల్ని గ్రహించాలని సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. తన ప్రసంగంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకేమన్నారంటే..చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లురెండేళ్లుగా చంద్రబాబు ఆధ్వర్యంలో దుర్మార్గ, రాక్షస, అరాచక, మాఫియా పాలన జరుగుతోంది. ఎలాంటి జంకూ బొంకూ లేకుండా బరితెగించి, చట్టాన్ని పూర్తిగా వాడుకుని, వ్యవస్థలన్నింటినీ తమ ప్రయోజనాలకు అనుకూలంగా మార్చేశారు. ఓవైపు అవినీతి విచ్చలవిడిగా జరుగుతోంది. మా పాలనలో ఐదేళ్లలో చేసిన అప్పును ఇప్పుడు రెండేళ్లలోనే చేసేశారు. అప్పట్లో రెండేళ్ల పాటు కోవిడ్లో ఆదాయం రాలేదు, ఖర్చు పెరిగింది. తానిచ్చిన మోసపూరిత హామీల్ని పక్కన పెట్టేయడమే కాకుండా, అవన్నీ పూర్తి చేసేశామని చంద్రబాబు నిస్సిగ్గుగా ప్రకటించుకుంటున్న తరుణంలో దీనిపై ప్రజల్లో చర్చ జరగాలంటే, ఈ రెండేళ్లలో జరిగే ఘోరం తెలియాలంటే ఓ ఉపన్యాసం, ప్రెస్ మీట్ తో సాధ్యం కాదు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించాం.ఈ మోసపూరిత పాలనలో సంక్షేమ పథకాలన్నీ చాపచుట్టేసిన నేపథ్యంలో వాటిపై ప్రజల్లో చర్చ జరిగే విధంగా, మేథావులు, ఆలోచనాపరులు, వివేచనా పరులు తమ చుట్టూ ఉండే వారికి చెప్పే విధంగా నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. ఇవాళ పోస్టర్ కార్యక్రమం విడుదల కార్యక్రమం ఇక్కడ చేశాం, రేపు జిల్లా కేంద్రాల్లో పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో, ఎల్లుండి నియోజకవర్గ కేంద్రాల్లో ఇదే కార్యక్రమం జరుగుతుంది.ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు నిరసన కార్యక్రమాలుప్రతీ ఒక్కరూ క్యూఆర్ కోడ్తో ఫోన్లలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ బుక్ లెట్, పోస్టర్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రజలు దీన్ని డౌన్ లోడ్ చేసుకుని, వాస్తవాలు తెలుసుకోవాలని కోరుతున్నాం. అలాగే ప్రజల వైపు నుంచి సూచనలు, సలహాలు ఉన్నా స్వీకరిస్తాం. ఈ క్యూఆర్ కోడ్ తో పోస్టర్లు డౌన్ లోడ్ చేసుకుని, మీ చుట్టు పక్కల ఉండే వారితో చర్చించాలని కోరుతున్నాం.రాష్ట్రంలో అతిపెద్ద ప్రతిపక్షంగా, బాధ్యతాయుత ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్సీపీ 2019-24 మధ్య ఇచ్చిన రికార్డు స్థాయి సంక్షేమ పాలనను సైతం గుర్తుచేసుకునే విధంగా, ప్రస్తుత పాలనతో పోల్చుకునే విధంగా 4వ తేదీ మండల కేంద్రాల్లో నిరసనలు, 8, 9 తేదీల్లో టౌన్ హాళ్లలో మీటింగ్స్ నిర్వహించబోతున్నాం. అలాగే 12వ తేదీ నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తాం. పవన్ కళ్యాణ్ సంతకం పెట్టి ఇచ్చిన బాండ్ పేపర్లను కూడళ్లలో తగులబెట్టే కార్యక్రమం కూడా ఇందులో ఉంటుంది. ఈ నిరసనలకు సంక్షేమ పథకాలు రాని బాధితులు కూడా తరలిరావాలి. ప్రతీ నెలా క్రమం తప్పకుండా ఏదో విధంగా కొంత మొత్తం ప్రజల ఖాతాల్లో పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేశారు.ఇప్పుడు అదంతా సున్నా అయిపోయింది. డ్వాక్రా మహిళలు పూర్తిగా రోడ్డున పడ్డారు. 18 శాతం పైగా ఉన్న వీరి నిరర్ధక ఆస్తుల్ని వైఎస్ జగన్ హయాంలో 4 శాతానికి తగ్గించాం. డ్వాక్రా మహిళలు మా హయాంలో కోటికి పెరిగారు. బ్యాంకులు కూడా వారికి లోన్లు ఇచ్చి సాయం చేశాయి. వైఎస్ జగన్ పాలన చివరి ఏడాదిలో 49 వేల కోట్లుగా ఉన్న డ్వాక్రా మహిళల రుణం కాస్తా ఇప్పుడు 30 వేల కోట్లకు పడిపోయింది. ఆరోగ్యం, విద్య విషయంలో ప్రభుత్వ సాయం తగ్గిపోయి పేదలు ఇబ్బందులు పడుతున్నారు. ఇవి కేవలం మా మాటలు కాదు, క్షేత్రస్దాయిలో అనుభవిస్తున్న వారి మాటలే.నిరసనల్లో ప్రజలు, మేథావులు భారీగా పాల్గొనాలిచంద్రబాబు ఇప్పుడు సూపర్ సిక్స్ ఇచ్చేశానంటే అందరూ నమ్మాల్సిందే అన్నట్లుగా ఉంది. మాయల మరాఠీ రోజూ అదే చెప్తుంటే ప్రజలు కూడా నమ్మక ఏం చేస్తారు ? ఈ లోగా వైఎస్సార్సీపీ మీద, పార్టీ అధినేత గురించి మాట్లాడకుండా వారిపై కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ జగన్ ఏది కాదో అదే అని చూపించే ప్రయత్నం పచ్చమీడియాలో చేస్తున్నారు.మెగా డీఎస్సీ పేరు మీద నెల రోజులుగా సాక్ష్యాలతో సహా బయటపెడున్నా వారి మీడియాలో ఎక్కడా కనబడదు. మహా ఉంటే అధికారుల సాయంతో దబాయింపు చేస్తున్నారు. తాడు లాగే పోటీతో, బ్రిడ్జి గేమ్స్ తో టీచర్ ఉద్యోగాలు పొందవచ్చని వీళ్లు నిరూపించారు. సెలెక్షన్ అయ్యాక తిరిగి నిబంధనలు మార్చేశామని అధికారులతోనే చెప్పిస్తున్నారు. చంద్రబాబు సుపుత్రుడు విద్యామంత్రి మాత్రం దీనిపై ఉలకడు, పలకడు. మేం ప్రశ్నిస్తుంటే ఇసుక, బైజూస్ అని డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారు. రాష్ట్రంలో కోటీ 47 లక్షల బాధిత కుటుంబాలు ఉన్నాక వారు రేపైనా తీర్పు ఇచ్చారు. కానీ వారిని గందరగోళ పరిచేందుకు జరుగుతున్న ప్రయత్నాల్ని అడ్డుకునేలా వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టబోతోంది. వైఎస్ జగన్ లక్ష్యం తాను ఉన్నా, మరొకరు వచ్చినా సంక్షేమం కొనసాగాల్సిందే. చంద్రబాబు హయాంలో టిడ్కో ఇళ్లు అప్పుల భారంలో ముంచి వెళ్లిపోతే, వైఎస్ జగన్ అలా వదిలేకుండా అప్పుల బాధ తీర్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆరోగ్య శ్రీ తెస్తే దాన్ని కూడా ఇప్పుడు ఎత్తేస్తున్నారు. అందుకే వీటిపై ప్రజల్లో చర్చ జరగాలని కోరుకుంటున్నాం. అందుకే వైఎస్సార్సీపీ నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో భారీగా పాల్గొనాలని ప్రజలు, సంక్షేమ పథకాల బాధితులతో పాటు మేథావులు, ఆలోచనాపరులకు పిలుపునిస్తున్నట్లు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. -
లోకేష్ వస్తే యువత బతుకులు మారతాయి అంటే ఏంట్లో అనుకున్న ఈ రేంజ్ లో మారుస్తావ్ అనుకోలేదు నాయన
-
YSRCP vs POLICE గుంటూరు కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
-
మెగా డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ నిరసన!
-
తీర్మానాల కంటే తిట్లకే ప్రాధాన్యం.. ఇదేనా మహానాడు?
నీ చుట్టూ ఉన్నవాళ్లెవరో చెప్పు.. నీవు ఎలాంటివాడివో నేను చెబుతా అని ఒక రచయిత అంటారు. అలాగే ఒక సభలో ప్రసంగించిన వక్తలు ఎవరో చెప్పు..ఆ సభ ఎలాంటిదో నేను చెబుతా అన్నది సరికొత్త నానుడిగా తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీ హైబ్రిడ్ మోడల్ లో మహానాడు నిర్వహించుకుంది. అంతవరకు ఎవరికి అభ్యంతరం లేదు. కొన్ని చోట్ల కార్యకర్తలు వచ్చారు.. కొన్ని చోట్ల సరిగా రాలేదు. జనాన్ని పోగు చేసే యత్నాలు చేశారు. కొన్ని చోట్ల చీరెలు కూడా పంచారు.. రికార్డింగ్ డాన్స్ లు నిర్వహించారు... గుడి, బడి, ప్రభుత్వ ఆఫీస్ దేనిని వదలకుండా ఆయా చోట్ల సభలు నిర్వహించి సరికొత్త ట్రెండ్ ఏర్పాటు చేశారు. కొన్ని గ్రామాలలో ప్రభుత్వ ఆఫీస్ లకు కూడా పచ్చ జెండాలు కట్టారని వీడియోలు వచ్చాయి. ఇదంతా అధికార దుర్వినియోగమే కదా!ఇక మహానాడు ప్రధాన కార్యక్రమంలో ప్రసంగించిన కొంతమంది వక్తలను చూస్తే మతి పోవల్సిందే. కిరాక్ అంటూ ఒకాయన వైఎస్సార్సీపీ నేతలను, ముఖ్యంగా మహిళా నేతలను అసహ్యమైన బూతులతో దూషిస్తుంటారు. ఆయన ప్రసంగించడానికి మహానాడులో అవకాశం ఇవ్వడం అంటేనే ఆ సభ ఇంత నాసిరకంగా జరిగిందా అన్న అభిప్రాయం పలువురికి కలిగింది. ఏభై ఏళ్ల సీనియర్ అయిన చంద్రబాబు నాయుడు అలాంటివారితో మాట్లాడించి, ఆసక్తిగా వినడం ఏమిటా అని పలువురు ముక్కున వేలేసుకున్నారు.ఇంకోక నాయకుడు ఎవరో చంద్రబాబు, లోకేష్ లతో పాటు దేవాన్ష్ అందాన్ని పొగుడుతూ ఉపన్యసించారు. బుద్దిగా చదువుకుంటున్న దేవాన్ష్ గురించి కూడా వీరు ప్రసంగిస్తున్నారంటే వీరికి పార్టీ పరంగా, ప్రభుత్వపరంగా పెద్ద సబ్జెక్టు లేదన్నమాట.గతంలో ఎన్టీఆర్ ఉన్నప్పుడు, ఆ తర్వాత చంద్రబాబు అధీనంలోకి పార్టీ స్వాధీనం అయిన తర్వాత కూడా కొన్నేళ్లు పార్టీ విధానాలపైన చర్చ జరిగేది. దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులపై తీర్మనాలు చేసి తమ అభిప్రాయాలను తెలిపేవారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వపరంగా జరిగిన లోటుపాట్లను కూడా చర్చించిన సందర్భాలు ఉన్నాయి. కాని ఈసారి మహానాడులో ఎంతసేపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను దూషించడానికి, వైఎస్సార్సీపీపై తప్పుడు ముద్రలు వేసి ఆత్మ సంతృప్తి చెందడానికి, ఆత్మ వంచన చేసుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చారు. సహజంగానే ఏ పార్టీ సమావేశంలో అయినా ప్రత్యర్ధి రాజకీయ పార్టీల విధానాలపై విమర్శలు ఉంటాయి. కాదనం. కాని ఈ మహానాడులో అచ్చంగా వైఎస్సార్సీపీని బూతులు తిట్టడానికే టైమ్ కేటాయించినట్లు కనిపిస్తుంది. అంతే తప్ప తమ రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలు ఏమిటి? వైఫల్యాలేమిటి? ఎందుకు చెప్పిన హామీలను అమలు చేయలేకపోయాం. వచ్చే మూడేళ్లలో ఏమి చేయాలని అనుకుంటున్నాం.. తదితర అంశాల గురించి పెద్దగా ప్రస్తావించకుండా, అన్నీ చేసేశాం అన్న భ్రమ కల్పించే యత్నం చేశారు.మరో కీలకమైన పాయింట్ ఏమిటంటే గతంలో ఏ సభ పెట్టినా అమరావతి అంటూ తెగ ఊదరగొట్టేవారు. కాని ఈసారి దాని గురించి పెద్దగా ప్రస్తావించినట్లు కనబడదు. ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలలో మహానాడుకు ఫుల్ కవరేజీ ఇచ్చినా, ఈ పాయింట్లపై ఫోకస్ పెట్టకపోవడం గమనించదగ్గ అంశమే. ఇప్పటికే సేకరించిన ఏభై వేల ఎకరాలు కాకుండా అదనంగా ఎందుకు భూమి అడుగుతున్నారు? రైతులకు ఇంతవరకు ఎందుకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వలేకపోయారు? ఒకే చోట లక్షల కోట్ల వ్యయం చేయవలసిన అవసరం ఉందా? ఇప్పటికే 47వేల కోట్ల అప్పు ఎందుకు చేయవలసి వచ్చింది? ఇంకెంత అప్పు దీనికోసం చేస్తారు? రూపాయి కూడా ప్రభుత్వ ధనం వెచ్చించనవసరం లేదని గతంలో అన్నారు కదా! ఇప్పుడెందుకు మాట మార్చారు? ఇలాంటివాటిపై మహానాడు వంటి సభలలో వివరణ ఇచ్చి ఉంటే అర్థవంతంగా ఉండేది కదా! అన్ని ప్రాంతాలకు చెందిన టీడీపీ కార్యకర్తలకే కాకుండా, ప్రజలకు కూడా ప్రభుత్వ వాదన తెలిసేది కదా!ఎన్నికల మానిఫెస్టోలోని అంశాల గురించి చెప్పి ఎంతవరకు అమలు చేశామో వివరించడానికి కదా ఇలాంటి మహానాడులు జరిపేది. ఉదాహరణకు ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 ఇస్తామన్నారు.. ఎందుకు ఇవ్వలేకపోయారు.. దీని గురించి కాకుండా వచ్చే ఎన్నికలలో పార్టీ పరంగా 33 శాతం సీట్లు ఇస్తామని ప్రసంగిస్తే ఒరిగేదేమి ఉంటుంది? మూడేళ్ల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో?ఎన్నికల టైమ్ లో మహిళలకు పార్టీపరంగా సీట్లు ఎక్కువ ఇస్తే ఓడిపోతామని, అందువల్ల ఇవ్వలేకపోతున్నామని చెప్పరని గ్యారంటీ ఏమి ఉంది? నిరుద్యోగ భృతి మూడువేలు ఏమైంది. బీసీలకు ఏభై ఏళ్లకే పెన్షన్ ఏమైంది? ఇలాంటి ప్రస్తావనలే లేకుండా మహానాడు ముగిస్తే ప్రజలకు ఏమి ప్రయోజనం కలుగుతుంది? జగన్ తీసుకు వచ్చిన 17 మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం ఎందుకు చేస్తున్నారో చెప్పాలి కదా!ఒకవైపు అమరావతికి వేల కోట్లు అప్పులు తెస్తూ మెడికల్ కాలేజీలకు డబ్బులు లేవంటే టీడీపీ కార్యకర్తలైనా అంగీకరిస్తారా? చంద్రబాబు ఎప్పటి మాదిరే అసత్యాలు, అర్థ సత్యాలు చెప్పి పార్టీవారిని మభ్యపెట్టడం సరైన విధానం అవుతుందా? ఎన్నికలకు ముందు సంపద సృష్టించడం తెలుసునని, జగన్ కంటే ఎక్కువ సంక్షేమం అందిస్తామని బీరాలు పోయారే. ఎన్నికలయ్యాక సంపద ఎలా సృష్టించాలో చెప్పండని జనాన్ని అడిగారు. మహానాడులో అప్పులు చేసి సంక్షేమ పథకాలు తగదని చెబుతున్నారు. మరి తెచ్చిన అప్పులన్నీ ఏమి అవుతున్నాయన్నదానిపై వివరణ ఇవ్వవచ్చు కదా! పైగా పది లక్షల కోట్ల అప్పు జగన్ టైమ్ లో జరిగిందని పచ్చి అబద్ధాన్ని చెప్పడం చంద్రబాబు వంటి సీనియర్ కి తగునా?రాష్ట్రం మొత్తం అప్పు ఎంత? ఈ రెండేళ్లలో ఎంత అప్పు చేశారు? అంతకుముందు టీడీపీ ఐదేళ్ల టరమ్ లో ఎంత అప్పు చేశారు?జగన్ టైమ్ లో ఎంత అప్పు అయింది? ఈ అంశాలపై జగన్ కాగ్ లెక్కల ఆధారంగా విమర్శలు చేస్తే, చంద్రబాబు మాత్రం ఎలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా జగన్ టైమ్ లో పది లక్షల కోట్ల అప్పు చేశారని చెప్పడం ధర్మమేనా? 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు, లక్ష మంది మహిళలను పారిశ్రామికవేత్తలను చేశాం అంటూ అతిశయోక్తులు చెప్పినా జనం నమ్ముతారా? ఇవన్ని ప్రతి నిత్యం చేసే రొటీన్ ప్రసంగాలే కదా! ఏపీలో ప్రాక్టికల్ గా ఏమి జరుగుతుందో తెలుసుకోలేని అమాయకులుగా జనం ఉన్నారని చంద్రబాబు భావిస్తుంటే చేయగలిగింది ఏమీ లేదు.ఈ మహానాడు లో కేవలం తన కుమారుడు, మంత్రి లోకేష్ కు మరింత ప్రాధాన్యత కల్పించడానికి, కాబోయే ముఖ్యమంత్రిగా పార్టీ శ్రేణులను మానసికంగా సిద్ధం చేయడానికి దీనిని ఉపయోగించుకున్నారు. అంతవరకు తప్పు లేదు. కాని చంద్రబాబు తన కుమారుడికి కూడా హుందా లేని రాజకీయాలు అలవాటు చేస్తుండడం బాధాకరం. డీఎస్సీ లో అక్రమాలపై జవాబు చెప్పకుండా లోకేష్ ఏదేదో మాట్లాడి దబాయించారనిపిస్తుంది. ఎల్లో మీడియా కూడా తొలి రోజు లోకేష్ కు మంచి కవరేజీ ఇచ్చి చంద్రబాబు ను తగ్గించడం స్పష్టంగా కనిపిస్తుంది. మహానాడులో చంద్రబాబు కన్నా, వక్తలు లోకేష్ భజనే ఎక్కువగా చేశారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని అన్నారు. అది నిజమే అనిపిస్తుంది. 1983 నుంచి టీడీపీలో ఉన్న సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సైతం ఇదే తరహాలో ప్రసంగిస్తూ లోకేష్ ను ఉగ్రనరసింహం అని చెప్పి మెప్పుపొందే యత్నం చేశారు.ఏది ఏమైనా ఈ రెండేళ్లలో నిర్దిష్టంగా ఫలానా గొప్ప పనులు చేశామని చెప్పలేని స్థితిలో చంద్రబాబు, లోకేష్ లు ప్రతిదానికి వైఎస్సార్సీపీపై ఆరోపణలు చేయడం, గొడ్డలి పార్టీ, రక్త చరిత్ర అని, బాబాయిని చంపించారని, తల్లి, చెల్లి అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒక వైపు స్త్రీలపై ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నది, కొందరు ఎమ్మెల్యేలే మహిళల పట్ల ఎంత అరాచకంగా వ్యవహరిస్తున్నది , రెడ్ బుక్ పేరుతో టెర్రర్ సాగుతున్నది అందరికి కనబడుతూనే ఉంది. అయినా వైఎస్సార్సీపీ పై ఆరోపణలు చేస్తున్నారు. అందువల్లే తెలుగుదేశంపైన, చంద్రబాబు, లోకేష్ లపైన వైఎస్సార్సీపీ నేతలు కూడా విరుచుకుపడ్డారు. వంగవీటి రంగా హత్యతో సహా సహా చంద్రబాబుపై వచ్చిన వచ్చిన ఆరోపణలన్నిటిని వారు ఏకరువు పెట్టి సొంత మామ ఎన్టీఆర్ రామారావు ఆయనను ఉద్దేశించి ఎంత తీవ్రంగా దూషించింది వివరిస్తున్నారు.తడిగుడ్డలతో గొంతులు కోసే రకం అని పేర్ని నాని టీడీపీపై మండిపడ్డారు. మహానాడులో ఆమోదించిన ఏ తీర్మానం చూసినా, అంతా జగన్ పైన దూషణలే కనిపిస్తున్నాయి. గత ఎన్నికలలో వైఎస్సార్సీపీకి వచ్చిన సీట్ల గురించి మాట్లాడారు కాని, పరకాల ప్రభాకర్ ఏభై లక్షల దొంగ ఓట్ల స్కామ్ గురించి సాక్ష్యాధారాలతో సహా వెల్లడించిన అంశంపై మాత్రం నోరెత్తలేకపోయారు. ఇది మహానాడులో పెద్ద బలహీనతగా కనిపిస్తుంది. ఎప్పటి మాదిరి ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలంటూ తీర్మానం చేసి వదిలివేశారు. అది రాకపోవడానికే చంద్రబాబే కారణమన్న ఆరోపణలపై మాత్రం జవాబు చెప్పరు. లక్షల మంది మహానాడులో పాల్గొన్నారని అంకెల గారడి చేయవచ్చు. నాణ్యమైన చర్చలు కాని, మంచి ప్రసంగాలు కాని లేకుండా చరిత్రలో నాసిరకం మహానాడుగా ఇది ముగిసిపోయినట్లు అనిపించడం లేదూ! -
మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ: వైఎస్సార్సీపీ నిరసన
ఏపీ డీఎస్సీలో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలంటూ వైఎస్సార్సీపీ యూత్ వింగ్ నిరసనలు చేపట్టింది రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కాగా, డీఎస్సీ పేపర్ లీక్, స్పోర్ట్స్ కోటాలో పోస్టులు అమ్ముకోవడంపై అభ్యర్థులు, యూత్ వింగ్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ:కూటమి సర్కారు తీరుపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్విద్యాశాఖలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన నోటిఫికేషన్లో మరిన్ని పోస్టులు కలిపి మెగా డీఎస్సీ ఇచ్చారు.మెగా డీఎస్సీలో తప్పులే కనిపిస్తున్నాయి.ప్రభుత్వంలో అన్ని పారదర్శకం అని చెబుతారు.. కానీ అన్ని గుట్టుగానే జరుగుతుంది.కలెక్టర్ కార్యాలయంలో పేర్లు, ర్యాంకులతో లిస్టులు పెట్టాలి.కలెక్టర్ కార్యాలయంలో మెరిట్ లిస్ట్ లు పెట్టాలి.ఆన్ లైన్ లో చూసిన ప్రతిసారి లిస్టులు మారిపోతున్నాయి.చదువు రానివాడు చూసినా అర్థమయ్యే రితీలో ఆన్ లైన్లో ఉండాలి. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా:డీఎస్సీలో అక్రమాలను నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అమలాపురంలో భారీ ర్యాలీవిద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన నేతలుజరిగిన ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలన్న వైఎస్సార్సీపీ నేతలుకార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ అనురాధ , కో-ఆర్డినేటర్లు పి.రాజేశ్వరి, సూర్యప్రకాశ్ గన్నవరపు శ్రీనివాస్, ఇతర వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలునెల్లూరు:మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలంటూ నెల్లూరు నగరంలో వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీ .500 మంది యువత , నిరుద్యోగులతో వీఆర్సీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించిన యువత .యువత, నిరుద్యోగుల నిరసనలతో అట్టుడికిన కలెక్టరేట్ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి , వైస్సార్సీపీ నెల్లూరు సిటీ ఇన్ చార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఇన్ చార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డిమెగా డీఎస్సీ అక్రమాలతో అభ్యర్థులు తీవ్రంగా దగాపడ్డారు:ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిబాబు వస్తే జాబ్ వస్తుందని ఓట్లు దండుకున్నారు: జక్కంపూడి రాజామెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీలక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకున్నారులక్షలు ఖర్చుచేసి రోజు 20 గంటలు చదువుకున్న నిరుద్యోగులకు అన్యాయం చేశారు.రాష్ట్రంలో లోకేష్ చేయని దోపిడి అవినీతి అంటూ ఏది లేదు..హెరిటేజ్ లో పాలు అమ్ముకునట్లు డీఎస్సీ ఉద్యోగాలు అమ్ముకున్నారునిరుద్యోగుల కన్నీళ్లు మీకు కనిపించడం లేదా?లోకేష్ను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలిపవన్ కళ్యాణ్ కు నిజాయితీ ఉంటే వెంటనే స్పందించాలిడీఎస్సీ ఉద్యోగాల భర్తీ.. ఎన్టీఆర్ ట్రస్టు భవన్ నుంచి జరిగింది: కేకే రాజుఒక్కొక్క పోస్ట్ ను రూ. 15 లక్షల నుంచి 20 లక్షల వరకు అమ్ముకున్నారు.డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలిలోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలి.డీఎస్సీపై చంద్రబాబు సిగ్గు లేకుండా అబద్ధాలు మాట్లాడుతున్నారుప.గో జిల్లా:కూటమి ప్రభుత్వం నిర్వహించిన దగా డీఎస్సీ మెగా కాదు.. దగా డీఎస్సీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను వెంటనే బర్త్ రఫ్ చేయాలి వైఎస్సార్సీపీ మహాధర్నా చలో కలెక్టరేట్ ర్యాలీలో పాల్గొన్న వైఎస్సార్సీపీ శ్రేణులుమహాధర్నా చలో కలెక్టరేట్ ర్యాలీలో పాల్గొన్న ఆచంట నియోజకవర్గ పరిశీలకులు శ్రీమతి మేడపాటి షర్మిళ రెడ్డి తదితర పార్టీ శ్రేణులుఅనంతరం జిల్లా కలెక్టర్ ఆఫీసులో వినతి పత్రం అందజేసిన నేతలురాజమండ్రి:స్థానిక రాజమండ్రి రూరల్ వైఎస్సార్సీపీ ఆఫీసు నుండి చలో కలెక్టరేట్ ఆఫీస్ వరకు మెగా కాదు-దగా డీఎస్సీ మహాధర్నా కార్యక్రమం మాజీ మంత్రివర్యులు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన దగా డీఎస్సీ మెగా కాదు-దగా డీఎస్సీపై నిరసనవిద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను వెంటనే బర్త్ రఫ్ చేయాలి మహాధర్నా చలో కలెక్టరేట్ ర్యాలీలో జక్కంపూడి విజయలక్ష్మి మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు,, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి , రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తదితర నేతలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు.తూర్పుగోదావరి జిల్లా...రాజమండ్రిలో భారీ ర్యాలీబొమ్మూరులో పార్టీ ఆఫీసు నుండి జిల్లా కలెక్టరేట్ వరకు కొనసాగిన నిరసన ర్యాలీవేణు గోపాలకృష్ణ కామెంట్స్..ఇది మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్సీ.పోస్టులను అమ్ముకున్నారుడీఎస్సీ నిర్వహణలో అనేక అవకతవకలు జరిగాయి. వాటిపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలిస్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇస్తామని అభ్యర్థులను దారుణంగా మోసం చేశారుడీఎస్సీ నిర్వహణపై పూర్తిస్థాయిలో సీబీఐతో విచారణ జరిపించాలిగుంటూరు..వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు చైతన్య కామెంట్స్మెగా డీఎస్సీ.. దగా డీఎస్సీ అయిందిఅనేక అవకతవకలు జరిగాయి.డీఎస్సీలో భారీ అవినీతి జరిగిందినిరుద్యోగులకు న్యాయం చేయాలిడీఎస్సీలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలిమాజీ మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్డీఎస్సీపై లోకేష్ ఎందుకు సమాధానం చెప్పడం లేదు?ముఖ్యమంత్రి, లోకేష్ సమాధానం చెప్పాలి.లోకేష్కు సిగ్గుంటే సమాధానం చెప్పి రాజీనామా చెప్పాలిదగా డీఎస్సీ నిర్వహించిందుకు సీఎంగా ప్రమోషన్ ఇస్తారేమో చూడాలి.లోకేష్ రాజీనామా చేయాలిమిస్టర్ లోకేష్ నోరు విప్పి మాట్లాడాలిఅక్రమాలు జరిగాయని చెబితే మాట్లాడితే దాడులు చేసే పరిస్థితి ఉంది.డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి.కృష్ణా జిల్లా..డీఎస్సీ అక్రమాలపై విచారణ జరిపించాలని కోరుతూ మచిలీపట్నంలో ఛలో కలెక్టరేట్లక్ష్మీ టాకీస్ సెంటర్ నుంచి జిల్లా కలెక్టరేట్ వరకూ ర్యాలీ..ర్యాలీలో పాల్గొన్న కృష్ణాజిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మెరుగుమాల కాళీ, మచిలీపట్నం వైఎస్సార్సీపీ ఇంఛార్జి పేర్ని కిట్టుజిల్లా కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చిన యువజన విభాగం నాయకులుపేర్ని కిట్టు కామెంట్స్..సకల శాఖా మంత్రి లోకేష్ తన చేతవాటం ప్రదర్శిస్తున్నాడుడబ్బులిస్తే ఏ ఉద్యోగమైనా అమ్ముకోవచ్చని లోకేష్ ను చూస్తే తెలుస్తోందిడీఎస్సీలో ఉద్యోగాలు కొనుక్కోవచ్చని లోకేష్ నిరూపించారుముందు మీ శాఖలో అవినీతి తగ్గించు లోకేష్తర్వాత ఎదుటి వారి గురించి వెటకారంగా మాట్లాడొచ్చుస్పోర్ట్స్ కోటాలో డబ్బులిచ్చిన వారికి ఉద్యోగాలిచ్చారురాత్రికి రాత్రి సర్టిఫికెట్లు పుట్టించడం ఉద్యోగాలు తీసుకోవడంనీపేరు లోకేష్ కాదు లో క్యాష్డీఎస్సీ అక్రమాల పై మా పోరాటం ఆగదునిరుద్యోగులకు న్యాయం జరిగే వరకూ పోరాడుతాంవిశాఖ..జక్కంపూడి రాజా కామెంట్స్..డీఎస్సీ మోసాలపై పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు?.పవన్ కాపులకు ఎందుకు వ్యతిరేకమో చెప్పాలి.చంద్రబాబు, లోకేష్ దగ్గర మార్కులు కోసమే పవన్ వ్యాఖ్యలు.డీఎస్సీ మోసాల గురించి మాట్లాడి పవన్ రియల్ హీరో అనిపించుకోవాలి.విద్యా శాఖ మంత్రి లోకేష్ కాబట్టి పవన్ కళ్యాణ్ నోరు మెదపడం లేదు..డీఎస్సీ అవకతవకలపై నోరు మెదపకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతావు.వైఎస్ జగన్ డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే పబ్లిసిటీ కోసం దాన్ని రద్దు చేశారు.కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దగా డీఎస్సీ తీశారు.లక్షలాది రూపాయలు ఖర్చు చేసి నిరుద్యోగులు ప్రిపేర్ అయ్యారు.నిరుద్యోగుల ఆకలి కేకలు లోకేష్కు వినిపించలేదా?.డీఎస్సీ పేరుతో లోకేష్ కొట్లాది రూపాయలు సంపాదించారు ..స్పోర్ట్స్ కోట పేరుతో లక్షల రూపాయలకు ఉద్యోగాలు అమ్ముకున్నారు.హెరిటేజ్లో పాలు పెరుగు అమ్ముకున్నట్లు డీఎస్సీ ఉద్యోగాలు అమ్ముకున్నారులోకేష్ సీబీఐకు విచారణకు ఒప్పుకోవాలి.లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలి..టీచర్ పోస్టులు అమ్ముకున్నట్లు ఆడియో వీడియోలు బయటికి వచ్చాయి..నిరుద్యోగ భృతి పేరుతో మోసం చేశారు..వాలంటీర్లకు జీతాలు పెంచుతామని చెప్పి ఉద్యోగాల నుంచి తీసేశారు.ఎన్నికల ముందు కాపులు సంఖ్య బలం గురించి మాట్లాడిన పవన్ ఇప్పుడూ కాపులతో నాకేం పనిలేదు అంటున్నాడు.కోట్లు ఖర్చు పెట్టడానికి కాపులు కావాలి కానీ ఎన్నికల తర్వాత వాళ్ళు అవసరమే లేదా?.అధికారంలోకి వచ్చిన తర్వాత నీ విధానం చూసి కాపులు ఆవేదనలో ఉన్నారు.అనంతపురం..డీఎస్సీ అక్రమాలపై కొనసాగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరుబాటవైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడిభారీగా తరలి వచ్చిన విద్యార్థులు, యువజన విభాగం నేతలుడీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్డీఎస్సీ అక్రమాలకు కారణమైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను భర్తరఫ్ చేయాలని డిమాండ్టీడీపీ కూటమి సర్కార్ వ్యతిరేకంగా నినాదాలుఉపాధ్యాయ పోస్టులు అమ్ముకున్నారని ఆగ్రహంతిరుపతి..తిరుపతి కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసనతిరుపతి కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ముట్టడిపార్టీ విద్యార్థి విభాగం, యువజన విభాగం ఆధ్వర్యంలో నిరసనపద్మావతిపురం నుంచి కలెక్టరేట్ వరకు భూమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో బైక్ ర్యాలీ, నిరసనడీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ పదవికి రాజీనామా చేయాలని నినాదాలు.టీచర్ పోస్టులను అమ్ముకుని మెరిట్లో ఉన్న నిరుద్యోగులకు అన్యాయం చేశారు అంటూ ఆగ్రహంసీఎం చంద్రబాబు రాజీనామా చేయాలి.. డౌన్ డౌన్ అంటూ నినాదాలు, -
చెప్పులతో కొట్టినా సిగ్గు రాదా.. కూటమిలో నీ స్థాయేంటో నీకు తెలుసా?
-
మహిళలంటే అంత చులకన చంద్రబాబు.. ఒళ్ళు దగ్గరపెట్టుకొని మాట్లాడు..
-
చంద్రబాబు.. ఓ గోబెల్స్ బాస్
సాక్షి,అమరావతి: ‘చంద్రబాబే ఓ గోబెల్స్ బాస్. ఇతరుల్ని ఎస్కో బార్ అంటాడు. ఆయనే పెద్ద ఎస్కో బార్. ఓ నక్క, హైనా, తోడేలు ఆలోచనలు కలిస్తే చంద్రబాబు’ అని వైఎస్సార్సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు’ పేరిట తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్రస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘చంద్రబాబు రెండేళ్ల పాలనలో ఎక్కువగా నష్టపోయింది మహిళలే. దగా, మోసం, వెన్నుపోటుకు పరాకాష్టగా ఈ రెండేళ్ల కూటమి పాలన నిలిచిపోతుంది’ అని స్పష్టం చేశారు. ‘ఉన్నవి ఊడపీకేసి.. నిలువుదోపిడీ చేసి.. మహిళలకు పెద్దపీట వేశానని, 33 శాతం రిజర్వేషన్ తెస్తామని మహానాడులో డబ్బా కొట్టుకున్నారు. చీకటి సామ్రాజ్యాధినేత ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో చంద్రబాబు చూపిస్తున్నారు. లక్ష రాక్షసుల ఆలోచనలు కలిస్తే చంద్రబాబు. అలాంటి వ్యక్తిని రాజకీయంగా నాశనం చేయగలిగే శక్తి వైఎస్ జగన్కే ఉంది. చంద్రబాబు పాలిట గొడ్డలి, త్రిశూలం, కత్తి అన్నీ జగనే’ అని స్పష్టం చేశారు. చొక్కా పట్టుకుని నిలదీసే అధికారం మహిళలకే ఉంది ‘రెండేళ్లపాటు సాగిన వ్యవస్థీకృత అరాచక పాలనను ఎత్తిచూపుతూ, రెండేళ్లకు ముందు సాగిన దేశంలోనే ఆదర్శమైన పాలనను గుర్తుచేసుకుంటూ.. ప్రజలకు గుర్తుచేస్తూ పది రోజుల పాటు పలు కార్యక్రమాలు చేపడుతున్నాం. రాష్ట్రంలో ఈ రెండేళ్లలో అందరి కంటే ఎక్కువగా నష్టపోయింది, దోపిడీకి గురైంది మహిళలే. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని చొక్కా పట్టుకుని నిలదీసే అధికారం వారికే ఉంది. ఏ పాలనకైనా మహిళలకు పెద్దపీట వేయడమే గీటురాయి. జగన్ ఐదేళ్ల పాలన అలాగే సాగింది. చెప్పినవన్నీ చేసేశానని ఈ ప్రభుత్వం చెప్పుకోవడం దోపిడీ, దగా, మోసానికి పరాకాష్ట. సౌత్, నార్త్లో జనాభా తేడాలకూ, పిల్లల్ని కనడానికి సంబంధం ఏంటి? ఉచిత విద్య, వైద్యం పీకేసి, ఇప్పుడు పిల్లల్ని కంటే వారికి అవన్నీ ఎవరు అందిస్తారు? నెలకు రూ.15 వేలు ఏమైందో తెలియదు, ఆడబిడ్డ నిధి ఏమైందో కూడా తెలియదు.వైఎస్సార్సీపీ హయాంలో ఐదేళ్లు మహిళలు రూ.1.70 లక్షల కోట్లకు పైగా డ్వాక్రా రుణాలు తీసుకున్నారు. ఇది దేశంలోనే రికార్డు. గతేడాది అది రూ.40 వేల కోట్లకు, ఈ ఏడాది రూ.30 వేల కోట్లకు తగ్గిపోయింది. ఈ రెండేళ్లలో జరిగిన అరాచకం, దోపిడీ, దగాను మహిళలకు గుర్తుచేయాలి. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మూడేళ్లలో సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయి. కాబట్టి ప్రజలకు వాస్తవాలను గణాంకాలతో సహా వివరించి వారికి మేమున్నామనే భరోసా కల్పించాలి.తద్వారా హామీల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా చైతన్యం తీసుకురావాలి’ అని సజ్జల పిలుపునిచ్చారు. ఎంపీ తనూజరాణి, వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి, వైఎస్సార్సీపీ మాజీ ఎంపీలు సత్యవతి, అనూరాధ, పార్టీ అధికార ప్రతినిధులు నందమూరి లక్ష్మీపార్వతి, ఆరె శ్యామల, మాజీ మంత్రి విడదల రజని, మహిళా నాయకులు సుభద్ర, ఉప్పాల హారిక, రాయన భాగ్యలక్షి్మ, కాకాణి పూజిత, నూరి ఫాతిమా ప్రసంగించారు. -
దొంగ ఎత్తులు.. నక్కజిత్తులు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం తీరు దొంగే దొంగా.. దొంగా.. అని అరిచినట్లుంది. నక్కజిత్తులతో ప్రజలను మాయ చేయాలని చూస్తోంది. ఉచిత ఇసుక ముసుగులో రాష్ట్రంలో యథేచ్ఛగా జరుగుతున్న దోపిడీని కప్పిపుచ్చుకునేందుకు ఎప్పటిలాగే తప్పుడు ప్రచారానికి దిగింది. తానే ఇసుక దందా నడుపుతూ గతంలో అక్రమాలు జరిగాయని విష ప్రచారం చేస్తోంది. ఇందుకు ‘ఈనాడు’ తందానా అంటోంది. ఈ క్రమంలో జగన్ హయాంలో ఇసుక దోపిడీ జరిగిందని, దానికి భారీగా జరిమానాలు విధిస్తున్నారంటూ అడ్డగోలు కథనం అచ్చేసింది. ప్రస్తుత చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో, 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలో ఇసుక అక్రమ తవ్వకాలు ఇష్టానుసారం సాగాయి. సాక్షాత్తు సీఎం చంద్రబాబు ఇంటి వెనుక కూత వేటు దూరంలోనే ఇసుక మాఫియా కృష్ణా నదిని కొల్లగొట్టడంపై 2019 ఏప్రిల్ 4వ తేదీన ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అక్రమాలకు కళ్లెం వేస్తూ అప్పటి చంద్రబాబు ప్రభుత్వానికి రూ.100 కోట్ల జరిమానా సైతం విధించింది. రాష్ట్రంలో ఇసుక అక్రమాలపై గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన సిట్ కూడా కేసు నమోదు చేసింది. ఇప్పుడు కూడా అదే ప్రాంతంలో ఇసుక తవ్వకాలు ఇష్టానుసారం జరుగుతున్నా చంద్రబాబు పట్టించుకున్న పాపాన పోలేదు. అప్పట్లో ప్రభుత్వానికి ఆదాయం వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో పారదర్శక ఇసుక విధానం అమలైంది. 2019 వరకు ఇసుకపై ఒక్క రూపాయి ఆదాయం రాని పరిస్థితుల్లో పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ నిర్వహించి, ఏడాదికి రూ.750 కోట్ల ఆదాయం వచ్చేలా చేసింది. ఐదేళ్లలో ఇసుక ద్వారా ప్రభుత్వానికి రూ.3,750 కోట్ల ఆదాయం లభించింది. ఆదాయం రావడమే కాకుండా, ఇసుక తవ్వకాలు క్రమబద్ధంగా జరిగి ప్రజలకు సులభతరంగా ఇసుక అందుబాటులోకి వచ్చింది. ధరలు కూడా టీడీపీ ప్రభుత్వం కంటే బాగా తగ్గాయి. బాబు రాగానే అక్రమాలు మొదలు2024లో చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ ఇసుక దందా మొదలైంది. ఎన్నికల ఫలితాలు వచ్చీ రావడంతోనే.. జగన్ ప్రభుత్వం వర్షాకాలంలో ఇసుక కొరత రాకుండా చూసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 70కిపైగా రీచ్ల్లో నిల్వ చేసిన 80 లక్షల టన్నుల ఇసుకపై టీడీపీ నేతల కన్ను పడింది. నేతలు ఎక్కడికక్కడ ఆ ఇసుక యార్డులను స్వాధీనంలోకి తీసుకుని యథేచ్ఛగా అమ్మేసుకున్నారు. సగానికి పైగా ఇసుక అమ్మేసుకున్నాక.. యార్డుల్లో పెద్దగా నిల్వలు లేవంటూ మిగిలిన కొద్దిపాటి ఇసుకను ప్రజలకు విక్రయించారు. అనంతరం ఉచిత ఇసుక విధానం అని చెప్పి రీచ్లు, స్టాక్ యార్డుల్లో ధరల పట్టిక పెట్టి మరీ ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. తవ్వకం చార్జీలు, లోడింగ్ చార్జీలు, రవాణా చార్జీలు అన్నీ కలిపి టన్ను ఇసుక రూ.1000 నుంచి రూ.2 వేల వరకు విక్రయిస్తున్నారు. అన్ని జిల్లాల్లో ఇసుక రీచ్లు, డీ సిల్టింగ్ పాయింట్లను టెండర్ల విధానంలోనే టీడీపీ నేతలకు కట్టబెట్టి అధికారికంగానే ఇసుకను అమ్ముతున్నారు. తవ్విన ఇసుకలో కొంత స్థానికంగా అమ్ముతూ, మిగిలిన ఇసుకను హైదరాబాద్, బెంగళూరు, చెన్నయ్ వంటి పెద్ద నగరాలకు తరలిస్తున్నారు.ప్రస్తుతం యథేచ్ఛగా⇒ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉచితం ముసుగులో ఇసుక అక్రమాల పర్వం యథేచ్ఛగా కొనసాగుతోంది. కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు.. నదులు, వాగులు, వంకలే కాకుండా పొలాలను కూడా వదలకుండా ఇష్టం వచ్చినట్లు ఇసుక తవ్వి, అక్రమంగా తరలించి అమ్ముకుంటున్నారు. గోదావరి, కృష్ణ, పెన్నా, చిత్రావతి, నాగావళి సహా అన్ని నదుల నుంచి ఇసుక అక్రమ రవాణా సాగుతోంది.⇒ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను పట్టించుకోకుండా, సుప్రీంకోర్టు సూచనలను సైతం లెక్క చేయకుండా.. అనుమతి లేని రీచ్లలో ఇసుకను తోడేస్తున్నారు. కార్మికులతోనే తవ్వకాలు చేయాల్సివుండగా, ప్రతిచోటా పొక్లెయిన్లు, జేసీబీలు, హిటాచీల వంటి భారీ యంత్రాలతో తవ్వకాలు జరుగుతున్నాయి. ఉచితం అంటూనే 18 టన్నుల లారీ ఇసుకను రూ.30-60 వేల వరకు అమ్ముతున్నారు.⇒ ఎన్టీఆర్ జిల్లా సరిహద్దుల నుంచి హైదరాబాద్కు, అనంతపురం సరిహద్దుల నుంచి కర్ణాటకకు, చిత్తూరు సరిహద్దు నుంచి కర్ణాటక, తమిళనాడుకు భారీ ఎత్తున ఇసుక అక్రమంగా తరలిపోతోంది. అన్నిచోట్లా కూటమి ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే అక్రమాలు జరుగుతున్నాయి. వారి ఆధ్వర్యంలోనే అక్రమ తవ్వకాలు జరుగుతుండగా.. చినబాబుకు ఆ మేరకు కమీషన్లు ఠంచనుగా చేరిపోతున్నాయి.⇒ చినబాబుకు కప్పం చెల్లిస్తూ ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు.. నదులు, వాగులను కొల్లగొడుతూ వేల కోట్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దందాను దాచి పెట్టేందుకు గతంలో అక్రమాలు జరిగాయని, ఆ అక్రమాలకు జరిమా నాలు విధిస్తున్నారని ఎల్లోమీడియా అండతో చంద్రబాబు అండ్ కో దుష్ప్రచారం చేస్తోంది. -
డీఎస్సీలో అక్రమాలు ముమ్మాటికీ వాస్తవం
తాడేపల్లి: డీఎస్సీలో జరిగిన అక్రమాలపై తాము సంధిస్తున్న ప్రశ్నలకు ప్రభుత్వ పెద్దలు సమాధానమివ్వకుండా తప్పించుకుని, విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తో రాజకీయ ప్రసంగాలు చేయించారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, వరుదు కల్యాణి మండిపడ్డారు. కోన శశిధర్ తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగడం ఏంటని ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. డీఎస్సీ అక్రమాలపై తాము రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు చేస్తుంటే.. బైజూస్ ట్యాబ్ ల్లో అవినీతి అంటూ ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలకు దిగుతున్నారని ఆక్షేపించారు. డీఎస్సీలో అక్రమాలు ముమ్మాటికీ నిజమని, వాటిపై సీబీఐ విచారణ జరిపించాల్సిందేనని ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. డీఎస్సీ అక్రమాలపై తేలిపోయిన కోన శశిధర్ వివరణ::లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీరాష్ట్రంలో విద్యాశాఖతో పాటు సకల శాఖ మంత్రిగా ఉన్న లోకేష్ లేదా ఆయన తండ్రి చంద్రబాబు డీఎస్సీ అక్రమాలపై మాట్లాడతారని అనుకున్నాం. లక్షలాది మంది జీవితాలతో ఆడుకున్న వ్యవహారంలో ఓ స్పష్టత వస్తుందని భావించాం. కానీ విద్యాశాఖ కార్యదర్శితో మాట్లాడించారు. ఆయన ఏకపక్షంగా మాట్లాడి, విలేఖరుల ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారు. మాకు సమాధానం చెప్పకపోయినా ఫర్వాలేదు, లక్షలాది మంది డీఎస్సీ అభ్యర్ధులకు, ప్రజలకు మాత్రం సమాధానం చెప్పాల్సిందే. మీరు మాట్లాడే పారదర్శకత ఎక్కడుంది ? మెరిట్ లిస్ట్ ఎందుకు పదే పదే మార్చారని అడుగుతున్నాం, ఎక్కడైనా ఫలితాలు వచ్చాక పారదర్శకంగా ఎవరెవరు అర్హత సాధించారో జిల్లా కేంద్రాల్లో మార్కులతో సహా ప్రకటిస్తారు. కానీ ఇక్కడ మెసేజ్ ల ద్వారా కాల్ లెటర్స్ వ్యక్తిగతంగా పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది?డీఎస్సీ కోసం ప్రత్యేకంగా కోటా తీసుకొచ్చారు. ఏపీలో ఎప్పుడూ వినని అత్యా, పత్యా వంటి క్రీడల్ని ఇందులో చేర్చారు. గూగుల్ లో కొడితే 9 మంది సభ్యులు ఉంటారని, ఆట ప్రాంతంలో ఓ కందకం ఉంటుందని వచ్చింది. టెన్ పిన్ బౌలింగ్ అని మరో క్రీడ. చెక్క మీద పిన్నులు అమరుస్తారట. ఇంకొకటి బ్రిడ్జి గేమ్ అట. ఇదో పేకాట లాంటి ఆట. టగ్ ఆఫ్ వార్ గేమ్ ను కూడా డీఎస్సీ స్పోర్ట్ కోటాలో పెట్టారు. బలంగా ఉన్న వారు ఓవైపు తాడు లాగేస్తే గెలిచే ఆట ఇది. ఇలాంటి ఆటలకు కూడా ఉద్యోగాలు ఇచ్చేస్తారా ? సభ్య సమాజానికి మీరు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ? వీళ్లు పీఈటీలుగా మాత్రమే పనిచేయరు, సెలెక్ట్ అయితే సబ్జెక్టులు కూడా చెప్తారట.నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దుమీకన్నా రాజకీయ అనుభవం తక్కువగా ఉన్న వైఎస్ జగన్ ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేస్తే రాష్ట్రంలో స్కూళ్ల రూపురేఖలే మారిపోయాయి, ప్రపంచంతో పోటీ పడాలని, ఆంధ్రప్రదేశ్ ను అక్షర క్రమంతో పాటు ఆభివద్ధిలోనూ ముందుంచాలని ఇంగ్లీష్ విద్యను అమలు చేశారు. ఎన్నో సంస్కరణలు అమలు చేసి నేటి విద్యార్ధులే భవిష్యత్ ఆస్తి అని చెప్పి పాలన చేశారు. మీరు మాత్రం డీఎస్సీలో ఉద్యోగాలు ఇవ్వడానికి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడతారా ? మాట్లాడితే కేసులు పెడతారా ? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక నియంతృత్వంలో ఉన్నామా? కాపీలు ఎక్కడా జరగవంటున్నారు, ఈ మధ్య జరిగిన నీట్ లో కాపీలు జరిగాయనే కదా పరీక్షలు రద్దు చేసింది. అక్కడా సీబీటీయే కదా. తప్పు జరిగింది, దాన్ని సరిదిద్దుకునేందుకు ప్రయత్నించండి, నిరుద్యోగుల జీవితాలతో ఆటలు ఆడుకోవద్దు. ముఖ్యమంత్రి బాధ్యత తీసుకుంటారా లేక విద్యామంత్రి బాధ్యత తీసుకుంటారా చెప్పండి. తప్పనిసరిగా రాజీనామా చేయాల్సిందే. ఈ రాష్ట్రంలో జరిగిన పెద్ద కుంభకోణంగా దీన్ని భావిస్తున్నాం. అధికారం ఉందని మేం ఏ విధంగా చెప్పినా ముందుకు సాగుతుందని అనుకుంటే సరికాదు. ప్రజాస్యామ్యంలో ప్రజల గొంతుకగా ప్రజల కోసం ఉద్యమించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్దంగా ఉంది. ఎమ్మెల్సీలు వెళ్లి విద్యాశాఖ కమిషనర్ ను కలిశాం, రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు ఇచ్చాం, రేపు ఛలో కలెక్టరేట్ నిర్వహించబోతున్నాం.రాజకీయ నేతగా కోన శశిధర్ వ్యాఖ్యలు:పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ ప్రెస్మీట్లో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ సీనియర్ ఐఏఎస్ అధికారి అని మర్చిపోయి రాజకీయ నాయకుడిలా మాట్లాడారు. వైఎస్సార్సీపీ నాయకుల మీద సివిల్, క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టులు చేస్తామని మాట్లాడుతున్నారు. మీ పాత్ర ఏంటి? అసలేం జరిగింది, దాని మీద మేమేం మాట్లాడాం ? వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఒకవేళ మీరు ఆ బాధ్యత తీసుకోకపోతే అధికారంలో ఉన్న నాయకులు మాట్లాడతారు. కానీ మీరు వాళ్ల పాత్రను తీసుకుని బెదిరింపులకు దిగడం నిరుద్యోగులు, ప్రజలు హర్షించలేదు. నిరుద్యోగుల వేదనపై కోన శశిధర్ గారి నుంచి సమాధానం వస్తుందని భావించాం, కానీ తెలియదు, అవగాహన లేదు, తన దృష్టిలో లేదని చెప్పేశారు. సరైన సమాధానం చెప్పలేక బెదిరింపులకు దిగి ప్రెస్ మీట్ ముగించారు. డీఎస్సీలో ఎస్సీఈఆర్టీలో పనిచేస్తున్న నవీన్ అనే వ్యక్తి సోషల్ స్టడీస్, తెలుగు మెథడాలజీలో పరీక్షలు రాస్తే సోషల్ లో ఫస్ట్ ర్యాంక్, తెలుగులో ఆరో ర్యాంక్ వచ్చింది. దీనిపై ప్రశ్నిస్తే కోన శశిధర్.. ఆయన మా దగ్గర ఉద్యోగిగా ఉన్నాడు, పరీక్ష రాసేటప్పుడు ఎన్వోసీ ఇవ్వలేదు కాబట్టి పక్కనబెట్టామన్నారు. తర్వాత అడిగితే సర్టిఫికెట్ల «ధృవీకరణకు రాలేదని పక్కనబెట్టామన్నారు. ఈ రెండింటిలో ఏది నిజమో ఆయన చెప్పాలి. నవీన్ ఫస్ట్ ర్యాంక్ ఉన్నట్లు వెబ్ సైట్ లో పెట్టాక, ఆరోపణలు రావడంతో మెరిట్ లిస్ట్ తీసేసి, దాని స్ధానంలో రివైజ్డ్ లిస్ట్ పెట్టారు. ‘బైజూస్’ పేరుతో డైవర్షన్ పాలిటిక్స్జగన్మోహన్రెడ్డి విద్యార్ధులకు బైజూస్ ట్యాబ్స్ ఇస్తే అందులో అవినీతి జరిగిందని వార్తలు రాయిస్తున్నారు. విద్యా రంగంలో ఎన్నో సంస్కరణలు చేసిన వ్యక్తి.. బైజూస్ ట్యాబ్స్ విషయంలో అవినీతి చేశాడని చెప్తారా ?, డీఎస్సీ అక్రమాలు బయటపడుతుంటే తట్టుకోలేక, వాటిని డైవర్ట్ చేయడానికి ఇలాంటి ఆరోపణలతో బురద జల్లే యత్నం చేస్తున్నారు. ప్రపంచ స్దాయిలో నాణ్యమైన విద్య అందించేందుకు 8వ తరగతి పిల్లలకు ఉచితంగా ట్యాబ్స్ ఇస్తే.. ఈ ప్రభుత్వం దాన్ని కూడా నాశనం చేసింది. ట్యాబులు ఇవ్వకపోగా.. మళ్లీ మాపై బురద జల్లుతున్నారు. మా మీద చేస్తున్న కక్షపూరిత రాజకీయాల్ని పిల్లల మీద కూడా చేస్తున్నారు. జగనన్నలా ట్యాబులు ఎందుకు ఇవ్వడం లేదని పిల్లలు ప్రశ్నిస్తుంటే.. సమాధానం చెప్పలేక ఇలా బురద జల్లుతున్నారు. కోవిడ్ లాంటి సమయాల్లో ఈ ట్యాబులు పిల్లలకు ఎంతో ఉపయోగపడ్డాయి. ఇప్పుడు వాటిని ఇవ్వకపోగా.. అవినీతి అంటూ బురద జల్లడం మీకే చెల్లింది.ఒక్క నవీన్ విషయంలోనే ఎన్నో అనుమానాలు:వెబ్ సైట్ లో ఆగస్టు 26న అతని పేరు మెరిట్ లిస్ట్ లో నుంచి తొలగించాక, అతని లాగిన్ కూడా బ్లాక్ చేశారు. సెప్టెంబర్ 2న సర్టిఫికెట్ల ధవీకరణ ఉంది. అతని పేరు ముందుగా బ్లాక్ చేశాక కూడా అతనికి కాల్ లెటర్ ఎలా పంపించారు. ఏ విధంగా అతను సెప్టెంబర్ 2 సర్టిఫికెట్ల ధవీకరణకు వచ్చే అవకాశం ఉంటుంది ? నా లాగిన్ బ్లాక్ చేశారు, నాకు కాల్ లెటర్ రాలేదని మీ దగ్గరికి వచ్చాక అతను కోర్టుకు కూడా వెళ్లాడు. మీరు వ్యూహాత్మకంగా బెదిరించి పక్కనబెట్టారా, అతను సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం రాలేదా ఇందులో ఏది నిజమో చెప్పాలి. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు రాలేదని అంటే అతని లాగిన్ ఎందుకు బ్లాక్ చేశారో, అతని ఫస్ట్ ర్యాంక్ ను ఎందుకు డిలీట్ చేశారో చెప్పాలి. ఇది ఆ ఒక్క వ్యక్తికే పరిమితం కాలేదు. ఆ ప్రశ్నాపత్రం కోచింగ్ సెంటర్లకు వెళ్లింది. ఒక్క వ్యక్తిని తొలగిస్తే సమస్య పరిష్కారం కాదు. సమగ్రంగా విచారణ జరిపించాలి. అందులో ఈ వ్యవహారం ఒక్కరికే పరిమితం అయిందా లేక చాలా మందికి వెళ్లిందా అనేది తేల్చాలి. ఇది వైఎస్సార్సీపీ డిమాండ్ మాత్రమే కాదు కొన్ని లక్షల మంది నిరుద్యోగుల కోరిక.డీఎస్సీపై సీబీఐ దర్యాప్తు జరిపించాల్సిందేలక్షా 36 వేల ఉద్యోగాలు ఒకేసారి ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. 3.50 లక్షల మందికి పరీక్షలు సక్రమంగా నిర్వహించలేక అక్రమాలకు పాల్పడ్డారు. డీఎస్సీలో ప్రతిసారీ మెరిట్ లిస్ట్ ప్రకటిస్తారు. అందరి మార్కుల్నీ వెల్లడిస్తారు. మొదటి మార్కు నుంచి చివరి మార్కు వరకూ పాసైన అందరి వివరాలు ఇందులో ఉంటాయి. వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ సిస్టమ్ ల ప్రకారం సెలెక్షన్ లిస్ట్ తయారు చేయాలి. ఆ తర్వాత సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ఉద్యోగాల భర్తీ ఉంటుంది. కానీ అభ్యర్ధులకు కాల్ లెటర్స్ వ్యక్తిగతంగా పంపించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తర్వాత కూడా వందల మందికి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఎందుకని ప్రశ్నిస్తే మీ ఉద్యోగాల్ని స్పోర్ట్స్, పీహెచ్ కోటా కింద ఇచ్చామని అధికారులు చెప్పారు. నిన్న కోన శశిధర్ కూడా 1:1లో ఉద్యోగాలు ఇచ్చామన్నారు. హారిజాంటల్ రిజర్వేషన్ పద్ధతి ప్రకారం కొత్తగా స్పోర్ట్స్, పీహెచ్, మహిళా కోటాలో ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి కొందరిని తొలగించామన్నారు. కాల్ లెటర్స్ పంపాక ఈ కోటాలు కొత్తగా ఎందుకు అమలు చేసారు. ఈ విషయం కాల్ లెటర్స్ పంపక ముందు చూసుకోలేదా ? హారిజాంటల్ కేటగిరీలో చూసుకుంటే ఉదాహరణకు కడపలో ఉర్దూ పోస్టులు 3 ఉంటే, ఇందులో మొదటి పోస్టు మహిళకు ఇవ్వాలి. రోస్టర్ పాయింట్స్ 58–75–83 లో ఎస్టీలకు ఇవ్వాలి. ఓ అమ్మాయిని, ఇద్దరు అబ్బాయిల్ని పిలిచారు. వీరికి ఉద్యోగాలు ఇచ్చేయాలి. కానీ మెరుగైన ర్యాంక్ ఉన్న అమ్మాయిని కాస్తా 58లో ఇవ్వకుండా 75లో ఇచ్చేశారు. మహిళా రిజర్వేషన్ ప్రకారం కాకుండా జనరల్ లో ఇవ్వాలని భావించారు. దీని వల్ల ఇద్దరు అబ్బాయిల్లో ఒకరు మిగిలిపోయారు. ఇది హారిజాంటల్ సిస్టమ్ కు వ్యతిరేకం. దీని మీద సదరు ఎస్టీ అభ్యర్ధి ప్రశ్నించినా ఫలితం లేక కోర్టుకు వెళ్లాడు. స్పోర్ట్ కోటాలో కూడా గోల్డ్ మెడల్ వచ్చిన వారికీ ఉద్యోగాలు ఇవ్వలేదు. అందుకే సీబీఐ దర్యాప్తు జరిగి వాస్తవాలు బయటికి రావాలి. ఇలాంటి తప్పులు పునరావతం కాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నాం.డీఎస్సీ కాదు ముమ్మాటికీ దగా డీఎస్సీ:వరుదు కల్యాణి, ఎమ్మెల్సీఎంతో పారదర్శకంగా చేపట్టాల్సిన డీఎస్సీని ఇవాళ దగా డీఎస్సీగా మార్చేశారు. నిరుద్యోగుల తరఫున వైఎస్సార్సీపీ ముందు నుంచీ చాలా ప్రశ్నలు అడుగుతోంది. స్పోర్ట్స్ కోటాను తీసుకుంటే 2012లో ఓ జీవో విడుదల చేశారు. 29 క్రీడలకు 2 శాతం రిజర్వేషన్ కల్పించారు. 2025 ఏప్రిల్ 18న ఇంకో 36 గేమ్స్ కలిపి మొత్తం 65 క్రీడలకు అవకాశం కల్పిస్తూ జీవో ఇచ్చారు. ఈసారి డీఎస్సీలో 421 మందికి స్పోర్ట్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారు. 2026 మేలో టెట్, డీఎస్సీ లేకుండా ఉద్యోగాలు ఇచ్చిన వారికి పరీక్ష పెట్టాలని మళ్లీ ఇంకో జీవో ఇచ్చారు. పాత జీవోను రద్దు చేశారు. ఇన్ని మార్పులు ఎందుకు చేస్తున్నారు? అక్రమాలు జరిగినందుకేగా?, టెట్, డీఎస్సీ లేకుండా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వడం ఏంటి ? ఈ కోటాలో ఇచ్చిన ఉద్యోగాల్లో క్రీడల అర్హతల ప్రాతిపదిక కూడా మార్చేశారు. మెడల్స్ కొట్టిన వారికి కాకుండా ఛాంపియన్ షిప్ లో పాల్గొన్న వారికి ప్రాధాన్యం ఇచ్చారు. డీఎస్సీ పేపర్ తయారీలో భాగమైన వ్యక్తికే ఫస్ట్ ర్యాంక్ వచ్చే ఉద్యోగం నుంచి తొలగించారు. కోన శశిధర్ కూడా మా ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వలేదు. కేవలం దాటవేత ధోరణి ప్రదర్శించారు. నవీన్ గురించి మూడు రకాలుగా సమాధానాలు చెప్పారు. కొన్ని లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలు ఆడుకున్నారని అర్దమవుతోంది. అందుకే సీబీఐ విచారణ కోరుతున్నాం’ అని డిమాండ్ చేశారు. -
వైఎస్సార్ విగ్రహం ధ్వంసంపై వైఎస్సార్సీపీ ధర్నా
నంద్యాల: నంద్యాల శ్రీనివాస్ సెంటర్ వద్ద మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేయడమే కాకుండా అది వైఎస్సార్సీపీ కార్యకర్త పనే అంటూ టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని వైఎస్సార్సీపీ ఖండించింది. ఘటన జరిగి కొద్ది సేపట్లోనే టీడీపీ వారి సోషల్ మీడియా హ్యాండిల్లో తప్పుడు ప్రచారం మొదలు పెట్టడంపై మండిపడింది.పోలీసులు మాత్రం మతిస్థిమితం లేని వ్యక్తి అని సర్టిఫికేట్ చూపించి విషయాన్ని తప్పదోవ పట్టించే ప్రయత్నం చెశారని వైఎస్సార్సీపీ మండిపడింది. ధ్వంసం చేసిన వ్యక్తి టీడీపీ-జనసేన నాయకులతో తిరిగితే అతను వైఎస్సార్సీపీ కార్యకర్త అంటూ చెప్పడాన్ని ప్రశ్నించింది. కచ్చితంగా ఈ ఘటన వెనుక ఎవరున్నారో నిగ్గు తేల్చాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. ఈ ధర్నాలో నంద్యాల జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి , ఎమ్మెల్సీ ఇషాక్ భాషా , పార్టీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు. -
పవన్ ఫోటోలకు చెప్పుదెబ్బలు.. 2029లో సినిమా చూపిస్తాం
-
కేసులకు, బెదిరింపులకు భయపడం : విడదల రజని
సాక్షి,తాడేపల్లి: కేసులకు, బెదిరింపులకు తాను బెదిరిపోనని మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ‘చంద్రబాబు మోసానికి’ రెండేళ్లు పేరిట పార్టీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో మహానాడు సాక్షిగా అబద్ధాలు,మహిళలకు చేసిన మోసంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా విడదల రజిని మీడియాతో మాట్లాడారు.చంద్రబాబు అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే వేధింపులు.. సూపర్ సిక్స్ హామీని గాలికొదిలేశారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెచ్చిన మెడికల్ కాలేజీని అమ్మకానికి పెట్టారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని ఆటకెక్కించారు. చంద్రబాబు మోసాలు,అన్యాయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం. బాబును భూస్థాపితం చేయడం మహిళలకే సాధ్యం’అని అన్నారు. -
స్టాన్ఫోర్డ్ వర్సిటీలో లోకేశ్ సర్టిఫికెట్ కొన్నారు: లక్ష్మీపార్వతి
తాడేపల్లి: బ్రిటిష్ కాలం నాటి విధానాలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్నాయని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి విమర్శించారు. బ్రిటిషర్లపై పోరాడినట్లే ఇప్పుడు పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. మోసానికి రెండేళ్లు పేరుతో వైఎస్సార్సీపీ మహిళా నేతల సమావేశం జరిగింది. ఇందులో లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు నాయుడు మొదట ఇందిరా గాంధీకి వెన్నుపోటు పొడిచాడు. చంద్రబాబు మాటలు నమ్మి ఎన్నికలకు వెళ్లినందుకు కాంగ్రెస్ దారుణంగా ఓడిపోయింది. కాంగ్రెస్ ఓడిపోగానే చంద్రబాబు ఎన్టీఆర్ కాళ్లదగ్గర చేరాడు. చంద్రబాబును పార్టీలోకి తీసుకోవద్దని అందరూ వ్యతిరేకించారు.లోకేశ్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదవలేదు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో సర్టిఫికెట్ కొన్నారు. లోకేశ్ సెవెన్త్ క్లాస్ కూడా సరిగ్గా పాసవ్వలేదు. ఇలాంటి అసమర్థుడిని చంద్రబాబు ప్రజలపై రుద్దాలని చూస్తున్నాడు. మహిళల క్యార్టెక్టర్ ను కించపరచడమేనా చంద్రబాబు మహిళలకు చేసే మేలు. బాలకృష్ణ ఈ రోజు చక్కగా సినిమాలు చేసుకుంటున్నాడంటే వైఎస్సార్ పెట్టిన భిక్ష. జగన్ మోహన్ రెడ్డిని మళ్లీ సీఎంగా చూడాలంటే మహిళల పైనే ఎక్కువ బాధ్యత ఉంది.కానీ భార్యను అడ్డంపెట్టుకుని చంద్రబాబు ఎన్టీఆర్ ను బుట్టలో వేసుకున్నాడు. చంద్రబాబుకు ఎడారి ఒంటె కథ సరిగ్గా సరిపోతుంది. టెంటు కింద చోటిస్తే యజమానిని బయటకు తోసేసిన ఒంటె, చంద్రబాబు ఒకే రకం. చంద్రబాబు అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకుంటాడు. ఎన్టీఆర్ తో నా పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఎన్టీఆర్ పార్టీ నుంచి బయటికి పొమ్మంటే నన్ను బతిమిలాడుకున్నాడు. నేను పట్టుబట్టడం వల్లే చంద్రబాబును పార్టీ నుంచి బయటికి గెంటేయకుండా ఆగారు.ఆ రోజు ఎన్టీఆర్ కు ద్రోహం చేయొద్దని నేను కోరాను. ఎన్టీఆర్ ను ఎప్పటికీ మోసం చేయనని నా చేతిలో చేయి వేసి, తన కొడుకుపై చంద్రబాబు ఒట్టు వేశాడు. నా దగ్గర ఒట్టు వేసి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు చేయి తాకడం కూడా పాపమే. వైస్రాయ్ హోటల్ కు వెళ్లినందుకు ఎన్టీఆర్ పై చెప్పులు వేయించారు. అవమానిస్తే ఎన్టీఆర్ చనిపోతాడని తెలిసి తీవ్రంగా అవమానించారు. ఎన్టీఆర్ పై క్షుద్రపూజలు కూడా చేయించిన నీచుడు చంద్రబాబు’’ అని చెప్పారు. -
బాబు, పవన్.. మీ పాలనలో మోసపోయింది మహిళలే: పూజిత
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు రెండేళ్ల పాలనలో మోసపోయింది మహిళలేనని వైఎస్సార్సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత ఆరోపించారు. మహిళల పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ తన ఎమ్మెల్యేను అదుపు చేయలేకపోయారని అన్నారు. నాయకుల మాదిరిగానే కూటమి పార్టీ నేతల పీఏలు కూడా మహిళలపై దాడులు చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్సార్సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో ఆడబిడ్డలపై చేయి వేస్తే అదే ఆఖరి రోజని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు చెప్పినట్లు నిందితులకు కాదు బాధిత మహిళలకు అదే ఆఖరి రోజు అవుతోంది. కోనేటి ఆదిమూలం, అరవ శ్రీధర్ ఘటనలే ఇందుకు సాక్ష్యం. న్యాయం కోరిన బాధితురాలి పైనే దాడి చేసినా పట్టించుకోలేదు. మహిళల పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ తన ఎమ్మెల్యేను అదుపు చేయలేకపోయారు.ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన బీఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్ చేశారు. దేవుడంటే కూడా కూటమి నేతలకు భయం లేదు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?. నాయకుల మాదిరిగానే కూటమి పార్టీ నేతల పీఏలు కూడా మహిళలపై దాడులు చేస్తున్నారు. వైఎస్ జగన్ అధికారంలో ఉండుంటే ఆడపిల్లపై చెయ్యి వేయాలంటే ఒక్కొక్కరు భయపడేవారు. నా వంటి వారు రాజకీయాల్లోకి వచ్చారంటే అది జగన్ ఇచ్చిన ధైర్యం’ అని చెప్పుకొచ్చారు. -
చంద్రబాబు, జగన్ మధ్య తేడా ఇదే: సజ్జల
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం.. మహానాడు సాక్షిగా చెప్పిన అబద్ధాలపై తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో చర్చ జరిగింది. సమావేశానికి వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మహిళా మంత్రులు, మాజీ మేయర్లు, మాజీ మహిళా ఎమ్మెల్యేలు, మహిళా ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఈ రెండేళ్లలో చంద్రబాబు చేసింది వ్యవస్థీకృత అరాచకపాలన. చంద్రబాబు ప్రభుత్వంలో ఎక్కువగా మోసపోయింది మహిళలే. వైఎస్ జగన్ ఐదేళ్లలో మహిళలకు పెద్దపీట వేశారు. చంద్రబాబు మోసం చేసి పుండుమీద కారం చల్లుతున్నారు. జగన్ కంటే ఎక్కువ చేస్తానని అధికారంలోకి వచ్చి ఉన్నవి కూడా పీకేశాడు. చంద్రబాబుకు జగన్కు ఎంతో వ్యత్యాసం ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు.‘‘అధికారం ఇచ్చిన ప్రజలకు మేలు చేయాలనేది జగన్ ఆలోచన. ఇచ్చిన హామీలను నెరవేర్చడం బాధ్యతగా జగన్ భావించారు. కానీ చంద్రబాబు ఏం చేయకుండానే సూపర్ సిక్స్ హామీలన్నీ నెరవేర్చేశానంటున్నాడు. ఇప్పుడు పిల్లలే సంపద పిల్లల్నికనండి అని చంద్రబాబు చెబుతున్నాడు. చంద్రబాబు ఇంటి నుంచే ఎందుకు మొదలుపెట్టరు. నెలకు 1500 ఆడబిడ్డ నిధి హామీని పక్కన పెట్టేశాడు. ఇప్పుడు ముగ్గుర్ని కంటే రూ.30 వేలు నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తామంటున్నాడు. మాఫియా అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో చంద్రబాబు పాలన ఒక ఉదాహరణ..రాష్ట్రంలో ఎక్కడ చూసినా దోపిడీనే కనిపిస్తోంది. వైఎస్ జగన్.. చంద్రబాబుకు గొడ్డలిలా కనిపిస్తున్నాడు. తనను రాజకీయంగా సమాధిచేయగల శక్తి జగన్కే ఉందని చంద్రబాబుకు భయం. అందుకే పదే పదే గొడ్డలి పార్టీ అని విమర్శలు చేస్తున్నాడు. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి ఈ రెండేళ్లలో జరిగిన దోపిడీని ప్రజలకు మనం వివరించాలి. ఆడబిడ్డ నిధి ఇస్తామని చంద్రబాబు చేసిన అతిపెద్ద మోసం. చంద్రబాబు చొక్కా పట్టుకుని నిలదీయాలి. మా హామీల సంగతి ఏంటని చంద్రబాబు,లోకేష్,పవన్ను ఎక్కడ కనబడినా అడగాలి’’ అని సజ్జల పిలుపునిచ్చారు.అనిత ఎక్కడ చర్చకు రమ్మన్నా వస్తాం: వరుదు కల్యాణివరుదు కల్యాణి మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు పాలన అంతా మోసం దగా. హామీలకు ఎగనామం పెట్టి ప్రజలకు పంగనామాలు పెట్టారు. చంద్రబాబు చీఫ్ మినిస్టర్ కాదు చీటింగా మాస్టర్. మొన్న జరిగింది హైబ్రీడ్ మహానాడు కాదు లోగ్రేడ్ మహానాడు. తల్లికి, చెల్లికి మహిళలందరికీ చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. మహానాడులో వైఎస్ జగన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. టీడీపీ నేతలకు వైఎస్ జగన్ ఎదురుగా నిలబడే ధైర్యం ఉందా?...టీడీపీకి, వైఎస్సార్సీపీకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. టీడీపీ, వైఎస్సార్సీపీ బోత్ ఆర్ నాట్ సేమ్. తెలుగువారి పౌరుషాన్ని జగన్ ఢిల్లీకి చూపించారు. తెలుగువారి ప్రయోజనాలను ఢిల్లీకి చంద్రబాబు తాకట్టు పెట్టారు. ఇచ్చిన హామీలు నెరవేర్చిన నాయకుడు వైఎస్ జగన్. హామీలను ఎగ్గొట్టిన మోసగాడు చంద్రబాబు. మా బ్రాండ్ సంక్షేమం.. మీ బ్రాండ్ సంక్షోభం. హోంమంత్రి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మేం కూడా మీలా మాట్లాడగలం కానీ మాకు సంస్కారం అడ్డొస్తుంది. జైల్లో ఖైదీలతో కుమ్మక్కైన మీకు వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత లేదు. రాష్ట్రాన్ని మద్యం, గంజాయికి కేరాఫ్ అడ్రస్గా మార్చేశారు. హోంమంత్రి అనిత ఎక్కడ చర్చకు రమ్మన్నా వస్తాం. వైఎస్ జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి మీకు వివరిస్తాం -
డీఎస్సీలో అక్రమాలపై రేపు వైఎస్సార్సీపీ ధర్నా
రాజమహేంద్రవరం సిటీ: డీఎస్సీ–2025లో అవకతవకలు, మోసాలపై జూన్ 1న వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేయనున్నట్లు వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు. డీఎస్సీపై సీబీఐ, సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేస్తామన్నారు.డీఎస్సీ నిర్వహణలో ప్రతిభ కలిగిన అర్హులకు అన్యాయం చేయడం, హైకోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండించారు. డీఎస్సీ నిర్వహణలో పారదర్శకత లోపించడం, విస్తుగొలిపే అక్రమాలు వెలుగు చూడడం, మెరిట్ లిస్టులు వెబ్సైట్ నుంచి మాయం చేయడం, రోల్ ఆఫ్ రిజర్వేషన్ సక్రమంగా పాటించకపోవడం, పోస్టులు అమ్ముకోవడం వంటి ఆరోపణలు బయటికి రావడం, స్పోర్ట్స్ కోటా పోస్టుల నియామకంలో అక్రమాలు వెలుగు చూడడం వంటి అంశాలపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ అభ్యర్థులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు. -
సర్కారు ఉక్కిరిబిక్కిరి!
తిరుపతి టాస్క్ఫోర్స్: డీఎస్సీ–2025లో అవకతవకలు బట్టబయలు కావడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం.. దాన్నుంచి బయట పడేందుకు కొత్తగా ఉపాధ్యాయులైన వారిని పావులుగా వాడుకునేందుకు స్కెచ్ వేసింది. మెరిట్ కలిగి ఉండీ, ఉద్యోగం రాని బాధితుల తరఫున పోరాడుతున్న వైఎస్సార్సీపీ పైకి వారిని ఉసిగొల్పేందుకు శక్తి వంచన లేకుండా కుట్ర పూరితంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో తిరుపతి వేదికగా బాలాజీ కాలనీలోని లక్ష్మీనారాయణ కళ్యాణ మండపంలో ‘నిరుద్యోగులపై గొడ్డలి వేటు’ అంటూ సమావేశం నిర్వహించేందుకు ప్రణాళిక రచించింది.స్వచ్ఛందంగా ఉపాధ్యాయులు ఈ సమావేశానికి వచ్చే పరిస్థితి ఉండదని భావించి డీఈవోను అడ్డం పెట్టుకుని మార్గ నిర్దేశం చేసింది. దీంతో డీఈవో కాస్తా టీడీపీ నేతగా పరకాయ ప్రవేశం చేశారు. ప్రభుత్వ పెద్దల సూచన మేరకు.. శనివారం మీటింగ్ ఉందని డీఎస్సీ–2025లో పోస్టింగ్ పొందిన ప్రతి ఉపాధ్యాయుడు మీటింగ్కు హాజరు కావాలని డీఈవో కేవీఎన్ కుమార్ తన సిబ్బందితో ఫోన్లు చేయించారు. ఓ దశలో వచ్చి తీరాల్సిందేనని బెదిరించారు. తీరా ఆ సమావేశానికి హాజరైన ఉపాధ్యాయులు.. అక్కడ టీడీపీ నేతలు ఉండటం చూసి బిత్తర పోయారు.డీఎస్సీ కుంభకోణంపై గళమెత్తిన వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన సమావేశానికి తమను మభ్యపెట్టి రప్పించడం తగదని అసహనం వ్యక్తం చేశారు. అధికారిక సమావేశం అని చెప్పి ప్రతిపక్ష పార్టీలను విమర్శించమని నిర్దేశించడం తగదని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో వారికి ఎదురు చెబితే దాడులు చేస్తారని జడిసి మిన్నకుండిపోయారు. ఈ సమావేశంలో శాప్ చైర్మన్ రవి నాయుడు, టీడీపీ ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, రాంభూపాల్రెడ్డి 2 గంటల పాటు టీడీపీ ప్రభుత్వానికి అనుకూలంగా, వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు.టీడీపీ కూటమి ప్రభుత్వానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. కాగా, పార్టీ సమావేశాన్ని తలపించేలా రాజకీయ నేతలు ఉపన్యాసాలు ఇవ్వడం ఏమిటని ఉపాధ్యాయులు తలలు పట్టుకున్నారు. తుదకు తమను పార్టీ కార్యకర్తలుగా చేశారని వాపోయారు. ‘ప్రభుత్వం ఇలా చేయడం తగదు. మమ్మల్ని ఇలా పిలిపించడం ఏమాత్రం సరికాదు. తప్పు జరిగింది కాబట్టే ప్రభుత్వం ఇంతగా భయపడుతోందని అర్థమవుతోంది.లేకుంటే ఇంత దొంగచాటుగా సమావేశం నిర్వహించడం ఏమిటి? పొరపాట్లు జరిగి ఉంటే హూందాగా ఒప్పుకుని సరిచేయాలి. అర్హత ఉన్న వారికి ఉద్యోగం రాకపోవడం నిజంగా నేరమే’ అని ఈ సమావేశానికి హాజరైన పలువురు ఉపాధ్యాయులు వ్యాఖ్యానించారు. ఈ విషయమై మీడియా ప్రతినిధులు డీఈవోను సంప్రదిస్తే.. ఆ సమావేశంతో తనకు సంబంధం లేదని విచిత్ర సమాధానం చెప్పడం కొసమెరుపు. అసలు ఏ అధికారంతో శాప్ చైర్మన్ రవి నాయుడు ఈ సమావేశం నిర్వహించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని బాధిత డీఎస్సీ అభ్యర్థులు డిమాండ్ చేశారు.సీన్ 1 : ‘డీఎస్సీ కుంభకోణంతో మన పరువుపోతోంది. మనమేమో గొప్పగా నిర్వహించామని ఇన్నాళ్లూ చెప్పుకున్నాం.. ఇలాగే సైలెంట్గా ఉంటే మన గ్రాఫ్ తగ్గిపోతుంది.. ఏదో ఒకటి చేయాలి.. లేదంటే ప్రజల్లో పలుచనైపోతాం.. చేసేదేదో త్వరగా చేయండి’ అని ప్రభుత్వ పెద్దలు తీవ్ర ఆందోళనతో దిశా నిర్దేశం చేశారు.సీన్ 2 : డీఎస్సీ కుంభకోణాన్ని అంతా తానై నడిపించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న శాప్ చైర్మన్ రవి నాయుడు రంగంలోకి దిగారు. తిరుపతి డీఈవోపై ఒత్తిడి తెచ్చారు. ప్రభుత్వ పరువు కాపాడటం కోసం తమకు సహకరించాలని, ఇది ‘పెద్దల’ నిర్ణయం అని చెప్పారు.సీన్ 3 : ‘హలో.. మేము డీఈవో కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాం. 2025 డీఎస్సీలో ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి శనివారం తిరుపతిలో డీఈవోతో సమావేశం ఉంది. ఉదయం 10 గంటలకు బాలాజీ కాలనీలోని లక్ష్మీనారాయణ కళ్యాణ మండపం వద్దకు కచ్చితంగా చేరుకోవాలి. ఎట్టిపరిస్థితిలో మిస్ కాకూడదు. మీటింగ్కు హాజరుకాని వారిపై కఠిన చర్యలు ఉంటాయి’ అని ఫోన్ ద్వారా హుకుం జారీ.సీన్ 4 : అఫీషియల్ సమావేశం అని చెప్పడంతో కొత్త ఉపాధ్యాయులంతా పనులు మానుకుని శనివారం హుటాహుటిన తిరుపతి చేరుకున్నారు. సమావేశం ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలోకి వెళ్లగానే అక్కడి వాతావరణం చూసి భయపడ్డారు. ఏమైనా మాట్లాడితే స్టేజి పైనున్న టీడీపీ నేతల అనుచరులు తన్నేలా ఉన్నారని నోరు మూసుకుని కూర్చున్నారు. ఈ గోలంతా తనకెందుకని అనుకున్న డీఈవో గైర్హాజరయ్యారు.సీన్ 5 : ‘మీరంతా కష్టపడి టీచర్ ఉద్యోగాలు సంపాదించారు. కానీ ప్రతిపక్ష వైఎస్సార్సీపీ కాదంటోంది. వారికి తగిన విధంగా మీరు సమాధానం ఇవ్వాలి. లేదంటే మీకు ఉద్యోగాలు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంపై మరక పడుతుంది’ అని శాప్ చైర్మన్ రవినాయుడు దిశానిర్దేశం చేశారు. ఇందుకు ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, రాంభూపాల్రెడ్డి వంత పాడారు. రాజకీయ సభకు ఉపాధ్యాయులా!?విద్యాభివృద్ధి, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన డీఈవో, అధికార పార్టీ రాజకీయ కార్యక్రమాలకు ఉపాధ్యాయులను సమీకరించే పనిలో నిమగ్నం కావడం దారుణం. డీఎస్సీలో జరిగిన అవకతవకలు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకు అధికార పార్టీ కొత్తగా నియమితులైన టీచర్లతో రాజకీయ సభ నిర్వహించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ఆ సభకు డీఈవో కార్యాలయం నుంచి టీచర్లకు ఫోన్లు చేసి రప్పించడం ఇంకా దారుణం. విద్యా కార్యక్రమమని భావించి హాజరైన ఉపాధ్యాయులకు రాజకీయ ఉపన్యాసం వినిపించడం ఏమాత్రం సబబు కాదు. ఈ అంశంపై కలెక్టర్ వెంటనే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. – వందవాసి నాగరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి, తిరుపతిటీడీపీ అడ్డాగా డీఈవో ఆఫీస్జిల్లా విద్యా శాఖ అధికారి అధికార పార్టీకి ఏజెంట్గా వ్యవహరిస్తూ తన పదవికి మచ్చ తెచ్చారు. ఈయన్ను తక్షణం విధుల నుంచి తొలగించాలి. జిల్లా విద్యా శాఖ కార్యాలయం అధికార పార్టీకి అడ్డాగా మారింది. అధికార పార్టీ ఏర్పాటు చేసే సభలకు కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులను సమీకరించే సాధనంగా డీఈఓ కార్యాలయాన్ని ఉపయోగించడం దారుణం. అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టే ఉద్దేశంతో డీఈవో ఉపాధ్యాయులకు ఫోన్లు చేసి సభకు హాజరు కావాలని ఆదేశించడం దుర్మార్గం. ఆయన ఆ పదవికి అనర్హుడు. తక్షణం తొలగించాలి. లేని పక్షంలో ఉద్యమిస్తాం. – అక్బర్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, తిరుపతిడీఈఓను సస్పెండ్ చేయాలిడీఈవో స్థాయి అధికారి ఓ పార్టీకి కొమ్ము కాయడం దారుణం. పార్టీలకు అతీతంగా వ్యవహరించాల్సిన వ్యక్తి ఇలాంటి దుశ్చర్యకు పాల్పడటం సహించరాని విషయం. డీఎస్సీలో జరిగిన అవినీతిపై వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసనలకు భయపడి ఉపాధ్యాయులను ఉసిగొల్పాలనుకోవడం దారుణం. అధికారిక మీటింగ్ అని చెప్పి, ఉపాధ్యాయులను మభ్యపెట్టి పార్టీ మీటింగ్లకు హాజరు కావాలని హుకుం జారీ చేసిన డీఈఓను తక్షణం సస్పెండ్ చేయాలి. – డాక్టర్ ఓబుల్రెడ్డి, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, తిరుపతిఎవరు చెబితే ఇలా చేశారు?డీఈఓగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డీఈవో తీరు విమర్శలకు తావిస్తోంది. విద్యా వ్యవస్థను రాజకీయాలకు ముడిపెట్టి పబ్బం గడుపుకుంటున్నారు. జిల్లా విద్యాశాఖలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్న తరుణంలో, వాటిపై దృష్టి సారించకుండా పార్టీ మీటింగ్లకు ఉపాధ్యాయులను పంపే కార్యక్రమంలో ఉండటం దారుణం. ఇలాంటి వ్యక్తులు ఆ పదవికి అనర్హులు. ఇలాంటి వ్యవహారాలతోనే ‘పది’ ఫలితాలపై ప్రభావం పడుతోంది. ఇంతకూ ఎవరు చెబితే డీఈవో ఈ సమావేశం నిర్వహించారో వెల్లడించాలి. – సుందరరాజు, ఎన్ఎల్ఎస్ఏ జాతీయ అధ్యక్షుడుఅబ్బే.. మేం పిలవలేదు..డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులకు తిరుపతిలో శనివారం మీటింగ్కు హాజరు కావాలని మేము ఎవరికీ చెప్పలేదు. డీఈవో ఆఫీస్ నుంచి తాను చెప్పినట్లు ఎవరూ కాల్స్ చేయలేదు. కొత్తగా ఎంపికైన టీచర్లను మీటింగ్ పేరుతో పిలిపించి.. టీడీపీ వాళ్లు నిర్వహించిన మీటింగ్కు హాజరు కావాలని మేము చెప్పలేదు. నాకు ఈ అంశంతో సంబంధం లేదు. పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా శనివారం నేను పిచ్చాటూరు, సత్యవేడు ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాల పరిశీలనలో ఉన్నాను. నా పేరు చెప్పి, డీఈవో ఆఫీస్ నుంచి ఎవరైనా ఫోన్లు చేసి ఉపాధ్యాయులను పిలిపించారేమో విచారిస్తాను. – కేవీఎన్ కుమార్, జిల్లా విద్యాశాఖాధికారి -
‘దళిత క్రైస్తవులను ఎస్సీలుగానే పరిగణించాలి’
న్యూఢిల్లీ: దళిత క్రైస్తవులను షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) జాబితాలో కొనసాగిస్తూ వారికి రాజ్యాంగబద్ధ హక్కులు కల్పించాలని వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం డిమాండ్ చేసింది. మతం మారినంత మాత్రాన శతాబ్దాలుగా కొనసాగుతున్న కుల వివక్ష, సామాజిక వెనుకబాటుతనం తొలగిపోదని గతంలో నియమించిన పలు కమిషన్లు స్పష్టంగా తేల్చిచెప్పాయని గుర్తు చేసింది. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ జస్టిస్ కే.జి. బాలకృష్ణన్ కమిషన్కు శనివారం వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం వినతిపత్రం సమర్పించింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సామాజిక న్యాయ స్ఫూర్తికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. వినతిపత్రం సమర్పించిన అనంతరం న్యూఢిల్లీలోని ఆంధ్ర భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్సార్సీపీరాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్రావు, ఎంపీలు డాక్టర్ ఎం. గురుమూర్తి, గొల్ల బాబూరావు, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్, మాజీ ఎంపీ నందిగం సురేష్ మాట్లాడారు. దళిత క్రైస్తవుల విషయంలో వివక్షత కొనసాగడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని వారు పేర్కొన్నారు. సిక్కులు, బౌద్ధులకు ఎస్సీ హోదా కొనసాగిస్తున్నట్లే దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలకు కూడా అదే హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. గతంలో కాకా కాలేల్కర్ కమిషన్, రంగనాథ్ మిశ్రా తదితర కమిషన్లు చేసిన సిఫార్సులను అమలు చేసి దళితులకు న్యాయం చేయాలని కోరారు.ప్రెస్మీట్లో వైఎస్సార్సీపీ ప్రతినిధులు ఏమన్నారంటే..వారి మాటల్లోనేదళితుల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం: ఎంపీ డాక్టర్ ఎం. గురుమూర్తి వైఎస్సార్సీపీఅధ్యక్షుడు వైయస్ జగన్ గారి ఆదేశాల మేరకు దళిత క్రైస్తవుల హక్కుల పరిరక్షణ కోసం జస్టిస్ కే.జి. బాలకృష్ణన్ కమిషన్కు ఈ రోజు వినతిపత్రం సమర్పించాం. ప్రస్తుతం సిక్కు, బౌద్ధ మతాలకు చెందిన దళితులకు ఎస్సీ హోదా కొనసాగుతున్నట్లుగానే, దళిత క్రైస్తవులకు కూడా అదే హక్కులు కల్పించాలి. గతంలో నియమించిన పలు కమిషన్లు మతం మారినంత మాత్రాన సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనం తొలగిపోదని స్పష్టంగా పేర్కొన్నాయి. ఆ నివేదికలను పరిగణనలోకి తీసుకుని దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కమిషన్ను కోరాం. కేంద్ర ప్రభుత్వానికి సమర్పించే నివేదికలో సానుకూల సిఫార్సులు చేయాలని విజ్ఞప్తి చేశాం. ఈ అంశం రాజకీయాలకు అతీతమైనది. అన్ని రాజకీయ పార్టీలు కలిసి నిజమైన అర్హుల హక్కులను కాపాడేందుకు ముందుకు రావాలి. దళిత క్రైస్తవుల ఎస్సీ హోదా విషయంలో వైఎస్సార్సీపీచిత్తశుద్ధితో వ్యవహరించింది. 2023 మార్చి 24న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. ఆ తీర్మానానికి, దళితుల హక్కుల పరిరక్షణకు మా పార్టీ ఇప్పటికీ కట్టుబడి ఉంది.దళితుడు ఏ మతంలో ఉన్నా దళితుడే: గొల్ల బాబూరావుదళితులు ఏ మతాన్ని స్వీకరించినా వారి సామాజిక వాస్తవికత మారదు. మతం ఆధారంగా దళితుల హక్కులను నిరాకరించడం సరికాదు. అందువల్ల దళితులు ఏ మతంలో ఉన్నా వారికి ఎస్సీ హోదా కల్పించాల్సిందే. సామాజిక న్యాయం, రాజ్యాంగ స్ఫూర్తి దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై సానుకూల నిర్ణయం తీసుకోవాలి.మత స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదు: జూపూడి ప్రభాకర్రావుదళిత క్రైస్తవుల హక్కులను కాలరాస్తూ వారిని బీసీసీ వర్గంలోకి నెట్టివేసే ప్రయత్నాలను వైఎస్సార్సీపీతీవ్రంగా ఖండిస్తోంది. దళిత క్రైస్తవులు ఏ మతంలో ఉన్నా వారి సామాజిక వాస్తవికత మారదు. అందువల్ల వారిని ఎస్సీలుగానే పరిగణించాలన్నదే మా పార్టీ స్పష్టమైన వైఖరి. రాజ్యాంగం ప్రతి పౌరుడికి మత స్వేచ్ఛను కల్పించింది. ఏ మతాన్ని అయినా స్వీకరించే హక్కు ఉన్నప్పుడు, దళితులు క్రైస్తవ మతాన్ని స్వీకరించినందుకు మాత్రమే ఎస్సీ హోదా నిరాకరించడం సామాజిక న్యాయ సూత్రాలకు విరుద్ధం. మతం మారినా కుల వివక్ష పోవడం లేదని కాకా కాలేల్కర్ కమిషన్, రంగనాథ్ మిశ్రా కమిషన్ సహా పలు కమిషన్లు స్పష్టంగా పేర్కొన్నాయి. దేశంలో ఇప్పటికీ దళితులపై వివక్ష కొనసాగుతూనే ఉంది. రెండు గ్లాసుల విధానం, అంటరానితనం, సామాజిక బహిష్కరణ వంటి సమస్యలు పూర్తిగా తొలగిపోలేదు. అలాంటప్పుడు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా నిరాకరించడం అన్యాయం. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలన్న అంశంపై వైయస్ జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2023లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. అదే వైఖరికి వైఎస్సార్సీపీఇప్పటికీ కట్టుబడి ఉంది. దళిత క్రైస్తవుల హక్కుల కోసం వైఎస్సార్సీపీనిరంతరం పోరాడుతుంది. బాలకృష్ణన్ కమిషన్ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా వ్యవహరించి దళిత క్రైస్తవులకు న్యాయం జరిగేలా సానుకూల సిఫార్సులు చేయాలి. దళితుల హక్కులకు భంగం కలిగించే ఏ ప్రయత్నాన్నైనా మేము ప్రతిఘటిస్తాం. అవసరమైతే పార్లమెంట్ వేదికగా కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం.దళితుల హక్కుల పరిరక్షణ కోసం వైఎస్సార్సీపీ పోరాటం:మేరుగు నాగార్జున దళిత క్రైస్తవులకు అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతోనే వైఎస్సార్సీపీఈ రోజు పోరాటం చేస్తోంది. దళితుల సామాజిక, ఆర్థిక పరిస్థితులపై అధ్యయనం చేసిన పలు కమిషన్లు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని స్పష్టంగా సూచించాయి. సిక్కులు, బౌద్ధ మతాలకు చెందిన దళితులకు ఎస్సీ హోదా కొనసాగిస్తున్నట్లుగానే, దళిత క్రైస్తవులకు కూడా అదే హక్కులు కల్పించాలి. దళితులపై దాడులు, అఘాయిత్యాలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రజల్లో ఆందోళన ఉంది. చర్చిలపై దాడులు జరుగుతున్న ఘటనలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. దళిత సంక్షేమాన్ని ఆకాంక్షించే నాయకుడిగా వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2023 ఏప్రిల్ 24న దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఆ తీర్మానానికి వైఎస్సార్సీపీఇప్పటికీ కట్టుబడి ఉంది. దళితుల హక్కుల పరిరక్షణ కోసం, వారికి న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఢిల్లీలో జస్టిస్ కే.జి. బాలకృష్ణన్ కమిషన్ను కలిసి వినతిపత్రం సమర్పించాం. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించడం సామాజిక న్యాయానికి అనుగుణమైన చర్య అవుతుంది. రాబోయే రోజుల్లో కూడా దళితులు, క్రైస్తవుల హక్కుల పరిరక్షణ కోసం వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుంది. దళిత క్రైస్తవుల పక్షాన వైయస్ జగన్ గారు దృఢంగా నిలబడతారని స్పష్టం చేస్తున్నాం.దళితుల పక్షాన నిలిచిన నాయకుడు జగన్: ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో దళితుల హక్కులపై కుట్ర జరుగుతోందనే ఆందోళన కలుగుతోంది. దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితా నుంచి దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పుట్టుకతో వచ్చిన కులాన్ని మత మార్పిడితో మార్చలేమనే వాస్తవాన్ని గుర్తించాలి. మతం మారినా సామాజిక వివక్ష, వెనుకబాటుతనం కొనసాగుతూనే ఉందని గతంలో నియమించిన పలు కమిషన్లు స్పష్టంగా పేర్కొన్నాయి. సిక్కు, బౌద్ధ మతాలను స్వీకరించిన దళితులకు ఎస్సీ హోదా కొనసాగుతుంటే, దళిత క్రైస్తవుల విషయంలో మాత్రమే భిన్నమైన వైఖరి అవలంబించడం సమంజసం కాదు. దళిత క్రైస్తవులను ఎస్సీలుగానే కొనసాగించాలని గతంలో నియమించిన కమిషన్లు సిఫార్సు చేశాయి. అయినప్పటికీ మరోసారి ఈ అంశాన్ని వివాదాస్పదం చేయడం అనుమానాలకు తావిస్తోంది. దళితులు క్రైస్తవ మతాన్ని స్వీకరించినంత మాత్రాన వారి సామాజిక పరిస్థితులు మారిపోలేదు. గ్రామాల్లో ఇప్పటికీ వివక్ష, వెలివేత, అనేక రకాల సామాజిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందువల్ల వారికి రాజ్యాంగబద్ధంగా లభించాల్సిన హక్కులను కాలరాయడం సరికాదు. దళితుల హక్కుల పరిరక్షణ కోసం వైఎస్సార్సీపీనిరంతరం పోరాడుతోంది. 2023లో వైయస్ జగన్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఆ తీర్మానానికి మా పార్టీ ఇప్పటికీ కట్టుబడి ఉంది. దళితులకు అన్యాయం జరిగితే వైఎస్సార్సీపీపెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధంగా ఉంటుంది. దళిత క్రైస్తవుల హక్కుల కోసం అవసరమైతే కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి చట్టపరమైన పరిష్కారం సాధిస్తాం. దళితుల పక్షాన వైయస్ఆర్సీపీ, వైయస్ జగన్ గారు ఎల్లప్పుడూ అండగా నిలుస్తారు. ఎస్సీ హోదా లేదనడం వివక్షతకు నిదర్శనం: అరుణ్ కుమార్ దళితులు ఎస్సీలుగా కొనసాగాలంటే హిందూ మతంలోనే ఉండాలని, క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే ఎస్సీ హోదా వర్తించదని చెబుతున్నారు. అయితే బౌద్ధం, సిక్కు మతాలను స్వీకరించిన దళితులకు మాత్రం ఎస్సీ హోదా కొనసాగిస్తున్నారు. ఈ భిన్నమైన వైఖరికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దళిత క్రైస్తవుల విషయంలో సమగ్రంగా అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాల్సిన కమిషన్ ముందుగానే ఒక అభిప్రాయానికి వచ్చినట్లు కనిపిస్తోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. క్రైస్తవ మతంలో కులం లేదని, అంటరానితనం లేదని చెప్పడం ద్వారా భారతీయ సామాజిక వాస్తవాలను విస్మరిస్తున్నారు. మతం మారినంత మాత్రాన సామాజిక వివక్ష, వెనుకబాటుతనం పూర్తిగా తొలగిపోవడం లేదనేది వాస్తవం. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలన్న అంశంపై వైయస్ జగన్ గారి ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని తీసుకుంది. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని వైఎస్సార్సీపీప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. సామాజిక న్యాయం, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా దళిత క్రైస్తవులకు కూడా సమాన హక్కులు కల్పించాల్సిన అవసరం ఉంది. ఎస్సీ హోదా కోసం ఐక్య పోరాటం: నందిగామ సురేష్ మతం మారిన కారణంతో దళితులకు ఎస్సీ హోదా నిరాకరించడం అన్యాయం. దళితులు ఏ మతాన్ని స్వీకరించినా వారి సామాజిక పరిస్థితులు, వివక్షకు గురయ్యే వాస్తవాలు మారవు. అందువల్ల దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ హోదా కల్పించాల్సిందే. దళితుల హక్కుల అంశంలో అన్ని రాజకీయ పార్టీలు స్పష్టమైన వైఖరి ప్రకటించాలి. ముఖ్యంగా టీడీపీ, జనసేన పార్టీల్లో ఉన్న ఎస్సీ నాయకులు ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. పదవుల కోసం మౌనం పాటించకుండా దళిత సమాజం తరఫున గొంతెత్తాలి. దళితుల సమస్యలు, హక్కుల అంశాలను పక్కనపెట్టి రాజకీయ విమర్శలకే పరిమితమవడం సరైంది కాదు. దళిత క్రైస్తవుల హక్కులను కాలరాసే ఏ ప్రయత్నాన్నైనా ప్రజలు ప్రశ్నించాలి. సమాజంలో సంపద, అవకాశాలు, హక్కులు అందరికీ సమానంగా అందేలా ప్రభుత్వాలు పనిచేయాలి. దళితులకు న్యాయం జరిగే వరకు, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా సాధించే వరకు అందరం ఐక్యంగా పోరాటం కొనసాగిస్తాం’ అని స్పష్టం చేశారు. -
డీఎస్సీ అక్రమాలపై ఆధారాలతోనే ప్రశ్నిస్తున్నాం
సాక్షి, నెల్లూరు: కూటమి సర్కార్ ఆర్బాటంగా నిర్వహించిన మెగా డీఎస్సీలో ముమ్మాటికీ అక్రమాలు జరిగాయని, గతేడాది క్రీడాకారుల కోటాపై ఇచ్చిన జీవోలు, ఈ ఏడాది వాటిని ఉపసంహరించి, మళ్లీ కొత్త జీవోలు ఇవ్వడమే దీనికి నిదర్శనమని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని తాము పదే పదే ప్రశ్నిస్తుంటే అధికారులు ఇచ్చిన ఖండనలోనూ తాము లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా తప్పించుకున్నారని కాకాణి ఆక్షేపించారు. అక్రమాలు జరగకపోతే డీఎస్సీపై సీబీఐ దర్యాప్తు లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్డితో విచారణ చేయించడానికి ఎందుకు భయపడుతున్నారని కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మీడియా సమావేశంలో ఆయన ఇంకేమన్నారంటే..డీఎస్సీపై ఆధారాలతోనే ప్రశ్నిస్తున్నాండీఎస్సీలో జరిగిన అక్రమాలపై మేం కేవలం ఆరోపణలు చేయట్లేదు, ఆధారాలతో సహ మీడియా ముందుకు వస్తున్నాం. మెగా డీఎస్సీలో అంతులేని అక్రమాలు జరిగాయి. ఓ పక్క టీచర్ ఉద్యోగాలపై నిరుద్యోగుల్ని ఊరించి, ఎన్నికలకు ముందు నుంచీ మెగా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చి, చివరికి 2025లో నోటిఫికేషన్ ఇచ్చారు. పరీక్ష నిర్వహణపై అనేక అనుమానాలు ఉన్నాయి. దీనిపై మేం చేసిన ఆరోపణల మీద అధికారులు ఖండన కూడా ఇచ్చారు. అయితే ఈ ఖండనలో అంతా మీరు చెప్పినవి కరెక్ట్ కాదని చెప్పారు కానీ, తప్పు జరగలేదని పాయింట్ల వారీగా చెప్పలేకపోయారు. నిరుద్యోగులకు డీఎస్సీలో జరిగిన దగాపై వైఎస్ జగన్ పిలుపు మేరకు ఇప్పటికే ఆందోళనలు చేశాం.జూన్ 1వ తేదీన యువత ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి కూడా చేయబోతున్నాం. మీరు అర్హులుగా ఎంపిక చేసిన అభ్యర్ధుల పేర్లు తుది జాబితాలో ఎందుకు గల్లంతయ్యాయో చెప్పగలరా ? మెరిట్ లిస్ట్ లేదు, సెలక్టెడ్ లిస్ట్ కూడా లేకుండా ఎంపికైన వారికి మెసేజ్ లు మాత్రమే పంపించారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా ఇలా జరిగిందా ? ఒక పోస్టుకు ఒక్కరినే పిలిచి, అర్హులైన వారికి ఉద్యోగాలు ఇవ్వలేదు, తిరస్కరించలేదు. అర్హులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనని హైకోర్టు చెప్పినా, ఆదేశాలు బేఖాతరు చేస్తూ కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారు.డీఎస్సీ ఫలితాలు ప్రకటించేటప్పుడే రూల్ ఆఫ్ రిజిస్టర్ రోస్టర్ ప్రకారం అభ్యర్ధులకు ఎన్ని మార్కులు వచ్చాయో మెరిట్ లిస్ట్ విడుదల చేయాల్సి ఉంది. కానీ విడుదల చేశాక దాన్ని డిలీట్ చేయాల్సి అవసరం ఎందుకొచ్చింది ? ఎప్పుడూ లేని విధంగా డీఎస్సీని ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది ? సర్టిఫికెట్ల పరిశీలనకు వచ్చే సరికి మరో కొత్త విధానం అమలు చేశారు. తుది ఎంపిక జాబితాకు వచ్చేటప్పటికి వీటన్నింటినీ పక్కనబెట్టి మరో కొత్త విధానం తెచ్చి, మీ అజెండాను అమలు చేసి అర్హులైన నిరుద్యోగుల కడుపు కొట్టే ప్రయత్నం చేశారు.నైతిక విలువల్లేని విద్యామంత్రి లోకేష్ఎప్పుడైనా పరీక్ష రాసిన అభ్యర్ధులకు మెరిట్ లిస్ట్ పరిశీలించుకునే హక్కు ఉంది. మెరిట్ లిస్ట్ లో తాము ఎక్కడ ఉన్నాం, తమకన్నా ముందూ వెనుక ఎవరున్నారనే అంశాల్ని తెలుసుకునే అవకాశం అభ్యర్ధులకు ఇవ్వాలి. మెరిట్ లిస్ట్ తయారు చేశాక పారదర్శకంగా సెలెక్టెడ్ లిస్ట్ ప్రకటిస్తారు. అది చేయలేదు కాబట్టి అక్రమాలు జరిగాయని కచ్చితంగా నమ్ముతున్నాం. అందుకే ఈ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేయించాలని పదే పదే కోరుతున్నాం.చదువూ, సంధ్యా లేని మొద్దబ్బాయి లోకేష్ ను తీసుకొచ్చి విద్యాశాఖ మంత్రిగా చేయడం ఈ సమాజానికి తీరని ద్రోహం చేయడమే. అందుకే ఆయన ఎవరైనా ప్రశ్నిస్తే.. వారిపై కేసులు పెడతానంటున్నారు తప్ప నా వల్ల పొరబాటు జరిగిందని, కాబట్టి తాను విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేస్తానని చెప్పడం లేదు. నైతిక విలువలు లేవు కాబట్టే లోకేష్ ఇలా వ్యవహరిస్తున్నారు. డీఎస్సీలో 16347 పోస్టుల్లో 421 పోస్టులు స్పోర్ట్స్ కోటాలో నింపారు. అందులో మీరు నింపిన విధానం చూస్తే ఎంత భయంకరమైన వాస్తవాలు వెలుగుచూస్తున్నాయో మేం వివరిస్తాం.స్పోర్ట్ కోటా జీవోల్లో మార్పులతో అక్రమాలుక్రీడల్లో ప్రతిభ చూపిన వారికి 2 శాతం రిజర్వేషన్ ఎప్పటి నుంచో అమలు ఉంది. స్పోర్ట్స్ కోటాపై ఉమ్మడి ఏపీలోనే 2012 ఆగస్టు 9న జీవో ఎంఎస్ నంబర్ 74 విడుదల చేసారు. అప్పుడు ఉన్న జీవోలో క్రీడల్లో రాష్ట్రానికి, దేశానికి గుర్తింపు తెచ్చిన వారికి 29 క్రీడల్లో ఈ రిజర్వేషన్ అమలు చేస్తామన్నారు. దీని ప్రకారం పోటీ పరీక్ష రాసిన తర్వాత క్రీడాకారులకు క్రీడా కోటాలో ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. కానీ చంద్రబాబు తన పుట్టినరోజుకు ఒక్క రోజుకు ముందు ఏప్రిల్ 19న జీవో 47, జీవో 4 కూడా తెచ్చారు. 2025 ఏప్రిల్ 19న విడుదల చేసిన జీవో 4లో 2 శాతంగా ఉన్న క్రీడా రిజర్వేషన్లను 3 శాతానికి పెంచారు. కానీ క్రీడల సంఖ్యను 29 నుంచి 65కు పెంచారు.గతంలో ఉన్న క్రీడల్లో స్పోర్ట్స్ కోటాలో అక్రమాలకు వీల్లేదు కాబట్టి దానికి మార్పులు చేశారు. అందుకే క్యారమ్స్, టెన్నికాయిట్, టగ్ ఆఫ్ వార్, యోగాసనాలు, బీచ్ వాలీవాల్ వంటి క్రీడల్ని చేర్చారు. జీవోడీ ఇచ్చిన మరో జీవో 47లో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలకు పోటీ పడే వారు అసలు పోటీ పరీక్షలు రాయాల్సిన అవసరం లేదని చెప్పేశారు. అంటే క్రీడా ప్రతిభ ఉన్న వారితో పాటు ఉపాధ్యాయ అర్హత ఉన్న వారికీ ద్రోహం జరిగింది. ఈ నెల 26న తిరిగి పోటీ పరీక్ష రాసిన వారికే డీఎస్సీలో ప్రాధాన్యం ఇవ్వాలని మరో జీవో ఇచ్చారు. అంటే గతంలో అర్హులుగా ఉన్న వారికి అవకాశం లేకుండా చేయడానికి, మీకు అనుకూలంగా ఉన్న వారికి ఉద్యోగాలు ఇప్పించేందుకు ఇలాంటి జీవో ఇచ్చారు. అందుకే మళ్లీ జీవోలో మార్పులు చేశారు.జీవో మార్పులతో అర్హులకు తీవ్ర అన్యాయంజీఏడీ ద్వారా గతేడాది ఏప్రిల్ 19న ఏపీ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ను సవరిస్తూ జీఏడీ ద్వారా రెండు జీవోలు ఇప్పించారు. ఇందులో గతంలో క్రీడాకారులు కూడా పోటీ పరీక్ష రాయాల్సి ఉండగా.. ఈ నిబంధనల్ని మార్చారు. దీంతో భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా ఈ నెలలో ఆ జీవోల్ని రద్దు చేశారు. గతేడాది ఇచ్చిన జీవోల్లో జాతీయ ఛాంపియన్ షిప్ సాధించిన వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది, ఆటలో పాల్గొంటున్న వారికి తర్వాత ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. దాన్ని మార్చి తాజాగా ఇచ్చిన జీవోలో జాతీయ స్దాయిలో ఆడిన వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుందని, ఛాంపియన్ షిప్ వస్తే తర్వాతి ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు.ఇలా ఎందుకు మార్చారో సమాధానం చెప్పగలరా ? ముందుగా ఇచ్చిన జీవో కరెక్ట్ అనుకుంటే, ఆ తర్వాత ఎందుకు ఉపసంహరించారు ? ఈ రెండు పరిణామాల మధ్య నష్టపోయిన వారికి ఎవరు బాధ్య త వహిస్తారు ? డీఎస్సీలో పరీక్ష రాసిన అభ్యర్ధుల పరిస్ధితి ఏంటి ? వీటికి సమాధానాలు చెప్పకుండా ప్రశ్నించిన వారిపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. అందుకే సీబీఐ దర్యాప్తు జరగాలని కోరుతున్నాం. ఇది లోకేష్ శాఖలో జరిగిన డార్క్ సీక్రెట్ ఆపరేషన్ అంటున్నాం. మీరు ఎంత మందిని అరెస్టు చేసుకుంటారో చేసుకోండి, దగాపడిన నిరుద్యోగులతో పాటు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, విద్యార్ధి, యువజన విభాగాలు సిద్దంగా ఉన్నాయి. కానీ దయచేసి ప్రతిభ ఉన్న వారికి మాత్రం అన్యాయం చేసి వారి ఉసురుపోసుకోకండి.డీఎస్సీలో జిల్లా కమిటీల పాత్ర ఉంటే అక్రమాలు సాధ్యం కావు కాబట్టి వీటిని నిర్వీర్యం చేశారు. అందుకే రాష్ట్ర స్దాయిలోనే ఈ పరీక్ష నిర్వహించారు. టెట్, డీఎస్సీకి సంబంధించి ఒకే వ్యక్తికి బాధ్యతలు కూడా అప్పగించారు. ప్రశ్నాపత్రం తయారు చేసిన వ్యక్తి కంప్యూటర్ ఆపరేటర్ అని మీరే ఒప్పుకుంటున్నారు. అతనే తిరిగి పరీక్ష రాసి కృష్ణాజిల్లాలో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే అతని వివరాలు డిలీట్ చేశారు. అతను కోర్టుకు వెళ్తే బెదిరించి కేసు వెనక్కి తీసుకోమంటున్నారు. అందుకే డబ్బులు చేతులు మారాయని మీరు ఇచ్చిన జీవోల ద్వారానే అర్థమవుతోంది. మీరు అక్రమార్కులపై చర్యలు తీసుకునే పరిస్ధితుల్లో లేరు.ఒకే కేటగిరీలో ముందు ఉన్న వాళ్లకు, తర్వాత ఉన్న వాళ్లకూ ర్యాంకులు వచ్చాయి, కానీ ఆమ్యామ్యాలు సమర్పించకపోవడం వల్ల మధ్యలో ఉన్న వారికి ర్యాంకులు రాలేదు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకొకటి ఉంటుందా ? టెస్ట్ మెసేజ్ ల పేరుతో ఉద్యోగాల జీవితాలతో ఆడుకున్నారు. మూడు పోస్టులకు అర్హత సాధిస్తే ఒకటే పోస్టుకు కాల్ లెటర్ ఇవ్వడం అన్యాయం కాదా ? ఈ మూడు పోస్టుల్లో హయ్యర్ గ్రేడ్ పోస్టు ఇవ్వాలని హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. దీనిపై సీబీఐ దర్యాప్తు చేయించాలని అడుగుతుంటే మా మీద క్రిమినల్ కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. మా మీద కాదు అక్రమాలతో యువత భవిష్యత్తును నాశనం చేసిన అధికారులపై ఈ కేసులు పెట్టండి. అలాగే ఎస్సీఈఆర్టీ నుంచే ప్రశ్నాపత్రాల లీక్ జరిగిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.ఈ ప్రశ్నాపత్రాలు అప్ లోడ్ చేసిన వ్యక్తి పరీక్ష ఎలా రాస్తాడు ? ఫస్ట్ ర్యాంక్ ఎలా తెచ్చుకుంటాడు, అతన్ని మీరు ఎందుకు తొలగించారో బయటపెట్టాలి. ఓపెన్ కేటగిరీలో రావాల్సిన పోస్టును వేరే వ్యక్తికి ఎలా ఇస్తారు ? అడిగితే వేరే వ్యక్తికి ఇచ్చామని చెప్పారని అధికారులు చెప్పినట్లు అభ్యర్ధులు కూడా బయటపెట్టారు. మీరు బేరసారాలు ఆడిన ఆడియోలు బయటికి వచ్చినా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ? దీని మీద ముఖ్యమంత్రి, విద్యామంత్రి సమాధానం చెప్పాల్సిందే. దీంతో పాటు అక్రమాలకు బాధ్యత వహించి విద్యామంత్రి లోకేష్ రాజీనామా చేయాలి. దీంతో పాటు సీబీఐ దర్యాప్తు లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాల్సిందేనని కాకాణి గోవర్ధన్రెడ్డి డిమాండ్ చేశారు. -
వీటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి: సజ్జల
తాడేపల్లి: వైఎస్సార్సీపీ ముఖ్య నేతలతో పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించి కీలక సూచనలు చేశారు. వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంపై సమీక్ష జరిపారు. రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘‘వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలి. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయటం లేదు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు. ఈ అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.ప్రజాసంఘాలు, వివిధ వర్గాల ప్రతినిధులు, కలిసివచ్చే రాజకీయ పార్టీలను కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేయాలి. డీఎస్సీ అంశంపై పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వల్ల సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మరింతగా తీసుకెళ్లాలి. దీనిపై పార్టీ కమిటీలు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలి. రెండేళ్ల పాలనలో జరిగిన వైఫల్యాలపై తీర్మానాలు చేసి వాటిని డిజిటల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలి. ఎస్ఐఆర్పై అప్రమత్తంగా ఉండాలి. ఇంటింటి సర్వే సమయంలో పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండాలి. సర్వే ప్రారంభమయ్యేలోగా అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. జూన్ 1న యువజన విభాగం ఆధ్వర్యంలో డీఎస్సీ అంశంపై చేపట్టనున్న నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలి’’ అని చెప్పారు. -
దారుణంగా YSRCP నేతపై దాడి..రక్తంతో
-
ఖర్జూరనాయుడు లేదా చంద్రబాబులా ఉండాలి! బాగా ప్లాన్ చేశావ్ బాబు..
-
‘‘అందుకే చంద్రబాబు పాత కథనే మళ్లీ తెరమీదకు తెచ్చారు’’
వైఎస్సార్ జిల్లా: చంద్రబాబు నాయుడు ఈ రెండేళ్లలో ఏపీని అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్రెడ్డి చెప్పారు. సంపద సృష్టించి దాన్ని పేద ప్రజలకు పంచుతానన్న మాట గాలిమాటగా మిగిలిపోయిందని విమర్శించారు.రాచమల్లు శివప్రసాద్రెడ్డి శనివారం వైఎస్సార్ జిల్లాలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రభుత్వ వైఫల్యాలపై మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున జూన్ 4 నుంచి నిరసన కార్యక్రమాలు ప్రకటించారు. ఈ తరుణంలో ప్రజల దృష్టిని మరల్చడానికి చంద్రబాబు మళ్లీ డైవర్షన్ పాలిటిక్స్ తెరమీదకు తెచ్చారు. దీనిలో భాగంగానే పాత కథనే.. మళ్లీ లిక్కర్ స్కాం అంటూ తెరమీదకు తెచ్చారు. వైఎస్ జగన్ను నేర చరిత్ర కలిగిన వ్యక్తిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు.అసలే స్కామే లేనిచోట స్కాం అంటారు.. సంబంధం లేని వారినందరినీ అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. అసలు ఏ ఆధారం లేకపోయినా చంద్రబాబు నియమించిన సిట్ ఏదో ఒక విధంగా మావాళ్లను ముద్దాయిలుగా చూపించి జైలుకు పంపింది. మిథున్రెడ్డి, ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, రాజ్ కసిరెడ్డి అందరికీ బెయిల్ వచ్చింది. చంద్రబాబు నమ్మదగిన మిత్రుడు కాదని, ఇన్స్టాంట్ కాఫీ లాంటివాడేనని పవన్ కల్యాణ్కు అమిత్ షా స్పష్టంగా చెప్పారు.వైఎస్ జగన్ దీర్ఘకాలికంగా స్నేహం చేయడానికి అర్హత కలిగిన వ్యక్తి అని అమిత్ షా స్పష్టంగా చెప్పారు. చంద్రబాబుకు వ్యతిరేకులందరూ మనకు వ్యతిరేకులు కానవసరం లేదని ఆయన చెప్పి పంపించారు. వైఎస్ జగన్తో ఎవరైతే ఆత్మీయంగా ఉంటారో వారందరికీ నోటీసులిచ్చి విచారణ పేరుతో వేధిస్తూనే ఉన్నారు. వ్యాపారంలో రూ.19 కోట్ల బ్యాంక్ అకౌంట్ ద్వారా లావాదేవీలు జరిగితే ఏ రకంగా అది లిక్కర్ స్కాంకు సంబంధం? కేఎన్నార్ 2007 నుంచీ ఇన్కం టాక్స్ చెల్లిస్తూ ఉన్నారు. ఆయన ఆర్ధిక లావాదేవీలన్నీ లీగల్గానే ఉంటాయి. ఎవరైనా చూసుకోవచ్చు. కేఎన్నార్ బాద్యత ఏంటి..? అతని స్థాయి ఏంటి..? దీనిలో అతనికి ఏం సంబంధం..? చంద్రబాబు కుమారుడు లోకేశ్ లక్షల కోట్లకు ఏ విధంగా అధిపతి కాగలిగారు? రెండెకరాల నుంచి రూ.లక్ష కోట్లకు చంద్రబాబు అధిపతి అయినప్పుడు కేఎన్నార్ లాంటి వారు రూ.20 కోట్లు సంపాదించడం తప్పా..? పచ్చళ్లు అమ్ముకున్న రామోజీరావు...ఇప్పుడు వేల కోట్లకు అధిపతి ఎలా అయ్యారు? రామోజీరావు చిట్ఫండ్ పేరుతో ఖాతాదారుల సొమ్ముతో వ్యాపారాలు చేయలేదా? సైకిల్పై కిరసనాయిల్ అమ్ముకునే రాధాకృష్ణ ఇవాళ కోట్లకు అధిపతి ఎలా అయ్యారు? రాదాకృష్ణకు ఫిలిమ్ నగర్లో ఉన్న బిల్డింగు చూస్తే ప్రజలు అవాక్కవుతారు. హైటెక్ సిటీలో తాడు బొంగరం లేని వాళ్లు కూడా వందల ఎకరాలు ఎలా కొనుగోలు చేశారు..? టీవీ5 నాయుడు ఎక్కడ ప్రారంభం అయ్యారు..ఇప్పుడు ఎక్కడున్నారు..? ఇప్పుడు కేఎన్నార్ను ఈ డబ్బు ఎలా వచ్చిందని అడిగే సిట్ అధికారులు చంద్రబాబు అండ్ కోను కూడా ఇలానే ప్రశ్నిస్తారా? పీఏల ద్వారా ఆర్థిక లావాదేవీలు చేసే సంస్కృతి జగన్కు లేదు. ఇప్పటి వరకు లిక్కర్ స్కాం విచారణలో ఏ సాక్ష్యమే మీదగ్గర లేదు’’ అని అన్నారు. -
వైఎస్సార్సీపీ నేతలపై ఆగని కూటమి నేతల అరాచకం
ఏలూరు: వైఎస్సార్సీపీ నేతలపై కూటమి నేతల అరాచక పర్వం కొనసాగుతూనే ఉంది. ఏలూరు జిల్లా శోభనాపురంలో వైఎస్సార్సీపీ నేత సాంబశివరావుపై టీడీపీ నేతలు దాడికి దిగారు. సాంబశివరావుపై కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు టీడీపీ నేతలు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడని సాంబశివరావుపై దాడి చేశారు కూటమి నేతలు. గాయపడిన సాంబశివరావును స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాంబశివరావును మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు పరామర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఈ తరహా దాడులు చేస్తారా అంటూ మేకా ప్రతాప్ ప్రశ్నించారు. -
ప్రజలు లేరని ప్రభుత్వ ఉద్యోగులను తరలిస్తావా? చంద్రబాబు అసలు బాగోతం
-
చంద్రబాబుకు కొత్త టెన్షన్.. బయటపడ్డ లోకేష్ స్కాముల చిట్టా..
-
‘జూన్ 10లోపు విద్యుత్ సబ్సిడీ హామీ అమలు చేయాలి’
సాక్షి, తాడేపల్లి: ఆక్వా, నాన్ ఆక్వా జోన్తో సంబంధం లేకుండా జూన్ 10వ తేదీ లోపు యూనిట్ రూపాయిన్నరకే సబ్సిడీ విద్యుత్ హామీని అమలు చేయాలని, నాన్ ఆక్వా జోన్ రైతులు గత రెండేళ్లుగా చెల్లించిన బిల్లులు రీయింబర్స్ చేయాలని తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, అప్సడా మాజీ వైస్ చైర్మన్ వడ్డి రఘురాం డిమాండ్ చేశారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆక్వా రైతులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టరేట్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆక్వా, నాన్ ఆక్వా జోన్తో సంబంధం లేకుండా అందరికీ రూపాయిన్నరకే యూనిట్ విద్యుత్ అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు, రెండేళ్లుగా ఒక్క కొత్త కనెక్షన్ కూడా ఇవ్వలేదని చెప్పారు. వైఎస్సార్సీపీ హయాంలో సీడ్, ఫీడ్ ధరలు, ఎగుమతులు, అన్నీ అప్సడా నిర్ణయం మేరకు రైతులతో చర్చించి తీసుకునేవాళ్లమని.. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ(అప్సడా)ని నిర్వీర్యం చేసేసి దళారుల చేతికి చంద్రబాబు పెత్తనం ఇచ్చాడని మండిపడ్డారు.ఫీడ్ ధరలు కూడా ఇష్టారాజ్యంగా పెంచితే ఊరుకోమని, రైతులతో చర్చించి ఏడాదికి ఒక్కసారే పెంచాలని డిమాండ్ చేశారు. ఆక్వా రైతులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, త్వరలోనే ఆక్వా రైతులతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశం నిర్వహిస్తారని వడ్డి రఘురాం వెల్లడించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..అప్సడా నిర్వీర్యం.. తీవ్ర సంక్షోభంలో ఆక్వా రంగంకూటమి ప్రభుత్వం వచ్చాక ఆక్వా రంగం తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకుంది. వైఎస్ జగన్ సీఎంగా ఉండగా ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా)ని ఏర్పాటు చేసి సీడ్ యాక్టు, ఫీడ్ యాక్టు అంటూ అన్ని విభాగాలను ఒకే గొడుకు కిందకి తీసుకొచ్చి ఆక్వా రైతులకు మేలు చేశారు. సీడ్, ఫీడు ధరలు పెంచాలన్నా, వాటి నాణ్యత పరిశీలించాలన్న ఒక కమిటీ ఉండేది. ఈ కమిటీలో ప్రభుత్వం, రైతులు, సీడు, ఫీడు యజమానులు, ఎక్స్పోర్టర్లు, ప్రాసెసింగ్ ప్లాంట్లు, మెడికల్ కంపెనీలు ఉండేవి.వీరంతా ఉమ్మడిగా చర్చించి ఏ నిర్ణయమైనా తీసుకునేవారు. రేట్లు పెంచాలన్నా, తగ్గించాలన్నా అప్సడాలో చర్చించి నిర్ణయం తీసుకునేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీని పూర్తిగా నిర్వీర్యం చేసి, పెత్తనాన్ని చంద్రబాబు తన బినామీలకు కట్టబెట్టాడు. పెరిగిన డీజిల్ ధరల కారణంగా ఆక్వారైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. ఇటీవల విచ్చలవిడిగా ఫీడు రేట్లు పెంచడానికి పూనుకున్నారు. వైయస్ జగన్ గారి హెచ్చరికలతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది.ఒక్క కొత్త కనెక్షన్ ఇవ్వలేదుఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్తో సంబంధం లేకుండా అందరికీ సబ్సిడీ విద్యుత్ రూపాయిన్నరకే ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు ఆక్వా రైతులను మోసం చేశాడు. రెండేళ్లలో చంద్రబాబు కొత్తగా ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వలేదు. కొత్తగా రిజిస్ట్రేషన్ల పేరుతో రెండేళ్లుగా కాలయాపన చేస్తూనే ఉన్నారు. మొత్తం 64 వేల కనెక్షన్లు ఉంటే వైఎస్సార్సీపీ హయాంలోనే 50,800 కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ఏటా రూ.800 కోట్ల మేర విద్యుత్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది. 2104-19 మధ్య కూడా యూనిట్ విద్యుత్ రూ.2 లకే ఇస్తామని చెప్పి ఆరు నెలలకే ఆపేశాడు. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక డిస్కంలకు గత టీడీపీ ప్రభుత్వం పెట్టిన బకాయిలు రూ.340 కోట్లు వైఎస్ జగనే చెల్లించి ఆక్వా రంగాన్ని ఆదుకోవడం జరిగింది.ఐదేళ్లలో రూ. 3640 కోట్లు సబ్సిడీ రూపంలో చెల్లించిన ఘనత వైయస జగన్కే దక్కుతుంది. నాన్ ఎలిజిబిలిటీ రైతులకు ఇబ్బందులు రావడంతో 24 గంటల్లో రూ. 24 కోట్లు రోల్ బ్యాక్ చేయడం జరిగింది. మెరైన్ ఎక్స్పోర్టులో రెండుసార్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వం దేశంలోనే మొదటిస్థానం సాధించి అవార్డులు తీసుకుంది. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉండగా సీపీఎఫ్ అనే కంపెనీ ఫీడ్ ధరలు పెంచినప్పుడు రైతులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. కంపెనీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లను థాయ్లాండ్ నుంచి 48 గంటల్లో పిలిపించి వారితో ప్రభుత్వం చర్చించి మూడేళ్లపాటు పైసా కూడా పెంచకుండా చూశాం. రెండుసార్లు పెంచితే రెండుసార్లూ రోల్ బ్యాక్ చేయడం జరిగింది.ఆక్వా రైతుల తరఫున వైఎస్సార్సీపీ డిమాండ్లుసంక్షోభంలో రోడ్డెక్కి నిరసన తెలియజేస్తున్న ఆక్వా రైతుల ఆక్రందనలు ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదు. ఇప్పటికైనా ఆక్వా నాన్ ఆక్వా జోన్తో సంబంధం లేకుండా రూపాయిన్నరకే సబ్సిడీ విద్యుత్ ఎప్పటి నుంచి ఇస్తారో స్పష్టంగా చెప్పాలి. నాన్ ఆక్వా జోన్ పరిధిలో సుమారుగా 12,800 కనెక్షన్లు ఉంటాయని అంచనా. వారందరూ గడిచిన రెండేళ్లుగా విద్యుత్ సబ్సిడీకి నోచుకోకుండా బిల్లులు చెల్లిస్తున్నారు. ఆ బిల్లులన్నీ రోల్ బ్యాక్ చేస్తారో లేదో చెప్పాలి. సంక్షోభంలో నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకునేలా ఇతర పంటల మాదిరిగానే ఆక్వా లోనూ పంటల సాగు వివరాలు నమోదు చేయాలి.ప్రాసెసింగ్ ప్లాంట్లకు వచ్చిన ఆర్డర్లు, పంట సాగు లెక్కలను బేరీజు వేసుకుని ధరలు నిలకడగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. సోయా, ఫిష్ ఆయిల్ ధరలు ఏడాదికి ఒక్కసారే పెరుగుతాయి. ఆక్వా సీడు, ఫీడ్ ధరలు ఇష్టమొచ్చినట్టు పెంచకుండా ఏడాదిపాటు ఒకే ధరతోనే విక్రయాలు జరిగేలా చూడాలి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాదిరిగానే ధరలు పెంచాల్సి వస్తే రైతుల అంగీకారం తప్పనిసరిగా తీసుకోవాలి.జూన్ 10వ తేదీ లోపు జోన్తో సంబంధం లేకుండా ఆక్వా రంగంలో రూపాయిన్నర సబ్సిడీకి విద్యుత్ పంపిణీ చేయాలి. రెండేళ్లుగా నాన్ ఆక్వా జోన్ రైతులు చెల్లించిన బిల్లును రీయింబర్స్ చేయాలి. రైతుల డిమాండ్లు నెరవేర్చకపోతే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్లను ముట్టడిస్తాం. త్వరలోనే ఆక్వా రైతులతో వైఎస్ జగన్ సమావేశం నిర్వహిస్తారు. ఆక్వా రైతులకు వైఎస్సార్సీపీ అండగా నిలబడి పోరాడతుందని వడ్డి రఘురాం స్పష్టం చేశారు -
అన్ని అక్రమ కేసులు, అరెస్టులు.. చంద్రబాబుపై న్యాయవాదులు సీరియస్
-
చేతికి వచ్చి చేజారిన పోస్టు.. ‘సారూ’.. తారుమారు!
జిల్లా టాపర్ అయినా జాబు రాలేదు..ఎస్సీ విభాగంలో నేను శ్రీకాకుళం జిల్లా టాపర్ అయినా నాకు ఉద్యోగం రాలేదు. స్పోర్ట్స్ కోటాలో ఒక మహిళకు ఉద్యోగం ఇచ్చారు. దీనిపై ఫిర్యాదు చేస్తే ఆ పోస్టింగ్ నిలిపారు. తర్వాత మెరిట్ అభ్యర్థిగా నాకు పోస్టింగ్ ఇవ్వాల్సి ఉన్నా ఆరు నెలలుగా ప్రభుత్వం స్పందించడం లేదు. – కె.అనిల్కుమార్, డీఎస్సీ బాధితుడు, శ్రీకాకుళంసాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ 2025లో విస్తుగొలిపే వాస్తవాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందుల నడుమ ఏళ్ల తరబడి శ్రమించి సాధించుకున్న అరుదైన అవకాశాన్ని చంద్రబాబు సర్కారు కాల రాసిందని కాల్ లెటర్లతో వెరిఫికేషన్కు సైతం హాజరై మోసపోయిన అర్హులైన అభ్యర్థులు మండిపడుతున్నారు. జిల్లాకు ఓ విధానం అమలు చేసి ‘హారిజాంటల్’ రిజర్వేషన్ అని పేరు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక పోస్టుకు ఒక్కరే అభ్యర్థిని (1:1 నిష్పత్తి) సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచి, అన్నీ సక్రమంగా ఉన్నట్లు ప్రకటించిన తరువాత తీరా తుది జాబితాలో తమ పేర్లు గల్లంతు చేశారని అర్హులు వాపోతున్నారు. ఒక పోస్టుకు ఒక్కరినే పిలిస్తే.. హాజరైన అభ్యర్థి సర్టిఫికెట్ల్లలో లోపం ఉంటే ఆ విషయం చెప్పి వారిని పక్కనబెడతారు. అనంతరం రెండో స్థానంలో ఉన్నవారికి అవకాశం కల్పించాలి. కానీ ఇక్కడ ఉద్యోగాలకు ఎంపికైన వారికే కాల్ లెటర్లు పంపి సర్టిఫికెట్ల పరిశీలనకు రావాల్సిందిగా నిర్ణీత తేదీని ప్రకటించారు. అన్ని పత్రాల పరిశీలన పూర్తి చేసి అంతా సక్రమమేనంటూ ప్రకటించారు. కానీ తుది ఎంపిక జాబితాలో మాత్రం అర్హుల పేర్లు లేకుండా చేశారు. ప్రభుత్వ నిర్వాకానికి బలైన ప్రతిభ గల డీఎస్సీ అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా 2 వేల మందికి పైగా ఉన్నట్లు చెబుతున్నారు.మెరిట్లో ఉన్నారని ప్రకటించి మోసం..!డీఎస్సీ ఫలితాలను ప్రకటించేటప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ ప్రకారం అభ్యర్థులకు వచ్చిన మార్కులతో మెరిట్ లిస్ట్ విడుదల చేయాలి. కానీ డీఎస్సీ 2025లో మాత్రం ఫలితాల ప్రకటన వరకు ఒక విధానం.. సర్టిఫికెట్ల పరిశీలనకు మరో విధానం.. తుది ఎంపిక జాబితా విడుదల సమయంలో మరో విధానాన్ని అమలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పరీక్ష రాసిన అభ్యర్థులంతా మెరిట్ లిస్ట్ను పరిశీలించే వీలు లేకుండా చేశారని ఆక్రోశిస్తున్నారు. మెరిట్ లిస్టును ప్రకటించిన తర్వాత సెలక్షన్ లిస్ట్ తయారు చేసి కౌన్సెలింగ్ నిర్వహించాలి.కానీ మెరిట్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్ లేకుండా నేరుగా ‘సెలెక్టెడ్’ అభ్యర్థులను ఒక పోస్టుకు ఒక్కరినే (1:1) ఎంపిక చేసి సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారు. పరీక్ష రాసిన 3,36,307 మందిలో కేవలం 16,437 పోస్టులకు అంత మందికే కాల్ లెటర్లు పంపారు. కాల్ లెటర్లు పంపిన వారిని నిర్ణీత తేదీల్లో ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరు కావాలని లేఖల్లో పేర్కొన్నారు. చెక్ లిస్టు సరి చూసుకున్న తర్వాత వారిని ‘ఓకే’ కూడా చేశారు. అయితే తిరస్కరణ జాబితాలో పేర్లు లేని, సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తయిన కొందరు అభ్యర్థుల పేర్లను తుది ఎంపిక జాబితాల్లో నుంచి తొలగించడం గమనార్హం.గోడు పట్టించుకోని విద్యాశాఖ మంత్రి కార్యాలయం..తమ సర్టిఫికెట్లు అన్నీ సరిగా ఉన్నాయని ప్రకటించాక కూడా పోస్టులు ఎందుకు ఇవ్వడం లేదని జిల్లా అధికారులను ప్రశ్నిస్తే... ఇందులో తమదేం లేదని, రాష్ట్ర కార్యాలయంలో సంప్రదించాలని సలహా ఇచ్చారు. బాధితులంతా రాష్ట్ర కార్యాలయంలో సంప్రదిస్తే.. మళ్లీ డీఎస్సీకి ప్రయత్నించండని ఉచిత సలహా ఇచ్చి అవమానించారని అభ్యర్థులు వాపోతున్నారు. ఈ డీఎస్సీలో ప్రభుత్వం అనుసరించిన విధానాల ప్రకారం.. మెరిట్లో ఉండి, పోస్టు వస్తుందన్న వారికే కాల్ లెటర్లు పంపారు. వారికి సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తి చేశారు. చివరకు వారికి మొండిచెయ్యి చూపించారు. అర్హులు తమకు జరిగిన అన్యాయంపై విద్యాశాఖ మంత్రి కార్యాలయాన్ని సంప్రదించగా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చేసేది లేక న్యాయ పోరాటానికి దిగారు.సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరు కావాలంటూ ఎం.ఏకాంబరానికి వచ్చిన కాల్ లెటర్ చిత్తూరు జిల్లా మాదిరెడ్డిపల్లికి చెందిన ఎం.ఏకాంబరం (బీసీ–డి) డీఎస్సీలో ఎస్ఏ సోషల్ స్టడీస్ విభాగంలో 125వ ర్యాంకు సాధించారు. జిల్లాలో బీసీ–డీ కేటగిరీలో 7 పోస్టులు ఉండగా ఆయన ఆరో అభ్యర్థి. ఆగస్టు 28న సర్టిఫికెట్ల పరిశీలనకు రావాలని కాల్ లెటర్ అందింది. అన్ని పత్రాలు పరిశీలించి అధికారులు ధ్రువీకరించారు. కానీ సెలక్షన్ లిస్టులో అతడి పేరు లేదు. అంతకు ముందే పెట్టిన రిజెక్ట్ లిస్టులోనూ ఏకాంబరం పేరు లేదు. ఇలా ఎందుకు జరిగిందని ప్రశ్నిస్తే.. ‘గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసుకోండి..’ అని డీఈవో సమాధానం ఇచ్చారు.సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం టి.విజయలక్ష్మికి వచ్చిన కాల్ లెటర్చిత్తూరు జిల్లా యాదమర్రికి చెందిన టి.విజయలక్ష్మి (ఓసీ) స్కూల్ అసిస్టెంట్ (ఇంగి్లష్) ఎస్జీటీలో 647వ ర్యాంకు వచ్చింది.ఆగస్టు 29న సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు రావాలని ఆమెకు కాల్ లెటర్ పంపారు. వెరిఫికేషన్ కూడా పూర్తయింది. కానీ ఫైనల్ ఎంపిక జాబితాలో మాత్రం పేరు లేదు. అటు రిజెక్ట్ లిస్టులో కూడా పేరు లేదు. దీనిపై డీఈవో కార్యాలయంలో సంప్రదించగా.. స్పోర్ట్సు కోటాలో మీ పోస్టు పోయిందని సమాధానం చెప్పారు. గ్రీవెన్స్లో ఫిర్యాదు చేస్తే కటాఫ్ అంతకు ముందే అయిపోయిందని చెప్పారు.సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు రావాలంటూ ఇ.శ్రీనివాసులుకు వచ్చిన కాల్ లెటర్ ప్రకాశం జిల్లా యర్రగొండపాలేనికి చెందిన ఇ.శ్రీనివాసులు (బీసీ–డి) ఎస్జీటీలో 87వ ర్యాంకు సాధించారు. ఆగస్టు 29న సర్టిఫికెట్ల పరిశీలనకు రావాలని ఆయనకు కాల్ లెటర్ అందింది. అయితే 2,665 ర్యాంకు అభ్యర్థికి హారిజాంటల్ రిజర్వేషన్ పేరుతో పోస్టు ఇచ్చారు. దీనిపై శ్రీనివాసులు గ్రీవెన్స్లో ఫిర్యాదు చేస్తే 85 ర్యాంకుతో పూర్తయిందని మౌఖికంగా, 58వ ర్యాంకుతో పూర్తయిందని రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఇందులో ఏది నిజం?సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం వై.శ్రవణ్కు వచ్చిన కాల్ లెటర్అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం వాడ నరసాపురానికి చెందిన వై.శ్రవణ్కుమార్(బీసీ–ఏ) ఎస్ఏ ఫిజికల్ సైన్స్లో 52వ ర్యాంకు, బీసీ–ఏ కోటాలో 3వ ర్యాంకు సాధించారు. ఆగస్టు 29న సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయింది. కానీ 10 రోజుల తర్వాత విడుదలైన లిస్టులో ఆయన పేరు లేదు. అటు రిజెక్ట్ లిస్టులోనూ కనిపించలేదు. దీనిపై ఆర్జేడీ కార్యాలయంలో గ్రీవెన్స్కు దరఖాస్తు చేయగా పొంతన లేని సమాధానాలు ఇచ్చారు.సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం ఎస్.పృథ్వీరాజుకు వచ్చిన కాల్ లెటర్నెల్లూరు జిల్లా సంగం గ్రామానికి చెందిన ఎస్.పృథీ్వరాజ్ (బీసీ–బీ) టీజీటీ తెలుగు జోన్–2లో 157వ ర్యాంకు సాధించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సెప్టెంబర్ 9న గుంటూరులో జరిగింది. కానీ 15న విడుదలైన సెలక్షన్ లిస్టులో ఆయన పేరు లేదు. దీనిపై విద్యాభవన్లోని గ్రీవెన్స్లో ఫిర్యాదు చేస్తే ఇంతవరకు స్పందన లేదు.సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం బండారు యమునకు వచ్చిన కాల్ లెటర్విశాఖ జిల్లాకు చెందిన బండారు యమున (బీసీ–డీ మహిళ) ఫిజికల్ సైన్స్లో 68వ ర్యాంకు సాధించారు. సర్టిఫికెట్ల పరిశీలన తర్వాత తనకు రావాల్సిన పోస్టును 311వ ర్యాంకు సాధించిన అభ్యర్థికి ఇచ్చారని యమున ఆవేదన వ్యక్తం చేసింది. అంత పెద్ద ర్యాంకు వచ్చిన వారికి ఎలా ఇచ్చారని జిల్లా అధికారులను ప్రశ్నిస్తే ‘స్పోర్ట్సు కోటా’లో ఇచ్చామని చెబుతున్నట్లు పేర్కొంది. జనరల్ విభాగంలో పరీక్ష రాసి 311వ ర్యాంకు పొందిన అభ్యర్థికి స్పోర్ట్సు కోటాలో ఉద్యోగం ఇచ్చినట్లు చూపారు. మెగా డీఎస్సీలో ఇలాంటి విచిత్రాలు మరెన్నో!⇒ వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లికి చెందిన షేక్ నసీమూన్ (బీసీ–ఈ) డీఎస్సీ 2025లో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ సైన్స్లో 43వ ర్యాంకు సాధించింది. సెప్టెంబర్ 7న సర్టిఫికెట్ల పరిశీలనకు కాల్ లెటర్ అందింది. అదే రోజు జిల్లా కేంద్రంలో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కాగా అన్నీ సక్రమంగా ఉన్నట్లు ప్రకటించి పోస్టు ఓకే చేశారు. తీరా నాలుగు రోజుల అనంతరం విడుదలైన ఎంపిక జాబితాలో ఆమె పేరు లేకపోవడంతో అధికారులను సంప్రదించగా.. ‘బై మిస్టేక్ వల్ల మీకు కాల్ లెటర్ అందింది..’ అంటూ చేతులు దులుపుకొన్నారు. జిల్లా కలెక్టర్, డీఈవో కార్యాలయాల చుట్టూ తిరిగినా ఆమెకు న్యాయం జరగలేదు.అలా ఎలా ఇచ్చేస్తారు?డీఎస్సీ రాసి సర్టిఫికెట్ వెరిఫికేషన్కు కూడా హాజరయ్యా. రిజెక్టెడ్, సెలెక్టెడ్ లిస్ట్లో నా పేరు లేదు. స్పోర్ట్స్ కోటాలో పోస్టు ఇచ్చినట్లు చెప్పారు. నాది 198వ ర్యాంక్ అయితే స్పోర్ట్స్ కోటా కింద పోస్ట్ ఇచ్చిన వ్యక్తి ర్యాంక్ 872. నాకు కాల్ లెటర్ ఇవ్వక ముందే స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరిగింది. మరి నాకు ఇవ్వాల్సిన పోస్టు స్పోర్ట్స్ కోటా కింద ఇచ్చామని ఎలా చెబుతారు? – ఎస్.నూకరాజు, కాకినాడసుప్రీంకోర్టు ఉత్తర్వులను పట్టించుకోరా?మెరిట్లో ఉన్నవారికి పోస్ట్లు ఇవ్వాలని.. మెరిట్ను డీ మెరిట్ చేయవద్దని సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా పోస్టులను ఇచ్చేశారు. ప్రతిభగల నాలాంటి వారికి అన్యాయం జరిగింది. ఓపెన్ కేటగిరిలో 30 పోస్ట్లు ఉన్నాయి. 87వ ర్యాంక్ వచ్చిన నాకు పోస్టు ఇవ్వలేదు. ప్రతిభను గుర్తించకపోతే ఎలా? – పి.ప్రతిభ, రాజమండ్రితీరని అన్యాయం..సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు కొంతమందికి మాత్రమే వ్యక్తిగతంగా సందేశాలు పంపి పిలిచారు. రిజర్వేషన్ నిబంధనలను సక్రమంగా అమలు చేయలేదు. ఇంగ్లీష్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ మార్కులను పారదర్శకంగా ప్రకటించలేదు. ఒకే అభ్యర్థి అనేక పోస్టుల జాబితాల్లో కొనసాగడంతో పలువురు అర్హులు ఉద్యోగాలను కోల్పోయారు. అభ్యర్థులకు తీరని అన్యాయం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. – దేవరకొండ వెంకట్రావు దర్శి, ప్రకాశం జిల్లానా ఉద్యోగం.. ఇతరులకు ఇచ్చారుడీఎస్సీ 2025లో బయాలజీ సైన్స్ ఉర్దూ మీడియం పరీక్ష రాశా. 57.77 మార్కులు వచ్చాయి. ఓసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన నాకు ఎస్ఏ పోస్టు ఇవ్వాలి. నాకివ్వాల్సిన పోస్టును బీసీ–ఈ అభ్యర్థికి ఇచ్చారు. న్యాయం చేయాలని 8 నెలలుగా అధికారులకు, విద్యాశాఖ మంత్రికి, చివరకు సీఎంకు విన్నవించుకున్నా ఫలితం లేదు. –సయ్యద్ జమీల్, రాయచోటి, అన్నమయ్య జిల్లా -
గాదె వెంకటరెడ్డి మృతిపై YS జగన్ సంతాపం
-
మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి మృతిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకటరెడ్డి కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ సంతాపం తెలిపారు. వెంకటరెడ్డి సుదీర్ఘకాలం ప్రజలకు సేవలు అందించారని... ఆయన మరణం రాజకీయ రంగానికి తీరని లోటన్నారు.‘‘ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రజా సమస్యలపై ఎప్పుడూ స్పందించే నాయకుడిగా గుర్తింపు పొందారు. తన తండ్రి డాక్టర్ వైఎస్సార్కు గాదె వెంకటరెడ్డికి సన్నిహితులుగా ఉండేవారు. వైఎస్సార్తో కలిసి ప్రజా సమస్యలపై పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారు’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
నువ్విచ్చేది ఏంటి బోడి... మహిళా రిజర్వేషన్లపై లోకేష్ కామెడీ కామెంట్స్
-
‘టీడీపీ మహానాడు ఓ మహానాటకం’
సాక్షి, తాడేపల్లి: టీడీపీ నిర్వహించిన మహానాడు ఓ మహా నాటకమని, పరిపాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చేసిన ఓ డైవర్షన్ రాజకీయమే అని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ప్రజలకు చేసిన అభివృద్ది, సంక్షేమం ఏదీ లేక ప్రజా సమస్యలు చర్చించాల్సిన మహానాడు వేదికను రాజకీయ నిందల వేదికగా మార్చేశారన్నారు.ముఖ్యమంత్రి దగ్గరి నుంచీ ఆయన మంత్రివర్గం అంతా కూడా వీధి భాషకు బాగా అలవాటు పడ్డారని తెలిపారు. మహిళా రిజర్వేషన్లు ఎలాగో వస్తాయని తెలిసి ముందస్తు క్రెడిట్ చోరీకి లోకేష్ ప్రయత్నించారని శ్యామల ఆక్షేపించారు. మహిళా సాధికారతపై లోకేష్ విసిరిన సవాల్ను స్వీకరిస్తున్నామని, వైఎస్ జగన్ హయాంలో ఏం చేశామో చర్చించేందుకు ఏ టీవీ ఛానల్ కైనా వచ్చేందుకు సిద్దమని ఆరె శ్యామల స్పష్టం చేశారు. ప్రెస్ మీట్లో ఆమె ఇంకేమన్నారంటే..మహిళా రిజర్వేషన్లపై ముందస్తు క్రెడిట్ చోరీమహిళా రిజర్వేషన్ల గురించి సకలశాఖా మంత్రి లోకేష్ చేసిన ప్రకటన కూడా ఓ డైవర్షనే. మహిళా రిజర్వేషన్లు ఎలాగో దేశమంతా రాబోతున్నాయి. ముందుగానే వాటిని దొంగిలించేందుకే లోకేష్ ఈ ప్రకటన చేశారు. ఇది అడ్వాన్సెడ్ క్రెడిట్ చోరీ అన్నమాట. మహిళల గురించి మాట్లాడేముందు లోకేష్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయో చెప్పాలి. 18-59 ఏళ్ల వయస్సు ఉన్న మహిళలకు ఆడబిడ్డ నిధి కింద ప్రతీ నెలా రూ.1500 ఇస్తామన్నారు.రెండు బడ్జెట్లు పూర్తయ్యాయి. ఇచ్చింది మాత్రం గుండుసున్నా. ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలెండర్లు అన్నారు. రెండేళ్లయింది. ఆరు సిలెండర్లు రావాలి. ఇచ్చింది ఒకటి లేదా రెండు. ఇక ఉచిత బస్సు కూడా ఏంతో ఊదరగొట్టి కేవలం ఐదు కేటగిరీలకే పరిమితం చేశారు. 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు నెలకు రూ.4 వేలు పెన్షన్ అన్నారు. ఇచ్చింది మాత్రం గుండుసున్నా. తల్లికి వందనంలోనూ 20 లక్షల మంది పిల్లలకు కోత పెట్టారు. ఇక మహిళలకు చేసిందేంటి ? మహిళలకు ఆర్దిక స్వావలంబన చేకూర్చేందుకు వైఎస్ జగన్ పెట్టిన పథకాన్నీ ఎత్తేసి ఇప్పుడు వీళ్లు చెప్తున్న మాటలు నిజంగానే కామెడీగా ఉన్నాయి.మహిళా రిజర్వేషన్లను ముందుగా అంగీకరించింది జగనేఏరు దాటాక తెప్ప తగలేసే తండ్రీ కొడుకుల మాటలు నమ్మే పరిస్ధితుల్లో రాష్ట్ర ప్రజలు లేరన్న విషయాన్ని ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు గుర్తుపెట్టుకోవాలి. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లపై దేశమంతా ఒక్కటిగా ఉన్న తరుణంలో దాన్ని కూడా వీళ్ల క్రెడిట్లో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అన్నప్పుడు అందరి కంటే ముందు ఒప్పుకున్నది, ఆచరణలో చేసి చూపించింది వైఎస్ జగన్.మహిళలకు రిజర్వేషన్పై లోకేష్ చేసిన ప్రకటనను ఆమోదిస్తున్నట్లు చంద్రబాబు చెప్తున్నారు. అమలు చేసేది వైఎస్ జగన్ మాత్రమే. ఎలాగో పార్లమెంట్లో ఈ బిల్లు పాస్ కాబోతోంది, దేశమంతా రిజర్వేషన్ రాబోతోంది. ఇలాంటి పరిస్ధితుల్లో మహిళల రిజర్వేషన్ తమ బ్రెయిన్ చైల్డ్ అన్నట్లుగా మాట్టాడటం సిగ్గుచేటు. మహిళా రిజర్వేషన్లపైనా ఈ క్రెడిట్ చోరీ ఏంటి? మీ రాజకీయ జీవితమంతా క్రెడిట్ చోరీయే. ఎన్టీఆర్ నుంచి పార్టీ చోరీ, ఆయన మరణానికి కారణమైన విమర్శల మధ్య ఆయనకు దండలేసి దండాలు పెడుతున్నారు. ప్రజలు ఏదీ మర్చిపోరు. అన్నీ గుర్తుపెట్టుకుంటారు.హత్యా రాజకీయాలు టీడీపీవేగొడ్డలి పార్టీ అంటున్న వారికి హత్యా రాజకీయాలు ఎవరివో తెలియవా? వైఎస్ జగన్ ప్రెస్ మీట్లో మీ హత్యా రాజకీయాల్ని స్పష్టంగా వివరించిన తర్వాత ప్రతీ ఒక్కరికీ వాస్తవాలు అర్థమయ్యాయి. మీకు మనస్సాక్షి ఉంటే ఎన్టీఆర్ మరణం, వంగవీటి రంగా, మల్లెల బాబ్జీ, పింగళి దశరథరామ్ వంటి వారి హత్యలకు కారకులు ఎవరో చెప్పండి. వివేకానందరెడ్డి హంతకులు కూడా ఇవాళ రోడ్డు మీద ధైర్యంగా ఎలా తిరగగలుగుతున్నారో చెప్పండి. మీరు అధికారంలోకి వచ్చాక జరిగిన సచివాలయ ఉద్యోగుల మరణాలకు కారణం ఎవరు? స్వాతంత్రం తర్వాత దేశంలోనే తొలిసారి వైఎస్ జగన్ ఒకే రోజు 2019 అక్టోబర్ 2న లక్షా 20 వేల ఉద్యోగుల్ని నియమించి చరిత్ర సృష్టించారు.మీరు అధికారంలోకి వచ్చాక ఈ రెండేళ్లలో 100 మంది సచివాలయ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. దీన్ని బట్టి ఎవరివి హత్యా రాజకీయాలు, ఎవరిది గొడ్డలి పార్టీయే అర్దమవుతోంది. మీరు అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ పాలనలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలపై దాడులు పెరిగాయి. 21 మంది రాజకీయ హత్యలకు గురయ్యారు. ఇప్పుడు చెప్పండి ఎవరిది గొడ్డలి పార్టీ ? రాష్ట్రంలో శాంతి భద్రతలపై మీరే మాట్లాడాలి. మహిళ పోలీసు స్టేషన్ కు వెళ్లే పరిస్ధితి ఉందా, వెళ్లినా ఫిర్యాదు తీసుకునే పరిస్ధితి ఉందా ? రాష్ట్రంలో ఎక్కడ చూసినా అమాయకులపై వేధింపులు, అక్రమ కేసులు, సోషల్ మీడియాపై దాడులే.రైల్వే కోడూరు ఎమ్మెల్యేపైలో మోసం, అత్యాచారం ఆరోపణలపై మహిళా ఉద్యోగి నేరుగా సీఎంకే ఫిర్యాదు చేసినా ఇప్పటికీ చర్యల్లేవు. మహిళా స్కూలు ప్రిన్సిపాల్ ను టీడీపీ ఎమ్మెల్యే వేధిస్తే ఎలాంటి చర్యల్లేవు, మంత్రి సంధ్యారాణి పీఏపై లైంగిక వేధింపులపై చర్యల్లేవు, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహిళలతో అసభ్య కాల్స్ లో మాట్లాడినా చర్యల్లేవు, జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని అవమానించిన అనంతపురం ఎమ్మెల్యేపైనా చర్యలుండవు. కాబట్టి మహిళల గౌరవం గురించి మాట్లాడే అర్హత మీకెక్కడిది?మహిళల్లో దైర్యం నింపిన జగన్ పథకాలుస్త్రీ శక్తి అంటే సభలో చప్పట్టు కొట్టుకోవడం కాదు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ అసలు స్త్రీ శక్తి ఎలా ఉంటుందో చూపించారు. ప్రతీ ఇంట్లోనూ ఓ నమ్మకం కలిగించారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే మహిళళకు సాధికారత లభించింది. మహిళలకు డిప్యూటీ సీఎం, హోంమంత్రి, మున్సిపల్, జడ్పీ పదవులు ఇచ్చిన చరిత్ర ఆయనది. ఆసరా, కాపు నేస్తం, సున్నా వడ్డీ, జగనన్న తోడు వంటి పథకాలు గత ప్రభుత్వంలో మహిళల స్వయం శక్తిని పెంచాయి. ఐటీసీ, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, రిలయన్స్ వంటి అంతర్జాతీయ నెట్ వర్క్ లతో మహిళా సంఘాల్ని అనుసంధానం చేసిన ఘనత వైఎస్ జగన్దే. కానీ చంద్రబాబు రెండేళ్ల పాలనలో మహిళలకు చేసిందేమీ లేదు. కానీ నిత్యం వైఎస్ జగన్పై నిందలు వేస్తున్నారు.రాష్ట్రంలో మీరు కోల్పోయిన విశ్వసనీయత మళ్లీ ఎప్పటికీ తిరిగి రాదు. ప్రతీ ఒక్కరికీ చంద్రబాబు, లోకేష్ గురించి అర్దమైపోయింది. మహానాడులో పెద్ద పెద్ద మాటలతో పబ్లిసిటీ కింగ్ లు, పరిపాలనలో పిల్లులని నిరూపించారు. హామీల విషయంలో గుంట నక్కల్లా వ్యవహరిస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో ప్రతీ పథకం మహిళల జీవితాల్లో మార్పు తెస్తే.. మీ పాలనలో మాత్రం ప్రతీకార రాజకీయాలు మాత్రమే కనిపిస్తున్నాయి. మామా, మరదలు, తమ్ముడు పార్టీ మహానాడు పేరుతో చేసిన మహానాటకం అద్భుతం.ఎందుకంటే మామ గారైన ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారు, మరదలి బలవన్మరణానికి కారణమయ్యారు, తమ్ముడి గారిని గొలుసులు వేసి కట్టేశారు. ఇవన్నీ నిజాలే. ఆ పార్టీ మామ, మరదలు, తమ్ముడు పార్టీ. మీరు హద్దులు దాటి మాట్లాడితే మేమూ ఇలాగే మాట్లాడాల్సి వస్తుంది. ఇన్నాళ్లూ మాట్లాడలేదంటూ మాకు కొన్ని విలువలు ఉన్నాయనే. మీరు దిగజారి మాట్లాడుతుంటే మీ అంత దిగజారకపోయినా వాస్తవాలు ప్రజలకు చెప్పాలనుకుంటున్నాం. నెత్తిమీద రూపాయి పెడితే చెల్లే అర్హత లేని వాళ్తంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై ఇష్టారాజ్యంగా నిందలేస్తున్నారు. అక్కడున్న వాళ్లంతా కబ్జాదారులు, బ్యాంక్ దోపిడీ దాడులు, మహిళల్ని లైంగికంగా వేధించిన వాళ్లు, డీఎస్సీ స్కాం దారులే. అదే వేదికపై మహిళా బిల్లును ఓడిన కాంగ్రెస్ తో వెంటనే విందులు చేసుకున్న వాళ్లూ ఉన్నారు. వీళ్లంతా వైఎస్ జగన్ గురించి, వైఎస్సార్సీపీ గురించి మాట్లాడుతున్నారు.లోకేష్కు వైఎస్సార్సీపీ ఓపెన్ ఛాలెంజ్లోకేష్ కు ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నాం. చర్చకు సిద్దమని మీరు సవాల్ విసిరారు కదా, దాన్ని స్వీకరిస్తున్నాం. ఏ టీవీ ఛానలో చెప్పండి, అందులో మా పార్టీ నుంచి ఓ ఎమ్మెల్యే వచ్చి చర్చలో పాల్గొంటారు. కానీ దాని కంటే ముందు పెండింగ్ లో ఉన్న పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్, వసతి దీవెన బకాయిలు రూ.10 వేల కోట్లు ఎప్పుడిస్తారా చెప్పండి, అలాగే డీఎస్సీ అక్రమాలపై ఎందుకు మౌనంగా ఉంటున్నారా చెప్పాలి. డీఎస్సీలో పేపర్ లీక్, మెరిట్ లిస్ట్ మాయం, డేటా లీక్ జరిగాయి. మీరు ఈ డార్క్ ఆపరేషన్ గురించి ఎందుకు బయటపెట్టలేకపోతున్నారు.రాష్ట్ర యువత లోకేష్ కు పేపర్ లీకేజ్ అని పేరు పెట్టారు. మీ హయాంలో ఎన్నిసార్లు పేపర్ లీక్ లు అయ్యాయి?, వాటిపై ఏ చర్యలు తీసుకున్నారు ? అడిగితే కేసులు పెడుతున్నారు. మీ పరీక్షల నిర్వహణలో తప్పులు పెట్టుకుని అడిగిన వాళ్ల మీద కేసులు పెడతామంటే ఎలాగో పేపర్ లీకేజ్ మంత్రి గారు చెప్పాలి. ఇవాళ మీ పేపర్ లీక్ వల్ల ఎంతో మంది జీవితాలు అతలాకుతలం అయ్యాయి. వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా దీనిపై ఎన్నో పోరాటాలు చేస్తున్నా మీరు స్పందించడం లేదు. మీ వీధి భాష చూసి మీరు చదివిన స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీ కూడా సిగ్గుపడుతుంది.ఓ పారిశ్రామిక వేత్త నుంచి లాబీయింగ్ చేసి డబ్బులు వసూలు చేసి ఫీజులు కట్టారన్నది వాస్తవమా కాదా లోకేష్ చెప్పాలి. స్టాన్ ఫర్డ్ డిగ్రీ కంటే వీధి భాష, కక్ష రాజకీయాలు, రెడ్ బుక్ పాలనపైనే ఎక్కువగా పీహెచ్డీ చేసినట్లున్నారు. అందుకే ప్రజలు వైఎస్ జగన్ ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారని ఆరె శ్యామల అన్నారు. -
వీళ్ళ బండారం ఎలా బయట పడిందంటే క్లుప్తంగా వివరించిన అంబటి
-
మహానాడు అని చెప్పి రికార్డింగ్ డాన్సులు వేశారు
-
కూటమి దగా డీఎస్సీపై కదం తొక్కిన వైఎస్సార్సీపీ (ఫొటోలు)
-
విద్యార్థుల ఉసురు పోసుకుంటున్నమంత్రి నారా లోకేష్..
-
మెగా డీఎస్సీ అక్రమాలపై YSRCP పోరుబాట..
-
‘సకల శాఖల మంత్రి లోకేష్ రాజీనామా చేయాల్సిందే’
ఏపీలో కూటమి సర్కార్ పాలనలో డీఎస్సీలో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలంటూ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలకు దిగింది. అన్ని జిల్లాల్లోనూ పలు విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు, పార్టీ నేతలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ కోటాలో పోస్టులు అమ్ముకోవడం, పేపర్ లీకేజీపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.అనంతపురం..డీఎస్సీ స్కాంపై విద్యార్థి సంఘాల ఆగ్రహంఅనంతపురం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపిన విద్యార్థి విభాగం నేతలువిద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ఉరేసుకుని విద్యార్థుల వినూత్న నిరసనటీడీపీ కూటమి సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలుఉపాధ్యాయ నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్విద్యార్థి విభాగం నేతల ఆందోళనకు సంఘీభావం తెలిపిన డీఎస్సీ అభ్యర్థులు గుంటూరు..పానుగంటి చైతన్య వైఎస్సార్సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగ అధ్యక్షుడు కామెంట్స్..ఎన్నికల సమయంలో మేము అధికారంలోకి రాగానే వెంటనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని లోకేష్ చెప్పారు.అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నిర్వహించకుండా ప్రభుత్వం నిరుద్యోగుల్ని మోసం చేసిందిప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ ఒక అక్రమాల పుట్టడీఎస్సీ పరీక్ష గందరగోళంగా మారిందిడీఎస్సీ లో జరిగిన అక్రమాలు అవకతవకలపై ప్రభుత్వం వెంటనే సీబీఐతో విచారించాలివిద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలిమాజీ మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్...ప్రభుత్వం నిర్వహించింది మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్సీపరీక్షలు నిర్వహించే వారు ఎలా డీఎస్సీ పరీక్ష రాస్తారులోకేష్ డబ్బులకు స్పోర్ట్స్ సర్టిఫికెట్లు అమ్ముకున్నారుస్పోర్ట్స్ కేటగిరీ కింద ఉన్న ఉద్యోగాలను లోకేష్ అమ్ముకున్నారులోకేష్ కు సిగ్గు ఉంటే వెంటనే రాజీనామా చేయాలిడీఎస్సీ లో జరిగిన అక్రమాలు అవకతవకలపై వెంటనే సీబీఐతో విచారణ జరిపించి లోకేష్ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలిఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కామెంట్స్..దేశంలో చంద్రబాబు లాంటి దరిద్రపు ప్రభుత్వం ఎక్కడా లేదుయువకుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందిడీఎస్సీ లో జరిగిన అక్రమాలు అవకతవకలపై ప్రభుత్వం వెంటనే సీబీఐతో విచారణ జరిపించాలినారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలికర్నూలు..ఎమ్మెల్యే వీరుపాక్షి కామెంట్స్..రాష్ట్రంలో చంద్రబాబు పాలన రాక్షస పాలన.రాష్ట్రంలో మెగా డీఎస్సీ దగా డీఎస్సీగా మార్చి అభ్యర్థులను రోడ్డున పడేశారు.మెగా డీఎస్సీలో భారీ కుంభకోణం జరిగిందివిద్యాశాఖలో జరిగిన అవినీతికి బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలి.డీఎస్సీలో మెరిట్ విద్యార్థుల పేర్లను మంత్రి లోకేష్ తప్పించారు.అభ్యర్థులు నుండి నేరుగా డబ్బులు ముట్టినట్లు సమాచారం.డీఎస్సీలో అన్యాయం జరిగిందని అడిగితే కేసులు పెడుతున్నారు.డీఎస్సీలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. విశాఖ..డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ పోరుబాట..డాబా గార్డెన్స్ అంబేద్కర్ కూడలి పార్టీ శ్రేణుల ఆందోళన..అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన నేతలు..కార్యక్రమానికి హాజరైన జిల్లా పార్టీ అధ్యక్షుడు కేకే రాజు, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, కుంభ రవి బాబు తదితరులు..నెల్లూరు..నెల్లూరు విఆర్సీ సెంటర్ వద్ద వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసనడీఎస్సీ పరీక్షల నిర్వహణ, అభ్యర్థుల ఎంపికలో అవకతవకలపై ఆందోళననియామక ప్రక్రియలో చోటుచేసుకున్న పరిణామాలపై ఆగ్రహంనిరసనలో పాల్గొన్న మాజీ మంత్రి కాకాణి, కూటమి ప్రభుత్వ పరిపాలన లోపంపై మండిపాటుఎస్వీ యూనివర్సిటీ ఎదుట వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నిరసన కార్యక్రమంలో భూమన కరుణాకరరెడ్డి పాల్గొన్నారు.భూమన కామెంట్స్..డీఎస్సీ అక్రమాలకు బాధ్యత చేస్తూ రాజీనామా చేయాలిఒక్కో ఉద్యోగం 15 నుంచి 20 లక్షలకు అమ్ముకున్నారుఓసీ ఓపెన్ కటాఫ్ లేకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు అన్యాయం చేశారుబీసీ, ఎస్సీ, ఎస్టీలు మెరిట్లో వచ్చినా రిజర్వేషన్లో మాత్రమే ఎంపిక చేశారు, ఓపెన్ కేటగిరిలో అన్యాయం చేశారుఓపెన్ కేటగిరి కటాఫ్ బయట పెట్టాలిరిజర్వేషన్ లేకుండా కొన్ని లక్షలు మందికి అన్యాయం చేశారుదీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం.స్పోర్ట్స్ కోటాలో అదనపు కోట కలిపి, శాప్ చైర్మన్ రవినాయుడు అర్హత లేని వారికి ఉద్యోగాలు3.50 లక్షలు మంది డీఎస్సీ రాస్తే.. వాళ్లకు కావాల్సిన వారికి ఉద్యోగాలు వచ్చాయిప్రభుత్వం వెంటనే సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్ అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి వ్యాఖ్యలు..మంత్రి నారా లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలిదీనిపై సీబీఐ విచారణ జరిపించాలి.సకల శాఖ మంత్రి నారా లోకేష్ భారీ ఎత్తున కోట్లు అవినీతికి పాల్పడ్డారు -
కూటమి రాక్షస పాలనపై YSRCP పోరుబాట
-
లోకేష్ మహానాడు.. రికార్డింగ్ డ్యాన్సులు.. పరువు తీశారు కాదయ్యా..
-
లోకేశ్.. నీ ఘన చరిత్ర అందరికీ తెలుసులే!
సాక్షి, అమరావతి: డీఎస్సీలో అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలని విద్యాశాఖ మంత్రి లోకేశ్కు వైఎస్సార్సీపీ హితవు పలికింది. చిత్తశుద్ధి ఉంటే డీఎస్సీపై ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేసింది. పూర్తి మెరిట్ జాబితాను విడుదల చేసి డీఎస్సీ ఆశావహులకు నిజాయితీగా సమాధానం చెప్పాలే తప్ప డైవర్షన్ పాలిటిక్స్, వ్యక్తిగత దూషణలు చేస్తే సమాజం హర్షించదని హెచ్చరించింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ గురువారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ పోస్టు చేసింది. డీఎస్సీ కుంభకోణంపై ప్రశ్నలకు లోకేశ్ ఎందుకు సమాధానం ఇవ్వలేకపోతున్నారని నిలదీసింది. ‘వెబ్సైట్ నుంచి మెరిట్ జాబితాను ఎందుకు తొలగించారు?, పారదర్శకత లేకుండా స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను ఎందుకు ఇచ్చారు?, రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు ఎందుకు నిరసన తెలుపుతున్నారు?’ అంటూ చురకలు అంటించింది. ‘మిమ్మల్ని (లోకేశ్ను) ఇంటర్మీడియెట్ పాస్ చేయించడానికి ఇప్పటి మంత్రి నారాయణ పడ్డ కష్టాలు అందరికీ తెలిసినవే. ఆ రోజుల్లో మీకోసం నారాయణ పడ్డ కష్టం వల్లే ఇప్పటికే మీమధ్య అనుబంధం అంత బలంగా ఉందనేది తెలిసినవారు అందరూ చెప్పుకుంటారు. అంతేకాదు.. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి మీరు తీసుకున్న డిగ్రీ వెనుక ఒక పారిశ్రామికవేత్తనుంచి తీసుకున్న ముడుపుల కథ ఉందని మర్చిపోకండి. ఆ రోజుల్లో ఆ ముడుపులను మీ ఫీజులు రూపంలో చెల్లించిన వాస్తవ కథ తెలుగు ప్రజలకు ఇంకా గుర్తు ఉంది. అలాంటి మీరు డిగ్రీల గురించి, పరీక్షల గురించి చెబితేం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు అవుతుంది’ అని లోకేశ్ వ్యవహర శైలిపై తీవ్ర స్థాయిలో మండిపడింది. -
‘గుంతలు’ తీసిన బంట్లు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు జిల్లాలో అక్రమ మైనింగ్ ప్రజల ఉసురు తీస్తోంది. క్వారీ గుంతల్లో పడి అమాయకులు బలైపోతున్నారు. తాజాగా అక్రమ మైనింగ్ వల్ల గుంటూరు జిల్లా నాయుడుపేటలో రెండు రోజుల కిందట క్వారీ గుంతలో పడి ముక్కుపచ్చలారని చిన్నారి ఆనంద్(6) అసువులుబాశాడు. అయినా అధికారపార్టీ నాయకులు అక్రమ మైనింగ్ ఆపడం లేదు. అధికారం మాది అడిగేవాడెవడు అనే చందంగా రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములనే తేడా లేకుండా తవ్వకాలకు తెగబడుతున్నారు. రూ.కోట్లకుకోట్లు దండుకుంటున్నారు. ఎవరైనా అడ్డువస్తే అధికారులనైనా సరే చెప్పింది చాలు వెళ్లు అంటున్నారు. స్థానిక ప్రజాప్రతినిధికి కప్పం కడితే చాలు అనుమతుల్లేకుండా ఎక్కడైనా యథేచ్ఛగా తవ్వుకోవచ్చునని విర్రవీగుతున్నారు. కనీస రక్షణ చర్యలు పాటించడం లేదు.గతంలోనూ ఎందరో బలి!గుంటూరు రూరల్ మండలంలో జరుగుతున్న క్వారీ మైనింగ్కు అమాయకులు బలవుతున్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు కోకొల్లలు జరిగాయి. గత తెలుగుదేశం ప్రభుత్వంలో కృష్ణా పుష్కరాల సమయంలో నాయుడుపేట సమీపంలో నిర్వహించిన అక్రమ క్వారీలో ఈత కోసం దిగి ఐదుగురు ప్రత్తిపాడు మండలానికి చెందిన చిన్నారులు మృత్యువాత పడ్డారు.⇒ గతేడాది నాయుడుపేటకు చెందిన ఒక యువకుడు రాత్రి సమయంలో బయటకు వెళ్లి ప్రమాదవశాత్తూ కాలుజారి పడి మృతి చెందాడు. ⇒ ఆరు నెలల క్రితం ఇదే అక్రమ క్వారీల్లో చౌడవరం సీఆర్ కాలనీకి చెందిన ఒక యువకుడు ప్రమాదవశాత్తూ జారిపడి మరణించాడు. ⇒ మూగజీవాలూ క్వారీ గుంతల్లో పడి మరణించిన సందర్భాలు ఉన్నాయి.నిరంతరాయంగా దందా గుంటూరు రూరల్ మండలంలోని ఓబులనాయుడుపాలెం, నాయుడుపేట, వెంగళాయపాలెం, చిన్నపలకలూరు, గోరంట్ల, ప్రత్తిపాడు మండలం నడింపాలెం పంచాయతీ పరిధిలో పగలూరాత్రీ తేడాలేకుండా అక్రమ గ్రావెల్ దందా జరుగుతోంది. ఇదంతా స్థానిక ప్రజాప్రతినిధి కనుసన్నల్లో సాగుతోంది. ప్రజాప్రతినిధి అల్లుడే ఈ తవ్వకాలు జరిపిస్తున్నట్లు సమాచారం. ఏకంగా ప్రజాప్రతినిధి కార్యాలయం నుంచి ఒకరిద్దరు తవ్వకాలు జరిపే ప్రాంతంలో రాత్రి, పగలు తరలిస్తున్న వాహనాల లెక్కలు రాసుకునేందుకు వస్తున్నారు. గ్రావెల్ లారీ ఒక్కొక్కటి రూ.8–10 వేలకు విక్రయిస్తున్నారు. దీనికోసం 100 అడుగులకుపైగా లోతుగా గోతులు తవ్వుతున్నారు. వీటివద్ద ఎటువంటి హెచ్చరికలూ లేకపోవడం, వర్షం పడినప్పుడు వీటిల్లో నీరు చేరడంతో ప్రజలు ప్రమాదవశాత్తూ పడి మృత్యువాత పడుతున్నారు. అక్రమ మైనింగ్ అడ్డా వడ్డమానుతుళ్లూరు మండలంలో వడ్డమాను అక్రమ మైనింగ్కు అడ్డాగా మారింది. రియల్ ఎస్టేట్ వెంచర్ల నిర్వాహకులు, టీడీపీ నాయకులు కలిసి ఈ దందాకు తెగబడుతున్నారు. చేబ్రోలు మండలంలోని శేకూరు, వీరనాయునిపాలెం, వడ్లమాను గ్రామాల్లోనూ యథేచ్ఛగా అక్రమమైనింగ్ సాగుతోంది. స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధుల అండతో గ్రామ, మండల స్థాయి నేతలు అక్రమ మైనింగ్కు పాల్పడుతూ లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. యడ్లపాడు మండలం, ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు మండలాల్లోనూ రాత్రి సమయాల్లో మైనింగ్ జరుగుతూనే ఉంది. అక్రమ మైనింగ్పై వైఎస్సార్సీపీ పోరాటం అక్రమ మైనింగ్పై వైఎస్సార్సీపీ అలుపెరగని పోరాటం చేస్తోంది. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. తాజాగా ఈ విషయంపై జనసేన నాయకులూ మండిపడుతున్నారు. ఇక్కడ ఉన్న అటవీ శాఖ భూముల్లోనూ టీడీపీ నేతలు అక్రమ మైనింగ్ చేస్తుంటే అవినీతికి అలవాటు పడిన అధికారులు పట్టించుకోవడం లేదని జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు విమర్శించారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన ఆయన ఏఎంఆర్ సంస్థ ప్రతినిధులను ప్రశ్నించారు. ఈ అక్రమ మైనింగ్పై పవన్ కళ్యాణ్కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. -
‘అందుకే.. టీడీపీ మహానాడులో రాజకీయ డ్రామా’
సాక్షి, తాడేపల్లి: మెగా డీఎస్సీ స్కామ్ బయటపడడంతో రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో ప్రజల దృష్టి మళ్లించేందుకే టీడీపీ మహానాడులో రాజకీయ డ్రామాకు తెర లేపారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగ మల్లీశ్వరి ఫైర్ అయ్యారు. తొలి సంతకం అంటూ నానా హడావిడి చేసి నిర్వహించిన డీఎస్సీ–2025లో ప్రభుత్వం పెద్ద స్కామ్ చేసిందని ఆమె ఆరోపించారు. అందుకే అది మెగా డీఎస్సీ కాదని ఒక దగా డీఎస్సీ అని అభివర్ణించారు.చెప్పుకోవడానికి రెండేళ్లుగా చేసిందేమీ లేదని, అందుకే అదే పనిగా జగన్పైనా, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపైనా విమర్శలు, నిందల పర్వంతోనే మహానాడు నిర్వహిస్తున్నారని నాగ మల్లీశ్వరి తేల్చి చెప్పారు. కాబట్టి నాడు ఎన్టీఆర్ హయాంలో నిర్వహించిన మహానాడుకు, ఇప్పటి ఈ మహానాడుకు మధ్య నక్కకు నాక లోకానికి ఉన్న తేడా ఉందని చెప్పారు. వర్చువల్ మహానాడు సమావేశాలకు చివరకు పార్టీ కార్యకర్తలు కూడా రావడం లేదని, అందుకే రికార్డింగ్ డ్యాన్స్లు ఏర్పాటు చేయడంతో పాటు, డ్వాక్రా మహిళలను బెదిరించి, సమావేశాలకు తీసుకొచ్చారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నాగ మల్లీశ్వరి తెలిపారు.ప్రెస్మీట్లో నాగ మల్లీశ్వరి ఇంకా ఏం మాట్లాడారంటే..:అందుకోసమేనా మీ ‘మహానాడు’?:టీడీపీ మహానాడు సమావేశాలు పూర్తి హాస్యాస్పదంగా మారాయి. తనకు తానే విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు ఇవాళ కామెడీ వ్యక్తులతో సమావేశాలు నిర్వహించడం రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. ఈ రెండేళ్లలో రాష్ట్రానికి ఏమి చేశారో, అభివృద్ధి కోసం ఏ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారో చెప్పకుండా.. రాబోయే రోజుల్లో ఏం చేస్తారన్న దానిపైనా మాట్లాడకుండా కేవలం జగన్గారిని తిట్టడానికే మహానాడు వేదికగా మార్చుకున్నారు. వైఎస్ జగన్ కాలిగోటికి కూడా సరిపోని వ్యక్తులతో విమర్శలు చేయించడం పూర్తిగా దిగజారిన చంద్రబాబు నైజానికి అద్దం పడుతోంది.స్త్రీ శక్తి పేరు పెట్టుకోవడం విడ్డూరం:రాష్ట్ర ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతూ టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. మహానాడులో 1160 సార్లు జగన్ పేరు జపించారు. మహిళల కోసం పోరాడుతున్నట్లు ‘స్త్రీ శక్తి’ అంటూ మహానాడుకు పేర్లు పెట్టుకోవడం విడ్డూరంగా ఉంది. మహానాడుకు మహిళలు రావడం లేదనే పరిస్థితిలో స్త్రీశక్తి అంటూ హడావిడి చేస్తున్నారు. కొన్ని చోట్ల రికార్డింగ్ డ్యాన్సులు కూడా పెట్టారు. మహిళల గౌరవం గురించి మాట్లాడే అర్హత మీకు ఉందా? ‘కనిపిస్తే ముద్దన్న పెట్టాలి.. లేకపోతే కడుపైనా చేయాలి’ అన్న డైలాగులు చెప్పింది మీ మామ బాలకృష్ణ కాదా?. చంద్రబాబు క్రెడిబులిటీని తగ్గించి లోకేష్ను హైలైట్ చేయడానికే ఈ మహానాడు నిర్వహిస్తున్నారు. నటనలో భాస్కర్ అవార్డు చంద్రబాబు, లోకేష్కే ఇవ్వాలి. అంత పెద్ద పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు.అనిత వ్యాఖ్యలు హాస్యాస్పదం: మహానాడు తొలి రోజు హోం మంత్రి అనిత మాట్లాడుతూ.. పార్లమెంట్లో మహిళా బిల్లు ద్వారా 30 శాతం రిజర్వేషన్లు ఇచ్చినా, ఇవ్వకపోయినా మా లోకేష్ మహిళలకు అవకాశాలు ఇస్తారని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. అనిత.. నీకు హోం మంత్రి పదవి ఎలా వచ్చిందో ఒకసారి ఆలోచించుకో. జీవితాంతం రుణపడి ఉండాల్సింది జగన్ గారికే తప్ప చంద్రబాబు, లోకేష్కు కాదు. దళిత మహిళలకు హోం మంత్రి పదవి ఇచ్చిన చరిత్ర జగన్గారిది. మహిళలకు 50 శాతం పదవులు, పనుల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ 2019–2024 మధ్య చట్టబద్ధంగా అవకాశాలు కల్పించకపోయి ఉంటే ఇవాళ నీకు ఆ పదవి వచ్చేదా? చంద్రబాబుకు నిజంగా నీపై అంత ప్రేమ ఉంటే గతంలో ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు? ఇవాళ పరిస్థితులు మారడంతో మంత్రి పదవి ఇచ్చారు. ఏది పడితే అది మాట్లాడి జగన్ను తిడితే సరిపోతుంది అనుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు.బూతులు. నిందలు. విమర్శలు.. ఇదే మహానాడు:మహానాడు అంటే నాలుగు బూతులు, నాలుగు విమర్శలు, నాలుగు తిట్లు, నాలుగు నిందలు అన్నట్టుగా మార్చేశారు. ఒక్కసారి ఆలోచించుకోండి.. 175 నియోజకవర్గాల అభ్యర్థులను ఒకే గదిలో కూర్చోబెట్టి జగన్ గారు మీటింగ్ పెడితే మీ మహానాడు మొత్తం కొట్టుకుపోతుంది. అదే జగన్ స్టామినా. అభివృద్ధి, సంక్షేమంపై చర్చకు సిద్ధమని లోకేష్ అంటున్నారు. దేనిమీదైనా చర్చకు మేం సిద్ధం. మా ఎమ్మెల్యేలు మీతో చర్చకు వస్తారు రెడీనా? కానీ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడితే ప్రజలు హర్షించరు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కాదు.. మేం రాసిన రెడ్బుక్ రాజ్యాంగమే రాష్ట్రంలో నడవాలని మీరు చేస్తున్న ప్రయత్నాలు చివరకు మీ పార్టీని భూస్థాపితం చేస్తాయని మర్చిపోతున్నారు.ఇప్పటికీ ఎన్టీఆర్ పేరునే వాడుకుంటున్నారు:ఎన్నికల సమయంలో ఆడబిడ్డకు నెలకు రూ.1500, మూడు ఉచిత సిలిండర్లు, తల్లికి వందనం అంటూ ఎన్నో హామీలు ఇచ్చినా అమలు చేయలేదు. ‘సూపర్ సిక్స్ సూపర్ హిట్’ అంటూ ప్రచారం చేసుకోవడం తప్ప 22 నెలల పాలనలో ఒక్క శ్వేతపత్రం కూడా విడుదల చేయలేదు. ఎన్టీఆర్ పథకాలు చెప్పుకోవడం తప్ప చంద్రబాబు స్వయంగా ప్రారంభించి పూర్తి చేసిన ఒక్క పథకం పేరైనా చెప్పగలరా? 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఇప్పటికీ ఎన్టీఆర్ పేరునే వాడుకుంటున్నారు. పార్లమెంట్లో మహిళా బిల్లుకు మొదటి మద్దతు తెలిపింది జగన్ గారే. ఇప్పుడు అదే విషయంపై క్రెడిట్ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.తల్లి, చెల్లి పేర్లతో చిల్లర రాజకీయాలు:పాలనా వైఫల్యాలు, డీఎస్సీ స్కామ్ బయట పడడంతో ప్రజల దృష్టి మళ్లించేందుకే మహానాడును వాడుకుంటున్నారు. డీఎస్సీ ప్రశ్నాపత్రం అప్లోడ్ చేసిన వ్యక్తికే టాప్ ర్యాంక్ ఎలా వచ్చిందో లోకేష్ సమాధానం చెప్పాలి. ఇది మెగా డీఎస్సీనా? లేక దగా డీఎస్సీనా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వాటికి సమాధానం చెప్పలేక తల్లి, చెల్లి పేర్లతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ‘గొడ్డలి పార్టీ’ అంటూ మాట్లాడేవాళ్లు ముందుగా తమ పార్టీ చరిత్ర చూసుకోవాలి. మీది వెన్నుపోటు పార్టీ కాదా? గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన దిశ యాప్ ఎంతో మంది మహిళలకు రక్షణ కల్పించింది. దాన్ని తీసేసి శక్తి యాప్ తెచ్చారని, మరి దాని వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? అని ప్రశ్నించిన నాగ మల్లీశ్వరి, చంద్రబాబు కూటమి పాలనలో మహిళలే ఎక్కువగా మోసపోతున్నారని చెప్పారు. -
ఏపీలో జరిగింది.. దగా డీఎస్సీ: పేర్ని నాని
సాక్షి, కృష్ణా జిల్లా: నారా లోకేష్ చిత్ర విచిత్రాలు, టక్కుటమార విద్యలు ప్రదర్శిస్తున్నాడంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని మండిపడ్డారు. ఆయన శాఖను గాలికి వదిలేసి మిగిలిన అన్ని శాఖల్లో వేలు పెట్టి ఉద్ధరిస్తున్నానని చెబుతున్నాడు. గురువుల నియామకంలో విద్యాశాఖ చేసిన చేసిన తప్పుడు పనులు అన్నీ ఇన్నీ కాదు’’ అంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు.‘‘99 పైసలుకే భూములు ఇచ్చి బాగానే పోగేసుకుంటున్నారు కదా. అమరావతిలో అడుగుకు రూ. 20 వేల రూపాయలకు కాంట్రాక్టులు ఇచ్చి పోగేసుకుంటున్నారు కదా. గురువుల నియామకంలో కూడా తప్పుడు పనులు చేయడమేనా?. సమాజానికి నష్టం చేస్తున్నామనే పాపభీతి కూడా ఉండదా మీకు?. 16 వేలపై చిలుకు టీచర్ పోస్టుల భర్తీ పేరుతో మెగా డీఎస్సీ పేరుతో దగా చేశారు. చంద్రబాబు, లోకేష్ నీచాతి నీచాలకు పాల్పడ్డారు. మెగా డీఎస్సీ నిజంగానే పారదర్శకంగా నిర్వహిస్తే మెరిట్ లిస్ట్ ఎందుకు ఇవ్వరు’’ అంటూ పేర్ని నాని ప్రశ్నించారు.‘‘మెరిట్ లిస్టు ఇవ్వరు.. ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో చెప్పరు. ఫోన్లకు మాత్రం మెసేజ్లు పెడతారంట. ఎంత సొమ్ము కొడితే అంత ర్యాంకు ఇస్తారా?. సిగ్గు లేకుండా విద్యాశాఖ నుంచి ప్రకటన ఇచ్చారు. విద్యాశాఖ నుంచి ప్రకటన ఇచ్చిన వాళ్లు అన్నమేనా తినేది. డీఎస్సీ మీద ఎవరైనా మాట్లాడితే కేసులు పెడతామంటున్నారు. తప్పుడు పనులు చేయడం మిమ్మల్ని ప్రశ్నిస్తే జైల్లో వేస్తారా?. ప్రతీ ప్రభుత్వ సంస్థలో నియామకాలు చేసినపుడు స్పోర్ట్స్ కోటాలో రెండు శాతం ఇవ్వాలని 2012లో జీవో ఇచ్చారు. 2024 ఏప్రిల్ 19న జీవో నెంబర్ 47, జీవో నెంబర్ 4ను విడుదల చేశారు..డీఎస్సీ, టెట్ పరీక్ష రాయకుండానే 3 శాతం స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇచ్చేస్తారంట. 29 ఆటలను 67 ఆటలుగా మార్చారు. బచ్చాలు, గోళీలాటలు తప్ప అన్ని ఆటలు పెట్టారు. దొడ్డిదారిన 421 మందిని వ్యాయామ ఉపాధ్యాయుల కింద నేరుగా రిక్రూట్మెంట్ చేసుకున్నారు. ఇది తప్పుకాదా... ఇంతకంటే నీచం మరొకటి ఉందా?. ఏపీలో దగా డీఎస్సీ.. అతిపెద్ద మెగా స్కామ్. స్పోర్ట్స్ కోటాలో ఎంపికైనా 421 మంది సర్టిఫికెట్లను బయటపెట్టే దమ్ముందా ఇదే నా ఛాలెంజ్...బోత్ ఆర్ నాట్ సేమ్ అని సినిమా డైలాగ్లు కొట్టడం కాదు. ఖలేజా ఉంటే.. నిజాయితీగా రిక్రూట్మెంట్ జరిపితే 421 మంది వివరాలు బయటపెట్టండి. మెరిట్ లిస్ట్, స్పోర్ట్స్ కోటా వివరాలు బయటపెట్టేలేనోళ్లకు మీకెందుకు సినిమా డైలాగ్లు. బాలకృష్ణ సినిమాలు చేసి డబ్బులు తీసుకుంటాడు. లోకేష్ స్కామ్లు చేసి డబ్బులు తీసుకుంటాడు. మెగా డీఎస్సీ స్కామ్పై సీబీఐ ఎంక్వైరీ చేయాలి. నిజాయితీగా రిక్రూట్మెంట్ చేశారనే నమ్మకం ఉంటే మెరిట్ లిస్ట్ బయటపెట్టండి. డీఎస్సీపై ప్రశ్నిస్తే కేసులు పెడతారా?’’ అంటూ పేర్ని నాని దుయ్యబట్టారు. -
నా ఫ్యామిలీ జోలికి రావద్దు..! వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
-
చెప్పులపార్టీ... నువ్వా నీతులు చెప్పేది
-
ప్రభుత్వమే ఆ పొలాలకు నష్టపరిహారం ఇవ్వాలి: పేర్ని నాని
సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నం కొత్తపూడి గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు. రైతుల అనుమతి లేకుండా పోర్ట్ పేరుతో విద్యుత్ టవర్ల ఏర్పాటుకు అధికారులు మార్కింగ్ చేశారు. ఇవాళ(మే 28, గురువారం) వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని.. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘1994-95లో కొత్తపూడి గ్రామంలోని దళిత, పేద కుటుంబాలకు ప్రభుత్వం పట్టాల రూపంలో భూమి ఇచ్చింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆ పట్టాలన్నింటినీ ఫ్రీ హోల్డ్ గా మార్పు చేశారు. పోర్టు అవసరాల కోసం ఆ పొలాల్లో హెవీ విద్యుత్ లైన్ టవర్లను వేయడానికి అధికారులు మార్కింగ్ చేశారు. రైతులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే రెవెన్యూ అధికారులు మార్కింగ్ చేశారు. హై ఓల్టేజ్ విద్యుత్ లైన్ల వల్ల తమ భూమికి విలువ లేకుండా పోతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు’’ అని పేర్ని నాని పేర్కొన్నారు.‘‘విద్యుత్ లైన్ టవర్లు వేయాలనుకుంటే ఈ పొలాలన్నింటినీ పూర్తిగా కొనుగోలు చేసి నష్టపరిహారం ఇవ్వాలి. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అసైన్డ్ భూములను సేకరించినా రైతులకు సంతోషకరమైన పద్ధతిలోనే పరిహారాన్ని అందించాం. కొత్తపూడి గ్రామ రైతులకు కూడా ప్రభుత్వం పరిహారం చెల్లించిన తర్వాతే పనులు ప్రారంభించాలి’’ అని పేర్ని నాని డిమాండ్ చేశారు. -
బీటెక్ రవి అవినీతి చిట్టా విప్పిన ఎంపీ అవినాష్
-
ప్లేస్ నువ్వే చెప్పు ఇదే నా ఛాలెంజ్
-
మహానాడులో కూడా వైఎస్ జగన్ నామస్మరణే: రోజా
సాక్షి, నగరి: మహానాడులో టీడీపీ నేతల భాష, బాడీ లాంగ్వేజ్ అసహ్యంగా ఉందన్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా. ఇది సైకిల్ పార్టీ మహానాడా? లేక సైకో పార్టీ మహానాడా? అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ కాలిగోటికి సరిపోని వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మహానాడును టీడీపీ కార్యకర్తలు కూడా పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు.మాజీ మంత్రి ఆర్కే రోజా నగరిలో మీడియాతో మాట్లాడుతూ..‘టీడీపీ, చంద్రబాబుది మహానాడు కాదు.. దగానాడు అని ప్రజలకు తెలిసిపోయింది. మహానాడులో టీడీపీ నేతలవి బోగస్ మాటలేనని మాటలకు అర్థమైంది. మహానాడులో వైఎస్ జగన్ నామస్మరణే ఎక్కువ చేశారు. వైఎస్ జగన్ అంటే టీడీపీ నేత వెన్నులో వణుకుపుడుతుంది. మహానాడు కార్యక్రమం అట్టర్ ప్లాప్ అయ్యింది. రికార్డింగ్ డ్యాన్స్లు పెట్టి సభకు బలవంతంగా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మహానాడు వేదికగా చంద్రబాబు రెండు నాలుకల ధోరణి ప్రదర్శించారు. మహిళా రిజర్వేషన్ అడ్డుకున్న కాంగ్రెస్ నేతలతో టీడీపీ నేతలు డిన్నర్ చేశారు. మహిళా రిజర్వేషన్లు అడ్డుకున్న వారిని కలిసిన మీరు మహిళా ద్రోహులు. ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారిపోయాయి. దేశంలో ఏపీ పోలీసుల ర్యాంక్ అట్టడుగు స్థానంలోకి వెళ్లింది. ఒక్కొక్కరు ముగ్గురు, నలుగురు కనాలని చంద్రబాబు చెబుతున్నారు. మహిళలు పిల్లల్ని కనాలని చెప్పడానికి చంద్రబాబు ఎవరు?. కాంగ్రెస్తో టీడీపీకి హాట్లైన్ బంధం ఉందని వైఎస్ జగన్ ఆనాడే చెప్పారు. దమ్ముంటే మహిళా బిల్లుకు మద్దతుగా మహానాడులో తీర్మానం చేయండి. మహానాడులో వైఎస్ జగన్ గురించి నీచంగా మాట్లాడారు. సైకో పాలనతో జనాల్ని పీడించింది మీరు కాదా చంద్రబాబు?. హరికృష్ణ శవం దగ్గర పొత్తులపై కేటీఆర్తో మాట్లాడిన మీరు సైకో కాదా?. నారా లోకేష్ బిల్డప్ మాటలు ఎందుకు?. జగన్ దెబ్బకు లోకేష్ ఢిల్లీలో అమిత్ షా కాళ్లు పట్టుకున్నారు. ఓటమి ఎరుగని ధీరుడు జగనన్న. నువ్వు తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయావు. వైఎస్సార్ ఆశయాల కోసం పుట్టిన పార్టీ వైఎస్సార్సీపీ. ప్రజ సమస్యలు ప్రశ్నిస్తే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. చంద్రబాబు ఆస్తుల్లో తల్లీ, చెల్లికి ఎంతిచ్చారో చెబుతారా?. మోసాలు, వెన్నుపోటుతో చంద్రబాబు సీఎం స్థాయి ఎదిగారు. తన చెల్లికి జగనన్న ఇచ్చినంత ఆస్తి ప్రపంచంలో ఎవరూ ఇవ్వలేదు. అసలు గొడ్డలి పార్టీ మీది. హెరిటేజ్ ఆస్తుల్లో మీ నాయకుడు తల్లి, చెల్లికి ఎంత వాటా ఇచ్చారో చెప్తారా?. తల్లితో ఉన్న ఫోటో గానీ, చెల్లితో ఉన్న ఫోటో ఒక్కటైనా బయట పెట్టాలి. పవన్ కళ్యాణ్ తల్లి, జూనియర్ ఎన్టీఆర్ తల్లిని దూషించిన మీరు సైకోలు కాదా?. వివేకా హత్య చంద్రబాబు అధికారంలోకి ఉన్నప్పుడు జరిగింది. అప్పుడు ఎందుకు సునీత, షర్మిల అడగలేదు. హత్య చేసిన దస్తగిరికి కొమ్ము కాస్తున్నది మీరు కాదా? అని ప్రశ్నించారు. మంత్రి అనిత.. సుగాలి ప్రీతి పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన మీరు ఆమెకు న్యాయం చేయాలి. మహిళా శక్తి అని పేరు పెడితే సరిపోదు, మహిళలు కు ముందు రక్షణ కల్పించాలి. రెండేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారు. వెన్నుపోటు రెండేళ్లు పేరుతో విడుదల చేసిన బుక్ లెట్ ప్రతి గడప గడపకు అందిస్తాం’ అని అన్నారు. -
ఛీ..ఛీ.. కొంచమైనా సిగ్గుండాలి.. లోకేష్ రాజీనామా చేయ్?
-
చంద్రబాబు రాక్షస పాలనపై పోరుబాట... వైఎస్సార్సీపీ శ్రేణులకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు
-
మళ్లీ అదే డైవర్షన్ కుట్ర
సాక్షి, అమరావతి: చంద్రబాబు తన మార్కు డైవర్షన్ రాజకీయాలకు మరోసారి తెరతీశారు. టీడీపీ కూటమి ప్రభుత్వ రెండేళ్ల అవినీతి, అసమర్థ పాలనపై వెల్లువెత్తుతున్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు పన్నాగం పన్నారు. అందుకు టీడీపీ వీరవిధేయ అధికారులతో ఏర్పాటు చేసిన సిట్ను మరోసారి అస్త్రంగా చేసుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు విచారణకు సంబంధించి సిట్ ఒక్కసారిగా హడావుడి చేయడమే అందుకు నిదర్శనం. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే డీజీపీ కార్యాలయం, సిట్ అధికారులు చకచకా కుట్ర కార్యాచరణ చేపట్టారు. కె.నాగేశ్వర్ రెడ్డి(కేఎన్ఆర్)ని సిట్ అధికారులు బుధవారం విచారించడం ఆ కుతంత్రంలో భాగమే. ఆయన్ను విజయవాడలోని సిట్ కార్యాలయంలో బుధవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు విచారించారు. పోరుబాటకు జడిసి డైవర్షన్ రాజకీయం టీడీపీ కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనా వైఫల్యాలపై వైఎస్సార్సీపీ పోరుబాటకు సిద్ధపడుతోంది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలతో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించి కార్యాచరణ నిర్దేశించారు. ఈ సమావేశం నిర్వహించనున్నట్టు కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. దాంతో బెంబేలెత్తిన ప్రభుత్వ పెద్దలు డైవర్షన్ కుట్రకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే కేఎన్ఆర్ను బుధవారమే విచారించాలని నిర్ణయించారు. తదనంతరం కూడా ఈ విచారణ పేరుతో వైఎస్సార్సీపీ నేతలను వేధించాలన్నదే ప్రభుత్వ పెద్దల పన్నాగమన్నది స్పష్టమవుతోంది. ఈ విచారణ ప్రక్రియను వక్రీకరిస్తూ.. ఎల్లో మీడియాకు లీకులు ఇస్తూ దు్రష్పచారానికి పాల్పడాలన్నదే ప్రభుత్వ పెద్దల లక్ష్యం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కుతంత్రాలను తిప్పికొడుతూ ఉద్యమ పథంలో సాగుతామని వైఎస్సార్సీపీ స్పష్టం చేసింది. ఇదీ సిట్ పన్నాగం మద్యం విధానంపై అక్రమ కేసులో చంద్రబాబు ప్రభుత్వం మొదటి నుంచి పోలీసు జులుం ప్రదర్శిస్తోంది. ఈ కేసులో విచారణ పేరుతో పలువురు అధికారులు, డిస్టిలరీల ప్రతినిధులను వేధించి వెంటాడింది. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలని వేధించింది. వారు చెప్పని విషయాలు చెప్పినట్టుగా వాంగ్మూలాలు నమోదు చేసింది. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, రిటైర్డ్ అధికారి కృష్ణమోహన్ రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప, రాజ్ కేసిరెడ్డి తదితరులను అక్రమంగా అరెస్టు చేసింది. అయినా సరే ఈ కేసులో ఎటువంటి ఆధారాలు చూపించలేక పోయింది. ఈ కేసులో అక్రమంగా అరెస్టు అయిన అందరికీ బెయిల్ మంజూరైంది. దాంతో ప్రభుత్వం కుట్ర పూరితంగానే అక్రమ కేసు నమోదు చేసిందన్నది స్పష్టమైంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం మరోసారి ఈ అక్రమ కేసు విచారణను తెరపైకి తేవడం గమనార్హం. కూటమి ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ కేసు విచారణ పేరుతో హడావుడి చేయాలని పన్నాగం పన్నిందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
బాబు రాక్షస పాలనపై పోరు
‘‘స్టేట్ గవర్నమెంట్కు ట్యాక్సుల రూపేణా వచ్చే సొమ్ము లీటరు పెట్రోల్ మీద రూ.31.62. లీటరు డీజిల్ మీద రూ.23.46. అదే కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం లీటరు పెట్రోలు మీద రూ.11.90. లీటరు డీజిల్ మీద రూ.7.80. ఈరోజు పెట్రోల్, డీజిల్ మీద ఇంత దారుణమైన బాదుడు కనిపిస్తున్నప్పుడు వాటి ద్వారా నీకు వచ్చే ట్యాక్సులు ఎందుకు తగ్గించడం లేదయ్యా? ఎన్నికల మేనిఫెస్టోలో నువ్వే కదా ఈ మాటలన్నీ రాశావు కదా? అని అడిగితే మాత్రం చంద్రబాబు నాయుడుకు బీపీ పెరుగుతుంది’’‘‘స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా కార్యకర్తల మనసులు గెలుచుకోవడానికి ప్రతి నియోజకవర్గ ఇన్చార్జి ప్రయత్నం చేయాలి. ఈరోజు వారికి మీరు అండగా నిలబడితే రాబోయే ఎన్నికల్లో ఈ కార్యకర్తలు మీ గెలుపు కోసం కృషి చేస్తారనే విషయాన్ని మాత్రం మరువొద్దు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా సరే ప్రతి స్థానంలోనూ వైఎస్సార్సీపీ జెండా ఎగుర వేయాలి. ఎక్కడైనా ఏకగ్రీవం జరిగిందంటే మాత్రం దాన్ని నేను సీరియస్గా తీసుకుంటా’’‘‘కుప్పంలో టీడీపీకి 20 వేలకు పైగా బోగస్ ఓట్లు ఉన్నాయి. ఒకే పేరు ఐదు సార్లు, పది సార్లు కనిపిస్తోంది. లిస్టులో ఆ పేరు కనిపించిన ప్రతి సారీ తండ్రి పేరు చూసినా లేదా భర్త పేరు చూసినా ఒకటే ఉంటాయి. ఇది కుప్పంలో మన కళ్ల ఎదుటే కనిపిస్తున్న హిస్టరీ అండ్ మిస్టరీ. ప్రతి ఊరిలో మనవారు అనుకున్న 50 ఓట్లు తొలగిస్తే చాలు.. నియోజకవర్గ వ్యాప్తంగా 5 వేల వరకు మన ఓట్లు పోయినట్టే!’’ -పార్టీ నేతలతో భేటీలో వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోకుండా అన్ని వర్గాలను దారుణంగా మోసం చేసిన చంద్రబాబు రెండేళ్ల రాక్షస పాలనపై జూన్ 4 నుంచి 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజలకు చంద్రబాబు చేసిన మోసం, దగా, వంచనను వివరిస్తూ ‘వెన్నుపోటుకు రెండేళ్లు..’ పేరుతో రూపొందించిన బుక్లెట్ను వైఎస్ జగన్ విడుదల చేశారు. అది గ్రామగ్రామానా, ఇంటింటికీ చేరేలా చూడాలని నిర్దేశించారు. ప్రతి కార్యకర్త వద్ద ఆ బుక్లెట్ ఉండాలని.. డిజిటల్ రూపంలో కూడా అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై నిరసన కార్యాచరణ.. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత.. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమంపై వైఎస్ జగన్ ప్రధానంగా చర్చించి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల కో–ఆర్డినేటర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యాలు చేసినా దీటుగా ఎదుర్కొని పార్టీని గెలిపించేందుకు ప్రతి ఒక్క నాయకుడు కృషి చేయాలని వైఎస్ జగన్ ఆదేశించారు. పార్టీ కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్న వారిని ఇప్పటి నుంచే గుర్తించాలని, వారిని అభ్యర్థులుగా ప్రకటించి ప్రతి అడుగులో తోడుగా నిలవాలని నిర్దేశించారు. స్వయంగా ఎమ్మెల్యే అభ్యర్థి తమకు అండగా నిల్చారన్న భావన స్థానిక ఎన్నికల్లో పార్టీ నుంచి పోటీ చేసే ప్రతి ఒక్కరిలో కలిగేలా చొరవ చూపాలని సూచించారు. తద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వారంతా ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపు కోసం గట్టిగా పని చేస్తారన్నారు. స్థానిక ఎన్నికల్లో ఎక్కడా ఏకగ్రీవానికి అవకాశం ఇవ్వొద్దని.. ఒకవేళ అలా జరిగితే అది అక్కడి ఇన్ఛార్జ్ వైఫల్యంగా భావిస్తామని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)పై చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పార్టీ నేతలకు వైఎస్ జగన్ గట్టిగా సూచించారు. ఇటీవల ఎన్నికలు జరిగిన పశి్చమ బెంగాల్, తమిళనాడులో ఫలితాలను ప్రస్తావిస్తూ.. ఆయా రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ‘సర్’ ఎలాంటి ప్రభావం చూపిందన్న విషయాన్ని గణాంకాలతో సహా వివరించారు. ఓట్లు తగ్గినా.. పెరిగినా డేంజరేనని హెచ్చరించారు. పార్టీ ముఖ్య నేతల సమావేశంలో వైఎస్ జగన్ ఏం మాట్లాడారంటే.. ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ బుక్లెట్ను ఆవిష్కరిస్తున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి. చిత్రంలో పార్టీ నేతలు బాబు రాక్షస పాలన.. ‘ముసలి పులి.. బంగారు కడియం’ రెండేళ్ల చంద్రబాబు పాలన గురించి నాకన్నా ఏ కార్యకర్తకు మైక్ ఇచ్చినా చక్కగా చెబుతాడు. చంద్రబాబు పాలన ఈ రెండేళ్లలో ఎలా ఉంది అని చూసిన తర్వాత.. ‘బాబు ష్యూరిటీ. మోసం గ్యారెంటీ’ అని రుజువైంది. వెన్నుపోటు.. విధ్వంసం.. అరాచకం.. అబద్ధాలు.. డైవర్షన్ పాలిటిక్స్.. దోపిడీ.. అవినీతి.. ఇదే ఈ రెండేళ్ల చంద్రబాబునాయుడు పరిపాలన! ఇంతకు ముందు ఎన్నికలప్పుడు కూడా చెప్పా.. ‘ఒక ముసలి పులి. బంగారు కడియం’ కథ! చంద్రబాబు నాయుడుకు ఓటు వేయడం అంటే ఇదే అని! ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈరోజు అదే రుజువు అవుతున్న పరిస్థితులు మన కళ్ల ఎదుటే చూశాం. ఆ రోజుల్లో చంద్రబాబు నోట్లో నుంచి వచ్చిన మాటలన్నీ కూడా జగన్ ఇచ్చేవే కాదు.. అంతకన్నా ఎక్కువ ఇస్తాను అని చెప్పి పులి, బంగారు కడియం కథ మాదిరిగానే ప్రజలందరినీ నమ్మించిన పరిస్థితి. తీరా ఓటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని పులి తిన్నట్టుగానే తినేస్తున్నాడు. ఆ కథలో ముసలి పులి ఏ మాదిరిగా చేస్తోందో చంద్రబాబునాయుడును చూసినా ఈరోజు అదే కనిపిస్తుంది. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన చంద్రబాబు చంద్రబాబు ఎన్నికలప్పుడు సూపర్ సిక్స్ అన్నాడు. సూపర్ సెవెన్ అన్నాడు. మేనిఫెస్టో కాపీ అన్నాడు. 143 హామీలు మేనిఫెస్టోలో పెట్టి చివరికి ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో వేసిన పరిస్థితులు ఈరోజు మనమంతా చూస్తున్నాం. రెండేళ్లు అయిపోయింది. మూడో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లలో భాగంగా ఆడబిడ్డ నిధి ఏమైంది? 18 ఏళ్ల వయసు నిండిన ప్రతి ఒక్క చెల్లెమ్మకూ ప్రతి నెలా రూ.1,500 చొప్పున సంవత్సరానికి రూ.18 వేలు ఇస్తానన్నావు కదా! రెండేళ్లు అయిపోయింది. మూడో సంవత్సరం బడ్జెట్లో కూడా పెట్టలేదు కదా? అని అడిగితే మాట రాదు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లో భాగంగా నిరుద్యోగ భృతి అని చదువుకున్న ప్రతి పిల్లాడికీ నెలకు రూ.3 వేల భృతి ఇస్తానన్నావు. సంవత్సరానికి రూ.36 వేలు.. రెండేళ్లకు రూ.72 వేలు ఇప్పటికే బాకీ పడ్డావు. మూడో సంవత్సరం బడ్జెట్లో కూడా పెట్టలేదు కదా? అంటే దాని మీద మాట ఉండదు. 50 ఏళ్లకే పెన్షన్ అన్నావు. 50 ఏళ్లు నిండిన ప్రతి అక్కచెల్లెమ్మకూ సంవత్సరానికి రూ.48 వేలు బాకీ. రెండేళ్లలో రూ.96 వేలు బాకీ. మూడో సంవత్సరం కూడా బడ్జెట్లో దాని గురించి కేటాయింపులు లేవు కదా? అంటే దాని గురించి కూడా ఎక్కడా పత్తా ఉండదు. మేనిఫెస్టో అడ్రస్ ఎక్కడా కనిపించదు. దీనిపై అడిగితే మాత్రం చంద్రబాబుకు బీపీ పెరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఆయన బీపీ చాలా ఎక్కువగా పెరుగుతోంది. టపా అని ఎక్కడన్నా పొరపాటున చంద్రబాబునాయుడును నిద్రలేపి మావిగన్ అని చెవిలో అన్నారంటే మాత్రం అక్కడే పడిపోయినా పడిపోతాడు. ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడులో ఇవన్నీ చూస్తున్నాం. సమావేశానికి హాజరైన వైఎస్సార్సీపీ నేతలు పెట్రో ధరల తగ్గింపుపైనా మోసమే.. చంద్రబాబు 143 హామీల్లో మనందరికీ ప్రధానంగా పెట్రోలు, డీజిల్ కళ్ల ఎదుటే కనిపిస్తోంది. ఈరోజు లీటరు పెట్రోలు రూ.117 దాటింది. లీటరు డీజిల్ చూస్తే రూ.105 దాటింది. పెట్రోలు, డీజిల్ ధరలు అధికారంలోకి రాగానే తగ్గిస్తామని చంద్రబాబు తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాడు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయిపోయింది. మూడో సంవత్సరం కూడా మొదలైంది. ఈరోజు పెట్రోలు, డీజిల్పై విపరీతంగా బాదుడే బాదుడు కనిపిస్తోంది. స్టేట్ గవర్నమెంట్కు ట్యాక్సుల రూపేణా వచ్చే సొమ్ము లీటరు పెట్రోల్ మీద రూ.31.62. లీటరు డీజిల్ మీద రూ.23.46. అదే కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం లీటరు పెట్రోలు మీద రూ.11.90. లీటరు డీజిల్ మీద రూ.7.80. ఈరోజు పెట్రోల్, డీజిల్ మీద ఇంత దారుణమైన బాదుడు కనిపిస్తున్నప్పుడు వాటి ద్వారా నీకు వచ్చే ట్యాక్సులు ఎందుకు తగ్గించడం లేదయ్యా? ఎన్నికల మేనిఫెస్టోలో నువ్వే కదా ఈ మాటలన్నీ రాశావు? అని అడిగితే మాత్రం చంద్రబాబు నాయుడుకు బీపీ పెరుగుతుంది. అందుకే బాబు డైవర్షన్ పాలిటిక్స్.. ఇదే పెద్దమనిషి చంద్రబాబునాయుడు తాను ఫలానా మంచి చేశాను అని చెప్పుకునే పరిస్థితి లేదు. నోరు తెరిస్తే అబద్ధాలు మినహా ప్రజలకు ఈ రెండు సంవత్సరాల్లో నేను ఈ మంచి చేశాను అని చెప్పుకునే పరిస్థితి లేదు. ఈ రెండేళ్లలో ఆయన చేసిన మంచి ఎక్కడా కూడా లేదు కాబట్టి, చెప్పుకునేందుకు ఏమీ లేదు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నాడు. ఏ అంశమైనా కూడా డైవర్ట్ చేయాలి. ప్రజలను ఈ టాపిక్ నుంచి.. ఆ టాపిక్ లోకి మభ్య పెట్టాలన్న దిక్కుమాలిన ఆలోచనతోనే అడుగులు పడ్డాయి. అందుకే ఈ మధ్య లేటెస్ట్గా గొడ్డళ్లు, కత్తులు, కటార్లు అంటూ కొత్త డైవర్షన్ పాలిటిక్స్ మనమంతా చూస్తూనే ఉన్నాం. ప్రజలందరూ పిచ్చోళ్లు అని చంద్రబాబునాయుడు అనుకుంటున్నాడు కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్లు. ప్రజలు చాలా చైతన్యవంతులు. గర్వంగా కాలర్ ఎగరేసుకుని చెప్పగలం.. రాష్ట్రంలో ఏ ప్రాంతమైనా బాగు పడిందన్నా.. నిజంగా ఎక్కడైనా అభివృద్ధి జరిగిందన్నా.. పేదవాడికి నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లాయి అన్నా.. ఒక రైతు బాగుపడ్డాడు అన్నా.. ఒక అక్కచెల్లెమ్మ బాగు పడిందన్నా.. ఒక పిల్లాడు చదువుల విషయంలో బాగుపడ్డాడన్నా.. ఇవన్నీ ఒక్క నాన్నగారి పాలనలోనే జరిగాయి. దాని తర్వాత వైఎస్సార్సీపీ, మీ జగనన్న పాలనలోనే జరిగాయి అని గర్వంగా చెప్పగలుగుతా. మంచి చేశాం అని చెప్పి కాలర్ ఎగరేసుకుని.. మాట ఇచ్చాం, మాట నిలబెట్టుకున్నాం అని గర్వంగా ప్రతి ఇంటికీ వెళ్లగలిగిన పరిస్థితి ఒక్క వైఎస్సార్సీపీకి మాత్రమే ఉందని గర్వంగా చెప్పగలుగుతాం. ఈరోజు ఇన్ని మోసాలు, ఇన్ని అబద్ధాలు, ఇన్ని అరాచకాలు, ప్రజలకు వివరించేందుకు చంద్రబాబు రెండు సంవత్సరాల పాలన పూర్తయిన నేపథ్యంలో ప్రజలను జాగృతి పర్చేందుకు ఒక బుక్లెట్ను రిలీజ్ చేస్తున్నాం. ప్రతి కార్యకర్త వద్ద ఉండాలి.. ప్రతి ఇంటికీ చేర్చాలి బుక్లెట్లో అన్ని అంశాలను క్షుణ్నంగా మనం చదువుకోవడమే కాకుండా మన పారీ్టలో ప్రతి కార్యకర్తకు ఈ రెండేళ్ల పాలనలో ప్రతి అంశం మీద అవగాహన ఉండేలా రూపకల్పన చేసి వారికి అందుబాటులోకి తెచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఇది వాళ్లందరికీ అందుబాటులోకి వెళ్లేలా మీరందరూ చర్యలు తీసుకోవాలి. ప్రజలకు చంద్రబాబు పొడిచిన వెన్నుపోట్లను వివరిస్తూ మొదటి ఏడాది మనం నిర్వహించిన ర్యాలీలు కార్యక్రమం అప్పట్లో బాగా జరిగింది. రెండో ఏడాది కూడా చంద్రబాబునాయుడు పాలన మీద నిరసన తెలుపుతూ అంతకన్నా ఇంకా గొప్పగా ర్యాలీలు జరగాలి. ఈ కార్యక్రమాలు అన్నింటినీ జూన్ 4 నుంచి 12 వరకు పార్టీ తరఫున చేపడుతున్నాం. ‘సూపర్హిట్’ అంటూ నిస్సిగ్గుగా ప్రచారం..ఎన్నికల హామీల్లో ఇంకా చాలా ఉన్నాయి.. సూపర్ సిక్సులు, సూపర్ సెవెన్లు పచ్చి మోసాలుగానే కనిపిస్తున్నాయి. సూపర్ సిక్సులు, సూపర్ సెవెన్లు పూర్తిగా ఒకవైపున ఎగరగొడుతూనే మరోవైపున సూపర్ సిక్సులు, సూపర్ సెవెన్లు అన్నీ చేసేశాం అని ఏకంగా ప్రకటనలు ఇస్తూ ప్రచారం చేసుకుంటున్న ముఖ్యమంత్రి బహుశా దేశ చరిత్రలో ఎవడూ ఉండడేమో. ఇంతగా అబద్ధాలను బుల్డోజ్ చేసి, పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి మరీ దాన్ని ముందుకు తీసుకునిపోయే వ్యక్తి బహుశా ప్రపంచ చరిత్రలో ఎవడూ ఉండడేమో.. ఒక్క చంద్రబాబునాయుడు తప్ప. ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ బుక్లెట్ ఇందుకే..‘చంద్రబాబునాయుడు వెన్నుపోటుకు రెండేళ్లు..’ బుక్ లెట్లో సూపర్ సిక్సులు, సూపర్ సెవెన్లతో ఏరకంగా ఆయన మోసం చేశాడనే దగ్గర నుంచి.. ఏ రకంగా విద్యాదీవెన, వసతి దీవెన ఎగ్గొట్టి పిల్లలను రోడ్ల మీదకు తెచ్చాడనే పరిస్థితి నుంచి.. ఆరోగ్యశ్రీ దుస్థితి, విద్య, వైద్యం, వ్యవసాయం ఏరకంగా కుప్పకూలిపోయింది? అక్కచెల్లెమ్మల జీవితాలు ఎలా చీకటిమయం అయిపోయాయి? లాంటి అన్ని విషయాలతో పాటు ఆయన దుర్మార్గాలు, దౌర్జన్యాలు, అవినీతి అన్నీ కూడా క్లుప్తంగా ప్రతి ఒక్కరికీ అర్థమయ్యే రీతిలో ఈ బుక్లెట్ రూపొందించడం జరిగింది. ఇది అందరికీ అందుబాటులోకి తెస్తున్నాం. క్యూఆర్ కోడ్, డిజిటల్ కాపీలు ప్రతి కార్యకర్తకూ చేరేలా మన పార్టీ వెబ్సైట్లో కూడా ఈ బుక్లెట్ వివరాలు అన్నీ అందుబాటులోకి తీసుకొచ్చాం.చంద్రబాబుకి సెగ తగిలేలా నిరసన కార్యక్రమాలు ఇలా.. జూన్ 4 నుంచి 12 వరకు జరగబోయే ఈ కార్యక్రమాలను ఒకవైపు ఎస్ఐఆర్, గ్రామ స్థాయిలో కమిటీల వెరిఫికేషన్, ఎండల తీవ్రతను కూడా పరిగణనలోకి తీసుకుని షెడ్యూల్ రూపొందించడం జరిగింది. జూన్ 4న మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. మీ నియోజకవర్గాల్లో ప్రతి మండలంలోనూ జూన్ 4న ఈ కార్యక్రమం చేపట్టండి. చంద్రబాబునాయుడుకు సంబంధించి ఆయన మేనిఫెస్టో అంటే ‘ఈనాడు’లో ఎన్నికల ముందు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ కాపీ.. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఫొటోలతో సంతకాలు పెట్టి ఇచ్చిన బాండ్ల కాపీలు.. (ఇవి నెట్లో, బుక్లెట్లో అందుబాటులోనే ఉన్నాయి) ప్రతి మండల కేంద్రంలో 4వ తేదీన ఈ రెండూ చూపిస్తూ నాలుగు కూడళ్ల మధ్య నిప్పంటించి నిరసన తెలిపే కార్యక్రమం. ఇందులో ఏదో ఒక మండలంలో నియోజకవర్గ ఇన్చార్జి పాలు పంచుకోవాలి. మిగిలిన మండలాల్లో కార్యకర్తలు పాలు పంచుకుని కార్యక్రమం జరిగేలా ప్రణాళిక రూపొందించాం. తరువాత జూన్ 8, 9వ తేదీల్లో వీలును బట్టి నియోజకవర్గ కేంద్రాల్లో వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో టౌన్ హాల్ సదస్సు ఉంటుంది. యువకులు, రైతులు, మహిళలు పాల్గొనే ఈ కార్యక్రమంలో వీరందరి సమక్షంలో వెన్నుపోటుకు రెండేళ్లు బుక్లెట్లోని అన్ని అంశాలను కూలంకషంగా చర్చించి అవగాహన కల్పించడం జరుగుతుంది. చివరగా జూన్ 12న రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనకు నిరసన తెలుపుతూ భారీ నిరసన ర్యాలీలు నిర్వహిద్దాం. ఈ కార్యక్రమాన్ని స్వయంగా నేను పర్యవేక్షిస్తా. తూతూ మంత్రంగా నిర్వహిస్తే సహించేది లేదు. ప్రజలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకి నిరసన సెగ తగిలేలా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. -
‘బీసీల్ని నిండా ముంచిన చరిత్ర చంద్రబాబుది’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు రెండేళ్ల పాలనలో బీసీలకు అడుగడుగునా అన్యాయం జరుగుతుందని, ఎన్నికలకు ముందు వారిని ఓటు బ్యాంకుగా వాడుకుని, అధికారంలోకి వచ్చాక నిండా ముంచారని వైఎస్సార్సీపీ బీసీ మాజీ మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, జోగి రమేశ్, విడదల రజనీ, కారుమూరి నాగేశ్వరరావు, మాజీ ఎంపీ బుట్టా రేణుక, పార్టీ నేత కారుమూరి సునీల్ మండిపడ్డారు.వైఎస్ జగన్ పాలనలో బీసీల్ని బ్యాక్ బోన్ కులాలుగా నిలబెడితే, ఇప్పుడు కూటమి సర్కార్ మళ్లీ వారిని వెనక్కి నెట్టేస్తోందన్నారు. మహానాడులో మాత్రం బీసీల పేరుతో గొప్పలు చెప్పుకుంటున్నారని, బీసీలకు చేసిన సంక్షేమంపై చర్చకు తాము సిద్దంగా ఉన్నామని వైఎస్సార్సీపీ నేతలు సవాల్ విసిరారు. మీడియా సమావేశంలో వైఎస్సార్సీపీ బీసీ నేతలు ఇంకేమన్నారంటే..బీసీలకు డిప్యూటీ సీఎం కూడా ఇవ్వలేరా?: చెల్లుబోయిన వేణు2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడు ఓ బీసీ ఉపముఖ్యమంత్రి ఉన్నారు, ఓసీల్లో కాపు సామాజిక వర్గానికి ఉపముఖ్యమంత్రి మీరే ఇచ్చారు. కానీ ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేశాక బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకునే యోగ్యత లేదా ? బీసీలు ఏమీ అడగరనే ధైర్యమా ? బీసీల ఆత్మగౌరవ, ఆత్మక్షోభకు కారకులు మీరు కాదా ? ఈ రాష్ట్రంలో ఎన్నో పోరాటాలు చేసినా రాజ్యాధికారం పొందలేని స్ధితిలో ఉన్న అనేక కులాలు నాడు జగన్మోహన్ రెడ్డి మేలు చేశారు. కానీ మీరు ఎన్నో అసత్యాలు చెప్పి అధికారంలోకి వచ్చాక కూడా ఎక్కడా ఉప ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వలేదు ? వెనుకబడ్డ కులాల్ని ఇంకా వెనక్కు నెట్టేశారనడానికి ఇదే నిదర్శనం కాదా ?ఆనాడు వైఎస్ జగన్ హయాంలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేసి 56 కార్పోరేషన్లు ఇస్తే .. మీరు ప్రతీ రోజూ ఏ కార్పోరేషన్ కూ భవనాలు లేవు, రూములు లేవని రోజూ విమర్శలు చేసారు. ఇప్పుడు మీరు 40 కార్పోరేషన్లను మాత్రమే వేసి మిగతా 16 కార్పోరేషన్లను వదిలేశారు. బీసీలు చైత్యనం కావాల్సిన అవసరం ఉంది. అబద్దాలకు వేదికగా మహానాడు పెట్టి తన మోసాల్ని చంద్రబాబు గొప్పగా చెప్పుకుంటున్నారు. మోసపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక బీసీలను మోసం చేసిన పార్టీ టీడీపీ. అందుకే రాష్ట్రంలో బీసీ సమాజం చంద్రబాబు మోసంపై ఆగ్రహంగా ఉంది. ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వని చంద్రబాబు బీసీల ద్రోహి. చంద్రబాబు అబద్దాల్ని నమ్మి బీసీలు రెండు, మూడు తరాలు వెనక్కిపోయారు.బీసీ సంక్షేమంపై చర్చకు సిద్ధం: జోగి రమేష్రెండు సంవత్సరాల చంద్రబాబు పాలనలో బలహీన వర్గాలకు అన్నీ ఇబ్బందులు, బాధలు, కష్టాలు, కన్నీళ్లే. వీటిపై మా పార్టీకి చెందిన బీసీ మాజీ మంత్రులంతా కలిసి ఓ కార్యాచరణ తీసుకోవాలని సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మహానాడు వేదికగా చంద్రబాబు మాటమాటలు, లోకేష్ అబద్దాలు వింటుంటే రాష్ట్ర ప్రజలు సిగ్గుపడుతున్నారు. 2019-2024 వరకూ వైఎస్ జగన్ పాలనలో వెనుకబడిన వర్గాలంతా ఎంతో ధైర్యంగా ఉన్నారు. స్పీకర్, కేబినెట్ మంత్రి పదవుల నుంచీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీట్ల నుంచీ, రాజ్యసభ సీట్ల వరకూ ఇచ్చి ఢిల్లీకి కూడా పంపారు.బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల్లో చోటిచ్చిన ఆ మహనీయుడి పరిపాలన ఎక్కడా ? అని వెనుకబడిన వర్గాలు ఆలోచిస్తున్నాయి. చంద్రబాబు ఎన్నికలకు ముందు బలహీన వర్గాలు చెప్పిన 50 ఏళ్లు దాటితే ఇస్తానన్న పెన్షన్ ఏమైంది ? 45 ఏళ్లు దాటిన అక్కాచెల్లెళ్లకు జగన్మోహన్ రెడ్డి గారు చేయూత ఇచ్చారు. కానీ ఇప్పుడు చంద్రబాబు మోసం చేసిన ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, చేయూత మోసాలు కనిపిస్తున్నాయి. జగనన్న పాలనలో బలహీన వర్గాలకు రూపాయి ఖర్చు లేకుండా ఫీజు రీయింబర్స్ మెంట్ చేశారు. అలాగే ఆరోగ్యశ్రీ ఇచ్చి వాళ్ల ఆరోగ్యాల్ని కాపాడారు. అభివృద్ది, సంక్షేమంపై చర్చకు సిధ్దమంటున్న లోకేష్.. దానికి టైమ్, ప్లేస్ కూడా చెప్పాలని బీసీ మాజీ మంత్రులుగా అడుగుతున్నాం. బీసీ వర్గాలకు మా జగనన్న చేసిందేంటో, మీరు చేస్తోంది ఏంటో తేల్చుకునేందుకు సిద్దంగా ఉన్నాం.బీసీల్ని ఓటు బ్యాంకుగా వాడుకున్న చంద్రబాబు: విడదల రజనిబీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పిన మా జగనన్న.. ఐదేళ్ల పాలనలో బీసీల పట్ల తనకున్న ప్రేమను, బీసీల్ని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ఎలా అడుగులు వేశారో రాష్ట్ర ప్రజలు చూశారు. దీని వల్ల బీసీలు ఎలా లబ్దిపొందారో కూడా చూసారు. కానీ అదే బీసీల్ని చంద్రబాబు ఇంకా వెనుకబాటుకు గురిచేస్తున్నారు. బీసీలకు ఏ విధమైన అభివృద్ది కానీ, సంక్షేమం కానీ ఇచ్చిన పాపాన పోలేదు. ఇవాళ మహానాడులో బీసీలకు ఏదేదే చేసేశామని చెప్పుకుంటున్నారు. వాస్తవానికి బీసీల సంక్షేమం కోసం పాటుపడింది, వారికి న్యాయం చేసింది వైఎస్ జగనే.మ్యానిఫెస్టోలో సైతం రాష్ట్రంలో 50 శాతం పైగా ఉన్న బీసీలకు అంతకు మించి ఖర్చుపెట్టిన చరిత్ర జగన్ ది. వారికి రాజకీయంగా అవకాశాలు కల్పించారు. తన రెండో కేబినెట్ లో ఏకంగా 11 మంది బీసీలకు అవకాశాలు ఇచ్చారు. కాంట్రాక్టుల్లో, నామినేటెడ్ పదవుల్లో 50 శాతం అవకాశాలు కల్పించారు. మంగళగిరి, కుప్పం వంటి నియోజకవర్గాల్లో బీసీలకు ఇచ్చిన సీట్లే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సామాజిక న్యాయానికి నిదర్శనం. కానీ చంద్రబాబు ఎన్నికల్లో బీసీల్ని ఓటు బ్యాంకుగా వాడుకోవడం మినహా వారికి సరైన న్యాయం ఎప్పుడూ చేయలేదు. దీనికి వ్యతిరేకంగా బీసీ మాజీ మంత్రులు .. ప్రభుత్వంపై పోరాటానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం.బీసీలపై తప్పుడు కేసులకు భయపడబోం: కారుమూరి నాగేశ్వరరావురెండేళ్ల కూటమి ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాల్ని గాలికొదిలేసి రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ అన్యాయం చేసింది. ఆ రోజు 10 లక్షల కోట్లు అప్పులు చేశారని తప్పుడు విమర్శలు చేశారు. కానీ ఆయన చేసిన 3.30 లక్షల కోట్ల అప్పుల్లోనే ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశారో మీ నోటితోనే చెప్తున్నారు. ఇప్పుడు మీరు రెండేళ్లలోనే 3.50 లక్షల కోట్ల అప్పులు చేసినా వాటిని ఏం చేశారో చెప్పుకోలేని దుస్దితిలో ఉన్నారు. ఆనాడు వైఎస్ జగన్ నాకు మంత్రి, నా కొడుక్కి ఎంపీ సీటు కూడా ఇచ్చారు. 38 ఎమ్మెల్సీల్లో 18 ఎమ్మెల్సీల్ని, 9 మంది మేయర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఛైర్మన్లలోనూ సింహభాగం బీసీలకు ఇచ్చారు.రాష్ట్రంలో బీసీ బిడ్డలు బాగా చదువుకుని డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారంటే ఆనాడు రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి చలవే. ఇప్పుడు ఎక్కడో యుద్దం జరుగుతుంటే పిల్లలకు డ్రెస్సు లేదు, బుక్స్ లేవంటున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు పత్రాల్లోనే మిగిలిపోయాయి. మీరు నా మీద, నా కొడుకు, కోడలి మీద కేసులు పెట్టినా భయపడేది లేదు. మేం తప్పుచేయలేదు కాబట్టి భయపడబోం, ప్రాణత్యాగానికైనా సిద్దం. బీసీ వర్గాల్ని ఇబ్బందిపెట్టాలని చూస్తే వారి ఆగ్రహానికి గురి కాక తప్పదు.బీసీల్ని అన్ని విధాలా మోసం చేస్తున్నారు: బుట్టా రేణుకబీసీలకు ఆర్దికంగా, సామాజికంగా అండగా నిలబడి, వారిని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ బీసీలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి అన్ని విధాలుగా మోసం చేస్తున్నారు. బీసీ మహిళలకు 50 ఏళ్లకు పెన్షన్ ఇస్తానని చెప్పి,జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ పథకాలు ఇస్తానని చెప్పి ఇప్పటికీ ఇవ్వలేదు. ఏ పథకం కూడా ఇవ్వకుండా ప్రశ్నిస్తే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.ఈ రెండేళ్లలో మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా.. మా ప్రభుత్వంలో చేసిన దానికీ, మీరు చేసిన దానికీ తేడా ఏంటో చూపించే ధైర్యం ఉందా అని అడుగుతున్నాం. ప్రతీ దాన్నీ రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకోవాలి, ప్రజల్ని ఎలా మభ్యపెట్టాలో చంద్రబాబుకు తెలుసు. కానీ మేం మాత్రం ఇచ్చిన మాట నిలబెట్టుకునే ముందుకెళ్తాం. మేం ఎప్పుడూ సాధ్యమయ్యేదే చెప్తాం, దాన్నే అమలు చేసి చూపిస్తాం.బీసీల్ని మోసం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు: కారుమూరి సునీల్బీసీలకు కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వలేని పరిస్ధితుల్లో ఉన్నారు. మహిళలకు ఉన్న పథకాలన్నీ కొనసాగిస్తూ సూపర్ సిక్స్ ఇస్తామని, అన్నీ గాలికొదిలేశారు. విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్ మెంట్ లేదు, రైతులకు ఇన్ ఫుట్ సబ్సిడీ లేదు, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు అమలు చేసిన ఏ ఒక్క పథకం ఈ ప్రభుత్వం అమలు చేయడం లేదు. డీఎస్సీలో చేసిన మోసంతో ఎంతో మంది బీసీ అభ్యర్ధులు ఇబ్బందిపడుతున్నారు. బీసీల్ని మోసం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. త్వరలో ఈ దిశగా కార్యాచరణ రూపొందించి ఉద్యమం చేపట్టబోతున్నాం. -
బీటెక్ రవిపై ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ఆగ్రహం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: బీటెక్ రవిపై వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీటెక్ రవి పులివెందుల ప్రజలకు కన్నం వేశారు. బైరెటీస్ డంపులను అక్రమంగా అమ్ముకున్నారు. రాత్రికి రాత్రే ముగ్గురాయిని తవ్వుకుని దోచుకున్నారు. మూడు టన్నుల బైరెటీస్ దోచుకుంటే కనీసం కేసు పెట్టలేదు. బీటెక్ రవిని చట్టం ముందు నిలబెడతాం. ఉల్లిమెల్ల తోటకు ఎందుకొచ్చాడో బీటెక్ రవి చెప్పాలి. ఎంపీటీసీ పదవి కోసం ఒక ప్రతిపాదనతో బీటెక్ రవి వచ్చాడు. ఎంపీటీసీ ఎన్నికల తర్వాత వైఎస్సార్సీపీలో చేరాలనుకున్నాడు’అని వ్యాఖ్యానించారు. -
పోలీస్ ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన సాక్షి రిపోర్టర్
-
ప్రతి ఇంట్లో బాబు వెన్నుపోటు పాలనపె చర్చ జరగాలి
-
నేలపై కూర్చుని వైఎస్సార్సీపీ నేతల నిరసన
సాక్షి, అమరావతి: మంగళగిరి విద్యాశాఖ కార్యాలయం దగ్గర వైఎస్సార్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. నేలపై కూర్చుని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. డీఎస్సీ అక్రమాలపై విచారణ జరపాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. అధికారుల తీరుపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎమ్మెల్సీల ప్రశ్నలకు అధికారులు సరైన సమాధానాలు చెప్పని అధికారులు.. అంతా సక్రమంగా ఉన్నట్టు బుకాయించారు. దీంతో వైఎస్సార్సీపీ నేతలు, అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ‘‘అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ర్యాంకు వచ్చింది నిజామా? కాదా?. మెరిట్ లిస్ట్లు ఎందుకు బయటపెట్టడం లేదు? అంటూ నిలదీసిన వైఎస్సార్సీపీ నేతలు.. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని మండిపడ్డారు. -
బాబు లోకేష్ ని ఇమిటేట్ చేసిన కొడాలి నాని ఓ రేంజ్ లో మాస్ వార్నింగ్
-
గొడ్డలి.. గాడిద గుడ్డు అంటూ... - బాబుపై కొడాలి నాని మాస్ ర్యాగింగ్
-
ప్రజల కోసం జగన్ ఎవరినైనా ప్రశ్నిస్తారు: కొడాలి నాని
సాక్షి, తాడేపల్లి: ఇవాళ పార్టీ సమావేశంలో వైఎస్ జగన్.. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారని.. బాబు రెండేళ్ల పాలనపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తామని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సర్ వల్ల నష్టాలు జరగకుండా చూడాలన్నారు.‘‘స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలు కాకుండా చూడాలి. చంద్రబాబు చేసిన వెన్నుపోటు రాజకీయాలు అందరూ చూస్తున్నారు. చంద్రబాబు, లోకేష్కు వంగి దండాలు పెట్టడమే తెలుసు. లోకేష్ ఉన్న ఒక్క శాఖను నడపలేక పోతున్నారు.. జగన్తో చంద్రబాబు చర్చకు రావాలి. ప్రజల కోసం జగన్ ఎవరినైనా ప్రశ్నిస్తారు. సింగిల్ వచ్చే సింహం జగన్. గుంపులు గుంపులుగా వచ్చేది వాళ్లు’’ అంటూ కొడాలి నాని ధ్వజమెత్తారు.సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ షో: పేర్ని నానిమాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. రెండేళ్ల చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల హామీలు తుంగలో తొక్కిందని మండిపడ్డారు. హామీల పేరుతో బాండ్లు ఇచ్చి మోసం చేసింది. రెండేళ్లలో ప్రజలను ఎలా మోసం చేశారో జూన్ 4 నుంచి 12 వరకు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాలు చేపడుతున్నాం. సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ షో. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అండగా ఉంటాం. సర్ పై అప్రమత్తంగా ఉండాలి. ఒక్క వైఎస్సార్సీపీ ఓటు కూడా పోకుండా చూడాలి. గొడ్డలి పార్టీ అని చంద్రబాబు డైవర్షన్ మాటలు మాట్లాడుతున్నారు’’ అంటూ పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నువ్వు, నీ దిక్కుమాలిన ఆలోచనలు... పనికొచ్చే పని చేయవా..?
-
కొంచెం బోర్ కొట్టినా వినండి..! నేతలతో జగన్ సరదా సన్నివేశం
-
వెన్నుపోటుకు రెండేళ్లు
-
ఇదేం జోక్ కాదు.. లెట్ తీసుకోకండి...
-
స్థానిక సంస్థల ఎన్నికలే మన టార్గెట్.. YSRCP నేతలకు జగన్ హెచ్చరిక
-
జూన్ 12.. గుర్తుపెట్టుకోండి..! చంద్రబాబు కు చెమటలు పట్టించాలి
-
సిగ్గులేకుండా మహానాడుకు, స్త్రీ శక్తి అని పెట్టుకున్నారు
-
స్థానిక సంస్థల ఎన్నికలు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, తాడేపల్లి: ఏపీలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికల్లో చంద్రబాబు కుట్రలను ఎదుర్కొంటూ ధీటుగా నిలబడాలని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే మన కార్యకర్తకు కచ్చితంగా తోడుగా ఉండాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి స్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి. చంద్రబాబు వైఫల్యాలపై చర్చ జరిగేలా చూడాలన్నారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆధ్వర్యంలో తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కీలక సమావేశం జరిగింది. ఈ విస్తృత స్థాయి సమావేశానికి కీలక నేతలు, పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, పార్లమెంట్ కో–ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ కో–ఆర్డినేటర్లు హాజరయ్యారు. ఈ సందర్బంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ..‘చంద్రబాబు ఎలాంటి కుట్రలు చేస్తాడో మన అందరికీ తెలిసిందే. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో చంద్రబాబు అధికార దుర్వినియోగాన్ని చూశాం. పోలీసులను అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలు చేయడం చూశాం. బరితెగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాడు. ఇన్ని ఉన్నా, స్థానిక సంస్థల ఎన్నికలను మనం ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి.చంద్రబాబు కుట్రలను ఎదుర్కొంటూ దీటుగా నిలబడాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే మన కార్యకర్తకు కచ్చితంగా తోడుగా ఉండాలి. విజయమైనా, పరాజయమైనా.. తన ఎమ్మెల్యే కేండిడేట్ తనకు అండగా ఉన్నాడు అని ప్రతి కార్యకర్తకూ కలగాలి. చంద్రబాబు కుట్రలను ఎదుర్కొంటూ అండగా నిలబడ్డాడని కార్యకర్తకు అనిపించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలకు తోడుగా ఉంటే, వాళ్లే మీకు జనరల్ ఎన్నికల్లో బలగంగా నిలబడతారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి స్థానంలో పార్టీ జెండా ఎగరాలి. ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. దాన్ని సీరియస్గా తీసుకుంటాను. అలా జరిగితే దాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జి ఫెయిల్యూర్గానే భావిస్తాను. ప్రజల్లో నిరంతరం ఎవరు ఉన్నారు? పార్టీ కార్యక్రమాల్లో ఎవరు చురుగ్గా పాల్గొంటున్నారో, ఇప్పటికే మీకందరికీ అవగాహనకు వచ్చి ఉంటుంది.అలాంటి వారిని గుర్తించి, పోటీకి సన్నద్ధం చేయండి.స్థానిక ఎన్నికల సమయం వచ్చే సరికి, చంద్రబాబు పరిపాలనా వైఫల్యాలను మన పార్టీ గ్రామ, వార్డు స్థాయి యంత్రాంగం ద్వారా, ప్రతి ఇంటికీ ఈ బుక్లెట్ మెటీరియల్ ద్వారా ప్రజలను జాగృత పరచాలి. రెండేళ్లలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేశాం. కమిటీ సభ్యులు అందరికీ కూడా వెన్నుపోటు రెండేళ్లు కాపీలు అందేలా చూడండి. ఈ బుక్లెట్ ప్రతీ ఇంటికీ చేరేలా చూడాలి. చంద్రబాబు వైఫల్యాలపై చర్చ జరిగేలా చూడాలి. చంద్రబాబు మోసాలు, వెన్నుపోట్లపై ప్రజలు తిరగబడతారు’ అని తెలిపారు. -
సర్ ప్రక్రియ.. వైఎస్ జగన్ హాట్ కామెంట్స్
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంఘం త్వరలో సర్ ప్రక్రియను చేపట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. బుధవారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన సర్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మనం ఎస్ఐఆర్పై దేశ వ్యాప్తంగా అనేక భయాలు, ఆందోళనలను అనేక రాజకీయ పార్టీలు వ్యక్తంచేయడం చూశాం. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలను ప్రభావితం చేసిందన్న వాదనలనూ విన్నాం. పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఏం జరిగిందో అంతా చూసే ఉంటారు. బెంగాల్లో 91 లక్షలు, అంటే ఉన్న ఓట్లలో 11.9%. అలాగే తమిళనాడులో 74 లక్షలు, అంటే మొత్తం ఓట్లలో 11.6% తొలగించారు. మమతాబెనర్జీ పోటీచేసిన భవానీపూర్లో 44,990 ఓట్లను తొలగించారు. అక్కడ ఆమె 15,105 ఓట్లతో ఓడిపోయారు. తమిళనాడులో స్టాలిన్ పోటీచేసిన నియోజకవర్గంలో దాదాపుగా 71,133 ఓట్లను తొలగించారు. ఆయన ఓడింది 8వేల ఓట్లతేడాతోనే. అంతేకాకుండా బెంగాల్లో తీసేసిన ఓట్లు 91లక్షలు అయితే, ఆ రాష్ట్రంలో మమత పార్టీ ఓడింది 31లక్షల తేడాతో. అదే తమిళనాడులో తీసేసింది 74లక్షల అయితే, స్టాలిన్ పార్టీ ఓడింది 17 లక్షల తేడాతోనే. అందుకే మనమంతా ఎస్ఐఆర్పై జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మనం ఓట్లు పెరగడం వల్ల ఓడిపోయాం. అక్కడ ఓట్లు తీసేయడం వల్ల వాళ్లు ఓడిపోయారు. ఈ రెండూ డేంజరే. ఊరికి యాభై మన ఓట్లను తీసేస్తే చాలు.. నియోజకవర్గానికి 5వేలు పోయినట్టే. అదే సమయంలో టీడీపీ బోగస్ ఓట్లమీద కూడా మనం దృష్టిపెట్టాలి. కుప్పంలో అది మన కళ్లెదుటే కనిపించింది. కుప్పంలో ఓట్ల జాబితా ఒక్కసారి చూస్తే 22వేల అనుమానాస్పద ఓట్లు ఉన్నాయి. ఒకే పేరు ఐదుసార్లో, పది సార్లో కనిపిస్తుంది. లిస్టులో ఆ పేరు కనిపించిన ప్రతిసారి కూడా తండ్రి పేరు చూసినా, లేక భర్త పేరు చూసినా సేమ్ ఉంటాయి. ఏపీలో ఓట్ల జాబితా ఓ హిస్టరీ అండ్ మిస్టరీ. ఇలాంటి బోగస్ ఓట్లు, తప్పుడు ఓట్లు మీద దృష్టిపెట్టాలి. అందుకే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నా అని వైఎస్సార్సీపీ శ్రేణుల్ని ఉద్దేశించి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. -
బాబు ‘వెన్నుపోటుకు రెండేళ్లు’.. వైఎస్సార్సీపీ బుక్ విడుదల
సాక్షి, తాడేపల్లి: ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండేళ్ల పాలనపై వైఎస్సార్సీపీ పోరాటానికి సిద్ధమైంది. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. చంద్రబాబు ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో బుక్ విడుదల చేశారు. జూన్ 4 నుంచి జూన్ 12 వరకు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం జరుపుతున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, శ్రేణులు నిరసనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. చంద్రబాబుకు ప్రజల నిరసన సెగలు తగలాలి అని అన్నారు.నిరసనలు ఇలా..జూన్ 4న మండల కేంద్రాల్లో వైఎస్సార్సీపీ నిరసనలు.జూన్ 8 లేదా 9న నియోజకవర్గ హెడ్క్వార్టర్స్లో టౌన్హాల్ సదస్సులు నిర్వహించాలి.జూన్ 12న ప్రతీ నియోజకవర్గ కేంద్రంలో చంద్రబాబు వెన్నుపోటు పాలనకు నిరసనగా ర్యాలీలు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆధ్వర్యంలో తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కీలక సమావేశం జరిగింది. ఈ విస్తృత స్థాయి సమావేశానికి కీలక నేతలు, పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, పార్లమెంట్ కో–ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ కో–ఆర్డినేటర్లు హాజరయ్యారు. ఈ సందర్బంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ..‘చంద్రబాబు రెండేళ్ల పాలన ఎలా ఉందో అందరికీ తెలుసు. బాబు షూరిటీ.. మోసం గ్యారెంటీ అని రుజువైంది. జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తానని బాబు నమ్మించారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన ఘనత చంద్రబాబుది. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తైంది. మూడోసారి కూడా బడ్జెట్ ప్రవేశపెట్టారు. సూపర్-6, సూపర్-7 లేదు. ఆడబిడ్డ నిధికి నిధుల్లేవు.18 ఏళ్లు నిండిన అక్కచెల్లెమ్మెలకు ఏడాదికి రూ.18 వేలు లేవు. 50 ఏళ్లు నిండిన వాళ్లకు పెన్షన్ కూడా ఇవ్వలే. నిరుద్యోగ భృతిలోనూ మోసం చేశారు. ఎవరైనా ప్రశ్నిస్తే చంద్రబాబుకి బీపీ పెరిగిపోతోంది. మావిగన్ అంటే చంద్రబాబు అక్కడే పడిపోయేలా ఉన్నారు. వ్యాట్ తగ్గించుకోమంటే బీపీ ఎందుకు?. పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. తగ్గించకపోగా.. బాదుడు మొదలుపెట్టారు. ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీనే కదా? ఎందుకు తగ్గించడం లేదు. రాష్ట్ర పన్నులతో తగ్గించుకోవచ్చు కదా చంద్రబాబూ!. తగ్గించమంటే బాబుకి బీపీ పెరుగుతోంది. ఇప్పటికీ హామీల అమలు లేదు. మేనిఫెస్టో అడ్రస్ కనిపించదు. ఏం చేయలేదు కాబట్టే డైవర్షన్ పాలిటిక్స్కు దిగారు. గొడ్డళ్లు కత్తులు,కటార్లంటూ కొత్త డైవర్షన్ తీసుకొచ్చారు. ప్రజలను పిచ్చోళ్లని చంద్రబాబు అనుకుంటున్నారు. కానీ, తెలివైన వాళ్లని గుర్తించాలి’ అని చెప్పుకొచ్చారు. -
ముసలి పులి బంగారు కడియం కథ.. మళ్లీ చెప్పిన జగన్
-
ఓట్లు తొలగించే కుట్ర..! పార్టీ నేతలతో జగన్ కీలక భేటీ
-
150 హత్యలు చేసినా.. పరిటాల రవిని వెనకేసుకొస్తారా ?
-
LIVE: YSRCP ముఖ్యనేతలతో వైఎస్ జగన్ భేటీ
-
వైఎస్సార్సీపీ కీలక సమావేశం.. జగన్ స్పీచ్ హైలైట్స్
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఉదయం జరిగిన ఈ సమావేశానికి కీలక నేతలు, పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, పార్లమెంట్ కో–ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ కో–ఆర్డినేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు కీలకాంశాలపై ఆయన కేడర్కు దిశానిర్దేశం చేశారు.. వైఎస్ జగన్ స్పీచ్ హైలైట్స్చంద్రబాబు రెండేళ్ల పాలన ఎలా ఉందో అందరికీ తెలుసుబాబు షూరిటీ.. మోసం గ్యారెంటీ అని రుజువైందిజగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తానని బాబు నమ్మించారుమేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన ఘనత చంద్రబాబుదికూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తైందిమూడోసారి కూడా బడ్జెట్ ప్రవేశపెట్టారుసూపర్-6, సూపర్-7 లేదుఆడబిడ్డ నిధికి నిధుల్లేవు18 ఏళ్లు నిండిన అక్కచెల్లెమ్మెలకు ఏడాదికి రూ.18 వేలు లేవు50 ఏళ్లు నిండిన వాళ్లకు పెన్షన్ కూడా ఇవ్వలేనిరుద్యోగ భృతిలోనూ మోసం చేశారుఎవరైనా ప్రశ్నిస్తే చంద్రబాబుకి బీపీ పెరిగిపోతోందిమావిగన్ అంటే చంద్రబాబు అక్కడే పడిపోయేలా ఉన్నారువ్యాట్ తగ్గించుకోమంటే బీపీ ఎందుకు?పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గిస్తామని హామీ ఇచ్చారుతగ్గించకపోగా.. బాదుడు మొదలుపెట్టారుఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీనే కదా? ఎందుకు తగ్గించడం లేదురాష్ట్ర పన్నులతో తగ్గించుకోవచ్చు కదా చంద్రబాబూ!తగ్గించమంటే బాబుకి బీపీ పెరుగుతోందిఇప్పటికీ హామీల అమలు లేదుచంద్రబాబు కుట్ర రాజకీయాలు అందరికీ తెలుసుమంచి చేశానని చెప్పుకునే స్థితిలో ఆయన లేరుమేనిఫెస్టో అడ్రస్ కనిపించదుఏం చేయలేదు కాబట్టే డైవర్షన్ పాలిటిక్స్కు దిగారుగొడ్డళ్లు కత్తులు,కటార్లంటూ కొత్త డైవర్షన్ తీసుకొచ్చారుప్రజలను పిచ్చోళ్లని చంద్రబాబు అనుకుంటున్నారుకానీ, తెలివైన వాళ్లని గుర్తించాలివైఎస్సార్ పాలనలో, వైఎస్సార్సీపీ హయాంలోనే జనాలకు మంచి జరిగింది.. ఆ విషయం కాలర్ ఎగరేసి మరీ చెప్పగలంవెన్నుపోటుకు రెండేళ్లు.. బుక్లెట్ ఆవిష్కరణచంద్రబాబువి వెన్నుపోటు కాదు.. వెన్నుపోట్లుసూపర్సిక్స్, సూపర్ సెవెన్ మోసాలను ప్రజలకు వివరించేలా వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమాలుచంద్రబాబు మోసాలు, అవినీతి, దుర్మార్గాలు వివరించేలా బుక్లెట్ విడుదలబుక్లెట్ విడుదల చేసిన వైఎస్ జగన్చంద్రబాబు మోసాల్ని ప్రజలకు వివరిస్తూ.. మొదటి ఏడాది ర్యాలీ నిర్వహించాం: వైఎస్ జగన్రెండో ఏడాది కూడా గొప్పగా ఆ కార్యక్రమాలు నిర్వహించాం: వైఎస్ జగన్జూన్ 4 నుంచి 12 దాకా.. వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం నిర్వహిద్దాం: వైఎస్ జగన్జూన్ 4న.. మండల కేంద్రాల్లో వైఎస్సార్సీపీ నిరసనలు: వైఎస్ జగన్8 లేదా 9వ తేదీన నియోజకవర్గ హెడ్క్వార్టర్స్ టౌన్హాల్లో సదస్సులు: వైఎస్ జగన్12న.. ప్రతీ నియోజకవర్గంలో చంద్రబాబు వెన్నుపోటు పాలనకు నిరసనగా ర్యాలీలు: వైఎస్ జగన్ఎండలు, సర్ కార్యక్రమం, గ్రామస్థాయి పార్టీ బలోపేతం తదిరత అంశాల్ని పరిగణనలోకి తీసుకుని ఈ షెడ్యూల్: వైఎస్ జగన్ఎమ్మెల్యే దగ్గరి నుంచి ప్రతీ ఒక్కరూ ఈ నిరసనల్లో భాగం కావాలి: వైఎస్ జగన్కార్యక్రమాలను స్వయంగా నేనే పర్యవేక్షిస్తా: వైఎస్ జగన్ప్రజల నిరసన సెగలు చంద్రబాబుకి తగలాలి: వైఎస్ జగన్జగన్ కీలక వ్యాఖ్యలు ఏపీలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయిచంద్రబాబు కుట్ర రాజకీయాలు అందరికీ తెలుసుమున్పిపల్ కార్పొరేషన్ ఉపఎన్నికల్లో ఆ కుట్రలు చూశాంపోలీసులను అడ్డం పెట్టుకొని ఏ విధంగా ప్రజాస్వామ్యం ఖూనీ చేశారో చూశాంఅందుకే.. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలిప్రతీ కార్యకర్తకు పార్టీ అండగా నిలిచిందన్న నమ్మకం కలగాలిఆ నమ్మకం కలిగితేనే కార్యకర్తలు మీకు తోడుగా ఉంటారుచంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా వైఎస్సార్సీపీ జెండా ఎగరాలిఎక్కడ కూడా ఏకగ్రీవం కాకూడదు.. అదే జరిగితే చాలా సీరియస్గా తీసుకుంటాంఏకగ్రీవం జరిగిందంటే ఇన్చార్జిలు ఫెయిల్ అయ్యారన్నమాటఇప్పటికే గ్రామ కమిటీలు, అనుబంధ కమిటీలు ఏర్పాటయ్యాయివీరందరితో కలిసి సరైన అభ్యర్థులను ఎంపిక చేయాలివైఎస్సార్సీపీ హయాంలో అందిన పథకాలు.. కూటమిలో ఎలా రద్దయ్యాయో ప్రజలకు వివరించాలిబాబు వెన్నుపోటు పాలన గురించి ప్రతీ ఇంట చర్చ జరగాలిస్థానిక సంస్థల ఎన్నికలను కచ్చితంగా సీరియస్గా తీసుకోవాలిసర్ ప్రక్రియ గురించి.. బెంగాల్, తమినాడు ఎన్నికలను అంతా చూశారుసర్ ద్వారా బెంగాల్, తమిళనాడులో లక్షల ఓట్లు తీసేశారుమమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్లో 45 వేలకు పైగా ఓట్లు తొలగించారుఆమె 15 వేల ఓట్ల తేడాతో ఓడారుతమిళనాడులో స్టాలిన్ పోటీ చేసిన కొలతూర్లో 71 వేల ఓట్లు తొలగించారుఆయన ఓడింది 8 వేల ఓట్ల తేడాతో.. ఈ అంశాలను జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకోండి91 లక్షల ఓట్లు బెంగాల్లో తొలగించారుమమతా బెనర్జీ పార్టీ 31 లక్షల ఓట్ల తేడాతో ఓడారుతమిళనాడులో 74 లక్షల ఓట్లు తీసేశారుస్టాలిన్ పార్టీ 17 లక్షల ఓట్ల తేడాతో ఓడారుకాబట్టి సర్ అంశాన్ని సీరియస్గా తీసుకోవాలిఓట్లు పెరగడం వల్ల మనం ఓడాం.. ఓట్లు తగ్గడం వల్ల వాళ్లు ఓడారుకుప్పంలో కళ్లెదుటే అది కనిపించిందిఏపీలో ఓట్లు హిస్టరీ అండ్ మిస్టరీమనం అనుకున్న నియోజకవర్గం నుంచి 50 ఓట్లు తొలగించినా చాలూ.. -
డీఎస్సీ ‘మెగా’ మోసం!
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ–2025 తప్పిదాలను కప్పిపుచ్చి మభ్యపెట్టేందుకు చంద్రబాబు సర్కారు పడరాని పాట్లు పడుతోందని శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆధారాలతో సహా డీఎస్సీ అక్రమాలు బహిర్గతం కావడంతో ప్రభుత్వం బెంబేలెత్తుతోందన్నారు. ‘ఫస్ట్ ర్యాంకర్కు కాల్ లెటర్ పంపకుండా ఎందుకు ఆపారు? నవీన్ క్యాండిడేట్ ఐడీని ప్రభుత్వం బ్లాక్ చేయడం నిజం కాదా? ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఏకంగా ఫస్ట్ ర్యాంకు రావడం.. ఫస్ట్ ర్యాంకు వచ్చినా కూడా ఉద్యోగంలో చేరకపోవడం చరిత్రలో ఎక్కడైనా ఉందా? డీఎస్సీ–2025 మొదటి మెరిట్ లిస్టు ఎందుకు రద్దు చేశారు?’ అని ఒక ప్రకటనలో సూటిగా ప్రశ్నించారు. గతంలో డీఎస్సీ మెరిట్ లిస్టులు కలెక్టర్ కార్యాలయాల్లోనే వెరిఫై చేసేవారని, ఈదఫా మాత్రం సెలెక్ట్ అయిన వారికి నేరుగా మెసేజ్లు పంపడం వెనుక మతలబు ఏమిటని నిలదీశారు. డీఎస్సీలో డొల్లతనంపై ‘సాక్షి’లో వరుసగా కథనాలు వెలువడటం.. మాజీ సీఎం వైఎస్ జగన్ దీన్ని ఎండగట్టడం.. సీబీఐ విచారణకు డిమాండ్ చేయడంతో ఉలిక్కిపడిన బాబు సర్కారు కనీసం ప్రాథమిక విచారణ కూడా చేయకుండానే అర్ధరాత్రి తూతూమంత్రంగా ఓ ప్రకటన జారీ చేసి చేతులు దులుపుకొనే యత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. డీఎస్సీ అక్రమాలను సర్వత్రా నిలదీస్తుంటే విద్యాశాఖ మంత్రి మాత్రం అంతా పారదర్శకమని తన ‘ఎక్స్’ ఖాతాలో బుకాయించడం విస్మయం కలిగిస్తోందన్నారు. మెరిట్ కలిగి ఉండి అన్యాయానికి గురైన అభ్యర్థులను బుజ్జగించేందుకు విద్యాశాఖ మంత్రి రాజకీయాలు చేయడం ఏమిటన్నారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా కింద 421 పోస్టులను ఎలాంటి పరీక్ష లేకుండా భర్తీ చేసిన ప్రభుత్వం తాజాగా అదే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందాలంటే రాత పరీక్ష తప్పనిసరి అంటూ పాలసీ, జీవోలను సవరించడం వెనుక మతలబు ఏమిటని నిలదీశారు.తప్పించుకునేందుకు ‘శాప్’ ఆపసోపాలు..ప్రభుత్వం వివరణ: శాప్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడాకోటా డీఎస్సీ పోస్టుల భర్తీలో ఎలాంటి అవకతవకలు జరగలేదు. పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న కథనాలు అవాస్తవం, నిరాధారమైనవి.ఇదీ వాస్తవం: క్రీడా కోటా డీఎస్సీ పోస్టుల భర్తీలో తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పోస్టులు పొందారని, అనర్హులకు పోస్టుల దక్కాయని.. అర్హులైనప్పటికీ తమకు అన్యాయం జరిగిదంటూ ఎందరో అభ్యర్థులు ‘శాప్’కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా కోర్టులకు వెళ్లి తేల్చుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. సమాచార హక్కు–2005 ప్రకారం అర్హులైన అభ్యర్థులు కోరిన సమాచారాన్ని ‘శాప్’ ఇంత వరకు ఇవ్వకపోవడం దేనికి సంకేతం? ఏదైనా నోటిఫికేషన్ తర్వాత పోస్టు భర్తీ చేస్తే ఆ పోస్టుకు సంబంధించిన సమగ్ర వివరాలు, ఉద్యోగి ఏ అర్హతతో ఉద్యోగం పొందారో సమాచారం ఇవ్వాల్సిందేనని దేశ అత్యున్నత న్యాయస్థానం గతంలో స్పష్టం చేసింది. దీనిని శాప్ అధికారులు ఎందుకు పట్టించుకోలేదు? టీచర్ పోస్టులకు బేరాలు పెడుతూ నంబర్తో సహా ఫోన్ కాల్ రికార్డింగ్స్ బహిర్గతమైతే వాటిపై శాప్ విచారణ చేయడం మానేసి మౌనం దాల్చడం వెనుక మతలబు ఏమిటి?ప్రభుత్వం వివరణ: 3,600 మంది అభ్యర్థులు దాఖలు చేసుకున్న 5,326 దరఖాస్తులను స్క్రీనింగ్ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే రాష్ట్ర స్థాయి కమిటీకి పంపించి పోస్టులు భర్తీ చేసింది.ఇదీ వాస్తవం: స్క్రీనింగ్ కమిటీలో సభ్యులైన డీఎస్డీవోలను ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా తయారీ వరకు ఎందుకు కొనసాగించలేదు? ప్రాథమిక ఎంపిక జాబితాను బహిరంగంగా ఎందుకు ప్రదర్శించలేదు? ఒకవేళ ప్రదర్శిస్తే కచ్చితంగా అభ్యంతరాలు వచ్చేవి. కానీ శాప్లో ఒక్క అభ్యంతరం కూడా ఎందుకు నమోదు కాలేదు? అంటే, అసలు ప్రాథమిక జాబితా ప్రదర్శించకుండానే తుది జాబితా సిద్ధం చేసేశారు. చివరికి ఫలితాల రోజు అనర్హురాలైన విజయనగరానికి చెందిన ఓ క్రీడాకారిణికి ఉద్యోగం రావడం గమనించి అర్హులు ఆధారాలతో సహా ఫిర్యాదులు చేస్తే శాప్ వాటిని ఎందుకు పట్టించుకోలేదు? ఈ ఏడాది ఏప్రిల్ 24న సాక్షిలో ‘డీఎస్సీ డీల్స్’ కథనం వెలువడగానే సదరు క్రీడాకారిణిపై విచారణ చేస్తున్నట్లు శాప్ పేర్కొంది. ఇప్పటికీ నెల రోజులు దాటినా విచారణ ఎందుకు ముగించడం లేదు? అంటే ప్రభుత్వమే వాస్తవాలు బయటపడకుండా అడ్డుకుంటోంది కదా!తాను ఎస్సీఈఆర్టీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా 2016 నుంచి పనిచేసినట్టు కోర్టుకు తెలిపిన నవీన్ సర్కారు అబద్ధాల వివరణలపై అభ్యర్థుల మండిపాటు..డీఎస్సీ–2025లో కృష్ణా జిల్లా సోషల్ స్టడీస్ టాపర్గా ప్రకటించిన పి.నవీన్ ఎస్సీఆర్టీలో అవుట్ సోర్సింగ్పై కంప్యూటర్ ఆపరేటర్గా పని చేస్తున్నాడు. అతడికి డీఎస్సీలో ప్రశ్నలను ఆన్లైన్ చేసే బాధ్యతలు అప్పగించారు. డీఎస్సీ ఫలితాల అనంతరం అతడికి టాప్ ర్యాంకులు వచ్చాయని గుర్తించిన అధికారులు మొత్తం ఎంపిక ప్రక్రియనే మార్చేశారు. అబద్ధాల వివరణలతో ప్రభుత్వం వరుసగా కట్టు కథలు వినిపిస్తోందని టీచర్ అభ్యర్థులు మండిపడుతున్నారు. చంద్రబాబు సర్కారు తీరును నిలదీస్తూ పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. తమ ప్రశ్నలకు జవాబు చెప్పాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న పలు సందేహాలు, ప్రభుత్వ వివరణలు ఇలా ఉన్నాయి..!ప్రభుత్వం వివరణ: డీఎస్సీ కృష్ణా జిల్లా సోషల్ స్టడీస్ టాపర్ పి.నవీన్ 2016 నవంబర్ నుంచి ఎస్సీఈఆర్టీలో అవుట్సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తూ వ్యక్తిగత కారణాలతో 2025లో రాజీనామా సమర్పించాడు. అన్నింటికంటే ముఖ్యంగా మెరిట్ ప్రాతిపదికన అతడిని జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా సర్టిఫికెట్ వెరిఫికేషన్కు పిలిచినా వెరిఫికేషన్కు హాజరు కాలేదు. ఇదీ వాస్తవం: డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు ఆగస్టు 26న కాల్ లెటర్లు విడుదల చేశారు. వీటిని ఆయా అభ్యర్థులు తమ డీఎస్సీ నంబర్ ఆధారంగా కంప్యూటర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఆగస్టు 29 నుంచి ప్రారంభమైన సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యారు. అయితే, నవీన్ తన క్యాండిడేట్ లాగిన్ ఐడీని అధికారులు బ్లాక్ చేశారంటూ హైకోర్టుకు ఆధారాలు సమర్పించాడు. అసలు కాల్ లెటర్ లేకుండా సర్టిఫికెట్ల పరిశీలనకు అనుమతిస్తారా?ప్రభుత్వం వివరణ: నవీన్ వ్యక్తిగత కారణాలతో 2025లో రాజీనామా సమర్పించాడు.ఇదీ వాస్తవం: నవీన్ 2025 ఏ నెలలో రాజీనామా చేశాడో చెప్పలేదు. తాను డీఎస్సీ ప్రక్రియ ముగిసే వరకు ఎస్సీఈఆర్టీలోనే కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేశానంటూ కోర్టుకు ఇచ్చిన పిటిషన్లో అతడు పేర్కొన్నాడు. మరి వ్యక్తిగత కారణాలతో ఎప్పుడు రాజీనామా చేశాడు?ప్రభుత్వం వివరణ : డీఎస్సీ రాసేందుకు నిర్ణీత విధానాల ప్రకారం ముందుగా శాఖకు సమాచారం ఇచ్చి సంబంధిత అధికారుల నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. అయితే నవీన్ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, అనుమతి పొందకుండా పరీక్షలకు హాజరయ్యాడు. అందువల్ల అతడి పేరు తదుపరి ఎంపిక ప్రక్రియ రికార్డుల నుంచి తొలగించాం. ఇదీ వాస్తవం: అనుమతి పొందకుండా పరీక్షలకు హాజరైతే అతడి ఎంపిక ప్రక్రియను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. కానీ దాదాపు ఏడాదిన్నర కాలంపాటు సాగిన డీఎస్సీ ప్రక్రియలో ఈ విషయాన్ని ఎందుకు గుర్తించలేదు? గుర్తించి ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అలా ఎక్కడా చేయలేదు. ఎంపిక ప్రక్రియలో నవీన్ను తొలగించి ఉంటే అతడి స్థానంలో మరో అభ్యర్థికి సోషల్ స్టడీస్లో మొదటి ర్యాంకు, జోన్–2 టీజీటీలో ఆరో ర్యాంకును మరో అభ్యర్థికి కేటాయించి ఉండాలి. ఇలా ఎందుకు చేయలేదు? ప్రభుత్వ తీరును తప్పుబడుతూ నవీన్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాడు. అతడికి పోస్టు ఇవ్వాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. మరి నవీన్ విద్యాశాఖ అనుమతి లేకుండా పరీక్ష రాశాడని, అందుకే అతడికి పోస్టు కేటాయింపును రద్దు చేశామని కోర్టుకు ప్రభుత్వం ఎందుకు చెప్పలేదు?ఉర్దూ మీడియం పోస్టుల్లోనూ తప్పిదాలు..!ప్రభుత్వం వివరణ: అన్నమయ్య, కడప జిల్లాలకు చెందిన స్కూల్ అసిస్టెంట్ బయాలజీ (ఉర్దూ మీడియం) పోస్టుల భర్తీ పూర్తిగా మెరిట్, రోస్టర్ నిబంధనల ప్రకారమే జరిగింది. ఓపెన్ కాంపిటీషన్ (ఓసీ) రోస్టర్ పాయింట్ కింద అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థిని, ఓసీ–ఈడబ్ల్యుఎస్ కోటా కింద చెల్లుబాటు అయ్యే సర్టిఫికెట్ గల మెరిట్ అభ్యర్థిని నిబంధనల ప్రకారమే ఎంపిక చేశాం. ఇందులో ఎటువంటి నిబంధనల అతిక్రమణ జరగలేదు.ఇదీ వాస్తవం: అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన సయ్యద్ జమీల్ డీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ (ఉర్దూ)లో 58.77 స్కోరు సాధించారు. ఓసీ–ఈడబ్ల్యుఎస్ కోటాలో ఆయనకు ఆ పోస్టు ఇవ్వాలి. కానీ ఆ పోస్టును ముస్లిం బీసీ(షేక్) వర్గానికి చెందిన అభ్యర్థికి ఇచ్చారు. ఎంపిక అయిన అభ్యర్థి 2008, 2012, 2014, 2018 డీఎస్సీల్లో ‘బీసీ’గా నమోదు చేసుకున్నాడు. 2025 నాటికి ‘ఓసీ–ఈడబ్ల్యుఎస్’గా నమోదు చేశాడు. గతంలో బీసీ కులం అని చూపించి 2025 డీఎస్సీలో ఓసీగా ఎలా మారిపోయాడు?ఇదేనా పారదర్శకత?డీఎస్సీ నియామకాలను అత్యంత పారదర్శకంగా పూర్తి చేశామని ప్రభుత్వం పదేపదే చెబుతోంది. అదే నిజమైతే టెట్ మార్కుల సవరణకు పలు పర్యాయాలు ఎందుకు అవకాశం ఇవ్వాల్సి వచ్చింది? ఒకసారి మెరిట్ జాబితాను విడుదల చేశాక సవరణతో రెండోసారి జాబితా ఎందుకు ఇచ్చారు? అనంతరం వాటిని ఆన్లైన్ నుంచి తొలగించి నేరుగా ఎంపిక జాబితాలు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? ఎంపికైనట్లు కొందరు అభ్యర్థులకు ఎస్ఎంఎస్లు పంపి, ఆ తర్వాత కాదని చెప్పడం నిజం కాదా? అమరావతిలో వేడుకలకు ఆహ్వానించి ఆ తర్వాత మీరసలు టీచర్ పోస్టులకే ఎంపిక కాలేదని చెప్పడంలో ఆంతర్యమేంటి? జూలై–2024 టెట్ను విజయవంతంగా పూర్తి చేసిన అధికారిని డీఎస్సీ కన్వీనర్గా నియమించామని చెబుతున్నారు. మరి ప్రారంభంలో ఆయనకే బాధ్యతలు ఎందుకు అప్పగించలేదు? అప్పటికే ఉన్న డీఎస్సీ కన్వీనర్ను ఎందుకు తొలగించారు?ప్రభుత్వం వివరణ: క్రీడా సంఘాలు, ఫెడరేషన్ల ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను ఇచ్చాం.ఇదీ వాస్తవం: స్క్రీనింగ్ కమిటీ ద్వారా అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన అత్యంత రహస్యంగా సాగింది. ఇందులో ఎక్కడా క్రీడా సంఘం, ఫెడరేషన్కు సంబంధించిన వ్యక్తులు లేరు. శాప్ తయారు చేసిన తుది జాబితా లిస్టు ప్రకారం ఆయా క్రీడా సంఘాల నుంచి సమ్మతి లేఖలు తీసుకుని ‘మమ’ అనిపించింది. జాతీయ స్థాయిలో పోస్టుల భర్తీలో ఫెడరేషన్లకు చెందిన వ్యక్తులను దగ్గర పెట్టుకుని సర్టిఫికెట్ల ధ్రువీకరణ చేపట్టడం ఆనవాయితీ. క్రీడాకారుల టీమ్ ఫొటోలు, మెడల్స్ లాంటివి స్వయంగా పరిశీలించి ధ్రువీకరిస్తారు. మరి ఇక్కడ అలా ఎందుకు జరగలేదు? డిగ్రీ లేకున్నా ఇతర రాష్ట్రాల్లో డిగ్రీ చదివినట్లు ఫేక్ సర్టిఫికెట్ తీసుకొచ్చి అనర్హులు టీచర్ ఉద్యోగాలు పొందారు. ఆ డిగ్రీలకు సంబంధించి శాప్ ఇతర రాష్ట్రాల వర్సిటీలను ఎందుకు సంప్రదించలేదు?ప్రభుత్వం వివరణ: మార్గదర్శకాలకు అనుగుణంగానే స్పోర్ట్స్ కోటా సీట్లను భర్తీ చేశాం.ఇదీ వాస్తవం: చరిత్రలో ఎన్నడూ లేని విధంగా డీఎస్సీలో 421 పోస్టులను స్పోర్ట్స్ కోటాలో పరీక్ష లేకుండా భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. దానికి తగ్గట్టుగా 97 శాతం పోస్టులు నింపేశారు. డీఎస్సీ ముగిసిన 8 నెలల తర్వాత క్రీడా పాలసీ, 3 శాతం హారిజాంటల్ రిజర్వేషన్ హఠాత్తుగా ఎందుకు మారింది? ఈ డీఎస్సీలో రాత పరీక్షల అవసరం లేకుండా క్రీడల కోటాలో ఉద్యోగాలు ఇవ్వగా ఇప్పుడు మాత్రం ఆయా శాఖలు నిర్వహించే రాత పరీక్షల్లో కచ్చితంగా అర్హత సాధించాలని ఎందుకు సవరించారు? రాత పరీక్ష లేకుండా ఉద్యోగం ఇవ్వడం తప్పయితే.. 2025 డీఎస్సీ పూర్తిగా తప్పిదమే. అది సక్రమమే అయితే.. ఇప్పుడు రాత పరీక్షను తప్పనిసరి ఎందుకు చేశారు? కర్నూలు జిల్లాలో ఓపెన్ కేటగిరీ పోస్టును భర్తీ చేసిన తర్వాత మళ్లీ నాన్–లోకల్ పోస్టు ఎలా భర్తీ చేస్తారు? దీనిపై కోర్టుల్లో కేసులు వేస్తే శాప్ 2002 తర్వాత జరిగిన సవరణలను దాచిపెట్టి కేవలం రాష్ట్రపతి ఉత్తర్వులు–1975 అంశాలను మాత్రమే కోర్టుకు ఎందుకు నివేదించింది?జవాబు చెప్పలేక జగన్పై వ్యక్తిగత విమర్శలా?విద్యాశాఖ మంత్రి లోకేశ్ డీఎస్సీపై వాస్తవాలను అంగీకరించకుండా మాజీ సీఎం వైఎస్ జగన్పై వ్యక్తిగత దూషణలు, విమర్శలు చేస్తూ ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు పెట్టడాన్ని బొత్స తీవ్రంగా ఖండించారు. డీఎస్సీలో అర్హులకు అన్యాయం జరగడం ముమ్మాటికీ నిజమని.. దీనిపై ‘సాక్షి’ ప్రచురించిన కథనం తప్పు అని నిరూపించే ఒక్క ఆధారాన్ని కూడా లోకేశ్ చూపలేకపోయారని పేర్కొన్నారు. 16 వేల టీచర్ పోస్టులను భర్తీ చేశామని, పది వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్ ఇచ్చామని గొప్పలు చెప్పుకున్న లోకేశ్ ఎక్కడా తప్పు జరగలేదని చెప్పే ధైర్యం చేయలేకపోయారని వ్యాఖ్యానించారు. డీఎస్సీ–2025లో జరిగిన దారుణాలు ఆధారాలతో సహా కళ్లముందే కనిపిస్తున్నా దర్యాప్తు చేస్తామని ఒక్కమాట అనేందుకు లోకేశ్ సాహసించలేదన్నారు. మెగా డీఎస్సీని అడ్డుకునేందుకు 200 కేసులు వేయించారని జగన్పై నిరాధార ఆరోపణలతో బురద చల్లారని మండిపడ్డారు. వాస్తవానికి డీఎస్సీలో తమకు అన్యాయం జరిగిందని కోర్టుకు వెళ్లిన వారంతా ప్రతిభ కలిగిన టీచర్ అభ్యర్థులేనని, వారిలో పరీక్ష రాయని వారు ఒక్కరూ లేరని గుర్తు చేశారు. ‘వారికి పోస్టులు ఇవ్వాలని సాక్షాత్తూ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. అయితే కోర్టు తీర్పు కాపీ వచ్చేలోపే ప్రక్రియను హడావుడిగా ముగిస్తూ ప్రభుత్వం ఫలితాలు ప్రకటన, ఎంపిక ప్రక్రియ, పోస్టింగ్లు ఇచ్చేశారు. దీనిపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మెరిట్ అభ్యర్థులకు పోస్టులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించడంతో పాటు విద్యాశాఖ తీరును తీవ్రంగా తప్పుబట్టింది. ఇది నిజం కాదా? ఈ విషయం తెలిసి కూడా లోకేశ్ విద్యాశాఖ మంత్రిగా ఎలా కొనసాగుతున్నారు? అర్హులకు ఎందుకు న్యాయం చేయలేదు? డీఎస్సీకి 3,36,307 మంది అభ్యర్థులు 5,77,694 దరఖాస్తులు సమర్పించారు. కూటమి ప్రభుత్వం ఆడిన అవినీతి క్రీడతో 3 లక్షల మందికి పైగా అభ్యర్థులకు పూడ్చలేని నష్టం జరిగింది. ఈ ప్రభుత్వం తక్షణం క్షమాపణ చెప్పి అభ్యర్థులకు న్యాయం చేయాలి’ అని బొత్స డిమాండ్ చేశారు. స్పోర్ట్సు డీఎస్సీలో జరిగిన స్కామ్పై ‘సాక్షి’లో కథనం వెలువడిన నెల రోజుల తర్వాత అబ్బే.. తప్పు జరగలేదంటూ ‘శాప్’ మంగళవారం ఓ ప్రకటన జారీ చేసి చేతులు దులుపుకోవటాన్ని బొత్స తప్పుబట్టారు.ఈ ప్రశ్నలకు జవాబేది చినబాబూ..1. పరీక్ష నిర్వహణలో చురుగ్గా పాల్గొన్న ఎస్సీఈఆర్టీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంకు ఎలా వచ్చింది?2. ఆ తర్వాత ఆ వివరాలను డేటాబేస్ నుంచి ఎందుకు డిలీట్ చేశారు? మెరిట్ లిస్టులను ఎందుకు దాచారు? టాపర్ వివరాలను ఎందుకు తొలగించారు?3. కృష్ణా జిల్లాలో సోషల్ స్టడీస్లో టాపర్గా వచ్చిన ఎస్సీఈఆర్టీ అవుట్సోర్సింగ్ ఉద్యోగి పి.నవీన్ ఎంపిక జాబితాలో తనకు పోస్టు లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది వాస్తవం కాదా?4. రాయలసీమ జిల్లాకు చెందిన ఓ క్రీడాకారిణి న్యాయంగా తనకు దక్కాల్సిన పోస్టు నాన్ృలోకల్ కోటాలో వేరే వ్యక్తికి కట్టబెట్టేశారని హైకోర్టును ఆశ్రయించింది నిజం కాదా?5. సెలెక్ట్ అయిన వారికి మాత్రమే నేరుగా మెసేజ్లు ఎందుకు పంపారు? కలెక్టర్ కార్యాలయాల్లో ఎంపికైన వారి జాబితాలు ఎందుకు పెట్టలేదు?6. రూ.15 లక్షలకు ‘‘స్పోర్ట్స్ కోటా’’ పోస్టులు బేరసారాలా? మీ పార్టీకి చెందిన నాయకుడే ఈ డీల్స్ కుదిర్చిన మాట వాస్తవం కాదా? ఎప్పుడూ క్రీడా మైదానంలో అడుగు పెట్టని వాళ్లకి కూడా ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇంటికే పిలిచి డీల్స్ చేస్తారా? రిక్రూట్మెంటా? లేక వేలం పాటా? ప్రతిభ ఉన్న ఉద్యోగార్థుల మాటేమిటి. స్పోర్ట్స్ కోటాలో ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చాయి? వారు ఏయే క్రీడల్లో ప్రతిభ చూపారు? వారికి ఎలా పోస్టింగులు ఇచ్చారో మొత్తం వివరాలు బయటపెట్టగలరా?7. టెట్ కన్వీనర్గా ఉన్న అధికారే డీఎస్సీ పరీక్షకూ కన్వీనర్ అయినప్పటికీ, ఉన్నపళంగా టెట్ కన్వీనర్ను తొలగించి విద్యా శాఖలోని జాయింట్ డైరెక్టర్ను డీఎస్సీ కన్వీనర్గా ఎందుకు పెట్టారు? దీనివెనుక మతలబు ఏమిటి?8. మెగా డీఎస్సీ పేరుతో అమరావతిలో నిర్వహించిన నియామకపత్రాల ప్రదానోత్సవానికి కొందరు డీఎస్సీ ఉద్యోగార్థులను పిలిచి, తర్వాత వాళ్లు సెలెక్ట్ కాలేదని వాళ్ల జీవితాల్లో నిప్పులు పోసిన మాట వాస్తవం కాదా? -
‘తెచ్చిన అప్పులన్నీ ఏమవుతున్నాయి?’
తాడేపల్లి : కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావొస్తున్నా, ఇంతవరకూ ఎన్నికల హామీలు నెరవేర్చలేదని రాష్ట్ర వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం విఫలమైందని, దాన్నుంచి తెప్పించుకునేందుకు జగన్పై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తెచ్చిన అప్పులన్నీ ఏమవుతున్నాయని, ఏ వర్గానికీ కూడా మేలు జరిగిన పరిస్థితే లేదన్నారు.ఈరోజు(మంగళవారం, మే 26వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన గడికోట శ్రీకాంత్రెడ్డి.. మాట్లాడితే అసెంబ్లీకి రమ్మంటారు.. వస్తే మీరు ఎలా బిహేవ్ చేస్తారో అందరికీ తెలుసన్నారు. జగన్ మీడియా సమావేశంలో సంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక పోతున్నారు. ఇప్పటివరకు మూడున్నర లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు. కనీసం అప్పులు దేనికి ఖర్చు చేశారో కూడా చెప్పటం లేదు. వైఎస్సార్సీపీ రూ. 10 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందని గతంలో ప్రచారం చేశారు. కానీ వైఎస్సార్సీపీ హయాంలో రూ. 3.30 లక్షల కోట్లు మాత్రమే అప్పులు చేసింది. సంక్షేమం, అభివృద్ధి అజెండా గా మా ప్రభుత్వం పనిచేసింది. ఇప్పుడు రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైంది..గతంలో పవన్ 35 వేల మంది మహిళలు మిస్ అయ్యారని మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న అఘాయితులపై మాట్లాడే దైర్యం చేయటం లేదు. అప్పట్లో సుగాలీ ప్రీతి విషయంలో ఊగిపోయారు. అధికారంలోకి వచ్చాక పట్టించుకున్న పాపాన పోలేదు. రాష్ట్రంలో హత్యా రాజకీయాలు చేస్తూ లా అండ్ ఆర్డర్ చేతిలోకి తీసుకున్నారు. ఈ ప్రభుత్వంలో ఏ వర్గానికి మేలు జరగటం లేదు. గత ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీని రద్దు చేసి కొత్తగా మెగా డీఎస్సీ అన్నారు. దాన్ని కూడా సరిగ్గా నిర్వహించకపోవటంతో అనేక విమర్శలు వస్తున్నాయి. డిఎస్సీ లో పేపర్ లీక్ దగ్గర నుంచి అనేక మోసాలు చేశారు..ఉద్యోగులను మానసికంగా వేధిస్తున్నారు. కక్ష్య కట్టుకుని ప్రతిపక్షాలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు.మెడికల్ కళాశాలల పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కమిషన్ల కోసం పోలవరం అస్తవ్యస్తం చేశారు. పోర్ట్స్ కూడా ప్రైవేటుపరం చేసేందుకు సిద్ధం అయ్యారు. మంత్రులు తమ శాఖల సంగతి వదిలేసి జగన్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. క్యాబినెట్ మొత్తం జగన్ ను వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘M అంటే మోసం.. D అంటే దగా.. S అంటే సూట్కేస్’
తాడేపల్లి: మెగా డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం పూర్తిగా దగా చేసిందని వైఎస్సార్సీపీ నేత, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. Mega Dsc లో ‘M అంటే మోసం.. D అంటే దగా.. S అంటే సూట్కేస్’ అని విమర్శించారు. పేపర్ లీక్, డేటా డిలీట్, సూట్కేస్ రాజకీయాలతో పచ్చ నేతలు పండగ చేసుకుంటున్నారని మండిపడ్డారు. ‘రాష్ట్రం దోపిడీకి గురవుతున్నా చంద్రబాబు చూస్తూ ఊరుకుంటున్నారు. ‘‘సూట్కేస్ మంత్రి” ద్వారా వ్యవహారాలు నడిపిస్తున్నారు. నారా లోకేష్ను “సకల శాఖ మంత్రి”గా మార్చారు. ఐటీ శాఖను “ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ” నుంచి “ఇల్లీగల్ టెక్నాలజీ”గా మార్చారు. క్రీడా మైదానంలో అడుగుపెట్టని వారికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఎలా వచ్చాయి? , స్పోర్ట్స్ కోటా ఎంపికల వివరాలను ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదు?, 1999, 2014లో నిరుద్యోగ భృతి పేరుతో చంద్రబాబు మోసం చేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే చేస్తున్నారు. నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ఇప్పటివరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. డీఎస్సీలో భారీ అక్రమాలు జరిగినా ప్రభుత్వం ఎందుకు విచారణ చేయటం లేదు. వారే పరీక్షలు నిర్వహిస్తారు.. వారే పేపర్ లీక్ చేస్తారు.. వారే డేటా డిలీట్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి రహస్యంగా మెసేజ్లు పంపించారు. మెరిట్ లిస్ట్ ఎందుకు ప్రకటించడం లేదు?, డీఎస్సీని “పచ్చ తమ్ముళ్ల కలెక్షన్ కౌంటర్”గా మార్చారు. చంద్రబాబు, లోకేష్, అధికారులు ఎవ్వరూ నిజాలు చెప్పడం లేదు. మరోసారి నిరుద్యోగులను మోసం చేశారు.లోకేష్కు, వైఎస్ జగన్కు పోలికే లేదు. వైఎస్ జగన్ విద్యాశాఖను గొప్ప వ్యవస్థగా మార్చారు. ప్రభుత్వ పాఠశాలలను దేవాలయాల్లా తీర్చిదిద్దిందీ జగనే. లోకేష్ వచ్చాక డిజిటల్ క్లాస్రూమ్స్, టోఫెల్, ఇంగ్లీష్ మీడియం, ట్యాబ్లను తొలగించారు. ప్రభుత్వ స్కూళ్లలో నాసిరకం భోజనం, మురుగునీరు, డ్యామేజ్ షూలు, నాసిరకం బ్యాగులు ఇస్తున్నారు. నెల వచ్చిందంటే పేదల ఖాతాల్లో నేరుగా డబ్బులు వేసిన సీఎం వైఎస్ జగన్ మాత్రమే. డీఎస్సీ అవినీతిపై పూర్తి స్థాయి విచారణ జరిపి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి. నిరుద్యోగులను మోసం చేసిన కూటమి ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలి. కూటమి ప్రభుత్వ విధానాలు రాష్ట్ర భవిష్యత్తును దిగజారుస్తున్నాయి’ అని మండిపడ్డారు. -
రెండే ఆప్షన్లు మీరే డిసైడ్ చేసుకోండి.. అరెస్ట్ పై కేతిరెడ్డి స్టాంగ్ వార్నింగ్
-
ఉద్యోగస్తులు అంటే ఎందుకు అంత పగ
-
మహేష్ రెడ్డిని హత్య చేసింది పరిటాల శ్రీరామ్ కావొచ్చు..?
-
తల్లి లేని లోటు తీర్చలేనిది..! ఎమోషనల్ అయిన పేర్ని కిట్టు
-
జగన్ ప్రశ్నలకు తండ్రీకొడుకుల మైండ్ బ్లాక్
-
వైఎస్ జగన్ ను కలిసిన సుగాలి ప్రీతి తల్లి
-
వైఎస్ జగన్ను కలిసిన సుగాలి ప్రీతి తల్లిదండ్రులు
సాక్షి,తాడేపల్లి: పవన్ కళ్యాణ్, చంద్రబాబు కుటుంబ సభ్యులను తిట్టిన వారి మీద పెట్టిన కేసుల్లో పురోగతి ఉంది కానీ తొమ్మిదేళ్ల క్రితం హత్యాచారానికి గురైన తన కుమార్తె కేసు దర్యాప్తులో మాత్రం ముందడుగు పడలేదని సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదే పదే సుగాలి ప్రీతి కేసు గురించి మాట్లాడి నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై మీద ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్, అధికారంలోకి వచ్చాక రెండేళ్లుగా కనీసం తమను పట్టించుకోవడం మానేశారని ఆమె ఆక్షేపించారు.అధికారంలోకి వచ్చాక మొదటిగా సుగాలి ప్రీతి కేసును దర్యాప్తు చేయిస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం అయ్యాక వెళ్లి కలిస్తే సాక్ష్యాధారాలన్నీ తారుమారయ్యాయని, డీఎన్ఏ రిపోర్టులు మారిపోయాయని మాట మార్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసు విషయంలోనే 2019కి ముందే ఆయన్ను కలిసి ముద్దాయిలు టీడీపీ వారేనని చెప్పినప్పుడు, అండగా ఉండి న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన పెద్ద మనిషి అధికారంలోకి వచ్చాక తామెవరో కూడా తెలియనట్టు వ్యవహరిస్తున్నాడని వైస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సుగాలి పార్వతి ఆవేదన చెందారు.ప్రెస్మీట్లో సుగాలి పార్వతి ఇంకా ఏం మాట్లాడారంటే..:పవన్కళ్యాణ్ పచ్చి స్వార్థం:వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని నిందించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందడానికే సుగాలి ప్రీతి కేసును పవన్ కళ్యాణ్ వాడుకున్నాడని అర్థమైంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని నిలదీసిన దానిలో పదో శాతమైనా సీఎం చంద్రబాబుని నిలదీసి ఉంటే ఈపాటికే కేసు దర్యాప్తు కొలిక్కి వచ్చేది. ఈ కేసును పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తుంటే, జనసేన నాయకులు, కార్యకర్తలతో తనపై దాడులు చేయించారు. జనసేన నాయకుడు గాదె వెంకటేశ్వరరావుని పురమాయించి తన వైకల్యాన్ని, కులాన్ని అవమానించేలా మాట్లాడించారు. పవన్కళ్యాణ్ను కలిసినప్పుడు కూడా ఇదే వైకల్యం, అదే రెడ్డి కులం ఉన్నాయని అన్నారు. మరి అవన్నీ తెలిసి కూడా అప్పుడెందుకు మాట్లాడలేదు? ఇచ్చిన హామీకి కట్టుబడడం అంటే ఇదేనా?.నా కూతురు దూరమైందన్న బాధ కన్నా కూటమి ప్రభుత్వం చేస్తున్న అవమానాలే మమ్మల్ని మరింత కుంగదీస్తున్నాయి. ప్రధాని మోదీతో మాట్లాడి సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగిస్తామన్న హామీ పవన్కళ్యాణ్కు గుర్తుకు లేదా? సుగాలి ప్రీతి కేసును అడ్డం పెట్టుకునే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడు.పవన్కళ్యాణ్కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా..:మాకు ఏదైనా న్యాయం జరిగిందీ అంటే, అది వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే. మేము కోరిన వెంటనే అడిషనల్ ఎస్పీ రమాదేవి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసి అత్యాచారం జరిగిందనే విషయాన్ని నిర్ధారించారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ విషయాన్ని మరుగున పడేసేందుకు ప్రయత్నించడం బాధాకరం. ఇప్పటికైనా పవన్కళ్యాణ్ తక్షణం స్పందించి నా బిడ్డ కేసు దర్యాప్తు చేయించి, నిందితులను శిక్షించాలి. లేదంటే రాజకీయ లబ్ధి కోసమే నా కూతురు కేసు వాడుకున్నానని బహిరంగంగా చెప్పాలి. ముద్దాయిలను కాపాడటానికి నాది రెడ్డి కులమంటూ కుల ప్రస్తావన తీసుకొస్తున్నారు.వీల్ ఛైర్ యాత్రకు ఎందుకు అనుమతివ్వడం లేదు?:నా కుమార్తె మృతికి న్యాయం చేయాలనే డిమాండ్తో 2025 లో వీల్ ఛైర్ యాత్రకు సిద్ధమైతే 300 మంది పోలీసులతో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారు. ఏ తప్పూ చేయకపోతే ప్రభుత్వం ఎందుకంతగా భయపడుతోంది? ఇప్పుడైనా నా వీల్ ఛైర్ యాత్రకు అనుమతివ్వాలి. ఎస్సీ, ఎస్టీ యాక్టు ప్రకారం మాకు రావాల్సిన బెనిఫిట్స్ని కూటమి ప్రభుత్వం ఆపేసిందని తెలుసుకున్న వైఎస్ జగన్గారు చాలా బాధ పడ్డారు. అవన్నీ సాధించడంతో పాటు కుటుంబానికి న్యాయం జరిగే దాకా పార్టీ లీగల్ సెల్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. -
అసలు ఏంజరిగిందంటే.. అరెస్ట్ పై YSRCP కార్యకర్తలు రియాక్షన్ .
-
15 సంవత్సరాలు రోడ్లపై డేకించారు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సెటైర్లు
-
తోపుదుర్తి రాజశేఖరరెడ్డి అరెస్ట్.. పరిటాల సునీత కు ప్రకాష్ రెడ్డి మాస్ వార్నింగ్
-
ప్రొ. నాగేశ్వర్ వ్యాఖ్యలకు భయపడ్డ పవన్..!
-
రాజాను చూసేందుకు భారీ ఎత్తున తరలివచ్చిన YSRCP కార్యకర్తలు.. పోలీసుల ఓవర్ రాక్షన్..
-
తోపుదుర్తి సోదరుడి అక్రమ అరెస్ట్
సాక్షి, అనంతపురం: వైఎస్సార్సీపీ నేతలపై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి సోదరుడు రాజశేఖరరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండేళ్ల క్రితం జరిగిన ఓ యువకుడి ఆత్మహత్య కేసులో తోపుదుర్తి రాజాను పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ నేతల ఒత్తిడితో రైల్వే పీఎస్ నుంచి అనంతపురం రూరల్ పీఎస్కు కేసును బదిలీ చేశారు. తోపుదుర్తి రాజాపై 108 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.తోపుదుర్తి రాజాకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. మరికాసేపట్లో ఆయన్ని కోర్టుకు హాజరుపరచనున్నారు. ఇది ముమ్మాటికీ రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని రాప్తాడు వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. తోపుదుర్తి ప్రకాష్రెడ్డికి ఇటీవల గన్మెన్లను తొలగించిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా ఆయన సోదరుడు తోపుదుర్తి రాజశేఖరరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామానికి చెందిన మహేష్ రెడ్డి అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రెండేళ్ల క్రితం జరిగింది. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖరరెడ్డి ప్రోద్భలంతోనే మహేష్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడంటూ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. తోపుదుర్తి రాజాను ఇవాళ ఉదయం అరెస్ట్ చేశారు. -
రేపు పార్టీ ముఖ్యనేతలతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 27న పార్టీ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ రోజు ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. దీనికి పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, పార్లమెంట్ కో–ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కో–ఆర్డినేటర్లు, ఎమ్మెల్సీలు హాజరవుతారు.రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ వ్యూహరచన, ఎస్ఐఆర్, పార్టీ కమిటీల నిర్మాణం తదితర కీలక అంశాలపై సమావేశంలో చర్చిస్తారు. అలాగే, చంద్రబాబు ప్రభుత్వ రెండేళ్ల పాలనలోని వైఫల్యాలు, ప్రజా సమస్యలు, సమకాలీన రాజకీయ పరిణామాలపై పార్టీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేస్తారు. పార్టీ బలోపేతం, ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లే కార్యాచరణ, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టే అంశాలపై కూడా సమావేశంలో సమగ్ర చర్చ జరుగుతుంది. -
రంగా హత్యకు చంద్రబాబే సూత్రధారి
సాక్షి, అమరావతి: ‘చంద్రబాబు ప్రోద్బలంతోనే విజయవాడలో వంగవీటి మోహనరంగా దారుణ హత్య జరిగింది. రంగా హత్యకు చంద్రబాబు సూత్రధారి అయితే, నాటి హోంమంత్రి కోడెల శివప్రసాదరావు, ఎస్పీ వ్యాస్ పాత్రధారులు. రంగా హత్యలో చంద్రబాబు పాత్ర ఉందని గట్టిగా విశ్వసించబట్టే మంత్రి పదవితోపాటు టీడీపీకి రాజీనామా చేస్తున్నానని హరిరామ జోగయ్య అప్పుడే చెప్పారు. విజయవాడలో ఏ ఇంటి తలుపు కొట్టి అడిగినా వంగవీటి రంగాను చంద్రబాబే చంపించాడని చెబుతారు.’ అని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర స్పష్టంచేశారు.ఆయన సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే రంగా హత్య జరిగింది. ఈ కేసులో చంద్రబాబు పాత్ర బయటపడుతుందనే సీబీఐ విచారణకు నాటి టీడీపీ ప్రభుత్వం అంగీకరించలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీబీఐ విచారణ చేయాలని కోరింది. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు దర్యాప్తును ప్రభావితం చేసి ఆయన పేరు లేకుండా చేసుకున్నారు. రంగా హత్య జరిగినప్పుడు, కేసును కొట్టేసినప్పుడు టీడీపీనే అధికారంలో ఉంది.రంగా హత్య కేసు నిష్పక్షపాతంగా విచారణ చేసి ఉంటే ఇవాళ చంద్రబాబు జైలులో ఉండేవారు. అప్పట్లో దర్యాప్తును ప్రభావితం చేయడానికే వర్గ విభేదాల పేరుతో కట్టుకథలు అల్లారు. చంద్రబాబుతో ఉన్న విభేదాల కారణంగానే తనను ఈ కేసులో ఇరికించాడని దేవినేని నెహ్రూ పలు సందర్భాల్లో చెప్పారు. అదేవిధంగా కాపు కులానికి చెందిన జర్నలిస్టు పింగళి దశరథరామ్ దారుణ హత్య వెనుక కూడా చంద్రబాబు హస్తం ఉందని ప్రజలందరూ నమ్ముతున్నారు.’ అని వంగవీటి నరేంద్ర చెప్పారు. చంద్రబాబు దిగజారుడుతనానికి పరాకాష్ట‘రంగా హత్యకు కడప నుంచి బాంబులు తెచ్చారని చంద్రబాబు ఇప్పుడు విష ప్రచారం చేస్తున్నారు. అదే నిజమైతే ఇన్నాళ్లూ పోలీసులకు ఎందుకు చెప్పలేదు. సీబీఐ విచారణను ఎందుకు కోరలేదు. కాంగ్రెస్లో అత్యంత సన్నిహితంగా మెలిగిన వైఎస్ రాజశేఖరరెడ్డి, వంగవీటి రంగా మధ్య ఉన్న స్నేహాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం వికృతంగా చూపించడం చంద్రబాబు దిగజారుడుతనానికి పరాకాష్ట. 1985లో రంగాకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వొద్దని చాలా మంది అడ్డుకున్నారు. అయినా వైఎస్సార్ టికెట్ ఇవ్వాలని పట్టుబట్టి సాధించారు.అలాంటి సన్నిహితుల మధ్య కూడా వివాదాలు ఉన్నట్లు వారు చనిపోయిన తర్వాత కట్టుకథలు సృష్టించడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడుకుని దేవినేని నెహ్రూ ఆ పార్టీలో చేరితే వైఎస్సార్పై బురదచల్లడం సిగ్గుచేటు. వైఎస్ జగన్ అడిగి ప్రశ్నలకు చంద్రబాబు నేరుగా సమాధానం చెప్పలేక వైఎస్సార్ కుటుంబంపై దుష్ప్రచారం చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.’ అని వంగవీటి నరేంద్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. -
మెగా డీఎస్సీనా? దగా డీఎస్సీనా?
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు సర్కార్ నిర్వహించిన డీఎస్సీ–2025 పరీక్షలపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘‘ఇది మెగా డీఎస్సీనా? లేక ఉద్యోగార్థులను మోసం చేసిన దగా డీఎస్సీనా? అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత పూర్తిగా లోపించిందని ఆక్షేపించిన మాజీ సీఎం వైఎస్ జగన్, పేపర్ లీకులు, డేటా డిలీట్లు, మెరిట్ లిస్టుల మాయం వంటి ఘటనలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.తమ హయాంలో ఇచ్చిన డీఎస్సీని రద్దు చేసి, ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసి, కొత్త నోటిఫికేషన్ను ప్రచారానికి వాడుకున్నారని విమర్శించారు. నారా లోకేశ్ని మంత్రి పదవి నుంచి తప్పించి ... మెగా డీఎస్సీని స్కాంపై సీబీఐ దర్యాప్తు కోరాలన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా సోమవారం సీఎం చంద్రబాబు సర్కార్ తీరును ఎండగడుతూ వైఎస్ జగన్ పోస్టు చేశారు. చంద్రబాబూ.. మీరు నిర్వహించింది మెగా ⇒ డీఎస్సీనా? లేక ఉద్యోగార్థులను మోసం చేసిన దగా డీఎస్సీనా? పారదర్శకత ఎక్కడ ఉంది? పేపర్లు లీక్.. డేటా డిలీట్.. మెరిట్ లిస్టు మాయం.. దీనిపై మీ సమాధానం ఏమిటి? మా హయాంలో ఇచ్చిన డీఎస్సీని రద్దుచేసి, ఉద్దేశ పూర్వకంగా ఆలస్యంచేసి, కొత్తగా మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి, దాన్ని పబ్లిసిటీకి వాడుకుని, తీరా పరీక్షల్లో మీరు చేసిన నిర్వాకాలు, స్కాంలతో ఉద్యోగార్థులకు ద్రోహం చేయలేదా?. దీనికేమి సమాధానం చెబుతారు? మీ సుపుత్రుడి శాఖలో లీకులతో సాగిన ‘డార్క్ ఆపరేషన్’ను ఎందుకు దాచిపెడుతున్నారు?. పరీక్ష నిర్వహణలో చురుగ్గా పాల్గొన్న ఎస్సీఈఆర్టీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంకు ఎలా వచ్చింది? ఆ తర్వాత ఆ వివరాలను డేటాబేస్ నుంచి ఎందుకు డిలీట్ చేశారు? మెరిట్ లిస్టులను ఎందుకు దాచారు? టాపర్ వివరాలను ఎందుకు తొలగించారు? సెలెక్ట్ అయిన వారికి మాత్రమే నేరుగా మెసేజ్లు ఎందుకు పంపారు? కలెక్టర్ కార్యాలయాల్లో ఎంపికైన వారి జాబితాలు ఎందుకు పెట్టలేదు? ⇒ రూ.15 లక్షలకు ‘‘స్పోర్ట్స్ కోటా’’ పోస్టుల బేరసారాలా? మీ పార్టీకి చెందిన నాయకుడే ఈ డీల్స్ కుదిర్చిన మాట వాస్తవం కాదా? ఎప్పుడూ క్రీడా మైదానంలో అడుగు పెట్టని వాళ్లకి కూడా ఫేక్ సర్టీఫికెట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇంటికే పిలిచి డీల్స్ చేస్తారా? రిక్రూట్మెంటా? లేక వేలం పాటా? ప్రతిభ ఉన్న ఉద్యోగార్థుల మాటేమిటి? ⇒ టెట్ కన్వీనర్గా ఉన్న అధికారే డీఎస్సీ పరీక్షకూ కన్వీనర్ అయినప్పటికీ, ఉన్నపళంగా టెట్ కన్వీనర్ను తొలగించి విద్యా శాఖలోని జాయింట్ డైరెక్టర్ను డీఎస్సీ కన్వీనర్గా ఎందుకు పెట్టారు? దీనివెనుక మతలబు ఏమిటి? మెగా డీఎస్సీ.. మెగా లీక్.. మెగా అవినీతి.. దీనికి బాధ్యత వహిస్తూ లోకేష్ ను పదవి నుంచి తప్పించి వెంటనే సీబీఐ దర్యాప్తు కోరాలి. చంద్రబాబూ..! మీలో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రతిభ చూపిన అభ్యర్థులకు న్యాయం చేయాలి. -
డీఎస్సీ నియామకాల్లో ప్రభుత్వ బరితెగింపు
సాక్షి, అమరావతి/ఒంగోలు సిటీ/కోరుకొండ : డీఎస్సీ నియామకాల్లోను స్కామ్లకు పాల్పడిన ప్రభుత్వ బరితెగింపు అత్యంత దుర్మార్గమని మాజీమంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు పేర్ని నాని, మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సమాజానికి భావిపౌరుల్ని అందించాల్సిన విద్యా వ్యవస్థలో సైతం స్కాంలు చేసే దౌర్భాగ్య స్థితికి చంద్రబాబు ప్రభుత్వం దిగజారిపోయిందన్నారు. వీరు సోమవారం వేర్వేరు చోట్ల డీఎస్సీ అక్రమాలపై స్పందిస్తూ ఏమన్నారంటే.. ఇంతకన్నా బరితెగింపు ఏమైనా ఉంటుందా?.. డీఎస్సీలో కాంట్రాక్టు ఉద్యోగికి స్టేట్ఫస్ట్ ర్యాంకు ఎలా వచ్చింది? ఈ చోద్యం ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. మెరిట్ లిస్ట్ ప్రకటించమని హైకోర్టు చెప్పినా పట్టించుకోలేదు. ఇంతకన్నా బరితెగింపు ఏమైనా ఉంటుందా? కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన చంద్రబాబు, ఆయన కుమారుడికి మాత్రమే పైలా పచ్చిస్లా సాగింది. మమ్మల్ని గొడ్డలి పార్టీ అంటూ విమర్శలు చేస్తున్న టీడీపీ వాళ్లది తడిగుడ్డల పార్టీ. ఇప్పటంలో రోడ్డు విస్తరణ కోసం గోడ కూల్చివేత సమయంలో స్పందించిన పవన్కళ్యాణ్ కార్ టాప్పై ఎక్కి మరీ వచ్చారు.. ఇప్పుడు బందరులో కార్యకర్త ఇంటి కూల్చివేత విషయంలో ఎందుకు స్పందించడం లేదు? – పేర్ని నాని, మాజీమంత్రిడీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి.. చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలి. నిరుద్యోగులను చంద్రబాబు, లోకేశ్ దగా చేశారు. అది మెగా డీఎస్సీ కాదు. మెగా స్కామ్. డీఎస్సీ ప్రక్రియను ప్రభుత్వ పెద్దల గుప్పెట్లో ఎందుకు పెట్టుకున్నారు? జిల్లా సెలక్షన్ కమిటీలను ఎందుకు నిర్వీర్యం చేశారు? టెట్ నిబంధనలను ఎందుకు మార్చేశారు? ఒక్కో పోస్టుకు రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు తీసుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. – మేరుగు నాగార్జున, మాజీమంత్రిలోకేశ్ పూర్తిగా విఫలమయ్యారు.. చంద్రబాబు సర్కారు నిర్వహించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ నుంచి ప్రశ్నపత్రాల రూపకల్పన, పరీక్షల నిర్వహణ, ఎంపికల వరకు భారీ అవకతవకలు చోటుచేసుకున్నాయి. అది మెగా డీఎస్సీ కాదు.. పూర్తిగా మాయా డీఎస్సీ. విద్యాశాఖ మంత్రిగా లోకేశ్ పూర్తిగా విఫలమయ్యారు. విద్యాశాఖను ఆయన పూర్తిగా గాలికి వదిలేసి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారు. సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరినా ప్రభుత్వం చెప్పడంలేదు. లోకేశ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి. – ఆదిమూలపు సురేష్, మాజీమంత్రి సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారించాలి.. సీఎం చంద్రబాబు అవినీతికి కేరాఫ్ అడ్రస్గా నిలిచారు. విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఆధ్వర్యంలో అవినీతి అడ్డూ, అదుపులేకుండా సాగుతోంది. డీఎస్సీ నిర్వహించిన వ్యక్తే టాపర్గా నిలవడం, ముందుగా పేపర్ లీక్ అవడం భారీస్కామ్ జరిగిందనడానికి బలం చేకూరింది. టాపర్గా నిలిచిన వ్యక్తికి పోస్టు ఇవ్వకపోవడం.. అక్రమాల ఆనవాళ్లు లేకుండా ఆన్లైన్ డేటాను డిలీట్ చేయడం, మెరిట్లిస్టును ప్రకటించకుండా, ఎంపికైన అభ్యర్థులకు మెస్సేజ్లివ్వడం సిగ్గుచేటు. ఈ స్కామ్పై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. – జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు -
గుడ్డలతో గొంతులు కోసే.. తడి గుడ్డల పార్టీ !
-
బీటెక్ రవి.. నువ్వెంత.. నీ బతుకెంత?: అవినాష్ రెడ్డి హెచ్చరిక
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ముఖ్యమంత్రి చంద్రబాబుకు అసలు బుద్దుందా?.. ఎవరిది గొడ్డలి పార్టీ అని వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. వైఎస్ జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేస్తారా?. దస్తగిరిని నెత్తిన పెట్టుకుంది టీడీపీ కాదా?. బీటెక్ రవిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నువ్వెంత.. నీ బతుకెంత.. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.పులివెందులలో వైఎస్సార్సీపీ బూత్ లెవల్ కార్యకర్తల సమావేశం జరిగింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ఇతర కీలక నాయకులు హాజరయ్యారు. ఈ సందర్బంగా అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘అమరావతిలో చంద్రబాబు కట్టే బిల్డింగుల అద్దాలకు అయ్యే ఖర్చుతో రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలన్నిటినీ పూర్తి చేయవచ్చు. ఇలాంటి దోపిడీని ప్రశ్నిస్తే సమాధానం ఉండదు.. ఎదురుదాడికి దిగుతారు. గతంలో పన్నులు తగ్గిస్తే.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయన్నారు. ఇప్పుడు అధికారంలోకి రాగానే ఆ పని మాత్రం చేయడం లేదు. వీటన్నిటిపై వైఎస్ జగన్ ప్రశ్నిస్తే జవాబు లేదు.మీరు చేస్తున్న తప్పులను సరిచేసుకోండి అంటే వాళ్లు.. స్వర్గీయ రాజారెడ్డి గురించి మాట్లాడుతున్నారు. లేదంటే వైఎస్సార్ గురించి మాట్లాడతారు. గొడ్డలి పార్టీ అంటారు. అసలు చంద్రబాబుకు బుద్ధుందా?. తానే గొడ్డలితో కిరాతకంగా చంపానని దస్తగిరి చెప్తే.. అతన్ని నెత్తిన పెట్టుకుని మోస్తున్నది మీ పార్టీ కాదా?. ఏరకంగా మాది గొడ్డలి పార్టీ అవుతుంది.. గొడ్డలి పార్టీ మీది. గొడ్డలితో నరికి చంపిన వాడిని నెత్తిన పెట్టుకుని ఊరేగిస్తున్నది మీరు. మా ప్రశ్నలకి సమాధానం లేక.. చేతిలో అధికారం ఉందని నోటికొచ్చిన మాటలన్నీ మాట్లాడుతున్నారు. ఇక్కడ పులివెందులలో ఉన్న టీడీపీ నాయకులు కూడా మాట్లాడటం మొదలుపెట్టారు. వీళ్లు అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో పులివెందులకు కన్నం వేసి దోచేసుకుంటున్నారు.నోరు జాగ్రత్తగా పెట్టుకో..ఇక్కడి బైరెటిస్, ఇసుక మొత్తాన్ని అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోచుకుంటున్నారు. పులివెందులలో వీళ్లు ఏ ఒక్క సమస్యనైనా పట్టించుకుంటున్నారా?. పులివెందుల ప్రజలు పట్టరు కానీ.. కేవలం జగన్నను తిడితే మీకు రాజకీయంగా మనుగడ అని భ్రమల్లో బతుకుతున్నారు. మీ ప్రతి ఒక్క మాటకూ జవాబు తప్పకుండా చెప్తాం. నిన్న బీటెక్ రవి.. వాడు వీడు అనే లెవల్లో మాట్లాడాడు. నీ గురించి అలా మాట్లాడాలంటే మాకు ఎంత సేపు?. నువ్వెంత.. నీ బతుకెంత? ఇసుక, ముగ్గురాయికి కన్నం వేసి బతికేవాడివి నువ్వు. అలాంటి నువ్వు వైఎస్ జగన్ను నోటికొచ్చినట్లు మాట్లాడేవాడివా? నోరు జాగ్రత్తగా పెట్టుకో.బీజేపీలోకి వెళ్తానన్నది నిజం కాదా?మేం అధికారంలో ఉన్నప్పుడు నువ్వు విజయసాయిరెడ్డి ఇంటికి వచ్చావ్.. ఎందుకొచ్చావో ప్రజలకు చెప్పు. ఆయన ఎమ్మెల్సీ పదవి అమ్ముకోడానికి 12 కోట్లు ఇప్పించండని విజయసాయిరెడ్డి ఇంటికి వచ్చాడు. ఆనాడు జగన్ అలాంటి పనులు చేయనని తిరస్కరించారు. తన ఎమ్మెల్సీ పదవి అమ్మేస్తా.. మీరు ఒప్పుకుంటే వైఎస్సార్సీపీ కండువా కప్పుకుంటా అన్నది నువ్వు కాదా?. మా పార్టీలో చేర్చుకోకపోతే సీఎం రమేష్ను పట్టుకుని బీజేపీలోకి వెళ్తానన్నది నిజం కాదా?. ఇదీ బీటెక్ రవి బతుకు. ప్రజలు ఇచ్చిన పదవిని అమ్ముకునే దౌర్భాగ్యమైన బతుకు అతనిది. అలాంటి వ్యక్తి ఈరోజు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఇలాంటి వారందరికీ మనం అధికారంలోకి రాగానే మంచి సమాధానం చెబుదాం. కక్షలు, కార్పణ్యాలు కాకుండా.. మనం ప్రజలకు మంచి చేసి ఇలాంటి వారికి బుద్ధి చెబుదాం. -
ఇది పులివెందుల.. చావును వెతుక్కుంటూ రావొద్దు! ? YSRCP మాస్ వార్నింగ్
-
వేరు శనక్కాయల మూట నుంచి సీఎం కుర్చీ వరకూ..
సాక్షి, తిరుపతి: చంద్రబాబు గత చరిత్ర చాలా హీనాతిహీమని.. దానిని ప్రసారం చేసే దమ్ము ఎల్లో మీడియాకు ఉందా? అని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్రెడ్డి. చంద్రబాబు ఆదేశాలతో వైఎస్సార్ కుటుంబంపై టీడీపీ అనుకూల మీడియా చేస్తున్న దుష్ప్రచారంపై ఆయన సోమవారం తిరుపతిలో మాట్లాడుతూ మండిపడ్డారు. ‘‘వైఎస్ఆర్ మరణాన్ని తట్టుకోలేక 670 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆయన అంత్యక్రియలకు ఐదు లక్షల మందికి పైగా హాజరయ్యారు. వైఎస్సార్ అభిమానులు ఊరూరా విగ్రహాలు కూడా పెట్టుకున్నారు. అలాంటిది వైఎస్ఆర్ కుటుంబంపై ఎల్లో మీడియా ఇష్టమొచ్చినట్లు రాతలు రాస్తోంది. అదే పని చంద్రబాబు విషయంలో చేయగలదా? అని భూమన ప్రశ్నించారు. చదువుకునే రోజుల్లోనే చంద్రబాబు కపట నైజంతో ఉండేవారు. నాటకంలో పాత్ర కోసం వేరు శనక్కాయల మూట దొంగలించిన ఘనుడు చంద్రబాబు. మరి ఎల్లో మీడియాకు ఆ వేరు శనక్కాయల మూట గురించి మొదలు.. సీఎంగా ఎదిగే క్రమంలో ఆయన చేసిన పనులన్నీ ప్రసారం చేసే దమ్ముందా?. వైఎస్ఆర్ భిక్షతోనే చంద్రబాబు మంత్రి అయ్యాడని గుర్తిస్తే మంచిది’’ అని భూమన అన్నారు. -
మీ అందరికీ YSRCP తరపున ఇదొక గొప్ప అవకాశం
-
27న వైఎస్సార్సీపీ కీలక సమావేశం
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. ఎల్లుండి(బుధవారం) పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ వ్యూహరచన, ఎస్ఐఆర్ అంశం, పార్టీ కమిటీల నిర్మాణం తదితర అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ బలోపేతం, ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లే కార్యాచరణ, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టే అంశాలపై కూడా సమావేశంలో సమగ్ర చర్చ జరగనుంది.అలాగే, చంద్రబాబు ప్రభుత్వ రెండేళ్ల పాలనలో జరిగిన వైఫల్యాలు, ప్రజా సమస్యలపై వైఎస్ జగన్ చర్చించనున్నారు. ఈ సమావేశానికి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, పార్లమెంట్ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు.


