breaking news
YSRCP
-
ఇళ్ల కూల్చివేత వెనుక లోకేశ్
భవానీపురం (విజయవాడపశ్చిమ): విజయవాడ భవానీపురం జోజినగర్లో 42 ప్లాట్లలో ఇళ్ల కూల్చివేత వెనుక మంత్రి లోకేశ్ ఉన్నారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. చంద్రబాబు సర్కారుకు ఇళ్లు కూల్చివేయడమే తప్ప కట్టిన చరిత్ర లేదని విమర్శించారు. జోజినగర్లో ఇళ్ల కూల్చివేసిన ప్రాంతాన్ని శుక్రవారం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాశ్, మాజీమంత్రి, పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నగర మేయర్, పార్టీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు రాయన భాగ్యలక్ష్మి పరిశీలించారు. బాధితుల్ని పరామర్శించారు. బాధితులు నేతల వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమను కోలుకోలేని విధంగా దెబ్బతీశారని కన్నీటిపర్యంతమయ్యారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ సుమారు 2.17 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారంటే దానివెనుక కచ్చితంగా ప్రభు త్వ పెద్దల అండ, వెన్నుదన్ను ఉండే ఉంటాయని పేర్కొన్నారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే సహకారంతో 200 మంది పోలీసులు రౌడీల్లా వచ్చి ఇళ్లల్లోవారిని బయటకు లాక్కొచ్చి కూల్చేశారని చెప్పారు. -
మా గూడును కూల్చారు
సాక్షి ప్రతినిధి, విజయవాడ/గన్నవరం: ‘‘ఎన్నో ఏళ్లపాటు పైసాపైసా కూడబెట్టి కట్టుకున్న గూడును నేలమట్టం చేసి రోడ్డు పాల్జేశారు. బాబు సర్కారు వచ్చాక మాపై దౌర్జన్యాలు విపరీతంగా పెరిగాయి. ఈ ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరించింది. ఇళ్లలోని సామగ్రి మొత్తం నష్టపోయి మూడు రోజులుగా భార్యాబిడ్డలతో టెంట్ల కింద ఉంటున్నాం. ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని మాట సాయం చేసిన పాపాన పోలేదు. మాకు మీరే న్యాయం చేయాలి. మా జీవితాలను నిలబెట్టాలి’’ అని వైస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ను విజయవాడ భవానీపురం జోజినగర్లో ఇళ్లు కూల్చివేతకు గురైన బాధితులు వేడుకున్నారు. శుక్రవారం ఉదయం 42 ప్లాట్ల యజమానులు ఆయనను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకొని వినతిపత్రం అందజేశారు.ప్రభుత్వం నుంచి తాము ఎదుర్కొన్న వేధింపులను వివరించి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా వారికి అండగా ఉంటానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు... ‘‘మేం 23 ఏళ్ల క్రితం భవానీపురం జోజినగర్ వద్ద అబ్దుల్ మజీద్ నుంచి స్థలాలు కొనుగోలు చేశాం. ప్రభుత్వానికి ఫీజులు చెల్లించి ఇళ్లు నిర్మించుకున్నాం. బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నాం. కానీ, మా స్థలాలు శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీకి చెందినవని, కోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నాయని, ఖాళీ చేయాలని, లేదంటే కూల్చివేస్తామని నోటీసులిచ్చారు. మమ్మల్ని కిరాయి గూండాలతో వచ్చి అనేకసార్లు బెదిరించారు. పోలీసులను కలిశాం. చాలామంది నాయకులకు చెప్పినా న్యాయం జరగలేదు. కోర్టు ఉత్తర్వులున్నా వినలేదు... మా విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలకు ఉపక్రమించవద్దని గత నెల 3న సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, ఈ నెల 3వ తేదీన బుధవారం 300 మందిపైగా పోలీసులు, శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ వారు ఆరు జేసీబీలతో వచ్చి మా ఇళ్లను కూల్చివేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు వస్తాయని, కాళ్లావేళ్ల్ల ప్రాథేయపడి నాలుగు గంటల సమయం కోరినా కనీసం మానవత్వం చూపలేదు. వందలాది పోలీసులతో వచ్చి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. ఇంట్లో సామాన్లను కూడా బయటికి తెచ్చుకోనివ్వలేదు.పిల్లలకు పాలు, మంచినీళ్లు అందించే అవకాశం ఇవ్వకుండా మా ఇళ్లను మా కళ్లముందే కూల్చివేశారు. చర్చిని అయినా కూల్చొద్దని ప్రాథేయపడ్డాం. కానీ, మాకెవరు అడ్డు వస్తారో చూస్తామంటూపడగొట్టారు. డిసెంబరు 31 వరకు 42 ప్లాట్లపై చర్యలు తీసుకోవద్దని, తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు పూర్తి రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులను చూపాక పోలీసులు వెళ్లిపోయారు. అప్పటికే అంతా అయిపోయింది’’ అని వాపోయారు. ప్లాట్ల యజమానులు వైఎస్ జగన్ను కలిసిన సమయంలో వైఎస్సార్సీపీ నేతలు తలశిల రఘురాం, దేవినేని అవినాష్, వెలంపల్లి, భాగ్యలక్షి్మ, పోతిన మహేష్ తదితరులు ఉన్నారు. -
కొనసాగుతున్న కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలు
విజయవాడ: వైఎస్సార్సీపీ శ్రేణులపై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. రెండు నెలల క్రితం జరిగిన ఘటనపై తాజాగా కేసులు నమోదు కావడం కూటమి సర్కార్ వేధింపులు కొనసాగింపునకు మరొక ఉదాహరణ. అక్టోబర్ 7వ తేదీన ఇబ్రహీంపట్నంలో జనార్థన్రావుకు చెందిన గోడౌన్లో నకిలీ మద్యం డంప్ను ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. ఈ ఘటన తర్వాత వైఎస్సార్సీపీ కార్యకర్తలతో కలిసి డంప్ను పరిశీలించారు జోగి రమేష్. దీనిపై ఇప్పుడు కేసు నమోదు చేశారు పోలీసులు. ఆ రోజు తమ విధులకు ఆటంకం కలిగించారంటూ ఇప్పుడు అక్రమ కేసులు నమోదుఉ చేశారు పోలీసులు. విచారణకు రావాలని 20 మంది వైఎస్సార్సీపీ నేతలకు నోటీసులిచ్చారు. దీనిపై వైఎస్సార్సీపీ మండిపడింది. ఎప్పుడో రెండు నెలల క్రితం జరిగిన ఘటనపై ఇప్పుడు కేసులు నమోద చేయడం కక్ష సాధింపు చర్య కాకపోతే ఏంటని ప్రశ్నించింది. -
కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన: సజ్జల
తాడేపల్లి : ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన వస్తుందన్నారు పార్టీ స్టేట్ కో -ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగిందని, అందుకే కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతంగా సాగుతుందన్నారు. ఈరోజు(శుక్రవారం, డిసెంబర్ 5వ తేదీ) కోటి సంతకాల సేకరణ సమీక్షలో భాగంగా వైఎస్సార్సీపీ ముఖ్య నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి జూమ్ మీటింగ్లో పాల్గొన్నారు. ఇందులో పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు జూమ్ మీటింగ్కు హాజరయ్యారు. ఈ మేరకు సజ్జల మాట్లాడుతూ.. ‘ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగిందికోటి సంతకాల సేకరణకు అనూహ్యమైన స్పందన వస్తోంది. అన్ని వర్గాల ప్రజలూ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తున్నారు. వారం క్రితమే కోటికి పైగా సంతకాలు అయ్యాయి. ఇప్పుడు ఇంకా వస్తూనే ఉన్నాయి. వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాలు మరింత క్రియాశీలకంగా పనిచేయాలి. పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు నాయకులతో అవసరమైన సమన్వయం చేసుకోవాలి’ అని స్పష్టం చేశారు. గురువారం(డిసెంబర్ 4వ తేదీ) వైఎస్సార్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షులతో ఆయన జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. -
‘అమరావతి.. అంతులేని కథ.. పోలవరం.. ముగింపు లేని కథ’
సాక్షి, తాడేపల్లి: పోలవరాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశారని.. దాన్ని బ్యారేజికే పరిమితం చేశారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 41 మీటర్లకే పూర్తి చేస్తుంటే కూటమి నేతలు ఏం చేస్తున్నారు? అంటూ నిలదీశారు. ఇప్పుడు చంద్రబాబు, వారి కేంద్ర మంత్రులు గుడ్డి గుర్రాలకి పళ్లు తోముతున్నారా? అని మండిపడ్డారు.‘‘అమరావతిది అంతులేని కథ.. పోలవరంది ముగింపు లేని కథగా మార్చారు. పోలవరాన్ని చంద్రబాబు ఏటిఎంలాగా వాడుకుంటున్నారు. రాష్ట్ర విభజన చట్టంలో కేంద్రమే పోలవరాన్ని పూర్తి చేయాలని ఉంది. కానీ డబ్బులు కొట్టేయటానికి ఆ ప్రాజెక్టును ఏపీకి బదలాయించుకున్నారు. కాఫర్ డ్యాం కట్టకుండా డయాఫ్రం వాల్ కట్టారు. అది కొట్టుకు పోవటంతో వెయ్యి కోట్ల నష్టం జరిగింది. స్పిల్ వే నిర్మిస్తే డబ్బులు రావని దాన్ని వదిలేశారు. జగన్ హయాంలోనే స్పిల్ వే, కాఫర్ డ్యాంల నిర్మాణాలు పూర్తి చేశారు. 2013-14 రేట్ల ప్రకారం పోలవరం కడతానని చంద్రబాబు చెప్పారు. కానీ అది పూర్తి కాదని జగన్ కేంద్రంతో మాట్లాడి 2017-18 ధరల ప్రకారం నిర్మాణానికి అంగీకరించేలా చేశారు...తొలిదశ నిర్మాణానికి రూ.12,157 కోట్లు ఎన్నికలకు ముందే రిలీజ్ కావాల్సి ఉంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు కుట్ర పన్ని అప్పుడు ఆ నిధులు రాకుండా చేశారు. మొదటి దశకే 41.5 కు మాత్రమే పోలవరాన్ని పరిమితం చేశారు. రెండోదశ అయిన 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మాణం జరగటం లేదు. అది పూర్తయితేనే ఉత్తరాంధ్రకు నీరు వెళ్తుంది. పోలవరాన్ని ఇప్పుడు బ్యారేజీకే పరిమితం చేశారు. ప్రాజెక్టును నట్టేట ముంచారు...వైఎస్ జగన్ కొన్ని వేల స్కూళ్లను నాడు-నేడు కింద బాగు చేశారు. జగన్ ఇచ్చిన బెంచీల మీద కూర్చుని చంద్రబాబు జగన్ని విమర్శించారు. సినిమా సెట్టింగ్ మాదిరి సెట్ చేసినా, అందులో పెట్టినవన్నీ జగన్ ఇచ్చిన బెంచీలు, కుర్చీలే. లోకేష్ విద్యా శాఖామంత్రిగా ఏ పనీ చేయలేదు. హోంమంత్రి అనిత చౌకబారు విమర్శలు మానుకోవాలి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ వారాంతంలో ఎక్కడ ఉంటున్నారు?. అసలు వీరికి హెడ్ క్వార్టర్ ఏది?..చంద్రబాబు ఇప్పటికీ అమరావతిలో ఎందుకు ఇల్లు కట్టుకోలేదు?. హైదరాబాద్లోని ఇంట్లోకి పవన్కి తప్ప మరెవరికీ ప్రవేశం లేదు. ధాన్యం కొనుగోలు చేయటం చేతగాని మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా జగన్ని విమర్శిస్తున్నాడు. రేషన్ బియ్యంలో కమీషన్లు దండు కుంటున్నారు. షిప్ని సీజ్ చేశారా? రేషన్ మాఫియాని అరికట్టారా?. ఆస్పత్రులలో సరైన వైద్యం అందించలేని మంత్రి సత్య కుమార్ కూడా జగన్ని విమర్శించటం సిగ్గుచేటు. లోకేష్.. చంద్రబాబు ప్లేటు తీశారు. రేపు కుర్చీ కూడా తీసేస్తారు. దైవాన్ని అడ్డం పెట్టుకుని దుర్మార్గపు నాటకాలు ఆడుతున్నారు. రాజకీయ కక్షల కోసం నీచమైన రాజకీయాలు చేస్తున్నారు. అధికారం కోల్పోయాక ఏం అవుతారో ఆలోచించుకోవాలి’’ అంటూ అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. -
ఏది విధ్వంసం చంద్రబాబూ?: సీదిరి
సాక్షి, శ్రీకాకుళం: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దుర్మార్గమని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. ప్రైవేటీకరణ ఆపాలని కొన్ని రోజులుగా ఉద్యమం చేస్తున్నామన్నారు. ప్రజాసంపదను దోచుకుంటున్నారంటూ చంద్రబాబు సర్కార్ను ఆయన నిలదీశారు. 16 నెలల కాలంలోనే 2 లక్షల 50 వేల కోట్లకు పైగా అప్పులు చేశారు. ఇలాంటి పరిపాలన దేశంలో మరెక్కడా ఉండదు’’ అని అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘ఐదేళ్లలో 3 లక్షల 30 వేల కోట్లు అప్పు చేయడం విధ్వంసమా?. 16 నెలల కాలంలో 2 లక్షల 50 వేల కోట్లకు పైగా అప్పు చేయడం విధ్వంసమా?. ఏది విధ్వంసం చంద్రబాబు..?. నాడు-నేడు కింద స్కూళ్ల రూపురేఖలు మార్చడం విధ్వంసమా?. నాడు బాబు పాలనలో శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్లు విధ్వంసమా?’’ అంటూ అప్పలరాజు దుయ్యబట్టారు. -
విజయవాడ భవానీపురం నిర్వాసితులకు YSRCP అండ
-
చంద్రబాబు ప్రభుత్వానికి సీఐడీ అధికారులు తలొగ్గారు: భూమన
తిరుపతి: పరకామణి వ్యవహారంలో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు భిన్నంగా సీఐడీ విచారణ జరిగిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. న్యాయస్థానాల మీద, న్యాయమూర్తుల మీద నాకు గౌరవం ఉందన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు, మంత్రులు తప్పుడు ప్రచారం చేశారు. బీఆర్ నాయుడు, పట్టాభి, వర్ల రామయ్య అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారు’’ అని ఆయన మండిపడ్డారు.‘‘మీ దగ్గర ఆధారాలు ఉంటే మిమ్మల్ని విచారణకు ఎందుకు పిలవలేదు?. టీటీడీ బోర్డులో సభ్యులుగా ఉన్నవారిని ఎందుకు విచారించలేదు?. చంద్రబాబును సంతృప్తి పరచడం కోసం కేవలం నన్ను మాత్రమే విచారణకు పిలిచారు. ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి మేరకు మాత్రమే సీఐడీ అధికారులు విచారిస్తున్నారు...చంద్రబాబు ప్రభుత్వానికి సీఐడీ అధికారులు తలొగ్గారు. మమ్మల్ని నిందితులుగా నిరూపించడం కోసం ప్రయత్నిస్తున్నారు. విచారణ మొత్తం రికార్డ్ చేసి మా దగ్గర సంతకాలు తీసుకోలేదు. మా దగ్గర సంతకాలు ఎందుకు తీసుకోలేదు. చంద్రబాబుకు న్యాయస్థానాల మీద గౌరవం లేదు’’ అని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ప్రాణం పోతే మళ్ళి రాదు.. రైతులు చావొద్దు..
-
పల్నాడు ఘోర ప్రమాదంపై వైఎస్ జగన్ విచారం
సాక్షి, తాడేపల్లి: పల్నాడు ఘోర రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో విద్యార్థులు మరణించడం బాధాకరమన్న ఆయన.. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.నాదెండ్ల మండలం గణపవరం వద్ద బైపాస్ రహదారిపై గురువారం రాత్రి ఓ కారు కంటెయినర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో అయ్యప్ప మాలధారణలో ఉన్న ఐదుగురు బీటెక్ విద్యార్ధులు మృతి చెందారు. ఈ ఘటనపై వైఎస్ జగన్ స్పందిస్తూ.. ఎంతో ఉన్నత భవిష్యత్ ఉన్న విద్యార్ధులు ఇలా ప్రమాదంలో మరణించడం తీవ్రంగా కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. -
జీజీహెచ్ వద్ద ఉద్రిక్తత.. శైలజానాథ్ను అడ్డుకున్న పోలీసులు
సాక్షి, అనంతపురం: అనంతపురం జీజీహెచ్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అరటి రైతు నాగలింగం (40) ఆత్మహత్య నేపథ్యంలో ఆసుపత్రికి వెళ్లిన మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నాయకులు సాకే శైలజానాథ్ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్బంగా రైతు కుటుంబాన్ని ప్రరామర్శిస్తే తప్పేంటని శైలజానాథ్ ప్రశ్నించారు.వివరాల ప్రకారం.. శింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామంలో అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య రైతు నాగలింగం (40) ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 10 గంటలకు రైతు మృతదేహాన్ని పరిశీలించేందుకు జీజీహెచ్ వచ్చేందుకు మాజీ మంత్రి శైలజానాథ్ సిద్ధమయ్యారు. శైలజానాథ్ వస్తున్న కారణంగా ఉదయం 8 గంటలకే రైతు నాగలింగం మృతదేహాన్ని పోలీసులు తరలించారు.ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి శైలజానాథ్ తక్షణమే జీజీహెచ్కు వెళ్లారు. ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు.. జీజీహెచ్ బయటే శైలజానాథ్ను అడ్డుకున్నారు. దీంతో.. పోలీసులు, శైలజానాథ్ మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. రైతు కుటుంబాన్ని వైఎస్సార్సీపీ నేతలు పరామర్శిస్తే తప్పేంటి? అని పోలీసులను ఆయన నిలదీశారు. ఇంత హడావుడిగా నాగలింగం మృతదేహానికి పోస్టుమార్టం చేసి.. తరలించాల్సిన అవసరం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, ఇదే సమయంలో జీజీహెచ్కు వచ్చిన శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణితో ైశైలజానాథ్ మాట్లాడారు. నాగలింగం కుటుంబాన్ని ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆమెకు సూచించారు. అనంతరం, శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు సర్కార్ నిర్వాకం వల్లే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అరటి రైతు నాగలింగం ఆత్మహత్య బాధాకరం. రైతు నాగలింగం మృతదేహానికి తెల్లవారుజామునే పోస్ట్ మార్టం నిర్వహించటం ఏంటి?. రైతులను వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించకూడదా?. చంద్రబాబు ప్రభుత్వ తీరు అమానవీయం’ అంటూ మండిపడ్డారు. -
వైఎస్ జగన్ ప్రశ్నలకు కూటమి నేతల్లో వణుకు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నలకు కూటమి నేతల్లో వణుకు మొదలైంది. వైఎస్ జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రులు నీళ్లు నమిలారు. వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించిన అనేక ప్రశ్నలకు ప్రభుత్వ పెద్దలు, మంత్రులు నోరు తెరవకపోవడం గమనార్హం.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్బంగా వైఎస్ జగన్.. కూటమి సర్కార్కు పలు ప్రశ్నలు సంధించారు. సూపర్ సిక్స్ అమలు చేశామంటున్న ప్రభుత్వ పెద్దలను సూటిగా ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు చొప్పున ఇచ్చారా?. ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు రూ.1500 చొప్పున ఇచ్చారా?. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చారా? అని అడిగారు.అలాగే, తిరుమల లడ్డూపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలను సైతం వైఎస్ జగన్ ప్రశ్నించారు. 2024 జులైలో కల్తీ కారణంతో వెనక్కు పంపిన నాలుగు నెయ్యి ట్యాంకర్లను ఆగస్టులో ఎలా అనుమతి ఇచ్చారు?. కల్తీ నెయ్యితో లడ్డూలు చేసి ఉంటే మరి టీటీడీ ఛైర్మన్, ఈవోలపై ఎందుకు కేసు పెట్టలేదు? అని అడిగారు. వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించిన ఇలాంటి అనేక ప్రశ్నలకు ప్రభుత్వ పెద్దలు, మంత్రులు ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం చెప్పలేదు. అసలు నోరే తెరవలేక పోవడం గమనార్హం. -
వల్లభనేని వంశీ ఎమోషనల్ వీడియో
-
నువ్వు నీ డిప్ప కటింగ్.. ఒకసారి మొఖం అద్దంలో చూసుకో
-
సందట్లో సడేమియా!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు దుర్మార్గపు పాలన సాగిస్తూ మరో వైపు తనపై అవినీతి కేసులను సందట్లో సడేమియా మాదిరిగా ఎత్తేసుకునే కుట్ర చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దుయ్యబట్టారు. న్యాయస్థానాలు ఇచ్చిన బెయిల్ షరతులను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి కేసుల్లో బెయిల్పై బయట ఉన్న చంద్రబాబు ‘తానే దొంగ.. తానే పోలీస్.. తానే పబ్లిక్ ప్రాసిక్యూటర్..’ అన్నట్లు వ్యవహరిస్తూ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి.. తనపై కేసులను తన ప్రభుత్వం ద్వారా విత్ డ్రా చేసుకుంటూ బరితెగిస్తున్నారని మండిపడ్డారు.గురువారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబు 2014–19 మధ్య ఆషామాషీ స్కాములు చేయలేదు. ఒక్క స్కిల్ స్కామ్లోనే వందల కోట్లు బొక్కేశారు. స్వయంగా ఆ ఫైళ్లపై చంద్రబాబు సంతకాలు చేసి డొల్ల కంపెనీలకు రూ.370 కోట్లు దోచిపెట్టారు. అక్కడేమో సీమెన్స్ ఎండీ ఆ డబ్బులు నాకు రాలేదు, నా కంపెనీయే కాదని స్టేట్మెంట్ ఇచ్చారు.డొల్ల కంపెనీలకు చంద్రబాబు స్వయంగా సంతకాలు పెట్టి ఫైల్ మూవ్ చేసి రూ.370 కోట్లు ఇచ్చిన కేసులో కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ అయిన ఈడీ.. డొల్ల కంపెనీలు పెట్టిన వాళ్లను, డబ్బులు తీసుకున్నోళ్లను అరెస్టు చేసింది. కానీ, డబ్బులు ఇచ్చినోడిని అరెస్టు చేయలేదు. డబ్బు మాత్రం పోయింది. డబ్బు ఇచ్చినోడిని అరెస్టు చేయకుండా ప్రొటెస్ట్ చేస్తుండటం ఏంటని ఏసీబీ కోర్టు ఆయన్ను జైలుకు పంపింది’ అని అన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. అతిపెద్ద అసైన్డ్ ల్యాండ్ స్కామ్చంద్రబాబు, ఆయన బినామీలు అసైన్డ్ భూములు కొనడం ఒక స్కాం అయితే.. ఆ తర్వాత వాటిని రెగ్యులరైజ్ చేసుకోవడం మరో పెద్ద స్కాం. అదే స్థాయిలో రింగు రోడ్డు అలైన్మెంట్ స్కాం చేశారు. కరెక్టుగా చంద్రబాబు హెరిటేజ్ భూముల దగ్గరకు వచ్చే సరికే రింగ్ రోడ్డు పక్కకు వెళ్లిపోతుంది. మరో వైపు ఉచితం పేరుతో రూ.కోట్ల విలువైన ఇసుకను దోచేస్తున్నారు. మా హయాంలో ఏడాదికి రూ.750 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.3,750 కోట్లు ఇసుక ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. బ్లాక్ లిస్టులోని కంపెనీకి కాంట్రాక్టులు!ఫైబర్ నెట్లో అర్హత లేని, బ్లాక్ లిస్టులో ఉన్న తన అనుచరుడి కంపెనీకి కాంట్రాక్టు కట్టబెట్టి రూ.వందల కోట్లు అప్పనంగా మింగేశారు. లిక్కర్లో ఎమ్మార్పీ కన్నా అధిక రేట్లకు అమ్మి తన బెల్ట్ షాపుల ద్వారా, పర్మిట్ రూముల ద్వారా, తన మాఫియా సామ్రాజ్యం ద్వారా దోచేశారు. కేబినెట్ ఆమోదం లేకుండా ప్రివిలేజ్ ఫీజును రద్దు చేసి, దాని మీద చంద్రబాబు స్వయంగా సంతకాలు పెట్టి వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కాంకు తెర తీశారు. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో లిక్కర్ స్కామ్ చేస్తున్నారు. డిస్టిలరీలకు ఆర్డర్లు ఇచ్చేది ప్రైవేట్ షాపులు. అలాంటి ప్రైవేట్ షాపులన్నీ చంద్రబాబు వ్యక్తులవి కాదా? ప్రతి ఐదు బాటిళ్లకు ఒక బాటిల్ కల్తీ మద్యం అమ్మేస్తున్నారు. చట్టం.. చంద్రబాబు చుట్టం!ప్రజాధనాన్ని బొక్కేసిన ఈ గజదొంగను చట్టం ముందు నిలబెట్టి శిక్షించడానికి కావాల్సిన అన్ని ఆధారాలు, సాక్ష్యాలు ఉన్నా కూడా చంద్రబాబు తన అధికార బలంతో కేసులు విత్డ్రా చేసుకునే కుట్రలకు తెగబడ్డారు. ఫిర్యాదుదారులైన అధికారుల్ని భయపెట్టి, బెదిరించి స్టేట్మెంట్లు విత్ డ్రా చేయించి, వాటిని కోర్టు ముందు పెట్టి, ఈ కేసులో ఏమీ లేదంటూ వ్యవస్థల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. రెఫర్ చార్జ్ షీట్ వేయించి మూసేయిస్తున్నారు.గతంలో కూడా సేమ్ మోడస్ ఆపరెండీకి పాల్పడ్డారు. ఏలేరు స్కామ్ తీసుకున్నా అంతే. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి ఆ పార్టీ బ్యాంకు అకౌంట్లను, ఆ పార్టీ గుర్తును లాక్కోవడం దగ్గర నుంచి మొన్నటి తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు ఇస్తూ ఆడియో టేపులు, వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయిన కేసులో.. ఇవాళ్టి కేసు వరకు చట్టం ఒక వైపు, వ్యవస్థలు మరో వైపు.. చంద్రబాబుకు చుట్టాలుగా మారి దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజల దృష్టి మళ్లించడానికే వైఎస్సార్సీపీ నేతలను అక్రమ కేసులతో వేధిస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న ఈ అన్యాయాలను వేలెత్తి చూపిస్తూ.. సాక్ష్యాలు, ఆధారాలతో ఎప్పటికప్పుడు ప్రజల ముందు పెడతాం. వాస్తవాలు ప్రజా క్షేత్రంలోకి తీసుకెళ్తాం. -
ఉద్యోగులను ముంచేశారు
‘‘ఉద్యోగుల సమస్యలు చూస్తే.. ఈ డిసెంబర్ పూర్తై జనవరి వస్తే ఐదు డీఏలు ఇవ్వాల్సి ఉండగా కేవలం ఒక్కటి మాత్రమే ఇచ్చారు. అది కూడా వాయిదాల్లో ఇస్తామంటున్నారు. మెరుగైన పీఆర్సీ ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఉన్న పీఆర్సీ చైర్మన్నే తీసేశారు. ఇప్పటివరకూ కొత్త చైర్మన్ను నియమించలేదు. ఉద్యోగులకు పెరిగిన జీతాలు వెంటనే ఇవ్వాల్సి వస్తుందనే దుర్బుద్ధితోనే పీఆర్సీ ఛైర్మన్ను నియమించలేదు. ఐఆర్ ఊసే లేదు’’ - వైఎస్ జగన్సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులను సీఎం చంద్రబాబు నిండా ముంచేశారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో చంద్రబాబు కుప్పలు తెప్పలుగా ఇచ్చిన హామీలు.. వాటిని అమలు చేయకుండా మోసం చేస్తున్న తీరును ఎండగడుతూ సర్కార్ తీరును కడిగిపారేశారు. గురువారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ఐదింటికి ఒకే డీఏ.. ఉద్యోగుల సమస్యలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూస్తే... ఈ డిసెంబర్ పూర్తయి జనవరి వస్తే ఐదు డీఏలు ఇవ్వాల్సి ఉండగా కేవలం ఒక్కటి మాత్రమే ఇచ్చారు. అది కూడా వాయిదాల్లో ఇస్తామంటున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే.. డీఏ అరియర్స్ను రిటైర్ అయిన తర్వాత ఇస్తామని చెప్పిన ప్రభుత్వాన్ని బహుశా చరిత్రలో ఎప్పుడూ చూసి ఉండం... ఒక్క చంద్రబాబు ప్రభుత్వంలో మినహా! దానికి తగ్గట్టుగా జీవో 60 జారీ చేశారు. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇంత దౌర్బాగ్యమైన జీవోను తీసుకొని వచ్చి ఉండరు (జీవో నంబర్ 60ని ప్రదర్శించారు). దీనిపై ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో దాన్ని ఉపసంహరించుకుని, వాయిదాల్లో ఇస్తామన్నారు. ఐఆర్ లేదు.. మెరుగైన పీఆర్సీ బూటకం మెరుగైన పీఆర్సీ ఇస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక ఉన్న పీఆర్సీ చైర్మన్నే తీసేశారు. ఆ స్థానంలో ఇప్పటివరకూ కొత్త చైర్మన్ను నియమించలేదు. చైర్మన్ను నియమిస్తే పీఆర్సీ రిపోర్టు ఇవ్వాలి. రిపోర్టు వస్తే దాన్ని వెంటనే అమలు చేయాలి. అమలు చేస్తే.. ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయి. దీంతో ఉద్యోగులకు పెరిగిన జీతాలు వెంటనే ఇవ్వాల్సి వస్తుందనే దుర్బుద్ధితోనే పీఆర్సీ చైర్మన్ను ఇప్పటివరకూ నియమించలేదు. అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామని చంద్రబాబు చెప్పారు. కానీ.. ఇప్పటివరకు ఐఆర్ ఊసే లేదు. నాడు మేం అధికారంలోకి రాగానే 27 శాతం ఐఆర్ ఇచ్చాం.దాంతో ఉద్యోగుల జీతాలు పెరిగాయి. ఆశ్చర్యం ఏమిటంటే.. మా ప్రభుత్వం ఇచ్చిన జీపీఎస్(గ్యారంటీడ్ పెన్షన్ స్కీం)ను కూడా చెల్లుబాటు కాకుండా చేసి ఉద్యోగులను చంద్రబాబు త్రిశంకు స్వర్గంలోకి నెట్టాడు. మేం తెచ్చిన జీపీఎస్ను దేశమంతా కాపీ కొడుతున్నారు. కనీసం అదైనా అమలు చేసి ఉంటే రిటైర్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ వచ్చేవి. పీఆర్సీ బకాయిలు, పెండింగ్ డీఏలు, జీపీఎఫ్లు, ఏపీజీఎల్ఐలు, మెడికల్ రీయింబర్స్మెంట్, సరెండర్ లీవ్స్ రూపంలో ఉద్యోగులకు చంద్రబాబు ఏకంగా రూ.31 వేల కోట్లు బకాయి పడ్డారు.ఆప్కాస్(ఏపీసీఓఎస్)లో ప్రతి నెలా 1వ తేదీనే జీతాలిచ్చేలా మా ప్రభుత్వంలో చర్యలు తీసుకున్నాం. కానీ ఇప్పుడు రెండు మూడు నెలలకోసారి ఇస్తున్నారు. నేను పులివెందులకు వెళ్తే మా వాళ్లు వచ్చి వినతిపత్రం ఇచ్చారు. మీరున్నప్పుడు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు వచ్చేవి.. ఇప్పుడు ఒకటో తేదీన జీతం కథ దేవుడెరుగు.. రెండు మూడు నెలలకు ఒకసారి ఇస్తున్నారు సార్..! అని చెబుతున్నారు. గెస్ట్ లెక్చరర్లకైతే ఎనిమిది నెలలుగా జీతాలే లేవు. ఈ ప్రభుత్వంలోఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నారు. దేవాలయాల్లో శానిటేషన్ పనులు కూడా కాంట్రాక్టర్లకే కట్టబెట్టేస్తున్నారు. భాస్కరనాయుడు లాంటి చంద్రబాబు బంధువులు, సన్నిహితులకే కాంట్రాక్టులు ఇస్తున్నారు. -
తుది ఘట్టానికి కోటి సంతకాల ఉద్యమం: సజ్జల రామకృష్ణారెడ్డి
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజా ఉద్యమ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అనూహ్య స్పందన వచ్చిందని వైఎస్సార్సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. గురువారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షులతో ఆయన జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమం తుది ఘట్టంపై అందరితో మాట్లాడుతున్నారని చెప్పారు.ఈ నెల 10న అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వచ్చే కోటి సంతకాలను జిల్లా కేంద్రాలలో ఉంచి, అక్కడి నుంచి 13న ఒకేసారి అన్ని నియోజకవర్గాల సంతకాలు పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపాలని చెప్పారు. ఆ రోజు జిల్లా కేంద్రంలో వేలాది మందితో ర్యాలీగా నిర్వహించి, నాయకుల ప్రసంగాల అనంతరం కోటి సంతకాల వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించాలని చెప్పారు. అప్పటి వరకు ఈ కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.ఇందుకోసం జిల్లా అధ్యక్షులు సమావేశం నిర్వహించుకోవడంతోపాటు అనుబంధ విభాగాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ నెల 16వ తేదీ సాయంత్రం 4 గంటలకు పార్టీ అధినేత వైఎస్ జగన్, ముఖ్య నాయకులు గవర్నర్ను కలిసి కోటి సంతకాలు అందజేస్తారని తెలిపారు. -
వెర్రితలలు వేస్తోన్న రెడ్బుక్ రాజ్యాంగం
తనపై ఉన్న లిక్కర్ కేసును నీరుగార్చేందుకు, కొట్టేయించేందుకు... వైఎస్సార్సీపీ పాలనలో తెచ్చిన మద్యం పాలసీని తప్పుగా చూపిస్తూ లేని లిక్కర్ స్కామ్ను చంద్రబాబు సృష్టించారు. ఇక రాష్ట్రంలో కుటీర పరిశ్రమల్లా కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీలు పెట్టింది టీడీపీ వాళ్లే. వీళ్లదే పోలీస్ వ్యవస్థ, వీళ్లవే బెల్టు షాపులు, వీళ్లవే పర్మిట్ రూమ్లు. రెడ్బుక్ పాలనలో వీళ్లుగాక ఇంకెవరికైనా నడిపే ధైర్యం ఉందా? మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్ అసభ్య పదజాలంతో తనను లైంగికంగా వేధిస్తున్నాడని మండలాఫీసు అటెండర్ అయిన ఒంటరి మహిళ ఫిర్యాదు చేయడానికి స్టేషన్కు వెళ్లినా, వాట్సాప్ మెసేజ్లు చూపించినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. బాధ్యత గల ప్రభుత్వమైతే గలీజ్ మెసేజ్లు పెట్టిన పీఏను లోపలేయాలి. –వైఎస్ జగన్సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం వెర్రితలలు వేస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు వాంగ్మూలాలతో వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్న సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమ కేసులతో నిర్బంధిస్తూ ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నారని మండిపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే... గత 19 నెలలుగా వీళ్లే ప్రభుత్వంలో ఉన్నారు. ములకలచెరువు, ఇబ్రహీంపట్నం, అనకాపల్లి, ఆముదాలవలస, నెల్లూరు, పాలకొల్లు, రేపల్లె... ఇలా అన్నిచోట్లా కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీలు వీళ్లు పెట్టినవే. (రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నాయకులతో కల్తీ మద్యం ఫ్యాక్టరీల నిర్వాహకులు దిగిన ఫొటోలు, సీజ్ చేసిన కల్తీ లిక్కర్ బాటిళ్ల ఫొటోలను చూపించారు) కల్తీ మద్యం మీద నచ్చిన బ్రాండ్ పేరుతో లేబుళ్లు వేస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ చానల్ కూడా వాళ్లదే. తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ జయచంద్రారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నుంచి బీఫాం తీసుకుంటూ ఫొటో దిగారు. ఇబ్రహీంపట్నంలో పట్టుబడ్డ ఆయన పార్టనర్ జనార్దనరావు, సురేంద్రనాయుడులు చంద్రబాబు, లోకేశ్తో ఫొటోలు దిగారు. అనకాపల్లి జిల్లా పరవాడలో స్పీకర్ అయ్యన్నపాత్రుడితో, మంత్రి లోకేశ్తో ఇలా పలుకుబడి కలిగిన టీడీపీ నేతలతో కల్తీ లిక్కర్ మాఫియా నడుపుతున్నవాళ్లు ఎక్కడపడితే అక్కడ ఫొటోలు దిగుతున్నారు. వీళ్లదే పోలీస్ వ్యవస్థ, వీళ్లవే బెల్టు షాపులు, వీళ్లవే పర్మిట్ రూమ్లు. రెడ్బుక్ పాలనలో వీళ్లుగాక ఇంకెవరికైనా నడిపే ధైర్యం ఉందా?. కానీ, ములకలచెరువు కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ను తీసుకుపోయారు. కల్తీ చేసిన జయచంద్రారెడ్డి, ఆయన బావమరిది గిరిధర్రెడ్డి, పీఏ రాజేష్లను ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. వీళ్ల ప్రభుత్వంలో అన్నీ వీళ్లే చేస్తూ, తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో... జోగి రమేష్ కల్తీ చేయిస్తున్నారంటున్నారు. ఇదెక్కడి అన్యాయం. దొంగే దొంగ దొంగ అంటున్నాడు. ఒక మాజీ మంత్రి పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? జోగి రమేష్, ఆయన తమ్ముడిని అరెస్ట్ చేస్తే... మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో పాల్గొన్న రమేష్ కుమారుడిపై కేసులు పెడుతున్నారు.మిథున్ను ఎందుకు అరెస్ట్ చేశారో? అని జడ్జి ఆశ్చర్యపడే పరిస్థితిమద్యం అక్రమ కేసులో చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, మిథున్రెడ్డితోపాటు ఇప్పటికే మా పార్టీకి చెందిన ఎంతోమందిని జైలుకు పంపించారు. అసలు మిథున్రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారో? ఆయనకు ఏం సంబంధమో? అని జడ్జి కూడా ఆశ్చర్యపడి తీర్పు రాసే పరిస్థితి. కృష్ణమోహన్రెడ్డి, ధనంజయరెడ్డి, ఎంఎన్సీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప, రాజ్ కేసిరెడ్డిలను నిర్బంధించారు. రూ.11 కోట్లు దొరికినట్లుగా చూపిస్తున్నారు. ఆ నోట్లపై ఉన్న నంబర్ల ద్వారా ఏ బ్యాంకులో డ్రా చేశారో? ఎప్పుడు డ్రా చేశారో? చెప్పాలని బాధితులు కోర్టులో పిటిషన్ వేశారు. రెడ్ హ్యాండెడ్గా డబ్బు దొరికితే పక్కనపెడతారు కదా? కానీ, వీళ్లు అన్నీ కలిపేశాం అంటున్నారు. ఆ డబ్బు బయటపడితే ఇంజనీరింగ్ కాలేజీవని తెలుస్తుందని, అది తెలియకుండా లిక్కర్ అని బ్యాండ్ వేసి రూ.11 కోట్లు వీళ్లే పెట్టి కేసులు బిల్డ్ చేస్తున్నారు. వీళ్లు ఏ స్థాయికి పోతున్నారంటే... భాస్కర్రెడ్డి, మిథున్రెడ్డి, కాకాణి గోవర్థన్రెడ్డి, వల్లభనేని వంశీ, పినిపె శ్రీకాంత్పై తప్పుడు కేసులు పెట్టారు. సాక్ష్యాలు సృష్టించి, అధికారులతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పిస్తున్నారు. పోసాని కృష్ణమురళి వంటి సామాన్యులు, సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును తప్పుడు కేసులతో అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్లపైనా గంజాయి కేసులు పెడుతున్నారు. విశాఖలో మా పార్టీకి చెందిన విద్యార్థి నాయకుడిపై గంజాయి కేసు పెట్టారు. రైల్వే న్యూ కాలనీలో పట్టుకున్నామని ఎఫ్ఐఆర్లో రాశారు. కానీ, ఇంటి దగ్గర్లోని టిఫిన్ సెంటర్కు వెళ్తుండగా, మద్దిలపాలెం వద్ద పట్టుకున్నట్లు, స్టేషన్కు తరలిస్తున్నట్లు సీసీకెమెరాలో రికార్డైంది. అతడి బైక్ను 14 కి.మీ. దూరంలో ఉన్న రైల్వే న్యూకాలనీకి తీసుకెళ్లారు. ఆ బైక్కు ఉన్న జీపీఎస్ ద్వారా ఈ విషయం తెలిసింది. పోలీస్ స్టేషన్ నుంచి అక్కడికి తీసుకువెళ్లి గంజాయి దొరికిందని చెప్పి కొండారెడ్డిని అరెస్ట్ చేశారు. ఇక బాధ్యత గల ప్రభుత్వమైతే సాలూరులో ఒంటరి మహిళకు గలీజ్ మెసేజ్లు పెట్టిన మంత్రి పీఏను లోపలేయాలి. కానీ, కేసులు పెట్టకపోగా, బాధితురాలు దిక్కుతోచక జర్నలిస్టులకు చెబితే, ఆ వార్త రాసిన ‘సాక్షి’ విలేకరి మీద కేసులు పెట్టారు. ఇది రెడ్బుక్ పాలన వెర్రితలలు వేస్తోందనడానికి నిదర్శనం.పిన్నెల్లిపై 16 తప్పుడు కేసులుమా పార్టీ మాచర్ల నియోజకవర్గం సీనియర్ నాయకుడు, నాలుగు సార్లు ఎమ్మెల్యే అయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడు వెంకటరామిరెడ్డిని తప్పుడు కేసులో ఇరికించాలని చూస్తున్నారు. టీడీపీకి చెందినవారి గ్రూపుల తగాదాలలో వాళ్లూవాళ్లూ చంపుకొంటే మా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిపై కేసులు పెట్టారు. ఆ ఘటనపై మీడియా సాక్షిగా టీడీపీ హయాంలో... పల్నాడు జిల్లా అప్పటి ఎస్పీ శ్రీనివాసరావు ఏమన్నారో మీరే చూడండి. (ఎస్పీ మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ చూపించారు) ‘గుండ్లపాడు గ్రామానికి చెందిన జె.వెంకటేశ్వరరావు అలియాస్ మద్దయ్య, జె.కోటేశ్వరరావును బ్లాక్ స్కార్పియోతో ఢీకొట్టి చంపారు. చనిపోయినవారికి తోట చంద్రయ్య కుటుంబంతో ఎలాంటి బంధుత్వం లేదు. ఇద్దరూ టీడీపీ వారే’ అని ఎస్పీ చెప్పారు. అంతేకాదు హతులు, హంతకులు టీడీపీవారేనని ఏకంగా ట్వీట్ చేశారు. ఈనాడులో కూడా అదే రాశారు. కానీ, ఈ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడిని అరెస్టు చేశారు. ఎక్కడన్నా న్యాయం, ధర్మం ఉందా? ఇలాంటివి చేస్తేనే నక్సలిజం పుడుతుంది. పిన్నెల్లిపై ఈ 19 నెలల్లో 16 తప్పుడు కేసుల పెట్టారు. ఆయన్ను ఇబ్బందులు పెడుతున్నారు. ఎన్నికల సమయంలో రిగ్గింగ్ను అడ్డుకున్నందుకు 54 రోజులు జైల్లో ఉంచారు. -
సూపర్ 6 పేరిట.. 'సూపర్' మోసం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలన్నీ అమలు చేసేశామని చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఈ మధ్య కాలంలో చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధం ఆడేస్తున్నారని ధ్వజమెత్తారు. వాళ్లకు సంబంధించిన పాంప్లెట్ పేపర్లు, ఎల్లో మీడియా టీవీ ఛానళ్లలో సూపర్ సిక్స్ విజయవంతం అంటూ ప్రకటనలు కూడా ఇచ్చేస్తున్నారని.. చంద్రబాబు గోబెల్స్కు టీచర్, మెంటార్ లాంటి వాడని ఎద్దేవా చేశారు.ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు ఇచ్చి, ఇప్పుడు ప్రజలను మోసగిస్తూ 420 చేష్టలు చేస్తున్న చంద్రబాబుపై చీటింగ్ కేసు పెట్టి లోపల వేయాలని నిప్పులు చెరిగారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై మీడియాతో మాట్లాడారు. అసలు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ల కింద ఏం చేశారో చెప్పాలని, సక్రమంగా ఒక్క హామీ కూడా అమలు చేయకుండా సూపర్ హిట్టని ఎలా ప్రచారం చేసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘రాష్ట్రంలో రైతులు పండించిన చీని, అరటి ఎగుమతి కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రత్యేకంగా రైళ్లు నడిపాం. 23 వేల టన్నులు ఉన్న అరటి ఎగుమతులను 2023–24 నాటికి 3 లక్షల టన్నులకు తీసుకెళ్లాం. దళారుల బెడద లేకుండా చేశాం. రవాణా ఖర్చులను 40 శాతం మేర తగ్గించాం. ఈ 19 నెలల పాలనలో రైతుల కోసం మీరేం చేశారు? రైతుల కష్టాలు పట్టవా?’ అని సీఎం చంద్రబాబును నిలదీశారు. రైతుల జీవితాలు చిన్నాభిన్నం అవుతుంటే నిద్రపోతున్నారా.. అని ప్రశి్నంచారు. మిమ్మల్ని సీఎం చేసింది గాడిదలు కాయడానికి కాదు కదా.. అంటూ మండిపడ్డారు.వ్యవసాయంపై 62 శాతం మంది ఆధారపడిన పరిస్థితుల్లో ఏ ప్రభుత్వమైనా సాగును పండుగ చేసి.. రైతులను సంతోష పెడితేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుందన్నారు. రైతు, రైతు కూలీ సంతోషంగా లేకుంటే రాష్ట్రం ఎదగదని, వెనకడుగు వేయాల్సి వస్తుందని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో పండుగలా ఉన్న వ్యవసాయాన్ని చంద్రబాబు దండగలా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని కాపాడాలని.. దేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపు ఒకసారి చూడండని అందరూ అనాల్సిన దుస్థితి కొనసాగుతోందన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..ఉచిత పంటల బీమాకు మంగళంఇటీవల మోంథా తుపాను వచి్చన సమయంలో ఆరీ్టజీఎస్ నుంచి చంద్రబాబు, ఆయన కొడుకు, ఆయన దత్తపుత్రుడూ కంప్యూటర్ల ముందు కూర్చొని పెద్ద బిల్డప్ ఇచ్చారు. వీళ్లకు తోడు ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లు ఎలా బిల్డప్ ఇచ్చాయంటే.. వీరు తుపాను పీకపట్టి డైవర్ట్ చేసినట్టు బిల్డప్ ఇచ్చాయి. వీళ్లు కాబట్టే తుపానును ఆపగలిగారన్నట్టుగా ఆకాశానికి ఎత్తారు. కానీ, వాస్తవ పరిస్థితులు గమనిస్తే.. తుపాను కారణంగా నష్టపోయిన ఏ ఒక్క రైతుకూ ప్రభుత్వం నుంచి పైసా సాయం అందలేదు. తుపాను ప్రభావం వల్ల 15 లక్షల ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లితే.. దాన్ని నాలుగైదు లక్షల ఎకరాలకు కుదించారు. వీరికి కూడా నష్ట పరిహారం ఇవ్వలేదు. బాబు 19 నెలల పాలనలో ఇప్పటి వరకు 17 ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయి. ఆ విపత్తుల కారణంగా రైతుల జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయి. ప్రభుత్వం నుంచి 17 విపత్తులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ రూ.1,100 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. వీటిని ఇవ్వనేలేదు. దీనికి తోడు మా ప్రభుత్వ హయాంలో రైతులకు హక్కుగా దక్కిన ఉచిత పంటల బీమాను రద్దు చేశారు. ఉచిత పంటల బీమా కింద రైతు తరఫున కూడా ప్రభుత్వమే ప్రీమియం కట్టి.. పంట నష్టపోయిన రైతులకు రూ.7,400 కోట్ల నుంచి రూ.7,800 కోట్ల మేర బీమా పరిహారం అందించాం. మా ప్రభుత్వ హయాంలో రైతులకు హక్కుగా దక్కిన ఉచిత పంటల బీమా పథకాన్ని చంద్రబాబు లేకుండా చేయడంతో బీమా పరిహారం రాకుండా పోయింది. రాష్ట్రంలో ఖరీఫ్ సమయంలో 84 లక్షల మంది రైతులు, కౌలు రైతులు పంటలు సాగు చేస్తే.. కేవలం 19 లక్షల మంది రైతులు మాత్రమే ఇన్సూరెన్స్ చేయించుకున్నారు. మరి మిగిలిన వారి పరిస్థితి ఏంటి? రోజూ చంద్రబాబు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటారు. నష్టపోయిన రైతులకు ఆ నష్టాన్ని ఎలా పూడుస్తారో ఆ ఉపన్యాసాల్లో ఎక్కడా చెప్పరు. రైతులకు పెట్టుబడి సాయం.. పీఎం కిసాన్ కింద కేంద్రం ఇచ్చేది కాకుండానే అన్నదాత సుఖీభవ కింద ఏటా రూ.20 వేలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తోంది. రెండేళ్లలో రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.10 వేలు ఇచ్చి రూ.30 వేలు ఎగ్గొట్టారు. ఒకవైపు పెట్టుబడి సాయం దక్కలేదు. మరోవైపు మా ప్రభుత్వంలో సీజన్ ముగిసే సమయానికి అందే ఇన్పుట్ సబ్సిడీ, రైతు భరోసా కనిపించకుండా పోయింది. హక్కుగా రావాల్సిన ఇన్సూరెన్స్ సొమ్ము రాకుండా పోయింది. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదుఇన్ని కష్టాల మధ్య రైతు సాగు చేసిన ఏ పంటకూ గిట్టుబాటు ధర రాని దుస్థితి చూస్తున్నాం. పోయిన ఏడాది ధాన్యం, పొగాకు, ఉల్లి, టమాట, మామిడి, సజ్జ, చీనీ, మిర్చి.. ఇలా ఏ పంట తీసుకున్నా గిట్టుబాటు ధర దక్కలేదు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. మోంథా తుపానులో నష్టపోయిన రైతుల నుంచి ధాన్యం కొనేవారు లేరు. 75 కేజీల బస్తాకు ఎంఎస్పీ ప్రకారం రూ.1,776 రావాలి. అయితే రూ.1,200, రూ.1,300కు ఇస్తారా? అని దళారులు రైతులను అడుగుతున్నారు. ఇంకో పక్క దిత్వా తుపాను పంట కోతల(హార్వెస్టింగ్) సమయంలో వస్తుందని 10రోజుల ముందే మనకు తెలుసు. కోసిన పంట కళ్లాల మీదే ఉందని తెలుసు. పంట కొనకుంటే ధాన్యం తడిచి పోతుందనీ తెలుసు. రైతులు ఇప్పటికే దెబ్బతిని ఉన్నారు. ధాన్యం కొనకపోతే మరింత నష్టాల్లో కూరుకుపోతారని తెలిసి కూడా చంద్రబాబు రైతులను ఆదుకునే ప్రయత్నం చేయలేదు. మా హయాంలో ఇలాంటి పరిస్థితులు వచి్చనప్పుడు ఎలాంటి స్పందన ఉండేదో ప్రజలు ఆలోచించాలి. యుద్ధ ప్రాతిపదికన యంత్రాంగం మొత్తం పనిచేసేది. వెంటనే గన్నీ బ్యాగ్స్, ధాన్యం సరఫరాకు లారీలు సమకూరేవి. ధాన్యం కొనుగోలుకు వెనువెంటనే చర్యలు తీసుకునేవాళ్లం. ధాన్యం సేకరణ, తరలింపునకు మొత్తం యంత్రాంగం అప్రమత్తం అయ్యేది. వర్షానికన్నా ముందే పంట కొనుగోలు పూర్తి చేసేవాళ్లం. ఇవన్నీ గతంలో జరిగాయి. ఈ రోజున రైతులు ఏమైపోయినా పట్టించుకునే వారే లేకుండా పోయారు. కేజీ అరటి పండ్లు అర్ధ రూపాయికొబ్బరి, అరటి, వేరుశనగ పంటలదీ ఇదే పరిస్థితి. ఏ పంటకూ రేట్లు లేవు. కేజీ అరటి అర్ధ రూపాయి అంటున్నారు. ఇలా అయితే రైతులు ఎలా బతుకుతారు? ఇంత ఘోరంగా పాలన సాగుతోంది. అదే మా ప్రభుత్వ హయాంలో అరటి, చీనీ రైతుల కోసం ఏకంగా ప్రత్యేకంగా రైళ్లు నడిపాం. అనంతపురం నుంచి ఢిల్లీకి, తాడిపత్రి నుంచి ముంబైకి, నంద్యాల, కర్నూలు నుంచి ఘజియాబాద్, లక్నోకు ప్రత్యేక రైళ్లు నడిచాయి. దీంతో రైతులకు దళారుల బెడదల తప్పింది. రవాణా ఖర్చులు తగ్గాయి. ఎగుమతులు పెరిగాయి. మా ప్రభుత్వం రాక మునుపు అరటి ఎగుమతి 23 వేల టన్నులు ఉంటే 2023–24లో 3 లక్షల టన్నులకు పెరిగింది. రైతులకు అదనంగా 20 నుంచి 40% రేట్లు పెరిగాయి. మరి ఈ ప్రభుత్వం, చంద్రబాబు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? పులివెందులలో 600 టన్నుల కోల్డ్ స్టోరేజ్ మా హయాంలో ప్రారంభించాం. కరెంట్ బిల్లుల ఖర్చు వస్తుందని దానిని మనుగడలో లేకుండా చేయడం దుర్మార్గం.డైవర్ట్ చేయడం కోసమే ‘రైతన్నా.. మీ కోసం’ఎన్నికలకు ముందు చంద్రబాబు రైతులకు ఇచ్చిన ప్రతి హామీ మోసంగా మారిపోయింది. ఆర్బీకేలు, ఈ–క్రాప్ వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి. తూతూ మంత్రంగా ఈ–క్రాప్ చేస్తున్నారు. ఒక పొలంలో రైతును నిలబెట్టి, ఎన్ని ఎకరాల్లో, ఏ పంట సాగు చేశారో ఆర్బీకేకు అనుసంధానం చేసేదే ఈ–క్రాప్. ఆ రైతుకు భవిష్యత్లో గిట్టుబాటు ధర రాకపోయినా, పంట నష్టం వాటిల్లినా ఆదుకునే వ్యవస్థ ఆర్బీకే ద్వారా ఉండేది.ఆర్బీకేల్లో పంటల వారీగా గిట్టుబాటు ధరల పట్టికలు ప్రచురించే వాళ్లం. ఎక్కడైనా గిట్టుబాటు ధర దక్కని పరిస్థితి ఉంటే వెంటనే ఆర్బీకే యాక్టివేట్(క్రియాశీలకం) అయ్యేది. జాయింట్ కలెక్టర్ దృష్టికి సమస్య వెళ్లేది. ఆయన మార్క్ఫెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ను అప్రమత్తం చేసి పంట కొనుగోలు చేసేవారు. మార్కెట్లో పోటీ సృష్టించేవారు. ఈ క్రమంలో మేం మార్కెట్ ఇంటర్వెన్షన్ కోసం దాదాపు రూ.7,457 కోట్లు ఖర్చు చేశాం. ఇప్పుడు రాష్ట్రంలో రైతు పరిస్థితి దయనీయంగా మారింది. ఈ అంశాన్ని డైవర్ట్ చేయడం కోసం ‘రైతన్నా.. మీ కోసం’ అని చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రైతులందరికి ధన్యవాదాలు.. అంటూ ఈనాడులో యాడ్ కూడా వేసుకున్నారు. అసలు వీళ్లు రైతుల దగ్గరకు పోయే పరిస్థితే లేదు. పోతే రైతులు తిడతారు, కొడతారు కూడా.. రైతుల దగ్గరకు పోకుండానే కార్యక్రమం విజయవంతం అయినట్టు ఆశ్చర్యకరంగా గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు.రాష్ట్రంలో మీరు ఎన్నికలకు ముందు చెప్పిన విధంగా సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అమలయ్యాయా? ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. ఎక్కడికైనా వెళ్లొచ్చని, ఏ బస్ అయినా ఎక్కొచ్చని ఎన్నికలకు ముందు చెప్పారు. ఇప్పుడేమో షరతులు పెడుతున్నారు. ఇది మోసం కాదా? ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారీ్టలకు 50 ఏళ్లకే పింఛన్ ఎక్కడ ఇచ్చారు? ఇలా ఎన్నెన్నో 420 చేష్టలు చేస్తున్న చంద్రబాబుపై చీటింగ్ కేసు పెట్టి లోపల వేయాల్సిందే. అసలు వాళ్ల ముగ్గురినీ లోపల వేయాలి. ఇదే మోసం చిట్ఫండ్, ఫైనాన్స్ స్కీమ్స్ నడిపే వాళ్లు చేస్తే జైల్లో పెట్టేవారు. వీళ్లు కాబట్టి ఈనాడు రాయదు.. ఆంధ్రజ్యోతి చూపదు.. టీవీ–5 పట్టించుకోదు.. అంతా గజ దొంగల ముఠా.రాష్ట్రంలో వ్యవసాయం, రైతుల పరిస్థితి చూస్తే బాధేస్తోంది. ధాన్యం, ఉల్లి, టమాటా, అరటి.. ఇలా ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదు. రాష్ట్రంలో పాలన ‘సేవ్ ఏపీ’ అన్న తరహాలో ఉంది. హలో ఇండియా.. ఆంధ్రప్రదేశ్ వైపు ఒకసారి చూడండని అందరూ అనాల్సిన దుస్థితి కొనసాగుతోంది. – వైఎస్ జగన్➤ఎన్నికలకు ముందు నిరుద్యోగ భృతి కింద రూ.3 వేలు ఇస్తామన్నారు. రెండేళ్లకు కలిపి ఒక్కొక్కరికి రూ.72 వేలు భృతి ఇవ్వాలి. ఏ ఒక్క నిరుద్యోగికైనా భృతిగా రూ.72 వేలు చెల్లించారా? ఇది మోసం కాదా? చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు ఎన్నికలకు ముందు బాండ్లు కూడా ఇచ్చారు. నిరుద్యోగ భృతి ఇవ్వనేలేదు. మరి సూపర్ సిక్స్ ఎక్కడ అమలైంది?➤ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు పైబడిన ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.1,500 ఇస్తామన్నారు. సంవత్సరానికి రూ.18 వేలు.. రెండేళ్లకు ఒక్కరికైనా రూ.36 వేలు ఇచ్చారా? ఇది మోసం కాదా?➤బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ అన్నారు. నెలకు రూ.4 వేలు చొప్పున ఏడాదికి రూ.48 వేలు, రెండేళ్లకు రూ.96 వేలు ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు? అన్నదాత సుఖీభవ కింద పీఎం కిసాన్ కాకుండా ఏడాదికి రూ.20 వేలు ఇస్తామన్నారు. రెండేళ్లకు కలిపి రూ.40 వేలు ఇవ్వాలి. ఇచ్చింది రూ.10 వేలే. ఇది మోసం కాదా?➤అమ్మ ఒడి పథకం పేరు మార్చారు. తల్లికి వందనం అన్నారు. ప్రతి పిల్లాడికి రూ.15 వేలు అన్నారు. తీరా చూస్తే తొలి ఏడాది ఎగ్గొట్టారు. రెండో ఏడాదికి వచ్చే సరికి 20 లక్షల మంది పిల్లలకు ఎగ్గొట్టారు. రూ.15 వేలు కాకుండా రూ.8 వేలు, రూ.9 వేలు, రూ.10 వేలు ఇచ్చారు. కొందరికి మాత్రమే రూ.13 వేలు ఇచ్చారు. రెండేళ్లకు ప్రతి పిల్లాడికి రూ.30 వేలు ఇవ్వాలి. ఇలా ఇస్తామని చెప్పి ఇవ్వక పోవడం మోసం కాదా?➤దీపం పథకం కింద ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తామన్నారు. రెండేళ్లకు ఆరు సిలిండర్లు ఇవ్వాలి. కానీ ఇచ్చింది రెండే. అవీ అందరికి ఇవ్వలేదు. ఇది మోసం కాదా?➤ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. ఎక్కడికైనా వెళ్లొచ్చని, ఏ బస్ అయినా ఎక్కొచ్చని ఎన్నికలకు ముందు చెప్పారు. ఇప్పుడేమో షరతులు పెడుతున్నారు. ఇది మోసం కాదా? ఇన్ని 420 చేష్టలు చేస్తున్న చంద్రబాబుపై చీటింగ్ కేసు పెట్టి లోపల వేయాల్సిందే కదా? అసలు వాళ్ల ముగ్గురినీ లోపల వేయాలి. ఇదే మోసం చిట్ఫండ్, ఫైనాన్స్ స్కీమ్స్ నడిపే వాళ్లు చేస్తే జైల్లో పెట్టేవారు. వీళ్లు కాబట్టి ఈనాడు రాయదు.. ఆంధ్రజ్యోతి చూపదు.. టీవీ5 పట్టించుకోదు.. అంతా గజ దొంగల ముఠా. -
Nandyala Hospital: హరినాథ్ రెడ్డికి YSRCP నేతల పరామర్శ
-
రెడ్బుక్ వెర్రితలలు వేస్తోంది: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: మద్యం కేసు నుంచి బయటపడేందుకే లేని కుంభకోణం ఒకటి సృష్టించారని.. ఉద్దేశపూర్వకంగా వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తున్నారని చంద్రబాబు సర్కార్పై వైఎస్ జగన్ మండిపడ్డారు. రెడ్ బుక్ వెర్రితలలు వేస్తోందన్నారు. ‘‘కల్తీ లిక్కర్ నడుపుతోంది టీడీపీ వాళ్లే. మంత్రులు, ఎమ్మెల్యేల మనుషులే కల్తీ లిక్కర్ దందా చేస్తున్నారంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘ములకల చెరువు, ఇబ్రహీంపట్నంలో కల్తీ దందా బయటపడింది. జయచంద్రారెడ్డికి బాబు స్వయంగా బీఫామ్ ఇచ్చారు. అనకాపల్లి, పరవాడలో కూడా కల్తీ మద్యం కేంద్రాలు నడిపారు. ఏలూరు, రేపల్లె, నెల్లూరులోనూ కల్తీ మద్యం దందా చేస్తున్నారు. రాష్ట్రమంతా కల్తీ మద్యం దందా నడుపుతున్నారు. లిక్కర్, బెల్టు షాపులు, పర్మిట్ రూమ్లన్నీ టీడీపీ వారివే. మ్యానుఫాక్యరింగ్, డిస్ట్రిబ్యూషన్ అంతా టీడీపీ వాళ్లే. టీడీపీ నేతలకు పోలీసులు సహాయం చేస్తున్నారు’’ అని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.‘‘జోగి రమేష్ను అన్యాయంగా జైల్లో పెట్టారు. తప్పుడు వాంగ్మూలాలు, సాక్ష్యాలు క్రియేట్ చేస్తున్నారు. జోగి రమేష్పై తప్పుడు కేసు పెట్టారు. జోగి రమేష్ కుమారుడిపై కూడా అక్రమ కేసు పెట్టారు. పిన్నెల్లి సోదరులపై కూడా అక్రమ కేసులు పెట్టారు. టీడీపీ వాళ్లే హత్యలు చేసుకుంటే పిన్నెల్లిని ఇరికించారు. టీడీపీ గ్రూప్ తగాదాల వల్లే హత్యలని ఎస్పీ చెప్పారు. టీడీపీ గొడవల వల్లే హత్యలని ఎస్పీ ట్వీట్ చేశారు‘‘మా పార్టీ విద్యార్థి నాయకుడు కొండారెడ్డిపై అక్రమ కేసు పెట్టారు. కొండారెడ్డిపై గంజాయి అక్రమ కేసు పెట్టారు. రైల్వే న్యూ కాలనీలో గంజాయి పట్టుకున్నామని ఎఫ్ఆర్ఐ రాశారు. నిజానికి కొండారెడ్డి టిఫిన్ చేస్తుండగా పట్టుకెళ్లారు. బైక్కు జీపీఎస్ ట్రాక్ ఉంది కాబట్టి.. పోలీసుల దౌర్జన్యం బయటపడింది. పోలీసులు ఇలా చేస్తే వ్యవస్థలు బతుకుతాయా? రెడ్ బుక్ను పోలీసులు ఫాలో అయితే ఎలా?’’ అంటూ వైఎస్ జగన్ నిలదీశారు.లిక్కర్ కేసును సృష్టించి చెవిరెడ్డిని వేధించారు. మిథున్రెడ్డి బెయిల్ సమయంలో జడ్జి సైతం ఎందుకు అరెస్ట చేశారని ఆశ్చర్యపోయారు. మా హయాంలో పని చేసిన అధికారులనూ అరెస్ట్ చేశారు. కాకాణి, వంశీ పోసాని, కొమ్మినేని లాంటి సీనియర్ జర్నలిస్టులను.. చివరకు ప్రశ్నించే సోషల్ మీడియా యాక్టివిస్టులనూ వేధించారు. మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్పై ఇప్పటివరకు కేసు లేదు. బాధిత మహిళ ఆధారాలు చూపించినా విచారణ లేదు. వాట్సాప్ మెసేజ్లు చూపించినా పోలీసుల్లో చలనం లేదు. వార్త రాసిన సాక్షి విలేకరిపై కేసు పెట్టారు’’ అంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు. -
కూటమి ప్రభుత్వానికి మాయరోగం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చిన్నారుల జీవితాలను చంద్రబాబు ఛిద్రం చేస్తున్నారంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు. ప్రభుత్వ హాస్టళ్లలో కలుషిత తాగునీరు, కలుషిత ఆహారం కారణంగా అనారోగ్యంతో 29 మంది పిల్లలు చనిపోయారని ఆయన నిప్పులు చెరిగారు. వందలాది విద్యార్థులు ఆసుపత్రుల పాలయ్యారని.. కూటమి ప్రభుత్వానికి మాయరోగం వచ్చిందని వైఎస్ జగన్ దుయ్యబటారు.‘‘ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎత్తేశారు. నాడు-నేడును పూర్తిగా ఆపేశారు. ఇంగ్లీష్ మీడియాన్ని తీసేశారు. స్కూల్లో డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు 7100 కోట్లు. నేటి తరం ఆస్తి చదువు. పిల్లలను చదివించడానికి బాబు ముందుకు రావడం లేదు’’ అని వైఎస్ జగన్ నిలదీశారు. -
గోబెల్స్కు గురువు మన చంద్రబాబే: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: సూపర్ సిక్స్ ఇచ్చేశామంటూ నిసిగ్గుగా చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. సూపర్-6,7 సూపర్హిట్ అని ప్రచారం చేసుకుంటున్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసింది గాడిదలను కాయడానికా? అంటూ మండిపడ్డారు. రైతులకు కూటమి ఇచ్చిన ప్రతిమాట అబద్ధమన్న వైఎస్ జగన్.. ఉచిత బస్సు ప్రయాణం కొంతమందికే, కొన్ని బస్సులు పరిమితం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.సూపర్-6,7 సూపర్హిట్ అని ప్రచారం చేసుకుంటున్నారు. చంద్రబాబు నుంచి గోబెల్స్ పాఠాలు నేర్చుకోవాలి. గోబెల్స్కు చంద్రబాబే టీచర్’’ అంటూ వైఎస్ జగన్ చురకలు అంటించారు. ‘‘నిరుద్యోగ భృతి కింద రూ.3 వేలు ఇస్తామన్నారు. ఏమైంది?. రెండేళ్లలో ఒక్కొక్కరికి రూ. 72 వేలు ఇవ్వాలి ఏమైంది?. ఆడబిడ్డ నిధి కింద ప్రతినెలా రూ. 1500 ఇస్తామన్నారు. రెండేళ్లలో రూ.18 వేలు ఇవ్వాలి.. ఇచ్చారా?. బీసీలకు 50ఏళ్లకే పెన్షన్ అన్నారు.. ఇచ్చారా?. చంద్రబాబు ఈ-క్రాప్ వ్యవస్థను భ్రష్టుపట్టించారు’’ అంటూ వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. -
వైఎస్ జగన్ ప్రెస్మీట్.. హైలైట్స్
సాక్షి, తాడేపల్లి: మోసాలతో, కుంభకోణాలతో చంద్రబాబు అండ్ కో ఆంధ్రప్రదేశ్ను అడ్డంగా దోచుకుంటున్నారని.. పైగా గోబెల్స్ ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి.. పలు అంశాలపై మాట్లాడారు. వైఎస్ జగన్ ప్రెస్మీట్ హైలైట్స్అమరావతిలో భూములు ఎవరూ కొనకూడదు.. అమ్మకూడదని చట్టంలో ఉందికానీ బాబు, ఆయన బినామీలు స్కామ్లు చేస్తూనే ఉన్నారుప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బును దోచేశారు బ్లాక్ లిస్టులో ఉన్న కంపెనీకి ఫైబర్ను కట్టుబెట్టి వందల కోట్లు దోచిపెట్టారుకేబినెట్ ఆమోదం లేకుండా ప్రివలేజ్ ఫీజులు రద్దు చేశారుప్రివిలేజ్ ఫీజు రద్దు ఫైల్పై బాబే సంతకం చేశారుచంద్రబాబుకు దేవుడు.. ప్రజలే బుద్ధి చెబుతారుచంద్రబాబు బరితెగింపు2014-19 మధ్య చంద్రబాబు స్కామ్లుఆషామాషీ స్కాములు కావవి!స్కిల్ స్కామ్ కేసును కేంద్రం కూడా గుర్తించిందిస్కిల్ స్కామ్లో 370 కోట్లు షెల్ కంపెనీలకు తరలించారుచంద్రబాబు, బినామీలతో అమరావతి భూకుంభకోణంఇసుక స్కామ్తో వందల కోట్లు దోచిపెట్టారువివిధ కేసులలో బెయిల్ మీద ఉన్న చంద్రబాబుచంద్రబాబు అవినీతిపై ఫిర్యాదు చేసిన అధికారుల్ని బెదిరించారుఅబద్ధపు వాంగ్మూలాలు ఇప్పించారుబెయిల్ షరతులను ఉల్లంఘిస్తూ బరితెగింపుబెదిరించి తనపై ఉన్న కేసుల్ని మూసేయించుకుంటున్నారుఉచితం పేరుతో కోట్ల విలువైన స్కామ్లు చేస్తున్నారుబాబు అండ్కో గోబెల్స్ను మించి పోయారువీటిని ప్రజల దృష్టికి తీసుకెళ్లడం ఆగదు అశోక్ గజపతిని ఎందుకు విచారణ జరపలేదు?చంద్రబాబు హయాంలో సింహాచలం ఆలయంలో చోరీసెప్టెంబర్ 1 ఆలయ ఉద్యోగులే చోరీకి పాల్పడ్డారురమణ, సురేష్.. ఇద్దరికీ స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారుఅలా ఎందుకు వదిలేశారు?.. ఇద్దరినీ జైల్లో ఎందుకు పెట్టలేదువిచారణ జరిపి ఆస్తుల్ని స్వాధీనం ఎంఉదకు చసుకోలేదుసింహాచలం ఆలయ ధర్మకర్త అశోక్ గజపతిఅశోక్ గజపతిని ఎందుకు విచారించలేదుసుబ్బారెడ్డి, అశోక్ గజపతిలకు చెరో న్యాయమా? పరకామణి కేసులో.. పరకామణిలో గతంలో ఏం జరిగిందో ఎవరికి తెలుసు?. పరకామణి దొంగ.. లెక్కింపులో ఎన్నో ఏళ్లుగా ఉన్నాడు. జీయర్ స్వామి మఠంలో క్లర్క్గా పని చేశాడు. ఆ దొంగ దగ్గర 9 డాలర్లు పట్టుబడ్డాయి. దొంగను మేం పట్టుకున్నాం.. మీరెందుకు పట్టుకోలేదు. ఈ కేసులో దొంగ దొరికినప్పుడు కేసు నమోదు అయ్యింది. కేసు కోర్టులకూ వెళ్లాయి. నిందితుడి కుటుంబ సభ్యులు ప్రాయశ్చితంగా రూ.14 కోట్లు విలువైన ఆస్తులన్నీ రాసిచ్చేశారు. దేవుడి సోమ్ము దొంగల పాలు కాకూడదని రూ.23 కోట్లతో సాంకేతికతను జోడించాం. ప్రతీచోట సీసీ కెమెరాలు పెట్టించాం. టీటీడీలో పారదర్శక వ్యవస్థ తీసుకొస్తే మాపైనే నిందలు వేస్తున్నారు.పరకామణి కేసులో.. జడ్జిలపైనే వర్ల రామయ్యలాంటి వాళ్లు నిందలేశారు. కేసు పట్టుకున్న వ్యక్తిని మరణించేలా చేశారు. ఆ మరణాన్ని కూడా రాజకీయం చేయాలనుకున్నారు. ఎల్లో మీడియాతో ఫేక్ కథనాలు రాయించారు. ఇది ధర్మమేనా? వాళ్లంతా టీడీపీ మనుషులే.. లడ్డూ ప్రసాదంలో వాస్తవాల కోసం వైవీ సుబ్బారెడ్డి కేసు వేశారు నిజాలు బయటకు రావాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు అప్పన్న అనే వ్యక్తి సుబ్బారెడ్డి పీఏ కాదుటీడీపీ ఎంపీ వేమారెడ్డి అనుచరుడు.. ఏపీ భవన్ ఉద్యోగిలడ్డూ దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్లో అంతా టీడీపీ వాళ్లే ప్రత్యక్షంగా, పరోక్షంగా తెలుగు దేశం పార్టీతో సంబంధాలు ఉన్నవాళ్లే టీడీపీని గెలిపించడానికి శాయశక్తుల కృషి చేసినవాళ్లే. బాబు మాఫియా కలెక్షన్లలో వీళ్లంతా భాగమే దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారుదేవుడంటే భయం, భక్తి లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారునెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని.. లడ్డూలు తయారు చేశారని ఆరోపణలు చేశారుఆ నెయ్యితో లడ్డూలు తయారయ్యాయని.. భక్తులు తిన్నారని ఆధారాలు ఉన్నాయా?తిరుమలకు వచ్చే ఏ ట్యాంకర్ అయినా సరే.. గుర్తింపు సర్టిఫికెట్తోనే రావాలిసర్టిఫికెట్ మాత్రమే కాదు.. టీటీడీ ల్యాబ్ల్లోనూ పరీక్షలో నెగ్గాలి ఆ పరీక్షల్లో రిజెక్ట్ అయితే వెనక్కి పంపిస్తారుమా హయాంలో 18 సార్లు వెనక్కి పంపించాంపకడ్బందీగా ప్రొటోకాల్ ఉన్నప్పుడు తప్పెలా జరుగుతుంది?బాబు అధికారంలోకి వచ్చాక.. జులైలో 4 ట్యాంకర్లు వెనక్కి పంపారుమళ్లీ ఆ ట్యాంకర్లే ఆగస్టులో తిరిగి వచ్చాయని.. లడ్డూ ప్రసాదంలో వాడారని రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొందిటీటీడీ చైర్మన్, ఈవో ఏం చేస్తున్నారు?ఇదే నిజమైతే.. ఎవరిని లోపల వేయాలి?.. ఇది చంద్రబాబు వైఫల్యం కాదా? తారాస్థాయికి చంద్రబాబు కక్షా రాజకీయాలుఉద్దేశపూర్వకంగా వైఎస్సార్సీపీ నేతలపై కేసులు.. అరెస్టులుచెవిరెడ్డిని జైలుకు పంపారుమిథున్ రెడ్డిని అరెస్ట్ చేయించారు మిథున్రెడ్డి బెయిల్ టైంలో ఎందుకు అరెస్ట్ చేశారో? అని జడ్జి ప్రశ్నించారుకాకాణి, శ్రీకాంత్, వంశీ.. వాళ్లను అరెస్ట్ చేశారుపోసాని లాంటి సామాన్యుడ్ని, కొమ్మినేని లాంటి సీనియర్ జర్నలిస్టును, చివరికి సోషల్ మీడియా యాక్టివిస్టులను వేధించారుమంత్రి సంద్యారాణి పీఏ వ్యవహారంలో ఆధారాలున్నా చర్యలు లేవువాట్సాప్ మెసేజ్లు కళ్ల ముందే కనిపిస్తున్నా పోలీసుల్లో చలనం లేదుఆధారాలు చూపించినా ఇప్పటిదాకా కేసు పెట్టలేదుపైగా వార్త రాసిన సాక్షి, సాక్షి విలేఖరిపై కేసులు పెట్టి నోటీసులు పంపించారు పిన్నెల్లి సోదరులపై తప్పుడు కేసులు పెట్టారురిగ్గింగ్ అడ్డుకున్నందుకే పిన్నెల్లిని జైల్లో పెట్టారుటీడీపీ ఆధిపత్య పోరు ఘటనను.. రాజకీయ ప్రతీకారానికి వాడుకుంటున్నారుటీడీపీ వాళ్లు హత్య చేసుకుంటే.. పిన్నెల్లిని ఇరికించారుచంపింది.. చంపబడ్డవాళ్లు.. టీడీపీ వాళ్లేనని పోలీసులే స్వయంగా చెప్పారుటీడీపీ గొడవల వల్లేనని ఎస్పీ స్వయంగా ట్వీట్ చేశారు చంద్రబాబు పాలనలో పిన్నెల్లిపై పెట్టిన కేసులు 16విశాఖలో వైఎస్సార్సీపీ విద్యార్థి నాయకుడు కొండా రెడ్డిని దొంగ కేసులో అరెస్ట్ చేశారుకొండా రెడ్డిపై గంజాయి కేసు పెట్టారుఆశ్చర్యం ఏంటంటే.. అరెస్ట్ చేసింది ఓ చోట.. నేరం జరిగిందని చెప్పింది మరో చోటఇలాంటి రాజకీయాలతో వ్యవస్థలు బతుకుతాయా?అన్యాయంగా వైఎస్సార్సీపీ వాళ్లను జైలుకు పంపారులిక్కర్ కేసులో బెయిల్ మీద ఉన్న వ్యక్తి చంద్రబాబుఅప్పుడు ఏదైతే స్కామ్ చేశారో.. ఇప్పుడు సీఎంగా అదే పని చేస్తున్నారుఅలాంటి వ్యక్తి తన కేసుల్ని నీరుగార్చేందుకు.. మధ్యలో ఉన్న మా ప్రభుత్వ పాలసీని తప్పుగా ప్రచారం చేస్తున్నారులేని కేసుతో .. చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ఎంపీ మిథున్రెడ్డి అరెస్టులు చేశారుమా హయాంలో పని చేసిన అధికారులనూ అరెస్ట్ చేశారుమిథున్రెడ్డి బెయిల్ సమయంలో ఎందుకు అరెస్ట్ చేశారు?అని జడ్జే ప్రశ్నించారు రెడ్బుక్ వెర్రితలలు వేస్తోందిరాష్ట్రమంతా కల్తీ లిక్కర్ నడుపుతోంది టీడీడీవాళ్లేమంత్రులు, ఎమ్మెల్యేల మనుషులతోనే ఆ దందా నడిచిందికుటీర పరిశ్రమ లాగా.. రాష్ట్రంలో ప్రతీ మూలా నడిపించారు మా పార్టీకి చెందిన జోగి రమేష్పై తప్పుడు కేసు పెట్టారుజోగి రమేష్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారుజోగి రమేష్ కొడుకును కూడా ఇబ్బంది పెడుతున్నారువాళ్ల పార్టీకి చెందిన నిందితులనే ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేదు వీళ్లదే ప్రభుత్వం.. వీళ్లదే స్కామ్కల్తీ మద్యం కేసుల్లో.. తయారు చేసింది, పంచింది.. దోచుకుంది.. అంతా వాళ్లేరెడ్బుక్ పాలనలో కల్తీ మద్యం తయారు చేసే దమ్ము వేరే పార్టీ వాళ్లకు ఉంటుందా? నమ్మేలా ఉందా ఇది?తప్పుడు ఆధారాలతో.. సాక్ష్యాలతో.. వైఎస్సార్సీపీ వాళ్లను జైల్లో పెడుతున్నారు ఉద్యోగులను చంద్రబాబు దారుణంగా మోసం చేశారుపీఆర్సీ లేదు.. ఐఆర్ లేదుచంద్రబాబు రూ.31 వేల కోట్లు బకాయి పడ్డారు ఏపీసీవోఎస్తో వైఎస్సార్సీపీ హయాంలో ఒకటో తేదీనే జీతాలిచ్చాంబాబు హయాంలో ఏపీసీవోఎస్ను నీరుగార్చారురెండు , మూడు నెలలకు కూడా ఏవీసీవోఎస్లో జీతాల్లేవుఉద్యమాల్ని ఖాతరు చేయకుండా స్కామ్లు చేస్తున్నారుజీతాలు పెరగొద్దని పీఆర్సీ చైర్మన్ను కూడా నియమించలేదుఐదు డీఎలు పెండింగ్లో ఉన్నాయి.. కేవలం ఒక డీఏ మాత్రమే ఇచ్చారు.. మిగతావి వాయిదాల్లో ఇస్తారట!రిటైర్ అయ్యాక ఎరియర్స్ ఇస్తామన్నది బాబు ప్రభుత్వం మాత్రమేవిశాఖ స్టీల్కు సొంత గనుల్లేకనే ఈ నష్టాలుమిట్టల్ అనే ప్రైవేట్ వ్యక్తి కోసం చంద్రబాబు సొంత గనులు ఇవ్వాలని అడుగుతారుకానీ, విశాఖ స్టీల్కు మాత్రం అడగరు.. ప్రభుత్వ ప్లాంట్ను పట్టించుకోరుఅందుకే గనులు ఇవ్వాలని మేం అసెంబ్లీలో తీర్మానం చేశాంప్రైవేటీకరణ కాకుండా ఆపేశాంస్టీల్ ప్లాంట్ విషయంలో మాములు దగా చేయలేదుఎన్నికల ముందు.. నాడు.. కాపాడుకుంటా.. కలిసి పోరాడతాం అని చెప్పారుఇప్పుడేమో.. ఇంట్లో పడుకుంటే జీతాలివ్వాలా?.. తమాషాలొద్దంటూ సీరియస్పీడీ యాక్టులు పెట్టి విశాఖ ఉద్యోగులను లోపల వేస్తారట!దటీజ్ చంద్రబాబు ప్రైవేటీకరణపై కోటి సంతకాలతో కోర్టుకెళ్తాంగవర్నర్ను కలుస్తాం.. కోర్టులో పిటిషన్ వేస్తాంమెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ సూపర్ స్కామ్లాభం ప్రైవేట్వాళ్లకు.. భారం ప్రభుత్వం, ప్రజలకా?ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఉద్యమంకోటి సంతకాలతో 16న గవర్నర్ను కలుస్తాం ఆ పత్రాలతోనే కోర్టులో పిటిషన్ సైతం వేస్తాం ఆరోగ్యశ్రీని పూర్తిగా నిలిపివేసి.. ఖూనీ చేశారు నెలకు రూ.300 కోట్లు అవుతుందిఅలా ఏడాదికి అయ్యే ఖర్చు రూ.3600 కోట్లుకానీ, ప్రభుత్వ ఆస్పత్రులను చంద్రబాబు హతం చేస్తున్నారుబకాయిలు విడుదల చేయకపోవడంతో నెట్వర్క్ ఆస్పత్రులు సర్వీసులను ఆపేశాయి104, 108లు స్కామ్గా మారిపోయాయిపేదలకు వైద్య సాయం అందేదెలా?సంజీవని పేరుతో డ్రామాకు తెర తీశారుఇంకోవైపు.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పెద్ద స్కామ్గా నడుస్తోందికొత్త కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం ఒక స్కామ్ అయితే.. ప్రైవేటీకరణ తర్వాత పని చేసే సిబ్బందికి ప్రభుత్వ జీతాలట!ఇది మరో పెద్ద స్కామ్.. బాబు ఇచ్చిన బొనాంజా భూమి, బిల్డింగ్, స్టాఫ్.. జీతాలు అన్నీ ప్రభుత్వానివే.. కానీ, ఓనర్లు ప్రైవేట్వాళ్లుభారం ప్రజలమీదకు.. లాభాలు ప్రైవేట్ వాళ్లకా?? నేటి తరం ఆస్తి చదువుపిల్లల్ని చదివించేందుకు చంద్రబాబు ముందుకు రావడం లేదుస్కూళ్లలో డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నాయినాడు-నేడును పూర్తిగా ఆపేశారుఇంగ్లీష్ మీడియాన్ని ఆపేశారుఫీజు రియంబర్స్మెంట్, వసతి బకాయిలు కోట్లలో పెరిగిపోయాయితల్లికి వందనం పేరిట మోసానికి పాల్పడ్డారువైఎస్సార్సీపీలో జరిగిన మంచిని చంద్రబాబు నిలిపివేశారుకలుషిత ఆహారం.. నీరు.. సరైన వసతులు లేక పిల్లల ప్రాణాలు పోతున్నాయిఅనారోగ్యంతో 29 మంది పిల్లలు చనిపోయారువందలాది మంది పిల్లలు ఆస్పత్రి పాలయ్యారుచిన్నారుల జీవితాలను చంద్రబాబు ఛిద్రం చేస్తున్నారుచంద్రబాబు పాలనలో.. ఇది ఎవరూ జీర్ణించుకోలేని విషయాలు గోబెల్స్కే మెంటార్ మన చంద్రబాబుసూపర్ సిక్స్.. సూపర్ సెవెన్.. అన్నీ మోసాలేపెన్షన్లు.. సిలిండర్లు.. ఇలా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదుఅయినా కూడా హామీలన్నీ నెరవేర్చామని ప్రచారంహిట్లర్ కాలంలోని జోసెఫ్ గోబెల్స్ ప్రపంచానికి తెలుసు అబద్ధపు ప్రచారాలకు గోబెల్స్ ప్రచారం అంటుంటాంఅందుకే చంద్రబాబు ప్రచారాలకు గోబెల్స్ ప్రచారాలు అని పేరుకానీ, ఆ గోబెల్సే చంద్రబాబు నుంచి చాలా నేర్చుకోవాలిఇలాంటివి చేస్తున్న చంద్రబాబు మీద చీటింగ్ కేసు పెట్టి జైల్లో వేయాలిగతంలో.. వైఎస్సార్సీపీ హయాంలో ఎలా ఉండేది?ఆర్బీకేలు అద్భుతంగా పని చేసేవిరైతులకు గిట్టుబాటు ధర కోసం ఆరాట పడ్డాంబాబు పాలనలో రైతులను దళారులను మోసం చేస్తున్నారుచంద్రబాబేమో చోద్యం చూస్తున్నారుఇచ్చిన హామీలు మోసం.. రైతుల పరిస్థితి దయనీయం.. టాపిక్ డైవర్ట్ కోసం రైతన్నా మీ కోసం అంటూ డ్రామాలుజీవితంలో రైతుల కోసం ఏం చేయని చంద్రబాబు.. బోగస్ ప్రచారాలకు దిగారుఘోరాతి ఘోరంగా ఉంది చంద్రబాబు పాలనదిత్వా తుపాను గురించి ముందస్తు సమాచారం ఉందిపంట కోతలకు సిద్ధంగా ఉందనీ తెలుసుఅయినా చంద్రబాబు ప్రభుత్వం నష్టాన్ని నివారించలేకపోయిందిమా హయాంలో ఇలాంటి విపత్తులు వస్తే పరిస్థితి ఎలా ఉండేది?వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో.. తక్షణ చర్యల ఉండేవిరైతులు ఎలా పోయినా ఫర్వాలేదని చంద్రబాబు అనుకుంటున్నారుకేజీ అరటికి రూ.50 పైసలా?వరి, కొబ్బరి, పత్తి.. ప్రతి పంట పరిస్థితి ఇదే..రైతులు ఎలా బతికేది?.. ఇంత ఘోరంగా పాలన సాగుతోందిచంద్రబాబు అనే వ్యక్తి అసలేం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడా?.. సీఎంగా ఉండి ఎందుకు?.. రైతులకు చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ మోసాలేరెండేళ్లలో రూ.40 వేల పంట సాయం ఇవ్వాలి.. కానీ, రూ.10 వేలే ఇచ్చారు 18 నెలల బాబు పాలనలో 17 ప్రకృతి విపత్తులుకూటమి పాలనలో రైతుల జీవితాలు ఛిన్నాభిన్నంరూ.1,100 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు వైఎస్సార్సీపీ హయాంలో హక్కుగా ఉచిత పంటల బీమావైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.7,000 కోట్ల ఉచిత పంటల బీమాచంద్రబాబు పాలనలో ఉచిత పంటల బీమా పేరిట మోసం84 లక్షల మంది రైతులు ఉంటే.. 19 లక్షల మందికే ఇన్సూరెన్స్ఇన్సూరెన్స్ డబ్బులు ఎప్పుడు ఇస్తారో తెలీదుఇన్పుట్ సబ్సిడీలు ఎప్పుడిస్తారో తెలియదుదయనీయంగా ఏపీ కౌలు రైతుల పరిస్థితిమరి గతంలో ఎలా ఉండేది?.. వైఎస్సార్సీపీ హయాంలో పండుగలా వ్యవసాయం62 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారుచంద్రబాబు హయాంలో దండుగగా మారిన వ్యవసాయంమోంథా తుపానును పీకపట్టి చంద్రబాబు, లోకేష్, పవన్లే ఆపినట్లు బిల్డప్ ఇచ్చారుతుపాను తర్వాత కూడా రైతులకు న్యాయం చేయలేదునష్టపోయిన రైతులకు పైసా సాయం అందించలేదుపైగా పంట నష్టాన్ని దారుణంగా తగ్గించారు సేవ్ ఆంధ్రప్రదేశ్లా.. పాలనరాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం గురించి చాలా విషయాలు తెలియాల్సి ఉందినాణేనికి రెండో వైపు ఎలా ఉందో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందిరాష్ట్రంలో సేవ్ ఆంధ్రా పాలన జరుగుతున్నదిరాష్ట్రం మొత్తం దేశం వైపు చూడాలిరైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుందిరైతు, రైతు కూలీ సంతోషంగా లేకపోతే రాష్ట్రం ఎదగదు -
అరుణాచలంలో రోజా పూజలు
-
నేడు వైఎస్ జగన్ ప్రెస్మీట్
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ప్రెస్మీట్ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు. -
16న వైఎస్ జగన్ నేతృత్వంలో గవర్నర్కు కోటి సంతకాలు అందజేత
సాక్షి, అమరావతి: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమ కార్యక్రమానికి అన్నివర్గాల ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చిందని వైఎస్సార్సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. వైఎస్సార్సీపీ జిల్లా పార్టీల అధ్యక్షులు, పార్లమెంటరీ పరిశీలకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు (కో–ఆర్డినేషన్, అనుబంధ విభాగాలు), రాష్ట్ర కార్యదర్శులు (కో–ఆర్డినేషన్), ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర కార్యదర్శులు (పార్లమెంట్)తో బుధవారం రామకృష్ణారెడ్డి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమంలా సాగిందన్నారు. సంతకాలు కోటి అనుకుంటే అంతకుమించి వస్తున్నాయని చెప్పారు. ఇప్పటివరకు నియోజకవర్గ స్థాయిలో సేకరించిన సంతకాలను ఈ నెల 10న జిల్లా పార్టీ కార్యాలయాలకు పంపాలని సూచించారు. 13న జిల్లా కార్యాలయాల నుంచి కేంద్ర కార్యాలయం తాడేపల్లికి పంపాలని కోరారు. ఈ నెల 16న పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి నేతృత్వంలో గవర్నర్కు కోటి సంతకాలు అందజేయనున్నట్టు చెప్పారు.సేకరించిన సంతకాలన్నీ నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజల ముందు, మీడియా ముందు ప్రదర్శించి వారి సమక్షంలోనే బాక్సుల్లో సర్ది వాహనాల్లో పెట్టి నాయకులు జెండా ఊపి జిల్లా పార్టీ కార్యాలయానికి పంపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమైన నాయకులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. 13న జిల్లా కేంద్రంలో కూడా అదే స్థాయిలో కార్యక్రమం నిర్వహించి అక్కడి నుంచి రాష్ట్ర కార్యాలయానికి పంపాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని అధినేత వైఎస్ జగన్ ప్రత్యేకంగా చెప్పారని వెల్లడించారు. జిల్లా కేంద్రం నుంచి వేలాది మందితో ర్యాలీలు చేపట్టి రాష్ట్ర కార్యాలయానికి పంపాలన్నారు. పార్టీ అనుబంధ విభాగాలు కూడా ఇందులో కీలకపాత్ర పోషించాలని సూచించారు. -
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.పార్టీ ప్రధాన కార్యదర్శిగా (ఎన్నారై ఎఫైర్స్) డాక్టర్ ప్రదీప్ చింతా, జీసీసీ గల్ఫ్ కమిటీ కన్వీనర్ గా బద్వేల్ హజీ ఇలియాస్, కో- కన్వీనర్లుగా గోవిందు నాగరాజు (కువైట్), దొండపాటి శశి కిరణ్ (ఖతర్), మహమ్మద్ జిలాని భాష (దుబాయ్) నియమితులయ్యారు. -
రేపు వైఎస్ జగన్ ప్రెస్మీట్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(గురువారం, డిసెంబర్ 4వ తేదీ) ప్రెస్మీట్ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు మీడియాతో ఆయన మాట్లాడనున్నారు. సమకాలీన రాజకీయ అంశాలపై వైఎస్ జగన్ మాట్లాడనున్నారు. -
ఈ మూడింటిలో ప్రభుత్వం విఫలం.. చంద్రబాబుపై తమ్మినేని ఫైర్
-
కూటమి పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం: వైఎస్ అవినాష్రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కూటమి సర్కార్ అన్ని వర్గాలకు అన్యాయం చేసిందని వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి మండిపడ్డారు. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ గూండాలు దౌర్జన్యం చేశారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై పులివెందులలో వైఎస్సార్సీపీ అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్, వైఎస్సార్సీపీ నేత వైఎస్ మదన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. గ్రామ, వార్డు, మండల స్థాయిలో పార్టీ బలోపేతానికి పార్టీ నేతలు సూచనలు ఇచ్చారు.ఈ సందర్భంగా అవినాష్రెడ్డి మాట్లాడుతూ.. పోలీసులు బాధితులపైనే తిరిగి కేసులు పెట్టడం నీచ సంస్కృతి అంటూ ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగరేస్తామన్నారు. వైఎస్సార్సీపీ విజయంతో కూటమి ప్రభుత్వానికి బుద్ధిరావాలని అవినాష్రెడ్డి అన్నారు. కమిటీల ఎంపిక విషయంలో ప్రతి నాయకుడు, కార్యకర్త ఎంతో కష్టపడి, ఇష్టపడి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. మన పార్టీ ఇన్ని సంవత్సరాలుగా గట్టిగా మనుగడ సాగించిందంటే అది దివంగత నేత వైఎస్సార్ ఆశీస్సులు, జగనన్న ప్రజాదరణ, ముఖ్యంగా కార్యకర్తల రెక్కల కష్టం’’ అని అవినాష్రెడ్డి పేర్కొన్నారు.‘‘చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా ఇచ్చే పరిస్థితి లేదు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, మహిళలకు ఏడాదికి 18 వేలు వంటి పథక పథకాలను అటకెక్కించారు. పులివెందులలో మెడికల్ కాలేజీ 50 సీట్లను వెనక్కు పంపిన నీచమైన ప్రభుత్వం ఇది. పులివెందుల ప్రాంతంలో అరటి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వైఎస్ జగన్ హయాంలో నిర్మించిన అరటి కోల్డ్ స్టోరేజ్ని ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది. ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగే పరిస్థితి టీడీపీ నాయకులకు లేదు. అందుకే ఆ పార్టీ నాయకులు క్రైంను నమ్ముకున్నారు...పులివెందుల జడ్పిటిసి ఎన్నికల్లో పోలీసుల అండతో యథేచ్ఛగా టీడీపీ గుండాలు దౌర్జన్యాలు చేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్తో పాటు ఇతర నాయకులను దాడులు చేసి పెట్రోల్ పోసి నిప్పు పెట్టే పరిస్థితి అందరూ చూశారు. అయినా కూడా పోలీసులు బాధితులపైనే తిరిగి కేసులు పెట్టడం నీచమైన సంస్కృతి. ఇలాంటి దారుణమైన పోలీసు వ్యవస్థను ఎప్పుడూ చూడలేదు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో టీడీపీ గుండాల దౌర్జన్యాలు, పోలీసులను ధైర్యంగా ఎదుర్కొని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుపుతాం’’ అని అవినాష్రెడ్డి చెప్పారు. -
‘బాబూ.. అధికారం శాశ్వతం కాదు.. కేసులున్నాయ్ కదా?’
సాక్షి, తాడేపల్లి: అధికారం కోసం చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడతారని తీవ్ర విమర్శలు గుప్పించారు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. చంద్రబాబు యథేచ్చగా రాజ్యాంగ ఉల్లంఘనలు చేస్తున్నారని ఆరోపించారు. అధికారం శాశ్వతం కాదని చంద్రబాబు తెలుసుకుంటే మంచిది. చంద్రబాబు వచ్చాకే మళ్ళీ ఫ్యాక్షన్ మొదలైంది అంటూ వ్యాఖ్యలు చేశారు.మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మీడియాతో మాట్లాడుతూ..‘అధికారం కోసం చంద్రబాబు నీచ, నికృష్ట రాజకీయాలకు పాల్పడతారు. అధికార దుర్వినియోగంలో చంద్రబాబు పీహెచ్డీ పొందారు. పోలీసు వ్యవస్థను చంద్రబాబు, లోకేష్ పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు. యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘనలు చేస్తున్నారు. పల్నాడులో జంట హత్యల కేసును పిన్నెల్లి సోదరుల మీద బనాయించారు. టీడీపీలోని రెండు వర్గాలు దాడులు చేసుకుని హత్యలు చేసుకున్నాయని సాక్షాత్తు ఎస్పీనే ప్రకటించారు. మరి అలాంటప్పుడు పిన్నెల్లి సోదరుల మీద కేసు ఎందుకు పెట్టారు?. ప్రకాశం జిల్లాలో ఒక టీడీపీ నేతని కూడా టీడీపీ రెండో వర్గమే హత్య చేసింది. దోచుకుని, దాచుకునే విషయంలో గొడవలు పడి వారికి వారే హత్యల దాకా వెళ్తున్నారు. అలాంటి కేసుల్లో మా వారిని ఎందుకు ఇరికిస్తున్నారు?జోగి రమేష్ సోదరుల మీద కూడా అలాగే అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారు. ములకలచెరువులో నకిలీ మద్యం బయట పడినప్పుడు జోగి రమేష్ లేడు. ఆ తర్వాత కావాలనే జోగి బ్రదర్స్ మీద అక్రమ కేసు పెట్టారు. కొందరు పోలీసులు చట్టాన్ని అతిక్రమించి దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. అలాంటి వారు భవిష్యత్తులో ఇబ్బంది పడతారు. చంద్రబాబుకు అధికారం శాశ్వతం కాదని తెలుసుకుంటే మంచిది. స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టు అయి జైలుకు వెళ్లారు. ఒంటినిండా రోగాలు ఉన్నాయని కోర్టును తప్పుదారి పట్టించి బెయిల్ తెచ్చుకున్నారు. సాక్షులను బెదిరించటానికి వీల్లేదని బెయిల్ ఇచ్చే ముందు కోర్టు చెప్పింది. ఆ కోర్టు ఆదేశాలను కూడా చంద్రబాబు ఉల్లంఘించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేసులన్నీ మాఫీ చేయించుకుంటున్నారు.ఇవన్నీ బయటకు తెలుస్తాయని డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. రోజుకొక వైఎస్సార్సీపీ నేతలను అరెస్టు చేస్తూ డైవర్షన్ చేస్తున్నారు. పల్నాడులో చంద్రబాబు హయాంలోనే ఫ్యాక్షన్ హత్యలు జరిగాయి. వైఎస్సార్, జగన్ హయాంలో రాయలసీమ, పల్నాడు ప్రాంతాలు ప్రశాంతంగా ఉన్నాయి. చంద్రబాబు వచ్చాకే మళ్ళీ ఫ్యాక్షన్ మొదలైంది. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తే సహించేది లేదు. న్యాయపోరాటం చేస్తాం. డిప్యూటీ సీఎం సినిమాకు వెయ్యి, ఎమ్మెల్యే బాలకృష్ణ సినిమాకు రూ.500 రేటు పెంచారు. నారా లోకేష్ సినిమా తీస్తే రూ.1500 పెంచుతారు. అధికార దుర్వినియోగం చేయటంలో కూటమి నేతలు ముందున్నారు’ అని ఎద్దేవా చేశారు. -
రైతన్న కోసం అశోక్ బాబు వినూత్న నిరసన
-
‘పవన్కు ‘పీపీపీ’ పక్కాగా సూట్ అవుతుంది’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: టీడీపీ నాయకులు ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగే పరిస్థితి లేదన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. కూటమి ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ దారుణంగా ఉందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో టీడీపీ గుండాల దౌర్జన్యాలు, పోలీసులను ధైర్యంగా ఎదుర్కొని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుపుతామని వ్యాఖ్యలు చేశారు. అలాగే, పీపీపీ అంటే పవర్, ప్రోటోకాల్, ప్యాకేజీ.. ఇవి పవన్కు వర్తిస్తాయని పార్టీ నేత సతీష్రెడ్డి ఎద్దేవా చేశారు.పార్టీ సంస్థాగత నిర్మాణంపై పులివెందులలో వైఎస్సార్సీపీ అవగాహన సదస్సు జరిగింది. ఈ సమావేశానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్, వైఎస్సార్సీపీ నేత వైఎస్ మదన్మోహన్రెడ్డి హాజరయ్యారు. గ్రామ, వార్డు, మండల స్థాయిలో పార్టీ బలోపేతానికి పార్టీ నేతలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్బంగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ..‘కమిటీల ఎంపిక విషయంలో ప్రతి నాయకుడు, కార్యకర్త ఎంతో కష్టపడి ఇష్టపడి పనిచేయాలి. మన పార్టీ ఇన్ని సంవత్సరాలుగా గట్టిగా మనుగడ సాగించిందంటే అది దివంగత నేత వైఎస్సార్ ఆశీస్సులు, జగనన్న ప్రజాదరణ, ముఖ్యంగా కార్యకర్తల రెక్కల కష్టం. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలకు అన్యాయం చేసింది. ఈ ప్రభుత్వంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా ఇచ్చే పరిస్థితి లేదు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, మహిళలకు ఏడాదికి 18,000, వంటి పథకాలను అటకెక్కించారు. పులివెందులలో మెడికల్ కాలేజీ 50 సీట్లను వెనక్కు పంపిన నీచమైన ప్రభుత్వం ఇది. పులివెందుల ప్రాంతంలో అరటి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వైఎస్ జగన్ హయాంలో నిర్మించిన అరటి కోల్డ్ స్టోరేజ్ని ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది. టీడీపీ నాయకులు ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగే పరిస్థితి లేదు. అందుకే పచ్చ పార్టీ నేతలు దాడులు, నేరాలు చేస్తున్నారు.పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో పోలీసుల అండతో యథేచ్ఛగా టీడీపీ గుండాలు దౌర్జన్యాలు చేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్తో పాటు ఇతర నాయకులను దాడులు చేసి పెట్రోల్ పోసి నిప్పు పెట్టే పరిస్థితిని అందరూ చూశారు. అయినా కూడా పోలీసులు బాధితులపైనే తిరిగి కేసులు పెట్టడం నీచమైన సంస్కృతి. ఇలాంటి దారుణమైన పోలీసు వ్యవస్థను ఎప్పుడూ చూడలేదు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో టీడీపీ గుండాల దౌర్జన్యాలు, పోలీసులను ధైర్యంగా ఎదుర్కొని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుపుతాం అని అన్నారు.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి మాట్లాడుతూ..‘ఏ రాష్ట్రంలో లేని దౌర్భాగ్య, నీచమైన ముఖ్యమంత్రి చంద్రబాబు. సూపర్ సిక్స్ పథకాలు సూపర్ ప్లాప్ అయ్యాయి. చంద్రబాబు మాత్రం సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అంటూ ఎల్లో మీడియా ద్వారా డబ్బాలు కొట్టుకుంటున్నాడు. పీపీపీ విధానం పవన్ కళ్యాణ్ మాత్రమే వర్తిస్తుంది. పీపీపీ అంటే పవర్, ప్రోటోకాల్, ప్యాకేజీ.. ఇవి పవన్కు వర్తిస్తాయి. మహిళలకు ఏడాదికి 18000, మూడు సిలిండర్లు, నిరుద్యోగ భృతి రైతు భరోసా పంటి పథకాలను చంద్రబాబు తుంగలో తొక్కాడు. జెడ్పీటీసీ ఎన్నికలలో పులివెందులలో తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జెండాను ఎగురవేస్తాం’ అని ధీమా వ్యక్తం చేశారు. -
నాన్న గారి ఆరోగ్యం ఎలా ఉంది!
తిరుపతి రూరల్: ‘నాన్న గారి ఆరోగ్యం ఎలా ఉంది మోహిత్.. ఈ ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులు ఎంతో కాలం నిలబడవు.. అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొందాం.. మంచి రోజులు వస్తాయ్.. మీకు అండగా నేనున్నాను.. ఎవరు అధైర్యపడవద్దు..’ అంటూ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. చంద్రగిరి అసెంబ్లీ నియోజక వర్గం సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్రెడ్డి తాడేపల్లిలో వైఎస్ జగన్ను మర్యాద పూర్వకంగా కలిశారు. మాజీ సీఎం జగన్ మోహిత్ను ఆప్యాయంగా పలుకరించి మద్యం అక్రమ కేసులో అరెస్టు చేసిన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆరోగ్యం గురించి వాకబు చేశారు. తన తండ్రి ఆరోగ్యంపై జాగ్రత్తలు సూచించారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తనను కలవాలని మోహిత్కు ధైర్యం చెప్పారు. -
చంద్రబాబు బెయిల్ క్యాన్సిల్! జైలుకు వెళ్లడం పక్కా
-
కూటమి సర్కార్పై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది: కాకాణి
సాక్షి, నెల్లూరు జిల్లా: నెల్లూరులో గంజాయి డాన్ అరవ కామాక్షి పక్కాగా టీడీపీకి చెందిన వ్యక్తి అని, ఆ పార్టీ ఎమ్మెల్యేనే ఆమెకు అండగా ఉన్నారని, ఆ మేరకు అనేక ఫోటోలు కూడా ఉన్నాయని వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి స్పష్టం చేశారు. అయినా కామాక్షి వైఎస్సార్సీపీకి చెందిందంటున్నారని, అలా తమ పార్టీకి మసి అంటించాలని చూస్తున్నారని ఆయన ఆక్షేపించారు. చివరకు సీఎం చంద్రబాబు సైతం నిస్సిగ్గుగా అవే మాటలు మాట్లాడుతున్నారని కాకాణి గోవర్థన్రెడ్డి మండిపడ్డారు. ఆయన ఏం మాట్లాడారంటే..:అందుకే కామాక్షి ఇల్లు కూల్చారు:కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. నెల్లూరులో అరవ కామాక్షి ఇల్లు కూల్చివేత ప్రజల అసహనానికి ఒక నిదర్శనం. ఒక హంతకురాలి ఇంట్లో 25 కేజీల గంజాయి దొరికిందంటే, ఆమెకు అధికార పార్టీ అండ ఉన్నట్లు కాదా? ఇంకా అది ఇంటలిజెన్స్ వైఫల్యం కాదా?. అయినా సీఎం చంద్రబాబు వైయస్ఆర్సీపీపై నెపం నెట్టుతున్నారు. కామాక్షి మా పార్టీకి చెందిందని నిస్సిగ్గుగా చెబుతున్నారు. పెంచలయ్య హత్యపై ఇటీవల సీఎం ఒక బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. ఇది అత్యంత హేయం.రాష్ట్రంలో చెలరేగుతున్న డ్రగ్స్ మాఫియా:రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా విచ్చలవిడిగా చెలరేగిపోవడం వల్ల ప్రజలకు రక్షణ లేకుండా పోయింది. నెల్లూరులో మాదకద్రవ్యాల వ్యతిరేకంగా పోరాడిన సామాజిక ఉద్యమకారుడు పెంచలయ్య హత్య ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. చెడు అలవాట్ల నిర్మూలన కోసం పెంచలయ్య అనేక కార్యక్రమాలు నిర్వహించగా, వాటిని సహించలేని గంజాయి, డ్రగ్స్ మాఫియా దారుణంగా హత్య చేసింది. తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో గంజాయి, డ్రగ్స్ నిర్మూలిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు 550 రోజులు పూర్తైనా ఆ పని చేయలేదు. పైగా పరిస్థితి మరింత దయనీయంగా మారింది. డ్రగ్స్ స్మగ్లర్లకు చంద్రబాబు ప్రభుత్వం అండగా నిలుస్తోంది.ప్రభుత్వంపై ప్రజల్లో అసహనం:పెంచలయ్య హత్యలో ప్రధాన నిందితురాలు అరవ కామాక్షిని పోలీసులు అరెస్టు చేసి సోదాలు జరపగా, ఆమె ఇంట్లో 25 కేజీల గంజాయి బయటపడింది. ఆమె టీడీపీ నేతల అండతోనే ఇదంతా చేసిందనే అనుమానాలు కలుగుతున్నాయి. ఒకవేళ ఈ గంజాయి నిజంగా వైయస్ఆర్సీపీ వాళ్లది అయితే అమ్మే ధైర్యం వారికి ఉంటుందా?.చివరకు ప్రజలు స్వయంగా కామాక్షి ఇల్లు కూల్చివేశారంటే మీ ప్రభుత్వంపై నమ్మకం పోయింది అని సందేశం కాదా? కామాక్షి ఇంట్లో గంజాయి ఉన్నట్లు తెలుసుకున్న స్థానికులు ఆగ్రహంతో ఆమె ఇంటిని కూల్చివేయడం ప్రజల్లో పెరిగిన అసహనానికి నిదర్శనం. ఈరోజు కామాక్షి ఇల్లు కూల్చారు. రేపు మీ ప్రభుత్వాన్నే కూల్చేస్తారు. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి బాబూ.టీడీపీ ద్వంద్వ ప్రమాణాలు:బంద్కు ముందు మద్దతు.. ఆ తర్వాత అడ్డుకోవడం. ఇది టీడీపీ రెండు కళ్ల సిద్ధాంతం. ద్వంద్వ ప్రమాణాలు. డిసెంబర్ 2న నెల్లూరు బంద్కు టీడీపీ, వైయస్ఆర్సీపీ, సీపీఐ, కాంగ్రెస్లు మద్దతు తెలిపినట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రకటించారు. తీరా బంద్ సందర్భంగా ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ర్యాలీ నిర్వహిస్తే పోలీసులతో అడ్డుకోవడం ఏమిటి?. ముందుగా మద్దతు ఇచ్చి తరువాత వెనక్కి తగ్గడం టీడీపీ ద్వంద్వ వైఖరికి నిదర్శనం కాదా?.పోలీసులు ఎందుకు భయపడుతున్నారు?:టీడీపీ ప్రభుత్వం రౌడీషీటర్లకు అండగా ఉండటంతో అరాచకాలు పెరిగిపోతున్నాయి. డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్టు చేస్తే వెంటనే ఎమ్మెల్యేల ఆఫీసుల నుంచి ఫోన్లు వెళ్తు్తన్నాయి. కేసుల తీవ్రత తగ్గించి, నిందితులను వదిలివేయడం, అమాయకులను ఇరికించే పరిస్థితి నెలకొంది. పోలీసులు ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరపాల్సిన స్థితి వచ్చింది. ఇది ఎంత దారుణమో పోలీసులే ఆత్మపరిశీలన చేసుకోవాలి. పోలీసులు నిద్ర లేచింది మొదలు ప్రతిపక్షంపై కేసులు పెట్టడానికి మాత్రమే పని చేస్తున్నారు. డ్రగ్స్ మాఫియాపై కఠిన చర్యలు లేవు.ప్రజలు తిరగబడ్డారు. ఇక మౌనం పాటించరు:పెంచలయ్య హత్యకు నిరసనగా ప్రజలు చేపట్టిన బంద్కు వైఎస్సార్సీపీ మద్దతు ప్రకటించింది. అంతే కాకుండా పెంచలయ్య కుటుంబానికి మా పార్టీ పూర్తి అండగా ఉంటుంది. ఇవాళ్టి (మంగళవారం) బంద్ విజయవంతం కావడం.. ప్రజలు ఈ ప్రభుత్వంపై తిరగబడ్డారని చెప్పడానికి నిదర్శనం. పెంచలయ్య సమాజహితం కోసం పని చేశాడు. అలాంటి వ్యక్తిని హత్య చేయడం అత్యంత దుర్మార్గం. ఇవన్నీ చూస్తుంటే.. టీడీపీ కూటమి ప్రభుత్వంపై ఇప్పటికే ప్రజలు తిరగబడ్డారని, వారు ఇక మౌనం వహించరని అర్థమవుతోందని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి స్పష్టం చేశారు. -
టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి శాపం
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో ఒక వైపు పంటల కొనుగోలు లేక, మరోవైపు లేని కనీస మద్దతు ధర వల్ల రైతులు కుదేలవుతున్నారని, ఇంకా ఎక్కడిక్కడ ధాన్యం కళ్లాల్లోనే ఉందని, దీంతో రైతులు నానా ఇబ్బంది పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి కైలే అనిల్కుమార్ వెల్లడించారు. గత 10 రోజులుగా రైతుల సమస్యల పట్ల మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిపించాలని ప్రయత్నిస్తున్నా, అటు వైపు నుంచి ఏ మాత్రం స్పందన రావడం లేదని ఆయన ఆక్షేపించారు.కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంలా మారిందని చెప్పారు. వ్యవసాయంపై చంద్రబాబు, ఎన్నికల ముందు ఒకలా, ఆ తర్వాత మరోలా మాట్లాడారని గుర్తు చేశారు. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు రైతులు కష్టాలు పడుతున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ తెలిపారు. ఏం మాట్లాడారంటే..:సంక్షోభంలో వ్యవసాయ రంగం:గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో వ్యవసాయం ఒక పండగలా సాగింది. విత్తనాలు మొదలు పంటల అమ్మకం వరకు ప్రతి గ్రామంలో రైతుల చేయి పట్టుకుని నడిపించాయి నాటి రైతు భరోసా కేంద్రాలు. వాటిని జగన్ ఏర్పాటు చేశారన్న అక్కసుతోనే, ఇప్పుడు ఆ వ్యసవ్థను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. దీంతో విత్తనాలతో పాటు, యూరియా కోసం కూడా రైతుల క్యూ కట్టక తప్పడం లేదు. యూరియాను బ్లాక్ మార్కెట్లో కొనకా తప్పడం లేదు.చివరకు పంటలు అమ్ముకోవడానికి కూడా ఇప్పుడు రైతులు తీవ్ర కష్టాలు పడుతున్నారు. ఏ ఒక్క పంటకూ కనీస మద్దతు ధర లభించడం లేదు. చాలా చోట్ల ధాన్యం కళ్ళాల్లోనే ఆరబోసి ఉండగా, వరస తుపాన్లు రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అటు ప్రభుత్వం నుంచి ఏ విధంగానూ అండ లేకపోవడం, ధాన్యం కొనుగోళ్లు లేకపోవడం, కనీస గిట్టుబాటు ధర కూడా రాకపోవడం.. ఇవన్నీ వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలో పడవేశాయి.కళ్ళాల్లోనే ధాన్యం. లేని కొనుగోళ్లు:రాష్ట్రంలో ఎక్కడికక్కడ కళ్లాల్లోనే ధాన్యం ఉండిపోయింది. ఇంకా చాలా చోట్ల రోడ్లపైనా ధాన్యం రాసులే ఉన్నాయి. మచిలీపట్నం హైవే మీద పెనమలూరు నుంచి «10 రోజులుగా, ధాన్యం రాసులు పోసి ఉండగా, ఓ మంత్రి అటుగా వెళ్తూ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని, వాటిని అక్కడి నుంచి తీసేయాలని ఆదేశించారు. ఒకవైపు ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం, మరోవైపు రైతులను ఆ విధంగా కూడా ఇబ్బంది పెడుతోంది.మొంథా తుపాన్తో నష్టపోయిన రైతులను ఎలా ఆదుకుంటామనే దానిపై ఇప్పటి వరకు అటు కేంద్రం నుంచి కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఒక్క ప్రకటన కూడా రాలేదు. తుపాన్ తర్వాత కనీసం ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినా, రైతుల కష్టాలు కొంత వరకైనా తీరేవి. కానీ, కూటమి ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీకి పూర్తిగా మంగళం పాడింది.దారుణంగా పడిపోయిన ధరలు:మా పామర్రు నియోజకవర్గంలో 75 కేజీల బస్తా ధాన్యాన్ని కనీసం రూ.1000కి కూడా కొనుగోలు చేయని దుస్థితి నెలకొంది. తేమ పేరుతో తూకం తగ్గిస్తున్నారు. అలా ఒక్కోసారి 75 కేజీల బస్తాల్లో 12 కేజీల వరకు తీసేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లలో వ్యాపారులు, దళారులదే రాజ్యంగా మారింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో, ధాన్యం కొనుగోళ్లలో ఆర్బీకేలు పని చేయడం వల్ల, ఏనాడూ రైతులు ఇలా ఇబ్బంది పడలేదు.ఇప్పుడు మినుములు, పెసలు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, టమోటా, చీనీ, మామిడి ఇలా దేనికీ మద్దతు ధర ఇచ్చిన పరిస్ధితి లేదు. అరటి అయితే మరీ దారుణంగా కేజీ కనీసం 50 పైసలు కూడా పలకడం లేదు. ఇకనైనా ప్రభుత్వం పంటలకు కనీస మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని కైలే అనిల్కుమార్ కోరారు. అలాగే రైతుల సమస్యలపై నోరెత్తితే, కక్ష సాధింపు చర్యలు విడనాడి, వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించాలని మాజీ ఎమ్మెల్యే తేల్చి చెప్పారు. -
కేసులు ఎదుర్కొనే ధైర్యం లేక.. చంద్రబాబు అడ్డదారులు: బొత్స
సాక్షి, విజయవాడ: తనపై ఉన్న అవినీతి కేసులను మూసివేయించడానికి సీఎం చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ.. ఒక పద్ధతి ప్రకారం కుట్రపూరితంగా వ్యవహరించి కేసులు మూసివేయిస్తున్నారంటూ దుయ్యబట్టారు.‘‘ఆ కేసుల్లో ఫిర్యాదుదారులుగా ఉన్న అధికారులను బెదిరించి, భయపెట్టి వాటిని ఉపసంహరించు కునేలాచేస్తున్నారు. ఆ ఆరోపణలపై నిష్పక్షపాతంగా వ్యహరించాల్సిన దర్యాప్తు అధికారులు కూడా పూర్తిగా కేసుల మూసివేతకు సహకరిస్తున్నారు. తనపై ఉన్న కేసులను ఎదుర్కొనే ధైర్యం లేక చంద్రబాబు అడ్డదారులు తొక్కుతున్నారు.’’ అని బొత్స మండిపడ్డారు.‘‘తద్వారా వ్యవస్థలను కలుషితం చేసి, ప్రజాస్వామ్య వ్యవస్థలను అపహాస్యం చేస్తున్నారు. దేశంలో ఇంత బరితెగింపునకు దిగిన రాజకీయ నాయకుడ్ని ఎక్కడ చూడం. తన రాజకీయ జీవితం ప్రారంభం నుంచి కూడా చట్టం నుంచి ఈ రకంగా తప్పించుకోవడం చంద్రబాబుకి అలవాటే. అదే ఈసారి కూడా కొనసాగుతోంది. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుపై గవర్నర్ తక్షణం చర్యలు తీసుకోవాలి. అధికార దుర్వినియోగాన్ని అడ్డుకోవాలి. దర్యాప్తు సంస్థల స్వతంత్రతను కాపాడాలి’’ అని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. -
రాజకీయాల్లో చంద్రబాబు వింత పోకడ: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: దేశంలో తప్పుడు రాజకీయాలు చేయటంలో చంద్రబాబు దిట్ట.. ఎప్పటికప్పుడు వింత పోకడలతో దిగజారుడు రాజకీయాలు చేస్తారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని దుయ్యబట్టారు. మంగళవారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లటం గతంలో చూశాం. ఇప్పుడు డబ్బు ఇచ్చి పదవులు కొనుక్కునే పరిస్థితి తెచ్చారు’’ అంటూ మండిపడ్డారు.‘‘డబ్బులు ఇచ్చి రాజీనామా చేయిస్తారు. తర్వాత ఆ డబ్బులు ఇచ్చిన వారికి పదవులు ఇస్తారు. పదవులు కొనుక్కునే వారిని కూడా చంద్రబాబే చూస్తారు. ముందే బేరం మాట్లాడి అడ్వాన్స్ ఇచ్చి రాజీనామాను చేయిస్తారు. ఎన్టీఆర్ హయాం నుండి ఇలాంటి కుట్ర రాజకీయాలు చేయటం చంద్రబాబు కు అలవాటే. ప్రజాస్వామ్యం, చట్టం, విలువులు అనేవీ పట్టించుకోని వ్యక్తి చంద్రబాబు. ఇలాంటి నాయకులు వస్తారని రాజ్యాంగం రాసేటపుడు అంబేద్కర్ కూడా ఊహించి ఉండరు’’ అంటూ పేర్ని నాని చురకలు అంటించారు.‘‘వైద్యం చేయించుకోకపోతే చచ్చిపోతాడని బెయిల్ తెచ్చుకున్న చంద్రబాబు ఇప్పటికీ ఆస్పత్రి కి వెళ్లలేదు. అధికారులను బెదిరించి తన మీద ఉన్న కేసులను మూయించేసుకుంటున్నారు. బెయిల్ ఉత్తర్వులను కూడా ఉల్లంఘించారు. అధికారాన్నిఅడ్డం పెట్టుకుని కేసులు మాఫీ చేయించుకుంటున్నారు. అమరావతిని చంద్రబాబు చంపేశారు. అసలైన కుట్ర దారు చంద్రబాబేనని రాజధాని రైతులే అంటున్నారు. అమరావతికి ఏ పరిశ్రమా రావటం లేదు. పెద్ద పెద్ద పరిశ్రమలన్నీ వైజాగ్ వెళ్తుంటే ఇక అమరావతిలో భూములకు రేట్లు ఎలా వస్తాయి?..హైవే నిర్మాణం చేస్తూ జగన్ రైతులకు మేలు చేశారు. ప్రధాన రోడ్డుకు పక్కనే చంద్రబాబు ఎలా ఇల్లు కట్టుకోగలిగారు?. రైతులకు ప్లాట్లు ఇవ్వకుండా మళ్ళీ రెండు విడత భూసమీకరణ ఎలా చేస్తారని రైతులే ప్రశ్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చింది కేవలం కేవలం దోచుకోవటానికి, తమ మీద ఉన్న కేసులను మాఫీ చేసుకోవటానికే. దోచుకున్న సొమ్మంతా దుబాయ్లో దాచుకుంటున్నారు. దొంగ సర్టిఫికేట్ తెచ్చుకున్నంత మాత్రాన చంద్రబాబు పునీతుడు కాదు. కచ్చితంగా చంద్రబాబు మీద ప్రకృతి తిరగపడుతుంది. అప్పుడు ఇవే కోర్టులు చంద్రబాబును జైలుకు పంపుతాయి..గోదావరి జిల్లాలో కొబ్బరి చెట్ల చనిపోవటంపై శాస్త్రవేత్తలతో పరిశోధన చేయించాలి. రైతులతో పాటు కొబ్బరి చెట్లకు కూడా ఊపిరి పోయాలి. ప్రజల అవసరాలు తీర్చటం చేతకాకే పవన్ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. లోకేష్ విమానాలు ఎలా తిరుగుతున్నారు. రూ.50 కోట్ల విలువైన భూమిని ఎకరా 99 పైసలకే తీసుకున్న వారు పెడుతున్నారా?. లోకేష్ బినామీలు ఖర్చు పెడుతున్నారా?. ఎవరు డబ్బు ఖర్చు చేస్తే విమానాల్లో తిరుగుతున్నారో లోకేష్ చెప్పాలి. చంద్రబాబు బినామీ పేరుతో హెలికాఫ్టర్ కొన్నారు. మరి లోకేష్ వాడుతున్న విమానాలకు డబ్బు ఎవరు కడుతున్నారు?. వారానికి రూ.20 లక్షల ఖర్చు ఎవరు చేస్తున్నారో చెప్పే దమ్ముందా?చంద్రబాబు అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకున్నారు. దీనిపై నేనే స్వయంగా ఆర్టీఐ ద్వారా అడిగి రెండేళ్లయినా ఎందుకు ఇవ్వటం లేదు?. పవన్ కళ్యాణ్ సినిమా మ్యాట్నీకే ఎవరూ వెళ్లటం లేదు. నిర్మాతలు రోడ్డున పడ్డారు. ఇప్పటివరకు జీఎస్టీ కూడా నిర్మాతలు చెల్లించలేదు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు దుర్మార్గపు విషపు ప్రచారాలను జనం నమ్మారు. ఇప్పుడు వారి మోసాన్ని జనం గ్రహించారు. తగిన సమయంలో తగిన గుణపాఠం నేర్పుతారు’’ అని పేర్ని నాని అన్నారు. -
Kasu Mahesh: నువ్వు బచ్చా గాడివి వెళ్ళి మీ అయ్యను అడుగు జూల "కంత్రి" బ్రహ్మానంద రెడ్డి
-
రైతులకు సంఘీభావంగా బుగ్గన పాదయాత్ర
సాక్షి, నంద్యాల జిల్లా: రైతుల పక్షాన మరో పోరాటానికి వైఎస్సార్సీపీ సిద్ధమైంది. రైతులకు సంఘీభావంగా వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పాదయాత్ర చేపట్టారు. అరటికి గిట్టుబాటు ధరలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్యాపిలి మండలంలో క్షేత్రస్థాయిలో అరటి పంటలను బుగ్గన పరిశీలించారు.హుసేనాపురం నుంచి డి.రంగాపురం వరకు ఆయన పాదయాత్ర చేపట్టారు. ప్యాపిలీ మండలంలో దాదాపు 4వేల ఎకరాల్లో రైతులు అరటి సాగు చేస్తుండగా.. గిట్టుబాటు ధరలేక గెలలను పొలాల్లోనే వదిలేస్తున్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని బుగ్గన రాజేంద్రనాథ్ డిమాండ్ చేశారు.‘‘మొక్క జొన్నకు మద్దతు ధర 2400 ప్రకటించిన ప్రభుత్వం.. రైతుల దగ్గర నుంచి ఇంత వరకు కొన్న పాపాన పోలేదు. నాడు జగన్ ప్రభుత్వంలో రైతులకు సకాలంలో మద్దతు ధర, ఎరువులను అందించేవారు నేడు కూటమి ప్రభుత్వంలో అధ్వాన పరిస్థితి నెలకొంది. రైతుల బీమా కోసం ఏడాదికి దాదాపు రూ.1500 కోట్లు ఖర్చు చేశాం. ప్యాపిలిలో రూ.50 కోట్ల రూపాయలు ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ మార్కెట్ ఏర్పాటు చేయడం కోసం శాంక్షన్ చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్క ఇటుక కూడా వేయకుండా ఆపేశారు. ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ మార్కెట్ ఏర్పాటు చేసింటే నేడు దళారులు వచ్చి కొనుగోళ్లు జరిపేవారు.రైతులను పట్టించుకోకుండా ఐటీ, ఆర్టిఫీషియల్ టెక్నాలజీ అంటూ రైతుల సమస్యలను గాలికి వదిలేశారు. గత ప్రభుత్వంలో అన్నీ సౌకర్యాలు, ఏర్పాట్లు కల్పించడంతో అరటి పంట రైతులు విదేశాలకు ఎగుమతులు చేశారని స్పష్టం చేశారు. ఇప్పటికైన కూటమి ప్రభుత్వం దిగొచ్చి రైతుల పక్షాన నిలబడి గిట్టుబాటు ధరలు కల్పించాలి. రైతులకు ఎప్పుడూ అండగా ఉంటాం, రైతుల కోసం పోరాటం చేస్తాం’’ అని బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. -
‘అప్పులు.. గొప్పలు.. అబద్ధాలు తప్ప బాబు చేసిందేమీ లేదు’
సాక్షి, కాకినాడ జిల్లా: కూటమి సర్కార్ పోకడలు చూస్తే.. ఇది ప్రజాస్వామ్యమా? అనిపిస్తుందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. మనం బాగుండాలనే స్వలాభమే కనిపిస్తుంది తప్ప.. ప్రజల బాగు కోసం ఆలోచించడం లేదు’ అని చంద్రబాబు ప్రభుత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘గత చంద్రబాబు పాలనలో లిక్కర్ స్కామ్ అవినీతి జరిగిందని 2023లో సీఐడీ కేసు పెట్టింది. ఇప్పుడు అదే సీఐడీ అధికారులు ఈ కేసుకు, మాకు సంబంధం లేదని వాంగూల్మం ఇచ్చారు. చంద్రబాబు తన మీద కేసును తానే విచారించుకుని.. తానే తీర్పు ఇచ్చేస్తున్నాడు. క్యాబినెట్ తీర్మానం.. ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా మద్యం విషయంలో అప్పట్లో నిర్ణయాలు జరిగాయి. తన మీద కేసును ఆయనే కొట్టేసుకుంటున్నారు...నిజంగా చంద్రబాబు నిరాపరాధి అయితే.. ఈ కేసును ఎందుకు కోర్టు ద్వారా విచారించుకోవడం లేదు. ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను బెదిరిస్తున్నారు. చంద్రబాబు పోరాటం.. ఆరాటం ఎందుకు జరుగుతుంది?. ప్రభుత్వ సొమ్ముతో సిద్దార్ధ లూథ్రా అనే న్యాయవాధికి ఫీజులు ఇచ్చి కేసులు వాదించుకుంటున్నాడు. చంద్రబాబు హయం లో స్కిల్ స్కామ్, ఇన్నర్ రోడ్డు వంటి పలు కేసులు ఉన్నాయి...చంద్రబాబుది ఎప్పుడు డబుల్ యాక్షనే. ఎన్నికలకు ముందు ఒక యాక్షన్.. ఎన్నికలు అయ్యాక మరో యాక్షన్. అప్పులు.. గొప్పలు.. అబద్ధాలు తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదు. చంద్రబాబు చేసే ఒక్క రోజు అప్పుతో ఒక మెడికల్ కళాశాల పూర్తవుతుంది. ఒక అరటిపండు అర్ధ రూపాయికి అమ్ముకునే పరిస్థితి రైతులకు దాపురించింది. వైఎస్ జగన్ హయంలో టన్ను అరటి రూ.25 వేలకు అమ్ముడు పోయింది. చంద్రబాబు రియల్ ఇంటిలెన్స్ ఏమైపోయింది?. చౌకగా వైజాగ్లో భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నాడు. గత 18 నెలల కాలంలో కొత్తగా ఎన్ని పెన్షన్లు ఇచ్చారో చెప్పాలి’’ అంటూ కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. -
వాయు కాలుష్యంపై వార్ ప్రకటించాలి: ఎంపీ అయోధ్య రామిరెడ్డి
ఢిల్లీ: ఢిల్లీ వాయు కాలుష్యంపై రాజ్యసభ జీరో అవర్లో వైఎస్ఆర్ సిపి ఎంపీ అయోధ్య రామిరెడ్డి స్పంధించారు. దీన్ని జాతీయ రాజకీయ, సామాజిక ప్రాధాన్యతాంశంగా తీసుకోవాలి. కాలుష్యం అనేది కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదు ఇది ఆరోగ్య ఆర్థిక పరమైన సమస్య. వాయు కాలుష్యంతో మన దేశం ప్రతి ఏడాది మూడు శాతం జీడీపీని కోల్పోతుంది. ప్రజలపై వైద్య చికిత్సల భారం పడి ఉత్పాదకతను కోల్పోతున్నారు. కాలుష్యంతో తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధుల భారిన పడుతున్నారు.ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా మారుతుంది. కాలుష్య నియంత్రణకు తగిన పాలసీ రూపొందించి కఠిన చర్యలు అమలు చేయాలి. వ్యర్ధాల నిర్వహణ, పవర్ ప్లాంట్ కంట్రోల్ , ఎయిర్ క్వాలిటీ, క్లీన్ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టాలి. జాతీయ సామాజిక, రాజకీయ ప్రాధాన్యత అంశంగా దీన్ని తీసుకోవాలి. కాలుష్యం నియంత్రణకు రియల్ టైం డేటాతో తగిన చర్యలు తీసుకోవాలి. ఢిల్లీలో వాయు కాలుష్యం హెల్త్ ఎమర్జెన్సీని తలపిస్తుంది. ఇక్కడ ప్రతి ఏడుగురిలో ఒకరు అకాల మరణ ముప్పును కాలుష్యం వల్ల ఎదుర్కొంటున్నారు.గతేడాది 17 వేల మంది వాయు కాలుష్యం వల్ల చనిపోయారు. వాయు నాణ్యత ప్రమాదకర స్థాయిలో కొనసాగుతుంది. వాహన కాలుష్యం ,పంట వ్యర్ధాల దహనం, నిర్మాణ పనుల వల్ల ఢిల్లీలో కాలుష్యం పెరుగుతుంది. ఈ తరహాలోనే విశాఖపట్నంలో కూడా పీఎం 10 లెవెల్స్ గడిచిన ఏడేళ్లలో 32.9 శాతం పెరిగింది. నేషనల్ క్లీన్ ఎయిర్ కార్యక్రమం కింద ఏపీకి 129.4 కోట్లు కేటాయిస్తే 39 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. కింది స్థాయిలో పర్యవేక్షణ లోపం, అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం,స్థానిక యంత్రాంగ పట్టించుకోకపోవడంతో కాలుష్యం పెరుగుతుందని అయోధ్య రామిరెడ్డి అన్నారు. -
విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం వద్దు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లోని వసతి గృహాల్లో వరుసగా ఫుడ్పాయిజనింగ్ ఘటనలు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదని వైఎస్సార్సీపీ ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి చెప్పారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడొద్దని చంద్రబాబు ప్రభుత్వాన్ని సోమవారం లోక్సభలో కోరారు. నాయుడుపేట, సత్యవేడు, శ్రీకాళహస్తితో పాటు రాష్ట్రంలో జరిగిన పలు సంఘటనలు తనను తీవ్రంగా కలచివేశాయన్నారు. ప్రభుత్వ వసతి గృహాలు, పాఠశాలల్లో పరిశుభ్రత లోపం, పాడైన ఆర్వో ప్లాంట్లు, శుభ్రం చేయని నీటిట్యాంకులు, వంటగది అపరిశుభ్రతవల్ల విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్న నేపథ్యంలో ఈ సమస్యపై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం వంటి వివరాలు తెలపాలని కోరారు. దీనికి కేంద్ర విద్యా శాఖ సహాయమంత్రి జయంత్ చౌదరి జవాబిస్తూ.. ఇటీవల కొన్ని పాఠశాలల్లో నీరు, ఆహారం కలుషితం కావడం వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, వారందరికీ చికిత్సచేసి డిశ్చార్జ్ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందని చెప్పారు.రాష్ట్రంలో 22 పీఎంకేకేలునైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ఏపీలో 22 ప్రధానమంత్రి కౌశల్ కేంద్రాలు (పీఎంకేకేలు) ఏర్పాటు చేసినట్లు కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి జయంత్ చౌదరి తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. వీటి ద్వారా 2022–25 మధ్య 12,091 మంది శిక్షణ పొందారన్నారు.మడ అడవుల అభివృద్ధికి రూ.13.077 కోట్లు రాష్ట్రంలో మడ అడవుల అభివృద్ధి కోసం రూ.13.077 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సహాయమంత్రి కీర్తివర్థన్ సింగ్ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ తనూజారాణి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. మడ అడవులను ప్రోత్సహించడానికి, పునరుద్ధరించడానికి, తీరప్రాంత పర్యావరణ వ్యవస్థల స్థితిస్థాపకతను పెంచడానికి మాంగ్రోవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్లైన్ హాబిటాట్స్, టాంజిబుల్ ఇన్కమ్స్ ప్రారంభించినట్లు చెప్పారు.ప్రభుత్వ బడుల్లో భారీగా తగ్గిన విద్యార్థుల సంఖ్య..ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిందని కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి జయంత్ చౌదరి చెప్పారు. వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ సమాచారం ప్రకారం.. 2024–25లో 1–8 తరగతుల విద్యార్థుల నమోదు తగ్గి నట్లు చెప్పారు. 2022–23లో 31,71,466 మంది బడికి రాగా.. 2024–25లో 26,15,935 మంది మాత్రమే హాజ రైనట్లు తెలిపారు. 2022–23 కంటే 2024–25లో 5,55,531 మంది తగ్గిపోయారని చెప్పారు. -
‘సీమ’ అరటి రైతులను ఆదుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: రాయలసీమ ప్రాంతంలో.. ముఖ్యంగా వైఎస్సార్ కడప జిల్లాలో అరటి రైతులు తీవ్రసంక్షోభంలో ఉన్నారని, ధరలు భారీగా పతనం కావడంతో దిక్కుతోచనిస్థితిలో ఉన్నారని వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యసభ జీరో అవర్లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల పులివెందుల ప్రాంతంలో అరటి రైతుల కష్టాలను స్వయంగా పరిశీలించారని, ఆయన సూచన మేరకు ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకొస్తున్నానని చెప్పారు. కరవు ప్రాంతమైనప్పటికీ రైతులు ఆధునిక టిష్యూ కల్చర్ (జీ9/కావెండిష్ రకం) ఎకరాకు 60–70 టన్నుల వరకు దిగుబడి సాధిస్తున్నారన్నారు. ప్రధాన సాగుప్రాంతమైన పులివెందులలో ఇటీవల వరకు టన్ను రూ.22 వేలు పలికిన అరటి ధర నెలరోజుల్లోనే టన్ను వందల రూపాయలకు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మంచి దిగుబడి వచ్చినా గిట్టుబాటుధర లేకపోవడంతో పంటను అమ్ముకోలేక రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. గెలలు చెట్ల మీదే పండి కుళ్లిపోతున్నాయని, కొన్నింటిని పారవేస్తున్నారని తెలిపారు. మరోవైపు వర్షాభావ పరిస్థితులు, కరవు కారణంగా 2025 ఖరీఫ్ సీజన్లో సాగు గణనీయంగా తగ్గిపోయిందన్నారు. వైఎస్సార్ కడప జిల్లాలో సాధారణ సాగుతో పోలిస్తే 19–35 శాతం మాత్రమే సాగు జరిగిందని చెప్పారు. ధరలు పడిపోయిన నేపథ్యంలో రైతులు నష్టపోకుండా ఉండేందుకు ముంబై, కోల్కతా వంటి ప్రాంతాలకు రైలుమార్గం ద్వారా అరటిని తరలించాలని సీఎం ఆదేశించారని, అయితే ఇంతటి తీవ్రమైన సంక్షోభంలో ఉన్న రైతులకు ఇది ఏమాత్రం సరిపోదని తెలిపారు. కేవలం అధిక దిగుబడినిచ్చే టిష్యూ కల్చర్ పద్ధతులను ప్రోత్సహిస్తే సరిపోదని, మార్కెట్ కుప్పకూలినప్పుడు, ప్రకృతి సహకరించనప్పుడు రైతులకు స్థిరమైన ఆదాయం లభించేలా భరోసా కల్పించాలి్సన అవసరం ఉందని చెప్పారు. కేంద్ర వ్యవసాయశాఖ తక్షణమే స్పందించి రాయలసీమ అరటి రైతులను ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.కడప విమానాశ్రయానికి రూ.606.4 కోట్లువైఎస్సార్సీపీ ఎంపీ మేడా రఘునాథరెడ్డి ప్రశ్నకు కేంద్రం జవాబు వైఎస్సార్ కడప జిల్లాలోని కడప విమానాశ్రయానికి ఉడాన్ పథకం కింద 2024–25లో రూ.606.4 కోట్లు కేటాయించినట్లు కేంద్ర పౌరవిమానయానశాఖ సహాయమంత్రి మురళీధర్ మోహల్ తెలిపారు. ఈ నిధులను పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చుచేసినట్లు చెప్పారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ ఎంపీ మేడా రఘునాథరెడ్డి ప్రశ్నకు ఆయన జవాబిచ్చారు. ఈ విమానాశ్రయాన్ని 2017 మార్చి 30న రూ.99.36 కోట్లతో రీజనల్ కనెక్టివిటీ స్కీం కింద గుర్తించినట్లు తెలిపారు. ప్రస్తుతం కడప నుంచి చెన్నై, విజయవాడ, హైదరాబాద్కు ఇండిగో విమానాలు రాకపోకలు సాగిస్తున్నట్లు చెప్పారు.జీపీఎస్ స్ఫూఫింగ్ నిజమేఇటీవల ఢిల్లీ విమానాశ్రయంలో జీపీఎస్ స్ఫూఫింగ్ జరిగినమాట వాస్తవమేనని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్నాయుడు తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ ఎస్.నిరంజన్రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. ఢిల్లీ విమానాశ్రయంలో ఈ స్ఫూఫింగ్కు గురైనట్లు చెప్పారు. దేశంలో 15 విమానాశ్రయాలు ఉడాన్ పథకం కింద పనిచేయడంలేదని కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహల్ నిరంజన్రెడ్డి మరో ప్రశ్నకు జవాబిచ్చారు. పరిశ్రమలకు సకాలంలో ఆర్థిక సహాయాన్ని చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు నిరంజన్రెడ్డి ప్రశ్నకు ఆ శాఖ సహాయ మంత్రి శోభ కరన్దాల్జే చెప్పారు. దేశంలో సింగిల్ స్క్రీన్లు తగ్గుతున్నాయని, వాటి నిర్మాణం, పునరుద్ధరణ కోసం సింగిల్ విండో క్లియరెన్స్ ఇవ్వాలని నిరంజన్రెడ్డి జీరో అవర్లో కోరారు. థియేటర్ ఫుడ్, బేవరేజెస్ ధరలపై నియంత్రణ తేవాలన్నారు.విశాఖ మెట్రోకు ప్రతిపాదనలురాష్ట్ర ప్రభుత్వం విశాఖలో సమాన భాగస్వామ్య నమూన కింద 46.23 కిమీ మెట్రో రైలు ప్రాజెక్టు కోసం సవరించిన ప్రతిపాదనలను సమర్పించినట్లు కేంద్ర పట్టణాభివృది్ధశాఖ సహాయమంత్రి టోకాన్ సాహు తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ గొల్ల బాబురావు ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. మెట్రో రైలు విధానం–2017 ప్రకారం అంచనా అవసరం, సాధ్యాసాధ్యాలు, వనరుల లభ్యతపై ఆమోదం ఆధారపడి ఉంటుందని చెప్పారు. అందువల్ల మంజూరు కోసం ఎటువంటి సమయం పేర్కొనలేమని తెలిపారు. -
చిట్టితల్లిపై వైఎస్ జగన్ ప్రేమ.. నెట్టింట వైరల్
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ ఏం చేసినా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అయిపోతుంటుంది. తాజాగా గన్నవరం ఎయిర్పోర్టులో ఓ చిన్నారి పట్ల ఆయన చూపించిన ప్రేమ నెట్టింటకు చేరింది. గన్నవరం ఎయిర్పోర్టులో జగన్ను చూసేందకు ఓ వ్యక్తి తన కూతురితో కలిసి వచ్చారు. ఆ బాలిక చెప్పు కాలి నుంచి జారిపోయింది. అది గమనించిన వైఎస్ జగన్ ఆమె చెప్పును అందించి.. ఆ చిన్నారిని ఆప్యాయంగా స్పృశించారు. తద్వారా పిల్లల పట్ల తనకు ఉండే ఆప్యాయతను మరోసారి ప్రదర్శించారు. అక్కడే ఉన్న కొందరు తమ ఫోన్లలో ఆ క్షణాలను బంధించగా.. అదిప్పుడు వైరల్ అవుతోంది. Man of Simplicity – YS Jagan ✨🙏💙 pic.twitter.com/KqxTnqpEvP— Johny Kaki (@johny_kaki) December 2, 2025 -
‘సుప్రీం’లో చెవిరెడ్డి మోహిత్రెడ్డికి మళ్లీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్సీపీ యువనేత చెవిరెడ్డి మోహిత్రెడ్డి(chevireddy mohith reddy)కి సుప్రీంకోర్టులో మరోసారి ఊరట లభించింది. ఏపీ లిక్కర్ కేసులో ఆయనపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని గతంలో ఇచ్చిన మధ్యంతర రక్షణ ఉత్తర్వులు జనవరి 19 వరకు పొడిగించింది. ఈ కేసుకు సంబంధించి సోమవారం జరిగిన విచారణలో ఏపీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది.. కేసును త్వరగా తేల్చాలని, ఎక్కువ గడువు ఇవ్వొద్దని కోరినప్పటికీ, ధర్మాసనం విచారణను జనవరికి వాయిదా వేసింది. రెండునెలల గడువు వద్దే వద్దు.. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం ఎదుట సోమవారం ఈ కేసు విచారణకు వచ్చింది. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు కొంత సమయం కావాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. దీనికి స్పందించిన ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయడానికి ‘రెండు నెలల సమయం’ ఇస్తామని ప్రతిపాదించింది. ప్రభుత్వ న్యాయవాది వెంటనే జోక్యం చేసుకుని.. ‘మై లార్డ్స్.. మాకు రెండు నెలల సమయం వద్దు. కేవలం రెండు వారాలు చాలు. ఈ కేసులో పిటిషనర్ (మోహిత్రెడ్డి) ఇప్పటికే అరెస్టు నుంచి రక్షణ పొందుతున్నారు. ఎక్కువ రోజులు వాయిదా వేస్తే అది దర్యాప్తుపై ప్రభావం చూపుతుంది. కాబట్టి కౌంటర్ దాఖలు చేయడానికి మాకు రెండు వారాల సమయం చాలు’ అని కోర్టును కోరారు. అంతేగాక.. సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ఈ కేసులో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్నారని, ఆయన అందుబాటులో లేనందున తదుపరి తేదీని నిర్ణయించాలని కోరారు. దీంతో ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 19కి వాయిదా వేసింది. అప్పటివరకూ మోహిత్రెడ్డిని అరెస్టుచేయడానికి వీల్లేకుండా ఉన్న మధ్యంతర రక్షణ కొనసాగనుంది. -
‘లాంఛనాలను’ బట్టి అంచనాలు
నక్కపల్లి: బల్క్ డ్రగ్ పార్క్, ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం నివాస ప్రాంతాలు త్యాగం చేసిన నిర్వాసితులకు చెల్లించాల్సిన నష్టపరిహారం విషయంలో ప్రభుత్వం అన్యాయం చేస్తోంది. సేకరిస్తున్న భూముల్లో తొలగించేందుకు గుర్తించిన ఇళ్లకు నష్టపరిహారం అంచనా వేయడంలో ఏపీఐఐసీ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. టీడీపీ నాయకులు సూచించిన వారికి, లాంఛనాలు(కమీషన్లు) అందించే వారికి అధికంగానూ, మిగిలిన వారికి తక్కువగానూ నష్టపరిహారాన్ని అంచనా వేస్తున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి, న్యాయం చేయాలని కోరుతూ సోమవారం బాధితులంతా వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ, సీపీఎం జిల్లా కార్యవర్గసభ్యులు ఎం.అప్పలరాజు, చందనాడ ఎంపీటీసీ గంటా తిరుపతిరావు, రైతు నాయకుడు తళ్ల భార్గవ్ల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. తహసీల్దార్ ఆర్.నరసింహమూర్తికి వినతి పత్రం ఇచ్చారు. నిర్వాసిత జాబితాలో స్థానికేతరులు చందనాడ పంచాయతీ తమ్మయ్యపేటలో సర్వే నెం. 90/9, 90/10లలో సుమారు 12 ఎకరాల విస్తీర్ణంలో 70 ఇళ్లు ఉన్నాయి. ఈ 12 ఎకరాలను ప్రభుత్వం స్టీల్ప్లాంట్ కోసం సేకరిస్తోంది. ఇందులో ఉన్న నిర్మాణాలకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. ఇళ్లతోపాటు, రైతులకు చెందిన పశువుల షెడ్లు కూడా ఉన్నాయి. ఇళ్లకు చదరపు అడుగుకు రూ.750 చొప్పున నష్టపరిహారం చెల్లించడానికి నిర్ణయించింది. ఏపీఐఐసీ, ఆర్అండ్బీ అధికారులు నిర్మాణాలకు విస్తీర్ణాన్ని బట్టి నష్టపరిహారం అంచనాలు తయారు చేస్తున్నారు. ఆర్సీసీ శ్లాబ్ ఇళ్లకు తక్కువగా, షెడ్లు, పెంకుటిళ్లకు అధికంగా అంచనాలు తయారు చేసి, నష్టపరిహారం కోసం సిఫార్సు చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. ఎన్యూమరేషన్లో దయ అనే ఏపీఐఐసీ అధికారి చేతివాటం ప్రదర్శిస్తున్నారని, సదరు అధికారి కూటమి నాయకులు సూచించిన వారికి, కమీషన్లు ఆశ చూపించిన వారికి అధికంగా నష్టపరిహారం సిఫార్సు చేశారని పేర్కొన్నారు. ఈ సర్వే నంబర్లలో 70 మంది మాత్రమే ఇళ్లు నిర్మించుకుని ఎప్పటినుంచో కాపురాలు చేస్తుంటే దాదాపు 50 మంది స్థానికేతరులను అదనంగా నిర్వాసితుల జాబితాల్లో చేర్చారని విమర్శిస్తున్నారు. అనర్హులు, స్థానికేతరుల జాబితాను తహసీల్దార్కు అందించారు. వివరాల నమోదులో పక్షపాతం ఆరు సెంట్ల విస్తీర్ణంలో రెండు ఆర్సీసీ శ్లాబ్ ఇళ్లు కలిగిన దొరబాబు అనే నిర్వాసితుడికి కేవలం రూ.6 లక్షల నష్టపరిహారం సిఫార్సు చేసి, రెండు సెంట్ల స్థలంలో వేరొకరి రేకుల షెడ్డుకు రూ.5 లక్షల పరిహారానికి సిఫార్సు చేశారని బాధితులు పేర్కొన్నారు. ఒకే ఇంటికి సంబంధించి ఇద్దరు నివసిస్తుంటే ఒకరికి అదనంగా, మరొకరికి తక్కువగా పరిహారం చెల్లించేందుకు సిఫార్సు చేసినట్లు వివరించారు. తాము ఇచ్చిన ఫిర్యాదులపై బహిరంగ విచారణ జరిపి, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునేవరకు నష్టపరిహారం తీసుకోబోమని, ఇళ్లను కూడా ఖాళీ చేసేది లేదని స్పష్టం చేశారు. ఈ ఫిర్యాదులపై విచారణ జరిపిస్తామని, డీఈ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఎన్యూమరేషన్ చేయిస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు. -
కేసులను ఎదుర్కొనే దమ్ములేక మూసేయించుకుంటున్నారా?
సాక్షి, అమరావతి: అవినీతి కేసులను ఎదుర్కొనే ధైర్యం లేక వాటి నుంచి తప్పించుకోవడానికి అడ్డదారులు తొక్కుతున్నారంటూ సీఎం చంద్రబాబుపై శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల అసైన్డ్ భూముల కుంభకోణం కేసు, తాజాగా మద్యం కుంభకోణం కేసును మూసేయించుకోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ కేసుల్లో ఫిర్యాదుదారులైన అధికారులు కొందరిని లేని స్కాంలలో ఇరికించి.. భయపెట్టి.. ఫిర్యాదును వెనక్కి తీసుకునేలా చేస్తే, మరికొందరితో కూడా అడ్డదారుల్లో ఫిర్యాదులను ఉపసంహరించుకునేలా చేస్తున్నారని మండిపడ్డారు.దర్యాప్తు సంస్థలు సైతం కేసుల మూసివేతకు సహకరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెయిల్పై ఉన్న చంద్రబాబు ఇలాంటి చర్యలకు పాల్పడ్డం అత్యంత దుర్మార్గమన్నారు. దేశంలో ఎక్కడా ఇంతటి అధికార దుర్వినియోగాన్ని చూడలేదన్నారు. తక్షణమే చంద్రబాబు అధికార దుర్వినియోగాన్ని నిలువరించాలని గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు చర్యలపై న్యాయపోరాటం చేస్తామని కూడా బొత్స హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ముఖ్యాంశాలు..కుట్రపూరితమే..‘ఒక పద్ధతి ప్రకారం కుట్రపూరితంగా వ్యవహరించి కేసులు మూసివేయిస్తున్నారు. వ్యవస్థలను కలుషితం చేసి, ప్రజాస్వామ్య వ్యవస్థలను అపహాస్యం చేస్తున్నారు. తన రాజకీయ జీవితం ప్రారంభం నుంచి కూడా చట్టం నుంచి ఈ రకంగా తప్పించుకోవడం చంద్రబాబునాయుడికి అలవాటే. అదే ఒరవడి ఈసారి కూడా కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2014–19 మధ్య చంద్రబాబు చేసిన అవినీతికి సంబంధించి పక్కా ఆధారాలు, సాక్ష్యాలతో పలు కేసులు నమోదయ్యాయి. స్కిల్ స్కాం కేసులో ప్రాథమిక ఆధారాలు ఉండడంతో చంద్రబాబును కోర్టు జ్యుడిషియల్ రిమాండ్కు కూడా పంపింది.ఆ కేసులో చంద్రబాబు బెయిల్పై ఉన్నారు. ఇవికాక అసైన్డ్ ల్యాండ్ కేసు, అమరావతి రింగ్రోడ్డు అలైన్మెంట్ కేసు, ఉచిత ఇసుక పేరుతో దోపిడీచేసిన వ్యవహారంలో కేసు, ఫైబర్ నెట్లో వందలకోట్ల అవినీతికేసు సహా లిక్కర్ కేసులు కూడా నమోదయ్యాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ కేసుల దర్యాప్తులో పురోగతి లేదు. దర్యాప్తు సంస్థలను తన గుప్పిట్లో పెట్టుకుని, ప్రతి క్షణం కేసులను నిర్వీర్యం చేయడానికి బాబు సర్కార్ ప్రయత్నిస్తోంది. ఈ ధోరణిని సహించబోము’ అని బొత్స స్పష్టం చేశారు. -
జోగి రమేష్ కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు
విజయవాడ: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను కొనసాగిస్తుంది. జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్కు ఎక్సైజ్ అధికారులు నోటీసులు పంపారు. విచారణకు హాజరు కావాలంటూ భవానీపురం ఎక్సైజ్ అధికారులు నోటీసులిచ్చారు. డిసెంబర్ 3వ తేదీన విచారణకు రావాలంటూ నోటీసులిచ్చారు. గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ కార్యాలయానికి డిసెంబర్ 3వ తేదీ మధ్యాహ్నం 1:30 లోపు హాజరుకావాలని నోటీసులు అందజేశారు. -
Chaitanya: సోమరిపోతు చంద్రన్న... అదిరిపోయే పిట్టకథ..
-
‘మీరు ఎన్ని నిధులు విడుదల చేశారో చర్చకు సిద్ధమా?’
తాడేపల్లి : ఏపీలోని విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే అందించాలని వైఎస్సార్సీపీ విద్యార్థి రాష్ట్ర అథ్యక్షుడు పానుగంటి చైతన్య డిమాండ్ చేశారు. లేకపోతే ఎమ్మెల్యేల ఇళ్లు, మంత్రుల ఇళ్లను త్వరలోనే ముట్టడిస్తామని హెచ్చరించారు. అపపటికీ రెస్పాండ్ కాకపోతే ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామన్నారు. ఈ రోజు(సోమవారం, డిసెంబర్ 1వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన పానుగంటి చైతన్య.. ‘ కూటమి పాలనలో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. చంద్రబాబు మాయ మాటలు నమ్మి ఓట్లేసినందుకు విద్యార్థి లోకాన్ని రీడ్డున పడేశారు. జగన్ హయాంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారు. చంద్రబాబు వచ్చాక బకాయిలు పెరిగి పోయాయి. ఎంతోమంది విద్యార్థులు ఫీజులు చెల్లించలేక కూలి పనులకు వెళ్తున్నారు. అండగా ఉంటానన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు కనపడటం లేదు.తన ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ ఎవరినీ పట్టించుకోవటం లేదు. నారా లోకేష్ హయాంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనం అయింది. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం’ అని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర మాట్లాడుతూ.. ‘ చంద్రబాబు, లోకేష్ విద్యార్థుల పాలిట ద్రోహులు. ఫీజు రీయింబర్స్మెంట్ అందక విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అవేమీ పట్టించుకోకుండా ప్రచారపిచ్చిలో మునిగి తేలుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. జగన్ హయాంలో త్రైమాసికం ప్రకారం రిలీజ్ చేశారు. కూటమి వచ్చాక కాలేజీలకి చెల్లిస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు. జగన్ ఇవ్వగా లేనిది చంద్రబాబు ఎందుకు ఇవ్వటం లేదు?, 2014-19 మధ్య చంద్రబాబు పెట్టిన బకాయి కూడా కలిపి ఒకేసారి రూ.4 వేల కోట్లు జగన్ ఇచ్చారు. చంద్రబాబు మాత్రం త్రైమాసికం ప్రకారం కూడా ఇవ్వటం లేదు. ఇప్పటికే రూ.7,800 కోట్లు చంద్రబాబు బకాయిలు పెట్టారు. నారా లోకేష్ విద్యార్థి సంఘాల నేతలతో పచ్చి అబద్దాలు చెప్తున్నారు. జగన్, చంద్రబాబు హయాంలలో ఎవరు ఎంత ఇచ్చారో చర్చకు సిద్దమా?, మా పార్టీ తరఫున చర్చకు మేము సిద్దంగా ఉన్నాం. ప్రభుత్వం తరపున ఎవరైనా చర్చకు రావాలి. రాష్ట్రంలో 16 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ అందక ఇబ్బంది పడుతున్నారు. కాలేజీ యాజమాన్యాలు పరీక్షలు కూడా రాయనీయటం లేదు. షాడో సీఎంగా వ్యవహరిస్తున్న లోకేష్ విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ విద్యార్థుల పాలిట ద్రోహులు’ అని మండిపడ్డారు.ఇదీ చదవండి:గో బ్యాక్.. ఎమ్మెల్యేను అడ్డుకున్న గిరిజనులు -
పోర్టుల ద్వారా ఏపీలో జరిగిన అభివృద్ధిపై వైఎస్ జగన్ ట్వీట్
-
Pilli Subhash: పార్లమెంటులో YSRCP చర్చించే అంశాలు ఇవే
-
పోర్టుల ద్వారా అభివృద్ధిపై వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో పోర్టుల అభివృద్ధి విషయమై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోర్టుల ద్వారా జరిగే అభివృద్ధి మన రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఇంజిన్ లాంటిదని చెప్పుకొచ్చారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘మన రాష్ట్రానికి ఉన్న పొడవైన తీరప్రాంతం కేవలం భౌగోళిక సరిహద్దు మాత్రమే కాదు. పోర్టుల ద్వారా జరిగే అభివృద్ధి, తద్వారా మన రాష్ట్రాన్ని మార్చే ఆర్థిక వృద్ధికి ఇంజిన్ లాంటిది అని అన్నారు. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ పోర్ట్స్ రెవల్యూషన్ హ్యాష్ ట్యాగ్ (#YSRCPPortsRevolution)ను పోస్టులో జత చేశారు. Our long coastline is not just a geographical boundary!It is an economic growth engine that will transform our State through Port-Led Development.#YSRCPPortsRevolution https://t.co/qu0mdXfSq1— YS Jagan Mohan Reddy (@ysjagan) December 1, 2025 -
బాబు పోకడలతో విశాఖ ఉక్కు భవిష్యత్తు ప్రశ్నార్థకం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పేమీ చేయలేదు.. ఆయన సహజ స్వభావాన్ని మరోసారి బయట పెట్టుకున్నారు. అంతే! విశాఖపట్నంలో పారిశ్రామిక సమ్మిట్ జరిగిన సందర్భంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపైన, అందులో పనిచేసే కార్మికులపైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పని చేయకపోయినా జీతాలు ఇవ్వాలా? అని చంద్రబాబు ప్రశ్నించారు. కష్టపడకుండా తెల్ల ఏనుగులా మారితే ఎలా అని ఆయన అన్నారు. వినడానికి బాగానే ఉంటుంది కదా! కాని ఇదే పెద్ద మనిషి 2024 ఎన్నికలకు ముందు ఏమని ప్రచారం చేశారు? ఇది ఆంధ్రుల హక్కు, సెంటిమెట్, దీనిని ఎలాగైనా కాపాడుకుంటాం,పొరాడుదాం.. అని చెప్పారా?లేదా?ఆ రోజు కార్మికులు సరిగా పనిచేయకపోవడం వల్లే నష్టాలలో ఉందని ఎందుకు ధైర్యంగా చెప్పలేదు?ఇప్పుడు మాట మార్చి తమ నైజాన్ని మరోసారి ప్రదర్శించినట్లు అవ్వలేదా? ఆయనతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కార్మికులను ఎలా రెచ్చగొట్టారు? తాను ఈ ప్లాంట్ను కాపాడడానికి సిద్దంగా ఉన్నానని, కార్మిక సంఘాలు కలిసి రావాలని అన్నారే కానీ ఇప్పుడు ఆ ఊసే ఎందుకు పవన్ ఎత్తడం లేదు. విశాఖ స్టీల్ సమస్యను సానుకూలంగా పరిష్కరించాలని కృషి చేసిన ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై వీరిద్దరూ ఎన్ని అభాండాలు మోపారు! కొద్దికాలం క్రితం శాసనమండలిలో మంత్రి లోకేష్ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగిపోయినా వైఎస్సార్సీపీ దుష్ప్రచారం చేస్తోందని అన్నారని వార్తలు వచ్చాయి కదా! ఆయన కూడా ప్రస్తుతం దీని గురించి మాట్లాడడం లేదే! అంటే వీరంతా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను మభ్య పెట్టి ఓట్లు వేయించుకున్నారని ఒప్పుకోవలసిందే కదా! 12వేల కోట్ల ప్యాకేజీ ఇచ్చాం కనుక ఇప్పుడు దానిని ఏమి చేసినా ఫర్వాలేదన్నట్లు చంద్రబాబు వ్యాఖ్యానించడం ఆశ్చర్యమే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ప్యాకేజీ ఎందుకు ఇచ్చారు?దేనికి వాడారు? ప్రైవేటువారికి అప్పగిస్తే రుణ బారం తగ్గించి ఇవ్వడానికి అలా చేశారన్న సంగతి అర్ధం అవుతూనే ఉంది కదా! ఈ సంస్థకు సొంత గనులు లేవని మొత్తుకుంటుంటే ఆ సంగతి చెప్పకుండా, అనకాపల్లి వద్ద ప్రైవేటు రంగంలో మరో స్టీల్ ప్లాంట్ తెస్తున్నామని, దానికి గనులు కేటాయించడానికి ప్రధాని మోదీని ఒప్పించామని చంద్రబాబు చెప్పారు. పైగా అది లాభాలలో నడుస్తుందని ఆయన జోస్యం చెబుతున్నారు. విశాఖ ఉక్కుకు ఎందుకు గనులు కేటాయించేలా కృషి చేయలేదో వివరించాలి కదా! ప్రైవేటుపై మోజు ఉంటే ఉండవచ్చు. కాని ఎన్ని కంపెనీలు ప్రభుత్వం నుంచి రాయితీలు , బ్యాంకుల నుంచి రుణాలు పొంది ఆ తర్వాత వాటిని సరిగా నడపలేక చేతులెత్తేశాయి. మరికొన్ని సంస్థలు మోసాలు చేసి దివాళాకు వెళ్ళాయి. ఇలా మూత పడ్డ పరిశ్రమలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలు మాత్రం బ్రహ్మాండంగా, హాపీగా ఉంటున్నారే. రాజకీయాలలోకి వచ్చి మంచి పదవులు పొందుతున్నారే. టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు వందల కోట్ల రుణాలను బ్యాంకులనుంచి పొంది ఎగనామం పెట్టారు కదా! గతంలో చంద్రబాబు టైమ్లో కొండపల్లి వద్ద లాంకో పవర్ అన్న సంస్థ ఏర్పాటైంది. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్కు చెందిన ఆ సంస్థ వివిధ కారణాలతో మూతపడింది.ఆ కంపెనీకి బ్యాంకులు ఇచ్చిన 45వేల కోట్ల రుణాలలో ఎంత భాగం మాఫీ అయ్యాయో చంద్రబాబు వంటి వారికి తెలియదా? అప్పుడు తెల్ల ఏనుగులకు ప్రభుత్వ డబ్బు కట్టబెట్టినా ఫర్వాలేదా? దేశ వ్యాప్తంగా ఏటా లక్షల కోట్ల మేర బ్యాంకులు పరిశ్రమలవారికి ఇచ్చిన రుణాలను రద్దు చేస్తున్నట్లు అధికారికంగానే ప్రకటిస్తున్నాయి కదా! ప్రైవేటు కంపెనీ లూలూ కు చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా వందల కోట్ల విలువైన భూమిని అర్ధణా,అణాలకు ఇచ్చేసింది కదా! అదే కంపెనీ అహ్మదాబాద్లో ఎందుకు 519 కోట్లతో భూమి కొనుగోలు చేసింది. ఏపీలో మాత్రం అతి తక్కువ మొత్తానికి విలువైన భూమిని లీజుగా పొందింది? దీనికి ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు?ఆ కంపెనీ ఉత్పత్తులపై పవన్ కళ్యాణ్ అభ్యంతరం పెట్టినా పట్టించుకోలేదే! కొన్ని కంపెనీలకు 99 పైసలకే భూములు ఇవ్వడం, మరికొన్నిటికి వేల కోట్ల రాయితీలు ఇవ్వడంం, ఉర్సా వంటి సంస్థలకు భూముల అమ్మకం వంటివి సమర్ధనీయమేనా? ఆ రాయితీలు ప్రజలు కట్టిన పన్నుల నుంచే కదా ఇచ్చేది. ప్రభుత్వ రంగ సంస్థలు సరిగా పనిచేయవని ఒక ముద్ర వేసి వాటి ఆస్తులను ప్రైవేటువారికి కట్టబెట్టడంలోని మతలబు ఏమిటి?చంద్రబాబు హయాంలోనే ఒకప్పుడు ఉమ్మడి ఏపీలో ఏభైకి పైగా ప్రభుత్వ సంస్థలను ప్రైవేటైజ్ చేశారు. ఆ ప్రైవేటు కంపెనీలు ఇప్పుడు బాగా నడుస్తున్నాయా? లేక కంపెనీలను మూసి భూములు అమ్ముకుంటున్నాయా? అన్న శంక పలువురిలో ఉంది. దానిపై చంద్రబాబు వివరణ ఇవ్వగలిగితే బాగుంటుంది కదా? ప్రజల పన్నులతోనే సమకూర్చుకున్న ఆస్తులను కొందరు వ్యక్తులను సంపన్నులను చేయడానికి వాడవచ్చా? దాదాపు రెండు లక్షల కోట్ల విలువైన భూములు విశాఖ ఉక్కుకు ఉన్నాయా?లేదా? సెయిల్తో పోల్చితే సొంత గనులు లేకపోయినా ఈ ప్లాంట్ ఉత్పాదకత ఎక్కువగా ఉన్న విషయాన్ని కార్మికులు గణాంకాలతో చెబుతున్నారు. అలాంటి కంపెనీ నిలదొక్కుకోవడానికి ఏమి చేయాలన్నదానిపై దృష్టి పెట్టకుండా,ఎలాగైనా ప్రైవేటువారికి కట్టబెట్టాలన్న ఆలోచనతో ఎందుకు ముందుకు వెళుతున్నారు. ఎన్నికలకు ముందు అదే తమ విధానమని చెప్పి ఉంటే ఎవరూ కాదనరు. కాని ఆ రోజు సెంటిమెంట్ అని ఆంధ్రుల హక్కు అని , ఈరోజు తెల్ల ఏనుగు అని అనడం, ప్రశ్నలు వేసిన మీడియావారిపై కస్సుమనడం చంద్రబాబుకే చెల్లింది. ఇవన్ని ఊసరవెల్లి మాటలుగా అనుకుంటారని కూడా ఫీల్ కారా? గొర్రె కసాయి వాడినే నమ్ముతుందన్నట్లుగా ఆ రోజుల్లో విశాఖ ప్రాంత ప్రజలు వీరి ప్రచారం నమ్మి భారీ మెజార్టీతో గెలిపించారు. అదికారం వచ్చాక వారిని ఏమి ప్రశ్నించలేని పరిస్థితి ఉంది. ఇప్పటికే సుమారు 35 విభాగాలను ప్రైవేటువారికి అప్పగించడానికి రంగం సిద్దం చేశారు. కొన్నివేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించారు. ప్రభుత్వానికి ఈ సంస్థ ద్వారా వచ్చిన ఆదాయం ఎంత అన్నదాని గురించి ఎందుకు మాట్లాడడం లేదని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. విశాఖకు ఒక ఐడెంటిటిగా ఉన్న ఈ ప్లాంట్ భవిష్యత్తును గందరగోళంలోకి ప్రభుత్వమే నెడుతున్నట్లుగా కనిపిస్తుంది. కేంద్రం ఈ విషయంలో చాలాకాలం గా స్పష్టంగా ఉన్నా,చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటివారు దీనిపై కార్మికులను ఎన్నికలకు ముందు మభ్యపెట్టడానికి సెంటిమెంట్ డైలాగులువాడారు. పైగా విశాఖ స్టీల్ ను ప్రైవేటుపరం చేయవద్దని తీర్మానం చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వంనై అభాండాలు మోపారు.ప్లాంట్ కు ఉన్న భూములలో కొంత భాగాన్ని అమ్మి ప్లాంట్ ను రక్షించుకుందామని ఆనాటి ప్రభుత్వం ప్రతిపాదిస్తే చాలా ఘోరం జరిగిపోతోందని చంద్రబాబు గగ్గోలు పెట్టారే!ఇప్పుడు ఏకంగా భూమితో పాటు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటువారికి అప్పనంగా ఇచ్చేసేలా ఉన్నారు. దీనిపై కార్మిక సంఘాలు కాని, రాజకీయ పార్టీల నేతలు కాని విశాఖ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి ప్రశ్నిస్తే కేసులు పెట్టడానికి పోలీసులు సిద్దంగా ఉంటారు. ఎక్కడ లేని విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తి లక్ష్యాల ప్రకారమే జీతాలుఇవ్వాలని యాజమాన్యం తలపెట్టిందట. ఇది పుండుమీద కారం చల్లడమే అవుతుందనిపిస్తుంది. పని చేయకపోయినా జీతాలు ఇవ్వాలా అన్న ప్రశ్న వేసిన చంద్రబాబుకు కార్మికులు కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. సూపర్ సిక్స్ అని, ఎన్నికల మానిఫెస్టో అని 150 హామీలు ఇచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు అనేక హామీలను ఎగవేస్తోంది కదా! అలాంటి ప్రభుత్వం కొనసాగడం ఎలా కరెక్టు అవుతుందన్నది వారి సందేహంగా ఉంది. నిత్యం అసత్య ప్రచారాలతో కాలాక్షేపం చేస్తున్న చంద్రబాబు సర్కార్ లోని మంత్రులకు ఎందుకు జితాలివ్వాలని జనం అడగవచ్చా? ప్రభుత్వంలోని సిబ్బందికి కూడా ఇలాగే ఏమైనా కండిషన్లు పెట్టబోతున్నారా?అని వారు అడుగుతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ప్రత్యేక విమానాలలో , హెలికాప్టర్లలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ లు తరచుగా పర్యటిస్తున్నారు కదా!వారికి అలా తిరిగే అధికారం ఉందా?లేకపోతే ఈ ఖర్చును జనం ఎందుకు భరించాలి. దేశవ్యాప్తంగా మరో నాలుగు ఉక్కు కర్మాగారాలను ప్రైవేటైజ్ చేయడానికి కేంద్రం ప్రతిపాదించి, ఆ రాష్ట్రాలలో వచ్చిన నిరసన దృష్ట్యా వెనక్కి తగ్గిందట. కాని ఆంధ్రులకు ఆ చేవ లేదని భావించిందో ఏమో కాని, విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై ముందుకు వెళుతోందన్న అభిప్రాయం ఏర్పడింది.దానికి చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మద్దతు ఇవ్వడం విషాదం. ఏది ఏమైనా విశాఖ ఉక్కు విషయంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా డబాయిస్తున్నానులే అనుకుంటుండవచ్చు. కాని ఉత్తరాంధ్రకే కాదు.. ఆంధ్ర ప్రజల సెంటిమెంట్కు ఆయన ద్రోహం చేసినట్లే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన గుర్తుంచుకుంటే మంచిది.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
వారం రోజులు టైం ఇస్తున్న.. లోకేష్ కు నాగార్జున యాదవ్ వార్నింగ్
-
ఏపీ సమస్యలపై గళమెత్తండి.. ఎంపీలకు జగన్ కీలక ఆదేశాలు
-
ఆంధ్రప్రదేశ్ సమస్యలపై పార్లమెంట్లో గళమెత్తాలి.... వైఎస్సార్సీపీ ఎంపీలకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం
-
రాష్ట్ర సమస్యలపై ఎలుగెత్తాలి.. పార్లమెంట్లో ప్రజా గళం
సాక్షి, అమరావతి: అన్నదాతల ఇక్కట్లతోపాటు రాష్ట్రానికి సంబంధించిన అన్ని ప్రధాన సమస్యలను పార్లమెంటు ఉభయ సభల్లో బలంగా లేవనెత్తి.. ప్రజల గొంతుకను గట్టిగా వినిపించాలని పార్టీ ఎంపీలను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ఒకవైపు తుపానుతో తీవ్ర నష్టం, మరోవైపు ఏ పంటకూ కనీస మద్దతు ధర దక్కక కుదేలైన వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్నారు. ఈ అంశాలన్నింటినీ పార్లమెంటు సమావేశాల్లో ప్రధానంగా ప్రస్తావించాలని సూచించారు. మోంథా తుపాను వల్ల తీర ప్రాంత జిల్లాల్లో లక్షల ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వం పరిహారం అందించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మరోవైపు ఏ పంటకూ కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) లేకపోవడం వారిని మరింత కష్టాల పాల్జేస్తోందన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఆర్బీకేల ద్వారా నేరుగా ధాన్యాన్ని సేకరించడం వల్ల ప్రతి పంటకూ కనీస మద్దతు ధర కచ్చితంగా దక్కేదని గుర్తుచేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం వాటన్నింటికి మంగళం పాడి రైతులను గాలికి వదిలేయడంతో దళారులు, వ్యాపారుల చేతిలో దోపిడీకి గురవుతున్నారని మండిపడ్డారు.వరి, మొక్కజొన్న, మినుములు, పత్తి, కంది, అరటి, మిర్చితోపాటు మామిడి లాంటి ప్రధాన పంటలకు ఎమ్మెస్పీ లభించక రైతులు అల్లాడుతున్న దృష్ట్యా కేంద్రం వెంటనే అత్యవసర నిధులు విడుదల చేసి కనీస మద్దతు ధర దక్కేలా ఎంపీలు ఒత్తిడి తేవాలని సూచించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పక్కాగా అమలు చేసిన ఉచిత పంటల బీమాకు కూటమి ప్రభుత్వం మంగళం పాడడం వల్ల ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతులకు ఎలాంటి రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇన్పుట్ సబ్సిడీ అందడం లేదని, ఈ–క్రాపింగ్ చేయకపోవడం వల్ల పంటల గణాంకాలు స్పష్టంగా తెలియక అర్హులైన రైతులకు కూడా పరిహారం అందని దుస్థితి నెలకొందన్నారు. మిర్చి రైతులను ఆర్థికంగా ఆదుకుంటామని మాట ఇచ్చిన ఈ ప్రభుత్వం దాన్ని నిలబెట్టుకోకుండా వారిని దగా చేసిందని, మామిడి కొనుగోళ్లలో కంపెనీలు తగిన ధర చెల్లించేలా చూడడంలో ప్రభుత్వ వైఫల్యం వల్ల ఆ రైతులూ తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. గ్రామీణ నిరుపేదల ఉపాధిని దెబ్బతీశారు..మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో సామూహికంగా 18.63 లక్షల జాబ్ కార్డులను చంద్రబాబు ప్రభుత్వం తొలగించడాన్ని ఎంపీల వద్ద వైఎస్ జగన్ ప్రస్తావించారు. ఇది అత్యంత దారుణమని, దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద కుటుంబాలకు ఉపాధి లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. అర్హత ఉన్న జాబ్ కార్డులన్నింటినీ పునరుద్ధరించడంతోపాటు వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తక్షణమే ఆపేయాలి.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యలను గట్టిగా వ్యతిరేకించాలని ఎంపీలను జగన్ ఆదేశించారు. సంస్థను ముక్కలుగా చేసి అమ్మేస్తున్నారని, ఇది సంస్థ పూర్తి ప్రైవేటీకరణ దిశగా చేస్తున్న పని అని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో పోరాటాలు, వేలాది మంది త్యాగాల ఫలితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పడిన విషయాన్ని గుర్తుచేశారు. వారందరితోపాటు ఆ సంస్థ కోసం భూములిచ్చిన రైతులను దగా చేయడం తగదన్నారు. సంస్థను ముక్కలు చేస్తూ ప్రైవేటీకరణ కోసం చేపట్టిన చర్యలన్నింటినీ వెంటనే ఉపసంహరించాలని, సంస్థను పునరుద్ధరించేలా వెంటనే సొంతంగా ఇనుప ఖనిజం గనులు కేటాయించి వేలాది మంది కారి్మకులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల జీవనోపాధిని కాపాడాలని కోరారు. శాంతి భద్రతలు దారుణం..రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా క్షీణించాయని వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తంచేశారు. రాజకీయ కక్షతో పోలీసు యంత్రాంగాన్ని దురి్వనియోగం చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తున్నారని ప్రస్తావించారు. చాలా మంది నాయకులు, ప్రజా ప్రతినిధులకు సెక్యూరిటీ తగ్గించి వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితి తీసుకొచ్చారని ఆక్షేపించారు. మరోవైపు ప్రభుత్వ హాస్టళ్లు, సంక్షేమ వసతిగృహాల్లో పరిస్థితి నానాటికీ దుర్భరంగా మారుతోందన్నారు.విద్యార్థులకు సరైన ఆహారం, తాగు నీరు అందడంలేదని, పరిశుభ్రత పూర్తిగా కొరవడిందని ఆందోళన వ్యక్తంచేశారు. వీటన్నింటితోపాటు కేంద్రం నుంచి పెండింగ్ నిధులు రాబట్టడం, రాష్ట్రంలో ఉపాధి కల్పన, కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను కాపాడుకునే దిశగా ఎంపీలు చొరవ చూపాలని.. ప్రజాసమస్యలను గట్టిగా ప్రస్తావిస్తూ, వారి గొంతుకలను బలంగా వినిపించి, కేంద్రం వాటిపై దృష్టిసారించేలా కృషిచేయాలని వైఎస్ జగన్ మార్గనిర్దేశం చేశారు. -
వైఎస్సార్సీపీ ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం
సాక్షి, తాడేపల్లి: పార్లమెంటు సమావేశాలు రేపటి(డిసెంబర్ 1, సోమవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. పార్లమెంటులో చర్చించాల్సిన అంశాలపై వైఎస్సార్సీపీ ఎంపీలకు ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా పోరాటం చేయాలని ఎంపీలను ఆదేశించారు. రాష్ట్ర రైతాంగ సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేయాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. తుపానులతో రైతులు నష్టపోయిన తీరు. పంటలకు గిట్టుబాటు ధరల్లేని అంశాలపై గట్టిగా చర్చించాలన్నారు.‘‘రైతులపై రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యంపై గట్టిగా కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలి. దళారుల చేతిలో దోపిడీకి గురవుతున్న వైనాన్ని సభలో చర్చించాలి. తమ హయాంలో అమలు చేసిన ఉచిత పంటల బీమాను చంద్రబాబు ప్రభుత్వం నిలిపేయటంపై మాట్లాడాలి. బీమా లేకపోవడంతో రైతులు నష్టపోవటం, ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ కూడా అందించని వైనాన్ని సభలో చర్చించాలి. ఈ-క్రాప్ విధానం అమలు చేయకపోవటాన్ని సభ దృష్టికి తీసుకు వెళ్లాలి. మామిడి రైతులకు ఇప్పటికీ ఫ్యాక్టరీలు బకాయిలు చెల్లించని వైనంపై మాట్లాడాలి. ఉపాధి హామీ పథకం జాబ్ కార్డుల తొలగింపును గట్టిగా ప్రశ్నించాలి..18.63 లక్షల కార్డులు తొలగించి పేదల కడుపు కొట్టడాన్ని పార్లమెంటులో నిలదీయాలి. అర్హులందరికీ తిరిగి కార్డులు ఇచ్చేలాగ ఒత్తిడి తేవాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను గట్టిగా వ్యతిరేకించాలి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం చేసిన త్యాగాలను మరోసారి కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి. రాష్ట్రంలో నెలకొన్న దారుణమైన రాజకీయ కక్ష సాధింపులు, అక్రమ అరెస్టులపై పార్లమెంట్లో చర్చించాలి. పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేయటంపై చర్చించాలి. ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్లో కలుషిత ఆహారం తిని విద్యార్థులు ఆస్పత్రుల పాలవటం.. మౌలిక సదుపాయాలను కల్పించని వైనాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి. రాష్ట్రానికి రావాల్సిన పాత బకాయిలపై చర్చించాలి. ఏపీ హక్కుల కోసం ఎంపీలు గట్టిగా గళమెత్తాలి’’ అని వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. -
PA సతీష్ కు మంత్రి సపోర్ట్.. కూటమిపై పుష్పశ్రీవాణి ఫైర్
-
‘రైతుల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారు’
నెల్లూరు : జిల్లాలో పునర్విభజన అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు ద్వంద్వ ధోరణి గురించి చర్చించెకోవాల్సిన అవసరం ఉందన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి. 2019లో వైఎస్ జగన్ చెప్పిన విధంగా ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాలు చేశారని, భౌగోళిక పరిస్థితులను, ప్రజల అభ్యంతరాలను అనుగుణంగా ఆనాడు విభజన చేయడం జరిగిందన్నారు. ఆ రకంగా 26 జిల్లాలను పునర్విభజన చేశారన్నారు. ఇప్పుడు చంద్రబాబు రైతుల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు కాకాణి. ‘ఆ రోజు భౌగోళిక పరిస్థితుల దృశ్య వెంకటగిరి నియోజకవర్గం లోని రాపూర్, కలువాయా, సైదాపురాన్ని నెల్లూరు జిల్లాలో చేర్చడం జరిగింది. నేడు చంద్రబాబు ఓ డ్రాఫ్ట్ విడుదల చేసి ఈ మూడు మండలాలను తిరిగి తిరుపతి జిల్లాలో కలుపుతామని అంటున్నారు. ఈ విభజన ద్వారా రైతాంగం, ప్రజానికం తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. జలాశయాలు నీటి విడుదలలో అనేక సమస్యలు ఎదురవుతాయి. సోమశిల, కండలేరు జలాశయాలకు సంబంధించిన నీటి విడుదల కమిటీలో ఈ నియోజకవర్గ ప్రతినిధులు ఆ జిల్లాలో ఉండే అవకాశం లేదు’ అని పేర్కొన్నారు. -
మీ డ్రామాలు ఆపండి.. కోటంరెడ్డి అండతోనే పెంచలయ్య హత్య
-
వెంకటేశ్వరశర్మతో వైఎస్సార్సీపీకి ఏ సంబంధం లేదు
సాక్షి, తాడేపల్లి: న్యాయవాది కోటంరాజు వెంకటేశ్వరశర్మ మీద మాచవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైతే, వెంటనే ఆయన్ను మా పార్టీకి చెందిన వాడిగా చెబుతూ.. ఎల్లో మీడియాలోనూ, వారి అనుకూల సోషల్ మీడియాలోనూ అదే పనిగా దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లాకు చెందిన లీగల్సెల్ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు.నిజానికి వెంకటేశ్వరశర్మకు వైఎస్సార్సీపీతో కానీ, పారీ లీగల్ సెల్తో కానీ, ఏనాడూ ఏ విధమైన సంబంధం లేదని, ఆయన తమ పార్టీలో ఎప్పుడూ క్రియాశీలకంగా లేరని వారు స్పష్టం చేశారు. టీడీపీకి చెందిన కొందరు కుట్రపూరితంగా వ్యవహరిస్తూ, వైఎస్సార్సీపీతో పాటు, జగన్ని నిందిస్తున్నారని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ ఎన్టీఆర్ జిల్లా లీగల్సెల్ కోఆర్డినేటర్ ఒ.గవాస్కర్, అదే విభాగం అధ్యక్షుడు సీహెచ్.సాయిరాం ఆక్షేపించారు. ఈ సందర్భంగా వారు ఏమన్నారంటే..:ఎంత వరకు సబబు? ఆలోచించండి:న్యాయవాది కోటంరాజు వెంకటేశ్వరశర్మకు సంబంధించి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన ఎప్పుడూ మా పార్టీలో కానీ, పార్టీ లీగల్ సెల్లో కానీ, క్రియాశీలకంగా లేరు. ఆయన మీద నమోదైన కేసు పూర్తిగా వ్యక్తిగతం. కానీ టీడీపీకి చెందిన కొందరు వ్యక్తులు కుట్ర పూరితంగా వ్యవహరిస్తూ, వీడియోలు రిలీజ్ చేసి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, జగన్ని అభాసుపాల్జేయాలని చూస్తున్నారు. కనీసం వాస్తవాలు కూడా తెలుసుకోకుండా, పత్రికలు కూడా అలా ప్రచారం చేయడం ఎంత వరకు సబబు అనేది ఆలోచించాలి.వెంకటేశ్వరశర్మ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏమేమో చేశారని నిందిస్తున్నారు. నిజానికి ఆయనకు పార్టీతో ఏనాడూ, ఏ విధమైన సంబంధం లేదు. అప్పుడు, ఇప్పుడు ఆయన ఏం చేసినా, అది పూర్తిగా వ్యక్తిగతం. అయినా ఆయన ఏదో చేశారని చూపుతూ, దాన్ని వైఎస్సార్సీపీకి అంటగడుతూ బురద చల్లడం అత్యంత హేయం. టీడీపీ కూటమి ప్రభుత్వం చివరకు లాయర్లను కూడా వదలడం లేదు.ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నం:ఒక వైపు హైకోర్టు మొట్టికాయలు వేస్తున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కేవలం మా పార్టీపై బురద చల్లుతూ.. వెంకటేశ్వరశర్మ ఏదో చేశారని, మా పార్టీకి అంటగడుతున్నారు. ఆ విధంగా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇదే వెంకటేశ్వరశర్మ, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో అంటకాగారు. కావాలంటే ఈ ఫోటోలు చూడండి. (అంటూ ఆ ఫోటోలతో పాటు, నందమూరి బాలకృష్ణతో దిగిన ఫోటో కూడా మీడియాకు చూపారు). మరి అలా చూస్తే, వెంకటేశ్వరశర్మ తెలుగుదేశం పార్టీకి చెందిన వారు అనుకోవచ్చు కదా? లేకపోతే పల్లా శ్రీనివాసరావుతో ఆయనకు ఉన్న సంబంధం ఏమిటి? దీనికి టీడీపీ ఏం సమాధానం చెబుతుంది? ఇద్దరూ చాలా సన్నిహితంగా ఉన్నట్లు ఈ ఫోటోలు చూపుతున్నాయి. మరి వెంకటేశ్వరశర్మకు, టీడీపీతో ఏం సంబంధం? ఆయన టీడీపీకి చెందిన వారు అనుకోవచ్చు కదా? అదే వెంకటేశ్వరశర్మ గతంలో నందమూరి బాలకృష్ణతో కూడా ఫోటో దిగారు. మరి ఆయనతో ఏం సంబంధం? ఇవన్నీ చూస్తుంటే, వెంకటేశ్వరశర్మ టీడీపీ లీగల్సెల్ సభ్యుడా?. ఇంకా ప్రజారాజ్యం ఉన్నప్పుడు చిరంజీవితో కూడా వెంకటేశ్వరశర్మ కలిసి ఉన్నాడు. చిరంజీవితో, ఆ పార్టీతో కూడా ఆయనకు ఏం సంబంధం ఉంది? ఇప్పటికైనా ఆ మీడియా ఇలాంటి దుష్ప్రచారాన్ని విడనాడాలి. లేకపోతే చట్టపరంగా చర్య తీసుకుంటాం.కేసు నమోదు కాగానే నింద మొదలు:వెంకటేశ్వరశర్మపై మాచవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగానే, వెంటనే ఎల్లో మీడియా దుష్ప్రచారం మొదలుపెట్టింది. ఆయన వైయస్సార్సీపీకి చెందిన వారని, జగన్గారికి అత్యంత సన్నిహితుడని చెబుతూ బురద చల్లుతున్నాయి. మళ్లీ చెబుతున్నాం. వెంకటేశ్వరశర్మ ఏనాడూ మా పార్టీలో లేడు. ఆయనకు మా పార్టీతో ఏ సంబంధం లేదు. ఆయన జగన్ వ్యక్తిగత లాయర్ కాదు.నిజానికి ఆ ఫోటోలు చూస్తుంటే, వెంకటేశ్వరశర్మకు మీ (టీడీపీ) పార్టీతోనే సంబంధాలు ఉన్నాయనిపిస్తోంది. ఆయన మీ పార్టీకి చెందిన వ్యక్తినే. మీకు డబ్బుల పంపకాల విషయంలో గొడవ అయింది కాబట్టే ఆయన మీద ఆరోపణలు చేస్తూ మాపైకి నెడుతున్నారు. ఇంకా చెప్పాలంటే వెంకటేశ్వరశర్మ తమ్ముడు జనసేనలో ఉన్నాడని ఒ.గవాస్కర్, సీహెచ్.సాయిరాం వివరించారు. ప్రెస్మీట్లో వై.పుల్లారెడ్డి, నాగిరెడ్డి, జి.లావణ్య కూడా పాల్గొన్నారు. -
వదిలిపెట్టం అన్నీ చూస్తున్నాం రాజా లోకేష్ కు కాకాణి వార్నింగ్
-
Kondapalli : చైర్మన్ పోడియం ముందు YSRCP కౌన్సిలర్ల నిరసన
-
లా అండ్ ఆర్డర్ విషయంలోనూ చంద్రబాబు మోసమే!
సాక్షి, నెల్లూరు జిల్లా: రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవని.. అందుకు నిదర్శనమే ప్రజా ఉద్యమకారుడు పెంచలయ్య దారుణ హత్య అని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేవలం మాదకద్రవ్యాలపై పోరాటం చేస్తున్నాడనే కారణంతోనే పెంచలయ్యను హత్య చేశారన్నారు. ‘‘హత్య చేసిన నిందితులు మరోవైపు పోలీసులపై దాడి చేశారు. డ్రగ్స్ మాఫియా పోలీసులపైనే తిరగబడుతుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? అంటూ కాకాణి ప్రశ్నించారు. ‘‘ఏపీని గంజాయి, డ్రాగ్స్ హబ్గా చంద్రబాబు మార్చారు. వంద రోజుల్లో గంజాయి నిర్ములిస్తానన్న చంద్రబాబు.. నేడు 555 రోజులవుతుంది అధికారం చేపట్టి.. నేడు శాంతి భద్రతల విషయంలో కూడా మోసం చేస్తున్నారు. చంద్రబాబుకు ఇప్పటికైనా కనువిప్పు కలుగుతుందని నేను అనుకోవడం లేదు. లోకేష్ ఆధ్వర్యంలో ఏదో సబ్ కమిటీ అన్నారు. ఏం వెలగబెట్టాడో సమాధానం చెప్పాలి...విశాఖ కేంద్రంగా జాతీయ డ్రగ్స్ ముఠా లావాదేవీలు జరుపుతున్న తీరు చూశాం. ఇతర దేశస్థులు వచ్చి రాష్ట్రంలో ఇలాంటి మాదకద్రవ్యాల సరఫరా సాగిస్తుంటే నిఘా వర్గం ఏం చేస్తోంది?. కేవలం ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు అనుకూలంగా ఇంటిలిజెన్స్ పనిచేస్తుంది తప్ప ఇంకోటి లేదు’ అంటూ కాకాణి మండిపడ్డారు. -
వీకెండ్ ఎమ్మెల్యే.. నీకు దమ్ముంటే దగ్గుబాటి ప్రసాద్ కు మేయర్ మహమ్మద్ వసీం ఛాలెంజ్
-
పవన్ పర్యటనలో ఆగంతకుడు అంటూ జనసేన "క్యామెడీ" అంబటి రాంబాబు సెటైర్లే సెటైర్లు
-
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక బడా స్కాం: గోపిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ పేరుతో టీడీపీ నేతలకు కట్టబెట్టి వందల కోట్లు దోచుకునే కుట్ర జరుగుతోందని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. యాభై ఎకరాల మెడికల్ కాలేజీ భూముల్ని కేజీ టమోటా ధరకు సమానంగా అమ్మేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారాయన. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ వెనుక స్కాం ఉంది. టీడీపీ నేతలకు కాలేజీలను కట్టబెట్టి వందల కోట్లు దోచుకుంటున్నారు. మెడికల్ సీట్లను చంద్రబాబు ప్రభుత్వం అమ్ముకోవడానికి రెడీ అయ్యింది. మెడికల్ కాలేజీలను 66 సంవత్సరాలు లీజుకు ఇవ్వటానికి జీవోలు ఇచ్చారు..తరతరాలుగా తమ వారికి దోచిపెట్టే ప్లాన్ చేశారు. యాభై ఎకరాల మెడికల్ కాలేజీల భూములను కేజీ టమోటా ధరకు సమానంగా అమ్మేస్తున్నారు. ఏ ప్రైవేట్ మెడికల్ కాలేజీ అయినా సరే జగన్ కట్టించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలాగా ఉన్నాయా?. అత్యద్భుతంగా జగన్ మెడికల్ కాలేజీలను నిర్మిస్తే చంద్రబాబు వాటిని సింపుల్గా అమ్మేస్తారా?. దేశంలో ఎక్కడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రయివేటీకరణ చేయలేదు. కానీ చంద్రబాబే ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రైవేట్ వారికి ఇచ్చాక కూడా స్టాఫ్కి ప్రభుత్వమే జీతాలు ఇస్తుందట.. ఏంటసలు?. ఒక పేదవాడు అత్యవసర వైద్యం కోసం వస్తే వైద్యం చేసే పరిస్థితి ఉంటుందా?. ఒకవేళ ఆస్పత్రి 70% ఫుల్ అయిందని చెప్పి వెనక్కు పంపితే ఆ పేదోడు బతికేదెలా?. వైద్య విద్య మీద ఈ ప్రభుత్వం సంవత్సరానికి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టలేదా?. ఇప్పటికే చంద్రబాబు వైఖరి వల్ల 2,750 మెడికల్ సీట్లు కోల్పోయాం. పాడేరు మెడికల్ కాలేజీ విషయంలో 50 సీట్లు కోల్పోయాం. ఇటీవల ఆ ప్రాంతంలో గర్భిణులు, హాస్టల్ విద్యార్థులు ఎంత ఇబ్బందులు పడ్డారో కనపడలేదా?. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు మంచి స్పందన వస్తోంది. మేం అధికారం చేపట్టాక ప్రైవేటీకరించిన మెడికల్ కాలేజీలను తిరిగి స్వాధీనం చేసుకుని తీరతాం అని అన్నారాయన. -
Ambati: రాజధాని పేరిట భారీ కుట్ర మరో 20 వేల ఎకరాలు స్వాహా!
-
చంద్రబాబు డైరెక్షన్లో అమరావతి మెగా సీరియల్
సాక్షి, తాడేపల్లి: అమరావతిని అడ్డంపెట్టుకుని చంద్రబాబు దోచుకుంటున్నారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అమరావతికి అసలైన విలన్ చంద్రబాబే. అడ్డగోలుగా భూదోపిడీ చేస్తూ వేల కోట్లు వెనుకేసుకుంటున్నారు. అమరావతి రైతులు పునరాలోచన చేసుకునే పరిస్థితిలో పడ్డారు. చంద్రబాబును నమ్మి పదేళ్ల క్రితమే భూములు ఇస్తే ఇంకా కావాలంట. ప్రపంచస్థాయి రాజధానిని నిర్మిస్తున్నామని అప్పట్లో చంద్రబాబు ప్రగల్భాలు పలికారు’’ అంటూ దుయ్యబట్టారు.‘‘ఇప్పటికే 54 వేల ఎకరాలను సేకరించారు. ఇప్పుడు రెండో విడతలో మరో 16,666 ఎకరాలను రైతుల నుండి సమీకరిస్తారట. మూడో విడతలో మరో 25 వేల ఎకరాలు తీసుకుంటారట. తొలి విడతలో తీసుకున్న భూములకే ఇప్పటికీ పూర్తిగా రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వలేదు. రైతులు అడిగితే అధికారులు అవమానపరుస్తున్నారు. భూములు తీసుకునేటప్పుడు త్యాగధనులు అన్నారు. ఇప్పుడేమో రైతులంటే పనికిమాలిన వాళ్లు అన్నట్టుగా చూస్తున్నారు..భూములు ఇచ్చిన రైతులు ఎంతో బాధపడుతున్నారు. అమరావతిని అడ్డంపెట్టుకుని చంద్రబాబు దోచుకుంటున్నారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే భూముల ధరలు తగ్గాయి. 18 నెలల్లో రాజధాని ప్రాంతంలో తట్టెడు మట్టి ఎత్తలేదు. ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు అప్పులు తీసుకొస్తున్నారు. అమరావతి కోసం ఇన్నీ తీసుకొచ్చి రూ.3 వేల కోట్లకే టెండర్లు పిలిచారు. చంద్రబాబు నిజ స్వరూపం రాష్ట్ర ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమౌతోంది’’ అని అంబటి పేర్కొన్నారు.‘‘రాజధానిని పూర్తి చేయకుండా సీరియల్ కథలా నడపాలన్నది చంద్రబాబు ప్లాన్. అమరావతిలో ఒక్క శాశ్వత భవనం లేదు. అమరావతిలో చంద్రబాబు నిర్మించిన భవనాలన్నీ తాత్కాలికమే. పార్లమెంట్కు రూ.970 కోట్లు ఖర్చు చేశారు. తెలంగాణ సచివాలయానికి రూ.500 కోట్లు ఖర్చు చేశారు. కానీ తాత్కాలిక అసెంబ్లీకే చంద్రబాబు రూ.700 కోట్లు ఖర్చు చేశారు’’ అంటూ అంబటి రాంబాబు నిలదీశారు.‘‘చంద్రబాబు అధికారంలోకి వస్తే భూముల ధరలు విపరీతంగా పెరుగుతాయని అప్పట్లో ప్రచారం చేశారు. ఇప్పుడు అత్యంత దారుణంగా రియల్ ఎస్టేట్ పడిపోయింది. రాజధానిలో ఇప్పటికీ ఒక్క తట్ట మట్టి కూడా వేయలేదు. కానీ రూ.3 వేల కోట్ల అడ్వాన్సులు ఇచ్చారు. వాటిలో కమీషన్లు కొట్టేశారు. రాజధాని సెల్ఫ్ ఫైనాన్స్ స్కీం అని చంద్రబాబు జనాన్ని మోసం చేశారు. ఇప్పుడు ప్రపంచమంతా తిరిగి రాజధాని కోసం అప్పులు చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రేట్లు పెంచి కాంట్రాక్టర్లకు అప్పగించారు..దాని వెనుక పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నట్టు రైతులు కూడా గుర్తించారు. అమరావతిలో తాత్కాలిక నిర్మాణాలకే వేల కోట్లు ఖర్చు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్కో అడుగుకు రూ.11 వేలు ఖర్చు చేశారు. దేశ పార్లమెంటు భవనానికి రూ.970 కోట్లు ఖర్చు చేస్తే, చంద్రబాబు తాత్కాలిక భవనాలకే రూ.750 కోట్లు ఖర్చు చేశారు. రాజధాని పల్లపు ప్రాంతంలో ఉండటం వలన ముంపునకు గురవుతోంది. రాజధాని నీరు నదిలోకి ఎత్తి పోయటం అమరావతిలోనే చూస్తున్నాం. రైతులకు న్యాయం చేయకుండా భూములు లాక్కోవటం సరికాదు’’ అని అంబటి రాంబాబు హితవు పలికారు.‘‘డిప్యూటీ సీఎంకి సరైన సెక్యూరిటీ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అపరిచిత వ్యక్తి వచ్చాడంటూ ఫిర్యాదులు ఇవ్వటం సిగ్గుచేటు. పవన్ కళ్యాణ్ ప్రచారం కోసం కామెడీ చేస్తున్నారు. సీరియస్ రాజకీయాల్లో పవన్ వెరైటీ కామెడీ చేస్తున్నారు. తన అభిమాని తనకోసం వచ్చినా పవన్ భయపడుతున్నారు. ఒక డీఎస్పీని అవినీతి పరుడని పవన్ అంటే చంద్రబాబు ఆ డీఎస్పీకి అవార్డులు ఇచ్చారు. ఇదీ ప్రభుత్వంలో పవన్ పరిస్థితి’’ అంటూ అంబటి చురకలు అంటించారు. -
రూ. పది వేలు లేవు.. నిరుద్యోగ భృతి లేదు
కర్నూలు జిల్లా: ఈ యువకుడి పేరు బోయ ఉలుగప్ప. బీకాం, బీఎడ్ చదివాడు. ఇతను హొళగుందలోని బీసీ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇతనికి భార్య పార్వతితో పాటు తల్లిదండ్రులు, ఇద్దరు అక్కలు ఉన్నారు. రెండెకరాల మెట్ట భూమి మాత్రమే ఉండి వ్యవసాయం, కూలీ పనులు చేస్తూ కుటుంభాన్ని పోషించుకునే వారు. గత ప్రభుత్వంలో నాలుగేళ్లు గ్రామ వలంటీరుగా పని చేస్తూ నెలకు ఇచ్చే రూ.5 వేలుతో పాటు కుటుంబాన్ని పోషించేవాడు. ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే నెలకు రూ.10 వేలు ఇస్తామని చంద్రబాబునాయుడుతో పాటు కూటమి నేతలు హామీలిచ్చి మరిచిపోయారు. నెలకు రూ.10 వేలు వస్తుందని ఆశతో ఎదురు చూసిన వారికి నిరాశే మిగిలి వీధిన పడ్డారు. దీంతో అటు వలంటీర్గా దూరమై.. ఇటు నిరుద్యోగ భృతి అందక కుటుంబ పోషణ భారంగా మారడంతో దినసరి కూలీగా మారాల్సి వచ్చింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నియోజకవర్గ పరిధిలో 122 గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాలకు 1,443 మంది వలంటీర్లు విధులు నిర్వహించేవారు. వీరంతా సేవా కార్యక్రమాలకు దూరమై.. ప్రభుత్వం అందించే ప్రోత్సాహం కోల్పోయారు. చంద్రబాబు మోసపూరిత హామీలతో ఎంతో మంది వీధిన పడ్డారు. -
దుష్ప్రచారం చేయబోయి అడ్డంగా బుక్కయిన జనసేన!
మలికిపురం : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో ఈ నెల 26న జరిగిన డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ పర్యటనలో వైఎస్సార్సీపీ కార్యకర్త పాల్గొన్నాడని.. పవన్ను హత్య చేసేందుకు పర్యటన ఆద్యంతం ఆయన వెనకే తిరిగాడంటూ జనసేన నాయకులు చేసిన హడావుడి వికటించింది. ఈ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్సార్సీపీ మీద బురదజల్లాలనే ప్రయత్నాలు బెడిసికొట్టాయి. రాజోలు దీవిలో బుధవారం పవన్ కల్యాణ్ పర్యటనలో మలికిపురం మండలం గూడపల్లి గ్రామానికి చెందిన పున్నం నరసింహమూర్తి అనే వ్యక్తి పాల్గొన్నాడు. అతడు వైఎస్సార్సీపీకి చెందిన వాడని, పవన్ను హత్య చేయడానికి రెక్కీ చేశాడని జనసేన నాయకులు ప్రచారం మొదలుపెట్టారు. దీనిపై ఆ పార్టీ నాయకులు అమరావతిలోని పార్టీ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ ప్రారంభించారు. తీరా చూస్తే నరసింహమూర్తి జనసేన కార్యకర్తగా నిర్ధారణ అయ్యింది. అసలేం జరిగిందంటే.. గూడపల్లికి చెందిన మండల పరిషత్ ఉపాధ్యక్షుడు సుందర శ్రీనుబాబు అనారోగ్యం వల్ల పవన్ పర్యటనకు రాలేదు. అతడి పాస్ మీద నరసింహమూర్తి పవన్ పర్యటనలో పాల్గొన్నాడు. ఈ వివాదానికి రాజోలులో జనసేన నాయకుల మధ్య ఆధిపత్య పోరు కూడా ఒక కార ణం. పవన్ పర్యటనలో రైతుల సభకు వచ్చే వారికి ఇచ్చే పాస్ల పంపిణీ ఆ పార్టీలోని రెండు వర్గాల మధ్య విభేదాలకు కారణమైంది. పాస్లు పెద్దగా పొందలేకపోయిన ఒక వర్గం.. జనసేన కార్యకర్తలకు కాదని వైఎస్సార్సీపీ కార్యకర్తలకు పాస్లు ఇచ్చారనే ప్రచారానికి దిగారు. ఇలా పాస్ పొందిన వైఎస్సార్సీపీ కార్యకర్త పవన్కు హాని కలిగించేందుకు వచ్చారంటూ జనసేన వ్యక్తులే ప్రచారం చేశారు. విచారించిన పోలీసులు నరసింహమూర్తి జనసేన కార్యకర్తేనని, అతనికి ఆ పార్టీ సభ్యత్వం కూడా ఉందని నిర్ధారించడంతో ఆ పార్టీ నాయకులు ఖంగుతిన్నారు. అసలు విషయం బయటపడగానే అందరూ కుక్కిన పేనులా మారిపోయారు. -
Venkata Krishna : ముచ్చురామిలో YSRCP కార్యకర్త పొలంలో జనసేన విధ్వంసం
-
అధికార దుర్వినియోగంతో చంద్రబాబు కేసుల మాఫీ
సాక్షి, తాడేపల్లి: గతంలో వేల కోట్లు దోచుకున్న చంద్రబాబు అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్నారని.. అధికార దుర్వినియోగంతో ఇప్పుడు ఆ కేసులన్నీ మాఫీ చేయించుకుంటున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అవినీతి, అక్రమాలతో వేల కోట్లు దోచుకున్నారు. అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. ఆధారాలతో సహా సీఐడీ కేసులు నమోదు చేసింది. అలాంటి కేసులన్నింటినీ ఇప్పుడు చంద్రబాబు మాఫీ చేసుకుంటున్నారు. అధికారులను బెదిరించి కేసులను విత్ డ్రా చేయిస్తున్నారు. లిక్కర్ కేసులో ప్రివిలేజ్ ఫీజు విషయంలో వేల కోట్లు ఖజానాకు రాకుండా చేశారు. దీని వెనుక వందల కోట్లు చేతులు మారాయి👉ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చేసి తమవారి భూములు పోకుండా జాగ్రత్త పడ్డారు. ఫైబర్ నెట్ లో రూ.350 కోట్లు అవకతవకలు చేశారు. సీఐడీ కూడా ఆధారాలతో పట్టుకుంది. అసైన్డ్ భూముల కుంభకోణంతో పేదల పొట్ట కొట్టారు. రూ.4,239 కోట్ల విలువైన భూమిని టీడీపీ నేతలు కొట్టేశారు. రూ.5,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కూడా కొట్టేసినట్టు సీఐడీ గుర్తించింది.. 👉.. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబే 13 చోట్ల నోట్ ఫైల్ మీద సంతకాలు పెట్టారు. రూ.372 కోట్లు కొట్టేసినట్టు సీఐడీ గుర్తించింది. ఈ కేసులో అరెస్టు అయి బెయిల్ మీద ఉన్న వ్యక్తి చంద్రబాబు. అలాంటి వ్యక్తి ఇప్పుడు సీఎం హోదాలో బెదిరించి అధికారులను బెదిరించి కేసులు విత్ డ్రా చేయిస్తున్నారు👉ప్రశ్నిస్తానన్న పవన్ ఈ కేసులపై ఎందుకు ప్రశ్నించటం లేదు?. పవన్ వలన దమ్మిడి లాభం లేనప్పుడు విమానాల్లో తిరగటం ఎందుకు?. ప్రభుత్వ కార్యాలయాల్లో ఫోటోలు పెట్టించుకోవటం ఎందుకు?. అవినీతి, అరాచకాలను ప్రశ్నించలేనప్పుడు డిప్యూటీ సీఎం పదవి ఎందుకు పవన్?👉తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ హిందువుల మనోభావాలను చంద్రబాబు తీశారు. వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో టీటీడీ బోర్డు అద్భుతంగా పని చేసింది. అలాంటి వ్యక్తిని విచారణ పేరుతో సీఐడీ వేధిస్తోంది. 👉ఏవీఎస్వో సతీష్ అనుమానాస్పదంగా చనిపోతే మా పార్టీ వారి మీద దారుణమైన ఆరోపణలు చేశారు👉రాజధానిలో దారుణమైన అవినీతి జరుగుతోంది. వేల కోట్ల దోపిడీ చేస్తున్నారు. నేషనల్ హైవేల కంటే ఎక్కువ ధరకు రోడ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారుపశ్చిమ ప్రకాశంలో తాగు, సాగు నీరు లేక జనం అల్లాడిపోతుంటే చంద్రబాబుకు కనపడటం లేదు. వైఎస్సార్ ఫ్యామిలీ వెలిగొండ ప్రాజెక్టును తీసుకువస్తే దాన్ని కూడా చంద్రబాబు ముందుకు పోనివ్వటం లేదు. టెండర్లలో భారీ అవినీతికి పాల్పడుతున్నారు. నీళ్లు ఇస్తామంటూ నిధులు తోడుకుంటున్నారు. రూ.17 కోట్లు దోచుకున్నారు. ఇలాంటివి ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెడుతున్నారు. ఏపీ పోలీసు వ్యవస్థ దేశంలో నే అట్టడుగున ఉంది. దాన్నిబట్టే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎలా పని చేస్తుందో అర్థం చేసుకోవచ్చు అని అన్నారాయన. -
కోటి సంతకాల సేకరణలో RK రోజా
-
Jakkampudi Raja: మా అక్క తానేటి వనీతమ్మ సొంత అక్క కన్నా ఎక్కువ
-
పక్కా పథకం ప్రకారం దారుణ హత్య!
జనసంచారం అంతగా లేని వ్యవసాయ క్షేత్రం. మురిపాల పొదరింట్లో పెనవేసుకున్న మూడు ముళ్ల బంధం. ఒకరిపై ఒకరు ఆధారపడి జీవిస్తున్న దాంపత్య జీవితం. ఎవరికి కన్నుకుంట్టిందో.. ఎవరు కక్ష పెంచుకున్నారో తెలియదుగానీ.. వృద్ధ దంపతులపై కత్తులు దూశారు. పండు ముత్తైదువును మారణాయుధాలతో పొడిచి ప్రాణం తీశారు. పక్కనే ఉన్న ఆమె భర్తను కూడా తుదముట్టించాలని ప్రయతి్నంచారు. ఇద్దరూ రక్తపు మడుగులో పడిపోయారు. పొద్దున్నే వచ్చిన పని మనిషి చూసి నిర్ఘాంతపోయారు. ఇది దొంగల పనా..? రాక్షస రాజకీయ క్రీడలో భాగమా అంతుపట్టడం లేదు. దంపతుల కుమారుడు వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడిగా రాణిస్తున్నారు. అతన్ని అడ్డుకోవడం చేతగాక ఆగంతకులు ఆయన తల్లిదండ్రులపై దాడికి తెగబడినట్టు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఏర్పేడు: ‘పచ్చని పల్లెల్లో రాజకీయ విషపుభీజాలు నాటిన విశృంఖల రాక్షసక్రీడ రాజ్యమేలుతోంది. కత్తుల వేటలో రక్తపుటేరులు పల్లె నేలను తడుపుతున్నాయి. సగటు మనిషి ప్రాణం తృణప్రాయమైంది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పల్లెల్లో అరాచకశక్తులే రాజ్యమేలుతున్నాయి. సగటు పౌరుడు ఎప్పుడు ఏమి జరుగుతుందో.. అని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాడు. తాజాగా శ్రీకాళహస్తి మండలం పుల్లారెడ్డికండ్రిగలో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్రెడ్డి తల్లిదండ్రులు చెవిరెడ్డి జయమ్మ(70), మహదేవరెడ్డి(81) ఉంటున్న ఇంట్లోకి గురువారం తెల్లవారుజామున గుర్తు తెలియని ఆగంతుకులు ప్రవేశించి కత్తులతో దాడులు చేసి జయమ్మను హతమార్చారు. ఆమె భర్తను కత్తిపోట్లతో తీవ్రంగా గాయపరిచారు. ఈ దుర్ఘటనతో శ్రీకాళహస్తి ఒక్కసారిగా ఉలిక్కిపడింది.’’ అరాచక పాలనకు దర్పణం ‘వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్రెడ్డి ఇంటిపై దాడి చేసి వారి తల్లిని హతమార్చి, తండ్రిని గాయపరచిన దుర్ఘటన శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అరాచకపాలనకు దర్పణంగా నిలుస్తోంది. ఇక్కడ శాంతిభద్రతలు పూర్తిగా గాడి తప్పాయి. మునుపెన్నడూ చూడని అరాచకశక్తులు రాజ్యమేలుతున్నాయి.. అని శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి ఈ దుర్ఘటనను తీవ్రంగా ఖండించారు. హత్యోదంతం గురించి తెలిసిన వెంటనే ఆయన హుటాహుటిన పుల్లారెడ్డి కండ్రిగ గ్రామానికి చేరుకుని మధుసూదన్రెడ్డి తల్లిదండ్రులు నివాసముంటున్న ఇంటిని పరిశీలించారు. హత్య కోణాలపై మృతురాలి కుటుంబసభ్యులతో చర్చించారు. అనంతరం శ్రీకాళహస్తిలో చికిత్స పొందుతున్న మహదేవరెడ్డిని పరామర్శించి, ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. పోలీసులు కేసును త్వరితగతిన ఛేదించి నిందితులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. మృతురాలి కుమారుడు చెవిరెడ్డి మధుసూదన్రెడ్డికి ధైర్యం చెప్పారు. మాజీ ఎమ్మెల్యేతోపాటు బర్రి హేమభూషణ్రెడ్డి, బర్రి సుదర్శన్రెడ్డి, గంగిరెడ్డి, రవీంద్రారెడ్డి, సురే‹Ù, శేఖర్రెడ్డి, నాధముని, శివారెడ్డి, రవి, ఆర్కాడు ముత్తు, సుమన్, దిలీప్, మున్నారాయల్, జయశ్యామ్రాయల్ తదితరులు ఉన్నారు.విద్యావేత్తగా ఎదిగి.. రాజకీయ రంగంలోనూ రాణిస్తూ.. జయమ్మ, మహదేవరెడ్డి దంపతుల కుమారుడు చెవిరెడ్డి మధుసూదన్రెడ్డి శ్రీకాళహస్తిలో విద్యాసంస్థలు నడుపుతూ కొన్ని దశాబ్దాలుగా రాణిస్తున్నారు. ఆయన రాజకీయంపైనా ఆసక్తితో మొదట్నుంచీ వైఎస్సార్ సీపీ అనుయాయుడుగా ఉంటూ వస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహరించి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డికి విధేయుడిగా, పార్టీ పటిష్టతకు నిబద్ధతతో పనిచేసుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ని పార్టీ అధిష్టానం వైఎస్సార్ సీపీ శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడిగా నియమించింది. పదవి పొందినప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ మండలంలోని అన్ని గ్రామాల్లో పార్టీ క్యాడర్ను బలోపేతం చేసుకుంటూ పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్నారు. అయితే ఆయనకు ఎంతో ఇష్టమైన తల్లిదండ్రుల కోసం సొంతూరిలోని వ్యవసాయ క్షేత్రంలో పెద్ద ఇల్లు నిర్మించి సకల సౌకర్యాలు కలి్పంచారు. ఎంపీ పరామర్శ శ్రీకాళహస్తి: వైఎస్సార్ సీపీ శ్రీకాళహస్తి మండలాధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్రెడ్డి తల్లిదండ్రులపై ఆగంతుకుల దాడిలో తల్లి మృతి చెందగా తండ్రి మహదేవరెడ్డి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికి త్స పొందుతున్నాడు. తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, ముక్కంటి ఆలయ పాలకమండలి మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఆస్పత్రికి చేరుకుని వారిని పరామర్శించారు. వైద్యులను అడిగి చికిత్స వివరాలను తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వయ్యాల కృష్ణారెడ్డి, రత్నంరెడ్డి, బుజ్జిమేస్త్రీ, అంజూరు వెంకటే‹Ùబాబు, పఠాన్ఫరీద్, శ్రీవారి సురే‹Ù, రామచంద్రారెడ్డి, పెరుమాళ్రెడ్డి, న్యాయవాది లక్ష్మీపతి, మల్లెంబాకం మునికృష్ణారెడ్డి, గోపీ గౌడ్, తేజు రాయల్, బాల, సు«దీర్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే పరామర్శశ్రీకాళహస్తి: గుర్తుతెలియని దుండగుల దాడిలో గాయపడిన చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి పరామర్శించారు. శ్రీకాళహస్తి మండలంలోని పుల్లారెడ్డి కండ్రిగలోని చెవిరెడ్డి మహదేవరెడ్డి, జయమ్మ దంపతులపై గుర్తుతెలియని దుండగులు దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో చెవిరెడ్డి జయమ్మ మృతి చెందగా, తండ్రి మహాదేవరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. మహాదేవరెడ్డి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం, ఆయన చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డిని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ దారుణమైన హత్యకు కారకులైన వారిని పోలీసులు వెంటనే గుర్తించి, చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యేతో పాటు బర్రె‡ సుదర్శన్ రెడ్డి, గంగిరెడ్డి, రవీంద్రారెడ్డి, సురేష్, శేఖర్ రెడ్డి, నాదముని, శివరెడ్డి, ముద్ధమూడి రవి, ఆర్కాడు ముత్తు, సుమన్, దిలీప్, మున్నా రాయల్, బుల్లెట్ జై శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. పథకం ప్రకారమే హత్య.. అయితే జనసంచారం అంతగా లేని వ్యవసాయ క్షేత్రంలో ఉంటున్న మధుసూదన్రెడ్డి తల్లిదండ్రులను అంతమొందించేందుకు పక్కా ప్రణాళికతో హత్య చేయడానికి వచ్చినట్లు హత్య జరిగిన తీరును బట్టి చూస్తే అర్థమవుతోంది. రాజకీయ ప్రత్యర్థులెవరైనా దాడి చేయించా రా? అనే కోణంలో వారి కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే సమీపంలోని ఎస్టీ కాలనీకి చెందిన వారెవరైనా బంగారు, డబ్బు కోసం ఇంట్లోకి చొరబడి హత్య చేశారా? అనే కోణంలోనూ పోలీ సుల దర్యాప్తు సాగుతోంది. ఇంతటి దారుణానికి ఒడి గట్టిన వారిని పోలీసులు వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది. -
వైఎస్సార్ కడప జిల్లాలో ముగిసిన వైఎస్ జగన్ పర్యటన
సాక్షి కడప: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రోజుల వైఎస్సార్ కడప జిల్లా పర్యటన గురువారం ముగిసింది. పులివెందులలోని క్యాంపు కార్యాలయం నుంచి గురువారం ఉదయం ఆయన బయలుదేరి వెళ్లారు. వైఎస్సార్ కడప జిల్లా పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ తొలిరోజు పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజలు, పార్టీ నాయకులతో మమేకమయ్యారు.రెండో రోజు పులివెందుల పరి«ధిలోని బ్రాహ్మణపల్లె సమీపంలో అరటి తోటలను పరిశీలించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. పలువురు నేతలను పరామర్శించడంతోపాటు వివాహ వేడుకకు హాజరయ్యారు. ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మూడోరోజు కూడా ఇల్లు, కార్యాలయం వద్ద వేచి ఉన్న ప్రజలతో మమేకమయ్యారు. -
ఉచితంగా విద్య, వైద్యం ప్రభుత్వం బాధ్యతే
సాక్షి, అమరావతి: పేద విద్యార్థులకు ఉచితంగా వైద్య విద్య, పేదలకు వైద్యాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ సేకరించిన కోటి సంతకాల ప్రతులను అందజేసేందుకు గవర్నర్ అబ్దుల్ నజీర్ అపాయింట్మెంట్ కోరుతూ గురువారం విజయవాడలో ఆయన్ని కలిశారు. అనంతరం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావులతో కలసి బొత్స మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలన్న చంద్రబాబు నిర్ణయాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమానికి ప్రజలు, విద్యార్థులతో పాటు ప్రజాసంఘాలు, మేధావులు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నట్లు తెలిపారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల అభిప్రాయాలను క్రోడీకరించి గవర్నర్కి సమర్పించనున్నట్లు బొత్స పేర్కొన్నారు. తాము చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో కూటమి నేతలు కూడా పాల్గొన్నట్లు చెప్పారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు పోరాటం చేస్తామని స్పష్టంచేశారు.ప్రజారోగ్యం ప్రభుత్వం చేతుల్లో ఉండాలే గానీ ప్రైవేటు ఆధీనంలో ఉంటే ప్రజలకు న్యాయం జరగదు. ప్రజారోగ్యం కోసం పరితపించిన వ్యక్తిగా వైఎస్ జగన్ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఐదు కాలేజీలు పూర్తై తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. వైఎస్ జగన్కు పేరు వస్తుందన్న అక్కసుతోనే మిగిలిన వాటిని సీఎం చంద్రబాబు ప్రైవేటీకరణ చేస్తున్నారు. స్కూలు పిల్లలకు ఉచితంగా ట్యాబులిస్తే గేమ్స్ ఆడుకుంటారని మాక్ అసెంబ్లీలో విద్యార్థులతో చెప్పించడం సిగ్గుచేటు.ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ ఎలాంటి ప్రభావాన్ని చూపించిందో.. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారో చూశాం. ఈ క్రమంలో ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ఒక్కో కాలేజీకి రూ.500 కోట్లు కేటాయించి, ప్రభుత్వ నిధులతో పాటు వివిధ ఆర్థిక సంస్థలతో టై అప్ చేసి పనులు ప్రారంభించాం. మెడికల్ కాలేజీలకి అనుసంధానంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కూడా నిర్మించే ఏర్పాట్లు చేశాం. దురదృష్టవశాత్తూ ప్రభుత్వం మారిన తర్వాత మెడికల్ కాలేజీలని్నంటినీ పీపీపీ పేరుతో ప్రైవేటుపరం చేస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులు లాభార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తారు. ఇప్పటికే ప్రైవేటు ఆసుపత్రుల్లో 30 శాతం పేదలకు చికిత్స చేయాలన్న నిబంధన ఉన్నా ఎక్కడా అమలు కాని పరిస్థితి నెలకొంది.వైఎస్సార్ పేదవాడు కూడా ధనవంతుడితో సమానంగా వైద్య చికిత్స పొందాలన్న ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. వైఎస్ జగన్ హయాంలో ఆరోగ్యశ్రీ కింద 2 వేల వరకు అదనపు ప్రొసీజర్లను చేర్చడంతో పాటు ఉచిత చికిత్స పరిధిని రూ.25 లక్షల వరకు విస్తరించారు. ఈ ప్రభుత్వానికి పేదలపై ఇంత కక్ష ఎందుకు? నెలకు రూ.300 కోట్లు ఆరోగ్యశ్రీ కోసం ఖర్చు చేయలేదా? బిల్లులు విడుదల కాకపోవడంతో నెట్ వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద పేదవాళ్లకు చికిత్స అందని పరిస్థితి నెలకొంది. పథకాన్ని నీరుగార్చి బీమా పరిధిలోకి తెస్తామంటున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో 60 లక్షల మందికి ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించాం. రూ.14 వేల కోట్లు ఆరోగ్యశ్రీ కోసం వెచ్చించాం. ఇంత డబ్బు ప్రైవేటు సంస్థలు అందిస్తాయా? ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి ప్రజారోగ్యం నాశనం అయిపోయినా ఫర్వాలేదు అనుకుంటున్నారా? ఇది దోపిడీ కాదా? రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను నిర్వీర్యం చేశారు. ఏ పంటకూ మద్దతు ధర లేదు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. రాయలసీమలో అరటి పంట తీవ్ర సంక్షోభంలో పడింది. 18 నెలలుగా శాంతి భద్రతలు దిగజారాయి. సంక్షేమ హాస్టళ్లలో కలుషిత ఆహారం తిని పిల్లలు అనారోగ్యం పాలై చనిపోతున్నారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవం పేరు ఉచ్ఛరించడానికి కూడా కూటమి ప్రభుత్వానికి అర్హత లేదు. రాజ్యాంగం అంటే కేవలం అధికార పార్టీలో ఉన్న ముగ్గురేనా? ప్రతిపక్ష నేతలను, వారి ఉనికిని కూడా భరించలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఇదేనా మీ 40 ఏళ్ల అనుభవం చంద్రబాబూ? పవన్ కళ్యాణ్ గతంలో ఆయన చేసిన ప్రసంగాలను ఒక్కసారి మళ్లీ వింటే బాగుంటుంది. ఆయన బూతులు మాట్లాడితే ఒప్పా? కాకినాడ వెళ్లి రేషన్ బియ్యం గురించి హడావుడి చేశారు. ఆ తర్వాత కూడా అక్రమ రవాణా ఎందుకు ఆగలేదు? ఒక డీఎస్పీ అవినీతిపరుడని, పేకాట క్లబ్బులు నడిపిస్తున్నాడని పవన్ కళ్యాణ్ చెప్పారు. మరి అదే డీఎస్పీకి అవార్డులు, రివార్డులు ఎలా ఇచ్చారు? -
95 వేల సంతకాలు పూర్తి YSRCP నేతలకు అవినాష్ అభినందనలు
-
‘సీఎం ట్రైనింగ్లో బిజీగా లోకేష్.. పవన్ జస్ట్ ఫొటోల డీసీఎం’
సాక్షి, తాడేపల్లి: ఆదాయం వచ్చే అన్ని శాఖల్లో వేలుపెడుతూ.. తనకు ఇచ్చిన శాఖను మాత్రం మంత్రి నారా లోకేష్ గాలికి వదిలేశారని వైఎస్సార్సీపీ గుంటూరు అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.. నారా లోకేష్ విద్యారంగాన్ని భ్రష్టు పట్టించారు. ప్రభుత్వ హస్టళ్లలో అన్నంలో పురుగులు వస్తున్నాయి. కలుషిత ఆహారం తిని విద్యార్థులు రోగాల పాలవుతున్నా పట్టించుకోవటం లేదు. కామెర్లతో పిల్లలు చనిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. నారా లోకేష్ విద్యా, ఐటీ శాఖలను గాలికి వదిలేశారు. సీఎంగా ట్రైనింగ్ అవుతున్నారు. ఆదాయం ఉన్న శాఖల్లో వేలుపెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే పనిలో ఆయన ఉన్నారు. చిన్నవయసులోనే ప్రవచనాలు చెబుతూ కొత్త అవతారం ఎత్తారు. సోషల్ మీడియాలో జగన్ పై ఏఐ వీడియోలు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఒకవైపు దారుణమైన పోస్టులు పెట్టిస్తూ మరోవైపు ట్వీట్ లో ప్రవచనాలు చెప్తున్నారు. రాజకీయాల్లో దుష్ట సంప్రదాయాలు తెచ్చిన వ్యక్తి చంద్రబాబు. మీడియాను అడ్డు పెట్టుకుని ప్రచారం పొందటమే పనిగా పెట్టుకున్నారు. పిల్లల ముందు చంద్రబాబు దారుణమైన అబద్దాలు చెప్పారు. తన వెన్నుపోటు రాజకీయాల గురించి వాస్తవాలు చెబితే బాగుండేది. చంద్రబాబు, లోకేష్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ యాంటీ హీరోలుగా తయారయ్యారు. హీరోలుగా నటిస్తూ విలన్ పనులు చేస్తున్నారు. వైఎస్ జగన్పై టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది. అటు చంద్రబాబు కోసమూ పవన్ కల్యాణ్ వైఎస్సార్సీపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం వచ్చాకే కొబ్బరి చెట్లు చనిపోతున్నాయని పవన్ కళ్యాణ్ అబద్దాలు చెప్పించే ప్రయత్నం చేశారు. కానీ నిజాలేంటో అక్కడి రైతులే చెప్పారు(ఈ సందర్భంగా రైతులు పవన్ ఎదుట మాట్లాడిన వీడియోను అంబటి ప్రదర్శించారు. ప్రశ్నించటానికే పుట్టిన పార్టీ అని చెప్పుకున్న పవన్ ఎదుటివారు ప్రశ్నిస్తే తట్టుకోలేక పోతున్నారు. కూటమికి సపోర్టు చేసిన విషయమ్మీద తన మనిషే ప్రశ్నించినా సమాధానం చెప్పలేక పోయిన పిరికి వ్యక్తి పవన్. అలాంటి వ్యక్తి డిప్యూటీ సీఎంగానే కాదు.. మంత్రిగా కూడా పనికి రాడు. అసలు రాజకీయాలకే పనికి రాని వ్యక్తి పవన్’’ అని అంబటి మండిపడ్డారు.బూతులు మాట్లాడటంలో పవన్ కళ్యాణ్ ని మించినవారు లేరు. సోషల్ మీడియాలో లోకేష్ ఆర్గనైజ్డ్గా బూతులు మాట్లాడిస్తున్నారు. పవర్ లేని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన జస్ట్ ఫోటోల ఉప ముఖ్యమంత్రి. అసలైన ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తోంది మాత్రం లోకేష్. అమరావతి నిర్మాణంలో వందల కోట్ల అవినీతి జరుగుతోంది. లోకేష్, పవన్ కళ్యాణ్ దోచుకుని దాచుకుంటున్నారు. ప్రజలే సరైన సమయంలో సమాధానం చెప్తారు. అధికారం కోసం ఇతరుల కాళ్లు పట్టుకోవడం కాదు. మేము కూటమితో పోరాడి అధికారంలోకి వస్తాం అని అంబటి ఉద్ఘాటించారు. -
జగన్ కోసం బారులు తీరిన జనం
-
‘జగన్కు మంచి పేరు వస్తుందనే ఇలా చేస్తున్నారు’
సాక్షి, తాడేపల్లి: ప్రజా ఆరోగ్యం కోసం వైఎస్ జగన్ ఎంతో తపించి మెడికల్ కాలేజీల తీసుకొస్తే.. వాటిని చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తున్నారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బొత్స నేతృత్వంలో వైఎస్సార్సీపీ బృందం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం తాడేపల్లి పార్టీ కేంద్రకార్యాలయంలో బొత్స ఈ అంశంపై మాట్లాడారు. కోవిడ్ సమయంలో అనేక ఇబ్బందులు పడ్డాం. జిల్లాకో మెడికల్ కాలేజీ ఉండాలనే ఆలోచనతో ముందుకు వెళ్లాం. పేదలకు మేలు జరగాలనే వైఎస్ జగన్ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. వైద్య రంగాన్ని వైఎస్ జగన్ అభివృద్ధి చేశారు. ప్రజల ఆరోగ్యం కోసం వైద్య రంగానికి నిధులు కేటాయించారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై పోరాడుతున్నాం. చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో కాలేజీలను పెట్టాలని చూస్తున్నారు. ఐదు కాలేజీలు మా హయాంలో పూర్తయ్యాయి. మిగతావి క్రమబద్దంగా పనులు జరుగుతున్నాయి. జగన్కు మంచి పేరు రాకూడదనే ప్రైవేటీకరణకు వెళ్తున్నారు. అవి పూర్తయితే జగన్ కు పేరు వస్తుందని కూటమి ప్రభుత్వం కుట్ర పన్నింది.. ..మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు సేకరిస్తున్నాం. అన్ని ప్రజాసంఘాలు, ప్రజాస్వామ్య వాదులు మద్దతు తెలుపుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ల చేతుల్లో ఉండకూడదు. అన్ని విషయాలు గవర్నర్కు వివరించాం. దీనిపై ఒక కమిటీని పంపించి ర్యాండమ్ చెకింగ్ చేయమని కోరాం. ప్రైవేట్ వాళ్లు ప్రజలకు ఎందుకు సేవ చేస్తారు?. లాభాపేక్షతో వ్యాపారం చేస్తే ప్రజల పరిస్థితి ఏంటి?. పేద పిల్లలు వైద్య విద్యని ఎలా చదవగలరు?. పీపీపీని వెనక్కు తీసుకునే వరకు మా పోరాటం ఆగదు’’ అని బొత్స స్పష్టం చేశారు. ఇంకా బొత్స ఏమన్నారంటే.. 👉జగన్ హయాంలో రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్యం పొందేలా చేశారు. చంద్రబాబుకు కోపం ఉంటే మాపై తీర్చుకోవాలి. అంతేగానీ పేదల మీద అంత కోపం ఎందుకు?. ఓటు వేసి గెలిపించిన పాపానికి అదే పేదల మీద కక్ష తీర్చుకోవటం న్యాయమేనా?. విద్య, వైద్య రంగాలను చంద్రబాబు సర్వ నాశనం చేశారు. 👉జగన్ హయాంలో ఏపీ విద్యార్థులు అంతర్జాతీయ ఖ్యాతిని సాధించారు. ట్యాబులు ఇస్తే విద్యార్థులు గేమ్ లు ఆడుకున్నారని మాక్ అసెంబ్లీలో చెప్పించారు. ఇలా పిల్లలతో చెప్పించటానికి కాస్తన్నా సిగ్గు ఉండాలి. స్పీకర్ అయ్యన్నపాత్రుడికి ఇంగిత జ్ఞానం లేదు. ఎమ్మెల్యేలను కించపరిచేలా మాట్లాడటం తగదు. ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటే స్పీకర్ తీసుకోవచ్చు. అంతేగానీ బాధ్యతలేని వ్యక్తి లాగా మాట్లాడటం సరికాదు👉రాష్ట్రంలో అసలు ప్రభుత్వమే లేదు. ఏ వ్యవస్థ మీదా పర్యవేక్షణ లేదు. ఎల్లోమీడియాలో ఆహాఓహో అనిపించుకోవటం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదు. రైతులు గిట్టుబాటు ధరల్లేక అల్లాడిపోతుంటే అసలే మాత్రం పట్టించుకోవటం లేదు. హాస్టళ్లలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్న ప్రభుత్వానికి పట్టటంలేదు. ఆస్పత్రులలో సరైన వైద్యం అందటం లేదు. ఇలాంటి వాటి గురించి కూడా చంద్రబాబు పట్టించుకోవటం లేదు👉రాజ్యాంగ ఆమోద దినోత్సవానికి ప్రతిపక్షాన్ని ఎందుకు పిలవలేదు?. రాజ్యాంగంలో ప్రతిపక్షాన్ని పిలవవద్దని ఉందా?. ప్రతిపక్షం గురించి పట్టించుకోని ప్రభుత్వానికి రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత లేదు👉పవన్ కళ్యాణ్ బూతులు మాట్లాడితే ఒప్పా?. ఇంకొకరు మాట్లాడితే తప్పా?. పవన్ కళ్యాణ్ కాకినాడ వెళ్లి రేషన్ బియ్యం గురించి హడావుడి చేశారు. మరి ఆ తర్వాత కూడా బియ్యం అక్రమ రవాణా ఎందుకు ఆగలేదు?. ఒక డీఎస్పీ అవినీతిపరుడుని, పేకాట క్లబ్బులు నడిపిస్తున్నాడని పవన్ చెప్పారు. మరి అదే డీఎస్పీకి అవార్డులు, రివార్డులు ఎలా ఇచ్చారు? అని బొత్స నిలదీశారు. -
సోషల్ మీడియాలో YSRCPపై పోస్టులు.. YSRCP నేతలు సీరియస్ వార్నింగ్
-
కలత్తూరు బాధితులకు పెద్దిరెడ్డి భరోసా..
-
Nedurumalli Ramkumar: కోటి సంతకాల సేకరణ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు
-
YSRCP నేత తల్లిదండ్రులపై దుండగులు దాడి
-
మంత్రి PA వ్యవహారం.. లోకేష్, పవన్ పై వరుదు కళ్యాణి ఫైర్..
-
వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి మధుసూదన్ తల్లిదండ్రులపై దాడి
తిరుపతి: జిల్లాలోని శ్రీకాళహస్తిలో దారుణం చోటు చేసుకుంది. వైఎస్సార్సీపీ శ్రీకాళహస్తి అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి తల్లిదండ్రులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో మధుసూదన్రెడ్డి త్లి జయమ్మ మృతి చెందగా, తీవ్ర గాయాల పాలైన తండ్రి మహాదేవరెడ్డికి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తులు ఎవరు అనేది తెలియరాలేదు. -
వివాహ వేడుకలో వైఎస్ జగన్.. వధూవరులకు ఆశీర్వాదం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందుల పర్యటనలో ఉన్న వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి బుధవారం ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. ఈ క్రమంలో దారి పొడవునా.. వివాహ వేదిక వద్ద ఆయన్ని చూసేందుకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. ఆయన్ని ఫొటోలు తీసేందుకు, ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం ప్రదర్శించారు. మున్సిపాలిటీ 23వ వార్డు ఇంఛార్జి, వైఎస్సార్సీపీ నేత కొంగనపల్లి మురళీమోహన్ ఇంట శుభకార్యం జరిగింది. ఆయన కుమారుడి వివాహ వేడుకకు వైఎస్ జగన్ హాజరయ్యారు. నూతన వధూవరులు సాయికిరణ్, వినీతలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. జగన్ రాకతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు తండోప తండాలుగా అక్కడికి తరలి వచ్చారు. ఆ సమయంలో అందరినీ ఆప్యాయంగా పలకరించుకుంటూ ముందుకు సాగారాయన. -
అవినీతి సామ్రాట్ మామూలోడు కాదు..!
-
జగనన్న కాలనీలపై అను'గృహం' కలిగేనా?
దగదర్తి: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేసే లక్ష్యంతో జగనన్న కాలనీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా సొంతిళ్లు లేని పేదలకు ఇంటి స్థలాలను కేటాయించడమే కాకుండా పక్కాగృహాలను సైతం మంజూరు చేసింది. 2024 ఎన్నికల నాటికి కొందరు గృహాలను పూర్తి చేసుకోగా, మరికొందరు వివిధ స్థాయిల వరకు నిర్మాణాలను చేపట్టారు. ఆ తరువాత వచ్చిన కూటమి ప్రభుత్వం బిల్లుల చెల్లింపులు చేయకపోవడంతో గృహ నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి. గత ప్రభుత్వం గృహ లబ్ధిదారులకు అందించేందుకు హౌసింగ్ కార్యాలయానికి సరఫరా చేసిన చువ్వను కూడా పంపిణీ చేయలేదు. రెండేళ్లుగా హౌసింగ్ కార్యాలయంలో లక్షలాది రూపాయల విలువైన చువ్వ తుప్పు పట్టిపోతున్నా హౌసింగ్ అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 1500 పక్కాగృహాలు మంజూరుగత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మండలంలోని 20 పంచాయతీల్లో 12 చోట్ల జగనన్న కాలనీల నిర్మాణం చేపట్టారు. అందులో సొంతిళ్లు లేని పేదలకు స్థలాలను కేటాయించారు. సుమారు 1500 పక్కాగృహాలను మంజూరు చేశారు. అందులో ఎన్నికలకు ముందే సుమారు 650 గృహ నిర్మాణాలను పూర్తి చేయగా లబ్ధిదారులు బిల్లులు చెల్లింపులు చేశారు. మరో 67 గృహాలను స్లాబు దశ వరకు నిర్మాణం చేపట్టారు. మిగిలిన గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక మిగిలిన వాటిలో ఒక్క గృహ నిర్మాణాన్ని కూడా పూర్తి చేయలేదు. గృహ లబ్ధిదారులకు అవగాహన కల్పించి నిర్మాణాలను పూర్తి చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించారు. కనీసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన ఇనుమును కూడా పంపిణీ చేయలేదు. దీంతో రెండేళ్లుగా మండల హౌసింగ్ కార్యాలయం బయట లక్షలాది రూపాయల విలువైన ఇనుము వర్షానికి తడుస్తూ ఎండకు ఎండుతూ తుప్పు పడుతోంది. గతంలో మంజూరు చేసిన ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులకు ప్రస్తుతం బిల్లులు చెల్లింపులు చేస్తామని, గృహ నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని గృహ నిర్మాణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పిల్లర్లు, స్లాబు నిర్మించుకుంటామన్న లబ్ధిదారులకు తుప్పు పట్టిన ఇనుమును పంపిణీ చేస్తున్నారు. తుప్పు పట్టిన ఇనుముతో నిర్మాణం చేపడితే నాణ్యత ఎలా ఉంటుందని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. -
కేసులు పెట్టినా జగన్ వెంటే.. జనం రావడానికి కారణం అదే
-
షాడో సీఎం ఫ్లైట్ ఖర్చు ఎంతంటే..? కారుమూరి వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్
-
పులివెందుల: అరటి రైతుల కష్టాలు విన్న వైఎస్ జగన్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందుల పర్యటనలో భాగంగా.. బ్రహ్మణపల్లి అరటి రైతులను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి కలిశారు. వైఎస్ జగన్కు రైతులు ఆకుపచ్చ కండువా కప్పి తోటల పరిశీలనకు ఆహ్వానించారు. సాగు నష్టాన్ని స్వయంగా వైఎస్ జగన్ పరిశీలిస్తూ.. వాళ్ల కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు.ఎకరానికి లక్షల పెట్టుబడి పెట్టి సాగు చేస్తే.. రెట్టింపు నష్టాలు వాటిల్లుతున్నాయని పలువురు రైతులు ఆయన వద్ద వాపోయారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదని ఈ సందర్భంగా వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. జగన్ హయాంలో అరటి రైతుల కోసం రూ. 20.15 కోట్లతో ఈ భవనాన్ని ప్రారంభించారు. ప్రతిరోజూ 32 టన్నుల సామర్థ్యం కలిగిన ప్రత్యేక టబ్లో అరటి కాయలను శుభ్రపరిచే యూనిట్తో పాటు 45 కిలోవాట్ల కూలింగ్ ఛాంబర్, 30.6 కిలోవాట్ల కోల్డ్ స్టోరేజ్, ఆరు కూలింగ్ సెల్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు. మార్కెట్లలో తగిన ధర లభించే వరకు రైతులు అరటి, నారింజ పండ్లను 40 రోజుల పాటు నిల్వ చేసుకునే కెపాసిటితో నిర్మించారు. అలాగే.. ప్లాంట్ ఆవరణలో 60 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో వే బ్రిడ్జ్ నిర్మించారు. అయితే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దుర్మార్గంగా దీనిని మూసేయించింది. ఇదీ చదవండి: బాబు పాలనలో గిల‘గెల’! -
వైఎస్సార్సీపీపై కక్ష సాధింపే టీడీపీ కూటమి టార్గెట్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీపై కక్షసాధింపే టీడీపీ కూటమి సర్కారు టార్గెట్ అని, ఆ నినాదాన్ని భుజానికెత్తుకుని తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని వైఎస్సార్సీపీ స్టేట్ కోఆరి్డనేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. ఆ దిశలోనే కన్ఫెషన్ స్టేట్మెంట్స్తో కాన్సిపిరసీ థియరీని సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారని ఆక్షేపించారు. అందులో నుంచి వచ్చినవే తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి , పరకామణి, లిక్కర్ వంటి కేసులు అని వెల్లడించారు. ఏ ఆధారాలు లేకుండానే అక్రమంగా కేసులు నమోదు చేసి ఎవరో ఒకరిని అరెస్టు చేయడం, బెదిరించడం.. ఆ తర్వాత వాంగ్మూలాలు నమోదు చేయడం.. వాటి ఆధారంగా టార్గెట్ లిస్ట్లో ఉన్న వారిపై కేసులు పెడుతూ, వైఎస్సార్సీపీ నాయకులపై కక్ష సాధిస్తున్నారని.. అదే సీఎం చంద్రబాబు నమ్ముకున్న కన్ఫెషన్, కాన్సిపిరసీ థియరీ అని సజ్జల మండిపడ్డారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయనేమన్నారంటే.. నెయ్యిపై ఏ ఆధారాలతో సిట్ విచారణ?..2019లో మా ప్రభుత్వం ఏర్పడినప్పుడు, మేము కూడా ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నట్లుగా కన్ఫెషన్, కాన్సిపిరసీ థియరీని అమలు చేసి ఉంటే, అధికారంలోకి వచ్చిన తొలి మూడు నెలలకే ఆయన్ను అరెస్ట్ చేసే వాళ్లం. కానీ, ఏనాడూ మేము కక్షపూరితంగా వ్యవహరించలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంటూ, ఏ ఆధారాలతో సిట్ ద్వారా విచారణ చేయిస్తుందో అర్థం కావడం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన నెయ్యి సరఫరాపై విచారణ చేస్తున్న సిట్, 2014–19 మధ్య జరిగిన నెయ్యి సరఫరాపైనా విచారణ చేస్తే అసలు నిజాలు తెలుస్తాయి. 2019 –24 మధ్య కేజీ నెయ్యి రూ.320 చొప్పున సేకరిస్తేనే కల్తీ అన్న నాయకులు. అంతకు ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో కేజీ నెయ్యి రూ.270కే సేకరించినప్పుడు కల్తీ జరిగినట్లు కాదా? ప్రభుత్వాలు మారినా టీటీడీలో దశాబ్దాలుగా నడుస్తున్న వ్యవస్థల ప్రకారమే టెండర్ల నిర్వహణ, క్వాలిటీ చెకింగ్ జరుగుతుంది. పరకామణి చోరీ అంటూ కేసు పెట్టి, వైఎస్సార్సీపీ నాయకులను ఇరికించే ఉద్దేశంతోనే విచారణ పేరుతో ఏవీఎస్వో సతీష్ కుమార్ను సిట్ వేధించింది. ఆ బాధతోనే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటాడని మేం మాట్లాడితే.. ఆధారాలు లేకుండానే హత్యగా ప్రచారం చేసిందే కాకుండా వైఎస్సార్సీపీ నాయకులే చంపించారని మాపై బురదజల్లారు.రిజెక్ట్ చేసిన నెయ్యిని ఎలా వాడారు?..‘‘టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక గత ఏడాది జూలైలో క్వాలిటీ చెక్ తర్వాత నాలుగు నెయ్యి ట్యాంకర్లను రిజెక్ట్ చేసి వెనక్కి పంపారని చెబుతున్నారు. వెనక్కి పంపిన నెయ్యిని తిరిగి తీసుకొస్తే వాడినట్టు సిట్ రిపోర్టులో ఉంది. అలాంటప్పుడు రిజెక్ట్ చేసిన నెయ్యినే కూటమి ప్రభుత్వంలో ఎలా వాడారు? టీడీపీ హయాంలో జరిగిన తప్పునకు చంద్రబాబు బాధ్యత తీసుకోరా? లిక్కర్ కేసులో ఇన్నాళ్లుగా విచారణ చేస్తున్న ప్రభుత్వం ఏం సాధించినట్టు? న్యాయస్థానాల దగ్గర విచారణ పేరుతో మా నాయకులను అదుపులోకి తీసుకుని నెలల తరబడి జైలుపాలు చేశారు.’’ అని రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.ఎస్ బ్యాంకులో టీటీడీ నిధుల జమ నియమాలకు విరుద్ధం కాదా?‘‘ప్రైవేట్ బ్యాంకులో 10 శాతానికి మించి టీటీడీ నిధులు డిపాజిట్ చేయకూడదనే నిబంధన ఉంది. కానీ టీటీడీ హయాంలో నిబంధనలు ఉల్లంఘించి ఎస్ బ్యాంక్ అనే ప్రైవేట్ బ్యాంకులో రూ.1300 కోట్లకు పైగా జమ చేశారు. వైవీ సుబ్బారెడ్డి చైర్మన్ అయ్యాక దాన్ని జాతీయ బ్యాంకుల్లోకి మార్చారు. ఎస్ బ్యాంకులో డిపాజిట్ చేసిన దానికి చంద్రబాబే కారణమని మేం ఆరోపించామా? కుట్ర రాజకీయాలు చేశామా?’’ అని సజ్జల ప్రశ్నించారు. లాయర్కు రూ.8 కోట్ల ఫీజు!‘‘చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఆయన కోసం వాదించిన లాయర్ సిద్దార్థ లూథ్రాని తీసుకొచ్చి వైఎస్సార్సీపీ నాయకుల మీద బనాయించిన అక్రమ కేసులన్నీ ఆయనకే అప్పజెప్పారు. ఈ కేసులకు ఆయనకు ఇప్పటి వరకు రూ.8 కోట్లకు పైగా జనం సొమ్మును ఫీజు కింద చెల్లించారు’’ అని సజ్జల విమర్శించారు. కేసుల క్లోజర్ కుట్ర!‘‘సీఎం చంద్రబాబు అధికార దుర్వినియోగంతో కేసులు క్లోజ్ చేయించుకునే కుట్ర చేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంతోపాటు, బార్లకు ప్రివిలేజ్ ఫీజు రద్దు కేసులను మాఫీ చేసుకునేందుకు యత్నిస్తున్నారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక బాబుపై ఉన్న అన్ని కేసులూ మళ్లీ బయటకు తీస్తాం.’’ అని రామకృష్ణారెడ్డి తేల్చిచెప్పారు.ఎందుకంత కడుపు మంట?‘‘తెలంగాణలో బలనిరూపణ చేసుకోవాల్సిన అవసరం మాకేంటి. వైఎస్ జగన్ సీబీఐ కోర్టుకు హాజరవుతున్న సందర్భంలో స్వచ్ఛందంగా ప్రజలు తరలివచ్చారు. 2014 తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తే వైఎస్సార్సీపీకి 7శాతం ఓట్లు వచ్చాయి. అయినా తెలంగాణ రాజకీయాలు వద్దనుకుని వచ్చిన మాకు బలనిరూపణ చేసుకోవాల్సిన అవసరం లేదు. వైఎస్ జగన్కు జనాదరణ పెరుగుతుంటే టీడీపీ, ఎల్లోవీుడియాకు ఎందుకంత కడుపుమంట?’’ అని సజ్జల ప్రశ్నించారు.కోటి సంతకాల సేకరణకు భారీ స్పందన‘‘వైఎస్సార్సీపీ హయాంలో తీసుకొచి్చన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. అందుకే వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో భారీగా పాల్గొని సర్కారుపై గళమెత్తుతున్నారు. కోటి సంతకాల సేకరణ గొప్ప ప్రజా ఉద్యమంగా చరిత్రలో నిలిచిపోతుంది.’’ అని సజ్జల పేర్కొన్నారు. ఒక్క ఇల్లు కట్టించకపోయినా క్రెడిట్ చోరీ..‘‘వైఎస్సార్సీపీ హయాంలో పూర్తి చేసిన 3 లక్షల ఇళ్లను కూటమి ప్రభుత్వంలో ఇచ్చినట్టు చెప్పుకోవడం దారుణం. పేదల కోసం ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా క్రెడిట్ చోరీకి పాల్పడటం సిగ్గుచేటు.’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు.అమ్మణమ్మ చెప్పిన కథలో నక్క చంద్రబాబే..‘‘చంద్రబాబు తల్లి అమ్మణమ్మ చెప్పిన కథలో నక్క చంద్రబాబే. లోకేశ్ పక్కనే ఉన్నారు కాబట్టి ఆ కథనే చాగంటి మరో రకంగా చెప్పారు. గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి అదానీ పేరెత్తితే వైఎస్ జగన్ కి క్రెడిట్ ఇవ్వాల్సి వస్తుందనే భయంతోనే చంద్రబాబు కిక్కురుమనడం లేదు. విశాఖలో అనామక కంపెనీలకు బాబు అప్పనంగా భూములు కట్టబెడుతున్నారు. అదే హెరిటేజ్ ఆస్తులైతే అంత తక్కువ ధరకు ఇస్తారా?’’ అని సజ్జల నిలదీశారు. -
పంచ సూత్రాలు కావు.. పచ్చి అబద్దాలు: కన్నబాబు
సాక్షి, కాకినాడ: 18 నెలల పాలనలో రైతును నిలువునా ముంచిన చంద్రబాబు ప్రభుత్వం.. పంచ సూత్రాల పేరుతో పచ్చి అబద్దాలు చెబుతున్నారని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్త, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రైతుల కోసం ధరల స్థిరీకరణ ప్రణాళికతోపాటు నిధీ కూడా లేని చంద్రబాబు ప్రభుత్వానికి.. రైతన్నా మీ కోసం అని తిరగడానికి సిగ్గనిపించడం లేదా? అని నిలదీశారు.రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్టే లేదని.. ఉన్నదల్లా చంద్రబాబు వ్యక్తిగత మార్కెటింగేనని తేల్చి చెప్పారు. రైతులకు ప్రకృతి వైపరీత్యాల జరిగన నష్టం కన్నా.. ప్రభుత్వం చేసిన నష్టమే ఎక్కువుగా ఉందని ఆక్షేపించారు. అరటికి రేటు లేదని రైతులు గోలపెడుతుంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటూ బాబు కహానీలు చెబుతున్నారని మండిపడ్డారు. దేశంలో రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఎకరా రూ.99 పైసలకే సంతర్పణ చేసిన చరిత్ర మరే ప్రభుత్వానికీ లేదన్న ఆయన.. దీన్ని విశాఖ భూదోపిడీకి జరుగుతున్న పెద్ద స్కామ్గా అభివర్ణించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..రైతులను మభ్యపెట్టే కార్యక్రమం..గడిచిన వారం రోజులుగా ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త డ్రామాలకు తెరతీసింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతులని ఆదుకోవడం మానేసి.. తామేదే చేస్తున్నామని వారిని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తోంది. 18 నెలల కూటమి పాలనలో కంటతడిపెట్టని రైతు లేడు. వరి దగ్గర నుంచి అపరాలు వరకు, అరటి నుంచి కొబ్బరి వరకు ఏ పంట పండించిన రైతును కదిలించినా ఒకటే బాధ. కానీ చంద్రబాబు తనను తాను మభ్యపెట్టుకుంటున్నాడో.. ప్రజలను మభ్యపెట్టాలనుకున్నాడో తెలియడం లేదు. ఇది ఆశ్చర్యం.రైతన్నా మీ కోసం అనే కార్యక్రమాన్ని చూస్తే.. అశ్వద్ధామ హతహ్ హతహ్ కుంజరహ తరహలో.. రైతన్నా మీ కోసం అని గట్టిగా చెబుతూ.. మనసులో మాత్రం మీకేమీ చేయలేం అన్నది గుర్తుకు వస్తుంది. రైతులు కోసం మీరు ఏం మేలు చేశారని చంకలు గుద్దుకుంటూ భుజాలెగరేస్తున్నారు? రైతులను కాలరెగరేసుకునేలా చేస్తామని చెప్పుకోవడానికి మీకు సిగ్గనిపించడం లేదా? రాష్ట్ట్రంలో ఏ జిల్లాకు వెళ్లినా ఫలానా పంట పండించిన రైతు ఆనందంగా ఉన్నాడని ఇచ్చాపురం నుంచి తడ వరకు, అనకాపల్లి నుంచి అనంతపురం వరకు ఒక్కరిని చూపించండి.కనీసం అంటే కనీసం మానవత్వం, ప్రేమ, దయలేని ప్రభుత్వమిది. పండించిన పంటకు దిక్కూ మొక్కూ లేదు కానీ పంచ సూత్రాల పేరుతో రైతన్నా మీకోం అని తయారై ఇంటింటికీ తిరుగుతూ ఏం చేయబోతున్నారు. రైతు పండించిన పంటకు దిక్కులేదు కానీ పంచసూత్రాల పేరుతో ప్రచారానికి మాత్రం తయారయ్యారు.పంచ సూత్రాలు- పచ్చి అబద్దాలునీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, పుడ్ ప్రాసెసింగ్..ప్రపంచ వేదికగా మార్కెటింగ్.. ఇలా మీ మాటలు వినడానికి మాత్రం సొంపుగా ఉంటాయి. వీటిలో ఒక్కటీ చేసిన పాపాన పోలేదు. నీటి భద్రత తీసుకుంటే.. ఒక్క కాలువ కూడా మీరు బాగుచేయలేదు. రెండోది డిమాండ్ ఆధారత పంటలు... ఉల్లి, టమోట రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక పొలంలోనే విడిచిపెడుతున్న దుస్థితి. కనీసం ఫలానా పంటకు డిమాండ్ ఉంది కాబట్టి ఆ పంట సాగుచేయండి అనైనా మీరు రైతులకు చెప్పలేదు. అదీ లేదు.అగ్రిటెక్.. ఈ విషయంలో మీ ప్రభుత్వం మరింత ఫెయిల్. ఏ విషయంలో టెక్నాలజీని వ్యవసాయానికి సంధానం చేశారు. ఉన్న ఇ-క్రాప్ పథకాన్నే మొత్తానికి సున్నా చుట్టించేశారు. పుడ్ ప్రాసెసింగ్ విషయానికొస్తే... రాష్ట్రంలో మా ప్రభుత్వ హయాంలో ఫలానా దగ్గర ఉంది అని మీరు చెప్పండి. చివరిగా ప్రపంచవేదికగా మార్కెటింగ్ .. ఇక్కడ దిక్కులేదు కానీ ప్రపంచ వేదిక అని చెబుతున్నారు.అరటి రైతుల వెతలు పట్టని ప్రభుత్వం..మీరు అమలు చేస్తున్న పంచ సూత్రాలేమిటంటే... రైతుకు ఆశపెట్టి బొమ్మ చూపించడం, పబ్బం గడుపుకోవడం, దోచుకోవడం, దాచుకోవడం, మోసం చేయడం, పబ్బం గడుపుకోవడం ఇదే మీ పంచ సూత్రాలు చంద్రబాబూ. ఇంత అన్యాయంగా రైతుల పట్ల ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్ధం కావడం లేదు? అరటి పంట ధర దారుణంగా పడిపోయి, రైతులు దిక్కుతోచని స్ధితిలోకి వెళ్లిపోయారు.ఇవాళ పత్రికల్లో వచ్చిన వార్తలు చూస్తే.. త్వరలో ఏపీ అరటిని కొంటాం అన్న ఈ వార్త చూస్తే.. కేంద్ర ప్రభుత్వమే ఆదుకుంటుందేమోనని అనిపిస్తుంది. ఈ ప్రకటన చేసింది రాష్ట్ర ప్రభుత్వమూ కాదు. ఢిల్లీ దగ్గర ఉన్న ఆజాద్ పూర్ మండి వ్యాపారులు హామీ ఇచ్చారని ఈనాడులో రాశారు. మరో వార్తలో రైతుల్లో కలవరం, వాతావరణంలో మార్పు.. గోనె సంచుల కొరత, కొనుగోలు చేసిన ధాన్యం నమోదవ్వని వైనం, కొనుగోలు కేంద్రాల నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ లోపం... అంటూ ఆంధ్రజ్యోతిలో వచ్చింది.ఈ రెండు వార్తలు రాష్ట్రంలో ఉన్న రెండు పవిత్ర పత్రికల్లో వచ్చాయి. వీటిని కూడా అబద్దాలు అని మీరు కొట్టిపారేస్తారా?18 నెలల్లో ఒక్క పంటకూ లేని మద్ధతు ధర..18 నెలల కాలంలో ఒక్క రైతును కూడా మీరు ఆదుకోలేదు. టమోట పంటను రైతులు ధర లేకపోవడంతో కోయలేక వదిలిపెట్టారు. మామిడికి ధరలేదు, మద్ధతు ధర ఇస్తామని ఇవ్వలేదు. మొక్క జొన్న రైతులైతే దిక్కుతోచని స్ధితిలోకి వెళ్లిపోయారు. పశ్చిమగోదావరి నుంచి శ్రీకాకుళం వరకు అధికంగా మొక్కజొన్న పండిస్తారు. వైయస్.జగన్ ప్రభుత్వ హయాంలో మొక్కజొన్న క్వింటాళ్లకి రూ.2300 నుంచి రూ.2400 కొంటే.. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కేవలం రూ.1700 మాత్రమే ధర పలుకుతుంది. మా ప్రభుత్వ హయాంలో మార్క్ ఫెడ్ ద్వారా పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాడు చేసి.. అన్నిచోట్ల 30-40 శాతం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. మీరెందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు?మొక్కజొన్న రైతులు అన్యాయమైపోతుంటే చూస్తూ ఎందుకు కూర్చున్నారు. బత్తాయి రైతులు సర్వనాశనం అయిపోయారు. మార్కెట్ లో కనీస ధరకు కూడా అడిగే పరిస్థితి లేదు. చివరకిరైతులు బత్తాయి తోటలను తెలిగిస్తున్నారు. ఉల్లి రైతులైతే పంట తొలగిస్తున్నారు. తీత ఖర్చులు కూడా రావు. అరటి పంట విషయంలో ప్రభుత్వం మరీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. ధర లేదు అంటే ఢిల్లీలో ఉన్న వ్యాపారులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మా రైతుల దగ్గర అరటి కొనండని బ్రతుమాలుతోంది.ఇదే అరటి పంటకు కోవిడ్ టైంలో ధరలు పడిపోతే... అరటిని ఎగుమతి చేసే కంపెనీలతో తీసుకొచ్చాం. ఏపీ నుంచి విదేశాలకు ఎగుమతి చేసాం. గూడ్స్ రైళ్లు తీసుకొచ్చి ఆ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరించి అరటి పంటను ఎగుమతి చేశాం. మీ హయాంలో అసలు ధరలస్ధిరీకరణ కోసం నిధి లేదూ, ప్రణాళిక కూడా లేదు. రైతన్నా మీ కోసం అని తిరగడానికి సిగ్గనిపించడం లేదా?అరటి గడిచిన మూడేళ్లలో సగటున వైయస్సార్సీపీ ప్రభుత్వంలో టన్నుకు రూ.25 వేలు పలికితే... ఇప్పుడు టన్ను రూ.500, కేజీ రూ.50 పైసలు పలుకుతోంది. కనీసం కోత ఖర్చులు అయినా వస్తాయా?మీరేమో వ్యాపారస్తుల దగ్గరికి వెళ్లి అడిగితే వారు 15 రోజుల తర్వాత వచ్చి కొంటామని చెబుతున్నారంట. ఈలోగా కాయ పండిపోయి కుళ్లిపోవడం ఖాయం. ఇదీ రైతన్నా మీకోసం అని మీరు చేస్తున్న గొప్ప కార్యక్రమం.ధాన్యం మద్ధతుధర 75 కేజీలకు మా హయాంలో కన్నా ఇప్పుడు రూ.300-రూ.400 తక్కువ ధరకు కొంటున్నారు. మొక్కజొన్న సగటున గత మూడేళ్లలో రూ.2300 నుంచి రూ.2090 ఉంటే ఇప్పుడు రూ.1200- రూ.1700 ఉంది. పత్తి ఎంఎస్పీ మా హయాంలో క్వింటాళ్ కి రూ.7020 ఉంటే.. ఈరోజు రూ.4500 నుంచి రూ.5000 ఉంది. వేరుశెనగా మా ప్రభుత్వ హయాంలో 6370 ఉంటే ఇవాళ రూ.4000 నుంచి రూ.4300 ఉంది. వైఎస్ జగన్ ముఖ్యంత్రిగా ఉన్నప్పుడు వరికోత యంత్రాల అద్దెలను కూడా నియంత్రించాం. గంటకు రూ.2500 ఉంటే ఇప్పుడు రూ.4000- రూ.4500 వసూలు చేస్తున్నారు. ఇదీ రాష్ట్రంలో పరిస్థితి.గత 18 నెలలుగా రైతులు ఇంత ఇక్కట్లు పడుతుంటే రైతన్నా మీ కోసం నేనున్నాను అని నిలబడిన నాయకుడు ఒక్కడు లేడు. ఇవాళ మీరు స్లోగన్లు ఇస్తుంటే ఖర్మ కాకపోతే మరేంటి? చంద్రబాబు నాయుడు వ్యక్తిగత మార్కెటింగ్ తప్ప ఈ రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ లేదు. 18 నెలల కాలంలో ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారో మీరు డేటా చెప్పగలరా? ఎంతమందికి సాయం చేశారో చెప్పగలరా? ఎందుకు ఈ డేటా చెప్పడం లేదు? ఏ రోజు పత్రికలు తిరగేసినా ఎంతమంది రైతులు బలవన్మరణం పొందారో రాస్తున్నారు. అయినా చీమకుట్టినట్లైనా లేదు.ఇక కౌలురైతులను పూర్తిగా గాలికొదిలేశారు. ఎన్నికల ముందు వైయస్.జగన్ ప్రభుత్వంలో అయితే కేంద్రంతో కలిపి రూ.13,500 ఇస్తున్నారు.. నేను అయితే అన్నదాత సుఖీభవ కింద పెట్టుబడిసాయంగా రూ.20వేలు కేంద్రంతో సంబధం లేకుండా ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఒక్కో రైతుకు రూ.40వేలు ఇవ్వాలి.కానీ ఇప్పటివరకు కేవలం రూ.10 వేలు మాత్రమే ఇచ్చారు. కౌలు రైతులకు ఇచ్చిన హామీ అనుకూలంగా మర్చిపోయారా? గుర్తుందా? వారికి ఎందుకు ఒక్క పథకాన్ని కూడా అమలు చేయడం లేదు? మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే భారీ వరదలు వచ్చి పంటలు కొట్టుకుపోతే మీరు వేసిన లెక్కల ప్రకారమే రూ.600 కోట్లు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వాలి. ఈ 18 నెలల కాలంలో దాన్ని ఎందుకు చెల్లించలేదు?. రైతన్నా మీ కోసమే అని స్లోగన్ చెబుతూ.. మీరు రైతులకు చెల్లించాల్సింది ఎందుకు ఇవ్వడం లేదు?అబద్దపు ప్రచారాలు- రైతుకు అందని చిల్లిగవ్వ సాయంఒక వైపు రైతులు చితికి పోతుంటే... మరోవైపు అన్నదాత సుఖీభవ అని మీరు దీవిస్తుంటే ప్రజలు అర్దం చేసుకోలేరా? మీ పంచ సూత్రాలు పచ్చి అబద్దాలు. వ్యక్తిగత ప్రచారాలు, డ్రామాలకే మీరు పరిమతమవుతున్నారే తప్ప.. రైతుల కోసం ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని చెప్పగలరా? ఆ రోజు వైస్.జగన్ ప్రభుత్వం కన్నా మిన్నగా మేము ఇది చేశామని చెప్పగలరా? అరటి పంటనే తీసుకుంటే మీరెంత సాయం చేశారు? మేమేం చేశామో తెలుస్తుంది. మా పార్టీ అధ్యక్షుడు వైయస్.జగన్ అరటి రైతులను పరామర్శించి వారికి అండగా నిలబడనున్నారు.మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ధాన్యం, కందులు, పెసలు, ఉల్లి, మిర్చి, పెసలు, పొగాకు, అరటి, సజ్జలు, కోకో, చీనీ, మామిడి ఇలా ఎవిరిని తీసుకున్నా... ఒక్క రైతుకూ చేయూతనివ్వని, ఒక్క రైతునీ నిలబడ్డనీ మీది మంచి ప్రభుత్వం ఎలా అవుతుంది?ఆ హక్కు మీకెక్కడుంది. ఏ వర్గం మీ పాలనలో ఆనందంగా లేదు. వ్యాపారులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు ఎవ్వరూ మీ ప్రభుత్వంలో ఆనందంగా లేరు.ఉచిత పంటల బీమా రద్దు, సున్నా వడ్డీకి ఎగనామం, ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వాలన్న విషయాన్ని మర్చిపోయారు. ప్రకృతి విపత్తుల కన్నా రైతులకు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం చేసే నష్టమే ఎక్కువగా ఉంది. మామిడి పంట తీసుకుంటే... మామిడి రైతులకు డబ్బులిస్తామని ప్రకటించారు. ఇవాల్టి వరకు ఒక్క రూపాయి వాళ్ల అకౌంట్లో వేస్తే చూపించండి. మామిడి రైతుల కోసం కర్ణాటక, తమిళనాడులో రూ.5 నుంచి రూ.18 వరకు మద్ధతు ధర ఇచ్చింది. ఏపీలో రూ.4 మద్ధతు ధరతో సరిపెట్టుకోవాలని చెప్పారు. ఇప్పుడేమో ఇంకా లెక్కలు తీస్తున్నామని చెబుతున్నారు. సీజన్ అయిపోయనా... ఇంకా లెక్కల పేరుతో కాకమ్మ కధలు చెబుతున్నారు.రైతులకి చంద్రబాబు ఇచ్చినన్ని హామీలు ఎవ్వరూ ఇచ్చి ఉండరు. రైతుల నుంచి ఉల్లి పంటను క్వింటాల్లు రూ.1200 కొనుగోలు చేస్తుందని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. దానికోసం చాలా ఖర్చు పెట్టారు. క్వింటాళ్లకు రూ.1200 ఇస్తామని చెప్పి అది అమలైందో లేదో కూడా చూడలేదు. మామిడి పంటకు కేజీ రూ.12 ఇస్తామన్నారు. మిర్చికి క్వింటాళ్లకు రూ.11,781 ఇస్తామన్నారు. ఏ ఒక్కటైనా అమలు చేశారా?. ఏది తీసుకున్నా ఆ రోజుకి పత్రికల్లో హెడ్ లైన్స్ లో ఉండాలన్న తపన తప్ప..ఆ పథకంపైనా కానీ, ఆ కార్యక్రమం పైనా కానీ రైతులకు చేరువ అయిందా? లేదా అన్న ఆలోచన ఎప్పుడూ లేదు. అరచేతిలో వైకుంఠం చూపించడం తప్ప మరేం లేదు.ఫెయిలైనా బాబు బుకాయింపు..చివరికి యూరియా రైతులకు సక్రమంగా సరఫరా లేదు, .. .ఒక బస్తా యూరియా కూడా రైతులకు ఇవ్వడంలో మీరు విఫలమయ్యారు అంటే.. యూరియా వాడితే కేన్సర్ వస్తుందని చెబుతాడు. అన్నం తింటే మీ ఆరోగ్యాలు మటాష్ అయిపోతాడు అంటాడు. పేదవాడి ఐదువేళ్లు నోటిలోకి వెళ్లాని... కిలో రెండు రూపాయలు బియ్యం పథకం చంద్రబాబు మామ ఎన్టీఆర్ గారి ప్రవేశపెడితే.. దాని వల్లఅందరి ఆరోగ్యాలు పోయాయన్నట్టు మాట్లాడుతున్నాడు.విత్తనాలు అందవు, పురుగుమందులు, యూరియా కూడా అందవు. చంద్రబాబు రైతులతో ముఖాముఖిలో ... డ్రోన్లకు కెమెరాలు ఏర్పాటు చేసి దాని సాయంతో ఏ మొక్కమీద పురుగు ఉందో చూస్తే.. డ్రోన్ ఆ మొక్క మీదే పురుగుమందు పిచకారీ చేస్తుందని చెబుతున్నాడు.ఇంకా చిత్రంగా గాలిని కూడా ఎనలైజ్ చేస్తామని చెబుతున్నాడు. ఇందుకోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ని తీసుకొస్తాడంట. అరటికి రేటు లేదు మహాప్రభో అంటే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెస్తామంటున్నాడు. పండిన ధాన్యం కొనేవాడు లేరంటే... ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఎవరికి కావాలి.. దయచేసి రియల్ ఇంటెలిజెన్స్ వాడండి చంద్రబాబూ.పండిన పంటకు ధరలేదని రైతులు గగ్గోలు పెడుతుంటే.. ప్రపంచ మార్కెట్ వేదికగా చేస్తానని చెబుతున్నాడు. అంటే మండీల దగ్గరకు వెళ్లి వ్యాపారులను బ్రతిమాలడమా? ఇదేం ప్రభుత్వం. అసలు మీకేమీ బాధ్యత అనిపించడం లేదా? కోనసీమలో కొబ్బరిరైతులు రేటు పెరిగిందని ఆనందపడేలోపే కొబ్బరి రేటు అనూహ్యంగా పడిపోయింది. అంబాజీ పేట మార్కెట్ లో నెల రోజుల వ్యవధిలో 1000 కాయిలకు రూ.9వేలు ధర తగ్గింది. ప్రభుత్వం కనీసం జోక్యం చేసుకోలేదు. గత నెలలో ఇదే సమయానికి 1000 కాయిలకు రూ.23-రూ.24 వేలు ఉండే ధర... రూ.9వేలు తగ్గిపోయింది. కనీసం నాఫెడ్ కి లేఖ రాసి మా కొబ్బరి కొనండని లేఖ కూడా రాయలేదు. రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది.మీరు మామిడి రైతులకు కేజీ రూ.4 సబ్సిడీ అదనంగా ఇస్తామన్నారు. ఎంత మంది రైతులకు ఇచ్చారు? ఎన్ని టన్నులకు ఇచ్చారు? ఆ వివరాలు ఉంటే ఇంటింటికీ వెల్లి చూపించండి. మనుషులతో, ప్రజల ఎమోషన్స్ తో చంద్రబాబురాజకీయం చేస్తున్నారు. తుపాన్ వస్తే అగ్గిపెట్టలు, కొవ్వెత్తులు సరఫరా చేయడం, యోగా డే వస్తే మ్యాట్ లు సరఫరా చేయడం, పుష్కరాలు వస్తే ముక్కులు పెట్టించడం, వరద వచ్చినా, తుపాను వచ్చినా పండగ చేసుకోవడం మీ కలవాటు.విశాఖ భూసంతర్పణ - భారీ స్కామ్..ఇక మీ భూముల పందేరం చూస్తే... రియల్ ఎస్టేట్ కంపెనీలకు కూడా ఎకరా రూ.99 పైసలకే కట్టబెడుతున్నారు. దేశ చరిత్రలో రూ.99 పైసలకే ఎకరాలకు ఎకరా పంచిన ప్రభుత్వం మరొక్కటి లేదు. అదేమిటని ప్రశ్నిస్తే పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులు అని చెప్తారు ఇదో పెద్ద స్కామ్. విశాఖలో భూముల ధారాదత్తం చేయడం ఏమిటి? మీరు అభివృద్ధి చేస్తున్న అంతర్జాతీయ నగరం అమరావతిలో భూములు కేటాయించవచ్చు కదా? విశాఖలో భూకంపాలు వస్తాయని, సునామీలు, తుపాన్లు వస్తాయని మన పత్రికల్లోను కథనాలు రాశారు కదా? ఇప్పుడు రావా? కేవలం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే వస్తాయా? మీ శిల్పి చెక్కిన మహనగరం అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి ఏ మహానుభావుడు ఎందుకు ముందుకు రావడం లేదు?వైజాగ్ కే ఎందుకు వస్తున్నారు? ప్రభుత్వ ఆస్తులకు కస్టోడియన్ గా ఉండాల్సిన మీరు వీటన్నింటినీ మీకు ఇష్టం వచ్చిన రేటుకి ధారాదత్తం చేయడమనేది ఏ విధంగా సబబు? వేల కోట్లు ఆస్తులు ఎవరికో అప్పనంగా కట్టబెట్టే మీరు రైతులకు మేలు చేద్దామన్న ఆలోచన ఎందుకు చేయడం లేదు? రియల్ ఎస్టేట్ కంపెనీలకు రూ.99 పైసలకే ఎకరా ఇచ్చే మీరు.. రూ.99 రూపాయలకు గజం జాగా పేదవాడి ఇంటి స్థలానికి ఇవ్వలేరా? విశాఖపట్నం భూములకు మంచి డిమాండ్ ఉంది కాబట్టి... కాబట్టి వాటిని నెమ్మదిగా కృష్టార్ఫనం చేస్తున్నారు.వైఎస్ జగన్.. అడుగడుగునా అన్నదాతలకు అండగా..వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2024 వరకు చూస్తే ఒక్క ఉచిత పంటల బీమా కిందే రూ.7802 కోట్లు, ఇన్ పుట్ సబ్సిడీ కింద రూ. 3262 కోట్లు, వైయస్సార్ రైతు భరోసా కింది రూ. 34,288 కోట్లు, వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ దాదాపు రూ.43744 కోట్లు, ఆక్వా విద్యుత్ సబ్సిడీ రూ.3497 కోట్లు, సున్నా వడ్డీ రాయితీ రూ.2051 కోట్లు, రూ.1380 కోట్లు విత్తన సబ్సిడీ ఇవ్వడంతో పాటు రూ.1700 కోట్లు ఖర్చు పెట్టి పీడర్లు సామర్ధ్యాన్ని పెంచాం.అదే విదంగా రూ.8845 కోట్లు మీ విద్యుత్ బకాయిలు తీర్చడంతో పాటు సెనగ రైతులకు రూ.300 కోట్లు బోనస్, ధాన్యం సేకరణకు రూ.960 మీ బకాయిలు తీర్చాం. మీ విత్తన బకాయిలు రూ.384 కోట్లు తీర్చాం. ఇది కాకుండా పంటల కొనుగోలుకు రూ.7787 కోట్లు ఐదేళ్లో ఖర్చు పెట్టింది. మీ ప్రభుత్వం పంటల కొనుగోళ్లకు 18 నెలల కాలంలో ఎంత చేశారు? మా మార్కెట్ ఇంటర్ వెన్షన్ ఫండ్ ఎంత? బడ్జెట్ లో మీ కేటాయింపులెంత? సమాధానం చెప్పండి చంద్రబాబూ అని నిలదీశారు.కూటమి ప్రభుత్వంలో రైతు పండించిన ఏ పంటైనా రోడ్డు పాలవ్వడం పరిపాటిగా మారిందని, అదే వైయస్.జగన్ ప్రభుత్వంలో కోవిడ్ లాంటి విపత్తులోనూ రైతు పండించిన ప్రతి పంటనూ కొనుగోలు చేయమని చెప్పారు. రైతులకు నష్టం రాకుండా చూడాలని చెప్పారు. అదే మార్కెట్ ఇంటర్ వెన్షన్, అదే రైతుని స్థిరీకరించే పద్ధతని కన్నబాబు తేల్చి చెప్పారు. అలా కాకుండా అశ్వద్ధామ హతహ్ తరహాలో రైతన్నా మీకోసం అని గట్టిగా చెప్పి... మనసులోపల ఏమీ చేయలేమన్నదే చంద్రబాబు నిజస్వరూపమని తేల్చి చెప్పారు. -
‘సరైన టైం చూసి కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు’
సాక్షి,వైఎస్సార్: పులివెందుల నియోజకవర్గం మంగళవారం జన సంద్రంగా మారింది. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా వేలాది మంది అభిమానులు, స్థానిక ప్రజలు భారీగా తరలి వచ్చారు. భాకరపురంలోని తన క్యాంప్ ఆఫీస్లో వైఎస్ జగన్ నిర్వహించిన ప్రజాదర్బార్కు అన్ని వర్గాల ప్రజలు హాజరై తమ సమస్యలను వినిపించారు. వైఎస్ జగన్ పర్యటనకు ఇంత భారీ స్పందన రావడం పట్ల వైఎస్సార్సీపీ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలు కూటమి ప్రభుత్వం ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారని, తగిన సమయంలో ప్రజలు తమ నిర్ణయం చెబుతారని పార్టీ నాయకులు వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ..చంద్రబాబు ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు, రైతులు మోసపోయారని ఆయన అభిప్రాయపడ్డారు.అరటి రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతుల వద్ద టన్నుకు రూ.200 మాత్రమే ఇచ్చి కొనుగోలు చేసి.. అదే పంటను మార్కెట్లో మధ్యవర్తులు రూ40 నుంచి రూ.50 కిలోకు అమ్ముతూ భారీ లాభాలు ఆర్జిస్తున్నారనిఅన్నారు.అరటి, చీనీ, మామిడి, టమోటా, పత్తి ఏ పంట తీసుకున్నా రైతులకు ఈ ప్రభుత్వంలో ప్రయోజనం కలగలేదని ఆయన విమర్శించారు. రైతుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. సూపర్ సిక్స్ హామీలో ప్రతి రైతుకు సంవత్సరానికి రూ.20,000 ఇస్తామని ప్రభుత్వం చెప్పినా, 18 నెలల్లో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. ఇన్పుట్ సబ్సిడీ కూడా అందలేదని పేర్కొన్నారు. రైతులు తమ సమస్యలను అర్థం చేసుకుని, సరైన సమయంలో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. -
‘నేనున్నాను..’ పులివెందుల ప్రజాదర్బార్లో వైఎస్ జగన్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి రాకతో పులివెందుల జనసందోహంగా మారింది. భాకరాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. వారి బాధలు, కష్టాలు, సమస్యలు వింటూ.. ‘నేనున్నాను’ అంటూ భరోసాతో పాటు ధైర్యాన్ని కల్పించారు. పులివెందుల చుట్టుపక్కల వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించిన వైఎస్ జగన్.. వారి యోగక్షేమాలు తెలుసుకుని, వారి సమస్యలు ఓపిగ్గా విన్నారు. వారికి భరోసా కల్పించారు. స్వయంగా పరిష్కరించగల వాటికి తక్షణమే స్పందించారు. వారి సమస్య పరిష్కారానికి ఏం చెయ్యాలో పక్కనే ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి సూచించారు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి మేలు ఒకటి కూడా జరగలేదని వచ్చిన వారంతా తమ గోడు వెళ్ళబోసుకున్నారు. అన్ని వర్గాలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసానిచ్చిన వైఎస్ జగన్, వారి పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.గోడు వెల్లబోసుకున్న రైతులువరుస తుపాన్లు, వర్షాలతో తాము అల్లాడిపోతున్నా చంద్రబాబు ప్రభుత్వం నుంచి కనీస సాయం కూడా అందడం లేదని ఈ సందర్భంగా పలువురు రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తామంతా భరోసాగా బ్రతికామని, కానీ ఇప్పుడు వ్యవసాయం అంటేనే అన్నదాతలు భయపడే పరిస్ధితికి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సంక్షేమాన్ని గాలికొదిలేసిన ప్రభుత్వంపై రైతుల తరుపున పోరాడతామని.. వారికి అండగా ఉంటామని జగన్ భరోసానిచ్చారు.మేం సీట్లు కోల్పోయాం: వైద్య విద్యార్థులుచంద్రబాబు సర్కార్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పలువురు వైద్యవిద్యార్థులు వైఎస్జగన్ను కలిసి వాపోయారు. పులివెందుల, పాడేరుతో మరో వంద సీట్లు వచ్చేవని.. అయితే కూటమి సర్కార్ నిర్ణయంతో సీట్లు కోల్పోయామని జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఒక్క మార్కుతో సీటు కోల్పోయానని చరణ్ అనే విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో కేంద్రం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని జగన్ భరోసా ఇచ్చారు. ఆప్యాయ పలకరింపులు.. సెల్ఫీలువైఎస్ జగన్పై అభిమానంతో కొందరు భాకరాపురం క్యాంప్ కార్యాలయానికి తరలి వచ్చారు. దివ్యాంగులు, చిన్నారులు, అక్కచెల్లెమ్మలు, యువకులను ఆయన అప్యాయంగా పలకరించారు. తిరిగి వెళ్లే క్రమంలో.. అక్కడే ఉన్న కొందరి యువకుల ఫోన్లలో స్వయంగా సెల్ఫీలు తీశారు. -
Sajjala: రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ఫెయిల్ అయ్యారు
-
‘తప్పు చేశారు కాబట్టే కేసుల్ని వెనక్కి తీసుకుంటున్నారు’
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి తెచ్చిన వ్యవస్థలను కూటమి ప్రభుత్వం కొనసాగించి ఉంటే రైతులకు మంచి జరిగేదన్నారు పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఇప్పుడు ఆ వ్యవస్థలు లేకనే తుపాన్ కారణంగా నష్టపోయిన రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారిందన్నారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వైఎస్సార్సీపీ హయాంలో రైతుల సంక్షేమంపై వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. కానీ, తుపాన్తో నష్టపోయిన రైతులను చంద్రబాబు ఆదుకోలేదు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని రైతుల దగ్గరకు చంద్రబాబు వెళ్తారు?. గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారు. ఇదంతా చంద్రబాబు నిర్వాకం వల్లే.... మాపై విష ప్రచారం చేస్తూనే అబద్ధాలు, మోసాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. లిక్కర్ స్కామ్ అన్నారు.. ఇప్పటివరకూ ఏమైనా తేలిందా?, సుప్రీంకోర్టు ఆదేశాలను సిట్ పాటించడం లేదు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వైఎస్సార్సీపీపై తప్పుడు కేసులు. కుట్ర సిద్ధాంతంతో పాలన చేస్తున్నారు. చంద్రబాబు తీరును ప్రజలు గమనిస్తున్నారు. ఆయనకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉన్నాయి.... చంద్రబాబు అవినీతికి సాక్ష్యాలు ఉన్నాయి. కానీ, ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకుని కేసులను ఎత్తివేయాలని చూస్తున్నారు. అవినీతి చేయకపోతే చంద్రబాబుకి ఎందుకంత భయం?. తప్పు చేయనప్పుడు కేసుల్ని ఎదుర్కోవాలి కదా. తప్పు చేశారు కాబట్టే కేసులు వెనక్కి తీసుకుంటున్నారు. మేం అధికారంలోకి వచ్చాక కేసులన్నీ తిరగతోడతాం. అన్ని కేసులపై పునర్విచారణ చేయిస్తాం’’ అని సజ్జల స్పష్టం చేశారు. -
ధర పతనం.. అరటి రైతులకు శోకం
సాక్షి, అమలాపురం/ రావులపాలెం: తీపి పంట అరటి.. రైతు నోరు చేదు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అంచనాలకు మించి దిగుబడి రావడం, ఉత్తరాదికి ఎగుమతులు క్షీణించడం, దేశీయంగా అరటి ధరలు గణనీయంగా పడిపోవడం, జిల్లా రైతులకు శాపంగా మారింది. ధరలు తగ్గడంతోపాటు ఎగుమతులు కూడా పెద్దగా సాగకపోవడంతో అరటి రైతులు విలవిలలాడుతున్నారు. (Banana Prices Drop In AP)ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అరటి సాగు అధికం. ఒక్క కోనసీమ జిల్లాలోనే సుమారు 25,204 ఎకరాల్లో అరటి పంట సాగు జరుగుతోంది. రావులపాలెం, ఆత్రేయపురం, కొత్తపేట, ఆలమూరు, పి.గన్నవరం, కపిలేశ్వరపురం, అయినవిల్లి, అంబాజీపేట మండలాల్లో ఈ సాగు అధికం. డెల్టాలోనే కాకుండా లంక గ్రామాల్లో అరటి ఏక పంటగాను, కొబ్బరిలో అంతర పంటగా సాగవుతోంది. మొత్తం సాగులో 80 శాతం తెల్ల అరటి, కర్పూరం కాగా, మిగిలిన 20 శాతం కూర అరటి, అమృతపాణి, ఎర్ర చక్కెర కేళీ వంటి రకాలు పండిస్తున్నారు.ఈసారి సీన్ రివర్స్సాధారణంగా కార్తిక మాసంలో అరటి ధరలు అధికంగా ఉంటాయి. కాని ఈసారి సీన్ రివర్స్ అయ్యింది. కార్తిక మాసం మొదలైన నాటి నుంచి అరటి ధరలు తక్కువగానే ఉన్నాయి. ప్రస్తుతం రావులపాలెం, అంబాజీపేట మార్కెట్ యార్డులలో అరటి ధరలు పరిశీలిస్తే కర్పూరం కనిష్టంగా రూ.100, గరిష్టంగా రూ.200 చొప్పున ఉంది. చక్కెర కేళీ (తెలుపు) రూ.150 నుంచి రూ.250 వరకు, బుషావళి రూ.125 నుంచి రూ.200 వరకు, బొంత (కూర అరటి) రూ.150 నుంచి రూ.200 వరకు, అమృతపాణి రూ.200 నుంచి రూ.350 వరకు, చక్కెర కేళీ (ఎరుపు) రూ.200 నుంచి రూ.300 వరకు ఉంది. ఇప్పుడున్న ధరలకు గెలకు అదనంగా రూ.100 నుంచి రూ.150 వరకు ఉంటే కాని రైతులకు గిట్టుబాటు కాదు. పైగా ఈ ధరలు నాణ్యత ఉన్న గెలలకు మాత్రమే. ఇప్పుడు మార్కెట్కు వస్తున్న గెలలు చాలా నాసిరకంగాను, చిన్న సైజువి కావడంతో ధరలకు మరింత కోత పెడుతున్నారు. (Banana Farmers Struggles In AP)నాణ్యత లేక ధరాఘాతం గత నెలలో వచ్చిన మోంథా తుపాను ప్రభావంతో ఈదురుగాలులు, వర్షాలకు అరటి తోటలు పెద్ద ఎత్తున నేలనంటిన విషయం తెలిసిందే. జిల్లాలో 3,379.90 ఎకరాల్లో పంట నేలకొరిగి దెబ్బతింది. తుపాను బారి నుంచి తప్పించుకున్న చోట్ల గాలులకు మొవ్వు ఒడి తిరిగిపోయింది. దీనివల్ల చెట్టు శక్తి కోల్పోవడంతో ఆ ప్రభావం గెలలపై పడింది. దీనివల్ల ఇప్పుడు కోత కోస్తున్న గెలల్లో 60 శాతం నాసిరకం గెలలు, మరో 20 శాతం మధ్యస్థంగా ఉండే మొరటు (నాణ్యమైన) గెలలు, మరో 20 శాతం మొరటు గెలలు వస్తున్నాయని రావులపాలెం మార్కెట్ యార్డు వ్యాపారులు చెబుతున్నారు.పది రోజులుగా పెరిగిన మంచు కూడా అరటి కాయల దిగుబడిని దెబ్బ తీస్తోంది. కాయల సైజు తగ్గిపోతోందని రైతులు వాపోతున్నారు. ఈ కారణంగా ఆశించిన ధరలు రావడం లేదంటున్నారు. దీనివల్ల రావులపాలెం మార్కెట్ యార్డు నుంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతులు కూడా తగ్గిపోయాయి. సీజన్లో ఇక్కడ నుంచి రోజుకు 25 నుంచి 30 లారీల అరటి (లారీకి సగటున 800 గెలలు) చొప్పున రోజుకు 25 వేల గెలలు ఎగుమతి జరిగేది. ఇప్పుడు కేవలం 15 వేల నుంచి 18 వేల గెలలు మాత్రమే ఎగుమతి అవుతున్నాయి.నలువైపులా పోటీరాయలసీమ జిల్లాలు కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురంలో దశాబ్దకాలంగా అరటి సాగు అధికంగా ఉన్నా అక్కడ జి–9 మాత్రమే పండించేవారు. ఇప్పుడు కర్పూరం అధికంగాను, అమృతపాణి, చక్కెర కేళీలు అధికంగా సాగు చేస్తున్నారు. మంచి దిగుబడి మొరటు 80 శాతం వరకు వస్తున్నాయి. దీనితో అక్కడ అరటికి డిమాండ్ పెరిగింది.ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి అరటి తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్కు ఎగుమతి అధికం. ఎర్ర చక్కెర కేళి మాత్రం తమిళనాడు వెళుతోంది. ఈ ఏడాది శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, తెలంగాణలోని ఖమ్మం, భద్రాది కొత్తగూడెంలో కూడా అరటి విస్తారంగా సాగు జరిగింది. మంచి దిగుబడి కూడా వస్తోంది. దీంతో ఉత్తరాదికి ఆయా జిల్లాల నుంచి ఎగుమతి అధికంగా ఉండడంతో ఇక్కడ అరటికి డిమాండ్ తగ్గింది.(Banana Farmers Challenges)తమిళనాడుకు ఎర్ర చక్కెర కేళీ ఎగుమతి అధికం. సీజన్లో దీని ధర రూ.400 నుంచి రూ.500 వరకు ఉంటోంది. ఇప్పుడు దిగుబడి నాణ్యత లేని కారణంగా రూ.200 నుంచి రూ.300కు పడిపోయింది. గతంలో రోజుకు ఆరు నుంచి ఎనిమిది మినీ వ్యాన్ల అరటి ఎగుమతి జరిగేది. ఇప్పుడు ఇది నాలుగు వ్యాన్లకు మించడం లేదు. పైగా తమిళనాడు నుంచి బొంత అరటి ఇక్కడకు పెద్ద ఎత్తున దిగుమతి అవుతోంది. దీని ధర కూడా తక్కువగా ఉండడం విశేషం.సంక్రాంతి వరకు డిమాండ్ వచ్చేలా లేదురావులపాలెం మార్కెట్కు పదిహే ను రోజులుగా నాణ్యత లేని గెలులు అధికంగా వస్తున్నాయి. తుపాను ప్ర భావం, మంచు వల్ల గెలల నాణ్యత దెబ్బతింటోంది. ధర పడిపోయింది. రాయలసీమలో పంట పెరగడం కూడా ధర పెరుగుదలకు అడ్డంకిగా మారింది. పండగల సీజన్ పూర్తవడంతో సంక్రాంతి వరకు డిమాండ్ వ చ్చేలా లేదు. – కోనాల చంద్రశేఖర్, అరటి వ్యాపారి, ఊబలంక, రావులపాలెం మండలంగాలులు దెబ్బ తీశాయితుపాను వల్ల ఈదురు గాలులకు అరటి తోటలకు పెద్ద దెబ్బ తగిలింది. గెలలు సరిగా తయారవడం లేదు. దీనివల్ల ధర రావడం లేదు. తుపాను ముందు గెల రూ.200 నుంచి రూ.400 వరకు ఉంది. ఇప్పుడు సగం ధర కూడా రావడం లేదు. గెలలు తయారవుతున్న సమయంలో గాలులు దెబ్బ తీశాయి.– పిల్లా గంగాధర్, అరటి రైతు, అంబాజీపేట -
మరోసారి రెచ్చిపోయిన పచ్చమూకలు.. వైఎస్సార్సీపీ నేతపై దాడి
కోబాక: తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి నియోజకవర్గం కోబాకలో పచ్చమూకలు రెచ్చిపోయాయి. కోబాకలో వైఎస్సార్సీపీ నేత గుణశేఖర్పై టీడీపీ కార్యకర్త సుదర్శన్ దాడికి పాల్పడ్డాడు. గుణశేఖర్ను బైక్తో ఢీకొటటి దాడి చేశాడు సుదర్శన్. సుదర్శన్ దాడిలో గాలి గుణశేఖర్ నాయుడుకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గుణశేఖర్ నాయుడ్ని ఎంపీ గురుమూర్తి పరామర్శించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని గురుమూర్తి డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే పచ్చ మూకలు దాడులకు దిగుతున్న సంగతి తెలిసిందే. వైఎస్సార్సీపీ శ్రేణుల్నే లక్ష్యంగా చేసుకుని వారు దాడులకు దిగుతున్నారు. తమ పార్టీ అధికారంలో ఉంది కదా అని గూండాయిజాన్ని ప్రదర్శిస్తున్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులు చేస్తున్న కూటమి నేతలు.. అంతు చూస్తామని తమకు ఎదురుతిరిగిన వారిని బెదిరిస్తున్నారు. ఇన్ని జరుగుతున్నా పోలీస్ చర్యలు మాత్రం నామమాత్రంగానే ఉంటున్నాయి. తాజాగా దాడి ఘటనలో టీడీపీ కార్యకర్త సుదర్శన్పై పోలీసులు ఎంతవరకూ చర్యలు తీసుకుంటారో చూడాలి. -
YSRCPలో కొత్త నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆదేశాలతో పార్టీలో వరుసగా నూతన నియామకాలు కొనసాగుతున్నాయి. సోమవారం సాయంత్రం మరికొన్ని పోస్టులకు సంబంధించిన ప్రకటనను పార్టీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా వంకెల పెద్ద పోలిరెడ్డి (బద్వేలు)ని, పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు పరిశీలకునిగా చిన్న అప్పలనాయుడుని, అలాగే.. అరకు, పాడేరు పరిశీలకులుగా బొడ్డేటి ప్రసాద్ నియమిస్తున్నట్లు పార్టీ ఆ ప్రకటనలో స్పష్టం చేసింది.ఇదీ చదవండి: అన్నా.. త్వరగా కోలుకో: వైఎస్ జగన్ ట్వీట్ -
ప్రతాప్రెడ్డి అన్న.. త్వరగా కోలుకో: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: కావలి(నెల్లూరు) మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఇటీవలె బైపాస్ సర్జరీ జరిగింది. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆకాంక్షించారు. ప్రతాప్రెడ్డి అన్నా .. మీరు త్వరగా కోలుకోవాలి అంటూ సోమవారం ఎక్స్ ఖాతాలో వైఎస్ జగన్ ఓ ట్వీట్ చేశారు. Wishing a speedy recovery from Bypass surgery, Get well soon @R_PratapReddy Anna! Ex MLA Kavali !— YS Jagan Mohan Reddy (@ysjagan) November 24, 2025 -
చంద్రబాబుకు బిగ్ షాక్ కోటి సంతకాల సేకరణలో టీడీపీ
-
టీడీపీ అవినీతి చాలా పెద్దది: మాజీ మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, తిరుపతి: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న కోటి సంతకాల సేకరణ విజయవంతంగా ముగిసిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన పార్టీలకు అతీతంగా ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. టీడీపీకి ఓటు వేసిన వారు, ఆ పార్టీ సానుభూతిపరులు కూడా కోటి సంతాకాల్లో భాగమయ్యారని పేర్కొన్నారు. పేదవర్గాల పిల్లలు డాక్టర్లు కావాలన్న కలలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూపం ఇచ్చిందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకు వచ్చింది. చాలా చోట్ల 60-70 శాతం పనులు పూర్తయ్యాయి. పేద పిల్లలు డాక్టర్లు అవుతారని ప్రజలు ఆశించారని పెద్దిరెడ్డి తెలిపారు.మదనపల్లి ప్రభుత్వ మెడికల్ కాలేజి పై కుక్కలు మొరుగుతూ ఉంటాయి. రూ.70కోట్లు పైగా ఖర్చు చేశారు ఇప్పటి వరకు రూ. 27 కోట్లు బిల్లులు చెల్లించారు అని వ్యాఖ్యానించారు. టిడిపి ప్రభుత్వం చేసే అవినీతి చాలా పెద్దది. దానిపై దృష్టి మళ్లించడానికి మాపై బురద చల్లుతున్నారు. సర్పంచ్ నుంచి కిందిస్థాయి నాయకులు కూడా విమర్శలు చేసే స్థితికి చేరుకున్నారు అని మండిపడ్డారు. జిల్లాలో తమ గురించి ఎవరిని అడిగినా తాము చేసిన సేవల గురించి చెబుతారని ఆయన పేర్కొన్నారు. మెడికల్ కాలేజీలను ప్రభుత్వం పూర్తిచేయాలి. పేద వర్గాల పిల్లలు డాక్టర్లు అయ్యేందుకు ప్రభుత్వాలు సహకరించాలని పెద్దిరెడ్డి అన్నారు. -
చంద్రబాబుకు రైతులంటే చిన్నచూపు : కైలే అనిల్ కుమార్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా మారిందని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ విమర్శించారు. ఇటీవల వచ్చిన మోంథా తుపాను వల్ల భారీ నష్టం జరిగినా ప్రభుత్వం ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదని మండిపడ్డారు.40 బస్తాల పంట 25 బస్తాలకు పడిపోయింది. రైతులు రోడ్డున పడ్డా పట్టించుకునే వారు లేరు. చంద్రబాబుకు రైతులపై చిన్నచూపు ఉందని అనిల్ కుమార్ అన్నారు.ఇదిలా ఉంటే కౌలు రైతుల పరిస్థితి మరింత కష్టాల్లో ఉందని కోత వ్యయం రూ.15 వేల మేర పెరిగిందని చెప్పారు. ఆర్బీకేలు నిర్వీర్యం కావడంతో దళారీ వ్యవస్థ పెరిగిందని విమర్శించారు.పంట నష్టం అంచనాల్లోనూ రైతులకు అన్యాయం జరిగింది. ప్రభుత్వం ఉచిత పంట బీమా అమలు చేయాలి. ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేయాలి. తేమ పేరుతో మిల్లులు చేసే మోసాలను అడ్డుకోవాలని కైలే అనిల్ డిమాండ్ చేశారు. -
టీడీపీకి షాక్.. వైఎస్సార్సీపీలోకి నేతల చేరికలు
సాక్షి, కర్నూలు: ఆలూరు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు క్రమంగా మారుతున్నాయి. చిప్పగిరిలో జరిగిన సమావేశంలో టిడిపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు స్థానిక నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.వైఎస్సార్ సీపీలో చేరిన నేతలు మాట్లాడుతూ.. టిడిపిలో తమకు ప్రాధాన్యత లేకపోవడం వల్ల స్థానిక సమస్యల పరిష్కారంలో పార్టీ నాయకత్వం విఫలమైంది. దాంతో వైఎస్సార్ సీపీలోకి వస్తున్నాం. టిడిపి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడిచినా ప్రజలకు ఏమీ చేయలేదు కానీ ప్రజలను మోసం మాత్రం చేసిందని వారు విమర్శించారు. ఎమ్మెల్యే విరుపాక్షి మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక సంక్షేమ పథకాలతో ప్రజల మనసులు గెలుచుకున్నారు. 2029లో ఆయన తిరిగి ముఖ్యమంత్రి అవుతారని నమ్మకం ఉంది అని పేర్కొన్నారు.ఆలూరు నియోజకవర్గ రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉండటం, త్రాగునీటి ఇబ్బందులు ఎక్కువగా ఉండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు.పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు నేను అండగా ఉంటాను. ప్రజా సమస్యల పరిష్కారమే మా లక్ష్యం అని విరుపాక్షి హామీ ఇచ్చారు. -
హిందూపురంలో టీడీపీ రాజకీయ కక్షసాధింపు
సాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా: హిందూపురంలో ఎక్సైజ్ శాఖ చర్యలపై తీవ్ర రాజకీయ వివాదం చెలరేగింది. స్థానిక మద్యం వ్యాపారి ప్రశాంత్ గౌడ్పై అక్రమంగా కేసు నమోదు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. అక్రమ కేసు పెడుతున్నామంటూ బహిరంగంగా ప్రకటించి మరీ ఆయన్ని అదుపులోకి తీసుకోవడాన్ని రాజకీయ వర్గాలు తప్పుబడుతున్నాయి.ప్రశాంత్ గౌడ్ను కొన్ని రోజులుగా స్థానిక టీడీపీ నేతలు బెదిరిస్తూ, మద్యం షాపును తమకు అప్పగించాలని ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. ఈ ఒత్తిళ్ల నేపథ్యంలోనే ఆయన అరెస్ట్ కావడం గమనార్హం. అంతేకాదు.. కేసు నమోదు సమయంలో “నీపై అక్రమ కేసు పెడుతున్నాం.. నన్ను క్షమించు” అని ఎక్సైజ్ సీఐ లక్ష్మీ దుర్గయ్య అన్నారని ప్రశాంత్ గౌడ్ కుటుంబ సభ్యులు తెలిపారు.టీడీపీ నాయకుల ఒత్తిడితోనే పోలీసులు ఈ కేసు పెట్టారని వైఎస్సార్ సీపీ వర్గాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. హిందూపురం శాసనసభ నియోజకవర్గానికి టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో, స్థానిక టీడీపీ నేతల బరితెగింపు పెరిగిందని వైఎస్సార్సీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.ఎక్సైజ్ శాఖ తీరును హిందూపురం వైఎస్సార్ సీపీ సమన్వయకర్త దీపిక, వైఎస్సార్ సీపీ బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ తప్పుబట్టారు. టీడీపీ నేతల సూచన మేరకు అక్రమ కేసులు నమోదు చేయడం విచారకరమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంత్ గౌడ్పై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని, లేకుంటే ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. -
‘స్పెషల్ ఫ్లైట్లో తిరిగే చంద్రబాబుకి రైతుల కన్నీళ్లు పట్టవు’
సాక్షి, అనంతపురం: రాష్ట్రంలో గిట్టుబాటు ధరల్లేక రైతులు అల్లాడుతుంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని శింగనమల వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు వ్యతిరేకి. ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతులకు కష్టాలు తప్పవు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతున్నారు. అయినా చంద్రబాబు సర్కార్ పట్టించుకోవడంలేదు. అరటి, ఉల్లి, మొక్కజొన్న, ధాన్యం, కొబ్బరి... ఇలా ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. చంద్రబాబు ప్రతిరోజూ స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతున్నారు. అలాంటి వ్యక్తికి రైతుల కన్నీరు కనిపించడం లేదా?. అలాంటప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయనేం చేస్తున్నట్లు అని శైలజానాథ్ అన్నారు. -
రేపు పులివెందులకు వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్ రెండు రోజుల పర్యటన కోసం మంగళవారం పులివెందుల రానున్నారు. కూటమి ప్రభుత్వ నిర్వాకం కారణంగా దారుణంగా నష్టపోయిన అరటి రైతుల పరామర్శతోపాటు పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. జగన్ బెంగళూరులోని తన నివాసం నుంచి మంగళవారం మధ్యాహ్నం బయలుదేరి హెలికాప్టర్ ద్వారా సాయంత్రం నాలుగు గంటల ప్రాంతానికి పులివెందుల చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా భాకరాపురంలోని క్యాంపు కార్యాలయానికి వస్తారు. సుమారు మూడు గంటల పాటు క్యాంపు కార్యాలయంలో పలువురి కలవనున్నారు. ఆ తరువాత స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటారు.బుధవారం ఉదయం పులివెందులలోని వాసవి కళ్యాణ మండపంలో జరిగే ఒక వివాహ కార్యక్రమానికి హాజరై వధూ వరులను ఆశీర్వదిస్తారు. ఆ తరువాత బ్రాహ్మణ పల్లె ప్రాంతంలో దెబ్బతిన్న అరటితోటలను సందర్శిస్తారు. రైతులతో ముఖాముఖి మాట్లాడతారు. వారి కష్టనష్టాలను తెలుసుకుంటారు. అరటి రైతుల పరామార్శ తరువాత వై.ఎస్.జగన్ లింగాల మాజీ సర్పంచ్ మహేశ్ రెడ్డి కుటుంబాన్ని పులివెందుల్లోని వారి స్వగృహంలో కలుసుకుంటారు. ఇటీవలే మరణించిన మహేశ్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామార్శిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు స్వగృహానికి చేరుకుంటారు. రెండు గంటల పాటు అక్కడే ఉంటారు. అనంతరం వేల్పుల గ్రామంలోని రామలింగా రెడ్డి ఇంటివెళ్లనున్నారు. అక్కడి నుంచి సాయంత్రం నాలుగు గంటలకు భాకరాపురంలోని క్యాంపు ఆఫీసుకు ఆ తరువాత ఏడు గంటలకు స్వగృహానికి చేరుకుంటారు. రాత్రి బస చేస్తారు.గురువారం ఎనిమిది గంటలకు భాకరాపురం నుంచి హెలికాప్టర్ ద్వారా బెంగళూరులోని జక్కూరుకు ఆ తరువాత యలహంకలోని తన ఇంటికి వెళ్లడంతో ఈ పర్యటన పూర్తవుతుంది.తాడేపల్లిరేపటి నుంచి మూడు రోజుల పాటు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ పులివెందుల పర్యటన25.11.2025 షెడ్యూల్సాయంత్రం 4 గంటలకు పులివెందుల చేరుకుని క్యాంప్ ఆఫీస్లో రాత్రి 7 గంటల వరకు ప్రజాదర్భార్ నిర్వహిస్తారు, రాత్రికి అక్కడి నివాసంలో బస…— YSR Congress Party (@YSRCParty) November 24, 2025 -
గంగుల బ్రిజేంద్ర రెడ్డి హౌస్ అరెస్ట్
-
బ్రిజేంద్ర రెడ్డి హౌస్ అరెస్ట్
-
ముంపు గ్రామస్తులకు వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి బాసట
సాక్షి, తిరుపతి: కే.వి.బి.పురం మండలంలోని ఒల్లూరు రాయల చెరువు ముంపు గ్రామస్తులకు తిరుపతి ఎంపీ వైఎస్సార్సీపీ నాయకుడు గురుమూర్తి అండగా నిలిచారు. ముళ్లూరి మండలం, కళత్తూరు గ్రామంలో దళిత కుటుంబాలకు ఎంపీ గురుమూర్తి ఆర్థిక సహాయం అందించారు. ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.. కళత్తూరు గ్రామంలోని దళిత కుటుంబాల అభ్యున్నతి కోసం నేను పని చేస్తున్నాను. ఈ స్థాయిలో వారికి సహాయం చేయడం నాకు గౌరవంగా ఉంది. గ్రామ పునరుద్ధరణ కోసం ఎంపీ నిధులను మంజూరు చేసినట్టు ఆయన ప్రకటించారు. ఈ ప్రాంతంలో జరిగిన సంఘటనలు మరోసారి పునరావృత్తం కాకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను కోరాను. ఈ చర్యలు గ్రామ ప్రజల సంక్షేమానికి ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను అని ఎంపీ గురుమూర్తి అన్నారు.కళత్తూరు దళితవాడ అభివృద్ధి కోసం ఎంపీ గురుమూర్తి ఇప్పటి వరకు కోటి 20 లక్షల రూపాయల సహాయం అందించారు. -
బాబు సీఎం.. రైతులకు ఇబ్బందులు, కష్టాలు: గడికోట
సాక్షి, అన్నమయ్య జిల్లా: చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న అన్ని సందర్భాల్లో రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి. రైతుల గురించి చంద్రబాబు మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. రైతులు బాగుంటే అన్నీ బాగుంటాయి.. కానీ, కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘రైతులు రాష్ట్రంలో చాలా మేర పంటలు సాగు చేయనే లేదు. అన్నమయ్య జిల్లాలో కనీసం పది శాతం కూడా పంటల సాగు జరగలేదు. మామిడి రైతులకు చంద్రబాబు డబ్బు ఇచ్చాను అంటాడు.. కానీ ఎవరికిచ్చాడో చెప్పడు. సాగు చేసిన ఏ పంటకూ కనీస గిట్టుబాటు ధర ఎక్కడా లేదు. అన్నదాత సుఖీభవ మొదటి ఏడాది ఎగ్గొట్టాడు. 20వేలు ఒకే సారి ఇస్తానన్నాడు.. అదీ విడుతల వారీగా ఇస్తున్నాడు. రైతులు బాగుంటే అన్నీ బాగుంటాయి. కానీ, ఈ ప్రభుత్వం రైతు బాగుకోసం చూడటం లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న అన్ని సందర్భాల్లో రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇంతవరకూ ఒక్క ఎకరాకు కూడా ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వలేకపోయాడు. గతంలో వైఎస్ జగన్ బీమా ప్రీమియం కూడా చెల్లించారు. ఏ సీజన్లో జరిగిన నష్టానికి అదే సీజన్లో ఇన్ పుట్ సబ్సిడీ, పరిహారం అందించారు. చంద్రబాబు రైతుల గురించి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది.నేడు రాయచోటిలో ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే కబ్జా చేసేస్తున్నారు. పోలీసులు పూర్తి బాధ్యతా లోపంతో వ్యవహరిస్తున్నారు. ప్రజల భూములను లాగేసుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారిపోయాయి. ఇంకా ఎంతకు దిగజారుస్తారు?. ప్రభుత్వ, ప్రైవేటు అని లేకుండా కనిపించిన ప్రతి ఒక్క భూమినీ కబ్జా చేసేస్తున్నారు. స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి అసలు మెడికల్ కాలేజీలే కట్టలేదంటారు. మదనపల్లి మెడికల్ కాలేజీపై కూడా అదే రీతిలో కుట్రలు చేస్తున్నారు. కల్తీ మద్యం కేసు ఏమైందో ఇంతవరకూ స్పష్టత లేదు’ అని వ్యాఖ్యలు చేశారు. -
నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలో ఉద్రిక్తత
సాక్షి, నంద్యాల: నంద్యాల జిల్లా రుద్రవరం మండలం ఎర్రగుడి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విజయ పాల డైరీ చైర్మన్, ఎస్వీ జగన్మోహన్రెడ్డి నామినేషన్ ప్రక్రియ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించడంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.విజయ పాల డైరీ ఎన్నికలను అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో రుద్రవరం మండలం ఎర్రగుడి దిన్నె గ్రామంలోని మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి, విజయ పాల డైరీ డైరెక్టర్ విజయసింహారెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేసినట్లు సమాచారం. -
Nellore: మేయర్ పీఠంపై కుట్రలు
నెల్లూరు (బారకాసు): నెల్లూరు మేయర్ పీఠంపై కన్నేసిన మంత్రి నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి తమ మార్కు రాజకీయానికి తెర లేపారు. మేయర్పై అవిశ్వాసం పెట్టడానికి సన్నాహాలు ప్రారంభించారు. సోమవారం కలెక్టర్కు అవిశ్వాసానికి నోటీసును అందించనున్నారు. వాస్తవానికి నెల్లూరు నగర పాలక సంస్థకు 2021లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 54 డివిజన్లలో క్లీన్స్వీప్ చేసింది. అయితే 12, 53 డివిజన్ల నుంచి మాత్రమే ఇద్దరు గిరిజన సామాజిక వర్గాలకు చెందిన మహిళలు ఎన్నికయ్యారు. మేయర్ పదవి గిరిజన మహిళకు రిజర్వ్ కావడంతో అప్పట్లో వైఎస్సార్సీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి వర్గంలోని 12వ డివిజన్ నుంచి కార్పొరేటర్గా ఎన్నికైన పోట్లూరు స్రవంతిని మేయర్గా ఎన్నుకున్నారు. అయితే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి 2023లో వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరారు. గతేడాదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతో రాజకీయ వ్యూహాలు ప్రారంభించారు. టీడీపీ మార్కు రాజకీయం కోసమే.. కార్పొరేషన్కు ఎన్నికలు జరిగి నాలుగేళ్లు గడిచాయి. పట్టుమని 10 నెలల కాలం కూడా లేదు. ఈ తరుణంలో మేయర్ పీఠంపై టీడీపీ మార్కు రాజకీయానికి మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి తెరతీశారు. వాస్తవానికి నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో 54 డివిజన్లు ఉంటే.. అన్ని డివిజన్లను వైఎస్సార్సీపీ కైవశం చేసుకుని క్లీన్ స్వీప్ చేసింది. ఇక సార్వత్రిక ఎన్నికల తర్వాత మారిన రాజకీయాల నేపథ్యంలో కొందరు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కొద్ది నెలల క్రితం జరిగిన రెండో డిప్యూటీ మేయర్ పదవికి ఎన్నికల సమాయానికి దాదాపు 42 మంది కార్పొరేటర్లు పచ్చ కండువాలు వేసుకొని టీడీపీ కార్పొరేటర్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే వీరంతా సాంకేతికంగా వైఎస్సార్సీపీ కార్పొరేటర్లుగానే కొనసాగుతున్నారు. కొంత కాలంగా తటస్థంగా ఉన్న మేయర్ స్రవంతి దంపతులు ఇటీవల వైఎస్సార్సీపీ ముఖ్య నేతలతో సన్నిహితంగా ఉండడం, తాను వైఎస్సార్సీపీనే అని బహిరంగంగా చెప్పడంతో జీరి్ణంచుకోలేకపోయిన మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి అసహనంతో రగిలిపోతున్నారు. ఆమెను ఇకపై మేయర్గా కొనసాగనివ్వ కూడదని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆదివారం మంత్రి క్యాంప్ కార్యాలయంలో నెల్లూరు సిటీ, రూరల్ పరిధిలోని కార్పొరేటర్లతో సమావేశం ఏర్పాటు చేసి మేయర్పై అవిశ్వాసానికి ప్రణాళిక సిద్ధం చేశారు. దీంతోపాటు కార్పొరేషన్ పరిధిలో ఇప్పటి వరకు 54 డివిజన్లు ఉండగా వీటిని 71 డివిజన్లుగా విభజించాలని ప్రాథమికంగా విస్తరణ సరిహద్దులు కూడా నిర్ణయించారు. కేవలం రెండు.. మూడు రోజుల్లో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. కార్పొరేషన్ లో డివిజన్లు పెరగడంతో రాజకీయ ఆశావహులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేడు అవిశ్వాస తీర్మానం నోటీస్ నగర పాలక సంస్థ పరిధిలోని సిటీ, రూరల్ నియోజకవర్గాలకు సంబంధించిన టీడీపీ కార్పొరేటర్లందరూ సోమవారం ఉదయం 11 గంటలకు కలెక్టరేట్కు చేరుకుని మేయర్పై అవిశ్వాస తీర్మానం నోటీస్ను అందజేయనున్నారని తెలిసింది. 15 రోజుల్లోపు సమావేశం నిర్వహించి మేయర్గా కొనసాగుతున్న స్రవంతిని గద్దె దించాలని కలెక్టర్కు నోటీసులు ఇవ్వనున్నారు. దేవరకొండకు ఇస్తారా..?ప్రత్యేకాధికారుల పాలన పెడతారా..? 54 డివిజన్లలో ప్రస్తుతం 12 మంది కార్పొరేటర్లు మాత్రమే వైఎస్సార్సీపీలో కొనసాగుతున్నారు. మిగతా 42 మంది టీడీపీలో కొనసాగుతున్న వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు మేయర్పై అవిశ్వాసం పెడితే నెగ్గే అవకాశం ఉంది. అయితే వీరిలో 53వ డివిజన్ నుంచి గెలిచిన దేవరకొండ సుజాత ఒక్కరే గిరిజన మహిళగా ఉన్నారు. అవిశ్వాసం తర్వాత తిరిగి మేయర్ ఎన్నిక నిర్వహిస్తే అవకాశం ఒక్క సుజాతకే ఉంది. అయితే కార్పొరేషన్ ఎన్నికలకు కేవలం 10 నెలలు కూడా లేకపోవడం, అవిశ్వాసం నెగ్గితే.. ఖాళీ అయ్యే మేయర్ స్థానానికి మళ్లీ ఎన్నిక జరగాలంటే.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. నెలల్లోనే పదవీ కాలం పూర్తయ్యే పదవికి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు తక్కువే అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గిరిజన సామాజిక వర్గానికి 40 ఏళ్ల తర్వాత దక్కిన ఈ గౌరవాన్ని టీడీపీ స్వార్థ రాజకీయాలతో మసకబార్చేందుకు సిద్ధమైంది. గిరిజన పీఠాన్ని ప్రస్తుతం డిప్యూటీ మేయర్గా కొనసాగుతున్న వ్యక్తికి ఇన్చార్జి మేయర్కు కట్టబెట్టాలని వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం.టీడీపీలో చేరాలంటూ ఒత్తిళ్లు.. ఆరోపణలు, కేసులు మేయర్ స్రవంతితోపాటు మరికొందరు కార్పొరేటర్లపై ఒత్తిళ్లు, ఆరోపణలు, వేధింపులు, అక్రమ కేసులకు ఎమ్మెల్యేలు తెగబడడంతో దిక్కుతోచని స్థితిలో వీరు వైఎస్సార్సీపీకి రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కోటంరెడ్డికి జైకొట్టారు. అయితే అప్పటికే వీరి మధ్య రాజకీయ అగాధం పెరగడం, వీరు తమ పదవులకు రాజీనామా చేయకపోవడంపై వైఎస్సార్సీపీ నేతలతోపాటు కార్పొరేటర్లు రచ్చ చేయడంతో తమ పదవికి గండం తప్పదని భావించిన మేయర్ దంపతులు తిరిగి వైఎస్సార్సీపీలోనే ఉన్నామంటూ చెప్పుకొచ్చారు. అయితే వీరు అటు టీడీపీ కార్యక్రమాల్లోనూ, ఇటు వైఎస్సార్సీపీ కార్యక్రమాల్లోనూ పాల్గొనకుండా తటస్థంగా ఉన్నారు. -
కాషాయం వేస్తాడు.. మెట్లు కడుగుతాడు! పవన్ పై శేఖర్ రెడ్డి సెటైర్లు
-
రాప్తాడులో జన‘హోరు’
రాప్తాడు/రాప్తాడు రూరల్: ఉప్పొంగిన అభిమాన జన సంద్రంతో రాప్తాడు ప్రాంతం కిక్కిరిసిపోయింది. జై జగన్ నినాదాలతో హోరెత్తిపోయింది. అభిమాన నేతను చూసేందుకు.. చేయి కలిపేందుకు.. సెల్ఫీలు దిగేందుకు ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున పోటీపడ్డారు. వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్రెడ్డి కుమార్తె డాక్టర్ మోక్షితా విష్ణుప్రియారెడ్డి, డాక్టర్ తేజేష్రెడ్డి వివాహ వేడుక ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడు సమీపంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు వైఎస్ జగన్ వస్తున్నారని తెలుసుకున్న ప్రజలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. వివాహ వేడుకలో పాల్గొని, నవ దంపతులను ఆశీర్వదిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి హెలిప్యాడ్ నుంచి వైఎస్ జగన్ కారులో ప్రయాణిస్తున్న మార్గంలో అశేష జనసందోహంతో జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. ఆయన కాన్వాయ్ వెంట అభిమానులు ఉప్పొంగిన ఉత్సాహంతో అడుగులు వేశారు. వివాహ వేదిక వద్దకు చేరుకోగానే ఈలలు, జై జగన్ నినాదాలు చేస్తూ తమ అభిమానం చాటుకున్నారు. వైఎస్ జగన్ అందరికీ అభివాదం చేస్తూ.. చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరిస్తూ వేదిక వద్దకు చేరుకున్నారు. నూతన వధూవరులు డాక్టర్ మోక్షితా విష్ణుప్రియారెడ్డి, డాక్టర్ తేజేష్రెడ్డికి వైఎస్ జగన్ వివాహ శుభాకాంక్షలు తెలియజేసి.. ఆశీస్సులు అందజేశారు. తోపుదుర్తి ప్రకాష్రెడ్డి, రాజశేఖర్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, వారి కుటుంబ సభ్యులు, బంధువులతో వైఎస్ జగన్ ముచ్చటించారు. అనంతరం అక్కడి నుంచి తిరుగుపయనమయ్యారు. -
టీడీపీ వర్ల రామయ్యపై వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ లీగల్ సెల్, ఎస్సీ సెల్ ప్రతినిధులు తాడేపల్లి పోలీసు స్టేషన్లో టీడీపీ నేత వర్ల రామయ్యపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.తాడేపల్లి పీఎస్లో ఫిర్యాదు అనంతరం, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నాయకుడు కొమ్మూరు కనకారావు మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు కూటమి నేతలు ఒక పథకం ప్రకారం ముందుకు వెళ్తున్నారు. హైదరాబాద్ పర్యటనలో రప్పా.. రప్పా డైలాగ్ బ్యానర్ను వైఎస్ జగన్కు ఆపాదిస్తున్నారు. పుష్ప సినిమాలో డైలాగ్ సెన్సార్ కట్ చేయలేదు కాబట్టి అభ్యంతరం లేదు. వర్ల రామయ్య తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. వర్ల రామయ్యపై చర్యలు తీసుకోవాలి’ అని కామెంట్స్ చేశారు. -
తోడు లేకుంటే వైద్యం చేయం
నెల్లూరు జిల్లా: ఆత్మకూరులోని జిల్లా ప్రభుత్వాస్పత్రిలో శనివారం దారుణం చోటు చేసుకుంది. వైద్యం కోసం ఒంటరిగా వచ్చిన ఓ పేషెంట్ ఓపీ తీసుకున్నప్పటికీ తోడుగా ఎవరూ రాలేదని వైద్యం చేయడానికి నిరాకరిస్తూ బయటకు పంపించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్యం పేదలకు గగనంగా మారింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బాధ్యతగా పనిచేసిన ఇదే వైద్య సిబ్బంది ఇప్పుడు ఇంత నిర్లక్ష్యంగా, నిర్దయగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని కలువాయి మండలం అంకుపల్లి గ్రామానికి చెందిన కొప్పాల పెంచలయ్య నెల్లూరులోని ఫత్తేఖాన్పేటలో ఉన్న నారాయణ జూనియర్ కళాశాలలో సెక్యూరిటీ గార్డుగా గత నెల క్రితం వరకు పని చేశాడు. అప్పట్లో వర్షాల నేపథ్యంలో కళాశాల వరండాలో వర్షపు నీరు అధికంగా చేరడంతో వాటిని కాలితో నెట్టుతూ ఉండడంతో నాలుగు రోజులకే అతని అరి కాలికి పుండ్లు ఏర్పడ్డాయి. స్థానికంగా ప్రైవేట్గా వైద్యం చేయించినా తగ్గకపోవడంతో, విధులు నిర్వర్తించలేకపోవడంతో ఏజెన్సీ వారు అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నా.. విభేదాలతో వేరుగా ఉంటున్నారు. దీంతో స్వగ్రామమైన అంకుపల్లికి చేరాడు. రోజు రోజుకు కాలి బాధ తీవ్రం కావడంతో నడవలేని స్థితిలో అష్టకష్టాలు పడి శనివారం ఆత్మకూరు ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో వైద్యం చేయించుకొనేందుకు వచ్చాడు. ఓపీ సైతం తీసుకున్నాడు. కట్టు కట్టే దగ్గరకు వెళ్తే అక్కడి సిబ్బంది ‘నువ్వు సహాయకుడు లేకుండా వస్తే వైద్యం చేయం’ అని చెప్పడంతో తాను గతంలో జగనన్న ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ ద్వారా 2021లో గుండె ఆపరేషన్ నెల్లూరులోని బొల్లినేని ఆస్పత్రిలో చేయించుకున్నానని, అప్పట్లో తన వెంట ఎవరూ లేరని, అయినా వైద్యం చేశారని తెలిపాడు. జగనన్న వల్ల తనకు ఉచితంగా వైద్యం జరగడంతో ఆయన పేరును తన గుండెపై పచ్చబొట్టు పొడిపించుకున్నట్లు పెంచలయ్య ఆత్మకూరు ఆస్పత్రి సిబ్బందికి తెలిపాడు. దీంతో అక్కడి సిబ్బంది ఇక్కడ రాజకీయాలు చెప్పొద్దని, ముందు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని వైద్యం చేయకుండానే పంపేశారు. దీంతో ఏమి చేయాలో పాలుపోక ఏడుస్తూ నడవలేని స్థితిలో మున్సిపల్ బస్టాండ్ వద్దకు చేరుకొని దిక్కుతోచక రోడ్డుపై కూర్చోని రోదిస్తున్న తీరు చూసిన స్థానికులు ఆస్పత్రి సిబ్బంది ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని, బస్టాండ్లో అతని పరిస్థితి చూసిన పలువురు వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై ప్రభుత్వ ఆస్పత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ను వివరణ కోసం ప్రయతి్నంచగా ఆయన అందుబాటులోకి రాలేదు. -
ఆస్ట్రేలియాలోని ఎన్నారైల సహకారం మరువలేనిది : లక్ష్మీపార్వతి
గత కొన్ని సంవత్సరాలుగా వైఎస్ఆర్సిపి పార్టీకి జగనన్నకు మద్దతుగా నిలుస్తున్నటువంటి ఆస్ట్రేలియా వైయస్సార్సీపీ ఎన్నారై లకి పార్టీ సీనియర్ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆస్ట్రేలియాలోనీ మెల్బోర్న్ పర్యటనలో ఉన్న లక్ష్మీపార్వతి గారు మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీనియర్ నాయకులని ఉద్దేశించి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పట్ల మీరు చూపిస్తున్న ఆధారాభిమానాలకు పార్టీ ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటుందని తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు ఎన్నారైలు మాట్లాడుతూ జగన్ గారు తన పరిపాలన హయాంలో ప్రజలకు ఎంతో మేలు చేశారని తమలో చాలామంది వారి తండ్రి పెట్టిన పథకాలను ఉపయోగించుకుని వచ్చి విదేశాల్లో స్థిరపడ్డామని వారి రుణం జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్లప్పుడూ మద్దతు తీర్చుకుంటామని తెలియజేశారు. మీ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ పార్టీకి ఇదేవిధంగా కొనసాగాలని ఆకాంక్షించారు.రాబోయే జగనన్న ప్రభుత్వంలో కార్యకర్తలకు అన్ని విధాలాగా భరోసా ఉంటుందని పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా వైసిపి నాయకులు నాగార్జున యలగాల, అనీల్ పెదగాడ, హరి చెన్నుపల్లి, శరత్ కుమార్ రెడ్డి తోట్లీ, విష్ణు వర్ధన్ రెడ్డి వాకమల్ల తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మెల్బోర్న్ టీం వైయస్ఆర్సీపీ సభ్యులకు ఆస్ట్రేలియా సీనియర్ వైసీపీ లీడర్ చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి గారు అభినందనలు తెలియజేశారు -
జగన్ హైదరాబాద్ పర్యటన పై ఎల్లో మీడియా చిల్లర డిబేట్లు... ఏకిపారేసిన కాకాణి
-
గంగపుత్రులకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి,తాడేపల్లి: ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకొని గంగపుత్రులకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాంకాక్షలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ‘సముద్రాన్ని జీవనాధారంగా చేసుకుని, ఎగసిపడుతున్న కెరటాలతో నిత్యం పోరాటం చేస్తూ జీవనం సాగిస్తున్న నా గంగ పుత్రులందరికీ ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు. మన ప్రభుత్వ హయాంలో మత్స్యకారుల సంక్షేమం, సాధికారతే లక్ష్యంగా 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణాన్ని చేపట్టాం. వివిధ పథకాల ద్వారా మత్స్యకారులకు రూ.4,913 కోట్లు లబ్ధి చేకూర్చాం. గతంలోనే కాదు ఇప్పుడు, ఎప్పుడూ మత్స్యకారులందరికీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని మాట ఇస్తున్నా’అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. సముద్రాన్ని జీవనాధారంగా చేసుకుని, ఎగసిపడుతున్న కెరటాలతో నిత్యం పోరాటం చేస్తూ జీవనం సాగిస్తున్న నా గంగ పుత్రులందరికీ ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు. మన ప్రభుత్వ హయాంలో మత్స్యకారుల సంక్షేమం, సాధికారతే లక్ష్యంగా 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్ల…— YS Jagan Mohan Reddy (@ysjagan) November 21, 2025 -
కూటమి, మోసం.. రెండూ కవల పిల్లలు: ఆర్కే రోజా
సాక్షి, తాడేపల్లి: మోసం, కూటమి ప్రభుత్వం రెండూ కవల పిల్లలుగా మారిపోయాయని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా. చంద్రబాబు ప్రభుత్వం రైతులను దారుణంగా మోసం చేస్తోందన్నారు. అన్నం పెట్టే రైతులను కూడా మోసం చేయడానికి కూటమి ప్రభుత్వానికి మనసు ఎలా వస్తుందో అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రైతులను ఆదుకోవాలని రోజా డిమాండ్ చేశారు.మాజీ మంత్రి ఆర్కే రోజా ట్విట్టర్ వేదికగా..‘సొంత జిల్లా మామిడి రైతులను మోసం చేస్తున్న చంద్రబాబు. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలోని 45 వేల మంది రైతులు పండించిన మామిడికి గిట్టుబాటు ధర లేకపోవడంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మామిడి రైతులకు అండగా ఉండటం కోసం బంగారుపాలెం పర్యటన చేశారు. జగనన్న వస్తుండటంతో భయపడ్డ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు.. రైతులను తప్పుదోవ పట్టించడానికి అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి 45 వేల మంది రైతులు పండించిన 4.50 లక్షల టన్నుల తోతాపురి మామిడిని ప్యాక్టరీలకు తోలారు.అప్పుడు రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ ఒక్క కిలోకు ప్రభుత్వం 4 రూపాయలు ప్యాక్టరీలు 8 రూపాయలు మొత్తం కిలో మామిడికి 12 రూపాయలు ఇస్తామని చెప్పారు. నెలలు గడిచినా ప్రభుత్వం ఇవ్వాల్సిన 180 కోట్లు, ప్యాక్టరీలు ఇవ్వాల్సిన 360 కోట్లు విడుదల చేయలేదు. రైతు సంఘాలు ఆందోళన చేయడం వారికి అండగా నా వంతు బాధ్యతగా నేను కూడా రైతుల ఆందోళనకు అండగా నిలబడ్డాను. విధిలేని పరిస్థితుల్లో ప్రభుత్వ వాటాగా ఇవ్వాల్సిన 180 కోట్లు విడుదల చేశారు. అయితే, ప్యాక్టరీలు ఇవ్వాల్సిన 360 కోట్లు ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళన చెందుతుండటంతో ప్యాక్టరీలు ఇవ్వాల్సిన 360 కోట్లు ఇవ్వకపోతే రైతులకు మద్దతుగా పోరాటం చేశామని నేను మాట్లాడిన విషయం మీకు తెలిసిందే.తాజాగా ప్రభుత్వం ప్యాక్టరీ యాజమాన్యం ఇవ్వాల్సిన 8 రూపాయలు కాకుండా ప్రభుత్వం ఇచ్చినట్లే 4 రూపాయలు ఇస్తుంది. కొన్ని చోట్ల మూడు రూపాయలు కూడా ఇస్తున్నారని కూడా రైతులు తమ బాధను నాకు చెప్పినప్పుడు చాలా బాధేసింది. అన్నం పెట్టే రైతులను కూడా మోసం చేయడానికి కూటమి ప్రభుత్వానికి మనసు ఎలా వస్తుందో.. ప్రభుత్వ మోసం వల్ల 45 వేల మంది రైతులు 180 కోట్లు నష్ట పోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తాము ఇచ్చిన హామీ మేరకు కిలోకు 8 రూపాయల చొప్పున 360 కోట్లు ఇవ్వాలని మామిడి రైతుల పక్షాన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. తమ న్యాయమైన డిమాండు కోసం మామిడి రైతులు చేసే పోరాటానికి నా సంపూర్ణ మద్దతు ఎప్పటిలాగే ఉంటుంది’ అని భరోసా ఇచ్చారు. స్వంత జిల్లా మామిడి రైతులను మోసం చేస్తున్న చంద్రబాబు...మోసం - కూటమి ప్రభుత్వం రెండూ కవలపిల్లలుగా మారింది, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలోని 45 వేల మంది రైతులు పండించిన మామిడికి గిట్టుబాటు ధర లేకపోవడంతో మాజీ ముఖ్యమంత్రి @ysjagan గారు మామిడి రైతులకు అండగా ఉండటం కోసం…— Roja Selvamani (@RojaSelvamaniRK) November 21, 2025 -
సాకే శైలజానాథ్కు మాతృవియోగం.. వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ కీలక నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ (Shailajanath) ఇంట విషాదం నెలకొంది. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తల్లి సాకె గంగమ్మ ఈ ఉదయం(శుక్రవారం) కన్నుమూశారు. దీంతో పలువురు రాజకీయ నేతలు ఆయనకు సంఘీభావం ప్రకటిస్తున్నారు.గంగమ్మ మరణం పట్ల వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం తెలియజేశారు. శైలజానాథ్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు.. గంగమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పని చేసిన సాకే శైలజానాథ్.. ప్రస్తుతం శింగనమల వైఎస్సార్సీపీ ఇంఛార్జ్గా ఉన్నారు. -
జన ప్రభంజనం.. హైదరాబాద్ లో జగన్ ను చూసి కూటమి కుళ్ళు రాజకీయాలు
-
వైఎస్సార్సీపీ రాష్ట్ర కాళింగ విభాగం అధ్యక్షుడిగా మురళీధర్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లానరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఆరంగి మురళీధర్ని పార్టీ రాష్ట్ర కాళింగ విభాగం అధ్యక్షుడిగా నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. -
జగన్ కోసం తండోపతండాలుగా జనాలు... ABN, TV5 థంబ్ నైల్స్ పై అంబటి మాస్ ర్యాగింగ్
-
Hyd: స్టేట్ ఏదైనా తగ్గని జగన్ క్రేజ్
-
హైదరాబాద్కు జగన్.. పోటెత్తిన అభిమానం (ఫొటోలు)
-
కాసేపట్లో హైదరాబాద్ కు చేరుకోనున్న YSRCP అధినేత YS జగన్ మోహన్ రెడ్డి
-
మార్కెటింగ్ చేసుకోవడం తప్ప.. రైతులకు చంద్రబాబు మేలు చేయరు
సాక్షి, అమరావతి: అబద్ధాలు, క్రెడిట్ చోరీలతో తనను తాను మేధావిలా మార్కెటింగ్ చేసుకోవడం తప్ప రైతులకు మేలు చేయాలన్న ఆలోచన చంద్రబాబుకి లేదని ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో–ఆర్డినేటర్, మాజీమంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్ కడప జిల్లాలో రెండోవిడత అన్నదాత సుఖీభవ నగదు జమ సందర్భంగా చంద్రబాబు చెప్పిన అబద్ధాలపై మండిపడ్డారు. ఈ ఒక్క పథకం ద్వారానే రెండేళ్లలో రైతులకు దాదాపు రూ.17 వేల కోట్లు మోసం చేశారన్నారు. ఏకంగా 7 లక్షల మంది రైతులను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించి వెన్నుపోటు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఇచ్చే నిధులతో సంబంధం లేకుండానే అన్నదాత సుఖీభవ కింద ఒక్కో రైతుకు ఏడాదికి రూ.20 వేలు పెట్టుబడి సాయం అందిస్తానని నమ్మించి.. ఎన్నికల్లో గెలిచాక రెండేళ్లలో కేవలం రూ.10 వేలు మాత్రమే ఇచ్చి చేతులు దులిపేసుకున్నారని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వం కౌలు రైతులను అసలు రైతులుగానే గుర్తించడం లేదని, ఏడాదిన్నర కూటమి పాలనలో వందలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్క కుటుంబాన్ని కూడా ఆదుకున్న పాపాన పోలేదని చెప్పారు. పంచ సూత్రాలు కాదు.. పచ్చి అబద్ధాలు ‘ఈ–క్రాప్ చేయడం చేతకాని వ్యక్తి చంద్రబాబు వ్యవసాయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొస్తానని చెబుతున్నారు. గడచిన ఐదేళ్లూ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్ది అయితే, అకౌంట్లో నగదు వేసే విధానం తానే తీసుకొచ్చానని చంద్రబాబు సిగ్గులేకుండా ప్రచారం చేసుకుంటున్నారు. పంచసూత్రాల పేరుతో ఆయన చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలే. వైఎస్సార్సీపీ హయాంలో సీఎం యాప్ను తీసుకొచ్చి రైతులు పండించిన పంటలను మార్కెటింగ్ చేస్తే.. చంద్రబాబు కొత్తగా యాప్ తీసుకొస్తానని చెబుతున్నాడు. గ్రోమోర్ సెంటర్ను చూసి ఆదర్శంగా ఉందని చెబుతున్న చంద్రబాబు.. వైఎస్సార్సీపీ హయాంలో రైతులకు అండగా అద్భుతంగా పనిచేసిన ఆర్బీకే సెంటర్లను నిర్వీర్యం చేశారు. ఏపీలో అమలవుతున్న ఆర్బీకే వ్యవస్థను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని నీతిఆయోగ్ సూచిస్తే, వైఎస్ జగన్కు మంచి పేరొస్తుందనే అక్కసుతో దానిని నిర్వీర్యం చేసి రైతులను నిలువునా ముంచిన నీచుడు చంద్రబాబు. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా మార్చి అరటి, దానిమ్మ వంటి వ్యవసాయ ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేసిన ఘనత వైఎస్ జగన్ది. అలాంటి మంచి పనులకు తన స్టాంప్ వేసుకుని చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు’ అని కన్నబాబు మండిపడ్డారు. ఏడాదిన్నరలో రైతులకు చేసింది శూన్యం ‘రైతులకు ఈ ప్రభుత్వం ఏడాదిన్నరలో చేసింది శూన్యం. రైతుల అప్పుల గురించి మాట్లాడమంటే యాప్ల గురించి చెబుతున్నారు. నకిలీ విత్తనాలతో శ్రీకాకుళం జిల్లాలో రైతులు తీవ్రంగా నష్టపోతే చంద్రబాబుకి చీమకుట్టినట్టయినా లేదు. ధరలు పతనమై రైతులు నష్టపోతుంటే ప్రభుత్వం ఎక్కడా కలగజేసుకుని ఆదుకున్న దాఖలాలు లేవు. మామిడి, మిరప, చెరకు రైతులను ఆదుకుంటామని చెప్పిన మాటలు గాలిలో కలిసిపోయాయి. రైతులకు మేలు జరిగేలా ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా చేయడం లేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉచిత పంటల బీమా పథకాన్ని, రైతులు రూపాయి కూడా ప్రీమియం చెల్లించే అవసరం లేకుండా అమలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఆ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది. వైఎస్సార్సీపీ హయాంలో 53.58 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.67,500 చొప్పున జమ చేశారు. ఐదేళ్లలో రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో రూ.34,378 కోట్లు వైఎస్ జగన్ ఇచ్చారు. చంద్రబాబు హామీ మేరకు రెండేళ్లలో రైతుల ఖాతాల్లో రూ.21,433 కోట్లు జమ చేయాల్సి ఉంటే.. రూ.5 వేల చొప్పున 46.85 లక్షల మంది రైతులకు రెండు విడతల్లో ఇచ్చిన మొత్తం కేవలం రూ.4,685 కోట్లు మాత్రమే. రెండేళ్లలోనే రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.16,746 కోట్లు కూటమి ప్రభుత్వం బకాయి పడింది. వైఎస్సార్సీపీ హయాంలో రైతు భరోసా పథకాన్ని కౌలు రైతులకు కూడా వర్తింపజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అన్నదాత సుఖీభవ పథకానికి కౌలు రైతులను చంద్రబాబు దూరం చేశారు’ అని కన్నబాబు పేర్కొన్నారు. -
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ ఆదేశాల మేరకు వైసీపీ నూతన నియామకాలు చేపట్టింది. ఎన్టీఆర్ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలుగా రాయన భాగ్యలక్ష్మి(విజయవాడ మేయర్)ని, మహిళా విభాగం రాష్ట్ర అధికార ప్రయినిధిగా సంపతి విజితలను నియమిస్తూ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. -
మంత్రి వాసంశెట్టి సుభాష్ వ్యాఖ్యలకు చెల్లుబోయిన అదిరిపోయే కౌంటర్
-
చిన్నారికి పేరు పెట్టిన జగన్ మావయ్య
సాక్షి, గుంటూరు: చిన్నారులంటే వైఎస్ జగన్ మోహన్రెడ్డికి అపారమైన మమకారం. ప్రజల మధ్యకి వెళ్లినప్పుడు వాళ్లూ ఆయన పట్ల ఎంతో భావోద్వేగానికి లోనవుతుంటారు. దీంతో స్వయంగా వాళ్లను దగ్గరకు తీసుకుని బుజ్జగించడం తరచూ చూసేదే. అలా ఓ చిన్నారికి మావయ్యగా ఆయన నామకరణం చేశారు కూడా. మంగళగిరి నియోజకవర్గం నూతక్కికి చెందిన బోళ్ళ వెంకటరెడ్డి, చందనాదేవి దంపతులు బుధవారం తమ అభిమాన నేత వైఎస్ జగన్ను తాడేపల్లికి వెళ్లి కలిశారు. తమ కుమార్తెకు నామకరణం చేయాలని ఆయన్ని కోరారు. దంపతుల కోరిక మేరకు వారిని అడిగి తెలుసుకుని మోక్షితా రెడ్డిగా పేరు పెట్టి లాలించారు. తమ కుమార్తెకు జగన్ చేతుల మీదుగా నామకరణం జరిగినందుకు ఆ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. -
రైతులకు ఒకే ఏడాది 7800 కోట్లు.. అది జగన్ ట్రాక్ రికార్డు
-
మేజిస్ట్రేట్ ముందు CI సిగ్గుతో తలదించుకున్నాడు
-
కూటమికి బిగ్ షాక్ ఇచ్చిన కోర్టు.. కారుమూరి వెంకటరెడ్డికి బెయిల్
-
కారుమూరి వెంకట్ రెడ్డికి బెయిల్
-
హత్యే! దొరికిపోయారు!? అరెస్టుల వెనుక సంచలన నిజాలు..
-
కారుమూరికి బెయిల్ మంజూరు
గుంతకల్లు, తాడిపత్రి టౌన్: ‘వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిపై పెట్టిన కేసుకు సంబంధించి అన్నీ బెయిలబుల్ సెక్షన్లే. ఆయనను అరెస్ట్ చేసేముందు ప్రాథమికంగా విచారించాలి. అలా చేయకుండా ఏకపక్షంగా అరెస్ట్ చేయడమేంటి’ అని పోలీసులను అనంతపురం జిల్లా తాడిపత్రి కోర్టు నిలదీసింది. ఈ మేరకు వెంకటరెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. రెడ్బుక్ రాజ్యాంగంతో బెదిరింపులకు పాల్పడుతూ ప్రశ్నించే గళాలను అణచివేస్తున్న చంద్రబాబు సర్కారు బరి తెగించి వ్యవహరిస్తోంది! సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వాన్ని కించపరిచేలా పోస్టులు చేశారని.. టీటీడీ మాజీ ఏవీఎస్వో, గుంతకల్లు రైల్వే ఇన్స్పెక్టర్ సతీశ్కుమార్ అనుమానాస్పద మృతిపై రాజకీయ ప్రేరేపిత పోస్టులు పెట్టారంటూ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని మంగళవారం హైదరాబాద్లో అక్రమంగా అరెస్టు చేసింది. తాడిపత్రికి చెందిన ఓ టీడీపీ నేత ఇచ్చిన ఫిర్యాదుతో.. సివిల్ దుస్తుల్లో వచ్చిన కొందరు వ్యక్తులు పోలీసులమని చెబుతూ, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఆయన్ను అక్రమంగా అరెస్టు చేసి గుంతకల్లు తరలించారు. దీనిపై కారుమూరి భార్య హరిత హైదరాబాద్లోని కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.డీఎస్సీ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణుల ఆందోళనవైఎస్సార్సీపీ నేత కారుమూరి వెంకటరెడ్డిని హైదరాబాద్లో అరెస్టు చేసిన తాడిపత్రి పోలీసులు గుంతకల్లు డీఎస్పీ కార్యాలయానికి తీసుకొచ్చారు. సాయంత్రం 6.00 నుంచి 9.00 గంటల వరకు డీఎస్పీ ఏ.శ్రీనివాస్ తన చాంబర్లో కారుమూరిని విచారించారు. నాలుగు గంటల హైడ్రామా తర్వాత ఆయన్ను తాడిపత్రి మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచేందుకు తీసుకెళ్లారు. కారుమూరి అక్రమ అరెస్ట్ను ఖండిస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులు డీఎస్పీ కార్యాలయం వద్దకు భారీగా తరలివచ్చాయి. అనంతపురం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి, జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డి, కారుమూరి సోదరి సునీతారెడ్డి తదితరులు డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ లీగల్ సెల్ నాయకులు హరినాథ్రెడ్డి, ఉమాపతి, రాజశేఖర్యాదవ్, శ్రీనివాస్రెడ్డి తదితరులు అక్రమ కేసు వివరాలను ఆరా తీశారు. కారుమూరు వెంకటరెడ్డిని కలిసేందుకు పోలీసులు ఏ ఒక్కరినీ అనుమతించకపోవడంపై పార్టీ నేతలు మండిపడ్డారు. తాడిపత్రి మండలం గన్నెవారిపల్లికి చెందిన టీడీపీ నేత, జేసీ ప్రభాకర్రెడ్డి అనుచరుడు చింబిలి ప్రసాద్ నాయుడు ఆదివారం తాడిపత్రి రూరల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కారుమూరిపై పోలీసులు 352, 353(1)(2)196 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.తాడిపత్రిలో ఉద్రిక్తతకారుమూరి వెంకటరెడ్డి అరెస్టు నేపథ్యంలో తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆయన్ను హైదరాబాద్ నుంచి తాడిపత్రికి తరలిస్తున్నట్లు మీడియా ద్వారా తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకులు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.కూకట్పల్లి పోలీసులకు కారుమూరి భార్య ఫిర్యాదుఆంధ్రప్రదేశ్ పోలీసులమంటూ కొందరు వ్యక్తులు సివిల్ డ్రస్లో వచ్చి కారుమూరి వెంకటరెడ్డిని తీసుకువెళ్లారంటూ ఆయన భార్య హరిత కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉదయం 7 గంటల సమయంలో సివిల్ డ్రస్లో వచ్చిన నలుగురు వ్యక్తులు తన సెల్ఫోన్ లాక్కుని, తన భర్తను వారితో తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. విషయాన్ని పెద్దది చేస్తే జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించాలని బెదిరించినట్లు వెల్లడించారు.నిత్యం ప్రశ్నిస్తున్నందుకే అక్రమ అరెస్టు: శ్యామలమూసాపేట (హైదరాబాద్): రెడ్బుక్ రాజ్యాంగంతో భయభ్రాంతులకు గురి చేసేందుకే అక్రమ అరెస్టులు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల మండిపడ్డారు. కారుమూరి వెంకటరెడ్డి భార్య హరితతో కలసి మంగళవారం హైదరాబాద్లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో అక్రమాలు, అన్యాయాలు చేస్తున్న వారిని అరెస్టు చేయకుండా.. వాటిని ప్రశ్నించే వారిని అక్రమంగా అరెస్టు చేయటం ఏమిటని ప్రశ్నించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అవినీతి, అక్రమాలను నిత్యం ప్రశ్నిస్తున్నందుకే కారుమూరిని అక్రమంగా అరెస్టు చేశారన్నారు. ఆయన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తూ, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రైవేట్ వాహనాల్లో తరలించారన్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా అరెస్టు చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని ధీటుగా ఎదుర్కొంటామని ఐటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ విజయభాస్కర్రెడ్డి స్పష్టం చేశారు. -
ఎల్లో మీడియాపై పేర్ని నాని ఆగ్రహం
సాక్షి,తాడేపల్లి: ఎల్లోమీడియాపై మాజీ మంత్రి పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ మాజీ ఏవీఎస్వీ సతీష్ కుమార్ మరణంపై ఇష్టం వచ్చినట్లు వార్తా కథనాల్ని ప్రసారం చేస్తోందని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం పేర్నినాని మీడియాతో మాట్లాడారు.రెండేళ్లుగా రాష్ట్రంలో చంద్రబాబు ఆటవిక పాలన కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ నేతలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. టీటీడీ మాజీ ఏవీఎస్ఈవో చనిపోతే ఆయన ఇంటిని పోలీసులే జల్లెడ పట్టారు. కనీసం సానుభూతి కూడా చూపించలేదు. సతీష్ కుమార్పై ఎల్లో మీడియా ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేస్తోంది. సతీష్ కుమార్ది అసలు ఆత్మహత్య?హత్య?అని తెలుసుకునేలోపే ఇల్లంతా జల్లెడపట్టారు. సతీష్ కుమార్ భార్య ఫోన్ కూడా లాక్కున్నారు. ఆ ఫోన్ ఎక్కడుందో ఇప్పటి వరకూ తెలియదు. సతీష్ కుమార్ కాల్ డేటా ఎక్కడ? అని ప్రశ్నించారు. -
డీఎస్పీ ఆఫీస్ వద్ద వైఎస్సార్సీపీ ఆందోళన
-
Ambati: కనీసం నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేసిన తాడిపత్రి పోలీసులు


