breaking news
YSRCP
-
‘చలో వెలుగోడు’లో ఉద్రిక్తత.. వైఎస్సార్సీపీ నేతల అడ్డగింత
సాక్షి, నంద్యాల: నంద్యాల జిల్లాలోని బండి ఆత్మకూరు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. వెలుగోడు రిజర్వాయర్ నుంచి వెంటనే నీటిని విడుదల చేసి చెరువులను నింపాలంటూ వైఎస్సార్సీపీ నేతలు ‘చలో వెలుగోడు రిజర్వాయర్’ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో వెలుగోడుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ నేతలు శిల్పా చక్రపాణి, రవిలను శిల్పా రవిని పోలీసులు అడుగడుగునా అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది..ఈ నేపథ్యంలో రైతుల కోసం నీళ్లు అడిగితే అడ్డుకుంటారా? అని పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా వెలుగోడు రిజర్వాయర్లను ముట్టడిస్తామని శిల్పాచక్రపాణి రెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు.. బస్టాండ్ వద్ద రైతులు నిరసన తెలుపుతున్నారు. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ.. వెంటనే కేసీ కెనాల్కు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వెలుగోడు నుండి నీటిని విడుదల చేసి చెరువుల నింపాలని మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, శిల్పా రవి కూటమి సర్కార్ను కోరారు. సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే నీటి విడుదలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: టీడీపీ ఎమ్మెల్యే పుట్టాపై కేసు నమోదు -
నీటి విడుదల ప్రారంభమైందో లేదో.. వెలిగొండలో అపశ్రుతి..!
-
రవిని నన్ను జైల్లో ఎంత ఇబ్బంది పెట్టారంటే
-
మాగుంట శ్రీనివాసులు రెడ్డి వ్యాఖ్యలు.. బూచేపల్లి అదిరిపోయే కౌంటర్
-
తాడిపత్రిలో పెద్దారెడ్డి ప్రత్యేక పూజలు
-
YSR విగ్రహ ప్రతిష్టాపనను అడ్డుకోవడంపై మండిపడుతున్న YSRCP నేతలు
-
మారికవలస గురుకులం పోరాటం మరింత ఉధృతం
మధురవాడ: సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్(సీవోఈ) పేరుతో మూసివేసేందుకు యత్నిస్తున్న మారికవలస గిరిజన సంక్షేమ బాలుర ఇంగ్లిష్ మీడియం పాఠశాలను ఇక్కడే కొనసాగిస్తామని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చే వరకు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని వైఎస్సార్సీపీ నేతలు, ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవి బాబు, మాజీమంత్రి పసుపులేటి బాలరాజు తదితరులు స్పష్టం చేశారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా ముందు రోజు మారికవలస బాలుర ఇంగ్లిష్ మీడియం పాఠశాలను ఇక్కడే కొనసాగిస్తామని, ఇతర ప్రాంతాలకు తల్లిదండ్రుల అనుమతి లేకుండా తరలించిన విద్యార్థులను తిరిగి తీసుకువస్తామని హామీ ఇచ్చిన అధికారులు మాట తప్పారని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి, గిరిజన సంఘాలు ఆందోళనకు దిగాయి. సోమవారం ఉదయం నుంచే గురుకుల పాఠశాల ప్రధాన గేటు ఎదుట నేలపై ఆందోళనకారులు బైఠాయించారు. పాడేరు ధర్నా శిబిరం నుంచి పాఠశాలకు తీసుకువచ్చిన 37 మంది విద్యార్థులను ఇక్కడ అనాథ పిల్లల్లా వదిలేశారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. మారికవలసలోని విద్యార్థులను పరామర్శించేందుకు బయలుదేరిన అరకు, పాడేరు ఎమ్మెల్యేలను అడ్డుకోవడం, గిరిజన సంఘాల నేతలు, ఇతర నాయకులను గృహ నిర్బంధం చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, జీసీసీ మాజీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి, వైఎస్సార్సీపీ ఐటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేకే సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.మారికవలస వెళ్తున్న పాడేరు, అరకు ఎమ్మెల్యేలను అడ్డుకున్న పోలీసులు..పాడేరు : మారికవలస గురుకులం వద్ద విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగంను పోలీసులు అడ్డుకున్నారు. అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. విశ్వేశ్వరరాజు మారికవలస బయలుదేరుతున్న సంగతి తెలుసుకున్న పోలీసులు స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చారు. అప్పటికే ఆయన విశాఖపట్నం బయలుదేరిపోవడంతో పాడేరు–చోడవరం ప్రధాన మార్గంలోని తాటిపర్తి చెక్పోస్టు వద్ద ఆయనను అడ్డుకుని సుమారు రెండు గంటలపాటు నిర్బంధించారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగంను వంతాడపల్లి చెక్పోస్టు వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఆయన వెనుదిరిగారు. తాటిపర్తి చెక్పోస్టు వద్ద ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు మాట్లాడుతు తాము శాంతియుతంగా నిరసన కార్యక్రమానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం విశ్వేశ్వరరాజును పోలీసులు అదుపులోకి తీసుకుని చోడవరం పోలీసు స్టేషన్కు తరలించారు. -
నేడు, రేపు వైఎస్ జగన్ పులివెందుల పర్యటన
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సెప్టెంబర్ 1, 2 తేదీల్లో పులివెందులలో పర్యటించనున్నారు. 2న ఇడుపులపాయలో జరిగే దివంగత సీఎం వెఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి కార్యక్రమంలో పాల్గొని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు. తొలుత.. సెప్టెంబర్ 1వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు వైఎస్ జగన్ పులివెందుల చేరుకుంటారు. అనంతరం భాకరాపురం క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. రాత్రికి పులివెందులలోని తన నివాసంలో బసచేస్తారు. రెండో తేదీ ఉదయం 7.45కు ఇడుపులపాయ చేరుకుంటారు. అక్కడ వైఎస్సార్ ఘాట్ వద్ద తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పిస్తారు. అనంతరం వైఎస్ జగన్ అక్కడి నుంచి తిరుగు ప్రయాణమవుతారు. -
ఎంపీ ల్యాడ్స్ వినియోగంలో టాప్లో నిలిచిన వైఎస్సార్సీపీ ఎంపీ
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో ఎంపీ ల్యాడ్స్ వినియోగంలో వైఎస్సార్సీపీ ఎంపీ మేడా రఘునాథరెడ్డి టాప్లో నిలిచారు. ఏపీ లోక్సభ, రాజ్యసభ ఎంపీల్లో మేడా రఘునాథరెడ్డి ఎంపీ ల్యాడ్స్ వినియోగంలో అగ్రస్థానాన్ని సాధించారుతనకు కేటాయించిన నిధుల్లో 55.17 శాతం అభివృద్ధి పనులకు ఎంపీ మేడా రఘునాథరెడ్డి ఖర్చు పెట్టారు. గ్రామాలలో సిసి రోడ్ల పనులకు అత్యధికంగా నిధులను ఖర్చుపెట్టారు. 14.7 కోట్ల రూపాయల నియోజకవర్గ నిధుల కేటాయింపులలో 8.10 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. 139 ప్రాజెక్టులకు సిఫారసు చేయగా 110 ప్రాజెక్టులు పూర్తి కాగా, మరో 29 పనులు కొనసాగుతున్నాయి. ఇక నాలుగో స్థానంలో అరకు ఎంపీ డాక్టర్ గుమ్మ తనుజా రాణి నిలిచారు. తనకు కేటాయించిన నిదుల్లో ఇప్పటివరకూ 48.94 శాతం నిధులను వినియోగించారు. ఇక తను కేటాయించిన ఎంపీ నిధుల్లో 35.71 శాతం ఖర్చుపెట్టిన ఏడో స్థానంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి నిలిచారు. ఈ జాబితాలో కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అట్టడుగు స్థానంలో నిలిచారు. తనకు కేటాయించిన నిధుల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు వర్మ. ఎంపీ ల్యాడ్స్ నిధులపై ఎంపవర్డ్ ఇండియన్ నివేదిక ద్వారా ఈ విషయాలు వెల్లడయ్యాయి. సీఎం చంద్రబాబు తీరుతో మంత్రి ఆనం మనస్తాపం -
నీ చరిత్ర మొత్తం బయట పెడితే.. మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా..
-
బాబుకు ఏపీ కంటే తెలంగాణ అంటేనే ప్రేమ ఎక్కువ..!
-
MLA మత్సరాస విశ్వేశ్వరరాజుపై పోలీసుల ఓవర్ యాక్షన్
-
నువ్వు నిరూపిస్తే నేను దేనికైనా రెడీ... వేమిరెడ్డికి అనిల్ కుమార్ యాదవ్ సవాల్
-
వెలిగొండ లెక్కలు బయటపెట్టే దమ్ముందా.. శ్రీకాంత్ రెడ్డి సంచలన కామెంట్స్
-
రేపు పులివెందులకు వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపటి(మంగళవారం) నుంచి పులివెందులలో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 2న ఇడుపులపాయలో జరిగే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు.01.09.2026 షెడ్యూల్ ఇలా.. వైఎస్ జగన్ సెప్టెంబర్ 1న(మంగళవారం) మధ్యాహ్నం 12 గంటలకు పులివెందుల చేరుకుంటారు. అనంతరం భాకరాపురంలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. రాత్రికి పులివెందులలోని తన నివాసంలో బస చేస్తారు.02.09.2026 షెడ్యూల్..సెప్టెంబర్ 2న ఉదయం పులివెందుల నివాసం నుంచి బయలుదేరి ఉదయం 7.45 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు. అక్కడ వైఎస్సార్ ఘాట్ వద్ద తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పిస్తారు. ఈ కార్యక్రమం అనంతరం వైఎస్ జగన్ అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవుతారు.చదవండి: తానే శంకుస్థాపన చేసి, తానే పూర్తి చేసినట్టు బాబు అబద్ధాలు.. వెలిగొండలో క్రెడిట్ చోరీ -
విజయసాయి వ్యాఖ్యలపై మల్లాది విష్ణు కౌంటర్..
-
జగన్ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తేడా...? బొప్పరాజు రియాక్షన్
-
ఓటర్ ఫారాలు పల్లీల పొట్లాలుగా.. అసలేం జరుగుతోంది?'బాధ్యత ఎవరిది?'
-
వెలిగొండకు జగన్ అప్పుడే.. క్రెడిట్ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!
-
బాబూ... చెత్త ఎవరిది? సోషల్ మీడియాలో రివర్స్ కౌంటర్!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు భలే ప్రకటనలు చేస్తుంటారు. వాటిని ఎల్లో మీడియా పరమ పవిత్రం అన్నట్లుగా ప్రముఖంగా ప్రచురించి ప్రచారం చేస్తుంటుంది. చంద్రబాబు ఈ మధ్య ఒక ప్రకటన చేశారు. అది ఏమిటంటే రాజకీయాలలో చెత్తను తొలగిద్దాం.. అని అన్నారు. మామూలుగా అయితే ఇది ఆహ్వానించదగిందే. కాని ఆయన లక్ష్యం వేరు. ప్రతిపక్షాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తున్నానని ఆయన అనుకోవచ్చేమోకాని, వాటిని విన్నవెంటనే, పత్రికలలో చదివిన వెంటనే గుర్తుకు వచ్చేది అధికార పార్టీలో ఉండేవారు చేసే అక్రమాల గురించే కదా! ఆ విషయాన్ని ఆయన పట్టించుకోకుండా స్పీచ్లు ఇస్తుండడం విశేషం.మనం రాజకీయాలలో ఉన్నవారిని అలాంటి పదాలతో సంభోధించడం సరైన పద్దతి కాదు. ఎవరు తప్పు చేసినా తప్పే. అసలు రాజకీయాలలో చెత్త అంటే ఏమిటో ఆయన ఒక నిర్వచనం ఇస్తే బాగుంటుంది కదా! ఎవరిపైన కేసులు ఉంటే వారు ఆ కోవలోకి వస్తారని అన్న భావనా? లేక ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడితే దానిని ఆ విధంగా పరిగణించాలన్న అర్థమా? ఎన్నికలలో డబ్బు ఖర్చు చేసేవారిపై వ్యాఖ్యలా?ఒక విశేషం ఏమిటంటే చంద్రబాబు నాయుడు ఈ స్పీచ్ ఇవ్వడానికి రెండు రోజుల ముందు జాతీయ స్థాయిలో ప్రజస్వామ్య సంస్కరణల వేదిక ఒక నివేదిక విడుదల చేసింది. అందులో ఏమి ఉంది? ఏపీలో 79 శాతం మంది ఎమ్మెల్యేలపై కేసులు ఉన్నాయనే కదా! అంటే అత్యధిక సంఖ్యలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేల మీదే కదా! నేర చరిత్ర కలిగిన ముఖ్యమంత్రుల జాబితాలో చంద్రబాబుది నాలుగో స్థానం అని అందులో ప్రకటించారు. ఈయనపై 19 క్రిమినల్ కేసులు ఉంటే, కొన్ని తీవ్రమైన అభియోగాలు ఉన్నాయని రిపోర్టు చెబుతుంది. ఆయన శిష్యుడుగా గుర్తింపు పొందిన తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డిపై ఏకంగా 89 కేసులు ఉన్నాయట. ఆయన అగ్రస్థానంలో ఉన్నారు.వీటిలో పెక్కు రాజకీయపరమైన కేసులు ఉండవచ్చని వీరు వాదించవచ్చు. కాని ఎదుటి పక్షాలపై అలాంటి కేసుల ఆధారంగానే చంద్రబాబు ఆరోపణలు చేస్తుంటారే! అక్కడే వచ్చింది సమస్య. తాను ఎవరిపైన ఆరోపణ చేస్తే అందులో నిజం ఉందని అనుకోవాలన్నది ఆయన భావన. అదే తనపై ఎవరైనా ఆరోపణ చేస్తే ఎవరూ నమ్మకూడదన్నది ఆయన ఉద్దేశం కావచ్చు. రాజకీయాలలో ఉన్నప్పుడు ఎంతసేపు ఎదుటివారిపై బురద వేయడమే పనిగా పెట్టుకున్నప్పుడు ఆ బురద తమపై కూడా పడే అవకాశం ఉంటుందని వారు గుర్తించాలి కదా! తనకు మీడియా బలం ఉంది కనుక తను చెప్పిందే జనంలోకి వెళుతుందని చంద్రబాబు భ్రమపడి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఆయనకే నష్టం.ఇవి కూడా చదవండి: వైఎస్ జగన్ ప్రశ్నలకు టీడీపీ ఉక్కిరిబిక్కిరి..!చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే సోషల్ మీడియాలో ఆయనను ఎద్దేవ చేస్తూ అనేక విషయాలను ఫాక్ట్స్ అండ్ ఫిగర్స్తో పోస్టులు వస్తున్నాయి. గొడ్డలి పార్టీ అని వైఎస్సార్సీపీని అంటూ తన పార్టీని వెన్నుపోటు పార్టీ అని చంద్రబాబు పిలిపించుకుంటున్నారు. మాజీ సీఎం జగన్ను ఉద్దేశించి చంద్రబాబు చేస్తున్న వ్యక్తిగత విమర్శలు చాలా అనుచితంగా ఉంటున్నాయి. చంద్రబాబు తన హోదాను, సీనియారిటీని కూడా మర్చిపోయి ఏది పడితే అది ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం దురదృష్టకరం. ప్రజలు నిజాయితీగా ఉంటే నాయకులు తప్పులు చేయరట. ఎన్నికలలో డబ్బు ప్రభావం లేకుండా చేయవలసిన బాధ్యత ప్రజలదట. అది జరిగితేనే రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుందట. అంటే ఇప్పట్లో రాష్ట్రం స్వర్ణాంధ్ర కాదని పరోక్షంగా చెప్పినట్లు అనుకోవాలా? ఎంతసేపు ప్రజలను నిందిస్తున్నారే తప్ప, తాము డబ్బు పంచకుండా ఎన్నికలలో పోటీచేస్తామని మాటవరసకు చెప్పలేకపోతున్నారన్న విమర్శ వస్తోంది.సీపీఎం కార్యదర్శి వి.శ్రీనివాసరావు అయితే నేరుగా రాజకీయాలలో డబ్బు ప్రభావం తెచ్చిందే చంద్రబాబు అని స్పష్టంగా చెబుతున్నారు. వైఎస్సార్సీపీ పార్టీ అధినేత పీఏ వందల కోట్లు సంపాదించారని ఆయన ఏ ఆధారంతో చెప్పారో తెలియదు. కాని చిత్రం ఏమిటంటే స్వయంగా చంద్రబాబు పీఏ ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి చెందిన సీబీటీడీనే రెండువేల కోట్ల అక్రమాలను గుర్తించినట్లు ప్రకటించింది. దాని గురించి ఎన్నడైనా చంద్రబాబు వివరణ ఇచ్చారా? స్కిల్ స్కామ్లో ఆయన పీఏ అరెస్టు కాకుండా అమెరికాకు పంపించిందెవ్వరో తెలియదా! స్కిల్ స్కామ్లో అప్పటి సీఐడీ చేసిన అభియోగాలపై ఎన్నడైనా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పాయింట్ వైజ్ వివరణ ఇచ్చి, తానేమి తప్పు చేయలేదని చెప్పి ఉండాలి కదా!ఈ స్కామ్లో ఏ అధికారులు అరెస్టు అయింది అందరికి తెలుసే. డీఎస్సీ, ఏపీపీఏస్సీ అంశాలను చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి లోకేష్లు ప్రస్తావిస్తూ తమ వాదన సమర్థించుకునే యత్నం చేస్తున్నా, జగన్ విసిరిన సవాల్, అంటే సీబీఐ విచారణకు సిద్దపడకపోవడం వారి బలహీనతగా కనిపించదా! నకిలీ మద్యంతో గత ప్రభుత్వంలో 30వేల మంది చనిపోయారని ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆధారాలు లేని ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం.విశేషం ఏమిటంటే కూటమి అధికారంలోకి వచ్చాక తంబళ్లపల్లె నియోజకవర్గంలో ములకల చెరువు గ్రామం వద్ద టీడీపీ నేతలే నకిలీ మద్యం తయారీ కేంద్రాన్నే పెట్టిన విషయం బహిర్గతం అయింది. అలాంటివి ఏవైనా జగన్ టైమ్లో కనిపించాయా? అయినా ఈ ఆరోపణలు ఏమిటో! చంద్రబాబు స్పీచ్ ఇస్తున్న టైమ్లోనే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేపై టీడీపీకే చెందిన మాజీ ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి తీవ్ర ఆరోపణ చేశారే. ఈ రెండేళ్లలో 200 కోట్లు భూ దోపిడీ, ఇతరత్రా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. మరి వాటిపై విచారిస్తానని ఎందుకు చెప్పలేకపోయారు.అంతేకాదు. అదే ఎమ్మెల్యే తనకు ప్రతినెల మామూళ్లు ఇవ్వాలని సబ్ రిజిస్ట్రార్ను బెదిరించినట్లు కూడా వార్తలు వచ్చాయే!విజయవాడ టీడీపీ ఎంపీ వర్గంపై తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ చేసిన ఆరోపణల మాటేమిటి? గంజాయి, మట్టి, ఇసుక మాఫియాగా మారి ఏ విధంగా అక్రమాలు చేస్తున్నదానిపై ఎన్ని ఆరోపణలు చేసింది ఆయనకు తెలియదా? వాటిపై చర్య తీసుకోకపోగా పార్టీ కమిటీ కొలికపూడిని పిలిచి మందలించిందని వార్తలు వచ్చాయే. ఇటీవలే ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ పోలీస్ స్టేషన్ అడ్డగానే దందాలు చేస్తున్నట్లు జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారే. వారిద్దరు బహిరంగంగా మాట్లాడవద్దని సలహా ఇస్తే సరిపోతుందా!ఇక మహిళలను వేదించిన కొందరు టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలను కనీసం పిలిచి కోప్పడ్డారా? ఒక మంత్రే తనను వేధించారని ఒక ఎన్ఆర్ఐ మహిళ ఫిర్యాదు చేస్తే ఏమి చర్య తీసుకున్నారో ప్రజలకు తెలియచేసి ఉండాల్సింది కదా! ఇలా చెప్పుకుంటూ పోతే భారతం అంత అయ్యే పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వ అద్వాన్న పరిస్థితి కళ్లకు కట్టినట్లు కనబడుతుంది.ఇక మంత్రి లోకేష్ డీఎస్సీపై ఐదో సారి చర్చకు రమ్మన్నా రావడం లేదని సభలలో ఉపన్యాసాలు ఇచ్చి, జనం వాటినే నమ్మాలని తండ్రి మాదిరే అనుకుంటే ఎలా? జగన్ విసిరిన సీబీఐ సవాల్ను దమ్ముగా ఎదుర్కుని స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరగలేదని రుజువు చేసుకోవచ్చు కదా! చంద్రబాబు, లోకేష్లు తమను తాము పొగుడుకుంటే పొగుడుకోవచ్చు. కాని ఎదుటివారిపై నిందలు మోపే ముందు, అనుచిత వ్యాఖ్యలు చేసే ముందు అవి తమకు కూడా తగులుతాయేమో చూసుకుని మాట్లాడితే వారికే మంచిది కదా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
రిలీజ్ తర్వాత ముస్తఫా ఫస్ట్ రియాక్షన్
-
జైలు నుంచి ముస్తఫా విడుదల
-
‘వెలిగొండ’లో క్రెడిట్ చోరీ
సాక్షి, అమరావతి: చంద్రబాబు అధికారంలో ఉండగా వెలిగొండ సొరంగాల తవ్వకాల పనులు జరిగింది కేవలం 6.686 కి.మీ...దివంగత వైఎస్సార్, మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వాల హయాంలో వెలిగొండ టన్నెళ్లలో తవ్వింది 30.901 కి.మీ...మరి ఎవరి హయాంలో వాయువేగంగా పనులు జరిగాయి? చంద్రబాబు క్రెడిట్ చోరీకి వేరే ఇంకేం సాక్షాలు కావాలి? ముఖ్యమంత్రి చంద్రబాబు నిస్సిగ్గుగా మరో క్రెడిట్ చోరీకి సిద్ధమయ్యారు! విశాఖలో డేటా సెంటర్.. భూముల సమగ్ర రీ సర్వే,.. గత ప్రభుత్వం చేపట్టిన ఇతర కార్యక్రమాలను తన ఖాతాలో వేసుకుంటున్న రీతిలోనే ఆయన దృష్టి తాజాగా ‘వెలిగొండ’ ప్రాజెక్టుపై పడింది. ఈ నెల 31న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి జంట సొరంగాలు (ట్విన్ టన్నెల్స్) ద్వారా కృష్ణా జలాలను నల్లమలసాగర్కు విడుదల చేస్తున్నానని.. మూడు దశాబ్దాల కలను సాకారం చేస్తున్నానంటూ ‘ఎక్స్’ ద్వారా సీఎం చంద్రబాబు గొప్పగా అబద్ధాలు చెబుతుంటే.. ఎల్లో మీడియా తందానా అంటోంది. వాస్తవానికి వైఎస్సార్సీపీ హయాంలో రెండేళ్లు కరోనా ప్రతికూల పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వెలిగొండలో అత్యంత సంక్లిష్టమైన, ఆసియా ఖండంలోనే అత్యంత పొడవైన జంట సొరంగాల(ట్విన్ టన్నెల్స్)ను రికార్డు సమయంలో పూర్తి చేసి.. 2024 మార్చి 6న నాటి సీఎం వైఎస్ జగన్ జాతికి అంకితం చేశారు. నల్లమలసాగర్లో ముంపునకు గురయ్యే 11 గ్రామాల్లోని 7,321 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పనకు 2024 నాటికే వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాలనీలను సిద్ధం చేసింది. వన్టైమ్ సెటిల్మెంట్ కింద నిర్వాసితులకు రూ.1,301.56 కోట్లతో పునరావాసం కల్పించడానికి శ్రీకారం చుట్టింది. 96 నిర్వాసిత కుటుంబాలకు పరిహారం చెల్లించి 2024 జనవరి నాటికే పునరావాసం కల్పించింది. మిగతా 7,225 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించి.. 2024 సీజన్లో శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం 841 అడుగులకు చేరగానే సొరంగాల ద్వారా కృష్ణా జలాలను నల్లమలసాగర్కు తరలించి, దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే వైఎస్ జగన్కు పేరొస్తుందనే నిర్వాసిత కుటుంబాలకు 26 నెలలుగా పునరావాసం కల్పించకుండా.. నల్లమలసాగర్కు కృష్ణా జలాల తరలింపుపై చంద్రబాబు సర్కార్ జాప్యం చేస్తూ వచ్చిందని సాగు నీటి రంగ నిపుణులు, రైతులు, రైతు సంఘాల నేతలు ఆక్షేపిస్తున్నారు. నిర్వాసిత కుటుంబాలకు రూ.1,301.56 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ.758 కోట్లను ఇటీవల బాబు సర్కార్ చెల్లించింది. బాబు సర్కారు జాప్యం వల్ల ప్రకాశం బ్యారేజీ మీదుగా 2024–25, 2025–26లో వరుసగా 848.96 టీఎంసీలు, 1,652.12 టీఎంసీల చొప్పున కృష్ణా వరద జలాలు సముద్రంలో కలిశాయని సాగునీటి రంగ నిపుణులు గుర్తుచేస్తున్నారు. టీడీపీ హయాంలో నాసిరకంగా ఫీడర్ కెనాల్ పనులు..గత ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక ప్రకారం నిర్వాసితులకు పునరావాసం కల్పించి ఉంటే.. 2024 ఖరీఫ్ సీజన్లోనే కృష్ణా వరద జలాలను వెలిగొండ జంట సొరంగాల ద్వారా నల్లమలసాగర్కు విడుదల చేసే అవకాశం ఉండేదని రైతులు చెబుతున్నారు. జంట సొరంగాల ద్వారా నల్లమలసాగర్ను అనుసంధానం చేసే ఫీడర్ ఛానల్ పనులు 2004 నుంచి 2014 మధ్య చేయగా, మిగిలిన 5.2 కి.మీ.లలో గట్లు (ఎంబాక్మెంట్) పనులను 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వం అత్యంత నాసిరకంగా చేసింది. దీంతో 2024లో కురిసిన వర్షాలకు టీడీపీ హయాంలో పనులు చేసిన ప్రాంతాల్లో ఫీడర్ చానల్ కోతకు గురైంది. ఫలితంగా ఇప్పుడు ఫీడర్ ఛానల్ బలహీనంగా ఉన్న చోట్ల రిటైనింగ్వాల్, మిగతా చోట్ల కాంక్రీట్ లైనింగ్ పనులను రూ.456 కోట్లతో చేపట్టి.. అస్మదీయ కాంట్రాక్టర్కు అధిక ధరలకు బాబు సర్కార్ కట్టబెట్టడం గమనార్హం. ఈ వ్యవహారంలో మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో ముడుపులు వసూలు చేసుకున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి.‘కొండంత’ స్వప్నాన్ని సాకారం చేసిన మహానేత వైఎస్సార్..⇒ శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వచ్చే 45 రోజుల్లో రోజుకు 85 క్యూమెక్కులు (3,001 క్యూసెక్కులు) చొప్పున తరలించే సామర్థ్యంతో 7 మీటర్ల వ్యాసం, 18.80 కి.మీ. పొడవుతో సొరంగం తవ్వి.. వెలిగొండ కొండల్లో నిర్మించే నల్లమలసాగర్కు తరలించి.. ప్రకాశం జిల్లాలో దుర్భిక్ష ప్రాంతాలకు సాగు, తాగునీళ్లు అందించాలని 1991–93లో డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) రూపొందించారు. కానీ.. 2004 వరకు ఈ ప్రాజెక్టు పనులను ఎవరూ చేపట్టలేదు. ⇒ దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక నదీ జలాలను మళ్లించి తెలుగు నేలను సుభిక్షం చేయడానికి జలయజ్ఞం చేపట్టారు. ఈ క్రమంలో వెలిగొండ ప్రాజెక్టు డీపీఆర్ను సమూలంగా మార్చేశారు. కృష్ణా నదికి వరద రోజులు క్రమేణ తగ్గుతున్న నేపథ్యంలో.. శ్రీశైలానికి వరద వచ్చే 45 రోజుల్లోనే రోజుకు 11,584 క్యూసెక్కులు చొప్పున 43.50 టీఎంసీలను తరలించేలా జంట సొరంగాలు (మొదటిది 85 క్యూమెక్కుల సామర్థ్యం, రెండోది 243 క్యూమెక్కుల సామర్థ్యం) తవ్వి.. కొత్తగా 53.85 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే నల్లమలసాగర్లో నిల్వ చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. తద్వారా ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో వర్షాభావ ప్రాంతాల్లో 4,47,300 (తీగలేరు కెనాల్ ద్వారా 62 వేల ఎకరాలు, తూర్పు ప్రధాన కాలువ ద్వారా 3,70,800, గొట్టిపడియ కాలువ ద్వారా 9,500 ఎకరాలు) ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు.. ఆ మూడు జిల్లాల్లో 30 మండలాల్లోని 15.25 లక్షల మంది దాహార్తిని శాశ్వతంగా తీర్చాలనే లక్ష్యంతో వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 అక్టోబర్ 27న పనులకు శంకుస్థాపన చేసి శ్రీకారం చుట్టారు. ⇒ జలయజ్ఞంలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టుకు రూ.3,581.58 కోట్లు ఖర్చు చేసి.. నల్లమలసాగర్తోపాటు సొరంగాల్లో చాలా వరకు పనులు పూర్తి చేయించారు. సొరంగాలను నల్లమలసాగర్కు అనుసంధానం చేసేలా 21.8 కి.మీల పొడవున 11,585 క్యూసెక్కులను తరలించేలా ఫీడర్ ఛానల్ పనులను చేపట్టారు. తీగలేరు కెనాల్, తూర్పు, పశ్చిమ ప్రధాన కాలువ, గొట్టిపడియ కెనాల్ పనులను చేపట్టారు.ఇంజినీరింగ్ అద్భుతం.. నల్లమలసాగర్ వెలిగొండ శ్రేణుల్లో సుంకేశుల, కాకర్ల, గొట్టిపడియ వద్ద కొండల మధ్య ఖాళీ ప్రదేశాల(గ్యాప్)ను కలుపుతూ మూడు డ్యామ్లు నిర్మించడంతో నల్లమల పర్వత శ్రేణులు, వెలిగొండ కొండల మధ్య 62.40 చదరపు కిలోమీటర్ల ప్రదేశంలో 53.85 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నల్లమలసాగర్ సహజ సిద్ధంగా రూపుదిద్దుకుంది. ఇదో ఇంజినీరింగ్ అద్భుతమని సాగునీటి రంగ నిపుణులు అభివర్ణిస్తున్నారు. నల్లమలసాగర్ పనులను మహానేత వైఎస్సార్ పూర్తిచేశారు.హామీని నిలబెట్టుకున్న వైఎస్ జగన్..⇒ వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తానని తన పాదయాత్రలో వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. మాట మేరకు సీఎంగా బాధ్యతలు చేపట్టగానే వెలిగొండను పూర్తి చేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. రెండేళ్లు కరోనా మహమ్మారి ప్రభావం వల్ల పనులు చేయలేని పరిస్థితి. అయినా సరే.. మొదటి సొరంగం పనుల్లో మిగిలిన 2.883 కిలోమీటర్ల పనులను 2019 నవంబర్లో ప్రారంభించి.. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ 2021 జనవరి 13 నాటికి పూర్తి చేయించారు. ⇒ 2014–19 మధ్య టీడీపీ హయాంలో మొదటి సొరంగం రోజుకు సగటున 2.41 మీటర్ల మేర తవ్వితే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రోజుకు సగటున 4.12 మీటర్ల మేర తవ్వడం గమనార్హం. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మొదటి సారంగం ద్వారా నల్లమలసాగర్కు నీటిని విడుదల చేసే హెడ్ రెగ్యులేటర్ పనులను అదే ఏడాది (2021) పూర్తి చేయించారు. ⇒ రెండో సొరంగంలో మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని 2019 ఎన్నికలకు ముందు భారీగా పెంచేసిన చంద్రబాబు.. వాటిని అధిక ధరలకు కట్టబెట్టి ప్రజాధనాన్ని దోచి పెట్టారు. వాటిని రద్దు చేసిన వైఎస్ జగన్.. రివర్స్ టెండరింగ్ నిర్వహించి, టీడీపీ సర్కార్ అప్పగించిన ధరల కంటే రూ.61.76 కోట్లు తక్కువకు పూర్తి చేసేందుకు ముందుకొచ్చిన సంస్థకు 7.698 కిలోమీటర్ల సొరంగం పనులను అప్పగించారు. తద్వారా చంద్రబాబు అక్రమాలను ప్రజల ముందు పెట్టారు. ⇒ రెండో సొరంగంలో టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్)కు కాలం చెల్లడంతో రోజుకు ఒక మీటర్ పని జరగడం కష్టంగా మారింది. దాంతో 2022లో మనుషుల ద్వారా పనులు చేయించాలని అధికారులకు వైఎస్ జగన్ దిశా నిర్దేశం చేశారు. మొదటి సొరంగం నుంచి రెండో సొరంగంలోకి 17.8 కి.మీ, 16.555 కి.మీ, 14.5 కి.మీ, 13.5 కి.మీ, 12.5 కి.మీ వద్ద సొరంగాలను తవ్వి.. అక్కడ మనుషులతో సొరంగాన్ని తవ్వించేలా పనులు చేపట్టారు. తద్వారా రికార్డు సమయంలో 7.685 కి.మీల పొడవున సొరంగం తవ్వకం పనులను 2024 జనవరి 21 నాటికి పూర్తి చేయించారు. హెడ్ రెగ్యులేటర్ పనులు కూడా పూర్తి చేశారు. ⇒ శ్రీశైలానికి వరద వచ్చేలోగా రెండో సొరంగం నుంచి టీబీఎంను బయటకు తీయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో రెండో సొరంగం రోజుకు సగటున 1.31 మీటర్ల మేర తవ్వితే.. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రోజుకు 7.25 మీటర్లు (టీబీఎం ద్వారా 1.45, మనుషుల ద్వారా 6.80 మీటర్లు) తవ్వడం గమనార్హం. ⇒ 2014–19లో టీడీపీ సర్కార్ చేపట్టకుండా నిర్లక్ష్యం చేసిన తీగలేరు కాలువను నల్లమల సాగర్కు అనుసంధానం చేసేలా సొరంగం, హెడ్ రెగ్యులేటర్, తూర్పు ప్రధాన కాలువను నల్లమలసాగర్కు అనుసంధానం చేసేలా సొరంగం తవ్వకం పనులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించింది. శ్రీశైలంలోకి కృష్ణా వరద జలాలు వచ్చిన వెంటనే.. సొరంగాల ద్వారా నల్లమలసాగర్కు తరలించి.. ఆయకట్టుకు నీళ్లందించడానికి లైన్ క్లియర్ చేశారు. ⇒ 2019–24 మధ్య కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ.. ఆర్థిక ఇబ్బందుల్లోనూ వెలిగొండ ప్రాజెక్టుకు రూ.1,046.46 కోట్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఖర్చు చేసింది. ప్రాజెక్టు పనులకు పెట్టిన ప్రతి పైసా సద్వినియోగమయ్యేలా జాగ్రత్తలు తీసుకుని శరవేగంగా పూర్తి చేయించింది. ⇒ వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాల్లోని 4.47 లక్షల ఎకరాలకు సాగునీటి సరఫరాకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. ఆ మూడు జిల్లాల్లోని 30 మండలాల్లో 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపింది. ⇒ వెనుకబడిన ఉమ్మడి ప్రకాశం జిల్లా సమగ్రాభివృద్ధికి వైఎస్ జగన్ రూపొందించిన ప్రణాళికలో భాగంగా దొనకొండలో ఏర్పాటు చేసే మెగా ఇండస్ట్రియల్ హబ్కు 2.58 టీఎంసీలు, పామూరు నిమ్జ్ (నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుపాక్చరింగ్ జోన్)కు 1.27 టీఎంసీల సరఫరాకు లైన్ క్లియర్ చేశారు. దొనకొండ, పామూరు ప్రాంతాల్లో పారిశ్రామికాభివృది్ధకి ఊతం ఇవ్వడం ద్వారా యువతకు భారీగా ఉపాధి అవకాశాలను కల్పించేలా ప్రణాళిక రూపొందించారు.అప్పుడూ ఇప్పుడూ బాబు సర్కార్ దోపిడీ..2014–19 మధ్య జరిగిన అక్రమాలను కడిగేసిన కాగ్⇒ ఎన్టీఆర్కు 1995లో వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకున్నాక.. 1996 లోక్సభ ఎన్నికల రూపంలో ఎదురైన తొలి గండాన్ని గట్టెక్కేందుకు.. అదే ఏడాది మార్చి 5న గొట్టిపడియ వద్ద నాటి సీఎం చంద్రబాబు వెలిగొండకు హడావుడిగా శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 1996 నుంచి 2004 వరకు ఈ ప్రాజెక్టు కోసం వెచ్చించింది కేవలం రూ.పది లక్షలే. అదీ శంకుస్థాపన సందర్భంగా నిర్వహించిన సభ ఏర్పాట్లు, ఖర్చుల కోసమే వ్యయం చేశారు. అప్పట్లో చంద్రబాబు పనులు చేపట్టి ఉంటే.. తెలుగుగంగ ప్రాజెక్టుకు కేడబ్ల్యూడీటీ (కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్)–2 నీటిని కేటాయించినట్లే వెలిగొండ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు చేసి ఉండేదని సాగు నీటి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.⇒ విభజన నేపథ్యంలో 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ప్రజాధనాన్ని దోచుకోవడానికి వెలిగొండ ప్రాజెక్టును ప్రయోగశాలగా మార్చుకున్నారు. 2014 నుంచి 2019 వరకు రూ.1,414.51 కోట్లు ఖర్చు చేసినా పనుల్లో ఏమాత్రం ప్రగతి కనిపించకపోవడమే చంద్రబాబు సర్కార్ దోపిడీకి నిదర్శనం. జీవో 22 (ధరల సర్దుబాటు), జీవో 63 (పనుల పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు)ను వర్తింపజేసి కాంట్రాక్టర్లకు ఉత్తినే రూ.630.57 కోట్లు దోచిపెట్టారు. 2017 నాటికే వెలిగొండను పూర్తి చేస్తామని ప్రకటించి టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్)ల మరమ్మతుల కోసం కాంట్రాక్టర్లకు రూ.66. 44 కోట్లను ఇచ్చేసి, కమీషన్లు వసూలు చేసుకున్నారు. మరమ్మతులు చేయకపోవడం వల్ల టీబీఎంలు ఎందుకూ పనికి రాకుండా పోవడమే అందుకు నిదర్శనం. ⇒ 2017.. 2018.. 2019.. ఇలా ఎప్పటికప్పుడు వెలిగొండ పూర్తి చేస్తామంటూ హామీలు ఇస్తూ వచ్చిన చంద్రబాబు రెండో సొరంగం పనులు చేస్తున్న కాంట్రాక్టర్ను తొలగించి, మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని పెంచి.. వాటిని అధిక ధరలకు మరో కాంట్రాక్టర్కు కట్టబెట్టి, కమీషన్లు వసూలు చేసుకుని ప్రాజెక్టు పనులను గాలికి వదిలేశారు. వెలిగొండ ప్రాజెక్టులో ఈ దోపిడీని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కడిగి పారేసింది. -
‘ఏపీలో ప్రభుత్వం అనేది ఉందా?’
విశాఖపట్నం: ఏపీలో ఎక్కడ చూసినా అనిశ్చితి పరిస్థితే కనిపిస్తోందని, అసలు రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఉందా? అని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఒకవైపు రాష్ట్రంలో వర్షాలు పడటం లేదని, కరువు నెలకొందని, మరొకవైపు నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయని మండిపడ్డారు. ప్రస్తుతం మధ్యతరగతి ప్రజల పరిస్థితి చాలా దుర్భరంగా ఉన్నా, కూటమి పాలకులు చీమ కుట్టినట్లు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు(ఆదివారం) విశాఖపట్నం నుంచి మీడియాతో మాట్లాడిన బొత్స.. రాష్ట్రంలో తీవ్రమైన సంక్షోభం ఉంటే, కూటమి ప్రభుత్వం మాత్రం వ్యక్తిగత ఆరోపణలతోనే కాలక్షేపం చేస్తుందని ధ్వజమెత్తారు. ‘రాష్ట్రంలో వర్షాలు పడటం లేదు.. కరువు నెలకొంది, రోజుకు 10 సార్లు కరెంట్పోతుంది. విద్యుత్ సమస్యపై ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదు. డీఎస్సీలో పరీక్షలు రాయకుండానే ఉద్యోగాలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం డీఎస్సీ ఉద్యోగాలు అమ్ముకుంది. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. జీవోలు ఇవ్వడం.. రద్దు చేయడం ఏంటి?, గ్యాస్ రూ. 937.. మధ్య తరగతి ప్రజలు ఎలా బ్రతకాలి?, అన్నపూర్ణ లాంటి ఏపీలో కిలో బియ్యం రూ. 70 ఉందిరాష్ట్రంలో చంద్రబాబులా అందరూ డబ్బులొన్న వాళ్లు ఉండరు. ధరలు పెరిగినట్లు తలసరి ఆదాయం పెరుగుతుందా?, పంచదార కేజీ రూ. 75 ఎలా కొనాలి?, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగితే ప్రజలు ఎలా బతకాలి. రాష్ట్రంలో క్రైం పెరిగింది. హత్యలు, అత్యాచారాలు, గంజాయి ఇవే రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో వర్షాలు పడటం లేదు, కరువు నెలకొంది. పబ్లిక్ మీటింగ్ల్లో చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. టైం పాస్ చేయడానికి చంద్రబాబు అరకు రావాలా?, అసలు రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఉందా?’ అని ప్రశ్నించారు బొత్స. ఇదీ చదవండి:కూటమి సర్కార్కు జోగి రమేష్ సవాల్ -
కూటమి సర్కార్కు జోగి రమేష్ సవాల్
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: కూటమి సర్కార్ వచ్చిన దగ్గర్నుంచి తానను టార్గెట్ చేస్తూనే ఉన్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. గుంటూరులో కోట్ల విలువైన ఇరిగేషన్ భూమి విషయంలో నాపై వార్తలు రాశారు. నిస్సిగ్గుగా నాపై ఆంధ్రజ్యోతి వార్త రాసింది. ప్రభుత్వం రాగానే నా కుమారుడిపై కేసు నమోదు చేశారు. నకిలీ మద్యం కేసులో నన్ను, నా తమ్ముడిని 83 రోజులు జైల్లో పెట్టారు. నా ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడులు చేయించారు’’ అని జోగి రమేష్ ధ్వజమెత్తారు.‘‘నా కుమారుడు, నాపై పెట్టిన కేసుల్లో మా పాత్రను నిరూపించలేకపోయారు. నా కుమారుడి వ్యక్తిగత వ్యవహారాన్ని కూడా రోడ్డుకి ఈడ్చారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ప్రభుత్వాన్ని కోరుతున్నా.. గుంటూరులో ఇరిగేషన్ భూముల వ్యవహారంలో ఉన్న ప్రైవేట్ వ్యక్తి ఎవరో వాస్తవాలు వెల్లడించండి. నన్ను, నా కుటుంబాన్ని అన్ని రకాలుగా టార్గెట్ చేశారు. గుంటూరు ఇరిగేషన్ భూముల విషయంలో నాపై వచ్చిన ఆరోపణలపై విచారణకు నేను సిద్ధం. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని చంద్రబాబును కోరుతున్నా. విజిలెన్స్ విచారణ జరిపించాలని కోరుతున్నా..అక్రమ కేసులు, తప్పుడు ఆరోపణలతో నాపై బురద చల్లాలని చూస్తున్నారు. నా గొంతు నొక్కాలని చూడటం మీకు సాధ్యం కాదు. అప్పులను తీర్చుకోవడానికి నాకు ఉన్న భూములను అమ్ముకుంటున్నా.. నాకు గుంటూరు ఇరిగేషన్ భూములతో ఎలాంటి సంబంధం లేదు. నాపై మీకు కక్ష తీరకపోతే ఇంకా ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. నా భార్య బైబిల్ చదివితే తప్పేంటి? నాతో పాటు నా భార్య కూడా ఆలయాలకు వస్తుంది. మొన్ననే నేను, నా భార్య కాశీ విశ్వేశ్వరుడి వద్దకు వెళ్లొచ్చాం. మూడేళ్ల క్రితం నా ఇంట్లో జరిగిన ఛండీయాగంలో నా భార్య, నేను పాల్గొన్నాం. తప్పుడు ప్రచారాలు చేయొద్దని చంద్రబాబును కోరుతున్నా’’ అని జోగి రమేష్ పేర్కొన్నారు. -
‘అందుకే విజయసాయిరెడ్డి ఆరోపణలు’
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ నాయకత్వాన్ని, వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేసి దాడి చేస్తున్నారని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలతో తమ పార్టీలో అపోహలు రావొచ్చని.. అందుకే ఈ వివరణ అన్న సజ్జల.. కోటరీలో వైఎస్ జగన్ బందీ అయితే తక్కువ సమయంలోనే వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చేదా? అంటూ ప్రశ్నించారు. ఇవాళ (ఆదివారం) మీడియాతో మాట్లాడిన సజ్జల.. వైఎస్ జగన్పై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.‘‘పార్టీకి సుదీర్ఘకాలం నాయకత్వం వహించే సత్తా ఉన్న నేత వైఎస్ జగన్ ఒక్కరే. పేదల జీవితాల్లో వైఎస్ జగన్ మార్పు తీసుకొచ్చారు. పార్టీని వీడిన వారిపై మేము ఎప్పుడూ పెద్దగా విమర్శలు చేయలేదు. విజయసాయిరెడ్డి సొంత కారణాలతో పార్టీ నుంచి బయటకు వెళ్లారు. వైఎస్ జగన్పై దాడి చేసేందుకు కొత్త పాత్రలు తెరపైకి వస్తుంటూనే ఉంటారు. అలానే ఇప్పుడు విజయసాయిరెడ్డి అనే పాత్ర తెరపైకి వచ్చింది. వైఎస్ జగన్పై సాయిరెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజల దృష్టి తన మీద పడాలనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. వైఎస్ జగన్ అన్ని మతాలపట్ల సమాన గౌరవం చూపిస్తారు’’ అని సజ్జల పేర్కొన్నారు.వైఎస్ జగన్పై విమర్శలు చేస్తే పబ్లిసిటీ వస్తుందని విజయసాయిరెడ్డి అనుకుంటున్నారు. వైఎస్ జగన్ చుట్టూ కోటరీ ఉందని అసత్య ప్రచారం చేస్తున్నారు. ప్రజల్ని తప్పుదారి పట్టించేలా విష ప్రచారం చేస్తున్నారు. పార్టీలో వైఎస్ జగన్ ఒక్కరే నాయకుడు.. మేమంతా కార్యకర్తలం. వైఎస్ జగన్పై ఎవరైనా విమర్శలు చేస్తే ఎల్లో మీడియా పండగ చేసుకుంటుంది. వైఎస్ జగన్.. విజయసాయిరెడ్డికి ఎంతో గౌరవం ఇచ్చారు. విజయసాయిరెడ్డిని ఆయన ఉన్నత స్థానంలో కూర్చొబెట్టారు’’ అని సజ్జల వివరించారు.‘‘గతంలో వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశానని విజయసాయిరెడ్డి అన్నారు. రాజీనామా సమయంలో ఎవరితోనూ సమస్యలు లేవని చెప్పారు. ఎంపీగా, జాతీయ కార్యదర్శిగా ఇలా ఎన్నో పదవులు పార్టీ ఇచ్చింది. వైఎస్సార్సీపీలో విజయసాయిరెడ్డికి వచ్చినన్ని పదవులు ఎవరికి రాలేదు’’ అని సజ్జల పేర్కొన్నారు.ఇదీ చదవండి: అంబటి రాంబాబుకు వైఎస్ జగన్ పరామర్శ ‘‘వైఎస్సార్సీపీకి కర్త, కర్మ, క్రియ ఒక్క వైఎస్ జగనే. పార్టీలో నంబర్ వన్, నంబర్ టూ అనే ప్రశ్నే లేదు. వైఎస్ జగన్ నంబర్ టూ, సజ్జల నంబర్ వన్ అన్న విజయసాయిరెడ్డి వ్యాఖ్య అత్యంత అన్యాయం. వైఎస్ జగన్ లేని వైఎస్సార్సీపీకి అర్థమే లేదు. విజయసాయిరెడ్డిని పార్టీలో వెనక్కి లాగారన్న ఆరోపణకు ఆయనకు వచ్చిన పదవులే సమాధానం. రాజ్యసభ సభ్యత్వం, జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, ఉత్తరాంధ్ర సమన్వయకర్త, అనుబంధ విభాగాల ఇన్చార్జ్ వంటి అత్యంత కీలక బాధ్యతలు ఆయనకే దక్కాయి. 2020 నుంచే తనను తగ్గించారని విజయసాయిరెడ్డి ఇప్పుడు చెబుతున్నారు. అలా అయితే 2022లో రెండోసారి రాజ్యసభకు ఎందుకు పంపారు?..పార్టీ నుంచి వెళ్లినప్పుడు ‘వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నాను. ఎవరిపైనా కోపం లేదు, సజ్జల వల్ల రాజీనామా చేయలేదు’ అని చెప్పిన విజయసాయిరెడ్డి ఇప్పుడు అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్ మతమార్పిడులను ప్రోత్సహించారన్న విజయసాయిరెడ్డి ఆరోపణ దారుణం. వైఎస్ కుటుంబం అన్ని మతాలను ఎలా గౌరవించిందో దశాబ్దాలుగా దగ్గరగా ఉన్న విజయసాయిరెడ్డికి బాగా తెలుసు. సాయిరెడ్డిపై వైఎస్ జగన్కు ప్రత్యేకమైన అభిమానం, విశ్వాసం ఉండేది. తప్పుడు కేసుల్లో తనతో పాటు ఇబ్బందులు పడ్డారన్న భావనతో అత్యున్నత స్థాయి అవకాశాలు, బాధ్యతలు ఇచ్చారు...రాజకీయ పార్టీ పెట్టుకోవాలంటే విజయసాయిరెడ్డి స్వేచ్ఛగా పెట్టుకోవచ్చు. కానీ కొత్త రాజకీయ ప్రయాణానికి ప్రచారం కోసం వైఎస్ జగన్ను, వైఎస్సార్సీపీని టార్గెట్ చేయడం సరికాదు. ఇదే ధోరణి కొనసాగితే సమాధానం కూడా అంతే ఘాటుగా ఉంటుంది. 2024 ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలినా వైఎస్సార్సీపీ సంస్థాగతంగా మళ్లీ పుంజుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలకైనా, 2029 సాధారణ ఎన్నికలకైనా, అంతకంటే ముందే ఎన్నికలు వచ్చినా పార్టీ సిద్ధం. వైఎస్సార్సీపీ ఎన్నికలకు భయపడటం లేదు. డెడ్, అబ్సెంట్, ఘోస్ట్ ఓట్లను తొలగించి ఓటర్ల జాబితా శుద్ధి చేసిన తర్వాత ఎన్నికలు జరపాలన్నదే పార్టీ డిమాండ్...వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి వైఎస్ జగన్ నాయకత్వం, వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేయడమే రాజకీయ ప్రత్యర్థుల ప్రధాన అజెండాగా మారింది. ప్రజల సమస్యలపై చర్చ జరగకుండా వైఎస్ జగన్ చుట్టూ వివాదాలు సృష్టించి అసలు అజెండాను పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర అనుకూల మీడియాతో పాటు సోషల్ మీడియాలోని ఫేక్ ఫ్యాక్టరీల ద్వారా జగన్పై నిరంతర విషప్రచారం జరుగుతోంది. ప్రజా సమస్యలు చర్చకు వస్తే చంద్రబాబు ప్రభుత్వానికి మైనస్ మార్కులే వస్తాయి. అందుకే వ్యక్తిగత వివాదాలను ముందుకు తెస్తున్నారు...వైఎస్ జగన్ను ఎవరో ఒక ‘కోటరీ’ నడిపిస్తోందన్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. ఎలాంటి పొత్తులు లేకుండా పార్టీని నిర్మించి, రికార్డు మెజారిటీతో అధికారంలోకి తీసుకువచ్చిన నాయకుడిని ఎవరో వెనక నుంచి నడిపిస్తున్నారనడం హాస్యాస్పదం. 2019లో భారీ విజయం, అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన చారిత్రక ఫలితాలు వైఎస్ జగన్ నాయకత్వ సామర్థ్యానికి నిదర్శనం. సంక్షేమం, అభివృద్ధి, పేదల జీవితాల్లో సమూల మార్పు అనే అజెండాతోనే వైఎస్సార్సీపీ పుట్టింది. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల సమస్యలు, సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి అనే అజెండాలో వైఎస్సార్సీపీకి మార్పు లేదు...వైఎస్ జగన్ ఇచ్చిన మాట, మేనిఫెస్టో, ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో రాజీ పడని నాయకత్వం. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు తొలుత కావాలనే స్పందించలేదు. ఆయన సృష్టించాలనుకున్న అజెండాలో పార్టీ పడకూడదన్నదే ఉద్దేశం. వైఎస్ జగన్పై విమర్శలు చేస్తే కొన్ని మీడియా సంస్థల్లో భారీ ప్రచారం వస్తుందనే పరిస్థితి ఏర్పడింది. వరుస ఆరోపణలతో పార్టీ కార్యకర్తల్లో కూడా అపోహలు వచ్చే పరిస్థితి రావడంతో స్పందించాల్సి వచ్చింది. విజయసాయిరెడ్డికి పార్టీలో అన్యాయం జరిగిందన్న వాదనకు వాస్తవాలు సరిపోవు. వైఎస్ జగన్ తర్వాత అత్యంత కీలక పదవులు, బాధ్యతలు పొందినవారిలో విజయసాయిరెడ్డి ముందువరుసలో ఉన్నారు. 2016లో రాజ్యసభ సభ్యత్వం, 2017లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యత...వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకత్వం వంటి అత్యంత కీలకమైన బాధ్యత కూడా విజయసాయిరెడ్డికే. ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా క్యాబినెట్ స్థాయి హోదా కూడా విజయసాయిరెడ్డికే. 2020–22 మధ్య ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ సమన్వయకర్తగా బాధ్యత. పార్టీ అనుబంధ విభాగాల ఇన్చార్జ్గా కూడా కీలక బాధ్యత. 2022లో రెండోసారి రాజ్యసభ సభ్యత్వం. ఇన్ని అవకాశాలు పొందిన తర్వాత ‘నన్ను ఎదగనివ్వలేదు, వెనక్కి లాగారు’ అనడం వాస్తవాలకు విరుద్ధం. విజయసాయిరెడ్డికి ఇచ్చిన ప్రాధాన్యంపై పార్టీలో ఇతరులు ఎప్పుడూ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. తప్పుడు కేసుల్లో వైఎస్ జగన్తో పాటు ఇబ్బందులు ఎదుర్కొన్నారన్న సానుభూతి కూడా విజయసాయిరెడ్డిపై జగన్కు ఉండేది...వైఎస్ జగన్ ఇచ్చిన ప్రత్యేక ప్రాధాన్యాన్ని తన వ్యక్తిగత ప్రతిభ వల్లే వచ్చిందని విజయసాయిరెడ్డి భావించి ఉండవచ్చు. పార్టీ నుంచి వెళ్లినప్పుడు చెప్పిన కారణాలకు, ఇప్పుడు చెబుతున్న కారణాలకు పొంతన లేదు. ‘సజ్జల వల్ల నేను పార్టీని వీడాను’ అన్న మాట విజయసాయిరెడ్డి రాజీనామా సమయంలో ఎక్కడా చెప్పలేదు. తన ఎదుగుదలను ఎవరూ అడ్డుకోలేరని గతంలో విజయసాయిరెడ్డే ప్రకటించారు. వైఎస్సార్సీపీలో ఒకే ఒక్క నాయకుడు వైఎస్ జగన్. మిగిలిన వారందరూ కార్యకర్తలే. వైఎస్ జగన్ను నంబర్ టూగా చూపించి మరొకరిని నంబర్ వన్గా ప్రచారం చేయడం రాజకీయ దురుద్దేశం. పార్టీ ఆవిర్భావం నుంచి విధానాలు, రాజకీయ నిర్ణయాలు, ఎన్నికల వ్యూహం అన్నింటిలో జగన్కే పూర్తి స్పష్టత...ఒక వ్యక్తి ఆలోచన, నిబద్ధత, ప్రజా అజెండా చుట్టూ రూపుదిద్దుకున్న పార్టీ వైఎస్సార్సీపీ. వైఎస్ జగన్ నాయకత్వం లేకుండా వైయస్సార్సీపీ అనే రాజకీయ వ్యవస్థకు అర్థమే లేదు. వైఎస్ జగన్ మతమార్పిడులను ప్రోత్సహించారన్న ఆరోపణ అత్యంత దారుణం. వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్ అన్ని మతాల పట్ల గౌరవంతో వ్యవహరించిన విషయం విజయసాయిరెడ్డికి ప్రత్యక్షంగా తెలుసు. వైఎస్ హయాంలోనే తిరుమలలో అన్యమతస్తుల ఉద్యోగాల అంశంపై చర్యలు తీసుకున్నారు. నలభై ఏళ్లుగా వైఎస్ కుటుంబంతో పరిచయం ఉందని చెప్పుకునే వ్యక్తే ఇప్పుడు మతమార్పిడుల ఆరోపణ చేయడం అన్యాయం. నిజంగా వైఎస్ కుటుంబానికి మతమార్పిడుల అజెండా ఉంటే దశాబ్దాలుగా అత్యంత దగ్గరగా ఉన్న విజయసాయిరెడ్డికే మతమార్పిడి జరిగి ఉండేదిగా ..కొత్త రాజకీయ పార్టీ పెట్టుకోవడం విజయసాయిరెడ్డి ఇష్టం; ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఆ హక్కు ఉంది. కొత్త పార్టీకి మీడియా స్పేస్ కోసం జగన్ను తిట్టడం రాజకీయ విధానం కాకూడదు. వైఎస్ జగన్పై విమర్శలు చేస్తే ఫుల్పేజీలు, బ్యానర్ హెడ్డింగులు వస్తాయనే ఉద్దేశంతో రాజకీయాలు చేయడం సరికాదు. టీడీపీ అనుకూల మీడియాకు పనిముట్టుగా మారి వైఎస్సార్సీపీపై నిరంతరం దాడి చేస్తే ఇక మౌనంగా ఉండే పరిస్థితి ఉండదు. ఇప్పటివరకు ‘మన సాయిరెడ్డి’ అనే భావనతో సంయమనం పాటించాం.. ఇదే ధోరణి కొనసాగితే రాజకీయంగా వేరే విధంగా ట్రీట్ చేయాల్సి వస్తుంది...విజయసాయిరెడ్డి ఆరోపణల వల్ల వైఎస్ జగన్ రాజకీయ స్థాయి గానీ, వైఎస్సార్సీపీ బలం గానీ తగ్గవు. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్సార్సీపీ బలహీనపడలేదు; సంస్థాగతంగా తిరిగి పుంజుకుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పూర్తి సన్నద్ధత. 2029 ఎన్నికలకు పూర్తి సన్నద్ధత. అంతకంటే ముందే సాధారణ ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధం. ఎన్నికలకు భయపడి కోర్టుకు వెళ్లారన్న ప్రచారం అవాస్తవం. ఓటర్ల జాబితాలో డెడ్, అబ్సెంట్, లేని ఓటర్లను గుర్తించి తొలగించే ప్రక్రియ పూర్తిచేయాలన్నదే డిమాండ్. లేని ఓట్లతో ఎన్నికలు నిర్వహించడం ప్రజాస్వామ్యం కాదు. ఓటర్ల జాబితా శుద్ధి చేసి ఎన్నికలకు వెళ్లాలన్నది న్యాయమైన డిమాండ్...సజ్జల పాత్రపై వచ్చిన ఆరోపణలకు డైరెక్ట్ సమాధానం. పదవులు, హోదాలు వ్యక్తిగత కిరీటాలు కాదు; పార్టీ అప్పగించిన బాధ్యతలు మాత్రమే. వైఎస్ జగన్ విజన్కు అనుగుణంగా పనిచేసే అవకాశం రావడమే ముఖ్యమైనది. జర్నలిజం నుంచి రాజకీయాల్లోకి రావడం ముందుగా వేసుకున్న ప్రణాళిక కాదు. వైఎస్ మరణం తర్వాత ఏర్పడిన రాజకీయ పరిణామాల్లో వైఎస్ జగన్తో కలిసి సాగిన ప్రయాణం నాది. 2014 వరకు సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్గా పనిచేసి, అనంతరం పూర్తిస్థాయిలో రాజకీయ బాధ్యతల్లోకి ప్రవేశించా..క్షేత్రస్థాయిలో ప్రజలతో నేరుగా పనిచేసే నాయకులు, కార్యకర్తలకే మరింత గౌరవం, ప్రాధాన్యం ఇవ్వాలన్నది వైఖరి. ఢిల్లీలో పార్టీ వ్యవహారాలు చూసేవారికి అవసరమైన ప్రాధాన్యం, రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పనిచేసేవారికి వారి పాత్రకు తగిన ప్రాధాన్యం.. ఇదంతా టీమ్వర్క్. టీడీపీతో సంబంధాలు ఉన్నందుకే సజ్జలపై కేసులు లేవన్న విజయసాయిరెడ్డి ఆరోపణకు అర్థం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం జగన్పై కేసులు పెట్టిన సమయంలో విజయసాయిరెడ్డి రాజకీయాల్లోనే లేరు. ఆ సమయంలో నేను సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్గా ఉన్నాను..ఒక పార్టీలో ఉన్న వ్యక్తి మరో పార్టీతో ఒప్పందం చేసుకుని తనపై కేసులు రాకుండా చేసుకోగలడన్న వాదన అసంబద్ధం. విజయసాయిరెడ్డి చేస్తున్న తాజా ఆరోపణలు ఆయన రాజకీయంగా ఎటువైపు వెళ్తున్నారో వెల్లడిస్తున్నాయి. భౌతిక దాడి జరిగిందని నిజంగా భావిస్తే విజయసాయిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. 74 సార్లు అవమానించారని, దాడి జరిగిందని ఆరోపణలు చేస్తే వాటికి సంబంధించిన వివరాలను అధికారికంగా బయటపెట్టాలి. ప్రస్తుత ‘రెడ్బుక్’ పాలనలో పాత ఫిర్యాదులపైనా కేసులు పెడుతున్న పరిస్థితి ఉంది. విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం వెంటనే స్పందించే అవకాశం ఉంది’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. -
మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుపై అక్రమ కేసు
సాక్షి, శ్రీకాకుళం: మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావుపై శ్రీకాకుళం రూరల్ పోలీస్టేషన్లో అక్రమ కేసు నమోదు చేశారు. రూరల్ ఎస్ఐ సురేష్ ఇచ్చిన వివరాలు మేరకు.. కుందువానిపేట గ్రామంలో మత్స్యకారులకు గత ప్రభుత్వ హయాంలో మంజూరైన ఇంటిని ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో ఈ ఏడాది మే నెల 14వ తేదీన గృహప్రవేశం చేసినందుకు హౌసింగ్ పీడీ వీవీ సత్యాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పేద మత్స్యకారుల కోసమే మా పోరాటం: ధర్మాన అర్హులైన పేద మత్స్యకారులు వైపే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోందని ధర్మాన ప్రసాదరా వు వివరణ ఇచ్చారు. పేదలకు ఇచ్చిన ఇళ్లను కొంతమంది తెలుగుదేశం బ్రోకర్లు అమ్ముకోవాలని చూస్తే ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. అర్హులైన మత్స్యకారులకు ఇల్లు ఇవ్వకుండా, వారి నోట్లో మట్టి కొట్టేందుకు కొంతమంది టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఎలాంటి కేసులు నమోదు చేసినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అమాయకులైన మత్స్యకారుల వైపే ఉంటుందని భరోసా ఇచ్చారు.అర్హులైన మత్స్యకారులకు ఇల్లు ఇవ్వడంలో ఎలాంటి తప్పిదం లేదని హైకోర్టు కూడా ఇటీవల తీర్పు ఇచ్చినప్పటికీ ఆ విషయం కొంతమంది నాయకులు తెలుసుకోకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. ఇలాంటి కేసుల్లో మితిమీరి జోక్యం చేసుకున్న అధికారులు రానున్న రోజుల్లో కోర్టు ధిక్కారణ కింద నిలబడాల్సి వస్తుందని తెలిపారు. -
‘పంచదార్ల’ను వదలని మైనింగ్ మాఫియా
సాక్షి, అనకాపల్లి: పవిత్ర పంచదార్ల కొండపై అక్రమ మైనింగ్ ఆగడం లేదు. ప్రభుత్వం జీవో జారీ చేసి 48 గంటలు కూడా గడవక ముందే అక్రమార్కులు మళ్లీ భారీ యంత్రాలతో తవ్వకాలు ప్రారంభించారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామంలోని శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రమైన పంచదార్ల కొండపై రెండు నెలలుగా కూటమి నేతలు అక్రమ తవ్వకాలకు పాల్పడడం.. దీనిపై గ్రామస్తుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవ్వడం తెలిసిందే. ఈ దందాపై ‘సాక్షి’ వరుస కథనాలు ఇవ్వడం.. వైఎస్సార్సీపీ ఢిల్లీ దాకా ఉద్యమించడంతో ప్రభుత్వం దిగొచ్చింది. ఈ నెల 27న పంచదార్ల కొండను ‘నో మైనింగ్ జోన్’గా ప్రకటిస్తూ జీవో 226 జారీ చేసింది.అయితే, ప్రభుత్వం ఇచ్చిన జీవోను సైతం అక్రమార్కులు లెక్కచేయడం లేదు. జీవో వచ్చిన రెండు రోజుల్లోనే, స్థానిక బీజేపీ ఎంపీ సీఎం రమేష్ బంధువు మైనింగ్ చేస్తున్న ప్రాంతానికి పక్కనే శనివారం మళ్లీ అక్రమ తవ్వకాలు మొదలుపెట్టినట్లు స్థానిక ప్రజలు వెల్లడించారు. ఈ విషయం అధికారులకు తెలిసినా, ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి ముసుగులో, పారిశ్రామిక పార్కు పేరుతో మైనింగ్ శాఖ కనీస అనుమతులు కూడా లేకుండా రెండు నెలలుగా రాత్రి, పగలు తేడా లేకుండా 3 నుంచి 4 లక్షల క్యూబిక్ మీటర్ల మేర గ్రావెల్ను తవ్వేశారు. ప్రశ్నించిన వారిని లారీలతో తొక్కిస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ తతంగంపై సాక్షి, వైఎస్సార్సీపీ పోరాటంతో ప్రభుత్వం దిగొచ్చి జీవో జారీ చేసినా, స్థానిక మాఫియా దానిని ఏ మాత్రం ఖాతరు చేయక పోవడం గమనార్హం. దీనిపై జిల్లా కలెక్టర్, రెవెన్యూ, మైనింగ్, విజిలెన్స్, పోలీసు శాఖ అధికారులు తక్షణం స్పందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
Putta Shiva Shankar : బాబు ఉంటే బతుకు ఇంతే
-
అవినీతికి బ్రాండ్ అంబాసిడర్.. చంద్రబాబు
-
అవమానించిన ఒక్కొక్కరికి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి.. జగనన్న 2.0 మీ ఊహకే వదిలేస్తున్న
-
ఆరు వేలు ఎందుకు రెండు వేలు ఇళ్ళు చూపించు నీవు ఏది చెప్తే అది చేస్తా...
-
కొడుకు, అల్లుడి రాజకీయ రంగ ప్రవేశం.. రాచమల్లు కామెంట్స్
-
రైతులను ముంచడమే చంద్రబాబు ఉద్దేశమా?: కాకాణి
సాక్షి, నెల్లూరు జిల్లా: శ్రీశైలం ప్రాజెక్టులో నీటిని ఉపయోగించుకోవడంలో కూటమి పూర్తి స్థాయిలో విఫలం అయిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. శ్రీశైలంలో నుంచి సోమశిల, కండలేడు జలాశయాలకు ఎందుకు విడుదల చేయడం లేదు? అంటూ ప్రశ్నించారు.పోతిరెడ్డిపాడు హెడ్ రెగులేటర్ను ఉపయోగించి వెంటనే ఎందుకు నీరు వినియోగించడం లేదు. నెల్లూరు, రాయలసీమ రైతులను నిట్టనిలువుగా ముంచడమే చంద్రబాబు ఉద్దేశమా?. నెల్లూరులో జలాశయాలు అడుగంటి పోయే పరిస్థితి ఏర్పడింది. 71 శాతం వరకు పుష్కలమైన నీరు శ్రీశైలంలో వున్న నీటిని వినియోగించుకోకపోవడంలో మీ దురుద్దేశం ఏంటి? అంటూ కాకాణి నిలదీశారు.‘‘మరో వైపు తెలంగాణ శ్రీశైలం నీటి ఎడాపెడా దోచుకుంటున్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఏపీ రైతుల జీవితాలను తాకట్టు పెడుతున్నాడా..?. నీటి యాజమాన్య పద్దతులను ఏనాడు పాటించిన పాపాన పోలేదు. మొదటి పంటకే నీరు కరువైంది. నెల్లూరు జిల్లా రైతాంగం ఆందోళన చేపట్టే పరిస్థితులు తలెత్తాయి’ అని కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: అలిగి వెళ్లిపోయిన దానం నాగేందర్ -
వైఎస్సార్సీపీ పోరాటంతో దిగొచ్చిన కూటమి సర్కార్
సాక్షి, అల్లూరి జిల్లా: విద్యార్థుల తల్లిదండ్రులు, వైఎస్సార్సీపీ పోరాటంతో కూటమి ప్రభుత్వం దిగొచ్చింది. మారికవలస గురుకుల పాఠశాలను యథాతధంగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది మారికవలస గురుకుల పాఠశాలను యథాతధంగా కొనసాగించాలని.. లేదంటే నేడు సీఎం చంద్రబాబు అరకు పర్యటనను అడ్డుకుంటామని విద్యార్థుల తల్లిదండ్రులు, వైఎస్సారర్సీపీ హెచ్చరించింది. తల్లిదండ్రులు, వైఎస్సార్సీపీ పోరాటంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మారికవలస స్కూల్ యథాతదంగా కొనసాగించాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది.విద్యార్థులు తల్లిదండ్రులకు హామీ ఇచ్చిన అధికారులు.. అల్లూరి జిల్లా నుంచి మారికవలసకు బస్సుల్లో విద్యార్థలను తరలించారు. మారికవలస స్కూల్ యథావిధిగా కొనసాగించాలని గత కొన్ని రోజులుగా విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. విద్యార్థులు తల్లిదండ్రుల పోరాటానికి వైఎస్సార్సీపీ అండగా నిలిచింది.వైఎస్ జగన్ హెచ్చరికలతో..అమరావతి: పంటల బీమా పథకం ద్వారా పెండింగ్లో ఉన్న రాష్ట్ర వాటా ప్రీమియం సబ్సిడీ చెల్లింపులపై రాష్ట్ర ప్రభుత్వంలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరికలతో సర్కారు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై) ద్వారా పెండింగ్ ప్రీమియం బకాయిలు రూ.500 కోట్లు విడుదలకు పరిపాలనా అనుమతి మంజూరు చేస్తూ శుక్రవారం వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్ జీవోఆర్టీ నంబర్ 821ను జారీ చేశారు.ఇదీ చదవండి: సంక్షోభంలో కృష్ణా బేసిన్కరువు కాటేస్తున్నవేళ చంద్రబాబు ప్రభుత్వం రైతులను ఏమాత్రం పట్టించు కోకుండా కుంభకర్ణుడి నిద్రలో ఉందంటూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం విలేకరుల సమావేశంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కారు ఆఘమేఘాల మీద పెండింగ్ ప్రీమియం బకాయిల కోసం నిధులు విడుదల చేయడం చర్చనీయాంశమైంది. -
తెలుగు భాషా దినోత్సవం.. వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ.. వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.‘‘వాడుక తెలుగుకు కొత్త వెలుగునిచ్చిన విశిష్ట భాషావేత్త గిడుగు వెంకట రామమూర్తి పంతులు. ప్రజలు మాట్లాడే భాషకు విద్యా, సాహిత్య రంగాల్లో.. సముచిత స్థానం కల్పించేందుకు కృషి చేసిన ఆ మహనీయుని భాషా సేవలు తరతరాలకు స్ఫూర్తి. గిడుగు గారి జయంతిని పురస్కరించుకుని నేడు నిర్వహించుకుంటున్న తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.వాడుక తెలుగుకు కొత్త వెలుగునిచ్చిన విశిష్ట భాషావేత్త గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారు. ప్రజలు మాట్లాడే భాషకు విద్యా, సాహిత్య రంగాల్లో సముచిత స్థానం కల్పించేందుకు కృషి చేసిన ఆ మహనీయుని భాషా సేవలు తరతరాలకు స్ఫూర్తి. గిడుగు గారి జయంతిని పురస్కరించుకుని నేడు నిర్వహించుకుంటున్న… pic.twitter.com/tTKbMnguS0— YS Jagan Mohan Reddy (@ysjagan) August 29, 2026 -
తాగడానికి నీళ్లు లేవు కానీ.. డ్రగ్స్ మాత్రం విచ్చలవిడిగా దొరుకుతున్నాయి
-
సాగునీరు ఇచ్చేవరకు ఉద్యమం
ఉరవకొండ: కరువు పీడిత అనంతపురం జిల్లాలో హెచ్చెల్సీ, జీబీసీ, హెచ్ఎన్ఎస్ఎస్ ఆయకట్టు భూములకు సాగునీరు ఇచ్చే వరకు ఉద్యమిస్తామని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, ఉరవకొండ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం పెద్దఎత్తున తరలివచ్చిన ఆయకట్టు రైతులు, పార్టీ శ్రేణులతో కలిసి ఉరవకొండ మండలం చిన్నముసూ్టరు గ్రామ సమీపంలోని 42వ జాతీయ రహదారి (అనంతపురం–బళ్లారి)ని దిగ్బంధం చేశారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఖరీఫ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందన్నారు. తుంగభద్ర, శ్రీశైలం జలాశయాల్లో నీరు ఉన్నా హెచ్చెల్సీ, హంద్రీ–నీవా ద్వారా ఆయకట్టుకు ఎందుకు ఇవ్వడం లేదని చంద్రబాబును ప్రశ్నించారు. పొరుగున ఉన్న కర్ణాటకలో 90 రోజుల పాటు సాగునీరు విడుదల చేస్తుండగా, మన రాష్ట్రంలో ఒక్క ఎకరాకు కూడా హెచ్చెల్సీ ద్వారా నీరు ఇవ్వడం లేదన్నారు.జిల్లా ప్రజల తాగునీటి అవసరాలకు 10 టీఎంసీలు సరిపోతాయని, మిగిలిన వాటా నీటిని ఆయకట్టుకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వం రేవంత్రెడ్డికి అమ్ముడుబోయి శ్రీశైలం నీటిని దిగువకు వదిలేస్తోందన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు. -
పేదల ఇళ్లు కూల్చివేతపై తోట త్రిమూర్తులు ఫైర్
మండపేట(తూ.గో. జిల్లా): మండపేటలో పేదల ఇళ్లు కూల్చివేతపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మండిపడ్డారు. పుష్కరాల పేరుతో పేదల ఇళ్లను కూల్చివేయడం దారుణమన్నారు. పొలాలను లే అవుట్లుగా మార్చే ఉద్దశంతోనే పేదల ఇళ్లను రాత్రికి రాత్రే తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేదల ఇళ్లను ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు సహకారంతో కూల్చేసిన విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు.పుష్కరాల పేరుతో పేదలకు నిలువు నీడ లేకుండా చేశారు. మూడు పుష్కరాల నుంచి ఉంటున్న వారిని అక్కడ నుండి తొలగించాల్సిన అవసరం ఏమి వచ్చిందో చెప్పాలి?, అది కూడా 200 మంది పోలీసులతో అర్ధరాత్రి రెండు, మూడు గంటలకు వచ్చి తొలగించాల్సిన అవసరం ఏముంది. అదే పని పట్టపగలు ఎందుకు చేయలేదు.మండపేటలో నేనేదో అరాచకాలు చేస్తున్నట్లు చెప్పడం సిగ్గుచేటు. అభివృద్ధిని నేను అడ్డుకుంటున్నానని చెప్పడం హాస్యాస్పదం. గతంలోఆస్తులు గురించి సవాల్ విసిరారు. ఇప్పటికీ నేను కట్టుబడి ఉన్నాను... ఎక్కడైనా చర్చకు సిద్ధం’ అని సవాల్ విసిరారు.‘కొండపల్లి మున్సిపాలిటీపై వైఎస్సార్సీపీ జెండా ఎగురవేయాలి’ -
‘కొండపల్లి మున్సిపాలిటీపై వైఎస్సార్సీపీ జెండా ఎగురవేయాలి’
విజయవాడ: కొండపల్లి మున్సిపాలిటీపై వైఎస్సార్సీపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలని మాజీ మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు. మున్సిపాలిటీ ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉందని, ఇప్పట్నుంచీ వైఎస్సార్సీపీ విజయం కోసం కృషి చేయాలన్నారు. ఈరోజు(శుక్రవారం, ఆగస్టు 28వ తేదీ) జోగి రమేష్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. దీనిలో భాగంగా జోగి రమేష్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ చేసిన అభివృద్ధిని ప్రతీ గడపకు తీసుకెళ్లాలన్నారు. కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్లలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటుందన్నారు. ‘మున్సిపల్ ఎన్నికలకు రెండు నెలల సమయం మాత్రమే ఉంది. జగన్ చేసిన అభివృద్ధిని ప్రతీ గడపకు తీసుకెళ్లాలి. కొండపల్లి మున్సిపాలిటీలో 40 వార్డులను గెలిచితీరుతాం. కొండపల్లి మున్సిపాలిటీ వైఎస్సార్సీపీ జెండా ఎగురవేయాలి. సమన్వయ కమిటీ ఆధ్వర్యంలోనే అభ్యర్ధుల ఎంపిక జరుగుతుంది. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుంది. కొండపల్లి మున్సిపాలిటీలో విజయాన్ని సాధించి జగనన్నకు కానుకగా ఇవ్వాలి’ అని పార్టీ శ్రేణులకు సూచించారు. ఇదీ చదవండి: ‘చంద్రబాబు చేసిందేమైనా ఉంటే ఆధారాలతో చూపించగలరా?’ -
ప్రశ్నించినందుకు TDP ఆఫీస్ కు లాక్కెళ్లి కొట్టారు..
-
అభివృద్ధి పేరుతో పేదల పొట్ట కొట్టడం కరెక్ట్ కాదు
-
పార్టీ మారతారు అని తెలిసినా... ఆ రోజు ఇచ్చిన మాట కోసం.. అనిల్ కుమార్ కీలక వ్యాఖ్యలు
-
అక్కాచెల్లెమ్మలకు వైఎస్ జగన్ రాఖీ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: దేశవ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్కాచెల్లెమ్మలకు శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. మీ ప్రేమాభిమానాలే నా బలం, నాకు కొండంత ధైర్యం. మీ సోదరుడిగా నాపై మీరు చూపుతున్న ఆప్యాయతకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. ఈ రాఖీ పౌర్ణమి మీ అందరి జీవితాల్లో ఆనందాలు, ప్రేమానుబంధాలు, ఆయురారోగ్యాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా అక్కచెల్లెమ్మలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అంటూ ఈ ఉదయం ఓ ట్వీట్ చేశారాయన.మీ ప్రేమాభిమానాలే నా బలం, నాకు కొండంత ధైర్యం. మీ సోదరుడిగా నాపై మీరు చూపుతున్న ఆప్యాయతకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. ఈ రాఖీ పౌర్ణమి మీ అందరి జీవితాల్లో ఆనందాలు, ప్రేమానుబంధాలు, ఆయురారోగ్యాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా అక్కచెల్లెమ్మలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.— YS Jagan Mohan Reddy (@ysjagan) August 28, 2026అంతకు ముందు.. నిన్నటి రాఖీ సందేశంలో ‘ప్రతి అక్కకు, చెల్లెమ్మకు, ప్రతి చిన్నారికి రక్షాబంధన్ శుభాకాంక్షలు. రక్షాబంధనం.. ఆత్మీయత, అనురాగాల పండుగ. అక్కాచెల్లెమ్మలకు ఎల్లప్పుడూ మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నా. ప్రతి అక్క, చెల్లెమ్మకు దేవుడి ఆశీస్సులు, చల్లని దీవెనలు ఎల్లకాలం లభించాలి’ అని వైఎస్ జగన్ అన్నారు. రక్షాబంధన్ సందర్భంగా కుటుంబాల్లో సంతోషం, ప్రేమ, ఆప్యాయతలు వెల్లివిరియాలని.. ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి నెలకొనాలని ఆయన కోరుకున్నారు.క్లిక్ చేయండి: రక్షాబంధన్: జగనన్నకు రాఖీ కట్టిన వైఎస్సార్సీపీ నేతలు -
ఎంపీగానా.. ఎమ్మెల్యే గానా..? 2029 ఎన్నికల్లో పోటీపై అనిల్ కుమార్ యాదవ్ క్లారిటీ
-
పంచదార్ల కొండపై వైఎస్సార్సీపీ పోరాటానికి దిగొచ్చిన ప్రభుత్వం
విజయవాడ: వైఎస్సార్సీపీ పోరాటంతో ప్రభుత్వం దొగొచ్చింది. పంచదార్ల కొండను నో మైనింగ్ జోన్గా ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. 153 హెక్టార్ల పరిధిని నో మైనింగ్ జోన్గా ప్రకటించింది. పంచదార్ల కొండను కూటమి నేతలు తవ్వేసిన విషయం తెలిసిందే. చారిత్రక పంచదారలను కూటమి నేతలు ధ్వంసం చేశారు. కూటమి నేతల అక్రమ మైనింగ్ పై వైసీపీ పోరాటం చేసింది. వైఎస్సార్సీపీ నేతలు కేంద్ర ప్రభుత్వానికి సైతం ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు నో మైనింగ్ జోన్గా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంచదార్లను నోమైనింగ్ జోన్గా చేపట్టాలని వైఎస్సార్సీపీ చాలా కాలంగా పోరాడుతున్న విషయం తెలిసిందే. లేదంటే మరింత పెద్దఎత్తున పోరాటం చేపడతామని సర్కారు హెచ్చరించింది. దీంతో చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ఎట్టకేలకు తలొగ్గి నో మైనింగ్ జోన్గా ప్రకటిస్తూ జీవో జారీ చేసింది.ఇదీ చదవండి: పాకిస్థాన్ వెంటనే చర్యలు తీసుకోవాలి: అమెరికా చట్టసభ సభ్యులు -
‘100 రోజుల్లో గంజాయి నిర్మూలిస్తానన్న హోంమంత్రి ఎక్కడ?’
సాక్షి, తాడేపల్లి : ఏపీ గంజాయి స్టేట్గా మారిపోయిందని.. పోలీసులతోనే గంజాయిని రవాణా చేసే దుస్థితికి తెచ్చారంటూ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగ మల్లీశ్వరి మండిపడ్డారు. గురువారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వంద రోజుల్లో గంజాయి నిర్మూలిస్తామన్న హోంమంత్రి ఎక్కడ ఉన్నారంటూ నిలదీశారు. లిక్విడ్ రూపంలో కూడా గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోంది. ఇప్పటికే 70 లక్షల లీటర్ల లిక్విడ్ పట్టుబడింది. గంజాయి డాన్ సోహెల్ని పోలీసుల నుంచి తప్పించిందెవరు?’’ అంటూ నాగ మల్లీశ్వరి ప్రశ్నించారు.‘‘హోంమంత్రి సొంత నియోజకవర్గంలోనే విచ్చలవిడిగా గంజాయి దొరుకుతోంది. చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనూ గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి. హోంమంత్రితో పోలీసులతో కూడా తప్పు చేయిస్తున్నారు. అత్యంత అసమర్థ మంత్రిగా హోంమంత్రి చరిత్రలో నిలిచిపోయారు. వైఎస్ జగన్ హయాంలో గంజాయి సాగుపై యుద్ధం చేశారు. ఆపరేషన్ పరివర్తన్ పేరుతో పెద్ద ఎత్తున చైతన్యం తెచ్చారు. ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు నడిపించారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక మళ్ళీ గంజాయి విచ్చలవిడిగా సాగవుతోంది’’ అంటూ మలీశ్వరి ధ్వజమెత్తారు.‘‘గంజాయిని నిర్మూలించామంటున్న హోంమంత్రి మాతో చర్చకు రాగలరా?. హోంమంత్రికి నిత్యం వైఎస్ జగన్పై విషం చిమ్మటం తప్ప మరో పనిలేదు. సోహెల్ పోలీస్ స్టేషన్ నుండి పారిపోతే ఇప్పటి వరకు పట్టుకోలేదు. ఇదీ హోంమంత్రి పనితీరు. హోంమంత్రి అనిత దగ్గరకు ఫైల్ వెళ్తే ఐదు రోజులపాటు చూడరు. ఇది ప్రభుత్వమే చేయించుకున్న సర్వేలో తేలిన అంశం. ఇలాంటి వారి పాలనలో రాష్ట్రం ఇంకేం బాగుపడుతుంది?’’ అంటూ నాగ మల్లీశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: పంచదార్ల కొండపై వైఎస్సార్సీపీ పోరాటానికి దిగొచ్చిన ప్రభుత్వం -
రాజీనామా చెయ్! నీకు రోజులు దగ్గర పడ్డాయి ధూళిపాళ్ల నరేంద్ర... బ్రాహ్మణుల ఉసురు ఊరికే పోదు
-
అమ్మవారికి మంగళ సూత్రాలు సమర్పించిన అంబటి మురళి
-
దొంగ ఎవరో తెలిసి కూడా.. పూజారుల్ని బలిచేస్తున్నారా?
సాక్షి, గుంటూరు: పొన్నూరు ఆలయంలో అమ్మవారి మంగళసూత్రం మాయం ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు దొంగల్ని పట్టుకోకుండా.. పూజారులను సస్పెండ్ చేశారంటూ మండిపడుతున్నారు. పైగా కొత్త మంగళసూత్రం సమర్పించే విషయంలోనూ స్పష్టత లేకుండా పోయింది. ఈ క్రమంలో.. గురువారం అమ్మవారికి తానే కొత్త మంగళసూత్రం సమర్పించారు పొన్నూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంఛార్జి అంబటి మురళి. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై, స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇది రాజకీయాలు మాట్లాడాల్సిన సమయం కాదు. కానీ, తప్పడం లేదు. 14వ తేదీన అమ్మవారి మంగళసూత్రం పోయింది. మంగళసూత్రం లేకుండానే వరలక్ష్మి వ్రతం చేయించారు. ఇది అశుభం. మంగళసూత్రాన్ని ఎలా సమకూరుస్తారో ప్రభుత్వం ప్రకటించలేదు. దేవదాయ శాఖ, రెవెన్యూ యంత్రాంగం ఇప్పటివరకూ స్పందించలేదు. ప్రభుత్వం స్పందించడం లేదు. అమ్మవారి మెడలో పూలదండలు తీసే సమయంలో మంగళసూత్రం పోయిందని కబుర్లు చెబుతున్నారు. మంగళసూత్రాన్ని చేయించి గుట్టుచప్పుడు కాకుండా అమ్మవారికి వేయాలని ఆలయ అధికారి బసవ శంకర్ చూశాడు. అలాంటప్పుడు ఈవో, సీనియర్ అసిస్టెంట్ లపై చర్యలు ఎందుకు తీసుకోలేదు. అమాయకులైన పూజారులనే ఎందుకు సస్పెండ్ చేశారు?.. దొంగ ఎవరో తెలుసు... కావాలనే బయట పెట్టలేదు. ఇవాళ మంగళసూత్రాలు ఇచ్చాం. నాను తాడు సెప్టెంబర్ 3వ తేదిన అందిస్తాం అని అంబటి మురళి పేర్కొన్నారు. పరువు నష్టం నోటీసులపై స్పందనఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర రాజ్యాంగేతర శక్తిగా మారాడు. నాపై పరువు నష్టం దావా వేశాడు. రూ. 5 కోట్లకు నోటీసులు పంపించారు. ఆయన రాజకీయ జీవితాన్ని సెకనుకు ఐదు పైసలుగా లెక్క కట్టాడు. ఆ ఐదు పైసలు నేనే ఇస్తాను. పాపాల భైరవుణ్ణి శిక్షించవా తల్లి అని అమ్మవారిని అంబటి మురళి వేడుకున్నారు. పూజారుల ఉసురు తగులుతుంది: ఆరే శ్యామలమంగళసూత్ర సమర్పణ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఆరే శ్యామల అన్నారు. ‘‘అర్చకులను దొంగతనంలో భాగస్వాములను చేస్తున్నారు. దొంగతనం జరిగిన విషయం కూడా ఎమ్మెల్యేకు తెలియదా?. పూజారుల ఉసురు తగులుతుంది. దొంగను పట్టుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వపైనే ఉంది’’ అని అన్నారామె. -
విడదల రజిని పరామర్శ
-
34% రిజర్వేషన్లు.. మహా డ్రామా
వివిధ డీబీటీ పథకాల ద్వారా బీసీల ఖాతాల్లోకి నేరుగా రూ.1.30 లక్షల కోట్లు పంపించాం. నాన్ డీబీటీతో కలిపి కేవలం బీసీలకే రూ.1.82 లక్షల కోట్లు అందించాం. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా, పెన్షన్ కానుక, చేయూత, ఆసరా, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, వాహనమిత్ర, చేదోడు, తోడు, కళ్యాణమస్తు, షాదీ తోఫా, సున్నా వడ్డీ వంటి పథకాల ద్వారా ఈ ప్రయోజనం బీసీ కుటుంబాలకు చేరింది. ఇవన్నీ ఒక్క వైఎస్సార్సీపీ.. ఓన్లీ జగన్ హయాంలోనే జరిగాయి. అప్పట్లో బీసీలకు చేసిన అభివృద్ధి గురించి చెబుతుంటే రోమాలు నిక్కబొడుస్తున్నాయి.50 శాతం మించి రిజర్వేషన్లు ఉండకూడదని హైకోర్టులు, సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని తెలిసి, ఇదే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసిందని తెలిసి కూడా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లంటూ చంద్రబాబు మరోసారి మహా డ్రామాకు దిగాడు. పైగా మళ్లీ కోర్టుకు పోయి అడ్డుకోవద్దంటూ కపట నాటకాలు ఆడుతున్నాడు. కోర్టుకు పోయేది ఆయనే, కొట్టివేయించేదీ ఆయనే, మళ్లీ దొంగ ఏడుపులు ఏడ్చేదీ ఆయనే. బీసీల అభ్యున్నతి విషయంలో ఛాంపియన్ ఎవరైనా ఉన్నారంటే.. అది కేవలం వైఎస్సార్సీపీ మాత్రమే. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బీసీల తల రాతలను మార్చే విప్లవాత్మక సంస్కరణలు మా ఐదేళ్ల ప్రభుత్వ హయాంలో తీసుకు వచ్చాం. కోర్టులు కొట్టేసినా, బీసీలకు ఆ మేరకు రాజకీయంగా ప్రోత్సాహం ఇవ్వాలని మాకు మేముగా నిర్ణయం తీసుకున్నాం. 34 శాతమే కాదు, అంతకంటే ఎక్కువ పదవులు ఇచ్చి, మా చిత్తశుద్ధిని చాటుకున్నాం. -వైఎస్ జగన్సాక్షి, అమరావతి: ‘బీసీల అభ్యున్నతి విషయంలో ఛాంపియన్ ఎవరైనా ఉన్నారంటే.. అది కేవలం ఒక్క వైఎస్సార్సీపీ మాత్రమే. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వారి తల రాతలను మార్చే విప్లవాత్మక సంస్కరణలు వైఎస్ జగన్ ఐదేళ్ల ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చాడు. కోర్టులు కొట్టేసినా, బీసీలకు ఆ మేరకు రాజకీయంగా ప్రోత్సాహం ఇవ్వాలని మాకు మేముగా నిర్ణయం తీసుకుని, 34 శాతమే కాదు.. అంతకంటే ఎక్కువ పదవులు ఇచ్చి, మా చిత్తశుద్ధిని చాటుకున్నాం’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. చంద్రబాబు బీసీల బతుకులను బుగ్గిపాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. హైకోర్టులు, సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని తెలిసి, ఇదే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసిందని తెలిసి కూడా బీసీ రిజర్వేషన్లు పేరిట మరోసారి చంద్రబాబు మహా డ్రామాకు దిగాడని విమర్శించారు. మళ్లీ కోర్టుకు పోయి అడ్డుకోవద్దంటూ కపట నాటకాలు ఆడుతున్నాడని.. కోర్టుకు పోయేది ఆయనే, కొట్టి వేయించేదీ ఆయనే, మళ్లీ దొంగ ఏడుపులు ఏడ్చేదీ ఆయనేనంటూ ధ్వజమెత్తారు. ప్రస్తుతం చంద్రబాబు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అమలైన పథకాలను ఆపేయడంతో పాటు సూపర్ సిక్స్, సూపర్సెవెన్ హామీలను చెత్త బుట్టలో వేసి బీసీల బతుకులను బుగ్గిపాలు చేస్తున్నాడని మండిపడ్డారు. రాజకీయంగా బీసీల ఎదుగుదలను ఓర్చుకోలేక, వారి మీద అక్రమ కేసులు పెట్టి, జైల్లో పెట్టే కార్యక్రమం చేస్తున్న చంద్రబాబుకు బీసీల మీద ప్రేమ ఉందంటే ఎవరైనా నమ్ముతారా? అంటూ విమర్శించారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో ఇచ్చింది మేమే ‘2019లో మేం అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో నంబర్ 176 ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చి, ఎన్నికలకు సిద్ధం అయ్యాం. కానీ చంద్రబాబు తన పార్టీ నాయకుడు, తన ప్రభుత్వంలో ఏపీ స్టేట్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్న బిర్రు ప్రతాపరెడ్డి ద్వారా హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేసు వేయించాడు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రిజర్వేషన్లు 50 శాతం దాటుతున్నందుకు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కొట్టేస్తున్నామని హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టులు, సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని తెలిసి, ఇదే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసిందని తెలిసి కూడా చంద్రబాబు మరోసారి మహా డ్రామాకు దిగాడు. పైగా మళ్లీ కోర్టుకు పోయి అడ్డుకోవద్దంటూ కపట నాటకాలు ఆడుతున్నాడు. కోర్టుకు పోయేది ఆయనే, కొట్టివేయించేదీ ఆయనే, మళ్లీ దొంగ ఏడుపులు ఏడ్చేదీ ఆయనే. బీసీల అభ్యున్నతి విషయంలో ఛాంపియన్ ఎవరైనా ఉన్నారంటే.. అది కేవలం వైఎస్సార్సీపీ మాత్రమే. అప్పుడు బీసీలకు పథకాలే పథకాలు.. వివిధ డీబీటీ పథకాల ద్వారా బీసీల ఖాతాల్లోకి నేరుగా రూ.1.30 లక్షల కోట్లు పంపించాం. నాన్ డీబీటీతో కలిపి కేవలం బీసీలకే రూ.1.82 లక్షల కోట్లు అందించాం. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా, పెన్షన్ కానుక, చేయూత, ఆసరా, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, వాహనమిత్ర, చేదోడు, తోడు, కళ్యాణమస్తు, షాదీ తోఫా, సున్నా వడ్డీ వంటి పథకాల ద్వారా ఈ ప్రయోజనం బీసీ కుటుంబాలకు చేరింది. ఇవన్నీ ఒక్క వైఎస్సార్సీపీ.. ఓన్లీ జగన్ హయాంలోనే జరిగాయి. అప్పట్లో బీసీలకు చేసిన అభివృద్ధి చెబుతుంటే రోమాలు నిక్క»ొడుస్తున్నాయి. కానీ ఇప్పుడు చంద్రబాబు బీసీల బతుకుల్ని బుగ్గిపాలు చేస్తున్నాడు. ఈ పథకాలన్నింటినీ ధ్వంసం చేశాడు. సూపర్ సిక్స్లు, సూపర్ సెవెన్లు అంటూ ఇచ్చిన బాండ్లను చెత్తబుట్టలో పారేశారు. చంద్రబాబుదంతా మోసమే. నిజంగా బీసీలకు ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో అందరూ ఆలోచించాలి. బీసీలు ఎదుగుతుంటే బాబు చూడలేరు రాజకీయంగా బీసీలు ఎవరైనా ఎదుగుతుంటే చంద్రబాబు ఓర్చుకోలేక అక్రమ కేసులతో జైల్లో పెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. యాక్సిడెంట్ కేసును హత్యాయత్నం కేసుగా మార్చి మాజీ మంత్రి, మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన సీదిరి అప్పలరాజును జైల్లో పెట్టాడు. ఒక మహిళా ఎస్సైని అడ్డుపెట్టుకుని, జరగని దాన్ని జరిగినట్టుగా చూపించి.. తప్పుడు కేసులు పెట్టి, ఆమదాలవలస నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ను జైలుకు పంపారు. టీడీపీ కార్యకర్తలే దాడులు చేస్తే, పైగా తప్పుదోవ పట్టించడానికి అదే టీడీపీ కార్యకర్త చేత ఏకంగా ఆయన భార్య దుస్తులను చింపివేయించి, అది చేసింది ఎమ్మెల్యే, అతని అనుచరులు అని చెప్పి.. ఆలూరు ఎమ్మెల్యే, బోయ సామాజిక వర్గానికి చెందిన విరూపాక్షిపై కేసులు పెట్టి జైల్లో పెట్టారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కొడుకు సునీల్ను అన్యాయంగా తప్పుడు కేసుల్లో జైలుకు పంపాడు. చంద్రబాబుకు బీసీలపై ప్రేమవుంటే ఇవన్నీ చేస్తాడా? విశాఖలో ఏడుగురు మత్స్యకారులు వేటకు వెళితే అందులో ఆరుగురు చనిపోతే, కనీసం వారిని చూడటానికి స్థానిక మంత్రి కూడా వెళ్లలేదు. ఈయన బీసీల గురించి మాట్లాడతాడు. విద్యా దీవెన, వసతి దీవెన లేక చదవులు మానేస్తున్న వారిలో అత్యధికులు బీసీలే ఉన్నా పట్టించుకునే నాథుడే లేడు. మరి చంద్రబాబుకు బీసీల మీద ప్రేమ ఉందంటే ఎవరైనా నమ్ముతారా? ఎవరి హయాంలో బీసీలు బాగుపడ్డారో అందరూ ఆలోచించాలి.34% రిజర్వేషన్లకు మించి బీసీలకు పదవులు ఇచ్చాం⇒ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బీసీల తల రాతలను మార్చే విప్లవాత్మక సంస్కరణలు ఆ ఐదేళ్లలో మేం తీసుకు వచ్చాం. కోర్టులు కొట్టేసినా, బీసీలకు ఆ మేరకు రాజకీయంగా ప్రోత్సాహం ఇవ్వాలని మాకు మేముగా నిర్ణయం తీసుకుని, 34 శాతమే కాదు, అంతకంటే ఎక్కువ పదవులు ఇచ్చి, మా చిత్తశుద్ధిని చాటుకున్నాం.⇒ మా కేబినెట్లో 25 మంది ఉంటే, అందులో 11 మంది బీసీలే. అంటే దాదాపు 40 శాతం మంత్రి పదవులు బీసీలకే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సామాజిక వర్గాలకు డిప్యూటీ సీఎం పదవులు ఇస్తే, ఇందులో రెండు డిప్యూటీ సీఎం పదవులు బీసీలకే ఇచ్చాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర కోటాలో భర్తీ అయిన 11 రాజ్యసభ స్థానాల్లో నలుగురు బీసీలను ఈ జగన్ రాజ్యసభకు పంపారు. అంటే దాదాపు 36 శాతం ప్రాతినిధ్యం. ⇒ చంద్రబాబు 2014–19 మధ్య ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదు. మేము 25 లోక్సభ సీట్లలో 11 బీసీలకే అంటే 44 శాతం ఇచ్చాం. 58 ఎమ్మెల్సీల్లో 28 బీసీలకే ఇచ్చాం. అంటే 48 శాతం వారికే. 13 జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవుల్లో 6 అంటే 46 శాతం బీసీలకే. 13 మేయర్ పదవుల్లో 9 అంటే 69 శాతం బీసీలకే. 636 ఎంపీపీ స్థానాల్లో 239 అంటే 38 శాతం బీసీలకే. మున్సిపల్ ఛైర్మన్ పదవులు 84లో 44 అంటే శాతం బీసీలకే.⇒ 639 జెడ్పీటీసీల్లో 227 అంటే 36 శాతం బీసీలకే. 8,239 ఎంపీటీసీల్లో 3,361 అంటే 41 శాతం మంది బీసీలే. 10,536 సర్పంచుల్లో దాదాపు 4 వేల మంది బీసీలే. అంటే 38 శాతం వారికే. వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్ పదవులు 196లో 76 అంటే 39 శాతం బీసీలకే. ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్ పదవులు 137లో 53 బీసీలకు ఇచ్చాం. అంటే 37 శాతం ఇచ్చాం. ⇒ 139 బీసీ కులాలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. ఇన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని చంద్రబాబుకు కలలో కూడా ఆలోచన రాలేదు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం, నామినేటెడ్ పనులు–కాంట్రాక్టుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చట్టం చేసి మరీ ఇచ్చాం. ఇందులో మహిళలకు కూడా 50 శాతం వాటా ఉండే విధానం మేం తీసుకు వచ్చాం. దేశంలోనే ఇది తొలిసారి. ⇒ బీసీలకు చట్ట సభల్లో 50 శాతం సీట్లు కేటాయించాలని కోరుతూ పార్లమెంటులో వైఎస్సార్సీపీ ఎంపీలతో ప్రైవేట్ బిల్లు పెట్టించాం. కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ, ప్రత్యేక బడ్జెట్ కోసం కూడా డిమాండ్ చేశాం. అలాగే బీసీ కులగణన కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. -
కరువు కాటేస్తున్నా కుంభకర్ణుడి నిద్రే
జూన్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయ్యాక... జూలై 8న పంటలకు నీళ్లు ఇస్తామంటూ ప్రకాశం బ్యారేజీ లాకుల దగ్గర వెన్నుపోటు పార్టీ ప్రభుత్వంలోని మంత్రులు ఫొటోలతో ఫోజులిచ్చారు. పబ్లిసిటీ స్ట్టంట్ చేశారు. వీళ్లను నమ్మి, నీళ్లు ఇస్తారనే ఆశతో కృష్ణా డెల్టాతో పాటు మిగిలిన చోట్లా రైతులు పెట్టుబడులు పెట్టి, అష్టకష్టాలు పడి, విత్తనాలు, ఎరువులు కొని నార్లు నాటారు. ఈ రోజు నార్లు ఎండుతున్న దుస్థితి. ఎకరాకు కనీసం రూ.15 వేల చొప్పున రైతులు నష్టపోయారు. ఒకవైపు వర్షాలు లేక సంక్షోభం వస్తే.. మరోవైపు చంద్రబాబు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు.ఇలాంటి పాలకులు ఉంటారనే... రాయలసీమ లిఫ్ట్ అనేది ఒక ఇన్సూరెన్స్ ప్రాజెక్టు కింద రాయలసీమ ప్రజల కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కట్టడం మొదలు పెట్టాం.సెప్టెంబర్ 15 తరువాత వర్షాలు కూడా పడవు. ఇక ఆ తర్వాత రైతులకు మీరేమిచ్చినా ఎవరికి ఉపయోగం? వ్యవసాయ రంగంపై ఆధారపడిన కూలీలకు ఈపాటికే అదనంగా ఉపాధి హామీ పనుల కల్పన ప్రారంభమై ఉండాలి. పేదలకు ఆహార భద్రత కార్యక్రమాలు ఇప్పటికే మొదలవ్వాలి. జిల్లాలవారీగా పశువులకు మేత సమకూర్చి ఉండాలి. అందుబాటులో ఉన్న రాష్ట్రాల నుంచి సేకరణ జరిగి ఉండాలి. మరి ఇవన్నీ ఎందుకు అమలు కాలేదు? సీఎంగా చంద్రబాబు ఏం చేస్తున్నారు?చంద్రబాబు ప్రభుత్వంలో డీఎస్సీ2025లో అక్రమాలు, పేపర్ లీకేజీల మీద సాక్ష్యాలు, ఆధారాలతో గత వారం సమగ్రంగా మాట్లాడా. ఏపీపీఎస్సీ గ్రూప్ృ1 నియామకాలపై చంద్రబాబు తప్పుడు ఆరోపణలపై సాక్ష్యాలతో వాస్తవాలను వివరించా. ఈ రెండింటిపై సీబీఐ విచారణకు మేం రెడీ.. మీరు రెడీనా? అని ఛాలెంజ్ కూడా చేశా. నేను ఛాలెంజ్ చేశాక ఇంత వరకూ ఆ అంశాలపై వాళ్లు మాట్లాడలేదు. కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు నేనిచ్చిన సమాధానాలపై వక్రీకరణలు చేస్తున్నారు. – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం ఉందని చంద్రబాబు ప్రభుత్వానికి తెలుసు. జూన్లో సాధారణ వర్షపాతం కంటే 25 శాతం లోటు వర్షపాతం నమోదు అయిందని కూడా తెలుసు. ఇవన్నీ తెలిసి కూడా, సాగుకు నీళ్లు ఇస్తున్నామంటూ జూలై 8న వెన్నుపోటు పార్టీ మంత్రులు ఫొటోలకు ఫోజులు ఇస్తూ పబ్లిసిటీ స్టంట్ చేశారు. వీరి మాటలు నమ్మి సాగు ప్రారంభించిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. రాష్ట్రంలో తీవ్ర కరువు తాండవిస్తోందని గుర్తించటానికి కూడా చంద్రబాబు ఇష్టపడటం లేదు..’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయకట్టు చివర ఉండే ప్రతి ఎకరాకూ నీళ్లు ఇవ్వడానికి చంద్రబాబు సంకల్పించారంటూ చేసిన ప్రచారాలను నమ్మి ఎకరాకు కనీసం రూ.15 వేలు చొప్పున పెట్టుబడి పెట్టిన రైతులు పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీశైలంలో పూర్తి స్థాయిలో నీటిమట్టం ఉన్నప్పటికీ చంద్రబాబు పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు ఇవ్వకుండా సీమ ప్రాజెక్టులన్నీ ఒట్టిపోయేలా చేస్తున్నారని నిప్పులు చెరిగారు. పులిచింతల నుంచి 10.5 టీఎంసీల కృష్ణా జలాలను తరలించేందుకు తెలంగాణ అక్రమంగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్లు నిర్మిస్తున్నా చంద్రబాబు కనీసం నోరెత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరువు, వ్యవసాయ సంక్షోభ పరిస్థితులను ఎదుర్కోవడం.. రైతులకు అండగా నిలవడంలో చంద్రబాబు సర్కార్ ఘోర నిర్లక్ష్యం, దారుణ వైఫల్యాలను సాక్ష్యాధారాలతో ఎండగట్టారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే.. సీమలోనే కాదు.. కోస్తాలోనూ కరువు ఛాయలురాష్ట్రంలో కరువు ప్రమాద ఘంటికలు మోగుతున్నా చంద్రబాబులో కనీస స్పందన లేకుండా పోయింది. జూన్, జూలై, ఆగస్టు.. ఇప్పటి వరకూ 52 శాతం లోటు వర్షపాతం నమోదైంది. కోస్తాంధ్రలో 41.78 శాతం, రాయలసీమలో 52.36 శాతం.. ఇలా రాష్ట్రంలో ఏ జిల్లాలో చూసినా లోటు వర్షపాతమే కనిపిస్తోంది. ఇంత దారుణమైన పరిస్థితులున్నా కుంభకర్ణుడి తరహాలో చంద్రబాబు నిద్ర నటిస్తున్నారు. రైతులకు మంచి చేస్తూ ఏ ఒక్క కార్యక్రమం చేపట్టలేదు. జూన్ నుంచి ఆగస్టు 26వ తేదీ వరకూ సాధారణ వర్షపాతం 388.54 మిల్లీవీుటర్లు (ఎంఎం) నమోదు అవ్వాల్సి ఉండగా 189.62 ఎంఎం మాత్రమే నమోదైంది. రాష్ట్రంలో 688కిగానూ 625 మండలాల్లో లోటు వర్షపాతమే కనిపిస్తోంది. అంటే 91 శాతం రాష్ట్రం లోటు వర్షపాతాన్ని ఎదుర్కొంటోంది. ఈ 625 మండలాల్లో 434 చోట్ల 19 శాతం కంటే అధికంగా లోటు వర్షపాతం ఉంది. మరో 191 మండలాల్లో 19 శాతం నుంచి 59 శాతం వరకూ తీవ్ర లోటు వర్షపాతం నెలకొంది. ఇక 28 జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే కనిపిస్తోంది. ఏఎస్ఆర్, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, వైఎస్సార్ కడప, శ్రీసత్యసాయి జిల్లాల్లో వర్షపాత లోటు తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. నిత్యం కరువు ఉండే రాయలసీమ జిల్లాలే కాకుండా కోస్తాంధ్ర జిల్లాల్లోనూ కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కరువు పరిస్థితులతో రైతాంగం, ప్రజలు అల్లాడుతుంటే దీన్ని గుర్తించడానికి కూడా వెన్నుపోటు పార్టీ నాయకుడు చంద్రబాబు ఇష్టపడటం లేదు. రైతులను ప్రజలను ఆదుకోవడానికి ఏ మాత్రం అడుగులు ముందుకు వేయడం లేదు. ఖరీఫ్ సీజన్లో రాష్ట్రంలో 63 లక్షలకు పైగా ఎకరాలు సాగవ్వాల్సి ఉండగా కేవలం 50 లక్షల ఎకరాల్లోనే సాగు నమోదైంది. అంటే దాదాపు 80 శాతానికే సాగు పరిమితం అయింది. సీమకు నీళ్లివ్వడానికి బాబుకు మనసు రాలేదురాయలసీమకు నీళ్లు ఇచ్చే విషయంలో చంద్రబాబు ఎంతో దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. శ్రీశైలంలో గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ఈ ఆగస్టు 11వ తేదీనే 879.50 అడుగులకు చేరుకుంది. అవకాశం ఉన్నా కూడా, పోతిరెడ్డిపాడు ద్వారా కిందకు రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లు సరిపడా ఇవ్వడానికి చంద్రబాబుకు మనసు రాలేదు. శ్రీశైలంలో 880 అడుగుల్లో నీటిమట్టం ఉంటే పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా పూర్తి సామర్థ్యం మేరకు 44 వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదలవచ్చు. 880 అడుగుల నుంచి నీటిమట్టం తగ్గేకొద్దీ పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు ఇచ్చే అవకాశం తగ్గుతూ పోతుంది. 854 అడుగుల కంటే కిందకు నీటిమట్టం పడిపోతే... రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వాలనుకున్నా, ఇవ్వలేని దుస్థితి వస్తుంది. అలాంటిది ఈ రోజు పరిస్థితి గమనిస్తే శ్రీశైలం నుంచి ఎడాపెడా అటు తెలంగాణ కరెంట్ ఉత్పత్తి చేస్తుండగా, ఇటు చంద్రబాబు కూడా రైతుల గురించి ఆలోచించకుండా విద్యుదుత్పత్తి చేస్తున్నారు. రోజుకు 48 వేల క్యూసెక్కులు నీటిని వాడుతున్నారు. ప్రస్తుతం ఇన్ఫ్లో కేవలం 7 వేల క్యూసెక్కులు ఉంటే ఔట్ఫ్లో 48 క్యూసెక్కులు ఉంటోంది. నికరంగా 3.5 టీఎంసీల నీళ్లు శ్రీశైలం నుంచి ఖాళీ అవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మూడు వారాల్లోనే శ్రీశైలం నీటిమట్టం 854 అడుగుల దిగువకు చేరుకుంటుంది. ఈ రోజు బహుశా 165 టీఎంసీల నీళ్లున్నాయి. రోజుకు 3.5 టీఎంసీల లెక్కన వాడుతూ పోతే మూడు వారాల్లో 75 టీఎంసీల మేర ఖర్చు అయిపోతాయి. 854 అడుగుల నీటి మట్టానికి వచ్చేస్తాం. దీని తర్వాత రాయలసీమకు నీళ్లు ఇవ్వాలన్నా ఇవ్వలేం. ఇంతకంటే నీటిమట్టం పడిపోతే పోతిరెడ్డిపాడును ఆపరేట్ చేయలేం. మరోవైపు ఎల్నినో, కరువు కనిపిస్తోంది. జూన్, జూలై, ఆగస్టు కూడా అయిపోయింది. సెప్టెంబర్ 15 వరకే వర్షాలు పడే అవకాశం ఉంది. శ్రీశైలంలో ఎడాపెడా నీళ్లు తోడేస్తుంటే 854 అడుగుల కిందకు నిల్వలు పడిపోయాక రాయలసీమకు నీరు ఎలా ఇస్తారు? ఇవ్వాలనుకున్నా ఇవ్వలేని పరిస్థితే కదా? మరి ఇప్పుడు మీరెందుకు నీరు ఇవ్వడం లేదు? అని చంద్రబాబును నిలదీస్తున్నా. ఇలాంటి పాలకులు ఉంటారనే.. రాయలసీమ లిఫ్ట్ అనేది ఒక ఇన్సూరెన్స్ ప్రాజెక్టు కింద రాయల సీమ ప్రజల కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కట్టడం మొదలు పెట్టాం.ఒక్క పైసా ఇవ్వని దుస్థితి2025 అక్టోబర్లో మోంథా తుపాను వచ్చి రైతులు నష్టపోతే ఇప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం ఒక్క పైసా సాయం చేయలేదు. ఉచిత పంటల బీమాను నాశనం చేశారు. సీజన్ ముగిసేలోపే ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీని ఇవ్వకుండా ఆ పథకాన్ని నాశనం చేశారు. ఈ–క్రాప్, రైతు భరోసా కేంద్రాలను నాశనం చేశారు. అగ్రి ల్యాబ్్సను నిర్వీర్యం చేశారు. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేని దుస్థితిని చంద్రబాబు ప్రభుత్వం తెచ్చింది. మా హయాంలో ‘సీఎం యాప్’ ఉండేది. ప్రతి ఆర్బీకే పరిధిలో గిట్టుబాటు ధరలతో పోస్టర్లు ప్రదర్శించే వాళ్లం. ఆ ఆర్బీకే పరిధిలో గిట్టుబాటు ధరలు రాని పరిస్థితుల్లో అగ్రికల్చర్ అసిస్టెంట్ ప్రభుత్వాన్ని అలెర్ట్ చేసేవారు. తక్షణమే జాయింట్ కలెక్టర్/మార్క్ఫెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ రంగంలోకి దిగేవారు. పంటలు కొనుగోలు చేసి మార్కెట్లో పోటీ సృష్టించేవారు. దీంతో రేట్లు పెరిగేవి. ఈ మాదిరిగా మా హయాంలో ఐదేళ్లలో మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా రూ.7,800 కోట్లు ఖర్చు చేసి రైతులకు తోడుగా నిలిచాం. గిట్టుబాటు ధరలు ఇప్పించాం. ఇప్పుడు ఆ వ్యవస్థను చంద్రబాబు పూర్తిగా నాశనం చేశారు. చివరకు రైతులకు సున్నా వడ్డీ పథకాన్నీ రద్దు చేసేశారు. పెట్టుబడి సాయం కింద పీఎం కిసాన్ కాకుండా అన్నదాతా సుఖీభవ ద్వారా ఏటా రూ.20 వేలు చొప్పున ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. మూడేళ్లకు రూ.60 వేలు ఇవ్వాల్సి ఉండగా ఇచ్చిందేమో రూ.19 వేలు. ఏకంగా రూ.41 వేలు ఎగ్గొట్టాడు. ఆదుకునే ఆలోచన ఉందా బాబూ?ఇంత తీవ్రమైన కరువు పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీలు, ప్రజలను చంద్రబాబు ఆదుకున్నారా? అసలు ఆదుకునే ఆలోచన అయినా ఆయనకు ఉందా? ఎంతసేపూ మాపై తప్పుడు ప్రచారం చేయడం, అబద్ధాలు, టాపిక్ డైవర్షన్, రెడ్బుక్పైనే ధ్యాస పెడుతున్నారు. కరువు సమయంలో ప్రజలను ఆదుకోవాలనే ధ్యాస లేదు. జూన్, జూలై, ఆగస్టు సెప్టెంబర్ నెలల్లోనే వర్షాలు పడతాయి. అప్పుడు ఖరీఫ్ సీజన్ నడుస్తుంది. జూన్లో 25 శాతం, జూలైలో 68 శాతం లోటు వర్షపాతం నమోదు అయింది. ఆ రెండు నెలల్లోనే సగటున 52 శాతం లోటు వర్షపాతం కనిపించింది. ఇంత లోటు వర్షపాతం ఉన్న పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రణాళిక (కంటింజెన్సీ ప్లాన్) ఏమైంది? ఆగస్టులోనే దాన్ని అమలు చేసి ఉండాలి. కనీసం అప్పుడైనా రైతులకు ప్రత్యామ్నాయ విత్తనాలు ఇచ్చి ఉంటే ఆగస్టు, సెప్టెంబర్లో కొద్దో గొప్పో కురిసే వర్షాలతో పంటలు పండి రైతులు కొంతైనా బాగుపడేవారు. అలసందలు, ఉలవలు, నువ్వులు, మినుములు, జొన్నలు, పెసలు ఇలాంటివన్నీ ప్రత్యామ్నాయ పంటలు. మరి ఎంత మందికి మీరు ప్రత్యామ్నాయంగా ఉచిత విత్తనాలు ఇచ్చారు? విత్తనాల పంపిణీ ఎందుకు జరగలేదు? ఇప్పటికే పంటలు వేసుకుని నష్టపోయిన రైతులకు ఏం సహాయం చేశారు? వర్షపాతం జూలై చివరి నాటికి 52 శాతం లోటు ఉన్న నేపథ్యంలో కరువు పరిస్థితులను పర్యవేక్షిస్తూ ఎదుర్కొనే వ్యవస్థ (డ్రౌట్ మానిటరింగ్ సెంటర్లు) పూర్తి స్థాయిలో అప్రమత్తమై ఉండాలి. జిల్లా కంటింజెన్సీ ప్లాన్లు అమలై ఉండాలి. విపత్తు నిర్వహణ ప్రణాళిక (క్రైసిస్ మేనేజ్మెంట్ ప్లాన్) అమలులోకి వచ్చి ఉండాలి. ప్రతి జిల్లాలో డ్రౌట్ కంటింజెన్సీ సెల్ ఏర్పాటై ఉండాలి. కంటింజెన్సీ ప్లాన్ ప్రకారం డ్రౌట్, రిసీలియంట్ షార్ట్ డ్యూరేషన్ సీడ్ స్టాక్స్ పంపిణీ రైతులకు జరిగి ఉండాలి. మరి ఇవన్నీ జరిగాయా? ఆగస్టు నెల ముగుస్తోంది. సెప్టెంబర్ 15 తరువాత వర్షాలు కూడా పడవు. ఇక ఆ తర్వాత మీరేమిచ్చినా ఎవరికి ఉపయోగం? వ్యవసాయ రంగంపై ఆధారపడిన కూలీలకు ఈపాటికే అదనంగా ఉపాధి హామీ పనుల కల్పన ప్రారంభమై ఉండాలి. పేదలకు ఆహార భద్రత కార్యక్రమాలు ఇప్పటికే మొదలవ్వాలి. జిల్లాలవారీగా పశువులకు మేత సమకూర్చి ఉండాలి. మేత అందుబాటులో ఉన్న రాష్ట్రాల నుంచి సేకరణ జరిగి ఉండాలి. మరి ఇవన్నీ ఎందుకు అమలు కాలేదు? సీఎంగా చంద్రబాబు ఏం చేస్తున్నారు? గుండెల మీద చేయి వేసుకుని తనను తాను చంద్రబాబు ప్రశ్నించుకోవాలని గట్టిగా నిలదీస్తూ అడుగుతున్నా. కనిష్ట స్థాయిలో సీమ డ్యామ్లలో నీటి నిల్వలురాయలసీమలోని ప్రాజెక్టుల్లో నీటి నిల్వల పరిస్థితి ఎంతో దయనీయంగా ఉంది. తెలుగు గంగ కెనాల్పై ఆధారపడిన వెలుగోడు, బ్రహ్మంసాగర్, సోమశిల, కండలేరు ప్రాజెక్టుల నిల్వ సామర్థ్యం 180 టీఎంసీలు అయితే ప్రస్తుతం కేవలం 55 టీఎంసీలు మాత్రమే నీళ్లు ఉన్నాయి. ఇందులో డెడ్ స్టోరేజ్ 14 టీఎంసీలు తీసేస్తే అందుబాటులో ఉన్నది 41 టీఎంసీలే. అంటే కేవలం 23 శాతం నీళ్లు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉండే పరిస్థితి. ఎస్ఆర్బీసీ (శ్రీశైలం కుడి గట్టు కాలువ), జీఎన్ఎస్ఎస్ (గాలేరు–నగరి) కింద ఉండే గోరకల్లు, అవుకు, గండికోట, పైడిపాలెం, వామికొండ, సర్వరాయసాగర్, చిత్రావతి రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యం 59 టీఎంసీలు. వీటిలో ఇప్పుడు కేవలం 31 టీఎంసీలు మాత్రమే నీళ్లున్నాయి. డెడ్ స్టోరేజ్ 8 టీఎంసీలు తీసేస్తే 23 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉంటాయి. అంటే కేవలం 39 శాతం నీళ్లు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. హెచ్ఎన్ఎస్ఎస్ (హంద్రీ–నీవా) కింద జీడిపల్లి, గొల్లపల్లి, చెర్లోపల్లి, పత్తికొండ, కృష్ణగిరి, అడవిపల్లి నిల్వ సామర్థ్యం 8.31 టీఎంసీలు. ఇప్పుడున్న నిల్వ కేవలం 4 టీఎంసీలు మాత్రమే. డెడ్ స్టోరేజ్ 1.65 టీఎంసీలు పోనూ కేవలం 2.5 టీఎంసీల నీరే అందుబాటులో ఉంటుంది. అంటే రాబోయే రోజుల్లో కరువు తీవ్రత మరింత దారుణంగా ఉంటుందని స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ నీళ్లు మళ్లిస్తుంటే బాబు మౌనంమరోవైపు నాగార్జున సాగర్ కుడి కాల్వ, ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా డెల్టా ప్రాంతానికి చంద్రబాబు చుక్క నీరు ఇవ్వడం లేదు. ఇంకా ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారంటే.. నాగార్జున సాగర్ కింద ఏపీకి సంబంధించిన పులిచింత ప్రాజెక్ట్ ఎగువన, దిగువన తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా లిఫ్ట్లు కడుతున్నా చంద్రబాబు చోద్యం చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం చింతలపాలెం మండలం పాతవెల్లటూరు దగ్గర రూ.1,450 కోట్లతో మహాత్మాగాంధీ పంప్డ్ హౌజ్ నిర్మాణాన్ని వేగంగా చేపడుతోంది. దీని ద్వారా పులిచింతల బ్యాక్ వాటర్ నుంచి 8 టీఎంసీలు తరలింపు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది పూర్తిగా అక్రమ నిర్మాణం. అదే విధంగా తెలంగాణలోనే చింతలపాలెం మండలం బుగ్గమాదారం దగ్గర రూ.394 కోట్లతో రాజీవ్ ఎత్తిపోతల పథకం పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా పులిచింతల దిగువన కృష్ణా నది నుంచి మరో 2.5 టీఎంసీలు తరలించాలని చూస్తున్నారు. పులిచింతల సామర్థ్యం దాదాపు 45 టీఎంసీలు అయితే ఏకంగా 10.5 టీఎంసీల నీటిని లిఫ్ట్ల ద్వారా మళ్లించడానికి తెలంగాణ ప్రభుత్వం పనులు చేపడితే చంద్రబాబు చోద్యం చూస్తున్నారు. కనీసం మాటలు లేవు. అడిగిన దాఖలాలూ లేవు. సాగునీటికి సంబంధించి ఇంత దారుణమైన పరిస్థితులను చంద్రబాబు కల్పించారు.పబ్లిసిటీ స్టంట్తో రైతులను ముంచారు..జూన్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయ్యాక... జూలై 8న పంటలకు నీళ్లు ఇస్తామంటూ ప్రకాశం బ్యారేజీ లాకుల దగ్గర వెన్నుపోటు పార్టీ ప్రభుత్వంలోని మంత్రులు ఫొటోలతో ఫోజులిచ్చారు. పబ్లిసిటీ స్ట్టంట్ చేశారు. వీళ్లను నమ్మి, నీళ్లు ఇస్తారనే ఆశతో కృష్ణా డెల్టాతో పాటు మిగిలిన చోట్లా రైతులు పెట్టుబడులు పెట్టి, అష్టకష్టాలు పడి విత్తనాలు, ఎరువులు కొని నార్లు నాటారు. సాగుకు వేగంగా అడుగులు ముందుకు వేశారు. ఈరోజు ఆ నార్లు ఎండుతున్న దుస్థితి. ఎకరాకు కనీసం రూ.15 వేల చొప్పున రైతులు నష్టపోయారు. ఒకవైపు వర్షాలు లేక సంక్షోభం వస్తే.. మరోవైపు చంద్రబాబు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు.బాబు నిర్వాకంతో రైతులకు రూ.3 వేల కోట్ల నష్టంకరువు వల్ల ఇంత విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ రైతులు, రైతు కూలీలను, ప్రజలను చంద్రబాబు ఆదుకుంటున్నారా? అంటే అదీ లేదు. రైతులకు ఆర్థిక రక్షణగా ఉండే వైఎస్సార్ ఉచిత పంటల బీమాను రద్దు చేసి తీవ్ర అన్యాయం చేశారు. ఇప్పుడు రైతులే ప్రీమియం భారాన్ని భరించి కట్టుకోవాల్సిన దుస్థితి తెచ్చారు. పంటల బీమా పథకం ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఓ చిన్న ఉదాహరణ. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్కు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానం గమనిస్తే.. రాష్ట్రంలో మా ప్రభుత్వ హయాంలో 2022–23 ఖరీఫ్లో 1.18 కోట్ల దరఖాస్తులకు ఉచిత పంటల బీమా వర్తిస్తే.. 2026–27 ఖరీఫ్లో కేవలం 40 లక్షల దరఖాస్తులు మాత్రమే పంటల బీమా కిందకు వచ్చాయి. ఇది స్వయంగా పార్లమెంట్లో లిఖితపూర్వకంగా ఇచ్చిన జవాబు. పీఎంఎఫ్బీవై కింద రాష్ట్రాలు, సంవత్సరాల వారీగా రైతులు, పంటల బీమాలో కవర్ అయిన భూ విస్తీర్ణం, ఇతర వివరాలను స్పష్టంగా కేంద్రం పార్లమెంట్కు ఇచ్చింది. మా హయాంలో నమోదైన 1.18 కోట్ల దరఖాస్తులు ఎక్కడ? బాబు పాలనలో రైతులే ప్రీమియం కట్టుకునే పరిస్థితుల్లో 40 లక్షల దరఖాస్తులు ఎక్కడ? ప్రస్తుతం 30–33 శాతం రైతులే బీమా పరిధిలోకి వచ్చారని తెలుస్తోంది. పైగా ఇంకా దారుణం ఏంటంటే 2023–24కు సంబంధించి.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక 2024 జూలైలో ఇన్సూరెన్స్ ప్రభుత్వం తరపున ప్రీమియం కట్టాలి. రైతులు, రాష్ట్ర వాటాను రాష్ట్ర ప్రభుత్వం కడితే 1/3 వాటాను కేంద్రం ఇస్తుంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం ప్రీమియం కట్టకపోవడంతో రైతులకు ఏకంగా రూ.3 వేల కోట్లు నష్టం వాటిల్లింది. రూ.1,100–1,800 కోట్లు కట్టి ఉంటే రైతులకు రూ.3 వేల కోట్లు వచ్చేవి. -
స్థానిక ఎన్నికల ప్రక్రియను ఆపండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం తలపెట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ పూర్తి కాక ముందే, రాష్ట్ర ఎన్నికల కమిషన్ 01.01.2026ని అర్హత తేదీగా తీసుకుంటూ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించడంపై వైఎస్సార్సీపీ న్యాయ పోరాటానికి దిగింది. సర్ ప్రక్రియ ముగిసి, తుది ఓటర్ల జాబితాను ప్రచురించిన తరువాత మాత్రమే వార్డుల ఓటర్ల జాబితాను తయారు చేసి, స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అప్పటివరకూ ఎన్నికల నోటిఫికేషన్ జారీ ప్రక్రియను నిలిపివేయాలని హైకోర్టును అభ్యర్థించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు భిన్నంగా... ‘దేశవ్యాప్తంగా చేపట్టిన సర్ ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్సహా 19 రాష్ట్రాల్లో 01.07.2026ను అర్హత తేదీగా తీసుకుని సర్ను నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం 01.01.2026ను అర్హత తేదీగా తీసుకుంటూ పురపాలక సంఘాల్లో ఓటర్ల జాబితా ప్రచురణకు నోటిఫికేషన్ ఇచ్చింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలు ప్రచురితం అయ్యాయి. ఈ నేపథ్యంలో సర్ పూర్తయి తుది ఓటర్ల జాబితాను ప్రచురించిన తరువాతనే ఎన్నికల ప్రక్రియను మొదలు పెట్టాలని కోరుతూ ఎన్నికల సంఘానికి మేం వినతి పత్రం ఇచ్చాం. 31.07.2026న ప్రచురించిన డ్రాఫ్ట్ జాబితా ప్రకారం రాష్ట్రంలో సుమారు 15.22 లక్షల మంది మరణించిన వారు, 7.37 లక్షల నకిలీ ఓట్లు, పెద్ద సంఖ్యలో శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వెళ్లిన వారి పేర్లు నమోదై ఉన్నాయి. తుది జాబితా 03.10.2026న వెలువడాల్సి ఉంది’ అని అప్పిరెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘానిది ఏకపక్ష నిర్ణయం ‘సర్ ప్రక్రియ పూర్తికాకముందే 01.01.2026 అర్హత తేదీతో పాత, తప్పుల తడకగా ఉన్న అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికలకు వెళ్లడం వల్ల ఒకే ప్రాంతంలో అసెంబ్లీకి ఒక జాబితా, స్థానిక సంస్థలకు మరొక జాబితా ఉంటుంది. మరణించిన, నకిలీ ఓటర్లు స్థానిక జాబితాలో కొనసాగడం వల్ల రిజర్వేషన్లు, రోటేషన్ విధానం దెబ్బతింటుంది. పంచాయతీ రాజ్ చట్టం, మున్సిపాలిటీల చట్టం ప్రకారం స్థానిక సంస్థలకు ప్రత్యేకమైన ఓటర్ల జాబితా ఉండదు. అది పూర్తిగా అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగానే తయారవుతుంది. చట్ట సవరణల ద్వారా జూలై 1ని కూడా అర్హత తేదీగా ఆమోదించినప్పటికీ, రాష్ట్ర ఎన్నికల సంఘం 01.01.2026 తేదీనే ఎంచుకోవడం ఏకపక్షం. ఈ విషయంలో మా ఆందోళనను సంఘం పట్టించుకోలేదు. ఎన్నికల సంఘం తీరు వల్ల స్వేచ్ఛాయుత, నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉండదు. పారదర్శకతకు ఏ మాత్రం స్థానం ఉండదు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలి’ అని అప్పిరెడ్డి తన వ్యాజ్యంలో హైకోర్టును కోరారు.హైకోర్టుకు అభ్యర్థనలు..» 01.01.2026ని అర్హత తేదీగా తీసుకుని వార్డుల ఓటర్ల జాబితాను తయారు చేయకుండా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలి. » ఒకవేళ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏ వార్డు ఓటర్ల జాబితానైనా ప్రచురిస్తే దానిని తాత్కాలికమైనదిగా భావించేలా ఉత్తర్వులు ఇవ్వాలి. » ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే తేదీ వరకు అసెంబ్లీ ఓటర్ల జాబితాలో జరిగే అన్ని రకాల చేర్పులు, తొలగింపులు అన్నీ కూడా స్థానిక వార్డు ఓటర్ల జాబితాలో కూడా ప్రతిబింబించేలా ఆదేశించాలి. » నామినేషన్లు దాఖలు చేసే చివరి తేదీ నాటికి ఈ సవరణలన్నింటినీ చేరుస్తూ ఒక అనుబంధ (సప్లిమెంటరీ) ఓటర్ల జాబితాను తప్పనిసరిగా ప్రచురించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలి. -
గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చేశారు!
చంద్రబాబు పాలనలో ఈ రాష్టంలో ఏ పంటకూ రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు. కానీ.. ఒక్క గంజాయికి మాత్రం గిట్టుబాటు ధర వస్తోంది. గంజాయి రవాణా స్థాయి నుంచి మాఫియా స్థాయికి చేరింది. పోలీసులనే వాటాదారులుగా చేసి చినబాబు, పెదబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చేశారు.నేరస్తులు, పోలీసులు, అధికారంలో ఉన్న పార్టీ పెద్దలు అందరూ కుమ్మక్కై ఈ దందా నడుపుతున్నారు. రేంజ్లుగా విభజించి సిండికేట్గా ఫామ్ అయ్యి.. ఆర్గనైజ్్డగా గంజాయి మాఫియాను నడుపుతున్నారు.నిడమానూరులో 140 కిలోల గంజాయి పట్టుబడింది. విచారణ ఆధారంగా కేరళకు చెందిన గంజాయి డాన్ సొహైల్ను విశాఖలో అరెస్టు చేసి విజయవాడకు తీసుకొస్తే పటమట పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్నాడన్నారు. అసలు అతను తప్పించుకున్నాడా? తప్పించబడ్డాడా? జూన్ 9న ఘటన జరిగితే ఇప్పటి వరకు సొహైల్ను పట్టుకోలేకపోయారు.పోలీసులే గంజాయితో దొరకడం అన్నది క్షమించరాని నేరం. బాధ్యతగల గవర్నమెంట్.. బాధ్యత గల డిపార్టుమెంట్.. బాధ్యతగల పోలీసు ఆఫీసర్లు చేయాల్సిన పని ఏంటంటే.. ఇలాంటి పనులు చేసే పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి. డిస్మిస్ చేయాలి. జైలులో పెట్టాలి. తప్పు చేస్తే ఇలా జరుగుతుంది అనే సంకేతాన్ని పంపించాలి. – మాజీ సీఎం వైఎస్ జగన్సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు పాలన సర్వం గంజాయి, డ్రగ్స్ మయం అని, మట్టి, ఇసుక, క్వార్ట్జ్, సిలికా, కల్తీ లిక్కర్ అన్నింటా మాఫియానేనని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు. ఒకవైపు రాజకీయ వేధింపులకు పాల్పడుతూ, తప్పుడు కేసులు పెడుతూ.. మరోవైపు ప్రభుత్వ ఆస్తులను పప్పు బెల్లాల మాదిరిగా పంచేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. పోలీసు వ్యవస్థను చంద్రబాబు సర్కార్ దిగజార్చిన తీరును వీడియోలు ప్రదర్శించి చూపుతూ.. ఫోటోలు, సాక్ష్యాధారాలు చూపుతూ కడిగిపారేశారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..ప్రతి వీధికీ బెల్ట్ షాపు..‘‘రాష్ట్రంలో ఒకవైపు మట్టి, ఇసుక, సిలికా, క్వార్ట్జ్, లేటరైట్ అన్నీ మాఫియానే. మరోవైపు ప్రభుత్వ ఆస్తులను వాళ్లకు నచ్చినవాళ్లకు, వాళ్ల మనుషులకు, బంధువులకు పప్పుబెల్లాలకు కట్టబెడుతున్నారు. రాజధాని పేరుతో అమరావతిలో బిల్డింగ్లు ఎస్ఎఫ్టీకి రూ.21 వేల నుంచి 22వేలు దాటింది. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, మెడికల్ కాలేజీలను శెనక్కాయలు, బఠాణీలకు అమ్మేస్తున్నారు. విలువైన భూమి ఎక్కడ కన్పించినా వదలడంలేదు. విశాఖపట్నంలో ఏ భూమినీ వదలడంలేదు. స్కాములు చేస్తున్నారు. ఇవన్నీ గాక డ్రగ్స్, గంజాయి.. బెల్ట్ షాపుల పేరిట కల్తీ లిక్కర్. ప్రతి ఊరుకు, ప్రతి వీధికి చంద్రబాబు తీసుకుపోయాడు. ఇదే రాష్ట్రంలో జరుగుతున్న పాలన. ఎస్సైలు జేమ్స్బాండ్లు అయితే.. చర్యలెందుకు?నిజంగానే ఎస్పీ చెబుతున్నట్టుగా సమాచారం మేరకు రెయిడ్ చేశారంటే.. డీఎస్పీ చెబుతున్నట్టు ఇద్దరు ఎస్సైలు వెళ్తుంటే.. రోడ్డు పక్కన ఒక వ్యక్తి అనుమాస్పదంగా కన్పిస్తే ఆరా తీస్తే గంజాయి మూట వదిలేసి పారిపోయి ఉంటే.. జేమ్స్బాండ్ 117 మాదిరిగా ఇద్దరు ఎస్సైలు ఛేజ్ చేసి ఉంటే.. వాళ్లకు నువ్వేం చేస్తావ్? శభాష్ అంటూ వాళ్లకు ప్రమోషన్ ఇచ్చి గోల్డ్ మెడల్, ప్రెసిడెంట్ మెడల్, సీఎం మెడల్, ఇంకో మెడల్ ఇచ్చేలా చేస్తావ్. కానీ అంతటి జేమ్స్బాండ్లకు వీఆర్ ఎందుకు ఇచ్చారయ్యా? నువ్వే ఒకవైపు వాళ్లు జేమ్స్బాండ్లు అంటున్నావ్.. నువ్వే మళ్లీ వాళ్లను వీఆర్ అంటున్నావ్.. చార్జీషీటు అంటున్నావ్.. యాక్షన్ అంటున్నావ్.. మళ్లీ ఇంకొక పక్కన డీఎస్పీ, ఎస్పీ అందరూ వారిని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ కేసులో గంజాయి వదిలి బైక్లో పారిపోయాడంటూ ఎవరిని ఇరికిస్తారో పాపం. ఇప్పటికే ఇరికించే కార్యక్రమాలు రాష్ట్రంలో చాలా చేస్తున్నారు.పోలీస్ వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో!నిజంగా వ్యవస్థ ఎంత దిగజారిపోయిందనేది చెప్పడానికి మరో ఉదాహరణ.. మొన్న విజయవాడలో సీఐ వేధింపులు భరించలేక వీడియో ద్వారా మరణ వాంగ్మూలం ఇస్తూ ఆత్మహత్య చేసుకున్న మాదిగ యువకుడు క్రాంతికుమార్ కుటుంబం చేస్తున్న ఆరోపణ ఏంటి? నా కొడుకు చేత చేయకూడని పనులు చేయించే ప్రయత్నం చేస్తుంటే తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. ఇంకో పిల్లాడు సాయికృష్ణ పోలీస్ స్టేషన్లోనే హత్యకు గురై బూడిద కూడా దొరకని పరిస్థితి. ఆ వ్యవహారంలో కూడా ఇలాంటి చర్చే నడుస్తోంది. నిజంగా వ్యవస్థ అన్నది ఏ స్థాయికి దిగజారిపోతుందనేందుకు ఇవన్నీ స్టాండింగ్ ఎగ్జాంపుల్స్. గ్రానైట్ మాఫియా నుంచి చినబాబు, పెదబాబుకు కలెక్షన్లుఅద్దంకి ఘటనలో వస్తున్న సమాచారం.. ఆ తర్వాత జరుగుతున్నవి చూస్తా ఉంటే.. గ్రానైట్ మాఫియా నుంచి పోలీసులే కలెక్షన్ చేసి ఎమ్మెల్యేకు ఇంత? చినబాబుకు ఇంత? పెదబాబుకు ఇంత? పంచే క్రమంలో ప్రైవేట్ పార్టీ చేసుకుంటూ మత్తులోకి వెళ్లిపోయారు. ఆ మత్తులోనే ఎస్సైలు కారులో వెళ్తూ దారిలో ఇదంతా జరిగింది. నిజంగా పోలీసుల సౌలభ్యం కోసం ఐజీలకు రాయలసీమ, కోస్తా అనే రేంజ్లు ఇస్తారు. ఫస్ట్టైమ్ ఏం చూస్తున్నామో తెలుసా? రేంజ్లుగా విభజించి సిండికేట్గా ఫామ్ అయ్యి.. కలెక్షన్ల వసూళ్లలో పాత్రధారులుగా పోలీసులే ఉండటం. ఎమ్మెల్యేల మద్దతుతో వసూళ్లు చేసి చినబాబుకు ఇంత, పెదబాబుకు ఇంత? అని ఆర్గనైజ్్డగా గంజాయి మాఫియాను నడుపుతున్నారు. కుప్పంలోనూ విచ్చలవిడిగా గంజాయి..ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పంలో గంజాయి, గుట్కా విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని స్థానిక టీడీపీ నాయకులే కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో ఇద్దరు మహిళా టీడీపీ నేతలు గంజాయి విక్రయిస్తున్నారని అదే పార్టీకి చెందిన వాళ్లు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో అధికారపార్టీకి చెందిన నేత అనుచరులు తమిళనాడులో 220 కిలోల గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారు. ఇవన్నీ నిజాలు. కుప్పం టీడీపీ నేతలు ఒరిస్సాలో గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డారు. చంద్రబాబు పాలనలో సర్వం గంజాయి మయం.. సర్వం దోపిడీ మయం.. సర్వం డ్రగ్స్ మయం.. సర్వం నకిలీ లిక్కర్ మయం..క్రమశిక్షణా చర్యలంటూ కప్పిపుచ్చడమెందుకు?» మరి ఇంత జరిగిన తర్వాత కూడా దాన్ని కవరప్ చేసేందుకు ఏంచేశారో గమనించాలి. (వీడియోలు ప్రదర్శించి వివరించారు.) డీఎస్పీ చెబుతున్న మాటలకు.. ఎస్పీ చెబుతున్న మాటలకు.. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ రిపోర్టుకు పొంతనలేదు. డీఎస్పీ, ఎస్పీ, ఎఫ్ఐఆర్లలో మూడు వేర్వేరు వెర్షన్లు చెప్పారు.» ఇద్దరు ఎస్సైలు కారులో వెళ్తుంటే.. రోడ్డు పక్కన అనుమానాస్పదంగా వ్యక్తి కన్పిస్తే.. ఆరా తీస్తే గంజాయి మూట వదిలి బైక్పై పారిపోతుండగా.. వీరిద్దరు కారులో ఛేజ్ చేసి పట్టుకునే ప్రయత్నంలో ఈ ఘటన జరిగిందని దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ చెప్పాడు.» కాదు కాదు ముందస్తుగానే సమాచారం వచ్చినందున.. ఆ సమాచారం మేరకు రెయిడ్ చేశామని ప్రకాశం జిల్లా ఎస్పీ అంటాడు. » ఎఫ్ఐఆర్ కాపీలో ఇద్దరు ఎస్సైల వాంగ్మూలం చూడండి. ఇద్దరు ఎస్సైల్లో ఒక ఎస్సై కొడుక్కి కడుపు నొప్పి వచ్చిందంట. అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి బల్లికురవ ఎస్సై పిలిస్తే.. సంతమాగులూరు ఎస్సై వెళ్లాడంట. కాంట్రడిక్షన్ చూడండి. మూడు వెర్షన్స్ ప్లే చేస్తాను చూడండి. (డీఎస్పీ, ఎస్పీ వీడియోలు ప్లే చేసి చూపించారు). » గంజాయిని సీజ్ చేశారని, వేగంగా వెళ్లే క్రమంలో ఆటోను ఢీకొట్టారని, ప్రమాదం జరగడంతో 108కు ఎస్సై ఫోన్ చేశాడని, గాయపడిన వారిని ఎస్సై అంబులెన్స్లో ఎక్కించి పంపించాడని ఎస్పీ చెప్పాడు. కానీ 108 రికార్డులో సమాచారం ఇచ్చింది స్థానికుడు అని రిపోర్టు అయ్యి ఉంది. చంద్రబాబు వచ్చాక 108 కాంట్రాక్ట్ తమ వాళ్లకే కట్టబెట్టారు. ఆ నిర్వాహకులే.. స్థానికుడు సమాచారం ఇచ్చినట్టు 108 పేషెంట్ కేర్ రికార్డులో పేర్కొన్నారు. » ఎస్సైలు ఆ రోజు మత్తులో కారులో వెళ్తూ ఆటోను ఢీకొట్టారు. ఆటోలో ఉన్న వారు గాయాలతో ఆసుపత్రిపాలయ్యారు. కారు నడుపుతున్న ఎస్సై, వెనుక సీట్లో కూర్చున్న ఇద్దరు ఎస్సైలు మత్తులో ఉన్నారు. ఎస్సైలు ప్రయాణిస్తున్న ఆ కారులో గంజాయి ఉంది. లిక్కర్ బాటిల్ ఉంది. పోలీస్ యూనిఫాం ఉంది. » ఇన్ని కన్పిస్తుంటే.. వాళ్లను డీఎస్పీ రక్షించేందుకు ప్రయత్నం చేస్తాడు.. తప్పుడు వాగ్మూలం ఇస్తాడు. వీడియోలు తీసినప్పుడు సీఐ బెదిరిస్తాడు.. వీడియోలు తీయొద్దని. వీడియోలు, ఫొటోలు తీస్తే అరెస్టు చేస్తానని బెదిరిస్తాడు. ఐపీఎస్ చేసిన ఎస్పీ కూడా గంజాయి తరలిస్తున్న ఎస్సైలను ప్రొటెక్ట్ చేయాలని తప్పుడు వాంగ్మూలం ఇస్తున్నాడు. » పోలీసులే గంజాయితో దొరకడం అన్నది క్షమించరాని నేరం. బాధ్యతగల గవర్నమెంట్.. బాధ్యత గల డిపార్టుమెంట్.. బాధ్యతగల పోలీసు ఆఫీసర్లు చేయాల్సిన పని ఏంటంటే.. ఇలాంటి పనులు చేసే పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి. డిస్మిస్ చేయాలి. జైలులో పెట్టాలి. తప్పు చేస్తే ఇలా జరుగుతుంది అనే సంకేతాన్ని పంపించాలి. కానీ చంద్రబాబూ నువ్వేం చేస్తున్నావ్ ఆ ఎస్సైలను కాపాడేందుకు తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు ఆధారాలు అన్నీ బిల్డ్ చేస్తా ఉన్నావ్. ఇవన్నీ చూస్తుంటే నిజంగా ప్రజలకు ఏమనిపిస్తుంది? అంతా కలిసికట్టుగా రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారు.. గంజాయి ఆంధ్రప్రదేశ్గా తయారు చేస్తున్నారు.. అని ప్రజలకు సంకేతాలు ఇవ్వడం కాదా? ఇలా జరుగుతోంది రాష్ట్రంలో పరిపాలన.పోలీసులే వాటాదారులుగా గంజాయి మాఫియా..!మొన్న ప్రకాశం జిల్లా అద్దంకిలో జరిగిన ఘటన నిజంగా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి ఓ ఊదాహరణ. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ వ్యవస్థతోనే.. అక్రమాలను అడ్డుకోవాల్సిన పోలీసు వ్యవస్థతోనే.. దగ్గరుండి వారిని కూడా వాటాదారులుగా చేస్తూ.. డ్రగ్స్, గంజాయి మాఫియాను ఆ స్థాయికి తీసుకుపోతే ప్రజలు ఇక ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఎవరిని నమ్మాలి? అద్దంకి ఘటనలో తాజా సమాచారం ప్రకారం మత్తులో ఉన్న ఒక ఎస్సై కారు నడిపితే మరో ఇద్దరు ఎస్సైలు మత్తులో వెనుక సీట్లో కూర్చున్నారు. ఆ కారుతో ఒక ఆటోని ఢీకొట్టడం.. యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ కారును ప్రజలు చుట్టుముట్టడం.. అందులోనివారంతా మత్తులో ఉండడాన్ని ప్రజలు చూడటం.. వెనక సీటులో, డిక్కీలో గంజాయి, లిక్కర్, పోలీస్ యూనిఫామ్ దొరకడం.. ఇదంతా చూసి ప్రజలు షాక్కు గురయ్యారు. మనం నిజంగా ఏపీలో ఉన్నామా? లేక కొలంబియాలో ఉన్నామా? అని అన్పిస్తోంది. రాష్ట్రంలో ఈ పరిస్థితులు చూసి ప్రతీ ఒక్కరు కూడా ఆందోళన చెందారు. గ్రామస్తులు ఆ ఘటనను వీడియోలు తీస్తుంటే సీఐ వచ్చి బెదిరించాడు. వీడియో తీస్తే జైలులో పెడతా అన్నాడు. (ఈ ఘటనను వీడియో, ఫొటోలతో వైఎస్ జగన్ వివరించారు).మా హయాంలో.. ఉక్కుపాదం మోపాం..ప్రత్యేకంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్) పెట్టి గంజాయి, డ్రగ్స్పై మా హయాంలో ఉక్కుపాదం మోపాం. 11,550 ఎకరాల్లో గంజాయి పంట ధ్వంసం చేశాం. 4.50కోట్ల గంజాయి మొక్కలు తొలగించాం. 13,210 మందిని అరెస్టు చేశాం. 2,950 వాహనాలను జప్తు చేశాం. పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకుని గంజాయి రవాణా రూట్లన్నీ బ్లాక్ చేశాం. ఏజెంట్ల మాయలో పడి.. వారు చెప్పినట్టుగా గంజాయి సాగు చేస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్న ట్రైబల్స్ను గుర్తించి ఆపరేషన్ పరివర్తన్, ఆపరేషన్ నవోదయం కార్యక్రమాలు అమలు చేశాం. రూ.144కోట్లు ఖర్చు చేసి ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రోత్సహించాం. దాదాపు 3లక్షల ఎకరాలకుపైగా పోడు భూములు గిరిజనులకు పంచిపెట్టాం. ఈ రోజు టోటల్ రివర్స్. పోలీసుల చేతనే గంజాయి వ్యాపారం చేయిస్తూ, వారిని భాగస్వాములను చేస్తూ టీడీపీ నాయకులు అందరూ కలిసి చేస్తున్న మాఫియా సామ్రాజ్యం. -
రాఖీ పౌర్ణమి.. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సందడే సందడి (ఫొటోలు)
-
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రాఖీ పౌర్ణమి సందడి
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రాఖీ పౌర్ణమి సందడి నెలకొంది. రాఖీ పౌర్ణమి సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని పలువురు మహిళలు, మాజీ ప్రజాప్రతినిధులు కలిసి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్కు రాఖీలు కట్టిన మహిళలు ఆయనకు స్వీట్లు తినిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలు, ఆప్యాయతలకు ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి సందర్భంగా వైఎస్ జగన్ను కలిసి రాఖీ కట్టడం ఆనందంగా ఉందని వారు పేర్కొన్నారు. తనను ఆప్యాయంగా కలిసి రాఖీలు కట్టిన మహిళలకు వైఎస్ జగన్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. వారితో కొద్దిసేపు ఆత్మీయంగా మాట్లాడి, వారి కుటుంబ సభ్యుల క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని ప్రతి అక్కాచెల్లెమ్మ ఆనందంగా, సురక్షితంగా ఉండాలని, వారి కుటుంబాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.ఇదీ చదవండి: పోలీసులే ఇలా ఉంటే ప్రజలు ఇంక ఎవరిని నమ్మాలి?: వైఎస్ జగన్ -
పోలీసులే ఇలా ఉంటే ప్రజలు ఇంక ఎవరిని నమ్మాలి?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: కూటమి పాలనలో ఓ వైపు తప్పుడు కేసులు, వేధింపులు కొనసాగుతుంటే.. మరోవైపు రకరకాల మాఫియాలు నడుస్తున్నాయని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. బుధవారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో యథేచ్ఛగా నడుస్తున్న దందాల గురించి మాట్లాడారు.రాష్ట్రంలో అంతా మాఫియానే కనిపిస్తోంది. అమరావతి పేరుతో బిల్డింగ్ల స్కామ్ నడుస్తోంది. విలువైన భూములను కొల్లగొడుతున్నారు. వీటికి తోడు విచ్చలవిడిగా డ్రగ్స్, గంజాయి, బెల్ట్ షాపులు అందునా కల్తీ మద్యం రాష్ట్రంలో ప్రతీ చోటా కనిపిస్తోంది. ప్రకాశం జిల్లా అద్దంకిలో జరిగిన ఘటన మరీ దారుణమని వైఎస్ జగన్ అన్నారు. శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో చెప్తోంది.ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే అక్రమాలకు పాల్పడుతున్నారు. వాటిల్లో వాటాదారులుగా మారిపోతున్నారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో.. మత్తులో పోలీసులే యాక్సిడెంట్ చేసి ప్రజలకు పట్టుబడ్డారు. కారులో గంజాయి, లిక్కర్, ఖాకీ యూనిఫాం దొరికాయి. డ్రైవర్తో సహా మరో ఇద్దరూ పోలీసులు మత్తులోనే ఉన్నారు. సీఐ వచ్చి వీడియోలు తీసే జనాల్ని తీయొద్దని బెదిరించారు. అలాంటప్పుడు ప్రజలు ఎవరికి ఫిర్యాదు చేయాలని, ప్రజలు ఎవరిని నమ్మాలి? అని వైఎస్ జగన్ నిలదీశారు.పైగా అద్దంకి ఘటనను కవర్అప్ చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. పోలీసు అధికారులు ఒక్కొక్కరు ఒక్కోలా ప్రకటనలు చేశారు. వాళ్ల మాటలకు ఎఫ్ఐఆర్కు పొంతనే లేదు(ఈ సందర్భంగా దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ, ప్రకాశం ఎస్పీ హర్షవర్ధనరాజుల వేర్వేరు స్టేట్మెంట్ల వీడియోలను ప్రదర్శించారు). ఇలాంటి పోలీసులను జైలుకు పంపకుండా.. తప్పుడు సాక్ష్యాలతో కాపాడాలని చూస్తున్నారు. కూటమి పాలనలో అద్దంకి ఘటనే కాదు.. కృష్ణలంక సాయికృష్ణ, విజయవాడ క్రాంతికుమార్ కేసులు ఈ వ్యవస్థలు ఎంతగా దిగజారిపోయాయో చెబుతున్నాయని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.వైఎస్సార్సీపీ హయాంలో గంజాయిని కట్టడి చేశాం. గంజాయి కేసుల్లో 13,210 మంది అరెస్ట్ చేశాం. 11 వేల ఎకరాల్లో గంజాయి పంటల్ని ధ్వంసం చేశాం.ఆపరేషన్ పరివర్తన్ పేరుతో గిరిజనులను గంజాయి సాగుకి దూరం చేశాం. ప్రత్యేకంగా ఎస్ఐబీని ఏర్పాటు చేశాం అని వైఎస్ జగన్ గుర్తు చేశారు. ఇప్పుడు.. చంద్రబాబు పాలనలో సర్వం దోపిడీ మయం.. గంజాయి మయం. కూటమి పాలనలో అందరూ కలిసి దందాలు చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేలకు ఇంత, చినబాబు.. పెదబాబుకి ఇంత అని వాటేలేసుకుంటున్నారు. చంద్రబాబు హయాంలో ఒకే ఒక పంటకు గిట్టుబాటు ధర లభిస్తోంది.. అది గంజాయే అని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు.ఇదీ చదవండి: కోర్టులకు వెళ్లేది చంద్రబాబే.. వద్దని చెప్పేది బాబే! -
కోర్టులకు వెళ్లేది చంద్రబాబే.. వద్దని చెప్పేది బాబే: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో బీసీ రిజర్వేషన్లపై కోర్టులకు వెళ్లేది చంద్రబాబే.. వద్దని చెప్పేది బాబే. కోర్టుకు వెళ్లొద్దని దొంగ ఏడుపులు ఏడ్చేది చంద్రబాబే అని మండిపడ్డారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. బీసీల అభ్యున్నతికి నిజాయితీగా కృషి చేసింది వైఎస్సార్సీపీనే. మా కేబినెట్లో 11 మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చామని వైఎస్ జగన్ వెల్లడించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో మేం ఎన్నికలకు వెళ్లాం. సుప్రీంకోర్టు, హైకోర్టులో చంద్రబాబు కేసులు వేయించారు. కోర్టులకు వెళ్లేది చంద్రబాబే.. వద్దని చెప్పేది బాబే. కోర్టుకు వెళ్లొద్దని దొంగ ఏడుపులు ఏడ్చేది చంద్రబాబే. బీసీల అభ్యున్నతికి నిజాయితీగా కృషి చేసింది మేమే. మా కేబినెట్లో 11 మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చాం. 40 శాతం మంత్రి పదవులు బీసీలకే ఇచ్చాం. 11 రాజ్యసభ సీట్లలో నలుగురు బీసీలను పంపింది మేమే. రెండు డిప్యూటీ సీఎం పదవులు కూడా బీసీలకే ఇచ్చాం.అలాగే, 13 జెడ్పీ చైర్మన్ సీట్లలో ఆరు బీసీలకే ఇచ్చాం. 13 మేయర్ స్థానాల్లో బీసీలకే 9 ఇచ్చాం. 636 ఎంపీపీ స్థానల్లో బీసీలకే 239 ఇచ్చాం. 84 మున్సిపల్ చైర్మన్ స్థానాల్లో 44 బీసీలకే ఇచ్చాం. 196 ఏఎంసీ చైర్మన్ స్థానాల్లో బీసీలకే 76 ఇచ్చాం. ఇవ్వన్నీ చట్టం చేసి మరీ ఇవ్వడం వైఎస్సార్సీపీకే సాధ్యపడింది. బీసీలకు చట్ట సభల్లో 50 శాతం కేటాయించాలని పార్లమెంట్లో ప్రైవేటు బిల్లు పెట్టించాం. బీసీ కులగణన కోసం అసెంబ్లీలో తీర్మానం చేశాం. వివిధ పథకాల ద్వారా డీబీటీ పద్దతిలో ఇచ్చాం. రూ.లక్షా 30వేల కోట్లు బీసీలకు అందజేశాం.బీసీల బతుకులను చంద్రబాబు బుగ్గిపాలు చేశాడు. మా హయాంలో అమలైన పథకాలను రద్దుచేశాడు. మేనిఫెస్టో హామీలను చెత్తబుట్టలో వేశాడు. రాజకీయంగా ఎదిగే బీసీలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. యాక్సిడెంట్ కేసును హత్యాయత్నం కేసుగా మార్చి సీదిరి అప్పలరాజును జైలులో పెట్టించారు. ఓ మహిళా ఎస్ఐను అడ్డుపెట్టుకుని చింతాడ రవిని అక్రమంగా జైలుకు పంపారు. కర్నూలులో టీడీపీ కార్యకర్తలు దాడులు చేస్తే విరూపాక్షిపై తప్పుడు కేసులు పెట్టారు’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. -
మదర్ థెరీసాకు వైఎస్ జగన్ నివాళి
తాడేపల్లి : మహనీయురాలు మదర్ థెరీసా జయంతి సందర్భంగా ఆమెకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నివాళి అర్పించారు. మానవత్వానికి ప్రతిరూపం మదర్ థెరిసా అని, ఆమె జయంతి సందర్భంగా ఆమెను స్మరించుకుందామని అన్నారు. ప్రేమ, కరుణ, నిస్వార్థ సేవతో తన జీవితాన్ని పేదలు, నిరాశ్రయులు, అనాథలు, అభాగ్యుల సేవకే అంకితం చేశారని పేర్కొన్నారు. ఎంత చిన్న పని అయినా మనిషి జీవితంలో గొప్ప మార్పును తీసుకురాగలదని ఆమె జీవితం మనకు చాటి చెబుతుందన్నారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం, అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడమే థెరిసాకు మనం అందించే నిజమైన నివాళి అని జగన్ పేర్కొన్నారు. మదర్ థెరిసా స్ఫూర్తితో ప్రేమ, దయ, సేవాభావాన్ని మన జీవితంలో భాగం చేసుకుందామని వైఎస్ జగన్ పేర్కొన్నారు. On the birth anniversary of Mother Teresa, we remember her life of love, compassion, and selfless service. Her legacy reminds us that even the smallest act of kindness can make a lasting difference. Let us honour her memory by caring for those around us. pic.twitter.com/Qfqvt4fdBH— YS Jagan Mohan Reddy (@ysjagan) August 26, 2026 -
వైఎస్ జగన్ ప్రెస్మీట్ హైలైట్స్..
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు. రైతులను పట్టించుకోకుండా చంద్రబాబు.. కుంభకర్ణుడిలా వ్యవహరిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా డ్రగ్స్, గంజాయి, బెల్ట్ షాపులు.. కల్తీ లిక్కర్ ప్రతీ ఊరికీ వ్యాపించింది. ఇందుకు అద్దంకి ఘటనే శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో చెప్తోందన్నారు. బీసీ రిజర్వేషన్లపై కోర్టులకు వెళ్లింది చంద్రబాబు.. అడ్డుకుందీ చంద్రబాబే.. మళ్లీ దొంగ ఏడుపులు ఆయనవే అని ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరువు తీవ్రత, ప్రభుత్వ నిర్లక్ష్యం, బీసీ రిజర్వేషన్లు, గంజాయి సమస్యలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి సర్కార్ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. వైఎస్ జగన్ ప్రెస్మీట్ హైలైట్స్..డీఎస్సీ అక్రమాలపై సవాల్ విసిరితే ఇప్పటి వరకు స్పందించలేదు.చంద్రబాబు సహా ఎవరూ స్పందించలేదు.రాష్ట్రంలో కరువు తీవ్రంగా ఉంది.ఏపీలో లోటు వర్షపాతం ఉంది.తీవ్ర కరువు పరిస్థితులు కనిపిస్తున్నా సీఎం చంద్రబాబు స్పందించడం లేదు.జూన్ నుంచి ఇప్పటి వరకు 52 శాతం లోటు వర్షపాతం ఉంది. ఏ జిల్లాలో చూసినా లోటు వర్షపాతమే ఉంది.చంద్రబాబు తీరు కుంభకర్ణుడి మాదిరిగా ఉంది.బాబు నిద్ర నటిస్తున్నారు తప్ప రైతులకు మంచి చేసే కార్యక్రమం చేపట్టలేదు.ఇప్పటి వరకు 189.62 మి.మీ మాత్రమే వర్షపాతం నమోదు.688 మండలాలకు 625 మండలాల్లో లోటు వర్షం ఉంది.కోస్తాలోనూ కరువు ప్రభావం ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో 91 శాతం లోటు వర్షపాతం ఎదుర్కొంటోంది.28 జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే కనిపిస్తోంది.ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తర్వాత జూలై 10న పంటలకు నీళ్లిస్తామని ఫొటోలకు ఫోజులిచ్చారు.రైతులంతా పెట్టుబడులు పెట్టి అష్టకష్టాలు పడుతున్నారు. మంత్రులు పబ్లిక్ స్టంట్లు వేస్తున్నారు. శ్రీశైలం ఖాళీ.. వీళ్లు నీళ్లు ఇస్తారనే నమ్మకంతో రైతులు ముందుకెళ్లారు.ప్రతీ ఎకరాకు రైతుకు రూ.15వేల నష్టం.ఎల్నినో ఎఫెక్ట్ ఉందని తెలిసినా ప్రభుత్వం మేల్కోలేదు.పత్రీ ఎకరాకు చివరి వరకు నీరిస్తామని గొప్పలు చెప్పారు.ఒకవైపు వర్షాలు లేక సంక్షోభం వచ్చింది.మరోవైపు.. చంద్రబాబు మానవత్వం లేదకుండా వ్యవహరిస్తున్నారు.ఆగస్టు 11న శ్రీశైలం నీటిమట్టం 880 అడుగులు.అవకాశమున్నా పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికి బాబుకు చేతులు రాలేదు.854 అడుగులకు నీటి మట్టం తగ్గితే సీమకు నీరు రాదు.ప్రస్తుతం 7000 క్యూసెక్కులు మాత్రమే ఇన్ఫ్లో ఉంది.శ్రీశైలం నుంచి ఎడాపెడా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.సెప్టెంబర్ 15వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఇదే పరిస్థితి కొనసాగితే నీటి మట్టం 854 అడుగులకు చేరుతుంది.ఆ తర్వాత రాయలసీమకు నీరిచ్చే అవకాశం ఎలా ఉంటుంది??సీమ ప్రాజెక్ట్ల కెపాసిటీ 180 టీఎంసీలు.. ప్రస్తుతం 55.56 టీఎంసీలు.సీమ ప్రజలకు 23 శాతమే నీరు అందుబాటులో ఉంది.నాగార్జున సాగర్ కుడి కాల్వ నుంచి చుక్కనీరు ఇవ్వడం లేదు.నాగార్జున సాగర్ కింద పులిచింతల ప్రాజెక్ట్ ఉంది.పులిచింతల దిగువన తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్ట్లు నిర్మిస్తున్నా పట్టించుకోవడం లేదు.తెలంగాణలో మహాత్మగాంధీ ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ నిర్మాణం వేగంగా జరుగుతోంది.రాజీవ్ ఎత్తిపోతల పథకం పనులు కూడా వేంగా జరుగుతున్నాయి.అయినా చంద్రబాబు చోద్యం చూస్తున్నారు. చంద్రబాబు ఆదుకున్నాడా?కరువు ఉన్నా ప్రజలు, రైతులను చంద్రబాబు ఆదుకున్నాడా?.వైఎస్సార్సీపీ ఉచిత పంటల బీమా పథకాన్ని కూడా రద్దు చేశారు.2023లో 1.18 కోట్ల ఉచిత పంటల బీమా దరఖాస్తులు వస్తే2026-27లో కేవలం 40 లక్షల దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.స్వయంగా ఈ గణాంకాలను కేంద్రమే వెల్లడించింది.అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ప్రభుత్వం బీమా కట్టలేదు.రైతులకు రూ.3000 కోట్ల నష్టం జరిగింది.2025 అక్టోబర్లో మోంథా తుపాను వచ్చింది.రైతులకు ఇప్పటికీ ఒక్క పైసా ఇవ్వలేదు.ఉచిత పంటల బీమాను చంద్రబాబు నాశనం చేశారు చంద్రబాబు దగ్గర రైతులను ఆదుకునే ప్లాన్ ఏమైనా ఉందా?.డైవర్షన్, రెడ్బుక్పై ఉన్న ధ్యాస.. బాబుకు రైతులపై లేదు.రైతులకు ప్రత్యామ్నాయం ఎందుకు చూపించలేదు??రైతులకు ఉచిత విత్తనాలు ఎందుకు ఇవ్వలేదు.ఏ పంటకూ గిట్టుబాటు ధర లేకుండా చేశారు. బీసీ రిజర్వేషన్లపై కామెంట్స్.. 2019లో మేం వచ్చిన తర్వాత జీవో నంబర్-176 ఇచ్చి బీసీలకు 34శాతం రిజర్వేషన్లు ఇచ్చి, ఎన్నికలకు సిద్ధం అయ్యాం.కానీ, చంద్రబాబు, తన పార్టీ నాయకుడు, తన గవర్నమెంట్లో అప్పట్లో, AP State Employment Guarantee Councilలో అప్పటి సభ్యుడు బిర్రు ప్రతాపరెడ్డి ద్వారా హైకోర్టులోనూ, సుప్రీంకోర్టులోనూ కేసు వేయించాడు.సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రిజర్వేషన్లు 50శాతం దాటుతున్నందుకు బీసీలకు 34శాతం కొట్టేస్తున్నామని హైకోర్టు తీర్పు ఇచ్చింది.హైకోర్టులు, సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని తెలిసి, ఇదే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసిందని తెలిసి కూడా మరోసారి మహా డ్రామాకు చంద్రబాబు దిగాడు.మళ్లీ కోర్టుకు పోయి అడ్డుకోవద్దంటూ కపటనాటకాలు ఆడుతున్నాడు. కోర్టుకు పోయేది ఆయనే, కొట్టివేయించేదీ ఆయనే, మళ్లీ దొంగ ఏడుపులు ఏడ్చేదీ ఆయనే.బీసీల అభ్యున్నతి విషయంలో ఛాంపియన్ ఎవరైనా ఉన్నారంటే.. అది కేవలం వైఎస్సార్సీపీ మాత్రమే.రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వారి తలరాతలను మార్చే విప్లవాత్మక సంస్కరణలు ఆ ఐదేళ్లలో మేం తీసుకు వచ్చాం.కోర్టులు కొట్టేసినా, బీసీలకు ఆమేరకు రాజకీయంగా ప్రోత్సాహం ఇవ్వాలని మాకు మేముగా నిర్ణయం తీసుకుని, 34శాతమే కాదు, అంతకంటే ఎక్కువ పదవులు ఇచ్చి, మా చిత్తశుద్ధిని చాటుకున్నాం.మా కేబినెట్లో 25 మంది ఉంటే, అందులో 11 మంది బీసీలే. అంటే దాదాపు 40 శాతం మంత్రిపదవులు బీసీలకే.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సామాజిక వర్గాలకు డిప్యూటీ సీఎం పదవులు ఇస్తే, ఇందులో రెండు డిప్యూటీ సీఎం పదవులు బీసీలకే ఇచ్చాం.మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర కోటాలో భర్తీ అయిన 11 రాజ్యసభ స్థానాల్లో నలుగురు బీసీలను ఈ జగన్ రాజ్యసభకు పంపారు.అంటే దాదాపు 36 శాతం ప్రాతినిధ్యం. చంద్రబాబు 2014-19 మధ్య ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదు.25 లోక్సభ సీట్లలో 11 బీసీలకే అంటే 44 శాతం బీసీలకే ఇచ్చాం.58 ఎమ్మెల్సీల్లో 28 బీసీలకే ఇచ్చాం. 13 జిల్లా పరిషత్ ఛైర్మన్ పదువులు ఉంటే, 6 అంటే 46శాతం బీసీలకే13 మేయర్ పదవుల్లో, 9 అంటే, 69శాతం బీసీలకే.636 ఎంపీపీ స్థానాల్లో, 239 అంటే 38 శాతం బీసీలకేమున్సిపల్ చైర్మన్ పదవులు 84లో, 44 అంటే ౫౩శాతం బీసీలకే639 జడ్పీటీసీల్లో, 227 అంటే, 36శాతం బీసీలకే8,239 ఎంపీటీసీల్లో, 3,361 అంటే, 41 శాతం మంది బీసీలే.10,536సర్పంచుల్లో దాదాపు ౪వేల మంది బీసీలే. అంటే 38శాతం వారికే.AMC చైర్మన్ పదవులు 196లో 76 అంటే 39శాతం బీసీలకేప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్ పదవులు 137లో, 53 బీసీలకు ఇచ్చాం. అంటే 37% ఇచ్చాం.139 బీసీ కులాలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం.ఇన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని కలలో కూడా చంద్రబాబుకు ఆలోచన రాలేదు. చట్టం చేసి మరీ.నామినేటెడ్ పదవుల్లో 50 శాతం, నామినేటెడ్ పనులు–కాంట్రాక్టుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చాం.ఇందులో మహిళలకు కూడా 50% వాటా ఉండే విధానం మేం తీసుకు వచ్చాం. దేశంలోనే ఇది తొలిసారి.అంతేకాదు బీసీలకు చట్టసభల్లో 50 శాతం సీట్లు కేటాయించాలని కోరుతూ పార్లమెంటులో వైఎస్సార్సీపీ ఎంపీలతో ప్రైవేట్ బిల్లు పెట్టించాం.కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ, ప్రత్యేక బడ్జెట్ కోసం కూడా డిమాండ్ చేశాం.అలాగే బీసీ కులగణన కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాం.వివిధ డీబీటీ పథకాల ద్వారా బీసీల ఖాతాల్లోకి నేరుగా రూ.1.30లక్షల కోట్లు పంపించాం.కాని ఇప్పుడు చంద్రబాబు బీసీల బతుకుల్ని బుగ్గిపాలు చేస్తున్నాడు. మా పథకాలన్నింటినీ ధ్వంసం చేశాడు.పైగా రాజకీయంగా బీసీల ఎదుగుదలను ఓర్చుకోలేక వారిమీద అక్రమకేసులు పెట్టి, జైల్లో పెట్టే కార్యక్రమం చేస్తున్నాడు.యాక్సిడెంట్ కేసును హత్యాయత్నం కేసుగా మార్చి మాజీ మంత్రి, మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన సీదిరి అప్పలరాజును జైల్లోపెట్టాడు.ఒక మహిళా ఎస్సైను అడ్డుపెట్టుకుని, జరగని దాన్ని జరిగినట్టుగా చూపించి, తప్పుడు కేసులు పెట్టి, ఆముదాలవలస నియోజకవర్గ పార్టీ సమన్వయ కర్త చింతాడ రవికుమార్ను జైలుకు పంపాడు.టీడీపీ కార్యకర్తలే దాడులు చేస్తే, పైగా తప్పుదోవ పట్టించడానికి అదే టీడీపీ కార్యకర్తచేత ఏకంగా ఆయన భార్య దుస్తులను చింపివేయించి, అదిచేసింది ఎమ్మెల్యే, అతని అనుచరులు అని చెప్పి, ఆలూరు ఎమ్మెల్యే, బోయ సామాజిక వర్గానికి చెందిన విరూపాక్షిపై కేసులు పెట్టి జైల్లోపెట్టారు.యాదవ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వర్రావు, ఆయన కొడుకు కారుమూరి సునీల్ను అన్యాయంగా తప్పుడు కేసుల్లో జైలుకు పంపాడు.మరి చంద్రబాబుకు బీసీలమీద ప్రేమ ఉందంటే ఎవరైనా నమ్ముతారా?గంజాయిపై కామెంట్స్..రాష్ట్రంలో అంతా మాఫియానే కనిపిస్తోంది.మట్టి, శాండ్, లిక్కర్ మాఫియా నడుస్తోంది.విచ్చలవిడిగా డ్రగ్స్, గంజాయి, బెల్ట్ షాపులు.కల్తీ లిక్కర్ ప్రతీ ఊరికీ వ్యాపించింది.అద్దంకి ఘటనే శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో చెప్తోంది.రక్షణ కల్పించాల్సిన పోలీసులే అక్రమాలు చేస్తున్నారు.ప్రజలు ఎవరిని నమ్మాలి.. ఎవరికి ఫిర్యాదు చేయాలి?.మత్తులో కారు నడిపింది కూడా మరో ఎస్ఐ అని తెలుస్తోంది.డ్రైవర్తో సహా మరో ఇద్దరు పోలీసులు కూడా మత్తులో ఉన్నారు.వీడియో తీసిన గ్రామస్తులను సీఐ బెదిరించారు.రాష్ట్రంలో పరిస్థితులు చూసి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.డీఎస్పీ, ఎస్పీ మాటలు.. ఎఫ్ఐఆర్కు పొంతన లేదు.ఎవరో గంజాయి వదిలి పరారయ్యాడని డీఎస్పీ అన్నారు.సమాచారం మేరకే దాడులు చేశామని ఎస్పీ చెప్పుకొచ్చారు.ఎఫ్ఐఆర్ కాపీ మాత్రం దీనికి భిన్నంగా ఉంది.పోలీసులే గంజాయితో దొరకడం క్షమించరాని నేరం.ఇలాంటి పోలీసులను జైలుకు పంపాలి.కానీ, తప్పుడు సాక్ష్యాలతో కాపాడాలని చూశారు.రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా చేస్తున్నారు.నిజంగా పోలీసులు ఛేజ్ చేసి దొంగలను పట్టుకుంటే వీఆర్కి పంపి ఎందుకు చర్యలు తీసుకున్నారు?. -
మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: నేడు మిలాద్-ఉన్-నబీ. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా..‘ప్రేమతో మనసులు గెలవాలనీ.. కరుణతో కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవాలనీ.. క్షమ, సహనం, సోదరభావాలతో శాంతియుత సమాజాన్ని నిర్మించాలనీ.. మహ్మద్ ప్రవక్త మానవాళికి అందించిన సందేశం సదా అనుసరణీయం. మహ్మద్ ప్రవక్త జన్మదినమైన మిలాద్-ఉన్-నబీ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని పోస్టు చేశారు. ప్రేమతో మనసులు గెలవాలని.. కరుణతో కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవాలని.. క్షమ, సహనం, సోదరభావాలతో శాంతియుత సమాజాన్ని నిర్మించాలని మహ్మద్ ప్రవక్త మానవాళికి అందించిన సందేశం సదా అనుసరణీయం. మహ్మద్ ప్రవక్త జన్మదినమైన మిలాద్-ఉన్-నబీ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ…— YS Jagan Mohan Reddy (@ysjagan) August 26, 2026 -
స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే విజయం మనదే... వైఎస్సార్సీపీ శ్రేణులకు వైఎస్ జగన్ దిశా నిర్దేశం
-
నేడు వైఎస్ జగన్ ప్రెస్మీట్
సాక్షి,అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ బుధవారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. సమకాలీన అంశాలపై ఆయన మాట్లాడనున్నారు. -
ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎన్నికలు జరిగితే.. 'మనదే విజయం'
రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలు మన వైపు ఉన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా.. నిష్పక్షపాతంగా జరిగితే వెన్నుపోటు పార్టీ కూటమికి ఘోర పరాజయం తప్పదు. ఇటీవల కొన్ని స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో చంద్రబాబు ఏ విధంగా దౌర్జన్యం చేశారో ప్రత్యక్షంగా చూశాం. అందుకే మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. కార్యకర్తల కోసం మనం గట్టిగా పని చేయాలి. అధికార పక్షం వాళ్లు ఎంత దౌర్జన్యం చేసినా, మా నాయకుడు నాతో ఉన్నాడన్న నమ్మకాన్ని కార్యకర్తలకు కల్పించాలి. అలా చేస్తేనే, రేపు వారు ఎన్నికల్లో మీకు తోడుగా నిలబడతారు. స్థానిక సంస్థల పదవులకు సంబంధించి ప్రత్యక్ష ఎన్నికలకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. అది ఒక విధంగా మనకు మంచిదే. ఒక బలమైన అభ్యర్థి అక్కడ నిలబడితే, మిగిలిన స్థానాలపై అతడు దృష్టి పెట్టొచ్చు. పోటీలో గట్టిగా నిలబడతాడు. ఆ బలమైన అభ్యర్థి.. మిగిలిన చోట్ల బలాన్ని ఇవ్వాలి. అలాగే అతడు సూపర్విజన్ కూడా చేయాలి. పార్టీ, ఇతర ప్రజా ప్రతినిధుల పర్యవేక్షణ, బలం లాభిస్తుంది. ఇలా చేయగలిగితే మన గెలుపు ఖాయం.మీ నియోజకవర్గాల్లో.. ఎక్కడా కూడా మన పార్టీ అభ్యర్థి పోటీ చేయని పరిస్థితి రాకూడదు. ఎక్కడైనా ఏకగ్రీవ ఎన్నిక జరిగితే ఇక నన్ను అడగాల్సిన పని లేదు. మీరు ఆ తర్వాత ఎన్నికల్లో నిలబడరు. అంటే, టికెట్ దక్కదు. అందుకే పరిస్థితులు ఎలా ఉన్నా, స్థానిక ఎన్నికల్లో ప్రతిచోటా మనం అభ్యర్థులను నిలపాలి. మన కార్యకర్తలకు తోడుగా నిలబడి పోరాడాలి.స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పార్టీ రూపొందించిన మెటీరియల్ (బుక్లెట్) ‘వెన్నుపోటు పార్టీ ృ వెన్నుపోటు పాలన’ అనేది ప్రతి ఊళ్లో, ప్రతి ఇంటికి వెళ్లాలి. మన పాలన, చంద్రబాబు పాలన మధ్య తేడా చెప్పాలి. దాదాపు 15 లక్షల గుర్తింపు కార్డులు సిద్ధం అవుతున్నాయి. జిల్లా, నియోజకవర్గాలు, మండల స్థాయిలో ఈ కార్డుల పంపిణీ జరుగుతుంది. బుక్లెట్ మెటేరియల్ కూడా మీకు అందుతుంది. ఇవన్నీ క్యూఆర్ కోడ్ ద్వారా అందుబాటులో ఉంటాయి కాబట్టి.. ప్రతి ఒక్కరూ తమ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలి.ఈ రెండున్నరేళ్ల చంద్రబాబు పాలన చూస్తే.. అంతా మోసం, దగా కనిపిస్తోంది. గత ఎన్నికల ముందు చంద్రబాబు ఏమన్నారు? జగన్ ఇచ్చేవి కాకుండా, అంతకు మించి ఇస్తామన్నాడు. అమ్మ ఒడి మనం ఒకరికి ఇస్తే, ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఆ పథకం ఇస్తానన్నాడు. ప్రతి ఇంటికి బాండ్లు పంపారు. చంద్రబాబు, పవన్ ఇద్దరూ దానిపై సంతకాలు చేశారు. ఏ పథకం ద్వారా ఆ ఇంట్లో ఎంత లబ్ధి కలుగుతుంది.. అని లెక్కలు చెప్పి నమ్మించారు. మన కంటే మూడింతలు ఎక్కువ ఇస్తామన్నారు. తీరా ఏమీ చేయకుండానే అన్నీ ఇచ్చేశామని చెప్పుకుంటున్నారు. ఇందుకు సమాధానం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తే వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించడం తథ్యమని, వెన్నుపోటు పార్టీ కూటమి ఘోర పరాజయం పొందడం ఖాయమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల కొన్ని స్థానిక సంస్థల ఎన్నికల ఉప ఎన్నికల్లో చంద్రబాబు ఏ విధంగా దౌర్జన్యం చేశారో చూశామన్నారు. కార్పొరేషన్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఏమేం చేశారో? ఎన్ని దౌర్జన్యాలు చేశారో? ప్రత్యక్షంగా చూశామంటూ ఎత్తిచూపారు. అందుకే రానున్న స్థానిక ఎన్నికల్లో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని పార్టీ నేతలకు ఉద్బోధించారు. ‘కార్యకర్తల కోసం మనం గట్టిగా పని చేయాలి.. అధికార పక్షం వాళ్లు.. చంద్రబాబు ఎంత దౌర్జన్యం చేసినా, మాకు మా నాయకుడు ఉన్నాడు అనే భావన, నమ్మకం మీరు కార్యకర్తల్లో కల్పించాలి. అలా చేస్తేనే, రేపు ఎన్నికల్లో వారు మీకు తోడుగా నిలబడతారు’ అని తేల్చి చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధతపై పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలతో వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారికి దిశానిర్దేశం చేశారు. వెన్నుపోటు పార్టీ కూటమి రెండేళ్ల పాలనపై ఇప్పటికే ప్రతి ఇంటా చర్చ మొదలైందని.. ప్రజలంతా ఈ పాలనను, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనను పోల్చి చూస్తున్నారని చెప్పారు. స్థానిక సంస్థల పదవులకు ప్రత్యక్ష విధానంలో ఎన్నికలు జరపాలన్న ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపాలని నిర్దేశించారు. స్థానిక ఎన్నికల కోసం ప్రత్యేక కార్యాచరణను ప్రకటించారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే.. స్థానిక ఎన్నికలు సందేహమే? అయినా సన్నద్ధం‘స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వాటిని మనం కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ఎన్నికలు ఇప్పుడే జరుగుతాయా.. లేదా.. అన్నది తెలియడం లేదు. ఒక వైపు 44 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని చెబుతున్నారు. ‘సర్’ రిపోర్టు కూడా అదే చెబుతోంది. మరో వైపు ఆ 44 లక్షల మందిని కలిపి ఓటర్ల జాబితా తయారు చేస్తున్నారు. అంటే లేని ఓట్లు ఉన్నట్లుగా చూపుతున్నారు. అది చట్ట ప్రకారం నేరం. రెండో వైపు పట్టణ స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ అంశం. గతంలో మనం ఇవ్వాలనుకుంటే, కోర్టు కొట్టేసింది. పక్కన తెలంగాణలో కూడా కోర్టు దాన్ని కొట్టేసింది. అయినా దానిపై చంద్రబాబు కావాలని జీవో ఇచ్చి, ఎన్నికలకు వెళ్తున్నాడు. అంటే అక్కడ ఒక స్పష్టమైన ఆదేశాలు ఉన్నా, కావాలని జీవో ఇచ్చి డ్రామా చేస్తున్నారు. ఎందుకంటే కోర్టు కొట్టేస్తుంది కాబట్టి. ఇవన్నీ చూస్తుంటే, చంద్రబాబు అసలు స్థానిక ఎన్నికలు జరుపుతాడా? అని అనుమానం వస్తోంది. అయినా, ఎన్నికలు జరుగుతాయన్న ఆలోచనతోనే మనం సిద్ధం కావాలి. ఆ దిశలో ముందుకు సాగాలి. గట్టిగా పోరాడాలి.ఇప్పుడు ప్రతి ఇంటా అదే చర్చ2024 మార్చి 16న ఎన్నికల కోడ్ వచ్చింది. ఆ తర్వాత ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి మనం దాదాపు 30 నెలలుగా ప్రతిపక్షంగా ఉన్నా, గ్రామ స్థాయి వరకు పార్టీని బలంగా నిర్మించుకోగలిగాం. తొలిసారిగా గ్రామ స్థాయిలో కమిటీలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఈ రెండున్నరేళ్లలో ఇలా ఒక పటిష్టమైన నాయకత్వాన్ని గ్రామ స్థాయిలో నిర్మించుకోగలిగాం. ఇది ఒక మంచి కార్యక్రమం. చంద్రబాబు రెండున్నరేళ్ల పాలన ఎలా ఉంది? అంతకు ముందు మన పరిపాలన ఎలా ఉంది? అన్న దానిపై ఈరోజు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. చంద్రబాబు పాలన లో వంచన, దగా..ఈ రెండున్నరేళ్ల చంద్రబాబు పాలన చూస్తే.. అంతా మోసం, దగా కనిపిస్తోంది. గత ఎన్నికల ముందు చంద్రబాబు ఏమన్నారు? జగన్ ఇచ్చేవి కాకుండా, అంతకు మించి ఇస్తామన్నాడు. అమ్మ ఒడి మనం ఒకరికి ఇస్తే, ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఆ పథకం ఇస్తానన్నాడు. ప్రతి ఇంటికి బాండ్లు పంపారు. చంద్రబాబు, పవన్ ఇద్దరూ దానిపై సంతకాలు చేశారు. ఏ పథకం ద్వారా ఆ ఇంట్లో ఎంత లబ్ధి కలుగుతుంది.. అని లెక్కలు చెప్పి నమ్మించారు. మన కంటే మూడింతలు ఎక్కువ ఇస్తామన్నారు. మనం చేయూత కింద ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు ఇచ్చాం. పలు మల్టీ నేషనల్ కంపెనీలు తెచ్చి అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలబడ్డాం. చంద్రబాబు ఏం చెప్పారంటే.. ఇంట్లో 50 ఏళ్లు నిండిన వారుంటే నెలకు రూ.4 వేల చొప్పున ఏటా రూ.48 వేలు ఇస్తామన్నాడు. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున, ఏటా రూ.36 వేలు ఇస్తామన్నాడు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఇస్తామన్నారు. అలా అన్నీ ఇస్తామని చెప్పి నమ్మించి, తర్వాత మోసం చేశారు. ప్రజలు దాన్ని గుర్తించారు. అందుకే ఈ రోజు ప్రతి ఇంట్లో వాటిపై చర్చ జరుగుతోంది. ఒకవైపు అన్నీ వైఫల్యాలు. మరో వైపు అరాచక పరిస్థితి. యథేచ్ఛగా రెడ్బుక్ అమలవుతోంది. స్కూళ్లు నాశనం అయ్యాయి. ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేశారు. ఈ పథకం ద్వారా వైద్య సేవలు అందడం లేదు. విద్య, వైద్య రంగాలు మొత్తం నాశనం అయ్యాయి. మహిళలకు సున్నా వడ్డీ రుణాలకు మంగళం పాడారు. ఇక ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు.. అరెస్టులు.. భయపెట్టి లొంగ దీసుకునే పరిస్థితి.సమావేశానికి హాజరైన పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు కార్యకర్తల్లో నమ్మకం కలిగించాలి..ప్రస్తుతం ప్రజలు మన వైపు ఉన్నారు. కార్యకర్తల కోసం మనం గట్టిగా పని చేయాలి. అధికార పక్షం వాళ్లు ఎంత దౌర్జన్యం చేసినా, మా నాయకుడు నాతో ఉన్నాడన్న నమ్మకాన్ని మీరు కార్యకర్తలకు కల్పించాలి. అలా చేస్తేనే, రేపు ఎన్నికల్లో వారు మీకు తోడుగా నిలబడతారు. స్థానిక సంస్థల పదవులకు సంబంధించి ప్రత్యక్ష ఎన్నికలకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. అది ఒక విధంగా మంచిదే. ఒక బలమైన అభ్యర్థి అక్కడ నిలబడితే, మిగిలిన స్థానాలపై అతడు దృష్టి పెట్టొచ్చు. పోటీలో గట్టిగా నిలబడతాడు. ఆ బలమైన అభ్యర్థి.. మిగిలిన చోట్ల బలాన్ని ఇవ్వాలి. అలాగే అతడు సూపర్విజన్ కూడా చేయాలి. అలా చేయగలిగితే, మనం ఎన్నికల్లో గట్టిగా నిలబడతాం. అంతే కాకుండా పార్టీ నుంచి ఇతర ప్రజా ప్రతినిధుల పర్యవేక్షణ, బలం లాభిస్తుంది.ఈ విభాగాలు.. ఈ పనులు చాలా ముఖ్యంప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యే/ఇన్చార్జ్ లీగల్ సెల్, మీడియా సెల్ తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు దౌర్జన్యం చేస్తాడు. మన పార్టీ వారిని వేధిస్తాడు. కాబట్టి మన క్యాడర్ను, కార్యకర్తలను కాపాడుకోవాలి. అందు కోసం మీరు మంచి టీమ్తో లీగల్ సెల్ను పక్కాగా ఏర్పాటు చేసుకోవాలి. అదే విధంగా మీడియా సెల్ కూడా పటిష్టంగా ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే మీరు ప్రెస్ మీట్స్ (మీడియా సమావేశాలు)లో తరచూ మాట్లాడాలి. మనం చేసిన మేలు, సంక్షేమం చెబుతూ పార్టీని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలి. ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టాలి. కాబట్టి తప్పనిసరిగా మీడియా సెల్స్ ఏర్పాటు చేసుకోవాలి. అదే విధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను బాగా ఉపయోగించుకోవాలి. ఎలా ఎక్కౌంట్ ఓపెన్ చేయాలి.. ఎలా యాక్టివేట్ చేయాలి.. ఎలా నడిపించాలనే దానిపై శిక్షణ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మనం పూర్తిగా దిగజారిపోయిన నెగటివ్ మీడియా ఈనాడు, ఏబీఎన్ తదితర వాటితో పోరాడుతున్నాం. మీకు మీరుగా బలంగా ఎదిగేందుకు, మరింతగా ప్రజల్లోకి వెళ్లేందుకు, పార్టీ ఇంకా బలంగా మారడానికి మీరు తప్పనిసరిగా లీగల్ సెల్, మీడియా సెల్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను పక్కాగా ఏర్పాటు చేసుకోవాలి. మీరు నియోజకవర్గ స్థాయిలో పని చేస్తూ.. జిల్లా స్థాయి, ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలి. ఇప్పటి వరకు దీంట్లో యాక్టివ్గా లేని వారు వెంటనే వాటిని ఏర్పాటు చేసుకోవాలి. ఇక రెండో అంశం.. ఇంటింటా ప్రచారం. ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో ఇంటింటికీ వెళ్లాలి. మన ప్రభుత్వ హయాంలో ఎలాంటి మంచి చేశామనేది చెప్పాలి. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం చేసిన దగా, వంచన గురించి వివరించాలి. మరో వైపు బలమైన అభ్యర్థి నిలబడాలి. ఆ అభ్యర్థి అందరినీ కలుపుకుపోవాలి. ఎక్కడా ఇగోకు వెళ్లొద్దు. ఎందుకంటే ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటు ఎంతో కీలకం. కేవలం 9 ఓట్లతో ఓడిన వారు, గెల్చిన వారు కూడా ఉన్నారు. జో జీతా వహీ సికందర్ఎన్నికల్లో గెలుపు ముఖ్యం. ఎందుకంటే.. జో జీతా వహీ సికందర్ (గెలిచిన వారే రాజు). కాబట్టి వచ్చే 60, 70 రోజులు మీరు మీ నియోజకవర్గాలు దాటి వెళ్లొద్దు. అందరినీ కలవండి. వ్యవస్థలు పక్కాగా ఏర్పాటు చేసుకొండి. అన్యాయం చేస్తే వదిలి పెట్టబోమని పోలీసులకు కూడా గట్టిగా చెప్పండి. చూస్తుండగానే మూడో ఏడాదిలోకి వచ్చాం. కాబట్టి వచ్చేది మన ప్రభుత్వమే. ఆ తర్వాత మీరు ఎక్కడున్నా, రిటైర్ అయినా వదిలిపెట్టబోమని చెప్పండి. వారిలో న్యూట్రాలిటీ (తటస్థ వైఖరి) తీసుకురావడానికి ప్రయత్నించండి. అప్పటికీ వారు మారకపోతే వారి వివరాలు డిజిటల్ డైరీలోకి ఎక్కించండి’ అని వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. మీ పాత్ర చాలా కీలకంప్రతి చోటా అభ్యర్థుల ఎంపిక ఇప్పటి నుంచే మొదలు పెట్టండి. పార్టీ కోసం గట్టిగా పని చేసే వారిని ఎంపిక చేయండి. రిజర్వేషన్ల ఖరారు తర్వాత, మారితే చూడొచ్చు. అంతేకానీ, అప్పుడు అభ్యర్థుల కోసం వెతికితే అంతగా ప్రయోజనం ఉండదు. జిల్లా, నియోజకవర్గం, మండల స్థాయిలో మీరు స్వయంగా హాజరై గుర్తింపు కార్డులు, మెటీరియల్ పంపిణీ చేయాలి. వాటికి సంబ«ంధించి, తగిన విధంగా నిర్దేశం చేయాలి. ప్రతిచోటా మీ ప్రమేయం ఉండాలి. స్థానిక ఎన్నికల్లో పార్టీతో పాటు, అభ్యర్థి కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే వారిపై ప్రజలకు ఎక్కువ దృష్టి ఉంటుంది. అందుకే అందరికీ ఆమోద యోగ్యమైన వారిని ఎంపిక చేయాలి. వీలైనంత వరకు అభ్యర్థుల ఎంపికలో ఏకాభిప్రాయం వచ్చేలా చొరవ చూపాలి.ప్రతి చోటా పోటీ చేయాలిఎక్కడా ఏకగ్రీవం ఉండకూడదుమీ నియోజకవర్గాల్లో.. ఎక్కడా కూడా మన పార్టీ అభ్యర్థి పోటీ చేయని పరిస్థితి రాకూడదు. అలా మన పార్టీ అభ్యర్థి నిలబడకుండా, పోటీలో లేకుండా ఉంటే, అక్కడ ఏకగ్రీవ ఎన్నిక జరిగితే నన్ను అడగాల్సిన పని లేదు. మీరు ఆ తర్వాత ఎన్నికల్లో నిలబడరు. అంటే, టికెట్ దక్కదు. అందుకే పరిస్థితులు ఎలా ఉన్నా, స్థానిక ఎన్నికల్లో ప్రతిచోటా మనం అభ్యర్థులను నిలపాలి. మన కార్యకర్తలకు తోడుగా నిలబడాలి. పోరాడాలి. అప్పుడే వారు ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో మీకు తోడుగా ఉంటారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పార్టీ రూపొందించిన మెటీరియల్ (బుక్లెట్) ‘వెన్నుపోటు పార్టీ – వెన్నుపోటు పాలన’ అనేది ప్రతి ఊళ్లో, ప్రతి ఇంటికి వెళ్లాలి. మన పాలన, చంద్రబాబు పాలన మధ్య తేడా చెప్పాలి. ఇవన్నీ మీ ద్వారానే పార్టీ కొనసాగిస్తుంది. ఈ ప్రక్రియ ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఇంకా గుర్తింపు కార్డులు సిద్ధం అవుతున్నాయి. దాదాపు 15 లక్షల కార్డులు రెడీ అవుతున్నాయి. జిల్లా, నియోజకవర్గాలు, మండల స్థాయిలో ఆ కార్డుల పంపిణీ జరుగుతుంది. బుక్లెట్ మెటీరియల్ కూడా మీకు అందుతుంది. ఇవన్నీ క్యూఆర్ కోడ్ ద్వారా అందుబాటులో ఉంటాయి కాబట్టి.. ప్రతి ఒక్కరూ తమ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలి.ఐదు అంశాలతో సంస్థాగత సమావేశాలు1. చంద్రబాబు పాలన వైఫల్యాలు2. మన ఐదేళ్ల పాలన, సంక్షేమం, సంస్కరణలు, ప్రజలకు చేసిన మేలు3. కేడర్ను మోటివేట్ చేసి, ఎన్నికలకు సిద్ధం చేయడం4. ఐడీ కార్డుల పంపిణీ5. మండల, గ్రామ, వార్డు స్థాయిలో ఇంటింటా ప్రచారం సంస్థాగత సమావేశాల షెడ్యూల్⇒ సెప్టెంబరు 5, 6, 7 తేదీల్లో జిల్లా స్థాయి సమావేశాలు ఉంటాయి. ఇందులో పార్టీ జిల్లా స్థాయి నాయకులు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్్జలు, జిల్లా స్థాయిలో అన్ని కమిటీల ఇన్ఛార్్జలు, పార్టీ సీనియర్ నాయకులు, జెడ్పీ ఛైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు పాల్గొంటారు.⇒ సెప్టెంబరు 8, 9, 10, 11 తేదీల్లో అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో సమావేశాల నిర్వహణ. వీటిలో నియోజకవర్గ స్థాయి పార్టీ నేతలు, ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు.⇒ సెప్టెంబర్ 12 నుంచి 22 వరకు మండల, వార్డు స్థాయి సమావేశాలు జరుగుతాయి. ఇందులో గ్రామ, వార్డు స్థాయి నుంచి కూడా నాయకులు పాల్గొంటారు. ఆ తర్వాత ఇంటింటి ప్రచారం. అంటే సెప్టెంబర్ 23 నుంచి ఆ కార్యక్రమం కొనసాగుతుంది. అక్కడ ‘వెన్నుపోటు పార్టీ – వెన్నుపోటు పాలన’ బుక్లెట్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక్కడ విలేజ్ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు అందరూ పాల్గొంటారు. మన పాలనలో విప్లవాత్మక మార్పులుమేనిఫెస్టోను ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్లా భావించి 99 శాతం అమలు చేశాం. పూర్తి పారదర్శకతతో పాలించాం. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ను నియమించి, ఇంటి గడప వద్దే ప్రభుత్వ సేవలు అందించాం. ఎక్కడా అవినీతికి తావు లేకుండా ప్రభుత్వ పథకాలు అందించాం. దేవుడి దయ వల్ల ఆ విధంగా ఒక గొప్ప పాలన ఇవ్వగలిగాం. ఎన్నికల్లో ఒక మాట చెబితే, ఒక విషయాన్ని మేనిఫెస్టోలో పెడితే, దాన్ని తూ.చ తప్పకుండా అమలు చేపి చూపాం. అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడే, ఒక షెడ్యూల్ ప్రకటించి పథకాలు అమలు చేశాం. ఇది ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని గర్వంగా చెప్పగలుగుతాం.⇒ సంస్కరణలు, మార్పులు కళ్లెదుట కనిపిస్తున్నాయి. ప్రభుత్వ బడుల్లో నాడు–నేడు ద్వారా పూర్తి మార్పులు చేశాం. 6వ తరగతి నుంచి డిజిటల్ బోర్డులు, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్లు ఇచ్చాం. మూడో తరగతి నుంచే టోఫెల్ శిక్షణ. ఇంకా బైజూస్ కంటెంట్.⇒ గ్రామ స్థాయిలో చూస్తే ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. గ్రామంలో విలేజ్ క్లినిక్స్. ఆరోగ్యశ్రీలో 3,300కు పైగా ప్రొసీజర్లు. రూ.25 లక్షల వరకు ఫ్రీ ట్రీట్మెంట్. నాడు దేశంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 60 శాతం స్పెషలిస్టుల కొరత ఉంటే, మన దగ్గర అది కేవలం 4 శాతం మాత్రమే. ఆ స్థాయిలో ఆస్పత్రుల్లో నియామకాలు జరిపాం. మన హయాంలో ఆస్పత్రుల్లో జీరో వెకెన్సీ.⇒ వ్యవసాయంలోనూ ఎన్నో మార్పులు తెచ్చాం. ప్రతి ఎకరాకు ఈ–క్రాప్ చేశాం. ఉచిత పంటల బీమా అమలు చేశాం. గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ప్రతి అడుగులో రైతులకు తోడుగా నిలబడ్డాయి. ప్రతి పంటకు కచ్చితమైన గిట్టుబాటు ధర కల్పించాం. సీఎం–యాప్ ద్వారా పంటల ధరలపై ఎప్పటికప్పుడు సమీక్ష చేసి, జేసీ స్థాయి అధికారితో మార్కెట్లో జోక్యం చేసుకున్నాం. తద్వారా పంటల కొనుగోలులో పోటీ ఏర్పడి, రైతులకు మేలు జరిగింది. అలా ఐదేళ్లలో రూ.7,800 కోట్లతో పంటల కొనుగోలు చేశాం.⇒ సుపరిపాలన, మహిళా సాధికారత, విద్య, వైద్యంలో ఎప్పుడూ చూడని మార్పులు. కొత్తగా 17 మెడికల్ కాలేజీలు, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు. కర్నూలు, విశాఖలో కొత్త ఎయిర్పోర్టులు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో అత్యుత్తమ వైద్య సేవలందించాం. డయాలసిస్ సేవలు. కిడ్నీ రీసెర్చ్ సెంటర్. ఆస్పత్రి ఏర్పాటు చేశాం. రూ.600 కోట్లతో మంచినీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటు చేశాం. అలా ప్రతి సమస్యకు పరిష్కారంగా శాశ్వత చర్యలు చేపట్టాం. -
సోషల్ మీడియా పోస్టుల తొలగింపుపై హైకోర్టుకు వెళ్లండి
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో వైఎస్సార్సీపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల నుంచి పోస్టులను ఇష్టానుసారంగా తొలగిస్తున్న వ్యవహారంపై ముందుగా రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ వాక్ స్వాతంత్య్రాన్ని హరిస్తోందంటూ వైఎస్సార్సీపీ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చింది. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ఖాతాలైన ‘జగనన్న కనెక్ట్స్’ (ఫేస్బుక్, ఇన్స్టా్రగామ్, యూట్యూబ్, ఎక్స్) నుంచి పోస్టులను పూర్తిగా తొలగించడాన్ని సవాల్ చేస్తూ ఆ పార్టీ వేసిన రిట్ పిటిషన్పై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరిస్తూ న్యాయమూర్తులు జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ శీల్ నాగుతో కూడిన ధర్మాసనం మంగళవారం నిర్ణయం తీసుకుంది. అసలేం జరిగింది?: కర్నూలులో మద్యం బెల్టు షాపుల కారణంగా చోటుచేసుకున్న విషాదంపై 2025 అక్టోబర్ 26న వైఎస్సార్సీపీ తన అధికారిక ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) ఖాతా వేదికగా పలు పోస్టులు పెట్టింది. ఆ పోస్టులు ఏపీ సీఎంని అవమానించే ఉద్దేశంతో, టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కూడా పార్టీ అదే అంశంపై పోస్టులు కొనసాగించగా పోలీసు స్టేషన్లలో వరుసగా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. జనవరి 27న కర్నూలు రూరల్ సీఐ ట్విట్టర్కు నోటీసు ఇస్తూ వైఎస్సార్సీపీ చేసిన పోస్టుల యూఆర్ఎల్స్ను తొలగించాలని ఆదేశించారు. సేఫ్ హార్బర్ రద్దు హెచ్చరికలు రాష్ట్ర ప్రభుత్వం తమపై ఉద్దేశపూర్వకంగా సెన్సార్షిప్ విధిస్తోందంటూ పార్టీ మరోసారి ట్వీట్ చేయగా.. ఐటీ చట్టం–2000లోని సెక్షన్ 79(3)(బి), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్లైన్స్) రూల్స్ 2021లోని 3(1)(డి), (జి), (ఎఫ్) నిబంధనల కింద సీఐ మరో నోటీసు జారీ చేశారు. 36 గంటల్లోగా ఆ ఖాతాలను, సంబంధిత ట్విట్టర్ పోస్టులను తొలగించకుంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పొందే ‘సేఫ్ హార్బర్’ రక్షణను ఉపసంహరిస్తామని హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్సీపీ రాజ్యాంగంలోని ఆర్టికల్–32 కింద సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. అడ్వకేట్ ఆన్ రికార్డ్ (ఏవోఆర్) మహపూజ్ ఏ నజ్కీ ద్వారా ఈ పిటిషన్ దాఖలైంది. నిబంధనల ఉల్లంఘనే.. శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2014) కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని పిటిషన్లో వైఎస్సార్సీపీ ఆరోపించింది. ఆ తీర్పు ప్రకారం ఐటీ చట్టం సెక్షన్ 69ఏ కింద కేంద్ర ప్రభుత్వ నిర్ణీత అధికారి లేదా సమర్థవంతమైన న్యాయస్థానం ఆదేశాల మేరకు మాత్రమే సోషల్ మీడియాలోని కంటెంట్ను బ్లాక్ చేయాలి లేదా తొలగించాలి. కానీ, ఐటీ చట్టంలోని సెక్షన్ 69ఏ కింద గానీ, ఏ న్యాయస్థానం నుంచి గానీ తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని పార్టీ స్పష్టం చేసింది. దీనికి పూర్తి విరుద్ధంగా వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన సీఐస్థాయి అధికారులు తమ పరిధిని దాటి ఐటీ చట్టం సెక్షన్ 79(3)(బి)ని ప్రయోగిస్తూ 36 గంటల్లోగా పోస్టులు, ఖాతాలను పూర్తిగా తొలగించాలని ఆదేశాలు ఇవ్వడం నిబంధనల ఉల్లంఘనేనని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. ఈ వాదనలను పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. తాము నేరుగా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ ఉల్లంఘనలపై ముందుగా హైకోర్టును ఆశ్రయించేందుకు పిటిషనర్కు వెసులుబాటు కల్పిస్తూ రిట్ పిటిషన్ను విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం ఇచి్చంది. -
ముఖ్య నేతలతో వైఎస్ జగన్ సమావేశం (ఫొటోలు)
-
రేపు ఉదయం 11 గంటలకు వైఎస్ జగన్ ప్రెస్మీట్
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (బుధవారం) ఉదయం 11 గంటలకు తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న సమకాలీన రాజకీయ పరిణామాలు, పలు కీలక అంశాలపై వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడనున్నారు. -
ఏకగ్రీవం అనే మాట వినిపిచకుండా.. స్థానిక ఎన్నికలు జరగాలి
-
ఆషామాషీగా తీసుకోవద్దు స్థానిక ఎన్నికలపై జగన్ దిశానిర్దేశం
-
YS జగన్ కు రాఖీ కట్టిన మహిళలు
-
స్థానిక ఎన్నికలపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, తాడేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా గనుక జరిగితే కూటమికి వ్యతిరేకంగా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇస్తారని ఆయన అన్నారు. మంగళవారం వైఎస్సార్సీపీ ముఖ్యనేతలతో భేటీ అయిన వైఎస్ జగన్.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘ఇవి కేవలం గెలుపోటములకు సంబంధించిన ఎన్నికలు కావు. మన కార్యకర్తల కోసం నిలబడాల్సిన ఎన్నికలు. ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనం ఓటేస్తారు. అందుకే చంద్రబాబు ఎన్నికలను నిష్పక్షపాతంగా జరగనివ్వరు. స్థానిక ఎన్నికలను నేతలు ఆషామాషీగా తీసుకోవద్దు. బలమైన అభ్యర్థులను నిలబెడదాం. గతంలో.. ఎంపీటీసీ, మున్సిపాలిటీ, జడ్పీ చైర్మన్, మేయర్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, దౌర్జన్యాలు, ప్రలోభాలు చూశాం. అధికార పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా నాయకుడు తనతోనే ఉన్నాడనే భరోసా ప్రతి కార్యకర్తకు కలగాలి. ఇప్పుడు కార్యకర్తకు అండగా నిలబడితేనే, రేపు సాధారణ ఎన్నికల్లో అతడు రెట్టించిన ఉత్సాహంతో పార్టీ కోసం పనిచేస్తాడు’’ అని వైఎస్ జగన్ అన్నారు.ప్రత్యక్ష ఎన్నికలు–బలమైన అభ్యర్థులుస్థానిక సంస్థల పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటన ఒకరకంగా మనకు అనుకూలమే. అందుకే బలమైన అభ్యర్థులను నిలబెట్టాలి. ప్రధాన పదవికి బలమైన అభ్యర్థి ఉంటే మిగిలిన ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, వార్డు అభ్యర్థులకు పర్యవేక్షణతోపాటు బలం లభిస్తుంది. అవసరమైన చోట కార్యకర్తలకు అండగా నిలిచేందుకు కుటుంబ సభ్యులను పోటీకి దింపడానికీ వెనకాడవద్దు. ప్రజల గొంతు వినిపించేలా, పార్టీ కార్యకర్తలకు భరోసా కల్పించేలా ప్రతి స్థానంలో పోటీ జరగాలిఏకగ్రీవాలకు అంగీకరిస్తే కఠిన నిర్ణయంఏ నియోజకవర్గంలోనూ పోటీ లేకుండా ఏకగ్రీవాలకు ఆస్కారం ఉండకూడదు. స్థానిక ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగితే, తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడున్న కో-ఆర్డినేటర్ పార్టీ అభ్యర్థులు కాలేరు. ప్రతి నియోజకవర్గంలో ఎక్కడెక్కడ అభ్యర్థులను నిలబెట్టారో ఎన్నికల అనంతరం నివేదికలు తెప్పించుకుంటా. అభ్యర్థులను నిలబెట్టడమే కాకుండా వారికి ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంత బలంగా మద్దతిచ్చారన్నదానిపైనా నివేదికలు తీసుకుంటా. కార్యకర్తల ఎన్నికల్లో మనం గట్టిగా నిలబడితేనే, మన ఎన్నికల్లో కార్యకర్తలు మన కోసం గట్టిగా నిలబడతారు.గ్రామస్థాయి ప్రచార కార్యక్రమం“వెన్నుపోటు పార్టీ–వెన్నుపోటు పాలన”పై గ్రామ కమిటీలు, అనుబంధ విభాగాలు ప్రతి గ్రామంలో ప్రచారం చేయాలి. ప్రతి కార్యకర్త ఇంటింటికీ వెళ్లి వైఎస్సార్సీపీ పాలనకు, కూటమి పాలనకు మధ్య తేడాను వివరించాలి. ఇంటింటి ప్రచారానికి అవసరమైన పూర్తి సమాచారాన్ని, ప్రచార సామగ్రిని పార్టీ అందిస్తుంది. కార్యక్రమాలన్నీ నిర్దిష్ట తేదీలు, షెడ్యూల్, వ్యవస్థీకృత కార్యాచరణ ప్రకారం జరగాలి.14–15 లక్షల గుర్తింపు కార్డులుపార్టీ కేడర్ కోసం దాదాపు 14–15 లక్షల గుర్తింపు కార్డులు సిద్ధమయ్యాయి. గ్రామస్థాయి కమిటీలు, అనుబంధ విభాగాల కార్యకర్తల వరకు గుర్తింపు కార్డులను పంపిణీ చేస్తాం. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయుల్లో సమావేశాలు నిర్వహించి గుర్తింపు కార్డులు అందించాలి. సమావేశాల్లో గుర్తింపు కార్డులతోపాటు ఇంటింటి ప్రచార సామగ్రినీ కేడర్కు పంపిణీ చేయాలి. గుర్తింపు కార్డుల్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది; కార్యకర్తలు తమ ఫోన్లలోనే సమాచారాన్ని పొందవచ్చు. సెప్టెంబరు 5,6,7 తేదీల్లో ఒకరోజు ఏదో ఒకరోజు జిల్లాల స్థాయి సమావేశాలు నిర్వహిద్దాం. సెప్టెంబరు 8,9,10,11 తేదీల్లో ఏదో ఒకరోజు అసెంబ్లీ నియోజవకర్గాల స్థాయి సమావేశాలు నిర్వహిద్దాం. ఇక మండల, వార్డు, డివిజన్ స్థాయిల్లో సెప్టెంబరు 12 నుంచి 22 వరకూ సమావేశాలు నిర్వహిద్దాం. లీగల్, మీడియా సెల్స్ యాక్టివ్గా ఉండాలిప్రతి నియోజకవర్గంలో లీగల్ సెల్, మీడియా సెల్లను వెంటనే బలోపేతం చేయాలి. పోటీ జరగకుండా అడ్డుకునేందుకు అధికార పార్టీ కేడర్పై దౌర్జన్యాలకు దిగే అవకాశం ఉంది; కార్యకర్తలను రక్షించుకోవాలి. నియోజకవర్గ స్థాయిలో సమర్థులైన న్యాయవాదులను ఒక వేదికపైకి తీసుకొచ్చి కార్యకర్తలకు అందుబాటులో ఉంచాలి. నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర లీగల్ సెల్స్ పరస్పరం అనుసంధానమై పనిచేయాలి. అవసరమైన కేసులను హైకోర్టు వరకు తీసుకెళ్లేందుకు సమన్వయ వ్యవస్థ ఉండాలి. పోలీసుల వేధింపులకు గురయ్యే కార్యకర్తలను న్యాయపరంగా రక్షించాల్సిన బాధ్యత పార్టీ తీసుకోవాలి. నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి లీగల్, మీడియా వ్యవస్థలన్నీ ఒకే యూనిట్గా పనిచేయాలి.సోషల్ మీడియాకు అత్యంత ప్రాధాన్యంప్రతి నియోజకవర్గంలో సోషల్ మీడియాకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. పార్టీలో సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్నవారిని గుర్తించి, మిగిలిన వారినీ యాక్టివేట్ చేయాలి. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వంటి వేదికలపైకి మొత్తం పార్టీ కేడర్ను తీసుకురావాలి. సోషల్ మీడియా ఖాతాలు ఎలా ప్రారంభించాలి, ఎలా యాక్టివేట్ చేయాలి, ఎలా నిర్వహించాలనే అంశాలపై శిక్షణ ఇవ్వాలి. జగన్ 2.0 సూపర్ యాప్, వైయస్సార్సీపీ టాక్స్, పార్టీ సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రజల్లోకి సందేశం తీసుకెళ్లాలి. పార్టీకి సంబంధించిన యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియా వ్యవస్థలను సమర్థంగా ఉపయోగించుకోవాలి. పార్టీ కేడర్కు వాస్తవ సమాచారం, అవసరమైన న్యూస్ కంటెంట్ నిరంతరం అందాలి. నియోజకవర్గాల్లోని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను వ్యక్తిగతంగా కలిసి పార్టీకి మద్దతుగా నిలవాలని కోరాలి. ఎందుకంటే.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి ప్రతికూల మీడియా వ్యవస్థలతో మనం యుద్ధం చేస్తున్నాం.నాయకులకు హెచ్చరికనియోజకవర్గాల్లో మీడియా, సోషల్ మీడియా, లీగల్ సెల్స్పై యాక్టివ్గా లేని నాయకులు ఇప్పటికైనా గేర్ మార్చాలి. నాయకులు కార్యకలాపాలను తమ నియంత్రణలోకి తీసుకోకపోతే కార్యకర్తలు నష్టపోతారు. ఇంటింటి ప్రచారం ద్వారా ప్రతి కుటుంబానికి వైయస్సార్సీపీ–కూటమి పాలన మధ్య తేడాను వివరించాలి.ఈగోలకు తావులేదుస్థానిక ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య తక్కువగా ఉంటుంది కాబట్టి అభ్యర్థి వ్యక్తిగత బలం అత్యంత కీలకం. అభ్యర్థుల ఎంపికలో భావోద్వేగాలు, వ్యక్తిగత ఈగోలను పక్కనపెట్టి అందరినీ కలుపుకొని వెళ్లాలి. తొమ్మిది ఓట్లతో గెలిచిన సందర్భాలు, తొమ్మిది ఓట్లతో ఓడిన సందర్భాలూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఓటూ కీలకమే. “జో జీతా వహీ సికందర్”.. గెలుపే ముఖ్యం, గెలుపు కోసం ఈగోలను పక్కన పెట్టాలి. ప్రతి గ్రామంలో పార్టీని బలంగా కన్సాలిడేట్ చేసి, సమర్థుడైన కార్యకర్త చుట్టూ ఏకాభిప్రాయం సృష్టించాలి. రాబోయే 60–70 రోజులు నాయకులు తమ నియోజకవర్గాలను దాటి వెళ్లకుండా పూర్తిగా స్థానిక ఎన్నికలపైనే దృష్టిపెట్టాలి. సరైన శ్రద్ధ, పూర్తి స్థాయి కార్యాచరణ ఉంటే స్థానిక ఎన్నికల్లో గెలుపు జెండా ఎగరేస్తాంవాళ్ల పేర్లు డిజిటల్ బుక్లోకి..పోలీసు అధికారులు పదవిని దుర్వినియోగం చేయకుండా న్యాయంగా, ధర్మంగా వ్యవహరించాలి. కానీ అలా జరగడం లేదు. కార్యకర్తలను వేధించే, అన్యాయం చేసే అధికారుల వివరాలను నమోదు చేయాలి. చట్టవిరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై భవిష్యత్తులో చట్టప్రకారం చర్యలు తప్పవు. ప్రతి పోలీసు అధికారి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా తటస్థంగా వ్యవహరించాలని కోరుతున్నాం. పోలీసు వ్యవస్థలో నిష్పాక్షికత తీసుకురావడానికి పార్టీ నాయకులు గట్టి ప్రయత్నం చేయాలి అని వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు.ఇదీ చదవండి: ఆలయాల విధ్వంసం.. పవన్ కంటికి కనిపించడం లేదా? -
స్థానిక ఎన్నికలే టార్గెట్.. YSRCP ముఖ్యనేతలతో జగన్ భేటీ
-
LIVE: YS జగన్ కీలక సమావేశం.. YSRCP నేతలతో భేటీ
-
YSRCP నేతల్ల విజువల్స్ @తాడేపల్లి
-
YSRCP సోషల్ మీడియా పిటిషన్.. నేడు సుప్రీంకోర్టులో విచారణ
-
స్థానిక ఎన్నికలపై పార్టీ ముఖ్యనేతలతో జగన్ భేటీ
-
మీరెన్ని కేసులు పెట్టినా.. నా గొంతు ఆగదు: అంబటి
సాక్షి, గుంటూరు: తనపై నమోదైన కేసులన్నీ ప్రస్తుతం ఎఫ్ఐఆర్ దశలోనే ఉన్నాయని, ఇప్పటివరకు ఛార్జ్షీట్లు దాఖలు చేయలేదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. ఒకే ఘటనకు సంబంధించి పలు కేసులు నమోదు చేసి తనను వేధించాలని చూస్తున్నారని చెప్పారు. రాజకీయ విమర్శలు చేసినందుకే కేసులు పెడుతున్నారని, వాటికి భయపడేది లేదని స్పష్టం చేశారు.తనపై వరుస కేసుల వ్యవహారంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు మంగళవారం ఉదయం మీడియాతో మాట్లాడారు. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్పై సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు సీఐడీతో పాటు మరో కేసు నమోదు చేశారని, ఇటీవల పట్టాభిపురం పోలీసులు కూడా తనపై కేసు పెట్టారని తెలిపారు. తన అధికారిక యూట్యూబ్ ఛానల్లో ‘ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన పార్టీ’ అంటూ పాటను పోస్టు చేశానని చెప్పారు. చంద్రబాబు తరచూ ‘గొడ్డలి పార్టీ’ అంటూ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో దానికి కౌంటర్గా ‘వెన్నుపోటు పార్టీ’ అంటూ రాజకీయ వ్యంగ్యంతో పోస్టు చేశానన్నారు.ఎన్టీఆర్ మీద కృష్ణ సినిమాలే తీశారువైఎస్ జగన్ మోహన్రెడ్డిపై ఏఐ వీడియోలతో అత్యంత అవమానకరంగా పోస్టులు పెట్టిన వారిపై తాను ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు కేసులు నమోదు చేయలేదని అంబటి ఆరోపించారు. అధికార పార్టీకి ఒక న్యాయం, ప్రతిపక్షానికి మరో న్యాయమా? అని ప్రశ్నించారు. రాజకీయ విమర్శలు, వ్యంగ్యాలు ప్రజాస్వామ్యంలో సాధారణమేనన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా ఎందుకు వ్యవహరించలేకపోతున్నారని అంబటి నిలదీశారు.‘‘రాజకీయ విమర్శలు చెయ్యకూడదా?. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆయనపై వ్యంగంగా అనేక చర్యలు కనిపించాయి. ఎన్టీఆర్ను పోలిన వేషధారణతో క్యారెక్టర్తో హీరో కృష్ణ ఏకంగా సినిమాలు తీశారు. ఆ కాలంలో ఇలాంటివేవీ జరగలేదే’’ అని అంబటి గుర్తు చేశారు.‘కేసులకు భయపడేది లేదు’కేసులతో బెదిరించాలని చూస్తే తాను భయపడబోనని అంబటి అన్నారు. పోలీసుల వాహనంలో గంజాయి దొరికిన ఘటనపై కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సత్తెనపల్లి, చిలకలూరిపేట, రేపల్లె ప్రాంతాలలో పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి. ఐజీ త్రిపాఠికి వాటాలు వస్తున్నాయి. పోలీసులే గంజాయి అమ్మి ఐజీకి డబ్బులు ఇస్తున్నారు. అందరూ కుమ్మక్కై వాటాలు పంచుకుంటున్నారు అని అన్నారు. రఘురామకృష్ణరాజుపై ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని అంబటి పేర్కొన్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలో నడుస్తోంది టీడీపీ కాదని, ‘వెన్నుపోటు పార్టీ’ అని విమర్శించారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా రాజకీయ విమర్శలు చేయడం ఆపబోనని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: బాలయ్య తంతారేమోనని భయపడి.. -
YSRCP ముఖ్య నేతలతో జగన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
పవన్కు ఇవేవీ కనిపించడం లేదా?: భూమన
సాక్షి, తిరుపతి: పురాతన ఆలయాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా.. సనాతనిగా తనను తాను చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు ఇవేవీ కనిపించడం లేదా? అని నిలదీశారు. మంగళవారం ఈ వ్యవహారం భూమన కరుణాకర్ స్పందించారు. కడప–చెన్నై రహదారి వెంట ఉన్న అనేక ఆలయాలను కూల్చివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రేణిగుంట–రైల్వే కోడూరు మార్గంలో వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఆంజనేయస్వామి ఆలయాన్ని కూల్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతించడంపై తీవ్రంగా మండిపడ్డారు.అంజనేయపురం గ్రామానికి ఆ ఆలయం వల్లే ఆ పేరు వచ్చిందని భూమన పేర్కొన్నారు. తొలి వాగ్గేయకారుడు అన్నమయ్య తిరుమలకు అడవి మార్గంలో వెళ్తూ ఇక్కడి స్వయంభూ ఆంజనేయస్వామిని పూజించిన చరిత్ర ఉందన్నారు. బ్రిటిష్ కాలంలో 1871లోనే అంజనేయపురంలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేశారని గుర్తుచేశారు.‘తెల్లోడు కాపాడితే.. నల్లోడు కూల్చేస్తున్నాడు’బ్రిటిష్ పాలకులు ఆలయాలను సంరక్షిస్తే.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పాలకులు వాటిని కూల్చేందుకు సిద్ధమవుతున్నారని భూమన వ్యాఖ్యానించారు. తిరుపతి–చెన్నై మార్గంలోని నగరి సమీపంలోని కీలపట్టు సర్కిల్లో ఆంజనేయస్వామి ఆలయాన్ని ఇప్పటికే కూల్చివేశారని చెప్పారు. 1993లో చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభమైన ఆలయాన్ని ఇప్పుడు ధ్వంసం చేశారని ఆరోపించారు.‘పవన్కు కనిపించడం లేదా?’సనాతన ధర్మ పరిరక్షకుడిగా చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు ఆలయాల ధ్వంసం కనిపించడం లేదా? అని భూమన ప్రశ్నించారు. ‘‘అన్న ఆలయాన్ని ప్రారంభిస్తే.. తమ్ముడు అధికారంలో ఉండగా అదే ఆలయాన్ని కూల్చివేశారు. ఇదేనా సనాతన ధర్మ పరిరక్షణ?’’ అంటూ నిలదీశారు. చంద్రబాబు ప్రభుత్వం ఆలయాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందన్న భూమన.. ఆలయాల పరిరక్షణ కోసం ప్రజలతో కలిసి వైఎస్సార్సీపీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: రఘురామరాజుపై కేసు ఏదీ? -
ముఖ్య నేతలతో వైఎస్ జగన్ కీలక సమావేశం
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ రీజినల్ కో-ఆర్డీనేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు (కో–ఆర్డినేషన్, అనుబంధ విభాగాలు), స్టేట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీలు పాల్గొన్నారు.రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత, తాజా రాజకీయ పరిణామాలు, ఎస్ఐఆర్ ప్రక్రియ తదితర కీలక అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ అంశాలపై పార్టీ నాయకులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. -
అక్రమ కేసులో మాజీ మంత్రి కారుమూరికి రిమాండ్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో మద్యం పాలసీపై అక్రమ కేసులో వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు హైదరాబాద్లోని ఈడీ ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను చంచల్గూడ జైలుకు తరలించారు. కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు ఆదివారం హైదరాబాద్లోని కొండాపూర్లో ఆయన్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా, ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరుపర్చారు. -
చంద్రబాబుకు రాయలసీమపై ద్వేషం
సాక్షి ప్రతినిధి,కర్నూలు: కరెంటు ఉత్పత్తి పేరుతో శ్రీశైలం నుంచి నీటిని కిందకు వదిలి చంద్రబాబు సర్కారు రాయలసీమకు తీవ్ర అన్యాయం చేస్తోందని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ధ్వజమెత్తారు. శ్రీశైలం నీటి మట్టం తగ్గితే పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు చుక్క నీరు కూడా అందదని ఆందోళన వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రాజెక్టులు నిండేలా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడు పరిశీలనకు వైఎస్సార్సీపీ నేతలను అనుమతించకపోవడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. రాయలసీమ రైతుల హక్కుల కోసం అందరూ చైతన్యవంతులై ఉద్యమించాలని కాటసాని పిలుపునిచ్చారు. కరెంటు ఉత్పత్తి పేరుతో శ్రీశైలం డ్యాంను ఖాళీ చేస్తూ రాయలసీమ ప్రాజెక్టులను ఎండబెడుతున్నారని శైలజానాథ్ ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా తమ హక్కులను అడగడానికి వచ్చిన వారిని అడ్డుకోవడం సరికాదని నేతలు మండిపడ్డారు. రాయలసీమకు నీళ్లు అందే వరకు వైఎస్సార్సీపీ రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తోందని స్పష్టం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రాయలసీమకు నీటి హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం పోతిరెడ్డిపాడు పరిశీలనకు వెళ్తున్న వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోతిరెడ్డిపాడుకు ఐదు కిలోమీటర్ల దూరంలోని బన్నూరు–చాబోలు క్రాస్వద్ద ఆత్మకూరు డీఎస్పీ రామాంజనేయ నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు అనుమతులు లేవంటూ అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నేతలను అడ్డుకునేందుకు పోతిరెడ్డిపాడు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం, పోతిరెడ్డిపాడు గేటుకు తాళం వేయడంపై ప్రతిపక్ష నేతల్లో ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో బన్నూరు క్రాస్వద్ద వైఎస్సార్సీపీ నేతలు కాటసాని రాంభూపాల్రెడ్డి, సాకే శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, శిల్పాచక్రపాణిరెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి, వైఎస్సార్సీపీ ఆలూరు పరిశీలకుడు తెర్నేకల్ సురేందర్రెడ్డి, నంద్యాల పరిశీలకురాలు శశికళారెడ్డి తదితరులు అక్కడే రోడ్డుపై బైఠాయించి గంటపాటు నిరసన తెలిపారు. చంద్రబాబు డౌన్డౌన్ అంటూ నినాదాలు చేశారు. రైతులకు సాగు నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మరోవైపు పోతిరెడ్డిపాడు పరిశీలనకు వస్తున్న మాజీ ఎమ్మెల్యేలు అమర్నాథరెడ్డి, రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, గంగుల ప్రభాకరరెడ్డి తదితర నేతలనూ ఎస్ఆర్ఎంసీ ఎడమగట్టు కాలువ 0.6వ కిలోమీటరు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. -
చంద్రబాబూ.. మీ అహంకారం వీడండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జూనియర్ డాక్టర్ల(జూడా)ను రోడ్డెక్కించి పేద రోగుల ప్రాణాలతో సీఎం చంద్రబాబు చెలగాటం ఆడుతున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మండిపడ్డారు. పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణం, జీవన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని స్టైపెండ్ను 15 శాతం కంటే మెరుగ్గా పెంచాలని జానియర్ డాక్టర్లు కోరుతుంటే కేవలం 3 నుంచి 5 శాతం మాత్రమే పెంచుతామని ప్రభుత్వం చెప్పడం అన్యాయం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ హయాంలో జీవో 287లో నిర్దేశించిన 15 శాతం కంటే అధికంగా.. మొత్తంగా 42.4 శాతం స్టైపెండ్ పెంచామని గుర్తు చేశారు. సూపర్ స్పెషాలిటీ కోర్సును అభ్యసిస్తున్న వారిని సీనియర్ రెసిడెంట్స్గా గురిస్తూ, వారి విజ్ఞప్తిని కూడా పరిగణనలోకి తీసుకుని నిర్దేశించిన దాని కంటే పెంచి.. మొత్తంగా 77 శాతం పెంపు వర్తింపజేశామన్నారు. ఆయుష్ విభాగానికి చెందిన జూనియర్ డాక్టర్లకు కూడా అల్లోపతి జూనియర్ డాక్టర్ల తరహాలోనే స్టైపెండ్ పెంచామని చెప్పారు. ఇప్పటికైనా అహంకారం వీడి, జూడా ప్రతినిధులతో వెంటనే చర్చలు జరిపి, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చంద్రబాబుకు సూచించారు. తగిన స్థాయిలో స్టైపెండ్ పెంచి, సమ్మెను విరమింపజేసి ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేద రోగులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాలని హితవు పలికారు. ఈ మేరకు సోమవారం ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..రెండు వారాలైనా స్పందించరా?‘రాష్ట్రంలోని 19 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు చెందిన దాదాపు 9 వేల మంది ఇంటర్న్లు, పీజీలు, సూపర్ స్పెషాలిటీ, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు రెండు వారాలుగా ఆందోళన చేస్తున్నా ఎందుకు స్పందించడం లేదు? నిబంధనల ప్రకారం జనవరి 1 నుంచి అమలు కావాల్సిన స్టైపెండ్ సవరణను ఎందుకు నిలిపేశారు? జూనియర్ డాక్టర్ల శ్రమతోనే ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో వైద్యసేవలు నడుస్తున్నాయి. ఇప్పుడు సమ్మె కారణంగా క్యాజువాలిటీ, ఐసీయూ, లేబర్ రూమ్ వంటి అత్యవసర సేవలకూ అంతరాయం ఏర్పడి రోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితికి చంద్రబాబు ప్రభుత్వ మొండి వైఖరి కారణం కాదా? ఇప్పటికే ప్రభుత్వం పెట్టిన బకాయిలతో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు చేతులు ఎత్తేశాయి. మరోవైపు ప్రభుత్వ వైద్య రంగాన్ని దారుణంగా దెబ్బ తీశారు. దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా మేం ఒకేసారి 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటు చేపట్టాం. ఐదింటిని పూర్తి చేసి, తరగతులు కూడా ప్రారంభించాం. మరో కాలేజీని క్లాసులకు సిద్ధం చేశాం. ఇలా మొత్తంగా 6 కళాశాలలు అందుబాటులోకి తెచ్చాం. మిగిలిన వాటిని పూర్తి చేయాల్సి ఉండగా, వాటిని తెగనమ్మడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదిసరిపోక ప్రభుత్వ బోధనాసుపత్రులు, ఇతర ఆస్పత్రుల్లో మిగిలిన నాడు–నేడు పనులను మీరు నిలిపివేశారు. డబ్ల్యూహెచ్వో/జీఎంపీ ప్రమాణాలు ఉండే మందులు లేక ప్రభుత్వాస్పత్రులు విలవిల్లాడుతున్నాయి. జీరో వేకెన్సీ పాలసీకి మంగళం పాడారు. వైద్య రంగంలో మేం నియమించిన 50 వేల మంది సిబ్బందిని క్రమంగా తగ్గిస్తున్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానానికి గండికొట్టారు. సీహెచ్సీల్లో స్పెషలిస్ట్ డాక్టర్లను తొలగించారు. విలేజ్, అర్బన్ క్లినిక్లను నిర్వీర్యం చేశారు. ఆరోగ్యశ్రీని దారుణంగా దెబ్బతీసి రూ.3 వేల కోట్లకుపైగా బకాయిలు పెట్టారు. ప్రజారోగ్య వ్యవస్థలో చంద్రబాబు సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు’ అని వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. -
నేడు వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులతో వైఎస్ జగన్ సమావేశం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన మంగళవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ రీజినల్ కో–ఆర్టీనేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు (కో–ఆర్టీనేషన్, అనుబంధ విభాగాలు), స్టేట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీలు పాల్గొననున్నారు.రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత, తాజా రాజకీయ పరిణామాలు, ఎస్ఐఆర్ ప్రక్రియ తదితర కీలక అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు. ఈ అంశాలపై పార్టీ నాయకులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. -
రేపు YSRCP ముఖ్య నేతలతో వైఎస్ జగన్ సమావేశం
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు తాడేపల్లిలో పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.ఈ ఉన్నత స్థాయి సమావేశంలో రాష్ట్రంలోని ప్రస్తుత ప్రజా సమస్యలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా చర్చించనున్నారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, ప్రజాపోరాటాలపై నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీలు హాజరుకానున్నారు. -
చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు: వైఎస్సార్సీపీ బీసీ నేతలు
తాడేపల్లి : చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం బీసీ వర్గాలను దగా చేస్తోందని వైఎస్సార్సీపీ బీసీ నేతలు ధ్వజమెత్తారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య బీసీ నేతలు వెన్నుపోటు పార్టీ వంచనపై బీసీ గర్జన సదస్సు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... వెన్నుపోటు పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు ఇచ్చిన హామీలైన 50 ఏళ్లు దాటిన మహిళలకు రూ.4 వేల పెన్షన్, కురువ, చేనేత, రజక, నాయిబ్రాహ్మణ తదితర కులవృత్తుల సంక్షేమ పథకాలను నిలిపివేసి తీరని ద్రోహం చేశారని దుయ్యబట్టారు. ముఖ్యంగా స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ల అంశంలో చట్టబద్ధత లేకుండా కేవలం జీవో నంబర్ 105 ఇచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారని, గతంలో వైఎస్.జగన్ 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయిస్తే కోర్టుల ద్వారా అడ్డుకున్న చరిత్ర చంద్రబాబుదేనని తేల్చి చెప్పారు. మరోవైపు మంత్రివర్గంలో బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుండా అవమానించిన చంద్రబాబు, ప్రశ్నించే బీసీ ప్రజాప్రతినిధులు, నాయకులపై అక్రమ కేసులు, భౌతిక దాడులతో కక్షసాధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.వైఎస్.జగన్ ప్రభుత్వంలో బీసీలంటే 'బ్యాక్వర్డ్ క్లాసెస్' కాదు, వారు సమాజానికి 'బ్యాక్ బోన్ క్లాసెస్'గా గుర్తించారని గుర్తుచేశారు. డీబీటీ ద్వారా రూ.1.70 లక్షల కోట్లకు పైగా సంక్షేమ నిధులను నేరుగా బీసీల ఖాతాల్లో జమ చేయడమే కాకుండా, 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి, రాజ్యసభ, లోకల్ బాడీస్, నామినేటెడ్ పదవుల్లో సింహభాగం కేటాయించి రాజకీయంగా, ఆర్థికంగా వారికి ఆత్మగౌరవం కల్పించారని వివరించారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న వెన్నుపోటు, వంచనా పూరిత రాజకీయాలను క్షేత్రస్థాయిలో ఎండగట్టేందుకు గ్రామ, మండల, నియోజకవర్గ, జోనల్ స్థాయిలలో విస్తృతంగా సదస్సులు నిర్వహించి రాబోయే ఎన్నికల్లో కూటమి సర్కారుకు బీసీ సమాజం ద్వారా తగిన గుణపాఠం చెబుతామని వైఎస్సార్సీపీ బీసీ నాయకులు స్పష్టం చేశారు.చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలపై రీజనల్ స్థాయి నుంచి పోరాటంతాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం నుంచి సుదీర్ఘంగా బీసీ నేతల సమావేశం నిర్వహించాం. ముఖ్యమంత్రి పదవి కోసం చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు అబద్ధాలు చెబుతూ బీసీలను మోసం చేస్తున్నారు. బీసీలకు వెన్నుముక అని చెప్పి వెన్నుపోటు పొడిచిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. టీడీపీ మోసపూరిత విధానాలను ప్రజల్లో ఎండగట్టేందుకు రీజనల్, జిల్లా, మండల స్థాయిల్లో సదస్సులు నిర్వహిస్తాం. చంద్రబాబు నాయుడు పాలనలో బీసీలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా సరిగ్గా అమలు కాలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్రెడ్డిగారు నేరుగా డీబీటీ ద్వారా రూ.1.70 లక్షల కోట్లు బీసీల ఖాతాల్లో వేశారు. అమ్మ ఒడి, అన్నదాత సుఖీభవ, చేనేతలకు ఇచ్చే సాయం వంటి పథకాలను కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టింది.స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ల పేరుతో జీవో నంబర్ 105 ఇచ్చి చంద్రబాబు మరో పెద్ద డ్రామాకు తెరలేపారు. గతంలో వైయస్. జగన్మోహన్రెడ్డి 34 శాతం రిజర్వేషన్ ఇస్తే కోర్టుల ద్వారా అడ్డుకున్న ఘనత చంద్రబాబుదే. ఉప ముఖ్యమంత్రి స్థానంలో బీసీ నేతను కూర్చోబెట్టకుండా కూటమి ప్రభుత్వం తీవ్ర అవమానం చేసింది.-చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మాజీ మంత్రి34 శాతం రిజర్వేషన్లపై చంద్రబాబుకు దమ్ముంటే తేల్చి చెప్పాలిఅసెంబ్లీ సాక్షిగా 34 శాతం రిజర్వేషన్ల పేరుతో బీసీలకు చంద్రబాబు మరోసారి వెన్నుపోటు పొడిచారు. స్థానిక సంస్థల్లో బీసీలకు నిజంగా 34 శాతం రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు వెళ్లే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు ఉందా?. అమలు కాని జీవోలను అడ్డుపెట్టుకుని పాలాభిషేకాలు చేయించుకుంటూ బీసీ సమాజాన్ని మోసం చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా 139 కులాల ప్రతినిధులం ఒక్కటయ్యాం. ఇందుకోసం జోనల్, జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో కార్యాచరణ చేపడతాం. ఐదేళ్ల పాలనలో బీసీలను రాజ్యాధికారంలో నిలబెట్టి బ్యాక్ బోన్గా మార్చిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి.ప్రశ్నించే బీసీ నేతలపై చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి, భౌతిక దాడులకు దిగుతోంది. కారుమూరి నాగేశ్వరరావు,వారి కుమారుడు కారుమూరు సునీల్, డాక్టర్ సీదిరి అప్పలరాజు, నేను, నా తమ్ముడు, అదే విధంగా చింతాడ రవికుమార్, విడదల రజిని సహా పలువురు వైఎస్సార్సీపీ బీసీ నేతలపై అక్రమ వేధింపులు కొనసాగుతున్నాయి. కూటమి నేతలు ఊదరగొడుతున్న రెడ్ బుక్ ఇప్పటికే డెడ్ బుక్ అయిపోయింది, త్వరలోనే డెత్ బుక్ కాబోతోంది. బీసీల గొంతు నొక్కాలని చూస్తే రాబోయే రోజుల్లో ప్రజలే ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెబుతారు.బలహీన వర్గాల వారందరం ఒక తాటి మీదకు వచ్చి వైయస్.జగన్ ని సీఎం చేసుకోబోతున్నాం.-జోగి రమేశ్, మాజీ మంత్రిబీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయకపోతే రాజీనామా చేస్తారా?వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వెన్నుపోటు పార్టీ వంచనపై బీసీ నాయకులందరం గళమెత్తాం. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే చెల్లని 34 శాతం రిజర్వేషన్ బిల్లును తెరపైకి తెచ్చి బీసీలను వాడుకుంటున్నారు.తెచ్చిన జీవో ప్రకారం 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయకపోతే కూటమి ప్రభుత్వం రాజీనామా చేస్తుందా?.వైయస్. జగన్మోహన్రెడ్డి హయాంలో ముగ్గురు బీసీలకు డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చి సముచిత గౌరవం కల్పించారు.చంద్రబాబు తన మంత్రివర్గంలో బీసీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుండా పక్కన పెట్టడం బీసీలకు తీవ్ర అవమానం.పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిన చంద్రబాబుకు ఒక బీసీని తన పక్కన కూర్చోబెట్టుకునే మనసు రాలేదు.బీసీ అంటే బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ అని నిరూపించిన గొప్ప నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.ఎన్నికల ముందు బీసీలను వెన్నుముక అని పొగిడి, గెలిచాక తలలోని వెంట్రుకలా తీసిపారేస్తున్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను బీసీలంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు రాష్ట్రవ్యాప్తంగా బీసీలందరం ఐక్యంగా పోరాటం చేస్తాం.-రమేష్ యాదవ్, ఎమ్మెల్సీమేనిఫెస్టో హామీలను తుంగలో తొక్కిన కూటమి ప్రభుత్వంఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా బీసీలను తీవ్రంగా వంచిస్తున్నారు. భవిష్యత్తులో వైఎస్సార్సీపీ తరపున చేపట్టబోయే బీసీ ప్రజా పోరాట కార్యాచరణపై విస్తృతంగా చర్చించాం.వైయస్.జగన్మోహన్రెడ్డిహయాంలో రూ.4.5 లక్షల కోట్ల సంక్షేమంలో రూ.2 లక్షల కోట్లకు పైగా బీసీలకే నేరుగా అందించాం. కూటమి 27 నెలల పాలనలో బీసీలకు ఇచ్చిన ఒక్క ప్రధాన హామీ కూడా అమలు కాలేదు. 50 ఏళ్లు నిండిన బీసీ మహిళలకు ఇస్తామన్న రూ.4,000 పెన్షన్ హామీపై ఇప్పటివరకు ఎలాంటి కార్యాచరణ లేదు. బీసీలకు రక్షణ చట్టం తెస్తామని చెప్పి, వైఎస్సార్సీపీ బీసీ నేతలపైనే అక్రమ కేసులు, దాడులు చేయిస్తున్నారు. సాధ్యం కాదని తెలిసి కూడా కేవలం రాజకీయ లబ్ధి కోసమే అసెంబ్లీలో 34 శాతం రిజర్వేషన్ డ్రామా ఆడారు. గతంలో వైయస్. జగన్ ప్రభుత్వంలో రిజర్వేషన్లు ఇవ్వాలని చూస్తే కోర్టులకు వెళ్లి అడ్డుకున్న చంద్రబాబు ఇప్పుడు కల్లబొల్లి మాటలు చెబుతున్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో నిరుపేద బీసీలు తీవ్ర వైద్య ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన 56 బీసీ కార్పొరేషన్లకు నేటికీ చైర్మన్లను నియమించకుండా నిధులు నిలిపివేశారు.-విడదల రజని, మాజీ మంత్రిబీసీ డిక్లరేషన్ అమలుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలిగత రెండు ఆర్థిక సంవత్సరాలు, మూడు బడ్జెట్లలో బీసీలకు కేటాయింపుల్లో లయన్ షేర్ ఎక్కడా కనిపించలేదు. 50 ఏళ్లు దాటిన మహిళలకు రూ.4,000 పెన్షన్ ఇస్తామని చెప్పి ఇప్పటివరకు దానిపై నోరు మెదపడం లేదు.బీసీ సంక్షేమ శాఖ మంత్రి మహిళ అయి ఉండి కూడా బీసీ మహిళల సమస్యలపై చర్చకు రావడం లేదు.కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 34 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత తేవాలి.గతంలో వైయస్. జగన్ రిజర్వేషన్లు ఇస్తుంటే కోర్టు ద్వారా అడ్డుకున్న చంద్రబాబు నేడు బీసీల ముందు నవ్వులపాలయ్యారు.కురువ కులస్తులకు గుడికట్లు పూజారుల గౌరవ వేతనం రూ.5,000 ఇస్తామన్న హామీని పూర్తిగా విస్మరించారు. చేనేతలకు ఇచ్చే పథకాల్లో తీవ్ర కోతలు పెట్టి, అర్హులైన వేలాది మంది పేర్లను తొలగించారు.టైలర్లు, రజకులు, నాయిబ్రాహ్మణులకు జగన్మోహన్రెడ్డి అందించిన ప్రోత్సాహకాలను కూటమి సర్కార్ రద్దు చేసింది. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే రాష్ట్రంలో శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలి. రాష్ట్ర జనాభాలో 60 శాతానికి పైగా ఉన్న బీసీలను మోసం చేస్తే రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారు.-ఉషశ్రీ చరణ్, మాజీ మంత్రిబీసీలకు నిజమైన సాధికారత అందించింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేచంద్రబాబు సుదీర్ఘ రాజకీయ జీవితంలో బీసీలకు జరిగిన లబ్ధికి, జగనన్న ఐదేళ్ల పాలనలో జరిగిన లబ్ధికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. దాదాపు రెండు దశాబ్దాల రాజకీయాల్లో చంద్రబాబు బీసీలను రాజ్యసభకు ఒకరిద్దరిని పంపించి ఉంటారు. కానీ వైయస్.జగన్ నలుగురు బీసీలను పెద్దల సభకు పంపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓసీ జనరల్ స్థానాల్లోనూ బీసీలకు మేయర్లు, చైర్మన్లుగా జగన్ గారు అవకాశం కల్పించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు సింహభాగం ఇచ్చి జగన్మోహన్రెడ్డి ముందు నిలిచారు. కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు ఉన్నా 34 శాతం రిజర్వేషన్లకు ఎందుకు చట్టబద్ధత తీసుకురాలేకపోయారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకోవడానికే ఎన్నికల ముందు చంద్రబాబు ఉత్తుత్తి జీవోలను తెస్తున్నారు. చంద్రబాబు బీసీలను కేవలం పాత కులవృత్తులకే పరిమితం చేయాలని చూశారు తప్ప ఉన్నత స్థానాలకు చేర్చలేదు. గతంలో నాయిబ్రాహ్మణులపై చంద్రబాబు చూపిన అహంకారపూరిత వైఖరిని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు.27 నెలల కూటమి పాలనలో బీసీ నేతలపై పీడీ యాక్ట్లు, 307 అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారు.నేటి యువత, బీసీలు చైతన్యవంతంగా ఉన్నారు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి చావుదెబ్బ తప్పదు.-మార్గాని భరత్, మాజీ ఎంపీ -
జలద్రోహంపై YSRCP సమరభేరి పోతిరెడ్డిపాడు వద్ద హైటెన్షన్
-
TDP MLA కృష్ణప్రసాద్ ఆఫీస్ వద్ద నా వియ్యంకుడు, కోడలు.. ఇదిగో వీడియో..
-
‘విద్యాశాఖ నిర్వహణలో మంత్రి లోకేష్ ఘోర వైఫల్యం’
తాడేపల్లి: కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలలు అత్యంత అధ్వానంగా మారాయని, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఘోరంగా విఫలమయ్యారని మాజీ ఎంపీ డాక్టర్ తలారి రంగయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సొంత విద్యాశాఖను గాలికొదిలేసి మిగతా అన్ని శాఖల్లో వేలుపెడుతూ, దేశ విదేశాల్లో ప్రచారానికే పరిమితమవుతున్నారని ఆయన మండిపడ్డారు. హాస్టళ్లలో కనీసం బాత్రూమ్లకు నీళ్లిచ్చే దిక్కులేక, మౌలిక వసతులు కరువై దాదాపు 100 మంది అమాయక విద్యార్థులు మృత్యువాత పడ్డారని, ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే...బాత్రూమ్లకు నీళ్లివ్వలేని దౌర్భాగ్యస్ధితి...రాష్ట్రంలో విద్యాశాఖ నిర్వహణ ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదు. విద్యాశాఖ మంత్రి లోకేష్ పరిశ్రమలు తెస్తున్నారని ప్రచారం చేసుకుంటున్నారు కానీ, ఇక్కడ విద్యాశాఖలో ముక్కుపచ్చలారని పేద పిల్లల ప్రాణాలు పోతున్నాయి. గత కొద్ది నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 100 మంది విద్యార్థులు మరణించారు. చనిపోయిన వారిలో 8 నుంచి 13 సంవత్సరాల లోపు వయసున్న పేద పిల్లలే ఎక్కువగా ఉన్నారు. నేను రాజకీయాల కోసం మాట్లాడటం లేదు, అమాయక విద్యార్థుల ప్రాణాలు పోతున్న ఒక మానవీయ కోణంలో మాట్లాడుతున్నాను.విద్యామంత్రి 4 నిమిషాలు ఈ బాత్రూమ్ల వద్ద ఉండగలరా?సెట్టూరు మండలం జెడ్పీ హైస్కూల్లో బాత్రూమ్లు సరిగ్గా లేక పక్కన ఉన్న గోడ చాటుకు కాలకృత్యాల కోసం వెళ్లిన తేజా హర్షవర్ధన్ అనే ఎస్సీ విద్యార్థిపై గోడ కూలి అక్కడికక్కడే చనిపోయాడు. అక్షయ్ అనే మరో బాలుడికి కాలు విరిగింది. అలాగే రాయలప్పదొడ్డిలో కాలకృత్యాలకు వెళ్లిన బాలుడు పామ్ పాండ్లో పడి ప్రాణాలు కోల్పోయాడు. కనీసం బాత్రూమ్లకు నీళ్లు ఇవ్వలేని అసమర్థ స్థితిలో ఈ విద్యాశాఖ ఉంది. కనేకల్లు హాస్టల్లో 650 మంది పిల్లలు ఉంటే నీళ్లు లేక దుర్గంధం మధ్య గడుపుతున్నారు. విద్యాశాఖ మంత్రికి సవాల్ విసురుతున్నా.. కనేకల్లు హాస్టల్ బాత్రూమ్ల వద్ద కనీసం 4 నిమిషాలు నిలబడే ధైర్యం ఉందా?.రూ. లక్షన్నర పెట్టి బోర్ వేసే గతి లేదా?..ఒక హాస్టల్లో 650 మంది పిల్లలుంటే రూ. లక్షన్నర పెట్టి ఒక బోర్ వేయించడానికి ఎమ్మెల్యేకు తీరిక లేదు, కలెక్టర్కు పట్టదు. ఎందుకంటే ముఖ్యమంత్రి కుమారుడు చూసే శాఖ కాబట్టి ఎవరూ మాట్లాడకూడదా? గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్. జగన్ 'గోరుముద్ద' ఒక్క పథకానికే రూ. 7,245 కోట్లు ఖర్చు చేశారు. కానీ నేడు కూటమి పాలనలో హాస్టళ్లలో పురుగులు పడ్డ ఆహారం పెడుతున్నారు. నరసన్నపేట బసివలసలో 8 ఏళ్ల రష్మిక, 12 ఏళ్ల కల్పన అనారోగ్యంతో చనిపోయారు. కేజీబీవీలు, గురుకులాల్లో సరైన వసతులు లేక పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల ప్రాణాలు పోతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోంది..ఇసుక, మద్యంపై ఉన్న శ్రద్ధ.. విద్యార్థులపై లేదా?కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 372 అక్రమ బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. రోజూ రూ. 20 నుంచి 25 లక్షల అక్రమ సంపాదన వస్తోంది. ఇసుక, కంకర, మద్యం, విండ్ పవర్ కాంట్రాక్టులు, దోపిడీలపై ఉన్న శ్రద్ధ.. హాస్టళ్లకు వెళ్లి పిల్లలకు కనీస వసతులు కల్పించడంలో ఎందుకు లేదు? ప్రజావేదికల వద్ద ఎమ్మెల్యే బంధువుల చుట్టూ తిరిగే కొద్దిమంది ఉపాధ్యాయులు బడులు, హాస్టళ్ల సంక్షేమాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు? జన్మదిన వేడుకలకు ఇచ్చే ప్రాధాన్యత పాఠశాలల నిర్వహణపై ఎందుకు పెట్టడం లేదు?.రూ. కోటి పరిహారం ఇవ్వాలివిద్యార్ధి చనిపోయిన తర్వాత రూ. 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోవడం సరికాదని మాజీ ఎంపీ తలారి రంగ్య మండిపడ్డారు. బెల్ట్ షాపుల ద్వారా రోజూ లక్షలు దండుకుంటున్న ఎమ్మెల్యే తన సొంతంగా రూ. 50 లక్షలు, ప్రభుత్వం తరపున మరో రూ. 50 లక్షలు.. మొత్తం కోటి రూపాయల పరిహారం మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి ఇవ్వడంతో పాటు... కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలకు కారణమైన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలన్నారు. మరోవైపు విద్యాశాఖ మంత్రి లోకేష్ కు పాలన చేతకాకపోతే తప్పుకోవాలని తేల్చి చెప్పారు. -
బీసీ రాష్ట్ర గర్జనకు రూట్ మ్యాప్ .. తాడేపల్లిలో YSRCP బీసీ నేతల కీలక భేటీ
-
అదిగో నా కోడలు.. వసంత కృష్ణ ప్రసాద్ ఆఫీస్ వద్ద.. సంచలన వీడియో బయటపెట్టిన జోగి రమేష్
-
వైఎస్సార్సీపీ పోతిరెడ్డిపాడు పర్యటన.. నంద్యాలలో పోలీసుల ఓవరాక్షన్
సాక్షి, నంద్యాల: నంద్యాల జిల్లాలోని పోతులపాడు టర్నింగ్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోతిరెడ్డిపాడుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ నేతలు మాజీ మంత్రి శైలజానాథ్, జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా, సుధీర్లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, పార్టీ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది.ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ..‘సీమకు నీళ్ళు కావాలని పోతిరెడ్డిపాడు చూడటానికి వెళ్తే అడ్డుకోవడం ఏంటి?. ఇది చాలా దారుణం. ఖచ్చితంగా వెళ్లి తీరుతాం’ అని వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. వైఎస్సార్సీపీ నేతలు వస్తున్నారనే కారణంగా అధికారులు.. పోతిరెడ్డిపాడు గేటుకు తాళం వేయడం గమనార్హం. అంతేకాకుండా రెగ్యులేటర్ వద్దకు వెళ్ళడానికి అనుమతులు లేవన్న సాకుతో పోతిరెడ్డిపాడు వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసి పోలీసులు భారీ బందోబస్తు పెట్టారు. -
వైఎస్సార్సీపీ బీసీ నేతల సమావేశం ప్రారంభం
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ బీసీ నేతల సమావేశం ప్రారంభమైంది. రాష్ట్రంలోని బీసీ నేతలు ఈ భేటీకి హాజరై పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. రాష్ట్రంలో బీసీలపై జరుగుతున్న దాడులు, బీసీలకు ఎదురవుతున్న సమస్యలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం.అలాగే రానున్న రోజుల్లో బీసీల కోసం పార్టీ తరఫున చేపట్టాల్సిన కార్యక్రమాలు, అనుసరించాల్సిన కార్యాచరణపై నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. బీసీల హక్కులు, రక్షణ, సంక్షేమం వంటి అంశాలపై సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా బీసీలపై జరుగుతున్న దాడులపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీయడంతో పాటు, ఆయా ఘటనలపై పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యాచరణపైనా నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం బీసీల సమస్యలపై పార్టీ భవిష్యత్ కార్యాచరణను నేతలు వెల్లడించే అవకాశం ఉంది. -
కారుమూరి కుటుంబానికి అండగా YS జగన్
-
‘సీమ’కు జలద్రోహంపై వైఎస్సార్సీపీ సమరభేరి
సాక్షి, అమరావతి: దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రజలకు చంద్రబాబు సర్కారు చేస్తున్న జలద్రోహంపై వైఎస్సార్సీపీ సమరభేరి మోగించింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు తక్షణమే పూర్తి సామర్థ్యం మేరకు నీటిని విడుదల చేయాలనే డిమాండ్తో సోమవారం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద రైతులతో కలిసి భారీఎత్తున ఆందోళన చేపట్టేందుకు సిద్ధమైంది. వర్షాభావ పరిస్థితుల్లోనూ ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి ఆదివారం ఉ.6 గంటల వరకూ 203.67 టీఎంసీల ప్రవాహం వచ్చింది. అందులో కేవలం ఏడెనిమిది టీఎంసీలు మాత్రమే ఇప్పటివరకూ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీ–నీవా ద్వారా సరఫరా చేశారు. మరోవైపు.. ఎడమ గట్టు విద్యుత్కేంద్రం విద్యుదుత్పత్తి చేస్తూ రోజుకు నాలుగు టీఎంసీలు.. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 2,400 క్యూసెక్కులు తరలిస్తూ తెలంగాణ సర్కారు శ్రీశైలాన్ని ఖాళీ చేస్తోంది. అయినా సరే.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు గరిష్ఠంగా ఎనిమిది వేల క్యూసెక్కులను మాత్రమే చంద్రబాబు సర్కారు విడుదల చేస్తుండడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజుకు 3,850 క్యూసెక్కుల చొప్పున తరలించేలా రూ.3,500 కోట్లతో హంద్రీ–నీవాను అభివృద్ధి చేశామని పదేపదే సర్కారు చెబుతున్నప్పటికీ మూడు వేల క్యూసెక్కులకు మించి ఎత్తిపోయడంలేదు. ప్రస్తుతం శ్రీశైలంలో 876 అడుగుల్లో 168.26 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. పోతిరెడ్డిపాడు ద్వారా 35–40 వేల క్యూసెక్కులు తరలించే అవకాశమున్నప్పటికీ చంద్రబాబు సర్కారు మీనమేషాలు లెక్కిస్తోంది. వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఎగువ నుంచి అంచనాల మేరకు వరద ప్రవాహం వచ్చే అవకాశంలేదు. అయినా, తెలంగాణ సర్కారు ఇదే రీతిలో నీటిని తోడేస్తే కొద్దిరోజుల్లోనే శ్రీశైలం ఖాళీ అవుతుంది. పోతిరెడ్డిపాడుపై ఆధారపడిన తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి ప్రాజెక్టుల్లో అంతర్భాగమైన రిజర్వాయర్లలో నీటి నిల్వలు కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. తక్షణమే పోతిరెడ్డిపాడు ద్వారా గరిష్ఠ స్థాయిలో నీటిని తరలించకపోతే సాగునీటికే కాదు.. తాగునీటికీ తీవ్ర ఇబ్బందులు తప్పవని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగుగంగ, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్, గాలేరు–నగరి ఆయకట్టులో కనీసం ఆరుతడి పంటలకు కూడా నీళ్లివ్వకపోవడంపై వారు మండిపడుతున్నారు. కరువు పరిస్థితులవల్ల పశుగ్రాసం లేక పశువులను తెగనమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు దన్నుగా సర్కారుపై వైఎస్సార్సీపీ కదనభేరి మోగించింది. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో కుదిరిన చీకటి ఒప్పందం మేరకు రాయలసీమ ఎత్తిపోతల పనులను ఆపేసి కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టిన చంద్రబాబు తీరును నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఉద్యమాన్ని ఉధృతం చేసిన విషయం విదితమే.కరువులోనూ వెన్నుపోటు పొడుస్తారా?.. వెన్నుపోటు, చంద్రబాబు పర్యాయ పదాలని మరోసారి నిరూపితమవుతోంది. తీవ్రమైన కరువు పరిస్థితుల్లోనూ గుక్కెడు తాగునీళ్లు ఇవ్వకుండా పురిటిగడ్డ రాయలసీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్నారు. తెలంగాణ సర్కారు విద్యుదుత్పత్తి చేస్తుండటంవల్ల శ్రీశైలం ఖాళీ అవుతోంది. అయినాసరే.. పోతిరెడ్డిపాడుకు కేవలం 8 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడుపై ఆధారపడిన తెలుగుగంగ, గాలేరు–నగరి, ఎస్సార్బీసీ ప్రాజెక్టుల్లో అంతర్భాగమైన రిజర్వాయర్లలో నీటి నిల్వలు కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. తక్షణమే పోతిరెడ్డిపాడుకు పూర్తిసామర్థ్యం మేరకు నీటిని విడుదలచేసి.. ఆ రిజర్వాయర్లకు నీటిని చేర్చకపోతే తాగునీటికీ తీవ్ర ఇబ్బందులు తప్పవని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. హంద్రీ–నీవాకూ సామర్థ్యం మేరకు 3,850 క్యూసెక్కులు సరఫరా చేయాలి. ఇదే డిమాండ్తో రైతులతో కలిసి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీఎత్తున ఆందోళనకు సిద్ధమయ్యాం. – సాకే శైలజానాథ్, మాజీమంత్రి -
బడులు ఖాళీ అవుతున్నా బాబు అబద్ధాలు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ చివరి ఏడాది అయిన 2023–24లో పోల్చితే 2025–26లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 5.56 లక్షలు తగ్గిందని కేంద్ర విద్యా శాఖకు చెందిన యూడైస్ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్–యూడీఐఎస్ఈ) గణాంకాలు తేల్చిచెబుతుంటే.. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ప్రైవేటు పాఠశాలల నుంచి 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని పదే పదే ప్రచారం చేసుకుంటోందంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. ఆధారం లేని ప్రకటనలు చేయడం, ఆ తర్వాత అధికారిక గణాంకాలతో దొరికిపోవడం కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయిందంటూ చంద్రబాబు సర్కార్కు చురకలంటించారు. ‘యూడైస్+’ గణాంకాలను ఉటంకిస్తూ ప్రభుత్వ పాఠశాల విద్యా రంగంలో కూటమి సర్కార్ అనుసరిస్తున్న తీరును కడిగిపారేశారు. విప్లవాత్మక సంస్కరణలతో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతి అడుగూ ముందుకు వేసిందని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలు తగ్గుతున్నాయని, విద్యార్థుల సంఖ్య పడిపోతుండగా.. ప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని ఎత్తిచూపారు. ఇది ప్రభుత్వ పాఠశాల విద్యా రంగంలో ఆందోళనకర పరిణామమంటూ ‘ఎక్స్’లో తన ఖాతాలో ఆదివారం వైఎస్ జగన్ పోస్టు చేశారు. వైఎస్ జగన్ ఆ పోస్టులో ఏమన్నారంటే.. బాబు ప్రభుత్వ డొల్ల ప్రచారం.. ఈ లెక్కలే సాక్ష్యం.. ‘మా ప్రభుత్వ చివరి ఏడాది అయిన 2023–24తో పోలిస్తే 2025–26లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు భారీగా తగ్గిపోయింది. కానీ, కూటమి ప్రభుత్వం మాత్రం, ప్రైవేటు పాఠశాలల నుంచి 1.10 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని పదే పదే ప్రచారం చేసుకుంటోంది. ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరిగిందనడానికి ఇదే నిదర్శనమని చెప్పుకుంటోంది. ఆధారం లేని ప్రకటనలు చేయడం, ఆ తర్వాత అధికారిక గణాంకాలతో దొరికిపోవడం కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది. 2023–24 విద్యా సంవత్సరంతో పోల్చితే 2025–26లో ప్రభుత్వ పాఠశాలల్లో 5,56,666 మంది విద్యార్థులు తగ్గినట్లు వెల్లడిస్తున్న యూడైస్ ప్లస్ నివేదిక 2023–24 విద్యాసంవత్సరంతో పోల్చితే 2025–26లో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 45 వేల నుంచి 44,222కు, ఎయిడెడ్ పాఠశాలల సంఖ్య 991 నుంచి 797కు తగ్గినట్లు వెల్లడిస్తున్న యూడైస్ ప్లస్ నివేదిక » నిజంగా 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరితే ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం విద్యార్థుల సంఖ్య పెరగాలి కదా? కానీ కేంద్ర విద్యాశాఖకు చెందిన ‘యూడైస్’ వెల్లడించిన అధికారిక గణాంకాలు అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. 2023–24 విద్యా సంవత్సరం, 2025–26 విద్యా సంవత్సరంతో పోల్చి చూస్తే, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 40,50,116 నుంచి 34,93,450కి పడిపోయింది. అంటే ఏకంగా 5,56,666 మంది విద్యార్థులు తగ్గిపోయారు. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 45 వేల నుంచి 44,222 కు తగ్గిపోయింది. ఇంకా ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల సంఖ్య కూడా 991 నుంచి 797కు పడిపోయింది. మరోవైపు అదే సమయంలో ప్రైవేటు యాజమాన్యంలోని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 45,53,380 నుంచి 48,40,296కు పెరిగింది. » అలా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులు తగ్గిపోతుంటే ప్రైవేటు పాఠశాలల్లో మాత్రం పెరుగుతున్నారు. అంటే, కూటమి ప్రభుత్వం చెబుతున్నది ఒకటైతే, కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్న వాస్తవాలు మరొకటి. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితికి, ప్రభుత్వ ప్రచారంలోని డొల్లతనానికి ఈ లెక్కలే ప్రత్యక్ష సాక్ష్యం. ప్రైవేటు విద్యా సంస్థలతో టీడీపీకి ఉన్నఅపవిత్ర సంబంధం కారణంగానే.. ఆంధ్రప్రదేశ్లోని ప్రైవేటు విద్యా రంగంలో నారాయణ, శ్రీచైతన్య, భాష్యం, విజ్ఞాన్, గీతం వంటి సంస్థల ఆధిపత్యం ఉంది. ఈ సంస్థలతో టీడీపీకి ఉన్న అపవిత్ర సంబంధాల కారణంగానే ప్రభుత్వ విద్యావ్యవస్థను ఉద్దేశపూర్వకంగా బలహీనపరుస్తూ, ప్రైవేటు విద్యా సంస్థల అభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం బాట వేస్తోందన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో చదివించే ఆర్థిక స్థోమత లేని పేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్యను దూరం చేస్తున్న అత్యంత ఆందోళనకరమైన పరిస్థితి ఇది. విద్యారంగంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలు» వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019–24 మధ్య విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చింది. మనబడి నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, జూనియర్ కళాశాలలు కలిపి 56,703 విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు చేపట్టాం. ఫర్నిచర్, రక్షిత మంచినీరు, రన్నింగ్ నీటి సదుపాయంతో కూడిన మరుగుదొడ్లు, అదనపు తరగతి గదులు తదితర సదుపాయాలతో ప్రభుత్వ విద్యాసంస్థల రూపురేఖలను మార్చాం. మొదటి దశలో 15,715 పాఠశాలల్లో పనులు పూర్తి చేశాం. రెండో దశలో 22,344 పాఠశాలలకు పనులను విస్తరించగా, మూడో దశ పనులు కూడా 2024 జూన్ నాటికి కొనసాగుతున్నాయి. నాడు–నేడు కార్యక్రమం కోసం మా ప్రభుత్వం రూ.8,524 కోట్లు ఖర్చు చేసింది.» ఎనిమిదో తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకు బైజూస్ కంటెంట్తో కూడిన ట్యాబ్లను ఉచితంగా అందించాం. పేద పిల్లలు ప్రపంచస్థాయిలో పోటీ పడాలనే లక్ష్యంతో ప్రాథమిక స్థాయి నుంచే ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాం. విద్యార్థులు సులభంగా ఆంగ్ల మాధ్యమంలోకి మారేందుకు ద్విభాషా పాఠ్యపుస్తకాలు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీలను అందించాం. ఆరో తరగతి నుంచి ప్రతి తరగతి గదిలో డిజిటల్ బోధన కోసం 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ (ఐఎఫ్పీ) ఏర్పాటు చేశాం. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులున్న పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేశాం. ఇంకా మూడో తరగతి నుంచే విద్యార్థుల్లో స్పోకెన్ ఇంగ్లిష్లో నైపుణ్యం పెంపొందించేందుకు టోఫెల్ శిక్షణ ప్రవేశపెట్టాం. ఇంకా విద్యార్థులకు అంతర్జాతీయ టోఫెల్ సర్టిఫికేషన్ అందించేందుకు అమెరికాకు చెందిన ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్ (ఈటీఎస్)తో ఒప్పందం చేసుకున్నాం.» ఇంకా మన పిల్లలు ప్రపంచస్థాయిలో పోటీ పడి విజయం సాధించాలనే లక్ష్యంతో ఇంటర్నేషనల్ బాకలారియేట్–ఐబీ విద్యా విధానాన్ని కూడా ప్రవేశపెట్టేందుకు చర్యలు ప్రారంభించాం. ఐబీ విధానంపై ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు, ఇతర విద్యాశాఖ సిబ్బందికి శిక్షణ, సామర్థ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. » ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు మన ప్రభుత్వం ప్రతి అడుగూ ముందుకు వేసింది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలు తగ్గుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పడిపోతుండగా, ప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఇది ప్రభుత్వ పాఠశాల విద్యా రంగంలో ఆందోళనకర పరిణామం. -
నా అరెస్టులో కొత్తేముంది?: కారుమూరి
హైదరాబాద్: మద్యం అక్రమ కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కారుమూరి నాగేశ్వరరావు స్పందించారు.అధికారులు తనను తీసుకెళ్తున్న సమయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నా అరెస్టులో కొత్తేముంది? అక్రమ అరెస్టులు రాష్ట్రమంతా జరుగుతున్నాయి. నా కుమారుడిని అరెస్ట్ చేశారు.. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేశారు. ఏమీ లేకుండానే కుటుంబాన్నంతటినీ ఇబ్బంది పెడుతున్నారు. కల్పితాలేవో వాస్తవాలేంటో కోర్టులో తెలుస్తాయి’’ అని ఆయన అన్నారు. కాగా, హైదరాబాద్లోని తన నివాసంలో కారుమూరిని ఈడీ ఆదివారం అరెస్టు చేసింది. తప్పుడు కేసులో కారుమూరిని కూటమి ప్రభుత్వం ఇరికించిన క్రమంలో ఆయనను అరెస్టు చేసింది. దీనిపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీ నాయకుడిని తప్పుడు కేసులో ఇరికించారని మండిపడుతున్నారు. ఇదీ చదవండి: కారుమూరి అక్రమ అరెస్టును ఖండించిన బీసీ నేతలు -
కారుమూరి అక్రమ అరెస్టును ఖండించిన బీసీ నేతలు
విజయవాడ: వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అక్రమ అరెస్టును పార్టీకి చెందిన బీసీ నేతలు ఖండించారు. లేని లిక్కర్ కేసును ఉన్నట్లు చూపించి కారుమూరిని అరెస్టు చేశారంటూ వైఎస్సార్సీపీ బీసీ నేతలు మండిపడుతున్నారు. ప్రశ్నించే బీసీలపై చంద్రబాబు కక్ష సాధిస్తున్నారని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ధ్వజమెత్తారు. ‘మాజీ మంత్రి కారుమూరి అరెస్టు అక్రమం. లేని లిక్కర్ కేసును సృష్టించి అరెస్టు చేశారు. వెన్నుపోటు పార్టీ ప్రభుత్వ అరాచకాలు పరాకాష్టకు చేరాయి. కారుమూరి అరెస్టు కక్ష సాధింపు చర్యల్లో భాగమే’ అని రమేష్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.మరో మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ. .లేని కేసును సృష్టించి అన్యాయంగా వేధిస్తున్నారన్నారు. కారుమూరిని కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అరెస్టు చేశారన్నారు. బీసీ నేతలపై వెన్నుపోటు పార్టీ అనైతికంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. అక్రమ మద్యాన్ని తమ హయాంలో పూర్తిగా నియంత్రించామన్నారు. మద్యం షాపులను సైతం తగ్గించామని, కారుమూరిని కావాలనే కేసులో ఇరికించారన్నారు. వెన్నుపోటు పార్టీ ఇకనైనా అరాచకాలు ఆపాలన్నారు. లేకపోతే చంద్రబాబుకు బీసీలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.అసలైన మద్యం స్కాం చంద్రబాబు హయాంలోనే జరిగిందని మరో మాజీ మంత్రి విడదల రజిని ధ్వజమెత్తారు. 2014-19లో మద్యం విక్రయాల్లో అక్రమాలు జరిగాయన్నారు. బార్లకు మేలు చేసేందుకు ప్రివిలేజ్ ఫీజును కూడా రద్దు చేశారని, చంద్రబాబు హయాంలోని మద్యం కేసులను కప్పిపుచ్చుకునేందుకే ఈ అక్రమ కేసులని మండిపడ్డారు. కారుమూరి అరెస్టును తామంతా తీవ్రంగా ఖండిస్తున్నామని ఆమె స్పష్టం చేశారు.అక్రమ కేసులో మాజీ మంత్రి కారుమూరి అరెస్టు -
‘అభివృద్ధి మాది... డప్పు కూటమి ప్రభుత్వానిది’
అనకాపల్లి: సీఎం చంద్రబాబు మాడుగుల పర్యటన వలన ఎలాంటి ప్రయోజనం లేదని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ నేత బూడి ముత్యాల నాయుడు విమర్శించారు. వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని ధ్వజమెత్తారు. అభివృధ్ధి తాము చేస్తే.. డప్పు మాత్రం కూటమి ప్రభుత్వం కొట్టుకుంటుందని మండిపడ్డారు. నమ్మినవారిని నట్టేట ముంచడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని, వెన్నుపోటు పొడవడమే ఆయన రాజకీయమన్నారు. ‘డిఎస్సీ అవకతవకలపై సీబిఐ విచారణ జరిపించాలి. సిబిఐ విచారణ అంటే కూటమి ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదు. కూటమి పాలనలో గ్రామాలలో మద్యం ఏరులై పారుతుంది. వైఎస్సార్సీపీ హయాంలో మద్యం దుకాణాలను పరిమితం చేశాం. ఇప్పుడు గ్రామాలలో బెల్ట్ షాపులు పెరిగాయి.వైఎస్సార్సీపీ గత పథకాలను కూటమి ప్రభుత్వం క్రెడిట్ తీసుకుంటుంది.రైతులపై టీడీపీ మొసలి కన్నీరు కురుస్తుంది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బాబు టైమింగ్, రైమింగ్... నవ్వకండి.. సీరియస్ మ్యాటర్...
-
‘బాబు సర్కార్ దాష్టీకాలపై 'ఆంధ్రకేసరి' స్ఫూర్తితో పోరాడుతాం’
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో నడుస్తున్న పోలీస్ రాజ్యానికి, ప్రభుత్వ దాష్టీకాలకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలబడి ఆంధ్రకేసరి స్ఫూర్తితో పోరాడుతామని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉద్ఘాటించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు 'ఆంధ్రకేసరి' టంగుటూరి ప్రకాశం పంతులు 154వ జయంతి వేడుకలు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు.. ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడుస్తూ బ్రిటీష్ సామ్రాజ్యంపై రాజీలేని పోరాటం చేసిన ధీరోదాత్తుడు టంగుటూరి అని కొనియాడారు.ప్రకాశం జిల్లాలో జన్మించి, లండన్లో బారిస్టర్ చదివిన ఆయన.. సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా తుపాకులకు ఎదురొడ్డి నిలిచిన తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక అని కీర్తించారు. రాజమండ్రి మున్సిపల్ చైర్మన్గా, మద్రాస్ ప్రెసిడెన్సీలో రెవెన్యూ మంత్రిగా రైతులకు, విద్యార్థులకు, మహిళలకు ఆయన చేసిన విశేష సేవలను స్మరించుకున్నారు. 'స్వరాజ్యం' పత్రిక ద్వారా జాతీయోద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, క్విట్ ఇండియా ఉద్యమంలో ఆయన పోషించిన కీలక పాత్రను గుర్తుచేశారు.ప్రజల పక్షాన నిలబడతాం..వైఎస్ జగన్ గారి నేతృత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ప్రకాశం పంతులు గారి బాటలోనే పయనిస్తోందని మల్లాది విష్ణు స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్న పోలీస్ రాజ్యానికి, ప్రభుత్వ దాష్టీకాలకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలబడి పోరాడుతామని ఉద్ఘాటించారు. ఆంధ్రకేసరి స్ఫూర్తితో అడుగులో అడుగు వేస్తూ ముందుకు సాగుతామని ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణమూర్తి, వివిధ విభాగాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
‘‘మార్గదర్శి బకాయిలను రామోజీ వారసులు చెల్లించాల్సిందే’’
తాడేపల్లి: రామోజీ రావు రాజకీయ నాయకుడు కాదు కానీ, టీడీపీని నడిపించిన వ్యక్తని మాజీ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. రామోజీకి చెందిన మార్గదర్శికి సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇవ్వలేదని అన్నారు. మార్గదర్శి బకాయిలను ఆయన వారసులు చెల్లించాల్సిందేనని చెప్పారు. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా రూ.2,600 కోట్లు సేకరించిందని, ఇది చట్టవిరుద్ధమని తెలిపారు. రామోజీ ఆర్ధికనేరగాడని, ఉండవల్లి అరుణ్ కుమార్ కేసు వేశాక రామోజీ కొన్ని టీవీ ఛానళ్లను అమ్మేశారని అంబటి రాంబాబు చెప్పారు. ఆ డబ్బును డిపాజిట్దారులకు అందించారని తెలిపారు. ఆర్బీఐని కూడా మేనేజ్ చేశారని, అందుకే మార్గదర్శి గురించి ఇక మేము పట్టించుకోమంటూ ఉండవల్లికి లేఖ రాసిందని చెప్పారు. ఉండవల్లి సొంతంగా కేసును వాదించారని అన్నారు. 20 ఏళ్లుగా ఆయన మార్గదర్శిపై పోరాటం చేస్తున్నారని తెలిపారు. మార్గదర్శి చిట్స్ కూడా తప్పుడుదారిలో నడుస్తోందని చెప్పారు. రామోజీ బతికినంతకాలం చంద్రబాబుకు సేవ చేశారని అన్నారు. ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచినప్పుడు కూడా చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించారని చెప్పారు. ఎన్టీఆర్ను అవినీతి పరుడనీ చిత్రీకరించారని తెలిపారు. అందుకే ఆయన చనిపోయాక చంద్రబాబు ప్రభుత్వం సొంత ఖర్చుతో సంతాప సభలు పెట్టిందని చెప్పారు. డీఎస్సీలో అక్రమాలపై ప్రశ్నించామని గ్రూప్ 1ని తెరమీదకు తెచ్చారని తెలిపారు. రెండింటిపై సీబీఐ విచారణ జరిపించాలంటే చంద్రబాబు, లోకేశ్ పారిపోయారని అన్నారు.ఉద్యోగాలు రాక రోడ్డున పడిన వారితో ర్యాలీ చేయించగలరా? అని అంబటి రాంబాబు నిలదీశారు.ఇదీ చదవండి: ప్రపంచం ముందు భారత్ తలెత్తుకు నిలబడేలా..‘‘పరీక్ష పేపర్ లీక్ కాలేదనీ, అంతా సక్రమంగా జరిగిందని వారితో చెప్పించగలరా? పవన్ కల్యాణ్ కేబినెట్ మీటింగ్లకు ఎందుకు వెళ్లటంతో ఆయనే చెప్పాలి. అనారోగ్యంతో రావటంలేదని జనసేన వాళ్లు అంటున్నారు. కానీ చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య ఆరోగ్యకర వాతావరణం దెబ్బ తిన్నదని కొందరు అంటున్నారు’’ అని అంబటి రాంబాబు తెలిపారు. -
తిరుమల శ్రీవారి సన్నిధిలో బొత్స సత్యనారాయణ
-
టీడీపీలో చేరలేదని... YSRCP సర్పంచ్ ఇల్లు కూల్చివేత..
-
బాబూ.. లోకేష్ను కాపాడే ప్రయత్నమా?: అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో డీఎస్సీ, గ్రూప్-1 అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సవాల్పై చంద్రబాబు, లోకేష్ ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. చంద్రబాబు తన కుమారుని కాపాడుకోవడం మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆదివారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘అనకాపల్లి జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు రైతాంగ సమస్యలు మీద కాకుండా రాజకీయాలు మాట్లాడారు. డీఎస్సీలో జరిగిన స్కాం నుంచి బయట పడటం మీద ఎక్కువ మాట్లాడుతున్నారు. డీఎస్సీ, గ్రూప్-1 అవకతకలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు వైఎస్ జగన్ సవాల్పై నోరు మెదపలేదు. తన కుమారుని కాపాడుకోవటం మీద చంద్రబాబు ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు.ప్రజాధనంతో సభలు పెడుతూ కొడుకును కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు, లోకేష్ పచ్చి అబద్దాలు చెప్పారు. లోకేస్ తోడల్లుడు భరత్, ఎమ్మెల్యే కూన రవి సంతకాలు చేస్తే ఉద్యోగాలు ఇచ్చారు. మీ వారిని కాపాడుకోవడానికి తాపత్రయమా చంద్రబాబు?. పనిక కాక ముందు ఒక జీవో.. పని అయ్యాక ఒక జీవోనా? సీబీఐ విచారణ జరిపించడానికి ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు?.ఇది కూడా చదవండి: తగ్గితే నెగ్గుకురాలేం.. జనసేనలో కొత్త ఆందోళనఒకొక్క టీచర్ ఉద్యోగాన్ని 15 లక్షలు వరకు అమ్ముకున్నారు. వైఎస్ జగన్ లక్ష 30 వేల ఉద్యోగాలను ఒకేసారి భర్తీ చేశారు. సచివాలయ ఉద్యోగాల భర్తీలో ఎక్కడా ఒక అవినీతి ఆరోపణ వినిపించలేదు. అది వైఎస్ జగన్ క్రెడిబిలిటి. మీ పార్టీ నాయకులు సంతకాలు పెట్టిన వారికి ఉద్యోగాలు ఇచ్చారు. వైఎస్ జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే అమ్మకం అని ప్రజలు నమ్ముతున్నారు. డేటా సెంటర్లకు మేము వ్యతిరేకం కాదు. డేటా సెంటర్లకు 10 టీఎంసీ నీళ్లు అవసరం. ఆ నీటిని డేటా సెంటర్లకు ఎలా ఇస్తారు?. చంద్రబాబు.. కరువు.. కవల పిల్లలు. చంద్రబాబు పాదంతో మరోసారి కరువు సంభవించింది. ఆంధ్రప్రదేశ్ను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి. వైఎస్ జగన్పై విమర్శలు చేయడం కోసమే బహిరంగ సభ పెట్టారు అంటూ మండిపడ్డారు. -
పోలీసుల వేధింపులకు.. వైఎస్సార్సీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం
పిడుగురాళ్ల/మాచవరం: ఓ కేసులో రాజీకి రావాలంటూ ఎస్ఐ పెడుతున్న వేధింపులు తాళలేక వైఎస్సార్సీపీ కార్యకర్త శనివారం ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అతనిని పిడుగురాళ్లలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాధితులు తెలిపిన వివరాలు.. 2023లో పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్తగణేశునిపాడు గ్రామానికి చెందిన బొంత గురవయ్యకు చెందిన పొలంలోకి టీడీపీకి చెందిన నంబుల వెంకటాద్రి, నంబుల గంగాధర్, యెనుముల గోపిలకు చెందిన గొర్రెలు వెళ్లాయి. దీంతో గొర్రెలను పొలంలోకి ఎందుకు దింపారంటూ వెంకటాద్రి, గంగాధర్, గోపిలను గురవయ్య ప్రశ్నించగా వారు గురవయ్యపై దాడిచేశారు. అప్పట్లో గురవయ్య మాచవరం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే గురవయ్యని ఊరు నుంచి వెళ్లిపోవాలంటూ టీడీపీ నాయకులు హుకుం జారీచేశారు. దీంతో గురవయ్య ఏడాదిన్నరగా పక్క గ్రామాల్లో ఉంటున్నాడు. ఇటీవల గురవయ్య తండ్రి చనిపోవడంతో కొత్తగణేశునిపాడు గ్రామానికి వచ్చి ఉంటున్నాడు. ఇది తెలుసుకున్న గ్రామ టీడీపీ నాయకులు చల్లగుండ్ల భిక్షమయ్య, నంబుల గంగాద్రి, నంబుల సింగరయ్య, చల్లగుండ్ల శ్రీకాంత్, నన్నపనేని గంగ ప్రసాద్.. గురవయ్య వద్దకు వచ్చి ‘నువ్వు కేసు రాజీ చేసుకోవాలి’.. అని బెదిరించారు. అలాగే, నెలరోజుల కిందట గురవయ్యను మాచవరం ఎస్ఐ పవన్కుమార్ పోలీస్స్టేషన్కు పిలిపించి కేసు రాజీ చేసుకోవాల్సిందేనని, చేసుకోకపోతే నీపై ఎన్ని కేసులు నమోదవుతాయో తెలీదని బెదిరించారు. అయినా గురవయ్య కేసు రాజీచేసుకోలేదు. మళ్లీ శుక్రవారం ఉదయాన్నే కానిస్టేబుల్ను కొత్తగణేశునిపాడు గ్రామానికి పంపించి కేసు నిమిత్తం గురవయ్యను తీసుకెళ్తున్నామని ఇంట్లో చెప్పి వెళ్లారు. గురవయ్య తమ్ముడు ప్రసాద్, కొంతమంది వైఎస్సార్సీపీ నాయకులు పోలీస్స్టేషన్కు వెళ్లారు. అయితే, ఎస్ఐ పవన్కుమార్ ప్రసాద్ను ఉద్దేశించి.. ‘నువ్వు, మీ అన్నయ్య వైఎస్సార్సీపీలో తిరుగుతారంట కదా, కేసులు ఎందుకు రాజీ చేసుకోరురా’.. అంటూ అసభ్యపదజాలంతో దూషించి ఇష్టమొచ్చినట్లు కొట్టారు. మరోవైపు.. శుక్రవారం రాత్రి స్టేషన్లో ఎస్ఐ పవన్కుమార్ గురవయ్యను తిట్టి, కొట్టి కేసు రాజీ చేసుకోకపోతే మరిన్ని కేసులు పెడతామని బెదిరించి పూచీకత్తుపై ఇంటికి పంపించేశారు. దీంతో బాధితుడు తీవ్ర మనస్తాపానికి గురై శనివారం ఉదయం ఇంట్లో ఎలుకల మందు తిన్నాడు. కుటుంబ సభ్యులు అతన్ని గమనించి ఆస్పత్రికి తరలించారు. అక్కడ గురవయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులు జరిగిన ఘటనపై పల్నాడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.ఎస్ఐ, టీడీపీ వాళ్లూ బెదిరించారు.. కేసు రాజీ చేసుకోవాల్సిందేనని ఎస్ఐ పవన్కుమార్ బెదిరించాడు. రోజు పోలీస్స్టేషన్కు తీసుకువెళ్లి.. కేసు రాజీ చేసుకోవాల్సిందేనని దుర్భాషలాడాడు. అలాగే, వైఎస్సార్సీపీ వెంట తిరిగిన మీరు మాపై కేసులు పెడతారా.. ఎందుకు రాజీకి రారో చూస్తాం.. గ్రామంలో ఎలా ఉంటారో చూస్తామంటూ టీడీపీ నాయకులూ బెదిరించారు. వీటన్నింటితో గురవయ్య మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. – రమాదేవి, గురవయ్య భార్య.. ప్రసాద్, గురవయ్య తమ్ముడు ఎలాంటి వేధింపులకు గురిచేయలేదు.. గురవయ్యను కేసు నిమిత్తం పోలీసుస్టేషన్కు పిలిపించిన మాట వాస్తవమే. అతనిని శుక్రవారం పిలిపించి విచారణ అనంతరం 41(ఏ) నోటీసులు ఇచ్చి ఇంటికి పంపించాం. ఎలాంటి వేధింపులకు గురిచేయలేదు. చికిత్స అనంతరం చట్ట ప్రకారం అతనిపై దర్యాపు చేపడతాం. ఆయన రాజీకి అంగీకరించలేదు. అతని నుంచి ఫిర్యాదు అందితే దానిపైనా దర్యాప్తు చేస్తాం. – మహేశ్వరరావు, గురజాల డీఎస్పీ -
స్టార్ హోటళ్ల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం
తిరుపతి మంగళం: తిరుపతి, తిరుచానూరు ప్రాంతాల్లో స్టార్ హోటళ్ల నిర్మాణం పేరుతో చంద్రబాబు, లోకేశ్ ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 20న కూటమి ప్రభుత్వం రెడిసన్ బ్లూ (ఫైవ్ స్టార్), సీఆర్ఆర్ హాస్పిటాలిటీ (ఫైవ్ స్టార్), ఎసెన్షియల్ (త్రీ స్టార్) హోటళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చిందన్నారు. 9 నెలల క్రితమే ఏర్పడిన సీఆర్ఆర్ హాస్పిటాలిటీకి తిరుచానూరు సమీపంలోని దామినేడులో 1.71 ఎకరాల ప్రైవేట్ స్థలంలో ఫైవ్స్టార్ హోటల్ నిర్మాణానికి అనుమతులు,ఐదేళ్ల ఉచిత విద్యుత్, యూడీఎస్, జీఎస్టీ తదితర రాయితీలు ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు. ఆ సంస్థకు హోటల్ రంగంలో అనుభవం, ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు లేవని చెప్పారు. అనుమతుల వెనకున్న వ్యక్తులను బయట పెట్టాలని డిమాండ్ చేశారు.ఇప్పటికే తిరుచానూరు సమీపంలో 21ఎకరాల టూరిజం భూమిని ఎకరాకు రూ.90 లక్షల చొప్పున 2 సంస్థలకు కేటాయించారని, ప్రభుత్వ విలువ ఎకరాకు రూ.4.5 కోట్లు ఉన్నప్పటికీ, తక్కువ ధరకే అప్పగించారన్నారు. రూ.వందల కోట్ల కమీషన్ల కోసం చంద్రబాబు, లోకేశ్ బరితెగించి, ఇష్టానుసారంగా అనుమతులివ్వడందారుణమన్నారు. స్టార్ హోటళ్ల పేరుతో భూ కేటాయింపుల్లో అక్రమాలు జరుగుతున్నాయని, వాటిపై వైఎస్సార్సీపీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు. -
‘మాజీ సర్పంచ్ను టార్గెట్ చేసి ఇంటిని కూల్చేస్తారా?’
తణుకు(ప.గో. జిల్లా): ఏపీలో నియంత పాలన కొనసాగుతోందనడానికి తమ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ లావణ్య ఇంటిని కూల్చేయడం మరొక ఉదాహరణ అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వరుదు కళ్యాణి ధ్వజమెత్తారు. కక్షతోనే ఆమె ఇంటిని కూల్చేశారని మండిపడ్డారు. ఈరోజు(శనివారం, ఆగస్టు 22వ తేదీ) తణుకు నియోజకవర్గం అయింతపూడిలో కూటమి నేతలు కూల్చేసిన మాజీ సర్పంచ్ లావణ్య ఇంటిని పరిశీలించడానికి వైఎస్సార్సీపీ నేతలు వరుదు కళ్యాణి, కల్పలతారెడ్డి తదితరులు వెళ్లారు. దీనిలో భాగంగా వారు మీడియాతో మాట్లాడారు.‘మాజీ సర్పంచ్ లావణ్యను ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ టార్గెట్ చేశారు. కక్షతో ఆమె ఇంటిని కూల్చేశారు. తణుకులో ఎలాంటి భయానక వాతావరణం ఉందో అర్థమవుతుంది. హిట్లర్, గడాఫీ కన్నా దారుణంగా టిడిపి నాయకుల పాలన ఉంది. టీడీపీ కండువా వేసుకోలేదని వైఎస్సార్సీపీకి మద్దతుగా ఉన్నారని వీరిపై కక్ష గట్టారు. ఇది కూటమి ప్రభుత్వమా కూల్చివేతల ప్రభుత్వమా...?, మహిళ అని కూడా చూడకుండా లక్షలు పెట్టి కట్టుకున్న ఇంటిని తెల్లవారుజామున వచ్చి కూల్చివేశారు..ఇది డబల్ ఇంజన్ సర్కార్ కాదు బుల్డోజర్ సర్కార్. అసలు మనం ఏపీలో ఉన్నామా? ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా’ అని వరుదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ.. ‘ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అయితంపూడి మాజీ సర్పంచ్ లావణ్య కుటుంబంపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు. మహిళపై ఎందుకింత కక్ష. ఇల్లు కూల్చడమే కాకుండా రెచ్చగొట్టేలా ఫ్లెక్సీలు కడతారా....?, ఫ్లెక్సీల కోసం ఏకంగా సీసీ కెమెరాలు నిఘా పెట్టారు. తణుకులో వైఎస్సార్సీపీకి మద్దతు పెరుగుతుందని ఇలాంటి కక్ష పూరిత రాజకీయాలు చేస్తున్నారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు వచ్చి ఇల్లు కూల్చేశారు. ఇళ్లలో ఎవరు ఉన్నారు.. ఏంటి అనేది ఈ ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం లేదా?, వైఎస్సార్సీపీ వారి ఇళ్లను కూల్చి వేయించడం దారుణం. అధికారం ఎవరికి శాశ్వతం కాదు గుర్తుపెట్టుకోండి’ అని హెచ్చరించారు. ఇదీ చదవండి:గుంటూరులో టీడీపీ నేతల గూండాగిరి -
‘పరిశ్రమలను భయపెట్టి తరిమేస్తున్నారు’
తాడేపల్లి: రాష్ట్రంలో వెన్నుపోటు కూటమి వేధింపులు, కప్పం డిమాండ్ల వల్లే ఆంధ్రప్రదేశ్ నుంచి పరిశ్రమలు వరుసపెట్టి పక్క రాష్ట్రాలకు పారిపోతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక రంగం తీవ్ర సంక్షోభంలో పడిందని విమర్శించారు. కొత్త పరిశ్రమలు రావడం మాట అటుంచితే, ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన సంస్థలు కూడా రాష్ట్రం విడిచి వెళ్లిపోతున్నాయని ఆరోపించారు. రూ.6,675 కోట్ల పెట్టుబడితో నెల్లూరులో ఏర్పాటు కావాల్సిన టాటా పవర్ ప్రాజెక్ట్ ఒడిశాకు వెళ్లిపోయిందని, రూ.3,538 కోట్ల పెట్టుబడితో నాయుడుపేటలో ఏర్పాటు కావాల్సిన వెబ్సోల్ ప్రాజెక్ట్ వెస్ట్ బెంగాల్కు వెళ్లిపోయిందని అన్నారు. ఈ సంస్థలు ఎందుకు రాష్ట్రం విడిచి వెళ్లిపోయాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలు వచ్చాయని ప్రభుత్వం ప్రచారం చేస్తోందని, అయితే ఆ పెట్టుబడులు ఎక్కడ వచ్చాయో, ఏ పరిశ్రమలు ఏర్పాటయ్యాయో, 20 లక్షల ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారో పబ్లిక్ డొమైన్లో పెట్టాలని పుత్తా శివశంకర్ సవాల్ చేశారు. పూర్తి వివరాలు ఇవ్వలేకపోతే కనీసం 10 శాతం ఉద్యోగాల వివరాలైనా వెల్లడించాలని పుత్తా శివశంకర్ డిమాండ్ చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...భూముల రద్దు.. కంపెనీల వెళ్లగొట్టింపుగత వైఎస్ జగన్ గారి హయాంలో అనకాపల్లిలో కోకాకోలా సంస్థకు, సత్యసాయి జిల్లాలో ఈవీ వాహనాల తయారీ సంస్థ ఆజాద్ మొబిలిటీకి కేటాయించిన భూములను ఈ ప్రభుత్వం అకారణంగా వెనక్కి లాక్కుని ఆ సంస్థలను తరిమేసింది. అనంతపురం జిల్లాలో జిన్ఫ్రా ప్రెసిడెన్స్, అనకాపల్లిలో జూపిటర్ ప్రాజెక్టు భూములను కూడా రద్దు చేసి వేల మంది ఉపాధికి గండికొట్టారు. మరోవైపు రాయలసీమలో అల్ట్రాటెక్, దాల్మియా, భారతీ తదితర సిమెంట్ పరిశ్రమల వద్ద టీడీపీ నేతలు ట్రాన్స్పోర్ట్, బూడిద కాంట్రాక్టుల కోసం తీవ్ర బెదిరింపులకు పాల్పడుతూ పారిశ్రామికవేత్తలను భయాందోళనలకు గురిచేస్తున్నారు.సిమెంట్ కంపెనీలకు తీవ్ర వేధింపులురాయలసీమ ప్రాంతంలోని సిమెంట్ పరిశ్రమలు, థర్మల్ ప్రాజెక్టులపై కూటమి నేతలు కక్ష సాధింపులకు పాల్పడుతూ భయాందోళనలు సృష్టిస్తున్నారు. ముఖ్యంగా జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి వర్గాలు బూడిద, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టుల కోసం అల్ట్రాటెక్, దాల్మియా, వికాట్, శ్రీచక్ర తదితర సిమెంట్ పరిశ్రమలను తీవ్రంగా వేధిస్తున్నాయి. కలెక్టర్ను సైతం లెక్కచేయకుండా, తాము చెప్పిన రేటుకే రవాణా ఇవ్వాలని, లేదంటే కప్పం కట్టాలని బెదిరింపులకు దిగుతున్నారు. ఇక భారతీ సిమెంట్స్ పై కక్ష సాధింపులో భాగంగా ఆ కంపెనీని మూసివేసేందుకు ప్రయత్నించారు, హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా ఇప్పటికీ రకరకాలుగా ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు.ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో పతనంకోవిడ్ కష్టకాలంలోనూ వైఎస్ జగన్ గారి పాలనలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నంబర్ వన్గా ఉన్న ఏపీ.. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎనిమిదో స్థానానికి పడిపోవడమే రాష్ట్ర దుస్థితికి నిదర్శనం. 24 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలు తెచ్చామని గోబెల్స్ ప్రచారం చేస్తున్న ప్రభుత్వం.. దమ్ముంటే కనీసం 10 శాతం ఉద్యోగుల వివరాలను పబ్లిక్ డొమైన్లో పెట్టాలని ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను.రాష్ట్ర ఖనిజ సంపదను ప్రైవేటు వ్యక్తులకు తాకట్టు పెట్టి రూ.9 వేల కోట్ల అప్పులు తెచ్చినందుకు ఏపీఎండీసీకి అసోచాం అవార్డు రావడం హాస్యాస్పదం. ఇదంతా కేవలం కార్పొరేట్ లాబీయింగే. దాన్ని గొప్పగా ప్రచారం చేసుకోవడం మరింత సిగ్గుచేటు. గత ఐదేళ్లలో వైఎస్ జగన్ గారి ప్రభుత్వం చేసిన అప్పుల కంటే, కూటమి ప్రభుత్వం ఈ ఏడాదిన్నర కాలంలోనే అత్యధికంగా అప్పులు చేసింది. అప్పులు తేవడంలో వీరికి మరో అవార్డు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు’అని ఎద్దేవా చేశారు.ఇదీ చదవండి:‘సీబీఐ పేరు వింటే చంద్రబాబు, లోకేష్కు బీపీ ఎందుకు?’ -
‘సీబీఐ పేరు వింటే చంద్రబాబు, లోకేష్కు బీపీ ఎందుకు?’
సాక్షి, తాడేపల్లి: సీబీఐ పేరు వింటే చంద్రబాబు, లోకేష్లకు బీపీ పెరుగుతోందని.. డీఎస్సీలో అక్రమాలపై విచారణ అంటే తట్టుకోలేక పోతున్నారంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ అన్నారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. స్పోర్ట్స్ కోటా పేరుతో పరీక్షలు రాయకుండానే ఉద్యోగాలు ఇచ్చారని మండిపడ్డారు.‘‘కొత్తకొత్త జీవోలతో గేట్లు ఎత్తి తమ వారికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. మెరిట్ లిస్టుల పేరుతో మరో మోసం చేశారు. డీఎస్సీ అక్రమాలు కప్పి పుచ్చుకోవటానికే గ్రూప్-1ను తెర మీదకు తెచ్చారు. సిట్తో విచారణ జరిపినా గ్రూప్-1లో తప్పులు కనపడలేదు. అందుకే రెండో సిట్ వేసి తప్పులు ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. దమ్ముంటే సీబీఐతో విచారణ జరపాలి. డీఎస్సీ, గ్రూప్-1 రెండిటి పైనా సీబిఐ విచారణ చేయించాలి’’ అని అరుణ్కుమార్ డిమాండ్ చేశారు.శాసనమండలిలో దీనిపై చర్చిద్దామంటే చంద్రబాబు, లోకేష్ పారిపోయారు. సీబీఐతో విచారణ అంటే ఎందుకంత భయం?. తప్పు చేసినట్టు ఇప్పటికైనా ఒప్పుకోండి. డీఎస్సీ అక్రమాలపై జనసేన, బీజేపీ ఎందుకు మౌనంగా ఉన్నాయి?. స్పోర్ట్స్ లో పాల్గొనడమే అర్హతగా ఉద్యోగాలు ఇస్తారా?. ఇలాంటి వారు పిల్లలకు ఏం పాఠాలు చెప్తారు?ఇదీ చదవండి: ‘సర్’లో ఈ నాలుగైదు రోజులే కీలకం..ఇప్పటికే రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు కుప్పకూలాయి. ఏపీని గంజాయి విక్రయ రాష్ట్రంగా మార్చారు. లింగమనేని రమేష్ కొడుకు ర్యాష్ డ్రైవింగ్తో ఒకరిని చంపేస్తే కేసులు ఉండవా?. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ తీసుకుంటూ దొరికినా చర్యల్లేవు. ఆదినారాయణ రెడ్డి కొడుకు గంజాయి తాగుతూ దొరికినా కేసుల్లేవు. కూటమి నేతలు, వారి పిల్లలకు ప్రత్యేక చట్టాలున్నాయా?’’ అంటూ అరుణ్కుమార్ ప్రశ్నించారు. -
‘తాడిపత్రిలోని పోలీసు స్టేషన్లకు జేసీ స్టేషన్లు అని పెట్టండి’
సాక్షి, అనంతపురం: తాడిపత్రి నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తాడిపత్రి అరాచకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఎందుకు మౌనంగా ఉన్నారు? అని ప్రశ్నించారు. తాడిపత్రిలోని పోలీసు స్టేషన్లకు జేసీ స్టేషన్లు అని పేరు పెట్టండి అంటూ నిప్పులు చెరిగారు.మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘గోవా లిక్కర్ అక్రమ సరఫరాపై వైఎస్సార్సీపీ నేతలతో ఓ కమిటీ వేయాలని జేసీ ప్రభాకర్ రెడ్డి అంటున్నారు. వైఎస్సార్సీపీ నేతలు ఎందుకు.. మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్లతో ఓ కమిటీ వేయండి. తాడిపత్రిలో విచ్చలవిడిగా జరుగుతున్న అక్రమ మద్యం, గంజాయి, పేకాటపై విచారణ చేయాలి. తాడిపత్రి పోలీసు స్టేషన్ల వద్దే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి.. ఉన్నతాధికారులు ఎందుకు స్పందించడం లేదు?. తాడిపత్రిలోని పోలీసు స్టేషన్లకు జేసీ స్టేషన్లు అని పేరు పెట్టండి. అసెంబ్లీ రౌడీ సినిమా తరహాలో అన్నింటికీ జేసీ ప్రభాకర్ రెడ్డి పేరు పెడితే సరిపోతుంది. టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి తన తండ్రి జేసీ ప్రభాకర్ రెడ్డిని గ్యాంగ్ స్టర్లా తయారు చేశారు. 24 మంది వైఎస్సార్సీపీ నేతలను అంతం చేస్తామని అస్మిత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి హెచ్చరిస్తున్నారు. దీనిపై సాక్షాత్తూ ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. తాడిపత్రిలో వివాహ వేడుకలకు హాజరుకావాలంటే జేసీ అనుమతి కావాలా?. తాడిపత్రిలో పోలీసుల ప్రేక్షక పాత్ర దేనికి సంకేతం?.ఇది కూడా చదవండి: వచ్చే మంగళవారం బాబు సర్కార్ మళ్లీ అప్పు.. గోవా లిక్కర్ కేసులో జేసీ తయారు చేసిన మార్ఫింగ్ ఫొటోలపై చర్యలు తీసుకోరా?. జేసీ అరాచకాలపై కలెక్టర్, ఎస్పీ ఎందుకు మౌనంగా ఉన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జేసీకి వత్తాసు పలికిన వారిపై కఠిన చర్యలు ఉంటాయి. జేసీపై ఉన్న కేసులన్నీ జేసీ ట్రావెల్స్ చీటింగ్, క్రిమినల్ కేసులే. ఫోర్జరీ డాక్యుమెంట్లతో స్క్రాప్ వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించిన ఘనుడు జేసీ ప్రభాకర్ రెడ్డి అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
రానున్న నాలుగైదు రోజులు చాలా కీలకం: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై వైఎస్సార్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సర్లో రెండో విడత కార్యక్రమం దాదాపు పూర్తవుతున్నందున మ్యాపింగ్, నాన్-మ్యాపింగ్, గైర్హాజరు, చిరునామా మార్పులు, డూప్లికేట్, మరణించిన ఓటర్లకు సంబంధించిన సమాచారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సజ్జల అన్నారు.ప్రాంతీయ కో-ఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంట్ సమన్వయకర్తలు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్లమెంట్ పరిశీలకులు, రాష్ట్ర స్థాయి సమన్వయ బాధ్యతలు నిర్వహిస్తున్న నేతలు, అసెంబ్లీ పరిశీలకులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అభ్యంతరాలు, క్లెయిమ్స్ దాఖలు చేసేందుకు నెలాఖరు వరకు చాలా తక్కువ సమయం మాత్రమే ఉన్నందున పార్టీ యంత్రాంగం వేగంగా పనిచేయాలని స్పష్టం చేశారు.గత నాలుగైదు నెలలుగా బూత్ స్థాయిలో బీఎల్ఏలు చురుకుగా పనిచేయడం వల్ల అర్హులైన ఓట్లు తొలగిపోకుండా చర్యలు తీసుకోవడంలో మంచి పురోగతి సాధించామని చెప్పారు. ఓటర్ల సంఖ్య 4.16 కోట్ల నుంచి 3.71 కోట్లకు తగ్గిన నేపథ్యంలో తొలగింపులకు సంబంధించిన వివరాలను పార్టీ శ్రేణులు నిశితంగా పరిశీలించాలని సూచించారు.17.29 లక్షల అనుమానాస్పద ఓట్లపై అప్రమత్తంగా ఉండాలిఇప్పటికే వచ్చిన 44 లక్షల నోటీసుల్లో అనుమానాస్పద అంశాలను గుర్తించి, ప్రతి ఓటు స్థాయిలో పరిశీలన జరపడం అత్యంత కీలకమని పేర్కొన్నారు. అర్హులైన ఓట్లు తొలగించే పరిస్థితిలో ఉంటే సంబంధిత ఫారాలను సమర్పించి వాటిని తిరిగి జాబితాలో ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. డూప్లికేట్ లేదా బోగస్ ఓట్లుగా భావించిన వాటిపై అవసరమైన అభ్యంతరాలను సమర్పించాలని చెప్పారు. ఇదే సమయంలో చిరునామా మార్పులు, ఇతర సవరణలకు సంబంధించిన దరఖాస్తులను కూడా అవసరాన్ని బట్టి సమర్పించాలని సూచించారు. పార్టీ స్థాయిలో ప్రత్యేకంగా గుర్తించిన సుమారు 17.29 లక్షల అనుమానాస్పద డూప్లికేట్ ఓట్లను బూత్ స్థాయిలో పరిశీలించాలని సజ్జల తెలిపారు.డూప్లికేట్ ఓట్లపై ప్రత్యేక శ్రద్ధ అవసరంఒకే పేరుకు లేదా ఇతర వివరాలకు దగ్గరగా ఉన్న ఓటర్లు వాస్తవంగా ఒకరేనా, వేర్వేరు వ్యక్తులా అనే అంశాన్ని బీఎల్ఏలు స్థానికంగా నిర్ధారించాలని సూచించారు. తమకు చెందిన ఓటు అయితే దాన్ని కొనసాగించేలా, తమకు సంబంధం లేని లేదా డూప్లికేట్గా గుర్తించిన ఓటుపై అవసరమైన అభ్యంతరం దాఖలు చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. బీఎల్ఏల ద్వారా వచ్చిన సమాచారాన్ని నియోజకవర్గ కోఆర్డినేటర్లు సమీకరించి సంబంధిత ఈఆర్ఓలకు సమర్పించాలని, సమర్పించిన ప్రతిసారీ రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.భవిష్యత్తులో అభ్యంతరాలపై చర్యలు తీసుకోకపోతే జిల్లా కలెక్టర్ లేదా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ రసీదులు, ఇతర పత్రాలు ఆధారాలుగా ఉపయోగపడతాయని తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియను నాలుగైదు రోజుల్లో పూర్తి చేసేలా బూత్ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.బయట ఉన్న ఓటర్లతో సమన్వయం అవసరంక్లస్టర్ ఇన్చార్జీలు, కంట్రోల్ రూమ్లు, టాస్క్ఫోర్స్, పార్లమెంట్ మరియు అసెంబ్లీ పరిశీలకుల సహకారంతో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. హైదరాబాద్కు సంబంధించిన అనుమానాస్పద డూప్లికేట్ ఓట్లపైనా వచ్చిన జాబితాలను పరిశీలించి, అవసరమైన అభ్యంతరాలను సమిష్టిగా సమర్పించాలని చెప్పారు. ఆగస్టు 27, 28 తేదీల నాటికి ప్రధాన ప్రక్రియను పూర్తి చేసి, నెలాఖరు చివరి రెండు రోజుల్లో తుది పరిశీలనకు అవకాశం ఉండేలా ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. ఆగస్టు 30 తర్వాత అవకాశాలు పరిమితమవుతాయని, అందువల్ల ప్రస్తుతం ఉన్న సమయాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని స్పష్టం చేశారు.ప్రత్యేక క్యాంపెయిన్ రోజుల్లో పోలింగ్ స్టేషన్ల వద్ద బీఎల్ఓలు అందుబాటులో ఉంటారని, ఆ అవకాశాన్ని బీఎల్ఏలు వినియోగించుకుని ఓటర్ల జాబితా, దరఖాస్తులు, నోటీసులు, సవరణల వివరాలను పరిశీలించాలని సూచించారు. బయట ఉన్న ఓటర్లకు సంబంధించిన అంశాల్లో వారికి అందుబాటులో ఉన్న విధానాలపై అధికారులతో సమన్వయం చేసుకోవాలని, అవసరమైన సమాచారాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు. సర్ ప్రక్రియను క్రమబద్ధంగా పూర్తి చేయడం ద్వారా అర్హులైన ఓటర్ల ప్రయోజనాలను కాపాడటంతో పాటు భవిష్యత్ ఓటర్ల జాబితా సవరణల్లో కూడా ఇబ్బందులు తగ్గుతాయని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.ఎన్నికల సన్నద్ధతపై 25న వైఎస్ జగన్ దిశానిర్దేశం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశాలపై పార్టీ న్యాయపరమైన చర్యలు తీసుకుంటోందని, పార్టీ ఎన్నికలకు ఎప్పుడైనా సిద్ధంగా ఉండేలా శ్రేణులు సన్నద్ధంగా ఉండాలని సజ్జల తెలిపారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఆగస్టు 25న కోఆర్డినేటర్ల సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆ సమావేశంలో ఎన్నికల సన్నద్ధతపై దిశానిర్దేశం చేస్తారని పేర్కొన్నారు. రాబోయే కొద్దిరోజులు పార్టీకి చెందిన సిబ్బంది, సహాయకులు, నియోజకవర్గ స్థాయి బాధ్యతలు నిర్వహిస్తున్నవారికి స్పష్టమైన టార్గెట్లు కేటాయించి పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమంపై దృష్టి పెట్టాలని సూచించారు. -
‘రాయలసీమ అభివృద్ధి నిరోధకుడు చంద్రబాబు’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాయలసీమ ప్రాంతానికి తీవ్ర అన్యాయమే జరుగుతుందని.. ఆయన పక్కా రాయలసీమ అభివృద్ధి నిరోధకుడని వైఎస్సార్సీపీ నేత మాజీ మంత్రి సాకే శైలజనాథ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన గ్రేటర్ రాయలసీమ టాస్క్ ఫోర్స్ కమిటీ, పార్టీ రైతు, యువజన, విద్యార్థి, సోషల్ మీడియా విభాగాల నేతలతో కీలక సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.శ్రీశైలం జలాశయం నిండుకుండలా ఉన్నప్పటికీ రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లు విడుదల చేయకుండా కూటమి ప్రభుత్వం రైతుల పొట్ట కొడుతోందని మండిపడ్డారు. పాలకుల మొద్దునిద్రను విడదీసేందుకు, రాయలసీమ రైతుల హక్కులను కాపాడేందుకు ఈ నెల 24న వైఎస్ జగన్ ఆదేశాల మేరకు సీమ ప్రాంత రైతులు, మేధావులు, అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద ప్రజా పోరాటానికి దిగుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే..సీమపై చంద్రబాబుది మొదటి నుంచీ కక్షపూరిత వైఖరే..చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడల్లా రాయలసీమ ప్రాంతం కరువుతో అల్లాడాల్సిందే. ఆయన పరిపాలన సీమకు అన్యాయం చేయడానికే అన్నట్లుగా సాగుతోంది. రాష్ట్రంలో వర్షాలు లేకపోయినా ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వచ్చి శ్రీశైలం రిజర్వాయర్లో దాదాపు 185 టీఎంసీల నీరు చేరింది. డ్యామ్ 90 శాతం నిండి పూర్తి స్థాయికి చేరువలో ఉంది. కానీ దానిపై ఆధారపడిన రాయలసీమ రిజర్వాయర్లన్నీ సగానికి పైగా ఎండిపోయి ఉన్నాయి. రైతులకు మేలు చేయాల్సింది పోయి, పంటలు వేసుకోవద్దని బాబు ఉచిత సలహాలు ఇస్తున్నారు.రైతులను వ్యవసాయానికి, భూములకు దూరం చేయడమే ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. పోతిరెడ్డిపాడు ద్వారా పూర్తిస్థాయి నీటిని ఎందుకు విడుదల చేయడం లేదు?. శ్రీశైలం నిండితే దిగువన ఉన్న వెలుగోడు, బ్రహ్మం సాగర్, సోమశిల, కండలేరు, గోరకల్లు, ఔకు, గండికోట, పైడిపాలెం, వామికొండ, చిత్రావతి ప్రాజెక్టులు ఎందుకు నిండటం లేదు? 11 టీఎంసీల సామర్థ్యం ఉన్న గోరకల్లులో కేవలం 4 నుంచి 5 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వకుండా ఆపుతున్నది ఎవరు? సీమ ప్రాజెక్టులను ఎండగడతామని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమైనా మాట ఇచ్చారా? పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం 40,400 క్యూసెక్కులు అయితే.. కేవలం 8 వేల క్యూసెక్కులు మాత్రమే వదులుతున్నారు. 850 అడుగులు దాటిన తర్వాత కనీసం 30 నుంచి 40 వేల క్యూసెక్కుల నీటిని వదిలే అవకాశం ఉన్నా ఎందుకు తాత్సారం చేస్తున్నారు?.రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను అడ్డుకున్న ద్రోహి చంద్రబాబుగతంలో వైఎస్ జగన్ రాయలసీమ ప్రాంతానికి ఒక రక్షణ కవచంలా 'రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్' ప్రాజెక్టును తలపెట్టారు. 90 శాతం పనులు పూర్తయిన ఆ ప్రాజెక్టును చంద్రబాబు.. తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డితో కుమ్మక్కై నిలిపివేశారు. ఆ ప్రాజెక్టు పూర్తయి ఉంటే 800 అడుగుల నుంచే రోజుకు 80 వేల క్యూసెక్కుల వరద నీటిని ఒడిసిపట్టి సీమ ప్రాజెక్టులన్నింటినీ క్షణాల్లో నింపేవాళ్లం. అలాంటి మహోన్నత ప్రాజెక్టును గతంలో 'బురద నీళ్లు' అంటూ చంద్రబాబు హేళన చేశారు. అలాగే హంద్రీ-నీవా ప్రవాహ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు పెంచుతూ వైయస్.జగన్ ఇచ్చిన టెండర్లను రద్దు చేసి, దాన్ని 3,800 క్యూసెక్కులకు కుదించి రాయలసీమ రైతుల నోట్లో మట్టి కొట్టారు.ఆల్మట్టి, అప్పర్ భద్రలపై ఎందుకు మౌనం?కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ రోజుకోసారి జపం చేసే చంద్రబాబు.. కర్ణాటకలో ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుతుంటే ఎందుకు నోరు మెదపడం లేదు? అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మాణం వల్ల తుంగభద్రకు 25 టీఎంసీల నీరు ఆగిపోయి ఏపీ ప్రయోజనాలు దెబ్బతింటుంటే ఎందుకు కేంద్రాన్ని నిలదీయడం లేదు? పులిచింతల పరివాహక ప్రాంత రైతుల గొంతు కోస్తుంటే చూస్తూ ఊరుకుంటారా? చంద్రబాబుకు నీళ్ల మీద, రైతుల మీద ప్రేమ లేదు. కేవలం రాజకీయ స్వలాభం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారు.24న 'పోతిరెడ్డిపాడు' వద్ద మహా పోరాటం..ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజల్లో ఎండగట్టడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందని శైలజనాథ్ స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఈ నెల 24వ తేదీ సోమవారం నాడు గ్రేటర్ రాయలసీమ జిల్లాల పార్టీ ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులు, రైతు విభాగాలతో కలిసి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను సందర్శిస్తున్నామన్నారు. పోతిరెడ్డిపాడును పూర్తి సామర్థ్యంతో, హంద్రీ-నీవాను పూర్తి సామర్థ్యంతో నడిపించి రాయలసీమ ప్రాజెక్టులను నింపాలని.. 6,300 క్యూసెక్కుల హంద్రీ-నీవా సామర్థ్యాన్ని తగ్గించి 3,800 క్యూసెక్కులకు పరిమితం చేయడం ఎందుకని నిలదీశారు.దీనిపై రైతులు, మేధావులు, ప్రజా సంఘాలతో కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని.. తక్షణమే శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు, మాల్యాల, ముచ్చుమర్రి ద్వారా పూర్తి సామర్థ్యంతో 40 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి రాయలసీమ రిజర్వాయర్లన్నింటినీ నింపాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయలసీమ వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని శైలజానాధ్ హెచ్చరించారు. -
‘డైవర్షన్ కోసమే మరోసారి తెరపైకి వివేకా కేసు’
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ అక్రమాలు, పోలీసులు ప్రయాణిస్తున్న కారులో గంజాయి దొరికిన ఘటన, సుగాలి ప్రీతి తల్లి వీల్చైర్ యాత్రను అడ్డుకోవడం, అధికార పార్టీ ఎంపీ కుమారుడు కారు నడుపుతూ యువతిని ఢీకొట్టి చంపిన ఘటన వంటి దారుణమైన అంశాలపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే వివేకా హత్య కేసును మరోసారి తెరపైకి తెచ్చారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి ఆక్షేపించారు.ఆ దిశలోనే తొలిసారి ఈడీని రంగ ప్రవేశం చేయించి, వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ఇంట్లో సోదాలు చేయిస్తున్నారని ఆయన తెలిపారు. దాని వల్ల ఏదో విజయం సాధించినట్లు ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోందని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన గడికోట శ్రీకాంత్రెడ్డి చెప్పారు. ప్రెస్మీట్లో ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..:అంతా డైవర్షన్ పాలిటిక్స్:డీఎస్సీ అక్రమాలపై నాలుగు రోజులుగా సీబీఐ విచారణ కోరుతున్నాం. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? గత ప్రభుత్వంలో గ్రూప్-1 అవకతవకలు జరిగాయని మీరు ఆరోపిస్తున్నారు కదా.. వాటిపై సీబీఐ విచారణకు మేము సిద్ధం. మరి మీ హయాంలో జరిగిన డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు మీరు సిద్ధమా? పోలీసులు ప్రయాణిస్తున్న కారులో గంజాయి దొరికిన ఘటనపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో గంజాయి అరాచకాలు పెరిగిపోతుంటే, యువత తప్పుదోవ పడుతుంటే దానిపై మాట్లాడకుండా ఎందుకు డైవర్షన్ చేస్తున్నారు?న్యాయం కోసం శాంతియుతంగా వీల్చైర్లో యాత్ర చేస్తున్న సుగాలి ప్రీతి తల్లిని ఎందుకు అడ్డుకున్నారు? ఎందుకు హింసించారు? ఆ తల్లికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అధికార పార్టీకి చెందిన ఎంపీ కుమారుడి హిట్ అండ్ రన్ ఘటనపైనా ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి. ఒక యువతిని కారుతో ఢీకొట్టి చంపిన ఘటనపై సమాధానం చెప్పకుండా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో ఇన్ని దారుణమైన అంశాలు ఉన్నాయి. వీటిపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఆ చర్చను పక్కదారి పట్టించేందుకే అవినాష్ రెడ్డి గారి ఇంట్లో ఈడీ సోదాలను ఏదో సాధించినట్లుగా ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది.వివేకానంద రెడ్డి హత్య కేసుపై టీడీపీకి సవాల్:వివేకానందరెడ్డి హత్యకు గురైనప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సిట్ విచారణ జరిగింది. ఆ తర్వాత సీబీఐ విచారణ కూడా జరిగింది. ఇప్పుడు ట్రయల్ జరగాలి అంటుంటే.. ట్రయల్ జరగనీయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? వివేకాను చంపిన గొడ్డలి ఎవరిదో తేల్చేందుకు ఎందుకు భయపడుతున్నారు? అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతోంది. కేసు ట్రయల్ సజావుగా సాగకుండా ఎందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారు? సీబీఐ విచారణ జరిగింది. కేసు కోర్టుల పరిధిలో ఉంది. నిందితులపై విచారణ జరిగి నిజాలు బయటకు రావాలి. ట్రయల్ జరగడానికి మీకు అభ్యంతరం ఏమిటి?చంద్రబాబుకి సంబంధించిన అనేక కీలక కేసుల్లో వాదిస్తున్న అడ్వకేట్ సిద్ధార్థ్ లూథ్రాయే వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడి తరఫున కూడా వాదిస్తున్నారు. ఈ సంబంధాలపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజల పన్నుల డబ్బుతో కోట్ల రూపాయలు ఫీజులు చెల్లిస్తూ, కేసు విచారణను ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? విచారణ జరపండి.. ట్రయల్ జరపండి.. నిజాలు ప్రజల ముందుకు రానివ్వండి. మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. సుగాలి ప్రీతి కేసు, వివేకానంద రెడ్డి హత్య కేసైనా సీబీఐ విచారణకు ఎందుకు సిద్ధంగా లేరో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.ఫాల్స్ ప్రాపగండా, ఫాల్స్ నేరేటివ్, డైవర్షన్ రాజకీయాలు మానండి. వ్యవస్థలపై నమ్మకం ఉంచండి. నిజాయితీగా విచారణ జరగనివ్వండి. మీ మీడియా శక్తితో ఎంత ప్రచారం చేసినా నిజాన్ని దాచలేరు. వివేకానంద రెడ్డి మా మనిషి. దివంగత వైఎస్సార్ సోదరుడు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకుడు. ఆయన హత్యను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం మానుకోవాలి. వివేకాను చంపిన గొడ్డలి ఎవరిదో తేలాలి. విచారణ జరగాలి. నిజం ప్రజల ముందుకు రావాలని గడికోట శ్రీకాంత్ రెడ్డి తేల్చి చెప్పారు. -
హైదరాబాద్: నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశ్వీరాదం(ఫొటోలు)
-
హైదరాబాద్లో వైఎస్ జగన్ భారీ ఫ్లెక్సీలు.. అభిమానుల కోలాహలం
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో బేగంపేట్ ఎయిర్పోర్టు వద్ద సందడి నెలకొంది. వైఎస్సార్సీపీ అభిమానులు భారీ సంఖ్యలో ఎయిర్పోర్టు వద్దకు చేరుకున్నారు. తమ అభిమాన నేత వైఎస్ జగన్కు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఎయిర్పోర్టు వద్ద వేచి చేస్తున్నారు.మరికాసేపట్లో వైఎస్ జగన్ బేగంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. దీంతో ఆయన రాక కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వైఎస్సార్సీపీకి చెందిన పలువురు కీలక నేతలు ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. వైఎస్ జగన్ రాకతో బేగంపేట్ పరిసరాల్లో సందడి నెలకొంది. అభిమానులు, పార్టీ శ్రేణుల రాకతో ఎయిర్పోర్టు పరిసర రోడ్లు జనసంద్రంగా మారాయి. వైఎస్ జగన్ను చూసేందుకు, స్వాగతం పలికేందుకు భారీగా కార్యకర్తలు తరలిరావడంతో అక్కడ సందడి వాతావరణం కనిపిస్తోంది.Hearty welcome @ysjagan Anna 🔥🔥🔥 pic.twitter.com/IQvz55shwJ— YS Jagan Fans Campaign™ (@YSJFansCampaign) August 21, 2026మరోవైపు.. వైఎస్సార్సీపీ అభిమానులు హైదరాబాద్లో భారీ స్థాయిలో వైఎస్ జగన్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వైఎస్ జగన్పై తమ అభిమానాన్ని చాటుకుంటూ ఫొటోలు పెట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. YSJAGAN Telangana Hyderabad Visit Draws AttentionYS Jagan is set to arrive in Hyderabad today. Large welcome posters and cutouts have appeared across the city, including a striking @ysjagan @KCRBRSPresident – @KTRBRS display arranged by BRS leader Chirra Ravinder Yadav pic.twitter.com/o2X6BuiKMl— Gummalla Lakshmana (@GUMMALLALAKSHM3) August 21, 2026 -
ఇది కూటమి సర్కారువారి డైవర్షన్ డ్రామా!
సాక్షి, గుంటూరు: కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ఆయన కుటుంబానికి సంబంధించిన ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించడం ఏపీలో రాజకీయ వేడిని పెంచింది. ఇన్నాళ్లుగా సీబీఐ విచారణలో కనిపించని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. ఇప్పుడు పీఎంఎల్ఏ పేరిట హఠాత్తుగా రంగంలోకి రావడంపై వైఎస్సార్సీపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ సోదాలు కూటమి ప్రభుత్వం వారి కొత్త డైవర్షన్ డ్రామా అంటూ మండిపడుతోంది.వివేకా హత్య కేసుకు సంబంధించి హైదరాబాద్లో రెండు, కడప జిల్లాలో నాలుగు ప్రాంతాల్లో.. మొత్తం పది చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. అవినాష్రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్రెడ్డికి సంబంధించిన ప్రాంతాలతో పాటు ఇతర వ్యక్తుల నివాసాలు, కార్యాలయాల్లోనూ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఉన్నట్లుండి ఈ కేసులో హవాలా మనీ కోణం తెరపైకి రావడం పలు అనుమాలకు తావిస్తోంది.ఇంతకాలం ఈడీ ఎక్కడ?2019 మార్చి 15న పులివెందులలో వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. తొలుత రాష్ట్ర దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టగా.. అనంతరం కేసు సీబీఐకి వెళ్లింది. సీబీఐ 2020 నుంచి దర్యాప్తు కొనసాగిస్తూ చార్జ్షీట్లు, అనుబంధ చార్జ్షీట్లు దాఖలు చేసింది. తాజాగా మూడో అనుబంధ చార్జ్షీట్ దాఖలు చేసిన అనంతరం.. ఇకపై మరింత దర్యాప్తు అవసరం లేదని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. వివేకా కుమార్తె సునీతారెడ్డి మాత్రం కేసులో మరింత లోతైన దర్యాప్తు అవసరమని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే సీబీఐ ఇప్పటికే దర్యాప్తు పూర్తిచేసినట్లు ఇచ్చిన వివరణను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. ఆ దశలో తదుపరి దర్యాప్తుపై జోక్యం చేసుకోలేదు.ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అదే హత్య కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ సోదాలు నిర్వహించడం రాజకీయంగా ప్రశ్నలకు తావిస్తోంది. సీబీఐ దర్యాప్తు దాదాపు ముగిసిందని చెబుతున్న సమయంలో.. కొత్తగా ఈడీ ఎందుకు రంగంలోకి వచ్చింది? ఇంతకాలం ఈడీ పేరు ఎక్కడా లేకుండా ఇప్పుడు హఠాత్తుగా సోదాలు ఎందుకు? అంటూ వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నిస్తోంది.డీఎస్సీ వివాదం.. అవినీతి ఆరోపణల వేడిఇదే సమయంలో.. ఏపీలో కూటమి ప్రభుత్వం డీఎస్సీ వ్యవహారం సహా పలు అంశాలపై విమర్శలు ఎదుర్కొంటోంది. డీఎస్సీలో అవకతవకలు జరగడం.. అసెంబ్లీ సమావేశాల్లో వాటిని పరోక్షంగా ఒప్పుకోవడం.. మండలిలో చర్చకు వైఎస్సార్సీపీ పట్టుబట్టడం.. భయపడి కూటమి ప్రభుత్వం పారిపోవడం తెలిసిందే. అటు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కూడా ఈ కుంభకోణాన్ని బయటపెట్టి.. చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్ను ఏకీపారేశారు. 2018 గ్రూప్-1 విషయంలో తాము సీబీఐ విచారణకు సిద్ధమని, డీఎస్సీపై సీబీఐ విచారణకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. ఈ క్రమంలో ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే వివేకా కేసును మళ్లీ తెరపైకి తీసుకొచ్చారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.‘డైవర్షన్ డ్రామా’నేఈడీ సోదాల వెనుక కేంద్ర దర్యాప్తు అవసరం కంటే రాజకీయ ప్రయోజనమే ఎక్కువగా కనిపిస్తోందనే చర్చ నడుస్తోంది. వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబు దీని వెనుక ఉన్నారనే అనుమానాలు బలపడుతున్నాయి.‘‘కూటమి ప్రభుత్వ తప్పులను, అవినీతి ఆరోపణలను, ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను కప్పిపుచ్చేందుకు ఏదో ఒక డైవర్షన్ డ్రామాకు దిగుతుంది. గత రెండేళ్లలో ఏపీలో జరుగుతోంది ఇదే. ఇప్పుడు కూడా ఇంతే’’ అని వైఎస్సార్సీపీ మండిపడుతోంది. మొత్తానికి వివేకా కేసులో సీబీఐ దర్యాప్తు ముగిసినట్లు చెబుతున్న వేళ.. అదే కేసులో ఈడీ ఎంట్రీ ఇవ్వడం ఏపీ రాజకీయాల్లో మరో హైడ్రామాకు తెరలేపినట్లైంది. -
నేడు హైదరాబాద్కు వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి జలవిహార్ గ్రాండ్ లాన్స్లో జరిగే సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు. -
చర్చల్లేవ్.. ఆమోదాలే
సాక్షి, అమరావతి: డీఎస్సీ అక్రమాలపై చర్చ జరపాలంటూ నాలుగో రోజు గురువారం సైతం వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు నల్లకండువాలు ధరించి శాసనమండలిలో ఆందోళనకు దిగారు. సభ వాయిదా విరామ సమయంలోనూ చైర్మన్ పోడియం ఎదుట నేలపై కూర్చుని ఆందోళన కొనసాగించారు. అయితే, డీఎస్సీ అంశంపై చర్చ లేకుండానే నాలుగు రోజుల శాసనమండలి సమావేశాలు ముగిశాయి. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, రమేష్యాదవ్, ఇషాక్బాషా డీఎస్సీ–2025 నిర్వహణ, స్పోర్ట్స్ కోటా నియామకాలపై చర్చించాలంటూ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని సభ ప్రారంభం కాగానే తిరస్కరిస్తున్నట్లు మండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు ప్రకటించారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమం మొదలు పెట్టినట్టు ప్రకటించగా.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మూకుమ్మడిగా చైర్మన్ పోడియం ముందుకు చేరుకుని డీఎస్సీ అక్రమాలపై వెంటనే చర్చను చేపట్టాలని కోరారు. అయితే, ప్రశ్నోత్తరాల కార్యక్రమమే కొనసాగుతుండడంతో పోడియం ముందు, పోడియంపైన చైర్మన్ కుర్చీని చుట్టిముట్టి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో ఆందోళనకు దిగారు. మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ, డీఎస్సీపై సభలో చర్చ చేయకుండా ప్రభుత్వం ఎందుకు పారిపోతోంది, వెంటనే చర్చకు అనుమతించాలి, విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. చైర్మన్ మోషేన్రాజు ఆందోళన చేస్తున్న సభ్యులను వారి స్థానాలకు వెళ్లి కూర్చోవాలని విజ్ఞప్తి చేసినా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళనను కొనసాగించారు. సభ్యుల ఆందోళన మధ్యనే ప్రశ్నోత్తరాలు కొనసాగగా.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు పోడియంపై చైర్మన్ కుర్చీకి రెండువైపులా నిలబడి నినాదాలు చేశారు. చైర్మన్ ముఖానికి అడ్డంగా ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఆందోళన కొనసాగిస్తుండటంతో 10.21 గంటల సమయంలో సభను తాత్కాలిక విరామ వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ ప్రకటించారు. సభ్యుల ఆందోళన కొనసాగిన ఆ 20 నిమిషాల సమయంలోనే మంత్రులు ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఐదు ప్రశ్నలకు జవాబిచ్చారు.నేలపై కూర్చుని ఆందోళన కొనసాగింపుసభ విరామ వాయిదా పడిన తర్వాత కూడా వైఎస్సార్సీపీ సభ్యులు పోడియం ముందు కూర్చుని ఆందోళన కొనసాగించారు. ‘చర్చకు రాకుండా విద్యాశాఖ మంత్రి పారిపోతున్నారు. డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణ జరపాలి. వెన్నుపోటు పార్టీ–వెన్నుపోటు ప్రభుత్వం’ అంటూ నినాదాలు కొనసాగించారు. 11.45 గంటల సమయంలో సభ తిరిగి ప్రారంభం కాగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీ దళవాయి రమాదేవితో చైర్మన్ మోషేన్రాజు ప్రమాణం చేయించారు. అనంతరం బిల్లులపై చర్చను చేపడుతున్నట్టు ప్రకటించడంతో వైఎస్సార్సీపీ సభ్యులు తిరిగి పోడియం వద్దకు చేరుకుని డీఎస్సీపై చర్చను చేపట్టాలంటూ ఆందోళనను కొనసాగించారు. సభ్యులు పలు సందర్భాల్లో చైర్మన్కు దండం పెడూతూ డీఎస్సీ అక్రమాలపై చర్చకు అనుమతించాలని కోరడం గమనార్హం. కాగా, ఆందోళనల మధ్యనే దాదాపు 15 నిమిషాల వ్యవధిలోనే నాలుగు బిల్లులపై చర్చ కొనసాగి, ఆమోదం పొందినట్టు చైర్మన్ ప్రకటించారు. వైఎస్సార్సీపీ సభ్యులు చైర్మన్ కుర్చీ చుట్టూ నిలబడి ప్లకార్డులతో ఆందోళన కొనసాగిస్తుండటంతో 12 గంటల సమయంలో సభను రెండోసారి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. వాయిదా అనంతరం 12.42 గంటలకు సభ తిరిగి ప్రారంభం కాగా, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ఆందోళనల మధ్యనే మధ్యాహ్నం ఒంటిగంటలోపు మరో 8 బిల్లులపై చర్చ చేపట్టిన చైర్మన్ ఆ బిల్లులన్నీ ఆమోదం పొందినట్టు ప్రకటించారు. తర్వాత మంత్రి నారాయణ ప్రవేశపెట్టిన ‘ది వాటర్ (ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్) అమెండ్మెంట్ యాక్ట్పై తీర్మానం ప్రవేశపెట్టి సభ్యుల ఆందోళన, గందరగోళ పరిస్థితుల మధ్య సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ మోషేన్రాజు ప్రకటించారు. ఈ సమయంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ‘షేమ్.. షేమ్. డీఎస్సీ చర్చనుంచి పారిపోయిన ప్రభుత్వం.. సిగ్గు, సిగ్గు’ అంటూ నినాదాలు కొనసాగించారు. అదే సభ నిరవధిక వాయిదాకు గుర్తుగా ‘జనగణమన..’ గీతం ప్రారంభం కావడంతో ఎక్కడివారు అక్కడే మౌనంగా నిలబడి గీతాలాపన చేశారు.లోకేశ్ రాజీనామా చేయాలిడీఎస్సీ–2025లో జరిగిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐతో విచారణ జరిపించాలని, ఈ అక్రమాలకు నైతికబాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. అసెంబ్లీ బయట సర్కిల్ నుంచి గురువారం ప్రదర్శనగా వారు ‘మండలి’కి చేరుకున్నారు. ఈ సందర్భంగా.. ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సిగ్గు సిగ్గు, వెన్నుపోటు పార్టీకి సిగ్గు శరము లేదు, ఇది మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్సీ, డీఎస్సీ అక్రమాలపై న్యాయం జరిగే వరకూ వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది.. పరీక్ష లేకుండా టీచర్ పోస్టులు ఇస్తారా సిగ్గు సిగ్గు.. జీఓ నెం.4, 47లపై సీబీఐ విచారణ జరపాలి.. అంటూ వారు నినాదాలు చేశారు. డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం మండలిలో చర్చించాలని.. తక్షణమే సీబీఐ విచారణ జరపాలంటూ ప్లకార్డు, పెద్ద బ్యానర్ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలందరూ పాల్గొన్నారు. -
ప్రతిపక్షానికి సమాధానం చెప్పే దమ్ము ప్రభుత్వానికి లేదు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ దురహంకారం, అవినీతి, దోపిడీ, అరాచకాలపై అసెంబ్లీలో ప్రతిపక్షానికి సమాధానం చెప్పే దమ్మూ, ధైర్యంలేక అధికారపక్షం పలాయనం చిత్తగిస్తోందని వైఎస్సార్సీపీ నాయకుడు, శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చెప్పారు. ఆయన గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని చెప్పారు. గంజాయి, ఇసుక, లిక్కర్ మాఫియాను ప్రభుత్వ పెద్దలే నడిపిస్తున్నారని అన్నారు. సాక్షాత్తూ పోలీసుల కారులోనే గంజాయి పట్టుబడిందని, ఇంతకంటే దిగజారుడుతనం ఉంటుందా అని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆ ఎస్పీ, డీఎస్పీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులను వదిలేసి కిందిస్థాయి వారిపై కేసులు పెట్టి చేతులు దులిపేసుకుంటున్నారని మండిపడ్డారు. అమరావతి అనేది చంద్రబాబుకి ఏటీఎంలా మారిందని చెప్పారు. అమరావతిలో కొత్తగా వారు చేసిందేమీలేదని, ఐదేళ్ల క్రితం ఆగిపోయిన సీడ్ యాక్సెస్ రోడ్డు దగ్గరే మళ్లీ టెంట్లు వేసి హడావుడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు.రోజంతా చర్చిద్దామన్నాం..డీఎస్సీలో అక్రమాలు, గ్రూప్ – 1 అంశాలపై సభలో రోజంతా చర్చిద్దామని, అవసరమైతే మరో రెండు రోజులు సభను పొడిగించాలని తాము డిమాండ్ చేస్తే పారిపోయారని, పైగా తమ గొంతు నొక్కే ప్రయత్నం చేశారని బొత్స తెలిపారు. బయటకొచ్చి మాత్రం ప్రతిపక్షంపై బురదజల్లుతూ డాంబికాలు పలుకుతారని అన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఒకే ఒక్క నోటిఫికేషన్ ద్వారా ఎలాంటి అవకతవకలు జరగకుండా 1.30 లక్షల సచివాలయ పోస్టులు భర్తీ చేశామని చెప్పారు. డీఎస్సీ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.వైఎస్సార్సీపీ హయాంలో 10,300కు పైగా టీచర్ పోస్టుల భర్తీ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 1998 డీఎస్సీలో మిగిలిపోయిన 5,887 మందికి, 2008 డీఎస్సీలో మిగిలిపోయిన 2,193 మందికి ఉద్యోగాలిచ్చామని చెప్పారు. 2019 స్పెషల్ డీఎస్సీ ద్వారా 521 మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. కేజీబీవీల్లో 1,250 మంది క్వాలిఫైడ్ టీచర్లను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించామని, ట్రిపుల్ ఐటీలో 450 మందికి ఉద్యోగాలిచ్చామని తెలిపారు. మొత్తంగా ఉపాధ్యాయ రంగంలో 10,300కు పైగా ఉద్యోగాలిచ్చామని తెలిపారు. అలాగే 2024 ఫిబ్రవరి 12న 6,100 పోస్టులతో డీఎస్సీని ప్రకటించామని, ఎన్నికల కారణంగా ఆ ప్రక్రియ నిలిచిపోయిందని తెలిపారు. మరి వైఎస్సార్సీపీ హయాంలో 16 వేల పోస్టులు ఇవ్వలేదని ఎలా చెబుతున్నారని, దీంట్లో ఏది అబద్ధమో సభలో నిరూపించే దమ్ము ప్రభుత్వానికి ఉందా అని సవాల్ చేశారు.విద్యా వ్యవస్థను సర్వ నాశనం చేస్తున్నారుపేద విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలన్న సత్సంకల్పంతో వైఎస్ జగన్ నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ, ఐబీ సిలబస్, జగనన్న గోరుముద్ద లాంటి విప్లవాత్మక మార్పులు తెచ్చారని బొత్స చెప్పారు. టెన్త్, ఇంటర్ పరీక్షల్లో కాపీయింగ్ లేకుండా కఠిన చట్టాలు తెచ్చామన్నారు. ఈరోజు ఆ వ్యవస్థలన్నింటినీ చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలేసి విద్యా వ్యవస్థను సర్వ నాశనం చేస్తోందని దుయ్యబట్టారు. ప్రభుత్వ బడులను నిర్వీర్యం చేసి, లక్షలాది విద్యార్థులను ప్రైవేట్ స్కూళ్ల వైపు నెడుతున్నారని చెప్పారు. సగం మంది తల్లులకు అమ్మ ఒడి డబ్బులు ఇవ్వకుండా ఎగనామం పెట్టారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వ మోసాలు, అరాచకాలను వదిలిపెట్టేది లేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజా కోర్టులో’నే తేల్చుకుంటామని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. -
గ్రూప్–1పై మేం రెడీ.. మెగా డీఎస్సీపై మీరు రెడీనా? సీబీఐ విచారణకు సిద్ధమా
పీవీ సింధుకు, డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో నింపిన 372 ఉద్యోగాలకు మధ్య పోలిక తీసుకువచ్చినందుకు చంద్రబాబును, లోకేశ్ను ఏమనుకోవాలి? వీళ్ల మైండ్లో చిప్లు ఉన్నాయా? లేవా? ఉంటే అవి పనిచేస్తున్నాయా? లేవా? స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన 372 మందిలో ఎంత మందికి సింధూకి వచ్చినట్లు మెడల్స్ వచ్చాయి? అసాధారణ ప్రతిభ కనబరిచే అంతర్జాతీయ క్రీడాకారులకు ప్రత్యేక నియామకం కల్పించటాన్ని సాధారణ స్పోర్ట్స్ కోటా టీచర్ రిక్రూట్మెంట్తో ఎలా పోలుస్తారు? బుద్ధి ఉన్నోడు ఎవరైనా ఇలాంటి పోలికలు తెస్తారా? తన స్కామ్లను కప్పిపుచ్చుకోవడానికి సింధులాంటి ప్లేయర్ను అడ్డుపెట్టుకుంటున్నారు.చరిత్రలో మొదటిసారి అసలు పరీక్షే లేకుండా టీచర్ ఉద్యోగాలిచ్చారు. విద్యా శాఖ మంత్రి ఆమోదం లేకుండా ఆ జీవోలు ఇవ్వగలుగుతారా? అరాచకాలకు గేట్లు ఎత్తి 372 మందికి ఉద్యోగాలు ఇవ్వగానే జీవోలు రద్దు చేసి గేట్లు మూసేశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంక్ ఎలా వచ్చింది? మెరిట్ లిస్ట్లో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? అనంతరం మెరిట్ లిస్ట్ ఎందుకు మార్చారు? స్పోర్ట్స్ కోటా పేరిట టీచర్ పోస్టుల అమ్మకాలు, బేరసారాలు జరిగినట్లుగా అసెంబ్లీలో తండ్రీ కుమారులు ఇద్దరూ ఒప్పుకున్నారు. ఇందులో ఆ బేరసారాలు చేస్తున్న వ్యక్తి ఫోన్ నెంబర్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. బేరసారాలు జరిగినట్లు ఆడియో, వీడియో సాక్ష్యాలు కనిపిస్తున్నా మీరు తీసుకున్న చర్యలేమిటి? స్పష్టంగా మొబైల్ నెంబర్ కనిపిస్తున్నా అనుమానితులంటూ స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఎలాంటి చర్యలూ లేవు. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించామని, బెయిల్పై వచ్చాడని తండ్రీ కుమారులు చెబుతున్నారు. అంటే ఆ స్థాయిలో కేసు నీరు గారుస్తూ.. అసెంబ్లీ సాక్షిగా తండ్రీ కుమారులు ఎంత పచ్చి అబద్ధాలు చెప్పారో చూడండి.. – వైఎస్ జగన్సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ–2025 అక్రమాలన్నీ పక్కా సాక్షా్యధారాలతో రుజువు కావడంతో తన కుమారుడిని కాపాడుకోవడానికి సీఎం చంద్రబాబు కొత్త ఆట మొదలు పెట్టారని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. మరింత దిగజారిపోయి ఏపీపీఎస్సీ 2018 గ్రూప్–1 నియామకాలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి ఏపీపీఎస్సీ పరీక్షలో ఇప్పటి మెగా డీఎస్సీలో మాదిరిగా పేపర్ లీకేజీ కాలేదు.. ఎవరికీ అనుకూలంగా ప్రత్యేక జీవోలు ఇవ్వలేదు.. పరీక్షే లేకుండా ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవని గుర్తు చేశారు. 2018 గ్రూప్–1 నియామకాలపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలపై సీబీఐ విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని.. మరి మెగా డీఎస్సీ–2025పై సీబీఐ విచారణకు మీరు సిద్ధమా..? అని చంద్రబాబు, నారా లోకేశ్కు సూటిగా వైఎస్ జగన్ సవాల్ విసిరారు. సిద్ధమైతే తక్షణమే రెండింటిపై సీబీఐ విచారణ కోరుతూ దర్యాప్తు సంస్థకు లేఖ రాయాలని చాలెంజ్ చేశారు. గ్రూప్–1 నియామకాల్లో తామెక్కడా తప్పు చేయలేదు కాబట్టే గట్టిగా సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నామన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మెగా డీఎస్సీ–2025 అక్రమాలపై చంద్రబాబు ప్రభుత్వాన్ని కడిగి పారేశారు. పక్కా సాక్ష్యాధారాలతో మెగా డీఎస్సీ కుంభకోణం రుజువు కావడంతో కుమారుడిని కాపాడుకోవాలన్న ఆరాటంతో 2018 గ్రూప్–1 నియామకాలపై చంద్రబాబు పిచ్చి ఆరోపణలు చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలను, పారదర్శకంగా చేపట్టిన గ్రూప్–1 నియామకాలను ఆధారాలతో వైఎస్ జగన్ వివరించారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా మెయిన్స్ నిర్వహణ.. మూల్యాంకనం.. ఇంటర్వూ్యలు.. పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ పూర్తయిందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే..డీఎస్సీ పోస్టులు అమ్ముకునేందుకు బేరసారాలు ఆడుతున్న ఆడియో కాల్ వివరాలను ఫోన్ నంబర్తో సహా ప్రదర్శించిన వైఎస్ జగన్ ఒక్క ఆరోపణ లేకుండా 1.30 లక్షల ఉద్యోగాల భర్తీ..మా హయాంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం. ఎక్కడైనా చిన్న ఫిర్యాదు వచ్చిందా? చిత్తశుద్ధి, పారదర్శకత అంటే అది. ఇప్పుడు చూస్తే కుట్రపూరిత జీవోలు ఇచ్చి వీళ్ల ఎంపీలు, ఎమ్మెల్యేలే ధ్రువీకరణ పత్రాలు జారీ చేసి 372 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చేశారు. ఇష్టారాజ్యంగా కుంభకోణాలు చేశారు. మేం 1.30 లక్షల ఉద్యోగాలు ఇస్తే ఎక్కడైనా ఒక్క ఆరోపణ వచ్చిందా? వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 78 నోటిఫికేషన్లు ఇచ్చి 6,296 పోస్టులు భర్తీ చేశాం. ఎక్కడైనా చిన్న వివాదం తలెత్తిందా? మేం ఇచ్చిన వాటిలో ఏడు నోటిఫికేషన్లు చంద్రబాబు పెండింగ్లో పెట్టారు. మరో రెండు రద్దు చేశారు. ఇదీ చంద్రబాబుకు నిరుద్యోగుల పట్ల ఉన్న ప్రేమ. మీ జోక్యంతో జరిగిన అక్రమాలన్నీ స్పష్టంమా హయాంలో జరిగిన గ్రూప్–1 నియామకాలకు, ఇప్పటి డీఎస్సీ–2025 నియామకాలకు ఎంతో తేడా ఉంది. చరిత్రలో మొదటిసారి పరీక్షే లేకుండా టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు. విద్యా శాఖ మంత్రి సంతకాలు లేకుండా ఈ జీవోలు ఇవ్వగలుగుతారా? నేరుగా విద్యా శాఖ మంత్రి ఆమోదంతో పరీక్షే లేకుండా ఉద్యోగాలు కట్టబెట్టే వ్యవస్థను రూపొందించారు. 372 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. అరాచకాలకు గేట్లు ఎత్తారు. ఉద్యోగాలు ఇవ్వగానే జీవోలు రద్దు చేసి గేట్లు మూసేశారు. ఇది నేరుగా చంద్రబాబు కుమారుడు విద్యా శాఖ మంత్రిగా ఉండగా జరిగింది. ఇది ఎంతో ఘోరమైన విషయం. డీఎస్సీ పరీక్ష రాయకుండానే టీచర్ ఉద్యోగాలు కట్టబెట్టిన చరిత్ర ఎప్పుడూ లేదు. మా హయాంలోని గ్రూప్–1, ఇప్పటి డీఎస్సీ–2025కి మధ్య మొదటి తేడా ఇది. ఇక అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్కు మొదటి ర్యాంక్ ఎలా వచ్చింది? మెరిట్ లిస్ట్లో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? అనంతరం మెరిట్ లిస్ట్ ఎందుకు మార్చారు? అదేవిధంగా అతని ఐడీలను ఎందుకు చెరిపేశారు? అతడికి కాల్ లెటర్ ఎందుకు పంపలేదు? ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? ఈ సాక్ష్యాలతోనే పేపర్ లీకైందని స్పష్టంగా రుజువైంది. బేరసారాలు జరిగినట్టుగా ఆడియో, వీడియో సాక్ష్యాలు కనిపిస్తున్నా మీరు తీసుకున్న చర్యలేమిటి? మొబైల్ నంబర్ కనిపిస్తున్నా అనుమానితులని అంటున్నారు. స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఎలాంటి చర్యల్లేవు. మరో కేసులో రూ.14 లక్షల నగదు లావాదేవీ జరిగినా ఆ వ్యక్తిని అరెస్ట్ చేయరు. విచారణ చేపట్టరు. ఇలా మీ వ్యక్తిగత జోక్యంతో కూడిన కుట్రలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏపీపీఎస్సీ స్వతంత్ర సంస్థ. పెద్ద పెద్ద అధికారుల పర్యవేక్షణలో ఆ సంస్థ పనిచేస్తుంది. పరీక్షలు నిర్వహిస్తారు. బాబు దురుద్దేశంతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. పైగా మా ప్రభుత్వం రాక ముందే గ్రూప్–1 ప్రిలిమ్స్ నిర్వహించారు. ప్రిలిమ్స్లో అర్హత సాధించిన వారికే మెయిన్స్ నిర్వహించాం. హైకోర్టు ఆదేశాలతో, కోర్టు ఆధ్వర్యంలో పరీక్షా పత్రాల మూల్యాంకనం, ఎంపికైన వారికి ఉద్యోగాల కల్పన ఇలా ప్రతి ప్రక్రియ చేపట్టాం. ఈ పరిస్థితి ఇంతకు ముందు లేదుబాబు పాలనలో నేరుగా పోలీసులతోనే నేరుగా గంజాయి అమ్మిస్తున్నారు. ప్రతి గ్రామం, వీధుల్లో గంజాయి లభ్యమవుతోంది. రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చేశారు. గంజాయి సంస్కృతి గ్రామాలకు పాకింది. గ్రామాల్లో ఎక్కడ చూసినా బెల్ట్షాపులు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి ఇంతకు ముందు రాష్ట్రంలో ఎప్పుడూ లేదు. పోలీసులే నేరుగా గంజాయి అమ్మకాలు.. బీసీల రిజర్వేషన్ అంశం.. బీసీలకు ఎవరేం చేశారు? రైతుల సమస్యలు.. రాష్ట్రంలో నెలకొన్న కరవు, సంక్షోభ పరిస్థితులపై వచ్చే వారం మరోమారు మీడియా ముందుకు వస్తా. -
కేంద్ర మంత్రి అమిత్ షాకు వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి లేఖ
ఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి లేఖ రాశారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన ఏడుగురు కోనసీమ మత్స్యకారులు, ముత్యాలమ్మ బోటును రక్షించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఇండియన్ నేవీ ఇండియన్ పోస్ట్ గార్డ్ సంయుక్తంగా మత్స్యకారులని రక్షించేందుకు గాలింపు చర్యలు చేపట్టాలని కోరారు.మత్స్యకారుల చివర మొబైల్ సిగ్నల్ని ట్రాక్ చేయాలి. విదేశాంగ శాఖతో సమన్వయం చేసుకొని బోటు అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించిందా లేదా అనేది తెలుసుకోవాలి. గాలింపు చర్యల సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయాలని ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు. ఆగస్టు మూడో తేదీన ఓడలరేవు నుంచి వెళ్లిన మత్స్యకారులు గల్లంతయ్యారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ గాలింపు చర్యలు చేపట్టిన మత్స్యకారులని , బోట్లని కనుగొనలేకపోయాయి. తమ వారి జాడ తెలియక కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనలో ఉన్నారు. బోటు ఇంజన్ ఫెయిల్యూర్ కారణంగా మునిగిపోవడం, లేదంటే అంతర్జాతీయ జలాల్లో కి ప్రవేశించి ఉండవచ్చని జిల్లా కలెక్టర్ అంటున్నారు. -
వైఎస్సార్సీపీ అభిమాని వర్షిత రెడ్డి వివాహ రిసెప్షన్కు వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన వైఎస్సార్సీపీ అభిమాని వర్షిత రెడ్డి వివాహ రిసెప్షన్కు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. తాడేపల్లి మండలం కుంచనపల్లిలో జరిగిన వివాహ రిసెప్షన్కు వైఎస్ జగన్ హాజరయ్యారు.నూతన వధూవరులు వర్షితరెడ్డి, క్రాంతి భాస్కర రెడ్డిలకు వివాహ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్.. నూతన దంపతుల వైవాహిక జీవితం ఆనందంగా, సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. -
రేపు హైదరాబాద్కు వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (21 ఆగస్టు, శుక్రవారం) హైదరాబాద్లో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి, 11 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.అక్కడి నుంచి జలవిహార్ గ్రాండ్ లాన్స్లో జరిగే సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు. నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం వైఎస్ జగన్ అక్కడి నుంచి తిరుగు ప్రయాణమవుతారు. -
రిలీజ్ తరువాత జగన్ ను కలిసిన సీదిరి కుటుంబం
-
వైఎస్ జగన్ని కలిసిన మెడికో ప్రియాంక పేరెంట్స్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మెడికో ప్రియాంక తల్లిదండ్రులు గురువారం కలిశారు. తమ కుమార్తెను కారుతో ఢీకొట్టి చంపిన విషయమై వైఎస్ జగన్కు ప్రియాంక పేరెంట్స్ వివరించారు.తమ కుమార్తెను తలచుకుని వెంకటేష్, చంద్రమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. వారిని వైఎస్ జగన్ సముదాయించి ధైర్యం చెప్పారు. నిందితులకు శిక్ష పడేలా చూడాలంటూ వైఎస్ జగన్ను ప్రియాంక కుటుంబ సభ్యులు కోరారు. అవసరమైన న్యాయ పోరాటం చేద్దామంటూ వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. -
వైఎస్ జగన్ను కలిసిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు కుటుంబ సభ్యులతో మర్యాదపూర్వకంగా కలిశారు. అక్రమ కేసులో అరెస్టై 23 రోజుల పాటు శ్రీకాకుళం జైలులో ఉన్న డాక్టర్ సీదిరి అప్పలరాజుతో వైఎస్ జగన్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ధైర్యం చెప్పారు.రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా ఉండాలని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని సీదిరి అప్పలరాజుకు వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులకు కూడా ధైర్యం చెప్పి, పార్టీ నుంచి పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. -
అవినీతి, అక్రమాల కోసమే డీఎస్సీలో శాప్ జోక్యం చేసుకుంది
-
‘అందుకే చంద్రబాబు సర్కార్ తోకముడిచింది’
సాక్షి, విజయవాడ: గత నాలుగు రోజులుగా డీఎస్సీపై ప్రభుత్వం చర్చకు రాలేదని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. గురువారం ఆయన శాసనమండలి మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. డీఎస్సీలో అవకతవకలున్నాయనే మేం విచారణ జరిపించాలని కోరాం. మార్కెట్లో వస్తువుల్లా ఉద్యోగాలు అమ్ముకున్నారు. డీఎస్సీలో అవకతవకలు జరిగింది వాస్తవం.. అందుకే ప్రభుత్వం తోకముడిచింది’’ అని బొత్స పేర్కొన్నారు.‘‘డీఎస్సీతో పాటు గ్రూప్-1 పైన కూడా సీబీఐ విచారణ జరిపించండి. 1998 డీఎస్సీలో 5887 మందికి ఉద్యోగాలిచ్చింది మేమే. 2008 డీఎస్సీలో 2193 మందికి ఉద్యోగాలిచ్చింది కూడా మేమే. 2019లో స్పెషల్ డీఎస్సీ నిర్వహించి 521 మందికి ఉద్యోగాలిచ్చాం. 1250 మంది కేజీబీవీ టీచర్లకు ఉద్యోగాలు కల్పించాం. మార్కెట్లో ఉద్యోగాలు అమ్ముకుని అండపిండ బ్రహ్మాండం బద్దలైపోయినట్లు డాంబికం ఎందుకు?. ఈ ప్రభుత్వం పనైపోయింది. రెండేళ్లలోనే ప్రభుత్వం మోసం తెలిసిపోయింది..మాట్లాడితే సవాళ్లు విసురుతారు.. చర్చకు రమ్మంటే రారు. ప్రజల సమస్యల పట్ల మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే సభలో చర్చించాలని కోరాం. మీలా ప్రతిదీ రాజకీయ కోణంలో మేం చూడలేం. మా ఇంటికొస్తే మీరు ఏం తెస్తారు.. మీ ఇంటికొస్తే మాకేమిస్తారు అనేలా ఉంది ప్రభుత్వం తీరు. రెండేళ్లలోనే లక్ష మంది విద్యార్థులు ఎందుకు తగ్గారు?. విద్యావ్యవస్థలో లోపం ఉంది కాబట్టే ప్రైవేట్కు తరలిపోయారు...విద్యావ్యవస్థను బలోపేతం చేసింది వైఎస్ జగన్. నాడు నేడు పెట్టి స్కూల్స్ రూపురేఖలు మార్చింది వైఎస్ జగన్. ఐబీ వంటి సిలబస్లు పెట్టి విద్యా ప్రమాణాలు పెంచింది వైఎస్ జగన్. జగన్ గోరుముద్ద ద్వారా మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారం అందించాం. వైఎస్ జగన్ అమ్మ ఒడిని సక్రమంగా అమలు చేశారు’’ అని బొత్స వివరించారు. -
కేసుల వెనుక కుట్ర ఇదే... చింతాడ రవి సంచలన వ్యాఖ్యలు
-
APలో స్థానిక ఎన్నికల సమరానికి సై అంటున్న YSRCP
-
మండలిలో జగన్ మాస్టర్ ప్లాన్.. కూటమికి చెక్.. డిప్యూటీ చైర్మన్ పీఠం YSRCP కైవసం
-
ఏపీ శాసన మండలి నిరవధిక వాయిదా
ఏపీ అసెంబ్లీ సమావేశాలు అప్డేట్స్.. 👉ఏపీ శాసన మండలి నిరవధిక వాయిదా.. 👉పది బిల్లులకు ఏపీ శాసనమండలి ఆమోదంచర్చకు రాకుండా తప్పించుకున్న కూటమి..డీఎస్సీ అక్రమాలపై చర్చకు రాని ప్రభుత్వంనాలుగు రోజుల పాటు డీఎస్సీ అక్రమాలపై విచారణ కోసం వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల పోరాటంనాలుగు రోజులు డీఎస్సీపై చర్చకు భయపడ్డ ప్రభుత్వంప్రతిపక్షం లేని అసెంబ్లీలో చర్చ పెట్టిన ప్రభుత్వంప్రతిపక్షం ఉన్న మండలిలో చర్చ కు భయపడ్డ ప్రభుత్వంఎమ్మెల్సీల ఆందోళన ఉధృతంశాసన మండలిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ఆందోళన ఉధృతంశాసన మండలి వాయిదా పడినా ఆందోళన కొనసాగింపుమండలిలో నేల మీద కూర్చుని ఆందోళన చేస్తున్న ఎమ్మెల్సీలుడీఎస్సీ అక్రమాలపై చర్చ జరపాలని ఆందోళననారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ఆందోళనశాసనమండలిలో వైఎశాసనమండలిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ఆందోళనడీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్డీఎస్సీపై చర్చకు వైఎస్సార్సీపీ పట్టుపోడియం వద్దకు చేరుకుని నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలునారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలంటూ నినాదాలు స్సార్సీపీ ఎమ్మెల్సీల ఆందోళనఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి కామెంట్స్..డీఎస్సీపై చర్చ జరపాలని కోరుతున్నా ప్రభుత్వంలో చలనం రావడం లేదుతప్పు చేశారు కాబట్టే భయపడుతున్నారుస్పోర్ట్స్ కోటా వారికి పరీక్ష లేకుండా ఉద్యోగమిచ్చామని మంత్రి లోకేష్ చెబుతున్నారుటెట్ నుంచి మినహాయించి ఇవ్వాలని ఢిల్లీ వెళ్లి అడిగినందుకు టీచర్లను సస్పెండ్ చేశారుతక్షణమే టీచర్లపై సస్పెన్షన్ ఎత్తేయాలిడీఎస్సీపై సీబీఐ విచారణ జరిపించాలిఎమ్మెల్సీ మధుసూధన్ కామెంట్స్..2% ఉన్న స్పోర్ట్స్ కోటాను 3% శాతానికి పెంచారుడీఎస్సీకి ముందు ఒక జీవో.. తర్వాత ఒక జీవో తెచ్చారు.జీవోలను అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారుడీఎస్సీలో ఉద్యోగాల కోసం లక్షల్లో బేరసారాలు జరిగాయిఎందుకు డీఎస్సీపై విచారణకు భయపడుతున్నారుఎమ్మెల్సీ ఇసాక్ బాషా కామెంట్స్..గతంలో ఎన్నడూ ఇలాంటి సమావేశాలు జరగలేదుడీఎస్సీపై విచారణ చేయించాలంటే భయపడి పారిపోతున్నారు.ర్యాలీగా మండలికి ఎమ్మెల్సీలు..ర్యాలీగా మండలికి బయలుదేరిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలుమెడలో నల్ల కండువాలు ధరించి నిరసనమెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అంటూ నినాదాలుడీఎస్సీ అక్రమాలపై తక్షణమే సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్డీఎస్సీపై విచారణ చేయాలంటూ ప్లకార్డుల ప్రదర్శనమంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ -
వైఎస్ జగన్ ప్రెస్మీట్ హైలైట్స్
సాక్షి, అమరావతి: మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆయన సమకాలీన రాజకీయ అంశాలు, ప్రజా సమస్యలు, డీఎస్సీపై మాట్లాడారు.వైఎస్ జగన్ ప్రెస్మీట్ హైలైట్స్..డీఎస్సీ అక్రమాలపై ఆధారాలు ప్రజల ముందు ఉంచాం.డీఎస్సీ అక్రమాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రశ్నిస్తే గింజుకున్నారు. తప్పు ఒప్పుకోవడం లేదు.తప్పులను ప్రతిపక్షం ఎత్తుచూపుతున్నదని చంద్రబాబుకు భయంఅసెంబ్లీలో చంద్రబాబు, లోకేష్ బ్యాటింగ్ చేస్తున్నారు.ప్రతిపక్షానికి సమయం ఇవ్వాల్సి వస్తుందని హోదా ఇవ్వడం లేదు. ప్రశ్నపత్రం తయారీ ఎస్సీఈఆర్టీ బాద్యతరెండూ ఒకే వ్యక్తి చేతిలోపెడితే పారదర్శకత ఉంటుందా?ఇక్కడే స్కామ్కు బీజం పడింది.ఒకే వ్యక్తి చేతిలో రెండు బాధ్యతలు ఎందుకు పెట్టారు?స్వయంగా లోకేష్ సభలో అంగీకరించారు.ఏపీ డీఎస్సీ నియామాక చరిత్రలో ఎప్పుడు ఒకే వ్యక్తికి రెండు బాధ్యతలు అప్పగించలేదుపేపర్ తయారీ విభాగంలో వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది.పరీక్ష నిర్వహణ డీఎస్సీ కన్వీనర్ది.ఫస్ట్ మెరిట్ లిస్ట్లో ఫస్ట్ ర్యాంకర్ నవీన్ పేరు ఉందిఫస్ట్ ర్యాంక్ వచ్చిన నవీన్కు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు?వెరిఫికేషన్లో నవీన్ పేరు లేదని ఉద్యోగం ఇవ్వలేదటఇదే వాస్తవం అయితే నవీన్ కోర్టుకు ఎందుకు వెళ్లాడు?సెకెండ్ వెరిఫికేషన్ లిస్టులో కూడా నవీన్ పేరు తొలగించారు.సర్టిఫికెట్ వెరిఫికేష్కు నవీన్ ఎలా వస్తాడు?డీఎస్సీ లీకేజీ, అక్రమాలపై చర్చకావాలంటూ నాలుగు రోజులపాటు శాసనమండలిని మా ఎంఎల్సీలు స్తంభింపచేశారు.కాని, అక్కడ డిస్కషన్ చేయడానికి ముందుకు రావడంలేదు. ఎందుకు కౌన్సిల్లో చర్చకు ఒప్పుకోలేదంటే, కారణం డీఎస్సీలో తప్పులు జరిగాయి కాబట్టి, సీబీఐ విచారణ చేయాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది కాబట్టి, జరిగిన దానికి బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామాచేసి తప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి. డీఎస్సీ పరీక్షల ప్రశ్నల తయారీ–పరీక్ష నిర్వహణ రెండూ ఒకే అధికారి చేతిలో పెట్టినట్టు లోకేష్ స్వయంగా అంగీకరించారు. మేం లేవనెత్తిన కీలక అంశంకూడా ఇదే. అంగీకరించడమే కాకుండా, తప్పేముంది అని దబాయించాడు.ప్రశ్నలు తయారుచేసే వ్యవస్థకు, పరీక్ష నిర్వహించే వ్యవస్థకు మధ్య ఉండాల్సిన చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఎందుకు తొలగించారో దర్యాప్తు జరగాలి, అంతేకాదు, ఒకే వ్యక్తి చేతిలో రెండు కీలక బాధ్యతలు ఎందుకు పెట్టారో తేలాలి? అందుకే సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాం.మరి ఇన్ని తప్పులు కనిపిస్తున్నప్పుడు సీబీఐ దర్యాప్తు జరగాలా? వద్దా?వాళ్ల మనుషులకు టీచర్ ఉద్యోగాలు అమ్ముకున్నారు.చదువు చెప్పేవారికి పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇచ్చేస్తారా?డీఎస్సీ నియామకం తర్వాత ఇచ్చిన జీవోను ఎందుకు వెనక్కి తీసుకున్నారుపీవీ సింధు పేరు చెప్పి చంద్రబాబు, లోకేష్ అబద్ధాలుచరిత్రలో లేనివిధంగా పరీక్ష రాయని వారికి ఉద్యోగాలు ఇచ్చేశారు.మెడల్స్ కాదు కేవలం పాల్గొన్నందుకే ఉద్యోగాలు ఇచ్చేశారు.గతంలో డీఎస్సీ క్వాలిఫై అయితేనే ఉద్యోగం వచ్చేది.జీవోలు ఇచ్చే స్థాయికి స్కాం వెళ్లింది.372 మందికి ఉద్యోగాలిచ్చిన జీవోలను రద్దు చేశారు.మంత్రి ఆమోదం లేకుండా జీవోలు ఇస్తారా?డీఎస్ స్కాంపై ఆడియో, వీడియో టేపులు బయటపడ్డాయి.డీఎస్సీ పరీక్ష రాయకుండానే, చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా, అసలు పరీక్ష రాయకుండానే, స్పోర్ట్స్కోటాలో పోస్టులు ఇచ్చామని, దీనికోసం జీవోలు జారీచేశామనికూడా ఒప్పుకున్నారు.దీన్ని సమర్థించుకోడానికి చెప్పిన కబుర్లు మామ్మూలుగా లేవు.స్పోర్ట్స్ పర్సన్స్కు టెస్ట్ పెట్టాల్సిన అవసరం లేదంట, పీవీ సింధులాంటి వారికి నేరుగా ఉద్యోగాలు ఇచ్చాం కాబట్టి, పిల్లలకు చదువుచెప్పే ఈ టీచర్ ఉద్యోగాలూ కూడా అలాగే ఇచ్చారంట?ఇలా అడ్డగోలుగా సమర్థించుకోవడం ఆ అబ్బా, కొడుకులు ఇద్దరికే తప్ప, ఎవరికైనా సాధ్యం అవుతుందా?పీవీ సింధుకు, డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో నింపిన 372 ఉద్యోగాలకు మధ్య పోలిక తీసుకువచ్చినందుకు చంద్రబాబును, లోకేష్ను ఏమనుకోవాలి? వీళ్ల మైండ్లో చిప్లు ఉన్నాయా? లేవా? ఉంటే అవి పనిచేస్తున్నాయా? లేవా?పీవీ సింధుకు 2016 రియో ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్, 2020 టోక్యో ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ వచ్చాయి. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఛాంపియన్ షిప్, కామన్వెల్త్, ఏసియన్ గేమ్స్, ఇలా చాలా ఇంటర్నేషనల్ టోర్నీల్లో ఎన్నో విజయాలు సాధించింది. స్పోర్ట్స్ కోటాలో నియమించిన దాదాపు 372 మందిలో పీవీ సింధులా ఎంతమందికి గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్ అచీవ్మెంట్స్ ఉన్నాయి? బుద్ధి ఉన్నోడు ఎవరైనా ఇలాంటి పోలికలు తెస్తారా?తన స్కాంలను కప్పిపుచ్చుకోవడానికి సింధులాంటి ప్లేయర్ను అడ్డుపెట్టుకుంటున్నాడు.సింధులాంటి వాళ్లకు ఇవ్వడానికే టీచర్ రిక్రూట్మెంట్లో స్పోర్ట్స్కోటాకు ఈ కొత్త జీవోలు ఇచ్చామని, చెప్తున్న ఈ చంద్రబాబు, లోకేష్ - ఇద్దరూ కూడా మళ్లీ ఇచ్చిన ఆ జీవోలను ఎందుకు ఎత్తివేశారో మాత్రం అసెంబ్లీలో సమాధానం చెప్పలేకపోయారు.ఒకవైపు సింధు పేరుచెప్పి, మరోవైపు వీళ్ల అబద్ధాలు ఏ స్థాయిలో ఉన్నాయి - అంటే, చివరకు ఆర్చరీలో నేషనల్ ఛాంపియన్ షిప్ సాధించిన, ఎస్టీ కేండిడేట్ దుర్గయ్యకు కూడా, కాల్ లెటర్ పంపిన తర్వాత కూడా, పోస్టు ఇవ్వకుండా అన్యాయం చేశారు. డీఎస్సీ విషయంలో ఏ ఫిర్యాదు వచ్చినా పక్కన పెట్టారు.విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాల్సిందే: వైఎస్ జగన్‘నీట్’ లోపాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాధర్మేంద్ర ప్రధాన్కు ఒక నీతి.. బాబు కుమారునికి మరొక నీతా?కొడుకును కాపాడుకునేందుకు బాబు మరింత దిగజారుడుబాబు, లోకేష్ డైరెక్షన్లోనే పోలీసుల వ్యవహరంమేం నిర్వహించిన ఎపీపీఎస్సీలో లీకేజీ జరగలేదు.స్పోర్ట్స్ కోటా పేరిట టీచర్ పోస్టుల అమ్మకాలు, బేరసారాలు చేసినట్టుగా, ఆడియో, వీడియో కాల్స్ బయటకు వచ్చినట్టుగా అసెంబ్లీలోనే ఒప్పుకున్నారు.మరి వీడియోలో బేరసారాలు చేస్తున్న వ్యక్తి ఫోన్ నంబర్ అంత స్పష్టంగా ఉన్నప్పుడు ఎఫ్ఐఆర్ కాపీలో, పేరు చూపకుండా, కేవలం సస్పెక్ట్ అని ఎందుకు రాయాల్సి వచ్చింది? ఎందుకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు సీనియర్ అధికారులతో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అసలు ఆకేసును ఎందుకు నిర్వీర్యం చేశారు. మరి చంద్రబాబు, లోకేష్లు ఇద్దరూ వీటికి ఎందుకు సమాధానం చెప్పలేదు? ఒంగోలులో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఒక డీఎస్సీ అభ్యర్థికి స్పోర్ట్స్కోటాలో పోస్టు ఇప్పిస్తామని రూ.14లక్షలు తీసుకున్నారు.రిఫరెన్స్గా మరో వ్యక్తికి కూడా ఇలాగే చేస్తున్నామని చెప్పారు. రిఫరెన్స్గా చూపిన వ్యక్తికి పోస్టు వచ్చింది, కాని, ఈ అమ్మాయికి పోస్టు రాలేదు. గట్టిగా అడిగితే ఏపీ టూరిజంలో మరో ఉద్యోగం ఇస్తామంటూ మభ్యపెట్టారు. తనకు అన్యాయం జరిగిందని, ఆ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాని పోలీసులు ఎఫ్ఐఆర్లో డీఎస్సీ పోస్టుకోసం బేరసారాలు చేశారని రాయకుండా, టూరిజం పోస్టుకోసం అన్నట్టుగా రాశారు.గత ఏడాది నవంబర్ 11న, ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే, ఇప్పటివరకూ ఎలాంటి చర్యల్లేవు. తన కంప్లైంట్పై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని ఎస్పీకి ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదు.అంటే డీఎస్సీ విషయంలో ఏ కంప్లైంట్ వచ్చినా, ఎక్కడవి అక్కడే ఎలాంటి విచారణ లేకుండా వదలిలేయాలని, తండ్రికొడుకులు ఇద్దరూ ఆదేశాలు ఇచ్చినట్టుగా, దాన్ని పోలీసులు పాటిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తోంది.లీకేజీ దగ్గరనుంచి స్పోర్ట్స్కోటా వరకూ, ఆపై బేరసారాల వరకూ ఇవన్నీ కూడా సమగ్రంగా పరిశీలించాల్సిన అంశాలు.అందుకే డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణ జరగాలి. జరిగిన వాటికి బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలి. మేం ఎవరికీ అనుకూలంగా జీవోలు తీసుకురాలేదుకొడుకును కాపాడుకునేందుకే చంద్రబాబు ఆక్రోశంనిజాలను ఎవరూ దాచలేరు.. బయట పెట్టాల్సిందేఅప్పట్లో కోవిడ్ వల్ల డిజిటల్ వాల్యుయేషన్కు వెళ్లాం.మార్కుల ఆధారంగా 165 మందికి ఉద్యోగాలు ఇచ్చాం.కొంతమంది కోర్టుకు వెళ్లడంతో డిజిట్ వాల్యుయేషన్ను పరిగణలోకి తీసుకోలేదు.మాన్యువల్ వాల్యుయేషన్ చేయాలని కోర్టు ఆదేశించింది.నాలుగేళ్ల తర్వాత చంద్రబాబు విషం కక్కుతున్నారు. కొడుకును కాపాడుకునేందుకు చంద్రబాబు కొత్త గేమ్ మొదలుపెట్టాడు. మరింత దిగజారిపోయి 2018- ఏపీపీఎస్సీ గ్రూప్-1 భర్తీపై తప్పుడు ఆరోపణలు చేయడం మొదలుపెట్టాడు.163 మంది ఉన్నత ఉద్యోగుల జీవితాలను అతలాకుతలం చేయాలని చంద్రబాబు టార్గెట్ చేశాడు.అప్పటి ఏపీపీఎస్సీ పరీక్షల్లో ఇప్పటి, డీఎస్సీ మాదిరిగా పేపర్ లీకేజీ అప్పుడు జరగలేదు.ఇప్పటి డీఎస్సీ మాదిరిగా ప్రశ్నపత్రాల విభాగంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ లేదా ఇతర ఉద్యోగులు ఎవ్వరికీ ర్యాంకులు రాలేదు. ఎవ్వరికీ అనుకూలంగా ప్రత్యేక జీవోలు ఇవ్వలేదు, పరీక్షలే లేకుండా ఎవ్వరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు.ఉద్యోగాలు అమ్ముకున్నట్టుగా, డబ్బులు ఇచ్చినట్టుగా, బేరసారాలు చేస్తున్నట్టుగా ఆడియో, వీడియో ఆధారాల్లాంటివి బయటకు రాలేదు.బయటకు వస్తున్నదల్లా చంద్రబాబు ఆక్రోశం. కొడుకును కాపాడుకోవాలన్న ఆయన ఆరాటం మాత్రమే.చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఏడాదిలోనే 2025, ఏప్రిల్లో ఒక సిట్ వేశాడు. ఫైనల్ ఫలితాల వెల్లడిలో ఏ తప్పూ జరగలేదని హైకోర్టులో గవర్నమెంటు అడ్వకేట్లు సైతం అఫడవిట్ ఫైల్ చేశారు. ఇది ఓవైపు జరుగుతుండగానే 2026 ఫిబ్రవరి 14న మరొక సిట్ వేశారు. సిట్లో ఉండేది ఎవరు? చంద్రబాబుగారి కింద పనిచేసే వారే.బురదజల్లడంకోసం దర్యాప్తు బృందాలను ఇష్టానుసారంగా వాడుకోవడం చంద్రబాబుకు కొత్తకాదు.గ్రూప్-1 వాల్యూషన్కు సంబంధించి హాయ్ల్యాండ్లో ఏదో జరిగిపోయిందని, అదే పనిగా, ఒకే అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేస్తున్నారు. హాయ్లాండ్లో ఎలాంటి ఎవాల్యూషన్ జరగలేదని అఫీషియల్ డాక్యుమెంట్స్ చాలా స్పష్టంగా చెప్తున్నాయి.చంద్రబాబు ప్రభుత్వమే 2025 నవంబర్ 15న, హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కూడా ఇదే విషయాన్ని రాశారు.మరి ఏదో జరిగిపోయిందన్న ప్రచారం ఎందుకు చేస్తున్నారు?గ్రూప్ -1పై ఎల్లో మీడియా దుష్ప్రచారం మొదలుపెట్టింది.బాబు హయాంలోని ఏపీపీఎస్సీ ఫలితాలు బయటపెట్టగలారా?ఇంటర్వ్యూలలో ఎన్ని మార్కులు వచ్చాయో, రిటన్ టెస్ట్లో ఎన్ని మార్కులు వచ్చాయో చెప్పగలరా?.. చంద్రబాబుకు వైఎస్ జగన్ సవాల్..ఏపీపీఎస్సీలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం: వైఎస్ జగన్ఒక్క ఆరోపణ లేకుండా 1.30 లక్షల మందికి ఉద్యోగాలిచ్చాం.2018 గ్రూప్ -1, 2025 డిఎస్సీ విచారణకు రెడీ.. సీబీఐ విచారణకు మీరు సిద్ధమా?తప్పు చేయలేదు కాబట్టి తలెత్తుకుని అడుగుతున్నాం.. చంద్రబాబు, లోకేష్కు వైఎస్ జగన్ సవాల్ మేం ఇచ్చిన దాంట్లో 7 నోటిఫికేషన్లను చంద్రబాబు పెండింగ్లో పెట్టాడు. మరో రెండింటిని రద్దు చేశాడు. ఇదీ నిరుద్యోగుల మీదున్న ప్రేమ.చంద్రబాబూ…మేం సవాల్ విసురుతున్నాం. మేం అడుగుతున్నట్టుగా DSC-2025పైనే కాదు, 2018 గ్రూప్-1 నోటిఫికేషన్మీదా, సీబీఐ ఎంక్వైరీ వేయండి. మేం రెడీ. చంద్రబాబు రెడీనా?తప్పు చేయలేదు కాబట్టి, మేం రెడీగా ఉన్నాం. చంద్రబాబు రెడీ అయితే వెంటనే సీబీఐ దర్యాప్తుకు లెటర్ రాయాలి. -
తాడిపత్రిలో టీడీపీ నేతల బరితెగింపు
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో టీడీపీ నేతలు రెచ్చిపోయి బరితెగింపు చర్యలకు దిగారు. ఇందులో భాగంగా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని కేసులో ఇరికించేందుకు మార్ఫింగ్ ఫొటోలను విడుదల చేశారు. ఓ కేసులో అనుమానితుడిగా ఉన్న వ్యక్తిని పెద్దారెడ్డి అనుచరుడిగా కుట్ర చేస్తూ ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.వివరాల మేరకు.. తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయుల రెచ్చిపోతున్నారు. రెండు రోజుల క్రితం తాడిపత్రిలో 400 బాటిళ్ల గోవా లిక్కర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పుట్లూరు మండలం చింతలపల్లికి చెందిన రామాంజినేయరెడ్డి అనుమానితుడిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో అనుమానితుడిని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచురుడిగా చూపించేందుకు పచ్చ నేతలు కుట్రకు తెరలేపారు. నిందితుడు.. పెద్దారెడ్డి పక్కనే ఉన్నట్టుగా జేసీ వర్గీయులు ఫొటో క్రియేట్ చేశారు. అనంతరం, ఆ ఫొటోలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.అయితే, పచ్చ నేతల కుట్రలకు వైఎస్సార్సీపీ చెక్ పెట్టింది. దీనికి సంబంధించిన ఒరిజినల్ ఫోటోను తాడిపత్రి వైఎస్సార్సీపీ నేతలు బయటపెట్టారు. వైఎస్సార్సీపీ కార్యకర్త స్థానంలో మరో వ్యక్తి ఫోటో మార్ఫింగ్ చేసి.. పెద్దారెడ్డిపై దుష్ప్రచారం చేసినట్టు ఆధారాలు చూపించింది. ఈ నేపథ్యంలో తాడిపత్రి టీడీపీ నేతల మార్ఫింగ్ వ్యవహారంపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. -
లోకేష్ కాదు 'లీకేష్'! ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా..
-
వెన్నుపోటు పార్టీ సర్కారుపై నిరసనాగ్రహం
సాక్షి, అమరావతి: వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం తీరుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు నిరసనాగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ– 2025లో జరిగిన అక్రమాలు, అవినీతిపై శానసమండలిలో చర్చించాలని కోరుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. శాసనసభలో డీఎస్సీపై ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి బల్లలు చరిపించుకున్న వారు మండలిలో చర్చకు ఎందుకు ముఖం చాటేస్తున్నారని ప్రశ్నించారు. లక్షలాది మందికి సంబంధించిన అంశంపై మండలిలో చర్చించాలని వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం అందజేస్తున్నా తిరస్కరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడో రోజు సమావేశాలకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు నల్లకండువాలతో హాజరయ్యారు. అంతకముందు నేలపై కూర్చొని నిరసన తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ డీఎస్సీపై చర్చకు రాని వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం డౌన్ డౌన్, మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ.. డీఎస్సీపై సీబీఐ విచారణ వేయాలి.. విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలంటూ నినాదాలతో హోరెత్తించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. -
డీఎస్సీ నియామకాల నిగ్గు తేలాలి.. సీబీఐ విచారణ జరపాల్సిందే
సాక్షి, అమరావతి: డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలు, బేరసారాలపై చర్చ జరగాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు వరుసగా మూడోరోజు బుధవారం కూడా శాసనమండలిలో పట్టుబట్టారు. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు నిగ్గుతేలాలి.. సీబీఐ విచారణ జరపాల్సిందే.. అంటూ ఆందోళన కొనసాగించారు. నల్లజెండాలు మెడలో వేసుకొని చైర్మన్ పోడియం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. డీఎస్సీ–2025 నిర్వహణ, నియామకాలపై చర్చ కోరుతూ సభ్యులు టి.కల్పలత, ఎం.వి.రామచంద్రారెడ్డి, పి.చంద్రశేఖర్రెడ్డి ఉదయం వాయిదా తీర్మానం ఇచ్చారు. సభ ప్రారంభం కాగానే చైర్మన్ మోషేన్రాజు ఆ వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో వైఎస్సార్సీపీ సభ్యులు చర్చకు అనుమతించాలంటూ పోడియం వద్దకు వెళ్లి డిమాండ్ చేశారు. వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన తర్వాత చర్చకు అనుమతించడం కుదరదంటూ చైర్మన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో వైఎస్సార్సీపీ సభ్యులు డీఎస్సీ అక్రమాలపై చర్చకు వెంటనే అనుమతించాలని నినాదాలు చేస్తూ పోడియంపైన చైర్మన్ వద్దకు వెళ్లి ప్లకార్డులు ప్రదర్శించారు. పోడియం కింద ఉన్న పలువురు సభ్యులు బల్లలు చరుస్తూ నినాదాలు కొనసాగించారు. విద్యాశాఖ మంత్రి లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలి.. మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్సీ అంటూ నినాదాలు చేశారు. చర్యలు తీసుకోవాలంటే ప్రభుత్వమే ప్రొసీజర్స్ ఫాలో కావాలి కదా: చైర్మన్ఈ సమయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ జోక్యం చేసుకుంటూ పోడియంపైకి వచి్చన సభ్యులపై చర్యలు తీసుకోవాలని మండలి చైర్మన్ మోషేన్రాజును కోరారు. ‘వాళ్లను కిందకు రమ్మనండి. మీరు చెప్పాలి. అది ప్రొసీజర్..’ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై చైర్మన్ స్పందిస్తూ.. ‘మీరు మంత్రి. స్పీకర్గా కూడా చేసి ఉన్నారు. మీరు పదేపదే సభను అర్డర్లో పెట్టమంటున్నారు. తప్పులేదు. చర్యలు తీసుకోమంటున్నారు. కానీ చర్యలు తీసుకోమన్నప్పుడు దానికి ఏం ప్రొసీజర్ ఉందో ప్రభుత్వపరంగా ఫాలో అవండి. అంతేతప్ప మీరు పదేపదే చైర్ను పెద్దస్వరంతో.. ఏదో చేయలేకపోతున్నారు అనడం సరికాదు. మీకు అన్ని రూల్స్ తెలుసు. చర్యలు ఏం తీసుకోవాలో, రూల్స్ ఫాలో అవండి’ అంటూ సూచించారు. మంత్రి నాదెండ్ల, చైర్మన్ల మధ్య ఈ చర్చ జరిగే సమయంలో వైఎస్సార్సీపీ సభ్యులు తీవ్రస్వరంతో నినాదాలు కొనసాగించడంతో కేవలం పది నిమిషాలకే సభను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ ప్రకటించారు. చైర్మన్కు మంత్రులు పాఠాలు చెప్పడం సరికాదు: బొత్స సత్యనారాయణ తిరిగి 11 గంటల సమయంలో సభ ప్రారంభమైన తరువాత మంత్రి నాదెండ్ల, మండలి చైర్మన్ మధ్య జరిగిన సంభాషణ మరోసారి చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా మండలి చైర్మన్ను ఉద్దేశించి మంత్రి నాదెండ్ల వ్యాఖ్యలను ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఖండించారు. ‘సభలో నిబంధనలు ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి ఒకే రకంగా వర్తిస్తాయి. చిన్న అలసత్వం ఏదైనా జరిగితే మీకు చెప్పవచ్చు కానీ, మీకు హితబోధ చేయడం సరికాదు. దురదృష్టకరం. మంత్రి వైఖరి చాలాసార్లు చూశా. సభ్యుల ఆవేదన కూడ చైర్మన్ పరిశీలించాలి. మా డిమాండ్ ఒక్కటే.. డీఎస్సీ అక్రమాలపై చర్చ జరగాలని. కానీ ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోంది. ప్రభుత్వం బయట మాత్రం ప్రతిచోట చర్చకు మేం సిద్ధమేనని చెబుతోంది. చర్చ జరపమనే మేం అడుగుతున్నాం. కానీ చైర్మన్కు పాఠాలు చెప్పడాన్ని ఖండిస్తున్నాం. మంత్రులే భాషను తూలనాడుతున్నారు. మేం తప్పుగా మాట్లాడితే చూపించండి’ అని బొత్స పేర్కొన్నారు. అనంతరం డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరిగింది. తరువాత మరోసారి వాయిదా పడి తిరిగి 12.45 గంటలకు ప్రారంభమైన సభ పదినిమిషాల వ్యవధిలోనే గురువారానికి వాయిదా పడింది. -
మోసాలపై చర్చ మొదలైంది
‘‘ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. 5 ఏళ్ల మన పాలన, చంద్రబాబు పాలన మధ్య తేడా పోల్చి చూస్తున్నారు. అక్కడ జగన్ ఉన్నాడు. వైఎస్సార్సీపీ ఉంది. ఇక్కడ చంద్రబాబు ఉన్నాడు. వెన్నుపోటు పార్టీ ఉంది. తేడా ఒక్క మనిషి మాత్రమే. జగన్ ఎలా చేయగలిగాడు? అదే చంద్రబాబు పాలనలో ఎందుకు జరగడం లేదు? అన్నదానిపై చర్చ జరుగుతోంది.’’ ‘‘చంద్రబాబు హయాంలో రైతులు హ్యాపీగా లేరు. మహిళలు హ్యాపీగా లేరు. చదువుకున్న పిల్లలు హ్యాపీగా లేరు. ఉద్యోగస్తులు హ్యాపీగా లేరు. ఎవ్వరూ సంతోషంగా లేరు.’’ ‘‘నాడు మడమ తిప్పని మన పరిపాలన గురించి ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. అలాగే చంద్రబాబు చేసిన మోసాలపైనా చర్చ సాగుతోంది. అందుకే వెన్నుపోటు పార్టీ అని చంద్రబాబు పార్టీకి ప్రజలే నామకరణం చేశారు. ఎన్టీ రామారావు అయినా సరే. ప్రజలైనా సరే. ఆయన చేసేది వెన్నుపోటు కాబట్టి. ఆ పార్టీకి ప్రజలే ఆ నామకరణం చేశారు.’’ -వైఎస్ జగన్సాక్షి, అమరావతి: వెన్నుపోటు పార్టీ పాలనపై రెండేళ్లలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. ‘ఇప్పటికే ప్రతి ఇంట్లో చర్చ మొదలైంది. 5 ఏళ్ల మన పాలన, చంద్రబాబు పాలన మధ్య తేడా పోల్చి చూస్తున్నారు. జగన్ ఎలా చేయగలిగాడు? అదే చంద్రబాబు పాలనలో ఎందుకు జరగడం లేదు? అన్నదానిపై చర్చ జరుగుతోంది.’ అని జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో ఏ వర్గమూ సంతోషంగా లేరని, అన్ని వర్గాలనూ మోసం చేశారని అన్నారు. స్థానిక ఎన్నికలకు శ్రేణులు సిద్ధం కావాలని ఆయన పిలుపు నిచ్చారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా మన గెలుపు తధ్యమని పేర్కొన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ముఖ్య నాయకులతో భేటీ అవుతున్న వైఎస్ జగన్.. ఆ దిశలో రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీకి చెందిన స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా పలకరించి.. ఆప్యాయంగా మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను.. జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి రాజమండ్రి రూరల్ పార్టీ ఇన్ఛార్జ్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణతో పాటు, పార్టీకి చెందిన స్థానిక మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఏం మాట్లాడారంటే.. ఎన్నికల ముందు చంద్రబాబు ఏమన్నారు? జగన్ ఇచ్చే దానికన్నా మూడింతలు ఎక్కువ ఇస్తామని చంద్రబాబు అన్నారు. అప్పుడు చంద్రబాబు చెప్పిన మాటలు ఇవి. జగన్ అమ్మఒడి కింద ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా ఒక్కరికే రూ.15 వేలు ఇచ్చాడు. నేను అలా కాదు. ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అందరికీ రూ.15 వేల చొప్పున.. నీకు 15 వేలు, నీకు 15 వేలు ఇస్తా అన్నాడు. అంతటితో ఆగిపోలా. జగన్ చేయూత కింద 45 ఏళ్లు నిండిన ప్రతి అక్కచెల్లెమ్మను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ, వాళ్లకు బ్యాంకుల్లో అనుసంధానం చేసి, అమూల్, ఐటీసి, రిలయన్స్, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, హిందుస్తాన్ లీవర్ వంటి సంస్థలతో టైఅప్ చేయించి, ప్రతి మహిళను తాను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ, 45 ఏళ్లు నిండిన ప్రతి అక్క చెల్లెమ్మకు ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు ఇస్తే.. జగన్ ఏటా కేవలం రూ.18,750 మాత్రమే ఇస్తున్నాడు. నేను అధికారంలోకి వస్తే, 50 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.4 వేల చొప్పున ఏటా రూ.48 వేలు ఇస్తానన్నాడు. మరి ఎక్కడ రూ.18,750. ఎక్కడ రూ.48 వేలు. అంటే దాదాపు మూడు రెట్లు. ఇంకా అంతటితో ఆగలా. 18 ఏళ్లు నిండిన ఏ మహిళకైనా నెలకు రూ.1500 చొప్పున ఏటా రూ.18 వేలు ఇస్తామన్నారు. అలా నీకు రూ.18 వేలు, నీకు రూ.18 వేలు, నీకు రూ.18 వేలు అని ప్రచారం చేశారు. అది ఆడబిడ్డ నిధి అంట!. ఇంకా భుజాన కండువా వేసుకుని ఎవరైనా రైతు కనిపిస్తే ఏమన్నాడు?. జగన్ ఇచ్చేది ఏటా రూ.13,500 మాత్రమే కదా, నేను వస్తే రూ.26 వేల చొప్పున ఇస్తామన్నారు. మళ్లీ ఎవరైనా యువకుడు కనిపిస్తే ఏమన్నాడు? నీకు రూ.36 వేలు, నీకు రూ.36 వేలు అన్నాడు. అదే నిరుద్యోగ భృతి. అలా అప్పుడు జగన్ ఇచ్చేవాటికన్నా ఇంకా ఎక్కువ ఇస్తానని చెప్పాడు. బాండ్లు, సంతకాలతో పచ్చి మోసం ఇంటింటికి పార్టీ కార్యకర్తలను, ఎమ్మెల్యే క్యాండిడేట్లను పంపాడు. తన ఫోటో, సంతకంతో ఒక బాండ్ తయారు చేసి, ప్రతి ఇంటికి ఇవ్వడం. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారమ్మా? ఒకరా, ఇద్దరా, ముగ్గురా? నీకు రూ.36 వేలు, నీకు రూ.36 వేలు అని, మీ ఇంట్లో రైతులు ఉన్నారమ్మా? అయితే ఆయనకు రూ.26 వేలు. మీ ఇంట్లో చిన్నమ్మలు, పెద్దమ్మలు ఉన్నారమ్మా? వాళ్లకు ఏటా రూ.18 వేలు. మీ ఇంట్లో 50 ఏళ్లు నిండిన మీ అత్తమ్మ ఉందా? నీకు రూ.48 వేలు. సినిమా రిలీజ్ జూన్, 2024. అని బాండ్లు ప్రతి ఇంటికీ పంపారు. ఇంకా ప్రమాణం. ‘నేను పవన్ కళ్యాణ్. మేమిద్దరం ప్రమాణ పూర్తిగా ప్రమాణం చేస్తున్నాం’ అని చెప్పి, ఇద్దరూ బాండ్ల మీద సంతకాలు చేశారు. అవేవీ అమలు కాలేదు కాబట్టి, ఈరోజు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. ఎక్కడికక్కడ యథేచ్ఛగా దోపిడీ ఈరోజు రాష్ట్రంలో మట్టి మాఫియా, లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా. అధిక ధరలకు పీపీఏలు. ప్రభుత్వ ఆస్తులను పప్పు బెల్లాలకు ఇచ్చేయడం, కొత్త మెడికల్ కాలేజీల అమ్మకం. అమరావతిలో చూస్తే చదరపు కట్టడానికి ఏకంగా రూ.20 వేలు వ్యయం. అదే హైదరాబాద్, బెంగళూరులో ఫైవ్ స్టార్ సదుపాయాలతో రెసిడెన్షియల్ కాంప్లెక్స్, అపార్ట్మెంట్ కట్టినా చదరపు అడుగుకు రూ.4,500. ఇంకా మహా అయితే రూ.5 వేలు వ్యయం. మరి ఇక్కడ అమరావతిలో ఇసుక ఉచితం. ఇంకా పలు రాయితీలు. అయినా చదరపు అడుగుకు రూ.20 వేలు ఖర్చు అంటున్నారు. లూటీ ఏ స్థాయిలో జరుగుతోందో ఇవన్నీ ఉదాహరణలు. ఇప్పుడు పీపీపీ పేరుతో దోచేయడం. ఆస్పత్రి సేవలు, తాగునీరు, ఆర్టీసీ, చివరకు చెత్త ఎత్తడం కూడా అంతా పీపీపీ. అంటే ఇక మీదట మొత్తం ప్రైవేట్ వాళ్ళకే. అంటే లంచాలు తీసుకోవడం. అన్నీ అమ్మేయడం. చంద్రబాబు పాలనలో సంపద సృష్టి అంటే అర్ధం ప్రభుత్వ ఆస్తులన్నీ శనక్కాయలు, పప్పుబెల్లాలకి అమ్మేయడం. విద్యార్థులకూ వెన్నుపోటు రాష్ట్రంలో పిల్లలు కూడా సంతోషంగా లేరు. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన లేవు. మామూలుగా వసతి దీవెన ప్రతి ఏప్రిల్ లో ఇస్తారు. ఏప్రిల్ 2024, ఏప్రిల్ 2025, ఏప్రిల్ 2026. ఏటా రూ.1100 కోట్లు. మన హయాంలో క్రమం తప్పకుండా ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు మూడు సంవత్సరాలు అయిపోయింది. దీంతో రూ.3,300 కోట్లు బాకీ. విద్యాదీవెన 2024 జనవరి–మార్రి త్రైమాసికం నుంచి ఇవ్వలేదు. వచ్చే ఏడాది విద్యా సంవత్సరం వరకు చూసుకుంటే మొత్తం 13 త్రైమాసికాలు పెండింగ్. ప్రతి క్వార్టర్కు రూ.700 కోట్లు. అంటే మొత్తం రూ.9,100 కోట్లు బాకీ. అది వసతి దీవెన బాకీ రూ.3,300 కోట్లు కలిపితే మొత్తం రూ.12,400 కోట్లు. కానీ, ఈయన ఇచ్చింది ఎంత అంటే ఒకసారి రూ.1700 కోట్లు. మరోసారి రూ.1100 కోట్లు. అంటే ఇంకా రూ.9 వేల కోట్లకు పైగా బాకీ పడ్డారు. ఫీజు చెల్లించలేక పిల్లలు చదువులు మానేసే దుస్థితి. ఇక గవర్నమెంట్ స్కూళ్లలో చదివే పిల్లలు ఏకంగా 6 లక్షలు తగ్గారు. అక్కచెల్లెమ్మలకూ వంచన అక్కచెల్లెమ్మలకు చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు లేదు. సూపర్ సిక్స్లు, సూపర్ సెవెన్ల సంగతి దేవుడెరుగు. ఇచ్చే సున్నా వడ్డీ పథకాన్ని సైతం రద్దు చేశాడు. పొదుపు సంఘాలకు బ్యాంకుల్లో ఇచ్చే రుణాలు చంద్రబాబు హయాంలో రూ.20 వేల కోట్లు ఉంటే, మన హయాంలో వాటి పరపతి పెంచడంతో, ఆ రుణ పరిమితి రూ.49 వేల కోట్లకు చేరింది. ఇంకా ఆ అక్కచెల్లెమ్మలకు మనం చేయూత ఇచ్చాం. ఆసరా ఇచ్చాం. సున్నా వడ్డీ రుణాలు ఇచ్చాం. రకరకాల పద్ధతుల్లో చేయి పట్టుకుని నడిపించుకుంటూ పోతే బ్యాంకులకు భరోసా కలిగింది. దీంతో రుణ పరిమితి రూ.20 వేల కోట్ల నుంచి రూ.49 వేల కోట్లకు చేరింది. అలా మన హయాంలో పెరుగుదల ఉంటే, ఇప్పుడు రూ.49 వేల కోట్ల నుంచి ఈ రోజు రూ.39 వేల కోట్లకు పడిపోయింది. సంక్షోభంలో వ్యవసాయం.. రైతుల గురించి కనీసం పట్టించుకునే నాథుడు లేడు. ఈరోజు రాష్ట్రంలో కరువు పరిస్థితి. 53 శాతం వర్షం లోటు కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర, సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ.. ఎక్కడ చూసినా అదే పరిస్థితి. ఏ రైతుకూ గిట్టుబాటు ధర రాని పరిస్థితి. లోటు వర్షపాతం నమోదవుతున్నా, ఎక్కడా వరికి బదులు ప్రత్యామ్నాయ విత్తనాలు ఇవ్వలేదు. ఉచిత పంటల బీమా ఈయనే దగ్గరుండి కత్తిరించాడు. ఇన్పుట్ సబ్సిడీ తీసేశారు. ఆర్బికేలను నిర్వీర్యం చేశారు. రైతులకు సున్నా వడ్డీ పథకం సున్నా. చివరికి ఏ స్థాయిలో వీళ్ళకు ప్లానింగ్ లేకుండా ఉన్నారంటే, శ్రీశైలంలో పూర్తిస్థాయి నీటి మట్టం 878 అడుగుల పైన ఉంటేనే పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీళ్లు ఇవ్వగలుగుతాం. ఫుల్ డ్రా అంటే 44 వేల క్యూసెక్స్. పక్కన తెలంగాణ పవర్ హౌస్ నుంచి పవర్ జనరేషన్ కోసం రిజర్వాయర్లో 800 అడుగుల నుంచే పంప్ చేస్తున్నారు. శ్రీశైలం నుంచి కల్వకుర్తి.. జూరాల నుంచి భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్ ఎత్తిపోతల ద్వారా తెలంగాణ సర్కార్ నీటిని తరలిస్తుంటే.. చంద్రబాబు ప్రభుత్వం రాయలసీమకు మాత్రం నీళ్లు ఇవ్వడం లేదు. కేసీ కెనాల్, తెలుగు గంగ ఆయకట్టు మొత్తం పంటలంతా నష్టపోతున్నారు. రైతులందరూ 40 శాతం పెట్టుబడి పెట్టి నారుమళ్ళు వేసి ఫెర్టిలైజర్స్ చల్లారు. ఒకవైపు ఉచిత పంటల బీమా లేదు.. మరోవైపు నీళ్లు ఇవ్వలేను అంటాడు.రెండేళ్లలోనే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత..ఎన్నికలు జరిగి చూస్తుండగానే మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టాం. కళ్ళు మూసుకొని, తెరిచే సరికి ఇంకో సంవత్సరం దాటితే, ఆ తర్వాత నా పాదయాత్ర మొదలవుతుంది. కళ్ళు మూసుకొని, తిరిగి తెరిచేసరికి ఈ రెండేళ్లు ఇట్టే ముగిసిపోతాయి. చూస్తుండగానే, మూడో ఏడాది కూడా వేగంగా గడిచిపోతుంది. ఇప్పటికే ప్రతి ఇంట్లో చర్చ మొదలైంది. మామూలుగా ఏ పార్టీకైనా, ప్రభుత్వానికైనా మూడో ఏడాదిలో వ్యతిరేకత అనేది కనిపిస్తుంది. కానీ చంద్రబాబు పాలనలో అది ఇప్పటికే కనిపిస్తోంది. ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత. దీనిపై ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. దీనినిబట్టి చూస్తే ఎన్నికలు ఎప్పుడు జరిగినా మన గెలుపు తథ్యం.చంద్రబాబు పాలనకు–మన పాలనకు తేడా ఏమిటంటే...ఎన్నికల మేనిఫెస్టో 99 శాతం పూర్తి చేసిన ఏకైక పార్టీ.. ఈ రాష్ట్రంలో.. బహుశా దేశంలో ఏదైనా ఉంది అంటే, అది వైఎస్సార్సీపీ అని సగర్వంగా చెప్పగలం. చిరునవ్వుతో ప్రతి ఇంటికి వెళ్లి, మా పాలనలో ఇలా జరిగింది అని గొప్పగా కూడా చెప్పుకోగలం. మన పాలన, చంద్రబాబు పాలన మధ్య తేడా ప్రతి ఇంట్లో కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ చూడని విధంగా, ఆ రోజుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే ఏ నెలలో ఏ పథకం వస్తుందో చెప్పేవాళ్లం. ఆ తర్వాత క్రమం తప్పకుండా అమలు చేసే వాళ్లం. అలా పక్కాగా బటన్ నొక్కిన పరిపాలన ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది. నిజంగా ఇది ఒక చరిత్ర. ఏకంగా రూ.2.73 లక్షల కోట్ల డీబీటీ.. అంటే నేరుగా బటన్ నొక్కడం, నేరుగా నగదు నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాలు, ఇళ్లలోకి వెళ్లిన పరిస్థితి. అలాంటిది చరిత్ర ఎప్పుడూ చూడలేదు. ఎక్కడా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా, నేరుగా ఇంటి దగ్గరికే పాలన వచ్చి, పథకాలు ఇచ్చిన చరిత్ర ఎప్పుడూ చూడలేదు. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, సుపరిపాలన, లా అండ్ ఆర్డర్లో దిశ వంటి కార్యక్రమం, ప్రతి గ్రామంలో ఒక మహిళా కానిస్టేబుల్ సచివాలయంలో ఉండడం. ఇవన్నీ చరిత్ర చూడని విషయాలు. స్కూళ్లు మన కళ్ళ ఎదుటే బాగుపడడం, ఆ స్కూళ్లలో నాడు–నేడు కార్యక్రమాలు జరగడం, గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం, మూడవ తరగతి నుంచే టోఫెల్ పీరియడ్, పిల్లలకు ఇంగ్లీష్లో శిక్షణ, 6వ తరగతి నుంచి క్లాస్ రూమ్స్ అన్నీ డిజిటలైజ్ కావడం, ఒక వైపు తెలుగు, మరో వైపు ఇంగ్లిష్ మీడియంతో బైలింగువల్ టెక్ట్స్ బుక్స్, రోజుకో మెనూతో బడి పిల్లలకు పౌష్టికాహారం ఇస్తూ అమలు చేసిన గోరుముద్ద.. ఆ స్థాయిలో సమీక్ష చేసిన సీఎంను బహుశా చరిత్రలో ఎప్పుడూ చూసి ఉండరు. 8వ తరగతికి వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబులు, చరిత్రలో ఎప్పుడూ ఎవరూ చూసి ఉండరు.రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, నేతలువిద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు విద్యా రంగంలో విప్లవాత్మక దిశగా మార్పులు వేస్తూ, ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్సీ మాత్రమే కాదు.. ఏకంగా ఐబి సిలబస్. ఐబి వాళ్ళని తీసుకొచ్చి, మన రాష్ట్ర ప్రభుత్వంతో పని చేయిస్తూ, 2020 నుంచి ప్రతి విద్యా సంవత్సరంలో ఒక క్లాస్ యాడ్ చేసేట్టుగా, 2025 మొదటి క్లాసు, 2026 సెకండ్ క్లాసు, 2027 థర్డ్ క్లాసు, ఇలా పెంచుకుంటూ, 2035 నాటికి ఐబి సిలబస్. అలా ఏకంగా మన రాష్ట్ర పిల్లలు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ 2035 లో రాసేట్టుగా అడుగులు పడిన పరిస్థితి అంతకు ముందు ఎప్పుడైనా జరిగింది అని అంటే, అది ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే. మనం రాక మునుపు ఆరోగ్యశ్రీలో 1000 ప్రొసీజర్లు కూడా సరిగ్గా లేవు. మనం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పరిధిని 3300 ప్రొసీజర్లకు తీసుకెళ్లాం. ఇంకా పథకంలో రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించాం. మనం వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీల నిర్మాణం మొదలుపెట్టాం. నాడు–నేడు కార్యక్రమంతో గవర్నమెంట్ స్కూళ్లు, ఆస్పత్రుల రూపురేఖలు మారిన పరిస్థితులు కూడా మన హయాంలోనే. మొదటిసారిగా గ్రామాల్లో విలేజ్ క్లినిక్ అన్నది దర్శనం ఇచ్చింది కూడా మనం వచ్చిన తర్వాతనే. మనం వచ్చిన తర్వాతే తొలిసారిగా ప్రతి మండలంలో రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ). ప్రతి పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లు. ఒక 104 అంబులెన్స్ సర్వీస్. పీహెచ్సీలో ప్రతి డాక్టర్కు ఆ మండలంలో నాలుగైదు గ్రామాలు కేటాయించి, ఒక డాక్టర్ పీహెచ్సీలో ఉంటే, మరో డాక్టర్ 104 సర్వీస్లో తనకు కేటాయించిన గ్రామాల్లో వైద్య సేవలందించేలా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ క్రియేట్ చేశాం. వైద్య సేవల కోసం తనకు కేటాయించిన గ్రామాలకు వెళ్లే డాక్టర్, అక్కడి విలేజ్ క్లినిక్ను ఉపయోగించేలా ఒక వ్యవస్థ ఏర్పాటు చేసి, అలా డాక్టర్లను గ్రామాలకు పంపించిన చరిత్ర ఎప్పుడైనా జరిగింది అంటే, అది ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే. సాధారణంగా గవర్నమెంట్ ఆస్పత్రుల్లో మందులు దొరకని పరిస్థితి నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) జీఎంపీ ప్రమాణాలతో కూడిన మందులు మాత్రమే దొరికేట్లుగా చేసి పరిస్థితి కూడా ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే జరిగింది. ఫ్యామిలీ డాక్టర్ కానీ, విలేజ్ క్లినిక్స్ కానీ, ఆరోగ్య సురక్ష కానీ, ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించడం కానీ.. ఇవన్నీ చరిత్రలో ఎప్పుడూ జరగని విషయాలు. గ్రామ స్వరాజ్యానికి పెద్దపీట తొలిసారిగా గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు. ఆ ఆర్బీకే పరిధిలోని గ్రామంలో ప్రతి ఎకరా ఈ–క్రాప్. ఆర్బీకేలోనే ఒక అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్. తాను అగ్రికల్చరల్ అసిస్టెంట్గా రైతు చేయి పట్టుకుని నడిపించడం. ఆ గ్రామంలో వేసిన ప్రతి పంటకు ఆర్బీకేలో బోర్డు పెట్టి పంటలకు గిట్టుబాటు ధరలు ప్రదర్శించడం. ఎక్కడైనా గిట్టుబాటు ధర రాకపోతే, ఆ గ్రామంలో వెంటనే ఆర్బికే అసిస్టెంట్, సీఎం–యాప్ ద్వారా అంటే..‘కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్’. ఆ సీఎం యాప్ను యాక్టివేట్ చేస్తే జాయింట్ కలెక్టర్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ మార్క్ ఫెడ్, వెంటనే జోక్యం చేసుకునే వారు. జాయింట్ కలెక్టర్ ఆ హోదాలో ఆ ఆర్బికే పరిధిలో ఏ రైతుకైతే గిట్టుబాటు ధర రావడం లేదో, ఏ పంటకైతే గిట్టుబాటు ధర రావడం లేదో, వెంటనే జాయింట్ కలెక్టర్ అక్కడ ఇన్వాల్వ్ అయ్యి, ఆ గ్రామంలో ఆ పంట కొనుగోలు చేసి, మార్కెట్లో పోటీతనం పెంచేవాడు. ఏకంగా మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కింద మన ఐదేళ్లలో రూ.7,800 కోట్లు ఖర్చు చేసి, ప్రతి రైతు ముఖాన చిరునవ్వు కనిపించే విధంగా గిట్టుబాటు ధరలు కల్పించిన ప్రభుత్వం మన ప్రభుత్వం. ఎప్పుడూ చూడని మార్పులు ఇవన్నీ. గ్రామంలోనే మన ముందే సచివాలయం. మన గ్రామంలోనే 10 మంది పిల్లలు అక్కడే పని చేస్తూ, చిక్కటి చిరునవ్వుతో సేవలు. మన గ్రామంలోనే 60 ఇళ్లకు ఒక వాలంటీర్, మన గ్రామంలో ఇంటికే నేరుగా వెళ్లి సహాయం అందించే పరిస్థితులు. ఇవన్నీ ఎప్పుడూ చరిత్రలో చూడలేదు. లంచాలు లేకుండా ప్రభుత్వ సాయం, ఎప్పుడైనా జరిగిందంటే, అది ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే.పోలీస్ వ్యవస్థ గాడి తప్పింది⇒ రాష్ట్రం నివ్వెరపోయే ఘటన. మొన్న అద్దంకిలో జరిగింది. ఓ కారు ఆటోను ఢీ కొట్టింది. చూస్తే, కారులో ఇద్దరు ఎస్ఐలు సివిల్ డ్రెస్లో ఫుల్ మత్తులో ఉన్నారు. అప్పుడందరూ చుట్టుముట్టి కారు డిక్కీ ఓపెన్ చేస్తే, గంజాయి, మద్యం, పెద్ద ఎత్తున డబ్బులు, పోలీస్ యూనిఫార్మ్ కనిపించాయి. యాక్సిడెంట్ విషయం తెలిసిన ఒక సీఐ అక్కడికి వచ్చాడు. అక్కడ స్థానికులు ఆ యాక్సిడెంట్ను వీడియో తీస్తుంటే, కేసు పెడతామని బెదిరించారు. ఆ తర్వాత ఆ ఎస్ఐలను ఘటనా స్థలి నుంచి తప్పించింది ఎవరు? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు. వాళ్ళ కారు. అయినా ఇంతవరకు కేసు లేదు. ప్రజలు కూడా మర్చిపోయేలా కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ⇒ పోలీస్ వ్యవస్థ ఈరోజు ఏ స్థాయిలో గాడి తప్పిందో చెప్పడానికి మీ రాజమండ్రిలోనే జరిగిన ఘటన. చిన్న ఉదాహరణ చెబుతా. డాక్టర్ ప్రియాంక. పీజీ మెడికల్ స్టూడెంట్. మన కళ్ల ముందే కనిపిస్తోంది. సోషల్ మీడియాలో వీడియోస్ వైరల్ అయ్యాయి. ఆ వీడియోలు చూస్తే నిజంగా బాధ అనిపించింది. తాగిన మైకంలో మత్తులో అది మరి గంజాయా లేకపోతే మద్యమా ఏమో గాని ఆ మత్తులో కారుతో గుద్దడం, ఒకసారి కూడా కాదు, గుద్దిన తర్వాత మళ్ళీ మళ్ళీ గుద్దుకుంటూ వెళ్ళిపోవడం. అటువంటి వాళ్ళ మీద చంద్రబాబునాయుడు గవర్నమెంట్లో ఏం కేసు పెట్టారు? కనీసం సరైన సెక్షన్లలో కేసులు కూడా పెట్టలేదు. చివరికి ఆ పాప నాన్న బాధతో మాట్లాడితే, వైఎస్సార్సీపీ ఆ కుటుంబానికి అండగా నిలబడితే, ప్రజలు వైఎస్సార్సీపీకి సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా ఏకమై నిరసనకు దిగితే కూడా చంద్రబాబు మనసు కరగని పరిస్థితి. ⇒ మరోవైపున చూస్తే, దొంగ కేసులు ఏ స్థాయిలో ఉన్నాయి? డాక్టర్ అప్పలరాజు కేసు. పాపం అప్పలరాజు కొడుకు బైక్ యాక్సిడెంట్. కారు కాదు. తాగింది లేదు, తాగుడు అలవాటు కూడా లేదు. 18 ఏళ్ల పిల్లోడు. పాపం బైక్ యాక్సిడెంట్ పొరపాటున జరిగింది. వెంటనే ఆ పిల్లోడు 108 కి ఫోన్ చేశాడు. ప్రమాదంలో గాయపడిన ఆ గొర్రెలకాపరికి సీపీఆర్ కూడా చేశాడు. అలా ఆ ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేశాడు. స్వయంగా 108 అంబులెన్స్కి ఫోన్ చేశాడు. అప్పలరాజు కూడా పోలీసులకు స్వయంగా సమాచారం ఇచ్చారు. కానీ, అదే అప్పలరాజు మీద పెట్టిన కేసు ఏమిటి? ఏకంగా మర్డర్ కేసు పెట్టారు. ఇక్కడేమో రాజమండ్రిలో మత్తులో కారుతో రెండు మూడు సార్లు గుద్ది, ఆపకుండా వెళ్ళిపోతే, చిన్న చిన్న సెక్షన్లతో కేసు. ⇒ మొన్న తాడిపత్రిలో గోవా నుంచి లిక్కర్ రవాణా. ఏదో కొన్ని కార్టన్లు కాదు. లారీలకు లారీల లోడ్. అంతకు ముందు తంబళ్లపల్లె నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి, ములకలచెరువులో ఏకంగా లిక్కర్ మాన్యుఫ్యాక్చరింగ్ కుటీర పరిశ్రమ పెట్టి, వాళ్ల బెల్ట్ షాపులకు పంపిణీ చేసి అమ్మించారు. ప్రతి ఐదు బాటిళ్లలో ఒక బాటిల్ కల్తీ బాటిల్. లిక్కర్ షాప్ పక్కనే పర్మిట్ రూమ్.ఆ పర్మిట్ రూమ్ల్లో లూజ్గా మందు అమ్మకాలు. ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరకు అమ్మకం. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి.ఎవరైనా చంద్రబాబుని ఎన్నికల హామీలపై ప్రశ్నించినా, ఎన్నికల సమయంలో ఇచ్చిన బాండ్లు చూపించి అడిగినా రెడ్ బుక్ రాజ్యాంగం ప్రయోగిస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు. ప్రశ్నించే గొంతు మీద కేసులు. అక్రమ కేసులు, అరెస్టులు, రొటీన్గా సాగుతున్నాయని, అవి ఏ స్థాయికి చేరాయంటే, రాష్ట్రంలో శాంతి భద్రతల వ్యవస్థ గాడి తప్పిందని ఆయన పేర్కొన్నారు. ఎప్పుడైతే పోలీసులను ఈ మాదిరిగా ఉపయోగించుకోవడం మొదలుపెడతారో, అప్పుడు ఆటోమేటిక్గా ఆ వ్యవస్థ గాడి తప్పుతుందని జగన్ అన్నారు. స్థానిక సమరానికి సై!స్థానిక సంస్థ ఎన్నికల పోరుకు పార్టీ శ్రేణులంతా సిద్ధం కావాలని.. గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఈ రెండేళ్లలో ఈ ప్రభుత్వం ఏ ఒక్క వర్గానికీ మేలు చేయలేదని ఎత్తిచూపారు. అందుకే త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో ఆ వ్యతిరేకత కనబడకుండా కుట్రలు చేసే వీలుందని.. అందుకు పోలీసు బలగాలనూ వినియోగించవచ్చని చెప్పారు. వైఎస్సార్సీపీకి అత్యంత ప్రజాదరణ ఉందని.. వచ్చే ఎన్నికల్లో వారే తమకు అండగా ఉంటారని, తోడుగా నిలుస్తారని అన్నారు. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం కుట్రలను ఎదుర్కొని స్థానిక ఎన్నికల్లో పోరాడాలని.. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు తథ్యమని పార్టీ శ్రేణులకు ఉద్బోధించారు. ‘‘చంద్రబాబు ఒక విలన్. స్థానిక ఎన్నికలు సరిగ్గా జరగనీయడు. పోలీసులను పెడతాడు. దౌర్జన్యం చేస్తాడు. బెదిరిస్తాడు. ప్రలోభాలు పెడతాడు. ఎన్నికలలో దుర్మార్గంగా గెలిచే ప్రయత్నం చేస్తాడు. కానీ, అందరూ గుర్తు పెట్టుకోండి. మనకు ప్రజలు సపోర్ట్గా ఉన్నారు. ఎన్నికల్లో చురుగ్గా పాల్గొనండి. అన్ని రకాలుగా మీకు పార్టీ సపోర్ట్ ఉంటుంది. మీ జగనన్న సపోర్ట్గా ఉంటాడు.’’ అని జగన్ పేర్కొన్నారు. ‘వాళ్ళు ఏ రకంగా మేనేజ్ చేసినా, ఏ రకంగా ఒత్తిడి తీసుకొచ్చినా, ఏ రకంగా పోలీసులను పెట్టుకొని ఏం చేసినా కూడా యుద్ధం మాత్రం జరగాలి.’ అని అన్నారు. ఒకవేళ పోలీసులను దురి్వనియోగం చేసి, ఆ చిన్న చిన్న స్థానాల్లో సైతం గెలవడం కోసం వాళ్ళు దుర్మార్గాలు చేస్తే మాత్రం రేపు పొద్దున జరగబోయే ఎన్నికల్లో చంద్రబాబుగారి పునాదులు కూడా కదిలే విధంగా కసి పెరుగుతుంది అనేది మాత్రం గుర్తు పెట్టుకోవాలని ఆయన అన్నారు. ‘అందుకే కచ్చితంగా గట్టిగా పోటీ ఎదుర్కొందాం. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఇంకొక సంవత్సరంలో జగనన్న పాదయాత్ర స్టార్ట్ అవుతుంది. ఇంకొక సంవత్సరంలో ఎన్నికలు జరుగుతాయి. ఆ విధంగా మనకు మనం ట్యూన్ చేసుకుందాం. గట్టిగా యుద్ధం చేద్దాం. గెలుపు మనదే. చివరగా, వేణుఅన్న మీ అందరికీ పరిచయస్తుడే. మంచి లీడరు. అందుకే ఆయన్ను గెలిపించే బాధ్యత మీ భుజస్కంధాలపై పెడుతున్నాను’ అని జగన్ పేర్కొన్నారు. -
నేను ఆ మహిళ SI ని... దరిద్రమైన కేసు నా మీద పెట్టారు.. రవి సంచలన నిజాలు
-
నేడు వైఎస్ జగన్ ప్రెస్మీట్
సాక్షి, అమరావతి: మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ గురువారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఆయన మీడియాతో మాట్లాడుతారు. -
వైఎస్ జగన్ను కలిసిన ఈదుమూడి గ్రామ యాదవులు
సాక్షి, తాడేపల్లి: ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఈదుమూడి గ్రామానికి చెందిన యాదవులు బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి తమకు జరిగిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు. తమపై జరిగిన దాడి, అనంతరం తమపైనే నమోదైన కౌంటర్ కేసు, పోలీసుల వ్యవహారశైలితో ఎదురవుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.మేకలు మేపుకుంటున్న తమపై టీడీపీ నేతలు దాడి చేశారనీ.. తిరిగి తమమీదే కేసులు పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు, పోలీసుల వైఖరిపై వైఎస్ జగన్కు బీసీలు ఫిర్యాదు చేశారు. బాధితులకు అండగా ఉంటామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. -
వచ్చే ఎన్నికల్లో బాబు కూసాలు కదలడం గ్యారంటీ
-
కుమార్తె పొలిటికల్ ఎంట్రీపై బొత్స కీలక ప్రకటన
సాక్షి, విజయవాడ: తన కుమార్తె రాజకీయ ప్రవేశంపై వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. స్థానిక ఎన్నికల్లో కుమార్తె అనూషను పోటీ చేస్తుందని బొత్స వెల్లడించారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయిస్తున్నట్టు ఆయన తెలిపారు. వారసురాలుగా కుమార్తెను రాజకీయాల్లోకి తీసుకొస్తున్న బొత్స.. ఎన్నికలు ఏ పద్దతిలో జరిగిన పోటీ చేయిస్తానని వెల్లడించారు.కాగా, అంతకుముందు బొత్స సత్యనారాయణ మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. మూడో రోజు కూడా కూటమి పారిపోయే వైఖరి అవలంభించిందని.. బయట మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుందని మండిపడ్డారు. డీఎస్సీపై సీబీఐ ఎంక్వైరీ వేయాలన్న బొత్స.. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.‘‘రాష్ట్ర చరిత్రలో కొత్త సంప్రదాయానికి తెరతీశారు. డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సమయంలో పాలక పార్టీ బయటకి వెళ్ళిపోయింది. సభా సంప్రదాయం పాలక పక్షం అమలు చేయాలి. 5 కోట్ల మందికి బాధ్యత వహించాలని వెన్నుపోటూ పార్టీకి లేదు. ఒంటెద్దు పోకడతో ప్రవర్తిస్తుంది’’ అంటూ బొత్స మండిపడ్డారు. -
YS జగన్ పాదయాత్రపై బిగ్ అప్డేట్!
-
విజయం మనం కొట్టే దెబ్బ ఎలా ఉండాలంటే..
-
రాజమండ్రి రూరల్ నియోజకవర్గ నేతలతో వైఎస్ జగన్ సమావేశం
-
మార్గాని భరత్ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
నోరు అదుపులో పెట్టుకో దద్దమ్మ... దమ్ముంటే లోకేష్ తో రాజీనామా చేయించు..


