breaking news
YSRCP
-
బొత్స అంటే బ్రాండ్..! స్పీచ్ ఇరగదీసిన బొత్స అనూష
-
లోకల్ ఎన్నికల్లో ఒక్కొక్కడికి.. కొడాలి నాని మాస్ వార్నింగ్
-
అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు
సాక్షి,విజయవాడ: మాజీమంత్రి అంబటి రాంబాబుపై కూటమి ప్రభుత్వ కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆయనపై మరో కేసు మోపేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నింది. తాజాగా ఆయనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు.ఈనెల 11వ తేదీనే విచారణకు హాజరు కావాలంటూ అంబటి రాంబాబుకు నోటీసులు జారీ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. అయితే, అంబటి రాంబాబు మాత్రం ఈడీ నుంచి తనకు ఎలాంటి నోటీసులు రాలేదని తెలిపారు. తాము ఫోన్ ద్వారా ఆయనకు సమాచారం అందించామని, ఈ వ్యవహారంలో అంబటి రాంబాబు నేరుగా తమ కార్యాలయానికి వచ్చి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని అన్నారు. ఈడీ విచారణకు సంబంధించి తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. -
‘చంద్రబాబు ఆ ఆలోచన నుంచి బయటకు రావాలి’
సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర రైతులకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారని.. కృష్ణా, గోదావరి నీటి నిర్వహణను లోపభూయిష్టంగా మార్చారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత సాకే శైలజానాథ్ మండిపడ్డారు. ఆ ఫలితంగా రాష్ట్ర మంతటా రైతులకు అన్యాయం జరిగిందని.. వ్యవసాయం దండుగ అనే ఆలోచనలో నుండి చంద్రబాబు బయట పడాలన్నారు. ఇంకా అదే ఆలోచనలో ఉన్నందునే రైతుల కష్టాలను పట్టించుకోవటం లేదని దుయ్యబట్టారు.‘‘శ్రీశైలం ప్రాజెక్టు కింద సాగయ్యే పంట భూములన్నీ బీడులుగా మారాయి. రాయలసీమలో చంద్రబాబు పర్యటిస్తే రైతుల కష్టాలు, కన్నీళ్ళు కనపడతాయి. ఇది ఎల్నినో కాదు.. ముమ్మాటికీ ఎల్లోనినోనే. తీవ్ర కరువు ఏర్పడినా ఎల్లో మీడియా చంద్రబాబుకు భజన చేస్తోంది. శ్రీశైలానికి భారీగా వరద అనీ, జలకళతో రాయలసీమ రిజర్వాయర్లు అంటూ వార్తలు రాశారు. అంత జలకళ ఉంటే.. మరి గ్రేటర్ రాయలసీమకు నీళ్లు ఎందుకు ఇవ్వటం లేదు?..కనీసం ఆరుతడి పంటలకు కూడా ఎందుకు నీరివ్వటం లేదు?. శ్రీశైలంలో పూర్తిస్థాయి నీటిమట్టం నీరు ఉన్నా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఎందుకు నీరు ఇవ్వటం లేదు?. రాయలసీమ ప్రజలు ఏం ద్రోహం చేశారని ఇంత కక్ష చంద్రబాబూ?. శ్రీశైలంలో 840 అడుగులకు చేరితే ఇక పోతిరెడ్డిపాడు ద్వారా నీరు ఇవ్వలేరు. అనాలోచిత నీటి నిర్వహణ కారణంగానే నీటి ఎద్దడి. నెల్లూరు బ్యారేజి కింద వేలాది ఎకరాల వరి పైరు ఎండిపోతోంది. శ్రీశైలం కింద సాగు చేసే రైతులు పూర్తిగా నష్టపోయారు..వెలిగొండ, పోలవరం వద్ద చంద్రబాబు సాష్టాంగ నమస్కారం చేశారు. అయినా పంట పొలాలకు సాగు నీరు ఇవ్వలేదు. పోలవరం ప్రాజెక్టును సైతం చివరికి రిజర్వాయర్ నుండి బ్యారేజిగా మార్చేశారు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారు. రాయలసీమ ప్రాంత ప్రజాప్రతినిధులు స్పందించాలి. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నీటి విడుదల చేయించాలి. ఎండిపోతున్న చీనా చెట్లు, అరటి తోటలు, వరిపైరు, శనగ తోటలు కనపడటం లేదా?. రోడ్డున పడుతున్న రైతుల కష్టాలు కనపడటం లేదా?. కర్ణాటక, తెలంగాణాలో సాగు నీరు ఇస్తుండగా లేనిది ఏపీలో ఎందుకు ఇవ్వరు?. చంద్రబాబు రాయలసీమలోని పొలాలు చూస్తే రైతుల కష్టాలు కనపడతాయి?. వ్యవసాయం దండగ అనే ఆలోచనలో నుండి చంద్రబాబు బయటకు రావాలి’’ అని శైలజానాథ్ హితవు పలికారు.ఇదీ చదవండి: ఏపీ సరిహద్దులు దాటిన రెడ్ బుక్ అరాచకం -
TV5, ABN రిపోర్టర్లు వచ్చారా..? నేను చెప్పింది చెప్పినట్లు వేయండి..
-
‘ఎన్ని ఇబ్బందులు పెట్టినా భయపడను’
సాక్షి, గుంటూరు: రాబోయే ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. గుంటూరులో ఈ నెల 20 తేదీన గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించనున్న సమావేశానికి ఏర్పాట్లను నియోజకవర్గ సమన్వయకర్తలు షేక్ నూరి ఫాతిమా, వనమా బాల వజ్రబాబు, మాజీ కార్పొరేటర్లు పరిశీలించారు.ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ.. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో కొత్తగా 76 వార్డులు ఉన్నాయి. రేపు సమష్టిగా పార్టీ శ్రేణులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఐక్యంగా రాబోయే ఎన్నికలకు వెళ్తున్నాం. ఈ రెండేళ్లలో చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. వైఎస్ జగన్ సంక్షేమ కార్యక్రమాలతో ఈ కూటమి సర్కార్ పోటీ పడలేకపోతోంది. రాబోయే ఎన్నికల్లో అధికార దుర్వినియోగం చేస్తే చూస్తూ ఊరుకోం. పోలీసులతో కట్టడి చేసే ప్రయత్నం చేస్తే సహించం’’ అంటూ అంబటి రాంబాబు తేల్చి చెప్పారు.దొంగ ఓట్లు ఉండటానికి వీల్లేదు. రాబోయే ఎన్నికల్లో ఒకరు ఒక ఓటు మాత్రమే వేయాలి. రెండో ఓటు వేయకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ పెడితే వేధించడమే పనిగా పెట్టుకున్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టిన నేను భయపడను. చెప్పాలి అనుకున్నది మేము ధైర్యంగా చెప్తాము. తండ్రి కొడుకులు వ్యవస్థలను నాశనం చేస్తున్నారు’’ అని అంబటి రాంబాబు దుయ్యబట్టారు.ఇదీ చదవండి: సీఎం రేవంత్కు కేటీఆర్ ఆఫర్ -
కూన రవికుమార్ DSC దందాను ఆధారాలతో బయటపెట్టిన చింతాడ
-
బాలకృష్ణగారికి ఇదే నా రిక్వెస్ట్... లోకేష్ కి ఆస్కార్ అవార్డు ఇప్పించండి ప్లీజ్
-
‘కరువు’ ముందే తెలిసినా కళ్లు మూసుకున్నారు
రాష్ట్రంలో ఎల్నినో తీవ్ర ప్రభావం చూపనుందని ఈ ఏడాది ఫిబ్రవరి 4న సీఎం చంద్రబాబే స్వయంగా చెప్పారు. ఆ విషయం చెప్పిన ఈ పెద్దమనిషి ఆ తర్వాత ఏం చేశాడు? అన్నది గమనిస్తే కనిపించేది పెద్ద సున్నా. ఈ మనిషి కార్యాచరణకు వచ్చేసరికి చేసింది ఏమీ లేదు. అంతా సున్నా.. సున్నా! అందుకనే ఇది ‘మ్యాన్ మేడ్ కరువు’!– వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్నది ‘ఎల్నినో’ ఎఫెక్ట్ కాదు.. ‘ఎల్లో నినో ఎఫెక్ట్’ అని.. ఇది ప్రకృతి వల్ల వచ్చిన కరువు మాత్రమే కాదని, సీఎం చంద్రబాబు నిర్వాకం వల్లే మరింత తీవ్రత పెరిగిందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎల్నినో ప్రభావంపై ఫిబ్రవరి 4నే వెల్లడించిన సీఎం చంద్రబాబు.. వచ్చే పరిస్థితిని ఎదుర్కోవడంలో మాత్రం ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదంటూ ఆక్షేపించారు. వర్షపాతం లోటు స్పష్టంగా కనిపిస్తున్నా డ్రామాలు ఆడారని ధ్వజమెత్తారు. స్విచ్లు నొక్కడం, లాకులు ఎత్తడం, ఫొటోలకు పోజులివ్వడం మాత్రమే చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వం మాటలు నమ్మి సాగులోకి దిగిన రైతులు ఇప్పుడు తీవ్ర కరువు పరిస్థితుల్లో నిండా మునిగారని, ప్రతి ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు పుణ్యాన రైతులకు అన్నీ కష్టాలేనని.. ఉచిత పంటల బీమా రక్షణ లేకుండా పోయిందని నిప్పులు చెరిగారు. శ్రీశైలం నుంచి రాయలసీమకు సకాలంలో నీళ్లు ఇవ్వలేదని.. విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వదిలేశారని.. పులిచింతల ఎగువ, దిగువన తెలంగాణ ఎడాపెడా లిఫ్ట్ల నిర్మాణం చేపట్టినా చంద్రబాబు నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్, జూలై, ఆగస్టులో వరుసగా మూడు నెలలు వర్షపాతం లోటు స్పష్టంగా కనిపిస్తున్నా ప్రభుత్వం స్పందించ లేదంటూ వైఎస్ జగన్ తప్పుబట్టారు. కరువు మండలాలు ఇంకా ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. కర్ణాటక చాలా ముందుగానే ఆ పని చేసిందని గుర్తు చేశారు. కరువు ముంచుకొస్తున్నా ప్రత్యామ్నాయ విత్తనాలు సిద్ధం చేయలేదని, పశుగ్రాసాన్ని జిల్లాలకు పంపలేదని, కనీసం ఉపాధి హామీ అదనపు పనిదినాలు కూడా కోరలేదంటూ దుయ్యబట్టారు. రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరువు, ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేని పరిస్థితిపై పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు, అన్ని జిల్లాల అధ్యక్షులు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని అక్కడి పరిస్థితిని వివరించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే..అన్ని జిల్లాలు... 628 మండలాల్లో ‘లోటు’రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులు గమనిస్తే ఖరీఫ్ ప్రారంభం నుంచి ఇవాళ్టి (సెప్టెంబర్ 16) వరకు దాదాపు 51 శాతం పైచిలుకు లోటు వర్షపాతం కనిపిస్తోంది. 28 జిల్లాలకు గాను 28 జిల్లాలూ ఈరోజు వర్షపాతం లోటులోనే ఉన్నాయి. 688 మండలాలకు గాను దాదాపు 628 మండలాలు వర్షాభావ పరిస్థితుల్లో ఉంటే, తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు సుమారు 332 మండలాల్లో కనిపిస్తున్నాయి. అంటే దాని అర్థం 51 శాతం పైచిలుకు వర్షపాతం లోటు ఉన్న పరిస్థితి. అన్నమయ్య జిల్లా–75%, సత్యసాయి జిల్లా–66%, ప్రకాశం జిల్లా–65%, చిత్తూరు జిల్లా–58.5%, వైఎస్సార్ కడప జిల్లా–57%, తూర్పు గోదావరి జిల్లా –57%, మార్కాపురం జిల్లా –56%, నంద్యాల జిల్లా–56%, విశాఖపట్నం జిల్లా–54%, అనంతపురం జిల్లా–51%, కర్నూలు జిల్లాలో 50% పైచిలుకు. ఇంత తీవ్రమైన లోటు వర్షపాతం రాష్ట్రం అంతటా కనిపిస్తోంది.ముందే తెలిసినా కార్యాచరణ సున్నాఅందుకే ఇది ‘మ్యాన్ మేడ్ కరువు..ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందుగా తెలియనిది కాదు. రాష్ట్రంలో ఎల్నినో తీవ్ర ప్రభావం చూపనుందని, ఈ ఏడాది ఫిబ్రవరి 4వ తారీఖున సీఎం చంద్రబాబే స్వయంగా చెప్పారు. ఆ విషయం చెప్పిన ఈ పెద్దమనిషి ఆ తర్వాత ఏం చేశాడు? అన్నది గమనిస్తే కనిపించేది పెద్ద సున్నా. ఈ మనిషి కార్యాచరణకు వచ్చేసరికి చేసింది ఏమీ లేదు. అంతా సున్నా.. సున్నా. అందుకనే ఇది ‘మ్యాన్ మేడ్ కరువు’. ముఖ్యమంత్రి అనే వ్యక్తి స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడం వల్ల జరిగిన నష్టం ఎంత తీవ్రంగా ఉంటుంది అన్నదానికి ఇది ఒక ఉదాహరణ. వీళ్ల మాటలు నమ్మి రైతులు నష్టపోతున్నారుమామూలుగా వర్షాకాలం జూన్ నుంచి సెప్టెంబర్ 15, 16 దాకా ఉంటుంది. అయితే ఈసారి ఎల్నినో ప్రభావం ఉంటుందని సీఎం చంద్రబాబు ఫిబ్రవరి 4వ తేదీనే ప్రకటించారు. ఇక జూన్లో–25% వర్షపాతం స్పష్టంగా కనిపించినా ఈ పెద్దమనిషి జూలై 11న ఏం చేశారు? ఆయన, ఆయన మంత్రి ఏం చేశారు? స్విచ్ నొక్కుతారు.. పూజ చేస్తారు.. ఫొటోలకు పోజులిచ్చి గేట్లు ఎత్తుతారు. నీళ్లు ఇస్తున్నాం.. సాగు చేసుకోండి అని చెబుతారు. వీళ్ల మాటలు నమ్మిన రైతులు అడుగు ముందుకేశారు. దీంతో ప్రతి ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఈరోజు నష్టపోతున్నారు. చంద్రబాబు పుణ్యాన రాష్ట్రంలో సాగు కూడా తగ్గింది. మామూలుగా ఖరీఫ్లో దాదాపు 76 లక్షల ఎకరాల్లో సాగవుతుంది. కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో 56.4 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు జరిగింది. అంటే దాదాపు 20 లక్షల ఎకరాల్లో విత్తనం కూడా పడలేదు. అంత దుర్భర స్థితిలో వ్యవసాయం ఉంది. ప్రివెంటివ్ సోయింగ్ అని చెప్పి వీరికి ఉచిత పంటల బీమా కనుక అందుబాటులో ఉంటే ఎకరాకు కనీసం రూ.15 వేలు చేతికి వచ్చేవి. అదే ఉచిత పంటల బీమా ఉండి ఉంటే...పోనీ.. సాగు జరిగిన ఆ 56.4 లక్షల ఎకరాల పరిస్థితి ఏమిటి? అని చూస్తే అక్కడ కూడా పంటలన్నీ తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితి. సాగు చేసిన ప్రతి రైతు పంటను బట్టి ఎకరాకు రూ.15 వేలకు పైగా నష్టపోయిన పరిస్థితి. అదే ఉచిత పంటల బీమా కనుక ఉండి ఉంటే ఈ రైతులకు అందరికీ కూడా, ఎకరా సాగు చేయని ప్రతి రైతుకు ఎకరాకు కనీసం రూ.15 వేలు ప్రివెంటివ్ సోయింగ్ కింద ఇన్సూరెన్స్ వచ్చేది. అదే రకంగా సాగు చేసిన ప్రతి ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు బీమా పరిహారం (ఇన్సూరెన్స్ క్లెయిమ్) అందేది. ఇది ‘ఎల్లో నినో ఎఫెక్ట్’..చంద్రబాబు పుణ్యాన ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా కంది, పత్తి, వేరుశనగ, మొక్కజొన్న, వరి మాత్రమే కాకుండా అన్ని చోట్ల పండ్ల తోటలు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకనే రాష్ట్రంలో ఎల్ నినో ఎఫెక్ట్ కాదు.. ఇది ఎల్లో నినో ఎఫెక్ట్. చంద్రబాబు పార్టీ ఎల్లో నినో ఎఫెక్ట్! ఈరోజు శ్రీశైలంలో నీళ్లు 862 అడుగులకు పడిపోయిన పరిస్థితి. ఆరోజు నేను మీడియాతో మాట్లాడినప్పుడు శ్రీశైలంలో దాదాపు 880 అడుగుల మేర 185 టీఎంసీల నీరు ఉంది. పోతిరెడ్డిపాడు నుంచి పూర్తి సామర్థ్యంతో 44 వేల క్యూసెక్కుల నీరు తీసుకోవడం శ్రీశైలంలో 880 అడుగుల నీరున్నప్పుడే సాధ్యం. అప్పుడు పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు ఇవ్వగలిగితేనే తెలుగు గంగ, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్, ఆయకట్టులో ఉన్న రిజర్వాయర్లు కానీ నింపగలుగుతాం. అదే శ్రీశైలంలో నీరు 854 అడుగులకు చేరితే పోతిరెడ్డిపాడు ద్వారా కేవలం 6 వేల క్యూసెక్కుల నీరు తీసుకోవడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. అంతకన్నా తగ్గితే నీరు తీసుకోవాలనుకున్నా సాధ్యం కాదు. ఇప్పుడు శ్రీశైలంలో 862 అడుగుల నీరుంది. అటు చూస్తే రాయలసీమలోని అన్ని రిజర్వాయర్లు డెడ్ స్టోరేజీకి కొంచెం అటు ఇటుగా ఉన్న పరిస్థితుల్లోకి వచ్చేశాయి. అయినా వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టడం లేదు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఎడాపెడా విద్యుత్ ఉత్పత్తి కోసం నీరు వాడేస్తోంది. తెలంగాణలో లిఫ్ట్ల నిర్మాణం..కళ్లు మూసుకున్న కూటమి ప్రభుత్వం..పులిచింతల సామర్థ్యం 45 టీఎంసీలు. అక్కడ ఎగువ, దిగువన రెండు చోట్ల తెలంగాణ ప్రభుత్వం లిఫ్ట్లు కడుతోంది. అలా దాదాపు 11 టీఎంసీల నీరు తీసుకునే ప్రయత్నం చేస్తోంది. దీనిపై గత ప్రెస్మీట్లో ఫోటోలు కూడా చూపించా. కళ్ల ముందే ఇంత దారుణం కనిపిస్తున్నా ఇక్కడ వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం కళ్లు మూసుకుంది. కనీసం నోరు కూడా మెదపడం లేదు. పోలవరం ఎత్తు తగ్గింపు రాష్ట్రానికి తీరని నష్టం..అంతకన్నా బాధాకరమైన విషయం ఏమిటంటే చంద్రబాబు పుణ్యమా అని పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో కడితే అందులో 194 టీఎంసీల నీరు నిల్వ చేయగలం. కానీ ఇప్పుడు దాన్ని 41.15 మీటర్లకు కుదించారు. దీనిపై చంద్రబాబు రాజీ పడ్డారు. పోలవరం ఎత్తు తగ్గించడానికి చంద్రబాబు ఆమోదం తెలపడం వల్ల అందులో నీటి నిల్వ సామర్థ్యం ఏకంగా 120 టీఎంసీలకు పడిపోయింది. అంటే దాదాపుగా 75 టీఎంసీల నీరు మనం కోల్పోతున్నాం. అంత నీరు నిల్వ చేసుకునే అవకాశం ఉన్నా దాన్ని వదిలేశారు. అలా కేంద్ర ప్రభుత్వం భరించాల్సిన రూ.60 వేల కోట్లలో దాదాపు రూ.30 వేల కోట్లు వదిలేసుకుంటున్నారు. గ్రావిటీ ద్వారా పోలవరం నుంచి నీళ్లు ఇవ్వగలిగిన పరిస్థితిని కూడా కావాలని వదిలేసుకుంటున్నారు.కరువు మండలాలు ఎందుకు ప్రకటించలేదు?జూన్లో–25%, జూలైలో–66%, ఆగస్టులో–55 శాతం వర్షపాతం లోటు అని తెలుసు. మరి వరుసగా ఇన్ని డెఫిసిట్లు కనిపిస్తున్నప్పుడు నువ్వు కరువు మండలాల కింద ఎందుకు డిక్లేర్ చేయలేకపోతున్నావు? నిజానికి కరువు మండలాల ప్రకటనకు సంబంధించిన మాన్యువల్ చాలా స్పష్టంగా ఉంది. అందులో ఒక పారాగ్రాఫ్ క్లియర్గా ఉంది. అదే కర్ణాటక ఆగస్టు 28వ తారీఖునే కరువు ప్రాంతాలు ప్రకటించింది. డ్రౌట్ మండలాల కింద డిక్లేర్ చేయడం వల్ల జరిగే ప్రధాన ప్రయోజనం ఏమిటో అందరికీ తెలిసిన విషయమే. మొట్టమొదటగా రుణాలన్నీ రీ షెడ్యూల్ అవుతాయి. క్రాప్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ వస్తాయి. మన దగ్గర చంద్రబాబు పుణ్యమా అని ఆ అవకాశం లేకుండా పోయింది. ఉచిత పంటల బీమా తీసేయడం వల్ల నష్టమే జరిగింది. ఇంకా ఎక్కడ ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో చంద్రబాబు కరువు మండలాలు ప్రకటించడం లేదు. ఈ విషయంలో పక్కన కర్ణాటక చూపించిన చొరవ ఆయన చూపించలేకపోతున్నారు. 56 లక్షల ఎకరాలకు లెక్క వేస్తే ఇన్పుట్ సబ్సిడీ కింద ఇచ్చే మొత్తం రూ.6 వేల కోట్లు అవుతుంది. ఆ మొత్తం ఇవ్వాల్సి వస్తుందనే భయమో లేక అది కూడా ఎందుకు ఇవ్వాలన్న ఆలోచనలో భాగంగా కరువు మండలాలు ప్రకటించడం లేదు.పార్టీ రిజినల్ కో–ఆర్డినేటర్లు, అన్ని జిల్లాల అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందస్తు చర్యలు నిల్..కరువు ముంచుకొస్తోందని ముందే తెలిసినా కంటింజెన్సీ ప్లాన్ లేదు. ప్రత్యామ్నాయ విత్తనాలు సరఫరా చేయలేదు. ఇప్పటికే ప్రత్యామ్నాయ విత్తనాలు, పశుగ్రాసం అన్ని జిల్లాలకు అంది ఉండాలి. వచ్చే ఏడాది మార్చి వరకు మరో 150 రోజులు అదనంగా ఉపాధి హామీ పనులు కల్పించేలా ప్రభుత్వం ఏమాత్రం డిమాండ్ చేయడం లేదు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి రొటీన్గా 100 రోజులు ఉపాధి హామీ పనులు వస్తాయి. కానీ, ఈ ఆరు నెలలు కూడా అవి వచ్చి ఉంటే చాలా మేలు జరిగేది.⇒ పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు వైవీ సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆళ్ల అయోధ్య రావిురెడ్డి, గుడివాడ అమర్నాథ్తో పాటు పార్టీ అన్ని జిల్లాల అధ్యక్షులు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి (వ్యవసాయ విభాగం) ఎంవీఎస్ నాగిరెడ్డి, పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, ఎంపీ పీవీ మిథున్రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు, పార్టీ రైతు విభాగం రాష్ట్ర అ«ధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబి), పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వడ్డి రఘురాం తదితరులు హాజరయ్యారు.ప్రభుత్వంపై ఒత్తిడికి కార్యాచరణరైతుల సమస్యలపై ఇంకా లోతైన అధ్యయనం చేస్తాం. పరిష్కారానికి తగిన కార్యాచరణ రూపొందిస్తాం. వారికి మరింత తోడుగా నిలుస్తాం. ఇవే కాకుండా స్థానిక డిమాండ్లను కూడా ప్రస్తావిస్తాం. ఆలోపు పార్టీ జిల్లా అధ్యక్షులంతా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ గట్టిగా గళం విప్పాలి. క్షేత్రస్థాయిలో పర్యటనలు పెంచాలి. రైతులకు తోడుగా ఉంటూ వారి సమస్యలు ఎలుగెత్తి చాటే కార్యక్రమం చేయాలి. అప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి, మెడలు వంచే కార్యక్రమం కచ్చితంగా జరుగుతుంది. సమస్యలపై అధికారులకు వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమం కూడా చేయాలి. అందులో భాగంగా తొలుత మండలం, తర్వాత నియోజకవర్గం, ఆ తదుపరి జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించాలి. రైతుల సమస్యలపై ప్రజల్లోనూ అవగాహన పెంచే ప్రయత్నం చేయాలి. ఎక్కడైనా అవసరాన్ని బట్టి, పరిస్థితి తీవ్రతను బట్టి స్వయంగా నేను ఆ కార్యక్రమంలో పాల్గొంటా.పుష్కర లిఫ్ట్, పురుషోత్త్తపట్నం లిఫ్ట్ రెండూ ఎప్పటి నుంచో ఉన్నాయి. వాటితో ఇటీవల చంద్రబాబు డ్రామా చేశారు. వాటి ద్వారా నీరు లిఫ్ట్ చేసి విశాఖ జిల్లాకు గోదావరి జలాలు తరలించామంటూ ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నారు. అవేవో కొత్త లిఫ్ట్లు అయినట్లు బిల్డప్ ఇచ్చారు. పోలవరంలో 75 టీఎంసీల నీటి నిల్వ, కేంద్రం నుంచి వచ్చే రూ.30 వేల కోట్లు కూడా వదులుకుని ఈ డ్రామా ఆడడం దారుణం. ఈరోజు విశాఖపట్నానికి తాగునీరు లేని పరిస్థితి తీసుకొచ్చిన ఘనత ఎవరిదంటే చంద్రబాబుదే! - వైఎస్ జగన్పోలవరం 45.72 మీటర్ల ఎత్తుతో కడితే అందులో 194 టీఎంసీల నీరు నిల్వ చేయగలం. కానీ ఇప్పుడు దాన్ని 41.15 మీటర్లకు కుదించారు. దీనిపై చంద్రబాబు రాజీ పడ్డారు. పోలవరం ఎత్తు తగ్గించడానికి చంద్రబాబు ఆమోదం తెలపడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం ఏకంగా 120 టీఎంసీలకు పడిపోయింది. అంటే దాదాపుగా 75 టీఎంసీల నీరు మనం కోల్పోతున్నాం.మామూలుగా ఖరీఫ్లో దాదాపు 76 లక్షల ఎకరాల్లో సాగవుతుంది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో 56.4 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు జరిగింది. అంటే దాదాపు 20 లక్షల ఎకరాల్లో విత్తనం కూడా పడలేదు. అంత దుర్భర స్థితిలో వ్యవసాయం ఉంది.చంద్రబాబు పుణ్యాన ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా కంది, పత్తి, వేరుశనగ, మొక్కజొన్న, వరి మాత్రమే కాకుండా అన్ని చోట్ల పండ్ల తోటలు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకనే రాష్ట్రంలో ఎల్నినో ఎఫెక్ట్ కాదు.. ఇది ఎల్లో నినో ఎఫెక్ట్. చంద్రబాబు పార్టీ ఎల్లో నినో ఎఫెక్ట్! కరువు ముంచుకొస్తోందని ముందే తెలిసినా కంటింజెన్సీ ప్లాన్, ప్రత్యామ్నాయ విత్తనాలు సరఫరా గురించి పట్టించుకోలేదు.జూన్లో 25%, జూలైలో 66%, ఆగస్టులో 55 శాతం వర్షపాతం లోటు అని తెలుసు. మరి వరుసగా ఇన్ని డెఫిసిట్లు కనిపిస్తున్నప్పుడు నువ్వు కరువు మండలాల కింద ఎందుకు డిక్లేర్ చేయలేకపోతున్నావు? అదే కర్ణాటక ఆగస్టు 28వ తారీఖునే కరవు ప్రాంతాలు ప్రకటించింది.రైతులకు మేలు చేసే ప్రణాళికే లేదు..⇒ ఈ ప్రభుత్వానికి ఎక్కడా ప్రణాళిక లేదు. రైతుకు మేలు చేయాలన్న ఆలోచన లేదు. ⇒ అన్నదాతా సుఖీభవ కింద మూడేళ్లలో రూ.60 వేలు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చింది కేవలం రూ.19 వేలు మాత్రమే. అంటే ఒక్కో రైతుకు రూ.41 వేలు బాకీ. కనీసం ఈ టైమ్లో అయినా ఆ మొత్తం రైతులకు ఇవ్వగలిగితే వారికి మేలు జరుగుతుంది. రైతులకు భరోసా ఇవ్వడానికి నీకు మనసు రావడం లేదు.⇒ ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలన్న ఆలోచన లేదు. మోంథా తుపాన్కు సంబంధించి ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదు. ⇒ సున్నా వడ్డీ పూర్తిగా రద్దు చేశారు. మన ప్రభుత్వ హయాంలో దాదాపు రూ.2,050 కోట్లు సున్నా వడ్డీ కింద ఇస్తే ఇవాళ ఆ పథకం కనపడకుండా పోయిన పరిస్థితి. ⇒ మరోవైపు ఇన్సూరెన్స్ పరిస్థితి ఎలా ఉందో గమనిస్తే.. 2022–23లో ఖరీఫ్ సీజన్లో ఉచిత పంటల బీమా ఆంధ్రప్రదేశ్లో 1.18 కోట్ల దరఖాస్తులకు వర్తిస్తే ఈ ఏడాది 2026–27 ఖరీఫ్లో దరఖాస్తుల సంఖ్య కేవలం 40 లక్షలకు పరిమితమైందని స్వయంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించింది. ⇒ అదే ఇప్పుడు ఉచిత పంటల బీమా ఉండి ఉంటే ప్రతి రైతుకు ఈ–క్రాప్ ద్వారా ఆటోమేటిక్గా ప్రతి ఎకరా ఉచిత పంటల బీమా పరిధిలోకి వచ్చేది. కానీ ఈ పెద్దమనిషి చేసిన నిర్వాకం ఏమిటి? ఆయన అధికారంలోకి వసూ్తనే 2024 జూన్లో కనుక 2023 ఖరీఫ్కు సంబంధించి ఇన్సూరెన్స్ ప్రీమియమ్గా రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన రూ.1,400 కోట్లు చెల్లించి ఉంటే రైతులకు దాదాపు రూ.3 వేల కోట్ల మేలు జరిగి ఉండేది. కానీ అది కట్టలేదు. అలా కట్టి ఉంటే, కేంద్ర ప్రభుత్వ వాటా కూడా వచ్చేది. దాని వల్ల పంటలన్నీ బీమా పరిధిలోకి వచ్చి రైతులకు మేలు జరిగేది.అన్నదాతకు తోడుగా నిలిచేందుకే...తీవ్ర కరువు పరిస్థితుల్లో చాలా నష్టపోయిన రైతులకు తోడుగా నిలబడే కార్యక్రమం చేస్తూ డిమాండ్లపై లోతుగా చర్చించేందుకే ఈ సమీక్ష చేస్తున్నాం. ఆ మేరకు పార్టీ తరఫున ఈ డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచబోతున్నాం. ఇవీ ఆ డిమాండ్లు..⇒ ప్రభుత్వం వెంటనే కరువు మండలాలు ప్రకటించాలి.⇒ రైతులకు ఉచిత పంటల బీమాను వెంటనే పునరుద్ధరించాలి. ఇప్పటికే కొందరు రైతుల నుంచి వసూలు చేసిన ప్రీమియంను తిరిగి ఇవ్వాలి.⇒ రైతులకు గతంలో ఎగ్గొట్టిన రూ.3 వేల కోట్ల పంటల బీమా పరిహారాన్ని కూడా వెంటనే ఇవ్వాలి. ⇒ గతంలో ఉచిత పంటల బీమా ఉండేది. దాని వల్ల ప్రతి రైతుకు సాగు చేయకపోయినా కూడా ప్రివెంటివ్ సోయింగ్ కింద ప్రతి ఎకరాకు రూ.15 వేల పరిహారం అందేది. చంద్రబాబు ఉచిత పంటల బీమా తీసేసినందువల్ల నష్టపోతున్న రైతులకు ప్రభుత్వం రూ.15 వేల చొప్పున ఇవ్వాలి.⇒ పంటలు వేసి నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున ఇవ్వాలి. ⇒ అన్నదాతా సుఖీభవ కింద మిగిలిన రూ.41 వేలు ప్రభుత్వం వెంటనే ఇవ్వాలి.⇒ అన్నదాతా సుఖీభవ పథకాన్ని కౌలు రైతులు, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పొందిన రైతులకు కూడా వర్తింపచేయాలి. వారికి మూడేళ్లకు కలిపి ఒక్కో రైతుకు రూ.60 వేల చొప్పున ఇవ్వాలి.⇒ మోంథా తుపాన్ వల్ల నష్టపోయిన రైతులకు వెంటనే రూ.846 కోట్లు విడుదల చేయాలి. ⇒ కరువు వల్ల నష్టపోయిన రైతులు సాగు చేసిన 56 లక్షల ఎకరాలకు మొత్తం లెక్క వేస్తే దాదాపు రూ.6 వేల కోట్లు అవుతుంది. కాబట్టి వెంటనే ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.6 వేల కోట్లు చెల్లించాలి.⇒ ఇతర పద్ధతులు, వేరే నెంబర్లు ఏమైనా ఉంటే వాటిని చూపించాలి. ఆ మేరకు మా ప్రభుత్వ హయాంలో మాదిరిగా సీజన్ ముగిసేలోగా పరిహారం ఇవ్వాలి.⇒ మన ప్రభుత్వ హయాంలో మాదిరిగానే ఈ మూడేళ్లకు సంబంధించి రైతులకు సున్నా వడ్డీ పథకాన్ని వర్తింపచేయాలి.⇒ కరువు తీవ్రత దృష్ట్యా రైతన్నలు పశుగ్రాసం కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో ఉన్నందున ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించి ఉచితంగా అందచేయాలి. అది ఇప్పటికే ఆలస్యమైంది.⇒ కరువు వల్ల వ్యవసాయ పనులు లేక కూలీల వలసలు ఇప్పటికే స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ఈ అక్టోబరు నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు ఆరు నెలల పీరియడ్లో మరో 150 రోజులు ఉపాధి హామీ పనులు క్రియేట్ చేసి తోడుగా నిలవాలి.⇒ విద్యాదీవెన, వసతి దీవెన పథకాల్లో ఎక్కువ మంది లబ్ధిదారులైన పిల్లలు రైతుల బిడ్డలే. ఆ రెండు కలిపి మొత్తం బకాయిలు దాదాపు రూ.9 వేల కోట్లు. డబ్బులు కట్టలేక పిల్లల చదువులు మానేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఆ బకాయిలు విడుదల చేసి ఆ రైతులకు, వారి పిల్లలకు తోడుగా నిలబడాలి. ⇒ తాగునీటి ఎద్దడి లేకుండా ఉచిత ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే కార్యక్రమం వెంటనే స్టార్ట్ చేయాలి.⇒ ఇబ్బందులు ఉన్న చోట వైఎస్సార్సీపీ తరఫున మనం చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎటువంటి తోడు, సహాయం అందలేదు. అది వెంటనే యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి.⇒ ఎక్కడ చూసినా కరెంట్ కోతలే. సాయంత్రం 5 నుంచి రాత్రి 11 దాకా గ్రామాలలో తీవ్రమైన కరెంట్ కోతలు. రైతులకు9 గంటలు ఉచిత విద్యుత్ కాదు కదా 6 గంటలు, 5 గంటలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. బోర్ల కింద ఉన్న పంటలు పూర్తిగా ఎండిపోతున్నందున కచ్చితంగా ఎటువంటి కోతలు లేకుండా కరెంట్ సప్లై చేయాలి.⇒ ప్రతికూల పరిస్థితుల్లో దురదృష్టవశాత్తూ ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ప్రభుత్వ సాయం అందాలి. మన ప్రభుత్వంలో రూ.7 లక్షల చొప్పున సాయం చేశాం. ఇప్పుడు కూడా బాధిత కుటుంబాలకు అలాగే ఇచ్చే కార్యక్రమం కచ్చితంగా జరగాలి. ⇒ ఎండిపోతున్న పండ్ల తోటలను కాపాడేందుకు 80% సబ్సిడీతో నీటి ట్యాంకర్ల ద్వారా సప్లై చేయాలి. -
వ్యవ‘సాయం’ పడకేసిందన్నా..
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితులు తాండవిస్తున్నా.. రైతులు, పశుపక్షాదులు విలవిల్లాడుతున్నా చంద్రబాబు కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వంలో వ్యవసాయం పూర్తిగా పడకేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు వ్యవసాయం అన్నా, రైతులు అన్నా ఇష్టం ఉండదని.. అందువల్లే వ్యవసాయ రంగాన్ని పూర్తిగా విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై గురువారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ నేతలతో సమీక్షించారు. పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు, పార్టీ అన్ని జిల్లాల అధ్యక్షులు ఈ సందర్భంగా అక్కడి పరిస్థితిని వైఎస్ జగన్కు వివరించారు. ‘ఉమ్మడి అనంతపురం జిల్లాలో వర్షాభావంతో వేరుశనగ, కంది సహా పంటలు దెబ్బతిన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రైతులతో పంటల బీమా ప్రీమియం కట్టించుకుని, పంట నష్టపోయిన రైతులకు బీమా పరిహారం అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. పశువులకు మేత దొరకని పరిస్థితి నెలకొంది. జిల్లాలో 200 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి, ఇన్పుట్ సబ్సిడీ అందించాలి. ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు అందించాలి. ప్రకాశం, పల్నాడు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. నంద్యాల జిల్లా గోరకల్లు రిజర్వాయర్లో నీరు ఉన్నా రైతుల పంటలకు నీరు విడుదల చేయడం లేదు. సర్కారు నిర్వాకం వల్ల నెల్లూరు జిల్లాలో రైతులకు రూ.1,500 కోట్ల నష్టం వాటిల్లింది. తిరుపతి వంటి ప్రధాన నగరానికి తాగునీరు అందించే పాపవినాశనం జలాశయంలోనూ నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. తాగునీటి భద్రతపై ఆందోళన పెరుగుతోంది. వైఎస్సార్ జిల్లాలో దారుణ పరిస్థితులు ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కర్నూలు జిల్లాలో గణేశ్ నిమజ్జనానికి కూడా నీరు కరువైంది’ అని ఆయా జిల్లాల అధ్యక్షుడు ఉషాశ్రీచరణ్, అనంత వెంకట్రామిరెడ్డి, బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాటసాని రాంభూపాల్రెడ్డి, కాకాణి గోవర్ధన్రెడ్డి, భూమన కరుణాకర్రెడ్డి, రవీంద్రనాథ్రెడ్డి, ఎస్వీ మోహన్రెడ్డిలు వైఎస్ జగన్ దృష్టికి తెచ్చారు. లక్షలాది ఎకరాల్లో నాట్లు పడని దుస్థితి‘కృష్ణా డెల్టాలో సుమారు 6 లక్షలకు పైగా ఎకరాల ఆయకట్టు ఉండగా, ప్రస్తుతం దాదాపు 50–55 వేల ఎకరాల్లో ఇప్పటికీ సాగు ప్రారంభం కాలేదు. పులిచింతలలో నీటి నిల్వలు ఉన్నప్పటికీ కృష్ణా డెల్టాకు సాగునీరు అందడం లేదు. గుంటూరు జిల్లాలో కేవలం 20 శాతం మాత్రమే నాట్లు పడ్డాయి. ఎరువులను బ్లాక్లో కొనాల్సి వస్తోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చారంటే కరువు తప్పదు. గోదావరి జిల్లాల్లో ఆక్వా, పొగాకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరియా కొరత, విద్యుత్ కోత పెరిగింది. పొరుగు రాష్ట్రం నుంచి ఎరువులు కొనుక్కోవాల్సి వస్తోంది. విశాఖలో తాగునీరు కూడా కరువైంది’ అని ఆయా జిల్లాల అధ్యక్షులు పేర్ని నాని, అంబటి రాంబాబు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, దూలం నాగేశ్వరరావు, ముదునూరి ప్రసాదరాజు, చిర్ల జగ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా, దేవినేని అవినాశ్, ధర్మాన కృష్ణదాసు, బెల్లాన చంద్రశేఖర్, కె.కె. రాజు, మత్స్యరాస విశ్వేశ్వరరాజు, బొడ్డేడ ప్రసాద్, పరీక్షిత్ రాజులు వైఎస్ జగన్కు వివరించారు. అన్ని జిల్లాల సమస్యలపై సమగ్ర కార్యాచరణ రూపొందించి పార్టీ పరంగా ఓ నిర్ణయం తీసుకుంటే దాన్ని విజయవంతంగా అమలు చేస్తామని పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి తెలిపారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుల పూర్తి ప్రసంగాలు epaper.sakshi.com లో -
‘‘సీఎం రమేశ్ పగలు బీజేపీతో, రాత్రి చంద్రబాబుతో..’’
అనకాపల్లి: ఎంపీ సీఎం రమేశ్పై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. చింతకుంట మునుస్వామి రమేశ్ అంటే ఎవరికైనా తెలుసా? అని అన్నారు. ఎక్కడో కడప నుంచి వచ్చి ఇక్కడ అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని చెప్పారు. చరిత్ర గుర్తెరిగి మాట్లాడితే బాగుండేదని సూచించారు.అనకాపల్లిలో అమర్నాథ్ మాట్లాడుతూ.. ‘‘1989లో ఒక వార్డుకి ఏజెంట్ గా ఉండే సీఎం రమేశ్ ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారో చెప్పాలి. నేనుగానీ నోరు విప్పితే నీ తల ఎక్కడ పెట్టుకుంటావో నీకే తెలీదు. సీఎం రమేశ్ సారా బుడ్డి సోడాబుడ్డికే పెరిగారు. సీఎం రమేశ్ ఒక రాజకీయ వ్యభిచారి. పగలు బీజేపీతో రాత్రి చంద్రబాబుతో రాజకీయం చేస్తారు.ఉమ్మడి విశాఖ జిల్లాలో చరిత్ర ఉన్న మా కుటుంబం మీద మాట్లాడితే ప్రజలు ఊరుకోరు. అధికారం ఉన్నప్పుడు గాడిద కూడా గుర్రంలా కనిపిస్తుంది.. ఇప్పుడు సీఎం రమేశ్ పరిస్థితి కూడా అంతే. సీఎం రమేశ్లాంటి వారు వస్తుంటారు పోతుంటారు.. గుడివాడ అమర్నాథ్ లోకల్. సీఎం రమేశ్ను పంచదారల కొండ అక్రమలు, అవినీతిపై ప్రశ్నించినందుకే విమర్శలు చేస్తున్నారు. అక్రమ సంపాదనకు అడ్డుకట్ట వేసినందుకే చిల్లర విమర్శలు చేస్తున్నారు. కడపలో నువ్వు చెల్లని రూపాయి కాబట్టే అనకాపల్లికి పంపించారు. సీఎం అంటే కమిషన్ మ్యాన్, చంద్రబాబు మనిషి, చిల్లర మనిషిని అందరూ అంటున్నారు. గోవాడ సూపర్ ఫ్యాక్టరీ రైతుల గురించి ఎప్పుడైనా మాట్లాడారా, స్థానికంగా రెండు వంతెనలు కూలిపోతే వాటి గురించి పట్టించుకున్నారా? రాజకీయ విమర్శలు తప్ప చేసింది ఏమీ లేదు’’ అని చెప్పారు. ఇదీ చదవండి: 15 ఏళ్ల తర్వాత గోడను కూలగొడితే లైబ్రరీ బయటపడింది.. -
ఏపీలో ఎల్నినో ఎఫెక్ట్ కాదు.. ‘ఎల్లో నినో’ ఎఫెక్ట్: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని.. ఖరీఫ్ ప్రారంభం నుంచి సెప్టెంబర్ 16 వరకు రాష్ట్రంలో 51 శాతానికిపైగా వర్షపాతం లోటు ఉందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఇవాళ(గురువారం) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శులు, రీజనల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో కరువు, వర్షాభావ పరిస్థితులు, నీటి ఎద్దడికి సంబంధించి జిల్లాల వారీగా స్థానిక పరిణామాలపై వైఎస్ జగన్ చర్చించారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని జిల్లాలూ వర్షపాతం లోటులోనే ఉన్నాయన్నారు. ‘‘688 మండలాల్లో దాదాపు 628 మండలాలు వర్షాభావ పరిస్థితుల్లో ఉన్నాయి. దాదాపు 332 మండలాల్లో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. అన్నమయ్య జిల్లాలో 75 శాతం వర్షపాతం లోటు. సత్యసాయి జిల్లాలో 66 శాతం, ప్రకాశం జిల్లాలో 65 శాతం వర్షపాతం లోటు...చిత్తూరులో 58.5 శాతం, వైఎస్సార్ కడపలో 57 శాతం వర్షపాతం లోటు. తూర్పుగోదావరిలో 57 శాతం, మార్కాపురం–నంద్యాలలో 56 శాతం చొప్పున వర్షపాతం లోటు. విశాఖపట్నంలో 54 శాతం, అనంతపురంలో 51 శాతం వర్షపాతం లోటు. ఎల్నినో ప్రభావం ఉంటుందని ఫిబ్రవరిలోనే తెలిసినా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదు’’ అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘జూలై, ఆగస్టులో కూడా తీవ్ర వర్షపాతం లోటు కొనసాగినా కరువు కార్యాచరణ చేపట్టలేదు. ప్రభుత్వ మాటలు నమ్మి సాగు చేసిన రైతులు ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.20 వేలకుపైగా నష్టపోయారు. సాధారణంగా 76 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు జరగాల్సి ఉండగా 56.4 లక్షల ఎకరాలకే పరిమితమైంది. దాదాపు 20 లక్షల ఎకరాల్లో విత్తనం కూడా పడలేదు. సాగు చేసిన ప్రాంతాల్లో కూడా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పంటను బట్టి రైతులు ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు నష్టపోయారు. కంది, పత్తి, వేరుశనగ, మొక్కజొన్న, వరి సహా అనేక పంటలు దెబ్బతిన్నాయిపండ్ల తోటలు కూడా కరువు దెబ్బకు ఎండిపోతున్నాయి. శ్రీశైలం నీటిని సరైన సమయంలో రాయలసీమకు మళ్లించడంలో ప్రభుత్వం విఫలమైంది. పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తీసుకునే అవకాశం ఉన్నప్పుడు చర్యలు తీసుకోలేదు. తెలుగు గంగ, ఎస్ఆర్బీసీ, కేసీ కెనాల్ పరిధిలోని రిజర్వాయర్లను ముందుగానే నింపాల్సింది. పులిచింతల వద్ద తెలంగాణ చేపడుతున్న లిఫ్ట్లపై రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. పోలవరం పూర్తి సామర్థ్యంపై ప్రభుత్వం రాజీపడుతోంది. పోలవరం నుంచి గ్రావిటీ ద్వారా నీరు అందించే అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలి. పుష్కర, పురుషోత్తపట్నం లిఫ్ట్ల పేరుతో ప్రచారం కాకుండా శాశ్వత సాగునీటి పరిష్కారంపై దృష్టిపెట్టాలి’’ అని వైఎస్ జగన్ సూచించారు.‘‘వరుస వర్షపాతం లోటు కనిపిస్తున్నా కరువు మండలాలను ఎందుకు ప్రకటించడం లేదు?. కరువు ప్రభావిత మండలాలను తక్షణమే అధికారికంగా ప్రకటించాలి. కరువు ప్రభావిత రైతుల రుణాలను రీషెడ్యూల్ చేయాలి. రైతులకు ఉచిత పంటల బీమాను వెంటనే పునరుద్ధరించాలి. రైతుల నుంచి వసూలు చేసిన పంటల బీమా ప్రీమియాన్ని తిరిగి చెల్లించాలి. గతంలో రైతులకు రావాల్సిన రూ.3 వేల కోట్ల పంటల బీమా పరిహారాన్ని వెంటనే చెల్లించాలి. విత్తనం వేయలేకపోయిన రైతులకు ఎకరాకు కనీసం రూ.15 వేల పరిహారం ఇవ్వాలి. పంట వేసి నష్టపోయిన రైతులకు ఎకరాకు కనీసం రూ.25 వేల పరిహారం ఇవ్వాలి’’ అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.‘‘ఉచిత పంటల బీమా కొనసాగి ఉంటే రైతులకు Prevented Sowing సహా బీమా రక్షణ ఉండేది. అన్నదాత సుఖీభవ కింద రైతులకు రావాల్సిన బకాయిలు పూర్తిగా చెల్లించాలి. అన్నదాత సుఖీభవ కింద మూడేళ్లలో రూ.60 వేలు ఇవ్వాలి. ఇచ్చింది కేవలం రూ. 19 వేలే. బకాయి పడ్డ రూ. 41 వేలు కూడా రైతులకు ఇవ్వాలి. కౌలు రైతులు, ఆర్వోఎఫ్ఆర్ పట్టాదారులైన రైతులకు మూడేళ్లలో ఎగ్గొట్టిన రూ. 60వేలు ఇవ్వాలి. తుఫాన్ల వల్ల రైతులకు పెండింగ్లో ఉన్న పంటల బీమా పరిహారాన్ని వెంటనే విడుదల చేయాలి. కరువు వల్ల నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ వెంటనే ప్రకటించాలి...ఇన్పుట్ సబ్సిడీ కింద సుమారు రూ. 6 వేల కోట్లు రైతులకు అందించాలి. సున్నా వడ్డీ పథకాన్ని తిరిగి అమలు చేయాలి. గత మూడు సంవత్సరాలకు సంబంధించిన సున్నా వడ్డీ బకాయిలన్నీ రైతులకు చెల్లించాలి. పశుగ్రాసాన్ని ముందుగానే సమీకరించి కరువు జిల్లా రైతులకు ఉచితంగా పంపిణీ చేయాలి. కరువు కారణంగా వ్యవసాయ కూలీలు వలస వెళ్లకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అక్టోబర్ నుంచి మార్చి వరకు అదనంగా 150 రోజుల ఉపాధి హామీ పనులు కల్పించాలి. కరువు ప్రాంతాల్లో ఉపాధి హామీ పనుల కోసం కేంద్రాన్ని వెంటనే అదనపు పనిదినాలు కోరాలి. విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలను వెంటనే చెల్లించాలి...ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల వల్ల రైతు, పేద కుటుంబాలపై అదనపు భారం పడకూడదు. విద్యా దీవెన–వసతి దీవెన కింద పెండింగ్లో ఉన్న సుమారు రూ.9 వేల కోట్లను విడుదల చేయాలి. కరువు ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. తాగునీటి సమస్య ఉన్న గ్రామాలకు ఉచిత ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలి. గ్రామాల్లో విద్యుత్ కోతలు లేకుండా చూడాలి. రైతులకు ప్రకటించిన ఉచిత వ్యవసాయ విద్యుత్ను కోతలు లేకుండా అందించాలి. బోర్ల కింద ఉన్న పంటలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలి...ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రతి రైతు కుటుంబానికి రూ.7 లక్షల పరిహారం ఇవ్వాలి. ఎండిపోతున్న పండ్ల తోటలను కాపాడేందుకు ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకోవాలి. పండ్ల తోటలకు నీటి ట్యాంకర్ల ఖర్చుపై 80 శాతం సబ్సిడీ ఇవ్వాలి. ముఖ్యంగా చీనీ సహా శాశ్వత పండ్ల తోటలను కాపాడేందుకు ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలి’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.పరిస్థితి తీవ్రతను బట్టి కరువు ప్రభావిత ప్రాంతాల్లో తాను కూడా పర్యటిస్తానన్న వైఎస్ జగన్.. రైతులకు అండగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కార్యాచరణ చేపడుతుందన్నారు. ‘‘ప్రతి జిల్లాలో కరువు పరిస్థితులపై పార్టీ నాయకులు అధ్యయనం చేసి ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా జిల్లాల వారీగా రైతుల ప్రత్యేక డిమాండ్లను కూడా ప్రభుత్వానికి సమర్పించాలి. రైతుల సమస్యలపై వైయస్సార్సీపీ నాయకులు క్షేత్రస్థాయి పర్యటనలు పెంచాలి. రైతుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు వినతిపత్రాలు ఇవ్వాలి. కరువు సమస్యలపై మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో కార్యాచరణ చేపట్టాలి. దీనికి ముందు మండల స్థాయి నుంచి నియోజకవర్గ, జిల్లా స్థాయి వరకు రైతులతో సమావేశాలు నిర్వహించాలి. రైతులకు అండగా నిలిచి వారి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి’’ అని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.ఇదీ చదవండి: ప్రశ్నిస్తే అకౌంట్ క్లోజ్!‘‘ఎల్నినో ప్రభావం వస్తుందని ఫిబ్రవరి 4నే చంద్రబాబు చెప్పారు. తెలిసినా ఆ తర్వాత చేసిన కార్యాచరణ మాత్రం సున్నా. ఇది ప్రకృతి వల్ల వచ్చిన కరువు మాత్రమే కాదు.. ముఖ్యమంత్రి స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడం వల్ల తీవ్రత పెరిగింది. వర్షపాతం లోటు కనిపిస్తున్నా స్విచ్లు నొక్కడం, లాకులు ఎత్తడం, ఫొటోలకు పోజులివ్వడమే చేశారు. మీ మాటలు నమ్మి సాగులోకి దిగిన రైతులు ఎకరాకు రూ.15 వేల నుంచి 20 వేలకుపైగా నష్టపోయారు. చంద్రబాబు పుణ్యాన రైతులకు ఉచిత పంటల బీమా రక్షణ లేకుండా పోయింది. రాష్ట్రంలో ఉన్నది ఎల్నినో ఎఫెక్ట్ కాదు... ‘ఎల్లో నినో ఎఫెక్ట్’. శ్రీశైలం నుంచి రాయలసీమకు నీళ్లు ఇవ్వగలిగిన సమయంలో ఇవ్వకుండా, విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వదిలేశారు...పులిచింతల ఎగువ, దిగువన తెలంగాణ లిఫ్టులు కడుతున్నా చంద్రబాబు కనీసం నోరు మెదపడం లేదు. రైతుల కోసం చంద్రబాబు మనసు పెట్టి పనిచేస్తున్నారనే భావన ఎక్కడా కనిపించడం లేదు. పోలవరం పూర్తి స్థాయి నీటిమట్టంపై రాజీపడి రాష్ట్రానికి రావాల్సిన నీటి నిల్వ సామర్థ్యాన్ని వదులుకుంటున్నారు. గతంలోనే ఉన్న పుష్కర, పురుషోత్తపట్నం లిఫ్టులను ఆపరేట్ చేసి కొత్తగా తానే నీళ్లు తెచ్చినట్టుగా చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు...ఒకవైపు పోలవరంలో నీటి నిల్వ సామర్థ్యాన్ని వదులుకుంటూ, మరోవైపు లిఫ్టుల పేరుతో డ్రామాలు చేస్తున్నారు. జూన్, జూలై, ఆగస్టు వరుసగా వర్షపాతం లోటు కనిపిస్తున్నప్పుడు కరువు మండలాలను ఎందుకు ప్రకటించలేదు?. కర్ణాటక ముందుగానే కరువు ప్రకటించింది; చంద్రబాబు ప్రభుత్వం ఆ పని కూడా చేయలేకపోయింది. కరువు వస్తున్నా ప్రత్యామ్నాయ విత్తనాలు సిద్ధం చేయలేదు; పశుగ్రాసాన్ని జిల్లాలకు పంపలేదు; ఉపాధి హామీ అదనపు పనిదినాల కోసం డిమాండ్ కూడా పెట్టలేదు’’ అని వైఎస్ జగన్ మండిపడ్డారు.ఇదీ చదవండి: సాక్షి టీవీ దెబ్బకు దిగొచ్చిన కూటమి సర్కార్ -
కరువు పరిస్థితులపై పార్టీ నేతలతో వైఎస్ జగన్ సమావేశం
-
తాడిపత్రిలో YSRCP కార్యకర్త విజయ్ ఇంటిపై దాడి
-
ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు.. ఆళ్ల నానికి YSRCP నేతలు నివాళులు
-
వైఎస్ జగన్ అధ్యక్షతన వైఎస్సార్సీపీ కీలక సమావేశం
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన పార్టీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో–ఆర్డినేటర్లు, పార్టీ ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు.జూమ్ ద్వారా జరిగిన ఈ మీటింగ్లో.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. కరువు పరిస్థితులు, పలు ప్రాంతాల్లో నెలకొన్న నీటి ఎద్దడిపై నేతల నుంచి వివరాలను వైఎస్ జగన్ అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రజలకు ఎదురవుతున్న ఇతర సమస్యలు, ఆయా జిల్లాల్లోని తాజా పరిస్థితులపైనా పార్టీ నేతలతో ఆయన చర్చించారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను గుర్తించి.. వాటిపై పార్టీ తరఫున చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా సమావేశంలో దిశానిర్దేశం చేశారు.ఇదీ చదవండి: కొండ పైనా క్రెడిట్ చోరీనా? -
జెండా, పార్టీ ని లాక్కున్నోడికి ఏపీ కి FBI తీసుకురావడం కష్టమా..?
-
నేడు వైఎస్సార్సీపీ నేతలతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శులు, రీజనల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో కరువు, వర్షాభావ పరిస్థితులు, నీటి ఎద్దడికి సంబంధించి జిల్లాల వారీగా స్థానిక పరిణామాలపై వైఎస్ జగన్ చర్చించనున్నారు. క్షేత్రస్థాయిలో రైతులకు అండగా ఉండేలా చేపడుతున్న పార్టీ కార్యక్రమాలపై ఆయన మాట్లాడనున్నారు. -
ఎఫ్బీఐ పేరుతో ‘పోలీసింగ్’!
సాక్షి,అమరావతి: అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) పేరును వాడి ఏపీ పోలీసులు తప్పుడు ఫిర్యాదులు చేయడంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు ‘రెడ్ బుక్ పాలన’ అంతర్జాతీయ స్థాయికి చేరిందంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబూ రాష్ట్రం పరువు తీయవద్దంటూ హితవు పలికారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో బుధవారం పోస్టు చేశారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఆధారాలను సైతం ఆయన ట్యాగ్ చేశారు. ఆ పోస్టులో ఇంకా జగన్ ఏమన్నారంటే.. దేశ ప్రతిష్ఠను కూడా దిగజార్చే హేయమైన చర్య ‘‘రాష్ట్ర పోలీసులు నకిలీ గుర్తింపుతో ఏకంగా అమెరికాకు చెందిన ‘ఎఫ్బీఐ’ పేరును వాడుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి నిజమైన ముప్పు. చంద్రబాబూ... మీ పాలనలో ఇదేనా పోలీసింగ్ అంటే?. లేక రాజకీయ కక్ష సాధింపు కోసం ప్రభుత్వమే స్వయంగా చేస్తున్న వ్యవహారమా?. ‘ఎక్స్’లోని పోస్టులను తొలగించాలని కోరుతూ రాష్ట్ర పోలీసులు తమను అమెరికాకు చెందిన ‘ఎఫ్బీఐ’గా పేర్కొనడం అత్యంత దారుణం. ఇది మన రాష్ట్రంతో పాటు దేశ ప్రతిష్ఠను కూడా దిగజార్చే హేయమైన చర్య. ఆ మెయిల్ ఆంధ్రప్రదేశ్ పోలీసుల అధికారిక ఈ –మెయిల్ చిరునామా నుంచే వచి్చందని ‘ఎక్స్’ ధృవీకరించింది. ఆ మెయిల్ పంపిన సంబంధిత అధికారి తాను ‘ఎఫ్బీఐ’ సంస్థకు చెందిన వ్యక్తిగా చెప్పుకున్నారు. అసలు ఆ అభ్యర్థన పంపాలని ఆదేశించింది ఎవరు? అక్కడ ‘ఎఫ్బీఐ’ పేరు ఎందుకు దుర్వినియోగం చేశారు? మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న గొంతులను అణచివేసేందుకు, ‘ఎక్స్’ను తప్పుదోవ పట్టించేందుకు ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేశారా? మీ రాజకీయ సెన్సార్íÙప్ను అమలు చేయడానికా పోలీసు యూనిఫాం? పోలీసు యూనిఫాం అనేది చట్టాన్ని పరిరక్షించడానికి ఉద్దేశించింది. అంతేగానీ మీ రాజకీయ సెన్సార్íÙప్ను అమలు చేయడానికి కాదు. రాజకీయ ప్రయోజనాల కోసం చేపట్టిన పోస్టుల తొలగింపు చర్యలో ఒక విదేశీ దర్యాప్తు సంస్థ పేరును వాడటం ఆంధ్రప్రదేశ్కు అవమానం. దీని వల్ల రాష్ట్ర పోలీసు వ్యవస్థ విశ్వసనీయత తీవ్రంగా దెబ్బ తింది. సోషల్ మీడియా యుగంలో వాస్తవాలను దాచి పెట్టలేరు.. అమలు చేయని సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు, డీఎస్సీ కుంభకోణం, అమరావతి నిర్మాణంలో దోపిడీ, అప్పులు, పాలనా వైఫల్యాలు, వేధింపులు.. ఇదీ మీ పరిపాలన.. విమర్శకుల గొంతు నొక్కేందుకు ఉపయోగిస్తున్న మీ అధికారాన్ని, గత ఎన్నికల ముందు మీరు ఇచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీల అమలుకు వినియోగించండి. ఇంకా తీవ్ర కరువు పరిస్థితుల్లో మొత్తం నష్టపోయిన రెతులను ఆదుకోండి. యువతకు ఉద్యోగాలు కల్పించండి. రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టండి. చాలా వేగంగా వ్యాప్తి చెందిన ఈ సామాజిక మాధ్యమాల యుగంలో వాస్తవాలను దాచి పెట్టడం సాధ్యం కాదు. మీ పనితీరుపై మీ ప్రభుత్వానికి అంత నమ్మకం ఉంటే, ప్రజలకు అంతా బాగా చేశామని అనుకుంటే.. అది మీ పనితీరులో చూపాలి. ఆ ప్రక్రియలో పూర్తి పారదర్శకంగా ఉండాలి. అంతేతప్ప, ఇలా సెన్సార్íÙప్, వేధింపులతో కాదు’’ అని వైఎస్ జగన్ ఎక్స్లో తెలిపారు. -
రేపు వైఎస్సార్సీపీ ముఖ్య నేతలతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు (సెప్టెంబర్ 17, 2026) ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శులు, రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో కీలక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.ఈ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత కరువు పరిస్థితులు, తీవ్రమైన నీటి ఎద్దడి, వర్షాభావ పరిస్థితులపై జిల్లాల వారీగా సమీక్షించనున్నారు. అలాగే ఆయా ప్రాంతాల్లోని స్థానిక పరిణామాలు, సమస్యలపై సీనియర్ నాయకులతో వైఎస్ జగన్ విస్తృతంగా చర్చించనున్నారు. క్షేత్రస్థాయిలో రైతాంగానికి అండగా ఉండేలా పార్టీ కార్యక్రమాలపై ఆయన నాయకులతో మాట్లాడనున్నారు. -
‘మోసాలు, కుట్రలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు’
సాక్షి, తాడేపల్లి: మోసాలు, కుట్రలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికలు వస్తున్నాయని కొత్తగా పెన్షన్లు ఇస్తానంటూ మోసానికి దిగారని.. దశల వారీగా పెన్షన్లు ఇస్తానంటూ మభ్యపెట్టటం మొదలు పెట్టారంటూ ఆయన దుయ్యబట్టారు.‘‘66 లక్షల మందికి వైఎస్ జగన్ హయాంలో పెన్షన్లు ఇచ్చారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి కొత్తగా పెన్షన్లు ఇచ్చారు. చంద్రబాబు 59 లక్షల మందికి మాత్రమే ఇస్తున్నారు. రెండేళ్లలోనే చంద్రబాబు 6.5 లక్షల పెన్షన్లు కట్ చేశారు. యాభై సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్లు ఇస్తామని గతంలో హామీ ఇచ్చారు. ఈ రెండేళ్లుగా పడిన బకాయితో కలిపి పెన్షన్లు ఇవ్వాలి’’ అని శ్రీకాంత్రెడ్డి డిమాండ్ చేశారు.‘‘వైఎస్ జగన్ హయాంలో ప్రారంభించిన ఇళ్లనే చంద్రబాబు ఆపేశారు. ఇప్పుడు కొత్తగా ఐదు లక్షల మందికి ఇళ్లు మంజూరు చేస్తామంటున్నారు. అసైన్డ్ భూముల విషయంలోనూ చంద్రబాబు అదే మోసానికి దిగారు. 20 ఏళ్లుగా అసైనీలుగా ఉన్న వారికే జగన్ పూర్తి హక్కులు కల్పించారు...చంద్రబాబు వచ్చాక ఆ జీవోని అమలు చేయకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు అవే భూములను తాను ఫ్రీహోల్డ్ చేయబోతున్నట్లు చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. చుక్కల భూములు, 22ఏ భూముల సమస్యలకు కూడా వైఎస్ జగన్ హయాంలో పరిష్కారం చూపారు. భూ సమస్యల పరిష్కారానికి వైఎస్ జగన్ చేసిన కృషి మరెవ్వరూ చేయలేదు’’ అని శ్రీకాంత్రెడ్డి పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఏపీలో మరో రిక్రూట్మెంట్లో గోల్మాల్! -
YSRCP సోషల్ మీడియా అకౌంట్ల నిలిపివేత వెనుక సంచలన విషయాలు
-
రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి షాక్?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: టీడీపీ రాజకీయాల్లో కొందరు ఎప్పుడూ కరివేపాకులాంటి వాళ్లేనని మరోసారి రుజువైంది. మంత్రి లోకేశ్ పర్యటనతో తన ప్రతిష్టను పెంచుకోవాలని చూసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి ఆ పార్టీలో వీసమెత్తు పలుకుబడి లేదని విస్పష్టమైంది. పార్టీలో జిల్లా నుంచి మంత్రి నారాయణ, వేమిరెడ్డి దంపతుల మాటకే ప్రాధాన్యత ఉందనే సంకేతాలు ఇచ్చినట్లు అయింది. ఇకపై నియోజకవర్గంలో పార్టీ క్యాడర్కు సైతం తన ముఖం చూపించుకోలేని ఘోర పరాభవాన్ని చవిచూశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ దగ్గర మార్కులు కొట్టేయాలనే తృష్ణతో లోకేశ్ బుధవారం నెల్లూరు, కోవూరు పర్యటనకు రానున్న నేపథ్యంలో తిరుపతి నుంచి వస్తున్న ఆయన్ను తన నియోజకవర్గ పరిధి నుంచి మాగుంట లేఅవుట్ రోడ్డులోని కార్యాలయం మీదుగా పర్యటనకు తొలుత రూట్ మ్యాప్ సిద్ధం చేశా రు. సుమారు 10 వేల మందితో ఘన స్వాగతం పలికి, తన పలుకుబడిని పెంచుకోవాలని నాలుగు రోజులుగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులతో సమీక్షలు, సమావేశాలు పెట్టారు. ఈ పరిణామాలతో మంత్రివర్గ విస్తరణ జరిగితే తనకు అవకాశం దక్కించుకోవాలని కోటంరెడ్డి కంటున్న కలలు భగ్నమే అని రాజకీయంగా చర్చ జరుగుతోంది. ఆఖరి క్షణంలో ఝలక్ అయితే లోకేశ్ పర్యటనలో నెల్లూరు రూరల్ ఊసేలేకుండా ఆఖరి క్షణంలో రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. నేరుగా మంత్రి నారాయణ ప్రాతినిథ్యం వహించే సిటీ నియోజకవర్గంలోని పలు కార్యక్రమాల్లో.. ఆ తర్వాత కోవూరులో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనేలా పర్యటన షెడ్యూల్ను ఖరారు చేయడంతో ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డిని ఉద్దేశ పూర్వకంగానే పక్కకు తప్పించినట్లు రాజకీయ వర్గాల్లో హాట్టాపిక్ చర్చ జరుగుతోంది. ఇది కోటంరెడ్డికి జరిగిన ఘోర పరాభవంగా భావిస్తున్నారు. ఇటీవల కాలంలో నెల్లూరు మేయర్ స్థానం విషయమై ఇటు మంత్రి నారాయణ, అటు వేమిరెడ్డి దంపతులతో విభేదించిన శ్రీధర్రెడ్డిని రాజకీయంగా ఒంటరిని చేసి అణచివేసేందుకే అనే ప్రచారం కూడా లేకపోలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో శ్రీధర్రెడ్డి లోకేశ్ పర్యటనలో పాల్గొంటారా? ముఖం చాటేస్తారా? అనే విషయంపై చర్చ నడుస్తోంది. బోసిపోయిన ఎమ్మెల్యే కార్యాలయం లోకేశ్ పర్యటన పర్యటన నేపథ్యంలో హడావుడి చేసిన కోటంరెడ్డి క్యాడర్ ఆఖరి క్షణంలో మార్పు చేయడంపై భగ్గుమంటుంది. నెల్లూరు రూరల్ పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తలు రచ్చరచ్చ చేయడంతో వారిని నాయకులు సముదాయించే ప్రయత్నం చేశా రు. జరిగిన అవమానం, క్యాడర్ ఒత్తిడిని తట్టుకోలేక శ్రీధర్రెడ్డి తన కార్యాలయం నుంచి నిష్క్రమించారు. హడావుడిగా కనిపించిన ఎమ్మెల్యే కార్యాలయ ప్రాంతంలో క్యాడర్ సైతం ముఖం చాటేయడంతో బోసిపోయింది. కోటంరెడ్డి ఇక ఒంటరేనా? రాజకీయంగా కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఒంటరి కావడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైఎస్సార్సీపీ అండతో ఎదిగిన కోటంరెడ్డి తన బలంగా భ్రమించారు. అడ్డగోలుగా చెలరేగిపోతున్న ఆయన్ను కట్టడి చేసిన నేపథ్యంలో తనకు రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్సార్సీపీని దూషిస్తూ పచ్చ కండువా కప్పుకొ న్నారు. అప్పటి నుంచి మాజీ సీఎం జగన్మోహన్రెడ్డిపై స్థాయిని మరిచి తరచూ ప్రేలాపణలతో చెలరేగిపోయారు. తాజాగా దగా డీఎస్సీపైనా లోకేశ్ను వెనకేసుకు వస్తూ ఇష్టారీతిన మాట్లాడారు. అప్పటి వరకు కోటంరెడ్డిని అభిమానించిన ఆ పార్టీ శ్రేణులు సైతం ఈ పరిణామాలతో ఛీదరించుకునే పరిస్థితికి దిగజారిపోయాడు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులను, శ్రేణులను సైతం బెదిరించి ఇదే తన బలమంటూ.. పేట్రేగిపోతున్నారు. తాజా పరిణామాలతో కోటంరెడ్డికి అధికార పార్టీలో కనీస స్థాయి పలుకుబడి లేదని స్పష్టం కావడంతో క్యాడర్ సైతం మౌనం.. గుంభనంగా వ్యవహరిస్తున్నారు. ఇదీ చదవండి: టీడీపీ ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు.. హెచ్-1బీ వీసాల పేరుతో.. -
డీఎస్సీ అక్రమాలపై పోరాటం ఉధృతం.. 21న భారీ నిరసనకు YSRCP పిలుపు..
-
గన్మెన్తో చెలరేగుతున్నటీడీపీ నాయకులు
సాక్షి ప్రతినిధి, కడప/పులివెందుల రూరల్: వైఎస్సార్ కడప జిల్లాలో అధికార టీడీపీ నేతలకు అడిగిందే తడవుగా చంద్రబాబు ప్రభుత్వం గన్మెన్ను కేటాయించడంతో, వారిని అడ్డుపెట్టుకొని నాయకులు చెలరేగిపోతున్నారు. ఒకరూ ఇద్దరూ కాదు.. ఏకంగా 25 మంది గన్మెన్ను ఇచ్చేంత పెద్ద అధికార హోదా లేని చోటా మోటా నాయకులు కూడా గన్మెన్ను వెంటేసుకొని తిరుగుతూ పట్టణంలో దందాలు, జూదం, దాడులతో అరాచకం సృష్టిస్తున్నారు. ఇటీవల తుమ్మలపల్లెకు చెందిన ఓ టీడీపీ నాయకుడు తన గన్మేన్తో గ్రామంలోని వైఎస్సార్సీపీ నాయకులపైన దాడికి దిగగా.., సోమవారం మరోసారి టీడీపీ నేత గన్మేన్ కాల్పులు జరపడం పట్టణ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జి బీటెక్ రవి వర్గంలోని రెండు గ్రూపులు సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఒకరిపై ఒకరు దాడులకు తెగబడ్డాయి. వినాయక ఉత్సవాల్లో వివాదం పట్టణంలోని మైత్రి లేఅవుట్లో టీడీపీ నాయకుడు పుష్పనాథరెడ్డి ఆధ్వర్యంలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం జరిగిన వినాయక చవితి ఉత్సవాల్లో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి బీటెక్ రవి, ఇతర నాయకులను సన్మానించారు. అక్కడే ఉన్న మరో టీడీపీ నాయకుడు అక్కులగారి విజయ్కుమార్రెడ్డిని సన్మానించలేదు. దీంతో పుష్పనాథరెడ్డి, విజయకుమార్ రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఆ తర్వాత పుష్పనాథరెడ్డి, తొండూరు మండలానికి చెందిన మల్లికార్జునరెడ్డి, కొత్తపల్లె మాజీ సర్పంచ్ ప్రసాద్, గంగాధరరెడ్డి, మంజునాథరెడ్డి ఓ బీజేపీ నాయకుడి ఇంటికి వెళ్లారు. విజయ్కుమార్ రెడ్డికి ఫోన్ చేసి అక్కడికి రమ్మన్నారు. విజయ్కుమార్ రెడ్డి అక్కడికి వెళ్లగా రెండు వర్గాల మధ్య మళ్లీ ఘర్షణ జరిగి, చెప్పులతో కొట్టుకొన్నారు. దీంతో ‘నీ ఇల్లు కూల్చేస్తాను’ అని పుష్పనాథ్ రెడ్డిని విజయ్కుమార్ రెడ్డి హెచ్చరించి వెళ్లిపోయాడు. దీంతో పుష్పనాథరెడ్డి రాత్రి 10.30 గంటల తర్వాత వంద మందితో విజయ్కుమార్రెడ్డి ఇంటికి వెళ్లి హజ్ కమిటీ డైరెక్టర్ మహబూబ్ బాషా, టీడీపీ నాయకుడు భాస్కర్రెడ్డిపై దాడి చేశారు. రాళ్లు, కర్రలతో ఇంటి ముందు ఉన్న మూడు కార్లను ధ్వంసం చేశారు. ఇదే సమయంలో హజ్ కమిటీ డైరెక్టర్ మహబూబ్ బాషా గన్మేన్ రబ్బాని గాలిలోకి కాల్పులు జరిపాడు. పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ భారీ పోలీసు బలగాలతో అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టాల్సి వచ్చింది. ఈ ఘర్షణపై ఇరు వర్గాలకు చెందిన పుష్పనాథరెడ్డి, మల్లికార్జునరెడ్డి, ప్రసాద్, గంగాధరరెడ్డి, మంజునాథరెడ్డితోపాటు అక్కులగారి విజయ్కుమార్రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. వాస్తవానికి అక్కడ ఉన్న ఏ ఒక్క నాయకుడికీ చట్ట ప్రకారం గన్మెన్ను ఇచ్చే హోదా లేదు. అంతకుమించిన ప్రాణముప్పు కూడా లేదని పరిశీలకులు చెబుతున్నారు. కానీ, పుష్పనాథరెడ్డి, విజయ్కుమార్ రెడ్డి సహా అక్కడున్న అందరికీ ప్రభుత్వం గన్మెన్ను ఇచ్చింది.ముప్పున్న వైఎస్సార్సీపీ నేతలకు రక్షణ కరవు.. కోర్టు ఆదేశాలూ బేఖాతరు మరోవైపు వైఎస్సార్సీపీలో నిజంగా ప్రాణాలకు ముప్పు ఉన్న నాయకులకు రక్షణ కరువైంది. వైఎస్సార్సీపీ నాయకునికి గన్మెన్ ఇవ్వాలన్న హైకోర్టు ఆదేశాలనూ పోలీసులు బేఖాతరు చేశారు. వైఎస్సార్సీపీకి చెందిన వేల్పుల రామలింగారెడ్డి (రాము)పై టీడీపీ నాయకులు హత్యాయత్నం చేయడంతో తనకు రక్షణ కల్పించాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తనపై జరిగిన దాడిలో తగిలిన గాయాలు, ఇతర బలమైన ఆధారాలను హైకోర్టుకు సమరి్పంచారు. వాటన్నింటినీ పరిశీలించిన హైకోర్టు.. రాముకు తక్షణమే గన్మెన్ను కేటాయించాలని కడప జిల్లా పోలీసులను ఆదేశించింది. అయినా, కడప జిల్లా పోలీసు అధికారులు రామలింగారెడ్డికి గన్మెన్ను ఇవ్వలేదు. ఇలా నిజమైన బాధితులకు రక్షణ నిరాకరిస్తూ, ఎలాంటి ప్రాణహాని లేని టీడీపీ నాయకులకు ప్రభుత్వం గన్మెన్ను కేటాయించడం పట్ల పులివెందుల వాసులు మండిపడుతున్నారు. -
డీఎస్సీ స్కామ్కు బాధ్యత వహిస్తారా? లేదా?
సాక్షి, అమరావతి: డీఎస్సీ స్కామ్కు బాధ్యత వహిస్తారా.. లేదా? అని ముఖ్యమంత్రి చంద్రబాబును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నియామక ప్రక్రియ మీద విశ్వసనీయత పోతే నిరుద్యోగుల కలల రెక్కలు విరిగిపోతాయన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘లక్షల మంది అభ్యర్థులు న్యాయమైన అవకాశం కోసం తమ జీవితంలో అత్యంత విలువైన కాలాన్ని ఈ పరీక్షల కోసం వెచ్చిస్తారు. కష్టపడి చదివి నిజాయితీగా ఉద్యోగం పొందడం కోసం వారి కుటుంబాలు కష్టపడి సంపాదించిన డబ్బును కూడా వెచ్చిస్తారు. కానీ, వ్యవస్థ విఫలమై దానిని నిరాశ పరిచినప్పుడు, దాని ప్రభావం కేవలం ఫలితాలపైనే కాదు.. మొత్తం నియామక ప్రక్రియపైనే అభ్యర్థులకు ఉండే నమ్మకం పోతుంది. చివరకు వారు తీవ్ర నిరాశకు గురవుతారు. చంద్రబాబూ.. న్యాయంగా పరీక్షలు నిర్వహించి, అర్హులకు అవకాశం ఇవ్వడం అన్నది మీ ఇష్టాయిష్టాలు కావు. అది ప్రభుత్వం బాధ్యత. వాళ్లు పడిన కష్టానికి న్యాయం చేయాలన్న బాధ్యత, జవాబుదారీతనం అవసరమని మీకు అనిపించడం లేదా? ప్రస్తుతం బయట పడిన డీఎస్సీ కుంభకోణానికి మీరు బాధ్యత వహిస్తారా.. లేదా?’ అని వైఎస్ జగన్ ఆ పోస్టులో చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. -
గుంటూరు పోలీసులకు ఎక్స్ మొట్టికాయలు!
గుంటూరు: ప్రతిపక్ష వైఎస్సార్సీపీ అనుకూల సోషల్ మీడియా అకౌంట్ల నిలిపివేత వెనుక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎక్స్ పూర్వపు హ్యాండిల్ ట్విట్టర్కు తప్పుడు సమాచారం ఇచ్చి మరీ సోషల్ మీడియా అకౌంట్లను నిలిపివేయడం సంచలనంగా మారింది. దీనంతటికి కారణం ఏపీలోని గుంటూరు పోలీసులేనని విషయం తేటతెల్లమైంది. ఎఫ్బీఐ పేరుతో ఎక్స్ కు ఫిర్యాదు చేసి గుంటూరు పోలీసులు బ్లాక్ చేయించారనే విషయం బయటపడింది. ఎలాగైనా ప్రతిపక్ష సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయించాలనే కుట్రతో ఎఫ్బీఐ పేరు వాడినట్లు తేలింది. దీనిపై ఏపీ పోలీసుల్ని ఎక్స్ సైతం ప్రశ్నించింది. అసలు ఏం జరిగిందంటే.. Tent politics పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు గుంటూరు పోలీసులు. ఇందుకు ఎఫ్బీఐ పేరును వాడుకున్నారు. ‘మీరు పెట్టిన పోస్ట్ను తొలగించాలంటూ’ Tent politicsకు అమెరికాలోని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పంపినట్టు మెయిల్ పంపారు గుంటూరు పోలీసులు. అయితే ఇది నిజమో కాదో తెలుసుకోవడానికి టెంట్ పాలిటిక్స్.. ఎక్స్ లీగల్ సపోర్ట్ టీమ్కు మెయిల్ చేసింది. అయితే ఫెడరల్ బ్యారో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నుంచి ఈ-మెయిల్ రాలేదని తేల్చింది ఎక్స్. దీనిపై గుంటూరు పోలీసులకు మొట్టికాయలు వేసింది ఎక్స్. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పంపినట్టు ఎలా మెయిల్ పంపారని గుంటూరు పోలీసులను ఎక్స్ ప్రశ్నించింది. ఇదీ చదవండి: ఏపీలో మరో రిక్రూట్మెంట్లో గోల్మాల్! -
ఆళ్ల నాని మృతిపై బొత్స ఎమోషనల్ కామెంట్స్
-
డీఎస్సీలో అక్రమాలపై పోరాటం ఉధృతం.. 21న భారీ నిరసన
తాడేపల్లి: డీఎస్సీలో అక్రమాలపై నిరసనలకు వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. ఈ నెల 21న విజయవాడ శాప్ ఆఫీస్ వద్ద వైఎస్సార్సీపీ నిరసన చేపట్టనుంది. దీనిపై మంగళవారం తాడేపల్లిలో మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు.‘‘డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్సీపీ అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై పోరాటం కొనసాగిస్తాం. 21న ఉదయం 10 గంటలకు శాప్ ఆఫీసు ఎదుట నిరసన చేస్తాం. 16 వేల పోస్టులతో డీఎస్సీ అంటూ దగా చేశారు. స్పోర్ట్స్ కోటాను 2 నుంచి 3 శాతానికి పెంచి అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారు. అర్హులకు అన్యాయం జరిగింది.ఉద్యోగం వచ్చిన వారు కూడా మాకు ఎందుకు ఉద్యోగం వచ్చిందో తెలీదంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో కచ్చితంగా న్యాయ విచారణ జరపాలి. కానీ ప్రభుత్వం ఆపని చేయకపోవడం బాధాకరం. పేపర్ లీక్ జరిగింది, స్పోర్ట్స్ కోటాలో అన్యాయం జరిగింది. అందుకే నేరుగా శాప్ ఆఫీసుకు వెళ్లి నిరసన తెలుపుతున్నాం.డీఎస్సీ అక్రమాలను అధికారుల మీదకు నెట్టేసే కార్యక్రమం చేస్తున్నారు. అధికారులను బలి చేయటానికూడా రెడీ అవుతారు. నారా లోకేశ్ కాకుండా ఇంకో మంత్రి ఉన్నట్లయితే ఇప్పటికే రాజీనామా చేయించే వారు. ఏ ఎస్సీనో. బీసీ మంత్రో అయితే బలి చేసేవారు. లోకేశ్ని కాపాడటానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.డీఎస్సీ అనగానే ప్రభుత్వం భయపడుతోంది. డీఎస్సీపై ఎవరు మాట్లాడినా ఆ వీడియోలను తొలగిస్తున్నారు. టీవీ ఛానల్లో చూపిస్తే ఆ ఛానల్ల ప్రసారాలను ఆపేస్తున్నారు. ఏం చేసినా బాధితుల తరఫున పోరాడుతాం. ప్రతి ఏటా ఉద్యోగాలు ఇవ్వటం సంగతి తర్వాత చూద్దాం. ముందు ఈ డీఎస్సీలో అక్రమాలపై విచారణ జరపాలి.లోకేశ్ పాదయాత్రలో పాల్గొన్న వారికి ఉద్యోగాలు ఇచ్చేస్తారా? మరి అర్హుల సంగతి ఏంటి? డీఎస్సీ దొంగ.. నారా లోకేశ్. పోలీసులను అడ్డు పెట్టుకుని ఉద్యమాలను అణచివేయలేరు’’ అని అంబటి రాంబాబు హెచ్చరించారు.ఇదీ చదవండి: ఏపీలో మరో రిక్రూట్మెంట్లో గోల్మాల్! -
ఆళ్లనాని మృతిపై వైఎస్సార్సీపీ నేతల దిగ్భ్రాంతి
సాక్షి, విశాఖపట్నం: మాజీ మంత్రి ఆళ్లనాని మృతిపై వైఎస్సార్సీపీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఆళ్లనాని మరణవార్త తనను తీవ్రంగా కలచివేసిందని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త విని కలత చెందానని ఆ వార్తతో తాను శోక సముద్రంలో మునిగిపోయామన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ.. భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.ఆళ్ల నాని కుటుంబ సభ్యులకు మాజీ మంత్రులు కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాసరావు తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నామని తెలిపారు . మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని భౌతిక దేహానికి విశాఖపట్నం వైఎఎస్సార్సీపీ అధ్యక్షులు కేకే రాజు నివాళులర్పించారు.కాగా మాజీ మంత్రి ఆళ్ల నాని(57) గుండెపోటుతో ఈ రోజు (మంగళవారం) విశాఖ నివాసంలో కన్నుమూశారు. ఏలూరు నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన ఆయన.. వైఎస్సార్సీపీ హయాంలో వైద్యారోగ్య శాఖ మంత్రిగా పని చేశారు. ఏలూరు రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న నేత ఆళ్ల నాని(ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్). కాంగ్రెస్ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన.. 2004, 2009 ఎన్నికల్లో ఏలూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం వైఎస్సార్సీపీలో చేరి 2019లో మళ్లీ ఏలూరు నుంచి విజయం సాధించారు.వైఎస్ జగన్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంతో పాటు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా కీలక బాధ్యతలు చేపట్టారు. కోవిడ్ సమయంలో ఆరోగ్యశాఖ మంత్రిగా ఆయన పాత్ర కూడా చర్చనీయాంశమైంది. ఏలూరు రాజకీయాల్లో ఆళ్ల నాని రాజకీయ ప్రస్థానం ఓ ప్రత్యేక అధ్యాయంగా నిలిచింది. ఆయన మృతి పట్ల పలువురు వైఎస్సార్సీపీ నేతలు, పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.ఇది చదవండి: మాజీ మంత్రి ఆళ్ల నాని హఠాన్మరణం -
ఆళ్ల నాని మృతి పట్ల YS జగన్ దిగ్భ్రాంతి
-
ఆళ్ల నాని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు
-
ఆళ్ల నాని మృతి పట్ల వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
తాడేపల్లి: మాజీ మంత్రి ఆళ్ల నాని మృతి పట్ల వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాని మృతి తనను తీవ్రంగా కలిచివేసిందని చెప్పారు. నాని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని అన్నారు. ఈ కష్టకాలంలో వారికి ధైర్యాన్ని ప్రసాదించాల్సిందిగా దేవుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఆళ్ల నాని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని అన్నారు. కాగా, మాజీ మంత్రి ఆళ్ల నాని (57) మంగళవారం విశాఖ నివాసంలో గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన ఏలూరు నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గత వైఎస్సార్సీపీ సర్కారులో డిప్యూటీ సీఎంతో పాటు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. -
Big Breaking : మాజీ మంత్రి ఆళ్ల నాని మృతి
-
మాజీ మంత్రి ఆళ్ల నాని హఠాన్మరణం
సాక్షి, ఏలూరు: ఏపీ రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మాజీ మంత్రి ఆళ్ల నాని(57) గుండెపోటుతో మంగళవారం విశాఖ నివాసంలో కన్నుమూశారు. ఏలూరు నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన ఆయన.. వైఎస్సార్సీపీ హయాంలో వైద్యారోగ్య శాఖ మంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే. ఏలూరు రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న నేత ఆళ్ల నాని(ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్). కాంగ్రెస్ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన.. 2004, 2009 ఎన్నికల్లో ఏలూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం వైఎస్సార్సీపీలో చేరి 2019లో మళ్లీ ఏలూరు నుంచి విజయం సాధించారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంతో పాటు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా కీలక బాధ్యతలు చేపట్టారు. కోవిడ్ సమయంలో ఆరోగ్యశాఖ మంత్రిగా ఆయన పాత్ర కూడా చర్చనీయాంశమైంది. ఏలూరు రాజకీయాల్లో ఆళ్ల నాని రాజకీయ ప్రస్థానం ఓ ప్రత్యేక అధ్యాయంగా నిలిచింది. ఆయన మృతి పట్ల పలువురు వైఎస్సార్సీపీ నేతలు, పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. -
చంద్రబాబు ఎలాంటివాడో నా కంటే వంశీకే బాగా తెలుసు కొడాలి నాని సెటైర్లు అదుర్స్
-
DSCఅక్రమాలపై మరోసారి బాబుపై జగన్ ప్రశ్నల వర్షం
-
జగన్ పర్యటనలో ఆ జనాన్ని చూస్తే నాకు.. సాకే శైలజానాథ్ రియాక్షన్
-
త్వరలోనే వంశీ విశ్వరూపాన్ని చూస్తారు వల్లభనేని వంశీ పై పేర్ని నాని కామెడీ
-
పండుగ రోజు గుడ్ న్యూస్ క్రీడాకారులకు జగన్ అభినందనలు
-
ఫ్రీ హోల్డ్ భూముల పేరుతో కూటమి రైతుల జీవితాలతో చెలగాటం
-
చేసిందే వెధవ పని.. సిగ్గు లేకుండా మళ్ళీ ప్రెస్ మీట్
-
జగన్ పాదయాత్రపై చింతమనేని సవాల్ అబ్బయ్య చౌదరి అదిరిపోయే కౌంటర్
-
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు వైభవంగా నిర్వహించారు. వినాయకుని విగ్రహానికి పార్టీ నేతలు ప్రత్యేక పూజలు చేశారు. పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు కల్పలతారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు హాజరయ్యారు.రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు.. విజయాలను ప్రసాదించే సిద్ధివినాయకుడి కృపాకటాక్షాలు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. -
వైఎస్ జగన్ అడిగింది లోకేష్కు అర్థం కాలేదా?
ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ చర్చల సవాళ్లను వదలి, ఇక బెదిరింపుల పర్వంలోకి వచ్చినట్లు కనిపిస్తుంది. ఎంత షాడో ముఖ్యమంత్రి అనిపించుకుంటున్నప్పటికీ లోకేష్ వ్యాఖ్యలు దుందుడుకుతనంగా ఉండడం బాగోలేదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా నిర్దిష్టమైన అభియోగాలతో, ఆధారాలతో డీఎస్సీలో జరిగిన అక్రమాలపై ప్రెస్మీట్లో మాట్లాడారు. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో పరీక్షలు రాయకుండానే ఉద్యోగాలు పొందిన వైనం, కొందరు నకిలీ ధృవీకరణ పత్రాలు సమర్పించడం తదితర విషయాలను జగన్ ప్రస్తావించారు.దానికి సమాధానంగా లోకేష్ ఏమి మాట్లాడారో చూడండి. డీఎస్సీపై జగన్ విషం కక్కుతున్నారట. వారి ఉపాధ్యాయుల జోలికి వస్తే చర్యలు తప్పవట. నియామకాలు ఆపాలని 300 కేసులు వేసినా కోర్టు తప్పుపట్టలేదట. డీఎస్సీకి, ఏపీపీఎస్సీ తేడా తెలుసా అని మరోసారి జగన్ను లోకేష్ పిచ్చి ప్రశ్న వేశారు. ఇక్కడే ఈయన బలహీనత తెలిసిపోతుంది. జగన్ అడుగుతున్నదేమిటి? లోకేష్ చెబుతున్నదేమిటి? కోర్టులు డీఎస్సీలో అక్రమాలు జరగలేదని ఎక్కడ చెప్పాయో తెలియదు. మీ పత్రిక విలేకర్లు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి ఉపాధ్యాయులను ఒత్తిళ్లకు గురి చేస్తున్నారని, కొన్ని చోట్ల దాడులు చేస్తున్నారని, దారుణమైన ఆరోపణ చేశారు.నిజంగా అలాంటిది ఒక్కటి జరిగినా ఈపాటికి ఎన్ని కేసులు పెట్టి ఉండేవారో కదా! రెడ్ బుక్ పేరుతో ఎంతమందిపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టించింది ప్రజలకు తెలియదా! టీచర్ల జోలికి ఎవరు వెళ్ళారు? ఎవరు దాడులు చేశారు? టీచర్లను రెచ్చగొట్టి ఏవైనా తప్పుడు కేసులు పెట్టించి, ప్రశ్నించే మీడియాను భయపెట్టడం ద్వారా డీఎస్సీ స్కామ్ వివరాలు బయటకు రాకుండా చూడాలన్నది మంత్రిగారి ఉద్దేశం ఏమో తెలియదు. కాని ఆ వ్యూహం అన్నిసార్లు పనిచేయదు కదా!స్పోర్ట్స్ కోటా అవకతవకల గురించి అడుగుతుంటే, వివరణ ఇవ్వకుండా టీచర్ల ఎంపిక మొత్తాన్ని వైఎస్సార్సీపీ తప్పుపడుతున్నట్లు లోకేష్ ప్రకటన చేయడం ఏమిటి? పనిలో పని స్కిల్ స్కామ్లో చంద్రబాబుకు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని కూడా చెప్పారు. కోర్టులో అసలు కేసే విచారణ లేకుండా చేసుకుని, ఇలా క్లీన్ చిట్ అని మాట్లాడడం ప్రజలను ఫూల్స్ను చేయడం కాదా? లోకేష్ చెబుతున్నట్లు డీఎస్సీపై జగన్ విషం కక్కలేదు. పరీక్షలలో జరిగిన అక్రమాలపై నిలదీస్తున్నారు. ఈ అక్రమాలు అర్హులైన కొందరు అభ్యర్ధుల పాలిట విషతుల్యంగా మారాయని చెప్పారు.అది ప్రభుత్వానికి కంటగింపుగా మారింది. అసలు పరీక్షలు రాయకుండానే టీచర్ పోస్టులు ఇవ్వాలని జీఓలు ఇవ్వడం, ఆ తర్వాత పని పూర్తి అయ్యాక పరీక్షలు లేకుండా టీచర్ల ఎంపిక జరగరాదని ఉత్తర్వులు ఇవ్వడం నిజమా? కాదా? ప్రశ్న పత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ ఒక వ్యక్తి చేతిలోనే ఎందుకు పెట్టారు? అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంకు వస్తే ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? స్పోర్ట్స్ కోటాలో 372 మందికి పరీక్ష లేకుండానే పోస్టులు ఇచ్చి, తదుపరి గేట్లు మూసేశారా?లేదా? అసలు క్రీడలే జరగలేదు కాని, కొందరు అందులో భాగస్వాములైనట్లు నకీలీ సర్టిఫికెట్లు తెచ్చారా? లేదా? అధికారులు మీడియా అడిగిన ప్రశ్నలకు నీళ్లు నమిలే పరిస్థితిని ఎదుర్కుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్లు వారు అధ్బుతంగా సమాధానం చెప్పారని ఎందుకు ప్రచారం చేస్తున్నారు?అక్రమాలు జరిగాయని అధికారులు ఒప్పుకున్నారని వైఎస్ జగన్ అంటున్నారు. విజిలెన్స్ విచారణ జరుగుతుందని ఒకసారి, పరీశీలిస్తామని మరోసారి, తమకు కుల సర్టిఫికెట్లతో సంబంధం లేదని, రెవెన్యూ శాఖ పరిధిలోనివని ఇంకొకసారి అధికారులు చెప్పారా? లేదా? అధికారులు ఏడుసార్లు వెరిఫై చేశామని అన్నారు. అయినా ఇన్ని ఇన్ని అవకతవకలు ఎలా జరిగాయి? అవన్ని బయటకు వచ్చాయి కదా! ఇవన్ని ఎందుకు! జగన్ వేసిన ప్రశ్నలకు వరసగా జవాబులు ఇవ్వగలిగితే సరిపోతుంది కదా!ఇదీ చదవండి: క్రెడిట్ వెనుక కాంట్రవర్సీ.. లోకేష్కు అగ్నిపరీక్ష!అభ్యర్థులు పలువురు తమకు అన్యాయం జరిగిందని, ఆధారాలతో సహా మీడియాకు చెబుతున్నారే! వారిని అధికారులు పిలిచి ఎందుకు విచారణ చేయడం లేదు?వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయడానికే భయపడుతన్నట్లు కనిపించడం లేదా! పరీక్షలు లేకుండా టీచర్ల పోస్టులు ఏమిటని వేరే కేసులో సుప్రింకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వం చూడలేదా? కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ డీఎస్సిలో తప్పు జరగలేదని చెబుతూనే మొత్తం ప్రక్రియ అంతా అధికారులే చేశారని చెప్పడంలో ఆంతర్యం ఏమిటి? ఊహించినట్లుగానే ఈ మొత్తం ఎపిసోడ్ను అధికారుల మీద నెట్టివేయడం కాదా? అంతకుముందు లోకేష్ను అభినందిస్తున్నానని పలు సభలలో చెప్పిన చంద్రబాబు ఈసారి అధికారుల ప్రస్తావన ఎందుకు తెచ్చారు?పవన్ కళ్యాణ్ ఉద్యోగ పత్రాల పంపిణీ కార్యక్రమంలో లేకపోయినా ఎందుకు ఆయన కూడా ఉన్నట్లు చెప్పుకోవల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఎందుకు దీనిపై స్పందించ లేదు? జనసేన, టీడీపీ మధ్య డీఎస్సీ అక్రమాలపై సోషల్ మీడియాలో విమర్శలు, ప్రతి విమర్శలు జరిగాయా? లేదా? వాటిని అదుపు చేయడానికి రెండు పార్టీలు ప్రయత్నించాయా?లేదా? అసలు ఏ తప్పు లేకపోతే సాక్షి మీడియాను నియంత్రించాలని ఎందుకు చూస్తున్నారు. సాక్షి, వైఎస్సార్సీపీ సోషల్ మీడియాతో పాటు, కొంతమంది స్వతంత్రంగా వీటిపై చేసే విశ్లేషణల వీడియోలను పోలీసుల ద్వారా ఎందుకు తొలగింపచేస్తున్నారు? డీఎస్సీ స్కామ్పై సాక్ష్యాలతో సహా కథనాలు ఇచ్చిన ఒక ప్రముఖ టీవీకి చెందిన సంపాదకుడు ఎందుకు రాజీనామా చేశారన్న చర్చ జరుగుతోందా? లేదా?ఇవన్ని గమనిస్తే డీఎస్సీలో ప్రభుత్వం తప్పు చేసిందన్న అభిప్రాయం బలపడడం లేదా? ప్రభుత్వానికి ఎల్లో మీడియా ఎంత వంత పాడుతున్నా, టీచర్ల పేరుతో ర్యాలీలు తీయించినా, డీఎస్సీ అక్రమాల వల్ల నష్టపోయిన అభ్యర్థులు వెనక్కి తగ్గడం లేదు కదా! అన్నిటిని మించి జగన్ చేసిన ఒకే ఒక్క సవాల్.. ఏపీపీఎస్సీ, డీఎస్సీ రెండింటిపైన సీబీఐ విచారణ జరపాలన్నదానిపై ఎందుకు నోరు మెదపడలేకపోతున్నారు?తన పదవికి ఎక్కడ ముప్పు వస్తుందో అని లోకేష్ భయపడుతున్నట్లు అవడం లేదా? విషం కక్కారా? లేక అమృతం తాగారా? అన్నది కాదు సమస్య. అక్రమాలు జరిగాయా? లేదా? అన్నది తేల్చాలా? ఆ ధైర్యం చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నారు? మొదట బుకాయింపు, ఆ తర్వాత తడబాటు, తదుపరి సెంటిమెంట్, ఇప్పుడు భయంతో డబాయింపు, కేసుల బెదిరింపు, మొత్తం అధికారులపై నెట్టేసి కుమారుడిని రక్షించే యత్నం... ఇవన్ని ఏమి చెబుతున్నాయి. అన్ని వేళ్లు లోకేష్ వైపు చూపుతున్నాయని జగన్ చెబుతున్నది వాస్తవమే అనిపించదా!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
విఘ్నేశ్వరుడి కృప ప్రజలందరిపై ఉండాలి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు, విజయాలను ప్రసాదించే సిద్ధివినాయకుడి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఈ పవిత్ర పర్వదినాన్ని రాష్ట్ర ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. వినాయకుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని వైఎస్ జగన్ కోరుకున్నారు. ఈ మేరకు ఈ ఉదయం ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారాయన. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు, విజయాలను ప్రసాదించే సిద్ధివినాయకుడి కృపాకటాక్షాలు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.#GaneshChaturthi— YS Jagan Mohan Reddy (@ysjagan) September 14, 2026అంతకు ముందు.. ఓ సందేశంలో రాష్ట్ర ప్రజలందరికీ ముందుగానే వైఎస్ జగన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. గణనాథుని ఆశీస్సులు ఉండాలని, క్షేమ, స్థైర్య, ఆయురారోగ్యాలు, సకల సంపదలు సిద్ధించాలని, సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. ఏ కార్యం తలపెట్టినా మహాగణనాధుడిని ముందుగా పూజిస్తామని, అలా ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మంచి పనులకు విఘ్నాలు తొలగిపోతాయని గుర్తు చేశారు. ఈ వినాయకచవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలూ కలగాలని, విజయాలు సిద్ధించాలని, ఇంకా గణనాథుని కరుణా కటాక్షాలతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని వైఎస్ జగన్ అభిలషించారు.ఇదీ చదవండి: ప్రపంచాన్ని చుట్టేసిన వినాయకుడు -
ఒక టీచర్ పోస్టు.. ఆరు మలుపులు!
సాక్షి, అమరావతి: ఒక ఉపాధ్యాయ పోస్టు నియామకంపై అధికారుల వివరణలు మారుతున్నాయని, ప్రతి కొత్త వివరణ టీచర్ అభ్యర్థుల్లో మరిన్ని ప్రశ్నలు రేకెత్తిస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. ఆ పోస్టుకు సంబంధించిన టెట్ మార్కులు, ఏడు దశల అర్హత పరిశీలన, డీఈవో ప్రకటన, అభ్యర్థి మళ్లీ టెట్ రాయడం వంటి అంశాలను వరుసగా ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబును నిలదీశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆదివారం వైఎస్ జగన్ పోస్టు చేశారు.తొలి మలుపు: 65 మార్కులతో ఏడు దశల పరిశీలన అభ్యర్థికి 65 టెట్ మార్కులు ఉన్నట్లు చూపించి, ఏడు దశల పరిశీలన అనంతరం ఉపాధ్యాయ పోస్టు ఇచ్చారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. అన్ని దశలు పూర్తయిన తర్వాతే నియామకం జరిగిందని చెబుతున్నప్పుడు, ఆ పరిశీలనలో అభ్యర్థి అర్హతను ఎలా నిర్ధారించారో వెల్లడించాలని ప్రశ్నించారు. రెండో మలుపు: అనర్హుడని డీఈవో ప్రకటన అదే అభ్యర్థి అనర్హుడని డీఈవో నిర్ధారించినట్లు వైఎస్ జగన్ తెలిపారు. అర్హత లేకపోతే ఏడు దశల పరిశీలనలో ఆ విషయం ఎందుకు బయటపడలేదని నిలదీశారు. ‘‘ఆ ఏడు దశల్లో అసలు ఏం వెరిఫై చేశారు?’’ అన్నది టీచర్ అభ్యర్థులకు సమాధానం చెప్పాల్సిన ప్రశ్న అని పేర్కొన్నారు.మూడో మలుపు: ఉద్యోగం ఎలా వచ్చిందో అభ్యర్థికే తెలియదా? తనకు ఉద్యోగం ఎలా వచ్చిందో తెలియదని సదరు అభ్యర్థే చెప్పినట్లు వైఎస్ జగన్ ప్రస్తావించారు. నియామకం పొందిన అభ్యర్థి నుంచి కూడా అలాంటి సమాధానం వచ్చిందంటే, పోస్టు భర్తీ ప్రక్రియపై తలెత్తిన సందేహాలను అధికారులు నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు.నాలుగో మలుపు: తెరపైకి 2018 టెట్ 77 మార్కులు తాజాగా అధికారులు మరో వివరణ ఇచ్చారని, అభ్యర్థి 2018లో రాసిన టెట్లో 77 మార్కులు సాధించినట్లు ధ్రువీకరించారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఆ మార్కులు అప్పటి నుంచే రికార్డుల్లో ఉంటే నియామక సమయంలో ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. 77 మార్కులతో అర్హత ఉందని ఇప్పుడు చెబుతున్నప్పుడు ముందుగా అనర్హుడని డీఈవో ఎందుకు ప్రకటించారని అడిగారు. ఈ వివరణ ప్రశ్నలు లేవనెత్తిన తర్వాతే ఎందుకు వచ్చిందని నిలదీశారు. ఐదో మలుపు: ఎస్జీటీ పోస్టుకు ‘రాంగ్ పేపర్’? 77 మార్కులు పేపర్ 2బీలో వచ్చినవిగా చెబుతున్నారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. అది స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్కు సంబంధించిన పేపర్ కాగా, ఎస్ జీటీ పోస్టుకు పేపర్–1ఏ అవసరమని గుర్తు చేశారు. ఈ పరిస్థితిలో అభ్యర్థి ఏడు దశల అర్హత పరిశీలనను ఎలా దాటారని ప్రశ్నించారు.ఆరో మలుపు: ఉద్యోగం వచ్చాక మళ్లీ టెట్ ఎందుకు? ఉద్యోగం పొందిన తర్వాత కూడా అభ్యర్థి 2025లో మళ్లీ టెట్ రాసినట్లు వైఎస్ జగన్ పేర్కొన్నారు. 2018లో సాధించిన 77 మార్కులే ఎస్జీటీ పోస్టుకు అర్హత కల్పించాయని అధికారులు చెబుతున్నట్లయితే, అభ్యర్థి మరోసారి టెట్కు హాజరు కావాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు సమాధానం చెప్పాలి ఒకే పోస్టుపై వరుసగా వస్తున్న ఈ వివరణల మధ్య నియామక ప్రక్రియను నిష్పాక్షికంగా, పారదర్శకంగా జరిగిందని ఎలా చెప్పగలరని సీఎం చంద్రబాబును జగన్ ప్రశ్నించారు. ఈ వ్యవహారం డీఎస్సీ కుంభకోణానికి దారితీయలేదా అని నిలదీస్తూ, దీనికి నైతిక బాధ్యత వహించరా అని నిలదీశారు. అభ్యర్థుల సందేహాలను తీర్చేలా మార్కులు, వర్తించే టెట్ పేపర్, అర్హత పరిశీలనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. -
బీసీలకు చంద్రబాబు వెన్నుపోటు
సాక్షి, రాజమహేంద్రవరం/రాజమహేంద్రవరం రూరల్: బీసీలను సీఎం చంద్రబాబు ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తూ, వారికి వెన్నుపోటు పొడుస్తున్నారని వైఎస్సార్సీపీ బీసీ నేతలు ధ్వజమెత్తారు. వెన్నుపోటు పార్టీ వంచనపై బీసీ గర్జన పేరిట రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఆదివారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరులో నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీ గర్జన పోస్టర్ను ఆవిష్కరించిన అనంతరం వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడారు. బీసీలకు పెద్దపీట వేసిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లను డైరెక్టర్లను నియమించారని గుర్తు చేశారు. అప్పటి వరకూ సామాన్యులకు అవకాశం దక్కని టీటీడీ బోర్డులో సైతం బీసీలను సభ్యులుగా నియమించారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీలుగా, రాజ్యసభ సభ్యులుగా మెజార్టీ సీట్లు బీసీలకే ఇచ్చారని గుర్తు చేశారు. వైఎస్ జగన్ పాలనలోనే బీసీ వర్గానికి రాజ్యాధికారం దక్కిందని పేర్కొన్నారు. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వంలో ఎక్కడా బీసీలకు ప్రాధాన్యమివ్వడం లేదని విమర్శించారు. వైఎస్ జగన్ హయాంలో ముగ్గురు బీసీలకు ఉప ముఖ్యమంత్రులుగా అవకాశమిస్తే, చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్కరికీ ప్రాధాన్యం ఇవ్వలేదని మండిపడ్డారు. ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి ఒక్క బీసీ కూడా చంద్రబాబుకు దొరకలేదా అని నిలదీశారు. బీసీని డిప్యూటీ సీఎం చేసి పక్కన కూర్చోబెట్టుకునేందుకు చంద్రబాబు ఇష్టపడకపోవడం దారుణమన్నారు. రిజర్వేషన్ పేరిట కొత్త డ్రామా మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండడంతో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ పేరిట డ్రామాకు తెరలేపారని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. వైఎస్ జగన్ 34 శాతం రిజర్వేషన్ ఇచ్చేందుకు గతంలో ప్రయతి్నస్తే, కోర్టుకెళ్లి టీడీపీ నేతలు అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ 45 శాతం పైగా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశమిచ్చిన గొప్ప నాయకుడు వైఎస్ జగన్ అని కొనియాడారు. వైఎస్ జగన్ను మళ్లీ సీఎంను చేసేందుకు కృషి చేద్దాం అని పిలుపునిచ్చారు. 20 లక్షల ఉద్యోగాలిస్తామని నిరుద్యోగులను మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. 50 ఏళ్లు దాటిన బీసీలకు పింఛన్లు ఇస్తామని మోసం చేశారన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో బీసీలకు జరిగిన మేలును ఇంటింటికీ వెళ్లి వివరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నెల 27న వెన్నుపోటు పార్టీ వంచనపై బీసీ గర్జన పేరిట భారీ సదస్సును రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలోనే నిర్వహించనున్నామని, ఈ సదస్సులో బీసీలకు ఏం కావాలో చర్చించి, వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్, ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, కవురు శ్రీనివాస్, రమేష్యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు పొన్నాడ సతీష్, రౌతు సూర్యప్రకాశరావు, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నవుడు వెంకటరమణ, రాజమహేంద్రవరం వైఎస్సార్సీపీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాల బీసీ సెల్ అధ్యక్షులు అల్లి రాజబాబు, కొండపల్లి దుర్గారావు, మట్టపర్తి నాగేంద్ర, నెరుసు చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు. -
ఏడాదైనా చైర్మన్ లేరు.. బాబ్జీ సంచలన నిర్ణయం
విజయవాడ: నగరాల కార్పొరేషన్కు వెంటనే నూతన చైర్మన్ను నియమించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాయన బాబ్జీ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆయన దీక్షకు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. నగరాల కార్పొరేషన్ గత చైర్మన్ మరణించి ఏడాది కావస్తున్నా ఇప్పటివరకు కొత్త చైర్మన్ను నియమించకపోవడం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాబ్జీ దీక్షను విరమింపజేసి ఆయన ప్రాణాలను కాపాడాలని కోరారు.నగరాల కులాన్ని బీసీ జాబితాలో చేర్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుందని వెల్లంపల్లి పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రత్యేకంగా నగరాల కార్పొరేషన్ను ఏర్పాటు చేశామని తెలిపారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విజయవాడ మేయర్గా రాయన భాగ్యలక్ష్మిని, దుర్గగుడి చైర్మన్గా పైలా సోమినాయుడిని నియమించడం ద్వారా నగరాల సామాజిక వర్గం ఆత్మగౌరవాన్ని పెంచామని చెప్పారు.నగరాల కార్పొరేషన్కు చైర్మన్ను నియమించే వరకు పోరాటం కొనసాగిస్తామని వెల్లంపల్లి స్పష్టం చేశారు. బాబ్జీ ఆమరణ నిరాహార దీక్షపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. -
పిడుగుపాటుతో నలుగురి మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి,తాడేపల్లి: పల్నాడు జిల్లాలో పిడుగుపాటుకు నలుగురు మృతి చెందడంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం, మోపిరివారిపాలెం, కాకాని శివారు లక్ష్మీపురం, పాలపాడు గ్రామాల్లో పిడుగుపడి నలుగురు మృతి చెందిన ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. పండుగ వేళ నాలుగు కుటుంబాల్లో విషాదం నెలకొనడం తనను కలచివేసిందని వైఎస్ జగన్ పేర్కొన్నారు.మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలవాలని, తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. -
డీఎస్సీ అక్రమాలపై చంద్రబాబుకు వైఎస్ జగన్ ప్రశ్నలు
సాక్షి,తాడేపల్లి : డీఎస్సీ అక్రమాల అంశానికి సంబంధించి చంద్రబాబుకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు ప్రశ్నలు సంధించారు. అసలు చంద్రబాబు ఇచ్చే వివరణలే మరిన్ని ప్రశ్నలకు అవకాశం కల్పిస్తోందంటూ సోషల్ మీడియా వేదికగా నిలదీశారు వైఎస్ జగన్. డీఎస్సీలో అక్రమాల ట్విస్టులను వివరిస్తూ ఆదివారం ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. ట్విస్ట్ 1: 65 మార్కులు → 7 దశల వెరిఫికేషన్..65 మార్కులు టెట్లో వచ్చినా టీచరు పోస్టు ఇచ్చారు.అంతకుముందు ఆ అభ్యర్థి 7 దశల వెరిఫికేషన్ ఎలా పూర్తి చేశాడు?ట్విస్ట్ 2: ఆ అభ్యర్థి అనర్హుడని డీఈవో తేల్చారుమరి ఆ 7 దశల్లో అసలు ఏం వెరిఫై చేసినట్టు?ట్విస్ట్ 3: ఉద్యోగం వచ్చింది... కానీ ఎలా వచ్చిందో అతనికే తెలియదు!మరి ఏడుసార్లు చేసిన వెరిఫికేషన్లో ఏం తేల్చారు?ట్విస్ట్ 4: సడన్గా తెరపైకి వచ్చిన 77 మార్కులు2018లో రాసిన టెట్లో అతనికి 77 మార్కులు వచ్చాయని అధికారులు నిర్ధారించారు.ఆ 77 మార్కులు అప్పటికే రికార్డుల్లో ఉంటే..అంతకుముందే వాటిని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు?డీఈవో అతన్ని అనర్హుడిగా ఎందుకు ప్రకటించారు?ప్రశ్నలు లేవనెత్తిన తర్వాతే ఈ వివరణ ఎందుకు బయటకు వచ్చింది?ట్విస్ట్ 5: “రాంగ్ పేపర్” ట్విస్ట్77 మార్కులు వచ్చినట్లు చెబుతున్నది పేపర్ 2లోకానీ SGT పోస్టుకు అవసరమైన టెట్ కేటగిరీ Paper-I-A.మరి అవేమీ చూడకుండానే అతను 7 దశల వెరిఫికేషన్ను ఎలా దాటాడు?ట్విస్ట్ 6: ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్లీ టెట్ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఆ అభ్యర్థి 2025లో మళ్లీ టెట్ రాశాడు.2018లో వచ్చిన 77 మార్కులతోనే అతనికి అర్హత ఉంటే..మళ్లీ టెట్ రాయాల్సిన అవసరం ఏమొచ్చింది?ఇప్పుడు అన్నింటికంటే పెద్ద ప్రశ్నలు:ఇదేనా నిష్పక్షపాతమైన, పారదర్శకమైన నియామక ప్రక్రియ?ఇలాంటి వ్యవహారాలే డీఎస్సీ స్కామ్కు అవకాశం కల్పించలేదా?చంద్రబాబూ.. ఇప్పటికైనా ఈ స్కాంలకు మీరు నైతిక బాధ్యత వహిస్తారా? లేదా? 𝗢𝗻𝗲 𝗧𝗲𝗮𝗰𝗵𝗲𝗿 𝗣𝗼𝘀𝘁. 𝗔 𝗥𝗼𝗹𝗹𝗲𝗿𝗰𝗼𝗮𝘀𝘁𝗲𝗿 𝗼𝗳 𝗧𝘄𝗶𝘀𝘁𝘀 & 𝗧𝘂𝗿𝗻𝘀 𝗶𝗻 𝘁𝗵𝗶𝘀 𝗗𝗦𝗖 𝗦𝗰𝗮𝗺!@ncbn Garu, the explanations keep changing, and every new explanation gives rise to even more questions for teacher aspirants.𝗟𝗲𝘁’𝘀 𝗳𝗼𝗹𝗹𝗼𝘄… pic.twitter.com/MP38UWEkxD— YS Jagan Mohan Reddy (@ysjagan) September 13, 2026 -
రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్ వినాయక చవితి శుభాకాంక్షలు
సాక్షి,తాడేపల్లి: రేపు(సోమవారం, సెప్టెంబర్ 14వ తేదీ) వినాయక చవితి పర్వదినం సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ గణనాథుని ఆశీస్సులు ఉండాలని, క్షేమ, స్థైర్య, ఆయురారోగ్యాలు, సకల సంపదలు సిద్ధించాలని, సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. ఏ కార్యం తలపెట్టినా మహాగణనాధుడిని ముందుగా పూజిస్తామని, అలా ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మంచి పనులకు విఘ్నాలు తొలగిపోతాయని గుర్తు చేశారు. ఈ వినాయకచవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలూ కలగాలని, విజయాలు సిద్ధించాలని, ఇంకా గణనాథుని కరుణా కటాక్షాలతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని వైఎస్ జగన్ అభిలషించారు. -
పోలవరంలో పాప ఘటన.. MP తనూజ రాణి ఎమోషనల్
-
‘చంద్రబాబు.. వెన్నుపోటు మ్యాన్, మోసాల మ్యాన్’
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో తాగునీటి సమస్య తీవ్రంగా మారిందని, ప్రజలకు గుక్కెడు నీరు కూడా అందించలేని స్థితి నెలకొందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం మాటల్లో భారీ ప్రచారం చేసుకుంటోందని, క్షేత్రస్థాయిలో మాత్రం ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. విశాఖను గతంలో వైఎస్ జగన్ విశ్వనగరంగా తీర్చిదిద్దితే.. కూటమి పాలకులు వినాశన నగరంగా మార్చారని మండిపడ్డారు.వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో తాగునీరు, సాగునీరు, పరిశ్రమలకు అవసరమైన నీరు అందడం లేదు. పోలవరం నీళ్లు తీసుకొచ్చామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంటే.. నగరంలో తాగునీటి కోసం ప్రజలు రోడ్లపై ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా గ్రావిటీతో నీరు రాకపోయినా, పురుషోత్తపట్నం నుంచి పాత పంపులు, మోటార్లతో నీటిని తరలించి ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు.విశాఖలో వందల కోట్ల విలువైన భూములను కేవలం 99 పైసలకే కట్టబెడుతున్నారంటూ ఆయన తీవ్ర విమర్శలు చేశారు. “99 పైసలకు పిల్లాడికి కనీసం చాక్లెట్ వస్తుందా? అలాంటిది వేల కోట్ల విలువైన భూములను ఎలా ఇస్తారు?” అని ప్రశ్నించారు. చంద్రబాబు వాటర్ మ్యాన్ కాదు.. ‘వెన్నుపోటు మ్యాన్’, ‘మోసాల మ్యాన్’ అని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో విశాఖలో నీటి సమస్య మరింత తీవ్రమైందని, నీటి సరఫరాలో కనీస ప్రణాళిక, భవిష్యత్ అవసరాలపై ముందుచూపు కనిపించడం లేదని విమర్శించారు. నీటి సమస్యపై ముందస్తు ప్రణాళిక ఉన్నప్పటికీ అధికారులు ఏం చేశారని ప్రశ్నించారు. డబ్బులు చెల్లించినా ట్యాంకర్లు సకాలంలో రాని పరిస్థితి ఉందని, విశాఖలో మట్టి మాఫియాను మించి ‘నీటి మాఫియా’ తయారైందని ఆరోపించారు.పోర్టు కాలుష్యాన్ని అరికట్టడంలో విఫలమైన అధికారులు ‘ఆపరేషన్ లంగ్స్’ పేరుతో చిరు వ్యాపారులు, తోపుడు బండ్లపై ప్రతాపం చూపుతున్నారని విమర్శించారు. స్టీల్ప్లాంట్ కార్మికులను రోడ్డున పడేసి ప్రైవేటీకరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని అన్నారు. విశాఖలోని సుమారు 20 లక్షల మంది ప్రజల నీటి అవసరాలను తీర్చలేని పాలకులు మాటల్లో మాత్రం కోటలు దాటుతున్నారని అన్నారు. స్థానిక ఎంపీకి ప్రజల నీటి కష్టాల కంటే బీచ్ షాక్స్, భూములపైనే ఆసక్తి ఉందంటూ విమర్శించారు. నీటి సమస్యను యుద్ధప్రాతిపదికన పరిష్కరించకపోతే విశాఖ ప్రజలతో కలిసి మహా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. రెడ్బుక్ రాజకీయాలు, కక్ష సాధింపులు పక్కనపెట్టి ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పాలకులకు ప్రజలు తగిన సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు.ఇదీ చదవండి: వైఎస్సార్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడిగా చంద్రశేఖర్ -
జగన్ లేకపోతే నేను లేను.. అందరి ముందు కన్నీళ్లు పెట్టుకున్న బద్దుకొండ అప్పలనాయుడు
-
‘చంద్రబాబు వాటర్ మెన్ కాదు.. క్వార్టర్ మెన్’
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు వాటర్ మెన్ కాదు.. క్వార్టర్ మెన్.. మంచి నీరు ఇవ్వలేదు.. మందు మాత్రం ఇస్తున్నారంటూ మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఇవాళ (ఆదివారం) విశాఖ నగర వైఎస్సార్సీపీ కార్యాలయంలో తూర్పు నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. రీజనల్ కోఆర్డినేటర్లు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, కేకే రాజు, వరుదు కళ్యాణి, మాజీ మేయర్ హరి వెంకట కుమారి పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించారు.ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. మూడు రోజులకు ఒకసారి మంచి నీరు ఇస్తున్నారు.. వేలాది బోర్లు ఎండిపోతున్నాయి. మంచి నీళ్లు ఇవ్వలేని ప్రభుత్వం ఉంటే ఎంత.. పోతే ఎంత? ఇప్పుడే ఇలా ఉంటే ఎండాకాలంలో మంచి నీటి పరిస్థితి ఏమిటి? మంచి నీటి సమస్యను పరిష్కరించడంలో చంద్రబాబు విఫలమయ్యారు’’ అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.చంద్రబాబు నైజం యూజ్ అండ్ త్రో పాలసీ: కన్నబాబుకురసాల కన్నబాబు మాట్లాడుతూ.. వెన్నుపోటు పార్టీ మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ‘‘చంద్రబాబుది వెన్నుపోటు పార్టీ అయితే వైఎస్సార్సీపీది వెన్ను చూపని పార్టీ. యాదవ సామాజిక వర్గానికి సాధారణ మహిళను జీవీఎంసీ మేయర్గా వైఎస్ జగన్ చేశారు.. యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళను చంద్రబాబు మేయర్ పీఠం నుంచి దించేశారు. చంద్రబాబు నైజం యూజ్ అండ్ త్రో పాలసీ...రుషి కొండపై భవనం కడితే తప్పుడు ప్రచారం చేశారు. కూటమి పాలనలో విశాఖ నగరంలో కొండలను పిండి చేస్తున్నారు. రూపాయికి చాక్లెట్ కూడా రాదు. కానీ ఎకరా భూమి 99 పైసలకు ఇచ్చేస్తున్నారు. మూడు రోజులకు ఒకసారి వాటర్ ఇచ్చేవాడు వాటర్ మ్యాన్ నా? చంద్రబాబు చేసిన మోసాన్ని గడప గడపకు తీసుకువెళ్లాలి. పెన్షన్లు తీసుకొనే వారిని చంద్రబాబు తాగు బోతులుగా చిత్రీకరిస్తున్నారు. పేకాట ఆడే వారికి డీఎస్సీలో ఉద్యోగాలు ఇచ్చారు’’అని కన్నబాబు దుయ్యబట్టారు. అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారు: వరుదు కల్యాణివైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. ‘‘అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం కోసం రూ.2 లక్షల 40 వేల కోట్లు ఖర్చు చేయాలి. మూడేళ్లలో కేవలం 32 వేల కోట్ల ఖర్చు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కార్యకర్త ఒక సైనికుడులా పని చేయాలి. కూటమికి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు’’ అని ఆమె పేర్కొన్నారు.విశాఖ నగర వైఎస్సార్సీపీ అధ్యక్షులు కేకే రాజు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించుకోవాలి. స్థానిక సమస్యలు మీద పెద్ద ఎత్తున పోరాటం చేయాలి. వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి, సంక్షేమం పథకాలను ప్రజలకు వివరించాలి. చెప్పిన హామీలు కంటే ఎక్కువగా వైఎస్ జగన్ అమలు చేశారు. విశాఖకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారు. యాదవులకు విశాఖ మేయర్ పదవి వైఎస్ జగన్ ఇచ్చారు. జీవీఎంసీలో కీలకమైన పదవులు బడుగు బలహీన వర్గాలు వారికి ఇచ్చారు’’ అని ఆయన వివరించారు.ఇదీ చదవండి: ఏడు దశల్లో వెరిఫికేషన్ అంటే ఇదేనా చంద్రబాబూ? -
కార్యకర్తల కోసం కదిలిన జగనన్న.. గోల్డ్, సిల్వర్ కార్డ్స్
-
వైఎస్సార్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడిగా చంద్రశేఖర్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విజయనగరం జిల్లాకు చెందిన వారిని వివిధ హోదాల్లో నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా గదల సన్యాసినాయుడు, విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బెల్లాన చంద్రశేఖర్ను నియమించినట్లు తెలిపింది. -
ఏడు దశల్లో వెరిఫికేషన్ అంటే ఇదేనా చంద్రబాబూ?
సాక్షి, అమరావతి: డీఎస్సీ నియామక ప్రక్రియలో ఏడు దశల వెరిఫికేషన్ అంటే ఇదేనా చంద్రబాబు అంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఏపీ మెగా డీఎస్సీ స్కామ్పై ఆయన మరోసారి ‘ఎక్స్’ వేదికగా చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. ‘వెరిఫికేషన్.. నో, నో.. ఏడు దశల వెరిఫికేషన్’ అంటూ జగన్ ఎక్స్లో పోస్టు చేశారు. ఏడు దశలు పెట్టినా.. ఒక్కో కేసులో ఒక్కో అంశం బయటపడుతోందని చెప్పారు. వెరిఫికేషన్ పేరుతో అసలేం సాధించారంటూ నిలదీశారు. ఉపాధ్యాయ అభ్యర్థుల భవిష్యత్తుతో చంద్రబాబు సర్కారు ఆటలాడుతోందని అన్నారు. ఉపాధ్యాయ అభ్యర్థుల కెరీర్లు మీకు అపహాస్యంగా మారాయా అని మండిపడ్డారు. ‘ముందుగా విజేతల జాబితాను పరిశీలిస్తే అందులో సంబంధిత అభ్యర్థుల పేర్లు కనిపించడంలేదు. ఆ తర్వాత ఖోఖో అధికారులను సంప్రదిస్తే.. సర్టిఫికెట్ నకిలీదని తేలింది. అంతేకాకుండా నాగార్జున యూనివర్సిటీని సంప్రదిస్తే.. అసలు ఆ క్రీడా కార్యక్రమమే జరగలేదని తేలింది. ఇలాంటి పరిస్థితుల్లో డీఎస్సీ ప్రక్రియను న్యాయమైన, పారదర్శకమైన నియామక ప్రక్రియగా ఎలా పిలుస్తారు? ఇది స్కామ్ కాదా? దీనికి మీరు నైతిక బాధ్యత వహించరెందుకు’ అని వైఎస్ జగన్ సీఎం చంద్రబాబుని నిలదీశారు. స్కిల్ కేసులో క్లీన్చిట్ అని చెప్పడం దౌర్భాగ్యం చంద్రబాబు చేసిన స్కామ్లో ఆయనే సొంతంగా క్లీన్ చిట్ ఇప్పించుకుని భుజాలు ఎగరేసుకుంటున్నారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఆయన శనివారం ఫేస్బుక్లో ఈమేరకు ఒక పోస్టు చేశారు. ‘అధికారులను బెదిరించి తనపై ఉన్న కేసుల పని పూర్తి చేసుకుని క్లీన్చిట్ అని చెప్పడం దౌర్భాగ్యం. తన మీద కేసులు తానే కొట్టేయించుకుంటున్నాడు. ఎందుకంటే అవన్నీ నిజం కాబట్టి. ఇప్పుడు కూడా డీఎస్సీ కేస్ని నిర్వీర్యం చేసే పని చేస్తున్నాడు. అయినా స్కిల్ కేసులో తనకు క్లీన్చిట్ వచ్చిందని చెప్పుకోవడం ఎంతటి దౌర్భాగ్యం’ అని వైఎస్ జగన్ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. -
నీకే డబ్బులు పడలేదా.. అందరి ముందు TDP నేత పరువు తీసిన కేతిరెడ్డి
-
అందుకే కలెక్టర్లను కూడా బెదిరిస్తున్నారు బాబుపై TJR సుధాకర్ బాబు షాకింగ్ కామెంట్స్
-
ప్రభుత్వ ఉద్యోగులంటే మీకెందుకు ఇంత చిన్న చూపు
-
జగన్ వెంట లక్షలాది సైనికులు.. YSRCPని ఎవరూ కదిలించలేరు
-
అందుకే కలెక్టర్లను చంద్రబాబు బెదిరిస్తున్నారు: టీజేఆర్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ఫ్రస్టేషన్ పీక్ లెవల్కు చేరిందని.. అందుకే కలెక్టర్లను కూడా బెదిరిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. ఆయన శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మహిళా ఐఏఎస్ సునీతను చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేశారని.. స్కిల్ కేసులో సునీత నిజాలు మాట్లాడారన్న కోపంతో చంద్రబాబు ఉన్నారన్నారు.‘‘చంద్రబాబు ఒత్తిడి చేయటం వలనే తాను సంతకాలు చేసినట్టు సునీత చెప్పారు. అందుకే తాను స్కిల్ కేసులో ఇరుక్కున్నానని చంద్రబాబు అనుమానిస్తున్నారు. అందుకే ప్రతిసారీ సునీతను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఒక దళిత ఐఏఎస్ అధికారిణిపై చంద్రబాబు నోరు పారేసుకోవటం సరికాదు. ఆమె తన బాధను మిగతా అధికారులతో చెప్పుకుంది. స్పోర్ట్స్ కోటాలో నారా లోకేష్ తన మనుషులకు అక్రమంగా ఉద్యోగాలు ఇచ్చారు. ఈ ఆధారాలన్నీ బయట పడినా.. చంద్రబాబు కలెక్టర్ల సమావేశంలో ఎందుకు మాట్లాడలేదు?’’ అంటూ టీజేఆర్ నిలదీశారు.‘‘డీఎస్సీ అక్రమాలను అధికారుల మీదకు నెట్టేశారు. అందుకే చంద్రబాబు మాటలు నమ్మి సంతకాలు చేయవద్దని పదేపదే చెప్పాం. మా పార్టీ అధికారంలోకి వచ్చాక లోకేష్ జైలుకు వెళ్లటం ఖాయం. నీట్ పేపర్ లీక్తో కేంద్రమంత్రి రాజీనామా చేశారు. మరి నారా లోకేష్ ఎందుకు రాజీనామా చేయలేదు?. చంద్రబాబు, లోకేష్ అవినీతిలో అధికారులు బాధ్యులు కావద్దు. ఐఏఎస్ అధికారిని సునీత లాగా స్ట్రాంగ్గా నిలబడాలి...ఎల్నినో ఎఫెక్ట్తో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వర్షాలు పడవని ముందే ప్రపంచమంతా తెలుసు. కానీ ఇప్పటివరకు ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టలేదు. ఇప్పుడు కలెక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేయటం సబబు కాదు. చంద్రబాబు చెప్పిన పెట్టుబడులు, ఉద్యోగాల లెక్కలన్నీ పచ్చి అబద్దాలు. రాష్ట్ర ప్రజలను దగా చేశారు. పెన్షనర్లను తాగుబోతులనటం దుర్మార్గం. వృద్దులు, వికలాంగులను తాగుబోతులు అంటూ అవహేళన చేయటం తగదు. ఆ మాటలను చంద్రబాబు వెంటనే వెనక్కు తీసుకోవాలి’’ టీజేఆర్ డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: ఈ ఆటలేంటి చంద్రబాబూ?: వైఎస్ జగన్ ఫైర్ -
7 దశల్లో వెరిఫికేషన్ చేసి ఏం సాధించారు? DSCలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పై జగన్ ఫైర్
-
బొత్స సత్యనారాయణ మరోసారి కంటతడి.. కీలక వ్యాఖ్యలు
సాక్షి, విజయనగరం: వైఎస్సార్సీపీ విజయనగం జిల్లా సర్వసభ్య సమావేశంలో శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ కంటతడి పెట్టారు. నమ్మినవారే మోసం చేశారని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. చిన్న శ్రీను అంశంపై అమర్నాథ్ మాట్లాడుతుండగా బొత్స కన్నీళ్లు పెట్టుకున్నారు.ఆ తర్వాత ఈ సమావేశంలో బొత్స మాట్లాడుతూ... వెన్నుపోటు పార్టీ అరాచకాలు ప్రజలకు తెలియాలని అన్నారు. వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. కార్యకర్తలంతా తలెత్తుకుని తిరిగేలా చేస్తారని తెలిపారు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమని అన్నారు. తన సహచరులు కేంద్ర మంత్రులుగా ఉన్నారని చెప్పారు. తనను పిలిచినా వెళ్లకుండా విలువలు కాపాడుకున్నానని అన్నారు. 2 రోజుల క్రితం కూడా..బొత్స మేనల్లుడు చిన్న శ్రీను పార్టీ మారడంతో ఇటీవల ఓ కార్యక్రమంలో ‘‘నమ్మినవాళ్లు మోసం చేశారు’’ అంటూ బొత్స సత్యనారాయణ ఒక్కసారిగా భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే. మళ్లీ శనివారం ఆయన కంటతడి పెట్టడం గమనార్హం.ఇదీ చదవండి: భారత సంతతి మహిళను ఫాలో అయ్యాడు.. చివరకు కాల్పులు -
కుటుంబాలను విడదీసే చరిత్ర చంద్రబాబుది: అమర్నాథ్
సాక్షి, విజయనగరం: ముఖ్యమంత్రి చంద్రబాబుకు కుటుంబాలను విడదీసే చరిత్ర ఉందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. బొత్స సత్యనారాయణ కుటుంబాన్ని ఎవరూ టచ్ చేయలేరు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే, బొత్స సత్యనారాయణ ఒక రాజకీయ విశ్వ విద్యాలయం అని ప్రశంసించారు.విజయనగరం జిల్లాలో నేడు వైఎస్సార్సీపీ జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ..‘విజయనగరం జిల్లా కార్యకర్తలు బొత్స 2.O కోసం ఎదురు చూస్తున్నారు. వైఎస్ జగన్ రాజకీయ పార్టీ పెట్టినప్పుడు నాయకులను నమ్మి పార్టీ పెట్టలేదు. వైఎస్సార్ అభిమానులను, ప్రజలను నమ్మి పార్టీ పెట్టారు. చంద్రబాబుకి కుటుంబాలను విడదీసే చరిత్ర ఉంది. అన్ని కుటుంబాల్లో ఇది జరగొచ్చు.కానీ బొత్స సత్యనారాయణ కుటుంబాన్ని టచ్ చేయలేరు. లోకేష్ చుట్టూ ఐఏఎస్ అధికారులు తిరుగుతున్నారని, చంద్రబాబు అనుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు గాడిద కూడా గుర్రంలా కనిపిస్తుంది. ఇప్పుడు లోకేష్ చుట్టూ తిరిగిన అధికారులు, రేపు గాడిద చుట్టూ తిరిగాం అని అనుకునే రోజు వస్తుంది. బొత్స సత్యనారాయణ ఒక రాజకీయ విశ్వ విద్యాలయం. ఎంతో మందిని సర్పంచ్ల నుంచి ఎమ్మెల్యేలను చేసిన చరిత్ర ఆయనది’ అంటూ వ్యాఖ్యలు చేశారు. కాగా, అమర్నాథ్.. చిన్న శ్రీను అంశం మాట్లాడుతుండగా బొత్స మరోసారి భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. ఇదీ చదవండి: ఆయన మనకెందుకు.. టీడీపీలో కొత్త చర్చ -
కక్ష సాధింపు చర్యలకు భయపడేది లేదు..
-
ఆయన మనకెందుకు?
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఎన్నాళ్లనుంచో ఉన్న మాకే పదవుల్లేవు.. ఎప్పుడు వస్తాయో తెలియడం లేదు.. అధికారంలోకి వచ్చి రెండేళ్లయింది... ఇంకా మా భవిష్యత్తే మాకు అర్థం కావడం లేదు.. ఇక్కడ ఉన్నవాళ్లకి ఏదీ అర్థం కాకపోతుంటే మళ్లా ఆయన, ఆయన కుమార్తె వచ్చి ఏం చేస్తారు..? మళ్లీ ఆయనను తెచ్చి మా మీద రుద్దడం ఎందుకు.. మా నియోజకవర్గాల్లో... గ్రామాల్లో.. మండలాల్లో మా పనులు మేము చేసుకోలేమా? ఆయనొచ్చి ఏం ఉద్ధరిస్తారు.. ఎందుకొచ్చిన లంపటం మాకు.. ఇదీ ఉమ్మడి విజయనగరం జిల్లాలోని టీడీపీ కార్యకర్త్తల నుంచి వినిపిస్తున్న వ్యాఖ్యలు. గత పదిహేనేళ్లుగా టీడీపీ కార్యకర్త దగ్గర్నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆఖరుకు కేంద్రమంత్రిగా పనిచేసి, ప్రస్తుతం గవర్నర్గా ఉన్న అశోక్ గజపతిరాజు సైతం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావును లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేసినవారే. అలాంటి వ్యక్తిని ఇప్పుడు ఏ రకంగా తమ పార్టీలో ఇముడ్చుకోవాలన్నది టీడీపీ క్యాడర్కు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఈయనను తెచ్చి ఎందుకు నెత్తిన ఎక్కించుకోవాలన్న ప్రశ్నలు టీడీపీ కాంపౌండ్ నుంచి వినిపిస్తున్నాయి. అదెలా కుదురుతుంది: బేబీ నాయిన మరోవైపు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయిన కూడా జెడ్పీచైర్మన్ చేరికను వ్యతిరేకించినట్లు తెలిసింది. వాస్తవానికి తాము గతంలో వైఎస్సార్ కాంగ్రెస్లో ఉండేవాళ్లమని, అప్పట్లో బొత్స సత్యనారాయణ, ఆయనతో బాటు మజ్జి శ్రీనివాసరావు తదితరులు కాంగ్రెస్ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్లోకి చేరడాన్ని సహించలేకనే తాము టీడీపీలో చేరామని, అలాంటపుడు మళ్లీ ఇప్పుడు ఆయనను టీడీపీలో ఎలా చేర్చుకుంటారని బేబీ నాయిన అధిష్టానాన్ని ప్రశ్నించినట్లు తెలిసింది. ఆయన టీడీపీలో చేరితే బొబ్బిలి రాజకీయాల్లో వేలుపెట్టి గ్రూపులు కట్టి తమకు ఇబ్బంది పెట్టడం.. పార్టీలో గ్రూపులు కట్టడం వంటి అనారోగ్యకరమైన పరిస్థితులు ఏర్పడతాయని బేబీనాయిన వాదించినట్లు తెలిసింది. కానీ, టీడీపీ అధిష్టానం ఆయనను ఊరడించి మజ్జి శ్రీనివాసరావును చేర్చుకున్నట్లు సమాచారం. మరోవైపు మంత్రి కొండపల్లి శ్రీనివాస్, తదితరులు కూడా చిన్న శ్రీను రాకను అయిష్టంగానే స్వాగతించినట్టు బోగట్టా. ఇదీ చదవండి: ఎమ్మెల్యే వరదరాజులరెడ్డికి టీడీపీ షాక్..! -
వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. ఇష్టానుసారం పెన్షన్లు, ఇళ్లు ఇచ్చింది
సాక్షి, అమరావతి: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హౌస్ మ్యాపింగ్ పేరుతో పేదలకు ఇష్టానుసారం పెన్షన్లు, ఇళ్లు ఇచ్చేసిందని, డబ్బులు కూడా అలాగే ఇచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆక్షేపించారు. నాటి సర్కారు ఇచ్చిన హౌస్ మ్యాపింగ్ ఆదేశాలను వెంటనే రద్దుచేయాలని అధికారులను ఆదేశించారు. కొత్త పెన్షన్ల జారీకి ముందే కుటుంబం యూనిట్గా మ్యాపింగ్ చేయాలన్నారు. తమ ప్రభుత్వం ఉమ్మడి, పెద్ద కుటుంబాలకే సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యత ఇస్తుందని, చిన్న కుటుంబాలను వారి ఆర్థిక స్థితిని బట్టి మెరిట్ ఆధారంగా చూస్తామని ఆయన చెప్పారు. పెద్ద కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వడం, ఆ కుటుంబానికి ఎక్కువ ప్రయోజనాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇదే ప్రభుత్వ విధానమని, దీనికి అనుగుణంగానే పాలసీలు, కార్యాచరణ ఉండాలని సీఎం తేల్చిచెప్పారు. రెండో రోజు శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సునుద్దేశించి ముఖ్యమంత్రి వివిధ అంశాలపై మాట్లాడుతూ.. రేషన్, పెన్షన్లు, ఇళ్ల కోసం కుటుంబాలను చిన్న కుటుంబాలుగా విభజించడం సరికాదన్నారు. (అంటే.. పేద వర్గాలను పెద్ద, చిన్న కుటుంబాలుగా వర్గీకరిస్తూ సంక్షేమ పథకాల లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేయాలనే ఎత్తుగడ సీఎం మాటల్లో స్పష్టంగా కనిపించింది). ఈ సమయంలో ఐఏఎస్ అధికారి కె. భాస్కర్ జోక్యం చేసుకుని ఒకే వ్యక్తి ఉన్న కుటుంబాలు 30 లక్షల యూనిట్లున్నాయని, వారికి ఇచ్చే ప్రయోజనాలకు హాని కలగకుండా చూడాలన్నారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. ఉన్న వారిని కొనసాగిస్తూనే కుటుంబం యూనిట్గా మ్యాపింగ్తో హేతుబద్దీకరణ చేయాలన్నారు. పెళ్లి చేసుకున్న జంటలకు రేషన్ కార్డులు ఇవ్వాలని మంత్రి నాదెండ్ల కోరారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. ‘రేషన్ కార్డులివ్వండి, అంతేగానీ.. దానికోసం కుటుంబాలను విడదీయవద్దని సూచించారు. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఐదు కిలోల చొప్పున రేషన్ బియ్యం అందించేలా చూడాలన్నారు. అవసరమైతే పది మంది గల పెద్ద కుటుంబాలకు ఒక కేజీ రేషన్ ఎక్కువ ఇవ్వాలన్నారు. చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే.. లబ్దిదారులు తాగుడుకు అలవాటుపడుతున్నారేమో చూడండి.. ప్రతీనెలా 1వ తేదీన పేదల సేవలో భాగంగా అందిస్తున్న డబ్బులను లబ్ధిదారులు సది్వనియోగం చేసుకుంటున్నారా లేక తాగుడుకు అలవాటు పడుతున్నారా చూడండి. గ్రామ, వార్డు సచివాలయాలకు ఒక్కో ఈవీ సైకిల్ ఇవ్వాలి. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది విధుల స్పష్టత కోసం జాబ్ ఛార్ట్ రూపొందించాలి. పీ–4 కార్యక్రమం మొక్కుబడిగా చేస్తున్నారు. ప్రజా సమస్యలపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. సరిగ్గా పనిచేయని వారిని పక్కన పెట్టాలి. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, మండల స్థాయిలో అధికారులు నెలలో నాలుగుసార్లు గ్రామాలకు వెళ్లాలి. ఇంకా కొంతమంది కార్యదర్శులు, శాఖాధిపతులు, కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లడంలేదు. ఇందులో ఎవ్వరికీ మినహాయింపులేదు. దీనిని తేలికగా తీసుకుంటే కఠినంగా ఉంటాం. ఒక చెవితో విని మరో చెవితో వదిలేస్తున్నారు. ఫోన్ లేకుండా రాలేరా? ఏసీ రూమ్ల్లో కూర్చుని ప్రజలను, వారి సమస్యలను పట్టించుకోకపోతే జెన్జీకే కాదు అందరికీ కడుపు మండుతుంది. అప్పుడు జెన్జీ లాంటి ఉద్యమాలు వస్తాయి. సరైన న్యాయం జరగలేదనిపిస్తే ఎవరైనా ప్రశ్నిస్తారు. ఫైళ్ల పరిష్కారంలో కొంతమంది మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతులు మూడ్రోజులకు పైగా సమయం తీసుకుంటున్నారు. వాట్సాప్ మెసేజ్లు చూస్తారు గానీ ఫైళ్లు చూడలేరా? ఫైళ్లన్నీ ఆన్లైన్లోనే నిర్వహించాలి. నెలరోజుల్లో భౌతిక ఫైళ్లకు ముగింపు పలకాలి. కొంతమంది శాఖాధిపతులు సమావేశానికి గైర్హాజరయ్యారు. వారికెంత ధైర్యం? ఫోన్ లేకుండా 12 గంటలు సమావేశానికి హాజరుకాలేరా? గైర్హాజరైన వారి నుంచి వివరణ తీసుకోండి. చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటా. ఇక ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలను పరిష్కరించాలి. విద్యారంగంపై ప్రభుత్వ వ్యయం తగ్గించాలి.. నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన అంతా కాగితాలకే పరిమితమైంది. విద్యా రంగంపై ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించాలి. అలాగే, వైద్య రంగంలో సంజీవని పథకాన్ని అమలుచేయడం ద్వారా ఆ రంగం బడ్జెట్లో రూ.5,000 కోట్లు తగ్గించాలి. జిల్లా కలెక్టర్లు సోలార్రూఫ్ టాప్ పథకం ‘సూర్యఘర్’ ద్వారా ఎన్ని ఎక్కువ ఇన్స్టలేషన్లు చేయిస్తే విద్యుదుత్పత్తిపై అంత ఒత్తిడి తగ్గుతుంది. -
‘డీఎస్సీ అక్రమాలకు సీఎంగా బాబు నైతిక బాధ్యత వహించరా?’
సాక్షి,తాడేపల్లి: రాష్ట్రంలో డీఎస్సీ అక్రమాల అంశానికి సంబంధించి చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. చంద్రబాబూ.. డీఎస్సీ నియామకాలను నిజంగా నిష్పక్షపాతంగా..పారదర్శకంగా నిర్వహించాలన్నదే మీ ఉద్దేశమైతే అర్హత పరీక్ష అవసరం లేకుండా జీవోలు ఎందుకు జారీ చేశారు?. క్వాలిఫైయింగ్ పరీక్ష నిబంధనను పక్కనపెట్టి నియామకాలను ఎందుకు చేపట్టారు?.డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత మళ్లీ పాత విధానాన్ని ఎందుకు అమలు చేశారు?. డీఎస్సీ సమయంలో ఒక విధానం.. నియామకాలు పూర్తయ్యాక మరో విధానం.. దీన్ని నిష్పక్షపాత, పారదర్శక నియామక ప్రక్రియ అని ఎలా అంటారు?అర్హత పరీక్ష నిబంధనను తొలగించడం ద్వారా డీఎస్సీ అక్రమాలకు ద్వారాలు తెరవలేదా?.నిబంధనలను మార్చి అక్రమాలకు అవకాశం కల్పించిన దానిపై చంద్రబాబు సమాధానం చెప్పాలి. డీఎస్సీలో జరిగిన అక్రమాలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నైతిక బాధ్యత వహించరా?’అంటూ ధ్వజమెత్తారు. .@ncbn Garu, if your intention was to conduct a fair and transparent recruitment, why were GOs issued dispensing with the requirement of a qualifying examination? And after the DSC process was completed, why were the policies amended in a manner that restored the old… pic.twitter.com/vzDTCvOwGE— YS Jagan Mohan Reddy (@ysjagan) September 11, 2026ఇదీ చదవండి : ఆ విషయాన్ని ప్రశ్నిస్తే దొంగ ఏడుపులా: వైఎస్ జగన్ -
చంద్రబాబు వెన్నుపోటు నాయకుడు: కొడాలి నాని
సాక్షి, కృష్ణా జిల్లా: చంద్రబాబు వెన్నుపోటు నాయకుడు అంటూ మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ కొడాలి నాని దుయ్యబట్టారు. 16 ఏళ్ల బాబు పాలనలో ఒక్కసారే స్థానిక ఎన్నికలు పెట్టాడు. ఎన్నికలకు వైఎస్ జగన్ భయపడుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. భయమంటే ఏంటో తెలియని నాయకుడు జగన్. చంద్రబాబు, లోకేష్ల అవినీతికి అంతులేకుండా పోయింది. డీఎస్సీ పేరుతో ఉద్యోగాలను అమ్మేశారు. కొంతమంది దొంగల కోసం స్పోర్ట్స్ జీవోలను మార్చారు’’ అని కొడాలి నాని మండిపడ్డారు.‘‘వైఎస్ జగన్ను చర్చకు రమ్మనడానికి లోకేష్కు ఉన్నస్థాయి ఏంటి?. పేర్ని నాని చర్చకు వస్తానంటేనే లోకేష్ పారిపోయాడు. తండ్రి పేరు నిలబెట్టేందుకు నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి వైఎస్ జగన్. ప్రజలకు ఇచ్చిన మాటకోసం మడమతిప్పని నేత వైఎస్ జగన్. నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగిన వ్యక్తి వైఎస్ జగన్. అధికారమే పరమావధిగా బతికే వ్యక్తి చంద్రబాబు. సూపర్ సిక్స్ పేరుతో ఎన్నికల్లో పెద్ద లిస్ట్ పట్టుకొచ్చాడు. చంద్రబాబు లాగా అబద్ధపు హామీలతో ఎన్నికలకు వెళ్లనని ధైర్యంగా చెప్పిన వ్యక్తి వైఎస్ జగన్. చంద్రబాబు ఒక్క వాగ్ధానమైనా నెరవేర్చాడా?. మోసంతో చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు’’ అని కొడాలి నాని ధ్వజమెత్తారు.‘‘వెన్నుపోటు సామ్రాట్ను, వెన్నుపోటు పార్టీని బంగాళాఖాతంలో కలిపేయాలి. పేర్ని నాని, ఆయన భార్య పై కేసులు పెట్టి వేధించారు. ఎన్ని కేసులు పెట్టినా పేర్ని నాని వెనక్కి తగ్గలేదు. వైఎస్ వెంట నిలిచి ఆయన గొంతును నిరంతరం వినిపిస్తున్నారు. వల్లభనేని వంశీని ఉద్ధేశపూర్వకంగా కేసులతో ఇబ్బంది పెట్టారు. వంశీకి హైదరాబాద్లో కోట్ల విలువైన ఆస్తులున్నాయ్. పేదల పట్టాలను అమ్ముకున్నాడని వంశీ పై దొంగ కేసులు పెట్టారు. భోగాపురం ఎయిర్ పోర్టు రాకతో ప్రజల కళ్లల్లో ఆనందం చూశానని సొల్లు కబుర్లు చెబుతున్నాడు. వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ ఎలా ఉంటుందో కూడా చంద్రబాబుకు తెలియదు. నీళ్ల కోసం కొండను ఎలా తవ్వుతారని విమర్శించింది చంద్రబాబే. చంద్రబాబు చేలో మేస్తే.. లోకేష్ గట్టుమీద మేస్తాడా?’’ అంటూ కొడాలి నాని నిలదీశారు. -
ఆ విషయాన్ని ప్రశ్నిస్తే దొంగ ఏడుపులా: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫేస్బుక్లో వీడియో రిలీజ్ చేశారు. మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అంటూ వీడియో విడుదల చేశారు. డీఎస్సీ పరీక్ష లేకుండానే టీచర్ ఉద్యోగాలు ఇచ్చేసి.. ప్రశ్నిస్తే దొంగ ఏడుపులా అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.కాగా, నిన్న(గురువారం) ప్రెస్మీట్లో మెగా డీఎస్సీ కుంభకోణం ఏ విధంగా జరిగిందో సాక్ష్యాధారాలతో వైఎస్ జగన్ మరోసారి ఎండగట్టారు. డీఎస్సీ అక్రమాలపై మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయని.. దొంగ సర్టిఫికెట్లు, ఫ్యామిలీ ప్యాకేజీలతో టీచర్ ఉద్యోగాలు ఇచ్చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులను, నిజాయతీపరులైన అభ్యర్థులను సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ దగా చేశారని నిప్పులు చెరిగారు.ఆ అక్రమాలను రుజువులతో సహా వెలుగులోకి తెచ్చామని.. వాటి ఆధారంగా తాను సంధించిన నాలుగు ప్రశ్నలకు ఇంతవరకూ తండ్రీ, కుమారులు ఎందుకు సమాధానం చెప్పడం లేదని నిలదీశారు. డీఎస్సీలో ఒక్కొక్కటిగా అక్రమాలు బయట పడుతుంటే వాటిని కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. -
నీకూ అర్చనకు ఎన్ని గొడవలు.. కిట్టు మాట్లాడుతుంటే పేర్ని నాని సెటైర్లే సెటైర్లు
-
బూత్ల వారీగా సమగ్ర వివరాలు ఇవ్వండి: వైఎస్సార్సీపీ
తాడేపల్లి: రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ, పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ)కి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పి రెడ్డి లేఖ రాశారు. అర్హులైన ఏ ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తొలగించకుండా చూడాలని, అదే సమయంలో దొంగ ఓట్లను ఏరివేయాలని ఆ లేఖలో స్పష్టంగా కోరారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో చోటుచేసుకున్న మార్పులకు సంబంధించిన పూర్తి వివరాలను బూత్ స్థాయిలో బహిర్గతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేశాఆరు. ఈ లేఖ ప్రతిని భారత ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్కు కూడా పంపించారు.డౌన్ లోడ్ లింకులతో సరిపెట్టకుండా...ఎస్ఐఆర్లో భాగంగా కొత్తగా ఓటర్లను చేర్చడం, తొలగించడం, ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడం, మరణించిన వారి ఓట్ల తొలగింపు, ఇతర సవరణలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నియోజకవర్గాల వారీగా, బూత్ల వారీగా సమగ్రంగా అందించాలని లేఖలో కోరారు. కేవలం డౌన్లోడ్ లింకులు ఇవ్వకుండా అధికారికంగా సమగ్ర వివరాలను అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. మ్యాప్ కాని ఓటర్లు, ఇతర కేటగిరీల కింద జారీ చేసిన నోటీసులపై కూడా పూర్తి వివరాలను వెల్లడించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరింది. ఎన్ని నోటీసులు జారీ చేశారు, ఎన్ని కేసులు పరిష్కరించారు, ఎన్ని ఓటర్లను తొలగించారు, ఇంకా ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయో బూత్, నియోజకవర్గాల వారీగా వెల్లడించాలని పేర్కొంది. దీనివల్ల బూత్ స్థాయి ఏజెంట్లు సంబంధిత ఓటర్ల వివరాలను పరిశీలించేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని అనుమానిత ఓటర్లతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న డూప్లికేట్ ఓట్ల వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించిందని లేఖలో అప్పిరెడ్డి పేర్కొన్నారు. వాటిపై పూర్తిస్థాయి విచారణ జరిపి, చట్ట ప్రకారం డూప్లికేట్ ఓట్లను తొలగించాలని కోరారు. ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.కుటుంబ సభ్యులందరి ఓట్లూ ఒకే బూత్లో ఉండాలిపోలింగ్ కేంద్రాల పునర్విభజనలో ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు వేర్వేరు బూత్లకు, కొన్ని సందర్భాల్లో వేర్వేరు వార్డులకు కేటాయించబడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఒకే ఇంటి చిరునామాలో నివసించే కుటుంబ సభ్యులను సాధ్యమైనంత వరకు ఒకే పోలింగ్ కేంద్రంలో ఉంచాలని కోరారు. ఓటర్లను ఒక పోలింగ్ కేంద్రం నుంచి మరో పోలింగ్ కేంద్రానికి మార్చినప్పుడు అనుసరించిన ప్రమాణాలను కూడా స్పష్టంగా వెల్లడించాలని కోరింది. భౌగోళిక ప్రాంతం, ఇంటి నంబర్, ఓటరు వరుస సంఖ్య లేదా ఇతర ఏ ప్రమాణం ఆధారంగా ఓటర్లను బదిలీ చేశారో స్పష్టం చేసి, రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధమైన విధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటర్ల సంఖ్యలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నందున, ఎస్ఐఆర్ అనంతరం వచ్చిన తాజా ఓటర్ల డేటా ఆధారంగా పోలింగ్ కేంద్రాల పునర్విభజనను మరోసారి సమీక్షించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.బూత్ మ్యాపింగ్ను పార్టీలకు అందించాలికొత్తగా ఏర్పాటు చేసిన లేదా పునర్విభజించిన పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన పూర్తి బూత్ మ్యాపింగ్ను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు అందించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ప్రతి బూత్కు అనుసంధానించిన ప్రాంతాలు, బూత్ స్థాయి అధికారుల వివరాలు, పాత బూత్ల నుంచి కొత్త బూత్లకు ఓటర్ల బదిలీల వివరాలను అందులో పొందుపరచాలని కోరారు. అలాగే, కొత్తగా ఏర్పాటు చేసిన లేదా పునర్విభజించిన పోలింగ్ కేంద్రాలకు నియమించిన బూత్ స్థాయి అధికారుల పేర్లు, సంప్రదించాల్సిన నంబర్లను ప్రజలకు అందుబాటులో ఉంచాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఎస్ఐఆర్ ప్రక్రియ బూత్ స్థాయిలో పారదర్శకంగా జరగాలని, అర్హత కలిగిన ఒక్క ఓటు కూడా తొలగించబడకుండా చూడాలని లేళ్ల అప్పిరెడ్డి కోరారు.ఇదీ చదవండి:‘అమరావతిలో వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం’ -
‘టైమ్, డేట్ చెప్పమన్న లోకేష్ ఎక్కడున్నాడు?’
సాక్షి, కృష్ణా జిల్లా: ‘టైమ్, డేట్ చెప్పమన్న లోకేష్ ఎక్కడున్నాడు?. తప్పులు చేసి అధికారుల మీద నెట్టేస్తున్నారు. జీవో ఇచ్చింది ఎవరు? అధికారులకు ఏంటి సంబంధం?. తండ్రి కొడుకుల వేషాలు చూడలేకపోతున్నామంటూ కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. ఇవాళ మచిలీపట్నంలో జరిగిన వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, సింహాద్రి రమేష్ బాబు, కైలే అనిల్ కుమార్, మచిలీపట్నం వైఎస్సార్సీపీ ఇంఛార్జి పేర్ని కిట్టు, పెడన వైఎస్సార్సీపీ ఇంఛార్జి ఉప్పాల రాము, పెనమలూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జి దేవభక్తుని చక్రవర్తి, జడ్పీచైర్ పర్సన్ ఉప్పాల హారిక, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ.. చంద్రబాబును నమ్మొద్దని.. ఎవరినైనా లోబరచుకుంటాడన్నారు. దొంగ తెలివితేటలున్న వ్యక్తి చంద్రబాబు. పార్టీ పెట్టిన ఎన్టీఆర్నే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి. అక్టోబర్ 2 నుంచి ఏ క్షణమైనా మున్సిపాల్టీల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి చంద్రబాబు మేయర్ల ప్రత్యక్ష ఎన్నికలు పెట్టడం లేదు. చంద్రబాబుకు కూటమి చీలిపోతుందనే భయం పట్టుకుంది. అందుకే పంచాయతీల కంటే ముందు మున్సిపాల్టీలకు ఎన్నికలు పెడుతున్నాడు. పోలీసులను అడ్డంపెట్టుకుని మున్సిపాల్టీలను గెలవాలనుకుంటున్నాడు’’ అని పేర్ని నాని మండిపడ్డారు. -
ఆయన వెళ్లిపోవడం వల్ల ఏం నష్టం లేదు.. బొత్స కొడుకు,కూతురు కౌంటర్
-
పోతిరెడ్డిపాడు వద్ద హైటెన్షన్ YSRCP నేతలను అడ్డుకున్న పోలీసులు
-
‘అందుబాటులో ఉంటా.. ఎప్పుడైనా ఫోన్ చేయండి’
విజయనగరం: కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను సోషల్ మీడియా వేదికగా ఎండగట్టాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సూచించారు. ఈరోజు(శుక్రవారం, సెప్టెంబర్ 11వ తేదీ) విజయనగరం జిల్లా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో బొత్స సమావేశమయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియా కార్యకర్తలకు బొత్స దిశా నిర్దేశం చేశారు. ‘ప్రభుత్వ వ్యతిరేక విధానాలను సోషల్ మీడియా వేదికగా ఎండగట్టాలి. చట్ట వ్యతిరేకమైన పోస్టులకు, అబద్ధపు ప్రచారాలకు దూరంగా ఉండాలి.ఇక మీదట ప్రతి కార్యకర్త నేరుగా జిల్లా పార్టీ కార్యాలయంలో అనుసంధానం కావాలి. నేను ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటాను.. ఏ సమయంలోనైనా ఫోన్ చేయొచ్చు’ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి:పోతిరెడ్డిపాడు వద్ద ఉద్రిక్తత -
దమ్ముంటే చర్చకు రా.. కూన రవికి చింతాడ రవికుమార్ సవాల్
-
YSRCP నేతలతో గుడివాడ అమర్నాథ్ అత్యవసర మీటింగ్
-
పోతిరెడ్డిపాడు వద్ద ఉద్రిక్తత
నంద్యాల: జిల్లాలోని పోతిరెడ్డిపాడు వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. జూపాడు బంగ్లా సమీపంలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద 9వ గేటు ఎత్తుతుండగా రోప్ తెగిపోయి గేటు కింద పడిపోయిన సంగతి తెలిసిందే. దాంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ పరిశీలనకు వైఎస్సార్సీపీ నేతలు అక్కడకు బయల్దేరి వెళ్లారు. .అయితే వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. గేటుకు తాళం వేసి మరీ అడ్డుకున్నారు పోలీసులు. మీడియాను సైతం అనుమతించలేదు. ప్రభుత్వం డొల్లతన బయటపడుతుందనే అక్కడకు వెళ్లిన తమను అడ్డకున్నారని వైఎస్సార్సీపీ విమర్శించింది. కాగా, శ్రీశైలం జలాశయం నుంచి నీటిని విడుదల చేసే సమయంలో పోతిరెడ్డిపాడు తొమ్మిదో నెంబరు ఐరన్ గేటుకు సంబంధించిన రోప్ అకస్మాత్తుగా తెగిపోయింది. గేట్లు ఎత్తుతున్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో గేటు ఊడిపోయి కింద పడిపోయింది. శ్రీశైలం బ్యాక్వాటర్ పూర్తి స్థాయిలో ప్రవహిస్తున్న తరుణంలో ఇది చోటు చేసుకుంది. ఇదీ చదవండి:మధ్యాహ్న భోజనం ఇంత అధ్వానమా? -
చంద్రబాబు చెల్లికి టీటీడీ భూములు.. నాగార్జున యాదవ్ కీలక వ్యాఖ్యలు
-
నీ కొప్పు సంగతేంటి లైవ్ లో పాట పాడి ఏకిపారేసిన అనిల్ కుమార్ యాదవ్
-
మీరు శివ పార్వతులా? నేను మీ కాళ్లకు నమస్కారం చేశానని నిరూపిస్తే.. అనిల్ ఛాలెంజ్
-
కాక్రోచ్లు ఊరికే రావు..! మెగా డీఎస్సీలో తవ్వేకొద్దీ స్కామ్లే
అక్రమాలు జరిగాయని ప్రస్ఫుటంగా కనిపిస్తున్నప్పుడు.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆయన కింద పనిచేసే అధికారులు చేసే విచారణలు నిజాయతీగా, సక్రమంగా జరుగుతాయా? అనే అనుమానం ఆ పార్టీ వాళ్లకు కూడా వస్తుంది. చంద్రబాబు కుమారుడు రాజీనామా చేయాల్సిన పరిస్థితుల్లో ఆయన కింద పని చేసే అధికారులు స్వతంత్రంగా నడుచుకోగలరా? అందుకే డీఎస్సీ పోస్టుల భర్తీపై సీబీఐ విచారణ చేయించాలని మేం మొదటి నుంచీ పట్టుబడుతున్నాం. నిజాయతీపరులైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా కోర్టుల్లోనూ పోరాడుతున్నాం.– మాజీ సీఎం వైఎస్ జగన్సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ–2025లో తవ్వేకొద్దీ అక్రమాలు బయటకు వస్తున్నాయని, చంద్రబాబు స్కామ్ల చరిత్రలో అదో ఆణిముత్యం.. చిరస్థాయిగా నిలిచిపోతుందని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. డీఎస్సీ అక్రమాలపై మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయని.. దొంగ సర్టిఫికెట్లు, ఫ్యామిలీ ప్యాకేజీలతో టీచర్ ఉద్యోగాలు ఇచ్చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులను, నిజాయతీపరులైన అభ్యర్థులను సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ దగా చేశారని నిప్పులు చెరిగారు. మెగా డీఎస్సీ కుంభకోణం ఏ విధంగా జరిగిందో సాక్ష్యాధారాలతో మరోసారి ఎండగట్టారు. ఆ అక్రమాలను రుజువులతో సహా వెలుగులోకి తెచ్చామని, వాటి ఆధారంగా తాను సంధించిన నాలుగు ప్రశ్నలకు ఇంతవరకూ తండ్రీ, కుమారులు ఎందుకు సమాధానం చెప్పడం లేదని నిలదీశారు. డీఎస్సీలో ఒక్కొక్కటిగా అక్రమాలు బయట పడుతుంటే వాటిని కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ధ్వజమెత్తారు. అభ్యర్థుల సర్టిఫికెట్లు ఏడు సార్లు వెరిఫికేషన్ చేశామని అధికారులు చెబుతున్నారని.. మరి అన్ని నకిలీ (ఫేక్) సర్టిఫికెట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. స్పోర్ట్స్ సర్టిఫికెట్లు నిఖార్సైనవని అధికారులు చెప్పలేకపోయారన్నారు. జరగని పోటీలు, టోర్నీలతో సర్టిఫికెట్లు జారీ చేశారని.. అవి బోగస్ అని స్వయంగా అసోసియేషన్లు వెల్లడించినా వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం పట్టించుకోకుండా తమవారికి అడ్డగోలుగా ఉద్యోగాలు ఇచ్చి ఆ తర్వాత గేట్లు మూసేసిందన్నారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. అసలు ఏ పరీక్షా లేకుండానే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం, అందులోనూ టీచర్ ఉద్యోగాలు ఇవ్వడం పెద్ద స్కామ్ అని స్పష్టం చేశారు. ఇదే బాటలో అటవీ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేశారని, అయితే మెగా డీఎస్సీ స్కామ్ బయటపడడంతో 40 ఉద్యోగాలకు బ్రేక్ వేయడమే కాకుండా, మిగిలిన పోస్టులకూ నియామకాలు చేపట్టలేదని వెల్లడించారు. ఇది ఉద్యోగార్థులకు తీవ్ర అన్యాయం చేయడం కాదా? అని సీఎం చంద్రబాబును నిలదీశారు. వ్యవస్థలను నాశనం చేస్తున్నారని, ఇలాంటి పరిస్థితులు కల్పిస్తేనే కాక్రోచ్లు పుట్టుకొస్తాయని, తప్పు చేసిన వారి మెడలు వంచేందుకు తానూ కాక్రోచ్గా మారతానని హెచ్చరించారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. బాబుకు బీపీ పెరిగి బెదిరిస్తున్నారుడీఎస్సీ 2025 కుంభకోణంలో తవ్వేకొద్దీ అక్రమాలు కనిపిస్తున్నాయి. గత రెండు వారాలుగా బయటకు వచ్చిన మరికొన్ని సాక్ష్యాలు, ఆధారాలు దీన్ని రుజువు చేస్తున్నాయి. ఇవి చూసిన తర్వాత కూడా ఈ స్కామ్ నుంచి తప్పించుకోగలరా? అలాంటి నివ్వెరపోయే వాస్తవాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ స్కామ్ రూపాలన్నీ అనకొండలా అనిపిస్తున్నాయి. అందుకే ఇవి బయటకు వచ్చే కొద్దీ చంద్రబాబుకి బీపీ పెరుగుతోంది. ఎవరైనా తప్పులు, ఆధారాలు బయటపెడితే వారిపై కేసులు పెడతాం, జైల్లో వేస్తామని బెదిరిస్తున్నారు. జర్నలిస్టుల మీద సైతం కేసులు పెడుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ నిలదీయకూడదంటూ అకౌంట్లు బ్లాక్ చేస్తున్నారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారు.ఈ ప్రశ్నలకు బదులేది?మెగా డీఎస్సీ స్కామ్ ఎలా జరిగిందో సాక్ష్యాలు, ఆధారాలతో చూపించా. దీనిపై నేను అడిగిన ప్రశ్నల్లో ఒక్క దానికి కూడా చంద్రబాబుగానీ ఆయన సుపుత్రుడు, విద్యాశాఖ మంత్రిగానీ సూటిగా సమాధానం చెప్పలేదు. అవన్నీ స్కామ్ పునాదులు. నేను అడిగిన ఆ నాలుగు ప్రశ్నలు చాలా సింపుల్. వాటిని మరోసారి గుర్తు చేస్తున్నా.1? రాష్ట్ర డీఎస్సీ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ప్రశ్న పత్రాల తయారీ, పరీక్ష నిర్వహణ.. ఈ రెండిటినీ ఒకే వ్యక్తి చేతిలో ఎందుకు పెట్టారు? పారదర్శకతకు ఎందుకు పాతరేశారు? ఇది స్కామ్కు ద్వారాలు తెరిచినట్లు కాదా? అని అడిగితే చంద్రబాబు నోరు విప్పలేదు.2? స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ)లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న నవీన్ అనే వ్యక్తికి మొదటి ర్యాంక్ ఎలా వచ్చింది? అతడికి మొదటి ర్యాంకు వచ్చినా ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? అతడి పేరును సెకండ్ మెరిట్ లిస్ట్లో ఎందుకు తీసేశారు? అతడి డీఎస్సీ క్యాండిడేట్ లాగిన్ ఐడీని ఎందుకు బ్లాక్ చేశారు? అతడిని సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు ఎందుకు పిలవలేదు? తనను పిలవలేదని డీఎస్సీ కన్వీనర్కు నవీన్ లేఖ కూడా రాశాడు. నవీన్ కోర్టుకు ఎందుకు వెళ్లాడు? ఇదంతా స్కామ్ను దాచిపెట్టడానికి చేసిన ప్రయత్నం కాదా? డీఎస్సీ ప్రశ్నపత్రంలో ప్రశ్నలను కూడా అమ్ముకున్నారని కొంతమంది అభ్యర్థులు చెప్పడం ఇటీవల సోషల్ మీడియాలో చూస్తున్నాం.. మెగా డీఎస్సీలో లీకేజీ జరిగిందనడానికి ఇది మరింత బలాన్ని ఇవ్వడం లేదా?3? స్పోర్ట్స్ కోటా జీవోను మార్చి గతంలో ఉన్న 2 శాతం కోటాను 3 శాతానికి పెంచడమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు ఏ పరీక్షా రాయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా భర్తీ చేసుకోవడానికి జీవో నెం.4, జీవో నెం.47 ఎందుకు తీసుకువచ్చారు? ఈ జీవోలతో గేట్లు ఎత్తి 372 మందిని రిక్రూట్ చేసి, పనైపోయిన తరువాత జీవో నెం.23, జీవో నెం.25, జీవో నెం.56తో గేట్లు మూసేశారు. ఎందుకు ఇంత అడ్డగోలు జీవోలు ఇచ్చారు? అసలు పరీక్షే లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు మీ ఇష్టం వచ్చినట్లు ఇస్తారా? ఎందుకు జీవోలు ఇచ్చారు? ఎందుకు ఉపసంహరించుకున్నారు?4? టీచర్ పోస్టుల కోసం డబ్బులు తీసుకున్నారంటూ ఏకంగా ఆడియో, వీడియో కాల్స్ బయటకు వచ్చిన తరువాత కూడా కేసును ఎందుకు నిర్వీర్యం చేశారు? ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించే వరకూ కేసును నీరుగార్చారు.అంత క్లియర్గా ఆడియో కాల్లో నెంబర్ కనిపిస్తుంటే ఆ వ్యక్తిని కనిపెట్టడం కష్టమా? కానీ ఎఫ్ఐఆర్లో మాత్రం గుర్తు తెలియని (సస్పెక్ట్) వ్యక్తి అని రాశారు. కేసు నమోదుకు ఆలస్యం ఎందుకు అయ్యిందంటే..? ఉన్నతాధికారులతో సంప్రదించడం వల్ల అని రాసుకొచ్చారు. చంద్రబాబు, ఆయన తనయుడు మాత్రం.. అరెస్ట్ చేసి, రిమాండ్కు పంపించామని అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు చెప్పారు. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ (సీసీటీఎన్ఎస్)లో చూస్తే రిమాండ్కు పంపలేదని స్పష్టంగా అర్థం అవుతుంది. ఇవన్నీ సింపుల్ ప్రశ్నలు. ఆరేళ్ల పిల్లాడికైనా అర్థం అవుతాయి. ఇవే మెగా డీఎస్సీ కుంభకోణానికి పునాదులు. ఇప్పుడు బయటకు వస్తున్న ఉదాహరణలన్నీ వీటికి సంబంధించిన కోణాలే. వెన్నుపోటు పార్టీ నాయకుడికి తనను, తన తనయుడిని కాపాడుకోవడమే ప్రధానం.అయితే ఇచ్చేయ్ టీచర్ ఉద్యోగం...! ఒక అక్రమాన్ని తవ్వుతుంటే, మరొకటి బయట పడుతోంది. బాబు కుంభకోణాల చరిత్రలో డీఎస్సీ స్కామ్ ఆణిముత్యంగా నిలిచిపోతుంది. నిరుద్యోగ యువకులను నట్టేట ముంచిన స్కాం ఇది. స్పోర్ట్స్ కోటా పేరుతో చేసిన అక్రమాలు చూస్తే.. వీడు మనవాడా! డబ్బులు ముట్టాయా! అయితే ఇచ్చేయ్ టీచర్ ఉద్యోగం అన్నట్లుగా డీఎస్సీ పోస్టులు భర్తీ చేశారు. జరగని పోటీలు జరిగినట్లుగా, ఆ పోటీల్లో పాల్గొని అద్భుతంగా ఆడినట్లుగా, తప్పుడు సర్టిఫికెట్లతో పోస్టులు ఇచ్చారు.పైస్థాయి నుంచి ఆదేశాలతో కింది స్థాయి వరకూ కుమ్మకై, ఒక పద్ధతి ప్రకారం (మోడస్ ఆపరాండీ) ఈ పోస్టులన్నిటినీ భర్తీ చేశారు. దీనిపై సీబీఐ విచారణ జరగాల్సిన అవసరం ఉందని ప్రతి కేస్ స్టడీ చెబుతోంది.జూడోలో పరీక్ష లేకుండా పోస్టులు..మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అసలు పరీక్షలే లేకుండా 372 మందిని నియమిస్తే.. ఒక్క జూడో కింద 39 మందికి ఎలాంటి పరీక్ష లేకుండానే పోస్టులు ఇచ్చారు. వీరిలో కొందరు సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూడో ఛాంపియన్ షిప్ 2013 ఖమ్మంలో జరిగినట్లుగా, అందులో పాల్గొని గెలిచినట్లుగా ధ్రువీకరిస్తూ ఏపీ జూడో అసోసియేషన్ ఇచ్చిన సర్టిఫికెట్లు పెట్టారు. తీరా చూస్తే అసలు ఆ తేదీల్లో (2013 అక్టోబర్ 19–21 మధ్య) ఆ ఛాంపియన్షిప్ ఖమ్మంలో జరగలేదని, తెలంగాణ జూడో అసోసియేషన్, ఖమ్మం జిల్లా జూడో అసోసియేషన్ చాలా స్పష్టంగా రాతపూర్వకంగా చెప్పాయి. ఇంతకీ ఈ జూడో అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరని చూస్తే.. చంద్రబాబు తనయుడు, విద్యాశాఖ మంత్రి లోకేశ్కు స్వయనా తోడల్లుడు, విశాఖపట్నం ఎంపీ భరత్. దీని అర్థం.. దొంగ సర్టిఫికెట్లు పుట్టించారని, మళ్లీ ఆ దొంగ సర్టిఫికెట్లకు మన రాష్ట్రంలోని పెద్దలే ధృవీకరణ కూడా చేసి ఇచ్చారని చాలా స్పష్టంగా అర్థం అవుతోంది. సాఫ్ట్బాల్ పేరిట మరో 38 మందికి ఇలానే పరీక్ష లేకుండానే టీచర్ పోస్టులు ఇచ్చారు. ఈ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరంటే.. టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్. ఆయన సంతకం చేసిన 21 సర్టిఫికెట్లతో టీచర్ ఉద్యోగాలిచ్చేశారు.పైనుంచి ఫోన్.. అంతా సెట్బసవేశ్వరరావు అనే మరో అభ్యర్థి 49వ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఖోఖో ఛాంపియన్షిప్ గుడివాడలో జరిగిందని, అందులో పాల్గొన్నానని సర్టిఫికెట్ పెట్టాడు. కానీ అతడి సర్టిఫికెట్ ఫేక్ అని ఆంధ్రా ఖోఖో అసోసియేషన్ అధికారికంగా శాప్కు లేఖ ఇచ్చింది. అయినా సరే దానిని పక్కన పడేసి, ఫేక్ సర్టిఫికెట్ పెట్టిన వాడికి ఉద్యోగం ఇచ్చేశారు. ఎందుకంటే పైనుంచి ఫోన్.. అంతా సెట్ అయిపోయింది ఉద్యోగం ఇచ్చేయమని! ప్రగడ కళ్యాణి అనే అభ్యర్థి కబడ్డీలో ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్శిటీ టోర్నమెంట్ 2003 నాగార్జున యూనివర్శిటీలో ఆడినట్లుగా పార్టిసిపేషన్ సర్టిఫికెట్తో, పరీక్ష రాయకుండానే ఉద్యోగం ఇచ్చారు. కానీ ఆ యూనివర్శిటీలో ఆ గేమ్స్ జరగలేదని, సౌత్ వెస్ట్ జోన్ కబడ్డీ పోటీలు మాత్రమే జరిగాయని తేలింది. అయినా సరే 7 అంచెల వెరిఫికేషన్ పూర్తి చేసుకుని ఉద్యోగం చేస్తున్నారు! టెట్ క్వాలిఫై కాకున్నా ఉద్యోగాలు..మరికొన్ని కేసుల్లో అయితే టెట్ పాసవకుండానే అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చారు. ఒక కేటగిరీలో టెట్ మార్కులు చూపించి, మరో కేటగిరీ టీచర్ పోస్టులు ఇచ్చారు. ఇంకొన్ని కేసుల్లో.. అభ్యర్థికి ఒక కులానికి సంబంధించి రిజర్వేషన్ ఉంటే, మరో కులానికి సంబంధించిన రిజర్వేషన్లో ఉద్యోగం ఇచ్చారు. కర్నూలు జిల్లాలో ఈడిగ ప్రభాకర్ అనే అభ్యర్థికి ఏ పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇచ్చారు. అతడి రిజర్వేషన్ కేటగిరీ ప్రకారం ఎస్జీటీ పోస్టుకు టెట్లో 75 మార్కులు రావాలి. కానీ ఆయనకు 65 మాత్రమే వచ్చాయి. ఇదే విషయాన్ని కర్నూలు డీఈవో కూడా ఒప్పుకున్నారు. మరి ఎస్జీటీ పోస్టు ఎలా ఇచ్చారు? ఎవరు చెబితే ఇచ్చారు? దీనిని కవర్ చేసుకోవడానికి తప్పులు మీద తప్పులు చేస్తున్నారు. ప్రభాకర్కు టెట్లో 77 మార్కులు 2018లో వచ్చాయని అధికారులు దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. కానీ హాల్టికెట్ నంబర్ ఆధారంగా వెబ్సైట్లోకి వెళ్లి టెట్ డేటా చూస్తే ఆ 77 మార్కులు స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే 2 బీ కేటగిరీకి సంబంధించిన మార్కులని తేలింది. అవి చూపించి ఆయనకు టెట్ 1 ఏ కేటగిరీలో ఉన్న పోస్టు ఎలా ఇచ్చారు? సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడి హోదాలో టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ధ్రువీకరించి ఇచ్చిన సర్టిఫికెట్ల ఆధారంగా టీచర్ ఉద్యోగాలు పొందిన 21 మంది వివరాలు ‘ఈడబ్ల్యూఎస్’ మరో పెద్ద రాకెట్..ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేరిట పెద్ద ఎత్తున రాకెట్ నడిచినట్లు ఒక్కొక్కటిగా కేసులు బయటకు వస్తున్నాయి. ఇతర కులాలకు చెందిన వారికి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉద్యోగాలిచ్చారు. కడప, కర్నూలు, తూర్పు గోదావరి జిల్లాల్లో ఇలాంటి కేసులు చాలా వెలుగులోకి వచ్చాయి. కడప జిల్లాలో రసూల్ 2008, 2012, 2018లో బీసీ–ఈ కేటగిరీ కింద డీఎస్సీ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకుంటే.. ఇప్పుడు మాత్రం ఓసీ–ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద ఉద్యోగం ఇచ్చారు. 1 : 1 రేషియోలో అధికారులు వెరిఫికేషన్ చేశాక కూడా పోస్టు ఎలా ఇచ్చారు? ప్రతి అభ్యర్థి సర్టిఫికెట్లను 7 సార్లు వెరిఫై చేశామని చెబుతున్నప్పుడు ఇన్ని అక్రమాలు ఎలా జరిగాయి? అర్హత లేదని తెలిసి కూడా ఎలా పోస్టులు ఇచ్చారు? ఎవరు చెబితే ఈ పని చేశారు? డీఎస్సీ స్కామ్ పునాదుల నుంచి ఈ కేస్ స్టడీస్ అన్నీ బయటకు వస్తున్నాయి. ‘ఏపీపీఎస్సీ’లోనూ ఇదే చేయాలనుకున్నారు!ఇంకా నిర్ఘాంతపోయే అంశం మరొకటి ఉంది. అదేమిటంటే.. ఏపీపీఎస్సీలోనూ పరీక్షలు రాయకుండానే ఉద్యోగాలిచ్చేయాలని చూశారు. అటవీ శాఖలో 814 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే, అందులో 40 పోస్టులు స్పోర్ట్స్ కోటా పేరిట పరీక్ష లేకుండా, కేవలం ఇలాంటి సర్టిఫికెట్లతో భర్తీ చేసేందుకు మెగా డీఎస్సీలో ఉపయోగించిన జీవో నెం.4ను వీళ్లు వాడుకున్నారు. అంటే డీఎస్సీ కుంభకోణం బయటకు రాకపోయి ఉంటే ఏపీపీఎస్సీలోనూ ఈ 40 పోస్టులు ఇచ్చేసేవారు. డీఎస్సీ అక్రమాలు బయటపడటంతో ఇవి కూడా వెలుగులోకి వస్తాయనే భయంతో మిగతా 774 పోస్టుల భర్తీ ప్రక్రియను మధ్యలోనే నిలిపివేశారు. 40 మంది జాబితా బయటపెట్టాల్సి వస్తుందని కాదా? అని నేను అడుగుతున్నా. ప్రభుత్వం, వ్యవస్థలపై నమ్మకం ఎలా ఉంటుంది?పోటీ పరీక్షల కోసం లక్షల మంది పిల్లలు సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతారు. లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. నిరుద్యోగులు ఇంత కష్టపడుతుంటే చివరికి స్కామ్లు చేసి, లంచాలు తీసుకుని నచ్చిన వాళ్లకు ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు. ఇక ప్రభుత్వం మీద, వ్యవస్థల మీద ఎవరికైనా నమ్మకం ఎలా ఉంటుంది? దీన్ని మార్చాలి. వ్యవస్థలోకి మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. మార్చాలంటే ఎలా జరుగుతుంది? పారదర్శకంగా సీబీఐ విచారణ జరపాలి. విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలి. లేదంటే కాక్రోచ్లు రాక తప్పదు. వీరి మెడలు కూడా వంచక తప్పదు. కచ్చితంగా అదే జరుగుతుంది.అందుకే సీబీఐ విచారణ అవసరంఅసలు పరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగాలు, అందులోనూ టీచర్ ఉద్యోగాలు ఇవ్వడమే ఓ స్కామ్. జీవోలు ఇవ్వడం.. స్పోర్ట్స్ కోటాలో 372 పోస్టులు నింపడం.. ఆ తరువాత జీవోలను రద్దు చేయడం ఇదంతా పెద్ద స్కామ్! అక్రమాలు జరిగాయని ప్రస్ఫుటంగా కనిపిస్తున్నప్పుడు, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆయన కింద పనిచేసే అధికారులు చేసే విచారణలు నిజాయతీగా, సక్రమంగా జరుగుతాయా? అనే అనుమానం ఆ పార్టీ వాళ్లకు కూడా వస్తుంది. చంద్రబాబు కుమారుడు రాజీనామా చేయాల్సిన పరిస్థితుల్లో ఆయన కింద పని చేసే అధికారులు స్వతంత్రంగా నడుచుకోగలరా? అందుకే డీఎస్సీ పోస్టుల భర్తీపై సీబీఐ విచారణ చేయించాలని మేం మొదటి నుంచీ పట్టుబడుతున్నాం. నిజాయతీపరులైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా కోర్టుల్లోనూ పోరాడుతున్నాం. కాక్రోచ్లు ఊరికే రావు. వ్యవస్థలను పాలకుడు ఇలా దగ్గరుండి చెడగొట్టినప్పుడే కాక్రోచ్లు వస్తాయి. నాలాంటి వాడు కూడా కాక్రోచ్ అవుతాడు.తప్పులు ఒప్పుకోక తప్పలేదు..!తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు సీఎం చంద్రబాబు ఐఏఎస్ అధికారులతో మాట్లాడించారు. ఐఏఎస్అధికారుల ప్రెస్మీట్ తర్వాత అంతిమంగా తేలింది ఏమిటంటే...⇒ టెట్ పాస్ అర్హత లేకపోయినా, పోస్టులు ఇచ్చామని ఒప్పుకోక తప్పలేదు.⇒ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు నిఖార్సైనవి అని చెప్పలేకపోయారు.⇒ వెరిఫికేషన్ ఒక బోగస్ అని చెప్పకనే చెప్పారు.⇒ టోర్నమెంట్లు జరగకుండానే సర్టిఫికెట్లు ఇచ్చారని ఒప్పుకోక తప్పలేదు.⇒ టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ సంతకం చేసిన సర్టిఫికెట్ల ఆధారంగా పోస్టులు ఇచ్చామని కూడా ఒప్పుకున్నారు.⇒ లోకేశ్ తోడల్లుడు అధ్యక్షుడిగా ఉన్న జూడో అసోసియేషన్లో పోటీలు జరగకపోయినా దొంగ సర్టిఫికెట్లు ఇచ్చారని ఒప్పుకోక తప్పలేదు. ⇒ కులాలు మార్చి కూడా పోస్టులు ఇచ్చామని అంగీకరించక తప్పలేదు.చక్రం తిప్పిన శాప్..మరికొన్ని కేసుల్లో శాప్ స్వయంగా చక్రం తిప్పింది. విశాఖపట్నంలో ఏ పరీక్షా లేకుండా స్పోర్ట్స్ కోటాలో సీహెచ్ యోగేశ్వరరావు అనే అభ్యర్థికి సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) ఉద్యోగం ఇచ్చారు. ఆయన చెల్లికి కూడా ఇచ్చారు. కుటుంబం మొత్తం ప్యాకేజీ మాట్లాడుకున్నట్లున్నారు! నల్గొండలో జరిగిన 23వ సీనియర్ సౌత్ నేషనల్ ఖోఖో ఛాంపియన్షిప్ 2009లో యోగేశ్వరరావుకు ఫస్ట్ ప్లేస్, ఆయన చెల్లి మోహినిదేవికి సెకండ్ ప్లేస్ వచ్చినట్లు సర్టిఫికెట్లు చూపించారు. అయితే విజేతల జాబితాలో వీళ్లు లేరని తెలంగాణ ఖోఖో అసోసియేషన్ స్పష్టంగా తేల్చి చెప్పింది. ఆ రోజు పోటీలో గెలుపొందిన క్రీడాకారుల వివరాలు, పేర్లతో కూడిన రికార్డులను కూడా బయటపెట్టింది. అంటే ఈవెంట్లు ఎక్కడెక్కడ జరిగాయో తెలుసుకుని, ఆ మేరకు దొంగ సర్టిఫికెట్లు పుట్టించారని అర్థం అవుతోంది. కానీ ఇచ్చిన ఈ ఉద్యోగాలన్నీ ఏడు సార్లు వెరిఫికేషన్ అయిన తరువాత, ప్రతీ దానిని స్రూ్కటినీ చేసి, స్క్రీనింగ్ చేసి, తనిఖీ చేసి ఇచ్చామని అధికారుల చేత చంద్రబాబు చెప్పిస్తున్నారు. -
ఐక్యంగా సాగుదాం.. విజయపతాకం ఎగురవేద్దాం
చీపురుపల్లిరూరల్(గరివిడి): ఐక్యంగా ముందుకు సాగి రానున్న స్థానిక, సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయపతాకాన్ని ఎగురవేద్దామని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గరివిడిలోని పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘కార్యకర్తలందరూ ప్రజల సమస్యలను తమ సమస్యలుగా భావించి వాటి పరిష్కారానికి కృషి చేయాలి. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా మనం అండగా నిలబడదాం. రాజకీయాలు శాశ్వతం కాదు. మనుషుల్లో ఉండే నైతిక విలువలు, పరస్పర గౌరవం శాశ్వతంగా నిలిచిపోతాయి. నేను తప్పు చేసినా నాకు చెప్పండి.. తప్పును తప్పుగా చెప్పగలగాలి.. మనకు మనమే సరిదిద్దుకుంటూ ప్రజల కోసం పనిచేద్దాం’ అని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని పేర్కొన్న ఆయన, పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కార్యకర్తలకు, నాయకులకు సముచిత స్థానాలను కల్పిస్తూ గ్రామాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పన లక్ష్యంగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తదితర నాయకులు పాల్గొన్నారు. ప్రజల ఆదరణ అమూల్యమంటూ భావోద్వేగం తన రాజకీయ జీవితంలో కార్యకర్తలు, ప్రజలు అందించిన ఆదరణను గుర్తు చేసుకుంటూ బొత్స ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. ఈ రోజు తనకు లభిస్తున్న గౌరవం అమూల్యమైనదంటూ కంటతడి పెట్టారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తను గుర్తుంచుకుంటామని పేర్కొన్న ఆయన, అందరినీ కలుపుకుని ముందుకు సాగుదామన్నారు. వ్యక్తిగత భేదాభిప్రాయాలను పక్కనపెట్టి పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా పనిచేద్దామన్నారు. -
సాక్షి టీవీ సోషల్ మీడియా మరో అకౌంట్ నిలిపివేత
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి సర్కార్ కుట్రలు కొనసాగుతున్నాయి. సాక్షి టీవీ సోషల్ మీడియా మరో అకౌంట్ను చంద్రబాబు ప్రభుత్వం నిలిపివేయించింది. డీఎస్సీపై వైఎస్ జగన్ ప్రెస్మీట్ పెట్టిన వెంటనే వీడియోలను తొలగించారు. ఫేక్ అకౌంట్లతో మెటాకు టీడీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. మరో వైపు వైఎస్సార్సీపీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి ప్రభుత్వం.. 20కిపైగా వైఎస్సార్సీపీ అనుకూల సోషల్ మీడియా అకౌంట్లు కూడా బ్లాక్ చేయించింది.సోషల్ మీడియా అకౌంట్ల తొలగింపు వెనుక ఏపీకి చెందిన సైబర్ అధికారులు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. డీఎస్సీ స్కామ్ వార్తలు పెట్టినందుకే సోషల్ మీడియా అకౌంట్ల బ్లాక్ చేస్తున్నట్లు సమాచారం. అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ‘సాక్షి’పై కక్ష సాధింపు చర్యలకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు ప్రభుత్వం.. పత్రికా స్వేచ్ఛను, వాక్ స్వాతంత్ర హక్కును కాల రాస్తోంది.ఇదీ చదవండి: జనసేన, బీజేపీ సిగ్గుపడాలి: వైఎస్ జగన్ -
గుర్తుపెట్టుకో నైతిక విలువలు ముఖ్యం.. బొత్స అదిరిపోయే కౌంటర్
-
ఎవరూ శాశ్వతం కాదు.. మజ్జి శ్రీను పార్టీ మారడంపై స్ట్రాంగ్ రియాక్షన్
-
నువ్వు మంత్రివా! DSC స్కామ్ అడ్డంగా దొరికిన లోకేష్
-
మీలాంటి వాళ్ల వల్లే కాక్రోచ్ లు పుట్టకొస్తారు.. కూటమిపై విరుచుకుపడ్డ YS జగన్
-
జగన్ దెబ్బకు బాబుకు బీపీ హై వెలుగులోకి కీలక ఆధారాలు
-
7 స్టెప్స్ వెరిఫికేషన్.. ఇది వీళ్ల బండారం..జగన్ సంచలన వ్యాఖ్యలు
-
రాజీనామా చేసే వరకు వదిలిపెట్టను జగన్ మాస్ వార్నింగ్
-
నమ్మినవాళ్లే నన్ను మోసం చేశారు..! కన్నీరు పెట్టిన బొత్స
-
‘నమ్మినవాళ్లే మోసం చేశారు..’ ఏడ్చేసిన బొత్స
సాక్షి, విజయనగరం: వైఎస్సార్సీపీ సీనియర్ నేత, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ భావోద్వేగానికి గురయ్యారు. ఇటీవలి పరిణామాలతో కలత చెందిన ఆయన.. కష్టకాలంలో నిలబడే కార్యకర్తలే పార్టీకి నిజమైన వెన్నుదన్ను అంటూ కంటతడి పెట్టారు. అయితే తండ్రి బొత్స సత్యనారాయణ కంటితడి పెట్టడంపై ఆయన కుమార్తె బొత్స అనూష చలించిపోయారు. తండ్రిని ఓదార్చారు. గురువారం గరివిడిలో చీపురుపల్లిలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఆ సమయంలో బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాస్(చిన్న శ్రీను) ఇటీవలె పార్టీ మారడం.. పార్టీతో కలిసి నడిచిన రోజుల్ని, అనుబంధాన్ని కొందరు కార్యకర్తలు ప్రస్తావించారు. ఆ ప్రసంగాల సమయంలో.. నమ్మినవాళ్లు మోసం చేశారంటూ బొత్స ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. ఆపై తనను తాను సముదాయించుకుని.. ‘‘వ్యక్తులు రావొచ్చు.. పోవచ్చు.. పార్టీ మాత్రం శాశ్వతం. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. పార్టీ పటిష్టత కోసం నిరంతరం పని చేయాలి. వైఎస్ జగన్ ఆశయాల కోసం కలిసి పని చేద్దాం. కష్టకాలంలో నిలబడే కార్యకర్తలే పార్టీకి నిజమైన వెన్నుదన్ను’’ అని అన్నారాయన.ఇదీ చదవండి: నేనూ ఓ కాక్రోచ్గా మారొచ్చు: వైఎస్ జగన్ -
అసలు సూత్రదారులు వీళ్లే..! ఆధారాలతో బయటపెట్టిన YS జగన్
-
బాబు జైలుకెళ్లి మూడేళ్లు... వెళ్తూ వెళ్తూ జగన్ సెటైర్లు అదుర్స్
-
15లక్షలకు DSC జాబ్ లు అమ్ముకున్నారు..! సంచలన వీడియో బయటపెట్టిన YS జగన్
-
శ్రీవారిని దర్శించుకున్న వెల్లంపల్లి
-
వైఎస్ జగన్ ప్రెస్మీట్ హైలైట్స్..
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్.. మెగా డీఎస్సీ కుంభకోణం గురించి కీలక విషయాలను వెల్లడిస్తున్నారు. వైఎస్ జగన్ ప్రెస్మీట్ హైలైట్స్2025 మెగా డీఎస్పీలో తవ్వేకొద్దీ అక్రమాలు కనిపిస్తున్నాయి.డీఎస్సీ అక్రమాలు బయటికొచ్చే కొద్దీ బాబులో బీపీ పెరుగుతోంది.నా ప్రశ్నలకు బాబు, లోకేష్ సమాధానం చెప్పలేదుప్రశ్నిస్తే తప్పుడు కేసులతో భయపెడుతున్నారు.రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రశ్నాపత్రం తయారీ2025 మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీప్రశ్నించిన జర్నలిస్టులపై కూడా అక్రమ కేసులు పెట్టారు.మా ప్రశ్నలకు సమాధానం చెప్పరు.. బుల్డోజ్ చేస్తారుఫస్ట్ ర్యాంకర్ను వెరికేషన్కు ఎందుకు పిలవలేదు?డీఎస్సీపై ప్రభుత్వానికి అనేక ప్రశ్నలు సంధించాంపర్యవేక్షణ ఒకే వ్యక్తి చేతిలో ఎందుకు పెట్టారు?ఎస్ఈఆర్టీలో వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చింది?మెరిట్ లిస్ట్లో ఫస్ట్ ర్యాంకర్ పేరును ఎందుకు మార్చారు?ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు?కోర్టుకు ఫస్ట్ ర్యాంకర్ ఎందుకు వెళ్లాడు.జీవో నంబర్ 4, 47తో గేట్లు తెరిచారు.ఆడియో, వీడియో కాల్స్ బయటకు వచ్చాయి.డిఎస్సీ స్కామ్ను దగ్గరుండి నిర్వీర్యం చేస్తున్నారు.ఇలాంటి స్కామ్ల వల్లే కాక్రోచ్లు పుట్టుకొస్తున్నాయి.బాబు స్కామ్ల హిస్టరీలో ఇదొక ఆణిముత్యంతప్పుడు సర్టిఫికెట్లతో ఉద్యోగాలిచ్చేశారు.నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు.పై నుంచి కింది స్థాయి వరకూ అంతా కుమ్మక్కయ్యారుకొడుకును కాపాడాలనే ఉద్దేశంలో చంద్రబాబు ఉన్నారు.వ్యవస్థలపై నమ్మకం లేకుండా చేస్తున్నారు.2013 జూడో సీనియర్ పోటీలో ఖమ్మంలో జరిగినట్లుగా ఏపీ జూడో అసోసియేషన్ సర్టిఫికెట్లు ఇచ్చింది.ఖమ్మంలో అసలు సీనియర్ పోటీలు జరగలేదని తెలంగాణ అసోసియేషన్ తేల్చి చెప్పింది.విశాఖలో అన్నాచెల్లెళ్లకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలిచ్చేశారు.దొంగ సర్టిఫికెట్లు చూపినట్లు ఆధారాలున్నాయి.ఏపీ జూడో అసోసియేషన్ అధ్యక్షుడు.. లోకేష్ తోడల్లుడు భరత్.డీఎస్సీ-2025, మెగా డీఎస్సీ కాదు, నిరుద్యోగులను, నిజాయితీపరులైన అభ్యర్థులను దగా చేసిన డీఎస్సీ అని చాలా రోజులుగా చెప్తున్నాం.గత రెండు వారాలుగా బయటకు వచ్చిన మరికొన్ని సాక్ష్యాలు, ఆధారాలు దీన్ని రుజువు చేస్తున్నారు.ఇవిచూసిన తర్వాత ఎవరైనా ఈస్కాం నుంచి తప్పించుకోగలుగుతారా? ఎందుకంటే అలాంటి నివ్వెరపోయే వాస్తవాలు మనకు కనిపిస్తున్నాయి.మెగా డీఎస్సీ కుంభకోణాన్ని తవ్వేకొద్దీ, ఈ స్కాం తాలూకు రూపాలు చాలా కనిపిస్తున్నాయి.మరోవైపు సోషల్మీడియాలో కూడా నిలదీయకూడదంటూ అక్కౌంట్లను బ్లాక్ చేస్తూ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారు. ఈ డీఎస్సీ స్కాం ఎలా జరిగిందో అనేక సార్లు ఇదే వేదికపై నుంచి నేను సాక్ష్యాలు, ఆధారాలు చూపించాను.నేను అడిగే ప్రశ్నలు చాలా సింపుల్. ఇందులో అర్థంకాకపోవడానికి కూడా ఏమీ లేదు.గతంలోనైనా, ఎప్పుడైనా, రాష్ట్ర డీఎస్సీ చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా, ప్రశ్న పత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ ఈ రెండింటినీ ఒకే వ్యక్తి చేతిలో ఎందుకు పెట్టారు? ఎందుకు పారదర్శకతకు పాతర వేశారు? అని అడిగా? ఇది స్కాంకు ద్వారాలు తెరిచినట్టుకాదా? అని అడిగా? కాని చంద్రబాబు నోరు విప్పలేదు.డీఎస్సీ ప్రశ్నపత్రంలో ప్రశ్నలనుకూడా అమ్ముకున్నారని ఇటీవలే కొంతమంది అభ్యర్థులు చెప్పడం, మెగా డీఎస్సీలో లీకేజీ జరిగిందనడానికి మరింత బలాన్ని ఇవ్వడంలేదా?స్పోర్ట్స్ కోటా జీవోను మార్చి, అదివరకే ఉన్న 2% స్పోర్ట్స్ కోటాను 3 శాతానికి పెంచడమే కాదు, ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్షే లేకుండా, డైరెక్ట్గా జీవో 4,47లతో గేట్లు ఎత్తారు.పని అయిపోయాక, మళ్లీ జీవో నంబర్ 23, 25, జీవో నంబర్ 56 లతో, గేట్లు మూసేశారు. ఎందుకు ఈ జీవోలు ఇచ్చారు? ఎందుకు పని అయిపోయిన తర్వాత, ఆ జీవోలను ఉపసంహరించారు? కారణం ఏంటి?టీచర్ పోస్టులకోసం డబ్బులు తీసుకున్నారంటూ ఆడియో, వీడియో కాల్స్ బయటకు వచ్చినా, దీనిపై విచారణ ఎందుకు నిర్వీర్యం చేశారు? ఎఫ్ఐఆర్ నమోదయ్యింది మొదలు, స్టేషనల్ బెయిల్ ఇచ్చి పంపడం వరకూ, ఎందుకు కేసును నిర్వీర్యం చేశారు? పైగా రిమాండ్కు పంపాం అంటూ అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు చెప్పారు. ఇవే బేసిక్గా మెగా డీఎస్సీ స్కాంకు సంబంధించి పునాదులు.ఇప్పుడు బయటకు వస్తున్న కేస్స్టడీస్ అన్నీకూడా, వీటికి సంబంధించిన కోణాలే. తవ్వుతున్న కొద్దీ ఒక్కో అక్రమం, ఒక అక్రమాన్ని తవ్వుతుంటే ఇంకో అక్రమం బయటకు వస్తోంది.బాబుగారి స్కాంల హిస్టరీలో మరో ఆణిముత్యం ఇది. నిరుద్యోగ యువకులను నట్టేటా ముంచి స్కాం ఇది.స్పోర్ట్స్కోటా పేరుతో వీళ్లు చేసిన అక్రమాలు చూస్తే, వీడు మనవాడా? ఇతను దగ్గరనుంచి డబ్బులు ముట్టాయా… అయితే ఇచ్చేయ్ టీచర్ పోస్టు.. అన్న పద్ధతిలో ఈ రిక్రూట్మెంట్ చేశారు.జరగని పోటీలు జరిగినట్టుగా, ఆ పోటీల్లో వీళ్లు అద్భుతంగా ఆడినట్టుగా తప్పుడు సర్టిఫికెట్లతో సైతం పోస్టులు ఇచ్చేశారు.పై స్థాయి నుంచి ఆదేశాలతో, కింది స్థాయి వరకూ కుమ్మక్కై, ఒక మోడస్ ఆపరండీ ప్రకారం ఈ పోస్టులన్నింటినీ భర్తీచేశారు.సీబీఐ విచారణ జరగాల్సిన అవసరాన్ని ప్రతి కేస్ స్టడీకూడా చెప్తోంది.స్పోర్ట్స్లో కోటా భర్తీచేసిన వాళ్ల జాబితా చూస్తే ‘జూడో ఆట’తో మొత్తం 39 మందికి ఎలాంటి ఎగ్జామ్ లేకుండా టీచర్ పోస్టులు ఇచ్చారు.సాఫ్ట్బాల్ పేరిట, 38 మందికి ఇలానే పరీక్ష రాయకుండానే, టీచర్ పోస్టులు ఇచ్చారు. ఈ సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరంటే, టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్.మరికొన్ని కేసుల్లో అయితే, శాపే చక్రంతిప్పింది.విశాఖపట్నంలో ఏ ఎగ్జామ్ రాయకుండానే ‘యోగేశ్వర్రావు’ అనే అభ్యర్థికి స్పోర్ట్స్ కేటగిరీలో ఎస్జీటీ టీచర్ పోస్టు ఇచ్చారు.ఈయన చెల్లెలికి కూడా ఇలానే స్పోర్ట్స్ కేటగిరీలో పోస్టు ఇచ్చారు.కాని వీళ్లు విజేతల జాబితాలో లేరని తెలంగాణ ఖో – ఖో అసోసియేషన్ చాలా స్పష్టంగా చెప్తూ, ఆరోజు పోటీల్లో గెలుపొందిన వారి వివరాలను విడుదలచేశారు.అంటే, ఈవెంట్లు ఎక్కడెక్కడ జరిగాయో కనుక్కుని. ఆమేరకు దొంగ సర్టిఫికెట్లు పుట్టిస్తున్నారని అర్థం అవుతోంది.కాని ఏడుసార్లు వెరిఫికేషన్ చేయించామని చంద్రబాబు అధికారులతో చెప్పిస్తున్నారు.కొన్ని కేసుల్లో, అభ్యర్థులు టెట్ పాస్ కాకుండానే ఉద్యోగాలు ఇచ్చారు.ఒక కేటగిరీలో టెట్ అర్హత ఉంటే, మరో సబ్జెక్ట్కు సంబంధించి టీచర్ పోస్టు ఇచ్చారు.ఇంకొన్ని కేసుల్లో అభ్యర్థికి ఒక కులానికి సంబంధించి రిజర్వేషన్ ఉంటే, మరో కులానికి సంబంధించిన రిజర్వేషన్లో పోస్టు ఇచ్చారు.కర్నూలు జిల్లాలో ‘ఈడిగ ప్రభాకర్’ అనే అభ్యర్థికి, ఏ పరీక్ష రాయకుండానే, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇచ్చారు.తన రిజర్వేషన్ కేటగిరి ప్రకారం ఎస్జీటీ పోస్టుకు టెట్లోలో 75 మార్కుల రావాలి.కాని, 65 మార్కులు వచ్చినా, స్పోర్ట్స్ కోటాలో ఎస్జీటీ పోస్ట్ ఇచ్చారు.ఈ విషయాన్ని కర్నూలు డీఈఓ కూడా ఒప్పుకున్నారు. మరి ఉద్యోగం ఎలా ఇచ్చారు? ఎవరు చెప్తే ఇచ్చారు?ఈడిగ ప్రభాకర్కు టెట్లో 77 మార్కులు 2018లో వచ్చాయని ఈ కేసును ఇక్కడ కప్పిపుచ్చే ప్రయత్నంచేశారు.కాని వీరు చూపిన హాల్ టికెట్ నంబర్ ఆధారంగా వెబ్సైట్లోకి వెళ్లి, టెట్ డేటా చూస్తే,ఈ 77 మార్కులు, స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే 2B కేటగిరీకి సంబంధించిన మార్కులు.మరి ఇతనికి టెట్ 1ఏ-లో ఉన్న, ఎస్జీటీ పోస్టు ఎలా ఇచ్చారు?ఈడబ్యుఎస్ రిజర్వేషన్ పేరిట పెద్ద ఎత్తున రాకెట్ నడిచినట్టు ఒక్కొక్కటిగా కేసులు బయటకు వస్తున్నాయి.ఇతర కులాలకు చెందిన వాళ్లకు ఈడబ్యుఎస్ కింద పోస్టులు ఇచ్చారు. కడప, కర్నూలు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఇలాంటి కేసులన్నీ వెలుగులోకి వస్తున్నాయి.కడప జిల్లాలో రసూల్ అనే వ్యక్తి బీసీ-ఈ కేటగిరీ అయితే, 2009, 2012, 2018లో బీసీ-ఈ కిందే డీఎస్సీ పరీక్షలకోసం అప్లై చేస్తే, ఇప్పుడు మాత్రం అతనికి ఓసీ- ఈడబ్ల్యూఎస్ కింద పోస్టు ఇచ్చారు.1:1 రేష్యోలో అధికారుల వెరిఫికేషన్ ఏశాక, దాన్ని దాటి పోస్టులు ఎలా ఇవ్వగలిగారు? ప్రతి అభ్యర్థి సర్టిఫికెట్లను 7సార్లు వెరిఫైచేశామని చెప్తున్నప్పుడు ఇన్ని అక్రమాలు ఎందుకు జరిగాయి? అర్హత లేదని తెలిసి కూడా, పోస్ట్లు ఎలా ఇచ్చారు? ఎవరు చెప్తే ఈ పనిచేశారు?నిరుద్యోగ యువతకోసం న్యాయస్థానాల్లోనూ పోరాడుతున్నాం.అర్హత లేనివారికి ఎవరు చెబితే పోస్ట్ ఇచ్చారు?అసలు ఏ పరీక్షా లేకుండానే పోస్ట్లు ఇవ్వడం పెద్ద స్కాం.నాలాంటి వాడు కూడా కాక్రోచ్ అవుతాడు- వైఎస్ జనన్చంద్రబాబు దగ్గర పనిచేసే అధికారులు నిస్పక్షపాతంగా విచారణ చేయగలరా?ఏ పరీక్షా లేకుండా గర్నమెంటు ఉద్యోగాలు ఇవ్వడమే పెద్ద స్కాంమరి అక్రమాలు జరిగాయని ఒప్పుకున్న తర్వాత, చంద్రబాబుగారి ప్రభుత్వమే అధికారంలో ఉండగా, ఆయన కింద పనిచేసే అధికారులతో చేసే విచారణలు నిజాయితీగా, స్వతంత్రంగా జరుగుతాయా?చంద్రబాబు కుమారుడు రాజీనామా చేయాల్సిన పరిస్థితుల్లో, ఆయన కింద పనిచేసే అధికారులు స్వతంత్రంగా నడుచుకోగలరా?అందుకే డీఎస్సీ రిక్రూట్మెంట్పై సీబీఐ విచారణ చేయించాలని మేం మొదటి నుంచీ పట్టుబడుతున్నాం. నిజాయితీపరులైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా కోర్టులోనూ పోరాడుతున్నాం.మరి కాక్రోచ్లు ఊరికే రావు. వ్యవస్థలను చెడగొట్టినప్పుడే కాక్రోచ్లు వస్తాయి. నాలాంటి వాడుకూడా కాక్రోచ్ అవుతాడు.మరో నిర్ఘాంతపరిచే విషయం ఏంటంటే, పరీక్షలు లేకుండానే, టీచర్ పోస్టులు కట్టబెట్టిన వీళ్లు, ఏపీపీఎస్సీలో కూడా పరీక్షలు లేకుండా ఉద్యోగాలు ఇవ్వాలని చూశారు.అటవీశాఖలోని 814 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే. అందులో 40 స్పోర్ట్స్ కోటా పోస్టులను పరీక్ష లేకుండా కేవలం స్పోర్ట్స్ సర్టిఫికెట్ల ఆధారంగా భర్తీ చేసేందుకు డీఎస్సీలో ఉపయోగించిన జీఓ నంబర్-4నే మీరు వాడుకున్నారు.డీఎస్సీ అక్రమాలు బయటపడగానే ఇవి కూడా వెలుగులోకి వస్తాయనే భయంతో రికక్రూట్మెంట్ను మధ్యలో ఆపేశారు.ఈ 40 పోస్టుల జాబితా బయటపడితే తమ బాగోతం కూడా బయటపడుతుందనే ఉద్దేశంతో మిగిలిన 774 పోస్టుల భర్తీని నిలిపేశారు.లక్షలమంది పిల్లలు పోటీ పరీక్షలకు సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతారు. లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు.ఇంత కష్టపడితే చివరకు స్కాంలతో ఇష్టారాజ్యంగా నచ్చిన వాళ్లకు లంచాలు తీసుకుని పోస్టులు ఇస్తున్నారు.ప్రభుత్వంమీద, వ్యవస్థలమీద మరి నమ్మకం ఎవరికైనా ఎలా ఉంటుంది? -
కురుక్షేత్రానికి సిద్ధం కండి.. క్యాడర్ కు జగన్ బిగ్ టాస్క్
-
చంద్రబాబు హామీలు.. మోసాలు.. ఇంటింటా ఇదే చర్చ
వచ్చే సెప్టెంబర్లో పాదయాత్ర చూస్తుండగానే కళ్లు మూసి తెరిచేసరికి దాదాపు రెండున్నర ఏళ్లు గడిచాయి. ఇప్పుడు సెప్టెంబరు నెలలో ఉన్నాం. మళ్లీ కళ్లు మూసి తెరిచేలోగా ఏడాది గడిచి మళ్లీ సెప్టెంబరు వస్తుంది. వచ్చే ఏడాది సెప్టెంబరు లేదా అక్టోబరులో నా పాదయాత్ర మొదలవుతుంది. పర్చూరు మీదుగా కూడా నా యాత్ర జరుగుతుంది. చంద్రబాబు చేసిన మోసమే ఇప్పుడు ప్రతి ఇంట్లో చర్చనీయాంశమైంది. జగన్ మోసం చేయలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మోసం చేయలేదు. వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా చేశారు. ఆ టైంలో కనీసం నాలుగువేళ్లు నోట్లోకి పోయాయి. కానీ, చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయాం. ఇవాళ నోట్లోకి ఏదీ పోవడం లేదు. చంద్రబాబు పుణ్యాన మా బతుకులు బస్టాండ్ అయిపోయాయి అన్న చర్చ ప్రతి ఇంట్లో జరుగుతోంది.‘‘జగన్ ఇస్తున్న పథకాల కంటే మూడింతలు ఎక్కువ ఇస్తాను అని చెప్పి చంద్రబాబు ప్రజలను మోసం చేశాడు. ప్రతి ఇంటికి బాండ్లు పంపాడు. ఆ బాండ్ల మీద చంద్రబాబు, పవన్కళ్యాణ్ ఫొటోలు, సంతకాలతో పాటు ప్రమాణం చేసే మాటలు. జగన్ ఇచ్చినవే కాకుండా సూపర్ సిక్స్లు, సూపర్ సెవెన్ల పేరిట ఇంకా ఎక్కువ, మూడింతలు ఇస్తామన్నారు.’’‘‘చంద్రబాబు అనే వ్యక్తి, తనను ప్రశ్నించే గొంతు వినడానికి సిద్ధంగా లేని మనిషి. ఎవరు ప్రశ్నించినా వారి మీద అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పడం, నిర్బంధించడం, ప్రలోభాలు పెట్టడం, దిగజారిన రాజకీయాలు చేయడం చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు హయాంలో మనం చూస్తోంది రోజుకో డ్రామా. రోజుకో నటన. రోజుకో డైవర్షన్.’’‘‘స్థానిక ఎన్నికలు ఎలా జరిగినా ప్రజలకు తోడుగా వైఎస్సార్సీపీ ఉంటుంది అన్న భరోసా మాత్రం కచ్చితంగా ఇవ్వాలి. ఎన్నికలు కనుక సాఫీగా జరిగితే వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఎక్కడైనా సరే విజయం సాధిస్తారు. ఒకవేళ ఎన్నికలు సాఫీగా జరగకపోయినా, ప్రజలకు తోడుగా పోటీలో గట్టిగా మనం నిలబడదాం.’’‘‘ప్రజలకు మంచి చేసి.. ఫలాన మంచి నేను చేశాను కాబట్టి నాకు ఓటు వేయండి అని అడిగే నిబద్ధత, చిత్తశుద్ధి పాలకుడికి ఉండాలి. అప్పుడే దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రజలు తోడుగా నిలబడతారు. కానీ చంద్రబాబు మాదిరిగా అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం, దౌర్జన్యాలు చేయడం, డైవర్షన్స్ చేస్తూ ఉండడాన్ని దేవుడు కరుణించడు. ప్రజలు హర్షించరు’’ – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ పాలనకు, చంద్రబాబు పాలనకు మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోందని, ఇది ప్రతి ఇంట్లో చర్చనీయాంశంగా మారిందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు హామీలు, మోసాలపైనే ప్రతి ఇంట్లోనూ చర్చ జరుగుతోందని, వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనను, చంద్రబాబు రెండున్నరేళ్ల పాలనను ప్రజలు పోల్చి చూసుకుంటున్నారని అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నేతలు, ముఖ్య కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు.. జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బలంగా నిలబడాలని, పోరాడాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు నిజాయితీగా జరిగితే విజయం తప్పకుండా వైఎస్సార్సీపీదే అని స్పష్టం చేశారు. పర్చూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ గాదె మధుసూదన్రెడ్డి, పలువురు నేతలు సమావేశానికి హాజరయ్యారు. వైఎస్ జగన్ ఏం మాట్లాడారంటే..కార్యకర్తలు గర్వపడేలా మన పాలనమన 5 ఏళ్ల పాలన, బాబు రెండున్నర ఏళ్ల పాలనలో ఎంతో తేడా ఉంది. దీనిపైనే ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. ఆ ఐదేళ్ల మన పరిపాలనలో ప్రతి కార్యకర్త కాలర్ ఎగరేసుకుని ఫలానావాడు మా నాయకుడు, ఫలానా పార్టీ మా పార్టీ అని గర్వంగా చెప్పుకోగలిగే పరిస్థితి. మ్యానిఫెస్టోకు అర్థం తీసుకొచ్చిన పార్టీ రాష్ట్ర చరిత్రలో కానీ, దేశ చరిత్రలో కానీ ఏదైనా ఉందంటే అది ఒక్క వైఎస్సార్సీపీ మాత్రమే. రాజకీయ నాయకులు, పార్టీలు ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలు ఇస్తారు. చంద్రబాబు లాంటి వాళ్లు అయితే ఏకంగా ప్రతి ఇంటికి బాండ్లు కూడా పంచిపెడతారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మ్యానిఫెస్టో, అందులో ఇచ్చిన హామీలు చెత్తబుట్టలో కనిపిస్తాయి. అలాంటి పరిస్థితిని మార్చిన పాలన మనది. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్లా భావిస్తూ, అందులో చెప్పిన వాటిలో 99 శాతం అమలు చేసిన పార్టీ వైఎస్సార్సీపీ మాత్రమే అని గర్వంగా చెప్పగలుగుతాం. అంతగా మాట ఇస్తే ఆ మాటపై నిలబడాలి అని తాపత్రయపడ్డాం. బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే ఏ పథకం ఏ నెలలో ఎప్పుడు ఇస్తాము అని ముందుగానే షెడ్యూల్ ప్రకటించి, ఒక్క పథకం కూడా మిస్ కాకుండా బటన్లు నొక్కి అమలు చేసిన పార్టీ వైఎస్సార్సీపీ మాత్రమే. గతంలో ఎప్పుడూ చూడని విధంగా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చాం. ప్రభుత్వ పథకాలు లంచాలు లేకుండా ఇవ్వగలిగే పరిస్థితి ఉంటుందా? అన్న సందేహాలను పటాపంచలు చేశాం. ప్రతి గ్రామంలో ఒక సచివాలయం ఏర్పాటు చేసి, ప్రతి 50, 60 ఇళ్లకు ఒక వలంటీర్ను తీసుకొచ్చి, ప్రతి పథకాన్ని పారదర్శకంగా అమలు చేశాం. ఇది వైఎస్సార్సీపీ హయాంలోనే జరిగింది.వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులు.. మన ప్రభుత్వ హయాంలో గవర్నమెంట్ స్కూళ్లు, ప్రైవేటు స్కూళ్లకు పోటీగా మారాయి. ఇంగ్లీష్ మీడియం చదువులు, మూడో తరగతి నుంచి టోఫెల్ పీరియడ్, సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్స్ అమలు చేయడం, నాడు–నేడు మనబడితో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు పూర్తిగా మార్చడం, ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లోనూ డిజిటలైజ్డ్ బోధన తీసుకొచ్చేలా డిజిటలైజ్డ్ క్లాస్ రూమ్స్ చేయడం వైఎస్సార్సీపీ హయాంలోనే జరిగాయి. గోరుముద్ద అనే పేరుతో పిల్లలు ఏం తింటున్నారో, తినే ఆ తిండి బాగుందా లేదా అని పట్టించుకునే ముఖ్యమంత్రి బహుశా దేశ చరిత్రలో ఎవరైనా ఉంటారో లేదో తెలియదు కానీ జరిగింది ఒక వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే. మొట్టమొదటిసారిగా బైలింగ్వల్ టెక్స్ట్బుక్స్.. ఒక పేజీ తెలుగు, ఒక పేజీ ఇంగ్లీషుతో బుక్స్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం మనది. ఎనిమిదో తరగతికి పిల్లాడు వచ్చేసరికి ఆ పిల్లాడి చేతుల్లో ట్యాబ్లు పెట్టింది కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. ఆరోగ్యశ్రీ పేదవాడికి ఇంకా తోడుగా ఉండేలా చాలా మార్పు చేశాం. మనం రాకముందు ఆరోగ్యశ్రీ పరిధి 1,000 ప్రొసీజర్లు. మనం వచ్చిన తర్వాత 3,300 ప్రొసీజర్లకు తీసుకెళ్లాం. ప్రతి పేదవాడికి రూ.25 లక్షల దాకా ఉచితంగా వైద్యం అందించాం. నాడు–నేడుతో హాస్పిటల్స్ రూపురేఖలు మారాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ జీఎంపీ ప్రమాణాలతో కూడిన మందులు అందుబాటులో ఉంచాం. అదీ మన చరిత్ర. ఇంకా ఆస్పత్రుల్లో జీరో వేకెన్సీ పాలసీ. ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్టుల కొరత జాతీయస్థాయిలో 61 శాతం ఉంటే మన రాష్ట్రంలో అది కేవలం 4 శాతం మాత్రమే. ఒకేసారి 17 కొత్త మెడికల్ కాలేజీలు యుద్ధ ప్రాతిపదికన మొదలు పెట్టడం అన్నది కూడా గతంలో ఎప్పుడూ చూడని విషయం. గ్రామస్థాయిలోనే విలేజ్ క్లినిక్ ఏర్పాటు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి గ్రామస్థాయిలోనే ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం. ఇంకా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్. ప్రతి మండలంలో రెండు పీహెచ్సీలు. ప్రతి పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లు. ప్రతి డాక్టర్కు నాలుగైదు ఊళ్లు కేటాయింపు. ఒక డాక్టర్ పీహెచ్సీలో ఉంటే, మరో డాక్టర్ తనకు కేటాయించిన గ్రామాలకు 104 అంబులెన్సులో పర్యటన. అలా ఆయా గ్రామాలు, అక్కడి వారితో డాక్టర్కు సాన్నిహిత్యం. అత్యుత్తమ వైద్య సేవలు. ఊరిలో పేషెంట్ను పేరు పెట్టి పిలవగలిగే పరిస్థితిలోకి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్. ఇది కూడా గతంలో ఎప్పుడూ, ఎక్కడా జరగలేదు. నష్టాల్లో ఉన్న రైతు. రైతు బ్రతుకంతా ఎప్పుడూ కష్టమే. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి నుంచి, రైతును పట్టించుకునే నాధుడు ఉండడు అన్న పరిస్థితి నుంచి, మొట్టమొదటిసారిగా రైతును చెయ్యి పట్టుకొని నడిపించాలని తపన పడింది వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే. అందుకోసం గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు. ఆ ఆర్బీకేలో అసిస్టెంట్గా అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్. ప్రతి ఎకరా ఈ–క్రాపింగ్. వాటన్నింటి ద్వారా ప్రతి అడుగులోనూ రైతును చెయ్యి పట్టుకొని నడిపించే కార్యక్రమం. ఆ ఆర్బీకేల్లో పంటల గిట్టుబాటు ధరల ప్రకటన. ఆ మేరకు పోస్టర్లు. ఏరోజైనా రైతుకు రేటు రాకపోతే వెంటనే ఆర్బీకేలోని అగ్రికల్చర్ అసిస్టెంట్ సీఎం–యాప్ (కంటిన్యూయస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్) ద్వారా యాక్టివేట్ చేస్తే, వెంటనే జాయింట్ కలెక్టర్, మార్క్ ఫెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ జోక్యం చేసుకోవడం, ఆ ఆర్బీకే పరిధిలో పంటలు కొనుగోలు చేయడం, అలా మార్కెట్లో పోటీని సృష్టించి రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చేయడం అన్నది దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. సచివాలయంలో మన కళ్ళ ముందే దాదాపు పది మంది కళకళలాడుతూ సేవలు అందించే కార్యక్రమం. ప్రతి 50,60 ఇళ్లకు ఒక వలంటీర్. ఇళ్లకే వెళ్లి సేవలు అందించే కార్యక్రమం. ఇవన్నీ ఎప్పుడూ చూడలేదు, ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తప్ప. వ్యవస్థలో కనీవిని ఎరుగని మార్పులు మన హయాంలోనే జరిగాయి.చంద్రబాబు పచ్చి దగామనం ఇస్తున్న పథకాల కంటే మూడింతలు ఎక్కువ ఇస్తాను అని చెప్పి చంద్రబాబు ప్రజలను మోసం చేశాడు. ప్రతి ఇంటికి బాండ్లు పంపాడు. ఆ బాండ్ల మీద చంద్రబాబు, పవన్కళ్యాణ్ ఫొటోలు, సంతకాలతో పాటు ప్రమాణం చేసే మాటలు. మనం ఇచ్చినవే కాకుండా సూపర్ సిక్స్లు, సూపర్ సెవెన్ల పేరిట ఇంకా ఎక్కువ, మూడింతలు ఇస్తామన్నారు. అప్పుడు చంద్రబాబునాయుడు చెప్పిన మాటలు ఏమిటి? జగనైతే అమ్మఒడి కింద ఎంత మంది పిల్లలు ఉన్నా ఒకరికే రూ.15 వేలు ఇస్తున్నాడు. మేమైతే ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే, అందరికీ రూ.15 వేల చొప్పున ఇస్తామన్నాడు. అంతటితో ఆగిపోలేదు. ఆడబిడ్డ నిధి కింద నీకు రూ.18 వేలు, నీకు రూ.18 వేలు ఇస్తామని చెప్పాడు. ఇంకా అంతటితో కూడా ఆగిపోలేదు. రైతు కనపడితే ఏమన్నాడు? జగన్ రైతు భరోసా కింద రూ.13,500 ఇస్తే, తాను రూ.26 వేలు ఇస్తానన్నాడు. అంతటితో ఆగిపోలేదు. 45 ఏళ్ళు దాటిన మహిళలకు చేయూత కింద జగన్ ఇచ్చేది కేవలం రూ.18,750 అయితే, తాము 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్నారు. అలా నీకు రూ.48 వేలు, నీకు రూ.48 వేలు ఇస్తామని ప్రచారం చేసుకున్నారు. ఇంకా దాంతోనూ ఆగిపోలేదు. 20 ఏళ్ల పిల్లోడు కనపడితే ఏమన్నాడు? నీకు రూ.36 వేలు, నీకు రూ.36 వేలు అని చెప్పాడు. అలా జగన్ కంటే అన్నీ ఎక్కువే ఇస్తానని నమ్మించాడు. ఆఖరికి వలంటీర్లను కూడా చంద్రబాబు మోసం చేశారు.దౌర్జన్యంతో పాలకులు రాజ్యం చేయలేరుఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే దౌర్జన్యంతో ఎప్పుడూ కూడా పాలకులు రాజ్యం చేయలేరు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు పాలనలో నా పాదయాత్రకు ముందు నంద్యాల ఉపఎన్నిక జరిగింది. ఆ ఉపఎన్నికల్లో విపరీతంగా పోలీసుల ద్వారా అధికార దుర్వినియోగం చేశారు. దాంతో నంద్యాల ఉప ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 34 వేల ఓట్లతో ఓడిపోయింది. కానీ ఆ తర్వాత ఏమైంది? మన పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను చంద్రబాబునాయుడు తన పార్టీలో చేర్చుకున్నాడు. ఆ తర్వాత ఏమైంది? దాని తర్వాత నా పాదయాత్ర జరిగింది. ఆ తర్వాత ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఏం జరిగింది? ఒక సునామీ వచ్చింది. దేవుడు చంద్రబాబుకి ఎలా మొట్టికాయలు వేశాడో చూశాం. అదే నంద్యాలలో దాదాపు 40 వేల ఓట్లతో మనం గెలిచాము. చంద్రబాబు మన పార్టీ నుంచి చేర్చుకున్న 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు. సరిగ్గా ఆ సంఖ్యలోనే ఆ పార్టీ గెలిచింది. మన దగ్గర నుంచి వెళ్లిన వాడు ఎవడూ గెలవలేదు ఒకడు తప్ప. అందరూ ఓడిపోయినారు.’’జరగబోయేది కురుక్షేత్రంఇప్పటి ఈ ఎన్నికల కంటే కూడా రేపు పొద్దున జరగబోయే కురుక్షేత్రం ముఖ్యం. ఈ ఎన్నికల్లో చిన్న ప్రాణులను ఓడించడం కోసం చంద్రబాబు చేసిన అధికార దుర్వినియోగం, పోలీసు బలగాల ప్రయోగంపై కసి అన్నది ఆ ఎన్నికల్లో రావాలి. అలాంటి కసి కార్యకర్తలకు రావాలి. ఆ కార్యకర్తకు పార్టీ అన్ని రకాలుగా తోడుగా అండగా నిలబడుతుంది. ఇది కార్యకర్తల కోసం జరుగుతున్న ఎన్నికలు. మనం కార్యకర్తలకు తోడుగా ఉండాల్సిన ఎన్నికలు. ప్రజలకు తోడుగా కార్యకర్త నిలబడతాడు. కార్యకర్తకు తోడుగా పార్టీ నిలబడుతుంది అన్న సంకేతం ఈ ఎన్నికల ద్వారా మనం ఇవ్వాలి.స్థానిక ఎన్నికలపైనా చంద్రబాబు డ్రామా.. కుట్రఇలాంటి పరిస్థితుల మధ్య ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే చంద్రబాబు ఆ ఎన్నికలు పెడతాడో లేదో తెలియదు. కానీ మేకపోతు గాంభీర్యం మాత్రం ప్రదర్శిస్తున్నాడు. ఎందుకంటే ఆయన నిజంగా స్థానిక ఎన్నికలు పెట్టే వాడే అయితే, బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ఇచ్చే వాడు కాదు. దీనికి సంబంధించి నాడు మన హయాంలో ఇచ్చిన జీఓను కోర్టు కొట్టేసింది. అయినా అంతకన్నా ఎక్కువ పదవులు మనం బీసీలకు ఇచ్చాం. ఆ జడ్జిమెంట్ ఇప్పుడు కనిపిస్తోంది. ఆ బీసీ రిజర్వేషన్లు తెలంగాణాలోనూ కొట్టేశారు. అందుకే ఇప్పుడు ఇక్కడ కూడా ఆ అవకాశం ఉందని తెలిసినా, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అంటూ చంద్రబాబు డ్రామా చేస్తున్నాడు. ఎందుకంటే ఈ ఎన్నికలు జరగకూడదు. వాయిదా పడాలన్నదే ఆయన కుట్ర. మరొకటి ‘సర్’. (ఓటర్ల జాబితాల సమగ్ర సవరణ) వీళ్ళే అంటున్నారు ఇక్కడ 44 లక్షల ఓట్లు లేవు అని. అయితే పాత జాబితాలతో ఎన్నికలు పెడతాడా? దానికి ఏ కోర్టయినా ఒప్పుకుంటుందా? మరి చంద్రబాబు ఎన్నికలు పెట్టాలని ఇవన్నీ చేస్తున్నాడా? పెట్టకూడదని చేస్తున్నాడా? ఇది మేకపోతు గాంభీర్యం కాకపోతే ఇదంతా ఏమిటి? సరే, ఏదైనా కానీ, చంద్రబాబుగారు స్థానిక ఎన్నికలు పెడతాడని అనుకుని, ముందుకు పోదాం.ఎన్నికలు సాఫీగా జరిగే వీలు లేదుచంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్నికలు సాఫీగా జరుగుతాయని నేను అనుకోవడం లేదు. చంద్రబాబు అనే వ్యక్తి, తనను ప్రశ్నించే గొంతు వినడానికి సిద్ధంగా లేని మనిషి. చంద్రబాబుని ఎవరు ప్రశ్నించినా వారి మీద అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పడం, నిర్బంధించడం, ప్రలోభాలు పెట్టడం, దిగజారిన రాజకీయాలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు హయాంలో మనం చూస్తోంది రోజుకో డ్రామా. రోజుకో నటన. రోజుకో డైవర్షన్. ఇది కాక రెడ్బుక్ రాజ్యాంగం. వీటన్నింటి నేపథ్యంలో ఎన్నికలు సాఫీగా జరుగుతాయని అనుకోవడం లేదు.సాఫీగా జరిగితే మనదే విజయంఎన్నికలు ఎలా జరిగినా ప్రజలకు తోడుగా వైఎస్సార్సీపీ ఉంటుంది అన్న భరోసా మాత్రం కచ్చితంగా ఇవ్వాలి. ఎన్నికలు కనుక సాఫీగా జరిగితే వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఎక్కడైనా సరే విజయం సాధిస్తారు. ఒకవేళ ఎన్నికలు సాఫీగా జరగకపోయినా, ప్రజలకు తోడుగా పోటీలో గట్టిగా మనం నిలబడదాం. చంద్రబాబు ఒకవేళ ఓడించే కార్యక్రమం, అధికార దుర్వినియోగం చేసే కార్యక్రమం, పోలీసులు జులుంను ఉపయోగించే కార్యక్రమం చేస్తే ఎవరిని ఓడించడం కోసం? ఆ చిన్న ప్రాణాన్ని ఓడించడం కోసం. ఆ చిన్న ఎంపీటీసీ స్థానం, ఆ చిన్న సర్పంచ్ స్థానం, ఆ చిన్న వార్డ్ మెంబర్ స్థానంలో ఉన్న వ్యక్తులను ఓడించడం కోసం. అందుకే అటువంటి చిన్న ప్రాణాలకు తోడుగా ఉండాలి. -
‘చంద్రబాబు పాలనపై ప్రజలు విసిగిపోయారు’
సాక్షి, గుంటూరు: చంద్రబాబు పాలనను చూసి ప్రజలు విసిగిపోయారని వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. గుంటూరులో వైఎస్సార్సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. మాజీ మంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్సీలు మురుగుడు హనుమంతరావు, చంద్రగిరి ఏసురత్నం, నియోజకవర్గ సమన్వయకర్తలు అన్నాబత్తుని శివకుమార్, అంబటి మురళీకృష్ణ, నూరి ఫాతిమా, దొంతిరెడ్డి వేమారెడ్డి, వనమా బాల వజ్ర బాబు, నియోజకవర్గ పరిశీలకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఎన్నో ఇబ్బందులు పడ్డామన్నారు. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత బయటపడకుండా చంద్రబాబు, లోకేష్ పోలీసులను అడ్డం పెట్టుకుని వ్యవహారం నడుపుతున్నారు. టీడీపీ వెన్నుపోటు పార్టీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలి’’ అని ఆయన పిలుపునిచ్చారు.మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ.. కార్యకర్తలే పార్టీకి ప్రాణం. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయాల్సిందే.. గెలవాల్సిందే. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో ఇబ్బందులు పడ్డాం. వైఎస్ జగన్ సంక్షేమ పాలన అందిస్తే.. కూటమి ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తుందని ఆమె మండిపడ్డారు.మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్రెడ్డి మాట్లాడుతూ.. కూటమిలో ఉన్న పార్టీలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు మనకు సెమీ ఫైనల్. స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు మిమ్మల్ని గెలిపిస్తారు.. అసెంబ్లీ ఎన్నికల్లో మీరు నాయకులను గెలిపించాలి. పార్టీ జెండా మోసిన ప్రతి వ్యక్తి మా మా బిడ్డ లాంటి వాళ్లే. -
నేడు వైఎస్ జగన్ ప్రెస్మీట్
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ గురువారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సమకాలీన అంశాలపై ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. -
మజ్జి శ్రీను పార్టీ మారడంపై బొత్స ఇంటి వద్ద అత్యవసర మీటింగ్
-
అరెస్ట్ను సెలబ్రేట్ చేసుకోవడం సిగ్గుచేటు: వీరశేఖర్ రెడ్డి
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని విమర్శిస్తే పార్టీ నాయకులు చూస్తూ ఊరుకోరని, వారి భాషలోనే అంతకన్నా బలంగా సమాధానం ఇస్తామని.. తమ హుందాతనాన్ని చేతకానితనంగా భావించవద్దని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వీరశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సహనం నశించేలా తమను రెచ్చగొడితే చంద్రబాబు తనయుడు నారా లోకేష్కు సంబంధించిన అంశాలపై కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు.2014 నుంచి 2019 మధ్య కాలంలో ఫైబర్ నెట్, ఇసుక, మద్యం, అమరావతి భూములు, స్కిల్ డెవలప్మెంట్ వంటి అనేక స్కామ్లకు పాల్పడి, కోట్లు కొల్లగొట్టి, జైలుకు వెళ్లి మెడికల్ బెయిల్పై బయటికి వచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్టస్ పేరుతో ఆ కేసులను కొట్టేయించుకున్న విధానంపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాంటి వ్యక్తి ఈరోజు అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. మా సహనాన్ని తక్కువ అంచనా వేయొద్దు:వైఎస్ జగన్ వ్యక్తిత్వ హననం చేస్తే చూస్తూ ఊరుకోం. మా హుందాతనం చేతకానితనం అనుకోవద్దు. మీరు రాళ్లు వేస్తే మేము బండలు వేయగలం. మీరు పూలు పెడితే మేము పుష్పగుచ్ఛాలు ఇవ్వగలం. మీరు బూతులు తిడితే మేము కూడా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మేము హుందాగా మాట్లాడుతున్నామంటే చేతకాక కాదు. మాపై వ్యక్తిగత విమర్శలు చేయకుండా రాజకీయంగా విమర్శిస్తే రాజకీయంగానే సమాధానం ఇస్తాం. ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజల సమస్యలను ఎలా పరిష్కరించాలి, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలి అనే దానిపై మాట్లాడాలి.కానీ చంద్రబాబు మాట్లాడటం మొదలుపెడితే బూతులు, అబద్ధ ప్రచారం, విషప్రచారం తప్ప మరేమీ కనిపించడం లేదు. నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఈ స్థాయికి దిగజారడం దురదృష్టకరం. మాజీ ముఖ్యమంత్రి, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిపై వ్యక్తిగతంగా, నీచంగా మాట్లాడటం సరైంది కాదు. ముఖ్యమంత్రి అనే స్థాయిని చంద్రబాబు మర్చిపోకూడదు.2014 నుంచి 2019 మధ్య ఫైబర్నెట్, ఇసుక, మద్యం, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్, అమరావతి అసైన్డ్ భూములు, స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించిన అనేక ఆరోపణలు వచ్చాయి. స్కిల్ కేసులో వందల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీల ఆరోపణలతో ఏపీ సీఐడీ కేసు నమోదు చేసి అరెస్టు చేస్తే కోర్టు జైలుకు పంపింది. అలాంటిది కేసులు, అరెస్టులు, రిమాండ్లకు సంబంధించిన విషయాలను కూడా సెలబ్రేట్ చేసుకోవడం ఏ విధమైన రాజకీయ సంస్కతి? తప్పు చేయకుండా ఒక సిద్ధాంతం కోసం పోరాడి జైలుకు వెళ్లినవాళ్లు గొప్పగా చెప్పుకుంటారు.కానీ తన అరెస్టును చంద్రబాబు సెలబ్రేట్ చేసుకోవడం సిగ్గుచేటు. స్కిల్ కేసులో అరెస్టు కాబటి జైల్లో ఉండొచ్చిన చంద్రబాబు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటాడు? ఆయన మెడికల్ గ్రౌండ్స్పై బెయిల్ వచ్చాడే కానీ కేసుల్లో నిజాయితీ పరుడిగా నిర్ధారణ కాలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అధికారాన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై ఉన్న కేసులను మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ పేరుతో తొలగించేసుకుంటున్నాడు.ముఖ్యమంత్రి పదవి చేపట్టింది తనపై ఉన్న కేసులను తొలగించుకోవడానికా? లేక ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికా? ఈ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి. కేసుల విషయంలో కోర్టులు నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితిలో ప్రభుత్వం, పోలీసులు తీసుకునే నిర్ణయాలపై కూడా ప్రజలకు వివరణ ఇవ్వాలి.లోకేశ్ బాగోతం బయట పెట్టమంటారా?వైఎస్ జగన్ చదువుల కోసం అమెరికా వెళ్లి హోమ్సిక్తో తిరిగి రావడం ఏమైనా పెద్ద తప్పా? చదువు కోసం అమెరికా వెళ్లి తల్లిదండ్రులను విడిచి ఉండలేక తిరిగి రావడాన్ని కూడా రాజకీయ విమర్శగా ఉపయోగించుకోవడం అన్యాయం. అప్పట్లో వైఎస్సార్.. చంద్రబాబు వ్యాఖ్యలకు ఇచ్చిన సమాధానం ప్రజలకు తెలుసు. వైఎస్ జగన్ వ్యక్తిగత జీవితంపై మాట్లాడుతున్న చంద్రబాబు.. ముందుగా తన కుటుంబానికి సంబంధించిన ఆరోపణలపై సమాధానం చెప్పాలి. నారా లోకేష్కు సంబంధించి గతంలో వచ్చిన ఆరోపణలపై ప్రజలకు వివరణ ఇవ్వాలి. ఇతరుల వ్యక్తిగత జీవితాలను ప్రశ్నించే ముందు తన కుటుంబంపై వచ్చిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. జనాలు అన్నీ మర్చిపోయారు, తాను ఏది చెప్పినా నమ్ముతారు అనుకోవద్దు.దస్తగిరి టీడీపీ ఆఫీస్కు ఎందుకు వెళ్లారు?వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడైన దస్తగిరికి టీడీపీ కార్యాలయంలో ఏం పని? ఆయనకు న్యాయ సహాయం ఎవరు అందించారు? ఈ అంశాలపై రాష్ట్ర ప్రజలకు స్పష్టమైన సమాధానం ఇవ్వాలి. వీటికి సమాధానం చెప్పిన తర్వాత వైఎస్ జగన్ గురించి మాట్లాడాలి. మేము హుందాగా మాట్లాడుతున్నాం. అంతే తప్ప, అది తమ బలహీనత కాదన్న విషయం చంద్రబాబు గుర్తుంచుకోవాలని వీరశేఖర్రెడ్డి స్పష్టం చేశారు. -
ఆ లేఖను బయట పెట్టగలరా?: వంగవీటి నరేంద్ర
సాక్షి, తాడేపల్లి: స్కిల్ స్కామ్ నుంచి డీఎస్సీ వరకు అవినీతి, అక్రమాలపై ప్రజలకు సమాధానం చెప్పకుండా సంబరాలు చేసుకోవడం చంద్రబాబు, లోకేశ్కు పరిపాటిగా మారిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర ధ్వజమెత్తారు. చంద్రబాబుపై స్కిల్ కేసు పెట్టింది వైఎస్ జగన్ కాదు.. ఈడీ పెట్టింది. కానీ తనపై వైఎస్ జగన్ కేసులు పెట్టించాడంటూ అన్యాయంగా మాట్లాడుతున్నారు. అనారోగ్య సమస్యలు చూపించి బెయిల్ తెచ్చుకున్న వ్యక్తి చంద్రబాబు’’ అంటూ నరేంద్ర మండిపడ్డారు.‘‘అధికారులను భయపెట్టి తనపై ఉన్న కేసులను వెనక్కి తీసుకునేలా చేసుకుంటున్నారు. తనపై కేసులకు తానే క్లీన్ చిట్ ఇచ్చుకోవటం సిగ్గుచేటు. చంద్రబాబు నేరం చేసినట్లు ఛార్జ్ షీట్ లో స్పష్టంగా ఉంది. ప్రభుత్వం మారిన తరువాత వరుసగా కేసులు క్లోజ్ అవుతున్నాయి. స్కిల్ కేసులో నలుగురిని ఈడీ అరెస్టు చేసింది. స్కిల్ కేసులో క్లీన్ చిట్ ఇచ్చిందంటున్నారు. ఆ లెటర్ బయట పెట్టగలరా?.సిద్ధార్థ లూథ్రాకి ఏ అధికారంతో ఏపీ పోలీసు అధికారులతో సమావేశాలు పెడుతున్నారు. చంద్రబాబు అడ్డదారిలో అధికారంలోకి రాకుండా ఉంటే జీవిత కాలం జైల్లో ఉండే కేసులు ఉన్నాయి. చంద్రబాబు మళ్లీ జైలుకి వెళ్ళడం ఖాయం’’ అని వంగవీటి నరేంద్ర వ్యాఖ్యానించారు. -
ప్రతి ఇంట్లో అదే చర్చ : వైఎస్ జగన్ (ఫొటోలు)
-
వైఎస్సార్ చెస్ టోర్నమెంట్లో విజేతగా శిబి శ్రీనివాస్ చెమికల
మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ సీపీ జర్మనీ విభాగం కన్వీనర్ కృష్ణ తేజా రెడ్డి గడ్డం ఆధ్వర్యంలో మ్యూనిక్ నగరంలో వైఎస్సార్ చెస్ టోర్నమెంట్ నిర్వహించారు. ఇందులో విజేతగా నిలిచిన డార్మ్ స్టడ్ అప్లయిడ్ సైన్సెస్ యూనివర్సిటీ విద్యార్ధి శిబి శ్రీనివాస్ చెమికలకు వైఎస్సార్ సీపీ ఐటీ విభాగ కోర్డినేటర్ విష్ణు వర్ధన్ రెడ్డి మార్తల ట్రోఫీని అందజేశారు. జర్మనీ వైఎస్సార్ సీపీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సాయి సూర్య చౌదరి నేలకుర్తి ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు.(చదవండి: జర్మనీలో ఘనంగా వైఎస్సార్ వర్ధంతి) -
తాడిపత్రిలో టీడీపీ నేతల దౌర్జన్యం.. వైఎస్సార్సీపీ ఆఫీసుకి తాళం
సాక్షి,అనంతపురం: తాడిపత్రి పెద్దవడగూరులో టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ రోజు ( బుధవారం) మండల వైఎస్సార్సీపీ కార్యాలయానికి జేసీ వర్గీయులు తాళాలు వేశారు. ఈ వ్యవహారం పట్ల పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోగా తాళం తీసేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకున్నారు. టీడీపీ గుండాలకు పోలీసులు సహకరిస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
YS జగన్ పాదయాత్ర డేట్ ఫిక్స్
-
చిన్న శీను పార్టీ మార్పుపై స్పందించిన బొత్స
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తీరుతెన్నులపై వైఎస్ఆర్సీపీ నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో దోచుకునేందుకే కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారని అన్నారు. కూటమి ఎమ్మెల్యేలకు ప్రజా సమస్యలు పట్టవని పేర్కొన్నారు. శాసనమండలి ప్రతిపక్ష నేత అయిన బొత్స సత్యనారాయణ.. స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్ జగన్ దిశా నిర్దేశం చేశారని, స్థానిక సంస్థల ఎన్నికలు ఏకగ్రీవం కాకూడదు అని చెప్పారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆకృత్యాలు ప్రజలకు తెలుసని, రాష్ట్రంలో అద్వాన్నమైన పరిస్థితులు ఉన్నాయని బొత్స పేర్కొన్నారు. ప్రజలకు అండగా వైఎస్ఆర్సీపీ ఉండాలని, రాష్ట్రంలో మళ్లీ వైఎస్ఆర్సిపి అధికారంలోకి వస్తుందని బొత్స అన్నారు. వైఎస్ఆర్సిపి మేయర్ను దౌర్జన్యం చేసి దించేశారని ఆరోపించారు. విశాఖ నగరంలో తాగు నీటి సమస్య ఉందని వాపోయారు. ప్రజా సమస్యలపై మంత్రులు, ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి లేదని, దోచుకోవడానికే కూటమి ప్రజా ప్రతినిధులు ఉన్నారని బొత్స మండిపడ్డారు. నిత్యవసర వస్తువులు ఆకాశాన్ని అంటుతున్నాయని, సీఎం చంద్రబాబు ఒక రోజైనా విశాఖ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టారా? అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలు టీవీ 5, ఏబీఎన్ కంటికి కనిపించలేదా? అని నిలదీశారు. పోలవరం నీళ్లు ఎక్కడ ఇచ్చారని, ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు ఇచ్చి గోదావరి జలాలు అని మోసం చేస్తారా? అని బొత్స ప్రశ్నించారు. గోదావరి జలాలు ఇస్తే విశాఖ నగరంలో మంచి నీటి సమస్య ఎందుకు ఉందని అడిగారు. ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగులు రోడ్ల పైకి వస్తున్నారని, పేకాట ఆడేవారికి డీఎస్సీలో ఉద్యోగాలు ఇచ్చారని బొత్సొ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బొత్స.. వెన్నుపోటు పార్టీ- వెన్నుపోటు పాలన పోస్టర్ విడుదల చేశారు. పార్టీ నాయకులకు ఐడి కార్డులను పంపిణీ చేశారు. చంద్రబాబు వెన్నుపోటు దారుడని తానేమీ చెప్పలేదని, ఆయన మామ ఎన్టీఆర్ చెప్పారన్నారు. అన్ని వర్గాల ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని, డీఎస్సీలో ఉద్యోగాలు లక్షల రూపాయలకు అమ్ముకున్నారన్నారు. మూడు లక్షల మందితో ఆటలాడుకున్నారని, డీఎస్సీపై మాట్లాడితే అరెస్టు చేస్తారా?.. ఎవర్ని అరెస్టు చేస్తారో చేయండంటూ బొత్స సవాల్ విసిరారు. టెట్ క్వాలిఫై అవకుండా టీచర్ ఉద్యోగాలు ఇచ్చారని, డీఎస్సీ అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాలని బొత్స డిమాండ్ చేశారు.అలాగే, చిన్న శీను పార్టీ మార్పుపై స్పం బొత్స సత్యనారాయణ స్పందించారు. రాజకీయాల్లో మనిషి అనేవాడికి స్వార్థం ఉంటుంది. కానీ, రాజకీయ పార్టీ శాశ్వతం. మనుషులు వస్తుంటారు పోతుంటారు.. పార్టీ పని పార్టీ చేస్తుంది. మాకు ఇదేమీ కొత్త కాదు అంటూ వ్యాఖ్యానించారు. -
2029.. ఏ ఒక్కడిని వదిలిపెట్టను... అనిల్ కుమార్ యాదవ్ మాస్ వార్నింగ్
-
జరగబోయేది కురుక్షేత్ర సంగ్రామం: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడు, ఎలా జరిగినా పార్టీ శ్రేణులు గట్టిగా నిలబడి పోరాడాలని పిలుపునిచ్చారు. అధికార దుర్వినియోగం, పోలీసు బలగాల ప్రయోగం, అక్రమ కేసులు, అరెస్టులు వంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు. బుధవారం పర్చూరు నియోజకవర్గ పార్టీ కేడర్తో జరిగిన సమావేశంలో జగన్ మాట్లాడారు. స్థానిక ఎన్నికలు జరుగుతాయో లేదో కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం వెనుక ఎన్నికలను వాయిదా వేయాలన్న ఉద్దేశం ఉందని వ్యాఖ్యానించారు. ఆ రిజర్వేషన్లను కోర్టు కొట్టివేస్తుందని ప్రభుత్వానికి ముందే తెలుసని, దానిని సాకుగా చూపి ఎన్నికలను వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ‘‘రేపు జరిగేది కురుక్షేత్ర సంగ్రామం. స్థానిక ఎన్నికల్లో జరిగే అధికార దుర్వినియోగం, పోలీసు బలగాల ప్రయోగంపై కసి వచ్చే సాధారణ ఎన్నికల్లో కనిపించాలి’’ అని అన్నారు. ఓట్లపై కూడా అనుమానాలు..ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపైనా జగన్ ప్రశ్నలు సంధించారు. ఇప్పటికే 44 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని ప్రభుత్వ వర్గాలే చెబుతున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిజంగా సజావుగా జరుగుతాయా? అని ప్రశ్నించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్సార్సీపీ ప్రజలకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. “ఎన్నికలు సాఫీగా జరిగితే వైఎస్సార్సీపీదే విజయం. సాఫీగా జరగనివ్వకపోయినా గట్టిగా పోరాడదాం. స్థానిక ఎన్నికల్లో మీరు గట్టిగా నిలబడాలి” అని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.రోజుకో డ్రామా.. డైవర్షన్ పాలిటిక్స్చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఎన్నికలు సాఫీగా సాగే అవకాశం లేదని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, జైలుకు పంపడం జరుగుతోందని ఆరోపించారు. ‘‘రోజుకో డ్రామా.. రోజుకో నటన.. డైవర్షన్ పాలిటిక్స్’’ అంటూ కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.స్థానిక ఎన్నికలు కేవలం రాజకీయ పార్టీలకు సంబంధించినవి కావని, అవి ప్రధానంగా కార్యకర్తల ఎన్నికలని జగన్ అన్నారు. గ్రామస్థాయిలో ప్రజలకు కార్యకర్తలే అండగా ఉంటారని, అలాంటి కార్యకర్తలకు పార్టీ కూడా అండగా నిలవాలని సూచించారు. దౌర్జన్యంతో ఎప్పటికీ పాలకులు రాజ్యం చేయలేరని వ్యాఖ్యానించారు.నంద్యాల ఉప ఎన్నికను గుర్తుచేస్తూ..పర్చూర్ కేడర్ వద్ద తన గత రాజకీయ అనుభవాలను కూడా వైఎస్ జగన్ ప్రస్తావించారు. 2017లో తాను పాదయాత్ర ప్రారంభించడానికి ముందు నంద్యాల ఉప ఎన్నిక జరిగిందని గుర్తుచేశారు. తీవ్ర అధికార దుర్వినియోగం కారణంగా వైఎస్సార్సీపీ 35 వేల ఓట్ల తేడాతో ఓడిపోయిందని అన్నారు. 2014–19 మధ్య తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను చంద్రబాబు తీసుకున్నారని జగన్ ఆరోపించారు. ఆ తర్వాత తాను పాదయాత్ర చేపట్టానని, ప్రజల్లో పెద్ద ఎత్తున స్పందన వచ్చిందని తెలిపారు. 2019 ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని గుర్తుచేశారు. నాడు తమ పార్టీ నుంచి తీసుకెళ్లిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీల సంఖ్యకే చంద్రబాబు పార్టీ పరిమితమైందని వ్యాఖ్యానించారు.మంచి చేసి ఓటు అడగాలి..పాలకులు ప్రజలకు మంచి చేసి, ఆ పనులను చూపించి ఓట్లు అడగాలని జగన్ అన్నారు. అలా చేసినప్పుడే దేవుడి ఆశీస్సులు, ప్రజల ఆదరణ లభిస్తాయని పేర్కొన్నారు. ఎల్లవేళలా అబద్ధాలు, దౌర్జన్యాలను ప్రజలు హర్షించబోరని అన్నారు. ‘‘జరగబోయేది కురుక్షేత్ర సంగ్రామం. ఆ సంగ్రామంలో మీరంతా ప్రజలకు తోడుగా నిలబడాలి.. పోరాడాలి’’ అని వైఎస్సార్సీపీ శ్రేణులకు జగన్ పిలుపునిచ్చారు.ఇదీ చదవండి: అర్హతే లేనివారికి టీచర్ పోస్టులా? -
పర్చూరుపై జగన్ ఫోకస్.. నేతలతో కీలక భేటీ
-
DSC అక్రమాలపై విచారణ జరిగితే నారా లోకేష్ జైలుకే
-
నేడు పర్చూరు నియోజకవర్గ నేతలతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 9న (బుధవారం) ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బాపట్ల జిల్లా పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. వారితో అక్కడ పార్టీ పరిస్థితులు, ప్రజా సమస్యలు, రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. -
సాగునీటి కోసం పోరుబాట
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీశైలం జలాలు సోమశిలకు విడుదల చేయాలనే డిమాండ్తో నెల్లూరు జిల్లా రైతులతో కలిసి వైఎస్సార్సీపీ మంగళవారం పోరుబాట పట్టింది. వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టాస్క్ ఫోర్స్ కో–ఆర్డినేటర్ సాకే శైలజానాథ్ నేతృత్వంలో మంగళవారం ‘చలో నెల్లూరు బ్యారేజీ’ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను ప్రయోగించింది. వైఎస్సార్సీపీ నేతలు, రైతులను బ్యారేజీ వద్దకు వెళ్లకుండా పోలీసులు అడుగడుగునా ఆటంకాలు కల్పిం చారు. బారికేడ్లు పెట్టి మరీ ఆంక్షలు విధించారు. రోప్ పార్టీలను రంగంలోకి దింపి రైతులు, వైఎస్సార్సీపీ నేతలపై దౌర్జన్యం చేశారు. ఎస్పీకి ముందుగానే సమాచారమిచ్చినా.. ఈ కార్యక్రమంపై ముందుగానే జిల్లా ఎస్పీకి వైఎస్సార్సీపీ నేతలు సమాచారమిచ్చినప్పటికీ అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. తొలుత మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్రెడ్డి, సాకే శైలజానాథ్, వైఎస్సార్సీపీ నెల్లూరు రూరల్ ఇన్చార్జి ఆనం విజయ్కుమార్రెడ్డి, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త బూదూరు గురవయ్య, సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకుడు వీరి చలపతి, రైతు విభాగం అధ్యక్షుడు శివుని నరసింహారెడ్డి తదితరులతో కలిసి రైతులు, పార్టీ నాయకులు వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయం నుంచి సుమారు 100 కార్లు, బైకులతో భారీ ర్యాలీగా నెల్లూరు బ్యారేజీ వైపు తరలివచ్చారు. అప్పటికే బ్యారేజీ వద్ద భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. రోప్ పార్టీలతో వైఎస్సార్సీపీ శ్రేణులను ముందుకు వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఉదయం నుంచి బ్యారేజీ రెండువైపుల బారికేడ్లు పెట్టి ప్రజలను సైతం రాకపోకలు సాగించకుండా నిలువరించారు. దీంతో దాదాపు గంటపాటు పోలీసులు, పార్టీ నేతల మధ్య తోపులాటలు జరిగాయి. అనంతరం రైతులు, నాయకులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. చివరకు పోలీసుల అడ్డంకులను లెక్కచేయకుండా బ్యారేజీ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. చంద్రబాబు నిర్లక్ష్యంతోనే శాశ్వత కరువు: కాకాణి చంద్రబాబు నిర్లక్ష్యంతోనే గ్రేటర్ రాయలసీమ శాశ్వత కరువు కోరల్లోకి వెళ్లిపోతోందని కాకాణి గోవర్ధన్రెడ్డి మండిపడ్డారు. స్వప్రయోజనాల కోసమే శ్రీశైలం జలాలను తెలంగాణకు తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. పంటలు ఎండిపోతున్నా కూటమి ప్రభుత్వం శ్రీశైలం దిగువ ప్రాజెక్ట్లకు నీటిని విడుదల చేయడంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోందని నిలదీశారు. శ్రీశైలంలో నీళ్లున్నా సోమశిలకు ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. నీటిమట్టం మరింత పడిపోతే నెల్లూరు జిల్లాకు శాశ్వత కరువు ముప్పు ఏర్పడుతుందన్నారు.సోమశిల–కండలేరు ఫ్లడ్ఫ్లో కెనాల్ ద్వారా ఒక్క రోజు నీటిని విడుదల చేసినా కలువాయి, కుల్లూరు చెరువులకు నీరు చేరుతుందన్నారు. ఇప్పటికే కలువాయి మండలం కనుపూరుపల్లి, నూకనపల్లి, యదనపర్తి, వెరు»ొట్లపల్లి, గోపవరం తదితర గ్రామాల్లో 3,600 నుంచి 4,000 ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయన్నారు. రైతులు పురుగు మందు డబ్బాలు చేతపట్టుకుని రోడ్డెక్కుతున్నా ప్రభుత్వానికి కనికరం లేదన్నారు. రైతుల పోరాటాల్ని అడ్డుకుని ప్రభుత్వ వైఫల్యాలను దాచలేరని మండిపడ్డారు. ఎల్నినో కాదు.. ఎల్లో నిల్ ఎఫెక్ట్: శైలజానాథ్ మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మాట్లాడుతూ.. ఇది ఎల్నినో ఎఫెక్ట్ కాదని.. ఎల్లో నిల్ ఎఫెక్ట్ అని ఎద్దేవా చేశారు. నెల్లూరు జిల్లా రైతుల్ని కూటమి ప్రభుత్వం నట్టేట ముంచుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సోమశిల ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి తక్షణమే నీటిని తరలించి ఎండిపోతున్న పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. పది రోజులుగా శ్రీశైలం నుంచి సోమశిలకు నీటిని తరలించాలని కోరుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. శ్రీశైలం నుంచి సోమశిలకు చుక్క నీరు కూడా ఇవ్వబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం దారుణమన్నారు. శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేసే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. -
‘బాబూ.. జాబులేవి?’ అని అడగడమే నేరమా?
సాక్షి, అమరావతి: ఇచ్చిన హామీలను నెరవేర్చా లని కాకినాడలో శాంతియుతంగా ర్యాలీ చేసిన నిరుద్యోగులపై కూటమి ప్రభుత్వం కక్ష పూరితంగా కేసులు పెట్టడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. హక్కుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నేరమా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలను నెరవేర్చాలని నిరసన తెలిపిన నిరుద్యోగులపై కేసులు పెడతారా? అంటూ నిలదీశారు. ఇది కూటమి ప్రభుత్వం నిరంకుశ విధానానికి నిదర్శనమంటూ మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం సామాజిక మాధ్యమం ఎక్స్లో కూటమి ప్రభుత్వ చర్యలను ఎండగట్టారు. ఆయన ట్వీట్లో ఇంకా ఏమన్నారంటే... నిరుద్యోగ యువతపై కేసులా? మెగా పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ కాకినాడలో శాంతియుతంగా నిరసన తెలిపిన నిరుద్యోగ యువతపై చంద్రబాబు నేతృత్వంలోని వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం పోలీసు కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. శ్యామ్, టి.రాజా, ఎం. గంగ సూరిబాబు, రాజేష్తో పాటు 20 మంది పోలీసు నిరుద్యోగులు చేసిన నేరమేమిటి? ‘బాబూ.. జాబులేవి?’ అని ప్రశ్నించడమేనా నేరం? ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని అడగడం కూడా తప్పా? ప్రజలు తాము ఎన్నుకున్న ప్రభుత్వాన్ని శాంతియుతంగా ప్రశ్నించడం కూడా ఆంధ్రప్రదేశ్లో నేరంగా మారిందా?. అప్రజాస్వామిక వైఖరికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది చంద్రబాబూ?ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల భృతి ఇస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని 20 లక్షల మంది నిరుద్యోగులకు ఈ లెక్కన ఏడాదికి రూ.7,200 కోట్లు, మూడేళ్లకు రూ.21,600 కోట్లు చెల్లించాలి. కానీ ఇటు ఉద్యోగాలు ఇవ్వకుండా, అటు నిరుద్యోగ భృతి చెల్లించకుండా యువతను మోసం చేసిన ఈ వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు తమ హక్కుల కోసం ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెడుతోంది.మెగా డీఎస్సీలో రోజుకొక మోసం బయటపడుతుంటే సమాధానం చెప్పలేక చంద్రబాబు, నారా లోకేశ్ ఇద్దరూ అణచివేత, నిర్బంధం, బెదిరింపులకు దిగుతున్నారు. అడ్డదారుల్లో ఉద్యోగాలు పొందిన వారిని కాపాడుతూ.. పారదర్శకంగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరుతున్న అర్హులైన నిరుద్యోగులను నేరస్తులుగా చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం యువత పట్ల అనుసరిస్తున్న వ్యతిరేక విధానానికి, అప్రజాస్వామిక వైఖరికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది?. యువత ఆశలు, ఆకాంక్షలను ఏనాడూ చంద్రబాబు గౌరవించలేదు వెన్నుపోటు పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ నియామకాల్లో అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిబంధనలకు విరుద్ధమైన నియామకాలు పరిపాటిగా మారాయి. అవినీతి, రాజకీయ పైరవీలతో ఉద్యోగాలను పంచుకోవడంపైనే వెన్నుపోటు పార్టీ దృష్టి తప్ప.. రాష్ట్ర యువత ఆశలు, ఆకాంక్షలను ఏనాడూ గౌరవించలేదు. ప్రతిభకు పట్టం కట్టి, అర్హులకు నిష్పక్షపాతంగా ఉద్యోగాలు కల్పిం చాలన్న చిత్తశుద్ధి ఈ వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వానికి లేదు. నిరుద్యోగ యువతపై నమోదు చేసిన కేసులన్నింటినీ తక్షణమే, బేషరతుగా ఉపసంహరించాలి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మెగా పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుంది. వారికి న్యాయం జరిగే వరకు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుంది’ అని మాజీ సీఎం వైఎస్ జగన్ హెచ్చరించారు. -
‘స్థానిక’ ఎన్నికలకు మనమంతా సన్నద్ధంగా ఉండాలి: బొత్స
కాకినాడ: స్థానిక సంస్థల ఎన్నికలకు మనమంతా సమాయత్తంగా ఉండాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు, మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సూచించారు. ప్రతీ స్థానంలోనూ పోటీ చేయాలని, పోరాటం చేసి విజయం సాధించాలన్నారు. కాకినాడ జిల్లా వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశంలో బొత్స మాట్లాడారు. కూటమి పాలనలో జరుగుతున్న ఆకృత్యాలను ఎన్నడూ చూడలేదని, వారి ఆకృత్యాలన్నీ టీవీ, పేపర్లు చూస్తూ కనిపిస్తాయన్నారు. ‘ టెట్ ఎన్ని సార్లు అయిన రాసుకోవచ్చు అని చంద్రబాబు, లోకేష్ ప్రజల చెవ్వుల్లో పువ్వులు పెడుతున్నారు. టెట్ రాయకుండా టీచర్ ఉద్యోగం ఇవ్వొచ్చా లేదా అనే దాని పై చెప్పడం లేదు. డీఎస్సీ అక్రమాల పై ప్రశ్నించినందుకు మాపై కేసులు పెడితే తేల్చుకుంటాం. ఆంద్రాలో ప్రజలు తిండిలేకుండా ఉంటే...ఢిల్లీలో బియ్యం కౌంటర్లు ఏర్పాటు చేశారు. పురుషోత్తపట్నం నుండి నీళ్లు తోడి పోలవరం కాలువలో వదులుతారా?, గ్రావెటీతో కాకుండా ఎన్నాళ్ళు నీళ్ళు ఇస్తారు. పోలవరం ప్రాజెక్టు నాణ్యత కోసం విదేశి నిపుణులు ఏం చెప్పారో చంద్రబాబు చెప్పాలి. అపర భగీరధుడు అంటే వైఎస్ఆర్. సున్నా వడ్డీ డ్వాక్రా మహిళలకు చంద్రబాబు ఎందుకు తీసేశాడు?, నిరుద్యోగ భృతి ఏది అని నిరుద్యోగులు అడిగితే వాళ్ళపై కేసుల పెడతారు.. అసలు సూపర్ సిక్స్ అమలు చేయకుండానే సూపర్హిట్ అని చెప్పుకోవడం సిగ్గుచేటు’ అని ధ్వజమెత్తారు. ‘టెట్ లేకుండా ఉద్యోగాలు ఎలా ఇస్తారు?’ -
రేపు పర్చూరు నియోజకవర్గ నేతలతో వైఎస్ జగన్ సమావేశం
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (09.09.2026) ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బాపట్ల జిల్లా పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు.ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులు, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణతో పాటు స్థానిక రాజకీయ పరిణామాలపై నేతలు, కార్యకర్తలతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చర్చించనున్నారు. -
‘టెట్ లేకుండా ఉద్యోగాలు ఎలా ఇస్తారు?’
తాడేపల్లి: డీఎస్సీలో జరిగిన అక్రమాలు, అవినీతిపై 3.30 లక్షల మంది నిరుద్యోగుల తరఫున జూన్ నెల నుంచే వైఎస్సార్సీపీ పోరాటం చేస్తోందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేసిన మోసాలు బయటపడటంతో సమాధానం చెప్పలేక ఇద్దరు ఐఏఎస్ అధికారులను ముందుకు నెట్టి అబద్ధాలు చెప్పిస్తున్నారని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ధ్వజమెత్తారు. స్పోర్ట్స్ కోటా అక్రమాలలో శాప్ పాత్ర ఉందని, అధికారుల ప్రెస్మీట్లో మీడియాను బెదిరించినట్లు ఉందన్నారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన చంద్రశేఖర్ రెడ్డి. విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి, డీఎస్సీ కన్వీనర్, శాప్ చైర్మన్ చేసిన తప్పులను అధికారులు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అక్రమాలన్నింటిపై విచారణ జరిపి తప్పులను తేల్చాల్సిన రోజు అధికారులకు వస్తుంది. స్పోర్ట్స్ డీఎస్సీ, మెగా డీఎస్సీల్లో టెట్ నిబంధనలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, విద్యా హక్కు చట్టాన్ని పూర్తిగా తుంగలో తొక్కారు. ఈడిగ ప్రభాకర్కు టెట్ అర్హత లేదని స్వయంగా అతనే ఒప్పుకున్నా, 2018లో 77 మార్కులు వచ్చాయని పీపీటీ ద్వారా అబద్ధపు ప్రచారం చేశారు. ఎస్జీటీ పోస్టుకు పేపర్ వన్-ఏ అవసరమైతే, స్పెషల్ స్కూల్స్కు వర్తించే పేపర్ టు-బి మార్కులను చూపించి కమిషనర్ ప్రజలను తప్పుదారి పట్టించారు. ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ పరిశీలిస్తే ఎక్కడా ప్రభాకర్కు పేపర్ టు-బి రాసిన దాఖలాలు లేవు. డీఎస్సీ ప్రక్రియ ముగిసిన తర్వాత 2025లో జరిగిన టెట్ పరీక్షను ప్రభాకర్ ఎందుకు రాయాల్సి వచ్చిందో అధికారులు సమాధానం చెప్పాలి. జే ఉషా స్కూల్ అసిస్టెంట్ బయోలాజికల్ సైన్స్కు దరఖాస్తు చేసుకుంటే, ఆమెకు ఏకంగా స్కూల్ అసిస్టెంట్ తెలుగు పోస్టు కేటాయించారు. 2017 తర్వాత లాంగ్వేజ్లకు ప్రత్యేకంగా టెట్ పాస్ కావాలన్న నోటిఫికేషన్ నిబంధనలను ఉల్లంఘించి ఉషాకు పోస్టు ఇచ్చారు. రాజ్ కుమార్ అనే వ్యక్తికి అర్హత లేకపోయినా, డీఎస్సీ రాయకపోయినా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఉద్యోగం కట్టబెట్టారు. తప్పులను ప్రశ్నిస్తున్న మీడియాకు, అభ్యర్థులకు వార్నింగులు ఇస్తూ అక్రమ కేసులు పెడతామని శాప్ ఎండీ బెదిరిస్తున్నారు. జూడో క్రీడలో జరిగిన ఘోరమైన అవకతవకలను రెండు అసోసియేషన్ల మధ్య గొడవగా చిత్రీకరించి తప్పించుకోవాలని చూస్తున్నారు. 2025 సెప్టెంబర్లోనే రిక్రూట్మెంట్ ముగిస్తే, 2026 జూన్లో వెబ్సైట్ ద్వారా సర్టిఫికెట్లను అక్రమంగా మార్చేశారు. పెద్దాడ అప్పలరాజుకు తన తమ్ముడి సర్టిఫికెట్తో ఉద్యోగం ఇచ్చిన విషయం అధికారిక వెబ్సైట్ ద్వారానే బట్టబయలైంది.ఆర్చరీ, కబడ్డీ అభ్యర్థుల సర్టిఫికెట్లు, విజయాల వివరాలను కూడా అధికారులు నిస్సిగ్గుగా ట్యాంపరింగ్ చేశారు. ఎమ్మెల్యే పూనా రవికుమార్ సంతకాలతో ఇచ్చిన సర్టిఫికెట్లను చెల్లుబాటు చేయడానికి నకిలీ ఆథరైజేషన్ లెటర్లను సృష్టిస్తున్నారు. జీవో నెంబర్ 4, 47 ప్రకారం సెక్రటరీ లేదా జనరల్ సెక్రటరీ మాత్రమే సంతకం చేయాలన్న రూల్ ఉంటే గౌరవ అధ్యక్షుడి సంతకాలను ఎలా ఆమోదిస్తారు. 2018 నోటిఫికేషన్ ప్రకారం స్పోర్ట్స్ పర్సన్లకు గ్రౌండ్ పెర్ఫార్మెన్స్కు 20 శాతం వెయిటేజీ మార్కులు ఇచ్చే నిబంధనను ఎందుకు రద్దు చేశారు. జిల్లా స్థాయిలో డీఎస్డీవోల ద్వారా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసే పద్ధతిని పూర్తిగా తొలగించి శాప్లో కూర్చుని అక్రమాలకు పాల్పడ్డారు. కలెక్టర్లు, డీఈవోల ఆధ్వర్యంలో జరగాల్సిన 1:1 సర్టిఫికెట్ వెరిఫికేషన్ను పూర్తిగా ఎత్తేసి నియామక పత్రాలు ఇచ్చారు. అభ్యర్థులు పెట్టుకున్న గ్రీవెన్స్లను కనీసం పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కోర్టు ఆదేశాలు ఇచ్చినా, శాప్ లేఖలు రాసినా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అర్హులకు న్యాయం చేయకుండా తొక్కిపెట్టింది. కోర్టు ఆదేశాలు ఉన్న 100 జెన్యూన్ కేసులను స్వయంగా తీసుకొస్తాం, గ్రీవెన్స్ ద్వారా బాధితులకు న్యాయం చేసే దమ్ము ప్రభుత్వానికి ఉందా?’ ప్రశ్నించారు.డీఎస్సీ అక్రమాలపై కథనాలు.. సాక్షి ప్రతినిధులపై అక్రమ కేసులు -
లోకేశ్.. ఇది సిగ్గు చేటు: కొండా రాజీవ్
సాక్షి, తాడేపల్లి : దేశంలో ఎక్కడా లేని విధంగా దొంగ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు ఇవ్వటం ఏపీలోనే చూస్తున్నామని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ అన్నారు. డీఎస్సీలో అవకతవకలు జరిగినట్లు సాక్ష్యాలు బయటపడినా.. ఎదురు దాడి చేయడం సిగ్గుచేటని మండిపడ్డారాయన. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. డీఎస్సీలో అక్రమాలు చేసి టీడీపీ నేతలు దొరికి పోయారు. సాక్ష్యాలు బయటపడినా ఎదురుదాడి చేయటం సిగ్గుచేటు. డీఎస్సీ అక్రమాలపై విచారణ జరిగితే నారా లోకేష్ జైలుకే వెళ్తారు. అక్రమాలు బయట పడినా లోకేష్ పై చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోలేదు?. ఒకప్పుడు వైఎస్ జగన్పై ఆరోపణలు చేస్తే సీబీఐతో విచారణ జరిపించుకోమని వైఎస్ఆర్ సవాల్ చేశారు. మరి లోకేష్ పై ఆధారాలతో బయటపడినా ఎందుకు వెనుకేసుకు వస్తున్నారు?. చంద్రబాబు వెంటనే లోకేష్తో రాజీనామా చేయించాలి అని రాజీవ్ అన్నారు.. దొంగ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు ఉవ్వటం ఏపీలోనే చూస్తున్నాం. మా హయాంలో జరిగిన ఏపీపీఎస్సీపై కూడా సీబీఐ విచారణకు మేం సిద్ధమంటున్నా కూడా వాళ్ల దగ్గరి నుంచి స్పందన లేదు. రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు?. ఉద్యోగం ఇచ్చే ముందు సర్టిఫికేట్ల విచారణ చేయాలి. కానీ ఇష్టానుసారం ఉద్యోగాలు అమ్మేసుకుని ఇప్పుడు సర్టిఫికేట్ల విచారణ చేస్తామంటారా?. ఫేక్ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందిన వారిని ప్రభుత్వం ఎందుకు కాపాడుతోంది?. వారిపై చర్యలు తీసుకుబే దమ్ము ప్రభుత్వానికి లేదు. ఒకవేళ చర్యలు తీసుకుంటే ఫేక్ వాళ్లు బయటకు వచ్చి ఎవరికి ఎంత డబ్బులు ఇచ్చారో బయట పెడతారోనని భయం.. .. పైగా ప్రశ్నించిన మీడియాపై కేసులు పెడతున్నారు. నారా లోకేష్ సవాల్పై చర్చించటానికి మా మాజీ మంత్రులు సిద్ధమే. అది చూసి ఆయన భయంతో పారిపోయారు. సవాల్ చేసిన నారా లోకేష్ మహిళలను అడ్డం పెట్టి మాట్లాడించటం ఎందుకు?. ఇది సిగ్గుచేటు అని కొండా రాజీవ్ అన్నారు.ఇదీ చదవండి: జనసేనకు షాకిచ్చిన టీడీపీ -
AP స్పోర్ట్స్ కోటా స్కామ్ లో కూన రవి
-
‘డీఎస్సీ అక్రమాల వెనుక నారా లోకేష్ హస్తం’
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ అక్రమాలు జరిగినట్టు అధికారులు అంగీకరించారు.. విజిలెన్స్ విచారణ జరుగుతోందని చెప్పారు.. అంటే అక్రమాలు జరిగినట్టు తేలిపోయింది. నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలి’’ అని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విజిలెన్స్తో కాకుండా సీబిఐతో విచారణ జరిపించాలన్నారు.‘‘ఈ అక్రమాల వెనుక నారా లోకేష్ హస్తం ఉంది. 382 స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు ఎవరికిచ్చారో పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. ఫేక్ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందిన వారిపై చర్యలేవీ?. ఇప్పటికీ అక్రమాలను కప్పి పుచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు?. పచ్చి అబద్దాలతో మంత్రి లోకేష్ అసెంబ్లీని సైతం అవమాన పరిచారు. వైఎస్ జగన్కు సవాల్ చేసిన లోకేష్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?. డీఎస్సీ అక్రమాల వెనుక వ్యవస్తీకృత నేరం ఉంది. ఒక పక్కా ప్లాన్ ప్రకారమే అక్రమాలు చేశారు...జూడో అసోసియేషన్ ఛైర్మన్ భరత్ సాక్షాత్తూ నారా లోకేష్ తోడల్లుడే. ఆ అసోసియేషన్ నుండి పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. ఇవన్నీ బయట పడాలంటే సీబిఐతో విచారణ జరపాల్సిందే. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందే. వైఎస్ జగన్కి సవాల్ చేసే స్థాయి లోకేష్కి లేదు. లోకేష్ ఎమ్మేల్యే కాకముందే నేను ఎంపీ అయ్యాను. లోకేష్తో చర్చకు నేను సిద్ధం. కరకట్ట ఇల్లయినా, హైదరాబాదు ఇంటికైనా చర్చకు వస్తా. డేటు, టైం లోకేష్ ప్రకటించాలి’’ అని మార్గాని భరత్ సవాల్ విసిరారు. -
ఈ లాజిక్ ఎలా మిస్సయ్యావ్ లోకేష్ ఇక నీ చాప్టర్ క్లోజ్..
-
నన్ను ఎవడైతే ఇబ్బంది పెట్టాడో వాడికే చెప్తున్నా.. పిన్నెల్లి మాస్ వార్నింగ్
-
DSC స్కామ్ పై లోకేష్ ఛాలెంజ్ లు నాగమల్లేశ్వరి అదిరిపోయే కౌంటర్
-
ఉమ్మడి జిల్లాకు పనిచేయడం అదృష్టం
గాందీనగర్(విజయవాడసెంట్రల్): ఎంతో చరిత్ర కలిగిన ఉమ్మడి కృష్ణా జిల్లాకు చివరి చైర్ పర్సన్గా పనిచేయడం తన అదృష్టమని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక అన్నారు. ఈ అవకాశాన్ని కల్పించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడలో రూ. 60లక్షల వ్యయంతో ఆధునికీకరించిన జెడ్పీ అతిథి గృహం, సమావేశ మందిరాన్ని ఉప్పాల హారిక సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ ఉప్పాల హారిక మాట్లాడుతూ పరిపాలన సౌలభ్యం కోసం కృష్ణాజిల్లాను మూడు జిల్లాలుగా విభజించారన్నారు. 16 మండలాలతో నూతనంగా ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటైందన్నారు. కొత్తగా ఏర్పడబోయే పాలక వర్గానికి సమావేశ మందిరంతో పాటు అతిథి గృహాన్ని ఆధునికీకరించి అన్ని వసతులతో భవనాలను ప్రారంభించామన్నారు. జిల్లాలు సరిహద్దులు మాత్రమే మారాయని, అంతా కలిసి ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనలో ఎటువంటి మార్పు ఉండబోదన్నారు. కార్యక్రమంలో కృష్ణాజిల్లా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అదికారి కృష్ణంరాజు, రమణ, జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ శ్రీదేవి, జెడ్పీటీసీలు వేముల సురేష్ అన్నవరం ఎలిజిబెత్ రాణి, కొమర వెల్లి గంగాభవాని, జెడ్పీ ఉపముఖ్యకార్య నిర్వహణాధికారి ఆనంద కుమార్, తదితరులు పాల్గొన్నారు. చదవండి: మీరు నిజమైన రైతులేనా! -
‘వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే’
అనపర్తి(తూ.గో.జిల్లా): వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. ఏపీలో ఏ రంగం చూసినా పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఏపీలో ఆక్వా రైతుల పొట్టకొడుతున్నారని, రైతుల ఆత్మహత్యలు చూసైనా చంద్రబాబు సిగ్గుపడాలని అమర్నాథ్ విమర్శించారు. చంద్రబాబు, కరువు కవల పిల్లలు అని అమర్నాథ్ ఎద్దేవా చేశారు. లోకేష్ తానే ముఖ్యమంత్రిగా బిహేవ్ చేస్తున్నారని, అధికారం పోయిన తర్వాత లోకేష్కు తన పరిస్థితి ఏమిటో తెలుస్తుందన్నారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరగాల్సిందేనని అమర్నాథ్ డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బలబద్రపురంలో వైఎస్ఆర్సిపి విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన వైఎస్సార్సీపీ నేతలు స్థానిక సంస్థల ఎన్నికలపై శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ‘ స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వ సంకేతాలు ఇస్తోంది. ఎన్నికలు జరిగినా జరగకపోయినా, పార్టీ శ్రేణులు సన్నద్ధంగా ఉండాలని వైఎస్ జగన్ చెప్పారు. ఏ ఒక్క స్థాయిలోను అధికార పార్టీ ఏకగ్రీవం కాకూడదని విషయాన్నిస్పష్టం చెశారు. రానున్నది వైఎస్సార్సీపీ కార్యకర్తల ప్రభుత్వం. అధికారం పోయిన తర్వాత లోకేష్ తన పరిస్థితి ఏమిటో గుర్తిస్తాడు. తానే ముఖ్యమంత్రినన్న రీతిలో వ్యవహరిస్తున్నాడు. డీఎస్సీపై సీబీఐ ఎంక్వయిరీకి సిద్ధమా అన్న వైఎస్ జగన్ సవాలుకు మీ వద్ద నుంచి స్పందన లేదు. డిఎస్సీ పై సిబిఐ ఎంక్వయిరీ జరిగే వరకు ఊరుకునేది లేదు. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు నాయకులంతా భరోసా కల్పించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయకేతనం ఎగురవేయాలి’ అని పేర్కొన్నారు.మరో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే విధంగా ఇప్పటికే చర్యలు చేపట్టాం. గ్రామస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశాం. పార్టీలో అన్ని స్థాయిలో ఉన్న సభ్యులు ప్రతి ఒక్కరికి ఐడి కార్డ్ అందించాలి. అందరికీ పార్టీ సముచితమైన గౌరవం ఇస్తుంది పార్టీ అధినేత మాటగా చెబుతున్నాను. డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ కూడా ప్రస్తుత ప్రభుత్వం అందించలేకపోయింది. రెండున్నరేళ్ళ తర్వాత కొత్త పెన్షన్లు గుర్తుకొచ్చాయా. వితంతు పింఛన్లు కూడా ఇవ్వలేకపోయారు. ఆక్వా ఫీడ్ కంపెనీలు, ప్రభుత్వం కుమ్మక్కై ఆక్వారైతుల పొట్టకొడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలి... గెలవాలి.. ఇదే మన లక్ష్యం.’ అని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ‘‘కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం అంతా లోకేశే.. రాజీనామా చేయాల్సిందే’’ -
వైఎస్సార్ వర్ధంతి: వైఎస్సార్సీపీ ఫీనిక్స్ ఎన్నారై కమిటీ రక్తదానం
ఫీనిక్స్ (అరిజోనా): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి , దివంగత నేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతిని పురస్కరించుకుని వైఎస్సార్సీపీ ఫీనిక్స్ ఎన్నారై కమిటీ, వైటలెంట్ సహకారంతో సెప్టెంబర్ 6న రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు కమ్యూనిటీ సభ్యులు, వాలంటీర్లు పాల్గొన్నారు. ప్రజాసేవకు, అవసరంలో ఉన్న వారికి అండగా నిలవడానికి డాక్టర్ వైఎస్సార్ చూపిన నిబద్ధతను ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గ్లోబల్ ఎన్నారై కోఆర్డినేటర్, మాజీ ముఖ్యమంత్రి విద్యా సలహాదారు ఆలూరు సాంబశివ రెడ్డి వర్చువల్గా ప్రారంభించారు. కార్యక్రమం ప్రారంభంలో డాక్టర్ వైఎస్సార్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆయన జీవితం, ప్రజాసేవ, ప్రజా సంక్షేమం కోసం చేసిన కృషిని ప్రతిబింబించే ప్రత్యేక ఆడియో-విజువల్ ప్రదర్శన నిర్వహించారు.కమిటీ సభ్యులు డాక్టర్ వైఎస్సార్తో తమకున్న వ్యక్తిగత అనుభవాలను, ఆయనలోని నిరాడంబరత, ధైర్యం, ప్రజాకేంద్రిత పాలనా విధానాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలూరు సాంబశివ రెడ్డి డాక్టర్ వైఎస్సార్ను “ప్రజల నాయకుడు”గా అభివర్ణిస్తూ, సామాన్య ప్రజలతో ఆయనకు ఉన్న విడదీయరాని అనుబంధాన్ని గుర్తుచేశారు. డాక్టర్ వైఎస్సార్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆ ఆశయాలను కొనసాగిస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన ఫీనిక్స్ ఎన్నారై కమిటీని ఆయన అభినందించారు. రక్తదానం అనేది సులభమైనదైనా, అత్యంత విలువైన సేవా కార్యక్రమమని, ఒకరి రక్తదానం నేరుగా మరొకరి ప్రాణాలను కాపాడగలదని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమాన్ని ధీరజ్ పోలా, వంశీ ఎరువరం, చెన్నా రెడ్డి మద్దూరి, రుక్మన్, శ్రీధర్ చెమిడితి, అంజి రెడ్డి,నాగేష్ పొర్ల, వేమ శేఖర్, విఘ్నేష్, కొండా రెడ్డి , శ్రీనివాస్ మామిడి, హేమ కుమార్, అజయ్ కాల్వ , కుడుముల సుధీర్, సుజన్, రాజేశ్వరరావు బండారు, రాజశేఖర్ అవుదూరి, హితేష్ తదితరులు నిర్వహించి, పాల్గొన్నారు. పలువురు వాలంటీర్లు, కమ్యూనిటీ సభ్యులు కూడా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన వైటలెంట్, రక్తదాతలు, వాలంటీర్లు, నిర్వాహకులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాసేవ, మానవతా విలువలు, సమాజ సంక్షేమం పట్ల డాక్టర్ వైఎస్సార్ చూపిన నిబద్ధతను కొనసాగిస్తూ, ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురాగల సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఫీనిక్స్ ఎన్నారై కమిటీ తన నిబద్ధతను మరోసారి పునరుద్ఘాటించింది. -
‘‘కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం అంతా లోకేశే.. రాజీనామా చేయాల్సిందే’’
సాక్షి,తాడేపల్లి: కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్ను అమ్మకానికి పెట్టారని వైఎస్సార్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. డీఎస్సీ స్కామ్ బాధితులకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న డీఎస్సీ స్కామ్ అక్రమాలపై సోమవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.డీఎస్సీ అక్రమాలపై ప్రతి ఇంట్లోనూ చర్చ జరుగుతోంది. అడ్డ దారిలో ఉద్యోగాలు పొందినవారి వివరాలు ప్రతిరోజూ బయటకు వస్తున్నాయి. చంద్రబాబు, లోకేష్ బయటకు వచ్చి ఎందుకు మాట్లాడటం లేదు?.ఇద్దరు మహిళా అధికారులతో మాట్లాడించారు. డీఎస్సీ అక్రమాల నేపథ్యంలో లోకేష్ రాజీనామా చేయాలి. ఏపీలో అమ్మకానికి టీచర్ పోస్టులు అన్నట్టుగా పరిస్థితి మారింది. ఆమాటకొస్తే రాష్ట్రాన్నే అమ్మకానికి పెట్టారు. టీచర్ పోస్టుల అమ్మకం వెనుక కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ నారా లోకేషే.కుంభకోణం చిన్నది కాదు, చేయించింది చిన్నవారు కాదు. మొదట డీఎస్సీలో అక్రమాలు జరగలేదన్నారు.ఇప్పుడేమో అక్కడక్కడా తప్పులు జరిగాయేమో అంటున్నారు. మా దృష్టికి వస్తే విచారణ జరుపుతామని చెప్తున్నారు.ఈ తప్పులు చేసిందీ, చేయించింది చిన్న వ్యక్తులు కాదు. దీనంతటి వెనుక ఉన్నది నారా లోకేషేనని తేలిపోయింది. డీఎస్సీ అక్రమాలు జరిగినందునే సాక్షితోపాటు మిగతా మీడియా సంస్థలు వార్తల్ని ప్రసారం చేస్తున్నాయి. అక్రమాలపై విచారణ జరపమనే మేమూ కోరుతున్నాం. అయితే లోకేష్కు వ్యతిరేకంగా విచారణ జరుగుతుందని ఎలా నమ్మాలి?.స్కాం జరిగినప్పుడు ఎవరు చేశారు? ఎలా చేశారో బయటకు తీయాలి. ఏదైనా తప్పులను చూపిస్తే దాన్ని కప్పి పుచ్చే ప్రయత్నం చేస్తున్నారు.మీడియా విచారణ చేస్తే కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. సోషల్ మీడియాను సెన్సార్ షిప్ చేయటం దుర్మార్గం. ఏపీలో అప్రకటిత ఎమర్జన్సీ అమలవుతోంది.స్పోర్ట్స్ కోటాలో అధికభాగం టీచర్ పోస్టులను అమ్మేసుకున్నారు.బంగారు పతకం సాధించిన దుర్గయ్యకు పోస్టు ఎందుకు రాలేదు?. నవీన్ అనే టాపర్ పేరు లిస్టులో పెట్టి, తర్వాత ఎందుకు తీసేశారు?. దీనిపై నవీన్ హైకోర్టుకు వెళ్లడంతో అక్రమాల డొంక కదిలింది. నవీన్ ఇష్యూపై అసెంబ్లీలో చంద్రబాబు, లోకేష్ వేర్వేరు ప్రకటనలు చేశారు.డీఎస్సీ ప్రశ్నాపత్రం తయారీలో నవీన్ పాల్గొన్నాడు.పేపర్ లీక్ అయింది. ప్రశ్నలను అమ్ముకున్నారు.120 ప్రశ్నలను రూ.3 లక్షల చొప్పున అమ్ముకున్నారు. అనేక అంశాలపై ఆధారాలు ఉన్నాయి. క్రీడా సంఘాల నుండి ఫేక్ సర్టిఫికేట్ తెచ్చి టీచర్ పోస్టులు అమ్మేసుకున్నారు. ఫేక్ టీచర్లు విద్యార్థులకు ఏం చదువులు చెప్తారు?.అర్హులకు అన్యాయం చేస్తే వారి జీవితాలు ఏం కావాలి?.డీఎస్సీలో అక్రమాలు చేసిన వారు జైల్లో ఉండాలి. బాధ్యత కలిగిన మంత్రి లోకేష్ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. వాస్తవాలు మాట్లాడకుండా నోరు పారేసుకుంటున్నారు. సవాల్ చేసే లోకేష్ శాసనమండలికి వచ్చి ఎందుకు సమాధానం చెప్పలేదు?. జూడో సర్టిఫికేట్లను ఫోర్జరీ చేసిన నలుగురికి ఉద్యోగాలు ఇచ్చారు.వారు ఇచ్చిన సర్టిఫికేట్లు ఫోర్జరీ అని తెలిసినా వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?. టెట్ క్వాలిఫై కాకపోయినా ఉద్యోగాలు ఎలా ఇచ్చారు?. దొంగల ముఠాలాగా వ్యవహరిస్తున్నారు.రేపు విచారణ జరిగితే అధికారులు కూడా తప్పించుకోలేరు. తప్పు జరిగినా బరితెగించి మాట్లాడుతున్నారు.మేము బయట పెట్టిన కేస్ స్టడీస్కు మంత్రి నారా లోకేష్ సమాధానం చెప్పాలి. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఇతర రాష్ట్రాల్లో తప్పులు చేసిన వారు జైలు పాలయ్యారు. హర్యానాలో అప్పటి సీఎం, ఆయన కుమారుడు జైలు పాలయ్యారు. చంద్రబాబు, లోకేష్ డీఎస్సీ పారదర్శకంగా జరిగిందని చెప్తున్నారు.మరి తప్పులు జరిగాయని అధికారులు ఎలా చెప్పారు?. చంద్రబాబు తన కొడుకును కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. డీఎస్సీ అక్రమాలపై ఎవరి దగ్గరైనా సమాచారం ఉంటే మాకు అందించవచ్చు. లోకేష్ రాజీనామా చేయాల్సిందే సీబీఐతో విచారణ జరపాల్సిందే.కేంద్రంలో కూడా వారి ప్రభుత్వమే ఉన్నప్పుడు లోకేష్, చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు?’అని ప్రశ్నించారు.👉ఇదీ చదవండి : టోరీ జరగలేదు... సర్టిఫికెట్ వచ్చింది! -
"అక్రమాలు చేయడం చంద్రబాబు నైజం"
సాక్షి,వైఎస్సార్: రాష్ట్రంలో డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ చేపట్టే ధైర్యం చంద్రబాబుకు లేదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. అక్రమాలు చేయడమనేది చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు లోకేష్కు నైజంగా మారిందన్నారు. రాష్ట్రంలో డీఎస్సీ అక్రమాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. ‘అబద్ధాలు అక్రమాలతో కూటమి ప్రభుత్వం నడుస్తోందని ఏపీలో టెట్ రాయకపోయినా టీచర్ ఉద్యోగం ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటలు ఆడకపోయినా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇచ్చేశారని చంద్రబాబు మెుసలి కన్నీరు కారుస్తున్నారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ ఎంక్వైరీ వేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి’అని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సవాల్ విసిరారు. -
లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్
-
ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా
-
చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు
-
సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు?: వైఎస్ అవినాష్రెడ్డి
వైఎస్సార్ జిల్లా: డీఎస్సీని సక్రమంగా నిర్వహిస్తే సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. టెట్ రాయకుండానే టీచర్ ఉద్యోగం రావడం ఏమిటని ప్రశ్నించారు. సాఫ్ట్ బాల్ సంఘం వ్యక్తి భార్యకు ఉద్యోగం రావడం ఏమిటి? అని అన్నారు.‘‘నిజాలు బయటకు వస్తే మీరు దోషులుగా నిలబతారనే భయం మీకు ఉంది. అసమర్థ విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఆధ్వర్యంలో ఇవన్నీ జరిగాయి. ఏదో ఒక రోజు మీరంతా చట్టం ముందు నిలబడాల్సిందే. చర్చకు రమ్మని మాపై సవాలు విసరడం కాదు. ఫిర్యాదు చేసిన 30,000 మందితో చర్చ పెట్టు. నీకు నిజాయితీ, దమ్ము, ధైర్యం ఉంటే వాటికి సమాధానం చెప్పు. వాస్తవాలు చెప్తూ తప్పుని ఎత్తిచూపితే సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్ చేస్తున్నారు. వాళ్లు చెప్పుకునే గొప్పలు మాత్రమే ప్రజల్లోకి వెళ్లాలని ఈ కుట్ర. వాళ్ల తప్పులు బయటకు రాకూడదని మీడియాపై ఉక్కుపాదం మోపుతున్నారు’’ అని వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు.పోలీసులను నమ్ముకుని ఎన్నికలకు టీడీపీటీడీపీ నాయకులు పోలీసులను నమ్ముకుని ఎన్నికలకు వెళ్తున్నారని వైఎస్ అవినాష్ రెడ్డి చెప్పారు. విచ్చలవిడిగా సంపాదించిన డబ్బు వారి వద్ద ఉందని తెలిపారు. మేము వైఎస్సార్సీపీ, వైఎస్సార్, వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన మేలు చూపి ముందుకు వెళ్తున్నాం. కార్యకర్తలంతా సమష్టిగా ఎన్నికలలో పనిచేయాలి. ప్రభుత్వం అన్ని రకాలా విఫలమైంది. సాగు, తాగు నీరు కూడా ఇవ్వలేని పరిస్థితి. శ్రీశైలంలో తెలంగాణ విద్యుత్ ఉత్పతి చేస్తుంటే మన ప్రభుత్వం మీన మేషాలు లెక్కిస్తుంది.రాయలసీమలో ఒక్క రిజర్వాయర్కూ నీళ్లు ఇవ్వడం లేదు. కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, వేధించిన అందరం సమష్టిగా ఎదుర్కొందాం. ప్రతి ఒక్క కార్యకర్తను కాపాడుకుంటాం’’ అని తెలిపారు. -
ఈవెంట్ మేనేజర్ లా తయారయ్యావ్.. నువ్వు పరిపాలనకు పనికిరావు..
-
AP: రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు YSRCP లేఖ
సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు వైఎస్సార్సీపీ లేఖ రాసింది. స్థానిక ఎన్నికల్లో భద్రత కోసం కేంద్ర బలగాల్ని మోహరించాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తూ లేఖ రాశారు. గత ఎన్నికల్లో జరిగిన ఘటనలను గుర్తు చేస్తూ అధికార యంత్రాంగ దుర్వినియోగం, అధికార పార్టీ వ్యక్తుల జోక్యం, బెదిరింపుల నేపథ్యంలో స్వేచ్ఛగా, నిష్పక్షిపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర బలగాల భద్రత అవసరమని తెలిపారు."కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన వ్యక్తులు పోలింగ్ ప్రక్రియలో జోక్యం చేసుకున్నారు. పోలింగ్ కేంద్రాల్లోకి అనధికారికంగా ప్రవేశించారు. పోలింగ్ ఏజెంట్లు, ఓటర్లను బెదిరించారు. పోలింగ్ ప్రక్రియకు ఆటంకం కల్పించారు.అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారుచిన్న కొట్టపల్లి పోలింగ్ బూత్లో మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఇతర రాజకీయ నాయకులు, పార్టీ కార్యకర్తలు పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించారు మంత్రి సమక్షంలోనే వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్పై భౌతిక దాడి చేశారు. పోలింగ్ కేంద్రం నుంచి బయటకు పంపించారు" అని తెలిపారు"అలాగే 2025 ఆగస్టు 7న నాగులదిన్నెవారిపల్లె గ్రామంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్, పార్టీ నేత వెలుపుల రామలింగారెడ్డిని లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు. వాహనాలను ఇనుపరాడ్లు, ఇతర ఆయుధాలతో ధ్వంసం చేశారు. ఒక ఇంటికి నిప్పుపెట్టేందుకు ప్రయత్నించారు. 2025 ఆగస్టు 13న పులివెందుల, ఒంటిమిట్ట మండలాల్లోని సుమారు 15 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లను బెదిరించారు. రిగ్గింగ్ చేసి, పోలింగ్ ఏజెంట్లను బయటకు పంపించారు" అని తెలిపారు.మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇలాంటి దారుణాలకే తెగపడ్డారని,తుని, పిడుగురాళ్ల, పాలకొండ మున్సిపాలిటీల్లో ఎన్నికల సమయంలో ఇలాంటి అరాచకాలే చేశారని లేఖలో పేర్కొన్నారు. తునిలో ఎన్నికల ప్రక్రియ గతంలో రెండు సార్లు వాయిదా పడింది. 2025 ఫిబ్రవరి 17న కూడా ఎన్నికలను అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయి. వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల ఇళ్లపై దాడులు జరిగాయి.కౌన్సిలర్లను బెదిరించేందుకు కొందరు పోలీసు సిబ్బంది అధికార పార్టీకి చెందిన వ్యక్తులతో కుమ్మక్కయ్యారన్నారు. పిడుగురాళ్లలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల ఇళ్లను కూల్చివేశారు. పాలకొండలో ఎస్సీ రిజర్వ్డ్ స్థానానికి చెందిన ఏకైక వైఎస్సార్సీపీ కౌన్సిలర్ను భయపెట్టి, బెదిరించడంతో ఎన్నిక వాయిదా పడిందన్నారు. కనుక ఈసారి సైతం ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ, వార్డు స్థాయిలో రాజకీయ పోటీ తీవ్రంగా ఉంటుంది, ఈ నేపథ్యంలో ప్రతిపక్ష అభ్యర్థులపై బెదిరింపులుకు దిగుతారని నామినేషన్ల దాఖలాకు అడ్డంకులు సృష్టిస్తారని ఎన్నికల సంఘానికి లేళ్ల అప్పిరెడ్డి విజ్ఞప్తి చేశారు. కాబట్టి పోలింగ్ రోజున మాత్రమే కాకుండా నామినేషన్ల నుండి , ఎన్నికల సామగ్రి రవాణా, స్ట్రాంగ్రూమ్ల భద్రత వరకు అన్ని కీలక దశల్లో కూడా కేంద్ర బలగాలను అందుబాటులో ఉంచాలని, సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడ తగిన భద్రతా చర్యలు చేపట్టాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం తగిన సంఖ్యలో కేంద్ర సాయుధ పోలీసు బలగాలను రప్పించాలి’ అని లేళ్ల అప్పిరెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఏపీలో కదులుతున్న డీఎస్సీ అక్రమాల డొంక -
‘స్థానిక ఎన్నికలు.. కూటమి మోసాలు ప్రజలకు తెలియాలి’
సాక్షి, తిరుపతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలని తిరుపతి, చిత్తూరు జిల్లాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గం సమన్వయకర్త ఆయా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటన చేయాలన్నారు. స్థానిక సంస్థలు ఎన్నికలపై ఉమ్మడి చిత్తూరు జిల్లా నియోజకవర్గం ఇంచార్జ్లు, ముఖ్య నాయకులతో రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి, చిత్తూరు జిల్లాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీలు సిపాయి సుబ్రమణ్యం, భరత్, మాజీ డిప్యూటి సీఎం నారాయణ స్వామి, మాజీ మంత్రి ఆర్కే రోజా, మాజీ ఎమ్మెల్యేలు వెంకటేగౌడ, బియ్యపు మధు సూధన్ రెడ్డి, డాక్టర్ సునీల్, మాజీ ఎంపీ రెడ్డప్ప, భూమన అభినయ్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, కృపాలక్ష్మి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వజ్ర భాస్కర్ రెడ్డి, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకులు రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ..‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక బ్రాండ్, ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డులు కూడా మీకు అందుతాయి. ఓట్లు వేసిన ప్రజలను చంద్రబాబు వెన్నుపోట్లతో పొడుస్తూనే ఉన్నాడు. నమ్మకం ద్రోహం చేస్తూ, అనుకూల మధ్యమాల ద్వారా ప్రచారం చేసుకుంటున్నాడు. పచ్చ మీడియా, కూటమి మోసాలను ప్రజల ముందుకు తీసుకెళ్లాలి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కార్యకర్తలందరూ క్రియాశీల కార్యకర్తలుగా పనిచేయాలి. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర కూడా మొదలు అవుతుంది. ఆలోపే మనమంతా సమిష్టిగా పనిచేద్దాం. పరస్పర చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందాం’ అని చెప్పుకొచ్చారు.మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ..‘స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయనే సంకేతాలు వస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా సర్లో మొదటి స్థానంలో ఉంది. ఈ ఎన్నికలలో అందరం సమిష్టిగా పనిచేసి, పార్టీని గెలిపించుకుందాం’ అని అన్నారు.మాజీ మంత్రి రోజా మాట్లాడుతూ..‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. ఎన్నికల ముందు హామీలు వర్షం కురిపించారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క పథకం అమలు చేయలేదు. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం, 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం చేశారు. రాష్ట్రంలో ఫేక్ సర్టిఫికెట్స్తో ఉద్యోగాలు ఇచ్చారు. అనర్హులకు డీఎస్సీలో ఉద్యోగాలు ఇచ్చారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో రైతులు పరిస్థితి దయనీయంగా ఉంది. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పాలనలో కరువు వచ్చింది. ఈవీఎంలు మేనేజ్ చేసుకుని ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది’ అని వ్యాఖ్యానించారు. -
‘పాలు, పెరుగు అమ్మినట్టు టీచర్ ఉద్యోగాలు అమ్మేశారు’
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: డీఎస్సీలో అక్రమాలు గురించి గతం నుంచి చెబుతూనే వచ్చామని.. మూడున్నర లక్షల మంది అభ్యర్థులను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నైతిక బాధ్యత వహించాలన్న ఆలోచన మాత్రం ప్రభుత్వానికి రావటం లేదన్నారు. డీఎస్సీలో అక్రమాలపై ప్రభుత్వం ప్రజలకు సంజాయిషి చెప్పాలని డిమాండ్ చేశారు.‘‘దేశ చరిత్రలో కానీ విని ఎరుగని రీతిలో గత ప్రభుత్వ హయాంలో ఒకటిన్నర లక్షల ఉద్యోగాల రిక్రూట్మెంట్ నిర్వహించాం. హెరిటజ్లో పాలు, పెరుగు అమ్మినట్టు రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాలు అమ్మేశారు. లోకేష్ విద్యాశాఖ మంత్రిగా రావటం విద్యార్థులకు శాపం. టెట్కి, డీఎస్సీకి ఒకరినే కన్వీనర్గా పెట్టడం దగ్గర నుంచి.. సంతలో బర్రెలు అమ్మినట్టు టీడీపీ నేతలు ఉద్యోగాలు అమ్మేసేంతవరకు ప్రతి విషయాన్ని ప్రజలకు వివరించాం. మీకు చిత్తశుద్ధి ఉంటే సీబిఐ విచారణ జరిపించండి’’ అని జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు.కుల విద్వేషాలు, మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయంగా లాభం పొందే ప్రయత్నం చేస్తున్నారు. లోకేష్ వ్యవహారంపై ఎందుకు సీబిఐ విచారణ జరపటం లేదు. సీబీఐ విచారణ జరిపితే వాస్తవాలు బయటికి వస్తాయి. యువగళం పాదయాత్రలో పాల్గొన్న వారిలో ఎవరెవరికి ఉద్యోగాలు ఇచ్చారో బయట పడుతుంది. ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుందని ఉద్దేశంతోనే ధైర్యం చేయడం లేదు. కనీసం గ్రౌండ్లో అడుగుపెట్టని వారికి సైతం స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చేశారు.. డబ్బు కోసం అక్రమ సంపాదన కోసం ఎటువంటి నీచమైన పని చేయడానికైనా ప్రభుత్వం దిగజారి పోతుంది. ఆడియో టేపులు బయటకు వచ్చినా ప్రభుత్వంలో స్పందన ఉండటం లేదు.డీఎస్సీ వ్యవహారంలో ఎందుకు ఒక్కరిపై కూడా కేసు నమోదు చేయలేకపోయారు. సోషల్ మీడియా హ్యాండిల్స్ నిలుపు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్ సర్వీసెస్ పరీక్షలపై మీరు చేసిన ఆరోపణలపై, ప్రస్తుత డీఎస్సీపై సిబీఐ విచారణకు ఆదేశాలు ఇవ్వండి. మీరు చేసిన తప్పుడు నియామకాలు బయటపడతాయి. సాక్ష్యాలు ఉన్నా ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరించడం దారుణం. లోకేష్ మంత్రిగా కొనసాగేందుకు అర్హత లేదు. తక్షణమే లోకేష్ రాజీనామా చేయాలి. ఈ వ్యవహారంలో కోర్టులు కూడా జోక్యం కల్పించుకోవాలి’’ అని జక్కంపూడి రాజా పేర్కొన్నారు. -
మెటా తో లోకేష్ కుమ్మక్కు... సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్...
-
ఉద్యోగులను మోసగిస్తున్న బాబు సర్కారు
కడప వైఎస్సార్ సర్కిల్: చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు అయినా ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ అమలు చేయకుండా వారిని మోసం చేస్తోందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. ఆయన శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చర్చలకు పిలిస్తే ఏదో చేస్తారని ఆశపడి వెళ్లారని, చివరికి రెండు డీఏలు, పోలీసులకు ఒక సరెండర్ లీవు ఇచ్చి నిరాశే మిగిల్చారని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఐదు డీఏలు పెండింగ్ ఉంటే రెండే ఇస్తారా అని ప్రశ్నించారు. ఈమాత్రం దానికే ఉద్యోగ సంఘం నాయకులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకోవడం విచిత్రంగా ఉందన్నారు. పీఆర్సీ కమిషన్, ముఖ్యమైన ఐఆర్ ఎక్కడని నిలదీశారు. సీపీఎస్ విషయంలో ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన వేల కోట్ల రూపాయల బకాయిలు కూటమి ప్రభుత్వం ఇచ్చిందో లేదో సమాధానం చెప్పాలన్నారు. పెండింగ్ బకాయిలు చెల్లించామని చెబుతున్న చంద్రబాబు సర్కారు ఆ వివరాలు ఇవ్వాలని కోరితే ఆర్థిక శాఖ వద్ద లేవంటున్నారన్నారు. మరి బకాయిలు చెల్లించామని ఎలా చెప్పుకొంటారని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే ఉద్యోగులకు మేలు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే ఉద్యోగులకు మేలు జరిగిందని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం 27 శాతం ఐఆర్ ఇచ్చిందని, అన్ని వర్గాల వారికి జీతాలు పెంచిందని, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకుందని గుర్తు చేశారు. కరోనా సమయంలో కేంద్రం డీఏలను ఫ్రీజ్ చేస్తే.. అది అయిపోగానే గత ప్రభుత్వం ఒక్కసారే ఐదు డీఏలు ఇచ్చిందని తెలిపారు. కరోనా సంక్షోభం కారణంగా ఫిట్మెంట్ 23 శాతం ఇస్తే రివర్స్ పీఆర్సీ అని చంద్రబాబు అంటున్నారని, మీకు చేతనైతే ఆ రివర్స్ పీఆర్సీ అయినా ఇవ్వండని అన్నారు. రెండున్నరేళ్లుగా ఐఆర్ లేకుండా ఉండటం ఎప్పుడూ జరగలేదన్నారు. ఈరోజు ఐఆర్ లేదు, పీఆర్సీ లేదు, పింఛను స్కీమ్ కూడా లేవన్నారు. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి భజన చేయడం మొదలు పెడితే ఇక ప్రభుత్వం సమస్యలు ఎందుకు పరిష్కరిస్తుందని ప్రశ్నించారు. ఉపాధ్యాయుల సస్పెన్షన్లపై ఆగ్రహం చంద్రబాబు ప్రభుత్వంలో సచివాలయ ఉద్యోగులపై పని ఒత్తిడి పెంచడం తప్ప జీతాల పెంపు, ప్రమోషన్లు లేవన్నారు. వందలాది ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. ఉన్న టీచర్లను టెట్ రాయాలంటారు కానీ.. వాళ్లు మాత్రం టెట్ లేకుండానే ఉద్యోగాలిస్తారని ఎద్దేవా చేశారు. డీఎస్సీలో ఎంపికైన ఉద్యోగులతో ర్యాలీలు చేయిస్తూ రాజకీయాలకు వాడుకోవడం దారుణమన్నారు. టెట్ గురించి కేంద్ర మంత్రిని కలిస్తే వారిపై అబద్ధపు ప్రచారం చేసి సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ ఎన్నికలు వచ్చే వరకు ఈ ప్రభుత్వం ఉద్యోగులకు ఏమీ చేయదని చెప్పారు. ఈ సమావేశంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి వరదారెడ్డి, రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు ఎస్వీ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బాబూ.. దేనికి భయం?
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025 నియామకాల్లో అక్రమాల వ్యవహారానికి సంబంధించి రోజురోజుకూ మరిన్ని ఆధారాలు బయట పడుతున్నాయని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. వాటన్నింటిపై వెల్లువలా తలెత్తే అన్ని ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని నిలదీశారు. అంతా పారదర్శకంగా జరిగిందన్నప్పుడు, దాచుకోవడానికి ఏమీ లేనప్పుడు మీ కెందుకింక భయం? అని ప్రశ్నించారు. డీఎస్సీ స్కామ్పై ప్రతిపక్షంతో పాటు గళం విప్పిన కొన్ని మీడియా సంస్థలు, సామాజిక కార్యకర్తలకు చెందిన సోషల్ మీడియా ఖాతాలను మెటా ద్వారా ఎందుకు బ్లాక్ చేయిస్తున్నారని, వాటిని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ–2025 నియామకాలు నిజాయితీగా, పారదర్శకంగా జరిగాయని అనుకుంటే వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలని సీఎం చంద్రబాబుకు సవాల్ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఆ పోస్టులో ఇంకా ఏమన్నారంటే..వెలుగులోకి కొత్త ఆధారాలు, వాస్తవాలు ‘రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మరిన్ని కొత్త ఆధారాలు, వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. అవన్నీ డీఎస్సీలో తీవ్ర అక్రమాలను బయట పెడుతూ, సీఎం చంద్రబాబు వెన్నుపోటు పార్టీ సమాధానం చెప్పాల్సిన అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పి, నిజాలను నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణకు అంగీకరించాల్సిన ప్రభుత్వం.. స్వతంత్ర దర్యాప్తును తిరస్కరిస్తోంది. మరో వైపు ప్రశ్నిస్తున్న గొంతులను అణచివేసే మార్గాన్ని వెన్నుపోటు పార్టీ ఎంచుకుంది. డీఎస్సీ నియామకాల అక్రమాలపై గొంతెత్తుతున్న ప్రతిపక్షంతో పాటు, కొన్ని మీడియా సంస్థలు, సామాజిక కార్యకర్తలు, వ్యక్తులకు సంబంధించిన సామాజిక పోస్టులు, ఖాతాలను మెటా సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో నియంత్రిస్తున్నారు. ‘చట్టపరమైన ఆదేశాలు’ అంటూ వాటిని తొలగించడం లేదా జియో బ్లాక్ చేయడం జరుగుతోంది. ఆ ఆంక్షల బారిన పడిన ఖాతాలు, పేజీలు, ఫేస్బుక్లో సాక్షి టీవీ, ఇన్స్టాగ్రామ్లో సాక్షి డిజిటల్, బిగ్ టీవీ, జగనన్న కనెక్ట్స్తో పాటు డీఎస్సీ స్కామ్పై ప్రశ్నిస్తున్న ఇతర వ్యక్తిగత హ్యాండిల్స్ కూడా ఉన్నాయి.ఇది పరిపాలన కాదు. నియంతృత్వ సెన్సార్షిప్వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ వ్యవహారం కేవలం డీఎస్సీ స్కామ్తోనే ఆగిపోవడం లేదు. వెన్నుపోటు పార్టీ ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలు, అమలు కాని సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఎన్నికల హామీలు, నిరంకుశత్వం, అధికార దుర్వినియోగంపై ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరినీ లక్ష్యంగా చేసుకుంటున్నారు. ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, ప్రశ్నించిన వారి గొంతు నొక్కేస్తున్నారు. ఇది పరిపాలన కాదు. నియంతృత్వ సెన్సార్షిప్! వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటన స్వేచ్ఛ భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు. ప్రశ్నలు రాజకీయంగా ఇబ్బందికరంగా ఉన్నాయనే కారణంతో ప్రతిపక్షం, మీడియా, సామాజిక కార్యకర్తలు, పౌరుల గొంతు నొక్కే అధికారం ఏ ప్రభుత్వానికీ లేదు.ప్రజలకు సమాధానం చెప్పండిచంద్రబాబు గారూ.. మీరు భయపడుతున్నది ప్రశ్నలకా? లేక వాటి సమాధానాలకా? డీఎస్సీ నియామకాల్లో ప్రతిరోజూ కొత్తగా వెలుగు చూస్తున్న ఆధారాలు ఒకవేళ అవాస్తవమైతే.. ప్రజల ముందుకు వచ్చి వాస్తవాలతో వాటిని ఖండించండి. ఆ పని చేయడం లేదు. ఇంకా సీబీఐ విచారణను కూడా ఎందుకు తిరస్కరిస్తున్నారు? అక్రమాలను బయట పెడుతున్న వారి గొంతు ఎందుకు అణచి వేస్తున్నారు? వారి పోస్టులు, ఖాతాలను ఎందుకు నియంత్రిస్తున్నారు? ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఒక పోస్టును తొలగించినంత మాత్రాన ఆధారాలు చెరిగిపోవు. ఒక ఖాతాను బ్లాక్ చేసినంత మాత్రాన నిజాన్ని పాతిపెట్టలేరు. ప్రతిపక్షాన్ని రాజకీయంగా ఎదుర్కోండి. ప్రజలకు ప్రజాస్వామ్యబద్ధంగా సమాధానం చెప్పండి. రాజ్యాంగబద్ధంగా పాలించండి.ఉత్తీర్ణులు కాకుండానే ఉపాధ్యాయ ఉద్యోగాలా?డీఎస్సీ పరీక్ష రాయకుండానే, ఉపాధ్యాయ అర్హత పరీక్ష ‘టెట్’లో ఉత్తీర్ణులు కాకుండానే కొందరికి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చి.. మిమ్మల్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా భర్తీ కోసం కొత్తగా జీవోలు జారీ చేశారు. ఆ నియామకాలు పూర్తి చేయగానే, ఆ జీవోలు రద్దు చేశారు. అయినప్పటికీ ఆ జీవోల ద్వారా నియమితులైన అభ్యర్థులు ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. అంటే అక్రమ నియామకాలకు ముందు గేట్లు తెరిచి.. ఆ నియామకాలు పూర్తయ్యాక వాటిని మూసివేశారు. ఇదంతా అవినీతిని సూచించడం లేదా? అందుకే నియంతృత్వ సెన్సార్షిప్లో భాగంగా నియంత్రించిన ప్రతి సామాజిక మాధ్యమ ఖాతాను, పోస్టును, కంటెంట్ను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నా. అలాగే అందరూ లేవనెత్తుతున్న ప్రశ్నలన్నింటికీ స్పష్టమైన సమాధానాలు చెప్పాలి.స్వతంత్ర దర్యాప్తు ద్వారా నిజానిజాలు తేల్చండిచంద్రబాబుకు.. ఆయన ప్రభుత్వానికి నేను ఒక సవాల్ చేస్తున్నా. డీఎస్సీ–2025 నియామకాలు నిజాయతీగా, పారదర్శకంగా జరిగాయని మీరు అనుకుంటే వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించండి. స్వతంత్ర దర్యాప్తు ద్వారా నిజానిజాలు తేల్చండి. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగినట్లు ఆధారాలతో సహా బయట పడుతున్నందున, వాటికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ తన పదవికి రాజీనామా చేయాలి. అంతే కాకుండా వెంటనే సామాజిక మాధ్యమాల ఖాతాలు పునరుద్ధరించండి. వాటి సెన్సార్షిప్ను ఆపండి. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పండి. సీబీఐ విచారణకు ఆదేశించండి. అంతా పారదర్శకంగా జరిగినప్పుడు, దాచుకోవడానికి ఏమీ లేనప్పుడు మీకెందుకింకా భయం?’ అని వైఎస్ జగన్ నిలదీశారు. -
వైఎస్సార్సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ విజయవంతం
తాడేపల్లి: దగా డీఎస్సీపై సీబీఐ విచారణ జరపాల్సిందేనని, అక్రమాలకు కారణమైన మంత్రి లోకేష్ తక్షణం మంత్రి పదవికి రాజీనామా చేయాలని "గురు పరిరక్షణ దీక్ష"లో వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిని అపహాస్యం చేస్తూ కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ-2025 నియామకాలు ఒక భారీ కుంభకోణంగా మారాయని, ఇది మెగా డీఎస్సీ కాదు పక్కా 'దగా డీఎస్సీ' అని వైఎస్సార్సీపీ నేతలు ముక్తకంఠంతో ధ్వజమెత్తారు. మెరిట్ సాధించిన అభ్యర్థులను పక్కనబెట్టి, టెట్ అర్హత కూడా లేని వారికి నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లతో అడ్డదారిలో ఉద్యోగాలు అమ్ముకున్నారని వారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువులకు అండగా నిలుస్తూ తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ‘గురు పరిరక్షణ దీక్ష’ను అత్యంత విజయవంతంగా నిర్వహించింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కనుసన్నల్లో జరిగిన ఈ మెగా కుంభకోణాన్ని తీవ్రంగా నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ ప్రతిష్టాత్మక దీక్షకు పార్టీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, వివిధ విభాగాల నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చి సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు. నిరసన ప్రారంభానికి ముందుగా సమాజానికి మార్గదర్శనం చేసిన పలువురు విశ్రాంత ఉపాధ్యాయులను నాయకులు వేదికపై ఘనంగా సత్కరించారు. అనంతరం వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి ఎమ్మెల్సీల భుజాలపై నల్ల కండువాలు వేసి దీక్షను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్కు ఫస్ట్ ర్యాంక్ వచ్చినా ఉద్యోగం ఇవ్వకపోవడం, కర్నూలుకు చెందిన ప్రభాకర్తో పాటు క్రీడలతో ఏమాత్రం సంబంధం లేని వారికి పోస్టులు కట్టబెట్టడమే ఈ దగా డీఎస్సీకి నిదర్శనమని ఆరోపించారు. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేసి, యువగళం పాదయాత్రలో పాల్గొన్న తమ పార్టీ కార్యకర్తలకు మంత్రి లోకేష్ పోస్టులు ఇచ్చుకున్నారని విమర్శించారు. కనీస అర్హత లేని నకిలీ ఉపాధ్యాయులను బడుల్లోకి పంపిస్తే భావితరాల విద్యార్థుల పరిస్థితి ఏంటని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శాసనమండలిలో డీఎస్సీ అక్రమాలపై చర్చకు పట్టుబడితే సమాధానం చెప్పే ధైర్యం లేక విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పారిపోయారని ఎద్దేవా చేశారు. నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తరహాలోనే, ఈ డీఎస్సీ స్కామ్కు బాధ్యత వహిస్తూ నారా లోకేష్ కూడా తక్షణమే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ నియామకాలపై ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, వెంటనే సీబీఐతో నిష్పాక్షిక విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. అలాగే ఇన్-సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చేలా కేంద్రాన్ని ఒప్పించడంతో పాటు, ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. మోసపోయిన 3.30 లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగేంత వరకు వైఎస్సార్సీపీ తరఫున తమ పోరాటాన్ని ఏమాత్రం ఆపబోమని నాయకులు ప్రభుత్వానికి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.ఉదయం దీక్షను ప్రారంభించిన సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్న డీఎస్సీ అక్రమాల పుట్టగా మారిందని మండిపడ్డారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన దారుణాలకు సంబంధించి రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి అర్హతలు లేని వారు టీచర్లుగా నియమితులైనట్లు సాక్షాత్తూ ఈ ప్రభుత్వమే తేల్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ అక్రమాలపై నాలుగైదు జిల్లాల్లో విద్యాశాఖ రహస్యంగా విచారణ చేస్తున్నట్లు పత్రికల్లో వార్తలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఇదంతా గమనిస్తుంటే అసలు మెగా డీఎస్సీ ఎంత లోపభూయిష్టంగా సాగిందో సామాన్యులకు సైతం ఇట్టే తెలిసిపోతోందని విమర్శించారు. నోటిఫికేషన్ విడుదల దగ్గర నుంచి నియామకాల వరకు అడుగడుగునా అవినీతి జరిగిందని ఇప్పటికే తేలిపోయిందని స్పష్టం చేశారు. నకిలీ సర్టిఫికెట్లతో, తప్పుడు రిజర్వేషన్లతో ఉద్యోగాలు పొందినట్లు రోజుకో కొత్త కోణం వెలుగుచూస్తోందని దుయ్యబట్టారు. నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎలాగైతే రాజీనామా చేశారో, ఇక్కడ మంత్రి నారా లోకేష్ కూడా తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ భారీ స్కామ్పై సీబీఐతో నిష్పాక్షికంగా విచారణ జరిపించాలన్నదే వైఎస్సార్సీపీ ప్రధాన డిమాండ్ అని సుబ్బారెడ్డి తేల్చిచెప్పారు. అనర్హులు గురువులుగా వస్తే భావి పౌరుల పరిస్థితి ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలందరూ నిశితంగా ఆలోచించాలని కోరారు. కష్టపడి చదివి ప్రతిభతో టీచర్ పోస్టులు సాధించిన వారిని తీసేయమని తాము కోరడం లేదని, నకిలీలను మాత్రమే ఏరివేయాలని స్పష్టం చేశారు.ఆ తర్వాత మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ, పవిత్రమైన గురువులను స్మరించుకోవడమే కాదు, వారిని గౌరవించుకోవడం కూడా మనందరి విధి అని ఉద్ఘాటించారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం చేసిన డీఎస్సీ నియామకాలు చూస్తే విద్యావ్యవస్థలోకి నకిలీలను తీసుకొచ్చారని అర్థమవుతోందన్నారు. భావితరాలకు సైతం ఈ ప్రభుత్వం పక్కా పన్నాగంతో వెన్నుపోటు పొడిచే కార్యక్రమానికి డీఎస్సీ ద్వారా శ్రీకారం చుట్టిందని మండిపడ్డారు. మంత్రి నారా లోకేష్ కేవలం కోట్లకు కక్కుర్తి పడి చేసిన అక్రమాల పాపం లక్షలాది మంది విద్యార్థుల భవితను నేడు ప్రశ్నార్థకం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ అక్రమాలను సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తున్నా ప్రభుత్వంలో కనీస ఉలుకూ పలుకూ లేకపోవడం దారుణమన్నారు. పాఠశాలలంటే కేవలం భవనాలు కాదని, భావితరాలకు విలువలు నేర్పే ఉత్తమ గురువులని కన్నబాబు ఈ సందర్భంగా గుర్తుచేశారు.మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, ఉన్నతమైన గురువుల నియామకంలో కూడా దొంగలు పడ్డారని ఉద్యమం చేయాల్సిరావడం సిగ్గుచేటు అని ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ ఉపాధ్యాయులతో సమాజం దారితప్పి భావితరాలకే తీవ్ర ప్రమాదం వాటిల్లే ముప్పు ఉందని హెచ్చరించారు. ఎంత వద్దని మొత్తుకున్నా లోకేష్ కావాలనే విద్యాశాఖను ఎంచుకున్నాడని గతంలో చంద్రబాబు చెప్పారని ఆయన గుర్తుచేశారు. కేవలం అడ్డదారిలో డబ్బులు దండుకోవడం కోసమే లోకేష్ ఈ విద్యావ్యవస్థను ఎంచుకుని మంత్రి అయ్యాడా అని అనుమానం కలుగుతోందని విమర్శించారు. ఎన్నికల్లో విధులు నిర్వహించే బాధ్యత టీచర్లదే కాబట్టి, వారిని అక్రమాలకు వాడుకోవచ్చనే దురుద్దేశంతోనే అడ్డదారిలో పోస్టులు కట్టబెట్టారని ధ్వజమెత్తారు. గత రెండేళ్లుగా మంత్రిగా నారా లోకేష్ వేసిన ప్రతి అడుగూ అనుమానాస్పదంగానే ఉందన్నారు. లోకేష్కి మంత్రి పదవి అంటే కేవలం మెహర్బానీ కోసమేనని, బాధ్యతగా వ్యవహరించిన ఒక్క సందర్భం కూడా లేదని ఎద్దేవా చేశారు. రెండేళ్లలో ఏ శాఖపై రానన్ని ఆరోపణలు, అవకతవకలు విద్యాశాఖపై వస్తున్నా లోకేష్ కనీస వివరణ ఇచ్చుకునే ధైర్యం చేయలేదన్నారు. డీఎస్సీ అక్రమాలను బయటపెడుతున్న మీడియా ఛానెళ్ల సోషల్ మీడియా అకౌంట్లను ఈ ప్రభుత్వం నిస్సిగ్గుగా బ్లాక్ చేయిస్తోందని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ చేసిన నిరంతర పోరాట ఫలితమే ఈరోజున అన్ని మీడియా ఛానెల్స్ డీఎస్సీ అక్రమాలను బయటకు తీసుకొస్తున్నాయన్నారు. మొన్నటి వరకు కేవలం స్పోర్ట్స్ కోటాలోనే అక్రమాలు జరిగాయని అంతా అనుకున్నారని, కానీ ఇప్పుడు అన్నింటా అవినీతి జరిగినట్టు రుజువైందని తెలిపారు. ఒక్క నకిలీ టీచర్ ఉద్యోగం పట్టుకున్నా రాజీనామా చేస్తానన్న లోకేష్, ఇప్పుడు పదుల సంఖ్యలో బయటపడుతున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సాక్ష్యాధారాలతో డీఎస్సీ అక్రమాలు బయటపడిన తర్వాత ఇక ప్రభుత్వంతో చర్చలు అనవసరమని పేర్ని నాని తేల్చిచెప్పారు. తండ్రీకొడుకులకు సైకో బుద్ధులు ఉన్నాయి కాబట్టే టీచర్ ఉద్యోగాలు కూడా అమ్ముకున్నారని, తక్షణమే లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.డీఎస్సీ - 2025 ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసిన నాటి నుంచి నియామకాల ప్రక్రియ ముగిసే వరకు ప్రతి దశలోనూ తీవ్రమైన అవకతవకలు జరిగాయని, బహుశా భారతదేశ చరిత్రలో ఇంత దుర్మార్గమైన, పనికిమాలిన ప్రభుత్వాన్ని ఏ రాష్ట్రంలోనూ ఎన్నడూ చూసి ఉండమని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. విద్యార్థుల జీవితాలతో పాటు ఉపాధ్యాయుల జీవితాలను కూడా బలిపీఠం ఎక్కిస్తున్న దుస్థితిని మొట్టమొదటిసారిగా మన ఆంధ్రరాష్ట్రంలో చూస్తున్నామని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో ఆదర్శప్రాయంగా నిలిచి, ప్రభుత్వాల ద్వారా ప్రయోజనాలు పొందిన పెద్దలను పార్టీ శ్రేణులు, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో ఘనంగా సన్మానించుకున్నామని పేర్కొన్నారు. మరోవైపు, ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న అప్రజాస్వామిక కార్యక్రమాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని అన్నారు. డీఎస్సీ పరీక్షల నిర్వహణలో పేపర్లు లీక్ కావడం, ఉద్యోగాల కోసం జీవోలు మార్చడం, లక్షలాది రూపాయలు చేతులు మారడం వంటి దారుణాలు జరిగాయని ఆరోపించారు. నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నైతిక బాధ్యత వహించినట్లుగా, రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదని విమర్శించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఉద్యోగ అవకాశాలు దక్కాలంటే, ఈ డీఎస్సీ అక్రమాలపై తప్పనిసరిగా సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నామని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి స్పష్టం చేశారు.ఈ దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కవురు శ్రీనివాస్, పి.సురేష్ బాబు, ఇసాక్ బాషా, కుంభా రవిబాబు, మొండితోక అరుణ్ కుమార్, రామచంద్రారెడ్డి, పాలవలస విక్రాంత్, సిపాయి సుబ్రహ్మణ్యం, రూహుల్లా, కల్పలతా రెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు సైతం ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగట్టారు. 16 వేల పోస్టుల భర్తీలో 16 వేల ఆరోపణలు వస్తున్నాయని, టెట్ లేకుండానే దొంగ సర్టిఫికెట్లతో కొలువులు ఇచ్చేశారని ఆయా నేతలు దుయ్యబట్టారు. డీఎస్సీ బాధితులకు పూర్తి న్యాయం జరిగి, ప్రభుత్వం సీబీఐ విచారణ వేసే వరకు తమ పోరాటం ఆగబోదని వైఎస్సార్సీపీ నాయకులు ముక్తకంఠంతో హెచ్చరించారు.మాజీ మంత్రులు పేర్ని నాని, కురసాల కన్నబాబు, మేకతోటి సుచరిత, తానేటి వనిత, జోగి రమేశ్, ఆదిమూలపు సురేష్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, దూలం నాగేశ్వరరావు, దేవినేని అవినాశ్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మొండితోక జగన్, టీజేఆర్ సుధాకర్ బాబు, అన్నాబత్తుని శివకుమార్, జక్కంపూడి రాజా, గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు బాలసాని కిరణ్, దొంతిరెడ్డి వేమారెడ్డి, దేవభక్తుని చక్రవర్తి, గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి, అంబటి మురళీ కృష్ణ, విజయవాడ మాజీ మేయర్ భాగ్యలక్ష్మి, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర, పార్టీ నూర్బాషా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ దస్తగిరి, ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణ మూర్తి, గుంటూరు జిల్లా లీగల్ సెల్ అద్యక్షుడు భగవాన్, లీగల్ సెల్ నాయకురాలు మాధవి, వివిధ విభాగాలకు చెందిన పార్టీ నాయకులు హాజరై దీక్షకు సంఘీభావం ప్రకటించారు. సాయంత్రం నాలుగు గంటలకు దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్సీలకు పార్టీ నాయకులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్, గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి నిమ్మరసం అందజేసి దీక్షను విరమింపజేశారు. -
సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్
-
స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్
-
డీఎస్సీ ఉద్యోగాలపై బొత్స బాంబు.. 14-15 లక్షలకు పోస్టులు అమ్ముకున్నారు..!


