-
అక్షయ్ కుమార్ నుంచి కత్రినా వరకు.. డైట్ సీక్రెట్స్ ఇవే..
బాలీవుడ్ టీవీ నటుడు, ప్రముఖ కమిడియన్, ప్రోడ్యూసర్, సింగర్ అయిన కపిల్ శర్మ సెటబ్రిటీలతో చేసిన 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోతో మంచి పేరు సంపాదించికున్నాడు. ఇటీవల ఆ షో ఫస్ట్ ఎపిసోడ్ నెట్పిక్స్లో విడుదల అయ్యింది అక్కడ కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఆ షోలో సెలబ్రిటీలు రణబీర్ కపూర్, నీతూ కపూర్ మరియు రిద్ధిమా కపూర్ సహానితో షేర్ చేసుకున్న ఆసక్తికర విషయాల తోపాటు హాస్యంతో కూడిన చిందులు అన్నింటిని ప్రేక్షక్షులు అలరించాయి. ఆ ఐదు షోల్లో ప్రముఖ సెలబ్రిటీలు ఫాలో అయ్యే డైట్ సీక్రెట్స్ కూడా కపిల్ వెల్లడించడం జరిగింది. స్రీన్పై మంచి అందంతో, పిట్నెస్తో కనిపించే హీరో/హీరోయిన్ల బ్యూటీ, ఫిట్నెస్ సీక్రెట్స్ తెలుసుకోవాలన్న కుతుహలం అందరికీ ఉంటుంది. అది కపిల్ శర్మ షో ద్వారా ప్రేక్షకులు తెలుసకునే అరుదైన అవకాశం లభించింది. అవేంటీ, ఎవరెవరు? ఎలాంటి డైట్స్ ఫాలో అవుతారో సవివరంగా చూద్దామా..! జాన్ అబ్రహం బాలీవుడ్ నటుడు, మోడల్, నిర్మాత అయిన జాన్అబ్రహం ఫిజిక్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఆరడుగుల ఆజానుబాహుడు అంటే అతడేనేమో అన్నట్లు ఉంటుంది అతడి ఆహార్యం. చక్కటి బాడీని మెయింటెయిన్ చేస్తూ మంచి ఫిట్నెస్తో కనిపిస్తాడు. 2021లో తన మూవీ 'సత్యమేవ జయతే2' ప్రమోషన్ సందర్భంగా కపిల్ శర్మ షోకి వచ్చినప్పుడూ తన ఫిట్నెస్ సీక్రెట్స్ని పంచుకున్నాడు. మంచి బాడీ మెయింటెయిన్ చేయాలంటే మంచి ఆహారం అనేది చాలా ముఖ్యం అని చెప్పాడు. అలాగే ఆహారంపై నియంత్రణ ఉండాలని అన్నారు. ప్రోటీన్ కోసం నాన్వెజ్ తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పారు. చాలామంది శాకాహారంతో ప్రోటీన్లు అందుతాయని చెబుతారు గానీ అందులో నిజం లేదని జాన్ చెప్పడం జరిగింది. ఇక్కడ జాన్ కండల దేహ సౌష్టవాన్ని చూస్తే.. పోషకాల తోకూడిన ఆహారం తినాల్సిందేనని స్పష్టమవుతుంది. అక్షయ్ కుమార్ ఇక అక్షయ్ కుమార్ తన 'హౌస్ఫుల్ 3' చిత్రం ప్రమోట్ చేసేందుకు కపిల్ శర్మ షోకి రావడం జరిగింది. ఆ షోలో ఆ మూవీ నటులంతా రావడం జరిగింది. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ ఆ షోలో అక్షయ్ కుమార్ ఫాలో అయ్యే స్ట్రీట్ డైట్ గురించి వెల్లడించారు. "తాను రితేష్ చక్కగా వ్యాయామం చేసి అలసిపోయి ఉన్నాం. అందువల్ల చాలా ఆకలిగా అనిపించి బటర్ చికెన్ తినాలని అనుకున్నాం. అయితే ఆ టైంలో అక్షయ్ వారికి ఉడకబెట్టిన క్యారెట్లు, బచ్చలి కూర ఇచ్చాడని, కనీసం అన్నం గానీ రోటీ గానీ లేదు. ఇంత స్ట్రీట్గా డైట్ ఫాలో అవుతాడని,అందువల్లే అక్షయ్ ఇప్పటికీ యంగ్ లుక్లోనే కనిపస్తాడని". అమితాబ్ అన్నారు. కేక్ అంటే చాలా ఇష్టం: కత్రినా కైఫ్.. కపిల్ శర్మ షోకి సంబంధించి ఒక ఎపిసోడ్లో కత్రినా తన డైట్ గురించి మాట్లాడింది. "నిజంగా ఆరోగ్యకరమైన డైట్ ఫాలో అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే నాకు కేక్లంటే మహా ఇష్టం కానీ దాన్ని తింటే జిమ్లో ఎక్కువసేపు గడపక తప్పదు. అందుకని ప్రతి ఆదివారం మనం కలుసుకుందామని కేక్తో సర్ది చెప్పుకుని నోటిని కంట్రోల్ చేసేందుకు కష్టపడతానని అంటోంది." కత్రినా. ఇక్కడ సెలబ్రిటీలు కూడా మనలానే ఒక్కోసారి ఫుడ్ స్కిప్ చేస్తారు. ఐతే తినాలనుకుంటే మాత్రం కంట్రోల్గానో లేక ఏదో ఒక రోజు కేటాయించుకుని పరిమితంగా తిని ఫిట్గా ఉండేందుకు ప్రయత్నిస్తారు. గులాబ్ జామూన్లు, సమోసాలు తినాల్సిందే: రాజ్కుమార్ రావ్ కపిల్ శర్మ షో 2020లో రాజ్కుమార్ రావ్ సందడి చేశారు. అయితే రాజ్ కుమార్ తనకు తినడమంటే ఇష్టమని చెప్పాడు. ఐతే రాజ్ ఫిటనెస్ చూస్తే.. ఆయన చెబుతుంది నమ్మశక్యంగా లేదని కపిల్ ఆ షోలో అభిప్రాయం వ్యక్తం చేయడంతో తన డైట్ గరించి క్లియర్గా చెప్పారు. "తనకు గులాబ్ జామూన్లు, సమోసాలంటే ఎంతో ఇష్టమో ఎలా తినేసేవాడో చెప్పారు. టీనేజ్లో ఉండగా వర్కౌట్స్ అయ్యాక తిన్నగా స్వీట్ షాక్కివెళ్లి ఏకంగా ఆరు గులాబ్ జామూన్లు, రెండు సమోసాలు తినాల్సిందే. అయితే సినీ పరిశ్రమలో ప్రవేశించాక డైట్ మీద దృష్టికేంద్రీకరించడంతో అలా తినడం మానేశానని, స్వీట్ తినాలనుకుంటే మాత్రం లిమిట్గా తింటానని అన్నారు." ఆదిత్య రాయ్: అరకేజీ ఐస్క్రీమ్ ఉండాల్సిందే.. ఇక ఆదిత్య రాయ్ మృణాల్ ఠాకూర్తో కలిసి కపిల్ శర్మ షోకి వచ్చి డైట్కి సంబంధించిన ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు. తాను రాత్రిపూట ఏకంగా అరకేజీ ఐసీక్రీం తినేవాడినని అన్నారు. చాల సమయం డైట్లోనే ఉంటాను కాబట్టి సడెన్గా నాలోపల ఉన్నవాడికి తినాలనే కోరిక మొదలవ్వగానే వెంటనే వెళ్లి ఏదో ఒకటి రెండు ఐస్క్రీమ్లు కాదు ఏకంగా 1/2 కేజీ ఐస్క్రీం లాగించేస్తాను. ఆ తర్వాత రోజు పూర్తిగా డైట్లో ఉండి, కసరత్తు చేస్తుంటానని అన్నారు. బరువు తగ్గే యత్నంలో ఉన్నప్పుడూ రోజుకి 1700 కేలరీలు ఉండే పిండి పదార్థాలు, కొవ్వు తక్కువుగా ఉన్నా ఆహారం, అలాగే 15 నుంచి 20 నిమిషాలు కార్డియో సెషన్లు చేయండి చాలు. మంచి ఫిట్నెస్గా ఉంటారు. ఇలా చేసే క్రమంలో ఒక్కోసారి డైట్ స్కిప్ అవుతుంది. అంతమాత్రాన వదిలేయకుండా మరసటి రోజు నార్మల్గా డైట్ ఫాలో అయిపోవాలంతే అన్నారు ఆదిత్య రాయ్. ఈ సెలబ్రిటీల డైట్ సీక్రెట్స్ అన్ని చూశాక కచ్చితంగా ఎవ్వరైనా అంతలా నోరు కట్టేసుకుని ఉండటం ఈజీ కాదు. అలా అని నోరు కట్టేసుకుని ఇబ్బంది పడక.. తినాలనిపించిన ఐటెమ్స్ హాయిగా తినేసి కాస్త వర్కౌట్ డోస్ పెంచడం తోపాటు డైట్లో కేలరీల తక్కువగా ఉన్నవి తీసుకుంటే చాలు. ఒక్కరోజుని డైట్ని స్కిప్ చేసినంత మాత్రన పూర్తిగా వదిలేయకూడదన్నది క్లియర్గా అర్థమవుతుంది. సో..! మీరు కూడా మీ వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణుల సాయంతో మంచి ఆరోగ్యకరమైన డైట్ని ఫాలో అవ్వండి, మంచి ఫిట్ నెస్తో బరువుని అదుపులో ఉంచుకోండి. -
ఆ అమ్మాయి కోసం చాలా ఎదురుచూశాను.. శ్రేయస్ అయ్యర్
ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ హోస్ట్ చేసిన ద గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కలిసి పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో హిట్మ్యాన్, శ్రేయస్ అభిమానులకు తెలియని చాలా విషయాలను షేర్ చేసుకున్నారు. కపిల్ శర్మ ప్రశ్నలు అడుగుండగా.. వీరిద్దరు తమదైన శైలిలో సమాధానాలు చెబుతూ నవ్వులు పూయించారు. ఆధ్యాంతం ఉల్లాసభరింతగా సాగిన ఈ షో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఆ అమ్మాయి మెసేజ్ కోసం ఎదురుచూశాను.. స్టేడియంలో మహిళా అభిమానులపై కెమెరామెన్ల ఫోకస్ అనే అంశంపై చర్చ జరుగుతుండగా శ్రేయస్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. నా తొలి ఐపీఎల్ సీజన్లో ఓ అందమైన అమ్మాయిని చూశాను. స్టాండ్స్లో కూర్చుకున్న ఆ అమ్మాయివైపు చేయి ఊపుతూ హలో చెప్పాను. ఆ సమయంలో ఫేస్బుక్ చాలా పాపులర్గా ఉండేది. అందులో ఆ అమ్మాయి రిప్లై ఇస్తుందేమో అని చాలా ఎదురుచూశానని శ్రేయస్ తన తొలి క్రష్ గురించి చెప్పుకొచ్చాడు. శ్రేయస్ ఈ విషయం గురించి చెప్పగానే షోకు హాజరైన వారంతా ఓకొడుతూ సౌండ్లు చేశారు. ఇదే షోలో శ్రేయస్ మరిన్ని విషయాలు కూడా పంచుకున్నాడు. తన ఆరాధ్య క్రికెటర్ రోహిత్ శర్మ అని, అతను టీమిండియా కెప్టెన్ అయినందుకు ఈ మాట చెప్పడం లేదని అన్నాడు. సహచరులతో రోహిత్ చాలా నాటు స్టయిల్లో మాట్లాడతాడని శ్రేయస్ చెప్పగా.. రోహిత్ కూడా శ్రేయస్పై ఇదే కంప్లైంట్ చేశాడు. ఇదిలా ఉంటే రోహిత్, శ్రేయస్ ప్రస్తుతం ఐపీఎల్ 2024తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సీజన్లో రోహిత్ ప్రాతినిథ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్ నాలుగు మ్యాచ్ల్లో ఒకే ఒక విజయంతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉండగా.. శ్రేయస్ నాయకత్వంలోని కేకేఆర్ 4 మ్యాచ్ల్లో 3 విజయాలతో రెండో స్థానంలో నిలిచింది. -
ఆ ఇద్దరితో రూమ్ అస్సలు షేర్ చేసుకోను: రోహిత్ శర్మ
ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ హోస్ట్ చేసిన ద గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కపిల్.. హిట్మ్యాన్, శ్రేయస్లను పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగాడు. వీటికి రోహిత్, శ్రేయస్ తమదైన శైలిలో బదులిచ్చారు. ఈ సందర్భంగా రోహిత్, శ్రేయస్ అభిమానులకు తెలియని చాలా విషయాలను షేర్ చేసుకున్నారు. ఆధ్యాంతం ఉల్లాసభరింతగా సాగిన ఈ షో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఆ ఇద్దరు పరమ గలీజ్గాళ్లు.. షో సందర్భంగా కపిల్ హిట్మ్యాన్తో సంభాషిస్తూ ఓ ఆసక్తికర ప్రశ్నను అడిగాడు. రూమ్ షేర్ చేసుకోవాల్సి వస్తే ఎవరితో కలసి షేర్ చేసుకుంటారని రోహిత్ను అడిగాడు. ఇందుకు రోహిత్ బదులిస్తూ.. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ప్రత్యేక గది కేటాయిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రూమ్ షేర్ చేసుకోవాల్సి వస్తే శిఖర్ ధవన్, రిషబ్ పంత్లతో మాత్రం అస్సలు ఉండనని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. ఆ ఇద్దరు గదిని చాలా మురికిగా ఉంచుతారు. ప్రాక్టీస్ నుంచి వచ్చాక బట్టలను మంచంపైనే పడేస్తారు. వారి గది తలపుపై ఎప్పుడూ డు నాట్ డిస్టర్బ్ (DOD) అనే బోర్డు దర్శనమిస్తుంది. ఈ ఇద్దరు మధ్యాహ్నం ఒంటి గంట వరకు పడుకుంటారు. ఉదయమే రూమ్ క్లీనింగ్కు వచ్చే వాళ్లు DOD బోర్డును చూసి వెనక్కు వెళ్లిపోతారు. మూడు నాలుగు రోజుల వరకు వాళ్ల రూమ్ చండాలంగా ఉంటుంది. ఈ కారణంగా వీళ్లతో రూమ్ షేర్ చేసుకోవడానికి ఎవ్వరూ ఇష్టపడరు. నేను కూడా వారితో ఉండాలని అస్సలు అనుకోనంటూ హిట్మ్యాన్ బదులిచ్చాడు. ఇదే సందర్భంగా రోహిత్ మరిన్ని విషయాలను కూడా షేర్ చేసుకున్నాడు. వన్డే వరల్డ్కప్ ఫైనల్లో ఓటమి అనంతరం అభిమానుల కోపానికి గురవుతానని భయపడ్డానని తెలిపాడు. కానీ ప్రజలు తమను బాగా ఆడామని ప్రశంసించడంతో ఊపిరి పీల్చుకున్నామని అన్నాడు. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 7) ముంబై ఇండియన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ (మధ్యాహ్నం 3:30).. లక్నో-గుజరాత్ (రాత్రి 7:30) తలపడుతున్నాయి. -
స్టార్ కమెడియన్ కళ్లు చెదిరే ఇల్లు, ఆస్తి గురించి తెలుసా?
Comedian Kapil Sharma net worth స్టార్ కమెడియన్ కపిల్ శర్మ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తన కామిక్ టైమింగ్, డైలాగ్ డెలివరీతో దేశవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన కపిల్ శర్మ పలు బాలీవుడ్ మూవీల్లో కూడా నటుడిగా సత్తా చాటాడు. ముఖ్యంగా తన కామెడీ షో, కామెడీ నైట్స్ విత్ కపిల్ తో పాపులర్ అయ్యాడు. దీంతోపాటు చాలా షోలకు హోస్ట్గా కూడా వ్యవహరించారు. ఈ క్రమంలో కపిల్ శర్మ నెట్వర్త్, కార్లు, తదితర వివరాలు ఆసక్తికరంగా మారాయి. పంజాబ్లో చక్కటి ఫాం హౌస్తోపాటు, ముంబైలో లగ్జరీ అపార్ట్మెంట్ కూడా ఉంది. దీంతో పాటు లోఖండ్వాలాలో మరొక లగ్జరీ ఇల్లు ఉన్నట్లు తెలుస్తోంది. విజయవంతమైన కెరీర్తో పాటు, కపిల్ అందమైన కుటుంబం కూడా ఆయన సొంతం. గర్ల్ ఫ్రెండ్ గిన్ని చత్రాత్ను డిసెంబర్ 12, 2018న వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు కుమార్తె అనయ్రా ,కుమారుడు త్రిషాన్ను ఉన్నారు. ఇక కపిల్ ఆస్తిపాస్తులను గమనిస్తే మీడియా నివేదికలప్రకారం స్వస్థలమైన పంజాబ్లో అందమైన ఫామ్హౌస్ని కూడా కలిగి ఉన్నాడు. ఈ ఫామ్హౌస్ విలువ రూ. 25 కోట్లు. పంజాబ్ గొప్ప సాంస్కృతిక వారసత్వంతో బహుళ ఎకరాల్లో విస్తరించి ఉందీ విశాలమైన ఎస్టేట్. ఈ విలాసవంతమైన రిసార్ట్ చుట్టూ పచ్చని పొలాలు , అందమైన పూదోటలతో,అత్యాధునిక ఫీచర్లతో ప్రకృతి ఒడిలో ఒక రాజభవనంలా ఉంటుంది. విజువల్ ట్రీట్ అందించే ఈ ఫామ్హౌస్లో విశ్రాంతి, వినోదానికి ఎక్కడా కొదవే ఉండదు. విలాసవంతమైన స్విమ్మింగ్ పూల్, ఇంటి బయట గెజిబో, అందమైన ఫౌంటెన్తో ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే ముంబైలోని పశ్చిమ శివార్లలో లగ్జరీ అపార్ట్మెంట్ కూడా ఉంది. భార్య గిన్ని చత్రత్, పిల్లలతో ఈ ఇంట్లో నివసిస్తున్నాడు. దీని ధర 15 కోట్లకు పైమాటే. జిమ్, టెర్రస్ గార్డెన్, సినిమా థియేటర్ ఉన్న ఈ యింటికి సంబంధించిన ఫోటోలను కపిల్ భార్య గిన్ని చత్రాత్ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో పోస్ట్ చేస్తూనే ఉంటారు. అలాగే దీపావళి సందర్భంగా ఈ ఇంటిని బాగా అలంకరించడం వారికి అలవాటు. విలాస వంతమైన ఫర్నిచర్, అద్భుత లైట్లు, మొక్కలు, బుద్ధ విగ్రహంతో తీర్చిదిద్దిన బాల్కనీ వీడియోను గతంలో ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కపిల్ శర్మ నెట్వర్త్ స్టాండ్-అప్ కమెడియన్, టెలివిజన్ వ్యాఖ్యాత, నటుడు, టెలివిజన్ నిర్మాతగా ఉన్న కపిల్ శర్మ నికర విలువ సుమారు రూ.280 కోట్లు. గత 5 సంవత్సరాలలో ఆయన సంపద 380 శాతం పెరిగింది. నెలవారీ ఆదాయం ,జీతం 3 కోట్లు. తాజా వార్తల ప్రకారం తన షో కొత్త సీజన్ కోసం, అతను ఒక్కో ఎపిసోడ్కు రూ. 50 లక్షలు వసూలు చేస్తాడు. ఇది కాకుండా బ్రాండ్ ఎండార్స్మెంట్స్ ద్వారా కోట్ల రూపాయలు ఆర్జిస్తాడు. ఒక్కో ఎండార్స్మెంట్కు కోటి రూపాయలు చార్జ్ చేస్తాడు. ఇక దాతృత్వం విషయంలో గొప్ప మనుసు చాటుకునే టాప్ సెలబ్రిటీలలో ఒకడు. భారతదేశంలో అత్యధిక పన్ను చెల్లింపుదారుడుగా ఉన్నాడు. ఖరీదైన కార్ కలెక్షన్ కపిల్ శర్మ , గిన్ని చత్రత్ జంట ఖరీదైన కార్ కలెక్షన్ , ఇతర లగ్జరీ వస్తువులతోపాటు, హై-ఎండ్ ఆటోమొబైల్స్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఫెరారీ, పోర్షే లాంటి అత్యాధునిక కార్లు అంటే పిచ్చి. రూ. 1.36 ఖరీదైన Mercedes Benz S350 CDI, రూ. 80 లక్షల వోల్వో XC 90, రేంజ్ రోవర్ ఎవోక్ Mercedes-Benz S-క్లాస్, BMW X7 హోండా సివిక్ లాంటి కార్లున్నాయి. DC డిజైన్ చేసిన వానిటీ వ్యాన్ దిలీప్ ఛబ్రియా డిజైన్ చేసిన వానిటీ వ్యాన్ విలువ రూ. 5.5 కోట్లు . బెడ్రూమ్, బాత్రూమ్, కిచెన్. లాంజ్ ఏరియాతో కూడిన ఖరీదైన ఇంటీరియర్ దీని సొంతం. -
రోడ్డు పక్కన గొడుగులు అమ్ముతున్న స్టార్ కమెడియన్
ఏ సినీ ఇండస్ట్రీలో అయినా కమెడియన్స్కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. స్టార్ హీరోలకు మించిన ఫాలోయింగ్ సంపాదిస్తుంటారు. తెలుగులో బ్రహ్మానందం, అలీ తదితరులు ఇలా చాలా క్రేజ్ సొంతం చేసుకున్న వాళ్ల జాబితాలో ఉంటారు. హిందీలో సునీల్ గ్రోవర్ అలాంటి వాడని చెప్పొచ్చు. ఇప్పుడు అలాంటిది రోడ్డు పక్కన గొడుగులు, మొక్కజొన్న పొత్తులు అమ్ముతూ కనిపించాడు. పలు సినిమాల్లో నటించిన సునీల్ గ్రోవర్.. 'కపిల్ శర్మ' షోతో బోలెడంత పాపులారిటీ దక్కించుకున్నాడు. డిఫరెంట్ గెటప్స్తో ఎంటర్టైన్ చేసేవాడు. కానీ కారణాలేంటో తెలియదు గానీ ఆ షో నుంచి తప్పుకొన్నాడు. ఇది జరిగిన చాన్నాళ్లు అయిపోయింది. అయితే కపిల్ శర్మ షోకి తిరిగి రావాలని అనుకుంటున్నట్లు ఈ హాస్య నటుడు పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: కమెడియన్ యాదమ్మ రాజుకి యాక్సిడెంట్!) ఈ మధ్యే 'యునైటెడ్ కచ్చే' వెబ్ సిరీస్తో అలరించిన సునీల్ గ్రోవర్.. షారుక్ ఖాన్ 'జవాన్' సినిమాలోనూ నటించాడు. ఇది సెప్టెంబరు 7న థియేటర్లలో రిలీజ్ కానుంది. దాని గురించి పక్కనబెడితే తాజాగా రోడ్ పక్కన తోపుడు బండిపై మొక్కజొన్న పొత్తులు, గొడుగులు అమ్ముతూ ఈ హాస్య నటుడు కనిపించాడు. అలానే రోడ్ పక్కన ఓ స్టాల్లో చపాతీలు చేస్తూ కమెడియన్ సునీల్ గ్రోవర్ దర్శనమిచ్చారు. ఆ ఫొటోలు, వీడియోలని సదరు కమెడియన్ స్వయంగా తన ఇన్ స్టాలో పోస్ట్ చేయడం విశేషం. అయితే ఇది కేవలం ఫన్ కోసమా చేశాడా మరేదైనా కారణం ఉందా తెలియాల్సి ఉంది. ఏదైతేనేం ఇది చూసిన చాలామంది నెటిజన్స్ ఫస్ట్ అవాక్కయ్యారు. ఆ తర్వాత నవ్వుకున్నారు. View this post on Instagram A post shared by Sunil Grover (@whosunilgrover) View this post on Instagram A post shared by Sunil Grover (@whosunilgrover) View this post on Instagram A post shared by Sunil Grover (@whosunilgrover) (ఇదీ చదవండి: విడాకుల రూమర్స్.. బుర్ఖాలో కనిపించిన కలర్స్ స్వాతి!) -
నటికి ఘోర అవమానం.. ఏకంగా ఆ బాడీ పార్ట్స్పైనే కామెంట్స్!
Sumona Chakravarti Kapil Sharma Show: ఒకప్పుడు టీవీల్లో వచ్చే షోలు బాగుండేవి. బోలెడంత కామెడీ ఉన్నా అది ఎవరినీ ఎలాంటి ఇబ్బంది పెట్టేది కాదు. ఇప్పుడు మాత్రం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. షోలు అంటేనే డబుల్ మీనింగ్ డైలాగ్స్, బాడీ పార్ట్స్ షేమింగ్ అన్నట్లు తయారైంది. మీకు అలాంటి కార్యక్రమాల ఏవో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఓ నటి, తనకు ఓ షోలో జరిగిన అవమానం గురించి బయటపెట్టింది. స్వయానా యాంకరే కామెడీ అనగానే చాలామందికి తెలుగులో ఓ షో గుర్తొస్తుంది. కానీ దానికంటే 'కపిల్ శర్మ షో' చాలా ఫేమస్. చాలా ఏళ్లుగా ఇది సక్సెస్ ఫుల్గా ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఇందులోనే యాంకర్ కపిల్ శర్మ చేసే కామెడీ నెక్స్ట్ లెవల్ ఉంటుంది. షోకి వచ్చే గెస్టులతో మస్తు ఫన్ జనరేట్ చేస్తుంటాడు. ఇక ఇదే షోలో కపిల్ శర్మకు భార్యగా సుమోనా చక్రవర్తి చేస్తోంది. అయితే ఈమె పాల్గొన్న తొలి ఎపిసోడ్లోనే మూతి-పెదాలని టార్గెట్ చేస్తూ కపిల్ శర్మ జోకులు వేశాడు. (ఇదీ చదవండి: నా భర్త నన్ను మోసం చేశాడు: సన్నీ లియోన్) కొన్నాళ్ల తర్వాత తొలి ఎపిసోడ్ లో సుమోనాపై వేసిన జోక్స్ పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో కపిల్ శర్మ ఆ తరహా జోక్స్ ని వదిలేశాడు. కానీ కొన్నాళ్ల తర్వాత ఓ ఎపిసోడ్ సందర్భంగా కపిల్ శర్మ స్క్రిప్ట్ లో లైన్స్ మర్చిపోయాడు. ఏం చేయాలో తెలీక ఈ నటి మూతి-పెదాలపై కామెంట్స్ చేస్తూ కామెడీ జనరేట్ చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా సుమోనా చక్రవర్తి తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. అప్పుడు చాలా అప్సెట్ అయిపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. అంతా సెట్ షోలో జరిగిన దానికి బాధపడిన నటి సుమోనాని, అదే షోలో చేస్తున్న అర్చన పురానా సింగ్ ఓదార్చింది. అసలు కపిల్ శర్మ ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో సుమోనాకి వివరించింది. దీంతో కాస్త కుదుటపడింది. ఏదైతేనేం ఇప్పుడు ఈమె చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయాయి. మరీ బాడీ పార్ట్స్ని టార్గెట్ చేస్తూ కామెడీ చేయడం ఏంటని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. (ఇదీ చదవండి: 'బేబి' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!) -
మహిళతో సహజీవనం.. లైవ్లో కమెడియన్ ఆత్మహత్యాయత్నం!
బాలీవుడ్లో ప్రముఖ కామెడీ షో 'ది కపిల్ శర్మ షో' గురించి తెలియని వారు ఉండరు. టాలీవుడ్లోనూ ఈ షో గురించి చాలామందికి తెలుసు. ప్రముఖులతో సైతం నవ్వులు తెప్పించే ఈ షో ద్వారా కపిల్ శర్మ ఫేమస్ అయ్యారు. మరో హాస్యనటుడు తీర్థానంద రావు కూడా ఈ షోతోనే గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తాజాగా కపిల్ శర్మ కో స్టార్ తీర్థానంద రావు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఫేస్బుక్ లైవ్లో పాయిజన్ తాగి బలవన్మరణానికి యత్నించాడు. వెంటనే విషయం తెలుసుకున్న స్నేహితులు అతని ఇంటికి చేరుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న తీర్థానందరావును ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నారు. (ఇది చదవండి :వరుణ్ లావణ్య ఎంగేజ్మెంట్: బేబీ బంప్తో ఉపాసన, డ్రెస్ ఖరీదెంతో తెలుసా? ) మహిళతో సహజీవనం.. వేధింపులు అయితే తనతో సహజీవనం చేస్తున్న మహిళ డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తోందని తీర్థానంద రావు ఆరోపిస్తున్నారు. తన డబ్బులు లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని.. ఆమె వల్ల రూ.4 లక్షల అప్పులు చేశానని చెప్పుకొచ్చారు. తనకు ఏదైనా జరిగితే ఆమెనే బాధ్యత వహించాలన్నారు. ఆమె వల్లే అప్పులు చేశా ఫేస్బుక్ లైవ్లో మాట్లాడుతూ.. 'తేడాది అక్టోబర్ నుంచి తాను ఓ మహిళతో తాను లైవ్-ఇన్ రిలేషన్షిప్లో ఉన్నా. ఇప్పటికే నాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాని వెనుక ఉన్న కారణమేంటో తెలియదు. ఆమె తనను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తోంది. తన నుంచి డబ్బులు లాక్కోవడానికి ప్రయత్నిస్తోంది. ఆమె నాకు ఫోన్ చేసి కలవాలనుకుంటున్నట్లు చెబుతోంది. ఆమె వల్ల లక్షల రూపాయలు అప్పు చేశా.' అని అన్నారు. అయితే ఆ తర్వాత లైవ్ వీడియోను డిలీట్ చేసినట్లు సమాచారం. - కె.తారకరామ కుమార్ (ఇది చదవండి : పుట్టబోయే బిడ్డ కోసం ఉపాసన కీలక నిర్ణయం!) -
బ్రిటన్ ప్రధాని అత్తగారినంటే ఎవరూ నమ్మలేదు: సుధామూర్తి
ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి అందరికీ సుపరిచితురాలే. రచయిత్రి, విద్యావేత్త, సామాజిక వేత్తగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. కోట్ల సంపద ఉన్నప్పటికీ సాధారణ మహిళగానే జీవిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంటారు. సుధామూర్తి సమాజానికి చేస్తున్న సేవలను గుర్తించి ఇటీవల భారత ప్రభుత్వం ఆమెను పద్మభూషన్ అవార్డుతో సత్కరించిన విషయం తెలిసిందే. కాగా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సుధామూర్తికి సొంత అల్లుడు అన్న విషయం తెలిసిందే. నారాయణ మూర్తి, సుధామూర్తి దంపతుల కుమార్తె అక్షరతో రిషి వివాహం 2009లో జరిగింది. వీరికి ఇద్దరు సంతానం(కృష్ణ సునక్, అనౌష్క సునక్). గతేడాది సెప్టెంబర్లో రిషి సునాక్ యూకే ప్రధానిగా ఎన్నికయ్యారు. అయితే ఇటీవల సుధామూర్తి లండన్కు వెళ్లగా అక్కడ ఎదురైన ఓ ఆసక్తికర విషయాన్ని బాలీవుడ్ టాక్షో ‘ది కపిల్ శర్మ షో’లో పాల్గొని పంచుకున్నారు. లండన్లో తన అడ్రస్ చెబితే ఇమిగ్రేషన్ అధికారులు నమ్మలేదని తెలిపారు. తాను ప్రధాని అత్తగారినంటే ‘జోక్ చేస్తున్నారా’ అని అడిగారని పేర్కొన్నారు. ‘నేను ఒకసారి యూకే వెళ్లాను. లండన్లో ఎక్కడ ఉంటారని ఇమిగ్రేషన్ అధికారులు నా రెసిడెన్షియల్ అడ్రస్ అడిగారు. నాతో పాటు మా అక్క కూడా ఉన్నారు. నా కొడుకు కూడా లండన్లో నివసిస్తున్నాడు. కానీ నాకు అతని పూర్తి అడ్రస్ తెలియదు. అందుకే అల్లుడు రిషి సునాక్ నివాసించే 10 డౌనింగ్ స్ట్రీట్’ను అడ్రస్గా రాశాను. అది చూసిన ఇమ్మిగ్రేషన్ అధికారులు నావైపు అదో రకంగా చూశారు. మీరు జోక్ చేస్తున్నారా అని అడిగారు. నేను నిజమే అని చెప్పాను. కానీ ఆయన నమ్మినట్లు నాకు అనిపించలేదు.72 ఏళ్ల వయసున్న నాలాంటి సాధారణ మహిళ బ్రిటన్ ప్రధాని రిషి అత్తగారంటే అక్కడ ఎవరూ నమ్మలేదు.’ అంటూ తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నారు. ఈ షోలో సుధామూర్తితో పాటు బాలీవుడ్ నటి రవీనా టాండన్, నిర్మాత గునీత్ మోంగా కూడా పాల్గొన్నారు. చదవండి: ఢిల్లీకి చేరుకున్న డీకే శివకుమార్.. సీఎం పదవిపై కీలక వ్యాఖ్యలు.. -
మాటలు పలుచన
జె.డి.శాలింజర్ తన నవల ‘క్యాచర్ ఇన్ ద రై’తో ప్రఖ్యాతం. అమెరికాలో లక్షల మంది అభిమానులను సంపాదించుకుని ఒక్కసారి కలిస్తే చాలు, చెప్పేది వింటే బాగుండు అని తహతహలాడించాడు. కాని ఎప్పుడూ జనం మధ్యలోకి రాలేదు. శాలింజర్ని ఇంటర్వ్యూ చేయడానికి మహామహులు ప్రయత్నిస్తే ఆశాభంగమే ఎదురైంది. అమెరికాలో తన నవల ‘హౌ టు కిల్ ఎ మాకింగ్బర్డ్’తో సంచలనం సృష్టించిన రచయిత్రి హార్పర్ లీ ఎవరినీ తన ఇంటిలోకి అడుగు పెట్టనీయలేదు. ఆమెని చూడాలని, ఇంటర్వ్యూ చేయాలని ఎందరో ప్రయత్నించి ఆమె ఇంటి గేట్ బయట నుంచే వెనుతిరిగే వారు. ప్రఖ్యాత కవి సాహిర్ లూధియాన్వీ తాను పాల్గొనే ముషాయిరాల్లో కవితా జ్ఞానం లేని శ్రోతలను గమనించాడంటే నిర్దాక్షిణ్యంగా వెళ్లగొట్టేవాడు. సంఘంలో గొప్పలు చెప్పుకోవడానికి కొంతమంది శ్రీమంతులు అతడు పాల్గొనే ప్రయివేటు ముషాయిరాలకు వచ్చినా వారికీ అదే గతి పట్టేది. అతణ్ణి ఇంటర్వ్యూ చేయడం దుర్లభం. చేయాలనుకున్న వ్యక్తికి ఉర్దూ సాహిత్యం, కవిత్వం కూలంకషంగా తెలిసి ఉండాలి. ‘నా గురించి నీకేం తెలుసో చెప్పు. అప్పుడు ఇంటర్వ్యూ ఇస్తాను’ అనేవాడు. మాటలకు చాలా విలువ ఉంటుంది. మాట్లాడే మనిషిని బట్టి, మాటలను వెలికి తీసే మనిషిని బట్టి ఆ సంభాషణ, ముఖాముఖికి విలువ వస్తుంది. ఓప్రా విన్ ఫ్రే తన ఇంటర్వ్యూలతో ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. ఆమె తన నైపుణ్యంతో ఎదుటివారి మాటల్లో ఉండే జ్ఞాపకాల గాఢతను వెలికి తెస్తుంది. ఆమె మైకేల్ జాక్సన్ని ఇంటర్వ్యూ చేస్తే ఆ రోజుల్లో కోట్ల మంది టీవీలకు అతుక్కుపోయి చూశారు. ఇప్పటికీ అమెరికన్ టెలివిజన్ చరిత్రలో అదే ఎక్కువ వ్యూయర్షిప్ పొందిన ఇంటర్వ్యూ. అడిగేవారి అంతస్తు చెప్పే వారి అంతస్తు తాలుమేలుగా కలిసినప్పుడు వచ్చే విలువ, గౌరవం అది. మన దేశంలో కూడా మంచి సంభాషణతో వ్యక్తిత్వాలను వెలికి తీసే పని స్త్రీలే మొదలెట్టారు. దూరదర్శన్లో నాటి బాలనటి తబస్సుమ్ చేసే టాక్ షోలకు విశేషంగా ఆదరణ ఉండేది. ఆమె తమను ఇంటర్వ్యూ చేయడం చాలామంది గౌరవంగా భావించేవారు. ఆ తర్వాత నటి సిమీ గెరేవాల్ చాలా విపులమైన ఇంటర్వ్యూలు చేసి అది చాలా శ్రద్ధతో పని చేయవలసిన రంగమని చాటింది. జయలలిత వంటి మొండిఘటం చేత తన ఇంటర్వ్యూలో పాట పాడించింది సిమీ. రతన్ టాటా, రాజీవ్ గాంధీ, రాజ్ కపూర్... వీరందరూ ఆమెతో మాట కలిపినవారిలో ఉన్నారు. రజత్ శర్మ ‘ఆప్ కీ అదాలత్’ ఒక భిన్నమైన ఫార్మాట్తో నింద–సంజాయిషీల ద్వారా చాలా మంది వ్యక్తిత్వాలను ప్రదర్శనకు పెట్టింది. ఆ తర్వాత చాలా కాలానికి ఆమిర్ ఖాన్ ‘సత్యమేవ జయతే’ షోతో ముఖాముఖి కార్యక్రమాలు తన వంటి సూపర్ స్టార్ నిర్వహించడం వల్ల వచ్చే సీరియస్నెస్ను, సామాజిక ప్రయోజనాన్ని లోకానికి తెలియచేశాడు. అయితే రాను రాను ఈ మాటల సేకరణ ఒక జీవనోపాధిగా మారింది. ప్రముఖులతో సంభాషణలు వినోదానికి, హాస్యానికి, కాలక్షేపానికి వనరుగా మారాయి. కరణ్జోహార్ వంటి హోస్ట్లు మునిగాళ్ల లోతుకే ఎదుటివారిని ఉంచుతూ సగటు ప్రేక్షకులను ఉత్సుకత పరిచే కబుర్లను వినిపించడం మొదలెట్టారు. శేఖర్ సుమన్ ‘మూవర్స్ అండ్ షేకర్స్’ ఇదే కోవలోకి వస్తుంది. కపిల్ శర్మ వంటి వారు బయలుదేరి హాస్యం కోసం ఎదుట ఉన్నది ఎవరైనాసరే వారితో నేలబారు మాటలు మాట్లాడించవచ్చని నిరూపించారు. ప్రచారం కోసం, ఏదో ఒక విధాన గుర్తుండటం కోసం ఒకనాడు తమ తమ రంగాలలో ఎంతో కృషి చేసినవారు కూడా ఇలాంటి షోలకు హాజరయ్యి ‘మీ ఇంట్లో సబ్బు అరిగిపోతే ఏం చేస్తారు?’ వంటి ప్రశ్నలకు జవాబులు ఇస్తూ వారి అభిమానులను చానల్ మార్చేలా చేస్తున్నారు. ఇప్పుడు ఈ మాటల సేకరణ పతాక స్థాయికి చేరింది. యూ ట్యూబ్ పుణ్యాన ప్రతి ఒక్కరూ కాసిన్ని వీడియోల కోసం, వాటి మీద వచ్చే జరుగుబాటు కోసం మైక్ పట్టుకుని సాంస్కృతిక, కళారంగాల్లో ఉన్న రకరకాల స్థాయి పెద్దల వెంటబడుతున్నారు. వీరికి తాము ఇంటర్వ్యూ చేస్తున్న కళాకారుల/సృజనకారుల గురించి ఏమీ తెలియదు. అధ్యయనం చేయరు. గతంలో ఏం జరిగిందో తెలియదు. ఇప్పుడు ఏం జరుగుతున్నదో తెలుసుకోరు. ‘చెప్పండి సార్... చెప్పండి మేడమ్’ అంటూ ‘చెప్పండి’ అనే ఒక్కమాట మీద ఇంటర్వ్యూలు ‘లాగిస్తున్నారు’. విషాదం ఏమంటే గొప్ప గొప్ప గాయనీ గాయకులు, నటీనటులు, సంగీతకారులు, రచయితలు, రాజకీయవేత్తలు, దర్శకులు, నిర్మాతలు... వీరి ‘బారిన’ పడుతున్నారు. తమను అడుగుతున్నవారు ‘పిల్లకాకులు’ అని తెలిసినా క్షమించి జవాబులు చెబుతున్నారు. ‘హోమ్ టూర్’ అని వస్తే తమ ఇళ్లు బార్లా తెరిచి చూపిస్తున్నారు. పిచ్చి ప్రశ్నలకు హతాశులవుతూనే ఏదో ఒకటి బదులు ఇస్తున్నారు. వారికి ఉన్న అభిమానులు వారి పట్ల ఉండే గౌరవాన్ని పోగొట్టుకునేలా ఈ ఇంటర్వ్యూలు ఉంటున్నాయి. అన్నింటినీ మించి వీరి ఇంటర్వ్యూలలోని శకలాలను వక్రీకరించే థంబ్నైల్స్తో పోస్ట్లు వస్తుండటం దారుణం. దినపత్రికలు పలుచబడి, అచ్చులో వచ్చే ఇంటర్వ్యూల స్థలం కుదింపునకు లోనయ్యాక సంభా షణలు, ముఖాముఖీలు ఇప్పుడు ఎలక్ట్రానిక్/డిజిటల్ మీడియాలోనే సాగుతున్నాయి. కొత్తగా మొదలైన ఓటిటి ప్లాట్ఫామ్స్ తమ సబ్స్క్రిప్షన్ లు పెంచుకోవడానికి పాపులర్ సినిమా స్టార్లను రంగంలోకి దింపి ఆ స్టార్ల ములాజాతో ఇతర స్టార్లను పిలిపించి టాక్షోలు నిర్వహిస్తున్నాయంటే ఊహించుకోవచ్చు. ఈ షోలన్నీ ఉంటే ఉండొచ్చు. కాని మాటను పలుచన చేయరాదు.పెద్దలారా! మాటకు విలువివ్వండి! మీ పెద్దరికానికి మాటతో మాట రానీకండి!! -
పాపులర్ కమెడియన్పై బయోపిక్.. అతనెవరంటే ?
Kapil Sharma Biopic Funkaar Will Soon Directed By Mrighdeep Singh: సినీ చిత్రసీమలో అనేక మంది ప్రముఖులపై అనేక బయోపిక్లు వస్తున్నాయి. మరికొన్ని రాబోతున్నాయి. స్టార్ హీరో హీరోయిన్లు, క్రికెట్ దిగ్గజాలు, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ వంటివారిపైనై ఈ బయోపిక్లు వచ్చాయి. అయితే ఇప్పటివరకూ ఒక కమెడియన్పై ఎలాంటి బయోపిక్ తీయలేదు. దీన్ని బ్రేక్ చేస్తూ ప్రముఖ కమెడియన్పై తాజాగా బయోపిక్ చిత్రం రానుంది. అతనెవరంటే మోస్ట్ పాపులర్ హిందీ కామెడీ టాక్ షో అయిన 'కామెడీ నైట్స్ విత్ కపిల్ శర్మ' హోస్ట్ కపిల్ శర్మ. అవును కపిల్ శర్మపై బయోపిక్ త్వరలో రానుంది. దీనికి సంబంధించిన విషయాన్ని ప్రముఖ సినీ విమర్శకుడు తన ట్విటర్ ద్వారా తెలిపాడు. కపిల్ శర్మపై వస్తోన్న ఈ బయోపిక్ చిత్రానికి 'ఫంకార్' అని టైటిల్ పెట్టారు. దీనికి మహావీర్ జైన్ నిర్మాతగా వ్యవహరించగా మృగ్ధీప్ సింగ్ లంబ దర్శకత్వం చేయనున్నారు. ఈయన గతంలో ఫుక్రే సినిమాను డైరెక్ట్ చేశారు. అలాగే ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సమర్పించనుంది. 'కపిల్ శర్మ కోట్లాది మంది ప్రజలకు ప్రతిరోజు నవ్వులను పంచుతాడు. అలాంటి కపిల్ శర్మ గురించి మీకు తెలియని జీవిత కథను వెండితెరపై చూపెట్టబోతున్నాం' అని మహావీర్ జైన్ తెలిపారు. BIOPIC ON KAPIL SHARMA: 'FUKREY' DIRECTOR TO DIRECT... A biopic on #KapilSharma has been announced... Titled #Funkaar... #MrighdeepSinghLamba - director of #Fukrey franchise - will direct... Produced by #MahaveerJain [#LycaProductions]... #Subaskaran presents. #KapilSharmaBiopic pic.twitter.com/7LxhfKt4r6 — taran adarsh (@taran_adarsh) January 14, 2022 ఇదీ చదవండి: దేవుడి ప్రసాదం అని చెప్పి ట్రిక్ ప్లే చేశారు.. చివరిగా -
దేవుడి ప్రసాదం అని చెప్పి ట్రిక్ ప్లే చేశారు.. చివరిగా
బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్, అందాల భామ సారా అలీ ఖాన్, తమిళ స్టార్ హీరో ధనుష్ ముగ్గురు కలిసి నటించిన చిత్రం 'ఆత్రంగి రే'. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా గతేడాది డిసెంబర్లో ప్రముఖ హిందీ టాక్ షో 'ది కపిల్ శర్మ షో'లో సందడి చేశారు అక్కీ, సారా. సినిమా చిత్రీకరణలో జరిగిన చిలిపి సన్నివేశాలు, సందడి గురించి ముచ్చటించారు. ఈ చిత్రానికి సంబంధించిన విషయాలను తనదైన రీతిలో అడిగి ఆకట్టుకున్నాడు కపిల్ శర్మ. అయితే ఈ క్రమంలో అక్షయ్ తనపై ఎలాంటి ట్రిక్ ప్లే చేశాడో చెప్పుకొచ్చింది సారా. నేను ఏం ట్రిక్ ప్లే చేశాను అని అక్షయ్ అడగ్గా.. సర్ మీరు నాకు స్వీట్ అని చెప్పి వెల్లుల్లి తినిపించారు. అది కూడా దేవుడి ప్రసాదం (నైవేద్యం) అని చెప్పారు మీరు. 'ఇదిగో బేటా ఇది దేవుడి ప్రసాదం' అని అన్నారు. అది కొంచెం వండిన వెల్లుల్లి కూడా కాదు. పచ్చి వెల్లికాయ.' అని తెలిపింది సారా. దీనికి 'అది నిన్ను బాధపెట్టిందా' అని అక్షయ్ అడిగితే 'అవును నాకు కొంచెం ఆనారోగ్యంగా అనిపించింది.' అని చెప్పింది సారా. ఈ మాటతో 'నువ్ తిన్నట్లు నీ కెరీర్పై ప్రమాణం చేసి చెప్పు' అని అడగ్గా 'నేను దాన్ని తింటే కచ్చితంగా అనారోగ్యంగా అనిపించేది' అని బదులిచ్చింది సారా అలీ ఖాన్. దీంతో ఒక్కసారిగా షోలో నవ్వులు చిందాయి. ఇదీ చదవండి: సుకేష్ కన్నా ఆమె బాడీగార్డే బెటర్.. వీడియోపై ట్రోలింగ్ -
అవును, విషం తాగాను: కమెడియన్ ఎమోషనల్
Comedian Tirthanand Rao: కరోనా వల్ల అన్ని రంగాలతో పాటు సినీ ఇండస్ట్రీ కూడా అతలాకుతలమైంది. సినిమానే నమ్ముకున్న ఎంతోమంది లాక్డౌన్ సమయంలో రోడ్డున పడ్డారు, టెక్నీషియన్లు, జూనియర్ ఆర్టిస్టులు, నటీనటులు ఇలా ఎందరో ఉపాధి లేక అల్లాడిపోయారు. ఈ క్రమంలో పలువురు బలవన్మరణానికి పాల్పడ్డారు. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత షూటింగ్లు మొదలైనా కొందరు ఆర్టిస్టులకు మాత్రం అవకాశాలు రావడం లేదు. వచ్చినా సరిగా డబ్బులు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఈ క్రమంలో ఆర్థిక సమస్యలతో సతమతమైన కమెడియన్ తీర్థానంద్ రావు గత నెలలో ఆత్మహత్యకు యత్నించాడు. అటు అప్పులు తీర్చలేక, ఇటు అయినవాళ్ల అండ లేదన్న బాధతో డిసెంబర్ 21న విషం తాగి అర్ధాంతరంగా తనువు చాలించడానికి సిద్ధపడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని గుర్తించిన ఇరుగుపొరుగువారు ఆస్పత్రికి తీసుకెళ్లడంతో చావు నుంచి తప్పించుకుని బతికి బట్టగట్టాడు. తాజాగా ఈ ఘటనపై తీర్థానంద్ స్పందిస్తూ తాను విషం తాగింది నిజమేనని అంగీకరించాడు. 'ఆర్థిక ఇబ్బందులతో నేను కొట్టుమిట్టాడుతున్నాను. పైగా నా కుటుంబం నన్ను ఒంటరిగా వదిలేసింది. అందుకే విషం తాగాను. ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే నా తల్లి, సోదరుడు కనీసం నన్ను చూడటానికి కూడా రాలేదు. మేమంతా అదే ప్రాంతంలో నివసిస్తున్నా వారు నాతో మాట్లాడటానికి కూడా ఇష్టపడరు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికొచ్చాక కూడా ఇంట్లో ఒంటరిగానే ఉంటున్నాను. ఇంతకంటే ఘోరమైనది ఇంకేదైనా ఉందా?' అని ఎమోషనల్ అయ్యాడు. కాగా తీర్థానంద్ 2016లో కపిల్ శర్మ కామెడీ సర్కస్ షోలో కనిపించాడు. ఓ గుజరాతీ సినిమాలో అవకాశం రావడంతో కపిల్ శర్మ షోలో దీర్ఘకాలం కొనసాగలేకపోయాడు. ఇతడు నానా పటేకర్లా ఉండటంతో అతడి వాయిస్ను మిమిక్రీ చేస్తూ డబ్బులు సంపాదించేవాడు. -
ఎన్టీఆర్ ఈవెంట్కు 10 ప్రత్యేక రైళ్లు.. అభిమానుల కోసం
Junior NTR Reveals 10 Special Trains For Andhrawala Audio Launch: జూనియర్ ఎన్టీఆర్కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన సినిమా ఫంక్షన్లలకు అభిమానులు భారీగా హాజరవుతుంటారు. అయితే తారక్ నటించిన మోస్ట్ అవేటెడ్ చిత్రం రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్). ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో అభిమానులను పెంచుకునే పనిలో పడ్డాడు తారక్. ప్రస్తుతం అయితే దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటం, థియేటర్ ఆక్యుపెన్సీలో ఆంక్షల వంటి పలు కారణాల వల్ల సినిమా వాయిదా పడింది. అంతకుముందు మాత్రం ఈ మూవీ ప్రమోషన్స్ను భారీగా చేసింది చిత్రబృందం. ఈ క్రమంలోనే ప్రముఖ హిందీ కామెడీ టాక్ షో 'ది కపిల్ శర్మ షో'లో పాల్గొన్నారు తారక్, రామ్ చరణ్, రాజమౌళి, అలియా భట్. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మూవీ ఈవెంట్స్కు అభిమానులు ఎలా వస్తారో చెప్పాలని హోస్ట్ కపిల్ శర్మ అడిగాడు. అందుకు ఎన్టీఆర్ తాను 2004లో నటించిన ఆంధ్రావాలా చిత్రం ఆడియో లాంచ్కు అభిమానులు ఎలా వచ్చారో తెలిపారు. అప్పుడు ప్రభుత్వం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసిన విధానం గురించి పేర్కొన్నారు. 'నా ఆంధ్రావాలా ఆడియో లాంచ్కు సుమారు 9 నుంచి 10 లక్షల మంది అభిమానులు వచ్చారు. వారికోసం ప్రభుత్వం 10 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాల్సి వచ్చింది.' అని తారక్ వెల్లడించారు. ఆంధ్రావాలా సినిమాను డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. About #Andhrawala Audio launch 🔥#NTR @RRRMovie @tarak9999 pic.twitter.com/x9sYS7dIZK — NTR ARMY (@NTRARMYOFFICIAL) January 2, 2022 ఇదీ చదవండి: అలియా భట్ నవ్వు.. నెటిజన్ల ట్రోలింగు.. -
ఒడిలో కూర్చోవాలనుందన్న నెటిజన్.. స్పందించిన నటి
హిందీ టీవీ పరిశ్రమలో ఎంతో పాపులారిటీ ఉన్న షో ‘ది కపిల్ శర్మ షో’. ఇందులో షోకి గెస్ట్గా వచ్చిన సెలబ్రిటీలను రకరకాల ప్రశ్నలు వేస్తూ నవ్విస్తుంటాడు హోస్ట్ కపిల్ శర్మ. 'పోస్ట్ కా పోస్ట్మార్టం' విభాగంలో హోస్ట్ పోస్ట్లపై కామెంట్లను చదివి వినిపించగా.. ఫన్నీ రిప్లై ఇచ్చింది నటి ఆయేశా జుల్కా. ఇంతకుముందు ఓ సారి తన పెంపుడు పిల్లిని ఎత్తుకున్న ఫోటోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది ఆయేశా. దానికి..‘నేను మియావ్ అంటా. మీ ఒడిలో కూర్చోబెట్టుకుంటారా?’ అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. ‘రండి, మీరు కనుగొంటారు’ అంటూ కపిల్ షోలో ఫన్నీ రిప్లై ఇచ్చింది ఈ సీనియర్ నటి. అయితే ఈ కామెంట్కి మరో నెటిజన్ ‘ఆమెకు పిల్లులు ఇష్టం, గాడిదలు కాదు’ అంటూ ఇంకా ఫన్నీ రిప్లై ఇచ్చాడు. అయితే ఈ కామెంట్కి మరో నెటిజన్ ‘ఆమెకు పిల్లులు ఇష్టం, గాడిదలు కాదు’ అంటూ ఇంకా ఫన్నీ రిప్లై ఇచ్చాడు. దానికి ఆయేషా నవ్వుతూ.. ‘అవును, ఆయనకి నిజం చెప్పారు’ అంటూ ఆ వ్యక్తికి సపోర్టు చేసింది. కాగా ఈ కపిల్ షోకి 90'లో కో స్టార్స్ అయిన జుహీ చావ్లా, మధుతో వచ్చింది ఈ సీనియర్ నటి. చదవండి: బూసన్ ఫిల్మ్ అవార్డు గెలుచుకున్న అపర్ణ సేన్ ‘ది రేపిస్ట్’ View this post on Instagram A post shared by Ayesha Jhulka (official) (@ayesha.jhulka) -
ఏసీ రిపేర్, లీకేజీ ఉందని ఫోన్ చేసేవారు: సైఫ్ అలీఖాన్
బాలీవుడ్లో మంచి పాపులారిటీ ఉన్న నటుల్లో సైఫ్ అలీఖాన్ ఒకరు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన తాజాగా ది కపిల్ శర్మ షోకి గెస్ట్గా వచ్చాడు. తన తాజా చిత్రం ప్రమోషన్లో భాగంగా ఆ సినిమా హీరోయిన్లు యామీ గౌతమ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్తో కలిసి ఈ షోలో పాల్గొన్నాడు. ఈ తరుణంలో ఫ్లాట్ల యజమానిగా ఉండే బాధలను తెలిపాడు. కపిల్ శర్మ షోలో ఫ్లాట్లు రెంట్కి ఇస్తే ఉండే ఇబ్బందుల గురించి హోస్ట్ కపిల్ మాట్లాడాడు. ఈ విషయాన్ని ఓన్ చేసుకున్న సైఫ్ తను చిన్నపాటి లాండ్లార్డ్నని, ఆ టార్చర్ ఎలా ఉంటుందో తనకు తెలుసన్నాడు. ‘ఇంకా పాత మనస్తత్వం ఉండడం వల్ల, వచ్చే ఆదాయాన్ని ఫ్లాట్లలో పెట్టుబడులు పెట్టి.. అద్దెకు ఇస్తుంటా. చాలా సార్లు అద్దెకున్నవారు ఏసీ రిపేర్, లీకేజీలు ఉన్నాయంటూ ఫోన్ చేసేవారు. కొన్నిసార్లు ఈ పని కోసం ఎవరినైనా నియమించుకోవాలనిపించేదని’ తెలిపాడు. ‘ఆ బాధ తట్టుకోలేక ఇప్పుడైతే ఓ మేనేజర్ని నియమించుకున్నాను. కానీ అంతకుముందు మాత్రం అన్నీ తానే చూసుకునేవాడినని’ అంటూ సైఫ్ చెప్పుకొచ్చాడు. అయితే సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఇటీవలే రెండో సంతానంగా జెమ్ పుట్టిన విషయం తెలిసిందే. అతను పుట్టడానికి ముందే ఉన్న ఇంటిని రూ.3.5లక్షలకు అద్దెకు ఇచ్చి, వేరే ఇంటికి మారారు. కాగా సైఫ్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా చేస్తున్న ‘ఆదిపురుష్’, ‘బంటీ ఔర్ బబ్లీ 2’ నటిస్తున్నాడు. చదవండి: కరీనాకు ఏ విషయంలోనూ సలహాలు ఇవ్వను: సైఫ్ అలీ ఖాన్ -
దారుణ స్థితిలో సిద్దార్థ్, మళ్లీ డ్రగ్స్ సేవించాడా?
Comedian Sidharth Sagar: మాదక ద్రవ్యాల నుంచి విముక్తి పొందిన నుంచి స్టాండప్ కమెడియన్ సిద్దార్థ్ సాగర్ అంతు చిక్కని పరిస్థితిలో పోలీసుల కంటపడ్డాడు. తనెక్కడున్నాడు? ఏం చేస్తున్నాడో కూడా తెలియని దుస్థితిలో ఉన్న అతడిని పోలీసులు పునరావాస కేంద్రానికి తరలించారు. గతంలో మాదకద్రవ్యాలకు బానిసైన అతడు సుదీర్ఘ పోరాటం తర్వాత దాన్ని జయించి తిరిగి కెరీర్ మీద ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలో ఫరాఖాన్ జడ్జిగా వ్యవహరిస్తున్న కామెడీ షోలో కంటెస్టెంట్గా అడుగుపెట్టి అందరినీ కడుపుబ్బా నవ్విస్తున్నాడు. కానీ ఈ మధ్యే షో నుంచి సిద్దార్థ్ సడన్గా మాయమయ్యాడు. మరో కమెడియన్ జామీ లివర్ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు. మరి సిద్దార్థ్ ఏమయ్యాడు? అని ఆరా తీయగా షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఆగస్టు 26న రాత్రి పూర్తి మైకంలో పడిపోయి ఉన్న సిద్దార్థ్ను ముంబై పోలీసులు గుర్తించి అతడి తల్లి అల్కా సాగర్కు సమాచారమందించారు. అయితే ఆ సమయానికి ఆమె ఢిల్లీలో ఉండటంతో తన అంగీకారంతో సిద్దార్థ్ను పునరావాస కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడు ఆ స్థితిలో ఉండటానికి గల కారణమేంటి? సిద్దార్థ్ మరోసారి డ్రగ్స్కు బానిసయ్యాడా? అన్న ప్రశ్నలకు అల్కా సాగర్ కింది విధంగా స్పందించింది. 'నేను చాలాకాలంగా సిద్దార్థ్ను అంటిపెట్టుకునే ఉంటున్నాను. కానీ నా పెంపుడు జంతువు అనారోగ్యం బారిన పడటంతో దాని వైద్యం కోసం ఢిల్లీ వచ్చాను. ఇంతలోనే సిద్దార్థ్ కండీషన్ బాగోలేదని తెలిసింది. అతడికి నా పేరు, నా ఫోన్ నంబర్ తప్ప మరేవీ గుర్తులేవని పోలీసులు చెప్పారు. దారుణమేంటంటే.. ఇలాంటి దుస్థితిలో ఉన్న సిద్దార్థ్కు సహాయం చేసేందుకు అతడి ఫ్రెండ్స్, తెలిసినవాళ్లు ఎవరూ ముందుకు రావట్లేదు. మేము మాత్రమే అతడి బాగోగులు చూసుకుంటాం కానీ కుటుంబానికి విలువివ్వడు. ఒక తల్లిగా అతడు వీలైనంత త్వరగా ఈ స్థితి నుంచి బయటపడాలని కోరుకుంటున్నాను. నేనెప్పుడూ తనని అంటిపెట్టుకునే ఉన్నాను. కానీ అనుకోకుండా ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. అక్కడ నా పెంపుడు జంతువు కూడా చనిపోయింది. చాలామందికి తెలియని విషయమేంటంటే సిద్దార్థ్కు బైపోలార్ డిజార్డర్ ఉంది. దీనివల్ల ఎప్పుడూ ఊహల్లో తేలుతుండే అతడికి ట్రీట్మెంట్ కూడా చేయిస్తున్నాం. కానీ అతడు మెడిసిన్ తీసుకోవడం మానేశాడు. దీని వెనకాల ఏదో బలమైన కారణమే ఉంటుందనుకుంటున్నాను. తను మళ్లీ ఇలాంటి స్థితికి చేరుకున్నాడంటే కచ్చితంగా ఏదో జరిగే ఉంటుంది. అతడికి నేనెప్పుడూ ఒక విషయం చెబుతూ ఉండేదాన్ని. నువ్వెంత పాపులర్ అవుతావో ఇండస్ట్రీలో నీకంతమంది శత్రువులు తయారవుతారు అని! జీవితాన్ని బ్యాలెన్సెడ్గా ఉంచుకోవాలని, డబ్బు వెనకాల పరిగెట్టకూడదని సూచించేదాన్ని. నిన్ను నేను పోషిస్తాను కానీ దయనీయ స్థితిలో మాత్రం చూడలేను అని చెప్పాను. నా కొడుకు కోసం తుదిశ్వాస వరకు పోరాడతాను. నేను ముంబైలో లేను కనుక అతడికి నిజంగా ఏం జరిగింది? అన్న దానిపై స్పష్టత రాలేదు. అతడు మళ్లీ డ్రగ్స్ తీసుకున్నాడా? లేదా బైపోలార్ డిజార్డర్కు అందిస్తున్న చికిత్సను నిలిపివేయడం వల్ల ఇలా జరిగిందా? అన్నది అర్థం కాకుండా ఉంది. ఈరోజు నేను ముంబై వెళ్లి అతడిని కలుసుకుంటాను. అప్పుడే ఈ విషయంలో నాకో క్లారిటీ వస్తుంది' అని అల్కా సాగర్ చెప్పుకొచ్చింది. -
‘రణ్బీర్ నా దుస్తులను తన గర్ల్ప్రెండ్స్కు గిఫ్ట్గా ఇచ్చేవాడు’
బాలీవుడ్ యంగ్ హీరో, లవర్ బాయ్ రణ్బీర్ కపూర్, సినిమాలతో ఎంత క్రేజ్ సంపాదించాడో, తన ప్రేమాయణాలతో అంతకంటే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్నాడు. బాలీవుడ్ బ్యూటీఫుల్ హీరోయిన్స్లో కొందరితో లవ్ట్రాక్ నడిపించాడు ఈ ప్లే బాయ్. అయితే గర్ల్ఫ్రెండ్స్ని ఇంప్రెస్ చేయడానికి తన సోదరి దుస్తులను వారికి గిఫ్ట్గా ఇచ్చేవాడట ఈ స్మార్ట్ హీరో. ఈ విషయాన్ని స్వయంగా తన సోదరి, జ్యువెలరీ డిజైనర్ రిద్దిమా కపూర్ సాహ్నీ చెప్పింది. తాజాగా ఆమె తన తల్లి, బాలీవుడ్ నటి నీతూ కపూర్తో కలిసి కపిల్ శర్మ షోలో పాల్గొంది. దీనికి సంబంధించిన ప్రోమోని సోనీ టీవీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో రిద్దిమా రణ్బీర్ ప్రేయాయణాల గురించి మాట్లాడుతూ కొన్ని సిక్రెట్స్ని చెప్పింది. "ఒక రోజు రణ్బీర్ గర్ల్ఫ్రెండ్ని ఇంటికి తీసుకొచ్చాడు. ఆమె వేసుకున్న టాప్ చూసిన తర్వాత అతను తనకి నా దుస్తులని గిఫ్ట్గా ఇచ్చాడని అర్థమైంది" అని రిద్దిమా పేర్కొన్నారు. కపిల్ శర్మ షోకి సంబంధించి సెట్స్లోని కొన్ని ఫోటోలని నీతూ కపూర్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. "తన కూతురితో కలిసి పాల్గొన్న కపిల్ శర్మ షో ఎంతో సరాదాగా సాగిందని" వ్యాఖ్యని వాటికి జోడించారు. కాగా, నీతూ కపూర్ భర్త, బాలీవుడ్ నటుడు రిషి కపూర్ క్యాన్సర్తో ఈ ఏడాది ఏప్రిల్ 30న మరణించిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) -
పంచ్లతో పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తున్నారు!
ఒకేరకమైన ముఖ కవళికలతో కవలలు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తారు. వీళ్లు ఎక్కడ కనిపించినా కొన్ని క్షణాలు మన చూపు వాళ్లమీదే ఉంటుంది. వాళ్లల్లో పెద్ద ఎవరు.. చిన్న ఎవరబ్బా అనిపిస్తుంది. కాస్త అయోమయానికి గురైనప్పటికీ తరువాత తీక్షణంగా చూస్తేగానీ వారి గురించి అర్థం కాదు. అటువంటింది ఒకే రకమైన డ్రెస్లు వేసుకుని, ఏ విషయాన్ని అయినా ఇద్దరూ ఒకేసారి చెబుతూ అందర్నీ కన్ఫ్యూజ్ చేయడమేగాక, కామెడీ పంచ్లతో పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తున్నారు చింకీ మింకీలు. ఏకరూప కవలలు కావడం, ఒకేరకమైన అభిరుచులు, అభిప్రాయాలతో.. రకరకాల ఫన్నీ కంటెంట్ వీడియోలు, లిప్ సింక్ కామిక్ వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ కోట్ల మందిని అలరిస్తున్నారు. ఇద్దరి డ్రెస్సింగ్ స్టైల్, గెటప్, హెయిర్ స్టైల్ ఒకే రకంగా ఉండడం వల్ల చింకీ ఎవరు? మింకీ ఎవరు? అని కనిపెట్టడం కూడా కష్టమే. సోషల్ మీడియా ట్రెండీ, సెన్సేషన్ చింకీ మింకీల అసలు పేర్లు సురభి మెహ్రా (చింకీ), సమృద్ది మెహ్రా (మింకీ). 1998లో నోయిడాలో పుట్టిన ఈ అక్కాచెల్లెళ్లు రూపంలో అచ్చుగుద్దినట్లు ఒక్కలాగే ఉంటారు. రూపంలోనేగాక వారి ఆలోచనలు, ఆహార్యాలు ఒకేవిధంగా ఉండడం విశేషం. నోయిడాలో పాఠశాల విద్యను పూర్తిచేసిన చింకీ మింకీలు పుణేలోని సింబయాసిస్ స్కిల్స్ అండ్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తిచేశారు. చిన్నప్పటినుంచి చురుకుగా ఉండే వీరు డిగ్రీ అయ్యాక ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగంలో చేరారు. రెండు నెలలు గడిచాక అక్కడ పని నచ్చకపోవడంతో ఉద్యోగం వదిలేసి మోడలింగ్ చేయాలని నిర్ణయిచుకుని ఆ దిశగా అడుగులు వేశారు. ఈ క్రమంలోనే ట్రెండ్కు తగ్గట్టుగా మోడ్రన్ డ్రెస్లు వేసుకుంటూ తమ ఫ్యాషన్ బ్లాగ్లో ఫోటోలు వీడియోలు అప్లోడ్ చేసేవారు. ఈ వీడియోలకు మంచి ఆదరణ లభించడంతో... 2016లో టిక్టాక్ వీడియోలు చేయడం ప్రారంభించారు. ఇండియాలో టిక్టాక్ అనుమతించినంత కాలం‘చింకీ మింకీ’ అకౌంట్కు ఆరున్నర కోట్ల మంది ఫాలోవర్స్ ఉండేవారు. ఇన్స్టాగ్రాంలో కూడా ఈ ట్విన్ సిస్టర్స్కు ఫాలోవర్స్ లక్షల్లోనే ఉండడంతో చింకీ మింకీలు బాగా పాపులర్ అయ్యారు. కపిల్ శర్మ షో పాపులర్ టిక్టాక్ స్టార్స్గా ఓ వెలుగు వెలుగుతున్న ట్విన్ సిస్టర్స్కు కపిల్ శర్మ షోలో నటించే అవకాశం దక్కింది. 2019లో జూన్ 9న ద కపిల్ శర్మ షోలో పొరిగింటి అమ్మాయిల్లా నటిస్తూ హాస్యాన్ని రసవత్తరంగా పండించి ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో చింకీ మింకీలు మరింత ఫేమస్ అయ్యారు. ఆ తరువాత ‘నాగిని’ సీరియల్, ‘కాలేజీ డ్రామా’ సిరీస్లో డబుల్ ట్రబుల్ ఎపిసోడ్లో రవీనా అండ్ కరిష్మా పాత్రలలో చక్కగా నటించారు. వీటితో పాటు టీవీ సీరీస్ అయిన ‘హీరో గాయబ్ మోడ్ ఆన్ ఎలాంగిసైడ్ అభిషేక్ నిగమ్’ వంటి కార్యక్రమం లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. లిప్సింక్ కామెడీ గ్లామర్గా కనిపించడంలో ఎక్కడా తగ్గని ఈ ట్విన్ బ్యూటీస్కు యూట్యూబ్ ఛానల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. వ్యంగంతో కూడిన వీడియోలు, లిప్ సింక్ కామెడీ ప్రదర్శన, డ్యాన్సింగ్ వీడియోలను తమ ‘చింకీ మింకీ’ యూట్యూబ్ ఛానల్లో పోస్టు చేసి సోషల్ మీడియా సెన్సెషన్గా మారారు. ప్రస్తుతం వీరి ఛానల్ను ఫాలో అయ్యే సబ్స్కైబర్స్ సంఖ్య రెండున్నర కోట్లుగా ఉంది. ఎక్కువగా మ్యాచింగ్ డ్రెస్లు, ఫోటో షూట్స్, వారు ఏంచేస్తున్నారో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఫాలోవర్స్ని ఆకట్టుకుంటున్నారు. తమకున్న కవలల రూపానికి కాస్త సృజనాత్మకత జోడించి సమయ స్ఫూర్తితో కామెడీ చేస్తూ ఆదాయంతోపాటు ఆదరణ పొందుతున్నారు చింకీ మింకీలు. -
‘మీకు డబ్బులు ఎలా వస్తాయి’.. నా భర్త చాలా కష్టపడతాడు: శిల్పా శెట్టి
Raj Kundra Arrest: లండన్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. సినిమాలు, వెబ్ సిరీస్ అవకాశాల పేరుతో యువతులకు గాలం వేసి.. ఆ తర్వాత వారితో బలవంతంగా అడల్ట్ చిత్రాలు నిర్మించి.. వాటిని కొన్ని యాప్ల ద్వారా జనాల్లోకి తీసుకెళ్తున్నాడనే ఆరోపణల మీద పోలీసులు రాజ్ కుంద్రాను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో రాజ్ కుంద్రా ఆదాయం గురించి భార్య శిల్పా శెట్టి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ వివరాలు.. కపిల్ శర్మ షోకు ఓ సారి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా, సోదరి షమితా శెట్టి గెస్ట్లుగా హాజరవుతారు. ఈ నేపథ్యంలో కపిల్ శర్మ, రాజ్ కుంద్రాను ఉద్దేశిస్తూ.. ‘‘మీరు ఎప్పుడు చూసినా టైం పాస్ చేస్తూ.. జాలీగా గడుపుతారు. ఇంత లగ్జరీ బతకడానికి మీకు డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది.. అసలు ఏం పని చేయకుండా మీకు డబ్బు ఎలా వస్తుందని’’ ప్రశ్నిస్తాడు. అంతేకాక ‘‘మీరు ఎప్పుడు చూసినా పార్టీలకు వెళ్తూ, భార్యతో షాపింగ్ అంటూ తిరుగుతారు. సినీ తారలతో ఫుట్బాల్ మ్యాచ్లు ఆడుతుంటారు. ఇన్ని పనులు చేస్తూ, బిజీగా ఉంటారు.. మీకు డబ్బులు సంపాదించడానికి టైం ఎప్పుడు దొరుకుతుంది’’ అని కపిల్ శర్మ ప్రశ్నిస్తాడు. అందుకు శిల్పా శెట్టి, రాజ్కుంద్రా, షమితా ముగ్గురు పెద్ద పెట్టున నవ్వుతారు. ఆ తర్వాత శిల్పా శెట్టి బదులిస్తూ.. ‘‘నా భర్త చాలా కష్టపడతారు.. ఒక్కోసారి ఆయన గంటలకొద్ది పని చేస్తూనే ఉంటారు. అసలు రెస్ట్ అనేది దొరకదు’’ అని సమాధానం చెప్పారు. ఏళ్ల నాటి ఈ వీడియో రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది చూసిన నెటిజనులు ‘‘కపిల్ శర్మ అడిగిన ప్రశ్నకు ఇన్నాళ్లకు సరైన సమాధానం లభించింది’’.. ‘‘సినిమా అవకాశాల పేరుతో యువతుల జీవితాలను నాశనం చేస్తూ.. తాను మాత్రం ఖరీదైన జీవితం గడుపుతున్నాడు’’.. ‘‘అవును పాపం.. పోర్న్ సినిమాలు తీయడానికి.. అమాయకులైన ఆడవారిని మోసం చేయడానికి చాలా కష్టపడుతున్నాడు’’ అంటూ ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు నెటిజనులు. शिल्पा शेट्टी के पति राज कुंद्रा को क्राइम ब्रांच ने अश्लील फिल्में बनाने के आरोप मे किया गिरफ्तार. Finally everyone got the right answer of the question asked by kapil sharma on #TheKapilSharmaShow many years ago.#RajKundra #shilpashettykundra #RajKundraArrest pic.twitter.com/TcMFujKiyu — Dessie Aussie 🇮🇳🇭🇲 (@DessieAussie) July 19, 2021 -
పని లేదు.. పదేళ్లుగా గర్భాశయ వ్యాధితో పోరాటం: నటి
ది కపిల్ శర్మ షో ఫేం నటి సుమోనా చక్రవర్తి సంచలన విషయాలు వెల్లడించారు. కోవిడ్ కారణంగా గత కొన్ని రోజులగా తనకు పని లేదని.. పదేళ్లుగా తాను ఎండోమెట్రియోసిస్ (గర్భాయశ సంబంధిత వ్యాధి)తో బాధపడుతున్నాని.. ప్రస్తుతం అది నాల్గవ స్టేజ్లో ఉందని వెల్లడించారు. సోషల్ మీడియా ద్వారా అభిమానులతో తన వ్యక్తిగత విషయాలు పంచుకున్నారు సుమోనా చక్రవర్తి. ఇక లాక్డౌన్ కారణంగా మానసికంగా చాలా కుంగిపోయానని తెలిపారు. లాక్డౌన్లో తన పరిస్థితి ఎలా ఉంది.. దాని నుంచి ఎలా బయటపడిగలిగింది వంటి తదితర అంశాల గురించి తెలిపారు. తాను చెప్పే విషయాలు కొందరిలోనైనా స్ఫూర్తి కలిగిస్తాయనే ఉద్దేశంతోనే వీటన్నింటిని వెల్లడిస్తున్నాను అన్నారు. సుమోనా మాట్లాడుతూ.. ‘‘చాలా రోజుల తర్వాత వ్యాయామం చేశాను. చాలా బాగా అనిపించింది. కొంతకాలంగా చేతిలో ప్రాజెక్ట్స్ లేవు. నిరుద్యోగిగా మారాను. నా మీద నాకే కోపం వచ్చేది. చాలా గిల్టీగా ఫీలయ్యేదాన్ని. నిరుద్యోగిగా ఉన్నప్పటికి కూడా నా కుటుంబాన్ని, నన్ను పోషించుకోగల్గుతున్నాను. అది చాలా మంచి విషయం. ఇక లాక్డౌన్ వల్ల కలిగిన మానసిక సమస్యలు దూరం చేసుకోవడానికి మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం, ముఖ్యంగా ఒత్తిడికి లోనవ్వకుండా ఉండటం ముఖ్యం’’ అన్నారు. ‘‘ఇంతవరకు దీని గురించి ఎవరికి చెప్పలేదు. 2011 నుంచి నేను ఎండోమెట్రియోసిస్తో పోరాడుతున్నాను. ప్రస్తుతం నాల్గో దశలో ఉంది. ఒత్తిడి అస్సలు మంచిది కాదు. ఇది చదివిన వారందరూ ఓ విషయం అర్థం చేసుకోవాలి. మెరిసేదంతా బంగారం కాదు. అలానే మా జీవితాలు వడ్డించిన విస్తరి కావు. మాకు చాలా సమస్యలుంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. దానితో పోరాడుతుంటాం. మన చుట్టూరా ఎక్కువగా నష్టం, అసహనం, ద్వేషం, దుఖం, ఒత్తిడి, నొప్పి ప్రతికూల భావనలే ఉంటాయి. కానీ మనకు కావాల్సింది ప్రేమ, దయ. అవి ఉంటే చాలు ఈ తుపానును దాటగల్గుతాం’’ అన్నారు. ‘‘ఇక వ్యక్తిగత సమస్యల గురించి ఇంత బహిరంగంగా చెప్పడం అంత సులువు కాదు. నేను నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఈ విషయాలను వెల్లడిస్తున్నాను. ఈ పోస్ట్ కొందరిలోనైనా స్ఫూర్తి నింపగలదని.. కొందరిలోనైనా చిరునవ్వులు పూయించగలదని ఆశిస్తున్నాను’’ అంటూ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. చదవండి: ‘మీరు సారీ చెప్తారా.. దేవుడి లీల’ -
కొత్తగా పెళ్లయిన కమెడియన్ జంటకు షాకిచ్చిన పోలీసులు
జలంధర్: కపిల్ శర్మ షోతో పాపులరైన హాస్య నటికి పంజాబ్ పోలీసులు షాకిచ్చారు. పెళ్లయిన 9 రోజులకు పోలీసులు ఆ నవ దంపతులపై కేసు నమోదు చేశారు. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో విధించిన నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ వారిపై కేసు నమోదు చేశారు. మాస్క్ ధరించకపోవడం.. పెద్ద ఎత్తున బంధువులు, స్నేహితులు వివాహ వేడుకకు వచ్చారని పోలీసులు గుర్తించారు. హాస్యనటుడు, గాయకుడు సంకేత్ భోస్లేకు సుగంధ మిశ్రాను వివాహం చేసుకుంది. అంగరంగ వైభవంగా వివాహ వేడుక జరిగింది. అయితే పెళ్లి సమయంలో కరోనా జాగ్రత్తలు పాటించలేదు. దీన్ని ఓ వీడియో ద్వారా గుర్తించిన అధికారులు వారిపై కేసులు నమోదు చేశారు. విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం 188 సెక్షన్ కింద వారిపై కేసు బుక్ చేశారు. పంజాబ్లోని జలంధర్కు చెందిన గాయని సుగంధ మిశ్రాను అదే ప్రాంతంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏప్రిల్ 26వ తేదీన వివాహం జరిగింది. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం వివాహాలు, శుభకార్యాలపై నిబంధనలు విధించింది. 10 మంది కన్నా అధికంగా ఉండకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ వివాహ వేడుకలో పెద్ద ఎత్తున బంధువులు, స్నేహితులు పాల్గొన్నారని ఓ వీడియోలో పోలీసులు గుర్తించారు. ఆ వీడియో ఆధారంగా ఆ నవ దంపతులపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ సరబ్జిత్ సింగ్ బహియా తెలిపారు. పగ్వారా పోలీస్స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. చదవండి: కరోనాపై కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు View this post on Instagram A post shared by 𝐒𝐔𝐆𝐀𝐍𝐃𝐇𝐀 𝐌𝐈𝐒𝐇𝐑𝐀 (@sugandhamishra23) -
పెళ్లి పీటలెక్కిన 'ద కపిల్ శర్మ షో' కమెడియన్లు
"ద కపిల్ శర్మ షో"తో గుర్తింపు పొందిని హాస్య నటి సుగంధ మిశ్రా ప్రియుడు, కమెడియన్ సంకేత్ భోస్లేని పెళ్లాడింది. కరోనా నేపథ్యంలో అతి కొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో పంజాబ్లోని లూధియానాలో వీరి పెళ్లి జరిగింది. వివాహానికి హాజరైన వారందరికీ ముందే కరోనా పరీక్షలు నిర్వహించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. గత కొంతకాలంగా వీళ్లిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇదే నిజమని తేల్చుతూ ఇద్దరూ పెళ్లి పీటలెక్కారు. ఇక వధువు సుగంధ మిశ్రా పింక్ లెహంగాలో అందంగా ముస్తాబవగా, సంకేత్ భోస్లే వైట్ అండ్ ఎల్లో కుర్తాలో కనిపించారు. వీరి పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రముఖులు, అభిమానుల నుంచి ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక వారం రోజుల క్రితమే సంకేత్ భోస్లేతో కలిసి త్వరలోనే కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాను అంటూ సుగంధ మిశ్రా ఇన్స్టాగ్రామ్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. సంకేత్ భోస్లేతో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ.. డిసెంబర్ నుంచే పెళ్లిపనులు మొదలుపెట్టానని, ఆన్లైన్లో పెళ్లి షాపింగ్ కూడా పూర్తైంది అని తెలిపింది. సంకేత్ డాక్టర్ కావడంతో కోవిడ్ నిబంధనల మధ్య అతి తక్కువ మంది సమక్షంలో నిశ్చితార్థం, పెళ్లి ఒకేసారి జరుగుతాయని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Preeti Simoes (@preeti_simoes) చదవండి : మా డేటింగ్ను సీక్రెట్గా ఉంచాను, తప్పలేదు: నటి గుత్తా జ్వాల-హీరో విష్ణు మెహందీ ఫోటోలు వైరల్ -
రెండోసారి తండ్రైన స్టార్ కమెడియన్
ముంబై: బాలీవుడ్ స్టార్ కమెడియన్ కపిల్ శర్మ మరోసారి తండ్రి అయ్యాడు. ఈ రోజు ఉదయం ఆయన భార్య గిన్ని చరాత్ పండంటి మగ బిడ్డకు జన్మినించారు. ఈ విషయాన్ని కపిల్ శర్మ సోషల్ మీడియా వేదికగా సోమవారం ప్రకటించాడు. ‘నమస్కార్.. ఈ రోజు ఉదయం నా భార్య మగ బిడ్డకు జన్మినించింది. దేవుడి దయ వల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. మా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు’ అంటూ ఆయన ట్వీట్ చేశాడు. బాలీవుడ్ నటీనటులు, అభిమానులు కపిల్కు శభాకాంక్షలు తెలుపుతున్నారు. త్వరలోనే తమ ఇంట్లోకి చిన్న అతిథి రాబోతున్నాడన్న శుభవార్తను గతవారం కపిల్ అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. (చదవండి: అందుకే బ్రేక్ తీసుకుంటున్నా: కపిల్ శర్మ) 2018లో హిందూ, సిక్కు సంప్రదాయంలో వివాహం చేసుకున్న కపిల్ శర్మ-గిన్ని చరాత్లకు 2019 డిసెంబర్లో కూతురు అనైరా శర్మ జన్మించింది. కాగా ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’ షోతో ప్రాచుర్యం పొందిన కపిల్ శర్మ.. హిందీ బుల్లితెరపై స్టార్ కమెడియన్గా ఎదిగిన సంగతి తెలిసిందే. అంతేగాక.. ఒక షోకు అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న వ్యక్తిగా కూడా రికార్డు సృష్టించాడు. ఇక పలు బాలీవుడ్ సినిమాలలో కూడా నటించిన కపిల్.. ‘సన్ ఆఫ్ మంజీత్ సింగ్’ అనే సినిమాతో నిర్మాతగా కూడా మారాడు. Namaskaar 🙏 we are blessed with a Baby boy this early morning, by the grace of God Baby n Mother both r fine, thank you so much for all the love, blessings n prayers 🙏 love you all ❤️ginni n kapil 🤗 #gratitude 🙏 — Kapil Sharma (@KapilSharmaK9) February 1, 2021 -
బ్రేక్ తీసుకుంటున్నా: స్టార్ కమెడియన్
ముంబై: ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా కొనసాగుతున్న కామెడీ షో ‘ది కపిల్ శర్మ షో’ కొన్నాళ్లపాటు వాయిదా పడనుంది. ఫిబ్రవరి నుంచి ఈ షో ప్రసారాలు నిలిచిపోనున్నాయంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని కపిల్ శర్మ నిర్ధారించారు. అయితే పూర్తిగా షో ముగిసిపోదని, చిన్న బ్రేక్ మాత్రమేనని అతడు పేర్కొన్నాడు. అదే విధంగా.. తాము త్వరలోనే మరో బుల్లి అతిథిని ఇంట్లోకి ఆహ్వానించబోతున్నామంటూ అభిమానులకు శుభవార్త చెప్పాడు. కాగా కపిల్ శర్మ గురువారం ట్విటర్లో ఫ్యాన్స్తో ముచ్చటించాడు. (చదవండి: కమెడియన్కు రూ. 5.5 కోట్ల కుచ్చుటోపి!) ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా... ‘‘అవును కపిల్ శర్మ షోకి చిన్న విరామం ఇస్తున్నా. అంతేగానీ పూర్తిగా కాదు.. ప్రస్తుత పరిస్థితుల్లో నేను నా భార్యకు తోడుగా ఉండాలి. ఎందుకంటే మా రెండో బిడ్డ త్వరలోనే ప్రపంచంలోకి రానుంది. అందుకే ఈ బ్రేక్’’ అని కపిల్ శర్మ స్పష్టం చేశాడు. ఇక తమకు పుట్టబోయేది పాపైనా, బాబు అయినా ఫర్వాలేదని, అనైరాకు తోబుట్టువు రావడమే సంతోషకరమైన విషయమని పేర్కొన్నాడు. కాగా ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’ షోతో ప్రాచుర్యం పొందిన కపిల్ శర్మ.. హిందీ బుల్లితెరపై స్టార్ కమెడియన్గా ఎదిగిన సంగతి తెలిసిందే. అంతేగాకుండా.. ఒక షోకు అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న వ్యక్తిగా కూడా రికార్డు సృష్టించాడు. ఇక పలు బాలీవుడ్ సినిమాలలో కూడా నటించిన కపిల్.. ‘సన్ ఆఫ్ మంజీత్ సింగ్’ అనే సినిమాతో నిర్మాతగా కూడా మారాడు. ఈ క్రమంలో 2018 డిసెంబరులో తన చిరకాల స్నేహితురాలు గిన్నీ చరాత్ను కపిల్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంటకు 2019లో కుమార్తె అనైరా శర్మ జన్మించింది. -
ఆ వార్త వినగానే.. అభిషేక్ని గట్టిగా తిట్టేశా: అజయ్ దేవ్గణ్
కోవిడ్ మొదలయ్యి భయభ్రాంతం చేస్తున్న రోజుల్లో అమితాబ్ దాని బారిన పడి హాస్పిటల్లో తీవ్రంగా పోరాడాల్సి రావడం అందరికీ తెలిసిందే. అదే సమయంలో అభిషేక్ కూడా కరోనా బారిన పడ్డాడు. తండ్రీ కొడుకులు ఇద్దరూ ఒకే హాస్పిటల్లో ఉన్నారు. ఆ సంఘటనతో దేశం అంతా అలెర్ట్ అయ్యింది. అమితాబ్కే వచ్చినప్పుడు మనక్కూడా రావచ్చని జాగ్రత్తలు పాటించింది. రెండు రోజుల క్రితం సోనీలో వచ్చిన ‘కామెడీ విత్ కపిల్’షోలో అభిషేక్ బచ్చన్, అజయ్ దేవ్గణ్ పాల్గొని ఆ ఘటనను గుర్తు చేసుకున్నారు. ‘కోవిడ్ వార్త వెలువడగానే నేను అభిషేక్కు ఫోన్ చేశాను. గట్టిగా తిట్టేశాను.. జాగ్రత్తగా ఉండాలి కదా అని. ఎవరి వల్ల వచ్చింది అనంటే అభిషేక్ కంగారుగా నాన్న వల్లే వచ్చి ఉంటుందని అన్నాడు. అమితాబ్ గారు ఇల్లు కదలకుండా ఉంటే ఆయన వల్ల అంటావు మళ్లీ. నువ్వు బయట తిరుగుతున్నావు. నీ వల్లే ఆయన కు వచ్చి ఉంటుంది’ అని బాగా తిట్టాను అని అజయ్ దేవ్గణ్ అన్నాడు. అజయ్ దేవ్గణ్ అమితాబ్ కుటుంబానికి బాగా దగ్గర. అభిషేక్ను పెట్టి హర్షద్ మెహతా బయోపిక్ ‘బిగ్ బుల్’ తాజాగా నిర్మించాడు. దాని ప్రమోషన్లో భాగంగా ఈ షోలో పాల్గొని కోవిడ్ ఉదంతాన్ని పంచుకున్నారు ఇద్దరూ. అభిషేక్ చదువు మానేసి స్విట్జర్లాండ్ నుంచి తిరిగి వచ్చి అజయ్ హీరోగా నటించిన ‘మేజర్ సాబ్’ యూనిట్లో స్పాట్బాయ్గా పని చేశాడు. ‘అప్పటి నుంచి అజయ్ నాకు అన్నగా మారాడు’ అని చెప్పాడు అభిషేక్.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
రాజస్తాన్ రాయల్స్కు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన బట్లర్
డిప్రెషన్లో ఉపాసన, అత్తారింటికి వెళ్లిన రామ్చరణ్ (ఫోటోలు)
రోహిత్ శర్మ సంచలన నిర్ణయం.. త్వరలోనే రిటైర్మెంట్!?
ప్రభుత్వ సానుకూలత ఉప్పెనలా ఓటెత్తింది: సజ్జల
ఏపీలో పోలింగ్ శాతం పెరిగింది: ఏపీ సీఈవో
బాబర్ ఆజం అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్గా
పెట్రోల్ బాంబులతో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు
డాక్టర్ కాళ్లు పట్టుకున్నా.. అర్ధరాత్రి రోడ్డుపై ఏడ్చుకుంటూ వెళ్లా..
ముంబైని ముంచెత్తిన భారీ వర్షం
PBKS: మేనేజ్మెంట్ సరిగ్గా లేకుంటే ఎవరేం చేస్తారు?
తప్పక చదవండి
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement