-
తెలంగాణలో హీటెక్కిన పాలి‘ట్రిక్స్’.. ఆ రెండు స్థానాలపై స్పెషల్ ఫోకస్!
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలపై అన్ని ప్రధాన పార్టీలు ప్రచార జోరును పెంచాయి. వరంగల్, మహబూబాబాద్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాన రాజకీయ పార్టీలు తమ దూకుడు పెంచాయి. అన్ని పార్టీలు ప్రచారంలో ఆరాటం,ఆర్భాటం, పోరాటం ప్రదర్శిస్తున్నాయి. గతంలో ఇప్పుడు లేని విధంగా వరంగల్ పార్లమెంట్ స్థానంలో అభ్యర్థులు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు. ప్రచారానికి తమ స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దించుతున్నాయి. కాంగ్రెస్ తరపున ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మహబూబాద్, వరంగల్ బహిరంగ సభలో పాల్గొనగా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఆయా రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులను, మంత్రులను, జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందిన లీడర్లను ప్రచారంలోకి దింపుతున్నాయి. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే ఆదివారం మాజీ ముఖ్యమంత్రి కాజీపేట వరంగల్ హనుమకొండలో రోడ్ షోలో పాల్గొనున్నారు. దీంతో వరంగల్లో టిఆర్ఎస్లో జోష్ వస్తుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీశ్ రావులు సైతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తూ పార్టీ ఎన్నికల ప్రచారంలో పాలు పంచుకుంటున్నారు. ఇప్పటికే వరంగల్లో కేటీఆర్ పర్యటన పూర్తి కాగా, పాలకుర్తి నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో, అంతకు ముందు వరంగల్ లోక్సభ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతల సన్నాహాక సమావేశంలో హరీశ్రావు పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.వరంగల్లో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం పర్యటన వరంగల్, హనుమకొండ పట్టణాల్లో జరిగే కార్నర్ మీటింగ్లో పాల్గొని ప్రసంగించనున్నారు. కేసీఆర్ రోడోషోకు సంబంధించిన రూట్ మ్యాప్ ఇప్పటికే ఖరారు కాగా హన్మకొండ జిల్లా బీఆర్ ఎస్ అధ్యక్షుడు వినయ్భాస్కర్, మాజీమంత్రి దయాకర్రావు ఏర్పాట్లను ఇప్పటికే పర్యవేక్షించారు.మే 1న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు రోడ్ షోలో పాల్గొన్న అనంతరం మానుకోట జిల్లా కేంద్రంలోనే బస చేయనున్నారు. ఎన్నికల తర్వాత తొలిసారిగా కేసీఆర్ వరంగల్ జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో రాజకీయంగా ప్రాధాన్యం ఏర్పడింది.లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. మానుకోట, హన్మకొండ జిల్లా కేంద్రాల్లో జరిగిన కాంగ్రెస్ జన జాతర సభల్లో పాల్గొని పార్టీ ఎమ్మెల్యేలకు, ముఖ్య నాయకులకు, శ్రేణులకు సందేశమిస్తూనే కాంగ్రెస్ పార్టీ విధానాలను, ప్రభుత్వ ఉద్దేశాలను ప్రజలకు ముఖ్యమంత్రి వివరించారు. ఈనెల 30 భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో నిర్వహించే కాంగ్రెస్ జన జాతర సభకు హాజరుకానున్నారు. వరంగల్ పార్లమెంటరీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయబోతున్న రెండో బహిరంగ సభ కావడం గమనార్హం. ఇప్పటి వరకు ఒకే లోక్సభ నియోజకవర్గం పరిధిలో రెండో బహిరంగ సభ జరగలేదు. వరంగల్ లోక్సభ పరిధిలోనే నిర్వహిస్తున్న రెండో సభకు సీఎం హాజరవుతుండటం విశేషం. 30వ తేదీన రేగొండ మండల కేంద్రంలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు సీఎం రేవంత్రెడ్డి ముఖ్య అతిథిగా రానున్న నేపథ్యంలో శనివారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.వరంగల్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి అరూరి రమేష్ గెలిపించాలని కోరుతూ.. మే 3న హన్మకొండ జిల్లా ఖాజీపేట మండలం మడికొండ శివారులో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఇప్పటికే షెడ్యూల్ ఖరారు కాగా.. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచక సాగుతున్నాయి. నరేంద్ర మోదీతో పాటు జాతీయ స్థాయి నేతలు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. వరంగల్ లోక్సభ సీటుపై కన్నేసిన బీజేపీ ఈస్థానంలో గెలుపునకు అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్వాసంతో ఉంది.ఆరూరి రమేష్ నామినేషన్కు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి హాజరుకాగా, నామినేషన్ల ఉప సంహరణ గడువు ముగిశాక బీజేపీ ప్రచారాన్ని ఉధృతం చేస్తుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నామినేషన్లకు ఉపసంహరణకు గడువు ఏప్రిల్ 29న ముగియనుండటంతో బరిలో ఎంతమంది అభ్యర్థులు నిలచేది..? ఎవరెవరు అభ్యర్థులుగా మిగలబోతున్నారు..? అభ్యర్థుల్లో ప్రధాన ప్రత్యర్థులు ఎవరనేది క్లారిటీ రానుంది. మే 1 నుంచి సరిగ్గా పదకొండు రోజుల పాటు ఎన్నికల ప్రచారం జోరుగా సాగనుంది. -
టచ్ చేస్తే మసే!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/ సాక్షి, మహబూబాబాద్: ‘‘20 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని, చిటికేస్తే వస్తారని కేసీఆర్ చెప్తున్నారు. చిటికె కాదు.. మిద్దెక్కి డప్పు కొట్టు .. నీ దగ్గర ఉన్నోళ్లు కూడా ఎవరైనా ఉంటారేమో చూద్దాం. గతంలోలాగా తోడేళ్లలా వచ్చి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎత్తుకుపోదామని అనుకుంటున్నావేమో. ఇక్కడ కాపలా ఉన్నది రేవంత్రెడ్డి. కంచె వేసి కాపాడుకునే పవర్ఫుల్ హైటెన్షన్ వైర్ లాంటివాడు. కరెంటు తీగ మీద కాకి వాలితే ఎట్లా అయితదో.. కాంగ్రెస్ వైపు చూస్తే అట్లానే షాక్ కొట్టి మాడిమసై పోతారు. ప్రయత్నం చేసి చూడు’’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారం మహబూబ్నగర్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా చల్లా వంశీచంద్రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో, పట్టణంలో నిర్వహించిన భారీ ర్యాలీ, కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. సాయంత్రం మహబూబాబాద్లో కాంగ్రెస్ తెలంగాణ జన జాతర బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆయా చోట్ల సీఎం రేవంత్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘మా కారు కొంచెం పాడైంది. గ్యారేజీకి పొయిందని నిన్న, మొన్న కేటీఆర్ అంటున్నారు. కారు రిపేరవడం కాదు.. ఇంజిన్ సహా మొత్తం పాడైపోయింది. ఇనుప సమాన్ల కింద తూకానికి అమ్ముడే. నీ కారే కాదు.. తండ్రి కేసీఆర్ ఆరోగ్యం కూడా దెబ్బతిన్నది.. ఇంకా నడవలేకపోతున్నరు. మొన్నటి ఎన్నికల్లో ఓటర్లు బీఆర్ఎస్ను పాతేసినా.. ఇంకా పొంకనాలు కొడుతున్నరు. మీ ఎమ్మెల్యేలే నీవెంబడి ఉంటలేరు. అలాంటిది ఎదుటి పార్టీల 20 మంది ఎమ్మెల్యేలున్నారని చెబుతావా? ఇంకెన్ని రోజులు ఇలా కథలు చెప్పి బతుకుతరు? మోదీ, కేసీఆర్ ఒక్కటే.. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ఇద్దరూ తోడు దొంగలు. వారిలో ఎవరికి ఓటేసినా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లే. తెలంగాణకు ద్రోహం చేసినట్లే.. పదేళ్లు పాలించిన ఇద్దరు రాష్ట్రానికి చేసింది శూన్యం. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిని బయట పెట్టకుండా కేసీఆర్ ఇచ్చే కమీషన్లకు కక్కుర్తి పడింది ప్రధాని కాదా? పదేళ్లలో పార్లమెంట్లో బీజేపీ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లును సమరి్ధంచినది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? ఏ ముఖంతో బీజేపీ ఓట్లు అడుగుతుంది? పదేళ్లు తెలంగాణకు నిధులు ఇవ్వకుండా అన్యాయం చేసిన బీజేపీ ఇప్పుడు ఓట్లు వేయాలంటూ ప్రజల ముందుకు రావడం సిగ్గుచేటు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయకుండా పక్కన పెట్టింది బీజేపీ కాదా? వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎటుపోయింది? తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ తెలంగాణ ఏర్పాటుపై వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ తెలంగాణ ప్రజల ఓట్లు ఎలా అడుగుతారు? ఉత్తర భారత దేశంలో కుంభమేళా, గంగానది పరిరక్షణ కోసం వేల కోట్లు కేటాయించిన బీజేపీ ప్రభుత్వం.. మన మేడారం జాతరకు ముష్టి రూ.3 కోట్లు కేటాయించి అవమానించింది. 42 మంది తెలుగు మాట్లాడే ఎంపీలుంటే ఒక్క మంత్రి పదవి ఇచ్చారు. అదే యూపీలోని 60 మంది ఎంపీలకు 12 మంత్రి పదవులు, 26 మంది ఎంపీలు ఉన్న గుజరాత్కు ఏడు మంత్రి పదవులు ఇచ్చి వివక్ష చూపారు. బీఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందం పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సొంతంగా ఒక్క సీటు కూడా గెలవదని గ్రహించే బీజేపీతో చీకటి ఒప్పందం కుదుర్చుకుంది. కేసీఆర్ తన బిడ్డ కవితకు బెయిల్ మంజూరు చేయించుకునేందుకు.. రాష్ట్రంలోని మహబూబ్నగర్, చేవెళ్ల, మల్కాజిగిరి, భువనగిరి, జహీరాబాద్ సీట్లను వదిలేశారు. ఎవరెన్ని ఒప్పందాలు చేసుకున్నా.. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ను ఓడించిన తెలంగాణ ప్రజలు.. ఈ ఎన్నికల్లో మోదీకి కూడా బుద్ధి చెప్పడం ఖాయం. కమ్యూనిస్టులు, టీజేఎస్ మద్దతు తీసుకుంటాం పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో సీపీఐ, సీపీఎం, టీజేఎస్ పార్టీల మద్దతు తీసుకుంటాం. వారితో చర్చించే బాధ్యతను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చూసుకుంటారు. ప్రజాస్వామ్య పరిరక్షణకోసం కలిసొచ్చే ఇతర పార్టీల మద్దతును కూడా కూడగడతాం. మరో పదేళ్లు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. ప్రజలకు ఇచ్చి న ప్రతీ హామీని నెరవేస్తుంది. తెలంగాణ బిడ్డల చావులను చూసిన సోనియా గాంధీ మనసు తల్లడిల్లి తెలంగాణ ఇచ్చారు. ఇప్పుడు ఆమె కుటుంబానికి అండగా ఉండేందుకు తెలంగాణ సమాజం సిద్ధంగా ఉంది. ఢిల్లీలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే. 14 మంది ఎంపీలతో ఢిల్లీ వెళ్తాం..’’ అని రేవంత్ పేర్కొన్నారు. పాలమూరుకు పది పైసలైనా తెచ్చారా? శత్రువు చేతిలో కత్తి పెడితే.. వాడు పక్కోన్ని పొడవడు. మన కడుపులోనే పొడుస్తడు. నిన్న మొన్నటివరకు పదేళుŠల్ కేసీఆరే సీఎంగా, మోదీ పీఎంగా ఉన్నారు కదా. పాలమూరుకు పది పైసలన్నా తెచ్చారా? పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తెచ్చారా? అది తేలేదుగానీ డీకే అరుణమ్మ మాత్రం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి తెచ్చుకుంది. పాలమూరులో ఆమె గెలిస్తే గడీలో ఉన్న బంధువులకు మేలే తప్ప పాలమూరుకు ఏ న్యాయమూ జరగదు. గల్లీ నుండి కేసీఆర్ వచ్చి నా.. ఢిల్లీ నుంచి మోదీ వచ్చి నా ఈ గడ్డ మనది. నాడు తట్టపనికో, మట్టి పనికో వలసలు పోయినం. ఇవాళ నాయకులమై మీ ప్రాంతానికొచ్చినం. రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే తలెత్తుకునేలా గౌరవాన్ని ప్రదర్శించినం. కేసీఆర్ది అసత్య ప్రచారం: మంత్రులు మహబూబాబాద్ సభలో మంత్రులు ప్రసంగించారు. రేవంత్ బీజేపీలోకి వెళ్తున్నారంటూ.. తాను బీఆర్ఎస్లోకి వెళ్తున్నానంటూ అసత్యపు ప్రచారం చేయడం మాజీ సీఎంకు అలవాటుగా మారిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 120 రోజులే అయిందని, ఈ కాస్త సమయంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పేర్కొన్నారు. గత పదేళ్లలో గిరిజనుల కోసం ఏమీ చేయని బీజేపీకి గిరిజనులు బుద్ధి చెప్తారని మంత్రి సీతక్క చెప్పారు. -
ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా
-
ఏసీబీకి చిక్కిన సబ్-రిజిస్ట్రార్
-
కదం తొక్కిన కార్మికులు
సాక్షి నెట్వర్క్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. ఐక్య కార్మిక సంఘాల అధ్వర్యంలో ఆయా కలెక్టరేట్ల ఎదుట మహాధర్నాలు నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాబాద్లో వ్యవసాయ మార్కెట్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. హనుమకొండలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లిలోని సింగరేణి గనుల్లో అన్ని సంఘాల నాయకులు, కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. జనగామలో రైల్వేస్టేషన్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యా లీగా వచ్చి ధర్నా చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా సాగింది. ఉదయం నుంచే పార్టీలు, సంఘాల నాయకులు ఆర్టీసీ డిపోల వద్దకు చేరుకుని బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అయితే, అధికారులు ముందుగానే దూరప్రాంత సర్విసులు రద్దుచేశారు. మిగతా సర్విసులు మధ్యాహ్నం తర్వాత మొదలయ్యాయి. కాగా, ఖమ్మం రూరల్ మండలం కాశిరాజుగూడెం నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు వెళ్తున్న విద్యార్థులను కూడా నిరసనకారులు అడ్డుకున్నారు. హాల్ టికెట్లు చూపించినా అనుమతించకపోవడంతో విద్యార్థులు కన్నీటిపర్యంతం కాగా, ఇతరులు సర్దిచెప్పడంతో పంపించారు. ఇక సింగరేణివ్యాప్తంగా సమ్మె పాక్షికంగానే సాగింది. 39,010 మంది కార్మికులకు 18,072 వేల మంది(60 శాతం) విధులకు హాజరయ్యారని అధికారులు తెలిపారు. అయితే, రోజువారీ లక్ష్యంలో 10 శాతం మేర బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. -
Ayodhya: గర్భిణిల ఎదురుచూపు.. బాలుడైతే..
సాక్షి, మహబూబాబాద్: భవ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కోసం అయోధ్య నగరం అందంగా ముస్తాబైంది. గర్భగుడిలో రామ్లల్లా కొలువుదీరబోతున్నాడు. ఈ చరిత్రాత్మక ఘట్టాన్ని తిలకించడానికి దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు. దేశవ్యాప్తంగా రామ నామస్మరణ జరుగుతోంది. మరోవైపు.. తెలంగాణలోని మహబూబాబాద్ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బాల రాముడి ప్రాణ ప్రతిష్ట గడియల కోసం కొందరు గర్భిణీలు ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో వారు ప్రసవించాలని కోరుకుంటున్నారు. ఆ సమయంలో తమ బిడ్డలకు జన్మనివ్వాలని అనుకుంటున్నారు. వివరాల ప్రకారం.. అయోధ్యలో నేడు రాముడి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ప్రసవల కోసం గర్భిణీలు ఎదురుచూస్తున్నారు. మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో శుభ గడియ కోసం గర్భిణీల వేచిచూస్తున్నారు. ఈ సమయంలో ప్రసవంలో పుత్రుడు జన్మిస్తే రాముడిగా.. ఆడపిల్ల జన్మిస్తే సీతమ్మగా పేరుగా పేరు పెట్టుకుంటామని చెబుతున్నారు. కాగా, దేశమంతా ఎదురు చూస్తున్న శుభ ముహూర్తాన సీతారాములకు జన్మనివ్వాలని గర్భిణీలు ఆరాటపడుతున్నారు. ఇక, పురిటి నొప్పులు వస్తున్నప్పటికీ నేడు శుభ ముహూర్తం కోసం వారు ఎదురు చూస్తున్నారు. -
విషాదం: కారు-ఆటో ఢీ.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి
మహబూబాబాద్ జిల్లా: సంక్రాంతి పండగ వేళ వారంతా దైవదర్శనానికి వెళ్లి వస్తున్నారు. పిల్లల కేరింతలతో ప్రయాణం ఆనందంగా సాగుతోంది. ఇంతలో అనుకోని ప్రమాదం ఎదురైంది. ఎదురెదురుగా వస్తున్న కారు-ఆటో ఢీకొన్నాయి. ఒకే కుటుంబంలో నలుగులు అనంతలోకాలు చేరుకున్నారు. ఒకే కుటుంబంలో తల్లి , కొడుకు , మనుమడు , మనవరాలు మరణంతో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. మహబూబాబాద్లో ఘోర ప్రమాదం జరిగింది. స్థానికంగా కంబాలపల్లి శివారులో కారు-ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను మహబూబాబాద్ ప్రభుత్వ హాస్పటల్కు తరలించారు. మృతులు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం చిన్న ఎల్లాపూర్ గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. జిల్లాకు చెందిన కుటుంబం నాగార్జునసాగర్ సమీపంలోని బుడియా బాపు దేవుడిని సందర్శించుకుని ఆటోలో ఇంటికి తిరిగి వస్తున్నారు. అదే జిల్లాకు చెందిన మరో కుటుంబం గుంజేడులోని ముసలమ్మ దేవతను సందర్శించుకుని కారులో తిరిగి వస్తున్నారు. ఇంతలో కంబాలపల్లి శివారుకు చేరుకోగానే కారు-ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇస్లావత్ శ్రీను(కొడుకు), పాప ( శ్రీను తల్లి ), రిత్విక్ ( శ్రీను కుమారుడు), రిత్విక ( శ్రీను కూతురు) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: ప్రాణం తీసిన చైనా మాంజా! -
ఉద్యోగం రావడంలేదని యువకుడి బలవన్మరణం
డోర్నకల్: ఉద్యోగం రావడంలేదనే మనోవేదనతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణ శివారు ఎర్రమట్టితండాలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక చోటుచేసుకుంది. డోర్నకల్ సీఐ బి.ఉపేందర్రావు తెలిపిన వివరాల ప్రకారం... ఎర్రమట్టితండాకు చెందిన భూక్యా అనిల్ అలియాస్ విజయ్(23) డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే కొన్ని పోటీపరీక్షలకు హాజరైన అనిల్ ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. ఆర్థిక ఇబ్బందులకుతోడు ఉద్యోగం రావడం లేదన్న మనోవేదనలో ఉన్న అనిల్ శుక్రవారం అర్ధరాత్రి తరువాత ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. మరునాడు ఉదయం కుటుంబసభ్యులు గమనించి చుట్టుపక్కల వెతకగా తండా సమీపంలోని ఓ వ్యవసాయబావిలో అనిల్ మృతదేహం లభ్యమైంది. మృతదేహం నుంచి పురుగుమందు వాసన రావడాన్ని కుటుంబసభ్యులు గుర్తించారు. ఉద్యోగం రాలేదనే బాధతోనే అనిల్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. అనిల్ తండ్రి జయరాజ్ 20 ఏళ్ల క్రితమే అదృశ్యంకాగా, తల్లి, సోదరుడు ఉన్నారు. తల్లి కల్పన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. అనిల్ ఆత్మహత్యకు ముందు రాసినట్లుగా చెబుతున్న ఓ లేఖ వాట్సాప్లో చెక్కర్లు కొట్టింది. ఉద్యోగం రాకపోవడం, ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో అనిల్ పేర్కొన్నాడు. కాగా, లేఖ విషయం తమ దృష్టికి రాలేదని పోలీసులు తెలిపారు. -
మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాస్ వార్నింగ్
-
మహబూబాబాద్ లో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు పూర్తి
-
మహబూబాబాద్ జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన బీఆర్ఎస్ నేతలు
-
రేవంత్, ఉత్తమ్ కుమార్కు కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, మహబూబాబాద్: తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో అధికార బీఆర్ఎస్ దూసుకుపోతోంది. మహబూబాబాద్లో బీఆర్ఎస్ ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేసీఆర్.. ప్రతిపక్ష పార్టీలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. 24 ఏళ్ల క్రితం పిడికెడు మందితో ఉద్యమాన్ని ప్రారంభించాం. తెలంగాణ వచ్చింది కాబట్టే మహబూబాబాద్ జిల్లా అయ్యింది. మన బాధలు ఎవరూ పట్టించుకోలేదు. కాంగ్రెస్ ఎన్నిసార్లు మోసం చేసినా పట్టుబట్టి తెలంగాణ సాధించాం. మహబూబాబాద్ తండాల్లో ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి కళకళలాడుతున్నాయి. గిరిజన ప్రాంతంలోనూ మెడికల్ కాలేజీని ప్రారంభించుకున్నాం. ఎన్నికల కోసం అబద్దాలు చెప్పడం లేదు. మొన్న మ్యానిఫెస్టో ప్రకటించాం. అభివృద్ధి నిరంతరం కొనసాగాలంటే బీఆర్ఎస్ గెలవాలి. మరింత ప్రగతి సాధించడానికి మీ దీవెన ఉండాలి. వెనుకబడిన గిరిజన ప్రాంతాన్ని మహబూబాబాద్ను జిల్లాగా ఏర్పాటు చేసి రూపు రేఖలు మార్చాం. కాంగ్రెస్ నాయకులు రేవంత్, ఉత్తమ్ రెడ్డిలు రైతు బంధు వద్దంటున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మూడు గంటలే కరెంట్ ఇవ్వాలంటున్నాడు. రైతులు ఆలోచించి మేలు చేసే ప్రభుత్వానికి ఓటు వేయాలి. కాంగ్రెస్ నాయకుల మాటలు వింటే గోస పడుతాం. కాంగ్రెస్ నాయకుల కల్లబొల్లి మాటలకు మోస పోవొద్దు.రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి శంకర్ నాయక్ అత్యధిక మెజార్టీతో గెలిపించాలి అని కోరారు. రైతుబంధు వృథా అని ఉత్తమ్కుమార్ రెడ్డి అంటున్నారు. ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో వేస్తామని కొందరు అంటున్నారు. వారిని ముందుగా బంగాళాఖాతంలో వేయాలని ప్రజలకు సూచించారు. తెలంగాణ అన్ని రంగాల్లో ముందంజలో ఉంది. కర్ణాటకలో కరెంట్ కోసం రైతులు ధర్నాలు చేస్తున్నారు. ఒకప్పుడు ఎరువుల కోసం యుద్ధాలు జరిగేవి. పోలీసు స్టేషన్లో ఎరువులను అందించిన దాఖలు చూశాం. నేడు ఎరువులు కొరత లేదు అని అన్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా 24గంటల కరెంట్ లేదు. రైతుబంధు, రైతుబీమా నేరుగా ఖాతాల్లో జమ అవుతున్నాయి. రైతుబంధు, పెన్షన్లను పెంచుకుంటూ ముందుకు వెళ్తాం అని తెలిపారు. -
నా తండాకు రోడ్డువేసి రుణం తీర్చుకున్నా..
సాక్షి, మహబూబాబాద్: ‘మా పెద్దతండాకు అప్పట్లో సక్రమంగా రోడ్డు లేదు. బడి కూడా లేదు. ఈ దుస్థితిని చూసి నా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేసేవారు. మన తండా బాగుపడదా.. అని ఎప్పుడూ బాధపడేవారు. ఇప్పుడు నేను మంత్రిగా తండాకు కావాల్సిన వసతులు కల్పించా. చక్కటి రోడ్డు వేయించా. నా తల్లిదండ్రులు ఉండి ఉంటే ఈ అభివృద్ధిని చూసి సంతోషపడేవారు’అంటూ వారిని తలచుకుంటూ రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ కంటతడి పెట్టారు. శనివారం మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండా క్రాస్రోడ్డు నుంచి చెక్డ్యామ్ వరకు రూ.1.35 కోట్లలో నిర్మించతలపెట్టిన బీటీ రోడ్డుకు మంత్రి శంకుస్థాపన చేశారు. మంత్రి సత్యవతి మాట్లాడుతూ గతంలో తన తండా పరిస్థితిని వివరిస్తూ కన్నీటిపర్యంతమయ్యారు. -
ముచ్చటగా మూడోసారి బరిలోకి.. ఈసారి ఓటమి తప్పదా?
పోరాటాల పురుటి గడ్డ మానుకోట. ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న మానుకోట తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావంతో గులాబీ తోటకు అడ్డగా మారింది. ఎస్టీ రిజర్వుడు స్థానమైన మహబూబాబాద్ లో గిరిజన నేతల మద్య రాజకీయ పోరు రక్తికట్టిస్తుంది. పార్టీలు ఎన్ని ఉన్నా ప్రధానంగా బిఆర్ఎస్ కాంగ్రెస్ బిజేపి మద్యనే పోటీ నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ హ్యాట్రిక్ దిశగా అడుగులు వేస్తుంటే, కాంగ్రెస్ బిజేపి ఇంకా అభ్యర్థి ఎంపికలో తలమునకలై పార్టీ శ్రేణులను అయోమయానికి గురి చేస్తున్నాయి. పాతకాపుల మద్యనే మానుకోటలో పోటీ నెలకొన్న పాలిటిక్స్పై స్పెషల్ స్టోరీ. ప్రజానాయకుడిగా పేరు ఒకప్పటి మానుకోట మహబూబాబాద్గా మారి జిల్లా కేంద్రంగా అవతరించింది. నియోజకవర్గాల పునఃర్విభజనతో ఎస్టీ రిజర్వుగా మారిన మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదు మండలాలు 155 గ్రామ పంచాయితీలు 238734 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం బిఆర్ఎస్ కు చెందిన శంకర్ నాయక్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం అవిర్బావంతో 2014లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టిన శంకర్ నాయక్ రెండోసారి 2018లో గెలిచి ప్రజానాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. విమర్శలకు తోడు గ్రూప్ రాజకీయాలు ముచ్చటగా మూడో సారి బీఆర్ఎస్ నుంచి బరిలో నిలుస్తున్న శంకర్ నాయక్ ఈసారి ప్రతికూల పరిస్థితులే కనిపిస్తున్నాయి. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన శంకర్ నాయక్కు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిని బట్టి గెలుపుఓటములు ఆధారపడి ఉన్నాయి. రెండు సార్లు ఎమ్మెల్యే అయిన శంకర్ నాయక్ బినామీ పేర్లమీద ఆస్థులు కూడబెట్టారనే విమర్శలు ఉన్నాయి. విమర్శలకు తోడు పార్టీలో గ్రూప్ రాజకీయాలు ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ రవీందర్ రావుతో సఖ్యత లేకపోవడం, మంత్రి సత్యవతి రాథోడ్తో అంటిముట్టనట్లు వ్యవహరించడం అతనికి ప్రతికూలంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చదవండి: కేసీఆర్ ఎన్డీయేలో చేరాలనుకున్న మాట నిజమే: ఈటల శంకర్ నాయక్కు చెక్ పడే పరిస్థితులు ఒకదశలో ఈ ఎమ్మెల్యే మాకొద్దు అంటు స్వపక్ష పార్టీ నాయకులే రోడ్డెక్కారు. అధిష్టానం పెద్దలు పార్టీనాయకుల మద్య సయోద్యకుదుర్చి మూడో సారి శంకర్ నాయక్ కు టికెట్ ఇవ్వడంతో అభ్యర్థిని మార్చాలనే డిమాండ్తో ఆందోళనకు సైతం జరిగాయి. పార్టీ పెద్దల జోక్యంతో ప్రస్తుతం అంతా సద్దుమణిగినట్లు కనిపిస్తున్నా అంతర్గతంగా రగిలిపోతున్న నాయకులతో శంకర్ నాయక్కు చెక్ పడే పరిస్థితులు ఉత్పన్నమవుతాయనే ప్రచారం సాగుతుంది. తనకే టికెట్ వస్తుందనే ధీమా ఇక కాంగ్రెస్లో అదే పరిస్థితి నెలకొంది. టిక్కెట్ రేసులో కేంద్ర మాజీమంత్రి పోరిక బలరాం నాయక్, బెల్లయ్య నాయక్, డాక్టర్ మురళి నాయక్ పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో బలరాం నాయక్ పోటీ చేసి శంకర్ నాయక్పై 13వేల పై చిలుకు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఎంపీగా కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవంతోపాటు అధిష్టానం పెద్దల ఆశిస్సులు ఉండడంతో ఈసారి సైతం తనకే టికెట్ వస్తుందనే దీమాతో ఉన్నారు. గట్టి పోటీ బలరాం నాయక్ అభ్యర్థి అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గెలుపుకు తిరుగుండదని ఇరు పార్టీల నాయకులు బావిస్తున్నారు. బలరాం నాయక్ కంటే స్థానిక డాక్టర్ ప్రజలతో తత్సంబందాలు ఉన్న మురళీ నాయక్ను కాంగ్రెస్ బరిలోకి దింపితే గట్టి పోటీ ఉంటుందని బావిస్తున్నారు. బలరాంనాయక్ ను కాదని మురళీనాయక్కు టికెట్ దక్కే పరిస్థితి లేదని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. నామమాత్రంగానే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుంచి హుస్సేన్ నాయక్ పోటీ చేయనున్నారు. గత 2018 ఎన్నికల్లో పోటీ చేసిన హుస్సెన్ నాయక్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. యూత్ పాలోయింగ్ ఎక్కువగానే ఉన్నప్పటికి ఓట్లను రాబట్టుకోవడంలో విఫలం అవుతున్నారనే భావన ప్రజల్లో ఉంది. తాజా రాజకీయ పరిస్థితుల నేపద్యంలో హుస్సెన్ నాయక్ పోటీ నామమాత్రంగా మారనుంది. చదవండి: ఈనెల 16న బీఆర్ఎస్ భారీ సభ.. మేనిఫెస్టో విడుదల ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మద్యనే నువ్వానేనా అన్నట్లు పోటీ సాగనుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకత, గ్రూప్ రాజకీయాలను విపక్షాలు అనుకూలంగా మలుచుకునే పనిలో పడి ఎత్తుకు పై ఎత్తులతో ముందుకు సాగుతున్నాయి. కాంగ్రెస్లో సైతం గ్రూప్ రాజకీయాలు, అభ్యర్థి విషయంలో క్లారిటీ లేక పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. అది కాస్త శంకర్ నాయక్కు అనుకూలంగా మారే పరిస్థితులున్నాయి. -
మహబూబాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు
-
మహబూబాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మూడేళ్ల కిత్రం జరిగిన బాలుడి హత్య కేసులో ముద్దాయికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. తొమ్మిదేళ్ల బాలుడు దీక్షిత్ రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న మందసాగర్కు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది, కాగా 2020 అక్టోబర్18న మహబూబాబాద్కు చెందిన కుసుమ వసంత, రంజిత్ రెడ్డి దంపతుల కుమారుడు దీక్షిత్ రెడ్డిని మందసాగర్ డబ్బుల కోసం కిడ్నాప్ చేశాడు. అక్కడి నుంచి కేసముద్రం మండలం అన్నారం శివారులో ఉన్న ధానమయ్య గుట్టపై తీసుకెళ్లా.. బాలుడిని హతమార్చి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం అదే రోజు రాత్రి దీక్షిత్ తండ్రికి ఫోన్ చేసి రూ.45 లక్షలు ఇస్తే బాలుడిని వదిలేస్తానని చెప్పాడు. పోలీసులకు దొరక్కుండా ఇంటర్నెట్ కాల్స్ ద్వారా తల్లిదండ్రులకు ఫోన్లు చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. ఇది జరిగిన మూడురోజుల అనంతరం తాళ్లపూసపల్లి సమీపంలో ఉన్న ధానమయ్య గుట్టలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. అప్పట్లో ఈ ఘటన ఉదంతం కలకలం రేపింది. అప్పటి జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో విచారణ చేపట్టి శనిగపురంకు చెందిన పంక్చర్ షాప్ నిర్వహుకుడు మంద సాగర్ నిందితుడిగా తేల్చారు పోలీసులు. ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో కిడ్నాప్ చేసినట్లు తేలింది. మళ్లీ దొరికిపోతామన్న భయంతోనే దీక్షిత్ను చంపినట్లు పోలీసులు తేల్చారు. ఈ కేసులో అరెస్టైన సాగర్ ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైల్లో శిక్షననుభవిస్తున్నాడు.. మూడేళ్లుగా సాగిన విచారణలో తాజాగా ఉరిశిక్ష విధిస్తూ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. చదవండి: హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి.. ఇద్దరు మృతి -
మహబూబాబాద్లో విషాదం: ఉరేసుకొని ఏఆర్ ఎస్సై ఆత్మహత్య
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గంగారం మండలం బావురుగొండలో ఏఆర్ ఎస్సై పడిగ శోభన్బాబు ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయ పొలం వద్ద ఉరివేసుకొని ప్రాణాలు విడిచారు కాగా శోభన్బాబు సత్తుపల్లి బెటాలియన్లో ఏఆర్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. మెడికల్ లీవ్లో సోమవారం ఇంటికి వచ్చిన శోభన్బాబు.. పొలం వద్ద ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. అనారోగ్య సమస్యలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు వెల్లడించారు. మృతుడి భార్య రజిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కేఎంసీలో ర్యాగింగ్.. ఏడుగురిపై కఠిన చర్యలు -
ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్ రైలులో పొగలు.. భయంతో ప్రయాణికుల పరుగులు
సాక్షి, మహబూబాబాద్ జిల్లా: ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ రైలుకు ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి హౌర్హా వెళ్తున్న రైలులో ఉన్నట్టుండి పొగలు వచ్చాయి. హైదరాబాద్ నుంచి హౌర్హా వెళ్తున్న రైలులో బ్రేక్ లైనర్స్ పట్టివేయడంతో దట్టమైన పొగలు వ్యాపించింది. మహబూబాబాద్ జిల్లా గుండ్రాతిమడుగు రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఆందోళన చెందిన వెంటనే రైలును ఆపేశారు. భయంతో రైల్లోంచి దిగి పరుగులు తీశారు. అర్ధగంటకుపైగా రైలును అధికారులు నిలిపి వేశారు. అనంతరం మరమ్మతులు చేపట్టి, యథాతథంగా రైలును పంపించారు. -
మహిళా దొంగల హల్చల్.. పట్టపగలే బట్టల దుకాణంలో చోరీ
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో పట్టపగలు మహిళా దొంగలు హల్చల్ చేశారు. బట్టల దుకాణంలోకి కస్టమర్ల మాదిరిగా ప్రవేశించిన నలుగురు మహిళలు చీరల చోరీకి పాల్పడ్డారు. యాజమాని పవన్ కన్నుగప్పి 20 వేల రుపాయల విలువ చేసే చీరలు అపహరించారు. కిలేడీల చోరీ బాగోతం పీపీ కెమెరాలో రికార్డు అయింది. సీసీ పుటేజ్ ఆధారంగా ఇద్దరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు షాప్ నిర్వాహకులు. మరో ముగ్గురు పారిపోగా. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే అయిదుగురు మహిళలు గుంటూరు నుంచి వచ్చినట్లు స్థానికులు భావిస్తున్నారు. కొత్తగూడ లో శుక్రవారం అంగడి కావడంతో సందడిగా మారిన షాప్లో చోరీకి యత్నించిన మహిళా చోరులు.. నిఘా కళ్ళతో అడ్డంగా బుక్కయ్యారు. -
'ఆవిడ వల్లే నా కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు..'
మహబూబాబాద్: అప్పట్లో ట్రాన్స్జెండర్ను పెళ్లి చేసుకుని వార్తల్లోకి ఎక్కిన మహబూబాబాద్ జిల్లా వాసి ధరావత్ శివరాం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ట్రాన్స్జెండర్ తపస్వీ వేధింపులు భరించలేకే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని బాధితుని తల్లి పోలీసులను ఆశ్రయించింది. తపస్వీతో విడిపోయిన తన కొడుకు మరో పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించగా.. అడ్డుకుని వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం భూపతిపేటకు చెందిన ధారావత్ శివరాం, జల్లి గ్రామానికి చెందిన ట్రాన్స్జెండర్ కొర్ర ప్రవీణ్ అలియాస్ తపస్విని వివాహం చేసుకున్నారు. ఇద్దరు మధ్యలో మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. మళ్లీ పెళ్లి చేసుకునేందుకు శివరాం ప్రయత్నిస్తుండగా ట్రాన్స్జెండర్ తపస్వి అడ్డుకున్నారు. అయితే.. ఈ క్రమంలో శివరాం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తపస్వి వేధింపులు భరించలేక పురుగులు మందు తాగి శివరాం ఆత్మహత్య చేసుకున్నట్లు అతని తల్లి పోలీసులును ఆశ్రయించింది. గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇదీ చదవండి: కామపిశాచికి ఎమ్మెల్యే టికెట్ ఎలా ఇస్తారు?: శేజల్ సంచలన ఆరోపణలు -
Mahabubabad: బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్? ఈసారి ఉత్కంఠ!
అధికార పార్టీలో అసమ్మతి... వర్గ విభేదాలు... స్వార్థ రాజకీయాలు... మండల గ్రామస్థాయిలో అసంతృప్తుల విభేదాలు.. కీలకమైన నేతలు ఉండడంతో పార్టీకి తలవొంపులు తెచ్చే విధంగా ప్రవర్తించడం...గత పది సంవత్సరాల పాలనలో భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మహబూబాబాద్ నియోజకవర్గంలో బిఆర్ఎస్.. కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ ఉంటుంది. ఎన్నికలను ప్రభావితం చేసే కీలకమైన అంశాలు: స్థానిక సంస్థల ప్రజా ప్రతి నిధులలో ఎంపిటిసిలు , సర్పంచుల అసంతృప్తి...దళిత బంధు లబ్ధిదారుల ఎంపికపై నిరాశ... డబల్ బెడ్ రూమ్...రైతు రుణమాఫీ.. ధరణి పోర్టల్ , పోడు భూముల పట్టాల పంపిణీలో గిరిజనేతరుల అసంతృప్తి ... గ్రామాలు , పట్టణాల అభివృద్ధి పై ప్రజల భిన్న అభిప్రాయాలు. నియోజకవర్గంలోని ఆసక్తికర అంశాలు: కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రం కావడంతో శరవేగంగా అభివృద్ది చెందుతుంది. ప్రభుత్వం మెడికల్ కళాశాల మంజూరు చేయగా ఈ సంవత్సరం నుంచి తరగతులు సైతం ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ఇంజనీరింగ్ కళాశాలను సైతం మంజూరు చేసింది. హార్టికల్చర్ డిగ్రీ కాలేజ్ ఉంది 300 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. అభ్యర్థులు : బీఆర్ఎస్ బానోత్ శంకర్ నాయక్ (కన్ఫాం) కాంగ్రెస్ : (ఆశవాహులు) బలరాం నాయక్ (మాజీ మంత్రి) మాజీ మంత్రి(TPCC నేత) డాక్టర్ మురళి నాయక్, నూనావత్ రాధా బీజేపీ : (ఆశవాహులు) యాప సీతయ్య జాటోత్ హుస్సేన్ నాయక్ వృత్తిపరంగా ఓటర్లు రైతులు కూలీలు ఎక్కువగా ఉంటారు. మతం కులం ఓటర్లు: ఎస్టి 95000 BC:76000 SC:32000 మైనార్టీ :16 ఓసి :14 నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు: మానుకోటగా పేరొందిన నియోజకవర్గంలో దట్టమైన అడవులు కొండలు గుట్టలు ఉన్నాయి.. ఆలయాలు అనంతరం టెంపుల్.. పర్యటక ప్రాంతం.. గూడూరు మండలం లోని గూడూరు జలపాతం -
డోర్నకల్: ఎమ్మెల్యేకు వ్యతిరేకత.. పుంజుకుంటున్న కాంగ్రెస్
2009 నియోజకవర్గాల పునఃర్విభజన వరకు జనరల్ స్థానంగా ఉన్న డోర్నకల్ కాంగ్రెస్కు కంచుకోటగా ఉంది. పునఃర్విభజనతో ఎస్టీ రిజర్వుడుగా మారింది. జనరల్ స్థానంలో ఎమ్మెల్యేగా గెలిచిన రెడ్యానాయక్, ప్రస్తుతం ఎస్టీ రిజర్వుస్థానంలో ఎదురీదే పరిస్థితి ఏర్పడుతుంది. ఒకప్పుడు రాజకీయ ప్రత్యర్థులైన మంత్రి సత్యవతి రాథోడ్, సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ బిఆర్ఎస్ పార్టీలో టికెట్ కోసం పోటీ పడ్డారు. కానీ చివరికి అధిష్టానం రెడ్యానాయక్కే టికెట్ను ఖరారు చేసింది. దాంతో పార్టీ కీలక నేతల్లో అసమ్మతి నెలకొంది. ఎన్నికలను ప్రభావితం చేసే ముఖ్య అంశాలు: గిరిజన ఓటర్లు ఎక్కువగా ఉండే నియోజక వర్గం ఇది. ముఖ్యంగా విద్యా, వైద్యం,స్థానిక సమస్యలు..డబుల్ బెడ్రూం ఇళ్ళు, దళిత బందు పతకాలను పరిమితంగా అమలు చేయడం. సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఏడు సార్లు పోటీ చేసి ఆరు సార్లు గెలిచిన మంత్రిగా పనిచేసినప్పటికి మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం ఎక్కడికి వెళ్ళిన నిలదీసే పరిస్తితి ఏర్పడింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు : బీఆర్ఎస్ రెడ్యా నాయక్ (కన్ఫాం) కాంగ్రెస్ పార్టీ : జాటోత్ రామ చoద్రునాయక్ (ఆశావాహులు) మలోత్ నెహ్రూ నాయక్ (ఆశావాహులు) ననావత్ భూపాల్ నాయక్(ఆశావాహులు) బిజేపి పార్టీ : లక్ష్మణ్ నాయక్ (ఆశావాహులు) రాజకీయ అంశాలు : ఒకప్పటి కాంగ్రెస్ కంచుకోట తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావంతో టిఆర్ఎస్ పాగా వేసి తన బలం పెంచుకుంది. ప్రస్తుతం ఎమ్మెల్యే మీద ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్ కాస్త పుంజుకునే అవకాశం ఉంది. ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాను ఏలిన కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడంతో ఆయన ప్రభావం డోర్నకల్ నియోజకవర్గంలో చూపే పరిస్థితి కనిపిస్తుంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి సైతం కాంగ్రెస్ లో చేరడంతో ఖమ్మం ప్రక్కన డోర్నకల్ పై పొంగులేటి ప్రభావం కనిపించే పరిస్థితి ఉంది. వృత్తిపరంగా ఓటర్లు : గిరిజనులు రైతులు ఎక్కువగా ఉంటారు మతం/కులం వారిగా ఓటర్లు : ఎస్టీ ఓటర్లు 92616 మంది బిసి ఓటర్లు 76 వేల మంది ఎస్సీ ఓటర్లు 29401 మంది ముస్లీం మైనార్టీ ఓటర్లు 6464 మంది నియోజకవర్గంలో బౌగోళిక పరిస్థితులు : వాగులు : పాలేరు, ఆకేరు, మున్నేరు ఆలయాలు : కురవి శ్రీ భద్రకాళీ సమేత వీరద్రస్వామి, నందికొండ గ్రామo శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ, నర్సింహులపేట వెంకటేశ్వర స్వామి ఆలయాలు, మరిపెడ మాకుల వెంకటేశ్వర స్వామి, డోర్నకల్ పురాతన శ్రీరాముల వారి ఆలయం(పెరుమండ్ల సంకిసా), చిన్నగూడూరు మండల కేంద్రం దాశరథీ స్వగ్రామం. -
తమ్ముడు.. అమ్మా నాన్నలను బాగా చూసుకో!
వరంగల్: తల్లిదండ్రులకు భారం అవుతున్నాననే మనస్తాపంతో ఓ యువకుడి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం మండల కేంద్రానికి చెందిన బొమ్మ శివాజీ(24) బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసి కొంత కాలం ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసి, పోటీ పరీక్షలకు సిద్ధ అవుతున్నాడు. ఈ క్రమంలో ఇటీవల రాసిన పరీక్షల్లో ఉద్యోగం రాకపోవడంతో అమ్మానాన్నలకు భారంగా మారుతున్నానని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లి తన సోదరుడికి సెల్ ఫోన్లో అమ్మానాన్నలను బాగా చూసుకో.. నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని మెసేజ్ చేసి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోదరుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా స్థానికులు బావి నుండి మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి రవీందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గట్ల సుధాకర్ తెలిపారు. -
ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో ప్రియురాలు ఆందోళన
-
మహబూబాబాద్ జిల్లా బొడ్లాడ శివారులో స్కూల్ బస్ బోల్తా
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (23-05-2024)
బీఆర్ఎస్కు10 ఏళ్ళు పట్టింది.. కాంగ్రెస్కు 5 ఏళ్ల పాలన గగనం: కిషన్ రెడ్డి
ఏపీలో చంద్రబాబు విధ్వంసం సృష్టించాడు: కాసు మహేష్రెడ్డి
రూ.46.90 లక్షల కారు లాంచ్ చేసిన బీఎండబ్ల్యూ - పూర్తి వివరాలు
ఓటీటీకి వందకోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
పుష్ప 2 మూవీలో ఛాన్స్ వదిలేసుకున్నా: రవి కృష్ణ
ఎంటర్ప్రెన్యూర్ కమ్ ఇన్ఫ్లుయెన్సర్గా మారిన లాయర్! ఏకంగా ఆరుసార్లు కేన్స్..!
ఆర్టిస్ట్గా ఫెయిల్ అయిపోయానేమో అనుకున్నా: గెటప్ శ్రీను
Dinesh Karthik: ఆ నవ్వే నన్ను ముంచేసింది!.. ఎల్లప్పుడూ నా వాడే!(ఫొటోలు)
టైమ్కి చెక్ వస్తుంది.. రూ. 11 కోట్లు.. ఇంకెందుకు ఆడటం?
తప్పక చదవండి
- బాయ్ఫ్రెండ్తో బ్రేకప్.. తొలిసారి క్లారిటీ ఇచ్చిన శృతిహాసన్!
- ‘దాడి సమయంలో కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారు’
- 800 ఏళ్ల నాటి వ్యాయామం..దెబ్బకు ఒత్తిడి, అలసట మాయం!
- బీసీసీఐ ఆఫర్ నిజమే.. నేనే రిజెక్ట్ చేశా: ఆసీస్ దిగ్గజం
- ప్రపంచంలోనే తొలి తల మార్పిడి..! ఏకంగా హాలీవుడ్ మూవీని తలపించేలా..!
- టాప్ 5 దేశాలను వెనక్కి నెట్టిన భారత్!
- రూ.2.5 కోట్లకు రూ.10 కోట్లు.. విరుష్క జంటకు లాభాల పంట!
- 'స్టార్ హీరోతో లవ్.. పేరెంట్స్ బలవంతం వల్లే పెళ్లి చేసుకున్నా'
- SRH vs RR: ‘సన్రైజర్స్ కాదు!.. రాజస్తాన్కే గెలిచే ఛాన్స్’
- పీకేకు దిమ్మతిరిగే ప్రశ్న.. సహనం కోల్పోయిన రాజకీయ వ్యూహకర్త
Advertisement