-
చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ ఓలా క్యాబ్స్లో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. బాధ్యతలు చేపట్టిన మూడు నెలలకే ఆ సంస్థ సీఈఓ పదవికి హేమంత్ బక్షి రాజీనామా చేసినట్లు సమాచారం. దీంతో పాటు సంస్థ పునర్నిర్మాణంలో భాగంగా ఓలా క్యాబ్స్ దాదాపు 200 మంది ఉద్యోగుల్ని తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయిఐపీఓకి ఓలా ఓలా క్యాబ్స్ ఐపీఓ వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. ఇందుకోసం ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్తో ఓలా క్యాబ్స్ ఇటీవలే చర్చలు నిర్వహించింది. మరో రెండు మూడు నెలల్లో సెబీకి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికే ఐపీఓ కోసం సెబీకి దరఖాస్తు చేసుకుంది.ఈ తరుణంలో సీఈఓ రాజీనామా, ఉద్యోగుల తొలగింపు అంశం ఓలా క్యాబ్స్ చర్చాంశనీయంగా మారింది. కాగా, ఓలా క్యాబ్స్ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. -
అత్యంత చౌకగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు
ఎలక్ట్రిక్ బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకో శుభవార్త. ప్రముఖ ఎలక్ట్రిక్ బైక్ దిగ్గజం ఓలా కీలక ప్రకటన చేసింది. తన తక్కువ ధర ఎస్1 ఎక్స్ మోడల్ ధరల్ని మరింత తగ్గిస్తున్నట్లు తెలిపింది. గతంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లను పెంచేందుకు కేంద్రం ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ బైక్లకు సబ్సిడీ ఇచ్చేది. ఆ తర్వాత ఆ సబ్సిడీపై కోత విధించింది. దీంతో అప్పటి వరకు ఊపందుకున్న ఈవీ కొనుగోళ్లు, అమ్మకాలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో తమ వాహనల అమ్మకాల్ని పెంచేందుకు ఓలా ఎలక్ట్రిక్ తన చౌకైన వేరియంట్ ధరను 12.5శాతం తగ్గించిందని,తద్వారా అమ్మకాలు పెంచుకోవచ్చని భావిస్తుంది. ఓలా దాని ఎస్1ఎక్స్ మోడల్ చౌకైన వేరియంట్ ధర రూ.79,999 నుండి రూ.69,999లకు తగ్గించిందని కంపెనీ మార్కెటింగ్ చీఫ్ అన్షుల్ ఖండేల్వాల్ తెలిపారు. ఇతర ఎస్1ఎక్స్ వేరియంట్ల ధరలు 5.6 శాతం, 9.1శాతం మధ్య తగ్గించినట్లు సమాచారం. ' ఓలా ఎస్1 ఎక్స్ (4కేడబ్ల్యూహెచ్) ఇప్పుడు దాని ధర రూ.1.09 లక్షల నుండి రూ.10,000 తగ్గి రూ.99,999 చేరింది. 3 డబ్ల్యూకేహెచ్ వేరియంట్ ధర రూ.84,999 కాగా.. 2కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో వచ్చే చవకైన వెర్షన్ రూ. 69,999 ప్రారంభ ధరకే అందుబాటులో ఉంది. -
విదేశాల్లో ఓలా క్యాబ్స్ షట్డౌన్.. కారణం ఏంటంటే?
ప్రముఖ దేశీయ రైడ్ షేరింగ్ దిగ్గజం ఓలా క్యాబ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా యూకే, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్లలో తన సేవల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ చివరి నాటికి అంతర్జాతీయ ఓలా క్యాబ్స్ సేవలకు స్వస్తి పలకనుంది. ఓలా క్యాబ్స్ ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తన అంతర్జాతీయ యూజర్లకు నోటిఫికేషన్ పంపింది. సంస్థ 2018లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో తన సేవల్ని ప్రారంభించింది. అంతర్జాతీయ మార్కెట్కు ఓలా గుడ్బై కాగా, తమ దేశంలో ఓలా సేవలను మూసివేయడంపై ఆస్ట్రేలియన్ మీడియా గతంలోనే అనేక కథనాలు ప్రచురించింది. మీడియా సంస్థ ఆస్ట్రేలియన్ ఫైనాన్షియల్ రివ్యూ డ్రైవర్లకు ఓలా పంపిన ఇమెయిల్ను ఉదహరించింది. ఏప్రిల్ 12 నుండి అన్ని సంబంధిత లేబుల్లను తీసివేయమని, దాని పర్మిట్ల కింద బుకింగ్లు తీసుకోవడం ఆపివేయమని కోరింది. అదే తేదీ నుండి సంస్థ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు కస్టమర్లకు పంపిన ఇమెయిల్ను న్యూస్.కామ్.ఏయూ అనే మీడియా సంస్థ హైలెట్ చేసింది. కారణం ఇదేనా క్యాబ్ ఇంధన వాహనాల్ని ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలంటూ ఆయా దేశాల ప్రభుత్వాలు ఒత్తిడి చేస్తున్నాయి. క్యాబ్స్ను ఈవీలుగా మార్చాలంటే ఖర్చుతో కూడుకున్న పని. పెట్టుబడి కూడా భారీ మొత్తంలో పెట్టాలి. పైగా న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియాల్లో విపరీతమైన పోటీ నెలకొంది. ఈ తరుణంలో ఓలా క్యాబ్స్ ఈ నిర్ణయం తీసుకుంది.భారత్లో విస్తరణకు మరింత అవకాశం ఉన్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నట్లు ఓలా ప్రతినిధులు చెబుతున్నారు. -
ఓలా మైండ్బ్లోయింగ్ ఆఫర్..అస్సలు మిస్సవ్వద్దు!
ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ కొనుగోలు దారులకు బంపరాఫర్ ప్రకటించింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ బైక్ ధరల్ని రూ.25 వేల వరకు తగ్గించినట్లు వెల్లడించింది. ఓలా ఎలక్ట్రిక్ సంస్థ వాహనదారులకు మొత్తం మూడు మోడళ్లపై ఈ భారీ ఆఫర్లను అందిస్తున్నట్లు తెలిపింది. ఓలా అఫిషియల్ వెబ్సైట్ ప్రకారం.. ఓలా ఎస్1 ఎక్స్ ప్రారంభ ధర రూ.79,999 (ఎక్స్ షోరూం ధర) ఉండగా, ఓలా ఎస్1 ఎయిర్ ప్రారంభ ధర రూ.1,19,999 (ఎక్స్ షోరూం ధర), ఓలా ఎస్1 ప్రో ప్రారంభ ధర రూ.1,29,999 (ఎక్స్ షోరూం) కే అందిస్తుంది. You asked, we delivered! We’re reducing our prices by upto ₹25,000 starting today for the month of Feb for all of you!! Breaking all barriers to #EndICEage! Valentine’s Day gift for all our customers 🙂❤️🇮🇳 pic.twitter.com/oKFAVzAWsC — Bhavish Aggarwal (@bhash) February 16, 2024 వాహన్ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది జనరిలో ఓలా సంస్థకు మొత్తం 31000 యూనిట్ల ఆర్డర్లు వచ్చాయి. ఈ మొత్తం 2023 డిసెంబర్ నెలలో 30000 యూనిట్లు ఉన్నాయని హైలెట్ చేసింది. కాగా, ఓలా సంస్థ ఎలక్ట్రిక్ టూవీలర్ విభాగంలో మార్కెట్ షేరు 40 శాతం ఉందని వాహన్ నివేదిక వెల్లడించింది. -
లిథియం బ్లాక్ల వేలంలో పాల్గొననున్న ప్రముఖ కంపెనీ?
పెరుగుతున్న ఇంధన అవసరాల దృష్ట్యా గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. శిలాజ ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాల్లోని బ్యాటరీల్లో వినియోగించే లిథియం అయాన్ బ్లాక్లను వేలం వేసేందుకు నిర్ణయించింది. ప్రభుత్వం చేపడుతున్న క్రిటికల్ మినరల్స్ ఆక్షన్లో ఓలా ఎలక్ట్రిక్ పాల్గొనాలని చూస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. లిథియం అయాన్ బ్లాక్లను వేలంలో దక్కించుకోవాలని యోచిస్తున్నట్లు తెలిసింది. లిథియం వంటి కీలక మినరల్స్ సరఫరా పెంచేందుకు ప్రభుత్వం కిందటేడాది చివరి నుంచి ఆక్షన్ చేపడుతోంది. ఎనిమిది రాష్ట్రాల్లోని 20 బ్లాక్లను వేలం వేస్తోంది. ఇదీ చదవండి: ఎడ్టెక్ కంపెనీకు నోటీసులు.. ఎందుకో తెలుసా.. ఈ ప్రక్రియ ద్వారా ప్రభుత్వం రూ.45 వేలకోట్లు సేకరించనుందని అంచనా. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వెహికల్స్ను ప్రమోట్ చేస్తున్న విషయం తెలిసిందే. కిందటి ఆర్థిక సంవత్సరంలో అమ్ముడైన మొత్తం 39 లక్షల వెహికల్స్లో ఈవీల వాటా 2 శాతం ఉంది. ఇది 2030 నాటికి 30 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఆక్షన్కు సంబంధించి ఓలా సంస్థ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. -
ఓలా కొత్త ఎలక్ట్రిక్ బైక్.. రేంజ్ 190 కిలోమీటర్లు.. ధర ఎంతంటే?
ఎలక్ట్రిక్ బైక్ వినియోగదారులకు శుభవార్త. ప్రముఖ ద్విచక్రవాహన తయారీ సంస్థ ఓలా బడ్జెట్ వేరియంట్ బైక్ ఎక్స్ ఎక్స్ను మార్కెట్కు పరిచయం చేసింది. 4కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఆప్షన్తో రూ.1.10లక్షలకే (ఎక్స్-షోరూమ్) ఈ బైక్ను అందిస్తున్నట్లు తెలిపింది. ఇక ఈ కొత్త వేరియంట్ బైక్కు ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ పెడితే చాలు 190 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయొచ్చు. ఛార్జింగ్ పెట్టేందుకు 6 గంటల 30 నిమిషాల సమయం పట్టనుంది. టాప్ స్పీడ్ 90 కేఎంపీఎహెచ్ వరకు ప్రయాణం చేయొచ్చని ఓలా యాజమాన్యం తెలిపింది. ఈ కొత్త ఈవీ వేరియంట్తో పాటు, 8 ఏళ్ల వరకు ఎక్స్ టెండెండ్ వారెంటీని ఉచితంగా అందిస్తుంది. అయితే ఈ సదుపాయం అన్నీ వాహనాలకు వర్తిస్తుంది. ఇందుకోసం వాహనదారులు రూ.5వేలు చెల్లించి 1,25,000 కిలోమీటర్ల వరకు పొడిగించుకునే అవకాశాన్ని ఓలా కల్పిస్తుంది. బుకింగ్స్ ప్రారంభం ఎప్పుడంటే? ఓలా ఎస్1 ఎక్స్ 4 కేడబ్యూహెచ్ డెలివరీలు ఏప్రిల్ నుండి ప్రారంభమవుతాయి. ఓలా ఎస్1 ఎక్స్ రెడ్ వెలాసిటీ, మిడ్నైట్, వోగ్, స్టెల్లార్, ఫంక్, పోర్సిలైన్ వైట్, లిక్విడ్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో అందించబడుతుంది. -
OLA ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్..
-
ఓలాకు తగ్గిన నష్టాలు
న్యూఢిల్లీ: 2023 ఆర్థిక సంవత్సరంలో ఓలా బ్రాండ్ మాతృసంస్థ ఏఎన్ఐ టెక్నాలజీస్ నికర నష్టాలు (కన్సాలిడేటెడ్) రూ.772 కోట్లకు తగ్గాయి. అంతక్రితం 2022 ఆర్థిక సంవత్సరంలో ఇవి రూ. 1,522 కోట్లుగా నమోదయ్యాయి. మరోవైపు, ఆదాయం 48 శాతం పెరిగి రూ. 1,680 కోట్ల నుంచి రూ. 2,481 కోట్లకు చేరింది. ఇక స్టాండెలోన్ ప్రాతిపదికన ఏఎన్ఐ టెక్నాలజీస్ నష్టం రూ. 3,082 కోట్ల నుంచి రూ. 1,083 కోట్లకు దిగివచి్చంది. ఆదాయం 58 శాతం వృద్ధి చెంది రూ. 1,350 కోట్ల నుంచి రూ. 2,135 కోట్లకు చేరింది. ఓలా మొబిలిటీ వ్యాపార విభాగం రూ. 250 కోట్ల నిర్వహణ లాభం నమోదు చేసింది. మొత్తం మీద గ్రూప్ స్థాయిలో ఏఎన్ఐ టెక్నాలజీస్ నష్టం రూ. 20,223 కోట్లకు చేరింది. -
క్యాబ్ బిల్లు చూసి షాకైన ప్యాసెంజర్..చివరికి ఏం చేశాడంటే..?
క్యాబ్ సేవల సంస్థ ఓలాకు సంబంధించి మరో షాకింగ్ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్లో క్యాబ్ బుక్ చేసుకున్న ఓ విద్యార్థికి ఊహించని ట్విస్ట్ ఎదురైంది. బుక్ చేసుకున్నపుడు ఉన్న ఫీజుకి, తీరా చెల్లించాల్సిన సొమ్ముకి ఉన్న తేడా చూసి కంగు తిన్నాడు. ఇదేం చోద్యం బాసూ అంటూ లబోదిబోమన్నాడు. చివరికి ఏమైందంటే..? కోల్కతా నుంచి బెంగళూరుకు వచ్చిన అనురాగ్ కుమార్ సింగ్ అనే కాలేజీ విద్యార్థి కెంపేగౌడ విమానాశ్రయంలో ఓలా 'మినీ' క్యాబ్ను చేసుకున్నాడు. ఓలా బుక్ చేసుకున్న మతికెరె ప్రాంతానికి సమయంలో ధర రూ.730 చూపించింది. తీరా రైడ్ ముగిసిన తరువాత రూ.5194 చెల్లించాలని డ్రైవర్ డిమాండ్ చేశాడు. దిగ్భ్రాంతికి గురైన అనురాగ్ వెంటనే తన ఫోన్లో చెక్ చేస్తే రైడ్ క్యాన్సిల్ అయినట్లు చూపించింది. క్యాన్సిల్ అయిన రైడ్కు అంత డబ్బులు ఎలా వసూలు చేస్తావంటూ డ్రైవర్ని నిలదీశాడు.దీంతో ఇద్దరి మధ్యా కాసేపు వాగ్వాదం జరిగింది. ఓలా కస్టమర్కేర్ను కూడా సంప్రదించేందుకు ప్రయత్నించాడు. అయినా ఫలితం లేదు. చివరికి అక్కడున్న తోటివారి సలహా మేరకు డ్రైవర్కు రూ. 1,600 చెల్లించాడు. తన ఫిర్యాదుకు ఓలా నుంచి ఎలాంటి స్పందన రాకపోవటంపై అనురాగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బెంగళూరు మొత్తం తిరిగినా ఇంత ఖర్చు కాదు అంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని సోషల్మీడియాలో వైరల్గా మారింది. ప్రయాణీకులు అప్రమత్తంగా ఉండాలని, రైడ్ వివరాల స్క్రీన్షాట్లను తీసుకొని, ఏదైనా తేడా వస్తే కస్టమర్ సపోర్ట్ టీమ్లకు రిపోర్ట్ చేయాలని నెటిజన్లు సూచించారు. -
ఓలా ఎలక్ట్రిక్ బంపరాఫర్!
ప్రముఖ ఎలక్ట్రిక్ బైక్ తయారీ సంస్థ ఓలా కీలక ప్రకటన చేసింది. త్వరలో ఓలా 25 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుందని ఆ సంస్థ సీఈఓ భవిష్ అగర్వాల్ ప్రకటించారు. తమిళనాడు గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్లో మాట్లాడిన ఆయన..తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో న్యూ ఈవీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ నిర్మిస్తున్నారు. ఈ యూనిట్ పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తే సుమారు 25 వేల మందికి కొలువులు లభిస్తాయని తెలిపారు. తద్వారా ప్రతి ఏటా సుమారు ఒక కోటి టూ వీలర్స్ తయారవుతాయని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఈ యూనిట్ కోసం గతేడాది తమిళనాడు ప్రభుత్వంతో ఓలా ఎలక్ట్రిక్.. ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ కోసం ఓలా ఎలక్ట్రిక్ రూ.7000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఎనిమిది నెలల్లో దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ యూనిట్ విజయవంతంగా నిర్మించుకున్నట్లు భవిష్ అగర్వాల్ తెలిపారు. వచ్చేనెల నుంచి ఈవీ స్కూటర్ల ఉత్పత్తి తయారవుతుందని అన్నారు. గత జూన్లోనే తమిళనాడులో మెగా మాన్యుఫాక్చరింగ్ ఫ్యాక్టరీ నిర్మిస్తామని ఓలా ఎలక్ట్రిక్ వెల్లడించింది. ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ సహకారంతో తమిళనాడు గిగా ఫ్యాక్టరీ నిర్మిస్తున్నట్లు తెలిపింది. దేశీయ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్ లీడర్గా నిలిచింది. నవంబర్ నెలాఖరు నాటికి మొత్తం ఈవీ స్కూటర్ల విక్రయంలో ఓలా ఎలక్ట్రిక్ వాటా సుమారు 32 శాతం. గతేడాది నవంబర్ నాటికి దాదాపు 30 వేల ఈవీ స్కూటర్లను విక్రయించింది. -
ఐపీఓకి ఓలా... సెబీకి దరఖాస్తు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సంస్థ ఓలా ఎలక్ట్రిక్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. వెరసి రెండు దశాబ్దాల తదుపరి ఆటోరంగ కంపెనీ ఐపీవో ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్ కానుంది. కాగా.. ఇష్యూలో భాగంగా రూ. 5,500 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 9,51,91,195 షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థ ఓసీటీ ఏర్పాటు చేస్తున్న ఓలా గిగాఫ్యాక్టరీ కోసం పెట్టుబడి వ్యయాలుగా వినియోగించనుంది. -
బంపరాఫర్, ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలుకు ఇదే మంచి ఛాన్స్!
ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనాలనుకుంటున్నారా? అయితే డిసెంబర్ 31లోపు కొనేసేయండి. ఈ లోపాటు వెహికల్స్ ధరలు తక్కువ ధరకే లభ్యం కానున్నాయి. కొత్త ఏడాది ప్రారంభంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఫేమ్ పథకంలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని, ఫలితంగా ఈవీ ధరలకు రెక్కలొచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణుల అంచనా. డిసెంబర్ నెలలలో ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థలు ఓలా, ఎథేర్ మోటార్స్, హీరో మోటోకార్పొతో పాటు పలు ఇతర ఆటోమొబైల్ సంస్థలు ఈవీలపై ఆఫర్లు అందిస్తున్నాయి. వాటిల్లో ముందుగా ఎథేర్ మోటార్స్ 450 ఎస్ అండ్ 450 ఎక్స్ మోడళ్లపై రూ.6,500 క్యాష్ బెన్ఫిట్స్ అందిస్తుంది. అదనంగా రూ.1500 కార్పొరేట్ బెన్ఫిట్స్ను సొంతం చేసుకోవచ్చుకోవచ్చు. ఇక ఎథేర్ ఎలక్ట్రిక్ డిసెంబర్ స్కీమ్ కింద మరో రూ.5,000 ఆదా చేసుకోవచ్చు. ఓలా సైతం ఇయర్ ఎండ్ ఆఫర్ కింద రూ.20వేల వరకు సబ్సిడీ, ఎంపిక చేసిన క్రెడిట్ కార్డ్లపై రూ.5 వేల వరకు డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు డౌన్ పేమెంట్ తగ్గుతుంది. జీరో ప్రాసెసింగ్ ఛార్జీలు వర్తిస్తాయి. మరో ఈవీ సంస్థ హీరో మోటోకార్ప్ సైతం విడా వి1 ఎలక్ట్రిక్ స్కూటర్పై రూ.38,500విలువ చేసే ఆఫర్లను అందిస్తుంది. రూ.7,500 వరకు ఈఎంఐ బెన్ఫిట్స్, రూ.8,259 విలువ చేసే బ్యాటరీ వారెంటీ పొడిగింపు, రూ.6,500 డిస్కౌంట్, రూ.5,000 ఎక్స్ఛేంజీ బోనస్, రూ.7,500 లాయల్టీ డిస్కౌంట్, రూ.2,500 కార్పొరేట్ డిస్కౌంట్, రూ.1,125 విలువచేసే సబ్స్క్రిప్షన్ ప్లాన్లతో మొత్తం కలిపి రూ.38,500 వరకు ప్రయోజనాల్ని అందిస్తోంది. -
సాదాసీదా క్యాబ్ డ్రైవరే కావొచ్చు.. ఓలా, ఉబెర్లకు గట్టిపోటీ ఇస్తున్నాడు!
ఓ సాదాసీదా క్యాబ్ డ్రైవర్ దేశీయ దిగ్గజ రైడ్ షేరింగ్ సంస్థలు ఓలా, ఉబెర్ గుత్తాదిపత్యానికి చెక్ పెడుతున్నాడు. చాపకింద నీరులా రైడ్ షేరింగ్ మార్కెట్ని శాసించే దిశగా వడిఒడిగా అడుగులు వేస్తున్నాడు. ఇంతకీ ఆ క్యాబ్ డ్రైవర్ ఎవరు? ఓలా, ఉబెర్ మార్కెట్ను తనవైపుకి ఎలా తిప్పుకుంటున్నాడు? చేతిలో వెహికల్ లేదు. అత్యవసరంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలి. ఆ సమయంలో మనం ఏం చేస్తాం. ఫోన్ తీసి వెంటే ఓలా, ఉబెర్తో పాటు ఇతర రైడ్ షేరింగ్ యాప్స్ ఓపెన్ చేసి అవసరానికి తగ్గట్లు బైక్, ఆటో, కారు ఇలా ఏదో ఒకటి బుక్ చేసుకుంటాం. సెకన్లు, నిమిషాల వ్యవధిలో సదరు క్యాబ్ డ్రైవర్ వచ్చి మనల్ని కోరుకున్న గమ్యానికి సురక్షితంగా వెళుతుంటారు. అలాంటి ఓ క్యాబ్ డ్రైవర్ సొంతంగా రైడ్ షేరింగ్ సంస్థను స్థాపించాడు. మార్కెట్లో కింగ్ మేకర్గా ఓలా, ఉబెర్లకు గట్టి పోటీ ఇస్తున్నాడు. Peak Bengaluru: Mr Lokesh my uber cab driver informed me that he has launched his own app to compete with uber and ola and already has more than 600 drivers on his app. Moreover, today they launched their IOS version for apple too. #Bengaluru #peakbengaluru@peakbengaluru pic.twitter.com/IGdiWItPG4 — The Bengaluru Man (@BetterBengaluro) December 20, 2023 600 మందికి పైగా డ్రైవర్లతో బెంగళూరు కేంద్రంగా ఒకప్పటి ఓలా, ఉబెర్లలో క్యాబ్ డ్రైవర్గా పని చేసిన లోకేష్ ‘నానో ట్రావెల్స్’ పేరుతో సొంతంగా స్టార్టప్ను ప్రారంభిచాడు. ఇప్పటికే ఆ సంస్థతో సుమారు 600పైగా డ్రైవర్లు భాగస్వామ్యమైనట్లు తెలుస్తోంది. డ్రైవర్ని కాదు.. ఓ కంపెనీకి బాస్ని ఈ తరుణంలో లోకేష్ నడుపుతున్న క్యాబ్ను బెంగళూరుకు చెందిన ఓ కస్టమర్ ప్రయాణించాడు. ప్రయాణించే సమయంలో కస్టమర్, నానో ట్రావెల్స్ ఓనర్ లోకేష్లు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అప్పుడే తాను క్యాబ్ డ్రైవర్ని కాదని, ఓలా,ఉబెర్ల తరహాలో నానో ట్రావెల్స్ పేరుతో ఓ స్టార్టప్ను ప్రారంభించినట్లు చెప్పాడు. అంతేకాదు నేటినుంచి యాపిల్ ఐఓఎస్ యూజర్లకు తమ సంస్థ యాప్ను అందుబాటులోకి తెచ్చామని, ఆ యాప్స్ను సొంతంగా డెవలప్ చేసింది తానేనని చెప్పడంతో ఆశ్చర్యపోవడం సదరు కష్టమర్ వంతైంది. అవసరం అయితే ఫోన్ చేయండి ఎయిర్పోర్ట్తో పాటు ఇతర అత్యవసర సమయాల్లో క్యాబ్ కావాల్సి ఉంటే ఫోన్ చేయమని కోరుతూ ఇరువురి ఒకరికొకరు ఇచ్చుపుచ్చుకున్నారు. లోకేష్ జరిపిన సంభాషణను కస్టమర్ ఎక్స్. కామ్లో ట్వీట్ చేయడం నెట్టింట్లో వైరల్గా మారింది. డ్రైవర్ నుంచి ఆంత్రప్రెన్యూర్గా ఆ ట్వీట్పై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఒక డ్రైవర్ నుంచి ఆంత్రప్రెన్యూర్గా ఎదుగుతున్నందుకు శుభాకాంక్షలు చెబుతుంటే రైడ్ షేరింగ్ మార్కెట్లో గట్టి పోటీ నెలకొంది. నిలబడడం కష్టమేనని అంటున్నారు. కొత్త సంస్థలు పుట్టుకు రావడం మంచిదే మరికొందరు ఉబెర్, ఓలా వంటి దిగ్గజ సంస్థ కొన్ని సార్లు ప్రయాణికులకు సౌకర్యవంతమైన, సమర్ధవంతమైన ప్రయాణాల్ని అందించలేవు. రైడ్ ధరలు ఎక్కువగా ఉండడంతో పాటు ఆ క్యాబ్ కోసం ఎదురు చూసే సమయం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయాల్లో నానో ట్రావెల్స్ ఉపయోగం ఎక్కువగా ఉంటుందంటూ రిప్లయి ఇస్తున్నారు. చదవండి👉 రెండక్షరాల పేరు కోసం 254 కోట్లు చెల్లించిన ముఖేష్ అంబానీ! -
నేడే కృత్రిమ్ ఏఐ విడుదల
ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ సంస్థ ఓలా అధినేత భవిష్ అగర్వాల్ కీలక ప్రకటన చేశారు. కృత్రీమ్.ఏఐని ప్రారంభించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 15 మధ్యాహ్నం 2.30గంటలకు కృత్రీమ్.ఏఐ లాంచ్ను కృత్రీమ్ అనే యూట్యూబ్ ఛానల్లో లైవ్ టెలీకాస్ట్ చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. Excited to showcase the potential of our AI. Tune in to the live launch event of Krutrim, India's own AI at 2:30PM tomorrow! Watch here: https://t.co/g7qmlHMuk1 pic.twitter.com/i7CrTrJYH1 — Bhavish Aggarwal (@bhash) December 14, 2023 ఈ సందర్భంగా ఇంగ్లీష్, హిందీ, కన్నడ, తమిళం, మరాఠీతో పాటు వివిధ ప్రాంతీయ భాషల్లో సొంత ఏఐ కుత్రిమ్ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. తద్వారా పరిశ్రమలు, జీవన విధానాన్ని సమూలంగా మార్చేందుకు ఏఐని 1.4 బిలియన్ల మందికి అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఏఐ మేడ్ ఇన్ ఇండియా ప్రస్తుత టెక్ ప్రపంచంలో కృత్తిమ మేధ దూసుకుపోతుంది. మనదేశం కూడా సొంతంగా ఏఐని తయారు చేసే స్థాయికి ఎదగాలి. కానీ దేశీయ స్టార్టప్లు, వినియోగదారులు విదేశీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ నిపుణులతో తయారు చేసిన ఏఐని వినియోగిస్తున్నాయి. అలా కాకుండా భారతీయ భాషల్లో ఏఐని డెవలప్ చేయాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. -
పెట్టుబడిదారులకు శుభవార్త, ఐపీఓకి ఓలా ఎలక్ట్రిక్.. ఎప్పుడంటే?
స్టాక్ మార్కెట్లోని పెట్టుబడిదారులకు శుభవార్త. ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం ఓలా ఎలక్ట్రిక్ త్వరలో ఐపీఓకి రానున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆ సంస్థ ఫౌండర్, సీఈఓ భవిష్ అగర్వాల్ డిసెంబర్ 20న సెబీకి డ్రాఫ్ట్ రెడ్ హియరింగ్ ప్రాస్పెక్ట్ (DRHP)ని దాఖలు చేయనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఐపీఓ ద్వారా 700 మిలియన్ డాలర్లను సేకరించనున్నారు. ఓలా లక్ష్యం అదే ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం సాఫ్ట్ బ్యాంక్ పెట్టుబడులున్న ఓలా సంస్థ వచ్చే ఏడాదిలో ఆ సంస్థ విలువ 7 నుంచి 8 బిలియన్ డాలర్ల మధ్య ఉండేలా ఓ లక్ష్యాన్ని నిర్ధేశించుకుంది. దానికి అనుగుణంగా ఐపీఓ ద్వారా నిధులు సేకరించి.. వాటితో ఓలా ఎలక్ట్రిక్ వెహికల్స్లో వినియోగించే లిథియం అయాన్ బ్యాటరీలను తయారు చేసే మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ను ఏర్పాటు చేయనుందని సమాచారం. నవంబర్ 17 నుంచే ప్రయత్నాలు ప్రారంభం ఓలా ఎలక్ట్రిక్ నవంబర్ 17న తన ఐపీఓ కోసం సన్నాహకాలు ప్రారంభించింది. కంపెనీ పేరును ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ నుండి ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్గా మార్చే ప్రయత్నాలు చేసింది. అయితే ఏదైనా కంపెనీ ఐపీఓకి రావాలంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని పబ్లిక్ కంపెనీగా మార్చాల్సి ఉంటుంది. అందుకే తన కంపెనీ పేరును మార్చనుంది. -
ఓలా ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు దారులకు శుభవార్త!
ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు దారులకు ఓలా శుభవార్త చెప్పింది. ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరపై రూ.20,000 తగ్గిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఆ బైక్ ధర రూ.1,09,999 ఉండగా.. ధర తగ్గింపుతో రూ.89,999కే సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ డిస్కౌంట్ కొత్తగా ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ కొనుగోలు దారులకు మాత్రమే అందుబాటులో ఉందని ఓలా పేర్కొంది. ఓలా ఎస్1ఎక్స్ సిరీస్లోని ఓలా ఎస్1 ఎక్స్ 3 కిలోవాట్ల బ్యాటరీ, ఓలా ఎస్1 ఎక్స్ 2 కిలో వాట్ల బైక్లను కొనుగోలు చేసే వారికి ఈ ఆఫర్ పొందలేరని వెల్లడించింది. ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ 3 వాట్ల బ్యాటరీతో జతచేసిన 6కిలో వాట్ల మోటార్ను అందిస్తుంది. ఇందులో మొత్తం మూడు రైడ్ మోడ్లు ఉన్నాయి. వాటిల్లో ఎకో, నార్మల్, స్పోర్ట్స్. ఎలక్ట్రిక్ స్కూటర్ 0-40కేపీఎంహెచ్ నుండి 3.3 సెకన్లలో, 5.5 సెకన్లలో 0-60 కేపీఎంహెచ్ వేగాన్ని అందుకోగలదు. గరిష్ట వేగం 90కేఎంపీహెచ్. ఏఆర్ఏఐ సర్టిఫైడ్ ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ రేంజ్ ఒక్కసారి పూర్తి ఛార్జ్పై 151కిమీ అయితే, ఒరిజినల్ రేంజ్ ఎకో మోడ్లో 125కిమీ, సాధారణ మోడ్లో 100కిలోమీటర్ల ప్రయాణం చేయొచ్చు. 500డబ్ల్యూ పోర్టబుల్ ఛార్జర్తో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీని ఇంట్లో కేవలం ఏడు గంటలలోపు పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ బైక్లోని ఫీచర్ల విషయానికొస్తే ఎల్ఈడీ హెడ్ల్యాంప్, టైలాంప్తో వస్తుంది. 5 అంగుళాల ఎస్సీడీ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్, డిజిటల్ కీ, టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్,క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. -
ఏఐపై భవిష్ అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
సామాన్యులు సైతం సులభంగా వినియోగించేలా చాట్జీపీటీ తరహాలో భారత్ సైతం చాట్ బాట్లను తయారు చేయాలని ఓలా అధినేత భవిష్ అగర్వాల్ పిలుపునిచ్చారు. కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్లో జరిగిన ఇన్సైట్: ది డిఎన్ఎ ఆఫ్ సక్సెస్ 12వ ఎడిషన్లో అగర్వాల్ మాట్లాడారు. రోజువారీ వినియోగంలో ఏఐ పాత్రపై ఆయన నొక్కి చెప్పారు. ఏఐ గురించి మాట్లాడుతూ..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో భారత్ ప్రపంచ దేశాలకు దిశా నిర్ధేశం చేసే స్థాయికి చేరుకుంటుందని అన్నారు. ‘ఏఐ రెవెల్యూషన్ వేగంగా జరుగుతోంది. ఇది మనుషుల ప్రొడక్టివిటీని పెంచుతుంది. సైన్స్ ,ఆవిష్కరణలను వేగవంతం చేస్తుంది.అంతేకాదు జ్ఞానం, సృజనాత్మకత సరిహద్దులను చెరిపేస్తుంది. సాంకేతిక, ఆర్థిక పురోగతితో పాటుగా రీసెర్చ్ ,మెటాఫిజికల్ అన్వేషణ వంటి వివిధ ఏఐ అంశాలలో భారత్ అగ్రగామిగా వృద్ది సాధిస్తుందని భవిష్ అగర్వాల్ అభిప్రాయ పడ్డారు. -
క్యాబ్లలో ఈ స్ట్రాటజీ గురించి తెలుసా? ఇలా చేస్తే డబ్బులు బాగా సంపాదించవచ్చు!
అదనపు ఆదాయం కోసం మన దేశంలో ఆయా రైడ్ హైరింగ్ సంస్థల్లో పార్ట్టైం, లేదంటే ఫుల్ టైం డ్రైవర్గా విధులు నిర్వహించే ఉద్యోగులు ఎంత సంపాదిస్తుంటారు? ఇలా ఎప్పుడైనా తెలుసుకోవాలని అనిపించిందా? రైడ్ షేరింగ్ సర్వీసులు అందించే ఉబర్ సంస్థ 2013 ఆగస్ట్ నెలలో భారత్లో తన కార్యకలాపాల్ని ప్రారంభించింది. 2023 ఆగస్ట్ నెలలో 10 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ నివేదికను విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం.. గడిచిన పదేళ్లలో ఉబర్ కంపెనీలో ఫుల్టైం, పార్ట్టైం విధులు నిర్వహిస్తున్న డ్రైవర్లు 2013 ఆగస్ట్ నుంచి 2023 ఆగస్ట్ వరకు మొత్తం 3,300 కోట్ల కిలోమీటర్ల మేర ప్రయాణించి కస్టమర్లను వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చారు. ఫలితంగా ఈ పదేళ్ల కాలంలో దేశీయంగా ఉన్న ఉబర్ డ్రైవర్ల మొత్తం సంపాదన సుమారు రూ.50 వేలకోట్లు సంపాదించారు. ఆ మొత్తంలో కస్టమర్ల ఉబర్ డ్రైవర్లకు టిప్కింద ఇచ్చిన మొత్తం రూ.300 కోట్లు సంపాదించినట్లు ఉబర్ తన రిపోర్ట్లో పేర్కొంది. పైన పేర్కొన్న డేటా అంతా ఉబర్ అధికారికంగా విడుదల చేస్తే.. రైడ్ హైరింగ్ సంస్థల్లో డ్రైవర్లుగా పనిచేస్తున్న వారు కాస్త తెలివి తేటలు ఉపయోగించి ఏడాదిలో భారీ మొత్తంలో సంపాదించవచ్చని అంటున్నాడు అమెరికాకు చెందిన ఓ ఉబర్ క్యాబ్ డ్రైవర్. ఆ స్ట్రాటజీతో అమెరికాలో అంత సంపాదిస్తే.. దేశీయ ఉబర్ డ్రైవర్లు ఆదాయం పెంచుకునే అవకాశం ఉందా? క్యాబ్ డ్రైవర్ సంపాదన రూ.23లక్షలు అమెరికాలోని నార్త్ కరోలినా ప్రాంతానికి చెందిన 70 ఏళ్ల ‘బిల్’ అనే ఉబర్ డ్రైవర్ 2022లో ఏడాది మొత్తం సంపాదించింది అక్షరాల రూ.23లక్షలు ఇది వినడానికి నమ్మశక్యం కాకపోవచ్చు. కానీ ఇది అక్షరాల నిజం. ఎందుకంటే! ఆరేళ్ల క్రితం రిటైరైన బిల్కి ప్రయాణాలు చేయడం అంటే మహా ఇష్టం. డబ్బుకు డబ్బుకు.. ప్రయాణం చేస్తున్నామన్న సంతృప్తితో ఉబర్లో పార్ట్టైం డ్రైవర్గా చేరాడు. వారానికి 40 గంటల పని చేస్తూ కొన్ని సింపుల్ టెక్నిక్స్ని ఉపయోగించి తన ఆదాయాన్ని మరింత పెంచుకోవడం మొదలు పెట్టాడు. అదెలానో వివరించాడు. స్ట్రాటజీ ఇందుకోసం ఉబర్ డ్రైవర్ బిల్ ఈ కొత్త స్ట్రాటజీని అప్లయి చేశాడు. ముందుగా రద్దీగా ఉండే ప్రాంతాలైన ఎయిర్పోర్ట్లు, శనివారం, ఆదివారం రెస్టారెంట్లు, బార్లను సెలక్ట్ చేసుకున్నాడు. ఈ ఏరియాల్లో రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 2.30 వరకు కిటకిటలాడుతుంటాయి. పీక్ అవర్స్ కాబట్టి కస్టమర్లు అధిక మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని అదునుగా చేసుకుని లాంగ్ రైడ్లు కాకుండా, స్థానిక ఏరియాల్లో మాత్రమే ప్రయాణికుల్ని ఎక్కించుకుంటాడు. కస్టమర్లు ఎన్ని కిలోమీటర్లు వెళతారో తెలుసుకుని తనకు ఏమాత్రం లాభం లేదనిపిస్తే ఆ రైడ్లను క్యాన్సిల్ చేస్తాడు. కస్టమర్ల డిమాండే ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ల్యాండ్ అయినప్పుడు ప్రయాణికుల డిమాండ్ను బట్టి రైడ్ ధరల్ని స్వయంగా తానే నిర్ణయించినట్లు ఓ మీడియా సంస్థకు తెలిపాడు. ఎయిర్ పోర్ట్ ప్రాంతాల్లో సాధారణంగా 20 నిమిషాల రైడ్కి ఉబర్ 10 నుంచి 30 డాలర్లు వరకు ఉంటుంది. కానీ బిల్ మాత్రం కస్టమర్ల రైడ్లను క్యాన్సిల్ చేసి 50 నుంచి 60 డాలర్లు ఛార్జీలు విధించాడు. రైడ్ రిక్వెస్ట్లో 10 శాతం కంటే తక్కువ రైడ్స్ మాత్రమే యాక్సెప్ట్ చేసి..వాటిలో 30 శాతానికి పైగా రద్దు చేసి తద్వారా ఆర్థికంగా ఎక్కువ మొత్తంలో చెల్లించే రైడ్లను పొందాడు. ఇలా గత ఏడాది సుమారు 1,500 ఉబర్ ట్రిప్ల నుంచి సుమారు 28,000 డాలర్ల (దాదాపు రూ.23 లక్షలు) మనీ సంపాదించినట్లు చెప్పాడు. ఇబ్బందులు తప్పవ్ రైడ్ క్యాన్సిల్ చేస్తే సదరు డ్రైవర్లు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని బిల్ చెప్పాడు. ఉబర్ రైడ్ను క్యాన్సిల్ చేస్తే అకౌంట్ను కోల్పోవడంతో పాటు 10 శాతం కంటే ఎక్కువ రైడ్లను క్యాన్సిల్ చేసిన డ్రైవర్లకు నిర్ధిష్ట పెట్రోల్ బంకుల్లో లభించే డిస్కౌంట్లు, ఇతర ప్రోత్సాహకాలు కోల్పోతారని అన్నాడు. అయినప్పటికీ, బిల్ ప్రస్తుతానికి తన బిల్ స్ట్రాటజీకి కట్టుబడి ఉన్నానని, అది లాభదాయకంగా ఉందని అంటూనే.. డ్రైవర్గా పనిచేస్తున్న నాకు ఇప్పుడు డబ్బు అవసరం లేదు. ఎందుకంటే నాకు డ్రైవింగ్ చేయడం అంటే ఇష్టమని మనసుల మాటని బయట పెట్టాడు. చదవండి👉🏻 అమ్మ, నాన్న కోసమే.. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఎమోషనల్ -
ప్రతి పది సెకన్లకు ఒక బైక్..హాట్కేకుల్లా ఓలా స్కూటర్ల అమ్మకాలు!
ప్రముఖ ఎలక్ట్రిక్ తయారీ సంస్థ ఓలా ఫెస్టివల్ సేల్ను నిర్వహించింది. ఈ సేల్లో ఓలా ఈవీ బైక్స్ హాట్కేకుల్లా అమ్ముడు పోయాయని ఆ కంపెనీ సీఈవో భవిష్ అగర్వాల్ తెలిపారు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ విక్రయాలపై భవిష్ అగర్వాల్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా 2022 ఫెస్టివల్ సీజన్తో పోల్చితే.. ఈ ఏడాది దసరా, నవరాత్రులలో ప్రతి పది సెకన్లకు ఒక ఓలా బైక్ను అమ్మినట్లు పేర్కొన్నారు. దీంతో 2022 కంటే ఈ ఏడాది 2.5 రెట్లు అమ్ముడు పోయినట్లు సంతోషం వ్యక్తం చేశారు. Our sales have gone through the roof this Dussehra and Navratri! Selling a scooter every 10 seconds right now, and almost 2.5x of last year!😀 India’s EV moment is here this festive season!#endICEage — Bhavish Aggarwal (@bhash) October 24, 2023 అందుబాటులో ఐదు మోడళ్లు ఓలా దేశీయ మార్కెట్లో 5 మోడల్స్ను అమ్ముతుంది. గత ఆగస్ట్ నెలలో ఎస్1 ఎయిర్, ఎస్1 ప్రో జనరేషన్2, ఎస్1 ఎక్స్ పేరుతో మూడు వేరియంట్స్ను వాహనదారులకు పరిచయం చేసింది. 2030 నాటికి భారత్ లక్ష్యం ఇదే 2030 నాటికి భారతదేశం రోడ్ల పై ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే తిరగాలని అప్పటి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ 2017లో ప్రకటించారు. అంతేకాదు, 2030 నాటికి దేశంలో 30 శాతం ప్రైవేటు కార్లు, 70 శాతం కమర్షియల్ వాహనాలు, 40 శాతం బస్సులు, 80 శాతం ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలు ఉండాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. తాజాగా, ఓలా సేల్స్ చూస్తుంటే భారత ప్రభుత్వ నిర్ధేశించిన లక్ష్యం త్వరలోనే నెరవేరుతుందనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. చదవండి👉 నెలకు రూ.70వేలు సంపాదించుకోవచ్చు.. ఓలా సీఈవో బంపరాఫర్ -
నెలకు రూ.70వేలు సంపాదించుకోవచ్చు.. ఓలా సీఈవో బంపరాఫర్
ప్రముఖ రైడ్ హెయిలింగ్ కంపెనీ ఓలా శుభవార్త చెప్పింది. బైక్ ట్యాక్సీ డ్రైవర్లు నెలకు రూ.70,000 సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం ప్రత్యేక చెల్లింపు పద్దతిని ప్రవేశ పెట్టినట్లు వెల్లడించింది. బెంగళూరుకి చెందిన రైడర్లు ముందుగా ఓలా ఎస్1 బైక్ని అద్దెకు తీసుకోవాలని, తద్వారా నెలకు రూ.70,000 సంపాదించుకోవచ్చంటూ ఓలా అధినేత భవిష్ అగర్వాల్ తెలిపారు. రైడ్ల ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు ఎలా సందించుకోవచ్చో వివరించారు. డబ్బులు ఎలా సంపాదించాలి? రైడర్లు ముందుగా సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.5,000 చెల్లించి ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ బైక్ను అద్దెకు తీసుకోవాలి. ఇందుకోసం డ్రైవర్లు పాన్కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ వివరాలు, వినియోగంలో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలి. అనతరం తాము రూపొందించిన ప్రత్యేక చెల్లింపులు ప్రకారం.. రైడర్లు కస్టమర్లకు సేవలు అందిస్తే కమిషన్ రూపంలో డబ్బులు సంపాదించుకోవచ్చని భవిష్ విడుదల చేసిన ఓ పాంప్లెట్లో పేర్కొన్నారు. ఓలా విడుదల చేసిన పాంప్లెట్లో ఏముందంటే? బెంగళూరులోని బైక్ ట్యాక్సీ డ్రైవర్ల కోసం తయారు చేసిన చెల్లింపు పద్దతి ప్రకారం.. 10 నుంచి 14 బుకింగ్స్ వరకు ఫిక్స్డ్ పేమెంట్ రూ.800 వరకు చెల్లిస్తుంది. అందులో ప్రతి రోజు రెంటల్ కింద రూ.100 చెల్లించాలి. ఇక, 15 నుంచి 19 బుకింగ్స్ వరకు ఇన్సెంటీవ్ రూపంలో రూ.1,300 వరకు సంపాదించవచ్చు. అందులో రెంటల్ అమౌంట్ రూ.50గా నిర్ధేశించింది. అయితే, రోజుకు 20 కంటే ఎక్కువ రోజువారీ బుకింగ్ల కోసం డ్రైవర్లు రోజువారీ అద్దె చెల్లించాల్సిన అవసరం లేదు. పైగా రోజుకి రూ.1,800 నుండి రూ. 2,800 పరిధిలో సంపాదించవచ్చు. వాళ్లు మాత్రం అనర్హులే అదే సమయంలో, డ్రైవర్లు వారి బుకింగ్లు రోజుకు 10 కంటే తక్కువ ఉంటే రోజువారీ స్థిర ఆదాయానికి అర్హులు కాదు. అయితే వారు అద్దె మొత్తంగా రూ. 300 చెల్లించాలని ఓలా తెలిపింది. ప్రయాణీకుల కోసం,ఓలా గత నెలలో షేర్ చేసిన రేట్ చార్ట్ ప్రకారం, బైక్ టాక్సీ సర్వీస్ కోసం 5 కిలోమీటర్లకు రూ. 25, 10 కిలోమీటర్లకు రూ. 50 చొప్పున నిర్ణయించింది. తక్కువలో తక్కువగా నివేదిక ప్రకారం, పూర్తిగా ఛార్జ్ చేయబడిన ఓలా ఎస్1 ఏ స్కూటర్ 70-75 కిమీల దూరం ప్రయాణం చేయొచ్చు. రూ. 800 ఇన్సెంటీవ్ పొందడానికి రైడర్ 10 రైడ్లను పూర్తి చేయాల్సి ఉండగా..ఏడు-ఎనిమిది ట్రిప్పుల తర్వాత వెహికల్ బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతుంది. స్కూటర్ పూర్తిగా రీఛార్జ్ చేయడానికి ఆరు గంటల కంటే ఎక్కువ సమయం పడుతుంది. చివరిగా.. రైడర్లు ఎక్కువ మొత్తంలో సంపాదించే అవకాశాల్ని తెలుసుకునేందుకు అధికారిక పేజీని సంప్రదించాలని ఓలా ప్లాంపెట్లో హైలెట్ చేసింది. చదవండి👉 ఓలాకు భారీ షాక్, తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరవుతున్న సీఈవో భవీష్ అగర్వాల్! -
వాహనదారులకు ఓలా బంపరాఫర్!
దేశంలో పండుగ సీజన్ ప్రారంభం కావడంతో ఇప్పటికే ఈకామర్స్ కంపెనీలు కొనుగోలు దారులకు భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తున్నాయి. ఇప్పుడు అదే దారిలో ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ సంస్థ ఓలా కొనుగోలు దారులకు బంపరాఫర్ ప్రకటించింది. అక్టోబర్ 16 నుంచి అక్టోబర్ 30 వరకు ‘భారత్ ఈవీ ఫెస్ట్’ పేరుతో నిర్వహిస్తున్న సేల్స్లో డిస్కౌంట్స్తో పాటు ఇతర బెన్ఫిట్స్ని అందిస్తున్నట్లు తెలిపింది. భారత్ ఈవీ ఫెస్ట్లో ఎస్1 ప్రో- సెకండ్ జనరేషన్ బ్యాటరీపై వారెంటీ పొడిగింపుతో పాటు ఎస్1 ఎయిర్పై 5ఏళ్ల వారెంటీపై 50 శాతం తగ్గింపు పొందవచ్చు. ఎక్ఛేంజ్ బోన్స్ కింద రూ.10,000 రాయితీ ఉంటుంది. వాహనదారుడి పాత పెట్రోల్ వాహనం ఇచ్చి కొత్త ఓలా ఎస్1 ను కొనుగోలు చేయొచ్చని తెలిపింది. టెస్ట్ రైడ్ స్కీంలో భాగంగా ఎంపిక చేసిన లక్కీ కస్టమర్కు ఉచితంగా ఓలా సిక్స్ ప్లస్ వెహికల్ను అందిస్తుంది. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డ్పై కొనుగోలు రూ.7,500 వరకు ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఒకవేళ ఓలా వెహికల్ను మీ ఫ్రెండ్స్, స్నేహితులకు రిఫర్ చేసి, వాళ్లు కొనుగోలు చేస్తే రూ.1,000 క్యాష్ బ్యాక్తో పాటు ఎగ్జిస్టింగ్ డిస్కౌంట్స్ పొందవచ్చని ఓలా ఈ సందర్భంగా ప్రకటించింది. అంతేకాదు, వెహికల్ను కొనుగోలు చేసే కస్టమర్లకి జోరో డౌన్ పేమెంట్, జీరో కాస్ట్ ఈఎంఐ, జీరో ప్రాసెసింగ్ ఫీజులను పొందవచ్చు. -
మరో వ్యాపారంలోకి అడుగు పెట్టిన ఓలా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రైడ్ హెయిలింగ్ యాప్ ఓలా తాజాగా ఓలా పార్సల్ సేవలను బెంగళూరులో ప్రారంభించింది. పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలను ఇందుకోసం కంపెనీ వినియోగించనుంది. దశలవారీగా పార్సల్ సర్వీ సులు ఇతర నగరాల్లో పరిచయం చేయనున్నట్టు కంపెనీ శుక్రవారం ప్రకటించింది. 5 కిలోమీటర్ల లోపు దూరానికి రూ.25 చార్జీ వసూలు చేస్తారు. 5 కిలోమీటర్లపైన దూరాన్నిబట్టి 20 కిలోమీటర్ల వరకు చార్జీ రూ.100 దాకా ఉంది. -
ఓలా ఎస్1 ఎయిర్: కస్టమర్లకు గుడ్ న్యూస్
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ ఎస్ 1 ఎయిర్ డెలివరీలను షురూ చేసింది. ఓలా ఎస్1,ఎస్1 ప్రోకి తరువాత గత నెలలో లాంచ్ అయిన ఇ-స్కూటర్ ఎస్ 1 ఎయిర్.ఇప్పటి వరకు 50వేల బుకింగ్లో ప్రజాదరణ పొందిన S1 Air డెలివరీలు 100 కంటే ఎక్కువ నగరాల్లో ప్రారంభమయ్యాయని, ఇతర మార్కెట్లలో త్వరలో మొదలవనున్నాయని కంపెనీ ఒకప్రకటనలో తెలిపింది. ఆసక్తిగల కస్టమర్లు దేశవ్యాప్తంగా 1,000కు పైగా ఎక్స్పీరియన్స్ నెట్వర్క్లో ఏదైనా ఒకదానిలో,లేదా యాప్ద్వారా S1 ఎయిర్, సులభమైన ఫైనాన్సింగ్ఎంపికలు తదితర సమాచారాన్ని తెలుసుకోవచ్చు అనిప్రకటించింది. S1Air 3 kWh బ్యాటరీ సామర్థ్యం, 6kW గరిష్ట మోటారు శక్తి, 151 కిమీల సర్టిఫైడ్ రేంజ్ మరియు 90 km/hr గరిష్ట వేగాన్నిఅందిస్తుంది.ట్విన్ ఫ్రంట్ ఫోర్క్, ఫ్లాట్ ఫుట్బోర్డ్, భారీ 34-లీటర్ బూట్ స్పేస్ , డ్యూయల్-టోన్బాడీ కలిగి ఉంది. ఓలా ఎస్1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకసారి ఛార్జింగ్ చేస్తే 125 కిలోమీటర్ల వరకు ప్రయాణించ వచ్చు. స్టెల్లార్ బ్లూ, నియాన్, పింగాణీ వైట్, కోరల్ గ్లామ్, లిక్విడ్ సిల్వర్ , మిడ్నైట్ బ్లూ ఆరు రంగుల్లో అందుబాటులో ఉంది. -
Ola Electric Bike Concept: మునుపెన్నడూ చూడని ఓలా కొత్త ఎలక్ట్రిక్ బైకులు (ఫొటోలు)
-
బడ్జెట్ ధరలో, ఓలా నుంచి 3 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు.. చూస్తే వావ్ అనాల్సిందే
ప్రముఖ దేశీయ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ సంస్థ ఓలా శుభవార్త చెప్పింది. భారత దేశ 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఓలా కస్టమర్ డే ఈవెంట్ను నిర్వహించింది. ఇందులో భాగంగా బడ్జెట్ ధరలో ఓలా ఎస్ 1 ఎక్స్తో పాటు ఓలా ఎస్1 ప్రో జనరేషన్ 2 బైక్లను లాంచ్ చేసింది. ఓలా ఎస్1 ఎక్స్ ధర రూ.79,000 (ఎక్స్ షోరూం) ఉండగా, ఓలా ఎస్ 1 ప్రో జనరేషన్ 2 ధర రూ.1.47 లక్షలుగా (ఎక్స్ షోరూం) ఉంది ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 ఎక్స్ను మూడు వేరింట్లలలో అందిస్తుంది. ఎస్1 ఎక్స్ ప్లస్, 2కేడబ్ల్యూ హెచ్ బ్యాటరీతో ఎస్1 ఎక్స్, 3కేడబ్ల్యూ హెచ్ బ్యాటరీతో ఎస్1 ఎక్స్ను అందిస్తుంది. ఈ వేరియంట్లలో టాప్ ఆఫ్ ది లైన్ మోడల్తో ఎక్స్ ప్లస్ 5.0 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే, ఎక్స్ మోడల్లు 3.5 అంగుళాల డిస్ప్లేతో వస్తాయి. కానీ రెండింటి పనితీరు ఒకేలా ఉంటుందని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు. టాప్ స్పీడ్ 90 కేఎంపీహెచ్ కాస్ట్ కటింగ్లో భాగంగా ఓలా సంస్థ వెహికల్ బాడీ తయారీ కోసం బ్లాక్ ప్లాస్టిక్ను ఉపయోగించింది. ఇక, ఎస్1 ఎక్స్ ప్లస్, ఎస్1 ఎక్స్3 రెండూ 6 కేడబ్ల్యూ ఎలక్ట్రిక్ మోటార్తో 3కేడబ్ల్యూహెచ్ ఛార్జర్తో వస్తున్నాయి. ఈ రెండు వేరియంట్ల రేంజ్ 151 కిలోమీటర్లు కాగా, టాప్ స్పీడ్ 90 కేఎంపీఎంహెచ్తో డ్రైవ్ చేయొచ్చు. 3.3 సెకండ్లలో 0 నుంచి 40కేఎంపీహెచ్ వరకు వెళుతుంది. ఓలా ఎస్1 ఎక్స్2 6కే డబ్ల్యూ ఎలక్ట్రిక్ మోటర్తో 2కేడబ్ల్యూ బ్యాటరీ ఛార్జర్ను అందిస్తుంది. లోయర్ రేంజ్ స్పీడ్ 91కేఎం, లోయర్ టాప్ స్పీడ్తో 85కేఎంపీహెచ్తో వెళ్లొచ్చు. కేవలం రూ.999 చెల్లించి ఆగస్ట్ 15 పర్వదినాన్ని పురస్కరించుకొని ఆగస్ట్ 21 వరకు పరిచయ ఆఫర్ను పొందవచ్చు. ఇందులో భాగంగా ఓలా ఎస్1 ఎక్స్ప్లస్ను రూ.99,999కే సొంతం చేసుకోవచ్చు. డెలివరీలు సెప్టెంబర్ నుంచి మొదలు కానున్నాయి. ఎస్1ఎక్స్3, ఎస్1 ఎక్స్2 ప్రీ రిజర్వేషన్ కోసం కేవలం రూ.999 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఎస్1 ఎక్స్3 వెహికల్ ధర రూ.89,999 ఉండగా, ఎస్1 ఎక్స్2 ధర రూ.79,999గా ఉంది. కేవలం ఈ ఆఫర్ నేటి నుంచి మరో ఆరు రోజులు మాత్రమే ఉంది. టాప్ స్పీడ్ 120 కేఎంపీహెచ్ ఓలా ఎస్1 ఎయిర్ జనరేషన్ 2ను లాంచ్ చేసింది. బ్యాటరీని రీడిజైన్ చేసి విడుదల చేయడంతో వెహికల్ పనితీరు అద్భుతంగా ఉన్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. దీంతో పాటు పవర్ట్రయిన్లో మార్పులు చేసి 11 డబ్ల్యూ మోటార్ను డిజైన్ చేసింది. దీంతో ఎస్1 ప్రో జనరేషన్ 2 ‘0 నుంచి 40 కేఎంపీహెచ్ వేగాన్ని కేవలం 2.6 సెకన్లలో అధిగమించవచ్చు. టాప్ స్పీడ్ 120 కేఎంపీహెచ్. పరిధి 195 కిలో మీటర్లుగా ఉంది. ఇందులో టెలిస్కోపిక్ సస్పెన్షన్, ఫ్లాట్ ఫ్లోర్బోర్డ్, వెనుకవైపు మెరుగైన మోనోషాక్ ఉన్నాయి. ఇది స్కూటర్ 6 కిలోల బరువు తగ్గడానికి సహాయపడింది. కొత్త ఓలా ఎస్ ప్రో జనరేషన్ 2 ధర రూ. 1.47 లక్షలు (ఎక్స్-షోరూమ్, పరిచయ) ధరలతో సెప్టెంబర్లో ప్రారంభమవుతుంది. అదరగొట్టేస్తున్న ఓలా బైక్లు ఈ సందర్భంగా ఓలా మరికొద్ది రోజుల్లో నాలుగు ఎలక్ట్రిక్ బైక్లను విడుదల చేస్తామని ప్రకటించింది. డైమండ్ హెడ్, అడ్వెంచర్, రోడ్స్టర్, క్రూయిజర్ పేరిట వావ్ అనిపించేలా ఉన్న కాన్సెప్ట్ బైక్స్ను ప్రదర్శించింది. 2024 చివరికల్లా మార్కెట్కు పరిచయం చేయనుంది. భారత్తో పాటు ఇతర దేశాల్లో సైతం ఈ ఎలక్ట్రిక్ బైక్లను అమ్మాలని ఓలా ఎలక్ట్రిక్ భావిస్తోంది. చదవండి👉 ఇదేందయ్యా..ఇది నేను చూడలా.. ‘ఓలా’ ఎలక్ట్రిక్ స్కూటర్ వైరల్!
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
బహిరంగ చర్చకు సిద్దమైన రాహుల్ గాంధీ.. బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
లోకేష్ కు బొత్స స్ట్రాంగ్ కౌంటర్
పాక్కు మోదీ బుల్లెట్తో సమాధానం చెప్తారు.. అమిత్ షా
మేము కొనసాగించిన YSR గారి ఆదర్శవంతమైన పథకాలు..!
అత్యుత్తమ ఓనర్ అతడే.. ఓ ఎమోషన్: గంభీర్ వ్యాఖ్యలు వైరల్
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పిఠాపురం (కాకినాడ జిల్లా)
బీఆర్ఎస్ అద్భుత విజయం సాధించబోతోంది: కేసీఆర్
ఓటు వేసే ముందు ఒక్కసారి ఈ విషయాలు ఆలోచించండి...
సీఎం జగన్ రోడ్ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)
‘ఫోర్లు, సిక్స్లు కొట్టడంలో తనకు తానే పోటీ’.. కేజ్రీపై మాన్
తప్పక చదవండి
- ‘ఫోర్లు, సిక్స్లు కొట్టడంలో తనకు తానే పోటీ’.. కేజ్రీపై మాన్
- ‘మిమ్మల్ని ప్రాధేయ పడుతున్న’.. కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
- టీడీపీ, పవన్కు మంత్రి బొత్స కౌంటర్
- సీఎం జగన్కు ఇంత మంది శత్రువులు ఎలా అయ్యారు?
- బాబును సీఎం చేసేందుకే ఈ లేనిపోని పెంట వార్తలు: పోసాని
- నీతో ప్రచారం చేస్తే నా ఓటమి ఖాయం... కేశినేని చిన్ని
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
Advertisement