-
ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్
-
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపటి(శనివారం) ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ను వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘరామ్ శుక్రవారం విడుదల చేశారు.సీఎం జగన్ 4వ తేదీన ఎన్నికల ప్రచారాన్ని మూడు నియోజకవర్గాల్లో నిర్వహిస్తారు. శనివారం ఉదయం 10 గంటలకు హిందూపురం పార్లమెంట్ పరిధి హిందూపురం పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు చిత్తూరు పార్లమెంట్ పరిధి పలమనేరు నియోజకవర్గ కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు పార్లమెంట్ పరిధి నెల్లూరు సిటీ గాంధీ విగ్రహం సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. -
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(బుధవారం) మూడు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరులో జరిగే సభలో పాల్గొననున్నారు.ఉదయం 10 గంటలకు బొబ్బిలి, మధ్యాహ్నం 12.30 గంటలకు పాయకరావుపేట, మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరులో జరిగే ప్రచార సభల్లో సీఎం జగన్ ప్రసంగించనున్నారు.కాగా, (ఈ రోజు) మంగళవారం ఒంగోలు పార్లమెంట్ పరిధిలో కొండెపి నియోజకవర్గంలోని టంగుటూరు, కడప పార్లమెంట్ పరిధిలోని మైదుకూరు, రాజంపేట పార్లమెంట్ పరిధిలోని పీలేరు నియోజకవర్గంలోని కలికిరిలో జరిగిన బహిరంగ సభల్లో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించారు. -
సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభలు.. షెడ్యూల్ ఇదే
సాక్షి, తాడేపల్లి: 22 రోజుల్లో 23 జిల్లాలు.. 86 నియోజకవర్గాలు.. 2,188 కి.మీలు.. 9 భారీ రోడ్ షోలు 6 ప్రత్యేక సమావేశాలు 16 బహిరంగ సభలు.. జన ప్రభంజనం మధ్య జైత్ర యాత్రలా సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర సాగింది. మండుటెండైనా, అర్ధరాత్రయినా పిల్లలు, పెద్దలు ఆత్మీయ స్వాగతం పలికారు. యాత్ర రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేసింది. మరో జైత్రయాత్రకు సీఎం జగన్ సిద్ధమయ్యారు. ఈ నెల 28న తాడిపత్రి నుంచి ఎన్నికల ప్రచార సభలు ప్రారంభించనున్నారు.మొదటి నాలుగు రోజుల టూర్ షెడ్యూల్ను వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం గురువారం విడుదల చేసింది. ప్రతిరోజూ మూడు బహిరంగ సభల్లో సీఎం పాల్గొననున్నారు. 28న ఉదయం తాడిపత్రి, మధ్యాహ్నం వెంకటగిరి, సాయంత్రం కందుకూరులో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. 29న చోడవరం, పి.గన్నవరం, పొన్నూరు.. 30న కొండేపి, మైదుకూరు, పీలేరు.. మే 1న బొబ్బిలి, పాయకారావుపేట, ఏలూరులో జరిగే సభలకు సీఎం జగన్ హాజరుకానున్నారు.మొదటి నాలుగు రోజుల టూర్ షెడ్యూల్28న తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు29న చోడవరం, పి గన్నవరం, పొన్నూరు30న కొండెపి, మైదుకూరు, పీలేరుమే 1న బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరు -
ముంబైలో కుబేర
ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్లో నటిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇటీవల బ్యాంకాక్లో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది.కాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ ముంబైలోప్రారంభం అయింది. దాదాపు రెండు వారాల పాటు సాగే ఈ షెడ్యూల్లో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారట శేఖర్ కమ్ముల. సోనాలి నారంగ్ సమర్పణలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ‘కుబేర’ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
మేమంతా సిద్ధం బస్సు యాత్ర 20వ రోజు షెడ్యూల్ విడుదల
-
మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. రేపటి షెడ్యూల్ ఇలా
సాక్షి, తూర్పుగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర ఉద్యమంలా కొసాగుతోంది. యాత్రలో భాగంగా సీఎం జగన్ పర్యటిస్తున్న ప్రాంతమంతా జన కెరటాన్ని తలపిస్తోంది. అడుగడుగునా జనం ప్రభంజనం మాదిరి కదిలివస్తోంది. జై జగన్ అంటూ ఉవ్వెత్తున నినాదిస్తున్నారు. మేమంతా సిద్ధం 18వ రోజు శుక్రవారం (ఏప్రిల్ 19) షెడ్యూల్ను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం గురువారం విడుదల చేశారు. బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్ ఉదయం 9 గంటలకు ఎస్టీ రాజపురం రాత్రి బస నుంచి బయలుదేరుతారు. రంగంపేట, పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్ మీదుగా ఉందురు క్రాస్ చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం ఉందురు క్రాస్, కాకినాడ బైపాస్ మీదుగా సాయంత్రం 3:30 గంటలకు కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం పిఠాపురం బైపాస్, గొల్లప్రోలు బైపాస్, కత్తిపూడి బైపాస్, తుని బైపాస్, పాయకరావుపేట బైపాస్ మీదుగా గొడిచర్ల క్రాస్ రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. -
సీఎం జగన్ 16వ రోజు బస్సుయాత్ర రూట్ మ్యాప్ ఇదే
-
‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 15వ రోజు షెడ్యూల్ ఇలా
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర ప్రతి రోజు ఓ జైత్రయాత్రలా కొనసాగుతోంది. అడుగడుగునా సీఎం వైఎస్ జగన్కు నీరాజనాలు పలుకుతున్నారు. యాత్రలో జననేతను చూసేందుకు.. మాట కలిపేందుకు.. కరచాలనంచేసేందుకు.. వీలైతే ఫొటో దిగేందుకు స్కూలు పిల్లల నుంచి వృద్ధుల వరకు మండుటెండైనా అర్ధరాత్రయినా పోటీ పడుతుండటం ఊరూరా కనిపిస్తోంది మేమంతా సిద్ధం 15వ రోజు ఆదివారం (ఏప్రిల్ 14) షెడ్యూల్ను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం శనివారం విడుదల చేశారు. బస్సు యాత్రలో భాగంగా సీఎం ఉదయం 9 గంటలకు కేసరపల్లి రాత్రి బస నుంచి బయలుదేరుతారు. గన్నవరం, ఆత్కూర్, తేలప్రోలు బైపాస్, వీరవల్లి క్రాస్ , హనుమాన్ జంక్షన్, పుట్టగుంట మీదగా జొన్నపాడు శివారుకు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. చదవండి: మేమంతా సిద్ధం: ఎన్టీఆర్ జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర అనంతరం జొన్నపాడు, జనార్దణపురం మీదగా సాయంత్రం 3.30 గంటలకు గుడివాడ శివారు నాగవరప్పాడు వద్దకు చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. తరువాత గుడివాడ, బొమ్ములూరు, గుడ్లవల్లేరు, వేమవరం, పెడన క్రాస్, బల్లిపర్రు, బంటుమల్లి బైపాస్ , పెండుర్రు మీదుగా సంగమూడి రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. -
పారదర్శక అనుమతుల జారీలో సువిధ పోర్టల్ రికార్డు
సాక్షి, అమరావతి: ఎన్నికల ప్రవర్తన నియమావళికి అనుగుణంగా రాజకీయ పార్టీలు తీసుకోవాల్సిన ముందస్తు అనుమతులు సులభతరంగా, పారదర్శకంగా అందించడానికి తీసుకొచ్చిన సువిధ పోర్టల్ రికార్డులు సృష్టిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తరువాత 20 రోజుల్లోనే దేశవ్యాప్తంగా రాజకీయపార్టీలు, అభ్యర్థుల నుంచి 73,379 అభ్యర్థనలు వచ్చినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందులో 60 శాతం (44,626) అభ్యర్థనలకు అనుమతులు ఇవ్వగా 15 శాతం (11,200) అభ్యర్థనలను తిరస్కరించినట్లు తెలిపింది. మిగిలిన అభ్యర్థనలు పరిశీలనలో ఉన్నట్లు పేర్కొంది. సువిధ పోర్టల్ వినియోగంలో 23,239 అభ్యర్థనలతో తమిళనాడు మొదటిస్థానంలో నిలిచింది. తర్వాత స్థానాల్లో పశ్చిమబెంగాల్ (11,976 అభ్యర్థనలు), మధ్యప్రదేశ్ (10,636 అభ్యర్థనలు) ఉన్నాయి. కనిష్టంగా చండీగఢ్లో 17 అభ్యర్థనలు, లక్షదీ్వప్లో 18, మణిపూర్లో 20 అభ్యర్థనలు అందాయి. ఇంకా నోటిఫికేషన్ వెలువడాల్సిన ఆంధ్రప్రదేశ్ నుంచి 1,153 అభ్యర్థనలు వచ్చాయి. ఉచిత, న్యాయమైన, పారదర్శకమైన ప్రజాస్వామ్యం అనే సూత్రాలకు అనుగుణంగా ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థుల నుంచి అనుమతి అభ్యర్థనలు స్వీకరించేందుకు, వెంటనే వాటిపై చర్యలు తీసుకునేందుకు భారత ఎన్నికల సంఘం సువిధ పోర్టల్ను అభివృద్ధి చేసింది. పార్టీలు, అభ్యర్థులు ఓటర్లకు చేరువయ్యే కార్యక్రమాలకు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ సూత్రంపై పారదర్శకంగా అనుమతులు ఇచ్చేందుకు ఈ పోర్టల్ వీలు కల్పిస్తోంది. ర్యాలీలు నిర్వహించడం, తాత్కాలిక పార్టీ కార్యాలయాలు తెరవడం, ఇంటింటికి ప్రచారం చేయడం, వీడియో వ్యాన్లు, హెలికాప్టర్లు, వాహనాలు, కరపత్రాలు పంపిణీ వంటి వాటికి అనుమతులు ఇస్తుంది. ఆన్లైన్ ద్వారా అనుమతులు సువిధ పోర్టల్ (https://suvidha.eci.gov. in) ద్వారా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎక్కడనుంచైనా, ఎప్పుడైనా అనుమతి అభ్యర్థనలను ఆన్లైన్లో సమరి్పంచవచ్చు. ఆఫ్లైన్లో కూడా అభ్యర్థనలు ఇవ్వవచ్చు. వివిధ రాష్ట్ర విభాగాల నోడల్ అధికారులతో నిర్వహించే పటిష్టమైన ఐటీ ప్లాట్ఫాం సహకారంతో దరఖాస్తులను సమర్థంగా ప్రాసెస్ చేయడానికి ఈ పోర్టల్ సహాయకారిగా ఉంటోంది. యాప్ ద్వారా కూడా సువిధ సేవలను పొందవచ్చు. దరఖాస్తుదారులు తమ అభ్యర్థనల స్థితిని ట్రాక్ చేయవచ్చు. ఈ యాప్ ఐవోఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్ఫారాల్లో అందుబాటులో ఉంది. సువిధ ప్లాట్ఫాం ఎన్నికల ప్రక్రియ సామర్థ్యాన్ని పెంపొందించడమే కాకుండా, అప్లికేషన్ల రియల్ టైమ్ ట్రాకింగ్, స్టేటస్ అప్డేట్, టైమ్స్టాంప్ చేసిన సమర్పణలను ఎంఎస్ఎం ద్వారా తెలియజేయడం ద్వారా పారదర్శకతను నిర్ధారిస్తుంది. ఇంకా పోర్టల్లో లభించే అనుమతి డేటా ఎన్నికల వ్యయాలను పరిశీలించడానికి విలువైన వనరుగా ఉపయోగపడుతుంది. ఎన్నికల ప్రక్రియలో మరింత జవాబుదారీతనం, సమగ్రతకు దోహదపడటమేగాక ఎన్నికల సంఘం నిబద్ధతను పునరుద్ఘాటించడానికి సువిధ ప్లాట్ఫాం ఎంతో దోహదపడుతుంది. న్యాయమైన, సమర్థమైన, పారదర్శక ఎన్నికల వాతావరణాన్ని సులభతరం చేయడానికి, అన్ని రాజకీయపార్టీలు, అభ్యర్థులు అవసరమైన అనుమతులు పొందేందుకు సమాన అవకాశాలు కలి్పంచేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. -
చలో రాజమహేంద్రవరం
‘గేమ్చేంజర్’ కోసం రాజమహేంద్రవరం వెళ్లనున్నారట రామ్చరణ్. శంకర్ దర్శకత్వంలో రామ్చరణ్ హీరోగా నటిస్తు్తన్న పోలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గేమ్చేంజర్’. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా, అంజలి, ఎస్జే సూర్య, శ్రీకాంత్, నవీన్చంద్ర, ప్రియదర్శి, జయరాం, సునీల్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ రాజమహేంద్రవరంలో జరగనుందని ఫిల్మ్నగర్ సమాచారం. రామ్చరణ్తో పాటు ముఖ్యతారాగణం పాల్గొనే ఈ షెడ్యూల్ ఈ నెలాఖరులోప్రారంభం కానుందని తెలిసింది. కథరీత్యా సినిమాలో వచ్చే ఫ్లాష్బ్యాక్ సన్నివేశాలను చిత్రీకరిస్తారట శంకర్. రాజమహేంద్రవరం షెడ్యూల్ పూర్తయిన తర్వాత వైజాగ్కు వెళ్తారట యూనిట్. తమన్ ఈ సినిమాకు స్వరకర్త. ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది.. రిలీజ్ డేట్పై త్వరలోనే స్పష్టత రానుంది. -
‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. రేపటి షెడ్యూల్ ఇలా..
సాక్షి, చిత్తూరు/నెల్లూరు: మేమంతాసిద్ధం 8వ రోజు గురువారం (ఏప్రిల్ 4) షెడ్యూల్ను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం బుధవారం విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదయం 9 గంటలకు గురవరాజుపల్లె రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి బయలుదేరుతారు. మల్లవరం, ఏర్పేడు మీదగా పనగల్లు, శ్రీకాళహస్తి బైపాస్ మీదగా చిన్న సింగమల సమీపంలో 11 గంటలకు చేరుకుని లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లతో ముఖాముఖిలో పాల్గొంటారు. అనంతరం చావలి చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. సాయంత్రం 3:30 గంటలకు నాయుడుపేటలో నుంచి చెన్నై జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం ఓజిలి క్రాస్, బుదనం, గూడూరు బైపాస్, మనుబోలు, నెల్లూరు బైపాస్ మీదుగా చింతరెడ్డి పాలెం వద్ద రాత్రి బసకు చేరుకుంటారు. ఇదీ చదవండి: చంద్రబాబు, ప్రజలకు మధ్య యుద్ధం ఇది: సీఎం జగన్ -
నేడు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇలా..
సాక్షి,అమరావతి/సాక్షి, పుట్టపర్తి: మేమంతా సిద్ధం 5వ రోజు సోమవారం (ఏప్రిల్1) షెడ్యూల్ను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల ఆదివారం విడుదల చేశారు. యాత్రలో భాగంగా సీఎం జగన్ ‘ శ్రీసత్యసాయి జిల్లాలోని సంజీవపురం వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస ప్రాంతం నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి బత్తలపల్లి, రామాపురం, కట్ట కిందపల్లి, రాళ్ళ అనంతపురం, ముదిగుబ్బ, ఎన్ఎస్పీ కొట్టాల, మలకవేముల మీదుగా పట్నం చేరుకుంటారు. పట్నం నడింపల్లి, కాళసముద్రం, ఎర్ర దొడ్డి మీదుగా కుటాగుళ్లకు చేరుకుని మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. అనంతరం బయలుదేరి కదిరి చేరుకుంటారు. అక్కడ పీవీఆర్ ఫంక్షన్ హాల్ లో మైనారిటీ సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొని మోటుకపల్లె మీదుగా జోగన్నపేట, ఎస్.ములకలపల్లె, మీదుగా చీకటిమనిపల్లెలో రాత్రి బసకు వెళతారు. -
సీఎం జగన్ బస్సు యాత్ర డే-3 షెడ్యూల్
-
సీఎం జగన్ బస్సు యాత్ర 2వ రోజు షెడ్యూల్ ఇదే
-
‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర రేపటి షెడ్యూల్ ఇదే
సాక్షి, నంద్యాల జిల్లా: పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రగతిపథంలో నిలిపేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఇడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచారభేరి మోగించారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నివాళులు అర్పించారు. అనంతరం ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రను ప్రారంభించారు. తొలి రోజు బస్సు యాత్ర కడప పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో జరిగింది. మేమంతా సిద్ధం బస్సు యాత్ర రెండో రోజు షెడ్యూల్ : మేమంతా సిద్ధం బస్సు యాత్ర రేపు(గురువారం) నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ లోని రాత్రి బస చేసిన ప్రాంతం నుంచి ప్రారంభమవుతుంది. ఈ యాత్రలో భాగంగా సీఎం జగన్ ఉదయం 9 గంటలకు ఆళ్లగడ్డ నుంచి నల్లగట్ల, బత్తలూరు, ఎర్రగుంట్ల చేరుకొని గ్రామస్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం గోవిందపల్లి మీదగా చాబోలు శివారులో భోజన విరామం తీసుకుంటారు. అనంతరం నూనేపల్లి మీదుగా నంద్యాల చేరుకుని గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం పాణ్యం, సుగాలిమిట్ట, హుస్సేనాపురం, ఓర్వకల్, నన్నూర్, పెద్దటేకూరు, చిన్నకొట్టాల, కె.మార్కాపురం క్రాస్, నాగలాపురం, పెంచికలపాడులో ఏర్పాటు చేయబడిన రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. ఇదీ చదవండి: నాపై బురద జల్లేందుకు నా చెల్లెమ్మల్ని తీసుకొచ్చారు: సీఎం జగన్ -
సీఎం జగన్ బస్సు యాత్ర షెడ్యూల్..
-
టీఎస్ ఐసెట్, ఈఏపీసెట్ షెడ్యూల్లో మార్పు
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో పలు ఎంట్రన్స్ పరీక్షల తేదీల్లో మార్పులు జరిగాయి. టీఎస్ ఈఏపీ సెట్తో పాటు ఐసెట్ పరీక్షలను రీషెడ్యూల్ చేస్తూ తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త షెడ్యూల్ను విడుదల చేసింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. మే 9 నుంచి 12 వరకు జరగాల్సిన ఈఏపీసెట్ మే 7 నుంచి 11వరకు రీ షెడ్యూల్ చేసింది. మే 7, 8 తేదీల్లో అగ్రికల్చరల్, ఫార్మసీ పరీక్షలు.. మే 9, 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. జూన్ 4, 5న జరగాల్సిన ఐసెట్ జూన్ 5, 6 తేదీలకు మార్పు చేశారు. -
40 సీట్లు.. 40 రోజులకుపైగా ఎన్నికలు! ఇక్కడ అప్పుడూ ఇంతే..
దేశంలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. 18వ లోక్సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వ తేదీ వరకు మొత్తం ఏడు విడతల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల షెడ్యూల్లో బిహార్ రాష్ట్రానికి ప్రత్యేకత ఉంది. ఇక్కడ 40 లోక్సభ నియోజకవర్గాలు ఉండగా 40 రోజులకు పైగా ఎన్నికలు జరగున్నాయి. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. దశలు నియోజకవర్గాలు దశ 1 (ఏప్రిల్ 19) ఔరంగాబాద్, గయా, నవాడా, జముయి దశ 2 (ఏప్రిల్ 26) కిషన్గంజ్, కతిహార్, పూర్నియా, భాగల్పూర్, బంకా దశ 3 (మే 7) ఝంఝర్పూర్, సుపాల్, అరారియా, మాధేపురా, ఖగారియా దశ 4 (మే 13) దర్భంగా, ఉజియార్పూర్, సమస్తిపూర్, బెగుసరాయ్, ముంగేర్ దశ 5 (మే 20) సీతామర్హి, మధుబని, ముజఫర్పూర్, సరన్, హాజీపూర్ దశ 6 (మే 25) వాల్మీకి నగర్, పశ్చిమ్ చంపారన్, పూర్వీ చంపారన్, షెయోహర్, వైశాలి, గోపాల్గంజ్, సివాన్, మహారాజ్గంజ్ దశ 7 (జూన్ 1) నలంద, పాట్నా సాహిబ్, పాటలీపుత్ర, అర్రా, బక్సర్, ససారం, కరకట్, జహనాబాద్ 2019లోనూ.. 2019లో కూడా బిహార్లో ఏప్రిల్ 11 నుండి మే 19 వరకు మొత్తం ఏడు దశల్లో లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఫలితాలు మే 23న వెల్లడయ్యాయి. జేడీ‘యూ-టర్న్’ నితీష్ కుమార్ మరో యూ-టర్న్ తీసుకొని బీజేపీతో చేతులు కలపడంతో బిహార్లో 2024 లోక్సభ ఎన్నికలపై చాలా ఉత్కంఠ నెలకొంది. 40 సీట్లతో బిహార్ దేశంలో అత్యంత కీలకమైన హార్ట్ల్యాండ్ రాష్ట్రాలలో ఒకటిగా ఉంది. బీజేపీ, కాంగ్రెస్ రెండింటికీ రాజకీయంగా ముఖ్యమైనది. నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూతో మళ్లీ పొత్తు కుదుర్చుకోవడంతో రాబోయే ఎన్నికల్లో బీజేపీ తన గత ఎన్నికల కంటే మెరుగైన పనితీరు కనబరుస్తుందని అంచనా వేస్తోంది. బీహార్ మాజీ సీఎం లాలూ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీతో పాటు కాంగ్రెస్ నుంచి గట్టి సవాల్ ఎదుర్కోనుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 22 సీట్లు గెలుచుకోగా, జేడీయూ 16 సీట్లు గెలుచుకుంది. రెండు పార్టీలు కూటమిగా ఆ ఎన్నికల్లో పోటీ చేశాయి. ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ సీనియర్ మిత్రపక్షంగా జేడీయూ అవతరించింది. ఎన్డీయేలో భాగమైన ఎల్జేపీ 6 సీట్లు గెలుచుకుంది. మహాఘటబంధన్లో భాగమైన కాంగ్రెస్ బిహార్లో కేవలం ఒక్క సీటు మాత్రమే సాధించింది. 23.58 శాతం ఓట్ షేర్తో అత్యధిక ఓట్లను కూడా బీజేపీ కైవసం చేసుకుంది. ఆసక్తికరంగా ఈసారి నితీష్ కుమార్ పార్టీతో పొత్తుతో బీజేపీ బరిలోకి దిగుతోంది. భారతీయ జనతా పార్టీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో బిహార్లో 17 స్థానాల్లో పోటీ చేస్తుండగా జేడీయూ 16 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టనుంది. మిగిలిన 7 నియోజకవర్గాల్లో ఎల్జేపీ, ఇతర మిత్రపక్షాలు పోటీ చేయనున్నాయి. -
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల... ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 దాకా ఏడు విడతల్లో పోలింగ్..ఇంకా ఇతర అప్డేట్స్
-
నేడు విడుదల కానున్న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్... లోక్సభతోపాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్..ఇంకా ఇతర అప్డేట్స్
-
రేపే ఎన్నికల షెడ్యూల్ ప్రకటన: ఈసీ
సాక్షి, ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల ఎప్పుడనే దానిపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా స్పందించింది. రేపు.. శనివారం(16 మార్చి) మధ్యాహ్నం మూడు గంటలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని.. ఈ మేరకు ప్రెస్మీట్ ఉంటుందని ఈసీఐ ప్రతినిధి ట్వీట్ ద్వారా తెలియజేశారు. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఏకకాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ను రేపు ఈసీ అధికారికంగా వెల్లడించనుంది. Press Conference by Election Commission to announce schedule for #GeneralElections2024 & some State Assemblies will be held at 3 pm tomorrow ie Saturday, 16th March. It will livestreamed on social media platforms of the ECI pic.twitter.com/1vlWZsLRzt — Spokesperson ECI (@SpokespersonECI) March 15, 2024 ఈసీ డేటా ప్రకారం.. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీల గడువు జూన్ 2వ తేదీతో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గడువు జూన్ 16తో, ఒడిషా అసెంబ్లీ గడువు జూన్ 24వ తేదీతో ముగియనున్నాయి. ఈసీలతో సీఈసీ భేటీ కేంద్ర ఎన్నికల సంఘంలో.. ఇద్దరు సభ్యుల కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో షెడ్యూల్ ప్రకటన జాప్యం అవుతుందేమోనని అంతా భావించారు. ఈ నేపథ్యంలో.. గురువారం ప్రధాని నేతృత్వంలోని హైపవర్డ్ కమిటీ ఈసీ సభ్యుల ఎంపిక కోసం భేటీ అయ్యింది. తదనంతరం.. రెండు పేర్లను రాష్ట్రపతికి పంపగా.. వెంటనే ఆమోద ముద్ర లభించింది. అలా.. ఎన్నికల సంఘానికి నిన్న ఇద్దరు నూతన ఎన్నికల కమిషనర్ల నియామకం ఆఘమేఘాల మీద జరిగింది. శుక్రవారం ఉదయం ప్రధాన కమిషనర్ రాజీవ్కుమార్ సమక్షంలో జ్ఞానేష్ కుమార్, డాక్టర్ సుఖ్ బీర్ సింగ్ సంధు ఎన్నికల కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం కీలక భేటీ జరిగింది. ఈ భేటీలోనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తేదీపై నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. -
ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఢిల్లీ: ఇవాళో.. రేపో.. ఏ క్షణమైనా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధంగా ఉంది. ఈసీకి నిన్న ఇద్దరు నూతన ఎన్నికల కమిషనర్ల నియామకం జరిగిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం వాళ్లు తమ బాధ్యతలు స్వీకరించి.. కాసేపట్లో కీలక భేటీలో పాల్గొననున్నారు. ప్రధాన కమిషనర్ రాజీవ్కుమార్ సమక్షంలో జ్ఞానేష్ కుమార్, డాక్టర్ సుఖ్ బీర్ సింగ్ సంధు ఎన్నికల కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా.. సీఈసీ రాజీవ్ కుమార్ వాళ్లకు అభినందనలు తెలియజేశారు. మరికాసేపట్లో సీఈసీ అధ్యక్షతన ఈ ముగ్గురు భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలోనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటనపైనా స్పష్టత రావొచ్చని తెలుస్తోంది. ఆ వెంటనే.. ఏ క్షణమైనా షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. CEC Shri Rajiv Kumar welcomed the two newly-appointed Election Commissioners, Shri Gyanesh Kumar & Dr Sukhbir Singh Sandhu who joined the Commission today #ECI #ChunavKaParv pic.twitter.com/9cHMWF0UOo — Spokesperson ECI (@SpokespersonECI) March 15, 2024 అంతా సిద్ధం.. లోక్సభ ఎన్నికల కోసం ఇప్పటికే రాష్ట్రాల వారీగా సమీక్షలు నిర్వహించింది కేంద్ర ఎన్నికల సంఘం. దఫాలవారీగా అక్కడి అధికార యంత్రాగంతో సమన్వయం జరిపింది కూడా. దీంతో ఈసీ ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లైంది. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలకు సైతం షెడ్యూల్ ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది. లోక్సభతోపాటే జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ఉంటుందా? అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక.. ప్రధాని మోదీ నేతృత్వంలోని హైపవర్డ్ కమిటీ నిన్న భేటీ అయ్యి.. ఆరుగురి పేర్ల పరిశీలన తదనంతరం చివరకు రిటైర్డ్ ఐఏఎస్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్ బీర్ సింగ్ సంధులను నూతన ఎన్నికల కమిషనర్లుగా ఎంపిక చేసింది తెలిసిందే. ఆ వెంటనే వీళ్లిద్దరి నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. -
ఏపీ ఈఏపీ సెట్–2024 షెడ్యూల్ విడుదల
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈఏపీ సెట్–2024 దరఖాస్తుల స్వీకరణ మంగళవారం ప్రారంభమైనట్లు సెట్ చైర్మన్, జేఎన్టీయూకే వీసీ డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు చెప్పారు. దరఖాస్తులకు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా ఏప్రిల్ 15 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఓసీ అభ్యర్థులు రూ.600, బీసీ రూ.550, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలన్నారు. రూ.500 అపరాధ రుసుంతో ఏప్రిల్ 30 వరకూ, రూ.1,000 ఫైన్తో మే 5 వరకూ, రూ.5 వేల ఫైన్తో మే 10 వరకూ, రూ.10 వేల ఫైన్తో మే 12వ తేదీ సాయంత్రం వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి మే 13–16 వరకూ, అగ్రికల్చర్, ఫార్మసీకి మే 17–19 వరకూ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఏపీలో 47, హైదరాబాద్లో 1, సికింద్రాబాద్లో 1 చొప్పున ఆన్లైన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. మే 7 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. పరీక్షకు ప్రొఫెసర్ కె.వెంకటరెడ్డి కన్వీనర్గా వ్యవహరిస్తున్నారని తెలిపారు. వివరాలకు 0884–2359599, 0884–2342499 హెల్ప్లైన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
13 తర్వాత ఏ క్షణమైనా షెడ్యూల్!
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 13వ తేదీ తర్వాత ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉందని కేంద్ర ఎన్నికల సంఘం వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎన్నికల సంసిద్ధతను పరిశీలించడానికి ఈసీ బృందం ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో పర్యటిస్తోంది. ఈ నెల 12, 13వ తేదీల్లో జమ్మూకశీ్మర్లో పర్యటించనుంది. ఈ పర్యటన ముగిసిన వెంటనే ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని ఈసీ వర్గాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు, ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాల తరలింపు, భద్రతా బలగాల మోహరింపు, సరిహద్దుల్లో పటిష్ట నిఘా వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో ఎన్నికల కమిషన్ సమీక్షలు పూర్తి చేసింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై ఎన్నికల సంఘం అధికారులు కేంద్రం హోం శాఖ అధికారులతో శుక్రవారం చర్చలు జరిపారు. దాదాపు 97 కోట్ల మంది ఓటర్ల కోసం దేశమంతటా దాదాపు 12.5 లక్షల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేలా కసరత్తు జరుగుతోంది. ఆరు నుంచి ఏడు విడతల్లో లోక్సభ ఎన్నికలను నిర్వహించేలా షెడ్యూల్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రభుత్వ పథకాలతో మెరుగుపడిన జీవనం
ఆ కుటుంబానికి పథకాలే ఆధారం
ఫ మా గుండెల్లో పెట్టుకుంటాం ఫ లంచాలు లేని పాలన తొలిసారి చూశాం ఫ చంద్రబాబును నమ్మి మరోసారి మోసపోలేం ఫ మనసు విప్పిన ‘తూర్పు’ ఫ ఉమ్మడి జిల్లాలో ‘సాక్షి’ రోడ్ షో ఫ ఆరు నియోజకవర్గాల్లో 82 కిలోమీటర్ల మేర నిర్వహణ
ఓటరన్నా.. ఆలోచించు!
తాగునీటికి 2.25 టీఎంసీల నీళ్లు
నేటి నుంచి ఇంజనీరింగ్ సెట్
అక్రమ నిర్మాణాల తొలగింపులో లోకాయుక్త జోక్యం చేసుకోలేదు
ఇప్పట్లో మరమ్మతులు కష్టమే!
అథ్లెటిక్స్ సంఘంలో రాజకీయ నేతల పెత్తనం
పాప్లెట్ చేపలతో పరేషాన్!
తప్పక చదవండి
- PK: 'పులుసు కారుతోంది'..!
- SRH: వాళ్లిద్దరు పిచ్ను మార్చేశారు.. అతడొక అద్భుతం!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- మా గురించి మాట్లాడేందుకు మీరెవరు?: వరలక్ష్మి శరత్కుమార్
- నాడు తిట్లు.. నేడు కౌగిలింతలు!
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- Lok Sabha Election 2024: ఎన్నికల చరిత్రలో ఏకగ్రీవాలు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- మొలకలతో బోలెడన్ని ప్రయోజనాలు, ఈ సైడ్ ఎఫెక్ట్స్తెలుసుకోండి!
Advertisement