రెండు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్‌ | Sakshi
Sakshi News home page

రెండు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్‌

Published Fri, Jan 12 2024 3:24 AM

Telangana MLC Elections Schedule Release - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యే కోటా కింద రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు గురువారం నోటిఫికేషన్‌ విడుదలైంది. ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌ రెడ్డి రాజీనామాలతో ఏర్పడిన ఖాళీల భర్తీకి ఈ ఉప ఎన్నికలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

తొలి రోజు ఎవరూ నామినేషన్‌ దాఖలు చేయలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం పేర్కొంది. ఈ నెల 18తో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది. 29న పోలింగ్‌ జరగనున్నారు.

Advertisement
Advertisement