నేడు రథోత్సవం
రాయచూరు రూరల్: కొప్పళ్ల గవిమఠంలో అభినవ సిద్ధేశ్వర శివాచార్యుల జాతరలో భాగంగా సోమవారం రథోత్సవం నిర్వహించనున్నారు. ఇందుకోసం మఠంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వందలాది సంవత్సరాల చరిత్ర కలిగిన గవి మఠానికి భక్తులు భారీగా తరలిరానున్నారు. లక్షలాది మంది భక్తులకు రొట్టెలు, బజ్జీలు, మాదిలి, జిలేబీలు సిద్ధం చేశారు. గవి మఠం ఆధ్వర్యంలో జల సంరక్షణ, రక్తదానం, లక్ష వృక్షోత్సవం, పేద పిల్లలకు ఉచితి విద్య, భోజన వసతి, దార్మిక అంశాలపై గోష్టులు తదితర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.


